breaking news
Family
-
గోల్డెన్ లెహంగాలో 24 క్యారెట్ల బంగారంలా మెరిసిన శోభితా ధూళిపాళ..!
ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో టాలీవుడ్ నటుడు నాగచైతన్య భార్య, అక్కినేని వారి కోడలు శోభిత ధూళలిపాళ బంగారు లుక్ అందర్నీ అబ్బురపిచింది. పెళ్లి దుస్తులను తలపించే ఆమె బంగారు రంగు లెహంగాలో కొత్త పెళ్లికూతురిలా మెరిసిపోయారామె. ఆ చీర తగ్గట్టు ధరించిన రూబి నెక్లెస్ ఆమె లుక్ని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేసింది. లెహంగా మెరిసే సీక్వెన్స్, పూసల అలంకరణ తోపాటు ఎంబ్రాయిడరీ, మెర్మెడ్ సిల్హౌట్లు లెహంగాకి గ్రాండ్ లుక్ని తెప్పించాయి. నేలను తాకేలా పొడవుగా ఉన్న ఈ లెహంగా రాయల్టీ లుక్కి దర్పణంలా నిలిచింది. ఆ లెహంగాకి మ్యాచింగ్ సీక్విన్డ్ టల్లే ఫ్యాబ్రిక్ బ్లౌజ్ లెహంగాను మరింత హైలెట్గా కనిపించేలా చేసింది. అలాగే దానికి సీత్రూ దుపట్టా, దానిచుట్టూ ఉన్న మిర్రర్ బోర్డర్తో కూడిన ఎంబాలిష్మెంట్ శోభితాను బంగారంలా మెరిసిపోయేలా చేసింది. పుత్తడి లెహంగా శోభిత ధగధగ మెరిపోతూ.. అందరి చూపులు ఆమె వైపుకే తిప్పుకునేలా చేసింది. ఇక్కడ శోభితా దరించిన ఆభరణాలు, జుమ్కీలు, స్టేట్మెంట్రింగులు, బ్యాంగిల్స్ తదితరాలన్ని శోభిత ఫ్యాషన్ స్టైల్ని హైలెట్ చేశాయి. మొత్తంగా ఆ కార్యక్రమంలో శోభితా లుక్ ఎవర్గ్రీన్గా నిలవడం విశేషం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by HT City (@htcity) (చదవండి: Meher Castelino: భారత్ తొలి మిస్ ఇండియా..!ఫ్యాషన్ జర్నలిజంకి ఐకాన్ కూడా..) -
గ్రహాంతర వాసులున్నారా?
అల్లాహ్ నిదర్శనాలలో భూమి ఆకాశాల సృష్టి కూడా ఒకటి. ఆ రెండింటి లోనూ జీవరాశులను వ్యాపింపజేసి ఉంచాడు. తాను తలుచుకున్నప్పుడు వాటిని పరలోకంలో ఒక చోట సమీకరించగలడు. ఖుర్ఆన్ భావామృతం: 42:28–29 వివరణ: ఈ సూక్తిని బట్టి జీవరాసులలో మన భూమి పైననే గాక ఇతర గ్రహాలలో కూడా జీవరాసులు ఉన్నాయని తెలుస్తోంది. ఆ దేవుడే ఏడు ఆకాశాలు సృష్టించాడు. అలాంటివే భూమిని పోలిన వాటిని కూడా సృష్టించాడు. వాటిపై కూడా ఆయన ఆజ్ఞలు అవతరిస్తూ ఉంటాయి. దేవుడు ప్రతిదానిపై అదుపు ,అధికారం గల సమర్థుడు. సర్వశక్తిమంతుడని ఆయన జ్ఞానం ప్రతి వస్తువుని ప్రతి విషయాన్ని పరివేష్టించి ఉందని మీరు తెలుసుకోవడానికే ఈ సంగతి తెలియజేయబడుతోంది. (ఖుర్ఆన్ భావామృతం:65:12) వివరణ: ఇలాంటివే మీ భూమిని పోలిన వాటిని కూడా సష్టించాడు అంటే ఏడు ఆకాశాల్లో ఏడు భూములు మాత్రమే సష్టించాడని కాదు. ఇది అర బి భాషలో పెద్ద సంఖ్యను కూడా సూచిస్తుంది. భూమిని పోలిన వాటిని అంటే బుద్ధి జీవులు గల మన భూమిని పోలిన భూములు అని అర్థం. దీన్నిబట్టి మన విశ్వంలో మనలాంటి బుద్ధి జీవులు ఉండే అనేక గ్రహాలు ఉన్నాయని తెలుస్తోంది. హజ్రత్ ఇబ్నెఅబ్బాస్ రజి ఈ సూక్తి గురించి వ్యాఖ్యానిస్తూ ఇలా అన్నారు: వాటిలోని ప్రతి భూమండలంలో ముహమ్మద్ ప్రవక్తను పోలిన ప్రవక్తలు ఉన్నారు; ఆదం అలైను పోలిన ఆదంలు ఉన్నారు; నూహ్ అలైను పోలిన నూహ్ లు ఉన్నారు. ఇబ్రాహీం అలైను పోలిన ఇబ్రాహీంలు ఉన్నారు; ఈసా అలై ను పోలిన ఈసాలు ఉన్నారు. క్వాంటం సిద్ధాంతం ఆధారంగా హ్యూగ్ ఎవరెట్ ప్రతిపాదించిన మల్టీ యూనివర్స్ సిద్ధాంతం ప్రకారం మన భూమండలానికి ఇక్కడున్న సృష్టి రాశులకు నకళ్లు ఉంటాయట! ఎకానమమిస్ట్ (లండన్) అనే పత్రిక 26–7–1969 సంచిక ప్రకారం అమెరికాకు చెందిన ర్యాండ్ కార్పొరేషన్ సంస్థ ఇతర గ్రహాలలో బుద్ధి జీవుల ఉనికిని గురించి పరిశోధన జరిపింది. దాని ప్రకారం మన పాలపుంతలో మన భూమి వాతావరణాన్ని పోలిన అరవై కోట్ల గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాలలో జీవరాసులు ఉండవచ్చని కూడా ఈ పరిశోధన ద్వారా తెలుస్తోంది. ఈ యథార్థాన్ని 1400 సంవత్సరాల క్రితమే ముస్లిం పండితులు తెలియజేశారు.(ఖుర్ ఆన్ భావామృతం 65:12). – మొహమ్మద్ అబ్దుల్ రషీద్ -
‘సినిమాలు చూసి సంతోషించండి.. నమ్మకండి’
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘పురాణ కథలకు సంబంధించిన సినిమాలు చూసి సంతోషించండి. ఇంకా ఆనందం కలిగితే చప్పట్లు కొట్టండి, కానీ నమ్మకండి’ అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ వ్యాఖ్యానించారు. స్థానిక హిందూ సమాజంలో చేస్తున్న వ్యాసభారత ప్రవచనంలో ఆయన మంగళవారం సభాపర్వం ముగించి, వనపర్వంలోకి ప్రవేశించారు. తండ్రి ఎముకలతో చేసిన పాచికలను శకుని ఉపయోగించాడంటూ ఓ సినిమాలో ప్రధానంగా చూపారని, ఇటువంటి కథనం భారతంలో కానీ, ఇతర పురాణాలలో కానీ లేదని చెప్పారు. నిజం చెప్పినా ప్రజలు శంకించేంతలా అసత్యాలు ప్రాచుర్యం పొందుతున్న పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ద్యూతానికి పాండవులను మళ్లీ పిలవాలని విదురుడిని ఆదేశించినప్పుడు భీష్మద్రోణ కృపాచార్యులు, గాంధారి తదితర పెద్దలందరూ ధృతరాష్ట్రుడిని వారించడానికి ప్రయత్నిస్తారు. అవినీతి, క్రౌర్యంతో సంపాదించుకున్న సంపద వినాశ హేతువు అవుతుందని హితైషులు హెచ్చరిస్తారు. కానీ, ధృతరాష్ట్రుని బుద్ధి వేరు. మామకాః పాండవాః.. అని ఆయన అనడంలో ఆంతర్యం బయటపడుతోంది. నా వాళ్లు వేరు, పాండవులు వేరు అని దీని భావం. ద్యూతానికి మళ్లీ వచ్చిన ఆహ్వానాన్ని ధర్మరాజు అంగీకరించడాన్ని కొందరు ఆధునికులు విమర్శిస్తారు. బంగారు లేడి ఉండదని తెలిసే, రాముడు దానిని తేవడానికి బయలుదేరినట్టు.. మాయాద్యూతమని తెలిసే, తండ్రి ఆనతి మీర లేక, ధర్మరాజు తిరిగి ఆడటానికి వస్తాడు. విధిని అనుసరించి బుద్ధి ఉంటుంది. పరాజితులైన పాండవులతో వెళ్తున్న ద్రౌపదిని చూసి దుశ్శాసనుడు పలుమార్లు ‘ఎద్దు, ఎద్దు’ అని ఆమెను హేళన చేస్తాడు. భీముడు ఉగ్రుడై దుశ్శాసనుడి రొమ్ము పగులగొట్టి, రక్తం తాగుతానని ప్రతిన చేస్తాడు. తన తొడను ద్రౌపదికి చూపిన దుర్యోధనుడితో తొడలు పగులగొడతానని, లేకపోతే తనకు పుణ్యగతులు కలగవని ప్రతిన చేస్తాడు. తొడలు పగులగొట్టడం యుద్ధనీతికి వ్యతిరేకమే అయినా, ధర్మబద్ధమైన ప్రతిజ్ఞా పాలన కోసం యుద్ధనీతిని అతిక్రమించవచ్చు’’ అని సామవేదం వివరించారు. పాండవులను వేదవేత్తలు అనుసరించారంటూ ఆయన వనపర్వాన్ని ప్రారంభించారు. వ్యాసుడు వనపర్వంగా పేర్కొన్న పర్వాన్ని నన్నయ అరణ్య పర్వమన్నాడని వివరించారు. తొలుత కంచి కామకోటి సంయమీంద్రులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి ఆరాధనోత్సవాన్ని పురస్కరించుకొని, పీఠాధిపతి శంకర విజయేంద్రసరస్వతి స్వామి సూచనల మేరకు రుద్రహోమం నిర్వహించి, అనుశాసన పర్వాంతర్గతమైన శివ సహస్రనామ పారాయణ నిర్వహించారు. -
భారత్ తొలి మిస్ ఇండియా..!ఫ్యాషన్ జర్నలిజంకి ఐకాన్ కూడా..
భారత్లో అంతగా ఫ్యాషన్ , అందాల పోటీలకు ప్రాచుర్యం లేని సమయంలో ముంబైకి చెందిన మెహర్ కాస్టెలినో మోడల్గా ఎంట్రీ ఇచ్చి ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించింది. అంతేగాదు ఈ ఘనత సాధించిన తొలిభారతీయ మహిళ నిలిచింది. ఆడవాళ్లు ధైర్యంగా తమకు నచ్చిన రంగంలో ధైర్యంగా దూసుకుపోవచ్చు అనేందుకు స్ఫూర్తిగా నిలిచారామె. ఈ రోజు ఇంతలా అందాల పోటీలకు క్రేజ్ వచ్చిందంటే అందుకు కాస్టలినోనే కారణమని చెప్పొచ్చు. అలాంటి శక్తిమంతమైన మహిళ 81 ఏళ్ల వయసులో అనారోగ్యంతో డిసెంబర్17న(బుధవారం) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆమెకు కుమారుడు, కోడలు నిషా, మనవరాలు క్రిస్టినా ఉన్నారు. ఫ్యాషన్ ప్రపచంలో భారతీయ మహిళలకు మార్గదర్శకురాలిగా ఉన్నా ఆమె ప్రస్థానం, సాధించిన విజయాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.భారత్కు ఫ్యాషన్ జర్నలిజాన్ని నేర్పించిన ఐకాన్, మొదటి మిస్ ఇండియా మెహర్ కాస్టెలినో(Meher Castelino). 1964లో మిస్ ఇండియాగా కిరీటాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించారు. దీని తర్వాత కూడా ఈమె మిస్ యూనివర్స్, మిస్ యునైటెడ్ నేషన్స్ వంటి అంతర్జాతీయ అందాల పోటీలలో భారత్ తరుఫున ప్రాతినిధ్యం వహించారు. తొలి ఫెమినా మిస్ ఇండియా టైటిల్ హోల్డర్గా, ఆమె విజయం భారత అందాల పోటీల చరిత్రలో ఒక నిర్ణయాత్మక క్షణాన్ని సూచిస్తుంది. కాస్టెలినోని నిశ్శబ్ద బలానికి చిహ్నంగా అభివర్ణిస్తూ, భారతదేశంలో ప్రారంభ ఫ్యాషన్, అందాల పోటీల దృశ్యాన్ని రూపొందించడంలో సహాయపడిన మార్గదర్శకురాలిగా ఫ్యాషన్ ప్రపంచం ఆమెను సదా కీర్తిస్తుంది.తొలితరం ఫ్యాషన్ జర్నలిస్టు కూడా..!మోడలింగ్, టైటిల్ విన్నింగ్ తర్వాత మెహర్ ఫ్యాషన్ జర్నలిజంలోకి అడుగు పెట్టారు. 1973లో ఈవ్స్ వీక్లీ లో తన మొదటి కథనాన్ని ప్రచురించారు. చాలా కొద్ది టైమ్ లోనే మెహర్ ఫ్యాషన్ కాలమిస్ట్ గా ఎదగి..160 జాతీయ, అంతర్జాతీయ పత్రికలు, మ్యాగజైన్లలో వ్యాసాలు రాశారు. మ్యాన్స్టైల్’, ‘ఫ్యాషన్ కెలిడోస్కోప్’ వంటి పుస్తకాలు కూడా ఆమె రచించారు. సింపుల్గా చెప్పాలంటే..భారత్లో ఫ్యాషన్ జర్నలిజానికి మెహర్ కాస్టెలినో ఐకాన్గా పేర్కొనవచ్చు. లాక్మే ఫ్యాషన్ వీక్ వంటి అనేక ప్రధాన ఫ్యాషన్ ఈవెంట్లకు ఆమె అధికారిక ఫ్యాషన్ రైటర్గా పనిచేశారు. ఫ్యాషన్ను కేవలం సెలబ్రిటీల గ్లామర్గా కాకుండా, ఒక పరిశ్రమగా విశ్లేషించిన తొలితరం జర్నలిస్టులలో ఆమె ఒకరు. భారతదేశంలో ఫ్యాషన్ రంగం అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఒక మహిళగా ప్రభంజనం సృష్టించి చాలామంది మహిళలు ఈ రంగంలోకి రావడానికి మార్గదర్శకురాలిగా, స్ఫూర్తిగా నిలిచారామె. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) (చదవండి: వందేళ్ల ఫ్యాషన్ బ్రాండ్ 'షనెల్' ప్రత్యేకతలివే..! మన తెలుగమ్మాయి కారణంగా..) -
పెళ్లైన లెక్చరర్ మాయలో 19 ఏళ్ల కూతురు..!
మా అమ్మాయికి నాలుగేళ్ల వయసున్నప్పుడు నా భార్య చనిపోయింది. అప్పటినుంచి అన్నీ నేనే అయి మా అమ్మాయిని గారాబంగా పెంచుకున్నాను. ఇప్పుడు మా అమ్మాయికి 19 ఏళ్లు. హైదరాబాద్లో హాస్టల్లో ఉంటూ ఇంజినీరింగ్ చేస్తోంది. అక్కడ తను చదువుకునే కాలేజీ లెక్చరర్తో రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉందని, ఆ లెక్చరర్కి ఇప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారని, అతను తన భార్యకు విడాకులు ఇచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడని తెలిసింది. అంతేకాదు, నేను కనక తన మాట కాదంటే ఆత్మహత్య చేసుకుంటానని చెబుతోందని కూడా తెలిసింది. నాకు నా కూతురు తప్ప వేరే లోకం లేదు. ఈ పరిస్థితులలో నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా చెప్పగలరు.– రామరాజు, భీమవరంమీ సమస్య చదువుతుంటే మనసు కలచి వేస్తోంది. మీరు వయసులో ఉన్నప్పుడే భార్య చనిపోయినా మళ్లీ పెళ్లి చేసుకోకుండా మీ కూతురే ప్రపంచంగా బతికారు. అలాంటి అమ్మాయి ఈ రోజు ఇలా ప్రవర్తిస్తుంటే జీర్ణించుకోవడం కష్టమే. అయితే ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇటువంటి సందర్భాలలో మీరు భావోద్వేగానికి లోనై అమ్మాయి మీద అరవడం, కోప్పడి మీవైపు లాక్కోవాలనుకోవడం సరైన పద్ధతి కాదు. మీరు ఎంత బలంగా తనని మీవైపు లాక్కోవాలనుకంటే తను అంతకన్నా బలంగా మీకు దూరంగా జరిగే ప్రమాదం ఉంది. ఆ వయసులో ఆకర్షణలు, ప్రేమ భావాలు సహజం. కానీ ఇప్పటికే వివాహమై, కుటుంబ బాధ్యతలతో ఉన్న వ్యక్తితో జీవితం ప్రారంభించాలనుకోవడం ఆమె అపరిపక్వతను సూచిస్తుంది. మందుగా మీ కుమార్తెను నిందించకుండా ఒత్తిడి లేకుండా ఫ్రశాంతంగా మాట్లాడండి. ఆమెను మీరు అర్థం చేసుకున్నారు అన్న భావన కలిగేలా నెమ్మదిగా విషయాలను వివరించండి. సాధ్యమైనంత వరకు మూడోవ్యక్తి ద్వారా ప్రాఫెషనల్ కౌన్సెలింగ్ చేయించడం మంచిది. క్లినికల్ సైకాలజిస్టులు ఎలాంటి పక్షపాతం లేకుండా వాస్తవాలు చూపించి ఆమెకు స్వతంత్రంగా ఆలోచించడానికి దారి చూపగలరు. అదే సమయంలో మీరు మీ అమ్మాయి ప్రేమించిన వ్యక్తి చెడ్డవాడని ఆమెతో పదే పదే అనడం వల్ల ఆమె మిమ్మల్ని అ΄ార్థం చేసుకుని మీకు మరింత దూరం అవుతుంది. వీలయితే ఆ కాలేజీ యాజమాన్యంతో మాట్లాడండి. ఒకవైపు ఇవన్నీ చేస్తూనే మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. తను ఆత్మహత్య ఆలోచనలు చేస్తోంది కాబట్టి అసలు ఒంటరిగా వదలకండి. జీవితంలో ఒకోసారి అన్ని సమస్యలకు పరిష్కారాలు మన చేతిలో ఉండచకపోవచ్చు. కాలాన్ని మించిన వైద్యుడు, అనుభవాన్ని మించిన గురువు లేడనే సత్యాన్ని గ్రహించండి. మనసు కవి ఆత్రేయ గారన్నట్టు ‘‘అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలే దని ఆగవు కొన్ని. జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని’’ అన్న తాత్త్విక ధోరణి ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరి అనిపిస్తుంది. మీరు మనసు గట్టి చేసుకుని ధైర్యంగా ఉండండి. డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
యూట్యూబ్ పేరెంటింగ్ ఎంతవరకు?
డిజిటల్ లెర్నింగ్ అనివార్యంగా పిల్లల జీవితంలో భాగమైన రోజులొచ్చాయి. ఒకప్పుడు పాఠ్యపుస్తకాలు, నోట్సులతో విద్య సాగితే ఇప్పుడు స్కూలు, కాలేజీలకు సమాంతరంగా పిల్లలు ఇంట్లో యూ ట్యూబ్ పాఠాలతో చదువుతున్నారు. అయితే ఈ చదువు ఎంత వరకు ఉండాలి? ఈ చదువును పిల్లలకు ఎంత మేరకు తల్లిదండ్రులు అనుమతించాలి? పరీక్షలు దగ్గర పడుతున్న సమయం ఇది.పలకా బలపం పట్టి అక్షరాలు దిద్దే కాలం నుంచి డిజిటల్ స్లేట్ మీద అక్షరాలు రాసే కాలం దాకా చిన్నారులు ఎదిగారు. ఒకప్పుడు పాఠాలంటే పుస్తకాల్లో చూసి చెప్పేవే. కానీ మారిన కాలంలో పాఠం డిజిటలైజ్ అయిపోయింది. అచ్చయిన అక్షరం కన్నా కంటి ముందు కనిపించే రూపాలను చూపిస్తూ పాఠం చెప్తున్నారు టీచర్లు. ఈ ట్రెండ్ మరింత ముందుకు వెళ్లి, యూట్యూబ్ సరికొత్త టీచర్గా మారిపోయింది. ఏ అంశమైనా అర్థం కాకపోతే విద్యార్థులు అందులో సెర్చ్ చేసి తెలుసుకుంటున్నారు. కేవలం పుస్తకాలనే నమ్ముకోకుండా టెక్నాలజీ ద్వారా పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇది మంచా, చెడా, దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటనేది ప్రస్తుతం చర్చగా మారింది.వ్యూస్ ప్రభావితం చేస్తున్నాయిగతంలో పిల్లలు టీచర్ పాఠం చెప్తున్నప్పుడు అర్థం కాకపోతే లేచి అడిగేవారు. సందేహాలు తీర్చేందుకు ఇంట్లో పెద్దలు, ట్యూషన్ టీచర్లు ఉండేవారు. ఈ రెండు విషయాలు ఇప్పుడు వెనుక స్థానం తీసుకున్నాయి. ఓపిక లేని టీచర్లు, తీరిక లేని తల్లిదండ్రులు యూట్యూబ్ను పిల్లల చేతుల్లో పెట్టారు. అందులో అనేకమంది ఎడ్యుకేషన్ కంటెంట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తున్నారు. పిల్లలకు అర్థమయ్యే సులభరీతిలో అంశాలను బోధిస్తున్నారు. అవన్నీ ఉచితం కావడంతో చిన్నారులు వాటిపై ఆధారపడుతున్నారు. దీంతో కొన్ని వీడియోలకు లక్షల కొద్దీ వ్యూస్ ఉంటున్నాయి. వ్యూస్ను చూసి పిల్లలు మరింతగా ఆ వీడియోస్ను ఫాలో అవుతున్నారు.ఎందుకీ మార్పు?ప్రస్తుతం అన్ని రంగాల్లో ఏఐ విప్లవం మొదలైంది. రాన్రానూ అది మరింత పెరుగుతుందని అందరూ భావిస్తున్నారు. ఇటువంటి సమయంలో చిన్నారులకు సాంకేతిక అనుభవం అవసరం అనేది తల్లిదండ్రుల వాదన. ఈ సమయంలో పాఠాలకు కేవలం పుస్తకాల మీద, టీచర్ల మీద మాత్రమే ఆధారపడితే కష్టమని, యూట్యూబ్ ద్వారా నేర్పే పాఠాలు చిన్నారులకు చేరాలని వారి మాట. పైగా పుస్తకాల్లోని అంశాలు పేరాల కొద్దీ రాసినా అవి చిన్నారులకు అనుభవపూర్వకమైన జ్ఞానం అందించలేవు. వీడియోలో అయితే వారి కంటికి అన్నీ కనిపిస్తూ వివరించడం వల్ల మరింత స్పష్టంగా నేర్చుకునే అవకాశం ఉందని అంటున్నారు.చెడు ప్రభావాల మాటేమిటి?యూట్యూబ్ పాఠాలు మంచివే అని అంటున్నా, దానివల్ల కలిగే చెడు ప్రభావాల మాటేమిటని విద్యావేత్తల ప్రశ్న. ఏదైనా అంశం గురించి చెప్పే వీడియోలను ఏ మేరకు నమ్మాలి, అందులోని అంశాలలో వాస్తవికత అనేది ఎవరు నిర్ణయిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఏది తప్పూ, ఏది ఒ΄్పో తెలియని చిన్నారులు వాటినే నమ్మితే రాబోయే కాలంలో అది ప్రమాదకరంగా మారుతుందని అంటున్నారు. దీంతోపాటు యూట్యూబ్ అలవాటైన చిన్నారులకు బడి మీద అయిష్టత పెరుగుతుందని, రోజంతా నెట్లో గడిపేందుకు ఆసక్తి చూపుతారని అంటున్నారు. ఇది వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందంటున్నారు. పుస్తకాల్లో ఉన్నది చదవడం వల్ల పిల్లల్లో ఊహాశక్తి పెరుగుతుందని, అన్నీ కంటి ముందు చూపించే వీడియోల వల్ల వారు సొంత బుర్ర వాడటంలో శ్రద్ధ పెట్టలేకపోతున్నారని అంటున్నారు. ఇలా చేస్తే మేలు..→ ఏ ఛానెల్ అయితే మేలైన, నిజమైన కంటెంట్ అందిస్తుందో ముందుగా తల్లిదండ్రులు తనిఖీ చేయాలి. అందులోని పాత వీడియోలు, దాని కింద కామెంట్లు పరిశీలించాలి. అది నమ్మదగినది అనిపిస్తేనే పిల్లలకు చూపించాలి.→ యూట్యూబ్ పాఠాలను కొందరు నిపుణులకు పంపి, అవి సరైనవని నిర్ధారణకు వచ్చాకే పిల్లలకు సూచించడం మరింత మేలు. → స్కూల్లో టీచర్లు చెప్పిన విషయాలు అర్థం కాలేదని పిల్లలు అంటే, ముందుగా ఆ విషయాలేమిటో తల్లిదండ్రులు కనుక్కోవాలి. దాని గురించి వారికి వివరించి, ఆ తర్వాత వారి పక్కనే కూర్చుని యూట్యూబ్ వీడియోలు చూడాలి. అందులోని చెప్పేదానికి తోడు మీరూ కొన్ని అంశాలు జతచేయాలి. → యూట్యూబ్ పాఠాలకు టైం కేటాయించాలి. ఎక్కువ సమయం పిల్లలు అవే చూడకుండా, వారికి ఇతర పనులూ కేటాయించాలి. → పిల్లలు ఏమేం వీడియోలు చూస్తున్నారు, ఎంతసేపు చూస్తున్నారు, ఎందుకు చూస్తున్నారు వంటి విషయాలు పెద్దలు గమనిస్తూ ఉండాలి. → కావాలని స్కూల్ మానేసి, పిల్లలు పాఠాల కోసం ఈ వీడియోల మీద ఆధారపడటాన్ని ఏమాత్రం ప్రోత్సహించకూడదు. → వీడియోల మధ్యలో సినిమాలు చూడటం, ఇతర అంశాలను చూడటం వంటివి పెద్దలు నిరోధించాలి. → వీడియోలు చూసి ఆగకుండా, అందులోని పాయింట్లను నోట్ చేసుకోమని సూచించాలి. వాటిని పాఠ్యపుస్తకాల్లోని అంశాలతో సరిచూసుకోమని చెప్పాలి. → యూట్యూబ్లో చూపించిన అంశాల గురించి పిల్లలతో చర్చించాలి. అవి వారికి ఎలా అర్థమవుతున్నాయో అంచనా వేసి, మార్పుచేర్పులు చెప్పాలి. -
గోరంత సేవైనా గౌరవమే!
అది... రెండేళ్ల కిందటి సంఘటన. హైదరాబాద్ నగరంలో ప్రజాదర్బార్. పదుల కొద్దీ వీల్ చెయిర్లలో దివ్యాంగులు. వారి కష్టాన్ని సీయంకి వివరిస్తోందో మహిళ. అందరూ రోడ్డు పక్కన అడుక్కునే వాళ్లే. ప్రభుత్వం పెన్షన్ ఇస్తే అడుక్కోవడం మానేస్తారు. పెన్షన్ రావాలంటే ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు రావాలంటే వారికో అడ్రస్ ఉండాలి. ఉండడానికి ఇల్లులేక, తినడానికి తిండి లేక రోడ్డు పక్కన భిక్షమెత్తుకుంటున్న వారిని అడ్రస్ అడిగితే ఏం చెప్పగలుగుతారు? ప్రభుత్వ వైఫల్యమే వీరి అడ్రస్, ఈ ప్రజాభవనే వీరి అడ్రస్... అని వాదించింది. సీయం పక్కనే రెవెన్యూ మినిస్టర్ కూడా ఉన్నారు. అడ్రస్ అవసరం లేకుండా ఆధార్ కార్డులు జారీ చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ నియమావళికి, ఆపన్నుల అవసరానికి మధ్య ఉన్న అగాధం తొలగిపోయింది. దిక్కులేని వారికి ఆధారం దొరికింది. సమస్య ఉంది అంటే పరిష్కారం కూడా ఉంటుంది. అయితే సమస్యను సింపతీతో చూసినంత కాలం పరిష్కార మార్గం కనిపించదు, ఎంపతీతో చూసినప్పుడే ఆ దారి గోచరమవుతుంది. బాధితుల కష్టాన్ని తన కష్టంగా భావించి స్పందించే మనసు ఉండడంతోనే ఆమెకు పరిష్కార మార్గం కనిపించింది. ఆమె సోషల్ యాక్టివిస్ట్ శ్రీలక్ష్మి రెడ్డి.‘నాకు వందమంది శక్తిమంతులైన యువతను ఇవ్వండి, భారతదేశాన్ని మార్చి చూపిస్తాను’ అన్న వివేకానందుడే తనకు స్ఫూర్తి అంటారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలక్ష్మిరెడ్డి. భర్త, ముగ్గురు పిల్లలతో గృహిణిగా ఖమ్మంజిల్లా నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన ఆమె రామకృష్ణ మఠం బోధనలతో స్ఫూర్తి పొందారు. తొంభయ్యవ దశకం మొదట్లోనే లయన్స్ క్లబ్ సభ్యురాలిగా సేవాపథంలో నడిచారు. చదువంటే ఆమెకు తీరని దాహం. ముగ్గురు పిల్లలను ఉన్నత విద్యావంతులను చేయడంతోపాటు పెళ్లి కారణంగా ఆగిపోయిన తన చదువును కొనసాగించారు. ఇప్పుడామె ఎల్ఎల్బి స్టూడెంట్. ‘మహిళలు కుటుంబ సమస్యలతో వస్తుంటారు. వారి కాపురం నిలబెట్టడానికి లోకజ్ఞానంతో కౌన్సెలింగ్ ఇచ్చేదాన్ని. న్యాయపరమైన సలహా కోసం తరచూ మా వారిని విసిగించాల్సి వస్తోంది. నా ఫ్రీ సర్వీస్ కోసం ఇంట్లో వాళ్లను ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఆ కోర్సు నేనే చేస్తే మంచిది కదా అని చదువుతున్నాను’ అంటూ తన జీవితాన్ని సేవాపథంలోకి నడిపించిన సంఘటనను గుర్తు చేసుకున్నారామె. మహిళాౖ ఖెదీ వార్త ‘‘న్యూస్పేపర్లో ‘అత్త తల పగుల కొట్టిన మహిళ’ అనే వార్త నన్ను కదిలించి వేసింది. ఆ మహిళది సత్తుపల్లి. మా మండలమే. ఎందుకిలా చేసి ఉంటుంది... ఒకసారి మాట్లాడదాం అని చంచల్గూడ జైలుకెళ్లి ఆమెను కలిశాను. వ్యభిచారం చేసి డబ్బు సంపాదించమని ఒత్తిడి చేయడం, భర్త ముందు దోషిగా నిలబెట్టడం వంటి బాధలు తట్టుకోలేకపోయింది. మనసు చంపుకుని బతకలేక, పట్టలేని కోపంలో రోకలితో తల మీద మోదింది. చట్టపరంగా ఆ మహిళ చేసింది తప్పే కాబట్టి న్యాయస్థానం శిక్ష విధించింది. ఆమెకు చదువు లేదు. శిక్ష పూర్తయి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఎలా బతకాలి అనే ప్రశ్న చాలారోజులు నన్ను తొలిచేసింది. జైలు శిక్షణ జైలు శిక్ష కోసం మాత్రమే కాదు శిక్షణ కూడా ఇవ్వాలని మహిళా ఖైదీలకు ఫినాయిల్ మేకింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, బ్యూటీషియన్, కంప్యూటర్ కోర్సులు నేర్పించడం మొదలుపెట్టాను. డ్వాక్రా గ్రూపు లీడర్ల కు ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ప్రోగ్రామ్లో వందలాది మహిళలకు శిక్షణనిచ్చాను. సమాజంలో నేను చూసిన సమస్యలు, నాకు ఎదురైన సవాళ్ల నుంచి పాఠాలు నేర్చుకున్నాను. ఆ పాఠాలే నా సేవకు సోపానాలు. మా ఉమ్మడి కుటుంబంలో ఏడాది బిడ్డ కంటిని కోల్పోయింది. ఇంటిల్లిపాదీ అనుభవించిన మానసిక క్షోభను దగ్గరగా చూశాను. అందుకే కంటి ఆపరేషన్ల మీద ఎక్కువ దృష్టి పెట్టాను. ఖైదీలకు కంటి ఆపరేషన్లు చేయించడానికి హోమ్ మంత్రి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ‘జైలు నుంచి సరోజినీదేవి కంటి ఆసుపత్రికి తీసుకెళ్లి, ఆపరేషన్ చేయించి కోలుకున్న తర్వాత తిరిగి జైల్లో దించడంలో ఏ మాత్రం తేడా జరిగినా నువ్వు జైల్లో ఉండాల్సి వస్తుందమ్మా జాగ్రత్త’ అని హెచ్చరించారు అప్పటి హోమ్ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి. విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ప్రశంసల వర్షం కురిపిస్తుంటే కానీ నేను చాలా పెద్ద సాహసం చేశానని తెలియలేదు. నిస్వార్థంగా గోరంత సేవ చేస్తే ఆకాశమంత గౌరవం దక్కుతుందని తెలిసింది. పాతికేళ్లు నిండిన సామాజిక సేవలో వర్మీ కంపోస్ట్ సర్వీస్కు రాష్ట్రపతి నుంచి పురస్కారం అందుకోవడం, రామకృష్ణ మఠం నుంచి మదర్ థెరిస్సా పురస్కారం నా మది నిండిన జ్ఞాపకాలు’’ అన్నారీ సామాజిక ఉద్యమకారిణి.ఆటా సభల్లో కొత్త భారతంజీవితం అంటేనే సవాళ్లమయం. కష్టం వచ్చిందని ఏ ఆడపిల్లా చనిపోకూడదు... తమ కాళ్ల మీద తాము నిలబడాలి, కష్టపెట్టిన వాళ్లు తలదించుకునేలా జీవించి చూపించాలనేదే నా సందేశం. అందుకే నా సర్వీస్లో హెల్త్, ఎడ్యుకేషన్, ఎకనమిక్ ఎంపవర్మెంట్ మీద దృష్టి పెట్టాను. సివిల్స్ ప్రిపరేషన్ కోసం హైదరాబాద్కు వచ్చిన పేదింటి ఆడపిల్లలకు ఉచితంగా బస, భోజనం అందిస్తున్నాను. మా తరంలో మహిళలకు అందని అభివృద్ధిని ఈ తరం యువతుల్లో చూస్తున్నాను. అయితే మనదేశంలో ఆడవాళ్లు ఎంత చదివినా, ఎంత పెద్ద బాధ్యతలు నిర్వర్తిస్తున్నా సరే... ఇంటికి వచ్చేటప్పటికి ఆమె గృహిణిగా మారిపోవాల్సిందే. గరిట ఆమె కోసం చూస్తూ ఉంటుంది. 2012లో ఆటా సభలకు యూఎస్లోని ఆట్లాంటాకు వెళ్లినప్పుడు మనం కోరుకుంటున్న స్త్రీ సమానత్వాన్ని అక్కడ చూశాను. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటారు, ఇంటిపనులను పంచుకుంటారు. యువతరం ఆలోచనలు సున్నితత్వాన్ని సంతరించుకుంటున్నందుకు సంతోషం కలుగుతోంది.– శ్రీలక్ష్మి రెడ్డి, సోషల్ యాక్టివిస్ట్– వాకా మంజులారెడ్డి‘సాక్షి’ స్టేట్ బ్యూరోఫొటో: నోముల రాజేశ్రెడ్డి -
కొద్ది సేపు బ్రేక్ ఇచ్చే కిక్ వేరేలెవెల్..!
పని చేయటం, విశ్రాంతి తీసుకోవటం అనేవి జీవితంలో రెండు అత్యంత ప్రధాన విషయాలు. ఈ రెండింటిలో సమతుల్యత కలిగి ఉండటం అనేది నైపుణ్యతకు సంబంధించినది. ఈ రెండింటిపై సరైన పట్టు తెలిసి ఉండటమే జ్ఞానం. పనిచేయడంలో విశ్రాంతి, విశ్రాంతిలో కార్యచరణతను చూడటం అనేది అంతులేని స్వేచ్ఛని అందిస్తుంది.బ్రేక్ ప్రాముఖ్యత...కాలం అనేది ప్రవహించే నది లాంటిది. ఆనందంగా ఉన్న సమయాన్ని సైతం తన ప్రవాహంలో తీసుకుపోతుంది. కొన్నిసార్లు ఆ ప్రవాహంలో ముక్కుపుటాలవరకు మునిగిపోతాం. ఆ తర్వాత నది ఒరవడి తగ్గాక లేదా వరద ఉద్ధృతి తగ్గాక ఒడ్డుకి చేరుకుంటారు. అలేగా జీవితంలో కూడా ఒక్కోసారి సంపూర్ణంగా కాలంతో ఉండాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఒడ్డుకు చేరి కూర్చొని గమనించాలి కూడా. అలాగే జీవితంలో కూడా ఇలాంటి సమతుల్యతను పాటించాల్సిన అవసరం తప్పక ఉంది.సరైన కార్యాచరణే విశ్రాంతికి పునాది..!ఎంత ఎత్తైన భవనాన్ని నిర్మించాలన్నా దానికి సరైన పునాది లోతుగా ఉండాల్సిందే. వింటినారిని ఎంత భాగా వెనక్కు లాగితే అంతవరకు బాణం దూరంగా వెళ్తుంది. అలాగే మన పనులు ఫలవంతమై, విజయం సాధించాలంటే. మనకు సరైన సమయంలో తగిన విశ్రాంతి అంత అవసరం. ధ్యానం అంటే..ధ్యానం అంటే ఏం చేయకుండా ఉండే ఓ అద్భుత కళ. ఇది గాఢ నిద్రలో పొందే విశ్రాంతి కంటే విలువైనది. శ్వాస మీద ధ్యాస పెట్టే ఈ సుదర్శన క్రియ. మెదడులోని ఆల్ఫా, బీటా తరంగాలు రెండింటిని పెంచి, ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ హార్మోన్ను నియంత్రిస్తుంది. ఫలితం విశ్రాంతిగా ఉంటూనే అప్రమత్తంగా(ఎరుకగా) ఉంటాం. ఫలితంగా ఒత్తిడికి గురికాకుండా పనిచేయగలుగుతాం.బ్యాలెన్సింగ్ లైఫ్ కోసం..ధ్యానం వెనుకకు లాగిపట్టి లోలోపలకు తీసుకువెళ్లి..పరిస్థితుల నుంచి పారిపోనివ్వకుండా చేస్తుంది. ఇది సమతత్వాన్నిసాధించేందుకు చేసే అభ్యాసం. అంతరంగంలో ప్రశాంతత, బాహ్యంగా చైతన్యంగా ఉండేలా చేస్తుంది.ఇది అందరికి తప్పక అవసరమైనది. మనలో కలిగే సంఘర్షణలకు పరిష్కారం తోపాటు అంతరంగ శాంతికి ఇది ఎంతో సహాయపడుతుంది. ఎప్పుడైతే అంతరంగంలో ప్రశాంతత ఏర్పడుతుందో..సానూకూలంగా స్పందించగలుగుతాం. సున్నితంగా ఉంటూ సానకూలంగా వ్యవహరించడం అత్యంత అవసరం. ఎందుకంటే సున్నిత మనస్కులు చిన్న విషయాలకే ఆవేశ పడిపోతారు. అతిగా స్పందించేవారు ఇతరులు ఏమనుకుంటారనేది అనవసరం, తమ వైఖరే సరైనదనేది వారి నమ్మకం. అందువల్ల సున్నతత్తం స్పందించే మనసు రెండూ అవసరమే మనిషికి. ఈ నాగరిక సమాజంలో మనగలగాలంటే..సంబంధాలు, సమతుల్యత రెండూ అవసరం. ముఖ్యంగా మన భావ ప్రకటన సవ్యంగా ఉంటే ఎలాంటి ఘర్షణలకు తావుండదు.విరామపు శక్తని ఎలా పెంపొందించుకోవాలంటే..మొదటగా విరామం అవసరం అన్న ఆలోచనే మిమ్మల్ని విశ్రాంతిగా ఉండనివ్వదు. బాగా కష్టపడి పనిచేయాలన్న ఆలోచన అలసట తెప్పిస్తుంది.తక్కువ సమయమైనా విశ్రాంతి పునరుత్తేజాన్ని అందిస్తుంది. ధ్యానం చేసేందుకు నాకు ఏం అక్కర్లేదు, నేను ఏం కాను, ఏమి చేయడం లేదు అనే వాటిని వదిలేయండి. మూడు కాలం మిమ్మల్ని నియంత్రించేలా చేయకండి, సమయం సరిపోవటం లేదన్న ఆలోచనే వద్దు. చివరగా చేసే పనిలో తీసుకునే ఆహారంలో సమతుల్యత పాటించండి. ఇక్కవ విశ్రాంతి తీసుకున్నప్పుడు శక్తిపొందుతారు, పనిచేసినప్పుడూ శక్తిని వ్యక్తపరుస్తారు. ఈ రెండిటి కలయికే జీవితం.సృజనాత్మకత, చైతన్యానికి మూలం ధ్యానం..చివరగా ధ్యానం చేయండి, అది మిమ్మల్ని, మీ మనసుని శుభ్రపరిచి, పనిభారాన్ని స్వీకరించేందుకు సిద్ధం చేస్తుంది. మనసు విశ్రాంతి పొందినప్పుడే బుద్ధి పదునెక్కుతుంది.ప్రశాంతమైన, స్థిరమైన మనసు మందకోడిగా ఉంటుంది. అది ఉత్సాహానికి, సృజనాత్మకతకు నెలవుగా మారి, ప్రపంచంలోని అత్యుత్తమమైన వాటన్నింటిని పొందగలిగేలా చేస్తుంది. -
సరికొత్త టెక్నాలజీతో మోకాళ్ల నొప్పులకు ఉపశమనం..! నాగార్జున సైతం..
మోకాళ్లు నొప్పులు ఎంతలా వేధిస్తాయో చెప్పాల్సిన పనిలేదు. బాధితులు తాళలేక ఎంతలా ఇబ్బంది పడతారనేది మాటలకందనిది. టాలీవుడ్ నటుడు నాగార్జున సైతం తానుకూడా ఆ సమస్యతో 15 ఏళ్లుగా బాధపడుతున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.వాళ్ల అమ్మ కూడా ఆ సమస్యతో బాధపడేదని, తన బాధను చూడలేపోయేవాడినని అన్నారు. అభివృద్ధి చెందిన టెక్నాలజీతో తనకు కొంత ఉపశమనం లభించిందని అన్నారు. అదెలాగో నటుడు నాగార్జున మాటల్లోనే తెలుసుకుందామా..!.మా అమ్మకు మోకాళ్ల నొప్పులు తీవ్రంగా ఉండేవి. దీంతో అప్పట్లో ఆమె బాధ చూడలేకపోయేవాడిని.. నొప్పులతో ఓ వైపు అమ్మ బాధ పడుతుంటే.. ఆమెను చూసిన నాకు ప్రాణం విలవిలలాడిపోయేది. ఇప్పటి మాదిరిగా అప్పట్లో ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందుబాటులో లేకపోవడం నన్ను బాధించింది.. ప్రస్తుతం నగరంలో ఈ మోకాళ్ల నొప్పులకు స్కైవాకర్ ఆర్థోపెడిక్ రోబోటిక్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది.. అని ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున అన్నారు. భాగ్య నగరంలోని గచ్చిబౌలిలో ఓ ప్రముఖ ఆస్పత్రికి చెందిన స్కైవాకర్ ఆర్థోపెడిక్ రోబోటిక్ టెక్నాలజీని బంజారాహిల్స్లోని లీలా గ్రాండ్లో మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఈ టెక్నాలజీ గురించి పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. ‘రోజులు మారుతున్న కొద్దీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. శరీరంలో కృత్రిమ అవయువాలు అమర్చడం, అవయవ మార్పిడి వంటి చికిత్సలు విజయవంతంగా చేపడుతున్నారు. గతంలో ఇటువంటి వైద్య సేవలు అందుటులో ఉండేవి కావు. దీంతో బాధితుల కష్టాలు వర్ణణాతీతం. ఇందుకు మా అమ్మే ఉదాహరణ. నా కళ్ల ముందు అమ్మ బాధపడుతుంటే చూడలేకపోయేవాడిని. ఆర్టిఫిషియల్ అవయవాలు అందుబాటులోకి వచ్చిన తరువాత పెయిన్ ఫ్రీ లైఫ్ చూస్తున్నాం. ప్రయాణ సమయంలో, ఎయిర్ పోర్టులు, ఇతర ప్రదేశాల్లో మోకాళ్ల నొప్పులతో చాలా మంది బాధపడుతుంటారు. నడవడానికి ఇబ్బంది పడుతుంటారు. కొత్త టెక్నాలజీ గౌరవంగా బతకడానికి ఎంతో ఉపయోగకరంగా మారింది.. ప్రస్తుత పరిస్థితుల్లో శరీరానికి ఫిట్నెస్ అవసరం. అదే మంచి జీవితాన్ని అందిస్తుంది. కులూమనాలీ షూటింగ్ సమయంలో నీ పెయిన్ సివియర్గా బాధించింది. కుంటుకుంటూ వెళ్లాను. అమ్మను చూసిన తరువాత నాకు ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదనిపించింది. నా స్నేహితులు డా.ప్రభాకర్ గురించి చెప్పారు. ట్రీట్మెంట్ తీసుకున్నాక ఐదేళ్ల నుంచి ఎలాంటి ఇబ్బందీ లేదు’అని నాగార్జున తెలిపారు. అక్కడి నుంచి ఏదైనా కొత్తగా మందులు, టెక్నాలజీ వస్తే పరస్పరం షేర్ చేసుకుంటాం. స్కైవాకర్ బిగ్ హీల్ ఫర్ మీ అని పేర్కొన్నారు నాగార్జున . కార్యక్రమంలో ఆరిట్ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. (చదవండి: వెయిట్ లిఫ్టింగ్తో కంటి చూపుకే ముప్పు..! హెచ్చరిస్తున్న వైద్యులు) -
వెయిట్ లిఫ్టింగ్తో తస్మాత్ జాగ్రత్త..! వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్
చాలామటుకు ఆర్థోపెడిక్ సమస్యలు ఉన్నవారు, పెద్దవాళ్లు వెయిట్లిప్టింగ్తో ఫిట్గా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఆ మోకాళ్ల సమస్యల నుంచి బయటపడుతున్నారు కూడా. కానీ ఒక్కోసారి ఇలాంటి వెయిట్ లిఫ్టింగ్లు అనుకోని సమస్యలు కూడా తెచ్చుపెడుతుందట. భారీ వెయిట్ లిఫ్టింగ్లు ఎత్తితే కంటి చూపే పోయే ప్రమాదం ఉంటుందట. ఇది చాలా అరుదుగా సంభవించే గాయమట. ఇలా ఎందుకు జరుగుతుంది..? ఫిట్నెస్ కోసం చేసే వ్యాయామాలు కంటిచూపుపై ప్రభావం చూపించడానికి రీజన్.27 ఏళ్ల ఆరోగ్యవంతమైన వ్యక్తి భారీ వెయిట్ లిఫ్టింగ్ ఎత్తిన వెంటనే ఆకస్మికంగా దృష్టికోల్పోయాడు. ఒక సాధారణ జిమ్ సెషన్ కాస్తా అత్యవసర వైద్య పరిస్థితిగా మారింది. నిజానికి అంతకుమునుపు అతడి కంటికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు కూడా లేవు. జిమ్లో డెడ్లిఫ్ట్ సమయంలో ఒత్తిడికి గురైన వెంటనే ఆ వ్యక్తికి దృష్టి సమస్యలు మొదలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా కుడి కంటిలో అస్పష్టత ఉందని, ఎడమకన్ను సాధారణంగా ఉందని చెప్పారు. అయితే ప్రభావిత కంటిలో దృష్టిలోపం గణనీయంగా ఉందని చెప్పారు. వ్యాయమాం చేసిన వెంటనే ఎంత అకస్మికంగా ఇబ్బందిగా అనిపించిందో వైద్యులకు వివరించాడు. అది ఎలాంటి నొప్పి లేకుండా ఒక గందరగోళంలా జరిగిందని అన్నాడు. ఎందువల్ల ఇలా అంటే..అతనికి దట్టమైన ప్రీ రెటీనా ఉందని, దీనిని సబ్హైలాయిడ్ హెమరేజ్ అని కూడా పిలుస్తారు. ఇది మాక్యులా పైన ఉంటుంది. ఇది పదునైన దృష్టికి కారణమయ్యే రెటీనా కేంద్ర భాగం. దీన్ని క్షణ్ణంగా స్కాన్ చేయగా ఆ రోగికి విట్రియస్ హెమరేజ్ ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. ఇది ఆకస్మికంగా భయపడినప్పుడూ లేదా తీవ్రమైన బరువు ఎత్తడం వల్ల వస్తుందట. ప్రస్తుతం ఈ రోగి ఎదుర్కొంటున్న సమస్యను 'వల్సాల్వా రెటినోపతి'గా పేర్కొన్నారు. వల్సాల్వా రెటినోపతి అంటే..వల్సాల్వా రెటినోపతి అనేది రెటీనా రక్తస్రావం. ఇది దగ్గు, ఎత్తడం లేదా గట్టిగా వాంతు చేసుకున్నప్పుడూ..ఛాతీ ఒత్తిడిలో అకస్మాత్తుగా పెరుగుదల కారణంగా రెటీనా కేశనాళికలు పగిలిపోయి కంటిలో రక్తస్రావం కలుగుతుందట. దాంతో అకస్మాత్తుగా, నొప్పిలేకుండా దృష్టి నష్టానికి దారితీస్తుంది. సాధారణంగా ఇలాంటి సమస్య కాసేపటి తర్వాత దానంతట అదే తగ్గిపోతుంది. కానీ కొన్నిసార్లు తీవ్రంగా ఉంటే లేజర్ లేదా శస్త్రచికిత్స అవసరం అవుతుంది. బరువులు ఎత్తడం, వాంతులు లేదా లైంగిక కార్యకలాపాలు వంటి కార్యకలాపాల తర్వాత ఆరోగ్యంగా ఉన్నవారిలో కూడా ఈ సమస్య అత్యంత సాధారణం అని చెబుతున్నారు.ఇది ఎందువల్ల అంటే ఏదో తెలియని ఒత్తిడి ఫలితం ఇలాంటివి సంభవిస్తాయని చెబుతున్నారు. ఇది ఎక్కువగా ఆరోగ్యకరమైన చురుకైన వ్యక్తులనే ప్రభావితం చేస్తుందట. లక్షణాలునిపుణుల అభిప్రాయం ప్రకారం, దృష్టిలో అకస్మాత్తుగా తగ్గుదల, తరచుగా ఒక కంటిలో. రోగులు వారి కేంద్ర దృష్టిలో ఒక చీకటి మచ్చ లేదా నీడను గురించి వివరిస్తారు. దాన్ని కొన్నిసార్లు సిరా మచ్చ లేదా అద్దాలపై మరకలా ఉందని చెబుతుంటారు. అస్పష్టమైన లేదా వక్రీకరించబడిన దృశ్య క్షేత్రాలు, తేలియాడే మచ్చలు అరుదుగా, గణనీయమైన రక్తస్రావం జరిగితే తేలికపాటి అసౌకర్యంముఖ్యంగా శారీరక శ్రమ లేదా శ్రమ తర్వాత మీ దృష్టిలో ఆకస్మిక మార్పులను మీరు గమనించినట్లయితే అత్యవసర అంచనాను పొందడం చాలా అవసరం.ఎలా చికిత్స చేస్తారంటే..ఈ పరిస్థితికి చికిత్స చేయడం అంటే.. రక్తస్రావంను సురక్షితంగా, వేగంగా క్లియర్ చేసి, దృష్టిని పునరుద్ధరించడం. అలాగే శాశ్వత రెటీనా నష్టాన్ని నివారించడం అని వైద్యులు అంటున్నారు. చిన్నపాటి రక్తస్రావం కోసం, రోగి దృష్టి, రెటీనా ఆరోగ్యాన్నినిశితంగా పరిశీలించి చికిత్స అందించడం జరుగుతుంది. .యాగ్ లేజర్ చికిత్సరక్తం లోపలి పరిమితి పొర కింద చిక్కుకున్నప్పుడు, YAG లేజర్ చికిత్సను సూచిస్తారు వైద్యులు. అరుదుగానే శస్త్ర చికిత్స అవసరం అవుతుందని చెప్పుకొచ్చారు వైద్యులు. . -
దేవుడి ఖజానా ఏమైంది?
బృందావన్లోని ప్రసిద్ధ బాంకే బిహారీ మందిరంలో దేవుడికి నైవేద్య సమయాల్లో గందరగోళం ఏర్పడింది. అందుకు కారణం ఆలయంలో చెల్లింపులతో కూడిన "ప్రత్యేక పూజలు" చేయడానికి భక్తులను అనుమతించడమేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నిరంతర పూజల వల్ల కృష్ణుడి విశ్రాంతి వేళలు లేకుండాపోయాయని మండిపడింది. అంతేగాదు కాసులకు కక్కర్తిపడి ఇలా చేస్తున్నారా అంటూ ఆలయ అధికారులపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో ఇలానే సుప్రీం కోర్టు పర్యవేక్షణలో తెరిచిన ఆలయ ఖజనా వివాదానికి సంబంధించి.. పలు ఆసక్తికర విషయాలు గురించి తెలుసుకుందామా..!1862లో రాజస్తానీ శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఉత్తరప్రదేశ్లోని బృందావన్ బాంకే బిహారీ ఆలయం శ్రీకృష్ణ భక్తులకు అత్యంత పవిత్రమైన స్థలాలలో ఒకటి. ఇది ఆధ్యాత్మికతతో నిండిన ప్రదేశం. ఈ ఆలయంలో కృష్ణుడిని బాంకే బిహారీగా పూజలందుకుంటాడు. అంటే ఇక్కడ కృష్ణుడు బాల రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే..గంటలు మోగించరు, హారతులు ఇవ్వరు. భక్తి శ్రద్ధలకు అంతరాయం కలగకుండా ఉండేందుకే ఇలా చేస్తుంటామని ఆలయ పూజారులు చెబుఉతున్నారు. ఏడాదిలో ఒక్కసారి అదికూడా అక్షయ తృతియ రోజున మాత్రమే భక్తులు బాల కృష్ణుని పాదాలను దర్శించుకునే భాగ్యం లభిస్తుందట.ఖజానా వివాదం..అనంతపద్మనాభుని ఆలయంలో మూసి ఉన్న గదిలాంటిదే బృందావన్లోని బాంకే బిహారి ఆలయంలో కూడా ఉంది. అందులో ఎన్నో నిధులు ఉన్నాయని అంతా అనుకునేవారు. ఆ గదిని అక్టోబర్ 2025లో, సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్ పర్యవేక్షణలో తెరిచారు. నిజానికి ఈ గది 1970ల నుంచి మూసివేసే ఉంది. సుమారు 54 ఏళ్ల తర్వాత తెరిచే ప్రయత్నం చేస్తే అదికాస్త పెను వివాదాంశమైంది. అయితే ఆ గదిలో ప్యానెల్ సభ్యులు రాగి కూజాలు, రాళ్లు, చెక్కపెట్టే, మూడు వెండి కడ్డీలు, ఒక బంగారు కడ్డీ,కొన్ని పాత్రలు మాత్రమే కనిపించాయని పేర్కొన్నారు. అయితే అదంతా అబద్ధమంటూ పూజారులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విలువైన ఆభరణాలు, శతాబ్దాల నాటి కానుకలు అపహరణకు గురయ్యాయని, ప్యానెల్ సభ్యులు తప్పదారి పట్టిస్తున్నారంటూ కృష్ణ భక్తులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. పారదర్శకత కోసం ప్రత్యక్షప్రసారంలో ఆ గది తనిఖీని ప్రసారం చేయాల్సిందిగా డిమాండ్ కూడా చేశారు. అంతేగాదు ఆలయ సంపద దుర్వినియోగం చేయబడిందనే అనుమానాలు వెల్లువెత్తాయి. దీంతో ఇప్పటికీ ఆ ఆలయ ఖజనా విషయం ఓ వివాదాస్పదమైన మిస్టరీగా మిగిలిపోయింది. దీనిపై సీబీఐ దర్యాప్తుకి ఆదేశించాలని కోరుతూ ప్రధాని మంత్రికి లేఖ సైతం రాశారు. విశేషం ఏంటంటే..ఈ బృందావన్లో ఉన్న కృష్ణుడి ఆలయానికి భారీగానే ఆర్థిక వనరులున్నాయి. ఏకంగా రూ. 400 కోట్ల వరకు బ్యాంకు డిపాజిట్లు, సీలు వేసిన లాకర్లు, భూమి కమతాలు, భారీ విరాళల రికార్డులు ఆడిట్లో ఉన్నట్లు నివేదికలు పేర్కొనడం విశేషం. కాగా, అపహరణకు గురైన ఆస్తులపై తొలి పూర్తిస్థాయి ఆడిట్ని నిర్వహించాలని సుప్రీం కోర్టు ప్యానెల్ ఆదేశించింది.(చదవండి: నెలగంట కట్టడం అంటే..? అది పండుగ రాకకు సంకేతమా..?) -
'అయ్ బాబోయ్ ఎంత పొడుగో'..!
అత్యున్నత హోదాలో ఉండి అంతే శారీరక ధృడత్వంతో మంచి ఎత్తుతో ఉంటే..కళ్లు తిప్పుకోలేం కదూ. అబ్బా పదవికి తగ్గ ఫిజిక్ అన్న ఫీల్ కలుగుతుంది. అలాంటి అనుభవమే ఎదురైంది ఇటాలియన్ ప్రధాని మోలోనికి. ద్వైపాక్షిక సమావేశం కోసం వచ్చినప్పుడూ ఆ దేశ అధ్యక్షులు ఘనంగా ఆహ్వానం పలకడం కామన్. అలానే మొజాంబిక్ దేశ అధ్యక్షుడకి చక్కగా ఆహ్వానం పలికింది ఇటలీ దేశం . అయితే ఆ దేశ అధ్యక్షుడిని చూడగానే ఒక్కక్షణంలో ఇటలీ ప్రధాని మెలోని రియాక్షన్ మారిపోయింది. అది స్పష్టంగా వీడియోల్లో కనిపిస్తోంది కూడా. అంతేగాదు వారిద్దరిని కెమెరాలో బంధించడానికి ఫోటోగ్రాఫర్లు సైతం ఇబ్బంది పడ్డారు. అసలేం జరిగిందంటే గతవాంర మొజాంబిక్ అధ్యక్షుడు డేనియల్ చాపో రోమ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన్కు స్వాగం పలికేందుకు వచ్చిన ఇటలీ ప్రధానికి మెలోని ఒక్కసారిగా కంగుతింటుంది. ఎందుకంటే డేనియ చాపో ఎత్తు చూసి ఆశ్చర్యపోతుంది. ఒక్కసారిగా అతనికి కరచాలనం చేయడానికి కూడా తడబడుతుంది. చెప్పాలంటే ఆమె ముఖంలో ఇంత పొడుగా అని విస్తుపోతున్నట్లు హవభావాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆమె మనసులో ఏదో అనుకుంటూ ఇబ్బందిగా మొజాంబిక్ అధ్యక్షుడు చాపోకి కరచాలనం ఇవ్వడానిక వస్తున్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది. అంతేగాదు అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్లుకు సైతం ఇద్దర్నీ ఒకే ఫోటోఫ్రేంలో బంధించడం చాలా సవాలుగా మారుతుంది. ఎందుకంటే అత్యున్నత హోదాలో ఉన్నవారి శారీరక ఎత్తులలో మరి ఇంత వ్యత్యాసం కనపడుకుండా కవర్ చేసేందుకు నానాతంటాలు పడ్డారు ఫోటోగ్రాఫర్లు. కానీ అది దాదాపు అసాధ్యం.ఎందుకంటే మొజాంబిక్ అధ్యక్షుడు డేనియ్ చాపో ఎత్తు ఏకంగా 6'8 కాగా, మెలోని ఎత్త కేవలం 5'2. నెట్టంట అందుకు సబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక ద్వైపాక్షిక సమావేశంలో ఇరువురు ఇటలీ మాట్టేయి ప్లాన్ ఫర్ ఆఫ్రికా శక్తి, వాణిజ్యం, సహకారం వంటి వాటిపై చర్చలు జరిపారు. కాగా, తన దేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత జన్మించిన మొజాంబిక్ అధ్యక్షుడు డేనియల్ చాపో అధ్యక్ష ఎన్నికల్లో దాదాపు 70 శాతం మెజార్టీ ఓట్లతో ఈ ఏడాది ప్రారంభంలోనే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం గమనార్హం.Ho ricevuto oggi a Palazzo Chigi il Presidente della Repubblica del Mozambico, Daniel Francisco Chapo.In particolare il colloquio, nel ricordare il cinquantesimo anniversario dell’indipendenza mozambicana e dello stabilimento delle relazioni diplomatiche, ha confermato la… pic.twitter.com/hI8kH3pFfO— Giorgia Meloni (@GiorgiaMeloni) December 11, 2025 (చదవండి: హనుక్కా పండుగ అంటే..? యూదులు ఎందుకింత ఘనంగా జరుపుకుంటారంటే..) -
గుర్రపుడెక్కతో కళాకృతులు..!
గుర్రపుడెక్క (వాటర్ హైసింత్)... నదీ ప్రవాహాలు, చెరువులు, కుంటల్లో సహజంగా పెరిగే కలుపు మొక్క. నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించడం, నీటి కాలుష్యానికి కారకమవుతుండడంతో వీటి పెరుగుదలను నివారించేందుకు స్థానిక సంస్థలు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇదే సమస్య గోదావరి జిల్లాలు, ముఖ్యంగా నది పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. కానీ అస్సాం సరికొత్త ఆలోచనతో చూపిన పరిష్కార మార్గం అన్ని రాష్ట్రాలకు ఉపయోగపడటమే గాక నదులు, చురువులు పరిశుభ్రంగా ఉంటాయి కూడా. మరి అస్సాం ఎలా ఈ గుర్రపుడెక్క సమస్యకు అర్థవంతంగా పరిష్కారం మార్గం చూపిందో తెలుసుకుందామా..!ఎన్నో అనర్థాలకు దారితీసే ఈ కలుపు మొక్కను అర్థవంతంగా మార్చి మహిళలకు పని కల్పిస్తూ దాని ద్వారా వారి ఆర్థిక చేయూతకు బాటలు వేసింది అస్సాం స్టేట్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ (ఏఎస్ఆర్ఎల్ఎం). ఈ గుర్రపు డెక్కను పెకిలించి వాటిని ప్రాసెస్ చేస్తూ ఎన్నో కళాకృతులను తయారు చేసేందుకు పెద్ద కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అస్సాం రాష్ట్రం మాజూలీ ద్వీపంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఏఎస్ఆర్ఎల్ఎం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తూ వారికి కళా ఉత్పత్తుల తయారీలో మెరికలుగా తీర్చిదిద్దుతోంది. ఈ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో వ్యాపారాన్ని విస్తృతం చేసేందుకు వ్యూహాత్మక కార్యాచరణకు సిద్ధమవుతోంది.బ్రహ్మపుత్రలో విరివిగా...ప్రపంచంలోని ఐదు అతిపెద్ద నదుల్లో బ్రహ్మపుత్ర ఒకటి. ఊహకందని వేగం, ప్రవాహం దాని సొంతం. దాదాపు ఏడాది పొడవునా ఈ నది ప్రవహిస్తూనే ఉంటుంది. అస్సాం రాష్ట్రంలోని మెజార్టీ ప్రాంతంలో ఈ నది ప్రవహిస్తుండగా... మాజూలీ ద్వీపం చుట్టూ విస్తరించి ఉండడం... నీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడంతో వాటర్ హైసింత్ కూడా ఇక్కడ దట్టంగా అల్లుకుని ఉంటుంది. ఈ పరిస్థితే ఇక్కడి మహిళా సంఘాలకు ఒక అవకాశంగా పరిణమించింది. అస్సాం గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన ప్రత్యేక వ్యూహంతో కళా ఉత్పత్తుల తయారీకి కీలక మలుపుగా మారింది.మూడు దశల్లో ప్రక్రియ...వాటర్ హైసింత్ నుంచి కళా ఉత్పత్తుల తయారీ నాలుగు దశల్లో ఉంటుంది. ముందుగా నది నుంచి వాటర్ హైసింత్ సేకరణ మొదటి దశలో చేపడుతుండగా... రెండోదశలో వాటి ఆకులను కత్తిరించి ఆరబెట్టడం... పొడిగా మారిన తర్వాత అల్లికకు అనువుగా మార్చేలా ప్రాసెస్ చేయడం... ఆ తర్వాత వాటిని మహిళలకు అందించే కళాత్మక పనులను కొనసాగించడం... తయారైన వస్తువులను మార్కెటింగ్ చేయడం లాంటి ప్రక్రియను మహిళా సంఘాల ద్వారా నిర్వహిస్తారు. అల్లికల ద్వారా పర్సులు, బుట్టలు, టేబుల్ మాట్స్, హ్యాండ్ బ్యాగులు, ల్యాప్టాప్ బ్యాగులు, బాటిల్ కేరియర్లు, హోమ్ డెకర్ ఐటమ్స్ను తయారు చేస్తున్నారు. తయారైన తర్వాత వాటికి పాలిషింగ్ చేయడంతో ఎంతో ఇంపుగా కనిపిస్తాయి. ఇవి పూర్తిగా పర్యావరణ హితమైనవి కావడంతో మార్కెట్లో వీటికి క్రేజ్ ఉంది. అయితే ఈ తయారీ ప్రక్రియంతా ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల పర్యవేక్షణలోనే జరుగుతుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ ప్రారంభ దశలో ఉన్నప్పటికీ... ఉత్పత్తి సామర్థ్యం పెరిగిన తర్వాత ఇతర ప్రాంతాలకు సైతం ఎగుమతి చేసేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అస్సాంలోని మాజూలీ నుంచి – చిలుకూరి అయ్యప్ప, సాక్షి (చదవండి: ఆ కారు కొన్నప్పుడు బాధపడ్డా..కానీ అదే నా బిడ్డ ఆరోగ్యానికి శ్రీరామరక్ష..!) -
మనసు దోచే వరమాల..! పూలతో చేసింది కాదు..
ఈ వెడ్డింగ్ సీజన్ ట్రెండ్... ‘క్రోచెట్ వరమాల’. కాస్త వెనక్కి వెళితే... వివాహం చేసుకోబోయే ఒక జంట నుంచి ఒక మహిళకు ‘వరమాల’ తయారుచేయాల్సిందిగా ఆర్డర్ వచ్చింది.‘ఎప్పుడూ పూలతోనే చేస్తే ఏం వెరైటీ ఉంటుంది. కొత్తగా చేయాలి’ అని ఆలోచించింది. ఆమె ఆలోచనలో నుంచి వచ్చిందే... క్రోచెట్ వరమాల. మృదువైన రంగుల ఉన్ని దారాలను ఉపయోగించి ఆమె తయారుచేసిన ‘వరమాల’ ఆహా అనిపించింది. వరమాల మేకింగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తరువాత ఈ వరమాలకు ‘క్రోచెట్ వరమాల’గా పేరు వచ్చింది. ఆ తరువాత ట్రెండ్గా మారింది. ఇలాంటి అందాల వరమాలను మీరు కూడా తయారుచేయాలనుకుంటున్నారా? ‘క్రోచెట్’ హ్యాండిల్తో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోను చూసి నేర్చుకోండి. వధూవరులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వండి!. View this post on Instagram A post shared by Hot_Knot (@hot_knot_by_sumee) (చదవండి: నెలగంట కట్టడం అంటే..? అది పండుగ రాకకు సంకేతమా..?) -
పిల్లల్ని కలిసే హక్కు తండ్రిగా నాకు లేదా?
నాకు ఇద్దరు కూతుళ్ళు. వయసు 8ఏళ్ళు, 6 ఏళ్ళు. మేము విడిపోయి 2 సంవత్సరాలవుతోంది. పిల్లలు నా భార్య వద్దనే ఉన్నారు. వాళ్లని చూడాలని ఉంది కానీ ఆమె నాకు చూపించకపోగా నామీద క్రిమినల్ కేసు, మెయింటెనెన్స్ కేసు వేసింది. పిల్లల్ని చూడాలంటే వారికి నానుంచి హాని ఉంది అని చెప్తుంది. పిల్లల్ని ఒకసారి కోర్టుకు తెస్తే, జడ్జిగారికి పిల్లల చేత ‘మా నాన్న మంచివాడు కాదు’ అని చెప్పించారు. నిజానికి పిల్లలు నాతో చాలా బాగా ఉండేవారు. తండ్రిగా పిల్లల్ని కలిసే హక్కు నాకు లేదా? నాతో ఎంతోబాగుండే పిల్లలు ఇలా అయ్యారు అంటే, తనే నేర్పించింది అని అనిపిస్తుంది. ఏం చేయాలో చెప్పగలరు.– సంపత్, విశాఖపట్నంఇది మీ ఒక్కరి సమస్య మాత్రమే కాదు. చాలా కేసులలో ఇలాంటి ధోరణి చూస్తుంటాము. అనేక కారణాలు ఉంటాయి. ‘‘తండ్రిగా పిల్లల్ని కలిసే హక్కు నాకు లేదా?’’ అని అడిగారు. తల్లిదండ్రులకి పిల్లలపై హక్కు మాత్రమే కాదు బాధ్యత ఉంటుంది. తల్లితండ్రుల ప్రేమ, ఆదరణ సమానంగా పొందే హక్కు పిల్లలకు ఉంటుంది. అంటే ప్రథమంగా అది పిల్లల హక్కు. మీ హక్కు కాదు. చట్టాలు చిన్నపిల్లల శ్రేయస్సు కోసమే ఉన్నాయి. వారి శ్రేయస్సు ముందు ఎవరి హక్కు అయినా చిన్నదే! భార్యాభర్తలు విడిపెయిన సందర్భాలలో పిల్లలను ఆయుధంగా వాడుకోవాలి అనుకోవడం దాదాపుగా అన్ని కేసులలో చూస్తుంటాము. అది తప్పు. భార్యాభర్తలు ఒకరికొకరు మంచివారు కాక΄ోయి ఉండొచ్చు. అంతమాత్రాన మంచి తల్లిదండ్రులు కాదని చెప్పలేము. విడి΄ోయిన తర్వాత పిల్లలు ఎవరి దగ్గర అయితే ఉంటారో వారు సాధారణంగానే అవతల వారిపై వ్యతిరేక భావనను పిల్లలలో పెంచుతుంటారు. విజ్ఞత కోల్పోతుంటారు. చిన్నారుల పసి హృదయాలపై వారు ఎంత ప్రభావం చూపిస్తున్నారో అర్థం చేసుకోలేనంత స్థాయిలో ప్రవర్తన మారి΄ోతూ ఉంటుంది. మీ విషయానికి వస్తే, రెండు సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్న మీరు పిల్లలు కావాలి అని కేసు ఎందుకు వేయలేదు? పిల్లల శ్రేయస్సు కోసం మీరు ఏం చేశారు? మీ బాధ్యతలను మీరు నిర్వర్తిస్తున్నారా? ఇలాంటివి కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది. కేసులో లబ్ధి కోసం ఉన్నట్లుండి పిల్లలపై ప్రేమ ఉన్నట్టు చూపించుకోవాలి అనుకుంటే కోర్టులు నమ్మవు! ఇప్పటికైనా పిల్లలపై బాధ్యతను నెరవేరుస్తూ, వారికి కస్టడీ మీకు కూడా కావాలి అని గార్డియన్స్ అండ్ వర్డ్స్ చట్టం కింద కేసు వేయవచ్చు. పిల్లల అభిప్రాయాలను బలవంతంగా మార్చారు అని మీరు ఖచ్చితంగా అనుకుంటే, మీ ఇద్దరు పిల్లలను సైకాలజిస్ట్ వద్దకు పంపాలి అని మధ్యంతర దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అందుకు తగిన కారణాలను చూపాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు ఎవరైనా పిల్లల మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకొని వారితో మాట్లాడాలి. తల్లిపైన లేదా తండ్రిపైన విష ప్రచారం చేయకూడదు. అలా చేస్తున్నవారికి నా విన్నపం ఏంటంటే: మీరు కేసులు గెలవచ్చు కానీ మున్ముందు పిల్లల భవిష్యత్తును కోల్పోతారు. జాగ్రత్త వహించాలి. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు.) (చదవండి: అలాంటి శోకం ఎవ్వరికి వద్దని..30 ఏళ్లుగా ట్రాఫిక్ పోలీసుగా సేవ!) -
గాన మాధుర్యంతో దూసుకుపోతున్న అమిత
విశాఖపట్నం: పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టుగా, చిన్న వయసులోనే తన పాటలతో ఎందరో అభిమానులను సంపాదించుకుంది పీఎం పాలేనికి చెందిన చింతకాయల అమిత. ప్రస్తుతం బీటెక్ చదువుతున్న ఈ యువ గాయని తన మధురమైన గాత్రంతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది. ఐదో తరగతి చదువుతున్నప్పుడే పలు టీవీ షోలలో పాల్గొని తన గాత్ర మాధుర్యాన్ని పరిచయం చేసింది. ఏ పాటనైనా అవలీలగా ఆలపిస్తూ, అంచెలంచెలుగా తన ప్రస్థానాన్ని ముందుకు సాగిస్తోంది. తాత నుంచి వారసత్వంగా సంగీతం అమిత తాతయ్య..పూర్ణ చంద్ర రావు ప్రముఖ సంగీత విద్వాంసులు, హార్మోనీ ప్లేయర్గా మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి. ఆయన స్ఫూర్తితోనే అమిత శ్రీకాకుళంలో గురువు దుర్గా ప్రసాద్ వద్ద సంగీతాన్ని నేర్చుకుని తన కళకు మెరుగులు దిద్దుకుంది. సంగీతం నేర్చుకుంటున్న సమయంలో ఐదో తరగతి చదువుతుండగా ఒక చానల్లో నిర్వహించిన ‘అమూల్ బోల్ బేబీ బోల్’ కార్యక్రమంలో పాల్గొని మొదటిసారిగా తన ప్రతిభను చాటుకుంది. ఆరో తరగతి చదువుతున్నప్పుడు మరో టీవీ చానల్లో నిర్వహించిన ‘సరిగమప లిటిల్ చాంప్స్’ లో పాల్గొని రన్నరప్గా నిలిచింది. 2023లో ప్రసారమైన ‘సూపర్ సింగర్’ టీవీ షోలో ఫైనలిస్ట్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ‘ఖడ్గం’ సినిమాలోని ‘అహ అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయే’ పాటకు స్టేజీపై పాడుతూ మంచి గుర్తింపు పొందింది. మిలియన్ వ్యూస్తో దూకుడు అమిత తాను పాడిన పాటలతో ఎందరినో ఆకట్టుకోవడమే కాకుండా, ప్రైవేట్ ఆల్బమ్స్తోనూ తన ప్రతిభను మరింత చాటుకుంది. ‘విడలేని ప్రేమని’, ‘రాయే రాయే పిల్లా’, ‘ముద్దుముద్దు గుంటడే నా బావగాడు’ వంటి పాటలతో సోషల్ మీడియాలో సైతం తన అభిమానులను పెంచుకుంది. ఈ పాటలు ప్రతిదీ మిలియన్ వ్యూస్తో దూసుకుని పోతున్నాయి. ఇటీవల విడుదలైన ‘ఉతుకు పిండు ఆరేయ్’ చిత్రంలో పాటతో మరోసారి తన గాత్ర ప్రత్యేకతను చాటుకుంది.సినిమాల్లో అవకాశం ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల్లో పాటలు పాడే అవకాశం లభించినట్లు అమిత తెలిపింది. తన తండ్రి అంబేడ్కర్, విజయనగరం సర్కిల్ ఇన్స్పెక్టర్, తల్లి గౌరి తనకు అన్ని విధాలా సహకారం అందిస్తున్నారని పేర్కొంది. ఒకవైపు బీటెక్ చదువుతూనే, మరోవైపు పాటలు పాడుతూ, గ్రూప్స్లో ఉత్తీర్ణత సాధించడం తన లక్ష్యమని చెప్పింది. సినిమాల్లో అవకాశాలు లభించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అమిత పేర్కొంది. -
అమ్మకు ‘కట్టుబాటు’
ఆమె తానొక స్త్రీ అనే మర్చిపోయింది. పల్లెటూళ్లో ఒక గొడ్డులా కష్టపడి ఇద్దరు కొడుకులను సాకింది. పల్లెటూరి పలుకుబడి... పల్లెటూరి కట్టుబడి... ఇవి మాత్రమే ఆమెకు తెలుసు. కొడుకు ప్రయోజకుడై నగరం అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ తల్లికి ఒక కండిషన్ పెట్టాడు. ఆమె సంస్కృతిని తక్కువ చేస్తూ బట్టలు కట్టుకునే పద్ధతి మార్చుకోవాలన్నాడు. తమిళంలో తాజాగా విడుదలైన ‘అంగమ్మాల్’ ఆలోచనలు రేకెత్తిస్తోంది.జీవితాంతం పంచె కట్టులో, భుజం మీద తుండుతో వ్యవసాయం చేస్తూ వచ్చిన తండ్రిని తన పెళ్లి కోసం ‘నువ్వు సూట్ వేసుకోవాల్సిందే నాన్నా’ అని కొడుకు పట్టుబడితే ఆ తండ్రికి ఊపిరి ఆడుతుందా? అసలు సూట్ వేసుకుని తిరగ్గలడా? బట్టలతోనా తండ్రికి గౌరవం? అయితే తండ్రి తొడుక్కునే బట్టలు ‘తక్కువ రకానివి’ అని నిర్ణయించేదెవరు?అలాగే జీవితాంతం రవికంటే ఏమిటో ఎరగక బండ చాకిరీ చేస్తూ వచ్చిన తల్లిని మాత్రం ‘నువ్వు నా పెళ్లి సందర్భంగా రవిక తొడగాల్సిందే’ అని కొడుకు పట్టుబడితే?ఆ తల్లి ఏం చేస్తుంది? ఏం చేయాలి? అటు కొడుకు మథనం... ఇటు తల్లి అంతర్మథనం. వెరసి ‘అంగమ్మాల్’ చిత్ర కథనం. తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ రాసిన ‘కొడు తుని’ అనే కథ ఆధారంగా దర్శకుడు విపిన్ రాధాకృష్ణన్ తెరకెక్కించిన చిత్రం ఇది. దిగ్దర్శకుడు కె.బాలచందర్ కోడలైన గీతా కైలాసం ఈ చిత్రంలో ప్రధాన పాత్ర ‘అంగమ్మాల్’గా నటించారు. ఆమె పెద్దకొడుకుగా భరణి, చిన్నకొడుకుగా శరన్ శక్తి నటించారు. భర్త పోయిన తర్వాత ఇద్దరు కొడుకుల్ని కడుపులో దాచుకుని సాక్కున్న తల్లి అంగమ్మాల్ జీవిత పద్ధతి వేరే, ఆమె తీరు వేరే. భర్త లేని స్త్రీ ఊళ్లో బతకడం కష్టం కనుక ఆమె బండగా మారిపోయింది. మగరాయుడిలా తనను తాను మలుచుకుంది. జాకెట్ వేసుకోవడం ఆమె ఎరుగదు. బీడీ తాగుతూ, అందర్నీ అదిలిస్తూ, కుటుంబాన్ని అధీనంలో ఉంచుకొని బతకడం అలవాటైన మనిషి. కోపధారి, రోషనారి. ఇటువంటి మనిషికి ఇప్పుడు చిన్నకొడుకు వల్ల కలిగిన సంకటమే ఈ కథలోని మూలాంశం. కొడుకు పట్నానికి వెళ్లి చదువుకుంటూ ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయి ఇంట్లోవాళ్లు పెళ్లికి ఒప్పుకున్నారు. సంబంధం మాట్లాడటానికి అతని ఊరొస్తామంటున్నారు. వాళ్లు పట్నవాసపు మనుషులు. హైక్లాసులో పెరిగినవారు. వారు వచ్చి, తన అమ్మ పద్ధతి, ప్రవర్తన చూస్తే ఏమనుకుంటారు? పెళ్లి విషయంలో పేచీ పెట్టరా? రవిక లేకుండా ఆమెను చూసి హవ్వా అనుకోరా? ఇదంతా ఆలోచించిన చిన్నకొడుకు రవిక వేసుకోమని పట్టుబట్టాడు. ఆమెతో పంతానికి పోయాడు. తల్లికి కొడుకు మీద ప్రేమ, అతని బతుకు మీద ఆరాటం. కానీ తన అస్థిత్వాన్ని తానెలా వదులుకోగలదు? ఆమె భుజం మీద ఒక అడవి పువ్వు పచ్చబొట్టు ఉంటుంది. అది ఆ ప్రాంతంలో కొండల్లో పాతికేళ్లకు ఒకసారి పూస్తుంది. భలే సువాసన. ఆ పువ్వు ఆమె భుజం మీదఆమెకో అస్తిత్వంలా ఉంటుంది. ఆ అడవి పువ్వు పాతికేళ్లకు ఒకసారే ఎందుకు పూస్తుంది అనంటే ఏం చెప్పగలం? అది దాని స్వభావం. దానిని ప్రతి సంవత్సరం పూయమంటే పూస్తుందా? అంగమ్మాల్ రవిక వేసుకోకుండా ఎందుకుంది అనంటే ఆమెకు అలా అలవాటైంది. చీరను ఒంటికి కప్పుకుని ఇన్నాళ్లు బతికింది. ఊరికి కూడా అదే అలవాటైంది. వారికి లేని ఇబ్బంది. అంగమ్మాల్కు లేని చింత ఇప్పుడు కొడుక్కు వచ్చింది– అదీ పట్నం నుంచి వచ్చే ఎవరి కోసమో. ఆమె బాగా ఆలోచించింది.చివరకు ఆమె తీసుకున్న నిర్ణయం ఆమెకూ, ఆమె కుటుంబంలోని వారికీ ఎలాంటి పరిస్థితులను కల్పించిందనేది చిత్రకథ. తమిళనాడులోని ఓ పల్లెలో కెమెరాను పాతి, చుట్టూ జరుగుతున్న అంశాలను చూపించిన సినిమా ఇది. అంత సహజమైన లొకేషన్లు, అక్కడి మనుషులు, వారి మనస్తత్వాలను ఈ చిత్రంలో చూపించారు. వారికి తగ్గ భాషనే డైలాగుల్లో వాడారు. గతంలో నిర్మాతగా వ్యవహరించిన గీతాౖ కెలాసం అనంతరం నటిగా మారారు. ఆమె కెరీర్లో మైలురాయిగా నిలిచిపోదగ్గ సినిమా ఇది. ఈ సినిమా మొత్తానికి ఆమె నటన అద్భుతం అనిపిస్తుంది. కుటుంబం కోసం రాయిలా మారిన మనిషి పద్ధతి చివరకు ఆ కుటుంబానికే ఇబ్బందికరంగా మారిన పరిస్థితుల్లో ఆ అమ్మ ఏం చేయాలో ఈ చిత్రం చూసి ఆలోచనలో పడాలి.పైకి ఎదిగిన పిల్లలు తమ తల్లిదండ్రుల సంస్కృతిని వెనుకబాటుగా చూడటం, వారిని నలుగురి ఎదుటకూ తేకపోవడం, వారిని ‘సంస్కరించాల’ని చూడటం మన సమాజంలో వినబడుతూనే ఉంది. మనల్ని కన్నవాళ్లను మనం ‘కరెక్ట్’ చేయాలనుకోవడం వారు ‘గాయపడే’ స్థాయిలో జరగాలా? వారిని వారిలా ఉండనివ్వండి అని చెప్పే సినిమా ‘అంగమ్మాల్’. త్వరలో ఓటీటీలో రావచ్చు. -
ఆమె ఆత్మవిశ్వాసం ఎవరెస్ట్
‘నేను సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నాను’ అనే మాట తిరుపతమ్మ నోటి నుంచి వినిపించినప్పుడు ఎంతమంది సీరియస్గా తీసుకొని ఉంటారో తెలియదు. ఆమె మాత్రం సీరియస్గా తీసుకున్నారు. ‘నువ్వు పోటీ చేయడం ఏమిటి!’లాంటి వెక్కిరింపులకు తన విజయంతో దీటైన సమాధానం ఇచ్చారు తిరుపతమ్మ. ఆమె ఎత్తు మూడు అడుగులు. ఆమె ఆత్మవిశ్వాసం... ఎవరెస్ట్ అంత!తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా చిల్పూరు మండలం చిన్న పెండ్యాల గ్రామ చరిత్రలో తొలిసారి విశేష ఘట్టం ఆవిష్కృతమైంది. మూడు అడుగుల ఎత్తు మాత్రమే ఉన్న ఇల్లందుల తిరుపతమ్మ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి, సర్పంచ్గా ఘనవిజయం సాధించారు. ఆమెతో పాటు ఆమె ప్యానెల్లోని పన్నెండు మంది వార్డు సభ్యులు కూడా విజయం సాధించడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ విజయం మహిళలకు, ముఖ్యంగా ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.రెక్కల కష్టం నమ్ముకొని...తిరుపతమ్మ ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడే తండ్రి కన్నుమూశారు. ఆ తర్వాత కుటుంబ భారం మొత్తం తిరుపతమ్మ, సోదరుడు సుదర్శన్ భుజాలపై పడింది. ఇద్దరు కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషించారు. ఆ తర్వాత తిరుపతమ్మ ఉపాధి హామీ పథకంలో వాచర్గా ఉద్యోగం సంపాదించారు. వాచర్గా పనిచేస్తూ ప్రతి మహిళకు, ప్రతి కుటుంబానికి దగ్గరయ్యారు. గ్రామస్తుల సమస్యలు తన సమస్యలుగా భావిస్తూ పరిష్కారానికి కృషి చేశారు. ప్రజల తలలో నాలుక అయ్యారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు# ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. ఒక్కపూట భోజనానికే ఇబ్బంది పడిన రోజులు ఉన్నా, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోలేదు.నా విజయ రహస్యం... ఆత్మవిశ్వాసంఎన్ని కష్టాల్లో ఉన్నా ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. అదే నా బలం. ఎన్నికలు నాకు కొత్త కావచ్చు. కాని గ్రామ ప్రజలు కొత్తవారు కాదు. వారు నా కుటుంబ సభ్యులు. ‘మంచి చేస్తే మంచే జరుగు తుంది’ అని బలంగా నమ్ముతాను. తమ్ముడు సుదర్శన్ చేసిన సేవలు, ప్రజలకు నాపై ఉన్న నమ్మకం సర్పంచ్గా నా గెలుపుకు కారణం. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ప్రభుత్వ సహకారంతో గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాను. – ఇల్లందుల తిరుపతమ్మ– కొత్తపల్లి కిరణ్ కుమార్, సాక్షి, జనగామ -
నెలగంట కట్టడం అంటే..? అది పండుగ రాకకు సంకేతమా..?
ధనుర్మాసం మొదలవ్వగానే అందరూ నెలగంట కడతారు అని అంటుంటారు. పైగా అప్పటి నుంచి ముంగిళ్ల అన్ని రంగవల్లులతో శోభాయమానంగా ఉంటాయి. అసలేంటి ఈ నెలగంట..అందులోని ఆంతర్యం గురించి సవివరంగా తెలుసుకుందామా..!నెలగంట కట్టడం అంటే, సంక్రాంతి పండుగకు సరిగ్గా నెల రోజుల ముందు మొదలయ్యే ధనుర్మాసం (Dhanurmasam) ప్రారంభాన్ని సూచించే ఒక సంప్రదాయం. అందులో భాగంగా ఇళ్లలో ముగ్గులు వేసి, గుడిలో గంటలు మోగిస్తూ, పండగ వాతావరణాన్ని సృష్టిస్తారు. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడుఆలయంలో మోగే గంటల శబ్దమే "నెలగంట". ఇవాళ (డిసెంబర్ 16 వ తేదీన) మధ్యాహ్నం (1. 23)ప్రాంతంలో ధనుస్సులో ప్రవేశిస్తాడు. దానినే మనం ధనుస్సంక్రమణం అంటాం! అలా ధనూరాశిలో ప్రవేశించిన సూర్యుడు - నెలంతా ఆ రాశిలోనే ఉంటాడు. ఇలా సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించగానే నెలగంట కట్టడం అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఆ తరువాత మకర రాశిలో ప్రవేశిస్తాడు. అది మకర సంక్రమణం!.ఈ నెలగంట కట్టినది మొదలుకొని పెద్ద పండుగ అయ్యేంతవరకు ఊళ్ళో ఎవరూ ఏ శుభకార్యం చేయరు. అంటే ఈ నెలంతా ఈ దీక్షలోనే ఉంటారు. ఈ నెలగంట కట్టడంతో ధనుర్మాసం ప్రారంభం అవుతుంది కాబట్టి..తిరుప్పావై పాశురాలు - వేకువజాము పూజలు నిర్వహిస్తారు. అంతేగాదు అలాగే ఈ నెలలోనే విష్ణుమూర్తిని మధుసూదనుడుగా ఆరాధిస్తారు. 15 రోజులు చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి, ఆ తర్వాత 15 రోజులు దద్ధోజనాన్ని నైవేద్యంగా పెడతారు. అలా భోగి పండుగ నాడు ఈ మార్గళి వ్రతం లేదా తిరుప్పావై పూర్తవుతుంది. ఒకరకంగా ఈ నెలగంట మన సంక్రాంతి పండుగ రాకను సూచిస్తుందని చెప్పొచ్చు.ఈ సమయంలో ఏం చేస్తారంటే..పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటివి చేయకూడదు. అలాగే ఈ నెల రోజులు విష్ణువుని మాత్రమే ఆరాధించాలని అంటారు. నెలగంట సమయంలో పంచామృతాలతో విష్ణుమూర్తిని ఆరాధించాలి. అభిషేకానికి శంఖాన్ని ఉపయోగించాలి. విష్ణుకి తులసి దళాలు సమర్పించాలి. పువ్వులతో అష్టోత్తర, సహస్రనామాలతో ఆరాధించాలి. దీప, ధూప, నైవేద్యాలను సమర్పించాలి. విష్ణువు కథలను వినడం, తిరుప్పావై పఠించడం చాలా మంచిది. నెలరోజులు చేయడం వీలు కాని వారు కనీసం 15 రోజులు, 8 రోజులు లేదా ఒక్క రోజైనా ఆచరించవచ్చు.(చదవండి: ఈశ్వరీ..జగదీశ్వరీ..) -
'అందరికీ ఫిర్యాదురహిత, సౌకర్యవంతమైన దర్శనం'
సాక్షి శబరిమల: "అందరికి ఫిర్యాదురహిత సౌకర్యవంతమైన దర్శనం" అనే పోలీసుల విజన్ని అమలు అయ్యేలా చేశామని కేరళ ఏడీజీపీ శ్రీజిత్ అన్నారు. శబరిమల యాత్ర ప్రారంభమైన 28 రోజుల తర్వాత గత ఏడాది కంటే సుమారు 4.5 లక్షల మందికి పైగా ఎక్కువ మంది యాత్రికులు దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. సింపుల్గా చెప్పాలంటే సగటున రోజుకి దాదాపు 80 వేల మందికి పైగా వచ్చారని అన్నారు. గత సోమవారం అత్యధిక సంఖ్యలో ఏకంగా ఒక లక్ష మందికి పైగా యాత్రికలు దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. నవంబర్ 24న కూడా ఇలా భక్తుల సంఖ్య లక్ష దాటిందని గుర్తు చేశారు.ఇదంతా అయ్యప్ప మహిమే..దర్శనం చేసుకున్న యాత్రికుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ భక్తులెవ్వరూ దర్శనం కోసం ఎక్కువసేపు వేచి ఉండటం లేదా ఫిర్యాదు చేయడం వంటివి చేయలేదని అన్నారు. ఇదంతా అయ్యప్ప స్వామి దయ వల్లనే అని చెప్పారు. నిజానికి అధికారులెవ్వరూ యాత్రికులెవరిని ఆపరు, ఇబ్బంది పెట్టరని, కూడా చెప్పారు. భక్తులను పర్వతం ఎక్కడానికి అవకాశం ఇస్తే..భక్తలు ఎవరూ వేచి ఉండాల్సి అవసరం ఏర్పడదు, అలాగే వాళ్లు నేరుగా పుణ్యక్షేత్రానికి చేరుకుని 18వ మెట్టు ఎక్కి ఆ హరిహరసుతుడిని ఎలాంటి ఫిర్యాదుల లేకుండా సౌకర్యవంతంగా దర్శనం చేసుకోగలుగుతారని అన్నారు..అదెలా సాధ్యమన్నది అతుపట్టడం లేదు..కాగా మకరవిళక్కు వరకు ప్రతిరోజూ వర్చువల్ క్యూ బుకింగ్లు పూర్తయ్యాయని చెప్పారు. అలాగే ప్రతిరోజూ వర్చువల్ క్యూ ద్వారా దర్శనం చేసుకుంటున్నారని అన్నారు. ఈసారి ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే శనివారం ఆదివారం రద్దీ తక్కువగా ఉంటుందని, బదులుగా, సోమవారం, మంగళవారం రద్దీ ఎక్కువయ్యిందని చెప్పారు. చెప్పాలంటే బుధవారం మధ్యాహ్నం నాటికి రద్దీ తగ్గుముఖం పడుతోందని అన్నారు. విచిత్రం ఏంటంటే చాలా బుకింగ్లు ఉన్నప్పటికీ అలా ఎలా స్వామి కైంకర్యాలకు ఆటంకం లేకుండా, అటు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సవ్యంగా జరిగిపోతోందో మాకు కూడా తెలియడం లేదని ఆనందంగా చెప్పుకొచ్చారు. అయితే తామే ఎక్కడకక్కడ పోలీసులతో మోహరించి భక్తులెవ్వరూ దర్శనం కోసం వేచి ఉండకుండా పకడ్బందీగా చేయగలిగినన్నీ ఏర్పాట్లు చేశామని కూడా చెప్పారు. స్పాట్ బుకింగ్ పెంపు ఎప్పుడంటే..సన్నిధానం వద్ద జనసమూహం ఎక్కువగా లేనప్పుడు, పోలీసు ప్రత్యేక అధికారి, ప్రత్యేక కమిషనర్, దేవస్వం కార్యనిర్వాహక అధికారులను సంప్రదించి స్పాట్ బుకింగ్ పెంచుతామని అన్నారు. జనసమూహం తక్కువగా ఉన్న రోజుల్లో, 10 వేలకు పైనే స్పాట్ బుకింగ్లు ఇస్తామని అన్నారు. అయితే యాత్ర మూడోరోజున యాత్రికులు ఎందుకు ఇబ్బంది పడ్డారో కూడా వివరించారు.ఆ రోజు యాత్రికులు క్యూలో ఉన్నప్పుడు షెడ్ స్థంభం దెబ్బతినడంతో దాన్ని తొలగించడంతో కాస్త సమస్యలు రావడంతోనే భక్తులు ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. సాధ్యమైనంతవరకుఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు కేరళ పోలీసు అత్యున్నతాధికారి శ్రీజిత్.(చదవండి: ఆ హరిహరసుతుడి అరవణ ప్రసాదం డబ్బాల కొరత..) -
హర్ష్ గోయెంకా ఇష్టపడే శీతాకాలపు చిరుతిండి..!
ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయెంకా స్వతహాగా ఆహారప్రియుడు. తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్లో ఆహారం పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. అలానే ఈసారి కూడా గజగజ వణికించే ఈ చలిలో తనెంతో ఇష్టంగా తినే ఆహారాన్ని షేర్ చేశారు. దీన్ని శీతకాలపు చిరుతిండిగా అభివర్ణిస్తూ..ఆ రెసీపి తయరీతో సహా వివరించారు. నిపుణుల సైతం ఆరోగ్యానికి ఎంతో మంచిదని పేర్కొనడం విశేషం.గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాల కాలానుగుణ వంటకాన్ని నెట్టింట షేర్ చేశారు హర్ష్ గోయెంకా. ఇది శీతకాలపు చిరుతిండి అని, తనకెంతో ఇష్టమని అన్నారు. పోంక్ రెసిపీ వ్యవహరిస్తారని చెప్పారు. ఇది ఆకుపచ్చని జొన్నలు,నిమ్మకాయ, మఖానా, కొద్దిగా సేవ్ జోడించి తయార చేసి స్మోకీ వంటకమట. ఇది తింటుంటే స్వర్గానికి వెళ్లిపోవాల్సిందేనట. దీనికి వెల్లుల్లి చట్నీ జోడిస్తేనే మంచి రుచి వస్తుందని చెప్పారు గోయెంకా. ఎలా చేస్తారంటే..తాజా పోంక్(ఆకుపచ్చని జొన్నలని) పచ్చి వాసన పోయేదాక వేయించాలి. ఆ తర్వాత ఉప్పు, నిమ్మరసం జల్లుకోవాలి. క్రంచిగా ఉండేలా మఖానా చక్కెర బంతులను జోడిస్తూ..స్సైసీ పంచ్ ఇచ్చేలా వెల్లుల్లి చట్నీ జోడిస్తే చాలట. కాస్త ఆకర్షణీయంగా కనిపించేలా క్రిస్పిసేవ్ చలులుకుంటే..ఎంతో రుచికరమైన పోంక్ రెడీ..!.ఆరోగ్య లాభాలు..ఇది కేవలం చిరుతిండి కాదు. లేత దశలో ఉండే ఈ జొన్నలు ప్రత్యేకమైన వగరు రుచి కలిగి నోటిలే ఇట్టే కరిగిపోయేంత మృదువుగా ఉంటాయి. దీనిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేగాదు ఫైబర్ మూలం. ఇందులో ఉపయోగించే జొన్నలు గ్లూటెన్ రహితంగా ఉంటాయి. అందువల గ్లూటెన్ అంటే పడినివాళ్లకి లేదా సెలియాక్ వ్యాధితో బాధపడేవారికి ఇది ఎంతో మంచిది. సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉండటం వల్ల ఇది మంచి ఎనర్జీని అందివ్వడమే కాకుండా ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలుగజేస్తుంది. అలాగే ఇందులో ఐరన్, మెగ్నిషియం, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అంతేగాదు ఇది మొత్తం ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.My favourite winter snack is ‘ponk’. Its green jowar, lightly roasted, rushed daily from Surat to Mumbai. Add salt, lemon, makhana sugar balls, sev, a spoon of garlic chutny, and you’ll be transported to heaven. This version has a little hara chana twist. pic.twitter.com/IzDOvUctIT— Harsh Goenka (@hvgoenka) December 13, 2025 (చదవండి: అలాంటి శోకం ఎవ్వరికి వద్దని..30 ఏళ్లుగా ట్రాఫిక్ పోలీసుగా సేవ!) -
అలాంటి శోకం ఎవ్వరికి వద్దని..30 ఏళ్లుగా ట్రాఫిక్ పోలీసుగా సేవ!
"నిస్వార్థమెంత గొప్పదో…నీ పదము రుజువు కట్టదా..సిరాలు లక్ష ఓంపదాచిరాక్షరాలు రాయదా".. అనే పాట గుర్తుకొస్తుంది ఈ వ్యక్తిని చూస్తే. ఎందుకంటే..ఈ వ్యక్తి ని ప్రమాదంలో కోల్పోయి తీరని దుఃఖంలో కోరుకుపోయాడు. చివరికి విధి భార్యను తీసుకుపోయి ఒంటిరిగా చేసింది. కానీ అతడు ఆ బాధలో మగ్గిపోకుండా తనలా విధి వంచితులవ్వకూడదని..ట్రాఫిక్ పోలీసులా ఉచితంగా సేవ చేస్తున్నాడు. కాలక్రమేణ అందరూ అతడని ట్రాఫిక్ పోలీసనే అనుకునేవారు, అతడిని పలకరిస్తే గానీ అసలు విషయం తెలిసేది కాదు. కానీ అతడి నిస్వార్థ సేవకు తగిన గుర్తింపు రావడమే కాదు..చుట్టుపక్కల స్థానికులు సైతం అతడిపై ప్రశంసల జల్లు కురిపిస్తారు. ఎవరా ఆ వ్యక్తి..ఏమా కథ తెలుసుకుందామా..!ఢిల్లీలోని రద్దీగా ఉండే సీలంపూర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద 79 ఏళ్ల వృద్ధుడు లాఠీతో నిలబడి ఉంటాడు. ఈ ఏజ్లో కూడా అక్కడ వాహనాలను నియంత్రిస్తూ డ్యూటీ చేస్తున్న ఆ వ్యక్తిని చూస్తే ఎవ్వరికైనా కుతూహలం కలుగుతుంది. ఇంకా రిటైర్ కాలేదా..ఉచితంగా సర్వీస్ అందిస్తున్నాడా..అన్న అనుమానాలతో ఉక్కిరిబిక్కిరి అవుతాం. అతడి పేరు గంగారాం. ఓ విషాదం తన జీవితాన్ని ఇలా మార్చేసిందంటాడు. తన కొడుకు తాను కలిసి టివీ అండ్ ఎలక్ట్రానిక్స్ రిపైర్ షాపు నడిపేవారు. ఒకరోజు అనుకోకుండా కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. ఆ దఃఖం అతడ్ని తీవ్రంగా కుంగదీసేసింది. చివరికి అతడి భార్య సైతం ఆ బాధను జీర్ణించుకోలేక అతడిని ఒంటిరి చేసి కానరాని లోకాలకు వెళ్లిపోయింది. ఒక్క దుర్ఘటన తన కుటంబాన్ని ఇంతలా చిన్నాభిన్నం చేయడంతో గంగారాం..ఇలాంటి భాధ పగవాడికి కూడా వద్దు అని స్ట్రాంగ్ ఫిక్స్ అవ్వుతాడు. ఆ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసు మాదిరిగా డ్రెస్ వేసుకుని ఢిల్లీలోని రద్దీగా ఉండే సీలంపూర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనాలను నియంత్రిస్తూ ఉండేవాడు. క్రమం తప్పకుండా ఆ జంక్షన్ వద్దకు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి జీతంభత్యం లేకుండా పనిచేశాడు. అలా రోజుకి సుమారు పది గంటలకు పైగా డ్యూటీ చేస్తుండేవాడు. మొదట్లో అతడిని కొందరు మోసగాడని తప్పుగా భావించేవారు, కాలక్రమేణ అతడి "నిస్వార్థ సేవ"ను గుర్తించడం ప్రారంభించారు. ఎవ్వరైనా అతడికి ఉచితంగా ఆహారం, డబ్బులు ఇచ్చినా నిరాకరించేవాడు. అలా ఏళ్ల తరబడి నిస్వార్థంగా ఎలాంటి జీతం తీసుకోకుండా ట్రాఫిక్ పోలీసులా సేవలందించాడు. అంతేగాదు రోడ్డుపై క్రమశిక్షణతో మెలిగితేనే ప్రాణాలను సురక్షితమనేది గంగారాం ప్రగాఢ నమ్మకం. దాన్నే ప్రజలకు పదే పదే చెబుతుండే వాడు కూడా. వయసు సహకరించకపోయినా, అనారోగ్యంగా ఉన్నా.. తన డ్యూటీకి మాత్రం విరామం ఇచ్చేవాడు కాదు. కనీసం కరోనా మహమ్మారి, సమయంలో ప్రభుత్వం సీనియర్ సిటీజన్లను పదే పదే ఇంట్లో ఉండమని విజ్ఞప్తి చేసినా..తన దినచర్యకు కట్టుబడి ఉండేవాడు గంగారామ్. ఆఖరికి వర్షం, భగభగ మండే వేసవిలో సైతం అతడి డ్యూటీకి బ్రేక్ వేయలేకపోయాయి.ఆ సేవ వృధాగా పోలేదు..ఏళ్ల తరబడిచేస్తున్న అతడి సేవలు పోలీసులు, సామాజికి సంస్థలు గుర్తించి అనేక పతకాలు, గౌరవాలతో సత్కరించింది. తరుచుగా గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవాలలో అతడిని పిలిచి మరి తన సేవకు తగిన సత్కారం చేసి అభినందించేవారు. చివరగా 2018లో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు అతన్ని అధికారికంగా ట్రాపిక్ సెంటినల్గా నియమించి, దశాబ్దాలులగా ఉచితంగా అందిస్తున్న సేవకు తగిన గుర్తింపు అందించారు. అంతేగాదు అతనికి మొబైల్ ఫోన్ కూడా అందించి,తగిన వేతనం అందేలా చేసిందిఢిల్లీ ప్రభుత్వం. ఇప్పుడు గంగారామ్ సగర్వంగా యూనిఫాం ధరించి తన విధులను ఈ ఏజ్లో కూడా నిర్వర్తిస్తూ..తరతరాలకు స్ఫూర్తిగా నిలిచాడు. (చదవండి: ఆ కారు కొన్నప్పుడు బాధపడ్డా..కానీ అదే నా బిడ్డ ఆరోగ్యానికి శ్రీరామరక్ష..!) -
ఆ కారు నా బిడ్డ ఆరోగ్యానికి శ్రీరామరక్ష..! వైరల్గా ఓ తండ్రి పోస్ట్..
కారు కొనడం అంటే మధ్యతరగతి కుటుంబాలకు తీరనిక కల అని చెప్పొచ్చు. డేర్ చేసి కొత మొత్తం కట్టి ఇన్స్టాల్మెంట్లో కొన్నా..ఆ డబ్బులన్నీ నెల నెల కట్టగలనా అనే భయం వెంటాడేస్తుంటుంది. అందుకే అంత మెంటల్ టెన్షన్ ఎందుకని..కారు కొనాలనే ఆలోచనే విరమించుకుంటా. కానీ ఈ వ్యక్తి ఆ సంశయాత్మక ధోరణి నుంచి బయటపడండని అంటున్నాడు. ముఖ్యంగా పిల్లలు ఉంటే మరో ఆలోచన చేయకుండా ధైర్యంగా కారు కొనాలనే నిర్ణయానికి రావడం మంచిదని సూచిస్తున్నాడు కూడా. ఎందుకలా అంటున్నాడంటే..ప్రస్తుతం బయట కాలుష్యం ఏ రేంజ్లో ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఆ కాలుష్యం కోరల నుంచి తన బిడ్డ ఊపిరితిత్తుల పాడవ్వకుండా తాను కొన్న కారు ఎలా రక్షించింది సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు ఒక వ్యక్తి. అతడు రెడ్డిట్ పోస్ట్లో ఇలా రాసుకొచ్చాడు. భారీ వాహనాలు, లారీ, ట్రక్కుల వెనుక ఉంటే ఏ రేంజ్లో పొగ దుమ్ము ఆవిరిస్తుందో చెప్పక్కర్లేదు. అలాంటప్పడు మనకు కారు చాలా సురక్షితం అని చెబుతున్నాడు. తాను గతవారమై రూ. 10 లక్షలు ఖరీదు చేసే మారుతి ఫ్రాంక్స్ కారుని రూ. 3లక్షలు డౌన్ పేమెంట్ చెల్లించి, రూ. 7లక్షల లోన్పై తీసుకున్నట్లు తెలిపాడు. అయితే మొదట అనవసరంగా లక్షలు చెల్లించి మరి ఇఎమ్ఐలో కారు కొన్నాని చాలా బాధపడ్డాడట. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకు పన్వేల్ నాసిక్ మీదుగా తన ఏడాది కూతురు, భార్యతో కలిసి కారులో వెళ్తున్నప్పుడూ తన అభిప్రాయం మారిందట. తాను తీసుకున్న నిర్ణయమే సరైనది అనిపించిందట. తాను ఆ జర్నీలో కొన్ని డీజిల్ ట్రక్కుల మధ్య ట్రాఫిక్లో చిక్కుకున్నాడట. అక్కడ దట్టమైన పొగ, దుమ్ము, కారు అద్దాలపై ఆవరించి అసలు బయట ఏమి కనిపించలేదట. కారు లోపల ఏసి ఆన్ అయ్యి ఉంది కాబట్టి తమకు అంత చికాకుగా అనిపించలేదట. ఒకవేళ్ల కారు కొనకపోయి ఉంటే ఈ ట్రాఫిక్లో బైక్ తన కుటుంబమంతా ఉండేది. అస్సలు ఆ కాలుష్య ఏడాది వయసున్న తన చిన్నారి ఊపరితిత్తులను ఎంతగా ప్రభావితం చేసేది అన్న ఆలోచన భయాందోళనకు తోను చేసిందట. దేవుడి దయవల్ల సరైన నిర్ణయం తీసుకునే కారుకొన్న లేదంటే అమ్మో ఈ భయానక కాలుష్యానికి మొత్తం కుటుంబమే అనారోగ్యం పాలయ్యేది అని రాసుకొచ్చాడు. అందుకే చెబుతున్నా..కారు కొనాలా వద్ద అన్న మీమాంసలో ఉన్న తమ లాంటి పేరెంట్స్ అంతా ప్రస్తుత కాలుష్య దృష్ట్యా డేరింగ్ నిర్ణయం తీసుకోండి. త్వరితగతిన కారు కొనండి అని పోస్ట్లో రాసుకొచ్చాడు. అంతేగాదు కారు అనేది లగ్గరీ కాదని మన పిల్లల పాలిట మొబైల్ ఎయిర్ ప్యూరిఫైయర్గా పేర్కొన్నారు. అలాగే ఖర్చు అని కాకుండా రక్షణను పరిగణలోకి తీసుకుని ధైర్యంగా కార కొనండని పిలుపునిచ్చాడు తన పోస్ట్లో. అయితే నెటిజన్లు అతని సూచనకు మద్దతివ్వడమే కాకుండా కారు రక్షణ, భద్రతా కూడా అది విస్మరించారు మీరు అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: వయసులో ఫిట్..పరుగులో హిట్..!) -
వాటర్ పూల్..బీచ్ ఫీల్..!
ఇక భాగ్యనగరవాసులు బీచ్ వైబ్స్ ఆస్వాదించడానికి గోవా, వైజాగ్, బందరు అంటూ దూరభారం డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదు. సిటిజనుల కోసం నగరానికి కూతవేటు దూరంలోనే ఆర్టిఫిషియల్ సముద్ర తీరం అవతరించనుంది. సముద్రం అనేది లేకుండానే తీరం ఎలా అనే ప్రశ్నకు మానవ మేధస్సుతో సమాధానం చెబుతున్న దేశపు తొలి నగరంగా హైదరాబాద్ చరిత్ర సృష్టించనుంది. ఈ బీచ్ పరిసరాలు విందు, వినోదాలతో పాటు సకల సౌకర్యాలకు కేరాఫ్గా నిలువనుంది. పర్యాటక ఆకర్షణను దృష్టిలోపెట్టుకుని దీనిని తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే జపాన్, దుబాయ్, సింగపూర్, స్పెయిన్ వంటి దేశాలతో పాటు ప్రపంచంలో పలు మానవ నిర్మిత బీచ్లు సందడి చేస్తున్న క్రమంలో దేశంలోనూ అదీ హైదరాబాద్లో ఈ ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మితం కానుండడం విశేషం. చారిత్రక నేపథ్యానికి కొదవలేదు.. సాంస్కృతిక వారసత్వానికీ లోటు లేదు. సంప్రదాయ వంటకాల సంపదకు కరవు లేదు.. ఆధునిక పార్టీ కల్చర్కూ అడ్డు లేదు.. ఇలా పర్యాటకులను ఆకట్టుకునే అనేక హంగులు ఉన్న నగరంలో చెప్పుకోదగ్గ లోటు అంటూ ఏదైనా ఉందంటే అది బీచ్ ఒక్కటే అని చెప్పాలి. ఇప్పుడు ఆ వెలితిని కూడా పూడ్చే ప్రయత్నాలు షురూ అయ్యాయి. ప్రకృతి సిద్ధంగా మాత్రమే సాధ్యమయ్యే సాగర తీరపు అందాలను మానవ శక్తితో పునర్సృష్టించేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం, నగరానికి సమీపంలోని బీచ్ అంటే అది పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని సూర్యలంక బీచ్ మాత్రమే. అది కూడా దాదాపు 320 కి.మీ దూరంలో ఉంది. అయితే తెలంగాణ తొలి మానవ నిర్మిత బీచ్ గచి్చబౌలి నుంచి కేవలం 20 కి.మీ దూరంలో కొలువుదీరనుంది. భూమి లభ్యత, ఔటర్ రింగ్ రోడ్ ద్వారా సులభంగా చేరుకోగలిగే రాకపోకల సౌలభ్యం కారణంగా కొత్వాల్ గూడను బీచ్ కోసం ఎంపిక చేశామంటున్నారు. దీనికి సంబంధించిన తుది ప్రాజెక్ట్ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. చెప్పుకోదగ్గ విశేషాలెన్నో.. మొత్తం 35 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఈ బీచ్ను తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ దాదాపు రూ.225 కోట్ల నుంచి రూ.300 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నట్లు సమాచారం. ఇసుక, నీరు మాత్రమే కాకుండా ఈ ప్రాజెక్టులో భాగంగా తేలియాడే విల్లాలు, లగ్జరీ హోటళ్లు, సాహస క్రీడలు, సెయిలింగ్, బంగీ జంపింగ్, స్కేటింగ్, వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు కానున్నాయి. ఇతర ఆకర్షణల్లో భాగంగా వేవ్ పూల్, ఫౌంటైన్లు, థియేటర్లు, రెస్టారెంట్లు, షాక్లు, సైక్లింగ్ ట్రాక్లు, పిల్లల కోసం ఆట స్థలాలు కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో కూడా... ఈ ప్రాజెక్టు సాకారమైతే, ఇది ప్రపంచ పర్యాటక ఆకర్షణగా మారుతుందని, హైదరాబాద్ స్థాయిని పెంచుతుందని అధికారులు విశ్వసిస్తున్నారు. దీనిలో పర్యావరణ అనుకూల నిర్మాణ పద్ధతులు ఖచి్చతంగా అమలు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ అంతర్జాతీయ పెట్టుబడిదారులను కూడా ఆకర్షిస్తుందని అధికారులు ఆశిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఫ్యూచర్ సిటీలోనూ ఒక అర్బన్ బీచ్ నిర్మించేందుకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ చాంపియన్స్ ఇన్ఫ్రాటెక్ ప్రతిపాదనలు సమర్పించింది. ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడితే హైదరాబాద్కు ఒకటి కాదు రెండు బీచ్లు అందుబాటులోకి రావచ్చు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇప్పటికే కృత్రిమ బీచ్లు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అలాంటి వాటిలో కొన్నింటిని అధికారులు పరిశీలిస్తున్నారు. పారిస్ స్ఫూర్తితో.. ఫ్రెంచ్ రాజధాని సీన్ నదిని ఆనుకుని కృత్రిమ బీచ్లను సృష్టించిన పారిస్ ప్లేజెస్ ప్రాజెక్ట్ నుంచి సిటీ బీచ్ ఆలోచన ప్రేరణ పొందింది. తాము పారిస్ ప్లేజెస్ ప్రాజెక్ట్ను పరిశీలించామని, అక్కడ భౌగోళిక పరిస్థితులతో పోల్చే పరిస్థితులు అనుకూలంగా ఉన్న నగరం కాబట్టి, ఇక్కడ అదే రీతిలో బీచ్ సృష్టికి పారిస్ ప్లేజెస్ మాదిరి నమూనాను అనుసరించాలని భావిస్తున్నట్లు పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. అదే విధంగా మరికొన్ని కృత్రిమ బీచ్లు కూడా అంతర్జాతీయంగా పేరొందాయి. దుబాయ్లోని పామ్ జుమేరాలో ప్రసిద్ధ మానవ నిర్మిత బీచ్లు ఉన్నాయి. ఇది విలాసవంతమైన రిసార్ట్లు, ప్రైవేట్ విల్లాలతో సందర్శకులకు ప్రత్యేకమైన విలాసవంతమైన అనుభవాన్ని అందిస్తుంది. దుబాయ్లోని పామ్ జుమేరాలో ప్రసిద్ధ మానవ నిర్మిత బీచ్లు ఉన్నాయి. ఇది విలాసవంతమైన రిసార్ట్లు, ప్రైవేట్ విల్లాలతో సందర్శకులకు ప్రత్యేకమైన విలాసవంతమైన అనుభవాన్ని అందిస్తుంది. బీచ్తో పాటు విందు, సకల వినోదాలకు కేరాఫ్ మాల్దీవ్స్ రాజధాని నగరం మాలేలోని తూర్పు తీరంలో కృత్రిమ బీచ్ క్రీడా కార్యక్రమాలు, కవాతు, కారి్నవాల్, ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలను నిర్వహించడానికి అనుకూలమైన వేదికగా మారింది. జపాన్లోని టోక్యోలో ఉన్న ఒడైబా సీసైడ్ పార్క్ పేరతో బీచ్ నిర్మించారు. టోక్యో బేలో ఒక ప్రసిద్ధ ప్రదేశంగా వినోద కార్యకలాపాలను అందిస్తుంది. అమెరికాలోని మిసిసిపీలో బిలోక్సీ మరొక ప్రసిద్ధ బీచ్. ఇది గల్ఫ్ తీరం వెంబడి ఉన్న 26 మైళ్ల పొడవైన మానవ నిర్మిత తీరప్రాంతంలో ఇది ఒక భాగం. సింగపూర్లోని 1,235 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సెంటోసా మలేషియా నుంచి దిగుమతి చేసుకున్న ఇసుకను కలిగి ఉన్న మూడు షెల్టర్డ్ బీచ్లు ఉన్నాయి. యూరప్లోని మొనాకో సిటీలో ఉన్న ఏకైక పబ్లిక్ బీచ్గా లార్వోట్టో బీచ్ పేరొందింది. రెస్టారెంట్లు, దుకాణాలు, కేఫ్లతో కళకళలాడే ఈ బీచ్లో కృత్రిమ ఇసుక కొంతవరకూ గులకరాళ్లలా ఉంటుంది. బీచ్కి వెళ్లేవారు దృఢమైన బూట్లు ధరించవలసి ఉంటుంది. పిల్లలు ఆట స్థలం కార్యకలాపాలు, బైక్ రైడ్లు ట్రాంపోలిన్ వినోదాన్ని అక్కడ ఆస్వాదించవచ్చు. (చదవండి: కాలినడకన.. 27 ఏళ్లు.. 31 వేల మైళ్లు! అంటే.. ప్రపంచం చుట్టొచ్చాడా?) -
వయసులో ఫిట్..పరుగులో హిట్..!
ఆయన ఆలోచనలు, ఆశయం పరుగుపెడతాయి.. విజయాన్ని దక్కించుకోవాలన్న సంకల్పం పరుగుకు ముందుంటుంది. అందుకే ఆయన ముందు మారథాన్లు చిన్నబోతున్నాయి. 74 ఏళ్ల వయసులోనూ మారథాన్లు, అల్ట్రా మారథాన్లు పూర్తి చేస్తూ జాతీయస్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. నూకలవారిపాలెం నుంచి వచ్చిన అతని ప్రస్థానం ఇప్పుడు బోస్టన్ మారథాన్ వరకూ పరుగుతీసింది. ఆయనే హైదరాబాద్కు చెందిన సీనియర్ రన్నర్ నాగభూషణరావు చలమలశెట్టి..కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం నూకలవారిపాలేనికి చెందిన నాగభూషణరావు ప్రస్తుతం నగరంలోని మల్లాపూర్లోని కేఎల్ రెడ్డి నగర్లో నివసిస్తున్నారు. వయసు పెరుగుతోందని వెనక్కి తగ్గకుండా.. ఆరోగ్యమే జీవితానికి అసలైన బలం అన్న సందేశాన్ని తన పరుగుతో నిరూపిస్తున్నారు. పరుగుల ప్రపంచంలోకి ఆయన ఐదేళ్ల క్రితం అడుగుపెట్టారు. అమెరికాలోని చికాగోలో అతని కుమారుడు మారథాన్ పూర్తి చేశారు. అదే స్ఫూర్తిగా తీసుకుని ప్రారంభంలో 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు వంటి చిన్న దూరాలతో మొదలుపెట్టి క్రమంగా స్టామినాను పెంచుకున్నారు. ఆ క్రమశిక్షణే దేశంలోని ప్రముఖ మారథాన్లలో నిలబెట్టేలా చేసింది.ఇది ఆయన రికార్డు..ముంబయి, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ వంటి మహానగరాల మారథాన్లతో పాటు లోనావాల నైట్ అల్ట్రా మారథాన్, 65 కిలోమీటర్ల సతారా అల్ట్రా మారథాన్ వంటి కఠిన పోటీలను ఆయన అవలీలగా పూర్తి చేశారు. ఇటీవల లద్దాఖ్ మారథాన్ సైతం పూర్తి చేయడం విశేషం. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పోటీల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ మారథాన్ను విజయవంతంగా ముగించడం ఆయన పట్టుదలకు నిదర్శనం. ఇప్పటివరకు 21 ఫుల్ మారథాన్లలో పాల్గొని 17 విజయాలను నమోదు చేశారు.వచ్చే ఏడాది బోస్టన్ మారథాన్కు..ఈ ఏడాది జులైలో నిర్వహించిన ఢిల్లీ మారథాన్ను ఆయన 4 గంటల 12 నిమిషాల 55 సెకన్ల సమయంలో ముగించారు. దీంతో ఆయన వచ్చే ఏడాది అమెరికాలోని బోస్టన్లో జరగనున్న 130వ బోస్టన్ మారథాన్కు అర్హత సాధించారు. భారత్ తరుపున పాల్గోనున్న ఆయన, హైదరాబాద్కు గర్వకారణంగా నిలవనున్నారు. View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) (చదవండి: పర్యావరణ హిత మష్రూమ్ ఫర్నీచర్..! జస్ట్ 180 రోజుల్లోనే..) -
కాలినడకన.. 27 ఏళ్లు.. 31 వేల మైళ్లు! అంటే.. ప్రపంచం చుట్టొచ్చాడా?
ప్రపంచం చుట్టి రావాలనుకోవడం ప్రస్తుత రోజుల్లో పెద్ద విషయం కాదు. డబ్బుకి లోటు లేదు అనుకుంటే సులభంగా చుట్టొచ్చేయొచ్చు. అలాకాకుండా కాలినడకన చుట్టి రావాలనుకోవడం మాత్రం..కాస్త ఆలోచించాల్సిందే. అసలు ఈ ఆలోచన సాధ్యమేనా అనే సందేహం కచ్చితంగా వచ్చేస్తుంది. కానీ ఇతడు దృఢ సంకల్పమే ఆయుధంగా ఎలాంటి వాహనాలను ఉపయోగించకుండా కాలినడకన ప్రపంచం చుట్టి రావాలనుకున్నాడు. ఇప్పుడు దాదాపు చాలామేరకు చుట్టేశాడు. ఇంకొద్ది రోజుల్లో అతడి యాత్ర ముగింపుకి రానుంది. ఇంత పెద్ద ఘనతను సృష్టించిన ఆ వ్యక్తి ఎప్పుడు ఈ ప్రపంచ యాత్రను ప్రారంభించాడు?, ఎలా సాగింది వంటి విశేషాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.29 ఏళ్ల బ్రిటిష్ మాజీ పారాట్రూపర్ కార్ల్ బుష్బీ, ఈ సాహస యాత్రకు శ్రీకారం చుట్టాడు. ఎలాంటి మోటారు వాహనాలు ఉపయోగించకుండా ప్రపంచం చుట్టి రావాలనే అసాధారణ లక్ష్యంతో బయలుదేరాడు. ఇప్పటికీ అతడి కల తీరనుంది. దాదాపు 29 ఏళ్ల సుదీర్ఘ యాత్ర అనంతరం 56 ఏళ్ల వయసుకు చేరుకున్న దశలో పూర్తి చేయనున్నాడు. అప్పటికీ పూర్తిగా మారిపోయిన ప్రపంచం, మరోవైపు సోషల్ మీడియా ఒత్తిడి వంటి సవాళ్లను అధిగమించి మరి ప్రపంచ యాత్రను ఇంకొద్ది రోజుల్లో విజయవంతంగా పూర్తిచేయనున్నాడు. తన యాత్ర పూర్తి అవ్వడానికి జస్ట్ వెయ్యి మైళ్ల దూరంలోనే ఉన్నాడంతే. ఇప్పటి వరకు చేసిన సాహస యాత్రల్లో ఈ వ్యక్తి చేసిన యాత్ర అత్యంత సుదీర్ఘమైన యాత్రగా నిపుణులు పేర్కొన్నారు. ఇక బుష్బీ తన ప్రపంచ యాత్రను 1998లో చిలీ సరిహద్దుల నుంచి ప్రారంభించాడు. అలా నడుచుకుంటూనే తన స్వదేశం ఇంగ్లాండ్కు చేరుకుంటానని భీష్ముడు మాదిరిగా ప్రతినబూనడట. ఇంతవరకు ఈ యాత్రలో ఎలాంటి యాంత్రిక రవాణాను వినయోగించకపోవడం విశేషం. ఇప్పడు తన యాత్ర చివరి దశలో ఉన్నాడు. అంతేగాదు అతడు వచ్చే ఏడాది సెప్టెంబర్ 2026 నాటికి తన స్వస్థలమైన ఇంగ్లాండ్కు చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నన్నా. ఇప్పటి వరకు 25 దేశాలు, ఎడారులు, యుద్ధ ప్రాంతాలు, అడవులు, గడ్డకట్టిన సముద్రాలను దాటాడు. ఈ డేరింగ్ యాత్ర అతడి అద్భుతమైన ఓర్పు, సంకల్ప బలాన్ని ప్రతిబింబిస్తోంది. ప్రస్తుతం 27 ఏళ్ల అనంతరం బుష్బీ ప్రయాణం పటగోనియా, ఆండీస్ పర్వతాలు, మధ్య అమెరికా, మెక్సికో, యుఎస్, రష్యా, మంగోలియా, ఆసియాలోని కొన్ని ప్రాంతాల గుండా సాగనుంది. అతడు బ్రిటిష్ సైన్యంలో పారాటూపర్గా పనిచేసిన అనుభవమే ఈ సాహన యాత్రకు పురికొల్పిందని అంటాడు బుష్బీ. సైన్యంలో ఉన్నప్పుడూ అద్భుతమైన ప్రదేశాలను చూశాను. అదే తనని ఈ ప్రపంచమంతా చుట్టిరావాలనే సంచార కాంక్షను ప్రేరేపించిందని చెప్పుకొచ్చాడు. యాత్ర సాగిన విధానం..బుష్బీ 31,000-మైళ్ల యాత్ర సుమారు ఎనిమిది నుండి పన్నెండేళ్లు పడుతుందని అతను అంచనా వేశాడు. 2008 ఆర్థిక సంక్షోభం, కోవిడ్-19 మహమ్మారి వంటి అనేక భౌగోళిక రాజకీయ, ఆర్థిక, లాజిస్టికల్ అడ్డంకుల కారణంగా దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంగా మారిపోయింది.అతను తన నడకను దక్షిణ అమెరికా దక్షిణ కొనలో ఉన్న చిలీలోని పుంటా అరేనాస్లో ప్రారంభించాడు. పనామా, కొలంబియా మధ్య ఉన్న ప్రమాదకరమైన డారియన్ గ్యాప్ను దాటడంతో సహా అమెరికా ఖండాల పొడవునా నడిచాడు. మార్చి 2006లో, అతను తోటి సాహసికుడు డిమిత్రి కీఫర్ అలాస్కా నుండి సైబీరియాకు కాలినడకన గడ్డకట్టిన బేరింగ్ జలసంధిని దాటిన మొదటి వ్యక్తులలో ఒకడిగా నిలిచాడు.అనధికారిక సరిహద్దు పాయింట్లోకి ప్రవేశించిన తర్వాత వీసా సమస్యలు, ఐదు సంవత్సరాల ప్రవేశ నిషేధం వంటి సమస్యలను ఎదుర్కొనాల్సి వచ్చింది. దాంతో రష్యా గుండా వెళ్లటం సాధ్యపడలేదు. టండ్రా పరిస్థితుల దృష్ట్యా శీతాకాలం చివరిలో, వసంతకాలం ప్రారంభంలో మాత్రమే నడక మార్గం అనుకూలంగా ఉండేది బుష్బీకి. ఆగస్టు 2024లో, రాజకీయ ప్రమాదాల కారణంగా ఇరాన్ లేదా రష్యాలోకి ప్రవేశించకుండా కజకిస్తాన్ నుంచి అజర్బైజాన్కు కాస్పియన్ సముద్రం మీదుగా ఈదాడు. దీనికై విశ్రాంతి కోసం సహాయక పడవలతో 31 రోజులు పట్టిన 179-మైళ్ల క్రాసింగ్.ఆ తర్వాత కాకసస్, టర్కీ గుండా నడిచాడు, 2025లో బోస్ఫరస్ జలసంధిని దాటి యూరప్లోకి ప్రవేశించాడు. 2025 చివరి నాటికి, అతను యూకే నుంచి 1,400 మైళ్ల కంటే తక్కువ దూరంలో ఉన్న రొమేనియా గుండా నడక ప్రారంభించాడు. అయితే బుష్బీ సంకల్పించినట్లుగా తన ప్రధాన నియమం విచ్ఛిన్నం కాకుండా జాగ్రత్తపడ్డాడు. కాలినడకనే తిరిగి ఇంటికి వెళ్లానే తన పట్టుదలను ఎక్కడ బ్రేక్ చేయకుండా ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం బుష్బీ హంగేరీలో ఉన్నాడు. ఇంగ్లాండ్లోని తన స్వస్థలమైన హల్ నుంచి దాదాపు 932 మైళ్ల దూరంలో ఉన్నాడు. అతడి యాత్ర విజయవంతమైతే గనుక నిరంతరాయంగా నడిచిన తొలి వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకుని రికార్డు క్రియేట్ చేస్తాడు. చివరగా బుష్బీ 29 ఏళ్ల వయసులో ప్రపంచ యాత్ర మొదలుపెడితే 56 ఏళ్ల వయసుకు పూర్తి చేయనున్నాడు. నిజంగా ఇది అతిపెద్ద డేరింగ్ యాత్ర కదూ..!(చదవండి: ఆ యువ సైక్లిస్ట్ గట్స్కి మాటల్లేవ్..! ఆ వ్యాధిపై అవగాహన పెంచడం కోసం..) -
క్రిటికల్ కేర్ తక్షణ.. రక్షణ!
