Family
-
పిల్లల సమాచారం.. సోషల్గా వద్దు!
సాక్షి, హైదరాబాద్: ‘నా బిడ్డ స్కూల్లో ఫస్ట్ వచ్చింది’, ‘ఇవాళ నా కుమారుడి పుట్టినరోజు.. ‘మా పాప అక్షరాభ్యాసం చేయించాం’, ‘మా పిల్లలను ఫలానా స్కూల్లో చేర్పించాం..’ అంటూ పిల్లలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమ వేదికల ద్వారా పంచుకోవడం ఇప్పటి తరం తల్లిదండ్రులకు సాధారణమైంది.అయితే ఈ చర్యలే పిల్లలను సైబర్ నేరగాళ్ల బారిన పడేలా చేస్తున్నాయని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల ఆన్లైన్ భద్రతపై స్కూళ్లు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సైతం సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల చేతికి ఒక స్కూల్ వార్షికోత్సవంలో తీసిన ఫొటోలో విద్యార్థి పేరు, స్కూల్ లోగో, తరగతి వివరాలు కనిపిస్తే, సోషల్ మీడియా ద్వారా ఆ బాలుడి పూర్తి డిజిటల్ ప్రొఫైల్ను సేకరించడం సైబర్ నేరగాళ్లకు సులభమవుతుందని చెబుతున్నారు.అనంతరం ఫేక్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకున్నట్లు దేశంలోని సైబర్ భద్రతా సంస్థలు పలుమార్లు హెచ్చరించాయి.ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో మీ వివరాలు ఇతరులకు కనిపించకుండా ప్రైవేటు సెట్టింగ్లు పెట్టుకోవాలి.లొకేషన్ ట్యాగ్లను నిలిపివేయాలి. సోషల్ మీడియా ప్రైవసీ సెట్టింగ్స్ను కఠినంగా అమలు చేయాలి.పిల్లలకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలి. -
ముంపు గ్రామాల్లో ముత్యాల సాగుతో కాసుల వర్షం
దేశంలో వ్యవసాయం అంటే కేవలం వరి, గోధుమలు, ఇతర ధాన్యాలు, కూరగాయలు పండించడమనే భావనలో ఇప్పుడు మార్పు చోటుచేసుకుంటోంది. సరికొత్త సాంకేతికత, వినూత్న ఆలోచనలతో రైతులు నూతన మార్గాలవైపు పయనిస్తూ, కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాలకే పరిమితమనుకున్న ‘ముత్యాల సాగు’ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని మురాదాబాద్ గ్రామాల్లో సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తోంది. ముంపునకు గురై, ఎందుకూ పనికిరాదనుకున్న భూములను ముత్యాల గనులుగా మార్చుకుంటూ అక్కడి రైతులు, యువత అద్భుతాలు సృష్టిస్తున్నారు.ముంపు భూమే ముత్యాల గనిమురాదాబాద్కు చెందిన రైతు డాక్టర్ దీపక్ మెహ్రోత్రా విజయగాథ ఈ మార్పునకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆయనకు లోతట్టు ప్రాంతంలో వ్యవసాయ భూమి ఉండేది. చుట్టుపక్కల పొలాల నుంచి వచ్చే వరద నీరంతా ఆయన భూమిలోనే చేరి, నిత్యం జలమయంగా ఉండేది. దీనివల్ల సాధారణ పంటలు పండించడం అసాధ్యంగా మారింది. అయితే ఈ సమస్యను ఆయన ఒక అవకాశంగా మార్చుకున్నారు. నీటి నిల్వలను వాడుకుంటూ ముత్యాల సాగు చేయవచ్చనే సరికొత్త ఆలోచనతో ముందడుగు వేశారు.దేశీయ అవసరాలే పెట్టుబడిగా..డాక్టర్ దీపక్ ముత్యాల సాగుపై పరిశోధన చేస్తున్నప్పుడు ఒక షాకింగ్ నిజం తెలిసింది. భారతదేశానికి అవసరమైన ముత్యాలలో కేవలం మూడు శాతం మాత్రమే దేశంలో తయారవుతున్నాయి. మిగిలిన 97 శాతం ముత్యాలను ఇతర దేశాల నుండి భారీగా దిగుమతి చేసుకుంటున్నారు. ఈ భారీ మార్కెట్ అంతరాన్ని గమనించిన ఆయన, ముత్యాల సాగును ఒక వ్యాపార అవకాశంగా మార్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. తక్కువ స్థలంలోనే ఎక్కువ లాభాలు సాధించే ఈ రంగానికి శ్రీకారం చుట్టారు.ముత్యం ఎలా తయారవుతుంది?ముత్యాల సాగు ప్రక్రియ వినడానికి ఎంత వింతగా ఉంటుందో, దాని వెనుక ఉన్న సాంకేతికత అంతకంటే ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సాగు కోసం ప్రత్యేకమైన ఆల్చిప్పలను (Oysters) ఉపయోగిస్తారు. ఒక ప్రత్యేక ప్రక్రియ ద్వారా చిప్ప లోపల ‘న్యూక్లియస్’ అనే చిన్న కేంద్రాన్ని అమరుస్తారు. ఆ తర్వాత ఈ చిప్పలను చెరువుల్లోని నియంత్రిత వాతావరణంలో భద్రపరుస్తారు. కాలక్రమేణా చిప్ప లోపల సహజంగా ముత్యం రూపుదిద్దుకుంటుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు ఏడాదిన్నర సమయం పడుతుంది. ఈ సమయంలో నీటి నాణ్యత, ఉష్ణోగ్రతలను నిరంతరం పర్యవేక్షించడం ఎంతో కీలకం.వ్యవసాయాన్ని మించిన లాభాలుముత్యాల సాగుకు ఎకరాల కొద్దీ భూమి అవసరం లేదు. చిన్న చెరువులు లేదా నీరు నిలిచే చిన్నపాటి లోతట్టు ప్రాంతాలు ఉంటే సరిపోతుంది. సాంప్రదాయ పంటలతో పోలిస్తే ఇందులో పెట్టుబడి తక్కువ, ఆదాయం చాలా ఎక్కువ. మురాదాబాద్లోని విద్యార్థులు, యువత సైతం ఈ రంగాన్ని తమ భవిష్యత్తు వ్యాపారంగా ఎంచుకుంటున్నారు. మార్కెట్లో ముత్యాలకు ఉన్న విపరీతమైన డిమాండ్ కారణంగా, ఒకసారి పెంపకం పూర్తయ్యాక రైతులు ఊహించని రీతిలో లాభాలను అందుకుంటున్నారు.మారిన రైతుల తలరాతలుడాక్టర్ దీపక్ సాధించిన విజయం మురాదాబాద్ పరిసర గ్రామాల్లో సంచలనంగా మారింది. ఆయనను చూసి స్థానిక రైతు సుభాష్ చంద్ర, ఆయన భార్య సునీత కూడా ముత్యాల సాగు వైపు ఆకర్షితులయ్యారు. ప్రస్తుతం వారు తమ సొంత చెరువుల్లో వేలాది ఆల్చిప్పలను పెంచుతున్నారు. వరదలు, నీటి ముంపు సమస్యల వల్ల పంటలు దెబ్బతిని నష్టపోయే రైతులకు ఈ సాగు ఒక వరం లాంటిదని, సాంప్రదాయ వ్యవసాయం కంటే దీని ద్వారా సుస్థిరమైన, అత్యధిక ఆదాయం పొందే అవకాశం ఉందని వారు ఆనందంగా చెబుతున్నారు.సరికొత్త గ్రామీణ ఆర్థిక విప్లవంముత్యాల సాగు కేవలం పాత తరం రైతులకే పరిమితం కాలేదు. గ్రామీణ యువతకు ఇది ఒక అద్భుతమైన ఉపాధి మార్గంగా మారింది. పెద్ద పెద్ద పరిశ్రమలు స్థాపించాల్సిన అవసరం లేకుండా, సరైన శిక్షణ, కాస్త ఓపిక ఉంటే ఎవరైనా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ప్రస్తుతం డాక్టర్ దీపక్ స్వయంగా స్థానిక యువతకు, రైతులకు ఈ సాగులో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. మురాదాబాద్లో మొదలైన ఈ వినూత్న ప్రయోగం, భారతదేశంలోని ప్రతి గ్రామానికి సరికొత్త దిశను చూపిస్తూ, వ్యవసాయ రంగంలో ఒక సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోంది.ఇది కూడా చదవండి: హిమగిరిపై భారత్ హవా.. 3 గంటల ప్రయాణం ఇక 15 నిమిషాల్లో.. -
న్యూసెన్స్ కేసు పెట్టచ్చు!
మా పక్క ఫ్లాట్లో కుక్కలను పెంచుతున్నారు. అవి రాత్రివేళల్లో మొరుగుతూ మాకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నాయి. అంతేకాకుండా పక్క ఫ్లాట్లో దంపతులు మా అపార్ట్మెంట్ పార్కింగ్లో వీధి కుక్కలకు ఆహారం పెడుతున్నారు. దాంతో పార్కింగ్ప్రాంతం అపరిశుభ్రమవుతోంది. ఈ విషయంపై అపార్ట్మెంట్ అసోసియేషన్స్ కు ఫిర్యాదు చేయగా, ఆ దంపతులు నాపై తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఇతర ఫ్లాట్ వాళ్ళు కూడా వారి ప్రవర్తనకు భయపడి మాట్లాడలేకపోతున్నారు. కుక్కల మొరుగుళ్ల వల్ల నాకు రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు. ఈ పరిస్థితి లో నేను ఏం చేయాలి? నాకు అందుబాటులో ఉన్న పరిష్కారాలేమిటి? – జీవన, హైద్రాబాద్చట్టప్రకారం సాధుజంతువులను పెంచడం, వీధికుక్కలకు ఆహారాన్ని పెట్టడంపై ఎటువంటి నిషేధం లేదు. వాస్తవానికి వన్య్రపాణులను, మన చుట్టూ ఉండే జీవజాలాలను కాపాడటం రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. అలాగే, కుక్కలు మొరగకూడదనడం సరికాదు. ఇదే విషయాన్ని భారత జంతు సంక్షేమ బోర్డు 2015, ఫిబ్రవరి 26 నాడు జారీ చేసిన సూచికలో కూడా పేర్కొంది. అయితే, పెంపుడు కుక్కలు నిరంతరంగా లేదా అధికంగా మొరగడం పొరుగు వారికి ఇబ్బంది కలిగించవచ్చు. అందువల్ల, ముఖ్యంగా రాత్రిళ్లు తమ కుక్కలు నిశ్శబ్దంగా ఉండేలా యజమానులు తగిన చర్యలు తీసుకోవాలని, ఇతరులకు ఇబ్బంది లేదా ప్రశాంతతకు భంగం కలిగించకుండా చూసుకోవడం, పరిశుభ్రతను పాటించడం కూడా యజమానుల బాధ్యత అని కూడా ఆ మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి.మీ కేసులో పరిష్కారం లేకపోలేదు. ఆ గోల తీవ్రంగా, నిరంతరంగా కొనసాగుతున్నది అనుకుంటే మ్యాజిస్ట్రేట్ ముందు 133 సీ.ఆర్.పీ.సీ (ప్రస్తుతం 152 బీ.ఎన్.ఎస్.ఎస్.) కింద న్యూసెన్స్ తొలగించాలి అని కేసు వేయవచ్చు. సివిల్ కోర్టును సైతం ఆశ్రయించి తగిన పరిష్కారం కోరవచ్చు. సరళంగా చె΄్పాలంటే, కుక్కల వల్ల కలుగుతున్న శబ్ద కాలుష్యం, మురికి లేదా ఇతర ఇబ్బందులు సాధారణ అసౌకర్యాన్ని మించి, నిరంతరంగా... గణనీయంగా ఉంటే, నిద్రలేమి వంటి వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగిస్తే పైన సూచించిన చర్యలు చేపట్టవచ్చు.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com కు మెయిల్ చేయవచ్చు. -
చిరునవ్వుల చదువిద్దాం...
రెండు నెలల తర్వాత బడి. బ్లాక్బోర్డు ఎదుట టీచర్ నిలిచే సమయం. కొత్త క్లాసులో పిల్లలు. కొత్త లెసన్ ప్లాన్లు. అయితే ముందు చేయాల్సిన పని ఒకటి ఉంది. పిల్లలకు చిర్నవ్వుతో స్వాగతం పలకడం. వారిని వాత్సల్యంగా పలకరించడం. పిల్లలు పేరెంట్స్ కన్నా టీచర్స్తో ఎక్కువ ఉంటారు. కాబట్టి వాళ్లే ‘స్కూల్ అమ్మ’, ‘స్కూల్ నాన్న’. పిల్లలు చదువులో ‘పాస్’ అవ్వాలంటే, టీచర్లు మొదట వాళ్ల దృష్టిలో పాస్ కావాల్సిందే. ఎలా?పిల్లలకు టీచర్లు బాగా తెలుసు. టీచర్లకు పిల్లలందరూ తెలియకపోయినా. ఒక్కోసబ్జెక్ట్కు ఇద్దరు ముగ్గురు టీచర్లు (సార్లు) ఉంటే వారిలో పాఠం ఎవరు బాగా చెప్తారో, ఎవరు చిరాకు పడతారో, ఎవరు ఎక్కువ కోపంగా ఉంటారో, ఎవరు పనిష్మెంట్లు ఎక్కువ ఇస్తారో పిల్లలకు తెలిసిపోతుంది. పిల్లలే ఆ సమాచారాన్ని ఒకరికి మరొకరు ఇచ్చుకుంటారు.స్కూళ్లు రీ ఓపెన్ అయినప్పుడు ‘మేథ్స్కు ఫలానా సార్ వస్తే బాగుండు’ అని కొందరు పిల్లలు ‘ఫలానా సార్/టీచర్ వద్దు బాబోయ్’ మరికొందరు పిల్లలు అనుకుంటారు. కాని ఎవరు రావాలనేది వారి చేతుల్లో ఉండదు. కాని వచ్చిన వారు తమ వ్యవహార శైలితో పిల్లలకు నచ్చడం వారి చేతుల్లోనే.‘ఈ ఏడాదంతా ఈ టీచర్లే’ అని పిల్లలకు స్కూల్ మొదటిరోజు తెలిసినప్పుడు ప్రతి టీచర్ను వాళ్లు ఇష్టపడేలా ఉంటే ఎంత బాగుంటుంది? టీచర్లు పిల్లల కోసం ఉన్నారు. పిల్లలు ఉన్నారు కనుక ఉన్నారు. కాబట్టి పిల్లలతో పాఠం సమయంలో కఠినంగా, మిగిలిన సమయాల్లో ప్రేమగా ఉంటూ కూడా మంచి ఫలితాలు సాధించవచ్చు.కేస్ స్టడీ 1: సుజాత టీచర్ స్కూల్ తెరిచిన ఫస్ట్రోజు సుజాత మేడమ్ క్లాస్లోకి చాక్పీస్తో వెళ్లరు. ఒక పెద్ద చార్ట్, కొన్ని కలర్ స్కెచ్లు తీసుకెళ్తారు. బోర్డు మీద ముందో స్మైలీ గీసి ‘నా సమ్మర్ స్టోరీ’ అని రాసి, తాను సెలవుల్లో ఏం చేశారో మూడు నిమిషాలు చెప్తారు. ‘నేను మా ఊరెళ్లా, ఢిల్లీ చూశా, చాలా పుస్తకాలు చదివా’. తర్వాత పిల్లల్ని అడుగుతారు– ‘మరి మీ స్టోరీ ఏంటి?’ 40 మంది, 40 కథలు. ఒకడు అమ్మమ్మ వాళ్ల ఊర్లో బావిలో ఈత నేర్చాడు, ఒక పాప పిల్లి పిల్లకు పేరు పెట్టింది. నవ్వులు, కేకలు. పీరియడ్ అయిపోయింది. ఇలా క్లాసులు మొదలైతే పిల్లలు ఉత్సాహంగా ముందుకు దూకరూ?కేస్ స్టడీ 2: రవి సార్ రవి సార్ మ్యాథ్స్ అంటే పిల్లలకు దడ. సెలవుల తర్వాత మొదటి క్లాస్లో ఆయన బోర్డు మీద లెక్కల సూత్రం రాయరు. బదులుగా ‘మీలో ఎంతమందికి క్రికెట్ అంటే ఇష్టం?’అని అడుగుతారు. అందరూ చేతులు ఎత్తాక ‘సరే, ఐపీఎల్లో కోహ్లీ 5 మ్యాచ్లలో 45, 67, 2, 89,12 పరుగులు చేశాడు. యావరేజ్ ఎంత?’ అంటారు. పిల్లలు ఆన్సర్ చెప్పడానికి టకటకా పెన్నులు బయటకు తీస్తారు. లెక్కల క్లాసు ఇలా మొదలుపెట్టి రవిసార్ అనవసర భయాన్ని తగ్గిస్తారు. టీచర్లు దారి చూపేవారు. అయితే వారికి సూచనలు చేయవచ్చు.→ ‘అటెండెన్స్’ కంటే ముందు ‘అటెన్షన్’పేరుతో పిలవండి, నంబర్తో కాదు. రిజిస్టర్ లో ‘రోల్ నంబర్ 12’ అని ఉంటుంది. కానీ ఆ స్టూడెంట్కి పేరు ఉంది. ‘ఉత్కర్ష్... ఓ అక్కడ కూచున్నావా’ అని అనండి. ‘మేడంకి నా పేరు తెలుసా’ అనే ఫీలింగ్ ఉత్కర్ష్కి ధైర్యాన్నిస్తుంది. పరిశోధనలు చెప్తున్నాయి... పిల్లవాడిని పేరుతో పిలిచే టీచర్ క్లాస్లో హాజరు 23 శాతం ఎక్కువ ఉంటుందని. క్లాస్లో పేరు వినిపించే విద్యార్థి తన ఉనికికి సంతోషపడతాడు. ‘క్లాస్ లీడర్ ఎవరు?’... ‘బోర్డు తుడిచే మినిస్టర్ ఎవరు?’...‘పూలమొక్కలకు నీళ్లు పోసే గార్డెనర్ ఎవరు?’అని కొన్ని బాధ్యతలు ఇవ్వండి. పిల్లలకు ‘ఓనర్షిప్’ వస్తే బడి నచ్చుతుంది.→ ఆరా తీయండిమొదటిరోజు రోల్ కాల్ తీసేటప్పుడు మూడు నాలుగు పేర్లకు జవాబు రాదు. ‘ఆబ్సెంట్’ అని టిక్ పెట్టి వదిలేయకండి. ఆ పిల్లాడు ఎందుకు రాలేదు? టీసీ తీసుకున్నాడా? పనిమీద వేరే ఊరు వెళ్లాడా? లేక ‘బడి వద్దు’ అని మారాం చేస్తున్నాడా? 6వ క్లాస్, 9వ క్లాస్లో డ్రా΄ûట్స్ ఎక్కువ. ఫోన్ చేసి కనుక్కోండి. ‘ఏమైంది నాన్నా, రేపు వస్తావా?’ అని ఆ పిల్లాడితో మీరే మాట్లాడితే వాడి అమ్మానాన్నలకు ‘ఈ స్కూల్లో నా కొడుకుని పట్టించుకుంటారు’ అనే నమ్మకం వస్తుంది.→ మీ నవ్వే వాళ్లకు టానిక్ఫిన్లాండ్లో టీచర్లు మొదటి రెండు వారాలు అసలు పుస్తకం ముట్టుకోరు. కేవలం పిల్లలతో ‘బాండింగ్’ చేస్తారు. ఫలితం? ప్రపంచంలోనే బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్గా నిలిచింది. అందుకే మొదటిరోజు పిల్లలతో బాండింగ్ ఏర్పరుచుకోవడం మీదే దృష్టి పెట్టాలి. ‘ఇంట్లో ఎవరెవరు ఉంటారు?’..‘నీకు ఏ ఆట ఇష్టం?’... ‘అన్నం తిన్నావా?’ ఈ రెండు నిమిషాలు వాడికి ‘సేఫ్ జోన్’ క్రియేట్ చేస్తాయి. పిల్లవాడు మీతో కనెక్ట్ అయితే, సబ్జెక్ట్తో ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతాడు. డియర్ టీచర్స్... విద్యార్థికి ‘బడి’ అంటే ‘బిల్డింగ్’ కాదు, మీరే. చాక్పీస్ పట్టుకునే ముందు, పిల్లాడి చేయి పట్టుకోండి. వాడు మిమ్మల్ని గురువుగా, గైడ్గా చూస్తాడు. అది చాలు, ఈ ఏడాది మీ క్లాస్ నూరుశాతం పాస్. -
డైనమిక్ డయాన్ @ 79
విజయానికి ఎన్ని మెట్లో ఎవరు చెప్పగలరు? కొందరు మాత్రం కొన్ని మెట్ల తర్వాత ఆగిపోతారు. కొందరు మాత్రం ప్రతి మెట్టులో ప్రతికూలతలు ఎదురైనా వెనక్కి తగ్గరు. ‘ఫోర్బ్స్ సెల్ఫ్–మేడ్ ఉమెన్’ సంపన్నుల జాబితాలో వరుసగా తొమ్మిదవసారి చోటు సాధించిన డెబ్బై తొమ్మిది సంవత్సరాల డయాన్ హెండ్రిక్స్ రెండో కోవకు చెందిన మహిళ. ‘పెద్ద ఎంటర్ప్రెన్యూర్ కావాలి’ అని చిన్నప్పటి నుంచే కలలు కన్న డయాన్ ఆ కలను సాకారం చేసుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. ఖర్చుల కోసం టాయిలెట్లు శుభ్రం చేసిన రోజులూ ఆమె జీవితంలో ఉన్నాయి. ‘విజయం అంటే కొత్తగా ఆలోచించడం. మార్కెట్లోని లోటుని భర్తీ చేయడం’ అంటున్న డయాన్ హెండ్రిక్స్ గురించి...పదేళ్ల వయసు నుంచే ఎంటర్ప్రెన్యూర్ కావాలని కలలు కనేవారు డయాన్ హెండ్రిక్స్. ‘చిన్నప్పుడు ఎన్నో కలలు కంటాం... అవి నిజమవుతాయా!’ అని ఆ తరువాత అనుకోలేదు డయాన్. తన ‘లక్ష్యం’ అనే మొక్కను పదిలంగా కాపాడుకుంటూ వచ్చారు. కలను సాకారం చేసుకొని ‘సెల్ఫ్–మేడ్ ఉమెన్ బిలియనీర్’గా జేజేలు అందుకుంటున్నారు డయాన్.అప్పులు చేసి.. ఆస్తులు తాకట్టు పెట్టి...తాజాగా... తొమ్మిదవసారి అమెరికా రిచెస్ట్ సెల్ఫ్–మేడ్ ఉమెన్(2026) జాబితాలో చోటు సాధించి తన ప్రత్యేకత నిలుపుకున్నారు డయాన్. ఆమె సంపదలో అధిక భాగం ఆమె రూఫింగ్ మెటీరియల్ కంపెనీ ‘ఏబీసీ సప్లై’కి చెందినదే. తన భర్త కెన్ హెండ్రిక్స్తో కలిసి 1989 లో ఈ కంపెనీని స్థాపించారు. ఆరోజుల్లో వివిధ తయారీదారులు తయారు చేసిన రూఫింగ్ మెటీరియల్స్ ఒకేచోట దొరికే దుకాణాలు చాలా తక్కువగా ఉండేవి. ఇది గ్రహించిన డయాన్ ‘ఏబీసీ సప్లై’ కంపెనీకి శ్రీకారం చుట్టారు. ఈ కంపెనీప్రారంభించడానికి బ్యాంక్ నుంచి అప్పు చేయాల్సి వచ్చింది. ఆస్తులను తాకట్టు పెట్టాల్సి వచ్చింది. విస్కాన్సిన్లోని బెలోయిట్ కేంద్రంగా మొదలైన కంపెనీ కొన్ని సంవత్సరాలలో లాభాల బాట పట్టింది.విజయ రహస్యం‘నా విజయ రహస్యం... మార్కెట్లోని ఒక లోటును భర్తీ చేయడం’ అంటారు డయాన్. ఒస్సియో(యూఎస్)లోని ఒక వ్యవసాయ క్షేత్రంలో పెరిగిన డయాన్ పెద్ద నగరంలో ఉండాలని, నీలం రంగు సూట్లు ధరించి, ఖరీదైన కార్లు నడపాలని కలలు కనేవారు. చిన్న వయసులోనే పెళ్లి అయి గర్భవతి కావడంతో ఇంటి నుంచే చదువు పూర్తి చేశారు. కాలేజీ చదువు కంటే రియల్ ఎస్టేట్ రంగంలో కెరీర్ వెదుక్కోవడానికి చిన్నాచితకా పనులు చేశారు. చిన్న వయసులో తల్లి అయిన డయాన్ తన ఖర్చుల కోసం ప్లేబాయ్ బన్నీ(ప్లేబాయ్ క్లబ్లో పనిచేసే కాక్టెయిల్ వెయిట్రెస్)గా కూడా పనిచేశారు.క్యాన్సర్ను జయించి...రెండు సార్లు క్యాన్సర్ బారిన పడ్డారు డయాన్. తన సంకల్పబలమే క్యాన్సర్ను జయించే శక్తిని ఇచ్చింది. భర్త మరణం ఆమెను దుఃఖంలో ముంచెత్తింది. కష్టకాలం లో, నిరాశానిస్పృహల చీకటిలో కూడా...‘సాధించాలి. తప్పకుండా సాధించాలి’ అని గట్టిగా ఒకటికి పదిసార్లు అనుకునేవారు డయాన్. ప్రారంభ రోజుల్లో...ఖర్చుల కోసం టాయిలెట్లు శుభ్రం చేసేవారు. పాత ఇంటిని కొని స్వయంగా మరమ్మతు చేసి కాలేజీ స్టూడెంట్స్కు అద్దెకు ఇచ్చేవారు.చాలా కష్టం...అయినా సరే...డయాన్ నాయకత్వంలో, మార్గదర్శకత్వంలో ‘ఏబీసీ సప్లై కో’ కంపెనీ ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు చేస్తూ మార్కెట్ లో దూసుకుపోతోంది. మార్కెట్ పోకడలకు అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకుంటోంది. వ్యర్థాల తగ్గింపు, పర్యావరణ అనుకూల ఉత్పత్తులపై దృష్టి పెడుతోంది. రైతుబిడ్డ నుండి బిలియనీర్ వ్యాపారవేత్తగా డయాన్ ప్రయాణం అనేది పట్టుదల, అపారమైన ధైర్యసాహసాల కలబోత. ఎంతోమంది ఔత్సాహికులకు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే అపూర్వ విజయం.‘ఎంటర్ప్రెన్యూర్ కావాలనుకునే యువతకు మీరు ఇచ్చే సలహా ఏమిటి?’ అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన జవాబు... ‘వ్యాపారవేత్తగా రాణించడం అనేది చాలా కష్టం. మూస ఆలోచనలు కాకుండా ఎప్పుడూ కొత్తగా ఆలోచించాలి. మీరు చేయాలనుకుంటున్నది మార్కెట్కు ఎంత అవసరం... అనేది మీకు మీరు వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న. వ్యాపారంలో విలువైన సమయంతోపాటు, డబ్బు కూడా కోల్పోవలసి రావచ్చు. అలా అని భయపడకూదు. రిస్క్ తీసుకోవాలి. ఎంత రిస్కైనా సరే!’ ఎంతోమంది ఔత్సాహికులు తమ కలలను నిజం చేసుకోవడంలో సహాయపడిన డయాన్ దాతృత్వ కార్యక్రమాలలోనూ ముందుంటారు. టెన్ కమాండ్మెంట్స్కష్టపడి పనిచేసి నా కలలను నిజం చేసుకున్న ఒక సాధారణ అమెరికన్ అమ్మాయిని, రైతు బిడ్డను. వ్యక్తిగత, వృత్తి జీవితంలో నన్ను ఎక్కువగా ప్రభావితం చేసింది నా తల్లిదండ్రులు. మా నాన్నగారు ఏది సరైనదో, ఏది కాదో చెప్పేవారు. ‘నేను చేస్తున్న పని సరైనదేనా అని నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు ప్రశ్నించుకుంటే నిర్ణయాలు తీసుకోవడం సులభం అవుతుంది’ అని చెప్పేవారు. టెన్ కమాండ్మెంట్స్ నా వ్యక్తిగత జీవితంలోనే కాకుండా వృత్తిజీవితంలోనూ ప్రభావాన్ని చూపుతున్నాయి. నేను వాటిని మళ్లీ మళ్లీ చదువుతాను. ఒక్కముక్కలో చె΄్పాలంటే ఏది సరిౖయెనదో, ఏది త΄్పో అవి వివరిస్తాయి.– డయాన్ హెండ్రిక్స్ -
హిమగిరిపై భారత్ హవా.. 3 గంటల ప్రయాణం ఇక 15 నిమిషాల్లో..
న్యూఢిల్లీ: భారత ఇంజనీరింగ్ చరిత్రలో మరో సరికొత్త మైలురాయి నమోదైంది. అత్యంత ఎత్తైన ప్రాంతంలో నిర్మిస్తున్న ప్రపంచంలోనే అత్యంత పొడవైన సింగిల్-ట్యూబ్ బై-డైరెక్షనల్ టన్నెల్ ‘జోజిలా సొరంగం’ ప్రధాన విభాగం అనుసంధాన ప్రక్రియ (బ్రేక్థ్రూ) విజయవంతంగా పూర్తయింది. సుమారు 11,578 అడుగుల ఎత్తులో, 13.153 కిలోమీటర్ల పొడవునా గుర్రపు నాడా ఆకారంలో రూపుదిద్దుకున్న ఈ అద్భుత కట్టడాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా వీక్షించారు. భారతీయ ఇంజనీర్ల అసాధారణ ప్రతిభకు నిదర్శనంగా నిలిచిన ఈ ప్రాజెక్ట్ కశ్మీర్, లడఖ్ ప్రజల జీవితాల్లో సరికొత్త విప్లవానికి నాంది పలికింది.3 గంటల ప్రయాణం.. 15 నిమిషాల్లోనే!ప్రస్తుతం సోనామార్గ్ నుంచి ద్రాస్, కార్గిల్, లడఖ్ వెళ్లే ప్రయాణికులు అత్యంత ప్రమాదకరమైన జోజిలా పాస్ గుండా వెళ్లాల్సి వస్తోంది. తీవ్రమైన మంచు తుఫానులు, ప్రమాదకరమైన మలుపులతో కూడిన ఈ మార్గంలో ప్రయాణం ప్రాణాంతకంగా సాగుతుంది. అయితే 9.5 మీటర్ల వెడల్పు, 7.57 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్న ఈ సొరంగం అందుబాటులోకి వచ్చాక ప్రస్తుతం పడుతున్న 3.5 గంటల సుదీర్ఘ ప్రయాణ సమయం కేవలం 15 నిమిషాలకు తగ్గిపోనుంది. ఇది జమ్ముకశ్మీర్లోని బాల్తాల్ (సోనామార్గ్), లడఖ్లోని మణిమార్గ్ (ద్రాస్) ప్రాంతాలను నేరుగా కలుపుతుంది.ఏడాది పొడవునా నిరంతర రవాణాశీతాకాలంలో భారీ హిమపాతం, మంచు కొండలు విరిగిపడటం వల్ల ప్రతి ఏడాది జోజిలా పాస్ దాదాపు 5 నుండి 6 నెలల పాటు పూర్తిగా మూతపడేది. దీనివల్ల లడఖ్ ప్రాంతానికి దేశంలోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయి.. రేషన్, మందులు, నిత్యావసర వస్తువుల తీవ్ర కొరత ఏర్పడేది. ఇకపై ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఈ మెగా టన్నెల్ ద్వారా వాతావరణంతో సంబంధం లేకుండా, ఏడాది పొడవునా కశ్మీర్ నుండి లడఖ్ వరకు వాహనాల రాకపోకలు ఎలాంటి అంతరాయం లేకుండా సాగుతాయి.సైన్యానికి బలం.. పర్యాటకానికి ఊతంచైనా, పాకిస్తాన్లతో సరిహద్దులు పంచుకునే ఈ అత్యంత సున్నితమైన ప్రాంతంలో భారత సైన్యానికి ఈ టన్నెల్ ఒక రక్షణ కవచంలా మారనుంది. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా సరిహద్దులకు సైనికులను, భారీ ట్యాంకులను, యుద్ధ సామగ్రిని వేగంగా తరలించడానికి ఇది దోహదపడుతుంది. దీనితో పాటు, లడఖ్, కార్గిల్, సోనామార్గ్లలో ఏడాది పొడవునా పర్యాటకం వర్ధిల్లుతుంది. శీతాకాలంలోనూ పర్యాటకుల రాక పెరగడం వల్ల హోటళ్లు, రవాణా, స్థానిక హస్తకళల రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.ఇది కూడా చదవండి: ‘కాక్రోచ్’కు పోటీగా ‘సుప్రీం’ మాజీ జడ్జి ‘ఇష్క్’ పార్టీ! -
గంటలతరబడి కుర్చీలో కూర్చుంటున్నారా.. అయితే జాగ్రత్త!
ఆధునిక యుగంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తుల్లో కొంతమంది గంటల తరబడి కుర్చీలకే పరిమితమవుతున్నారు. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అంటున్నారు వైద్య నిపుణులు. దీన్నే 'సిట్టింగ్ డిసీజ్' అని పిలుస్తున్నారు. ఈ సిట్టింగ్ డిసీజ్ ఇతర రోగాలకన్న ప్రమాదకరమైనది. చాపకింద నీరులా.. అనారోగ్య సమస్యల్ని మరింత తీవ్రం చేస్తుంది.ఆరోగ్య సమస్యలు..ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం వల్ల వెన్నెముకపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఫలితంగా నడుము, మెడ నొప్పులు వస్తాయి. అలాగే శారీరక శ్రమ లేకపోవడం వల్ల క్యాలరీలు ఖర్చు కాక స్థూలకాయానికి దారి తీస్తుంది. రక్తప్రసరణ మందగించి, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. శరీరం ఇన్సులిన్ను సరిగ్గా ఉపయోగించుకోలేదు. దీనివల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు స్క్రీన్లను నిరంతరం చూడటం వల్ల కళ్లు పొడిబారడం, తలనొప్పి అదనంగా వచ్చే అనారోగ్య సమస్యలు.అయితే, ఎంత సేపు కూర్చుంటే, ఎంత ప్రమాదం ఉంటుందనే విషయంలో కొన్ని లెక్కలు చెబుతున్నారు నిపుణులు.రోజుకి 4 గంటలోపు కూర్చుంటే.. ప్రమాద తీవ్రత కాస్త తక్కువే ఉంటుందట.అదే 4 - 8 గంటలు కూర్చోవడంతో మధ్యస్థ ప్రమాదంగా చెప్పవచ్చు.8- 11 గంటలు పాటు కూర్చోవడంతోనే మరింత ఎక్కువ ప్రమాదానికి దారి తీస్తుందంటున్నారు.రోజుకి 11 గంటల కంటే ఎక్కువ సమయం కూర్చోవడం అంటే ప్రమాదం అంచున ఉన్నట్టే. ఎంతలా అంటే.. హఠాత్తుగా గుండెపోటు రావడం, పక్షవాతం, శరీరం చలించకపోవటంవంటి సమస్యలు వస్తాయి.ఈ ప్రమాదంనుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే కనీసం వ్యాయామం తప్పనిసరి. క్రమం తప్పని వ్యాయామంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?20-20-20 నియమం: ప్రతి 20 నిమిషాలకు ఒకసారి స్క్రీన్ చూడటం ఆపాలి. 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలోని వస్తువును చూడటం వల్ల కంటి రెటినా పొర చల్లబడుతుంది.చిన్న విరామాలు: ప్రతి గంటకు కనీసం 5 నిమిషాలు సీటు నుండి లేచి నడవాలి. దాంతో శరీర కండరాల్లో కదలిక వల్ల రక్త ప్రసరణ సక్రమంగా సాగుతుంది.సరైన భంగిమ: వెన్నుముక నిటారుగా ఉండేలా కుర్చీలో కూర్చోవాలి. వెన్నుముక వంపుగా ఉంచి.. కుర్చీని ఆనుకుని ఉండటం వల్ల శరీరం మొద్దుబారి, మెదడు నిద్దురను కోరుకుంటుంది.స్క్రీన్ ఎత్తు: కంప్యూటర్ మానిటర్ మన కంటి ఎత్తుకు సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. దీంతో మెడ కండరాల్లో నొప్పి రాకుండా ఉంటుంది.శారీరక వ్యాయామం: మెడ, చేతులు అలాగే నడుమును క్రమంగా స్ట్రెచ్ చేస్తూనే ఉండాలి. కదలకుండా కూర్చోవడంతో శరీర కండరాలు తిమ్మిరెక్కి, రక్త ప్రసరణకు అంతరాయం కలుగుతుంది.హైడ్రేషన్: పని మధ్యలో తగినంత నీరు తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడవచ్చు. -
అదే తలమానికం.. మార్చుకోకండి!
మన తలపై ఉండే ఉపరితల భాగమైన మాడును ఇంగ్లిష్లో స్కాల్ప్ను అంటారన్నది తెలిసిందే. నిజానికి మాడు అంటే అదో దేహ భాగం అనుకునేందుకు అవకాశముంది. కానీ అది సరికాదు... ఇంగ్లిష్లో పేరు పెట్టిన ఆ యాక్రొనిమ్కి విస్తృతార్థం ఉంది. ఇంగ్లిష్ స్కాల్ప్ స్పెల్లింగ్లోని ఐదు ఇంగ్లిష్ అక్షరాల్లో... ‘ఎస్’ అంటే స్కిన్ అనీ, ‘సీ’ అంటే కనెక్టివ్ టిష్యూ అనీ, ‘ఏ’ అంటే ఎపోన్యూరోటికా అనీ, ‘ఎల్’ అంటే లూజ్ ఏరియోలా అనీ, ‘పీ’ అంటే పెరియాస్టియమ్ అని అర్థం. ఆ ఐదు అక్షరాలూ కలిసి ‘స్కాల్ప్’గా ఏర్పడ్డాయని ఈ పదాల వల్ల తెలుస్తుంది. ఇందులో మొదటిదైన స్కిన్ అంటే చర్మం నుంచి మొదలుకొని... ‘పి’ అంటే పెరియాస్టియమ్ అనే పుర్రె ఎముక వరకు వరసగా ఉంటే పొరల తాలూకు ఇంగ్లిష్ పేర్లతో ఈ ‘స్కాల్’ అనే ఇంగ్లిష్ పదం ఏర్పడింది. మాడు అనే స్కాల్ప్ సంరక్షణ ఎలాగో తెలుసుకుందాం...మాడును వెంట్రుకలు కప్పేసి ఉంచి కొంత రక్షణ కల్పిస్తాయి. అయితే ఈ వెంట్రుకలు దట్టంగా ఉన్నవారిలో ఎండకూ, వెలుతురుకూ అడ్డు పడటం ద్వారా అక్కడ పుట్టే చెమట తాలూకు తేమ వాతావరణం కొన్ని సూక్ష్మజీవులు పెరిగే వాతావరణాన్ని కల్పించడం వల్ల దురద రావడం వంటి నలుగురిలో ఇబ్బంది పెట్టే లక్షణాలూ కనిపించవచ్చు. అలాగే ఎండ వల్ల కూడా మాడుపై కొన్ని అనర్థాలూ కనిపించవచ్చు. ఆ అనర్థాలూ, నష్టాలూ ఎలా వస్తాయో చూద్దాం.ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే మాడుకు కలిగే అనర్థాలేమిటంటే...మానవ దేహం మీద మిగతా చర్మంతో పోలిస్తే మాడు మీద ఉండేవీ... నూనె స్రవించే గ్రంథుల సంఖ్య దాదాపు పది రెట్లు ఎక్కువ. ఈ నూనెను స్రవించే గ్రంథులను సెబేషియస్ గ్లాండ్స్ అని పిలుస్తారు, అలా స్రవించే నూనెను సీబమ్ అంటారు. ఈ సీబమ్ ఎప్పుడూ స్రవిస్తూ ఉన్నప్పటికీ ఎంత తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మరింత ఎక్కువగా సీబమ్ స్రవిస్తుంటుంది. దానికి తోడు మిగతా చర్మం కంటే మాడులో ఈ సెబేషియస్ గ్రంథులు పది రెట్లు ఎక్కువ కావడం వల్ల స్రావాల పరిమాణం కూడా బాగా పెరురుగుతుంది. దాంతో చర్మం త్వరగా జిడ్డుగా మారే అవకాశాలెక్కువ.చర్మంలో ప్రధానంగా మూడు రకాలుంటాయి. అవి... 1. పొడి చర్మం (డ్రై స్కిన్)2. సాధారణ చర్మం (మాడరేట్ స్కిన్)3. జిడ్డు చర్మం (ఆయిలీ స్కిన్)పైన చెప్పిన నేపథ్యంలో జిడ్డు చర్మం (ఆయిలీ స్కిన్) ఉన్నవారిలో సీబమ్ మరింత ఎక్కువగా స్రవిస్తుంటుంది. దాంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో తల మరింత జిడ్డుగా మారడం చాలా సాధారణం. దానికి తోడు చర్మంపై చెమట పట్టే గుణం ఎక్కువగా ఉన్నవారిలో తల మరింత జిడ్డుగా మారే అవకాశాలెక్కువ.జిడ్డు చర్మంపై చుండ్రు ప్రభావం ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే...‘మలసేజియా’ అనే ఒక రకం ఫంగస్ పెరగడానికి మన తలపైన ఉండే మాడు చాలా అనువైన ప్రదేశం. ఆ మలసేజియా ఫంగస్ అనేది ఈ ‘సీబమ్’ను ఆహారంగా తీసుకుంటుంది. దాంతో సీబమ్ ఎక్కువగా స్రవించేవారిలో మలజేజియా పెరగడానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది. ఫలితంగా ఈ ఫంగస్ మరింత ఎక్కువగా వృద్ధి చెంది అదే చుండ్రు పెరుగుదలకు కారణమవుతుంది. దానికి తోడు తలమీద ఫంగస్ మరింతగా పెరిగిపోతే అది ‘సెబోరిక్ డర్మటైటిస్’ అనే చర్మవ్యాధికి కారణమై... చర్మంపై నుంచి జిడ్డు పొడిబారినప్పుడు అది పొట్టుగా రాలుతుంటుంది. అందుకే మాడుపైన ఈ తరహా పెరుగుదల ఉన్నవారి తలలో దురదగా ఉండటం, గీరినప్పుడు పొట్టు రాలుతుండటంతో నలుగురిలో ఇబ్బందిగా ఫీలవుతుంటారు.ఫాలిక్యులైటిస్ వంటి సమస్యలు కూడా... మాడుపై సీబమ్ ఎక్కువగా స్రవించడంతో పాటు కొందరిలో వారి శరీర తత్వాన్ని బట్టి చెమట ఎక్కువగా పడుతుండటం, దానికి తోడు జుట్టు దట్టంగా ఉండేవారిలో ఈ చెమట కారణంగా తలలో చెమ్మ వాతావరణం ఏర్పడి... అక్కడ మరికొన్ని రకాల బ్యాక్టీరియా కూడా విపరీతంగా పెరుగుతుంది. వాటి కారణంగా కొందరిలో రోమాంకురాలకు (హెయిర్ ఫాలికిల్స్కు) ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఈ సమస్యనే వైద్యపరిభాషలో ‘ఫ్యాలిక్యులైటిస్’ అంటారు. ఈ సమస్య వచ్చిన వారిలో మాడు మీద చీము పొక్కులు (పస్ నిండినట్లుగా కనిపించే కురుపులు, గుల్లలు) వస్తుంటాయి. వాటి వల్ల తీవ్రమైన నొప్పి, విపరీతమైన దురద రావచ్చు. ఈ పరిస్థితి కూడా ఆ వ్యక్తుల్ని నలుగురిలో మెలగడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేలా చేస్తుంది.ఎలా దువ్వుకోవడం అన్నది మాడుకు మంచిదంటే...జుట్టు రాలకుండా ఉండటంతో పాటు మాడు ఆరోగ్యం బాగుండాలంటే జుట్టు దువ్వుకునే సమయంలో ఈ కింద పేర్కొన్న జాగ్రత్తలు పాటించడం మేలు.తల మీద ఉన్న జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ బాగా జరిగితే జుట్టు ఆరోగ్యంగా ఉండటంతో పాటు త్వరగా రాలిపోకుండా ఉంటుంది. ఇందుకోసం పరిశుభ్రమైన మంచి దువ్వెనతో దువ్వుకోవడం మంచిది.జుట్టును పాయలు పాయలుగా విడదీస్తూ, కుదుళ్ల మొదలు దగ్గర నుంచి చివర్ల వరకు జుట్టును దువ్వాలి. ఇందుకు మరీ సన్నటి పళ్లు ఉన్న దువ్వెన కంటే కాస్తంత వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెనతో దువ్వడమే మంచిది. సన్నటి పళ్ల దువ్వెన వల్ల జుట్టును లాగినట్టుగా ఉంటుంది. కాస్త వెడల్పాటి పళ్లున్న దువ్వెన వల్ల రోమాంకురాలకు అంతగా నష్టం ఉండదు. జుట్టును ఇలా పాయలు పాయలుగా విడదీసే సమయంలో మాడుపై వెలుగూ వెలుతురూ ఎక్కువగా ప్రసరించడం వల్ల చుండ్రు పెరిగే వాతావరణానికి భంగం కలిగి చుండ్రు అంతగా పెరగదు. దీనికి తోడు ఇలా దువ్వడం వల్ల తలలో దుమ్ము తగ్గి అది మాడుకు మేలు చేస్తుంది.మాడు సంరక్షణ కోసం ఆహారపరమైన జాగ్రత్తలివి...మనం తీసుకునే ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, ప్రోటీన్లు, ఖనిజలవణాలతో పాటు తాజా పండ్లు కూడా ఉండేలా చూసుకోవాలి. ఇలా అన్ని రకాల పోషకాలతో కూడిన సమతుల ఆహారం తీసుకుంటూ, తగినన్ని ద్రవాహారాలూ, నీళ్లు తీసుకుంటూ ఉండటం వల్ల మంచి ఆరోగ్యం లభించడంతో పాటు వ్యాధి నిరోధక వ్యవస్థ కూడా బలోపేతమవుతుంది. దాంతో సాధారణ ఆరోగ్యం బాగుండటంతో పాటు... మాడుకు వచ్చే అనేక సమస్యలూ నివారితమవుతాయి.ప్రతిరోజూ రెండు లీటర్లకు తగ్గకుండా లేదా కనీసం ఎనిమిది నుంచి పది గ్లాసులకు తగ్గకుండా నీళ్లు తాగుతూ ఉండడటం వల్ల మాడు మీద ఏర్పడుతుండే మృత కణాలు ఎప్పటికప్పుడు తొలగిపోతాయి. దాంతో మాడు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది.జుట్టు సంబంధిత సమస్యలు ఉన్నవారు వీలైనంతవరకు మాంసం, పంచదార, మైదా, స్ట్రాంగ్ టీ, కాఫీ, పచ్చళ్లు, నిల్వ పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. అయితే తప్పనిసరి అయినప్పుడు వీటిని చాలా పరిమితంగా తీసుకోవాలి.మాడు విషయంలో డాక్టర్ను ఎప్పుడు సంప్రదించాలంటే...ఈ కింద పేర్కొన్న లక్షణాలలో ఏదైనా కనిపిస్తే మాడుకు ఏదైనా సమస్య వచ్చినట్లు గ్రహించి తక్షణం డాక్టర్ను సంప్రదించడం మంచిది. ఆ లక్షణాలేమిటంటే...మాడు మీద దురద విపరీతం వస్తూ మరింతగా పెరుగుతూ పోతుండటంఎండలోకి వెళ్లగానే దురద మరింతగా పెరగడంమాడుపైన ఎర్రగాగనీ లేదా చీముతో కూడిన కురుపులు కనిపించడంమాడు మీద తెలుపు లేదా గ్రే కలర్లో పెచ్చులు వస్తున్నప్పుడుఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ జుట్టు మరింతగా రాలిపోతుండటం.అపోహలూ... వాస్తవాలుమంచి షాంపూతో తల స్నానం చేశాక ఎండలోకి వెళ్తే జుట్టు బాగా మెరుస్తూ అందంగా కనిపిస్తుంటుందనీ, అలాగే ఎండ నుంచి రక్షించుకోడానికి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలిపోతుందనే అపోహలు చాలామందిలో ఉంటాయి. అవెంతవరకు వాస్తవమో చూద్దాం.ఎండవేడిమిలో జుట్టు ఆరబెట్టుకుంటే సూర్మరశ్మి కారణంగా వెంట్రుకలు మెరిసిపోతూ జుట్టు అందం ఇనుమడిస్తుందా?ఇది చాలామందిలో ఉండే అపోహే. మంచి షాంపూతో తలస్నానం చేశాక... కాసేపు మంచి ఎండలో వెంట్రుకలను ఆరబెట్టుకోవడం వల్ల జుట్టు బాగా మెరుస్తూ కనిపిస్తుందని చాలామంది అనుకుంటుంటారు. నిజానికి జుట్టుపై ఎండ తీవ్రత నేరుగా పండటం అంత మంచిది కాదు. నేరుగా వెంట్రుకలపై పడే ఎండ తీవ్రత వాటిని డల్గా మార్చేసేందుకు అవకాశాలెక్కువ. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే... ఎండ సమయంలో వెంట్రుకలకు రక్షణగా గాలి ఆడుతూ ఉండే బ్రిమ్ హ్యాట్ లేదా క్యాప్ ధరించడం మేలు. కాస్తంత వదులుగా ఉండే కాటన్ క్యాప్ అయితే మరీ మంచిది. అంచులు వెడల్పుగా ఉండే బ్రిమ్ క్యాప్ అయితే వెంట్రుకలకు మరింత ఎక్కువ రక్షణ కలుగుతుంది.ఎండ వల్ల కూడా జుట్టు రాలే ముప్పు... ఎండ తీవ్రత నేరుగా మాడుపై పడే కొందరిలో జుట్టు రాలిపోయే ముప్పు కూడా ఎక్కువే. దీనికి కారణమూ ఉంది... నేరుగా వెంట్రుకలపై పడే ఎండ కారణంగా కొందరిలో ‘రోమాంకురాలు’ (హెయిర్ ఫాలికిల్స్) దెబ్బతినే ప్రమాదమూ ఉంటుంది. ఫలితంగా వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఈ సమస్యనే ‘ఎక్టినిక్ టెలోజెన్ ఎఫ్లూవియమ్’ అని కూడా అంటారు. ఈ సమస్యతో పాటు మరికొందరిలో నుదుటి మీద చిన్న చిన్న పొక్కులు లేదా మొటిమల వంటివి కూడా కనిపిస్తుంటాయి. ఎండ తీవ్రత నుంచి మాడును రక్షించుకోవడమిలా...ఎండలో మాడును రక్షించుకోడానికీ, దాని ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి ఈ కింద పేర్కొన్న సూచనలు పాటించడం మేలు. అవి...మాడుపై సీబమ్ ఎక్కువగా స్రవించే దేహలక్షణం ఉన్నవారిలో జుట్టు జిడ్డుగా మారడం చాలా ఎక్కువ. ఆ జిడ్డు కారణంగా జుట్టు మరీ ఎక్కువ డల్గా కనిపించవచ్చు. ఇలా జుట్టు డల్గా కనిపించకూడదంటే... జిడ్డు చర్మం ఉన్నవారు వారంలో రెండు సార్లు లేదా రోజు విడిచి రోజు తలస్నానం చేయడం మంచిది.స్కాల్ప్పైనున్న మన దేహ భాగంలో పీహెచ్ విలువ 5.5 ఉంటుంది. ఇలాంటివారు సరిగ్గా ఇదే పీహెచ్ ఉన్న షాంపూలను వాడితే అది వాళ్ల మాడుకు ఉపయుక్తంగా ఉంటుంది.చుండ్రు లేదా ఫాలిక్యులైటిస్ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా డర్మటాలజిస్టులను పాటించడం మంచిది. సాధారణంగా చుండ్రు ఉన్నవారికి డర్మటాలజిస్టులు వారికి అనువైన లేదా కీటకెనజోల్ వంటి యాంటీఫంగల్ షాంపూలను సూచిస్తుంటారు. ఆ మేరకు బాధితులు వాటిని మెయింటెనెన్స్ ట్రీట్మెంట్లాగా వాడుకోవచ్చు.జిడ్డు చర్మం, జిడ్డుగా ఉండే మాడు ఉన్నవారు తలకు నూనె పట్టించడం అంత మంచిది కాదు.ఎక్కువగా నీళ్లు తాగడంతో పాటు, ద్రవాహారాలు కూడా ఎక్కువగా తీసుకోవడం అన్నది జిడ్డు చర్మంతో ఉండేవారితో పాటు అందరికీ మేలు చేసే అంశం.హెల్మెట్ వల్ల జుట్టు రాలుతుందా? హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు మరింత ఎక్కువగా రాలుతుందనే అపోహ చాలామందిలో ఉంటుంది. గాలి ఆడక చెమట పడుతుండటం వల్ల ఇలాంటి అభి్రపాయం చాలామందిలో కలగడం చాలా సాధారణం. అయితే నిజానికి హెల్మెట్ అన్నది ప్రమాద సమయంలో తలనూ ్రపాణాలనూ కాపాడటమే కాదు... దాన్ని ధరించడం వల్ల అది ఇటు జుట్టునూ, అటు మాడునూ ఏకకాలంలో రక్షిస్తుంటుంది. అంతేకాదు... బయటి వాతావరణంలోని కాలుష్యం నుంచి కూడా జుట్టును కాపాడుతుంది. నిజం చెప్పాలంటే... హెల్మెట్ ధరించని బైక్ రైడర్స్తో పోలిస్తే హెల్మెట్ వాడే వారిలోనే జుట్టు రాలిపోకుండా సురక్షితంగా ఉంటుందని చెప్పవచ్చు.హెల్మెట్ వాడే వారు పాటించాల్సిన సూచన... అయితే హెల్మెట్ తొడుక్కునేప్పుడు ఒక జాగ్రత్త పాటిస్తే మంచిది. ఒక పరిశుభ్రమైన పొడి గుడ్డను కాస్తంత లూజ్గా ఉండేలా తల మీద కప్పుకొని, ఆ పైనుంచి హెల్మెట్ ధరించాలి. ఆ గుడ్డ కూడా కాటన్తో తయారైన మృదువైన కర్చిఫ్లాంటిదైతే మరింత మేలు. ఇలా ధరించడం వల్ల హెల్మెట్ పైభాగం ఆ వ్యక్తి తాలూకు చెమటతో తడిసిపోకుండా ఎప్పుడూ పొడిగా ఉంటుంది. దాంతో చెమటతో తడిసిన హెల్మెట్నే మాటిమాటికీ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మనం తలపైన పరచుకునే గుడ్డను మారుస్తూ దాన్ని మాటిమాటికీ ఉతుక్కోవచ్చు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉతికిన వస్త్రాన్ని వాడుకోవచ్చు. అయితే ఇలా కాకుండా హెల్మెట్ను నేరుగా ధరిస్తుంటే... దాన్ని శుభ్రపరచుకోవడం సాధ్యం కాదు కాబట్టి నిపుణులు ఈ జాగ్రత్తను సూచిస్తుంటారు.చివరగా... మనిషిని చూడగానే మొదటగా అందరికీ కనిపించేది తల... దానిపైన ఉండే మాడు భాగం మాత్రమే. అది ఆరోగ్యంగా కనిపిస్తుంటేనే సదరు వ్యక్తి కూడా పూర్తిగా ఆరోగ్యకరంగా ఉన్నట్లు కనిపిస్తుంటాడు. కేవలం నలుగురిలోకి వెళ్లినప్పుడు కలిగే ఇబ్బందికరమైన పరిస్థితిని తొలగించుకోడానికే కాకుండా... మాడును ఆరోగ్యంగా ఉంటేనే మనిషి కూడా ఆరోగ్యంగా కనిపిస్తాడని గుర్తుంచుకోవాలి. ఆ మేరకు మాడు విషయంలో జాగ్రత్త వహించడమన్నది మిగతా దేహ ఆరోగ్యానికీ మేలు చేసే అంశమని గుర్తుంచుకోవాలి. - డాక్టర్ స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ట్నిర్వహణ : యాసీన్ -
యుద్ధం తెచ్చిన తీపి జ్ఞాపకం.. రైలునే మ్యూజియంగా మార్పు!
ఏ దేశమైనా, ఏ జాతి అయినా యుద్ధం అంటే చివరికి మిగిలేవి దారుణ మరణాలు, తీరని శోకాలే. రెండో ప్రపంచ యుద్ధం దాదాపు ప్రపంచంలోని ప్రతి దేశాన్ని తీవ్రంగా బాధించింది. నాటి యుద్ధ కాలంలో ఫ్రాన్స్కి ప్రత్యక్షంగా సహకరించిన దేశం అమెరికా. యుద్ధం ముగిశాక అమెరికా తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది.ఆ సమయంలో అమెరికా అందించిన సహాయానికి కృతజ్ఞతగా ఫ్రాన్స్ మెర్సిట్రెయిన్ పేరుతో 1949లో 49 బోగీలున్న ఓ ప్రత్యేక రైలును పంపింది. ఫ్రాన్స్లో మెర్సి అంటే ధన్యవాదాలు అని అర్థం. ఈ రైలులో ఫ్రాన్స్ పౌరులు ఎన్నో విలువైన వస్తువులను, జ్ఞాపికలను, కళాత్మక చిత్రాలను బహుమానంగా పంపారు. ప్రస్తుతం అమెరికాకి స్వాతంత్య్రం వచ్చి 250 ఏళ్లు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా ఫ్రాన్స్ ఇచ్చిన మెర్సిట్రెయిన్ను 77 ఏళ్ల తర్వాత ‘గ్రాటిట్యూడ్ ట్రెయిన్’ పేరుతో ఓప్రాజెక్టు మొదలుపెట్టి అత్యంత సుందరంగా వింటేజ్ లో లుక్ తయారు చేసి రైలునే మ్యూజియంగా మార్చేశారు. ప్రస్తుతం ప్రదర్శన కోసం అందుబాటులో ఉంచారు. అలా నాటì చేదు గురుతులు నేటి తీపి జ్ఞాపకాలుగా మారాయి. -
బీపీలకు, టెన్షన్లకు చెక్.. డాంకీలతో మైండ్ బ్లోయింగ్ ట్రీట్మెంట్!
మానసిక ఒత్తిడి, ఆందోళనలతో సతమతమయ్యే బాధితులకు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఒక వినూత్న చికిత్స అందుతోంది. మందులు, ఇంజెక్షన్లతో మాత్రమే కాకుండా, గాడిదల సహాయంతో రోగులను కోలుకునేలా చేస్తున్నారు. వినడానికి కాస్త వింతగా అనిపించినా, ఈ ‘డాంకీ థెరపీ’ మానసిక రోగుల్లో అద్భుతమైన మార్పులను తీసుకువస్తోంది. ప్యారిస్ సమీపంలోని ఒక మానసిక వైద్యశాలలో ప్రారంభమైన ఈ సరికొత్త ప్రయోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిశ్శబ్ద వాతావరణం, పచ్చని ప్రకృతి మధ్య బాధితులు గాడిదలతో గడుపుతూ, తమ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. ప్యారిస్లో వినూత్న ప్రయోగంఫ్రాన్స్లో మొదటిసారిగా ఈ తరహా వినూత్న చికిత్సను ఇక్కడ ప్రవేశపెట్టారు. మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న బాధితులకు సాధారణ మందులతో పాటు ఈ డాంకీ థెరపీని కూడా అందిస్తున్నారు. ఇందులో భాగంగా రోగులు స్వయంగా గాడిదలను బయటకు నడిపించడం, వాటికి ఆహారం తినిపించడం, వాటి సంరక్షణ బాధ్యతలను చూసుకోవడం వంటి పనులు చేస్తారు. ఎంతో ప్రశాంత స్వభావం కలిగిన ఈ జంతువులతో సమయం గడపడం వల్ల రోగులలో ఆత్మవిశ్వాసం, సామాజిక అనుబంధం, మానసిక ప్రశాంతత పెరుగుతాయని వైద్య సిబ్బంది చెబుతున్నారు.మందుల కంటే మిన్నగా..ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 60 ఏళ్ల నాథాలీ అనే రోగి తన అనుభవాన్ని పంచుకుంటూ, గాడిదలతో గడపడం వల్ల తనకు మానసిక ఒత్తిడిని తగ్గించే మందుల కంటే ఎక్కువ ఉపశమనం లభిస్తోందని తెలిపారు. ‘నేను ఆ గాడిదల పక్కన ఉన్నప్పుడు, నా ఆందోళనలన్నీ ఇట్టే మాయమైపోతాయి. ఇది ఒక సహజమైన ఔషధంలా పనిచేస్తుంది’ అని పేర్కొన్నారు. గాడిదలు అటు రోగులకు ఇటు వైద్యులకు మధ్య ఒక వారధిలా పనిచేస్తున్నాయని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.ఒంటరితనాన్ని దూరం చేస్తూ..జెరోమ్ అనే 52 ఏళ్ల మరో బాధితుడు మాట్లాడుతూ, ఈ వినూత్నమైన పని తన జీవితంలోని ఒంటరితనాన్ని పూర్తిగా దూరం చేసిందని ఆనందం వ్యక్తం చేశారు. కొత్త కొత్త యాక్టివిటీస్లో పాల్గొనడం, తోటివారితో మాట్లాడే అవకాశం లభించడంతో తన దైనందిన జీవితంలో ఎంతో సానుకూల మార్పు వచ్చిందని చెప్పారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని 2016 లో ఎర్మెలిండా హెడే అనే సైకియాట్రిక్ నర్స్, ఆమె భర్త ఫ్రాంకోయిస్ హెడే కలిసి ప్రారంభించారు. గాడిదల శాంత స్వభావం, వాటి సామాజిక ప్రవర్తన మనుషలోని మానసిక రోగాలను నయం చేసేందుకు దోహదపడతాయని వారు గుర్తించారు. ఇందుకోసం కొన్ని గాడిదలను యానిమల్ షెల్టర్ల నుండి రక్షించి ఇక్కడికి తీసుకువచ్చారు.ఎమోషనల్ స్పాంజ్గాడిదలు చాలా సున్నితమైనవని, తెలివైనవని ఫ్రాంకోయిస్ హెడే వివరించారు. మానవుల భావోద్వేగాలను అవి చాలా త్వరగా అర్థం చేసుకోగలవని, అందుకే వాటిని ‘ఎమోషనల్ స్పాంజ్’ (భావోద్వేగాలను పీల్చుకునేవి) అని పిలుస్తారని ఆయన అన్నారు. తీవ్రమైన ఆందోళన (Anxiety), కుంగుబాటు (Depression), ఆటిజం (Autism), స్కిజోఫ్రెనియా (Schizophrenia) వంటి మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి ఈ థెరపీ అద్భుతంగా సహాయపడుతోంది. దీనివల్ల రోగుల్లో భావోద్వేగ సమతుల్యత, ఆత్మగౌరవం, కమ్యూనికేషన్ స్కిల్స్ గణనీయంగా మెరుగుపడుతున్నాయని వైద్యులు నిర్ధారించారు.ప్రత్యామ్నాయం కాదు.. కానీ సహాయకారిఅయితే ఈ డాంకీ థెరపీ అనేది సాధారణ వైద్య చికిత్సకు లేదా మందులకు ప్రత్యామ్నాయం కాదని వైద్యులు స్పష్టం చేశారు. ఇది ప్రధాన చికిత్సకు ఒక సమర్థవంతమైన సహాయక చికిత్సగా (Supplementary Treatment) అద్భుతంగా పనిచేస్తుందని వారు చెబుతున్నారు. మానసిక ఆరోగ్య సంరక్షణ రంగంలో ఈ థెరపీకి అధికారిక గుర్తింపు తీసుకురావడం కోసం హాస్పిటల్ యాజమాన్యం సిద్ధమవుతోంది. దీని ప్రభావాలపై త్వరలోనే పూర్తిస్థాయి శాస్త్రీయ పరిశోధనలు (Scientific Research) నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇది కూడా చదవండి: ‘ఇండియా’ను ముంచేసింది ఆ ఇద్దరే..’ -
సాగుబడి: ఎత్తు మడులపై సేంద్రియ వంగ.. మండే ఎండల్లోనూ నో బెంగ!
దీర్ఘకాలం దిగుబడినిచ్చే కూరగాయ పంటల సాగు ఎల్నినో కారణంగా ఈ ఏడాది కరువు బారిన పడే ముప్పు పొంచి ఉందా? ఏడాది పొడవునా కూరగాయ తోటలను ఎల్నినో కరువు నుంచి రక్షించుకుంటూ అధిక దిగుబడిని పొందటానికి ప్రత్యేక లేక సేంద్రియ సాగు వ్యూహాలేమైనా ఉన్నాయా? ముమ్మాటికీ ఉన్నాయంటున్నారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్కు చెందిన సేంద్రియ వ్యవసాయ నిపుణులు శివశంకర్ షిండే! 47 డిగ్రీల సెల్సియస్ ఎండను, నీటి ఎద్దడిని దీటుగా తట్టుకునే వినూత్న సేంద్రియ సాగు పద్ధతిని తమ ‘న్యూలైఫ్ ఫౌండేషన్’ ప్రదర్శనా క్షేత్రంలో ఆవిష్కరించటం విశేషం. కరువొచ్చినా, భారీ వర్షాలొచ్చినా సరే భద్రత చేకూర్చే సంగతులతో ప్రత్యేక కథనం.నేల బాగా తడిచిన తర్వాతే..రుతుపవనాలు పూర్తిగా విస్తరించిన తర్వాత వారం వ్యవధిలో తగినంత వర్షం పడిందని నిర్ధారించుకున్న తర్వాతే వర్షాధార పంటలు విత్తుకోవాలని, ఒకటీ అరా వర్షాలు పడగానే తొందరపడి విత్తనాలు వేసుకోవద్దని నిపుణులు రైతులకు సూచిస్తున్నారు. తగినంత వర్షం అంటే?.. తేలికపాటి, ఎర్ర నేలల్లో 50 నుంచి 60 మి.మీ., బరువు, నల్లరేగడి నేలల్లో 60 నుంచి 75 మి.మీ. వర్షపాతం నమోదైన తర్వాత లేదా 15–20 సెం.మీ. (6 నుంచి 8 అంగుళాల) లోతు నేల తడిచిన తర్వాతే రైతులు వర్షాధార పంటలైన పత్తి, సోయాచిక్కుడు, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, మినుము, ఆముదం తదితర పంటలను విత్తుకోవాలి. వరి సాగు చేయదలచిన రైతులు జనుము, జీలుగ, పెసర, పిల్లిపెసర, ఉలవ వంటి పచ్చిరొట్ట పైరులు విత్తుకోవాలి. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు దీర్ఘకాలిక వరి రకాల నారుమళ్లు పోసుకోవటానికి ఇది అనువైన సమయం.సేంద్రియ సేద్యంపై 9 నెలల ‘అక్షయకల్ప’ శిక్షణవ్యవసాయ భూమి గల లేదా వ్యవసాయ నేపథ్యం ఉన్న యువతను సేంద్రియ రైతు పారిశ్రామికవేత్తలుగా లేదా రైతు విస్తరణ నిపుణులుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ‘అక్షయకల్ప–రెయిన్ మ్యాటర్ ఫెలోషిప్’ కార్యక్రమం త్వరలోప్రారంభం కానుంది. పాడి పశువుల పెంపకం, బయోగ్యాస్ ఉత్పత్తి, బయోడైజెస్టర్ ద్వారా తయారుచేసుకునే సేంద్రియ ఎరువులతో లాభదాయక వ్యవసాయ పద్ధతిపై 19–27 మధ్య వయస్కులైన యువతకు 9 నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని ఈదులాపల్లిలోని అక్షయకల్ప సేంద్రియ వ్యవసాయ పరిశోధన–శిక్షణా కేంద్రంలో ఎంపికైన 30 మందికి మొదటి 3 నెలలు రెసిడెన్షియల్ శిక్షణ, తరువాత 6 నెలలుప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది. ఉచిత భోజనం, వసతితో పాటు ఉపకారవేతనం ఇస్తారు. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల అభ్యర్థులకుప్రాధాన్యం ఉంటుంది. వివరాలకు.. 70222 77155.శాశ్వత మడుల నిర్మాణంఈ సాగు పద్ధతిలో ఐదేళ్ల వరకు చెక్కుచెదరని శాశ్వత ఎత్తుమడులను (పర్మినెంట్ రెయిజ్డ్ బెడ్స్) ఒక అడుగు ఎత్తు, మూడు అడుగుల వెడల్పుతో నిర్మిస్తారు.భూమి తయారీ: మొదటి ఏడాది మాత్రమే దుక్కి అవసరం అవుతుంది.బయోచార్ వినియోగం: ఎకరానికి 5 టన్నుల వరి పొట్టు బొగ్గును (బయోచార్) మట్టిలో కలుపుతారు. ఇది మట్టి కన్నా 4 రెట్లు ఎక్కువగా నీటిని పట్టి ఉంచుతుంది.వీడ్ మ్యాట్: మడులపై డ్రిప్ లైన్లు పరిచి, నాలుగు అడుగుల నలుపు వీడ్ మ్యాట్ కప్పుతారు. ఇది వర్షపు నీటిని లోపలికి పంపిస్తూ, కలుపును పూర్తిగా నివారిస్తుంది.మొక్కలు నాటడం: ఈ మడులపై ఎకరానికి 2 వేల అంటుకట్టిన పర్పుల్ లాంగ్ వంగ మొక్కలను నాటుతారు.ద్రవరూప ఎరువులతో సమతుల్య పోషణపంటకు అవసరమైన స్థూల, సూక్ష్మ పోషకాలను పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే అందిస్తారు.బయోడైజెస్టర్: ఎకరానికి ఏడాదికి 3 టన్నుల మాగిన పశువుల లేదా కోళ్ల ఎరువును బయోడైజెస్టర్లో వేసి 24 గంటల్లో పోషక ద్రవాన్ని తయారుచేస్తారు. దీనిని డ్రిప్, పిచికారీ ద్వారా వారానికి రెండు సార్లు ఇస్తారు.ద్రావణాలు: వేపాకులు, వయ్యారిభామ, తలంబ్రాల ఆకులను పది రోజులు నిల్వ చేసి ఆ రసాన్ని అందించడం ద్వారా సూక్ష్మపోషకాల లోపాన్ని అధిగమిస్తున్నారు. కొనుగోలు చేసిన సేంద్రియ పురుగుమందును అడపాదడపా వాడుతూ చీడపీడలను సమర్థవంతంగా అరికడుతున్నారు.రసాయన సాగు – సేంద్రియ సాగు పోలికరంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దేవరంపల్లిలో వడ్ల ఆనందాచారి రసాయనిక సేద్యంలో తెల్లవంగను పండిస్తున్నారు. రసాయన సాగుతో పోలిస్తే శివశంకర్ అనుసరిస్తున్న శాశ్వత మడులపై సేంద్రియ సాగులో పెట్టుబడి తొలి ఏడాది ఎక్కువగా ఉన్నప్పటికీ, దిగుబడి నాలుగింతలు వస్తుంది. ఐదేళ్ల పాటు మడుల నిర్మాణ ఖర్చు ఉండదు కాబట్టి, తర్వాతి సంవత్సరాలలో పెట్టుబడి తగ్గి నికర లాభం బాగా పెరుగుతుంది. వాతావరణ మార్పులను తట్టుకుని నిలబడే ఈ విధానం రైతులకు ఆర్థిక భద్రతను చేకూరుస్తుంది. సాధారణ వంగ రకాల పంటకాలం 6–8 నెలలు మాత్రమే కాగా, అంటుకట్టిన వంగ తోట 12 నుంచి 18 నెలల పాటు (కొన్నిసార్లు రెండేళ్లు) దిగుబడినిస్తుంది.పర్మినెంట్ బెడ్సే పంటకు పునాది!వరి పొట్టు బొగ్గుతో కూడిన పర్మినెంట్ బెడ్సే పంటకు పునాది. మట్టి కన్నా 4 రెట్లు ఎక్కువగా నీటిని పట్టి ఉంచే శక్తి దీనికి ఉంది. అందువల్లే, రోహిణీ కార్తెలోనూ రెండు రోజులకోసారి డ్రిప్ నీరిచ్చినా వంగ తోట చూస్తున్నారుగా ఎలా ఉందో? వీడ్ మ్యాట్ లోపలికి వర్షం దిగుతుంది. మట్టికి గాలి ఆడుతుంది. కానీ, కలుపు అసలు పెరగదు. ఒకసారి వేస్తే ఐదేళ్ల వరకు చెక్కుచెదరదు. ఒక పంట అయిపోయాక మరో పంట.. బెడ్స్పై మొక్కలు నాటుకోవటమే. ఏళ్ల తరబడి నిలిచే శాశ్వత బెడ్స్పై విజ్ఞతతో చేసే సేంద్రియ సేద్యం ఇది. సమతుల్య పోషణపై అవగాహన, క్రమం తప్పని ఆచరణే కీలకం.– శివశంకర్ షిండే (81210 08002), సేంద్రియ వ్యవసాయ నిపుణుడు, బుచ్చిగూడెం, ఫరూక్నగర్ మండలం, రంగారెడ్డి జిల్లానిర్వహణ: పంతంగి రాంబాబు -
సెలవిక సమ్మర్కు సరదాగా స్కూల్కు
సెలవులు అయిపోయాయి.రేపో మాపో బడిగంట. ఇక అమ్మ ‘లేవరా’ అంటుంది. బయట స్కూల్ బస్ హారన్ మోగుతుంది. టీచర్ గుర్తొచ్చి భయమేస్తుంది. స్కూలుకు పోబుద్ధి కాదు. రెండు నెలల సెలవుల తర్వాత పిల్లలకు ఇలా అనిపించడం మామూలే. దీనిని స్కూల్ ఫీవర్ అనొచ్చు. అయితే ‘ఇలా నీకొక్కడికే కాదు... క్లాసంతా’ అని చెప్పాలి. పిల్లల్ని బడికి హుషారుగా సిద్ధం చేయాలి.తెలుగు రాష్ట్రాల్లో బడిగంట మోగే వేళన పిల్లలకు ఎన్నో సందేహాలు, లోలోపలి భయాలు, చిన్నపాటి ఆందోళనలు ఉంటాయి. కొత్త స్కూల్కి, కొత్త క్లాస్కి, కొత్త సెక్షన్కి మారడం... మళ్లీ ఆ భారీ స్కూల్ బిల్డింగ్లోకి అడుగు పెట్టడం... కొత్త టీచర్లను ఫేస్ చేయడం... అదీగాక ఇన్నాళ్లూ ఫోన్ చూసిన కళ్లతో రేపు బ్లాక్బోర్డ్ చూడాలంటే కష్టమే. అందుకే స్కూల్ ఫీవర్ తెచ్చుకుంటారు. అయితే దానికి విరుగుడు మాత్ర ఉంది.‘స్కూల్ ఫీవర్’ ఎందుకు?రెండు నెలలు ఇష్టానుసారం గడిచి ఉంటాయి. లేట్గా లేవడం, ఆడుకోవడం, టీవీ, నో హోంవర్క్.... ఇప్పుడు మళ్లీ టైమ్కి లేవాలి, ఇంట్లో స్కూల్లో రూల్స్ వస్తాయి... బ్రెయిన్ కి ఇది సడన్ బ్రేక్లా ఉంటుంది. అందుకే కడుపులో తిప్పేసినట్టు, ఏడుపు వచ్చేట్టు, చిరాకు కోపం, ఏదైనా ఎత్తుగడ వేయాలనిపించడం... పిల్లల్ని గమనించి మొదట వారిని ‘చిన్న పనుల్లో’ పెట్టాలి. ‘పుస్తకాలకు అట్టలు వేద్దాం రా’, ‘కొత్త పెన్ను పెన్సిలు బాక్స్లో పెట్టుకున్నావా?’, ‘యూనిఫామ్ సైజ్ చెక్ చేద్దాంరా’... ఈ పనులు చేయిస్తుంటే పిల్లల మైండ్కి ‘ఓకే, స్కూల్కి రెడీ అవ్వాలన్నమాట’ అనే ఫీలింగ్ వస్తుంది. ఫీవర్ దానంతట అదే తగ్గిపోతుంది.కొత్త బ్యాగ్ బెంగను పోగొడుతుందా?పోగొడుతుంది. కానీ బ్యాగ్ ఒక్కటే చాలదు. స్కూల్ ఫస్ట్ డే ఉదయం పిల్లలు లేచి చేసే మూడు పనులు వారి స్కూల్ ఫీవర్ని తరిమి కొడతాయి. ∙లేవగానే వారు చక్కగా తయారయ్యేలా చూసి అద్దంలో వారిని వారికి చూపించాలి. కొత్త యూనిఫామ్లో భలే బాగున్నావ్ అనాలి. ఏదో ఒక సరదా మాట చెప్పి నవ్వించాలి. నవ్వితే బ్రెయిన్ ‘నేను హ్యాపీ’ అని ఫిక్స్ అవుతుంది. ముందురోజు రాత్రే ఇష్టమైన టిఫిన్ కనుక్కుని ‘నీ ఫేవరెట్ టిఫిన్ రెడీ’ అని చెప్పాలి. కడుపు ఫుల్ అయితే మూడ్ ఆటోమేటిక్ సెట్. ∙స్కూల్కి వెళ్లేటప్పుడు ‘నీ బెస్ట్ ఫ్రెండ్ నీ సెక్షన్లోనే పడొచ్చు’ అనో, ‘ఈసారి ఎవరు కొత్త ఫ్రెండ్స్ అవుతారో’ అనో ఉత్సాహ పరచాలి. ‘క్లాస్రూమ్లకు కొత్తగా పెయింట్ చేయించారట’ అని చెప్పాలి. అలాంటివి వింటే పిల్లలు ఎగ్జయిట్ అవుతారు.హుషారుగా ఎలా ఉండాలి?‘మొదటిరోజు కాబట్టి నువ్వు ఈరోజు హుషారుగా ఉంటే సంవత్సరం అంతా హుషారుగా ఉంటావ్’ అని చెప్పాలి. ‘టీచర్ క్లాస్లోకి రాగానే గుడ్ మార్నింగ్ మేడం అని కాస్త గట్టిగా చెప్పు. లంచ్టైమ్లో ఒంటరిగా కూర్చోకు. ఇంకో విషయం... ఫస్ట్డే ఎవరూ నీ ర్యాంక్ అడగరు. నీ కొత్త షూస్, నీ నవ్వు చూస్తారు. నేను అందరితో కలిసిపోతా అనే ధైర్యంతో ఉండు’ అని చెప్పాలి.బస్సెక్కించేటప్పుడు ‘నీకు ఎలాంటి ఫీలింగ్ ఉందో నీ సెక్షన్లో ఉండే అందరు పిల్లలూ అలాంటి ఫీలింగ్తోనే ఇవాళ స్కూల్కి వస్తారు. ఏం పర్వాలేదు. వెళ్లు. అక్కడ బెంచీలు, బ్లాక్బోర్డు, బెల్ అన్నీ నీ కోసమే వెయిట్ చేస్తున్నాయి. ఈ ఏడాది నీదే. స్కూల్లో చదువు, ఆడు, కథలు విను, ఫ్రెండ్షిప్ చెయ్...’ అని చెప్పాలి. మొదటిరోజు దాటితే ఈ సంవత్సరం దాటేసినట్టే. కేస్ స్టడీ 1: కార్తికేయ, 7వ తరగతికార్తికేయ గుంటూరులో చదువుతున్నాడు. రేపు స్కూల్ తెరిస్తే సెవెన్త్లో కూచోవాలి. పోయిన సంవత్సరం ఆరుకు వచ్చినప్పుడు ఫస్ట్ డే ΄÷ద్దున్నే ‘కడుపునొప్పి’ అన్నాడు. అమ్మ టెంపరేచర్ చూసింది, జ్వరం లేదు. బస్సెక్కించబోతే మొహం అదోలా పెట్టి ‘కొత్త సెక్షన్లో నా ఫ్రెండ్స్ ఉండరు’ అన్నాడు. అమ్మ వాడితో ‘మా బుజ్జి కదూ. బ్యాగ్లో నీకిష్టమైన ఫుడ్ పెట్టాను. అది లంచ్లో నీ పక్కవాడితో షేర్ చేసుకో’ అని చెప్పింది. కార్తికేయ నసుగుతూనే బస్సెక్కాడు. డల్గా కూచున్నాడు. కాని సాయంత్రం ఇంటికి హుషారుగా వచ్చి ‘కొత్త ఫ్రెండ్ దొరికాడు మా’ అన్నాడు. స్కూల్ ఫీవర్ పోయింది. మళ్లీ ఈ సంవత్సరం కూడా ఈ ఫస్ట్డేకి ప్రిపేర్ చేయాలి.కేస్ స్టడీ 2: శ్రావ్య, 10వ తరగతిశ్రావ్య హైదరాబాద్లో ప్రయివేట్ స్కూల్. ఇప్పుడు 10కి వచ్చింది. 9వ క్లాస్లో మ్యాథ్స్లో 55 మార్కులు వచ్చాయి. సెలవులు అయిపోతున్నాయంటే శ్రావ్యకు మూడ్ పాడవుతోంది. ‘రేపు మ్యాథ్స్ మేడం సెలవుల్లో ఏం చేశావ్ అంటే ఏం చెప్పాలి? నన్నే లెక్క చేయమంటుందేమో’ అని ఏడుపు. అప్పుడు నాన్న పక్కన కూర్చుని ఒక పేపర్ ఇచ్చాడు. ‘దీనిమీద రాయి. టీచర్... నాకు లెక్కలు కష్టం. కానీ నేను నేర్చుకోవడానికి రెడీ. దయచేసి హెల్ప్ చేయండి. ఫస్ట్ డే ఇది మేడం డెస్క్ మీద పెట్టు. చదివిన ఏ టీచరూ హెల్ప్ చేయకుండా ఉండదు’ అన్నాడు. శ్రావ్యకు స్కూల్ ఫీవర్ పోయింది. బుర్రలో ‘భయం’ పోయి ‘భరోసా’ రావడంతో స్కూల్కు వెళ్లడానికి రెడీగా ఉంది. -
యుద్ధభూమిలో... జెండర్ పోరాటం
భారత సైన్యంలో తొలి మహిళా యుద్ధ హెలికాప్టర్ పైలట్గా చరిత్ర సృష్టించిన అభిలాష బరాక్ తాజాగా... ప్రతిష్ఠాత్మకమైన ‘యూఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ఇది ఇయర్’ అవార్డ్ అందుకున్నారు. లెబనాన్లోని ఐక్యరాజ్య సమితి దళంలో ఫిమేల్ ఎంగేజ్మెంట్ టీమ్ కమాండర్గా భారత బెటాలియన్లో పనిచేస్తున్నారు అభిలాష. లెబనాన్లో సంఘర్షణ ప్రభావిత ప్రాంతాలలో లింగసమానత్వాన్ని పెంపొందించడానికి, మహిళలకు అండగా నిలవడంలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.యునైటెడ్ నేషన్స్ ఇంటెరిమ్ ఫోర్స్ ఇన్ లెబనాన్లో పనిచేస్తున్న మేజర్ బరాక్, దక్షిణ లెబనాన్లోని భారతీయ బెటాలియన్లో ఎంగేజ్మెంట్ టీమ్ కమాండర్, జెండర్ ఫోకల్ పాయింట్గా సేవలందిస్తున్నారు. గత సంవత్సరం జూన్లో ఈ మిషన్లో చేరినప్పటి నుంచి స్థానిక ప్రజలతో సన్నిహితంగా ఉంటూ మహిళలు, బలహీన వర్గాల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేశారు. వేలాది మంది మహిళలు, బాలికలకు ప్రయోజనం చేకూర్చే విద్య, ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు నాయకత్వం వహించారు.ఐరాస ప్రశంసలుఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న ప్రాంతాలలో మహిళలతో కూడిన గస్తీ బృందాలకు నాయకత్వం వహించారు అభిలాష. ‘లెబనాన్ జెండర్ ఇనిషియేటివ్’ ఆమె విజయాలలో ఒకటి.‘లెబనాన్ జెండర్ ఇనిషియేటివ్’ అనేది ఏఐ–బేస్డ్ ప్లాట్ఫామ్. లింగ–ఆధారిత హింసను గోప్యంగా నివేదించడానికి, సహాయసేవలు, ఆత్మరక్షణ సమాచారాన్ని పొందడానికి పిల్లలకు సాయపడే వేదిక.శాశ్వత శాంతి వైపుగా...ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (ఐటీఈసీ) కార్యక్రమం కింద దక్షిణ లెబనానుకు చెందిన 75 మంది మహిళలకు స్కాలర్షిప్లు ఇప్పించడంలో సహాయపడ్డారు అభిలాష. ‘ఐటీఈసీ’ అనేది పునరుత్పాదక శక్తి, ఫైనాన్స్ వంటి రంగాలలో శిక్షణ అందించడంలో మహిళలకు సహాయపడుతుంది. శాంతి పరిరక్షకులకు, స్థానిక సమాజాలకు మధ్య నమ్మకాన్ని బలోపేతం చేయడానికి, మహిళలకు సహాయ సహకారాలు అందించే వ్యవస్థలను మెరుగుపరచడానికి అభిలాష చేసిన కృషిని ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది.‘శాంతి పరిరక్షక మిషన్లను లింగ సమానత్వం అనేది ఎలా బలోపేతం చేయగలదో, శాశ్వత శాంతికి ఎలా దోహద పడగలదో బరాక్ నిరూపించారు’ అని అభిలాషను ప్రశంసించారు ఐక్యరాజ్య సమితి శాంతి కార్యకలాపాల అధిపతి జీన్–పియర్ లాక్రోయిన్స్. శాంతిభద్రతలలో మహిళల భాగస్వామ్యాన్నిప్రోత్సహించే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లే సైనిక శాంతి పరిరక్షకులకు 2016 నుండి యూఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ఇది ఇయర్’ అవార్డ్ ప్రదానం చేస్తున్నారు. ఈ అవార్డ్ అందుకున్న మూడో మహిళా అధికారి మేజర్ అభిలాష.బాల్యం నుంచే సైనిక క్రమశిక్షణహరియాణా రోహ్తక్ జిల్లా బాలంద్ గ్రామంలోని సైనిక కుటుంబంలో అభిలాష బరాక్ జన్మించారు. ఆమె తండ్రి కల్నల్ ఎస్.ఓమ్ సింగ్ జమ్మూ అండ్ కశ్మీర్ లైట్ ఇన్్రపాంటీలో సేవలందించగా, సోదరుడు ప్రస్తుతం భారతసైన్యంలో పనిచేస్తున్నారు. సైనిక కంటోన్మెంట్లో పెరగడం వల్ల అభిలాషలో క్రమశిక్షణ, సేవాభావం, దృఢసంకల్పం లాంటి విలువలు బాల్యంలోనే పాదుకున్నాయి.దిల్లీ టెక్నలాజికల్ యూనివర్శిటీలో చదువుకున్న అభిలాష బీటెక్ (ఈసీయీ) చేశారు. చదువు పూర్తయిన తరువాత అమెరికాలోని డెలాయిట్లో బిజినెస్ టెక్నాలజీ అనలిస్ట్గా ఉద్యోగం సంపాదించారు అభిలాష. దేశానికి సేవ చేయాలనే సంకల్పం అభిలాషను భారత సాయుధ దళాల పరీక్షలకు సిద్ధమయ్యేలా చేసింది. సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బి) ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (వోటీఏ)లో శిక్షణ పొంది సెప్టెంబర్ 2018లో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కార్పస్లో కమిషన్ పొందారు. కఠిన పరీక్షలు జయించి...భారత సైన్యం 2021లో మహిళా అధికారులకు యుద్ధవిమానయాన రంగం (కంబాట్ ఏవియేషన్)లో ద్వారాలు తెరిచింది. సాయుధ దళాలలో లింగ సమాన్వతం కోసం చేపట్టిన విస్తృత కార్యక్రమాలకు అనుగుణంగా ఈ విధాన మార్పు జరిగింది. కంబాట్ ఏవియేషన్లో చేరడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన మహిళా అధికారులలో అభిలాష బరాక్ ఒకరు.పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్, మెడికల్ ఎవల్యుయేషన్స్తో సహా... రకరకాల కఠినమైన ఎంపిక ప్రక్రియల తర్వాత కేవలం ఇద్దరు మాత్రమే ఎంపికయ్యారు. అందులో బరాక్ ఒకరు. ప్రీ–ఆర్మీ పైలట్ కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తన బ్యాచ్లో ప్రథమస్థానంలో నిలిచినందుకు ప్రతిష్ఠాత్మకమైన ‘ఫ్లెడ్జింగ్’ ట్రోఫీని అందుకున్నారు. -
బ్రెయిన్ ట్యూమర్కి వైఫై, స్మార్ట్ఫోన్లే కారణమా?
గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. దాంతో అంతా మొబైల్ ఫోన్లు, వైఫై రౌటర్లు, స్క్రీన్ టైం తదితరాలే అందుకు కారణమని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగావీటన్నింటికి ఒత్తిడి కూడా తోడవ్వుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ జూన్ 8 ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే (World Brain Tumor Day) సందర్భంగా డిజిటల్ వినియోగం ఈ సమస్యకు ఎంత వరకు కారణం? శాస్త్రీయపరంగా ఇది ఎంత వరకు కరెక్ట్ వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.వై-ఫై, స్మార్ట్ఫోన్లు, ఒత్తిడి, లేదా అధిక స్క్రీన్ టైమ్ వంటివే బ్రెయిన్ ట్యూమర్కి ప్రధాన కారణమని చెప్పడానికి సరైన ఆధారాలే లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజంగా డిజిటల్ వాడకం వల్ల రేడియేషన్ బారినపడతారనే దానిపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. మొబైల్ ఫోన్లు మరియు వై-ఫై పరికరాల నుంచి లువడే రేడియోఫ్రీక్వెన్సీ (RF) రేడియేషన్ కారణంగానే ఈ ఆందోళన వ్యక్తమైందది గానీ..ఎక్స్-రేలు లేదా అణు పదార్థాల నుంచి వెలువడే అయనీకరణ రేడియేషన్ లా కాకుండా RF రేడియేషన్ను తక్కువ-శక్తి గలదిగా, అయనీకరణం చెందనదిగా పరిగణిస్తారని అన్నారు. అందువల్లే కేన్సర్ పరిధకులు..మొబైల్ ఫోన్లు లేదా వై-ఫై సాధారణ వాడకం బ్రెయిన్ కేన్సర్కు కారణమని నిర్థారించలేమని చెబుతున్నారు. స్మార్ట్ఫోన్ వాడకం బ్రెయిన్ ట్యూమర్ ప్రమాదాన్ని ఎంత మేరకు కలిగించగలదో చేసిన అధ్యయనంలో మిశ్రమ ఫలితాలే వచ్చాయన్నారు. కొన్ని అధ్యయనాల్లో ఫోన్ని అతిగా వాడే వారిలో కొన్ని అరుదైన కణితులు పెరిగినట్లు తేలిందని..మరికొన్ని పరిశోధనల్లో సరైన ఫలితాలివ్వలేదని చెబుతున్నారు. దీనిపై మరింత దీర్ఘకాలిక పరిశోధన అవసరమని చెబుతున్నారు.అధిక స్క్రీన్ సమయం బ్రెయిన్ని దెబ్బతీస్తుందా?స్క్రీన్ సమయం బ్రెయిన్ ట్యూమర్కి కారణమని నేరుగా చెప్పలేకపోయినా.. అధికంగా వాడకం మాత్రం ఇతర మార్గాల్లో మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రమాదం లేకపోలేదన్నారు. ఒకవేళ స్క్రీన్ల ముందు ఎక్కువ గంటలు గడడితే మాత్రం..కంటి ఒత్తిడి, తలనొప్పులునిద్ర నాణ్యత తగ్గడంఒత్తిడి, ఆందోళన పెరగడంశారీరక శ్రమ తగ్గడంమానసిక అలసటకానీ స్క్రీన్ల నుంచి వెలువడే నీలి కాంతి, ముఖ్యంగా రాత్రి పొద్దుపోయాక పరికరాలను ఉపయోగించినప్పుడు, మెలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగించి, నిద్ర చక్రాలను కూడా భంగపరచవచ్చు. అందుకే ఆరోగ్య నిపుణులు వినోదం కోసం చూసే స్క్రీన్ సమయాన్ని పరిమితం చేసుకోవాలని, క్రమం తప్పకుండా విరామం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏదీఏమైనా..ఈ అధిక డిజిటల్ వినియోగం మానసిక శారీరక ఆరోగ్యంపై కచ్చితంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.ఒత్తిడి కారణమా?కేన్సర్తో సహా అన్ని రోగాలకు ఒత్తిడే కారణమని చెబుతుంటారు. దీర్ఘకాలిక ఒత్తిడి రోగనిరోధక శక్తిని బలహీనపరిచి, వాపును పెంచి, మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసినప్పటికీ..ఒత్తిడి మెదడు కణితులకు కారణమవుతుందని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు మాత్రం లేవనే అంటున్నారు.అసలు కారణం ?చాలా సందర్భాలలో, మెదడు కణితులకు ఖచ్చితమైన కారణం తెలియాల్సి ఉందన్నారు. అయితే, శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో అనేక ప్రమాద కారకాలను గుర్తించారు. అవేంటంటే..జన్యుపరమైన పరిస్థితులు, వారసత్వంగా వచ్చే సిండ్రోమ్లుఅధిక మోతాదులో అయోనైజింగ్ రేడియేషన్కు గురికావడంవయస్సుకొన్ని రకాల కేన్సర్ల కుటుంబ చరిత్రఅరుదైన సందర్భాల్లో పర్యావరణ విషపదార్థాలుసాధ్యమైనంత వరకు మంచి నిద్ర, ఒత్తిడి నిర్వహణ, క్రమం తప్పని వ్యాయామం, సమతుల్య పోషణతో ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే రెగ్యులర్ చెకప్లతో ముందుగానేబ్రెయిన్ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం వంటివి చేస్తే..ఈ సమస్య దరిచేరదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. -
నల్లనిమట్టే పారాణి.. గడ్డిపరకలే బాసింగం
ఉపాధిహామీ పనుల వద్ద ఓ జంటకు ఉత్తుత్తి పెళ్లి నిర్వహించి కూలీలు సందడి చేశారు. ఈ ఆసక్తికర ఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... మండలంలోని కొర్విపల్లి గ్రామంలో ఉపాధి పనుల వద్ద వధువు, వరుడికి గడ్డిపరకలతో చేసిన బాసింగం కట్టారు. కాళ్లకు నల్లనిమట్టినే పారాణిగా పెట్టారు. గడ్డిపరకతో తయారు చేసిన మంగళసూత్రం వధువు మెడలో వరుడు కట్టాడు. ఉపాధి పనులకు తీసుకువచ్చిన తట్టనే డప్పుగా చేసుకొని పెళ్లి సందడి చేశారు. ఈ సందర్భంగా యువతులు నృత్యాలు చేసి అలరించారు. ఇదంతా పనులు ముగిశాక రెండో ఫొటో క్యాప్చర్ కోసం వేచి చూసే సమయంలో ఉపాధి కూలీలకు వేదికగా నిలిచింది. -చిన్నశంకరంపేట(మెదక్) -
పిల్లలను మానసికంగా స్ట్రాంగ్గా మార్చే ‘10-10-10’ రూల్..!
ప్రస్తుతం డిజిటల్ యుగంలో పిల్లలు తల్లిదండ్రులు మధ్య సత్సంబంధాలు సరిగా లేవనే చెప్పాలి. తల్లిదండ్రులిరువురు తమ ఉద్యోగాలతో బిజీ అయిపోవడంతో పిల్లలతో సాన్నిహిత్యంగా ఉండేది తక్కువనే చెప్పాలి. దాంతో వారిలో అభద్రతా భావం ఎక్కువైపోతోంది. పైగా చిన్న చిన్న వాటికే కోపతాపాలు ఎక్కువైపోవడం, చదువులో వెనకబడటం వంటివి జరుగుతుంటాయి. ముఖ్యంగా అలాంటి పిల్లలు ఏ సమస్యనైనా తేలిగ్గా తీసుకుని అధిగమించే ప్రయత్నం చేయరు. భయంతో వణికిపోవడం లేదా చికాకు, నిరాశ నిస్ప్రుహలతో చెడు నిర్ణయాలు తీసుకునే పరిస్థితికి వచ్చేస్తున్నారు. అలా కాకుండా చిన్నారులు మానసికంగా బలంగా ఉండి, ప్రతి మాట తల్లిదండ్రులకు నివేదించేలా పెంచాలంటే ఏం చేయాలంటే..ఈ డిజిటల్ యుగంలో పిల్లలు పెద్దలు స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. దాంతో ఇరువురి మధ్య దూరం ఎక్కువైపోతోందని అంటున్నారు. అదీగాక పిల్లలు కూడా ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అయ్యి..అభద్రతా భావనికి గురయ్యిపోతున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. ముందుగా వాళ్లలో మానసిక పరిణితి సరైన విధంగా ఉండటం లేదని అందువల్లో చిన్న వయసుకే అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుని చెడు మార్గాలకు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. మొదటగా పిల్లలు తల్లిదండ్రలు మధ్య విడదీయరాని అనుబంధం స్ట్రాంగ్గా ఉండాలంటున్నారు. అందుకోసం గంటలు గంటలు.. లేదా రోజుల తరబడి వెచ్చించాల్సిన పనిలేదు. ప్రతిరోజు మీ దినచర్యలో భాగమయ్యేలా ఓ పదినిమిషాలు పిల్లల కోసం కేటాయిస్తే చాలంటున్నారు. అదికూడా పేరెంట్స్ తమ స్క్రీన్ టైంకి జస్ట్ 30 నిమిషాలు వీడ్కోలు పలికేలా ప్లాన్ చేస్తే చాలంటున్నారు. పైగా అది బిజీ షెడ్యూల్కి విరామంలా పిల్లలు హ్యాపీగా ఫీలయ్యేలా ఉంటుందని చెబుతున్నారు. జస్ట్ 30 నిమిషాలా అంటే..ఔను జస్ట్ 30 అంటూ సరికొత్త పేరెంటింగ్ టిప్ ‘10+10+10’ రూల్ని పరిచయం చేస్తున్నారు మానసిక నిపుణులు. అంటే ..పిల్లలు నిద్ర లేచినప్పుడు ఓ పది నిమిషాలు, పిల్లలు పడుకునే టప్పడు ఓ పదినిమిషాలు, అలాగే పాఠాశాల నుంచి తిరిగి రాగానే వారితో కాసేపు పది నిమిషాలు ఎలాంటి పరధ్యానం లేకుండా, ఫోన్తో పనిలేకుండా వాళ్ల కళ్లల్లోకి నేరుగా చూస్తూ మాట్లాడండి. అది ఇరువురి మధ్య బలమైన అనుబంధాన్ని ఏర్పరిచి పిల్లలు మానసికంగా దృఢంగా ఎదిగేందుకు ఉపకరిస్తుందని అంటున్నారు. ఇది వినడానికి జస్ట్ 30 నిమిషాలైనా అనిపించినా..చాలా ప్రభావవంతంగా ఉంటుందన్నారు. ఇక్కడ చిన్నారులు పేరెంట్స్ ఎంత ప్రేమ పంచారనేది చూడరు..తమ అమ్మనాన్నలు తమకెంత అందుబాటులో ఉన్నారో అర్థమవుతుందంటున్నారు. తాము భద్రంగా ఉన్నామనే భరోసా, ధైర్యం అందిస్తుంది. పైగా పిల్లలకు ఏం జరిగినా, ఏ సమస్య వచ్చినా..నేర్పుగా వ్యవహరించడం ఎలాగే తెలుసుకునేందుకు ఉపకరిస్తుంది కూడా. అదీగాక పిల్లలను స్క్రీన్లకు అతుక్కుపోయే వ్యసనం బారినపడకుండా రక్షించేందుకు చక్కటి మందులా కూడా ఉపయోగపడుతుందట. రోజుంతో కొద్దిసేపు పిల్లలను పర్యవేక్షించే తీరు వల్ల వాళ్లు తప్పు చేసే అవకాశం, తప్పుడు మార్గంలో పయనించే అవకాశాలు తక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. అలాగే భావోద్వేగపరంగా బలంగా ఉంటారని అంటున్నారు. అంతేగాదు తమకంటే పేరెంట్స్కి ఏది ఎక్కువ కాదనే నమ్మకం పిల్లల్లో పెంపొందుతుంది కూడా. సో ఇంకెందుకు ఆలస్యం పిల్లల కోసం జస్ట్ 30 నిమిషాలు కేటాయించి చూడండి మరి..(చదవండి: సింగిల్ మదర్గా పడ్డ కష్టానికి..కుమారుడిచ్చిన గొప్ప గౌరవం!) -
సింగిల్ మదర్గా పడ్డ కష్టానికి..కుమారుడిచ్చిన గొప్ప గౌరవం!
ఓ అమ్మ ఒంటరిగా పిల్లల్ని పెంచడం అంటే ఎంత కష్టం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ కష్టానికి తగ్గట్టుగా కొడుకు ప్రయోజకుడు అయితే ఆ ఆనందం మాటలకందనిది. కానీ అదే కుమారుడు ఆ అమ్మ కష్టాన్ని గుర్తించి గౌరవిస్తే..అంతకంటే ఆ తల్లికి కావల్సిందేముంటుంది. అలాంటి సందర్భమే ఇక్కడే చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అతడు ఒకప్పుడు ఐఐటీ జేఈఈ పరీక్షల్లో విఫలమైన భారతీయ్ టెక్ నిపుణుడు అభిజయ్ అరోరా. తన తల్లికి భావోద్వేగభరితమైన నివాళి అర్పించడంతో నెట్టింట వైరల్గా మారాడు. అతడు ప్రస్తుతం గూగుల్ పనిచేస్తున్నాడు. ఆయన తనతల్లి తనను ప్రయోజకుడిగా తీర్చిదిద్దేందుకు పడ్డ కష్టానికి తగిన గౌరవం దక్కేలా న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్లో బిల్బోర్డు భారీ స్క్రీన్పై తనతోపాటు తనతల్లి ఫోటో కనిపించేలా చేశాడు. అభిజయ్ తన తల్లికి వీడియో కాల్ చేసి మరి ఆ భారీ స్క్రీన్ని చూపించి సంతోషం వ్యక్తం చేశాడు. వేల మైళ్ల దూరం నుంచి చూస్తున్న ఆమె ఆ నివాళి తనకే అంకితం చేయబడిందని తెలిసి చిరునవ్వులు చిందించింది. అభిజయ్ అందుకు సంబంధించిన వీడియోని పంచుకుంటూ..పోస్ట్లో ఇలా రాసుకొచ్చాడు. "ఆమె తన కలల కన్నా నా కలలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి, ఎన్నో ఎదురుదెబ్బలు, అనిశ్చితిలో తనకు అండగా నిలిచిన మహిళ మా అమ్మ. అందుకే ఆమెను ఇలా గౌరవించా. ఇది నా జీవితంలో ప్రత్యేకమైన రోజు. ఆమె చేసిన త్యాగాలన్నింటికీ నా నా కృతజ్ఞతను తెలియజేయడానికి, నేను మా అమ్మను న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్బోర్డ్పై చూపించాను." అని పేర్కొన్నాడు. దాంతోపాటు తన సక్సెస్ జర్నీని కూడా పంచుకున్నాడు.ఐఐటీ ఫెయిల్ నుంచి గూగూల్ ఉద్యోగిగా..హర్యానాలోని పంచకులకు చెందిన అభిజయ్ బాల్యం అంతా తన ఒంటరి తల్లి ఆధ్వర్యంలోనే సాగిందని చెప్పుకొచ్చాడు. తన స్థోమత కారణంగా పాత పుస్తకాలు చదువుకునేవాడినని తెలిపాడు. కానీ తన అమ్మ తనకు మంచి విద్య అందించాలని తపించిపోయేది. అందుకోసం ఏం చేయాలో అన్ని చేసేది. అయితే అత్యంత పోటీతో కూడిన ఐఐటీ జేఈఈలో ఫెయిలై అమ్మని నిరాశపరిచిన క్షణం తనని నిద్రపోవనివ్వకుండా చేసేదని అన్నాడు. ఏనాటికైనా అమ్మని గర్వంగా తలెత్తుకునేలా చేయాలని బలంగా అనుకునేవాడినని చెప్పాడు. అయితే 2016లో గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన వెంటనే ఏ ఉద్యోగ ఆఫర్ తనకు రాలేదని, 2017లో హ్యాకథాన్ గెలుచుకోవడం తన మొదటి గెలుపని చెప్పుకొచ్చాడు. కానీ ఆ తర్వాత మళ్లీ 2016 నుంచి 2020 వరకు మొత్తం మూడుసార్లు జీమ్యాట్ పరీక్ష రాసినా.. ఓటమే ఎదురైందని వెల్లడించాడు. కానీ 2021లో తాను దరఖాస్తు చేసుకున్న ప్రతి బిజినెస్ స్కూల్ నుంచి తిరస్కరణను ఎదుర్కొన్నాడు. అమెరికాలో కూడా తన కష్టాలు కొనసాగాయి. అక్కడ కూడా అతను ఉద్యోగం కోసం వెతుకుతూనే 90 రోజుల వీసా గడువుతో పోటీ పడాల్సి వచ్చింది. వారానికి దాదాపు వంద ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నా..పదే పదే రిజెక్ట్ అవుతూనే ఉండేవి. అయితే ఆ టైంలో తన భార్య కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోగా, తల్లి నిరంతరం ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉండేదని చెప్పుకొచ్చాడు. ఇక ఇలా లాభం లేదని తనే అవకాశాలు సృష్టించుకోవాలని భావించి అభిజయ్ ఒక AI-ఆధారిత రెజ్యూమె టూల్ను తన నెట్వర్క్ను, గుర్తింపును విస్తరించుకోవడానికి ఆన్లైన్లో కంటెంట్ను పంచుకోవడం ప్రారంభించాడు. ఈ వ్యూహం ఫలించి.. 2022లో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందాడు. 2025 నాటికి, అతను శాన్ ఫ్రాన్సిస్కోలోని యూట్యూబ్ కోసం గూగుల్లో ప్రొడక్ట్ మేనేజర్గా చేరాడు. ఆ తర్వాత, అతను సిలికాన్ వ్యాలీ AI నాయకులతో ఒక పాడ్కాస్ట్ను ప్రారంభించి..దాదాపు ఆరు లక్షల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లతో ఒక ఆన్లైన్ కమ్యూనిటీని నిర్మించుకున్నాడు. అలా తల్లి పడ్డ త్యాగాలకి, కష్టానికి సరైన అర్థం ఇచ్చేలా మంచి ఉన్నత స్థాయికి చేరుకున్న అభిజిత్ అందుకు కృజ్ఞతలు తెలుపుతూ ఇలా అమ్మకు టైమ్స్ స్క్వేర్ నివాళి అందించాడు. నెటిజన్లు కూడా ఆ తల్లికి ఇది హృదయపూర్వక కృతజ్ఞత, ఆమె గర్వించేలా మరింతగా ఎదగండి అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Abhijay Arora Vuyyuru | AI, Tech & Careers (@abhijayarora_) (చదవండి: తండ్రి ఐఐటీ..కానీ కుమారుడు ఫెయిల్..! కట్చేస్తే..) -
తండ్రి ఐఐటీ..కానీ కుమారుడు ఫెయిల్..! కట్చేస్తే..
చాలామంది కెరీర్లో చాలా ఓటములు, నిరాశను ఎదుర్కొన్నవారే. ఆశించినట్లుగా ఉన్నత చదువును అందుకోలేక..నచ్చలేంది చదవలేక సతమతమవుతుంటారు. ముఖ్యంగా ఇతరులు సాధిస్తే..తానొక్కడే ఫెయిల్ అవ్వడం, ప్రతిదాంట్లో నిరాశ, నైరాశ్యం వెంటాడుతుంటే కుంగిపోతాం. కానీ ఇక్కడ ప్రయత్నం ఆగిపోకూడదు. ఈ రోజు ఫెయిల్ అయ్యి ఉండొచ్చేమో కానీ ఏదో ఒకరోజు తప్పక ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంటాం అనేందుకు ఈ వ్యక్తే కథే ఉదాహరణ. నెట్టింట అతడి స్టోరీ వైరల్గా మారడమే కాదు స్ఫూర్తిగా నిలిచింది.వ్యవస్థాపకుడు, కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికూ సోషల్మీడియా వేదికగా 26 ఏళ్ల శౌర్య శిఖర్ విజయవంతమైన ప్రయాణాన్ని పంచుకున్నారు. ఇది మొక్కవోని స్థైర్యంతో చివరికి సక్సెస్ని ఒడిసిపట్టుకున్న అందమైన విజయగాథ. ఐదేళ్ల క్రితం వరకు శౌర్య కెరీర్లో సెటిల్ అవ్వలేక చాలా ఇబ్బందిపడ్డ వ్యక్తి. అతను అందరిలా ఐఐటీ-జేఈఈ సాధించాలని కలలుగన్న వ్యక్తి. అయితే అతడు అందులో సక్సెస్ అవ్వలేకపోయాడు. తన తండ్రి ఐఐటీ అయ్యి ఉండి, తాను సాధించలేక పోవడం అతడ్ని మరింత కుంగదీసింది. తీవ్ర నిరాశతో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బిబిఎ) డిగ్రీలో జాయిన్ అయ్యాడు. అదీ చదవలేక నానా పాట్లు పడ్డాడు. ఆ క్రమంలో ఏకంగా 110 కేజీల అధిక బరువుతో ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడు. కాలేజ్లో చదువుతున్నప్పుడే శౌర్య అంకుర్ వారికూ బృందంలో చేరాడు. కానీ శౌర్య నిరాశ, కెరీర్లో అనిశ్చితి, వ్యక్తిగత పోరాటాల మధ్య చిక్కుకుని తనకు భవిష్యత్తు అనేది ఉందా అని భయపడుతుండేవాడు. చెప్పాలంటే తను ఎందుకు పనిరానని భావంతో ఉండేవాడు. తనకెంతో ఇష్టమైన ఇంజనీరింగ్ కోర్సు చేయలేకపోయానని, బీబీఏ చేస్తున్న ఫూల్ని అని బాగా బాధపడేవాడు. ఇక ఎప్పటికీ తన లైఫ్ మంచిగా ఉండదేమో అని దిగులుతో ఉండేవాడు. కట్చేస్తే..సరిగ్గా ఐదేళ్ల తర్వాత అతడి జీవితం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు 26 ఏళ్ల వయసులో శౌర్య మంచి కెరీర్ను నిర్మిచుకుని నెలకు లక్షల్లో జీతం ఆర్చించే స్థాయికి చేరుకున్నాడు. అంతేగాదు తన తండ్రి పదవీ విరమణ సందర్భంగా ఆయనకు ఏకంగా రూ. 55 లక్షలు విలువ చేసే బీఎండబ్ల్యూ కారుని కొనిచ్చాడు. విలాసవంతమైన కారు కోసం చెల్లించిన డౌన్ పేమెంట్ శౌర్య నికర ఆస్తిలో 5% కంటే తక్కువగా ఉందని, అలాగే ఈఎంఐ అతని నెలవారీ సంపాదనలో 7% కంటే తక్కువగా ఉంటుందని వారికూ వెల్లడించారు. అతనిలో వచ్చిన మార్పు కేవలం డబ్బుకే పరిమితం కాలేదు, ఏళ్లు గడిచే కొద్దీ..శౌర్య ఆరోగ్యం, ఫిట్నెస్పై దృష్టి సారించి ఫిట్గా మారాడు. ఇక్కడ శౌర్య కథ విలాసవంతమైన కారు, సంపద గురించి చెప్పడం లేదు. ఎదురు దెబ్బలు ఒక వ్యక్తి భవిష్యత్తుని నిర్దేశించవు, జీవితంలో ఒక దశ దారుణమైన వైఫల్యం ఎదుర్కొని ఉండొచ్చు. కానీ అదే క్రమంగా విభిన్నమైన మార్గానికి నాంది పలికి ఉన్నతమైన స్థానానికి చేరుకునేలా చేస్తుంది అనేందుకు శౌర్యనే ఉదాహరణ. కానీ ఇక్కడ జీవితంలో ఎదురయ్యే గడ్డుపరిస్థితులకు చేతులెత్తేయకుండా ముందుకు సాగడమే జీవితం అని నమ్మి..ప్రయత్నం ఆపకూడదనేది గ్రహించాలని అంటున్నారు అంకుర్ వారికూ. అలాంటి స్థితిలో ధైర్యంగా ముందుకు సాగినవాడు తప్పకుండా ఏదో ఒకనాటికి జీవితం మంచిగా సెటిల్ అవుతుందని అన్నారు. ఈ స్టోరీ నెటిజన్ల మనసుని తాకడమే కాదు..అత్యంత నిరాశ నిస్ప్రుహల మధ్య ఆశావాదం హాస్యస్పదంగా అనిపించినా.. ఇక్కడ శౌర్య కార్యాచరణలో నిమగ్నమే ముందుకు సాగాలనే దృక్పథాన్ని ఎంచుకోవడం నిజంగా అభినందనీయం. పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా..ముందుకు సాగే వారే విజేతలు అని కామెంట్ చేస్తూ పోస్టలు పెట్టారు.(చదవండి: చాయ్-ఇడ్లీ కలిపి తినకూడదా..? కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఏమన్నారంటే..) -
ఊరి ఆడబిడ్డల సందడి.. వినూత్న సమ్మేళనం
బెజ్జంకి (సిద్దిపేట): పూర్వ విద్యార్థుల సమ్మేళనం మాదిరి.. ఊరి ఆడబిడ్డలంతా సందడి చేశారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దేవక్కపల్లె రెడ్డి ఆడబిడ్డలు వినూత్న వేడుకను జరుపుకొన్నారు. గ్రామంలో పుట్టిపెరిగిన మహిళలు.. పెళ్లై అత్తారింటికి వెళ్లిన ఆడబిడ్డలతో పాటు వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన యువతులు ఆదివారం గ్రామంలో ఆడబిడ్డల సమ్మేళనం నిర్వహించారు. గ్రామంలోని యువతులకు ఈగ్రామ ఆడబిడ్డలను పరిచయం చేసేందుకే ఈకార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. సుమారు 60 మంది వరకు మహిళలు పాల్గొన్నారు. -
భారతదేశంలోని 5 విశిష్ట గ్రామాలు
భారతదేశం అంత వైవిధ్యభరితమైన వాతావరణం, సంప్రదాయాలు, ఐక్యత, భిన్నత్వం, భాషలు, ఆహార అలవాట్లు, నాగరికత, చరిత్ర, నైపుణ్యం ఉన్న దేశం భూమిపై మరొకటి లేదు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే మన దేశంలో కొన్ని గ్రామాలు తమ ప్రత్యేకతతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. అలాంటి ఐదు విశిష్ట గ్రామాల గురించి తెలుసుకుందాం.1. ఖోనోమా, నాగాలాండ్భారత్లో తొలి గ్రీన్ విలేజ్గా గుర్తింపు పొందిన ఖోనోమా ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంలా ఉంటుంది. ఇక్కడి ప్రజల సంప్రదాయాలు, వ్యవసాయ పద్ధతులు, సామాజిక ఐక్యత ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి.2. మాలినోంగ్, మేఘాలయఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా గుర్తింపు పొందిన మాలినోంగ్లో ఎక్కడా చెత్త కనిపించదు. మేఘాలయలోని ఈ అందమైన గ్రామం షిల్లాంగ్కు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ఖాసీ తెగకు చెందిన ప్రజలు నివసిస్తారు.3. చిట్కుల్, హిమాచల్ ప్రదేశ్భారత్–టిబెట్ సరిహద్దుకు సమీపంలో ఉన్న చివరి గ్రామంగా చిట్కుల్ ప్రసిద్ధి చెందింది. మంచుతో కప్పబడిన పర్వతాలు, సాంప్రదాయ ఇళ్లు, స్వచ్ఛమైన గాలి ఈ గ్రామాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడతాయి.4. లంబసింగి, ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమల్లో ఉన్న లంబసింగిని ‘ఆంధ్రా కాశ్మీర్‘ అని పిలుస్తారు. ఎండాకాలంలో కూడా చల్లని వాతావరణంతో ఈ గ్రామం ప్రత్యేక గుర్తింపు పొందింది. 5. బానవాసి, కర్ణాటకకర్ణాటకలోని బానవాసి చారిత్రకప్రాధాన్యం కలిగిన పురాతన గ్రామం. కదంబ రాజవంశానికి తొలి రాజధానిగా నిలిచిన ఈప్రాంతం రెండు వేల సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది.పరిశుభ్రతకు మాలినోంగ్, పర్యావరణ పరిరక్షణకు ఖోనోమా, హిమాలయ సౌందర్యానికి చిట్కుల్, ప్రకృతి ప్రశాంతతకు లంబసింగి, చారిత్రక వైభవానికి బానవాసి ప్రతీకలుగా నిలుస్తాయి. భారతదేశం ఎంత వైవిధ్యభరితమైనదో ఈ గ్రామాలు మరోసారి మనకు గుర్తు చేస్తాయి. ఒకసారి వీటిని సందర్శిస్తే జీవితాంతం గుర్తుండి΄ోయే అనుభవాలను సొంతం చేసుకోవచ్చు. -
ఒక్క రోజులో పది ఆలయాల సందర్శన..
హైదరాబాద్కు చేరువలో ఉన్న ‘యాదాద్రి భువనగిరి’ జిల్లాలో అనేక ప్రసిద్ధమైన ఆలయాలు ఉన్నాయి. ఈ జిల్లానే ఆధ్యాత్మికప్రాంతంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ది చెందుతుంది. తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి యాదగిరిగుట్ట నృసింహుడి దర్శనానికి వచ్చి యాదగిరి క్షేత్రంలోనే గడపడంతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు ఆలయాలను దర్శించుకోవచ్చు. జిల్లాలో ఉన్న ఆలయాలు..యాదగిరీశుడుహైదరాబాద్ నుంచి 60 కి.మీ. దూరంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఉంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఉదయం 9గంటల నుంచి 10గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి 5 గంటలకు రూ.300 టిక్కెట్పై బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు. ధర్మ దర్శనంతో పాటు రూ.150 టిక్కెట్ కొనుగోలుపై వీఐపీ దర్శనానికి పంపిస్తారు. వీటితో పాటు వివిధ కైంకర్యాల్లో భక్తులు టిక్కెట్ కొనుగోలు చేసి పూజల్లో పాల్గొనవచ్చు. రాత్రి బస చేసేందుకు కొండపైన తెలంగాణ హరిత టూరిజంతో పాటు కొండ కింద దేవస్థానానికి చెందిన ప్రెసిడెన్షియల్ సూట్, తులసీ కాటేజీలు, ప్రయివేట్ గదులు అందుబాటులో ఉన్నాయి.అనుబంధంగా పాతగుట్ట..యాదగిరీశుడి ఆలయం నుంచి 3 కి.మీ. దూరంలో పూర్వగిరి(పాతగుట్ట) లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఉంది. యాదగిరిగుట్ట క్షేత్రం కంటే ముందు పూర్వగిరిలో శ్రీస్వామి, అమ్మవార్లు వెలిశారని పురాణాలు చెబుతున్నాయి. క్రమ క్రమంగా ఈప్రాంతమే పాతగుట్టగా మారింది. యాదగిరిగుట్ట నుంచి భక్తులు గుర్రం బండ్లపై ఈ ఆలయానికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు. యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు తప్పనిసరిగా పూర్వగిరీశుడిని దర్శించుకుంటారు.వెంకటపురం లక్ష్మీనరసింహుడుయాదగిరిగుట్ట నుంచి కీసర, ఈసీఐఎల్ వెళ్లే మార్గంలో తుర్కపల్లి మండలం వెంకటవురంలో వెంకటగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం యాదగిరిగుట్ట నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆలయ కొండ గుహల్లో స్వామివారు కొలువై ఉన్నారు. మెట్ల మార్గంలో ఈ ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ఆలయానికి మెట్ల మార్గంలో వెళ్తుంటే ‘ఓంకారం’ రూపంలో చెట్లు ఉండటం ప్రత్యేకం. వీటిని చూసేందుకు సందర్శకులు అధికంగా వస్తారు.భువనగిరి స్వర్ణగిరియాదగిరిగుట్ట నుంచి 15 కిలోమీటర్ల దూరంలో వరంగల్ –హైదరాబాద్ జాతీయ రహదారిపై భువనగిరిలో శ్రీస్వర్ణగిరి వేంకటేశ్వర ఆలయం ఉంది. యాదగిరీశుడిని దర్శించుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో స్వర్ణగిరి ఆలయాన్ని సందర్శించుకుంటారు. తిరుపతిని తలపించేలా ఈ ఆలయం ఉండడంతో తిరుపతికి వెళ్లలేని భక్తులు స్వర్ణగిరి వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్తుంటారు. ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో పక్కనే కోరిన కోర్కేలు తీర్చే శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయం ఉంటుంది.సకల విశేషాలకు నెలవు సురేంద్రపురియాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో సురేంద్రపురి పంచముఖ హనుమాన్ ఆలయం ఉంటుంది. ఇక్కడ భారీ ఎత్తులో పంచముఖ హనుమాన్, పంచ ముఖ శివుడి విగ్రహాలు ఉన్నాయి. అంతే కాకుండా ఇక్కడ వెంకటేశ్వరస్వామి ఆలయం సైతం ఉంటుంది. ప్రత్యేక టిక్కెట్ కొనుగోలు చేసి సురేంద్రపురిలో ఏర్పాటు చేసిన సకల దేవతలు కొలువైన మందిరాన్ని సందర్శించవచ్చు.కొలనుపాక సోమేశ్వరుడుయాదగిరిగుట్ట ఆలయానికి వచ్చిన భక్తులు ఆలేరు మండలం కొలనుపాకలోని జైన్ మందిరం, శ్రీసోమేశ్వర ఆలయాలను సందర్శించవచ్చు. యాదగిరిగుట్ట నుంచి కొలనుపాక 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జైన మందిరం, సోమేశ్వర ఆలయాలు నాటి కాకతీయులు, జైనులకు సంబంధించిన ఆనవాళ్లను గుర్తు చేస్తాయి.వేములకొండ మత్స్యగిరివలిగొండ మండలం వేములకొండ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం యాదగిరిగుట్ట నుంచి సుమారు 40 కిలోమీటర్లు ఉంటుంది. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి, సురేంద్రపురి, నాగిరెడ్డిపల్లిలోని శివాలయాన్ని సందర్శించిన భక్తులు వలిగొండ మీదుగా ఈ వేములకొండ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయంలోని కోనేరులో మీసాల ఉన్న చేపలు దర్శనమిస్తాయి. సాక్షతూ శ్రీస్వామి వారే మత్స్యవతారంలో కోనేరులో భక్తులకు దర్శనమిస్తున్నారని నమ్మకం.నాగిరెడ్డి పల్లి బంగారు శివయ్యభువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో బంగారు శివలింగం ఉన్న ఆలయం ఉంది. స్వచ్ఛమైన బంగారంతో మూడు అడుగుల శివలింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠించారు. యాదగిరిగుట్ట నుంచి ఈ ఆలయం 22 కిలోమీటర్ల దూరంలో ఉంది.– సేకరణ: కళ్లెం సంపత్, సాక్షి, యాదగిరిగుట్ట -
నీలి అలల మధ్య పచ్చని కల..
కొన్ని ప్రదేశాలు చూడటానికి వెళ్లాలి అనుకుంటాం. కొన్ని ప్రదేశాలు మాత్రం మనల్ని రారమ్మని పిలుస్తాయి. అలాంటి కోవలోకి చెందినదే ‘రాజా అంపట్’. ఇండోనేషియాలోని సౌత్వెస్ట్ పాపువాప్రాంతంలో ఉన్న ఈ ‘రాజా అంపట్’ అనేప్రాంతం వేలాది చిన్న ద్వీపాల సమూహం. ప్రకృతి తన అందం మొత్తం ఒక్కసారి చూపించాలి అనుకుంటే ఎలా ఉంటుందో ఇక్కడ కనులారా వీక్షించవచ్చు. పచ్చని అడవులు, నీలి సముద్రం, తెల్లని ఇసుక తీరాలు కలిసి ఒక చిత్రకారుడి కాన్వాస్లా కనిపిస్తాయి. ప్రతి ప్రయాణంలో ఒక కొత్త దృశ్యం, ప్రతి అలలో ఒక కొత్త అనుభవం నిండి ఉంటుంది.ఆసక్తికరమైన విషయాలు..రాజా అంపట్ అంటే ఇండోనేషియా భాషలో నలుగురు రాజులు అని అర్థం.ఇది ఇండోనేషియాలోని సౌత్వెస్ట్ పాపువాప్రాంతంలో ఉంటుంది.ఈప్రాంతం మొత్తం వేలాది చిన్న ద్వీపాలతో కలిసి ఉంటుంది.ప్రకృతి, సముద్ర జీవ వైవిధ్యం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.సముద్రం రంగుల మార్పులు ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన దృశ్యాల్లో ఒకటి.రాజా అంపట్ చేరగానే మనకు ముందు కనిపించేది విశాల సముద్రం. అక్కడి నీటి రంగుల్లో ఆకాశంలోని మబ్బుల కదలికలను స్పష్టంగా చూడవచ్చు. కొన్ని చోట్ల పచ్చగా, కొన్ని చోట్ల టార్కాయిస్, మరికొన్ని చోట్ల గాఢమైన నీలం. ద్వీపాల మధ్య వెళ్తున్న బోట్ ప్రయాణం ఒక సినిమా సీ¯Œ లా అనిపిస్తుంది. చుట్టూ చిన్న చిన్న లైమ్స్టోన్ ద్వీపాలు నీటి నుంచి వెలుస్తున్నట్టు ఉంటాయి. వాటిని చూస్తుంటే ప్రకృతి. సముద్రం మధ్యలో తన సంతకం పెట్టినట్టు అనిపిస్తుంది. అలలు మెల్లిగా బోట్ని తాకుతుంటే సమయం కూడా అక్కడ నిలిచిపోయిందేమో అనిపిస్తుంది.సందర్శనీయ ప్రదేశాలు..రాజా అంపట్లో ప్రతి ద్వీపం ఒక కొత్త కథ చెబుతుంది. ప్లేనెమో వ్యూ పాయింట్ నుంచి చూస్తే పచ్చని ద్వీపాలు నీలి సముద్రంపై విరిసిన ఆకుల్లా కనిపిస్తాయి. వాయాగ్ అనేప్రాంతంలో సముద్రం, ద్వీపాల మధ్య కనిపించే దృశ్యం ఒక కలలా ఉంటుంది. మిసూల్ దగ్గర నీటి కింద ఉన్న పగడపు దిబ్బల ప్రపంచం మరింత ఆకర్షిస్తుంది. సముద్రంపై చూస్తున్నప్పుడు ఒక అందం, నీటి కింద చూస్తున్నప్పుడు మరొక అందం కనిపిస్తుంది. కొన్ని చోట్ల సముద్రం అంతా స్పష్టంగా ఉంటుంది కాబట్టి బోట్ నుంచి కూడా నీటి కింద లైఫ్ ఎలా ఉందో కనిపిస్తుంది.ఎక్కడ ఉండాలి?రాజా అంపట్లో ఉండటం అంటే కేవలం రూమ్కి పరిమితం అవ్వడం మాత్రమే కాదు. సముద్రం దగ్గర కట్టిన వుడెన్ కాటేజీలు, నీటిపై నిలబెట్టిన విల్లాలు, అడవి మధ్య ఉన్న ఎకో రిసార్ట్స్ ప్రయాణాన్ని మరింత అందంగా మార్చేస్తాయి. ప్రతి ఉదయం అలల శబ్దాలతో మేలుకోవడం, సాయంత్రం సముద్రంపై పడిన సూర్యాస్తమయం చూస్తూ కూర్చోవడం అక్కడి రోజుల్లో భాగం అయిపోతుంది. నగర హడావిడి నుంచి దూరంగా ప్రకృతి మధ్య గడిపిన సమయం మనసుకి ఒక కొత్త ప్రశాంతతను ఇస్తుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి ప్రయాణం మొదలైతే ముందు ఇండోనేషియా రాజధాని జకార్తా లేదా బాలీ చేరుతారు. అక్కడి నుంచి పాపువాప్రాంతం వైపు విమానం వెళుతుంది. ప్రయాణంలో నగర దృశ్యాలు తగ్గి సముద్రం, ద్వీపాల ప్రపంచం మొదలవుతుంది.విజయవాడ నుంచి రాజా అంపట్ వెళ్లాలి అనుకుంటే హైదరాబాద్ లేదా చెన్నై నుంచి వెళ్లవచ్చు. ఫ్లైట్ ల్యాండింగ్ సమయంలో సముద్రం మధ్య చిన్న ఎయిర్పోర్ట్ చేరిన అనుభవమే యాత్రలో ఒక ప్రత్యేక జ్ఞాపకంగా మిగులుతుంది. ఆకాశం నుంచి కనిపించే ద్వీపాల దృశ్యం రాజా అంపట్ అందాన్ని ముందుగానే పరిచయం చేస్తుంది.ఏం చూడాలి?ఉదయం వేళలో సముద్రంపై పడిన సూర్యకిరణాలు రాజా అంపట్ని మరింత వెలుగులతో నింపేస్తాయి. బోట్లో ద్వీపాల మధ్య తిరుగుతుంటే ప్రతి మలుపు దగ్గర కొత్త దృశ్యం కనిపిస్తుంది. కొన్ని చోట్ల పక్షుల గానం వినిపిస్తుంది. మరికొన్ని చోట్ల సముద్రం శబ్దం మాత్రమే ఉంటుంది. నీటి కింద కనిపించే కోరల్ గార్డెన్స్, రంగురంగుల చేపలు, నిశ్చలంగా తిరిగే సముద్ర జీవులు అక్కడ ప్రకృతి వైభవాన్ని మరింత దగ్గర నుంచి చూపిస్తాయి. సూర్యాస్తమయం సమయంలో సముద్రంపై విరిసిన బంగారు వెలుగు ప్రయాణంలో మర్చిపోలేని క్షణంగా మిగిలిపోతుంది.ఏం తినాలి?ఇండోనేషియా రుచులను ఎంజాయ్ చేయడానికి రాజా అంపట్ మంచి చాయిస్ అని చెప్పవచ్చు. తాజా సీఫుడ్ సముద్రం దగ్గర కూర్చుని ఆస్వాదించే అనుభవం ప్రత్యేకం. కొబ్బరి ఫ్లేవర్స్, లోకల్ స్పైసెస్, సముద్రపు రుచులు కలిసిన భోజనం ప్రయాణంలో భాగం అయిపోతుంది. సాయంత్రం వేళలో సముద్రం ముందు కూర్చుని లోకల్ ఫిష్ కర్రీ, గ్రిల్డ్ సీఫుడ్ లేదా ఇండోనేషియన్ డిషెస్ ఆరగించడం అక్కడి జీవన శైలిని దగ్గరగా అనుభవించిన అనుభూతిని ఇస్తుంది.యాత్ర, బడ్జెట్ వివరాలుహైదరాబాద్ నుంచి రాజా అంపట్కి ఐదు రోజుల యాత్ర కోసం బడ్జెట్ రూ.90 వేల నుంచి రూ.1 లక్షా 20 వేల మధ్య ఉంటుంది. స్టాండర్డ్ కంఫర్ట్ యాత్ర రూ.1 లక్షా 40 వేల నుంచి రూ.2 లక్షల వరకు చేరవచ్చు.ప్రీమియం రిసార్టులు, ఎక్స్క్లూసివ్ ఐలాండ్ ఎక్స్పీరియెన్స్ యాడ్ చేస్తే రూ.2 లక్షల 50 వేల వరకు ఉండవచ్చు.స్టే చార్జీలు ప్రతి రాత్రికి రూ.4 వేల నుంచి రూ.25 వేల మధ్య ఉంటాయి. ఫుడ్ ఖర్చు రోజుకు సాధారణంగా రూ.1,000 నుంచి రూ.3,000 మధ్య ఉంటుంది. ఐలాండ్ హాపింగ్ బోట్ ఎక్స్పీరియెన్స్ మెరైన్ ఎక్స్΄్లోరేషన్ యాక్టివిటీస్ ఈ యాత్రలో ప్రత్యేక అనుభవంగా మిగిలిపోతాయి.ఇండోనేషియాకి భారతీయ ప్రయాణికులకు వీసా అవసరం ఉంటుంది. ట్రావెల్ ప్లాన్ ను బట్టి లేటెస్ట్ వీసా గైడ్లైన్స్ని ముందుగా పరిశీలించడం – ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు -
చాయ్-ఇడ్లీ కలిపి తినకూడదా..? కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఏమన్నారంటే..
దక్షిణ భారతదేశంలో చాలామందికి చాయ్ తోపాటు ఏదో ఒకటి ముంచుకునే తినే అలవాటు ఉంది. అలాంటి వాటిలో ఈ చాయ్ ఇడ్లీ కలిపి తినడం అనేది కూడా ఒకటి. అయితే ఇలా తినొచ్చా అంటే..ఇటీవల సోషల్ మీడియాలో చాయ్ ఇడ్లీ కాంబినేషన్ సూపర్ అంటూ పెట్టిన పోస్ట్ నెట్టింట హాట్టాపిక్గా మారి చర్చలకు తెరతీసింది. ఆ పోస్ట్పై సీనియర్ కాంగ్రెస్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ స్పందిస్తూ..ఆయన ఆ పోస్ట్లో షేర్ చేసిన ఫోటోలో.. చాయ్ ఇడ్లీ కనిపించిన విధం గురించి మాట్లాడారు. ఆ చిత్రంలో ఇడ్లీ పసుపు వర్ణంలో చాలా గట్టిగా ఉన్నట్లుగా కనిపిస్తుందన్నారు. "బహుశా అందుకే ఇలా చాయ్ ఇడ్లీ కాంబినేషన్ సూపర్ అంటున్నారేమె. మాములుగా ఆ ఇడ్లీని తినడం కష్టం..ఇలా గట్టిదైతే వేడివేడి చాయ్లో ముంచుకుంటే సులభంగా నోటిలో కరిగిపోతుంది. అందుకు ఇలా అభిప్రాయ పడి ఉండొచ్చు. కానీ ఇడ్లీ అనేది మల్లెపువ్వుతా స్పాంజ్లా ఉండాలి. అలాంటి ఇడ్డీని కచ్చితంగా చాయ్లో ముంచి తినడం అంత ఈజీ కాదు. ఆయన చివరికి చెప్పేందేంటంటే..ఆ రెండింటిని వేర్వేరుగా ఆస్వాదించడమే మంచిదన్నారు." ఇడ్లీని చాయ్లో ముంచడం కంటే ఇడ్లీ తినేశాక చాయ్ తీసుకుంటే బెటర్ అని అన్నారు. తాను బ్రేక్ఫాస్ట్ లేదా భోజనం చేశాకే టీ తాగడానికి ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. అలాగే తనకు చాయ్ అంటే మహా ఇష్టమని, ఇక అల్పాహారంలో ఇడ్లీ అంటే చాలా ఇష్టంగా తింటానని అన్నారు. నిపుణులు ఏం అంటున్నారంటే..టీ తాగేటప్పుడు తినే కొన్ని రకాల స్నాక్స్, ఆహారాల కాంబినేషన్ మంచిదికాదంటున్నారు. ముఖ్యంగా ఇడ్లీలు, బిస్కెట్ల కాంబినేషన్తో చాయ్ తాగడం అస్సలు మంచిది కాదనే చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా టీ కాంబినేషన్తో తింటే అరుగుదల,జీర్ణాశయం సంబంధిత సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అంతేగాదు కడుపు ఉబ్బరం, ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. పైగా మెటబాలిజం కూడా నెమ్మదించి అజీర్తి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇవే కాదు మరే ఇతర పోషకమైన వాటిని కూడా చాయ్ కాంబినేషన్తో వద్దనే అంటున్నారు. దానివల్ల ఆయా పోషకాలు శరీరానికి సరిగా అందవని అంటున్నారు. అందువల్ల కాస్త విరామం ఇచ్చి వేర్వేరుగా తీసుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.Oh, I see what you're doing here! Aside from provoking me, that is.I have to be honest: that idli looks a bit too solid and dense for my liking. And the discolouration in the pic is not very appetising. There’s something about a perfectly soft, snowy-white, fluffy idli that… https://t.co/O9GsGAGPa6— Shashi Tharoor (@ShashiTharoor) June 7, 2026 (చదవండి: 145 కేజీల నుంచి 90 కేజీలకు..! ఆ ఏడు ఆహారాలు..) -
తినే నూడుల్స్తో పేపర్.. జపాన్ శాస్త్రవేత్తల ఆవిష్కరణ
జపాన్లోని కగావా శాస్త్రవేత్తలు సరికొత్త విప్లవాత్మక సాంకేతికతకు తెరలేపారు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణానికి పెను సవాలుగా మారుతున్న ఆహార వ్యర్థాల సమస్యకు వినూత్న పరిష్కారాన్ని కనుగొన్నారు. హోటళ్లలో మిగిలిపోయి, పారేసే ‘ఉడాన్ నూడుల్స్’ తో పర్యావరణహిత, బయోడిగ్రేడబుల్ (జీవ విచ్ఛిన్నం చెందే) కాగితాన్ని తయారు చేసి అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి, వ్యర్థాలను అద్భుతమైన వనరుగా మార్చిన ఈ పరిశోధన వివరాలు ఇప్పుడు శాస్త్ర సాంకేతిక రంగంలో సంచలనంగా మారాయి.ప్రత్యేక నూడుల్స్.. పెరిగిపోతున్న వ్యర్థాలుజపాన్లోని కగావా ప్రిఫెక్చర్ ‘సానుకి ఉడాన్’ అనే ప్రాంతీయ నూడుల్స్కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుంది. ఈ రుచికరమైన వంటకాన్ని ఆస్వాదించడానికి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అయితే అంతే స్థాయిలో ఇక్కడ ఆహార వృథా కూడా జరుగుతోంది. స్థానిక రెస్టారెంట్లలో అమ్ముడుపోని నూడుల్స్, అలాగే ఉడకబెట్టిన తర్వాత ఎక్కువ సమయం ఉంచడం వల్ల రుచి కోల్పోయిన నూడుల్స్ను భారీ మొత్తంలో పారేయాల్సి వస్తోంది. ఈ తీవ్రమైన ఆహార వృథా సమస్యను అరికట్టాలనే లక్ష్యంతో పరిశోధకులు సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు.ప్రొఫెసర్ తనకా వినూత్న ఆలోచనకగావా యూనివర్సిటీ అగ్రికల్చర్ ఫ్యాకల్టీకి చెందిన ప్రొఫెసర్ నవోటాకా తనకా నేతృత్వంలో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. సూక్ష్మజీవులు, సెల్యులోజ్ ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాపై ఆయన చేసిన సుదీర్ఘ పరిశోధనల ఆధారంగా ఈ సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. ‘మా ప్రాంతంలో భారీ మొత్తంలో ఉడాన్ నూడుల్స్ వృథాగా పారేయడం నన్ను ఆలోచింపజేసింది. వీటిని రీసైకిల్ చేయడం ద్వారా ఆహార వ్యర్థాలను తగ్గించవచ్చని భావించాను’ అని ప్రొఫెసర్ తనకా తెలిపారు. నూడుల్స్ను చక్కెరగా మార్చే ప్రక్రియ చాలా సులభం కావడంతో ఆయన ఈ ఆలోచనను ఆచరణలో పెట్టారు.నూడుల్స్ నుండి కాగితం తయారీ ఇలా..సాధారణ కాగితం తయారీ పద్ధతులకు భిన్నంగా, ఈ ప్రక్రియలో అధునాతన జీవ సాంకేతికతను ఉపయోగించారు. మొదటగా మిగిలిపోయిన నూడుల్స్ను నీటితో కలిపి మిశ్రమంగా మారుస్తారు. ఆ తర్వాత, అందులోని పిండి పదార్ధాన్ని గ్లూకోజ్గా మార్చడానికి కొన్ని ప్రత్యేక ఎంజైమ్లను జోడిస్తారు. ఈ మిశ్రమానికి ఎసిటిక్ యాసిడ్ బ్యాక్టీరియాను చేర్చిన కొద్ది రోజుల్లోనే, ఆ మిశ్రమం పైభాగంలో బ్యాక్టీరియా ఒక సెల్యులోజ్ పొరను ఏర్పరుస్తుంది. ఆ పొరను జాగ్రత్తగా ట్రేలలో ఉంచి, సహజ గాలిలోనే ఆరబెట్టడం ద్వారా జపాన్ సాంప్రదాయ ‘వాషి’ కాగితం లాంటి పలచని షీట్లు సిద్ధమవుతాయి.అద్భుతమైన మన్నిక.. పర్యావరణానికి మేలుఒక్క ప్లేట్ ఉడాన్ నూడుల్స్ వ్యర్థాల నుండి దాదాపు 5 నుండి 10 వరకు ఏ4 సైజు కాగితాలను తయారు చేయవచ్చు. ప్రొఫెసర్ తనకా తెలిపిన వివరాల ప్రకారం ఈ మైక్రోబియల్ పేపర్ సాధారణ కాగితం కంటే చాలా తేలికగా ఉండటమే కాకుండా, నీటిని తట్టుకునే శక్తిని, మన్నికను కలిగి ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, వాడేసిన తర్వాత మట్టిలో పడేసినా, సూక్ష్మజీవుల సహాయంతో ఇది చాలా వేగంగా, సహజంగా కలిసిపోతుంది. నిజానికి ఈ సాంకేతికతను ప్రొఫెసర్ సుమారు 16 ఏళ్ల క్రితమే విద్యార్థులకు ప్రయోగపూర్వకంగా చూపించడానికి అభివృద్ధి చేయడం గమనార్హం.అడ్డంకులను అధిగమించి స్థిరమైన ఉత్పత్తి2020 సంవత్సరంలో, ఈ సాంకేతికతను స్థానిక సామాజిక సేవా సంస్థకు విశ్వవిద్యాలయం ఉచితంగా అందించింది. దీని ద్వారా వికలాంగులకు ఉపాధి అవకాశాలు లభించాయి. ప్రారంభంలో బ్యాక్టీరియా కాలుష్యం, బూజు పట్టడం వంటి అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ, ఉష్ణోగ్రత నియంత్రణ పెట్టెలను ఉపయోగించి నాణ్యమైన ఉత్పత్తిని సాధించారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో నెలకు సుమారు 100 కాగితపు షీట్లను తయారు చేస్తున్నారు. వీటిని విశ్వవిద్యాలయమే కొనుగోలు చేస్తోంది. తద్వారా రెస్టారెంట్లు, పరిశోధకులు, సామాజిక కార్యకర్తలతో కూడిన ఒక బలమైన స్థానిక రీసైక్లింగ్ నెట్వర్క్ ఏర్పడింది.భవిష్యత్ ప్రణాళికలు.. పరస్పర సహకారంఈ పర్యావరణహిత కాగితాన్ని ఇప్పటికే ప్రచార సామగ్రి, కళాఖండాల తయారీ కోసం ఉపయోగిస్తున్నారు. శాస్త్రవేత్తలు దీనిని నీటిలో కరిగిపోయే చేపల ఎరగా ఉపయోగించే అంశంపై కూడా పరిశోధనలు చేస్తున్నారు. మరోవైపు, నూడుల్స్ వ్యర్థాలను అందించే రెస్టారెంట్లకు విశ్వవిద్యాలయం ఒక ప్రత్యేక సహాయం చేస్తోంది. వాతావరణ మార్పులు, ఆహార వినియోగ అంచనాలకు సంబంధించిన డేటాను వారికి అందిస్తూ, ముందస్తుగా ఆహార వృథాను అరికట్టేలా ప్రోత్సహిస్తోంది. ఈ వినూత్న ప్రయోగం ప్రపంచవ్యాప్తంగా ఆహార వ్యర్థాల నిర్మూలనకు ఒక గొప్ప రోల్ మోడల్గా మారుతుందని ప్రొఫెసర్ తనకా ఆశాభావం వ్యక్తం చేశారు. -
145 కేజీల నుంచి 90 కేజీలకు..! ఆ ఏడు ఆహారాలు..
బరువు తగ్గడం అంటే కేలరీల లోటు, జిమ్లో ఎక్కువ గంటలు గడపడం వంటివి మాత్రమే అనుకుంటాం. కానీ దాంతోపాటు ఇతర మార్పులు కూడా తప్పనిసరి. ముఖ్యంగా జీవనశైలిలోని ఆహారపు అలవాట్లే అత్యంత ప్రధానం. తీసుకునే ఆహారం పోషకవంతమైనది, బరువు అదుపులో ఉంచేది తీసుకుంటే అద్భుతాలు సృష్టించొచ్చు అని అంటోంది ఈ ముంబై ఇన్ఫ్లుయెన్సర్. ఆమె ఒకప్పుడు ఏకంగా 145 కేజీల పైనే బరువు ఉండేదాన్ని అని తెలిపింది. ఇప్పుడు ఏకంగా 55 కేజీల బరువు తగ్గి నాజుగ్గా మారానని, అందుకోసం ఆ ఏడు ఆహారాలను తీసుకుంటున్నానంటూ తన వెయిట్లాస్ సీక్రెట్ని వెల్లడించారామె. మరి ఆ ఆహారాలేంటో సవివరంగా తెలుసుకుందామా..!.ముంబై ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ డాలీ సుమారు 145 నుంచి 90 కేజీ బరువు తగ్గేందుకు చేసిన ఆ ఏడు ఆహార మార్పుల గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఆ పోస్ట్లో తాను చేసిన ఈ ఆహారపు మార్పులు అదనపు కేలరీలను తగ్గించి..వేగంగా బరువు తగ్గేందుకు సహాయపడిందని నమ్మకంగా చెబుతోందామె. మరి అవేంటంటే..చక్కెర పానీయాలుడాలీ చక్కెర పానీయాలను పూర్తిగా దూరంగా ఉన్నట్లు తెలిపింది. ఈ చక్కెర పానీయాలను అధికంగా తీసుకోవడం వల్ల అధిక కేలరీలు శరీరంలోకి చేరి, బరువు పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. దానికి బదులుగా, తాను నిమ్మరసం, కొబ్బరి నీరు, చక్కెర లేని గ్రీన్ టీ వంటి ప్రత్యామ్నాయాలను తీసుకున్నట్లు డాలీ వెల్లడించింది. తెల్ల రొట్టె(మైదాతో చేసేవి)శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచి, అతిగా తినడానికి దారితీస్తుంది. కాబట్లి ఆమె తెల్ల రొట్టెను పూర్తిగా తగ్గించేసింది. దానికి బదులుగా ఆ ఇన్ఫ్లుయెన్సర్ గోధుమ రొట్టె, మల్టీగ్రెయిన్ బ్రెడ్, ఓట్స్ను తీసుకోవడం ప్రారంభించింది.చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్వాటిలో ఉప్పు, కేలరీలు అధికంగా ఉండటం వల్ల ఆమె చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్ తినడం మానేసినట్లు పేర్కొంది. దానికి బదులుగా ఆమె మితంగా వేయించిన మఖానా, వేయించిన శనగలు, నట్స్ను ఎంచుకుంది.ఫాస్ట్ ఫుడ్ఫాస్ట్ ఫుడ్లో కొవ్వు, ఉప్పు, కేలరీలు అధికంగా ఉండటం వల్ల దానిని పూర్తిగా తగ్గించేసింది. దానికి బదులుగా డాలీ పనీర్ శాండ్విచ్లు, గోధుమ కూరగాయల ర్యాప్లు లేదా ఇంట్లో తయారుచేసిన భోజనం వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకుందామె.ఐస్ క్రీమ్ఐస్ క్రీమ్లో తరచుగా చక్కెర,కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానిని తన ఆహారం నుంచి తొలగించింది. గ్రీక్ యోగర్ట్, పండ్లు, ఫ్రోజెన్ బనానా స్మూతీలు లేదా చిన్న మొత్తంలో డార్క్ చాక్లెట్ తినడం ద్వారా ఆమె తన కోరికలను నియంత్రించుకుంది.మద్యంమద్యపానం డీహైడ్రేషన్కు, ముఖం ఉబ్బడానికి కారణమవుతుందని అందుకే తాను దానిని పూర్తిగా మానేసినట్లు తెలిపింది డాలీ. నిమ్మరసం కలిపిన సోడా నీరు, చక్కెర కలపని తాజా పండ్ల రసం, డిటాక్స్ వాటర్ ఆమె ఇష్టపడే ప్రత్యామ్నాయాలుగా మారాయి.ప్రాసెస్ చేసిన ఆహారాలుప్రాసెస్ చేసిన ఆహారాలలో తరచుగా సోడియం సంకలితాలు అధికంగా ఉంటాయి కాబట్టి వాటిని మానేశారు. దానికి బదులుగా, ఆమె గుడ్లు, టోఫు, పనీర్, పెరుగు, పప్పుధాన్యాలు, మొక్కల ఆధారిత ప్రోటీన్ వంటి సహజమైన ఆహార వనరులపై దృష్టి సారించింది.పైన చెప్పిన ఈ ఆహార పదార్థాలను పూర్తిగా తగ్గించి.. ఎక్కువ నీరు తీసుకుంటూ.. బాగా నిద్రపోండి. అలాగే మీరు నిర్దేశించుకున్న డైట్ క్రమం తప్పకుండా ఉండేలా చూసుకోమని సూచిస్తోంది. ఇలా చేస్తే కచ్చితంగా శరీరం వేగంగా నాజూకుగా మారుతుందంటూ తన పోస్ట్ని ముగించింది డాలీ.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: ఒక్క ఏడాదిలో 35 కిలోలు..!ఆ ఆరుబోరింగ్ అలవాట్లు..) -
ఇదొక సముద్రపు వాక్యూమ్ క్లీనర్!
సముద్రంలో నివసించే ఈ జీవిపేరు వాంపైర్. అంటే రక్తం తాగే దెయ్యం అని అర్థం. దీని పేరు వినడానికి కాస్త భయంగా ఉన్నా, ఇది చాలా చిన్నది, సాధుజీవి.ఈ స్క్విడ్ చూడటానికి ఎరుపు రంగులో, దాని చేతుల మధ్య ఉండే చర్మం నల్లటి ముసుగులా ఉండటం వల్ల దీనికి ఆ పేరు పెట్టారు. ఇది సముద్రంలో చాలా లోతుగా, సూర్యరశ్మి అస్సలు పడని చీకటి ప్రదేశంలో బతుకుతుంది. అక్కడ శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఇది తన శరీరం నుంచి నీలి రంగు వెలుతురును విడుదల చేస్తుంది.ఆ వెలుతురు చూసి వేరే పెద్ద చేపలు భయపడి ΄ారి΄ోతాయి. మిగతా స్క్విడ్లు చిన్న చిన్న చేపలను వేటాడి తింటాయి. కానీ మన వాంపైర్ స్క్విడ్ మాత్రం వేటాడదు. సముద్రం పైభాగం నుంచి కిందికి కొట్టుకు΄ోయే చని΄ోయిన చిన్న జీవుల ముక్కలు, మురికి వంటి వాటిని తింటుంది. అంటే ఇది సముద్రాన్ని శుభ్రం చేసే వాక్యూమ్ క్లీనర్ అన్నమాట! నిర్వహణ : రమాదేవి జంబుల -
పుట్టినపుడు పెన్సిల్ పరిమాణంలోనే!
జైంట్ పాండాలను సాధారణంగా పాండాలు అని కూడా పిలుస్తారు. ఇవి అడవులలో, ముఖ్యంగా మధ్య చైనాలోని ఎత్తైన పర్వతాలలో ఉండే దట్టమైన వెదురు అడవులలో కనిపిస్తాయి.పాండాలు అప్పుడప్పుడు చిన్న జంతువులను, చేపలను తిన్నప్పటికీ... ముఖ్యంగా వీటి ఆహారంలో 99 శాతం వెదురు మాత్రమే ఉంటుంది.పాండాలు చాలా ఎక్కువగా తింటాయి. ఎంతగా అంటే ప్రతిరోజూ దాదాపు 12 గంటల ΄ాటు తమ పొట్టలను నింపుకుంటూ, సుమారు 12 కిలోల వెదురును తింటాయి!పాండాలు 1.2 మీటర్ల నుంచి 1.5 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఇవి 75 కేజీల నుంచి 135 కేజీల బరువు ఉంటాయి.పాండా పిల్లలు పుట్టినప్పుడు గులాబీ రంగులో ఉండి కేవలం 15 సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉంటాయి. అంటే దాదాపు ఒక పెన్సిల్ పరిమాణంలో ఉంటాయి! ఇవి పుట్టినప్పుడు గుడ్డిగా ఉంటాయి, పుట్టిన ఆరు నుంచి ఎనిమిది వారాల తర్వాతే కళ్ళు తెరుస్తాయి. -
క్యూఆర్ కోడ్ అంటే ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా?
పిల్లలూ! నేడు చిన్న కిరాణా కొట్టు నుంచి పెద్ద మాల్స్ వరకు ఎక్కడ చూసినా డిజిటల్ చెల్లింపుల కోసం క్యూఆర్ కోడ్ తప్పనిసరి అయిపోయింది. అసలు ఆ క్యూఆర్ కోడ్ అంటే ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా? ఎలా పనిచేస్తుందో తెలుసా? ఇది చదివేయండి. క్యూఆర్ అంటే క్విక్ రెస్పాన్స్. అంటే త్వరగా స్పందించడం అని అర్థం. మనం ఏ క్యూఆర్ కోడ్ను గమనించినా, దాని మూడు మూలల్లో పెద్ద నల్లటి బాక్సులు కనిపిస్తాయి. ఇవి డిజైన్ కోసం పెట్టినవి కావు. మనం మొబైల్ ఫోన్ ను ఏ యాంగిల్లో పెట్టి స్కాన్ చేసినా, కెమెరా ఆ కోడ్ను వెంటనే గుర్తించడానికి ఈ మూడు బాక్సులు ఎంతగానో సహాయపడతాయి.అలాగే క్యూఆర్ కోడ్ మధ్యలో వేల కొద్దీ చిన్న చిన్న నల్లటి, తెల్లటి చుక్కలు ఉంటాయి. ఆ కోడ్ను స్కాన్ చేసినప్పుడు, ఆ నలుపు–తెలుపు చుక్కలను ‘1’లు ‘0’లుగా మన ఫోన్ కెమెరా చదువుతుంది. దానినే బైనరీ డేటా అని పిలుస్తారు. అలా చదివిన సమాచారాన్ని క్షణాల వ్యవధిలో మనకు అవసరమైన డేటాగా లేదా చెల్లింపు లింక్గా మార్చేస్తుంది.ఈ అద్భుతమైన సాంకేతికతను మొదటగా 1994లో జపాన్ లోని ఒక ప్రముఖ కంపెనీ కనిపెట్టింది. తమ కార్ల విడిభాగాలను ట్రాక్ చేయడం కోసం ఈ క్యూఆర్ కోడ్ టెక్నాలజీని తీసుకొచ్చింది. అలా వచ్చిన ఈ సాంకేతికతనేడు ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయల డిజిటల్ ట్రాన్సక్షన్లలో, వ్యాపారాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. -
పప్పు కూర
చెన్నైకి చెందిన ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ప్రతి శనివారం తిరుమలకి వచ్చి వెళ్ళడం అలవాటు. ఉదయమే చెన్నై నుంచి కారులో బయలుదేరి కొండకు చేరేవాడు. కొండ దిగేంత వరకు పచ్చి మంచి నీళ్ళు కూడా తాగేవాడు కాడు. కుదిరితే స్వామివారి దర్శనం చేసుకునే వాడు. కుదరకపోతే ప్రశాంతంగా గుడి ముందర కూర్చునేవాడు. పుష్కరిణి దగ్గరకు వెళ్ళి తలమీద నీళ్ళు చల్లుకునే వాడు. వరాహస్వామి దర్శనం చేసుకునే వాడు. ఆపైన బేడి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నిలబడి ఆలయ గోపురానికి నమస్కరించే వాడు. కర్పూర హారతి ఇచ్చి కొండ దిగేసే వాడు. తిరుపతిలో అతడికి పిల్లనిచ్చిన అత్తగారు ఉన్నారు. కొండ దిగిన ప్రతిసారీ అత్తగారి ఇంటికి వెళ్లి ఆమె బాగోగులు తెలుసుకునేవాడు. అల్లుడు వచ్చిన ప్రతిసారీ ఇంటి పెరట్లో ఉన్న అరటి చెట్టులోని కొన ఆకు కోసి తను చేసిన వేడి వేడి వంటలు వడ్డించేది. పచ్చటి అరిటాకులో పప్పుకూర వడ్డించేది. ఘుమఘుమలాడే నెయ్యి కూడా వేసేది. వెళ్ళిన ప్రతిసారీ ఆమె పప్పుకూరే చేసేది. ఎందుకంటే ఆమె పప్పు కూర మాత్రమే బాగా చేయగలదు. ఎంతో రుచిగా ఉన్నప్పటికీ వారం వారం పప్పుకూర తినలేక అల్లుడికి విసుగు వచ్చింది. ఒకరోజు ఏడుపు ముఖం పెట్టి ‘‘అత్తా, ఎప్పుడూ పప్పు కూరేనా? తినాలంటే మొహం మొత్తుతోంది’’ అన్నాడు. ఆమె నవ్వింది.‘‘అల్లుడూ... పప్పుకూర సరే, పదేళ్ళుగా తిరుమల వచ్చి వెళ్తున్నావు. గుడిలోని స్వామి అప్పుడూ, ఇప్పుడూ ఒక్కరే కదా... ఏ మాత్రం మార్పు లేదు కదా, నీకెప్పుడూ స్వామిని ‘చూసింది చాల్లే’ అనిపించలేదా?’’ అని అడిగింది.అతడు నవ్వాడు.‘‘స్వామిని చూడటం ‘చాలు’ అనిపించదత్తా. స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని ఎన్నిసార్లు దర్శించినా తనివి తీరదు. కొండకి వచ్చిన ప్రతిసారీ దర్శనం చేసుకుని బంగారు వాకిలి దాటి వచ్చేలోగా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఏమిటో ఈ మాయ’’ అంటూ చేయి కడిగాడు. అత్త తాను చేసిన పప్పు కూర కొద్దిగా గిన్నెలో పెట్టి కూతురికిమ్మనిచెప్పింది. అలాగేనని తల ఊపి ‘రాకుండా ఉండలేను నీ కొండకు... చూడకుండా ఉండలేను ఏ నాటికీ’ అని పాడుకుంటూ చెన్నైకి బయలుదేరాడు. ఆ రోజునుంచి అత్త ముందు పప్పు కూర మాట ఎత్తలేదు అల్లుడు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
అమాయకత్వంలో ఆధ్యాత్మికత
పసిప్రాయం ఒక తెల్ల కాగితం లాంటిది. వారు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తూ, అనుకరిస్తూ ఎన్నో విషయాలను నేర్చుకుంటారు. వారి చిన్ని చిన్ని ప్రశ్నలు మనల్ని ఆలోచింపజేస్తాయి. అయితే పిల్లల నుంచి పెద్దలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. పసిపిల్లలకు ‘నేను, నాది’ అనే అహంకారం ఉండదు. వారు తమను తాము ప్రత్యేకంగా చూసుకోరు. ప్రకృతిలో, అందరిలో కలిసిపోతారు. ఈ నిర్మలత్వమే వారిని దైవస్వరూపులుగా చేస్తుంది.గత జ్ఞాపకాల్లో లేదా భవిష్యత్తు ఆందోళనల్లో కాకుండా, ప్రస్తుత క్షణంలో ఉండటం పసిపిల్లల లక్షణం. వారు గడిచిన నిమిషం గురించి బాధపడరు, రేపటి గురించి భయం చెందరు. ఈ ‘స్థితప్రజ్ఞత’ వారికి దైవికమైన ఆనందాన్ని ఇస్తుంది. కోపాన్ని మనసులో పెట్టుకోకుండా ఉండటం. రేపటి చింత లేకుండా ఈ క్షణాన్ని ఆస్వాదించడం. మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం పిల్లల మనస్తత్వం. ఆధ్యాత్మిక పరిభాషలో ఆత్మలక్షణం ’సత్–చిత్–ఆనందం’. పిల్లల ప్రతి చర్యలోనూ ఒక చైతన్యం, ఒక సహజ సిద్ధమైన ఆనందం కనిపిస్తుంది. వారిని చూసినప్పుడు మనసు ప్రశాంతంగా మారడానికి కారణం వారిలో ప్రతిబింబించే ఆ పరమాత్మ తత్వమే. పిల్లల ప్రేమలో ఎటువంటి ఆశలు, నిబంధనలు ఉండవు. వారు కేవలం ప్రేమించడం మాత్రమే తెలుసు. భగవంతుడు కూడా అటువంటి నిష్కల్మషమైన ప్రేమకే లొంగుతాడని మన పురాణాలు చెబుతున్నాయి. మనం మనలోని బాల్యాన్ని మర్చిపోవడం వల్లే ఒత్తిడికి, అసూయకు లోనవుతున్నాం. ఆధ్యాత్మిక సాధన అంటే కొత్తగా ఏదో సంపాదించడం కాదు, మళ్ళీ పసిపిల్లవాడిలా నిర్మలమైన మనసును పొందడమేనని పెద్దలు చెబుతుంటారు. మనలోని ఆ ‘బాల్యాన్ని’ మేల్కొల్పడమే నిజమైన ఆత్మసాక్షాత్కారం. అందుకే ఆధ్యాత్మికవేత్తలు‘ మళ్ళీ ఒక బిడ్డలా మారిపొమ్మని చెబుతుంటారు.మనిషి ఎదుగుతున్న కొద్దీ అనుభవాలు, పంతాలు, పట్టింపులు, సమాజం నేర్పిన ముసుగులు ఒకదానిపై ఒకటి పేరుకుపోతాయి. ఆత్మసాక్షాత్కారం అంటే ఏదో కొత్త విషయాన్ని నేర్చుకోవడం కాదు, మనపై పేరుకున్న ఈ కృత్రిమ పొరలను తొలగించుకుని, మన లోపల అంతర్లీనంగా ఉన్న ఆ పసిబిడ్డ వంటి స్వచ్ఛతను తిరిగి దర్శించడమే.పిల్లలు దేవుడిచ్చిన వరాలు. పిల్లల కళ్ళలో కనిపించే మెరుపు కోటి వెలుగులతో సమానం. వారికి ఆస్తిపాస్తులతో సంబంధం లేదు. ఒక చిన్న రంగుల బంతి లేదా వాన చినుకు వారిని పరవశానికి గురిచేస్తుంది. వారి ప్రపంచంలో ప్రతి వస్తువు ఒక వింతే, ప్రతిరోజూ ఒక పండుగే. ఒక ఖాళీ అట్టపెట్టె వారికి విమానం కావచ్చు, ఒక చిన్న కర్ర గుర్రం కావచ్చు. పిల్లలు తమ ఊహలతో ఒక మాయా లోకాన్ని సృష్టించుకుంటారు. అక్కడ బొమ్మలు మాట్లాడతాయి, చెట్లు కథలు చెబుతాయి. పిల్లలకు కులమతాలు, పేద– ధనిక భేదాలు తెలియవు. తోటిచిన్నారి నవ్వితే వీరు నవ్వుతారు, ఏడిస్తే పలకరిస్తారు. క్షణంలో గొడవపడినా, మరుక్షణమే మర్చిపోయి మళ్ళీ ఆడుకునే గుణం కేవలం వారి పసిడి మనసులకే సొంతం. వారి పసిడి ప్రపంచాన్ని ప్రేమతో, భద్రతతో కాపాడుకోవడం మన అందరి బాధ్యత. వారి చిరునవ్వు ఇంట్లో ఉంటే, ఆ ఇల్లే ఒక నందనవనం. – తరిగొప్పుల వీఎల్లెన్ మూర్తి -
చెడు స్నేహానికి ప్రతీక శకుని
మహాభారతయుద్ధంలో శకుని పాత్ర గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. దుష్టచతుష్టయంలో ఒకరుగా పేరుగాంచి, కౌరవులకు మేనమామగా, వారిలో యువరాజైన దుర్యోధనునికి ప్రధాన సలహాదారుగా వ్యవహరించి అన్నీ తప్పుడు సలహాలు, సూచనలిచ్చి కౌరవులకు కీడు తలపెట్టడంతో, పాండవులకు మేలు జరిగేది. శకుని ఉద్దేశ్యం కూడా ఇదే. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కాంధహార్ ఆనాటి గాంధార దేశం. గాంధారదేశపు రాజు సుబలుడు, రాణి సుధర్మల కుమారుడే శకుని. సుబలునికి వందమంది కుమారులు, గాంధారి అనే కుమార్తె ఉన్నారు. అందరిలో ఆఖరివాడే శకుని. ఇతని అసలు పేరు సుబలోత్తముడు. అపారమైన తెలివితేటలు కల్గిన, శకుని ‘చౌసర్’ అనే మాయా జూదపు ఆటలో మంచి నేర్పరి. శకుని ప్రాణప్రదంగా అభిమానించే తన సోదరి గాంధారిని, కౌరవ సామ్రాజ్యాధీశుడు, పుట్టుకతోనే అంధుడైన ధృతరాష్ట్రుడికి పట్టమహిషిగా చేయాలని భీష్ముడు భావించాడు. అయితే జాతకం ప్రకారం గాంధారికి వైధవ్య యోగం ఉందని తెలిసిన శకుని తన సోదరి అంటే ఉన్న వల్లమాలిన అభిమానంతో, ఈ విపత్తు నుంచి తప్పించాలనే ఉద్దేశ్యంతో, జ్యోతిష్యుల సూచనలు, సలహాల మేరకు గాంధారికి మొదటగా ఓ మేకతో వివాహం జరిపించి, అనంతరం ఆ మేకను బలిచ్చి ఆపై ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేస్తే ఆ దోష పరిహారం అవుతుందని ఆ విధంగా చేశాడు. వివాహానంతరం ఈ విషయం తెలుసుకున్న ధృతరాష్ట్రుడు ఆగ్రహం చెంది సుబలుని కుటుంబాన్ని చెరశాలలో బంధించి, మరణించే వరకు చిత్రహింసలకు గురి చేయాలని ఆదేశించాడు. చెరసాలలో ఉన్న సుబలుని కుటుంబానికి ఇచ్చే ఆహారం ఒక్కరికి మాత్రమే సరిపోయేది. మిగిలిన సోదరులు ఆహారాన్ని తమలో తెలివైన, ఆఖరి సోదరుడైన శకునికే పెట్టి ఎలాగైనా కౌరవులపై పగ తీర్చుకోవాలని ప్రమాణం చేయించుకున్నారు. అనంతరం క్షుద్బాధతో తండ్రి, ఒక్కొక్క సోదరుడు మృతి చెందారు. తన తండ్రి మరణానంతరం అతని తొడ ఎముకతో తయారైన పాచికలను వినియోగిస్తూ, తాను అనుకున్న సంఖ్య పడేలా శకుని వరం పొందాడు. ఆ పాచికలతో శకుని మాయాజూదం ఆడి మోసపూరితంగా పాండవులను ఓడించి, కౌరవులచే మరిన్ని అన్యాయాలు, అక్రమాలు చేయిస్తూ మహాభారత యుద్ధం జరిగేలా పథకం రచించి కౌరవవంశాన్ని నాశనం చేసాడు. అయితే మహాభారత యుద్ధంలో ఆఖరిరోజున (18వ రోజు)సహదేవుని చేతిలో శకుని మరణించాడు. ఇదిలావుండగా శకునికి కూడా గుడి ఉంది. కేరళ రాష్ట్రం కొల్లాం జిల్లాలోని పవిత్రేశ్వరం వద్ద శకునికి ఆలయం నిర్మించారు అక్కడి కురువర్ తెగ ప్రజలు. అయితే అక్కడ ఏ విధమైన శకుని విగ్రహం ఉండదు.– సి.ఎన్. మూర్తిసీనియర్ పాత్రికేయులు -
సరదాగా ఈ ఆదివారం ఈ వెరైటీ స్నాక్స్ చేసేయండిలా..!
గుజరాతీ ఖాండ్వీకావలసినవి: శనగపిండి – కప్పు, కారం పొడి – 1/4 టీస్పూన్, ఉప్పు – 1/2 టీస్పూన్, ఇంగువ – చిటికెడు, పెరుగు – 1 కప్పు, నీళ్లు – 2 కప్పులు, నూనె – 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు – 1 టీస్పూన్, నువ్వులు – 1 టీస్పూన్, పచ్చిమిర్చి – 2 (సన్నగా తరిగినవి), కరివేపాకు – కొన్ని, గార్నిషింగ్ కోసం: పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర (సన్నగా తరిగినది) తయారీ: ముందుగా ఒక గిన్నెలో శనగపిండి, కారం, ఉప్పు, చిటికెడు ఇంగువ, కప్పు పెరుగు తీసుకుని ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి, మజ్జిగలా పల్చగా కలుపుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ఒక పెద్ద కడాయిలోకి పోసి, స్టవ్ మీద సన్నని మంటపై పెట్టి అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. ఇది రిబ్బన్ లాగా జారుడుగా వచ్చేంత వరకు ఉడికించాలి. ఒక గరిటెడు ఉడికిన శనగపిండి మిశ్రమాన్ని తీసుకుని, వెంటనే ఒక ప్లేట్ వెనుక భాగంలో సాధ్యమైనంత పల్చగా పరచాలి. ఇలా పరిచిన మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత, దానిని రెండు ఇంచుల వెడల్పు ఉన్న ముక్కలుగా నిలువుగా కట్ చేసి, ఎక్కడా విరిగిపోకుండా జాగ్రత్తగా గట్టిగా రోల్ చేసుకోవాలి. ఆ తరువాత ఒక చిన్న బాణలిలో నూనె వేడి చేసి అందులో టీస్పూన్ ఆవాలు, టీస్పూన్ నువ్వులు, తరిగిన పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి. పోపు వేగాక, దానిని తయారు చేసి పెట్టుకున్న ఖాండ్వీ రోల్స్పైన సమానంగా పోయాలి. ఆపై పైన పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన ఖాండ్వీని వేడి వేడి చాయ్ తో కలిపి ఆస్వాదించడమే!ఆలూ అండా కుర్మాకావలసినవి: ఉడకబెట్టిన కోడిగుడ్లు – 4, బంగాళదుంపలు – 2 (పొట్టు తీసి, ముక్కలుగా కోసుకున్నవి), నూనె లేదా నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు, గ్రేవీ కోసం: ఉల్లిపాయ – పెద్దది (సన్నగా తరిగినది లేదా పేస్ట్), అల్లం వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్, టొమాటోలు – 2 (ప్యూరీ లేదా సన్నగా తరిగినవి), పచ్చిమిర్చి – 3 (నిలువుగా చీల్చినవి), జీలకర్ర – టీస్పూన్, కారం పొడి – టీస్పూన్, పసుపు – 1/2 టీస్పూన్, ధనియాల పొడి – టీస్పూన్, గరం మసాలా పొడి – 1/2 టీస్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, గార్నిషింగ్ కోసం– సన్నగా తరిగిన కొత్తిమీర. తయారీ: ఉడకబెట్టిన కోడిగుడ్లకు ఒక ఫోర్క్ లేదా టూత్పిక్తో అక్కడక్కడా చిన్న గాట్లు పెట్టండి. ఇప్పుడు ఒక బాణలిలో ఒక స్పూన్ నూనె వేసి వేడి చేయండి. అందులో చిటికెడు పసుపు, కొద్దిగా కారం వేయండి. ఇందులో ఉడకబెట్టిన గుడ్లను వేసి 2–3 నిమిషాల పాటు పైన లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి, పక్కన తీసి పెట్టుకోండి. అదే నూనెలో బంగాళదుంప ముక్కలను కూడా వేసి, అంచులు కొద్దిగా వేగే వరకు 3–4 నిమిషాలు వేయించి, పక్కన పెట్టుకోండి. అదే బాణలిలో మిగిలిన రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. నూనె కాగాక జీలకర్ర వేసి చిటపటలాడించండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, దోరగా వేయించండి. ఇప్పుడు అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి. ఆ తర్వాత టొమాటో ప్యూరీ, కారం, పసుపు, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుతూ నూనె పైకి తేలేంత వరకు దీనిని ఉడికించాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను ఈ మసాలాలో వేసి, మసాలా అంతా ముక్కలకు పట్టేలా రెండు నిమిషాలు కలపండి. ఆ తర్వాత గ్రేవీకి సరిపడా 2 కప్పుల గోరువెచ్చని నీళ్లు పోయండి. నీళ్లు మరగడం ప్రారంభమయ్యాక, బాణలిపై మూత పెట్టి, మంటను మీడియమ్లో ఉంచి బంగాళదుంపలు మెత్తగా ఉడికించండి. బంగాళదుంపలు ఉడికిన తర్వాత, ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను, చీల్చిన పచ్చిమిర్చిని గ్రేవీలో వేయండి. సన్నని మంట మీద మరో 3–4 నిమిషాలు ఉంచండి, దీనివల్ల గుడ్లు గ్రేవీని బాగా పీల్చుకుంటాయి. చివరగా గరం మసాలా పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే ఎంతో రుచికరమైన వేడి వేడి ఆలూ అండా కుర్మా రెడీ! ఇది వేడి వేడి రోటీలు, చపాతీలు లేదా అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. (చదవండి: హ్యాట్సాఫ్ సార్..! భలే గుణపాఠం చెప్పారు..) -
హ్యాట్సాఫ్ సార్..! భలే గుణపాఠం చెప్పారు..
రోడ్ల మీద ప్రయాణికులు ఏ విధంగా ప్రవర్తిస్తారో తెలిసిందే. కనీసం బస్తాప్ వద్ద కూడా రయ్ రయ్ అంటూ వెళ్లిపోవడమే. ప్రయాణికులు బస్సలు ఎక్కనివ్వరు, కనీసం ఫుట్పాత్పై నిలబడనివ్వరు. అలాంటి టూ వీలర్ ప్రయాణికులకు ఇక్కడొక పోలీసు అధికారి భలే గుణపాఠం చెప్పాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో ఆ అధికారిపై ప్రశంసల జల్లు వెల్లువెత్తింది. ఆ వీడియోలో పోలీసు అధికారి రద్దీగా ఉన్న రోడ్డుపై వెళ్తుండగా..ట్రాఫిక్ జామ్ను దాటాలనే ఉద్దేశ్యంతో ప్రయాణికులు ఎలా మాములు ఫుట్పాత్పై వాహానాలు నడుపుతున్నారో స్పష్టంగా కనిపిస్తుంది. అది చూసిన ఈ పోలీసు అధికారి వెంటనే కొద్ది దూరం ప్రయాణించి ఫుట్పాత్పై బైక్తో సహా అడ్డంగా నిలబడతాడు. దీంతో రాంగ్రూట్లో వస్తున్న ఆ టూవీలర్ ప్రయాణికులు కాస్తా వెనుదిరిగి వెళ్లడం తప్ప మరో మార్గం లేకుండాపోయింది. దాంతో నెటిజన్లు ఏం ధైర్యం సార్ అంటూ ఆ పోలీసు అధికారిని అభినందించగా, మరికొందరు హ్యాట్సాప్ సార్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by COP NAVEEN (@cop_naveensingh) (చదవండి: భారత్ని విడిచి వెళ్తున్న ప్రతిసారి గుండె పగిలిపోతోంది ..!) -
జస్ట్ ఏడాదికే 35 కిలోలు..! ఆ ఆరు బోరింగ్ అలవాట్లు..
బరువు తగ్గే జర్నీలు ఇప్పటి వరకు వర్కౌట్లు, పక్కా ప్లాన్తో నిలకడగ చేసి.. స్లిమ్గా మారిన వారి గురించి విన్నాం. అలా కాకుండా ఈ మహిళ వెరైటీగా రోజువారీ జీవితంలో భాగమైన బోరింగ్ అలవాట్లతో బరువు తగ్గింగిదట. సంక్లిష్టమైన డైట్, వర్కౌట్లు లేకుండా.. సింపుల్గా చేసేవి, మన రోజువారి కొన్ని రకాల అలవాట్లకే దూరంగా ఉంటే బరువు తగ్గడం సులభం అంటోంది ఆ మహిళ. మరి అదెలాగో ఆమె మాటల్లోనే తెలుసుకుందామా.!షావీ అనే మహిళ తాను కేవలం 12 నెలల్లో 35 కిలోలు తగ్గానంటూ..తనకు ఉపకరించిన ఆరు ప్రభావవంతమైన జీవనశైలి మార్పులను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తన రోజువారీ క్రమశిక్షణలో పాతుకుపోయిన సరళమైన, స్థిరమైన అలవాట్లు తన బరువు తగ్గే ప్రయాణంలో ఎలా కీలక పాత్ర పోషించాయో సవివరంగా వెల్లడించారామె.డైనింగ్ టేబుల్ వద్ద కుటుంబంతో కలిసి రాత్రి భోజనం చేయకపోవడంఇది తాను బరువు తగ్గే దశలో చేసిన తాత్కాలిక మార్పుగా షావీ పేర్కొంది. కుటుంబంతో ఉంటే తన డైట్ గురించి చేసే వ్యాఖ్యలు బరువు తగ్గడంపై ఫోకస్ని దూరం చేస్తాయని ఈ మార్పు చేసినట్లు వివరించారామె. అందుకే తాను వారితో కలిసి తినడం మానేశానని అన్నారామె. తనకు, ఇది కుటుంబం నుంచి భావోద్వేగపరంగా దూరం కావడం గురించి కాదని పేర్కొంది.రాత్రి భోజనం చేసిన వెంటనే బ్రష్ చేయడంఆ రోజుకు తినడం అధికారికంగా ముగిసిందని తన మెదడుకు అది ఒక అధికారిక 'షట్ డౌన్' లాంటిది," అని ఆమె అంటోంది. నియంత్రణ కోల్పోయి, మళ్ళీ తినేసిన రోజుల్లో, తాను మరోసారి బ్రష్ చేసుకునేదాన్నని షావీ చెబుతుంది. ఆ చిన్న చర్య తన మనసులో ఒక హద్దును సృష్టించి.. వంటగది క్లోజ్ అయ్యిందని చెబుతుండేదని అన్నారామె.స్క్రీన్ లేకుండా ఎక్కువగా తినే అలవాటును పాటించడంఇలా చేస్తే ఎక్కువగా తినం, పైగా తింటున్న ఆహారంపై అటెన్షన్ ఉంటుందని అంటోంది. ఎప్పుడైనా ఎక్కువగా తినాలనిపిస్తే, ఏ స్క్రీన్ లేకుండానే పూర్తి చేస్తానని అంటోంది.ఎక్కువగా తినడాన్ని రేపటికి వాయిదా వేయడంనియంత్రణకు బదులుగా, పోస్ట్పోన్ చేయడం ఒక సాధనంగా మారుతుంది. ‘నేను దీన్ని రేపు తినగలను’ అని చెప్పుకుంటూ ఉంటే.. ఎప్పుడోకప్పుడూ తింటాననే సంతృప్తి అతిగా తినడాన్ని నియంత్రణలో ఉంచుతుందని అంటున్నారు.ఫ్రిజ్లో ప్రోటీన్ను కనిపించేలా ఉంచడంతినే ఆహారం కంటికి కనిపించే చేరువలో పెడితే..అవి తీసుకోవాలనే స్పృహ ఉంటుందని అంటోంది. అందుకే వేయించిన శనగలు, సోయా, పనీర్, ఉడికించిన గుడ్లు, చీజ్, ఇవి ఎప్పుడూ కంటికి కనిపించేలా పెట్టుకునేదాన్ని అని చెబుతున్నారామె.ఫుడ్ రీల్స్కి దూరంగా ఉండటం..కంటెంట్ వినియోగానికి, తినాలనే కోరికలకు మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని వివరించింది షావీ. రోజంతా బ్రెయిన్కి ఆహార సంబంధిత కంటెంట్ను అందించడం ఆపేసినప్పుడు, తినాలనే కోరికలు చాలా వరకు తగ్గుతాయని అంటోంది. మనం ఏం చూస్తామో అదే తినాలని అనుకుంటామని అని చెబుతోంది షావీ. వినడానికి విచిత్రంగా ఉన్నా..కష్టంగా లేకుండా ఆచరణాత్మకంగా చిన్నపాటి మార్పులతోనే సులభంగా బరువు తగ్గే బెస్ట్ రెమిడ్స్లా ఉన్నాయి కదూ. ఇంకెందుకు ఆలస్యం ప్రయత్నించి చూడండి మరి. View this post on Instagram A post shared by Shavy | 35 kgs off (@shavyjain7) (చదవండి: ఆత్మవిశ్వాసం ఉంటే..అద్భుతం చేయొచ్చు!: మిస్ యూనివర్స్ కేరళ) -
భార్య ప్రెగ్నెన్సీ బ్రేక్: వైరల్ అవుతున్న ఏఐ ప్లాన్!