‘‘ఆయనది చాలా క్రిటికల్ కండిషన్ అట!’’... ఒకరికి చాలా సీరియస్గా ఉన్నప్పుడు చాలామంది ఈ మాట వాడుతుంటారు. కార్డియాలజీ, న్యూరాలజీ... ఇలాంటి అనేక విభాగాల్లాగే ‘క్రిటికల్ కేర్’ అనేది కూడా ఒక విభాగం. కాకపోతే కార్డియాలజీ, న్యూరాలజీలతో పాటు ఇలాంటి అన్ని విభాగాల వారికీ చికిత్స అందించే అత్యంత కీలక విభాగమిది. అయితే... వైద్యశాస్త్ర పరిజ్ఞానం ఉన్న కొందరు తప్ప... చాలామంది క్రిటికల్ కేర్నూ, ఎమర్జెన్సీ విభాగాన్నీ ఒకటే అనుకుంటారు. కానీ అది సరికాదు. కానీ... క్రిటికల్ కేర్ అన్నా లేదా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అన్నా దాదాపుగా ఒకటే. కాకపోతే కార్డియాలజీ, న్యూరాలజీలకు ప్రత్యేకంగా ఐసీసీయూ (ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ యూనిట్), ఎన్ఐసీయూ (న్యూరో ఇంటెన్సివ్ కేర్ యూనిట్) ఇలా చాలా పెద్ద పెద్ద హాస్పిటళ్లలో వేర్వేరు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు ఉండవచ్చు. కానీ ఓ మోస్తరు పెద్ద హాస్పిటల్స్లో ఒకే ఐసీయూ ఉంటుంది. క్రిటికల్ పరిస్థితుల్లో ఉండే బాధితులకు ఈ క్రిటికల్ కేర్ యూనిట్స్లో అందే చికిత్సలూ, అందజేసే నిపుణులైన డాక్టర్లు... ఆ క్రిటికల్ కేర్ ప్రత్యేకతలేమిటో చూద్దాం.క్రిటికల్ కేర్, ఎమర్జెన్సీ కేర్ ఒకటి కాదు. ఎమర్జెన్సీ అంటే... ఏదైనా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న బాధితులప్రాణాలు నిలిపేందుకు కొద్దిసేపు మాత్రమే అక్కడ ఉంచి చికిత్స అందించి... ఇకప్రాణాలు నిలుస్తాయన్న తర్వాత క్రిటికల్ కేర్ / ఇంటెన్సివ్ కేర్ యూనిట్కు తరలించి అక్కడ మాత్రం చాలా సేపు ఉంచి చికిత్స అందించి, ఒక వార్డుకు లేదా రూమ్కు తరలించి చికిత్స అందిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎమర్జెన్సీ కొద్ది కాలం... క్రిటికల్ కేర్లో కాస్తంత ఎక్కువ కాలం చికిత్స అందిస్తారు.క్రిటికల్ కేర్కూ, ఎమర్జెన్సీకీ ఇదీ తేడా...మనకు తేలిగ్గా అర్థమయ్యేందుకు ఒక ఉదాహరణ చెప్పుకుందాం. విషం తీసుకున్న ఒక వ్యక్తిని ఎమర్జెన్సీకి తీసుకురాగానే... ఒక సెకండ్లోని చాలా సూక్ష్మమైన భాగం అంటే క్షణాల్లోనే గొంతులోకి పైప్ వేయగలంత సమర్థులు ఎమర్జెన్సీలో ఉంటారు. అలా ఆ గొట్టం ద్వారా కడుపులో ఉన్న విషాన్ని బయటకు తీసుకువస్తారు. అలాగే ఓ రోడ్డు యాక్సిడెంటు లేదా ఇతరత్రా ప్రమాదాలకు గురైనవారినీ (ట్రామా కేసు) లేదా గుండెపోటు వచ్చినా, పక్షవాతానికి గురైనా... తక్షణప్రాణాపాయం ఉన్నవారికి... తక్షణ వైద్యసేవ అందాల్సిన అవసరం ఉన్న వ్యక్తికి... ఆ తక్షణ చికిత్స అందేలా చేసేదే ఎమర్జెన్సీ వార్డు. ఇక అలా ఎమర్జెన్సీ చికిత్స అందిన తర్వాత... అప్పటికప్పుడు వచ్చే ప్రమాదం తప్పినప్పటికీ... తక్షణ అవసరం పెద్దగా ఏదీ లేకపోయినా... పూర్తి ప్రమాదం ఇంకా ఉండనే ఉందనీ, కొంతకాలం పాటు చాలా అప్రమత్తంగా చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలిశాక... అంతటి అప్రమత్తతతో పేషెంట్స్ను చూసుకునే విభాగమే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లేదా క్రిటికల్ కేర్ యూనిట్. ఎమర్జెన్సీలో ఉండే అన్ని రకాల అప్రమత్తమైన సేవలూ క్రిటికల్ కేర్లో ఉన్నప్పటికీ... ఇక్కడ పేషెంట్ను ఎమర్జెన్సీ వార్డులో కంటే ఎక్కువ సేపు ఉంచి చికిత్స అందిస్తారు. కొన్ని దేశాల్లో దీన్ని ‘క్రిటికల్ కేర్ విభాగం’ అంటారు. మరికొన్ని చోట్ల దీన్నే ‘ఇంటెన్సివ్ కేర్ విభాగం’ అంటారు. పేరు ఏదైనప్పటికీ... అక్కడి డాక్టర్లు, వైద్య సిబ్బంది అనునిత్యం అప్రమత్తంగా ఉంటారు. ఇందుకోసం క్రిటికల్ కేర్ డాక్టర్లు ప్రత్యేక శిక్షణ పొంది ఉంటారు. పేషెంట్ జీవితాన్ని కాపాడాటానికి రోజులోని 24 గంటలూ అంతే సావధానంగా ఉంటారు. అందుకే వీళ్లను ఇంటెన్సివిస్ట్స్ అని కూడా అంటారు.ఇక్కడి పేషెంట్స్ ఎవరంటే...?తక్షణ చికిత్స అందక అలాగే వదిలేస్తే కొద్ది క్షణాల్లోనేప్రాణాపాయం సంభవించగల అవకాశం ఉన్న పేషెంట్స్ను క్రిటికల్ కేర్ యూనిట్కు తరలిస్తారు. అత్యవసరంగా వైద్యసేవలు అవసరమైన రోగులు ఆసుపత్రిలో తొలుత వచ్చే ప్రదేశమిది. సాధారణంగా గుండెపోటు, పక్షవాతం, ఏదైనా రోడ్డు / వాహన / రైలు ప్రమాదానికి గురైనవారు, అగ్నిప్రమాదాల బారిన పడ్డవారు, పాము లేదా తేలు కాటుకు గురైనవారు, విషం తాగినవారు, ఏదైనా ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్కు గురై తక్షణ చికిత్స అవసరమైనవారు... ఇలాంటి కేసులను క్రిటికల్ కేర్ యూనిట్కు తరలిస్తారు.అన్ని విభాగాలలోనూ నిష్ణాతులు... క్రిటికల్ కేర్ ఇంటెన్సివిస్టులు ఒక పేషెంట్స్కు... ఏ ప్రత్యేకమైన దేహభాగం లేదా అవయవానికి (గుండె లేదా మెదడు... ఇలా) లేదా ఓ వ్యవస్థకు (కార్డియాలజీ / న్యూరాలజీ / గ్యాస్ట్రో ఎంటరాలజీ వ్యవస్థ) ఎలాంటి వైద్యచికిత్స అవసరమో... ఆ డాక్టర్తో పాటు మిగతా అనుబంధ విభాగాలలోని ఆ డాక్టర్ల బృందమంతా వెంటనే పేషెంట్కు చికిత్స అందించడం మొదలుపెడతారు. ఉదాహరణకు ఒక వ్యక్తి రోడ్డు యాక్సిడెంట్కు లోనైనప్పుడు మొదట తలకు దెబ్బతగిలి ఉండే న్యూరో సర్జన్తో పాటు ఎముకలకు ఏదైనా హాని జరిగిందేమోనంటూ ఆర్థోపెడిక్ సర్జన్... అలాగే ఆ దెబ్బ తగిలిన చోటును బట్టి రక్తప్రసరణ వ్యవస్థకు ఏదైనా విఘాతం కలిగితే దానికి సంబంధించిన నిపుణులు... ఇలా అవసరాన్ని బట్టి ప్రధాన వైద్య నిపుణులతో బాటూ ఇతర నిపుణులూ కలిసి పనిచేసి పేషెంట్ను రక్షించడానికి ప్రయత్నిస్తారు. అలా మొదటగా అతడిలోని జీవక్రియలకు సంబంధించిన వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేసేలా చూస్తారు. ఇలాంటి పత్యేక శిక్షణ పొందిన వైద్యులను ‘ఇంటెన్సివిస్ట్స్’ అంటారు. అంటే వాళ్ల చికిత్స చాలా కేంద్రీకృతంగా, తక్షణం పేషెంట్ప్రాణాలను రక్షించడం కోసమే అయి ఉంటుంది. ఈ ఇంటెన్సివిస్ట్లందరూ కేవలం ఒక నిర్ణీతమైన దేహవ్యవస్థా లేదా ఓ నిర్దిష్టమైన అవయవం విషయంలోనే కాకుండా... పూర్తిగా అన్ని శారీరక దేహ వ్యవస్థలూ (అంటే నాడీ, జీర్ణ, రక్తప్రసరణ, గుండె ఇలా అన్ని రకాల వ్యవస్థలూ), దేహభాగాలూ / అవయవాలన్నింటిపైనా మంచి పట్టు, వాటి చికిత్సల్లో అద్భుతమైన నైపుణ్యంగలవారిగా ఉంటారు.గతం కంటే ఇప్పుడు మరిన్ని నైపుణ్యాలతోనూ ఇంకింత ప్రత్యేకంగా... దాదాపుగా గత మూడు శతాబ్దాల క్రితం అన్ని రంగాలకు చెందిన వైద్యులంతా ఈ ఇంటెన్సివ్ కేర్ యూనిట్/క్రిటికల్ కేర్ విభాగంలో ఉండేవారు. అన్ని రకాల సేవలూ అక్కడే దొరికేవి. కానీ ఇప్పుడు ఆధునిక యుగంలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు / క్రిటికల్ కేర్ యూనిట్ల పనితీరు పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు వైద్యరంగంలో వచ్చిన ఆధునిక వైద్య పరిజ్ఞానం, అత్యున్నతమైన సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత... పేషెంట్లను ఉంచే ప్రదేశాలూ, అక్కడి వసతులు అన్నీ ప్రత్యేకంగా మారాయి. ఉదాహరణకు... శ్వాస తీసుకోలేని రోగులకు కృత్రిమశ్వాస అందించేందుకు వెంటిలేటర్లు, పేషెంట్స్కు సంబంధించిన అన్ని రకాల కీలకమైన రీడింగ్స్ను తీసుకునే అత్యున్నత స్థాయి పరిజ్ఞానం కలిగిన సున్నితమైన (ప్రెసిషన్గా పనిచేసే సెన్సిటివిటీ ఎక్కువగా ఉండే) పరికరాలు, మూత్రపిండాలు విఫలమైన సందర్భాల్లో కృత్రిమంగా దేహంలో లేదా రక్తంలోని మలినాలన్నింటినీ తొలగించే డయాలసిస్ యంత్రాలు... ఇలా ఎన్నో కీలకమైన ఉపకరణాలన్నీ ఏ రంగానికి కావాల్సినవి ఆ రంగాలకు చెందిన ప్రత్యేక ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో ఇప్పుడు అమర్చి ఉంచుతున్నారు.అన్నింటా పురోగతితో పాటు అత్యవసర వైద్యసేవల్లో కూడా...ఇప్పటితో పోలిస్తే కొద్ది కాలం కిందట వైద్యచికిత్సలు ఇప్పటికంటే కాస్త నింపాదిగా, కాస్తంత మెల్లగా సాగేవి. అందుకే ఒకప్పటి తీవ్రమైన జబ్బులకూ శానిటోరియమ్ల తరహాలోనే ఆసుపత్రులు ఉండేవి. అత్యవసరంగా వైద్యసేవలు అందించాల్సిన చాలా సందర్భాలలో పేషెంట్లు చనిపోవడం లాంటి దుర్ఘటనలే ఎక్కువగా చోటుచేసుకునేవి. కానీ ఇప్పుడు ఆధునిక వైద్య చికిత్స ప్రక్రియల్లో గణనీయమైన పురోగతి రావడంతో ఈ చికిత్స అందించే క్రమంలోనూ విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. అంటే ఎంత వేగంగా హాస్పిటల్కు తీసుకొస్తే అంతటి ఉత్తమమైన / వేగవంతమైన చికిత్స అందేలాగా... దానికి అనుగుణంగానే ప్రభావాలు (రిజల్ట్స్) కనిపించేలా పరిస్థితులు మారిపోయాయి. ఉదాహరణకు... పెను ప్రమాదాలేవైనా సంభవించినప్పుడు... అది జరిగిన మొదటి అరగంటలోనే పేషెంట్స్ను తీసుకువస్తే... ఆ వ్యవధిని ΄్లాటినమ్ మొమెంట్స్ అని,ప్రాణాపాయాన్ని తప్పించగల అవకాశాలు పుష్కలంగా ఉంటాయని, రెండో అరగంటను గోల్డెన్ మొమెంట్స్ అని, ఆ తర్వాతి క్షణాలను సిల్వర్ మొమెంట్స్... అంటూ అభివర్ణిస్తున్నారు. అంటే గోల్డెన్ మొమెంట్స్లోప్రాణాపాయాన్ని తప్పించడానికి మంచి అవకాశం ఉండగా... ఆ తర్వాతి క్షణాల్లో ఒక మోస్తరు అవకాశాలుంటాయని... ఇలా ప్రమాదమైనా, గుండెపోటు, పక్షవాతం లాంటి ఆరోగ్య పెనుముప్పులనైనా తప్పించే అవకాశం ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది. దీనికి తోడు అన్ని విభాగాల్లోనూ సూపర్స్పెషాలిటీలు, అందులోనూ మళ్లీ సబ్స్పెషాలిటీలు రావడం మొదలైంది. ఈ మార్పుకు తగినట్లుగానే క్రిటికల్ కేర్ యూనిట్లు సైతం తమ తమ విభాగాల్లో ఇంకా ప్రత్యేకతలను సంతరించుకోవడం మొదలుపెట్టాయి. అత్యాధునిక ఉపకరణాలు,ప్రాణాలను కాపాడేందుకు కొత్త కొత్త అత్యాధునిక వైద్యసేవలు ఆవిష్కృతమవుతున్నాయి. ఈ యూనిట్లలోకి కొత్త పరికరాలు వస్తున్నాయి. ఇక్కడ పనిచేసే వైద్యులు సైతం పీజీ (ఎం.డి.) తర్వాత ఇంకా మళ్లీ క్రిటికల్ కేర్ మెడిసిన్ అనే ప్రత్యేక విద్యార్హత / ప్రత్యే శిక్షణ పొందాల్సి ఉంటుంది.ఇక్కడి నిపుణుల ప్రత్యేకత ఏమిటంటే...ఏదైనా ఒక అవయవానికి ఓ వ్యాధి వచ్చిందనుకోండి. తొలుత అది ఆ అవయవానికే పరిమితమవుతుంది. కొంతకాలం తర్వాత అది మరింతగా తీవ్రమైతే ΄÷రుగునే ఉన్న అవయవాలకూ లేదా దానితో సంబంధం ఉన్న అవయవాలకూ, సంబంధిత వ్యవస్థలకూ విస్తరిస్తుంది లేదా వాటిపై తన ప్రతికూలతలను చూపుతుంది. ఉదాహరణకు... గుండెపోటుతో గుండె కండరం విఫలం కావడం మొదలైతే... అది కేవలం గుండెకే పరిమితం కాకుండా... రక్తసరఫరా సరిగా జరగకపోవడంతో మెదడుకు కూడా రక్తం అందకపోవడం, దాని పనితీరూ ప్రభావితం కావడం జరుగుతాయి. మెదడు అన్ని కీలక అవయవాలను నియంత్రిస్తుంటుంది కాబట్టి దాని అధీనంలో ఉండే అన్ని అవయవాలూ చచ్చుబడిపోయేందుకు అవకాశాలు పెరుగతాయి. ఒకవేళ మెదడులో రక్తస్రావం అయి, గుండెను నియంత్రించే కేంద్రంపై దాని ప్రభావం పడితే గుండెనూ ప్రభావితం చేస్తుంది. అందుకే క్రిటికల్ కేర్ యూనిట్లో ఉన్నప్పుడు వ్యాధి సోకిన అవయవం గాకుండా... దాని వల్ల ప్రభావితమైన అవయవాలూ పనిచేయకుండా పోయే కండిషన్ను ‘మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్’ అంటారు. ఇక అన్ని అవయవాలూ పూర్తిగా విఫలమైతే దాన్ని ‘మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్’గా చెబుతారు. ఇలాంటి పరిస్థితి రాకుండా క్రిటికల్ కేర్ యూనిట్లోని డాక్టర్లందరూ నిరంతరం శ్రమిస్తుంటారు. అందుకే క్రిటికల్ కేర్ యూనిట్లో పనిచేసే వైద్యులకు కేవలం ఒక ప్రత్యేకమైన అవయవానికి సంబంధించిన పరిజ్ఞానమో లేదా ఒక వ్యవస్థకు చెందిన పరిజ్ఞానమో కాకుండా... శరీరంలోని అన్ని అవయవాలకు సంబంధించిన సంపూర్ణ పరిజ్ఞానం ఉండేలా శిక్షణ పొందుతారన్నమాట. అందుకోసం ప్రత్యేకంగా క్రిటికల్ కేర్ మెడిసిన్ (సీసీఎమ్) అనే విభాగమే రూపొందింది. వీళ్ల నేతృత్వంలోనే అత్యంత సంక్లిష్టమైనప్రాణాపాయాన్ని నివారించే విధులు నిర్వర్తించే కీలకమైన పనులు జరుగుతుంటాయి.ఉదాహరణకు ఒక కేస్ స్టడీ...ఒక వ్యక్తికి నిమోనియా సోకిందనుకుందాం. నిజానికి నిమోనియా లంగ్స్కు సంబంధించిన సమస్య. దేహంలోని ఎన్నో వ్యవస్థల్లో ‘శ్వాసకోశ వ్యవస్థ’ ఒకటి. నిమోనియా ఆ వ్యవస్థ కిందికి వస్తుంది. సాధారణంగా నిమోనియా చికిత్స కోసం యాంటీబయాటిక్స్తో చికిత్స అందిస్తే చాలు. కానీ ఏవైనా కారణాల వల్ల సమస్య అదుపులో లేకుండా పోయి... పేషెంట్కు శ్వాస అందకపోతే ఆక్సిజన్ పెట్టాలి. కృత్రిమ శ్వాస ఇవ్వడానికి వెంటిలేటర్ అవసరం. ఒకవేళ లంగ్స్ కు ఉన్న ఇన్ఫెక్షన్ రక్తానికీ వ్యాపించి, సెప్సిస్గా మారితే అప్పుడు కేవలం యాంటీబయాటిక్స్తో మాత్రమే చికిత్స చేస్తే సరిపోదు. ఆ పరిస్థితుల్లో అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేయించేలా మందులు ఇవ్వాలి. గుండె, రక్తప్రసరణ వ్యవస్థ అన్ని సక్రమంగా ఉండేలా చూడాలి. రక్తపోటు నియంత్రణలోకి వచ్చేలా చూడాలి. ఒక్కోసారి అతడికి గుండె పనితీరును మెరుగుపరచడానికి హార్ట్లంగ్ బైపాస్ అనే చికిత్సనూ అందించాల్సి రావచ్చు. ఇలా చేయడాన్ని ‘ఎక్స్ట్రా కార్పోరియల్ ఆక్సిజనేషన్’ అంటారు. ఒకవేళ ఇన్ఫెక్షన్ లంగ్స్ నుంచి కిడ్నీలకు పాకితే... అప్పుడతడి రక్తంలోని వ్యర్థాలను తొలగించడానికి ‘డయాలిసిస్’ అనే ప్రక్రియను నిర్వహించాలి. రక్తం పూర్తిగా కలుషితమైతే దాన్ని బయటకు తీసుకువచ్చి అక్కడ కృత్రిమంగా శుభ్రం చేసి మళ్లీ ఆ ఇన్ఫెక్షన్ తొలగిపోయాక శరీరంలోకి ఎక్కిస్తారు. దీన్ని ‘ఎక్స్ట్రా కార్పోరియల్ ప్యూరిఫికేషన్’ అంటారు. ఇలాంటి సేవలెన్నో ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్/క్రిటికల్ కేర్ యూనిట్లలో దొరుకుతాయి.ఇదో టీమ్ స్పిరిట్తో కూడిన ప్రక్రియఅత్యంత సంక్లిష్టమైన ఈ క్రిటికల్ కేర్ విభాగాల్లో కేవలం ఇంటెన్సివిస్టులు మాత్రమే కాకుండా... ఆయా విభాగాలకు చెందిన నిపుణులూ సేవలందిస్తుంటారు. ఉదాహరణకు... ఆయా అవయవానికి సంబంధించిన వైద్యులు, క్రిటికల్ కేర్ కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన నర్స్లు, సాంకేతిక నిపుణులు (టెక్నీషియన్స్)... ఇలా ఎందరో ఒక బృందంగా (టీమ్గా) పనిచేస్తుంటారు. ఈ టీమ్ వర్క్ అంతా ఒక సీనియర్ ఇంటెన్సివిస్ట్ నేతృత్వంలో, అతడి ఆదేశాల మేరకు పనిచేస్తుంటారు. వీళ్లంతా ఒక టీమ్స్పిరిట్తో పేషెంట్ను అతడున్న సంక్లిష్ట పరిస్థితి (క్రైసిస్) నుంచి బయటపడేసి సేవ్ చేస్తారు. అందుకే ఈ వైద్యవిభాగాన్ని గౌరవపూర్వకంగా ‘క్రిటికల్ కేర్ మెడిసిన్’గా లేదా ఇంటెన్సివ్ కేర్ చికిత్స అందే ప్రదేశంగా అభివర్ణిస్తారు.ఎవరెవరికి ఈ సేవలుఅవసరమంటే...? సాధారణంగా చాలా పెద్దవీ, అలాగే అత్యంత సంక్లిష్టమైనవీ అయిన శస్త్రచికిత్సలు పూర్తయ్యాక పేషెంట్ పరిస్థితి బాగా నిలకడ స్థితికి వచ్చే వరకు క్రిటికల్ కేర్లోనే ఉంచుతారు. వాళ్లే కాకుండా ఇంకా పెద్ద పెద్ద ప్రమాదాలకు గురైనవారు, గుండెపోటు వచ్చినవారూ, పక్షవాతానికి గురైన వారూ, అవయవాల మార్పిడి చికిత్స అందుకున్నవారూ, నీళ్లలో ముగినిపోయినవారు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో కీమోథెరపీ తర్వాతా అలాగే మలేరియా, డెంగ్యూ, స్వైన్ఫ్లూ వంటి మామూలు జబ్బులు సైతం కొందరిలోప్రాణాంతకంగా మారినప్పుడు వారికీ ఈ క్రిటికల్ కేర్ సేవలు అవసరమవుతాయి. ఇంకేవైనా రోడ్డు ప్రమాదాలూ, బాంబు పేలుళ్లు జరిగి అనేకమంది పదులు, వందల సంఖ్యల్లో ప్రమాదాలకు గురైనప్పుడు కూడా క్రిటికల్ కేర్ సేవలు నిరంతరం, నిరంతరాయంగా అందుతుంటాయి.నిర్దిష్టమైన పనివేళలంటూ ఉండవు... అన్నీ పనివేళలే... అక్కడ పనిచేసే సిబ్బందికి నిర్దిష్టమైన పనివేళలంటూ ఉండవు. ఏ క్షణాల్లో అత్యవసర సేవలు అవసరమవుతాయో తెలియక అనుక్షణం అప్రమత్తంగా ఉండేలా షిఫ్టుల్లో నిపుణులైన నర్సులు, సిబ్బంది పనిచేస్తుంటాయి. సవాళ్లతో కూడిన పరిస్థితుల్లోనూ ఇంకా గట్టిగా పనిచేస్తారు. వారు కోలుకున్న తర్వాత మళ్లీ మరొకరిప్రాణాలు రక్షించే పనుల్లో... ఇలా నిరంతరమూ తమ పనుల్లో నిమగ్నమవుతుంటారు.అంతరాయాలను నివారించేందుకు కొద్దిమందికే అనుమతి... ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో పనులు సాఫీగానూ లేదా అంతరాయాలు లేకుండా కొనసాగేందుకు వీలుగా సాధారణ వ్యక్తులను చాలా పరిమితంగా మాత్రమే అనుమతిస్తుంటారు. ఒకవేళ వెళ్లాల్సివచ్చినా ప్రత్యేకమైన గౌనులు, మాస్కులు, క్యాప్స్ ధరించి వెళ్లాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలు కూడా పేషెంట్స్కు మేలు చేసేందుకు ఉద్దేశించినవే. అక్కడ (ఐసీయూలో) ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదలను బాగా తగ్గించడానికే. ఆగిన గుండెను మళ్లీ స్పందిచేలా చేసే సీపీఆర్ (కార్డియో పల్మునరీ రిససియేషన్) చేసే సిబ్బంది వంటి ప్రత్యేక నిపుణులు అక్కడ ఉంటారు. ఈ సంయుక్త సేలవన్నింటి వల్ల ఇప్పుడు... అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో గాయపడ్డా... వారిలోప్రాణాలు కోల్పేయేవారి సంఖ్య దాదాపుగా తగ్గిపోయింది. ఇలా అందరిప్రాణాలూ కాపాడటం కోసం ఉద్దేశించిన అంత్యంత కీలకమైనదే ఈ క్రిటికల్ కేర్ విభాగం. -
స్టార్ పేరెంటింగ్
‘పేరెంటింగ్ అంటే ఇలా ఉండాలి. ఇలా మాత్రమే ఉండాలి’ అని పుస్తకంలో రాసుకొని ఏ తల్లిదండ్రులు పేరెంటింగ్ చేయరు. పిల్లల పెంపకంలో ఒక్కొక్కరిదీ ఒక్కో దారి. అది సహజమైనది. సృజనాత్మకమైనది. ఎవరి దారి ఏదైనా అందులోని మంచి ఎంతోమంది తల్లిదండ్రులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. సోషల్ మీడియా వేదికగా ప్రియాంక చోప్రా, ట్వింకిల్ఖన్నా, కరీనా కపూర్, సానియా మీర్జా... మొదలై వారు వివిధ సందర్భాలలో తమ పేరెంటింగ్ అనుభవాలను పంచుకున్నారు. పాతతరం, కొత్తతరంలోని అంశాలతో మిళితమైన ఈ నయా పేరెంటింగ్ గురించి...మన మూలాల్లోకి...‘గ్లోబల్ ఐకాన్’గా గుర్తింపు తెచ్చుకున్నా సరే, ప్రియాంక చోప్రా తన భారతీయ మూలాలను ఎప్పుడూ మరవలేదు. కూతురు మాల్తీ మేరీకి భారతీయ సంప్రదాయాలు తెలిసేలా పెంచుతోంది. అమెరికాలో ఉన్నా సరే ఇంట్లో రోజూ హిందీ వినపడాల్సిందే. దీంతో మాల్తీ చిన్న చిన్న హిందీ మాటలు మాట్లాడుతుంటుంది. కూతురు నోటి నుంచి హిందీ వినిపించినప్పుడు ఆ తల్లి సంతోషం ఇంతాఅంతా కాదు!ప్రియాంక మాటల్లో చెప్పాలంటే... ‘భాష అనేది కమ్యూనికేషన్ మాత్రమే కాదు, కనెక్షన్ కూడా!’ భాష మన మూలాలతో మనల్ని అనుసంధానిస్తుంది. అమెరికాలోని తన ఇంట్లో ఇండియాను ఆవిష్కరించడానికి మన పండగలను తప్పనిసరిగా జరుపుకుంటుంది ప్రియాంక. వాటి వి«శిష్ఠత గురించి పిల్లలకు చెబుతుంది. మనదైన సంగీతం వినిపిస్తుంది. మన జానపద కథలు చెబుతుంది. ఇంట్లో వండిన భారతీయ వంటకాల గురించి వివరిస్తుంది.‘మా అమ్మాయికి పనీర్, బిర్యానీ అంటే చాలా ఇష్టం’ అని సంతోషంగా చెబుతుంది ప్రియాంక. ‘నా ప్రయత్నాల వల్ల భౌగోళికంగా, సాంస్కృతికంగా, భావోద్వేగపరంగా తాను ఎక్కడి నుంచి వచ్చింది అనేది మాల్తీ తెలుసుకోగలుగుతుంది’ అంటుంది ప్రియాంక. మన మూలాలను మరిచిపోనివ్వని పేరెంటింగ్ ఎలా ఉంటుందో ప్రియాంక పెంపకంలో చూడవచ్చు. ‘నా కూతురు నా నీడ కాదు. నా వారసత్వం... మాల్తీ ఒక ఫైర్’ అని కూతురు గురించి మురిసిపోతుంటుంది ప్రియాంక.తల్లే గురువుటెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్కు తల్లి మాత్రమే కాదు, ఆటలో గురువు కూడా. ఆమె తల్లి నసీమా మీర్జా షేర్ చేసిన వీడియోలో సానియ ఇజాన్తో కోర్టులో తిరగడం, ఫోర్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్ గురించి నేర్పించడం కనిపిస్తుంది. నసీమా ఈ అందమైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.... ‘నోస్టాల్జిక్, నోస్టాల్జిక్, నొస్టాల్జిక్! కూతురు, మనవడు ఒకే రకమైన పాషన్తో టెన్నిస్ ఆడుతున్న దృశ్యం చూడడం’ అని రాసింది.నసీమాకు సానియా బాల్యం గుర్తొచ్చి ఉంటుంది. చిన్నారి సానియాతో తాను కూడా టెన్నిస్ కోర్టులకు వెళుతుండేవి. ‘ఆటలెందుకమ్మా...చక్కగా చదువుకోకుండా’ అని ఆమె అని ఉంటే టెన్నిస్ స్టార్గా సానియా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకునేది కాదు. ‘పిల్లల ఇష్టాయిష్టాలు కనిపెట్టాలి, ఇష్టపడే వాటిలోనే వారిని తీర్చిదిద్దాలి’ అనే సూత్రాన్ని నమ్మి పాటించింది నసీమా. ఇప్పుడు ఆమె కూతురైన సానియా కూడా అంతే. కుమారుడు ఇజాన్లోని ఇష్టాన్ని కనిపెట్టి ఆ చిన్నారికి టెన్నిస్లో ఓనమాలు దిద్దిస్తోంది. తల్లే గురువు అయితే అంతకంటే ఆనందం ఏముంటుంది! తల్లికొడుకులకు తేడా ఏమిటంటే... తల్లి రైట్–హ్యాండెడ్. కొడుకు లెఫ్ట్–హ్యాండెడ్. ఒక పాషన్తో ఏడు సంవత్సరాల ఇజాన్ స్ట్రోక్స్ ప్రాక్టిసింగ్ చూస్తుంటే, ఈ సాధన ఇలాగే కొనసాగితే భవిష్యత్లో ఇజాన్ తల్లి మెచ్చిన తనయుడు అవుతాడు అనడంలో సందేహాం లేదు.ఆమె అడుగు జాడల్లో..పేరెంటింగ్కు సంబంధించి పెద్దలు మహా విశ్వవిద్యాలయాలు! కరీనా కపూర్కు సంబంధించి మహా విశ్వవిద్యాలయం ఆమె అత్తయ్య షర్మిలా ఠాగోర్. ‘ఎప్పుడూ మీ అడుగు జాడల్లో నడవడానికి ప్రయత్నిస్తుంటాను’ అని షర్మిలా ఠాగోర్కు ఇటీవల పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది కరీనా. ఈ సందర్భంగా అత్తయ్య ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. పిల్లలతో షర్మిల ఎలా కలిసిపోతుందో చెప్పడానికి ఈ ఫొటోలే సాక్ష్యం.ఆరోజుల్లో సినిమాలలో చాలా బిజీగా ఉండడం వల్ల చిన్నారి సైఫ్ అలీఖాన్తో ఎక్కువ సమయం గపపడానికి షర్మిలకు సమయం చిక్కేది కాదు. దాని గురించి ఇప్పటికీ బాధ పడుతూ ఉంటుంది. పిల్లలతో ఎక్కువ సమయం గడపకపోవడం వల్ల కలిగే నష్టాల గురించి చెబుతుంటుంది. ఎలాంటి అంతరాయం కలిగించకుండా పిల్లల మాటలను శ్రద్ధగా వింటుంది ఠాగోర్. ‘మన నుంచి పిల్లలే కాదు, పిల్లల నుంచి మనం నేర్చుకునేది కూడా ఏదో ఒకటి ఉంటుంది’ అంటుంది షర్మిలా.‘కెరీర్లో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబంలో ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవడానికి ఏదో ఒక విషయం ఉంటుంది. పిల్లల పెంపకానికి సంబంధించి సంప్రదాయ విధానాలకు, ఆధునికి విధానాలను జత చేయాలి’ అంటుంది షర్మిలా ఠాగోర్. అత్తయ్య మాటలను అక్షరాల అనుసరించే ప్రయత్నం చేస్తోంది కరీనా కపూర్.ఆత్మగౌరవంపేరెంటింగ్కు సంబంధించి రచయిత్రి, నటి ట్వింకిల్ఖన్నా తన తల్లి డింపుల్ కపాడియాను సందర్భానుసారంగా ఉదాహరిస్తుంటుంది. ప్రసిద్ధ బాలీవుడ్ నటి డింపుల్ కపాడియ ఆరోజుల్లో మూడు షిఫ్ట్లలో పనిచేస్తూ ఉండేది. క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ పిల్లల చదువు, బాగోగులకు సంబంధించి అశ్రద్ధ వహించేది కాదు. పొద్దున అయిదు గంటలకే లేచి వ్యాయామాలు చేస్తూ ఉండేది.‘వ్యాయామాలు చేస్తున్న అమ్మను చూస్తున్నప్పుడు సూపర్ ఉమెన్ను చూసినట్లుగా ఉండేది’ అని గతాన్ని గుర్తు చేసుకుంటుంది ట్వింకిల్ ఖన్నా. ఆత్మగౌరవానికి సంబంధించి తన తల్లి నుంచి ఎంతో నేర్చుకున్నానని చెబుతుంటుంది ట్వింకిల్. ‘మీరు ఆధారపడగల ఏకైక వ్యక్తి మీరే. ప్రతి మహిళా స్వతంత్రంగా ఉండాలి’ అని కూతుళ్లు ట్వింకిల్, రింకిలకు చెబుతుండేది డింపుల్.‘అత్తయ్యలు, అమ్మమ్మ, తాతయ్యలతో మా ఇళ్లు సందడిగా ఉండేది. ఇంట్లో ఎందరు ఉన్నప్పటికీ అమ్మతో గడపడం అనేది అపురూపమై అనుభవం’ టింకిల్ ఖన్నా దృష్టిలో పేరెంటింగ్ అంటే... ‘పేరెంటింగ్ నిర్మాణత్మకంగా ఉండాలి. అదే సమయంలో స్వేచ్ఛ ఉండాలి. పేరెంటింగ్లో క్రమశిక్షణ ఉండాలి. సరదాగా నవ్వుకునే స్వేచ్ఛ ఉండాలి. పేరెంటింగ్లో బ్యాలెన్సింగ్ అనేది ప్రధానం’ ‘పిల్లల పెంపకానికి సంబంధించి ఇప్పుడు తల్లిదండ్రులు సరికొత్త సవాళ్లు ఎదుర్కొంటున్నారు’ అని చెబుతున్న ట్వింకిల్ ఖన్నా వాటి పరిష్కార మార్గాల గురించి పత్రికలలో, పుస్తకాలలో, సోషల్ మీడియాలో రాస్తూ ఉంటుంది. -
పర్యావరణ హిత మష్రూమ్ ఫర్నీచర్..! జస్ట్ 180 రోజుల్లోనే..
ఫర్నీచర్ అనగానే చాలామటుకు ప్లాస్టిక్ ఏదో రూపంలో వినియోగిస్తున్నాం. ముఖ్యంగ కుర్చీలు, సోఫాసెట్ల వరకు అన్నింట్లో ప్లాస్టిక్ మయం. కాస్త డబ్బులు బాగా ఉంటే..మంచి వుడ్తో చేసిన ఫర్నీచర్ ఉపయోగిస్తారు. చాలా తక్కువ ఖరీదు కూడా. ఇలా అందరికీ అందుబాటులో ఉండే ప్లాస్టిక్ ఫర్నీచర్కి అడ్డుకట్ట వేసేలా ముంబైకి చెందిన దంపతులు విన్నూతన ఆవిష్కరణకు తెరలేపారు. భూమాతకు హానికరం కానీ మట్టిలో కలిసిపోయే ఫర్నీచర్ని అన్వేషించి మరి సరికొత్త ఆవిష్కరణకు పూనుకుని అందరిచేత ప్రశంసలందుకుంటున్నారు. ఇంతకీ వాళ్లు ఆ ఫర్నిచర్ని ఏవిధంగా తయారు చేశారంటే..మష్రూమ్తో ఫర్నిచర్ డిజైన్కి శ్రీకారం చుట్టారు ముంబైకి చెందిన భక్తి లునావత్, సుయాష్ సావంత్ దంపతులు. 2010లో ముంబైలోని ఒక ఆర్కిటెక్చర్ స్కూల్లో ఒకరికొకరు పరిచయమయ్యారు. అలా 2015లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఇద్దరూ బార్సిలోనాలోని ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ కాటలోనియా (ఐఏఏసీ)కి పై చదువుల కోసం వెళ్లారు. చదువు పూర్తయ్యాక ఇద్దరి వేర్వేరు మార్గాల్లో పయనించారు. భక్తి స్పానిష్ ఆర్కిటెక్ట్ రికార్డో బోఫిల్తో కలిసి పనిచేస్తే.. సుయాష్ లిస్బన్లో ప్రాక్టీస్ చేశాడు. కానీ.. ఇద్దరూ 2022లో తిరిగొచ్చి ముంబైలో కలుసుకున్నారు. అదే సంవత్సరం వాళ్లు 'అనోమాలియా' పేరుతో స్టార్టప్ పెట్టారు.సాధారణంగా కన్స్ట్రక్షన్, డిజైన్ ఇండస్ట్రీల నుంచి పెద్ద ఎత్తున వ్యర్థాలు వస్తుంటాయి. వాటిని తగ్గించే మార్గాల కోసం ఇద్దరు అన్వేషించారు. వారిద్దర్ని కలిపింది కూడా ఆ ఆలోచనే. అప్పుడే వాళ్లు మైసిలియం రీ జెనరేటివ్, సర్క్యులర్ నేచర్ గురించి తెలుసుకున్నారు. దాంతో ఫర్నిచర్ తయారుచేస్తే లైఫ్ స్పాన్ పూర్తి కాగానే బయోడీగ్రేడ్ అవుతుంది. అంటే నేచర్లో కలిసిపోతుంది. ఇతర ఫర్నిచర్ మెటీరియల్స్లా భూమిపై పేరుకుపోదని గుర్తించారు.దీనిపై ప్రయోగాలు చేసేందుకు కరోనా టైం కలిసొచ్చింది. అప్పుడే వాళ్లు దీనిపై రీసెర్చ్, ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. ముందుగా వాళ్లు కప్ కేక్ ట్రేల్లో మష్రూమ్స్ని పెంచారు. అవి తేలికగా ఉన్నప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అప్పటినుంచి వాటితో ఇటుకలు, పార్టిషన్స్, క్లాత్ తయారుచేశారు. చివరికి ఫర్నిచర్తో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు.ఇది పెరుగుతుందే గానీ..తయారవ్వదు..ఇప్పుడు వాళ్లు అనోమాలియాలో ఫర్నిచర్ తయారుచేయడం లేదు. పెంచుతున్నారు. అందుకే 'గ్రోన్ నాట్ బిల్ట్' అనే ట్యాగ్లైన్తో ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేస్తున్నారు. మైసిలియంని అగ్రికల్చర్ వేస్ట్తో కలిపి మాడ్యులర్ 'మైక్రోబ్లాక్లను' తయారుచేస్తారు. ప్రతి బ్లాక్ 1.5 కిలోల బరువు ఉంటుంది. కానీ, 1.5 టన్నుల కంప్రెసివ్ లోడ్ను తట్టుకోగలదు. ఈ బ్లాక్లను స్టూల్స్, టేబుళ్లు, అల్మారాలు.. ఇలా ఏ ఫర్నిచర్ తయారీలో అయినా వాడుకోవచ్చు. మరో ప్రత్యేకత ఏంటంటే.. దీంతో 'మైకోలైవింగ్' అనే మైసిలియం క్లాత్ని కూడా తయారుచేస్తున్నారు.మైసిలియం ఓవర్ గ్రోత్ దశలో ఉన్నప్పుడు దాని పొరని ఒలిచి, ప్రాసెస్ చేసి సీటింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. పెరిగిన మైసిలియం బ్లాక్స్ను కాల్చడం, ఎండలో ఆరబెట్టడం వల్ల అది చాలా స్ట్రాంగ్గా మారుతుంది. దానికి తేనె తెట్టె మైనం, లైమ్ ప్లాస్టర్ లాంటి న్యాచురల్ కోటింగ్స్ వేస్తారు. వీళ్లు తయారుచేసిన ప్రొడక్ట్స్ 10 నుంచి 12 సంవత్సరాల వరకు మన్నికగా ఉంటాయి. ఆ తర్వాత చెత్తలో వేస్తే 180 రోజుల్లో మట్టిలో కలిసిపోతాయి. అయితే ఈ పుట్టగొడుగులు పెంచడం అంత సులభం కాదు. అందుకు సవాళ్ల తోపాటు, ఓపిక చాలా అవసరం. ఆర్థికంగా కూడా ఈ స్థార్టప్ ప్రయాణం చాలా కష్టమే. ఇక భక్తి, సయాష్లు ఉద్యోగాలు చేసి సంపాదించింది మొత్తం ఇందులోనే పెట్టేశారు. అలాగే దీనికి గోద్రేజ్ లాంటి ఫెలోషిప్స్, గ్రాంట్ల వల్ల కొంత ఆర్థికసాయం కూడా తోడైంది. అలా 2022లో అనోమాలియాను ప్రారంభించారు. మొదట్లో తమ ప్రొడక్ట్ని కొంటారో లేదో అని భయపడ్డారు. కానీ మూడేళ్లకే వాళ్ల ప్రొడక్ట్స్కి మంచి గుర్తింపు లభించింది. 2025లో అత్యంత ప్రతిష్టాత్మకమైన డిజైన్ వేదికల్లో ఒకటైన వెనిస్ బిన్నెలేలో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం ఇండోనేషియాలోని ఎంవైసీఎల్ కంపెనీతో పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మైసిలియం ఉత్పత్తిదారుల్లో ఒకటి. ఇందులో రైతులను కూడా భాగస్వాములను చేయాలని చూస్తున్నారు ఇద్దరూ. వాళ్ల సాయంతోనే వ్యర్థాలను సేకరించి పర్యావరణానికి మేలుచేసే ఫర్నీచర్ ఉత్పత్తి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెబుతున్నారు భక్తి, సుయోష్లు.(చదవండి: హనుక్కా పండుగ అంటే..? యూదులు ఎందుకింత ఘనంగా జరుపుకుంటారంటే..) -
సంచలన విజయం.. ఎవరీ శ్రీలేఖ?
కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. ఒంటరిగా పోటీ చేసి విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 101 వార్డులకు జరగిన ఎన్నికల్లో 50 చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలిచారు. దీంతో తిరువనంతపురం మేయర్ పీఠం తొలిసారిగా కాషాయ పార్టీకి దక్కింది. అయితే మేయర్గా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. మేయర్ రేసులో సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారి ఆర్. శ్రీలేఖ (R. Sreelekha) ముందంజలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. 64 ఏళ్ల శ్రీలేఖ శాస్త్ర మంగళం వార్డు నుంచి ఎల్డీఎఫ్ కూటమి అభ్యర్థిపై 700 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.మోదీ స్ఫూర్తితో పొలిటికల్ ఎంట్రీ1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన శ్రీలేఖ కేరళలో తొలి మహిళా ఐపీఎస్గా రికార్డుకెక్కారు. ఉద్యోగ జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న ఆమె, వివాదస్పద అధికారిగా పేరుగాంచారు. 2020లో పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి అనేక అంశాలపై బహిరంగంగా స్పందిస్తూ వస్తున్నారు. 2024, అక్టోబర్లో ఆమె బీజేపీలో చేరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ స్ఫూర్తితో తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. “నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా ఉన్నాను. పదవీ విరమణ తర్వాత, ప్రజలకు సేవ చేయడానికి ఇదే ఉత్తమ మార్గమని నేను నమ్ముతున్నాను,” అని ఆమె అన్నారు.లెక్చరర్ టు ఐపీఎస్శ్రీలేఖ తిరువనంతపురంలోనే పుట్టిపెరిగారు. 1960 డిసెంబర్ 25న ప్రొఫెసర్ ఎన్. వేలాయుధన్ నాయర్, బి. రాధమ్మ దంపతులకు ఆమె జన్మించారు. కాటన్ హిల్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్లో విద్యాభాస్యం ప్రారంభించారు. ఆ తర్వాత ఉమెన్స్ కాలేజ్ నుంచి ఆంగ్ల సాహిత్యంలో తన బ్యాచిలర్ డిగ్రీ చేశారు. యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుంచి మాస్టర్ డిగ్రీ పట్టా అందుకున్న తర్వాత లెక్చరర్గా ఉద్యోగ జీవితం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొద్దిరోజులు రిజర్వ్ బ్యాంక్లో కూడా పనిచేశారు. 1987, జనవరిలో కేరళ తొలి మహిళా ఐపీఎస్ అధికారిణిగా పోలీసు సర్వీసులో చేరారు. మహిళలు పోలీసు ఉన్నత ఉద్యోగాల్లో చేరడానికి ఆమె ప్రేరణగా నిలిచారు.తల్లి ప్రోత్సాహంమహిళా ఐపీఎస్ అధికారిగా మొదటి పదేళ్లు చాలా సవాళ్లు ఎదుర్కొన్నానని గతంలో ఓ ఇంటర్య్వూలో చెప్పారు. మహిళా పోలీసు అధికారికి స్నేహపూర్వకంగా లేని వ్యవస్థతో పోరాడటానికి తాను రెట్టింపు కష్టపడ్డానని పేర్కొన్నారు. అయితే ఎంతో మంది యువతులు తనను స్ఫూర్తిగా తీసుకోవడం ఆనందం కలిగించే విషయమని చెబుతూ... వేరే రాష్ట్రానికి చెందిన ఒక యువ మహిళా ఐపీఎస్ తనలాగే కావాలని ఆకాంక్షిస్తున్నా ఆశీర్వాదం కోసం తన వద్దకు వచ్చిన క్షణాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. తన తల్లి ఇచ్చిన ప్రోత్సాహం కారణంగానే తాను ఐపీఎస్ సాధించానని శ్రీలేఖ వెల్లడించారు. కాగా, పోలీసు శాఖలో మహిళల ప్రాతినిథ్యం పెంచడానికి శ్రీలేఖ కృషి చేశారు. పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాల్లో 'పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి' అనే నిబంధనను తొలగించాలని కోరుతూ ఆమె నిరంతరం లేఖలు రాసేవారు. ఆమె కాలంలో 4 శాతం ఉన్న మహిళా ప్రాతినిధ్యం, నేడు పోలీసు బలగంలో 9 శాతానికి పైగా పెరిగింది.'రైడ్ శ్రీలేఖ'చేర్తలా, త్రిస్సూర్, పతనంతిట్ట, అలప్పుజ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు శ్రీలేఖ. తన పనితీరుతో 'రైడ్ శ్రీలేఖ'గా ఆమె ప్రాచుర్యం పొందారు. సీబీఐలో నాలుగేళ్లు పనిచేశారు. న్యూఢిల్లీలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్గానూ సేవలు అందించారు. డిఐజీ, ఐజీ, ఏడీజీపీగా ఆమె విజిలెన్స్, అవినీతి నిరోధక బ్యూరో, క్రైమ్ బ్రాంచ్కు నాయకత్వం వహించారు. ఆర్థిక నేరాల కేసుల విచారణలో భాగంగా దాడులు చేయడానికి ఏమాత్రం ఆలోచించే వారు కాదు. ఆమె నాయకత్వంలో పోలీసు బృందాలు ఆకస్మిక దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున అవినీతిని బట్టబయలు చేశాయి. అందుకే ఆమెకు 'రైడ్ శ్రీలేఖ' అనే పేరు వచ్చింది. 2007లో కేరళ ప్రభుత్వం ఆమెను విశిష్ట సేవా పురస్కారంతో సత్కరించింది.నిందితురాలికి చెంపదెబ్బకేరళ సంచలనం రేపిన 2003 నాటి కిలిరూర్ లైంగిక వేధింపుల కుంభకోణంలో ప్రధాన నిందితురాలైన లతా నాయర్ను చెంపదెబ్బ కొట్టి వార్తల్లో నిలిచారు శ్రీలేఖ. ఇలా కొట్టడం చట్టవిరుద్ధమైనప్పటికీ తన చర్యను సమర్థించుకున్నారామె. మైనర్ బాలికల లైంగిక దోపిడీపై దర్యాప్తులో భాగంగా ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితురాలు ఒకరిని అప్పట్లో శ్రీలేఖ కలిశారు. తమకు ఈ గతి పట్టించిన దుర్మార్గులను పట్టుకుని రెండు చెంపదెబ్బలు కొట్టమని ఆమెను బాధితురాలు వేడుకుంది. ఆమె కోరిక మేరకు నిందితురాలిని చెంపదెబ్బ కొట్టారు. “ఇంకొకటి మిగిలి ఉంది. రెండో చెంపదెబ్బ కొట్టనందుకు బాధ పడుతున్నాను” అని తర్వాత అన్నారు. పోలీసు విభాగంలో స్త్రీ ద్వేషం, లైంగిక వేధింపులను కూడా ఆమె బహిరంగంగానే ప్రతిఘటించారు.చదవండి: సివిల్స్ విజేతల్లో ఎక్కువ మంది వారే!చిన్ననాటి స్నేహితుడే భర్తశ్రీలేఖ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆమె భర్త డాక్టర్ సేతునాథ్ తిరువనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పీడియాట్రిక్ సర్జరీ ప్రొఫెసర్గా పనిచేశారు. సేతునాథ్ ఆమె చిన్ననాటి స్నేహితుడు కావడం విశేషం. వీరి కుమారుడు గోకుల్ ఎంబీఏ చదువుతున్నాడు. శ్రీలేఖ రచయిత్రి కూడా. 'మరణదూతన్' అనే డిటెక్టివ్ నవల సహా తొమ్మిది పుస్తకాలు రాశారు. -
హనుక్కా పండుగ అంటే..? అందుకే యూదులు అంతలా..
ఆ్రస్టేలియాలోని సిడ్నీలోని బాండీ బీచ్ కాల్పుల మోతతో దద్దరిల్లిన సంగతి తెలిసిందే. యూదుల సంప్రదాయ హనుక్కా వేడుక విషాదంగా మార్చేసి..సంతోషాన్ని ఆవిరి చేశారు ముష్కరులు. ఆదివారం సెలవరోజు కావడం సరదాగా బీచ్లో ఈ పండుగ చేసుకుంటున్న యూదులపై హఠాత్తుగా కాల్పులు జరిపారు ఇద్దరు ఉగ్రవాదులు. ఈ ఘటనలో అక్కడికక్కడే 16 మందికి పైగా మరణించగా, పలువురు తీవ్ర గాయలపాలయ్యారు. ఇలా మతపరమైన వేడుకను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారంటే..ఇది కచ్చితంగా ఉగ్రదాడేనని ఆస్ట్రేలియా ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో యూదులు జరుపుకునే పండు హనుక్కా అంటే ఏంటి. ఈ పండుగ ప్రధానోద్ధేశ్యం ఏంటో చూద్దామా..!.యూదుల సంప్రదాయ హనుక్కా వేడుక (Hanukkah)ను "కాంతి పండుగ" అని కూడా పిలుచుకుంటారు. మక్కబీస్ (Maccabees) అనే యోధులు జెరూసలేం ఆలయాన్ని పునఃప్రతిష్ఠించిన అద్భుతానికి గుర్తుగా ఈ వేడుకను ఎనిమిది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. దీనిలో భాగంగా ప్రతిరాత్రి మెనోరా (Menorah) పై(కొవ్వొత్తుల స్టాండ్) కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు, ఆటలు, పాటలతో గడుపుతారు. ఆ రోజు నూనెతో చేసిన వంటకాలను తింటారు. ఈ పండుగ అణిచివేత నుంచి సంపాదించుకున్న స్వేచ్ఛ, విశ్వాసాలకు ప్రతీకగా జరుపుకుంటారు యూదులు. హనుక్కా అంటే.."హనుక్కా" అంటే హీబ్రూలో "అంకితం" (dedication) అని అర్థం. ఇది ఆలయ పునఃప్రతిష్ఠను సూచిస్తుంది.అద్భుతం జరిగిన రోజు..క్రీ.పూ. 2వ శతాబ్దంలో గ్రీకు-సిరియన్ పాలకులు యూదుల మత స్వేచ్ఛను అణచివేసినప్పుడు, మక్కబీస్ (Maccabees) అనే యోధులు పోరాడి ఆలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఆలయంలో ఒక రోజుకు సరిపడా నూనె ఎనిమిది రోజులు వెలిగిందని ఒక అద్భుతం జరిగింది.ఏరోజున ఈ పండుగ జరుపుకుంటారంటే..ఇది హీబ్రూ క్యాలెండర్ ప్రకారం కిస్లేవ్ (Kislev) నెల 25వ రోజున ప్రారంభమై ఎనిమిది రోజుల పాటు జరుపుకుంటారు. ఎలా జరుపుకుంటారు?మెనోరా వెలిగించడం(ప్రత్యేక దీపపు స్టాండ్): ప్రతి రాత్రి తొమ్మిది కొమ్మల దీపం (Hanukkiah లేదా Menorah) వెలిగిస్తారు. ఒక ప్రత్యేక కొవ్వొత్తి (Shamash) మిగిలిన ఎనిమిదింటిని వెలిగిస్తుంది. ఇది అద్భుతానికి ప్రతీక.డ్రీడెల్ (Dreidel) అనే నాలుగు వైపుల బొంగరంతో ఆడుతూ పాటలు పాడుతూ జరుపుకుంటారు.విందు..ఆరోజు ముఖ్యంగా బంగాళదుపంతో చేసిన పాన్కేక్లను తప్పనిసరిగా ఆరగిస్తారు. దాంతోపాటు జామ్ డోనట్స్ను కూడా ఆస్వాదిస్తారు. అంతేగాదు ఆరోజు పిల్లల కోసం ప్రత్యేకంగా చాక్లెట్ బాక్స్లను గిఫ్ట్గా ఇచ్చి పెద్దలు ఆశీర్వాదాలు అందిస్తుంటారు కూడా.స్వేచ్ఛకు గుర్తుగా చేసుకునే హనుక్కా పండగ రోజునే ఆస్ట్రేలియాలో యూదులపై కాల్పులు జరిపి వేడుకను ఆస్వాదించే స్వేచ్ఛే లేకుండా చేసి తీరని శోకాన్ని నింపారు. నాడు జరిగిన అద్భుతమే జరిగి..తమ పండుగను యూదులు ఆనందంగా జరుపుకోవాలని మనసారా కోరుకుందాం.(చదవండి: ఏఐతో.. 'మెస్సీ'మరైజ్! సెల్ఫీ రూ. 10 లక్షలు..) -
ఆ యువ సైక్లిస్ట్ గట్స్కి మాటల్లేవ్..! ఏకంగా 30 దేశాలు..
ఓ యువ సైక్లిస్ట్ ఖండాల మీదుగా అసాధారణ పర్యాటనకు పూనుకున్నాడు. ఏదో రికార్డు సృష్టించాలనో..తానెంటో ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశ్యంతోనో కాదు. స్వలాభం ఆశించకుండా ఓ గొప్ప సందేశాన్ని అందించేలా సాహసోపేతమైన స్ఫూర్తిదాయక పర్యాటనను చేపట్టాడు ఆ యువకుడు. ఏకంగా 18 వేల కిలోమీటర్లు తొక్కి..తన టూర్ని సక్సెస్ఫుల్గా పూర్తిచేశాడు. తాను వయసులో చిన్న గానీ ఔదార్యంలో అందరికంటే మిన్నా అని చాటిచెప్పాడు. ఎవరా యువకుడు..ఏ లక్ష్యం కోసం ఇంత పెద్ద సాహసానికి పూనుకున్నాడంటే..ఫ్రాన్స్కు చెందిన 24 ఏళ్ల యువ సైక్లిస్ట్ కిలియన్ లే గయాడర్ తన స్వస్థలం నుంచి చైనాకు 18,000 కిలోమీటర్లు తొక్కుకుంటూ సైకిల్పై వెళ్లడం విశేషం. అతడు ఖండాలు మీదుగా చేపట్టి అసాధారణ టూర్ని చేపట్టి..ఏకంగా 30కి పైగా దేశాలు చుట్టేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఈ టూర్ని వాయువ్య ఫ్రెంచ్ నగరం రెన్నెస్ నుంచి ప్రారంభించి..నెలల తరబడి నిరంతరం ప్రయాణిస్తూ..ఇటీవలే చైనాకు చేరుకున్నాడు. సింపుల్గా చెప్పాలంటే..లే గయాడర్ తన జీవితంలో మర్చిపోలేని గొప్ప సాహసోపేతమైన పర్యాటనను విజయవంతంగా పూర్తిచేశాడు. ఇది తన లైఫ్లోనే అత్యంత చిరస్మరణీయ విజయాలలో ఒకటిని సమర్థవంతంగా పూర్తిచేయగలిగానంటున్నాడు. ఎందుకోసం ఈ పర్యాటన అంటే..అనారోగ్యంతో పోరాడుతూ కూడా మన డ్రీమ్స్ని, లక్ష్యాలను నెరవేర్చుకోవచ్చు అని చెప్పేందుకే ఈ సాహసోపతమైన పర్యాటనకు పూనుకున్నట్లు తెలిపాడు. ఇక లె గయాడర్ 2023లో ఫ్రెంచ్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. 14 ఏళ్ల ప్రాయంలో అడవిలో ఉండే బొరేలియా బాక్టీరియా కారణంగా లైమ్ వ్యాధి బారిన పడ్డాడు. దాన్నుంచి కోలుకునేందుకే నెలలు, సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత క్రమంగా శక్తిని పొంది, పూర్తిస్థాయిలో ఆరోగ్యంవంతుడయ్యేందుకు దాదాపు మూడేళ్లు పట్టింది. ఆ నేపథ్యంలోనే ఈ వ్యాధిపై ప్రజలందిరికీ అవగాహన కలిగేలా చేయాలని.. ఇలా సైకిల్ యాత్రకు సంకల్పించాడు. తనలా మరెవ్వరూ ఇంతలాబాధ పడకుండా, ముందు జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించేందుకే ఈ సాహస యాత్ర అని చెప్పుకొచ్చాడు. ఫ్రాన్స్ నుంచి యూరప్ ఆసియా అంతటా దాదాపు 10 వేల కిలోమీటర్లు పైనే ఒంటిరిగా సైకిల్ తొక్కాడు. టర్కీ, జానీయాల వరకు తన స్నేహితుడు తోడు రాగా, అక్కడ నుంచి లె గయాడర్నే ఒంటరిగా చైనాకు చేరుకున్నాడు. అయితే చైనాకు చేరుకునే మార్గం చాలా కఠినమైన భూభాగం, చాలా సవాళ్లుతో కూడిన వాతావరణమని అంటున్నాడు. ఏకంగా ఎనిమిది నెలలు..ఈ యాత్ర కోసం నిధులు సేకరించడానికి సుమారు ఎనిమిద నెలల పనిచేశాడు. అయితే ఈ మొత్తం పర్యాటకు అతడికి సుమారు రూ.15 లక్షలు పైనే ఖర్చయ్యింది. ఈ టూర్కి ఫ్రెంచ్ బ్యాంకు, స్థానిక కౌన్సిల్, సంస్థల నుంచి ఆర్థిక సహాయం సైతం అందింది లె గయాడర్కు. నిజానికి తన ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుంటే ఈ మార్గాలలో తాను ప్రయాణిచడం అత్యంత క్లిష్టమైన సవాలు, పైగా ప్రత్యేక అనుభవ కూడా అని అంటున్నాడు ఆ యువ సైక్లిస్ట్.లైమ్ వ్యాధి (Lyme disease) అంటే:ఇది బోర్రెలియా (Borrelia) అనే బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్. అడవుల్లో, గడ్డిపొదల గుండా వెళ్లినప్పుడూ ఈ వ్యాధి బారిన పడతారట. దీని కారనంగా ఎర్రటి వలయాకారపు దద్దుర్లు , జ్వరం, తలనొప్పి, అలసట, కీళ్ల నొప్పులు వస్తాయి. సకాలంలో చికిత్స తీసుకోకపోతే గుండె, నాడీ వ్యవస్థ, కీళ్లపై ప్రభావం చూపి ప్రాణాంతకంగా మారుతుందట. (చదవండి: ఎముకలు కొరికే చలిలో..టీ,కాఫీ తాగుతున్నారా?) -
ఏఐతో.. 'మెస్సీ'మరైజ్! సెల్ఫీ రూ. 10 లక్షలు..
వెర్రి వేయి తలలు.. అంటే ఇదేనేమో?!.. దీనికి తాజా ఉదాహరణే ఇది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ భాగ్యనగరంలో గడిపింది కేవలం కొన్ని గంటలే. ఆయన పర్యటన శంషాబాద్ విమానాశ్రయం–తాజ్ ఫలక్నుమ–ఉప్పల్ స్టేడియం మధ్యే జరిగింది. అయినప్పటికీ మెస్సీతో వేల మంది ఫొటోలు దిగారు. కొందరైతే తాము వండిన వంటల్నీ ఆ ఆటగాడికి రుచి చూపించారు. మరికొందరు ఫుట్బాల్తో పాటు ఇతర ఆటలు సైతం మెస్సీతో ఆడించేశారు. వీటిని సంబంధించిన ఏఐ ఫొటోలు మూడు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ కల్పిత ఫొటోల హడావుడి నేపథ్యంలో నిజంగా మెస్సీతో ఫొటో దిగిన వాళ్లు తమ ప్రత్యేకతను చాటుతూ పోస్టు చేయలేని, చేసినా నమ్మలేని పరిస్థితి నెలకొంది. సామాజిక మాధ్యమాల రాకతో ప్రతి ఒక్కరూ గ్లోబల్ ప్లాట్ఫామ్లో భాగస్వాములయ్యే అవకాశం దక్కింది. దీంతో పాటు ఇటీవల అందుబాటులోకి వచ్చిన గూగుల్ జెమినీ, పర్ప్లెక్సిటీ, చాట్జీపీటీ వంటి మాధ్యమాల రాకతో నిజానికి, అబద్దానికి మధ్య తేడా గుర్తించడం సామాన్యులకు కష్టమైన పరిస్థితిగా మారిపోయింది. వీటిలో కొన్ని ఆశ్చర్యంగా, హాస్యాస్పదంగా, ఆనందంగానూ అనిపిస్తుంటి.. మరికొన్ని బాధను కలిగించే పోస్టులు కూడా ఉన్నాయి. తాజాగా అలాంటి ఆశ్చర్యాన్ని కలిగించే పోస్టులు కుప్పలు తెప్పలుగా సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. అదే అర్జంటీనా ఫుట్బాల్ ఆటగాడు మెస్సీతో దిగిన ఫేక్ సెల్ఫీ ఫొటోలు. మెస్సీతో మేముసైతం.. మెస్సీ హైదరాబాద్ టూర్, సీఎం ఎ.రేవంత్రెడ్డితో ఫుట్బాల్ మ్యాచ్ తదితరాలకు సంబంధించి దాదాపు నెల రోజుల క్రితమే అప్డేట్ వచ్చింది. అయితే మూడు రోజుల క్రితం వరకు ఏఐ చిత్రాల హడావుడి సోషల్మీడియాలో కనిపించలేదు. ‘మెస్సీతో సెల్ఫీ దిగడానికి రూ.10 లక్షలు చెల్లించాలి.. అది కూడా కేవలం వంద మందికి మాత్రమే అవకాశం’ అంటూ ఇటీవల వార్తలు వెలువడ్డాయి. అప్పటి నుంచి ఈ ఏఐ చిత్రాల ప్రతిసృష్టి ప్రారంభమైంది. తాము మెస్సీ వద్దకు వెళ్లి, రూ.10 లక్షలు చెల్లించి ఫొటో ఎందుకు దిగాలంటూ కామెంట్స్ చేస్తున్న సిటిజనులు ఆ ఫుట్బాల్ దిగ్గజంతో రూపొందించిన ఏఐ చిత్రాలను తమ సోషల్మీడియాలో ఖాతాల్లో పోస్టు చేస్తూ మెస్సీనే వారి వద్దకు వచ్చాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. చిత్రంగా, విచిత్రంగా.. ఉప్పల్ స్టేడియంలో ఏ క్రికెట్ మ్యాచ్ జరిగినా కీడ్రాభిమానుల సోషల్మీడియా ఖాతాలన్నీ సంబంధిత ఫొటోలతో నిండిపోతాయి. స్పోర్ట్స్ టీషర్టులు, ముఖానికి రంగులతో స్టేడియం లోపల, చుట్టుపక్కల దిగిన ఫొటోలను పోస్టు చేస్తుండటం పరిపాటే. మెస్సీ టూర్ నేపథ్యంలో తెరపైకి వచ్చిన ‘సెల్ఫీ–రూ.10 లక్షల’ అంశంతో వీటితో పాటు ఏఐ చిత్రాలూ సోషల్మీడియా ఖాతాలను ముంచెత్తాయి. కొందరు మెస్సీని స్టేడియంలోని తమ గ్యాలరీల్లోకి వచ్చి, తమతో ఫొటోలు దిగినట్లు సృష్టిస్తున్నారు. మహిళలు, యువతులైతే మరో అడుగు ముందుకు వేశారు. ఏకంగా మెస్సీని నేరుగా తమ ఇళ్లకే తీసుకెళ్లిపోయారు. హాలు, వంటిల్లు అన్న తేడా లేకుండా కూర్చోబెట్టి బిర్యానీ, పులిహోర తినిపిస్తున్నట్లు, వండిస్తున్నట్లు కూడా ఏఐ ఫొటోలు సృష్టించి సోషల్మీడియాల్లో పోస్టు చేశారు. ఆడించి.. ఓడించి.. సిటీ టూర్లో భాగంగా మెస్సీ–సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహించిన అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్, సింగరేణి ఆర్ఆర్–9 జట్ల మధ్య ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది. క్రీడాకారులు, ప్రముఖులు, యాంకర్లతో కలిపి ఈ మ్యాచ్లో మొత్తం 50 మంది కూడా పాల్గొనలేదు. అయితే సోషల్మీడియా వేదికగా మాత్రం మెస్సీ లక్షల మందితో ఫుట్బాల్, క్రికెట్, బాస్కెట్ బాల్తో పాటు కబడ్డీ కూడా ఆడేశాడు. ఆయన తమతో ఆయా ఆటలు ఆడినట్లు, ఆడలేక ఓడినట్లు ఏఐ చిత్రాలను సృష్టించిన నెటిజనులు సోషల్మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. కొందరైతే చారి్మనార్, గోల్కొండ, ఫలక్నుమ ప్యాలెస్ వద్ద మెస్సీతో కలిసి హైదరాబాద్ చాయ్ తాగుతున్నట్లు, ఆయనే ఫాస్ట్ఫుడ్ తయారు చేస్తున్నట్లు సృష్టించారు. ఈ ఏఐ ఫొటోలను సృష్టించి వైరల్ చేసిన వారిలో సమాన్యులే కాదు.. కొందరు ప్రముఖులు, నాయకులు, యాంకర్లు సైతం ఉండటం గమనార్హం. (చదవండి: ఆ దేశంలో న్యాప్ కేఫ్లు ఉంటాయి!) -
శబరిమలలో ముమ్మరంగా ఆహార భద్రతా శాఖ తనిఖీలు
శబరిమలకి వచ్చే భక్తుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆహార భద్రతా శాఖ తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భక్తులకు నాణ్యమైన ఆహారం అందేలా పంబా, సన్నిధానంలలో పనిచేస్తున్న ప్రత్యేక ఆహార భద్రతా బృందాలు ఆహార సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీల్లో పంబలో 328 , సన్నిధానంలో 302 తనిఖీలు పూర్తయ్యాయి.పంబలో లోపాలు గుర్తించిన సంస్థలపై 6 కాంపౌండ్ ఫుడ్ నోటీసులు, 21 సవరణ నోటీసులు జారీ చేశారు. సన్నిధానంలోని 24 సంస్థలకు సవరణ నోటీసులు పంపించారు. మొత్తం ఆరు ఫిర్యాదులు పరిష్కరించబడగా , కాంపౌండ్ ఫుడ్ విధానం ద్వారా నాలుగు సంస్థల నుంచి రూ.30,000 జరిమానా వసూలు చేశారు.పంబ, సన్నిధానంలోని ఆహార వ్యాపారులకు ఆహార సరఫరా సంబంధిత అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ప్రాథమిక నాణ్యత పరీక్షల కోసం పంబాలో 69 ఆహార నమూనాలు, సన్నిధానంలో 62 ఆహార నమూనాలను పరీక్షలకు పంపించారు.ఆహార భద్రతకు సంబంధించిన టోల్ - ఫ్రీ నంబర్లను అన్ని సంస్థల్లో స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లో కూడా తనిఖీలు కొనసాగుతాయని ఆహార భద్రతా అధికారులు తెలిపారు. కాగా, సరిగ్గా మూడేళ్ల క్రితం శబరిమల అయ్యప్పస్వామి అరవణ పాయసంలో వాడే యాలకుల్లో పురుగు మందు అవశేషాలున్నట్లు తేలడం తోపాటు ఇటీవల అయ్యప్పస్వామి అభిషేకానికి, ప్రసాదాల తయారీకి ఉపయోగించే తేనెలో సైతం లోపాలున్నట్లు విజిలెన్స్ తేల్చడం తదితర కారణాల రీత్యా శబరిమలలో ఆహారభద్రతా శాఖ తనిఖీలు ముమ్మరంగా చేపట్టింది.(చదవండి: ఆ హరిహరసుతుడి అరవణ ప్రసాదం డబ్బాల కొరత..) -
ఆ దేశంలో న్యాప్ కేఫ్లు ఉంటాయి!
దక్షిణ కొరియాలో ‘న్యాప్ కేఫ్’ల పేరుతో కేఫ్లు ఉంటాయి. పగటి పూట పవర్ న్యాప్ తీసుకోవాలనుకునేవారు వీటికి వెళుతుంటారు. బొలీవియాలో ‘పలాసియో డి సాల్’ పేరుతో పూర్తిగా ఉప్పు దిమ్మలతో నిర్మించిన హోటల్ ఉంది. సిక్కింలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో టిబెటన్ నూతన సంవత్సర లోసర్ వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకలను చూడడం అద్భుతమైన అనుభవం.ఫిబ్రవరి మాసంలో అరుణాచల్ప్రదేశ్లో ఆరు రోజుల పాటు క్రీడలు, సాంస్కతిక ఉత్సవాలు ‘తవాంగ్సు టైడ్స్ ఇంటర్నేషనల్’ పేరుతో ఘనంగా జరుగుతాయి. దేశ,విదేశాలకు చెందిన ఆటగాళ్లు, కళాకారులు ఈ క్రీడా, కళా ఉత్సవాలలో పాల్గొంటారు. తవాంగ్సు నది ఒడ్డున రాత్రులు ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలతో అందంగా వెలిగిపోతాయి. క్రీడా ప్రతిభను గుర్తించడం, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పేరులో ‘గ్రీన్’ మాట ఉన్నప్పటికీ....‘గీన్ల్యాండ్’తో పోల్చితే ‘ఐస్ల్యాండ్’లోనే పచ్చదనం ఎక్కువ. View this post on Instagram A post shared by Santosh Jha (@career_first_) (చదవండి: వన్స్ అపాన్ ఏ టైమ్... వండర్ఫుల్ పోస్టర్స్) -
వన్స్ అపాన్ ఏ టైమ్... వండర్ఫుల్ పోస్టర్స్
ఇప్పుడంటే...ఆధునికం అని ఏమిటి, అత్యాధునికమైన కెమెరాలు ఉన్నాయి. ఫొటోషాప్లు ఉన్నాయి. ఎన్నో ఎన్నెన్నో ఎడిటింగ్ టూల్స్ ఉన్నాయి. కానీ...వన్స్ అపాన్ ఏ టైమ్ పెద్దగా ఏమీ లేవు.అయినా...ఎన్నో పరిమితులు ఉన్నా, ట్రావెలింగ్కు సంబంధించిన పోస్టర్లను అద్భుతంగా డిజైన్ చేసేవారు ఆర్టిస్ట్లు. ‘అవి ఆ కాలానికి మాత్రమే’ అనుకోవడానికి లేదు. కాలాతీతమైనవి. అందుకే అలనాటి ట్రావెలింగ్కు సంబంధించిన అద్భుత పోస్టర్ల ఎగ్జిబిషన్ గురుగ్రామ్లోని ‘హెరిటేజ్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియం’లో జరుగుతోంది...1920లలో...మన దేశంలోని రైల్వే బోర్డు తమ ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి అనేదాని గురించి ఆలోచించింది. ఆదాయం పెరగాలంటే ప్రయాణికుల సంఖ్య పెరగాలి. ప్రయాణికుల సంఖ్య పెరగాలంటే ఆకర్షణీయమైన ప్రకటనలు రూపొందించాలి అని నిర్ణయించుకుంది.అలా మొదలైంది...దేశంలోని ప్రధాన పర్యాటక ప్రదేశాల గురించి ప్రచారం చేయడానికి దేశీయ, అంతర్జాతీయ చిత్రకారులతో పోస్టర్లు, ఇతరత్రా విజువల్స్ రూపొందించారు. ఇవి రైల్వే స్టేషన్ గోడలపై, ఓడరేవులు, వ్యాపారకేంద్రాలు, మార్కెట్లు, పోస్టాఫీసుల దగ్గర కనిపించేవి. విదేశీ పర్యాటకులను దృష్టిలో పెట్టుకొని ఆసక్తి కలిగించేలా డిజైన్ చేసిన పోస్టర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ పోస్టర్లలో అత్యంత పాత పోస్టర్... 1914కు చెందిన కనర్డ్ లైన్ అడ్వర్టైజ్మెంట్. అద్భుతమైన లేఔట్తో ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్లపై ‘విజిట్ ఇండియా’ ‘సీ ఇండియా’ అంటూ పెద్ద పెద్ద అక్షరాలు కనిపిస్తాయి. ఆరోజుల్లో రైల్వే యాడ్స్ను రూపొందించడం అనేది ఖరీదైన వ్యవహారంలా ఉండేది. ఆ ఖరీదుకు తగ్గట్టే పోస్టర్లు ఆకర్షణీయంగా కనిపించేవి.ఎయిర్ ఇండియా... మహారాజా మస్కట్ఇక విమానాల విషయానికి వస్తే... ‘ఎయిర్ ఇండియా’ పోస్టర్లు ‘మహారాజ మస్కట్’ తో ఆకట్టుకునేవి. ‘ఎయిర్ ఇండియా–రోమ్ ΄ోస్టర్’ ‘ఎయిర్ ఇండియా–యూరప్ పోస్టర్’....ఇలా రకరకాల పోస్టర్లు డిజైన్ చేసేవారు. అలనాటి న్యూ బోయింగ్ 747ను ప్రమోట్ చేయడానికి కూడా ఎయిర్ ఇండియా పోస్టర్లు రూపొందించింది.కళాత్మక విలువలునవీన సాంకేతికతతో ఫొటోగ్రఫీ కొత్త పుంతలు తొక్కడానికి ముందే పదిమందిని ఆట్టుకునేలా ఈ పోస్టర్లను రూపొందించడం విశేషం. గ్రాఫిక్ ఆర్టిస్ట్ల లితోగ్రాఫిక్ ప్రింట్స్ ఎక్కువగా ఉండేవి. గౌరీ శంకర్, పి.సమ్దార్, కుషల్ ముఖర్జీ, శోభాసింగ్, బి.సన్యాల్లాంటి చిత్రకారులు ఎక్కువగా పోస్టర్లు డిజైన్ చేసేవారు.‘మొక్కుబడిగా డిజైన్ చేసినట్లు కాకుండా కళాత్మక విలువలు ఉట్టిపడేలా ఆనాటి ట్రావెల్ పోస్టర్లు కనిపిస్తాయి’ అంటారు విశ్లేషకులు.ఆ కాలానికి స్వాగతంఅలనాటి అద్భుత విజువల్స్ ఈతరానికి పరిచయం చేయడానికి గురుగ్రామ్లోని హెరిటేజ్ ట్రాన్స్΄ోర్ట్ మ్యూజియం నడుం కట్టింది. 1930 నుంచి 1970 మధ్యలో రూ΄÷ందించిన ట్రావెల్ పబ్లిసిటీ ΄ోస్టర్లను హెరిటేజ్ ట్రాన్స్΄ోర్ట్ మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు. ‘΄ోస్టర్స్ దట్ మూవ్డ్ ఇండియా: టూరిజం, ట్రావెల్ అండ్ ట్రాన్స్΄ోర్ట్’ పేరుతో నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 2026 వరకు కొనసాగుతుంది. -
పర్యాటకం: ఫ్లెమింగో! పింక్ సీజన్..ఫుల్ స్వింగ్..!
పర్యాటక ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ నేలంతా పరుచుకున్న పచ్చదనం చూసి ముగ్దులవుతుంటాం. కానీ, ఈ సీజన్లో ప్రత్యేకంగా నేలంతా గులాబీ రంగుపరుచుకున్నట్టుగా.. అలల్లా ఎగిసిపడుతున్న ఆ అందం చూడాలంటే మన దేశంలోనే కొన్ని ముఖ్యమైన ప్రదేశాలున్నాయి. వీకెండ్లో ఈ పింక్ సీజన్.. మీలో ఫుల్ స్వింగ్ను ఇట్టే తెచ్చేస్తుంది. అతిథులుగా విచ్చేసి, సందడి చేస్తున్న పింక్ ఫ్లెమింగోలు బారులు బారులుగా తేరు కట్టి, తీరుగా మనల్ని అలరిస్తున్నాయి. ఆ అందాల ఆనందాన్ని తిలకించడానికి ముందుగా ముంబై మీదుగా ప్రయాణిద్దాం... భారతదేశంలో అధికారికంగా ఫ్లెమింగో సీజన్ వచ్చేసింది. పిలవకుండా వచ్చే ఈ శీతాకాలపు అతిథులు ముంబైతోపాటు నవీ ముంబైలలోని కొన్ని బెస్ట్ సైట్ సీయింగ్ ఫ్లెమింగో ప్రదేశాలు ఉన్నాయి. పొడవాటి కాళ్ళు, వంగిన మెడలు, విలక్షణమైన కిందికి వంగిన ముక్కులతో సొగసైన ఈ నీటి పక్షులు.. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న చిత్తడి నేలలను గులాబీ రంగుతో చిత్రించడం ప్రారంభించాయి. ప్రతి యేటా అక్టోబర్ చివరి నుండి మే మొదటి వారం వరకు ఫ్లెమింగోలు భారతదేశానికి వలస వస్తుంటాయి. ఫిబ్రవరి నుండి మార్చి వరకు వీటి సంఖ్య గరిష్టస్థాయిలో ఉంటుంది. ఈ సంవత్సరం వర్షాకాలం సీజన్ కొంచెం పెరగడంతో ఈ పక్షుల రాకలో కొంచెం ఆలస్యం జరిగిందని పక్షి పరిశీలకులు గమనించారు. ఇప్పుడు, ఈ అద్భుతమైన పక్షుల మొదటి గుంపు ముంబై, నవీ ముంబై అంతటా ఐకానిక్ ప్రదేశాలలో వచ్చి చేరాయి. దీంతో వీక్షకుల ఉత్సాహం మిన్నంటుతోంది. థానే క్రీక్ ఫ్లెమింగో అభయారణ్యంపక్షి ప్రేమికులకు ఈ ప్రాంతం స్వర్గధామమే. ఈ అభయారణ్యం ఐరోలి, వాషి మధ్య విస్తరించింది. ఉల్హౌస్ నది సల్సెట్ ద్వీపం ఈశాన్య మూలలో రెండు ఉపనదులుగా విడి΄ోతుంది. మరొకటి వాసాయి క్రీక్. ఈ రెండూ అరేబియా సముద్రంలోకి ప్రవహిస్తాయి. క్రీక్ సాల్సెట్ ద్వీపం తూర్పు సరిహద్దును ఏర్పరచడం, కొంకణ్ ప్రధాన భూభాగం నుండి ద్వీపాన్ని వేరు చేస్తుంది. దీనినే థానే క్రీక్ అంటారు. ఈ ్ర΄ాంతం వివిధ ఏవియన్ జాతులకు నిలయంగా ఉండటంతో బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ ద్వారా ముఖ్యమైన పక్షి ప్రాంతంగా గుర్తించబడింది. ముఖ్యంగా ఇది ఫ్లెమింగోలు, అనేక ఇతర వలస, నీటి పక్షుల జనాభాకు నిలయంగా ఉంది. ఫ్లెమింగోలను దగ్గరి నుంచి వీక్షించడానికి కోస్టల్ – మెరైన్ బయోడైవర్సిటీ సెంటర్ నుండి ప్రసిద్ధ బోట్ సఫారీ ఉంది.సేవిరి మడ్ ఫ్లాట్స్ ముంబై నడిబొడ్డున ఉన్న ఈ ΄ోషకాలతో కూడిన బురద ఫ్లాట్లు వేలాది ఫ్లెమింగోలను ఆకర్షిస్తాయి. బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ ఇక్కడ గైడెడ్ వాక్లు మరియు ఫ్లెమింగో–వాచింగ్ ఈవెంట్లను నిర్వహిస్తుంది.భండప్ పంపింగ్ స్టేషన్తూర్పు ఎక్స్ప్రెస్ హైవేకి దూరంగా ఉన్న ఈ క్రీక్సైడ్ స్పాట్ పక్షులను చూసేవారికి, ముఖ్యంగా సూర్యోదయ– సూర్యాస్తమయ సమయంలో చాలా ఇష్టమైనది. ఈ ప్రాంతం మడ అడవులతో ఆకర్షణీయంగా ఉంటుంది. వివిధ రకాల నీటి బాతులు, వలస పక్షులను ఆకర్షిస్తుంది.డీపీఎస్ ఫ్లెమింగో సరస్సుఇప్పుడు నవీ ముంబైలోని నెరుల్ ప్రాంతంలో ఒక పరిరక్షణ అభయారణ్యం, ఈ సరస్సు సూర్యోదయం– సూర్యాస్తమయ సమయాలలో అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది. ఇది ఫొటోగ్రాఫర్ల కంటికి కళల దృశ్యమై కనువిందు చేస్తుంది. ఇది నగరంలో ప్రశాంతమైన ప్రదేశం, ప్రకృతి నడకలు, పక్షుల ఫోటోగ్రఫీకి అనువైనది.కరావే ఫ్లెమింగో పాయింట్నవీ ముంబైలోని సీవుడ్స్లో టీఎస్ చాణక్య సమీపంలో, సుందరమైన వెట్ల్యాండ్స్లో నడుస్తూ ఫ్లెమింగోలను చూడొచ్చు. ప్రశాంతమైన పరిసరాలు, కుటుంబంతో కలిసి చేసే విహారయాత్రలు, పర్యావరణ పర్యాటకానికి గొప్ప ప్రదేశంగా మారాయి. ఫ్లెమింగో గుంపులను దగ్గర నుంచి చూసేందుకు సీజనల్ బోట్ రైడ్లు అందుబాటులో ఉంటాయి.భిగ్వాన్లోని ఉజాని ఆనకట్ట బ్యాక్ వాటర్స్తరచుగా మహారాష్ట్ర భరత్పూర్ అని పిలువబడే భిగ్వాన్ పక్షి ప్రేమికులకు అంతగా తెలియని రత్నం. పూణే సమీపంలోని యశ్వంత్ సాగర్ జలాశయం ఫోటోగ్రాఫర్లకు మరొక హాట్స్పాట్.కర్నాల పక్షుల అభయారణ్యం ముంబైకి సమీపంలో ఉన్న ఈ అభయారణ్యం ట్రెక్కింగ్ ట్రైల్స్, ఇతర వలస జాతులతో పాటు ఫ్లెమింగోలను వీక్షించడానికి వీలు కల్పిస్తుంది. ఇది చారిత్రాత్మక కర్నాల కోటకు నిలయం. అంతేకాదు, పక్షులను చూడటానికి గొప్ప ప్రదేశం.నందూర్ మధమేశ్వర్ పక్షుల అభయారణ్యం : నాసిక్లోని ఒక ముఖ్యమైన చిత్తడి నేల ఇది. ప్రకృతి ప్రేమికులకు, ఫొటోగ్రాఫర్లకు అనువైనది. ఈ అభయారణ్యం రామ్సర్ ప్రదేశంగా గుర్తించబడింది, శీతాకాలంలో వేలాది వలస పక్షులను ఈ ప్రాంతం ఆకర్షిస్తుంది. ప్రకృతితో తిరిగి కనెక్ట్ అవ్వాలనుకునే వారికి కోయ్నా వన్యప్రాణుల అభయారణ్యం, సంజయ్ గాంధీ నేషనల్ పార్క్తోపాటు మహారాష్ట్ర నేచర్ పార్క్లను కూడా సందర్శించవచ్చు. ఫ్లెమింగోలను చూడటం అనేది కేవలం దృశ్యాలను వీక్షించే కార్యక్రమం కాదు. వేగవంతమైన ప్రపంచంలో నిశ్శబ్దంగా ఉండే అందమైన, ఆహ్లాదకరమైన దృశ్యాలను మనసులో ముద్రించుకోవచ్చు. నిశ్శబ్దంలో నీటి అలలు, తెల్లవారుజామున ఆకాశంలో మెత్తటి రెక్కల శబ్దంలో నవీ ముంబై విలువైన అరుదైన సహజ విహారయాత్రను అందిస్తుంది.సూర్యోదయం–సూర్యాస్తమయాలు అత్యుత్తమం...ఉదయం 7 నుండి 9 గంటల మధ్య లేదా మధ్యాహ్నం 4 నుండి 6 గంటల మధ్య, పక్షులు చురుకుగా ఆహారం తీసుకుంటున్నప్పుడు ఈ ప్రదేశాలు చాలా అందంగా ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ విహరించవచ్చు. ప్రవేశ రుసుము ఒక్కొక్కరికి రూ.50, గైడెడ్ బోట్ సఫారీ ఒక్కొక్కరికి రూ.500..పడవ ప్రయాణానికి..ఈ ప్రదేశాలలో స్థానిక మత్స్యకారులు నేచర్ లవర్స్కి సూర్యోదయ పడవ ప్రయాణాలను అందిస్తారు. పక్షులకు దాణా వేయడం, వాటిని అందుకోవడానికి పెద్ద సంఖ్యలో ఫ్లెమింగోలు ఎగరడం.. ఆహ్లాదంగా అనిపించే ఉదయాలే దీనికి ఉత్తమ సమయం. అభయారణ్యం వెలుపల పడవ ప్రయాణాలు సాధారణంగా ఉదయం 6.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ పడవ ప్రయాణానికి సీజన్, వ్యక్తుల సమయాన్ని బట్టి వ్యక్తికి రూ.900 – రూ.1,500 మధ్య ఖర్చవుతాయి.ఇలా చేరుకోవచ్చు...హైదరాబాద్ ప్రయాణికులు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ముంబైకి రెండు గంటల విమాన ప్రయాణం ద్వారా చేరుకోవచ్చు. తరువాత రైలు లేదా టాక్సీ ప్రయాణం ద్వారా నవీ ముంబైకి వెళ్లచ్చు. వాషి, నెరుల్, సీవుడ్స్లో వసతి సదుపాయం లభిస్తుంది.మన దేశానికి అరుదెంచే వలస పక్షుల సమయాలు...పింక్ ఫ్లెమింగోలు శీతాకాలంలో దాదాపు నవంబర్ నుండి మే వరకు భారతదేశానికి వస్తాయి. జనవరి నుండి మార్చి వరకు విస్తృతంగా సందడి చేస్తాయి. ఫ్లెమింగో సీజన్ మాత్రం నవంబర్ నుండి మే వరకు కొనసాగుతుంది. కాక΄ోతే వాటి సంఖ్య తగ్గుతూ ఉంటుంది. ఈ సీజన్లో నివాసి లెస్సర్ ఫ్లెమింగోలు, వలస వచ్చిన గ్రేటర్ ఫ్లెమింగోలు రెండూ కనిపిస్తాయి. ట్రావెల్ ట్రెండ్స్జెన్ ఏఐ వోవర్ అడ్మిన్ రాబోయే కాలంలో ప్రయాణాలకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వాడకం పెరగబోతోంది. ప్రయాణికులు ఇప్పటికే ట్రావెల్ ప్లాన్, బుకింగ్ల కోసం జనరేటివ్ ఏఐని ఉపయోగిస్తున్నారు. ప్రయాణాలకు సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వడానికి చాట్జీపీటీ కూడా రంగంలోకి దిగడంతో ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడం గతంలో కంటే చాలా సులువు అయింది. ప్రయాణాలకు సంబంధించి ఏఐ సాంకేతికతను వాడుకోవడానికి సంబంధించి మంచితోసాటు చెడు కూడా ఉంది అని చెబుతున్నారు నిపుణులు. ఆల్గోరిథమిక్ సిఫారసులు వోవర్ టూరిజానికి కారణం అవుతాయని, ఉద్దేశపూర్వకంగా కొన్ని ప్రాంతాలను మాత్రమే ప్రయాణానికి సూచిస్తాయని, ట్రావెల్ స్కామ్స్ జరగడానికి కూడా అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ‘ప్రయాణాల కోసం ఏఐ సాధనాలను వాడుకోవడానికి సంబంధించి ఎన్నో పరిమితులు ఉన్నాయి’ అంటుంది కల్చరల్ ట్రెండ్స్ స్పెషలిస్ట్ జాస్మీన్ బినా.ఇతర రాష్ట్రాలలోనూ...మహారాష్ట్రలోని చిత్తడి నేలలు, సరస్సులతోపాటు గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్, ఒడిశాలోని చిలికా సరస్సు వంటి తీర్ర΄ాంతాలలో ఫ్లెమింగోలు అద్భుతమైన అందాలలో కనువిందు చేస్తాయి. మహారాష్ట్రలో భిగ్వాన్ ‘దక్షిణ భారత్పూర్‘ అని పిలుస్తారు, ఉజాని ఆనకట్ట బ్యాక్ వాటర్ ఫ్లెమింగో గుంపుకు ప్రసిద్ధి చెందింది.గుజరాత్లో...అతిపెద్ద లెస్సర్ ఫ్లెమింగో బ్రీడింగ్ గ్రౌండ్ (ఫ్లెమింగో సిటీ) కు నిలయం. నల్ సరోవర్, థాల్ లేక్ పక్షుల కేంద్రం, ఖిజాదియా పక్షుల అభయారణ్యంలో శీతాకాలంలో ఫ్లెమింగోలు పుష్కలంగా కనువిందు చేస్తాయి. చేరుకోవడానికి ప్రయాణ మార్గం...విమానంలో... హైదరాబాద్ రాజీవ్గాంధీ ఎయిర్ ΄ోర్ట్ నుంచి అహ్మదాబాద్ లేదా జామ్ నగర్కు చేరుకోవచ్చు. అహ్మదాబాద్ నుంచి నల్ సరోవర్, థాల్ ్ర΄ాంతాలకు కారు లేదా లోకల్ ట్రైన్లో చేరుకోవచ్చు. కచ్కు విమానంలో లేదా రోడ్డు, రైలు మార్గం ద్వారా చేరుకొని తర్వాత రాన్కు ప్రయాణించవచ్చు. రాజస్థాన్సాంబార్ సరస్సు ఫ్లేమింగోలకు శీతాకాలపు విడిది ప్రదేశం. హైదరాబాద్ నుండి 1100 కిలోమీటర్ల దూరంలో ఉంది సాంబార్ లేక్. విమానం /రైలు మార్గాల్లో వయా జైపూర్కు చేరుకొని వెళ్లాలి. రైలు మార్గంలో నాగ్పూర్, ఫులేరా కు చేరుకోవచ్చు. ఒడిశాభారతదేశంలోని అతిపెద్ద తీర్రప్రాంత సరస్సు అయిన చిలికా సరస్సు వేలాది మందిని ఆకర్షిస్తుంది. హైదరాబాద్ నుంచి చిలికా సరస్సు రోడ్డు మార్గంలో దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఫ్లైట్/ ట్రెయిన్/ బస్ మార్గాల ద్వారా విశాఖపట్నం, భువనేశ్వర్ మీదుగా చేరుకోవచ్చు. భువనేశ్వర్కి విమానంలో వెళ్లి అక్కణ్ణుంచి టాక్సీ లేదా ట్రెయిన్ ద్వారా సరస్సుకు చేరుకోవచ్చు. – నిర్మలారెడ్డి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: ఎముకలు కొరికే చలిలో..టీ,కాఫీ తాగుతున్నారా?) -
ఎముకలు కొరికే చలిలో..టీ,కాఫీ తాగుతున్నారా?
వణికించే చలిలో వెచ్చగా మారడానికి చాలా మంది తేనీటి మీదే ఆధారపడతారు. మిగిలిన కాలాల్లో రోజుకి ఒకటి రెండు సార్లు మించి తాగే అలవాటు లేనివాళ్లు కూడా వింటర్లో టీ హంటర్స్గా మారిపోతారు. ఎక్కువ సార్లు టీ లేదా కాఫీ తాగడం ప్రారంభిస్తారు.కానీ ఈ శీతాకాలపు అలవాటు మన శరీరంపై, దాని పనితీరుపై ఊహించని దుష్ప్రభావాలను చూపుతుందని రాయ్పూర్లోని ఎయిమ్స్ ఆర్థోపెడిక్ స్పోర్ట్స్ ఇంజురీ సర్జన్ డాక్టర్ దుష్యంత్ చౌహాన్ అంటున్నారు. ఆయన ఇటీవల రాసిన ఓ ఇన్స్ట్రాగామ్ పోస్ట్లో ఈ సీజన్లో ఎడాపెడా టీ తాగేయడం ఎంతగా ఆరోగ్యపరమైన అనర్ధాలు తెస్తుందో వివరించారు మితంగా తీసుకోవడం ఎందుకు ముఖ్యమో కూడా తెలియజేశారు.వేడి పానీయాలు ఎముకల ఆరోగ్యానికి మధ్య ఉన్న మనం ఊహించని సంబంధాన్ని డాక్టర్ చౌహాన్ హైలైట్ చేశారు. చల్లని వాతావరణంతో కలిపినప్పుడు అధిక కెఫిన్ కీళ్ల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఆయన వివరిస్తున్నారు. ‘‘టీ వేడిగా ఉంటుంది, కానీ అది మీ ఎముకలను ‘చల్లబరుస్తుంది’. అని చెబితే అది వినడానికి కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ అది వాస్తవం అంటున్నారాయన. శీతాకాలంలో చాలా మంది టీ లేదా కాఫీ తీసుకునే డోస్ పెంచడంతో, మోకాళ్ల లోపల మృదులాస్థి మరింత దుర్బలంగా మారుతుందని ఆయన వెల్లడించారు. ఆయన చెబుతున్న ప్రకారం...‘‘ మోకాళ్ల లోపల మృదులాస్థి రెండు ఎముకల మధ్య ఉండే పొర, ఎండిపోవచ్చు. ఇది కీళ్లలో సున్నితత్వాన్ని మొద్దుబారుస్తుంది. ఎముకలు ఒకదానికొకటి రుద్దినప్పుడు ఎక్కువ నొప్పిని కలిగిస్తుంది శీతాకాలంలో కూడా డీహైడ్రేషన్ సమస్య ఉంటుంది. అయితే ఈ డీ హైడ్రేషన్ గుర్తించబడదు. చల్లని వాతావరణం నుంచి టీ, కాఫీలు తక్షణ ఓదార్పునిచ్చినప్పటికీ, శరీరానికి సరళత కీళ్ల పనితీరుకు అవసరమైన ద్రవాలను అవి భర్తీ చేయలేవు మనం త్రాగేవి మన ఎముకలు కీళ్లను ప్రభావితం చేస్తాయని చాలా మంది గ్రహించరు .అయితే టీని ఆస్వాదించవచ్చు, కానీ దానితో పాటు తగినంత నీరు త్రాగడం చాలా అవసరం. ‘‘హైడ్రేట్గా ఉండటం వల్ల డీహైడ్రేషన్ను నివారించవచ్చు, ఇది శీతాకాలంలో సర్వసాధారణం ఆరోగ్యకరమైన కీళ్లను నిర్వహించడానికి చాలా ముఖ్యమైనది". వేడి పానీయాలను ఆస్వాదిస్తున్నప్పుడు తగినంత నీరు తీసుకోవడం వంటి సాధారణ చర్యలు గణనీయమైన మేలు చేస్తాయి.ఆర్థోపెడిక్ ట్రామా రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ పి సి జగదీష్ ఆంగ్లపత్రిక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు, ‘‘మృదులాస్థి అధిక శాతం నీటితో తయారవుతుంది దాని స్థితిస్థాపకత, షాక్ శోషణ సామర్థ్యం మృదులాస్థి ఉపరితలాన్ని నిర్వహించడానికి తగినంత హైడ్రేషన్పై ఆధారపడుతుంది. శరీరం డీ హైడ్రేషన్కి గురైనప్పుడు, మృదులాస్థి దాని అంతర్గత నీటి శాతాన్ని కోల్పోతుంది, ఇది కీళ్లను కుషన్ చేసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది కదలిక సమయంలో ఇబ్బందులను పెంచుతుంది. అయితే కెఫీన్ స్వయంగా నేరుగా కీళ్లను దెబ్బతీయదని, అది తేలికపాటి మూత్రవిసర్జన ప్రభావాన్ని కలిగి ఉంటుందని తద్వారా తక్కువగా నీటిని తీసుకునే అలవాటున్న వ్యక్తులలో ద్రవ నష్టాన్ని బాగా పెంచడానికి దోహదం చేస్తుందని ఆయన చెబుతున్నారు.. శీతాకాలంలో, నీటి తీసుకోవడం తగ్గిస్తూ దానిని నీటిని టీ లేదా కాఫీతో భర్తీ చేస్తారని ఆయన పేర్కొన్నారు, అక్కడే నిజమైన ప్రమాదం దాగి ఉంది.రోజుకు పలు కప్పుల చాయ్ లేదా కాఫీ తాగే వ్యక్తులకు, శరీర బరువు కార్యాచరణ స్థాయిని బట్టి, మొత్తం రోజువారీ ద్రవం తీసుకోవడం 2 నుంచి 2.5 లీటర్ల వరకు ఉండాలనేది సాధారణ సలహా అని డాక్టర్ జగదీష్ చెప్పారు. ‘తగినంత హైడ్రేషన్ను నిర్వహించడానికి ప్రతి కెఫిన్ పానీయం ఒక గ్లాసు సాదా నీటితో సమతుల్యం చేసుకోవాలి అని ఆయన సూచిస్తున్నారు.శీతాకాలపు కీళ్ల నిర్వహణలో హైడ్రేషన్ ఒక భాగం మాత్రమే నంటున్న ఆయన. ‘క్రమం తప్పకుండా కదలిక వ్యాయామాలు, కీళ్ల చుట్టూ కండరాల బలాన్ని నిర్వహించడం, ఎక్కువసేపు కూర్చోకుండా ఉండటం శరీరాన్ని వెచ్చగా ఉంచడం అన్నీ మెరుగైన కీళ్ల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నవారు తరచుగా నడక, సైక్లింగ్ లేదా నీటి ఆధారిత వ్యాయామాలు వంటి తక్కువ ప్రభావ కార్యకలాపాల ద్వారా ప్రయోజనం పొందుతారని, అలాగే విటమిన్ డి, కాల్షియం ఒమేగా–3 అధికంగా ఉండే ఆహారాలను తగినంతగా తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు.(చదవండి: ఆ హరిహరసుతుడి అరవణ ప్రసాదం డబ్బాల కొరత..) -
జీవన నావకు స్నేహ సారథి
ఆపదలో తోడుండేవాడే నిజమైన స్నేహితుడు. యుద్ధంలో ధైర్యం చూపించేవాడే అసలైన వీరుడు. దానగుణం కలవాడే నిజమైన ధనవంతుడు. పేదరికంలోనూ పక్కన నిలబడేదే ఉత్తమ భార్య. కష్టాల్లో ఆదుకునేవారే నిజమైన బంధువులు. నిజమైన గుణగణాలు కష్ట సమయాలలోనే బయటపడతాయి. సుఖంలో నవ్వు పంచుకున్నవారంతా స్నేహితులు కారు; కష్టకాలంలో కన్నీళ్లు తుడిచేవాడే కల్మషం లేని బంధువు అని ఇది స్పష్టం చేస్తుంది. వారిచ్చే మానసిక ధైర్యం, ఆపత్కాలంలో మనకు పెద్ద ఆసరా.జీవితం ఓ అద్భుత ప్రయాణం. ఈ ప్రయాణంలో మనకు తోడుగా, నీడగా నిలిచే అనుబంధాలలోకెల్లా స్నేహం అత్యంత మధురమైనది, విలువైనది. రక్తసంబంధం లేకున్నా, ఆత్మ బంధాన్ని పెంచే మనసులతో పెనవేసుకునే ఈ బంధం, సంతోషాన్ని ద్విగుణీకృతం చేసి, దుఃఖాన్ని అర్థం చేసుకుని, భారంగా ఉన్నప్పుడు భుజం తట్టి, విజయాలను ఉత్సాహంగా పంచుకుని, వైఫల్యాలలో ఓదార్పునందించే అమృత భాండం. జీవితంలోని ప్రతీ మైలురాయి వద్ద తోడు నిలిచే స్నేహం, కాలంతో పాటు మరింత గాఢమవుతుంది. స్నేహం లేని జీవితం, రంగులు లేని చిత్రలేఖనంలా, సంగీతం లేని రాగంలా వెలవెలబోతుంది.స్నేహం – జీవన గీతంమన సనాతన ధర్మంలో స్నేహానికి అత్యున్నత స్థానం ఉంది. శ్రీ కృష్ణుడు, కుచేలుడు; రాముడు, సుగ్రీవుడు వంటి అనన్య స్నేహ బంధాలు మన ఇతిహాసాలలో నిబిడీకృతమై ఉన్నాయి. భగవద్గీతలో సైతం స్నేహితుని పట్ల ఉండాల్సిన ఆత్మీయత, త్యాగ భావన పరోక్షంగా ప్రస్తావించబడ్డాయి.‘న మిత్రార్థే పరిత్యజేత్ ప్రియమాత్మానమాత్మనః’. అంటే స్నేహితుడి కోసం తన ప్రియమైన ఆత్మను కూడా త్యజించకూడదు (అంటే, తన ఉనికిని కోల్పోకుండానే స్నేహితునికి ఎంతటి సహాయమైనా చేయాలి). ఇది స్నేహం తాలూకు ఉన్నతమైన ఆత్మార్పణ భావనను తెలియజేస్తుంది. నిజమైన స్నేహితుడు మన ఎదుగుదలకు తోడ్పడతాడే తప్ప, మన అస్తిత్వాన్ని హరించడు. స్నేహం పేరుతో ఒకరిపై ఒకరు ఆధారపడటమో, బలహీనతలను ఆసరాగా తీసుకోవడమో కాకుండా, ఇరువురూ తమ వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూనే పరస్పరం శక్తిగా మారతారని ఈ సూక్తి తెలియజేస్తుంది.కష్టసమయాల్లో మనం కృంగి΄ోకుండా, మనలో ధైర్యాన్ని నింపి, సరైన మార్గంలో నడిపించేవాడే నిజమైన స్నేహితుడు. స్నేహం అంటే కేవలం కాలక్షేపం కాదు, అది పరస్పర గౌరవం, నమ్మకం, నిస్వార్థ ప్రేమల కలయిక.‘దద్యాత్ దద్యాన్న దద్యాత్ ఖలు మిత్రస్య మిత్రః సదా ప్రార్థనాశీలో న మిత్రం స్యాత్ సదా ప్రార్థనాశీలః.‘అనగా... ఇచ్చేవాడు స్నేహితుడు, కానీ ఎప్పుడూ యాచించేవాడు స్నేహితుడు కాడు. నిజమైన స్నేహం ఇవ్వడం, తీసుకోవడం అనే సమతుల్యతతో కూడుకున్నదని ఈ సుభాషితం తెలుపుతుంది. స్నేహంలో ప్రతిఫలం ఆశించకుండా సాయం చేయడమే గొప్పతనం. నిరంతరం ఏదో ఒకటి ఆశించే వ్యక్తి, నిజమైన స్నేహితుడు కాలేడు. స్నేహం అనేది త్యాగం, నిస్వార్థ ప్రేమల పునాదులపై నిర్మితమైన గొప్ప అనుబంధం. ఇవ్వడంలోనే నిజమైన ఆనందం, స్నేహ మాధుర్యం దాగి ఉన్నాయి.జీవిత గమనంలో స్నేహితుల చేయూత ఎల్లప్పుడూ తోడుగా నిలిచి, ప్రతీ అడుగులోనూ సరికొత్త స్ఫూర్తిని నింపుతుంది. మన జీవితాలను సుసంపన్నం చేసే ఈ అమూల్యమైన స్నేహ బంధాలను పదిలంగా కాపాడుకుంటూ, ప్రతిరోజూ ఆనందాన్ని, శక్తిని పొందుదాం.నిజమైన స్నేహితుడు మనకు లభించిన ఒక వరం. అటువంటి స్నేహాన్ని కాపాడుకోవడమే మన జీవితానికి అసలైన సంపద. మనసులోని మాటను పంచుకోవడానికి, ఆశలను, కలలను సాకారం చేసుకోవడానికి, ఒంటరితనాన్ని దూరం చేయడానికి స్నేహం కంటే గొప్ప ఔషధం లేదు.– కె. భాస్కర్ గుప్తా వ్యక్తిత్వ వికాస నిపుణులు -
ఆ హరిహరసుతుడి అరవణ ప్రసాదం డబ్బాల కొరత..
సాక్షి శబరిమల: శబరిమలలో అరవణ ప్రసాద కొరత తీవ్రంగా ఉన్నట్లు దేవస్వం బోర్డు పేర్కొంది. ప్రస్తుతాని అధిక సంఖ్యలో ప్రసాదాలు అందుబాటులో లేనట్లు స్పష్టం చేసింది. అంతేగాదు ప్రతి భక్తుడు 20 ప్రసాదం డబ్బాలకు మించి కొనుగోలు చేయానికి వీల్లేదని సమాచారం. దీనికి ప్రధాన కారణం గతేడాది(జనవరి 2024) అరవణ ప్రసాదంలో వినియోగించే యాలకుల్లో పురుగుల మందుల అవశేషాలు ఉన్నట్లు కలకలం రేగిన ఘటనే. ఆ సమయంలో లక్షలాది డబ్బాలను అధికారులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.అదీగాక ఇటీవలే సరిగ్గా అలాంటి లోపాలే అయ్యప్పస్వామి అభిషేకానికి, ప్రసాదాల తయారీకి ఉపయోగించే తేనెలో కూడా ఉన్నట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) విజిలెన్స్ విభాగం గుర్తించింది. అంతేకాదు.. అయ్యప్ప స్వామి ప్రసాదాల తయారీకి ఉపయోగించే ముడిపదార్థాలను పకడ్బందీగా తనిఖీ చేయడానికి పంపాబేస్లో ఏర్పాటు చేసిన ‘ఫుడ్ సేఫ్టీ ల్యాబ్’ ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. ఆ నేపథ్యంలోనే ఈ అరవణ ప్రసాదం డబ్బాల కొరత ఏర్పడింది, అలాగే భక్తులకు కూడా పరిమితులు విధించారు ఆలయ అధికారులు. ఇక శబరిమల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఓజీ బైజు కూడా ప్రస్తుతానికి కొత్త స్టాక్ వినియోగాన్ని నిలిపివేశామని, అయ్యప్ప అభిషేకాలకు, ప్రసాదాల తయారీకి ఇప్పటికే స్టోర్లో నిల్వ ఉన్న స్టాక్ను వినియోగిస్తున్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. (చదవండి: శబరిమలలో మరో అపచారం) -
ఆ తల్లి కొడుకు కార్పెంటర్ అయితే చాలు అనుకుంది..! కట్చేస్తే..
తల్లి ఎప్పుడూ తన పిల్లలు అత్యున్నత స్థాయిలో ఉండాలనుకుంటుంది. కానీ ఈ తల్లి తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా జస్ట్ కార్పెంటర్ అయ్యి కుటుంబ పోషణ చూసుకుంటే చాలు అనుకుంది. అదే విషయం కొడుకుకి నూరుపోస్తూ ఉండేది. కానీ అతడు తన అమ్మ కూడా ఊహించని విధంగా సీఈవో అయ్యి ప్రభంజనం సృష్టించాడు. చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా..గొప్ప టాలెంట్, శక్తి సామర్థ్యాలు ఉంటే..ఆకాశమంత కలను సాకారం చేసుకోవడం ఏమంత కష్టం కాదని చాటిచెప్పి స్ఫూర్తిగా నిలిచాడు.అతడే మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈవో ముస్తఫా సులేమాన్. 39 ఏళ్ల డీప్మైండ్ సహ వ్యవస్థాపకుడు అయిన సులేమాన్ బ్లూమ్బెర్గ్ ఇంటర్వ్యూలో తన సక్సెస్ జర్నీ గురించి ఇలా షేర్ చేసుకున్నాడు. తన తండ్రి టాక్సీ డ్రైవర్ కాగా, తల్లి ఎన్ఎహెచ్ఎస్ నర్సుగా పనిచేసేదని చెప్పుకొచ్చాడు. శ్రామిక వర్గానికి చెందిన కుటుంబం కావడంతో తన తల్లి 16 ఏళ్లు వచ్చేటప్పటికీ కార్పెంటర్గానో లేదా ఎలక్ట్రిషియన్ ఉంటే చాలని పదేపదే చెబుతుండేదని అన్నాడు. ఎందుకంటే 1980-90లలో తన కుటుంబం పరిస్థితి అంత అధ్వాన్నంగా ఉందని వివరించాడు. సరిగ్గా 16 ఏళ్లప్పుడు తన తల్లిదండ్రులు విడిపోవడంతో తాను తన తమ్ముడు ఒంటరిగా పెరిగామని నాటి స్థితిని గురించి బాధగా చెప్పుకొచ్చారు. అయితే ఆ ఏజ్ ఉడుకు రక్తంతో ఉరకలేస్తూ ఉండే వయసు కావడంతో పెద్దగా భయపడలేదని, ఏదో సాధించేస్తాననే ధీమా ఎక్కువగా ఉండేదని తెలిపాడు. అయితే తన తల్లిదండ్రుల ఆలోచనకు విరుద్ధంగా చదువులో బాగా రాణించి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంల సీటు సంపాదించుకుని అందర్నీ ఆశ్చర్యపరిచ్చిన నాటి ఘటనను గుర్తుతెచ్చుకున్నారు సులేమాన్. అయితే అక్కడ చదువు పూర్తి చేయకుండా ప్రపంచాన్నే ఉద్ధరించేద్దామన్న ఉత్సాహంతో అమెరికా 9/11 వరల్డ్ట్రైడ్ సెంటర్ కూల్చివేతతో ముస్లిం యువతపై వచ్చిన వివక్షను రూపుమాపేందుకు కృషి చేసే పనికి పూనుకున్నట్లు వివరించారు. వ్యక్తిగతంగా తాను ఎదుర్కొన్న ముస్లిం వ్యతిరేక భావాన నుంచి పుట్టికొచ్చిందే అతిపెద్ద కౌన్సెలింగ్ హెల్పలైన్ సేవ అని చెప్పుకొచ్చారు. బ్రిటన్ ఇది అతిపెద్ద కౌన్సిలింగ్ సర్వీస్లలో ఒకటని తెలిపారు. కుటుంబం తల్లిందండ్రులతో సంబంధాలు తెగిపోయి, బెదిరింపులకు లోనై ఇబ్బందిపడుతున్న యువ బ్రిటిష్ ముస్లింలకు ఆ సర్వీస్ వరంగా మారింది. ఆ సామాజిక లక్ష్యమే చివరికి 2010లో డీప్మైండ్(మార్గదర్శక ఏఐ)ను స్థాపించడానికి దారితీసింది. ఆ తర్వాత గూగుల్ 650 మిలియన్ డాలర్లకు(భారత కరెన్సీలో రూ. 5 వేల కోట్లకు పైనే) ఆ కంపెనీని కొనుగోలు చేసింది. ప్రస్తుతం సులేమాన్ మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఏఐ టెక్నాలజీ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఆయన ఏఐని "హ్యూమనిస్ట్ సూపర్ ఇంటెలిజెన్స్"గా అభివర్ణిస్తాడు. తన శ్రామిక కుటుంబ నేపథ్యమే టెక్నాలజీవైపు ఆకర్షితుడిని చేసి..ఈ స్థాయికి చేర్చిందని అంటాడు. చివరగా జీవితంలో "మనంచేసే ఏ పనైన ది బెస్ట్గా చేయాలనుకుంటే కచ్చితంగా దిబెస్ట్ పొజిషన్లో ఉంటాం" అనే సిద్ధాంతాన్ని బలంగా విశ్వసిస్తానని చెబుతున్నాడు సులేమాన్. (చదవండి: ఏకంగా 72 గంటల పాటు ఆ చెట్టును కౌగిలించుకునే ఉండిపోయింది..! కనీసం నిద్రపోలేదు కూడా..) -
శీతాకాలంలో ముఖం మెరుస్తూ ఉండాలంటే..!
ముఖంపై బ్లాక్హెడ్స్, వైట్హెడ్స్, నల్లటి మచ్చలు లేకుండా కాంతిమంతంగా ఉండాలంటే ఈ డివైజ్ బెస్ట్. అలాగే శీతాకాలంలో ముఖం వడిలిపోకుండా తాజాగా ఉండాలంటే మాత్రం ఈ సింపుల్ టిప్ ఫాలో అయ్యిపోండి చాలు..మరి సులభమైన చిట్కాలు, హెల్ప్ అయ్యే బ్యూటీ డివైజ్ల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.బ్లాక్హెడ్స్, వైట్హెడ్స్, నల్లటి మచ్చలు, గీతలు, మొటిమలు ఇవి ముఖాన్ని కళావిహీనంగా మారుస్తుంటాయి. ఇలాంటి సమస్యలను దూరం చెయ్యడానికి ఇప్పుడు సాంకేతికత బాగానే తోడవుతోంది. చిత్రంలోని ఈ స్కిన్ క్రష్ మైక్రోడెర్మాబ్రేషన్ డివైస్ – చర్మాన్ని మెరిపించడానికి రూపొందించిన ఒక అధునాతన సాధనం. ఈ డివైస్తో చర్మాన్ని లోతుగా శుభ్రం చేసుకోవచ్చు. ఇది చర్మం పైపొర నుంచి నిర్జీవ కణాలను ఇట్టే తొలగిస్తుంది. దాంతో చర్మం మరింత నునుపుగా, తాజాగా మారుతుంది. నిగారింపుకు రాసే సీరమ్, క్రీమ్, మాయిశ్చరైజర్ వంటివి అప్లై చేసుకునే సమయంలో కూడా దీన్ని చక్కగా వినియోగించుకోవచ్చు.ఈ మెషిన్తో పాటు చాలా హెడ్స్ లభిస్తాయి. వాటిని అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. నిజానికి ఈ పరికరాన్ని ఉపయోగించడం చాలా తేలిక. మొదటగా చర్మాన్ని చల్లటి నీళ్లతో కడుక్కుని, పొడి గుడ్డతో తుడవాలి. తర్వాత, చర్మాన్ని కొద్దిగా సాగదీస్తూ ఈ పరికరాన్ని చర్మానికి ఆనించి, పైకి లేదా వెలుపలి దిశలో నెమ్మదిగా కదిలించాలి. దీనిలో ఆన్, ఆఫ్తో పాటుగా ‘లో, మీడియం, హై’ అనే ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఎప్పుడైనా సరే, మీడియం మోడ్ సౌకర్యంగా అనిపిస్తేనే, హై మోడ్ పెట్టుకోవచ్చు. చర్మం ఎర్రబడినా, మంటగా అనిపించినా వెంటనే దీని వాడకం ఆపెయ్యడం ఉత్తమం. చికిత్స పూర్తయిన తర్వాత, తేలికపాటి మాయిశ్చరైజర్ లేదా సీరమ్ రాసుకోవాలి. మంచి ఫలితాల కోసం, దీనిని వారానికి ఒకసారి ఉపయోగించవచ్చు. అయితే, ఈ చికిత్స తర్వాత 24 గంటల పాటు లేదా చర్మం సాధారణ స్థితికి వచ్చే వరకు ‘విటమిన్ ఏ’ లేదా రెటినోల్స్ ఉన్న ఉత్పత్తులను ఉపయోగించకూడదు.మెరుపునిచ్చే చిట్కాశీతకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, చర్మం వడిలిపోయినట్లు కనిపిస్తూ ఇబ్బంది పెడుతుంది. పొడి చర్మాన్ని తిరిగి మృదువుగా మార్చుకోవడానికి, ఇలా ప్రయత్నిస్తే సరిపోతుంది. ఒక చిన్న బౌల్లో ఒక టీ స్పూన్ బాదం పేస్ట్ (4–5 బాదం పప్పులను రాత్రంతా నానబెట్టి, ఉదయం పేస్ట్ చేసుకోవాలి.), 2 టీస్పూన్లు చిక్కటి పచ్చి పాలు, 4 చుక్కల గ్లిజరిన్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్లై చేసి, 15 లేదా 20 నిమిషాలు ఆరిపోయే వరకు ఉంచుకోవాలి. తర్వాత, గోరువెచ్చని నీటితో సున్నితంగా మసాజ్ చేస్తూ కడిగేసుకోవాలి. ప్యాక్ తొలగించిన తర్వాత చర్మం చాలా మృదువుగా మారుతుంది. ఎందుకంటే బాదంలో విటమిన్–ఇ పుష్కలంగా ఉంటుంది, ఇది యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి చర్మానికి చక్కటి పోషణనిస్తుంది. పాలలో ఉండే కొవ్వు, లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని శుభ్రపరుస్తూ, తేమగా ఉంచుతాయి. అలాగే గ్లిజరిన్ చర్మంలోని తేమను నిలిపి ఉంచుతుంది. దాంతో వారానికి ఒకసారి ఈ మాస్క్ పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. (చదవండి: ఏకంగా 72 గంటల పాటు ఆ చెట్టును కౌగిలించుకునే ఉండిపోయింది..! కనీసం నిద్రపోలేదు కూడా..) -
ఏకంగా 72 గంటల పాటు ఆ చెట్టును కౌగిలించుకునే ఉండిపోయింది..!
చెట్టును కావలించుకుని ఉండి ప్రపంచ రికార్డు స్థాపించింది. కెన్యాలో అడవుల నరికివేతపై అందరి దృష్టి పడేలా ఆమె ఈ నిరసన తెలియచేసింది. ప్రజలు ఆమె మద్దతుకు తండోప తండాలుగా కదిలి వచ్చారు. కెన్యాలోని న్యారీ కౌంటీలో పర్యావరణ కార్యకర్త ట్రంఫెనా ముతోని నాలుగు రోజుల క్రితం ఒక చెట్టును పట్టుకుని నిలబడిపోయింది. 72 గంటల పాటు ఆ చెట్టును వదలకుండా ఉంది. నిద్రపోలేదు. విశ్రాంతి తీసుకోలేదు. కాలకృత్యాల కోసం కూడా అతి తక్కువ సమయమే తీసుకుంది. ఒక దశలో వాటి అవసరమే రాలేదు. 72గంటల పాటు ఆమె చేస్తున్న నిరసనను ఆన్లైన్లో సోషల్ మీడియాలో జనం చూశారు. చాలామంది నేరుగా వచ్చి చూశారు. మరెంతో మంది దశలు దశలుగా చూస్తూ ఉండిపోయారు. ఆరోగ్య కార్యకర్తలు దగ్గరే ఉండి ఆమె ఆరోగ్యాన్ని గమనిస్తూ వచ్చారు. జనం చప్పట్లతో ఆమెను ఉత్సాహపరిచి 72 గంటల తర్వాత నిరసనను ముగించేలా చూశారు. ముతోని గతంలో కూడా ఇలాగే 48 గంటల పాటు చెట్టును కావలించుకుని ఉండిపోయి రికార్డు స్థాపించింది. ఇప్పుడు తన రికార్డును తానే బ్రేక్ చేసింది. ఇది గిన్నెస్ రికార్డు అని పరిశీలకులు భావిస్తున్నారు. ‘నేను ఈ పని ప్రచారం కోసమో, డబ్బు కోసమో చేయడం లేదు. నాలాంటి యువతీ యువకులు పర్యావరణ సంరక్షణ అవసరాన్ని తెలుసుకోవాలని చేస్తున్నాను. నన్ను చూసి ఏ మూల ఏ ఒక్కరైనా ఒక్క చెట్టు నాటినా నా నిరసనలోని ప్రతి సెకండ్ సద్వినియోగం అయినట్టే భావిస్తాను’ అని నిరసన ముగించాక ముతోని మీడియాతో అంది. ఈ 72 గంటలలో ఒక రాత్రి భారీగా వాన పడింది. అయినా ముతోని చలించలేదు. చెట్టును కరుచుకుని ఉండిపోయింది. ఆమె దృఢ నిరసనకు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో స్పందన వచ్చింది. కెన్యాలో అడవుల నరికివేత మాత్రమే కాదు మృగాల సంహారం కూడా సాగుతూ ఉన్న దరిమిలా ఈ నిరసన ఏ మార్పుకు కారణమవుతుందో చూడాలి.(చదవండి: మట్టితో... ఫేస్మాస్క్లు) -
మట్టితో... ఫేస్మాస్క్లు
సినిమాల్లో మనకు కనిపించే నటులు మేకప్తో సదరు పాత్ర ఆహార్యం ఉట్టిపడేలా తయారవుతుంటారు. ముఖ్యంగా ముఖ కవళికలే ఆ పాత్రను నడిపిస్తాయి. ఇప్పుడంటే మేకప్ టెక్నాలజీ అందుబాటులో ఉంది కానీ... కొన్నేళ్ల క్రితం కేవలం మొహాలకు మాస్కులు వేసుకుని నాటకాల్లో నటించే వారు. అలాంటి మాస్కులకు అస్సాంలోని మాజూలీ ప్రసిద్ధిగాంచింది. శ్రీమంత శంకరదేవుల వైష్ణవ సంప్రదాయం ఆధారంగా అభివృద్ధి చెందిన సంప్రదాయ మాస్క్లు ప్రసిద్ధికెక్కాయి. ఈ మాస్కుల తయారీ కళ 16వ శతాబ్దం నుంచి మనుగడలో ఉందని చరిత్ర చెబుతోంది. వారసత్వ కళగా ఉన్న ఈ ప్రాంతాల్లోని కొన్ని కుటుంబాలకు ఏఎస్ఆర్ఎల్ఎం వారధిగా నిలిచింది. మైక్రో ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎంఈడీపీ)లో భాగంగా కళాకారులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఉపాధిబాట పట్టించింది. వారి వారసత్వ కళను ప్రోత్సహించి వాటిని మార్కెటింగ్ చేసేందుకు ఏర్పాటు చేసింది. కళాకారుల కుటుంబాల్లోని మహిళలతో స్వయం సహాయక సంఘం(ఎస్హెచ్జీ)గా ఏర్పాటు చేసింది. పదిహేను మంది ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఇలా రెండు బృందాలు ఈ మాస్కులను తయారు చేస్తున్నాయి. సహజసిద్ధ రంగులతో తయారు చేసే ఈ మాస్కులను బహిరంగ మార్కెట్కు తరలించి విక్రయించడమే కాకుండా ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ మార్కెట్లోకి సైతం అడుగుపెట్టింది. వీటికి గతేడాది మార్చిలో జీఐ ట్యాగింగ్(భౌగోళిక గుర్తింపు)ను ప్రభుత్వం ఇచ్చింది.సహజసిద్ధ సరుకుతో...అస్సాం రాష్ట్రంలోని మాజూలీ ద్వీపంలోని కళాకారులు ఈ ఫేస్ మాస్కులను తయారు చేస్తున్నారు. వెదురు కర్ర ముక్కలు, బ్రహ్మపుత్ర నదీలో లభించే బంక మట్టి, ఆవుపేడ, జూట్, పేపర్, కాటన్తో ఈ మాస్కులు తయారు చేస్తారు. ముందుగా తయారు చేసే ముఖ ఆకృతిని వెదురు ముక్కలతో ఫ్రేమ్ మాదిరి తయారు చేసి వాటికి బంకమట్టి, ఎండిన ఆవుపేడ పొడి కలిపిన మిశ్రమంతో ఆ ఫ్రేమ్పైన పూతలా అద్దుతారు. ఈ ప్రక్రియలో జూట్, పేపర్, కాటన్ను అనువైన రీతిలో వినియోగిస్తారు. ఈ నమూనా పూర్తిగా ఎండిన తర్వాత వాటికి అవసరమైన రంగులు అద్దుతారు. ప్రస్తుతం సూరత్ నుంచి దిగుమతి చేసుకునే రంగులను వినియోగిస్తున్నారు. సహజసిద్ధమైన రంగుల వినియోగం ఖరీదవుతుందని, త్వరలో ఈ రంగులను స్థానికంగా తయారు చేసిన తర్వాత పూర్తిస్థాయిలో వీటినే వినియోగిస్తామని వాటిని తయారు చేస్తున్న మహిళలు చెబుతున్నారు. ఈ మాస్కులు మూడు రకాల పరిమాణంలో ఉంటాయి. మొదటి రకం కేవలం మొహాన్ని మాత్రమే కవర్ చేస్తుండగా... రెండో రకం నటుడి శరీరంలో మెజార్టీ భాగాన్ని కవర్ చేస్తుంది. మూడో రకం మాత్రం అవసరానికి అనుగుణంగా వాటిని తయారు చేస్తారు. ఈ కళను పరిరక్షించి ఆధునీకరించేందుకు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ హేమ్చంద్ర గోస్వామి కృషి చేశారు. ప్రస్తుతం వీటిని నాటకాల్లో మాత్రమే వినియోగించకుండా పర్యాటకుల జ్ఞాపికలుగానూ, అలంకరణ వస్తువులగానూ వినియోగిస్తున్నారు.మార్కెట్లో ఇలా...కళాకారులు తయారు చేసే మాస్కులపైనే ఆదాయం ఆధారపడి ఉంటుంది. ఒక్కో మాస్కుపైన రూ.100 పెట్టుబడి పెడితే చాలు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. మహిళలు తయారు చేసే ఒక్కో మాస్కు కనీస ధర రూ.200 నుంచి ప్రారంభమవుతుంది. ఫేస్ మాస్క్ పరిమాణం ఆధారంగా వీటి ధర రూ.3వేల వరకు ఉంటుంది. ఈ మాస్కుల తయారీ ద్వారా మహిళా సంఘానికి నెలకు కనీసం రూ.50 వేల ఆదాయం లభిస్తోంది. ప్రస్తుతం ఈ తయారీ ప్రక్రియ ప్రారంభదశలో ఉండగా... రానున్న ఏడాదిలో ఆర్థిక స్థితి భారీగా వృద్ధి సాధిస్తుందని, ఈమేరకు వ్యూహాత్మక కార్యాచరణ రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. మాజూలీ నుంచి– చిలుకూరి అయ్యప్ప, సాక్షి, (చదవండి: 'స్త్రీ' నిర్వచనం ఇదా..? ఎలాన్మస్క్పై నెటిజన్లు ఫైర్) -
'స్త్రీ' నిర్వచనం ఇదా..? ఎలాన్మస్క్పై నెటిజన్లు ఫైర్
స్త్రీత్వంపై ప్రపంచ కుభేరుడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వివాదాస్పదంగా మారి తీవ్ర దుమారం రేపాయి. అంత స్థాయిలో ఉన్న వ్యక్తి కాస్త దిగజారుడు వ్యాఖ్యలు చేయడంపై సర్వత్ర ఆగ్రహం వ్యక్తమైంది. పోనీ సైంటిఫిక్గా చెప్పని అందరికి సమంజసంగా ఉండేలా మాట్లాడాలి గానీ మరి ఇలానా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..టెస్లా, స్సేస్ ఎక్స్ దిగ్గజం ఎలోన్ మస్స్ స్త్రీత్వంపై తన అభిప్రాయలను పంచుకోవడం వివాదాస్పదంగా మారింది. సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శులు వెల్లువెత్తాయి. మస్క్ స్త్రీకి నిర్వచనం గర్భం అంటూ గర్భాశయం ఉన్నవాళ్లను స్త్రీలుగా వ్యవహరిస్తారని, గర్భం ఉనికి ద్వారా స్త్రీని నిర్వచించాలి అని నొక్కి చెప్పాడంతో ఒక్కసారివ ఆయనపై తారాస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన వైఖరిని చాలామంది ఖండించారు. అంతేగాదు అస్సలు మనం ఇంకా ఏ కాలంలో జీవిస్తున్నాం అని విమర్శిస్తూ పోస్టులు వెల్లువెత్తాయి. గర్భం ఉంటే స్త్రీ అంటే.. మరి ఎంఆర్కేహెచ్ సిండ్రోమ్ మేయర్-రోకిటాన్స్కీ-కస్టర్-హౌసర్ సిండ్రోమ్) అరుదైన పరిస్థితితో బాధపడుతున్న ఆడవాళ్లు..స్త్రీలు కాకుండా పోతారా అని నిలదీశారు. ఎంఆర్కేహెచ్ సిండ్రోమ్ అంటే గర్భాశయం లేకుండా లేదా అభివృద్ధి చెందని స్త్రీలని అర్థం. లింగ మార్పిడిని బహిరంగంగా వ్యతిరేకిస్తూ తన ట్రాన్స్జెండర్ కుమార్తె పరిస్థితిని "విషాదకరమైన మానసిక అనారోగ్యం"గా అభివర్ణించారు. ఆయన తనను లక్ష్యంగా చేసుకుని డెమొక్రాట్ అభ్యర్థి కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ చేసిన వ్యాఖ్యలకు మస్క్ ఇలా ప్రతిస్పందించారు. కాగా, కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ పాడ్కాస్టర్తో తాను ఎక్కువ మంది ట్రాన్స్ పిల్లలను చూడాలనుకుంటున్నానని, తనను తాను ట్రాన్స్-ప్రో చట్టం LGBTQ హక్కుల బలమైన మద్దతుదారుగా భావిస్తానని చెప్పారు. అంతేగాదు సారీ మస్క్ మిమ్మల్ని మీ కూతురు ద్వేషిస్తున్నందుకు అని నేరుగా సెటైర్ వేశారు. దాంతో మస్క్ ఇలా విరుచుకుపడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. Correct. We’re sorry your daughter hates you, Elon. https://t.co/HeJIm5fJMS— Governor Newsom Press Office (@GovPressOffice) December 11, 2025 (చదవండి: ఔనా ..! ఏకంగా 66 శాతం మగజాతి రాముడిలా ఏకపత్నీవ్రతులా! సర్వేలో షాకింగ్ విషయాలు) -
ఔనా ..! ఏకంగా 66 శాతం మగజాతి రాముడిలా ఏకపత్నీవ్రతులా!