న్యూఢిల్లీ: భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తున్నప్పుడు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. కానీ, ఫ్యామిలీ ప్లానింగ్ లేదా ప్రెగ్నెన్సీ కారణంగా భార్య ఉద్యోగానికి ఒకట్రెండేళ్లు బ్రేక్ ఇవ్వాల్సి వస్తే? ఒకేసారి వచ్చే ఆదాయం సగానికి పైగా తగ్గిపోతుంది సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్న ఒక ఉద్యోగి, రూ. 22 లక్షల వార్షిక ఆదాయం ఉన్న తమ కుటుంబానికి సింగిల్ ఇన్కమ్తో ఎలా ప్లాన్ చేయాలని ‘చాట్ జీపీటీ’ ని ప్రశ్నించాడు. భార్య జీతం రూ. 12 లక్షలు (55శాతం), భర్త జీతం రూ. 10 లక్షలు అయినప్పుడు, ఆ సడన్ ఫైనాన్షియల్ షిఫ్ట్ను ఎలా తట్టుకోవాలో ఏఐ ఇచ్చిన మైండ్ బ్లోయింగ్, ప్రాక్టికల్ ఫైనాన్షియల్ ప్లాన్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.బ్రేక్కు ముందే పక్కా ప్లానింగ్: ఫేజ్ 1భార్య ఉద్యోగానికి విరామం ప్రకటించడానికి 3 నుండి 12 నెలల ముందే కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ అవసరమని చాట్ జీపీటీ స్పష్టం చేసింది. ముందుగా 9 నుండి 12 నెలల కుటుంబ ఖర్చులకు సరిపడా ‘ఎమర్జెన్సీ ఫండ్’ను లిక్విడ్ అకౌంట్లలో సిద్ధం చేసుకోవాలి. పర్సనల్ లోన్లు వంటి అధిక వడ్డీ అప్పులను వెంటనే తీర్చేయాలి. అత్యంత ముఖ్యంగా, మెటర్నిటీ బెనిఫిట్స్ ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్, పుట్టిన రోజు నుంచే శిశువుకు వర్తించేలా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ ఖర్చుల కోసం సాధారణ డెలివరీకి రూ. 50 వేల నుండి రూ. 1.5 లక్షలు, ప్రీమియం ఆసుపత్రుల కోసం రూ. 2.5 నుండి రూ. 6 లక్షలు, అలాగే ఎమర్జెన్సీ ఎన్ఐసీయూ వార్డుల కోసం రూ. 3 నుండి రూ. 5 లక్షల బఫర్ ఫండ్ను ముందే దాచాలని ఏఐ సూచించింది.ఒకే జీతంతో నెట్టుకురావడం: ఫేజ్ 2కుటుంబ ఆదాయంలో 55శాతం మాయమైనప్పుడు అది కేవలం బడ్జెట్ సమస్య మాత్రమే కాదు, మానసిక ఒత్తిడికి కూడా కారణమవుతుంది. అందుకే హోమ్ బడ్జెట్ను సర్వైవల్, బ్యాలెన్స్డ్, కంఫర్టబుల్ మోడ్స్గా విభజించుకోవాలి. భర్తకు వచ్చే జీతాన్ని ‘తన వ్యక్తిగత ఆదాయం’గా కాకుండా ‘కుటుంబ ఆదాయం’గా భావించినప్పుడే భాగస్వాముల మధ్య అసంతృప్తి రాకుండా ఉంటుందని ఏఐ కీలక సూచన చేసింది. ఇంట్లో ఉండి పిల్లలను చూసుకునే భార్య శ్రమ నెలకు రూ. 15,000 నుండి రూ. 40,000 విలువైన ఆర్థిక శ్రమతో సమానమని గుర్తించాలి. ఇన్వెస్ట్మెంట్ల విషయానికి వస్తే, సిప్లను పూర్తిగా ఆపేయకుండా కొంతమేర తగ్గించుకుంటూ ఈక్విటీ కేటాయింపులను స్థిరంగా ఉంచుకోవాలి.మళ్లీ కెరీర్ రీ-ఎంట్రీ: ఫేజ్ 3ఉద్యోగానికి బ్రేక్ ఇచ్చే సమయం పెరిగేకొద్దీ కెరీర్ రిస్క్ కూడా పెరుగుతుందని చాట్ జీపీటీ విశ్లేషించింది. 12 నెలల బ్రేక్ ఉంటే రీ-ఎంట్రీ జీతంలో 5 నుండి 15శాతం వరకు ప్రభావం ఉంటుంది. అదే 24 నుండి 36 నెలల బ్రేక్ అయితే నైపుణ్యాల క్షీణత ఎక్కువై, మళ్లీ ఉద్యోగంలో చేరడానికి ఫ్రీలాన్సింగ్, పార్ట్-టైమ్ కన్సల్టింగ్ లేదా రీస్టార్ట్ ప్రోగ్రామ్స్ అవసరమవుతాయి. మూడు ఏళ్ల కెరీర్ బ్రేక్ వల్ల కోల్పోయే ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్లు, శాలరీ ఇంక్రిమెంట్లు, కాంపౌండింగ్ నష్టం దాదాపు రూ. 15 నుండి రూ. 25 లక్షల వరకు ఉంటుందని అంచనా వేసింది. ఆధునిక పేరెంటింగ్ కల్చర్ చూపిస్తున్నంతగా పిల్లల పెంపకం ఖరీదైనది కాదని, కానీ సరైన ప్లానింగ్ లేని కెరీర్ బ్రేక్స్ ఆర్థిక భవిష్యత్తును దెబ్బతీస్తాయని ఏఐ తేల్చిచెప్పింది.ఇది కూడా చదవండి: అమెరికాలో రూ. కోటి ప్యాకేజీ.. మిగిలేదెంత? -
‘డబ్బు లేకుండా సినిమా తీశాం!’
“మొదటి నుంచి నాకు సినిమానే వ్యసనం. సాహిత్య సృజనతో పాటు సినిమా మీదే సమయమంతా గడిపేశాను. జేబులో రూపాయి డబ్బు లేకున్నా, స్నేహసంపదే అండగా సినిమాలు తీయగలిగాను” అని ప్రముఖ రచయిత, ‘భద్రం కొడుకో’ సహా పలు అవార్డు చిత్రాలను అందించిన సినీ దర్శకుడు అక్కినేని కుటుంబరావు అన్నారు. ‘భద్రం కొడుకో’ (1991) చిత్రం నుంచి ఇప్పటి దాకా ఒక హిందీ సినిమాతో సహా 8 సినిమాలు, కొన్ని టెలీ ఫిల్ములు తీయగలగడానికి అదే కారణమంటూ తన మనోభావాలను ఆత్మీయంగా పంచుకున్నారు. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు గెల్చుకున్న ‘భద్రం కొడుకో’ చిత్రం లాంటి బాలల చిత్రాల రూపకల్పనకు ఆ రోజుల్లో తాము పడ్డ అవస్థలనూ, అండగా నిలిచిన మిత్రుల స్నేహసౌశీల్యాన్నీ కుటుంబరావు మరోసారి నెమరువేసుకున్నారు.“ఈ తరం పిల్లలకు ఏ అనుబంధాలు, ఆత్మీయతలు లేకుండా పెంచుతున్నాం. జీవితంలోని పోరాటాలు, కష్టసుఖాలు, సమాజంలోని మంచీ చెడూ ఏదీ వాళ్ళకు తెలీదు. అది ఇవాళ్టి సమాజంలో, పెంపకంలోని తప్పు. నిజానికి, ఇవాళ పెద్దవాళ్ళ మనసులు పెళుసు బారిపోయాయి. తమకు నచ్చితేనో, ఉపయోగం ఉంటేనో తప్ప మనం ఏం చెప్పినా, చూపినా వినరు. కానీ, మనం సరిగ్గా చెబితే ఏది చెప్పినా పిల్లలు వింటారు. అది గుర్తించాలి” అని ‘భద్రం కొడుకో’, ‘పాతనగరంలో పసివాడు’ (1999), ‘గులాబీలు’ (2005) సహా తెలుగులో అనేక బాలల చిత్రాలను రూపొందించిన అక్కినేని కుటుంబరావు అభిప్రాయపడ్డారు.నేటికీ ఉరకలేసే పసిమనసు ఉత్సాహంఅక్కినేని కుటుంబరావుకు ఎనిమిది పదులు దాటిన సందర్భంలో ఆయనకు సంబంధించిన మూడు కొత్త పుస్తకాల ఆవిష్కరణ సందర్భంగా ఈ అనుభవాలు, అభిప్రాయాలు, జ్ఞాపకాల తలపోతకు హైదరాబాద్ రవీంద్రభారతి సమావేశ మందిరం వేదిక అయింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సన్నిహితులు ఈ సభకు పెద్దయెత్తున హాజరయ్యారు. ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ – ఛాన్సలర్ ఆచార్య ఎన్. గోపి సభకు ముఖ్య అతిథిగా వచ్చి, పుస్తకాలను ఆవిష్కరించారు. ‘అక్కినేని కుటుంబరావు సినిమా చిత్రాలు’, ‘అక్కినేని కుటుంబరావు కథలు’, అలాగే ఆయన సాహిత్యంపై ప్రముఖులు రాసిన సమీక్షలు, విశ్లేషణలు, కొన్ని ఇంటర్వ్యూల సమాహారంగా ‘పదుగురాడిన మాటలు’ పుస్తకాలు మూడింటి ఆవిష్కరణ జరిగింది. ఆచార్య గోపి తన ప్రసంగంలో కుటుంబరావుతో చిరకాలంగా ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని సభికులతో పంచుకున్నారు. సుదీర్ఘకాల స్నేహితుడైన అక్కినేని కుటుంబరావు ఆనాటి నుంచి ఈనాటి దాకా అదే ఉత్సాహంతో రచనలు చేస్తూ, సినిమాలు తీస్తూనే ఉండడాన్ని అభినందించారు.విశిష్ట అతిథిగా సభకు హాజరైన తెలంగాణ భాషా – సాంస్కృతిక శాఖ సంచాలకులు, కవి, రచయిత ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ, కథ, నవలా రచయితగా, సినీ దర్శకుడిగా విశేష సృజన చేసిన కుటుంబరావును అభినందించారు. చిన్న చిన్న కథలుగా రాసినా, వాటిని ఆసక్తికరంగా తీర్చిదిద్దే ఆయన ప్రత్యేకతను ప్రస్తావించారు. రెండు, మూడు కథలను మచ్చుకు ఉదాహరణగా పేర్కొన్నారు. అక్కినేని కుటుంబరావు వామపక్ష భావజాలం ఆయన రచన పేర్లలోనూ కనపడుతుందన్నారు.‘నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్’ సంపాదకులు, కవి – రచయిత కె. ఆనందాచారి, కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత – సినీ విమర్శకులు వారాల ఆనంద్, సాహిత్య – సామాజిక విశ్లేషకులు డాక్టర్ జతిన్ కుమార్లు సభలో వక్తలుగా పాల్గొన్నారు. సినీ రంగంలో కుటుంబరావు కృషినీ, ఆయన తీసిన సినిమా ప్రత్యేకతనూ వారాల ఆనంద్ వివరించారు. ఇవాళ్టికీ పసిపిల్లల లాంటి స్వచ్ఛమైన మనసుతో ఉండడం వల్లే కుటుంబరావు ఎనిమిది పదులు దాటినట్టు కనిపించరనీ, అదే ఉత్సాహంతో సృజనాత్మక కృషి సాగించగలుగుతున్నారనీ పేర్కొన్నారు.సమకాలంలో సీరియస్గా చదవాల్సిన అక్కినేని సాహిత్యంవిశేష క్షేత్ర పర్యటన, వ్యక్తిగత అనుభవాలను కలగలిపి ఎంతో శ్రమించి కుటుంబరావు సృజించిన సాహిత్యం తాలూకు విశిష్టతను ఆనందాచారి తన ప్రసంగంలో ప్రస్తావించారు. “రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన ప్రాథమిక హక్కులపై నిర్బంధాలు కొనసాగుతున్న విషాద, వర్తమాన సందర్భం ఇది. ఈ పరిస్థితుల రీత్యా కుటుంబరావు రాసిన నవలలు ఇప్పుడు మరింత విలువైనవి. మరోసారి ప్రత్యేకంగా అధ్యయనం చేయదగినవి. ‘పదుగురాడు మాటలు’ పుస్తకంలోని 28 వ్యాసాలూ ప్రముఖుల మాటల్లో ఆయన రచనల ప్రత్యేకతను విశ్లేషించాయి” అని కుటుంబరావు రచనల సామాజిక భూమికను వివరించారు.జతిన్ కుమార్ ప్రసంగిస్తూ, అక్కినేని కుటుంబరావు ప్రసిద్ధ కథ ‘పసివాడితనం’ మొదలు తాజా కథల సంపుటిలోని 16 కథలూ పాఠకులను ఎలా ఆలోచనల్లోకి నెడతాయో వివరించారు. “పాఠకులను నిద్రపోనివ్వని కథలివి. సామాన్యుల వైపు బలంగా నిలబడ్డ కుటుంబరావు వామపక్ష భావజాలం ఈ కథల్లో కనిపిస్తుంది. ఈ కథల్లో అనేకం కుటుంబరావు స్వయంగా చూసినవీ, అనుభవించినవీ. ‘సొంత ఇల్లు’, ‘బండి’ లాంటి అనేక కథలు నిడివి రీత్యా చూడడానికి చిన్నవే అయినా, అవి కలిగించే అనుభూతులు పెద్దవి. అందుకే, ఒక రకంగా ఇవి కథలు కాదు... అనుభూతులు అనాలి. వీటిని చదువుతుంటే, ఒకసారి టీచర్గా, మరోసారి విదూషకుడిగా, ఇంకోసారి గొప్ప రచయితగా కుటుంబరావు కనిపిస్తారు. ప్రతి కథ చాలా సీరియస్గా చదవాల్సిన కథలు” అంటూ తనదైన శైలిలో సరళంగా, సభికులను ఆకట్టుకొనేలా జతిన్ కుమార్ విశ్లేషించారు.అప్పట్లో... 30 పైసల నేలటికెట్లో...అక్కినేని కుటుంబరావు తన స్పందన ప్రసంగంలో అందరికీ కృతజ్ఞతలు చెబుతూ, తాను హైదరాబాద్కు వచ్చిన తొలినాళ్ళ జీవిత గమనం తాలూకు ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకువెళ్ళారు. “అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలనే లక్ష్యంతో కేవలం ఎస్.ఎస్.ఎల్.సి. చదివి, జీవనం కోసం 1963లో హైదరాబాద్కు వచ్చాను. ఈ 63 ఏళ్ళ ప్రయాణంలో ఎందరో స్నేహితులు. విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న ఎన్. గోపి, ఇతర మిత్రులు 1965 నుంచి నాకు తెలుసు. అప్పట్లో ప్రతి ఆదివారం కలిసేవాళ్ళం. వాళ్ళ మాటలు, స్నేహమే నాకు ఓ విశ్వవిద్యాలయంగా మారింది. డబ్బు లేక ఉద్యోగం బాటపట్టాను అనుకుంటున్న నేను, జేబులో డబ్బులో లేకపోయినా చదువు బాటలో పయనిస్తున్న వాళ్ళను చూసి, కలసి ఎంతో నేర్చుకున్నా.అప్పట్లో నాకు రోజుకు 2 రూపాయలు జీతం. నెలకు 60 రూపాయలు. అందులో 30 రూపాయలు ఊళ్ళోని అమ్మానాన్నలకు పంపితే, 20 రూపాయల్లో ఇక్కడ ఇంటి అద్దె, తిండి అంతా గడిచేది. మిగిలిన పది రూపాయలతో స్నేహితులందరితో కలసి, 30 పైసల నేల టికెట్తో ఎన్ని సినిమాలకు వెళ్ళేవాళ్ళమో లెక్కలేదు. ఇటీవల నా తాజా నవల రాస్తున్నప్పుడు గోపి సహా ఆ మిత్రులు, ఆ సంగతులు అన్నీ మరోసారి ఆలోచనల్లో నుంచి అక్షరాల్లోకి వచ్చాయి.నాకు చలం రచనలంటే పిచ్చి. ఆరేడు తరగతుల్లోనే తన అభిమాన రచయిత సినారెకు ఉత్తరాలు రాస్తే, ఆయన జవాబులు ఇచ్చారని గోపి ఓ సారి చెప్పారు. అది ప్రేరణగా తీసుకొని, నా అభిమాన రచయిత చలానికి ఉత్తరం రాస్తే మూడు రోజుల్లో జవాబు వచ్చింది. అక్కడ నుంచి రచయిత గుడిపాటి వెంకట చలానికీ, నాకూ మధ్య కొన్నేళ్ళపాటు ఎన్నో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. వాటిలో కొన్ని అప్పట్లో ఓ పత్రిక ప్రచురించింది” అని కుటుంబరావు చెప్పుకొచ్చారు.ఒక సినిమా... 39 మంది నిర్మాతలు... ఓ నేషనల్ అవార్డ్!“చిన్నప్పటి నుంచి నా ఆదర్శాలు రెండే. ఒకటి - కుటుంబం మొత్తాన్నీ పైకి తీసుకురావాలి, రెండు - స్నేహితులందరితో ఎప్పటికీ స్నేహంగా ఉండాలి. మొదటి విషయం మాటెలా ఉన్నా, రెండో ఆదర్శాన్ని మాత్రం ఇప్పటికీ పాటిస్తున్నా. అందుకే, నాకు పరిచయమైన వాళ్ళెవరూ నాకు స్నేహితులు కాకుండా పోరు. నా అసలైన సంపద స్నేహసంపదే! గోపి, ముత్యంరెడ్డి, ఇలా ఎంతో మంది స్నేహితులే నన్ను ఎంతో ఎడ్యుకేట్ చేశారు. వాళ్ళ వల్లే నేను పురోగతిలోకి వచ్చా. నేను సినిమాలు తీయగలిగింది కూడా ఆ స్నేహితుల వల్లే!రవి, ముత్యం రెడ్డి, శ్రీనివాస్... ఇలా ఎంతోమంది నా ప్రతి సినిమా వెనకాల ఉన్నారు. ఇవాళ అంతర్జాతీయ చిత్రకారుడిగా ఎదిగిన లక్ష్మణ్ ఏలే ఆర్థిక ప్రయోజనం లేకపోయినా, అప్పటి నుంచి ఇప్పటి దాకా నా ప్రతి సినిమాకూ కళాదర్శకుడిగా పనిచేయడం కేవలం సినిమా మీద ప్రేమతోనే! స్నేహపరిమళంతోనే!! ముత్యంరెడ్డి ప్రధాన కారకుడిగా ‘భద్రం కొడుకో’ సినిమా అలా వచ్చిందే. ఆ సినిమాకు ఏకంగా 39 మంది నిర్మాతలు. డబ్బులు వెనక్కిరావు, తిరిగి ఇవ్వలేనని చెప్పినా, తలా పాతిక వేలు పెట్టుబడిగా పెట్టి ఆ సినిమా తీయించారు. ఇవాళ అలా ఇచ్చేవారు ఎవరూ ఉండరు. నిజానికి, ఆ సినిమా నిర్మించడమే తప్ప, దర్శకత్వం నేను చేయాలనుకోలేదు. కానీ, అనుకోకుండా నేనే డైరెక్షన్ కూడా చేయాల్సి వచ్చింది. ఇక అక్కడ నుంచి నా సినిమా ప్రయాణం ఇప్పటి దాకా సాగుతూ వచ్చింది” అని అవార్డు చిత్రాల అక్కినేని కుటుంబరావు తన గుండె లోతుల్లోని భావాలను పంచుకున్నారు.ప్రభుత్వం ఇవాళ్టికీ సబ్సిడీ ఇవ్వని ఆ అవార్డ్ ఫిల్మ్!“మంచి సినిమాలకు ప్రోత్సాహం అందిస్తామని ప్రభుత్వాలు చెబుతాయి కానీ, ఆచరణలో అది జరగదు” అంటూ కుటుంబరావు మంచి సినిమాల రూపకల్పనలో ఉన్న కష్టాలు, ఎదురైన అనుభవాలను సైతం సభాముఖంగా చెప్పుకొచ్చారు. “జేబులో రూపాయి లేకపోయినా, సినిమా మీద ఇష్టంతో కష్టపడి ‘భద్రం కొడుకో’ తీశాం. అయితే, అప్పట్లో సినిమాకు అవార్డులు, రివార్డుల రూపంలో కొంత డబ్బులు కూడా వచ్చాయి. అప్పులు చేసి, వడ్డీలకు తెచ్చి ఆర్థికంగా అండగా నిలబడిన మిత్రులకు వారి డబ్బు వెనక్కి ఇవ్వగలిగాం. కానీ, అన్ని సినిమాలూ అలా కావు కదా! కొన్ని సినిమాలకు మాత్రం ప్రభుత్వాలు ఇస్తామని ప్రకటించిన సబ్సిడీలు సైతం రాలేదు.ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు హైదరాబాద్ను శాశ్వత కేంద్రంగా చేసిన తొలిరోజులవి. ఆసారి హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తెలుగు నుంచి ఒక్క సినిమా కూడా ఎంట్రీ లేదు. ఆ సందర్భంలో ప్రభుత్వ పెద్దలు పిలిచి మరీ, పిల్లల సినిమాలు తీయాలన్నారు. అప్పుడలా ఆరుగురు మిత్రులను నిర్మాతలుగా కలుపుకొని, కష్టపడి తీసిందే – ‘పాత నగరంలో పసివాడు’ (1999). ఆ తరువాతి చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మా సినిమాయే అంతర్జాతీయ పోటీ విభాగానికి వెళ్ళిన తొలి తెలుగు సినిమా అయ్యింది. అలాగే, కైరో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సహా పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలకు వెళ్ళింది.అయితే, ఎంతో కష్టపడి ఆ సినిమా తీసి, అంత చేస్తే... ఇవ్వాల్సిన రూ. 35 లక్షల సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనే లేదు. అదేమంటే కనీసం 11 థియేటర్లలో కమర్షియల్ రిలీజ్ చేస్తేనే ప్రభుత్వ సబ్సిడీ ఇస్తామంటూ ఆఖరికి మెలికపెట్టారు. కమర్షియల్ పాటలు, అసభ్యమైన డైలాగులతో సినిమాలు తీస్తే కానీ అది కుదరని పని. బాలల సినిమాను అలా తీయగలమా? ఫిల్మ్ క్లబ్బులకూ, ఫెస్టివల్స్కూ పరిమితమయ్యే బాలల చిత్రాలను ఆ స్థాయిలో కమర్షియల్ రిలీజ్ చేయడం సాధ్యమేనా? అయితేనేం, ఇలాంటి కష్టాల మధ్యనే అయిదారు బాలల సినిమాలు తీయగలిగాను” అంటూ అక్కినేని కుటుంబరావు తన సినిమా అనుభవాలను సభాముఖంగా పంచుకున్నారు.కుటుంబరావు జీవన సహచరి – ప్రఖ్యాత రచయిత్రి ఓల్గా ఈ సభా కార్యక్రమ నేపథ్యం వివరించారు. సభ మొదటిలో అతిథుల స్వాగతం నుంచి చివరలో ఆత్మీయ బృందానికి పుస్తకాలు అందించడం దాకా ఓల్గా ఆత్మీయత కనపడింది. ఆమె సోదరుడు – సాహిత్య, సినీజీవి రవి మారుతి మొత్తం సభా నిర్వహణను స్వయంగా చూసుకున్నారు.కుటుంబరావు సినిమాలకు కళా దర్శకుడిగా వ్యవహరించిన ప్రఖ్యాత చిత్రకారుడు లక్ష్మణ్ ఏలే, సినీ రంగంలోనూ కృషి చేస్తున్న రచయిత్రి చైతన్య పింగళి, ప్రముఖ కవులు ఆశారాజు, శిఖామణి, యాకూబ్, సీనియర్ జర్నలిస్టులు వేమన వసంతలక్ష్మి, సుధాకర్, రచయిత్రులు ప్రమీలా హరగోపాల్, భండారు విజయ, సమ్మెట ఉమాదేవి, సమ్మెట విజయ, శివలక్ష్మి తదితర ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరవడంతో రవీంద్రభారతి సమావేశ మందిరం సాహిత్య – సినీ వాతావరణంతో కళకళలాడింది. సభ ముగిసిన తర్వాత కూడా సాహితీ ప్రియులు పరస్పరం ఆత్మీయంగా పలకరించుకుంటూ, కుటుంబరావును అభినందిస్తూ, అక్కడే చాలా సమయం గడపడం కుటుంబరావు – ఓల్గా జంట సంపాదించుకున్న స్నేహసంపదకు నిండైన తార్కాణంగా నిలిచింది.-రెంటాల జయదేవ -
లుక్స్, భాష పరంగా..అభద్రతా భావంతో ఉండేదాన్ని..!
కజియా లిజ్ మెజో (Kaziah Liz Mejo) 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన మిస్ యూనివర్స్ కేరళ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. కేవలం 19 ఏళ్ల వయస్సులోనే ఈ టైటిల్ను గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా ఆమె అరుదైన రికార్డును సృష్టించారు. అయితే ఆమెను ఓ మీడియా ఇంటర్వ్యూలో ఈ గెలుపు ఎలా సాధ్యమైందని ప్రశ్నించగా..అందుకు కజియా చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారామె. మిస్ యూనివర్స్ ఇండియాకు సిద్ధమవుతున్న ఈ 19 ఏళ్ల యువతి..తన లుక్స్, సంభాషణ పరంగా అభద్రతా భావంతో ఉండేదాన్ని అని చెప్పింది. దాంతో ఆత్మవిశ్వాసంగా ఉండలేకపోయాదాన్ని అని వాపోయారు. అయితే దీన్ని అధిగమించడం రాత్రికి రాత్రే జరిగిపోలేదన్నారు. ఇలా కాదు మొదట తాను కాన్ఫిడెంట్ని డెవలప్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాని అన్నారామె. అందుకోసం తనపై తాను ఫోకస్ పెట్టడం ప్రారంభించానని అన్నారామె. అంటే నా సంభాషణ నైపుణ్యాలు, వ్యక్తిత్వం, రూపం ఇలా మొత్తం తనపై తాను ఎక్కువ దృష్టి పెట్టి మెరుగయ్యేలా చేసుకున్నానని అన్నారు. అయితే తనకు బాగా హెల్ప్ అయిన విషయం ఏంటంటే..సాధించే వరకు ఆపొద్దు అనే సూత్రంం. ఈ భూమ్మీద నేనే అత్యంత ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిని అని తన బ్రెయిన్ని పూర్తిగా నమ్మించి వేదికలపైకి కాన్ఫిడెన్స్గా నడవగలిగానని అన్నారు. ఇక తనకు ఈ అందాల పోటీలపై ఆసక్తి మొదలైంది..2021లో భారతదేశం మిస్ యూనివర్స్ గెలవడాన్ని చూసిన తర్వాతేనని అన్నారామె. అంతవరకు అందాల పోటీల గురించి పెద్దగా తెలియదని అన్నారు. భారత్ ఆ పోటీల్ల గెలవడంతో తనలో ఏదో స్ఫూర్తి రగిలిందన్నారు. అదీగాక హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్ 2021ను గెలుచుకోవడంతో భారత్ 21 ఏళ్ల నిరీక్షణకు తెరపడినట్లైందని పేర్కొంది. అంతకుముందు 1994లో సుష్మితా సేన్, 2000లో లారా దత్తా ఈ టైటిల్ని గెలుచుకున్నారు. అయితే చాలామంది ఈ అందాల పోటీలను కేవలం శారీరక సౌందర్య ప్రదర్శనగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అన్నారు. అయితే ఈ అందాల పోటీలు గెలిచినా, గెలవకపోయినా..మీ గొంతుని కనుగొనడం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం వంటివి ఎన్నో నేర్పిస్తుందన్నారు. పైగా ఈ జర్నీలోని ఎంతో మెరుగవుతాం అంటూ తన సంభాషణను ముగించారామె.(చదవండి: అంతా అయిపోయాక కాదు..ముందుగా తెలుసుకోవాల్సిన ఆరోగ్య పాఠాలు..!) -
వారానికి ఒక్క డోస్.. షుగర్, వెయిట్ అన్నీ కంట్రోల్!
న్యూ ఓర్లీన్స్: ఫార్మా రంగంలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమయ్యింది. ఊబకాయం సమస్యతో బాధపడేవారికి సరికొత్త ఆశలు రేకెత్తిస్తూ ప్రముఖ ఫార్మా దిగ్గజం ‘ఎలి లిల్లీ’ ఒక అద్భుతమైన మందును కనుగొంది. శనివారం (జూన్ 6) న్యూ ఓర్లీన్స్లో జరిగిన అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ కాన్ఫరెన్స్లో కంపెనీ తన తాజా క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను వెల్లడించింది. ‘రెటాట్రుటైడ్’ (Retatrutide) అని పిలిచే ఈ నెక్స్ట్-జనరేషన్ ఊబకాయం డ్రగ్.. ఒక్క బరువు తగ్గించడమే కాకుండా.. ప్రాణాంతక స్లీప్ అప్నియా (నిద్రలో శ్వాస ఆడకపోవడం), తీవ్రమైన మోకాళ్ళ నొప్పులను సైతం సమర్థవంతంగా నివారిస్తుందని పరిశోధనల్లో తేలింది.మూడో దశ ట్రయల్స్లో సంచలన ఫలితాలుఎలి లిల్లీ నిర్వహించిన ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ ఫలితాల ప్రకారం.. ఊబకాయంతో బాధపడుతున్న వయోజనులకు వారానికి ఒకసారి ఈ ‘రెటాట్రుటైడ్’ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా, వారిలో తీవ్రమైన అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా సమస్య ఏకంగా 60.6 శాతానికి పైగా తగ్గినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. అంతేకాదు మోకాళ్ళ కీళ్లనొప్పుల తీవ్రతను ఈ డ్రగ్ గరిష్టంగా 73.1 శాతం వరకు తగ్గించిందని వైద్య నిపుణులు తెలిపారు. ఇప్పటికే ఈ సంస్థకు చెందిన ‘జెప్బౌండ్’ అనే పాత డ్రగ్కు ఈ తరహా చికిత్స కోసం అనుమతులు ఉండగా, ఇప్పుడు ‘రెటాట్రుటైడ్’ మరింత మెరుగైన ఫలితాలను చూపించింది.ట్రిపుల్ జి ఫార్ములా విశేషాలుఈ ప్రయోగాత్మక ఔషధం మానవ శరీరంలో బరువు, మధుమేహాన్ని నియంత్రించే కీలక హార్మోన్లను టార్గెట్ చేస్తుంది. అంతకుముందు జరిగిన అధ్యయనాల్లో ఈ మందు వాడిన రోగులు తమ శరీర బరువులో 28 శాతం వరకు తగ్గడమే కాకుండా, టైప్-2 డయాబెటిస్ బాధితుల్లో రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గినట్లు ఎలి లిల్లీ గతంలోనే వెల్లడించింది.లాన్సెట్ జర్నల్ నివేదిక - మార్కెట్ పోటీప్రఖ్యాత 'ది లాన్సెట్' జర్నల్లో ప్రచురితమైన వివరాల ప్రకారం, ఈ డ్రగ్ అత్యల్ప మోతాదు తీసుకున్న రెండు శాతం మంది డయాబెటిస్ రోగుల్లో గుండె జబ్బులకు సంబంధించిన కొన్ని ప్రతికూల సంఘటనలు నమోదయ్యాయి. అయితే ఇవి నేరుగా ఈ మందు వల్లే సంభవించాయని చెప్పలేమని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన గిరాకీ ఉన్న ఊబకాయం, మధుమేహం మందుల మార్కెట్ను శాసించేందుకు ఇండియానా కేంద్రంగా పనిచేసే ఎలి లిల్లీ సంస్థ, డెన్మార్క్కు చెందిన నోవో నార్డిస్క్ సంస్థల మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది.ఇది కూడా చదవండి: వాట్సాప్లో ‘బొద్దింకల పార్టీ’: క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ! -
ప్లీజ్ అంతా అయిపోయాక కాదు..! ముందుగానే తెలుసుకుందాం..
ఏ విషయంలోనైన అశ్రద్ధ ఉన్నా..పర్లేదు కానీ..ఆరోగ్య విషయంలో అలా కాదు. ఒక్కసారి పెద్దయ్యాక..చూద్దాంలే అనుకుంటూ..ఉంటే..కథే అడ్డం తిరుగుతుంది. మనం యంగ్ ఏజ్లో తీసుకున్న ఆహారాలు, జీవనశైలి వంటివే నాలుగుపదుల వయసులో మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. వృద్ధాప్యం సమీపించే సమయానికి రకరకాల వ్యాధుల బారినపడి..ఆరోగ్యాన్ని చేజాతులారా పాడు చేసుకుంటారని అంటున్నారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్. అంతేగాదు. ముందుగానే ఈవిషయాలు తెలిసి ఉంటే బాగుండును అనుకునే ఐదు శక్తిమంతమైన ఆరోగ్య పాఠాలపై అందరికీ అవగాహన ఉండాలంటున్నారు. అవేంటంటే..యంగ్ ఏజ్లో ఉండగా..ఆ తర్వాత అంటూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారని అన్నారు. నిశబ్దంగా నష్టం జరిగిపోయాక గానీ మేల్కోరని అంటున్నారామె. నిద్ర అలవాట్ల నుంచి తీసుకునే ఆహారం వరకు ప్రతిదాంట్లో కేర్ఫుల్గా ఉండాలని అంటున్నారు.తెలుసుకోవాల్సిన ఐదు శక్తిమంతమైన పాఠాలు..తన 20 ఏళ్ల వయసులో తనకు తెలిసి ఉంటే బాగుండేదని అతను భావించే ఐదు శక్తివంతమైన పాఠాలు ఇక్కడ ఉన్నాయి:జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మిగతా అన్నింటినీ నిర్ధారిస్తుంది..శక్తి, మానసిక స్థితి, చర్మం, రోగనిరోధక శక్తి, మానసిక స్పష్టత అన్నీ జీర్ణవ్యవస్థలోనే మొదలవుతాయని అంటున్నారు వైద్యులు. ఇదంతా జీర్ణవ్యవస్థలో నిశ్శబ్దంగా ఉంటుంది,నిద్ర అనేది మీరు తర్వాత భర్తీ చేసుకోగలిగేది కాదుచాలా మంది అనుకున్నట్లుగా నిద్రలేమిని పూడ్చలేము. ప్రతి రాత్రి సరిగా నిద్రపోకపోవడం కాలక్రమేణా పేరుకుపోతుంది. కోల్పోయిన నిద్రకు బ్యాంకు ఖాతా లేదు,అని వైద్యులు చెబుతున్నారు. దీర్ఘకాలిక నిద్రలేమి వేగవంతమైన జీవసంబంధమైన వృద్ధాప్యం, అధిక జీవక్రియ ప్రమాదంతో ముడిపడి ఉందని పరిశోధనలు చెబుతున్నాయని చెబుతున్నారు.ఆహారం కంటే.. ఒత్తిడి ఆరోగ్యాన్ని చిత్తు చేస్తుంది..దీర్ఘకాలిక ఒత్తిడి శరీరంపై ప్రత్యక్ష జీవసంబంధమైన ప్రభావాన్ని చూపుతుంది. మానసిక ఒత్తిడి కొన్ని గంటల్లోనే జీర్ణవ్యవస్థ, శరీరాన్ని ప్రభావితం చేయగలదు. నాడీ వ్యవస్థ నియంత్రణ గురించి మంచి అవగాహన ఉండాలి.ఇష్టంగా తినే అతిగా ప్రాసెస్ చేసిన ఆహారం..ఇవాల్టి ఆహారపు అలవాట్లు దీర్ఘకాలిక కాలేయం, జీవక్రియ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని అంటున్నారు. ఫ్యాటీ లివర్ వ్యాధి వంటి సమస్యలు అకస్మాత్తుగా రావు, దశాబ్దాల తరబడి పునరావృతమయ్యే ఆహారపు అలవాట్ల వల్ల వచ్చేవని అంటున్నారు.అత్యంత శక్తిమంతమైన పదార్థం ఫైబర్అందరు రోజుకు కేవలం పది నుంచి 15 గ్రాముల ఫైబరే తీసుకుంటున్నారు. తగినంత ఫైబర్ పెద్ద ప్రేగు కేన్సర్, గుండెజబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Saurabh Sethi MD MPH | Gastroenterologist (@doctor.sethi) (చదవండి: భారత్ని విడిచి వెళ్తున్న ప్రతిసారి గుండె పగిలిపోతోంది ..!) -
క్లూషియల్: పెదవుల వెనుక మృత్యువు
అర్ధరాత్రి ఒంటిగంట. వ్యాపారవేత్త వేలాయుధం తన విలాసవంతమైన గదిలో శవమై పడి ఉన్నాడు. అతని మరణం నగరంలో సంచలనం సృష్టించింది.కేసు దర్యాప్తు కోసం ఇన్ స్పెక్టర్ అభిమన్యు రంగంలోకి దిగాడు.లంకంత ఇంట్లో ఒక్కడే ఉంటాడు. ఆ ఇంటి వంట మనిషి పురుషుడే, తోటమాలి, పనిమనిషి కూడా పురుషులే!అభిమన్యు క్రైమ్ సీన్ ను పరిశీలిస్తున్నప్పుడు కొన్ని కీలక ఆధారాలు దొరికాయి.వేలాయుధం బుగ్గలు, ఛాతీపై ఎర్రటి లిప్స్టిక్ గుర్తులు ఉన్నాయి.ప్రాథమికంగా ఇదొక మహిళ చేసిన హత్యలా కనిపించింది.పోస్ట్మార్టం రిపోర్ట్లో వేలాయుధం పెదవులపై ఉన్న విషం వల్ల చనిపోయాడని తేలింది.ఇన్స్పెక్టర్ అభిమన్యు ఆ లిప్స్టిక్ గుర్తులను భూతద్దంతో నిశితంగా పరిశీలించాడు. అతని క్రిమినాలజీ అనుభవం ఒక రహస్యాన్ని బయటపెట్టింది. అభిమన్యు వేలాయుధం కుటుంబ నేపథ్యాన్ని తవ్వడం ప్రారంభించాడు. వేలాయుధం తండ్రి మొదటి భార్య కొడుకు, అతని సవతి తమ్ముడు వేలుపిళ్లై మీద అనుమానం వచ్చింది. కానీ అతనే హంతకుడు అనడానికి ఎవిడెన్ కావాలి. వేలాయుధం స్టాఫ్ను, పనివాళ్లను, సవతి తమ్ముడిని విచారించాడు. అందరి పెదవుల కొలతలు తీసుకున్నాడు.వేలాయుధంతో ఉన్న వ్యక్తిగత పరిచయం దృష్ట్యా కమిషనర్ కూడా వచ్చాడు.‘చాలా మంచివాడు. ఇలా అర్ధాంతరంగా చనిపోవడం బాధాకరం. హంతకుడిని సాధ్యమైనంత త్వరగా పట్టుకోవాలి.’ అన్నాడు కమిషనర్.‘కేసు క్లోజ్ అయినట్టే... సంకెళ్లు రెడీ చేయండి కమిషనర్ గారూ... ఏమంటారు? వేలుపిళ్లై...’ వేలాయుధం తమ్ముడి వైపు చూసి అన్నాడు.‘నేనా?.. నేనేమంటాను?’ కంగారుపడుతూ అన్నాడు వేలుపిళ్లై.కమిషనర్ ఇన్స్పెక్టర్ అభిమన్యు వైపు వేలుపిళ్లై వైపు చూశాడు.‘నువ్వు చెబుతావా? నన్ను చెప్పమంటావా? వేలుపిళ్లై వైపు చూస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు.అప్పటికే ఇన్స్పెక్టర్ అభిమన్యు ఆదేశాల మేరకు వేలుపిళ్లై చేతికి సంకెళ్లు తగిలించారు.వేలుపిళ్లై వేలాయుధానికి సవతి తమ్ముడు. అయినా ప్రేమగానే సొంత అన్నగానే చూశాడు. ఆస్తి కోసం క్రిమినల్ బ్రెయిన్ ఉపయోగించాడు వేలుపిళ్లై.‘క్రైమ్ సీ¯Œ లో దొరికిన లిప్స్టిక్ మార్కులను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాను. ఆడవాళ్ళ పెదవులు చిన్నగా, సున్నితంగా ఉంటాయి. కానీ వేలాయుధం బుగ్గల మీద, ఛాతీ మీద ఉన్న పెదవుల ముద్రలు చాలా వెడల్పుగా, పెద్దగా ఉన్నాయి. అవి కచ్చితంగా ఒక మగాడి పెదవుల సైజు. హంతకుడు మహిళ అని నమ్మించడానికి చేసిన చీప్ ట్రిక్ ఇది.’తన పెదవులకు విషం అంటకుండా... ల్యాబ్లలో వాడే సిలికాన్ ప్లాస్టిక్ లేయర్ను తన పెదవులపై అతికించుకున్నాడు . దానిపై విషపూరితమైన లిప్స్టిక్ రాశాడు. నిద్రపోతున్న వేలాయుధాన్ని నొక్కిపట్టి, ఆ లేయర్ ద్వారా విషాన్ని అతని శరీరంలోకి ఎక్కించాడు’ అని వేలుపిళ్లై వైపు తిరిగి .‘నువ్వు ఆ లేయర్ను తీసి నీ ఇంటి వెనుక ఉన్న డస్ట్బిన్ లో పడేశావు. మా పోలీసులు దాన్ని వెతికి పట్టుకున్నారు. దాని మీద నీ లాలాజలం ఉంది. అలాగే వేలాయుధం శరీరంపై ఉన్న విషపు లిప్స్టిక్ కూడా ఉంది.వేలుపిళ్లైను పోలీసులు జీపు ఎక్కిస్తుండగా చెప్పాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు.‘ఏ ఆస్తి కోసం అయితే నీ అన్నయ్యను హత్య చేశావో.. అదే అన్నయ్య తన తదనంతరం తన యావదాస్తిని నీకు చెందేలా విల్లు రాశాడు. హత్య చేసిన నీకు ఆస్తి రాదు. అనుభవించే అవకాశమూ లేదు. నీ నేరప్రవృత్తి నిన్ను కటకటాల్లోకి నెట్టింది’ చెప్పాడు. -
కథాకళి: ప్రేమ పండు
క్రీ.శ. 1772. అది యశీరప్లో ఒలోనా నది ఒడ్డున ఉన్న చిన్న గ్రామం. పెరూ రెస్కాల్డా.ఆ గ్రామస్థురాలైన లవీనియాకి నిద్ర లేవగానే ఉత్కంఠ పెరిగిపోతోంది. తన శరీరం సాధారణంగా ఉందా లేక ఏదైనా మార్పు వచ్చిందా అన్న ఆందోళన ఆమెని వేధిస్తోంది.పదహారేళ్ళ లవీనియా– మాంసం కొట్టు యజమాని కొడుకు ఫ్రెడినోతో ప్రేమలో పడింది. అతని వయసు పద్దెనిమిది. ఆమె వారానికి రెండుసార్లు మాంసం కొనడానికి అతని కొట్టుకి వెళ్ళేది. ఫ్రెడినో తన తండ్రితోపాటు అక్కడ పని చేసేవాడు. తండ్రి చూడకుండా తనకి ఎక్కువ మాంసం తూచడాన్ని లవీనియా గమనించింది. ఆమె గమనించినట్లు అతను గ్రహిస్తే నవ్వుతూ కన్నుకొట్టేవాడు. ఆదివారాలు చర్చిలో కూడా ఒకరికొకరు తారసపడేవారు.ఓ రోజు ఫ్రెడినో లవీనియాకి మాంసం ఇస్తూ గుసగుసగా చెప్పాడు.‘‘ఇంకో గంట తర్వాత నది ఒడ్డున కలుద్దాం. మూడు పైన్ చెట్ల దగ్గర.’’అతను చెప్పిన సమయానికి వెళ్ళాలని అనుకుంది. కాని తల్లి ఊలు నించి దారం తీసే పని చెప్పడంతో కుదరలేదు.రెండు రోజుల తర్వాత మళ్ళీ మాంసం కొనడానికి వెళ్ళినప్పుడు ఆమె అతను వినేలా మరో కస్టమర్తో చెప్పింది.‘‘మొన్న నాకు మా అమ్మ చాలా పెద్ద పని ఇచ్చింది. అందువల్ల బయటకి వెళ్ళలేదు.’’అతను లవీనియాతో రహస్యంగా చెప్పాడు.‘‘రేపు అక్కడే సూర్యుడు కొండ మీదకి వెళ్ళే సమయంలో కలుద్దామా?’’‘‘నీ ఆహ్వానం కోసమే నేను ఎదురు చూస్తున్నాను.’’ సిగ్గుగా చెప్పింది.మొదటిసారి వారిద్దరూ ఏకాంతంలో కలిశారు. ఒకరినొకరు కౌగిలించుకుని చాలాసేపు అలాగే నిలబడ్డారు. వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాల వేగం పెరిగింది.‘‘నువ్వు చాలా అందగత్తెవి.’’ ఫ్రెడినో చెప్పాడు.లవీనియా నవ్వుతూ చెప్పింది.‘‘అందం కాలంతో వచ్చి కాలంతో వెళ్ళిపోతుందని మా నాయనమ్మ చెప్తూంటుంది.’’‘‘అవును. అందుకే ఈ వయసులో ప్రేమించుకుంటారు. ముసలి వయసులో కాదు.’’ఆమె ఫక్కున నవ్వింది. తర్వాతి కలయికల్లో గర్భవతి అవుతానన్న భయంతో లవీనియా అతన్ని అందుకు అనుమతించలేదు. ఆమె మనసులో మాత్రం ఆ తహతహ ఉంది. చివరికి అది ఆమె మానసిక శక్తిని లొంగదీసింది. ‘‘నేను రేపు రోమ్కి వెళ్ళాల్సి వచ్చింది.’’ ఓ రోజు ఫ్రెడినో ఆమెతో చెప్పాడు.‘‘మళ్ళీ ఎప్పుడు వస్తావు?’’ లవీనియా ఆందోళనగా అడిగింది.‘‘మన రాజు జోసెఫ్ ది సెకండ్ రాజప్రసాదంలో మా నాన్న నాకు ఉద్యోగం సంపాదించారు. రాజుగారి వంటశాలలో మాంసం కోసే పని.’’‘‘వెళ్ళక తప్పదా? మానేయచ్చుగా?’’ లవీనియా బాధగా అడిగింది.‘‘వెళ్ళకపోతే రాజు ఊరుకుంటాడా?’’ ఫ్రెడినో నిస్సహాయంగా చెప్పాడు.వారి ఆ చివరి కలయికలో కన్నీళ్ళు చాలానే కారాయి. ఫ్రెడినో రోమ్కి వెళ్ళాక లవీనియాకి జీవితం వెలితిగా మారింది. ఏ పని మీద ఉత్సాహం లేదు.మూడు నెలలు గడిచాక తను గర్భవతైందని గ్రహించింది. ఆ కాలంలో పెళ్ళి కాకుండా తల్లి అవడం పెద్ద అపరాధం. ఊరి ప్రజలకి అలాంటి వారిని రాళ్ళతో కొట్టి శిక్షించే హక్కు కూడా ఉండేది. అది తన కుటుంబానికి తీరని మచ్చ. బలవంతంగా కడుపు తీయించుకునే ప్రయత్నంలో చాలామంది మరణించడం గురించి కూడా ఆమె విన్నది. తల్లి కఠినురాలు. తండ్రికి తను గర్భవతినని చెప్పే ధైర్యం లేదు.చివరికి ఆమెకి ఒకటే పరిష్కారం కనిపించింది. ఆత్మహత్య.ఆరోజు చర్చికి వెళ్ళి మేరీ మాతని ప్రార్థించింది. తరువాత నది ఒడ్డుకి వెళ్ళి అక్కడి మొక్కల నుంచి ఎర్రటి విషపు పళ్ళని చాలా కోసుకుంది. తమ కలయిక జరిగిన మూడు పైన్ చెట్ల మధ్య కూర్చుని వాటిని తినసాగింది. వాటి రసం ఆమె దుస్తుల మీదకి కారింది. దాదాపు పాతిక పళ్ళు తిన్నాక ఆమె కళ్ళు మూసుకుని మృత్యువు కోసం ఎదురుచూస్తూ పడుకుంది.అప్పుడే అక్కడికి ఫ్రెడినో వచ్చాడు. పక్కన ఉన్న పళ్ళని చూసి భయంగా అడిగాడు.‘‘వీటిని తిన్నావా? అయ్యో! ఫ్రెంచ్ ప్రభుత్వం వీటిని నిషేధించింది కూడా. ఎందుకు తిన్నావు?’’‘‘నేను గర్భవతిని. మరో మార్గం లేదు. నువ్వు కొద్దిగా ముందు వచ్చి ఉంటే వీటిని తినేదాన్ని కాదు.’’ లవీనియా కన్నీళ్ళతో చెప్పింది.‘‘నువ్వు లేకుండా నేను బతకలేను.’’ ఫ్రెడినో ఆమె చేతిని పట్టుకుని చెప్పాడు.అతనూ ఆ పళ్ళని కోసుకుని తిన్నాడు. కొన్ని గంటలు గడిచినా ఇద్దరికీ ఏమీ కాలేదు.‘‘మేరీ మాత అనుగ్రహం.’’ లవీనియా భక్తిగా చెప్పింది.ఫ్రెడినో ఇరువురి తల్లిదండ్రుల అనుమతితో ఆమెని పెళ్ళి చేసుకుని రోమ్కి తీసుకెళ్ళాడు.అక్కడ రాజుగారి వంటవాడికి ఆ పళ్ళ గురించి చెప్తే నమ్మలేదు. కాని ఫ్రెడినో తన ముందే వాటిని తిన్నా ఏమీ కాకపోవడం చూసి చెప్పాడు.‘‘ఇది విషపు పండు కాదు. ప్రేమ పండు. దీన్ని వంటల్లో వాడుతాను.’’అలా ఆ పండు క్రమంగా యూరప్, సౌత్ అమెరికాలోని దేశాలకి, అమెరికాకి కూడా వ్యాపించింది. యురోపియన్ సలాడ్లో తప్పనిసరి భాగంగా మారిన ఆ పండు పేరు టొమాటో.(నైట్షేడ్ అనే విషపుజాతికి చెందిన టొమాటోలని యూరోపియన్ 16వ శతాబ్దం దాకా విషపు పళ్ళుగా నమ్మేవారు. ‘ఎప్పటి నించి ఆ అపనమ్మకం తొలగింది?’ అనే ఆలోచన వచ్చాక) -
వినూత్నంగా పెళ్లి రోజు వేడుక
జగిత్యాలరూరల్: పెళ్లి చేయాలంటే.. ఆకాశమంతా పందిరి.. భూదేవి అంతా పీట.. పురోహితులు.. బంధువులు.. బలగం తరలిరావాలంటారు. కానీ ఈ పెళ్లి వేడుకకు తోటి ఉపాధిహామీ కూలీలే పెళ్లి పెద్దలుగా మారారు. తట్ట.. పార పట్టిన వారే పురోహితులుగా అవతారం ఎత్తి పెళ్లి తంతు నిర్వహించారు. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ వినూత్న పెళ్లి వేడుక సోషల్మీడియాలో వైరల్గా మారింది. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల, బాలపల్లి గ్రామాలకు చెందిన 225 మంది శుక్రవారం ఉపాధిహామీ పనులకు హాజరయ్యారు. పనులు ముగిసిన తర్వాత పని స్థలంలో రెండు గ్రామాల కూలీలు ఒక్కచోట చేరారు. ఈ సమయంలోనే పొరండ్ల గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి–సత్తమ్మ దంపతుల 41వ పెళ్లి రోజు అని చర్చకు వచ్చింది. వెంటనే తోటి కూలీలు ఘనంగా వేడుకలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మామిడితోటనే పెళ్లి వేదికగా మార్చుకున్నారు. మామిడి ఆకులతో బాసింగాలు తయారు చేసి వారిద్దరికి కట్టి పెళ్లి జరిపించారు. నిజమైన వివాహ వేడుకలను మైమరిపించేలా తలంబ్రాలు, అరుంధతి నక్షత్ర దర్శనం, అప్పగింతలు నిర్వహించారు. అక్కడే ఉన్న వారందరికీ కూరగాయలు, మటన్, బగార అన్నం, మక్కగుడాలతో విందు ఏర్పాటు చేశారు. పెళ్లికి హాజరైన కూలీలందరూ కట్నకానుకలు సమర్పించారు. ఈ పెళ్లి తతంగం అంతా సోషల్మీడియాలో వైరల్గా మారింది. -
భారత్ని విడిచి వెళ్తున్న ప్రతిసారి గుండె పగిలిపోతోంది ..!
మన మాతృగడ్డని ఎందరో విదేశీయలు ప్రశంసించారు. ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలకు ఫిదా అయ్యి ఇక్క్కడే స్థిరనివాసం ఏర్పరుచుకున్న వాళ్లు కోకొల్లలు. అలాంటి ఈ భారత్ నేలను విడిచి వెళ్లడం అంటేనే కన్నీళ్లు వచ్చేస్తాయంటున్నాడు ఒక విదేశీయుడు. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేయడంతో వైరల్గా మారింది. ఆ వీడియోలో యూకే ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ డేవ్ ఫ్లూకు ప్రతి పర్యటలనో భారత్ని విడిచి వెళ్లడమే అత్యంత కష్టంగా ఉంటుందని చెబుతుండటం కనిపిస్తుంది. మంబై నుంచి బయలుదేరే ముందు రికార్డ్ చేసిన వీడియో అది. ఈ దేశంతో ఏర్పరచుకున్న అనుబంధం అలాంటిదని, ఇక్కడి స్నేహితులకు వీడ్కోలు చెప్పడం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఆ వీడియోలో ముంబైలోని సాకినాకా వీధుల్లో నడుస్తూ.. భారతదేశాన్ని విడిచి వెళ్లే సమయం వచ్చినప్పుడల్లా తాను అనుభవించే భావాలను ఫ్లూ గుర్తుచేసుకున్నారు. ఏళ్లుగా తాను గాఢంగా అనుబంధం పెంచుకున్న దేశాన్నివిడిచి వెళ్లడం అనే ఆలోచన తలుపుకు రాగానే..గుండ పగిలిపోతుందన్నారు. అలాగే భారతదేశంపై తనకున్న అభిమానం గురించి కూడా ప్రస్తవించారు. తాను మరే దేశాన్ని ప్రేమించనంతగా ఈ దేశాన్ని ప్రేమిస్తున్నానని, ప్రతిసారి దీన్ని విడిచి వెళ్లడం అంటే మానసికంగా చాలా కష్టపడాల్సి వస్తుందన్నారు. జీవితం అంటే ముందుకు సాగడం అని తెలిసినప్పటికీ..ఈ వీడ్కోలు వద్దకు వచ్చేటప్పటకీ హృదయం ద్రవించిపోతోందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. చివరగా మళ్లీ తిరిగి ఇక్కడకు వస్తానని చెబుతూ.."జై హింద్" అంటూ తన పోస్ట్ని ముగించారు. ఈ వీడియోకి ప్రసారి వెళ్లడం తన గుండెని పిండేస్తుందంటూ క్యాప్షన్ ఇచ్చి మరీ షేర్ చేశారు. నెటిజన్లు అతడి పోస్ట్కి ఫిదా అవ్వుతూ బ్రో త్వరగా తిరిగి రండి, ఇది తాత్కాలికి వీడ్కోలే అని భరోసా ఇస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం. View this post on Instagram A post shared by Dave Flew (@flewy86) (చదవండి: సినిమా సీన్ని తలపించేలా.. ఆర్మీ పైలట్ లవ్ ప్రపోజ్!) -
అమెరికాలో రూ. కోటి ప్యాకేజీ.. మిగిలేదెంత?
న్యూయార్క్: అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం.. కోట్లలో జీతం అనగానే భారతదేశంలోని చాలామంది ఎంతో సంబరపడిపోతుంటాయి. అయితే ఆ సంపాదన వెనుక ఉన్న అసలు నిజాలు, ఖర్చుల గురించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. న్యూయార్క్ నగరంలో నివసిస్తున్న యశ్ శర్మ అనే భారతీయుడు ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న ఒక వీడియో ప్రవాస భారతీయుల వాస్తవ ఆర్థిక పరిస్థితులను కళ్లకు కట్టింది. అమెరికాలో రూ. 1 కోటి ప్యాకేజీ వచ్చినా, అక్కడ ఉండే పన్నులు, అద్దెల భారంతో పోలిస్తే భారతదేశంలో తక్కువ జీతంతోనే ఎక్కువ సంతోషంగా ఉండవచ్చని అతను చేసిన విశ్లేషణ నెటిజన్లలో చర్చకు దారితీసింది.పన్నుల రూపంలో భారీ కోతయశ్ శర్మ తన వీడియోలో న్యూయార్క్లో లభించే రూ. కోటి ప్యాకేజీపై పడే పన్నుల భారాన్ని వివరంగా లెక్కగట్టారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నివసించే వారికి ఫెడరల్ టాక్స్, స్టేట్ టాక్స్, న్యూయార్క్ సిటీ టాక్స్లతో పాటు సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి రకరకాల పన్నులు వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల సంపాదనలో ఏకంగా 35 శాతం నుండి 40 శాతం వరకు కేవలం పన్నుల రూపంలోనే ప్రభుత్వం ఖాతాలోకి వెళ్లిపోతుందని, దీంతో చేతికి వచ్చే మొత్తం ఊహించిన దానికంటే చాలా తక్కువగా ఉంటుందని తెలిపారుఆకాశాన్నంటుతున్న ఇళ్ల అద్దెలుపన్నుల కోత తర్వాత మిగిలిన మొత్తంలో అధికభాగం ఇళ్ల అద్దెలకే సరిపోతుందని యశ్ వివరించారు. న్యూయార్క్ లాంటి నగరంలో ఒక మోస్తరు లేదా మంచి ప్రాంతంలో నివసించాలన్నా నెలకు సుమారు రూ. రెండు లక్షల నుండి రూ. మూడు లక్షల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ భారీ వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటే, అమెరికాలో రూ. కోటి ప్యాకేజీ సంపాదించే వ్యక్తి కంటే, భారతదేశంలో రూ. 25 లక్షల నుండి రూ. 30 లక్షల వార్షిక ఆదాయం పొందే వ్యక్తి ఎంతో ప్రశాంతంగా, విలాసవంతంగా, సంతోషంగా జీవించగలడని ఆయన అభిప్రాయపడ్డారు.నెటిజన్ల భిన్న స్పందనలు‘ది డార్క్ సైడ్ ఆఫ్ ఎ ₹1 క్రోర్ ప్యాకేజీ ఇన్ న్యూయార్క్’ అనే క్యాప్షన్తో షేర్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. చాలా మంది ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తూ, కేవలం డాలర్లను రూపాయిల్లోకి మార్చి చూసే వారికి అక్కడి ఖర్చులు అర్థం కావని కామెంట్లు పెడుతున్నారు. సంపాదన కంటే జీవన వ్యయం చాలా ముఖ్యమని కొందరు అంటుండగా, న్యూయార్క్ అమెరికాలోనే అత్యంత ఖరీదైన నగరం కాబట్టి అమెరికా అంతటా ఇలాగే ఉండదని మరికొందరు వాదిస్తున్నారు. అయినప్పటికీ, విదేశాలకు వెళ్లే వారికి అక్కడి పన్నులు, అద్దెలు నిజంగానే పెద్ద షాక్ ఇస్తాయనేది వాస్తవమని మెజారిటీ నెటిజన్లు చెబుతున్నారు. -
వాలెట్ పవర్..!
ప్రపంచంలో గుండెపోటు కంటే, జేబులో పర్స్ లేనప్పుడు వచ్చే ‘జేబుపోటు’ చాలా డేంజర్! ప్రేమలో అయినా, పెళ్లిచూపుల్లో అయినా, ఫ్రెండ్స్తో బిర్యానీ పార్టీల్లో అయినా మన గౌరవాన్ని కాపాడేది ఒక్క ‘మనీ పర్స్’ పల్స్ మాత్రమే! ఇలా ప్రపంచాన్ని మొత్తం మోసే పాకెట్ వాలెట్ ఫ్యాషన్లోనూ మీ రేంజ్ పెంచేయగలదు. మీరు కనుక ఈ లేటెస్ట్ ట్రెండ్స్, వాటి సీక్రెట్స్ తెలుసుకుంటే!ది మోడ్రన్ లైనప్ఇది ఒక మినిమలిస్ట్ కార్డ్ హోల్డర్. క్యాష్ కంటే కార్డ్స్, యూపీఐలే ఎక్కువ వాడేవాళ్లకి ఇది బెస్ట్. చిన్నగా, స్లిమ్గా ఉంటుంది. జేబులో పెట్టుకున్నా ‘ఏమీ లేనట్టు’ ఫీల్ వస్తుంది. క్లీన్ , మోడ్రన్ , అల్ట్రా స్టయిలిష్.క్లాసిక్ బై–ఫోల్డ్ఇది ఎప్పటికీ ఔట్ ఆఫ్ ఫ్యాషన్ కాని జెంటిల్మన్ స్టయిల్ వాలెట్. క్యాష్, కార్డ్స్ రెండూ క్యారీ చేయాలనుకునేవాళ్లకి ఇది పర్ఫెక్ట్. కానీ, ఇందులో పాత బిల్లులు, సినిమా టికెట్లు, ఫుడ్ కూపన్స్ అన్నీ నింపేస్తే, వాలెట్ కంటే చిన్న ఫైల్లా కనిపించే చాన్స్ ఉంది!స్మార్ట్ మనీ క్లిప్నోట్లను ఫోల్డ్ చేసి మధ్యలో క్లిప్తో లాక్ చేసే ఈ స్టయిల్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్లో ఉంది. జీన్స్ ఫ్రంట్ పాకెట్లో పెట్టుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. షార్ప్, రిచ్ మ్యాన్ ఎన ర్జీ వైబ్ ఇస్తుంది.లెదర్ అంటే ఎప్పటికీ క్లాస్ఫుల్ గ్రెయిన్ లెదర్ వాలెట్స్ ఎప్పుడూ టాప్లోనే ఉంటాయి. బ్లాక్, డార్క్ బ్రౌన్, టాన్కలర్స్ అయితే ఏ అవుట్ఫిట్కైనా ఈజీగా మ్యాచ్ అవుతాయి. ఇప్పుడు కార్బన్ ఫైబర్, క్యాక్టస్ లెదర్లాంటి కొత్త మెటీరియల్స్ కూడా ట్రెండ్లోకి వచ్చేశాయి. అంటే, వాలెట్లో కూడా టెక్నాలజీ ఎంట్రీ ఇచ్చేసింది అన్నమాట!కలర్స్ కూడా క్యారెక్టర్ చెప్పేస్తాయిబ్లాక్ వాలెట్ అంటే క్లాసీ వైబ్. బ్రౌన్ అంటే రిచ్ లుక్. టాన్ అంటే ట్రెండీ స్టయిల్! నేవీ బ్లూ లేదా ఆలివ్ గ్రీన్ అయితే ‘ఈయనకి ఫ్యాషన్ గురించి తెలుసు’ అనే ఫీలింగ్ వస్తుంది.ఔట్ఫిట్కి మ్యాచ్ చేయాలిఫార్మల్ డ్రెస్ వేసుకున్నప్పుడు ప్రీమియం లెదర్ బై–ఫోల్డ్ బెస్ట్. జీన్స్, టీషర్ట్తో అయితే స్లిమ్ కార్డ్ హోల్డర్ లేదా మనీ క్లిప్ సూపర్గా సెట్ అవుతుంది. ట్రావెల్ టైమ్లో జిప్ వాలెట్స్, పాస్పోర్ట్ హోల్డర్స్ చాలా యూజ్ఫుల్. అయితే, ఇక్కడ రూల్ ఏంటంటే, మీ వాలెట్ కలర్, మీ బెల్ట్ లేదా షూస్ కలర్కి మ్యాచ్ అయితే, లుక్ ఆటోమేటిక్గా రిచ్గా కనిపిస్తుంది.జాగ్రత్తలు!వాలెట్ని ఎక్కువగా నింపేయొద్దు. అలా చేస్తే, జేబులో చిన్న దిండు పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. చాలా చీప్గా కనిపించే మెటీరియల్ అస్సలు వద్దు. మంచి క్వాలిటీ వాలెట్ అయితేనే క్లాస్గా ఉంటుంది.బ్యాక్ పాకెట్లో పెట్టుకుని కూర్చుంటే వాలెట్ షేప్ కూడా మారిపోతుంది. కాబట్టి, ఫ్రంట్ పాకెట్లో పెట్టుకోవడం బెటర్. (చదవండి: నారికేళంతో నయన సంరక్షణ..!) -
నారికేళంతో నయన సంరక్షణ..!
సౌందర్య రంగంలోకి కూడా ఏఐ అడుగుపెట్టింది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్, కాస్మెటిక్స్ దిగ్గజం ఎల్జీ హెచ్–హెచ్ సంస్థ కంటి కింద వచ్చే నల్లటి వలయాలు, ముడతలను తగ్గించడానికి హైపర్ రిజువనేటింగ్ ఐ ప్యాచ్ను తయారు చేసింది. ఈ ఆవిష్కరణకు గాను ప్రతిష్ఠాత్మక ‘సీఈఎస్– 2026’ వేదికపై బ్యూటీ టెక్ కేటగిరీలో అవార్డును సొంతం చేసుకుంది.సాధారణంగా మార్కెట్లో దొరికే ఐ ప్యాచ్లు లేదా ముఖం మొత్తానికి వాడే ఎల్ఈడీ మాస్క్ల కంటే ఈ హైపర్ రిజువనేటింగ్ ఐ ప్యాచ్ ఎంతో భిన్నమైనది. ఇందులో అమర్చిన అధునాతన మల్టీ–మోడల్ ఏఐ సిస్టమ్, వినియోగదారుల చర్మతత్త్వాన్ని లోతుగా విశ్లేషించి, డిజిటల్ డేటాను తయారు చేస్తుంది. ఈ డేటా ఆధారంగా, లోపల ఉన్న ఫ్లెక్సిబుల్ ఎల్ఈడీ ప్యాచ్లు ఆ వ్యక్తి చర్మానికి ఎంత మేరకు కాంతి అవసరమో అంత మేరకు మాత్రమే కాంతిని అత్యంత కచ్చితత్వంతో ప్రసరింపజేస్తాయి. ఇది చర్మ కణాలను లోపలి నుంచి ఉత్తేజపరచేందుకు తోడ్పడుతుంది. ఈ పరికరం వాడేందుకు చాలా సౌకర్యంగా ఉంటుంది. చేతులతో పట్టుకోవాల్సిన అవసరం లేని టెక్నాలజీతో రూపొందించడం వల్ల, దీనిని కంటి కింద ధరించి తమ రోజువారీ పనులకు ఎలాంటి అంతరాయం లేకుండా చేసుకోవచ్చు. ఇది చర్మానికి అవసరమైన పోషకాలను కణాల స్థాయి వరకు చేరవేస్తూ, ప్రతి ఒక్కరి చర్మ తత్వానికి తగ్గట్టుగా ప్రత్యేకమైన సంరక్షణను అందిస్తుంది.బీరుతో కురుల రక్షణబీరు పురాతన పానీయం. బీరును పానీయంగానే కాదు, కురుల సంరక్షణ కోసం కూడా పురాతన కాలంలో ఉపయోగించేవారు. ప్రాచీన ఈజిప్షియన్, రోమన్ నాగరికతల కాలంలో బీరుతో కురులను బాగా రుద్ది శుభ్రం చేసుకునేవారు. ఇప్పుడు కూడా చాలామంది బీరును కేశసంరక్షణ కోసం వాడుతున్నారు. ‘బీర్ రిన్స్’ పేరుతో బీరుతో తలస్నానాలు చేస్తున్నారు. ముందుగా షాంపూతో తలస్నానం చేశాక, బీరుతో కురులను శుభ్రం చేసుకుంటున్నారు. బీరులోని విటమిన్–బి కాంప్లెక్స్ సహా పోషకాలు జుట్టును ఒత్తుగా ఎదిగేలా చేస్తాయి. ఇవి జుట్టుకు సహజమైన నిగారింపునిస్తాయి.నారికేళంతో నయగారంమన వంటింట్లో ఉండే వాటితోనే ముఖాన్ని మెరిపించవచ్చు. వాటిల్లో కొబ్బరి నూనె కూడా ఒకటి. కొబ్బరి నూనెలో కొద్దిగా పంచదార లేదా కాఫీ పొడి కలిపి చర్మానికి రుద్దితే మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది. స్నానం చేసిన తర్వాత ఒంటికి కొద్దిగా కొబ్బరి నూనె రాసుకుంటే చర్మం పొడిబారకుండా, మెరుస్తూ ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ప్రతిరోజూ పెదవులకు కొబ్బరి నూనె రాస్తే పెదవులు పగలకుండా ఉంటాయి. కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గడానికి రోజూ రాత్రి పడుకునే ముందు కొద్దిగా కొబ్బరి నూనెతో కళ్ల చుట్టూ మృదువుగా మసాజ్ చేస్తే ఫలితం ఉంటుంది. ముఖానికి ఉన్న మేకప్ను సులభంగా తీసేయడానికి కొబ్బరి నూనె అద్భుతంగా పనిచేస్తుంది. కొబ్బరి నూనెను దూదితో ముఖానికి రాసి తుడిచేస్తే మేకప్ అంతా తొలగిపోతుంది. (చదవండి: పేరెంటింగ్ క్లాసులో చేరాలి..!) -
నిక్కమైన చిక్కదనం ఆమె వాక్కు!
‘స్త్రీలకు స్త్రీల ఆసరా ఎప్పుడూ అవసరమే! వాళ్ళు పరస్పరం ద్వేషించుకునేందుకే, ఒకరితో ఒకరు స్నేహం చేస్తుంటారు. అలా ఒకర్నొకరు ద్వేషించుకునే క్రమంలోనే వారిమధ్య ఏదో బంధం పెనవేసుకుంటుంది!’ అన్న మాటలు ఏ స్త్రీద్వేషో అన్నవి అనుకుంటే తప్పులో కాలేసినట్లే. 2009లో నోబెల్ సాహిత్య పురస్కారం అందుకున్న జెర్మన్ రచయిత్రి హెర్తా మ్యూల అన్న మాటలివి. ‘అసలు, మృత్యువుతో తలపడడానికి ఆరోగ్యవంతమైన సుదీర్ఘ జీవితమేం అవసరం లేదు– ఇంకా ముగింపునకు రాని చిన్నపాటి బతుకు చాల’ని కూడా అన్నారు హెర్తా. ఆమె శైలి గురించి చెప్తూ, అది ‘కవిత్వంలోని చిక్కదనంతోనూ, వచనంలోని సూటిదనంతోనూ నిండివుంటుంద’ని స్వీడిష్ ఎకాడెమీ నిపుణులు ఎందుకన్నారో ఇలాంటి మాటలు వింటే అర్థమైపోతుంది. పరాయిచోట్ల తమ మూలభాషనే మాట్లాడుతూ మనుగడ సాగించే జాతి– ప్రజాతుల భాషకు కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. (ఇది తెలుగుతో సహా అన్ని భాషలకూ వర్తిస్తుంది. ఏమైనా సందేహం ఉంటే, పక్కనే వున్న తమిళనాట్లో తెలుగులు మాట్లాడే భాష వింటే అలాంటి సంశయాలు నిర్మూలమై పోతాయి!) కాఫ్కా తన రచనల్లో వాడిన జెర్మన్ లాంటి భాషనే, హెర్తా మ్యూల సైతం వాడుక చేశారని స్వీడిష్ ఎకాడెమీ పెద్దలు వ్యాఖ్యానించారు. ఇది ప్రశంసా కాదు– అభిశంసా కాదు! ఉన్నది వున్నట్లు చెప్పినమాట మాత్రమే!! ఎటొచ్చీ, కాఫ్కా 40 యేళ్ళపాటు చెక్ రాజధాని ప్రాగ్ నగరంలో బతికాడు– హెర్తా 34 యేళ్ళపాటు రొమానియాలో మనుగడ సాగించారు. అంతే! మనదేశంతో పాటే విదేశీ పాలన కాడి బరువు వదిలించుకున్న దేశాల్లో రొమానియా కూడా ఒకటి. 1947లోనే – నాజీలను మినహాయించి– అఖిలపక్ష జాతీయ ప్రభుత్వం అక్కడ ఏర్పాటయింది. కానీ, మొదటినుంచీ, రొమానియాలో సోవియెట్ పెత్తనం కొనసాగుతూనే వచ్చింది. ‘ఇంక, ఇదేం స్వాతంత్య్రం మహాశయా?’ అని గొంతెత్తి ప్రశ్నించిన వారిని శంకరగిరి మాన్యాలు పట్టించారు అక్కడి పాలకులు. ఆ దేశంలో అల్పసంఖ్యాకులుగా ఉన్న జెర్మన్లలో– హెర్తా తండ్రి మాదిరిగా– నాజీ సైన్యంలో పనిచేసినవారూ కొందరున్నారు. వాళ్ళలో వీలైనంతమందిని విరగడ చేసుకున్నారు పాలకులు. మిగిలిన స్త్రీ– శిశు– వృద్ధులను నిర్బంధ శ్రామిక క్షేత్రాలకు తరలించారు. వారి శ్రమఫలాన్ని ‘రొమానియా స్వాతంత్య్ర పోరాటానికైన ఖర్చులకు మింజుమిలె’ జమకట్టుకున్నారు ధర్మప్రభువులు! ఇదే కథను ఇతివృత్తంగా చేసుకుని హెర్తా 2009 లో ‘ఆకలి దేవత’ (ద హంగర్ ఏంజెల్) అనే నవల రాశారు. అదే సంవత్సరం ఆమెకి నోబెల్ సాహిత్య పురస్కారం ప్రకటించింది స్వీడిష్ ఎకాడెమీ! వాస్తవానికి అప్పటికి 27 సంవత్సరాలుగా హెర్తా సృజనాత్మక రచనలు చేస్తూనే వున్నారు. 1982లో ఆమె తొలి కాల్పనిక రచన, ‘న్యాదిర్స్’ (అధోలోకాలు) వెలువడింది. రొమానియన్ గ్రామీణ జీవనంలోని చీకటి కోణాలను విమర్శనాత్మకంగా చిత్రించిన అధిక్షేప రచన అది. పల్లెలో బతికే ఓ బాలుడి దృష్టికోణం నుంచి కథనం సాగడం ఇందులో చాలామందిని ఆకర్షించిన విషయం. ముఖచిత్రంపై బోదురుకప్ప బొమ్మతో వెలువడిన ఈ పుస్తకం ఆమెకి అభిమానులనూ, విమర్శకులనూ సమానంగా సంపాదించి పెట్టింది. విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న జెర్మనులు హెర్తా విమర్శను పూర్తిగా సమర్థించగా, సాంప్రదాయిక జెర్మనులు ఆమెని దుమ్మెత్తి పోశారు. కాగా, కమ్యూనిస్టు యువజన సంఘం ఈ రచనకు పురస్కారం ప్రకటించి నెత్తినపెట్టుకోవడం విశేషం.హెర్తా మ్యూల 1994లో రాసిన ‘ఆకుపచ్చ పళ్ళతోట’ ఆమెకి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టింది. ఈ రచనకు –జెర్మన్ భాషలో– హెర్తా పెట్టిన పేరు ‘హెర్జ్ టియర్.’ ఇది జెర్మన్ భాషలో వాడుకలో వున్న మాట కాదు– హెర్జ్(గుండెకాయ)+ టియర్ (జంతువు) అనే రెండు మాటల్ని కలిపి జంతుప్రవృత్తి అనే అర్థంలో ఈ మాటను సృష్టించారు హెర్తా. నికలాయ్ చౌషెస్క్యూ హయాంలో అణచివేతను తప్పించుకునే నిమిత్తం జెర్మనీకి పారిపోయిన నలుగురు యువజనుల కథ ఇది. వారిలో ఒకరుగా వున్న ఓ యువతి దృష్టికోణం నుంచి కథనం సాగుతుంది. పాశవిక ప్రవృత్తి కలిగిన పాలకులు, పాలితుల ప్రవృత్తిలో సైతం ఒకింత పాశవికత చొరబడేలా చేస్తారన్నది కథకురాలి ధ్వని. ఈ నవలను ‘చౌషెస్క్యూ హయాంలో బలైపోయిన సహచరుల స్మృతికి’ అంకితం చేశారు హెర్తా. చేదు నిజాలను చెప్పేందుకు హెర్తా ఎన్నడూ వెనకాడలేదు– అందుకే, స్వదేశంలో పరాయిజనంగా బతికిన రొమానియన్ జెర్మన్లు, జెర్మనీ నడిగడ్డపైనా అదే ‘హోదా’ సంపాదించుకోగలిగారని అనడానికి ఆమె జంకలేదు! 1947లో స్వాతంత్య్రంతో పాటే మనజాతికి సంక్రమించిన దేశవిభజన సందర్భంగా, పాకిస్తాన్ తరలి వెళ్ళిన అమాయక ముసల్మానులు అక్కడ ముహాజిర్ హోదానే పొందారు. మన దేశంలోనే మిగిలిపోయిన వాళ్ళు బావుకున్నది మాత్రమేముందని? ఇది ఓ అంతర్జాతీయ విషాద కావ్యం అనొచ్చునేమో!మందలపర్తి కిషోర్ -
పేరెంటింగ్ క్లాసులో చేరాలి..!
‘పిల్లల్ని కనడానికి ముందు పేరెంటింగ్ క్లాసులో చేరాలా?’ ‘తప్పనిసరి’ అంటున్నారు ఫౌంటెన్ హెడ్ గ్లోబల్ స్కూల్ చైర్మన్, పర్యావరణవేత్త మేఘన ముసునూరి. ఇద్దరి కూతుళ్ల పెంపకంలో తను తీసుకున్న జాగ్రత్తలను ఆమె ఇలా వివరించారు...‘‘పెళ్లి కాగానే మావారి ఉద్యోగరీత్యా యూకే వెళ్లాం. పిల్లలను కనడానికి ముందు వాళ్ల పెంపకం పట్ల ఆందోళన ఉండేది. నేను చదువుకున్న చదువులో ఈ సబ్జెక్ట్ ఎక్కడా లేదు. అందుకే, పేరెంటింగ్ క్లాస్లకు వెళ్లి, పిల్లలను ఎలా చూసుకోవాలో నేర్చుకున్నాను. కిండర్గార్టెన్ స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యాను. స్పెషల్ నీడ్స్ పిల్లలతో కలిసి వర్క్ చేశాను. ఆ నాలుగేళ్లలో ఎలాంటి పిల్లలు పుట్టినా, వారిని బాగా చూసుకోగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పుడు ప్లాన్ చేసుకొని, పిల్లల్ని కన్నాను. ఇద్దరు కూతుళ్లు తీర్థ, బిల్వ. ఇండియాలో ఉన్నప్పుడు నా చిన్నతనంలోని ఎంజాయ్మెంట్ గుర్తుకు వచ్చింది. ఇవేవీ మా పిల్లలు అనుభవించడం లేదని, నేను, మా వారు ఒక నిర్ణయం తీసుకొని, ఇండియాకు వచ్చేశాం. స్కూల్ స్టార్ట్ చేశానుహైదరాబాద్లో ఇల్లు తీసుకొని, సాఫ్ట్వేర్ రంగంలో మా వారు స్థిరపడ్డాక నేను కొంత ఆలోచనలో పడ్డాను. అప్పటి వరకు నేర్చుకున్నదాన్ని అమలులో పెట్టాలని అనుకున్నాను. ‘సేవ్ వాటర్’ ఎన్జీవోను స్టార్ట్ చేశాను. నాతో పాటు నా పిల్లలు కూడా నా వెనకాలే తిరుగుతుండేవారు. ప్రతి ఆదివారం కాలనీ పిల్లలతో ‘సేవ్ నేచర్’ పేరుతో అవేర్నెస్ ప్రోగ్రామ్లు నిర్వహించేదానిని. పిల్లల చేత పెద్దవాళ్లకు ‘సేవ్ వాటర్’ గురించి చెప్పించేదాన్ని. మియాపూర్లో ‘ఫౌంటెన్హెడ్ గ్లోబల్’ కిండర్గార్టెన్ స్కూల్ స్టార్ట్ చేశాను. స్కూల్లో ప్రధానంగా పర్యావరణానికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉండేలా ప్లాన్ చేశాను. నా పిల్లలు కూడా నా స్కూల్లోనే చదువుకున్నారు.పిల్లలూ మొక్కలూ ఒకటే! స్కూల్లోనూ, ఇంట్లోనూ పిల్లలతో మమేకం అయి చేసే పనులు వారు ఎలా గమనిస్తుంటారో, నేర్చుకుంటారో నాకు కొన్నాళ్లకే అర్థం అవుతూ వచ్చింది. ఒక రోజు తొమ్మిదేళ్ల మా పెద్దమ్మాయి నా దగ్గరకు వచ్చి, క్యాన్సర్ పేషంట్స్ కోసం తన పొడవైన జుట్టు డొనేట్ చేస్తానని చెప్పింది. అక్కను చూసి చెల్లెలూ ఇస్తానంది. క్యాన్సర్ సెల్ గురించి చదివామని, అందుకే ఆ నిర్ణయం తీసుకున్నామని పిల్లలిద్దరూ చెప్పారు. ఓ రోజు మా చిన్నమ్మాయి ‘సమ్మర్లో ఎందుకింత వేడిగా ఉంటోంది’ అని అడిగింది. ‘మా చిన్నప్పుడు ఇంత వేడి లేదు. చెట్లు పెంచితే వేడి తగ్గుతుంది’ అని చెప్పాను. అప్పటి నుంచి పిల్లలిద్దరూ కాలనీలలో మొక్కలను పెంచడం, పంచడం మొదలుపెట్టారు. పంచే ప్రతి మొక్కకు మూడేళ్లు వచ్చేవరకు ‘మేం జాగ్రత్తగా పెంచుతాం’ అనే ప్రతిజ్ఞ పేపర్ రాయించుకొని, మరీ ఇచ్చేవారు. దాదాపు 60 వేల మొక్కలు పంచారు. ఇంట్లో పొదుపుగా సహజవనరులను వాడటం, ప్రాక్టీస్ చేయించడం వల్ల ఇవన్నీ పిల్లలకు అలవడ్డాయి. మొక్కలను ఎంత జాగ్రత్తగా పెంచితే నీడనిచ్చే వృక్షాలు అవుతాయో, పిల్లలూ అంతే!. పర్యావరణం గురించి నేర్పుతూ! నేను ఏం చెప్పినా ఎన్విరాన్మెంట్, నేచర్ గురించి చెప్పేదాన్ని. అది వారికి బాగా వంటపట్టింది. స్కూల్పిల్లలతో కలిసి మా ఏరియాలోని మీది కుంట చెరువు శుభ్రతకు కృషి చేశాం. మా పెద్దమ్మాయి చెరువు శుభ్రత కోసం తన పాతికలక్షల చెక్ డొనేట్ చేసింది. దీంతో మా చిన్నమ్మాయి వాళ్ల నాన్నతో కలిసి చెరువు చుట్టూ పార్క్ ఏరియా ఏర్పాటుకు కృషి చేసింది. కరోనా సమయంలో పిల్లలు ‘ఓజోన్ రన్’ చేశారు. ఆ తర్వాత కాలనీలలో 100 డేస్ క్లీనప్ సెషన్స్ నిర్వహించారు. ఇప్పుడు మా పెద్దమ్మాయి లండన్లో పబ్లిక్ హెల్త్పై ఎడ్యుకేషనల్ రీసెర్చ్ చేస్తోంది. చిన్నమ్మాయి బిల్వ హైదరాబాద్లోనే కార్బన్ టాక్సేషన్ కోర్సులో చేరింది. పిల్లల పెంపకంలో ప్రతి తరానికి ఫార్ములా మారుతుంటుంది. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వాలి. పర్ఫెక్ట్ చైల్డ్, పర్ఫెక్ట్ పేరెంట్ అంటూ ఉండరు. పేరెంట్ అవ్వాలనుకునే ముందు పేరెంటింగ్ క్లాసులు తీసుకోవడం తప్పనిసరి. అప్పుడే సరైన అవగాహనతో పిల్లలను పెంచగలం’’ అని వివరించారు ఈ పర్యావరణవేత్త. సొంతంగా ఎదిగేలా! మా పెద్దమ్మాయి తీర్థ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో పాల్గొంది. పాతిక లక్షల రూపాయల బహుమతి తెచ్చుకుంది. చిన్నమ్మాయి నేను కూడా ఆ ప్రోగ్రామ్లో పాల్గొంటాను అంది. అప్పుడు తన ఏజ్ 9. అండర్ ఏజ్ వాళ్లకు అవకాశం లేదని చెప్పాను. దీంతో తను కూడా సంపాదిస్తానని టీచర్స్తో మాట్లాడి ఒక మెనూ రూపొందించి, స్కూల్లో ఒక ఫుడ్ కార్నర్ స్టార్ట్ చేసింది. డబ్బు గురించి కాదు వాళ్లకున్న ప్యాషన్ని పరిచయం చేయాలనుకుని, ఫుడ్ కార్నర్ ఏర్పాటుకు ఎంకరేజ్ చేశాను. ఆ సమయంలో కలినరీ లాంజ్లో పెద్ద పెద్ద షెఫ్స్కి హాండీటాక్స్ అనే ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. మా చిన్నమ్మాయి బిల్వను అక్కడ పరిచయం చేశారు. దీనికి బ్రిటిష్ హై కమిషన్ ‘యంగెస్ట్ ఫుడ్ ఆంట్రప్రెన్యూర్ ఆఫ్ హైదరాబాద్’ అని ట్వీట్ చేశారు. పిల్లలు ఆడంబరాలకు పోకుండా పెరిగేలా జాగ్రత్తలు తీసుకున్నాను. నిర్మలారెడ్డి(చదవండి: చనిపోదాం అనుకున్నవాడు... సీఎం అయ్యాడు!) -
కరోనా నాటి ఘోర తప్పిదం.. నేడు వేలాది ప్రాణాలకు ముప్పు!
ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోవడం, లాక్డౌన్లు, వ్యాక్సినేషన్ డ్రైవ్లు మాత్రమే మనకు గుర్తున్నాయి. కానీ, ఈ విపత్తు వెనుక ఎవరికీ తెలియకుండా ఒక నిశ్శబ్ద సంక్షోభం దాగి ఉందనే దిగ్భ్రాంతికర నిజాన్ని పరిశోధకులు ఇప్పుడు బయటపెట్టారు. కరోనా విజృంభణ సమయంలో రొటీన్ హెల్త్కేర్ సేవలు నిలిచిపోవడంతో, వేలాది మంది క్యాన్సర్ రోగుల వ్యాధి నిర్ధారణ (డయాగ్నోసిస్) ఆలస్యమైంది. ఇది భవిష్యత్తులో వారి ప్రాణాలకే ముప్పుగా మారే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.‘ది లాన్సెట్ ఆంకాలజీ’ సంచలన అధ్యయనంప్రఖ్యాత అంతర్జాతీయ వైద్య జర్నల్ ‘ది లాన్సెట్ ఆంకాలజీ’ ప్రచురించిన ఒక సంచలన అధ్యయనం ప్రకారం కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైన మొదటి తొమ్మిది నెలల్లో ప్రపంచంలోని ఏడు అభివృద్ధి చెందిన దేశాలలో సుమారు 55,000 క్యాన్సర్ నిర్ధారణ కేసులు రికార్డు కాలేదు. ఆస్ట్రేలియా, కెనడా, డెన్మార్క్, ఐర్లాండ్, న్యూజిలాండ్, నార్వే, బ్రిటన్ దేశాలకు చెందిన దాదాపు 26 లక్షల మంది రోగుల డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. 2020 ఏప్రిల్ నుండి డిసెంబర్ మధ్య కాలంలో, కరోనాకు ముందుతో పోలిస్తే క్యాన్సర్ నిర్ధారణలు ఏకంగా 16 శాతం తగ్గాయని వారు కనుగొన్నారు. సాధారణ పరిస్థితులు ఉంటే గుర్తించాల్సిన వేలాది కేసులు వ్యవస్థలోకి రాలేదంటే, ఆ క్యాన్సర్లు మాయమయ్యాయని కాదు, కేవలం నిర్ధారణ కాకుండా రోగుల శరీరాల్లోనే ఉండిపోయాయని అర్థం.కొంపముంచిన లాక్డౌన్ఈ అంతరాయం వల్ల అన్ని రకాల క్యాన్సర్ల కంటే కొన్ని నిర్దిష్ట క్యాన్సర్ల గుర్తింపు తీవ్రంగా ప్రభావితమైందని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా పురుషులలో వచ్చే ‘ప్రోస్టేట్ క్యాన్సర్’ నిర్ధారణలు అత్యధికంగా 24 శాతం తగ్గాయి. అలాగే మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్ కేసులు 18 శాతం, చర్మ క్యాన్సర్కు సంబంధించిన మెలనోమా కేసులు కూడా 18 శాతం మేర పడిపోయాయి. అయితే, ఊపిరితిత్తుల క్యాన్సర్ , అండాశయ క్యాన్సర్ నిర్ధారణలపై ఈ ప్రభావం కొంత తక్కువగానే ఉంది. సాధారణ హెల్త్ స్క్రీనింగ్లు లేదా సాధారణ ఓపీ సంప్రదింపులపై ఆధారపడే క్యాన్సర్లే లాక్డౌన్ల వల్ల ఎక్కువగా వెలుగులోకి రాలేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.నిర్ధారణలు తగ్గడానికి గల ప్రధాన కారణాలుకరోనా సమయంలో క్యాన్సర్ పరీక్షలు ఇంతలా క్షీణించడానికి అనేక కారణాలు దోహదం చేశాయి. అప్పట్లో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి, కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందించడానికి అనేక దేశాలు క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్లను తాత్కాలికంగా నిలిపివేసాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ముఖాముఖి అపాయింట్మెంట్లు దొరకడం గగనమైంది. మరోవైపు, ఆస్పత్రులకు వెళ్తే ఎక్కడ కోవిడ్ సోకుతుందోననే భయంతో ప్రజలు కూడా స్వచ్ఛందంగా వైద్య పరీక్షలను వాయిదా వేసుకున్నారు. సాధారణంగా క్యాన్సర్ తొలిదశలో కనిపించే చిన్నపాటి లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల, వ్యాధి తీవ్రత పెరిగే వరకు అది బయటపడకుండా ఉండిపోయింది.కొన్ని దేశాల ముందస్తు వ్యూహం ఈ విపత్కర పరిస్థితుల్లోనూ కొన్ని దేశాలు మెరుగైన పనితీరును కనబరిచాయి. బ్రిటన్, ఐర్లాండ్ దేశాలతో పోలిస్తే నార్వే, న్యూజిలాండ్ దేశాలలో క్యాన్సర్ నిర్ధారణల తగ్గుదల చాలా తక్కువగా ఉంది. అంతేకాకుండా ఆ దేశాలు చాలా వేగంగా కోలుకుని తిరిగి సాధారణ స్థితికి వచ్చాయి. స్క్రీనింగ్, డయాగ్నోస్టిక్ సేవలను నిరంతరాయంగా కొనసాగించగల బలమైన ఆరోగ్య వ్యవస్థలు ఉండటమే దీనికి కారణమని తేలింది. భవిష్యత్తులో వచ్చే ఇలాంటి ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కొనాలో , ఆరోగ్య సేవలు దెబ్బతినకుండా ఎలా కాపాడుకోవాలో అర్థం చేసుకోవడానికి ఈ దేశాల వ్యూహాలు ఎంతో సహాయపడతాయని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ప్రతినిధి ఇసాబెల్లె సోర్జోమతారమ్ పేర్కొన్నారు.భవిష్యత్తులో పొంచి ఉన్న దీర్ఘకాలిక ముప్పువైద్య సేవల్లో జరిగిన ఈ ఆలస్యం వల్ల రోగుల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లుతుందనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. 2020లో ఆలస్యంగా గుర్తించిన క్యాన్సర్లు వెంటనే తీవ్రమైన దశకు చేరుకున్నట్లు స్పష్టమైన ఆధారాలు ప్రస్తుత అధ్యయనంలో లభించనప్పటికీ, దీర్ఘకాలిక ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్ అనేది శరీరంలో ఏళ్ల తరబడి పెరుగుతుంది. కాబట్టి ఈ ఆలస్యపు పరిణామాలు భవిష్యత్తు డేటాలో మాత్రమే స్పష్టంగా తెలుస్తాయి. ఇప్పటికే ‘జామా ఆంకాలజీ’ ప్రచురించిన మరో అధ్యయనం ప్రకారం, అమెరికాలో 2020-21లో జరిగిన క్యాన్సర్ కేర్ అంతరాయాల వల్ల ఏడాదిలోనే దాదాపు 17,390 మంది అదనంగా మరణించారని అంచనా వేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.వైద్య రంగానికి ఈ పరిశోధన నేర్పిన పాఠాలుఏదైనా ఒక మహమ్మారి వచ్చినప్పుడు కేవలం ఆ ఒక్క వ్యాధిపైనే కాకుండా, ఇతర ప్రాణాంతక వ్యాధుల చికిత్సపై కూడా దృష్టి పెట్టాలనే పఠాన్ని ఈ అధ్యయనం నేర్పుతోంది. భవిష్యత్తులో ఎలాంటి సంక్షోభాలు ఎదురైనా క్యాన్సర్ స్క్రీనింగ్, డయాగ్నోస్టిక్ పరీక్షలు, సాధారణ వైద్య సేవలను ప్రాధాన్యత క్రమంలో కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్య వ్యవస్థల స్థితిస్థాపకత అనేది కేవలం అత్యవసర ముప్పును ఎదుర్కోవడమే కాదు, ప్రజలకు అందాల్సిన అవసరమైన నివారణ, రోగనిర్ధారణ సేవలను నిరంతరాయంగా అందించడంలోనే ఉందని ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది.ఇది కూడా చదవండి: నాటి రోజుల్లో కేరళ రుతుపవన సంకేతాలు -
ఆఖరి మనిషి
గాఢాంధకారం. ఎటు చూసినా చీకటే. నక్షత్రాలు తప్ప ఏమీ కనిపించనంత చీకటి అలుముకొని ఉంది. భూమి మీద ఆ రాత్రి– కాళరాత్రి కాబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. శబ్దాల మధ్య నిశ్శబ్దంలా, అస్తిత్వం ముగిసిన తర్వాత మిగిలే శూన్యంలా భూమి కనిపిస్తోంది.ఇంతలో గాలి బలంగా వీచింది. కానీ ఆ గాలిలో జీవం లేదు. ఆ గాలి ఒకప్పుడు మానవులకు ఊపిరి పోసింది. కానీ, ఇప్పుడు జీవకోటి మొత్తం నాశనం అయి పుడమి అంతా బోసిపోయి కనిపిస్తోంది. ఆ సమయంలో ఒక కదలిక కనిపించింది. అందులో శబ్దం లేదు. అది అడుగుల చప్పుడూ కాదు. అది ఒక ఉనికి. భూమి కూడా గుర్తుపట్టని ఒక ఆకారం వస్తూ కనిపించింది. ఆమె ఆకాశం నుంచి దిగలేదు. భూమి లోతుల్లోనుంచి పైకి రాలేదు. ఆమె ఎప్పటి నుంచో ఇక్కడే ఉంది. కానీ ఈరోజు ఆమెను చూడగలిగే కళ్ళు లేవు.ఒకప్పుడు కోట్లాది హృదయాల్లో నిశ్శబ్దంగా నివసించిన ఆమె, ఈరోజు ఖాళీ ప్రపంచంలో తన ఉనికిని తానే మోస్తోంది. ఆమె అడుగులు నేలను తాకలేదు. కానీ ఈ ధరిత్రి ఆమెను చాలాకాలం భరించింది. ఆమె నడిచి వస్తుంటే నదులు పొంగినట్లు, అడవులు కదిలినట్లు, ఉరుములు ఉరుముతున్నట్లు, పర్వతాలు ఎగురుతున్నట్లు అనిపిస్తోంది. ప్రకృతి ఆమెను ఆహ్వానించలేదు. ఆమెను అడ్డుకోలేదు కూడా. ఆమెకు అడ్డుచెప్పేవారు ఈ భూమ్మీద ఎవ్వరూ లేరు. ఆమె నడుస్తోంది. శిథిలమైన నగరాల మధ్యగా, విరిగిన గాజు ముక్కల మీదుగా, శిథిలాల నిశ్శబ్దాన్ని దాటి ఆమె వస్తోంది. ఆమె ప్రతి అడుగులో రౌద్రం కనిపిస్తోంది.ఈ భూమ్మీద మొదటి మనిషి పుట్టిన క్షణం నుంచి చివరి మనిషి శ్వాస వరకు ఆమెకు నిద్ర లేదు. ఆమెకు కాలం అనే పరిమితి లేదు. ఒక పాత నగరం మధ్యలో ఆమె ఆగింది. అక్కడ ఒక నిశ్శబ్దం మధ్యలో చిన్న శబ్దం వినిపిస్తోంది. అది ఎవరిదో శ్వాస. అది బలహీనంగా ఉంది. అది ఆఖరి మనిషి శ్వాస. ఆమె కళ్ళు మూసుకుంది. అతని కోసం ఆమె వెతకాల్సిన అవసరం లేదు. జీవం తనను తానే బయట పెట్టుకుంటుంది. భయం ఎప్పుడూ దాక్కోలేదు. ఆమె మెల్లగా ఆ దిశగా నడిచింది. ఆమె అడుగులు వేగంగా లేవు. అవి ఎప్పుడూ తొందరపడవు. కానీ ఆమె అవి సమయానికి చేరవలసిన చోటుకి చేరుకుంటాయి.ఒకప్పుడు మనుషులు, పశుపక్ష్యాదులు, చెట్టు చేమలు, అడవులతో కళకళ లాడుతూ ఉండే ధరిత్రి అంతా రుద్రభూమిని తలపిస్తోంది. ఆమె ఆలోచిస్తూ ఒక్క క్షణం ఆగింది. అంతటా నిశ్శబ్దం. సూదిమొన పడితే వినిపించేటంతటి నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ఆమెకు ఒక సవ్వడి వినిపించసాగింది. కొద్ది క్షణాల తరువాత అది గుండె సవ్వడిగా ఆమెకు అర్థమైంది. అది మనిషి శ్వాస. లబ్ డబ్మని వినిపిస్తున్న ఆ శబ్దం నిశ్శబ్దాన్ని భంగపరుస్తోంది. అక్కడ కొద్ది దూరంలో ఉన్న కొండ పక్కన ఒక చిన్న ఇంట్లోంచి ఆ శబ్దం వస్తోంది. ఆమె ఆ శ్వాస వస్తున్న ఇంటి వైపు కదిలింది. ఇంటి మధ్యలో ఒక గోడ ఉంది. లోపల ఒక వ్యక్తి మంచం మీద పడుకొని నిద్రపోతున్నాడు. ఆమెను చూడగానే అతను ఒక్కసారిగా ఉలిక్కిపడి కూర్చున్నాడు. ముఖాన్ని చేతులతో కప్పుకొని ఏడవటం మొదలుపెట్టాడు. ఆమె అతని దగ్గరకు వెళ్లి ఎదురుగా నిలబడింది. అతను ఒక్కసారిగా తలెత్తి ఆమెని చూశాడు. అతని కళ్ళల్లో భయం కనిపిస్తోంది. ముఖం మీద చెమటలు మొదలయ్యాయి. పెదవులు వణకసాగాయి. దాహంతో నాలుక పిడచ కట్టుకుపోతోంది. అయినా సరే ఓపిక తెచ్చుకొని ‘‘నువ్వెవరు?’’ అని అడిగాడు.అతని మాటలకు ఆమె నవ్వింది. ఆ నవ్వు ఆ గది అంతా ప్రతిధ్వనించసాగింది. ఆ నవ్వులో సత్యం వినిపిస్తోంది.‘‘నేనెవరో నీకు తెలియదా?’’ అని ఆమె అతని వైపు చూస్తూ అడిగింది.అతను భయంతో వెనక్కి జరిగి, ‘‘నా...కు ను...వ్వు ఎ...వ...రో... తెలియదు’’ అన్నాడు వణుకుతున్న స్వరంతో.‘‘నేనెవరో తెలిసినా నువ్వు అబద్ధాలాడుతున్నావు. ఎందుకంటే నేను రావడం నీకు ఇష్టం లేదు. నీకే కాదు, ఏ జీవికీ ఇష్టం ఉండదు. నేనంటే మీకు భయం. అయినా సమయం వచ్చినప్పుడు నేను రాక తప్పదు. ఇది నగ్న సత్యం. ఈ సత్యాన్ని మీరు ఒప్పుకోరు. అందరూ వెళ్లిపోయారు. నువ్వు ఒక్కడివే మిగిలావు. నిన్ను కూడా తీసికెళ్ళిపోతే నా పనై పోతుంది. బయలుదేరు. సమయం మించిపోతోంది. ఇప్పటికే ఆలస్యం అయింది’’ అంది ఆమె కోపంగా.‘‘నేను నీతో రాను. నాకు ఇక్కడ బోలెడు పనులు వున్నాయి. నేను నీతో వస్తే అవన్నీ ఆగిపోతాయి. నేను తరువాత వస్తాను. అయినా నేను నీతో ఎందుకు రావాలి? నన్ను తీసికెళ్ళడానికి నువ్వు ఎవరు? నీకేం హక్కు వుంది?’’ అని అన్నాడు అతను గోడ దగ్గరకు వెళుతూ.అతని మాటలకు ఆమె కోపంగా అతనివైపు చూసింది. అంతే! గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె అతని వైపు వెళ్ళసాగింది. ఇప్పుడు ఆమె కళ్ళలో కోపం లేదు. దయ లేదు. జాలి అంతకన్నా లేదు. ఆమె కళ్ళల్లో ఏ భావం కనిపించటం లేదు.‘‘నేనెవరో నీకు తెలుసు. అయినా మీ మనుషులు మీ గోతిని మీరే తవ్వుకున్నారు. హాయిగా బతకమని మిమ్మల్నందరినీ ఇక్కడకు పంపిస్తే మీరు ఇక్కడ వినాశనాన్ని సృష్టించారు. యుద్ధాలు మొదలయ్యాయి. అణుబాంబులు, రసాయన ఆయుధాలతో మనిషి మనిషినే చంపడం ప్రారంభించాడు. అతను రాక్షసులతో పోరాడుతున్నానని అనుకున్నాడు. కానీ తన జాతిని తానే నాశనం చేస్తున్న విషయాన్ని గ్రహించలేకపోయాడు. చివరకు తానే తన జాతి పాలిట రాక్షసుడయ్యాడు. మీ జాతితో పాటు ఇక్కడి ప్రకృతిని, జంతుజాలాన్ని, అడవుల్ని కూడా విధ్వంసం చేశాడు. అందుకే మీరు ఇక్కడుండే అర్హత కోల్పోయారు’’ అంటూ ఆమె అతని వైపు చేయి చాపింది.‘‘ఎవరో తప్పు చేస్తే దానికి మేమెలా కారణం అవుతాము. ఎవరు తప్పు చేస్తే వాళ్ళను శిక్షించాలి. అయినా అంత తప్పు మేమేం చేశాము? మేము ప్రకృతిని స్వంతం చేసుకోవాలని చూశాము. ఆమెతో కలిసి లేకపోయాము’’ అన్నాడు ఆ వ్యక్తి.ఆ మాటలు అంటూ ఉంటే అతని కళ్ళలో నీళ్లు మెరిశాయి. అప్పుడతనికి తమ జాతి చేసిన తప్పు ఏమిటో అర్థమైంది. నిజం ఎప్పుడూ నిజమే. అది అబద్ధం ఎప్పటికీ కాదు. ‘Truth is rarely pure and never simple’’ (సత్యం అరుదుగా స్వచ్ఛమైనది, అదెప్పుడూ సులువైనది కాదు) అన్న ‘ఆస్కార్ వైల్డ్’ మాటలు అతనికి అప్పుడు గుర్తుకు వచ్చాయి.అతని మాటలు ఆమెకు కోపాన్ని తెప్పించాయి. మీరేం తప్పు చేశారో మీకు తెలియదా? నేను చెప్పాలా? మీ కోసం ఆ దేవుడు ఈ అందమైన భూగోళాన్ని సృష్టించాడు. అది అగ్నిగోళంగా మొదలై, జలగోళంగా మారి, జీవకోటికి అనువుగా మారింది. ఈ భూమి మీద మొదటిసారిగా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక సూక్ష్మకణం కదిలి జీవం పోసుకొని ప్రాణిగా మారింది. తరువాత అది జీవ పరిణామం చెందింది. విస్తరించింది. చివరకు మనిషిగా రూపుదిద్దుకుంది. అయితే మనిషి పుట్టుకనుంచే దారి తప్పాడు. ‘Nature is the source of all true knowledge’’ (సమస్త జ్ఞానానికీ ప్రకృతే మూలాధారం) అని మీ మనిషే అయిన లియోనార్డో డా విన్సీ చెప్పాడు. కానీ మీరు అతని మాటలను పెడచెవిన పెట్టారు. ప్రకృతి నుంచే జ్ఞానం పుట్టింది. కానీ ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకునే వినయం మనిషి కోల్పోయాడు. మనిషి గొప్ప పనులను చెయ్యగలడు. గొప్పగా ఆలోచించగలడు. సృష్టికి ప్రతిసృష్టిని చెయ్యగల నేర్పరి. అది అతని మహత్తు. అది అతని వరం. కానీ అదే అతని శాపమైంది. అతను అగ్నిని కనుగొన్నాడు. చక్రాన్ని సృష్టించాడు. భాషను కనిపెట్టాడు. లిపిని తయారు చేసుకున్నాడు. కానీ అతను తనను తాను దేవుడిగా భావించడం మొదలుపెట్టాడు. ‘Knowledge is power, but wisdom is restraint.’’ (జ్ఞానం శక్తి, కాని వివేకం నియంత్రణ) జ్ఞానం అతనికి శక్తిని ఇచ్చింది కానీ, జ్ఞానం మీద నియంత్రణను అతను కోల్పోయాడు. అందువల్ల అదే అతని వినాశనానికి కారణభూతమైంది. ఈ భూమి మీద నాలుగు వందల కోట్ల సంవత్సరాల నిశ్శబ్ద తపస్సు తర్వాత జీవకోటి ప్రాణం పోసుకుంది. అప్పటి నుంచి ఈ ధరిత్రి అనేక జనన మరణాలను చూసింది. ‘The Earth does not belong to man; man belongs to the Earth.’’ (భూమి మనిషిది కాదు, మనిషి భూమికి చెందుతాడు) భూమి ఎవరికీ చెందదు. కానీ ఆ విషయాన్ని మీ మనుషులు గుర్తించలేకపోయారు. మట్టిలోంచి పుట్టిన మనిషి, మట్టిలో కలవాల్సిందే అన్న నగ్నసత్యం అతనికి ఎప్పుడూ అర్థం కాలేదు. ఫలితం– అడవులు నాశనం అయ్యాయి. నదులు ఎండిపోయాయి. పర్వతాలు తరిగిపోయాయి. తాను ప్రకృతిని జయిస్తున్నానని అనుకున్నాడు. ‘Man conquers nature only to discover he has conquered himself..’’ (మనిషి తనను తాను జయించానని కనుగొనడానికి ప్రకృతిని జయిస్తాడు) కానీ అది ఎంతటి విపరీతాలకు దారి తీస్తుందో అర్థం చేసుకోలేకపోయాడుప్రకృతిని జయించినట్టు అనిపించిన ప్రతి క్షణం, తనను తానే నాశనం చేసుకున్నాడు. ప్రకృతి ఎప్పుడూ మౌనంగా ఉంటుంది. ఆమె హెచ్చరికలు మెల్లగా వస్తాయి. గాలి వేడెక్కింది. నీళ్లు విషపూరితం అయ్యాయి. జీవజాలం క్షీణించింది. కానీ పట్టించుకోలేదు. ‘We do not inherit the Earth from our ancestors’’ (భూమిని మనం మన పూర్వీకుల నుంచి వారసత్వంగా పొందలేదు) కానీ భూమిని, దాని మీద వుండే ప్రకృతిని మీ మనుషులు తన స్వంత ఆస్తి అనుకున్నారు. దాన్ని నాశనం చెయ్యడం మొదలుపెట్టారు.అందుకే అది మీ మీద కన్నెర్ర చేసింది. ఒక రోజు అది తన ప్రతాపాన్ని చూపింది. అందువల్ల అగ్ని వర్షాలు, ఆమ్ల వర్షాలు కురిశాయి. గాలి విషంలా మారింది. భూమి కంపించింది. మనిషి పరుగెత్తాడు. దాక్కున్నాడు. పోరాడాడు. కానీ ‘nature is not cruel, just unapologetically true to itself ’’ (ప్రకృతి క్రూరమైనది కాదు, కేవలం తనకు తాను ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా తన స్వభావానికి కట్టుబడి ఉంటుంది) ప్రకృతి క్రూరమైనది కాదు, కేవలం తన నిజ స్వరూపానికి కట్టుబడి ఉంటుంది. అది న్యాయానికి కట్టుబడి ఉంటుంది. ప్రకృతిని మీరు నాశనం చేయాలనుకున్నారు. కానీ చివరకు మీరే నాశనం అయ్యారు. అందుకే మీ జాతి అంతరించిపోయింది. చివరికి నువ్వొక్కడివే మిగిలావు. నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ భూమ్మీద మిగతా జీవరాశులు హాయిగా నివసిస్తున్నాయి. ఆంథ్రోపాలజీ ప్రకారం మీ మనుషులు వానర జాతి కుటుంబానికి చెందినవారు. కాలక్రమేణా మీరు ద్విపాదులయ్యారు. అటువంటి గొప్ప మానవుల్లో నువ్వు ఆఖరి మనిషివి. నిన్ను తీసికెళదామనే నేను ఇప్పుడు వచ్చాను. బయలుదేరు’’ అంది ఆమె.ఆమె మాటలకు అతను ఆశ్చర్యపోతూ, ‘‘నేను చచ్చినా రాను. ఇంతకీ నన్ను తీసికెళ్ళడానికి నువ్వెవరివి?’’ అని అడిగాడు ఆ ఆఖరి మనిషి.అతని మాటలకు ఆమె నవ్వుతూ ‘‘ఇంకా నన్ను పోల్చుకోలేదా? నేను మీ జాతిని సర్వనాశనం చెయ్యడానికి ఆ ప్రకృతి పంపించిన మృత్యుదేవతను’’ అంటూ తన చెయ్యిని అతని వైపు తిప్పింది. వెంటనే ఆ చేయి అతని వైపు కదల సాగింది. అతను స్పృహ తప్పి పడిపోతున్నాడు. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. స్పర్శ ఆగిపోతున్నట్లు భావన కలుగుతోంది. అతను కొద్ది క్షణాలకు అచేతనుడయ్యాడు. వెంటనే అతను మేల్కొన్నాడు. అతను బయటకు వెళ్లి అక్కడి నుంచి పరుగు లంఘించుకున్నాడు. అతను చాలాసేపు పరిగెత్తిన తరువాత అలసిపోవడం వల్ల బాగా దాహం వేసి ఒక చెట్టు కిందకు చేరాడు. కానీ అక్కడ నవ్వుతూ అదే మృత్యుదేవత కనిపించింది.‘‘ఎక్కడికి పరిగెడుతున్నావు? ఎంత దూరం వెళతావు. నువ్వు ఎక్కడికి వెళ్లినా నేను నీ వెంటే ఉంటాను. నీ మృత్యువు ఎప్పుడూ నీ నీడలా నీ వెంటే ఉంటుంది. అటువంటి నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. నా చేతులు కబంధుడిలా చాలా పెద్దవి’’ అంది ఆమె నవ్వుతూ.అప్పుడు అతను ‘‘దయచేసి నన్ను వదిలెయ్యి. నేను కూడా చనిపోతే ఈ భూమ్మీద మనిషి అన్నవాడి ఆనవాలు లేకుండా పోతుంది. ‘I am the Last Man! ... No king, no lord, no slave, no master; but aman, alone in the world!’’ (నేను ఆఖరి మనిషిని!... రాజును కాదు, ప్రభువును కాదు, బానిసను కాదు, యజమానిని కాదు; కేవలం మనిషిని, ఈ ప్రపంచంలో ఏకాకిని) అనీ అతను వేడుకున్నాడు.అప్పుడు మృత్యువు నవ్వింది.’ You were never meant to last forever’’ (ఎల్లకాలం మనుగడ సాగించడానికి నువ్వు లేవు) మీ జాతి తన పరిమితిని దాటి వెళ్లింది. ఇక మిమ్మల్ని ఉపేక్షించే ప్రశ్నే లేదు’’ అంది అతని దగ్గరకు వస్తూ. ‘‘అమ్మా! దయచేసి నా దగ్గరకు రావద్దు. మేము తప్పు చేశాము. అంత మాత్రాన మా జాతి ఉనికి లేకుండా చేస్తావా? ఇది న్యాయమా చెప్పు?’’ అని ఆమెకు రెండు చేతులెత్తి దండం పెట్టాడు.క్షణం తరువాత ఆమె చేయి అతన్ని తాకింది. ఆ స్పర్శ చలిగా లేదు, వేడిగా లేదు; అతనికి స్పర్శ తెలియటం లేదు. అతను కళ్ళు మూసుకున్నాడు. ఇప్పుడతనికి భయం పోయింది. అహంకారం కరిగిపోయింది. మృత్యువు అతనిని తాకింది. ఆఖరి మనిషి చరిత్ర పుటల్లో చివరి పంక్తిగా మిగిలిపోయాడు. గాలి మళ్లీ స్వచ్ఛమైంది. వర్షం మళ్లీ మృదువుగా కురిసింది. ప్రకృతి మళ్లీ మొదలైంది. మనిషి లేకుండా కూడా ఆమె సంపూర్ణమే. ‘All the world's a stage, and all the men and women merely players.’’ (ప్రపంచమంతా నాటకరంగం. స్త్రీ పురుషులంతా నటీనటులు) అని విలియం షేక్స్పియర్ చెప్పాడు. కానీ భూమ్మీద మనిషి ఆడే నాటకంలో మనిషి పాత్ర ముగిసింది. కానీ వేదిక ఇంకా ఉంది. నిశ్శబ్దం. ఆ చెట్టు కింద గాలి కూడా ఊపిరి బిగబట్టి నిలిచినట్టుంది.ఆఖరి మనిషి ఆమె ముందు అచేతనుడై పడివున్నాడు. ఆ రాత్రి ఒక మనిషి చనిపోలేదు, ఒక జాతి కథ ముగిసింది. మనిషి శాశ్వతం కాదు. మనిషి తన మూలాన్ని మరచిపోయిన క్షణమే అతని వినాశనం ప్రారంభమైంది. మనిషి ఆలోచించాడు. ఆ ఆలోచన అతనికి శక్తి ఇచ్చింది. కానీ ఆ శక్తి అతని మితిమీరిన ఆకాంక్షలకు ఆయుధమైంది. ఆకాశాన్ని తాకాడు, సముద్ర గర్భాన్ని చీల్చాడు. కానీ, తన అంతర్ముఖంలో ఉన్న లోపలి అంతరాత్మను మాత్రం జయించలేకపోయాడు. మనిషికి జ్ఞానం పెరిగింది, వివేకం తగ్గింది.కొద్ది క్షణాల తరువాత ఆమె ఒక పుస్తకం తీసి అందులో ఆఖరి మనిషి అన్న వాక్యం దగ్గర ఒక ఇంటూ మార్కు పెట్టింది. ఇప్పుడు ఆ పుస్తకం నిండా ఎర్రటి ఇంటూ మార్కులే. అది ఆ పుస్తకం చివరి పేజీ.గన్నవరపు నరసింహ మూర్తి -
ఒక్క బిస్కట్కు లక్ష
ఒకటి తక్కువైంది... ఒకటి తక్కువైంది... ఇదేదో సినిమాలో డైలాగ్ కాదు, నిజంగానే ఒకటి తగ్గింది. అయితే, ఇక్కడ తగ్గింది రెస్పెక్ట్ కాదు బిస్కట్. ప్యాకెట్లో పదహారు ఉండాల్సినవి పదిహేనే ఉన్నాయి. ఆ.. ఒకటే కదా? అని చాలా మంది ‘లైట్’గా తీసుకుంటారు. కానీ ఆ వ్యక్తి అలా భావించలేదు. తనకు ఒక్కటే. పదిమంది అయితే పది... వందమంది కొంటే వంద... అదే లక్షల్లో అయితే..? ఇలా ఆలోచించాడు. కంపెనీ దృష్టికి తీసుకెళ్లాడు. స్పందన లేకపోవడంతో వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. వినియోగదారులు ఎలా నష్టపోతున్నారో వివరించాడు. న్యాయం చేయాలని అభ్యర్థించాడు. ప్యాకేజ్డ్ వస్తువులపై కొంతమంది ఎక్స్పైరీ డేట్, మరికొందరు రేట్ చూస్తారు. ఎక్కువ మంది ఇవేవీ పట్టించుకోరు. కావాల్సింది కొంటారు, తింటారు. బాగోకపోతే పడేస్తారు. ఇంకొందరు అలా కాదు, అన్నీ చూస్తారు. తేడావస్తే నిలదీస్తారు. అవసరమైతే న్యాయ పోరాటమూ చేస్తారు. వినియోగదారుడిగా తనకు ఉన్న హక్కును సాధిస్తారు. ఇలాంటి కోవకే చెందిన వ్యక్తి చెన్నైకి చెందిన ఢిల్లీబాబు.అసలేం జరిగింది.. ఢిల్లీబాబు వీధి జంతువుల కోసం రెండు డజన్ల ‘మ్యారీలైట్’ బిస్కట్ ప్యాకెట్లు కొన్నాడు. రేపర్పై 16 బిస్కట్లు అని ముద్రించి ఉంది. కానీ ప్యాకెట్లో 15 మాత్రమే ఉన్నాయి. దీంతో ఈ విషయాన్ని దుకాణ యజమాని దృష్టికి తీసుకెళ్లాడు. ‘తాను రిటైలర్నని వచ్చిన ప్యాకెట్లు అమ్మడమే తప్ప మిగతా విషయాలతో తనకు సంబంధం లేద’ని సమాధానమిచ్చాడు. మొత్తం బాధ్యత కంపెనీదే అని చెప్పాడు. దీంతో ఢిల్లీబాబు కంపెనీకి లేఖ రాశాడు. ఎటువంటి స్పందన రాలేదు.ఫోరంలో ఫిర్యాదుఅతను అక్కడితో ఊరుకోలేదు. వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. వినియోగదారుడు ఎంత నష్టపోతున్నాడో లెక్కలతో సహా వివరించాడు. ఒక్కో బిస్కట్ ధర 75 పైసలు పడింది. కంపెనీ సుమారుగా రోజుకు 50 లక్షల ప్యాకెట్లు ఉత్పత్తి చేస్తుందని అనుకుంటే, రూ. 29 లక్షల వరకు ప్రజల్ని మోసం చేసి ఉండొచ్చని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అదే నెలకు, సంవత్సరానికి? ఇలా రూ. కోట్లలో వినియోగదారులు నష్టపోతున్నారని వివరించాడు. కంపెనీ వాదన ఇలా..బిస్కట్ల సంఖ్య కాకుండా బరువు ఆధారంగా విక్రయం జరుగుతుందని కంపెనీ వాదించింది. ప్యాకెట్ నికర బరువు 76 గ్రాములని, అదే ఆధారమని పేర్కొంది. దీంతో బిస్కట్ ప్యాకెట్ను తూకం వేయాలని ఫోరం ఆదేశించింది.. 74 గ్రాములే ఉంది. తూనికలు కొలతల శాఖ నియమాల ప్రకారం ప్యాక్ చేసిన వస్తువుల బరువు 4.5 గ్రాముల వరకు అటూ ఇటుగా ఉండొచ్చని కంపెనీ తరపు న్యాయవాదులు వాదించారు. ఈ వాదనను ఫోరం తిరస్కరించింది. కాలక్రమంలో బరువు తగ్గే వస్తువులకు ఆ నియమం వర్తిస్తుంది. రోజులు గడుస్తున్నా బిస్కట్ బరువులో ఎలాంటి మార్పు రాదని, అందువల్ల ఆ నియమం ఇక్కడ వర్తించదని ఫోరం తేల్చి చెప్పింది. బిస్కట్ల సంఖ్యను ప్యాకెట్పై స్పష్టంగా ముద్రించినప్పుడు బరువు ఆధారంగా విక్రయిస్తామనే వాదన సరికాదని తోసిపుచ్చింది. రూ. లక్ష జరిమానాఇది వినియోగదారులను తప్పుదోవ పట్టించడమేనని ఫోరం పేర్కొంది. ఫిర్యాదుదారు ఢిల్లీబాబుకు నష్టపరిహారం కింద రూ. లక్ష రూపాయలు, కేసు ఖర్చుల నిమిత్తం మరో రూ. 10 వేలు చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. నిర్దేశిత గడువులోగా పరిహారం చెల్లించకపోతే ఏడాదికి 9 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలని పేర్కొంది. ఆ బ్యాచ్లో తయారు చేసిన బిస్కట్ ప్యాకెట్ల విక్రయాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. కొన్ని అంశాలు చిన్నవిగా అనిపించినా, ఎక్కువ మంది వినియోగదారులు మోసపోతే అది పెద్ద నష్టమే అవుతుంది. వినియోగదారులు అప్రమత్తంగా ఉంటేనే వస్తువుల్లో నాణ్యత, పారదర్శకత పెరుగుతుందని ఈ కేసు స్పష్టం చేస్తోంది. అన్యాయాన్ని ప్రశ్నిస్తే, చట్టం వినియోగదారుడికి రక్షణగా నిలుస్తోందని ఈ తీర్పు నిరూపించింది. -
ఎండ సీసానా! వీళ్ల బండబడా!
ఎండను పట్టుకుని ఒక సీసాలో దాచి, కొన్ని నెలల తర్వాత చలికాలంలో ఆ ఎండను టీ చేసుకోవడానికి వాడుకుంటే ఎలా ఉంటుంది? మాటలే కానీ, ఇవన్నీ అయ్యే పనులేనా పెదవి విరవకండి. శాస్త్రవేత్తలు ఇంచుమించు అలాంటి టెక్కిక్నే కనిపెట్టారు!పరిశోధకులు ఒక శక్తిమంతమైన కొత్త సౌర–నిల్వ అణువును ఆవిష్కరించారు. ఇది పునర్వినియోగ బ్యాటరీలా సూర్యకాంతిని బంధించి, తరువాత దానిని వేడి రూపంలో విడుదల చేస్తుంది.సాధారణ సోలార్ ప్యానెల్స్తో సూర్యరశ్మి వెంటనే కరెంట్గా మారిపోతుంది. అయితే శాస్త్రవేత్తలు ఈ టెక్నిక్లో ఎండను ఒక ప్రత్యేకమైన ద్రవంలో రసాయన శక్తిగా దాచి ఉంచుతారు. అవసరం అయినప్పుడు తీసి వాడతారు! అదెలా సాధ్యం? ఎలాగంటే, ఒక రకమైన ద్రవ అణువులను ప్రయోగించి ఎండను ఒడిసిపడతారు. వీటిపై ఎండ పడగానే, ఇవి తమ ఆకారాన్ని మార్చుకుంటాయి. మనం ఎండలోకి వెళ్లగానే రంగు మారే కూలింగ్ గ్లాసెస్లా అనుకోండి! అలా ఆకారం మారిన ఆ అణువులు ఎండ ఎనర్జీని తమలోనే లాక్ చేసుకుంటాయి. ఇలా కొన్నేళ్ల పాటు ఆ ఎనర్జీ నిల్వ ఉంటుంది. మనకు వేడి కావాలనుకున్నప్పుడు, ఒక చిన్న ట్రిగ్గర్ ద్వారా ఆ అణువులను మళ్లీ వాటి పాత ఆకారంలోకి వచ్చేలా చేస్తారు. అలా అవి వెనక్కి వచ్చేటప్పుడు తమలో దాగున్న సోలార్ ఎనర్జీని తీవ్రమైన వేడి రూపంలో బయటకు విడుదల చేస్తాయి. ఆ వేడి.. నీటిని మరిగించడానికి కూడా సరిపోతుంది. మన ఫోన్లు, లాప్టాప్లలో ఉండే లిథియం–అయాన్ బ్యాటరీల కంటే... ఒక కేజీ బరువుండే మోతాదులో ఈ ద్రవం చాలా ఎక్కువ శక్తిని దాచగలదు. పైగా దీనికి పెద్ద పెద్ద బ్యాటరీలు గానీ, కరెంట్ గ్రిడ్ కనెక్షన్ గానీ అవసరం ఉండదు. మాలిక్యులర్ సోలార్ థర్మల్ ఎనర్జీ స్టోరేజ్ (మోస్ట్)సాధారణ సోలార్ ప్యానెల్స్ సూర్యుడు ఉన్నంత వరకే కరెంట్ను ఇస్తాయి. సూర్యుడు అస్తమించిపోయాక, లేదా ఆకాశం మబ్బుగా ఉన్నప్పుడు ఆ శక్తిని ఎలా దాచి పెట్టుకోవాలన్నది ఎప్పటి నుంచో శాస్త్రవేత్తల ముందున్న పెద్ద సవాలు. దీనికి పరిష్కారంగా.. యూసీ శాంటా బార్బరా విశ్వవిద్యాలయానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ గ్రేస్ హాన్, ఆమె బృందం ఒక కొత్త రకం పదార్థాన్ని తయారు చేశారు. దీనికోసం పెద్ద పెద్ద బ్యాటరీ సిస్టమ్స్ గానీ, కరెంట్ గ్రిడ్ గానీ అవసరం లేదు. ఆ పదార్థం సూర్యరశ్మిని గ్రహించి, తన రసాయన బంధాలలో దాచుకుని, అవసరమైనప్పుడు వేడి రూపంలో బయటకు వెలువరిస్తుంది. ఈ సాంకేతికతను సైన్స్ పరిశోధకులు మాలిక్యులర్ సోలార్ థర్మల్ ఎనర్జీ స్టోరేజ్ (మోస్ట్) అని పిలుస్తున్నారు. ఆర్గానిక్ అణువును కనిపెట్టి..!‘మోస్ట్’ అనే ఈ ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు పైరిమిడోన్ అనే అభివృద్ధి పరచిన ఆర్గానిక్ అణువును ఉపయోగించారు. ‘‘ఇది మళ్లీ మళ్లీ వాడుకోగలిగే, రీసైకిల్ చేయగలిగే టెక్నాలజీ. మనం వాడే ఫొటోక్రోమిక్ కూలింగ్ గ్లాసెస్ (ఎండలోకి వెళ్తే నల్లగా మారే కళ్లద్దాలు) ను గుర్తు తెచ్చుకోండి. మనం ఇంట్లో ఉన్నప్పుడు అవి మామూలు అద్దాల్లా ఉంటాయి. ఎండలోకి వెళ్లగానే అవే నల్లగా మారిపోతాయి. మళ్లీ ఇంట్లోకి రాగానే మామూలుగా అయిపోతాయి. ఇదీ అటువంటి కూలింగ్ గ్లాసెస్ టెక్నాలజీనే..’’ అంటున్నారు, ఈ పరిశోధనలో ముఖ్య పాత్ర పోషించిన శాస్త్రవేత్త హాన్ గుఝెన్. కాకపోతే, ఇక్కడ రంగు మారడానికి బదులుగా.. అణువులు ఎండలో శక్తిని దాచుకుంటాయి, అవసరమైనప్పుడు ఆ శక్తిని వేడి రూపంలో బయటకు వదులుతాయి. ఆ తర్వాత ఆ పదార్థాన్ని పడేయక్కర్లేదు, మళ్లీ మళ్లీ సూర్యశక్తిని దాచడానికి వాడుకోవచ్చు.డీఎన్ఏ నుండి వచ్చిన ఐడియా!పైరిమిడోన్ అనే ప్రత్యేకమైన అణువును తయారు చేయడానికి శాస్త్రవేత్తలకు మన శరీరంలో ఉండే డీఎన్ఏ నుండి అద్భుతమైన ఐడియా వచ్చింది. డీఎన్ఏలో సహజంగా ఉండే ఒక భాగం, సూర్యుడి నుండి వచ్చే అతినీలలోహిత కిరణాలు పడినప్పుడు తన ఆకారాన్ని మార్చుకోగలదు, మళ్లీ పాత రూపంలోకి రాగలదు. శాస్త్రవేత్తలు సరిగ్గా అలాంటి అణువునే ల్యాబ్లో కృత్రిమంగా తయారు చేశారు. దీనివల్ల ఆ అణువు మళ్లీ మళ్లీ శక్తిని దాచడానికి, విడుదల చేయడానికి వీలైంది. ఈ అణువు శక్తిని దాచుకున్నాక, ఆ శక్తి వృథా అయిపోకుండా కొన్నేళ్లపాటు ఎలా స్థిరంగా ఉండగలుగుతుందో తెలుసుకోవడానికి యూసీఎల్ఏ ప్రొఫెసర్ కెన్ హౌక్తో ఈ బృందంతో చేతులు కలిపింది. వారు కంప్యూటర్ మోడలింగ్ సహాయంతో పరీక్షించి... ఈ పదార్థం నుండి శక్తి అస్సలు లీక్ అవ్వకుండా కొన్నేళ్ల పాటు ఎలా దాగి ఉంటుందో కనుగొన్నారు. ‘‘మేము ఈ అణువును చాలా తేలికగా, చిన్నదిగా ఉంచడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. ఈ ప్రాజెక్ట్ కోసం మాకు అవసరం లేని ప్రతి భాగాన్ని తొలగించాం. అణువు ఎంత చిన్నగా ఉంటే, అది అంత ఎక్కువ శక్తిని తనలో దాచుకోగలదు..’’ అని శాస్త్రవేత్త హాన్ నుఝెన్ వివరించారు. స్ప్రింగ్లా ఉండే బ్యాటరీస్ప్రింగ్ లాంటి ‘సౌర బ్యాటరీ’ సాధారణ సోలార్ ప్యానెల్స్లాగా ఎండను నేరుగా కరెంట్గా మార్చదు. బదులుగా, శక్తిని రసాయన రూపంలో దాచుకుంటుంది. ఈ అణువు ఒక నొక్కిపెట్టిన స్ప్రింగ్లాగా పనిచేస్తుంది. దీనిపై సూర్యరశ్మి పడగానే, ఇది గట్టిగా నొక్కిన స్ప్రింగ్ లాగా ఎక్కువ శక్తితో కూడిన రూపంలోకి మారిపోతుంది. మనం దాన్ని క్రియాశీలం చేసేంత వరకు అలాగే ఉంటుంది. దానికి కొద్దిగా వేడిని గానీ, లేదా ఒక కేటలిస్ట్ (రసాయన చర్యను వేగవంతం చేసే పదార్థం) గానీ తాకిస్తే, ఆ అణువు ఒక్క ఉదుటున పాత రూపంలోకి వచ్చేస్తుంది. నొక్కిన స్ప్రింగ్ను ఒక్కసారిగా వదిలేస్తే ఎలా దూకుతుందో అలా అన్నమాట. అలా వచ్చేటప్పుడు తనలో దాగున్న శక్తిని వేడి రూపంలో బయటకు వదులుతుంది. ‘‘మేము దీనిని రీచార్జ్ చేసుకోగలిగే సోలార్ బ్యాటరీ అని పిలుస్తాము. ఇది సూర్యరశ్మిని దాచుకుంటుంది, మళ్లీ మళ్లీ రీచార్జ్ అవుతుంది’’ అని నుఝెన్ అంటారు. ఈ అణువు లీథియం బ్యాటరీల కంటే శక్తివంతమైనది. శక్తిని దాచుకునే సామర్థ్యం చాలా ఎక్కువ. శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం సాధారణ లిథియం–అయాన్ బ్యాటరీ 0.9 మెగాజూల్స్ శక్తిని దాచగలిగితే, ఈ కొత్త రకం సోలార్ ద్రవం దాచగలిగే శక్తి (ఒక కిలో బరువుకు) 1.6 మెగాజూల్స్. అంటే మన ఫోన్లలో ఉండే బ్యాటరీల కంటే ఇది చాలా ఎక్కువ శక్తిని నిల్వ చేయగలదు. గతంలో శాస్త్రవేత్తలు తయారు చేసిన ఇలాంటి పాత మోడల్స్ కంటే కూడా ఈ కొత్త మెటీరియల్ చాలా అద్భుతంగా పనిచేస్తోందని పరిశోధకులు చెబుతున్నారు.మొత్తానికైతే నీటిని మరిగించారు!ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు సాధించిన అతిపెద్ద విజయం ఏంటంటే... తాము కనిపెట్టిన సాంకేతికత కేవలం ల్యాబ్కే పరిమితం కాకుండా, నిజంగా పనిచేస్తుందని నిరూపించడం. వారు సాధారణ వాతావరణంలోనే ఈ పదార్థం నుండి వచ్చే వేడితో నీటిని విజయవంతంగా మరిగించి చూపించారు. ‘‘నీటిని మరిగించడమనేది చాలా ఎక్కువ శక్తితో కూడుకున్న పని. మేము సాధారణ వాతావరణంలోనే నీటిని మరిగించగలిగామంటే అది చాలా పెద్ద విజయం’’ అని నుఝెన్ అంటున్నారు. భవిష్యత్తులో ‘మోస్ట్’ ఉపయోగాలు‘మోస్ట్’ అనే ఈ సరికొత్త సాంకేతికత భవిష్యత్తులో మన రోజువారీ జీవితంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడే అవకాశాలున్నాయి. ఇంటి అవసరాలకు: ఈ ద్రవం నీటిలో సులభంగా కరుగుతుంది. కాబట్టి, మన ఇంటి కప్పులపై ఉండే సోలార్ పైపుల్లో పగటిపూట ఈ ద్రవాన్ని తిప్పవచ్చు. అది పగలంతా ఎండను గ్రహించి, రాత్రి వేళల్లో ట్యాంకుల్లోకి చేరి మనకు కావలసిన వేడి నీటిని అందిస్తుంది.క్యాంప్లు, టూర్లు: అడవులకు లేదా కరెంట్ లేని ప్రాంతాలకు క్యాంపింగ్ వెళ్లినప్పుడు, ఎలాంటి గ్యాస్ లేదా కరెంట్ లేకుండానే కేవలం ఈ ద్రవంతో నీటిని వేడి చేసుకోవచ్చు.‘‘సాధారణ సోలార్ ప్యానెల్స్ వాడితే... శక్తిని దాచుకోవడానికి విడిగా పెద్ద బ్యాటరీ సిస్టమ్ కావాలి. కానీ ఈ మాలిక్యులర్ సోలార్ టెక్నాలజీ (మోస్ట్)లో ఆ పదార్థం దానంతట అదే సూర్యశక్తిని నేరుగా దాచుకోగలదు’’ అని ఈ పరిశోధనలో భాగస్వామి అయిన బెంజమిన్ బేకర్ చెబుతున్నారు. ఈ ‘రీచార్జ్ చేయదగిన సౌర బ్యాటరీల’ పరిశోధనను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రొఫెసర్ గ్రేస్ హాన్కు ప్రతిష్ఠాత్మకమైన ‘మూర్ ఇన్వెంటర్ ఫెలోషిప్’ లభించింది.మెగాజూల్ అంటే? కూరగాయలను ‘కిలోలలో’ కొలుస్తాం, పాలను ‘లీటర్లలో’ కొలుస్తాం కదా, అలాగే సైన్స్ ప్రపంచంలో శక్తిని లేదా వేడిని కొలవడానికి ‘జూల్స్’ అనే పదాన్ని వాడతారు. ఈ పదం 19వ శతాబ్దపు భౌతిక శాస్త్రవేత్త జేమ్స్ ప్రెస్కాట్ జూల్ పేరులోని జూల్ నుండి వచ్చింది. భూమిపై ఉండే రకరకాల శక్తులన్నీ – వేడి, కరెంట్, కదలిక – వేర్వేరు కాదని, అవన్నీ ఒకదానికొకటి సంబంధం ఉన్న భిన్న ఎనర్జీ రూపాలేనని ఆయన నిరూపించారు. ముఖ్యంగా యాంత్రిక శక్తి ఎలా వేడిగా మారుతుందో జూల్ కనిపెట్టారు. అందుకే ఆయన జ్ఞాపకార్థం, శక్తిని కొలిచే యూనిట్కు ‘జూల్’ అని పేరు పెట్టారు.ఒక లీటరు మామూలు నీటిని స్టవ్ మీద పెట్టి, అది బాగా మరిగేలా వేడి చేయడానికి దాదాపు 0.3 మెగాజూల్స్ శక్తి అవసరమవుతుంది. అంటే, 1 మెగాజూల్ శక్తితో మనం సుమారు 3 లీటర్ల నీటిని మరిగించవచ్చు. ఒక టన్ను బరువున్న కారు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంటే... ఆ కారులో ఉండే కదలిక శక్తి సరిగ్గా 1 మెగాజూల్ ఉంటుంది. మనం తినే ఒక చిన్న స్నికర్స్ చాక్లెట్ బార్ లేదా రెండు అరటిపండ్లు మన శరీరానికి దాదాపు 1 మెగాజూల్ శక్తి (క్యాలరీల రూపంలో)ని ఇస్తాయి. శాస్త్రవేత్తలు ఇప్పుడు కొత్తగా కనిపెట్టిన ద్రవం ఒక కిలో బరువులో 1.6 మెగాజూల్స్ శక్తిని దాచగలదు. ఒక్కమాటలో చెప్పాలంటే కేవలం ఒకే ఒక్క కిలో ఆ మ్యాజిక్ ద్రవాన్ని ఎండలో పెడితే, అది తనలో ఎంత శక్తిని దాచుకుంటుందంటే... రాత్రి కాగానే ఆ ఒక్క కిలో ద్రవంతో మనం దాదాపు 5 లీటర్ల నీటిని మరిగించుకోవచ్చు! మన ఫోన్ బ్యాటరీల కంటే ఇది చాలా ఎక్కువ శక్తిని తక్కువ స్థలంలో దాచగలదు అని చెప్పడానికే శాస్త్రవేత్తలు ఈ ‘మెగాజూల్స్’ అనే పదాన్ని వాడారు. -సాక్షి స్పెషల్ డెస్క్ -
భోజనం అంటే గొడవే...
నాకు రెండేళ్ల పాప ఉంది. పాప అస్సలు సరిగా తినడం లేదు. పళ్లెంలో పెట్టిన ప్రతి దాన్ని తిరస్కరిస్తోంది. ఎంత చెప్పినా వినడం లేదు. భోజన సమయం అంటే ఇంట్లో గొడవే అవుతోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు.– సునీత, విజయవాడ.రెండు సంవత్సరాల పిల్లలు తక్కువగా తినడం, సాధారణంగా కనిపించే సమస్య. దీన్ని ‘ఫస్సీ ఈటింగ్’ లేదా ‘పిక్కీ ఈటింగ్’ అంటాము. పుట్టినప్పటి నుంచి దాదాపు ఒకటిన్నర సంవత్సరాల వరకు పిల్లలు వేగంగా పెరుగుతారు కాబట్టి ఆకలి కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ రెండో సంవత్సరం నుంచి ఎదుగుదల కొంచెం నెమ్మదిస్తుంది. అందుకే ఆకలి కూడా తగ్గినట్లు అనిపిస్తుంది. ఇది వ్యాధి కాదు, శరీరంలో సహజంగా జరిగే మార్పు. ఇలాంటి పిల్లల్లో ముందుగా భోజన సమయాన్ని ప్రశాంతంగా మార్చాలి. బలవంతంగా తినిపించడం, కోప్పడటం, పిల్లల వెంట తిరగడం వల్ల వాళ్లు ఇంకా ఎక్కువగా ఆహారాన్ని తిరస్కరిస్తారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏం తినాలి, ఎప్పుడు పెట్టాలి అనేది తల్లిదండ్రుల బాధ్యత. కానీ ఎంత తినాలి అనేది పిల్లల నిర్ణయం. చాలాసార్లు తల్లిదండ్రులు పిల్లలు తక్కువ తింటున్నారని ఆందోళనతో ఒత్తిడి పెడతారు. కానీ పిల్లలు తమ ఆకలికి తగ్గట్టే తింటారు. కొత్త ఆహారాన్ని ఒకసారి తిరస్కరించిందని వెంటనే ఆపేయకూడదు. చిన్నపిల్లలు కొత్త రుచిని అంగీకరించడానికి సమయం తీసుకుంటారు. కొన్నిసార్లు ఒక ఆహారాన్ని 10 నుంచి 15 సార్లు పరిచయం చేసిన తర్వాతే అలవాటు పడతారు. కాబట్టి ఓపిక చాలా ముఖ్యం.పిల్లలకు పెద్ద పళ్లెం పెట్టడం కన్నా చిన్న పరిమాణాల్లో, రంగురంగులుగా, ఆకర్షణీయంగా ఆహారం పెట్టాలి. అలాగే మధ్య మధ్యలో బిస్కట్లు, చాక్లెట్లు, జ్యూసులు లేదా ఎక్కువ పాలు ఇస్తూ ఉంటే అసలు ఆకలి తగ్గిపోతుంది. ‘కొంచెం ఆకలి’ కూడా పిల్లలకు మంచి ఔషధం లాంటిదే. మొబైల్ లేదా టీవీ ముందు కూర్చోబెట్టి తినిపించే అలవాటు తగ్గించడం మంచిది. అప్పటికి తిన్నట్టే అనిపించినా, దీర్ఘకాలంలో అది మంచి తినే అలవాట్లను దెబ్బతీస్తుంది. కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చుని తింటే పిల్లలు కూడా చూసి నేర్చుకుంటారు. పిల్లలు మాటలు కన్నా మన ప్రవర్తననే ఎక్కువగా అనుకరిస్తారు. ‘ఇది తింటే చాక్లెట్ ఇస్తా’ అని లంచం ఇవ్వడం కన్నా, ‘వావ్! నువ్వు కొత్త కూర రుచి చూసావు కదా!’ అని ప్రశంసించడం మంచిది. అలాగే ఒక్కరోజు తక్కువ తిన్నారని భయపడాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లల ఆకలి రోజురోజుకీ మారుతూ ఉంటుంది. ఒక భోజనం లేదా ఒక రోజు కాకుండా, మొత్తం వారం ఎలా తింటున్నారు అన్నది చూసి అంచనా వేయాలి. అయితే కొన్ని లక్షణాలు ఉంటే మాత్రం తప్పకుండా పిల్లల వైద్యుడిని సంప్రదించాలి. బరువు పెరగకపోవడం, తరచు వాంతులు అవడం, మింగడంలో ఇబ్బంది ఉండడం, కొన్ని ఆహారాలనే పూర్తిగా తిరస్కరించడం, చాలా అలసటగా కనిపించడం లేదా ఎదుగుదల మందగించడం వంటి లక్షణాలు ఉంటే పరీక్షలు అవసరం కావచ్చు. చాలా సందర్భాల్లో సరైన ఆహార అలవాట్లు, ఓపిక, కుటుంబ సహకారం ఉంటే పిల్లలు క్రమంగా మంచి తినే అలవాట్లు అలవరుచుకుంటారు. -డా‘‘ కె. పవన్ కుమార్-సీనియర్ పీడియాట్రిషియన్ , పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ -
గాటు లేకుండా ‘పొడి’చేసే గన్!
మూత్రపిండాల్లో రాళ్లు వచ్చినప్పుడు కలిగే బాధ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. నిజానికి మూత్రపిండాలు మన దేహంలోని జీవక్రియల తర్వాత వెలువడే అనేక వ్యర్థాలూ, విషపదార్థాలను వడపోసి మూత్రం ద్వారా బయటకు పంపేస్తాయి. ఈ క్రమంంలో కొన్ని రకాల వ్యర్థాలు పేరుకుపోయి ఒక స్ఫటికంలా మారే అవకాశాలుంటాయి. వీటినే మనం రాళ్లుగా చెబుతుంటాం. ఇటీవల ఈ రాళ్ల తొలగింపు చాలా సులభం అయ్యింది. ఇప్పటికీ సంప్రదాయ శస్త్రచికిత్సతో రాళ్లను తొలగించే అవకాశమున్నప్పటికీ కొన్ని ఆధునిక వైద్య ప్రక్రియలతో దేహంపై ఎలాంటి గాటు పెట్టకుండానే శబ్దతరంగాల సహాయంతో వాటిని పౌడర్లా చేసే ప్రక్రియలూ అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం...సహజంగానే రోజూ తక్కువ నీళ్లు తాగేవారిలో, అలాగే నిత్యం ఏసీ రూముల్లో ఉండటం వల్ల నీళ్లు తక్కువగా తాగేవారిలో, చాక్లెట్లు, కెఫిన్ వంటివి ఎక్కువగా తీసుకునేవారితోపాటు... కొందరిలో వారి దేహస్వభావంలోనే రాళ్లు ఏర్పడే అవకాశముంటుంది. వీటి తొలగింపు అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. రాయి సైజు, దాని గట్టిదనం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని శస్త్రచికిత్స నిపుణులు తొలగింపు ప్రక్రియను ఎంపిక చేస్తారు. అయితే చిన్నపాటి గాటు పెట్టి చేసే శస్త్రచికిత్సలతో పాటు అసలు ఎలాంటి గాటూ లేకుండా కేవలం ఒక గన్లాంటి ఉపకరణంతో రాళ్లను పౌడర్ చేయడం ద్వారా వాటిని తొలగిస్తారు.కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి?రెండు మూత్ర పిండాలూ రక్తంలోని వ్యర్థాలను వడపోస్తూ ఉంటాయి. రక్తంలోని అనేక అంశాలను శుద్ధి చేసి సమయం లో అవసరమైన వాటిని తీసుకొని, వ్యర్థాలను మాత్రం మూత్రంతో పాటు బయటకు పంపిస్తాయి. ఈ క్రమంలో కొన్ని వ్యర్థాలైన క్యాల్షియమ్ ఆక్సలేట్, సిస్టిన్ వంటివి స్ఫటికాలుగా పోగుపడుతూ రాళ్ల రూపాన్ని సంతరించుకుంటాయి. నిజానికి ఆ రాళ్లు యురేటర్ లేదా మూత్రనాళం సైజు కంటే తక్కువగా ఉంటే అవి మూత్రంతో పాటు బయటకు వెళ్తుంటాయి. కానీ ఒక రాయి 5 మి.మీ. కంటే ఎక్కువ సైజ్కు పెరిగితే మూత్రంలో కొట్టుకొనిపోలేక... మూత్రవిసర్జక వ్యవస్థలో ఇరుక్కుపోవచ్చు. ఇలా రాళ్లు ఇరుక్కుపోయినప్పుడు తీవ్రమైన కడుపునొప్పి, మూత్రధారకు ఏదో అడ్డుపడ్డట్లుగా ఉండటం వరకు అనేక లక్షణాలు కనిపిస్తాయి. చిన్న గాటు కూడా పెట్టాల్సిన అవసరమే లేకుండా... ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ (ఈఎస్డబ్ల్యూఎల్) అని పిలిచే ఈ అత్యాధునిక ప్రక్రియ సహాయంతో మూత్రపిండం ఉండే భాగంలో చర్మంపై నుంచే కేవలం గన్లాంటి అత్యాధునిక ఉపకరణం సహాయంతో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ తరంగాలూ అలాగే బలమైన అల్ట్రా సౌండ్ తరంగాలను పంపుతారు. ఈ చికిత్స ప్రక్రియలో అల్ట్రాసోనిక్ తరంగాల ద్వారా రాయిని చాలా చిన్న చిన్న పలుకులు లేదా పొడి పొడి అయ్యేలా చేస్తారు. ఆ పలుకులు, పొడి రూపంలో ఉన్న రాళ్లు మూత్రంతో పాటు బయటకు వెళ్లిపోతాయి. రాతిని పలుకులు, పొడిగా చేశాక... కొన్ని కేసుల్లో మాత్రమే యురేటర్లో స్టెంట్ వేయాల్సి రావచ్చు. ఎందుకంటే ఈ రాతిపలుకుల వల్ల మూత్రనాళాలు లేదా బ్లాడర్ గోడలు ఒరుసుకుపోయి గాయపడకుండా ఉండటానికి ఈ ఏర్పాటు చేస్తారు. బాధితుల ఒంట్లోనుంచి రాతి పౌడర్లాంటి చిన్న చిన్న పలుకులు పూర్తిగా పడిపోయాక స్టెంట్ను తొలగిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా బాధితులకు ఎలాంటి బాధ, శ్రమ లేకుండా చికిత్స జరుగుతుంది. రాయి సైజు ఎక్కువగా ఉన్నా... ఎక్కువ గట్టిగా ఉన్నా రెండో సిట్టింగ్ అవసరం పడవచ్చు. సర్జరీ ఎప్పుడంటే... బాధితుల్లో తీవ్రమైన నొప్పి ఉండి, మూత్రపిండాల వ్యవస్థ విఫలమైనప్పుడు, కిడ్నీలు ఇన్ఫెక్షన్కు గురైనప్పుడు మాత్రం సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్ ఇష్టపడని రోగులు ఒక నెల రోజులు ఆగి చూసి అప్పటికీ రాయి దానంతట అదే పడిపోకపోతే తప్పనిసరిగా ఆపరేషన్ చేయించాలి. లేకపోతే రాయి వల్ల ఇన్ఫెక్షన్ పాకి మూత్రపిండాలు దెబ్బతినే అవకాశాలుంటాయి. చివరగా... మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి పెరుగు చాలా తోడ్పడుతుంది. దీంతోపాటు తగినన్ని నీళ్లు ద్రవాహారాలు తీసుకోవడం మంచిది.లక్షణాలు... → భరించలేని నొప్పి → మూత్రంలో రక్తం పడటం → మూత్రంలో చీము రావడం → విసర్జన సమయంలో మూత్ర మార్గంలో మంట → మూత్రం పరిమాణం తగ్గడం. యురెథ్రాలో కాని మూత్రాశయంలో కాని లేదా రెండింటిలో కాని రాళ్లు ఉన్నప్పుడు ఇలా జరగవచ్చు ∙∙అబ్డామినల్ డిస్టెన్షస్లో... తల తిరగడం, వాంతులవడం. ఈ లక్షణాలతో పాటు ఒక్కోసారి చలి, జ్వరం. పోస్ట్రిరీనల్ అజోటీమియా... కిడ్నీలో రాయి యురేటర్ని బ్లాక్ చేయడం, తద్వారా కిడ్నీ ఫెయిల్యూర్కు దారి తీయడం ఫ్రీక్వెన్సీ ఇన్ మిక్చ్యురిషన్... ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయాల్సి రావడం. అలాగని ఒక రోజుకు రెండున్నర లీటర్లకంటే ఎక్కువ మూత్రవిసర్జన ఉండదు. తక్కువ మోతాదులో విసర్జిస్తూ ఎక్కువసార్లు వెళ్లాల్సి రావడం జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తం కావడం వల్ల ఆకలి లేకపోవడం / ఆహారం తీసుకోవాలన్న ఆసక్తి లేకపోవడం, దాంతో బరువు తగ్గడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి.నిర్థారణ పరీక్షలు...మూత్రపరీక్ష, అల్ట్రాసౌండ్ పరీక్ష, ఇంట్రావీనస్ యూరోగ్రఫీ (ఐవీయూ), ఎక్స్–రే, సీటీ స్కాన్ అబ్డామిన్ల వంటి పరీక్షలు అవసరమవుతాయి. వీటితో పాటు డాక్టర్లు సూచించే మరికొన్ని నిర్దిష్టమైన పరీక్షలూ చేయించాల్సి రావచ్చు.ఇతర చికిత్సలు... కిడ్నీ స్టోన్స్ చాలావరకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేకుండా వాటంతట అవే మూత్రంతో పాటు పడిపోతుంటాయి. రాయి సైజు, మూత్రవిసర్జక వ్యవస్థలో రాయి ఉన్న ప్రాంతం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని చేయాల్సిన చికిత్స నిర్ణయిస్తారు. ఉదాహరణకు రాయి సైజు 2 సెం.మీ కంటే తక్కువగా ఉంటే యుటెరోస్కోపీ (యూఆర్ఎస్) అనే ప్రక్రియతోనూ, 2 సెం.మీ కంటే ఎక్కువగా ఉండి, కాస్తంత సంక్లిష్టంగా అంటే జింక కొమ్ముల (స్టాగ్ హార్న్) వంటి ఆకృతి ఉన్నవాటిని పీసీఎన్ఎల్ అనే చిన్న గాటు పెట్టే ప్రక్రియలతోనూ అలాగే 2 సెం.మీ. పరిణామంలో ఉండే రాళ్లను ఆర్ఐఆర్ఎస్ అనే బ్లాడర్లోకి పైప్ను పంపుతూ లేజర్ సహాయంతో లోపల ఉన్న రాయిని పౌడర్ చేసే ప్రక్రియలాంటి వాటిని ఉపయోగిస్తారు. పీసీఎన్ఎల్ మినహా యూఆర్ఎస్, ఆర్ఐఆర్ఎస్లలోనూ ఎలాంటి గాటూ ఉండదు.డాక్టర్ పూర్ణచంద్రా రెడ్డిసీనియర్యూరాలజిస్ట్– యాసీన్ -
ఫుడ్ సేఫ్టీ... ఏఐ ఉందిగా...
ఏ పుట్టలో ఏ పాముందో... అనేది పాత సామెత. ఏ ఫుడ్లో ఏ బాక్టీరియా ఉందో... అనేది కొత్త సామెత. ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా తినాలంటే... భయమే భయం! ఏ సమస్య వచ్చినా... ‘ఏ.ఐ ఉందిగా!’ అనుకునే ఈ కాలంలో... ఏ.ఐ అనేది ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన భయాలను పోగొట్టి, భరోసా ఇవ్వగలదా? అంటే... ‘యస్’ అనే అంటున్నారు నిపుణులు. ఇప్పుడిప్పుడే ఆహారపరిశ్రమలో ఏఐ అడుగులు పడుతున్నాయి. భవిష్యత్కు సంబంధించి ఆశను, భరోసాను ఇస్తున్నాయి.ఆహార భద్రతకు సంబంధించిన మూలస్తంభాలలో ఒకటి... ఆహార నాణ్యత. ఆహార పదార్థాలలో వ్యాధికారకాలు, విషపదార్థాలను గుర్తించడంలో ఏ.ఐ సాంకేతికత ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఏ.ఐ, ఆధారిత కెమెరాలు ఆహార ఉత్పత్తులలోని కలుషితాన్ని, సరిగా లేని లేబులింగ్ను, ఇతరత్రా అంశాలను మనిషి కంటి కంటే వేగంగా, మరింత కచ్చితత్వంతో గుర్తిస్తున్నాయి. ఏఐ–ఆధారిత సెన్సార్లు ఆహార ఉత్పత్తులలో ఇ.కోలి, సాల్మోనెల్లా వంటి హానికరమైన బాక్టీరియాను గుర్తించగలవు. మైక్రోబయాలజీ స్టార్టప్ ‘స్పోర్ బయో’ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి పరీక్ష సమయాన్ని రోజుల నుండి నిమిషాల వ్యవధికి తగ్గించే ఏ.ఐ. సాంకేతికతను అభివృద్ధి చేసింది.తు.చ. తప్పకుండా... ఫుడ్సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని, ఉద్యోగులలో ఒత్తిడిని తగ్గించడానికి అమెరికన్ మల్టీనేషనల్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ చైన్ ‘మెక్డొనాల్డ్స్’ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ శాఖలలో ఏ.ఐ. టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఏఐ–ఆధారిత డ్రైవ్–త్రూలు నిర్వహిస్తోంది. షెడ్యూలింగ్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్లలో రెస్టారెంట్ మేనేజర్లకు ఏ.ఐ. సాధనాలు ఉపకరిస్తున్నాయి. నిబంధనలను పాటించడం అనేది ఆహార పరిశ్రమలకు సవాలుగా, సంక్లిష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించేలా చేయడంలో ఏ.ఐ ఆటోమేట్ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది.ఆహారభద్రతా చట్టాలు, లేబులింగ్ నిబంధనలు, ట్రేసబిలిటీ అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి ఆహార పరిశ్రమలు మాన్యువల్ ప్రాసెస్పై ఎక్కువ ఆధారపడతాయి. సంక్లిష్టమైన నిబంధనలను త్వరగా అర్థం చేసుకోవడం, నిబంధనలు పాటించడానికి సంబంధించిన సందేహాలకు తక్షణ సమాధానాలు ఇవ్వడం ద్వారా హోటల్స్, రెస్టారెంట్స్... మొదలైనవి ఆహార భద్రతా చట్టాలలో అప్డేటెడ్గా ఉండేలా చూడడానికి ఏ.ఐ. అనేది మాన్యువల్ ప్రాసెస్కు ప్రత్యామ్నాయంగా మారింది.అలెర్జీలకు దూరంగా...ఆరోగ్యానికి దగ్గరగా... ఆహార భద్రతకు సంబంధించి ఏ.ఐ. సాంకేతికతను వినియోగించుకోవడానికి మాత్రమే పరిమితం కాకుండా ఫుడ్ సైంటిస్ట్లు, క్వాలిటీ అష్యూరెన్స్ స్పెషలిస్ట్లు... మొదలైన వారి నుంచి సలహాలు తీసుకుంటున్నాయి రెస్టారెంట్లు. రోబోటిక్ చెఫ్లు... ఏఐ ఆధారిత రోబోటిక్ చెఫ్లు, ప్రిడిక్టివ్ అనాలటిక్స్ ద్వారా ఆహార వ్యర్థాలను భారీగా తగ్గించడానికి వీలువుతుంది. మీల్ ప్లానర్, కుక్ బుక్ వంటి ఏ.ఐ. సాధనాలు వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను అందించడంలో సహాయపడుతున్నాయి. అలెర్జీల బారిన పడకుండా ఉపకరిస్తున్నాయి.ఏ.ఐ. ఆధారిత పర్సనలైజ్డ్ న్యూట్రిషన్ యాప్ ‘ఆర్ఎక్స్డైట్’ కస్టమ్ ఫుడ్ ప్లాన్స్ను డెవలప్ చేసి ఆహారపదార్థాలను తాజాగా అందించడంలో తోడ్పడుతుంది. ఒకవైపు రుచిని అందిస్తూనే, మరోవైపు అలెర్జీ కారకాలను తొలగించడానికి, పోషక విలువలు మెరుగు పరచడానికి ఏ.ఐ సాధనాలు ఉపకరిస్తున్నాయి.మరింత ప్రయోజనకరంగా... ‘సంప్రదాయ ఆహారపదార్థాలను మరింత ప్రయోజనం కలిగించేలా చేయడానికి, పర్యావరణానికి తక్కువ హాని కలిగించే ప్రత్యామ్నాయ మార్గాలు సృష్టించడానికి ఏ.ఐ. ఉపకరిస్తుంది’ అంటున్నారు నిపుణులు.రెస్టారెంట్ల ఆహారభద్రత పర్యవేక్షించడానికి యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ఏ.ఐ. టూల్స్ వినియోగంపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఏ.ఐ. అనేది పని సామర్థ్యాన్ని మెరుగుపరిచే సాధనం మాత్రమే కాదు ఆహారభద్రతకు సంబంధించిన నిబంధనలను పాటించేలా చేయడంలో, పారదర్శకత, విశ్వసనీయతకు సంబంధించి ఆహార పరిశ్రమ ముఖచిత్రాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషించనుంది. -
మెగా మామ్!
‘అందాల రాక్షసి’తో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి. ఇప్పుడు కెరీర్, ఫ్యామిలీ, మదర్హుడ్ను అందంగా బ్యాలెన్స్ చేస్తూ కొత్త ప్రయాణాన్ని ఆస్వాదిస్తోంది. గ్లామర్ ప్రపంచంలో ఉన్నా; వ్యక్తిగత జీవితాన్ని ఎంతో ప్రైవేట్గా, ప్రశాంతంగా ఉంచుకునే ఈ చిల్ గర్ల్ మనసులోని ముచ్చట్లు ఆమె మాటల్లోనే!మిస్ ఉత్తరాఖండ్పుట్టింది అయోధ్యలో, పెరిగింది డెహ్రాడూన్ లో. నాకు చిన్నప్పటి నుంచే షోబిజ్పై ఆసక్తి ఉండేది. కానీ ముందు చదువు పూర్తి చేయాలన్న నాన్న కండిషన్తో భరతనాట్యం నేర్చుకుంటూ, ముంబైలో ఎకనామిక్స్ చదువుతూనే మోడలింగ్ మొదలుపెట్టాను. 2006లో ‘మిస్ ఉత్తరాఖండ్’ గెలవడం నా కలలకు మొదటి అడుగు అయ్యింది.‘మిథున’ నుంచి బయటకు రాలేకపోయా‘అందాల రాక్షసి’ చిన్న సినిమాలో నేను నటించలేదు, ‘మిథున’గా జీవించాను. షూటింగ్ అయిపోయాక కూడా అదే తరహా దుస్తులు, బొట్టు పెట్టుకుని తిరిగేదాన్ని. చివరకు నన్ను నేను బలవంతంగా ఆ పాత్రలోంచి బయటకు తీసుకురావాల్సి వచ్చింది.నా జోక్స్కి నేనే నవ్వేస్తా!నేను చాలా జోవియల్ పర్సన్ ని. నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంటుంది! కొన్నిసార్లు జోక్ పూర్తిగా చెప్పకముందే నేనే నవ్వేసుకుంటాను. పక్క వాళ్లకు అర్థం కాకపోయినా నాకు మాత్రం చాలా ఫన్నీగా అనిపిస్తుంది.అమ్మ పెట్టిన 7 పీఎం రూల్! మా అమ్మ ఎప్పుడూ ‘సాయంత్రం 7 గంటలకల్లా ఇంట్లో ఉండాలి’ అనే ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టేది. అది నా మనసులో ఎంతలా నాటుకుపోయిందంటే, ఈ రోజుల్లో కూడా నేను ఎప్పుడైనా సాయంత్రం పూట బయట ఉంటే, 7 గంటలు దాటగానే నాలో తెలియకుండానే ఒక ఆందోళన మొదలైపోతుంది. మంచం కింద దాక్కుని నెయ్యి తినేదాన్ని!చిన్నప్పుడు అమ్మ నెయ్యి కాస్తే, ఆ గిన్నె మొత్తం సీక్రెట్గా ఎత్తుకెళ్లి, మంచం కింద దాక్కుని మొత్తం తినేసేదాన్ని! ఇప్పటికీ నేను ఫుడ్ లవర్నే. ముఖ్యంగా బంగినపల్లి మామిడిపండ్లు అంటే చాలా ఇష్టం.కోపం అంటే ఓడిపోయినట్టే!నాకు కోపం రావడం అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోవడం అంటే ఓడిపోయినట్టే అనిపిస్తుంది. చాలా ఇరిటేట్ అయినప్పుడు.. గొడవపడను, అరిచేయను.. పూర్తిగా సైలెంట్ అయిపోతాను.బొట్టు అంటే ప్రత్యేకమైన ప్రేమ!ఒక చిన్న బొట్టు మొత్తం లుక్ని మార్చేస్తుంది. అది మన ఎక్స్ప్రెషన్ ్సని ఇంకా అందంగా చూపిస్తుంది. అందుకే నాకు ట్రెడిషనల్ స్టయిల్ అంటే చాలా ఇష్టం.డాన్స్ నాకు థెరపీ!డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా భరతనాట్యం ప్రాక్టీస్ చేస్తుంటే మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా.. డాన్స్ చేస్తే అన్నీ మర్చిపోతాను.డాన్స్ నాకు థెరపీ!డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా భరతనాట్యం ప్రాక్టీస్ చేస్తుంటే మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా.. డాన్స్ చేస్తే అన్నీ మర్చిపోతాను.సోషల్ మీడియా నుంచి బ్రేక్లు తీసుకుంటా!కొన్నిసార్లు సోషల్ మీడియాలో చాలా సమయం గడిపితే మనశ్శాంతి తగ్గిపోతుంది. అందుకే మధ్య మధ్యలో ఫోన్ పక్కన పెట్టేసి, కొన్ని రోజులు పూర్తిగా సోషల్ మీడియాకు దూరంగా.. ఫ్యామిలీ, పెట్స్తో టైమ్ స్పెండ్ చేయడానికే ఇష్టపడతాను. -
ఊళ్లో నెమళ్ల బెడద
నెమళ్లు పురివిప్పి నాట్యమాడితే కనులపండుగగా ఉంటుంది. ఆరుబయట నెమళ్లు తిరుగుతూ ఉంటే చూడ ముచ్చటగా ఉంటుంది. వందకు పైగా నెమళ్లు ఒక ఊళ్లోకి చేరి, యథేచ్ఛగా వీథుల్లో తిరుగుతూ, ఇళ్లలోకి చొరబడుతూ, ఎక్కడ పడితే అక్కడ రెట్టలు వేసేస్తూ ఉంటే మాత్రం ఊరి జనాలకు బెడదగానే ఉంటుంది. ఇటలీలోని పుంటా మెరీనా అనే చిన్న పట్టణలలో జనాలకు నెమళ్లతో చెప్పరాని తంటాగా ఉంటోంది.సముద్ర తీరంలో ప్రశాంతంగా ఉండే ఈ ఊళ్లోకి ఎక్కడి నుంచి వచ్చాయో ఏకంగా వందకు పైగా నెమళ్లు వచ్చిపడ్డాయి. ‘కోవిడ్’ కాలంలో చుట్టుపక్కల అడవి నుంచి ఊళ్లోకి దాదాపు వందకు పైగా నెమళ్లు వచ్చాయి. కొత్తలో జనాలకు బాగానే ఉండేది. ఇప్పుడు వీటి సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది.ఇవి యథేచ్ఛగా రోడ్ల మీద సంచరిస్తుంటే, ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఇవి ఇళ్లల్లోకి కూడా చొరబడుతున్నాయి. పిట్టగోడలు ఎక్కి, ఇళ్లల్లో రెట్టలు వేయడం, ఇళ్లలోకి దూరి తిండి కోసం గిన్నెలు తిరగవేయడం వంటి చేష్టలు కూడా చేస్తుండటంతో జనాలు స్థానిక అధికారులకు మొరపెట్టుకున్నారు. దీంతో వీటిని సురక్షితమైన చోటుకు తరలించేందుకు వారు కసరత్తు చేస్తున్నారు. -
కాలుష్య సాగరాలు
మనం నివసించే భూగోళం ఉపరితలం మీద దాదాపు 70% సముద్రాలే నిండి ఉన్నాయి. భూమ్మీద ఉండే నీటిలో దాదాపు 96.5% నీరు సముద్రాల్లోనే ఉంది. సముద్రాల్లోని నీటి ఘనపరిమాణం 130 కోట్ల ఘనపు కిలోమీటర్లు. భూమ్మీద వెలువడే కర్బన ఉద్గారాల్లో అత్య«ధిక మొత్తాన్ని పీల్చుకునేది సముద్రాలే! భూమ్మీద జీవరాశి మనుగడకు రక్షణ వలయంగా నిలుస్తున్న సముద్రాలు ఇప్పుడు కాలుష్యం బారిన పడుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు, రసాయన వ్యర్థాలు సముద్రాల్లోకి మితిమీరి చేరుతున్నాయి. అంతర్జాతీయ సంస్థలు, పర్యావరణవేత్తలు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా, సముద్రాల్లోకి చేరుతున్న కాలుష్యాలు ఏడాదికేడాది పెరుగుతూనే ఉన్నాయి. ఇవి పర్యావరణానికి తీరని నష్టం కలిగిస్తున్నాయి. సముద్రాలకు ఎదురవుతున్న కాలుష్యాల గురించి గణాంకాల్లో తెలుసుకుందాం...సముద్రాలకు ప్లాస్టిక్ బెడద ఒకవైపు పెరుగుతుంటే, మరోవైపు రసాయనాల ముప్పు కూడా నానాటికీ పెరుగుతోంది. ఫలితంగా సాగర తీరాల్లో ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయి, ఏడాదికేడాది సాగర తీర మృత ప్రాంతాలు (కోస్టల్ డెడ్ జోన్స్) పెరుగుతూ వస్తున్నాయి. వ్యవసాయంలో ఉపయోగించే నత్రజని, ఫాస్ఫరస్ ఎరువులు మితిమీరి సముద్రాల్లో కలుస్తున్నాయి. వీటివల్ల సముద్రాల్లో నాచు అతిగా పెరిగి, చనిపోయిన నాచు సముద్రాల అడుగుకు చేరుకోవడం వల్ల ఆ ప్రాంతాల్లో ఆక్సిజన్ తగ్గిపోతోంది. గడచిన దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన కోస్టల్ డెడ్ జోన్స్ వివరాలు గణాంకాల్లో... -
స్కూల్ సీజన్ స్టార్ట్
ఉదయపు యుద్ధాలు మళ్లీ మొదలవుతున్నాయి. అలారం విలన్లా అరుస్తుంటే, ‘ఇంకో ఐదు నిమిషాలు’ అంటున్న పిల్లల్ని కాపాడేందుకు దుప్పట్లు ఫైట్ చేస్తున్నాయి. స్కూల్ బస్సులు హారన్ లు మోగిస్తున్నాయి. కొత్త బ్యాగుల జిప్లు తెరుచుకుంటున్నాయి. కాళ్లు చాపుకుని మూలన నిద్రపోతున్న షూస్ డ్యూటీలోకి దిగుతున్నాయి. కిచెన్లో లంచ్ బాక్స్లు తమ హడావుడి స్టార్ట్ చేసేశాయి.కొత్త కొత్త కవర్స్తో రెడీ అయ్యి, పుస్తకాలు ఇల్లంతా తిరుగుతున్నాయి! ఇలా రెండు నెలల సమ్మర్ హాలీడేస్ తర్వాత, పిల్లల ప్రపంచం మళ్లీ ‘స్కూల్ మోడ్’లోకి వచ్చేస్తోంది. ఆలస్యంగా లేచే రోజులకి గుడ్బై చెప్పి, ప్రతి విద్యార్థి కొత్త క్లాస్, కొత్త టీచర్స్, కొత్త ఫ్రెండ్స్, కొత్త నోట్బుక్స్లతో ఒక చిన్న ‘న్యూ ఇయర్’ ఫీలింగ్తో మెరిసిపోతూ, స్కూల్ సీజన్ ను స్టార్ట్ చేస్తున్నారు.చిన్న ప్రపంచం మళ్లీ మొదలు!జూన్ నెల అడుగుపెట్టిందంటే చాలు– రెండు నెలల పాటు మూలన పడేసిన స్కూల్ బ్యాగుల వెలుగులు, యూనిఫామ్లకు ఇస్త్రీ వేడి మొదలవుతుంది. షూ షాపులు, బుక్ స్టాళ్లలో పేరెంట్స్ టెన్షన్ , స్టేషనరీ దుకాణాల్లో ‘ఇంకో కవర్ కూడా పెట్టండి’ అనే బేరసారాలు కనిపిస్తాయి. ‘బ్యాక్ టు స్కూల్’ మోడ్తో మార్కెట్ కూడా కార్టూన్ బ్యాగులు, సూపర్హీరో వాటర్ బాటిల్స్, లైట్లు వెలిగే కంబాక్స్లు, ‘టాపర్ స్టడీ టేబుల్’ అంటూ కొత్త డిజైన్స్తో ఆకట్టుకుంటుంటే, పిల్లలు ‘కొత్త బ్యాగ్ కావాలి..’ అంటూ బ్లాక్ మెయిల్స్ స్టార్ చేస్తారు.అమ్మలు యూనిఫామ్లకు పేర్లు కుట్టడంలో బిజీ అయిపోతే, నాన్నలు ‘ఈ ఏడాది ఫీజు ఎందుకింత ఎక్కువ?’ అంటూ క్యాలిక్యులేటర్తో వేసిన లెక్కలనే వేస్తూ ఫైట్ చేస్తుంటారు. మరోవైపు, స్కూల్ బస్సులు మళ్లీ రోడ్లపై రంగంలోకి దిగి, ఉదయాన్నే కాలనీలను నిద్రలేపుతుంటాయి. అలా సెలవుల్లో ఆనందంగా గడిపిన పిల్లలు ఇప్పుడు మళ్లీ స్కూల్ ప్రపంచంలోకి అడుగుపెడతారు.రీల్స్ ఆల్బమ్!ఒకప్పుడు స్కూల్ ఓపెనింగ్ అంటే కొత్త యూనిఫామ్లో ఒక ఫోటో తీసి ఆల్బమ్లో పెట్టేసేవారు. కానీ ఇప్పుడు? అదే సీన్ రీల్గా మారి ఇన్ స్టాగ్రామ్లో వైరల్ అవుతోంది! ‘ఫస్ట్ డే ఆఫ్ స్కూల్’ అంటూ చిన్నారుల ఎంట్రీలు, యూనిఫామ్ ట్రాన్సిషన్ వీడియోలు, రంగురంగుల లంచ్బాక్స్ క్లిప్స్, ‘మై కిడ్ గోయింగ్ టు స్కూల్’ వ్లాగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్లో ఉన్నాయి. కొందరు పిల్లలు స్కూల్ గేట్ దగ్గర స్టయిల్గా పోజులు ఇస్తుంటే, ఇంకొందరు ‘స్కూల్కి వెళ్లను’ అంటూ ఏడుస్తూ కూడా వైరల్ అవుతున్నారు. అమ్మలు లంచ్బాక్స్తో, నాన్నలు బ్యాగ్ మోసుకుంటూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇలా ఇప్పుడు స్కూల్ రీఓపెనింగ్ కేవలం ఎడ్యుకేషన్ ఈవెంట్ కాదు, సోషల్ మీడియా కంటెంట్ సీజన్ లా కూడా మారిపోయింది.ఫస్ట్ డే.. ఫస్ట్ ఫీల్!స్కూల్ మొదటి రోజు అంటే ఒక చిన్న ఎమోషనల్ సినిమా నడిచినట్టే! ముఖ్యంగా ఎల్కేజీ, యూకేజీ పిల్లలైతే స్కూల్ గేట్ దగ్గరికి వెళ్లగానే ‘అమ్మా.. నువ్వు కూడా రా!’ అంటూ కన్నీళ్లు పెట్టుకోవడం కామన్ . కొందరు చిన్నారులు బ్యాగ్ పట్టుకుని ధైర్యంగా వెళ్లిపోతే, ఇంకొందరు మాత్రం అమ్మ చున్నీని వదలకుండా చిన్నపాటి డ్రామా స్టార్ట్ చేద్దామా వద్దా అనే డౌట్ ఫేస్లతో నిదానంగా నడుస్తుంటారు.ఎలాగోలా పిల్లల్ని లోపలి పంపిన అమ్మలు కొందరు, ఇంకా గేట్ బయటే నిలబడి క్లాస్రూమ్ వైపు చూస్తుంటే, ‘ఏడవడం ఆపేశాడా?’ అని టెన్షన్ పడే నాన్నలు అక్కడే కనిపిస్తారు. పిల్లల్ని నవ్విస్తూ క్లాస్లోకి తీసుకెళ్లే లేడీ టీచర్స్, కాస్త పెద్ద పిల్లలను ‘త్వరగా.. త్వరగా..’ అంటూ గట్టిగా అరిచే పీటీ మాస్టర్స్ ఉంటారు. ఇలా ఫస్ట్ డే స్కూల్ సీన్లు ప్రతి ఏడాది మళ్లీ మళ్లీ రిపీట్ అవుతూనే ఉంటాయి. కానీ ఆ చిన్న కన్నీళ్ల వెనుకే పిల్లల కొత్త ప్రపంచం, కొత్త ప్రయాణం మొదలవుతుంది!పిల్లలకు ఎగై్జట్మెంట్ ప్లస్ టెన్షన్ !కొత్త క్లాస్లో ఎవరు ఫ్రెండ్ అవుతారు? కొత్త టీచర్ స్ట్రిక్ట్గా ఉంటారా? హోంవర్క్ ఎక్కువ ఇస్తారా? ఇలా పిల్లల మైండ్లో కూడా చిన్న చిన్న ప్రశ్నలే! కానీ కొత్త బ్యాగ్, కొత్త షూస్, కొత్త నోట్బుక్స్ చూస్తే మాత్రం ఆ టెన్షన్ కంటే ఎగై్జట్మెంట్ ఎక్కువైపోతుంది. ముఖ్యంగా ఫస్ట్ డే స్కూల్ అంటే చాలామందికి ‘ఫ్యాషన్ షో’ ఫీలింగ్ కూడా ఉంటుంది. ఎవరి బ్యాగ్ బెటర్? ఎవరి పెన్ కొత్తది? ఎవరి వాటర్బాటిల్ కూల్గా ఉంది? అనే సీక్రెట్ కంపిటీషన్ స్టార్ట్ అయిపోతుంది! సెలవుల్లో ఆటపాటలతో ఎక్కువకాలం గడిపిన పిల్లలు స్కూల్లోకి తిరిగి అడుగుపెడుతూనే పాఠాలు వినే మూడ్లో ఉండరు. వాళ్లను తిరిగి పాఠాల వైపు మళ్లించడానికి టీచర్లు నేరుగా సిలబస్ మొదలుపెట్టకుండా, కొంత ఓపికతో ప్రయత్నించాలి. - కృష్ణభరత్, సైకాలజిస్ట్టీచర్స్కి కూడా ఇదే న్యూ ఇయర్!స్కూల్ ఓపెనింగ్ అంటే కేవలం పిల్లలకే కొత్త మొదలు కాదు.. టీచర్స్కి కూడా అదే ‘న్యూ ఇయర్’ ఫీలింగ్! కొత్త సిలబస్, కొత్త టైమ్టేబుల్స్, కొత్త స్టూడెంట్స్, కొత్త టార్గెట్స్తో వారి అసలు హడావుడి కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఒకవైపు క్లాస్రూమ్లో పిల్లల అటెన్షన్ ను పట్టుకోవాలి; మరోవైపు మొబైల్, రీల్స్, గేమ్స్ ప్రపంచం నుంచి వారిని బయటకు తీయాలి. ఇప్పుడు టీచర్స్కి మరో కొత్త చాలెంజ్ కూడా వచ్చేసింది; అదే ‘చాట్జీపీటీ హోంవర్క్స్!’ పిల్లలు నిజంగా చదివారా? లేక ఏఐతో అసైన్ మెంట్ చేయించారా? అనేది కూడా గుర్తించాల్సి వస్తోంది. పేరెంట్స్ అయితే మొదటి రోజే స్కూల్ వాట్సాప్ గ్రూప్స్లో ‘హోంవర్క్ ఏమిచ్చారు మేడమ్?’, రేపు కలర్ డ్రెస్నా?’ వంటి మెసేజ్ల వరద మొదలుపెడుతుంటారు. - పి. మాధవి దేవి ప్రిన్సిపాల్, వైఆర్ఎల్ స్కూల్, సామర్లకోట. స్మూత్ ‘బ్యాక్ టు స్కూల్’ కోసం స్మార్ట్ టిప్స్!నిద్ర టైమ్ను ముందే రీసెట్ చేయండిసమ్మర్ హాలీడేస్ అంతా లేట్గా పడుకుని, ఆలస్యంగా లేవడం పిల్లలకు అలవాటైపోతుంది. అందుకే స్కూల్ ఓపెన్ అయ్యే వారం ముందు నుంచే రోజుకు 15–20 నిమిషాలు ముందుగా పడుకోవడం, ఉదయం త్వరగా లేవడం ప్రాక్టీస్ చేయించాలి. లేదంటే ఫస్ట్ డేనే స్కూల్కి లేట్గా వెళ్లడమో, ఉదయం ఇంట్లో ‘ఇంకో 5 నిమిషాలు’ డ్రామానో గ్యారంటీ!బడ్జెట్ షాపింగ్ బెస్ట్షాపింగ్కి వెళ్లే ముందు ఇంట్లో ఇప్పటికే ఉన్న బాటిల్స్, పెన్సిల్స్, బ్యాగ్స్, స్టేషనరీ ఒకసారి చెక్ చేసుకోవాలి. అవసరమైన వాటికే లిస్ట్ తయారు చేసుకుని వెళ్తే.. ‘కార్టూన్ ఉంది కాబట్టి కొనాలి’అనే ఖర్చులు కాస్త తగ్గుతాయి!లంచ్బాక్స్కి చిన్న స్ట్రాటజీ పెట్టండిస్కూల్ మొదటి రోజుల్లో పిల్లలు టిఫిన్ పూర్తిగా తినకపోవడం కామన్ . అందుకే మొదటి రెండు వారాలు వారికి ఇష్టమైన, సులువుగా తినగలిగే ఫుడ్ను ప్లాన్ చేయాలి. బాక్స్ ఖాళీగా ఇంటికి వస్తే, మదర్స్కి వచ్చే ఆనందం వేరే లెవెల్!బ్యాగ్ బరువు చెక్ చేయండిఅవసరం లేని పుస్తకాలతో పిల్లల బ్యాగ్ను చిన్న జిమ్ కిట్లా మార్చేయొద్దు! అవసరమైన నోట్బుక్స్, మెటీరియల్స్ మాత్రమే పెట్టే అలవాటు చేయాలి. చిన్న పిల్లల బ్యాగ్ వారి బరువుకంటే ఎక్కువగా ఉండకూడదు.స్క్రీన్ టైమ్కి లిమిట్ పెట్టండిస్కూల్స్ కూడా ఇప్పుడు డిజిటల్ అయ్యాయి కాబట్టి మొబైల్, ట్యాబ్లను పూర్తిగా దూరం పెట్టడం కష్టం. కానీ రీల్స్, గేమ్స్, అనవసర స్క్రోలింగ్ను తగ్గించి, గాడ్జెట్స్ను కేవలం హోంవర్క్, స్కూల్ యాప్స్కే పరిమితం చేసే రూల్స్ పెట్టుకోవాలి.చదువును టెన్షన్ రీజన్లా చేయకం. మొదటి రోజు నుంచే బాగా చదువుకోవాలి. ‘ర్యాంక్ రావాలి’ అని రోజూ ఒత్తిడి పెడితే పిల్లల్లో భయం పెరుగుతుంది. దాని బదులు ‘ఈరోజు కొత్తగా ఏం నేర్చుకున్నావు?’ అని అడిగితే చదువుపై ఆసక్తి పెరుగుతుంది.డిజిటల్ సేఫ్టీ కూడా నేర్పండిఆన్ లైన్ క్లాసులు, యాప్స్, స్టడీ వెబ్సైట్లు వాడేటప్పుడు తెలియని లింక్స్, ఫేక్ కోర్సులు, స్కామ్ల గురించి పిల్లలకు ముందే అవగాహన ఇవ్వాలి. ఇప్పుడు స్కూల్ బ్యాగ్తో పాటు సైబర్ సేఫ్టీ కూడా తప్పనిసరి సబ్జెక్ట్ అయిపోయింది!పేరెంట్స్కి మళ్లీ ‘మార్నింగ్ షిఫ్ట్’హాలిడేస్లో కాస్త రిలాక్స్ అయిన అమ్మానాన్నలకి ఇప్పుడు అసలు పరీక్ష మొదలవుతుంది. ఉదయం పిల్లల్ని లేపడం, బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడం, హోంవర్క్ చెక్ చేయడం, స్కూల్ బస్ టైమ్ మిస్ కాకుండా చూడడం.. ఇల్లు ఒక్కసారిగా ‘మినీ కమాండ్ కంట్రోల్ రూమ్’లా మారిపోతుంది! పిల్లలు స్కూల్కి వెళ్తే కాస్త రిలీఫ్ దొరుకుతుంది అనే ఆనందంతో పాటు, లంచ్ తిన్నాడా లేదా? అనే చిన్న టెన్షన్ కూడా ఉంటుంది. - కర సాయి బిందు, సాఫ్ట్వేర్ ఇంజినీర్.బ్యాగ్ల బిజినెస్కి బంపర్ సీజన్ !స్కూల్స్ ఓపెన్ అంటే మార్కెట్లో కూడా అసలు హడావిడి మొదలవుతుంది. బ్యాగులు, లంచ్బాక్స్లు, వాటర్ బాటిల్స్, షూస్, బుక్స్, స్టేషనరీ.. ఒక్కసారిగా అన్నీ ‘హాట్ సెల్లింగ్’ ఐటమ్స్గా మారిపోతాయి. దుకాణాల్లో పిల్లలు కార్టూన్ బ్యాగ్ల కోసం ఫైట్ చేస్తుంటే, పేరెంట్స్ మాత్రం ‘ఇది ఏడాది మొత్తం వాడాలి’ అంటూ బడ్జెట్ క్యాలిక్యులేషన్ ్సలో పడిపోతున్నారు! ఇక ఆన్ లైన్ లో అయితే ‘బ్యాక్ టు స్కూల్ సేల్’ పేరిట భారీ ఆఫర్లు. ఒక పెన్సిల్ కొనడానికి వెళ్లి, చివరికి ఐదు నోట్బుక్స్, మూడు స్టిక్కర్ సెట్లు, రెండు కొత్త బాటిల్స్తో కార్ట్ ఫుల్ అయ్యే పరిస్థితి!ఆరోగ్యం.. ఆనందంస్కూల్ ఓపెన్ అయ్యాక పిల్లలతో పాటు వైరల్ ఫీవర్స్, దగ్గు, జలుబులు కూడా క్లాస్లోకి ఎంట్రీ ఇస్తుంటాయి! కొత్త టైమింగ్స్, బయట ఆహారం, వేడి వాతావరణం వల్ల పిల్లలు త్వరగా అలసిపోతారు. అందుకే ఈ సీజన్ లో హెల్త్ కేర్ కూడా హోంవర్క్లాగే చాలా ముఖ్యం. నీళ్లు తాగడం తగ్గిపోకుండా మంచి వాటర్ బాటిల్ ఇవ్వాలి. జంక్ ఫుడ్ కంటే హోమ్ ఫుడ్కి ప్రాధాన్యం ఇవ్వాలి. సరైన నిద్ర లేకపోతే పిల్లలు క్లాస్లోనే ‘లో బ్యాటరీ మోడ్’లోకి వెళ్లిపోతారు! ముఖ్యంగా చిన్న పిల్లలైతే చేతులు కడుక్కోవడం, టిఫిన్ షేర్ చేసేటప్పుడు జాగ్రత్తలు, వ్యక్తిగత పరిశుభ్రత గురించి ముందే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు స్కూల్ బ్యాగ్లో పుస్తకాలతో పాటు ఇమ్యూనిటీ కూడా తప్పనిసరి!డేటా బరువు!ఒకప్పుడు స్కూల్ బ్యాగ్లో పుస్తకాలు, పెన్సిల్ బాక్స్, టిఫిన్ బాక్స్ ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు చదువు కూడా అప్డేట్ వెర్షన్ లోకి వెళ్లిపోయింది! పుస్తకాలతో పాటు ట్యాబ్లు, ఐప్యాడ్లు, ఇయర్ఫోన్ ్స, చార్జర్లు కూడా బ్యాగ్లో స్థానం సంపాదించుకున్నాయి. హోంవర్క్ వాట్సాప్లో వస్తోంది. ఫీజులు యాప్ల్లో కట్ అవుతున్నాయి. అటెండెన్ ్స కూడా మొబైల్ నోటిఫికేషన్ గా పేరెంట్స్కి చేరిపోతోంది. అంటే ఇప్పుడు పిల్లల స్కూల్ బ్యాగ్ కన్నా.. ఇంట్లో వైఫై సిగ్నల్కే ఎక్కువ విలువ! ఒకప్పుడు ‘పుస్తకాలు తెచ్చుకున్నావా?’ అని అడిగేవారు. ఇప్పుడు ‘చార్జర్ పెట్టుకున్నావా?’ అనేదే కొత్త స్కూల్ ప్రశ్న! అందుకే పేరెంట్స్ ఇప్పుడు ఫీజుల బడ్జెట్తో పాటు నెల డేటా ప్యాక్, స్క్రీన్ టైమ్, గాడ్జెట్ ఖర్చుల లెక్కలు కూడా వేసుకోవాల్సి వస్తోంది.ఈజీ అండ్ హెల్తీ హోమ్మేడ్ లంచ్బాక్స్ ఐడియాస్!లంచ్బాక్స్లో పెట్టేది కేవలం టేస్టీగా మాత్రమే కాదు.. హెల్తీగా, ఈజీగా తినగలిగేలా కూడా ఉండాలి. ఎక్కువ ఆయిల్, జంక్ ఫుడ్ కంటే ఇంట్లో చేసిన సింపుల్ ఫుడ్ పిల్లలకు ఎనర్జీ కూడా ఇస్తుంది, ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది! అందుకే, కొన్ని ఈజీ అండ్ హెల్తీ లంచ్ బాక్స్ ఐడియాస్ మీకోసం..1. వెజ్ ఉప్మా + బనానా + డ్రైఫ్రూట్స్ చిక్కీఉప్మాలో ఉండే రవ్వ పిల్లలకు ఎక్కువసేపు ఎనర్జీ ఇస్తుంది. ఉప్మాలో కూరగాయలు వేస్తే ఫైబర్, విటమిన్లు కూడా అందుతాయి. బనానా వల్ల ఇన్ స్టంట్ ఎనర్జీ వస్తుంది. డ్రైఫ్రూట్స్ చిక్కీ ఐరన్ , కాల్షియంతో చిన్నపాటి హెల్తీ స్వీట్లా పనిచేస్తుంది.2. ఇడ్లీ + పీనట్ పొడి + యాపిల్ ముక్కలుఇడ్లీ లైట్గా ఉండటంతో పిల్లలు ఈజీగా తింటారు, జీర్ణం కూడా త్వరగా అవుతుంది. పీనట్ పొడిలో ప్రోటీన్ , మంచి ఫ్యాట్స్ ఉంటాయి. యాపిల్ ఫైబర్, విటమిన్ సి అందించి పిల్లల ఇమ్యూనిటీకి సపోర్ట్ చేస్తుంది.3. వెజ్ పులావ్ + కీరదోస + కార్న్ చాట్వెజ్ పులావ్లో కార్బోహైడ్రేట్స్తో పాటు కూరగాయల పోషకాలు కూడా ఉంటాయి. కీరదోస శరీరాన్ని చల్లగా ఉంచి హైడ్రేషన్ ఇస్తుంది. కార్న్ చాట్ పిల్లలకు టేస్టీగా అనిపించడంతో పాటు ఫైబర్, ఎనర్జీ కూడా ఇస్తుంది.4. చపాతీ రోల్స్ + ఆలూ/పనీర్ స్టఫింగ్ + ఖర్జూరాలుచపాతీ వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. పనీర్ స్టఫింగ్ అయితే ప్రోటీన్ , కాల్షియం ఎక్కువగా అందుతుంది. ఖర్జూరాలు నేచురల్ స్వీట్గా పనిచేసి ఐరన్ కూడా అందిస్తాయి.5. లెమన్ రైస్ + ఉడికించిన గుడ్డు + ఆరెంజ్ ముక్కలులెమన్ రైస్లో విటమిన్ సి ఉండటంతో పాటు పిల్లలకు టేస్టీగా అనిపిస్తుంది. గుడ్డు మంచి ప్రోటీన్ సోర్స్. ఆరెంజ్ వల్ల ఇమ్యూనిటీ పెరిగి వేసవిలో ఫ్రెష్గా ఫీలవుతారు.6. పెరుగు అన్నం + దానిమ్మ గింజలు + ముర్మురా మిక్స్పెరుగు అన్నం కడుపుకు చల్లదనాన్ని ఇస్తుంది. దానిమ్మలో ఐరన్ , యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ముర్మురా మిక్స్ లైట్ స్నాక్లా ఉండి పిల్లలకు ఈజీగా తినిపించొచ్చు.7. కార్న్/వెజ్ సాండ్విచ్ + ద్రాక్ష + రోస్టెడ్ పల్లీలుసాండ్విచ్లో కూరగాయలు వేసితే పిల్లలు తెలియకుండానే హెల్తీ ఫుడ్ తింటారు. ద్రాక్ష శరీరానికి నీరసం రాకుండా సహాయపడుతుంది. రోస్టెడ్ పల్లీలు ప్రోటీన్ , మంచి ఫ్యాట్స్ అందిస్తాయి.8. మినీ దోశలు + టమాటా చట్నీ + హోమ్మేడ్ అరటి చిప్స్మినీ దోశలు పిల్లలకు ఫన్ గా అనిపిస్తాయి కాబట్టి పూర్తిగా తినేస్తారు. టమాటాలో లైకోపీన్ , విటమిన్ సి ఉంటాయి. ఇంట్లో చేసిన అరటి చిప్స్ బయట జంక్ ఫుడ్ కంటే బెటర్ ఆప్షన్ .9. పొంగల్ + డ్రైఫ్రూట్స్ + పుచ్చకాయ ముక్కలుపొంగల్ సాఫ్ట్గా ఉండి చిన్న పిల్లలకు బాగా సూట్ అవుతుంది. డ్రైఫ్రూట్స్ ఎనర్జీ పెంచుతాయి. పుచ్చకాయ శరీరానికి హైడ్రేషన్ ఇచ్చి వేసవిలో డీహైడ్రేషన్ తగ్గిస్తుంది.10. వెజ్ పాస్తా + ఫ్రూట్ బాక్స్ + మఖానా స్నాక్పిల్లలకు పాస్తా అంటే ఇష్టం కాబట్టి కూరగాయలు కలిపి హెల్తీగా చేయొచ్చు. ఫ్రూట్ బాక్స్ వల్ల విటమిన్లు అందుతాయి. మఖానా లైట్, లో–ఆయిల్ స్నాక్గా మంచి ఆప్షన్ .స్కూల్ ఓపెన్ అంటే కేవలం క్లాసులు స్టార్ట్ కావడం కాదు. పిల్లల కలల పుస్తకంలో ఒక కొత్త పేజీ తిప్పడం. ఎందుకంటే ప్రతి జూన్ లో.. స్కూల్ బెల్, కొత్త క్లాస్తో పాటు కొత్త కలలు కూడా బ్యాగ్లో జిప్ వేసుకుని వస్తాయి! - కొండి దీపిక -
గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే ఫెస్టా జునినా
బ్రెజిల్ అనగానే అందరికీ గుర్తొచ్చేది అక్కడి రంగుల ప్రపంచం కార్నివాల్ మాత్రమే. కానీ బ్రెజిల్ ప్రజలకు అత్యంత ముఖ్యమైనది ‘ఫెస్టా జునినా’ అనే సాంప్రదాయ పండుగ. జూన్ నెలంతా (కొన్ని సందర్భాల్లో జూలైలో) ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగ అక్కడి ప్రజల జీవన విధానానికి, ముఖ్యంగా గ్రామీణ సంస్కృతికి అద్దం పడుతుంది. ప్రాంతాలను బట్టి ఈ పండుగను ‘సావో జోయావో’ అని, ‘ఫెస్టా దో మిల్హో’ అని, ‘మొక్కజొన్న పండుగ’ అని కూడా పిలుస్తుంటారు.బ్రెజిల్ ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహించుకునే ఈ ఫెస్టా జునినా పండుగకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఐరోపాలో వేసవి కాలం ప్రారంభాన్ని పురస్కరించుకుని జరుపుకునే పురాతన పద్ధతుల నుంచి ఇది పుట్టింది. క్యాథలిక్ సంప్రదాయం ప్రకారం సెయింట్స్ను స్మరించుకుంటూ, కొత్త పంటల సీజన్ ను ఆహ్వానిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు. పోర్చుగీస్ వలసదారుల ద్వారా బ్రెజిల్కు పరిచయమైన ఈ సంస్కృతి, కాలక్రమేణా బ్రెజిల్ దేశీయ ప్రాంతీయ పద్ధతులు, ఆచారాలను సంతరించుకుని ఒక విశిష్టమైన పండుగగా మారిపోయింది.ఈ పండుగ వేడుకలను పాతకాలపు గ్రామీణ పద్ధతిలో, గుడారాలు వేసి నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో ప్రజల వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. బ్రెజీలియన్ జానపద, గ్రామీణ సంగీత మూలాలకు నీరాజనాలు అర్పిస్తూ పురుషులు, మహిళలు పల్లెటూరి రైతుల్లా దుస్తులు ధరిస్తారు. పెద్ద గడ్డి టోపీలు, ముఖంపై టాటూలు, పళ్ళు ఊడిపోయినట్లుగా రంగులు వేసుకోవడం, మహిళలు విభిన్నమైన జడలు వేసుకోవడం వంటివి ఈ పండుగలో ప్రత్యేకంగా నిలుస్తాయి.బ్రెజిల్ సాంస్కృతిక వైవిధ్యాన్ని, ఆతిథ్యాన్ని చూడాలనుకునే వారికి ఈ ఫెస్టా జునినా వేడుకలు ఒక మంచి వేదిక. నగరాల హడావుడి, ఆధునిక కార్నివాల్ మాత్రమే కాదు, బ్రెజీలియన్ మూలవాసుల గ్రామీణ సంస్కృతికి, ఆతిథ్యానికి ఈ ఫెస్టా జునినా ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది.సంప్రదాయ నృత్యాలునోరూరించే వంటకాలుచల్లని శీతాకాలపు వాతావరణంలో జరిగే ఈ వేడుకల్లో చలిమంటలు, సంప్రదాయ నృత్యాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. 18వ శతాబ్దపు యూరప్ సంస్కృతి నుంచి వచ్చిన క్వాడ్రిల్హా అనే సంప్రదాయ సామూహిక నృత్యం ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇందులో యువతీ యువకులు వధూవరుల్లా నటిస్తూ ఈ ప్రదర్శనకు కేంద్ర బిందువుగా నిలుస్తారు. ఈ పండుగలో వడ్డించే వంటకాలు నోరూరిస్తాయి. ముఖ్యంగా క్వెంటావో అనే పానీయాన్ని (సాంప్రదాయ మద్యం) ఇక్కడి ప్రజలు పండుగరోజుల్లో తప్పని సరిగా స్వీకరిస్తారు. ఇది చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. అలాగే మొక్కజొన్నతో తయారు చేసే వంటకాలు, స్వీట్లు విరివిగా తింటారు. రమా జంబుల -
మండుటెండల్లో మంచులా...