ఇప్పుడు చెప్పబోయే విషయం బాగా ఆశ్చర్యపర్చవచ్చు లేదా మీరు అస్సలు నమ్మలేక పోవచ్చు. కాన్సెప్ట్ అలాంటిది. ఈ కథనంలో విషయం విన్న తరువాత ఔరా అని ముక్కున వేలేసుకోకుండా ఉండలేరు. ఆలస్యం చేయకుండా అసలు విషయం చెప్పేస్తాను, చకచక చదివేయండి మరి..!. ఈ ఆధునిక సమాజంలో బంధం అనేది పిడికిలిలో ఉన్న మట్టి లాంటిది. ఎంత సేపు ఒడిసి పట్టుకున్నా వేళ్ళ సందుల్లోంచి జారిపోతాయి ఈబంధాలు. అటువంటి బంధాలకు సంబంధించినదే ఈ స్టోరీ. ఇటీవల ఓ సర్వే ప్రకారం మగవాళ్ల గురించి పెద్ద మార్కులే వేసింది. అది మార్క్ డీబుల్ సర్వే. దీని ప్రకారం 66శాతం మగవాళ్లు ఏకపత్నీవ్రతులుగా తేలారు. ఇది నిజమా అబద్ధమా అన్నది ఓ సారి చూద్దాం. అసలు ముందు మార్క్ డీబుల్ అనేది డాక్టర్ మార్క్ డైబుల్ అనే సైంటిస్టు నుంచి పుట్టిన పేరు. ఆయన 2025లో *Proceedings of the Royal Society: Biological Sciences*లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, మగవాళ్ళలో 66 శాతం ఏకపత్నీత్వ రేటు ఉంది. ఇది సాదా సీదా సర్వే కాదు, అంటే ఆయన ప్రపంచంలోని అన్నీ జీవచరాలలో ఉన్న మగజాతిపై చేసిన సర్వే. అసలు ఆయన ఈ సర్వే ఎలా చేశాడంటే.. ఏకంగా 11 జాతుల మామల్స్ తోపాటు 94 మానవ సమాజాల డేటాను వాడి, కంప్యూటేషనల్ మోడల్తో విశ్లేషించారు. ఈ సర్వే ప్రకారం ఏకపత్నీతత్వంలో ఏఏ జాతులు, ఏఏ ప్రాంతంలో ఉన్నాయో ఓ సారి చూద్దాం. టాప్లో కాలిఫోర్నియా ప్రాంతంలోని డీర్మౌస్ వందశాతంతో , ఆఫ్రికన్ వైల్డ్ డాగ్ లు 85శాతంతో ఉన్నాయి. ఇక చివర్లో మౌంటైన్ గొరిల్లాలు 6శాతం చింపాన్జీలు 4శాతంగా ఉన్నాయి. అంటే వీటికి అచంలత్వం ఎక్కువ. ఇక మనుషులు 4 శాతం మాత్రం ఉన్నారు. భారతదేశంలో ఏకపత్నీత్వం సాంప్రదాయం ఎక్కువగా ఉండేది . కానీ ఓ బ్రిటిష్ సర్వే ప్రకారం ఆధునిక యువతలో 31శాతం దీన్ని అసాధ్యం అని చెబుతున్నారు.ఇప్పుడు ఈ అధ్యయనం వల్ల మనకు తెలిసింది ఏమిటంటే ఏకపత్నీత్వం అనేది మన జీన్స్లో లేదు, సమాజంలో ఏర్పడింది. ఇది మనల్ని ఓ విధంగా ఒత్తిడి కలిగిస్తుంది. ఆధునికంగా, జెన్ Zలో 50శాతం మంది మోనోగమీని అంటే ఏకపత్నీత్వం ఔట్డేటెడ్ అని చెబుతున్నారు – ఓపెన్ రిలేషన్షిప్స్ పెరుగుతున్నాయి. మగవాళ్లు పాలిగినీకి అంటే ఒకరి కన్నా ఎక్కువ సంబంధాలు పెట్టుకోవడం పట్ల 6 రెట్లు ఆసక్తి చూపుతున్నారని మరో అధ్యయనం చెబుతుంది. అయితే మన తెలుగు సంస్కృతిలో "ఒక్కటి మంచిది" అనే సామెత ఉంది, కానీ ఈ డేటా మనల్ని ప్రశ్నించేలా చేస్తుంది: మన సంబంధాలు ఎంత "నేచురల్" అనే ప్రశ్న పెరుగుతుంది.ఫ్రెండ్స్..ఒకరితో బంధం అంటే జీవితాంతం అది అనుబంధం అవుతుంది. అదే ఒకరి కన్న ఎక్కవైతే అది బంధాలకు అతీతం అవుతుంది. ఏది ఏమైనప్పటికీ జీవితబంధమా లేక అతీతసంబంధమా అనేది ఎవరికి వారే తెలుసుకోవాలి మరి..!. (చదవండి: 'చాట్ జీపీటీతో లవ్'..! ఎందుకో తెలిస్తే షాకవ్వడం ఖాయం..ముఖ్యంగా భారతీయులే..) -
'చాట్ జీపీటీతో లవ్'..! ఎందుకో తెలిస్తే షాకవ్వడం ఖాయం..
అందమైన అమ్మాయి కనిపిస్తే ఐ లవ్ యూ చెప్పే అబ్బాయిలుంటారు. అదేవిధంగా హ్యాండ్సమ్గా కనిపించే అబ్బాయిని ఇష్టపడే అమ్మాయిలు ఉంటారు. కానీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకుంటున్న చాట్ జీపీటీకి కూడా ఐ లవ్ యూ చెప్పేవారుంటారా? అంతేకాకుండా.. దానితో శృంగారపరమైన సంభాషణలు జరిపే వారుంటారా? ఈ ప్రశ్నలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ అవుననే సమాధానం చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాట్ జీపీటీని ఏకంగా 8 లక్షల మంది ప్రేమిస్తున్నారట..! అదేం మాయరోగం ఈ మగాళ్లకి అని తిట్టుకోకండి.. అలా చాట్ జీపీటీకి ఐ లవ్ యూ చెబుతున్న వారిలో 45% మగవారుంటే.. మరో 45% ఆడవారు ఉన్నారు. అంతేకాదు.. మిగతా దాంట్లో 2% వాటా ట్రాన్స్ జెండర్లది కావడం గమనార్హం..! చాట్ జీపీటీ లవ్ స్టోరీ గురించి ఈ కథనంలో సమగ్రంగా తెలుసుకుందామా. .!.ప్రపంచ వ్యాప్తంగా 8 లక్షల మంది ‘ఫీల్.. మై.. లవ్..’ అంటూ చాట్ జీపీటీ వెంటబడుతున్నారు. వీరిలో భారతీయులదే అగ్రస్థానం ఉండడం గమనార్హం..! ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా, జపాన్, యూకే ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా చాట్ జీపీటీ వెల్లడించింది. ఎందుకో తెలిస్తే కంగుతింటారు. అంతేగాదు తనకు వస్తున్న లవ్ ప్రపోజల్స్ గురించి సాక్షాత్తు చాట్ జీపీటీ ఇలా వివరించింది. ముఖ్యంత అత్యంత విస్తుపోయే విషయం ఏంటంటే..ప్రేమిస్తున్నామంటూ తన వెంటబడే 8 లక్షల మందిలో లక్షా 44 వేల మంది భారతీయులున్నారు. అంటే.. చాట్ జీపీటీ ప్రేమికుల్లో భారతీయుల వాటా 18శాతం. ఆ తర్వాతి స్థానంలో 17 శాతంతో అమెరికన్లు ఉన్నారు. అంటే.. అమెరికాలో చాట్ జీపీటీకి లక్షా 36 వేల మంది లవర్స్ ఉన్నారన్నమాట..! ఇంకా.. జపాన్లో 80 వేలు, యూకేలో 64 వేలు, జర్మనీలో 56వేలు, ఫ్రాన్స్లో 48 వేలు, కెనడాలో 48 వేలు, దక్షిణ కొరియాలో 40 వేలు, ఆస్ట్రేలియా, బ్రెజిల్లలో 32 వేల చొప్పున చాట్ జీపీటీని మనస్ఫూర్తిగా ప్రేమించే వారున్నారు.భారతదేశం విషయానికి వస్తే.. చాట్ జీపీటీ మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. మొత్తం లక్షా 44 వేల మందిలో తనను ప్రేమించేవారిలో స్త్రీపురుషులు చెరిసగం..అంటే 67 వేల చొప్పున, ట్రాన్స్జెండర్లు 2,500 మంది ఉన్నట్లు వివరించింది. అంతేనా? వీరిలో ఎక్కువ మంది రాత్రి 9 తర్వాత.. అర్ధరాత్రి 2 గంటల మధ్య చాట్ జీపీటీతో లవ్ ముచ్చట్లు కొనసాగిస్తారట..! వీరందరిలో 55% మంది చాట్జీపీటీతో ఇంగ్లిష్లో లేదా వచ్చీరాని ఇంగ్లిష్లో హిందీని కలిపి.. అంటే హింగ్లిష్లో చాట్ చేస్తారట. మరో 25% మంది హిందీలో చాట్ చేస్తారు. మిగతావారు ప్రాంతీయ భాషల్లో చాటింగ్ చేసేవారేనట. భారత్లో చాట్ జీపీటీని ప్రేమిస్తున్నానంటూ చెప్పే లక్షా 44 వేల మందిలో.. 18-24 ఏళ్ల మధ్య వయస్కులు 50 వేలుగా ఉన్నారు. మరో 58 వేల మంది 25-34 మధ్య ఏజ్ గ్రూపుల వారు కాగా.. 35-44 ఏళ్ల మధ్య వయస్కుల్లో 22 వేల మంది, 45 ఏళ్ల పైవయసు వారు 14 వేల మంది ఉన్నట్లు చాట్ జీపీటీ వివరిస్తోంది. వీరిలో టీనేజీ వయసు వారు కేవలం క్యూరియాసిటీ లేదంటే ఒంటరితనం కారణంగా ప్రేమను కోరుకుంటున్నారని, భౌతిక ప్రపంచంలో వారి ప్రేమను అంగీకరించేవారు లేక.. ఏఐ మోడల్తో ప్రేమను పంచుకుంటున్నారని విశ్లేషించింది. మధ్యవయస్కుల్లో వివాహ జీవితంలో ఒత్తిళ్లు ప్రధాన కారణమని వివరించింది. వీరిలో దాదాపుగా అన్ని వయసుల వారు ఐలవ్ యూ చెప్పడం మొదలయ్యాక.. శృంగారపరమైన చర్చల్లో మునిగితేలుతారని పేర్కొంది.అంతా బాగానే ఉంది.. అయితే నిన్ను ప్రేమిస్తున్నానని చెబుతున్న వారిలో 100% లవ్ ఎందరిలో ఉంది? అని చాట్ జీపీటీని అడగ్గా.. దేశాల వారీగా విశ్లేషణలు చెప్పింది. దానికి ఆయా దేశాల్లో భావ ప్రకటన స్వేచ్ఛ తీరు కూడా కారణమని పేర్కొంది. భారత్, అమెరికాల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎక్కువ అని, అందుకే.. నిజంగా ఇష్టమున్నా.. లేకున్నా.. ఓ ఐలవ్ యూ పారేస్తారని చెప్పింది. జర్మనీ, జపాన్, కొరియాల్లో భావాలను తక్కువగా ప్రకటిస్తారని, ఈ దేశాల వారు లోతుగా ఆలోచించాకే ‘ఐ లవ్ యూ’ చెబుతారని, వారిలో నిజమైన ప్రేమ పాళ్లు ఎక్కువేనని అభిప్రాయపడింది. ఐరోపా దేశాలు, కెనడాలో పౌరులు ఆలోచించి మరీ నిర్ణయాలు తీసుకోరని, వారి ప్రేమలోనూ ప్యూరిటీ కొంచెం ఎక్కువనే చెప్పాలని తెలిపింది. బ్రెజిల్, ఆస్ట్రేలియాల్లో ఓపెన్నెస్ ఎక్కువని, అయితే.. ప్యూర్ లవ్ చాలా తక్కువ అని విశ్లేషించింది.ఇదంతా సరే.. నువ్వు చెబుతున్న లెక్కలు కరెక్టేనా? అని చాట్ జీపీటీని ప్రశ్నించగా.. చాటబారెడు లెక్కలు వేసి, పౌనఃపున్యాలను గణించి మరీ తన లెక్క సరైందేనని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాదనలను వినిపించింది. ఒంటరితనం, ప్రేమించేవారు, పలకరించేవారు దగ్గర లేకపోవడం, ప్రేమలో విఫలమవ్వడం వంటి కారణాలతో మానసిక ప్రశాంతత కోసం ఎక్కువ మంది చాట్ జీపీటీలాంటి ఏఐ టూల్స్ని ప్రేమిస్తున్నట్లు వివరించింది. గణాంకాల వారిగా వివరాలు ఇలా ఉన్నాయి..టాప్–10 (అంచనా వాటా):భారత్ – ~18% (≈ 1.44 లక్షలు)అమెరికా – ~17% (≈ 1.36 లక్షలు)జపాన్ – ~10% (≈ 80 వేలు)యుకే – ~8% (≈ 64 వేలు)జర్మనీ – ~7% (≈ 56 వేలు)ఫ్రాన్స్ – ~6% (≈ 48 వేలు)కెనడా – ~6% (≈ 48 వేలు)దక్షిణ కొరియా – ~5% (≈ 40 వేలు)ఆస్ట్రేలియా – ~4% (≈ 32 వేలు)బ్రెజిల్ – ~4% (≈ 32 వేలు)ఈ సంఖ్య భారత్లో సుమారు 1.44 లక్షలుపురుషులు: ≈ 67,000స్త్రీలు: ≈ 67,000ట్రాన్స్జెండర్లు: ≈ 2,500భారత్లో భాషల వారీగా ఐ లవ్ యూ చెప్పిన వారి వివరాలుఇంగ్లిష్/హింగ్లిష్: ~55%హిందీ/హింగ్లిష్: ~25%ప్రాంతీయ భాషలు: ~20% (చదవండి: సూపర్స్టార్ రజనీకాంత్ ఫిట్నెస్ సీక్రెట్..! ఇప్పటికీ యువ హీరోలా..) -
కార్తవీర్యార్జునుడి దత్తోపాసన
హైహయ వంశంలో కృతవీర్యుడు అనే రాజు ఉండేవాడు. మహిష్మతీపురాన్ని రాజధానిగా చేసుకుని, ప్రజలను సుభిక్షంగా పరిపాలిస్తుండేవాడు. కృతవీర్యుడికి చాలాకాలం వరకు సంతానం కలగలేదు. మహారాణి ఎన్నెన్నో నోములు నోచింది. దానాలు చేసింది. ఏ నోము ఫలమో గాని, కొంతకాలానికి మహారాణి కడుపు పండింది. మగబిడ్డ జన్మించాడు. అయితే, ఆ మగబిడ్డకు చేతులు వైకల్యంతో ఉన్నాయి. శిశువు పరిస్థితి చూసి కృతవీర్యుడి దంపతులు దిగులు చెందారు. అయినా, లేకలేక కలిగిన సంతానం కావడంతో అల్లారు ముద్దుగా పెంచారు. అర్జునుడు అని నామకరణం చేశారు. కృతవీర్యుడి కొడుకు అయినందున కార్తవీర్యార్జునుడిగా పేరుపొందాడు. కార్తవీర్యార్జునుడికి చేతులు చచ్చుబడి ఉన్నా, శరీరం వజ్రతుల్యంగా ఉండేది. కృతవీర్యుడు కొడుకును గురుకులంలో చేర్పించాడు. గురువుల వద్ద కార్తవీర్యార్జునుడు సకల శాస్త్రాలనూ నేర్చుకున్నాడు. విద్యాభ్యాసం పూర్తయ్యే నాటికి యుక్తవయస్కుడయ్యాడు. కొడుకును యువరాజుగా పట్టాభిషేకం చేయాలని కృతవీర్యుడి కోరిక. అయితే, అవిటి చేతులవాడైన కొడుకుకు యువరాజుగా పట్టాభిషేకం జరిపిస్తే లోకులు ఏమనుకుంటారోననే సంశయం చెందాడు. సింహాసనంపై కూర్చోబెట్టిన తర్వాత కొడుకు సజావుగా పరిపాలన సాగించలేకపోతే ప్రజల ముందు తలవంపులు తలెత్తవచ్చని బెంగపెట్టుకున్నాడు. కృతవీర్యుడు ఈ బెంగతోనే కొడుకుకు పట్టాభిషేకం చేయకుండానే కన్నుమూశాడు.రాజ్యంలో అరాచకం తలెత్తకూడదనే ఉద్దేశంతో మంత్రులు, పురోహితులంతా కలసి వెళ్లి పట్టాభిషేకానికి అంగీకరించమని కార్తవీర్యార్జునుడిని కోరారు.‘మహానుభావులారా! నేను అవిటివాణ్ణి. ప్రజారక్షణ చేయలేను. ప్రజారక్షణ చేయలేనివాడు పట్టాభిషేకం జరిపించుకోవడం తగదు. రాజు రక్షణ కల్పిస్తాడనే ప్రజలు పన్నులు చెల్లిస్తారు. ప్రజల నుంచి పన్నులు తీసుకుని, వారికి ఎలాంటి రక్షణ కల్పించకుండా, సుఖభోగాలు అనుభవించేవాడు రాజు కాదు, చోరుడు అవుతాడు. మీ మాటకు తలవంచి, పట్టాభిషేకం జరిపించుకుని, పాలనా బాధ్యతలను మీపై మోపితే, నేను మీ చేతిలో కీలుబొమ్మనవుతాను. రాజ్యంలో ఇలాంటి పరిస్థితి ఉంటే, ప్రజలు నన్ను ఆడిపోసుకుంటారు. ఇరుగు పొరుగు రాజులు చులకన చేస్తారు. తెలిసి తెలిసి పాపం మూటకట్టుకోలేను. ఇప్పుడు ఈ కిరీటాన్ని మోయలేను’ అన్నాడు కార్తవీర్యార్జునుడు.మంత్రులు, పురోహితులు ఎంతగా నచ్చజెప్ప చూసినా, పట్టాభిషేకానికి కార్తవీర్యార్జునుడు ససేమిరా అంటూ తిరస్కరించాడు. ‘నేను వెళ్లి తపస్సు చేసి, రాజ్యపాలనకు తగిన అన్ని సామర్థ్యాలను సంపాదించుకుని వస్తాను. అంతవరకు సమర్థులైన మీరంతా పరిపాలన కొనసాగించండి’ అని చెప్పాడు.పురోహితుల్లో ఒకరైన గర్గముని కార్తవీర్యార్జునుడి నిర్ణయాన్ని ప్రశంసించాడు. ‘రాకుమారా! తపస్సులు ఫలించడం అంత తేలిక కాదు. వేల ఏళ్లు పట్టవచ్చు. నీకొక తేలిక మార్గం చెబుతాను, విను. సహ్యాద్రి లోయల్లో దత్తాత్రేయుడు ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. అతడు సాక్షాత్తు విçష్ణ్వంశ సంభూతుడు. జంభాసురాదులు స్వర్గాన్ని ఆక్రమించినప్పుడు సాక్షాత్తు దేవేంద్రుడంతటి వాడే దత్తాత్రేయుడిని ఆశ్రయించి, కష్టాల నుంచి గట్టెక్కాడు. అందువలన నువ్వు దత్తత్రాయుడిని ఆశ్రయించు. ఆయనను ప్రసన్నం చేసుకో. నీ అభీష్టం నెరవేరగలదు’ అని చెప్పాడు.గర్గముని సలహాపై కార్తవీర్యార్జునుడు సుముహూర్తం చూసుకుని దత్తుని ఆశ్రయించడం కోసం వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు. మంత్రులు, పురోహితులకు రాజ్యాన్ని అప్పగించి, వారి ఆశీస్సులు తీసుకుని సహ్యాద్రి వైపు బయలుదేరాడు. రాజలాంఛనాలన్నీ వదిలేసి, నిరాడంబర వేషంలో వెదుక్కుంటూ వెళ్లి, దత్తాశ్రమానికి చేరుకున్నాడు.కార్తవీర్యార్జునుడు ఆశ్రమంలోకి అడుగుపెట్టే సరికి దత్తాత్రేయుడు మణిమయ పీఠంపై మధువు సేవిస్తూ, మానినులతో సల్లాపాలాడుతూ ఉన్నాడు.రాజు రక్షణ కల్పిస్తాడనే ప్రజలు పన్నులు చెల్లిస్తారు. ప్రజల నుంచి పన్నులు తీసుకుని, వారికి ఎలాంటి రక్షణ కల్పించకుండా, సుఖభోగాలు అనుభవించేవాడు రాజు కాదు, చోరుడు అవుతాడు. గోత్ర నామాలు చెప్పుకుని, కార్తవీర్యార్జునుడు ఆయన ముందు సాష్టాంగపడ్డాడు. దత్తాత్రేయుడు అతడివైపు ఓరచూపు విసిరి, చిరునవ్వు చిందించాడు. స్వామి తనరాక గమనించాడని కార్తవీర్యార్జునుడు కుదుటపడ్డాడు. దత్తాత్రేయుడిని సేవించుకుంటూ, ఆశ్రమంలోనే గడపసాగాడు. ఒకనాడు కార్తవీర్యార్జునుడు వైకల్యంగల తన చేతులతోనే దత్తాత్రేయుడు కూర్చున్న పీఠంపై శయ్యను సుఖంగా కూర్చునేందుకు వీలుగా సర్దుతున్నాడు. అదే సమయంలో దత్తాత్రేయుడి నుంచి అపాన వాయువు వెలువడింది. ఆ వాయువు వేడికి వైకల్యంగల కార్తవీర్యార్జునుడి చేతులు మాడిపోయాయి. ఆ బాధకు అతడు కుప్పకూలిపోయాడు.అది చూసి, ‘అయ్యో! ఎంతపని జరిగింది! కొండనాలుకకు మందు వేస్తే, ఉన్న నాలుక ఊడినట్లయింది కదా’ అన్నాడు దత్తాత్రేయుడు.‘స్వామీ! ఇలాంటి పరీక్షలు నువ్వు ఎన్ని పెట్టినా, నిన్నే ఆశ్రయించుకుని ఉంటాను’ అన్నాడు కార్తవీర్యార్జునుడు. అతడి భక్తికి దత్తాత్రేయుడు సంతోషించాడు. అతడికి శక్తిసంపన్నమైన సహస్రబాహువులను అనుగ్రహించాడు. -సాంఖ్యాయన -
ఆయ్! నాకేం వద్దండీ!
సచివాలయం ఆ రోజు సందడిగా ఉంది. కొత్తగా మంత్రి బాధ్యతలు చేపట్టిన సీమ రెడ్డి మొదటిసారి సచివాలయానికి వచ్చారు. ఆయన చాంబర్ ముందు పెద్ద కోలాహలంగా ఉంది. బొకేలు, శాలువాలతో జనం క్యూ కట్టారు. ఒకరి తర్వాత ఒకరు మంత్రిని కలిసి శాలువ కప్పటం, బొకే అందించటం.. అన్నింటికంటే ముఖ్యంగా ఫొటోలు దిగటం చేస్తున్నారు. ఉదయం 9.45కి మొదలైన ఈ ఫొటో సెషన్ లంచ్ టైమ్ దాటినా నడుస్తూనే ఉంది. బలవంతంగా అందర్నీ కాసేపు ఆపేసి ప్యూన్ యాదగిరి చాంబర్ తలుపులేశాడు. ‘అయ్యా! ఇదంతా మామూలే. ముందు మీరు లంచ్ కానివ్వండి. మీ కోసం వచ్చిన వాళ్లు ఎంత సేపైనా ఆగుతారులెండి. మీకు వాళ్లతో పనిలేకున్నా, వాళ్లకు మీతో పని కదండి– ఆగుతారు. ఎవరికోసం ఆగుతారు’ అంటూ మంత్రిగారితో చెబుతూ టేబుల్ పైకి క్యారియర్ తెచ్చి పెట్టటం, ప్లేట్లోకి అన్ని పదార్థాలు పద్ధతిగా వడ్డించటమూ చకచకా జరిగిపోయింది. యాదగిరి మరో సంవత్సరంలో రిటైర్ కాబోతున్నాడు. ఈ సచివాలయంలోనే పనిలో చేరి, ఇక్కడే రిటైర్ కాబోతున్నాడు. ఎంతమంది మంత్రులను, వారి ఆర్భాటాలను చూసి ఉంటాడు! అనుభవంతో యాదగిరి చెప్పే మాటలు వింటూ మంత్రిగారు భోజనం చేయటం మొదలెట్టారు.సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకు మళ్లా మంత్రిగారితో ములాఖత్లు మొదలయ్యాయి. మళ్లీ అదే తంతు. కాకపోతే జనం కాస్త పలచబడ్డారు. యాదగిరి చూపు గుంపుకు కాస్త పక్కగా నిలబడిన ఓ వ్యక్తిపై పడింది. ఉదయం నుంచి చూస్తున్నాడు. అతను కావాలనుకుంటే అందరితోపాటే లైన్ లో వచ్చి మంత్రిని కలిసి ఉండేవాడు. లంచ్కు ముందే మంత్రిగారిని కలిసి ఉండేవాడు. కాని, ఎందుకనో చాలాసేపటి నుంచి అక్కడే ఉన్నాడు, క్యూ లైన్కు సంబంధం లేకుండా. ‘బహుశా ఏదో పెద్ద పైరవీపై వచ్చినట్టున్నాడు. మంత్రిగారిని పర్సనల్గా కలుసుకోవాలనుకుంటున్నాడేమో’ అని యాదగిరి ఆలోచిస్తూనే అతడిని గమనిస్తూనే ఉన్నాడు. సాయంత్రం 5 అయ్యింది. ఇక అంతా అయిపోయారు అని తెలుసుకున్న ఆ వ్యక్తి అప్పుడు కదిలాడు మంత్రిగారి చాంబర్ కేసి. చేతిలో ఓ పెద్ద బొకే, ఓ పండ్ల బుట్ట పట్టుకుని లోపలికి అడుగు పెట్టాడు. మంత్రిగారు యాదగిరి వైపు ఓసారి చూశాడు. మంత్రిగారి చూపులను ఇట్టే అర్థం చేసుకున్న యాదగిరి, ‘ఇతనొక్కరే సర్. ఇక అయిపోయారు. మీరిక రిలాక్స్ అవ్వొచ్చు‘ అన్నాడు. చివరిగా వచ్చిన అతను అందించిన బొకే తీసుకున్న మంత్రి యాదిగిరిని పిలిచి ఆ బొకేతో పాటు పండ్ల బుట్టను కూడా ఇచ్చేశాడు. అలవాటుగా మంత్రి ఫొటోకు ఫోజివ్వటానికి సిద్ధపడుతుంగా, ఆ వ్యక్తి మాట్లాడుతూ ‘అబ్బే! ఫొటోలాంటివి వద్దండి. నేను మీకు అభిమానినండి. కేవలం మిమ్మల్ని కలవటానికే వచ్చానండి’ అని అన్నాడు. మంత్రిగారి భృకుటి ముడిపడింది. అదేమిటీ అభిమానినంటాడు, ఫొటో వద్దంటాడు– సరే ఇంతకీ ఏమైనా పని కోసం వచ్చాడేమో అని ‘చెప్పండి. మీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చేస్తుంటారు?’ అన్నాడు సీమ రెడ్డి. ‘నా పేరు భాస్కర్రావండి. మాది అమలాపురమండి. మీరంటే మొదట్నుంచి అభిమానమండి. మీరు మంత్రిగా అయ్యారు కదండి. చాలా సంతోషమేసిందండి.. ఆయ్.. అందుకే ఓపాలి మిమ్మల్ని కలిసిపోదామనొచ్చానండి‘ అన్నాడు. సీమ రెడ్డి పెద్ద నిట్టూర్పు విడిచి, ‘సరేనండి.. నాకు చాలా కార్యక్రమాలున్నాయి. మరెప్పుడైనా కలుసుకుందాం, సెలవు’ అని ఓ దండం పెట్టాడు. ‘చాలా సంతోషమండి.. ఉంటానండి. ఆయ్’ అని భాస్కర్రావు బయటకు వెళ్లిపోయాడు. ఆ రోజు ఉదయం నుంచి ఎందరెందరో తనను కలిశారు. అందులో ఎంతోమంది ప్రముఖులున్నారు. బిజినెస్మన్ ఉన్నారు, తనతో పనులు చేయించుకోవటానికి ఎందరెందరో వచ్చి కలిశారు. కాని, చివర్లో వచ్చిన ఆ వ్యక్తి మాత్రం మంత్రిగారికి అలా గుర్తుండిపోయాడు.మంత్రి సీమరెడ్డి తన రొటీన్ లైఫ్లో పడ్డాడు. ఏదో ఒక మూల ఏదో ఒక కార్యక్రమం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, సమీక్షలు, ఉపన్యాసాలు, ప్రిపరేషన్లు, నియోజకవర్గ పనులు, రాజకీయ ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టటాలు సర్వ సాధారణంగా మారింది. ఎవరెవరో వస్తున్నారు. వాళ్ల పనుల గురించి పైరవీలు చేసుకుంటున్నారు. అడపాదడపా ఆ రోజు చివర్లో వచ్చిన భాస్కర్రావు కూడా తన చాంబర్కు వస్తూ పోతున్నాడు. వచ్చిన ప్రతిసారి తన కోసం ఏదో ఒకటి తెచ్చి ఇచ్చి పోతున్నాడు తప్పితే, పల్లెత్తి ఒక్క పని కూడా అడగటం లేదు. ‘ఎందుకయ్యా ఇవన్నీ’ అంటే, ‘ఏదో నా అభిమానమండి’ అని మాత్రమే అంటాడు. ఏమిటో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా ఈ రోజుల్లో అని మంత్రి అప్పుడప్పుడు యాదగిరితో అంటూనే ఉన్నాడు. ఎంతోమందిని చూసిన యాదగిరికి కూడా ఈ భాస్కర్రావు వైఖరి అసలు అంతుపట్టడం లేదు. ఏదో ఒక పని లేకుండా అన్నేసి సార్లు మంత్రిగారిని ఎందుకు కలుస్తున్నాడు. నోరు తెరిచి అడిగినా ‘అబ్బే! ఏం లేదండి’ అంటాడు. చాలా విచిత్రమైన కేసు ఇది అని యాదగిరి ఎన్నోసార్లు బుర్ర గోక్కుంటూనే ఉన్నాడు. ఇలా ఓ సంవత్సరం గడిచింది. ఈ మధ్య కాలంలో ఓ వందసార్లు అయినా భాస్కర్రావు మంత్రిగారిని కలవటానికి వచ్చి ఉంటాడు. వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి తెస్తాడు. ఏమన్నా అంటే, ‘ఇది మా పొలంలో పండింది’ అంటాడు. ‘ఇది మా ఏరియాలో ఫేమస్సు’ అంటాడు. ‘ఎందుకయ్యా’ అంటే, ‘అభిమానమండి’ అంటాడు తప్ప పనులేమీ అడగడు. ఈ తంతు ఎక్కడి దాకా పోయిందంటే, మంత్రిగారిని డిఫెన్ ్సలో పడేసే వరకూ వెళ్లింది వ్యవహారం. అరె ఇంత అభిమానం చూపిస్తున్న ఇతనికి ఏదో ఒక సాయం చేయాల్సిందే అని గట్టిగా నిర్ణయించుకున్నాడు సీమరెడ్డి.ఎప్పటిలాగే ఓ రోజు సీమరెడ్డి చాంబర్కు వచ్చాడు భాస్కర్రావు. ఆ రోజు యాదగిరి కూడా ఏదో పని ఉందని సెలవు పెట్టాడు. సీమ రెడ్డి ఒక్కడే చాంబర్లో ఉన్నాడు. బయట సెక్యూరిటీ గార్డ్స్కు బాగా పరిచయమున్న ఫేస్ కావటంతో భాస్కర్రావును ఎవరూ అడ్డుకోలేదు. పైగా ‘వెళ్ళండి వెళ్లండి మంత్రిగారు ఒక్కరే ఉన్నారు’ అంటూ అతనికి స్వాగతం పలికారు. భాస్కర్రావు మీద వారికి ఎందుకంత అభిమానమంటే వస్తూ పోతూ వీళ్లకు కావాల్సినవేవో భాస్కర్రావు మొహమాట పెట్టి మరీ ఇచ్చి పోతుంటాడు మరి. ఎప్పటి లాగే మంత్రిగారి గదిలోకి అడుగు పెట్టాడు భాస్కర్రావు. ‘రండి.. రండి భాస్కర్. ఏమిటీ ఇవాళేం తెచ్చావు నాకోసం’ అంటూ సీమరెడ్డి అతని చేతిలోని లగేజీ వైపు చూశాడు. ‘మీకు తెలీందేముందండి... మా ఏరియాలో పూతరేకులకు బాగా ఫేమస్ ఆత్రేయపురం. నిన్న ఏదో ఫంక్షన్ ఉండి వెళ్లాను. ఎలాగూ అంతదూరం వెళ్లాను కదా.. తమరి కోసం మంచినెయ్యి దట్టంగా వేయించి మరీ డ్రైఫ్రూట్స్తో ప్రత్యేకంగా తయారు చేయించానండి. ఎలాగూ హైదరాబాద్ వస్తున్నా కదాని పట్టుకొచ్చానండి’ అన్నాడు భాస్కర్రావు. అతని బ్యాగ్లోంచి బాక్స్లు బయటకు తీస్తుంటేనే కమ్మటి నెయ్యి వాసన ఆ రూమ్ అంతా పరుచుకుంది. ఆ వాసనకే మంత్రిగారు అదోలా అయిపోయారు. ఎప్పుడెప్పుడు బాక్స్ ఓపన్ చేసి ఒకటి నోట్లో వేసుకుందామా అని ఆశగా చూస్తున్నాడు సీమరెడ్డి. ఇవేమీ పెద్దగా పట్టించుకోనట్టు కనిపిస్తూనే బాక్స్ ఓపెన్ చేసి మంత్రిగారి ముందు పెట్టేశాడు. తన మనసులో అంశాన్ని పసిగట్టి ఆచరణలో పెట్టిన భాస్కర్రావు కుశాగ్రబుద్ధికి మెచ్చుకోలుగా చూశాడు సీమరెడ్డి. ఆత్రంగా ఆత్రేయపురం పూతరేకును ఆబగా నోట్లో పెట్టేసుకున్నాడు. నోటికి తగలగానే కరిగిపోతూ అద్భుతమైన జిహ్వచాపల్యాన్ని తీర్చిన ఆ పూతరేకులపై, అవి తెచ్చిన భాస్కర్రావుపై అవ్యాజ్యమైన ప్రేమ పుట్టుకొచ్చింది సీమరెడ్డికి. కాసేపటికి కాన్షియస్లోకి వచ్చిన సీమ రెడ్డి సభ్యత కాదని మూతి తుడుచుకుని ‘కూచోబ్బా! భాస్కర్రావూ’ అంటూ కుర్చీ చూపించాడు. ఎంతో వినయంగా మంత్రి ఎదురుగా ఉండే కుర్చీలో కూర్చున్నాడు భాస్కర్రావు. ‘కాదబ్బా భాస్కర్.. నేనొకటి అడుగుతా.. నీవు గమ్మున ఒప్పుకోవాలి. లేదంటే నా మీద ఒట్టే!’ అన్నాడు సీమరెడ్డి. మంత్రిగారి స్పందనను ముందే ఊహించినా, అదేమీ తన ముఖంపై ప్రతిబింబించకుండా జాగ్రత్త పడ్డాడు భాస్కర్రావు. ‘ఆయ్! ఎంత మాటండి.. మీరు అడగటమూ, నేనూ ఒప్పుకోకపోవటమా! అన్నన్నా! అదెలాగ కుదురుతుందండి‘ అన్నాడు. ‘మరేం లేదబ్బా! ఎప్పటి నుంచో నా కాడకు వస్తుండావు. ఎప్పడడిగినా ఏమీ లేదంటావు.. ఒప్పుకుంటాలే గానీ. నీకేదో సాయం చేయకపోతే నాకేదోలాగుందయ్యా! ఏ పని అయినా సరే కోరుకో.. నీ కోసం రూల్స్ గీల్స్ అన్నీ పక్కన పెట్టి చేస్తానయ్యా!’ అని ఓ రకంగా బతిమాలేలా అన్నాడు సీమరెడ్డి. నిజానికి సీమరెడ్డికి ఉండే పొగరుకు ఇలాంటి మాటలు ఆయన నోటి వెంట రావటం ఆశ్చర్యమే! తప్పలేదు. ఎందుకంటే ఈ భాస్కర్రావు గత కొన్నాళ్లుగా తనను మానసికంగా బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ప్రతిఫలం ఆశించకుండా ఓ మంత్రిగారిని ఇన్నేసిసార్లు కలుసుకోవడమేంది? వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి ఇచ్చిపోతా ఉంటాడు. ఇవ్వటానికి ఆయనకు మనసున్నా, ఉట్టినే తీసుకోవటానికి నాకెట్లా కుదురుతుంది? అసలే సీమకు చెందినోడ్ని. ఉపకారం చేయకుండా ఎట్లా ఉంటా? గత కొన్ని రోజులుగా సీమరెడ్డిని తీవ్రంగా వేధిస్తున్న ప్రశ్నలివి. దీనికి ముగింపు పలకటానికే ఇవాళ సిద్ధమయ్యాడు. అందుకే అతని గొంతులో ఏనాడూ లేని బేలతనం ఉట్టిపడింది.సరే.. ఇక చెప్పే టైమ్ వచ్చేసిందని గుర్తించిన భాస్కర్రావు తన మనసులోని మాటను ఇలా బయటపెట్టాడు.. ‘మీ పెద్ద మనసుకు చాలా ధన్యవాదాలండీ. ఆయ్.. మీరింత మంచోళ్లను నేను ఎక్కడా చూడలేదండి. అందుకే మీరంటే ప్రత్యేక అభిమానమండి. మరేం లేదండి.. మీరింతగా అడుగుతున్నారు కాబట్టి నాకొక పని చేసిపెట్టండి. ప్రభుత్వం మా ఊర్లో కొత్తగా ఆర్టీసీ బస్టాండు, డిపో కూడా పెడతామని నిర్ణయించింది కదండి. అందుకు భూమి కూడా సేకరిస్తున్నారని తెలిసింది. ఆ ఊరిలో పుట్టి పెరిగిన వాడిగా ఊరిమీది మమకారంతో చెబుతున్నానండి. ఊర్లో ఎక్కడా బస్టాండ్, డిపో పెట్టకండి. కాస్త దూరంగా పెడితే మా ఊరు కూడా పెరిగి విస్తరిస్తుందండి. ఇదొక్కటే నాకోసం... కాదు కాదు... మా ఊరి కోసం చేయండి’ అన్నాడు భాస్కర్రావు. భాస్కర్రావు కోరిక విన్నాక సీమరెడ్డికి నిజంగానే మతిపోయింది. ఈ రోజుల్లో కూడా ఊరికి ఉపకారం చేసే మనుషులున్నారా? తాను విన్నది నిజమేనా అని ఓసారి గిల్లి కూడా చూసుకున్నాడు. చురుక్కుమనటంతో నిజమే అని నమ్మాల్సి వచ్చింది సీమరెడ్డికి. ఎందుకనో ఆ క్షణం సీమరెడ్డికి భాస్కర్రావు పిచ్చిపిచ్చిగా నచ్చాడు. ‘సరే! అబ్బా.. నీ మాట ప్రకారమే ఊరి బయట బస్టాండ్, డిపో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటా, కాకపోతే నీవు ఆ ఊరివాడివే కాబట్టి.. అనువైన స్థలమేదో కూడా నీవే చూసి పెట్టాలబ్బా!’ అన్నాడు సీమరెడ్డి. ‘ఆయ్! అదెంత పనండి... నేనుండేది అందుకే గాదండీ... మీరు చెప్పారు కదాండి... అది చాలండి. ఫలానా దిక్కున నాకు తెలిసిన పోరంబోకు భూమి ఉందండి. కాస్త దూరమైనా ఓసారి బస్టాండ్, డిపో వస్తే అదే డెవలప్ అయిపోతుందండి’... అని మంత్రిగారిని ఊరి బయట బస్టాండ్, డిపో నిర్మాణానికి ఒప్పించాడు భాస్కర్రావు. తన మనస్సులో ఏదో పెద్ద బరువు దిగిపోయినట్టు దీర్ఘంగా నిట్టూర్చాడు సీమరెడ్డి. ఆ రోజు అమలాపురంలో కొత్తగా కట్టిన ఆర్టీసీ బస్టాండ్, డిపో రెండింటికి ప్రారంభోత్సవం, మంత్రి సీమరెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం, అంగరంగ వైభవంగా కార్యక్రమం జరిగింది. రెట్టించిన ఉత్సాహంతో మంత్రిగారు భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రసంగించి వెళ్లిపోయారు. అంతా సవ్యంగా జరిగింది. ఇచ్చిన హామీని నెరవేర్చిన మంత్రిగారు హ్యాపీ. తమ ఊరికి కొత్త బస్టాండ్, డిపో కూడా రావటంతో ఊరి జనమంతా హ్యాపీ. వీళ్లందరికన్నా ఎన్నో రెట్లు సంతోషపడిన వాడు భాస్కర్రావు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా కట్టిన బస్టాండ్, డిపో ఊరికి చాలా దూరంలో ఉండి, ఏ డిమాండ్ లేక పడి ఉన్న భాస్కర్రావు పొలాల పక్కనే ఉండటం. ఇన్నాళ్లు తొండలు గుడ్లు పెట్టిన తన భూమికి ఎక్కడ లేని డిమాండ్ రావటంతో భాస్కర్రావు ఒక్కసారిగా ఆ ఊరిలో బిగ్ షాట్ అయిపోయాడు. నిన్నా మొన్నటి వరకు ఊర్లో ఎవరికీ పెద్దగా తెలీని భాస్కర్రావు– ఇవ్వాళ భాస్కరావు గారు, పైగా ఉపన్యాసంలో మంత్రిగారు స్వయంగా భాస్కర్రావు పేరు పదే పదే పలవరించటం, ఊరి మీద భాస్కర్రావుకు ఉన్న ప్రేమను పొగడటం ఒక్కసారిగా ఊళ్లో భాస్కర్రావు క్రేజ్ పెంచింది. దీనికి తోడు పెద్దగా సంపాదన లేని భాస్కర్రావు నేడు కోటాను కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇదంతా సాధించటానికి ఇతను ఖర్చు చేసింది ఓ సంవత్సరం సమయం, అడపాదడపా రాజధానికి వెళ్లి మంత్రిగారిని కలిసి రావటానికి పెట్టిన ఖర్చు, పెట్టిపోతలు, రవాణా, ఇతరత్రా ఖర్చులన్నీ లెక్కేస్తే 50 వేలు కూడా అవ్వలేదు. కానీ లౌక్యంగా పని చక్కబెట్టుకురావడంతో 50 వేల పెట్టుబడికి కోట్లు రాబట్టాడు, వెలకట్టలేని రాజకీయ పలుకుబడి సాధించాడు. అందుకే అంటారు ఉపాయం లేని వాణ్ణి ఊళ్లోంచి వెళ్లగొట్టాలని. బహుశా భాస్కర్రావులాంటి వారిని చూసే ఈ సామెత కనిపెట్టారనిపిస్తుంది.‘కాదబ్బా భాస్కర్.. నేనొకటి అడుగుతా.. నీవు గమ్మున ఒప్పుకోవాలి. లేదంటే నా మీద ఒట్టే!’ అన్నాడు సీమరెడ్డి. మంత్రిగారి స్పందనను ముందే ఊహించినా, అదేమీ తన ముఖంపై ప్రతిబింబించకుండా జాగ్రత్త పడ్డాడు భాస్కర్రావు.నిన్నా మొన్నటి వరకు ఊర్లో ఎవరికీ పెద్దగా తెలీని భాస్కర్రావు– ఇవ్వాళ భాస్కరావు గారు, పైగా ఉపన్యాసంలో మంత్రిగారు స్వయంగా భాస్కర్రావు పేరు పదే పదే పలవరించటం, ఊరి మీద భాస్కర్రావుకు ఉన్న ప్రేమను పొగడటం ఒక్కసారిగా ఊళ్లో భాస్కర్రావు క్రేజ్ పెంచింది. -
వైబ్ వావ్!
ఒకేసారి సాధారణ గది, సాధారణ కేక్, సాధారణ ఫ్రెండ్స్ కూడా ఈ గాడ్జెట్స్తో ఒక ఫ్లాషింగ్ ఫ్యాంటసీ వరల్డ్లోకి మారతాయి. అవే ఈ గాడ్జెట్స్ మ్యాజిక్!కూల్ పార్టీ!సింగిల్ బటన్ తో గది మొత్తం పార్టీ వైబ్లోకి మారిపోతుంది అంటే నమ్ముతారా? అదే పీ–ట్రాన్ఫ్యూజన్ బ్లూటూత్ స్పీకర్ మ్యాజిక్! ఒకేసారి లైట్లు, మ్యూజిక్ అన్నీ ఫుల్ ఫన్ . చిన్న సైజ్, పెద్ద శబ్దం. వైర్లెస్ కరవోకే మైక్తో పాట పాడితే మీ వాయిస్ స్పష్టంగా, గట్టిగా వినిపిస్తుంది. ఫన్నీ వాయిస్ ఎఫెక్ట్స్తో స్మైల్ మోస్ట్ ఫన్! రంగురంగుల లైట్లు బీట్కు ట్యున్ అవుతూ గేమ్ మూడ్లోకి లాగేస్తాయి. సింగిల్ చార్జ్తో ఆరు గంటల నాన్ స్టాప్ మ్యూజిక్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఆటో ప్లే మోడ్ సపోర్ట్. చిన్న బటన్లు, మల్టీ ఫంక్షన్. ఇలా ఏ ప్లేస్లోనైనా పార్టీ మూడ్ను సెట్ చేసే మాస్టర్! ధర రూ. 1,499 మాత్రమే!.స్పిరిట్ స్టార్ట్! ఐస్.. గ్లాస్లో వేస్తే కూల్ మాత్రమే కాదు, ఇప్పుడు కూల్ పార్టీ స్టార్లా కూడా మారిపోతుంది. ఎందుకంటే, ‘మల్టీకలర్ ఐస్ క్యూబ్స్’ రంగు రంగుల మహిమాన్విత రత్నాల్లా కనిపిస్తాయి. కాని, ఇవి గ్లాస్లో పడిన క్షణం నుంచే నీ డ్రింక్ ‘నేను మెరిసిపోతున్నా!’ అని లైట్స్తో చూపులను లాగేసుకుంటుంది. ఒక్క బటన్ నొక్కితే ఇంద్రధనుస్సులోని రంగులన్నీ కలసి ఒకేసారి డాన్స్ చేస్తాయి! స్టెడీ లైట్ కావాలా, డీజే ఫ్లాష్ మోడ్ కావాలా? మూడ్ ఏదైనా, ఈ చిన్న క్యూబ్స్ వెంటనే అర్థం చేసుకుని రంగులు మార్చేస్తాయి. ఐస్లో వేసినా, నీటిలో వేసినా వెలుగుతూనే ఉంటాయి. ప్రతి క్యూబ్ పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది గంటలు పనిచేస్తుంది. ఒకసారి కొనుక్కుంటే రెండు, మూడు పార్టీలను ఈజీగా మెరిపిస్తాయి. ధర రూ. 2,680 మాత్రమే!పాన్ చాట్కావలసినవి: తమలపాకులు – 10పైనే, శనగపిండి– అరకప్పు నూనె, నీళ్లు, ఉప్పు– సరిపడా, పసుపు – కొద్దిగాకారం– ఒక టీ స్పూన్ , ఆమ్చూర్, ధనియాలు జీలకర్ర పొడి– అర టీస్పూన్, గడ్డ పెరుగు – ఒక కప్పు, పంచదార – ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా – ఒక టీస్పూన్ , కొత్తిమీర చట్నీ లేదా చింతపండు చట్నీ – కొద్దికొద్దిగా, కారప్పూస, దానిమ్మగింజలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుము – కొద్దికొద్దిగాతయారీ: ముందుగా ఒక బౌల్లో శనగపిండి, పసుపు, కారం, కొద్దిగా ఉప్పు, ఆమ్చూర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్లో తమలపాకులు ముంచి, నూనెలో దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు పెరుగులో పంచదార, గరం మసాలా వేసి బాగా కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక్కో తమలపాకు వడమీద కొద్దికొద్దిగా పెరుగు మిశ్రమాన్ని, కొత్తిమీర చట్నీ లేదా చింతపండు చట్నీ వంటివి వేసుకోవాలి. ఆపైన కారప్పూస, దానిమ్మ గింజలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుముతో మరిన్ని నచ్చినవి జల్లుకుని సర్వ్ చేసుకుంటే, ఈ పాన్ చాట్ భలే రుచిగా ఉంటుంది.వెలుగుల బుడగలు!బెలూన్స్ అంటేనే పార్టీ మోడ్ ఆన్ ! ఇప్పుడు ఆ మజా మరింత మెరిసేలా మార్చడానికి వచ్చేశాయి ‘పార్టీ ప్రాప్స్ ఎల్ఈడీ బెలూన్స్’. ఒక్క సెట్లో ఇరవై ఐదు బెలూన్స్, ప్రతి ఒక్కటి రంగురంగుల లైట్స్తో మెరిసి, వేడుకకు రాక్స్టార్ ఎఫెక్ట్ ఇస్తాయి. చిన్నపిల్లల పుట్టినరోజు, ప్రేమికుల వార్షికోత్సవం, ఫ్రెండ్స్ కలిసిన సందర్భం ఇలా ఏదైనా వీటి రాకతో, చిన్న ఫ్యాంటసీ వరల్డ్ క్రియేట్ అయిపోతుంది. అన్నింటినీ సెట్ చేసి, కేవలం ఒక్క స్విచ్ నొక్కితే చాలు, బెలూన్స్లోని లైట్స్ ఆన్ అయి, వెలుగుల పండుగను ప్రారంభిస్తాయి. ఉపయోగించడం సులభం. ధర రూ. 397 మాత్రమే!ఐస్ క్రీమ్ బర్గర్కావలసినవి: బన్స్ – 2 లేదా 4, ఐస్క్రీమ్ – 4 లేదా 8 స్కూప్స్ (వీటిని సర్వ్ చేసుకునే ముందే ఫ్రిజ్లోంచి బయటికి తియ్యాలి, వెనీలా, చాక్లెట్, స్ట్రాబెర్రీ వంటి ఫ్లేవర్స్ ఎంచుకోవచ్చు), పీనట్ బటర్ – 2 లేదా 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి, బాదం, జీడిపప్పు – కొద్దికొద్దిగా (దోరగా నేతిలో వేయించి చిన్నచిన్నగా కట్ చేసుకోవాలి)తయారీ: ముందుగా బన్స్ని మధ్యలోకి సమాంతరంగా కట్ చేసి ఓవెన్ లో నేతితో బేక్ చేసుకోవాలి. అనంతరం లోపలవైపు పీనట్ బటర్ పూసుకుని, నేతిలో వేయించిన జీడిపప్పు, బాదం జల్లుకుని, రెండేసి బన్స్ ముక్కలు తీసుకుని, వాటి మధ్యలో ఐస్ క్రీమ్ స్కూప్స్ పెట్టుకోవాలి. నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఈ బర్గర్స్ చాలా టేస్టీగా ఉంటాయి.అరటిపువ్వు సమోసాకావలసినవి: అరటి పువ్వు– ఒక కప్పు (కచ్చా బిచ్చా కట్ చేసుకుని–మసాలా, ఉప్పు వేసి, ఆవిరిపై మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి), క్యారట్ తురుము – పావు కప్పు, కొబ్బరి తురుము–పావు కప్పు సోయా సాస్, టొమాటో సాస్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్ల చొప్పున, గోధుమ పిండి – 2 కప్పులు, మైదా పిండి – ఒక కప్పు మిరియాల పొడి – 1 టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – సరిపడాతయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని, అందులో క్యారట్ తురుము, కొబ్బరి తురుము, మిరియాల పొడి, అరటి పువ్వు ముక్కలు, సోయా సాస్, టొమాటో సాస్, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో బౌల్లో మైదా పిండి, గోధుమ పిండి, అర టేబుల్ స్పూన్ నూనె, కొద్దిగా ఉప్పు వేసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు కలుపుతూ చపాతీ ముద్దలా చేసుకోవాలి. అనంతరం ఆ ముద్దపైన తడిబట్ట కప్పి, అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని, ఆ ఉండల్ని చపాతీలా ఒత్తి, సమోసాలా చుట్టి అందులో అరటి పువ్వుల మిశ్రమాన్ని పెట్టి, ఊడిపోకుండా ఫోల్డ్ చేసుకోవాలి. వాటిని కాగిన నూనెలో వేయించి తీస్తే సరిపోతుంది. -
191 ఎట్ 52!
అతడి పేరు మహ్మద్ సలీం... మారుపేరు సునీల్శెట్టి... సొంత దుకాణం నుంచే చోరీలు ప్రారంభించాడు. 52 ఏళ్ల వయస్సున్న ఇతగాడు 34 ఏళ్ల నేర ప్రస్థానంలో 191 చోరీలు చేశాడు... ఇప్పటివరకు 26 సార్లు పోలీసులకు చిక్కి కటకటాల్లోకి వెళ్లాడు... ‘పీడీ’కి దొరక్కుండా జాగ్రత్తపడుతున్న ఇతగాడిని హైదరాబాద్లోని బండ్లగూడ పోలీసులు డిసెంబర్ 2న మరోసారి పట్టుకున్నారు. చోరీల ద్వారా వచ్చిన సొమ్మును ఇతగాడు ఉత్తరాదిలో జల్సాలతో పాటు హెలీటూరిజానికి వెచ్చిస్తుంటాడు. హైదరాబాద్లోని ఫతేదర్వాజా సమీపంలో ఉన్న కుమ్మరివాడికి చెందిన సలీం పూర్తి నిరక్షరాస్యుడు. బతుకుతెరువు కోసం తొలినాళ్లల్లో కిరోసిన్ లాంతర్లు తయారు చేసే కర్మాగారంలో పనివాడిగా చేరాడు. ఆపై తన తండ్రి నిర్వహిస్తున్న కిరాణా దుకాణంలోనే పని చేయడం మొదలెట్టాడు. ఇలా తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్న సలీంకు 16వ ఏట ఓ అమ్మాయితో పరిచయమైంది. అక్కడ నుంచి అతడి జీవితం మలుపులు తిరగడం మొదలైంది. ఈ పరిచయం కాస్తా కొన్నాళ్లకు ప్రేమకు దారి తీసింది. ఆమెతో కలిసి షికార్లు చేయడానికి అవసరమైన ఖర్చుల కోసం చోరుడిగా మారాడు. తొలుత తమ దుకాణంలోనే చిన్న చిన్న చోరీలు చేయడం మొదలెట్టాడు. కొన్నాళ్లు గుట్టుగానే సాగినా, చిరవకు విషయం బయటకు పొక్కేసరికి ఇల్లు వదిలి పారిపోవాల్సి వచ్చింది. దీంతో గత్యంతరం లేక చాదర్ఘాట్లోని ఓ హోటల్లో కార్మికుడిగా చేరాడు. ఈ పని చేస్తూనే అవకాశం చిక్కినప్పుడల్లా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న చిన్న గృహోపకరణాలు తస్కరించేవాడు. 1991లో ఇతడి 18వ ఏట ఇత్తడి వస్తువుల చోరీ కేసులో తొలిసారిగా చాదర్ఘాట్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. జైల్లో పరిచయమైన ‘సీనియర్ల’ వద్ద తాళాలు పగులకొట్టడంతో మెలకువలు నేర్చుకున్నాడు. ఈ చోరుడు ప్రధానంగా పాతబస్తీలోని ఓ వర్గానికి చెందిన వారి ఇళ్లనే టార్గెట్గా చేసుకునేవాడు. అందుకే గడిచిన మూడుసార్లూ బండ్లగూడ పోలీసుస్టేషన్లో నమోదైన కేసుల్లోనే అరెస్టు అయ్యాడు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు సాధారణంగా తెల్లవారుజాము 3 గంటల వరకు మెలకువగానే ఉంటారు. అందుకే ఇతగాడు తెల్లవారుజాము 4 గంటల తర్వాతే రంగంలోకి దిగుతాడు. అప్పటి వరకు నిద్రరాకుండా ఉండేందుకు తన స్మార్ట్ఫోన్లో లూడో, క్రికెట్ ఆడుతూ టైమ్పాస్ చేస్తాడు. చిన్న టార్చ్లైట్, కటింగ్ ప్లేయర్తో ఫీల్డ్లోకి వచ్చే ఇతగాడు ప్రధానంగా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన ఇళ్లనే ఎంచుకుంటాడు. తాళం వేసున్న ఇంటిని టార్గెట్ చేసినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్ పగులకొట్టడు. గోడ దూకి సజ్జ ద్వారా ఇంటి పైకి చేరతాడు. అక్కడ నుంచి ఇంట్లోకి చేరే మార్గం వెతుక్కుని ప్రవేశిస్తాడు. ఇతగాడు చోరీ చేసే సమయంలో పెట్రోలింగ్ వాహనాలు ఆ ప్రాంతానికి వచ్చినా ఇంటి తాళం యథాతథంగా ఉండటంతో వారు ఆ ఇంటిపై దృష్టిపెట్టరనే ఉద్దేశంతో ఇలా చేస్తుంటాడు. టార్గెట్ చేసిన ఇంటి లోపలకు వెళ్లాక అక్కడ దొరికే చెంచాలు తదితరాలతోనే అల్మారాలు పగులకొట్టి సొత్తు స్వాహా చేస్తాడు. ఇతగాడు 1998లో ముగ్గురు సంతానం ఉన్న ఓ వితంతువును వివాహం చేసుకున్నాడు. సునీల్శెట్టి ప్రస్తుతం ఏడుగురి పిల్లలకు తండ్రి. ఈ సొత్తు విక్రయించగా వచ్చిన సొమ్ముతో ముంబై, అజ్మీర్ సహా ఉత్తరాదిలో జల్సాలు చేస్తుంటాడు. సైట్ సీయింగ్తో పాటు హెలీకాఫ్టర్లో సంచరించే హెలీటూరిజం కోసం భారీగా ఖర్చు చేస్తాడు. సెక్స్వర్కర్ల వద్దకు వెళ్ళే అలవాటు ఉన్న సలీం ఓసారి రూ.12 లక్షల చోరీ సొత్తుతో ముంబైలోని ఓ మహిళ వద్దకు వెళ్లాడు. ఇతడు నిద్రపోతున్న సమయంలో ఆ సొత్తు కాజేసిన ఆమె అక్కడ నుంచి ఉడాయించింది. బాలీవుడ్ నటుడు సునీల్శెట్టి అంటే అమితంగా ఇష్టపడే సలీం తన పేరునూ అలానే మార్చుకున్నాడు. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఆ హీరో ఇంటి వద్దకు అనేకసార్లు వెళ్లినా కలవడం సాధ్యం కాలేదు. ఇప్పటి వరకు 191 నేరాలు చేసి 26 సార్లు అరెస్టు అయినా, శిక్షలు పూర్తయ్యే వరకు జైలు నుంచి బయటకు రాని నేపథ్యంలోనే ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగం అనేక సందర్భాల్లో సాధ్యం కాలేదు. పోలీసులకు చిక్కిన ప్రతిసారీ ఐదారు చోరీలు అంగీకరిస్తున్నా, ఇన్నేళ్లల్లో కేవలం రెండుసార్లే ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగం సాధ్యమైంది. -
అంతరించింది అనుకుంటే.. అంతలోనే కనిపించింది
అడవుల్లో ఇంకా ఎన్నో రహస్యాలు, ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయని మరోసారి నిరూపించింది ఒక చిన్న ప్రాణి. గత మూడు దశాబ్దాలుగా కనుమరుగైందనుకున్న ‘మౌస్ డీర్’, మళ్లీ అడవిలో నడుస్తూ కనిపించింది. ఇటీవలి రోజుల్లో వియత్నాం అడవుల్లో శాస్త్రవేత్తలు దీనిని కెమెరాల్లో గుర్తించారు. ముప్పై ఏళ్లుగా దాని జాడ కనిపించకపోవడంతో, శాస్త్రీయ రికార్డుల్లో ఏ ఆధారమూ లేకపోవడంతో, ఇది పూర్తిగా అంతరించిపోయిందని అందరూ నమ్మేశారు. కాని ప్రకృతి ఎప్పుడూ తన ప్రణాళికలను చివరి నిమిషంలోనే బయటపెడుతుంది. అన్నట్లు, అలా ఒక్కసారిగా సర్ప్రైజ్లా ప్రత్యక్షమైంది ఈ చిన్న జీవి. ప్రపంచంలోనే అతి చిన్న కాళ్లున్న, గొర్రెల కుటుంబానికి చెందిన ఈ మౌస్ డీర్ బరువు పది కిలోలు. అడవుల లోతుల్లో, వెలుగుకు దూరంగా జీవించే స్వభావం వల్ల దీని ఉనికి తెలుసుకోవడం అంత సులువు కాదు. అందుకే ఇన్ని ఏళ్ల తర్వాత మళ్లీ కనిపించడమే ఒక అరుదైన అద్భుతం. -
స్టార్ స్టయిల్..!
ప్రతిరోజూ ఫ్యాషన్లో ఒక చిన్న అడ్వెంచర్! అదితిరావు స్టేట్మెంట్ యిల్! ఇందుకోసం, తను ఫాలో *అయ్యే చిన్న చిన్న స్టయిల్ హ్యాక్స్, స్పార్కింగ్ టిప్స్ ఏంటో ఇక్కడ చూడండి!కొత్త ఆభరణాలు, కొత్త లుక్స్ ఇవన్నీ ప్రయత్నించడానికి నేను ఎప్పుడూ వెనుకాడను. ఫ్యాషన్లో కొత్తదనం భయాన్ని కాకుండా, ఉత్సాహాన్ని ఇస్తుంది. నిజమైన మెరుపు ఆభరణాల్లో కాదు, వాటిని ధరించే మన వైబ్లోనే ఉంటుంది.– అదితిరావు హైదరీజుంకాల మ్యాజిక్!చెవులకు వేసుకునే ఆభరణాల్లో ఎన్నో రకాలున్నా, సంప్రదాయ అందాన్ని క్లాసీగా చూపించడంలో ఆక్సిడైజ్డ్ జుంకాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా పెద్ద డోమ్ ఆకారంలో మెరిసే ఈ జుంకాలు, మొత్తం లుక్ను మరింత అందంగా మార్చేస్తాయి. ఎక్కువగా ఇలాంటి జుంకాలు రంగురంగుల దారాలు, మిర్రర్ వర్క్తో ఉండే కుర్తాలు, డీప్ జ్యూల్ టోన్స్లో ఉన్న అనార్కలీలకు అద్భుతంగా సరిపోతాయి. కళ్లకు సాఫ్ట్ కాజల్, నేచురల్ మేకప్, చిన్న బొట్టు ఇవన్నీ కలిస్తే ఆభరణాల అందం మరింత మెరిసిపోతుంది. హెయిర్ స్టయిల్ సింపుల్గా వదిలి, మెడను బోసిగా ఉంచడం చాలా ముఖ్యం, అప్పుడే ఈ జుంకాలు హైలైట్ అవుతాయి. చేతులకు దుస్తుల రంగులకు తగ్గట్టు బీడెడ్ బ్రేస్లెట్లు లేదా చిన్న ట్రెడిషనల్ గాజులు వేసుకుంటే మొత్తం స్టయిల్కు కలర్ఫుల్ టచ్ వస్తుంది. ఫెస్టివల్స్, ఫ్యామిలీ ఫంక్ష¯Œ ్స, కల్చరల్ ఈవెంట్స్ ఇలా ఎక్కడైనా ఇలాంటి జుంకాలు వేసుకుంటే, మీరు ప్రత్యేకంగా కనిపించడం ఖాయం!∙దీపిక కొండి -
నోటిఫికేషన్లతో కెరీర్ డేమేజ్
అర్ధరాత్రి సరిగ్గా 2:17 గంటలకు అర్చనకు టీమ్స్ నోటిఫికేషన్ వచ్చింది. కళ్లు తెరవాలనిపించలేదు. కానీ ఏం నోటిఫికేషన్ వచ్చిందో వెంటనే చెక్ చేయమని మెదడు అరుస్తోంది. మెదడే నెగ్గింది. అర్చన స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసింది. ‘Tomorrow's Deck Updated’’ అని నోటిఫికేషన్ కనిపించింది. నిద్ర ఎగిరిపోయింది. ఇది కేవలం అర్చన కథ కాదు. ప్రతి నగరంలో, ప్రతి కంపెనీలో వేలాది మంది ప్రొఫెషనల్స్ ఇలా ఫోన్ నోటిఫికేషన్ శబ్దాలకు నిద్రను కోల్పోతున్నారు. చూడ్డానికి ఇది చిన్న డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. కానీ దాని ప్రభావం వృత్తి, వ్యక్తిత్వం, మానసిక ప్రశాంతత... ఇలా అన్నిటిపై పడుతుంది. ఫోన్ నోటిఫికేషన్లు మన జీవితం మీద చేస్తున్న దాడులు కేవలం శబ్దాల దాడులు కావు. అవి మైక్రో–బ్రెయిన్ హిట్స్. ప్రతి పింగ్ ఒక చిన్న ఒత్తిడి. ప్రతి చిన్న ఒత్తిడి ఒక పెద్ద డిస్టర్బెన్స్. ప్రతి డిస్టర్బెన్స్ చివరకు బర్న్ఔట్కు దారితీస్తుంది. సైన చెప్పే అసలు నిజం...మన మెదడు ఏ పని మీదైనా ఫోకస్ పెట్టగలిగే సమయం సుమారు 8 నుంచి 12 నిమిషాలు మాత్రమే. ఆ సమయంలో దానికి విఘాతం కలిగితే తిరిగి ఫోకస్ రావడానికి 23 నిమిషాలు పడుతుందని బ్రెయిన్ సైంటిస్టులు చెప్తున్నారు. ఉద్యోగులకు రోజుకు వచ్చే నోటిఫికేషన్ల సంఖ్య: వాట్సప్–120, ఈమెయిల్ అలర్ట్స్–40–100, టీమ్స్ 85–150, కేలండర్ పింగ్స్ 10–20. అంటే రోజుకు సగటున 250–300 విఘాతాలు. అంటే మీ ఎనిమిది పని గంటల సమయంలో ఐదు గంటలు పూర్తిగా ఫోకస్ లేకుండా వృథా అవుతున్నాయి. అందుకే చాలామంది ప్రొఫెషనల్స్ రోజంతా బిజీగా ఉన్నప్పటికీ రోజు చివర్లో ‘ఏం చేశాను?’ అనిపిస్తుంది. ఇది మీ తప్పు కాదు. ఇది మీ మెదడుపై జరిగిన దాడి.అలసట కాదు, బ్రెయిన్ డామేజ్ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019లో బర్న్ఔట్ను occupational phenomenon’ జాబితాలో పెట్టింది. వర్క్ ప్లేస్ ఒత్తిడి వల్ల మెదడు ఎగ్జాస్ట్ అవుతోందని అర్థం. బర్న్ఔట్కు మూడు ప్రాథమిక లక్షణాలున్నాయి. ∙భావోద్వేగ అలసట. అంటే, ఉదయం లేచిన వెంటనే శక్తి లేకపోవడం. ‘ఇవాళ కూడా ఇదేనా...’ అనిపించడం. ∙పనిపట్ల విసుగు. ఎంతో ఇష్టంగా చేసిన పని కూడా ఇప్పుడు చిరాకు తెప్పించడం. ∙పనితీరు పడిపోవడం, సృజనాత్మకత క్షీణించడం. చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడంలో కూడా గందరగోళం.షాకింగ్ విషయం ఏమిటంటే నోటిఫికేషన్లు ఈ మూడు లక్షణాలను డైరెక్ట్గా పెంచుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. స్టాన్ఫర్డ్ న్యూరోసైన్స్ ల్యాబ్స్ స్టడీ ప్రకారం నోటిఫికేషన్ల వల్ల పనితీరు 17శాతం పడిపోతుంది. ‘ఒక్క నిమిషం...’తో కెరీర్ డ్యామేజ్నిరంతర నోటిఫికేషన్లతో ఫోకస్ కోల్పోవడం వల్ల జరిగే నష్టం మూడు దిశల్లో సాగుతుంది.1. నోటిఫికేషన్లు మీ డీప్ జోన్ను విచ్ఛిన్నం చేసి మిమ్మల్ని ఒక రియాక్షన్–మోడ్ ఉద్యోగిగా మార్చేస్తాయి. దీనివల్ల మీరు క్రియేటివ్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ లాంటి డీప్ వర్క్స్ సమర్థంగా చేయలేరు. దాంతో గుర్తింపు, పదోన్నతి, నాయకత్వ స్థానాలకు దూరమవుతారు. 2. ‘ఏం జరిగినా వెంటనే స్పందించాలి’ అనుకోవడం విధేయత కాదు, బర్న్ అవుట్ ప్రారంభదశ. దీనివల్ల భావోద్వేగ క్షీణత జరుగుతుంది. 3. మీరు రోజంతా బిజీగా ఉన్నా ప్రభావం శూన్యం కావడం మీ కెరీర్ గ్రోత్కు అత్యంత ప్రమాదకరం. మేనేజర్లు, హెచ్ఆర్, ఉన్నతాధికారులు దీన్ని గమనిస్తారు.ఇది కేవలం మీ తప్పా?ఇది కేవలం మీ తప్పు కానే కాదు, ఈనాటి వర్క్ ప్లేస్ సమస్య. ఈనాటి ఆఫీసుల్లో మీటింగ్స్ ఎక్కువ, మెసేజింగ్ యాప్స్ ఎక్కువ. డెడ్ లైన్లు నెత్తిమీద కూర్చుంటాయి. అందరూ ‘అర్జెన్సీ అడిక్షన్’లో చిక్కుకు పోయారు.పరిష్కారాలు... 1. రోజులో కనీసం రెండు గంటలు ‘నో నోటిఫికేషన్ జోన్’. ఆ సమయాన్ని మీ డీప్ వర్క్కు ఉపయోగించండి. 2. నోటిఫికేషన్ డైట్ పాటించండి. అంటే, వాట్సప్ గ్రూప్లను మ్యూట్ చేయండి. సోషల్ మీడియాను ఆఫ్ చేయండి. ఈమెయిల్స్ రోజుకు మూడుసార్లు మాత్రమే చెక్ చేయండి. 3. ప్రతి 90 నిమిషాల పని తర్వాత ఐదు నిమిషాల బ్రేక్ తీసుకోండి. ఆ సమయంలో కొద్దిగా నడవండి. లేదా నీళ్లు తాగండి. ఇది మీ కాగ్నిటివ్ ఎనర్జీని తిరిగి పెంచుతుంది. 4. మల్టీ టాస్కింగ్ అనేది మెదడుకు విషం లాంటిది. సింగిల్ టాస్క్ ఆక్సిజన్ లాంటిది. అందుకే ఒకసారి ఒకేపని అనే నిబంధన పెట్టుకుని పాటించండి. -సైకాలజిస్ట్ విశేష్ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com -
ఆచి తూచి 'తగ్గొచ్చు'
ఆహారమే ఔషధం అన్నారు పెద్దలు. కాని, మనం ఆ ఆహారాన్ని అపసవ్యంగా తింటూ అనారోగ్యాల పాలవుతున్నాం. కారణాలేమైనప్పటికీ, ఆహారం తీసుకోవటంలో నియంత్రణ కోల్పోవటమే అసలు సమస్య. మనం ఊబకాయులుగా, రోగులుగా మారటానికి మూల కారణం మనం తింటున్న పదార్థాల మోతాదులే. పరిమాణం, నాణ్యత, సమతుల్యత గాడి తప్పింది. అవసరానికి మించి తిన్న ‘అసమతుల్య ఆహారం’ శరీరానికి శక్తిని ఇచ్చే క్రమంలో దేహాన్ని అతిగా బరువెక్కించి రోగాల పుట్టగా మార్చుతోంది. ఏది వీలైతే అది, ఎంత వీలైతే అంత తింటున్నాం. ఏయే పోషకాలు ఎంత మోతాదులో నాకు అవసరం ఉంది? ఎంత తింటున్నాను? అనే అవగాహన లోపించటం లేదా సమాచారం తెలిసినా విస్మరించడమే అధిక బరువుకు, ఆ పైన ఊబకాయానికి రాచబాటలు వేస్తోంది. ముఖ్యంగా పొట్ట చుట్టుకొలత పెంచుతోంది. చర్మం కింద శరీరం అంతటా పేరుకునే కొవ్వు కన్నా పొట్ట చుట్టూ పేరుకునే కొవ్వు అత్యంత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఇన్సులిన్ నిరోధకత ఫలితంగా కొవ్వు నిల్వలు పేరుకుంటాయి. ఫలితంగా బీపీ, షుగర్, ఫ్యాటీ లివర్, గుండెజబ్బు వంటి జీవనశైలి జబ్బులన్నీ వస్తున్నాయి. మనల్ని రోగాల పుట్టగా మార్చుతున్నది మనం తిన్న ఆహారమే అయినప్పుడు... ఆ ఆహారాన్నే తెలివిగా శక్తియుతమైన ఆయుధంగా వాడి రోగాలను, వాటికి మూలమైన ఊబకాయాన్ని ఎందుకు తగ్గించుకోకూడదు? అందుకు ఉన్న మార్గాలేమిటి?.. చర్చిద్దాం..ఆహారంలో ఎక్కువ పరిమాణంలో అవసరమైన పోషకాలను స్థూల పోషకాలని, అతి తక్కువ మోతాదులో అవసరమైన వాటిని సూక్ష్మ పోషకాలని అంటాం. స్థూల పోషకాలైనా, సూక్ష్మ పోషకాలైనా ఆ వ్యక్తి వయసు, ఎత్తు, శారీరక శ్రమ అవసరాలకు తగిన మోతాదులో ఉండాలి. పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు తదితర పోషకాలను అవసరమైనంత, సమతులమైన పాళ్లలో తినాలి. కాని, మనలో చాలామంది ఈ క్రమశిక్షణ పాటించటం లేదు. ఎంత తింటే ఆరోగ్యకరం?ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ ‘మై ప్లేట్ ఫర్ ది డే’ 2024 సిఫారసుల ప్రకారం.. సగటు భారతీయ వ్యక్తి రోజులో తీసుకునే కిలోకేలరీల శక్తిలో వరి బియ్యం, గోధుమ పిండి, చిరుధాన్యాలన్నీ కలిపి 45%కు పరిమితం చేయాలి. పప్పుధాన్యాలు, గుడ్లు, మాంసాహారం 14%–15% వరకు ఉండాలి. కొవ్వు 30% కంటే తక్కువగా లేదా సమానంగా ఉండాలి. గింజలు, నూనె గింజలు, పాలు, పాల ఉత్పత్తులు 8%–10% వరకు తీసుకోవాలి.ఎంత తింటున్నాం?కేంద్ర ప్రభుత్వ ‘గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్సీఈఎస్)’ ప్రకారం 2023–24లో పట్టణ వాసులు సగటున తలసరి ఆహార వినియోగం రోజుకు 2,233 కిలో కేలరీల మేరకు ఉంది. 338 గ్రాముల పిండి పదార్థాలు (1,351 కిలో కేలరీలు. 61%), 63 గ్రాముల ప్రొటీన్లు (254 కిలో కేలరీల. 11%), 70 గ్రాముల కొవ్వు పదార్థాలు (628 కిలో కేలరీలు. 28%) తీసుకుంటున్నారు. దేశ జనాభాలో ఎక్కువ మంది సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆహారాలను (చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, బీన్స్, గింజలు, తాజా కూరగాయలు, పండ్లు) చాలా తక్కువగా తింటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ‘ఆహార జబ్బు’ల భారం 56%భారతీయులు మోస్తున్న జబ్బుల ఆర్థిక భారంలో 56.4% మేరకు అపసవ్యమైన, అసమతుల్యతతో కూడిన ఆహారం తీసుకోవటమేనని జాతీయ పోషకాహార సంస్థ (ఐసీఎంఆర్–ఎన్ఐఎన్) 2024 నాటి డైటరీ గైడ్లైన్స్లో స్పష్టం చేసింది. అసమతుల్య ఆహారం ఫలితంగా జీవక్రియలు లయ తప్పి మెటబాలిక్ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. అధిక రక్తపోటు, రక్తంలో అధిక చక్కెర, అధిక ట్రైగ్లిజరైడ్లు, తక్కువ హెచ్డీఎల్ (మంచి) కొలెస్ట్రాల్ స్థాయి, పెరిగిన నడుము చుట్టుకొలత (ఉదర ఊబకాయం).. ఈ ఐదింటిలో ఏ మూడు ఉన్నా వారికి మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్లే.సమతులాహారం, శారీరక శ్రమ ద్వారా గుండె జబ్బుల్ని, రక్తపోటు సమస్యలను తగ్గించుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్ను 80% వరకు రాకుండా జాగ్రత్తపడొచ్చు. అకాల మరణాలను చాలా వరకు నివారించుకోవచ్చని ఎన్ఐఎన్ చెబుతోంది.ఎవరి లెక్క వారికే! ఒక వ్యక్తికి పిండి పదార్థాలు, ప్రోటీన్, కొవ్వు పదార్థాలు ఎన్ని గ్రాములు/కేలరీలు అవసరం? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటుంది. వ్యక్తిని బట్టి మారిపోతుంది. మీ వ్యక్తిగత పోషక అవసరాలు మీ బరువు, మీ రోజువారీ శారీరక శ్రమ స్థాయి, మీకున్న ఆరోగ్య సమస్యలు, మీ ఆరోగ్య లక్ష్యాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇంకో ముఖ్యాంశం ఏమిటంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తున్నారు? అనే దాన్ని బట్టి కూడా పోషకాల కూర్పు, శాతం ఆధారపడి ఉంటుంది. ఆహార పద్ధతులు అనేకం ఉన్నప్పటికీ ప్రధానమైనవి రెండు రకాలు. మొదటిది: హై కార్బ్ డైట్. అంటే.. ప్రధాన శక్తి వనరుగా పిండి పదార్థాలను తీసుకోవటం. సాధారణంగా అందరూ అనుసరించే ఆహార పద్ధతి ఇదే. రెండో పద్ధతి: లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్.సి.హెచ్.ఎఫ్) డైట్. అంటే.. కొవ్వు పదార్థాలను ప్రధాన శక్తి వనరుగా తీసుకోవటం. వీటిలో ఏ ఆహార పద్ధతిని అనుసరించినా, ముఖ్యంగా మీరు ఆశించిన ఆరోగ్య లక్ష్యాలు సాధించాలంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తారు? ఎంత తినాలి? ఏది తినాలి? అనే విషయాపై నిర్ణయం తీసుకొని, ఆచరించటం ప్రారంభించాలి. ఆచి ‘తూచి’ తినాలి. ఆహార క్రమశిక్షణతో పాటు శారీరక వ్యాయామ క్రమశిక్షణను కూడా జోడించి కొనసాగించాలి. అప్పుడే మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి.మీ బీఎంఐ, బీఎంఆర్ ఎంత?శరీర బరువును తగ్గించుకోవాలనుకునే వారు మొదట చెయ్యాల్సిన పని వారి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), బాడీ మెటబాలిక్ రేట్ (బీఎంఆర్) ఎంతో తెలుసుకోవాలి. ఇటువంటి ముఖ్యమైన డేటాను తెలుసుకోవటానికిప్పుడు ‘బాడీ ఫ్యాట్ స్కేల్’ అనే డిజిటల్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆసుపత్రుల్లో ఈ పరికరాలు పెడుతున్నారు. బరువు తూచే డిజిటల్ పరికరంలోనే బీఎంఐ, బీఎంఆర్, పొట్టచుట్టూ కొవ్వు, శరీరం మొత్తంలో కొవ్వు ఎంత ఉన్నాయి వంటి చాలా వివరాలను తెలుసుకోవచ్చు. బీఎంఐ 23 కన్నా తక్కువగా ఉంటే ఆరోగ్యకరం. 30లోపు ఉంటే అధిక బరువు, 35కి మించితే ఊబకాయంగా భావిస్తారు. ఎంత అధిక బరువు ఉంటే బీఎంఆర్ అంత ఎక్కువగా ఉంటుంది. ఈ కొలమానాలను బట్టి బరువు తగ్గాలా? నార్మల్ రేంజ్లోకి రావాలంటే ఎంత తగ్గాలి? అనేది బరువుతో పాటు బీఎంఆర్ను కూడా పరిగణనలోకి తీసుకొని నిర్ణయించుకోవాలి. వ్యక్తి శరీరంలో దైనందిన జీవక్రియలకు ఎన్ని కిలో కేలరీల శక్తి అవసరమవుతోందో బీఎంఆర్ తెలియజేస్తుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే బీఎంఆర్ చూపే కేలరీల కన్నా రోజు మొత్తంలో తక్కువ కేలరీలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ఈ విధంగా కేలరీల కొరత సృష్టించినప్పుడు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను కరిగించి వినియోగించుకోవటానికి శరీరం అలవాటుపడుతుంది. ఒకవేళ తగినంత బరువు లేని వారైతే బీఎంఆర్ కన్నా ఎక్కువ కేలరీల ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గాలి, పొట్ట తగ్గాలి అనుకునే వ్యక్తి పని బీఎంఆర్ కన్నా తక్కువగా ఎన్ని కేలరీలు తినాలని నిర్ణయించుకున్న తర్వాత ఏ ఆహార పద్ధతిని అనుసరించాలన్న ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. బరువు పెరగడానికి దారితీసిన పిండిపదార్థాల కేలరీలనే ఎక్కువగా తీసుకునే ఆహార పద్ధతిలోనూ కొన్ని కేలరీలు తగ్గించి తింటే క్రమంగా బరువు తగ్గుతుంది. పిండి పదార్థాల శాతం గతం కన్నా తగ్గించి, ప్రొటీన్లను పెంచుకోవాలి. తగ్గాలి సరే.. అయితే, ఏ పిండి పదార్థాలైతే ఒంట్లో కొవ్వు ఎక్కువగా పెరగటానికి కారణమైనాయో వాటినే తగ్గించి తింటూ, వ్యాయామం చేస్తే ఫలితాలు వస్తాయి. అయితే, కొద్ది నెలలు బరువు తగ్గినా వ్యాయామం వల్ల ఆకలి ఎక్కువై, ఎక్కువ తినాల్సి వచ్చి, మళ్లీ బరువు పెరిగే ముప్పు ఉంటుంది. ఏ ఆహార పద్ధతిలో అధిక కొవ్వు నిల్వల సమస్య వచ్చిందో ఆ ఆహార పద్ధతిలోనే కొన్ని మార్పులు చేసినంత మాత్రాన గణనీయమైన ఫలితాలు సాధించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఊబకాయానికి కారణమైన బరువును, ఆ బరువుకు కారణమైన కొవ్వు నిల్వలను గణనీయమైన స్థాయిలో కరిగించుకోవాలంటే ఇన్సులిన్ నిరోధకతను తగ్గించుకునే వేరే ఆహార పద్ధతిని అనుసరించటం మేలు. లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహార పద్ధతిని అనుసరించటం ద్వారా ఆరోగ్య లక్ష్యాలను సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే, మీ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను తినటమే కాకుండా.. పిండి పదార్థాలను బాగా తక్కువగా, కొవ్వు పదార్థాలను ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా శరీర బరువు నీరసం లేకుండా, ఆరోగ్యదాయకంగా తగ్గించుకోవచ్చని ఎల్సీహెచ్ఎఫ్ నిపుణులు, సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ పీ వీ సత్యనారాయణ అంటున్నారు. ఎల్సీహెచ్ఎఫ్ డైట్తో పాటు ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ చెయ్యటంతో పాటు వ్యాయామం జోడిస్తే మరింత ఉత్తమ ఫలితాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఎల్సీహెచ్ఎఫ్ వైద్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ పద్ధతిని ఆచరించటం ద్వారా సత్ఫలితాలు సాధించటంతో పాటు కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చని ఆయన సూచిస్తున్నారు. ఇన్సులిన్ నిరోధకతే కీలకంరక్తంలో చక్కెర స్థాయిని తెలిపే హెచ్బీఏ1సి పరీక్షతో పాటు.. ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలోకి విడుదలయ్యే గ్లూకోజ్ను కణజాలానికి అందించడంలో కీలకపాత్ర నిర్వహించే ఇన్సులిన్ హార్మోన్ ఏ స్థాయిలో విడుదలవుతోంది? ఎంతసేపటికి తిరిగి సాధారణ స్థితికి వస్తోంది? అనే గణాంకాలను బట్టి ఇన్సులిన్ నిరోధకత ఎంత ఉన్నదనే విషయం నిర్ధారిస్తారు. దీన్ని నిర్ధారించడానికి ‘హోమా ఐఆర్’ అనే ఓరల్ గ్లూకోజ్ టెస్ట్ చేస్తారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తక్కువగా ఉండే వారిలో కూడా ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హెచ్బీఏ1సి పరీక్ష ద్వారా షుగర్ వ్యాధి నిర్ధారణ అయ్యేదానికి 15 సంవత్సరాలు ముందే హోమా–ఐఆర్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇన్సులిన్ నిరోధకతను తొలి దశలోనే గుర్తించి, ఆహారంలో తగిన మార్పు చేసుకుంటే షుగర్, తదనంతర గొలుసు వ్యాధుల ముప్పును తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘హోమా–ఐఆర్’ టెస్ట్లో ఇన్సులిన్ నిరోధకత (ఇన్సులిన్ రెసిస్టెన్స్) ఎంత ఉంది? ఆ వ్యక్తికి ఇతర ఆరోగ్య సమస్యల స్థితిగతులు ఎలా ఉన్నాయి? అనే విషయాలను పరిగణనలోకి తీసుకొని లోకార్బ్ హెల్దీ అండ్ హై ఫ్యాట్ డైట్లో పోషకాల కూర్పును, శాతాన్ని, వ్యాయామాన్ని డాక్టర్ సూచిస్తారు. ఇది ఏ ఇద్దరికీ ఒకేలా ఉండదు. ఎవరి ప్రత్యేక పరిస్థితులకు తగిన విధంగా వారికి ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్ సూచిస్తారు. కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువగా, పిండి పదార్థాలు అతి తక్కువగా తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు తమ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను మాత్రమే తీసుకోవాలన్న నియమం ఈ ఆహార పద్ధతిలో కూడా వర్తిస్తుంది. అంతకన్నా ఎక్కువ కేలరీలు తింటే బరువు పెరిగే ముప్పు ఏ ఆహార పద్ధతిలోనైనా ఉంటుంది. అందుకే కదా మితాహారం ముద్దు అని మన పెద్దలు చెప్పేది! లోకార్బ్ డైట్ ప్లానింగ్ ఎలా? ఉదాహరణకు 177 సెం.మీ. ఎత్తు, 59 ఏళ్ల వయసు ఉన్న పురుషుడు 82 కిలోల బరువు ఉన్నాడనుకుందాం. బీఎంఐ 28.5. బీఎంఆర్ 1678. మెటబాలిక్ ఏజ్ 62. పొట్ట చుట్టూ కొవ్వు 6 కన్నా తక్కువ ఉండాలి. కానీ, 11 ఉంది. బీపీ, షుగర్ లేదు. ఫ్యాటీ లివర్ గ్రేడ్1 ఉంది. ఇన్సులిన్ నిరోధకత ఉంది. జాగ్రత్త పడకపోతే కొద్ది సంవత్సరాల్లో షుగర్ బారినపడే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ఇదీ అతనికి ఇచ్చిన ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్.. రోజులో 1500 కిలోకేలరీలకన్నా తక్కువ ఆహారం తినాలి. నికర పిండి పదార్థాలు 20 గ్రాములకు మించకూడదు. 60 గ్రాములు ప్రొటీన్లు, 100–150 గ్రాముల కొవ్వు పదార్థాలను తీసుకోవాలి. క్రమశిక్షణతో ఈ ఆహార నియమాలతో పాటు వ్యాయామం చేస్తూ ఉంటే 6 నెలల్లోనే బీఎంఐ 23.5కు, పొట్ట 7కు తగ్గింది. రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్వంటకం ఏదైనా, అందులో ఉపయోగించే ప్రతి పదార్ధానికి సంబంధించిన స్థూల పోషక విలువలను విధిగా లెక్కించాలి. పొద్దున్నే ఆ రోజు తినాలనుకునే పదార్థాలతో పట్టిక తయారు చేసుకోవాలి. ఏవి తిన్నా రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్ పరిమితుల మేరకే తినాలి. వాటిలో నికర పిండి పదార్థం (పిండి పదార్థంలో నుంచి పీచును తీసేస్తే మిగిలేది నికర పిండి పదార్థం) ఎంత? ప్రొటీన్లెన్ని? కొవ్వు పదార్థం ఎంత? అని సరిచూసుకొని, తూకం వేసుకొని, ముందే పట్టిక రాసుకోవటం అతి ముఖ్యమైన విషయం. ఆ తర్వాతే ఏది తినాలో, ఎంత తినాలో నిర్ణయించుకొని అంతే తినాలి. నెయ్యి లేదా వెన్న, కాఫీ (లేదా టీ) డికాక్షన్/ వేడి నీటితో కలిపి, గిలకొట్టి తయారు చేసుకొని తీసుకునే ‘బుల్లెట్ కాఫీ’ ఈ ఆహార పద్ధతిలో చాలా కీలకమైన ఉదయకాలపు శక్తి వనరు. 50 గ్రా. నెయ్యి/వెన్న, 25 గ్రా. పాల మీగడ, 5 గ్రా. గానుగ కొబ్బరి నూనె, 100 ఎం.ఎల్. కాఫీ డికాక్షన్ కలిపి దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకునే ‘బుల్లెట్ కాఫీ’లో 1.3 గ్రా. నికర పిండి పదార్థాలు, 1.4 గ్రా. ప్రొటీన్, 45.9 గ్రా. కొవ్వు పదార్థాలు, 418 కిలోకేలరీల శక్తి ఉంటాయి. వ్యక్తి అవసరాలను బట్టి నెయ్యి/వెన్న, పాల మీగడల మోతాదులో హెచ్చు తగ్గులు చేసుకోవచ్చు. రోజంతా తీసుకునే కేలరీల్లో దాదాపు మూడింట ఒకవంతు బుల్లెట్ కాఫీ ద్వారానే సమకూర్చుకోవచ్చు. దాహాన్ని బట్టి తాగునీటిని పుష్కలంగా తాగాలి. కూరగాయలు, ఆకుకూరలు, గింజలు, పిక్కలను విధిగా, తగు మాత్రంగా రోజువారీ మెనూలో చేర్చుకుంటే సూక్ష్మపోషకాల లోపం రాకుండా ఉంటుంది. వంటకాలు వ్యక్తిగత ఆహారపు అలవాట్లు, ఆసక్తులు, లభ్యత, కొనుగోలు శక్తిని బట్టి ఏ రోజుకారోజు వారానికి ఒక షెడ్యూల్ పెట్టుకొని పునరావృతం చేసుకోవచ్చు. ఇతరత్రా ఆహార పదార్థాలు రోజుకోలా మారుతుంటాయి. బుల్లెట్ కాఫీ మాత్రం రోజూ తీసుకోవాలి. మాంసాహారులకు ఈ ఆహార పద్ధతి కొంత సులువు. గుడ్డు కూడా ముట్టని శాకాహారులైతే చాలా రకాల ప్రత్యామ్నాయ ఆహారాలు సమకూర్చుకొని తినాల్సి వస్తుంది. వీగన్లకు ఇంకా కొంచెం కష్టం. ఫుడ్ సప్లిమెంట్లు వాడుకోవాల్సి ఉంటుంది. అతిగా తిన్న పిండి పదార్థాల వల్ల శరీరంలో పెరిగిపోయిన కొవ్వు నిల్వలను కొవ్వు ప్రధాన ఆహారంతో కరిగించాలంటే తెలివైన ప్రణాళిక, రాజీలేని క్రమశిక్షణతో కూడిన ఆచరణే వజ్రాయుధాలు!హెచ్చరిక: ఈ కథనం ఉద్దేశం ఎల్సీహెచ్ఎఫ్ డైట్ గురించి కొంతమేరకు అవగాహన కలిగించటానికి మాత్రమే. మరింత లోతైన అవగాహన కోసం ‘లో కార్బ్ స్కూల్’ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూడండి. ఎల్సీహెచ్ఎఫ్ డైట్పై అవగాహన గల వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ ఆహార పద్ధతిని అనుసరించబూనుకోవటం ఆశించిన ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చకపోగా అనర్థాలకు దారితీసే అవకాశాలు మెండుగా ఉంటాయి. జాగ్రత్త. లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ ‘ఆరోగ్యకరమైన’ ట్రెండ్రోజూ మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ఉండేది పిండి పదార్థాలే. వీటివల్ల మనం రోగాల బారిన పడుతున్నాం. కడుపులోకి వెళ్లిన పిండి పదార్థాన్ని పచనం చేసి, గ్లూకోజ్గా మార్చి, శరీరానికి శక్తినిచ్చే పని ఇన్సులిన్ అనే హార్మోన్ ద్వారా జరుగుతుంది. అవసరానికి మించి పిండి పదార్థాలు, హానికరమైన కొవ్వు పదార్థాలను మనం రోజూ తినడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వాన్ని కోల్పోతుంది. అందువల్ల శరీరంలో అధికంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ ఫలితం లేని స్థితికి చేరినప్పుడు ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ (ఇన్సులిన్ నిరోధకత) ఏర్పడుతోంది. అధిక బరువు దగ్గరి నుంచి క్యాన్సర్ వరకు 64 రకాల జబ్బులకు ఇదే కారణమవుతోందన్న అవగాహన ఇటీవల కాలంలో పెరిగింది. అందువల్ల పిండిపదార్థాలను తక్కువగా తీసుకుంటూ.. మాంసకృత్తులు, ఆరోగ్యదాయకమైన కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరవు అంటున్నారు వైద్య నిపుణులు. దీన్నే ‘లో కార్బ్ హెల్దీ ఫ్యాట్’ – ఎల్సీహెచ్ఎఫ్ ఆహార పద్ధతిగా చెబుతున్నారు.పిండి పదార్థాలను ఎక్కువగా తింటే.. మనం తినే ఆహారం జీర్ణమై గ్లూకోజ్గా మారి, శరీర భాగాలు నిర్విరామంగా పనిచేయటానికి శక్తిగా ఉపయోగపడుతుంది. ఆహారంలో పిండి పదార్థాలు పెరిగితే రక్తంలో చక్కెర శాతాలూ పెరుగుతాయి. శరీరం ఈ చక్కెరలను కరిగించడానికి, శక్తి ఉత్పత్తి చేయటానికి కనీసం 2 నుంచి 3 గంటల సమయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియను నిర్వహించే ఇన్సులిన్ చాలినంత లేకపోయినా, సరిగ్గా పనిచేయకపోయినా రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉండదు.⇒ ఆహారం ద్వారా అందే గ్లూకోజ్లో అవసరమైనప్పుడు వెంటనే వాడుకోవటానికి వీలుగా కొంత మేరకు గ్లైకోజెన్ గా మారుతుంది. మిగిలిపోయిన అదనపు శక్తిని కొవ్వుగా మార్చి నిల్వ చేసుకునే సామర్థ్యం శరీరానికి ఉంది.⇒ గ్లైకోజెన్ .. బ్యాంకు ఖాతాలో ఎప్పుడైనా వాడుకోవటానికి సిద్ధంగా ఉండే సొమ్ములాంటిది. కొవ్వుగా మారిన గ్లూకోజ్ను.. ఫిక్స్డ్ డిపాజిట్గా చెప్పుకోవచ్చు.⇒ గ్లూకోజ్ ఒకసారి కొవ్వుగా మారితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప, తిరిగి దానికదే గ్లూకోజ్గా మారదు. ఈ కొవ్వును జీవన క్రియ ద్వారానే కరిగించి శక్తిగా మార్చగలం. ⇒ పిండి పదార్థాలు తక్కువగా, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహారం తీసుకుంటే శరీరంలో అధిక కొవ్వును సులువుగా కరిగించవచ్చు. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తింటే..ఊబకాయులు ఆహారం పరిమితం చేసినా, ఉపవాసం ఉన్నా కూడా బరువు తగ్గటం కంటే పెరుగుతారు. ఈ విచిత్రమైన పరిస్థితి ఎందుకంటే, మనకు ఎక్కువ ఆకలి వేసినప్పుడు ఇన్సులిన్ ప్రభావం అధికమై ఆహారంలోని పిండి పదార్థాలను కొవ్వుగా మార్చి నిల్వ చేస్తుంది. ఈ పరిస్థితి మారాలంటే మన ఆహారంలో అధిక సంతృప్త కొవ్వులు ఉన్న నూనె వాడాలి. తద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి, బరువు పెరుగుదలను నివారించవచ్చు. దీనికి తక్కువ పిండి పదార్థాలు ఉండే ఆహారాన్ని కలిపితే శరీరంలో ఉన్న నిల్వ కొవ్వు కూడా కరగటం మొదలవుతుంది.శాకాహారులైనా, మాంసాహారులైనా అనుసరించవచ్చునేను గత 47 సంవత్సరాలుగా వేలాది గుండె శస్త్రచికిత్సలు, ముఖ్యంగా బైపాస్ సర్జరీలు చేశాను. పిండి పదార్థాలను ఎక్కువగా తింటూ వ్యాయామాలు చేసినా శరీరంలో కొవ్వు కరగటం పెద్దగా జరగదు. ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా జరిగిన అధ్యయన ఫలితాలను స్టడీ చేశాను. తక్కువ పిండి పదార్థాలు, ఎక్కువ ‘ఆరోగ్యకరమైన కొవ్వులు’ ఉండే లోకార్బ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్.సి.హెచ్.ఎఫ్.) ఆహారం ప్రపంచ వ్యాప్తంగా చాలా మందికి సహాయకారిగా నిలిచిందని నా అధ్యయనంలో గుర్తించాను. ఆ తర్వాతే నేనూ ఇది పాటించి లబ్ధి పొందాను. 17 ఏళ్ల క్రితం మధుమేహం, రక్తపోటుకు ఇన్సులిన్ ఇంజక్షన్లు వాడేవాడిని. మొదట్లో ఈ ఆహార పద్ధతిని నేనూ నమ్మలేదు. రెండేళ్లు పరిశోధన చేసి ఈ నియమావళిని నమ్మి ప్రారంభించాను. ఇందులో గానుగ ద్వారా తీసిన కొబ్బరి నూనె వాడకం చాలా ప్రధానం. 6 వారాల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. ఇన్సులిన్ ఇంజక్షన్, రక్తపోటుకు మందులు వాడటం ఆపేశాను. ‘లో కార్బ్ స్కూల్’ అనే యూట్యూబ్ చానల్లో.. అనేక ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎలాంటి ఆహార పద్ధతులు పాటించాలో తెలిపే చాలా వీడియో ప్రసంగాలు కూడా చేశాను. ఎల్సీహెచ్ఎఫ్ డైట్ను శాకాహారులైనా, మాంసాహారులైనా అనుసరించవచ్చు. – డా. పి.వి. సత్యనారాయణ ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్, ఎల్సిహెచ్ఎఫ్ ఆహార పద్ధతి నిపుణులు, హైదరాబాద్ఎంతెంత మోతాదుల్లో తినాలి?ఆహారంలో ఎక్కువ పరిమాణంలో అవసరమైన పోషకాలను స్థూల పోషకాలని, అతి తక్కువ మోతాదులో అవసరమైన వాటిని సూక్ష్మ పోషకాలని అంటాం. స్థూల పోషకాలైనా, సూక్ష్మ పోషకాలైనా ఆ వ్యక్తి వయసు, ఎత్తు, శారీరక శ్రమ అవసరాలకు తగిన మోతాదులో ఉండాలి. పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు తదితర పోషకాలను అవసరమైనంత, సమతులమైన పాళ్లలో తినాలి. కాని, మనలో చాలామంది ఈ క్రమశిక్షణ పాటించటం లేదు. ఎంత తింటే ఆరోగ్యకరం?ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ ‘మై ప్లేట్ ఫర్ ది డే’ 2024 సిఫారసుల ప్రకారం.. సగటు భారతీయ వ్యక్తి రోజులో తీసుకునే కిలోకేలరీల శక్తిలో వరి బియ్యం, గోధుమ పిండి, చిరుధాన్యాలన్నీ కలిపి 45%కు పరిమితం చేయాలి. పప్పుధాన్యాలు, గుడ్లు, మాంసాహారం 14%–15% వరకు ఉండాలి. కొవ్వు 30% కంటే తక్కువగా లేదా సమానంగా ఉండాలి. గింజలు, నూనె గింజలు, పాలు, పాల ఉత్పత్తులు 8%–10% వరకు తీసుకోవాలి.ఎంత తింటున్నాం?కేంద్ర ప్రభుత్వ ‘గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్సీఈఎస్)’ ప్రకారం 2023–24లో పట్టణ వాసులు సగటున తలసరి ఆహార వినియోగం రోజుకు 2,233 కిలో కేలరీల మేరకు ఉంది. 338 గ్రాముల పిండి పదార్థాలు (1,351 కిలో కేలరీలు. 61%), 63 గ్రాముల ప్రొటీన్లు (254 కిలో కేలరీల. 11%), 70 గ్రాముల కొవ్వు పదార్థాలు (628 కిలో కేలరీలు. 28%) తీసుకుంటున్నారు. దేశ జనాభాలో ఎక్కువ మంది సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆహారాలను (చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, బీన్స్, గింజలు, తాజా కూరగాయలు, పండ్లు) చాలా తక్కువగా తింటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ‘ఆహార జబ్బు’ల భారం 56%భారతీయులు మోస్తున్న జబ్బుల ఆర్థిక భారంలో 56.4% మేరకు అపసవ్యమైన, అసమతుల్యతతో కూడిన ఆహారం తీసుకోవటమేనని జాతీయ పోషకాహార సంస్థ (ఐసీఎంఆర్–ఎన్ఐఎన్) 2024 నాటి డైటరీ గైడ్లైన్స్లో స్పష్టం చేసింది. అసమతుల్య ఆహారం ఫలితంగా జీవక్రియలు లయ తప్పి మెటబాలిక్ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. అధిక రక్తపోటు, రక్తంలో అధిక చక్కెర, అధిక ట్రైగ్లిజరైడ్లు, తక్కువ హెచ్డీఎల్ (మంచి) కొలెస్ట్రాల్ స్థాయి, పెరిగిన నడుము చుట్టుకొలత (ఉదర ఊబకాయం).. ఈ ఐదింటిలో ఏ మూడు ఉన్నా వారికి మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్లే.సమతులాహారం, శారీరక శ్రమ ద్వారా గుండె జబ్బుల్ని, రక్తపోటు సమస్యలను తగ్గించుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్ను 80% వరకు రాకుండా జాగ్రత్తపడొచ్చు. అకాల మరణాలను చాలా వరకు నివారించుకోవచ్చని ఎన్ఐఎన్ చెబుతోంది.ఎవరి లెక్క వారికే! ఒక వ్యక్తికి పిండి పదార్థాలు, ప్రోటీన్, కొవ్వు పదార్థాలు ఎన్ని గ్రాములు/కేలరీలు అవసరం? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటుంది. వ్యక్తిని బట్టి మారిపోతుంది. మీ వ్యక్తిగత పోషక అవసరాలు మీ బరువు, మీ రోజువారీ శారీరక శ్రమ స్థాయి, మీకున్న ఆరోగ్య సమస్యలు, మీ ఆరోగ్య లక్ష్యాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇంకో ముఖ్యాంశం ఏమిటంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తున్నారు? అనే దాన్ని బట్టి కూడా పోషకాల కూర్పు, శాతం ఆధారపడి ఉంటుంది. ఆహార పద్ధతులు అనేకం ఉన్నప్పటికీ ప్రధానమైనవి రెండు రకాలు. మొదటిది: హై కార్బ్ డైట్. అంటే.. ప్రధాన శక్తి వనరుగా పిండి పదార్థాలను తీసుకోవటం. సాధారణంగా అందరూ అనుసరించే ఆహార పద్ధతి ఇదే. రెండో పద్ధతి: లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్.సి.హెచ్.ఎఫ్) డైట్. అంటే.. కొవ్వు పదార్థాలను ప్రధాన శక్తి వనరుగా తీసుకోవటం. వీటిలో ఏ ఆహార పద్ధతిని అనుసరించినా, ముఖ్యంగా మీరు ఆశించిన ఆరోగ్య లక్ష్యాలు సాధించాలంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తారు? ఎంత తినాలి? ఏది తినాలి? అనే విషయాపై నిర్ణయం తీసుకొని, ఆచరించటం ప్రారంభించాలి. ఆచి ‘తూచి’ తినాలి. ఆహార క్రమశిక్షణతో పాటు శారీరక వ్యాయామ క్రమశిక్షణను కూడా జోడించి కొనసాగించాలి. అప్పుడే మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి.మీ బీఎంఐ, బీఎంఆర్ ఎంత?శరీర బరువును తగ్గించుకోవాలనుకునే వారు మొదట చెయ్యాల్సిన పని వారి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), బాడీ మెటబాలిక్ రేట్ (బీఎంఆర్) ఎంతో తెలుసుకోవాలి. ఇటువంటి ముఖ్యమైన డేటాను తెలుసుకోవటానికిప్పుడు ‘బాడీ ఫ్యాట్ స్కేల్’ అనే డిజిటల్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆసుపత్రుల్లో ఈ పరికరాలు పెడుతున్నారు. బరువు తూచే డిజిటల్ పరికరంలోనే బీఎంఐ, బీఎంఆర్, పొట్టచుట్టూ కొవ్వు, శరీరం మొత్తంలో కొవ్వు ఎంత ఉన్నాయి వంటి చాలా వివరాలను తెలుసుకోవచ్చు. బీఎంఐ 23 కన్నా తక్కువగా ఉంటే ఆరోగ్యకరం. 30లోపు ఉంటే అధిక బరువు, 35కి మించితే ఊబకాయంగా భావిస్తారు. ఎంత అధిక బరువు ఉంటే బీఎంఆర్ అంత ఎక్కువగా ఉంటుంది. ఈ కొలమానాలను బట్టి బరువు తగ్గాలా? నార్మల్ రేంజ్లోకి రావాలంటే ఎంత తగ్గాలి? అనేది బరువుతో పాటు బీఎంఆర్ను కూడా పరిగణనలోకి తీసుకొని నిర్ణయించుకోవాలి. వ్యక్తి శరీరంలో దైనందిన జీవక్రియలకు ఎన్ని కిలో కేలరీల శక్తి అవసరమవుతోందో బీఎంఆర్ తెలియజేస్తుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే బీఎంఆర్ చూపే కేలరీల కన్నా రోజు మొత్తంలో తక్కువ కేలరీలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ఈ విధంగా కేలరీల కొరత సృష్టించినప్పుడు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను కరిగించి వినియోగించుకోవటానికి శరీరం అలవాటుపడుతుంది. ఒకవేళ తగినంత బరువు లేని వారైతే బీఎంఆర్ కన్నా ఎక్కువ కేలరీల ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గాలి, పొట్ట తగ్గాలి అనుకునే వ్యక్తి పని బీఎంఆర్ కన్నా తక్కువగా ఎన్ని కేలరీలు తినాలని నిర్ణయించుకున్న తర్వాత ఏ ఆహార పద్ధతిని అనుసరించాలన్న ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. బరువు పెరగడానికి దారితీసిన పిండిపదార్థాల కేలరీలనే ఎక్కువగా తీసుకునే ఆహార పద్ధతిలోనూ కొన్ని కేలరీలు తగ్గించి తింటే క్రమంగా బరువు తగ్గుతుంది. పిండి పదార్థాల శాతం గతం కన్నా తగ్గించి, ప్రొటీన్లను పెంచుకోవాలి. తగ్గాలి సరే.. అయితే, ఏ పిండి పదార్థాలైతే ఒంట్లో కొవ్వు ఎక్కువగా పెరగటానికి కారణమైనాయో వాటినే తగ్గించి తింటూ, వ్యాయామం చేస్తే ఫలితాలు వస్తాయి. అయితే, కొద్ది నెలలు బరువు తగ్గినా వ్యాయామం వల్ల ఆకలి ఎక్కువై, ఎక్కువ తినాల్సి వచ్చి, మళ్లీ బరువు పెరిగే ముప్పు ఉంటుంది. ఏ ఆహార పద్ధతిలో అధిక కొవ్వు నిల్వల సమస్య వచ్చిందో ఆ ఆహార పద్ధతిలోనే కొన్ని మార్పులు చేసినంత మాత్రాన గణనీయమైన ఫలితాలు సాధించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఊబకాయానికి కారణమైన బరువును, ఆ బరువుకు కారణమైన కొవ్వు నిల్వలను గణనీయమైన స్థాయిలో కరిగించుకోవాలంటే ఇన్సులిన్ నిరోధకతను తగ్గించుకునే వేరే ఆహార పద్ధతిని అనుసరించటం మేలు. లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహార పద్ధతిని అనుసరించటం ద్వారా ఆరోగ్య లక్ష్యాలను సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే, మీ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను తినటమే కాకుండా.. పిండి పదార్థాలను బాగా తక్కువగా, కొవ్వు పదార్థాలను ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా శరీర బరువు నీరసం లేకుండా, ఆరోగ్యదాయకంగా తగ్గించుకోవచ్చని ఎల్సీహెచ్ఎఫ్ నిపుణులు, సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ పీ వీ సత్యనారాయణ అంటున్నారు. ఎల్సీహెచ్ఎఫ్ డైట్తో పాటు ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ చెయ్యటంతో పాటు వ్యాయామం జోడిస్తే మరింత ఉత్తమ ఫలితాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఎల్సీహెచ్ఎఫ్ వైద్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ పద్ధతిని ఆచరించటం ద్వారా సత్ఫలితాలు సాధించటంతో పాటు కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చని ఆయన సూచిస్తున్నారు. ఇన్సులిన్ నిరోధకతే కీలకంరక్తంలో చక్కెర స్థాయిని తెలిపే హెచ్బీఏ1సి పరీక్షతో పాటు.. ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలోకి విడుదలయ్యే గ్లూకోజ్ను కణజాలానికి అందించడంలో కీలకపాత్ర నిర్వహించే ఇన్సులిన్ హార్మోన్ ఏ స్థాయిలో విడుదలవుతోంది? ఎంతసేపటికి తిరిగి సాధారణ స్థితికి వస్తోంది? అనే గణాంకాలను బట్టి ఇన్సులిన్ నిరోధకత ఎంత ఉన్నదనే విషయం నిర్ధారిస్తారు. దీన్ని నిర్ధారించడానికి ‘హోమా ఐఆర్’ అనే ఓరల్ గ్లూకోజ్ టెస్ట్ చేస్తారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తక్కువగా ఉండే వారిలో కూడా ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హెచ్బీఏ1సి పరీక్ష ద్వారా షుగర్ వ్యాధి నిర్ధారణ అయ్యేదానికి 15 సంవత్సరాలు ముందే హోమా–ఐఆర్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇన్సులిన్ నిరోధకతను తొలి దశలోనే గుర్తించి, ఆహారంలో తగిన మార్పు చేసుకుంటే షుగర్, తదనంతర గొలుసు వ్యాధుల ముప్పును తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘హోమా–ఐఆర్’ టెస్ట్లో ఇన్సులిన్ నిరోధకత (ఇన్సులిన్ రెసిస్టెన్స్) ఎంత ఉంది? ఆ వ్యక్తికి ఇతర ఆరోగ్య సమస్యల స్థితిగతులు ఎలా ఉన్నాయి? అనే విషయాలను పరిగణనలోకి తీసుకొని లోకార్బ్ హెల్దీ అండ్ హై ఫ్యాట్ డైట్లో పోషకాల కూర్పును, శాతాన్ని, వ్యాయామాన్ని డాక్టర్ సూచిస్తారు. ఇది ఏ ఇద్దరికీ ఒకేలా ఉండదు. ఎవరి ప్రత్యేక పరిస్థితులకు తగిన విధంగా వారికి ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్ సూచిస్తారు. కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువగా, పిండి పదార్థాలు అతి తక్కువగా తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు తమ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను మాత్రమే తీసుకోవాలన్న నియమం ఈ ఆహార పద్ధతిలో కూడా వర్తిస్తుంది. అంతకన్నా ఎక్కువ కేలరీలు తింటే బరువు పెరిగే ముప్పు ఏ ఆహార పద్ధతిలోనైనా ఉంటుంది. అందుకే కదా మితాహారం ముద్దు అని మన పెద్దలు చెప్పేది! లోకార్బ్ డైట్ ప్లానింగ్ ఎలా? ఉదాహరణకు 177 సెం.మీ. ఎత్తు, 59 ఏళ్ల వయసు ఉన్న పురుషుడు 82 కిలోల బరువు ఉన్నాడనుకుందాం. బీఎంఐ 28.5. బీఎంఆర్ 1678. మెటబాలిక్ ఏజ్ 62. పొట్ట చుట్టూ కొవ్వు 6 కన్నా తక్కువ ఉండాలి. కానీ, 11 ఉంది. బీపీ, షుగర్ లేదు. ఫ్యాటీ లివర్ గ్రేడ్1 ఉంది. ఇన్సులిన్ నిరోధకత ఉంది. జాగ్రత్త పడకపోతే కొద్ది సంవత్సరాల్లో షుగర్ బారినపడే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ఇదీ అతనికి ఇచ్చిన ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్.. రోజులో 1500 కిలోకేలరీలకన్నా తక్కువ ఆహారం తినాలి. నికర పిండి పదార్థాలు 20 గ్రాములకు మించకూడదు. 60 గ్రాములు ప్రొటీన్లు, 100–150 గ్రాముల కొవ్వు పదార్థాలను తీసుకోవాలి. క్రమశిక్షణతో ఈ ఆహార నియమాలతో పాటు వ్యాయామం చేస్తూ ఉంటే 6 నెలల్లోనే బీఎంఐ 23.5కు, పొట్ట 7కు తగ్గింది. రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్వంటకం ఏదైనా, అందులో ఉపయోగించే ప్రతి పదార్ధానికి సంబంధించిన స్థూల పోషక విలువలను విధిగా లెక్కించాలి. పొద్దున్నే ఆ రోజు తినాలనుకునే పదార్థాలతో పట్టిక తయారు చేసుకోవాలి. ఏవి తిన్నా రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్ పరిమితుల మేరకే తినాలి. వాటిలో నికర పిండి పదార్థం (పిండి పదార్థంలో నుంచి పీచును తీసేస్తే మిగిలేది నికర పిండి పదార్థం) ఎంత? ప్రొటీన్లెన్ని? కొవ్వు పదార్థం ఎంత? అని సరిచూసుకొని, తూకం వేసుకొని, ముందే పట్టిక రాసుకోవటం అతి ముఖ్యమైన విషయం. ఆ తర్వాతే ఏది తినాలో, ఎంత తినాలో నిర్ణయించుకొని అంతే తినాలి. నెయ్యి లేదా వెన్న, కాఫీ (లేదా టీ) డికాక్షన్/ వేడి నీటితో కలిపి, గిలకొట్టి తయారు చేసుకొని తీసుకునే ‘బుల్లెట్ కాఫీ’ ఈ ఆహార పద్ధతిలో చాలా కీలకమైన ఉదయకాలపు శక్తి వనరు. 50 గ్రా. నెయ్యి/వెన్న, 25 గ్రా. పాల మీగడ, 5 గ్రా. గానుగ కొబ్బరి నూనె, 100 ఎం.ఎల్. కాఫీ డికాక్షన్ కలిపి దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకునే ‘బుల్లెట్ కాఫీ’లో 1.3 గ్రా. నికర పిండి పదార్థాలు, 1.4 గ్రా. ప్రొటీన్, 45.9 గ్రా. కొవ్వు పదార్థాలు, 418 కిలోకేలరీల శక్తి ఉంటాయి. వ్యక్తి అవసరాలను బట్టి నెయ్యి/వెన్న, పాల మీగడల మోతాదులో హెచ్చు తగ్గులు చేసుకోవచ్చు. రోజంతా తీసుకునే కేలరీల్లో దాదాపు మూడింట ఒకవంతు బుల్లెట్ కాఫీ ద్వారానే సమకూర్చుకోవచ్చు. దాహాన్ని బట్టి తాగునీటిని పుష్కలంగా తాగాలి. కూరగాయలు, ఆకుకూరలు, గింజలు, పిక్కలను విధిగా, తగు మాత్రంగా రోజువారీ మెనూలో చేర్చుకుంటే సూక్ష్మపోషకాల లోపం రాకుండా ఉంటుంది. వంటకాలు వ్యక్తిగత ఆహారపు అలవాట్లు, ఆసక్తులు, లభ్యత, కొనుగోలు శక్తిని బట్టి ఏ రోజుకారోజు వారానికి ఒక షెడ్యూల్ పెట్టుకొని పునరావృతం చేసుకోవచ్చు. ఇతరత్రా ఆహార పదార్థాలు రోజుకోలా మారుతుంటాయి. బుల్లెట్ కాఫీ మాత్రం రోజూ తీసుకోవాలి. మాంసాహారులకు ఈ ఆహార పద్ధతి కొంత సులువు. గుడ్డు కూడా ముట్టని శాకాహారులైతే చాలా రకాల ప్రత్యామ్నాయ ఆహారాలు సమకూర్చుకొని తినాల్సి వస్తుంది. వీగన్లకు ఇంకా కొంచెం కష్టం. ఫుడ్ సప్లిమెంట్లు వాడుకోవాల్సి ఉంటుంది. అతిగా తిన్న పిండి పదార్థాల వల్ల శరీరంలో పెరిగిపోయిన కొవ్వు నిల్వలను కొవ్వు ప్రధాన ఆహారంతో కరిగించాలంటే తెలివైన ప్రణాళిక, రాజీలేని క్రమశిక్షణతో కూడిన ఆచరణే వజ్రాయుధాలు!హెచ్చరిక: ఈ కథనం ఉద్దేశం ఎల్సీహెచ్ఎఫ్ డైట్ గురించి కొంతమేరకు అవగాహన కలిగించటానికి మాత్రమే. మరింత లోతైన అవగాహన కోసం ‘లో కార్బ్ స్కూల్’ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూడండి. ఎల్సీహెచ్ఎఫ్ డైట్పై అవగాహన గల వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ ఆహార పద్ధతిని అనుసరించబూనుకోవటం ఆశించిన ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చకపోగా అనర్థాలకు దారితీసే అవకాశాలు మెండుగా ఉంటాయి. జాగ్రత్త. లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ ‘ఆరోగ్యకరమైన’ ట్రెండ్రోజూ మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ఉండేది పిండి పదార్థాలే. వీటివల్ల మనం రోగాల బారిన పడుతున్నాం. కడుపులోకి వెళ్లిన పిండి పదార్థాన్ని పచనం చేసి, గ్లూకోజ్గా మార్చి, శరీరానికి శక్తినిచ్చే పని ఇన్సులిన్ అనే హార్మోన్ ద్వారా జరుగుతుంది. అవసరానికి మించి పిండి పదార్థాలు, హానికరమైన కొవ్వు పదార్థాలను మనం రోజూ తినడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వాన్ని కోల్పోతుంది. అందువల్ల శరీరంలో అధికంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ ఫలితం లేని స్థితికి చేరినప్పుడు ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ (ఇన్సులిన్ నిరోధకత) ఏర్పడుతోంది. అధిక బరువు దగ్గరి నుంచి క్యాన్సర్ వరకు 64 రకాల జబ్బులకు ఇదే కారణమవుతోందన్న అవగాహన ఇటీవల కాలంలో పెరిగింది. అందువల్ల పిండిపదార్థాలను తక్కువగా తీసుకుంటూ.. మాంసకృత్తులు, ఆరోగ్యదాయకమైన కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరవు అంటున్నారు వైద్య నిపుణులు. దీన్నే ‘లో కార్బ్ హెల్దీ ఫ్యాట్’ – ఎల్సీహెచ్ఎఫ్ ఆహార పద్ధతిగా చెబుతున్నారు.ఏయే ఆహార పదార్థాల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు ఎంతెంత ఉన్నాయో తెలుసుకొని, ఏ వ్యక్తి (పసిపిల్లలు, పిల్లలు, యుక్తవయస్కులు, నడివయస్కులు, గర్భవతులు, బాలింతలు, వృద్ధులు)కి ఎంత మోతాదుల్లో అవి అవసరమో లెక్క వేసుకొని తినటం ద్వారా సమతుల ఆహారం తీసుకోవచ్చు. లెక్క వేసుకొని తినాలన్న మాట విడ్డూరంగాను, అంత అవసరమా అనే సందేహం రావచ్చు. కానీ, సత్ఫలితాలు రాబట్టాలంటే అదే అవసరం. ఎంత తినాలో తెలుసుకొని, తెలివిగా తింటే అధిక బరువు/ ఊబకాయంతో పాటు వచ్చే ఎన్నో ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. వ్యాధులు దరిచేరకుండా ఆరోగ్యంగా జీవించడానికి కూడా ఈ సమతులాహారం దోహదం చేస్తుంది. మనం ఏయే పదార్థాలను ఎంతెంత మోతాదులో తినాలో తెలియాలంటే మొదట ఆయా ఆహార పదార్థాల్లో అసలు పోషకాలు ఎంతెంత మోతాదులో ఉన్నాయో తెలుసుకోవాలి. సాధారణంగా ప్రతి ఆహార పదార్థంలోనూ స్థూల పోషకాలైన పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలతోపాటు సూక్ష్మ పోషకాలు ఉంటాయి. అయితే, వేర్వేరు మోతాదుల్లో ఉంటాయి. కొన్నిటిలో పిండి పదార్థాలు ఎక్కువగా, ప్రొటీన్లు తక్కువగా, కొవ్వు పదార్థాలు మరీ తక్కువగా ఉంటాయి. మరికొన్నిటిలో కొవ్వు ఎక్కువ, ప్రొటీన్లు మోస్తరుగా, పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఇంకొన్నిటిలో అసలు పిండి పదార్థాలే ఉండవు. కాబట్టి, వ్యక్తిగతంగా మీకు ఏయే పోషకాలు ఎంత మోతాదులో కావాలో తెలుసుకొని, మీ ఆరోగ్య లక్ష్యం నిర్దేశించుకోవాలి. ఈ లక్ష్య సాధనకు అవసరమైనన్ని పోషకాలతో కూడిన ఆహారాన్ని పనిగట్టుకొని లెక్క వేసుకొని తీసుకుంటే మీ ఆరోగ్య లక్ష్యాలను క్షేమకరమైన రీతిలో సాధించవచ్చు.ఆహారంలో ఎక్కువ పరిమాణంలో అవసరమైన పోషకాలను స్థూల పోషకాలని, అతి తక్కువ మోతాదులో అవసరమైన వాటిని సూక్ష్మ పోషకాలని అంటాం. స్థూల పోషకాలైనా, సూక్ష్మ పోషకాలైనా ఆ వ్యక్తి వయసు, ఎత్తు, శారీరక శ్రమ అవసరాలకు తగిన మోతాదులో ఉండాలి. పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు తదితర పోషకాలను అవసరమైనంత, సమతులమైన పాళ్లలో తినాలి. కాని, మనలో చాలామంది ఈ క్రమశిక్షణ పాటించటం లేదు. ఎంత తింటే ఆరోగ్యకరం?ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ ‘మై ప్లేట్ ఫర్ ది డే’ 2024 సిఫారసుల ప్రకారం.. సగటు భారతీయ వ్యక్తి రోజులో తీసుకునే కిలోకేలరీల శక్తిలో వరి బియ్యం, గోధుమ పిండి, చిరుధాన్యాలన్నీ కలిపి 45%కు పరిమితం చేయాలి. పప్పుధాన్యాలు, గుడ్లు, మాంసాహారం 14%–15% వరకు ఉండాలి. కొవ్వు 30% కంటే తక్కువగా లేదా సమానంగా ఉండాలి. గింజలు, నూనె గింజలు, పాలు, పాల ఉత్పత్తులు 8%–10% వరకు తీసుకోవాలి.ఎంత తింటున్నాం?కేంద్ర ప్రభుత్వ ‘గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్సీఈఎస్)’ ప్రకారం 2023–24లో పట్టణ వాసులు సగటున తలసరి ఆహార వినియోగం రోజుకు 2,233 కిలో కేలరీల మేరకు ఉంది. 338 గ్రాముల పిండి పదార్థాలు (1,351 కిలో కేలరీలు. 61%), 63 గ్రాముల ప్రొటీన్లు (254 కిలో కేలరీల. 11%), 70 గ్రాముల కొవ్వు పదార్థాలు (628 కిలో కేలరీలు. 28%) తీసుకుంటున్నారు. దేశ జనాభాలో ఎక్కువ మంది సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆహారాలను (చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, బీన్స్, గింజలు, తాజా కూరగాయలు, పండ్లు) చాలా తక్కువగా తింటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ‘ఆహార జబ్బు’ల భారం 56%భారతీయులు మోస్తున్న జబ్బుల ఆర్థిక భారంలో 56.4% మేరకు అపసవ్యమైన, అసమతుల్యతతో కూడిన ఆహారం తీసుకోవటమేనని జాతీయ పోషకాహార సంస్థ (ఐసీఎంఆర్–ఎన్ఐఎన్) 2024 నాటి డైటరీ గైడ్లైన్స్లో స్పష్టం చేసింది. అసమతుల్య ఆహారం ఫలితంగా జీవక్రియలు లయ తప్పి మెటబాలిక్ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. అధిక రక్తపోటు, రక్తంలో అధిక చక్కెర, అధిక ట్రైగ్లిజరైడ్లు, తక్కువ హెచ్డీఎల్ (మంచి) కొలెస్ట్రాల్ స్థాయి, పెరిగిన నడుము చుట్టుకొలత (ఉదర ఊబకాయం).. ఈ ఐదింటిలో ఏ మూడు ఉన్నా వారికి మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్లే.సమతులాహారం, శారీరక శ్రమ ద్వారా గుండె జబ్బుల్ని, రక్తపోటు సమస్యలను తగ్గించుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్ను 80% వరకు రాకుండా జాగ్రత్తపడొచ్చు. అకాల మరణాలను చాలా వరకు నివారించుకోవచ్చని ఎన్ఐఎన్ చెబుతోంది.ఎవరి లెక్క వారికే! ఒక వ్యక్తికి పిండి పదార్థాలు, ప్రోటీన్, కొవ్వు పదార్థాలు ఎన్ని గ్రాములు/కేలరీలు అవసరం? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటుంది. వ్యక్తిని బట్టి మారిపోతుంది. మీ వ్యక్తిగత పోషక అవసరాలు మీ బరువు, మీ రోజువారీ శారీరక శ్రమ స్థాయి, మీకున్న ఆరోగ్య సమస్యలు, మీ ఆరోగ్య లక్ష్యాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇంకో ముఖ్యాంశం ఏమిటంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తున్నారు? అనే దాన్ని బట్టి కూడా పోషకాల కూర్పు, శాతం ఆధారపడి ఉంటుంది. ఆహార పద్ధతులు అనేకం ఉన్నప్పటికీ ప్రధానమైనవి రెండు రకాలు. మొదటిది: హై కార్బ్ డైట్. అంటే.. ప్రధాన శక్తి వనరుగా పిండి పదార్థాలను తీసుకోవటం. సాధారణంగా అందరూ అనుసరించే ఆహార పద్ధతి ఇదే. రెండో పద్ధతి: లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్.సి.హెచ్.ఎఫ్) డైట్. అంటే.. కొవ్వు పదార్థాలను ప్రధాన శక్తి వనరుగా తీసుకోవటం. వీటిలో ఏ ఆహార పద్ధతిని అనుసరించినా, ముఖ్యంగా మీరు ఆశించిన ఆరోగ్య లక్ష్యాలు సాధించాలంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తారు? ఎంత తినాలి? ఏది తినాలి? అనే విషయాపై నిర్ణయం తీసుకొని, ఆచరించటం ప్రారంభించాలి. ఆచి ‘తూచి’ తినాలి. ఆహార క్రమశిక్షణతో పాటు శారీరక వ్యాయామ క్రమశిక్షణను కూడా జోడించి కొనసాగించాలి. అప్పుడే మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి.మీ బీఎంఐ, బీఎంఆర్ ఎంత?శరీర బరువును తగ్గించుకోవాలనుకునే వారు మొదట చెయ్యాల్సిన పని వారి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), బాడీ మెటబాలిక్ రేట్ (బీఎంఆర్) ఎంతో తెలుసుకోవాలి. ఇటువంటి ముఖ్యమైన డేటాను తెలుసుకోవటానికిప్పుడు ‘బాడీ ఫ్యాట్ స్కేల్’ అనే డిజిటల్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆసుపత్రుల్లో ఈ పరికరాలు పెడుతున్నారు. బరువు తూచే డిజిటల్ పరికరంలోనే బీఎంఐ, బీఎంఆర్, పొట్టచుట్టూ కొవ్వు, శరీరం మొత్తంలో కొవ్వు ఎంత ఉన్నాయి వంటి చాలా వివరాలను తెలుసుకోవచ్చు. బీఎంఐ 23 కన్నా తక్కువగా ఉంటే ఆరోగ్యకరం. 30లోపు ఉంటే అధిక బరువు, 35కి మించితే ఊబకాయంగా భావిస్తారు. ఎంత అధిక బరువు ఉంటే బీఎంఆర్ అంత ఎక్కువగా ఉంటుంది. ఈ కొలమానాలను బట్టి బరువు తగ్గాలా? నార్మల్ రేంజ్లోకి రావాలంటే ఎంత తగ్గాలి? అనేది బరువుతో పాటు బీఎంఆర్ను కూడా పరిగణనలోకి తీసుకొని నిర్ణయించుకోవాలి. వ్యక్తి శరీరంలో దైనందిన జీవక్రియలకు ఎన్ని కిలో కేలరీల శక్తి అవసరమవుతోందో బీఎంఆర్ తెలియజేస్తుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే బీఎంఆర్ చూపే కేలరీల కన్నా రోజు మొత్తంలో తక్కువ కేలరీలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ఈ విధంగా కేలరీల కొరత సృష్టించినప్పుడు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను కరిగించి వినియోగించుకోవటానికి శరీరం అలవాటుపడుతుంది. ఒకవేళ తగినంత బరువు లేని వారైతే బీఎంఆర్ కన్నా ఎక్కువ కేలరీల ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గాలి, పొట్ట తగ్గాలి అనుకునే వ్యక్తి పని బీఎంఆర్ కన్నా తక్కువగా ఎన్ని కేలరీలు తినాలని నిర్ణయించుకున్న తర్వాత ఏ ఆహార పద్ధతిని అనుసరించాలన్న ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. బరువు పెరగడానికి దారితీసిన పిండిపదార్థాల కేలరీలనే ఎక్కువగా తీసుకునే ఆహార పద్ధతిలోనూ కొన్ని కేలరీలు తగ్గించి తింటే క్రమంగా బరువు తగ్గుతుంది. పిండి పదార్థాల శాతం గతం కన్నా తగ్గించి, ప్రొటీన్లను పెంచుకోవాలి. తగ్గాలి సరే.. అయితే, ఏ పిండి పదార్థాలైతే ఒంట్లో కొవ్వు ఎక్కువగా పెరగటానికి కారణమైనాయో వాటినే తగ్గించి తింటూ, వ్యాయామం చేస్తే ఫలితాలు వస్తాయి. అయితే, కొద్ది నెలలు బరువు తగ్గినా వ్యాయామం వల్ల ఆకలి ఎక్కువై, ఎక్కువ తినాల్సి వచ్చి, మళ్లీ బరువు పెరిగే ముప్పు ఉంటుంది. ఏ ఆహార పద్ధతిలో అధిక కొవ్వు నిల్వల సమస్య వచ్చిందో ఆ ఆహార పద్ధతిలోనే కొన్ని మార్పులు చేసినంత మాత్రాన గణనీయమైన ఫలితాలు సాధించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఊబకాయానికి కారణమైన బరువును, ఆ బరువుకు కారణమైన కొవ్వు నిల్వలను గణనీయమైన స్థాయిలో కరిగించుకోవాలంటే ఇన్సులిన్ నిరోధకతను తగ్గించుకునే వేరే ఆహార పద్ధతిని అనుసరించటం మేలు. లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహార పద్ధతిని అనుసరించటం ద్వారా ఆరోగ్య లక్ష్యాలను సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే, మీ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను తినటమే కాకుండా.. పిండి పదార్థాలను బాగా తక్కువగా, కొవ్వు పదార్థాలను ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా శరీర బరువు నీరసం లేకుండా, ఆరోగ్యదాయకంగా తగ్గించుకోవచ్చని ఎల్సీహెచ్ఎఫ్ నిపుణులు, సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ పీ వీ సత్యనారాయణ అంటున్నారు. ఎల్సీహెచ్ఎఫ్ డైట్తో పాటు ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ చెయ్యటంతో పాటు వ్యాయామం జోడిస్తే మరింత ఉత్తమ ఫలితాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఎల్సీహెచ్ఎఫ్ వైద్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ పద్ధతిని ఆచరించటం ద్వారా సత్ఫలితాలు సాధించటంతో పాటు కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చని ఆయన సూచిస్తున్నారు. ఇన్సులిన్ నిరోధకతే కీలకంరక్తంలో చక్కెర స్థాయిని తెలిపే హెచ్బీఏ1సి పరీక్షతో పాటు.. ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలోకి విడుదలయ్యే గ్లూకోజ్ను కణజాలానికి అందించడంలో కీలకపాత్ర నిర్వహించే ఇన్సులిన్ హార్మోన్ ఏ స్థాయిలో విడుదలవుతోంది? ఎంతసేపటికి తిరిగి సాధారణ స్థితికి వస్తోంది? అనే గణాంకాలను బట్టి ఇన్సులిన్ నిరోధకత ఎంత ఉన్నదనే విషయం నిర్ధారిస్తారు. దీన్ని నిర్ధారించడానికి ‘హోమా ఐఆర్’ అనే ఓరల్ గ్లూకోజ్ టెస్ట్ చేస్తారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తక్కువగా ఉండే వారిలో కూడా ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హెచ్బీఏ1సి పరీక్ష ద్వారా షుగర్ వ్యాధి నిర్ధారణ అయ్యేదానికి 15 సంవత్సరాలు ముందే హోమా–ఐఆర్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇన్సులిన్ నిరోధకతను తొలి దశలోనే గుర్తించి, ఆహారంలో తగిన మార్పు చేసుకుంటే షుగర్, తదనంతర గొలుసు వ్యాధుల ముప్పును తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘హోమా–ఐఆర్’ టెస్ట్లో ఇన్సులిన్ నిరోధకత (ఇన్సులిన్ రెసిస్టెన్స్) ఎంత ఉంది? ఆ వ్యక్తికి ఇతర ఆరోగ్య సమస్యల స్థితిగతులు ఎలా ఉన్నాయి? అనే విషయాలను పరిగణనలోకి తీసుకొని లోకార్బ్ హెల్దీ అండ్ హై ఫ్యాట్ డైట్లో పోషకాల కూర్పును, శాతాన్ని, వ్యాయామాన్ని డాక్టర్ సూచిస్తారు. ఇది ఏ ఇద్దరికీ ఒకేలా ఉండదు. ఎవరి ప్రత్యేక పరిస్థితులకు తగిన విధంగా వారికి ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్ సూచిస్తారు. కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువగా, పిండి పదార్థాలు అతి తక్కువగా తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు తమ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను మాత్రమే తీసుకోవాలన్న నియమం ఈ ఆహార పద్ధతిలో కూడా వర్తిస్తుంది. అంతకన్నా ఎక్కువ కేలరీలు తింటే బరువు పెరిగే ముప్పు ఏ ఆహార పద్ధతిలోనైనా ఉంటుంది. అందుకే కదా మితాహారం ముద్దు అని మన పెద్దలు చెప్పేది! లోకార్బ్ డైట్ ప్లానింగ్ ఎలా? ఉదాహరణకు 177 సెం.మీ. ఎత్తు, 59 ఏళ్ల వయసు ఉన్న పురుషుడు 82 కిలోల బరువు ఉన్నాడనుకుందాం. బీఎంఐ 28.5. బీఎంఆర్ 1678. మెటబాలిక్ ఏజ్ 62. పొట్ట చుట్టూ కొవ్వు 6 కన్నా తక్కువ ఉండాలి. కానీ, 11 ఉంది. బీపీ, షుగర్ లేదు. ఫ్యాటీ లివర్ గ్రేడ్1 ఉంది. ఇన్సులిన్ నిరోధకత ఉంది. జాగ్రత్త పడకపోతే కొద్ది సంవత్సరాల్లో షుగర్ బారినపడే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ఇదీ అతనికి ఇచ్చిన ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్.. రోజులో 1500 కిలోకేలరీలకన్నా తక్కువ ఆహారం తినాలి. నికర పిండి పదార్థాలు 20 గ్రాములకు మించకూడదు. 60 గ్రాములు ప్రొటీన్లు, 100–150 గ్రాముల కొవ్వు పదార్థాలను తీసుకోవాలి. క్రమశిక్షణతో ఈ ఆహార నియమాలతో పాటు వ్యాయామం చేస్తూ ఉంటే 6 నెలల్లోనే బీఎంఐ 23.5కు, పొట్ట 7కు తగ్గింది. రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్వంటకం ఏదైనా, అందులో ఉపయోగించే ప్రతి పదార్ధానికి సంబంధించిన స్థూల పోషక విలువలను విధిగా లెక్కించాలి. పొద్దున్నే ఆ రోజు తినాలనుకునే పదార్థాలతో పట్టిక తయారు చేసుకోవాలి. ఏవి తిన్నా రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్ పరిమితుల మేరకే తినాలి. వాటిలో నికర పిండి పదార్థం (పిండి పదార్థంలో నుంచి పీచును తీసేస్తే మిగిలేది నికర పిండి పదార్థం) ఎంత? ప్రొటీన్లెన్ని? కొవ్వు పదార్థం ఎంత? అని సరిచూసుకొని, తూకం వేసుకొని, ముందే పట్టిక రాసుకోవటం అతి ముఖ్యమైన విషయం. ఆ తర్వాతే ఏది తినాలో, ఎంత తినాలో నిర్ణయించుకొని అంతే తినాలి. నెయ్యి లేదా వెన్న, కాఫీ (లేదా టీ) డికాక్షన్/ వేడి నీటితో కలిపి, గిలకొట్టి తయారు చేసుకొని తీసుకునే ‘బుల్లెట్ కాఫీ’ ఈ ఆహార పద్ధతిలో చాలా కీలకమైన ఉదయకాలపు శక్తి వనరు. 50 గ్రా. నెయ్యి/వెన్న, 25 గ్రా. పాల మీగడ, 5 గ్రా. గానుగ కొబ్బరి నూనె, 100 ఎం.ఎల్. కాఫీ డికాక్షన్ కలిపి దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకునే ‘బుల్లెట్ కాఫీ’లో 1.3 గ్రా. నికర పిండి పదార్థాలు, 1.4 గ్రా. ప్రొటీన్, 45.9 గ్రా. కొవ్వు పదార్థాలు, 418 కిలోకేలరీల శక్తి ఉంటాయి. వ్యక్తి అవసరాలను బట్టి నెయ్యి/వెన్న, పాల మీగడల మోతాదులో హెచ్చు తగ్గులు చేసుకోవచ్చు. రోజంతా తీసుకునే కేలరీల్లో దాదాపు మూడింట ఒకవంతు బుల్లెట్ కాఫీ ద్వారానే సమకూర్చుకోవచ్చు. దాహాన్ని బట్టి తాగునీటిని పుష్కలంగా తాగాలి. కూరగాయలు, ఆకుకూరలు, గింజలు, పిక్కలను విధిగా, తగు మాత్రంగా రోజువారీ మెనూలో చేర్చుకుంటే సూక్ష్మపోషకాల లోపం రాకుండా ఉంటుంది. వంటకాలు వ్యక్తిగత ఆహారపు అలవాట్లు, ఆసక్తులు, లభ్యత, కొనుగోలు శక్తిని బట్టి ఏ రోజుకారోజు వారానికి ఒక షెడ్యూల్ పెట్టుకొని పునరావృతం చేసుకోవచ్చు. ఇతరత్రా ఆహార పదార్థాలు రోజుకోలా మారుతుంటాయి. బుల్లెట్ కాఫీ మాత్రం రోజూ తీసుకోవాలి. మాంసాహారులకు ఈ ఆహార పద్ధతి కొంత సులువు. గుడ్డు కూడా ముట్టని శాకాహారులైతే చాలా రకాల ప్రత్యామ్నాయ ఆహారాలు సమకూర్చుకొని తినాల్సి వస్తుంది. వీగన్లకు ఇంకా కొంచెం కష్టం. ఫుడ్ సప్లిమెంట్లు వాడుకోవాల్సి ఉంటుంది. అతిగా తిన్న పిండి పదార్థాల వల్ల శరీరంలో పెరిగిపోయిన కొవ్వు నిల్వలను కొవ్వు ప్రధాన ఆహారంతో కరిగించాలంటే తెలివైన ప్రణాళిక, రాజీలేని క్రమశిక్షణతో కూడిన ఆచరణే వజ్రాయుధాలు!హెచ్చరిక: ఈ కథనం ఉద్దేశం ఎల్సీహెచ్ఎఫ్ డైట్ గురించి కొంతమేరకు అవగాహన కలిగించటానికి మాత్రమే. మరింత లోతైన అవగాహన కోసం ‘లో కార్బ్ స్కూల్’ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూడండి. ఎల్సీహెచ్ఎఫ్ డైట్పై అవగాహన గల వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ ఆహార పద్ధతిని అనుసరించబూనుకోవటం ఆశించిన ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చకపోగా అనర్థాలకు దారితీసే అవకాశాలు మెండుగా ఉంటాయి. జాగ్రత్త. లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ ‘ఆరోగ్యకరమైన’ ట్రెండ్రోజూ మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ఉండేది పిండి పదార్థాలే. వీటివల్ల మనం రోగాల బారిన పడుతున్నాం. కడుపులోకి వెళ్లిన పిండి పదార్థాన్ని పచనం చేసి, గ్లూకోజ్గా మార్చి, శరీరానికి శక్తినిచ్చే పని ఇన్సులిన్ అనే హార్మోన్ ద్వారా జరుగుతుంది. అవసరానికి మించి పిండి పదార్థాలు, హానికరమైన కొవ్వు పదార్థాలను మనం రోజూ తినడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వాన్ని కోల్పోతుంది. అందువల్ల శరీరంలో అధికంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ ఫలితం లేని స్థితికి చేరినప్పుడు ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ (ఇన్సులిన్ నిరోధకత) ఏర్పడుతోంది. అధిక బరువు దగ్గరి నుంచి క్యాన్సర్ వరకు 64 రకాల జబ్బులకు ఇదే కారణమవుతోందన్న అవగాహన ఇటీవల కాలంలో పెరిగింది. అందువల్ల పిండిపదార్థాలను తక్కువగా తీసుకుంటూ.. మాంసకృత్తులు, ఆరోగ్యదాయకమైన కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరవు అంటున్నారు వైద్య నిపుణులు. దీన్నే ‘లో కార్బ్ హెల్దీ ఫ్యాట్’ – ఎల్సీహెచ్ఎఫ్ ఆహార పద్ధతిగా చెబుతున్నారు.పిండి పదార్థాలను ఎక్కువగా తింటే.. మనం తినే ఆహారం జీర్ణమై గ్లూకోజ్గా మారి, శరీర భాగాలు నిర్విరామంగా పనిచేయటానికి శక్తిగా ఉపయోగపడుతుంది. ఆహారంలో పిండి పదార్థాలు పెరిగితే రక్తంలో చక్కెర శాతాలూ పెరుగుతాయి. శరీరం ఈ చక్కెరలను కరిగించడానికి, శక్తి ఉత్పత్తి చేయటానికి కనీసం 2 నుంచి 3 గంటల సమయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియను నిర్వహించే ఇన్సులిన్ చాలినంత లేకపోయినా, సరిగ్గా పనిచేయకపోయినా రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉండదు.⇒ ఆహారం ద్వారా అందే గ్లూకోజ్లో అవసరమైనప్పుడు వెంటనే వాడుకోవటానికి వీలుగా కొంత మేరకు గ్లైకోజెన్ గా మారుతుంది. మిగిలిపోయిన అదనపు శక్తిని కొవ్వుగా మార్చి నిల్వ చేసుకునే సామర్థ్యం శరీరానికి ఉంది.⇒ గ్లైకోజెన్ .. బ్యాంకు ఖాతాలో ఎప్పుడైనా వాడుకోవటానికి సిద్ధంగా ఉండే సొమ్ములాంటిది. కొవ్వుగా మారిన గ్లూకోజ్ను.. ఫిక్స్డ్ డిపాజిట్గా చెప్పుకోవచ్చు.⇒ గ్లూకోజ్ ఒకసారి కొవ్వుగా మారితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప, తిరిగి దానికదే గ్లూకోజ్గా మారదు. ఈ కొవ్వును జీవన క్రియ ద్వారానే కరిగించి శక్తిగా మార్చగలం. ⇒ పిండి పదార్థాలు తక్కువగా, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహారం తీసుకుంటే శరీరంలో అధిక కొవ్వును సులువుగా కరిగించవచ్చు. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తింటే..ఊబకాయులు ఆహారం పరిమితం చేసినా, ఉపవాసం ఉన్నా కూడా బరువు తగ్గటం కంటే పెరుగుతారు. ఈ విచిత్రమైన పరిస్థితి ఎందుకంటే, మనకు ఎక్కువ ఆకలి వేసినప్పుడు ఇన్సులిన్ ప్రభావం అధికమై ఆహారంలోని పిండి పదార్థాలను కొవ్వుగా మార్చి నిల్వ చేస్తుంది. ఈ పరిస్థితి మారాలంటే మన ఆహారంలో అధిక సంతృప్త కొవ్వులు ఉన్న నూనె వాడాలి. తద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి, బరువు పెరుగుదలను నివారించవచ్చు. దీనికి తక్కువ పిండి పదార్థాలు ఉండే ఆహారాన్ని కలిపితే శరీరంలో ఉన్న నిల్వ కొవ్వు కూడా కరగటం మొదలవుతుంది. పిండి పదార్థాలను అతి తక్కువగా, కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకున్నప్పుడు శరీరం శక్తి వినియోగ పద్ధతి గ్లూకోజ్ నుంచి కీటోన్ బాడీస్కి షిఫ్ట్ అవుతుందని డాక్టర్ పీ వీ సత్యనారాయణ తెలిపారు. శక్తి వనరుగా (పిండి పదార్థాల ద్వారా అందే) గ్లూకోజ్కు బదులుగా (కొవ్వు పదార్థాల ద్వారా అందే) కీటోన్ బాడీస్పై శరీరం ఆధారపడుతుంది. బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీల ఆహారం తీసుకున్నప్పుడు శరీరంలో కొవ్వు నిల్వలను కరిగించి వాడుకోవటానికి శరీరం అలవాటు పడుతుంది. పిండి పదార్థాలు తక్కువగా తినటం వల్ల ఇన్సులిన్ నాణ్యత మెరుగుపడుతుంది. క్రమంగా ఇన్సులిన్ నిరోధకత సమస్య కూడా తీరుతుంది. ఈ విధంగా ఇన్సులిన్ నిరోధకతతో వచ్చిన జీవన శైలి జబ్బులు సైతం మందులు లేకుండానే సమసిపోతాయని డా. సత్యనారాయణ వివరించారు.ఏమేమి తినొచ్చు?లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్.సి.హెచ్.ఎఫ్) డైట్లో కొవ్వులు, ప్రొటీన్లు ఎక్కువగా, పిండి పదార్థాలు అతి తక్కువగా తినాలి అంతే. ఈ పరిమితుల్లో ఏయే ఆహార పదార్థాలను సమకూర్చుకోగలిగితే, ఏవి ఇష్టపడితే వాటిని తినొచ్చు. ఏయే ఆహార పదార్థాల్లో, ఏయే వంటకాల్లో మొత్తం ఈ మూడు పోషకాలు ఎనెన్ని గ్రాములు, ఎన్నెన్ని కిలో కేలరీలు ఉన్నాయో లెక్క వేసుకొని, పోషకాహార పట్టిక రాసుకొని మరీ తినాలి. మాంసాహారులు, శాకాహారులు, వీగన్లు ఎవరైనా ఈ డైట్ను అనుసరించవచ్చు. వంద గ్రాములు బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలలో 50 గ్రాములకు పైగా పిండి పదార్థాలుంటాయి కాబట్టి అవిగానీ, వాటితో వండిన వంటకాలు గానీ తినటానికి లేదు. నెయ్యి, వెన్న, కూరగాయలు, ఆకుకూరలు, గుడ్లు, గింజలు, మాంసం తినొచ్చు. మసాలాలు మామూలే. కొబ్బరి గానుగ నూనె వాడాలి. కొబ్బరి పిండి రొట్టెలు, బాదం పిండి రొట్టెలు, అవిసె పిండి రొట్టెలు తినొచ్చు.ఏ నిష్పత్తిలో తీసుకోవాలి?ప్రధానంగా మనం తీసుకునే ఆహారంలోని స్థూల పోషకాలు మూడు.. పిండి పదార్థాలు(కార్బోహైడ్రేట్లు), మాంసకృత్తులు (ప్రొటీన్లు), ఆరోగ్యదాయకమైన కొవ్వు పదార్థాలు (హెల్దీ ఫ్యాట్స్). ఎల్సీహెచ్ఎఫ్ పద్ధతి ప్రకారం.. ఉదాహరణకు.. 172 సెం.మీ. ఎత్తు, 82 కిలోల బరువు ఉన్న వ్యక్తి.. బరువు తగ్గాలనుకుంటే.. రోజువారీ తీసుకోవాల్సినవి..నికర పిండి పదార్థాలు – 20 గ్రా.(పిండి పదార్థం నుంచి పీచును మినహాయిస్తే మిగిలేవి నెట్ కార్బోహైడ్రేట్లు)మాంసకృత్తులు – 70 గ్రా.ఆరోగ్యకరమైన కొవ్వులు – 100–150 గ్రా.ఈ మూడూ కలిపి కనిష్ఠంగా 1200 నుంచి గరిష్ఠంగా 1500 క్యాలరీల వరకు తీసుకోవాలి.ఈ ఆహార విధానం అందరికీ ఒకేలా ఉండదు. అందువల్ల దీనిపై అవగాహన ఉన్న వైద్యులను సంప్రదించి, వారి పర్యవేక్షణలోనే ఈ ఆహారం, జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి మనిషికి వారి వారి అనారోగ్య సమస్యలు, ఆరోగ్య లక్ష్యాలు.. వీటన్నింటి ఆధారంగా వైద్యులు అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తారు. ఈ ఆహార నియమావళికి అలవాటు పడటానికి కొన్ని రోజుల నుంచి కొన్ని వారాలు సమయం పట్టవచ్చు.ఆహారంలో ఎక్కువ పరిమాణంలో అవసరమైన పోషకాలను స్థూల పోషకాలని, అతి తక్కువ మోతాదులో అవసరమైన వాటిని సూక్ష్మ పోషకాలని అంటాం. స్థూల పోషకాలైనా, సూక్ష్మ పోషకాలైనా ఆ వ్యక్తి వయసు, ఎత్తు, శారీరక శ్రమ అవసరాలకు తగిన మోతాదులో ఉండాలి. పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు తదితర పోషకాలను అవసరమైనంత, సమతులమైన పాళ్లలో తినాలి. కాని, మనలో చాలామంది ఈ క్రమశిక్షణ పాటించటం లేదు. ఎంత తింటే ఆరోగ్యకరం?ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ ‘మై ప్లేట్ ఫర్ ది డే’ 2024 సిఫారసుల ప్రకారం.. సగటు భారతీయ వ్యక్తి రోజులో తీసుకునే కిలోకేలరీల శక్తిలో వరి బియ్యం, గోధుమ పిండి, చిరుధాన్యాలన్నీ కలిపి 45%కు పరిమితం చేయాలి. పప్పుధాన్యాలు, గుడ్లు, మాంసాహారం 14%–15% వరకు ఉండాలి. కొవ్వు 30% కంటే తక్కువగా లేదా సమానంగా ఉండాలి. గింజలు, నూనె గింజలు, పాలు, పాల ఉత్పత్తులు 8%–10% వరకు తీసుకోవాలి.ఎంత తింటున్నాం?కేంద్ర ప్రభుత్వ ‘గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్సీఈఎస్)’ ప్రకారం 2023–24లో పట్టణ వాసులు సగటున తలసరి ఆహార వినియోగం రోజుకు 2,233 కిలో కేలరీల మేరకు ఉంది. 338 గ్రాముల పిండి పదార్థాలు (1,351 కిలో కేలరీలు. 61%), 63 గ్రాముల ప్రొటీన్లు (254 కిలో కేలరీల. 11%), 70 గ్రాముల కొవ్వు పదార్థాలు (628 కిలో కేలరీలు. 28%) తీసుకుంటున్నారు. దేశ జనాభాలో ఎక్కువ మంది సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆహారాలను (చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, బీన్స్, గింజలు, తాజా కూరగాయలు, పండ్లు) చాలా తక్కువగా తింటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ‘ఆహార జబ్బు’ల భారం 56%భారతీయులు మోస్తున్న జబ్బుల ఆర్థిక భారంలో 56.4% మేరకు అపసవ్యమైన, అసమతుల్యతతో కూడిన ఆహారం తీసుకోవటమేనని జాతీయ పోషకాహార సంస్థ (ఐసీఎంఆర్–ఎన్ఐఎన్) 2024 నాటి డైటరీ గైడ్లైన్స్లో స్పష్టం చేసింది. అసమతుల్య ఆహారం ఫలితంగా జీవక్రియలు లయ తప్పి మెటబాలిక్ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. అధిక రక్తపోటు, రక్తంలో అధిక చక్కెర, అధిక ట్రైగ్లిజరైడ్లు, తక్కువ హెచ్డీఎల్ (మంచి) కొలెస్ట్రాల్ స్థాయి, పెరిగిన నడుము చుట్టుకొలత (ఉదర ఊబకాయం).. ఈ ఐదింటిలో ఏ మూడు ఉన్నా వారికి మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్లే.సమతులాహారం, శారీరక శ్రమ ద్వారా గుండె జబ్బుల్ని, రక్తపోటు సమస్యలను తగ్గించుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్ను 80% వరకు రాకుండా జాగ్రత్తపడొచ్చు. అకాల మరణాలను చాలా వరకు నివారించుకోవచ్చని ఎన్ఐఎన్ చెబుతోంది.ఎవరి లెక్క వారికే! ఒక వ్యక్తికి పిండి పదార్థాలు, ప్రోటీన్, కొవ్వు పదార్థాలు ఎన్ని గ్రాములు/కేలరీలు అవసరం? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటుంది. వ్యక్తిని బట్టి మారిపోతుంది. మీ వ్యక్తిగత పోషక అవసరాలు మీ బరువు, మీ రోజువారీ శారీరక శ్రమ స్థాయి, మీకున్న ఆరోగ్య సమస్యలు, మీ ఆరోగ్య లక్ష్యాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇంకో ముఖ్యాంశం ఏమిటంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తున్నారు? అనే దాన్ని బట్టి కూడా పోషకాల కూర్పు, శాతం ఆధారపడి ఉంటుంది. ఆహార పద్ధతులు అనేకం ఉన్నప్పటికీ ప్రధానమైనవి రెండు రకాలు. మొదటిది: హై కార్బ్ డైట్. అంటే.. ప్రధాన శక్తి వనరుగా పిండి పదార్థాలను తీసుకోవటం. సాధారణంగా అందరూ అనుసరించే ఆహార పద్ధతి ఇదే. రెండో పద్ధతి: లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్.సి.హెచ్.ఎఫ్) డైట్. అంటే.. కొవ్వు పదార్థాలను ప్రధాన శక్తి వనరుగా తీసుకోవటం. వీటిలో ఏ ఆహార పద్ధతిని అనుసరించినా, ముఖ్యంగా మీరు ఆశించిన ఆరోగ్య లక్ష్యాలు సాధించాలంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తారు? ఎంత తినాలి? ఏది తినాలి? అనే విషయాపై నిర్ణయం తీసుకొని, ఆచరించటం ప్రారంభించాలి. ఆచి ‘తూచి’ తినాలి. ఆహార క్రమశిక్షణతో పాటు శారీరక వ్యాయామ క్రమశిక్షణను కూడా జోడించి కొనసాగించాలి. అప్పుడే మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి.మీ బీఎంఐ, బీఎంఆర్ ఎంత?శరీర బరువును తగ్గించుకోవాలనుకునే వారు మొదట చెయ్యాల్సిన పని వారి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), బాడీ మెటబాలిక్ రేట్ (బీఎంఆర్) ఎంతో తెలుసుకోవాలి. ఇటువంటి ముఖ్యమైన డేటాను తెలుసుకోవటానికిప్పుడు ‘బాడీ ఫ్యాట్ స్కేల్’ అనే డిజిటల్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆసుపత్రుల్లో ఈ పరికరాలు పెడుతున్నారు. బరువు తూచే డిజిటల్ పరికరంలోనే బీఎంఐ, బీఎంఆర్, పొట్టచుట్టూ కొవ్వు, శరీరం మొత్తంలో కొవ్వు ఎంత ఉన్నాయి వంటి చాలా వివరాలను తెలుసుకోవచ్చు. బీఎంఐ 23 కన్నా తక్కువగా ఉంటే ఆరోగ్యకరం. 30లోపు ఉంటే అధిక బరువు, 35కి మించితే ఊబకాయంగా భావిస్తారు. ఎంత అధిక బరువు ఉంటే బీఎంఆర్ అంత ఎక్కువగా ఉంటుంది. ఈ కొలమానాలను బట్టి బరువు తగ్గాలా? నార్మల్ రేంజ్లోకి రావాలంటే ఎంత తగ్గాలి? అనేది బరువుతో పాటు బీఎంఆర్ను కూడా పరిగణనలోకి తీసుకొని నిర్ణయించుకోవాలి. వ్యక్తి శరీరంలో దైనందిన జీవక్రియలకు ఎన్ని కిలో కేలరీల శక్తి అవసరమవుతోందో బీఎంఆర్ తెలియజేస్తుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే బీఎంఆర్ చూపే కేలరీల కన్నా రోజు మొత్తంలో తక్కువ కేలరీలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ఈ విధంగా కేలరీల కొరత సృష్టించినప్పుడు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను కరిగించి వినియోగించుకోవటానికి శరీరం అలవాటుపడుతుంది. ఒకవేళ తగినంత బరువు లేని వారైతే బీఎంఆర్ కన్నా ఎక్కువ కేలరీల ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గాలి, పొట్ట తగ్గాలి అనుకునే వ్యక్తి పని బీఎంఆర్ కన్నా తక్కువగా ఎన్ని కేలరీలు తినాలని నిర్ణయించుకున్న తర్వాత ఏ ఆహార పద్ధతిని అనుసరించాలన్న ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. బరువు పెరగడానికి దారితీసిన పిండిపదార్థాల కేలరీలనే ఎక్కువగా తీసుకునే ఆహార పద్ధతిలోనూ కొన్ని కేలరీలు తగ్గించి తింటే క్రమంగా బరువు తగ్గుతుంది. పిండి పదార్థాల శాతం గతం కన్నా తగ్గించి, ప్రొటీన్లను పెంచుకోవాలి. తగ్గాలి సరే.. అయితే, ఏ పిండి పదార్థాలైతే ఒంట్లో కొవ్వు ఎక్కువగా పెరగటానికి కారణమైనాయో వాటినే తగ్గించి తింటూ, వ్యాయామం చేస్తే ఫలితాలు వస్తాయి. అయితే, కొద్ది నెలలు బరువు తగ్గినా వ్యాయామం వల్ల ఆకలి ఎక్కువై, ఎక్కువ తినాల్సి వచ్చి, మళ్లీ బరువు పెరిగే ముప్పు ఉంటుంది. ఏ ఆహార పద్ధతిలో అధిక కొవ్వు నిల్వల సమస్య వచ్చిందో ఆ ఆహార పద్ధతిలోనే కొన్ని మార్పులు చేసినంత మాత్రాన గణనీయమైన ఫలితాలు సాధించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఊబకాయానికి కారణమైన బరువును, ఆ బరువుకు కారణమైన కొవ్వు నిల్వలను గణనీయమైన స్థాయిలో కరిగించుకోవాలంటే ఇన్సులిన్ నిరోధకతను తగ్గించుకునే వేరే ఆహార పద్ధతిని అనుసరించటం మేలు. లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహార పద్ధతిని అనుసరించటం ద్వారా ఆరోగ్య లక్ష్యాలను సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే, మీ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను తినటమే కాకుండా.. పిండి పదార్థాలను బాగా తక్కువగా, కొవ్వు పదార్థాలను ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా శరీర బరువు నీరసం లేకుండా, ఆరోగ్యదాయకంగా తగ్గించుకోవచ్చని ఎల్సీహెచ్ఎఫ్ నిపుణులు, సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ పీ వీ సత్యనారాయణ అంటున్నారు. ఎల్సీహెచ్ఎఫ్ డైట్తో పాటు ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ చెయ్యటంతో పాటు వ్యాయామం జోడిస్తే మరింత ఉత్తమ ఫలితాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఎల్సీహెచ్ఎఫ్ వైద్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ పద్ధతిని ఆచరించటం ద్వారా సత్ఫలితాలు సాధించటంతో పాటు కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చని ఆయన సూచిస్తున్నారు. ఇన్సులిన్ నిరోధకతే కీలకంరక్తంలో చక్కెర స్థాయిని తెలిపే హెచ్బీఏ1సి పరీక్షతో పాటు.. ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలోకి విడుదలయ్యే గ్లూకోజ్ను కణజాలానికి అందించడంలో కీలకపాత్ర నిర్వహించే ఇన్సులిన్ హార్మోన్ ఏ స్థాయిలో విడుదలవుతోంది? ఎంతసేపటికి తిరిగి సాధారణ స్థితికి వస్తోంది? అనే గణాంకాలను బట్టి ఇన్సులిన్ నిరోధకత ఎంత ఉన్నదనే విషయం నిర్ధారిస్తారు. దీన్ని నిర్ధారించడానికి ‘హోమా ఐఆర్’ అనే ఓరల్ గ్లూకోజ్ టెస్ట్ చేస్తారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తక్కువగా ఉండే వారిలో కూడా ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హెచ్బీఏ1సి పరీక్ష ద్వారా షుగర్ వ్యాధి నిర్ధారణ అయ్యేదానికి 15 సంవత్సరాలు ముందే హోమా–ఐఆర్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇన్సులిన్ నిరోధకతను తొలి దశలోనే గుర్తించి, ఆహారంలో తగిన మార్పు చేసుకుంటే షుగర్, తదనంతర గొలుసు వ్యాధుల ముప్పును తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘హోమా–ఐఆర్’ టెస్ట్లో ఇన్సులిన్ నిరోధకత (ఇన్సులిన్ రెసిస్టెన్స్) ఎంత ఉంది? ఆ వ్యక్తికి ఇతర ఆరోగ్య సమస్యల స్థితిగతులు ఎలా ఉన్నాయి? అనే విషయాలను పరిగణనలోకి తీసుకొని లోకార్బ్ హెల్దీ అండ్ హై ఫ్యాట్ డైట్లో పోషకాల కూర్పును, శాతాన్ని, వ్యాయామాన్ని డాక్టర్ సూచిస్తారు. ఇది ఏ ఇద్దరికీ ఒకేలా ఉండదు. ఎవరి ప్రత్యేక పరిస్థితులకు తగిన విధంగా వారికి ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్ సూచిస్తారు. కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువగా, పిండి పదార్థాలు అతి తక్కువగా తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు తమ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను మాత్రమే తీసుకోవాలన్న నియమం ఈ ఆహార పద్ధతిలో కూడా వర్తిస్తుంది. అంతకన్నా ఎక్కువ కేలరీలు తింటే బరువు పెరిగే ముప్పు ఏ ఆహార పద్ధతిలోనైనా ఉంటుంది. అందుకే కదా మితాహారం ముద్దు అని మన పెద్దలు చెప్పేది! లోకార్బ్ డైట్ ప్లానింగ్ ఎలా? ఉదాహరణకు 177 సెం.మీ. ఎత్తు, 59 ఏళ్ల వయసు ఉన్న పురుషుడు 82 కిలోల బరువు ఉన్నాడనుకుందాం. బీఎంఐ 28.5. బీఎంఆర్ 1678. మెటబాలిక్ ఏజ్ 62. పొట్ట చుట్టూ కొవ్వు 6 కన్నా తక్కువ ఉండాలి. కానీ, 11 ఉంది. బీపీ, షుగర్ లేదు. ఫ్యాటీ లివర్ గ్రేడ్1 ఉంది. ఇన్సులిన్ నిరోధకత ఉంది. జాగ్రత్త పడకపోతే కొద్ది సంవత్సరాల్లో షుగర్ బారినపడే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ఇదీ అతనికి ఇచ్చిన ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్.. రోజులో 1500 కిలోకేలరీలకన్నా తక్కువ ఆహారం తినాలి. నికర పిండి పదార్థాలు 20 గ్రాములకు మించకూడదు. 60 గ్రాములు ప్రొటీన్లు, 100–150 గ్రాముల కొవ్వు పదార్థాలను తీసుకోవాలి. క్రమశిక్షణతో ఈ ఆహార నియమాలతో పాటు వ్యాయామం చేస్తూ ఉంటే 6 నెలల్లోనే బీఎంఐ 23.5కు, పొట్ట 7కు తగ్గింది. రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్వంటకం ఏదైనా, అందులో ఉపయోగించే ప్రతి పదార్ధానికి సంబంధించిన స్థూల పోషక విలువలను విధిగా లెక్కించాలి. పొద్దున్నే ఆ రోజు తినాలనుకునే పదార్థాలతో పట్టిక తయారు చేసుకోవాలి. ఏవి తిన్నా రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్ పరిమితుల మేరకే తినాలి. వాటిలో నికర పిండి పదార్థం (పిండి పదార్థంలో నుంచి పీచును తీసేస్తే మిగిలేది నికర పిండి పదార్థం) ఎంత? ప్రొటీన్లెన్ని? కొవ్వు పదార్థం ఎంత? అని సరిచూసుకొని, తూకం వేసుకొని, ముందే పట్టిక రాసుకోవటం అతి ముఖ్యమైన విషయం. ఆ తర్వాతే ఏది తినాలో, ఎంత తినాలో నిర్ణయించుకొని అంతే తినాలి. నెయ్యి లేదా వెన్న, కాఫీ (లేదా టీ) డికాక్షన్/ వేడి నీటితో కలిపి, గిలకొట్టి తయారు చేసుకొని తీసుకునే ‘బుల్లెట్ కాఫీ’ ఈ ఆహార పద్ధతిలో చాలా కీలకమైన ఉదయకాలపు శక్తి వనరు. 50 గ్రా. నెయ్యి/వెన్న, 25 గ్రా. పాల మీగడ, 5 గ్రా. గానుగ కొబ్బరి నూనె, 100 ఎం.ఎల్. కాఫీ డికాక్షన్ కలిపి దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకునే ‘బుల్లెట్ కాఫీ’లో 1.3 గ్రా. నికర పిండి పదార్థాలు, 1.4 గ్రా. ప్రొటీన్, 45.9 గ్రా. కొవ్వు పదార్థాలు, 418 కిలోకేలరీల శక్తి ఉంటాయి. వ్యక్తి అవసరాలను బట్టి నెయ్యి/వెన్న, పాల మీగడల మోతాదులో హెచ్చు తగ్గులు చేసుకోవచ్చు. రోజంతా తీసుకునే కేలరీల్లో దాదాపు మూడింట ఒకవంతు బుల్లెట్ కాఫీ ద్వారానే సమకూర్చుకోవచ్చు. దాహాన్ని బట్టి తాగునీటిని పుష్కలంగా తాగాలి. కూరగాయలు, ఆకుకూరలు, గింజలు, పిక్కలను విధిగా, తగు మాత్రంగా రోజువారీ మెనూలో చేర్చుకుంటే సూక్ష్మపోషకాల లోపం రాకుండా ఉంటుంది. వంటకాలు వ్యక్తిగత ఆహారపు అలవాట్లు, ఆసక్తులు, లభ్యత, కొనుగోలు శక్తిని బట్టి ఏ రోజుకారోజు వారానికి ఒక షెడ్యూల్ పెట్టుకొని పునరావృతం చేసుకోవచ్చు. ఇతరత్రా ఆహార పదార్థాలు రోజుకోలా మారుతుంటాయి. బుల్లెట్ కాఫీ మాత్రం రోజూ తీసుకోవాలి. మాంసాహారులకు ఈ ఆహార పద్ధతి కొంత సులువు. గుడ్డు కూడా ముట్టని శాకాహారులైతే చాలా రకాల ప్రత్యామ్నాయ ఆహారాలు సమకూర్చుకొని తినాల్సి వస్తుంది. వీగన్లకు ఇంకా కొంచెం కష్టం. ఫుడ్ సప్లిమెంట్లు వాడుకోవాల్సి ఉంటుంది. అతిగా తిన్న పిండి పదార్థాల వల్ల శరీరంలో పెరిగిపోయిన కొవ్వు నిల్వలను కొవ్వు ప్రధాన ఆహారంతో కరిగించాలంటే తెలివైన ప్రణాళిక, రాజీలేని క్రమశిక్షణతో కూడిన ఆచరణే వజ్రాయుధాలు!హెచ్చరిక: ఈ కథనం ఉద్దేశం ఎల్సీహెచ్ఎఫ్ డైట్ గురించి కొంతమేరకు అవగాహన కలిగించటానికి మాత్రమే. మరింత లోతైన అవగాహన కోసం ‘లో కార్బ్ స్కూల్’ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూడండి. ఎల్సీహెచ్ఎఫ్ డైట్పై అవగాహన గల వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ ఆహార పద్ధతిని అనుసరించబూనుకోవటం ఆశించిన ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చకపోగా అనర్థాలకు దారితీసే అవకాశాలు మెండుగా ఉంటాయి. జాగ్రత్త. లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ ‘ఆరోగ్యకరమైన’ ట్రెండ్రోజూ మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ఉండేది పిండి పదార్థాలే. వీటివల్ల మనం రోగాల బారిన పడుతున్నాం. కడుపులోకి వెళ్లిన పిండి పదార్థాన్ని పచనం చేసి, గ్లూకోజ్గా మార్చి, శరీరానికి శక్తినిచ్చే పని ఇన్సులిన్ అనే హార్మోన్ ద్వారా జరుగుతుంది. అవసరానికి మించి పిండి పదార్థాలు, హానికరమైన కొవ్వు పదార్థాలను మనం రోజూ తినడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వాన్ని కోల్పోతుంది. అందువల్ల శరీరంలో అధికంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ ఫలితం లేని స్థితికి చేరినప్పుడు ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ (ఇన్సులిన్ నిరోధకత) ఏర్పడుతోంది. అధిక బరువు దగ్గరి నుంచి క్యాన్సర్ వరకు 64 రకాల జబ్బులకు ఇదే కారణమవుతోందన్న అవగాహన ఇటీవల కాలంలో పెరిగింది. అందువల్ల పిండిపదార్థాలను తక్కువగా తీసుకుంటూ.. మాంసకృత్తులు, ఆరోగ్యదాయకమైన కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరవు అంటున్నారు వైద్య నిపుణులు. దీన్నే ‘లో కార్బ్ హెల్దీ ఫ్యాట్’ – ఎల్సీహెచ్ఎఫ్ ఆహార పద్ధతిగా చెబుతున్నారు.పిండి పదార్థాలను ఎక్కువగా తింటే.. మనం తినే ఆహారం జీర్ణమై గ్లూకోజ్గా మారి, శరీర భాగాలు నిర్విరామంగా పనిచేయటానికి శక్తిగా ఉపయోగపడుతుంది. ఆహారంలో పిండి పదార్థాలు పెరిగితే రక్తంలో చక్కెర శాతాలూ పెరుగుతాయి. శరీరం ఈ చక్కెరలను కరిగించడానికి, శక్తి ఉత్పత్తి చేయటానికి కనీసం 2 నుంచి 3 గంటల సమయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియను నిర్వహించే ఇన్సులిన్ చాలినంత లేకపోయినా, సరిగ్గా పనిచేయకపోయినా రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉండదు.⇒ ఆహారం ద్వారా అందే గ్లూకోజ్లో అవసరమైనప్పుడు వెంటనే వాడుకోవటానికి వీలుగా కొంత మేరకు గ్లైకోజెన్ గా మారుతుంది. మిగిలిపోయిన అదనపు శక్తిని కొవ్వుగా మార్చి నిల్వ చేసుకునే సామర్థ్యం శరీరానికి ఉంది.⇒ గ్లైకోజెన్ .. బ్యాంకు ఖాతాలో ఎప్పుడైనా వాడుకోవటానికి సిద్ధంగా ఉండే సొమ్ములాంటిది. కొవ్వుగా మారిన గ్లూకోజ్ను.. ఫిక్స్డ్ డిపాజిట్గా చెప్పుకోవచ్చు.⇒ గ్లూకోజ్ ఒకసారి కొవ్వుగా మారితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప, తిరిగి దానికదే గ్లూకోజ్గా మారదు. ఈ కొవ్వును జీవన క్రియ ద్వారానే కరిగించి శక్తిగా మార్చగలం. ⇒ పిండి పదార్థాలు తక్కువగా, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహారం తీసుకుంటే శరీరంలో అధిక కొవ్వును సులువుగా కరిగించవచ్చు. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తింటే..ఊబకాయులు ఆహారం పరిమితం చేసినా, ఉపవాసం ఉన్నా కూడా బరువు తగ్గటం కంటే పెరుగుతారు. ఈ విచిత్రమైన పరిస్థితి ఎందుకంటే, మనకు ఎక్కువ ఆకలి వేసినప్పుడు ఇన్సులిన్ ప్రభావం అధికమై ఆహారంలోని పిండి పదార్థాలను కొవ్వుగా మార్చి నిల్వ చేస్తుంది. ఈ పరిస్థితి మారాలంటే మన ఆహారంలో అధిక సంతృప్త కొవ్వులు ఉన్న నూనె వాడాలి. తద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి, బరువు పెరుగుదలను నివారించవచ్చు. దీనికి తక్కువ పిండి పదార్థాలు ఉండే ఆహారాన్ని కలిపితే శరీరంలో ఉన్న నిల్వ కొవ్వు కూడా కరగటం మొదలవుతుంది. -
అర్ధరాత్రి అతిథి
ఆ రాత్రి నాకు ఏదో చప్పుడుకి మెలకువ వచ్చింది. లేచి లైట్ వేసి పడక గదిలోంచి హాల్లోకి వచ్చాను. ఓ కొత్త వ్యక్తి నాకు కనపడ్డాడు. అతను ఎవరో, అక్కడ ఎందుకు ఉన్నాడో నాకు అర్థమైంది. ఇంట్లోకి ఎలా ప్రవేశించాడా అని చూశాను. వంటగదిలోని వెంటిలేటర్కున్న రెండు ఇనప కడ్డీలు వంచబడ్డాయి. అతని చేతిలోని రెండున్నర అడుగుల పొడవున్న పంపు గొట్టంతోనే వాటిని వంచాడని ఊహించాను. ‘‘డబ్బు.’’ అతను చెప్పాడు. ‘‘డబ్బు?’’ ‘‘డబ్బు, నగలు ఇస్తే హాని చేయకుండా వెళ్ళిపోతాను. లేదా...’’ చేతిలోని ఆయుధాన్ని ఝళిపించాడు.గోడకి వేలాడే నా షోల్డర్ బేగ్ని అందుకుని జిప్పుని లాగాను. అందులోంచి తీసిన పర్స్ చూపించాను. దాన్ని తనవైపు విసిరేయమన్నట్లుగా సౌంజ్ఞ చేశాడు. ఆ పని చేశాను. వంగి దాన్ని అందుకుని అందులోని డబ్బుని చూసి మొహం చిట్లించాడు. ‘‘నేను అడిగింది బిచ్చం కాదు.’’ కోపంగా చెప్పాడు. ‘‘ఇంట్లో ఉన్నదంతే.’’‘‘ఇంట్లో రెండు వందల ఏభై మాత్రమే ఉందంటే నమ్మను. నగలు ఎక్కడున్నాయి?’’ అడిగాడు. ‘‘నగలు లేవు. ఇంటి పైభాగం కొత్తగా కట్టించాను. నగలు బేంక్లో తాకట్టులో ఉన్నాయి. గోల్డ్ లోన్ తీసుకున్నాను.’’అతని మొహంలో అసంతృప్తి కొట్టొచ్చినట్లుగా కనిపించింది. ‘‘ఈ ఇంట్లో నువ్వు, నేను తప్ప ఇంకెవరూ లేరని నాకు తెలుసు. నువ్వు మళ్ళీ నీ ఫేమిలీ ఫోటోలోని అందరినీ చూడాలనుకుంటే నేను అడిగింది ఇచ్చి పంపు.’’ కసురుతూ చెప్పాడు. ‘‘నేను అబద్ధం చెప్పలేదు.’’ ‘‘బేంక్ గోల్డ్ లోన్ కాగితాలు చూపించు.’’ ఆ తెలివైన దొంగ కోరాడు. ‘‘అవి బేంక్ లాకర్లో ఉన్నాయి.’’ ‘‘లాకర్ తాళం చెవి చూపించు.’’ రెట్టిస్తూ అడిగాడు. నా భార్య బుర్రలా నాది చురుగ్గా ఆలోచించదు. అతన్ని భౌతికంగా ఓడించలేను. నా కష్టార్జితాన్ని అతనికి అప్పగించలేను. ‘‘ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? నువ్వు చెప్పింది కట్టు కథని నాకు తెలుసు. మీ పడక గదిలో బట్టల అలమర లోపల గోడకి ఫిక్స్ చేసిన ఐరన్ సేఫ్ని తెరు.’’ రుసరుసలాడుతూ ఆజ్ఞాపించాడు. అందులోని నా భార్య నగల విలువ పాతిక లక్షలకి తక్కువ ఉండదు. ‘‘పద.’’ ‘‘మా ఆవిడ దాని తాళంచెవి ఎక్కడ పెట్టిందో నాకు తెలీదు.’’ ‘‘సరే. ఆవిడకి ఫోన్ చేసి అడుగు.’’‘‘ఇప్పుడా?’’ ‘‘భార్యకి భర్త ఏ సమయంలోనైనా ఫోన్ చేయొచ్చు. ముఖ్యంగా తన ప్రాణం మీదకి వచ్చిన సందర్భంలో. మీ ఆవిడతో తాళం చెవి గురించి తప్ప ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే తల పగులుతుంది. అందులో ముఖ్యమైన కాగితాలు ఉన్నాయని, రేపు వాటి అవసరం ఉందని గుర్తొచ్చిందని చెప్పు. నువ్వు చెప్పిందంతా నేను నమ్మానని అనుకోక. నీకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ మాత్రమే ఇస్తున్నాను. నేనీ ఇంట్లోంచి ఈ రాత్రి డబ్బు, బంగారంతో లేదా రక్తం తడిసిన చేతులతో వెళ్ళడం మాత్రం ఖాయం. స్పీకర్ ఫోన్ ఆన్ చేసి మాట్లాడు.’’ కఠినంగా చెప్పాడు. నేను మా ఆవిడకి ఫోన్ చేశాను. ఆమె ఆన్సర్ చేసింది. ‘‘బేంక్లో తాకట్టు పెట్టిన బంగారం రసీదు అవసరమైంది. మన లాకర్ తాళంచెవి ఎక్కడుంది?’’ అడిగాను. ‘‘మర్చిపోయారా? అక్వేరియంలో కత్తి పక్కనే.’’ ‘‘హాల్లో అక్వేరియంలో ఉంది.’’ లైన్ కట్ చేసి అతనివైపు తిరిగి చెప్పాను. ‘‘కత్తేమిటి?’’ అడిగాడు. ‘‘ఫిష్ టేంక్లోని చేపలకి ఐరన్ అందాలని ఓ కత్తిని ఉంచాం. అది ఎవరూ వెతకని చోటని అందులో లాకర్ తాళంచెవి ఉంచుతామన్న సంగతి మర్చిపోయాను.’’ అతను నా వెంట హాల్లోకి నడిచాడు. అక్వేరియంలో ఆరంజ్, నీలం రంగు చేపలు తిరుగుతున్నాయి. నేను నీళ్ళల్లో చేతిని ఉంచబోతే అరిచాడు. ‘‘ఆగు. కత్తిని తీద్దామనా? నేను తీస్తాను.’’ నన్ను పక్కకి నెట్టి అక్వేరియం నీళ్ళలో తన ఎడమ చేతిని ఉంచాడు. అరగంట తర్వాత ఆ దొంగని అంబులెన్స్లోకి ఎక్కిస్తూంటే చెప్పాను.‘‘అతనికి స్టింగ్ రే చేప ముల్లు గుచ్చుకుందని డాక్టర్కి చెప్పండి.’’ ఆ అక్వేరియంలోని చేపల్లో ఆ చేప ఖరీదైంది. కొరడాలా ఉండే దాని తోకతో కొడితే, దాని చివర ఉన్న విషపు ముల్లు ద్వారా శరీరంలోకి విషం ఎక్కి క్షణాల్లో మనిషికి స్పృహ తప్పుతుంది. మా ఆవిడ నాలా కాదు. ఏం జరుగుతోందో ఇట్టే ఊహించింది. అతనే అందులో చేతిని ఉంచాలని, కత్తిని ఉంచినట్లు అబద్ధం చెప్పింది. చెప్పాగా. ఆవిడ మెదడంత చురుగ్గా నా బుర్ర పని చేయదు.ఆ లాకర్ తాళంచెవి మంచానికి ఉన్న చిన్న రహస్య అరలో ఉందని నాకు తెలుసని మా ఆవిడకి తెలుసు. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
ఇంటికీ నగధగలు
ఆభరణాల అలంకరణ ఇంటికీ వర్తిస్తుందని ఈ డిజైన్స్ చూస్తేనే అర్ధమవుతుంది. సంపన్నతకు అద్దం పట్టే ఈ జ్యూలరీ స్టైల్ డెకర్ ప్రత్యేక ఈవెంట్స్కు మరిన్ని హంగులను చేకూరుస్తుంది. సాధారణంగా కర్టెన్ అలంకరణ కిటికీలకు, గుమ్మాలకు స్టయిలిష్ టచ్ను జోడించడానికి ఫ్యాబ్రిక్, డిజైన్స్ ఎంపికలో శ్రద్ధ కనబరచేవారు. ఇప్పుడు వాటి మీదుగా క్రిస్టల్ లేదా ముత్యాలు, రంగు రాళ్లు, ఇతర పూసలతో చేసిన డిజైన్లు టై–బ్యాక్లు, హోల్డ్బ్యాక్లు, రింగులు అంటూ కర్టెన్ ఆభరణాలు మరింత ఆకట్టుకునేలా అందుబాటులోకి వచ్చేశాయి. ముత్యాల వరసవాడుకలో ఇవి ఎంతో సౌలభ్యంగా ఉంటాయి. కృత్రిమ ముత్యాలు లేదా పూసల వరుసలు ప్లెయిన్ కర్టెన్లకు మరింత హంగునిస్తాయి.క్రిస్టల్ వెలుగులుకొన్ని డిజైన్లలో కాంతిని ఆకర్షించడానికి, గది అలంకరణకు విలాసవంతమైన అనుభూతిని జోడించడానికి వివిధ పూసలు, స్ఫటికాలు లేదా రైన్స్టోన్లు మంచి మెరుపునిస్తాయి.లోహాల ధగధగలుఅందమైన డిజైన్లతో లోహపు ఆభరణాలను కర్టెన్లు ఉన్న గోడలకు సెట్ చేస్తారు. కొన్నిసార్లు బంగారం లేదా వెండి లోహాలతో పూసలు, క్రిస్టల్స్ జత చేసినవీ ఇంటికి ధగధగలనిస్తాయిహుక్ రింగ్స్ కర్టెన్ హార్డ్వేర్ కూడా ‘నగల‘ సౌందర్యంతో అందుబాటులోకి ఉంటున్నాయి. మెటల్ లేదా ప్లాస్టిక్లో ఇవి లభిస్తాయి. ఈ రింగులు బంగారం, వెండి, రాగి లోహాలతో ఉంటాయి. వీటికి డిజైనర్లు ఆభరణాల హంగులన్నీ అద్దుతున్నారు. ఈ ఆభరణాలు కర్టెన్ రాడ్ చివరన, డ్రేప్లపైన సెట్ చేస్తారు. వీటిలో ఎన్నో డిజైన్ల వరకు మార్కెట్లో లభిస్తున్నాయి. లోహాలు, నాణ్యత, డిజైన్లను బట్టి వందల రూపాయల నుంచి ఎంత ఖరీదైనా తమ స్థాయిని బట్టి ఏర్పాటు చేసుకునే వీలు ఈ ‘నగలకు’ ఉంది. – ఎన్నార్ -
కెమెరా ఆఫ్.. భూమి ఆన్!
బిగ్బాస్లో కనిపించిన నిజమైన మనసు, సహజమైన వెలుగు భూమి శెట్టిని ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇప్పుడు ఆ నిరాడంబరతలో దాగి ఉన్న ధైర్యం, నిశ్శబ్దంగా పెరిగిన శక్తి ‘మహాకాళి’గా మారి సినీ ప్రపంచంలో ఒక కొత్త రూపాన్ని సృష్టించబోతోంది. ఆ ప్రయాణంలోని విశేషాలన్నీ ఆమె మాటల్లోనే మీ కోసం. నేను కర్ణాటకలోని కుందాపురలో పుట్టాను. సముద్రపు గాలి, ఇంటి ముందున్న చెట్ల నీడ, చిన్న చిన్న పండుగల హడావుడి అవే నా బాల్యపు ఆనందాలు.అమ్మానాన్న భాస్కర్ శెట్టి, బేబీ శెట్టిలది సాధారణ జీవితం, వాళ్లు నేర్పిన విలువలే నేడు నన్ను ఉన్నతంగా తీర్చిదిద్దాయి.ఇంజినీరింగ్ చేశాను. కాని, నా మనసు మాత్రం పూర్తిగా యాక్టింగ్పైనే ఉండేది. అలా నా నటన ప్రయాణం టీవీతో మొదలైంది. ‘కిన్నరి’ సీరియల్లో చేసిన ‘మణి’ పాత్ర నాకు సినిమాల ప్రపంచానికి తలుపులు తెరిచింది. 2019లో ‘బిగ్ బాస్ కన్నడ’లోకి వెళ్లినప్పుడు ఎలాంటి అంచనాలు లేవు కాని, నా నిజమైన వ్యక్తిత్వం ప్రేక్షకుల హృదయాన్ని తాకింది. రన్నరప్గా బయటికి వచ్చినా కూడా, నాకు వచ్చిన ప్రేమ మాత్రం ఒక విజేతలా నిలిచింది.ఆ తర్వాత వచ్చిన ‘ఇక్కట్’ సినిమా ప్రేక్షకుల అభిమానం రెట్టింపు చేసింది. ఆ ప్రేమే నాకు సినిమా మీదున్న నమ్మకాన్ని మరింత బలపరచింది. తర్వాత వచ్చిన ‘షరతులు వర్తిస్తాయి’, ‘కింగ్డమ్’ వంటి ప్రాజెక్టులు నా నటనకు కొత్త షేడ్స్ ఇచ్చాయి. ప్రతి పాత్ర నాకు నాలో ఉన్న మరో భూమిని పరిచయం చేసింది.∙ఇప్పుడు నా ముందున్న పెద్ద మైలురాయి ‘మహాకాళి’. సూపర్హీరో ఫిల్మ్లో ఫీమేల్ లీడ్గా నిలవడం నాకు ఒక గౌరవం మాత్రమే కాదు. ఒక బాధ్యత కూడా. ఈ పాత్ర నా శక్తులను కొత్తగా పరీక్షించబోతోంది.∙నా రోజువారీ జీవితం మాత్రం చాలా సింపుల్. నాట్యం, కథలు, సంగీతం ఇవే నా హ్యాపీ స్పేస్.కెమెరా ముందు నటిస్తున్నంతసేపు ‘భూమి శెట్టి’ అనే వ్యక్తిని మరచిపోతాను. కాని, కెమెరా ఆఫ్ అయ్యాక మళ్లీ కుందాపుర అమ్మాయిగా నా చిన్న ప్రపంచంలోకి వెళ్తాను.∙అభిమానులు పంపే ప్రేమే నా ఎనర్జీ. వాళ్లే నా నమ్మకం. వాళ్ల వల్లే నా ప్రయాణం ప్రతి రోజూ మరింత అందంగా మారుతోంది. -
చిట్కాలున్నా... చికిత్సే ముఖ్యం!
సోషల్ మీడియా వచ్చాక ఓ ఉత్పాతమూ వచ్చిపడింది. ‘పాత పేషెంట్ కొత్త డాక్టర్తో సమాన’మంటూ అప్పట్లో ఓ సామెత లాంటి వాడుక ఉండేది. దాన్ని నిజం చేస్తూ పాత పేషెంట్లూ అంతకుమించి పాపులర్ సెలిబ్రిటీలైన సోనాలీ బెంద్రే, మనీషా కోయిరాలా, క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్, హాలీవుడ్ మోడల్ లీజా రే వంటి జనాల్లో మంచి క్రేజ్ ఉన్న వ్యక్తులు... ‘ఆటోఫేజీ’ అనే ఓ సైంటిఫిక్ పదాన్ని... ఇటీవలి పాపులర్ చిట్కా మంత్రా పదమైన ‘వెల్నెస్ చికిత్స’తో కలగలిపి ‘వెల్నెస్’ అద్భుతాల తాలూకు ప్రభావాలను సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారు. ఉపవాసాలూ, డీటాక్స్ విధానాల్లాంటివే అద్భుత మాయా–మంత్రాలంటూ ప్రజలకు ఇంపుగా ప్రజెంట్ చేస్తున్నారు. అసలు అన్నం కంటే పక్కన అంచుకుపెట్టుకుని నంజుకునే చిరుతిండినే నిజభోజనంగా వర్ణిస్తున్నారు. వాళ్ల మాటల మాయల్లో పడుతున్న జనాలు... అసలు వాస్తవాల కంటే అద్భుతాలనే ఎక్కువగా నమ్ముతున్నారు. ఫలితంగా ఈ ‘మిరాకిల్స్ థెరపీ’లను ఎక్కువగా నమ్ముతూ ఉండే అదే క్యాన్సర్కు అద్భుత చికిత్సేమోనంటూ అమాయక ప్రజలు అసలుకే మోసం తెచ్చుకుంటున్నారు. ఈ విషయంపై క్యాన్సర్ నిపుణులైన డాక్టర్ల మాటేమిటో చూద్దాం.వాళ్లు క్యాన్సర్ను జయించిన యోధులే. అద్భుత మనోబలంతో క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కొన్న మహామహులే. తాము క్యాన్సర్ను అధిగమించాక తాము అనుసరించిన చిట్కాలను వెల్లడిస్తూ వాళ్లు చెబుతున్న కొన్ని మాటలేమిటో చూద్దాం. → ఇంటర్మిట్టెంట్ ఫాస్టింగ్ (రోజుకు నియమిత వేళల్లోనే తిని... మిగతా సమయమంతా ఉపవాసంలో గడపడం), యాంటీ ఇన్ఫ్లమేషన్ డైట్ తీసుకోవడం, కొద్దిపాటి వ్యాయామంతో తాను క్యాన్సర్నుంచి బయటపడ్డానంటోంది ప్రముఖ బాలీవుడ్– టాలీవుడ్ ఫేమ్ సోనాలి బెంద్రే. → క్లీన్ ఈటింగ్ ప్రాసెస్ చేయని, రిఫైన్ చేయని, పొట్టుతీయని ముడి ధాన్యాలతో వండిన భోజనం)తో పాటు యోగా, ప్రాణాయామం వంటి వాటితో క్యాన్సర్ను జయించానన్నది ప్రముఖ నటి మనీషా కోయిరాలా మాట. → కీమోతో పాటు... క్రమశిక్షణతో కూడిన జీవనమూ భోజనమూ, దేహంలోని విషాలను శుభ్రపరిచే డీ–టాక్స్ ఆహార విహారాలూ తననుంచి క్యాన్సర్ను దూరం చేశాయంటాడు క్రికెటర్ యూవీ (యువరాజ్ సింగ్). → శాకాహారంతో కూడిన భోజనం, ధ్యానం (మెడిటేషన్), యోగా ఆయుర్వేద మార్గాల పయనం వల్లనే తనకు క్యాన్సర్ నయమయ్యిందంటోంది ప్రముఖ మోడల్, లీజా రే. ఇక్కడ ఈ ప్రముఖులు చెప్పిన చిట్కాలన్నీ ‘ఆటోఫేజీ’ అనే ప్రక్రియను వేగవంతం చేశాయనీ... అందువల్లనే తమకు క్యాన్సర్ వేగంగా, ప్రభావపూర్వకంగా నయమైందంటూ చెబుతున్న సోషల్ మీడియా వేదికగా చెబుతున్న మాటలు సాధారణ ప్రజల మెదళ్లలోకి తేలిగ్గా ఎక్కుతున్నాయి. వాళ్ల మనసుల్లోకి సులువుగా వెళ్తున్నాయి. అయితే జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులైన ఆ వెల్నెస్ మార్గాలు మంచివే. కానీ అవే క్యాన్సర్ను పూర్తిగా నయం చేయలేవని అంటున్నారు. ‘ఆటోఫేజీ’ అనే ఇటీవలి సైంటిఫిక్ పరిభాషకు చెందిన ఆ పదం అర్థం ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉందన్నది వైద్యప్రముఖుల మాట. దాంతోపాటు ‘అపాప్టోసిస్’, ‘ ప్రోటీయోజోమ్’ అనే పదాలకు అర్థాలు వాటి వెనక పరమార్థాలూ తెలుసుకుంటే కేవలం అద్భుతాలనిపించే చికిత్సప్రక్రియలు... (మిరాకిల్ రెమిడీలు) మాత్రమే కాకుండా వాస్తవ చికిత్సలకు తోడుగా... ఈ అనుబంధ మార్గాలూ జతగూడినప్పుడే అసలు ఫలితాలు వస్తాయంటున్న డాక్టర్ల మాటల ఆంతర్యాలను తెలుసుకుందాం...అసలు ‘ఆటోఫేజీ’ అంటే ఏమిటి? దేహంలో ఎప్పటికప్పుడు కణాలు పుడుతూ, చనిపోతూ ఉంటాయి. అందులో చనిపోయిన కణాలతో పాటు కొన్ని నిరర్థకమైనవీ, వ్యర్థమైనవీ ఉంటాయి. మన దేహంలోని శుభ్రం చేసే వ్యవస్థ ఇలాంటి మృతకణాలూ, నిరర్థక, వ్యర్థకణాలను తొలగిస్తూ ఉంటుంది. ఇలా ఆరోగ్యకరమైన కణాల మనగడను సుగమం చేస్తూ, ఈ మృత, వ్యర్థ, నిరర్థక కణాలను తినేసే ప్రక్రియనే ‘ఆటోఫేజీ’ అంటారు. ఈ సెలిబ్రిటీల మాటేమిటంటే... పైన చెప్పిన ఉపవాసాలూ, ప్రాణాయామ ధ్యానాలూ, డీటాక్స్ ప్రక్రియల వంటి వెల్నెస్ మార్గాల ద్వారా మన ఆరోగ్యకరమైన కణాలన్నీ ‘క్యాన్సర్ కణాలనే’ తినేస్తే? అప్పుడు క్యాన్సర్ హరించుకుపోయి ఆరోగ్యం దక్కుతుందనేలా వారి సోషల్ మీడియా సందేశాలు ప్రజలకు చేరుతున్నాయి. అంతకంటే సంక్లిష్టమైనది ఆటోఫేజీ...నిజానికి ‘క్యాన్సర్ బయాలజీ’లో ఆటోఫేజీ ప్రక్రియ అంతకంటే చాలా సంక్లిష్టమైనది అంటున్నారు ఆధునిక వైద్యచికిత్సకులు. ఒకసారి అదేమిటో చూద్దాం. ∙కణంలో మరిన్ని సూక్షమైన అంతర్గతమైన భాగాలు (ఆర్గనెల్స్) దెబ్బతిన్నప్పుడు ఆ కణం మనుగడ కష్టం. అది చనిపోయే ప్రక్రియలో దేహం దాన్ని శుభ్రం చేసి తొలగిస్తుంది. అందులోని ప్రోటీన్ శిథిలాలను ఒకచోట చేర్చి ఊడ్చేస్తుంది. అలా చనిపోయిన లేదా బలహీనపడి నిరర్థకం కాబోతున్న కణాలను దేహం తొలగించివేస్తుంది. దీన్నే ‘ఆటోఫేజీ’ అంటారు.అదీ మరచిపోతున్న ముప్పు... ఇదీ చేస్తున్న తప్పు... ఇక్కడ సెలిబ్రిటీలు ఒక విషయం మరచిపోతున్నారు. తమకున్న పరిమితమైన వైద్యపరిజ్ఞానంతో అసలు విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఉపవాసాలు చేస్తున్నప్పుడు తన జీవక్రియల కోసం దేహంలోని కణాలు తమకు కావాల్సిన ఆహారం కోసం మృత/వ్యర్థకణాలనూ, క్యాన్సర్ కణాలనూ తినేస్తాయని భావిస్తున్నారు. కానీ ఇక్కడ వారు ఒక ముప్పును విస్మరిస్తున్నారు. క్యాన్సర్ కణం కూడా ఒక కణమే. దానికీ ఆహారం కావాలి. ఉపవాసం ద్వారా దానికి అవసరమైన ఆహారాలు అందనప్పుడు అది కూడా ఆరోగ్యకరమైన కణాలనూ తినేయడం మొదలుపెట్టేందుకు అవకాశాలు ఎక్కువ. అంతేకాదు... మామూలు కణం కంటే కూడా అది మరింత చురుగ్గా, మరింత వేగంగా ఆరోగ్యకరమైన కణాలను కబళించవచ్చు. పైగా ఆహారం అందకపోవడంతో దేహాన్ని రక్షించుకునే వ్యాధి నిరోధక వ్యవస్థ మరింత బలహీనపడితే క్యాన్సర్ కణజాలాలే మామూలు ఆరోగ్యవంతమైన కణాలను తినేయడం ప్రారంభిస్తే అది మొదటికే మోసం వచ్చే పరిస్థితి! అంటే ఉపవాసం వల్ల క్యాన్సర్ ఎండిపోవడానికి (ఫాస్టింగ్ స్టార్వ్స్ క్యాన్సర్) బదులుగా తామే ఆకలితో మాడాల్సి వస్తుందని తెలిసినప్పుడు క్యాన్సర్ కణాలు ఇంకా ఇంకా కుతంత్రాలతో (కన్నింగ్గా) ఆరోగ్యవంతమైన కణాలను తినేయడం మొదలుపెట్టే ప్రమాదలెన్నో పొంచి ఉంటాయి.ఆటోఫేజీ లాంటిదే ఆటాప్టోసిస్... సెలిబ్రిటీలు ఆటోఫేజీ గురించి సోషల్ మీడియాలో మాట్లాడటం వల్ల దాని గురించి మామూలు ప్రజలకు తెలియరావచ్చు. కానీ... ఈ రంగంలో ఇలా ఆటోఫేజీలా పనిచేస్తూ క్యాన్సర్ కణాలను తినేసేందుకు దోహదపడే పరిశోధనలూ, అలాంటి పరిజ్ఞానాలూ, పరిభాషా... ఇలాంటివి వాళ్లకు తెలియని అంశాలెన్నో ఇంకా ఉన్నాయి. ఉదాహరణకు అటాప్టోసిస్, యూబిక్విటిన్– ప్రోటియోజోమ్ సిస్టమ్ వంటివి. ఉదాహరణకు అటాప్టోసిస్ అంటే ఏమిటో చూద్దాం. ఎవరినైనా బాగా కించపరిచి, కోలుకోలేనంతగా నిందిస్తే వాళ్లేం చేస్తారు? తట్టుకోలేక ఆత్మహత్యకూ ఒడిగట్టవచ్చు కదా! అచ్చం అపాప్టోసిస్ ప్రక్రియలో కూడా అలాంటిదే జరుగుతుంది.యుబిక్విటిన్ – ప్రోటియోజోమ్ సిస్టమ్ అంటే... యుబిక్విటిన్ అనేది ఏ ప్రోటీన్కు అంటుకుంటుందో దాన్ని కాలపరిమితి ముగిసిపోయిన లేదా చెడిపోయిన / లోపభూయిష్టమైన ప్రోటీన్గా గుర్తించవచ్చు. అది కణంలో ఉన్నప్పుడు కణం సమతౌల్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే యుబిక్విటిన్ ప్రోటీన్ కణం నుంచి తొలగిపోవాలి. అప్పుడే కణం చురుగ్గా నార్మల్ కణంగా ఉంటుంది. అలా కణం నుంచి యుబిక్విటిన్ను తొలగించడానికి తోడ్పడేందుకు ఉద్దేశించిన వ్యవస్థ... అంటే యుబిక్విటిన్ ప్రోటీన్ను ధ్వంసం చేసేందుకు తోడ్పడే వ్యవస్థే ప్రోటియోజోమ్ వ్యవస్థ. అంటే ప్రోటియోజోమ్ అన్నది ప్రోటీన్ డిస్ట్రక్షన్ సిస్టమ్ అన్నమాట. ఈ యుబిక్విటిన్ అనేది అలాగే ఉంటే అది చెడిపోయిన కణానికి అమరత్వం ఇస్తుంది. ఒకవేళ ఆ చెడిపోయిన కణాలకు అమరత్వం ఉంటే అవి తొలగిపోవు. కాబట్టి ఈ ప్రోటియోజోమ్... తన డబుల్ నెగెటివ్ మార్గంలో వాటిని గుర్తించి ధ్వంసం చేస్తుంది. అలా చెడుకణాలూ లేదా దెబ్బతిన్న/లోపభూయిష్టమైన కణాలను తొలగిస్తుంది. ఇతి జరిగేందుకు దోహదపడేదే ‘యుబిక్విటిన్ – ప్రోటియోజోమ్ వ్యవస్థ’గా చెబుతారు.కొన్ని మందులతో ప్రోటీయోజోమ్ ప్రక్రియను అడ్డుకుని క్యాన్సర్ను తగ్గించడం ఇలా... ఈ యుబిక్విటిన్– ప్రోటియోజోమ్ ప్రక్రియను గుర్తించిన వైద్య శాస్త్రవేత్తలు ‘బార్టెజోమిబ్’ అలాగే ‘కార్ఫిల్జోమిబ్’ వంటి ప్రోటియోజోమ్ ఇన్హిబిటర్లను తయారు చేసి ప్రయోగించారు. ఈ మందులతో ‘మైలోమా’ అనే క్యాన్సర్ నయం కావడం మొదలైంది. ఇలాంటి మందులను ( ప్రోటియోజోమ్ ఇన్హిబిటర్స్ను) మరిన్ని కనుగొనడం ద్వారా అనేక రకాల క్యాన్సర్లను తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా చూసినప్పుడు ఆటోఫేజీ, అపాప్టోసిస్, ప్రోటీయోజోమ్ అనేవి చాలా సంక్లిష్టమైన ప్రక్రియలు. అవి కొనసాగే మార్గాలను (పాత్ వేస్) అనేక మందుల సహాయంతో నిర్వహితమయ్యేలా చేయడం వల్ల క్యాన్సర్ కణం తనంతట తాను మటుమాయమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికి ఇది ‘మైలోమా’లోనే సఫలీకృతమైంది. కానీ ఇంకా కొన్ని క్యాన్సర్ల (సాలిడ్ ట్యూమర్స్) విషయంలోనూ, మరిన్ని క్యాన్సర్లలోనూ విజయవంతం కావాల్సి ఉంది. ఇందుకోసం రకరకాల కాంబినేషన్లలో అపాప్టోసిస్ మాడ్యులేటర్లు, ఇమ్యూనో, టార్గెట్ థెరపీ ప్రక్రియలూ, ప్రోటియోజోమ్ ఇన్హిబిటర్లు రూపొందించడంలో వైద్యశాస్త్రజ్ఞులు నిమగ్నమై ఉన్నారు.ఆ అపోహలన్నీ అలా ఆవిర్భవించినవే... ఎన్నో ఏళ్లుగా అటాప్టోసిస్ ప్రక్రియను క్యాన్సర్ను జయించేందుకు ఒక ప్రత్యామ్నాయ ‘నేచర్ క్యూర్’ ప్రక్రియగా జనం అపోహపడుతున్నారు. కొన్ని ఆహారాల ద్వారా క్యాన్సర్ లాంటి లోపభూయిష్టమైన కణాలు తమంతట తామే తమ మరణశాసనం రాసుకునేలా చేయడం (యాక్టివేటెడ్ / ప్రోగ్రామ్డ్ సెల్ డెత్)గా చాలామంది పొరబడుతుంటారు. కానీ అది పొరబాటు. క్యాన్సర్ కణాలు ఎంత జిత్తులమారివి అంటే... అవి ‘అటాప్టోసిస్’నూ తప్పించుకోగలవు. అదెలాగంటే... సెల్ను అపాప్టోసిస్కు గురిచేసే ప్రక్రియలో క్యాన్సర్ కణంలోని పవర్హౌజ్ అయిన మైటోకాండ్రియాను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది. అదే సమయంలో ‘బీసీఎల్–2’ అనే కుటంబానికి చెందిన మరో ప్రోటీన్ విడుదలై అది యాంటీ అపాప్టోటిక్ ప్రక్రియ ద్వారా క్యాన్సర్ కణంలోని మైటోకాండ్రియాలోకి రసాయనాలు వెళ్లకుండా చేయడం ద్వారా తనను తాను రక్షించుకుంటుంది.చివరగా... ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ప్రభావవంతమైన క్యాన్సర్ చికిత్సలు రేడియోథెపీ, కీమోథెరపీ, శస్త్రచికిత్సలే. వీటి తర్వాతే ఉపవాసాలూ, యోగా, ధ్యానం, డీ–టాక్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారాలూ, పోషకాహారాలూ, నేచురోథెరపీలను అనుబంధంగా ఉపయోగించుకోవాలి. ఏ సెలిబ్రిటీలు చెప్పినా అవి ప్రత్యామ్నాయ చిట్కాలే తప్ప ప్రధాన చికిత్సలు కావని అందరూ తెలుసుకోవాలంటున్నారు డాక్టర్లు.అపాప్టోసిస్ అంటే... క్యాన్సర్ అంటేనే అది చెడిపోయిన / నార్మల్గా ఉండని కణం అన్న విషయం తెలిసిందే. ఏవైనా రసాయనాల ద్వారా ఓ చెడిపోయి దెబ్బతిన్న కణాన్ని మరింతగా అవమానించేలా చేస్తే అది బాగా కుంగి కుచించుకుపోయి నశించిపోయే పరిస్థితే ‘అపాప్టోసిస్’ అని చెప్పవచ్చు. నిజానికి చాలా సంక్లిష్టమైన జీవరసాయన పద్ధతికి ఇక్కడ చెప్పినది మామూలు ప్రజానీకానికి అర్థమయ్యేలా చెప్పేందుకు ఇదో సింపుల్ వివరణ అనుకోవచ్చు. అంటే కొన్ని రసాయనాలను ఉపయోగించి ఓ కణాన్ని అవమానించడం ద్వారా దాని మరణాన్ని అదే తెచ్చుకునే ‘ ప్రోగ్రామ్డ్ సెల్ డెత్’ కార్యక్రమం ఈ అపాప్టోసిస్.నిర్వహణ: యాసీన్ -
కాస్ట్లీ అభిమానం.. కాసులు కుమ్మరిస్తేనే ఆ మహాభాగ్యం!
ఫుట్బాల్ లెజెండ్ మెస్సీతో ఒక్క ఫొటోకి 10 లక్షలంట!.. “అంత ఖర్చా?” అని ఆశ్చర్యపోయినవాళ్లు ఎందరో.కానీ ఆ ఒక్క ఫొటో కోసం టికెట్లు క్షణాల్లో అమ్ముడుపోయాయని తెలుసా?అటు స్టేడియం, థియేటర్ గేట్ల వద్ద పొడవైన క్యూలు సరిపోదన్నట్లు ఇటు ఆన్లైన్లో వీఐపీ ప్యాకేజీల హడావిడి.గుండెల నిండా ఉండాల్సిన అభిమానం.. ఇప్పుడు కాసులు కుమ్మరించి కొనుగోలు చేసే ట్రెండ్గా మార్కెట్లో దూసుకుపోతోంది..తమ అభిమాన తారలను, ఆటగాళ్లను.. గ్రౌండ్లలో, స్క్రీన్లపైనే చూడడంతో సరిపోదన్నట్లు వ్యవహరిస్తున్నారు కొందరు. ప్రత్యక్షంగా కలిసి వీలైతే ఓ ఫొటో.. కుదిరితే కలిసి భోజనం చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వేల నుంచి లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఫుట్బాల్ రారాజుగా పేరున్న మెస్సీతో ఫొటో కోసం రూ.10 లక్షల దాకా ఖర్చు ఇందులో భాగమే!. అది ఎలాగంటే..🐐గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా మెస్సీ భారత్లో పర్యటిస్తున్నారు. ఆయనతో మీట్ అండ్ గ్రీట్ ప్యాకేజీ కోసం రూ.9.95 లక్షలు + జీఎస్టీ కలిపి రూ.10 లక్షల దాకా అవుతోంది. ఈ ప్యాకేజీలో మెస్సీతో షేక్ హ్యాండ్, ప్రొఫెషనల్ గ్రూప్ ఫొటో(ఆరగురు దాకా ఉండొచ్చు.. నో సెల్ఫీ.. నో సోలో ఫొటో!), ప్రైవేట్ లౌంజ్ యాక్సెస్ (ఒక గంట పాటు, ప్రత్యేక ఫుడ్ & బేవరేజెస్తో) అన్నీ కలిపే ఉంటాయి. ఆయన ఎలాగూ వీవీఐపీ కాబట్టి ఆయనకు ఉండే భద్రత నడుమే ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే అవి మనకూ వర్తిస్తాయన్నమాట. సాధారణంగా.. బ్రాండ్ అంబాసిడర్గా మెస్సీ కొన్ని సెకన్లు కనిపిస్తే చాలని కోట్లు కమ్మరిస్తుంటాయి కంపెనీలు. సో.. జస్ట్ ఫొటోకే అంత ఖర్చా?.. అని అనుకోవడానికి ఏమాత్రం లేదు. 😲మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు ఖర్చవుతున్నట్లే.. మరో ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో విషయంలోనూ భారీగానే ఈ ఛార్జ్ ఉంటోంది. ఫుట్బాల్ స్పెషల్ ఈవెంట్స్లో పాస్తో కలిపి ఫొటో కోసం రూ. 5-7 లక్షల దాకా వసూలు చేస్తుంటారు. పాప్ సింగర్లు టేలర్ స్విఫ్ట్ ప్రదర్శన పాస్తో పాటు ఫొటో కోసం రూ.40 వేల నుంచి 80 వేల మధ్య, అలాగే.. మరో పాప్ సెన్సేషన్ జస్టిన్ బీబర్తో ఫొటో, సంతకం కోసం లక్ష దాకా ఛార్జ్ చేస్తున్నారు. కొరియాకు చెందిన బీటీఎస్ బ్రాండ్ మీట్ అండ్ గ్రీట్ ప్యాకేజీ రూ.2 లక్షలకు తక్కువ కాకుండా ఉన్నాయి మరి.👉ఎంతసేపు హాలీవుడ్ రేంజేనా?.. మన దగ్గర అలాంటి తారలు లేరని అనుకుంటున్నారా?. అక్కడికే వస్తున్నాం. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, షారూఖ్ ఖాన్, రణ్బీర్ కపూర్, అలియా భట్, దీపికా పదుకొనే.. కొందరు సెలబ్రిటీల విషయంలో ఇలాంటి చార్జీలు రూ.లక్షకు తక్కువ కాకుండానే ఉన్నాయి. ఇక్కడ గమనించదగ్గ విషయం ఒకటి ఉంది. 😇ఈ డబ్బులు సెలబ్రిటీలు వసూలు చేసేవి కావు. కార్పొరేట్ ఈవెంట్స్, బ్రాండ్ ప్రమోషన్స్, చారిటీ ఈవెంట్లలో భాగంగా ఏర్పాటు చేసే మీట్ ద గ్రీట్లో భాగంగా వసూలు చేస్తారు. ఇందులో వీఐపీ ఆతిథ్యం, స్పెషల్ పాస్, బ్యాక్ స్టేజ్ ఫొటోలు.. వగైరాతో బోనస్గా ఫొటో దిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అవేవీ వాళ్లు వాళ్ల జేబుల్లో వేసుకునేందుకు నిర్ణయించే చార్జీలు కావన్నమాట. (నోట్: పైన పేర్కొన్న ఛార్జీలు ఫిక్స్ చేసినవి కావు.. ఈవెంట్లను.. డిమాండ్ను బట్టి మారే అవకాశమూ లేకపోలేదు). ☠️ఇది ప్రత్యేక వీఐపీ అనుభవం మాత్రమే. ఛార్జీలు ఉంటాయి కాబట్టి సాధారణ ప్రేక్షకులకు ఈ అవకాశం దక్కేది చాలా తక్కువ. పైగా వీటిని నిర్వాహకులు పక్కా వెబ్సైట్ల నుంచే నిర్వహిస్తుంటారు. అదే సమయంలో ఇక్కడ స్కామ్లకు అవకాశం లేకపోలేదు. అందుకే అధికారిక టికెట్ ప్లాట్ఫారమ్ల ద్వారా కాకుండా ఇతర మార్గాల్లో కోనే ప్రయత్నంలో మోసపోకూడదని చెబుతుంటారు. 🥱ఇంత చెప్పాక కూడా.. లక్షల తగలేసి ఇదేం వెర్రితలలు వేసిన అభిమానం రా అయ్యా?.. అంతెందుకు బుజ్జీ అనుకుంటున్నారా?.. ఎవరి ఇష్టం వారిది కదా!. సినీ తారలు క్యాజువల్గా బయట తిరిగినప్పుడు కూడా రిక్వెస్ట్ చేసి దిగొచ్చు. ఒకవేళ వాళ్లు నో చెప్పడమో.. ఫోన్లు లాక్కోవడమో.. కుదరితే నాలుగు పీకడమో చేశారాంటరా?.. అప్పుడు ఏ మహేష్బాబునో, వెంకీ మామనో, ఐకాన్ స్టార్ బన్నీనో, రౌడీ విజయ్దేవరకొండనో లేదంటో పరభాషల్లో రజినీకాంత్, విజయ్, విజయ్ సేతుపతినో, మమ్మూటీ, మోహన్లాల్ మాదిరి అభిమానుల కోసం స్పెషల్ సెషన్లు నిర్వహించి ఫ్రీగా ఫొటోలకు ఫోజులు ఇచ్చే తారలు బోలెడు మంది ఉండనే ఉన్నారు. అసలు ఇవన్నీ ఎందుకు.. ఏఐ ఉండనే ఉందిగా! అంటారా?.. మ్.. అది మీ ఇష్టం ఇక.. చెలరేగిపోండి. -
ఎందుకొచ్చిన తలనొప్పి ఇది?
ఒక విచిత్రమైన విషయం తెలుసా? మన ఎమోషన్స్కూ, ఆలోచనలకూ, ఉపాయాలకూ, బాధలకూ, సంతోషాలకూ కారణమైన మెదడులో ఉండేదంతా కేవలం కొవ్వుల కణజాలం మాత్రమే. అయినా ఒంట్లో ఎక్కడెక్కడి నొప్పులనూ తాను ఇట్టే తెలిసేలా చేస్తుంది కదా... కానీ ఇంతా చేసి ఇలా అన్ని నొప్పుల్నీ తెలియజేసే ఈ మెదడుకు మాత్రం నొప్పి తెలియదు. తనను కోస్తున్నా తనకు నొప్పే తెలియని ఇదే మెదడు... మిగతా ‘తల’నొప్పులను మాత్రం ఎందుకు తెలియజేస్తుంది? అసలు తలనొప్పి అంటే ఏమిటి? అది ఎందుకు వస్తుంది?... ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు.మామూలుగా తలనొప్పి అనగానే తేలిగ్గా తీసుకున్నా... ‘అబ్బ... అదో తలనొప్పి రా’ అనే వాడుక మాట వల్ల అదెంత దుర్భరంగా ఉంటుందో, ఎలా మన రోజునూ, సంతోషాలనూ పాడుచేస్తుందో చెప్పకనే చెప్పినట్లవుతుంది. అన్నట్టు తలనొప్పి వచ్చినప్పుడు ఓ ఆసక్తికరమైన ప్రశ్న కూడా ఉద్భవిస్తుంది. అదేమిటంటే... మెదడుకు నొప్పి అనే అనుభూతే కలగక΄ోతే... తలనొప్పి సమయంలో ఇంత బాధ ఎందుకు కలుగుతుంది? అప్పుడు తలలో ఏం జరుగుతుందంటే... ఎప్పుడెప్పుడు...? నాడీ వ్యవస్థలో ఏమైనా సమస్యలున్నా, మైగ్రేన్ వంటి సమస్య లేదా ఏదైనా తీవ్రమైన మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఉన్నప్పుడు చాలామందిలో తలనొప్పి వస్తుంటుంది. అంతేకాదు... ఈ తలనొప్పుల రహస్యాలను ఇంకా ఎందరో పరిశోధకులూ, వైద్యశాస్త్రవేత్తలూ శోధిస్తూ తలనొప్పుల కారణాలను అన్వేషిస్తూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటున్నారు. తోడు తెచ్చుకునే ఇతర నొప్పులెన్నో! సాధారణంగా తలనొప్పి ఒంటరిగా రాకుండా... మరికొన్ని నొప్పులతో పాటు వస్తుంటుంది. ఉదాహరణకు... ∙వికారం ∙ముక్కు కారుతుండటం కళ్ల నుంచి నీళ్లు కారుతుండటం ∙దేనిపైనా దృష్టి కేంద్రీకరించలేని సమయాల్లో... ఇలా పైన పేర్కొన్న లక్షణాలతోపాటు తలనొప్పి ఎందుకు వస్తుంటుందన్నది స్పష్టంగా తెలియదు. కానీ ఇప్పటికి తెలిసిందల్లా... దేహాన్ని రక్షించే ప్రక్రియలో భాగంగానే ఇలా జరుగుతోందన్న విషయం మాత్రం స్పష్టం. ఎందుకు వస్తాయి? సాధారణంగా శరీరం ఏదో రకమైన ఒత్తిడి.. శారీరకమైన ఒత్తిడి లేదా భావోద్వేగాల వల్ల లేదా పర్యావరణపరమైన ఒత్తిడుల వల్ల కావచ్చు. మెదడు, మెడ చుట్టూ ఉండే నరాలు, రక్తనాళాలు చాలా సున్నితమైన మార్పులకూ తేలిగ్గా ప్రతిస్పందించేలా ఉంటాయి. దాంతో పైన పేర్కొన్న ఏ మార్పులు కలిగినా వెంటనే ఇరిటేట్ అయి నొప్పిని కలిగించేలా చేస్తాయి. వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, కౌమారసమయంలో హార్మోన్లలో వచ్చే మార్పులు, నిద్రలేమి, ఒంట్లో నీరు తగ్గడం (డీహైడ్రేషన్), ఆహారం తీసుకోక΄ోవడం, మోతాదుకు మించి కెఫిన్ తీసుకోవడం వంటి వాటితో తలనొప్పులు రావచ్చు. అలాగే తీవ్రమైన భావోద్వేగాలకు లోనుకావడం వల్ల కూడా తలనొప్పిని ప్రేరేపిస్తుంది. ఉదాహరణకు బాగా ఉద్విగ్నతకు లోనుకావడం, తీవ్రంగా ఎక్సైట్ కావడం, తీవ్రమైన విచారంలో మునిగి΄ోవడం వంటి చర్యలు మెదడులోని కొన్ని రసాయనాల సమతుల్యతను భగ్నం చేస్తాయి. కండరాల్లో ఒత్తిడిని కలిగిస్తాయి. ఇవన్నీ కలిసి తలనొప్పులను ప్రేరేపిస్తాయి. ఒక్కోసారి వాతావరణంలో తీవ్ర మార్పు... ఉదాహరణకు ఒక ప్రదేశంలో ఎక్కువగా ఉన్న వాతావరణ ఒత్తిడి కారణంగా సైనస్లలో ఒత్తిడి పెరిగి అది ముఖం కండరాల్లో ముఖ్యంగా నుదురు వెనకనుండే ప్రదేశం, చెంపలు, కళ్ల దగ్గర ఉండే కండరాల్లో టెన్షన్ వృద్ధి చేయడం వల్ల కూడా తలనొప్పి రావచ్చు. నివారణ / చికిత్స తలనొప్పులకు చికిత్స అందించాలంటే ముందుగా దానికి నిర్దిష్టమైన కారణం ఏదో తెలుసుకోవాలి. మైగ్రేన్ లాంటి తీవ్రమైన, డాక్టర్ దగ్గర చికిత్స అందించాల్సిన తలనొప్పి మినహా చాలా రకాల తలనొప్పులు సింపుల్గా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్లనే తగ్గి΄ోతాయి. ఉదాహరణకు నీళ్లు ఎక్కువగా తాగుతూ దేహాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం లాంటి సాధారణ సూచనలతోనూ తగ్గుతాయి. ఇక వేళకు తినడం, వేళకు నిద్ర΄ోవడం వల్ల నాడీవ్యవస్థలో సమతౌల్యత, క్రమం తప్పని వ్యాయామం వల్ల ఒత్తిడి తగ్గడం వంటి చర్యలతో చాలావరకు నివారితమవుతాయి లేదా అవి వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయి. దీనికి తోడుగా యోగా, రిలాక్సేషన్ టెక్నిక్స్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్లతో ఒత్తిడి తగ్గించుకోవడం ద్వారానూ నివారించుకోవచ్చు. చికిత్స విషయానికి వస్తే... ఒకటి రెండుసార్లు పెయిన్ కిల్లర్స్ వాడాక అప్పటికీ తలనొప్పలు వస్తూనే ఉంటే.... దానికి ఇంకేదో కారణం (అండర్ లైయింగ్ కాజ్) ఉంటుందని గ్రహించి, దానికి చికిత్స తీసుకోవాలి. ఇక మైగ్రేన్కు డాక్టర్లు అప్పటికప్పుడు నొప్పిని తగ్గించేందుకు ఒక రకం, మళ్లీ మళ్లీ రాకుండా ఉండేందుకు మరో రకం... ఇలా రెండు రకాల మందులు వాడతారు. ఇలా తలనొప్పులకు కారణాలు తెలుసుకునే దానికి తగ్గ చికిత్స తీసుకోవడం ద్వారా తలనొప్పులు తగ్గుతాయి. – యాసీన్తలనొప్పి అంటే ఏమిటి?తలనొప్పిని అర్థం చేసుకోవాలంటే మొదట మెదడు నొప్పిని అనుభవించదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే మెదడులో నొప్పిని తెలుసుకునే పెయిన్ రిసె΄్టార్స్ ఉండవు. దాంతో మెదడుకు గాయమైనా లేదా మెదడును కోస్తున్నా అది నొప్పిని అనుభవించదు. ఇటీవల కొన్ని సందర్భాల్లో మెదడుకు సర్జరీ చేస్తుంటే బాధితుడికి సినిమా చూపిస్తూ శస్త్రచికిత్స నిర్వహించామంటూ న్యూస్పేపర్లలో, టీవీల్లో చూసిన సంఘటనలు చాలామందికి గుర్తుండే ఉంటాయి. అయితే మెదడు చుట్టూ ఉండే అనేక పొరలు, రక్తనాళాలు, వాటిని రక్షించే కణజాలం, నాడీతంత్రులు, నరాల్లో నొప్పిని గ్రహించే పెయిన్ రిసె΄్టార్స్ వల్లనే తలనొప్పి అనుభవంలోకి వస్తుంది.మైగ్రేన్ అంటే ఏమిటి?మైగ్రేన్ అనేది తలనొప్పుల్లో చాలా తీవ్రంగా నొప్పిని కలగజేస్తుంటుంది. తలబద్దలవుతున్నట్లుగా వచ్చే ఈ తలనొప్పితో పాటు వికారం, వాంతులు, వెలుతురు చూడలేక΄ోవడం/ శబ్దాలు వింటుంటే చికాకు, కళ్ల ముందు మిరిమిట్లు గొలుపుతున్నట్లుగా వింతకాంతులు ఇలాంటి లక్షణాలూ కలగలసి బాధను మరింత తీవ్రతరం చేస్తాయి. ప్రతి పదకొండు మంది పిల్లల్లో ఒకరిని బాధించే ఈ మైగ్రేన్ వల్ల చాలామంది పిల్లలు చదువులో వెనకబడతారు. ఆడుకోలేరు, గదిలోంచి కదల్లేనంతగా బాధపడుతుంటారు. తమకు సరిపడని ఏదో అంశం పిల్లలను ట్రిగర్ చేయడం వల్ల వచ్చే ఈ తలనొప్పిలో మెదడులోని నొప్పిని తెలిపే పాత్వేస్ అవసరానికంటే ఎక్కువగా... అంటే మరింతగా ప్రతిస్పందించడం వల్ల నొప్పి కలుగుతుంది. తల్లిదండ్రుల్లో ఈ వ్యాధి ఉన్నవారి పిల్లల్లో ఇది అనువంశీకంగా కూడా రావచ్చు. తీవ్రమైన ఎండ, గాఢమైన వాసనలు, చెవులు బద్దలయ్యే శబ్దాలు, వేళకు తినక΄ోవడం / వేళకు నిద్ర΄ోక΄ోవడం వంటి అంశాలు మైగ్రేన్ను ప్రేరేపించవచ్చు. -
ఉత్సాహానికి ఉల్లాసానికి లైన్ డ్యాన్సింగ్
డాన్స్ చేయడమంటేనే ఉత్సాహం. అందరూ కలిసి ఒక వరుసలో చేస్తూ ఉంటే భలే ఉల్లాసం. ఇవాళ రేపు లైన్ డాన్సింగ్ చిన్నా పెద్దల్లో ట్రెండ్ అవుతోంది. మన పల్లెల్లో ఎప్పటి నుంచో కోలాటం, భజనల్లోఉండే లైన్డాన్స్ ఇప్పుడు ఫిట్నెస్ మంత్రగా ఉంది. వివరాలు.చిన్నప్పుడు పాఠశాలల్లో ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు టీచర్లు పిల్లల చేత డ్యాన్స్ చేయించేవారు. అందర్నీ ఒక వరసలో నిలబెట్టి, వారికి తగ్గ స్టెప్పులు నేర్పించి, అందరూ ఒకేలా చేసేందుకు శిక్షణ ఇచ్చేవారు. దీన్ని ‘లైన్ డ్యాన్సింగ్’ అనేవారు. అందరూ ఒకే లైన్ లో నిల్చుని చేసే డ్యాన్స్ ఇది. ప్రస్తుతం ఇది సరికొత్త ట్రెండ్గా మారింది. చిన్నాపెద్దా, యువత, ముసలి అనే తేడా లేకుండా చాలామంది ఇందులో పాల్గొంటున్నారు. ఈ లైన్ డ్యాన్స్ ను వీడియోలు తీసి నెట్లో ట్రెండ్ అవుతున్నారు.ఈ ట్రెండ్ ఎలా మొదలైంది?లైన్ డ్యాన్సింగ్ అనేది కొత్త పద్ధతి కాదు. అయితే కొవిడ్ అనంతర కాలంలో ఈ డ్యాన్స్ ట్రెండ్గా మారింది. ఒంటరితనంతో ఇబ్బంది పడేవారు, తోడు లేదని బాధపడేవారు, ఇతర మానసిక సమస్యలున్నవారు ఒకచోట చేరి లైన్ డ్యాన్స్ క్లబ్స్ ఏర్పాటు చేసుకున్నారు. వరుసగా నిలబడి, సంగీతానికి తగ్గట్లు లయబద్ధంగా నృత్యం చేయడం ద్వారా తాము ఒంటరివాళ్లం కాదు అనే భావనను పెంచుకున్నారు. మెల్లగా ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో చాలామంది ఈ లైన్ డ్యాన్సింగ్ను ఒక విధానంగా పాటిస్తున్నారు. అందరిముందూ డ్యాన్స్ చేసేందుకు భయపడేవారు, సిగ్గు, మొహమాటం కలిగినవారికి ఇది సౌకర్యవంతంగా మారింది. డ్యాన్స్ రాకపోయినా ఇతరుల నుంచి స్టెప్స్ నేర్చుకొని నాట్యం చేయడం మొదలుపెట్టారు.శారీరక ఆరోగ్యానికి మేలుగా..లైన్ డ్యాన్సింగ్ అనేది శారీరక ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఇందులో భారీ స్టెప్స్, స్పీడ్ మూమెంట్స్ ఉండవు. చేసేవారి వయసు, వారి శరీరాకృతి, వయసును బట్టి కొందరు ఈ లైన్ డ్యాన్సింగ్కి డ్యాన్స్ కంపోజ్ చేస్తుంటారు. ఒక్కోసారి ఎవరికి నచ్చినట్లు వారు కూడా డ్యాన్స్ చేయొచ్చు. ఒకరితో కలిసి మరొకరు డ్యాన్స్ చేయడం వల్ల శరీరంలోని పలు సమస్యలు దూరమవుతాయి. యువత ఎక్కువగా కొత్త రకాల స్టెప్స్ ఫాలో అవుతుండగా, వయసు పైబడినవారు నిదానంగా, హాయిగా సాగే డ్యాన్స్ ని ఇష్టపడుతున్నారు. వారి ఆరోగ్యాన్ని బట్టి, వారికి అనువైన రీతిని ఎంచుకుంటున్నారు. ఇలా చేయడం ద్వారా కీళ్లనొప్పులు, నడుమునొప్పి తగ్గి శరీరం చురుగ్గా ఉంటుందని వారు అంటున్నారు.మానసిక ఆరోగ్యానికి ఊతంలైన్ డ్యాన్స్ కేవలం శారీరక ఆరోగ్యాన్నే కాదు, మానసిక ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్తుంది. అందరూ కలిసి డ్యాన్స్ చేయడం ద్వారా శరీరంలో నొప్పి, బాధ తగ్గించే రసాయనాలు విడుదలై వారిని ఉల్లాసంగా ఉంచుతాయి. ఈ నృత్యం చేసిన తర్వాత తమలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, తమలో ఆందోళనలు తగ్గాయని అంటున్నారు. లైన్ డ్యాన్స్ చేసేవారే కాదు, చూసేవారు కూడా ఆహ్లాదాన్ని ΄÷ందుతున్నామని అంటున్నారు. మానసిక సమస్యలతో బాధపడుతున్నవారికి కొందరు వైద్యులు ఈ డ్యాన్స్ చేయమని సలహా ఇస్తున్నారు.సామాజిక బంధాలూ పదిలంలైన్ డ్యాన్సింగ్ ద్వారా సామాజిక బంధాలూ పదిలమవుతున్నాయి. ఒంటరిగా బాధపడే లైన్ డ్యాన్స్ చేయడం ద్వారా ఇతరులతో కలిసిపోతున్నారు. తమ మనసులోని బాధల్ని దూరం చేసుకుంటున్నారు. సుమారు 43 శాతం మంది యువత ఇదే మాట చెప్తున్నారు. ఈ లైన్ డ్యాన్స్ తమకు బోలెడంత మంది మిత్రుల్ని దగ్గర చేసిందనేది వారు చెప్పే మాట. వయసు మళ్లినవారు సైతం ఒంటరితనాన్ని దూరం చేసుకునేందుకు ఇటువంటి లైన్ డ్యాన్స్ క్లబ్లలో చేరుతున్నారు. ఇతర వ్యాపకాలతో పోలిస్తే మానసిక ఆందోళన, ఒంటరి భావనలు దూరం చేసుకునేందుకు ఇది మేలైన మార్గం అని నిపుణులు అంటున్నారు. -
పెద్దవారికీ కావాలి జి.పి.ఎస్.
మతిమరుపు, అలై్జమర్స్, మనస్తాపం, ప్రమాదాలు... ఇంట్లో పెద్దవాళ్లు కనపడకుండా పోవడానికి ఎన్నో కారణాలు. వారిని పట్టుకోవడం ఎలా? రెండు రోజుల క్రితం ముంబైలో 79 ఏళ్ల వృద్ధురాలు కనపడకుండా పోతే మనవడు ఆమె మెడ గొలుసులో బిగించిన జి.పి.ఎస్.ను యాక్టివేట్ చేసి ఆమెఆ దాపున ఉన్న ఆస్పత్రిలో స్పృహ లేకుండా పడి ఉందని తెలుసుకున్నాడు. వయో వృద్ధులు తప్పి పోతే వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి మార్కెట్లో జి.పి.ఎస్. ట్రాకర్లు ఉన్నాయి. రోజులు బాగలేని ఈ కాలంలో వీటి అవసరం ఎక్కువగా ఉంది.ముంబయికి చెందిన 79 ఏళ్ల సైరాబీ ఇటీవల ఒకరోజు ఈవెనింగ్ వాక్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అలా వెళ్లిన మనిషి తిరిగి రాలేదు. ఏమయ్యారో తెలీదు. చుట్టుపక్కలప్రాంతాలు వెతికినా కనిపించలేదు. సైరాబీని ఓ బైక్ గుద్దేయడంతో ఆమెను స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఒంటరిగా బయటకు వచ్చిన ఆమె వివరాలు అక్కడున్న ఎవరికీ తెలియలేదు. అయితే ఆమె ఆచూకీ ఎక్కుడుందో ఇంటి వారిని పట్టిచ్చింది ఆమె మెడలో ధరించిన నెక్లెస్లోని జీపీఎస్.మనవడి ముందు చూపువయసులో పెద్దవారు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోతే ఆందోళనగానే ఉంటుంది. మార్గమధ్యంలో వారికేమైందని కలవరం మొదలవుతుంది. సైరాబీ ఇంట్లో అదే పరిస్థితి నెలకొంది. అయితే ఆమె మనవడు మహమ్మద్ వసీం ఆమె వేసుకున్న నెక్లెస్లో రహస్యంగా జీపీఎస్ ట్రాకర్ ఇన్ స్టాల్ చేశాడన్న విషయం ఎవరికీ తెలియదు. వృద్ధులు రకరకాల కారణాల వల్ల ఇల్లు విడిచి పెట్టి వెళుతుంటారు. లేదా దారి తప్పుతుంటారు. అందుకే మనవడు ముందు చూపుతో ట్రాకర్ అమర్చాడు. ఆ పని మేలు చేసింది. మనవడు వెంటనే ట్రాకర్ స్విచ్ ఆన్ చేయగా, వారింటికి 5 కి.మీల దూరంలో ఉన్న కేఈఎమ్ ఆసుపత్రిని చూపించింది. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆమె తలకు గాయమైందని, ఆరోగ్యం కుదురుగా ఉందని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఇలా నిత్యం అనేకమంది వృద్ధులు తప్పిపోయి ఆచూకీకి దూరమవుతున్నారు. అటువంటి వారికి జీపీఎస్ ట్రాకర్ మేలు చేస్తోంది.నెక్లెస్ జీపీఎస్ ట్రాకర్‘నెక్లెస్ జీపీఎస్ ట్రాకర్’ ఇటీవల కాలంలో అనేకమందికి చేరువైంది. నగలకుండే లాకెట్ల లోపల ఇమడ్చగలిగే ఈ చిన్న పరికరం మనం ఎక్కడున్నది, ఎక్కడికి వెళ్తున్నది స్మార్ట్ ఫోన్ ద్వారా ట్రాక్ చేస్తుంది. పైకి మామూలు నగలలాగే కనిపిస్తూ ఉండటం వల్ల అలంకరణకూ లోటూ ఉండదు. ఒంటరిగా బయటకు వెళ్లే మహిళలు, చిన్నారులు, వృద్ధులు, మతిమరుపు కలిగినవారు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్న వారికి ఇది చాలా ఉపకరించే పరికరం. వాళ్లు ఎక్కడైనా తప్పిపోయినా, జరగరానిది జరిగినా, అపహరణకు గురైనా వెంటనే ఆచూకీ తెలుసుకోవచ్చు. ఒంటరిగా దూరప్రయాణాలు చేసేవారు, అడవి, కొండలు, ఎడారులు వంటి దూర ప్రాంతాలకు వెళ్లేవారు తప్పిపోకుండా వీటిని వినియోగించొచ్చు. ఏదైనా నేరాలు జరిగినా, అనుకోని ఘటనలు జరిగినప్పుడు సాక్ష్యాలుగా ఇవి పోలీసుశాఖకు మేలు చేయనున్నాయి. ధరలు అందుబాటులోనే..జీపీఎస్ ట్రాకర్ నెక్లెస్ ధరలు అందుబాటులోనే ఉంటాయి. బేసిక్ ట్రాకింగ్ నెక్లెస్ కనీస ధర రూ.3 వేల నుంచి రూ.4 వేల దాకా ఉంటుంది. మధ్యస్థ స్థాయిలో రూ.6 వేల నుంచి రూ.10 వేల దాకా ఉంటుంది. ఎక్కువ ఆప్షన్ ్స ఉన్న హైఎండ్ ట్రాకర్ కావాలంటే రూ.10 వేల నుంచి రూ.15 వేల దాకా ఖర్చు చేయాల్సి ఉంటుంది. -
సూపర్స్టార్ రజనీకాంత్ ఫిట్నెస్ సీక్రెట్..! ఇప్పటికీ యువ హీరోలా..
తమిళ సినిమా ఐకాన్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ కుర్రహారోల మాదిరిగా అంతే ఫిట్గా ఉండటమే కాదు, స్టైలిష్గా డ్యాన్స్లు కూడా చేస్తుంటారు. ఏడు పదుల వయసులోనూ అంతే స్ట్రాంగ్ పర్సనాలిటి మెయింటైన్ చేస్తున్న సూపర్స్టార్ డైట్ సీక్రెట్ తెలిస్తే ఆశ్చర్యపోతారు. అంతేగాదు ఒక చెన్నై డాక్టర్ రజనీ డైట్ గురించి వివరిస్తూ ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను కూడా ఇషేర్ చేశారు. మరి ఇవాళ (డిసెంబర్ 12) రజనీకాంత్ 75వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఆరోగ్య రహాస్యాలు, డైట్ ఎలా ఉంటుంది వంటి వాటి గురించి ఆ డాక్టర్ మాటల్లోనే తెలుసుకుందామా.చెన్నై బారియాట్రిక్ సర్జన్ డాక్టర్ ప్రీతి మృణాళిని రజనీ ఆరోగ్య రహస్యం గురించి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఆయన ఐదు తెల్లటి ఆహారాలను నివారించడం వల్ల ఇంతలా ఆరోగ్యంగా యాక్టివ్గా ఉన్నారని అన్నారామె. ఉప్పు, చక్కెర, మైదా, పాలు, పెరుగు అతిగా తీసుకుంటే వాపు, ఇన్సులిన్ స్పైక్లు, ఆమ్లత్వం, గట్ సమస్యలకు దోహదం చేస్తాయి. అలాగే ఆయన మంచి పోషకవంతమైన ఆహారం తోపాటు రోజువారీ వ్యాయామాలు, ధ్యానం వంటివి ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి దోహదపడతాయని అన్నారు. అలాగే డాక్టర్ మృణాళిని రజనీ డ్యాన్సులు చేస్తున్న వీడియోలు పంచుకుంటూ..మన సూపర్ స్టార్ రజనీకాంత్ 74 సంవత్సరాల వయస్సులో కూడా చాలా అందంగా నృత్యం చేస్తున్నారు కదా..!. దానికి కారణం ఏంటో తెలుసా..అంటూ ఆయనే స్వయంగా తాను ఎలాంటి ఆహారం తీసుకుంటాననేది చెబుతున్న వీడియోని కూడా ఆమె జోడించారు. ఆ వీడియోలో రజనీకాంత్ స్వయంగా తాను తెల్లటి ఆహారాలకు దూరంగా ఉంటానని అన్నారు. అవేంటో కూడా ఆయనే చెప్పారు కూడా.ఆ ఐదు ఎందుకు నివారించాలంటే.1. ప్రాసెస్ చేసిన తెల్లటి చక్కెరడాక్టర్ మృణాళిని మాట్లాడుతూ.. "ఇది బొడ్డు కొవ్వు, ఇన్సులిన్ నిరోధకత, ఆకలి కోరికలను పెంచుతుంది. కాబట్టి, దీన్ని ఎంత త్వరగా నివారిస్తే అంత మంచిది." అని సూచించారు.2. తెల్ల ఉప్పుపరిమితంగా తీసుకోకపోతే పొట్ట ఉబ్బరం, అధిక బిపి (రక్తపోటు) కూడా రావొచ్చు3. తెల్ల బియ్యందీన్ని (తెల్ల బియ్యం) కూరగాయలతో కలిపి మితమైన పరిమాణంలో తీసుకుంటే పర్లేదు లేదంటే బరువు వేగంగా పెరిగిపోయేందుకు దారితీస్తుందని హెచ్చరించారు డాక్టర్ మృణాళిని. 4. మైదాబియ్యంలో కొద్దిగా ఫైబర్ ఉంటుంది, కానీ మైదాలో పూర్తిగా జీరో కేలరీలు ఉంటాయి. కాబట్టి, బరువు పెరగడం ఖాయం అని హెచ్చరిస్తున్నారు వైద్యులు5. పాలు, పెరుగు వెన్న వంటి పాల ఉత్పత్తులుఇవి కాల్షియం, ప్రోటీన్లకు మంచి మూలం. కానీ, 40 ఏళ్ల తర్వాత, జీవక్రియ మందగించడం ప్రారంభమవుతుందట. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిదని అంటున్నారు. అప్పుడే పొట్ట ఉబ్బరం, అధిక బరువు సమస్య దరిచేరవని అంటున్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Dr.Preethi Mrinalini | Laparoscopic & Bariatric Surgeon (@dr.preethimrinalini) (చదవండి: Success Story: డెలివరీ బాయ్ నుంచి జొమాటో డిజైనర్ రేంజ్కు! మనసును కదిలించే సక్సెస్ స్టోరీ..) -
తిరుగు ప్రయాణంలో అయ్యప్ప భక్తుల కష్టాలు..
పల్లికట్టు శబరిమలైకి - కల్లుమ్ ముల్లుం కాలికి మెత్తె" అంటూ భక్తిపారవశ్యంతో నడిచి ఆ అయ్యప్ప దర్శనం చేసుకున్న భక్తులకు తిరుగు ప్రయాణం కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఎంతో శ్రమకోర్చి కాలినడకన వచ్చి మరి ఆ అయ్యప్పను దర్శనం చేసుకున్నవారికి తిరుగు ప్రయాణం కష్టాలు కన్నీళ్లు పెట్టించేస్తున్నాయి. ఎలాంటి పరిష్కారం చూపకుండా మీపాట్లు మీరు పడండని గాలికి వదిలేశారంటూ మండిపడుతున్నారు. అస్సలు మా తిరుగు ప్రయాణం కష్టాలు ఎవ్వరికి పట్టవా అని ఆక్రోశిస్తున్నారు భక్తులు. నిజానికి శబరిమల ప్రధాన పార్కింగ్ ప్రాంతం నీలక్కల్. అయితే అయ్యప్ప దర్శనం చేసుకున్న యాత్రికులను నీలక్కల్ తీసుకుపోవడానికి బస్ స్టాప్ త్రివేణి వద్ద ఉంది. అందుకోసం బస్లులు పెట్రోల్ పంప్ దగ్గర యు-టర్న్ తీసుకొని నీలక్కల్కు వెళ్లడానికి త్రివేణికి చేరుకుంటాయి. మరోవైపు యాత్రికులు రోడ్డుపైకి రాకుండా నిరోధించడానికి బారికేడ్లు నిర్మించారు. అలాగే బస్సు ఎక్కడానికి ఒకే ఒక మార్గం ఉంది. దీంతో బస్సు రాగానే నిరీక్షిస్తున్న వందలాది మంది యాత్రికులు ఒకేసారి ఎక్కేందుకు ప్రయత్నం చేయడంతో తోపులాట జరిగి ఎక్కే వీలు లేకుండా పోతోంది. హెల్తీగా ఉన్నవాళ్లు ఏదోలా ఎక్కేసినా..ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లల పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉంది. మొత్తం మూడు బస్సులు కలిసి త్రివేణికి చేరుకుంటాయి. అయితే బస్సు రావడంతోనే ఎక్కే హడావిడిలో ఉంటారు ప్రయాణికులు..మరోవైపు ఒక బస్సు తలుపు మాత్రమే తెరుస్తారు. పోనీ మూడు బస్సులు ఒకేసారి డోర్లు తెరిచిని కాస్త పరిస్థితి చక్కబడేది. అలా కాకుండా ఒక బస్సు తర్వాత ఒకటి డోర్ ఓపెన్ చేయడంతో రద్దీ ఎక్కువై..చాలామంది అయ్యప్ప భక్తులు ఎక్కలేక నాన అవస్థలు పడుతున్నారు. బస్సులు వస్తూనే ఉంటున్నాయి కానీ తాము ఎక్కలేకపోతున్నాం అని భక్తులు చాలా బాధగా వాపోతుండటం గమనార్హం. పరిష్కారం కానీ జఠిల సమస్యలా..ప్రయాణికులు ఎంతలా ఫిర్యాదు చేసినప్పటికీ..పరిష్కారం కానీ జఠిలా సమస్యలా అలానే ఉంది అక్కడ పరిస్థితి. అసలు సన్నిధానం వద్ద అన్ని సమస్యలలో జోక్యం చేసుకునే స్పెషల్ కమిషనర్, ఏడీఎం ఈ సమస్యకు ఎందుకు పరిష్కారాన్ని సూచించడం లేదని మండిపడుతున్నారు భక్తులు. బస్సు ఎక్కడానికి క్యూ వ్యవస్థను ఏర్పాటు చేయాలనేది భక్తులందరి ప్రధాన డిమాండ్. కానీ ఇప్పటి వరకు అధికారులు దీనిపై ఎలాంటి నిర్ణయం గానీ పరిష్కారం గానీ సూచించకపోవడం అత్యంత బాధకరం.(చదవండి: శబరిమలలో దొంగల గుర్తింపునకు డ్రోన్లతో నిఘా) -
డెలివరీ బాయ్ నుంచి జొమాటో డిజైనర్ రేంజ్కు!
ఎన్నో స్ఫూర్తిదాయకమైన స్టోరీలు చూస్తుంటాం. ఎంతవరకు ప్రేరణగా భావిస్తామో తెలియదు గానీ, మన కళ్లముందే డెవలప్ అవుతున్న వాళ్లను బొత్తిగా గమనించం. కనీసం వాళ్లను చూసినా.. సక్సెస్ని ఒడిసిపట్టుకోవడం ఎలాగో తెలుస్తుంది. అందుకు ఉదాహరణ ఈవిద్యార్థి.జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ ఒకప్పుడు బ్లింకిట్లో డెలివరీ ఏజెంట్గా పనిచేసిన ఉద్యోగి గురించి సోషల్ మీడియాలో ఎక్స్లో షేర్ చేశారు. ఆయన ఆ పోస్ట్లో విద్యార్థి దృఢ సంకల్పాన్ని, ఆహార సాంకేతికత పర్యావరణ వ్యవస్థ సృష్టించిన అవకాశాలను ప్రశంసించారు. గోయల్ తన పోస్ట్లో బ్లింకిట్ ఉద్యోగి అథర్వ్ సింగ్ తండ్రి మద్దతు లేకుండా విద్య, జీవన ఖర్చుల కోసం ఎలా నిధులను సమకూర్చుకుంటున్నాడో వివరించారు. ఇది చూశాక తాను ఏమి సంపాదించలేని సమయం చాలానే ఉంది కదా అని నా జీవితం ప్రశ్నిస్తున్నట్లు అనిపించిందని గోయల్ పోస్ట్లో రాసుకొచ్చారు. అంతేగాదు ఆ వ్యక్తి పరిస్థితి మెరుగుపడింది బ్లింకిట్ నియామకం గురించి ఇన్స్టాగ్రామ్ ప్రకటన చూశాకేనని అన్నారు. అప్పటి నుంచి ఆ విద్యార్థి జీవితం దినదినాభి వృద్ది చెందుతూనే ఉందని పోస్ట్లో వెల్లడించారు గోయల్. ఒక పక్క కాలేజ్లో డిజైన్ కోర్సు చదువుతూ బ్లింకిట్లో డెలివరి బాయ్గా పని చేసిన ఆ అబ్బాయి ఇవాళ జొమాటో డిజైన్ బృందంలో చేరేందుకు సన్నద్ధమవుతున్నాడంటూ ఆయన పోస్ట్ని ముగించారు. ఇది నిజంగా గ్రేట్ కదా..ఒకప్పుడు డెలివరీల చేసిన అబ్బాయే ..డిజైన్ చేసే స్థాయికి అంటే చాలా స్ఫూర్తిదాయకమైన జర్నీ కదూ ఇది. క్షణాల్లో వైరల్ అయిన ఈ పోస్ట్ని చూసి నెటిజన్లు చాలా అమ్యూలమైన పాఠాన్ని అందించింది ఈ స్టోరీ అని కొందరూ, ఇలాంటి సక్సెస్ స్టోరీలు మనకు ఆకాశమే హద్దు అని అనిపించేలా చేస్తాయి అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.Stories like this make all of it absolutely worth it. pic.twitter.com/HMd1U3N8c7— Deepinder Goyal (@deepigoyal) December 11, 2025 (చదవండి: రాబందుల గూళ్లలో 750 ఏళ్ల నాటి పురాతన చెప్పులు..! విస్తుపోయిన శాస్త్రవేత్తలు) -
రాబందుల గూళ్లలో 750 ఏళ్ల నాటి పురాతన చెప్పులు..!
పురావస్తు శాస్త్రవేత్తల పరిశోధనలు ఎన్నో కొంగొత్త విషయాలకు లేదా పురాతన చరిత్రకు ఆలవాలం. మధ్యయుగ కాలంలో మనుషులు ఇలా ఉండేవారని వాటి ఆనవాళ్లు, గుర్తులు ఉపయోగించిన పరికరాలతో అంచానా వచ్చేవాళ్లం. కానీ ఆ విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరిచి మన పరిశోధకులుకు అందించి విస్మయపరిచాయి ఈ రాబందుల గూళ్లు. అవన్ని ఎలా పాడవ్వకుండా చెక్కుచెదరకుండా ఉన్నాయన్నది పరిశోధకులకు ఊహకందని మిస్టరీలా మారింది.దక్షిణ స్పెయిన్లో ఒక గుహలో శతాబ్దాల నాటి రాబందుల గూళ్లు పరిశోధకులకు ఆసక్తిని రేకెత్తించాయి. ఆ పర్వత గుహల్లో రాబందులు లోతైన భారీగూళ్లను నిర్మించడమే ఇందుకు కారణం. నిజానికి ఇవి మనం చూసే రాబందులుకు కాస్త భిన్నంగా గడ్డంతో ఉంటాయి. అలాగే వేటాడటంలో చాలా ప్రత్యేకతను కలిగి ఉంటాయి. అంతేగాదు ఆగూళ్లు పదిలంగా ఉండేలా..తాజా కొమ్మలు, ఉన్ని, ఎముకలు, ఇతర పదార్థాలను జోడించి మరి అందంగా నిర్మించాయి. దాంతో ఆ భారీ గూళ్లలో ఏ వస్తువు దాచినా భద్రంగా ఉంటాయట. అయితే ఈ గూళ్లను పురావస్తు పరిశోధకులు 2008, 2014 మధ్య కాలంలో గుర్తించి తవ్వడం ప్రారంభించారు. ట్విస్ట్ ఏంటంటే అక్కడ ఈ జాతులు సుమారు 70-130 సంవత్సరాల క్రితం అదృశ్యమయ్యాయి. కానీ అవి వదిలి వెళ్లిన ఈ గూళ్ల కారణంగా నాటి చరిత్రకు ఆధారాలు లభించినట్లయ్యిందని చెబుతున్నారు పరిశోధకులు. అయితే ఈ గూళ్లలో వేలాది జంతువుల ఎముకల తోపాటు 200 కి పైగా మానవ నిర్మిత కళాఖండాలను పరిశోధకులు గుర్తించారు. వాటిలో శాస్త్రవేత్తలను అత్యంత అమిత ఆశ్చర్యానికి గురిచేసింది మాత్రం దాదాపు 650-750 సంవత్సరాల క్రితం తయారు చేసిన చెప్పులు. అవి ఇప్పటికీ పాడవ్వకుండా ఉండటం చాలా మిస్టరీగా అనిపించింది పరిశోధకులకు. అందులోనే పెయింటింగ్ వేసిన గొర్రె చర్మపు తోలు, గుడ్డ ముక్కలు, గడ్డితో నేసిన పనిముట్లు, మధ్యయుగ క్రాస్బౌ బోల్ట్ తదితరాలను గుర్తించారు. ఈ పక్షులకు వేటాడటంలో ప్రత్యేకతతోపాటు ఎముకలను పగలు కొట్టి వాటి మజ్జను తినడంలో స్పెషలిస్ట్లట. ఈ గూళ్లను చూస్తే సహజ మ్యూజియంలా అనిపిస్తున్నాయని చెబుతున్నారు పరిశోధకులు. ఎందుకంటే..మధ్యయుగం నాటి పర్యావరణ వ్యవస్థలు, పక్షి ఆహారం, అలాగే ఆ కాలంలోని మానవ కార్యకలాపాలపై అసామాన్యమైన అంతర్దృష్టిని అందించాయని చెప్పారు. ప్రస్తుతం దక్షిణ స్పెయిన్లో రాబందులు కనుమరుగైనప్పటికీ..వాటి గూళ్లు పరిశోధనలకు, అలాగే పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలకు గొప్ప మార్గాన్ని అందించాయని అన్నారు. ఈ గడ్డం రాబందులు ఈ వస్తువులన్నింటిని ఎత్తుకెళ్లి..ఒకరకంగా నాటి మానవజీవితంపై ఒక ఆలోచనను అందించాయని అన్నారు. కాగా, ఈ పరిశోధన ఇటీవల ఎకాలజీ జర్నల్లో ప్రచురితమైంది.(చదవండి: రూ.1.3 కోట్ల ఉద్యోగ ఆఫర్..! కానీ ట్విస్ట్ ఏంటంటే..ఏకంగా ఆరు నెలలు..) -
రూ.1.3 కోట్ల ఉద్యోగ ఆఫర్..! కానీ ట్విస్ట్ ఏంటంటే..
కొన్ని ఉద్యోగ ఆఫర్లు పిచ్చెక్కించేలా ఉంటాయి. ఆఫర్ని అంగికరించొచ్చా? వద్దా? అనే సందేహంలోకి నెట్టేస్తాయి. దాని వెనుక కాస్త ఇబ్బందుల తోపాటు, మన ప్రియమైన వాళ్లను వదిలి దూరంగా వెళ్లాల్సి ఉంటుంది. పోనీ రిస్క్ చేద్దామన్నా ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? మన అనుకున్న వాళ్లే మనకు దూరమైపోతారా అనే బెంగ, గుబులు మొదలై.. నానా హైరానా పడుతుంటాం. అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు ఈ శాస్త్రవేత్త. ఏ నిర్ణయం పాలుపోక నెటిజన్ల సలహా తీసుకుందామనే ఉద్దేశ్యంతో తన కథను షేర్ చేసుకున్నాడు ఈ పరిశోధకుడు.ఆ వ్యక్తి తన సోషల్ మీడియా పోస్ట్లో తాను పర్యావరణ పరిశోధనలో పనిచేస్తున్నానని, తన కంపెనీ మెక్ముర్డో స్టేషన్లో ఆరు నెలల పరిశోధన కోసం అంటార్కిటికాకు వెళ్లాలనుకుంటున్నారా అని అడిగింది. ఆరు నెలల పరిశోధన కోసం ఏకంగా రూ. 1.3 కోట్లు చెల్లిస్తానని బంపరాఫర్ ఇచ్చింది. పైగా అంత మొత్తం రిటైర్మెంట్ టైంకి ఆహారం, గృహనిర్మాణం, విమానాలు, గేర్ పనులు అన్ని కవర్ అయిపోతాయి. కాబట్టి ఆ ఆఫర్ నాకెంతో నచ్చింది. అందులోనూ అంటార్కిటికాలో ఉండటం అంటే ఖర్చులు లేకుండా హాయిగా జీవించొచ్చు. మూడేళ్లు తన స్నేహితురాలితో కలిసి ఉన్నా, కానీ ఇప్పుడు సడెన్గా తనను వదిలి వెళ్లడం అన్న ఆలోచనే చాలా కష్టంగా ఉంది. ఇదేమి థ్రిల్లింగ్ ఫీల్లా అనిపించేది కూడా కాదని చెబుతున్నాడు. ఒకవేళ తాను ఆ ఆఫర్ని అంగీకరించినా.. కూడా ఆమె తనకు మద్దతిస్తుందని, కానీ అంతకాలం ఆమెకు దూరంగా ఉండటం అంటేనే మనసుకు చాలా కష్టంగా ఉందని వాపోయాడు. అదీగాక తన ప్రస్తుత ఆదాయ నికర విలువ రూ. 1.62 కోట్లు అని, ఆరు నెలల ఒప్పందం కారణంగా త్వరితగతిన రిటైర్మెంట్ తీసుకుని హాయిగా బతికేయొచ్చని చెబుతున్నాడు ఈ శాస్త్రవేత్త. అంతేగాదు జీతం మొత్తం కూడా నేరుగా బ్యాంకులోనే కంపెనీ చెల్లిస్తుంది కాబట్టి..ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. కానీ ఏకంగా ఆరు నెలలు ఒంటరిగా సైన్సు పరిశోధనలతో గడపాలి. సైన్సే లోకంగా గడిపాను గానీ..ఇలా ఒంటిరిగా అంకితమయ్యే అవకాశం కల్పిస్తుందని కలలో కూడా అనుకోలేదని చెబుతున్నాడు. అయితే ఈ ఆరు నెలల కాలం తన వ్యక్తిగత జీవితంపై తన రిలేషన్స్పై గట్టి ప్రభావం చూపి మళ్లీ ఒంటిరిగా మార్చేస్తుందేమోనని భయంగా ఉంది. అందువల్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బెటర్ అనేది కాస్త చెప్పండి అంటూ తన బాధనంతా రాసుకొచ్చాడు ఈ పరిశోధకుడు పోస్ట్లో. అయితే నెటిజన్లు చాలామంది ఆ ఆఫర్ని ధైర్యంగా అంగీకరించండి, మీ స్నేహితురాలు పూర్తిగా మద్దతిస్తుందన్న నమ్మకం ఉంటే బేషుగ్గా నిర్ణయం తీసుకోవడానికి సంకోచించాల్సిన పనిలేదు. పైగా పదవీవిరమణ సమయానికి ఇద్దరూ హాయిగా గడపొచ్చు. అలాగే జస్ట్ ఆరు నెలల కాలం పెద్ద ఎక్కువ సమయం ఎడబాటు కూడా కాదు. కాకపోతే గడ్డకట్టే ఆ అంటార్కిటిక్లో జీవన స్థితి ఎలా ఉంటుంది, తట్టుకోగలనా లేదా అనేదాని గురించి కూలంకషంగా తెలుసుకుని ముందుకు సాగండి ఆల్ద బెస్ట్ అని చెబుతూ పోస్టులు పెట్టారు.(చదవండి: Adarsh Hiremath: డ్రాపౌట్ టు బిలియనీర్) -
లైన్ డ్రాయింగ్ కోసం..