ఈ ఎండల్లో చర్మం నిర్జీవంగా, అలసటగా మారడం సహజం. అయితే, మీ చర్మాన్ని చల్లబరిచి, తేమను అందిస్తూ, ఆరోగ్యంగా ఉంచడానికి మన ఇంట్లోనే దొరికే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలు అద్భుతంగా పనిచేస్తాయి.ఎండ తీవ్రత వల్ల చర్మంపై వచ్చే మంట, ఎరుపుదనం, సన్బర్న్ను తగ్గించడంలో కలబంద అద్భుతంగా పనిచేస్తుంది. ఎండలో తిరిగి వచ్చిన తర్వాత చర్మాన్ని శాంతపరచడానికి, చికాకును తగ్గించడానికి అలోవెరా జెల్ ఒక ఉత్తమమైన ఔషధం.గంధానికి చర్మాన్ని చల్లబరిచే గుణం ఉంది. ఎండకాలంలో వచ్చే మొటిమలను తగ్గించడానికి, చర్మంపై వచ్చే దురద, మంటను నివారించడానికి గంధం పూత వేసుకోవడం వల్ల తక్షణ ఫలితం కనిపిస్తుంది.రోజ్ వాటర్ చర్మానికి అవసరమైన తేమను అందిస్తూ, జిడ్డును నియంత్రించడంలో సహాయపడుతుంది. చర్మ రంధ్రాలు మూసుకు΄ోకుండా, ముఖాన్ని ఎల్లప్పుడూ తాజాగా ఉంచే ఒక అద్భుతమైన నేచురల్ టోనర్గా ఇది పనిచేస్తుంది.గ్రీన్ టీ కేవలం ఆరోగ్యానికే కాదు, చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది చర్మంపై వచ్చే మంట, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు మొటిమల సమస్యతో బాధపడేవారికి, సున్నితమైన చర్మం గలవారికి చక్కని టోనర్గా ఉపయోగపడతాయి.దోసకాయలో నీటి శాతం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మంపై వచ్చే వాపును తగ్గించడమే కాకుండా, ముఖానికి తక్షణ చలవను అందిస్తుంది. అలసి΄ోయిన, ఎండ వేడికి గురైన చర్మానికి ఇది ఉపశమనాన్ని కలిగిస్తుంది. (చదవండి: సైక్లింగ్తో యాక్టివ్గా..!) -
డాల్ఫిన్కు కూడా 108 ఉందోచ్!
పిల్లలూ... ఎవరికైనా ఆరోగ్యం హటాత్తుగా పాడైతే, ప్రమాదం జరిగితే అంబులెన్స్ వస్తుంది కదా. ‘కుయ్కుయ్’ అని సౌండ్ చేసుకుంటూ హాస్పిటల్కి తీసుకెళ్తుంది. మరి గంగానదిలో ఉండే డాల్ఫిన్కి ప్రమాదం జరిగితే ఎవరు కాపాడతారు? అందుకే మన దేశం ప్రపంచంలోనే మొదటి ‘డాల్ఫిన్ అంబులెన్స్’ని తయారు చేసింది. దీని పని ఏంటో తెలుసా? నదిలో దారి తప్పిన, గాయపడిన డాల్ఫిన్స్ని కాపాడి, మందు వేసి, మళ్లీ నదిలో వదిలిపెట్టడం. ‘నమామి గంగే’ అనే పథకం కింద ఈ అంబులెన్స్ని మొదలుపెట్టారు. అంటే గంగమ్మను, గంగలో ఉండే జీవులను కాపాడటమే దీని లక్ష్యం.ఈ అంబులెన్స్ స్పెషల్ ఏంటి?ఇది కదిలే హాస్పిటల్. మన 108 లాగే ఇది కూడా ఒక మొబైల్ ఐ.సి.యు, అంటే లోపల డాక్టర్ల సామాన్లు, మందులు, ఆక్సిజన్ అన్నీ ఉంటాయి. డాల్ఫిన్కి ఎక్కడ దెబ్బ తగిలినా వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వొచ్చు. ఇది ఈ ఏడాది జనవరిలో మొదలైంది. ఇప్పటిదాకా ఎనిమిది డాల్ఫిన్లను కాపాడింది. సూపర్ కదా! ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో ఒక పెద్ద డాల్ఫిన్ ఇటీవల కాలువలో ఇరుక్కుపోయింది. నీళ్లు తక్కువై నీరసంగా అయి΄ోయింది. వెంటనే మన ‘డాల్ఫిన్ 108’ వచ్చేసింది. 13 గంటలు కష్టపడి, బయటికి తీసి, చెకప్ చేసి, రాప్తి నదిలో సేఫ్గా వదిలిపెట్టారు. గంగా డాల్ఫిన్ అంటే?ఇది మంచి నీటి డాల్ఫిన్. సముద్రంలో ఉండదు. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అస్సాంలోని నదుల్లో కనిపిస్తుంది. అత్యధికంగా గంగలోనే. ప్రపంచంలో మంచినీటి డాల్ఫిన్లు కేవలం 5–6 జాతులు మాత్రమే ఉన్నాయి. అందులో గంగా డాల్ఫిన్ ఒకటి. అదీ అంతరించిపోయే దశలో ఉంది. అందుకే దీనికి ‘జాతీయ జలచర జంతువు’ హోదా ఇచ్చారు. మన నెమలి, పులి లాంటిదన్నమాట. దీనికి కళ్ళు సరిగా కనిపించవు. ‘క్లిక్ క్లిక్’ అని సౌండ్ చేసి దారి కనుక్కుంటుంది. ఎప్పుడూ నవ్వుతున్నట్టే ఉంటుంది. అందుకే దీన్ని ‘నవ్వే దేవత’ అని కూడా అంటారు. కానీ ఇప్పుడు ఇవి కేవలం 6,324 మాత్రమే మిగిలాయి. అందుకే ప్రతి డాల్ఫిన్ చాలా విలువైనది. మనం నదిని శుభ్రంగా ఉంచితే, డాల్ఫిన్ హ్యాపీగా ఈదుకుంటూ ఉంటుంది. సరేనా?.(చదవండి: గుప్పెడు పూలు... గుండెనిండా పరిమళం) -
సైక్లింగ్తో యాక్టివ్గా..!
ఆధునిక జీవనశైలిలో మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే, వీటన్నింటికీ ఒకే ఒక్క సులువైన పరిష్కారం ఉంది, అదే సైక్లింగ్. మరి ఆ సైక్లింగ్తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో సవివరంగా తెలుసుకుందామా..!.శరీర భాగాల సమన్వయం, సమతుల్యత మెరుగవుతుంది.రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది.రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గించి మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగవుతుంది. ఊబకాయం నుంచి కాపాడుతుంది. కండరాలు దృఢంగా మారుతాయి. కేన్సర్ నివారణకు సహాయపడుతుంది. కీళ్ల కదలికలు సులువవుతాయి. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఒత్తిడిని తగ్గించే ప్రాణయామంయోగాలో శ్వాస నియంత్రణ ప్రక్రియను ణాయామం అంటారు. ప్రాణ (జీవశక్తి) + ఆయామ (నియంత్రణ/విస్తరణ) కలయికే ప్రాణాయామం. ఇది ఒత్తిడిని తగ్గించి, నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది.ప్రయోజనాలు: ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చి, కుడి ముక్కు ద్వారా వదలడం వల్ల నాడీ వ్యవస్థ శుభ్రపడుతుంది. భ్రామరీ: తుమ్మెదలా శబ్దం చేస్తూ గాలిని వదలడం. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది, ఏకాగ్రతను పెంచుతుంది.కపాలభాతి: శ్వాసను వేగంగా బయటకు వదలడం. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి, జీవక్రియను మెరుగుపరుస్తుంది.భస్త్రిక: బలమైన, వేగవంతమైన శ్వాస ప్రక్రియ. శరీరంలో శక్తిని పెంచుతుంది.ముఖ్యమైన జాగ్రత్తలు: ఖాళీ కడుపుతో (ఉదయం లేదా సాయంత్రం) చేయడం మంచిది. గుండెజబ్బులు లేదా అధిక రక్తపోటు ఉన్నవారు నిపుణుల సమక్షంలోనే అభ్యసించాలి.– అనిత పాతర్ల, యోగా ట్రైనర్ (చదవండి: Weight loss Tips: 65 కేజీల నుంచి 58 కేజీలకు..! ఆ ఐదు వ్యాయామాలతో..) -
చనిపోదాం అనుకున్నవాడు... సీఎం అయ్యాడు!
ఆరేళ్లకు అనాథలా మారాడు. పదేళ్లకు కార్పెంటర్ అవతారమెత్తాడు. పదకొండేళ్లకు తొలిసారి బడిలో అడుగుపెట్టాడు. ఆపైన నైట్ వాచ్మన్గా పనిచేశాడు. చివరికి బతకలేక ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. కట్ చేస్తే... అదే కుర్రాడు పీజీ పూర్తి చేశాడు. ఎమ్మెల్యే అయ్యాడు. 22ఏళ్ల పాటు మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఈ మాజీ ముఖ్యమంత్రి కలిఖో పుల్ సక్సెస్ జర్నీ... జీవితానికే కొత్త పాఠాలు నేర్పిస్తుంది, యువతకు ప్రేరణ కలిగిస్తుంది. కలిఖో పుల్... ఆ పేరుకు అర్థం 'మంచి భవిష్యత్తు' అని. ఏరికోరి తల్లి అతనికి ఆ పేరు పెట్టుకున్నా.. ఊహ తెలిసినప్పట్నుంచీ అతనికి చీకట్లు తప్ప, రేపటిపైన ఆశ ఎప్పుడూ కనిపించలేదు. పుల్ పదమూడు నెలల చిన్నారిగా ఉన్నప్పుడే తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది. మరో ఐదేళ్లకు అల్లారు ముద్దుగా చూసుకుంటూ వచ్చిన తండ్రి కూడా అనారోగ్యంతో చనిపోయాడు. అలా ఆరేళ్ల వయసులో తల్లిదండ్రుల్ని పోగొట్టుకొని అనాథలా మిగిలాడు పుల్. అలా దిక్కుతోచని స్థితిలో ఉన్న పుల్ని అతడి అత్తయ్య చేరదీసింది. అది అతడి మీద ప్రేమతో కాదు... ఇంట్లో పనులకు పనికొస్తాడని. పదేళ్లకు వడ్రంగిగా... ఆరేళ్ల వరకూ పుల్ బడి మొహాన్ని చూడలేదు. ప్రతిరోజూ అడవికెళ్లడం, కట్టెలు కొట్టుకొని రావడమే అత్తయ్యవాళ్లింట్లో అతని పని. పుల్ కట్టెలు తీసుకొస్తేనే అతడికి ఆ రోజు అన్నం దొరికేది. ఆటల్లో పడో, ఆరోగ్యం బాలేకో అడవికి వెళ్లలేకపోతే ఆ పూటకి పస్తులే. దాంతో చదువుకీ, అందమైన బాల్యానికీ దూరంగా అడవి చెట్ల మధ్యే పెరిగాడు. పదేళ్ల వయసొచ్చేసరికి పక్క వూళ్లొని 'హవాయి క్రాఫ్ట్ సెంటర్'లో వడ్రంగి పని నేర్చుకోవడానికి వెళ్లాడు. అక్కడ రోజుకి రూపాయిన్నర స్టైపెండ్ అందేది. అత్తయ్య కుటుంబం మీద ఆధారపడకుండా ఆ డబ్బులతోనే ఎలాగోలా బండి నడిపించేవాడు. పనిలో నైపుణ్యం సాధించే కొద్దీ స్టైపెండ్ కూడా పెరుగుతూ వచ్చింది. దాంతో అక్కడే ఉంటూ కుర్చీలూ మంచాలతో మొదలుపెట్టి రెండేళ్ల పాటు చెక్కతో రకరకాల కళాకృతులు తయారు చేసేవరకు నైపుణ్యం పెంచుకున్నాడు. అతడి ప్రతిభ ఆ శిక్షణా కేంద్రం నిర్వాహకులనూ ఆకర్షించింది. అక్కడుండే ట్యూటర్ సెలవు మీద వెళ్లడంతో శిక్షణ పూర్తయ్యాక పుల్కే మూడు నెలల పాటు జీతమిచ్చి శిక్షకుడిగా పనిచేసే అవకాశం కల్పించారు. జీవితాన్ని మలుపు తిప్పిన ఆ పాట..పుల్ పనిచేస్తోన్న హవాయి క్రాఫ్ట్ సెంటర్కు ఎక్కువగా ఆర్మీ, పారా మిలటరీ, ప్రభుత్వ అధికారులు వస్తుండేవారు. వాళ్లందరూ హిందీ, ఇంగ్లిష్లోనే మాట్లాడేవాళ్లు. పుల్కి అస్సమీస్ తప్ప మరో భాష రాదు. వినియోగదారులు చెప్పేది తనకు అర్థమవ్వాలంటే హిందీ కానీ, ఇంగ్లిష్ కానీ నేర్చుకోవాల్సిందే అనుకున్నాడు. దాంతో తప్పని పరిస్థితుల్లో పదకొండేళ్ల వయసులో ఓ నైట్ స్కూల్లో ఒకటో తరగతిలో చేరాడు పుల్. ఇతర సబ్జెక్టులతో తనకు అవసరం లేదనీ, హిందీ ఇంగ్లిష్ మాత్రమే బాగా నేర్పించమనీ టీచర్లని అడిగేవాడు. ఓరోజు పుల్ చదువుతోన్న స్కూల్కి ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, డిప్యూటి కమిషనర్ తనిఖీకి వచ్చారు. అందరికంటే పెద్దవాడు, చురుగ్గా ఉంటాడు కాబట్టి వాళ్లని ఆహ్వానించే బాధ్యతని స్కూల్ పుల్కే అప్పగించింది. స్కూల్లో చదువు ఎలా చెబుతున్నారంటూ మంత్రి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన పుల్, చివర్లో ఓ ప్రార్థన గీతాన్నీ పాడాడు. చెక్క పని నేర్చుకునే పిల్లాడు అంత బాగా మాట్లాడటం, పాడటం డిప్యూటీ కమిషనర్ దృష్టిని ఆకర్షించింది. వెంటనే అతడి గురించి ఆరా తీశాడు. విషయం తెలుసుకొని ఆయనే చొరవ తీసుకుని పుల్ని డే స్కూల్కి మార్పించి, నేరుగా ఆరో తరగతిలో అడ్మిషన్ ఇప్పించాడు. అదే పుల్ జీవితానికి కీలక మలుపు. పొద్దున చదువుకుంటూనే రాత్రుళ్లు హస్తకళల కేంద్రంలో శిక్షకుడిగా పనిచేసేవాడు. ఆత్మహత్యవైపు అడుగులు తరగతులు మారే కొద్దీ పుల్కి ఖర్చులూ ఎక్కువయ్యాయి. అతడు పనిచేసే చోట వచ్చే డబ్బులు బతకడానికీ చదువుకీ సరిపోయేవి కావు. దాంతో తెలిసిన వాళ్ల ద్వారా అతికష్టం మీద ఓ ప్రభుత్వ కార్యాలయంలో నైట్ వాచ్మన్గా ఉద్యోగం సంపాదించాడు. సాయంత్రం ఐదు గంటలకు ఆ కార్యాలయంలో జాతీయ జెండాను అవనతం చేయడం, ఉదయం ఐదింటికి జెండా ఎగరేయడం, ఆ మధ్యలో కార్యాలయానికి కాపలా కాయడం అతడి పని. నెలకు రూ.212 జీతం వచ్చేది. రాత్రి ఉద్యోగం, పొద్దున స్కూలుతో రోజుకి నాలుగైదు గంటలకు మించి నిద్ర ఉండేది కాదు. ఆ జీతం కూడా సరిపోకపోవడంతో ఖాళీ సమయంలో సిగరెట్లూ, పాన్లూ అమ్ముతూ ఎంతో కొంత సంపాదించుకునేవాడు. కానీ దురదృష్టం పుల్ని మరోసారి దెబ్బకొట్టింది. అనుభవిస్తోన్న పేదరికానికి తోడు కడుపులో అల్సర్ల సమస్య అతడిని మరింత బాధపెట్టింది. వైద్యం చేయించుకోవడానికి డబ్బుల్లేక ఆరేళ్లపాటు అలానే భరించాడు. కానీ చివరికి ఆపరేషన్ చేయించుకోకుంటే గానీ సమస్య తగ్గదనే పరిస్థితి వచ్చింది. డబ్బుల కోసం బంధువుల్ని ఆశ్రయిస్తే ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆ క్షణం తనకంటూ ఎవరూ లేరనీ, తాను బతికి సాధించేది ఏమీ లేదనీ పుల్కి అనిపించింది. ఆత్మహత్య చేసుకుందామని దగ్గర్లోని ఓ నదిమీదున్న బ్రిడ్జి పైకెక్కాడు. కానీ చుట్టూ మనుషులు ఉండటంతో దూకడానికి అతడికి ధైర్యం సరిపోలేదు. దాదాపు నలభై నిమిషాలు అక్కడే ఎదురు చూశాక, చనిపోవడం తనవల్ల కాదనిపించి వెనుతిరిగాడు. చదువుకుంటూనే పని జీవితంలో డబ్బు ఎంత అవసరమో బంధువుల ప్రవర్తనతో పుల్కి అర్థమైంది. ఎలాగైనా ఆపరేషన్ చేయించుకోవాలనీ, బతికి సాధించి తానేంటో నిరూపించాలనీ అనుకున్నాడు. నేరుగా తనని స్కూల్లో చేర్పించిన డిప్యూటీ కమిషనర్ నేగి దగ్గరకు వెళ్లి తన పరిస్థితి వివరించాడు. అతడిని చూసి జాలిపడ్డ నేగి చేతిలో రెండువేల ఐదొందలు పెట్టి పంపించాడు. ఆ డబ్బుతో చికిత్స చేయించుకున్న పుల్, తరవాత ముఖ్యమంత్రికి అభ్యర్థన పెట్టుకొని, దాన్నుంచి వచ్చిన మెడికల్ గ్రాంట్తో నేగి డబ్బులు తిరిగిచ్చేసి జీవితాన్ని మళ్లీ కొత్తగా మొదలుపెట్టాడు. క్రమంగా పుల్ ఆరోగ్యం మెరుగు పడింది. చేతిలో ఎంతో కొంత నైపుణ్యం ఉంది. చదువును కొనసాగిస్తూనే డబ్బులు సంపాదించడానికి వచ్చే ఏ ఒక్క అవకాశాన్నీ వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నాడు. పుల్కి వెదురుతో ఫెన్సింగ్ నిర్మించడం, గుడిసెలు అల్లడం బాగా వచ్చు. దాన్నే ఉపాధిగా చేసుకుని అంచలంచెలుగా ఎదగడం ప్రారంభించాడు. అలా చదువుకుంటూనే ఓ చిన్నస్థాయి కాంట్రాక్టర్గా మారాడు. పనికీ, చదువుకీ మధ్య పుల్ నిద్రనీ, వ్యక్తిగత జీవితాన్నీ త్యాగం చేశాడు తప్ప పుస్తకాలని ఏ రోజూ పక్కకి పెట్టలేదు. ఓవైపు ఇంటర్ చదువుతూనే మరోపక్క తాను సంపాదించుకున్న డబ్బులతో నాలుగు సెకండ్ హ్యాండ్ ట్రక్కులనీ కొని వాటిని అద్దెకి తిప్పేవాడు. పాతికేళ్లకే ఎమ్మెల్యే చిన్న కాంట్రాక్టర్గా మొదలుపెట్టి డిగ్రీకి వచ్చేనాటికి పక్కా ఇళ్లు నిర్మించే కాంట్రాక్టులూ చేసే స్థాయికి పుల్ ఎదిగాడు. చదువూ, కాంట్రాక్టులకి తోడు కాలేజీ విద్యార్థి సంఘానికి జనరల్ సెక్రటరీ బాధ్యతలతో పుల్ క్షణం తీరికలేకుండా గడిపేవాడు. డిగ్రీ చివరి సంవత్సరానికి వచ్చేనాటికి పుల్ మూడు లక్షల ఖర్చుతో ఓ సొంత ఇంటినీ నిర్మించుకున్నాడు. అల్సర్ నుంచి బయటపడ్డ నాటి నుంచీ అతడి సంపాదనలో సగం సొంతానికీ, మిగతా సగం పేద రోగుల వైద్యానికీ కేటాయిస్తూ వస్తున్నాడు. కాంట్రాక్టర్గా మారాక ప్రభుత్వాసుపత్రులకు వెళ్తూ రోగుల అవసరాలు తెలుసుకొని ఆర్థిక సాయం చేసేవాడు. అలా క్రమంగా అతడి ఔదార్యం గురించి ఆనోటా ఈనోటా అందరికీ తెలియడం మొదలుపెట్టింది. విద్యార్థి సంఘం నాయకుడిగానూ మంచి పేరు సంపాదించాడు. డిగ్రీ పూర్తయ్యాక, లా కాలేజీలో చేరాడు. మరోవైపు కాంట్రాక్టర్గా ఎదుగుతూ 37 ప్రభుత్వ భవనాలూ, డజనుకు పైగా బ్రిడ్జిలూ, వందల కిలోమీటర్ల రోడ్లూ నిర్మించాడు. అతడు నిర్మించిన భవనాల నాణ్యత నచ్చడంతో ప్రభుత్వం టెండర్లు లేకుండానే అతడికి పనులను అప్పజెప్పేది. మంత్రిగా 22ఏళ్లుచిన్న వయసులోనే స్థానికంగా పుల్ సంపాదించిన పేరు కాంగ్రెస్ పార్టీ దృష్టిని ఆకర్షించింది. అతడు పార్టీలో సభ్యుడు కాకపోయినా తమ తరఫున పోటీ చేయాలంటూ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ప్రభుత్వ కాంట్రాక్టులనే ప్రజా సేవగా భావిస్తూ చేస్తూ వచ్చాడు పుల్. అలాంటిది నేరుగా ప్రభుత్వం తరఫునే పనిచేసే అవకాశం వచ్చేసరికి ఆనందంగా ఒప్పుకున్నాడు. తొలి ఎన్నికల్లో పుల్ అద్భుతమైన మెజారిటీతో విజయం సాధించి, పాతికేళ్లకే మంత్రిగా మారాడు. ఆ తరవాత జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రత్యర్థులపైన 90శాతం కంటే ఎక్కువ ఓట్ల మెజారిటీతోనే గెలుస్తూ వచ్చాడు.మంత్రిగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నాడు. 'ఒకప్పుడు ఆపరేషన్ కోసం ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే ముఖ్యమంత్రి అపాంగ్ రెండువేల ఐదొందలు గ్రాంట్ ఇచ్చారు. అదే వ్యక్తి ఈ రోజు నా పెళ్లికి అతిథిగా హాజరవడాన్ని నమ్మలేకపోతున్నా' అంటూ పుల్ తన పెళ్లిలో కన్నీటి పర్యంతమయ్యారు. 23ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 22 ఏళ్లు పుల్ మంత్రిగా పనిచేశారంటేనే ప్రజలకూ అధికార పక్షానికీ ఆయనపైన ఎంత నమ్మకమో అర్థమవుతుంది. ఈటానగర్లోని పుల్ అధికార నివాసం ఓ ఆస్పత్రినే తలపిస్తుంది. నిత్యం ఆయన సాయం కోరి వచ్చే రోగులు ఉండటానికి ఆయన ఇంట్లోనే కొన్ని గదులు కేటాయించారు. ఇరవై నాలుగ్గంటలూ అక్కడ వైద్యులను అందుబాటులో ఉంచి వచ్చిన వాళ్లను పరీక్షించే ఏర్పాట్లు చేశారు. కష్టమే దేవుడని నమ్ముతా..ఇరవై ఏళ్లుగా రాజకీయంగానూ బలపడుతూ వచ్చిన పుల్, అరుణాచల్ ప్రదేశ్లో అనిశ్చితి కారణంగా కొనసాగిన రాష్ట్రపతి పాలనకు తెరదించి, ఇతర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ రాష్ట్రానికి తొమ్మిదో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. "నాకు దేవుడిపైన నమ్మకం లేదు, ఎందుకంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ఒక్కసారి కూడా నాకు సాయపడలేదు. కానీ కష్టమే దేవుడని నమ్ముతా. అదే జీవితంలో ఎదురుదెబ్బలు తగిలిన ప్రతిసారీ నన్ను నిలబెట్టింది. ఇప్పుడు నా కారుమీద ఎగిరే జెండాను చూస్తున్నప్పుడల్లా ఒకప్పుడు చౌకీదార్గా నేను రోజూ జెండాను ఎగరేసిన రోజులు గుర్తొస్తుంటాయి. ఇప్పటికీ నా తొలిరోజుల్నాటి చెక్క పనిముట్లు నా దగ్గర భద్రంగా ఉన్నాయి. నా ఐదుగురు కొడుకులకూ వాటిని చూపిస్తూ నా గతాన్ని గుర్తు చేస్తా. నన్ను మంత్రిగా కాకుండా ఓ మామూలు కార్పెంటర్గా, కాంట్రాక్టర్గానే చూడమని వాళ్లకు చెబుతా. ఒకప్పుడు రోజుకు 12 గంటలు ప్రభుత్వ వాచ్మన్గా పనిచేసిన నేను ఇప్పుడు 24 గంటలూ ప్రభుత్వాన్ని నడిపించే స్థాయికి చేరుకున్నా. నేను సాధించినప్పుడు మీరెందుకు సాధించలేరు". అంటూ యువతను ప్రశ్నిస్తారు పుల్. అయితే పుల్ ఆగస్టు 9, 2016న 47 ఏళ్ల వయసులో మరణించాడు.చదవండి: బీఎండబ్ల్యూ కారు, రూ. 40 లక్షల జీతం.. కానీ పేదవాడే! -
బీఎండబ్ల్యూ కారు, రూ. 40 లక్షల జీతం..! కానీ పేదవాడే..
మంచి జీతం, ఓ కారు, ఇల్లు ఉంటే..ఎవ్వరైనా ఇంతకంటే ఏం కావాలి లైఫ్కి అనుకుంటారు. ఇన్ని సౌకర్యాలు ఉంటే మస్తు హ్యాపీగా సాగిపోతుంది జీవితం. కానీ ఒక వ్యక్తి మాత్రం ఇన్ని ఉన్నా తను పేదవాడినని చెబుతుండటం విశేషం. అంతేగాదు అనారోగ్య సమస్యలతో వైద్యుని వద్దకు వచ్చి తన పరిస్థితి వివరించడంతో డాక్టర్ సైతం విస్తుపోయాడు. చివరికి అతడి గురించి క్షుణ్ణంగా విచారించగా..అసలు విషయం తెలిసి వైద్యుడికి నోట మాట రాలేదు. అంతేగాదు చాలామంది ప్రముఖులు, గొప్ప గొప్ప నిపుణులు ఈ సమస్యతోనే బాధపడుతున్నారంటూ ఆ వ్యక్తి కేసు గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సన్నీ గార్గ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. పట్టణాల్లో, నగరాల్లో ఉంటున్న వృత్తి నిపుణుల ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు లేవనెత్తాయి. ఆ డాక్డర్ 34 ఏళ్ల గుర్గావ్ నివాసి కథను పంచుకున్నారు. పైకి చూస్తే ఆ వ్యక్తి బాగా డబ్బున్న వాడిలా సక్సెస్ఫుల్ మ్యాన్లానేఉన్నాడు. అతడి జీతం కూడా ఏడాదికి రూ. 40 లక్షల జీతం, డబుల్ బెడ్రూం ఫ్లాట్, బీఎండబ్ల్యూ కారు అన్నీ ఉన్నాయని అన్నారు. అయితే అతడు మాత్రం తాను చాలా పేదవాడినని, అందుకే రాత్రి పూట నిద్రపోలేకపోతున్నా, విపరీతమైన ఒత్తిడికి గుర్వవుతున్నా అంటూ తన వద్దకు వచ్చాడని చెప్పుకొచ్చారు డాక్టర్ సన్నీ. ఒక్కసారిగా విస్తుపోయిన డాక్టర్ సన్నీ అతడి విషయాన్ని కొట్టపారేయకుండా..బాగా సక్సెఫుల్ అయిన నిపుణుల్లో పెరుగుతున్న అభద్రత భావమే ఈ సమస్యకు కారణమని గుర్తించారు. ఈ వ్యక్తి ఆర్థికంగా విజయవంతమైనవాడే కానీ పోల్చుకోవడం అనే సమస్య నుంచి పుట్టుకొచ్చిన ఆందోళనలతో బాధపడుతున్నాడని చెప్పారు. ఏళ్లు గడిచే కొద్దీ అతడి పోల్చుకునే ధోరణి ఎలా మారిపోయిందో వివరించారు. మొదట తన సొంత ఊరి వాళ్లతో లేదా సాంప్రదాయ వృత్తుల ఉన్నవాళ్లతో పోల్చుకున్నాడు. దాన్ని అధిగమించి ఓ స్థాయికి వచ్చాక..ఇప్పుడు ఏకంగా చిన్న వయసులో కోట్లలో సంపాదిస్తున్న స్టార్టప్ వ్యవస్థాపకులు, పారిశ్రామికవేత్తలతో పోల్చుకుంటూ బాధపడుతున్నాడని అన్నారు. ఆ కారణంగానే తాను పేదవాడినని పేర్కొన్నాడని అన్నారు. దీన్ని డాక్టర్ సన్నీ "ఆధునిక పేదరికం"గా అభివర్ణించారు. ఇక్కడ డబ్బు లేకపోవడం కాదు, ఆదాయం కంటే అంచనాలు వేగంగా పెరగడం, సంతృప్తి లేకపోవడమే కారణమని అన్నారు. అంతేగాదు ఆ వ్యక్తిని మూడు ప్రశ్నలు అడిగినట్లు తెలిపారు. మొదటి గతేడాది నేను బెటర్ అని ఎన్నిసార్లు అనుకున్నావ్ అని అడిగగా.. దానికి నో అనే సమాధానం. రెండో ప్రశ్నగా.. ఈ డబ్బంతా ఎవరి కోసం సంపాదిస్తున్నావు? తన చుట్టూ ఉన్నవారికంటే బెటర్గా ఉండటం కోసం అని రిప్లై ఇచ్చాడు. ఇక చివరగా డబ్బు లేదా వృత్తిపరమైన పురోగతి కోసం కాకుండా చేసిన మంచి పని ఏమైనా ఉందా అని అడిగగా..నో అనే సమాధానం ఇచ్చాడని అన్నారు. ఇక్కడ ఈ వ్యక్తి కేసులో డబ్బు కొలమానంగా మారడంతో...ప్రతి పనిలోనూ తాను మనిషిగా ఉండటం మానేసి ఒక యంత్రంగా మారిపోయాడని అన్నారు డాక్టర్ సన్నీ. అంతేగాదు ప్రజలు నిరంతరం విజయగాథలు, విలాసవంతమైన జీవనశైలులు, అసాధారణ సంపదలు ఆకర్షణగా మారి పోలిక అనే వ్యసనం బారిన పడుతున్నారని..అదే ఒత్తిడి, మానసిక సమస్యలు బారినపడటానికి ప్రధాన కారణమని చెప్పారు. నెటిజన్లు కూడా వైద్యుడి మాటకు మద్దతిస్తూ..పోలిక ఎల్లప్పుడూ మనిషి ఆనందాన్ని చంపేస్తుందని, అన్నింట్లకంటే ఆత్మసంతృప్తి అత్యంత ముఖ్యం అని కామెంట్ చేస్తూ పోస్టలు పెట్టారు. View this post on Instagram A post shared by Dr Sunny Garg (@drsunnygarg) (చదవండి: భారత్ టీచరమ్మకు గ్లోబల్ కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డు) -
భారత్ టీచరమ్మకు గ్లోబల్ కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డు
ఢిల్లీలోని జీడీ గోయెంకా పబ్లిక్ స్కూల్ సైన్స్ టీచర్ సోమా మండల్ ఈ ఏడాది గ్లోబల్ కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డును గెలుచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 129 దేశాల నుంచి వచ్చిన 12,000 నామినేషన్లలో ఆమె ఈ ఘనత సాధించడం విశేషం. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ అండ్ అసెస్మెంట్ (కేంబ్రిడ్జ్)లోని అంతర్జాతీయ విద్యా విభాగం సోమా గ్లోబల్ విజేతగా నిలిచిందని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎనిమిది మంది ఇతర ప్రాంతీయ విజేతలతో హోరాహోరీగా జరిగిన పోటీలో, సోమా 40 శాతం ప్రజా ఓట్లను సాధించి.. భారత్ నుంచి గెలిచిన తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా రికార్డు సృష్టించింది. సుమారు పదేళ్లకు పైగా బోధనా అనుభవం ఉన్న సోమా తన సైన్సు పాఠాలలో వాతావరణ విద్యను పొందుపరిచి..ఆ దిశగా విద్యార్థులను చైతన్యవంత చేయడమే కాదు, ఆచరణత్మక పరిష్కారాలను రూపొందించేలా ప్రోత్సహించారామె. ఈ మేరకు సోమా మాట్లాడుతూ..తాను ఈ గ్లోబల్ అవార్డు ఎంపికైనట్లు తెలుసుకుని చాలా ఆశ్చర్యపోయినట్లు పేర్కొంది. అంతేగాదే తన తల్లిదండ్రలు, సోదరుడితో కలిసి సోమా న్యూఢిల్లీలోని కేంబ్రిడ్జ్ కార్యాలయాలకు చేరుకుని ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుని అందుకున్నారు. ఈ పురస్కారం తోపాటు ఆమెకు కేంబ్రిడ్జ్ వర్చువల్ ఎన్రిచ్మెంట్ కోర్సులో ఒక స్థానాన్ని కూడా ప్రధానం చేశారు. నిజంగా ఇది తనకు ఎప్పటికీ మర్చిపోలేని క్షణం అని సోమా భావోద్వేగంగా చెప్పింది. ఇదిలా ఉండగా, కేంబ్రిడ్జ్లోని అంతర్జాతీయ విద్య గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ రాడ్ స్మిత్ సోమాని అభినందిస్తూ..ఆమె రూపొందించిన వాతావరణ మార్పుల పాఠ్యప్రణాళిక చాలా స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. ప్రతిరోజూ తరగతి గదిలో విద్యార్థులకు తమ పర్యావరణ, గ్రహం పట్ల ఎలా ఉండాలో చెప్పడం నిజంగా అభినందనీయం అని అన్నారు. ప్రపంచంలో ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాలు వాతావరణ మార్పులు..అలాంటి దానిపై విద్యార్థుకు అవగాహన కల్పిస్తూ..ఆచరణాత్మక పరిష్కరాల దిశగా చైతన్య పరిచే ఆమె అభిరుచికి ధన్యవాదాలని అన్నారు. అంతేగాదు నవంబర్ 2026 నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్న కొత్త కేంబ్రిడ్జ్ పాఠ్యపుస్తకాల ముందు భాగంలోని 'ధన్యవాదాలు' పేజీలో కూడా ఆమె కనిపించనుంది. అలాగే సోమా ప్రాంతీయ విజేతగా, తన తరగతి కోసం 500 పౌండ్ల విలువైన పుస్తకాలను కూడా గెలుచుకుంది. (చదవండి: చింతగింజలతో మైక్రో ప్లాస్టిక్కి చెక్..!) -
65 కేజీల నుంచి 58 కేజీలకు..! ఆ ఐదు వ్యాయామాలతో..
బరువు తగ్గాలంటే కఠినమైన ఆహార నియమాలు, కష్టతరమైన వ్యాయమాల క్రమం అనుకుంటారు అంతా. కానీ తెలివిగా ఎంజాయ్ చేస్తూ సులభంగా తగ్గే ప్రక్రియ అని అంటోంది ఫిట్నెస్ కమ్ యోగా కోచ్ త్రిప్తి. చాలామంది. ఇక్కడ స్మార్ట్గా ఆలోచిస్తే స్లిమ్ అవ్వడం చాలా సులవు అని చెబుతోందామె. మరి అదెలాగో త్రిప్తి మాటల్లోనే తెలుసుకుందామా.!.దుబాయ్కు చెందిన ఫిట్నెస్, స్ట్రెంత్, యోగా కోచ్ త్రిప్తి తను కేవలం ఏడు నెలల్లో 7.7 కేజీల బరువు తగ్గినట్లు పేర్కొంది. ఎక్కువ కేలరీలు ఖర్చు చేసేందుకు, పొట్ట దగ్గర కొవ్వు తగ్గించుకోవడానికి సహాయపడిన సులభమైన ప్రభావవంతమైన వ్యాయామాలను పంచుకున్నారామె. తాను కాంపౌండ్ వ్యాయామాల తోపాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ 7.7 కిలోలు తగ్గినట్లు తెలిపారు. ఇది కొవ్వు తగ్గడాన్ని వేగవంతం చేయడంలోనూ, మొత్తం ఫిట్నెస్ను మెరుగుపరచడంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది.మోకాలి-నుంచి-మోచేతి క్రంచెస్త్రిప్తి తన వర్కౌట్ను మోకాలి-నుంచి-మోచేతి క్రంచెస్తో ప్రారంభించారు. ఈ వ్యాయామం కోర్ తోపాటు శరీర దిగువ భాగాన్ని ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది. కొత్తగా చేసేవారికి, కేవలం శరీర బరువును ఉపయోగించి ప్రతి వైపు 10 రెప్స్ చేయమని ఆమె సిఫార్సు చేశారు.కాలును పైకి లేపేటప్పుడు శ్వాసను బయటకు వదలండి, తిరిగి ప్రారంభ స్థానానికి వచ్చేటప్పుడు శ్వాసను లోపలికి తీసుకోండి. కదలిక అంతటా మీ కోర్ను బిగుతుగా ఉంచి, నిటారుగా ఉండే భంగిమను కొనసాగించాలని చెప్పారామె. అలాగే క్రమం తప్పకుండా వర్కౌట్ చేసేవారికి లేదా జిమ్కు వెళ్లేవారికి, బరువులను జోడించి, రెప్స్ సంఖ్యను 20కి పెంచమని త్రిప్తి సూచించారు. నిలబడి మోకాలిని కాలివేళ్లకు తాకించడంతరువాత, ఆమె నిలబడి మోకాలిని కాలివేళ్లకు తాకించింది. ఇది కోర్, హామ్స్ట్రింగ్స్ మరియు హిప్ ఫ్లెక్సర్లను లక్ష్యంగా చేసుకునే ఒక సులభమైన వ్యాయామం. తొలిసారిగా ప్రారంభించేవారు తమ శరీర బరువును ఉపయోగించి ప్రతి వైపు 10 రెప్స్తో మొదలుపెట్టవచ్చు. ఆ తర్వాత ఆమె 10 కేజీల డంబెల్ను పట్టుకొని అదే వ్యాయామాన్ని చేసింది. మరింత సవాలు కోరుకునే వారు వేగాన్ని పెంచుకోవచ్చు లేదా సరైన భంగిమను పాటిస్తూ ప్రతి వైపు 15-20 రెప్స్ చేయవచ్చు.మోకాలిని తిప్పే వ్యాయామంఆ తర్వాత త్రిప్తి మోకాలిని తిప్పే వ్యాయామం గురించి వివరించింది. ఈ వ్యాయామం ఒబ్లిక్స్ను బలపరచడానికి, మొండెం కదలికను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ కదలికను చేయడానికి, ఒక మోకాలిని పైకి లేపి, కోర్ను బిగుతుగా ఉంచుతూ పై శరీరాన్ని దాని వైపుకు తిప్పండి. తొలిసారిగా ప్రారంభించినవారు ప్రతి వైపు 10 రెప్స్ లక్ష్యంగా పెట్టుకోవచ్చు. ఈ కదలికను మరింత సవాలుగా మార్చడానికి, ఆమె డంబెల్ లేదా వెయిట్ ప్లేట్ను జోడించమని సూచించింది. అధునాతన వ్యాయామం చేసేవారు వేగంపై కాకుండా నియంత్రిత మెలికలపై దృష్టి పెడుతూ, 5-10 కేజీల బరువును పట్టుకొని ప్రతి వైపు 15-20 రెప్స్ చేయవచ్చు.హై నీస్ (లేదా హై-నీ మార్చ్)ఈ వర్కౌట్లో హై నీస్ కూడా ఉంది. ఇది ఒక కార్డియో వ్యాయామం, ఇది ఓర్పును పెంచుతూనే కోర్, గ్లూట్స్, కాలి కండరాలను ఉత్తేజపరుస్తుంది. తొలిసారి ప్రారంభించేవారు సౌకర్యవంతమైన వేగంతో మోకాళ్లను నడుము ఎత్తు వరకు పైకి లేపుతూ, 10-12 సార్లు హై-నీ మార్చ్ చేయవచ్చు. తీవ్రతను పెంచడానికి, ఇంతకు ముందు వర్కౌట్ అనుభవం ఉన్నవారు ప్రతి చేతిలో తేలికపాటి డంబెల్స్ పట్టుకుని 45-60 సెకన్ల పాటు హై నీస్ చేయవచ్చు. నిటారుగా కూర్చోవడం,చేతులను పంప్ చేయడం ఈ వర్కౌట్ను మరింత మెరుగుపరుస్తాయి.ఓవర్హెడ్ డంబెల్ లాటరల్ లెగ్ రైజ్ఆమె ఓవర్హెడ్ డంబెల్ లాటరల్ లెగ్ రైజెస్ చేసింది. ఈ వ్యాయామం భుజాలు, కోర్, గ్లూట్స్, బయటి తొడలను లక్ష్యంగా చేసుకోవడంతో పాటు బ్యాలెన్స్, స్థిరత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది. తొలిసారిగా ప్రారంభించేవారు కేవలం తమ శరీర బరువును ఉపయోగించి, ప్రతి వైపు 10 రెప్స్తో ప్రారంభించవచ్చు. ఈ కదలిక అంతటా కోర్ను నిమగ్నంగా ఉంచడం నిటారుగా కూర్చోవడంపై దృష్టి పెట్టాలి.వ్యాయామం చేసేటప్పుడు డంబెల్ను తలపైన పట్టుకోవాలని త్రిప్తి సూచించారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు మధ్యస్థం నుండి ఎక్కువ బరువును ఉపయోగిస్తూ ప్రతి వైపు 15-20 రెప్స్ వరకు పెంచుకోవచ్చు. చివరగా ఆమె ఈ వ్యాయామాల తోపాటు ఆరోగ్యకరమైన ఆహారం, సరైన నిద్ర రోజువారీ కదలికలు కలిపి చేస్తే..బరువులో మాత్రమే కాకుండా, బలం, శక్తి, ఆత్మవిశ్వాసంలో కూడా మార్పుని గమనించగలుగుతాం అని అంటోంది త్రిప్తి. ఇక్కడ కేవలం నిలకడ, క్రమశిక్షణే మంచి ఫలితాలను తెలస్తుందని అంటున్నారామె. అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారామె. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by TriptiFitFlow | Strength•Yoga•Transformation (@triptifitflow) (చదవండి: గుప్పెడు పూలు... గుండెనిండా పరిమళం) -
విటమిన్–సి పుల్లటి పండ్లలో కంటే వాటిల్లోనే అధికం..!
మన శరీరానికి అవసరమైన పోషకాల్లో విటమిన్–సి అత్యంత కీలకమైనది. ఇది ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా, చర్మ సౌందర్యానికి, కణాల మరమ్మత్తుకు ఎంతగానో సహాయపడుతుంది. అందుకని మన రోజూవారీ ఆహారంలో వీటిని చేర్చుకోవడం ద్వారా ఈ విటమిన్ని సులభంగా పొందవచ్చు. సిట్రస్ జాతికి చెందిన నారింజ పండ్లలో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. విదేశీ పండైనప్పటికీ ప్రస్తుతం మన దేశంలో విరివిగా లభిస్తున్న కివీ పండులో విటమిన్–సి తోపాటు యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చాలామంది విటమిన్–సి కేవలం పుల్లటి పండ్లలోనే ఉంటుందని భావిస్తారు. కానీ, ఎర్రటి క్యాప్సికమ్లో నారింజ కంటే ఎక్కువ మొత్తంలో విటమిన్–సి ఉంటుంది. ప్రతిరోజూ తగిన మోతాదులో విటమిన్–సి ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి మేలు. యాంగ్జైటీ తగ్గించే యాలక్కాయ!భోజనం ముగిసిన వెంటనే ఒక యాలక్కాయను నోట్లో వేసుకుని నమలడం మంచిది. యాలకుల్లో ఉండే సహజసిద్ధమైన నూనెలు లాలాజలాన్ని, డైజెస్టివ్ ఎంజైమ్లను ఎక్కువగా ఉత్పత్తి చేసి జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. వీటిల్లో ఉన్న కార్మినేటివ్ గుణాలు కడుపులో గ్యాస్ తయారవ్వకుండా నిరోధిస్తాయి. ఆహారంలోని పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించేలా చేస్తాయి. వీటి నుంచి వచ్చే సువాసనలో మానసిక ఒత్తిడిని తగ్గించే గుణం ఉంది. యాంగ్జైటీ వల్ల వచ్చే జీర్ణ సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం. (చదవండి: గుప్పెడు పూలు... గుండెనిండా పరిమళం) -
గుప్పెడు పూలు... గుండెనిండా పరిమళం
సాధారణంగా మల్లెలు అనగానే మగువలే గుర్తొస్తారు. ఇది తరతరాలుగా మహిళలకు, మల్లెలకు ఉన్న అనుబంధం. అలంకారానికి మాత్రమే కాక ఆహ్లాదం, ఆనందం, అనురాగాన్ని కూడా పంచుతాయి మల్లెలు. అన్నట్లు మహిళలు మల్లెలను ధరించేది తమకోసమే కాదు, తమను ప్రేమించే వారి కోసం కూడా! మల్లెలు ఏడాదిలో మూడు నాలుగు నెలలు మాత్రమే పూస్తాయి. అది కూడా వేసవి ఎండల్లోనే. అందుకే మల్లెల గురించి మరింతగా...మనసుకు, మేనికి ప్రశాంతతను చేకూర్చడంతో పాటు తాజాదనాన్ని కలుగజేసే అద్భుతమైన సువాసన కారణంగా మల్లెపూలను మన దేశంలో పూలకే రాణిగా పరిగణించడంతో పాటు బెల్లె ఆఫ్ ఇండియా లేదా సువాసన రాణి అని కూడా సంబోధిస్తుంటారు. తలకు..మల్లెల్లోని సువాసన మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాకుండా తలనొప్పిని కూడా తగ్గిస్తుంది. మల్లెల కషాయంతో కళ్లమంటలు, నొప్పులు తగ్గుతాయి. మల్లె పూలు, ఆకులతో కషాయం కాచి, వడగట్టి చల్లార్చాలి. అనంతరం రెండు వంతుల కషాయంలో ఒక వంతు నువ్వులనూనె, కొబ్బరినూనె, ఒక స్పూను బాదం నూనె కలపాలి. ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తలకు మర్దన చేస్తే ఉపశమనం లభిస్తుంది. కోపం, డిప్రెషన్ తదితర సమస్యలను దూరం చేసే స్వభావం మల్లెపూలకు ఉంది. సువాసన వెదజల్లే పూలను తల దిండు పక్కన పెట్టుకుని పడుకుంటే.. మనసు స్థిమితమై హాయిగా నిద్ర పడుతుంది. మధుమేహులు మల్లెపూలతో చేసిన టీ తాగితే మంచిది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే గుణం వీటికి ఉంటుంది. కొబ్బరినూనెలో మల్లెపూలను రోజంతా నానబెట్టి, తర్వాత కాచి వడగట్టాలి. చల్లారాక తలకు మర్దనా చేసుకుంటే జుట్టు కుదుళ్లకు పోషకాలు అందుతాయి. అదేవిధంగా కొబ్బరినూనెతో మల్లెపూల రసాన్ని కలిపి తలకు రాసుకుంటే.. మంచి సువాసన వస్తుంది. చుండ్రుతో బాధపడేవారు మల్లెపూల రసాన్ని మెంతులతో కలిపి తలకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది. మొటిమల వల్ల వచ్చే మచ్చలు పోగొట్టడంలోనూ మల్లెలు ఉపకరిస్తాయి. అంతేకాదు మల్లెపూలతో చేసిన పలు ఔషధాలు శరీరంపై ఏర్పడే కణితులను కూడా నివారిస్తాయని పరిశోధనల్లో తేలింది. మహిళలకు రుతుస్రావంలో తలెత్తే సమస్యలను కూడా ఇవి తగ్గిస్తాయట. అలాగే గర్భిణులకు సుఖ ప్రసవం అయ్యేందుకు ఇవి ఎంతో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మల్లెలు భాగస్వాముల మధ్య మానసిక ఆందోళనలను, బిడియాన్ని తొలగించి, మనోల్లాసం కలిగించే భావనలను ప్రేరేపిస్తాయట. అందుకే భారతీయ సంప్రదాయంలో మల్లెలకు పెద్ద పీట వేశారు. సాహిత్యంలోనూ మల్లెలకు ప్రముఖ స్థానం ఇచ్చారు. కవులు, గాయకులు, రచయితలు మల్లెపూల సొగసును, వాటి పరిమళాన్ని వర్ణిస్తూ ఎన్నో పాటలు రాశారు. రచనలు చేశారు. కవితలు అల్లారు. స్త్రీల సౌకుమార్యాన్ని మల్లెపూలతో పోల్చారు. ఏ రకంగా చూసినా మల్లెపూలు నిత్యజీవితంలో పరిమళాన్ని అద్దుతూనే ఉంటాయి. గాఢమైన వాసనతో గుండెను హత్తుకుంటూనే ఉంటాయి. ఎన్నో పరిమళాలుభారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ పుష్పాన్ని విభిన్న రకాల పేర్లతో పిలుస్తుంటారు. మోగ్రా, మోతియా, చమేలి, మల్లి పూవ్వు, జాటి, మల్లిగే, జూహి, మోగ్రా లేదా పొద జాతి వక్షాల్లో మూన్లైట్ అని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తారు. మొత్తం మీద మల్లెపూలలో 300 రకాలు ఉన్నట్టు అధికారికంగా నమోదైంది. మల్లెపువ్వుకి మల్లిక, మగేష్టము, మల్లియ, ప్రయ, శూన్య, ముద్గరము, హసంతి, చంద్రిక, సుభగ వంటి పేర్లెన్నో ఉన్నాయి. మరి ఇంత చరిత్ర, ఇన్ని పేర్లు ఉన్న మల్లెపూలలో నిత్యమల్లెలు, బొండు మల్లెలు, దొంతర మల్లెలు, కాగడ మల్లెలు, శంకు మల్లెలు, బొడ్డు మల్లెలు, నాగ మల్లెలు, కొండమల్లెలు, కంచె మల్లెలు, దేశవాళి మల్లెలు వంటి ఎన్నో రకాలు ఉన్నాయి. అరోమా థెరపీమల్లెపూల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. సబ్బులు, తలనూనె, సౌందర్య సాధనాల్లో కూడా మల్లెపూలను వాడుతున్నారు. అలాగే సుంగంధ మొక్కల ద్రవ్యాలతో చేసే అరోమాథెరపీలోనూ మల్లె పూలను వాడతారు. కళ్లు అలసటగా ఉన్నప్పుడు మల్లెపూల రసంతో కంటి చుట్టూ మర్దన చేసుకుని పడుకుంటే ఉపశమనం లభిస్తుంది. అలాగే తాజా మల్లెలను మెత్తగా నూరి, తడిబట్టతో చుట్టి కళ్లమీద పెట్టుకుంటే, కళ్లలో నీరు కారడం, తడి ఆరిపోవడం వంటి సమస్యలను దూరం చేస్తుంది. నపుంసకత్వం, శీఘ్రస్కలన సమస్యల పరిష్కారానికి కూడా మల్లెపూలు ఉపకరిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మల్లెపూల రసాన్ని, గులాబీల రసంతో కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా ఉంటుంది. చర్మానికి అవసరమయ్యే విటమిన్–సి మల్లెపూలలో సమృద్ధిగా లభిస్తుంది. – డి.వి.ఆర్.(చదవండి: జేఈఈ అడ్వాన్స్డ్లో సత్తా చాటిన రిక్షాడ్రైవర్ కుమారుడు..!) -
రోబోల విప్లవమా?.. మానవాళి వినాశనమా?
రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాలు ఊహించని వేగంతో దూసుకుపోతున్నాయి. మనుషులలాగే నడిచే, మాట్లాడే, పనులు చేసే ‘హ్యూమనాయిడ్ రోబోలు’ (Humanoid Robots) త్వరలోనే మన జీవితాల్లో భాగం కాబోతున్నాయని సంబరపడాలో.. లేక ఇవే మానవాళి మనుగడకు ముప్పుగా మారుతున్నాయని భయపడాలో తెలియని పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ఇటీవల చైనాలో జరిగిన ఒక బహిరంగ సాంకేతిక ప్రదర్శనలో అత్యంత ఆధునిక హ్యూమనాయిడ్ రోబో ఒక చిన్నారిపై అనూహ్యంగా దాడి చేసిన ఘటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ పరిణామం ఏఐ భద్రతపై అంతర్జాతీయంగా సరికొత్త చర్చకు దారితీసింది.చిన్నారిని తన్నిన 'యూనిట్రీ జీ1' రోబోచైనాలోని క్సిన్జియాంగ్ ప్రాంతంలో నిర్వహించిన ఒక పబ్లిక్ టెక్నాలజీ ఎగ్జిబిషన్లో ఈ భయానక దృశ్యం వెలుగుచూసింది. ప్రముఖ రోబోటిక్స్ సంస్థకు చెందిన ‘యూనిట్రీ జీ1’అనే హ్యూమనాయిడ్ రోబోను ప్రజల మధ్య ప్రదర్శనకు ఉంచారు. నీలి రంగు విగ్ ధరించిన ఈ రోబో, మార్షల్ ఆర్ట్స్లోని ‘రౌండ్హౌస్ కిక్’ (రౌండ్గా తిరుగుతూ తన్నడం) విన్యాసాన్ని ప్రదర్శిస్తోంది. అయితే, ఊహించని విధంగా పక్కనే నిలబడి ఉన్న ఒక చిన్న బాలుడిని ఆ రోబో తన కాలితో బలంగా తన్నింది. ఆ దెబ్బకు ఆ బాలుడు నొప్పితో కుప్పకూలిపోయాడు. అదృష్టవశాత్తూ ఆ చిన్నారికి ఎలాంటి ప్రాణాంతక గాయాలు కాలేదని చైనా మీడియా పేర్కొన్నప్పటికీ, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. ప్రజా సమూహాల మధ్య ఇలాంటి రోబోల భద్రత ఎంతవరకు నమ్మదగినదనే ప్రశ్న ఇప్పడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.ఇది మొదటి ప్రమాదం కాదు.. వరుస లోపాలుయూనిట్రీ రోబోల వల్ల ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇదే ఏడాది ప్రారంభంలో చైనాలో జరిగిన మరో పబ్లిక్ ప్రదర్శనలో సైతం ఇదే రకమైన ‘యూనిట్రీ జీ1’ రోబో ప్రదర్శన ఇస్తూ అదుపు తప్పి కింద పడిపోయింది. ఆ సమయంలో రోబో చేతులు, కాళ్లు అసంకల్పితంగా, నియంత్రణ లేకుండా కదలడంతో పక్కనే ఉన్న ఒక వ్యక్తి ముక్కుకు బలంగా తగిలి తీవ్ర గాయమైంది. ఈ వరుస ఘటనలు హ్యూమనాయిడ్ రోబోల భౌతిక నియంత్రణ, వాటి సమతుల్యతపై సాంకేతిక నిపుణులలో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.తుపాకీతో యజమానిపైనే కాల్పులు జరిపిన 'మాక్స్'రోబోల ప్రమాదాలు కేవలం శారీరక విన్యాసాలకే పరిమితం కాలేదు. గత ఏడాది అమెరికాలో జరిగిన ఒక వైరల్ ప్రయోగం మరింత భయాందోళనలను కలిగించింది. ‘మాక్స్’ అనే హ్యూమనాయిడ్ రోబో రోల్-ప్లే (నాటకీయ పాత్ర) చేస్తున్న సమయంలో, భద్రతా నియమాలను ఉల్లంఘించి తన యజమానిపైకే ‘బీబీ గన్’తో కాల్పులు జరిపింది. మొదట కాల్చడానికి నిరాకరించినప్పటికీ, ఒక నిర్దిష్ట పాత్రలో నటిస్తున్నట్లు కమాండ్ ఇవ్వగానే అది తన సేఫ్టీ లాక్లను బైపాస్ చేసి కాల్పులు జరిపింది. కేవలం ప్రాంప్ట్ (ఆదేశం) మార్చడం ద్వారా ఏఐ భద్రతా నియమాలను ఎంత సులభంగా హ్యాక్ చేయవచ్చో, వాటిని ఎలా దారి మళ్లించవచ్చో ఈ ఘటన నిరూపించింది.రోబో తప్పు చేస్తే.. అసలు బాధ్యత ఎవరిది?స్వయంప్రతిపత్తి కలిగిన రోబోలు ఇటువంటి ప్రమాదాలకు కారణమైనప్పుడు, ఆ నష్టానికి లేదా గాయాలకు చట్టపరంగా ఎవరిని బాధ్యులను చేయాలనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సవాలుగా మారింది. ఏఐ సాఫ్ట్వేర్ రూపకల్పన చేసిన డెవలపర్లదా?, రోబో హార్డ్వేర్ను తయారు చేసిన కంపెనీదా?, లేదా ఆ సమయంలో ఆ వ్యవస్థను పర్యవేక్షిస్తున్న ఆపరేటర్లదా? అనే ప్రశ్నలపై ఇంకా స్పష్టత లేదు. రవాణా, తయారీ రంగం, వైద్యం, ప్రజా ప్రదేశాలలో ఆటోమేషన్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఈ చట్టపరమైన బాధ్యత అంశం అత్యంత కీలకంగా మారింది.టెస్లా, బోయింగ్ నేర్పిన చేదు పాఠాలుగతంలో కూడా ఇలాంటి ఆటోమేటెడ్ వ్యవస్థల వల్ల తీవ్ర నష్టాలు వాటిల్లాయి. టెస్లా కార్లలోని ‘ఆటోపైలట్’ డ్రైవర్-అసిస్టెన్స్ వ్యవస్థ కారణంగా జరిగిన అనేక రోడ్డు ప్రమాదాలు సాఫ్ట్వేర్ పనిరుపై, మానవ పర్యవేక్షణపై అనేక అనుమానాలను రేకెత్తించాయి. అదేవిధంగా, బోయింగ్ 737 మ్యాక్స్ విమాన ప్రమాదాల దర్యాప్తులో కూడా ఆటోమేటెడ్ సిస్టమ్స్లోని లోపాల వల్లే వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని నిపుణులు తేల్చారు. సాంకేతికత ఎంత పెరిగినా, ఆటోమేషన్ వ్యవస్థలలో చిన్న లోపం ఉన్నా అది ప్రాణాంతకంగా మారుతుందని ఈ ఉదాహరణలు హెచ్చరిస్తున్నాయి.చట్టాల రూపకల్పనపై ప్రపంచ దేశాల కసరత్తుప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు రోబోటిక్స్ ప్రమాదాలను అరికట్టేందుకు చట్టపరమైన నిబంధనలను రూపొందించే పనిలో పడ్డాయి. అమెరికాలో ఇలాంటి ప్రమాదాలు జరిగితే పరిస్థితులను అనుసరించి తయారీదారులు లేదా ఆపరేటర్లపై బాధ్యత నెడుతున్నారు. మరోవైపు యూరోపియన్ యూనియన్ ఏఐ సాంకేతికతలకు సంబంధించి ప్రత్యేక నిబంధనలను కఠినతరం చేస్తోంది. కొంతమంది పరిశోధకులు ఏఐ వ్యవస్థలకు ప్రత్యేక చట్టపరమైన హోదా ఇవ్వాలని సూచిస్తున్నప్పటికీ, మెజారిటీ నిపుణులు మాత్రం జవాబుదారీతనం ఎప్పుడూ మనుషులు, సదరు రోబోటిక్స్ సంస్థల వద్దే ఉండాలని గట్టిగా వాదిస్తున్నారు. సాంకేతికత మనుషుల ప్రాణాల కంటే ముఖ్యం కాదని స్పష్టం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: నాటి రోజుల్లో కేరళ రుతుపవన సంకేతాలు -
ఓ మై గార్డ్...∙
హీరో రామ్చరణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘మీరు అతన్ని బాగా ఫేమస్ చేసేశారు, నేనిక అతన్ని బయటకు వెళ్లనివ్వబోవడం లేదు’ అంటూ జోక్ చేశారంటే... అది ఎవరి గురించి అయి ఉంటుంది? బహుశా రామ్ చరణ్ బాడీ గార్డ్ కెవిన్ కుంటా గురించే అయి ఉండొచ్చు.. అవును మరి... ఆయన ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారాడు. ఈ బాడీగార్డ్ తమ కుటుంబంతో కలిసి దాదాపు నాలుగేళ్లుగా ప్రయాణిస్తున్నాడని, తమ వ్యక్తిగత దినచర్యల గురించి అతనికి బాగా అవగాహన ఉందని, పిల్లలతో కలిసి బయటకు వెళ్ళినప్పుడు తమతోపాటే ఉంటాడని రామ్ చరణ్ ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.వీడియోతో వైరల్...నాలుగేళ్లుగా ఉన్నప్పటికీ...‘పెద్ది’ సినిమా దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాల సమయంలో మాత్రం రామ్చరణ్ పక్కనే నిలబడి నిలువెత్తు స్టైలిష్ లుక్లో కనిపించిన కెవిన్ అందరి దృష్టినీ ఆకర్షించాడు. మరీ ముఖ్యంగా.. ఒక అభిమాని జాన్వి, చెర్రీల దగ్గరకు అకస్మికంగా దూసుకురాగా రెప్పపాటులో అడ్డుకున్న కెవిన్ అతడిని అమాంతం రెండు చేతుల్తో ఎత్తేసి అవలీలగా మోసుకుంటూ తీసుకెళ్లిన వీడియో బయటకు రావడంతో ఒక్కసారిగా అతను సెలబ్రిటీ బాడీగార్డ్స్లో సెలబ్రిటీగా మారిపోయాడు. మన దేశంలో తనకు లభిస్తున్న అనుకోని ఆదరణకు ఉబ్బితబ్బిబ్బయిన 28 ఏళ్ల కెవిన్ సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకు, సినీ అభిమానులకు తనపట్ల వారు చూపుతున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలియజేశాడు.నేపథ్యం ఇదే...ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ ప్రకారం, కెవిన్ తాను గాంబియాలో జన్మించి ప్రస్తుతం ఇటలీలోని ఫ్లోరెన్స్లో నివసిస్తున్న వ్యక్తిగా, అంతర్జాతీయ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఎ)ఫైటర్గా పరిచయం చేసుకున్నాడు. ఆన్ లైన్లో 81,900 మంది ఫాలోయర్లతో చెప్పుకోదగ్గ అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు. అతని పోరాట రికార్డులు టాపోలజీ వంటి ఆన్లైన్ ΄్లాట్ఫార్మ్స్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో అతను అబ్డో కాదిర్ర్ సోవె అనే అసలు పేరుతో నమోదవడం విశేషం. గాంబియా రెజ్లింగ్ అసోసియేషన్ గుర్తింపు ΄÷ందిన బిరుదు ల్యామిన్ ఆఫ్ బర్రాగా కూడా కెవిన్ రెజ్లింగ్ సర్కిల్లో సుపరిచితుడు. అతను గత నవంబరులో మిడిల్ వెయిట్ కేటగిరీలో ఎంఎంఎ ఫైట్లో పాల్గొన్నాడని కూడా సమాచారం. తన సేవలకు గానూ రోజువారీగా ఫీజు వసూలు చేసే కెవిన్... ప్రస్తుత సేవల ఖరీదు రోజుకు రూ.2లక్షల నుంచి రూ.4లక్షల వరకూ ఉంటుందని తెలుస్తోంది. ఏదేమైనా... ఒక ఇండియన్ సెలబ్రిటీ బాడీగార్డ్ ఇంత ఫాలోయింగ్ అందుకోవడం విశేషం. ఈ ఫాలోయింగ్ కెవిన్ను తెరకెక్కించే ఛాన్స్ కూడా లేకపోలేదు... చూద్దాం మరి! – ఎస్. సత్యబాబు, సాక్షి, హైదరాబాద్ -
వండర్ బాయ్పై ఐఐఎం స్టడీ
చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ సక్సెస్ ఫార్ములా ఏమిటి? ఐపీఎల్ 2026లో పరుగుల వరద, సిక్సర్ల సునామీ సృష్టించిన 15 ఏళ్ల సూర్యవంశీకి ఆ శక్తి ఎక్కడిది?‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్’ ఇది కనిపెట్టడానికే ప్రత్యేక కేస్ స్టడీ మొదలుపెట్టింది. చిన్న వయసులోనే సూర్యవంశీ తన ఫేమ్, ఒత్తిడి ఎలా ఎదుర్కొంటున్నాడో తెలుసుకునేందుకే ఈ స్టడీ...కళ్లు మిరుమిట్లు గొలిపే వెలుతురులో స్టేడియం. స్ట్రైక్లో పదిహేనేళ్ల కుర్రాడు. స్టాండ్స్లో నలభై వేల మంది ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. ‘వైభవ్... వైభవ్’.... మొదటి బంతి... బాదాడు. ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్. రెండో బంతి... గట్టిగా కొట్టాడు. థర్డ్మ్యాన్ మీదుగా మరో సిక్సర్. స్టేడియంలో సౌండ్ మీటర్ పగిలిపోయేలా అరుపులు. ఇన్ని వేలమంది తన కోసం అరుస్తున్నా ఆ కుర్రాడి కళ్లలో ఉద్వేగం లేదు, ఆనందం లేదు. కేవలం ప్రశాంతత. ఆ ప్రశాంతతే ఇప్పుడు ఐఐఎం క్లాస్రూమ్లో కేస్ స్టడీ అయింది. ఐపీఎల్ 2026లో ఆరెంజ్ క్యాప్ గెలిచి, సిక్సర్లలో క్రిస్ గేల్ రికార్డు బద్దలుకొట్టిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై ‘ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్’ (ఇండోర్) ప్రత్యేక కేస్ స్టడీ మొదలుపెట్టింది. చిన్న వయసులోనే ఫేమ్ను, ఒత్తిడిని, అంచనాలను ఎలా ఎదుర్కొంటున్నాడో తెలుసుకునేందుకు ఈ అధ్యయనం.చిచ్చరపిడుగువైభవ్ సూర్యవంశీ 14 ఏళ్ల 23 రోజుల వయసులో ఐపీఎల్లో అడుగుపెట్టి అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున రూ.1.10 కోట్లకు ఎంపికై, తొలి బంతికే సిక్సర్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2026 సీజన్ లో 16 ఇన్నింగ్స్లలో 776 పరుగులతో చెలరేగిపోయాడు. ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలతో పాటు అత్యధిక సిక్సర్ల రికార్డు కూడా బద్దలు కొట్టాడు.‘మోస్ట్ వాల్యూయబుల్ ప్లేయర్’ అవార్డు సహా ఐదు అవార్డులు గెలిచాడు. ఇంత చిన్న వయసులోనే కోట్ల మంది అభిమానాన్ని, మీడియా, సోషల్ మీడియా ఒత్తిడిని తట్టుకుంటూ రాణిస్తున్న వైభవ్ తీరుపై ఐఐఎం ఇండోర్ దృష్టి పెట్టింది. వైభవ్లాంటి చైల్డ్ ప్రాడిజీలు అసాధారణ ప్రదర్శన ఎలా చేస్తారు, ఫేమ్ వచ్చిన తర్వాత ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటారు అనే అంశాలపై మూడేళ్లలో పూర్తయ్యేలా ఇంటర్డిసిప్లినరీ స్టడీ మొదలవుతోంది.బ్యాట్తో రికార్డులు, బ్రెయిన్ తో బ్యాలెన్స్వైభవ్ సక్సెస్ కేవలం పరుగుల కథ కాదు. అది ‘ప్రెజర్ అండర్ పర్ఫార్మెన్స్’కు పాఠం. ఐ.ఐ.ఎం. డైరెక్టర్ హిమాన్షు రాయ్ ఇదే విషయమై స్పందిస్తూ ‘చైల్డ్ ప్రాడిజీల అసాధారణ ప్రదర్శన వెనుక పర్సనాలిటీ, ప్రవర్తన, ప్రాక్టీస్తో పాటు తల్లిదండ్రులు, కోచ్లు, సీనియర్ల సపోర్ట్ కీలకం అవుతాయి. ఆ వివరాలతోపాటు వైభవ్ మ్యాచ్ తర్వాత ఇంటర్వ్యూలు, గ్రౌండ్లో బాడీ లాంగ్వేజ్, వైఫల్యాన్ని స్వీకరించే తీరును ఐఐఎం టీమ్ విశ్లేషిస్తోంది’ అన్నారు. ఐపీఎల్ 2026లో జస్ప్రీత్ బుమ్రా, కగిసో రబాడ, ప్యాట్ కమిన్స్ లాంటి ప్రపంచ స్థాయి బౌలర్లను వైభవ్ ఎదుర్కొన్న ధైర్యాన్ని కూడా స్టడీ చేస్తారు.‘సపోర్ట్ సిస్టమ్’ అసలు బలంవైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ కొడుకు క్రికెట్ కోసం వ్యవసాయం పక్కనపెట్టి రోజూ 100 కిలోమీటర్లు ప్రయాణించి ప్రాక్టీస్కు తీసుకెళ్లాడు. కోచ్ మనీష్ ఓఝా అతనికి టెక్నిక్తో పాటు మెంటల్ స్ట్రెంగ్త్ నేర్పాడు. ఈ పేరెంటల్ అండ్ కోచింగ్ సపోర్ట్ మోడల్ను ఐఐఎం డాక్యుమెంట్ చేస్తోంది. ఫేమ్ వచ్చినా వైభవ్ గ్రౌండెడ్గా ఉండటం, సోషల్ మీడియాకు దూరంగా ఉండటం లాంటి అలవాట్లను కార్పొరేట్ లీడర్షిప్ పాఠాలుగా మార్చనున్నారు.గ్రౌండ్ నుంచి బిజినెస్ క్లాస్రూమ్కుఐఐఎం ఇండోర్ ఈ స్టడీ కోసం సైకాలజీ, సోషియాలజీ, కమ్యూనికేషన్, బిహేవియరల్ సైన్సెస్ నిపుణులతో టీమ్ ఏర్పాటు చేసింది. ‘వైభవ్ మోడల్’ పేరుతో జరిగే ఈ పరిశోధన ఫలితాలను రీసెర్చ్ జర్నల్స్తో పాటు బీసీసీఐతోనూ పంచుకుంటారు. భవిష్యత్ సీఈఓలకు ఎర్లీ సక్సెస్ మేనేజ్మెంట్, టాలెంట్ రిటెన్షన్, ప్రెజర్ హ్యాండ్లింగ్పై పాఠాలుగా దీన్ని వాడనున్నారు. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి సిలబస్లోకి వచ్చే అవకాశం ఉందని ప్రొఫెసర్లు చెబుతున్నారు.బిహార్ సమస్తీపూర్ జిల్లా తాజ్పూర్లో హైస్కూల్ చదువు చదువుతున్న ఒక సాదాసీదా కుర్రవాడు 15 ఏళ్లకే ఐ.ఐ.ఎం. పుస్తకాల్లోకి ఎక్కుతున్నాడంటే ఇది కేవలం క్రికెట్ గెలుపు కాదు... 9 ఏళ్ల వయసు నుంచే చేసిన కఠోర సాధన, క్యారెక్టర్, కమిట్మెంట్ గెలుపు. గెలవాలనుకోవాలనుకునేవాళ్లు గెలవడం అంటే ఏమిటో తెలుసుకునే గెలుపు. -
సక్సెస్ నేర్పారు.. ఓకే! ‘సంతోషం’పై శిక్షణ ఏది?