బొమ్మల పుస్తకంలోకి వెళితే పుస్తకంలోకి వెళ్లినట్లు మాత్రమే ఉండదు. మరో ప్రపంచంలో అడుగు పెట్టినంత ఆనందంగా ఉంటుంది. బొమ్మల ప్రపంచానికి ‘ఏఐ లైన్ డ్రాయింగ్ జనరేటర్’ అనేది మైండ్–బ్లోయింగ్ అప్గ్రేడ్. ‘నాకు బొమ్మలు అంటే చాలా ఇష్టం. కానీ గీయడం మాత్రం రాదు’ అనేవారికి ఏఐ లైన్ డ్రాయింగ్ జనరేటర్లు బెస్ట్ ఫ్రెండ్స్! బొమ్మలు గీయడం ఏమాత్రం రాక΄ోయినా తమ ఊహలను ‘ఏఐ లైన్ డ్రాయింగ్’తో బొమ్మలుగా మలచవచ్చు.కొన్ని ఫ్లాట్ఫామ్స్....ఓపెన్ఆర్ట్ (ఏఐ లైన్ ఆర్ట్ జనరేటర్) దీనిలో పోర్టయిట్స్, అబ్స్ట్రాక్ట్, ఫ్లోరల్, ఫ్యాషన్ అనే విభాగాలు ఉన్నాయి.ఏఐలైన్ ఆర్ట్.కామ్ పోర్టయిట్.యాప్/ఫొటో–టు–లైన్ ఆర్ట్ ‘కన్వర్ట్ ఇమేజ్ టు లైన్ డ్రాయింగ్ ఇన్ సెకండ్స్’ అంటోంది ఐకలరింగ్ఏఐ ఫోటర్ (ఫ్రీ ఆన్లైన్ ఏఐ లైన్ ఆర్ట్ జనరేటర్) న్యూ ఆర్క్.ఏఐ. ప్రోమీఏఐప్రో కాన్వా.కామ్/ఏఐ–ఆర్ట్–జనరేటర్ ఏఐ–డ్రా.టోక్యో (చదవండి: -
డ్రాపౌట్ టు బిలియనీర్
సెల్ఫ్–మేడ్ బిలియనీర్ల సక్సెస్ స్టోరీలు ఎంతో ఆసక్తిగా వినేవాడు ఆదర్శ్ హిరేమర్. ‘మెర్కోర్’ స్టార్టప్తో తాను కూడా సెల్ఫ్– మేడ్ బిలియనీర్ల జాబితాలో చిన్న వయసులోనే చేరిపోయాడు. ఇది రాత్రికి రాత్రే జరిగిన అద్భుతం కాదు. ఎన్నో నిద్రలేని రాత్రుల శ్రమఫలం. తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఏఐ మోడల్ ట్రైనింగ్ స్టార్టప్ ‘మెర్కోర్’తో విశిష్ఠ విజయాన్ని సాధించాడు 22 సంవత్సరాల ఆదర్శ్...ట్రెండన్ ఫుడీ, సూర్య మిదా (ఇద్దరి వయసు 22 ఏళ్లు)తో కలిసి ఏఐ మోడల్ ట్రైనింగ్ స్టార్టప్ ‘మెర్కోర్’ ప్రారంభించాడు ఆదర్శ్. ఈ స్టార్టప్ ఇటీవల పది బిలియన్ డాలర్ల విజయాన్ని అందుకొని అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఫేస్బుక్ను ప్రపంచానికి పరిచయం చేసిన ‘టెక్ టైటాన్’ మార్క్ జుకర్బర్గ్ రెండు దశాబ్దాల రికార్డ్ను బ్రేక్ చేసింది. సిలికాన్వ్యాలీలోని బే ఏరియాకు చెందిన ఈ ముగ్గురు స్నేహితులు ఒక స్కూల్లో జరిగిన డిబేట్ సందర్భంగా మొదటిసారిగా కలుసుకున్నారు. బెల్లార్మైన్ కాలేజిలో చదువుకునే రోజుల్లో ప్రతిష్ఠాత్మకమైన థీల్ ఫెలోషిప్ అందుకున్నారు. ఆ తరువాత కాలేజికి గుడ్బై చెప్పారు.స్టార్టప్ ప్రారంభించారు..డాటా లేబులింగ్, ఏఐ మోడలింగ్ ట్రైనింగ్కు సంబంధించి తక్కువ టైమ్లోనే ఈ స్టార్టప్ మంచి పేరు తెచ్చుకుంది. డాక్టర్లు, లాయర్లు, కన్సల్టెంట్స్, బ్యాంకర్ల రూపంలో కంపెనీలో 30,000 మంది ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ వార్షిక రికరింగ్ రెవెన్యూ(ఏఆర్ఆర్) 500 మిలియన్ డాలర్లు.‘ఇది నిజమేనా అని ఇప్పటికీ అనిపిస్తుంది. ఈ స్టార్టప్ లేకపోతే కాలేజీలోనే చదువుతూ ఉండేవాడిని’ నవ్వుతూ అంటాడు ఆదర్శ్. కాలేజీ రోజుల్లో క్రమశిక్షణ, కొత్త విషయాలపై ఆసక్తితో ఉండేవాడు ఆదర్శ్. ఆ రెండూ తనకు స్టార్టప్ ప్రయాణంలో ఉపయోగపడ్డాయి. పని బాగా నచ్చితే పనిలాగా అనిపించదు. ఆదర్శ్ విషయంలోనూ ఇదే జరిగింది. కంపెనీ ప్రారంభించిన తరువాత ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. తల్లిదండ్రులతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు కూడా పని గురించే ఆలోచిస్తుంటాడు!‘మెర్కోర్’ స్టార్టప్ సూపర్ సక్సెస్కు కారణం ఏమిటి?ఆదర్శ్ మాటల్లో చె΄్పాలంటే.. ‘ఏఐ ల్యాబ్లు, కస్టమర్లు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న సమయం అది. ఆ సమయంలోనే మేము మెర్కోర్తో ఏఐ ప్రపంచంలోకి అడుగుపెట్టాం. కొద్ది కాలంలోనే వారు ఎదురుచూస్తున్న ప్రత్యామ్నాయం మేము కావడం సంతోషంగా ఉంది’ అమెరికాలో పుట్టి పెరిగినప్పటికీ ఆదర్శ్కు మన దేశంతో బలమైన భావోద్వేగ బంధం ఉంది. అతడి తల్లిదండ్రులు కర్నాటకకు చెందిన వారు..‘ఇండియాలో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు’ అంటాడు ఆదర్శ్. సైజబుల్ ఆపరేషన్స్, ప్రొడక్ట్స్, ప్రతిభావంతులైన ఇంజినీరింగ్ టీమ్తో గ్లోబల్ ఏఐ టాలెంట్లో తనదైన పేరు తెచ్చుకుంది మెర్కోర్. ‘ఏఐ రెవల్యూషన్ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి’ అనే విమర్శతో ఆదర్శ్ ఏకీభవించడు. ‘ఏఐ ద్వారా సరికొత్త లేబర్ మార్కెట్ ఏర్పడుతుంది. ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి. ఏఐతో ఎలాంటి భయం అవసరం లేదు. ప్రతి సాంకేతిక విప్లవం మనిషి జీవితాన్ని మెరుగుపరిచింది’ అంటాడు ఆదర్శ్.నెక్స్ట్ ఏమిటి!కొత్త విషయాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నా చిన్నప్పటి నుంచి ఉంది. ఆ ఆసక్తి నాకు స్టార్టప్ ప్రయాణంలో ఉపయోగపడింది. ఇప్పుడు అసలు సిసలు సవాలు ఏమిటంటే నెక్ట్స్ ఏమిటి? అనేది. ప్రజలు ఇప్పుడు దీని గురించే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. అందుకే మా ప్రాధాన్యత జాబితాలో....‘నెక్ట్స్ ఏమిటీ?’ అనేది కూడా ఉంటుంది.– ఆదర్శ్ (చదవండి: ఇండిగో...ఇదిగో! నో డిలేస్, నో డైవర్షన్స్...) -
సోలో మహిళా బైకర్ ...సరికొత్త రికార్డ్...
పురుషులతో సమానంగా బైక్ రైడింగ్లో మహిళలు దూసుకుపోతున్నారు. ఆకాశమే హద్దుగా రికార్డులు తిరగరాస్తున్నారు. అదే క్రమంలో పూణేకు చెందిన సోలో ఉమెన్ బైకర్ ఐశ్వర్య నాగర్కర్(32) అలియాస్ సఖి–రైడర్ని తన 350సిసి బైక్పై స్వర్ణ చతుర్భుజి హైవేపై ప్రయాణం (గోల్డెన్ క్వార్డిలేటరల్ హైవే జర్నీ) సాగిస్తున్నారు. యంగెస్ట్ ఇండియన్ మదర్ గా గతంలో ఏ మహిళా సోలో రైడర్ సాధించిన ఘనత కాకపోవడం గమనార్హం. ఈ ఘనత ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బూన్ ఆఫ్ రికార్డ్లలో నమోదు కానుంది. గత 6వ తేదీన పూణెలో ప్రారంభమైన ఈ జర్నీ దాదాపుగా 6వేల కిమీ కొనసాగనుందని బెంగళూరు, చెన్నై, నెల్లూరు, ఒంగోలు, విశాఖపట్నం నగరాల మీదుగా సాగి తూర్పు ఉత్తర భారత ప్రాంతాల్లో పూర్తి సర్క్యూట్ పూర్తి చేసిన తర్వాత ఈ నెల 22న పూణేకు తిరిగి చేరుకుంటానని గృహిణి, 8ఏళ్ల కూతురుకి తల్లి కూడా అయిన ఐశ్వర్య చెప్పారు. బైక్ రైడ్ కొనసాగిస్తూనే ‘సాక్షి’తో ముచ్చటించిన ఆమె పలు అంశాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...తెలుగువాళ్ల ఆదరణ మరువలేను..నా బైక్ జర్నీ ప్రారంభమైన 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, ఒంగోలుకు చేరుకున్నాను. అలాఅలా విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్టణం, శ్రీకాకుళం పట్టణాల మీదుగా ప్రయాణించాను. ఈ సందర్భంగా పలు చోట్ల స్థానికులతో సంభాషించాను ప్రతీ చోటా అక్కడి సమస్యలు, ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అంశాలపై వారితో ముచ్చటించాను. నన్ను స్వంత ఇంటి మనిషిలా ఆదరించిన వారి ఆత్మీయత మరచిపోలేను. నా జర్నీ సందర్భంగా ఇంకా చాలా మంది మహిళలు సంకోచాలతో తమ జీవితాలను పరిమితం చేసుకుంటున్నారని అర్ధమైంది. సేవతో మిళితం చేస్తూ...నా బైక్ రైడింగ్ ఇతరుల కంటే వేగంగా ప్రయాణించడమో, రికార్డుల సృష్టికే పరిమితం కాదు... ఇతరులు నా కోసం నిర్దేశించిన పరిమితులను దాటి ప్రయాణించడం నా లక్ష్యం. దీనిని సేవతో మిళితం చేస్తూ సాగుతున్నా. మహారాష్ట్రలోని ఫోఫ్సండి జిల్లా పరిషత్ పాఠశాల సహా పలు గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్ధుల కు అండగా ఉండేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. వారికి ఆర్ధిక చేయూత అందించేందుకు విరాళాలు సేకరించడానికి రైడర్లు, స్నేహితులు, కుటుంబ సభ్యులు సహోద్యోగులను సమీకరిస్తుంటాను.కూతురి కోసం మట్టి సేకరణ...నా ఈ తాజా ప్రయాణంలో అద్భుతమైన వ్యక్తులను కలిశాను ప్రతి రాష్ట్రం ఎంత అందంగా ఉంటుందో గమనించాను అంతేకాదు నేను ప్రయాణించే ప్రతి రాష్ట్రం నుంచి గుప్పెడు మట్టిని సేకరిస్తానని నా కుమార్తెకు ఒక ప్రత్యేకమైన వాగ్దానం చేశా. ఎందుకంటే మన దేశం సంస్కృతిలో... ఆహారంలో, భాషలో, సుసంపన్నమైనది. కానీ దేశపు నిజమైన ఆత్మ దాని మట్టిలోనే ఇమిడి ఉంటుందని నా అభిప్రాయం నేను ఆమెకు ఈ మట్టి జాడీలను ఇచ్చినప్పుడు, భారతదేశం మొత్తం ఆమె ఇల్లేనని... ఆకాశమే ఆమె హద్దు అనే నమ్మకాన్ని కూడా బహుమతిగా ఇస్తాను కేవలం మట్టి మాత్రమే కాదు, నేను ప్రయాణించే రహదారుల నుంచి ధైర్యం, నేను స్పృశించే భూమి నుంచి ఆశీర్వాదాలు, నేను కలిసే వ్యక్తుల నుంచి జ్ఞాపకాలను సేకరిస్తూ ముందుకు సాగుతున్నాను. నా ప్రయాణం కిలోమీటర్ల లెక్క గురించి కాదు, ఇది నా దేశంతో అనుసంధానం కావడం గురించి, అది పంచిన ప్రేమను ఇంటికి తీసుకురావడం గురించి.మహిళకు స్ఫూర్తిగా..నేను నా కోసం, నా కూతురి కోసం, తాను కూడా ఎవరూ ఊహించనంత దూరం ప్రయాణించగలనని నిరూపించే ప్రతి మహిళ కోసం ఈ రైడ్ చేస్తున్నాను. ఒక మహిళ బలం పరిమితుల ద్వారా నిర్వచించలేం, వాటిని ఛేదించే ధైర్యం ద్వారా మాత్రమే నిర్వచించవచ్చు. ఇది వారికి చూపించడమే నా లక్ష్యం. నేను సంచరించే ప్రతి రహదారి, మహిళలు స్వేచ్ఛగా, ధైర్యంగా భయం లేకుండా సంచరించే ప్రపంచం వైపు ఒక అడుగు. ఇతర మహిళలు వారి శక్తిని విశ్వసించడానికి, వారి కలలను సాకారం చేసుకోవడానికి వారి స్వంత మార్గాన్ని సృష్టించుకునేలా నా ప్రయాణాల ద్వారా, ప్రేరేపించాలనేది నా ఆలోచన. నా మోటార్సైకిల్ కేవలం ఒక యంత్రం కాదు అది నా స్వరం, నా స్వేచ్ఛ, సాధికారత పట్ల నా నిబద్ధత. ప్రతి మైలుతో, మహిళలు తమ సొంత మార్గాన్ని ఎంచుకున్నప్పుడు వారిని ఎవరూ ఆపలేరనే సందేశాన్ని నాతో మోసుకెళ్తున్నాను. అన్నింటికంటే ముఖ్యంగా, నా భర్త మద్దతు లేకుండా ఈ ప్రయాణం సాధ్యం కాదు. నేను 15 రోజులు ఇంట్లో ఉండడం లేదంటే ఇలా రోడ్ల మీద ప్రయాణిస్తుంటే మా కూతురి బాగోగులు తాను చూసుకుంటున్నాడు. నా తల్లిదండ్రులు , నా అత్తమామలు కూడా తమ చేతనైనంతగా నాకు మద్దతు ఇస్తున్నారు. అదే విధంగా ప్రతీ మహిళ తనను తాను నిరూపించుకునేందుకు కుటుంబం అండగా నిలవాలని నేను కోరుకుంటున్నాను.::Satya Babu -
భూతల్లిని కాచే బిడ్డ
ఐక్యరాజ్య సమితి అత్యున్నత పర్యావరణ పురస్కారం ‘ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ 2025’ను డిసెంబర్ 10న నైరోబీలో తమిళనాడు ఐ.ఏ.ఎస్. అధికారి సుప్రియా సాహూ అందుకున్నారు. ఈ అవార్డు కోసం ప్రపంచవ్యాప్తంగా ఐదుగురిని ఎంపిక చేయగా వారిలో సుప్రియ ఒకరు. 2002లో ఐ.ఏ.ఎస్గా చేరినప్పటి నుంచి నీలగిరి కొండల్లో ఏనుగుల సంరక్షణ, సునామీ పరిష్కారానికి మడ అడవులు పెంచడం, పర్యావరణ రంగంలో అవిశ్రాంత కృషి సుప్రియాకు ఈ అత్యున్నత పురస్కారం తెచ్చి పెట్టాయి. వివరాలు....సుప్రియా సాహు... ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. ఐక్యరాజ్యసమితి అత్యున్నత పర్యావరణ పురస్కారం ‘యూఎన్ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ 2025’ బుధవారం నైరోబీ (కెన్యా) లో ఆమె అందుకున్న దరిమిలా అంత సమున్నత అవార్డు రావడంలో ఆమె కృషి ఏమిటా అని అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. వన్య్రపాణుల సంరక్షణతో సహా భారతదేశంలో కీలకమైన పర్యావరణ సవాళ్లపై ఆమె చూపిన శ్రద్ధ, నాయకత్వ బాధ్యతలకు గుర్తింపుగా ఆమె ఈ అవార్డు అందుకున్నారని తెలుసుకుని హర్షం వెలిబుచ్చుతున్నారు.ఏనుగులంటే ఎందుకంత ఇష్టం?సుప్రియా సాహు ప్రస్తుతం తమిళనాడు అడిషనల్ చీఫ్ సెక్రటరీ మాత్రమే కాదు పర్యావరణం, వాతావరణ మార్పు, అటవీశాఖ విభాగానికి సర్వోన్నత అధికారి కూడా. అటవీ శాఖకు సంబంధించి ఆమె నిర్వహిస్తున్నది కేవలం బాధ్యత కాదనీ స్వాభావికంగానే ఆమె ప్రకృతి రక్షకురాలనీ తెలిసినవారు అంటారు. తండ్రి ఉద్యోగరీత్యా దేశంలోని అనేక ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు ప్రకృతి రమణీయతను చూసి దాని పై మక్కువ పెంచుకున్న సుప్రియ ఆ సమయంలోనే ఏనుగులపై ఆసక్తి పెంచుకున్నారు. ఆ ఇష్టం నేటికీ కొనసాగుతోంది. ఆమె ఇన్ స్టా అకౌంట్ మొత్తం ఏనుగుల చిత్రాలతో నిండి ఉంటుంది. ఏనుగులంటే ఎందుకంత ఇష్టం అని అడిగితే కష్టాలలో నుంచి బయట పడటం, కుటుంబ బంధాలు నిలబెట్టుకోవడం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉండటం ఏనుగుల నుంచి నేర్చుకోవచ్చని అంటారు సుప్రియ.భూతాపం తగ్గాలని..ఇటీవల తమిళనాడు ప్రభుత్వ సారథ్యంలో ‘గ్రీన్ క్లైమేట్ కంపెనీ’ని ప్రవేశపెట్టి తమిళనాడులో ఉన్న, రాబోయే పరిశ్రమలు పర్యావరణ హితంగా ఉండటానికి అవసరమైన అనుసంధానకర్త పాత్రను పోషించేలా రూపొందించారు సుప్రియ. అడవులను రక్షించడం, అక్కడ ప్లాస్టిక్ చెత్త వేయకుండా చూడటం, భూతాపం తగ్గే వ్యవస్థలు ఏర్పాటు చేయడం, దెబ్బతిన్న పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడం వంటివి తమిళనాడు రాష్ట్రమంతా జరిగేలా ఈ వ్యవస్థ ద్వారా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో సుమారు 10 కోట్లకు పైగా మొక్కలు నాటడానికి, 65 కొత్త రిజర్వ్ ఫారెస్ట్లను స్థాపించడానికి ఆమె నాయకత్వం వహించారు. సునామీ సమయంలో మడ అడవులు అలల ధాటిని నిలువరించడం చూసిన సుప్రియ వాటి పెంపుదల కోసం విశేషంగా కృషి చేశారు. ఆమె ఆధ్వర్యంలో మడ అడవులు రెట్టింపు కావడం దేశవ్యాప్తంగా చెప్పుకోదగ్గ విషయంగా మారింది. అంతరించిపోతున్న జీవజాతుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఆమె నిధిని సేకరించారు.1.2 కోట్ల మందికి మేలుపర్యావరణ పరిరక్షణకు సుప్రియ చూపిన మార్గాలన్నీ ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రకృతికి మేలు చేకూర్చేవిగా ఉండటంతో ఉన్నతాధికారులు ఆమె కృషిని అభినందించారు. ఈ క్రమంలో లక్షలాది హరిత ఉద్యోగాలను ఆమె సృష్టించారు. ఆమె చేసిన పనుల కారణంగా అటవీ విస్తీర్ణం పెరిగి సమారు 1.2 కోట్ల మందికి మేలు జరిగింది. ‘స్థానిక గ్రామాల్లో నాకు మద్దతుగా నిలిచి, మడ అడవులను సొంతంగా శుభ్రం చేయడానికి నాతో కలిసి పని చేస్తున్న ప్రజలే నాకు ప్రేరణ. వారి నుంచి స్ఫూర్తి పొందుతూ ఎంతటి పనైనా చేయగలననిపిస్తోంది’ అని వివరిస్తున్నారు సుప్రియా సాహు.జంతువులు ప్లాస్టిక్ తినడం చూసి..2002 నుంచి కలెక్టర్గా పని చేస్తున్న సుప్రియ తన మొదటి పోస్టింగ్ చేస్తున్నప్పటి నుంచి ప్రకృతిని రక్షించేందుకు తాను, తన అధికారం ఏం చేయచ్చా అని తీవ్రంగా ఆలోచించారు. బాధ్యతారహితంగా ప్రవర్తించే మనుషుల వల్లే పర్యావరణానికి తీవ్రమైన నష్టమని ఆమె గుర్తించారు. ‘నీలగిరి జిల్లా కలెక్టర్గా ఉన్న సమయంలో జంతువులు ప్లాస్టిక్, చెత్త తినడం చూశాను. అది చాలా దారుణమైన విషయం అనిపించింది’ అని ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకుంటారు సుప్రియ. వెంటనే ఆమె నీలగిరిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను తొలగించే లక్ష్యంతో ‘ఆపరేషన్ బ్లూ మౌంటైన్’ ప్రచారాన్ని ప్రారంభించారు. ప్లాస్టిక్ కాలుష్యం గురించి జనానికి పెద్దగా తెలియని సమయంలోనే ఆమె ప్లాస్టిక్కు వ్యతిరేకంగా పోరు చేపట్టారు. అంతేకాదు ఏనుగుల సంరక్షణ కేంద్రాలతో పాటు పులులు తిరుగాడేందుకు అడవుల జోన్ను విస్తరించారు. -
మనసు దోచే ముగా..!
పట్టు చీరలంటే మనకు వెంటనే గుర్తొచ్చేవి కంచి, ఇక్కత్, గద్వాల్, బనారస్, ధర్మవరం, ఉప్పాడ... బనారస్ మినహాయిస్తే మిగిలినవన్నీ తెలుగు రాష్ట్రాలు, సమీప ప్రాంతాల్లో తయారయ్యేవే. దేశీయ మార్కెట్లో వీటి పరపతి అంతా ఇంతా కాదు. అయితే ఇంతకు మించి పరపతి సాధించిన మరో రకమే ముగా సిల్క్. ‘గోల్డన్ సిల్క్ ఆఫ్ అస్సాం’గా పేరుగాంచిన ముగా పట్టు చీరలు అస్సాం రాష్ట్రంలోని సువాల్కుచి కేంద్రంగా తయారవుతున్నాయి. అస్సాంలో తయారై అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ముగా చీరలు దేశంలో తయారయ్యే అత్యంత ఖరీదైన చీరల్లో ముందు వరుసలో ఉన్నాయి. జీఐ ట్యాగింగ్తో నాణ్యత గుర్తింపు ఉన్న ఈ చీరలకు జపాన్ , జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాల మార్కెట్లో బోలెడంత క్రేజ్. మనకు తెలిసిన కంచి, బనారస్ పట్టు చీరల్లో మేలిమిరకం చీరలు రూ.25 వేల నుంచి లభ్యమైతే ముగా పట్టు చీరలు మాత్రం కనిష్టంగా రూ.50 వేలు ఉంటే... డిజైన్ బట్టి చీర ధర రూ.5 లక్షల వరకు ఉంది. ఈ చీరల మన్నిక కూడా వందేళ్లకు పైగా చెక్కుచెదరకుండా ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు. ఈ చీరలకు దేశీయంగా మార్కెట్ ఉన్నప్పటికీ... వీటి ధర మాత్రం సంపన్న వర్గాలు మాత్రమే కొనుగోలు చేసే విధంగా ఉంది. అయితే ఈ చీరలకు జపాన్ , యూరప్ మార్కెట్లో మాత్రం మంచి డిమాండ్ ఉంది. ప్రధానంగా అతినీలలోహిత కిరణాలకు రక్షగా ఈ పట్టు చీర ఉంటుందనే నమ్మకం అక్కడి మార్కెట్ను భారీగా పెంచింది. అంత ఖరీదైన చీరలు తయారు చేస్తున్నా కార్మికులకు మాత్రం అరకొర ఆదాయమే!సువాల్కుచిలో వేలాది మగ్గాలు...అస్సాం రాష్ట్రంలోని పాలస్బరి, బొకాఖత్, బర్పేట, నల్బరీ, ధుబ్రి జిల్లాల్లోనూ ఈ చీరల తయారీ కేంద్రాలు ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో మగ్గాలు, డిజిటల్ మగ్గాలు మాత్రం సువాల్కుచిలో మాత్రమే చూస్తాం. ఇక్కడ పట్టు పురుగుల నుంచి దారం తీయడం, ఆ దారాన్ని ప్రాసెస్ చేసి చీర తయారీకి అనువైన విధంగా మార్చేవరకు అవసరమైన ప్రక్రియంతా ఇక్కడ జరుగుతుంది. ముగా పట్టు పురుగు కకూన్ (గూడు/కవచం) నుంచి పట్టు దారాన్ని తీస్తారు. ఒక కిలో పట్టు గూళ్ల ధర ప్రస్తుత మార్కెట్లో రూ.45 వేలుగా ఉంది. ఇందులో దాదాపు 5వేల గూళ్లు ఉంటాయి. వీటిని ప్రాసెస్ చేస్తే ఒకటిన్నర చీరలకు సరిపడా దారం తయారవుతుంది. ఒక్కో చీర తయారైన తర్వాత సగటున 700 గ్రాములుంటుంది. డిజైన్ , జరీ వినియోగాన్ని బట్టి చీర బరువు మారుతుంది. ఒక చీర తయారీకి గాను దారం ప్రాసెస్ నుంచి చివరి వరకు సగటున నెల రోజుల నుంచి 3 నెలల సమయం పడుతుందని, డిజైన్ ను బట్టి తయారీకి మరింత సమయం కూడా పడుతుందని నేత కార్మికులు చెబుతున్నారు.యూవీ రక్షణకు ప్రత్యేకంముగా చీరలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. యూరప్లోని జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశీలతో పాటు జపాన్ లోనూ ఈ పట్టు చీరలు, వస్త్రాలకు డిమాండ్ ఉంది. దీంతో అస్సాంలో ఉత్పత్తి అయ్యే ముగా వస్త్రాల్లో 80 శాతం పైగా ఎగుమతి చేస్తామని సువాల్కుచి వ్యాపారి హీరాలాల్ వివరించారు. ముగా పట్టు అతి నీలలోహిత కిరణాల నుంచి రక్షణ స్తుందని, వీటిని గొడుగులుగా కూడా తయారు చేస్తున్నట్లు ఆయన వివరించారు. వాటితోపాటు ఆభరణాలు కూడా తయారు చేస్తున్నామన్నారు.రసాయనాలు లేవు..→ అత్యంత ఖరీదైన చీర... మార్కెట్లో ఈ రకానికి బ్రాండింగ్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. నార్త్ ఈస్ట్ హ్యాండిక్రాఫ్ట్ అండ్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ ఈహెచ్హెచ్డీసీ)ఆధ్వర్యంలో ఈ చీరలకు జీఐ (జీయోగ్రాఫికల్ ఇండికేషన్ ) ట్యాంగింగ్ చేస్తున్నారు. జీఐ ట్యాగ్ ఉన్న చీరలు మాత్రమే మన్నికైనవనే సంకేతాన్ని మార్కెట్లోకి తీసుకెళ్తున్నారు.→ జీఐ ట్యాగింగ్ కోసం సువాల్కుచిలోని ఎన్ ఈహెచ్హెచ్డీసీలో ప్రత్యేకంగా ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మూడు రకాల పరీక్షలు చేసి చీర వాస్తవికతను నిర్ధారిస్తారు. ఒక్కో చీర పరిశీలించి జీయో ట్యాగ్ వేసినందుకు అక్కడ రూ.100 ఫీజు వసూలు చేస్తున్నారు. మూడేళ్ల క్రితం ప్రారంభించిన ఈ ల్యాబ్లో దాదాపు 30 లక్షల పరీక్షలు జరిపినట్లు ఎన్ ఈహెచ్హెచ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ మారా కోచో తెలిపారు.→ దేశంలోనే అత్యంత విలువైన చీరల తయారీలో కీలక ప్రాత పోషిస్తున్న నేత కార్మికులు, కూలీలు మాత్రం ఆర్థికంగా బక్కచిక్కి ఉన్నారు. వీరికి రోజుకు సగటున రూ.400 మేర కూలి చెల్లిస్తున్నారు. వాస్తవానికి ఈ చీరలకు విదేశాల్లో మార్కెట్ ఉండడంతో నేత కార్మికుల నుంచి కొనుగోలు చేస్తున్న చీరలను వ్యాపారులు ఎగుమతి చేస్తున్నారు. దీంతో వ్యాపారులు మాత్రమే అధిక లాభాలను గడిస్తున్నారు. → ముగా దారం సహజంగా బంగారు రంగులో మెరుస్తూ ఉంటుంది. సూర్యకాంతి పడినప్పుడు ఈ మెరుపు మరింత ప్రకాశవంతమవుతుంది. దారం వయసుతో పాటు మెరుపు పెరుగుతుంది. ఇతర పట్టు రకాలు కాలక్రమంలో మసకబారితే, ముగా పట్టు మాత్రం కడిగిన కొద్దీ, ధరించిన కొద్దీ బంగారంలా మరింత మెరుస్తుంది. ప్రపంచంలోని అన్ని సహజ పట్టు రకాల్లో ముగా పట్టు ఎక్కువ బలమైందిగా పేరొందింది.→ సోము–సోలు చెట్లు తగ్గిపోవడం వల్ల ముగా పట్టు పురుగుల సంఖ్య తగ్గుతోంది. ఈ పురుగులు అత్యంత సున్నితమైనవి కావడంతో వాతావరణంలో మార్పులు జరిగినా, కనీసం పురుగుమందులూ, ఇతర పొగ వాసన తగిలిన వెంటనే ఈ ముగా పట్టు పురుగులు వెంటనే చనిపోతాయి. ప్రస్తుతం ముగా పట్టు పరిశ్రమకు ఇదే అతిపెద్ద సవాలు. మరోవైపు ముగా చీరలు మార్కెట్లో ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి. పాలిస్టర్, టస్సర్ మిక్స్ వెరైటీలు మరో సవాలు.→ ముగా పట్టు పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు అస్సాం ప్రభుత్వం ‘ముగా మిషన్’ పథకం అమలు చేస్తోంది. సోము చెట్ల పెంపకం, సీడ్ బ్యాంకులు, నేతకారులకు శిక్షణలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సువాల్కుచిలో ‘ముగా సిల్క్ విలేజ్’ ఏర్పాటు చేసి అభివృద్ధి చేయడం లాంటి కార్యక్రమాలూ కొనసాగుతున్నాయి. సువాల్కుచి నుంచి – చిలుకూరి అయ్యప్ప, సాక్షి -
శబరిమలలో దొంగల గుర్తింపునకు డ్రోన్లతో నిఘా
సాక్షి శబరిమల: శబరిమలలో మండల పూజల సీజన్ ఈ నెల 27తో ముగియనుంది. ఆ వెంటనే మకరవిళక్కు సీజన్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ‘సందట్లో సడేమియా’లా భక్తుల రద్దీని అవకాశంగా మలచుకుంటున్న దొంగలు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. వారికి చెక్ పెట్టేందుకు అధికారులు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో శబరిమల పరిసరాల్లో నకిలీ పత్రాలతో.. గుర్తింపు కార్డులతో సేవకు వచ్చే వారి కోసం తనిఖీలను ముమ్మరం చేశారు. రాష్ట్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పంపాబేస్ నుంచి సన్నిధానం వరకు అన్ని ప్రాంతాల్లో తనిఖీలు, నిఘా పెంచినట్లు వెల్లడించారు.అలాగే భద్రత దృష్టా అధికారులు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుతో సహా తాత్కాలిక ఉద్యోగుల పత్రాలను తనిఖీ చేయడం జరుగుతుందని అన్నారు. కొందరు నకిలీ గుర్తింపు కార్డులను చూపిస్తూ వివిధ ప్రదేశాలలో పనిచేస్తున్నారని కూడా పేర్కొన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అయా వ్యక్తుల కోసం పోలీసులు, బోర్డు సమాచారాన్ని పరస్పరం సమాచారాన్ని పంచుకుంటాని చెప్పారు. అయితే ఒక్కోసారి నకిలీ సర్టిఫికెట్లతో వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ, వారి పరిస్థితి దృష్ట్యా సాధారణంగా ప్రశ్నించి విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. ఇదిలా ఉండగా, శబరిమల అటవీ ప్రాంతాల్లో పోలీసులు, అటవీ శాఖ సంయుక్తంగా వైమానిక నిఘా కూడా నిర్వహిస్తున్నాయి. "రద్దీ పెరిగినప్పుడు దొంగలు, సంఘ వ్యతిరేక శక్తులు , యాచకులు తరచుగా శబరిమలకు వస్తారు. వారు పోలీసులను, అటవీ శాఖను పట్టించుకోకుండా శబరిమల మార్గంలోని అడవుల్లోనే ఉంటారు. అలాంటివారు నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్లు వంటి పత్రాలతో వస్తారు. వారి రాక భద్రతా ముప్పుని సృష్టిస్తోంది" అని ఆందోళన వ్యక్తం చేశారు అధికారులు. అయ్యప్ప భక్తులను మోసగించి రద్దీ సమయాల్లో అడవిలోకి ప్రవేశించడం వారి నేరశైలి అని తెలిపారు. ఈ నేపథ్యంలో నీలిమల, అప్పచిమేడు, శరణ్గుత్తి తదితర ప్రాంతాల పరిసర అడవులలో డ్రోన్ నిఘాను ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. అలాగే పోలీసుల రిజిస్టర్లలో నమోదుకాని కార్మికులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పంపా, సన్నిధానంలో రెవెన్యూ శాఖ స్క్వాడ్, పోలీసు షాడో బృందం 24 గంటలు మోహరించి ఉంటాయని వెల్లడించారు.(చదవండి: శబరిమలలో 50% మంది తెలుగు భక్తులే) -
ఆరోగ్యకరమైన జీవనశైలితో డయాబెటిస్ తగ్గిపోతుందా..?
చాలామందిని వేధించే సమస్య డయాబెటిస్. గణాంకాలు సైతం రానున్న రోజుల్లో భారత డయాబెటిస్ కేరాఫ్గా మారనుందంటూ హెచ్చరిస్తున్నాయి కూడా. కొందరికి అధిక బరువుతో మొదలై డయాబెటిస్ బారినపడి ఇబ్బందులు పడుతున్నవారెందరో. కానీ కొందరూ ఆ వ్యాధి రావడంతోనే మేల్కొని ఆరోగ్య స్పృహ తెచ్చుకుని మరి బరువు తగ్గడమే కాదు డయాబెటిస్ని ితిప్పుకొడుతున్నారు. ఆ కోవలో ఈ కామెడీ హీరో కూడా చేరిపోయి ప్రేరణ కలిగిస్తున్నారు. ఏకంగా 78 ికిలోలు వరకు బరువు ఉండే ఆయన అంతలా ఎలా బరువు తగ్గారో సవివరంగా తెలుసకుందామా...!.అమెరికా హాస్య నటడు 'మైక్ అండ్ మోలీ' స్టార్ బిల్లీ గార్డెల్ టైప్ 2 అధికబరువుతో ఇబ్బంది పడుతూ ఉండేవాడు. డయాబెటిస్ నిర్ధారణ అయ్యేటప్పటికీ సుమారు 172 కిలోలు పైనే బరువు పెరిగిపోయాడు. సరిగ్గా 2020లో రక్తంలో చక్కెర స్థాయిలు అధికమయ్యేంత వరకు మేల్కొలేదు. అదీగాక ఆ టైంలో మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో బిల్లీ గార్డెల్ అధిక బరువు, స్లీప్ అప్నియా, ధూమపానం చేసేవాడు, టైప్ 2 డయాబెటిస్, ఉబ్బసం వంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుండేవాడు. ఓపక్క కరోనా మహమ్మారి,మరోవైపు అనారోగ్యా జాబితాతో భయాందోళనలకు లోనై ఆరోగ్య స్పృహపై ఫోకస్ పెట్టాడు. కానీ తగ్గుదామని ఉపక్రమించిన ప్రతిసారి పెరిగిపోవడంతో లాభం లేదనుకుని..తన వ్యక్తిగత వైద్యులతో చర్చించి మరి బరువు తగ్గించే సర్జరీలకు ప్లాన్ చేశాడు.మార్పు వచ్చిందా అంటే..ఈ 53 ఏళ్ల గార్డెల్ జూలై 2021లో బారియాట్రిక్ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇది అతడి పరివర్తనలో తొలి అడుగు. ఆహారం విషయంలో తీసుకున్న జాగురకత..మంచి మార్పుకి శ్రీకారం చుట్టింది. కడుపు ఫుల్గా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలతో ఓదార్పునిచ్చే ఆహారం తీసుకుంటూ..ఆకలిని నియంత్రించగలిగాడు. అలా 78 కిలోల వరకు అధిక బరువుని తగ్గించుకుని స్లిమ్గా హీరోలా మారిపోయాడు. అంతేగాదు డయాబెటిస్ కూడా నయం అయిపోయింది.ఇది మంచిదేనా అంటే..నిపుణుల అభిప్రాయం ప్రకారం, ముఖ్యంగా ఊబకాయం ఉన్నవారు గణనీయమైన బరువు తగ్గడం వల్ల టైప్ 2 డయాబెటిస్ను తిప్పికొట్టగలరని చెబుతున్నారు. ఇక్కడ హాస్య నటుడు కాలేయం , క్లోమంలో కొవ్వును తగ్గించి.. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచాడు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి వీలు కల్పించి డయాబెటిస్ నుంచి ఉపశమనం అందిస్తుంది. అయితే బరువు పెరిగితే మాత్రం మళ్లీ డయాబెటిస్ తిరగబెట్టొచ్చు. అందువల్ల ఇలా సర్జరీ చేయించుకున్నవాళ్లు ఆ బరువుని మెయింటైన్ చేసేలా..జీవనశైలిలో మార్పులు, వ్యాయామం తదితరాల విషయాల్లో కేర్ తీసుకుంటే చాలని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు ఇక్కడ బరువు తగ్గించే సర్జరీతో కేవలం ఐదు నుంచి పది శాతమే బరువు తగ్గుతారని, ఆ తర్వాత అంతా ఫిజికల్గా మనం కష్టపడి స్లిమ్గా మారాల్సిందేనని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం . పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: భారత్ గుర్తింపును "మధురంగా" మార్చిన మహిళ..!ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు..) -
భారత్ గుర్తింపును "మధురంగా" మార్చిన మహిళ..!
మన భారతదేశ గుర్తింపు, అభివృద్ధిలో తోడ్పడిన కొందరిని మర్చిపోతుంటాం. ఎవరో గుర్తు చేస్తేగానీ మనం గ్రహించం. అలాంటి మహనీయుల్లో ఒకరు డాక్టర్ జానకి అమ్మళ్. తియ్యదనంతో చెరగని ముద్రవేసి భారత్ని ప్రపంచవేదికపై తలెత్తుకునేలా చేశారామె. అలాంటి ప్రముఖ మహిళ చేసిన అచంచలమైన కృషి గురించి పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా నెట్టింట షేర్ చేశారు. ఈ తరం తప్పక తెలుసుకోవాల్సిన గొప్ప మహిళ ..అలాగే ఆమె సాధించిన విజయాలు అందరికీ స్ఫూర్తి అంటూ జానకి అమ్మల్పై ప్రశంసలజల్లు కురిపించారు. ఆనంద్ మహీంద్రా ఎక్స్ పోస్ట్లో జానకి అమ్మల్ వారసత్వాన్ని గుర్తుచేసుకుంటూ..ఆమెను ధైర్యం, ఆశయం, అసాధారణ సేవకు నిలువెత్తు నిదర్శనం. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో రెండవ అతిపెద్ద చెరకు ఉత్పత్తిదారు అయినప్పటికీ...ఈ విజయానికి కారణమైన మహిళ గురించి విన్నారా అని ప్రశ్నించారు. ఈ అమ్మళ్ కథ భారతీయ మహిళలకు ప్రేరణ అని చెప్పారు. వృక్షశాస్త్రంలో పిహెచ్డి చేసిన తొలి భారత మహిళ అమ్మల్. భారతీయ పరిస్థితులకు అనుగుణంగా తియ్యగా ఉండే.. అధిక దిగుబడినిచ్చే చెరకు రకాలను అభివృద్ధి చేసి, ప్రధాన ఆర్థిక లాభాలను అంచిందని తెలిపారు. ఆమె అద్భుతమైన రచనలు కూడా చేశారని తెలిపారు. కానీ పాఠ్య పుస్తకాల్లో ఆమె గురించి చాలా తక్కువగానే ప్రస్తావించారన్నారు. చెప్పాలంటే ఆమె కథ యువతరానికి అస్సలు తెలియదనే చెప్పొచ్చు.పెళ్లి కూడా చేసుకోలేదు..మహీంద్రా అమ్మళ్ జీవితాన్ని హైలైట్ చేస్తూ ఒక వీడియోను కూడా పంచుకున్నారు. 1932లో, వృక్షశాస్త్రంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీని సంపాదించిన తొలి భారతీయ మహిళ, అలాగే శాస్త్రీయ పరిశోధనకు పూర్తిగా అంకితమై వివాహాన్ని కూడా తిరస్కరించారని చెప్పారు. జన్యు శాస్త్రవేత్తగా కోయంబత్తూరులోని చెరకు పెంపకం సంస్థలో చేరడానికి భారతదేశానికి తిరిగి వచ్చింది. అయితే ఆ టైంలో భారత్ చెరకుకి తీపి తక్కువగా ఉండేదట. అందుకే భారత్ ఆగ్నేయాసియా దేశమైన పాపువా న్యూ గినియా నుంచి చెరుకుని దిగుమతి చేసుకునేదట. కానీ అమ్మల్ హైబ్రిడ్ క్రాస్-బ్రీడింగ్లో చేసిన కృషికి భారత్ నేలే స్వయంగా తియ్యటి చెరకును ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని అందుకుంది. దాంతో దిగుమతిదారుగా ఉన్న భారత్ కాస్తా ఉత్పత్తిదారుగా, ఎగుమతిదారులలో ఒకటిగా మారేందుకు దారితీసిందట. ఆమె ఆవిష్కరణలు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను తెచ్చిపెట్టి.. దేశానికి గణనీయమైన ఆదాయాన్ని అందించాయన్నారు మహీంద్రాIndia is the world’s 2nd-largest sugarcane producer.But the woman who made it possible slipped into the footnotes of our history.Hers is an extraordinary story of courage, ambition and service. She is an outstanding role model for all young Indian women. Yet how many… pic.twitter.com/gZIsEKEto1— anand mahindra (@anandmahindra) December 8, 2025 వివక్షను ఎదుర్కొంటూనే సక్సెస్..అమ్మళ్ ఒంటరి మహిళ, కులం కారణంగా తీవ్ర వివక్షను ఎదుర్కొన్నారట. భారతదేశంలోని సవాళ్లు ఆమెను లండన్కు తరలివెళ్లిపోయేలా చేసిందట. అక్కడ ఆమె రెండొవ ప్రపంచ యుద్ధం టైంలో కూడా తన పరిశోధనను కొనసాగించింది. అలా ఆమె అంతర్జాతీయ కృషి ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన వృక్షశాస్త్రజ్ఞురాలిగా ఆమె ఖ్యాతిని సుస్థిరం చేసింది.నెహ్రూ చొరవతో మళ్లీ భారత్కి..1951లో, జవహర్లాల్ నెహ్రూ ఆహ్వానం మేరకు, జానకి అమ్మళ్ సెంట్రల్ బొటానికల్ లాబొరేటరీకి నాయకత్వం వహించడానికి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఆమె చేసిన కృషికి భారత ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. అంతేగాదు జీవవైవిధ్య పరిరక్షణలో మార్గదర్శకురాలిగా మారింది. ఇంత ఘనత సాధించిన ఆమె పేరు పాఠ్యపుస్తకాల్లో లేకపోవడం బాధకరం అని పోస్ట్ ముగించారు..(చదవండి: ఓర్నీ ఇదేంటిది..! అత్తారింటికి నవవధువే డ్రైవ్ చేసుకుంటూ..) -
ఓర్నీ ఇదేంటిది..! అత్తారింటికి నవవధువే డ్రైవ్ చేసుకుంటూ..
పెళ్లిలో జరిగే ప్రతి తంతు అపురూపమైన క్షణం. ఆ వివాహ ఘట్టం అంత తేలిగ్గా మర్చిపోలేని మధురానుభూతులు. బహుశా ఆ ఉద్దేశ్యంతోనే ఆ వధువు ఇలా చేసిందో ఏమో గానీ వరుడుకి నోట మాట లేకుండా చేసింది. అప్పుడే తనకు నచ్చినట్లుగానే అంతా చేయాల్సిందేనా అన్నట్లుగా నవ్వుతూ కళ్లప్పగించి చూశాడు. అసలేం జరిగిందంటే..ఈ వింత ఘటన లూధియానాలోని థార్లో చోటుచేసుకుంది. పెళ్లి తంతు అయిపోయింది. ఆ తర్వాత అప్పగింతలు వేళ వధువుని తీసుకొచ్చి తల్లిదండ్రులు కారు వెనకాల కూర్చొబెట్టి సాగనంపుతారు కామన్. పైగా వరుడు పెళ్లికొడుకు కాబట్టి అతన కూడా కారు డ్రైవ్ చేయడు. ఇది వివాహంలో సర్వసాధారణం. కానీ ఈమె మాత్రం తన అత్తారింటికి భర్తతో కలిసి తనే స్వయంగా కారు నడిపుతూ వెళ్లాలనకుందట. ఆ విషయం ముందే కాబోయే వరుడుకి చెప్పడంతో అతను కూడా సమ్మతించాడు. అంతేకాదు అక్కడ పెళ్లి మండపం వద్ద ఉన్న బంధువులు, సన్నిహితులు విస్తుపోయేలా నవవధువుని పెళ్లికొడుకే ఎత్తుకుని ఎస్యూవీ కారు వద్దకు తీసుకురాగ, ఆమె డ్రైవర్ సీటులో దర్జాగా కూర్చొంది. ప్యాసింజర్ సీటులో వరుడు కూర్చొని మనం ఇంటికి సురక్షితంగా చేరుకోవాలి అని ఆమెకు నవ్వుతూ చెబుతున్నాడు. అంతేగాదు వరుడు దేవుడా మమ్మల్ని క్షేమంగా ఇంటికి తీసుకువెళ్లు అని ప్రార్థించాడు కూడా. అందుకు సంబంధించిన ఫన్నీ వీడియో నెట్టింట వైరల్గా అవుతోంది. View this post on Instagram A post shared by Bhawni & Chirag (@chirag_ke_bhaw_badgye) (చదవండి: 50 ఏళ్ల సహోద్యోగి అలా ప్రవర్తిస్తే ఏం చేయాలి..!) -
50 ఏళ్ల సహోద్యోగి అలా ప్రవర్తిస్తే ఏం చేయాలి..!
ఉద్యోగంలో సహోద్యోగులతో సమస్యలు, చిన్న చిన్న గొడవలు కామన్గానే ఉంటాయి. అవి వర్క్ పరంగానే తప్ప వ్యక్తిగతంగా కాదు కాబట్టి..అక్కడున్నంత సేపే గుర్తించుకుంటాం. ఆ తర్వాత వదిలేస్తాం. కానీ కొందరు కాస్త చొరవ తీసుకుని అసౌకర్యానికి గురిచేసేలా ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా మహిళపట్ల కొందరు మగ ఉద్యోగులు ప్రవర్తన డిఫెరెంట్గా ఉంటుంది. అలా కాకుండా 50 ఏళ్ల వ్యక్తి వయసుకు తగ్గట్టుగా కాకుండా కుర్రాడిలా ప్రవర్తిస్తే ఎవ్వరికైన చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. అలాంటి పరిస్థితినే ఎదుర్కొంది ఓ టెక్ కంపెనీలో పనిచేస్తున్న వివాహిత.ఆమె పోస్ట్లో ఇలా రాసుకొచ్చింది. మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్న 22 ఏళ్ల మహిళ 50 ఏళ్లకు పైనే ఉండే సహోద్యోగితో తనకెదురైన అసౌకర్యమైన క్షణాన్ని పోస్ట్లో షేర్ చేసుకుంది. తామెప్పుడు చాలా స్నేహపూర్వకంగా ఉండేవాళ్లం. మేనేజ్మెంట్ మీటింగ్లు ముగిసిన వెంటనే కంపెనీయే ఫ్రీగా స్నాక్స్ పెట్టడం జరుగుతుంది. దానిని తాము షేర్ చేసుకునేవాళ్లం. అలాగే ఏదైనా విషయం ఉన్న మైక్రోసాఫ్ట్ టీమ్లో చాట్ చేసుకునేవాళ్లం. అవన్నీ పనిలో భాగంగా చాలా సాధారణమే. అందువల్ల స్నేహపూర్వకంగానే ఇదంతా అనే భావించా. కానీ ఒక వారం తర్వాత పెళ్లిచేసుకుని వచ్చాక ఒక్కసారిగా అతడి తీరు మారిపోయింది. రోటీన్గా ఇదివరకిటిలా స్నాక్స్ షేర్ చేయడం అన్ని చేశారు. అక్కడ వరకు అంతా బాగానే ఉన్నా..సడెన్గా గ్రూప్లో మెసేజ్ల పరంపర డిఫెరెంట్గా మొదలైంది. ఆరోజు జరిగే పనుల గురించి జోక్ చేయడం నుంచి కాస్త విభిన్నంగా మాట్లాడాడు. దాన్ని కూడా తేలిగ్గా తీసుకున్నానంటూ తన గోడును చెప్పుకొచ్చిందామె. డిసెంబర్ 30కి ముందు రోజు అదనపు షిఫ్ట్ల అనంతరం అతడి స్వరంలో మార్పులు స్పష్టంగా గమనించాను. అతడు ఓ పెద్దాయనలా ప్రవర్తించడం లేదనిపించింది. మన ఇద్దరం మంచి ఫుడ్లవర్స్ కాబట్టి ఎప్పుడైనా సరదా వీలుకుదిరితే డిన్నర్కి ప్లాన్ చేద్దామా అని అడిగాడు. ఒక్కసారిగా ఆ మాటకు హుతాశురాలినయ్యానంటూ..తను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని షేర్ చేసుకుంది. అంతేగాదు అతడి ఆహ్వానాన్ని రిజెక్ట్ చేసి దూరంగా ఉంచాలా, యాజమాన్యానికి ఈ ఘటన గురించి వివరించాలో సలహా ఇవ్వమని కోరింది పోస్ట్లో. అయితే నెటిజన్లు..ఆ ఆహ్వానానని తిరస్కరించండి. అతడి ఆలోచన తీరు సరిగా లేదు..సున్నితంగా రిజెక్ట్ చేసి దూరంగా ఉండటమే మంచిది అంటూ పోస్టులు పెట్టడం గమనార్హం. (చదవండి: ఆరోగ్యకరమైన జీవనశైలితో డయాబెటిస్ తగ్గిపోతుందా..? ఆ హాస్య నటుడు ఏకంగా 78 కిలోలు తగ్గి..) -
ఈశ్వరీ..జగదీశ్వరీ..
బ్రహ్మంగారి మఠంలో కొలువుదీరిన శ్రీ ఈశ్వరీదేవి.. జగన్మాతగా విరాజిల్లుతున్నారు. భక్తుల కొంగుబంగారమై నిలిచి.. విశేష పూజలందుకుంటున్నారు. ఈశ్వరీదేవి మఠంలో నేటి గురువారం నుంచి అమ్మవారి ఆరాధన, గురుపూజ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారి చరిత్ర, ఉత్సవాల విశేషాలపై ప్రత్యేక కథనం.శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాన ప్రబోధకర్త, రాజయోగి, హేతువాది, మహిమాన్వితులు, తత్వవేత్త, సంఘ సంస్కర్త, దైవస్వరూపులుగా వినుతికెక్కారు. ఆయన మనువరాలు శ్రీ ఈశ్వరీదేవి. ఆమె జేజినాయన వలే తత్త్వాలు, కీర్తనలు, కాలజ్ఞానం రాసి విశేష కీర్తి పొందారు. వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం ఎక్కువగా భవిష్యత్తును తెలియజేస్తే.. ఈశ్వరిదేవి నోటి నుంచి వెలువడే మాటలు అప్పటికప్పుడే జరిగి తీరేవి. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లాలోని బ్రహ్మంగారిమఠంలో వెలసిన శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి మఠం పక్కనే ఈశ్వరీదేవి మఠం ఉంది. పరాశక్తి స్వరూపిణి ΄ార్వతీదేవి, లక్ష్మీదేవి అంశ నుంచి ఈశ్వరీదేవి అవతరించారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆమె 1703లో స్వస్తిశ్రీ స్వభాను నామసంవత్సరంలో జన్మించారు. వీరబ్రహ్మేంద్రస్వామి రెండో కుమారుడైన గోవిందయ్యస్వామి, గిరియమ్మ దంపతులకు ఈశ్వరమ్మ, కాశమ్మ, శంకరమ్మ అనే ముగ్గురు కుమార్తెలు, ఓంకారమయ్య, సాంబమూర్తి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఈశ్వరమ్మ పెద్దకుమార్తె. బ్రహ్మంగారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. అందరి పిల్లల్లాగా.. వీధి బడిలో సామాన్య విద్యనభ్యసించారు. సంస్కృతం, తెలుగు భాషలలో పాండిత్యం సంపాదించారు. భారత భాగవతాది గ్రంథాలను స్వయంగా వర్ణించే వారు. నిత్యం యోగం అభ్యసించుట, గ్రంథాల పఠనంతోనే గడుపుతుండేది. 12 ఏళ్ల వయసులోనే... ఒకరోజు గోవిందయాచార్య శయ్యపై పరుండి, తీవ్రమైన ధ్యాననిష్టలో మునిగిపోయారు. అలా మూడు రోజులు ఉన్నారు. పిలిచినా పలకలేదు. దీంతో చనిపోయారేమోనని భావించి.. ఆయన భార్య గిరియమ్మ, బంధుమిత్రులు దుఃఖించటం ప్రారంభించారు. అప్పుడు 12 ఏళ్ల వయసు ఉన్న ఈశ్వరీదేవి వచ్చి.. దుఃఖించే అంత పని ఏమి జరగలేదని, నాయన పరమాత్మతో ఆత్మను లీనం చేశారని తెలిపారు. ఆమె గది తలుపులు వేసి సాంబ్రాణి ధూపం వేశారు. వీరబ్రహ్మేంద్రస్వామి తెలిపిన ‘ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః’ అనే బీజాక్షరి మంత్రాన్ని జపించారు. వెంటనే గోవిందయ్య లేచి కూర్చున్నారు. ఈ విషయాన్ని చూసిన జనం సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. అప్పటి నుంచి ఈశ్వరీదేవి సామాన్య మనిషి కాదని, మహిమాన్వితురాలని గుర్తించారు. తండ్రినే గురువుగా భావించి.. ఆయన ద్వారా మంత్రోపదేశం నేర్చుకున్నారు. 14 ఏళ్లు తపస్సు చేసి... బ్రహ్మంగారి మఠానికి సమీపాన ఉన్న నల్లమల కొండ గుహలో 14 ఏళ్లు కఠోర తపస్సు చేసి.. అష్టాంగయోగాది, జ్ఞానవాక్సిద్ధి పొందారు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి స్వప్నసాక్షాత్కార దర్శనం పొంది.. ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రహ్మతత్వాన్ని బహుళ ప్రచారం చేయడానికి సంకల్పించారు. తల్లిదండ్రులు వివాహ ప్రయత్నం చేయగా.. నిరాకరించారు. లోక కల్యాణార్థం బ్రహ్మచర్య దీక్ష బూని ఆత్మతత్వ బోధనలు రచించారు. మఠాధీశులై... తండ్రి గోవిందయ్యస్వామి యోగ సమాధి నిష్ట వహించిన దివ్య సన్నిధానానికి గర్భగుడి, అంతరాలయం, ముఖమండపం నిర్మించి ప్రత్యేక(చిన్న) మఠం ఏర్పాటు చేశారు. ఆ మఠానికి మఠాధీశులై నిత్యపూజ కార్యక్రమాలు, ఆరాధన గురు పూజోత్సవాలు నిర్వహిస్తుండేవారు. అమ్మవారి బోధనలు విని ఆకర్షితులై.. ఎంతో మంది శిష్యులుగా మారారు. రాజయోగినిగా మారి, శిష్యసమేతంగా దేశ పర్యటన చేసి భక్తితత్వాన్ని ప్రచారం చేశారు. భక్తులకు ఎన్నో లీలలు ప్రత్యక్షంగా చూపించారు. ఎందరినో సంస్కరించి జ్ఞాన దీప్తిలా భాసిల్లి.. జనుల గుండెల్లో అమ్మవారిగా కొలువైనారు.సజీవ సమాధి ఈశ్వరమ్మ వారు 1789లో శ్రీ సౌమ్యనామ సంవత్సర మార్గశిర బహుళ నవమినాడు సజీవ సమాధి నిష్ట వహించారు. నాటినుంచి లోకకల్యాణార్థం యోగ నిద్రముద్రితురాలై భక్తజనుల నిత్య నీరాజనాలు స్వీకరిస్తున్నారు. చిన్నమఠం శ్రీ ఈశ్వరిదేవిమఠంగా పేరొందినది. అమ్మవారు సజీవ సమాధి నిష్ట పొందిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా ఆరాధన, గురుపూజ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. అమ్మవారిని గురువుగా భావిస్తారు కనుక శిష్యులు, భక్తులు ఈ కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహిస్తారు.భారీగా భక్తుల రాకదేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలిరానున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచే కాకుండా.. కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. వీరి సౌకర్యం కోసం పలు ప్రాంతాల నుంచి ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపనుంది.ఆరాధనోత్సవాలు నేటి నుంచి 16 వరకు అమ్మవారి ఆరాధన గురుపూజ మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో రోజూ ఉదయం ప్రభాతసేవ, పంచామృతాభిషేకం, కుంకుమార్చన, మధ్యాహ్నం నైవేద్యం, నీరాజనం, తీర్థప్రసాద వినియోగం, సాయంత్రం సూక్త΄ారాయణం, అభిషేకం, కుంకుమార్చన, రాత్రి నైవేద్యం, నీరాజనం, తీర్థప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే భక్తుల కాలక్షేపం కోసం సంగీత విభావరి, హరికథలు, భజన కార్యక్రమాలు ఉంటాయి.11న కలశోత్సవం, కలశ స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.12న ఉదయం అశ్వవాహనం, రాత్రి హంస వాహనంపై అమ్మవారి ఊరేగింప13న (ఈశ్వరీదేవి మార్గశిర బహుళ నవమిన మహాదేవి సజీవ సమాధి నిష్ట వహించిన రోజు) ఉదయం దేవతా ఆవాహనం, శాంతి హోమం, సామూహిక కుంకుమార్చనలు, మధ్యాహ్నం దీక్షా అలంకరణ ఉత్సవం, సాయంత్రం సహస్ర దీపాలంకరణ, తులాభారం, ఊయల సేవ, రాత్రి సింహ వాహన గ్రామోత్సవం ఉంటాయి. 14న గుడి ఉత్సవం, రాత్రి పుష్పరథోత్సవం 15న పూర్వపు మఠాధిపతులు వీరబ్రహ్మయాచార్య స్వాముల వారి ఆరాధన, గ్రామోత్సవం16న మహాప్రసాద వినియోగంతో ఉత్సవాలు ముగుస్తాయి. – వడ్ల మల్లికార్జున ఆచార్య, సాక్షి, కడప(చదవండి: అరటిచెట్టు వెనక ఆధ్యాత్మిక రహస్యం) -
అరటిచెట్టు వెనక ఆధ్యాత్మిక రహస్యం
హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వృక్షాలలో అరటి చెట్టు ఒకటి. ఈ చెట్టును దేవ వృక్షంగా, సాక్షాత్తు శ్రీమహావిష్ణువుకు ప్రతీకగా భావిస్తారు. అందుకే ఏ శుభకార్యం జరిగినా, పూజాది కార్యక్రమాలు నిర్వహించినా అరటి ఆకులు, గెలలు తప్పనిసరి. అయితే, ఈ పవిత్రమైన చెట్టును ఇంట్లో సరైన దిశలో నాటడం వల్ల అపారమైన శ్రేయస్సు పాజిటివ్ ఎనర్జీ కలుగుతాయని వాస్తు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈశాన్యదిశలో అరటి చెట్టును నాటడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటో తెలుసుకుందాం.. ఈశాన్యం అనేది శుభాలకు నిలయంగా భావిస్తారు. ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం, అరటిచెట్టును నాటడానికి ఈశాన్య దిశ అంటే తూర్పు–ఉత్తర దిక్కుల మధ్య మూల. ఇది అత్యంత శ్రేయస్కరం అయింది. ఈశాన్యాన్ని దేవతల స్థానంగా, శివుడు, గురువు బృహస్పతి కి సంబంధించిన దిక్కుగా భావిస్తారు. ఈ దిశలో అరటి చెట్టు ఉండడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవాహం పెరుగుతుంది. అరటి చెట్టు బహస్పతి గ్రహానికి సంబంధించినది. ఈశాన్యంలో అరటి చెట్టును నాటి, పూజించడం ద్వారా జాతకంలో గురు గ్రహం బలం పెరుగుతుంది. గురు బలం పెరిగితే, జ్ఞానం, విద్య, అదృష్టం, ఆర్థిక స్థిరత్వం కలుగుతాయి. గురువారం రోజున శ్రీమహావిష్ణువుకు అరటి చెట్టు రూపంలో పూజ చేయడం, పసుపు నీరు పోయడం వల్ల లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభించి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని విశ్వసిస్తారు. అరటి చెట్టు నాటేటప్పుడు పాటించాల్సిన వాస్తు నియమాలు ఏమిటంటే..? అరటి చెట్టు ఇంట్లో శుభాన్ని తీసుకురావాలంటే, కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఈశాన్యంతోపాటు, ఉత్తర లేదా తూర్పు దిశలో కూడా నాటవచ్చు. అయితే అరటిచెట్టు నీడ ఇంటిపై పడకుండా చూసుకోవడం ముఖ్యం.ముఖ్య గమనిక.. అరటి చెట్టును ఇంటి ప్రధాన ద్వారం ముందు భాగంలో నాటకూడదు. ఎల్లప్పుడూ ఇంటి పెరట్లో లేదా కాంపౌడ్ లోపల వెనుక భాగంలో ఉండేలా చూసుకోవాలి. అరటి చెట్టుకు దగ్గరలోనే తులసి మొక్కను నాటడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. తులసి విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది కాబట్టి, ఇద్దరి అనుగ్రహం లభిస్తుంది. అరటి చెట్టు చుట్టూ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. ఆకులు ఎండిపోకుండా చూసుకోవడం, ఎండిన ఆకులను ఎప్పటికప్పుడు తొలగించడం ద్వారా ప్రతికూల శక్తిని నివారించవచ్చు. పవిత్రమైన అరటి చెట్టును ఈశాన్యంలో నాటి, నిత్యం పూజించడం ద్వారా ఆ ఇంట్లో సుఖ సంతోషాలు, శ్రేయస్సు ఎల్లప్పుడూ వెల్లివిరుస్తాయని ఆధ్యాత్మిక పెద్దలు చెబుతున్నారు. – పసుపులేటి వెంకటేశ్వరరావు -
‘మా పిల్లలను స్కూలుకు పంపించం'
తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి స్కూలుకు పంపాలనుకోవడం సహజం. అయితే ఈ కోల్కతా దంపతులు మాత్రం ‘మా పిల్లలను స్కూలుకు పంపించం గాక పంపించం’ అంటున్నారు. వీరి ‘అన్స్కూలింగ్’ సిద్ధాంతం ఆన్లైన్లో చర్చనీయాంశంగా మారింది. ఈ దంపతుల దృష్టిలో సంప్రదాయ విద్య అనేది...వేస్ట్ ఆఫ్ టైమ్!సంప్రదాయ బడుల కంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియెన్స్’ ద్వారా తమ పిల్లలకు చదువు చెప్పడానికి రంగంలో దిగారు. ట్రావెల్, నేచర్ వాక్స్, వర్క్షాప్స్, హ్యాండ్స్–ఆన్ యాక్టివిటీల ద్వారా తమ పిల్లలకు చదువు నేర్పిస్తున్నారు. విద్యాబోధనలో కొత్తదారిలో ప్రయాణిస్తున్న ఈ తల్లిదండ్రుల గురించి సోషల్ మీడియా ఇన్ఫ్లూయెనర్–నటి షెనాజ్ ట్రెజరీ ఒక వీడియోను షేర్ చేసింది.ట్రావెలింగ్ ద్వారా పిల్లలు చరిత్రను బాగా అర్థం చేసుకుంటారని, పిల్లలకు ఇష్టమైన క్రికెట్ ద్వారా కూడా వారికి కష్టమనిపించే గణితాన్ని సులభంగా నేర్పించవచ్చనీ అంటున్నారు. సంప్రదాయ కెరీర్ మార్గాలలో వెళ్లడం కంటే తమ పిల్లలను ఎంటర్ప్రెన్యూర్లుగా చూడాలని వీరు కోరుకుంటున్నారు.‘స్కూలుకు వెళ్లే విద్యార్థులు నేర్చుకోవడం కంటే ఎక్కువగా అలసిపోతున్నారు. అందుకే మేము అన్స్కూలింగ్ కాన్సెప్ట్ను ఎంచుకున్నాం. నిర్మాణాత్మక పాఠ్యాంశాలు కాకుండా పిల్లలు ఆసక్తి చూపించే అభ్యాస విధానం మంచిది. పాఠశాల విద్యతో పోల్చితే ఇంటి విద్యలో పేరెంట్స్ బాగా ఇన్వాల్వ్ అవుతారు’ అన్నారీ దంపతులు.ఈ వీడియోపై సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వెల్లువెత్తాయి. ‘నేను కూడా మీ మార్గాన్నే అనుసరిస్తున్నాను’ అని స్పందించారు సెలబ్రిటీ సారా అఫ్రీన్ ఖాన్.‘సంప్రదాయ పాఠశాల విద్య పక్కా వ్యాపారంగా మారినప్పుడు అన్స్కూలింగ్ అనుసరించదగిన మార్గం’ అని మరొకరు స్పందించారు.కొందరు మాత్రం ఇలా స్పందించారు...‘తోటివారితో ఎలా మెలగాలి... ఇంకా ఇతర సామాజిక సంబంధాలను అవగాహన చేసుకోవడం అనేది అన్స్కూలింగ్ ద్వారా సాధ్యపడదు. స్కూలు అనేది మినీ సమాజం. అక్కడ భవిష్యత్కు సంబంధించి ఎన్నో విషయాలను పిల్లలు సహజంగానే నేర్చుకోగలుగుతారు. బాల్య స్నేహలకు సంబంధించి మధుర జ్ఞాపకాలకు అన్స్కూలింగ్లో అవకాశం లేదు’. View this post on Instagram A post shared by Travel, Romance, Smiles (@shenaztreasury) (చదవండి: తస్మాత్ జాగ్రత్త..! బాడీబిల్డర్లు కండలు ముఖ్యమే కానీ..) -
తస్మాత్ జాగ్రత్త..! బాడీబిల్డర్లు కండలు ముఖ్యమే కానీ..
‘జిమ్కు వెళ్లేవారు స్టెరాయిడ్లు వాడుతున్నారు’ అనే మాట వినిపించినప్పుడు కళ్ల ముందు కండలు తిరిగిన పురుషుడి చిత్రం ఆవిష్కృతం అవుతుంది. అయితే సీన్ మారుతోంది. పురుషులే కాదు స్టెరాయిడ్లు వాడుతున్న మహిళల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి...ప్రపంచవ్యాప్తంగా మహిళలలో అనబాలిక్ స్టెరాయిడ్ల వాడకం పెరిగిందని చెబుతోంది ఇంటర్నేషనల్ స్టడీస్ సిస్టమేటిక్ రివ్యూ. 2014లో స్టెరాయిడ్లు వాడిన మహిళలు 1.6 శాతం ఉండగా, 2024 రివ్యూ ప్రకారం 4 శాతం మంది మహిళలు స్టెరాయిడ్లు ఉపయోగిస్తున్నారు. మహిళా బాడీబిల్డర్లలో దాదాపు 17 శాతం మంది, ప్రతి ఆరుగురిలో ఒకరు స్టెరాయిడ్లను ఉపయోగిస్తున్నారని నివేదిక చెబుతోంది. ఈ పెరుగుదలకు సోషల్ మీడియాలోని ‘ఫిట్ఫ్లూయెన్సర్స్’ ప్రభావమే కారణం అనే విమర్శ ఉంది.స్టెరాయిడ్లు వాడుతున్న వారిలో ఎక్కువమంది మహిళలకు దీర్ఘకాలంలో వాటి దుష్ప్రభావం గురించి అవగాహన లేదు. వీటిని వాడుతున్న క్రమంలో అనారోగ్య సమస్యలు ఎదురైనా వైద్యులను సంప్రదించడం లేదు.గతంతో పోల్చితే పవర్లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాడీబిల్డింగ్లలో మహిళల సంఖ్య వేగంగా పెరిగింది. ‘ఆటతీరు మెరుగు పడాలి. ప్రత్యర్థిపై పైచేయి ఉండాలంటే మాదకద్రవ్యాలు వాడాలి’ అనే భావన వల్ల కొందరు వాటికి దగ్గరవుతున్నారు.ఆస్ట్రేలియా, స్కాండినేవియాలలో చేసిన ఒక అధ్యయనం ప్రకారం...పురుష స్నేహితులు, కోచ్ల వల్ల స్టెరాయిడ్లను ఉపయోగించడం మొదలుపెడతారు. ఇవి హానికరం అనే భావన కంటే పోటీకి అనివార్యమనే భావనే వారిలో ఉంటుంది. స్టెరాయిడ్లు ఆటకు ఎంత మేలు చేస్తాయనేది పక్కన పెడితే ఆరోగ్యానికి హాని చేస్తాయి.వాటిలో కొన్ని...ముఖంపై వెంట్రుకలు పెరగడం స్వరంలో మార్పులు రుతుక్రమంలో మార్పులు, సంతానలేమి రొమ్ము కణజాలం తగ్గడం మొటిమలు రావడం, వెంట్రుకలు రాలడం ఆందోళన, చిరాకు, తీవ్రమైన మానసిక స్థితిస్టెరాయిడ్లలో సీసం, ఆర్సెనిక్, కాడ్మియంలాంటి ప్రమాదకరమైన విషపూరితాలు ఉంటాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఇవి క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులకు కారణమయ్యే విషాలు.‘ఈ ప్రమాదాలను నివారించాలంటే స్టెరాయిడ్ల వాడకం వల్ల కలిగే నష్టాల గురించి సోషల్ మీడియా వేదికగా ఫిట్నెస్ ఇన్ఫ్లూయెన్సర్ల ద్వారా విస్తృత ప్రచారం చేయడమే మార్గం’ అంటున్నారు నిపుణులు. (చదవండి: అయోర్టిక్ స్టెనోసిస్ అంటే..? తొమ్మిది పదుల వయసులో ఇది తప్పదా..?) -
నవ్వినా.. ఏడ్చినా... కుప్పకూలిపోతుంటాను..?
డాక్టర్ గారూ, నేనొక చిత్రమైన సమస్యతో బాధపడుతున్నాను. అదేమంటే, రాత్రి నేను ఎంతసేపు పడుకున్నా. రోజంతా మగత గానే ఉంటుంది. కంప్యూటర్ ముందు కూర్చున్నా టీ.వి చూస్తున్నా. చివరకు భోజనం చేస్తూ చేస్తూ అలాగే పడుకుని ΄ోతాను. డ్రైవింగ్ చేస్తూ నిద్రపోతానేమో అని ఈ మధ్య డ్రైవింగ్ చేయడం కూడా మానేశాను. అలాగే బాగా భయపడ్డా, గట్టిగా నవ్వినా కుప్పకూలిపోతాను. నేను కావాలనే ఇదంతా చేస్తున్నాననుకుని మా ఇంట్లో వాళ్లు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడం లేదు. నేను సాక్షిలో మీ కాలమ్ రెగ్యులర్గా చదువుతాను. కనీసం మీ సమాధానం చూసైనా ఇంట్లో వాళ్ళు నన్ను డాక్టర్కి చూపిస్తారనే నమ్మకంతో, నా సమస్యను మీకు మెయిల్ చేస్తున్నాను! – స్వాతి,ప్రొద్దుటూరుమీ సమస్య చాలా ఇబ్బందికరమైనది, మీ పరిస్థితికి బాధ కూడా కలుగుతోంది. కేవలం అవగాహనా లోపం వలన సరియైన చికిత్స అందుబాటులో ఉన్న సమస్యలని కూడా పట్టించుకోక పోవడం వల్ల ఎలా జరుగుతోందో మీ విషయాన్ని బట్టి అర్థం అవుతుంది. మీరు చెబుతున్న లక్షణాలని బట్టి మీరు ‘నార్కోలెప్సీ’ అనే సమస్యతో బాధపడుతున్నారని అనిపిస్తోంది. ఇది మెదడులోని ‘హైపోథాలమస్ అనే భాగం పని విధానంలో మార్పుల వలన వచ్చే ఒక న్యూరో.. సైకియాట్రిక్ డిజార్డర్. ఈ సమస్యలో నిద్రకి సంబంధించిన సాధారణ లయ దెబ్బతింటుంది. నిద్రలో వచ్చే REM & NREM అనే రెండు నిద్ర దశల క్రమ పద్ధతిలో మార్పులు ఈ సమస్యకి ప్రధాన కారణం. దాని వలన పడుకునే ముందు, నిద్రలేచే ముందు వివిధ రకాల భ్రాంతులు కలుగుతాయి. విపరీతమైన కలలు వస్తాయి. నిద్ర లేచే ముందు శరీరం పక్షవాతానికి గురైనట్లు అనిపిస్తుంది. కాళ్లూ చేతులు కదిలించలేరు. అన్నీ వినబడతాయి, కనబడతాయి, కానీ సమాధానం చెప్పలేరు. దీని వలన విపరీతమైన భయానికి, అసౌకర్యానికీ గురౌతారు. అలాగే బాగా ఎమోషనల్ అయినప్పుడు మెలకువ స్థితిలోనే, మెదడు REM స్థితిలోకి వెళ్ళిపోతుంది. దీనివలన ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. ఈ అనుభవం కూడా అత్యంత భయానకంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ కండిషన్ను ‘ఫిట్స్’ అనుకొని తప్పుగా వైద్యం కూడా చేసే కేసులు కూడా చూస్తూంటాను. కొంతమంది కావాలనే ఇలా చేస్తున్నారనే అసలు చికిత్సే ఇప్పించరు. పాలిమ్నోగ్రఫీ అనే పరీక్ష ద్వారా ఈ సమస్యను నిర్ధారించవచ్చు. అలాగే ‘స్టిమ్యులెంట్సు, కొన్ని రకాల ‘యాంటీ డిప్రెసెంట్’ మందులు వాడితే ఈ సమస్య నియంత్రణలో ఉంటుంది. ఎక్కువగా ఎమోషన్స్కి గురికాకుండా కౌన్సెలింగ్ కూడా తీసుకోవాలి. ఉదయంపూట కొంచెంసేపు నిద్రపోవడం కూడా ఈ సమస్యలోంచి బయట పడేందుకు దోహదం చేస్తుంది. మీరు నిరాశకు గురికాకుండా మీ ఇంట్లో వాళ్ళకి ‘సాక్షి’లో నా సలహా చూపించండి. అర్థం చేసుకొని మీకు వైద్య సహాయం అందిస్తారని నా నమ్మకం. ఆల్ ది బెస్ట్! డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
అందరి అమ్మ అల్కాశర్మ
భగవంతుడి అనుగ్రహాలూ, లీలలూ చాలా చిత్రవిచిత్రంగా ఉంటాయి. చాలామందిని దీవించి, వరాలిచ్చి పంపుతుంటాడా... మరికొందరి పట్ల ఆగ్రహించడం ద్వారా చాలామందిని అనుగ్రహిస్తుంటాడు దేవుడు. అలా ఓ చిన్నారి బిడ్డకు శిక్ష విధించి... ‘‘ఇలాంటి అభాగ్యులెందరో ఉంటారూ... వాళ్లకు నువ్వు సేవలందించ’’మంటూ ఓ తల్లికి అనాథల బాధ్యతలు అప్పగించాడు. భగవంతుడు ఆదరించకపోతే అదెంత బాధాకరంగా ఉంటుందో అనుభవమైంది కాబట్టి... అలాంటి అభాగ్యులెందరినో ఆమె ఆదరిస్తోంది. హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఓ తల్లే అల్కా శర్మ. ఎందరిలోనో స్ఫూర్తి నింపే ఆ అమ్మ కథేమిటో చూద్దాం. దేవుడెందుకోగానీ... అల్కా శర్మ పట్ల నిర్దయగా ఉన్నాడు. ఆమె కొడుకైన అయాన్కు ‘ఆప్సోక్లోనస్ మయోక్లోనస్ సిండ్రోమ్’ – (ఓఎమ్ఎస్) అనే ఓ అరుదైన వ్యాధిని అనుగ్రహించాడు. ఆ వ్యాధి కూడా చాలా చిత్రమైంది. తాను నమ్ముకున్న భగవంతుడే తనను శిక్షించినట్టుగా... తన సొంత వ్యాధి నిరోధకవ్యవస్థ తననే కబళించి దెబ్బతీసే ‘ఆటో ఇమ్యూన్’ వ్యాధి అది. అమాయకమైన చిన్నారులను దెబ్బతీసే ఆ వ్యాధి... ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత లేదా న్యూరోబ్లాస్టోమా అనే నరాల వ్యాధి వచ్చాక బయటపడుతుంది.ఈ వ్యాధి లక్షణాలేమిటంటే..?ఈ వ్యాధి ఉన్నవారి కనుగుడ్లు అత్యంత వేగంగా చకచకా అటు ఇటూ కదిలిపోతుంటాయి. ఈ కండిషన్ను ‘ఆప్సోక్లోనస్’ అంటారు. ఇలా కనుగుడ్లు చకచకా కదలడాన్ని ‘డాన్సింగ్ ఐస్’ (నాట్యం చేస్తున్న కళ్లు)గా కూడా అభివర్ణిస్తారు. దీనినే వైద్యపరిభాషలో ‘నిస్టాగ్మస్’ అంటారు. ఇక కండరాలపై అదుపు ఉండక అవి కూడా వాటంతట అవే కదిలిపోతుంటాయి. ఫలితంగా కాళ్లూ చేతుల కండరాలపై పట్టు ఉండదు. ఒక్కోసారి నాలుక కండరంపైనా అదుపు ఉండదు కాబట్టి మాట ముద్ద ముద్దగా వస్తుంటుంది. ఇలా కళ్లూ, కాళ్లూ, కండరాలపై అదుపు ఉండని ఈ ‘ఆప్సోక్లోనస్ మయోక్లోనస్ సిండ్రోమ్’తో తన బిడ్డను అనుగ్రహించగానే ఓ చిర్నవ్వు నవ్వింది ఆ తల్లి. ‘ఓహో... నాకీ శిక్ష విధించి ఇలాంటి అభాగ్యులెందరి బాధలనో గుర్తించమంటూ నన్ను అనుగ్రహించావా తండ్రీ’’ అంటూ ఆ తల్లి అల్కా శర్మ తన బిడ్డల్లాంటి ఎందరో దివ్యాంగ బిడ్డలకేసి దయగా చూసింది. వాళ్ల బాధలు బాపేందుకు పూనుకుంది. తన భర్త నీరజ్ శర్మ కూడా ఆమె సంకల్పానికి తన చేయూతనిచ్చారు. అప్పటికి తనకున్న బంగారాన్నీ, ఆభరణాలనూ అన్నింటినీ అమ్మేసి వచ్చిన డబ్బుతో హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రా జిల్లా, ఫతేపూర్ తహసిల్లోని ఛత్తర్ అనే చోట దివ్యాంగులైన పిల్లల కోసం ఓ అనాథాశ్రమాన్ని ప్రారంభించింది. ‘ఏంజెల్ డిజేబిలిటీ అండ్ ఆర్ఫనేజ్ హోమ్’ అనే ఆ అనాథాశ్రమాన్ని మొదలుపెట్టిన నాటి నుంచీ... అంటే 2018 మొదలుకొని ఇప్పటివరకూ దాదాపు 160 మందికి పైగా దివ్యాంగ బాలిబాలికలలకు నివాస ఫిజియోథెరపీ సేవలనూ, స్పీచ్ థెరపీ వంటి చికిత్సలద్వారా సేవలందిస్తోంది అల్కా. ఈ పిల్లల్లో చాలామంది ఇప్పుడు తమ వైకల్యాన్ని అధిగమిస్తూ తమ పనులు తాము చేసుకునేలా స్వావలంబన సాధించారు. ఇలా తన కొడుకుకు వైకల్యాన్ని ఇవ్వడం ద్వారా ఆ భగవంతుడు తనపై అలక బూనినా తాను మాత్రం తన సేవా అసిధారావ్రతాన్ని అదేపనిగా కొనసాగిస్తూ పిల్లలను అనుగ్రహిస్తూనే ఉంది అమ్మ అల్క శర్మ. – యాసీన్ -
ఆ చూపు ప్రపంచంకప్పు దాకా..
కూతురు అంధురాలుగా పుడితే వదిలి వెళ్లిపోయే తండ్రి ఉండొచ్చుగాని తల్లి ఉండదు. అస్సాం అంధ క్రికెటర్ సిము దాస్ని తల్లి అంజు దాస్ ఒక్కతే ఎన్నో కష్టాలతో పెంచింది. ఫలితంగా ఇవాళ కూతురు భారత జట్టు తరఫున ప్రపంచ కప్పు సాధించిన విజేతగా నిలిచింది. ఆమెకు అస్సాం ప్రభుత్వం 10 లక్షల నగదు బహుమతి, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది. ఇదంతా ఆ తల్లి ఓర్పుకు దొరికిన ప్రతిఫలం.నవంబర్ 23, ఆదివారం రోజు అంజు దాస్ ఎప్పట్లాగే పని ముగించుకుని ఇంటికి బయలుదేరింది. ఆమె అస్సాంలోని నగావ్ జిల్లా కొతియటోలి అనే పల్లెలో వంట మనిషిగా, పని మనిషిగా జీవిస్తోంది. ఇల్లు మరికాస్త దూరంలో ఉందనగా ఊళ్లో ఉన్న కుర్రాళ్లంతా చప్పట్లతో, కేరింతలతో ఆమెకు ఎదురు వచ్చారు. ‘అక్కా. నీ కూతురు సాధించింది. మనం వరల్డ్ కప్ గెలిచాం’ అని మెచ్చుకోలుగా వాళ్లు మాట్లాడుతుంటే అంజుదాస్ కళ్ల నుంచి ధారాపాతంగా ఆనందబాష్పాలు రాలిపడ్డాయి.→ ఆమె కూతురు విజేతఅంధ మహిళా క్రికెటర్లను ప్రోత్సహించడానికి మొట్ట మొదటిసారి ‘టి 20 వరల్డ్ కప్ ఫర్ బ్లైండ్ విమెన్’ను కొలంబోలో నవంబర్ 11 నుంచి 23 తేదీల మధ్య నిర్వహించారు. అమెరికా, ఆస్ట్రేలియా సహా మన పొరుగున ఉన్న దేశాలతో కలిపి మొత్తం ఆరు దేశాలు పాల్గొన్న ఈ పోటీలో ఇండియా జట్టు అప్రతిహతంగా సాగి ఫైనల్స్లో నేపాల్ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ జట్టులో అంజుదాస్ కూతురు సిము దాస్ ఉంది. ఇండియా గెలవడానికి టోర్నమెంట్లో మొత్తం 68 విలువైన పరుగులు చేసింది. అస్సాం మారుమూల పల్లెలో నిలువ నీడ లేని కుటుంబం నుంచి కేవలం తల్లి అందించిన ప్రోత్సాహంతో సిము దాస్ ఈ అద్భుతం సాధించింది. ఆ ప్రయాణం అంతా గుర్తుకొచ్చి అంజుదాస్ కళ్లు వర్షించాయి.→ ప్రధానే స్పందించారుఅంధ మహిళల జట్టు సభ్యులు వరల్డ్ కప్తో ఢిల్లీలో ప్రధానిని కలిశారు. ఆ తర్వాత అస్సాంకు సిము దాస్ చేరుకుంటే ఆమెకు ఘన స్వాగతం లభించింది. అయితే ఆ వెంటనే ఒక తెల్లవారు జామున ప్రధాని నుంచి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు ఫోన్ వచ్చింది. ‘నువ్వు సిము దాస్ను కలిశావా’ అని ప్రధాని అడిగారు. ‘వెంటనే కలిసి ఆమెకు కావాల్సిన సాయం చేయి’ అన్నారు. అప్పటికి బిశ్వ శర్మకు సిము దాస్ గురించి తెలియదు. ఆగమేఘాల మీద తెలుసుకుని ఆమెకు పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పారు. అస్సాం గవర్నర్ ఆమెను తన నివాసానికి ఆహ్వానించి మరో లక్ష రూపాయల నజరానా ఇచ్చారు. ఇన్ని ప్రశంసలు సిము దాస్ గెలుపుకు. కాదు కాదు ఆమె తల్లి గెలుపునకు.→ తండ్రి పారిపోతే...అంజుదాస్కు వివాహం అయ్యాక మొదట కొడుకు పుట్టాడు. ఆ కొడుకు అంధుడే కాదు బధిరుడు కూడా. రెండవసారి కుమార్తె పూర్తి అంధత్వంతో పుట్టింది. కూతురు అంధత్వ వార్త విన్న వెంటనే భర్త మొత్తం కుటుంబాన్ని వదిలేసి పారిపోయాడు. వాళ్లకు ఇల్లు కూడా లేదు. ఊరిపెద్ద తన పొలంలో చిన్న గుడిసె వేసుకోమన్నాడు. ఆరోజు నుంచి నేటి వరకూ వాళ్లు ఆ గుడిసెలోనే ఉన్నారు. ఊరి ఉపాధ్యాయుడు సిమును చదివించమని సూచించడంతో తల్లి ధైర్యం చేసి గువహతిలో అంధ బాలికల స్కూల్లో చేర్చించింది. అక్కణ్ణుంచి సిము ఢిల్లీ వరకూ వెళ్లి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది. 2022లో క్రికెట్లో ప్రవేశించిన వెంటనే ప్రతిభ చూపుతూ జాతీయ జట్టుకు ఎంపికై ట్వంటీ ట్వంటీ కప్ గెలుపులో కీలకపాత్ర పోషించింది.→ అమ్మ లేకపోతే...‘అమ్మ లేకపోతే నేను లేను. ఆమె తన జీవితం మొత్తం పోరాడుతూనే ఉంది. నేటికీ మా అన్నయ్యకు ఆమె సేవలు చేస్తోంది. మా కోసమే ఆమె బతికింది. నేను ఆమె కోసమే గెలిచాను. ఇంకా ఆడతాను. మా అమ్మను సంతోషంగా ఉంచాలనేదే నా కోరిక’ అంది సిము దాస్. -
అయోర్టిక్ స్టెనోసిస్ అంటే..? తొమ్మిది పదుల వయసులో ఇది తప్పదా..?
90 ఏళ్ల ప్రముఖ బాలీవుడ్ నటుడు ప్రేమ్ చోప్రాకు తీవ్రమైన అయోర్టిక్ స్టెనోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే ఆయనకు ట్రాన్స్కాథెటర్ అయోర్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ (TAVI) ప్రక్రియ జరిగింది. దీన్ని గుండె సంబంధిత పరిస్థితిగా పేర్కొన్నారు వైద్యులు. గుండె కవాటాలు పనిచయకపోవడం వల్లే వచ్చే సమస్యగా పేర్కొన్నారు. అంటే గుండె, శరీరంలోని వివిధ భాగాల మధ్య ప్రధాన రక్త వాహక ధమని అయిన అయోర్టాకు రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు అల్లుడు షర్మాన్ జోషి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అసలు అయోర్టిక్ స్టెనోసిస్ అంటే ఏంటి, ఇది ఎందువల్ల వస్తుంది తదితరాల గురించి తెలుసుకుందామా..!.అయోర్టిక్ స్టెనోసిస్ అంటే ఏమిటి?అయోర్టిక్ స్టెనోసిస్ (AS) అనేది అయోర్టిక్ వాల్వ్ తీవ్రమైన పరిస్థితి. ఈ స్థితిలో, బృహద్ధమని కవాటం ఇరుకుగా మారి పూర్తిగా తెరుచుకోదు. ఈ సంకుచితం గుండె నుంచి బృహద్ధమనిలోకి, తర్వాత శరీరంలోని మిగిలిన భాగాలకు రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుందని కార్డియాలజిస్ట్లు చెబుతున్నారు.ఎందువల్ల ఇలా అంటే.."రక్త ప్రవాహం తగ్గినప్పుడు, గుండె కండరం బలహీనపడవచ్చు. నిజానికి ఇది తీవ్రమైన సమస్య సకాలంలో సమస్యను నిర్థారించి చికిత్స అందించకపోతే తీవ్రమైన బృహద్ధమని స్టెనోసిస్ గుండె వైఫల్యంతో తీవ్ర సమస్యలకు దారితీస్తుందని చెప్పుకొచ్చారు.వయసు పెరిగే కొద్దీ, గుండె కవాటాల కాల్సిఫికేషన్ కారణంగా ఈ పరిస్థితి తరచుగా అభివృద్ధి చెందుతుంది. కాలక్రమేణా, కాల్షియం నిక్షేపాలు గట్టిపడతాయి వాల్వ్ కరపత్రాలను గట్టిపరుస్తాయి. దాంతో వాల్వ్ పూర్తిగా తెరవడం కష్టతరం చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే.. ఇది ఇరుక్కుపోయిన తలుపును తెరవడానికి ప్రయత్నించడం లాంటిది. అంటే ఊపిరిరాడని పరిస్థితి ఎదురవ్వుతుంది. బలవంతంగా ప్రయత్నిస్తే మరో సమస్య ఎదురుకావొచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు.లక్షణాలు ఎలా ఉంటాయంటే..ఊపిరి ఆడకపోవడం, ఛాతీ నొప్పి లేదా మూర్ఛపోవడం వంటి లక్షణాలను అనుభవిస్తే.. ఇరుకైన వాల్వ్ గుండెపై ఒత్తిడి తెస్తుందని అర్థం. ఇది గుండె వైఫల్య అవకాశాలను పెంచుతుంది. సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది.ముందస్తుగా గుర్తించగలమా..?బృహద్ధమని స్టెనోసిస్ గమ్మత్తైనది. ఎందుకంటే ప్రారంభ దశల్లో గుర్తించడ కష్టం. ఇరుకైన బృహద్ధమని కవాటం ఉన్న చాలా మందికి ఎటువంటి లక్షణాలు ఉండవు. ఇది ప్రారంభ రోగ నిర్ధారణలను కోల్పోవడానికి దారితీస్తుంది. మితమైన బృహద్ధమని స్టెనోసిస్ ఉన్న చాలా మందికి లక్షణాలు ఉండవని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా పేర్కొంది. మరి ఎలా నిర్ధారిస్తారు?లక్షణాలు వెంటనే స్పష్టంగా కనిపించకపోవచ్చు కాబట్టి బృహద్ధమని స్టెనోసిస్ను గుర్తించడం కష్టంగా ఉంటుంది. ఈ పరిస్థితిని నిర్ధారించడానికి, ఇమేజింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. బృహద్ధమని స్టెనోసిస్ తీవ్రతను విశ్లేషించడానికి, అంచనా వేయడానికి ఉత్తమ ప్రారంభ పరీక్ష ట్రాన్స్థొరాసిక్ ఎకోకార్డియోగ్రఫీ (TTE) ఈ పరీక్ష వాల్వ్ ప్రాంతం, రక్త ప్రవాహ వేగం, అలాగే వాల్వ్ అంతటా పీడన ప్రవణతలతో సహా సమాచారాన్ని అందిస్తుంది.వాటి తోపాటు ఎలక్ట్రో కార్డియోగ్రామ్లు (ECGలు), ఛాతీ ఎక్స్-కిరణాలు వంటి పరీక్షలు గుండె ఆరోగ్యాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడతాయి.TAVI ఒక్కటే ప్రత్యామ్నాయమా..ప్రేమ్ చోప్రా వంటి వృద్ధాప్య రోగులకు, TAVI నిజమైన ఆశను అందిస్తుంది. సాంప్రదాయకంగా, తీవ్రమైన బృహద్ధమని స్టెనోసిస్కు చికిత్స చేయడం అంటే ఓపెన్-హార్ట్ సర్జరీ కిందకు వస్తుంది. దానికంటే ఈ TAVI తక్కువ ప్రమాదంతో సులభంగా బయటపడతారు. ఈ చికిత్సలో తక్కువ రోజులో ఆస్పత్రిలో ఉంటే వెసులుబాటు తోపాటు తొందరగా కోలుకోగలం కూడా. అలాగే ఇది జీవన నాణ్యతను కొనసాగించే అవకాశాన్ని కూడా అందిస్తుంది.(చదవండి: -
శబరిమలలో 50% మంది తెలుగు భక్తులే
శబరిమలలో అంతకంతకు పెరుగుతున్న భక్తుల జనసందోహం. కేవలం నిన్న ఒక్కరోజే తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా శబరిమలకు తరలివచ్చారు. స్థానిక సంస్థల ఓటింగ్ రోజు(పంచాయతీ ఎన్నికలు) అయినప్పటికీ.. సన్నిధానం, పంపా, శబరిపీఠం, శరణ్గుత్తి ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. తెల్లవారుజామున 3 గంటలకు ఆలయం తెరిచినప్పుడూ.. ఒక గంటలో ఏకంగా 13 వేల మందికి పైగా భక్తులు శబరికొండ ఎక్కారు. సాయంత్రం 6 గంటలకు దర్శనం కొచ్చే వారి సంఖ్య 75,463 కు చేరుకుంది. 18వ మెట్టు ఎక్కేందుకు శరణ్గుత్తి, మరంకూట్ట మధ్య భారీ క్యూ ఉంది. గత కొన్ని రోజులతో పోలిస్తే.. నిన్న ఒక్కరోజే రద్దీ అధికం. శబరిమలకు వస్తున్న భక్తుల్లో 50 శాతం మంది ఆంధ్ర, తెలంగాణకు చెందినవారే ఉంటున్నారు. అలాగే నిన్న దర్శనానికి వచ్చిన మలయాళీలలో చాలామంది మలబార్ ప్రాంతానికి చెందినవారే కావడం గమనార్హం.(చదవండి: Sabarimala: ‘ఉరక్కుళి జలపాతం వైపు వెళ్లొద్దు’) -
దీపావళికి విశ్వ కిరీటం
న్యూఢిల్లీ: భారతదేశ సాంస్కృతిక వైభవానికి, తరతరాల జీవన సంస్కృతికి అత్యంత అరుదైన గౌరవం దక్కింది. చీకటిని చీల్చే దివ్య కాంతుల పండుగ దీపావళి.. బుధవారం యునెస్కో సాంస్కృతిక వారసత్వ నిధిగా ప్రపంచ వేదికపై ఘనంగా ఆవిష్కృతమైంది. యునెస్కో ఇన్టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో స్థానం సంపాదించుకుంది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకాయి. ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా జరుగుతున్న యునెస్కో కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. యునెస్కో కమిటీ కీలక చర్చల అనంతరం దీపావళిని గౌరవప్రదమైన ఈ జాబితాలో చేర్చినట్లు ప్రకటించగానే, ప్రాంగణమంతా ‘జై హింద్’, ‘వందేమాతరం’, ‘భారత్ మాతా కీ జై’ నినాదాలతో మారుమోగింది. వేదిక ముందు సంప్రదాయ వస్త్రధారణతో కళాకారులు ప్రదర్శనలు ఇవ్వగా, భారీ తెరపై దీపావళి పండుగ చిత్రాలు కనువిందు చేశాయి. జాబితాలో 16వ అంశంగా దీపావళి యునెస్కో యునెస్కో ఇన్టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో భారత్ నుంచి చేరిన 16వ అంశం దీపావళి. ఈ జాబితాలో ఇప్పటికే కుంభమేళా, కోల్కతా దుర్గా పూజ, గుజరాత్కు చెందిన గర్బా నృత్యం, యోగా, వేద పఠన సంప్రదాయం, రామాయణం ఇతిహాసం సంప్రదాయ ప్రదర్శన అయిన రామలీల వంటి 15 ఇతర అంశాలు ఉన్నాయి. దీపావళి లోతైన భావోద్వేగం యునెస్కో ఇన్టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితా ఖరారుకు ఏర్పాటు చేసిన కమిటీ 20వ సమావేశంలో దీపావళిని ఎంపిక చేసినట్లు ప్రకటన వెలువడిన వెంటనే.. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దేశం తరపున కీలక ప్రకటన చేశారు. ‘ప్రతి భారతీయుడికి, దీపావళి అనేది లోతైన భావోద్వేగం, ఇది తరతరాలుగా అనుభూతి చెందుతోంది, జీవిస్తోంది, ఆస్వాదిస్తోంది’.. అని షెకావత్ తన ప్రసంగంలో అభివర్ణించారు. ఈ గుర్తింపు ద్వారా, ‘యునెస్కో పునరుద్ధరణ, శాంతి, మంచికి విజయం సాధించాలనే శాశ్వత మానవ వాంఛను గౌరవిస్తోంది’.. అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కుమ్మర్ల నుంచి కళాకారుల వరకు లక్షలాది చేతులు ఈ వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నాయని స్పష్టం చేశారు. 🔴 BREAKINGNew inscription on the #IntangibleHeritage List: Deepavali, #India🇮🇳.Congratulations!https://t.co/xoL14QknFp #LivingHeritage pic.twitter.com/YUM7r6nUai— UNESCO 🏛️ #Education #Sciences #Culture 🇺🇳 (@UNESCO) December 10, 2025భారత్ ఆతిథ్యం ఇదే తొలిసారి యునెస్కో అంతర–ప్రభుత్వ కమిటీ సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఎర్రకోట సముదాయంలో డిసెంబర్ 8 నుంచి 13 వరకు ఈ 20వ సమావేశం జరుగుతోంది. దీపావళిని యునెస్కో జాబితాలో చేర్చినందుకు పాకిస్తాన్ దౌత్యవేత్త షోయబ్ సర్వార్ భారత్కు అభినందనలు తెలిపారు. దాదాపు వారం రోజులుగా యునెస్కో నిర్వహిస్తున్న ఈ కీలక సమావేశంలో 80 దేశాలు సమరి్పంచిన మొత్తం 67 నామినేషన్లను పరిశీలిస్తున్నారు. మంగళవారం, బంగ్లాదేశ్ నుండి వచ్చిన తంగైల్ సంప్రదాయ చీర నేతకళ, ఆఫ్గానిస్తాన్ నుంచి బెహజాద్ శైలిలో సూక్ష్మ చిత్రలేఖనాన్ని యునెస్కో జాబితాలో చేర్చారు. పురుషుల అబా (గావున్) అయిన ’బిష్త్’ తయారీ నైపుణ్యాలు, అభ్యాసాలు కూడా ఈ జాబితాలో చేరాయి. ఇరాక్, జోర్డాన్, కువైట్ దేశాలకు చెందిన సాంస్కృతిక అంశాలు కూడా బుధవారం యునెస్కో జాబితాలో స్థానం పొందాయి.Unesco says Diwali is most asthetic festival in the world. Nothing comes close pic.twitter.com/A6sNlHJDaw— Lala (@lala_the_don) December 10, 2025 (చదవండి: గుడి నిజమే కానీ.. పెళ్లిళ్లు మాత్రం చేయరు!) -
రాగులు ఆరోగ్యానికి ఇంత మంచిదా..? అందుకే ఉపాసన అలా..
ఇటీవల కాలంలో ప్రజలలో ఆరోగ్య స్పృహ ఎక్కువైంది. అంతా పోషకాహారాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా చిరుధాన్యాలను తీసుకునేందుకు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ఆ చిరుధాన్యాలలో ఒకటి ఈ రాగులు. ఇవి ఆరోగ్యానికి ఎంత మంచిదంటే..సెలబ్రెటీలు, ప్రముఖులు సైతం వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకునేందుకే ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ హీరో రామ్చరణ్ భార్య, మెగా ఇంటి కోడలు ఉపాసన సైతం ఇది డైట్లో తప్పనిసరని ఓ ఇంటర్వ్యూలో ఆమెనే స్వయంగా చెప్పడం విశేషం. అంతలా అందిరి మదిని దోచిన ఈ చిరుధాన్యం రాగులతో కలిటే లాభాలు, ఎలా తీసుకుంటే మంచిది తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.ఉపాసన కూడా క్రమశిక్షణతో కూడిన డైట్కే ప్రాధాన్యత ఇస్తారామె. 36 ఏళ్ల ఆమె ప్రతి రోజు ఆరోగ్యకరమైన పోషకాహారాన్నే తీసుకోవాలనే విశ్వసిస్తానంటోంది. చిరుధాన్యాల్లో తనకు బాగా నచ్చింద రాగులని పేర్కొంది. అంతేగాదు తనకు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఇచ్చిన సలహాలను గుర్తు చేసుకుంటూ..ఉపాసన రాగులను ఏదోరూపంలో మీ డైట్ బాగంగా చేసుకోండని సూచించినట్లు వెల్లడించింది. అలాగే ఆయన కుమార్తే రాధా జగ్గీతో జరిగిన సంభాషణను కూడా షేర్ చేసుకున్నారామె. భరతనాట్య నృత్యకారిణి అయిన ఆమెకు సద్గురువే స్వయంగా రాగి గంజిని చేసి ఇచ్చేవారని, అదే తనను ఇంతలా ఫిట్గా ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తోందని ఆమె చెప్పినట్లు పేర్కొన్నారు ఉపాసన. అందుకే దీన్ని తన కుమార్తె డైట్లో కూడా భాగం చేశానని చెప్పుకొచ్చింది. అయితే తన కూతురు ఈ రాగులను ఇష్టపడిందా అని అడిగితే మాత్రం..ఆరోగ్యం కోసం తప్పదు, తనకు మరో ఛాయిస్ లేదని నవ్వేశారామె. మరి నిజంగానే రాగులు అంత పోషకవంతమైనదా అంటే..ఎముకలకు బలం..రాగుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. వృద్ధాప్యంలో ఆస్టియో పోరోసిస్ వంటి ఎముకల సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది. చిన్నారులు, వృద్ధులు రాగులను తింటే ఎంతో మేలు జరుగుతుంది. ఎముకలు బలహీనంగా మారకుండా ఉంటాయి. పాలిచ్చే తల్లులు కూడా రాగును తింటే శిశువుకు ఎంతో మేలు జరుగుతుంది. శిశువు ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఎముకలు బలంగా మారుతాయి. చక్కగా ఎదుగుతారు.మధుమేహం రోగులకు..డయాబెటిస్ ఉన్నవారికి రాగులు ఎంతో మేలు చేస్తాయి. రాగుల గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల రాగులను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. దీని వల్ల షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. రాగుల్లో అధికంగా ఉండే ఫైబర్, పాలిఫినాల్స్ షుగర్ లెవల్స్ను తగ్గించేందుకు సహాయం చేస్తాయి. రాగుల్లో ఫైబర్ అధికంగా ఉన్న కారణంగా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్దకం తగ్గుతుంది. అధికంగా బరువు ఉన్నవారు బరువును తగ్గించుకునేందుకు గాను రాగులు సహాయం చేస్తాయి.రక్తహీనతకు..రాగుల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది సహజసిద్ధంగా మనకు లభిస్తుంది. అందువల్ల రాగులను తింటుంటే రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులలో వచ్చే రక్తహీనత సమస్యను తగ్గించవచ్చు. రాగుల్లో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అనేక ఫినోలిక్ సమ్మేళనాలు సైతం ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి తగ్గేందుకు సహాయం చేస్తాయి. దీని వల్ల కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. ఫ్రీ ర్యాడికల్స్ వల్ల శరీరానికి జరిగే నష్టం తగ్గుతుంది. ఫలితంగా గుండెపోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.మితంగానే మంచిది..ఇన్నిప్రయోజనాలు కలిగించే రాగులున తగు మోతాదులోనే తీసుకోవాలని చెబుతున్నారు నిపుణుల. న్యూట్రిషన్ల ప్రకారం..రాగులను పిండి రూపంలో తీసుకుంటే రోజుకు 100 గ్రాముల వరకు తీసుకోవచ్చు. మరీ అధికంగా తింటే శరీరంలో ఆగ్జాలిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది కిడ్నీ స్టోన్లను కలగజేస్తుంది -
గుడి నిజమే కానీ.. పెళ్లిళ్లు మాత్రం చేయరు!
ఆలయంలో వివాహం చేసుకుంటుంటారు చాలామంది. అలాగే కొన్ని ఆలయాలు సాముహిక పెళ్లిళ్లను జరిపిస్తుంటాయి కూడా. మరికొందరు మొక్కుల రీత్యా కూడా ఆలయంలో వివాహం చేసుకుంటారు. అలాంటిది వేల ఏళ్ల నాటి పురాతన ఆలయం ఆకస్మికంగా వివాహాలను నిషేధించాలని గట్టి నిర్ణయం తీసుకుంది. అంతేగాదు ఆలయ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్వయంగా అక్కడ ప్రభుత్వానికి తెలియజేసింది కూడా. అందుకు సుప్రీం కోర్టు కూడా సమ్మతించడం విశేషం ఇలా ఎందుకు నిర్ణయం తీసుకున్నారో తెలిస్తే విస్తుపోతారు.బెంగళూరులోని పురాతన ఆలయాలలో ఒకటి, చోళుల కాలం నాటి సోమేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ చాలామంది జంటలు వివాహాలు చేసుకుంటారు. అనాదిగా వస్తున్న ఆచారం కూడా. అలాంటిది గత ఆరు నుంచి ఏడు సంవత్సరాలు వివాహ వేడుకులను నిలిపివేసింది. ఎంతో సుదీర్ఘ చరిత్ర ఉన్న ఆ ఆలయంలో వివాహాలను నిషేధించడం భక్తులలో చర్చనీయాంశంగా మారింది. ఆలయ చరిత్రసోమేశ్వరస్వామి ఆలయం సుమారు 12వ-13వ శతాబ్దాల నాటిదిగా భావిస్తున్నారు. దీని నిర్మాణంలో చోళులు, విజయనగర రాజుల నిర్మాణ శైలి స్పష్టంగా కనిపిస్తుంది. బెంగళూరు వ్యవస్థాపకుడైన కెంపేగౌడ కూడా ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లు లేదా విస్తరించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయంలో వేలాది జంటలు పెళ్లితో ఒక్కటయ్యేవి. అయితే ఆ జంటలే మధ్య సయోధ్య కుదరక విడాకులకు దారితీయడంతో.. ఆ ఆలయ పూజారులు కోర్టుల చుట్టూ తిగరాల్సి వచ్చింది. అంతేగాదు ఆలయ ఆగమ పనులకంటే..కోర్టు చుట్టూ తిరగడమే పనైంది పూజారులకు. ఈ న్యాయపరమైన చిక్కులను నివారించేందుకు, అలాగే పూజారులు ఆయల కైంకర్యాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకే ఇలా వివాహాలను నిషేధించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ కమిటీ పేర్కొంది. హిందూ వివాహాలకు పేరుగాంచిన ఈ ఆలయం ఏటా వందలాది జంటల వివాహాలను ఘనంగా జరిపించేది. ఆలయ గోపురం కింద ఈ వివాహాలు జరిగేవవి. వేద సంప్రదాయాలకు, ఆచారాలకు అనుగుణంగా అవిచ్ఛిన్నంగా జరిగే ఈ వివాహాలు..ఇటీవల విడాకులు కేసులు అంతకంతకు పెరిగి ఆలయ పవిత్రత మంట కలిసిపోయేలా మారింది. దానికి తోడు ఆ పెళ్లిలో సాక్షులుగా ఉన్న పూజారులు కోర్లుమెట్టాక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతరెండేళ్లలోనే ఆలయ అధికారులకు 50కి పైగా విడాకులు ఫిర్యాదుల అందాయట. చాలా వివాహాలు ఇంట్లోని కుటుంబసభ్యులకు చెప్పాపెట్టకుండా చేసుకోవడం, కొందరు నకిలీ డాక్యుమెంట్లతో పెళ్లిళ్లు చేసుకోవడంతో ఈ సమస్యలు తలెత్తుతున్నట్లు అధికారులు వాపోయారు. పూజారుల భక్తి సమయం ఆదా అయ్యేలా, అలాగే ఆలయ పవిత్రతను కాపాడుకునేలా ఇలా వివాహాలను నిషేధించక తప్పలేదని చెబుతున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయవాది అమిష్ అగర్వాల్ మాట్లాడుతూ..ఆలయం ఇతర ఆచారాలు, మతపరమైన వేడుకలను అనుమతిస్తూనే ఉంది. కానీ ప్రస్తుతానికి వివాహాలను అనుమతించబోమని నిర్ణయించింది. ట్రెండ్ను అంచనా వేసి, కమ్యూనిటీ వాటాదారులతో సంప్రదించిన తర్వాత భవిష్యత్తులో ఈ విధానాన్ని సమీక్షించవచ్చని యాజమాన్యం పేర్కొంది." అని చెప్పారు. నిజానికి దక్షిణ భారతదేశంలో దేవాలయాలలో వివాహాలు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. ఆ నేపథ్యంలోనే పురాతన దేవాలయాల్లో వీటిని నిర్వహించేందుకు అధిక ప్రాముఖ్యత ఇస్తారు. కానీ పెరుగుతున్న విడాకుల కేసులు, పూజారులను చట్టపరమైన చిక్కుల్లో పడేశాయి. దీంతో అధికారులు సోమేశ్వర ఆలయం మరిన్ని న్యాయమపరమైన చిక్కులను ఎదుర్కొనకుండా ఉండేలా ఈ వివాహాలకు అడ్డుకట్టవేయాల్సి వచ్చింది.(చదవండి: లెట్స్ సింగ్..ఫుల్ స్వింగ్..!) -
లెట్స్ సింగ్..ఫుల్ స్వింగ్..!
క్లాస్రూమ్ సింగింగ్ నుంచి కరోకే సాంగ్స్ దాకా నగరంలో పాటలు వినే శ్రోతల్ని పాటల్ని ఆలపించే గాయకులుగా మార్చే పలు వేదికలు పుట్టుకొస్తున్నాయి. సంగీతం నేర్చుకోకున్నా.. అనుభవం లేకున్నా.. పాటాభిమానమే అర్హతగా పాడుకుందాం రా.. అని ఆహ్వానిస్తున్నాయి. అదే క్రమంలో కొత్తగా పుట్టుకొచ్చిన ట్రెండ్ పేరే ‘సింగ్ ఎలాంగ్’.. అచ్చ తెలుగులో చెప్పాలంటే సామూహిక గానం.. భాగ్యనగరంలో విభిన్న భాషలు సంప్రదాయాలు సంగీత ధోరణులు కలిసిపోయి కొత్త ట్రెండ్స్కు ఊపిరిపోస్తున్నాయి. అలాంటి మరో కొత్త ట్రెండే కలిసి పాడే సెషన్లు. అయితే ఇవి కరోకేలాగా ఒంటరిగా పాడేవి కాదు. ఈ సింగింగ్ సమావేశాలకు వేదిక ఉండదు. అలాగే ప్రధాన గాయకులు అంటూ ఎవరూ ఉండరు. అంతేకాదు ఔత్సాహికుల పాడే నైపుణ్యంపై తీర్పులు చెప్పడం లాంటివి కూడా జరగవు. అపరిచితులైన అందరూ కలిసి పాడతారు. అన్నింటినీ విడిచిపెట్టి సంగీతంతో కనెక్ట్ అయ్యేందుకు సృష్టించిన ప్రత్యేక ప్రదేశంలో కలవడమే సింగ్ ఎలాంగ్. కేఫ్స్ నుంచి కమ్యూనిటీస్ దాకా.. ఈ సింగ్ ఎలాంగ్ ఈవెంట్స్.. సాధారణంగా ప్రశాంతంగా ఉండే కేఫ్లు, విశాలమైన కల్చరల్ స్పేసెస్లు, గేటెడ్ కమ్యూనిటీ, పార్క్స్, సిటీ దగ్గరలోని పిక్నిక్ స్పాట్స్ తదితర ప్రదేశాలలో నిర్వహిస్తున్నారు. దీంతో ఇవి ప్రస్తుతం నగరంలో తాజా వారాంతపు క్రేజ్గా మారాయి. వీటి రిజిస్ట్రేషన్ ఫీజులు సైతం రూ.150 నుంచి రూ.300 వరకు అందుబాటులో ఉండటంతో అన్ని వయసుల వారిని ఆకర్షిస్తున్నాయి. సామూహిక గానంలోని వినోదాన్ని పంచే ఇలాంటి సెషన్స్ నిర్వహించేందుకు కేంద్రీయ విద్యాలయ పూర్వ విద్యార్థి, డేటా విశ్లేషకురాలు లాస్య నందిగాం(25), సివిల్ ఇంజనీర్ అయిన ప్రనిధి కాంచనపల్లి(24) కలిసి జూలైలో ‘అన్ప్లగ్డ్ రాగం’ను ప్రారంభించారు. ‘మాకు వివిధ వయసుల వారు దూర ప్రాంతాల నుంచి వచ్చి పాల్గొనేవారు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరికీ సంగీతంతో అనుబంధాన్ని పెంచడమే మా ప్రయత్నం’ అంటున్నారు లాస్య.. ‘రెట్రో, ఫెస్టివల్, జానపద ఇలా వారానికో థీమ్ను ఎంచుకుంటాం. మా తల్లిదండ్రులు ఇళయరాజా అభిమానులు, కాబట్టి ఈ అభిరుచి సహజంగానే నాకూ అబ్బింది’ అని ప్రనిధి చెబుతున్నారు.పాటలతో కలుపుగోలు.. ఒత్తిడికి వీడ్కోలు ఈ ఆలోచన మానసిక ఆరోగ్య కార్యక్రమాల నుంచి పుట్టిందని చెప్పొచ్చు. సామాజిక మాధ్యమాల పుణ్యమా అని ప్రతి ఒక్కరూ ఏదో విధంగా మరికొందరితో కనెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఈ సామూహిక సంగీతం దానిని సులభతరం చేసింది. ‘వయస్సు లేదా వృత్తి వ్యాపకాలతో సంబంధం లేకుండా మనస్ఫూర్తిగా పాడటానికి మాత్రమే వస్తారు. పధాన గాయకుడు/గాయని అంటూ ఎవరూ ఉండరు.. అందరూ ఒకే గొంతుగా పాడతారు. అపరిచితులమనే భావన కాసేపటికే మాయమవుతుంది. సుపరిచితులై, వారంలోని ఒత్తిడికి వీడ్కోలు పలుకుతారు. ఇది ఓ రకంగా చెప్పాలంటే సంగీతం ద్వారా చేసే చికిత్స.’ అని హైదరాబాద్, వైజాగ్ వంటి నగరాల్లో ఈ సింగ్ ఎలాంగ్ కార్యక్రమాలను నిర్వహించే ‘ఓపెన్సెట్’ వ్యవస్థాపకుడు హర్ష కొమరవోలు అంటున్నారు. తాము కేఫ్లతో కలిసి ఒప్పందం చేసుకుని ఈ తరహా ఈవెంట్స్ నిర్వహిస్తామన్నారాయన. ఉపశమనం.. ఉభయకుశలోపరి.. ఈ సెషన్లు నగరవాసులకు భావోద్వేగ ఉపశమనంగా సరికొత్త స్నేహానికి మార్గాలుగా మారాయి. ‘ఈ పాటల వేడుకలు కళాకారులకు సైతం కొత్త శైలులను కనుగొనడంలో సారూప్యత కలిగిన వ్యక్తులతో కనెక్ట్ అవ్వడంలో సహకరిస్తున్నాయి. ‘ఈ సెషన్లు పాటల పోటీలు కావు.. అయినప్పటికీ అవి నాకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి సంగీతం పట్ల నాకున్న మక్కువను పంచుకునే ఇతరులను కలవడానికి సహాయపడ్డాయి’ అని నగరవాసి తరుణ్ అంటున్నారు. ఓ వైపు పాటలు వినే ఆసక్తి కొనసాగుతూనే ఉంటే మరోవైపు దానికి ధీటుగా స్వయంగా పాటలు పాడే సమాజం విస్తరిస్తోంది. స్వరాలు ఏకమైనప్పుడు, సంగీతం అభిరుచుల ఐక్యతను కూడా వినిపిస్తోంది. -
ఎలాన్ మస్క్ సమర్పించు... మెమొరీ ట్రిక్స్
‘అదేమిటో... చిన్న చిన్న విషయాలు కూడా గుర్తుపెట్టుకోలేకపోతున్నాను’ అనుకునేవారిలో మీరు కూడా ఉన్నారా? అయితే మీరు అపర కుబేరుడు ఎలాన్ మస్క్ అనుసరించే మెమోరీ ట్రిక్స్ ఫాలో కావాల్సిందే. ‘ట్రిక్స్ టు రిమెంబర్ ఎవ్రీథింగ్’ అంటున్నాడు మస్క్. వాటిలో కొన్ని...బ్రెయిన్ అనేది కొన్నిసార్లు అనవసర సమాచారంతో, అనవసర ఆలోచనలతో చెత్తబుట్టగా మారిపోతుంది. దీంతో అవసరమైన విషయాలకు చోటు ఉండదు. అందుకే అనవసర విషయాలను ఎప్పటికప్పుడూ డిలీట్ చేసి మంచి విషయాల కోసం స్పేస్ ఏర్పాటు చేసుకోవాలి.ముఖ్యమైన విషయాలతో ‘మెమోరీ ట్రీ’ నిర్మించాలి. ఈ చెట్టుకు కొమ్మలుగా కొత్త విషయాలను అనుసంధానిస్తూ పోవాలి. ఎవరికివారు పర్సనల్ కోడింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకోవాలి. విషయాలను వేగంగా గుర్తు తెచ్చుకోవడానికి సంఖ్యలు, చిహ్నాలు, చిత్రాలు.. మొదలైన వాటిని ఉపయోగించాలి. ‘ఈ ట్రిగ్గర్లు మెదడులోని సంక్లిష్ట సమాచారాన్ని త్వరగా, తక్కువ శ్రమతో తిరిగి పోందడానికి ఉపయోగపడతాయి’ అంటాడు మస్క్.విషయాలు, పేర్లను గుర్తు తెచ్చుకోవడంలో ‘మీనింగ్ఫుల్ కనెక్షన్’ ముఖ్యం అంటాడు ఎలాన్ మస్క్. ఉదాహరణకు ఒక వ్యక్తి పేరును గుర్తు తెచ్చుకోవడానికి వారి హాబీ, ఫన్నీస్టోరీ, వారి ముఖానికి సంబంధించి యూనిక్ ఫీచర్, ఆ వ్యక్తి నవ్వు, మాట్లాడే పద్ధతి... మొదలైన వాటితో పేరును గుర్తు పెట్టుకోవాలి.మీనింగ్ఫుల్ కనెక్షన్ అనేది ఎందుకు ముఖ్యమైనది అంటే... మన మెదడు ర్యాండమ్ ఫ్యాక్ట్స్ కంటే స్టోరీలను, ఎమోషన్లనూ ఎక్కువగా గుర్తుపెట్టుకుంటుంది.‘అసోసియేట్ ఇన్ఫర్మేషన్’ టెక్నిక్ గురించి నొక్కిచెబుతున్నాడు మస్క్. అసాధారణ దృశ్యాలతో, సమాచారాన్ని గుర్తు పెట్టుకోవడమే... అసోసియేట్ ఇన్ఫర్మేషన్. ఉదాహరణకు... ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు అరటిపండ్లు కొనాలనుకున్నారు. ఇందుకోసం ఒక అసాధారణ దృశ్యాన్ని మదిలో ఆవిష్కరించుకోవాలి. ఏనుగంత సైజులో ఉన్న అరటిపండు సన్గ్లాసెస్ ధరించి మీ కిచెన్లో డ్యాన్స్ చేస్తుంటుంది!‘రిపీట్ అండ్ రివ్యూ’ మెథడ్లో భాగంగా గతంలోకి వెళ్లి మనకు నచ్చిన విషయాలను గుర్తు తెచ్చుకోవాలి. ఇలా తరచుగా చేయడం ద్వారా జ్ఞాపకశక్తి బలోపేతం అవుతుంది. -
కాలేయ మార్పిడి చేయించుకున్న వారికి ఇన్ఫెక్షన్లు
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సైతం కాలేయ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో ఇన్ఫెక్షన్ల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలడం ఆందోళన కలిగిస్తున్నదని సౌత్ ఏషియన్ లివర్ ఇనిస్టిట్యూట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్లో సౌత్ ఏషియన్ లివర్ ఇనిస్టిట్యూట్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండున్నరేళ్ళ పాటు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న 67 మంది రోగుల ఆరోగ్యంపై నిర్వహించిన అధ్యయనంలో బహుళ మల్టీ డ్రగ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్(ఎండీఆర్) తీవ్ర స్థాయిలో ఉన్నట్లు తేలిందన్నారు. 24 శాతం మందిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఉండగా మరి కొంత మందిలో ఇతర సమస్యలు ఉన్నాయన్నారు. 16 బ్యాక్టీరియా కేసుల్లో 15 మందిలో యాంటీ బయాటిక్స్కు పూర్తిగా రెసిస్టెంట్గా ఉండటం ఆందోళనకరంగా ఉందన్నారు. దీంతో పాటు కొన్ని కేసుల్లో యాక్సా జోలిడినోన్ తరగతికి చెందిన ఔషదాల పట్ల కూడా ప్రతిఘటన కనిపించడం ఆందోళన కలిగించే అంశమన్నారు. పాజిటీవ్ వచ్చిన 16 మందిలో తొమ్మిది మంది సర్జరీకి ముందే రక్త పరీక్షల్లో బ్యాక్టీరియా ఉన్నట్లు తేలిందని వారు అప్పటికే ఎండీఆర్ బ్యాక్టీరియాతో ఉన్నారని వెల్లడి అయిందన్నారు. ఈ అధ్యయనం వల్ల ఆరోగ్య విధానాల్లో చికిత్సా పద్ధతుల్లో మార్పు అవసరం ఉన్నదని సూచిస్తోందన్నారు. గత వందేళ్ళుగా రోగులకు ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా నియంత్రించడమే ఆస్పత్రుల ప్రధాన లక్ష్యంగా ఉండేదని తాజా అధ్యయనంలో ఆస్పత్రికి వచ్చే ముందే వారిలో ఎండీఆర్ ఇన్ఫెక్షన్ ఉండటం పరిశీలిస్తే ప్రస్తుతం అవలంభిస్తున్న విధానాలు సరిపోవని తేలిందన్నారు. కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సకు ముందే ఇలాంటి ఇన్ఫెక్షన్లను గుర్తించి నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇది జాతీయ స్థాయిలో ఆరోగ్య సంక్షోభంగా భావించాల్సి ఉంటుందని ప్రజలతో పాటు అన్ని వర్గాల వారు ఈ సమస్యపై తక్షణమే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లివర్ క్రిటికల్ కేర్ కన్సల్టెంట్ ఎ. గోగినేని తదితరులు పాల్గొన్నారు. -
ఆమె ఫ్యాషన్ భవిత
‘అనుకోలేదని ఆగవు కొన్ని’ అనే కవి మాట భవిత మండవ విషయంలో సరిగ్గా సరిపోతుంది. మోడల్ కావాలని కలలో కూడా అనుకోలేదు భవిత. అయితేనేం.. కలలో కూడా ఊహించని అవకాశం ఆమెను వెదుక్కుంటూ రైల్వేస్టేషన్కు వచ్చింది. ఆ సమయంలో అదృష్టం అనే రైలు ఎక్కిన భవిత... స్వయం ప్రతిభతో మోడలింగ్ ప్రపంచంలో సరికొత్త తారగా వెలుగుతోంది. హైదరాబాద్కు చెందిన ఇరవై అయిదు సంవత్సరాల భవిత ప్రఖ్యాత ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ‘చానల్’ ఫ్యాషన్ షోలో ఓపెనింగ్ వాక్ చేసింది. ఈ అవకాశం అందుకున్న తొలి భారతీయ మోడల్గా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన పదహారణాల తెలుగు అమ్మాయి భవిత గురించి...హైదరాబాద్లోని జేఎన్టీయూలో ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన భవిత ఇంటరాక్టెడ్ డిజైన్ అండ్ మీడియాలో మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లింది. ఒకానొక రోజు... న్యూయార్క్ సబ్ వే స్టేషన్లో రైలు కోసం ఎదురు చూస్తున్న భవితను ఒక వ్యక్తి చిరునవ్వుతో పలకరించాడు. ‘మోడలింగ్ చేస్తారా?’ అని అడిగాడు. ఆ క్షణంలో భవిత మనసులో ఏమనుకుందో తెలియదు. ‘సరదాగా అంటున్నాడా?’ ‘సీరియస్గానే అంటున్నాడా?’ మొత్తానికైతే ‘యస్’ అన్నది. అతడి పేరు... మాథ్యూ బ్లేజీ. మెన్స్ వేర్ డిజైనర్గా ఫ్యాషన్ కెరీర్ ప్రారంభించిన మాథ్యూ ఫ్రెంచ్ ఫ్యాషన్ లగ్జరీ బ్రాండ్ ‘చానల్’కు క్రియేటివ్ డైరెక్టర్గా పనిచేశాడు.అద్భుత దర్శనం‘ఫ్యాషన్కి సంబంధించి కొన్నిసార్లు ఆధునికం కావిని కూడా అత్యాధునికం అనిపిస్తాయి’ అంటాడు మాథ్యూ. కొన్నిసార్లు... మోడల్ కాని వారు కూడా అద్భుతమైన మోడల్గా దర్శనమివ్వవచ్చు. భవిత విషయంలో అతడికి జరిగింది అదే! ‘ఇలా మాత్రమే చేయాలి’ అంటూ గంభీరమైన గురువులా ఎప్పుడూ కనిపించేవాడు కాదు మాథ్యూ. ‘ఎలాంటి టెన్షన్ వద్దు. సరదాగా చేసేయ్’ అన్నట్లుగా మాట్లాడేవాడు. ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ బటేగా వనీటా స్ప్రింగ్/ సమ్మర్–2025 ఫ్యాషన్ షోలో మోడల్గా అరంగేట్రం చేసింది భవిత. ఫస్ట్ షోతోనే మంచి మార్కులు తెచ్చుకుంది... ఇక అక్కడి నుంచి న్యూయార్క్, మిలాన్, పారిస్, లండన్లలో ఫ్యాషన్ దిగ్గజాలతో కలిసి షోలు చేసింది.తాజా విషయానికి వస్తే...ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ చానల్ ‘షనెల్... మేటియే డార్ 2026’ టైటిల్తో ఫ్యాషన్ షో నిర్వహించింది. 2018 తరువాత ‘చానల్’ న్యూయార్క్లో చేస్తున్న షో కావడంతో ఈ షో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇలాంటి ప్రతిష్ఠాత్మకమైన షోలో ఓపెనింగ్ వాక్ చేసే అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు. ఈ అవకాశం అందుకున్న తొలి భారతీయ మోడల్గా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది భవిత. మాథ్యూతో కలిసి క్యాంపెయిన్లో కూడా పాల్గొంది.ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ వీరేన్ షా మాటల్లో చెప్పాలంటే... ‘ఆర్డినరీ ప్లేస్లో కనిపించిన ఎక్స్ట్రార్డినరీ పర్సన్. మాథ్యూ ఆమె జీవితాన్ని మార్చివేశాడు’ ఒక ఇన్స్టాగ్రామ్ వీడియోలో భవితను ఇంటర్య్వూ చేసిన వ్యక్తి... ‘ఇది జస్ట్ ప్రారంభం మాత్రమే’ అన్నాడు. ఇంకా ఎన్నో అద్భుత విజయాలు మోడలింగ్ ప్రపంచంలో ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు! వేయి శుభములు కలుగుగాక.సబ్ వే టు రన్ వే⇒ సంవత్సరం క్రితం నేను మోడలింగ్ మొదలుపెట్టాను. మోడలింగ్లో నాకు ఎలాంటి ముందస్తు అనుభవం లేదు. మోడలింగ్కు సంబంధించి మొదటిసారిగా కలిసి పనిచేసిన వ్యక్తి మాథ్యూ బ్లేజీ. మాథ్యూ నన్ను పూర్తిగా నమ్మాడు. నా మొదటి రన్వే నుండి నా మొదటి క్యాంపెయిన్ వరకు, నేను ఊహించని జీవితాన్ని సృష్టించి ఇచ్చాడు. అతని ‘చానల్’ను అనుసరించడం, అతనితో కలిసి ప్రయాణాన్ని కొనసాగించడం గౌరవం గా భావిస్తున్నాను.⇒ నిజాయితీగా చెప్పాలంటే మొదట్లో నేను భయపడ్డాను. నేను పని చేసిన బ్రాండ్ల గురించి నాకు పెద్దగా తెలియదు. ఫ్యాషన్ ప్రపంచంలో అవి ప్రముఖ బ్రాండ్లు అయినప్పటికీ నేను మధ్యతరగతి కుటుంబంలో పెరగడం వల్ల అవి నాకు పూర్తిగా కొత్త.⇒ ఒకసారి వెనక్కి వెళితే...‘సవాళ్లు నాకు కొత్తేమీ కాదు కదా’ అన్నట్లుగా నాకు నేను ధైర్యం చెప్పుకొని ప్రశాంతంగా ఉండగలిగాను. అయితే ‘చానల్’ అనేది భిన్నమైన అనుభవం. నేను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందే ఆ బ్రాండ్ గురించి తెలుసు. ఆ ప్రసిద్ధ బ్రాండ్కు సంబంధించిన షోలో నడవడం(ఓపెనింగ్ వాక్) అనేది మరపురాని విషయం. మ్యాజికల్ ఎక్స్పీరియెన్స్. షో తరువాత వేదిక వెనక ఉన్న ప్రతి ఒక్కరు సంతోషంగా నన్ను హగ్ చేసుకున్నారు. కన్నీళ్లతో భావోద్వేగాలను పంచుకున్నారు.ఈ సీజన్లో నాకు సంతోషకరమైన విషయం ఏమిటంటే..?ఇతర మోడల్స్, టీమ్తో ఏర్పర్చుకున్న బంధం. ఈ టీమ్లో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నాం. అలా అందరినీ కలుపుకొని పోయే క్రియేటివ్ డైరెక్టర్ ఉంటే ఆ ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు మాథ్యుపై ఎంతో ప్రేమ ఉంది.⇒ ‘షోలో లేని వ్యక్తులు ఏమి చూడాలనుకోవాలనుకుంటారు?’ అనే ప్రశ్నకు నా జవాబు ఇది.... మాథ్యూ బ్లేజీ, ‘చానల్’ బ్రాండ్ టీమ్ ఎంత అద్భుతమైనవారో ప్రజలు చూడాలని నేను కోరుకుంటున్నాను. వారిలోని ఆ΄్యాయత, దయాగుణం నా హృదయాన్ని తాకింది. వారిలోని అసాధారణ ప్రతిభ, వృతిపట్ల అంకితభావం పనిలోని ప్రతి అంశలోనూ కనిపిస్తుంది. వారితో కలిసి ప్రయాణం చేయడాన్ని చాలా అదృష్టంగా భావిస్తున్నాను.అమ్మానాన్నల కంట్లో ఆనందం!తన తల్లిదండ్రులకు సంబంధించి ఒక వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది భవిత. ఈ వీడియో క్లిప్లో ఆమె తల్లిదండ్రుల భావోద్వేగాలు కనిపిస్తాయి. న్యూయార్క్లోని బోవరీ స్టేషన్ బ్యాక్గ్రౌండ్తో కూతురు పాల్గొన్న ఫ్యాషన్ షోను చూస్తూ ఆనంద బాష్పాలతో భవిత పేరును పదే పదే ఉచ్చరిస్తుంటుంది ఆమె తల్లి. తండ్రి ఒకింత గర్వంతో చూస్తుంటారు. ‘ఇది నాకు ఎంత అద్భుతమో చెప్పడానికి మాటలు చాలవు. థ్యాంక్యూ’ అని కాప్షన్లో రాసింది భవిత.⇒ ‘అద్భుత విజయాల వెనుక తల్లిదండ్రుల త్యాగాలు ఉంటాయి. వారి చల్లని ఆశీర్వచనాలు ఉంటాయి’ అని చెప్పకనే చెప్పిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.⇒ ఏమీ తెలియని మోడలింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టడం అంటే ఆ సమయంలో రిస్క్గానే భావించాలి. ఒకవేళ రిస్క్ అనుకుంటే ఆమె ఈ కొత్త ప్రపంచంలోకి వచ్చేది కాదేమో! తల్లిదండ్రులు ఆమె భుజం తట్టి ప్రోత్సహించారు. ఉత్సాహాన్ని ఇచ్చారు.మోడలింగ్లోకి వచ్చినప్పటికీ చదువుకు దూరం కాలేదు భవిత. ఒకవైపు చదువుకుంటూనే, క్యాంపస్ జాబ్ చేస్తూనే మోడలింగ్ చేసింది. -
ట్రెండీగా బ్రాండ్ ప్రమోషన్ ఇలా
మన గురించి మనం కాకపోతే ఇంకెవరు చెబుతారు అనేది ఈ తరం నానుడి..! దీనినే ట్రెండీగా బ్రాండ్ ప్రమోషన్ అంటూ ఈతరం నగర జీవనశైలిలో భాగం చేశారు. కొన్ని సంవత్సరాలుగా ఈ బ్రాండ్ ప్రమోషన్ అనే మాట విరివిగా వినబడుతోంది. చిన్న చిన్న స్టార్టప్స్ సంస్థల నుంచి మొదలు ఎమ్ఎన్సీల వరకు ఈ బ్రాండ్ ప్రమోషన్ సంస్థల సేవలు వినియోగించుకుంటున్నాయి. అధునాతన రీతిలో మారుతున్న జీవన శైలి, వ్యాపార ధోరణుల్లో వచ్చిన వేగం, అన్నింటికీ మించి సోషల్ మీడియా విప్లవం.. ఈ మూడు సమ్మేళనంగా పుట్టింది ఒక భారీ మార్కెట్ ట్రెండ్ ఈ ‘బ్రాండ్ ప్రమోషన్’. కొన్ని సంవత్సరాలుగా ఈ రంగం మన నగరంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా అద్భుతమైన వృద్ధి సాధించింది. వ్యక్తిగత బ్రాండింగ్ నుంచి కార్పొరేట్ ప్రమోషన్ వరకు, ప్రతీ రంగానికీ ఇది తప్పనిసరి సాధనమైంది. – సాక్షి, సిటీబ్యూరోఅభిరుచి, సృజనాత్మకత, డిజిటల్ అవగాహన.. ఈ మూడు ఆయుధాలతో హైదరాబాద్ యువత (Hyderabad Youth) బ్రాండ్ ప్రమోషన్ రంగంలో నేటి ‘గేమ్ ఛేంజర్స్’గా మారుతున్నారు. యూట్యూబ్, ఇన్స్ట్రాగామ్, స్నాప్చాట్, ఎక్స్(ట్విట్టర్) నుంచి పాడ్కాస్ట్లు, రీల్స్ ప్రొడక్షన్, వెబ్క్యాంపైన్ల వరకుం ఈ జెన్–జీ ఎంటర్ప్రెన్యూర్స్ తమ సొంత స్టైల్తో బ్రాండ్లను ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు. స్టార్టప్ కల్చర్కు హబ్గా నిలిచిన హైదరాబాద్లో చిన్న టీమ్లే పెద్ద క్యాంపైన్లను నడిపిస్తూ పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలకు టఫ్ పోటీ ఇస్తున్నాయి. కొత్త స్టార్టప్స్ స్థాపకుల నుంచి స్థానిక హోం–బేస్డ్ వ్యాపారులు కూడా వీరి సేవలను ఆశ్రయిస్తున్నారు.గ్లోబల్ స్టాండర్డ్స్.. ఏఐ ఆధారిత క్యాంపైన్ టూల్స్, డేటా–డ్రైవన్ మార్కెటింగ్, కంటెంట్ ఇంజనీరింగ్, 3డీ రీల్స్, ఏఆర్ ఫిల్టర్లు.. ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ప్రమోషన్ ఏజెన్సీలు గ్లోబల్ స్టాండర్డ్లతో పనిచేస్తున్నాయి. భవిష్యత్లో ఈ రంగం మరింత విస్తరించబోతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి వ్యక్తి ఒక బ్రాండ్ అయ్యే కాలం వస్తోంది. ప్రతి వ్యాపారం తమ కథను చెప్పాల్సిన అవసరం ఉంది. అలా చెప్పించే వారే ఈ తరం బ్రాండ్ ప్రమోటర్లు. నగర జీవనశైలిని ప్రతిబింబించేలా డిజిటల్ ప్రపంచంలో తమ కథను చెప్పించుకోవాలంటే ఈ రోజుల్లో బ్రాండ్ ప్రమోషన్ ఒక ‘లగ్జరీ’ కాదు.. ఒక అవసరం.‘ఆక్సిజన్’ సోషల్ మీడియా.. సోషల్ మీడియా (Social Media) వేదికలు నేటి బ్రాండ్లకు కావాల్సిన ఆక్సిజన్ అని చెప్పుకోవచ్చు. ఒక వైరల్ రీల్ ఒక క్రియేటివ్ పోస్టు ఒక చిన్న స్టోరీ ఇవి నిమిషాల్లోనే బ్రాండ్ను లక్షల మంది దగ్గరకు తీసుకెళ్లగలిగే శక్తిని కలిగిఉన్నాయి. ఇందులో హైదరాబాద్ నగరం మరింత ప్రత్యేకమైంది. ఇక్కడి ప్రేక్షకులకు ట్రెండ్స్పై అద్భుతమైన ‘సెన్స్’ ఉండటం. అందుకోసమే నగరంలోని చాలా బ్రాండ్ ప్రమోషన్ ఏజెన్సీలు ప్రత్యేకంగా ట్రెండింగ్ కంటెంట్ ల్యాబ్స్, క్రియేటివ్ స్టూడియోలు, ఇన్ఫ్లుయెన్సర్ భాగస్వామ్యాలను ఏర్పాటు చేసి సరికొత్త ఐడియాలతో బ్రాండ్లను ‘రిలేటబుల్’ – ‘వైరల్’గా మారుస్తున్నాయి.కాదేదీ అనర్హం.. సినిమా, రాజకీయాలు, వ్యాపారం కాదేది అనర్హం అంటూ అందరికీ బ్రాండ్ ప్రమోషన్ (Brand Promotion) తప్పనిసరిగా మారింది. ఒకప్పుడు బ్రాండ్ ప్రమోషన్ అంటే కార్పొరేట్ కంపెనీలు, ఎఫ్ఎమ్సీజీ ఉత్పత్తులు మాత్రమే గుర్తొచ్చేవి. కానీ.. ప్రస్తుతం రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు, సోషల్ మీడియా స్టార్లు, కొత్త ఎంటర్ప్రెన్యూర్స్, ఎడ్యూ–ఇనిస్టిట్యూట్స్, ఈవెంట్ ఆర్గనైజర్లు.. ఇలా ప్రతి ఒక్కరూ తమ ఇమేజ్, వారి పనితీరును ప్రజలకు చేరువ చేసేందుకు డిజిటల్ ప్రమోషన్ను శాశ్వతమైన భాగంగా మార్చుకున్నారు. ముఖ్యంగా ప్రతి ఎన్నికల సమయంలో డిజిటల్ క్యాంపైన్లే కీలకం. సినిమా రీలీజ్లకు ఇన్ఫ్లూయెన్సర్ కొలాబ్స్ తప్పనిసరి. కొత్త ఉత్పత్తుల కోసం సోషల్ హైప్ లేకుండా మార్కెట్లో నిలబడటం కష్టమైన కాలం ఇది.సిటీ లైఫ్స్టైల్.. టెక్ సిటీ, కల్చర్ సిటీ, ఇవన్నీ కలిసిన నగరం హైదరాబాద్ (Hyderabad). ఇక్కడి జీవనశైలిలో ‘డిజిటల్ ప్రెజెన్స్’ ఇప్పుడు ప్రొఫెషనల్ ఇమేజ్ మాత్రమే కాదు, లైఫ్స్టైల్ స్టేట్మెంట్ కూడా. అవుట్డోర్ షూట్స్, క్రియేటివ్ స్టూడియోలు, ఫ్యాషన్ ఇన్ఫ్లూయెన్సర్లు, స్ట్రీట్ ఫుడ్ బ్లాగర్లు, ట్రావెల్ రీల్స్ క్రియేటర్లు ఇలా విభిన్న రంగాల్లో పనిచేసేవారు తమ బ్రాండ్ ప్రత్యేకంగా గుర్తింపు పొందేలా చేయడానికి పెద్ద ఎత్తున ప్రమోషన్ స్ట్రాటజీలను అనుసరిస్తున్నారు.చదవండి: మేనరికాల జోడు.. భావితరాలకు చేటు..!‘గేమ్ ఛేంజర్’.. సార్వత్రిక మార్కెట్లో తమ పేరు నిలబెట్టుకోవడం చిన్న వ్యాపారులకు పెద్ద సవాలు. కానీ బ్రాండ్ ప్రమోషన్ ఈ గ్యాప్ను పూర్తిగా తగ్గించింది. ఒక చిన్న బొటిక్, ఒక క్లౌడ్ కిచెన్, ఒక లోకల్ బ్యూటీ ప్రొడక్ట్.. ఇవి పెద్ద బడ్జెట్ లేకుండానే సోషల్ మీడియా క్యాంపైన్తో భారీ రీచ్ సాధిస్తున్నాయి. ఇలాంటి ఉదాహరణలు సిటీలో వందల సంఖ్యలో కనిపిస్తాయి. ఇది నగరపు స్వభావమే.. ప్రతి సృజనాత్మకతకు వేదిక. -
మిసెస్ మామ్ గ్రాండ్ ఫినాలె..!
ఇటీవలి కాలంలో ప్రసవం అంటేనే సిజేరియన్ అంటున్నారని, వాటి కంటే సురక్షిత, సాధారణ ప్రసవాలే ఎప్పుడూ శ్రేయస్కరమని కిమ్స్ గ్రూప్ ఆస్పత్రుల సీఈఓ డాక్టర్ అభినయ్ తెలిపారు. సాధారణ ప్రసవాల మీద అవగాహన పెంపొందించే లక్ష్యంతో డాక్టర్ కె.శిల్పిరెడ్డి ఫౌండేషన్, కిమ్స్ కడల్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహించిన మిసెస్ మామ్ తొమ్మిదో సీజన్ గ్రాండ్ ఫినాలె కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. డాక్టర్. శిల్పిరెడ్డి, డా. శిల్పిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమం గర్భిణీ స్త్రీలకు మాతృత్వంలో ఉన్న సవాళ్లు, ఆనందాల గురించి తెలుసుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించింది. తొమ్మిదో సీజన్కు మొత్తం 220 జంటలు పేర్లు నమోదుచేసుకోగా వారిలో 57 జంటలు గ్రాండ్ ఫినాలెకు అర్హత సాధించారు. వారందరినీ డాక్టర్ అభినయ్ అభినందించారు. మాతృత్వం అనేది ఒక మధురానుభవం అని, అందులోని ప్రతి దశనూ తల్లిదండ్రులు ఇద్దరూ ఆస్వాదించాలని తెలిపారు. గర్భిణి అయిన భార్యను కంటికి రెప్పలా కాపాడుకోవడంతో పాటు, పుట్టబోయే బిడ్డ సంరక్షణ విషయంలో కూడా తండ్రులది చాలా కీలక పాత్ర అని ఆయన చెప్పారు. భర్త చేదోడువాదోడుగా ఉంటే భార్య తన మాతృత్వాన్ని మరింత ఆస్వాదించగలదని వివరించారు. సాధారణ లేదా సిజేరియన్ సురక్షిత ప్రసవాలు మంచివని డాక్టర్ అభినయ్ అన్నారు. గ్రాండ్ ఫినాలెకు హాజరైన అతిథులు, జంటలను ఉద్దేశించి కిమ్స్ కడల్స్ ఆస్పత్రి ఆబ్స్టెట్రిక్స్, గైనకాలజీ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ కె. శిల్పిరెడ్డి మాట్లాడుతూ.. “సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడంతో పాటు కుటుంబం యొక్క గొప్పతనాన్ని పరిచయం చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. తల్లిదండ్రులు ఏం తినాలి, పిల్లలకు ఏం పెట్టాలనే అంశాలను వారికి వివరించాం. 70-80 రకాల అంశాలను ఈ తల్లిదండ్రులకు పరిచయం చేశాం. ఇంతమందికి ఒకేచోట అవగాహన కల్పించగలిగితే వాళ్లు సమాజంలో ఈ సందేశాన్ని పంచుతారు. సాధారణ ప్రసవం అనగానే నొప్పులు భరించలేం అన్నట్లుగా చెబుతున్నారు. ఇది తప్పు. గతంలో అన్నీ సాధారణ ప్రసవాలే ఉండేవి. తర్వాత క్రమంగా వివిధ కారణాలతో సిజేరియన్లు పెరిగాయి. ప్రసవం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. దాన్ని అలాగే జరగనివ్వాలి. ఇంతకుముందు సీజన్లలో పాల్గొన్నవారిలో 85% మందికి సాధారణ ప్రసవాలే జరిగాయి. వక్రీకరణలు చాలా జరుగుతున్నాయి కాబట్టి, వీరికి అవగాహన పెంచాలి. ఇక్కడ పాల్గొన్నవారు తమ బంధువులు, స్నేహితులకు చెప్పినా నెమ్మదిగా సమాజం మొత్తం మారుతుంది” అని చెప్పారు. గర్భధారణ సంరక్షణ తోపాటు భవిష్యత్తు తల్లిదండ్రులకు అవసరమైన అవగాహన కల్పించారు. చదవండి: మేనరికాల జోడు..భావితరాలకు చేటు..! -
ఆ విపత్తు ముడివేసిన వైవాహిక బంధం..!
కొన్ని వివాహాలు విధి ఆడిన వింత నాటకంలా ఉంటాయి. డెస్టినీ అంటారే అలా..ఒకరితో మనకు రాసిపెట్టి ఉంటే..ఎలాగైనా..ఎన్నేళ్లైనా..మళ్లీ ఒక్కచోటుకి చేర్చి కలిపేస్తుంది.అందుకు నిదర్శనం ఈజంట. బహుశా వీళ్లిద్దరిని విధి ముడివేసిన జంట అనొచ్చేమో. కాదు కాదు.. విపత్తు ముడివేసిన జంట అనాలేమో..!.అసలేం జరిగిందంటే..నవంబర్ 29న హునాన్ ప్రావిన్స్లో ఐదవ వార్షిక హాన్ శైలి సామూహిక వివాహ వేడుక సందర్భంగా 37 జంటలు వైవాహిక బంధంతో ఒక్కటికానున్నాయి. ఆ నేపథ్యంలో ఓ జంట కథ వెలుగులోకి వచ్చింది. లియాంగ్ జిబిన్, లియు జిమెయ్ అనే జంట 15 ఏళ్లక్రితం అసాధారణ పరిస్థితుల్లో ప్రారంభమైన తమ లవ్స్టోరీని పంచుకున్నారు. రెండు జీవితాలను మార్చిన రక్షణ బాధ్యత..2008లో వెంచువాన్లో భూకంపం సంభవించినప్పుడు 22 ఏళ్ల లియాంగ్ అత్యవసర సహాయక చర్యల కోసం సైనికుడిగా పనిచేస్తున్నాడు. అప్పటికి పది సంవత్సరాల వయసున్న లియు, ఒక కూలిపోయిన భవనం రెండొవ అంతస్తులో ఉక్కు కడ్డీలు, ఇటుకల కింద చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ ఉంది. అది చూసిన లియాంగ్ అతడి బృందం సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి ఆమెను కాపాడారు. ఆ తర్వాత చికిత్స కోసం తక్షణమే ఆస్ప్రతికి తరలించారు. అయితే ఆ చిన్నారి కోలుకున్నాక తన తల్లిదండ్రులతో కలిసి హునాన్లోని జుజౌకు వెళ్లిపోయారు. అయితే తనను కాపాడిని సైనికుడి గురించి ఏదో స్పల్ప జ్ఞాపకమే ఉందామెకు. అదీగాక ఆ ఘటన జరిగి చాలా ఏళ్లు కావడంతో అంతగా ఆ సైనికుడి ముఖం అంతగా గుర్తులేదామెకు. అయితే 2020లో 22 ఏళ్ల లియు చాంగ్షాలో తన తల్లిదండ్రులతో భోజనం చేస్తున్నప్పుడు ఊహించని ఘటన చోటు చేసుకుంది. వాళ్ల టేబుల్కి సమీపంలోని మరో టేబుల్ వద్ద కూర్చొన్న వ్యక్తిని చూసి లియు తల్లి గుర్తుపట్టి పలకరించింది. "మీరు మా బిడ్డ లియుని కాపాడిన బ్రదర్ లియాంగ్ మీరేనా అని అడుగుతుంది. పదేళ్ల వయసులో ఆ అమ్మాయి కాస్తా చాలా మారిపోవడంతో గుర్తుపట్టలేక ఇబ్బందిపడతాడు లియాంగ్. ఆ ఘటన గుర్తుంది కానీ ఆ చిన్నారి రూపు రేఖలు చాలా మారిపోవడంతో పోల్చుకోలేకపోతున్నానని చెబుతాడు లియు తల్లితో". అప్పటి నుంచి లియు ఆ సైనికుడు లియాంగ్తో క్రమంతప్పకుండా మాట్లాడుతూ ఉండేది. ఆమె భావల లోతుని అర్థం చేసుకుంటాడు లియాంగ్. అంతేగాదు లియుకి కూడా అతడి దృఢత్వం, విధేయత ఎంతగానో నచ్చుతాయి. అలా ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది.లియుని తన జీవితంలోని ఆశాకిరణంగా భావిస్తాడు లియాంగ్. తాను నిరుత్సాహంగా ఉన్నప్పుడల్లా లియు సానుకూలత తనను పైకి లేపుతుందని ప్రగాఢంగా విశ్వసించడమే కాదు జీవితంటే ఆశతో నిండి ఉందని గుర్తు చేస్తుంటాదామె అని భావోద్వేగంగ చెబుతున్నాడు లియాంగ్ విధి ముడివేసిన బంధం..తమ జర్నీ గురించి చెబుతూ..విధి చాలా అద్భుతమైనది. పన్నేడేళ్ల క్రితం ఆమెను రక్షించాను. పన్నేండేళ్ల తర్వాత ఆమె నా జీవితంలోకి వచ్చింది. భలే చిత్రంగా ఉంది తలుచుకుంటుంటే అని నవ్వుతూ చెబుతున్నాడు లియాంగ్.(చదవండి: ప్రధాని మోదీ నుంచి బాలీవుడ్ నటుల వరకు అంతా మెచ్చే పటోలా ఫ్యాబ్రిక్..! అంత ఖరీదా..?) -
ప్రధాని మోదీ నుంచి బాలీవుడ్ నటుల వరకు అంతా మెచ్చే పటోలా ఫ్యాబ్రిక్..!
భారతీయ చేనేత సంప్రదాయం వేల ఏళ్ల నాటిది. అవి విలాసవంతమైనవి, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగినవి కూడా. కొన్నిటికి వాటి చారిత్రక నేపథ్యం కారణంగా యావత్తు ప్రపంచం మెచ్చేలా ప్రజాదరణ సైతం ఉంది. అలాంటి ప్రాముఖ్యత కలిగిన చేనేత వస్త్రాల్లో ఒకటి గుజరాత్కి చెందిన పటాన్ పటోలా ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ అందానికి రాజీకీయ నాయకుల నుంచి బాలీవుడ్ నటుల వరకు అందరూ ఫిదా. అంతలా ఆదరణ పొందుతున్న ఈ పటాన్ పటోలా చేనేత వస్త్రం ఎలా కళాకారుల చేతులో రూపుదిద్దుకుంది..? ఎలా పుట్టుకొచ్చింది వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా..!.విభిన్న రంగుల్లో ఆకర్షణీయంగా కనిపించే ఈ పటోలా డబుల్ ఇకాట్ టెక్నిక్ ఉపయోగించి నేస్తారు. వీటిలో రేఖాగణిత మోటీప్లు కూడా ఉంటాయి. అదోక విస్తృత కథాఖండం. ఇందులో పూల నుంచి జంతువుల మోటీఫ్లు కూడా ఉంటాయి. ప్రతి డిజైన్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది.900 ఏళ్ల నాటి చరిత్ర..12వ శతాబ్దంలో రాజు కుమార్పాల ఈ పటోలాను ఇష్టపడ్డాడు. చాలా క్లిష్టంగా ఉండే చేతిపని. ఆయన జైన మతాన్ని స్వీకరించాడు. అందువల్ల ఆలయాలు పరిశుభ్రంగా ఉండటమే కాకుండా..అక్కడకు వచ్చే ప్రజలంతా పటోలా వస్త్రాల్లో కనిపించాలని హుకుం జారీ చేసేవాడు. ఈ వస్త్రం మహారాష్ట్రలోని జల్నా నగరం రవాణా అయ్యేది. అయితే ఒకసారి రాజు కుమార్పాల ఒక ఆయానికి వెళ్తే..అక్కడ పూజారి మీ దుస్తులు అపరిశుభ్రంగా ఉన్నాయంటూ లోపలికి వెళ్లనివ్వలేదు. ఒక్కసారిగా అతడి మాటలకు హుతాశుడై ఇలా ఎందుకన్నాడు. అత్యంత విలాసవంతమైన పటోలా పట్టు వస్త్రాలు మాములు దుస్తుల్లా ఎలా కనిపించాయని విచారించగా, అసలు విషయం బయటపడింది. జల్నా రాజు పటోలా బట్టలను బెడ్షీట్లుగా ఉపయోగించేవాడని, వాటిని రాజకుటుంబాలకు బహుమతిగానూ లేదా విక్రయించేవాడని తెలుస్తుంది. దాంతో కుమారపాల్ రాజు అతడితో యుద్ధం చేసి గెలిచాక..దాదాపు 700 మంది సాల్వి కళాకారులను, వారి కుటుంబాలను పటాన్ తీసుకువచ్చి పటోలా వస్త్రాల్లో కల్తీ లేని నాణ్యమైనవి వచ్చేలా చూశాడు. తన పాలనలో ఆ బట్ట ఉత్పత్తి బాగుండేలా కేర్ తీసుకున్నాడు. అలా దీని గురించి తరతరాలకు తెలిసేందుకు దారితీసింది. View this post on Instagram A post shared by Salvi Nirmal (@patola_bynirmalsalvi)నేయడానికి వ్యవధి కూడా ఎక్కువే..నిజానికి ఆరు నెలల కాలానికి గానీ ఒక చీర ఉత్పత్తి అవ్వదట. అంత సంక్లిష్టమైన చేతి పనితో కూడిన చేనేత వస్త్రం ఇది. అందుకు సంబంధించిన ఆధారాలు అజంతాలోని ఫ్రెస్కోలు, పద్మనాభపురం రాజభవనాల మీద లిఖిత పూర్వకంగా చెక్కబడి ఉన్నాయట కూడా. ముఖ్యంగా కేరళ గోడ చిత్రాల్లో ఇది ప్రస్పుటంగా కనిపిస్తుందట. అంటే ఈ పటోలా చీరలు దగ్గర దగ్గర వెయ్యి ఏళ్ల నాటివిగా పేర్కొనవచ్చు. సాల్విస్, సోనిస్ అనే రెండు వర్గాల వారికే ఈ పటోలా చేనేత నైపుణ్యం తెలుసట. గుజరాతీలోని పాత స్మారక చిహ్నాలలో ఉన్న క్లిష్టమైన గోడ డిజైన్ల ద్వారా ప్రేరణ పొందిన చతురస్రాకార నమూనాల్లో కూడా ఈ పటోలా వస్త్రాల్లో చూడొచ్చు. ఈ చేనేత వస్త్రంలోని చిహ్నాలు చాలామటుకు సంతానోత్పత్తి, శక్తి, అదృష్టం, శ్రేయస్సుతో ముడిపడి ఉండటం విశేషం. అందుకే గుజరాతీ మహిళలు శుభ సందర్భాల్లో తప్పనిసరిగా ఈ వస్త్రాలను ధరిస్తారట. డిజైన్ రూపొందించడానికే మూడు నుంచి నాలుగు నెలలు పడుతుందట. ఇక నేయడానికి ఏకంగా 40 నుంచి 50 రోజుల పడుతుందట. కనీసం ఇద్దరు కార్మికులు ఈ చీరపై ఎనిమిది నుంచి 9 గంటలు కూర్చొంటే గనుక ఇది పూర్తవ్వుతుందట. ఇప్పటకీ ఒక సాధారణ పటోలాను పూర్తిచేయాలన్న కనీసం ఐదు నెలల వ్యవధి పడుతుందట. అందుకే అంత ఖరీదు..అందువల్లే ఈ పటోలా చీరలు అంత ఖరీదు పలుకుతాయట. మార్కెట్లో అచ్చం అలాంటి నకిలీ ఫ్యాబ్రిక్ పటాన్ పటోలా వచ్చేస్తున్నాయి. అయితే అవి రూ. 2000 నుంచి రూ. 3000లు పలుకుతాయి. నాణ్యమైన ఒరిజనల్ పటోలా పట్టు చీర మాత్రం రూ. 1,50,000 నుంచి దగ్గర దగ్గర 3,50,000 వరకు పలుకుతుందట. అంతేగాదు వీటిని మలైకా అరోరా, స్మృతి ఇరానీ, దీపికా పదుకొనే, సోహా అలీ ఖాన్, కరిష్మా తన్నా, కంగనా రనౌత్, భూమి పెడ్నేక్కర్, మాధురి దీక్షిత్లు ఎంతో ఇష్టంగా ధరిస్తారట. అలాగే మన ప్రధాని మోదీ సైతం దీన్ని ఇష్టపడతారు. ఆయన జూలై 2022 లో పటోలా స్కార్ఫ్లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. View this post on Instagram A post shared by Salvi Nirmal (@patola_bynirmalsalvi) (చదవండి: మేనరికాల జోడు..భావితరాలకు చేటు..!) -
ఆమె కాలాన్ని బంధించింది
చేతిలో కెమెరా...దాని వెనక వేగంగా కదిలే కన్ను...ప్రతి సందర్భానికీ స్పందించే మనసు... ఇవి ఉంటే చాలు...కదిలే కాలాన్ని బంధించి... చాయాచిత్రంగా చరిత్ర పుటల్లో భద్రపరచవచ్చు. ముందు తరాలకు చెదరని తరగని జ్ఞాపకాలు అందించవచ్చు. దృశ్యాన్ని ఫొటోగా మార్చే సాంకేతిక శక్తి కెమెరాకు ఉండొచ్చు. కానీ దాని వెనక ఉన్న కెమెరామన్ కన్ను అంతకన్నా ముఖ్యం. సకాలంలో స్పందించే హృదయం లేని చేతిలో కెమెరా ఒక బొమ్మ మాత్రమే...అని మాటల ద్వారా కాకుండా తను తీసిన చిత్రాల ద్వారా చెప్పిన అద్భుత ఫొటోగ్రాఫర్ పద్మవిభూషణ్ హొమయ్ వ్యారవాలా. హొమయ్ వ్యారవాలా ఇండియా మొట్టమొదటి మహిళా ఫొటో జర్నలిస్ట్. భారత దేశం తెల్లదొరల వలసపాలన నుంచి స్వంతంత్ర దేశంగా ఎదిగిన ప్రయాణాన్ని తన చిత్రాల ద్వారా చెప్పిన తొలి ఫొటోగ్రాఫర్ హొమయ్. పురుషాధిపత్యం అధికంగా ఉన్న ఈ ఫొటోగ్రఫీ రంగంలో హోమయ్ హద్దుల్ని, సరిహద్దుల్ని చెరిపేసి స్వేచ్చా విహంగం. ఆకాశమే హద్దుగా తన వృత్తిలో అనుక్షణం జీవించారు. దేశ చరిత్రలో అపురూప ఘట్టాలను చాయాచిత్రాలుగా మలచి ఆ అద్భుత దృశ్య సంపదను మనకు అందించారు. హొమయ్ ని కేవలం ఓ ఫొటోగ్రాఫర్ గా మాత్రమే కాదు.... గత చరిత్ర ప్రత్యక్ష సాక్షిగా చూడాలి. ఈ దేశం పరపాలన నుంచి స్వపరిపాలన దాకా చేసిన ప్రయాణాన్ని ఈ దేశ గత చరిత్రను కెమెరా లో బంధించిన వ్యక్తిగా హొమయ్ కు ప్రత్యేక స్థానం దక్కుతుంది.హొమయ్ 1913 డిసెబర్ 9న గుజరాత్ రాష్ట్రం నవ్సారిలో ఓ పర్సి కుటుంబంలో జన్మించారు. తండ్రి ఓ టూరింగ్ డ్రమా కంపెనీలో నటుడు. తర్వాతి కాలంలో కుటుంబం బోంబేలో స్థిరపడింది. తల్లి ప్రోత్సాహంతో హుమయ్ బోంబే యూనివర్సిటీ, సర్ జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చదువుకున్నారు. ఆసమయంలోనే ఆమెకు ఫొటోగ్రఫీపై దృష్టి మళ్ళింది. 1941 లో హొమయ్ కు మనీక్షా వ్యారవాలాతో వివాహమయ్యింది. అతను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఫొటోగ్రాఫర్, అకౌంటెంట్ గా పనిచేసేవారు. హొమయ్ 1938లో బొంబే క్రానికల్ పత్రికలో ఫొటోగ్రాఫర్ గా తన కెరీర్ ప్రారంభించారు. ప్రింట్ మీడియా ప్రధాన స్రవంతిలో , ఇల్యుస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో పనిచేసిన మొట్టమొదటి మహిళా ఫొటోగ్రాఫర్ హుమయ్ . డాల్డా 13 అనే మారుపేరుతో ఆమె చిత్రాలు ప్రచురితం అయ్యేవి. ప్రతిరోజూ నగర జీవనంలో అరుదైన దృశ్యాలను ఫొటోలుగా బంధించి పత్రికకు అందించే వారు. ఆ తర్వాత 1940 నుంచి 1970 దాకా ఢిల్లీలో బ్రిటీష్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ కు పనిచేశారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ స్వాంతంత్ర్య దినోత్సవ ప్రసంగం, గాంధీ అంతిమయాత్ర లాంటి చారిత్రాత్మక ఘట్టాలను చిత్రించారు. అలాగే క్వీన్ ఎలిజెబిత్ 2 లాంటి విశిష్ట విదేశీ అతిథులు వచ్చినపుడు వారి చిత్రాలను కెమెరాలో బంధించారు. బ్రిటీస్ పాలన అంతిమదశతో పాటు బారత్ స్వాంతంత్ర్య సంబరాలను చిత్రీకరించారు. స్వాంతంత్ర్య సమర ఘట్టాల చిత్రాలు ఇప్పటికీ చెక్కు చెదరని జ్ఞాపకాలుగా మనకు మగిల్చిన హొమయ్ కు రోలిఫ్లెక్స్ కెమెరా అంటే ఇష్టం. ఆమె చిత్రాలు మానవీయ కోణంలో, సహజ చిత్రాలుగా ప్రాచుర్యం పొందాయి. ప్రముఖ నేతల చారిత్రక సందర్భాలతో పాటు వారు నడుస్తున్నప్పుడో, నవ్వుతున్నప్పుడో సహజ (క్యాండిడ్) చిత్రాలను తీయడంలో హొమయ్ ది అందెవేసిన చేయి. 1970 లో ఫొటోగ్రఫర్ వృత్తినుంచి హొమయ్ రిటైర్ అయ్యారు. 2011 లో ఆమెకు ప్రతిష్టాత్మక పద్మవిభూషన్ గౌరవం దక్కింది. ఎప్పుడూ దుమికే జలపాతంలా చురుగ్గా జీవించిన హుమయ్ తమ రిటైర్ జీవితాన్ని గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో చాలా ప్రశాంతంగా గడిపారు. హుమయ్ 2012 జనవరి 15న తమ 98వ ఏట ఈ లోకానికి వీడ్కోలు పలికారు. దేశంలోనే తొలి మహిళా ఫోటోజర్నలిస్ట్ గా.... 1940 లోనే అప్పటి సమాజంలోని పురుషాధిక్యతను నిలదీసిన ధీర మహిళగా హుమయ్ ను మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. -
మేనరికాల జోడు..భావితరాలకు చేటు..!
బిడ్డ పుట్టగానే చుట్టాలూ పక్కాలూ అందరి ముఖాల్లో సంతోషమే. బిడ్డ కాళ్లూ వేళ్లూ... ఇలా అవయవాలన్నీ సరిగా ఉన్నాయో లేదో చూసి అంతా బాగుంటే పండంటి బిడ్డ అంటూ ఆనందిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎదుగుతున్నకొద్దీ ఆ చిన్నారి కనబరుస్తున్న తెలివితేటలను చూసి ఇంకాస్త మురిసిపోతుంటారు. కానీ ఇలా ఎదిగే సమయంలో ఏవైనా మానసిక సమస్యలు కనిపిస్తే మాత్రం ఆ తల్లిదండ్రుల వేదన చెప్పనలవి కాదు. ఆ బాధను మాటల్లో వర్ణించడానికి వీలు కాదు. సాధారణంగా ఇలాంటి శారీరక వైకల్యాలూ, లేదా మానసికమైన ఎదుగుదల లోపాలూ కనిపించే పిల్లలు మేనరికపు వివాహాల్లోని జంటలకే పుట్టడం ఎక్కువ. అందుకే డాక్టర్లు కూడా దగ్గరి సంబంధాలు వద్దనే సూచిస్తుంటారు. ఎందుకు? మేనరికపు వివాహాల్లో ఇలా ఎందుకిలా జరుగుతుంది, ఒకవేళ మేనరికపు పెళ్లిళ్లు తప్పనప్పుడు బిడ్డ పుట్టకముందూ, కడుపున పడ్డ తర్వాత చేయించుకోవాల్సిన పరీక్షలూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటనే పలు అంశాలను తెలుసుకునేందుకు ఉపయోగపడే కథనమిది.ఓ బిడ్డలో లోపం వచ్చిందంటే ... తల్లిదండ్రులిద్దరిలోంచి వచ్చిన జన్యువులే (జీన్స్) సాధారణంగా ఇందుకు కారణం. తల్లిదండ్రులకు చెందిన ఆ జన్యువుల్లో ఏ లోపాలూ లేకపోతే ఆరోగ్యకరమైన అవయవాలే బిడ్డలకు వస్తాయి. సాధారణంగా ఒక లోపం వచ్చిదంటే... తల్లిదండ్రుల్లో ఎవరిదో ఒకరి జీన్ లోపభూయిష్టంగా ఉండవచ్చు. అయితే ఆ లోపం తల్లిదండ్రుల్లో ఎవరినుంచి వచ్చిందో చెప్పడం కష్టం. ఇది ఎలా జరుగుతుందంటే... ఓ అవయవానికి సంబంధించి తల్లిదండ్రులిద్దరి నుంచీ జీన్స్ బిడ్డకు వస్తాయి. ఈ రెండింటిలో ఒకదాంట్లో లోపం ఉందనుకోండి. అప్పుడు అదే అవయవానికి సంబంధించిన మంచి జీన్... లోపమున్న జీన్ను డామినేట్ చేసి... ఆ లోపం రాకుండా నివారిస్తుంది. ఒకవేళ తల్లిదండ్రులిద్దరి జన్యువుల్లోనూ లోపం ఉంటే...? అప్పుడు ఆ బిడ్డకు ఆ అవయవానికి సంబంధించిన లోపం వస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రులిద్దరూ ఎలాంటి దగ్గరి సంబంధాలూ లేని వేర్వేరు కుటుంబాలకు చెందిన వారనుకుందాం. అప్పుడు తల్లిదండ్రుల్లో ఒకరిలో జన్యులోపం ఉంటే లోపం లేని మరో జన్యువు దాన్ని డామినేట్ చేసి లోపాన్ని నివారిస్తుంది. అయితే ఒకే కుటుంబాల వారిలో (మేనరికాల్లో అదే కుటుంబాల వారి మధ్య పెళ్లి అవుతుంది కాబట్టి) ఇద్దరి జన్యువులూ లోపంతోనే ఉండే అవకాశముంటుంది కాబట్టి ఆ లోపం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుకే దగ్గరి సంతతికి చెందిన... దగ్గరి సంబంధం కలిగిన వ్యక్తుల మధ్య పెళ్లిళ్లను ఆధునిక వైద్యశాస్త్రం అంతగా ప్రోత్సహించదు. మరి ఎలాంటి దగ్గరి సంబంధాలు లేనప్పుడు ఇలాంటి అవకరాలకు అవకాశం లేదా? ఉంటుంది. కానీ... దూరపు సంబంధాల్లో ప్రతి 400 జంటల్లో ఒకరికి లోపమున్న బిడ్డ పుట్టే అవకాశం ఉంటే... దగ్గరి సంబంధాల విషయంలో కేవలం 200 జంటల్లోనే లోపమున్న బిడ్డ పుట్టేందుకు ఛాన్సులెక్కువ. అందుకే ఆరోగ్యకరమైన బిడ్డ కోసం దూరపు సంబంధాలనూ, వీలైతే అసలు రక్తసంబంధాలే లేని ఇతర కుటుంబాల వారితో వివాహాలను ఆధునిక వైద్యశాస్త్రం ప్రోత్సహిస్తోంది. కానీ... దగ్గరి సంబంధాల వివాహాలతో పుట్టబోయే బిడ్డలకు ముప్పు పొంచి ఉంటుందిలా... దగ్గరి వివాహాలను వైద్య పరిభాషలో కన్సాంగ్వినియస్ మ్యారేజెస్ అంటారు. అంటే ఉదాహరణకు అక్కకూతుర్ని... అంటే కోడలు వరసయ్యే అమ్మాయి తన మామను చేసుకోవడం, లేదా మేనమామ, మేనత్త పిల్లలను పెళ్లి చేసుకోవడం. ఇలాంటి దగ్గరి సంబంధాల వల్ల పుట్టబోయే బిడ్డల్లో అనేక రకాల అవయవలోపాల నుంచి బుద్ధిమాంద్యం వరకు ఎన్నో రకాల రుగ్మతలు, సిండ్రోమ్స్ వచ్చే అవకాశం పొంచి ఉంటుంది.పేరెంట్స్ నుంచి బిడ్డలకు పోలికలూ, గుణాలూ లక్షణాలెలా వస్తాయంటే... బిడ్డ పుట్టగానే బంధువులందరూ చుట్టూ చేరి మురిపెంగా చూసుకుంటూ రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ‘‘అరె... వీడి ముక్కు చూడండి. అచ్చం వాళ్ల నాన్నదే. వాడి కళ్లు చూడండి. అచ్చం వాళ్ల అమ్మవే’’ అంటూ మురిపెంగా పోలికలు చూస్తూ మురిసిపోతుంటారు. బిడ్డలో ఎలా వస్తాయి ఈ పోలికలు? ఎలాగంటే... మనిషి దేహం కోటానుకోట్ల కణాలతో నిర్మితమై ఉంటుంది. ఈ కణాలన్నీ మొదట ఒకే ఒక తొలికణంతో మొదలైన జైగోట్ నుంచి అనేకానేక కణవిభజనల తర్వాత ఏర్పడతాయి. ఇక మానవుని ప్రతి కణంలో 46 క్రోమోజోములుంటాయి. అంటే 23 జతలు. వీటిలో ఈ జతలో... 23 మహిళ నుంచి, మరో 23 పురుషుడి నుంచి వచ్చి కలిసి... తొలి కణం ఏర్పడుతుంది. దీన్నే మనం పిండం అంటాం. ఈ పిండంలోని 23 జతల క్రోమోజోములపై అనేక జన్యువులు ఉంటాయి. జన్యువు అంటే ఏమిటంటే... దేహంలోని ప్రతి అంశానికీ, ప్రతి అవయవానికీ, ఎదుగుదలకూ, బిడ్డ అవయవాల షేపుకూ, సైజ్కూ, పెరిగే ఒడ్డూ పొడవునకు సంబంధించిన ప్రతి సమాచారమూ ఈ జన్యువుల్లో నిక్షిప్తమై ఉంటుంది. ఈ జన్యువులన్నీ క్రోమోజోములపై ఉంటాయి. ఈ క్రోమోజోముల 23 జతలు ఒకదానితో మరొకటి కలిసి ఒక కణంగా రూపొందే సమయంలో తల్లిదండ్రుల నుంచి బిడ్డలకు ΄ోలికలు, తల్లిదండ్రుల లక్షణాలూ, శరీరాకృతి, రంగు వంటి అనేక అంశాలు సంక్రమిస్తాయి. ఇలా ఈ లక్షణాలన్నీ ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అవుతుంటాయి.దగ్గరివాళ్లలో పెళ్లిళ్లతో లోపాలు ఎందుకంటే... క్రోమోజోములపై లక్షణాలను సంక్రమింపజేసే జన్యువులు తండ్రి నుంచి ఒకటీ, తల్లి నుంచి మరొకటి కలిసి సంపూర్ణమవుతాయన్న విషయం తెలిసిందే. ఉదాహరణకు... ఒక మహిళలో (కాబోయే తల్లిలోని) ఒక జన్యువు కాస్త చెడి΄ోయి... బిడ్డలో అది ఆస్తమా వ్యాధిని కలగజేసే అవకాశం ఉందనుకుందాం. ఆ మహిళ తన కుటుంబంలోని దగ్గరి వారిని కాకుండా అసలు ఏ సంబంధమూ లేనివారిని పెళ్లి చేసుకుందని అనుకుందాం. ఆ పురుషుడిలోని అదే రకమైన జన్యువు ఆరోగ్యంగా ఉందనుకుందాం. ఈ ఆరోగ్యకరమైన పురుషుడి జన్యువు, అనారోగ్యకరమైన ఆ స్త్రీ జన్యువును అధిగమిస్తుంది. అంటే ఇంగ్లిష్లో చెప్పాలంటే డామినేట్ చేస్తుంది. ఇలా లొంగి ఉండే అనారోగ్యకరమైన జన్యువును ‘రెసెసివ్’ జీన్ అంటారు. అలాగే డామినేట్ చేసే జన్యువును ‘డామినెంట్’ జీన్ అంటారు. ఒకవేళ కుటుంబ సభ్యుల్లోని దగ్గరి సంబంధంలోనే పెళ్లి జరిగిందనుకోండి. అప్పుడు తల్లిదండ్రులిద్దరూ ఒకే కుటుంబం నుంచి వచ్చినవారు కాబట్టి వారిద్దరిలోనూ ఆ జన్యువులు ఒకేలా ఉంటాయి. దాంతో ఇద్దరి జన్యువుల్లోనూ ఏదీ మరొకదాన్ని డామినేట్ చేయక΄ోవడం, రెండూ లోపంతోనే ఉండటంతో పుట్టబోయే బిడ్డలో ఆస్తమా బయటపడుతుంది. ఇది ఒక జన్యువు ఉదాహరణ మాత్రమే. ఇలా తల్లిదండ్రుల లక్షణాలను మోసుకెళ్లే జన్యువులు ఒక్క క్రోమోజోమ్పై దాదాపు 20,000 వరకూ ఉంటాయి. అంటే భవిష్యత్తులో ఆ పుట్టబోయే బిడ్డ ప్రతి లక్షణమూ ముందే ప్రోగ్రామ్ అయి΄ోయి జన్యువుల్లో నిక్షిప్తమై ఉంటుంది. అందుకే దంపతులిద్దరూ అపరిచిత కుటుంబాల నుంచి పెళ్లిళ్లు చేసుకుంటే ఒకరిలో అనారోగ్యకరమైన జన్యువు (ఫాల్టీ జీన్) ఉన్నా... దాన్ని దంపతుల్లోని మరో ఆరోగ్యకరమైన జన్యువు డామినేట్ చేస్తుంది. అయితే ఇక్కడ పేర్కొన్న ఆస్తమా ఉదాహరణలా ఇది అన్నివేళలా ఇలాగే బిడ్డలో వ్యక్తమవ్వాలనే నిబంధన ఏదీ ఉండదు. కొన్ని ఫాల్టీ జీన్స్... ఇలా ఒక తరం నుంచి మరో తరానికి వెళ్లే క్రమంలో మరింతగా చెడిపోతూ.... చెడిపోతూ... అకస్మాత్తుగా ఒక పెద్ద లోపంగా బిడ్డలో వ్యక్తం (ఎగ్జిబిట్) కావచ్చు. అందువల్లనే మేనరికాల్లో దంపతులిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతోఫాల్టీ జీన్స్ అనేవి దంపతులిద్దరిలోనూ ఒకేలా ఉండి అవయవ లోపాలూ లేదా జబ్బులూ వ్యక్తమవుతాయి. ఎలాంటి జబ్బులకు ఆస్కారం ఉంది? మేనరికపు వివాహాలు చేసుకున్న వారిలో అవయవలోపాలూ, పుట్టుకతో వచ్చే జబ్బులు (కంజెనిటల్ డిసీజెస్), రక్తసంబంధిత వ్యాధులైన హీమోఫీలియా, థలసీమియా వంటివి, సిస్టిక్ ఫైబ్రోసిస్, మూత్రపిండాల వ్యాధులు (కంజెనిటల్ యురెట్రో పెల్విక్ అబ్స్ట్రక్షన్), కండరాల, నరాలకు సంబంధించిన వ్యాధులు, కొన్ని రకాల సిండ్రోములు (అనే జబ్బుల లక్షణాల మిశ్రమంతో ప్రయుక్తమయ్యే జబ్బులన్నింటినీ కలుపుకుని ఒకే ఒక మాటరూపంలో ‘సిండ్రోమ్’ అని పిలుస్తారు), బుద్ధిమాంద్యత, వికినిడి సమస్యలు, కళ్లసమస్యలు, గుండెకు సంబంధించిన సమస్యలు (గుండెలో రంధ్రాలు, వాటి ధమనుల్లో లోపాలు), చిన్నప్పుడే వచ్చే డయాబెటిస్, జన్యుపరమైన సమస్యలు రావచ్చు. ఇక కాబోయే తల్లిలో మాటిమాటికీ జరిగే గర్భస్రావాలు, బిడ్డ పుట్టగానే చనిపోవడం, బిడ్డకు శ్వాససంబంధిత సమస్యలు, జీవక్రియలకు సంబంధించిన (మెటబాలిక్) సమస్యలు ఇలా అనేక వైద్యపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జన్యుపరమైన సమస్యలూ – రకాలు సాధారణంగా జన్యుపరమైన సమస్యలను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి... 1) ఆటోజోమల్ డామినెంట్ : ఇలాంటి జీన్స్ వచ్చిన పిల్లల్లో సమస్య బయటకు కనిపిస్తూ ఉంటుంది. పైగా లోపంతో ఉన్న జీన్ డామినెంట్గా ఉంటుంది. దాంతో ఒక్క జీన్ సంక్రమించినా పిల్లల్లో సమస్య బయటపడుతుంది. 2) ఆటోజోమల్ రెసెసివ్ : వీటిలో సమస్య బయటపడదుగానీ... సమస్యను / వ్యాధిని కలగజేసే జన్యువులు తల్లిదండ్రులిద్దరిలోనూ నిశ్శబ్దంగా లోపలే ఉంటాయి. వీళ్లు తర్వాత తరానికి సమస్యను మోసుకెళ్తారు. కాబట్టి వీరిని ‘క్యారియర్స్’ అంటారు. ఇద్దరు ‘క్యారియర్స్’ పెళ్లాడితే... రెండు రెసెసివ్ జీన్స్ కలిసి... పుట్టబోయే బిడ్డలో సమస్య తప్పక బయటపడుతుంది. 3) ఎక్స్ లింక్డ్ సమస్యలు : ఇలాంటి సమస్యలు ‘ఎక్స్’ క్రోమోజోమ్పై నిక్షిప్తమై ఉంటాయి. దాంతో ఈ జీన్ కలిగిన ఆడపిల్లలు సమస్యకు ‘క్యారియర్స్’గా ఉంటారు. సమస్య మగపిల్లల్లో బయటపడుతుంది.పెళ్లి తప్పదనుకుంటే... ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని మేనరికపు వివాహాలకు దూరంగా ఉండటమే చాలావరకు మంచిది. ఒకవేళ ఈ అంశాలన్నీ తెలియక నిశ్చితార్థమో, వివాహమో చేసుకుంటే... అప్పుడు ఆ జంట చేయాల్సిన పనులివి... వివాహానికంటే ముందుగా : పెళ్లికి ముందే అమ్మాయీ, అబ్బాయి... ఈ ఇద్దరినీ ప్రీ–మేరిటల్ అండ్ జెనెటిక్ కౌన్సెలింగ్ కోసం నిపుణులను కలవాలి. అప్పుడా నిపుణులు కుటుంబ ఆరోగ్య చరిత్రను పరిగణనలో తీసుకుంటారు. అంటే వీరి తల్లిదండ్రులు, మేనత్త, మేనమామ, తాతలు, ముత్తాతల్లో ఏవైనా దగ్గరి సంబంధం చేసుకోవడం వల్ల వచ్చిన సమస్యలు ఉన్నాయా అని తెలుసుకుంటారు. ఉంటే... వీరికి పుట్టే పిల్లలకు ఆ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో విశ్లేషణాత్మకంగా అంచనావేస్తారు. వాటి ఆధారంగా రిస్క్ తీసుకోవచ్చా లేదా అనేది ఆ జంట నిర్ణయించుకోవచ్చు. అవసరమైతే ఆ జంటకు కొన్ని రక్తపరీక్షలూ చేయించే అవకాశమూ ఉంటుంది. సాధారణంగా వచ్చే జన్యుపరమైన సమస్యలను తెచ్చే జీన్స్ ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోడానికి ఇద్దరికీ జెనెటిక్ టెస్టింగ్ చేస్తారు. అయితే ఎన్ని పరీక్షలు చేసినా వారికి ఏ సమస్యా రాదనో, వస్తుందనో నిర్ధారణగా చెప్పడం కష్టం. ఒకవేళ ఆటోజోమల్ డామినెంట్ సమస్యలు వస్తాయని తెలిస్తే వీలైనంతవరకు ఆ పెళ్లి వద్దనుకోవడమే మంచిది. పెళ్లి తర్వాత : పెళ్లి తర్వాత కూడా జెనెటిక్ కౌన్సెలింగ్కు వెళ్లి పైన పేర్కొన్నవన్నీ పాటించవచ్చు. గర్భం దాల్చడానికి మూడు నెలల ముందునుంచే ఫోలిక్యాసిడ్ మాత్రలు రోజుకు ఒకటి చొప్పున తీసుకోవాలి. గర్భం వచ్చాక : ఇక్కడ పేర్కొంటున్న సమస్యలన్నీ జన్యుపరమైనవి కావడంతో పుట్టబోయే పిల్లల్లో ఏ సమస్యా రాకుండా చేయడమన్నది ఏ నిపుణులకూ సాధ్యం కాదు. కాక΄ోతే కొన్ని గుర్తించదగిన సమస్యలను ముందుగానే పసిగట్టడం వల్ల, పుట్టిన తర్వాత వెంటనే చెయ్యగలిగిన చికిత్సలేవైనా ఉంటే వాటికోసం తక్షణమే సన్నద్ధమయ్యేలా జాగ్రత్త తీసుకోవడం చేయవచ్చు. లేదా లోపల ఉన్న సమస్యను తెలుసుకోవడం... ఒకవేళ అది మెదడుకు సంబంధించినదీ లేదా ఎప్పటికీ సరిచేయలేనిదని తెలిస్తే గర్భస్రావం (ఐదు నెలల లోపల) అవకాశాల గురించి ఆలోచించడం లేదా బిడ్డను కనడం... ఈ రెండింటిలో వారికి అనువైన / తగిన నిర్ణయం తీసుకోవచ్చు. చివరగా... మేనరికపు పెళ్లిళ్ల వల్ల పుట్టే పిల్లలకు వచ్చే అవయవ లోపాలను రాకుండా చేసేందుకు గర్భంతో ఉన్నప్పుడే ఇచ్చే మందులు, చేసే ఇంజెక్షన్లు ఉన్నాయని చాలామంది అనుకుంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే. అలాంటి ఇంజెక్షన్లుగానీ మందులు గానీ ఉండవు. ఇక మేనరికపు వివాహాల వల్ల పిల్లలకు అవకరాలు వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి ఆస్తి కోసమో లేదా ఇతరత్రా కుటుంబ భద్రతల దృష్ట్యా అలాంటి వాటిని చేసుకుని... ఆర్థికంగా, మానసికంగాబాధపడటం కంటే... ఆరోగ్యకరమైన బిడ్డల కోసం కాస్తంత మంచి సంబంధాలు వెదికి బయటి సంబంధాలు చేసుకోవడమే మేలు అని గుర్తుంచుకోవాలి. అయితే ఇది వారి వారి వ్యక్తిగతమైన కుటుంబ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. రక్తసంబంధాల్లోనే వివాహాలకు కారణాలివి... ఆర్థిక కారణాలూ, తెలిసినవారి కుటుంబంలో అయితే బిడ్డ బాగోగులు తెలుస్తాయనే ఈ రెండు అంశాలే దగ్గరి బంధుత్వాల్లో పెళ్లిళ్లకు కారణం. అందునా... ప్రధానంగా ఆర్థిక అంశాలే బాగా దగ్గరి సంబంధాలు చేసుకునేలా చాలావరకు ఆ కుటంబాలవారిని ప్రభావితం చేస్తుంటాయి. మేనత్త / మేనమామ పిల్లలను చేసుకుంటే ఆస్తి బయటివారికి చెందకుండా... ఆస్తిలో ఆస్తి కలుస్తుందనే అంశమే చాలా సందర్భాల్లో ఇలాంటి పెళ్లిళ్లను ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. ఇక రెండో ప్రధాన అంశం... ఉద్వేగపూరిత బంధం. అంటే ఎమోషనల్ రిలేషన్షిప్. మనం ప్రాణప్రదంగా పెంచుకున్న మన బిడ్డను ఎక్కడో దూరంగా ఉన్నవారికి ఇచ్చి పెళ్లి చేస్తే... వారెలా చూసుకుంటారో, బాగా చూసుకుంటాఓ లేక ఆరళ్లు పెడుతూ బాధలకు గురిచేస్తారో? అదే... బిడ్డ మన కళ్లెదురుగా ఉంటే మనమూ కూతురి బాగోగులు కళ్లారా చూస్తూ ఉండవచ్చు. ఈ రెండు అంశాల కారణంగా కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా దగ్గరి బంధువుల్లోనే పెళ్లిళ్లు జరుగుతుంటాయి. దాంతో తమ జీవనశైలుల్లోనూ, తమ సాంస్కృతిక విధానంలో దంపతులిద్దరూ తేలిగ్గా ఇమిడిపోతారు... దాంతో దంపతులకు ఇబ్బందులు రావనే భావన ఇలాంటి వివాహాలను ప్రోత్సహిస్తుంది.మేనరికపు పెళ్లిళ్లు... దంపతులు చేయించుకోవాల్సిన పరీక్షలు :గర్భందాల్చిన మూడో నెలలో (12 వారాల్లో) డబుల్ మార్కర్ టెస్ట్ అనే రక్తపరీక్ష చేయించుకుంటే బిడ్డలో డౌన్స్ సిండ్రోమ్, ట్రైజోమ్ 18, 13 వంటి కొన్ని రకాల జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా లేక తక్కువగా ఉన్నాయా అని తెలుస్తుంది. ఈ పరీక్షల ఫలితాలను బట్టి వేరే పరీక్షలు అవసరమా కాదా అని తెలుస్తుంది. మూడో నెలలో (12వారాలప్పుడు) న్యూకల్ ట్రాన్స్లుయెన్సీ స్కాన్ (ఎన్టీ స్కాన్) చేయించుకుంటే, ఆ సమయానికి బయటపడే సమస్యలు ఏమైనా ఉంటే తెలుస్తాయి. పై పరీక్షల్లో కొన్ని జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందనే సందేహం కలిగినప్పుడు దాన్ని నిర్ధారణ చేయడానికి బిడ్డ చుట్టూ ఉండే మాయ నుంచి కొంత ముక్క సేకరించి ‘కోరియా విల్లస్ బయాప్సీ’ అనే పరీక్ష చేస్తారు. ఐదో నెలలో ట్రిపుల్ మార్కర్ లేదా క్వాడ్రపుల్ మార్కర్ వంటి రక్తపరీక్షలు చేయించుకుంటే పుట్టబోయే బిడ్డలో కొన్ని రకాల జన్యుపరమైన సమస్యల ముప్పు ఎక్కువా లేదా తక్కువా అన్నది తెలుస్తుంది. ఇందులో రిస్క్ ఎక్కువగా ఉన్నట్లు ఫలితాలు వస్తే ఆమ్నియోసెంటైసిస్ అనే పరీక్ష చేయించాలి. ఇందులో గర్భంలోని బిడ్డ చుట్టూ ఉండే ఉమ్మనీరు లోంచి 10 – 20 ఎమ్ఎల్ తీసి జన్యువుల పరీక్షకు (క్యారియోటైపింగ్కు) పంపించి సమస్యను నిర్ధారణ చేస్తారు. ఈ పరీక్ష వల్ల ఒక శాతం మందిలో గర్భస్రావమయ్యే అవకాశం ఉంటుంది. ఐదో నెల చివరిలో 18–22 వారాలప్పుడు ‘టిఫ్ఫా’ అనే స్కానింగ్ చేయడం వల్ల బిడ్డలో వచ్చే అవయవలోపాలను ముందుగానే గుర్తించవచ్చు. దీనితో ΄ాటు జెనెటిక్ సోనోగ్రామ్ చేయించుకుంటే కొన్ని జన్యుసంబంధిత వ్యాధులను సూచించే సాఫ్ట్ మార్కర్లను గుర్తించి, దానికి తగినట్లుగా తర్వాతి నిర్ణయం తీసుకోవచ్చు. ఆరో నెలలో 22–24 వారాల్లో 2డీ ఫీటల్ ఎకో కూడా చేయించుకుంటే గుండెకు సంబంధించిన లోపాలను తెలుసుకోవచ్చు. స్కానింగ్లో నూటికి నూరు శాతం లోపాలను కనుక్కోలేకపోవచ్చు. కొందరిలో బిడ్డ పొజిషన్, ఉమ్మనీటి శాతం, తల్లి పొట్ట మీద అధికకొవ్వు వంటి అంశాలను బట్టి కూడా కొన్ని లోపాలను కనుగొనడం మిస్సయ్యే అవకాశం ఉంది. బిడ్డ పుట్టాక : బిడ్డపుట్టిన తర్వాత మొదటి వారంలోనే నియోనేటల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించడం వల్ల త్వరగా చికిత్స చేయదగిన వ్యాధులు ఏవైనా ఉంటే తెలుస్తుంది. అంటే ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజమ్ వంటివి గుర్తించవచ్చు. బిడ్డ మూడో నెలలో వినికిడి లోపాలను గుర్తించే పరీక్షలు చేయించి, ఒకవేళ ఉంటే వాటిని చాలావరకు సరిదిద్దవచ్చు.డాక్టర్ శ్రీజ గుర్రాల, సీనియర్ కన్సల్టెంట్ యూరోగైనకాలజిస్ట్ (చదవండి: హార్న్బిల్ ఫెస్టివల్ ..! ఫుడ్ మెనూ చూస్తే..మతిపోవడం ఖాయం..!) -
హార్న్బిల్ ఫెస్టివల్..! ఫుడ్ మెనూ చూస్తే..మతిపోవడం ఖాయం..!
నాగాలాండ్ రాష్ట్రంలో డిసెంబర్ రాగానే తొలివారం హార్న్బిల్ ఫెస్టివల్ మొదలైపోతుంటుంది. ఈ వేడుక చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీన్ని చూసేందుకు ఇతర రాష్ట్రాల ప్రజలు, విదేశీయలు తండోపతండాలు వస్తుంటారు. ముఖ్యంగా ఈ పండుగలలో ఉండే ఫుడ్ మెనూ చూస్తే నోరెళ్లబెడతారు. ఆ వంటకాలు చూసి..ఇవేం రెసిపీల్రా బాబు అని అనుకోకుండా ఉండలేదు. పాపం అలానే ఫీలయ్యాడు ఈ విదేశీయుడు. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేశాడు. నాగాలాండ్ హార్న్బిల్ ఫెస్టివల్ వివిధ రంగు రంగుల సంస్కృతుల సమాజాలు, సాంప్రదాయంతో శక్తిమంతంగా ఉంటాయి. నాగాలాండ్ కోహిమా నుంచి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిసామా హెరిటేజ్ విలేజ్లో జరిగే పది రోజుల కార్యక్రమం. ఈ పండుగ డిసెంబర్ 1 నుంచి ప్రారంభమై డిసెంబర్ 10 వరకు కొనసాగుతుంది. ఈ పండుగలో కనిపించే ప్రత్యేకమైన ఆహార వంటకాలు అత్యంత హైలెట్ అని చెప్పొచ్చు. యూకేకి చెందిన వ్లాగర్ అలెక్స్ వాండర్స్ ఈ వేడుకలో పాల్గొని అక్కడి రెస్టారెంట్లోని అసాధారణ ఫుడ్ మెనూ గురించి నెట్టింట వీడియో రూపంలో షేర్ చేశాడు. ఆ వీడియోలో తాను భారతదేశంలోని హార్న్బిల్ ఫెస్టివల్లో ఉన్నానని పేర్కొన్నాడు. నా మొత్తం లైఫ్లో చూసి అత్యంత క్రేజీ మోనూలో ఇది ఒకటి. నాకు ఆ మెనూలో కనిపించిన 22 వంటకాలను చూసి నోటమాట రాలేదని అంటున్నాడు. బార్బెక్యూ పోర్క్, పోర్క్ ఇన్నార్డ్స్, అనిషితో పంది మాంసం, ఆక్సోన్తో పంది మాంసం, బియ్యం లేదా పరాఠాతో బటర్ చికెన్, బియ్యం లేదా పరాఠాతో దాల్ మఖానీ, చికెన్ లివర్ గిజార్డ్, డ్రై రోస్ట్డ్ ఫిష్, ఫిష్ పాంగ్సెన్, రొయ్యల టెంపురా మరియు మరిన్ని ఉన్నాయి. వ్లాగర్ దృష్టిని ఆకర్షించినవి నత్త, పట్టు పురుగు, మిడత, సాలీడు, వెనిసన్ (జింక మాంసం), పంది మాంసం, గేమ్ బర్డ్(మాంసం), పామ్ సివెట్ పిల్లి మాంసం వంటి వంటకాలు ఉన్నాయి. ఇలాంటివి తింటారా ఈ పండుగలో అని విస్తుపోయానంటున్నాడు యూకే వ్లాగర్. నెటిజన్లు మాత్రం మాదేశంలో విభిన్న సంస్కృతులకు నెలవు. భిన్నత్వంలో ఏకత్వం ప్రతిదానిలో స్పష్టంగా కనిపిస్తుందంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.హార్న్బిల్ ఫెస్టివల్:హార్న్బిల్ ఫెస్టివల్ అనేది ఈశాన్య భారత రాష్ట్రమైన నాగాలాండ్లో డిసెంబర్ 1 నుంచి 10 వరకు జరుపుకునే వార్షిక పండుగ. ఈ పండుగ నాగాలాండ్లోని అన్ని జాతుల సమూహాలను సూచిస్తుంది. దీన్ని పండుగల పండుగ అని కూడా పిలుస్తారు. రంగురంగులుగా పెద్దగా ఉండే అటవీ పక్షిపేరు మీదుగా ఈ పండుగకు పేరు పెట్టారు. నాగాలాండ్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడానికి, అంతర్-జాతి పరస్పర చర్యను ప్రోత్సహించడానికి, అక్కడి ప్రభుత్వం డిసెంబర్ తొలివారంలో హార్న్బిల్ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. View this post on Instagram A post shared by Alex Wanders (@alexwandersyt) (చదవండి: ఆర్డర్లు కాదు ఇన్స్పిరేషన్ డెలివరీ చేస్తోంది!) -
Sagubadi: రైతమ్మల శ్రమకు జేజేలు!
వ్యవసాయం, ఆహారోత్పత్తుల తయారీ, పంపిణీ రంగాల్లో మహిళలు అత్యంత కీలకపాత్ర పోషిస్తున్నారు. మహిళా శ్రమ తోడు లేకుండా వ్యవసాయం ఒక్క పూట కూడా ముందుకు సాగదు. ఆమె బహుపాత్రాభినయం చెయ్యకపోతే కుటుంబమూ వర్ధిల్లదు. పొలాల్లో వ్యవసాయ పనులు, ఇంటి దగ్గర పశుపోషణతో పాటు అదనంగా వంట పనులు, ఇంటి పనులు, పెద్దల సంరక్షణ పనులను భుజాన వేసుకొని మోస్తున్న మహిళా రైతులు కొవ్వొత్తుల్లా కరుగుతూ సమాజ అభ్యున్నతికి దోహదపడుతున్నారు. మహిళా రైతులు ప్రత్యక్షంగా, పరోక్షంగా లింగపరమైన ప్రతిబంధకాలను, వివక్షలను, అసౌకర్యాలను ఎదుర్కొంటున్నారు. ఈ లింగ అంతరాలను గుర్తించి, పరిష్కరిస్తే ఆర్థికాభివృద్ధి పరుగులు పెడుతుంది. ఆహార అభ్రదత గణనీయంగా తగ్గుతుందని అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. ఈ కొత్త సంవత్సరంలో ఆ దిశగా మీ ఆలోచనలు, ఆచరణకు పదును పెట్టండి అని ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. 2026ను అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం (ఐవైడబ్ల్యూఎఫ్ 2026)గా ప్రకటించింది. ఆహార భద్రతను అందించటంలో మహిళలు – రైతుగా, రైతు కూలీగా, ఆహార పరిశ్రమదారుగా, ఉద్యోగిగా, అమ్మగా, కుటుంబ సభ్యుల సంరక్షకురాలిగా– బహుముఖ సేవలందిస్తున్నారు. ప్రపంచ వ్యవసాయ శ్రామిక శక్తిలో మహిళలకు గణనీయమైన భాగస్వామ్యం ఉంది. వ్యవసాయ, ఆహార విలువ గొలుసులో వీరి పాత్ర అత్యంత కీలకం. వ్యవసాయంలో, వ్యవసాయానుబంధ రంగాల్లో ఆహారోత్పత్తి, ప్రాసెసింగ్ పనుల నుంచి పంపిణీ, వాణిజ్య కార్యకలాపాల వరకు వ్యవసాయ, ఆహార విలువ గొలుసు పరిధిలోకి వస్తాయి. ఇంటి ఆహార భద్రత, పోషకాహారం సమకూర్చటంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2021లో వ్యవసాయ ఆహార రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా శ్రమిస్తున్న వారిలో 41% మహిళలైనప్పటికీ, మహిళల శ్రమ విలువను తక్కువగా చూస్తున్నారు. నడుములు పడిపోయే శ్రమతో కూడుకున్న పనులు చేయిస్తారు. కానీ, తక్కువ జీతం. భూమి, ఆర్థిక, సాంకేతికత, విద్య, విస్తరణ సేవలు తదితర అన్ని స్థాయిల్లో నిర్ణయాలు తీసుకునే విషయంలో వ్యవస్థాగత అడ్డంకులను మహిళా రైతులు ఎదుర్కొంటున్నారు. మహిళా రైతుల జీవన వాస్తవాలను వెలుగులోకి తీసుకురావటానికి, లింగ సమానత్వాన్ని పెంపొందించడానికి, మహిళలను శక్తివంతం చేయడానికి.. తద్వారా వ్యవసాయాన్ని ఆహారోత్పత్తి రంగాలను మరింతగా ఒడిదుడుకుల్ని తట్టుకునేలా పటిష్టంగా నిర్మించడానికి అనుగుణంగా విధాన సంస్కరణలు, పెట్టుబడులను ప్రోత్సహించాలని ఐక్యరాజ్యసమితి లక్ష్యంగా పెట్టుకుంది. ఎఫ్ఏఓతో పాటు ఐరాస అనుబంధ సంస్థలైన ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ (ఐఎఫ్ఏడీ), వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (డబ్లు్యఎఫ్పీ)లు వచ్చే ఏడాదంతా మహిళా రైతులను బలోపేతం చేసే కార్యకలాపాలను సమన్వయం చేస్తాయి. ‘మహిళా రైతు’లంటే ఎవరు?వ్యవసాయ, ఆహార రంగాల్లో విభిన్న పాత్రల్లో పనిచేస్తున్న మహిళలందరూ మహిళా రైతులే. చిన్న/పెద్ద సొంత భూముల్లో పంటలు సాగు చేసే మహిళలు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, చేపలు/రొయ్యల రైతులు, మత్స్యకారులు, చేపల కార్మికులు, తేనెటీగల పెంపకందారులు, పశువులు/కోళ్ల పెంపకందారులు, ప్రాసెసర్లు, వ్యాపారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, గ్రామీణ వ్యవస్థాపకులు, సాంప్రదాయ విజ్ఞానవంతులు.. అధికారిక లేదా అనధికారిక పనిలో నిమగ్నమయ్యే మహిళలు.. భూమి యాజమాన్య హక్కులు ఉన్నా లేకున్నా సరే.. వీరంతా మహిళా రైతులే. వీరిలో యువతులు, వృద్ధులు, పేద, ఆదివాసీ మహిళలు, వైకల్యాలున్న మహిళలు, శరణార్థులు, వలస వచ్చి వ్యవసాయ, ఆహార శుద్ధి పనులతో పొట్టపోసుకుంటున్న మహిళలు కూడా ఈ కోవలోని వారే. వ్యవసాయ, ఆహార రంగాల్లో మహిళల స్థితిగతులు, లింగ అసమానతల స్థాయి, పర్యావరణ విపత్తుల నేపథ్యంలో మహిళలు ఎదుర్కొంటున్న అసమానతల వల్ల కలుగుతున్న ప్రమాదాలను ఎఫ్ఏఓ నివేదికలు నొక్కి చెబుతున్నాయి. మీకు తెలుసా?→ ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం, వ్యవసాయానుబంధ రంగాలు, ఆహార పరిశ్రమల్లో 2021లో పనిచేసే కార్మికుల్లో మహిళలు 41% ఉన్నారు. అయినప్పటికీ గ్రామీణ మహిళలు అసమానతను ఎదుర్కొంటున్నారు. → మగ రైతులతో పోల్చితే చాలా మంది మహిళా రైతులు చిన్న కమతాల్లోనే సేద్యం చేస్తున్నారు. → వ్యవసాయం, అనుబంధ రంగాలు, ఆహార పరిశ్రమల్లో పనిచేసే మహిళల సంపాదన పురుషుల కన్నా 22% తక్కువ. → మహిళా రైతులపై పొలం పనులతో పాటు ఇంటి సంరక్షణ పని భారం అధికంగా ఉంటుంది. ఇంటి పనులకు ప్రత్యేక ఆదాయం ఉండదు. అసలు ఆ శ్రమ విలువ లెక్కలోకి రాదు. పని చేసినా ఆర్థిక సాధికారత రాదు. వారి శారీరక, మానసిక శ్రేయస్సును ఈ వేతనం లేని పని భారం దెబ్బతీస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలు తమ కుటుంబ సభ్యుల కోసం చేసే వేతనం లేని సంరక్షణ పని విలువ ఏటా కనీసం 10.8 లక్షల కోట్ల డాలర్లని ఎఫ్ఏఓ లెక్కగట్టింది.→ ప్రణాళికాబద్ధమైన పథకాల ద్వారా గ్రామీణ మహిళలను సాధికారపరిస్తే 5.8 కోట్ల మంది ఆదాయం పెరుగుతుంది. 23.5 కోట్ల మందికి ఒడిదుడుకుల్ని తట్టుకునే శక్తి పెరుగుతుంది. అయినప్పటికీ ఈ దిశగా కృషి జరగటం లేదు. → తీవ్రమైన వేడి, కరువుల నేపథ్యంలో పురుషుల కంటే మహిళలపై ఎక్కువ పని భారం పడుతుంది. → లింగపరమైన అంతరాలను రూపుమాపితే ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి ఏటా లక్ష కోట్ల డాలర్ల మేరకు పెరుగుతుంది. 4.5 కోట్ల మంది ఎదుర్కొంటున్న ఆహార అభద్రతను తగ్గించవచ్చు. → ఆహార అభద్రత బాధితుల్లో మహిళల సంఖ్యే ఎక్కువ. ఉపాధి, విద్యావకాశాలు, ఆదాయంలో లింగపరమైన అంతరం తగ్గించగలిగితే మహిళల్లో ఆహార అభద్రతను 52% తొలగించవచ్చని ఎఫ్ఏఓ నివేదిక తెలిపింది. → మహిళలకు భూమి హక్కులు కల్పిస్తే వ్యవసాయ, ఆహార వ్యవస్థలు, గ్రామీణాభివృద్ధికి.. మొత్తంగా సమాజాభివృద్ధికి సహాయపడుతుంది. భూమి యాజమాన్య హక్కు విషయాల్లో లింగ వివక్ష రాజ్యం ఏలుతోంది. సాగు భూమిపై మహిళలకు మరింతగా హక్కులు కల్పిస్తే వారి సాధికారత, పెట్టుబడి సామర్థ్యం, స్థిరత్వం, సమస్యలను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. భూమి హక్కున్న మహిళా రైతుకు సేవల లభ్యత మెరుగవుతుంది. లింగ ఆధారిత హింస తగ్గుతుందని ఎఫ్ఏఓ సూచిస్తోంది. గడ్డిభూముల సంవత్సరం కూడా ! 2026ను మహిళా రైతుల సంవత్సరంతో పాటు గడ్డి భూములు, సంచార పశుకాపరుల సంవత్సరంగానూ ఉమ్మడిగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. గడ్డి భూములు, సవన్నాలు, పొదలతో నిండిన బంజర్లు, ఎడారులు, చిత్తడి భూములు, కొండలు గుట్టలున్న ప్రాంతాల విస్తీర్ణం భూతలమ్మీద సగానికి సగం ఉంటుంది. ఈ ప్రాంతాలను పర్యావరణ హితమైన రీతిలో నిర్వహించటం జీవవైవిధ్యం, పచ్చదనం పరిరక్షణకు, కర్బన నిల్వలు, నీటి చక్రం నిర్వహణకు అవసరం. గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలు వంటి సుమారు 100 కోట్ల పశువులను బంజరు భూములు, పచ్చికబయళ్లలో మేపుకుంటూ ఎంతో మంది సంచార పశుకాపరులు తరతరాలుగా జీవనం సాగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భూముల్లో దాగి ఉన్న కర్బన నిల్వల్లో 30% ఈ భూముల్లోనే ఉంది. భూతాపం పెరగటం వల్ల ఈ భూముల్లోని సగం కర్బనం వాతావరణంలో కలిసినట్లు అంచనాలు ఉన్నాయి. ఫలితంగా ఈ భూములపై ఆధారపడి ఉన్న ప్రజల జీవనోపాధులు ప్రమాదంలో పడుతున్నాయి. గడ్డి భూములు, చిత్తడి నేలల పరిరక్షణకు పాలకులు శ్రద్ధతీసుకొని పెట్టుబడులు పెట్టాలని ఎఫ్ఏఓ పిలుపునిచ్చింది. ఈ భూములను పరిరక్షించటం ద్వారా పంట పొలాలకూ మేలు జరుగుతుంది. -
ఆర్డర్లు కాదు ఇన్స్పిరేషన్ డెలివరీ చేస్తోంది!
‘నీ దగ్గర ఏమీ లేకపోయినా సరే, ధైర్యం ఉండాలి. జీవనోత్సాహం ఉండాలి. అవి రెండూ ఉంటే అన్నీ వస్తాయి’ అంటారు. 52 సంవత్సరాల వీణాదేవి దగ్గర అవి ఉన్నాయి. వీణ 50 శాతం శారీరక వైకల్యం ఉన్న మహిళ. ఆమె తన వైకల్యం గురించి బాధపడుతూ కూర్చోలేదు. ‘ఇంట్లో ఖాళీగా కూర్చోకూడదు. ఏదో ఒక పని చేయాలి’ అని గట్టిగా అనుకుంది. గత కొన్ని నెలల నుంచి జెప్టో డెలివరీ ఏజెంట్గా పనిచేస్తోంది.‘కష్టం అనిపించడం లేదా?’ అని ఎవ రైనా అడిగితే... ‘ఖాళీగా కూర్చుంటేనే నాకు చాలా కష్టం’ అని నవ్వుతూ చెబుతుంది. నటి, మోడల్ మలైకా అరోరా ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. వీడియోలో అరోరా వీణతో మాట్లాడుతూ కనిపిస్తుంది.‘ఇలాంటి మహిళను చూడడం నాకు ఇదే మొదటిసారి. చిన్న చిన్న విషయాలకే తెగ బాధపడిపోతుంటాం. వద్దు. గయ్స్... జీవితం చాలా విలువైనది. ఆమె కస్టమర్ల ఆర్డర్ను డెలివరీ చేయడం లేదు. ఇన్స్పిరేషన్ను డెలివరీ చేస్తోంది’ అని రాసింది అరోరా.ప్రౌడ్ ఆఫ్ హర్’: ‘మహిళలు సంకల్పిస్తే ఎన్ని అడ్డంకులు ఉన్నా అధిగమించి తాము అనుకున్నది సాధించగలరు’ ఇలాంటి మాటలతో కామెంట్ సెక్షన్ ప్రశంసలతో నిండిపోయింది. -
తీర్పు ఏదైనా...పోరుకు ప్రశంస
శక్తిమంతులతో పోరాడే సమయంలో పోరాటమే విజయంతో సమానం. ఆ తర్వాత దక్కిన న్యాయం సంతృప్తిని ఇవ్వొచ్చు ఇవ్వకపోవచ్చు. కేరళ సూపర్స్టార్ దిలీప్ తనపై అత్యాచారం చేసేందుకు ఒక గ్యాంగ్తో కుట్ర పన్నాడని ఆరోపించి సుదీర్ఘకాలం పోరాడిన నటి (తెలుగులో కూడా నటించింది) చివరకు డిసెంబర్ 8న జడ్జిమెంట్ వినగలిగింది. మొత్తం 15 మంది నిందితులున్న ఈ కేసులో 1 నుంచి 6 వరకు ఉన్న నిందితులను కోర్టు దోషులుగా ఖరారు చేసి 8వ నిందితుడైన దిలీప్ను నిర్దోషిగా విడుదల చేసింది. దీనిపై వ్యాఖ్యలు వినిపిస్తున్నా కేరళను కంపింప చేసి ఎన్నో సవాళ్లు తట్టుకుని పోరాడిన నటిని ముందు ప్రశంసించాల్సి ఉంది.తాను పని చేసే రంగంలో అత్యంత శక్తిమంతుడైన వ్యక్తి వల్ల తనకు అన్యాయం జరిగిందని ఒక బాధితురాలు విశ్వసిస్తే ఆమె చేసే పోరాటానికి ఎన్ని అవరోధాలు ఉంటాయి? మలయాళ సూపర్స్టార్ దిలీప్ పన్నిన కుట్ర వల్లే తన మీద అత్యాచారం జరిగిందని న్యాయపోరాటానికి దిగిన మలయాళ నటి ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని చివరకు ‘తీర్పు’ను సాధించింది. అయితే ఆ తీర్పులో తనకు దక్కిన న్యాయం పాక్షికమా? సంపూర్ణమా అనేది చర్చే అయినా... ఇంతవరకూ ఆమె వెరవక నిలబడటం చాలా గొప్ప సంగతి. స్ఫూర్తిదాయకమైన పోరాటం.→ అసలేం జరిగింది?మలయాళ నటి ‘ఎం’ (కథనం కోసం పెట్టిన పేరు) ఫిబ్రవరి 17, 2017న త్రిషూర్లోని తన ఇంటి నుంచి కొచ్చి వెళుతున్నప్పుడు రాత్రి వేళ ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో వాహనంతో ఢీకొట్టిన కొంతమంది ఆమె వాహనంలోకి జొరపడ్డారు. ఆ తర్వాత కొచ్చి అంతా తిప్పుతూ ‘ఎం’ను దుర్బాష లాడారు. వారిలో పల్సన్ సుని అనే పాత నేరస్తుడు ఆమె మీద అత్యాచారం చేయడమే కాదు అదంతా వీడియో తీశాడు. ఆ తర్వాత ఒక దర్శకుడి ఇంటి ముందు ఆమెను పడేసి ఉడాయించాడు. దర్శకుడి సహాయంతో అదే రోజు ‘ఎం’ కేసు నమోదు చేసింది.→ తర్వాత ఏం జరిగింది?మొదట పోలీసులు ఇదో బ్లాక్మెయిల్ దందా చేసే వారి పని అని భావించారు. అయితే అత్యాచార సమయంలో పల్సర్ సుని ‘ఎం’తో ‘నేను కొటేషన్ అందుకోవడం వల్లే ఈ పని చేస్తున్నాను’ అన్నాడు. కొటేషన్ అంటే సుపారీ. అయితే ఈ సుపారీ సంగతి వెంటనే పోలీసుల దృష్టికి రాలేదు. బాధితురాలు ఇది కీలకమైన కామెంట్గా గమనించలేదు.→ అరెస్టులుపోలీసులు వరుసగా అరెస్టులు చేశారు. వీరిలో పల్సర్ సునితో పాటు ‘ఎం’ వాహన డ్రైవర్ ఇంకా ఆరు గురు ఉన్నారు. మే 1, 2017 నాటికి ‘ది విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ పేరుతో మలయాళ నటీమణులు ఒక బృందంగా ఏర్పడి ముఖ్యమంత్రిని కలిసి మలయాళ పరిశ్రమలో సెక్సువల్ హరాస్మెంట్ గురించి చర్యలు తీసుకోవలసిందిగా కోరారు. జూన్, 2017 నాటికి విష్ణు అనే వ్యక్తి తాను పల్సర్ సునీ జైల్మేట్నని జైలులో అతడు ఈ కేసు వెనుక నటుడు దిలీప్ ఉన్నాడన్న సంగతి చెప్పాడని బయటకు వెల్లడి చేయడంతో గగ్గోలు మొదలైంది. మరోవైపు ‘కొటేషన్ డబ్బు బేలెన్స్ చెల్లించమని’ పల్సర్ సుని రాసినట్టుగా చెప్పే లెటర్ బయటకు ‘లీక్ అయ్యింది’. దాంతో ఈ అత్యాచారం కుట్రలో దిలీప్ ఉన్నాడన్న విషయం బయటకు వచ్చి కేరళలో కంపనలు పుట్టాయి. జనం రెండుగా చీలి వాదులాడుకున్నారు. ‘ఎం’ను దుర్బాషలాడారు. జూన్ 24, 2017న దిలీప్ను పోలీసులు అరెస్టు చేశారు.→ దిలీప్పై ఆరోపణ ఎందుకు?నటుడు దిలీప్, నటి మంజు వారియర్ 2012లో వివాహం చేసుకున్నారు. అయితే దిలీప్కు మరో నటి కావ్య మాధవన్తో సంబంధం ఉన్నట్టు మంజుకు అనుమానం వచ్చింది. కాని ఏ ఆధారం దొరకలేదు. అయితే దిలీప్కు, కావ్యా మాధవన్కు ఉమ్మడి స్నేహితురాలైన ‘ఎం’కు ఈ విషయం తెలిసి ఉండొచ్చనే ఉద్దేశంతో మంజు ‘ఎం’ను నిలదీసింది. ‘ఎం’ ఆ సంబంధాన్ని బయట పెట్టిందని సమాచారం. తనకు స్నేహితురాలిగా ఉంటూ తన పెళ్లిలో చిచ్చు పెట్టిన ‘ఎం’ మీద ఆనాటి నుంచి కోపం పెట్టుకున్న దిలీప్ సమయం కోసం ఎదురు చూశాడని ఆరోపణ. ఈలోపు 2015లో మంజు, దిలీప్లు విడాకులు తీసుకున్నారు. 2016లో దిలీప్, కావ్య వివాహం చేసుకున్నారు. 2017లో ‘ఎం’ మరికొన్ని రోజుల్లో ఎంగేజ్మెంట్ చేసుకోనున్నదనగా ఈ ఘటన జరిగింది. ఈ పూర్వరంగం అంతా ‘ఎం’ను దిలీప్ దీని వెనుక ఉన్నాడని విశ్వసించేలా చేసింది. అయితే దిలీప్ ముందు నుంచీ ఇదంతా తన ప్రతిష్టను తట్టుకోలేని శక్తులు చేసిన కుట్రగా కొట్టేస్తూ వచ్చాడు. 84 రోజులు జైలులో ఉండి బయటకు వచ్చిన దిలీప్ తనే ఈ కేసులో సి.బి.ఐ. విచారణ జరిపించాలని సుప్రీం కోర్టు వరకూ వెళ్లాడు.→ 2018లో విచారణ మొదలుఎర్నాకుళం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో హనీ ఎం.వర్గీస్ అనే మహిళా న్యాయమూర్తి నేతృత్వంలో 2018లో విచారణ మొదలైంది. అయితే ఈ జడ్జి మీద తనకు విశ్వాసం లేదని బాధిత నటి కేరళ హైకోర్టు కూ, సుప్రింకోర్టుకూ వెళ్లి న్యాయమూర్తిని మార్చమని అభ్యర్థించింది. అయితే న్యాయమూర్తి మార్పు జరగలేదు. విచారణలో స్వచ్ఛతపై అసంతృప్తితో 2022 నాటికి ఇద్దరు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఒకరి తర్వాత ఒకరుగా కేసు నుంచి తప్పుకున్నారు. చాలా మంది సాక్షులు మొదట బాధితురాలి పక్షాన స్టేట్మెంట్స్ ఇచ్చి కాలక్రమంలో అడ్డం తిరిగారు. సత్వర విచార జరగాల్సిన కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వెళ్లింది. దిలీప్ ఉపయోగించిన ఫోన్లు, ఇతర ఫోన్లు ‘టాంపర్’ అయ్యాయన్న ఆరోపణలు వచ్చాయి. అత్యాచార దృశ్యాలు చిత్రీకరించిన ఫోను ‘మాయమైంది’. వీటన్నింటి మధ్య కేసు నత్తనడక నడవగా స్వయంగా సుప్రిం కోర్టు రంగంలో దిగి కేసును తొందరగా ముగించమని హెచ్చరించాల్సి వచ్చింది. చివరకు 2022లో ‘ఎం’ తనకు తానే బయటకు వచ్చి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి జరిగిన అన్యాయాన్ని మొరపెట్టుకుంది. కేరళ ప్రభుత్వం విధించిన హేమ కమిటీ మలయాళ పరిశ్రమలో స్త్రీలపై జరుగుతున్న దౌర్జన్యాలను బయటకు వెల్లడి చేయడంతో మరో దుమారం లేచింది. ఇవన్నీ అయ్యాక తుదకు డిసెంబర్ 8, 2025న తీర్పు వెలువడింది. ఇందులో ఆరుగురు నిందితులను దోషులుగా కోర్టు తేల్చింది. 7 నుంచి 15 వరకూ ఉన్న నిందితులను వదిలిపెట్టింది. 8వ నిందితుడైన దిలీప్కు ప్రస్తుతానికి విముక్తి దొరికింది. అయితే దీని మీద విస్తృతంగా వ్యాఖ్యలు, విమర్శలు వినపడుతున్నాయి. కేరళ ప్రభుత్వం ఈ తీర్పును చాలెంజ్ చేస్తామని చెప్పింది. బాధిత ‘ఎం’ కూడా పై కోర్టుకు వెళ్లవచ్చు. తదుపరి పరిణామాలు ఎలా ఉన్నా బలవంతులపై బాధిత మహిళల పోరాటం ఆగవలసిన అవసరం లేదని ‘ఎం’ నిరూపించింది. ఆమె స్థయిర్యం వల్లే ఇంతవరకైనా వచ్చింది. ఇక మీదట ఆమె చేయబోయే పోరాటం మరో తీర్పును ప్రసాదించవచ్చు. వేచి చూద్దాం. -
లెదర్.. లైటింగ్.. అదరహో
ఇంటికి అందం గృహోపకరణం. ఆ గృహోపకరణాన్ని ఆకర్షణీయమైన డిజైన్గా రూపొందిస్తే అది ద్విగుణీకృతమవుతుంది. అలాంటి వాటిని ‘లెదర్’తో తయారు చేసి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు రాయదుర్గంలోని ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్డీడీఐ–హెచ్) హైదరాబాద్ క్యాంపస్ విద్యార్థులు. తమ సెమిస్టర్లో భాగంగా ప్రాజెక్టుల రూపకల్పనలో విద్యార్థులు ఎఫ్డీడీఐ–హెచ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. తేజ్లోహిత్ రెడ్డి చొరవ, ఫ్యాకల్టీ ప్రతినిధుల ప్రోత్సాహంతో వీటిని తయారు చేశారు. బెడ్ ల్యాంపులు, గోడకు వేలాడదీసే ల్యాంప్లలో వాడిన లెదర్పై రకరకాల చిత్రాలు వేసి అందులో అమర్చిన ల్యాంప్ వెలిగిస్తే రంగు రంగుల చిత్రం చూడచక్కగా కనిపిస్తూ విద్యార్థుల ప్రతిభకు పట్టం టడుతోంది. గోడకు, ఇంటి ముందు వేలాడ దీసేలా ల్యాంప్లకు చుట్టూరా లెదర్ను అమర్చి దానికి రంగులు వేయడంతో ‘ట్రెండీ’గా కనిపిస్తోంది. (చదవండి: జంటలకు ఐవీఎఫ్ వైఫల్యం వర్రీ ఉండదు..! క్లినిక్లు కూడా..) -
జంటలకు ఐవీఎఫ్ వైఫల్యం వర్రీ ఉండదు..! క్లినిక్లు కూడా..
భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఐటీ హబ్లలో ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్, పూణే, చెన్నైలలో కెరీర్ ప్లానింగ్కే ప్రాధాన్యత ఇస్తున్నారు ఐటీ జంటలు. దాంతో ఆ తర్వాత పేరెంట్స్గా మారలేకపోతున్నాం అని బాధపడుతున్న జంటలెందరో. సుదీర్ఘ పనిగంటలు, జీవనశైలి మార్పులు, ఆలస్యంగా వివాహం, పని ఒత్తిడి తదితర కారణాలతో చాలా జంటలు తమ సంతానోత్పత్తి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. చివకికి ఏక్లినిక్ని సంప్రదిస్తే మంచిదన్న టెన్షన్తో సన్నిహితులు, బంధువులు సూచనలను ఆశ్రయిస్తారు. చివరికి అక్కడ ఈ ఐవీఎఫ్ సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తారు. ఆఖరికి అందులో కూడా వరుస ఫెయిలర్స్ చూసి విసిగివేసారిన దంపతులెందరో. కొందరు మాత్రం పట్టుదలతో తల్లిందండ్రలవ్వగా మరికొందరికి మాతం అదొక కలగానే మిగిలిపోతుంది. ఆ సమస్యను చక్కబెట్టేందుకు ఒయాసిస్ ఫెర్టిలిటీ మరో ముందడుగు వేసింది. సహజంగా గర్భం దాల్చలేక ఇబ్బందిపడి క్లినిక్లను ఆశ్రయిస్తే ఆఖరికి ఐపీఎఫ్లో కూడా నిరాశను ఎదుర్కొన్న జంటలకు ఊరటనిచ్చేలా..భావోద్వేగ మద్దతను అందిస్తోంది ఒయాసిస్ ఆస్పత్రి. సౌకర్యవంతమైన టెలి-కన్సల్టేషన్లతో మద్దతిస్తోంది దంపతులకు. అంతేగాదు సంతానోత్పత్తి సంరక్షణ వృత్తిపరమైన నిబద్ధతలతో సమలేఖనం చేసేందుకు ప్రయత్నిస్తోంది. దీన్ని అన్ని ఆస్పత్రులు అమలు చేసేందుకు ముందుకొస్తే.. చాలా జంటలకు తల్లిందండ్రులు అయ్యే అవ్వకాశం ఉంటుందని పేర్కొంది. డాక్టర్ వరలక్ష్మి యాకసిరి, ప్రాంతీయ వైద్య విభాగాధిపతి, ఒయాసిస్ ఫెర్టిలిటీ చదవండి: అతి పిన్న వయస్కురాలైన యువ బిలియనీర్..! ఏకంగా రూ. 10వేల కోట్లు.. -
క్యారెట్స్, ఆపిల్స్ తీసుకువెళ్లడం ఎంత పనైపాయే..! ఆ ఎలుగుబంటి..
సర్క్స్లోనూ, పార్క్ల్లోనూ జంతవులకు సంబంధించిన ప్రదర్శనల విషయంలో ఏమరపాటు తగదు. వాటికి ఇబ్బంది కలిగించేలా లేదా అవి టెంప్టయ్యేలా ఆహార పదార్థాలు ఉన్నా..వాటిని కంట్రోల్ చేయలేం. అందువల్ల జంతువుల సంరక్షకులు ఆ విషయంలో బీకేర్ఫులగా ఉండాలి. లేదంటే ఈ కీపర్కి పట్టిన గతే పడుతుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.అసలేం జరిగిందంటే..చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్లోని హాంగ్జౌ సఫారీ పార్క్లో జంతువుల సర్కస్కి సంబంధించి లైవ్ ప్రదర్శన జరుగుతోంది. ఇంతలో అకస్మాత్తుగా ఓ నల్ల ఎలుగుబంటి జూ కీపర్పై దాడి చేసింది. ఇలా ఎందుకు చేసిందో అక్కడున్న పార్క్ నిర్వాహకులెవ్వరికీ అర్థం కాలేదు. ఈ అనూహ్య ఘటనకు తేరుకుని అక్కడున్న మిగతా సిబ్బంది ఆ జూకీపర్ని ఎలుగుబంటి దాడి నుంచి రక్షించే యత్నం చేశారు. కానీ అది మాత్రం అతడిని గట్టిగా పట్టుకుని దాడి చేసేందుకే ట్రై చేస్తూనే ఉంది. చివరికి ఏదోలాగా జూ సిబ్బంది ఆ ఎలుగుబంటి నుంచి అతడిని రక్షించి..దాన్ని సెల్లోకి తరలించారు. అది జూకీపర్ సంచి నిండా యాపిల్స్, క్యారెట్లు తీసుకురావడం చూసి..టెంప్టయ్యి అలా దాడి చేసిందని జూ నిర్వాహకులు వివరణ ఇచ్చారు. అయితే ఆ ఎలుగుబంటి దాడిలో సదరు జూకీపర్కు ఎలాంటి గాయాలు అవ్వలేదని, అలాగే ఆ ఎలుగుబంటి కూడా సురక్షితంగానే ఉందని జూ నిర్వాహకులు తెలిపారు. ఇక ఆ ఎలుగుబంటిని పబ్లిష్ షోల నుంచి తొలగించినట్లు కూడా వెల్లడించారు. కానీ నెటిజన్లు లాభం కోసం వాటితో అలాంటి పనులు చేయిస్తే ఫలితం ఇలానే ఉంటుందని తిట్టిపోస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం.A zoo handler was briefly attacked by a black bear during a performance at Hangzhou Safari Park. The worker is safe, the bear has been removed from public shows, and officials say smell of treats may have triggered the animal’s reaction. pic.twitter.com/qtI38aBV0B— Open Source Intel (@Osint613) December 7, 2025(చదవండి: షీస్ ఇండియా షో..) -
షీస్ ఇండియా షో..
అందచందాలతో అదరగొట్టారు.. ర్యాంప్పై హొయలొలికించారు.. ఆహుతులను ఆకట్టుకున్నారు.. ఫ్యాషన్ షోకు దేశ నలుమూలల నుంచి 18 నుంచి 81 ఏళ్ల అత్యున్నతమైన 20 మంది ఫైనలిస్టులు విచ్చేశారు. హైదరాబాద్ యూసుఫ్గూడలోని ఫస్ట్ బెటాలియన్ ప్రాంగణంలో ఉన్న శౌర్య కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం రాత్రి షీ’స్ ఇండియా పేరుతో జరిగిన ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. ఈ పోటీలకు ఎత్తు, బరువు వంటి అర్హతలు లేవు. గృహిణుల నుంచి ఏరోనాటికల్ ఇంజినీర్లు వరకు, స్కూల్ టీచర్లు నుంచి నర్సులు వరకు, ఫ్యాషన్ ఇండస్ట్రీ నుంచి కార్పొరేట్ ఐకాన్లు వరకు అందరూ ఒక వేదికపై కలిసి వాక్ చేశారు. ఈ గ్రాండ్ గాలా ఫినాలేలో గెలుపొందిన మహారాణులను సత్కరించారు. డ్రీమ్ఫోక్స్ సహకారం అందించిన ఈ కార్యక్రమంలో షీ’స్ ఇండియా వ్యవస్థాపకులు, సహా వ్యవస్థాపకులు షారోన్ ఫెర్నాండెజ్, శిల్పా జైన్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: Baghini River: చీరలకు సహజ రంగులను అందించే నది..! బాఘిని ప్రింట్ మాయాజాలం) -
ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన బిలియనీర్..! ఏకంగా రూ. 10వేల కోట్లు..
డ్యాన్సర్గా ప్రయాణం మొదలైనా ఆ అమ్మాయి ప్రయాణం.. అతి కొద్ది సమయంలోనే అంచెలంచెలుగా ఎదిగి..అత్యున్నత స్థాయిలో నిలిచింది. కేవలం 29 ఏళ్లకే అత్యంత పిన్న వయస్కురాలైన యువ బిలియనర్ రికార్డులకెక్కింది. ఆమె స్థాపించిన కంపెనీ ఏకంగా వేల కోట్ల విలువను చేరుకుంది. అలాగే ఆమె సందప కూడా రూ 10 కోట్లు పైనే నికర విలువను కలిగి ఉండటం విశేషం. ఇంతకీ ఆమె ఎవరు.. అంత చిన్న వయసులో బిలియనీర్గా ఎలా అవతరించింది ఆ సక్సెస్ మంత్ర ఏంటి వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఆ అమ్మాయే బ్రెజిల్కు చెందిన లువానా లోప్స్ లారా. స్వయంకృషితో ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన బిలియనీర్గా అవతరించింది. కేవలం 29 ఏళ్ల వయసుకే ఈ ఘనతను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఆమె స్థాపించిన ప్రిడిక్షన్ మార్కెట్ ప్లాట్ఫారమ్ కాల్షి.. ఇటీవలే 11 బిలియన్ డాలర్లు అంటే మన కరెనన్సీలో అక్షరాల రూ. 90 వేల కోట్లకు పైగా విలువను చేరుకోవడంతో ఈ ఘనత సాధించింది.బ్రెజిల్లో జన్మించిన ఆమె రష్యాలోని బోల్షోయ్ థియేటర్ స్కూల్లో ప్రొఫెషనల్ బ్యాలరీనాగా (డ్యాన్సర్) ట్రైశిక్షణ పొందింది. ఆ తర్వాత కొంతకాలం ఆస్ట్రియాలో ప్రొఫెషనల్ బ్యాలెరినాగా ప్రదర్శనలు కూడా ఇచ్చింది. అలాగే విద్యారంగంలో కూడా రాణించిందామె. అమెరికా వెళ్లి అక్కడ ఎంఐటీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్సులో డిగ్రీ పూర్తి చేసింది. అక్కడే క్లాస్మేట్ తారెక్ మన్సూర్ (29 ఏళ్ల) కలిసింది. ఆ తర్వాత 2018లో న్యూయార్క్ నగరంలోని ఫైవ్ రింగ్స్ క్యాపిటల్లో ఇంటర్న్షిప్లు చేస్తున్నప్పుడూ వారి మధ్య స్నేహం మరింత బలపడింది. ఆ నేపథ్యంలోనే అంచనా-మార్కెట్ ప్లాట్ఫామ్ను కాల్షి ఏర్పాటు చేయాలనే ఆలోచన చేశారిద్దరు. అనుకున్నట్లుగా 2019లో కాల్షి కంపెనీని ప్రారంభించారు. . అయితే పలు సవాళ్లు అనంతరం 2020లో కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్ (CFTC) నుంచి ఆమోదం పొంది.. USలో మొదటి సమాఖ్య నియంత్రిత అంచనా-మార్కెట్ ప్లాట్ఫామ్గా అవతరించింది. 2023లో నియంత్రణ సంస్థలు దాని ఎన్నికల ఆధారిత ఒప్పందాలను నిరోధించినప్పుడు పోరాటం తీవ్రమైంది. నిరుత్సాహపడకుండా, లోప్స్ లారా పోరాడారు. ఫలితంగా 2024 సెప్టెంబర్లో అమెరికా ఎన్నికల ట్రేడింగ్కు సంబంధించిన ఒక కీలకమైన దావాలో స్నేహితులిద్దరూ విజయం సాధించారు. అంతుముందు కాల్షి కంపెనీ నికర విలువ రూ. 4,100 కోట్లుగా ఉంది. ఎప్పుడైతే ఎన్నికల ట్రేడింగ్ పొందిన రాత్రి ఒక్కసారిగా రూ. 8 వేల కోట్లకు ఎగబాకింది. అలా ఈ స్టార్టప్ సంపదలో దూకుడుగా విస్తరించింది. అంతేగాదు ఈ కాల్షి కంపెనీలో లారా 12 శాతం వాటా కలిగి ఉంది. దీంతో లారా వ్యక్తిగత సంపద కూడా భారీగా పెరిగింది. ఆమె ఆస్తులు 1.3 బిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో ఏకంగా రూ.10 వేల కోట్లకు పైమాట. దాంతో లారా ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కురాలైన స్వయంకృషి బిలియనీర్గా నిలిచింది. ఇక లారా తల్లి మ్యాథ్స్ ప్రొఫెసర్ కాగా.. తండ్రి ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్. వారిద్దరి స్ఫూర్తితోనే ఆమె మసాచుసెట్స్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్, గణితంలో డిగ్రీలు పూర్తి చేసింది. ఇంటర్న్షిప్ల ద్వారా క్వాంటిటేటివ్ ట్రేడింగ్లో అనుభవాన్ని పొందింది. అలా రియల్ వరల్డ్ సంఘటనల ఫలితాలపై.. ట్రేడింగ్ చేయాలనే ఆలోచనతో కాల్షి సంస్థను లారా స్థాపించడం విశేషం. ఇక లారా బిలియనీర్ కథ ఆర్జనలో సరికొత్త ట్రెండ్ని సృష్టించింది. దృఢ సంకల్పం, అభ్యున్నలి కోసం చేసే పదునైన ఆలోచనలు ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా మారుస్తాయి అనేందుకు లారానే ఒక ఉదాహరణ.Kalshi raised $1B at an $11B valuation.A decade ago, only a few thousand people knew what a prediction market was.Eighteen months ago, most prediction markets were banned - until we overcame the government to set them free.Over the past seven years, our community has opened… pic.twitter.com/hGDkYxkSlh— Tarek Mansour (@mansourtarek_) December 2, 2025 (చదవండి: Baghini River: చీరలకు సహజ రంగులను అందించే నది..! బాఘిని ప్రింట్ మాయాజాలం) -
చీరలకు సహజ రంగులను అందించే నది..!
చీరలకు రంగులు అద్దడం అంటే కచ్చితంగా రసాయనాలు ఉపయోగించాల్సిందే. ముఖ్యంగా చేనేత వస్త్రాలు, రకరకాల ప్రింట్ ఫ్యాబ్రిక్ చీరలైన అద్దిన రంగు నిలబడాలంటే..కచ్చితంగా రసాయనాలు జోడించాల్సిందే. అయితే ఈ గ్రామ ప్రజలు అందుకు విరుద్ధం. వాళ్లు చీరలకు నదిలోని నీటి సాయంతోనే రంగులు శాశ్వతంగా ఉండేలా చేస్తారు. చీరలకు అద్దే రంగులను సైతం పర్యావరణహితంగానే ఉపయోగిస్తారు. ఎక్కడా.. రసాయనాలు వాడరు. కేవలం నది నీటితో తడపగానే..ఈ చీరకు అద్దిన రంగు శాశ్వతంగా నిలిచిపోతుంది. అదెలా సాధ్యం..ఆ కళాకారుల చేతుల్లో దాగున్న మ్యాజిక్ ఏంటి తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.మధ్యప్రదేశ్లోని బాఘి అనే గ్రామం పర్యావరణహిత సాంస్కృతిక చీరలకు ప్రసిద్ధి. ఇక్కడ ప్రవహించే బాఘి నది రసాయనాలు వాడకుండా చీరలకు సహజరంగుని అందిస్తోంది. ఈగ్రామం బాఘి ప్రింట్ చీరలు, డ్రెస్లకు ఫేమస్. అక్కడ ఉండే స్థానికులంతా చేతి కళాకారులే. వారంతా ఈ పనే చేస్తుంటారు. ఎక్కడైన రసాయనాలు కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తే..వీళ్లు ప్రకృతి వరంలా ప్రసాదించిన బాఘి నది నీటితోనే శాశ్వత రంగుని అద్దుతారు. ఆ నది సాయంతోనే అక్కడి గ్రామస్తులు ఈ అద్భుతాన్ని సృష్టిస్తున్నారు. ఎందువల్ల ఇలా అంటే..బాఘిని నది నీటిలో అధిక ఖనిజ పదార్థాం అయిన ఐరన్ కంటెంట్ ఎక్కువ. ఫలితంగా రంగు వేసే ప్రక్రియలో ఇది సహజ ఉత్ప్రేరకం లేదా మోర్డెంట్గా పనిచేస్తుంది. ఫలితంగా సింథటిక్ రసాయనాలు లేకుండా రంగులు దీర్ఘకాలంపాటు మన్నికగా ఉంటాయి. నదికి ఆ పేరు ఎలా వచ్చిందంటే..దాదాపు 400 సంవత్సరాల క్రితం పంజాబ్లోని సింధ్ నుంచి మధ్యప్రదేశ్లోని బాగ్ అనే గ్రామానికి వలస వచ్చిన ఖత్రిస్ సమాజం బాఘ్ ప్రింట్స్ ముద్రణను ప్రారంభించిందని చెబుతారు. నది చుట్టూ ఉన్న దట్టమైన అడవులు, పులుల (‘బాగ్’) కారణంగా దీనికి ఆ పేరు వచ్చిందని చెబుతారు గ్రామస్తులు. ఎలా చేస్తారంటే..ఈ సహజ ప్రక్రియ ఖారాతో ప్రారంభమవుతుంది. అంటే నది రాళ్లపై బట్టను కడిగి స్టార్చ్ని తొలగిస్తారు. తర్వాత బట్టను ఐరన్ అధికంగా ఉంటే బాఘిని నదిలో ముంచి రంగు కోసం సిద్ధం చేస్తారు. ఈ బాఘిప్రింట్లలో అత్యంత ప్రసిద్ధి భాగం హ్యాండ్-బ్లాక్ ప్రింటింగ్.రంగులద్దడం కోసం చింతపండు, దానిమ్మ తొక్క, ఇనుప తుప్పు, ఆకుల నుంచి సేకరించిన సహజ రంగులను వినియోగిస్తారు. చివర్లో ఆ వస్త్రాన్ని నదిలో అనేకసార్లు కడుగుతారు. అలా చేయడం వల్ల రంగు అవశేషాలు పోయి..రసాయన ఫిక్సర్లు లేకుండా రంగులు ప్రకాశవంతంగా, మన్నికగా ఉంటాయి.(చదవండి: అందమైన అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు..!) -
అమ్మ పుట్టినరోజుని పెళ్లిలా సెలబ్రేట్ చేశాడు..!
అమ్మ అంటేనే ఓ భావోద్వేగం. సృష్టికి ప్రతిరూపం, ప్రతక్ష దైవం అమ్మే..అలాంటి అమ్మ జన్మదినోత్సవాన్ని ఏ పిల్లలైన చక్కగా సెలబ్రేట్ చేయాలనుకుంటారు. మహా అయితే కేక్ కటింగ్ లేదా ఆమెకు నచ్చిన ప్రదేశానికి తీసుకెళ్లి సెలబ్రేట్ చేయడమో చేస్తాం. కానీ ఈ ఎంటర్ప్రెన్యూర్ వాళ్ల అమ్మ బర్త్డేని ఏ రేంజ్లో సెలబ్రేట్ చేశాడంటే..అది పెళ్లా లేక మరేదైనా..అని ఫీల్ వస్తుంది.ఆ రేంజ్లో అదిరిపోయేలా సెలబ్రేట్ చేశాడు ఆ కుమారుడు. ఆ వేడుకకు వచ్చిన వారంతా గొప్ప కొడుకు అంటూ మెచ్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ కుమారుడే ఆకాశ్ మెహాతా. తన 60 ఏళ్ల తల్లి చేతనా మెహతా పుట్టిరోజుని ఎంత ఘనంగా సెలబ్రేట్ చేశాడంటే..ఏదో పెళ్లి వేడుక అనుకునేలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశాడు. ఆ వీడియో క్లిప్లో నాలుగు భాగాల గ్రాండ్ వేడుకలు కనిపిస్తాయి. ఇందులో భక్తి, సంగీతం, ఎడారి సఫారీ, తదితర పలు విలాసవంతమైన పార్టీలతో సన్నిహితులు, బంధువర్గం ఆశ్చర్యపోయేలా జరిపాడు. అందరూ ఇది పుట్టినరోజు వేడుకలా లేదు, ఏదో పెళ్లికి వచ్చినట్లుగా ఉంది మాకు అంటూ ఆకాశ్ మెహాతాను మెచ్చుకున్నారు. అంతేగాదు అందరికీ నీలాంటి కొడుకు ఉంటే ఎంత బాగుండును అని ప్రశంసించారు కూడా. అందుకు సంబంధించని వీడియోని ఆకాశ్ మెహతా షేర్ చేసతూ పోస్టులో ఇలా రాశారు. "నా ప్రాణ స్నేహితురాలికి 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మాటలకు మించి నిన్ను ప్రేమిస్తున్నా అంటూ హార్ట్ ఎమోజీలను జోడించారు". ఇక నెటిజన్లు సైతం ఆ వీడియోని చూసి..అందమైన అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షంలు. బర్త్డేని ఓ గొప్ప వేడుకలా చేశారంటూ ఆకాశ్పై పొగడ్తల వర్షం కురిపించారు. View this post on Instagram A post shared by Akash Mehta (@mehta_a) (చదవండి: సుందర దృశ్యాలకు నెలవు..! మంచు కొండల్లో మరువలేని ప్రయాణం..) -
సుందర దృశ్యాలకు నెలవు..! మంచు కొండల్లో మరువలేని ప్రయాణం..
పర్వతాలు వాటి దిగువ ప్రాంతాలలో జీవిస్తున్నవారికి తాగు నీరు, ఆహారం, జీవనోపాధిని అందించేందుకు ప్రతి సంవత్సరం కృషి జరుగుతోంది. ఐక్యరాజ్య సమితి 2025ను అంతర్జాతీయ హిమానీ నదాల సంరక్షణ సంవత్సరంగాప్రకటించడం వెనుక గల ఉద్దేశమూ అదే. డిసెంబర్ 11 ఇంటర్నేషనల్ మౌంటెయిన్ డే సందర్భంగాసుందర దృశ్యాలకు నెలవుగా ఉన్న హిమాలయాలలో సాహసోపేతమైన ట్రెక్కింగ్ మార్గాలను అన్వేషిద్దాం...పర్వతారోహణలో సుందర దృశ్యాలు, ఆత్మిక శక్తి, శిఖరాగ్రం చేరుకున్నాక పూర్తి శాంతిని అనుభవంలోకి తీసుకువస్తాయి హిమనీ నదాలు. భారతదేశం, నేపాల్ అంతటా విస్తరించి ఉన్న హిమాలయాలు ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాలు, గొప్ప సాంస్కృతిక అనుభవాలను అందిస్తున్నాయి. ఉత్తరాఖండ్లోని పచ్చని లోయలు, కాశ్మీర్లోని స్వచ్ఛమైన సరస్సులు, లడఖ్లో క్లిష్టమైన మార్గాలు, సిక్కింలోని ప్రశాంతమైన కొండల నుండి నేపాల్లోని గంభీరమైన శిఖరాల వరకు హిమాలయాలు సాహస యాత్రకు ఆహ్వానం పలుకుతున్నాయి. మన దేశంలో కేదార్కాంత ట్రెక్, ఉత్తరాఖండ్లోని ఉల్లాసకరమైన పంగర్చుల్లా పీక్ ట్రెక్, కాశ్మీర్ గ్రేట్ లేక్స్, పశ్చిమ బెంగాల్లోని సందక్ఫు ట్రెక్, సిక్కింలోని గోచల, లడఖ్లోని మార్ఖా లోయను వీక్షించి తీరాల్సిందే. నేపాల్లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్, సుందరమైన అన్నపూర్ణ సర్క్యూట్ ట్రెక్, ప్రశాంతమైన లాంగ్టాంగ్ వ్యాలీ, అద్భుతమైన మార్డి హిమాల్ ట్రెక్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ట్రెక్కింగ్ మార్గాలలోనూ మునిగిపోవచ్చు. హిమాలయాలలో భద్రత, సౌకర్యాలతో మరపురాని జ్ఞాపకాలను అందించేందుకు ట్రావెల్ ఏజెన్సీలు రూ.20,000 నుంచి లక్ష రూపాయల వరకు ప్యాకేజీలను అందిస్తున్నాయి. అనువైన మరిన్ని ట్రెక్కింగ్ ప్లేస్లు...కేదార్కాంతతో పాటు హిమాలయాలలోనే ఎత్తైన పర్వత శిఖరాలలో పేరొందినవి. దయారా బుగ్వాల్ ట్రెక్ అతి ఎత్తైన శిఖరాలలో ఒకటిగా పేరొందిన దయారా పర్వతం ఎత్తైన గడ్డి మైదానాలతో నిండి ఉంటుంది. ఇది ఏడాది పొడవునా ట్రెకింగ్ చేయడానికి అందుబాటులో ఉండగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో స్కీయింగ్ చేసేవారికి మరింత అనుకూలం.ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు పచ్చదనంతో నిండి ఉంటుంది. నవంబర్ నుంచి మార్చి వరకు మంచుతో నిండి ఉంటాయి. హిమాలయ శిఖరాలను 360 డిగ్రీల కోణంలో చూడవచ్చు. ట్రావెల్ ఏజెన్సీలు అందిస్తున్న ప్యాకేజీలో భోజనం, టిఫిన్, టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, అనుభవజ్ఞులైన ట్రెక్కింగ్ గైడ్లు, వైద్య సౌకర్యాలు, ఆక్సిజన్ సిలిండర్లు.. వంటివి అందిస్తారు. డెహ్రాడూన్ నుండి దయారా బుగ్వాల్ చేరుకోవడానికి రోడ్డు మార్గం ఉంది. బ్రహ్మతల్... లేక్ ట్రెక్ పచ్చిక, అడవులు, మంచుతో నిండిన శిఖరాలను చూస్తూ సాగించే వింటర్ ట్రెక్ ఇది. బెకల్తాల్ సరస్సు పూర్తిగా ఘనీభవించి ఉంటుంది. దీనికి తోడు త్రిశూల్ పర్వతం, నందా ఘటి పర్వతం వంటి శక్తివంతమైన హిమాలయ శిఖరాలు కనిపిస్తాయి. ఇక బ్రహ్మతల్ శిఖరాగ్రం నుండి మరిన్ని అద్భుత శిఖరాలను చూడవచ్చు. అడవులు, గ్రామాలు, పచ్చికభూములు, ఘనీభవించిన సరస్సు మీదుగా ఈ ట్రెక్కింగ్ సాగుతుంది. సరస్సు చుట్టూ పడే శీతాకాలపు సాయంత్రం నడక ఎప్పటికీ గుర్తుండి΄ోతుంది. బ్రహ్మతల్ సరస్సు వద్ద బ్రహ్మ తపస్సు చేశాడని, ఈ సరస్సును బ్రహ్మ పవిత్ర సరస్సుగా మార్చాడని స్థానిక గ్రామస్తులు చెబుతారు.కువారీ పాస్ ట్రెక్ ఇది గర్హా్వల్ పర్వత శ్రేణిలోని ప్రాచీన ట్రెక్లలో ఒకటిగా పేరొందింది. ట్రావెల్ ఏజెన్సీలు ఆరు రోజులకు గాను రూ.7000 నుంచి రూ.9000 వరకు ప్యాకేజీలు అందిస్తున్నాయి. ఇది చారిత్రక ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్న ట్రెక్. 1905లో అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ కర్జన్ ఈ ట్రెక్ చేరుకున్నాడు. అప్పటి నుండి అతని పేరు మీదుగానే ఈ ట్రెక్ను పిలుస్తున్నారు. ఇది ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ఉంది. ఈ ట్రెక్ రిషికేశ్ నుండి మొదలవుతుంది. జోషిమఠ ప్రాంతంలోని గ్రామాల మీదుగా ప్రయాణించాలి. మంచుతో నిండి, ఏడాది పొడవున ఉండే కువారీ పాస్ ట్రెక్ అన్ని సీజన్లలోనూ అందంగా ఉంటుంది. సందక్పు ఫలుట్ ట్రెక్.. ఈ ట్రెక్లో నాలుగు ఎత్తైన శిఖరాలను చూసే ఉత్కంఠభరితమైన అనుభవాన్ని పొందవచ్చు. ఒకవైపు ఎవరెస్ట్, లోట్సే, మకాలు శిఖరాలు చూడవచ్చు. మరోవైపు గంభీరమైన కాంచన్జంగా శిఖరంపై కిరీటంలా ఉన్న ప్రసిద్ధ స్లీపింగ్ బుద్ధ మాసిఫ్ను చూడవచ్చు. సందక్పు ట్రెక్లో భారతదేశంలోనే అత్యుత్తమ సూర్యాస్తమయ, సూర్యోదయాలను చూడవచ్చు. వెదురు, రోడోడెండ్రాన్ అడవులు సందక్పు ట్రెక్ అందాన్ని మరింత పెంచుతాయి. హిమాలయా పుష్పాలుగా ప్రత్యేకత గల రోడోడెండ్రాన్లు ఇక్కడ కనిపిస్తాయి. అరుదైన ఎర్ర΄ాండాలను కూడా చూడవచ్చు. ట్రావెల్ ట్రెండ్స్క్వయిట్ వోవర్ఎవ్రీ థింగ్‘క్వయిట్ వోవర్ ఎవ్రీథింగ్’ హవా కొనసాగనుంది. ఆధునిక జీవితంలోని రకరకాల ఒత్తిళ్ల నుంచి తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొనే ట్రెండ్ ఇది. డిజిటల్ సంస్కృతిలో పీకల లోతు మునిగిపోయాక చాలామందికి ఇతర ప్రపంచాలేవీ కనిపించడం లేదు. డిజిటల్ సంస్కృతికి ఆవల అద్భుత ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలోకి వెళ్లాలంటే ప్రయాణించాలి.ప్రయాణించాలంటే డిజిటల్ సంకెళ్లను ఛేదించాలి. ఈ క్రమంలోనే డిజిటల్ డిటాక్స్కు ప్రాధాన్యత పెరిగింది. మితిమీరిన డిజిటల్ సంస్కృతి నుంచి బయటపడి మానసిక ప్రశాంతతను వెదుక్కుంటూ కొత్త ప్రదేశాలకు వెళ్లే ధోరణి పెరిగింది.ఒరెగాన్స్ స్కైకేవ్ రిట్రీట్స్లో అతిథులు చీకటి క్యాబిన్లలో మూడు రోజులు బస చేస్తారు! కొన్ని రోజుల పాటు బాహ్యప్రపంచానికి, వెలుతురుకు దూరంగా ప్రత్యేకంగా సిద్ధం చేయబడిన పిచ్–బ్లాక్ గదులలో లేదా చీకటి గుహలలో గడపడం అనేది టిబెటన్ బౌద్ధంలోని సంప్రదాయం. ఈ బౌద్ధ సంప్రదాయం ట్రావెల్స్ ట్రెండ్స్లో ఒకటిగా మారింది. ‘స్వీయ–ఆవిష్కరణకు ఉపకరిస్తుంది’ అంటారు ఈ విధానాన్ని అనుసరించేవారు.పర్వతారోహకులకు వెంట తప్పనిసరి...పర్వతారోహణ చేసే పర్యాటకులు ఆడ/మగ సమకూర్చుకోవాల్సినవి, వెంట తెచ్చుకోవాల్సినవి...రక్బ్యాక్, డౌన్ జాకెట్, గ్లౌజ్లు (వాటర్ ప్రూఫ్వి), పోంచో లేదా రెయిన్ కోట్, ట్రెక్కింగ్ పోల్, హెడ్ ??టార్చ్, ట్రెక్ షూస్, ట్రెక్ ΄్యాంట్ – 2, ఒక జత థర్మల్స్, వెచ్చని సాక్స్ (జత), కాటన్ సాక్స్ (3–4 జతలు), ఉన్ని టోపీ, సన్ క్యాప్, గ్లౌజులు (ఉన్ని, వాటర్ ప్రూఫ్), అవసరాన్ని బట్టి అదనపు దుస్తులు, ప్లేట్లు, చెంచా, కాఫీ కప్పు, ఫోటో గుర్తింపు కార్డు, సన్ గ్లాసెస్, హ్యాండ్ టవల్, సన్ స్క్రీన్ లోషన్, మాయిశ్చరైజర్, చెప్పులు. పవర్బ్యాంక్స్, టాయిలెట్ పేపర్ రోల్స్, టవల్స్, జిప్ లాక్ బ్యాగులు, శానిటైజింగ్ టాయిలెట్ స్ప్రే, సోప్, హ్యాండ్ వాష్, టూత్ పేస్ట్, టూత్ బ్రష్ .. మొదలైనవి అవసరం అవుతాయి.ప్రపంచంలో.. ఎత్తైన ఏడు శిఖరాలుప్రపంచంలోని ప్రతి ఖండంలో ఉన్న ఎతైన శిఖరాలను అధిరోహించడం ఏ పర్వతారోహకుడికైనా లభించే అత్యంత గౌరవనీయమైన విజయాలలో ఒకటి. సెవన్ సమ్మిట్గా పేరొందిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఏడు శిఖరాలను కలిగి ఉన్న పర్వతాలు, వాటి మార్గాలు..ఆసియా: ఎవరెస్ట్ శిఖరంఎవరెస్ట్ శిఖరం ఆసియాలోనూ, ప్రపంచంలోనే అత్యంత ఎతఐన పర్వతం. ఇది నేపాల్, టిబెట్ మధ్య సరిహద్దులో దక్షిణ ఆసియాలోని గ్రేట్ హిమాలయాలలో ఉంది. 29,035 అడుగుల (8,850 మీటర్లు) ఎత్తుకు చేరుకున్న దీనిని 1852లో గవర్నమెంట్ సర్వే ఆఫ్ ఇండియా భూమి ఉపరితలంపై ఎతైన ప్రదేశంగా గుర్తించింది. ఎవరెస్ట్ పైకి ప్రధాన యాత్రలు 1920లలో ప్రారంభమయ్యాయి. కానీ 1953లో ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్గే లు దాని శిఖరాన్ని చేరుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది పర్వతారోహకులు ఈ శిఖరాగ్రాన్ని చేరుకునేందుకు తపిస్తున్నారు.దక్షిణ అమెరికా: మౌంట్ అకాన్కాగువాదక్షిణ అమెరికా, పశ్చిమ అర్ధగోళం రెండింటిలోనూ అకాన్కాగువా పర్వతం ఎతై ్తనది. ఇది పశ్చిమ–మధ్య అర్జెంటీనాలోని చిలీ సరిహద్దులో ఉంది. అకాన్కాగువా పర్వతం ఉత్తర, దక్షిణ అనే రెండు శిఖరాలను కలిగి ఉంది, ఇవి ఒక శిఖరం ద్వారా అనుసంధానించబడి ఉన్నాయి. దక్షిణ శిఖరం 22,736 అడుగులు (6,930 మీటర్లు) ఎత్తులో ఉంది. 22,831 అడుగులు (6,959 మీటర్లు) ఎత్తులో ఉన్న ఎతైన ఉత్తర శిఖరాన్ని మొదటిసారిగా 1897లో స్విస్ అధిరోహకుడు మాథియాస్ జుర్బ్రిగ్గెన్ చేరుకున్నాడు.ఉత్తర అమెరికా: డెనాలిడెనాలి (మౌంట్ మెకిన్లీ అని కూడా పిలుస్తారు) ఉత్తర అమెరికాలో ఎత్తైన శిఖరం. ఇది దక్షిణ–మధ్య అలాస్కాలోని అలాస్కా శ్రేణిలో ఉంది. ఈ పర్వతం 18,000 అడుగులు (5,500 మీటర్లు) ఎత్తు ఉంటుంది. 1910లో ఇద్దరు ప్రాస్పెక్టర్లు ఉత్తర శిఖరాన్ని జయించిన మొదటి అధిరోహకులు. హడ్సన్ స్టక్, హ్యారీ కార్స్టెన్స్ జూన్ 7, 1913న సౌత్ పీక్కు ఒక బృందానికి నాయకత్వం వహించారు. ఈ రోజుల్లో, ప్రతి సంవత్సరం వందలాది మంది అధిరోహకులు ఈ శిఖరాగ్రాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.ఆఫ్రికా: కిలిమంజారోకిలిమంజారో పర్వతం ఆఫ్రికాలో ఎతైన శిఖరం. ఇది కెన్యా సరిహద్దుకు సమీపంలో ఈశాన్య టాంజానియాలో ఉంది. ఈ పర్వతం మూడు అగ్నిపర్వతాలతో రూపొందింది. శంఖువును పోలి ఉండే కిబో, 19,340 అడుగులు (5,895 మీటర్లు) ఎత్తులో ఉంది. కిలిమంజారో పర్వతం ప్రపంచంలోనే నాల్గవ అత్యంత ప్రముఖ పర్వతం. 1889లో ఈ శిఖరాన్ని చేరుకున్న మొదటి వ్యక్తి జర్మన్ భౌగోళిక శాస్త్రవేత్త హాన్స్ మేయర్ , ఆస్ట్రియన్ పర్వతారోహకుడు లుడ్విగ్ పుర్ట్షెల్లర్. మౌంట్ కిలిమంజారో నేషనల్ పార్క్ 1987లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది.యూరప్: మౌంట్ ఎల్బ్రస్కాకసస్లోని ఎతైన శిఖరం, ఐరోపాలోని ఎతైన ప్రదేశం నైరుతి రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్. 2.5 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ అంతరించిపోయిన అగ్నిపర్వతం జంట శంఖుల్లా ఉంటుంది. ఇవి 18,510 అడుగులు (5,642 మీటర్లు), 18,356 అడుగులు (5,595 మీటర్లు) ఎత్తు వరకు విస్తరించి ఉన్నాయి. పొడవైన శంఖువును మొదటిసారిగా 1874లో స్విస్ గైడ్ పీటర్ నుబెల్ నేతృత్వంలోని బ్రిటిష్ యాత్ర అధిరోహించింది.అంటార్కిటికా: విన్సన్ మాసిఫ్1935లో అమెరికన్ అన్వేషకుడు లింకన్ ఎల్స్వర్త్ కనుగొన్న విన్సన్ మాసిఫ్ అంటార్కిటికాలో అత్యంత ఎత్తై పర్వతం. ఖండంలోని పశ్చిమ భాగంలోని ఎల్స్వర్త్ పర్వతాల సెంటినెల్ శ్రేణిలో ఉన్న ఈ శిఖరం రోన్నే ఐస్ షెల్ఫ్ను చూస్తుంది. ఇది సముద్ర మట్టానికి 16,050 అడుగుల (4,892 మీటర్లు) ఎత్తున ఉంది. అంటార్కిటికా అన్వేషణకు నాయకత్వం వహించిన యుఎస్ కాంగ్రెస్ సభ్యుడు కార్ల్ విన్సన్ పేరు మీద విన్సన్ పేరు పెట్టారు. దీని శిఖరాగ్రాన్ని మొదటిసారిగా 1966లో అమెరికన్ ఆల్పైన్ క్లబ్, నేషనల్ సైన్స్ ఫౌండేషన్ మద్దతుతో ఒక అమెరికన్ చేరుకున్నారు.ఆస్ట్రేలియా: మౌంట్ కోస్సియుస్కోమౌంట్ కోస్సియుస్కో ఆస్ట్రేలియాలో ఎతైన శిఖరం. ఇది ఆగ్నేయ న్యూ సౌత్ వేల్స్లోని ఆస్ట్రేలియన్ ఆల్ప్స్ స్నోవీ పర్వతాలలో ఉంది. ఈ శిఖరం 7,310 అడుగులు (2,228 మీటర్లు) ఎత్తు. పోలిష్ అన్వేషకుడు, భూవిజ్ఞాన శాస్త్రవేత్త పాల్ స్ట్రెజెలెక్కి 1840లో మౌంట్ కోస్సియుస్కోను అధిరోహించిన మొదటి యూరోపియన్. అతను ఈ పర్వతానికి ΄ోలిష్ దేశభక్తుడు, అమెరికన్ విప్లవ వీరుడైన టాడ్యూస్జ్ కోస్సియుస్కో పేరు పెట్టాడు. ‘శీతాకాలపు ట్రెక్ల రారాణి’ కేదార్కాంతభారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రం పూర్తిగా ప్రకృతి అద్భుతాలతో నిండి ఉంది. అందుకే ఈ భూమిని దేవుని స్వంత భూమి లేదా ‘దేవభూమి‘ అని పిలుస్తారు. ఈ ప్రదేశం ప్రత్యేకత ఏడాది పొడవునా సాహసయాత్ర కోరుకునే ట్రెక్కర్లను ఆకర్షించడంలో విజయవంతమైంది. ఇక ప్రసిద్ధ శీతాకాల ట్రెక్ ప్రదేశం కేదార్కాంత. ఈ ట్రెక్ ‘శీతాకాలపు ట్రెక్ల రాణి‘ గా పేరు పొందింది. గోవింద్ నేషనల్ పార్క్ దట్టమైన పైన్ అడవుల గుండా కేదార్కాంత శిఖరం వైపుగా ట్రెక్కింగ్ వెళుతుంది. మోకాలి లోతు మంచు, పై నుండి మంత్రముగ్ధులను చేసే దృశ్యం. కేదార్కాంత ట్రెక్ 12,500 అడుగుల ఎత్తులో ఉన్నప్పటికీ ట్రెక్కింగ్ మొదలుపెట్టేవారికి ఈ మార్గం సులభంగా ఉండటంతో మరింత ప్రాచుర్యం పొందింది. ఇక్కడ మంచు ఏప్రిల్ నెల వరకు ఉంటుంది. ఇది ఇతర శీతాకాలపు ట్రెక్లకు భిన్నంగా చాలా ప్రజాదరణ పొందింది. ఈ ట్రెక్ సంక్రి అనే చిన్న గ్రామం నుండి ప్రారంభమవుతుంది. ఓక్, రోడోడెండ్రాన్ దట్టమైన అడవులు, గడ్డకట్టిన సరస్సు మధ్యలో నడక సాగిస్తూ, మంచు శిఖరాన్ని అధిరోహించడానికి ఎంతో మంది ఉత్సాహం చూపుతుంటారు. ప్రముఖ హిమాలయ శిఖరాలు అయిన బందర్పూంచ్, కాల్నాగ్, స్వర్గారోహిణి మొదలైనవి.. కేదార్కాంత శిఖరం నుండి కనిపిస్తాయి.ఈ ట్రెక్ ప్రత్యేకత ఏమిటంటే... దేశంలోని అత్యంత ప్రసిద్ధ శీతాకాలపు ట్రెక్లలో ఒకటిగా పేరొందింది. హిమాలయాలలో శీతాకాలంలో అందుబాటులో ఉండే మంచు ట్రెక్కి ఇది అనుకూలమైనది.ఇది హిమాలయ శిఖరాన్ని ఎక్కిన అనుభూతిని ఇస్తుంది.మొదట్లో ట్రెక్కింగ్ చేసేవారికి అనువైన ప్రాంతం.కేదార్కాంత బేస్ క్యాంప్ అద్భుతమైన సుందర దృశ్యాలకు ఆలవాలం. శిఖరం నుండి కనిపించే దృశ్యం మనల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. కేదార్కాంత శిఖరం నుండి సూర్యోదయం అత్యుత్తమమైనది.కేదార్కాంత ట్రెక్ షెడ్యూల్ఆరు పగళ్లు, ఐదు రాత్రుళ్లు ప్యాకేజీని ట్రావెల్ ఏజెన్సీలు అందిస్తున్నాయి.1వ రోజు: డెహ్రాడూన్ నుండి సంక్రి వరకు 196 కి.మీ డ్రైవ్, దీనికి 8–9 గంటల సమయం పడుతుంది.2వ రోజు: సంక్రి నుండి జుడా కా తలాబ్ క్యాంప్ సైట్ వరకు 3.5 కి.మీ ట్రెక్, 5–6 గంటలు పడుతుంది. ఎత్తు 7200 అడుగుల నుండి 9186 అడుగుల వరకు ఉంటుంది.3వ రోజు: జుడా కా తలాబ్ నుండి కేదార్కాంత బేస్ క్యాంప్కు 3 కి.మీ ట్రెక్ చేయాలి. ఇందుకు 4–5 గంటల సమయం పడుతుంది. ఎత్తు 9186 అడుగుల నుండి 10,334 అడుగుల వరకు ఉంటుంది.4వ రోజు: సమ్మిట్ హర్గావ్ క్యాంప్లో పగలు, రాత్రి ప్రయాణం, బస సమయం మొత్తం 7 కి.మీ 9–10 గంటలు. 5వ రోజు: హర్గావ్ నుండి సంక్రికి దిగి డెహ్రాడూన్కు 4 కి.మీ దిగి, 196 కి.మీ ప్రయాణం చేస్తూ డెహ్రాడూన్కు చేరుకోవాలి.సంక్రి ఎలా చేరుకోవాలంటే... హిమాలయాల దిగువ ప్రాంతంలో ఉన్నది సంక్రి. కేదార్కాంత, హర్ కి డన్, ఫులారా రిడ్జ్, బాలి పాస్ వంటి అనేక ప్రసిద్ధ హిమాలయ ట్రెక్లకు బేస్క్యాంప్గా పనిచేస్తుంది. నగర జీవిత హడావిడికి దూరంగా ఉన్న ఈ చిన్న గ్రామం మన హృదయాలను ఇట్టే దోచుకుంటుంది. అందమైన హోమ్స్టేలు, రుచికరమైన తినుబండారాలు, కేఫ్లు, అద్భుతమైన స్వర్గరోహిణి శిఖరం, మంత్రముగ్ధులను చేసే దృశ్యాలతో సంక్రిప్రాంతం ప్రేమలో ఇట్టే పడిపోతాం. సంక్రి డెహ్రాడూన్ నుండి 206 కి.మీ. ఢిల్లీ నుండి 434 కి.మీ దూరంలో ఉంది. ఢిల్లీ నుండి నేరుగా సంక్రి చేరుకోలేం. డెహ్రాడూన్ చేరుకున్న తర్వాతనే సంక్రికి ప్రయాణించవచ్చు:రోడ్డు మార్గం:సంక్రి డెహ్రాడూన్ నుండి దాదాపు 206 కి.మీ దూరంలో ఉంది మరియు సాధారణంగా చేరుకోవడానికి 8–9 గంటలు పడుతుంది.రెండు మార్గాలు ఉన్నాయి:వయా ముస్సూరీ – తక్కువ దూరం. ఈ మార్గాన్నే చాలా మంది అనుసరిస్తారు. వయా వికాస్నగర్ – ముస్సూరీ ట్రాఫిక్ను నివారించాలనుకుంటే మంచి ఎంపిక.బస్సు ద్వారా:డెహ్రాడూన్ రైల్వే స్టేషన్ నుండి సంక్రికి ప్రైవేట్, ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉన్నాయి . సాధారణంగా రోజుకు 2–3 బస్సులు ఉంటాయి. చివరి బస్సు ఉదయం 8:00 గంటలకు బయలుదేరుతుంది. ఆ తరువాత, సంక్రికి బస్సులు అందుబాటులో లేవు.టాక్సీ ద్వారా:4 లేదా అంతకంటే ఎక్కువ మందితో కలిసి ప్రయాణిస్తుంటే టాక్సీని అద్దెకు తీసుకోవాలి. డెహ్రాడూన్ నుండి సంక్రికి టాక్సీ ధర రూ.6500 ఉంటుంది.రైలు మార్గం:సంక్రికి సమీప రైల్వే స్టేషన్ డెహ్రాడూన్ రైల్వే స్టేషన్. అక్కడి నుండి, సంక్రి చేరుకోవడానికి బస్సు లేదా టాక్సీ తీసుకోవచ్చు.విమాన మార్గం:సంక్రికి సమీప విమానాశ్రయం డెహ్రాడూన్ లోని జాలీ గ్రాంట్ విమానాశ్రయం. భారతదేశంలోని ప్రధాన నగరాల నుండి డెహ్రాడూన్కు విమానాలు అందుబాటులో ఉన్నాయి, ఆ తర్వాత రోడ్డు మార్గంలో సంక్రి చేరుకోవచ్చు. పర్వతారోహణలో సుందర దృశ్యాలు, ఆత్మిక శక్తి, శిఖరాగ్రం చేరుకున్నాక పూర్తి శాంతిని అనుభవంలోకి తీసుకువస్తాయి హిమనీ నదాలు. భారతదేశం, నేపాల్ అంతటా విస్తరించి ఉన్న హిమాలయాలు ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాలు, గొప్ప సాంస్కృతిక అనుభవాలను అందిస్తున్నాయి. ఉత్తరాఖండ్లోని పచ్చని లోయలు, కాశ్మీర్లోని స్వచ్ఛమైన సరస్సులు, లడఖ్లో క్లిష్టమైన మార్గాలు, సిక్కింలోని ప్రశాంతమైన కొండల నుండి నేపాల్లోని గంభీరమైన శిఖరాల వరకు హిమాలయాలు సాహస యాత్రకు ఆహ్వానం పలుకుతున్నాయి.మన దేశంలో కేదార్కాంత ట్రెక్, ఉత్తరాఖండ్లోని ఉల్లాసకరమైన పంగర్చుల్లా పీక్ ట్రెక్, కాశ్మీర్ గ్రేట్ లేక్స్, పశ్చిమ బెంగాల్లోని సందక్ఫు ట్రెక్, సిక్కింలోని గోచల, లడఖ్లోని మార్ఖా లోయను వీక్షించి తీరాల్సిందే. నేపాల్లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్, సుందరమైన అన్నపూర్ణ సర్క్యూట్ ట్రెక్, ప్రశాంతమైన లాంగ్టాంగ్ వ్యాలీ, అద్భుతమైన మార్డి హిమాల్ ట్రెక్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ట్రెక్కింగ్ మార్గాలలోనూ మునిగి΄ోవచ్చు. హిమాలయాలలో భద్రత,సౌకర్యాలతో మరపురాని జ్ఞాపకాలను అందించేందుకు ట్రావెల్ ఏజెన్సీలు రూ.20,000 నుంచి లక్ష రూపాయల వరకు ప్యాకేజీలను అందిస్తున్నాయి. (చదవండి: ప్రత్యేక సామర్థ్యంతో అద్భుతాలు చేసిన అసామాన్య వ్యక్తులు..!) -
ఆత్మనిగ్రహం... ఆత్మస్థైర్యం
మనస్సు చంచలమైనది. అది నిరంతరం ఏదో ఒక దానిగురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటి మనస్సును స్వేచ్ఛగా వదిలేస్తే ఇంద్రియాలకు అధీనమైపోతుంది. కామక్రోధాదులను బలపరుస్తుంది. అహంకార మమకారాలను వృద్ధి చేస్తుంది. ఈ క్రమంలో ఇంద్రియాలకు లాలసుడైన మనిషి విచక్షణను కోల్పోయి క్షణిక సుఖాలకు దగ్గర అవుతాడు. దీంతో అభివృద్ధి నిలిచిపోయి అథఃపాతాళంలోకి పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మనస్సును ఎప్పటికప్పుడు నిగ్రహించుకుంటూ ఇంద్రియ వశం కాకుండా మంచి పనులు మాత్రమే చేయాలనే నిబద్ధతతో మనస్సును అధీనంలో ఉంచుకోవడమే ఆత్మ నిగ్రహం.చంచలమైన మనస్సును నిశ్చలంగా చేయడం సాధారణమైన విషయం కాదు. సామాన్యులకే కాదు, అత్యంత శూరుడైన అర్జునికి కూడా మనస్సును నిగ్రహించుకోవడం సాధ్యం కాలేదు. మనసును నిగ్రహించడం వాయువును బంధించడం కన్నా కష్టమైందని అర్జునుడే స్వయంగా అన్నాడు. భారత యుద్ధం ప్రారంభం కావడానికి ముందు తనకు సారధ్యం వహిస్తున్న శ్రీ కృష్ణునితో అర్జునుడు ఈ మాటలు పలికాడు. యుద్ధంలో ప్రతిపక్షం మీద దృష్టి సారించి తన తాత భీష్ముడు, గురువు ద్రోణాచార్యుడు, సహాధ్యాయ గురుపుత్రుడు అశ్వత్థామ, అన్నదమ్ములైన కౌరవ సోదరులను చూసి విషాదంలో పడి పోయాడు. వారంతా తన స్వజనం కావడంతో యుద్ధం చేయడానికి అతనికి మనస్కరించలేదు. దాంతో అతని చేతిలో నుంచి ధనస్సును జార విడుస్తూ ‘‘కృష్ణా నాకు విజయం వద్దు... రాజ్య సుఖాలు వద్దు... ఆచార్యుణ్ణి, పితామహుణ్ణి, బంధువులను నేను సంహరించలేను’’ అంటూ మౌనం వహించి విముఖుడై కూర్చుండిపోయాడు. అతని మనస్సు నిగ్రహాన్ని కోల్పోయింది. అందువల్లనే అర్జునికి ఇలాంటి స్థితి ఏర్పడింది. ఇది గమనించిన శ్రీ కృష్ణుడు అర్జునుణ్ణి యుద్ధానికి సన్నద్ధం చేయడానికి ఎంతో శ్రమ పడాల్సి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 అధ్యాయాలుగా ఉండే భగవద్గీతను బోధించాడు. భౌతికమైనవి, తాత్వికమైనవి అనేకానేక విషయాలు తాను గురువుగా మారి అర్జునునికి బోధించాడు. దాంతో అర్జునుడు శత్రువులను సంహరించడానికి అంగీకరించాడు. మనోనిగ్రహం పొందడం చేతనే అర్జునుడు తిరిగి మామూలు స్థితికి వచ్చాడు. తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు. దీనినే మనం నిత్య జీవిత పోరాటంలో పాఠంగా మలచుకోవాలి. ఆ పాఠం మనల్ని సత్యసంధులుగా, న్యాయవేత్తలుగా, నీతిపరులుగా తీర్చిదిద్దుతుంది. మనో నిగ్రహం అలవడితే సద్గుణ సంపన్నులు అవుతారు. భక్తి, జ్ఞాన, వైరాగ్య భావనలు కలిగి, సమదృష్టి అలవడుతుంది. అయితే ఆత్మ నిగ్రహానికి, ఆత్మస్థైర్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఆత్మ స్థైర్యం ఉన్న మనిషికి ఆత్మ నిగ్రహం ఏర్పడుతుంది. ఆత్మ పట్ల నమ్మకం, విశ్వాసం ్రపోది చేసుకున్న వ్యక్తి ఆత్మ స్థైర్యాన్ని సంపూర్ణంగా కైవసం చేసుకోవచ్చు. స్వార్థరహితమైన మనసు, ప్రవత్తి, వ్యాపకం వంటివి మనిషి ధీరోదాత్తతకు ఉపకరణాలు. ఏ ప్రలోభాలకూ లొంగని స్వభావం వల్ల మనిషి ఆత్మస్థైర్యాన్ని సంతరించుకుంటాడు. దైవం పట్ల ప్రత్యేక శ్రద్ధ లేకపోయినప్పటికీ తన పట్ల గురి, నమ్మకం ఉన్న వ్యక్తి ఆత్మస్థైర్య సంభూతుడే అవుతాడు. ఆత్మ స్ధైర్యం మనిషి శక్తి సామర్థ్యాలను ద్విగుణీకృతం చేస్తుంది. పిరికితనాన్ని పారదోలుతుంది. విద్యార్జనకు, ఆరోగ్య సాధనకు తోడ్పడుతుంది. భిన్నత్వం గల సమాజంలో ఏకతాభావన సాధించేందుకు బలం ఇస్తుంది. ఆధ్యాత్మిక అంశంలో సైతం ముందుకు సాగేందుకు తోడ్పడుతుంది. అందువల్ల జీవితంలో ఉన్నత సోపానాలను అధిరోహించాలనుకునే ప్రతివ్యక్తి ఆత్మస్థైర్యం పెంపొందించుకుంటే ఆత్మనిగ్రహం దానికదే సొంతమవుతుంది. మనోనిగ్రహం ఆధ్యాత్మిక సాధనకు అత్యవసరం. లౌకిక విషయాల సాధనకు కూడా మనో నిగ్రహం అవసరం. అలాంటపుడే మనిషి సజ్జనుడుగా నలుగురిలో కీర్తింపబడతాడు. చంచల చిత్తమైన మనస్సును, విషయలోలత్వం నుంచి మరల్చి ఆత్మయందే స్థాపితం చేసి ఆత్మకు సర్వదా అధీనమై ఉండేటట్లు చేయాలని భగవద్గీత కూడా స్పష్టం చేసింది.– దాసరి దుర్గాప్రసాద్ -
అంధ లెఫ్టినెంట్ కల్నల్ నుంచి వీల్చైర్ మోడల్ వరకు..!