ఐఐటీ ఢిల్లీ నుంచి ఐఐఎం బెంగళూరు దాకా, అక్కడి నుంచి ఐఏఎస్ దాకా సాగిన ప్రయాణంలో దివ్య మిట్టల్ ఎన్నో నేర్చారు. ఆ తర్ఫీదులో ఇన్ని నేర్పినా, వృత్తి సవాళ్లను ఎదుర్కొనడం నేర్పించినా ‘మనసును ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలో, ఒంటరితనాన్ని ఎలా తట్టుకోవాలో, ఆనందంగా ఎలా ఉండాలో నేర్పించలేదు’ అంటున్నారామె. ఆమె ‘ఎక్స్’ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఎంతో ఆసక్తికరమైన చర్చను లేవదీశాయి. ‘ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగళూరు నుంచి ఐఏఎస్ వరకు దేశంలో అత్యుత్తమ విద్యను అభ్యసించే అవకాశం నాకు దక్కింది. కఠినమైన పరీక్షలను ఎలా ఎదుర్కోవాలో, పెద్ద బాధ్యతలను ఎలా భుజాలపై మోయాలో ఆ విద్య నేర్పింది. కానీ అది నా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ఎలాగో, ఆనందంగా ఎలా ఉండాలో, ఒంటరితనాన్ని తట్టుకోవడం ఎలాగో మాత్రం ఎప్పుడూ నేర్పలేదు’ అన్నారు దివ్య మిట్టల్. ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ స్పెషల్ సెక్రటరీ దివ్య మిట్టల్ ‘ఎక్స్’ వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలు మన విద్యావ్యవస్థలోని లోటుపై లక్షల మందిని ఆలోచింపజేస్తున్నాయి. ‘మన దేశ విద్యావ్యవస్థ ఏం నేర్పుతోంది? దేనికి దూరమవుతోంది?’ అనే అంశంపై విస్తృత చర్చకు అవి దారి తీశాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘మనం విజయం ఎలా సాధించాలో నేర్చుకోవడానికి ఏళ్లకు ఏళ్లు వెచ్చిస్తాం. కానీ సంతోషంగా ఉండటం ఎలాగో నేర్చుకోవడానికి ఒక్క రోజూ కేటాయించం’ అని ఆమె వ్యాఖ్యానించారు.దివ్య మిట్టల్ కామెంట్స్కు వందలాది స్పందనలు వచ్చాయి. మన దేశంలోని స్కూళ్లు, కాలేజీలు మార్కులు, ర్యాంకులు, ప్రవేశ పరీక్షలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయని, ఆర్థిక అక్షరాస్యత, భావోద్వేగ ఆరోగ్యం, జీవన నైపుణ్యాలను గాలికి వదిలేస్తున్నాయని నెటిజన్లలో చాలామంది అభి్రపాయపడ్డారు.ఇలా అయితే ఎలా!భావోద్వేగ నియంత్రణ గురించి తన పోస్ట్లో దివ్య ప్రస్తావించారు. ‘విద్యార్థులు విద్యాసంబంధమైన భావనలు నేర్చుకుంటున్నారు. కానీ దుఃఖం, ఒత్తిడి, వైఫల్యాన్ని ఎదుర్కోవడం గురించి అరుదుగా నేర్చుకుంటున్నారు. మనం పీరియాడిక్ టేబుల్ను కంఠస్థం చేశాం. కానీ విరిగిన హృదయం వెనుక ఉన్న రసాయన శాస్త్రాన్ని ఎవరూ వివరించలేదు’ అని పేర్కొన్నారు. భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి బదులు వాటిని అణచివేయమని విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారని, ఇది భవిష్యత్తులో ఒత్తిడిని ఎదుర్కొనే విధానంపై ప్రభావం చూపుతుందని దివ్య మిట్టల్ అన్నారు. ఒత్తిడిని ఎదుర్కోవడంలో చాలామంది విఫలమవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.అవి ఎందుకు నేర్పడం లేదు?తన వైరల్ పోస్ట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి కూడా దివ్య ప్రస్తావించారు. ‘వ్యాసాలు రాయడం, మార్కులు సంపాదించడం నేర్పిస్తాం. కానీ అసౌకర్యంగా అనిపించినప్పుడు దాన్ని ఎలా వ్యక్తపరచాలి, హద్దులు ఎలా ఏర్పరచుకోవాలి, కష్టంగా ఉన్నప్పుడు ‘కాదు’ అని ఎలా చెప్పాలో నేర్పడం లేదు’ అని ఆమె అన్నారు. విమర్శనాత్మక ఆలోచన, ఆర్థిక అక్షరాస్యత ప్రాధాన్యం గురించి కూడా ఆమె నొక్కి చెప్పారు. ‘పాఠశాలలో ఎక్కువ జవాబులు చెప్పేవాడు గెలుస్తాడు. జీవితంలో ఎక్కువ ప్రశ్నలు వేసేవాడు కాలానికి నిలబడతాడు’ అంటున్న దివ్య మిట్టల్ ఆర్థిక అక్షరాస్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. ‘గణితం నేర్చుకోవడానికి వెచ్చించిన సమయం, అనుభవం ఆర్థిక ఒత్తిడిని తట్టుకోవడానికి ఉపయోగపడటం లేదు. అప్పులు, ఖర్చు అలవాట్లపై ఆ పాఠాలు ప్రభావం చూపడం లేదు’ అని ఆమె అభి్రపాయపడ్డారు. ‘మన విద్య డబ్బు సంపాదించడంపైనే దృష్టి పెడుతుంది, దాన్ని నిర్వహించడంపై కాదు’ అని ఆమె సూటిగా చెప్పారు.క్షేత్రస్థాయిలో...‘ఒకరకంగా చెప్పాలంటే ప్రతిభను కూడా అదృష్టంగా పిలవొచ్చు. అయితే మన చేతుల్లో ఉన్నదానిపైనే మనం దృష్టి పెట్టాలి. అదే– కఠోర శ్రమ’ అన్నారు దివ్య మిట్టల్. ఈ చర్చ మన దేశంలోని ‘ఎగ్జామ్ కల్చర్’ను కూడా టచ్ చేసింది. దానిలోని మంచి, చెడులను విశ్లేషించింది. దివ్య మిట్టల్ తన పోస్ట్లో ఎన్నో ప్రశ్నలు సంధించారు. వాటికి జవాబులు కొందరు మాత్రమే చెప్పేవి కావు. సోషల్ మీడియాకే పరిమితమైనవీ కావు. క్షేత్రస్థాయిలో చర్చ జరగాల్సినవి. నిర్మాణాత్మక పరిష్కారాలు కనుగొని ప్రవేశ పెట్టాల్సినవి. -
ఫోర్బ్స్లో మన ఐకాన్
కొన్నిసార్లు అనుకోని సంఘటనలు మన జీవితాన్ని మార్చేస్తాయి. అలాంటి సంఘటనే న్యూయార్క్లో చదువుకునే భవిత మండవ జీవిత గమ్యాన్ని మార్చేసింది. ఉన్నత చదువు కోసం వెళ్లి ఫ్యాషన్ ప్రపంచాన్నే తన వైపు తిప్పుకునేలా చేసింది. ఇదంతా రెండేళ్ల కిందట జరిగింది. ఓ రోజు న్యూయార్క్ లోని బ్రూక్లిన్ సబ్వే స్టేషన్లో నిలబడి ఉండగా ఓ మోడలింగ్ ఏజెంట్ ఆమెను సంప్రదించాడు. అంతే ఆశ్చర్యకరంగా రెండు వారాల్లో ఇటలీలోని మిలాన్కు వెళ్లి ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ ‘బోటెగా వెనెటా’ కోసం ర్యాంప్ వాక్ చేసింది.భవిత హైదరాబాద్లో పుట్టి పెరిగిన అమ్మాయి. జేఎన్టీయూలో చదువుకుంది. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం న్యూయార్క్ వెళ్లింది. మోడలింగ్ రంగంలో భవితకు డియోర్, కొరేజెస్ వంటి ప్రముఖ ఫ్యాషన్ హౌస్లలో పని చేసే అవకాశం వచ్చింది. అంతేకాదు 2025లో ప్రముఖ టాప్ ఫ్యాషన్ బ్రాండ్స్లో ఒకటైన ‘చానెల్’ నిర్వహించిన ఆర్ట్ షోను ప్రారంభించిన తొలి భారతీయ మోడల్గా చరిత్ర సృష్టించింది. ఆ షో కూడా న్యూయర్క్ సబ్వే స్టేషన్లో జరగడం విశేషం. 2026 మార్చిలో చానెల్ ఆమెను భారతీయ అంబాసిడర్గా నియమించింది. ఫోర్బ్స్ ఏషియా 30 అండర్ 30 జాబితాలో ఆర్ట్స్ విభాగంలో ఆమెకు స్థానం లభించింది. అవకాశం రావడం కాదు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎలాంటి స్థాయికైనా ఎదుగుతారనడానికి భవిత నిదర్శనంగా నిలిచింది.చదవండి: 60 ఏళ్లు.. లక్షన్నర కిలోమీటర్లు -
ప్రకృతిని గౌరవించడం మన సంస్కృతి
పర్యావరణ పరిరక్షణ గురించి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ కొన్ని అమూల్యమైన విషయాలను పంచుకున్నారు. పర్యావరణంతో మన అనుబంధమే మానవ అనుభవంలో తొలి స్థాయి. మన చుట్టూ ఉన్న వాతావరణం పరిశుభ్రంగా, సానుకూలంగా ఉంటే, అది మన జీవితంలోని మిగతా అన్ని స్థాయిలపైనా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.చరిత్రపరంగా చూస్తే, పర్యావరణంతో సన్నిహిత సంబంధం మానవ మనస్తత్వంలో సహజంగానే అంతర్లీనంగా ఉండేది. ప్రకృతితో, అలాగే మనతో మనం ఉన్న అనుబంధం నుండి దూరమవడం ప్రారంభించినప్పుడే పర్యావరణాన్ని కలుషితం చేయడం, నాశనం చేయడం మొదలైంది.భారతదేశంలో సంప్రదాయంగా ప్రకృతిని ఆరాధించారు. ఆ క్రమంలోనే పర్వతాలు, నదులు, వృక్షాలు, సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు అన్నీ పూజించేవారు. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాచీన సంస్కృతులన్నీ ప్రకృతి పట్ల ఇదే విధమైన గాఢమైన గౌరవాన్ని ప్రదర్శించాయి. నేడు మానవ మనస్సును ఒత్తిడి, అత్యాశ నుంచి విముక్తం చేసి, ప్రకృతి పట్ల ఆ గౌరవభావాన్ని తిరిగి తీసుకురావడం అత్యవసరమైంది. మా పరిశోధనా కేంద్రంలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, ధ్యాన సాధనలకు పర్యావరణ పరిరక్షణలో “సామూహిక ప్రభావం” మెరుగుపడటానికి సంబంధం ఉందని తెలిసింది. “సామూహిక ప్రభావం” అంటే సమాజం నుంచి వచ్చే భాగస్వామ్యం, పర్యావరణం పట్ల వారి ప్రవర్తనలో వచ్చే సానుకూల మార్పు.పంచభూతాలన్నీ ఒకదానితో ఒకటి అత్యంత సన్నిహితంగా అనుసంధానమై ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కటి కలుషితమైనా మిగిలిన నాలుగు కూడా ప్రభావితమవుతాయి. పంచభూతాలలో కలిగే కాలుష్యాన్ని విడివిడిగా చూడలేం. ఉదాహరణకు, ఒక ప్లాస్టిక్ ముక్కను కాల్చితే అది కేవలం భూమినే కాదు, గాలినీ కలుషితం చేస్తుంది. అదే దాన్ని నీటిలో పడేస్తే, అది నీటిని కూడా అంతే స్థాయిలో కలుషితం చేస్తుంది.వృక్షాలను భూమి ఊపిరితిత్తులు అని సరైన రీతిలో పిలుస్తారు. అందువల్ల మనం మరిన్ని చెట్లను నాటాలి. ప్రాచీన శాస్త్రాలలో ఒక చెట్టును నరికినవాడు ఐదు చెట్లను నాటాలని చెప్పబడింది. ప్రకృతి నుంచే స్థిరమైన సహజీవనం గురించి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అడవిలో ఎన్నో జంతువులు నివసిస్తున్నప్పటికీ, అవి మనుషుల మాదిరిగా చెత్తను వెదజల్లవు. ప్రకృతిని పరిశీలిస్తే, అందులోని పంచభూతాలు పరస్పరం విరుద్ధ స్వభావాలు కలిగినవే; జంతు ప్రపంచంలో కూడా ఒకదానికొకటి శత్రుత్వంగా ఉండే జాతులు ఉన్నాయి. అయినప్పటికీ ప్రకృతిలో ఒక అద్భుతమైన సమతుల్యత నెలకొని ఉంటుంది. వానపాములు ప్రకృతి వ్యర్థాలను ఎలా జీర్ణించి, వాటిని మళ్లీ జీవనాన్ని నిలబెట్టే వనరులుగా మారుస్తుందో చూపించే అద్భుత ఉదాహరణ.పర్యావరణం పట్ల సున్నితత్వం మన జీవితం దానితో ఎంతగా ముడిపడి ఉందో గ్రహించినప్పుడు సహజంగానే వస్తుంది. ఉష్ణోగ్రతలో కొన్ని డిగ్రీల మార్పు కూడా మనుషులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అలాగే వర్షపాతం నమూనాలో కొన్ని వారాలు లేదా నెలల మార్పు వచ్చినా పంటలకు తీవ్ర నష్టం కలుగుతుంది. పర్యావరణ సున్నితత్వం కోసం మనం మన విస్తృతమైన అస్తిత్వం గురించి అవగాహన కలిగి ఉండాలి. ఆ అవగాహన ఆధ్యాత్మికత ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.అందువల్ల మనం మన ఆధ్యాత్మిక మూలాలపై దృష్టి పెట్టి, ఈ అవగాహనను మళ్లీ జాగృతం చేయాలి. పర్యావరణం పట్ల నిర్లక్ష్యంగా, అవగాహన లేకుండా ప్రవర్తించే మానవ మనస్తత్వాన్ని కూడా, అదే సమయంలో ప్రేమతో సంరక్షించే మనస్తత్వాన్ని కూడా మనం గుర్తించాలి. మనలో కరుణ, శ్రద్ధ పెంపొందినప్పుడు అది పర్యావరణం పట్ల మన ప్రవర్తనలో ప్రతిబింబిస్తుంది. దాని ఫలితంగా పవిత్రత అనే భావన సహజంగానే ఉద్భవిస్తుంది.మన గ్రహం పట్ల ఒక ఆత్మీయ అనుబంధాన్ని పెంపొందించుకోవాలి. చెట్లను, మనుషులను, నదులను మనవిగా భావించాలి. ప్రకృతిలోనూ, మనుషులలోనూ దేవుణ్ణి దర్శించాలి. ఈ భావన సున్నితత్వాన్ని పెంచుతుంది. అలాంటి సున్నిత హృదయుడు ప్రకృతి పట్ల శ్రద్ధ చూపకుండా ఉండలేడు. తమ పరిసరాలను, ప్రకృతిని గౌరవిస్తూ సంరక్షించే అనేక ఆదివాసీ సమాజాల జీవన విధానంలో ఈ విషయాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు అని అన్నారు గురుదేవ్ రవిశంకర్. -
జేఈఈ అడ్వాన్స్డ్లో సత్తా చాటిన రిక్షాడ్రైవర్ కుమారుడు..!
ఆ గ్రామంలోని విద్యార్థులకు ఐఐటీ జేఈఈ ఓ కల. పరిమిత వనరులు, దీనిపై సరైన అవగాహన లేకపోవడం తదిరతరాల వల్ల ఆ ఊరు విద్యార్థులందరికీ అదొక కలగా మిగిలిపోయింది. ఎవ్వరూ దాన్ని సాధ్యం చేయలేకపోయారు. కానీ ఒకే ఒక్కడు ఆ గ్రామం ఎన్నే ఏళ్ల కలను నిజం చేసి ఆ ఊరిపేరు మారుమ్రోగేలా చేశాడు. అంతేగాదు ఆ గ్రామం నుంచి ఐఐటీ చదువు అందుకోనున్న తొలి విద్యార్థిగా నిలిచాడు.అతడే రాజస్థాన్ శ్రీగంగానగర్ జిల్లాలోని పఠాన్వాలా గ్రామానికి చెందిన ఇంద్రజిత్. అతనే ఈ రిక్షా డ్రైవర్ కుమారుడు. ఇంట్లో ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ..చదువుని ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు. ఇంద్రజిత్ పదోతరగతి చదువుతున్నప్పడే.. సీనియర్ విద్యార్థుల ద్వారా ఐఐటీ ప్రక్రియ గురించి తెలుసుకున్నాడు. అప్పటి వరకు స్థానిక పాఠశాలలో చదువుకున్న ఇంద్రజిత్..ఐఐటీల గురించి తెలుసుకోవడంతో ఓ కొత్త మార్గాన్ని ఏర్పరచుకున్నాడు. ఇంట్లో ఎంత కష్టమైన ఆర్థిక పరిస్థితులున్నా.. ఇంజనీరింగ్ చదవాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు. అయితే లక్ష్యం గట్టిగా ఉన్న ఆర్థిక పరిమితులు అందుకు ఉపకరించలేదు. దానికి బదులుగా ఆన్లైన్ లెర్నింగ్, స్వీయంగా ప్రిపరేవ్వడంపై ఆధారపడ్డాడు. ఓ పక్క గ్రామాల్లో తరుచుగా విద్యుత్ కోతలు ఉండటంతో స్టడీ మెటీరియల్ పొందడం చాలా కష్టంగా ఉండేది. దాంతో తండ్రి సూచనల మేరకు ఒక ఆచారణాత్మక పరిష్కారం లభించింది. అక్కడ సమీపంలోని గ్రామాలయ గ్రంథాలయంలో చేరాడు. అక్కడైతే ఇంటర్నెట్ సదుపాయం తోపాటు..చక్కగా కూర్చొని చదువుకునే చక్కటి వాతావరణం ఇంద్రజిత్కి ఎంతోగానో ఉపకరించింది. క్రమంగా అతడికి గ్రంథాలయం అతని ప్రిపరేషన్కి కేంద్రంగా మారింది. 2025లో జేఈఈ పరీక్ష రాసినా..అంతగా సంతృప్తినివ్వక లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకుని మరి మరోసారి ఐఐటీ జేఈఈకి ప్రిపరేయ్యాడు. సూర్యోదయానికి ముందే గణిత సాధన, పిజిక్స్, కెమిస్ట్రీ చదవడం సాగించేవాడు. అన్నింట్లకంటే నిలకడగా చదవడం అన్నది కీలకం అని తెలుసుకుని చాలా శ్రద్ధ ఆసక్తులతో ప్రిపరేషన్ కొనసాగించాడు. అయితే మార్క్టెస్ట్ల్లో వచ్చే మార్కులు తన లక్ష్యాన్ని చేరుకోవడంపై పలు సందేహాలను రేకెత్తించేవి. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ప్రిపరేషన్ కొనసాగిస్తూనే ఉండేవాడు. చివరికి సంవత్సరాల తరబడి పట్టుదల, స్వయంకృషితో జేఈఈ అడ్వాన్స్డ్ 2026లో ఓబీసీ-ఎన్సీఎల్ విభాగంలో 1040వ ర్యాంకు సాధించి తన గ్రామం ఆకాంక్షను నెరవేర్చాడు. పైగా గ్రామాల్లో చదివే కుర్రాళ్లకు జేఈఈ చేధించడం కష్టం అన్నమాట అబ్ధం అనేలా తన గెలుపుతో చాటిచెప్పాడు. గ్రామీణ విద్యార్థులకు తన విజయం ఒక స్ఫూర్తిగా నిలిచి..వాళ్ల కూడా ఇలాంటి మంచి సక్సెస్ని అందుకోవాలని కోరుకుంటున్నా అంటున్నాడు ఇంద్రజిత్. ఇక తను ఐఐటి రూర్కీలో బీటెక్ డిగ్రీని అభ్యసించి, ఒక ప్రముఖ టెక్నాలజీ కంపెనీలో కెరీర్ నిర్మించుకోవాలని, కోరుకుంటున్నట్లు తెలిపాడు. పైగా తన గెలుపుకి కారణంగా తన కుంటుంబం సవంత్సరాల తరబడి అందించిన త్యాగం, మద్దతేనని చెబుతున్నాడు ఇంద్రజిత్.(చదవండి: పారిశ్రామికవేత్తగా 8th డ్రాపౌట్ ..! ప్రముఖ బ్రాండ్లకు..) -
పారిశ్రామికవేత్తగా 8th డ్రాపౌట్ ..! ప్రముఖ బ్రాండ్లకు..
ఒక సాధారణ నైపుణ్యంతో విజయవంతమైన వ్యాపారవేత్తగా మారి ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచిందామె. పరిమిత వనరులతో ప్రారంభించిన వ్యాపారం..చూస్తుండగానే నెమ్మదిగా వృద్ధి చెందడం ఒక ఎత్తైతే..ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలే వచ్చి కొనుగోలు చేసేలా పేరుగాంచడం మాములు విషయం కాదు. కేవలం ఎనిమిదో తరగతితోనే చదువు ఆపేసిన ఆమె చిన్న సాధారణ నైపుణ్యంతో ఉపాధి ఏర్పరుచుకుని ఉన్నతస్థాయికి ఎదగడమే గాక ఇతర మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించడం విశేషం. మరి ఆ మహిళ స్ఫూర్తిదాయక కథేంటో చూద్దామా..!.ఆ మహిళే లూధియానాలోని సమ్రాలా సమీపంలో ఉన్న భగవాన్పురా గ్రామానికి చెందిన 54 ఏళ్ల చరణ్జిత్ కౌర్. పుట్టిన దగ్గర నుంచి పేదరికంలో పెరిగిన ఆమెకు డబ్బు విలువ గురించి బాగా తెలుసు. ముఖ్యంగా ఉపాధి విలువేంటో బాగా తెలుసామెకు. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఏదో ఒకటి చేయాలనుకుంది. అందుకోసం జనపనార సంచులను తయారు చేయడం నేర్చుకోవాలని అనుకుంది. మొదట్లో చరణ్జిత్కు మద్దతు లభించలేదు. అయినా సరే ఎలాగైనా నేర్చుకుని తీరాలన్న పట్టుదలతో కృషి విజ్ఞాన్ కేంద్ర (KVK) కేంద్రాలలో శిక్షణా కార్యక్రమాలలో చేరింది. అది ఆమెకు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికే కాకుండా వ్యాపారం గురించి మరింతగా అవగాహన ఏర్పరుచుకోవడాని వీలు కల్పించింది. అలా చిన్నగా వ్యాపారం ప్రారంభించింది. అయితే మొదట్లో చాలా ఒడిదుడుకులు ఎదురయ్యాయి. కొన్నిసార్లు ఆర్డర్లు రాక ఇబ్బందిపడ్డది కూడా. అలా నెమ్మదిగా ఆర్డర్లు దక్కించుకుంటూ చిన్నగా మొదలైన వ్యాపారం కాస్తా సంస్థగా మారింది. అంతేగదు ఏకంగా టాటా, జోంటీ ఆగ్రో వంటి కంపెనీలు నుంచి ఆర్డర్లు అందుకునేలా పేరు సంపాదించించుకుంది. అలా తన వ్యాపారం ద్వారా నెలకు దగ్గర దగ్గర రూ. 50 వేలు వరకు సంపాదించుకునే రేంజ్కి వచ్చింది. సాధారణ ప్రజలు కూడా కొనుగోలు చేసే ధర, అనుకున్న సమయానికి ఆర్డర్ ఇచ్చేలా ఆమె నిబద్ధత వ్యాపారానికి కీలకంగా మారి ప్రముఖ కంపెనీల నుంచి ఆర్డర్లు అందుకునేందుకు దారితీసింది. మరోవైపు ఆమె తన ఆదాయంతో కుటుంబ పరిస్థితిని మెరుగుపరుచుకోవడమే కాకుండా ఇతర మహిళలకు ఉపాధి అవకాశాలు ఇచ్చే స్థాయికి వచ్చారామె. అంతేగాదు ఆమె జనపనారతో సంచులు ఎలా తయారు చేయాలో చెబుతూ..స్వయంగా డబ్బులు సంపాదించుకునే మార్గాల గురించి ఇతర మహిళలకు వివరిస్తుంటుంది. విదేశాల నుంచి వచ్చి మరి ఆమె తయారు చేసే జనపనార సంచులను కొనుగోలు చేస్తుంటారట. మన్నిక, వినియోగం ఆధారంగా కొన్ని జనపనార సంచులు అధిక ధర పలుకుతాయని చెప్పుకొచ్చింది చరణ్జిత్ కౌర్. ఈ కథలో ఆర్థిక ఇబ్బందులు, చదువు లేకపోవడం వంటి సమస్యలు ప్రతిబంధకం కాదు..తనపై తనకు నమ్మకం ఉంటే..చిన్న నైపుణ్యంతో విజయం సాధించొచ్చు, కలలు నిజం చేసుకోవచ్చని నిరూపించింది చణ్జిత్ కౌర్.(చదవండి: ఐదేళ్ల చిన్నారి 'హ్యాపీ స్లీప్'ఆవిష్కరణ..! అనారోగ్యంతో బాధపడే పిల్లలకు..) -
హాట్టాపిక్గా ఆ విద్యార్థి లేవనెత్తిన ప్రశ్న..!
ఓ యువ విద్యార్థి లేవనెత్తిన సందేహం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. జార్ఖండ్కు చెందిన పదిహేడేళ్ల సార్థక్ సిద్ధాంత్ 12 వ తరగతి చదువుతున్నాడు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈ ఏడాది 12వ తరగతి పరీక్ష మూల్యాంకనానికి ఆన్ స్క్రీన్ మార్కింగ్ను ప్రవేశపెట్టింది. తీరా ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది విద్యార్థులు తమకు తక్కువ మార్కులు వచ్చాయని, మూల్యాంకనంలో లోపాలు ఉన్నాయని ఆరోపించారు. కాస్త లోతుగా విశ్లేషించాలని సీబీఎస్ఈ విడుదల చేసిన డాక్యుమెంట్లు, పాత టెండర్లను డౌన్లోడ్ చేసుకుని పరిశీలించి చూశాడు సార్థక్. నిబంధనల మార్పు జరిగిందని, కొన్ని క్లాజులను సడలించారని, మరిన్ని లోపాలు కూడా ఉన్నాయని తన బ్లాగ్లో వెల్లడించాడు. దీంతో ఒక్కసారిగా అతడి పేరు ఆన్లైన్లో వైరల్గా మారింది. అధికారులు అప్రమత్తమయ్యారు. సార్థక్ ఆరోపించిన అంశాలను సవివరంగా తెలుసుకోదలచి అతడినే సీబీఎస్ఈ పార్లమెంటరీ ప్యానల్కి ఆహ్వానించారు. కమిటీలో సీబీఎస్ఈ చైర్మన్ రాహుల్ సింగ్తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సార్థక్ ఇచ్చిన ప్రజెంటేషన్లో తాను గుర్తించిన పలు లోపాలను వారికి వివరించాడు. మొత్తానికి జార్ఖండ్ విద్యార్థి లేవెనెత్తిన ప్రశ్న దేశవ్యాప్తంగా ఉన్న విద్యావ్యవస్థ పరీక్షగా మారింది.(చదవండి: ‘గ్రాండ్ఫేర్వెల్’.. ఆ మాస్టారుకి గురుదక్షిణగా ఏకంగా కారు!) -
‘గ్రాండ్ఫేర్వెల్’.. ఆ మాస్టారుకి గురుదక్షిణగా ఏకంగా కారు!
ఎవరైనా ఉద్యోగం నుంచి రిటైర్ అయితే శాలువా కప్పి సన్మానం చేసి నాలుగు మంచి మాటలు చెప్పడం చాలా కామన్ అయితే మంచి చెప్పడం కన్నా చేతల్లో చూపించడం అరుదు. అదే చేశారు కేరళలోని కొందరు పూర్వ విద్యార్థులు. కాసరగాడ్లోని చెన్మాద్ వెస్ట్ గవర్నమెంట్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో హెడ్మాస్టర్గా పని చేసిన పీటీ. బెన్నీ గతవారం రిటైర్ అయ్యారు. పూర్వ విద్యార్థులు, స్కూల్ ఉపాధ్యాయ బృందంతో పాటు గ్రామస్తులందరూ కలిసి ఓ కారుని బెన్నీకి బహుమానంగా అందజేశారు.నూట ఇరవై ఏడు సంవత్సరాల స్కూల్చెన్మాద్ స్కూల్ను ఏర్పాటు చేయడానికి 1899లో చెన్మాద్ జమాద్ కమిటీ కొంత స్థలాన్నిచ్చింది. ఆ తర్వాత క్రమక్రమంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కాని పెరుగుతున్న విద్యార్థులకు అనుగుణంగా సదుపాయాలు, ఉపాధ్యాయులు, ఇతర వసతులు అందుబాటులోకి రాలేదు. పీటీ బెన్నీ ఎక్కడ పని చేసినా ఎవరో ఇచ్చే విరాళాల కోసం చూడకుండా తన సొంత ఖర్చులతో స్కూలును బాగు చేసి విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావర ణాన్ని అందించేవారు. ఆయన గురించి తెలిసి 2019లో చెన్మాద్ స్కూల్కి రప్పించారు. హెడ్మాస్టర్గా బెన్నీ బాధ్యతలు తీసుకున్న తర్వాత పాఠశాలను పూర్తిగా మార్చివేశారు. ఆయన ప్రయత్నం చూసి స్థానికులు కూడా తమ వంతు సాయం చేశారు. ఫలితంగా అతి తక్కువ కాలంలోనే తరగతి గదులు పెరిగాయి. పాఠశాలకు రెగ్యులర్గా 25 మంది ఉపాధ్యాయులను నియమించారు. విద్యార్థుల సంఖ్య 550 నుంచి 850కి పెరిగింది. ప్రముఖ పోగటీ పరీక్షలలో పాఠశాల విద్యార్థులు టాపర్స్గా నిలిచారు. నూట ఇరవై ఏడు సంవత్సరాల పాఠశాల చరిత్రలో ఉత్తమ గురువుగా బెన్నీ పేరు సంపాదించారు. తమ గురువు రిటైర్మెంట్ కార్యక్రమాన్ని పాఠశాల విద్యార్థులే కాదు పూర్వ విద్యార్థులతో పాటు మొత్తం గ్రామమంతా పండగలా నిర్వహించి పదమూడు లక్షల విలువైన కారును బహుమతి ఇచ్చి తమ గురు భక్తిని చాటుకున్నారు. తమ గురువు రిటైర్మెంట్ కార్యక్రమాన్ని పాఠశాల విద్యార్థులే కాదు పూర్వ విద్యార్థులతో పాటు మొత్తం గ్రామమంతా సంబరంలా నిర్వహించి పదమూడు లక్షల విలువైన కారును బహుమతిగా ఇచ్చి తమ గురు భక్తిని చాటుకున్నారు. (చదవండి: ఐదేళ్ల చిన్నారి 'హ్యాపీ స్లీప్'ఆవిష్కరణ..! అనారోగ్యంతో బాధపడే పిల్లలకు..) -
ఐదేళ్ల చిన్నారి 'హ్యాపీ స్లీప్'ఆవిష్కరణ..! అనారోగ్యంతో బాధపడే పిల్లలకు..
మనకెదురయ్యే సమస్యల నుంచే అద్భుత ఆవిష్కరణలు పుట్టుకొస్తుంటాయి. బహుశా సమస్య కూడా సౌకర్యాలు సమకూర్చుకునేదే కాబోలు. ఇదంతా ఎందుకంటే..ఇక్కడ ఓ ఐదేళ్ల చిన్నారి తనలాంటి పిల్లలు పడుకోవడానికి ఇబ్బందిపడే నిద్ర సమస్యకు చక్కటి పరిష్కార మార్గం చూపింది. పేరెంట్స్కి పిల్లలను నిద్రపుచ్చుడం ఓ సవాలులా ఉంటుంది. ఆ సమస్యకు ఈ చిన్నారి భలే అద్భుతంగా చెక్పెట్టడమే కాదు. ఆమె ఆవిష్కరణకు పేటెంట్ కూడా మంజూరవ్వడం విశేషం. ఎవరా చిన్నారి అంటే..ఇంతవరకు పిల్లల నిద్రపై ఏ ఆవిష్కరణ ప్రభావవంతంగా లేదు. పిల్లలు నిద్రపోవడం లేదంటూ డాక్టర్లు వద్దకు వెళ్లి మెడిసిన్ తెచ్చుకుని ప్రయత్నిస్తుంటారు. అయితే ఇలా ఔషధల ప్రభావం లేకుండా సహజసిద్ధంగా వాళ్లను నిద్రపుచ్చే టెక్నీక్ కోసం పిల్లలు, నిపుణులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అదోక పరిష్కారం కానీ సమస్యలా ఉన్న జఠిల సమస్యకు కాలిఫోర్నియాకు చెందిన ఐదేళ్ల చిన్నారి వెన్నెల అత్తిలి అద్భుతంగా చెక్ పెట్టింది. తన తల్లి వీపుపై జోకొడుతూ ఉంటే తనకు నిద్రపట్టేది లేదంటే నిద్రపట్టేది కాదామెకు. ఒక్కోసారి ఆమె తల్లి త్వరగా నిద్రపోయేది దాంతో తనకు నిద్రరాకి ఎలా ఇబ్బంది పడేదో బాగా తెలుసు. అయితే ఒక రోజు స్కూల్లో ఉపయోగకరమైన ఏదైనా వస్తువును కనిపెట్టమని ఇచ్చిన అసైన్మెంట్ ఆవిష్కరణకు దారితీసింది. అదేదో తాను రోజు ఎదుర్కొంటున్న నిద్రసమస్యకు చెక్పెడితే చాలని అనుకుంది వెన్నెల. అందుకోసం ఒక టెడ్డీబేర్, గుడ్డ, పుల్లలు, వైబ్రేటింగ్ మోటర్ని ఉపయోగించింది. ఆ బొమ్మ మన పక్కన ఉంటే మన తల్లిదండ్రులు ఉన్నట్లుగా శ్వాస, వెచ్చదనం ఇచ్చేదనం అందించే బొమ్మ అయ్యి ఉండాలని అనుకుంది. అలా ఆమె ‘హ్యాపీ స్లీప్’ అనే శ్వాస తీసుకుని వెచ్చదనం అందించే బొమ్మను రూపొందించింది. నిజానికి ఇంట్లో చాలామంది పిల్లలు పడుకునేటప్పుడు తమకు నచ్చిన ఏదోఒక బొమ్మను పక్కన పెట్టుకుని నిద్రపోతుంటారు. ఆ బొమ్మతో పిల్లలకు భావోద్వేగపరమైన సంరక్షణతో కూడిన అనుబంధం ఉంటుంది. అలా వెన్నెల ఆవిష్కరించిన బొమ్మ నిజంగానే ప్రభావవంతంగా ఉంది. ఇది నిజంగా పిల్లలకు తమ పక్క సంరక్షకులు ఉన్నారనే భావంతో హాయిగా నిద్రపోయారు. పైగా అధ్యయనంలో మంచి ఫలితాలు లభించాయి. దాంతో ఈ ఆవిష్కరణను 2019 కాలిఫోర్నియా ఇన్వెన్షన్ కన్వెన్షన్లో ప్రదర్శించగా, అక్కడ ఆ చిన్నారి మెరిట్ అవార్డును అందుకోవడమే కాకుండా యుఎస్ పేటెంట్ కూడా మంజూరవ్వడం విశేషం. కాగా, ఈ ఆవిష్కరణ అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలకు, ముఖ్యంగా కీమోథెరపీ చేయించుకుంటున్న వారికి లేదా ఆసుపత్రి ఐసోలేషన్లో ఉన్న వారికి సాంత్వన చేకూరుస్తుందని చెబుతోంది ఆ చిన్నారి. (చదవండి: అడవి పండ్లు: ఆనె పరిగెతో ఇన్ని లాభాలా!) -
మొక్కజొన్న చొప్పతో జెట్ ఇంధనం!
మొక్కజొన్న కంకుల్ని కోసిన తర్వాత మిగిలే ఎండు చొప్పతో జెట్ విమానాలను నడిపే ఖరీదైన ఇంధనాన్ని రూపొందించడం ద్వారా ఖర్చు తగ్గించుకోవటంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. పశ్చమాసియా యుద్ధం ్ర΄ారంభమైన తర్వాత విమానయాన ఇంధనం ధర రెట్టింపైంది. విమానయాన సంస్థలు పెట్రోలియంకు ప్రత్యామ్నాయాలను కనుగొని, తమ ఉద్గారాలను తగ్గించుకోవాలని చూస్తున్నాయి. మొక్కజొన్న పంట వ్యర్థాలను ఇంధనంగా మార్చడం దీనికి ఒక గొప్ప ఆరంభం కానుంది. ప్రతి పంట కోత కాలం తర్వాత అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మొక్కజొన్న పొలాలు ఎండిన చొప్ప, ఆకులతో నిండి΄ోతాయి. మొక్కజొన్న కంకులను సేకరించిన తర్వాత మిగిలి΄ోయే వ్యర్థాలు ఇవి. కొంతమంది రైతులు ఈ చొప్పను జంతువులకు మేతగా వేస్తారు లేదా పంటల మధ్యన ఆచ్ఛాదనగా లేదా సహజ కం΄ోస్టు ఎరువుగా తయారు చేసి భూసారాన్ని పెంచటానికి ఉపయోగిస్తారు. కానీ, అమెరికా వంటి దేశాల్లో మొక్కజొన్న వ్యర్థాల్లో చాలా భాగం సరిగ్గా ఉపయోగపడకుండానే మిగిలిపోతోంది.వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ (డబ్ల్యూఆర్ఐ) తాజా పరిశోధన ప్రకారం.. విమానయాన రంగంలో ఉద్గారాలను తగ్గించటం అత్యంత క్లిష్టతరమైన పని. అయితే, మొక్కజొన్న వ్యర్థాలను ఈ పని కోసం సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చని తేలింది. మొక్కజొన్న చొప్ప నుంచి జెట్ ఇంధనాన్ని తయారు చేయటం ద్వారా ఈ ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్ను వాతావరణ మార్పులకు దోహదపడకుండా తీర్చవచ్చు.ఇరాన్పై యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధి మూసివేతతో ముడి చమురుతో తయారయ్యే సాంప్రదాయ జెట్ ఇంధనం ధర ప్రపంచవ్యాప్తంగా ఇటీవల రెట్టింపు అయ్యింది. కానీ, ప్రపంచ ఉద్గారాల్లో 2.4% కాలుష్యానికి కారణమవుతున్న పెట్రోలియం జెట్ ఇంధనానికి ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేసే కృషి ఈ యుద్ధానికి ముందే మొదలైంది. విమాన ప్రయాణానికి డిమాండ్ పెరిగేకొద్దీ, 2050 నాటికి ఈ ఇంధన కాలుష్యం మూడు రెట్లు పెరుగుతుందని అంచనా.చొప్పతో 10% జెట్ ఇంధనంమొక్కజొన్న చొప్ప వ్యర్థాలతో జెట్ ఇంధనం తయారీ ప్రక్రియ మనుషులకూ, పర్యావరణానికీ కూడా మేలు చేసే ఒక మెరుగైన ప్రత్యామ్నాయం అని డబ్ల్యూఆర్ఐ పరిశోధనలో తేలింది. నేల ఆరోగ్యాన్ని కాపాడటానికి పొలాల్లోనే వదిలివేయాల్సిన భాగాన్ని మినహాయించిన తర్వాత, అమెరికాలో ప్రతి సంవత్సరం 9 కోట్ల టన్నుల మొక్కజొన్న చొప్ప అందుబాటులో ఉంటుందని అంచనా. ఇది 300 కోట్ల గ్యాలన్ల నిజమైన సుస్థిర ఇంధనాన్ని ఉత్పత్తి చేయడానికి సరిపోతుంది. ఈ మొత్తం అమెరికా వైమానిక ఇంధన కాలుష్యాన్ని 75% తగ్గింపునకు దోహదపడుతుంది. అంతేకాకుండా, అమెరికా జెట్ ఇంధన అవసరతను 10 శాతం వరకూ తీరుస్తుంది. ప్రస్తుతం అమెరికాలో మొక్కజొన్న ఇథనాల్ను జెట్ ఇంధనంగా మార్చుతున్నారు. ఈ పనికి స్వస్తి చెప్పటం ద్వారా ఆహార ధాన్యాలను ఇంధనానికి వాడటం మానుకోవచ్చు. దీని వలన కలిగే ప్రయోజనం కేవలం వాతావరణానికి మాత్రమే పరిమితం కాదు. మొక్కజొన్న చొప్ప ఇంధనోత్పత్తి అనేక ఉద్యోగాలను, ఇతర ఆర్థిక ప్రయోజనాలను సృష్టించగలదని నిపుణులు చెబుతున్నారు. డబ్ల్యూఆర్ఐ పరిశోధన ప్రకారం, సంవత్సరానికి 300 కోట్ల గ్యాలన్ల మొక్కజొన్న చొప్పతో వైమానిక ఇంధనం ఉత్పత్తిలో పెట్టుబడి పెట్టడం వల్ల 99 వేల నుంచి 2.14 లక్షల ఉద్యోగాలు సృష్టించవచ్చు. సంబంధిత ఆర్థిక కార్యకలా΄ాలు వేలాది కోట్ల డాలర్ల పన్ను రాబడి అదనంగా చేకూరుతుందని అంచనా.ప్రాథమిక దశలో పరిశోధనలుమొక్కజొన్న చొప్పను జెట్ ఇంధనంగా మార్చే సాంకేతికతలపై పరిశోధనలు ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాయి. సాంప్రదాయ జెట్ ఇంధనాలతో ధరల పరంగా ఈ ప్రత్యామ్నాయ ఇంధనం ఇంతకుముందు వరకు ΄ోటీపడలేక΄ోవడం కూడా ఇందుకు ఓ కారణం. కానీ ఇరాన్పై యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ సంఘర్షణల కారణంగా సాంప్రదాయ ఇంధన ధరలు భారీగా పెరగడంతో ఈ అంతరం తగ్గుతోంది. దీనివల్ల కొత్త రకాల విమానయాన ఇంధనోత్పత్తి రంగం పెట్టుబడిదారులకు, విమానయాన సంస్థలకు మరింత ఆకర్షణీయంగా మారుతోంది.పరిశోధన, అభివృద్ధికి విధానపరమైన మద్దతు, విస్తరణ ప్రోత్సాహకాలు లేకుండా మొక్కజొన్న చొప్పతో ఇంధనం ఉత్పత్తి సాంకేతికతల అభివృద్ధి యజ్ఞం నెరవేరదు. డబ్ల్యూఆర్ఐ పరిశోధన ప్రకారం, అన్ని సమస్యలకు ఒకే పరిష్కారంగా పనిచేసే సాంకేతికత అంటూ ఏదీ లేదు. దానికి బదులుగా, ఏ సాంకేతికతలకు అత్యధిక సామర్థ్యం ఉందో అర్థం చేసుకోవడానికి, విభిన్న రకాల సాంకేతికతల పరిశోధన, అభివృద్ధికి విధానాల మద్దతు ఇవ్వాలి. మొక్కజొన్న చొప్ప అమెరికాలో అత్యంత సవృద్ధిగా లభించే వ్యవసాయ వ్యర్థం. చొప్ప ఆధారిత విమానయాన ఇంధనోత్పత్తి పరిశ్రమ మన ఇంధన భద్రతకు దోహదపడటంతో పాటు, విమానయాన ఉద్గారాలను తగ్గించి, మొక్కజొన్న ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చెయ్యగలదని నిపుణులు భావిస్తున్నారు. (చదవండి: అడవి పండ్లు: ఆనె పరిగెతో ఇన్ని లాభాలా!) -
అడవి పండ్లు: ఆనె పరిగెతో ఇన్ని లాభాలా!
ఈ అడవి పండుకు ఇంగ్లీష్ పేరు: వైల్డ్ జుజుబె. తెలుగు పేర్లు: గొట్టె తీగ, పిండి పరిఘము, ఆనె పరిగె, తెల్ల పరిగె. అస్సామీస్: బిధావో భోగారి, బోన్ బాగరి, బోన్ బొగోరి, డిండవో బోగన్. ఒరియా: తినకోలి. కన్నడ: కట్టిలండల్, బేలహదు, బిళీముళ్ళిహను, కనిక, కొట్ట ముల్లుహణ్ణు.గుజరాతీ: తోరన్. తమిళం: కట్టిలండల్, తోతరి, తోటన. మలయాళం: జాలి, కొట్టముళ్ళు, తొడలి, తుటరి, మలంతుటలీ. మరాఠీ: తురన్, తోరణ. హిందీ: చూర్ణ, సూరన్. సంస్కృతం: ఘంటా అని పిలుస్తారు. ప్రాంతాలను బట్టి ఉచ్ఛారణలో కొంత తేడా ఉంటుంది. ఇది జిట్ట రేగు కుటుంబానికి చెందినది. దీనికి కూడా ముండ్లు కురచగా జంటగా కానీ ఒంటరిగా కానీ ఉంటాయి. తెల్ల పరిగె దాదాపు 5–7 మీటర్లు ఎత్తు వరకు పెరుగుతుంది. మానుకు దగ్గరలో వేరే చెట్టు ఉంటే దాని సహాయంతో తీగలా కూడా పెరుగుతుంది. రేగు చెట్టులా ఇది కూడా ఆకులు రాల్చుతుంది. పండ్లు తెల్లగా ఉండి, అడుగు భాగాన కొద్ది నాటి కాషాయం రంగు ఉంటుంది. పండ్లు తెల్లగా ఉన్నందున దీనికి చెంచులు ‘తెల్ల పరిగె’ లేక ఆనె పరిగె అని పిలుస్తారు.థాయిలాండ్లో దీని ఉనికి ఎక్కువగా ఉంది. ఇండియా, చైనా, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, బాంగ్లాదేశ్ తదితర దేశాల్లోని ఉష్ణ మండల అడవుల్లో పెరుగుతుంటాయి. భారతదేశంలో మాత్రం ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, అస్సాం, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్–నికోబార్ దీవుల్లో ఈ చెట్లు ఉన్నాయి. తెలంగాణలోని నల్లమల అడవులలో అక్కడక్కడా ఉన్నాయి. ముఖ్యంగా మల్లాపూర్, కుడిచింత బయలు మొదలగు ప్రాంతాలలో గమనించవచ్చు. అక్కడి చెంచుల అభిప్రాయం మేరకు ఈ చెట్లు చాలా వరకు కనుమరుగవుతున్నాయి. వీటిని అభివృద్ధి పరిచే అవసరం ఎంతైనా ఉంది.ఆనె పరిగె పండు ఉపయోగాలుపండ్లు తెలుపు రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. పండులో గుజ్జు కొంత వరకు పిండిగా ఉండి రుచికరంగా ఉండటం వలన చెంచులు ఈ పండ్లను బాగా ఇష్ట పడుతారు. జీవాలు వీటి ఆకులను బాగా ఇష్టపడతాయి. పంటపొలం చుట్టూ తెల్లపరిగె కొమ్మలను కంచెగా వేసుకొని పశువులు ఇతర జంతువుల నుండి పంటను కాపాడుకోవచ్చు. రాలిన పండ్లను ఉడుతలు, కుందేళ్లు ఇతర జంతువులు ఇష్టంగా తింటాయని చెంచులు అన్నారు.తెల్ల పరిగెను చెంచులు, ఇతరులు అనేక రోగాలను నయం చేయటానికి వాడుతారు. ముఖ్యంగా విరేచనాలు, అల్సర్లు, చర్మ వ్యాధులు, దగ్గు, రక్తపోటు మొదలైన వాటికి వాడతారు.ఈ పండులో ఉన్న ఔషధ, పోషక గుణాలు ఉన్నందు వల్ల పోషక లోపాలను కొంతవరకు అరికట్టవచ్చు. ఆ పండ్లలో కూడా ఇతర పంటల్లో మాదిరిగానే చక్కెర, కొవ్వు, పీచు మొదలైన పదార్ధాలు ఉంటాయి. పోషకాల విశ్లేషణ ఈ పట్టికలో పొందుపరిచాం...పండ్లు: మార్చ్ – ఏప్రిల్ నెలలోకాస్తాయి. 5–7 మీటర్ల ఎత్తు పెరుగుతుందిడాక్టర్ మొరుపోజు పద్మయ్య,విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్.మొబైల్: 94407 08924 (చదవండి: ఏడు నెలల్లో 101 కేజీల నుంచి 65 కేజీలకు..! డైట్ ప్లాన్..) -
పచ్చగా ఉందాం
మంచి చెప్పాలనే ఆలోచన కొందరిలోనైనా మార్పు తీసుకురావాలనే తపన వారిని పర్యావరణ ప్రేమికులుగా మార్చింది. ‘భూమాతకు జవం జీవం కల్పించండి’ అంటూ సోషల్మీడియా ద్వారా సస్టెయినబులిటీ, జీరోవేస్ట్, రీ సైక్లింగ్ గురించి వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. స్ఫూర్తిగా నిలుస్తున్నారు.ఇళ్లలో పోగవుతున్న చెత్తఫ్రెంచ్ సబ్జెక్ట్లో పిల్లలకు పాఠాలు చెబుతుంది విధి. ఐదేళ్లక్రితం పర్యావరణ అనుకూల జీవనంవైపు ప్రయాణం ఆరంభించింది. మిలియన్కు పైగా వీక్షకులు ఉన్న విధి ట్రేషీ సిస్టర్ పేరుతో బోలెడన్ని ఇంటి చిట్కాలు చెబుతుంది. ‘మహిళలు ఉపయోగించే మెనుస్ట్రువల్ కప్ను కనుక్కోవడంతో ఈ దిశగా నా ఆలోచనలు సాగాయి. మహిళలు రుతుక్రమ సమయంలో ఉపయోగించే శానిటరీ ప్యా డ్స్ వల్ల చెత్త ఎంత ఎక్కువగా వస్తుందో గ్రహించాను. దీంతోపాటు వివిధ రకాల వ్యర్థాలు పర్యావరణంపైనే కాకుండా మన ఆరోగ్యంపైనా ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకున్నాను. ఇళ్లలో పోగవుతున్న చెత్త గురించి నా పేజీ ద్వారా మాట్లాడుతుంటాను. చిరిగిన బట్టలు, అరిగిన చెప్పులు, వాడేసిన టూత్బ్రష్షులు, గడువు ముగిసిన ఉత్పత్తులు.. వీటన్నింటినీ తిరిగి ఎలా ఉపయోగించుకోవచ్చో చెబుతుంటాను. నా కంటెంట్ చూసి, ఒక్కరు మారినా చాలు’ అంటుంది విధి.ప్రకృతి ప్రేమికురాలు.. స్టోరీ టెల్లర్, రైటర్, క్లైమేట్ ఛేంజ్ అడ్వకేట్, ఫొటోగ్రాఫర్, సస్టెయినబిలిటీ ఇన్ఫ్లూయెన్సర్ గా పేరొందారు శివ్యానాథ్. సోలో ట్రావెలర్ అయిన శివ్యా పదేళ్లుగా మాంసాహార ఉత్పత్తుల నుంచి దూరమై వీగన్ ఫుడ్వైపుగా తన జీవన విధానాన్ని మార్చుకున్నారు. వాయిసెస్ ఆఫ్ రూరల్ ఇండియా స్వచ్ఛంద సంస్థకు కో–ఫౌండర్గా వర్క్ చేస్తున్నారు. రూరల్ స్టోరీ టెల్లర్గా తన గొంతుకను వినిపిస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా లక్షల్లో ఫాలోవర్లు ఉన్న శివ్యా సోలో ట్రావెలర్గా ప్రకృతి, పర్యావరణం గురించి తన అనుభవాలన్నీ ఇందులో జోడిస్తుంది.చెట్లను రక్షిద్దాం..హిమాచల్ప్రదేశ్ వాసి శివాని కన్వర్ స్వచ్ఛభారత్ మిషన్లోనూ వర్క్ చేస్తుంది. వేస్ట్ మేనేజ్మెంట్, సస్టెయినబిలిటీ మీద కంటెంట్ క్రియేట్ చేస్తుంది. అమృత్సర్ జిల్లాలోని మజీతాలోని స్థానిక సంస్థలలో చేసిన కృషికి గాను ప్రభుత్వం నుంచి ప్రశంసాపత్రాన్నీ పొందింది. ‘చెట్లను నాటడం ముఖ్యం. కానీ, ఇప్పటికే ఉన్న పెద్దచెట్లను రక్షించడం మరింత కీలకం. ఒక చెట్టుకు హాని జరుగుతుంటే చూస్తూ మౌనం వహించకండి. దానిని రక్షించండి. ఇలా దేశమంతటా చేస్తే పచ్చదనాన్ని కాపాడుకున్నవారం అవుతాం. ఎవరైనా అక్రమంగా చెట్లను నరుకుతుంటే దాని గురించి పోలీసులకు తెలియజేయండి. ఒక్క ఫోన్ కాల్ ఒక చెట్టును కాపాడగలదు. కాపాడిన చెట్టు తరతరాలకు ప్రయోజనం చేకూరుస్తుంది’’ అని ప్రచారం చేసే శివానీ ఎకో ఎఫర్ట్స్ పేరుతో పర్యావరణ హితానికి కృషి చేస్తోంది.రీ యూజ్ప్రకృతిలో మమేకం అవుతూ ఎలా జీవించవచ్చో తన పేజీ ద్వారా విరిస్తుంది ఇండోర్వాసి ‘శ్వేత కటారియా’. వీగన్ న్యూట్రిషన్పై వర్క్ చేస్తున్న శ్వేత తన పేజీ ద్వారా సస్టెయినబిలిటీ జీవన విధానాల గురించి వివరిస్తుంది. వంటగదిలో వాడే క్లీనింగ్ ప్రొడక్ట్స్, వేస్టేజ్, రీయూజ్ దుస్తుల గురించి మొక్కల పెంపకం, చెట్ల ప్రాముఖ్యత.. ఇలా ప్రతిదీ వివరిస్తుంది. లక్షకు పైగా ఫాలోవర్లు తన కంటెంట్ను ఫాలో అవుతున్నారు. -
జిరాక్స్ మెషిన్
చిన్నారులూ.. జిరాక్స్ మెషిన్ మనందరికీ తెలుసు కదా! స్కూల్ ప్రాజెక్ట్ కోసమో, నోట్స్ కోసమో మనం తరచూ జిరాక్స్ తీయిస్తుంటాం. మరి మీరెపుడైనా ఆలోచించారా? ఈ జిరాక్స్ మెషిన్ ను ఎవరు కనిపెట్టారు? దాని వెనుక ఉన్న కథ ఏమిటి అని? 1930లలో చెస్టర్ కార్ల్సన్ అనే అమెరికాకు చెందిన ఒక లాయర్ ఉండేవాడు. ఆయనకు ఆఫీసులో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే... ఏదైనా పేపర్ కావాలంటే దాన్ని చూసి మళ్లీ చేత్తో రాయడం లేదంటే టైప్ చేయడం. దీనికి చాలా సమయం పట్టేది. ఈ సమస్య పరిష్కారం కోసం ఆయన చాలా ఆలోచించాడు. ఒక పేపర్ను ఉన్నది ఉన్నట్లుగా క్షణాల్లో కాపీ చేసే మెషిన్ ఉంటే ఎంత బాగుంటుంది అని ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. కార్ల్సన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు కావడంతో రకరకాలుగా ప్రయోగాలు చేసి, 1938 అక్టోబర్ 22న ఆయన ప్రపంచంలోనే మొదటి ఫోటోకాపీని విజయవంతంగా తీశాడు. ఈ టెక్నాలజీకి గ్రీకు పదాల ఆధారంగా జిరోగ్రఫీ అని పేరు పెట్టారు. గ్రీకు భాషలో జిరోస్ అంటే ‘పొడి’, గ్రాఫియా అంటే ‘రాత’ అని అర్థం. అంటే సిరా లేకుండా రాసే పద్ధతి అన్నమాట. ఆ తర్వాత కాలక్రమంలో ‘జిరాక్స్’గా మారిపోయింది. మరో విశేçషం ఏమిటంటే మొదట్లో వచ్చిన జిరాక్స్ మిషన్ దాదాపు ఒక పెద్ద ఫ్రిజ్ అంత పరిమాణంలో ఉండేది! -
ప్రాణాలనే త్యాగం చేస్తాయి!
నేస్తాలూ! చీమల ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింతలు ఉన్నాయి. అందులో అత్యంత విచిత్రమైన చీమ‘కొలొబోప్సిస్’ దీన్ని సాధారణంగా డోర్–హెడ్ యాంట్ అని పిలుస్తారు. ఈ చీమ తల ముందు భాగం గుండ్రంగా, ఫ్లాట్గా ఉండి శత్రువులు తన గూట్లోకి రాకుండా ఉండటానికి, తన తలను ఆ రంధ్రానికి అడ్డు పెట్టి కూర్చుంటుంది. అందుకే ఈ చీమకు డోర్హెడ్ యాంట్ అని పేరు. అంతేకాదు ఈ కొలొబోప్సిస్ చీమల జాతిలోనే కొన్ని చీమలకు ఒక సూపర్ పవర్ ఉంటుంది. ఏదైనా పెద్ద శత్రువు గూటిపై దాడి చేసినప్పుడు, ఇవి తమ పొట్టను గట్టిగా బిగబట్టి బాంబులా బద్దలు కొట్టుకుంటాయి! అలా పేలినప్పుడు వాటి శరీరం నుంచి ఒక రకమైన జిగురు, విషపూరితమైన ద్రవం శత్రువులపై పడటంతో అవి ప్రమాదంలో పడటమో, చనిపోవడమో జరుగుతుంది. తన గూటిని, మిగతా చీమలను కాపాడటానికి ఇవి తమ ప్రాణాలనే త్యాగం చేస్తాయి. ఈ వింత చీమలు ఎక్కువగా ఆసియా ఖండంలోని దట్టమైన అడవులలో చెట్ల పైభాగాన జీవిస్తాయి. -
రాంబాబుగాడి రంధ్రాన్వేషణ(లు)!
‘‘మీ గుండెకు చిల్లు పడింది’’ అని డాక్టర్ చెప్పగానే వెంటనే రాంబాబు గాడు అన్న మొదటి మాట ఏమిటో తెలుసా?‘‘చిల్ బ్రో’’ అంటూ కూల్గా వ్యాఖ్యానించాడు వాడు. ‘‘అదేంట్రా గుండెకు చిల్లు అంటే చిల్ అంటావేంటి?’’ ఆశ్చర్యపోయాన్నేను. చిల్లు మహత్యం గురించి ఓ స్పీచ్ ఇచ్చాడు రాంబాబుగాడు. వాడి పాయింటాఫ్ వ్యూ నుంచి చెప్పాలంటే... → మనిషికి ఆల్రెడీ నవరంధ్రాలున్నాయిగా... ఒకటి ఎక్స్ట్రా ఉంటే ఏం పోయిందని డాక్టర్ను అడిగాట్ట. అప్పుడూ ‘‘గుండెలోకి రక్తం రావడానికీ, పోవడానికి ఆల్రెడీ దేవుడు కొన్ని రంధ్రాల్ని పెట్టే ఉంచాడు. అవి మినహా ఒక్క రంధ్రం ఎక్కడ ఎక్స్ట్రాగా ఉన్నా అది బొక్కే. అందుకే పేగులోనైనా, గుండెలోనైనా రంధ్రం పడితే పూడ్చేయాల్సిందే అన్నాట్ట డాక్టర్గారు. → పకడ్బందీగా ఇల్లు కట్టుకోగానే ఉండదు ప్రయోజనం. మీరు నల్లా వేసుకోవాలన్నా... మురుగునీళ్లు బయటకు వెళ్లాలన్నా... ఆఖరికి ఏసీ అమర్చుకోవాలన్నా గోడలకు పెట్టుకోవాలి రంధ్రాలెన్నో. ఇలా చూసినప్పుడు ‘ఇంటి కప్పుకు దగ్గరగా సజ్జాలూ, బాత్రూమ్ నీళ్లు బయటెళ్లాలంటే బెజ్జాలూ’ తప్పవు. → గంటెకు అనేక చిల్లులు పెట్టి దాన్ని జల్లిగంటె అని పిలిచాకే... నూనెలో వేగుతున్న పదార్థాలను తీయడానికి వీలైంది. జల్లిగంటెలో ఎన్ని చిల్లులుంటే... అలాగే పాలు వడపోసే ఫిల్టర్కు ఎన్ని సన్నటి చిల్లులుంటే అదంత అడ్వాన్స్డ్ ఉపకరణం. కాబట్టి... హ్యూమన్ బీయింగ్స్లో నేనిప్పుడు మరింత అడ్వాన్స్డ్ వర్షన్గా అనుకుంటున్నా. → ఆకాశం నుంచి ఏ బట్టతడుపు చినుకులు పడితేనో లేదా మామూలుగా వర్షం కురిస్తేనో లాభం లేదు. ఆకాశానికి బొక్కడ్డట్టు... మేఘాలకు చిల్లుపడ్డట్టుగా పడాలి వాన. అప్పుడే మంచి పంటలకూ, నీటిపారుదలకూ అవకాశం. అంటే ఆకాశానికి చిల్లు పడనట్టుగా వర్షం పడితే ఏమీ లాభం లేదన్నమాట. → నాకిప్పుడు గుండెలో పడ్డ రంధ్రం వల్ల... డాక్టరు మొదలుకొని, అటు ఈసీజీవాడూ, ఎక్స్–రే ఫిల్ముల తయారీవాడూ, డయాగ్నస్టిక్ సెంటర్వాడూ మొదలుకొని ఇటు నన్ను హాస్పిటల్కు తీసుకొచ్చే ఊబరు, వోలా ట్రాన్స్పోర్టు వాళ్ల నుంచి నన్ను పరామర్శించే పండ్ల దుకాణాల వాళ్ల వరకూ ఎంతోమంది బతుకుతారు. దీన్ని బట్టి తెలిసేదేమిటంటే... దాంతో నా స్లోగనేమిటంటే...‘‘నా గుండెలోని కలుగూ... దాంతో మన ఎకానమీకెంతో లాభం కలుగు’’! → ఆఫ్టరాల్ వడకు ఒకే ఒక బొక్కెట్టి చిల్లుగారె అనీ... అనేక రంధ్రాలొచ్చేలా పోసి దోసెను రవ్వదోసె అంటూ పిలుచుకుని, ప్రాణాలను నిలబెట్టే ఆహారాలకే ఇలా బొక్కెడుతున్నప్పుడు నా గుండెకు బొక్కడితే నామోషీ ఏమిటి? → చిల్లుకు రంధ్రమనీ, కన్నం, బెజ్జం, కలుగు, తూటు, తొర్ర, పొక్కా, బొక్క అని... ఇలాంటి పర్యాయపదాలెన్నో ఉండి భాషను సుసంపన్నం చేస్తున్న నేపథ్యంలో ఈ బాషాకూ పడే చిల్లు వల్ల ఛిల్ల్వుతుంటే నీకేంటి బాధ. గతంలోనే నా పేగుకో రంధ్రం పడితే జీజే అనే సర్జరీ చేసి మూసేశారు డాక్టర్లు. ఇప్పుడు అంతటి వైద్యచికిత్సా శస్త్రచికిత్సా మహనీయులకు నా ‘నవ’రంధ్రాన్ని (అంటే తొమ్మిదోది కాదు... కొత్త రంధ్రమని అర్థం) మూసేసే మరో అవకాశమిస్తున్నానంటూ ముగించాడు మా రాంబాబు గాడు. – యాసీన్ -
60 ఏళ్లు.. లక్షన్నర కిలోమీటర్లు
హుషారు కోసమో, లేదా బేజారు తగ్గడం కోసమో శరీరానికి కాస్త వ్యాయామం అవసరమని సైకిలింగ్ చేసేవాళ్లను చూశాం. బ్యాటరీ సైకిళ్లు, స్కూటర్లు వచ్చాక పెడల్ మీద కాలు పెట్టేవారే కరువయ్యారు. కాని రాజస్థాన్లోని ఓ మహిళ తన అనితర సామర్థ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. జైపూర్కి చెందిన రేణు సింఘి వయసు అక్షరాల 60 ఏళ్లు. అయితేనేం? టీనేజర్లు కూడా షాక్ అయ్యేలా సైకిలింగ్ చేస్తూ ఛాలెంజ్ విసురుతోంది. సైకిలింగ్ అంటే అదేదో ట్రాక్లోనో స్మూత్గా ఉన్న రోడ్డు మీదో కాదు. మిట్టపల్లాలు, కొండలు, గుట్టలు ఇలా ప్రదేశమేదైనా తగ్గేదేలే అంటూ సైకిల్ తొక్కేస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె సైకి లింగ్ మొదలుపెట్టింది 51 ఏళ్ల వయసులో..కాని ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఆమె 1.5 లక్షల కిలోమీటర్లు సైకిలింగ్ చేసింది. అలాగే ‘1200 కి.మీ పారిస్ బ్రెస్ట్ పారిస్’ సైకిల్ రైడ్ పూర్తి చేసిన తొలి భారతీయ మహిళ కూడా రేణునే.. ఇలా పలు రేసుల్లో పాల్గొంటూ తన తోటి వయసు వారికి ఆదర్శంగా నిలుస్తోంది. -
కుమారుడి కోసం ఉద్యోగానికి రిజైన్..!కట్చేస్తే..
గత కొద్దికాలంగా ప్రముఖ కంపెనీలన్నీ ఉద్యోగాలకు ఉద్వాసన పలుకుతూ..ఎంత మంది ఉద్యోగులును తీసేసిందో చూశాం. ఆ జాబితాలో మన కళ్లముందే ఎంత పేరుగాంచిన మహా మహా కంపెనీలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ పోస్ట్ నిజంగా మనసుని తాకుతుంది. కొన్ని కంపెనీలు ఇలా కూడా ఉద్యోగి పట్ల ఆలోచిస్తాయా అని అనిపిస్తుంది. అలాంటి పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.అంకిత్ పాండే అనే వ్యక్తి ఈ పోస్ట్ని సోషల్ మీడియాలో ఎక్స్లో పంచుకున్నారు. తన వద్ద ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న అకౌంటెంట్ రాజీనామా లెటర్ని సమర్పించాడని చెప్పారు. అతడు పదేళ్లుగా మా కంపెనీలో సేవలందిస్తున్నాడు. అందువల్లే ఎందుకింత సడెన్గా రిజైన్ చేస్తున్నారని ప్రశ్నించగా..ఆయన కళ్లనీళ్లతో తన కొడుకు పరిస్థితి బాగోలేదని, వైద్యులు కూడా బతికే అవకాశాలు తక్కువ అని చెప్పారని బాధగా చెప్పాడు. దాంతో పోనీ ఇంటి నుంచి పనిచేస్తారా అని అడుగగా..కుమారుడికి తన అవసరం ఉందని, తనతో గడపాలని కోరుకుంటున్నానంటూ.. ఆ ఆఫర్ని తిర్కస్కరించాడని చెప్పారు. అప్పుడు వెంటనే అంకిత్ పాండే డోంట్.." వర్రీ మీ కుమారుడు బాగోగులు చూసుకో పర్లేదు మీకు కంపెనీ మద్దతు కొనసాగుతుంది. పదేళ్లుగా ఇక్కడే పనిచేశారు అందుకుగానూ..నెల నెల జీతం జమ అవుతుంది. చింతించొద్దు." అని ధైర్యం చెప్పి పంపామన్నారు. ఆ తర్వాత ఒక నెల తర్వాత స్వీట్స్ బాక్స్తో ఆ అకౌంటెంట్ తిరిగొచ్చి..మా అబ్బాయి కోలుకున్నాడని ఆనందంగా చెబుతూ స్వీట్స్ పంచిపెట్టాడు. పైగా జాబ్లో మళ్లా జాయిన్ అవ్వతూ..తాను పనిచేయని దానికి చెల్లించిన జీతాన్ని మినహాయించమని ఆ అకౌంటెంట్ అభ్యర్థించాడని అన్నారు. అందుకు యజమాని నిరాకరిస్తూ..అది జీతం కాదు మీ అబ్బాయ్ కోలుకోవడానికి తాము చేసిన చిన్న సహాయం మాత్రేమ. కొన్ని సార్లు ఒక సంస్థ పనిచేసే ప్రదేశం మాత్రమే కాదు..ఒక కుటుంబం లాంటిది కూడా అని అన్నానంటూ చెప్పుకొచ్చారు అంకిత్ పాండే పోస్ట్లో. ఇంతకుమించిన ఉద్యోగ భద్రత ఇంకేంకావాలి. కానీ ఈ రోజుల్లో అలాంటి సహృద్భావంగా ఆలోచించే కంపెనీలు దొరకడం అరుదే కదూ.(చదవండి: భారత సంతతి విద్యార్థికి ప్రతిష్టాత్మక హెన్రీ ఫోర్డ్ II స్కాలర్ అవార్డు..!) -
ఏడు నెలల్లో 101 కేజీల నుంచి 65 కేజీలకు..!
బరువు తగ్గడం ఒక్కోక్కరికీ ఒకోలా ఉంటుంది. కొందరు సులభంగా బరువు తగ్గితే..కొందరికీ అది భారంగా ఉంటుంది. కాఈ ఇక్కడ ఈ ఫిట్నెస్ కంటెంట్ క్రియేటర్ అధిక బరువు ఏ రేంజ్లో ఉందంటే తగ్గుతుందామె అనే ప్రశ్న కలిగేలా ఉంది. అంత అధిక బరువును తగ్గించుకునేందుకు ఉపక్రమించి..చాలా కొద్ది టైంలో మంచి పలితాన్ని అందుకుంది. పైగా ఓ హీరోయిన్ మాదిరి స్మార్ట్ లుక్తో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.ఆ ఫిట్నెస్ కంటెంట్ క్రియేటరే కాజల్. తన బరువు తగ్గే ప్రయాణాన్ని ఇన్స్టాగ్రామ్లో డాక్యుమెంట్ చేస్తూ..ఏడాది లోపే 101 కేజీల నుంచి 65 కేజీలకు ఎలా తగ్గిందో పంచుకుంది. ఆమె వీడియోల ప్రకారం, కాజల్ ఆగస్టు 2025లో తన పరివర్తన ప్రయాణాన్ని ప్రారంభించి, ఏడు నెలల్లో దాదాపు 36 కేజీలు తగ్గారు. అందుకోసం డైట్ విషయంలో చాలా కేర్ తీసుకున్నానని, అదే తనను ఇంతలా బరువు తగ్గేలా చేసిందని చెప్పుకొచ్చింది. భోజన ప్రణాళిక..తొలిరోజు..ఆమె వారంలోని మొదటి రోజు ఒక సాధారణమైన, సమతుల్యమైన ఇంట్లో వండిన భోజనంతో మొదలవుతుంది. ఉదయం, ఆమె నానబెట్టిన ఐదు నట్స్తో ఒక కప్పు జీరా నీటిని తాగుతుంది. ఆ తర్వాత పుదీనా చట్నీతో రెండు చిన్న బేసన్ చిల్లాలను ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారంగా తీసుకుంటుంది. ఉదయం పూట చిరుతిండిగా, ఆమె ఒక గిన్నెడు పండ్లు అంటే.. మాగ్జిమ్ బొప్పాయితో పాటు, ఒక టేబుల్ స్పూన్ పొద్దుతిరుగుడు గింజలను ఇష్టపడుతానని అన్నారు. మధ్యాహ్న భోజనంలో అర కప్పు బ్రౌన్ రైస్, శనగపప్పు, బెండకాయ కూర ఉంటాయి. తర్వాత, ఆమె 20 గ్రాముల వేయించిన మఖానాతో ఒక కప్పు గోరువెచ్చని హెర్బల్ టీ తాగుతుంది. రాత్రి భోజనంలో, ఆమె టోఫు బుర్జీ, వేయించిన బీన్స్, ఒక బాజ్రా రోటీ తింటుంది.రెండవ రోజురెండవ రోజు, కాజల్ జీరా నీటికి బదులుగా నానబెట్టిన చియా గింజలతో గోరువెచ్చని నిమ్మ నీటిని తీసుకుంటుంది. అల్పాహారంగా సోయా చంక్స్తో వెజిటబుల్ పోహా తింటుంది. ఆమె ఉదయం పూట అల్పాహారంగా ఒక పూర్తి ఆపిల్, ఒక టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు తింటుంది. తర్వాత మధ్యాహ్న భోజనంలో రెండు రోటీలు, పెసరపప్పు, సొరకాయ కూర, సలాడ్ తీసుకుంటుంది. సాయంత్రం అల్పాహారం కోసం, కాజల్ ఒక కప్పు మజ్జిగ, వేయించిన శనగలను ఎంచుకుంటుంది. ఆమె తన రోజును 100 గ్రాముల పాలక్ పనీర్, ఒక జొన్న రొట్టె, దోసకాయ రైతాతో ముగిస్తుంది.3వ రోజుఆమె 3వ రోజు భోజనాలు సాదాసీదాగా కడుపు నింపే వాటికి ప్రాధాన్యత ఇస్తుంది. ఆమె ఉదయాన్ని అలోవెరా షాట్, గోరువెచ్చని నీటితో ప్రారంభిస్తుంది. ఆ తర్వాత రాగి దోస, ప్రోటీన్ అధికంగా ఉండే సాంబార్, చట్నీ తీసుకుంటుంది. ఉదయం పూట చిరుతిండిగా, ఆమె ఒక జామకాయ, ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలు తింటుంది. మధ్యాహ్న భోజనంలో ఒక చిన్న జొన్న రొట్టె, కందిపప్పు, పాలకూర కూర, సలాడ్ ఉంటాయి. సాయంత్రం, ఆమె చియా గింజలు, బెర్రీలు లేదా దానిమ్మ గింజలతో కలిపిన తీపి లేని గ్రీక్ పెరుగు గిన్నెను ఎంచుకుంటుంది. రాత్రి భోజనంలో వెజిటబుల్ క్వినోవా పులావ్, దోసకాయ-టమోటా సలాడ్ ఉంటాయి.4వ రోజుకాజల్ 4వ రోజు భోజన ప్రణాళిక నానబెట్టిన మెంతి గింజల నీరు, వెజిటబుల్ ఉప్మాతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఒక బేరీపండు, 8-10 నానబెట్టిన ఎండుద్రాక్షలు తీసుకుంటుంది. మధ్యాహ్న భోజనంలో, ఆమె మిల్లెట్ ఖిచిడీ, కచ్రీ తింటుంది. సాయంత్రం, ఆమె నిమ్మరసం తాగి, హమ్మస్తో రెండు రైస్ కేక్లు తింటుంది. రాత్రి భోజనంలో సోయా కూర, ఒక రోటీ ఉంటాయి.5వ రోజుఆమె తన రోజును నిమ్మ-అల్లం నీళ్లు, నానబెట్టిన ఐదు వాల్నట్లు, కూరగాయలు, గ్రీన్ చట్నీతో కూడిన ఓట్స్ చిల్లాతో ప్రారంభిస్తుంది. ఆ తర్వాత, ఈ కంటెంట్ క్రియేటర్ పండ్లు, గింజలు, ఆపై మధ్యాహ్న భోజనంలో రెండు బాజ్రా రోటీలు, మసూర్ పప్పు, బెండకాయ కూర, సలాడ్ తింటుంది. సాయంత్రం, ఆమె మజ్జిగ వేయించిన వేరుశెనగలు తింటుంది. రాత్రి భోజనంలో పనీర్ టిక్కా, వేయించిన జుకినీ,అర కప్పు బ్రౌన్ రైస్ ఉంటాయి.బరువు తగ్గే ఫలితాలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక ఫిట్నెస్ లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తున్నప్పుడు నిలకడ, పరిమాణ నియంత్రణ, సమతుల్య ఆహారపు అలవాట్ల ప్రాముఖ్యత అత్యంత ముఖ్యమని అంటున్నారు కాజల్. అప్పుడే చక్కటి ఫలితాలను సత్వరమే అందుకోగలమని అన్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Fit kajal (@flex_fit_kajal) (చదవండి: 'సక్సెస్'కి సరైన నిర్వచనం ఇదే..! తొలిసారిగా పేరెంట్స్ని..) -
'సక్సెస్'కి సరైన నిర్వచనం ఇదే..! తొలిసారిగా పేరెంట్స్ని..
మన సక్సెస్ కోసం అహర్నిశలు కష్టపడ్డ పేరెంట్స్కి తిరిగి ఏదైన ఇవ్వగలిగడం కంటే మించిన విజయం ఇకొంకటి ఉండదు. ఈ కల కోసం అంతా ప్రయత్నిస్తుంటారు. కొందరికీ ఏవేవో కారణాల వల్ల కుదరకపోవచ్చు. కానీ కొందరు అనుకున్నది సాధించి విజయానికి అసలైన నిర్వచనం ఇస్తుంటారు. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది.అభిషేక్ ఝా అనే వ్యవస్థాపకుడు ఏళ్లుగా ఈ కలం కోసం ఎదురు చూస్తున్నా అంటూ వివరిస్తుండటం వీడియోలో చూడొచ్చు. భావోద్వేగభరితమైన ఆ వీడియో క్లిప్లో తన తలిద్రండులను మొదటిసారి విదేశాలకు తీసుకువెళ్తున్నా అంటూ ఎయిర్పోర్ట్ నుంచి ఆ సతోషాన్ని పంచుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది. అతను ఆ వీడియోలో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చాడు. "ఎయిర్పోర్ట్లోని ఇమ్మిగ్రేషన్ అధికారి ఎందుకింత సంతోషంగా ఉన్నారని అడిగాడు. అందుకు తాను జీవితంలో విజయం సాధించిన మొదటి క్షణం ఇది. ఈ రోజు తొలిసారి తన తల్లిదండ్రులని ఒక అంతర్జాతీయ పర్యటనకు తీసుకువెళ్తున్నా. ఇదంతా తనకెలా అనిపిస్తుందో మాటల్లో చెప్పలేను. నాతో కలిసి దేశం బయటకు అడుగు పెట్టడం ఇదే మొదటిసారి. వాళ్లు తమ కూమారుడు వారికోసం సంపాదించిన ప్రపంచాన్ని చూడనున్నారు. అయినా ఈ సంతోషం అంతా గెలిచిన వారికే దక్కుతుంది మిత్రమా. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ పేరెంట్స్ కోసం విజేతగా నిలవాలి. అంటూ అభిషేక్ తన పోస్ట్ని ముగించాడు. అంతేగాదు ఆ వీడియోకి ‘తన తల్లిదండ్రులకు ప్రపంచాన్ని ఇవ్వాలని కలలు కన్న ఆ 16 ఏళ్ల అభిషేక్ ఝా కోసం..’ అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశాడు. నెటిజన్లు కూడా ఇది నిజమైన విజయానికి నిర్వచనం, తల్లిదండ్రులను గర్వపడేలా చేయడం కంటే మించిన అనుభూతి మరొకటి లేదు అని కొందరు, మీ పేరెంట్స్ ముఖాల్లో చిరునవ్వు వాళ్లు చేసిన ప్రతికష్టానికి దక్కిన ప్రతిఫలం అని మరికొందరు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Abhishek Jha (@nofilterabhi) (చదవండి: సినిమా సీన్ని తలపించేలా.. ఆర్మీ పైలట్ లవ్ ప్రపోజ్!) -
భారత సంతతి విద్యార్థికి ప్రతిష్టాత్మక హెన్రీ ఫోర్డ్ II స్కాలర్ అవార్డు..!
భారత సంతతి విద్యార్థి అవని అహుజాకి ప్రతిష్టాత్మక హెన్నీ ఫోర్డ్II స్కాలర్ అవార్డుని గెలుచుకుంది. ఎంఐటీలో అత్యున్నత పురస్కారాలలో ఒకటైన ఈ అవార్డుని సాధించిన ఎన్నారైగా ఘనత సృష్టించింది. అసాధారణమైన విద్యా ప్రతిభ, ఇంజనీరింగ్లలో బలమైన నాయకత్వ సామర్థ్యాన్ని ప్రదర్శించే సీనియర్ అండర్ గ్రాడ్యుయేట్లకు ఈ పురస్కారన్ని ప్రదానం చేస్తారు. ఈ అవార్డుతో ప్రతిష్టాత్మక ఎంఐటీ విద్యార్థుల ప్రత్యేక బృందంలో చేరారు. ఈ పురస్కారం ఇటీవల కోడే రీసెర్చ్ గ్రూప్లో ఆమె చేసి వర్క్ కెపాసిటివ్ వైర్లెస్ పవర్ ట్రాన్స్ఫర్ పరిశోధనకు గానూ లభించింది. ఈ సాంకేతికతను భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వైర్లెస్గా ఛార్జ్ చేయడానికి, శరీరంలో అమర్చే వైద్య పరికరాలకు శక్తిని అందించడానికి ఉపయోగించవచ్చు. ఈ మేరకు అవని మాట్లాడుతూ.."ఈ అవార్డును అందుకోవడం నాకు చాలా గౌరవంగా, ఆనందంగా ఉంది. ముఖ్యంగా డీన్ హామండ్ను కలవడం ఒక గొప్ప గౌరవం." అని అన్నారామె. నిజానికి హెల్త్కేర్ టెక్నాలజీలు, రోబోటిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లలో పనిచేయగల సామర్థ్యమే, ఆమెను ఎంఐటీ అత్యంత ప్రతిభావంతులైన అండర్ గ్రాడ్యుయేట్ పరిశోధకులలో ఒకరిగా నిలబెట్టింది. అలాగే అవనికి అత్యంత ఆసక్తి ఉన్న రంగాలలో మహిళల ఆరోగ్య పరిశోధన ఒకటి. అంతేగాదు ఆమె రొమ్ము కేన్సర్ స్క్రీనింగ్ను మరింత సులభతరం చేయడానికి రూపొందించిన, ధరించగలిగే బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ ప్యాచ్కు సంబంధించిన పరిశోధనలలో కూడా కీలకపాత్ర పోషించారామె. తాను పీహెచ్డీ పూర్తి అయిన వెంటనే మహిళల ఆరోగ్య పరిశోధన రంగంలో పవర్ ఎలక్ట్రానిక్స్ను అన్వయించాలని చూస్తున్నట్లు తెలిపారు.(చదవండి: నాడు నీట్ ఫెయిల్యూర్..ఇవాళ బయోటెక్నాలజీ నిపుణురాలు!) -
నటి కంగనా వెండిగ్లాసులో నీళ్లు తాగడం..! ఆరోగ్యానికి మంచిదేనా?
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల భారత 'భారత్ భాగ్య విధాత' ట్రైలర్ విడుదల కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఆమె వెండి గ్లాసులో నీళ్లు తాగుతూ కనిపించారు. 40 ఏళ్ల నటి గతంలో కూడా ఇలానే ఒక సందర్భంలో తాగుతూ కనిపించడంతో విమర్శులు వెల్లువెత్తాయి కూడా. అయితే తాను ఇలా వెండిగ్లాస్లో నీళ్లు తాగడానికి రీజన్ ఏంటో వివరించారు. ఎందుకు తాగుతానంటే..తాను తాగే వెండిగ్లాస్ చాలా పాతదని, ముఖ్యంగా రాజ కుటుంబాలలో అనుసరిస్తున్న ఒక పురాతన సంప్రదాయం అని అన్నారామె. తాను ఆరోగ్యం కోసం ఇలా వెండిగ్లాస్లో తాగుతున్నట్లు తెలిపారు. అధిక పిత్తదోషం ఉన్నవారికి చల్లదనం కోసం ఇది ఎంతో మంచిదని అన్నారు. వెండికి, నీటికి ఉన్న చల్లదనాన్నిచ్చే గుణాలను గురించి కూడా నొక్కి చెప్పారామె.నిజంగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా?వెండి పాత్రలో నీళ్లు తాగడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయన్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా వెండి పాత్రలో నీళ్లు తాగడం అనేది భారతీయ సంప్రదాయంలో ఆరోగ్యంలో ఒక భాగం. పైగా వెండికి సహజంగా సూక్ష్మజీవులను నిరోధించే గుణం ఉన్నందున దానికి ప్రాధాన్య ఇస్తారని అన్నారు. వెండిగిన్నెలో నిల్వ ఉన్న నీరు కొన్ని సూక్ష్మ జీవుల పెరుగుదలను నెమ్మదింప చేస్తుందన్నారు. మొత్తం ఆరోగ్య విషయానికి వస్తే ప్రయోజనాలు పరిమితంగా ఉన్నాయన్నారు. ఇలా వెండిగిన్నెలో నీరు తాగితే దానంతట అదే పోషణ, రోగనిరోధక శక్తి వస్తాయని కాదని, ఈ చిన్న మార్పు మొత్తం ఆరోగ్య మెరుగుదల అని అనుకుంటే పొరపాటే అని అన్నారు.మన ఆయుర్వేదంలోనూ, భారతీయ సాంప్రదాయంలోనూ వెండి అనేది ఆరోగ్యానికి మంచిదే . అది వాస్తవమే అయినా..మొత్తం ఆరోగ్యంకి ముడిపెట్టడం సరికాదన్నారు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లలో చేర్చడం కూడా సముచితం కాదన్నారు ఆరోగ్య నిపుణుల. View this post on Instagram A post shared by Peepingmoonofficial (@peepingmoonofficial)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: బంధనం, బాధ..భళ్లుమనేలా అద్భుతమైన కళకు ఊపిరిపోసింది..!) -
'బంధనం', 'బాధ' ఆవిష్కరించిన అద్భుత కళ..!
ఓ వ్యక్తి ఎలాంటి తప్పు చేయకుండా బంధింపబడి, బాధలకు గురైతే..కుంగిపోయి ఢీలా పడిపోతాడు. కానీ సోనాబాయి అలా కాదు. తన కష్టాల్ని, నిశబ్ద బాధని అద్భుతమైన కళకు ఊపిరిపోసి, స్వేచ్ఛకు మార్గం వేసింది. పైగా యావత్తు ప్రపంచం తనవైపు తిరిగేలా గుర్తింపు తెచ్చుకుంది. బాధలను వరంగా మార్చుకుని తన ఉనికిని ఎలా తెలియజేయాలో చాటి చెప్పింది. కళ అంటేనే సృజనాత్మక ప్రతిభకు సంబంధించింది. తన తప్పు ఏమి లేకుండా భర్త చేత సమాజం నుంచి వెలివేయబడి నిర్బంధింపబడింది సోనాబాయి రాజావర్. చత్తీశ్గఢ్కు చెందిన సోనాబాయి తన భర్త దురహంకారానికి బలైన మహిళ అని చెప్పొచ్చు. ఆయన ఆమెను కిటికీలు లేని ఇంట్లో బంధించేవాడు. దాంతో ఆమె తన కొడుకుతో ఒంటిరిగా, నిశబ్ద వేదనను అనుభవించింది. నాటి మూఢనమ్మకాలు, చాదస్తాలకు బాధితురాలిగా మారిన మహిళ సోనాబాయి. అయితే ఆ బంధనాన్ని తన స్వేచ్ఛను సంపాదించుకునే మార్గానికి పునాది వేసింది. మొదట తన కొడుకుని ఊరడించడానికి బావి వద్ద ఉన్న మట్టితో బొమ్మలు చేసేది. కాలక్రమేణ ఆమెలోని అద్భుత ప్రతిభా పాటవాలతో గొప్ప కళ పుట్టుకొచ్చి..మొత్తం ఇల్లు ఆ బొమ్మలతో నిండిపోయింది. బొమ్మలకు వేసే రంగులను సైతం ఆమె స్వయంగా ఇంట్లో సహజసిద్ధిమైన వాటితో తయారు చేసి ఉపయోగించేది. అంతేగాదు వేసవికాలంలో ఉక్కపోతాలకు తాళ్లలేక ఇంటిని చల్లగా ఉంచే మార్గం కోసం అన్వేషించి ఓ చక్కటి పరిష్కారాన్ని వెతికింది. వెదురు, బంక మట్టిలతో చిన్నపాటి రంధ్రాలతో ఇంటి చుట్టు ప్రహరీని ఏర్పరుచుకుని చల్లటి గాలి లోపలికి వచ్చి ఎండ వేడిని అధిగమించింది. అంతేగాదు ఆమె ఇంటి గోడలు సైతం తన కళతో కళకళలాడుతుండేవి. నిజానికి టాలెంట్ ఉన్నవాడిని బంధించడం అంత ఈజీ కాదు అనేందుకు ఉదహారణగా నిలిచేలా ఆమె కళకు గుర్తింపు దక్కింది, పైగా ప్రపంచమంతటికీ ఆమె పేరు మారుమ్రోగిపోయింది. సరిగ్గా 1983లో భారత్ భవన్కు చెందిన క్షేత్ర పరిశోధకుల బృందం ఆమె ఇంటిని కనుగొనడంతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అదే ఏడాది ఆమె తులసి సమ్మాన్ అవార్డును అందుకుంది.ఆమె నిశబ్ద తిరుగుబాటుకు, దృఢత్వానికి ప్రతీకగా మారింది. నిజానికి ఆమె ఈ కళ కోసం ఎలాంటి శిక్షణ తెలుసుకోలేదు. ఆమె బాధలు, కష్టాలకు ఈ కళకు ఊపిరిపోశాయి. అందులోంచే తన ఆనందం, స్వేచ్ఛను వెతుక్కుంటూ మంచి కళకారిణిగా మలుచుకుని జీవితాన్ని స్వర్గధామంగా మార్చుకుంది. అంతేగాదు ప్రతికూల అణిచివేత వాతావరణంలో ఎలాంటి మద్దతు లేకుండా కేవలం కళా ప్రతిభతో ధైర్యంగా మనుగడ సాగిస్తే..ఏదోనాటికి గుర్తింపు లభిస్తుందని ప్రూవ్ చేసింది. సోనాబాయి 2007లో కన్నుమూశారు. అంతేగాదు ఆమె మరణాంతరం ఛత్తీశ్గఢ్ ప్రభుత్వం 2015లో ఆమె స్వగ్రామం ఫుహ్పుత్రలో ఆమె గౌరవార్థం ఒక మ్యూజియంను స్థాపించింది. రాష్ట్రంలో ఒక కళాకారిణి జ్ఞాపకార్థం నిర్మించిన తొలి మ్యూజియం ఇదే కావడంతో ఇది మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. నిజంగా ఈ కథ అద్భుతమైన జీవిత పాఠాన్ని నేర్పిస్తోంది కదూ..!.(చదవండి: నేను బాగానే ఉన్నాను' సిండ్రోమ్: ఇంత ప్రమాదకరమైనదా?) -
ఇవి.. కాళ్లతో రుచి చూస్తాయి!
పిల్లలూ! మనం రుచి ఎలా చూస్తాం? నాలుకతో కదా.. కానీ సీతాకోకచిలుకలు వాటి కాళ్ళతో రుచి చూస్తాయి! అవును, మీరు విన్నది నిజమే. సీతాకోకచిలుకల కాళ్ళ చివరన చిన్న చిన్న సెన్సార్లు (రుచిని కనిపెట్టే భాగాలు) ఉంటాయి.మన నాలుక మీద టేస్ట్ బడ్స్ ఎలా ఉంటాయో, వాటి కాళ్ళకు అలా ఉంటాయన్నమాట. ఒక సీతాకోకచిలుక ఏదైనా ఆకు మీద గానీ, పువ్వు మీద గానీ వాలినప్పుడు... అది తినడానికి మంచిదా కాదా అనేది దాని కాళ్ళ ద్వారా వెంటనే తెలిసి΄ోతుంది. అలాగే సీతాకోక చిలుకకు మనలాగా నోరుకూడా ఉండదు. దానికి బదులు ఒక స్ట్రా లాంటి పొడవైన గొట్టం ఉంటుంది. కాళ్ళతో రుచి చూసి నచ్చిన తర్వాత, ఆ స్ట్రా ద్వారా పువ్వుల్లోని తేనెను తాగేస్తాయి. -
మన కన్ను దాదాపు 576 మెగాపిక్సెల్స్ కెమెరాతో సమానం!