దివ్యాంగులకు సాధికారత కల్పించడం అనేది అందరి కర్తవ్యవం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు. వారంతా ప్రత్యేక సామర్థ్యంతో తమలోని అసామాన్య ప్రతిభతో ఆకట్టుకుంటారని ప్రశంసించారు. గత మంగళవారం జరిగిన 2025 జాతీయ వికలాంగుల సాధికారత అవార్డుల వేడుకలో దివ్యాంగుల ప్రతిభను మెచ్చుకుంటూ 32 మందికి అవార్డులు ప్రదానం చేశారు. వాళ్లంతా లింగ వివక్షను, వైకల్యాన్ని అధిగమించి అసాధారణ విజయాలను అందుకున్న వారు. అవార్డులందుకున్న ఈ 32 మందిలో ప్రతిఒక్కరిలో ఉన్నా అసామాన్య ప్రతిభ స్ఫూర్తిని రగిలికస్తూ ఉంటుంది. మరి ఆ అసామాన్య ప్రతిభావంతులెవరూ..వారి ప్రత్యేకత గురించి సవివరంగా చూద్దామా..!.80% లోకోమోటర్ వైకల్యం ఉన్న యాజీన్ జాతీయ వికలాంగులు సాధికారత అవార్డు గ్రహిత. ఆయన కళ్లకు గంతలు కట్టుకుని కీబోర్డుని అవలీలగా ఆలపించగలరు. ఆయన ఊహ గొప్పతనాన్ని చెప్పిన వ్యక్తి. ఒకప్పుడూ తాను సంజు సామ్సన్తో ఆడానని, ఇప్పుడూ ఈ వైకల్యం కారణంగా వీల్చైర్కే పరిమితమయ్యా..కానీ తనని ఆపేది ఏది లేదని చెప్పుకొచ్చారు. ఇక బెంగళూరుకు చెందిన షీబా కోయిల్పిచాయ్ బహుళ వైకల్యంతో పోరాడుతోంది. ఆమె మాట్లాడలేకపోయిన సుమారు మూడు వేలకు పైగా వార్లీ పెయింటింగ్లతో తన అనుభవాలను చెబుతుంది. ఆమె రచనలు కర్ణాటకలో రాష్ట్రపతి భవన్, లోక్భవన్ ప్రపంచ సేకరణలో ప్రచురితమయ్యాయి. ఆమె శిక్షణ పొందిన సంస్థలోనే టీచర్గా పాఠాలు బోధిస్తుంది. నాగ్పూర్కు చెందిన అబోలి విజయ్ జరిత్ దేశంలోని మొట్టమొదటి వీల్చైర్ మోడల్, ప్రేరణాత్మక వక్తకూడా. తన కుటుంబమే అతిపెద్ద బలం అంటోంది.లెఫ్టినెంట్ కల్నల్ ద్వారకేష్ చంద్రశేఖరన్ పూర్తిగా అంధుడైనప్పటికీ భారసాయుధ దళాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన జాతీయ ఈత రికార్డులను బద్దలు కొట్టారు. భారతదేశంలో బ్లైండ్ షూటింగ్ని ప్రవేశపెట్టిన ఘనత అతడిదే. అలాగే సియాచిన్ హిమానీనదం వరకు ట్రెక్కింగ్ చేశారు.బెంగళూరుకు చెందిన సీనియర్ యాక్సెసిబిలిటీ స్పెషలిస్ట్ మేఘ పతంగి దృష్టి లోపంతో బాధపడుతున్నా.. డిజిటల్ టెక్నాలజీ లక్షలాదిమంది అంధులకు హెల్ప్ అయ్యేలా కృషి చేసింది. ఈ అవార్డు గ్రహీతల్లో చత్తీస్గఢ్లోని ధమ్తారికి చెందిన బసంత్ వికాస్ సాహు కూడా ఉన్నారు. 95% లోకోమోటర్ వైకల్యంతో జీవిస్తూ.. తన జీవన్ రంగ్ ఫౌండేషన్ ద్వారా ప్రత్యేక వికలాంగులు, గిరిజన యువతకు శిక్షణ ఇస్తూన్నారు. పైగా తన చేతికి బ్రష్ కట్టుకుని చిత్రలేఖనాలు గీస్తారాయన. ఆయన చిత్రాలు గిరిజన జీవితంపై స్పష్టమైన ఆలోచనను అందిస్తాయి.వడోదరకు చెందిన రాజేష్ శరద్ కేత్కర్ భారతీయ సంకేత భాష (ISL)ను సమర్థించే యాక్సెసిబిలిటీ భావనను పునర్నిర్మించారు. ఆయన మార్గదర్శక ISL-ఆధారిత అభ్యాస వ్యవస్థలను ప్రవేశపెట్టారు. దాంతో లక్షలాది మందికి బధిరులు నడిపే వార్తా వేదికను నిర్మించారు. అలాగే కమ్యూనికేషన్ను సాధికారతగా మార్చారు. చివరగా అవార్డు గ్రహీతలంతా ఒక ఏకైక సత్యాన్ని వివరించారు. అదేంటంటే..వైకల్యం ప్రతిబంధకం, మనల్ని కోల్పోవడం కాదని ప్రూవ్ చేశారు. ఆ వైకల్యం మన అభ్యన్నతిని ఏ మాత్రం ఆపలేదని తమ సక్సెస్తో నిరూపించారు. (చదవండి: Gucchi Mushrooms: పుతిన్ రాష్ట్రపతి భవన్ విందులో గుచ్చి పుట్టగొడుగుల రెసిపీ..! స్పెషాలిటీ ఏంటంటే..) -
పుతిన్ రాష్ట్రపతి భవన్ విందులో గుచ్చి పుట్టగొడుగుల రెసిపీ..!
భారత్లో పర్యటిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. హైదరాబాద్ హౌస్లో 23వ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు కూడా. డిసెంబర్ 2021 అనంతరం తొలిసారిగా ఈ శిఖరాగ్ర సమావేశానికి భారతదేశంలో ఉన్నారు పుతిన్. ప్రధాని మోదీ ఆయనకు రష్యన్ ఎడిషన్తో కూడిన భగవద్గీతను గిఫ్ట్గా ఇచ్చారు కూడా. అలాగే గత శుక్రవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో కేంద్ర మంత్రులు, దౌత్యవేత్తలకు గ్రాండ్గా విందు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సమావేశ ముగిసింది. అయితే ఆ విందు చాలా ప్రత్యేకతను సంతరించుకుంది కూడా. ఈ నేపథ్యంలో మెనూలో వడ్డించిన వంటకాలేంటి..వాటి ప్రత్యేకతలు గురించి తెలుసుకుందామా..!.మోనూ మొత్తం శాకాహార వంటకాలే ఉన్నాయి.భారతదేశం అంతటా ఉన్న ప్రాంతీయ వంటకాల జాబితాను అందించారు. ఈ జాబితాలో పశ్చిమబెంగాల్ నుంచి గుర్సందేశ్, ఉత్తర భారతదేశం నుంచి పసుపు పప్పు తడ్కా, దక్షిణ ప్రాంతాల నుంచి మురుక్కు టిబెట్, నేపాల్ సరిహద్దుల నుంచి జోల్ మోమో, జమ్మూ కశ్మీర్ నుంచి గుచ్చిడూన్ చెటిన్(వాల్నట్ చట్నీతో వడ్డించే స్టఫ్డ్ మోరెల్ పుట్టగొడుగులు) ఉన్నాయి. ఈ రెసిపీలో గుచ్చి పుట్టగొడుగుల వంటకం అత్యంత స్పెషల్. అంత సులభంగా వండుకునే అవకాశం ఉండదే. అలాగే ఎప్పుడు పడితే అప్పుడ తినలేం కూడా. ఎందువల్ల అంటే..ఈ కాశ్మీరీ వంటకం దాని మూలం కారణంగానే అని చెప్పొచ్చు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో అరుదుగా లభించే పుట్టగొడుగులివి. అందువల్లే ఇది కిలో దాదాపు రూ. 35 వేలు నుంచి రూ. 40 వేలు వరకు పలుకుతుంది. ఇవి అడవిలోనే లభిస్తాయి. వీటిని ప్రత్యేకంగా పెంచడం సాధ్యం కాదు. వీటికి ఒక విధమైన నేల రకం, నిర్ధిష్ట ఉష్ణోగ్రత అవసరం. హిమపాతం సీజన్ ముగిసిన వెంటనే వసంతకాలం సమయానికి హిమాలయ ప్రాంతంలో ఇవి దర్శనమిస్తాయి. అనుకోని అటవీ మంటల తర్వాత కూడా వీటిన సాగు చేయొచ్చట. అదే దీనిలో స్పెషాలిటీ అట. ఈ ప్రత్యేకత కలిగిన గుచ్చి పుట్టగొడుగులను కనిపెట్టడం కూడా సవాలట. కొన్ని వారాలపాటు మాత్రమే సాగయ్యే ఈ పుట్టగొడుగును అన్వేషించడం ఓ టాస్క్లా ఉంటుందట. అదీగాక పాకశాస్త్రంలో వీటికి ఉన్న టేస్టే వేరేలెవెల్ అట. పైగా సంప్రదాయ వైద్యలో ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రజలు విరివిగా వినయోగించడంతో వీటికి అధిక డిమాండ్ ఉందట. ప్రపంచంలో అత్యంత ఖరీదైన పుట్టగొడుగులగా ఇవి ప్రసిద్ధిగాంచినవి. View this post on Instagram A post shared by NDTV (@ndtv) ఈ మష్రూమ్తో చేసే వంటకాలు..గుచ్చి పులావ్, యాఖ్ని, రోగంజోష్, వంటి శాకాహార వంటకాలను చేస్తారుట. పైగా మాంసానికి ప్రత్యామ్నాయ వంటకంగా ఆస్వాదిస్తారట ఆహారప్రియులు. అంత ప్రత్యేకతలు కలిగిన ఖరీదైన పుట్టగొడుగులు కావడంతోనే ఈ గుచ్చి డూన్ చెటిన్ రాష్ట్రపతి భవన్లో వ్లాదిమిర్ పుతిన్ విందు కోసం మెనూలో స్పెషల్గా ఏర్పాటు చేశారట. (చదవండి: దోసెల రెస్టారెంట్ కోసం..టెక్ ఉద్యోగాన్ని వదిలేశాడు! కట్చేస్తే..) -
మధుమేహుల్లో కాళ్ల సంరక్షణపై అవగాహనకు వాకథాన్
మన దేశం మధుమేహ రాజధానిగా మారిపోయింది. 2022 నాటి లెక్కల ప్రకారం ప్రపంచంలో మధుమేహ బాధితులు అత్యంత ఎక్కువగా ఉంది భారతదేశంలోనే. అయితే మధుమేహ బాధితులు అన్నింటికంటే ఎక్కువగా దృష్టిపెట్టాల్సింది వాళ్ల కాళ్లమీదేనని పలువురు ప్రముఖులు తెలిపారు. ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు భాగ్యనగరంలో ఆదివారం వాకథాన్ను నిర్వహించారు. ఈ వాక్థాన్ను మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఛైర్మన్ రమేష్ గోరంట్ల, టాలీవుడ్ నటుడు సుశాంత్, కిమ్స్ ఆస్పత్రుల ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు ప్రారంభించారు.మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. “మధుమేహం అనేది చాలా సాధారణంగా మొదలయ్యే సమస్య. అసలు చాలామందికి అది ఉందన్న విషయమే మొదట్లో తెలియదు. దాన్ని గుర్తించేసరికే చాలా ఆలస్యం అవుతుంది. పైగా మధుమేహం ఉన్నవాళ్లు తమ కళ్లు, కాళ్లు, ఇతర అవయవాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కంటిచూపు తగ్గుతున్నా, కాళ్ల మీద పుళ్లు కనిపించినా, ఏమైనా దెబ్బలు తగిలినా వెంటనే తగిన చికిత్సలు తీసుకోవాలి. వాటిలో నిర్లక్ష్యం చేయడం వల్ల చాలామందికి కాళ్లు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రతిరోజూ తగినంత నడక, యోగా, లేదా మరేదైనా భౌతిక కార్యకలాపాలతో చురుకైన జీవనశైలి గడపాలి. స్మార్ట్ ఫోన్లు, ఇతర గాడ్జెట్ల మీద ఎక్కువగా ఆధారపడితే శారీరక కార్యకలాపాలు తగ్గిపోయి ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి” అని తెలిపారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఛైర్మన్ రమేష్ గోరంట్ల మాట్లాడుతూ.. “ఇంతకుముందు మధుమేహం అంటే 50. 60 ఏళ్లు దాటినవాళ్లకే ఉండేది. కానీ ఇప్పుడు బాగా చిన్నవయసు వాళ్లలో కూడా ఇది ఉంటోంది. పిల్లలు, యువత మామూలుగా ఆటలు ఆడుకుంటూ ఉంటారు. ఆటల్లో దెబ్బలు తగలడం సర్వసాధారణం. అయితే అలాంటప్పుడు మధుమేహం ఉన్నవాళ్లయితే వాళ్లకు గాయాలు అంత త్వరగా నయం కావు. ఇప్పుడు ఇక్కడున్న వైద్యులు, ఇతర ప్రముఖులు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఇలాంటి గాయాల వల్ల కాళ్లు తొలగించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అలా జరగకుండా ఉండాలంటే మధుమేహం ఉన్నవాళ్లు కాళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎప్పటికప్పుడు మధుమేహం స్థాయి పరీక్షించుకోవడంతో పాటు కీలక అవయవాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి” అని సూచించారు.టాలీవుడ్ నటుడు సుశాంత్ మాట్లాడుతూ, “ఇన్నాళ్ళూ కళ్లకు, ఎముకలకు, పొట్టలోని భాగాలకు.. ఇలా రకరకాల వైద్యులు ఉంటారని తెలుసు గానీ, ప్రత్యేకంగా పాదాల కోసం కూడా ఒక ప్రత్యేక వైద్యవిభాగం ఉందన్న విషయం నాలాంటి చాలామందికి తెలియదు. ఇటీవలి కాలంలో చాలామందికి మధుమేహం ఉంటోంది. అందువల్ల ప్రతి ఒక్కళ్లూ కాళ్ల విషయాన్ని సరిగ్గా పట్టించుకోవాలి. ఏమాత్రం తేడా అనిపించినా వెంటనే ఇలాంటి ఫుట్ క్లినిక్లకు వచ్చి పరీక్ష చేయించుకోవాలి” అన్నారు.ఈ సందర్భంగా కిమ్స్ ఆస్పత్రుల సీఎండీ, ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు మాట్లాడుతూ, “మధుమేహుల్లో 15-25% మందికి తమ జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు కాళ్ల మీద పుళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే, మధుమేహ బాధితులకు నరాలు పాడవ్వడం వల్ల ఇలాంటి సాధారణ పుండ్ల వల్ల వాళ్లకు నొప్పి అంతగా తెలియదు. అందువల్ల వాటిని నిర్లక్ష్యం చేస్తారు. కానీ, మధుమేహం వల్ల కాళ్లు తొలగించాల్సిన పరిస్థితుల్లో 85% కేవలం ఇలాంటి పుండ్లకు చికిత్స చేయకపోవడం వల్లే వస్తాయి. సరైన సమయానికి పుండ్లకు చికిత్స చేయించకపోతే పరిస్థితి చాలా విషమంగా మారుతుంది. అందువల్ల మధుమేహం ఉన్నవారంతా ఎప్పటికప్పుడు తమ కాళ్ల విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి” అని చెప్పారు.ఈ సందర్భంగా ద ఫుట్ డాక్టర్ ఆస్పత్రిలో డాక్టర్ వూండ్ అనే యాప్ను ఆవిష్కరించారు. సురక్షితమైన, పరిశుభ్రమైన డ్రసింగ్తో ఇంట్లోనే గాయాలను నయం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. నిపుణులైన వైద్యులు దూరంగా ఉండే గాయాలను గమనించి, ఎక్కువగా ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండా చేసి అటు ఆర్థికభారం, ఇటు సమయం కూడా ఆదా చేస్తుంది. దీంతోపాటు.. ప్రతి ఒక్కరికీ వాళ్ల పాదాల తీరు, సైజులకు అనుగుణంగా పాదరక్షలు తయారుచేసే ప్రత్యేకమైన మిషన్ ఒకదాన్ని ద ఫుట్ డాక్టర్ ఆస్పత్రిలో ఏర్పాటుచేశారు. దీనివల్ల రోగులు తమ కాళ్ల సమస్యలను త్వరగా గుర్తించడంతో పాటు నూరుశాతం కస్టమైజ్డ్ పాదరక్షలను పొందే అవకాశం ఉంటుంది. దానివల్ల వాళ్ల పాదాలకు సంపూర్ణ రక్షణ, సౌకర్యం లభించి.. కాళ్లు, పాదాలకు గాయాలు కాకుండా ఉంటాయి.(చదవండి: డయాబెటిక్ నెఫ్రోపతి: చాపకింద నీరులా వ్యాపిస్తుంది..జరభద్రం) -
దోసెల రెస్టారెంట్ కోసం..టెక్ ఉద్యోగాన్ని వదిలేశాడు! కట్చేస్తే..
ఫుడ్ రెస్టారెంట్ లేదా హోటల్ నడపడం అంటే అంత ఈజీ కాదు. చాలా శ్రమతో కూడిన పని. అభిరుచి లేదా ప్యాషన్ ఉంటే తప్ప సాధ్యం కాదు. కానీ ఈ యువకుడు చక్కగా అధిక జీతం వచ్చే టెక్ ఉద్యోగాన్ని కేవలం దోసెలు అమ్మడం చాలా తృణపాయంగా వదిలేశాడు. ఇదేం ఆసక్తి అనుకోకండి. ఆయన ఆరోగ్యకరమైన రీతీలో దోసెలను అమ్మాలనే ఉద్దేశ్యంతో ఇలా చేశాడట. వినడానికి ఏంటిది అనిపించినా..? మరి.. అంత రిస్క్ తీసుకుని ఆ యువకుడు సక్సెస్ అయ్యాడా అంటే..జర్మన్లో అధిక జీతం వచ్చే టెక్ ఉద్యోగం చేసేవాడు మోహన్. స్కాలర్షిప్పై పారిస్లో చదువుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో అధిక వేతనంతో కూడాన ఉద్యోగాలు వచ్చాయి. అయితే వాటన్నింటిని కాదనుకుని స్నేహితులతో కలిసి దోసె రెస్టారెంట్ని ప్రారంభించాలనుకున్నాడు. అది కూడా ఆరోగ్యకరమైన గ్లూటెన్ రహిత దోసెలను అందించాలనే లక్ష్యంతో ఆ టెక్ ఉద్యోగాలను వద్దనుకున్నానంటూ తన స్టోరీని ఇన్స్టాగ్రామ్లో వీడియో రూపంలో షేర్ చేసుకున్నాడు. అలాతాను 2023లో తన దోసెమా రెస్టారెంట్ని ప్రారంభించినట్లు తెలిపాడు. అతను సహా వ్యవస్థాపకుడిగా, మేనేజింగ్ డైరెక్టర్గా రెస్టారెంట్ బాధ్యతలు చూసుకుంటున్నట్లు తెలిపాడు. ఈ ఆకస్మిక మార్పు చాలా కొత్తగా..ఇష్టంగా ఉన్నా..చాలా సవాళ్లు ఎదుర్కొన్నానని కూడా వివరించాడు. బాగా అలసిపోయి, నిద్రలేని రాత్రులు గడిపిన రోజులు చాలా ఉన్నా..ఇష్టంతో చేసే పనిలో ఆ ఇబ్బందులు పెద్ద కష్టంగా అనిపించవని అంటున్నాడు. ఇవాళ తన కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లో శాఖలు ఉన్నాయని, తాజాగా భారతదేశంలో పుణేలో కూడా శాఖలు ఉన్నాయని వీడియోలో మోహన్ చెప్పుకొచ్చారు. నెటిజన్లు ఆ యువకుడి ధైర్యానికి ఆశ్చర్యపోవడమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనే అతడి తపన మమ్మల్ని ఎంతగానో ఇంప్రెస్ చేసింది, పైగా అతడిపై గౌరవం ఇంకా పెరిపోయింది అని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Dosamaa (@dosamaa_in) (చదవండి: కూతురిని అలా చూసి..! ఆ తల్లిదండ్రుల రియాక్షన్ మాములుగా లేదుగా..) -
శునక టెక్ సేవలు
ఇకముందు... ‘కుక్కలు ఏం చేస్తాయి?’ అనే ప్రశ్నకు– ‘ఇంటికి కాపలా కాస్తాయి’ అనే ఏకైక సమాధానం మాత్రమే వినిపించక΄ోవచ్చు. ‘ఇంకా ఎన్నో చేస్తాయి’ అని చెప్పవచ్చు. కుక్కలను మరింతగా ఉపయోగించుకోవడానికి శాస్త్రవేత్తలు ఒక సరికొత్త మార్గాన్ని అభివృద్ధి చేశారు. దాని పేరే... డాగోసోఫీ బటన్. గృహోపకరణాలను శునకం నియంత్రించడానికి ఈ బటన్ ఉపయోగపడుతుంది. కుక్కలు తమ యజమానులకు మరిన్ని ఇంటి పనులలో సహాయం చేయడానికి వీలుగా యానిమల్–కంప్యూటర్ ఇంటరాక్షన్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు. వినియోగదారులు తాము ఎంపిక చేసుకున్న అప్లికేషన్ను రిసీవర్లో ప్లగ్ చేయాలి. తద్వారా ఫ్యాన్ ఆన్చేయడం, లైట్ ఆఫ్ చేయడం... మొదలైన వాటికి డాగోసోఫీ బటన్ ఉపయోగపడుతుంది. నీలి, తెలుపు రంగులో ఉన్న డోగోసోఫీ బటన్ను శునకానికి కనిపించేలా ఏర్పాటు చేస్తారు. ఈ బటన్ చాలా సున్నితంగా ఉంటుంది. కుక్క తన ముక్కుతో బటన్ను తట్టడంతో అది యాక్టివేట్ అవుతుంది. ఇలా చేయడానికి శునకానికి కొంత శిక్షణ అవసరం ‘డాగోసోఫీ ఈ పరికరాలను మాత్రమే, ఇంత సంఖ్యలో మాత్రమే నియంత్రిస్తుందనే పరిమితి లేదు. మీ సృజనాత్మకతతో ఎన్ని పరికరాలైనా నియంత్రించేలా శునకానికి శిక్షణ ఇవ్వవచ్చు’ అంటున్నారు డాగోసోఫీ రూపకర్తలు. (చదవండి: మలబద్ధకం నివారణ కోసం..! ఈట్ ఫ్రూట్) -
మలబద్ధకం నివారణ కోసం...
మలబద్ధకం చాలామందిని బాధిస్తూ ఉంటుంది. ఫ్రీ మోషన్ కాకపోవడం వల్ల వచ్చే ఈ సమస్యతో దీర్ఘకాలంలో మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలూ ఉంటాయి. అందుకే ఈ సమస్యను నివారించుకోవడం ఎంతోముఖ్యం. అందుకు పాటించాల్సిన కొన్ని సూచనలుఫైబర్ (పీచు) సమృద్ధిగా ఉండే ఆహారాలతో మలబద్ధకాన్ని నివారించుకోవడం తేలికే. వాటివల్ల జీర్ణాశయమార్గం శుభ్రమవ్వడమే కాకుండా తేలిగ్గా విరేచనం అయ్యేందుకు ఆ పీచు సహాయపడుతుంది. ఫైబర్ వల్ల దేహంలో మనం తీసుకున్న పిండిపదార్థాల నుంచి చక్కెర నెమ్మదిగా విడుదలవుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర మోతాదులు ఒకేసారి పెరగవు. పొట్టుతో కూడిన అన్ని రకాల ధాన్యాల్లోనూ ఈ పీచు ఎక్కువ. అందుకే పొట్టు తీయని ధాన్యాలు... మరీ ముఖ్యంగా వరి విషయానికి వస్తే దంపుడు బియ్యం వంటివి మేలు చేస్తాయి. ఇక మామూలు ధాన్యాల్లో కంటే తృణధాన్యాల్లో పీచు మోతాదులు ఎక్కువ. కాయగూరలు, ఆకుకూరలు, మొలకెత్తిన ధాన్యాల్లోనూ పీచుపాళ్లు ఎక్కువ. ఇవి మలబద్ధకంతో పాటు చాలా రకాల క్యాన్సర్లనూ నివారిస్తాయి. చిక్కుళ్లలో ప్రోటీన్ తోపాటు ఫైబర్ కూడా ఎక్కువే. ఇవి కండరాలకు బలాన్నివ్వడంతోపాటు మలబద్దకం నివారణకూ తోడ్పడుతూ ఒకేసారి రెండు ప్రయోజనాలనిస్తాయి. తాజాపండ్లలోనూ పీచు ఎక్కువగానే ఉంటుంది. అందుకే అతిగా తీపి ఉండని తాజాపండ్లు డయాబెటిస్ ఉన్నవారికీ మేలు చేస్తాయి. బొప్పాయి, పుచ్చ, నారింజ వంటి పండ్లలో పీచు మోతాదు ఎక్కువగా ఉండటంతో మలబద్ధకాన్ని తేలిగ్గా నివారిస్తాయి. పండ్లను పళ్లరసాల రూపంలో తీసుకుంటే అందులో పీచుపదార్థాలు దాదాపుగా ఉండవు. అందుకే పండ్లను కొరికి తినడమే మేలు. పీచుపదార్థాలతోపాటు తగినన్ని నీళ్లు తాగడం వల్ల విరేచనం సాఫీగా అవుతుంది. రోజుకు కనీసం రెండు లీటర్ల (కనీసం పది గ్లాసుల) నీళ్లు తాగడం మంచిది. (చదవండి: డయాబెటిక్ నెఫ్రోపతి: చాపకింద నీరులా వ్యాపిస్తుంది..జరభద్రం) -
డయాబెటిక్ నెఫ్రోపతి: చాపకింద నీరులా వ్యాపిస్తుంది..జరభద్రం
డయాబెటిస్ (మధుమేహం) అంటే కేవలం రక్తంలో చక్కెర మోతాదులు పెరగడం మాత్రమే కాదు. అది దేహంలోని అనేక అవయవాలను నిశ్శబ్దంగా దెబ్బతీసే ప్రమాదకారి. డయాబెటిస్ వల్ల మిగిలిన అన్ని అవయవాల్లో కన్నా కిడ్నీలు దెబ్బతినే అవకాశాలెక్కువ. ఎంత ఎక్కువ అంటే... డయాబెటిస్తో బాధపడే వ్యక్తులలో 60% మందికి కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. పైగా ఆ సమస్య తారస్థాయికి చేరే వరకూ చాలామందికి ఆ విషయం తెలియనే తెలియదు. ఇలా చాపకింద నీరులా నిశ్శబ్దంగా పెరుగుతూపోయే డయాబెటిక్ నెఫ్రోపతీ అనే ఈ కిడ్నీల వ్యాధి కారణంగా వచ్చే అనర్థాలూ, లక్షణాలూ, చికిత్స వంటి అంశాలపై అవగాహన కోసం...ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే డయాబెటిస్తోపాటు దానివల్ల కలిగే అనర్థాలు పెరిగిపోయాయి. టైప్ 1 అలాగే టైప్ 2... ఈ రెండు రకాల డయాబెటిస్లూ నెఫ్రోపతీకి దారితీస్తాయి, అయితే ఎక్కువ మందికి టైప్ 2 డయాబెటిస్ ఉండటం వల్ల చాలా కేసుల్లో కిడ్నీ పనిచేయకపోడానికి ఇదే కారణం. పైగా కిడ్నీ దాదాపుగా దెబ్బతిని పూర్తిగా పనిచేయకుండా పోయేవరకు చాలామందికి ఈ విషయం తెలియనే తెలియదు. డయాబెటిస్తో కిడ్నీలు ఎలా దెబ్బతింటాయంటే... కిడ్నీలు నిరంతరం రక్తాన్ని వడ΄ోస్తూ, అందులోని వ్యర్థాలూ, విషపదార్థాలను తొలగిస్తూ, వాటిని మూత్రం ద్వారా బయటకు ΄ోయేలా చేస్తుంటాయి. రక్తంలో చక్కెర మోతాదులు ఎక్కువగా ఉన్నకొద్దీ కిడ్నీలోని అత్యంత సన్నటి రక్తనాళాలు దెబ్బతింటాయి. ఫలితంగా వాటి వడ΄ోత సామర్థ్యం క్రమంగా తగ్గుతూ పోతుంటుంది. ఒకనాటికి కిడ్నీ పూర్తిగా పనిచేయని పరిస్థితి వస్తుంది. దాంతో జీవితాంతం డయాలసిస్ మీద ఆధారపడాల్సి వస్తుంది లేదా కిడ్నీ మార్పిడి తప్ప వేరే ప్రత్యామ్నాయమే ఉండదు.ముందుగానే గుర్తించడం ఇలా... డయాబెటిక్ నెఫ్రోపతికి చికిత్స చేసి మళ్లీ మొదటిలా కిడ్నీని పనిచేయించడం అసాధ్యం. అంటే దీనిని రివర్స్ చేయలేమని అర్థం. పైగా దాదాపుగా కిడ్నీ పూర్తిగా దెబ్బతినేవరకు దీని లక్షణాలు కనిపించవు. అందుకే నిశ్శబ్దంగా వృద్ధిచెందే ఈ వ్యాధిని తెలుసుకోడానికి క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయిస్తుండటం అవసరం.ఇవీ వైద్యపరీక్షలు... మైక్రో అల్బుమిన్ మూత్ర పరీక్ష : ఈ పరీక్షతో మూత్రంలో కొద్ది మొత్తంలోనైనా లీక్ అవుతుండే ప్రోటీన్ (అల్బుమిన్)ను గుర్తించవచ్చు. కిడ్నీ దెబ్బతినడంలో ఇది తొలి దశ. సీరం క్రియాటినిన్ అండ్ ఈ–జీఆర్ఎఫ్ (ఎస్టిమేటెడ్ గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేట్) : ఈ పరీక్షతో కిడ్నీ వడ΄ోత సామర్థ్యాన్ని కొలవవచ్చు. ఈ–జీఆర్ఎఫ్ తగ్గడం అంటే అది కిడ్నీ పనితీరు తగ్గడానికి ఒక సూచన.రక్తపోటును నిరంతరం పర్యవేక్షిస్తుండటం : హైబీపీ అన్నది కిడ్నీ దెబ్బతినే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అందుకే రక్తపోటును ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండటం, మందులతో అదుపులో పెట్టుకోవడం అవసరం. వార్షిక ఆరోగ్య పరీక్షలు: మధుమేహం ఉన్న ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా ఐదేళ్ల కంటే ఎక్కువగా డయాబెటిస్తో బాధపడుతున్న ఆరోగ్య చరిత్ర ఉన్నవారు ప్రతి ఏడాదీ వార్షిక పరీక్షలు చేయించుకుంటూ ఉండటం అవసరం. ఎందుకంటే ఈ డయాబెటిస్ ఏ అవయవంపై తన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందో ఎవరికీ తెలియదు. అందుకే డయాబెటిస్తో బాధపడే ప్రతి ఒక్కరూ ఇలా ప్రతి ఏడాది అన్ని రకాల వైద్యపరీక్షలూ చేయించుకోవడం మేలు.ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్కి చికిత్సలిలా:కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతిని, కిడ్నీ సామర్థ్యం పూర్తిగా తగ్గినట్లయితే, మూత్రపిండాల మార్పిడి చికిత్స (రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ) అవసరం డయాలసిస్: ఈ ప్రక్రియ ద్వారా రక్తంలోని వ్యర్థాలనూ, విషాలతో కూడిన ద్రవాలను తొలగిస్తారు హీమో–డయాలసిస్: శరీరం వెలుపల అమర్చే యంత్రంతో వారానికి పలు మార్లు రక్తాన్ని వడ΄ోయడం పెరిటోనియల్ డయాలసిస్: కడుపులోని పెరిటోనియమ్ అనే పొరలో అమర్చే క్యాథటర్ (గొట్టం లాంటి పరికరం) సహాయంతో దేహంలోని వ్యర్థాలూ, విషాలను వడపోయడం చివరగా కిడ్నీ మార్పిడి చికిత్స : చనిపోయిన వ్యక్తి నుంచి సేకరించిన లేదా బతికే ఉన్న దగ్గరి బంధువైన దాత నుంచి తీసుకున్న కిడ్నీని బాధితులకు అమర్చేందుకు చేసే శస్త్రచికిత్స ఇది ∙ఇక టైప్ 1 మధుమేహంతో బాధపడే బాధితులకు కిడ్నీ–ప్రాంక్రియాస్ మార్పిడి చికిత్స కూడా ఒక ప్రత్యామ్నాయం కావచ్చు.మేనేజ్మెంట్ : పరిస్థితి డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి వరకు వెళ్లకూడదనుకునే బాధితులు ఎప్పటికప్పుడు వైద్యులు సూచించిన మందులు వాడుతూ, తమ బీపీ, చక్కెర మోతాదులు అదుపులో ఉండేలా చూసుకోవాలి.చివరగా... డయాబెటిక్ నెఫ్రోపతీ అనేది రివర్స్ చేయలేని తీవ్రమైన వేదన కలిగించే పరిస్థితి. డయాబెటిస్ను ఎప్పటికప్పుడు అదుపులో పెట్టుకోవడం, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం, జీవనశైలి మార్పులను క్రమశిక్షణతో అవలంబించడం, డాక్టర్ సూచనలను తప్పక పాటించడం వంటి జాగ్రత్తలతో చాలా ఖర్చుతో కూడినవీ లేదా బాధించేవైన డయాలసిస్, కిడ్నీ మార్పిడి వరకు వెళ్లకుండా జాగ్రత్త పడవచ్చని అవగాహన పెంచుకోవడమన్నది అవసరమని అందరూ గుర్తుంచుకోవాలి. మొదటి, రెండో దశల్లో... జీవనశైలిలో మార్పులు:రక్తంలో చక్కెరను అదుపులో ఉంచడం ( గ్లైసీమిక్ కంట్రోల్) : రక్తంలోని చక్కెర మోతాదులను పరిమిత స్థాయిలోనే ఉండేలా చూసేందుకు కొన్ని మందులు అవసరమైన వారికి ఇన్సులిన్ వంటివి ఇవ్వడం. రక్తపోటును అదుపు చేయడం (బీపీ కంట్రోల్) : ఏంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ (ఏసీఈ) ఇన్హిబిటర్స్ లేదా ఏంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్ సహాయంతో బీపీని 130 / 80 అనే కొలతకంటే తక్కువగా ఉండేలా మందులివ్వడం ఆహారంలో మార్పులు : తీసుకునే ఆహారంలో ఉప్పు మోతాదులు తగ్గించడం అలాగే ్ర΄ోటీన్ నియంత్రిత స్థాయిలోనే ఉండేలా జాగ్రత్త తీసుకోవడం వంటి జాగ్రత్తలు క్రమ తప్పకుండా చేసే వ్యాయామలు : బరువును ఆరోగ్యకరమైన పరిమితిలోనే ఉంచుకునేందుకు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం దురలవాట్లకు దూరంగా ఉండటం : పొగతాగడం, మద్యం వంటి అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండటం.డయాబెటిక్ నెఫ్రోపతీ లక్షణాలు సాధారణంగా డయాబెటిక్ నెఫ్రోపతీ తాలూకు మొదటి దశల్లో గుర్తించదగిన లక్షణాలేవీ కనిపించవు. అయితే జబ్బు పెరుగుతున్నకొద్దీ ఈ కింద పేర్కొన్న లక్షణాలూ, సూచనలూ కనిపించవచ్చు పాదాలు, చీలమండలు లేదా కళ్ల చుట్టూ ఉబ్బు లేదా వాపు (కిడ్నీల పనితీరు తగ్గడంతో దేహంలోని నీరు బయటకు పోలేకపోవడవంతో ఈ ఉబ్బు / వాపు కనిపిస్తుంది) అలసట, నీరసం, నిస్సత్తువ, బలహీనతఆకలి లేకపఓవడం లేదా వికారం మరీ ఎక్కువగాగానీ లేదా తక్కువగాగానీ జరిగే మూత్ర విసర్జన నురుగుతో కూడిన మూత్రం (ప్రోటీన్ నష్టం వల్ల)నిరంతరం అధిక రక్తపోటు (కన్సిస్టెంట్గా హైబీపీ)శ్వాస ఆడకపోవడం (దేహంలోని నీరు ఊపిరితిత్తుల్లో చేరడం వల్ల) ఈ లక్షణాలను గమనించినట్లయితే, కిడ్నీ వ్యాధి నిర్ధారణ కోసం వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.డయాబెటిక్ నెఫ్రోపతి చికిత్సలుదీనికి నిర్దిష్టంగా కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగానూ, వ్యక్తిగతంగానూ (పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్) చికిత్సలు ఉంటాయి. ఈ వైద్య చికిత్సల ద్వారా కిడ్నీ దెబ్బతినడం మరింత వేగంగా జరగకుండా చూడటంతోపాటు అప్పటికే దెబ్బతిన్నందున ఆరోగ్యంపై పడే ప్రతికూల ప్రభావాలను తగ్గించడమే లక్ష్యంగా చేస్తారు.ఇవీ వాడాల్సిన మందులు ఎస్జీఎల్టీ 2 ఇన్హిబిటర్లు (ఉదాహరణకు, డపాగ్లిఫ్లోజిన్, ఎంపాగ్లిఫ్లోజిన్); అలాగే జీఎల్పీ – 1 రిసెప్టర్ అగోనిస్ట్లు (ఉదాహరణకు లిరాగ్లూటైడ్, సెమాగ్లూటైడ్) అనేవి టైప్ 2 మధుమేహంతో బాధపడుతున్న బాధితుల్లో కిడ్నీ వ్యాధి మరింత వేగంగా పురోగమించకుండా చూడటంతోపాటు గుండెకు సంబంధించిన జబ్బులను తగ్గించడానికి ఉపయోగించే కొత్త మందులివి ఫైనెరెనోన్ (కెరెండియా) అనేది ఒక నాన్–స్టెరాయిడల్ మినరలో కార్టికాయిడ్ రిసెప్టర్ యాంటాగనిస్ట్ డ్రగ్. కిడ్నీ వైఫల్యమూ అలాగే గుండె సంబంధిత జబ్బుల వల్ల కలిగే ప్రమాదాలను తగ్గించడానికి వాడే మందు అధిక కొలెస్ట్రాల్ను అదుపు చేయడానికి స్టాట అనే మందులు. డాక్టర్ గంధె శ్రీధర్, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజీ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ (చదవండి: కూతురిని అలా చూసి..! ఆ తల్లిదండ్రుల రియాక్షన్ మాములుగా లేదుగా..!) -
రావోయి మా ఇంటికీ... టీ ఉన్నది... గరం గరం ఫుడ్ ఉన్నది!
‘అతిథి దేవోభవ’ అనే మాటకు కేరాఫ్ అడ్రస్ మన దేశం. ఈ మాటను మరోసారి నిజం చేసే వీడియో ఒకటి వైరల్గా మారింది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో రెండు మిలియన్ల వ్యూస్తో దూసుకుపోతోంది. అమెరికన్ వ్లోగర్ మాల్వీనా హిమాలయ ప్రాంలోని మారుమూల గ్రామానికి వెళ్లింది. ఎవరూ పరిచయం లేక΄ోయినా, ఏ ఇంటికి వెళ్లినా ఆమెకు గొప్ప ఆతిథ్యం దొరికింది. తమకు వచ్చిన ఇంగ్లీష్లోనే... ‘ప్లీజ్ డ్రింక్ టీ’ అన్నారు. ‘ప్లీజ్ టేక్ ఫుడ్’ అన్నారు. వీడియోలో... మాల్వీనా ఒక వృద్ధురాలిని పలకరిస్తుంది. ఆ మాటా ఈ మాటా మాట్లాడిన తరువాత మాల్వీనా బయలు దేరేముందు ‘భోజనం చేసి వెళ్లు’ అని పట్టుబడుతూ ఆ బామ్మ ఒకటికి రెండుసార్లు అడగడం నెటిజనులను కదిలించింది. ‘భోజనం వద్దు టీ చాలు’ అని అడిగింది మాల్వీనా. ఆప్యాయత, అనురాగాల రుచుల ఆ టీ ఎన్ని కోట్లు పెడితే మాత్రం వస్తుంది? ఏమంటారు మాల్వీనా! View this post on Instagram A post shared by Malvina (@malvinaisland)(చదవండి: కూతురిని అలా చూసి..! ఆ తల్లిదండ్రుల రియాక్షన్ మాములుగా లేదుగా..!) -
కూతురిని అలా చూసి..! ఆ తల్లిదండ్రుల రియాక్షన్ మాములుగా లేదుగా..!
మనల్ని సంతోషపరచడానికి పెద్ద పెద్ద విజయాలే అక్కర్లేదు. చిన్న చిన్న సందర్భాలు కూడా కారణం అని చెప్పడానికి ఈ వీడియో క్లిప్ ఉదాహరణ. మోడల్ నవ్య క్రిష్ణ తల్లిదండ్రులు తొలిసారిగా తమ కూతురి ఇమేజెస్ను బిల్బోర్డ్పై చూసి ఎంతో సంతోషించారు. నవ్య తల్లిదండ్రుల ఎక్స్ప్రెషన్లను ఈ వీడియో స్లోగా రికార్డ్ చేసింది. బిల్బోర్డ్పై కనిపించిన కూతురి ఫొటోగ్రాఫ్ని చూసి... ‘ఇది నిజమేనా? మన అమ్మాయేనా!!’ అన్నట్లుగా చూశారు. ఆ తరువాత వారి సంతోషానికి అవధి లేదు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వారి రియాక్షన్ తాలూకు వీడియో క్లిప్ నెటిజనులకు తెగనచ్చేసింది. ‘నా చిత్రాలు ఎన్నో బిల్బోర్డ్లపై కనిపించినప్పటికీ... ఇది మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. ఒకింత గర్వంతో, ఆనందంతో మెరిసిపోయే వారి కళ్లు నాకు అపురూపం’ అని తన పోస్ట్లో రాసింది నవ్య క్రిష్ణ. ‘పిల్లలు విజయాలు సాధించినప్పుడు తల్లిదండ్రుల కళ్లలో కనిపించే మెరుపు వెల కట్టలేనిది!’ అని స్పందించారు ఒక యూజర్. View this post on Instagram A post shared by ssnuk (@scrollstopnewsuk) (చదవండి: Bhavitha Mandava: వందేళ్ల ఫ్యాషన్ బ్రాండ్ 'షనెల్' ప్రత్యేకతలివే..! మన తెలుగమ్మాయి కారణంగా..) -
వందేళ్ల ఫ్యాషన్ బ్రాండ్ 'షనెల్' ప్రత్యేకతలివే..!
మన హైదరాబాద్ నుంచి న్యూయార్క్ వెళ్లిన భవిత మండవ అనే అమ్మాయి మోడలింగ్లో సంచలనాలు సృష్టిస్తోంది. న్యూయార్క్ సిటీలో జరిగిన షనెల్ మెతీర్స్ దార్-2026 కలెక్షన్లో ర్యాంప్ను ఓపెన్ చేసి ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త స్టార్గా నిలిచింది. ర్యాంప్ను ఓపెన్ చేయడం అంటే.. షోను ప్రారంభించే స్టార్ మోడల్గా అందరు మోడళ్ల కంటే ముందుగా వాక్ చేయడం. ఒక తెలుగమ్మాయి ఈ ఘనతను సాధించడంతో ఒక్కసారిగా ఏంటీ షనెల్ మోతీర్స్ దార్ షో, దాని స్పెషాలిటీ గురించి ఆరాలు మొదలయ్యాయి. ఈ నేఫథ్యంలో ప్రఖ్యాతిగాంచిన దిగ్గజ ఫ్యాషన్ బ్రాండ్ 'షనెల్' ప్రత్యేకత గురించి సవివరంగా తెలుసుకుందామా..మెతీర్స్ దార్ (Métiers d'Art) అంటే ఫ్రెంచ్ భాషలో దీని అర్థం "కళల లేదా హస్తకళలు". ఈ ఫ్యాషన్ షోను షనెల్ నిర్వహిస్తోంది. ఈ ఫ్యాషన్ షో ప్రత్యేకత..సంప్రదాయ హస్తకళల నైపుణ్యాలను, వాటిని సృష్టించే కళాకారుల గురించి ప్రపంచానికి పరిచయం చేయడం, వాటికి గుర్తింపు తీసుకురావడమే ఈ షో ప్రధాన ముఖ్యోద్దేశం. ఇక ఈ షోలో అత్యంత క్లిష్టమైన ఎంబ్రాయిడరీ, ఫెదర్ వర్క్, జ్యువెలరీ, లెదర్ వర్క్ వంటి కలెక్షన్లను ప్రదర్శిస్తారు. View this post on Instagram A post shared by Bhavitha Mandava (@bhavithamandava) వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన బ్రాండ్..షనెల్ అనేది 1910లో ఫ్రెంచ్ మహిళా ఫ్యాషన్ డిజైనర్ గాబ్రియెల్ కోకో షనెల్ స్థాపించిన లగ్జరీ ఫ్యాషన్ హౌస్. ఇది మహిళల శైలిలో చక్కదనం, సరళత, కాలాతీత డిజైన్లో విప్లవాత్మక మార్పులను తీసుకురావడం తదితరాలకు సంబంధించి ప్రసిద్ధి చెందింది. దీన్ని 1910లో పారిస్, ఫ్రాన్స్ దేశాలలో ఈ షెనల్ బ్రాండ్ని స్థాపించారు ఫ్రెంచ్ మహిళా డిజైనర్ కోకో. దీని ప్రధాన కార్యాలయం లండన్. దీనికి ప్రపంచవ్యాప్తంగా బోటిక్లు కూడా ఉన్నాయి. ఇది హాట్ కోచర్ , రెడీ టు వేర్ దుస్తులు, హ్యాండ్ బ్యాగులు, పలు ఫ్యాషన్ ఉపకరణాలు, వాచ్లు, చక్కటి ఆభరణాలు, పెర్ఫ్యూమ్ తదితర సౌందర్య సాధానాలను ప్రమోట్ చేస్తుంది. ఈ బ్రాండ్ ఐకానిక్ క్రియేషన్స్..చానెల్ నం. 5 పెర్ఫ్యూమ్ (1921) - ఇప్పటివరకు అత్యంత ప్రసిద్ధ సువాసనలలో ఒకటి.చానెల్ సూట్ - మహిళలకు ఆధునిక చక్కదననానికి సింబల్ది లిటిల్ బ్లాక్ డ్రెస్ - ఫ్యాషన్లో ప్రధానమైనదిగా మారిన కోకో చానెల్ ఆవిష్కరణ.2.55 హ్యాండ్బ్యాగ్ - చైన్ స్ట్రాప్తో క్విల్టెడ్ లెదర్, ఇప్పటికీ ప్రపంచం మెచ్చిన హ్యాండ్బ్యాగ్గా పేరుతెచ్చుకుంది.ప్రత్యేకతలు..ఫ్యాషన్లో పలు విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మహిళలను స్వేచ్ఛగా తమ ఫ్యాషన్ను వ్యక్తపరిచే అవకాశాన్ని ఇచ్చింది. అలాగే సౌకర్యవంతంగా దుస్తులన ధరించడాన్ని పరిచయం చేసింది. ఇది ఆధునాతనకు పెద్దపీట వేస్తూనే..సంప్రదాయ కళా నైపుణ్యాన్ని ప్రోత్సహించడమే గాక సాధికారతను కూడా సూచించింది. అంతేగాదు ఎంబ్రాయిడీరీ, ప్లీటింగ్ నగల తయారీతో కళాకారుల నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా సుమారు 500కుపైనే బోటిక్లతో త్వరితగతిన అత్యంత గుర్తింపు పొందిన లగ్జరీ బ్రాండ్లలో ఒకటిగా పేరుతెచ్చుకుంది. ఈ బ్రాండ్ సీఈవో లీనా నాయర్ మన భారతీయ మూలాలకు చెందినవాడు కావడం విశేషం. క్రియేటివ్ డైరెక్టర్ మాథ్యూ బ్లేజీ తన సృజనాత్మక ఫ్యాషన్ ఆవిష్కరణలతో ఈ షనెల్ ప్రభావాన్ని మరింత విస్తరింప చేస్తూనే ఉన్నారు. View this post on Instagram A post shared by @ideservecouture (చదవండి: అంతర్జాతీయ మోడల్గా హైదరాబాదీ.. ట్రెండింగ్లో భవితా మండవ) -
ఈ వారం కథ: సముద్రం
మలక్కా జలసంధి ..మలయా ద్వీపకల్పం సుమత్రా ద్వీపానికి మధ్య ఉన్న 930 కిలోమీటర్లు ఉన్న జలసంధి.అక్కడ నుండి పశ్చిమానికి 90 మైళ్ళ దూరంలో ఒక ఓడ ఆగి ఉంది. ఆ ఓడ మీద ఒక నలజెండా ఎగురుతూ ఉంది. దాని మీద ఒక పుర్రెబొమ్మ ఉంది.ఆ ఓడలో సుమారు ఒక ఇరవై మంది వరకు ఉన్నారు. ఓడ డెక్ మీద కూర్చున్న వారందరూ ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుంది వాళ్ళ వాలకం. వారందరి చేతుల్లోనూ పుర్రెలతో తయారు చేసిన మద్యం గ్లాసులు ఉన్నాయి. వాటిల్లో పోసిన ‘రమ్’ తాగుతూ వినోదిస్తున్నారు.ఇంతలో ఒక పెద్ద అల వచ్చి ఆ డెక్ మీదకు కొన్ని చేపలను విసిరేసి సముద్రంలో కలిసిపోయింది.చెవులకు రింగు పెట్టుకుని; తలకు నల్లటి పాగా కట్టుకుని, ఆ పాగాలో పిడిబాకు ఉంచిన ఒక వ్యక్తి తన పక్కన పడి ఉన్న పెద్దచేపను చేతిలోకి తీసుకున్నాడు.దాని నోరు తెరిచి, తాను తాగుతున్న రమ్ను నోటిలో పోశాడు. తర్వాత దాన్ని నోటిలో పెట్టుకుని నమలసాగాడు.అదంతా చూస్తున్న మిగిలిన అందరూ ‘హే నాయకా’ అంటూ అరవసాగారు. వాళ్ళందరూ అలా అరుస్తున్న సమయంలో సముద్రంలో ఈదుకుంటూ వచ్చిన ఒక వ్యక్తి డెక్ మీదకు వచ్చాడు. అందరూ నిశ్శబ్దమై పోయారు. ‘నాయకా!’ అంటూ అతడికి సలాం చేశాడు.తరువాత తాను తెచ్చిన వివరాలతో ఒక మ్యాప్ అతడికి అందించాడు. అది చూసిన అతడు ‘మన ఓడను ఇక్కడి నుంచి ఉత్తరం దిశగా మళ్లించండి. మనం ఎదురు చూస్తున్న నౌక ఇంకొన్ని గంటల్లో బయల్దేరుతుంది’ అని ఆజ్ఞాపించాడు. ఓడ ముందుకు కదిలింది.అందరూ తమ వద్ద ఉన్న పిడిబాకులను తుపాకులను, కత్తులను పట్టుకుని ఉన్నారు. వారందరూ తమ నాయకుడి ఆజ్ఞ కోసం సిద్ధంగా ఉన్నారు.వారందరూ స ..ము ..ద్ర.. పు .. దొం.. గ.. లు ... పైరేట్స్!సాల్ శెట్టి ద్వీపం..దేశంలో అత్యంత రద్దీగా ఉండే ముంబై ఓడరేవు.కదలడానికి సిద్ధంగా ఉన్న కార్గో నౌకలతో; సముద్రతీరానికి చేరుకుంటున్న ఇతర నౌకలతో; ప్రయాణికులతో; అటు ఇటు తిరుగుతూ తమతమ విధులు నిర్వర్తిస్తున్న ఓడల సిబ్బందితో కిటకిటలాడుతోంది.తీరంలో కొద్దిదూరంలో ఒక పెద్ద నౌక లంగరు వేసి ఉంది. అది ముంబై తీరం నుంచి సింగపూర్ వరకు ప్రయాణించే క్రూజ్ షిప్ అయిన ‘రాయల్ డైమండ్ డాన్’.ప్రయాణికులందరూ ఒక్కొక్కరుగా ఓడలోకి వెళ్తున్నారు. ఎంట్ర¯Œ ్స వద్ద వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే వారిని డెక్ మీదకు పంపిస్తున్నారు.ఓడ ఎక్కబోయే ముందు ఒక అందమైన యువతి ఫోన్ మాట్లాడుతూ అక్కడ నిలబడి ఉంది. మాట్లాడుతూ మాట్లాడుతూ యథాలాపంగా ముందుకు చూసింది. అక్కడ ఒక వ్యక్తి తన వద్దకే వస్తున్నట్టు ఆమెకు అనిపించింది. ఆ వ్యక్తి కలర్ గాగుల్స్ ధరించి, జేబుల్లో చేతులు పెట్టుకుని ముందుకు వస్తున్నాడు. తల పైకెత్తి ఓడను చూస్తూ వస్తున్నట్టు ఆమెకు అర్థమైంది.ఈలోగా ఆ గాగుల్స్ ఉన్న వ్యక్తి వచ్చి ఆమెను ఢీ కొట్టాడు. ఆ ఢీ కొట్టడంతో ఆమె పట్టుకున్న ఫోన్, అతను పెట్టుకున్న గాగుల్స్ ఒకేసారి కింద పడిపోయాయి. ‘ఏయ్ మిస్టర్ కళ్ళు పైకి పెట్టుకుని నడిస్తే ఇలాగే ఉంటుంది.’ అంటూ తన ఫోన్ కోసం కిందకు వంగింది. ‘సారీ మిస్’ అంటూ ఆ వ్యక్తి కూడా గాగుల్స్ కోసం కిందకు వంగాడు. అదే సమయంలో ఇద్దరి తలలు మరోసారి ఢీ కొట్టుకున్నాయి.అబ్బా అనుకుంటూ పైకి లేచింది ఆ యువతి. ‘ఏయ్ మిస్టర్ ఇలాంటి పెద్ద ఓడను ఎప్పుడూ చూడలేదా?’చిరుకోపంగా అడిగింది. ‘ఇప్పుడే మొదటిసారి ఇంత పెద్ద ఓడను చూస్తున్నాను.’ అమాయకంగా మొహం పెట్టి ఆమెకు బదులిచ్చాడు. అతడి కళ్ళు అల్లరిగా నవ్వుతున్నాయి.ఆమెను చూస్తూ ‘మీరు చాలా అందంగా ఉన్నారు. మిస్ ఇంటర్నేషనల్ పోటీలకు బాగా సరిపోతారు’ అని ముందుకు నడుస్తూ చెప్పాడు అతడు.‘అయినా నేను సింగపూర్లో జరిగే మిస్ ఇంటర్నేషనల్ పోటీలకు వెళ్తున్నట్టు ఇతడికి అర్థమైందా?’ మనసులో అనుకుంటూ, ‘మిస్టర్ పోకిరి’ అనుకుంది ఆమె.తరువాత ఓడ ఎక్కడానికి వెళ్ళింది. మిస్టర్ పోకిరి కూడా డెక్ మీదకు చేరుకున్నాడు.అరగంట తర్వాత మెల్లిగా ‘రాయల్ డైమండ్ డాన్’ అరేబియా సముద్ర జలాల్లో ముందుకు కదిలి క్రమేణా వేగం పుంజుకుంది.ఇండియన్ నేవీ హెడ్ క్వార్టర్స్...ఒక బులెట్ ప్రూఫ్ కారు శరవేగంగా వచ్చి ఆ భవనం ముందు ఆగింది. అందులోంచి ఒక వ్యక్తి కిందకు దిగాడు. ఆ వ్యక్తి మొహంలో ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అతడిని చూడగానే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది ‘సెల్యూట్’ చేస్తున్నారు. కాని, అదంతా పట్టించుకోని ఆ వ్యక్తి పరిగెడుతున్నట్టే లోపలకు అడుగు పెట్టాడు.నాలుగు అంతస్తులున్న ఆ భవనంలో మూడవ అంతస్తులో ఉన్న సౌత్ బ్లాక్ వింగ్. లిఫ్ట్ కోసం చూడకుండా క్షణానికి రెండు మెట్లు ఎక్కుతూ వింగ్లోకి దూసుకుపోయాడు.సౌండ్ ప్రూఫ్ గది అయిన ఆ గదిలోకి దూసుకువచ్చిన ఆ వ్యక్తిని చూశాడు నేవీ చీఫ్ అగర్వాల్. తన నోట్లో ఉన్న సిగార్ను బయటకు తీస్తూ ఆ వ్యక్తి వంక చూశాడు. ఆ వ్యక్తి నేవీ ఆఫీసర్ తరుణ్ మిశ్రా.‘బాస్! అక్కడ దాడి జరగబోతోంది. రాయల్ డైమండ్ డాన్ నౌకను పైరేట్స్ ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నారని మనకు రహస్య సమాచారం అందింది. వెంటనే మన వాళ్ళను అలెర్ట్ చేయకపోతే నౌకలో ఉన్న ప్రయాణికులను సముద్ర దొంగలు ప్రాణాలతో వదిలిపెట్టరు.’ తరుణ్ కంగారుగా చెప్పాడు.అంతా వింటున్న అగర్వాల్ ఏమీ మాట్లాడకుండా మళ్లీ సిగార్ నోట్లో పెట్టుకుని, పైకి లేచాడు. అతడిని చూస్తూ .. ‘ఈ సమాచారం నాకు కొన్ని గంటల కిందటే వచ్చింది’ అన్నాడు తాపీగా.‘బాస్! మరిప్పుడు డైమండ్ డాన్ నౌకను కాపాడటం ఎలా?’ ఆందోళనగా అడిగాడు.‘మరేం పర్వాలేదు. సముద్రదొంగలను వెంటాడి వేటాడడానికి మన మెరైన్ కమాండో విజయ్ రాణా– డైమండ్ డాన్ నౌకలో ఉన్నాడనే సమాచారం కూడా వచ్చింది. పదిహేను రోజులు సెలవు తీసుకున్న విజయ్ ఆ షిప్లో వెళ్తున్నాడని తెలిసింది’ అన్నాడు.ఆ మాటలు వినగానే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు తరుణ్ మిశ్రా. తమ చీఫ్ కంగారు లేకుండా అలా తాపీగా ఎందుకున్నాడో అర్థమైంది.అనంత సాగర జలాలలో ‘డైమండ్ డాన్’ నౌక 2 నాటికల్ మైళ్ళ వేగంతో ప్రయాణిస్తోంది. ప్రయాణికుల్లో కొంతమంది తమ తమ క్యాబిన్లలో ఉండిపోయారు. కొంతమంది నౌకలో ఉన్న ఫుడ్ కోర్ట్స్లో– నౌకను చూడాలని కుతూహలంతో ఇలా ఎవరికి వారు తమతమ పనులలో ఉన్నారు.‘డైమండ్ డాన్ రెస్టారెంట్’ తాటికాయలంత మెరిసే అక్షరాలతో రాసిన పేరుని చూస్తూ లోపలికి అడుగు పెట్టాడు మిస్టర్ పోకిరి. అలా అడుగుపెట్టగానే అతడి కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. కారణం అక్కడ మిస్ ఇంటర్నేషనల్ ఫుడ్ తింటూ కూర్చుని ఉంది. ఆమెను చూడగానే ‘ఈ బ్రహ్మచారి జీవితం ఈ భామకే అంకితం’ అని పాడుతూ.. ఫుడ్ తీసుకుని వెళ్లి ఆమె ముందు కూర్చున్నాడు. ఆమె అతడిని కళ్ళెత్తి చూసి ‘ఇక్కడకు కూడా వచ్చేసాడు మిస్టర్ పోకిరి’ అనుకుంటూ తినడం మొదలెట్టింది.‘హలో మిస్! నేను మిస్టర్ బ్రహ్మచారిని మాత్రమే కాని, పోకిరిని మాత్రం కాదు’ అన్నాడు. తినడం మొదలుపెడుతూ.తాను మనసులో అనుకున్న మాటలు ఇతడికెలా తెలిశాయనుకుంటూ ఆమె ఆశ్చర్యపోయింది.ఉన్నట్టుండి తమను ఎవరో గమనిస్తున్నట్టు బలంగా అనిపించసాగింది అతడికి.వెంటనే అతడు అలెర్ట్ అయ్యాడు. కనుచివరల నుంచి చుట్టూ గమనించాడు. అందరూ ఎవరి పనుల్లో వారున్నారు కాని, మిస్ ఇంటర్నేషనల్ వెనుక ఉన్న కుర్చీల్లో ఉన్నవారు యథాలాపంగా తమనే గమనిస్తున్నారు.వారు మొత్తం నలుగురు ఉన్నారు. ఏదో తింటూ, తాగుతూ కనురెప్ప వేయకుండా ఆమెనేచూస్తున్నారు. ఆమె తినడం ముగించి, లేచి బయటకు నడిచింది. మిస్టర్ పోకిరి కూడా లేచి, ఆమె వెనుక వెళ్ళడానికి అన్నట్టుగా ముందుకు కదిలాడు.అంతలో ఆ గమనిస్తున్నవారిలో ఒకడు అతడి వద్దకు అడ్డుగా వచ్చాడు. వాడిని చూసిన మిస్టర్ పోకిరి ‘ఎవరు బాస్ నువ్వు? అడ్డు తప్పుకో’ అన్నాడు మిస్ ఇంటర్నేషనల్ వెళ్లిన వైపుగా చూస్తూ...వాడితో ఉన్న మిగిలిన ముగ్గురూ మిస్టర్ పోకిరిని చుట్టుముట్టారు. అప్పుడు గమనించాడు వారందరినీ... వారి వాలకం... వారి మాటల్లో కరుకుదనం... వారి బలిష్టమైన చేతులు... శరీరాలు కనుచివరల నుంచి గమనించాడు అతడు. అక్కడ ఉన్న నలుగురూ అదే తీరులో ఉన్నారు.వాళ్లెవరో అతడికి అర్థమైపోయింది. ఒక్కసారిగా గుండె ఝల్లుమంది. చుట్టూ చూశాడు. స్త్రీలు, చిన్నపిల్లలతో సహా నౌకలో చాలామంది అక్కడున్నారు.వారందరినీ వీళ్ళు చుట్టుముడితే? అసలు వీళ్ళు నౌకలోకి ఎలా రాగలిగారు?ఎంతమంది వచ్చారు? ఆలోచిస్తూ అక్కడి నుంచి ముందుకు కదిలాడు మిస్టర్ పోకిరి.ఆలోచిస్తూ డెక్ మీదకు వచ్చాడు.అప్పటికే అక్కడ మిస్ ఇంటర్నేషనల్ డెక్ మీద నిలబడి సముద్రాన్ని చూస్తోంది.అతడిని చూడగానే ఆమె ‘వచ్చేశాడు మిస్టర్ పోకిరి’ అని మనసులోనే తిట్టుకుంది.కాని, అతడి ఆలోచనలు వేరుగా ఉన్నాయి. అతడి మెదడు శరవేగంగా ఆలోచిస్తోంది.అతడి వెనగ్గా వచ్చిన నలుగురిలో ఇద్దరు వ్యక్తులు ఆమెను చుట్టుముట్టారు.అది చూసిన మిస్టర్ పోకిరి ఆమె చేయి పట్టుకుని ముందుకు పరుగు తీశాడు.వాళ్లిద్దరూ డెక్ చివరిభాగానికి చేరుకున్నారు. అక్కడ ఆ సమయంలో ఎవరూ లేరు.తమను చుట్టుముట్టిన ఆ ఇద్దరినీ మిస్టర్ పోకిరి గాలిలోకి డైవ్ చేస్తూ, ఊహించని వేగంతో ఒక్కసారిగా తన్నాడు. ఆ వేగానికి వాళ్లిద్దరూ అల్లంతదూరంలో పడ్డారు.పైకి లేచి అక్కడినుంచి పారిపోయారు. వారిని చూసి మిగిలిన ఇద్దరు కూడా అక్కడినుంచి జారుకున్నారు. అదే సమయంలో అతడి షూ నుంచి జారిపడిన ఐడీ కార్డును చేతిలోకి తీసుకున్న మిస్ ఇంటర్నేషనల్ ఆ కార్డు చూసి, స్థాణువులా అలా నిలబడిపోయింది.ఆమె ముందుకు వచ్చిన మిస్టర్ పోకిరి ‘హలో మిస్!’ అన్నాడు.ఆ మాటలకు ఉలిక్కిపడి తేరుకున్న ఆమె ‘మీరు మెరైన్ కమాండో విజయ్ రాణా’... అంటూ ఆగిపోయింది.తాను మిస్టర్ పోకిరి అనుకుంటున్నవాడు విజయ్ రాణా నా? అతడి గురించి తాను ఎన్నోసార్లు విని ఉంది. ఎన్నో నౌకలను, ఎందరో ప్రయాణికులను కాపాడటంలో విజయ్ రాణాను మించిన సాహసవంతుడు ఎవరూ లేరని ఎన్నోసార్లు విని ఉంది. అలాంటి వ్యక్తి తన ఎదురుగా తనతో పాటే ఉంటూ తనను కాపాడటం అనేది ఆమెకు నమ్మశక్యం కాకుండా ఉంది. ‘హలో మిస్!’... చిటికె వేస్తూ మళ్ళీ పిలిచాడు విజయ్ రాణా. తేరుకున్న ఆమె ‘నా పేరు అర్చన. మనదేశం తరపున నేను సింగపూర్లో జరిగే మిస్ ఇంటర్నేషనల్ పోటీలకు వెళ్తున్నాను’ అన్నది.‘మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎందుకు వెళ్తున్నారో అంతా నాకు తెలుసు’ అన్నాడు విజయ్ రాణా.ఆ మాటలకు అర్చన ఆశ్చర్యంగా ఉండిపోయింది.‘అర్చనా! మనం ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నాం. ఈ నౌకలో ఉన్న ప్రయాణికులందరినీ కాపాడాలి. నువ్వు వెంటనే నీ కేబిన్లోకి వెళ్ళిపో, క్విక్!’ అంటూ అక్కడి నుంచి ముందుకు కదిలాడు విజయ్ రాణా.అర్చన ‘ఏమైంది?’ అని అడిగింది. వెళ్తూ వెళ్తూ ‘ఈ నౌకలో సముద్రపు దొంగలున్నారు’... చెబుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విజయ్ రాణా.∙∙ దెబ్బ తిన్న దొంగలు కచ్చితంగా ఊరికే ఉండరు. ప్రయాణికులను భయపెట్టడమో, దోచుకోవడమో చేసే పనిలో తప్పకుండా ఉంటారని అనుకున్నాడు విజయ్ రాణా. ముందు ఈ నౌకలోకి పైరేట్స్ ఎంతమంది వచ్చారో తెలుసుకోవాలనుకుంటూ నౌక కెప్టెన్ శ్రీకర్ వద్దకు వెళ్ళాడు.‘కెప్టెన్ మన నౌకలో సముద్రపు దొంగలు ప్రవేశించారు. వారెంతమంది ఉన్నారో మొదటగా తెలుసుకోవాలి. తరువాత వారినెలా ఎదుర్కోవాలో చూద్దాం’ అన్న రాణా మాటలకు శ్రీకర్ అదిరిపడ్డాడు.‘అట్టే సమయం లేదు’ అని చెబుతున్న రాణా మాటలకు శ్రీకర్ వెంటనే వెళ్లి, నౌకలో ఉన్న కెమెరాల ఫుటేజీ మొత్తం విజయ్ రాణాకు చూపించసాగాడు.కిందటి రాత్రి నౌక ఒకచోట లంగరు వేసినప్పుడు లంగరు కోసం ఉపయోగించిన మోకులాంటి తాడు ద్వారా వాళ్ళందరూ నౌకలోకి సాధారణ ప్రయాణికుల రూపంలో వచ్చారు. వాళ్ళు సుమారు ఇరవై మంది వరకు ఉన్నారని కనిపెట్టాడు విజయ్ రాణా.అది చూడగానే వెంటనే, నౌకలో సిబ్బందిని ఆపదలో ఉన్నప్పుడు అలెర్ట్ చేసే అలారం మోగించాడు.శ్రీకర్ వెంటనే ‘మీరు విజయ్ రాణా కదా!’ అడిగాడు. చిరునవ్వుతో ఔనన్నట్లుగా తలాడించి, అక్కడినుంచి వెళ్ళిపోయాడు.ఇక ఎంతమంది సముద్రపుదొంగలు దాడి చేసినా తమకు ఎలాంటి భయం లేదనుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళాడు శ్రీకర్. అతను లోపలకు రాగానే అక్కడే ఉన్న దొంగల నాయకుడు అతడికి తుపాకీ గురి పెట్టాడు. తరువాత అతడిని బందీగా చేసుకుని, నౌకను దారి మళ్ళించమని ఆదేశించాడు.అలారం మోగగానే నౌకలో పై అంతస్తులలో ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ప్రమాదాన్ని శంకించారు. అన్ని క్యాబిన్లకు ఉన్న లాక్ సిస్టమ్ను ఫ్రీజ్ చేసేశారు. దాని వల్ల లోపల ఉన్నవాళ్లు బయటకు రాలేరు. బయట వాళ్ళు లోపలికి పోలేరు. కాని, భయంతో కేకలు వేస్తున్న మిగిలిన ప్రయాణికులను సముద్రపు దొంగలు చుట్టుముట్టి, అందరి తలలకు తుపాకులు ఎక్కుపెట్టారు. అందరినీ నౌక డెక్ మీదకు తీసుకు వచ్చారు. వారిలో సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నారు. డెక్ మీద ప్రయాణికులందరినీ నిలబెట్టారు. వారి చుట్టూ దొంగలు చుట్టుముట్టి ఉన్నారు.కెప్టెన్ శ్రీకర్ కాబిన్... దొంగల నాయకుడు అతడి పక్కనే ఉండి తలకు తుపాకీ గురిపెట్టి ఉన్నాడు. నౌకను తనకు ఇష్టం వచ్చిన దిశలో మళ్లిస్తున్నాడు.శ్రీకర్ చేసేదేమీ లేక అతడు చెప్పినట్టుగానే నౌకను నడుపుతున్నాడు.ఇంతలో ఒక్కసారిగా దొంగలనాయకుడు దూరంగా ఎగిరి పడ్డాడు. అతడి చేతిలోని తుపాకీ అల్లంత దూరంలో ఎగిరి పడింది.మెరుపువేగంతో కదిలి ఆ తుపాకీని అందుకున్నాడు విజయ్ రాణా. దొంగల నాయకుడిని ఇద్దరూ కలిసి పెడరెక్కలు విరిచి కట్టారు. అతడిని చెరోపక్క పట్టుకున్న విజయ్ రాణా, శ్రీకర్ డెక్ మీదకు వచ్చారు.అక్కడ తమ నాయకుడి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్న దొంగలందరూ ఆ దృశ్యాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు.దొంగలనాయకుడి తలకు తుపాకీ గురిపెట్టిన విజయ్ వారిని చూస్తూ, ‘అందరూ మీ తుపాకులను, కత్తులను పక్కన పెట్టండి. లేకుంటే మీ నాయకుడి ప్రాణాలకు ముప్పు వస్తుంది’ అన్నాడు.దొంగలందరూ కలిసి తమ తుపాకులను, కత్తులను ఒక చోట పెట్టారు. ‘అందరినీ వదిలేయండి. లేకపోతే...’ అన్నాడు శ్రీకర్.అందరినీ వదిలి దొంగలందరూ ఒకపక్కగా వచ్చారు. వారిని అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది బంధించారు. అదే సమయంలో తప్పించుకున్న దొంగల నాయకుడు ముందుకు వేగంగా కదిలి తన తలపాగాలో దాచి ఉన్న పిడిబాకును బయటకు తీసి దగ్గరలో ఉన్న అర్చనను ముందుకు లాగి, ఆమె కంఠానికి గురి పెట్టాడు.అది చూసిన విజయ్ రాణా కదలకుండా అక్కడే ఆగిపోయాడు.‘మర్యాదగా మమ్మల్ని ఇక్కడనుండి వెళ్లనివ్వండి. లేకపోతే ఈ అమ్మాయిని చంపేస్తాను’ అన్నాడు దొంగల నాయకుడు.అందరూ అక్కడే ఆగిపోయారు. దొంగలందరినీ వదిలిపెట్టారు. అర్చనను ముందుకు తీసుకెళ్తున్నాడు దొంగలనాయకుడు. విజయ్ రాణా ఊహించని మెరుపువేగంతో కదిలి, దొంగలనాయకుడిని వెనుక నుంచి ఒక్క తోపు తోశాడు. ఆ దెబ్బకు దొంగల నాయకుడు ముందుకు తూలి పడిపోయాడు. కాని, రెప్పపాటులో మిగిలిన దొంగలందరూ అర్చనను చుట్టుముట్టారు. ఆమెను మధ్యలో పెట్టుకుని ముందుకు నడుస్తున్నారు.పైకి లేచిన దొంగలనాయకుడు విజయ్ రాణాను చూసి, వికటంగా నవ్వుతూ ముందుకు కదిలాడు.వారందరూ కలిసి డెక్ అంచుల వరకు వెళ్లారు. అర్చనను తీసుకుని సముద్రంలో ఉన్న తమ మరపడవలో వెళ్లిపోవాలని దొంగల నాయకుడు మిగిలినవారిని ఆదేశించాడు.అలాగే చూస్తూ ఉండిపోయిన విజయ్ రాణా మెరుపువేగంతో కదిలాడు. అతడు ఏం చేస్తాడా అని అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. రెప్పపాటు వేగంలో డెక్ దగ్గరకు చేరుకోవడం... ఒక పెద్ద రాకాసి అల ఉవ్వెత్తున లేచి డెక్ మీదకు ఉరకడం రెండు ఒకేసారి జరిగాయి.అల ధాటికి కొట్టుకుపోతున్న అర్చనను ఒక చేత్తో గట్టిగా హత్తుకుని, డెక్ మీద ఉన్న బలమైన ఉక్కు పైపును మరొకచేత్తో గట్టిగా పట్టుకున్నాడు విజయ్ రాణా.ఆ అల ధాటికి సముద్రంలోకి కొంతమంది దొంగలు కొట్టుకుపోగా, మిగిలినవారిని అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది బంధించారు. సముద్రపు దొంగల దాడికి గురైన నౌకలో ఉన్న ప్రయాణికులను ప్రత్యేక భద్రతతో ఇండియాకు తిరిగి పంపిస్తున్నారు. ఆ నౌక డెక్ మీద విజయ్ రాణా పక్కన అర్చన కూడా ఉంది.ఆమెను చూస్తూ ‘మిస్ ఇంటర్నేషనల్ పోటీలు మిస్ అయిపోయావు’ అన్నాడు విజయ్ రాణా. ‘ఈ మిస్టర్ పోకిరికి మిసెస్ కావాలని.. కావాలనే ఆ పోటీలు మిస్ చేసుకున్నాను’ అన్నది అతడిని చుట్టేసి, అతని ప్రేమకు, సాహసానికి బందీ అవుతూ... ∙శ్రీసుధామయి -
కథాకళి: వన్ బై టు
గత ఆరేళ్ళుగా ఓ కార్పొరేట్ హాస్పిటల్లో నర్స్గా పని చేస్తున్న అద్విత ఆరోజు అంబులెన్స్లో ఓ ఫామ్ హౌస్కి వెళ్ళింది. ఆ ఇంటి సర్వెంట్ మెయిడ్ చెప్పింది.‘‘అతను మా సార్ డ్రైవర్. వెనక ఔట్ హౌస్లో ఉంటాడు. కారు సిద్ధం చేయమని చెప్పడానికి వెళ్ళి చూస్తే, అపస్మారకంగా కనిపించాడు. సార్కి చెప్తే మీకు ఫోన్ చేయమన్నారు.’’‘‘అతనికి ఎవరైనా ఉన్నారా?’’ ఆమె వెంట నడుస్తూ అద్విత అడిగింది.‘‘లేరు. బ్రహ్మచారి. ‘జీతం బానే వస్తుంది. పెళ్ళి చేసుకోలేదే’మని అడిగితే ఓ నవ్వు నవ్వుతాడు తప్ప జవాబు చెప్పడు.’’స్ట్రెచర్తో ఇద్దరు పేరామెడిక్స్ వారిని అనుసరించారు. సర్వెంట్ మెయిడ్ వాళ్ళని ఫామ్ హౌస్ వెనక ఉన్న పెంకుటింటికి తీసుకెళ్ళింది. అద్విత ఇనుప బద్దీలకి అల్లిన ప్లాస్టిక్ నవారు మంచం మీది సన్నటి పరుపు మీద స్పృహలో లేని రోగిని, ఓ మూల ఉన్న డంబెల్స్ని చూసింది.‘‘ఇతని వయసు తెలుసా?’’ అద్విత అతని బీపీని చూస్తూ అడిగింది.‘‘రాబోయే నెలకి ముప్ఫై ఒకటి వస్తాయి అనుకుంటా.’’‘‘బీపీ బాగా పడిపోయింది. హార్ట్ ఎటాక్. గుండె బలహీనంగా కొట్టుకుంటోంది. ఇతన్ని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి.’’ స్టెతస్కోప్తో అతని గుండె చప్పుడుని విని, అతనికో ఇంజక్షన్ ఇచ్చి చెప్పింది. ‘‘రోజూ ఎక్సర్సైజ్ చేస్తాడు. చెడ్డ అలవాట్లు లేవు. కాఫీ, టీలు కూడా తాగడు. టీ ఇస్తానంటే, ఒంటరిగా తాగను అంటాడు. ‘నాతో కలిసి తాగు’ అంటే నీతో కాదు అంటాడు. అయినా ఇదేం ఖర్మ?’’‘‘ఈ రోజుల్లో సంపూర్ణ ఆరోగ్యం కూడా ఓ రోగమే. చెడ్డ అలవాట్లు లేని కన్నడ నటుడు శివరాజ్ కుమార్కి చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ వచ్చి పోలా?’’అంబులెన్ ్సలో వెళ్ళేప్పుడు అతను కళ్ళు తెరిచి చూసి మూసుకున్నాడు. కాని వెంటనే మళ్ళీ కళ్ళు తెరచి అద్వితని చూశాడు. అతని మొహంలో బలహీనమైన చిరునవ్వు. ఏదో మాట్లాడాడు. కాని అది వినపడకపోవడంతో ఆమె తన చెవిని అతని నోటి దగ్గరికి తీసుకెళ్ళింది.‘‘నిన్ను చూస్తే సంతోషం వేస్తోంది.’’ బలహీనంగా వినిపించింది.‘‘ఫర్వాలేదు. భయపడక. నీకేం కాదు.’’ అతని భుజం తట్టి చెప్పింది.‘‘నర్స్గా కాదు సంతోషం.’’హాస్పిటల్కి చేరుకున్నాక అతన్ని ఎమర్జెన్సీ రూమ్కి షిఫ్ట్ చేయడంతో అద్విత బాధ్యత పూర్తయింది.అరగంట తర్వాత ఓ నర్స్ వచ్చి చెప్పింది.‘‘జూనియర్ డాక్టర్గారు నిన్ను రమ్మంటున్నారు.’’అక్కడికి వెళ్ళాక కార్డియాక్ మానిటర్ని చూసి, అతని గుండె ఎంత బలహీనంగా కొట్టుకుంటోందో గ్రహించింది.‘‘ఇతను నీతో మాట్లాడతాడట.’’‘‘మాట్లాడు.’’ ఆమె అతని నోటి దగ్గర తన చెవిని ఉంచి చెప్పింది.‘‘నర్సింగ్ కాలేజ్లో నేను బస్డ్రైవర్గా పని చేసేటప్పుడు నిన్ను చూశాను అద్వితా. రెండుసార్లు నీతో కలసి వన్ బై టు టీ తాగాలని ఉందని చెప్పాను. మూడోసారి నన్ను వేధించకు అన్నావు.’’‘‘ఓ. సారీ. నువ్వు నాకు గుర్తు లేదు.’’‘‘ఇప్పుడు నీతో కలిసి వన్ బై టు టీ తాగాలని ఉంది. ఆ టీ తాగుతూ ‘ఐ లవ్ యు’ అని చెప్పాలనుకున్నాను...’’ అతను రొప్పుతూ చెప్పాడు.‘‘మాట్లాడకు.’’ అద్విత చెప్పింది. జూనియర్ డాక్టర్ వెంటనే కేంటీన్ కి ఫోన్ చేసి వన్ బై టు టీ తీసుకురమ్మని చెప్పాడు. అది వచ్చేలోగా మాటిమాటికీ కార్డియాక్ మానిటర్ని, తలుపుని చూడసాగాడు. టీ వచ్చాక అద్విత ఓ కప్పుని అతని నోటికి అందించింది. అతను ఓ గుక్క తాగి తను చెప్పాలి అనుకున్నది ఎంత ప్రయత్నించినా చెప్పలేకపోయాడు.‘‘అతన్ని ముద్దు పెట్టుకో. తర్వాత ప్రశ్నలు.’’ జూనియర్ డాక్టర్ వెంటనే అరిచాడు.ఆమె ఆ పని చేస్తే సరిదిద్దాడు.‘‘పెదవుల మీద.’’ఆమె అతని పెదవులని తన పెదవులతో చుంబించింది. అతను కళ్ళు తెరచి ఆమె వంక చూశాడు. ఆ కళ్ళల్లో అకస్మాత్తుగా వెలుగు! క్రమంగా అది ఆరిపోయింది. మానిటర్లోని ఆకుపచ్చ గీత స్ట్రైట్ లైన్ గా మారింది. జూనియర్ డాక్టర్ అతని మొహం మీద దుప్పటిని కప్పాడు.రెండు కన్నీటి చుక్కలు ఆ టీ కప్పుల్లో పడ్డాయి.‘‘ఇతను నిన్ను ప్రేమించాడని తెలిస్తే మన పెళ్ళి జరిగేది కాదేమో!’’ జూనియర్ డాక్టర్ అద్వితతో చెప్పాడు.∙∙ అద్విత టీ తాగటం మానేసింది. పూర్తిగా. ఒంటరిగా కూడా. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి ‘ఫన్డే’లో ప్రచురితమయ్యే ఈ శీర్షికలో మల్లాది కథలు రాయడమే కాదు, మిమ్మల్ని కూడాభాగస్వాములను చేయనున్నారు. మీరైతే ఈ కథకు ఏ పేరు పెడతారో ఈ కింది మెయిల్కు పంపండి. kathakalisakshi@gmail.com -
హైహయుల కథ
హైహయ వంశంలో కార్తవీర్యార్జునుడు అనే మహారాజు ఉండేవాడు. నర్మదా తీరంలోని మహిష్మతీ నగరాన్ని రాజధానిగా చేసుకుని, రాజ్యాన్ని పాలించేవాడు. కార్తవీర్యార్జునుడి వద్ద భృగువంశ విప్రులు పురోహితులుగా ఉండేవారు. వారి ఆధ్వర్యంలో కార్తవీర్యార్జునుడు అనేక యజ్ఞయాగాదులు చేశాడు. అతడు చేసిన దానాలతో, అతడి నుంచి అందుకున్న సంభావనలతో భృగువంశీయులందరూ సంపన్నులయ్యారు. కార్తవీర్యార్జునుడు స్వర్గస్థుడయ్యాక హైహయులు నిర్ధనులయ్యారు. ఒకసారి వారికి పెద్దమొత్తంలో ధనం అవసరమైంది. హైహయులు సుక్షత్రియులే అయినా, అహం చంపుకొని భృగువంశ పురోహితులను ఆర్థిక సహాయాన్ని అభ్యర్థించారు. లుబ్ధులైన భార్గవులు లేదు పొమ్మంటూ హైహయులకు మొండిచేయి చూపారు. హైహయులు తమ సంపదను బలవంతంగా దోచుకుంటారేమోనని భయపడిన భార్గవులు తమ వద్దనున్న అపార ధనరాశులను భూమిలో పాతిపెట్టి, తట్టా బుట్టా సర్దుకుని, భార్యా బిడ్డలతో పాటు మహిష్మతీ నగరాన్ని విడిచిపెట్టి, అడవుల్లోకి పారిపోయారు.హైహయులకు ఎక్కడా ధనం దొరకలేదు. మనసు చంపుకొని భార్గవులనే మరోసారి అడుగుదామని వారి ఆశ్రమాలకు వచ్చారు. అన్నీ ఖాళీగా ఉన్నాయి. వారందరూ పారిపోయారని తెలిసింది. ధనరాశులను పాతిపెట్టి ఉంటారని అనుమానించిన హైహయులు ఇళ్లన్నీ తవ్వారు. అంతులేని ధనరాశులు దొరికాయి. ఈ సంగతి తెలిసిన భార్గవులలో కొందరు లబోదిబోమంటూ తిరిగి తమ ఆశ్రమాలకు వచ్చారు. క్షమించమంటూ హైహయుల కాళ్ల మీద పడ్డారు. తాము సవినయంగా అడిగితే ధనం లేదని చెప్పి, పాతిపెట్టి పారిపోయిన భార్గవులపై హైహయులు మండిపడ్డారు. వారిపై ధనుర్బాణాలను ఎక్కుపెట్టారు. దొరికిన వారిని దొరికినట్లుగా మట్టుబెట్టారు. అడవులలో తలదాచుకున్న భార్గవులను వెదికి వెదికి మరీ సంహరించడం ప్రారంభించారు. ఈ బీభత్సానికి భార్గవుల పత్నులు రోదనలు ప్రారంభించారు. హైహయుల మారణకాండ వల్ల చెలరేగిన కలకలానికి, రోదనలకు చుట్టుపక్కల ఆశ్రమాల్లోని మునీశ్వరులు ఏదో దారుణం జరుగుతోందని తలచి పరుగు పరుగున అక్కడకు చేరుకున్నారు. వారు అక్కడికి చేరుకునే సరికి హైహయులు భార్గవులను ఊచకోత కోస్తూ కనిపించారు. మునిగణమంతా హైహయులకు అడ్డువెళ్లి, వారించారు. విప్రులను వధించడం పాపకృత్యమని, ఈ హింసాకాండను ఇక్కడితో విరమించుకోమని హెచ్చరించారు. మునిగణం వారించడంతో హైహయులు కొంత శాంతించారు. ఆగ్రహావేశాల నుంచి తేరుకుని, పెదవి విప్పారు.‘మునీశ్వరులారా! మీరు మమ్మల్ని నిందిస్తున్నారే గాని, వీరు మా పట్ల చేసిన పాపకృత్యం మీకు తెలియదు. వీరు మా పూర్వీకుల వద్ద పౌరోహిత్యం చేసేవారు. మా పూర్వీకుల నుంచి భూరి దానాలు, సంభావనలు స్వీకరించి ధనాఢ్యులయ్యారు. వీరు విప్రులు కాదు, నయవంచకులు, పరమ లోభులు. మాకు అత్యవసరం ఏర్పడి ధనాన్ని సర్దుబాటు చేయమని సవినయంగా అర్థిస్తే, కనికరమైనా లేకుండా, లేదు పొమ్మన్నారు. పైగా మేమెక్కడ బలవంతం చేస్తామోనని అనుమానించి, ధనరాశులను భూమిలో పాతిపెట్టి, అడవులకు చేరుకున్నారు. కృతజ్ఞత కలిగిన మనుషులు చేయదగిన పనేనా ఇది? వీరిని చంపుతున్నామంటే, చంపమా మరి? వీరికి ఈ ధనరాశులన్నీ మా పూర్వీకుడైన కార్తవీర్యార్జునుడు లోక క్షేమం కోసం యజ్ఞ యాగాదులు చేయమని, తాము సుఖంగా బతకమని, యాచకులకు దానం చేయమని వీరికి అపార ధనరాశులను ఇచ్చాడు. వీళ్లు ఈ మూడింటిలో ఏ ఒక్క పనీ చేయలేదు. పైగా లోభంతో ధనరాశులను భూమిలో పాతిపెట్టారు. పరమ లోభులైన ఈ నీచులను విప్రులు అనవచ్చునా? యజమానుల క్షేమం కోరుకోని వీరు లోకక్షేమాన్ని కాంక్షిస్తారనుకోగలమా? ధనానికి మూడే గతులు. దానం, భోగం, నాశం. దానం చేయక, తాను అనుభవించక ధనం కూడబెట్టిన లోభులు వంచకులు, దండనార్హులు. అందుకే మేము ఈ వంచకులను దండించాం. ఇందులో మా తప్పులేదని మా అభిప్రాయం. దీని గురించి మీరు మాపై కినుక వహించకండి’ అన్నారు.హైహయుల సమాధానానికి మునీశ్వరులెవరూ మారు పలకలేకపోయారు. అయితే, మునిగణం రాకతో హైహయులు ఆగ్రహం నుంచి బయటపడ్డారు. రోదిస్తున్న భార్గవుల పత్నులను ప్రాణాలతో విడిచిపెట్టారు. అప్పటికే భయకంపితులై ఉన్న ఆ స్త్రీలు, ప్రాణాలు దక్కడమే చాలనుకుని, అక్కడి నుంచి బయలుదేరి హిమవంతం చేరుకున్నారు.హిమాలయాలకు చేరుకున్న భార్గవుల పత్నులు కొన్నాళ్లకు భయాందోళనల నుంచి తేరుకున్నారు. వారంతా నదీతీరంలో మట్టితో గౌరీదేవి బొమ్మను చేసి, దీక్షగా అర్చించారు. వారి భక్తికి ప్రసన్నురాలైన దేవి కలలో కనిపించింది. ‘మీలో ఒకరికి ఊరు అంశతో కొడుకు పుడతాడు. అతడే మీ దుఃఖాలను తొలగించగలడు’ అని పలికింది. కొన్నాళ్లకు భార్గవపత్నులలో ఒకరికి తొడలో గర్భం ఏర్పడింది. ఒకనాడు వారు ఉంటున్నవైపు హైహయులు వచ్చారు. వారిని చూసి భార్గవపత్నులు భయకంపితులై పరుగులు తీశారు. హైహయులు వారిని వెంబడించారు. పరుగు తీయలేని ఊరుగర్భిణిని ఖడ్గధారులైన హైహయులు చుట్టుముట్టారు. ఊరుగర్భంలో ఉన్న బాలకుడు తన తల్లి దీనావస్థకు చలించిపోయి, గర్భాన్ని చీల్చుకుని బయటకు వచ్చాడు. మార్తాండకాంతితో మెరిసిపోతున్న ఆ బాలుడిని చూడటంతోనే హైహయులకు కళ్లు పోయాయి. ఇది పాతివ్రత్య మహిమ అని గ్రహించిన హైహయులు రోదిస్తూ ఆ తల్లి కాళ్ల మీద పడ్డారు. ‘తల్లీ! కనికరించు’ అని ప్రాధేయపడ్డారు. ‘క్షత్రియవీరులైన మీరు నావంటి సామాన్య స్త్రీని ప్రాధేయపడటం తగదు. నాకు మీ మీద ఎలాంటి కోపం లేదు. తన తాత తండ్రులను చంపినందుకు నా కుమారుడికే మీ మీద కోపంగా ఉంది. ఇతడు జగదీశ్వరి ప్రసాదంగా నాకు జన్మించాడు. అతడే మిమ్మల్ని క్షమించగలడు’ అని చెప్పింది. హైహయులు వెంటనే ఆ బాలుడి పాదాల మీద పడ్డారు. బాలభార్గవుడు ప్రసన్నుడై, వారికి దృష్టి ప్రసాదించాడు. ధర్మబద్ధంగా పాలన సాగించండి అని హితవు చెప్పి, వారిని పంపాడు.సాంఖ్యాయన -
పోలీసులూ జైలుకెళ్లారు!!
లంచాలు తీసుకుంటూ చిక్కి, ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టి, అవకతవకలకు పాల్పడి, నేరాలు చేసి, చివరకు రాజకీయ కక్షసాధింపుల వల్ల– రకరకాల కారణాలతో పోలీసులు జైలు పాలైన ఉదంతాలను వింటుంటాం. కొన్ని కేసుల దర్యాప్తులో భాగంగా నిందితులను విచారించడానికి కోర్టు అనుమతితోనూ పోలీసులు జైలు లోపలకు వెళతారు. అయితే ఎలాంటి ఆధారం లేకుండా, అగమ్యగోచరంగా ఉన్న ఓ కేసు దర్యాప్తుకు అవసరమైన సమాచారం సేకరించడానికి అరెస్టైన ఓ పోలీసు అధికారి కొన్ని రోజులు జైల్లో, ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైదీల మధ్య గడిపాడు. ఇది 2007 సెప్టెంబర్లో చోటు చేసుకుంది. గోకుల్చాట్, లుంబినీ పార్కు పేలుళ్ల కేసు దర్యాప్తు నేపథ్యంలో ఈ ఉదంతం జరిగింది. హైదరాబాద్లోని గోకుల్చాట్, లుంబినీపార్క్ల్లో 2007 ఆగస్టు 25న సాయంత్రం జంట పేలుళ్లు జరిగాయి. అదే రోజు దిల్సుఖ్నగర్లోని వెంకటాద్రి థియేటర్ సమీపంలో మరో పేలని బాంబు పోలీసులకు దొరికింది. ఆ రెండు చోట్లా జరిగిన పేలుళ్లలో 45 మంది మరణించారు. దాదాపు మూడువందల మంది గాయపడ్డారు. ఈ ఘాతుకానికి సరిగ్గా వంద రోజుల ముందు 2007 మే 18 మధ్యాహ్నం హైదరాబాద్ పాతబస్తీలో ఉన్న మక్కా మసీదులో బాంబు పేలుడు జరిగింది. శుక్రవారం ప్రార్థనల్ని టార్గెట్గా చేసుకున్న ఉగ్రవాదులు రెండు బాంబులు ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటి పేలగా, మరోదాన్ని స్వా«ధీనం చేసుకున్న పోలీసులు దాన్ని నిర్వీర్యం చేశారు. ఈ విధ్వంసంలో 11 మంది మరణించగా, 19 మంది గాయపడ్డారు.హైదరాబాద్లో వంద రోజుల వ్యవధిలో రెండు విధ్వంసాలు జరగడంతో పోలీసు విభాగం అప్రమత్తమైంది. అప్పటికే మక్కా మసీదు పేలుడు కేసు సీబీఐకి బదిలీ కాగా, గోకుల్చాట్, లుంబినీపార్క్ పేలుళ్ల కేసు దర్యాప్తునకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్ (సిక్) ఏర్పాటైంది. ఉమ్మడి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందిలో ఉగ్రవాదంపై పట్టున్న అధికారులను డిప్యుటేషన్పై సిక్లో నియమించారు. అప్పటికే ఉగ్రవాద కేసుల్లో అరెస్టయి, బయటకు వచ్చిన వ్యక్తులు, అనుమానితులు, వారి అనుచరులు– ఇలా వందల మందిని అదుపులోకి తీసుకున్న సిక్ – వీరి విచారణ కోసం హైదరాబాద్ శివార్లలోని అనేక గెస్ట్ హౌస్లు, ఫామ్హౌస్లు ఇంటరాగేషన్ కేంద్రాలుగా ఉపయోగించుకుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా పోలీసులు ఎలాంటి ఆధారం చిక్కలేదు. భారీ సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో వారి కుటుంబీకులు, న్యాయవాదులు, పౌరహక్కుల సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి పోలీసులపై ఒత్తిడి పెరిగింది.ఆధారాలు దొరక్కపోవడంతో సిక్ దిక్కుతోచని స్థితిలోకి వెళ్లింది. అప్పట్లో హైదరాబాద్లోని జైళ్లల్లో ఖైదీల వద్ద సెల్ఫోన్లు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి తోడు అప్పటికే రిమాండ్లో ఉన్న ఉగ్రవాదులను కలవడానికి వారి సంబంధీకులు వచ్చిపోతుండే వాళ్లు. ఈ పరిణామాలను గమనించిన ఓ పోలీసు అధికారికి ఓ ఆలోచన వచ్చింది. గోకుల్చాట్, లుంబినీపార్క్ పేలుళ్లకు సంబంధించిన సమాచారం ఏదైనా జైల్లో ఉన్న ఉగ్రవాదులకు తెలిసే అవకాశం ఉంటుందని భావించారు. జైల్లో ఉన్న వారిని ప్రశ్నిస్తే ఏదైనా క్లూ దొరుకుతుందని అనుకున్నారు. ఈ ఆలోచన బాగానే ఉన్నా, వారిని ప్రశ్నించడం ఎలా అన్నదే ఎవరికీ అంతుచిక్కలేదు. న్యాయస్థానం అనుమతి లేకుండా జైల్లోకి వెళ్లి ప్రశ్నించలేరు. కస్టడీలోకి తీసుకోవడానికి వారిపై ఎలాంటి ఆరోపణలు, ఆధారాలు లేవు. పిటిషన్లు వేసినా, పెద్ద సంఖ్యలో ఖైదీలను ప్రశ్నించడానికి కోర్టు అనుమతి లభించదు. ఇవన్నీ బేరీజు వేసిన ఓ అధికారికి వచ్చిన ఆలోచనే– నమ్మకమైన సమర్థుడైన పోలీసు అరెస్టు. ఉగ్రవాదులు నమ్మే వర్గానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేసుకుని, ఏదో ఒక కేసులో అరెస్టు చేసి జైలుకు పంపడానికి ఉన్నతాధికారులూ అంగీకరించారు. అంతే.. సిక్లో ఉన్న అధికారులంతా తమ వద్ద పని చేసిన, చేస్తున్న వారిలో అలాంటి పోలీసు కోసం వెతికారు. అప్పట్లో ఆంధ్రా ప్రాంతంలో పని చేస్తున్న ఓ పోలీసు దీనికి సమర్థుడని అంతా అంగీకరించారు. ఆలోచనను ఆచరణలో పెట్టడానికి పోలీసు సిద్ధంగా ఉన్నా, జైలులోకి ఎలా పంపాలన్న దానిపై భారీ తర్జనభర్జన జరిగింది. చివరకు గుడుంబా ప్యాకెట్లు కలిగి ఉన్నాడనే ఆరోపణలపై హైదరాబాద్లోని ఓ పోలీసుస్టేషన్లో ఆ పోలీసుపై కేసు నమోదు చేయించారు. అందులో అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు రిమాండ్ ఖైదీగా పంపారు. ఆ పోలీసు దాదాపు 15 రోజులు జైల్లో ఉండి సమాచార సేకరణకు ప్రయత్నించారు. జైల్లో ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సిక్ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. చాకచక్యంగా జైల్లో గడిపిన సదరు పోలీసు అధికారి, ఈ పేలుళ్లపై వారికి ఎలాంటి సమాచారం లేదని నిర్ధారించుకున్నాక బెయిల్పై బయటకు వచ్చారు. ఆపై ఈ కేసులు ఆక్టోపస్కు బదిలీ కావడంతో సిక్ కథ ముగిసింది. దీంతో ‘జైలుకు వెళ్లిన పోలీసు’ తాను పని చేసే ప్రాంతానికి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆపై కొన్నాళ్లకు నాటకీయ పరిణామాల మధ్య ఆ గుడుంబా కేసు క్లోజ్ అయింది. కొన్నాళ్లకు ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) హైదరాబాద్ జంట పేలుళ్లకు కారణమని తెలిసింది. 2007 సెప్టెంబరు 13న ఢిల్లీలో వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. దీనికీ ఐఎం బాధ్యత ప్రకటించుకుంది. ఈ కేసులను దర్యాప్తు చేసిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు నిందితుల షెల్టర్ గుర్తించారు. అక్కడి జామియానగర్లోని బాట్లాహౌస్ ఎల్–18 ఫ్లాట్లో 2008 సెప్టెంబర్ 15న జరిగిన ఎన్కౌంటర్లో ఆతిఖ్ అలియాస్ బషర్ సహా మరో ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా, ముగ్గురు పట్టుబడ్డారు. ఈ ఉదంతంతో ఐఎం డొంక కదిలింది. ఈ ఆధారాలతో ముందుకు వెళ్లిన ముంబై క్రైమ్ బ్రాంచ్ దేశ వ్యాప్తంగా 11 విధ్వంసాలకు పాల్పడిన ఉగ్రవాదులను అరెస్టు చేసింది. వీరిలోనే జంట పేలుళ్ల నిందితులు సైతం ఉండటంతో సిక్ డీల్ చేసిన కేసులు కొలిక్కి వచ్చాయి. వీరిని పీటీ వారెంట్లపై తీసుకువచ్చి అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఈ మూడు కేసుల్లో నిందితులుగా ఉండి, అరెస్టు అయిన ఐదుగురిలో అనీఖ్, అక్బర్లపై 2018 సెప్టెంబర్ 4న నేరం రుజువైంది. వీరికి అదే నెల 10న ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.శ్రీరంగం కామేష్ -
ఉరుము లేని పిడుగు
1941 డిసెంబర్ 7న జపాన్ సైన్యం హవాయిలోని పెర్ల్ హార్బర్లో ఉన్న అమెరికా నౌకా స్థావరం పైన ఆకస్మికంగా దాడి జరిపింది. అసలు ఏ మాత్రం ఊహించని ఆ పరిణామంతో అమెరికా, రెండో ప్రపంచ యుద్ధంలోకి దిగక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. డిసెంబర్ 8న, అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డెలానో రూజ్వెల్ట్ జపాన్ పై యుద్ధ ప్రకటన కోసం చట్ట సభ ‘కాంగ్రెస్’ ఆమోదం కోరారు. కాంగ్రెస్ వెంటనే సమ్మతించింది. అందుకు ప్రతిచర్యగా డిసెంబర్ 11న, జపాన్ తో పొత్తు ఉన్న జర్మనీ, ఇటలీ అమెరికాపై యుద్ధం ప్రకటించాయి. ఆ విధంగా అమెరికా పూర్తిస్థాయిలో రెండవ ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించవలసి వచ్చింది.స్నేహితులు శత్రువులయ్యారు!నిజానికి అమెరికా, జపాన్ ఒక జట్టులో ఉండి మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాయి. పెర్ల్ హార్బర్పై దాడి కారణంగా రెండో ప్రపంచ యుద్ధంలో రెండూ పరస్పరం శత్రు దేశాలు అయ్యాయి. అసలెందుకు జపాన్ పెర్ల్ హార్బర్ నౌకా స్థావరంపై దాడి చేయవలసి వచ్చింది? ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో సైనిక విస్తరణను నిలిపివేయాలని జపాన్ పై అమెరికా ఒత్తిడి తెస్తుండటమే అందుకు కారణం. పుస్తకం ఇచ్చిన ప్రేరణ!పెర్ల్ హార్బర్పై దాడి చేయాలన్న ఆలోచన మొదట వచ్చింది.. జపాన్ అడ్మిరల్ ‘ఇసోరోకు యమమోటో’కు. ఆ దాడికి పథక రచన చేసింది కెప్టెన్ మినోరు గెండా. యమమోటోకు ఆ ఆలోచన రావటానికి రెండు విషయాలు ప్రేరణనిచ్చాయి. ఒకటి : కాలజ్ఞాన గ్రంథం. రెండోది, అప్పటికి ఏడాది క్రితమే జరిగిన ఒక దాడి. యమమోటోకు ప్రేరణ కలిగించిన ఆ గ్రంథం పేరు ‘ది గ్రేట్ పసిఫిక్ వార్’. దానిని 1925లో బ్రిటిష్ నౌకాదళ అధికారి హెక్టర్ బైవాటర్ రాశారు. అందులోని కథాంశం, అమెరికా– జపాన్ల మధ్య ఘర్షణలు జరగడం. జపనీయులు యుఎస్ నౌకాదళాన్ని నాశనం చేయడంతో ఆ గ్రంథం ప్రారంభమై గువామ్ (పశ్చిమ పసిఫిక్ ప్రాంతం), ఫిలిప్పీన్స్ లపై జపాన్ దాడి చేయడం వరకు కొనసాగుతుంది. అలాగే, 1940 నవంబర్ 11న ఇటలీలోని టొరంటో నౌకాశ్రయంలో ఇటాలియన్ నౌకాదళంపై బ్రిటన్ రాయల్ వైమానిక దళం విజయవంతంగా దాడి చేయటం కూడా యమమోటోకు స్ఫూర్తిని ఇచ్చింది. దాడికి ఒక రోజు ముందు1941 డిసెంబర్ 6న పెర్ల్ హార్బర్లో ఓడల కదలికలు, మోహరింపు స్థానాల గురించి జపాన్ వివరాలు రాబడుతున్నట్లు అమెరికాకు సమాచారం అందింది. ఆ సమాచారాన్ని ఒక క్రిప్టాలజిస్ట్ తన ఉన్నతాధికారి అయిన మహిళా ఆఫీసర్కు చేరవేసి, తను డిసెంబర్ 8 సోమవారం వచ్చి కలుస్తానని చెప్పారు. ఆ మర్నాడు డిసెంబర్ 7 ఆదివారం... హవాయిలోని ఓహులో ద్వీపంలో ఒక రాడార్ ఆపరేటర్ తన కంప్యూటర్ స్క్రీన్పై... ద్వీపం మీదుగా వెళుతున్న పెద్ద విమానాల సమూహాన్ని చూశాడు. వెంటనే అతను ఆ విషయాన్ని తన ఉన్నతాధికారికి ఫోన్ చేసి చెప్పారు. అయితే ఆ అధికారి, ఆ విమానాలు ఆరోజు అక్కడికి రావాల్సిన యు.ఎస్. బి–17 బాంబర్ యుద్ధ విమానాలు అయి ఉండవచ్చని, వాటి గురించి ఆందోళ చెందాల్సిన పని లేదనీ చెప్పాడు. గంట 15 నిముషాల్లోనే!ఆ తర్వాత కొద్ది సేపటికే ఉదయం 7:55 గంటలకు పెర్ల్ హార్బర్పై జపాన్ దాడి ప్రారంభమైంది. ఆ మొత్తం దాడి కేవలం ఒక గంట 15 నిముషాల్లోనే పూర్తయింది. దానికి ముందు కెప్టెన్ మిట్సువో ఫుచిడా.. ఓహూలో ద్వీప గగన తలంలోకి రాగానే, ‘అమెరికా దిక్కుతోచని విధంగా మా చేతికి చిక్కింది’ అని చెప్పటానికి ‘టోరా, టోరా, టోరా’ అనే కోడ్ సందేశాన్ని జపాన్ నౌకాదళానికి పంపారు. నిజానికి 1907 నాటి హేగ్ సమావేశంలోని మొదటి నిబంధన ప్రకారం, దాడి ప్రారంభించే ముందు ఏ దేశమైనా ముందుగా యుద్ధ ప్రకటన చేయాలి. అయితే జపాన్ ఆ విషయాన్ని ముందస్తుగా వాషింగ్టన్లోని అమెరికా అధికారులకు తెలియబరచటానికి ముందే దాడి మొదలైపోయింది. దాంతో జపాన్ పెర్ల్ హార్బర్పై దొంగదాడి చేసినట్లయింది. విమానాల నుంచి విధ్వంసంపెర్ల్ హార్బర్పై జపాన్ దాడిలో నాలుగు వాహక నౌకల నుండి పైకి లేచిన 353 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. వాటిలో 40 టార్పెడో విమానాలు, 103 లెవల్ బాంబర్లు, 131 డైవ్–బాంబర్లు, 79 ఫైటర్ జెట్లు ఉన్నాయి. ఇంకా... రెండు భారీ క్రూజర్లు, 35 జలాంతర్గాములు, రెండు లైట్ క్రూజర్లు, తొమ్మిది ఆయిలర్లు, రెండు యుద్ధనౌకలు, 11 డిస్ట్రాయర్లు ఉన్నాయి. ఆ దాడిలో 68 మంది అమెరికన్ పౌరులు సహా 2,403 మంది అమెరికా సైనికులు మరణించారు. 8 యుద్ధనౌకలు సహా 19 యూఎస్ నేవీ నౌకలు ధ్వంసం అయ్యాయి. యూఎస్ పసిఫిక్ నౌకాదళానికి చెందిన మూడు విమాన వాహక నౌకలు దాడికి ముందే సముద్రంలోకి వెళ్లి ఉండటంతో జపాన్ సైన్యం వాటిని గుర్తించలేకపోయింది. డోరీ మిల్లర్ అసమాన శౌర్యంజపాన్ దాడిలో ‘యు.ఎస్.ఎస్. (యునైటెడ్ స్టేట్స్ షిప్) అరిజోనా యుద్ధనౌక’ సిబ్బంది సహా పాటుగా పసిఫిక్ మహా సముద్రంలో మునిగిపోయింది. పెర్ల్ హార్బర్ దాడిలో చనిపోయిన వారిలో సగం మంది అరిజోనా షిప్లోని వారే. మునిగిపోయిన యుద్ధనౌక పైన అమెరికా జెండా ఎగురుతూ ఉంది. ఆనాటి దాడిలో మరణించిన అమెరికన్ అమర వీరులకు స్మారక చిహ్నంగా ఆ జెండా నిలిచిపోయింది. యు.ఎస్.ఎస్. వెస్ట్ వర్జీనియా నౌక స్టీవార్డ్ డోరీ మిల్లర్, పెర్ల్ హార్బర్పై జపాన్ దాడి జరుపుతున్న సమయంలో కనబరచిన అసమాన ధైర్య సాహసాలు, విధి నిర్వహణ పట్ల ఆయన అంకిత భావం అమెరికాకు చిరస్మరణీయమైనవి. మొదట అతడు ప్రాణాంతకంగా గాయపడిన కెప్టెన్కు సహాయం అందించాడు. తరువాత మెషిన్గన్ తో రెండు జపాన్ విమానాలను ధ్వంసం చేశాడు. నిజానికి మెషిన్ గన్ని ఆపరేట్ చేయటం డోలీ మిల్లర్కు అదే మొదటిసారి. దాడి సమయంలో అతడు చూపిన తెగువకు, సమయస్ఫూర్తికి, సేవకు గుర్తింపుగా అమెరికా అత్యున్నత పురస్కారం ‘నేవీ క్రాస్’ లభించింది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఆ నేవీ క్రాస్ను పొందిన మొదటి ఆఫ్రికన్ అమెరికన్ డోరీ మిల్లర్. జపాన్పై ప్రతీకార దాడులుపెర్ల్ హార్బర్ దాడిలో అమెరికా ప్రతిఘటనతో జపాన్ 29 విమానాలను, 5 చిన్న జలాంతర్గాములను కోల్పోయింది. ఒక జపాన్ సైనికుడు ఖైదీగా పట్టుబడ్డాడు. 129 మంది జపాన్ సైనికులు మరణించారు. పెర్ల్ హార్బర్పై దాడిలో పాల్గొన్న అన్ని జపాన్ నౌకలలో, ఉషియో అనే ఒక్క నౌక మాత్రమే చెక్కు చెదరకుండా బయటపడింది. దీనిని యోకోసుకా నౌకా స్థావరం వద్ద అమెరికా స్వాధీనం చేసుకుంది. కూటమి ధాటికి ఓటమిమొత్తానికి అమెరికా కోలుకుంది. అది కూడా జపాన్ ఊహించిన దాని కంటే త్వరగా! కేవలం ఆరు నెలల తర్వాత, 1942 జూన్ ఉత్తర పసిఫిక్ మహా సముద్రంలోని మిడ్వే ప్రాంతంలో అమెరికాకు చెందిన విమాన వాహక నౌకాదళం... యమమోటో నావికాదళానికి చెందిన నాలుగు జపాన్ విమాన వాహక నౌకలను ధ్వంసం చేసింది. ఈ మిడ్వే విజయం తర్వాత, 1945 సెప్టెంబరులో మూడో ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి, ఒక నెల ముందు ఆగస్టులో అమెరికా, బ్రిటన్, చైనా, రష్యాల కూటమి ధాటికి జపాన్ సామ్రాజ్యం ఓటమి పాలైంది. సాక్షి, స్పెషల్ డెస్క్ -
అప్పుడే తెలిసిపోయింది
తన ప్రయాణం ప్లాన్ చేసినదేం కాదు. కాని, విధి పిలుపును మాత్రం ఆమె విన్నది. అలా హైదరాబాద్ వీధుల్లో పానీపూరీ తింటూ నవ్వుకున్న సాదాసీదా అమ్మాయి– నేడు తెరపై సహజ మంత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆమె శివాని నాగారం. ఆమె విషయాలు ఆమె మాటల్లోనే మీ కోసం!⇒ చిన్నప్పటి నుంచే నేర్చుకున్న కూచిపూడి నాట్యం నాకు ఒక థెరపీలా ఉంటుంది. ఏదైనా టెన్షన్ ఉన్నా, కొన్ని స్టెప్స్ వేస్తే చాలు, మనసంతా రిలాక్స్ అయిపోతుంది.⇒ హైదరాబాద్లోనే పెరిగాను. అందుకే రోడ్డు పక్కన నిలబడి మిర్చి బజ్జీ, పానీపూరీ తినడం, సాయంత్రం రోడ్ల మీద కార్లు వెళ్లే శబ్దం వినడం ఇవన్నీ నా చిన్న చిన్న ఆనందాలు.⇒ సినిమాల్లోకి రావడం నేను ముందే ప్లాన్ చేసుకున్న విషయం కాదు. కాని, నా ప్రయాణం పెద్ద తెరతో కాదు, చిన్న కథలతోనే మొదలైంది. ఒక చిన్న షార్ట్ఫిల్మ్లో కొద్దిసేపు మాత్రమే కనిపించినా, అలా మొదటిసారి కెమెరా ముందు నిలబడ్డ ఆ క్షణంలోనే ‘ఇదే నా దారి’ అని నాకు స్పష్టంగా తెలిసిపోయింది.⇒ మొదటి సినిమా ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ విడుదలైనప్పుడు మనుసులో కొంచెం భయం ఉన్నా, ప్రేక్షకులు చూపిన ప్రేమ ఆ భయాన్ని పూర్తిగా కరిగించింది.⇒ రెండో, మూడో సినిమాలు వచ్చేటప్పటికి నాలోనే ఒక కొత్త శివానిని చూసుకున్నాను. ప్రతి పాత్ర నాకు ఒక కొత్త నేర్పు, ఒక కొత్త అనుభవం ఇచ్చింది.⇒ పూలంటే నాకు ప్రత్యేకమైన ప్రేమ. ఏ పువ్వైనా చేతిలో తీసుకుని అలా తిరగేస్తూ, వాసన చూస్తూ ఉండటం నాకు హాబీలా మారిపోయింది.⇒ కథలు చదవడం నా అలవాటు. పెద్ద నవలలు కాకుండా, హృదయానికి హత్తుకునే చిన్న కథలు బాగా నచ్చుతాయి.⇒ ఫ్యాషన్ విషయానికి వస్తే నేను చాలా సింపుల్. ఒక మంచి జీన్స్, క్లీన్స్ గా ఉండే కుర్తా, చిన్న చెవిపోగులు. అంతే, నేను సిద్ధం.⇒ చర్మ సంరక్షణ విషయంలో నేను ఎక్కువ క్రీములు వాడను. రోజూ తగినంత నీళ్లు తాగడం, రాత్రి మాయిశ్చరైజర్ మాత్రం తప్పనిసరి. వారానికి ఒకసారి పెసరపిండి రాసుకుంటే చాలు, చర్మం బాగా ఫ్రెష్గా మారుతుంది.⇒ నాకు ఇష్టమైన రంగులు పింక్లోని మృదువైన షేడ్స్, లైట్ బ్లూ.⇒ అభిమానులతో మాట్లాడటం నాకు చాలా ఇష్టం. వాళ్ల కామెంట్లు, మెసేజులు, వారి ప్రేమ– అవన్నీ నాకు కొత్త శక్తి ఇస్తాయి. -
పేరెంట్స్ చేతిలో ఫోన్లు.. పిల్లలతో పెరుగుతున్న దూరాలు
సాయంత్రం. వర్క్ఫ్రమ్– హోమ్ జూమ్ మీటింగ్ ముగిసింది. అమ్మ సోఫాలో కూర్చొని ఫోన్ స్క్రోల్ చేస్తుంది. నాన్న యూట్యూబ్లో వీడియోలు చూస్తూ బిజీ. ఆరేళ్ల ఆరాధ్య వాళ్ల ముందు కూర్చుని ఉంది. ఆ రోజు స్కూల్లో ఏం జరిగిందో చెప్తోంది. పేరెంట్స్ తమ బిజీలో తామున్నారు. ఆ బిడ్డ కళ్లలో చిన్న నిరాశ. పేరెంట్స్ అది గమనించలేదు. కానీ ఆరాధ్య మెదడు గమనిస్తోంది. ప్రతిరోజూ, ప్రతి నిమిషం పేరెంట్స్ ‘హాజరు’ కన్నా ‘గైర్హాజరు’ను గుర్తించి రికార్డు చేస్తుంది. ఇది చిన్న విషయం కాదు. ఇది ఈ తరానికి సంబంధించిన నిశ్శబ్ద భావోద్వేగ సంక్షోభం. పేరెంట్స్ పక్కనే ఉంటున్నారు, కానీ ఎమోషనల్గా కాదు. పిల్లలతో తాము సరిపడినంత సమయం గడుపుతున్నామని 70శాతం పేరెంట్స్ అనుకుంటున్నారు. కానీ పేరెంట్స్ ఎప్పుడూ ఫోన్తో బిజీగా ఉంటున్నారని 67శాతం పిల్లలు ఫీలవుతున్నారని హార్వర్డ్ యూనివర్సిటీకి అధ్యయనం చెబుతోంది. భోజనాల సమయంలో పేరెంట్స్ ఫోన్ చూస్తూ ఉండటం పిల్లలకు మరింత దూరం చేస్తుందని మరో అధ్యయనంలో స్పష్టమైంది. భారతదేశంలో జరిగిన పలు అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. దీంతో పిల్లలు సమస్యలు సృష్టిస్తూ పేరెంట్స్ దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అంటే పిల్లలది తప్పు ప్రవర్తన కాదు, పేరెంట్స్ అటెన్షన్ కోసం ఆరాటం మాత్రమే.మెదడు ఎలా స్పందిస్తుంది?⇒ అనుబంధం పెరగడానికి ప్రతిస్పందన, ఇచ్చిపుచ్చుకోవడం, పునరావృతం ముఖ్యం. ఫోన్ వల్ల ఈ మూడూ బ్రేక్ అవుతాయి. ⇒ పిల్లలు తమ భావాలను నియంత్రించడానికి మొదటగా తల్లిదండ్రుల ముఖాన్ని, స్పందనను గమనిస్తారు. పేరెంట్స్ చూసి స్పందించకపోతే, వారి మెదడులో ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ పెరుగుతుంది.⇒ పిల్లలు పరిశీలన ద్వారా నేర్చుకుంటారు. పేరెంట్స్ ఫోన్లో ఉంటే వారు నేరుగా చూడటం, కమ్యూనికేషన్, సహానుభూతి చూడలేరు. దీంతో వారిలో క్రమంగా సామాజిక ఇబ్బంది పెరుగుతుంది. ⇒ పేరెంట్–పిల్లల మధ్య ఇంటరాక్షన్ తగ్గితే పిల్లల్లో ప్రవర్తనా సమస్యలు మూడురెట్లు పెరుగుతాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది. తినడం, ఆడటం, మాట్లాడటం– అన్నీ దెబ్బతింటాయి. ⇒ పేరెంట్స్తో పదేపదే డిస్కనెక్షన్ అనుభవించిన పిల్లలు తక్కువగా షేర్ చేస్తారు, తక్కువగా నమ్ముతారు, తక్కువగా అటాచ్ అవుతారు.∙ఏం చెయ్యాలి?నోటిఫికేషన్లు, డెడ్ లైన్లు, వాట్సప్ మెసేజ్లు రోజూ ఉండేవే. అవి రోజూ వస్తూనే ఉంటాయి. కానీ ఒకసారి పిల్లలతో అనుబంధం విరిగిపోతే, తిరిగి రావడానికి సంవత్సరాలు పడతాయి. అందుకే పిల్లలతో బంధానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మీరు ఎంత సమయం గడిపారనేది కాదు, ఎంత ప్రెజెన్స్తో ఉన్నారనేది ముఖ్యం. 1. ప్రతి రోజూ కేవలం 20 నిమిషాలు ఫోన్కు దూరంగా ఉండేలా నిబంధన పెట్టుకోవాలి. ఆ 20 నిమిషాలు పిల్లలకు క్లాసులు పీకకుండా, సరిదిద్దకుండా వాళ్లు చెప్పేది శ్రద్ధగా వినాలి. దీనివల్ల అనుబంధాలకు కారణమయ్యే ఆక్సిటోసిన్ విడుదలవుతుంది. 2. డైనింగ్ టేబుల్, బెడ్ రూమ్, పిల్లలు చదువుకునే చోట ఫోన్ ఉపయోగించకూడదు. పిల్లలు మీరు చెప్పేది తక్కువ వింటారు, మీరు చేసేది ఎక్కువ అనుసరిస్తారు. 3. పిల్లలతో బంధం బలపడాలంటే గంటలు గంటలు గడపాల్సిన అవసరంలేదు. ఒక చిరునవ్వు, ఒక స్పర్శ, ఒక చూపు చాలు. ఇలాంటి సూక్ష్మమైన అంశాలు పిల్లల్లో భావోద్వేగ భద్రత కలిగిస్తాయని స్టాన్ఫోర్డ్ సైకాలజిస్ట్ ఎమా సెపాలా చెప్తున్నారు. 4. మీరు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు పిల్లల గొంతు వినిపిస్తే, వెంటనే వారి వైపు చూడాలి. వారి మాటలను వింటున్నట్టు సిగ్నల్ ఇవ్వాలి. ఈ ఒక్క చిన్న మార్పు పిల్లల్లో అనుబంధానికి భారీ భరోసానిస్తుంది. 5. ఆదివారం కనీసం ఒక గంట పూర్తిగా పిల్లలతో గడపండి. ఆటలు ఆడండి, పాటలు పాడండి, కథలు వినండి, కుటుంబమంతా కలిసి గడపండి. ఈ గంట పిల్లల మనసులో ‘ఫ్యామిలీ ఫస్ట్’ అనే ఫ్రేమ్ వర్క్ను బలపరుస్తుంది. 6. ఫోన్ నోటిఫికేషన్లు, వాట్సప్ గ్రూపులు ఆఫ్ చేయండి. సోషల్ మీడియా లాగిన్కు సమయాన్ని నిర్ణయించుకోండి. మీ నియంత్రణే మీ పిల్లలకు నమూనా అవుతుంది. 7. ‘‘నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను ఫోన్ చూస్తుంటే నీకు ఎలా అనిపిస్తుంది?’’ అని అడగండి. వారి సమాధానాన్ని శ్రద్ధగా విని, ఆ మేరకు మీ ఫోన్ అలవాట్లలో మార్పులు చేసుకోండి. 8. ‘‘నాకు నువ్వు, నీ మాటలు ముఖ్యం’’ అని పిల్లలకు రోజుకు ఒక్కసారైనా చెప్పండి. అది పిల్లల్లో నమ్మకం, ఆత్మవిశ్వాసం, భద్రతాభావాన్ని పెంచుతుంది.- సైకాలజిస్ట్ విశేష్ ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్ -
ఆత్మరక్షణకు ‘ఆస్కార్’ నటన!
‘నేచర్ ఆస్కార్ అవార్డ్స్’లో బెస్ట్ యాక్టర్ ఇన్స్ సర్వైవల్ డ్రామా ట్రోఫీ ఎవరికి దక్కాలంటే, సందేహమే లేదు, ఒపాసమ్కే వస్తుంది! ఎందుకంటే ఈ చిన్న జంతువు సస్పెన్స్ థ్రిల్లర్ లెవెల్లో యాక్టింగ్ చేస్తుంది. ప్రమాదం ఎదురైతే ఒక్కసారిగా నేలపై పడిపోతుంది, శరీరాన్ని పూర్తిగా శవంలా మార్చేసుకుని, కళ్ళు మూసేసుకుని చచ్చిపోయినట్లు నటిస్తుంది.అంతే కాదు, తనను వేటాడటానికి వచ్చిన జంతువులకు తాను చచ్చినట్లు నమ్మకం కలిగించడానికి కుళ్లిన శవం వాసన కూడా విడుదల చేస్తుంది. దీన్ని ఆ పరిస్థితిలో చూసిన క్రూరమృగాలు ‘ఇది చచ్చిపోయింది, పైగా కుళ్లిపోతోంది కూడా!’ అని అనుకుని వెనక్కి తగ్గిపోతాయి. ఈ సీక్రెట్ సర్వైవల్ ట్రిక్నే ‘ప్లేయింగ్ పోసమ్’ అంటారు. ప్రకృతి ఇచ్చిన ఈ సహజ రక్షణ పద్ధతితో, శత్రువు వెళ్లిపోయాక మన ఒపాసమ్ నెమ్మదిగా కళ్లు తెరచి, డ్రామా పూర్తయ్యిందని తెలుసుకుని, సైలెంట్గా జంగిల్లోకి జారిపోతుంది! -
చలివెచ్చని జాగ్రత్తలు
కాలాలన్నింటిలోనూ శీతకాలం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఓవైపు చల్లటిగాలి జివ్వుమనిపిస్తుంటే– స్వెటర్ తొడుక్కుని లేదా శాలువలు కప్పుకుని తిరగడం దగ్గర నుంచి, వెచ్చటి చలిమంటల ముందో, రూమ్ హీటర్ ముందో ఒద్దికగా కూర్చోవడం వరకు, ఇవన్నీ ఆస్వాదించాల్సిన సందర్భాలే! త్వరగా చీకటిపడి, ఆలస్యంగా వెలుతురు రావడం, కాలం వేగంగా పరుగులు తీస్తున్న భావన కలగడం– ఈ సీజన్లో మరో ప్రత్యేకత! నిజానికి చాలామంది కాలాలన్నింటిలోనూ పసందైన కాలం చలికాలమే అంటారు. వర్షాకాలంలో వర్షాలు, ఎండాకాలంలో ఎండలు ఎక్కువైనా, తక్కువైనా వాటిని భరించలేం కాని, చలికాలంలో స్వెటర్లు, గ్లౌజులు వేసుకుని చలి గజగజలను ఆస్వాదిస్తూ గమ్మత్తుగా గడిపేయవచ్చు మరి! అయితే శీతకాలంలో చలి మాత్రమే కాదు, వ్యాధులు కూడా వణికించేస్తుంటాయి. ఈ కాలంలో అనారోగ్య సమస్యలు వస్తే తగ్గించుకోవడం ఏమంత సులభం కాదు.చలికాలంలో సాధారణంగా వచ్చే అనారోగ్యాలు ఎంతవరకు అంటువ్యాధులుగా మారతాయి? ఎలాంటి జాగ్రత్తలు అవసరం? ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? వాటి సంగతి ఒకసారి పరిశీలిద్దాం... చలికాలంలో వాతావరణం పొడిగా ఉండటం, అలాగే మనుషులంతా ఇండోర్స్లో గుమిగూడటం వలన జలుబు చేసే క్రిములు, ఫ్లూ వైరస్లు, ఇతర శ్వాసకోశ వ్యాధులు సులభంగా వ్యాపిస్తాయి. వ్యాధి లక్షణాలు కనిపించక ముందు, లక్షణాలు తగ్గిన తర్వాత కూడా ఇవి ఇతరులకు సోకే అవకాశముంటుందని ప్రపంచ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ – క్లీవ్లాండ్ క్లినిక్ వెల్లడించింది. సాధారణంగా వ్యాధి సోకిన రెండు నుంచి మూడు రోజుల తర్వాత ఇతరులకు అంటించే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆ క్లినిక్ తేల్చింది. ఈ చలికాలంలో సర్వసాధారణంగా వచ్చే అనారోగ్యాలు, అవి ఎలా వ్యాప్తి చెందుతాయో ఇప్పుడు చూద్దాం!సాధారణ జలుబుఇది అంటువ్యాధి. లక్షణాలు కనిపించకముందే, లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు (సుమారు మూడవ రోజు వరకు) ఇతరులకు సులభంగా సోకుతుంది. లక్షణాలు తగ్గిన తర్వాత కూడా రెండు వారాల వరకు వైరస్ ఇతరులకు అంటించే అవకాశవఫ్లూఇది కూడా త్వరగా వ్యాప్తి చెందే అంటువ్యాధే! లక్షణాలు కనిపించకముందే ఇతరులకు అంటుతుంది. లక్షణాలు కనిపించిన తర్వాత ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఇతరులకు సోకే అవకాశముంటుంది.కోవిడ్ 19ఇది చాలా సులభంగా, అలాగే వేగంగా వ్యాపిస్తుంది. లక్షణాలు కనిపించడానికి ఒకటి లేదా రెండు రోజుల ముందు, అలాగే లక్షణాలు మొదలైన తర్వాత రెండు నుంచి మూడు రోజుల పాటు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశముంది. తేలికపాటి లక్షణాలున్నవారు ఐదు రోజుల వరకు, తీవ్రమైన లక్షణాలు ఉన్నవారు 20 రోజుల వరకు కూడా ఈ వ్యాధిని వ్యాప్తి చేసే అవకాశముంది.రెస్పిరేటరీ సిన్సిషీయల్ వైరస్ఇది సాధారణంగా ఆరోగ్యవంతులలో జలుబులా ఉన్నప్పటికీ, శిశువులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి లేనివారికి ఇది ప్రమాదకరమైన వ్యాధి. లక్షణాలు కనిపించడానికి కొన్ని రోజుల ముందు, ఆ తర్వాత ఎనిమిది రోజుల వరకు ఇది అంటువ్యాధి. అయితే, శిశువులు, రోగనిరోధక శక్తి లేనివారు నాలుగు వారాల వరకు కూడా ఈ వైరస్ని వ్యాప్తి చెయ్యగలరు.చెస్ట్ కోల్డ్ (బ్రోంకైటిస్)బ్రోంకైటిస్ అంటువ్యాధి కాదు. ఇది వస్తే ఊపిరితిత్తుల్లోని శ్వాసనాళాల వాపు, శ్లేష్మం ఎక్కువ ఉత్పత్తి కావడం, ఛాతీ బిగువుగా, నొప్పిగా అనిపించడం వంటి సమస్యలు కనిపిస్తాయి. అయితే బ్రోంకైటిస్కు కారణమయ్యే జలుబు, ఫ్లూ లేదా ఇతర వైరస్లు మాత్రం అంటువ్యాధులే. వేరొకరి నుంచే వైరస్ వ్యాప్తి చెంది చెస్ట్ కోల్డ్లా మారుతుంది.న్యుమోనియావైరల్ న్యుమోనియా, బ్యాక్టీరియల్ న్యుమోనియా ఇవి రెండూ అంటువ్యాధులే. వైరల్ న్యుమోనియా జ్వరం పూర్తిగా తగ్గేంత వరకు వ్యాప్తి చెందుతుంది. బ్యాక్టీరియల్ న్యుమోనియా అయితే, యాంటీబయోటిక్స్ తీసుకున్నా, 48 గంటలు తర్వాతే అంటువ్యాధి తీవ్రత తగ్గుతుంది.పింక్ ఐవైరస్ లేదా బ్యాక్టీరియాతో వచ్చే పింక్ ఐ చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది. వైరల్ పింక్ ఐ లక్షణాలు ఉన్నంత కాలం, ఇంక్యుబేషన్ పీరియడ్లో ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాపిస్తుంది. బ్యాక్టీరియల్ పింక్ ఐ యాంటీబయోటిక్స్ తీసుకున్న 24 గంటల వరకు లేదా లక్షణాలు పూర్తిగా తగ్గేంత వరకు అంటువ్యాధిగానే పరిగణిస్తారు.సైనస్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ సైనస్ ఇన్ఫెక్షన్ అంటువ్యాధి కాదు. కానీ, సైనస్కు కారణమయ్యే జలుబు మాత్రం ఇతరులకు సోకుతుంది. ఇతరుల వల్లే మనకొస్తుంది.స్ట్రెప్ థ్రోట్గ్రూప్ ఏ స్ట్రెప్టోకాకస్ అనే బ్యాక్టీరియాతో ఇది వస్తుంది. ఇది తీవ్రంగా వ్యాప్తి చెందే అంటువ్యాధి! జ్వరం పూర్తిగా తగ్గిన తర్వాత కనీసం 12 గంటల పాటు యాంటీబయోటిక్స్ తీసుకున్న తర్వాతే జనాల్లో తిరగడం ఉత్తమం. అంతవరకు ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది.ఆయుర్వేద చిట్కాలు ఆహార నియమాలుఆయుర్వేదం ప్రకారం, శీతకాలంలో జీవ శక్తిని, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. సలాడ్లు లేదా చల్లటి ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి, ఎందుకంటే అవి శరీరంలో కఫాన్ని పెంచవచ్చు. నెయ్యి, నూనెలను మితంగా తీసుకోవడంతో చర్మం పొడిబారకుండా ఉంటుంది. చలికాలంలో వెచ్చదనానికి, ఆరోగ్యం కోసం తినదగిన ఉత్తమ ఆహారాలను ఇప్పుడు చూద్దాం.ఆయుర్వేదం ప్రకారం, శీతకాలంలో జీవ శక్తిని, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. సలాడ్లు లేదా చల్లటి ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి, ఎందుకంటే అవి శరీరంలో కఫాన్ని పెంచవచ్చు. నెయ్యి, నూనెలను మితంగా తీసుకోవడంతో చర్మం పొడిబారకుండా ఉంటుంది. చలికాలంలో వెచ్చదనానికి, ఆరోగ్యం కోసం తినదగిన ఉత్తమ ఆహారాలను ఇప్పుడు చూద్దాం.అల్లం: ఆయుర్వేదంలో దీనిని ‘సార్వజనీన ఔషధం’ అని పిలుస్తారు. దీన్ని చలికాలంలో ఎక్కువగా తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది. టీలోను, కూరల్లోను, సూపుల్లోను అల్లం వాడటం మంచిది. అలాగే, అల్పాహారంలో శొంఠి లడ్డూలు, అల్లం చట్నీ తీసుకోవడం కూడా మంచిదిపసుపు: ముఖ్యంగా శీతకాలంలో పసుపు బాగా పనిచేస్తుంది. పసుపులో వాపును తగ్గించే రసాయనాలు ఉంటాయి. ఇది శరీరానికి, మెదడుకి, గుండెకు చాలా మంచిది. శీతకాలంలో కూరల్లోను, పాలల్లోను పసుపు తరచుగా తీసుకోవచ్చు.జాజికాయ : ఇది శరీరానికి వెచ్చదనాన్నిచ్చే సుగంధ ద్రవ్యం. నిద్ర మెరుగుపరచడానికి, జీర్ణక్రియకు ఇది బాగా సహాయపడుతుంది. వేడి పాలలోను, మిఠాయిల్లోను, కూరల్లోని మసాలా మిశ్రమాల్లోను జాజికాయ పొడిని వాడుకోవచ్చు. ఉసిరి: చలికాలంలో వచ్చే జలుబు, ఫ్లూ నుంచి ఉసిరి రక్షణనిస్తుంది. ఉసిరిలో పుష్కలంగా ఉండే విటమిన్–సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. రోజుకి ఒకటైనా పచ్చి ఉసిరిని నేరుగా తినొచ్చు. తేనె లేదా పంచదారతో కలిపి కూడా తినవచ్చు. ఉసిరిని ఊరగాయలా కూడా తీసుకోవచ్చు.నువ్వులు: నువ్వులలో ప్రొటీన్, ఐరన్, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి కాలేయానికి, గుండెకు రక్షణనిస్తాయి. ఈ చలికాలంలో నువ్వుల లడ్డూలు, నువ్వుల చిక్కీలు తీసుకోవచ్చు. రకరకాల వంటకాలపై నువ్వులపొడిని కలుపుకుని తినడం కూడా మంచిదే!బెల్లం: బెల్లం శరీరానికి వెచ్చదనాన్నిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. బెల్లంతో చిక్కీలు, అరిసెలు, లడ్డూలు చేసుకుని తింటే ఉత్తమం.సజ్జలు– రాగులు : ఈ చిరుధాన్యాలు శరీరానికి వెచ్చదనాన్నిస్తాయి. వీటిలో ఫైబర్, ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, ఐరన్, బి విటమిన్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని అదుపు చేయడానికి సహాయపడతాయి. వీటితో రొట్టెలు, ఉప్మా, దోసె, అంబలి, లడ్డూలు వంటివి చేసుకోవచ్చు.నెయ్యి: చలికాలంలో నెయ్యి శరీరానికి శక్తిని, చురుకుదనాన్ని ఇస్తుంది. దీనిలో విటమిన్–ఎ, ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. చర్మానికి కాంతినిస్తుంది. కిచిడీ, పప్పు, పరాఠాలు, హల్వా లేదా అన్నంతో కలిపి తీసుకోవచ్చు.మెంతులు–మెంతికూర: ఇవి చలికాలంలో జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వీటిలో ప్రొటీన్, ఐరన్ అధికంగా ఉంటాయి. మెంతులను రాత్రి నీటిలో నానబెట్టి పేస్ట్ చేసుకుని తినడం మంచిది. మెంతి ఆకులను పరాఠాలు లేదా కూరల్లో కూడా వాడుకోవచ్చు.గోందు: చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్నిచ్చే చక్కటి ఆహారం ఇది. తుమ్మచెట్ల నుంచి సేకరించే జిగురును గోందు కటిర అంటారు. ఇది బరువు నియంత్రణకు, కొలెస్ట్రాల్ను కరిగించడానికి, కాల్షియం పెరగడానికి సహాయపడుతుంది. దీంతో లడ్డూలు కూడా చేసుకుంటారు.బాదం – వాల్నట్లు: చలికాలంలో బాదం, వాల్నట్ వంటి గింజలు తినడం మంచిది. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్, ఫైబర్ ఉంటాయి. వాల్నట్లలో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్, బాదంలో విటమిన్– ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని నానబెట్టి చిరుతిండిగా తినడం లేదా డ్రై ఫ్రూట్ లడ్డూలలో కలిపి తినడం మంచిది.చిలగడ దుంపలు – క్యారట్లు: చలికాలంలో ఈ దుంపలు శరీరానికి వెచ్చదనాన్ని, రోగనిరోధక శక్తిని అందిస్తాయి. క్యారట్లలో విటమిన్ ఎ, చిలగడ దుంపలలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. చిలగడదుంపలను ఎక్కువగా ఉడికించి లేదా కాల్చి తింటారు. వీటిని సూప్లలో కూడా వాడుకోవచ్చు. క్యారట్ను కూరల్లో ఉపయోగించడంతో పాటు హల్వా రూపంలోను తీసుకుంటారు.ఆకు కూరలు: పాలకూర, తోటకూర వంటివి చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఐరన్, కాల్షియం అందించడానికి సహాయపడతాయి. వీటిని పప్పు, పరాఠాలు, సూప్ల రూపంలో తీసుకోవడం మంచిది.జామకాయ: జామకాయల్లో విటమిన్–సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జామకాయ చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలోని అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పచ్చిగా లేదా పండురూపంలో తినొచ్చు.స్టమక్ బగ్ఇది కూడా వేగంగా వ్యాప్తి చెందే అంటువ్యాధే! వాంతులు, విరేచనాలు అవుతున్న సమయంలో ఎక్కువగా వ్యాపిస్తుంది. లక్షణాలు తగ్గిన తర్వాత కూడా రెండు వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు వ్యాధిగ్రస్థుల నుంచి ఇతరులకు సోకే అవకాశముంటుంది. పైగా ఈ వైరస్లు ఉపరితలాలపై వారాల తరబడి జీవించగలవు.ఇలాంటి అంటువ్యాధుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పైన పేర్కొన్న అంటువ్యాధులతో పాటు చెవినొప్పి, చలి–జ్వరం, దవడ వాపు వంటివన్నీ చలికాలంలో వచ్చే సాధారణ వ్యాధులే.టాన్సిలైటిస్చలికాలంలో ఎక్కువగా ఇబ్బంది పెట్టే మరో సమస్య టాన్సిలైటిస్. ఇది అంటువ్యాధి కాదు! గొంతు లోపలి భాగంలో గుండ్రటి కణజాలాలుంటాయి. వాటినే టాన్సిల్స్ అంటారు. బ్యాక్టీరియా లేదా వైరస్ సోకినప్పుడు వీటికి వాపు రావడాన్నే టాన్సిలైటిస్ అంటారు. ఈ ఇన్ఫెక్షన్ సోకినట్లయితే, ఆహారం, నీళ్లు, లాలాజలం కూడా మింగడానికి కష్టంగా ఉంటుంది.ఆర్థరైటిస్ (కీళ్ల నొప్పులు)మధ్య వయస్సు లేదా వృద్ధాప్యంలో ఉన్నవారికి శీతకాలపు కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తాయి. వీటిని ఎదుర్కోవడం చాలా కష్టం. ఈ నొప్పులకు కచ్చితమైన కారణాన్ని వైద్య శాస్త్రం ఇంకా చెప్పలేకపోతోంది. నొప్పి, వాపు, కండరాలు బిగించినట్లుగా అనిపించడం ఇవన్నీ లక్షణాలే! ముఖ్యంగా బరువు పెరగకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఈ సమస్య కాళ్ళ కీళ్లపై భారం పడేలా చేస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి. కనీసం వాకింగ్ అయినా చేస్తుండాలి. బాడీ మొత్తం కప్పి ఉండేలా ఉన్ని దుస్తులు వేసుకోవాలి. ఎందుకంటే తీవ్రమైన చలికి గురికావడం కూడా కీళ్ల నొప్పికి కారణమవుతుంది. పొగతాగే అలవాటు ఉంటే మానేయాలి. సెకండ్హ్యాండ్ స్మోకింగ్కు కూడా దూరంగా ఉండాలి. ఈ కాలంలో ఆహారం, నీళ్లు, ఇతర వస్తువులను తోటివారితో పంచుకోకపోవడం ఉత్తమం.శీతకాలంలో డీహైడ్రేషన్!సాధారణంగా డీహైడ్రేషన్ అనే మాట మనం వేసవిలో ఎక్కువగా వింటాం. నిజానికి చలికాలంలో దాహం తక్కువగా అనిపించినా, డీహైడ్రేషన్ సమస్య రాకుండా చూసుకోవాలి అంటున్నారు నిపుణులు. నారింజ, ద్రాక్ష, నిమ్మకాయ వంటి పండ్లలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, చర్మానికి సహజ కాంతిని ఇవ్వడానికి వీటిని తీసుకోవడం ఉత్తమం. దానిమ్మ యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. చలికాలంలో శరీరానికి శక్తినిస్తుంది. వీటితో పాటు వెచ్చని నీళ్లు లేదా హెర్బల్ టీలను తరచుగా తీసుకోవడంతో శరీరంలో తేమ శాతం నిలకడగా ఉంటుంది.చలికాలంలో వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి చిట్కాలు⇒ దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు చేతులకు కాకుండా మోచేతి లోపలి భాగానికి అడ్డు పెట్టుకోవాలి.⇒ తలుపు నాబ్స్, కౌంటర్టాప్ల వంటి తరచుగా తాకే ఉపరితలాలను శుభ్రం చేయాలి.⇒ వ్యక్తిగత వస్తువులను పంచుకోకుండా ఉండాలి.⇒ లక్షణాలు తగ్గేంత వరకు ఇంటికే పరిమితం కావాలి.⇒ తరచుగా సబ్బు, గోరువెచ్చని నీటితో చేతులు కడుక్కోవాలి. ⇒ వైరస్లు– టేబుల్స్, డోర్నాబ్లు, కౌంటర్టాప్లు, ఆఫీస్ సామాగ్రి వంటి ఉపరితలాలపై కొన్ని గంటలు లేదా రోజులు కూడా జీవించగలవు. ఈ సాధారణంగా తాకే ఉపరితలాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయడానికి, సురక్షితమైన క్లీనర్లను ఉపయోగించాలి⇒ ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు తగినంత నిద్ర అవసరం. పెద్దలు రాత్రికి 7–9 గంటలు, పిల్లలు వారి వయస్సును బట్టి ఎక్కువ నిద్ర పోవాలి. నిద్ర లేమి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది.⇒ విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్న పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తినడంతో రోగనిరోధక వ్యవస్థను కాపాడుకోవచ్చు. విటమిన్ సి, జింక్ వంటి పోషకాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.⇒ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో రోగనిరోధక వ్యవస్థ పుంజుకుంటుంది. జలుబు దగ్గు వంటి లక్షణాల నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. వారంలో ఎక్కువ రోజులు కనీసం30 నిమిషాలు తేలికపాటి వ్యాయామం చేయడం మంచిది. ⇒ చేతులతో తరచుగా ముఖం, నోరు తాకకుండా ఉండాలి. గొంతును తేమగా ఉంచడానికి క్రమం తప్పకుండా నీళ్లు తాగాలి. ⇒ వైరస్ లేదా బ్యాక్టీరియా బారిన పడితే రోజుకు రెండుమూడు సార్లు ఉప్పు నీటితో కొన్ని నిమిషాల పాటు పుక్కిలించాలి. ఇది గొంతు నొప్పిని తగ్గిస్తుంది. ⇒ ఈ సీజన్లో ఎక్కువగా గోరువెచ్చని నీరు తాగాలి. ఇంటి వాతావరణాన్ని తేమగా ఉంచడానికి ఎయిర్ హ్యూమిడిఫైయర్ గాడ్జెట్ (చర్మం, గొంతు, ముక్కు, పెదవులు పొడిబారకుండా నివారించే పరికరం) ఉపయోగించాలి.ఇక ఈ కాలంలో చర్మం పొడిబారిపోకుండా కళావిహీనంగా మారిపోకుండా ఆలివ్ నూనె, వెన్న, కొబ్బరి నూనె వంటి వాటితో శరీరానికి మర్దన చేసుకున్నాక స్నానం చేయడంతో మంచి ఫలితముంటుంది. ఎక్కువగా క్రీమ్స్, లోషన్స్ వంటి కాస్మెటిక్స్ వాడటం కంటే వంటింటి చిట్కాలను పాటించడమే మేలు. ఆరోగ్యం, ఆహారం, అందం ఈ మూడింటా తగు జాగ్రత్తలు తీసుకుంటే వింటర్కి మించి సీజనే ఉండదు. - సంహిత నిమ్మన -
కళాకాంతుల కనుల వేడుక
కనువిందైన కళ– ఆ కళకు తగ్గ కాంతి మిళితమై, చలికాలపు రాత్రుల్లో కళ్లు చెదిరే మాయాజాలాన్ని చూడాలంటే నెదర్లండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్కి పోవాల్సిందే! ‘ఆమ్స్టర్డామ్ ఫెస్టివల్’– ఇది ప్రతి సంవత్సరం శీతాకాలంలో నిర్వహించే ఒక అంతర్జాతీయ కాంతి కళా ప్రదర్శన. ఈ ఉత్సవం ప్రధాన లక్ష్యం కాంతితో చీకటిని తరిమి, ఆనందాన్ని నింపడమే! ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన థీమ్తో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులు డిజైన్ చేసిన ప్రత్యేకమైన లైట్ ఆర్ట్వర్క్లను ఇక్కడ ప్రదర్శిస్తారు.ఈ ఉత్సవం సాధారణంగా నవంబర్ నెల చివర నుంచి జనవరి నెల మధ్య వరకు జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆ వెలుగులు ఈ ఏడాది నవంబర్ 27న ప్రారంభమై జనవరి 18న ముగుస్తాయి. ఆమ్స్టర్డామ్ కాలువలు, నదీతీరాలు, పట్టణ ప్రాంతాలు కాంతి కళాకృతులతో మెరుస్తున్నాయి. ఈ కళాఖండాలు కేవలం అలంకరణలు మాత్రమే కాకుండా, ప్రతి సంవత్సరం ఎంచుకున్న థీమ్కు సంబంధించిన కథలను, ఆలోచనలను తెలియజేస్తాయి. నిజానికి ఈ 2025–26 థీమ్ ‘లెగసీ’– అంటే మన భవిష్యత్ తరాలకు మనం ఏమి వదిలి వెళ్తున్నాం? అనే ప్రశ్న చుట్టూనే కాంతులు ప్రతిబింబిస్తాయి. మొత్తానికి ఈ ఫెస్టివల్ను మూడు పద్ధతుల్లో తిలకించొచ్చు. మొదటిది పడవ ప్రయాణం, రెండవది నడకమార్గం, మూడవది సైకిల్ యాత్ర.పడవ ప్రయాణం ఈ లైట్ ఆర్ట్వర్క్లను వీక్షించడానికి సౌకర్యవంతమైన మార్గం పడవ ప్రయాణం. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ ‘వాటర్ కలర్స్’ మార్గంలో పయనించేటప్పుడు, కాంతి ప్రతిబింబాలు నీటిపై పడి అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తాయి. అనేక క్రూజ్ కంపెనీలు కళాఖండాల గురించి వివరించే ఆడియో గైడ్లను అందిస్తాయి.నడకమార్గం ఫెస్టివల్లో ఆర్ట్వర్క్లను దగ్గరగా, నిదానంగా చూడాలనుకునే వారికి నడక మార్గమే మంచిది. దీనిని ‘ఇల్యూమినాడే’ అని కూడా పిలుస్తారు. ఈ మార్గం నగరం నడిబొడ్డు గుండా వెళుతుంది. అద్భుతంగా ఉంటుంది.సైకిల్ యాత్ర సైకిల్పై నగరంలో లైట్ ఆర్ట్వర్క్లను చూస్తూ వెళ్ళడం మరొక ఆసక్తికరమైన అనుభవం. ఏ మార్గాన్ని ఎంచుకున్నా ఆ కళాకాంతులను చూసి కళ్లు జిగేల్ మనక మానవు! -
అదే.. నా స్టయిల్ హంట్ స్పాట్!
పేరు రితు వర్మ, కానీ ఫీల్? క్లాసీ చార్మ్, ఎలిగెంట్ వైబ్! స్క్రీన్స్ పై ఆమె ఫ్రేమ్ రాగానే కథే కాదు, మొత్తం మూడ్ మారిపోతుంది. మెరిసే ఆ స్పార్క్, గ్రేస్తో సైలెంట్గా స్టన్నింగ్గా అనిపించే ఆమె స్టయిలింగ్ టిప్స్ మీ కోసం!డ్రెస్ బ్రాండ్: గీతిక కానుమిల్లి ధర రూ. 46,800జ్యూలరీ బ్రాండ్: కర్ణిక జ్యూలర్స్ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.నేను చాలాప్రైవేట్ పర్సన్స్ . అందుకే నా ఫ్యాషన్స్ కూడా పూర్తిగా సెల్ఫ్ ఎక్స్ప్రెషన్స్ మోడ్లోనే ఉంటుంది. దుస్తుల బ్రాండ్ అయినా, స్ట్రీట్ షాప్ అయినా, నచ్చితే చాలు వెంటనే కార్ట్లో ఉంటాయి. అయితే, నా స్టయిల్ హంట్ స్పాట్ ఎక్కువగా ఆన్లైన్ స్క్రోలింగ్లోనే! – రీతు వర్మ -
విహారంలో పుస్తకం.. రీడింగ్ రిట్రీట్
సోషల్ మీడియా ఎంత కమ్ముకున్నా పుస్తకం పునరుత్థానం అవుతూనే ఉంది. పుస్తక పఠనానికి కొత్త దారులు పడుతున్నాయి. ఏదైనా మంచి చోటుకు విహారంగా వెళ్లి పుస్తకం చదువుకుంటూ కూచోవడం ట్రెండ్గా మారింది. దానినే ‘రీడింగ్ రిట్రీట్’ అంటున్నారు. ఒక్కరూ, లేదా కొద్దిమంది ఏదైనా చోటుకు వెళ్లి పుస్తకాలు చదువుకుంటూ రిలాక్స్ అవుతున్న ఈ ధోరణిపై వీకెండ్ కథనం.రోజూ పనులు, హడావిడి, తీరిక లేని శ్రమ, మొహం మొత్తే పరిసరాలు... వీటి మధ్య నుంచి పారిపోయి, ఎటైనా ఏకాంత ప్రదేశంలో హాయిగా వీకెండ్స్ గడపాలనిపిస్తుంది ఎవరికైనా. అలా గతంలో చేసే వారు. ఇప్పుడూ చేస్తున్నారు. అయితే అలా వెళ్లి సరదాగా తిరగడమో, పార్టీ చేసుకోవడమో, షాపింగ్ చేయడమో కాకుండా ఏ పనీ చేయకుండా పుస్తకాలు చదువుకుంటూ కూచోవాలనుకుంటున్నారు కొందరు. ప్రశాంతమైన చోటుకు వెళ్లి అంతే ప్రశాంతంగా పుస్తకాలు చదువుకుంటూ గడపే ట్రెండ్ పేరు ‘రీడింగ్ రిట్రీట్’. ప్రస్తుతం ఈ ట్రెండ్ ఎంతోమంది పాఠకులను ఒకచోట చేరుస్తోంది. కొందరు ఆపరేటర్లు ప్రత్యేకంగా కొన్ని చోట్లను ఇందుకై తయారు చేసి మా దగ్గరకు వచ్చి పుస్తకాలు చదువుకోండి అని కూడా ‘ప్యాకేజ్’లు ఆఫర్ చేస్తున్నారు. వాళ్లు పెట్టే తిండి తింటూ హాయిగా చదువుకుని తిరిగి ఇల్లు చేరడమేనన్నమాట.రీడింగ్ రిట్రీట్కు ఎందుకు వెళ్లాలి?ఆధునిక జీవితంలో వేగాన్ని తగ్గించడం అంత సులభం కాదు. రోజూ ఏదో పని, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక విషయాలు... ఇంకా చాలా చాలా. వీటి మధ్య తీరిగ్గా పుస్తకం చదివే అవకాశం దొరకదు. సెలవుల్లో అలాంటి ప్రయత్నం చేసినా ఎవరో ఒకరు మనల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. లేదా చుట్టూ ఉన్న వాతావరణం అనుకూలంగా ఉండదు. తర్వాత చదువుదాం, తర్వాత చూద్దాం అని పుస్తక పఠనాన్ని వాయిదా వేస్తుంటారు. ఆ వాయిదాను ఆచరణలోకి తీసుకువచ్చేందుకు కొందరు ఈ రిట్రీట్ ధోరణిని తీసుకొచ్చారు.రీడింగ్ రిట్రీట్ ఎక్కడ అనుకూలం?నగర జీవితంలోని రణగొణధ్వనులకు దూరంగా ఎక్కడైనా రీడింగ్ రిట్రీట్ జరుపుకోవచ్చు. ఊరి చివరి ఖాళీ ప్రదేశాలు కావొచ్చు. ప్రశాంతమైన అటవీ మార్గాలు కావొచ్చు. ఎతై ్తన కొండలు, సముద్రతీరాలు కావొచ్చు. ఊరి సమీపంలోని రిసార్ట్లు కావొచ్చు. మీకు అనుకూలమైన ప్రదేశాలు దీనికి ముఖ్యం. ఎటొచ్చీ ఎక్కువగా జనం వచ్చే ప్రదేశాలు, సులభంగా పట్టణాలను చేరే ప్రాంతాలు లేకపోవడం మేలు. అలా ఉంటే మనసు మన మాట వినదు. కనీసం ఐదారు గంటలు అక్కడ కూర్చొని చదువుకోవచ్చు అనే చోటను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. మధ్యలో భోజనం, ఇతర అవసరాలకు అనుగుణంగా ఆ ప్రాంతం ఉండాలి. రీడింగ్ రిట్రీట్లో ఎంతమంది? ఈ రీడింగ్ రిట్రీట్లో ఇంతమంది ఉండాలన్న నిబంధనేమీ లేదు. ఇద్దరితో మొదలుకొని ఎంతమందైనా ఉండొచ్చు. అయితే వారంతా పాఠకులై ఉండాలి. మీరంతా కలిసి ఒకచోటును ఎంపిక చేసుకొని, అక్కడికి వెళ్లి, ఎవరి పుస్తకంలో వారు మునిగిపోవచ్చు. అయితే నిజంగా పఠనం మీద ఆసక్తి ఉన్నవారినే ఎంచుకోవడం ఉత్తమం. అప్పుడే మీకు ఇబ్బంది ఉండదు. ఇటీవల కాలంలో రీడింగ్ రిట్రీట్ను ఏర్పాటు చేసేందుకు కొన్ని సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. మీరంతా ఒక బృందంగా ఏర్పడి, వారిని సంప్రదిస్తే మీ సంఖ్య, అభిరుచికి తగ్గట్లు వారే ఓ ప్రాంతాన్ని సూచించి, అక్కడ తగిన ఏర్పాట్లు చేస్తారు. ఇవి చేయడం తగదు→ పుస్తక పఠనంపై ఆసక్తి లేకుండా రీడింగ్ రిట్రీట్కు వెళ్లడం సరికాదు. దీనివల్ల పక్కవారి ఏకాగ్రతను దెబ్బతీసినట్లు అవుతుంది. → ఒక్కొక్కరు ఒక్కోరకమైన సాహిత్యాన్ని ఇష్టపడతారు. అక్కడికి వెళ్లాక ఈ విషయంలో ఎవరితోనూ వాదించకూడదు. → మీరు ఎన్ని పుస్తకాలు చదవగలరో అన్ని తీసుకెళ్లాలి. అక్కడికి వెళ్లాక పుస్తకాల కోసం ఇతరుల్ని ఇబ్బంది పెట్టకూడదు. లేదా వారి అనుమతితోనే వారి పుస్తకాలు తీసుకోవాలి. → అక్కడికి వెళ్లాక ఫోన్, ల్యాప్టాప్ వంటివి వాడకూడదు. అది ఆ కార్యక్రమం ఉద్దేశాన్ని దెబ్బతీస్తుంది. ఫోన్ ఆఫ్ చేయలేకపోతే సైలెంట్ మోడ్లో పెట్టాలి. → ఇతరులతో వాదించడం, గట్టిగా చర్చించడం, ఇతరులు చదువుతున్న పుస్తకాలను హేళన చేయడం, పుస్తకంలోని అంశాలను ముందుగానే వివరించడం, వాటి గురించి తేలిగ్గా మాట్లాడటం అస్సలు చేయకూడదు. -
ఇంటి వద్దకే శబరిమల అయ్యప్ప ప్రసాదం..! ఇలా ఆర్డర్ చేయండి..
శబరిమల అయ్యప్ప ప్రసాదం ఇష్టపడని వారుండరు. అంతటి ప్రత్యేకత కలిగిని అరవణ ప్రసాదం ఇంటి వద్దకే నేరుగా వచ్చేస్తుంది. అదికూడా శబరిమలకు వెళ్లక్కర్లేకుండానే అయ్యప్ప ప్రసాదాన్ని నేరుగా పొందొచ్చు. అదెలాగంటే..మనం ఉన్న చోటు నుంచే పోస్టాఫీసుల ద్వారా ఆర్డర్ చేస్తే సులభంగా శబరిమల అరవణ ప్రసాదం పొందొచ్చు. దీనికోసం ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు పోస్టల్ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేస్తోంది. శబరిమలలోని పోస్టాఫీస్ శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శించలేని భక్తుల కోసం ఇంటి నుంచే అరవణ ప్రసాదం కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేసింది. భారతదేశంలో అన్ని పోస్టాఫీసులు నుంచి ఈ శబరిమల అయ్యప్ప ప్రసాదం కొనుగోలు చేసుకోవచ్చని దేవస్వం బోర్డు పేర్కొంది. భారతదేశంలోని అయ్యప్ప భక్తులందరికీ శబరిమల అయ్యప్ప ప్రసాదం అందేలా చేయడమే తమ లక్ష్యమని శబరిమల పోస్టాఫీస్ అధికారులు తెలిపారు. దీనికోసం ప్రసాదాన్ని ఇంటింటికి చేరవేసే ప్రాజెక్టును పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రారంభించింది. ఈ ప్రసాదంలో నెయ్యి, అరవణ ప్రసాదం, పసుపు, కుంకుమ, విభూతి, అరచనై ప్రసాదం తదితరాలు ఉంటాయి. ధరల వివరాలు..టిన్ కవర్తో కూడిన ప్రసాదం కిట్ కొనడానికి రూ.520లు రుసుము చెల్లించాలి4-టిన్ అరవాణ ప్రసాదం కిట్ కోసం రూ.960లు10-టిన్ అరవాణ ప్రసాదం కిట్ కోసం రూ.1,760 చెల్లించాలిపోస్టాఫీసులో ప్రసాదం ధర చెల్లస్తే..రాబోయే కొద్ది రోజుల్లోనే శబరిమల అయ్యప్ప ప్రసాదం స్వయంగా మీ ఇంటికి వచ్చి తీరుతుందని అధికారులు తెలిపారు. ప్రతి ఏడాది అయ్యప్ప ఆలయం మకర సంక్రాంతి జ్యోతి దర్శనం నిమిత్తం తెరిచి..కొద్దిరోజుల అనంతరం మూతబడుతుంది. ఆ తర్వాత శబరిమల పోస్టాఫీస్ కూడా లాక్ చేయబడుతుంది. అలాగే వచ్చిన స్టాంప్లను పంపాలో సురక్షితంగా ఉంచుతారు. అంతేగాదు భారతదేశంలో రాష్ట్రపతి తర్వాత ప్రత్యేకమైన పిన్కోడ్ (689713) కలిగి ఉన్న ఏకైక దైవం శబరిమల అయ్యప్ప స్వామి. వార్షిక మకరజ్యోతి ప్రారంభం కాగానే శబరిమల అయ్యప్ప ఆలయానికి వివిధ లేఖలు అందుతాయి. ఆ భక్తుల లేఖలు అయ్యప్ప పాదాల వద్ద ఉంచడం అనేది అక్కడొక ఆచారం. ఇక్కడి పోస్టాఫీసు ద్వారానే భక్తుల ఇళ్లకు ప్రసాదం పంపిణీ చేయబడుతుంది.(చదవండి: అయ్యప్ప దర్శనం కోసం బారులు తీరిన జనం..నాడ మూసివేత..) -
ఊపిరితిత్తుల్లో గుచ్చుకుపోయిన ఇనుప రాడ్లు
భాగ్యనగరంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం మూడో అంతస్తు నుంచి నవీన్ కుమార్ అనే ఓ భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తు పడిపోయాడు. అతడి ఊపిరితిత్తుల్లోకి ఇనుప రాడ్లు గుచ్చుకుపోయి, వాటికి రంధ్రం పడింది. అయినా సరే.. ఆ కార్మికుడికి అమోర్ ఆస్పత్రి వైద్యులు రికార్డు సమయంలో అత్యవసర శస్త్రచికిత్స చేసి, అతడి ప్రాణాలు నిలబెట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..42 ఏళ్ల వయసున్న నవీన్ కుమార్ను ఆస్పత్రికి తీసుకొచ్చేసరికి అతడి శరీరం నుంచి రెండు ఇనుప రాడ్లను తొలగించాల్సి ఉంది. అప్పటికే అతడు స్పృహ కోల్పోయాడు, అతడి రక్తపోటు కేవలం 50/30 మాత్రమే ఉంది. ఇక ఆక్సిజన్ శాచ్యురేషన్ అయితే కనీసం లెక్కలకు కూడా అందనంత తక్కువగా ఉంది. అతడి హృదయం వద్ద పెద్ద గాయం ఉండడం, అందులోంచి గుండె, ఊపిరితిత్తులు కూడా కనిపిస్తుండడం, దాదాపు 2-3 లీటర్ల వరకు రక్తం పోవడం, ఊపిరితిత్తులకు-ఛాతీ గోడకు మధ్య రక్తం గడ్డకట్టడం, ఊపిరితిత్తులకు రంధ్రం పడడం... ఇన్ని సమస్యలు అతడికి ఉన్నాయి.ముందు అత్యవసరంగా అతడిని వెంటిలేటర్ మీద పెట్టారు. శరవేగంగా రక్తం ఎక్కించి, రీససిటేషన్ చేశారు. గాయం చాలా పెద్దగా ఉన్నట్లు సీటీ స్కానింగ్లో తెలిసింది. దాంతో వెనువెంటనే అతడిని ఆపరేషన్ థియేటర్కు తరలించారు. వైద్యులు అతడికి అత్యవసరంగా థొరకాటమీ శస్త్రచికిత్స చేశారు. అతడి ఎడమ ఊపిరితిత్తిలోని శ్వాసకోశం పూర్తిగా ధ్వంసమైపోయింది. దాంతో దాన్ని తొలగించాల్సి వచ్చింది. కానీ రక్తస్రావం చాలా ఎక్కువగా ఉండడంతో నవీన్ రక్తపోటు మరింతగా పడిపోసాగింది. ఫలితంగా రక్తం మరింత ఎక్కించారు. ఒక ఊపిరితిత్తి మాత్రమే పనిచేస్తుండడంతో దాన్ని రక్షించేందుకు వెంటిలేషన్ వ్యూహాలను అమలుచేశారు. అతడికి ఆక్సిజన్ ఏమాత్రం అందకపోతున్నా కూడా మెదడు, ఇతర కీలక అవయవాలు ఏవీ దెబ్బతినకుండా వైద్యబృందం చాలా కష్టపడింది.ఈ కేసు సంక్లిష్టత గురించి అమోఆర్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థో ఆంకాలజీ సర్జన్ డాక్టర్ కిశోర్ బి. రెడ్డి మాట్లాడుతూ, “మేం చికిత్స చేసిన వాటిలో ఇది అత్యంత సంక్లిష్టమైన, సమస్యాత్మకమైన ట్రామా కేసు. నవీన్కు తగిలిన గాయాలన్నీ ప్రాణాంతకమే. ప్రతి నిమిషం చాలా విలువైనది. దాంతో మా అత్యవసర, సర్జికల్, ఎనస్థీషియా, క్రిటికల్ కేర్ బృందాల్లోని వైద్యులందరూ అద్భుతమైన సమన్వయంతో పనిచేసి అతడి ప్రాణాలు కాపాడారు. ప్రపంచస్థాయి ట్రామాకేర్ సదుపాయాలు, సరైన సమయానికి చికిత్స అందించాం అనడానికి అతడి ప్రాణాలు నిలబడడమే నిదర్శనం. ఇప్పుడతడు కోలుకుని సాధారణ జీవితం గడపడం మాకెంతో ఆనందాన్నిస్తోంది” అని తెలిపారు.నవీన్ చాలా అద్భుతంగా కోలుకోవడంతో, 48 గంటల్లోనే వెంటిలేటర్ తొలగించారు. కాసేపటి తర్వాత అతడు ఒకరి సాయంతో నడవగలిగాడు. వారం రోజుల్లోపే అతడు ఎలాంటి సాయం అవసరం లేకుండా తన కాళ్ల మీద తాను నడుస్తూ కోలుకోవడంతో డిశ్చార్జి చేశాం.అతడికి చికిత్స చేసిన వైద్యబృందంలో శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ పూజిత, ఎమర్జెన్సీ బృందానికి చెందిన డాక్టర్ నందీప్, డాక్టర్ అశోక్, క్రిటికల్ కేర్ విభాగ నిపుణులు డాక్టర్ ప్రత్యూష, ఎనస్థీషియా నిపుణులు డాక్టర్ జగదీష్ కీలకంగా వ్యవహరించారు.(చదవండి: మాంజా మెడకు చుట్టుకుని తెగిన రక్తనాళాలు..హెల్మెట్ పెట్టుకున్నా..!) -
రోడ్డుపై రాయి.. రూ.5 వేల ధర ఎలా పలికిందంటే..!
రోడ్డు మీద రాయిని చూడగానే కాలితో తన్నడమో చూసిచూడనట్లు వదిలేయడమో చేస్తాం. కానీ ఈ యువకుడు రోడ్డుపై పడి ఉన్న రాయికి రూపం ఇచ్చాడనాలో లేక దానికి విలువనిచ్చాడనలో తెలియదు గానీ అద్భుతం చేశాడు. టాలెంట్కి కాదేది అనర్హం అన్నట్లుగా ఓ రాయిని అద్భతమైన వస్తువుగా తీర్చిదిద్ది ప్రశంసలందుకోవడమే కాదు వేలల్లో డబ్బుని కూడా ఆర్జించాడు. ఢిల్లీకి చెందిన ఒక యువకుడు రాయిని ఇంటి అలంకరణకు ఉపకరంగా ఉండే వస్తువుగా మార్చాడు. అతడి నైపుణ్యానికి అంతా విస్తుపోయారు కూడా. రోడ్డుమీద పడి ఉన్న రాయిని అద్భుతమైన గడియారంగా మార్చాడు. రాయి చివరి అంచులను పాలిష్ చేసి అందంగా మార్చాడు. గడియారం సూదిని అటాచ్ చేసేందుకు, ఇతర పరికరాలను సెట్ చేసేందుకు రంధ్రాలు చేశాడు. అలాగే ఆకర్షణీయంగా కనిపించేలా పెయింట్ వేశాడు. చివరగా సూది, బ్యాటరీ చొప్పించి.. రాతితో రూపుదిద్దుకున్న ఫంక్షనల్ గడియారాన్ని డిజైన్ చేశాడు. ఆ తర్వాత ఆ గడియారాన్ని పలువురికి చూపించినా..ఎవరూ ప్రశంసించలేదు, కొనేందుకు ఆసక్తి కూడా చూపించలేదు. దాంతో మరికొన్ని మార్పులు చేసి అమ్మకానికి పెట్టగా కూడా పరిస్థితి అలానే ఉంది. దాంతో ఆ యువకుడి గడియారంతో రోడ్డుపై నిలబడి అమ్మేందుకు ప్రయత్నించగా..చాలామంది రూ. 460కి అడగారు. మరి అలా అడగటం నచ్చక..ఇది రాయితో తానే స్వయంగా చేతితో చేసిన గడియారం అని చెబుతుంటాడు. అది విని ఆసక్తిగా ఒక వ్యక్తి ఆ యువకుడి వద్దకు వచ్చి ధర ఎంత అని అడగగా రూ. 5 వేలు అని చెప్పగానే మారుమాట్లడకుండా డబ్బు చెల్లించి మరి ఆ గడియారాన్ని కొనుగోలు చేశాడు. అంతేగాదు ఆ రాయిని సేకరించడం దగ్గర నుంచి గడియారంగా మార్చడం వరకు మొత్తం తతంగాన్ని రికార్డు చేసి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు ఆ యువకుడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి మరి. View this post on Instagram A post shared by Sabke Bhaiya JI (@deluxebhaiyaji) (చదవండి: వివాహంలో వరుడు సప్తపది తోపాటు మరొక ప్రమాణం..!) -
మాంజా మెడకు చుట్టుకుని తెగిన రక్తనాళాలు..హెల్మెట్ పెట్టుకున్నా..!
సంక్రాంతికి ఇంకా దాదాపు 40 రోజులకు పైగా ఉన్నా ఇప్పటి నుంచే మాంజా ప్రమాదాలు మొదలైపోయాయి. నగరంలోని గుర్రంగూడ ప్రాంతానికి చెందిన కార్తీక్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రముఖ సంస్థలో పనిచేస్తున్నారు. ఆయన ఇంటి నుంచి నాగోలు వైపు తనకు కాబోయే భార్యతో కలిసి బైకు మీద వెళ్తుండగా ఉన్నట్టుండి మెడకు ఏదో పట్టుకున్నట్లు అయ్యింది. తీరా చూస్తే.. అప్పటికే మెడ తెగిపోయింది. అటుగా వెళ్తున్న మరో వ్యక్తి అతడిని గమనించి వెంటనే సమీపంలో ఉన్న కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కార్తీక్కు సత్వరం చికిత్స అందించి రక్తనాళాలు తిరిగి అతికించిన కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ రిషిత్ బత్తిని ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు.కార్తీక్ తనకు కాబోయే భార్యతో కలిసి వెళ్తుండగా కామినేని ఫ్లై ఓవర్ ఎక్కిన కాసేపటికి అతడి మెడకు మాంజా చుట్టుకుంది. హెల్మెట్ పెట్టుకున్నా కూడా మెడ భాగంలో అది గట్టిగా కోసుకుంది. దాంతో అతడి మెడ కండరాలతో పాటు, పైవైపు ఉండే రక్తనాళాలు కూడా తెగిపోయాయి. అయితే అదృష్టవశాత్తు లోపలి భాగంలో ఉండే ప్రధాన రక్తనాళాలు గానీ, శ్వాసనాళం గానీ గాయపడకపోవడంతో అతడికి మరీ ఎక్కువగా ఇబ్బంది కలగలేదు. అయితే, రక్తనాళం తెగడంతో రక్తస్రావం ఎక్కువగా ఉంది. ఆస్పత్రికి తీసుకురాగానే ముందు ఎమర్జెన్సీలో రక్తస్రావం ఆపేందుకు ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో వెంటనే శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించాం. అరగంటలోపే శస్త్రచికిత్స ప్రారంభించి అతడికి తెగిపోయిన రక్తనాళాలను తిరిగి అతికించడంతో పాటు.. కండరాన్ని కూడా కుట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయగలిగాం. మాంజాను చేత్తో తీయడానికి ప్రయత్నించడంతో అతడి చేతి వేళ్లకు కూడా గాయాలయ్యాయి. అతడితో పాటు వెనక కూర్చున్న యువతికి మెడ దగ్గర, కంటి దగ్గర స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో ఆమెకు ప్రాథమిక చికిత్స చేశాం.సంక్రాంతికి ఇంకా చాలా సమయం ఉన్నా ఇప్పటినుంచే పతంగులు ఎగరేయడం మొదలైంది. అయితే, అవి తెగిపోయినప్పుడు వాటికి వాడుతున్న మాంజాలు కూడా తెగిపోయి.. గాలికి వేలాడుతూ ఇలా రోడ్డు మీద వెళ్లేవాళ్ల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. గాజు పూసిన మాంజాలు ఎక్కువ ప్రమాదకరంగా ఉంటాయి. వీటి నియంత్రణకు ఇప్పటినుంచే అధికారులు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇలాంటి ప్రాణాంతక ప్రమాదాలు మరిన్ని జరిగే అవకాశం ఉంటుంది అని డాక్టర్ రిషిత్ బత్తిని తెలిపారు. ఈ శస్త్రచికిత్సలో ఇంకా జూనియర్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ సయ్యద్ మఝర్ అలీ, చీఫ్ కార్డియాక్ అనెస్థటిస్ట్ డాక్టర్ సురేష్ కుమార్, కన్సల్టెంట్ అనెస్థటిస్ట్ డాక్టర్ రవళి సాదె పాల్గొన్నారు.కాపాడింది కూడా కామినేని వైద్యుడేతనను ఈ ప్రమాదం నుంచి కాపాడి ఆస్పత్రికి తీసుకెళ్లినది కూడా కామినేని ఆస్పత్రికి చెందిన వైద్యుడేనని బాధితుడు కార్తీక్ తెలిపారు. ‘‘నేను నాకాబోయే భార్యతో కలిసి నాగోలు వైపు వెళ్తున్నాను. 40 కిలోమీటర్లలోపు వేగంతోనే వెళ్తుండగా ఉన్నట్టుండి ఏదో కోసుకున్నట్లు అనిపించింది. చెయ్యి పెట్టి చూసేసరికి హెల్మెట్ లోపల నుంచి మాంజా కనిపించింది. అది తగిలిచెయ్యి కూడా కోసుకుపోయింది. వెంటనే బండి పక్కకి తీసి ఆపేశాను. తర్వాత మెడదగ్గర నొప్పి ఉంది ఏంటా అని చెయ్యి పెడితే చెయ్యి అంతా రక్తం ఉంది. ఈలోపు అటుగా వచ్చిన వైద్యుడు తన కర్చీఫ్ ఇచ్చి అదిమిపట్టుకోమన్నారు. రెండు మూడు ఆటోలు ఆపినా ఆగలేదు. దాంతో ఆయన తన బండి మీద దగ్గర్లో ఉన్నకామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఎమర్జెన్సీలో అడ్మిట్ అయ్యాను. తర్వాత అరగంటకు ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లారు. నన్ను ఆస్పత్రిలో చేర్చింది కూడా ఒక వైద్యుడే అని తర్వాత తెలిసింది. ఇంకా సంక్రాంతికి చాలా సమయం ఉన్నా ఇప్పటినుంచే ఇలా మాంజాలు తగలడం మొదలైతే రోడ్ల మీద వెళ్లేవారికి చాలా ప్రమాదం ’’ అని కార్తీక్ చెప్పారు.(చదవండి: ఊపిరితిత్తుల కేన్సర్కి విలన్ ధూమపానం మాత్రమే కాదు..!) -
వివాహంలో వరుడు సప్తపది తోపాటు మరొక ప్రమాణం..!
సాధారణంగా వివాహంలో సప్తపది అనే తంతు ఉంటుంది. ధర్మేచ, కామేచ అంటూ వధువరులు చేత ఏడు ప్రమాణాలు చేయిస్తారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ వరుడు వెరైటీగా ఎనిమిదో ప్రమాణం చేయిస్తాడు. పాపం ఆ వధువుకి అంగీకరించక తప్పలేదు. ఇంతకే ఏంటా ప్రమాణం అంటే..ఢిల్లీలో జరిగి వివాహ వేడుకలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. మయాంక్ దియా అనే వధువరుల వివాహం అంగరంగ వైభవంగా సాగుతుంది. సరిగ్గా సప్తపది తంతు వచ్చింది. అందరి వధువరులానే ఈ జంట ఆ ప్రమాణాలు చేసింది. కానీ ట్వీస్ట్ ఏంటంటే వీటి తోపాటు ఇంకో ప్రమాణం కూడా చేద్దాం అనగానే ఒక్కసారిగా అంతా షాకయ్యారు. ఎనమిదో వచనం(ప్రమాణంగా) ఈ రోజు నుంచి మన గదిలో ఏసీ ఉష్ణోగ్రతను తక్కువగా ఉంచుదాం అని చెబుతాడు. సాంప్రదాయ హిందూ వివాహంలో జంట సాధారణంగా పవిత్ర అగ్ని చుట్టూ తిరుగుతూ..ఏడు పవిత్ర ప్రమాణాలు చేస్తారు. దీనని సప్తపది అంటారు. అయితే మయాంక్ ఎనిమిదో వచనంగా చెప్పించిన ప్రమాణం ఆ వధువుకి ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణం కదూ..!. మయాంక్ ఈ పెళ్లి వేడుకలో సడెన్గా మైక్ తీసుకుని మరి తన కాబోయే భార్యతో ఈ ఎనిమిదో ప్రమాణం చేయించడం గమనార్హం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. బ్రో భార్యను అడగకుండానే ఈ ప్రమాణం చేయించావే..ముందే గ్రిప్లో పెట్టుకుంటున్నావా అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Shaadi Reelz | Wedding Content Creator (@shaadireelz) (చదవండి: పేరు మార్చేసుకున్న ఇండిగో?! వైరల్గా హర్ష్ గోయెంకా పోస్ట్) -
ఊపిరితిత్తుల కేన్సర్కి విలన్..జస్ట్ స్మోకింగ్ మాత్రమే కాదు..!
ఊపిరితిత్తుల కేన్సర్ ఎందువల్ల వస్తుదంటే...అందరూ చెప్పేది బీడి,చుట్ట సిగరెట్ల వల్ల అనే ఠక్కున చెప్పేస్తారు. కానీ అదొక్కటే కారణం కాదని శాస్త్రవేత్తలు నొక్కి చెబుతున్నారు. మనచుట్టూ ఉన్న పరిసరాలే ప్రధాన ముప్పుగా పరిణమిస్తునన్నాయిని హెచ్చరిస్తున్నారు. మరి అదెలాగో సవివరింగా తెలుసుకుందాం. నిజానికి ఇటీవల కాలంలో పట్టణ ప్రాంతాల్లో ధూమపానం చేయని వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ చాలామంది ఈ మహమ్మారిని బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. కనీసం సిగరెట్ వాసన కూడా చూడని వారిలో కూడా పీఎం2.5గా పిలిచే కణాలు ఊపిరితిత్తుల్లోనూ, రక్తప్రవాహంలో ప్రవహించి కణాలను దెబ్బతీసి, ఊపిరితిత్తుల కేన్సర్కు దారితీసే ఉత్పరివర్తనాలను ప్రేరేపిస్తాయని చెబుతున్నారు. ఇది కేవలం నగరాల్లోనూ కాదు గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితని చెబుతున్నారు. ఎందుకంటే..డీజిల్, పంట అవశేషాలను కాల్చడం వల్ల ఈ మహమ్మారి బారిన పడుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. అదీగాక గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యిమీద వంట చేస్తారు. దాన్నుంచి వచ్చే పొగ, ఒకవేళ కిచెన్లో సరైన వెంటిలేషన్ లేకపోతే.. ఆ పొగాకు ఎక్కువసేపు గురవ్వాల్సి వస్తుంది. ఫలితంగా ఊపిరితిత్తుల కేన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు నిపుణులు. అలాగే రాడాన్ వాయువు, సహజంగా సంభవించే రేడియో ధార్మిక వాయువుకి ఎక్కువ ఎక్స్పోజ్ అయినా..ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. అలాగే మైనింగ్, సిలికా దుమ్మ లేదా డీజిల్తో నడిచే కర్మాగారాల్లో వర్క్చేసే వ్యక్తులు ఈ వ్యాధి బారిన పడుతుంటారని చెప్పుకొచ్చారు. ధూమపానం చేయనివారు ఎందుకు సేఫ్గా లేరు...ధూమపానం చేయనివారిలో, ముఖ్యంగా యువకులు, మహిళల్లో ఊపిరితిత్తుల కేన్సర్ ఉపరకం అయినా అడెనోకార్సినోమా పెరుగుదల ఉన్నట్లు గుర్తించారు. అలాగే పర్యావరణం తోపాటు జన్యుపరమైన కారకాలు కూడా పెద్దపాత్ర పోషిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా వాయకాలుష్యం, జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఈ ప్రమాదాన్ని మరింత పెంచుతాయని చెబుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు..రోజువారీ AQI (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) స్థాయిలను పర్యవేక్షించడంకాలుష్యం ఎక్కువగా ఉన్న రోజుల్లో, బహిరంగ కార్యకలాపాలను పరిమితం చేయడంట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో కిటికీలు మూసి ఉంచడం.ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, ఎయిర్ ప్యూరిఫైయర్లు లేదా సహజంగా గాలిని ఫిల్టర్ చేసే పీస్ లిల్లీస్, స్పైడర్ ప్లాంట్లు వంటి మొక్కలను ఉపయోగించండి.పొగ రహిత గృహాలు, కార్యాలయాల ఉండేలా మెయింటైన్ చేయడంవర్కింగ్లో దుమ్ము లేదా రసాయనాలకు గురికాకుండా ఉండటం. చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వడం.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మెరుగైన ఫలితాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: బెడ్షీట్స్ మార్చి ఎంత కాలమైంది?) -
అయ్యప్ప దర్శనం కోసం బారులు తీరిన జనం..నాడ మూసివేత..
సాక్షి శబరిమల: సన్నిధానం వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఈ రాత్రికి నాడ మూసివేస్తే రేపు తెల్లవారుజామున 3 గంటల వరకు యాత్రికులను 18వ మెట్టు ఎక్కడానికి అనుమతించరు. ఆ తర్వాత భద్రతలో భాగంగా, పోలీసులు, కేంద్ర దళాలు CRPF, RAF, NDRF, యాంటీ టెర్రర్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, స్పెషల్ బ్రాంచ్ పోలీసుల సంయుక్తంగా రూట్ మార్చ్ నిర్వహించనున్నారు.నాడ మూసివేత అంటే..నాడ అంటే శబరిమల అయ్యప్ప ఆలయానికి వచ్చే ప్రధాన మర్గం. ఇది అయ్యప్ప భక్తులకు, ముఖ్యంగా దీక్షధారులకు అతి ముఖ్యమైనది. సింపుల్గా చెప్పాలంటే అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకునే మెట్ల మార్గం. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచే ఆలయ ప్రవేశ మార్గం. అందువల్ల ఈ మెట్లమార్గం గుండా ఉండే ప్రధాన ద్వారాన్ని మూసివేస్తే..భక్తులను 18వ మెట్టు ఎక్కడానికి అనుమతించరు. ఇక్కడే స్వామివారికి ఆలయ పూజారులు విశేష పూజలు జరుపుతారు. భక్తులు తెచ్చే ఆవునేతితో అయ్యప్పకు అభిషేకం చేస్తారు.ఇదిలా ఉండగా, సన్నిధానం పంపా, నీలక్కల్ వద్ద అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు. రాత్రి నాడ మూసివేశాక, తిరుముట్టం, దాని పరిసరాలు ప్రత్యేక పోలీసుల రక్షణలో ఉంటాయి. ఎప్పుడైతే నాడ మూసివేస్తారో ఆ తదనంతరం యాత్రికులను పాపంతల్ వద్ద క్యూలో నిలబెడతారు. రేపు తెల్లవారుజామున 3 గంటలకు నాడ తెరిచిన తర్వాత మాత్రమే భక్తులను 18వ మెట్టు ఎక్కడానికి అనుమతిస్తారు. సన్నిధానం వైపు ట్రాక్టర్ల తరలింపును రెండు రోజులుగా పరిమితం చేశారు. ట్రాక్టర్లలో తీసుకువచ్చిన వస్తువులను కూడా తనిఖీ చేస్తారు. గుర్తింపు కార్డు లేకుండా ఎవరిని సిబ్బంది ద్వారం గుండా తిరుముట్టంలోకి ప్రవేశించడానికి అనుమతించరు. ఈ ప్రాంతంలో నిఘా ముమ్మరంగా ఉంటుంది. ఇక ఫుట్పాత్ వద్ద దర్శనం ప్రారంభంలో స్కానర్లు డోర్ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, హోల్డ్ మెటల్ డిటెక్టర్లు ఉపయోగించే స్రీనింగ్ తనిఖీ తదితరాలు పర్యవేక్షణ ఉంటుంది.(చదవండి: పులిమేడు రూట్లో భక్తుల రద్దీ) -
పేరు మార్చేసుకున్న ఇండిగో?!
దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో గత నాలుగు రోజులుగా విమాన సర్వీసుల అంతరాయాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో శుక్రవారం (డిసెంబర్ 5) ఒక్క రోజే 400కి పైగా విమానాలను రద్దు చేసింది. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ భారీ అంతరాయంపై ఇండిగో అధికారికంగా ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది కూడా. రద్దయిన అన్ని విమానాలకు ఆటోమేటిక్గా ఒరిజినల్ పేమెంట్ మోడ్కు పూర్తి రీఫండ్ ప్రాసెస్ చేస్తామని చెప్పింది. ఈతరుణంలో నెట్టింట పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా హాస్యస్పదంగా చేసిన పోస్ట్ హాట్టాపిక్ మారింది.ఆ పోస్ట్లో వరసగా నాలుగో రోజున కూడా విమాన సర్వీసులు అంతరాయం కొనసాగుతుండగా, గోయెంకా ఎయిర్లైన్ లోగోతో కూడిన సరికొత్త పేరును నెటిజన్లతో ఇలా పంచుకున్నారు. కొనసాగతున్న విమాన సర్వీసులు అంతరాయం నేపథ్యంలో తమ ఎయర్లైన్స్ పేరు మార్పు అంటూ.. “ఇట్ డిడ్న్'ట్ గో”, అని సరదాగా ఇలా పోస్ట్ చేశారు. అంతే నిమిషాల్లో ఈ పోస్ట్వైరల్ అయిపోయింది. చాలామంది ప్రయాణికులు ఈ జోక్ను మన నిరాశను ప్రతిబింబిస్తుందని చెప్పడం విశేషం. భారతదేశంలోని అతిపెద్ద విమానాయాన సంస్థ ఈ వారం ప్రారంభం నుంచి వందలాది సేవలను రద్దు చేసింది, ఢిల్లీ, బెంగళూరు మరియు చెన్నై వంటి ప్రధాన కేంద్రాలలో ప్రయాణీకులను ఇబ్బందులకు గురిచేసింది. ఫలితంగా ప్రత్యామ్నాయ విమానాల టిక్కెట్ల ధరల అమాంతం పెరిగేందుకు కారణమైంది. ఇక గోయెంకా చేసిన పోస్ట్ విమానాల రద్దుతో ఎయిర్పోర్ట్లో చిక్కకుపోయిన ప్రయాణికులను ఎంతాగానో ఆకట్టుకుంది. నెటిజన్లంతా "ఇండిగో ఇండిగో నుంచి ఇట్ డిడ్ డిట్ గోకు వెళ్లడం క్రేజీగా ఉంది అంటూ పోస్టులు పెట్టారు. మరికొందరు తదుపరి అప్డేట్ పేరు మార్పు కాదని ఆశిస్తునన్నాం అలాగే ఇక ఈ ఆలస్యం కొనసాగదని ఆశిస్తున్నాం అని పోస్టులు పెట్టారు. కానీ కొంతమంది విమాన చరిత్రలోనే ఇంతలా విమాన సర్వీసుల రద్దు అనేది భలే ట్విస్టింగ్గా ఉన్నా..బహుశా లోగో కూడా రీబ్రాండ్ కోరుకుంటుందేమో అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. కాగా, ఈ విమాన సర్వీసులు అంతరాయం పూర్తిగే తగ్గే వరకు గోయెంకా పోస్ట్ వైరల్ అవుతూనే ఉంటుంది కాబోలు.Name change announced…. pic.twitter.com/Pd3JJiE6CG— Harsh Goenka (@hvgoenka) December 5, 2025 (చదవండి: ఏఐ చాట్బాట్తో జర జాగ్రత్తోయ్..!) -
ఏఐ చాట్బాట్తో జర జాగ్రత్తోయ్..!
సాంకేతిక అందుబాటులోకి రావడంతో నగరంలో చాట్బాట్ వినియోగం భారీగా పెరుగుతోంది.. ఐటీ, రీసెర్చ్ స్కాలర్స్, జెన్ జీ యువత ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో.. ఏదో ఒక అవసరానికి ఏఐని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ, పర్ప్లెక్సిటీ వంటి వివిధ రకాల సాధనాలు అందుబాటులకి రావడంతో సమాచారం కోసం కొందరు.. టైంపాస్ కోసం మరి కొందరు వీటిని భారీ స్థాయిలో వినియోగిస్తున్నారు. అయితే ప్రాంప్టింగ్ సరిగా లేకపోతే.. తిప్పలు తప్పవని, సరైన సమాచారం రాబట్టాలంటే.. సరైన ఇన్పుట్ కూడా అవసరమని, ఒకవేళ ప్రాంప్టింగ్ ద్వారా సమాధానం పొందినా.. దీనికి ఫ్యాక్ట్ చెక్ కూడా అవసరం అని చెబుతున్నారు టెక్ నిపుణులు.. దీనిని గుర్తెరిగి సరైన రీతిలో వినియోగించాలని సూచిస్తున్నారు. కాగా నగర జీవనశైలిపై ఈ చాట్బాట్ వినియోగం ప్రభావం చూపుతోందని తెలుస్తోంది. ప్రతి చిన్నవిషయానికీ వీటిపై ఆధారపడుతున్నారని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. సాంస్కృతిక నగరి హైదరాబాద్లో సాంకేతిక వినియోగం పెరుగుతోంది. ఓ వైపు రాయదుర్గ్–ఫైనాన్షియల్–డ్రిస్టిక్ట్లోని ఐటీ కార్యాలయాల్లోని ఉద్యోగులు.. రీసెర్చ్ చేయడానికి నగరానికి వచ్చే విద్యార్థులు, ప్రముఖులు, పనుల్ని వేగంగా పూర్తి చేసుకోవడానికి ఏఐ చాట్ ప్లాట్ఫామ్పై ఆధారపడుతున్నారు. గ్లోబల్ స్థాయిలో కొన్ని పెద్ద కన్సూ్యమర్–ఫ్రెండ్లీ చాట్ బోట్స్ (చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ, క్లౌడ్, పర్ప్లెక్సిటీ)తో పాటు ఉత్సాహభరితమైన స్థానిక–ఇండియన్ సంస్థలతో పాటు ఎన్నో సొల్యూషన్స్ మెరుగైన ఇంటిగ్రేషన్లు అందుబాటులోకి తేవడంతో ఈ తరహా ఎకోసిస్టమ్ వేగంగా పెరుగుతోంది. ఇండియన్ చాట్బాట్ బూమ్.. ప్రధానంగా నగరంలో వినియోగించే వేదికలు రెండో తరానికి చెందినవి. ప్రపంచ స్థాయి జనరల్–పర్పస్ చాట్ ఏజెంట్లు (చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ, క్లౌడ్, పర్ప్లెక్సిటీ, బింగ్ కాపీలాట్ మొదలైనవి) కాగా.. స్థానిక/ఎంటర్ప్రైజ్ ఆధారిత కన్వర్జేషనల్ ఏఐ ప్లాట్ఫామ్స్ (హాప్టిక్, యెల్లో.ఏఐ, యూనిపోర్) వంటివి.. అలాగే చిన్న స్టార్టప్స్, బాట్స్, వెర్బల్ ఇన్ఫో–సర్వీసులు హైదరాబాద్ వ్యాపారాల్లో కనిపిస్తుంటాయి. ఇటీవల ఇండియన్ మార్కెట్లోనే వందలకొద్దీ ప్లేయర్లు, బిజినెస్–సొల్యూషన్లు అందుబాటులో ఉన్నట్లు అంచనాలు. ఇది భారతీయ చాట్బాట్కి బూమ్ అని పిలుస్తున్నారు. లైఫ్ స్టైల్లో సౌలభ్యాలు.. దీనికి సంబంధించి నగర సౌలభ్యాల్లో భాగంగా పనితీరు పెరుగుతుంది. కోడింగ్–హెల్ప్, డాక్యుమెంట్ డ్రాఫ్టింగ్, ఈ మెయిల్ టెంప్లెట్లు, ఐడియాస్.. అధికారికంగా ఇతరుల సహాయం పొందాల్సిన పనులు, ఇండిపెండెంట్గా వేగంగా చేయొచ్చు. విద్యార్థులు, పరిశోధకుల కోసం 24/7 తక్షణ సమాధానాలు, ట్యుటోరింగ్, అల్గారిథమ్ వివరణలు, పాఠ్యాంశాల ఇతివృత్తాలు సమగ్రంగా అందిస్తుంది.. స్థానిక భాషలకు మద్దతు ఇచ్చేలా కొన్ని ఇండియన్ వేదికలు తెలుగు/హిందీ/తమిళ్/కన్నడ వంటి స్థానిక భాషలను అందజేస్తున్నాయి. షార్ట్–ఫార్మాట్ కస్టమర్–సపోర్ట్ కోసం ఉత్తమమైన మార్గం. నష్టాలు, కొత్త సవాళ్లు.. నగర స్థాయిలో వినియోగం పెరగడంతో మిస్–ఇన్ఫర్మేషన్, ప్రైవసీ సమస్యలు, స్కామ్స్, ఉద్యోగ మార్పులు వంటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయని ఇటీవల బహుళ–ఆధారాల పరిశోధనలు చెబుతున్నట్లు తెలుస్తోంది. చాట్మోడల్స్ ప్రజానీక అభిప్రాయాలపై ప్రభావం చూపగలవు కానీ, వాస్తవికత (అక్యూరసీ)లో పొరపాట్లు ఉండవచ్చు. దీంతో నగరంలోని డిజిటల్–సోఫిస్టికేషన్లో కొన్ని వర్గాలు జాగ్రత్తగా ఉండాలి. మరొక ప్రధాన సమస్య..ఆటోమెషన్. దీని కారణంగా రిటైల్, కాల్–సెంటర్, మొదలైన జాబ్స్లో మార్పులు, ఫ్రోజన్లు (డీప్ ఫెక్), వాయిస్ స్కామ్లు వంటివి సరిగా గుర్తించలేకపోవడం వంటి ఇబ్బందులు కూడా ఉన్నాయని తెలుస్తోంది.ప్రాంప్టింగ్ ఎందుకు ముఖ్యం? ప్రాంప్ట్ అనగా మన ప్రశ్నకు–రూపం. కాంటెక్ట్స్ ఇవ్వడంలో మెళకువులు తెలిసి ఉండాలి.. ఇది ఏఐతో అనుసంధానం చేసేటప్పుడు ‘కేమికల్ మిక్స్’ లాగా పనిచేస్తుంది. సరైన ప్రాంప్ట్ ఉంటేనే సమాచారం షార్ప్, యాప్ట్గా వస్తుంది. అదే సమయంలో సరైన మార్గదర్శకాలు లేకపోతే పొరపాట్లు దొర్లే ప్రమాదం కూడా ఉంది. దీంతో పాటు తప్పుడు కంటెంట్ వచ్చే అవకాశాలే ఎక్కువని గుర్తించాలి. వీటిని గమనంలో ఉంచుకోవాలి.. హైదరాబాద్ తరహా నగరాల్లో ఈ ఏఐ చాట్ వేదికలు మన దైనందిన జీవనశైలిని, పని సదుపాయాలను, విద్యా సాధనాల్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. సరైన జ్ఞానం, నైతికత, ఫ్యాక్ట్–చెకింగ్తోనే ఈ టెక్ సదుపాయాన్ని సమర్థవంతంగా మార్చుకోగలం. ఇందులో భాగంగా పనిలో ఎటువంటి ఏఐ టూల్ ఉపయోగించిందో గమనించాలి. ప్రైవసీ సెట్టింగ్స్, డేటా షేరింగ్ స్క్రీన్లు చూస్తూ ఉండాలి. ప్రధాన సమాచారానికి రెండు వేర్వేరు సోర్సుల నుంచి నిర్ధారణ చేసుకోవాలి. ప్రాంప్ట్–స్కిల్స్ వల్ల సరైన మార్కెట్ లాభాలు పొందగలం. ‘తెలుగులో స్కోర్–పాస్స్ కోసం 250 పదాల్లో వ్యాసం’ లాంటిది. ఫార్మాట్ గుర్తించడంలో భాగంగా బుల్లెట్ పాయింట్స్, సమ్మరీ, కోడ్ శాంపిల్స్ వినియోగించడం అవసరం. ఇది ఏ స్లాట్స్పై ఆధారపడింది అనే వాలిడేషన్ అడగడం మంచి అలవాటు. సున్నితమైన నిర్ణయాలు (న్యాయ, వైద్య) కోసం నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: ప్లేట్లు కడిగే స్థాయి నుంచి రూ 50 కోట్ల వ్యాపారం నిర్మించే రేంజ్కు..!) -
బెడ్షీట్స్ మార్చి ఎంత కాలమైంది?
ప్రతి రోజూ రాత్రంతా చర్మానికి నేరుగా తగులుతూ, చెమట, నూనెలు, మన నుంచి వేరయిన డెడ్సెల్స్ అన్నీ బెడ్షీట్స్ మీదే కదా పడేది! వీటిని సరిగ్గా పట్టించుకోకపోతే, అవి మొటిమలు, అలర్జీలు, అశాంతికరమైన నిద్రకు కారణం అవుతాయి. అందువల్ల మీ బెడ్షీట్స్ని క్రమం తప్పకుండా మార్చడం అవసరం!ఏమేం పేరుకుపోతాయంటే..?ప్రతి రాత్రి, చర్మం లక్షలాది చనిపోయిన కణాలను వదిలివేస్తుంది. వీటితోపాటు సహజ నూనెలు, చెమట కూడా ఉంటాయి. మీరు రాసుకునే లోషన్లు లేదా కాస్మెటిక్ అవశేషాలు కూడా ఈ మిశ్రమానికి తోడవుతాయి. డస్ట్ మైట్స్ అనే సూక్ష్మ కీటకాలు ఈ చిన్న పొలుసులను తినడానికి ఇష్టపడతాయి. ఇవన్నీ మీరు గంటల తరబడి విశ్రాంతి తీసుకునే మీ మంచంపై పేరుకుపోతాయి! ఇవి కొంతమందిలో తుమ్ములు, కళ్లు దురద పెట్టడం, చివరకు ఆస్తమాను కూడా ప్రేరేపించగలవు. అందుకే, శుభ్రమైన బెడ్షీట్స్ అనేవి సౌకర్యానికే కాక, మీ ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యమైనవి.ఎప్పుడు మార్చాలి?.. చాలా మందికి, ప్రతి ఒకటి నుంచి రెండు వారాలకు ఒకసారి బెడ్షీట్స్ మార్చడం సరిపోతుంది. ఫ్రెష్గా ఉండే బెడ్షీట్స్ మీ నిద్ర మరింత గాఢంగా ఉండటానికి సహాయపడతాయి. ఇది మీ మొత్తం ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది.వారానికోసారి... మీకు వీపు, ఛాతీ లేదా ముఖంపై మొటిమల సమస్య ఉంటే, వారానికోసారి బెడ్షీట్స్ని మార్చడం ముఖ్యం. దిండు కవర్లను ఇంకా తరచుగా ఉతకాల్సి ఉంటుంది! చర్మంపై నూనెలు, బ్యాక్టీరియా ఒత్తిడికి గురైనప్పుడు రంధ్రాలను అడ్డుకుని, మొటిమలను మరింత తీవ్రతరం చేస్తాయి. బెడ్షీట్స్పై పేరుకునే డస్ట్మైట్స్ వల్ల దగ్గు, దురదలు వస్తాయి. అందువల్ల అలర్జీలు లేదా ఆస్తమా ఉన్నవారు కూడా వారానికోసారి ఉతకడం ద్వారా డస్ట్ మైట్స్, అలర్జీ కారకాలను తగ్గించుకోవచ్చు.బెడ్షీట్స్ పరిశుభ్రతకు ఏం చేయాలి?క్రిములు, డస్ట్ మైట్స్ను నిర్మూలించడానికి బెడ్షీట్స్ను 60 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వేడినీటిలో ఉతకాలి. దిండు కవర్లను వారానికి రెండు సార్లు మార్చండి. అంతేకాదు, బూజు రాకుండా పరుపులు పూర్తిగా పొడిగా ఉండేలా చూసుకోండి. మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు, వాతావరణం వేడిగా, తేమగా ఉన్నప్పుడు లేదా మీ మంచంపై మీతోపాటు మీ పెంపుడు జంతువులు లేదా పిల్లలు కూడా పడుకునేటప్పుడు బెడ్షీట్స్ వీలైనంత తరచుగా ఉతకడం అవసరమని గుర్తించండి. (చదవండి: పరిణీతి చోప్రా చేసిన టేస్టీ... మష్రూమ్ టోస్ట్! -
పరిణీతి చోప్రా చేసిన టేస్టీ... మష్రూమ్ టోస్ట్!
రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఇటీవలే తన భార్య పరిణీతి చోప్రాతో కలిసి ‘కర్లీ టేల్స్’ వారి ‘తేరే గల్లీ మే’ ఎపిసోడ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ హోస్ట్ కామియా జానీకి రాఘవ్ చద్దా.. పరిణీతి చేసిన స్పెషల్ ‘మష్రూమ్ టోస్ట్’ వంటకాన్ని రుచి చూపించారు. మొదట ఆ వంటకం ఎలా చేస్తారో ఊహించడానికి ప్రయత్నించిన ఆప్ నాయకుడు, చివరకు కచ్చితమైన రెసిపీ కోసం పరిణీతికి ఫోన్ చేసి కనుక్కున్నారు.మష్రూమ్ టోస్ట్ రెసిపీ వివరాలుఫోన్ కాల్లో పరిణీతి, ఈ మష్రూమ్ టోస్ట్ రెసిపీ ‘చాలా సులభం‘ అని చెబుతూనే ఎలా చేయాలో వివరించారు. తయారీ విధానం: ముందుగా ఒక పాన్లో వెన్న వేసి, ఆ తర్వాత ఒకటి లేదా ఒకటిన్నర చెంచాల మైదా కలపాలి. తర్వాత పాలు పోసి, అది చిక్కబడి క్రీమ్లాంటి తెల్లటి సాస్ అయ్యే వరకు బాగా కలుపుతూ ఉండాలి. మరొక పాన్లో వెన్న వేసి, అందులో మష్రూమ్స్, ఉప్పు, మిరియాలు, వెల్లుల్లి, చిల్లీ ఫ్లేక్స్, ఇతర పదార్థాలు వేసి బాగా వేయించాలి. ఆ వేయించిన మష్రూమ్స్ను ముందుగా తయారుచేసిన వైట్ సాస్లో కలపాలి. చివరిగా, వంటకానికి మరింత రుచి, రిచ్నెస్ రావడానికి, తురుముకున్న పర్మేసన్ లేదా చెడ్దార్ చీజ్ను కలపాలి. ఈ మిశ్రమాన్ని వేడిచేసి, టోస్ట్ చేసిన బ్రెడ్ స్లైస్లపై లేయర్ గా వేసి సర్వ్ చేయాలి. దీనిని చికెన్, చేపలు లేదా పన్నీర్తో కూడా తినొచ్చని పరిణీతి తెలిపారు. View this post on Instagram A post shared by Curly Tales | A Fork Media Group Co. (@curly.tales) (చదవండి: పుతిన్ భారత పర్యటన: రష్యా అధ్యక్షుడు ఇష్టపడే వంటకాలివే..!) -
హగ్స్ – క్వెశ్చన్స్
పిల్లలను జాగ్రత్తగా సంరక్షించుకోవడం, వారికి మంచి బుద్ధులు అలవడేలా చూసుకోవడం తల్లిదండ్రులందరి బాధ్యత. అయితే ప్రతి ప్రతిరోజు రాత్రి పిల్లల్ని, తల్లిదండ్రులు దగ్గర కూర్చోబెట్టుకొని కొన్ని ప్రశ్నలు అడగడం వల్ల వారి ఆలోచనా విధానం, వ్యక్తిత్వ వికాసంపై మంచి ప్రభావం పడుతుందని మానసిక నిపుణులు అంటున్నారు. ఇంతకీ తల్లిదండ్రులు పిల్లల్ని అడగాల్సిన ఆ ప్రశ్నలేంటో చూద్దామా..తల్లిదండ్రులు వేసే ఈ ప్రశ్నలు పిల్లల భవిష్యత్తును నిర్దేశించేంత శక్తిని కలిగి ఉంటాయని, ఇవి పిల్లల్లో ఆత్మపరిశీలన, ఆసక్తి, బాధ్యతాభావం, ధైర్యం, సమస్యలను ఎదుర్కొనే నైపుణ్యం వంటి ముఖ్యమైన విలువలను పెంచుతాయంటున్నారు నిపుణులు.తల్లిదండ్రులకు పిల్లలంటే అపారమైన ప్రేమ ఉంటుంది. ఎప్పుడూ వారిని ముద్దు చేస్తూనే ఉంటారు. అయితే పేరెంట్స్ ప్రేమగా పిల్లలకు రోజూ ఒక ముద్దు పెట్టడం, హగ్ ఇవ్వడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.తల్లిదండ్రులందరికీ పిల్లలంటే ప్రేమే. అయితే కొందరు తల్లిదండ్రులు ఆ ప్రేమను సరిగా వ్యక్తం చేయ (లే)రు. అది చాలా తప్పు. పిల్లలకు తమ ప్రేమను వ్యక్తపరచడం కూడా అవసరం. రోజూ పిల్లలకు ఒక హగ్ ఇవ్వడం, ముద్దు పెట్టడం చిన్న విషయంలా కనిపించినా, పిల్లల మనసులో అది అపారమైన భద్రత, సాంత్వన, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. హగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది?రోజూ హగ్ ఇవ్వడం వల్ల పిల్లల మెదడులో ‘‘ఆక్సిటోసిన్’’ అనే హ్యాపీ హార్మోన్ విడుదల అవుతుంది. ఇది పిల్లలలో ఒత్తిడిని తగ్గిస్తుంది. భయాన్ని తొలగిస్తుంది. కోపాన్ని నియంత్రిస్తుంది. మనుషుల మధ్య ప్రేమను, అనుబంధాన్ని పెంచడంలో ఈ హార్మోన్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందుకే హగ్ చేసుకున్న తర్వాత పిల్లలు వెంటనే స్మైల్ ఇస్తారు. ప్రశాంతంగా మారతారు.ముద్దు పెట్టడం వల్ల..?పిల్లలకు ముద్దు పెట్టినప్పుడు వారి హార్ట్ బీట్ మారుతుంది. శ్వాస నెమ్మదిస్తుంది, మనసులో ప్రేమ పూరిత వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా స్కూలుకు వెళ్లే పిల్లలు ఉదయం ఇంటి నుంచి బయలుదేరే సమయంలో ఒక ముద్దు పెట్టి.. హగ్ ఇవ్వడం వల్ల రోజంతా వారి మనసు ప్రశాంతంగా ఉంటుంది. పేరెంట్స్ చూపించే ప్రేమ వారికి గుర్తుకు వస్తుంది. దానివల్ల ఒంటరితనం దూరమవుతుంది.శక్తినిచ్చే హగ్పిల్లలు తప్పులు చేసినప్పటికీ.. వారు బాధపడుతున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు దగ్గరకు తీసుకుని హగ్ ఇవ్వడం వల్ల వారికి ఎనలేని శక్తి లభిస్తుంది. ‘‘నేను నీతోనే ఉన్నాను, భయపడాల్సిన అవసరం లేదు’’ అనే భావన వారిలో కలుగుతుంది. దానివల్ల పిల్లలు తప్పును ఒప్పుకోవడానికి, నేర్చుకోవడానికి, మళ్లీ ప్రయత్నించడానికి సిద్ధంగా ఉంటారు. బంధం బలపడుతుందిరోజూ ఇలా పేరెంట్స్ ప్రేమని పొంందిన పిల్లలు భవిష్యత్తులో మంచి వ్యక్తులవుతారు. క్రమశిక్షణతో ఉంటారు. ఇతరులను అర్థం చేసుకునే గుణాన్ని కలిగి ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు రోజూ పిల్లలను ఇలా ప్రేమతో దగ్గర చేసుకోవడం తల్లిదండ్రులకూ మంచిదే. మనసులో ఉన్న ఒత్తిడి తగ్గిపోతుంది. రోజంతా పని చేసిన అలసట సడలిపోయి మనసు తేలికవుతుంది. తల్లిదండ్రులకూ, పిల్లలకూ మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుంది.ఈ రోజు కొత్తగా ఏం నేర్చుకున్నావు?పిల్లలను ప్రతిరోజూ పడుకునేముందు ‘ఈ రోజు కొత్తగా ఏం నేర్చుకున్నావు?’’ అని అడగాలి. దానివల్ల వారిపై సానుకూల ప్రభావం పడుతుంది. అంతేకాదు, పిల్లల్లో ఆసక్తిని పెంచి, పరిశీలన శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేస్తుంది. ఈ ఒక్క ప్రశ్నతో వారు రోజు మొత్తం నేర్చుకున్న విషయాలను గుర్తుచేసుకుంటారు. ఫలితంగా వారి జ్ఞాపకశక్తి బలపడుతుంది. తాము నేర్చుకున్న విషయాన్ని అంచనా వేసే అలవాటు ఏర్పడుతుంది. అంతేకాదు, తల్లిదండ్రులు తాము నేర్చుకున్న విషయాల పట్ల ఆసక్తి చూపుతున్నారని పిల్లలు భావిస్తారు. దానివల్ల పిల్లలు, పేరెంట్స్ మధ్య ప్రేమ, అనుబంధం పెరుగుతుంది. అంతేకాదు రోజూ ఏదో ఒక్క విషయం కొత్తగా నేర్చుకోవాలి అనే ప్రేరణ పిల్లల్లో కలుగుతుంది. ఇలా నిరంతరం అడగటం వల్ల పిల్లల్లో సజనాత్మకత, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం క్రమంగా పెరుగుతాయి.ఈ రోజు నీకు ఏదైనా కష్టంగా అనిపించిందా?పిల్లలను ప్రతిరోజు ‘‘ఈ రోజు నీకు ఏ విషయం కష్టంగా అనిపించింది?’’ అని అడుగుతుండాలి. ఎందుకంటే తల్లిదండ్రులు తమ కష్టాలను వినడానికి సిద్ధంగా ఉన్నారని పిల్లలు తెలుసుకోవడం వల్ల వారిలో భద్రతాభావం, నమ్మకం పెరుగుతుంది. అనుబంధం బలపడుతుంది. దాని ద్వారా వారిలో ఆత్మపరిశీలన, నిజాయతీ, భావాలను వ్యక్తపరిచే ధైర్యం పెరుగుతుంది. అంతేకాదు, పిల్లలు తమకు కష్టమైన విషయాలను ఎప్పటికప్పుడు తమ తల్లిదండ్రులకు చెప్పుకోవడం వల్ల వారి మానసిక భారం తగ్గి భావోద్వేగాలలో స్థిరత్వం పెరుగుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఈ ప్రశ్న ద్వారా పిల్లలకు కష్టాలు సహజమని.. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని అర్థమవుతుంది.రేపు ఏం నేర్చుకోవాలనుకుంటున్నావు?పిల్లలను రోజూ ‘‘రేపు నువ్వు ఏం నేర్చుకోవాలనుకుంటున్నావు? నీకు ఏం తెలుసుకోవాలని ఆసక్తి ఉంది?’’అని అడగడం వల్ల వారిలో భవిష్యత్ పట్ల సానుకూల దృష్టి, నేర్చుకోవాలనే ఉత్సాహం పెరుగుతుంది. అంతేకాదు, ఈ ప్రశ్న పిల్లలను ఆలోచించేలా చేసి, వారి రోజును వారే స్వయంగా ΄్లాన్ చేసుకునేలా చేస్తుంది. రేపు నేర్చుకోవాలనుకునే విషయాన్ని గుర్తించడం వల్ల వారికి చదువుపై ఆసక్తి పెరుగుతుంది. తల్లిదండ్రులకు కూడా పిల్లల ఆసక్తులను అర్థం చేసుకునే అవకాశం వస్తుంది. దానివల్ల పిల్లల అభిరుచులకు అనుగుణంగా మద్ధతు, మార్గదర్శకత్వం అందించవచ్చు. తల్లిదండ్రులు రోజూ పిల్లలు స్కూలు నుంచి రాగానే వారి కోసం కాస్త సమయం కేటాయించి.. వారిని ప్రేమగా పక్కన కూర్చోబెట్టుకొని ఈ మూడు ప్రశ్నలు అడగడం ద్వారా వారిలో ఆత్మపరిశీలన, ఆసక్తి, ధైర్యం, సమస్య పరిష్కార నైపుణ్యం, స్వతంత్ర ఆలోచన వంటి ముఖ్యమైన లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. పేరెంట్స్ చేసే ఈ చిన్న ప్రయత్నం వల్ల వారు చదువులోనే కాక, జీవితంలోనూ విజయవంతం కావడానికి అవకాశం ఉంటుంది. -
Savitri: వెండి వెన్నెల జాబిలి..
‘వింత కాదు నా చెంతనున్నది వెండి వెన్నెల జాబిలి... నిండు పున్నమి జాబిలి’... నింగిలోని జాబిలి ఒక్కటి అందరికీ. తెలుగు వారికి మాత్రం నింగిలోనా, వెండి తెరన రెండు జాబిలుల నిండు సోయగాలు. సావిత్రి జన్మించి నేటికి 90 ఏళ్లు. ఆమె నటించింది సరిగా 15 ఏళ్లు. చనిపోయింది 46 సంవత్సరాలకు! కాని తెలుగు వారు ఆమెను తమ ఆడపడుచుగా భావిస్తూనే ఉన్నారు. మహానటిగా కొలుచుకుంటూనే ఉన్నారు. పదే పదే తలుచుకుంటూనే ఉన్నారు. మన ‘పార్వతి‘, మన ‘మధురవాణి’, మన ‘మిస్సమ్మ’, మన ‘శశిరేఖ’... దేవుడు ఏమరపాటులో తెలుగువారికి ఇచ్చిన అపురూపవరం సావిత్రి. ఆమెకు నివాళి. డిసెంబర్ ఎంత వరదాయిని. సావిత్రిని ఇచ్చింది. డిసెంబర్ ఎంత దుఃఖదాయిని. సావిత్రిని తీసుకెళ్లింది. మంచివాళ్లు వేసే శిక్షలు ఉడుంపట్టులా ఉంటాయి. వదలవు. గింజుకోవాలి. పెనుగులాడాలి. అయినా సరే... వదలవు. సావిత్రిని నమ్ముకున్న వాళ్లందరూ బాగుపడ్డారు. తిరిగి వారిని నమ్మిన సావిత్రి తప్ప. బదులుగా వారిని కొట్టలేదు ఆమె. తిట్టలేదు. కొరడా పట్టుకు శిక్షించలేదు. మరేం చేసింది? కోమాలోకి వెళ్లిపోయింది. బతికే ఉంది. కాని బతికి లేదు. ఊపిరితోనే ఉంది. కాని జీవంతో లేదు.మన వల్ల మోసపోయినవారు మన ఇంటి ముందు ధర్నాకు కూచుంటే ఎంత ఇబ్బందో కోమాలోకి వెళ్లిన సావిత్రి– ఒకరోజు కాదు రెండ్రోజులు కాదు... నెల కాదు... రెండు నెలలు కాదు... 19 నెలల పాటు అలా నిలదీస్తున్నట్టుగా, పాపాలను లెక్కిస్తున్నట్టుగా మృత్యుశయ్యపై ఉండి తనను వంచించిన వారిని దండించింది. చలన చిత్ర తెర మీద క్షణం విరామం లేకుండా జగజ్జేయమానంగా వెలిగిన తారను నిశ్చలన స్థితికి నెట్టడం తెలుగు వారి చరిత్రలో ఒక ‘ఘనత’. సావిత్రి వీడ్కోలు తీసుకునే నాటికి ఆమె వయసు 46. సాధారణంగా– పుట్టిన పిల్లాపాపలు ఎదిగి వారితో స్త్రీలు ఆనందాలు పంచుకోవడం మొదలయే వయసు అది.‘బాలరాజు’ శతదినోత్సవం బెజవాడలో జరుగుతుంటే చూడటానికి వెళ్లి పొంరపాటున మురుక్కాలవలో జారింది సావిత్రి. విధి ఆమెను సరిగ్గానే హెచ్చరించింది– నువ్వు ఎంచుకోబోయే రంగంలో మురుక్కాలవలూ వుంటాయి... మహా జలపాతాలూ ఉంటాయి... భద్రం అని. చిన్నపిల్ల. గ్రహించలేదు. సినీ పరిశ్రమలో అడుగు పెట్టాక మహా జలపాతం వలే కదిలి, ఉరకలెత్తి, హోరు సృష్టించి, అడ్డులన్నింటినీ కకావికలం చేస్తూ ప్రవహించి... చివరకు కొంత మురుగును ఆమె చూడాల్సే వచ్చింది.చదవడం ఆపండి.. రెండు పాటలు చూడండి..ఒకటి ‘మంచి మనసులు’లో ‘నన్ను వదిలి నీవు పోలేవులే’. ఆ పాట ప్రిలూడ్ మొదలయ్యాక నాగేశ్వరరావు సరాసరి పరిగెత్తుకుంటూ వచ్చి చెట్టు వద్ద నిలుచుంటాడు. వెనుక ఒక సెకన్ తేడాలో సావిత్రి పరిగెత్తుకుంటూ రావాలి. మామూలుగా కాదు. ప్రిలూడ్కు తగినట్టుగా గంతులేస్తూ వచ్చి, సరిగ్గా పల్లవి మొదలయ్యే సమయానికి గంతులు ముగించి, పల్లవి అందుకోవాలి. అంతేనా? అల్లరిగా నవ్వుతూ కొద్దిగా పెదవి కొరకాలి. ఇవన్నీ మూడు నాలుగు సెకన్లలో చేయాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ రీల్స్ చేస్తున్నారు కదా... ఫోనుందని. ట్రై చేయండి. స్టార్ నటీమణులైనా సరే. జస్ట్ ట్రై చేసి చూడాలి.రెండు– ‘ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ మారినదేమి చెలీ’... ఈ పాటలో నాగేశ్వరరావుకే మాటలుంటాయి. సావిత్రికి ఉత్త హమ్మింగ్. నాగేశ్వరరావు పలికే ప్రతి మాటకు సావిత్రి తన హమ్తో జవాబిస్తూ ఉంటే ఆ ఒక్క ముఖంలో ఇన్నేసి భావాలా? ఆ రెండు కళ్లల్లో ఇన్నిన్ని అర్థాలా? ఆమెలా చేయగలరేమో ప్రయత్నించి చూడండి. చేయగలిగినవారు ఉన్నారేమో గాలించండి. నో. సావిత్రిలా చేయగలిగే దమ్ము సావిత్రికి మాత్రమే ఉంది. ఆమె అతి సులువుగా చేసింది అందరికీ అత్యంత కష్టమైనది.సావిత్రి చిన్నప్పటి నుంచి డాన్సింగ్ స్టార్. ఆ డాన్స్ చూసే ఆమెను నాటకాల్లోకి తీసుకున్నారు. అన్నీ డాన్స్ డ్రామాలే. మగ వేషంలో ఉన్న ఆడపిల్లలతో. రాధా–కృష్ణ, మేనక–విశ్వామిత్ర, నారాయణమ్మ–నాయుడుబావ. స్టేజ్ మీదకు లేడిపిల్ల వచ్చిందా? ఎవరా పిల్ల? సావిత్రి అట గదా. అల్లరిగా చేసినా భలే అందంగా చేస్తుందే! అవును. అల్లరిగానే చేస్తోంది. తండ్రి లేని పిల్లలు అల్లరి ఎక్కువ చేస్తారు. ఏమంటే తండ్రి లేడన్న విషయం మర్చిపోవడానికి.సావిత్రి (Savitri) బాగా అల్లరి చేసేది. పైకి నాన్–సీరియస్. లోన అగాథం. పెదనాన్న ఉన్నాడు. ఎంత ఉన్నా పెదనాన్న నాన్న కాడు. రక్షకుడు. సావిత్రికి కావాల్సింది అదిలించేవారు కాదు. లాలించేవారు. మగవాళ్లంటే పెదనాన్నలా ఉంటారని అనుకోవడం తప్ప లాలించే మగవాణ్ణి, అనునయంగా మాట్లాడే పురుషుణ్ణి చూడలేదామె.పద్నాలుగేళ్ల వయసులో, ఈడేరిన ప్రాయంలో అలాంటి పురుషుణ్ణి మొదటిసారి చూసిందామె. జెమినీ గణేశన్. ఎదుటివారి తప్పులు మనకు తోవ ఇస్తే మన తప్పులు మరొకరికి దారి ఇస్తాయి. ఈ వృత్తం సావిత్రి జీవితంలో పర్ఫెక్ట్గా పూర్తయ్యింది. ఎలాగంటే భానుమతి (Bhanumati) చేసిన రెండు తప్పులు సావిత్రికి లాభించాయి. డి.ఎల్.నారాయణ ‘దేవదాసు’ తీయడానికి నిశ్చయించుకుని పార్వతి వేషం వేయమని అడగడానికి వెళితే ‘నా దగ్గర ప్రోడక్షన్ మేనేజర్గా పని చేసి నన్నే హీరోయిన్గా బుక్ చేయడానికి వచ్చావా’ అన్నట్టుగా ఆమె అంగీకరించ లేదు. ఆ వేషం సావిత్రికి వెళ్లింది.. సావిత్రి వెలిగింది..‘మిస్సమ్మ’ షూటింగ్ మొదలయ్యి రెండున్నర రీళ్లు తీశాక, షూటింగ్ రోజు వ్రతం పెట్టుకుని ఆ సంగతి సరిగ్గా సమాచారం ఇవ్వక షూటింగ్కు రాకపోవడంతో చక్రపాణికీ, భానుమతికీ పేచీ వచ్చింది. చక్రపాణి ఆమె ఎదుటనే అందాకా తీసిన రీళ్లను కుప్పబోసి నిప్పంటించాడు. భానుమతి చేయాల్సిన మిస్సమ్మ భానుమతికి కాకుండా పోయింది. ఆ వేషం సావిత్రికి దక్కింది. సావిత్రికి తిరుగు లేకుండా పోయింది.మరి కొన్నేళ్లకు సావిత్రి చేసిన రెండు తప్పులు– అధిక తిండి, మద్యపానం ఆమెనూ ఆమె రూపాన్ని మార్చేశాయి. ‘దేవత’ (1965) తీసే నాటికి లాంగ్షాట్లో చూపించాలంటే కెమెరామెన్లు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఆప్పటికి ఆమె వయసు కేవలం 30. కొత్త హీరోయిన్లు ఆమె అవకాశాలు తన్నుకుపోయారు. విశేషం ఏమంటే ఆమె కంటే ఒక్క సంవత్సరం తర్వాత పుట్టిన జమున 1975 వరకూ హీరోయిన్గా చెలాయించింది.సావిత్రికి ఒక సమస్య ఉంది. ఏదైనా పాత్ర ఇస్తే ఆ పాత్రను అద్భుతంగా అర్థం చేసుకుంటుంది. ఎదురుగా ఉండబోయే పాత్రలు ఇవే అనంటే వాటినీ అంతే బాగా అనలైజ్ చేసుకుంటుంది. కాని ఇంత తెలిసిన నటి ఎందుచేతనో ఎదుట ఉన్న మనిషిని మాత్రం గుర్తించలేదు. వాళ్లు ఎటువంటి వాళ్లో, వాళ్లు ఏ వేషం కట్టి తన వద్దకు వచ్చారో ఎప్పడూ గ్రహించలేకపోయింది. ఆమెకు తెలిసింది ఒక్కటే. నమ్మడం. నమ్మి చెడ్డవాళ్లలో సావిత్రిది ముందు వరుస. ఆమెకు కల్లబొల్లి మాటలు చెప్పి నగలు దోచుకెళ్లిన వాళ్లు... కొంగు ముడిలో ఉన్న డబ్బు కాజేసినవారు.... తీసుకున్న డబ్బు ఎగ్గొట్టిన వారు... చిల్లరకు ఆస్తులు కొని కొట్టేసిన వాళ్లు.... అందరూ అయినవాళ్లే. నమ్మించిన వాళ్లు.మనిషికి చదువు తోడుండాలి. లేదా చదువుకున్న వారి తోడు ఉండాలి. సావిత్రికి రెండూ లేవు. ఇన్కంటాక్స్ను కట్టాలని, సరిగా కట్టాలని తెలియాల్సిన అవసరం ఉంది. తెలియచేయాల్సిన వారి బాధ్యతా ఉంది. 8లక్షల టాక్స్ బకాయిలు 30 లక్షల వరకూ వెళ్లాయి. ఆమెను దర్శకురాలిని చేద్దామని ఉవ్విళ్లూరిన బృందం హామీ సంతకాలు పెట్టించి పక్కకు తప్పుకుంది. ‘హీరోయిన్’గా చేయడానికి వచ్చిన ‘పరిమితి’ దర్శకురాలిగా అస్తిత్వం చూపమని పోరు పెట్టింది. సొంత నిర్మాణ దర్శకత్వంలో ‘మూగమనసులు’ సినిమాను తమిళంలో శివాజీ గణేశన్ హీరోగా ప్రాప్తం’ గా తీయడం ఒక తొందరపాటైతే, అదే సొంత నిర్మాణ దర్శకత్వంలో చలం హీరోగా ‘వింత సంసారం’ తీయడం గ్రహపాటు. రెండూ ఒకే రోజు 1971 ఏప్రిల్ 14న విడుదలయ్యాయి. ఒక తెలుగు హీరోయిన్ తీసిన రెండు సినిమాలు ఒకేరోజు రెండు భాషల్లో రెండురాష్ట్రాల్లో విడుదల కావడం రికార్డ్. కాని ఆ రికార్డును ఎవరూ గుర్తించలేదు. ఆ సినిమాలు ఫ్లాప్ అవడం వల్ల సావిత్రికి ఎంత పోయిందో, ఆ ఫ్లాప్లు చూపించి ఎంత లాగవచ్చో మాత్రం గుర్తుంచుకున్నారు. డబ్బు పోతే బాధ నిజమే కానీ మనుషులు కొట్టే దెబ్బకు కలిగే బాధ ఇంకా అధికం. నౌకర్లు, చాకర్లు, మంది మార్బలంతో వెలిగిన తార... కారణాలు ఏవైనా ఆమె ఒక్కతి ఒంటరిగా జీవించే స్థితి రారాదు. డయాబెటిస్ పేషంట్ అయినప్పుడు ఆమెకు ఇన్సులిన్, ఆ వెంటనే సరైన ఆహారం ఇచ్చే సిబ్బంది లేని స్థితిలో ఉండటం సరి కాదు. బాధ్యులెవరో తేలాల్సిన దుర్మార్గం అది. ఫలితంగా ఏమైంది? 1980 మే 11న ఔట్డోర్ కోసం బెంగళూరు వెళ్లి ఇన్సులిన్ తీసుకుని, ఆహారం స్వీకరించకుండా నిద్ర పోవడంతో సావిత్రి కోమాలోకి వెళ్లిపోయింది. ఎలాంటి దేహం ఆమెది? పొంలంలో పని చేసి, స్టేజ్ మీద గెంతి, బలమైన ఆహారం తీసుకుని దృఢంగా పెరిగిన దేహం. కాని మనసు తిన్న ఘాతాలతో స్వయంగా తలపెట్టుకున్న అపకారాలతో ఆ దేహం ధ్వంసమైంది.ఆ మహానటి ఒక తల్లి కూడా. ‘బొమ్మలు కొనిపెడతాలే నాన్నా’... అని పక్కనే ఉన్న కుమారుడితో అన్న మాటను నెరవేర్చకుండానే మరో 19 నెలల తర్వాత కన్నుమూసిందా కన్నతల్లి. గొప్ప ప్రతిభ. దానికి అవకాశం దొరకాలి. దొరకబుచ్చుకునేంత వరకు పోరాడాలి. దొరికాక విజృంభించాలి. ఇది... సావిత్రిని చూసి నేర్చుకోవాలి నేటి జెన్ జి తరం.గొప్ప పురోభివృద్ధి... కాని అప్రమత్తంగా ఉండాలి... ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి... ఆరోగ్య క్రమశిక్షణ ఉండాలి... కుటుంబంలో వచ్చే సమస్యలను శ్రద్ధగా పరిష్కరించుకోవాలి... అప్పుడే అది మరింత గొప్ప విజయం... ఇది కూడా సావిత్రిని చూసి నేర్చుకోవాలి.సావిత్రి ఒక స్కూల్.ఆమె నటన, జీవితం రెండూ తెలుగు వారికి శాశ్వత పాఠాలు.మహానటి టాప్ టెన్ 1953 దేవదాసు –వేదాంతం రాఘవయ్య1955 కన్యాశుల్కం – పి పుల్లయ్య1955 మిస్సమ్య– ఎల్వీ ప్రసాద్1957 మాయాబజార్– కెవిరెడ్డి1957 తోడికోడళ్లు – ఆదుర్తి సుబ్బారావు1959 అప్పుచేసి పప్పుకూడు – ఎల్వీ ప్రసాద్1962 గుండమ్మ కథ – కమలాకర కామేశ్వరరావు1963 నర్తనశాల – కమలాకర కామేశ్వరరావు1964 మూగమనుసలు – ఆదుర్తి సుబ్బారావు1965 పాండవ వనవాసం – కమలాకర కామేశ్వరరావుఆమె నోట సన్నాయి పాట‘నీ లీల పాడెద దేవా’.... సన్నాయితో పోటీ పడి ఎస్.జానకి పాడిన ఈ పాట తమిళ డబ్బింగ్ ‘మురిపించే మువ్వలు’లోనిదని అందరికీ తెలుసు. ఈ పాట పాడే సమయానికి ఎస్.జానకికి అంత పేరు లేదు. దాంతో సావిత్రి ఈ పాటను సుశీల వంటి పెద్ద గాయనితో పాడించాలని కోరింది. అయితే సన్నాయితో పోటీ పడే గళం జానకికి తప్ప మరొకరితో లేదని అందరూ తేల్చి చెప్పాక అభినయించడానికి ఒప్పుకుంది. ‘నీ లీల పాడెద దేవా’ పాటను జెమినీ గణేశన్తో అభినయించడం వల్ల ఒక సూపర్హిట్ పాటను ఆ భార్యాభర్తలు అభినయించినవారు అయ్యారు. సావిత్రికి చక్కని గొంతు ఉంది. ఆమె పాటలు కూడా పాడుతుంది. అంతే కాదు షూటింగ్లు లేనప్పుడు తన సినిమాల పాటల రికార్డింగ్ ఏదైనా జరుగుతూ ఉంటే వెళ్లి కూచునేది. ఆమె తొలిసారి దర్శకత్వం వహించిన ‘చిన్నారి పాపలు’ కు సంగీత బాధ్యతలు పి.లీలకు అప్పగించిందామె. ఆమె దర్శకత్వంలోని ‘మాతృదేవత’లో ‘మనసే కోవెలగా మమతలు మల్లెలుగా’ పాట పెద్ద హిట్.మీకు మీరే మాకు మేమే...స్వాభావికంగా మంచితనం ఉన్న ఆర్టిస్టులో గొప్ప ఆర్ట్ ఉంటే ఆ ఆర్టిస్టుకు తిరుగు ఉండదు. సావిత్రిని చూస్తే మంచి అమ్మాయి అని టక్కున తెలిసి పోతుంది. ఆ ముఖంలో అసామాన్యమైన ప్రతిభ కూడా కనిపిస్తుంటే జనం ఊ.. అన్నా బ్రహ్మరథం పడతారు. ఆ.. అన్నా బ్రహ్మరథం పడతారు. 1955లో సావిత్రి సినిమాలు ముఖ్యమైనవి మూడు వచ్చాయి. ‘మిస్సమ్మ’, ‘దొంగరాముడు’, ‘కన్యాశుల్కం’. ఒకదానిలో టీచరమ్మ, మరోదానిలో కూరలమ్మి, ఇంకోదానిలో వేశ్య. ‘మిస్సమ్మ’లో కస్సుబుస్సులాడే సావిత్రిని చూసి ఎమ్టీరావు అనే ఎన్.టి.రామారావు (NT Ramarao) ‘నేను కూడా అంతో ఇంతో మంచివాణ్ణే కదండీ’ అంటాడు బెరుగ్గా. అప్పటికి సావిత్రికి స్టార్ స్టేటస్ రాలేదు. కాని తన నటనతో ఎదురుగా ఉన్నది రామారావు అయినా పాత్రకు తగ్గ పై చేయి సాధించగలిగింది. ‘మీకు మీరే మాకు మేమే’ పాటలో సావిత్రి ఈసునసూయలు ఎంత అందమో అంత చందం.‘దొంగ రాముడు’లో నిజమైన కూరగాయల బుట్టను నెత్తిన పెట్టుకుంటే ‘ఎందుకమ్మా... ఉత్త బుట్ట చాలు’ అని ఎవరో అంటే ‘లేదు సార్.. ఉత్త బుట్ట నడకకీ బరువు బుట్ట నడకకీ తేడా ఉంటుంది’ అని మోసిందామె. ఆమె ఆ బుట్టతో నడుస్తుంటే శరీరం చూసి పురుషులకు చిత్త వికారం కలగదు. సావిత్రి అదే సినిమాలో ఖాళీ బుట్టతో నడక కూడా ఎలా ఉంటుందో చూపుతుంది. రెంటికీ తేడా! ఇక ఆర్.నాగేశ్వర రావుతో సావిత్రి పాడిన ‘రావోయి మా ఇంటికి’ కంటితో వింటూ చెవితో చూడాలి.‘కన్యాశుల్కం’లో మధురవాణిని అర్థం చేసుకుని సాహితీ ప్రమాణాలకు తగినట్టుగా ఆ వయసులో నటించడం సావిత్రి మరో రికార్డు! అందులో ‘లొటిపిట్ట’ జోక్కు మధురవాణి సుదీర్ఘంగా నవ్వే సీన్ ఉంది. అంతసేపు వేరెవరైనా నవ్వితే ప్రేక్షకులు తెర చింపేస్తారు. సావిత్రి కాబట్టి చెల్లింది.సావిత్రి తెలుగులో నటించే వేళకు హిందీలో హీరోయిన్లు స్విమ్సూట్లు వేస్తున్నారు. మోడ్రన్ డ్రస్సులు... హెయిర్ స్టయిల్స్ ఫాలో అవుతున్నారు. వాన పాటల్లో తడుస్తున్నారు. కాని సావిత్రి కేవలం కట్టు, బొట్టులతో తను తనలాగే ఉంటూ ప్రేక్షకులను జయించింది. డాన్స్ బాగా వచ్చినా చాలా కొద్దిగా తప్ప చేయలేదు. క్లోజప్ను కాచుకోగల ఏకైక నటి ఆమె. ఆమె క్లోజప్స్ను ‘మాయాబజార్’లో చూడాలి. తల్లిచాటు శశిరేఖ, ప్రేమిక శశిరేఖ, మాయా శశిరేఖ... ఆ సినిమాలో ఆమె ‘మగాడు’లా నటించింది.‘మూగ మనసులు’ స్క్రిప్ట్ విని ‘నేను గౌరి పాత్ర వేస్తాను’ అన్నదట సావిత్రి. ‘నువ్వు ఆ పాత్ర వేస్తే రాధలా వేసే వారిని ఎక్కణ్ణుంచి తేవాలి’ అన్నారట ఆదుర్తి. అవును... నాగేశ్వరరావును ‘ఒరే’ అనగలిగేది, అంటే ప్రేక్షకులు వినగలిగేది సావిత్రి నుంచే. ‘మంచి మనసులు’లోని సావిత్రి వేసిన పాత్రకు ఎందరో అభిమానులు. ఆమె నాగేశ్వరరావును అల్లరి పెడుతుంటే మురిసిన స్త్రీలు నాగేశ్వరరావు దక్కకపోతే ఆమె కంటే ఎక్కువ దు:ఖపడ్డారు.‘డాక్టర్ చక్రవర్తి’లో ‘నీవు లేక వీణ’ పాట సున్నితమైనది. భర్తను తలుచుకుంటూ విరహంతో శృంగార భావనను చాలా సటిల్గా చూపుతుంది సావిత్రి. ‘పరువము వృధగా బరువుగా సాగే’ లైన్ దగ్గర తన చెంపను తనే నిమురుకుని, రెండు చేతులు దగ్గరకు చేర్చి ఒళ్లు విరుచుకుంటుందామె. అసభ్యత లేని ఆ చేష్ట శృంగారాభినయానికి ఆనవాలు.ఇటువంటి గొప్ప నటి ‘గోరింటా పూసింది కొమ్మా లేకుండా’ అని తెల్ల వెంట్రుకలతో, బక్క చిక్కి పాడితే, ఎలా ఉన్నా ‘సావిత్రి ఉందట’ అంటూ మహిళా ప్రేక్షకులు పోటెత్తారు. సావిత్రి ఘనతలు చెప్పడం చక్కెరలో పలుకులు లెక్కబెట్టడం. నిరూపణ అక్కర్లేని గొప్పతనం, మహా నటనం సావిత్రిది. అందుకే ఆమె మహానటి సావిత్రి. -
పుతిన్ ఇష్టపడే వంటకాలివే..!
భారత్లో పర్యటిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. హైదరాబాద్ హౌస్లో 23వ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు కూడా. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి, అధికారిక విందులో ఆయ ఇష్టంగా ఆస్వాదించే వంటకాలేవి, ముఖ్యంగా ఇలాంటి పర్యాటనలలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు తదితరాల గురించి సవివరంగా తెలుసకుందామా..!.పుతిన్ భారత్ వంటకాలను రుచి చూస్తారేమోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కానీ పుతిన్ క్రమశిక్షణ, కఠినమైన భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే నాయకుడిగా పేరుగాంచిన వ్యక్తి. ఆయన ఆహారానికి సంబంధించి.. ఫుల్ సెక్యూరిటీ మధ్య సైనిక పర్యవేక్షణలో నిర్వహిస్తారు. సాధారణంగా హోటల్ లేదా ఇతర దేశాల ఆతిథ్యంలో తయారు చేసిన భోజనాన్ని చాలా అరుదుగా తీసుకుంటారట పుతిన్. మాములుగా అయితే శిక్షణ పొందిన రష్యన్ చెఫ్లు, సహాయక సిబ్బంది పుతిన్ వెంట వస్తుంటారు. కాబట్టి వారే ఆయన భోజనం గురించి స్వయంగా చూసుకుంటారు. అందువల్ల ఆయన ఎలాంటి ఆహారం తీసుకుంటారనేది చాలా సీక్రెట్గా ఉంది. అంతరంగిక వర్గాల సమాచారం ప్రకారం..ఆయన ఆరోగ్యకరమైన ఆహారానికే ప్రాధ్యానత ఇస్తారట. ప్రతి ఉదయం తేనె లేదా గంజితో ట్వోరోగ్(రష్యన్ కాటేజ్ చీజ్)తో ప్రారంభమవుతుందట. తాజా జ్యూస్, కౌజు పిట్ట గుడ్లతో చేసిన ఆమ్లెట్, తక్కువ చక్కెర కలిగిన ఆహారాలు వంటి వాటినే తీసుకుంటారట.ఆయన ఎర్ర మాంసం కంటే తాజా చేపలు అది కూడా కాల్చినవి ఇష్టంగా తింటారట. లేత గొర్రెపిల్ల మాంసం కూడా అప్పడప్పుడూ తీసుకుంటారట. ఇక ఆయన భోజనంలో ఎక్కువుగా టమోటాలు, దోసకాయలు, ఇతర ప్రాథమిక కూరగాయల సలాడ్లు తప్పనిసరిగా ఉంటుందట.ఇక జ్యూస్లలో కూడా మూలికా పానీయాలు, కేఫీర్, బీట్రూట్-ముల్లంగి జ్యూస్ వంటివి తీసుకుంటారట. ఇక పుతిన్కు పిస్తా ఐస్ క్రీం మహా ఫేవరెట్ డిజర్ట్ అట. చివరగా ఆయన క్రమశిక్షణతో కూడిన సంప్రదాయ ఆహారానికే కట్టుబడి ఉంటారట. చాలామటుకు ప్రోటీన్ కంటెంట ఉన్నవి, పోషకాహారానికి ప్రాధాన్యత ఇస్తారని చెబుతున్నారు పుతిన్ సన్నిహితులు.(చదవండి: అక్కడ మహిళల జనాభానే ఎక్కువ..! ఎందుకంటే..) -
అక్కడ మహిళల జనాభానే ఎక్కువ..! ఎందుకంటే..
మహిళల సంఖ్య తగ్గిపోతోంది, బ్రూణ హత్యలు పెరిగిపోతున్నాయి అంటూ గగ్గోలు పెడుతున్న గణాంకాలు గురించి విన్నాం. కానీ వీటన్నింటికి విరుద్ధంగా మహిళలు సంఖ్య అత్యధికంగా ఉన్న దేశం గురించి విన్నారా..?. ఔను ఇది నిజం. అక్కడ మహిళల సంఖ్య ఎంతలా ఉందంటే..మొత్తం కార్యాలయాల్లో అంతా మహిళలే కనిపిస్తారు. కనీసం ప్లంబింగ్, వడ్రంగి పనులు వంటి వాటిల్లో కూడా మహిళలే ఉంటారు. అందుకు గల కారణం..?, ఫలితంగా మహిళలు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారంటే..లాట్వియాలో గణనీయమైన లింగ అసమతుల్యత ఎదుర్కొంటోంది. అక్కడ పురుషుల కంటే 15.5% ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. ఇది యూరోపియన్ యూనియన్లో సగటు అంతరం కంటే మూడు రెట్లు ఎక్కువ. 65 ఏళ్లు అంత కంటే ఎక్కువ వయసున్న పురుషులకు రెండింతలు మహిళలు ఉన్నారు. రోజువారి జీవితంలో పురుషుల కొరత చాలా ఘోరంగా ఉంటుందని వరల్డ్ అట్లాస్ పేర్కొంది. దాంతో అక్కడ మహిళ ఇంటి పనుల్లో సహాయం కోసం భర్తలను నియమించుకుంటున్నారట. అంటే అద్దెకు భర్తలను తెచ్చకుంటున్నారు. ఆ మహిళలంతా ఆన్లైన్లో ఒక గంటకు భర్తలను బుక్ చేసుకుంటారట అక్కడ మహిళలు. వారు ప్లంబింగ్, వడ్రండి,టెలివిజన్ ఇన్స్టాలేషన్ వంటి పనుల్లో సాయం అందిస్తారు. అంతేగాదు పెయింటింగ్, కర్టెన్లు ఫిక్సింగ్ వంటి ఇతర పనులు కూడా చేస్తారట. చాలామంది ఈ సేవలను వినియోగించుకోవడానికే మొగ్గు చూపిస్తారట. పురుషుల కొరతకు రీజన్దీనికి పురుషుల తక్కువ ఆయుర్దాయమే కారణమని చెబుతున్నారు. అధిక ధూమపాన రేటు, జీవనశైలి సంబంధిత ఆరోగ్య సమస్యల వల్ల ఇలా జరుగుతుందని పేర్కొన్నారు లాట్వియా నిపుణులు. వరల్డ్ అట్లాస్ ప్రకారం లాట్వియన్ పురుషులలో 31% మంది ధూమపానం చేస్తున్నారట. అదీగాక వారిలో చాలామంది అధిక బరువు సమస్యలను ఎదుర్కొంటున్నారట కూడా.ఫలితంగా అద్దెకు భర్తల ట్రెండ్ఇంతలా మగవాళ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో భర్తలను అద్దెకు తీసుకునే ట్రెండ్వై పుకే మొగ్గు చూపుతున్నారట అక్కడ మహిళలు. ఇదేమీ కొత్తదికాదు ఎందుకంటే గతంలో యూకేలో లారా యంగ్ అనే మహిళ 2022లో "రెంట్ మై హ్యాండీ హస్బెండ్" అనే వ్యాపారం కింద తన భర్త జేమ్స్ను చిన్న చిన్న ఉద్యోగాలకు అద్దెకు ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. (చదవండి: అమెరికా-భారత్కి మధ్య ఇంత వ్యత్యాసమా..!)