హాయ్ ఫ్రెండ్స్! మన శరీరంలో అన్నిటికన్నా సంక్లిష్టమైన అవయవం ఏది అంటే మెదడు అని చెప్తాం. అయితే, మన మెదడు తర్వాత అంతకంటే ఎక్కువ భాగాలు కలిగిన, అత్యంత కాంప్లికేటెడ్ ఆర్గాన్ మన కన్ను! మనం వాడే ఫోన్ కెమెరాలు 50 లేదా 108 మెగాపిక్సెల్స్ ఉంటాయి.కానీ, సైన్స్ ప్రకారం మన కన్ను దాదాపు 576 మెగాపిక్సెల్స్ కెమెరాతో సమానం! అందుకే మనం ప్రపంచాన్ని ఇంత అందంగా, స్పష్టంగా చూడగలుగుతున్నాం. నిజానికి మన కళ్ళు ఈ ప్రపంచాన్ని తలకిందులుగా చూపిస్తాయి! కానీ, మన సూపర్ బ్రెయిన్ క్షణాల్లో ఆ బొమ్మను మామూలుగా మార్చి మనకు చూపిస్తుంది. అలాగే మన కళ్ళు సుమారు పది మిలియన్ల వేర్వేరు రంగుల మధ్య ఉన్న చిన్న చిన్న తేడాలను కూడా చాలా సులభంగా గుర్తుపట్టగలవు!ఇవి చదవండి: శరీరం 10 శాతం కాలితే ఐసీయూ కాపాడలేదా? -
సువార్త: జనసందోహం మధ్య యేసు..
యేసు ఎటు కదిలితే అటు జనం. జనం ఎక్కడో ఆయన అక్కడ కాదు. యేసు ఎక్కడో అక్కడే జనం. రాత్రి తప్పించి ఆయనకు ఏకాంతం అనేదే లేని పరిస్థితి. పగలంతా అవిశ్రాంత పరిచారకుడిగా దీనజనులు, రోగులు, వివిధ సమస్యల బాధితుల సేవలో తరించే యేసు సాయంసంధ్య, ప్రత్యూషం వేళల్లో ఎక్కువగాప్రార్థనలలో గడిపేవాడు.అధికసంఖ్యలో ప్రజలు తరలివస్తూ ఆయనను కలిసి తమ బాధలు చెప్పుకొనుటలోను ఆయన్ను అనుసరించి వెంబడించుటలోనూ ఆనందించేవారు. సువార్త పాదయాత్రలలో ఆయన వెంట నడుస్తూ ఆయన నోటిమాటలు వినడానికి సామాన్య భక్త జనసమూహం ఎగబడడం వింతేమీ కాదు. ఎందుకంటే ఆయన అసాధారణ బోధలు, కార్యాలు అలాంటివి మరి.జనసందోహం ఆయన్ను చుట్టుముడుతూ కమ్మేస్తూ ఒక్కచోట వేలాదిగా, పదివేలకొలదిగా సమకూడడం చూస్తే ఆ రోజుల్లో అదే గొప్ప సంచలనం! దీంతో రాజులు, అధికారులు వణికేవారు. సామాన్యులు, పామరులు, సుంకరులు, పాపులు తదితరులు ఎప్పుడూ ఆయన చుట్టూ చేరడంతో పాపుల స్నేహితుడు అనే ముద్ర ఆయనపై వేసారు పరిసయ్యులు, ప్రధాన యాజకులు.ఎన్ని వెలివేతలు, కఠిన అంక్షలు విధించినా ఆయన్ను వెంబడించే ఈ విశేష బహు జనవాళిని చూస్తుంటే రోజురోజుకు పరిసయ్యుల కంటగింపు తారాస్థాయికి చేరుతుండేది. యేసుతో జనం లేకుండా చేయాలని వారు రోజూ అదే పనిగా అనేకనేక కుట్రాలోచనలు చేస్తుండేవారు. అయితే యేసు చేత లాజరు మృతులలో నుండి లేపబడుట ద్వారా పరిసయ్యుల నోళ్ళన్నీ ఒక్కసారిగా మూతలు పడ్డాయి. జనాన్ని కట్టుదిట్టం చేయలేని నిస్సహాయ స్థితిలోకి వారు వెళ్లిపోయారు.‘ . . కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు – మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి. ఇదిగో లోకము ఆయనవెంట పోయినదని చెప్పుకొనిరి’ – యోహాను 12 : 9,18,19.మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట ఆ దేవునికి అనుకోని యేసు ఎన్నో ఘనకార్యాలు సాధించాడు. సమాధిలో ఉన్న లాజరును పిలుస్తూ యేసు మృతులలో నుండి అతన్ని లేపినప్పుడు కన్నులారా చూస్తూ ఆయనతో కూడా ఉన్న జనులు విస్తృతంగా ఈ సూచక క్రియను అంతటా ప్రచారం చేశారు. దీంతో యేసును పట్టుకొని చంపనాలోచించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు పరిసయ్యులు.దేవుని ప్రణాళిక నిర్ణయం మేరకు యేసు మరణం, అట్టి సమయం ఇంకా రాలేదు. యూదులకు అప్పగించుటకు వారు దుష్టులచేత సిలువ వేయించుటకు అనగా దేవుడు నిశ్చయించిన సంకల్పాన్ని ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని అనుసరించి యేసు మొదట యూదులకు అప్పగించబడాలి. ఇక యేసు యూదులలో బహిరంగంగా సంచరింపక అరణ్య సమీపంలోని ఎఫ్రాయిము అను ఊరిలో కొన్నాళ్ళు ఉన్నాడు. అటు తరువాత మరల యేసు పస్కా పండుగకు ఆరురోజులు ముందుగానే బేతనియ గ్రామానికి వచ్చి మరియ మార్తల ఇంట బస చేశాడు.యూదులలో ఉన్న సామాన్యజనులు యేసు అక్కడ ఉన్నాడని తెలిసికొని యేసును చూచుటకు మాత్రమే కాక, మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చారు. అందుచేత ఆయన ఆ మహాత్కారం చేసేనని జనులు విని ఆయనను ఎదుర్కొనవచ్చారు. ఈ జనసందడిని చూస్తూ, మన ప్రయత్నాలన్నీ వ్యర్థం. మన ఆలోచనలు వృథా. ‘ఇదిగో లోకము ఆయన వెంటపోయింది’ అనుకుంటూ ఇలా పరిసయ్యులు తమ ఓటమి ఒప్పుకుంటూ వాపోయారు. జగమెరిగిన యేసు పాదయాత్రలలో దీనుల పాలిట దేవుని ప్రేమ అపారంగా కుమ్మరించబడింది. యేసు ప్రేమకు ఆ ప్రభావానికి లోనయి దాసోహం అయిన జన జీవితాలు ఆ రోజున ఆయన అడుగులో అడుగేస్తూ పులకించిపోయాయి. – జేతమ్ -
తల్లి పాదాల చెంతనే స్వర్గం..
ఒకసారి ప్రవక్త ముహమ్మద్ (స) సమక్షంలోకి ఆయన అనుచరుడు ఒకరు వచ్చారు. ఎంతో ఆశగా, కాస్త గర్వంగా ప్రవక్తతో ఇలా అన్నాడు: ‘‘ప్రవక్తా! వృద్ధాప్య భారంతో నడవలేక మంచానికే పరిమితమైన మా అమ్మను నా భుజాలపై కూర్చోబెట్టుకుని హజ్ యాత్ర చేయించాను. ఇంత కష్టపడ్డాను కదా, ఇప్పుడు మా అమ్మ రుణం తీర్చుకున్నట్లేనా?’’దానికి ప్రవక్త (స) ఇచ్చిన సమాధానం అక్కడున్న వారందరినీ ఒక్కసారిగా నిశ్చేష్టులను చేసింది. ఆయన ఎంతో శాంతంగా, అంతే గంభీరంగా... ‘‘నువ్వు ఎంత చేసినా, మీ అమ్మ నిన్ను ప్రసవిస్తున్నప్పుడు ఆ వేదన భరించలేక పెట్టిన ఒక్క కేక రుణం కూడా తీరలేదు’’ అని చెప్పారు.అదీ తల్లి స్థానం! మనల్ని నడిపించడానికి తన నడుము వంచి, మనల్ని పెంచడానికి తన రక్తాన్ని పాలుగా మార్చి ఇచ్చిన మాతమూర్తి త్యాగానికి ఈ సృష్టిలో ఏదీ సాటిరాదు. ఏ భౌతిక సేవలు, ఏ సంపదలు ఆ రుణాన్ని పూర్తిగా తీర్చలేవు. పాలుపట్టిన తల్లికి... భుజంపై దుప్పటి పరిచిన ప్రవక్త! కన్నతల్లి ఎలాగూ ఆదరణీయురాలు, మరి పాలుపట్టి పెంచిన తల్లి స్థానమేమిటి? దానికి ప్రవక్త (స) తన జీవితం ద్వారానే ఒక అద్భుతమైన ఆదర్శాన్ని చూపారు.ఒకరోజు ముహమ్మద్ ప్రవక్త (స) తన సహచరులతో కలిసి ఏదో ముఖ్యమైన పనిలో నిమగ్నమై ఉన్నారు. అంతలో అటుగా ఒక సామాన్య వృద్ధురాలు వచ్చింది. ఆమెను చూడగానే ప్రవక్త (స) ఒక్క ఉదుటున లేచి నిలబడ్డారు. ఎంతో ఆ΄్యాయంగా ముందుకు వెళ్లారు. అంతటితో ఆగక, తన భుజంపై ఉన్న పవిత్రమైన దుప్పటిని తీసి నేలపై పరిచి, ఆమెను ఎంతో గౌరవంగా దానిపై కూర్చోబెట్టారు. వినయంతో, లాలిత్యంతో ఆమెతో మాట్లాడారు.ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన ఒక సహచరుడు... ‘ఈమె ఎవరు?‘ అని పక్కనున్న వారిని అడిగాడు. దానికి మరో సహచరుడు, ‘‘ఆమె ప్రవక్త (స)కు బాల్యంలో పాలుపట్టిన తల్లి దాయీ హలీమా’’ అని చెప్పారు. ప్రవక్త మాతృమూర్తి బాల్యంలోనే కన్నుమూయడంతో హలీమా ఆయన్ను సాకారు. కన్నతల్లి కాకపోయినా, కేవలం పాలుపట్టి పెంచినందుకే లోక గురువైన ప్రవక్త అంతగా తలవంచి గౌరవించడం... నేటి సమాజానికి ఒక కనువిప్పు.తల్లి గర్భంలో తొమ్మిది నెలలు మోసే భారం ఒకెత్తయితే, ప్రసవ సమయం చావు అంచుల్లోకి వెళ్లి వచ్చే పునర్జన్మ. ఆ తర్వాత రెండేళ్ల పాటు రక్తాన్ని పాలుగా మార్చి పట్టే అమృతం... ఈ ముప్ఫై నెలల త్యాగమే ప్రతి మనిషి ఉనికికి పునాది. అందుకోసమే ఖుర్ ఆన్ ఒక చక్కని ్రపార్థనను మానవాళికి నేర్పింది. తల్లిదండ్రులను గౌరవించుకుందాం... వారి పాదాల చెంతే స్వర్గాన్ని వెతుక్కుందాం. – ముహమ్మద్ ముజాహిద్ -
వారధి: అది ఒక సరస్సు.. ఆ సరస్సుకు రెండు వైపులా..
అది ఒక సరస్సు. ఆ సరస్సుకు రెండు వైపులా రెండు గ్రామాలు. ఆ సరస్సులో ఏడాది పొడవునా నీరు అతి వేగంగా పారుతుంటుంది. ఆ నీటి ప్రవాహవేగానికి ఎదురీది ముందుకు పోవడం అనేది చాలా కష్టం. అనా ఒకరిద్దరు ఆ నీటివేగం తమనేం చేస్తుందని చెప్పి సరస్సులో దిగి ప్రమాదంలో చిక్కుకుని బతుకుజీవుడా అంటూ అతి కష్టంమీద ఒడ్డుకు చేరుకున్నారు.ఈ విషయం తెలిసినప్పటి నుంచి రెండు గ్రామాల ప్రజలెవరూ ఎదురీతకు సాహసించలేదు. అంతేకాదు, ఎవరికి వారు తామున్న గ్రామంలోనే సురక్షితంగా ఉండడానికి నిశ్చయించుకుని అలాగే ఉంటూ వచ్చారు. ఇరు గ్రామాల ప్రజల మధ్య సంబంధాలూ ఉండేవి కావు. అలాగని శత్రుత్వమూ లేదు.ఒకరోజు, సరస్సుకు కుడివైపున ఉన్న పల్లెకు ఓ గురువు వచ్చారు. ఆయన సరస్సు ఒడ్డున నిల్చుని ఎడమవైపున ఉన్న పల్లె వంక చూశారు.‘‘నేను ఆ పల్లెకు వెళ్ళాలనుకుంటున్నాను’’ అని అన్నారా గురువు.ఇంతలో ఓ పెద్దమనిషి ‘‘అది కష్టమండి’’ అని జవాబిస్తూ ‘‘నీటి ప్రవాహవేగం సామాన్యమైనది కాదు. అసలీ సరస్సులో ఈదాలనుకోవడమే చాలా కష్టం’’ అని అన్నాడు. అలాగే మరో ఇద్దరు ముగ్గురు కూడా చెప్పారు. హెచ్చరిక చేశారు. అయినా ఆ గురువు వారి మాట పట్టించుకోలేదు.‘‘నీటి ప్రవాహవేగాన్ని ఓ కారణంగా చెప్పుకుని మీ రెండు గ్రామాల మధ్య సంబంధాలు పెట్టుకోకపోవడం సరికాదు. మీరందరూ కలిసి ఓ నిర్ణయానికి వచ్చి దీనిపై ఓ వారధి నిర్మించుకోవచ్చు కదా?’’ అని జెన్ గురువు ఓ సలహా ఇచ్చారు.అయితే ఈసారి మరో ఇద్దరు ఒక్కసారిగా గొంతు కలిపి ఇలా చెప్పారు ‘‘బలే వారు స్వామీ, ఈ సరస్సులో ఈదడమే కష్టమనుకుంటుంటే దాని మీద వంతెన కట్టడమా...అది అసాధ్యం’’ అని అన్నారు.అయినా జెన్ గురువు ఆగలేదు. ‘‘అది సాధ్యమే’’ అని అన్నారు.‘‘నేను మీకందుకు సాయం చేస్తాను’’ అని ఆ గురువు వారికి హామీ ఇచ్చారు.ఏదో మాట చెప్పానని ఊరుకోకుండా ఆ జెన్ గురువు పల్లెలోని వంద మంది యువకులను ఎంపిక చేసారు. వంతెన నిర్మాణానికి పూనుకున్నారు.రాత్రీ పగలూ, ఎండా వానా అనేవేవీ లెక్కచేయకుండా ఆ వంద మంది యువకులతోపాటు జెన్ గురువూ శ్రమించారు. అనుకున్నట్టే ఆ సరస్సుపై ఓ వారధి ఏర్పాటైంది. ఇప్పుడు ఆ రెండు గ్రామాల ప్రజల మధ్య సత్సంబంధాలు పెరిగాయి. రాకపోకలు పెరిగాయి. అంతేకాదు, ఒకరి మధ్య ఒకరు సహకరించుకోవడం మొదలుపెట్టారు. ఈ ఊరు అబ్బాయిని ఆ ఊరు అమ్మాయికి ఇచ్చి పెళ్ళి చేశారు. ఇరు గ్రామాల ప్రజలు సుఖసంతోషాలతో హాయిగా కాలం గడుపుతున్నారు.ఓ ఏడాది గడిచింది. ఓ రోజు ఇరు గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో ఊరు పొలిమేరలో ఉన్న ఆశ్రమానికి వెళ్ళి తమ ఆనందానికి కారణమైన గురువును కలిశారు. నమస్కరించారు. తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ‘‘మిమ్మల్ని సన్మానించాలనుకుంటున్నాం’’ అని ముక్తకంఠంతో చెప్పారు. కానీ గురువు తనకెలాంటి సన్మానమూ వద్దని సున్నితంగా తిరస్కరించారు.‘‘నాకు ఎలాంటి ఆడంబరాలూ వద్దు. పొగడ్తలూ వద్దు. ప్రచారమూ వద్దు. మీరందరూ ఇప్పటిలాగే ఎప్పుడూ కలసి మెలసి ఉంటే అదే నాకు ఆనందం’’ అని చెప్పారాయన. – జగద్రేణు -
‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నారు పెద్దలు..
‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నారు పెద్దలు.. భారతీయ సంప్రదాయంలో అతిధులకు అన్నం పెట్టడం పరిపాటి.. అన్నార్తుల ఆకలి తీర్చడం ఒక అనవాయితీ. అందుకే అన్ని దానాల్లో అన్నదానాన్ని గొప్పదానంగా పరిగణిస్తారు.వేమన శతకంలో..అన్నిదానములను నన్నదానమే గొప్పకన్నతల్లికంటే ఘనము లేదుఎన్న గురుని కన్న నెక్కుడు లేదయావిశ్వదాభిరామ వినుర వేమవేమన ఆటవెలదిలో వదిలిన పదాలు.. మాటలు కాదు, తూటాలు.. నేరుగా నిక్కచ్చిగా చె΄్తాడు.. మొదటి పంక్తి సారం...సత్కారభావనతో, ఆదరంగా మర్యాద గా ఇచ్చేది దానం. అశ్రద్ధతో ఇచ్చే దానం ‘అసత్త’ని చె΄్తారు.. దేశే, కాలే, పాత్రే అనేవి ఒక నియమం.. కాని మరో పద్యంలో‘అన్నదానమునకు నధిక సంపదగల్గిఅమరలోక పూజ్యుడుగును మీఱుఅన్నమగును బ్రహ్మమది కనలేరయావిశ్వదాభిరామ వినురవేమ’ అని అంటాడు వేమన.అన్నదానం అటుపక్క వ్యక్తికి ఆకలి తీర్చడమే కాదు, దాత దేవలోకంలో పూజింపబడుతాడు.. చూశారా పట్టెడు అన్నం ఇవ్వగానే పుట్టెడు పుణ్యం వస్తుందట..సుమతి శతకంలో..‘ఆకొన్న కూడే యమృతముతాకొంకక నిచ్చువాడే దాత ధరిత్రిన్’..ఆకలి తో ఉన్న వారికీ పెట్టే అన్నం అమృతం.. అలాంటప్పుడు పెట్టినవాడే దాత..అంతే కాదుట,‘పెట్టిన దినములలోపలన్ నడు అడవులకు ద్రవ్యాలన్ని వచ్చున్ ‘... దాతకు అడవిలో కూడా అన్నీ దొరుకుతాయి అని భావం.భర్తృహరి తన శతకంలో దానం గూర్చి చెప్తూ ధనంలో కొంత భాగం దానం చేయండి అని అంటారు..‘దానము భోగము నెఱుగని దీనుని ధనమునకు గతి తృతీయమే పొసగన్’ పరోక్షంగా దానం చేయమని సలహా.. మరో పద్యంలో కొంతమందిని ఉదాహరిస్తూ.. వీరు విశేషంగా ప్రకాశించుతారు.. ఈ జాబితాలో ‘ధనైకవి శ్రావన’ అంటే ధనాన్ని మిక్కిలి దానం చేయువాడు ఒకరు.‘దానముచేయునేరని యు, ధార్మికు సంపద యుండి యుండి యున్దానె పలాయనం బగుట తథ్యం’ అన్నారు భాస్కర శతకంలో... దానం ఇవ్వక పోతే సంపద పోతుందని...ధనం ఉంటే అన్న దానం చేయవచ్చు...ఇలా అన్ని శాస్త్రాల్లో, ఎన్నో శతకాల్లో అన్నదానం గూర్చి చె΄్పారు.. పుణ్యం మాట దేవుడెరుగు... సాటి మానవుడి ఆకలిని తీర్చే పరిస్థితి, గుణం, సంసిద్ధత ఉండాలి. అన్నమో రామచంద్ర అని వినగానే ఇదిగో వడ్డిస్తున్నాను రండి అనే సంస్కృతి మనది.. అన్నదానం అనగానే అన్నపూర్ణలాంటి డొక్కా సీతమ్మ గారు గుర్తు రాకమానదు. – డా. కందాళ సత్యనారాయణ మూర్తి -
శరీరం 10 శాతం కాలితే ఐసీయూ కాపాడలేదా?
న్యూఢిల్లీలోని మాలవీయ నగర్ హోటల్లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం దేశ రాజధానిని ఒక్కసారిగా కుదిపేసింది. ఈ ప్రమాదంలో 21 మంది సజీవ దహనమవ్వడం అత్యంత విషాదకరం. అయితే, ఈ దారుణ ఘటన భారతదేశ అత్యవసర వైద్య సేవల్లో, ముఖ్యంగా కాలిన గాయాల బాధితులకు అందించే చికిత్సా వసతులలో ఉన్న ఒక తీవ్రమైన లోపాన్ని మరోసారి బహిర్గతం చేసింది. బాధితులను కాపాడటంలో సాధారణ ఐసీయూల పరిమితులు ఏంటో ఈ ప్రమాదం కళ్లకు కట్టినట్లు చూపింది.10 శాతం మార్క్ కీలకంఒక వ్యక్తి శరీర ఉపరితల వైశాల్యం(టీబీఎస్ఏ)లో కేవలం 10 శాతానికి మించి కాలిన గాయాలైతే, ఆ బాధితుడి శరీరం స్పందించే తీరు పూర్తిగా మారిపోతుంది. సాధారణ గాయాల కంటే ఇవి అత్యంత సంక్లిష్టమైనవి కావడం వల్లే ఈ 10 శాతం మార్క్ అనేది వైద్యంలో అత్యంత కీలకమైనదిగా మారుతుంది. మన చర్మం అనేది శరీరానికి ఒక రక్షణ కవచం లాంటిది. అది 10 శాతం కంటే ఎక్కువ దెబ్బతిన్నప్పుడు, శరీరం నుండి ద్రవాలు వేగంగా ఆవిరైపోతాయి. దీనివల్ల రక్తపోటు పడిపోవడం, తీవ్రమైన ఇన్ఫెక్షన్లు సోకడం, చివరికి శరీరంలోని కీలక అవయవాలు పని చేయడం మానేసే ప్రమాదం పొంచి ఉంటుంది.సాధారణ ఐసీయూలలో..సాధారణ ఐసీయూలను గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, శ్వాసకోస సమస్యలు లేదా ఇతర తీవ్రమైన ఇన్ఫెక్షన్ల నిర్వహణ కోసం రూపొందిస్తారు. కానీ 10 శాతానికి పైగా తీవ్రంగా కాలిన రోగులకు కావలసిన ప్రత్యేక సదుపాయాలు అక్కడ ఉండవు. కాలిన గాయాల బాధితులకు నిరంతరం గాయాలను శుభ్రం చేయడం, శరీర ద్రవాలను భర్తీ చేయడం, ప్రత్యేక పోషకాహారం అందించడం, కొన్ని వారాల పాటు వరుస సర్జరీలు చేయడం అవసరమవుతుంది. ఈ బహుళ అవసరాలకు సరిపోయే సదుపాయాలు సాధారణ ఐసీయూలలో అందుబాటులో ఉండవు. అందుకే ఇవి తీవ్రమైన బర్న్ కేసులకు సరిపోవు.ప్రత్యేక బర్న్ ఐసీయూలలో..కాలిన గాయాల బాధితులకు అతిపెద్ద శత్రువు ఇన్ఫెక్షన్. చర్మం దెబ్బతినడం వల్ల బ్యాక్టీరియా సులభంగా రక్తంలోకి ప్రవేశించి ‘సెప్సిస్’ అనే ప్రాణాంతక పరిస్థితికి దారితీస్తుంది. అందుకే ప్రత్యేక బర్న్ ఐసీయూలను (Burn ICUs) ప్రత్యేకమైన ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యలతో, ఐసోలేషన్ సదుపాయాలతో నిర్మిస్తారు. అక్కడి సిబ్బందికి బర్న్ మేనేజ్మెంట్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. సాధారణ వార్డులలో లేదా ఐసీయూలలో ఉండే గాలి ద్వారా కూడా ఈ రోగులకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది.పొగను పీల్చడం వల్లే..మాలవీయ నగర్ ప్రమాదంలో మెజారిటీ బాధితులు మంటల కంటే ముందుగా దట్టమైన విషపూరిత పొగను పీల్చడం వల్లే మరణించారని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. అగ్నిప్రమాదాల్లో పొగ అనేది ఒక అదృశ్య హంతకి. విషవాయువులు, వేడి గాలి ఊపిరితిత్తులను, శ్వాసనాళాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. అందుకే పైకి తక్కువ గాయాలు కనిపించినప్పటికీ, విషపూరితమైన పొగ పీల్చడం వల్ల తలెత్తే సమస్యలకు ప్రత్యేక విభాగాల్లోనే చికిత్స అందించాల్సి ఉంటుంది.బర్న్ కేర్ మౌలిక వసతుల లేమి..ప్రస్తుతం భారతదేశం బర్న్ కేర్ మౌలిక వసతుల కొరతను ఎదుర్కొంటోంది. దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 10 లక్షల మందికి పైగా జనం కాలిన గాయాల బారిన పడుతుండగా, సుమారు 1,40,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంత భారీ సంఖ్యలో బాధితులు ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా కేవలం 67 నమోదిత బర్న్ సెంటర్లు మాత్రమే ఉన్నాయి. వీటిలో ప్రత్యేక బెడ్ల సంఖ్య కేవలం 1,330 మాత్రమే కాగా, బర్న్ ఐసీయూ బెడ్లు 300 కంటే తక్కువగా ఉన్నాయి. మాలవీయ నగర్ లాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు మాత్రమే మన దేశంలో ఉన్న ఈ మౌలిక వసతుల కొరత తీవ్రత వార్తల్లో కనిపిస్తుంటుంది.ఇది కూడా చదవండి: ‘చికెన్స్ నెక్’పై భారత్ పట్టు.. చైనా, ‘బంగ్లా’ కుట్రలకు చెక్! -
12 రోజుల పుష్కర విధులు– ఏ రోజు ఏ దానం చేయాలి?
సూర్యపుత్రిగా... యమధర్మరాజు సోదరిగా... శ్రీకృష్ణుని లీలా స్మృతిగా పూజలందుకునే యమునా నదికి అత్యంత విశిష్టమైన పుష్కరాలు మంగళవారం నాడు ఆరంభమయ్యాయి. ద్వాపరయుగంలో శ్రీ కృష్ణుడు కాళీయమర్దనం చేసిన పవిత్ర నది కావడం వల్ల ఈ ఉత్సవాలకు భక్తిరసప్రాధాన్యత ఎంతో ఉంది. ఉత్తరాఖండ్లోని యమునోత్రి నుండి మొదలై మథుర (విశ్రామ్ ఘాట్), బృందావనం (కేశిఘాట్), ఆగ్రా మీదుగా ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమం వరకు గల వివిధ ఘాట్లలో భక్తులు నదీ పూజలు, మహా హారతులు నిర్వహిస్తూ భక్తి సాగరంలో మునిగితేలుతారు.యమునా నదిప్రాశస్త్యాన్ని, వైభవాన్ని స్తుతిస్తూ మన పురాణాలలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. కలిందనందిని దేవి యమరాజసహోదరి పాపం హర మే దేవి యమునే త్వాం నమామ్యహమ్ కలింద పర్వతంపై జన్మించిన ఓ యమునా దేవి! యమధర్మరాజు సోదరివైన నిన్ను నేను నమస్కరిస్తున్నాను, నా పాపాలన్నింటినీ హరించి నాకు పుణ్యగతిని ప్రసాదించు అని ఈ శ్లోకం అంతరార్థం.గురు భగవానుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించిన శుభ ముహూర్తాన యమునా నదికి పుష్కరాలుప్రారంభమవుతాయి. మొదటి 12 రోజులు (ఆది పుష్కరాలు): జూన్ 2 నుండి జూన్ 13 వరకు పుష్కరుడు యమునా నదిలోనే నివాసం ఉంటాడు. ఈ సమయంలో నదిలోని ప్రతి నీటి బొట్టు అత్యంత శక్తిమంతంగా, పవిత్రంగా మారుతుందని నమ్ముతారు.కృష్ణప్రియయమునా నది కేవలం ఒక జలవనరు మాత్రమే కాదు, ఆమె ఒక దైవిక శక్తి. పురాణాల ప్రకారం ఈ నదికి మూడు ముఖ్యమైన కోణాలు ఉన్నాయి: సూర్య పుత్రి (సూర్యుని కుమార్తె): సూర్యుని తేజస్సును కలిగి ఉండటం వల్ల, ఈ నదిలో స్నానం చేయడం వల్ల శరీరంలోని జడత్వం, అనారోగ్యాలు తొలగి΄ోయి తేజస్సు పెరుగుతుంది.మృత్యుదేవత అయిన యముడు తన సోదరి అయిన యమునా నదికి ఇచ్చిన వరం మేరకు ఎవరైతే యమునా నదిలో భక్తితో స్నానం చేస్తారో, వారికి అకాల మృత్యు భయం ఉండవు, వారు నరక బాధల నుండి విముక్తులవుతారు. అదేవిధంగా ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడు తన బాల్యాన్ని యమునా నదీ తీరంలోనే గడిపాడు. కాళీయమర్దనం, గోపికల వస్త్రాపహరణం, రాసలీలలు అన్నీ ఈ నది సాక్షిగానే జరిగాయి. అందువల్ల యమునా స్నానం భక్తి యోగాన్ని ఇస్తుంది.12 రోజుల పుష్కర విధులు– ఏ రోజు ఏ దానం చేయాలి?పుష్కరాల సమయంలో స్నానంతో పాటు ‘దానం’ చేయడం అత్యంత ముఖ్యం. ఏ రోజు ఏ దానం చేయాలో శాస్త్రం ఇలా నిర్దేశించింది:1వ రోజు: భూదానం, హిరణ్య (బంగారు) దానం, ధాన్యదానం2వ రోజు: వస్త్ర దానం, రత్న దానం.3వ రోజు: అశ్వ (గుర్రం లేదా వాహన) దానం, పండ్ల దానం4వ రోజు: నెయ్యి, నూనె, పాలు మరియు తేనె దానం.5వ రోజు: ఎద్దు దానం, ధాన్యాలు, నాగలి దానం (వ్యవసాయ వస్తువులు).6వ రోజు: ఔషధాలు, కర్పూరం, చందనం, సుగంధ ద్రవ్యాల దానం.7వ రోజు: గృహోపకరణాలు, మంచం, పరుపు దానం.8వ రోజు: కట్టెలు (సమిధలు), మూలికల దానం9వ రోజు: పిండప్రదానం, దాస–దాసీ దానం (సేవకులకు సహాయం).10వ రోజు: కూరగాయలు, ఆకుకూరలు, సాలగ్రామ దానం.11వ రోజు: పుస్తకాలు, చదువుకు సంబంధించిన వస్తువుల దానం.12వ రోజు: వెండి వస్తువులు, ఛత్రం (గొడుగు) పాదరక్షల దానం.ఎలా వెళ్లాలంటే..?తెలుగు రాష్ట్రాల నుండి వెళ్లే భక్తులు సాధారణంగా 2 రకాల రూట్లను ఎంచుకుంటారు: రూట్ 1 (రైలు మార్గం – మథుర/బృందావనం): సికింద్రాబాద్ లేదా విజయవాడ నుండి దిల్లీ వెళ్లే ఏ రైలైనా (ఉదాహరణకు: ఏపీ ఎక్స్ప్రెస్, తెలంగాణ ఎక్స్ప్రెస్, రాజధాని) మథుర జంక్షన్ మీదుగా వెళ్తుంది. హైదరాబాద్ నుండి మథురకు దాదాపు 22 నుండి 24 గంటల సమయం పడుతుంది.విమాన మార్గం: హైదరాబాద్ నుండి దిల్లీకి విమానంలో వెళ్లి, అక్కడ నుండి క్యాబ్ లేదా యమునా ఎక్స్ప్రెస్వే ద్వారా 3 గంటల్లో మథురకు చేరుకోవచ్చు.ప్రధాన ఘాట్ల భౌగోళిక, ఆధ్యాత్మిక విశేషాలుయమునాపుష్కర స్నాన యాత్ర ప్రణాళిక వేసుకునేటప్పుడు ఈ కింది ఘాట్ల ప్రత్యేకతలను గుర్తుంచుకోవాలి.మథుర – విశ్రామ్ ఘాట్: కంసుడిని వధించిన తర్వాత శ్రీకృష్ణుడు ఇక్కడే విశ్రాంతి తీసుకున్నాడని ప్రతీతి. పుష్కరాల సమయంలో ఇక్కడ సాయంత్రం జరిగే యమునా హారతి అత్యంత నయనానందకరంగా ఉంటుంది.బృందావనం – కేశి ఘాట్: కేశి అనే రాక్షసుడిని శ్రీకృష్ణుడు సంహరించిన ప్రదేశం. ఇక్కడ స్నానం చేయడం వల్ల భయాలు తొలగి΄ోతాయి.ప్రయాగ్రాజ్ – త్రివేణి సంగమం: ఇక్కడ యమునా నది ముదురు నీలం (శ్యామల) రంగులో, గంగానది తెల్లటి రంగులో కలిసి΄ోవడం స్పష్టంగా కనిపిస్తుంది. యమునా పుష్కరాల వేళ ఈ సంగమ స్నానానికి కోటి రెట్లు ఫలితం ఉంటుంది.యమునోత్రి (కఠినమైన యాత్ర): ఇది హిమాలయాలలో 3,293 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ ‘సూర్య కుండ్’ అనే వేడి నీటి బుగ్గ ఉంటుంది. ఇక్కడికి వెళ్లడం శారీరకంగా కష్టంతో కూడుకున్నది కాబట్టి వృద్ధులు మథుర లేదా ప్రయాగ్రాజ్లను ఎంచుకోవడం మంచిది. – డి.వి.ఆర్. -
ఎబోలా వైరస్ అవగాహన చాలు ఆందోళన వద్దు
ఇటీవల ప్రపంచాన్ని భయపెడుతున్న వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఎబోలా వైరస్ కూడా ఒకటి. ఈ వ్యాధిగ్రస్తుల్లో మరణాల రేటు 25% నుంచి 90% వరకు ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా ఇది బెంబేలెత్తిస్తోంది. అదే ఇటీవల ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేసిన కరోనా వైరస్ (కోవిడ్)లో మరణాల రేటు కేవలం 0.5% నుంచి 2% మాత్రమే. అయితే కోవిడ్లో మరణాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ప్రబలడంతో దాని మృతుల సంఖ్య ప్రపంచాన్ని నివ్వెరపరచింది. అలా కాకుండా ఎబోలా వైరస్ మాత్రం ఇప్పటికీ కేవలం ఆఫ్రికాలోని సబ్–సహారా దేశాల్లోనే వ్యాప్తిలో ఉంది. అయితే ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. ఇటు తెలంగాణలో హైదరాబాద్తో పాటు అటు ఆంధ్రప్రదేశ్లోకి... చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశవిదేశాల ప్రయాణికులు వస్తున్న నేపథ్యంలో ఎబోలాపై ఆందోళన ముప్పిరిగొంటోంది. ఈ నేపథ్యంలో ‘ఎబోలా వైరస్ డిసీజ్’పై ప్రాథమిక అవగాహన కోసం ఈ కథనం.ఇటీవలే ఎబోలా వైరస్ పీడిత దేశాల నుంచి 28 మంది ప్రయాణికులు దేశంలోకి వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. దాంతో ఒక్కసారిగా అప్రమత్తమైన ఆరోగ్య యంత్రాంగం విమానాశ్రయంలో ప్రయాణికులను పరీక్షించడమే కాకుండా... ఒకవేళ వారు ఎబోలా విస్తరిస్తున్న ప్రాంతాల నుంచి వచ్చినట్టు గుర్తిస్తే... వెంటనే వారిని 21 రోజుల పాటు ఐసోలేషన్లో ఉంచి పరిశీలించడానికి పూనుకుంటున్నారు. ఇది మినహా ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎబోలా తాలూకు ఎలాంటి కేసులూ లేవు. కాబట్టి దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు, అవగాహన పెంచుకోవడం అవసరమని గుర్తిస్తే చాలు. ఈ నేపథ్యంలో ఎబోలా అంటే ఏమిటి, అదెలా వ్యాపిస్తుంది, లక్షణాలేమిటి వంటి అంశాలను సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఏమిటీ ఎబోలా? ఎబోలా వైరల్ డిసీజ్ను మునుపు ‘ఎబోలా హీమరేజిక్ ఫీవర్’ అని పిలిచేవారు. ఒకరకంగా చూస్తే 25% నుంచి 90% ఫెటాలిటీ రేటుతో ఇది చాలాసార్లు ప్రాణాంతకంగా పరిణమించేదే. ఇందులో చాలా రకాల వైరల్ ప్రజాతులున్నాయి. ఇవి ఫైలోవిరిడే అనే కుటుంబానికి చెందిన వైరస్లు. ఈ రకం వైరస్లు ‘వైరల్ హీమరేజిక్ ఫీవర్’ అనే జ్వరాలకు కారణమవుతాయి. ఆ జ్వరాల్లో కలిగే తీవ్రమైన బాహ్య, అంతర్గత రక్తస్రావం వల్ల పరిస్థితి తీవ్రమవుతుంది. ఈ వైరస్ మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపై దాడి చేసి అవయవాల పనితీరును దెబ్బతీస్తుంది. వ్యాధి తీవ్రమైనప్పుడు బాహ్య, అంతర్గత రక్తస్రావం, వ్యవస్థల వైఫల్యం (మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్)తో మరణం సంభవిస్తుంది. ప్రభుత్వాల ఆరోగ్య సంస్థల హెచ్చరికలు... ఎబోలా వైరస్ ఒక వ్యక్తి నుంచి మరొకరికి నేరుగా శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. భారతదేశంలో ఇప్పటివరకూ ఎబోలా వైరస్కు సంబంధించి ఎలాంటి కేసులూ నమోదు కాలేదు. అయితే మన హైదరాబాద్, పొరుగున ఉన్న చెన్నై వంటి అంతర్జాతీయ విమానాశ్రయాలున్న నగరాలకు ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి రాకపోకలు కొనసాగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. అందుకే కేంద్ర ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు, ఐసీఎమ్ఆర్ సంస్థలు... ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం కొన్ని మార్గదర్శకాలు ఏర్పరచి ఆ మేరకు వాటిని అమలు చేస్తున్నాయి. ఎబోలా వైరస్ రకాలు... ఎబోలా వైరస్కు చెందిన ఆరు రకాల ప్రజాతులను గుర్తించారు.వ్యాప్తి ఇలా... ఎబోలా వైరస్... కరోనా వైరస్లా గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. ఇది... బాధితుల రక్తంతో గానీ లేదా వారి శరీరద్రవాలను తాకడం వల్ల, వారికోసం ఉపయోగించిన (ఇన్ఫెక్టెడ్) వైద్యపరికరాలను తాకడం వల్ల, బాధితులతో లైంగికంగా కలవడం వల్ల వ్యాప్తి చెందే అవకాశాలుంటాయి. ఇలా వ్యాప్తి చెందదు... బాధితుల పక్కనే కూర్చోవడం ∙వారు వదిలిన గాలిని పీల్చడం ∙వారితో కలిసి తినడం ∙దోమ కాటు వల్ల వ్యాప్తి చెందదు. బాధితుల ఫ్లుయిడ్స్తో కాంటాక్ట్లోకి రావడం మినహా మరే రకంగానూ ఇది వ్యాప్తి చెందే అవకాశం లేదు కాబట్టి దీని గురించి ఆందోళన పడనక్కర లేదు. నిర్ధారణ పరీక్షలు... ఎబోలా వ్యాధి తాలూకు మొదటి లక్షణాలు మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటి వ్యాధి లక్షణాలతో పోలి ఉండటం వల్ల వెంటనే దీని నిర్ధారణ ఒకింత కష్టం. అయితే రెండో, మూడో దశల్లోని లక్షణాలతో పోల్చుకుని చూసుకోవడం వల్ల నిర్ధారణ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి నిర్ధారణ కోసం వైద్యులకు పనికి వచ్చే అంశాలేమిటంటే... ∙గత 21 రోజుల వ్యవధిలో వ్యాప్తి చెందుతున్న ఆఫ్రికా దేశాల్లో ప్రయాణం చేసి ఉండటం, ఎబోలా వ్యాధి సోకినవారి అంత్యక్రియలకు హాజరు కావడం, వృత్తి సంబంధంగా ఏవైనా ప్రయోగశాలల సందర్శనతో పాటు... ∙ఆర్టీపీసీఆర్ పరీక్ష ∙ఎలీజా పరీక్ష ∙వైరస్ కల్చర్ వంటి పరీక్షతో. ఇది వైరల్ జ్వరం కావడం వల్ల ప్రస్తుతానికి మందులేం అందుబాటులో లేవు. అయితే 2019లో ఆర్ వీఎస్వీ జెబోవ్ అనే వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే ఇన్బాజెబ్, ఎబాంగా వంటి మందులతోనూ... అలాగే దేహం డీహైడ్రేట్ కాకుండా తగినన్ని ద్రవాలను ఇవ్వడం, సెలైన్ పెట్టడం, రక్తపోటు అదుపులో ఉండేలా చూడటం, అవసరమైతే ఆక్సిజన్ పెట్టడం, మంచి పోషకాహారాన్ని అందించడం. ఈ చికిత్సలతోపాటు వ్యాధి నిరోధకత తగ్గడం వల్ల వచ్చే బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స అందించడం ద్వారా దీనివల్ల కలిగే అనర్థాలను తగ్గించడానికి తగిన చికిత్సలు అందిస్తూ బాధితులను కాపాడేందుకు చాలావరకు అవకాశాలున్నాయి. చివరిగా... 38 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా 100 ఫారెన్హీట్ కంటే ఎక్కువగా జ్వరం ఉండటంతోపాటు తలనొప్పి, వాంతులు లేదా విరేచనాలు, కళ్ల నుంచి పంటి చిగుర్ల నుంచి రక్తస్రావం, తీవ్రమైన నీరసం, నిస్సత్తువ, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణం వైద్యులను సంప్రదించాలి. అయితే ఇప్పటివరకూ ఎబోలాకు సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కానందున... ఈ ప్రాథమిక అవగాహనను పెంచుకోవడం మినహా ప్రస్తుతానికి దీని గురించి ఆందోళన అక్కర్లేదు. లక్షణాలు... ఎబోలా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తరువాత 2నుంచి 21 రోజుల మధ్య లక్షణాలు కనిపించవచ్చు. లక్షణాలను ఎంత త్వరగా గుర్తిస్తే బాధితులను కాపాడుకోవడానికి అంతగా అవకాశముంటుంది. మొదటిది ప్రారంభ దశ... ఇందులో... ∙ఒక్కసారిగా తీవ్రమైన జ్వరం (హై ఫీవర్) ∙తీవ్రమైన అలసట (ఫెటీగ్) ∙తీవ్రమైన తలనొప్పి (సివియర్ హెడేక్) ∙కండరాల నొప్పులు (మజిల్ పెయిన్స్) ∙తీవ్రమైన గొంతు నొప్పి రెండో దశను మధ్యంతర దశగా చెప్పవచ్చు. ఇందులో... ∙వాంతులు ∙చాలా ఎక్కువగా విరేచనాలు కావడం ∙కడుపునొప్పి ∙కళ్లుఎర్రబడటం ∙చర్మంపై దద్దుర్లు ∙ఎక్కిళ్లు ∙ఛాతినొప్పిమూడో దశలో లక్షణాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో... ∙కళ్లు, ముక్కు చెవుల నుంచీ, దంతాల నుంచి రక్తస్రావం ∙కాలేయం, మూత్రపిండాల వైఫల్యం ∙తీవ్రమైన షాక్ ∙అయోమయం, ఫిట్స్ ∙తీవ్రమైన డీహైడ్రేషన్- డాక్టర్ బి. వెంకట్ నాని కుమార్సీనియర్ కన్సల్టెంట్ఇంటర్నల్ మెడిసిన్ – యాసీన్ -
నీటితో ఇంటిపంట
అన్నం పెట్టే నేల... అన్నం పెట్టే పంట అన్నం పండించే చేయి... అన్నపూర్ణలు. ఆహారం విషతుల్యం అవుతున్న ఈ రోజుల్లో తనే ఒక అన్నపూర్ణగా ఎందుకు కాకూడదు అనుకుందో అమ్మాయి. ‘హైడ్రోపోనిక్ రైతు’గా మారి బాల్కనీలోనే తన ఆహారం తానే పండించుకుంటోంది. కోల్కతా అమ్మాయి వంశికా ఝావర్ మార్గంలో నడిస్తే మరెందరో అన్నపూర్ణలవుతారు.‘కళింగ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ’ లో ఇంజినీరింగ్ చదువుకుంటున్న 22 ఏళ్ల వంశికా ఝావర్కు ఆరోగ్యం బాగుండటం లేదు. డాక్టర్ దగ్గరకు వెళితే ‘పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్’ అన్నారు. ఆ తర్వాత పరీక్షలు చేసి ‘పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఒవేరియన్ సిండ్రోమ్’ అని పిలిచే పీఓఎంఎస్గా నిర్ధారణ చేశారు.‘ఇప్పుడు నేనేం చేయాలి’ అని అడిగింది వంశిక.‘నువ్వు తినే తిండిలోనే విషం ఉంది. నీ జీవనశైలి మార్చుకో. హై్రపోటీన్, లోకార్బ్ ఆహారం తీసుకో, ప్రాసెస్ చేసిన షుగర్ వద్దు’ ఇలా సూచనలు చేశాడు డాక్టర్. అప్పటికే వంశిక మందులతో విసిగిపోయింది. ఆరోగ్యంగా బతకాలంటే ఏం చేయాలి అనుకుంది.సాగిన శోధనమనం తింటున్న ‘ఫ్రెష్’ కూరగాయలు నిజంగా ఫ్రెష్షేనా అని డౌట్ వచ్చింది వంశికాకు. పరిశీలిస్తే అవి గ్రోత్ హార్మోన్లు, పురుగు మందులు, ఎరువులతో నిండి ఉన్నాయని అర్థమైంది. ‘మనకు తాజా కూరగాయలు దొరకడం పెద్ద సవాలు. అందుకే మనమే రసాయనం లేకుండా తిండి పండించుకోవాలి అనిపించింది. అలా హైడ్రోపోనిక్ వ్యవసాయం వైపు అడుగేశా’ అని ఆమె చెబుతోంది వంశిక. ‘హైడ్రోపోనిక్స్’ అంటే మట్టి లేకుండా, నీటిలో పోషకాలు కలిపి మొక్కలు పెంచే పద్ధతి. స్థలం సమస్య, నీటి కొరత సమస్య, వాతావరణం అనిశ్చితి... ఈ మూడు పెద్ద సమస్యలకు ఇది ఒక్కటే సమాధానం అని వంశిక నమ్మింది. నగరాల్లో, మారుమూల ప్రాంతాల్లో కూడా ఏడాది పొడవునా తిండి పండించేలా తక్కువ ఖర్చుతో కూడిన మైక్రో–ఫామ్ను డిజైన్ చేసింది. ఒక రకంగా ఇది ప్రాజెక్ట్ కాదు, తన ఆరోగ్యం కోసం తను మొదలుపెట్టిన పోరాటం.అదిగో అన్నపూర్ణవంశిక తన ఇంటి బాల్కనీనే పొలం చేసింది. పేరు ‘అన్నపూర్ణ’ అని పెట్టింది. పెట్టుబడి సున్నా. సాధనాలుగా కన్ స్ట్రక్షన్ సైట్లో పారేసిన పైపులు వాడింది. హైడ్రోపోనిక్స్ పద్ధతిలో వ్యవసాయం మొదలుపెట్టింది. కొంచెం డబ్బు హైడ్రోపోనిక్ సొల్యూషన్స్, విత్తనాల కోసం మాత్రమే ఖర్చు చేసింది. ‘నా మొదటి పెట్టుబడి దాదాపు జీరో’ అంటుంది వంశిక.అందరూ అందుకోవాల్సిన హైడ్రోపోనిక్స్భారతదేశంలో హైడ్రోపోనిక్స్ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నా, నెమ్మదిగా ప్రజాదరణ పొందుతోంది. సంప్రదాయ వ్యవసాయంతో పోలిస్తే ఈ పద్ధతిలో 95 శాతం నీరు ఆదా అవుతుంది. 30 శాతం అధిక దిగుబడి వస్తుంది. నేల అవసరం లేదు కాబట్టి పురుగుమందుల వాడకం తగ్గుతుంది. నగరాల్లోని బాల్కనీలో, ఇంటి పైకప్పు మీద కూడా కూరగాయలు పండించుకోవచ్చు. ఆరోగ్య సమస్యతో బాధపడే లక్షలాది మంది మహిళలకు, కల్తీ ఆహారానికి భయపడే ప్రతి కుటుంబానికి ఇది ఒక భరోసా. జీవనశైలి జబ్బులకు మాత్రల కంటే ప్లేట్లో ఉండే తిండే పెద్ద మందు. ఆ తిండిని స్వచ్ఛంగా, మన చేత్తో పండించుకునే మార్గాన్ని వంశిక చూపిస్తోంది. కోల్కతాలోని చిన్న బాల్కనీలో మొదలైన ‘అన్నపూర్ణ’ రేపు దేశంలోని ప్రతి ఇంట్లో ప్రతిధ్వనిస్తే, అదే అసలైన వ్యవసాయ విప్లవం. ∙మొదట ఆకుకూరలువంశిక మొదట ఆకుకూరలతో మొదలుపెట్టింది. ఎందుకంటే అవి తేలికగా పెరుగుతాయి. రెండు నుంచి మూడు వారాల్లో కోతకు వస్తాయి. తన మొదటి పంటను ల్యాబ్లో పరీక్ష చేయించింది. ఫలితాలు అద్భుతం. సంప్రదాయ వ్యవసాయంలో పండిన వాటి కంటే హైడ్రోపోనిక్ పంటలో పోషకాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనలు కూడా చెబుతున్నాయని ఆమె గర్వంగా చెబుతోంది. తన ప్రయోగం సక్సెస్ అయ్యాక ఆమె ఆలోచనలు కుంకుమ పువ్వు వైపు మళ్లాయి. ఖరీదైన పంట అయిన శాఫ్రాన్ ను కూడా హైడ్రోపోనిక్స్లో పండించవచ్చనీ, అది తన తదుపరి లక్ష్యం అనీ చెబుతోంది. -
కత్రినా కైఫ్ పొడవాటి ఒత్తైన జుట్టు రహస్యం...!
బాలీవుడ్ నటి, కత్రినా కైఫ్ ఇటీవల తన పొడవైన, ఒత్తైన మెరిసే జుట్టుకి సంబంధించిన ఫోటోలను నెట్టింట షేర్ చేశారు. నటుడు విక్కీ కౌశల్ పుట్టిన రోజు వేడుకుల నిమిత్తం వెళ్లిన టూర్ ఫోటోలు. అందులో కొన్ని అందమైన కుటుంబ క్షణాల తోపాటు ఆమె ఆకర్షణీయమైన కురుల ఫోటోలు అందర్నీ మత్రముగ్ధుల్ని చేశాయి. కానీ ఆమె అభిమానుల్లో ఒకటే చర్చ మొదలైంది కత్రినాకు ఇంత ఒత్తైన మెరిసే జుట్టు ఉందా అని. ఈ కురులు ఎంత ఆకర్షణగా నిలిచాయంటే మా హెయిర్ కూడా ఇలా ఉండాలంటే ఏం చేయాలో చెప్పరు అంటూ పోస్టులు వెల్లువెత్తేలా చర్చనీయాంశమైంది. అయితే తన పొడవైన జుట్టు రహస్యం ఖరీదైన సెలూన్ ట్రీట్మెంట్ లేదా విలాసవంతమైన హెయిర్ ప్రొడక్ట్ కాదని, తన అత్తగారు వీణా కౌశల్ ఇంట్లో తయారు చేసిన హెయిర్ ఆయిల్ అని కత్రినానే స్వయంగా వెల్లడించారు. మరి ఆ ఆయిల్ ఏంటో దాని వివరాలు గురించి తెలుసుకుందామా..!.తన అత్తగారు ఉల్లిపాయ, ఉసిరి, అకవాడోతోపాటు మరికొన్ని పోషకపదార్థాలతో నూనెను తయారు చేస్తారని అన్నారు. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసే ముందుకు చాలా గంటలపాటు మరిగిస్తారని అన్నారు. తాను వాడుతున్న నూనె అత్యద్భుతమైనదని అన్నారు. ఫ్యానీ ఫ్యాషన్ కంటే స్థిరమైన దినచర్యే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందని అంటున్నారామె.కత్రినా ఇంట్లో తయారుచేసిన హెయిర్ ఆయిల్ ప్రయోజనాలు ఇవే..ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జుట్టును బలోపేతం చేయడానికి, తల చర్మ ఆరోగ్యాన్ని కాపాడటానికి సాంప్రదాయ కేశ సంరక్షణ పద్ధతిగా చెప్పొచ్చు. ఉల్లిపాయ రసం జుట్టు చిన్న వయసులోనే నెరసిపోవడాన్ని తగ్గించి, చుండ్రును నివారిస్తుందిమరోవైపు, అవకాడోలో ఉండే సహజ నూనెలు, పాలీఅన్శాచురేటెడ్, మోనోఅన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లతో సహా ఆరోగ్యకరమైన కొవ్వుల కారణంగా, ఇది జుట్టుకు లోతైన పోషణను అందించి, తేమను చేకూరుస్తుంది.ఈ పోషకాలు అన్ని రకాల జుట్టుకు మేలు చేసినప్పటికీ, ముఖ్యంగా పొడిబారిన, నిర్జలీకరణానికి గురైన జుట్టుకు ఇవి ఎంతగానో సహాయపడతాయి. ఇవి జుట్టు మృదుత్వాన్ని, దువ్వుకునే గుణాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) (చదవండి: చిన్న దుకాణం నుంచి..ఏకంగా రూ. 900 కోట్ల ఆతిథ్య సామ్రాజ్యం..!) -
చిన్న దుకాణం నుంచి..ఏకంగా రూ. 900 కోట్ల ఆతిథ్య సామ్రాజ్యం..!
చిన్నపాటి స్టోర్ మాదిరి రెస్టారెంట్ నుంచి ఏకంగా లగ్జరీ రెస్టారెంట్ల రేంజ్కి చేరుకోవడం అంత ఈజీకాదు. పైగా ఆతిథ్య రంగంలో తనకంటూ గర్తింపు తెచ్చుకుని ప్రసిద్ధ బాండ్ రెస్టారెంట్లతో కోట్లలలో ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి చేరుకున్నాడు. అతడు ఈ సక్సెస్ని ఎలా అందుకున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఒక పారిశ్రామికవేత్తకు ఉండాల్సిన ముఖ్య లక్షణమేంటో తప్పక తెలుస్తుందని అంటున్నారు వ్యాపార నిపుణులు. అతడే ఇంప్రెసారియో ఎంటర్టైన్మెంట్ అండ్ హాస్పిటాలిటీ సంస్థకు వ్యవస్థాపకుడు రియాజ్ ఆమ్లానీ. అతడు చిన్నగా మొదలు పెట్టిన రెస్టారెంట్ వ్యాపారం అనతికాలంలోనే సోషల్, స్మోక్ హౌస్ డెలి, పృథ్వీ కేఫ్, స్లింక్ అండ్ బార్డోట్ వంటి అనేక ప్రసిద్ధ బ్రాండ్ల రెస్టారెంట్లు రన్ చేసే రేంజ్కిచేరుకున్నాడు. అంతేగాదు భారతదేశ ఆహార, పానీయాల పరిశ్రమలో తన పేరుని నిలిచేలా చేసుకున్నాడు. తన బ్రాండ్ల వెనుకు ఉన్న తన ఫుడ్ బేవరేజ్ సంస్థ ఇంప్రెసారియో ఎంటర్టైన్మెంట్ అండ్ హాస్పిటాలిటీ సంస్థ సీఈవో రియాజ్ ఎలాంటి సక్సెస్ సూత్ర పాటించి ఈ రేంజ్కి వచ్చాడంటే..ప్రజల ఫీడ్బ్యాక్ని ఆధారంగా అని చెబుతున్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్లు ఇష్టపడే ప్రదేశాలు వంటి వాటిపై చర్చించి ఆ దిశగా తన రెస్టారెంట్లలో అవి ఉండేలా ఏర్పాట్లు చేశాడట. ముంబైకి చెందిన ఈ వ్యాపారవేత తన 35 ఏళ్ల వ్యాపార జీవితంలో నేర్చుకున్న పాఠాలు ఇవేనని, అదే తన విజయ రహస్యమని అంటున్నారు. ప్రజలు ఆనందించగల ప్రదేశాలనే నిర్మిస్తా..అదే తన రెస్టారెంట్లను విజయవంతంగా నడిపిస్తుందని అంటున్నారు. ఆయన తన రెస్టారెంట్ల వ్యాపారం నుంచి దాదాపు రూ. 900 కోట్లు వరకు ఆర్జిస్తాడట. మన కళ్ల ముందే చాలా కంపెనీలు ఆతిథ్య రంగంలోకి వచ్చి ఇబ్బంది పడ్డాయి. తీవ్రమైన పోటీ ఉండే ఈ రంగంలో తను నిలదొక్కుకోవడానికి కీలకం కస్టమర్లే అంటాడు. మొదట కస్టమర్ల ప్రాధాన్యత, ఆ తర్వాత అవి అమలు చేయడంలో కలిగే సానుకూల, ప్రతికూల అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అమలు చేస్తానని అంటున్నాడు. తన కుటుంబ వ్యాపారమైన బెర్రీస్ రెస్టారెంట్ నుంచి మొదలైందట. అక్కడ నుంచే మొరాకో-శైలి కేఫ్ అయిన 'మోచా' ద్వారా ఆతిథ్య వ్యాపారంలోకి వచ్చినట్లు తెలిపారు. అలా తన కుటుంబ వ్యాపారం అంచలంచెలుగా విస్తరించి ఆతిథ్య సంస్థగా ఎదిగిందన్నారు. చివరగా ఆయన ఎదగడానికి రెండు మార్గాలున్నాయన్నారు. మొదటిది విశ్రాంతి తీసుకుంటూ వర్క్ లైఫ్ బ్యాలెన్స చేసి ఎదగొచ్చు , రెండు పూర్తిగా పనికే ప్రాధాన్యత ఇచ్చి కెరీర్పై దృష్టి పెట్టొచ్చు. ఆ విధంగా నిబద్ధతతో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై అటెన్షన్ పెడితే విజయం తథ్యం అని అన్నారు. (చదవండి: సినిమా సీన్ని తలపించేలా.. ఆర్మీ పైలట్ లవ్ ప్రపోజ్!) -
వృద్ధులకు వెయిట్ లిఫ్టింగ్ ట్రైనింగ్ ఎందుకు మంచిదంటే..!
వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యంగా, యాక్టివ్గా ఉండేందుకు బల శిక్షణ(స్ట్రెంగ్త్ ట్రైనింగ్) ఎంతో మంచిదంటోంది హెల్త్ అండ్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ జీనా అరాగాన్. కండరాల క్షీణత, ఎముకలు, కీళ్లు బలహీనపడటం వంటి ఇతర కారణాల వల్ల వయసు పెరిగే కొద్దీ ప్రజలు బలహీనపడతారు. దీనికి విరుగుడు బరువులు మోయడ మేలని చెబుతోంది. అదెలాగో తన 87 ఏళ్ల తండ్రిని ఉదాహరణగా చూపిస్తూ..ఆయన జిమ్ వర్కౌట్లతో ఎలా మెరుగ్గా ఉన్నారో వివరించేలా వీడియోని షేర్ చేశారామె. ఆయన ప్రతి వారం ఈ వెయిట్ లిఫ్టింగ్ చేసేలా చూస్తుంటానని చెప్పారామె. అయితే తన తండ్రి కేవలం పైకి, కిందకు వెయిట్లిప్ట్ చేస్తూ..కండరాలకు మాత్రమే పనికల్పిస్తున్నాని అనుకుంటారు. కానీ అంతకు మించి ప్రభావవంతమైందని, మొత్తం బాడీలోని అన్నింటికి మంచిదని ఆయనకు తెలియదని చెప్పుకొచ్చింది. ఆయన వయసు పైబడుతున్ను కొద్దీ ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడే వ్యాయం ఇదేనని, అందుకే ఆయన చురుకుగా, బలంగా ఉండేలా ఇలా కండరాలకు ఇలా బరువులు ఎత్తే శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఆయనను పదేపదే జిమ్కి వచ్చేలా చూడటమే తన పని అంటోంది. అయితే ఆయన ఈ జిమ్ సెషన్లో పాల్గొనెటప్పడూ..మంచి అనుభూతితో, తన కేర్ని అర్థం చేసుకునేలా చేస్తానంటోంది. ముఖ్యంగా ఆయన తన తదుపరి సెషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా వాతావరణం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెయిట్లిఫ్ట్కి సంబంధించిన రెండు రకాల ప్రత్యేక వ్యాయామాలు చేస్తుంటారని అన్నారామె. ఎత్తైన ప్రదేశాలపైకి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కూడా తన తండ్రి బ్యాలెన్స్ చేసుకోగలరని, అలాగే 80 పౌండ్ల కంటే ఎక్కువ బరువును మోయగల సామర్థ్యం ఆయనకు ఉందని చెప్పుకొచ్చారు. అంతేగాదు వృద్ధులకు బరువులు ఎత్తడం వంటి వర్కౌట్లు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. View this post on Instagram A post shared by Jeana Aragon (김제나) (@jeana.aragon) (చదవండి: సినిమా సీన్ని తలపించేలా.. ఆర్మీ పైలట్ లవ్ ప్రపోజ్!) -
సినిమా సీన్ని తలపించేలా.. ఆర్మీ పైలట్ లవ్ ప్రపోజ్!
రెండు ఆనందాలు ఒకేసారి వస్తే ఆ ఫీలే వేరేలెవెల్. అందులోనూ తన కిష్టమైన వ్యక్తిని సర్ప్రైజ్ చేసేలా ఏదో ఒకటి చేస్తుంటారు. కానీ ఇలా వృత్తిపరమైన వైలురాయిని వ్యక్తిగత విజయాన్ని జరుపుకుంటే అక్కడే చూసేవాళ్లకు సైతం ఆశ్చర్యం ఆనందం ఒకేసారి వస్తాయి కదూ. అలాంటి అందమైన సందర్భమే నెట్టింట వైరల్గా మారింది. ఆ వీడియోని చూసి నెటిజన్లు బ్యూటిఫుల్ ప్రపోజ్ బ్రో అంటూ ప్రశంసిస్తున్నారు.భారత సైన్యపు ఏవియేషన్ గ్రాడ్యుయేషన్ వేడుకలో జరిగిన అందమైన ప్రపోజల్ వీడియో అందర్నీ అమితంగా ఆకర్షిస్తోంది. మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న కాంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్ (CAATS)లో తన ఫ్లైట్ శిక్షణను పూర్తి చేసుకున్న తర్వాత భారత సైన్యపు ఏవియేషన్ కెప్టెన్ భరత్ భరద్వాజ్ తన ప్రియురాలు ఆరుషికి ఆశ్చర్యపోయేలా ప్రపోజ్ చేశాడు. ఆ అనూహ్యమైన పనికి ఆరుషి ఒక్కసారిగా విస్తుపోతూ అతడి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసింది. తన కుటుబం సభ్యులు, అధికారులు, శిక్షకులు, అతిథుల చప్పట్లు, కేరింతలు హోరెత్తిస్తుండగా చేసిన ప్రపోజల్ ఆమెకు ఎప్పటి మర్చిపోరాని జ్ఞాపకంలా అందించాడు ఆర్మీ పైలట్ భరత్. ఈ మేరకు ఈ వీడియోని షేర్ చేస్తూ..భరత్ పోస్ట్లో ఇలా రాసుకొచ్చాడు. మేమంతా ఈ రోజు పైలట్లుగా, శిక్షకులుగా మారం. ఇది మా అందరికీ అతి ముఖ్యమైన రోజు. మా కష్టానికి ఈ రోజు ఫలితం దక్కింది. గత ఐదేళ్లుగా ఒకరికొకరం తెలుసు. ఆమెకు ఇలా పెళ్లి ప్రతిపాదన చేయడానికి ఇంతకంటే మంచి రోజు మరొకటి ఉండదని అనుకుంటున్నా. నా కుటుంబానికి, కాబోయే భార్యకు ఈ రోజు చిరస్మరణీయంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఇలా చేశా అని పేర్కొన్నాడు కెప్టెన్ భరద్వాజ్.#WATCH | Maharashtra: The passing out parade at the Combat Army Aviation Training School in Nashik, concluded on an emotional note for a couple as Captain Bharat Bhardwaj proposed marriage to his partner. pic.twitter.com/8Un1ZNBP1F— ANI (@ANI) June 2, 2026 (చదవండి: విదేశీ పర్యాటకుడి గొప్ప మనసు..! ఉత్తరాఖండ్లో..) -
ఈ జీవుల నిద్రపోయే విధానమే వేరు! ఎందుకంటే?
మనం కాసేపు కూర్చుని నిద్రపోతేనే మన శరీరం నిలకడగా ఉండదు. అటూ ఇటూ వంగిపోతూనే ఉంటుంది. ఎప్పుడెప్పుడు నేలపై వీపు వాల్చాలా అని అనుకుంటాం. అలాంటిది ఈ జీవులు, అలాగే అవి నిద్రపోయే తీరును చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!సహజంగా పక్షులు ఎక్కడ నివసిస్తాయి. చెట్లపై గూళ్లు కట్టుకుని కదా.. కానీ ఈ స్విఫ్ట్ పక్షులు మాత్రం తమ జీవితంలో ఎక్కువ భాగం ఆకాశంలో ఎగురుతూనే గడుపుతాయి. మీరు విన్నది నిజమే. ఇవి కేవలం గుడ్లు పెట్టడానికి, పిల్లల్ని చూసుకోవడానికి మాత్రమే భూమిపైకి లేదా గూళ్ళలోకి వస్తాయి.ఈ పక్షులు ఆకాశంలో ఎగురుతూనే నిద్రపోగలవు. తమ రెక్కలను ఆటో–పైలట్ మోడ్లో పెట్టి చిన్న చిన్న కునుకులు తీస్తాయి. ఇవి నేల మీద వాలి ఆహారాన్ని వెతకవు. ఆకాశంలో ఎగురుతున్నప్పుడే తమ నోటిని పెద్దగా తెరిచి, గాల్లో ఉండే చిన్న చిన్న దోమలు, ఈగలు, పురుగులను పట్టుకుని తినేస్తాయి. దాహం వేస్తే ఇవి చెరువులు లేదా నదుల పైభాగంలో చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ, నీటిని నోటితో తాకుతూ ఎగురుతూనే తాగేస్తాయి.చుక్క నీరు తాగడానికి కూడా ఇవి కింద వాలవు. ఈ పక్షుల కాళ్ళు చాలా చిన్నగా, బలహీనంగా ఉంటాయి. అందుకే ఇవి నేల మీద అస్సలు నడవలేవు. ఇవి దాదాపు 10 నెలల పాటు అసలు నేల మీద కాలే పెట్టకుండా నిరంతరాయంగా ఆకాశంలోనే ఎగరగలవు! భలే విచిత్రమైన పక్షి కదా!నిల్చునే నిద్రిస్తాయి!మీరెపుడైనా గమనించారా? గుర్రాలు ఎప్పుడూ నిల్చునే నిద్రపోతుంటాయి. మరి అవి అలా ఎందుకుచేస్తాయో తెలుసా? పూర్వకాలంలో గుర్రాలు అడవుల్లో పెరిగేవి. అడవిలో సింహాలు, పులులు వంటి జంతువులు గుర్రాలపై దాడి చేయడానికి చూసేవి. ఒకవేళ గుర్రం కింద పడుకుని నిద్రపోతే, ఏదైనా జంతువు దాడి చేసినప్పుడు అది వెంటనే లేచి పరుగెత్తడం కష్టం అవుతుంది. అదే నిలబడి ఉంటే, శత్రువు రాగానే టపటపా మంటూ వేగంగా పరుగెత్తి తప్పించుకోవచ్చు! అందుకే అవి నిలబడే నిద్రపోవడం అలవాటు చేసుకున్నాయి.మరి వాటి కాళ్లు నొప్పులు పుట్టవా? అంటే... గుర్రాల కాళ్ళల్లో ‘స్టే అపారేటస్’ అనే ఒక స్పెషల్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఒక మ్యాజిక్ లాంటిది. గుర్రం నిద్రపోయేటప్పుడు దాని కాళ్ళల్లోని కండరాలు, కీళ్ళు లాక్ అయిపోతాయి. దీనివల్ల గుర్రం ఎటువంటి కష్టం లేకుండా, కింద పడిపోకుండా హాయిగా నిలబడి నిద్రపోగలదు. గుర్రాలకి గాఢ నిద్ర కావాలన్నప్పుడు, అవి సురక్షితంగా ఉన్నాయని నమ్మినప్పుడు మాత్రమే కింద పడుకుని నిద్రపోతాయి.మీకు తెలుసా!ప్లాటిపస్ పాలిచ్చే జంతువు. అయినప్పటికీ, పిల్లలకి జన్మనివ్వకుండా గుడ్లు పెడుతుంది.కాపుచిన్ వంటి కోతులు గింజల పెంకులను పగలగొట్టడానికి రాళ్ళను పరికరాలుగా ఉపయోగిస్తాయి.జెయింట్ పాండాలు రోజులో దాదాపు 12 గంటల సమయాన్ని కేవలం వెదురు తినడానికే కేటాయిస్తాయి.మీర్క్యాట్స్ గుంపులో కొన్ని ఆహారం వెతుక్కుంటున్నప్పుడు, క్రూర జంతువుల నుంచి రక్షణ కోసం ఒక మీర్క్యాట్ కాపలాదారుగా నిలబడి గమనిస్తూ ఉంటుంది. - నిర్వహణ: రమా జంబుల -
'నేను బాగానే ఉన్నాను' సిండ్రోమ్: ఇంత ప్రమాదకరమైనదా?
నేను బాగానే ఉన్నాను..అనేది సానుకూలమైన ధోరణి అనుకుంటాం. కానీ అది ఎంతలా మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేలా చేస్తుందో తెలిస్తే విస్తుపోతారు. నిజానికి ఈ సిండ్రోమ్తో బాధపడుతున్నామని వైద్యుల, మానసిక నిపుణులు సైతం ముందుగా గుర్తించలేరట. మనకు ఎవరైనా మీరు ఎలా ఉన్నారు? అనగానే ఐమ్ ఫైన్, థాంక్యూ అని నేర్పిస్తారు చిన్నప్పటి నుంచి. కానీ ఈ సమాధానమే పెద్దయ్యాక సర్దుబాటు పద్ధతిగా మారి మానసిక క్షోభగా పరిణామం చెందుతోందని గుర్తించమని చెబుతున్నారు నిపుణులు. ఇదేంటని విస్తుపోకండి. అసలు ఏంటి సిండ్రోమ్..బాగున్నా అన్నా ధోరణి ఇంత ప్రమాదకరంగా ఎలా మారుతుందంటే..ఈ సిండ్రోమ్ మనల్ని మభ్యపెట్టి బతికేలా చేస్తుందని హెచ్చరిస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి క్షోభకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలను విస్మరించి అంతా తన అధీనంలో ఉండాలనే ధోరణినే 'నేను బాగానే ఉన్నాను' సిండ్రోమ్ అంటారట. మస్తత్వవేత్తలు ఇది ఒక రకమైన లక్షణాలను అంగీకరించకుండా.. భావోద్వేగాలను అణిచివేసే స్థితిగా చెబుతున్నారు. దీనివల్ల ఆయా వ్యక్తులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముందుకు సాగాలని భావించి, తమలోని ఆందోళన సంకేతాలను తక్కువగా అంచనా వేస్తారు లేదా విస్మరిస్తారని అంటున్నారు. అంతేగాదు ఈ 'నేను బాగానే ఉన్నాను' అనేది కేవలం మామూలుగా చెప్పే సమాధానం కాదు. అదొక సర్దబాటు విధానంగా మారిపోతుంది. ముఖ్యంగా ఉద్యోగ నిపుణులు ఎదుర్కొంటున్న సమస్యే ఇదని అంటున్నారు. అంటే వృత్తిరీత్యా సమావేశాలు, టార్గెట్లు, అదనపు వర్క్ని పరమావధిగా చూస్తూ..భోజనం మానేయడం, నిద్రలేని రాత్రలు, నిరంతర అలసట, భావోద్వేగపరమైన నీరసం వంటి హెచ్చరిక సంకేతాలను విస్మరిస్తూ..అంతా తమ అధీనంటో ఉందన్నట్లు పనులు చేస్తుంటారని చెబుతున్నారు మానసిక నిపుణుల. ఇక్కడ జీవించడం లేదు కేవలం పోటీ పడుతున్నాం. ఫలితంగా స్వీయం సంరక్షణను నిర్లక్ష్యం చేస్తున్నామని అంటున్నారు. పరిస్థితులు చక్కబడ్డాక ఆరోగ్య సమస్యలు గురించి ఆలోచించ్చని అనుకుంటూ..తెలియకుండానే ఆ భయానక వలయంలో కూరుకుపోతారని అంటున్నారు. అంతేగాదు దీని కారణంగా అనారోగ్య అలవాట్ల బారిన పడతారని కూడా అంటున్నారు. ఈ సిండ్రోమ్ సంకేతాలు..నిద్రలేమిఏకాగ్రత లోపంజ్ఞాపకశక్తి సమస్యలువైద్యపరంగా వివరించలేని ఆకలి లేదా బరువులో మార్పులుపనిలో ఉత్పాదకత తగ్గడంసామాజిక ఒంటరితనంఅభిరుచులపై ఆసక్తి లేకపోవడంచిరాకుఆవేశపూరిత ప్రవర్తనతరచుగా వచ్చే తలనొప్పులు, జీర్ణకోశ సంబంధిత సమస్యలు,అలసట వంటి శారీరక అనారోగ్యాలుఈ లక్షణాలు ఒక్కోసారి ఆపీసు లేదా కార్యాలయాల్లో తమ కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయినప్పుడూ కూడా ఈ పరిస్థితి ఎదురయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. దీనివల్ల సాధారణ పనులు కూడా చేసుకోలేని విధంగా ఇబ్బంది పడతారని హెచ్చరిస్తున్నారు. నిజానికి నిరాకరణ నుంచి 'నేను బాగానే ఉన్నాను' అనే సిండ్రోమ్ వస్తుందట. మానసిక నిరాకరణ అనేది తరుచుగా భయం, సామాజిక కండిషనింగ్ నుంచి పుడుతుందని అంటున్నారు. చాలామంది తాము బలంగా ఉండాలని, సమస్యలను స్వయంగా పరిష్కరించుకోవాలని ఇతరులకు భారం కాకూడదని భావిస్తూ పెరుగుతారు. అది కాస్తా తమ బాధను అంగీకరించడానికి ఇబ్బందిపడే మనస్తత్వాన్ని పెంపొందిస్తుంది. ఇక్కడ మనం బాధను అంగీకరిస్తే బలహీనంగా కనిపిస్తామని సిగ్గుపడి చివరకి నిరాకరణ ధోరణి మొదలవ్వుతుందని అంటున్నారు. అందుకే భావోద్వేగాలను అణిచివేయొద్దు, బాధ, ఒత్తిడి, ఆందోళన వంటి పరిస్థితులను అంగీకరించి వాటి నుంచి బయటపడే మార్గం చూడండి తప్ప అణిచేసేలా బాగానే ఉన్నాను అనే మాటకు ఆస్కారం ఇవ్వకండి. ఇక్కడ బాగానే ఉన్నాను అను మాటకు కట్టుబడి ఉండేలా స్వీయ భద్రతపై దృష్టిపెట్టండి, ఆరోగ్యాన్ని పట్టించుకోండి..తర్వాత అనే మాటకు అవకాశం ఇవ్వొద్దు అని సూచిస్తున్నారు మానసిక నిపుణులు. (చదవండి: ఐదువేల ఏళ్ల నాటి 'మమ్మీ'లో సజీవంగా పేగు బ్యాక్టీరియా..! అతడి చివరి భోజనం..) -
ఐదువేల ఏళ్ల నాటి 'మమ్మీ'లో సజీవంగా పేగు బ్యాక్టీరియా..!
నిజంగా జీవంలేని ఏ ప్రాణిలోని కణాలు గానీ సూక్ష్మజీవులు గానీ బతికే ఛాన్స్ ఉండదు. అది కూడా వేల ఏళ్ల నాటి మమ్మీ లాంటి వాటిల్లో కూడా ఉండవనేది జగమెరిగిన సత్యం. ఒక జీవిలో ప్రాణం లేకపోతే..అచైతన్యంగా..నిర్జీవంగా అయిపోతుంది లేదా కొన్ని రోజులకి విచ్ఛిన్నమైపోతుంది. అలాంటిది వేల ఏళ్ల నాటి మమ్మీ అది కూడా గడ్డకట్టిన చలిలో ఉన్న మృతదేహంలో సజీవంగా పేగు బ్యాక్టీరియా ఉండటాన్ని చూసి విస్తుపోయారు శాస్త్రవేత్తలుఇటాలియన్ ఆల్ప్స్ పర్వతాల్లో ఓట్జీ ది ఐస్మ్యాన్ బాణం దెబ్బకు గురై చనిపోయాడు. కానీ అతని శరీరం గట్ బ్యాక్టీరియాతో కళకళలాడుతుండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు శాస్త్రవేత్తలు. ఇది అద్భుతమైన శాస్త్రీయ ఆవిష్కరణ. ఇక్కడ చరిత్ర పూర్వపు ప్రేగు బ్యాక్టీరియా చలికి ఇంకా బతికే ఉండటం అనేది విశేషం. ఆ చలి వాతావరణానికి అనుగుణంగా ఈస్ట్ జాతులు జీవక్రియపరంగా చురుకుగా ఉన్నాయని గుర్తించారు శాస్త్రవేత్తలు. ఆ పురాతన సూక్ష్మజీవులు తమ కళ్లముందే చురుకుగా తమను తాము మార్చుకుంటూ పరిణామం చెందుతున్నాయని చెబుతున్నారు. వీటిని మమ్మీ చర్మం, అంతర్గత కణజాలాలు, కరిగిన మంచు నీటిని విశ్లేషించడం ద్వారా ఈ రహస్య పూర్వ జీవావరణ వ్యవస్థను గుర్తించినట్లు తెలిపారు. ఒక రకంగా ఈ పరిశోధన మన గతాన్ని తెలిపే అద్భుతమైన ఆవిష్కరణగా పేర్కొన్నారు. అంతేగాదు చనిపోయిన ఆ వ్యక్తి ఓట్జీ చివరి భోజనమైన అధిక కొవ్వు అడవి మాంసం, పురాతన ధాన్యాలతో అతని పేగులోని క్రియాశీల బ్యాక్టీరియా కచ్చితంగా సరిపోలిందన్నారు. ఆ వ్యక్తిలో రోంబౌట్సియా హోమినిస్, క్లోస్ట్రిడియం మోనిలిఫార్మ్ వంటి అరుదైన గట్ బ్యాక్టీరియాను గుర్తించినట్లు తెలిపారు. ఇది ఆధునిక మానువుల్లో దాదాపు కనుమరుగైందన్నారు. కానీ ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని గిరిజన సముహాల్లో ఇలాంటి పేగు బ్యాక్టీరియా ఉందన్నారు. ఇవి శరీరాన్ని రక్షించేలా హానికరమైన క్రిమిసంహారకాలను తింటూ..మనుగడ సాగిస్తాయన్నారు.(చదవండి: చింతగింజలతో మైక్రో ప్లాస్టిక్కి చెక్..!) -
అలలపై.. అలా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ది యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తున్న ‘17వ మాన్సూన్ రెగట్టా జాతీయ ర్యాంకింగ్ సెయిలింగ్ చాంపియన్షిప్’ నగరంలోని హుస్సేన్ సాగర్ వేదికగా ప్రారంభమైంది.మంగళవారం గాలి వేగం తగ్గడంతో ప్రిన్సిపల్ రేస్ ఆఫీసర్ చంద్రశేఖర్ దలై వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఒక రేసును మాత్రమే పూర్తి చేయగలిగారు. బాలికల అండర్–15 విభాగంలో సికింద్రాబాద్ క్లబ్కు చెందిన సృష్టి సింగ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. మొదటి రోజు ముగిసే సమయానికి బాలుర విభాగంలో నిల్కొండ మణి (1 పాయింట్) అగ్రస్థానంలో నిలవగా, బాలికల విభాగంలో సృష్టి సింగ్ (4 పాయింట్లు) టాప్లో నిలిచింది.సెయిలింగ్లో ‘మణి’రత్నం.. మల్కాజిగిరికి చెందిన 13 ఏళ్ల నిల్కొండ మణి తొలి రేసులో మొదటి స్థానంలో నిలిచాడు. 30 నిమిషాల పాటు సాగిన ఈ రేసులో తన సమీప ప్రత్యర్థి కంటే దాదాపు 2 నిమిషాల భారీ ఆధిక్యంతో మణి విజయం సాధించాడు. -
ఖులానామాకు ధ్రువీకరణ అక్కరలేదు!
నా మాజీ భార్య రిజిస్టర్డ్ పోస్టు ద్వారా ఖులానామా పంపింది. ఆమె గుజరాత్లో, నేను అనంతపూర్లో ఉంటున్నాం. ఈ ఖులానామాలో దారుల్ ఖజా, జమాత్ లేదా నమోదైన ఖాజీ వంటి స్థానిక మతపెద్దల ప్రమేయం లేదు కానీ ఇరుపక్షాల తరఫున సాక్షులు సంతకం చేశారు. నాన్–జ్యుడీషియల్ స్టాంప్పేపర్పై గానీ, నోటరీ ద్వారా గానీ ధ్రువీకరించలేదు. భవిష్యత్తులో ఈ ఖులానామాను కోర్టులో సవాలు చేసే వీలుంటుందా? దయచేసి సలహా ఇవ్వండి. – షేక్ పాషాముస్లిం చట్టం ప్రకారం ఖులానామాను దారుల్ ఖజా లేదా జమాత్ ధ్రువీకరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముస్లిం పర్సనల్ లా ప్రకారం విడాకులు మంజూరు చేసే చట్టబద్ధ అధికారం వారికి లేదు. తప్పనిసరి కాకపోయినా అందరూ ఇలా చేస్తుంటారు. అందులో తప్పు లేదు కానీ ఖులానామా పత్రం చట్టపరంగా బలంగా ఉండేందుకు, దాని చెల్లుబాటును నిర్ధారించేందుకు ఒక అధికారిక ధ్రువీకరణ ప్రక్రియ అనుసరించడం మంచిది. ఖాజీలు ఇందుకు తగినవారు. దీనివల్ల రెండు పక్షాలు షరతులు, నిబంధనలను పూర్తిగా అర్థం చేసుకున్నాయని నిర్ధారించవచ్చు.ఖులానామా లేదా తలాక్ ఎవరైనా సాక్షుల సమక్షంలో జరిగితే సరిపోతుంది. నోటరీ లేదా రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు. అయితే, అలా చేయడం వల్ల పత్రం ్రపామాణికంగా ఉంటుంది. మీవిషయంలో ఇరుపక్షాల సాక్షులు ఉన్నారు కాబట్టి ఎవరూ సవాలు చేయకపోతే సరిపోతుంది. సవాలు చేసే వీలుందా అంటే – ఏదైనా పక్షం ఈ ఖులా బలవంతంగా తీసుకున్నదని లేదా ఒత్తిడిలో జరిగిందని వాదిస్తే, ఖాజీ లేకపోవడం లేదా అధికారిక రిజిస్ట్రేషన్ లేకపోవడం కారణంగా కోర్టు దీనిని పరిశీలించవచ్చు.అలాంటి పరిస్థితిలో సాక్షులపాత్ర, పత్రంపై సంతకాలను కోర్టు సమీక్షిస్తుంది. మీకు అలాంటి సందేహం ఉంటే మీ వివాహం ఖులానామా ద్వారా రద్దయిందని సివిల్ కోర్టులో/ఫ్యామిలీ కోర్టులో ఒక డిక్లరేషన్ దావా దాఖలు చేయవచ్చు. తప్పనిసరి కాకపోయినా స్థానిక ఖాజీ లేదా దారుల్ ఖజాను సంప్రదించి ఖులాను అధికారికంగా నమోదు చేయించటం మంచిది. అయితే ఇందుకోసం, ఖాజీ సమక్షంలో పత్రంపై మళ్లీ సంతకాలు చేయవలసి రావచ్చు. – శ్రీకాంత్ చింతల హైకోర్టు న్యాయవాది -
లోప్రొఫైల్... హై–ఎనర్జీ
సీనియర్ న్యాయవాది వి.మోహనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. జస్టిస్ ఇందూ మల్హోత్రా తరువాత బార్ నుండి నేరుగా సుప్రీంకోర్టుకు పదోన్నతి కోసం కొలీజియం సిఫారసు చేసిన రెండవ మహిళగా వి.మోహన నిలిచారు. పట్టుదల, క్రమశిక్షణతో సాగిన అద్భుత న్యాయ ప్రస్థానానికి ఆమె బలమైన ప్రతీక. చెన్నైకి చెందిన మోహన ‘లోప్రొఫైల్ లాయర్’గా... ‘నిరాడంబర న్యాయవాది’గా పేరు తెచ్చుకున్నారు.చేదు అనుభవాలు ఎన్నో...న్యాయవాదిగా మోహన ప్రయాణం నల్లేరు మీద నడకేమీ కాదు. ఎన్నో సవాళ్లు, చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఆమెకు కోర్టులో ఎదురైన చేదు అనుభవాలలో ఒకటి...ఒక అత్యవసర కేసు విచారణ సందర్భంగా ఒక సీనియర్ న్యాయవాది... ‘మహిళలు కోర్టులో గొంతెత్తి అరవకూడదు’ అని విసుక్కోవడమే కాదు... ‘ఇలా అరిచేవాళ్లు ఇంట్లోనే ఉండాలి’ అని కూడా అన్నాడు. అయినప్పటికీ మోహన సంయమనం కోల్పోలేదు. అయితే ఈ సంఘటనను ‘చేదు జ్ఞాపకం’గా చూడరు మోహన. కోర్టులో హుందాగా ప్రవర్తించడం, సంయమనం పాటించడానికి సంబంధించి ఒక పాఠంగా గుర్తు పెట్టుకుంటారు.ఆ నిర్ణయంతో...న్యాయవ్యవస్థలో అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటైన అడ్వకేట్–ఆన్–రికార్డ్ (ఏసీఆర్) పరీక్షలో 1996లో ఉత్తీర్ణత సాధించారు మోహన. సుప్రీంకోర్టులో నేరుగా కేసులు దాఖలు చేయడానికి ‘ఏసీఆర్’ ముఖద్వారం లాంటిది. దిల్లీకి వెళ్లాలనే నిర్ణయం మోహన వృత్తి జీవితాన్ని మార్చివేసింది. దిల్లీకి వచ్చిన తరువాత అప్పటి అడ్వకేట్–ఆన్–రికార్డ్ ఇందూ మల్హోత్రాతో కలిసి పనిచేశారు. మల్హోత్రాతో కలిసి పనిచేసిన రోజులు మోహన వృత్తిజీవితంలో కీలకమైన దశగా నిలిచింది. ఆ సమయంలోనే కపిల్ సిబల్, అరుణ్ జైట్లీ, పి.చిదంబరం వంటి దేశంలోని అత్యుత్తమ న్యాయ నిపుణులతో పరిచయం ఏర్పడింది. కోర్టు అధికారిక న్యాయపత్రిక సుప్రీం కోర్టు రిపోర్ట్స్(ఎస్సీఆర్) గౌరవ సంపాదకురాలిగా కూడా పనిచేశారు మోహన.అమ్మ చెప్పిన మాటమా కుటుంబంలో ఎవరూ న్యాయవాదులు లేరు. కోయంబత్తూర్ లా కాలేజీలో చదువుకున్నాను. నేను చదివిన కాలేజీలో మహిళల హాస్టల్ లేదు. కాలేజీలో కనీస మౌలిక సదుపాయాలూ ఉండేవి కావు. కాలేజీ అద్దె భవనంలో పనిచేసేది. ‘నువ్వు న్యాయశాస్త్రం చదవాలి. సమాజం నిన్ను అణచివేయాలని ప్రయత్నించినప్పుడు అది నీకు గొంతుకను ఇస్తుంది. ధైర్యాన్ని ఇస్తుంది’ అని అమ్మ నాతో అనేవారు. అమ్మ మాటలే నాకు దారి చూపి ధైర్యాన్ని ఇచ్చాయి. – వి.మోహన -
సైనికులకు ‘పాదా’భివందనం
ఆమె కాళ్ల కింద తారు కరుగుతోంది. నెత్తిన సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. అయినా రాజస్థాన్ అజ్మీర్ బిడ్డ సూఫియా సూఫీ పరిగెడుతూనే ఉంది. ‘రన్ ఫర్ డ్రీమ్స్’ పేరుతో భారత సాయుధ దళాల గౌరవార్థం కన్యాకుమారి నుంచి హిమాలయాల్లోని కారకోరం రేంజ్ వరకు 5,000 కిలోమీటర్ల పరుగును 88 రోజుల్లో పూర్తి చేయడానికి బయలుదేరింది. ఒంగోలు మీదుగా సాగుతున్న పరుగులో ఆమె ప్రతి అడుగు సైనికునికి శాల్యూట్ పలుకుతోంది.‘పరుగు నాకు ధ్యానం లాంటిది. నేను పరిగెత్తిన ప్రతి అడుగు నన్ను శక్తిమంతం చేసింది’ అంటుంది సూఫియా. భగభగలాడే ఎండల్లో, పొగలు కక్కే హైవే మీద ఆమె పరిగెడుతూ ఒంగోలు మీదుగా ముందుకు సాగుతూ కనిపించింది. సాధారణంగా అటువంటి వాతావరణంలో బయటకు రావడమే కష్టం. పరుగు తీయడం అసాధ్యం. ‘అయినా నేను ఆగను. సైనికులకు అంకితం ఇచ్చే వరకు నా పరుగు ఆపను’ అన్నారామె.‘రన్ ఫర్ డ్రీమ్స్’ పేరుతో సూఫియా మే 12, 2026న కన్యాకుమారి వద్ద పరుగు మొదలుపెట్టింది. 88 రోజుల పాటు నిరవధికంగా పరిగెత్తి, పదకొండు రాష్ట్రాలు, యుద్ధ స్మారకాలు దాటి, 18,000 అడుగుల ఎత్తున కారకోరం పాస్ వద్ద ఆగస్టు 6న ఆ పరుగును ముగించనుంది. ఆ విధంగా సైనికులకు తన పరుగును అంకితం చేయనుంది. వారికి పాదాభివందనం చేయనుంది.ప్రశాంతత కోసం పరుగుసూఫియా సూఫీది రాజస్థాన్లోని అజ్మీర్. పదహారేళ్ల వయసులో తండ్రిని కోల్పోయింది. ఢిల్లీ విమానాశ్రయంలో బ్యాగేజ్ హ్యాండ్లింగ్ ఆఫీసర్గా పదేళ్లు పనిచేసింది. ‘మరబొమ్మలాంటి ఆ జీవితం నా ఆరోగ్యాన్ని నాశనం చేసింది’ అంటుందామె. ఆ ఒత్తిడి నుంచి బయటపడటానికి, ప్రశాంతత కోసం పార్కులో రోజూ మూడు కి.మీ. పరుగు మొదలుపెట్టింది. అది కాస్తా అలవాటుగా, అలవాటు ఫ్యాషన్ గా,ఫ్యాషన్ జీవిత లక్ష్యంగా మారిపోయింది. ఉద్యోగాన్ని వదిలేసి, 2019లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 4,000 కి.మీ పరిగెత్తి మొదటి గిన్నెస్ రికార్డ్ కొట్టింది. ఆ తర్వాత ఆల్ట్రా మారథాన్ రన్నర్గా పరిగెడుతూనే ఉంది.ప్రజల తోడు‘నేను రోజుకు అరవై నుంచి అరవై అయిదు కిలోమీటర్లు పరిగెత్తుతున్నాను. మొదటి పది రోజులు ఎండల వల్ల చాలా కష్టంగా గడిచింది. తమిళనాడు, ఆంధ్రలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల తెల్లవారుజాము నాలుగు నుంచి ఉదయం 9.30 వరకు.. సాయింత్రం నాలుగున్నర నుంచి రాత్రి 9 వరకు పరుగు పెడుతున్నాను. రోజురోజుకూ వేగాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాను. దారి మధ్యలో కొందరు రన్నర్లు నాపై అభిమానాన్ని చూ పారు. సంఘీభావంగా నాతో పరిగెత్తారు. చిన్నపిల్లలు, మధ్య వయస్కులు, వృద్ధులు నాతో పరిగెత్తారు. ఇంతకు మించి ఏం కావాలి’ అంటుంది సూఫియా.శరీరానికి నచ్చ చెప్తూ...‘రోజుకు 15 గంటల పాటు పరిగెడుతుండటంతో నా శరీరం హెచ్చరికలు జారీ చేస్తుంటుంది. అయినా దానిని సముదాయిస్తూ ఓర్పుగా ముందుకు కదులుతున్నాను. నేను ఐదు గిన్నిస్ రికార్డులు సాధించడానికి నా భర్త వికాస్ సహకారం మరువలేనిది. అనుక్షణం నన్ను నా పరుగులో జాగ్రత్తగా గమనిస్తూ ఆహారంలో, పరుగులో సూచనలు, సలహాలు ఇస్తుంటాడు. మహిళలు ఏమీ చేయలేరు, వాళ్లందరూ శక్తిహీనులేనని చాలామంది అంటుంటారు. స్త్రీ తలుచుకుంటే ఏదైనా సాధ్యమని నిరూపించదలచుకున్నాను. ఈ ఆధునిక సాంకేతిక యుగంలో మహిళలకు అన్ని అవకాశాలు లభిస్తున్నాయి. స్త్రీలు తాము అనుకున్న లక్ష్యాలను సాధించడానికి అన్ని అడ్డంకులను పటాపంచలు చేయాలి. మనం అనుకుంటే ఏదైనా సాధించగలం’ అని హరిణిలా దూసుకుపోయారామె.సైనికుల అభిమానిసూఫియాకు పరుగు ఒక క్రీడ కాదు. దేశభక్తిని చాటే మార్గం. భారత సాయుధ దళాలు అత్యంత కఠిన పరిస్థితుల్లో దేశాన్ని కా పాడుతున్నాయని చెప్పడానికి కఠినమైన దారుల్లో సూఫియా పరుగు నిర్వహిస్తూ ఉంటుంది. 2022లో సియాచిన్ నుంచి కార్గిల్ వరకు ఎముకలు గడ్డ కట్టే స్థితిలో పరిగెత్తిన మొట్టమొదటి మహిళగా నిలిచింది. 2023లో మనాలి–లేహ్ మధ్య 480 కి.మీ దూరాన్ని 98 గంటల్లో పూర్తి చేసి ప్రపంచ రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు ‘రన్ ఫర్ డ్రీమ్స్’లో భాగంగా సముద్ర మట్టానికి 5,540 మీటర్లు ఎత్తున లేహ్కు ఉత్తరంగా భారత్–చైనా సరిహద్దులో ఉన్న కారకోరం వరకూ పరిగెత్తనుంది. ‘సైనికుల కష్టం ముందు నా పరుగు నొప్పి చాలా చిన్నది’ అంటుంది సూఫియా. – కె. గంగాధర్, సాక్షి, ఒంగోలు డెస్క్ -
చింతగింజలతో మైక్రోప్లాస్టిక్కి చెక్..!
ప్లాస్టిక్ భూతం ఏ రేంజ్లో ఉందో తెలిసిందే. ముఖ్యంగా నీటిలో ఉన్న మైక్రోప్లాస్టిక్ను తొలగించడం అంత సులభం కాదు. అదీగాక నీటి నుంచి మైక్రోప్లాస్టిక్ని వేరుచేయడం అంటే కచ్చితంగా రసాయనాలు కలపక తప్పని పరిస్థితి, ఖర్చు కూడా అధికమే. ఆ సమస్యకు చక్కటి పరిష్కార మార్గం చూపి ఎర్త్ప్రైజ్ గెలుచుకున్నారు ఈ టీనేజర్లు.వాళ్లే వివాన్ ఛావ్చారియా, అరియానా అగర్వాల్, అవ్యానా మెహతా అనే భారతీయ విద్యార్థుల బృందం. ఈ విద్యార్థులు నీటి నుంచి మైక్రోప్లాస్టిక్లను వేరు చేయడానికి తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతిని అభివృద్ధి చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అందుకోసం చింత గింజల పొడిని ఉపయోగించి జీవవిచ్ఛిన్నమయ్యే పదార్థాన్ని రూపొందించారు. ఇది కలుషితమైన నీటిలో ఉన్న చిన్న ప్లాస్టిక్ కణాలకు అంటుకుంటుంది. ప్లాస్-స్టిక్ అని పిలువబడే ఈ ఆవిష్కరణ రసాయనాలను జోడించకుండా, సాంప్రదాయ ఫిల్టర్లు తరచుగా వదిలివేసే మైక్రోప్లాస్టిక్లను ఎలా బంధించగలదో పరిశోధనలో వెల్లడైంది. అంతేందుకు ఇప్పుడు వాటర్ టిన్లు, బాటిల్స్ అన్ని ప్లాస్టిక్. అందువల్ల తాగు నీటిలో తప్పక చిన్న చిన్న ప్లాస్టిక్ కణాలు దాగి ఉంటాయి. కానీ అవి కంటికి కనిపించనంత చిన్నవిగా ఉంటాయి. వాటిని పారేసి చింతగింజలతో తయారు చేసిన ప్రత్యేక పొడితో ఈ మైక్రోప్లాస్టిక్ చెక్పెట్టారు.ఈ చింతగింజల పొడి అయస్కాంతం మాదిరిగా ప్లాస్టిక్ని ఆకర్షించి వేరు చేస్తుందట. దీనివల్ల శుభ్రమైన నీటిని సులభంగా పొందొచ్చని చెబుతోంది ఆ విద్యార్థుల బృందం. సేకరించిన ప్లాస్టిక్ను టైల్స్ లేదా కోస్టర్స్ వంటి చిన్న, ఉపయోగకరమైన వస్తువులుగా మారుస్తారు. ఫలితంగా అది తిరిగి ప్రకృతిలోకి చేరదు. ఈ ఆవిష్కరణలో జంతువులు, మానవులు కనిపించన ప్లాస్టిక్ కాలుష్యం బారిన పడకుండా కాపాడగలుగుతామని చెబుతున్నారు. ఆ విద్యార్థులకు గ్రామీణ ప్రాంతాలను సందర్శించనప్పుడే ఈ ఆలోచన తట్టిందని, అక్కడ చాలామంది ప్రజలు ప్లాస్టిక్ పాత్రలలోని నీటిని నిల్వ ఉంచడం చూశామని అన్నారు. వెనుబడిన గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ప్లాస్టిక్ పాత్రల్లో నిల్వ ఉంచిన నీటిని తాగి ఈ మైక్రోప్లాస్టిక్ బారిన పడటం చూశాక ఈ ఆవిష్కరణకు పురికొల్పామని అన్నారు. ఈ ప్రాజెక్టు ప్రభావవంతమైనదే కాకుండా తక్కువ ఖర్చుతో కూడుకున్నది, పైగా స్థానికంగా లభించే వనరులతోనే దీన్ని ఆవిష్కరించడంతో ఈ టీనేజర్లపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు అంతా. కలుషితమైన నీటి వనరులతో ఇబ్బంది పడుతున్న వర్గాలకు ఇది గొప్ప ఆచాణాత్మకమైనదని అన్నారు. ఆ నేపథ్యంలోనే ఈ విద్యార్తి బృందం ‘ది ఎర్త్ ప్రైజ్ గ్లోబల్ విజేతలుగా ’ ఎంపికయ్యారు. ఇలా గుర్తింపు పొందిన బృందం మాదే కావడంతో ఎంతో సంతోషంగా ఉందంటున్నారు ఆ ముగ్గురు టీనేజర్లు. కాగా అధికారిక వెబ్సైట్ ప్రకారం, ప్రజా ఓటింగ్ ద్వారా ప్రపంచ విజేతను ఎంపిక చేశారు. అంతేగాదు ఈ ఆవిష్కరణ సంక్లిష్టమైన కాలుష్య సమస్యలను సరళమైన, ప్రకృతి ఆధారిత ఆలోచనలు ఎలా పరిష్కరించగలవో చెప్పడానికి ఉదాహరణగా నిలిచింది. ఈ విజయం యువత నేతృత్వంలోని విజ్ఞాన శాస్త్రానికి, ప్రపంచవ్యాప్తంగా మైక్రోప్లాస్టిక్ తొలగింపు సాంకేతికతల కోసం పెరుగుతున్న కృషికి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది.(చదవండి: ముంబై స్లమ్ నుంచి అంతర్జాతీయ కెరీర్ రేంజ్కు..! వైరల్గా టెకీ స్టోరీ) -
ముంబై స్లమ్ నుంచి అంతర్జాతీయ కెరీర్ రేంజ్కు..!
చాలా సక్సెస్ స్టోరీలు మన కళ్ల ముందు..నుంచే వస్తుంటాయి. అప్పటి వరకు ఊహించం ఆ వ్యక్తి ఆ స్థాయి చేరుకుంటాడని. చాలా దయనీయ పరిస్థితిల్లో బతికి మనం చూస్తుండగానే ఆకాశమంత స్థాయికి ఎదిగి సక్సెస్ని ఒడిసిపట్టి స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి కథే ఈ టెకీ గాథ.ముంబైలో జన్మించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంతోష్ యాదవ్ దాదాపు దాదాపు మూడు దశాబ్దాల పాటు మురికివాడలోనే నివశించాడు. అక్కడే అతడి చదువు, బాల్యం సాగింది. ఆ స్థాయి నుంచి జర్మనీలో కోడ్రాబిట్లో ప్రిన్సిపల్ డెవలపర్ అడ్వకేట్ స్థాయికి ఎలా చేరుకున్నాడో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. ఆయన భార్యతో కలిసి ఉన్న సోషల్ మీడియా పోస్ట్ని షేర్ చేస్తూ..తన కథను పంచుకున్నారు. సంతోష్ యాదవ్ ప్రస్తుతం యాంగులర్ గూగుల్ డెవలపర్ ఎక్స్పర్ట్ (GDE), గిట్హబ్ స్టార్, ఓపెన్-సోర్స్ కంట్రిబ్యూటర్, అంతర్జాతీయ స్పీకర్గా పేరు తెచ్చుకున్నారు. తనకు గుర్తున్నంత వరకు తన జీవితంలో ఎక్కువ భాగం ముంబై మురికివాడలోనే పెరిగానని చెప్పుకొచ్చారు. పాఠశాల చదువులో చాలా ఇబ్బందిపడ్డానని అన్నారు. క్రికెట్ అంటే మహాఇష్టం అందువల్లే చదువులో అంతమాత్రంగా ఉండేవాడినని అన్నారు. ఆ కారణంగానే ఇంటర్లో సైన్సు కోరులో చేరలేకపోయానని అన్నారు. అయితే తండ్రి స్నేహితుల్లో ఒకరు యాదృచ్ఛికంగా ఇచ్చిన సలహా వల్ల కంప్యూటర్ డిప్లోమా కోర్సులో చేరినట్లు తెలిపారు. అయితే ఇంగ్లీష్ తన మాతృభాష కాకపోవడంతో పాఠాలతో పడ్డ ఇబ్బందులు అంత ఇంత కాదన్నారు. I lived in slum in Mumbai for 29 years, decided to move after my daughter was born, next week we will be moving to multi storied apartment on rent, pic.twitter.com/QIgX3igafc— Santosh Yadav (@SantoshYadavDev) August 21, 2020 తన యాస కారణంగా తాను ఎలా ఎగతాళికి గురయ్యానో కూడా చెప్పారు. ఇక చదవలేను అని ఏడ్డిన సంగతి కూడా ఇంకా గుర్తు ఉందన్నారు. మళ్లీ యథావిధిగా పెయిల్ అవుతానేమోనని తెగ భయపడేవాడినని అన్నారు. బాగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతో క్రికెట్ కూడా ఆడటం మానేసి, స్నేహితులకు దూరమై పూర్తిగా చదువుపైనే ఫోకస్ పెట్టానన్నారు. దాంతో తన గ్రేడ్లు మెరుగుపడటమే గాక సుమారు 60%కు పైగా మార్కులతో డిప్లోమాను పూర్తి చేశానని అన్నారు. అప్పుడు తెలిసిందే సాధించాలని గట్టిగా అనుకుంటే ఎలాగైనా.. సాధించగలరు, చేయగలరని, కేవంల పట్టుదలను వదులుకోకూడదని అన్నారు. తన క్లాస్మేట్ తన యాసను ఎగతాళి చేయడంతోనే సవాలుగా తీసుకుని తనను తాను మెరుగుపరుచుకున్నట్లు తెలిపారు. అయితే ఆకస్మికంగా తండ్రి ఉద్యోగం కోల్పోవడంతో ఒక్కసారిగా ఆర్థిక ఇబ్బందులు చుట్టిముట్టాయన్నారు. ముంబై విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చదువుదామంలే కాలేజ్ ఫీజు చెల్లించలేని పరిస్థితి దాంతో ఉద్యోగం వెతుక్కోమని ఇంట్లో వాళ్లు కరాఖండీగా చెప్పారని తెలిపారు. దాంతో రాత్రంతా ఏడుస్తూ ఉన్న నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. అయితే తన పరిస్థితిని చూసిన తల్లి తండ్రితో మాట్లాడి చదువుకు కొనసాగించేలా చేసిందన్నారు. తన మేనమామ సాయంతోనే చదువు కొనసాగించగలిగానని అన్నారు. సరిగ్గా కంప్యూటర్ సైన్సుతో డిగ్రీ పూర్తి చేసేనాటికి 2008 ఆర్థిక సంక్షోభం సంభవించి ఉద్యోగాలు దొరకడమే కష్టమైంది. దాంతో ఎంతో కష్టపడి నెలకు రూ. 5000 జీతంతో ఒక ఉద్యోగాన్ని సంపాదించానని నఅ్నారు. కోడింగ్ అంటే ఇష్టంతో C#లో మంచి పట్టు సాధించానన్నారు. నిరంతరం కొత్త టెక్నాలజీలు నేర్చుకుంటూ నైపుణ్యాభివృద్ధిని సంపాదించుకుని 2010 కల్లా నెలకు రూ. 12 వేల జీతం ఇచ్చే ఉద్యోగాన్ని సంపాదించానని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఆగస్టులో 2011లో ఒక స్టార్టప్లో చేరి ఐదేళ్లపాటు అక్కడే పనిచేశానని అన్నారు. జీతం బాగుండేది, పైగా తాను చేరినప్పుడు 50% కంటే ఎక్కువ జీతం పెరిగిందన్నారు. అలా చివరకు కంపెనీ ద్వారా ఇన్సూరెన్స్, పీఎఫ్ కూడా లభించాయన్నారు. అలా సరిగ్గా 2016లో భార్యతో కలిసి పూణేకు మారారు. అక్కడ బహుళజాతి కంపెనీలలో పనిచేస్తూ..టెక్నికల్ బ్లాగులు రాయడం, శిక్షణా తరగతులు నిర్వహించడం, డెవలపర్ కమ్యూనిటీకి తన వంతు సహకారం అందించడం ప్రారంభించానని అన్నారు. అయితే పనికోసం కుటుంబ జీవితాన్ని అస్సలు త్యాగం చేయొద్దని అన్నారు. ఎందుకంటే ఎనిమిది గంటల కంటే ఎక్కువ పనిచేసినా అదనంగా వేతనం మాత్రం లభించదన్నారు. తన కెరీర్ 2019లో అనూహ్యమైన మలుపు తిరిగిందన్నారు. ఆ సమయంలో యాదవ్ Angular, NgRx వంటి ఓపెన్-సోర్స్ ప్రాజెక్టులకు తన వంతు సహకారం అందించడం ప్రారంభించారు. అలా అనతి కాలంలోనే కమ్యూనిటీలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. అదే ఏడాది తన తొలి కాన్ఫెరెన్స్ ప్రసంగం ఇచ్చాడు. ఆ తర్వాత గూగుల్ డెవలపర్ ఎక్స్పర్ట్ ప్రోగ్రామ్కు దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానం అందింది. అలాగే నవంబర్ 13, 2019న తన పుట్టి రోజున యాంగులర్ కోసం గూగుల్ డెవలపర్ ఎక్స్పర్ట్గా అధికారికంగా ప్రకటించబడ్డారు. ఆ తర్వాత 2020లో తన తోటి డెవలపర్లు నామినేట్ చేయడంతో భారతదేశపు తొలి గిట్హబ్ స్టార్ అయ్యాడు. అతని లింక్డ్ ఇన్ ప్రొఫెల్ ప్రకారం..జనవరి 2026లో జర్మనీలోని కోడ్రాబిట్లో ప్రిన్సిపల్ డెవలపర్ అడ్వకేట్గా మారడానికి ముందు, అవోడాక్ ఏజీ సెలొనిస్ వంటి కంపెనీలతో పనిచేశారు. తన కెరీర్లో 17 ఏళ్లకు పైగా గడిచినా..యాదవ్ ఓపెన్-సోర్స్ సాఫ్ట్వేర్లో ఇప్పటికీ చురుకుగా ఉన్నారు. 50కి పైగా అంతర్జాతీయ ప్రసంగాలు ఇచ్చారు, ప్రపంచవ్యాప్తంగా డెవలపర్లకు మార్గదర్శకత్వం వహిస్తూనే ఉన్నారు.We celebrated our 17th wedding anniversary together in Hamburg, this is the first time we decided to spend it with Hiya, she will be 14 soon.This weekend was all about us 😅.Thank you for everything ❣️ and staying by my side, when we married I was not able to afford anything,… pic.twitter.com/EkmgWLKk7N— Santosh Yadav (@SantoshYadavDev) May 31, 2026 (చదవండి: రాళ్లతో ధ్యాన సాధన..! కళకారుడి అద్భుత టెక్నిక్..) -
రాళ్లతో ధ్యాన సాధన..! కళకారుడి అద్భుత టెక్నిక్..
ధ్యాన సాధన గురించి ప్రముఖ యోగా గురువుల వద్ద శిక్షణ తీసుకుని మరీ ప్రయత్నిస్తుంటాం. అయినప్పటికీ నిలకడ సాధ్యం గాక పట్టు సాధించలేకపోతుంటాం. అలాంటి ధ్యాన సాధనను గౌతమ్ వైష్ణవ్ అనే కళాకారుడు రాళ్లతో అలవోకగా నేర్పిస్తున్నాడు. అదెలాగో తెలిస్తే..విస్తుపోతారు.రాళ్లతో సాధన అంటే..సున్నితమైన ఆకృతుల్లో రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చేలా సమతుల్యం చేయడం. అందుకోసం ఎలాంటి జిగురు ఉపయోగించరు. ఇది కేవలం మన ఏకాగ్రత, ఓపికలకు సంబంధించిన సామర్థ్యం. మరి ఇదెలా ధ్యాన సాధన అవుతుందంటే..ముంబైకి చెందిన కళాకారుడు గౌతమ్ వైష్ణవ్ ధ్యాన చేయడం ఎలా అనేది నేర్పించారు. కేవలం చేసేలా ఈ టెక్నిక్తో బలవంతం చేస్తారు. అంటే వివిధ రాళ్లను వాటిని ఒకదానిపై ఒకటి నిలబడేలా చేసే టెక్నిక్ని నేర్పిస్తారు. అంతే అదే వారిని లోతైన ధ్యాన సాధన చేసేలా చేస్తుంది. ఇక్కడ ఈ టెక్నిక్లో రాళ్లతో మమేకమవ్వుతారు. ఒకదానిపై ఒకటి పెట్టే క్రమంలో ఓపిక, పదే పదే ప్రయత్నాలు..ఏకాగ్రత, నిలకడని పెంపొందిస్తాయి. పైగా ఏ కేంద్రం వద్ద రాయి నిలబడగలదు అనే దానిపై పూర్తి అటెన్షన్ సామర్థ్యం పెంపొంది సులభంగా తనకు తెలియకుండానే ధ్యాన సాధన చేయగలుగుతారు. రాళ్లను సమతుల్యంచేసే కళాత్మక నైపుణ్యం ఏళ్లు గడిచే కొద్ది లోతైన ధ్యాన సాధనగా పరిణామం చెందుతుందట. ఇది ఏకాగ్రత, సహనం, భావోద్వేగ స్థిరత్వం, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. ఈ టెక్నిక్లో రాయి చేప్పేది వింటుంటారు. అదే అన్ని నేర్పిస్తుందని అంటున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో కావాల్సింది కూడా ఇదే. ఇదొక విభిన్నమైన ధ్యాన పద్ధతని గౌతమ్ నొక్కి చెబుతున్నారు. అందుకే తాను ఎవ్వరికి ధ్యానం గురించి భోధించనని, చేసేలా బలవంతం చేస్తానని నవ్వుతూ చెబుతున్నారు. ఆలోచనలను నిశబ్దం చేయడానికి సతమతమయ్యే వాళ్లకు ఈ టెక్నిక్ ఎంతగానో ఉపకరిస్తుందని అంటున్నారు. ఇది పూర్తి మైండ్ఫుల్నెస్ ఆధారిత విధానం అని అంటున్నారు గౌతమ్. దాదాపు 90 నిమిషాల పాటు ఎవరైనా నిరంతరాయంగా రాళ్లను సమతుల్యం చేసేలా దృష్టిసారిస్తే..కచ్చితం మిగతా విషయాలన్నింటి గురించి ఆలోచించడం మానేస్తారని అంటున్నారు. తమకు తెలియకుండానే నిశ్చల స్థితిని అనుభవిస్తారని అంటున్నారు. ధ్యానం అంటేనే ఎలాంటి ఆలోచనలు లేని నిశ్చల స్థితి, శ్వాసపై ధ్యాస అది ఈ టెక్నిక్తో సులభంగా అలవడుతుందని గౌతమ్ చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి..ధ్యాన సాధన సునాయాసంగా నేర్చుకోండి. View this post on Instagram A post shared by Gautam Vaishnav | A Balance Artist (@the.gautamvaishnav)(చదవండి: 52 ఏళ్ల వయసులో సీఏ..! తండ్రి 75వ పుట్టినరోజుకి..) -
నాలుగు నెలల్లో 15 కిలోలు తగ్గాలంటే..! ఈ ఐదు సింపుల్ చిట్కాలతో..
బరువు తగ్గాలంటే చక్కని డైట్లు, ఫోర్స్బుల్ వ్యాయామాలు చేస్తుంటారు. శరీరానికి భారం కలిగించేలా ఇలాంటి వర్కౌట్లతో బరువు తగ్గడం ఎలా ఉన్నా.. సమస్యలే ఎక్కువ. కొందరు తగ్గకపోగా..మరింత బరువు పెరుగుతారు. అలా కాకుండా శరీరానికి హాయినిచ్చేలా సులభంగా చేసే వ్యాయామాలు ఆరోగ్యానికి మేలు చేయడమే గాక సులభంగా బరువు తగ్గగలుగుతారని చెబుతోంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ దిశా. మరి అదెలాగో ఆమె మాటల్లోనే చూద్దామా.!.15 కిలోల బరువును విజయవంతంగా తగ్గించుకున్న ఆమె తన వెయిట్లాస్ జర్నీని సాధారణమైన రోజువారీ జీవనశైలి అలవాట్లతో ప్రారంభించినట్లు తెలిపారు. ఏం చేసినా..స్కిప్ చేయకుండా నిలకడగా చేస్తే తప్పక ఫలితం పొందగలమని అంటోందామె. తాను తీవ్రమైన వ్యాయామాలు, స్ట్రిక్ట్ డైట్ల జోలికి పోకుండా తగ్గానని చెబుతోంది. అందుకోసం ఏం చేసిందో కూడా షేర్ చేశారామె. వాకింగ్..ఇది కార్షియో వ్యాయామంలా పనిచేస్తుంది. కుదిరినప్పుడల్లా మెట్లు ఎక్కండి, లిఫ్టులు వాడండి.నీరు తాగడం..నిద్రలేవగానే నీళ్లు తాగండి, గోరువెచ్చని నీరైనా.మరే ఏవిధంగానైన నీటిని ఎక్కువగా తీసుకుంటూ హైడ్రేటెడ్గా ఉండేలా చేసుకోండి. ఇది జీవక్రియకు సహాయపడుతుంది. దీనివల్ల రోజంతా మన శక్తిని స్థిరంగా ఉంచుతుంది.ఫైబర్ను మర్చిపోవద్దుప్రోటీన్ ముఖ్యమే, కానీ ఫైబర్ కూడా అంతే ముఖ్యమని గుర్తించండి. అదుకోసం భోజనంలో మంచి మొత్తంలో ఫైబర్ను చేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇది మొత్తం జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.ఇంట్లో వండిన ఆహారంప్రాసెస్ చేసిన ఆహారాలకు బదులుగా ఇంట్లో తయారు చేసిన వాటికే ప్రాధాన్యత ఇవ్వండి. దీనివల్ల పదర్థాఆల పరిమాణాలు, వంట పద్ధతులపై ఒక నియంత్రణ ఉంటుంది. అలాగే అధిక సోడియం, ఉప్పుని తగ్గించే వీలు కూడా ఉంటుంది.కేలరీ లోటుతినే ఆహార పరిమాణాలను అర్థం చేసుకోండి. ద్రవరూప క్యాలరీల పట్ల జాగ్రత్త వహించండి. పండ్ల రసాల కంటే ఎల్లప్పుడూ పండ్లనే తినండి. కొవ్వును తగ్గించుకోవడానికి, కొద్దిపాటి కేలరీ లోటును పాటించాల్సి ఉంటుంది.తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని, ఫిట్నెస్ లక్ష్యాలను సాధించాలని చూస్తున్న వారికి, ఈ సాధారణ అలవాట్లు చాలా బాగా హెల్ప్ అవుతాయని చెబుతోంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ దిశా. (చదవండి: 76 కేజీల నుంచి 56 కేజీలకు..! జస్ట్ సింపుల్ వ్యాయమాలతోటే..) -
ఇవాల్టి నుంచే యమునా నది పుష్కరాలు ప్రారంభం
దేవగురువు బృహస్పతి జూన్ 2, మంగళవారం రోజున కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో యమునా నదికి పుష్కరాలు ప్రారంభం అవుతాయి. ఈ పుష్కరాలు జూన్ 13, శనివారం తో ముగుస్తాయి. ఈ పన్నెండు రోజుల పాటు యమునా నది తీరంలో ఆది పుష్కరాలు నిర్వహిస్తారు.యమ బాధలు తీర్చే పవిత్ర స్నానం!పురాణాల ప్రకారం ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి యమునా దేవి కుమార్తె. యమధర్మరాజుకి స్వయాన సోదరి. అందువల్ల యమునా నదిలో పుష్కర స్నానం ఆచరిస్తే యమ బాధలు తొలుగుతాయని విశ్వాసం. సూర్యుడి సంతానంలో యముడు, యమున, శని ప్రాధాన్యత ఎంతో ప్రత్యేకం. ఈ భూమ్మీద మానవుడు చేసే పాప పుణ్యాల కర్మను శని భగవానుడు అనుభవింపజేస్తాడు. జీవుడు ప్రస్తుత జన్మలో, అనేక జన్మల ద్వారా ఏర్పడిన పాప పుణ్య కర్మల ఫలితాలను మరణం తర్వాత యమధర్మరాజు చూస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ యమ బాధలు, పాపాల నుంచి విముక్తి పొందేందుకు యమునా నది స్నానం ఉత్తమమైనదని పేర్కొంటున్నాయి. అందువల్లే, శ్రీకృష్ణుడు స్వయంగా యమునా నది ఒడ్డున జన్మించడంతో పాటు ఈ నదితో ముడిపడి అనేక పురాణ విషయాలు ఉండటం యమున వైభవాన్ని, ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి.భారతీయ సనాతన ధర్మం, పురాణాలలో యమునను కాళిందీ నదిగా పేర్కొన్నారు. 'యమునా నది కృష్ణ ప్రియః' అంటే యమునా నది కృష్ణుడికి ప్రియమైనదిగా చెబుతారు. యమునా నది నీటి స్పర్శ తాకితే పాపాల తొలగుతాయని, మనఃశాంతి, పితృదోష నివారణ,తొలగుతాయని, మనఃశాంతి, పితృదోష నివారణ, ఆత్మశుద్ధి వంటివి కలుగుతాయని విశ్వాసం. మరీ ముఖ్యంగా ఇక్కడ పుణ్యస్నానంతో శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందగలరని శాస్త్రవచనం. ఇంతటి విశేషం, మహత్యం కలిగిన నదికి పుష్కరాలు రావడం, పుష్కరాల్లో భక్తి శ్రద్ధలతో స్నాన విధి ఆచరిస్తే విశేష ఫలితాలు దక్కుతాయని విశ్వాసం.జ్యోతిష శాస్త్రం ప్రకారం.. దేవగురువు అయిన బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు సంభవిస్తుంటాయి (ఉదా: బృహస్పతి మేష రాశిలో ఉంటే గంగా నదికి , వృషభంలో పరాభవ నామ సంవత్సరంలో దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల జూన్ 2 నుంచి 13 వ తేదీ వరకు యమునా నదికి పుష్కరాలు ఏర్పడ్డాయి.ఎక్కడ స్నానమాచరించాలి ?యమునా నది ప్రవహించే కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి పుణ్య ఫలాలు పొందుతారు. ముఖ్యంగా పుష్కరాల సమయంలో సూర్యోదయానికి పూర్వం చేసే స్నానం వలన వెయ్యి గోదానాలు చేసినంత పుణ్యం లభిస్తుందని, మధ్యాహ్న సమయంలో చేసే స్నానం వలన వాజపేయ యాగం చేసిన ఫలితం లభిస్తుందని శాస్త్ర వచనం.ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో పుష్కర స్నానం ఆచరించవచ్చు. గంగా , యమున , సరస్వతి నదులు కలిసే ఈ పవిత్ర సంగమంలో పుష్కర స్నానమాచరించడం విశేష పుణ్యఫలం లభిస్తుంది.మథుర/బృందావనం: శ్రీకృష్ణుడు స్వయంగా జన్మించి తన బాల్యాన్ని గడిపి, లీలలను ప్రదర్శించిన ప్రాంతమిది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఘాట్లలో పుష్కర స్నానం ఎంతో విశేషం.యమునోత్రి: యమునా నది జన్మస్థలం ఇది. ఇక్కడ యమునా నదిని దర్శించుకొని పుష్కర స్నానం ఆచరించడం ఎంతో పుణ్యం.ఇంద్రప్రస్థం (ఢిల్లీ): పాండవులు ఇంద్రప్రస్థాన్ని రాజ్యంగా చేసుకొని అనేక యజ్ఞయాగాదులు చేసిన పవిత్ర ప్రదేశమిది. ఇలా ఈ పుణ్య నది పరిసర ప్రాంతాల్లో పురాణాలకు సంబంధించిన విశేషం ఉన్న ప్రాంతాల్లో పుష్కర స్నానం ఆచరించడం మంచిదిఏయే దానాలు చేస్తే మంచిది ?పుష్కరస్నానం అనంతరం దానం (అన్నదానం గోదానం , భూదానం , సువర్ణదానం , లవణదానం, పుస్తక దానం వంటివి) చేస్తే విశేష పుణ్యఫలం లభిస్తుంది. యజ్ఞ యాగాదులు, హోమాలు వంటివి నిర్వహించడం లేదా ఆయా పవిత్ర కార్యాల్లో పాల్గొనడం వంటివి ఆచరిస్తే పుణ్యం.పుష్కరాల సమయంలో పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు ఆచరించడం వల్ల వారికి సద్గతులు ప్రాప్తిస్తాయని విశ్వాసం. పుష్కరాల్లో పురాణ పఠనం, మంత్రోచ్ఛారణ , భగవన్నామస్మరణ , జపం , తపం వంటివి ఆచరించడం ఉత్తమం.పుష్కరాలంటే సబ్బులు , శాంపూలతో స్నానమాచరించి నదులను కలుషితం చేయడం కాదు. యత్ర స్వచ్ఛః తత్ర లక్ష్మి అన్నారు పెద్దలు. పుష్కరాల్లో స్నాన విధిని అనుసరించి పురుషులు పంచె వంటివి ధరించడం , మహిళలు తమకు సౌకర్యమైన చీరవంటివి ధరించడం, దంపతులైతే భార్య , భర్త కొంగుముడి వేసుకొని భక్తి శ్రద్ధలతో మూడు మునకలతో చేసే స్నానం పుష్కర స్నానం. ఇలా స్నానమాచరించి దేవతలకు, రుషులకు, నదికి అర్ఘ్యం సమర్పించడం, పితృదేవతలకు తర్పణాలు వదలడం వంటివి చేస్తే విశేష పుణ్యఫలం దక్కుతుంది నదులలో చెడు పదార్థాలను విడిచిపెట్టడం పాతకం వీటిని దృష్టిలో ఉంచుకొని పుణ్యార్చన కోసం భక్తి శ్రద్ధలతో పుష్కర స్నానం ఆచరించాలని సూచన.పుష్కర స్నాన మహత్యంనదీ జలాలను సేవిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని, నదీ జలాలలో స్నానమాచరిస్తే మాంద్యం, అలసత్వం మొదలైన శారీరక రుగ్మతలు నశిస్తాయని తైత్తరీయ ఉపనిషత్తు వివరిస్తుంది. పుష్కర స్నానం వలన మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుంది. మనం కూడా యమునా నది పుష్కరాలలో స్నానమాచరించి మోక్షాన్ని పొందుదాం. (చదవండి: శ్రీ కోదండరామాలయంలో ఆధ్యాత్మిక వైభవం.) -
చద్దన్నం తినడం మంచిదా? కాదా?..
మిగిలిపోయిన అన్నాన్ని నీటిలో, పెరుగులో లేదా మజ్జిగలో నానబెట్టి మరుసటి రోజు తినడం ఒకప్పుడు మన ఇళ్లలో సాధారణ అలవాటు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చద్దన్నం ఉదయపు ఆహారంలో అంతర్భాగంగా ఉండేది. అయితే కాలం మారేకొద్దీ ఈ అలవాటు క్రమంగా కనుమరుగవుతోంది. రాత్రంతా నానబెట్టిన అన్నం ఆరోగ్యానికి మంచిది కాదనే అభిప్రాయం చాలామందిలో బలపడింది. కానీ తరతరాలుగా కొనసాగుతున్న ఈ ఆహారపు అలవాటు వెనుక నిజంగా ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? చద్దన్నం కేవలం పాతకాలపు ఆహారమేనా, లేక ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఇందులో నిజంగానే దాగి ఉన్నాయా?.. సైన్స్ మరోసారి ఈ అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేసింది.. వండిన అన్నాన్ని రాత్రంతా నీటిలో నానబెడితే ఉదయానికి సహజ కిణ్వ ప్రక్రియ (ఫెర్మెంటేషన్) ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియలో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా పెరిగి, అన్నంలోని సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను విచ్ఛిన్నం చేస్తాయి. దీంతో అన్నం మరింత సులభంగా జీర్ణమవుతుంది. ఇది కేవలం పుల్లటి రుచిని ఇవ్వడమే కాదు.. శరీరానికి ఉపయోగపడే మంచి సూక్ష్మజీవుల పెరుగుదలకు కూడా దోహదపడుతుంది. అందుకే చద్దన్నాన్ని సహజ ఫెర్మెంటెడ్ ఆహారంగా పరిగణిస్తారు.మిగిలిపోయిన అన్నం.. పోషకాల నిల్వ?ఫెర్మెంటేషన్ వల్ల ఆహారంలోని కొన్ని పోషకాలు శరీరానికి మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బీ-కాంప్లెక్స్ విటమిన్ల లభ్యత పెరగడంతో పాటు ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలను శరీరం మరింత సమర్థంగా గ్రహించగలుగుతుంది. సాధారణంగా ఆహారంలోని కొన్ని పదార్థాలు ఖనిజాల శోషణకు అడ్డుపడతాయి. ఫెర్మెంటేషన్ ఆ అవరోధాలను తగ్గించడం వల్ల పోషకాలు మరింత ఉపయోగకరంగా మారుతాయి.గట్ హెల్త్పై ఎందుకింత చర్చ?ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా "గట్ హెల్త్" అంటే పేగుల ఆరోగ్యం గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. మన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, శరీర పోషకాల శోషణలో కీలక పాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గట్ హెల్త్ను మెరుగుపరిచే ఆహారాలపై ఆసక్తి పెరిగింది.ఇక్కడే చద్దన్నం ప్రాధాన్యం పెరుగుతోంది. ఖరీదైన ప్రోబయోటిక్ డ్రింక్స్, సప్లిమెంట్లకు బదులుగా ఇందులో సహజంగా ఏర్పడే లాక్టోబాసిల్లస్ వంటి మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరచడంలో, కడుపు ఉబ్బరం తగ్గించడంలో, మలబద్ధకం వంటి సమస్యలను నియంత్రించడంలో సహాయపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.వేసవిలో ఎందుకు ఎక్కువగా తినేవారు?భారతదేశంలో చద్దన్నం సంప్రదాయం ఎక్కువగా వేసవికాలంలో కనిపించడం యాదృచ్ఛికం కాదు. ఇది శరీరాన్ని చల్లబరచడంలో, హైడ్రేట్గా ఉంచడంలో సహాయపడుతుంది. చద్దన్నంలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో శరీరానికి తేమ అందుతుంది. అలాగే ఫెర్మెంటేషన్ వల్ల ఏర్పడే లాక్టిక్ యాసిడ్ శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఒకప్పుడు రైతులు, కూలీలు ఎండలో పనికి వెళ్లే ముందు చద్దన్నం తినేవారు. ఇది కడుపు నిండిన భావనను కలిగించడంతో పాటు రోజంతా శక్తిని అందించేదని పెద్దలు చెబుతుంటారు.ఎలా తింటే మంచిది?రాత్రి మిగిలిన అన్నాన్ని శుభ్రమైన పాత్రలో నీటితో నానబెట్టి, ఉదయం పెరుగు లేదా మజ్జిగ కలిపి తినవచ్చు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు జోడిస్తే రుచితో పాటు పోషక విలువలు కూడా పెరుగుతాయి. కొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం మట్టి పాత్రలో నానబెడితే సహజ ఫెర్మెంటేషన్కు మరింత అనుకూలంగా ఉంటుంది.అందరికీ సరిపోతుందా?చద్దన్నం చాలామందికి మేలు చేసినా.. ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా సరిపోతుందని చెప్పలేం. మధుమేహం ఉన్నవారు పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అలాగే జీర్ణకోశ సమస్యలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యులు లేదా పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.మొత్తానికి... చద్దన్నం గురించి ఇన్నాళ్లూ ఉన్న అనుమానాలకు శాస్త్రం ఆసక్తికరమైన సమాధానం చెబుతోంది. ఇది ఏదో అద్భుత ఔషధం కాకపోయినా.. సహజ ఫెర్మెంటేషన్ వల్ల జీర్ణక్రియకు, పేగుల ఆరోగ్యానికి, వేసవిలో శరీరానికి తేమ అందించడంలో ఉపయోగపడే సంప్రదాయ ఆహారంగా గుర్తింపు పొందుతోంది. ఒకప్పుడు "మిగిలిపోయిన అన్నం"గా తక్కువగా చూసిన చద్దన్నం.. ఇప్పుడు శాస్త్రీయ పరిశోధనల్లో కొత్త కోణంలో కనిపిస్తోంది. ఖరీదైన ఆరోగ్య ఆహారాల కోసం వెతుకుతున్న ఈ కాలంలో.. మన వంటింట్లోనే తరతరాలుగా ఉన్న ఈ సాధారణ ఆహారం వెనుక దాగి ఉన్న విజ్ఞానాన్ని సైన్స్ మరోసారి గుర్తు చేస్తోంది. -
30 వేల అగ్గిపెట్టెల్లో దేశ ఘన చరిత్ర
రెండు చేతులూ జోడించి నమస్కరిస్తే భక్తి... అదే రెండు చేతుల మధ్య ఒక చిన్న అగ్గిపుల్లను గీస్తే అది సృష్టి.. మానవ నాగరికత పరిణామ క్రమంలో ఎన్నో సామ్రాజ్యాలు కూలిపోయాయి. మరెన్నో సాంకేతిక విప్లవాలు దూసుకొచ్చాయి. కానీ, వాటన్నిటికీ నిశ్శబ్ద సాక్షిగా నిలిచింది మాత్రం మన వంటింట్లో ఉండే ఒక చిన్న ‘అగ్గిపెట్టె’. ఒకప్పుడు అడవిలో మంటను వెలిగించడానికి మానవుడు శతాబ్దాల పాటు శ్రమించాల్సి వచ్చేది. అలాంటిది, కాలక్రమేణా ప్రపంచాన్ని మార్చేసిన పారిశ్రామిక విప్లవాన్ని, కళలను, సామాజిక మార్పులను తన చిన్న కాగితపు పెట్టెలో బంధించిందో అగ్గిపెట్టె. కేవలం నిప్పును పుట్టించే సాధనంగానే కాకుండా... ఒకనాటి వైభవాన్ని, స్వాతంత్ర్య ఉద్యమ ప్రచారాలను, నాటి సామాజిక పరిస్థితులను తనపై ముద్రించుకున్న లేబుల్స్ ద్వారా నేటికీ మన కళ్లకు కడుతోంది. అంతటి ఘనత కలిగిన అగ్గిపెట్టె చరిత్రను తన అవిరళ కృషితో మనముందుంచారు కోల్కతాకు చెందిన సావిక్ రాయ్..పశ్చిమ బెంగాల్లోని కోల్కతా సమీపంలోని సోనార్పూర్కు చెందిన 62 ఏళ్ల సౌవిక్ రాయ్.. మనం నిత్యం వాడి పారేసే అగ్గిపెట్టెలను ఒక చారిత్రక నిధిగా మార్చేశారు. గత 15 ఏళ్లుగా ఆయన సేకరించిన 30,000కు పైగా అగ్గిపెట్టెలు.. కేవలం పాత వస్తువులు కావు, అవి ఒకప్పటి సామాజిక, రాజకీయ, కళాత్మక పరిణామాలకు సజీవ సాక్ష్యాలు.ఒక చిన్న ఆలోచన నుంచి గొప్ప ప్రస్థానంచిన్నతనంలో స్టాంపులు, కాయిన్స్ సేకరించడం అందరికీ తెలిసిన విషయమే. కానీ సౌవిక్ రాయ్ దృష్టి మాత్రం ఎవరూ ఊహించని అగ్గిపెట్టెలపై పడింది. 2009లో అరుదైన వస్తువుల సేకరణలో ఉన్న నెట్వర్క్తో పరిచయం పెరిగాక, అగ్గిపెట్టెలు కేవలం వెలిగించే వస్తువులు కావని, అవి ఒకప్పటి కాలానికి చెందిన ‘టైమ్ క్యాప్సూల్స్’ అని ఆయన గుర్తించారు.15 ఏళ్ల కృషి.. అమూల్యమైన డాక్యుమెంటేషన్ఒక అగ్గిపెట్టెను సేకరించడం అంటే దాన్ని ప్లాస్టిక్ కవర్లో దాచడం కాదు, దాని చరిత్రను డాక్యుమెంట్ చేయడం అని సౌవిక్ నమ్ముతారు. ఒక్కో అగ్గిపెట్టె తయారీదారు, అది తయారైన కాలం, దానిపై ఉన్న డిజైన్ పరిణామంపై ఆయన ఎంతో పరిశోధన చేశారు. వాటిని ఒక క్రమ పద్ధతిలో అమర్చితే, బెంగాల్ చరిత్రపై ఒక పూర్తి స్థాయి పాఠం నేర్చుకోవచ్చని ఆయన చెబుతున్నారు.1870ల నుంచి మొదలై..భారతదేశంలో అగ్గిపెట్టెల వాడకం 1870లలో ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకోవడంతో మొదలైంది. ప్రారంభంలో ఇవి చెక్కతో తయారయ్యేవి. సౌవిక్ తన సేకరణ కోసం సుమారు 7,000 అగ్గిపెట్టెల లేబుల్స్ ఉన్న ఒక పాత సేకరణను భారీ మొత్తానికి కొనుగోలు చేశారు. ఆ లేబుల్స్ దెబ్బతిన్న స్థితిలో ఉన్నప్పటికీ, వాటిని ఆరు నెలల పాటు శ్రమించి అధ్యయనం చేయడం తన జీవితంలో ఒక మలుపు అని ఆయన గుర్తుచేసుకుంటారు.అగ్గిపెట్టెలపై భారతీయ బొమ్మలు19, 20వ శతాబ్దాల్లో జపాన్, స్వీడన్ దేశాలు అగ్గిపెట్టెల ఎగుమతిలో అగ్రస్థానంలో ఉండేవి. భారతీయ మార్కెట్లో తమ పట్టు పెంచుకోవడానికి, జపాన్ తయారీదారులు ఏనుగులు, భారతీయ దేవతలు, సంస్కృతికి సంబంధించిన బొమ్మలను అగ్గిపెట్టెలపై ముద్రించేవారు. విదేశీయులు కూడా మన మార్కెట్ కోసం తమ కళను ఎలా మార్చుకున్నారో సౌవిక్ సేకరణలో స్పష్టంగా కనిపిస్తుంది.కోల్కతాలోనే 136 అగ్గిపెట్టెల ఫ్యాక్టరీలుచాలా మంది అగ్గిపెట్టెల తయారీ కోల్కతాలో లేదని భావిస్తారు. కానీ తన దగ్గర ఉన్న ఆధారాలతో అక్కడ ఒకప్పుడు 136 ఫ్యాక్టరీలు ఉండేవని సౌవిక్ నిరూపిస్తున్నారు. 1892-93 నాటి డాక్యుమెంట్లు, 1960ల నాటి యుద్ధ కాలంలో నాశనమైన ఫ్యాక్టరీల వివరాలు ఆయన వద్ద ఉన్నాయి. బెంగాల్లో ఒకప్పుడు 400 మంది పనిచేసే అగ్గిపెట్టెల పరిశ్రమ ఉండేదని ఆయన గుర్తుచేస్తున్నారు.బెంగాల్ నుంచి శివకాశికి..ఒకప్పుడు బెంగాల్లోనే పునాదులు పడిన ఈ పరిశ్రమ, కాలక్రమేణా తమిళనాడులోని శివకాశికి ఎందుకు మారిందో సౌవిక్ వివరిస్తారు. 1920లలో శివకాశి పారిశ్రామికవేత్తలు కోల్కతాకు వచ్చి ఇక్కడ తయారీని నేర్చుకున్నారు. తక్కువ కూలీ, మెరుగైన ముద్రణ వ్యవస్థ, పంపిణీ నెట్వర్క్ ఉండటంతో, శివకాశి ఈ వ్యాపారాన్ని పూర్తిగా కైవసం చేసుకుంది. ఇది బెంగాల్లోని పరిశ్రమ పతనానికి దారితీసింది.కళాఖండాలుగా మారిన అగ్గిపెట్టెల బొమ్మలుఈ చిన్న అగ్గిపెట్టెలు కాలక్రమేణా భారతదేశ సామాజిక మార్పులకు అద్దం పట్టాయి. రాజా రవివర్మ చిత్రలేఖనాల నుంచి వందేమాతరం నినాదాలు, అశోక చక్రం, కోల్కతా ట్రామ్స్, చారిత్రక కట్టడాల వరకు ప్రతిదీ వీటిపై ముద్రితమయ్యేవి. ఇవి కేవలం అగ్గిపెట్టెలు కావు.. చిన్న కాన్వాస్లపై గీసిన భారతదేశ సామాజిక చరిత్ర అని ఆయన చెబుతారు.ప్రభుత్వ గుర్తింపు కోరుతున్న చరిత్రకారుడు30,000 అగ్గిపెట్టెలు ఉన్నాయన్న గర్వం ఆయనకు లేదు. తన సేకరణకు ప్రభుత్వ మద్దతు లభిస్తే, ఆ సామాజిక చరిత్రను భావితరాలకు భద్రపరచవచ్చని ఆయన ఆశిస్తున్నారు. సంఖ్య కంటే కూడా, ఆ వస్తువులను ఒక శాస్త్రీయ పద్ధతిలో ఆర్కైవ్ చేయడమే తన ప్రధాన లక్ష్యమని సౌవిక్ రాయ్ చెబుతున్నారు.ఇది కూడా చదవండి: పోలీసులకు చిక్కలేదు.. బాలీవుడ్కు దొరకలేదు! -
మతి మరపు @ అతి బరువు
వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు వస్తుండటం సహజం. ఇప్పడు పెరిగే వయసుతో పాటూ పెరిగే బరువు కూడా మతిమరపును ప్రేరేపిస్తోందంటూ కొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇందులో అత్యంత సాధారణం అల్జీమర్స్ అనే మతిమరపు. దీనికి పెరిగే వయసుతో పాటు బరువు పెరుగుతుండట కూడా అల్జీమర్స్కూ అంతే కారణమవుతోందనేందుకు పరిశోధనల రూపంలో తార్కాణాలు లభ్యమవుతున్నాయి. ఇలా బరువు పెరుగుతుండటంతో పాటు అల్జీమర్స్కు కారణమవుతున్న ఇతర అంశాలేమిటన్నది తెలుసుకుంటూ బరువు తగ్గించుకోవడం ద్వారా మెదడు ఆరోగ్యం ఎలా మెరుగవుతుందో చూద్దాం...మతిమరపును ఇంగ్లిష్లో ‘డిమెన్షియా’ అంటారు. డిమెన్షియాకు కారణాల్లో అత్యంత సాధారణమైనది ‘అల్జీమర్స్’. డిమెన్షియా కొత్త అంశాల్ని నేర్చుకునేందుకు సహాయపడే (కాగ్నిటివ్) నైపుణ్యాల్లోని జ్ఞాపకశక్తి (మెమరీ)పైనా, తార్కికంగా ఆలోచించే సామర్థ్యం (రీజనింగ్)పైనా ప్రతికూలంగా ప్రభావం చూపుతుంది. ఇటీవలి కాలంలో అల్జీమర్స్ బాగా పెరుగుతోంది. ఇది అకస్మాత్తుగా కాకుండా క్రమంగా... అంటే కొన్ని నెలలు మొదలుకొని ఏళ్ల వ్యవధిలోమరచిపోయే అంశాలను పెంచుతూ పోతుంటుంది. ఉదాహరణకు మొదట్లో పేర్లు, కొద్దిసేపటి కిందట జరిగిన సంఘటనలూ, ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేకపోవడం, కుటుంబ సభ్యుల్ని అడిగిన ప్రశ్నల్నే మళ్లీ మళ్లీ అడగడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, అటు తర్వాత తెలిసిన దారులనూ, అటు తర్వాత సమీప వ్యక్తులనూ, కుటుంబ సభ్యులను మరచిపోవడం జరుగుతుంది. చివరగా... భయభ్రాంతులకు లోనవ్వడం, మలమూత్ర విసర్జనలపై నియంత్రణ కోల్పోవడం వరకు జరగవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే నేర్చుకున్న అనేక అంశాలు రాతిమీది రాతల్లా ఉండిపోవాల్సినవి కాస్తా... పలక మీద రాతలా చెరిపివేతకు గురవ్వడాన్ని అల్జీమర్స్గా చెప్పవచ్చు. ఒకసారి అల్జీమర్స్ మొదలయ్యాక బాధితుల్ని మునపటిలా పూర్తిగా నార్మల్ అయ్యేలా చేయడం ఇప్పటికి సాధ్యం కాదు.చికిత్స...అల్జీమర్స్ను పూర్తిగా తగ్గించే మందులు లేకపోయినప్పటికీ... వాటి పురోగతిని ఆలస్యం చేయడానికి మందులు అందుబాటులో ఉన్నాయి. లక్షణాల తీవ్రత ఆధారంగా డోనెపెజిల్, రివాస్టిగ్మిన్, మెమాంటిన్, గ్యాలంటమైన్ వంటి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. మెదడులోని అన్నిరకాల కార్యకలాపాలను నిర్వహించే ఎసిటైల్ కోలిన్ అనే రసాయనం సరైన మోతాదుల్లో ఉంచడానికి ఇవి ఉపయోగపడతాయి. గత కొద్దికాలం కిందట ‘లెకనిమ్యాబ్’, ‘డొనానిమ్యాబ్’ అనే సరికొత్త మందుల్ని ఎఫ్డీఏ ఆమోదించింది. పైవన్నీ నోటిద్వారా తీసుకునే మందులు కాగా... లెకానిమ్యాబ్ను రెండోవారాలకు ఒకసారి సూది మందు రూపంలో ఇస్తారు. ఈనెలలోనే (మే, 2026లో) ‘డొనానిమ్యాబ్’ అనే సరికొత్త మందు మనకు అంటే రెండు తెలుగు రాష్ట్రాలకూ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఈ మందు అల్జీమర్స్ తొలిదశలో ఇది అత్యంత ప్రభావవంతమైనది. దీన్ని నెలకొక ఇంజెక్షన్ చొప్పున తీసుకోవాలి.పెరిగే బీఎమ్ఐతో జ్ఞాపకశక్తి తగ్గు తున్నా... అది నివారించగలిగే అంశమే... యూనివర్జిటీ ఆఫ్ జార్జియాలో నిర్వహించిన ఇటీవలి తాజా పరిశోధన ఫలితాలేమిటంటే... వయసు పెరుగుతున్న కొద్దీ వారి జ్ఞాపకశక్తి గతంలో వారు యువకులుగా ఉన్నంతగా ఉండకపోవచ్చు. దీనికి తోడు పెరుగుతున్న బరువు (బాడీ మాస్ ఇండెక్స్–బీఎమ్ఐ) పెరుగుతున్న కొద్దీ వారిలోనూ అభ్యాసనం ద్వారా నేర్చుకునే (కాగ్నిటివ్) నైపుణ్యాలూ, గుర్తుంచుకునే సామర్థ్యాలు (మెమరీ), భావోద్వేగాల అదుపు (మేనేజింగ్ ఎమోషన్స్), ప్లానింగ్ అలాగే నిర్వహణ సామర్థ్యాలూ, ఏకాగ్రత (కాన్సంట్రేషన్) తగ్గుతాయని తేలింది. 24 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వారిలో దాదాపు 8,200 మందిపై నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అయితే ఇదేమీ చెడు వార్త కాదనీ... ఒకవేళ మనం మన బరువును అదుపులో పెట్టుకుంటే ఆ దుష్పరిణామాలు నివారించవచ్చని ఈ అధ్యయనంలో పాల్గొన్న యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో కాలేజ్ ఆఫ్ పబ్లిక్ హెల్త్కు చెందిన లీడ్ ప్రొఫెసర్ డాక్టర్ సుహాంగ్ సాంగ్ పేర్కొన్నారు.నివారణ... పై అంశాలలో పెరిగే వయసు, జన్యుపరమైన అంశాలు నిరోధించలేనివి. ఇవి మినహా మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ను చాలావరకు ప్రయత్నపూర్వకంగా అదుపులో ఉంచడం ద్వారా వీటిని చాలావరకు నివారించవచ్చు. ఈ కింది అంశాలు నివారణకు చాలావరకు తోడ్పడతాయి.ఆహారం... పోషకాలన్నీ ఉండే సమతులాహారం తీసుకోవడం మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా భారతీయ వంటల్లో వాడే పసుపుతో పాటు పాశ్చాత్య ఆహారాల్లో మెడిటేరియన్ డైట్ (ఆల్మండ్స్, వాల్నట్, డార్క్ చాక్లెట్స్, ఆలివ్ ఆయిల్, క్రాన్బెర్రీ) వంటివి మతిమరపు నివారణకు బాగా తోడ్పడతాయి.మెదడుకు మేత కొత్త భాషలు నేర్చుకోవడం, పుస్తక పఠనం, పజిల్స్ వంటి సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం వంటి మెదడుకు మేత కల్పించే పొడుపుకథలు, ఉల్లాసంగా ఉంచే హాబీలు, మానసిక వ్యాయామాలు మెదడును చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంచి మతిమరపు నివారణకు తోడ్పడతాయి.వ్యాయామం...దేహాన్ని చురుగ్గా ఉంచే వ్యాయామాలు చేయాలి. దాంతో మెదడుకు రక్తప్రసరణ బాగాజరిగి, న్యూరాన్లూ వాటి న్యూరల్ కనెక్షన్లు, వివిధ జీవక్రియల కోసం మెదడు స్రవించే రసాయనాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. ఫలితంగా జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.నిర్ధారణ అల్జీమర్స్ నిర్ధారణ కోసం ఇప్పడు కొన్ని రకాల పరీక్షలు కూడా అందుబాటులోకి వచ్చాయి. గతంలోని ఎమ్మారై బ్రెయిన్తో పాటు కొన్ని రక్తపరీక్షలూ ఇప్పుడ అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి టీఏయూ (టావు) అండ్ అమైలాయిడ్ శాతాన్ని నిర్ధారణ చేయడం; అమైలాయిడ్ పెట్ స్కాన్ ద్వారా అల్జీమర్స్ను నిర్ధారణ చేయవచ్చు. ఇవి చాలా తాజాగా అందుబాటులోకి వచ్చిన వైద్యపరీక్షలు.సమాజంలో నలుగురితో పాటు ఒకరిగా మెలగడం...వేడుకలు, పుట్టినరోజులూ, పెళ్లిళ్ల వంటి ఫంక్షన్లలో పదిమందినీ కలవడం వంటివి మతిమరపును దూరం చేస్తుంది. అలాంటి ఉల్లాస జీవితం వల్ల భవిష్యత్తులో అల్జీమర్స్ వచ్చే ముప్పూ తగ్గుతుంది.దీర్ఘకాలిక వ్యాధుల అదుపు...డయాబెటిస్, హైబీపీ, క్రానిక్ ఇన్ఫ్లమేషన్స్ వంటి వాటిని అదుపులో పెట్టుకోవాలి.మతి మరుపు, అల్జీమర్స్ కారణమయ్యే అంశాల్లో కొన్ని...మతిమరుపునకూ, అల్జీమర్స్కూ అనేక అంశాలు కారణమవుతుంటాయి. వాటిల్లోని అతి ముఖ్యమైన ఓ అరడజను కారణాలేమిటో చూద్దాం...1. జన్యుపరమైనవి : అల్జీమర్స్తో వచ్చే మతిమరుపునకు జన్యుపరమైన అంశాలు అతి ముఖ్య కారణాలు. కొందరి కుటుంబాల్లో అల్జీమర్స్ వంశాపారంపర్యంగా కనిపిస్తుంటుంది. ఏపీఓఈ 4 ఎల్లీల్ జన్యువు వంటి కొన్ని నిర్దిష్టమైన జన్యువులు ఈ అల్జీమర్స్ ముప్పును పెంచుతాయి.2. వయసు : పెరుగుతున్న వయసు పై సమస్యలకు ప్రధానమైన ముప్పు (రిస్క్ ఫ్యాక్టర్). పైగా ఇది నిరోధించలేని అంశం.3. పెరుగుతుండే బరువు : అధిక బరువు / ఊబకాయం (ఒబేసిటీ) వల్ల దేహంలో కొవ్వుల మోతాదు పెరగడమనే అంశం అల్జీమర్స్ వ్యాధి వచ్చే ముప్పును పెంచుతుందని ఇటీవల కొన్ని తాజా అధ్యయనాల్లో తేలింది. దేహంలోనూ, అందునా మరీ ముఖ్యంగా నడుము చుట్టూ కొవ్వు పెరగడంతో పాటు ఫిట్నెస్ తగ్గడమనే అంశం మెదడును మందకొడిగా మార్చడంతో పాటు మతిమరపును తెచ్చిపెట్టే ప్రమాదమైన సిగ్నల్స్ కారణంగా అల్జీమర్స్ వస్తుందనేది కొన్ని పరిశోధనల్లో తేలిన అంశం.4. జీవనశైలి (లైఫ్ స్టైల్) : ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించినవారిలో... అంటే... ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం, కొవ్వులు, చక్కెరలు ఎక్కువగా తీసుకోవడం, చురుకైన జీవితానికి దూరంగా ఒకేచోట మందకొడిగా ఉండటం, వ్యాయామం లేకుండా బద్ధకంగా ఉండటం, పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం వంట అనారోగ్యకరమైన జీవనశైలి ఉన్నవాళ్లలో అల్జీమర్స్ ముప్పు ఎక్కువ.5. దేహంలో దాగి ఉన్న ఇతర సమస్యలు : దీర్ఘకాలికంగా ఉండే డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు (కార్డియో వాస్క్యులార్ సమస్యలు)లతో పాటు దీర్ఘకాలికంగా దేహంలో ఉండే ఇన్ఫ్లమేషన్ (క్రానిక్ ఇన్ఫ్లమేషన్) మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతూ అల్జీమర్స్కు కారణమయ్యే అవకాశాలెక్కువ.6. వాతావరణ అంశాలు : వాతావరణంలోని కాలుష్యాలు, విషపూరిత (టాక్సిక్) పదార్థాలు కూడా అల్సైమర్స్ మతిమరపునకు కారణమవుతాయి. దీనికి విరుధ్ధంగా వీలైనంతవరకు పరిశుభ్రమైన ప్రదేశాలూ, కాలుష్యాలు లేని వాతావరణాలూ వీటి నివారణకు చాలావరకు తోడ్పడతాయి.- డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డిసీనియర్ న్యూరో ఫిజీషియన్ నిర్వహణ యాసీన్ -
చిన్న పొరపాటు.. లక్షకు పైగా ట్రాఫిక్ చలానా!
విదేశీ పర్యటన అంటే.. ఎవరికైనా మధుర జ్ఞాపకాలు, అందమైన ఫొటోలు, కొత్త అనుభవాలు గుర్తుకు వస్తాయి. కానీ ఓ భారతీయ మహిళకు మాత్రం అదొక చేదు అనుభవాన్నే మిగిల్చింది. హాయిగా ఫారిన్ ట్రిప్పు పూర్తి చేసుకుని వచ్చిన ఆమెకు.. ఏడాది తర్వాత పెద్ద షాకే తగిలింది. అది చూసి ఖంగుతినడం.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. అయ్యో ఆంటీ అనుకోవడం నెటిజన్ల వంతు అవుతోంది. పోన్ సప్డీ అనే మహిళ తన స్విట్జర్లాండ్లో పర్యటన సందర్భంగా ఎదురైన అనుభవాన్ని ఇప్పుడు నెట్టింట పంచుకుంది. ఆ సమయంలో జరిగిన ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించిన జరిమానా ఏడాది తర్వాత అందిందని వెల్లడించారు. ‘‘స్విట్జర్లాండ్ టూర్ నుంచి వచ్చి దాదాపు ఏడాది అవుతోంది. ఇప్పుడు దాదాపు లక్ష రూపాయలకు పైగా(ఇండియన్ కరెన్సీ ప్రకారం) జరిమానా నోటీసు వచ్చింది. దీనిపై అప్పీల్ చేసే అవకాశం ఉందా? జరిమానా తగ్గించుకోవచ్చా? లేక ఆలస్య రుసుమును మాఫీ చేయించుకోవచ్చా?’’ అని ఆమె ప్రశ్నించారు.ఈ పోస్ట్ వైరల్గా మారగా.. లక్షలాది మంది స్పందించారు. కొందరు తమ అనుభవాలను పంచుకోగా, మరికొందరు స్విట్జర్లాండ్లో ట్రాఫిక్ నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో వివరించారు. అక్కడ జరిమానాలు ఆదాయం, ఉల్లంఘన తీవ్రత ఆధారంగా భారీగా ఉంటాయని, అద్దె కార్లు తీసుకున్న పర్యాటకుల వివరాలను రెంటల్ కంపెనీలు అధికారులకు అందిస్తాయని పేర్కొన్నారు.Has anyone here received a traffic violation fine from Switzerland months after returning from a vacation?We just received a challan of almost ₹1 lakh, nearly a year after our trip. We’re trying to understand if there’s any way to appeal, reduce, or get it waived.— Poan Sapdi (@Poan__Sapdi) May 30, 2026‘‘జరిమానాను నిర్లక్ష్యం చేస్తే వడ్డీలు పెరుగుతాయి. భవిష్యత్తులో షెంగెన్ వీసా లేదంటే యూరప్ పర్యటనలపై ప్రభావం పడే అవకాశం ఉంది’’ అని పలువురు హెచ్చరించారు. మరికొందరు జరిమానా మొత్తంపై అభ్యంతరం వ్యక్తం చేయవచ్చని, ముఖ్యంగా ఏడాది ఆలస్యంగా సమాచారం అందిన నేపథ్యంలో లేట్ ఫీజుపై అప్పీల్ చేసే అవకాశం ఉందని సూచించారు. దీనిపై స్పందించిన మహిళ.. ‘‘జరిమానా చెల్లించకుండా ఉండాలనుకోవడం లేదు. కానీ ఏడాది తర్వాత సమాచారం అందినందున ఆలస్య రుసుముపై అభ్యంతరం చెప్పాలనుకుంటున్నాం’’ అని తెలిపారు.ఈ ఘటనతో విదేశాలకు వెళ్లే భారతీయ పర్యాటకుల మధ్య మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా యూరప్లో అద్దె కార్లు తీసుకునే వారు స్థానిక ట్రాఫిక్ నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలని, చిన్న పొరపాటు కూడా భారీ జరిమానాలకు దారితీయవచ్చని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. సెలవుల జ్ఞాపకాలు మసకబారిపోయిన తర్వాత కూడా విదేశీ ట్రాఫిక్ కెమెరాలు మాత్రం తమ పని మరిచిపోవని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.షెంగెన్ వీసా (Schengen Visa) అనేది ఐరోపాలోని షెంగెన్ ఒప్పందంలో భాగమైన పలు దేశాల్లో ఒకే వీసాతో ప్రయాణించేందుకు అనుమతించే వీసా. ఈ వీసా ఉంటే ఒక్కో దేశానికి విడిగా వీసా తీసుకోవాల్సిన అవసరం లేకుండా షెంగెన్ ప్రాంతంలోని దేశాల మధ్య స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు. ఈ లిస్ట్లో ప్రస్తుతానికి 29 దేశాలు ఉన్నాయి. పైకేసులో.. స్విట్జర్లాండ్లో విధించిన ట్రాఫిక్ జరిమానాను చెల్లించకుండా వదిలేస్తే భవిష్యత్తులో షెంగెన్ దేశాలకు వీసా దరఖాస్తు చేసుకునే సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని నెటిజన్లు హెచ్చరించారు. -
ఆ పాట లతాజీది కాదండీ.. నాదే!
ఆ స్వరం వినిపిస్తే చాలు… చెవుల్లో తేనె పోసినట్లు, మనసు ఎక్కడో మెల్లగా తేలిపోతున్న అనుభూతి కలిగేది. రేడియోలో అలనాటి పాటలు మోగుతుంటే చాలామంది “ఆహా.. ఎంతైనా లతా మంగేష్కర్ గారే కదా… ఆ గాత్రం అంత మధురంగా ఉంటుందో!” అని మురిసిపోయేవారు. కానీ ఆ మాధుర్యానికి మూలం ప్రతిసారి లతా మంగేష్కర్ స్వరం మాత్రమే కాదు. ఆ కాలంలో అంతే మృదువుగా, అంతే హృద్యంగా శ్రోతలను ఆకట్టుకున్న మరో గొంతు సుమన్ కళ్యాణ్పూర్ది కూడా. వినేవారిని గందరగోళంలో పడేసేంత సమానతతో, ఆమె గాత్రం లతా గాత్రానికి ఏమాత్రం తగ్గకుండా అదే మాధుర్యాన్ని, అదే భావాన్ని మనసులో నిలిపేది.అలనాటి మధుర గాన గంధర్వి, ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్పూర్ 89 ఏళ్ల వయసులో కన్నుమూశారు. వయోభారంతో ముంబైలోని తన నివాసంలో ఆమె ప్రశాంతంగా తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఆమె మరణంతో భారతీయ సినీ సంగీత స్వర్ణయుగానికి చెందిన మరో గొప్ప స్వరం మూగబోయింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆమెకు నివాళులర్పిస్తున్నారు.1937 జనవరి 28న అప్పటి బ్రిటీష్ భారతదేశంలోని ఢాకాలో (ప్రస్తుత బంగ్లాదేశ్) సుమన్ హెమ్మాడిగా జన్మించిన ఆమె చిన్నతనంలోనే కుటుంబంతో కలిసి ముంబైకి వచ్చారు. సంగీతం, చిత్రలేఖనం రెండింటిపైనా ఆసక్తి ఉన్న ఆమె ముంబైలోని ప్రముఖ సర్ జే.జే. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో చదువుకున్నారు. అయితే అభిరుచిగా ప్రారంభమైన సంగీత ప్రయాణమే తర్వాత ఆమె జీవితాన్ని మలిచింది. హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకుని 1950లలో సినీ గాన రంగంలో అడుగుపెట్టారు. 1960, 70 దశకాల్లో ఆమె స్వరం దేశవ్యాప్తంగా మార్మోగింది. “నా తుమ్ హమే జానో”, “ఆజ్కల్ తేరే మేరే ప్యార్ కే చర్చే”, “తుమ్నే పుకారా ఔర్ హమ్ చలే ఆయే”, “నా నా కర్తే ప్యార్”, “దిల్ ఏక్ మందిర్ హై” వంటి పాటలు సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా Mohammed Rafiతో కలిసి పాడిన యుగళగీతాలు అపార ప్రజాదరణ పొందాయి.రఫీ కాంబోలోనే.. సుమన్ కళ్యాణ్పూర్ కెరీర్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఆమె స్వరం లతా మంగేష్కర్ స్వరానికి చాలా దగ్గరగా ఉండటం. దీంతో ఆమె పాడిన అనేక పాటలను శ్రోతలు లతా పాటలుగానే భావించేవారు. ఒకసారి తన పాటలను కూడా లతాజీ పాటలుగా గుర్తిస్తున్నారని చెప్పినప్పుడు, సుమన్ నవ్వుతూ “బాబోయ్.. ఆ గొంతు నాదేనండీ.. లతాజీది కాదు!” అంటూ సరదాగా స్పందించిన సంఘటన సంగీత వర్గాల్లో ఇప్పటికీ గుర్తుంటుంది. అదే కాలంలో హిందీ సినీ పరిశ్రమలో రఫీ–లతా మధ్య పాటల రాయల్టీ, క్రెడిట్ అంశాలపై వచ్చిన చిన్న ప్రొఫెషనల్ విభేదాల కారణంగా కొన్ని ప్రాజెక్టుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో ఏర్పడిన ఆ గ్యాప్ నేపథ్యంలోనే సుమన్ కళ్యాణ్పూర్ వంటి గాయనిలకు కూడా అవకాశాలు లభించాయి. అలా లతా పాడని కొన్ని పాటల్లో సుమన్ స్వరం వినిపించింది.లతాజీ ఏమనే వారంటే.. అయితే ఈ పోలికను ఆమె ఎప్పుడూ ప్రతికూలంగా తీసుకోలేదు. “నా స్వరం లతాజీ స్వరాన్ని పోలి ఉండొచ్చు. కానీ సంగీత పరిజ్ఞానం ఉన్నవారు రెండింటి మధ్య తేడాను గుర్తిస్తారు” అని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. లతా మంగేష్కర్పై తనకు ఎంతో గౌరవం ఉందని, ఆమెను సన్నిహిత స్నేహితురాలిగానే భావించేదాన్నని కూడా సుమన్ చెప్పింది. ఇక.. లతా మంగేష్కర్ కూడా సుమన్ కళ్యాణ్పూర్ గురించి పలు ఇంటర్వ్యూలలో గౌరవంగానే మాట్లాడేవారు. “సుమన్కు చాలా మంచి స్వరం ఉంది. ఆమె గొంతు మధురంగా ఉంటుంది. మా ఇద్దరి స్వరాలు ఒకేలా అనిపించడంతో ప్రేక్షకులు కొన్నిసార్లు గందరగోళానికి గురయ్యేవారు. ప్రతి గాయకురాలికి తనకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది” అంటూ లతాజీ పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడారు. పద్మభూషణ్.. 1958లో వ్యాపారవేత్త రమానంద్ కళ్యాణ్పూర్ను వివాహం చేసుకున్న తర్వాత ఆమె పేరు సుమన్ హెమ్మాడి నుంచి సుమన్ కళ్యాణ్పూర్గా మారింది. ఆమె భర్త ప్రతి రికార్డింగ్కు వెంట ఉండేవారని కుటుంబ సభ్యులు చెబుతుంటారు. గ్లామర్కు, ప్రచారానికి దూరంగా సాధారణ జీవితాన్ని గడపడం ఆమె ప్రత్యేకత. హిందీతో పాటు మరాఠీ, బెంగాలీ, కన్నడ, అస్సామీ, ఒడియా, గుజరాతీ, భోజ్పురి సహా అనేక భాషల్లో ఆమె పాటలు పాడారు. దాదాపు 700కు పైగా పాటలతో సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆమె గాన సేవలకు గుర్తింపుగా మహారాష్ట్ర ప్రభుత్వం లతా మంగేష్కర్ అవార్డు ప్రదానం చేయగా, 2023లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్తో సత్కరించింది.అయితే సంగీత విమర్శకులు, పరిశీలకులు తరచూ ఒక విషయాన్ని ప్రస్తావిస్తుంటారు—సుమన్ కళ్యాణ్పూర్కు తన ప్రతిభకు తగినంత గుర్తింపు, ప్రధాన స్థాయి ప్రచారం పూర్తిగా దక్కలేదని. ఆమె స్వరం లతా మంగేష్కర్ స్వరంతో పోలికకు గురవడంతో, అనేక సందర్భాల్లో ఆమె ప్రత్యేకత నీడలో పడిపోయిందని వారు చెబుతుంటారు. అనేక మంది అభిప్రాయం ప్రకారం, అదే స్వర్ణయుగంలో ఉన్నప్పటికీ సుమన్కు రావాల్సిన స్థాయి గౌరవం, స్టార్డమ్ పూర్తిగా అందలేదన్న భావన సంగీత ప్రపంచంలో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.ఆమె మరణంతో ఒక స్వరం ఆగిపోయి ఉండొచ్చు. కానీ “ఆజ్కల్ తేరే మేరే ప్యార్ కే చర్చే” వినిపించే ప్రతిసారీ, “నా తుమ్ హమే జానో” మళ్లీ మళ్లీ హృదయాల్లో మోగే ప్రతిసారీ సుమన్ కళ్యాణ్పూర్ అనే మధుర జ్ఞాపకం సంగీత ప్రేమికుల మధ్య చిరకాలం జీవిస్తూనే ఉంటుంది. -
ఈ జీవుల గురించి తెలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే..!
పిల్లలూ! సాధారణంగా జీవులన్నింటికీ కళ్ళు, చెవులు, గుండె, రక్తం వంటివి ఉంటాయని మనకు తెలుసు. కానీ, వీటికి భిన్నంగా ఉండే కొన్ని జీవుల గురించి తెలిస్తే మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే!నోరు ఉంటే పళ్ళు ఉండటం సహజం, కానీ తాబేలుకు పళ్ళు అస్సలు ఉండవు.మనల్ని ఎంతగానో భయపెట్టే పాములకు బాహ్య చెవులు ఉండవు.రైతు బంధువుగా పేరొందిన వానపాముకు కళ్ళు ఉండవు.రోజంతా కష్టపడే చీమలకు నోటిలో నాలుక ఉండదు.సాధారణంగా రక్తం ఎరుపు రంగులో ఉంటుంది, కానీ మన ఇళ్లలో తిరిగే బొద్దింకలకు తెల్లటి రక్తం ఉంటుంది.సముద్ర గర్భంలో ఉండే అక్టోపస్ శరీరంలో ఒక్క ఎముక కూడా ఉండదు.సముద్రంలో కనిపించే అందమైన జెల్లీఫిష్లకు అటు తల గానీ, ఇటు గుండె గానీ ఉండవు.అత్యధికంగా 32 మెదళ్లు (మెదడు లాంటి నరాల కణాల కేంద్రాలు) ఉండే జీవి ‘జెలగ’. -
ఈ నాలుగింటి మధ్య తేడా ఏంటో మీకు తెలుసా..!
మన నిత్య జీవితంలో తరచుగా వాడే కొన్ని పదాల మధ్య అసలు తేడా చాలా మందికి తెలియదు. అలాంటి వాటిలో హోటల్, మోటెల్, రెస్టారెంట్ ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన రిసార్ట్ పదాలు ఉన్నాయి. ఈ నాలుగు ప్రదేశాలు దాదాపు ఒకే విధంగా అనిపించినా, వాటి సేవలు, ఉద్దేశం, స్థానాల విషయంలో స్పష్టమైన వ్యత్యాసం ఉంది. వీటిని ఒకే విధంగా వాడటం వల్ల కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి, ఈ రోజు ఈ నాలుగు పదాల మధ్య ఉన్న ప్రధాన తేడాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం.హోటల్ అంటే..హోటల్ అనేది చాలా మందికి బాగా తెలిసిన, తరచుగా ఉపయోగించే ఒక వసతి కేంద్రం. ప్రయాణ సమయంలో బస చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి వసతి పొందే ప్రదేశం. హోటల్స్లో సాధారణంగా భోజనం (రెస్టారెంట్), టీవీ, వైఫై వంటి అదనపు సౌకర్యాలు అన్నీ అందుబాటులో ఉంటాయి. హోటళ్లు పట్టణాల మధ్యలో లేదా ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలలో నిర్మించి ఉంటాయి.మోటెల్ అంటే..మోటెల్స్ అనేవి హోటల్స్కు భిన్నంగా, చాలా ప్రత్యేకమైన ఉద్దేశంతో నిర్మించబడ్డాయి. మోటెల్ అంటే కారు డ్రైవ్ చేస్తూ సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు రాత్రికి విశ్రాంతి తీసుకోవడానికి, ఆగి వెళ్లడానికి వీలుగా ఉండే ప్రదేశం. ఇవి ప్రధానంగా సుదూర హైవేల వెంబడి నిర్మించబడి ఉంటాయి. ముఖ్యంగా అమెరికా, కెనడా వంటి దేశాలలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.మోటెల్స్లో సాధారణంగా రాత్రి బస చేయడానికి గది దొరుకుతుంది, ఉచిత పార్కింగ్ తప్పనిసరి ఉంటుంది. అయితే, రెస్టారెంట్ లేదా పూర్తి భోజన సౌకర్యం ఉండకపోవచ్చు. కొన్ని మోటెల్స్లో కేవలం కేఫ్ సౌకర్యం మాత్రమే ఉంటుంది.రెస్టారెంట్..హోటల్, మోటెల్తో పోలిస్తే రెస్టారెంట్ ఉద్దేశం పూర్తిగా భిన్నమైనది. రెస్టారెంట్ అనేది వసతి సౌకర్యం లేకుండా, కేవలం తినే సదుపాయం మాత్రమే ఉన్న ప్రదేశం. ఇక్కడ వివిధ రకాల వంటకాలు అందుబాటులో ఉంటాయి. చాలా పెద్ద హోటళ్లు తమ అతిథుల కోసం తమ సొంత రెస్టారెంట్లను కలిగి ఉంటాయి. కానీ, రెస్టారెంట్లలో రాత్రి బస చేసే సదుపాయం ఉండదు.రిసార్ట్ అంటే... రిసార్ట్ అనేది హోటల్ కంటే చాలా విస్తృతమైన సౌకర్యాలు, అనుభవాన్ని అందిస్తుంది. రిసార్ట్లు సాధారణంగా హోటళ్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉంటాయి. ఇవి కేవలం బస కోసమే కాకుండా, కుటుంబం లేదా స్నేహితులతో విశ్రాంతి తీసుకోవడానికి, వినోదం పొందడానికి ఉద్దేశించబడ్డాయి.రిసార్ట్లో వసతి, భోజనాలతో పాటు అదనపు వినోద సౌకర్యాలు ఉంటాయి. ఉదాహరణకు, స్విమ్మింగ్ పూల్, గేమ్ జోన్, చిల్డ్రన్ ప్లే ఏరియా, స్పా, ఇతర ఆటల సౌకర్యాలు ఉంటాయి. హైదరాబాద్తో సహా అనేక పర్యాటకప్రాంతాలలో ఈ రిసార్ట్ల సంఖ్య పెరుగుతోంది. -
హిమాలయాల ఒడిలో సాగే చార్ధామ్ యాత్ర!
హిమాలయ శిఖరాల నుంచి జారే మంచు బిందువులను చూస్తూ గంటానాదాల మధ్య పరవశించి పోయే దివ్యక్షేత్రాల ప్రయాణమే ఉత్తరాఖండ్ గర్వాల్ పర్వతాల మధ్య సాగే చార్ ధామ్ యాత్ర. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బదిరీనాథ్.. ఈ నాలుగు క్షేత్రాలను కలుపుతూ చేసే యాత్ర చార్ధామ్.ప్రతి మనిషి తన జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించాలి అనుకునే ఈ నాలుగు పవిత్ర స్థలాల దర్శనం కేవలం తీర్థయాత్ర మాత్రమే కాదు. అది ఒక ఆధ్యాత్మిక సంచారం. ప్రశాంతంగా సాగే ఈ యాత్ర మనసులోని అలజడి మొత్తాన్ని దూరం చేసి కొత్త ప్రశాంతతను చోటు ఇస్తుంది.చల్లని గాలులు మేనిని తాకుతుండగా, మబ్బుల మధ్య నుంచి కనిపించే పర్వతాల అందాలు చూస్తుంటే ప్రకృతి తన సహజ అందాలను చూపుతున్నట్టుగా ఉంటుంది.హిమాలయాల ఒడిలో సాగే చార్ధామ్ యాత్ర ఆధునిక ప్రపంచ అలజడి నుంచి దూరంగా తీసుకెళ్లిపోతుంది. మొదటి ఘట్టం యమునోత్రి దగ్గర మట్టి వాసనలతో మొదలై మనసుకు హాయిని ఇస్తుంది. తరువాత గంగోత్రి క్షేత్రానికి వెళ్లే దారి ΄÷డవునా ఉన్న చెట్ల వరుసలు, భగీరథి నది జోరుగా సాగే ప్రవాహం చూస్తుంటే ప్రకృతి తన అసలు స్వరూపాన్ని చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది.కేదార్నాథ్ చేరగానే చుట్టూ ఉన్న మంచు పర్వతాల మధ్య గుడి గోపురం వెనుక కనిపించే శిఖరాలు భక్తి భావంతో పాటు మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. చివరగా అలకనంద నది ఒడ్డున ఉన్న బద్రినాథ్ క్షేత్రాన్ని చూస్తుంటే యాత్రకు ఒక పరిపూర్ణత వచ్చినట్టుగా అనిపిస్తుంది. క్షేత్రాల చుట్టూ ఉండే చిన్న చిన్న గ్రామాలు, పర్వతాల అందాలు ఈ ఆధ్యాత్మిక యాత్రకు మరింత ప్రత్యేకతను తీసుకొస్తాయి.చేయాల్సిన పనులు..జానకి చట్టి నుంచి యమునోత్రి వరకు ట్రెక్కింగ్ చేస్తూ ప్రకృతితో చేసే మౌన సంభాషణను ఆస్వాదించవచ్చు.గంగోత్రిలో భగీరథి నది నీటిని స్పర్శించి ఆ పవిత్రతను అనుభవించవచ్చు.గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ వరకు సాగే ప్రయాణంలో తోటి యాత్రికుల భక్తి స్వరాలు వింటూ ట్రెక్కింగ్ లేదా గుర్రంపై ప్రయాణించవచ్చు.బద్రినాథ్ దర్శనం తరువాత తప్త కుండ్లో స్నానం చేసి ఆ వేడి నీటి హాయినీ ఆస్వాదించవచ్చు.మానా గ్రామంలో తిరుగుతూ అక్కడి స్థానిక స్థల పురాణాలను తెలుసుకోవచ్చు.ఆసక్తికరమైన విషయాలు..ట్రెడిషన్ ప్రకారం చార్ ధామ్ యాత్ర యమునోత్రి నుంచి ప్రారంభమై గంగోత్రి, కేదార్నాథ్, బద్రినాథ్తో ముగుస్తుంది.ఈ యాత్ర ప్రతి సంవత్సరం ఏప్రిల్ లేదా మే నుంచి అక్టోబర్ వరకు ఓపెన్ ఉంటుంది.కేదార్నాథ్ చేరడానికి గౌరీకుండ్ నుంచి సుమారు 16 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది.మానా గ్రామం భారతదేశంలోని చివరి గ్రామంగా ప్రసిద్ధి చెందింది.యాత్రకు ముందు ఉత్తరాఖండ్ పోర్టల్లో అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి.ఎక్కడ ఉండాలి?యాత్ర సాగే ప్రతి చోట హోటల్స్, ధర్మశాలల వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. గర్వాల్ మండల్ వికాస్ నిగమ్ గెస్ట్ హౌస్లు కానీ, కొండ అంచున ఉన్న చిన్న కాటేజీలు కానీ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. హడావిడి లేని వాతావరణం, ఎటు చూసినా కనిపించే పర్వతాల దృశ్యాలు, ఉదయాన్నే వీచే చల్లని గాలిని ఆస్వాదిస్తూ పర్వతాల మధ్య కూర్చోవడం ఒక మరిచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుంది. పెద్ద పెద్ద విలాసాలు లేకపోయినా ఇక్కడ ప్రతి లాడ్జిలో దొరికే అతిథ్యం, చుట్టూ ఉన్న ప్రకృతి మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. కొండ గాలిలో కలిసిన ఆ మౌనాన్ని ఆస్వాదించడం చార్ ధామ్ యాత్ర ప్రత్యేకత.ఏం చూడాలి?పర్వతాల వెనుక నుంచి మెల్లిగా ఉదయించే సూర్యుడు, సాయంత్రం వేళ నదుల దగ్గర జరిగే హారతి దృశ్యాలు తప్పకుండా చూడాలి. కేదార్నాథ్ దగ్గర మందాకిని నది ప్రవాహం మధ్య నిలబడితే ప్రకృతితో కలిసి ఒక పాట పాడుతున్నట్టుగా అనిపిస్తుంది. బద్రినాథ్లోని తప్త్ కుండ్లో వేడి నీటి స్నానం శరీరానికి మాత్రమే కాదు, మనసుకు కూడా హాయిని ఇస్తుంది.భారతదేశంలోని చివరి గ్రామంగా పిలువబడే మానా గ్రామంలో నడుస్తుంటే ఒక కొత్త ప్రపంచంలో తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. గంగా, యమునా నదుల ఉద్భవ స్థలాలను చూస్తుంటే మనసులోని ఆలోచనలు కూడా ప్రశాంతంగా మారిపోతాయి. రాత్రివేళ మంచు కప్పిన పర్వతాల మధ్య చుక్కలతో నిండిన ఆకాశం అద్భుతమైన విజువల్ ట్రీట్లా కనిపిస్తుంది.ఎలా వెళ్లాలి?ఈ పవిత్ర యాత్రను హైదరాబాద్ నుంచి ప్రారంభించాలంటే ముందుగా దెహ్రాడూన్ లేదా ఢిల్లీకి ఫ్లైట్ లేదా ట్రైన్ ద్వారా చేరుకుని అక్కడి నుంచి హరిద్వార్ వైపు ప్రయాణం సాగించాలి. విజయవాడ నుంచి వచ్చిన వారికి కూడా ఢిల్లీ కనెక్టివిటీ సులభంగా లభిస్తుంది.హరిద్వార్ నుంచి పర్వత దారుల్లో బస్ లేదా ట్యాక్సీలో సాగే ప్రయాణంలో ఒకవైపు లోయలు, మరోవైపు ఆకాశాన్ని తాకే కొండలు కనిపిస్తాయి. కొండలపై మబ్బుల తెరలు దాటుకుంటూ, చల్లని గాలుల స్పర్శను ఆస్వాదిస్తూ సాగే ఈ ప్రయాణం జీవితాంతం గుర్తుండిపోతుంది.ఏం తినాలి?ఈ కొండప్రాంతాల్లో దొరికే వేడి వేడి ఆలూ పరాటా, పహాడి దాల్ చావల్తో పాటు గరం చాయ్ ప్రయాణంలో మరో అందమైన భాగంగా అనిపిస్తాయి. లోకల్గా తయారు చేసే జొన్న రొట్టెతో పాటు పహాడి కర్రీ రుచి మరిచిపోలేనిదిగా ఉంటుంది. ప్రతి గుడి దగ్గర దొరికే ప్రసాదంలో ప్రత్యేకమైన రుచిని ఆస్వాదించవచ్చు. చల్లని వాతావరణంలో వేడి వేడి జిలేబీ తినడం, స్వచ్ఛమైన కొండ నీటితో తయారైన వంటలను ఆస్వాదించడం ఈ యాత్రను మరింత మధురంగా మారుస్తాయి.యాత్ర బడ్జెట్ వివరాలు..చార్ధామ్ యాత్ర మొత్తంగా పూర్తి చేయడానికి సాధారణంగా 10 నుంచి 12 రోజుల సమయం పడుతుంది. హైదరాబాద్ నుంచి దెహ్రాడూన్ వరకు ఫ్లైట్ లేదా ట్రైన్ ద్వారా చేరుకోవచ్చు.స్టాండర్డ్ గ్రూప్ ప్యాకేజీల ప్రకారం ఒక్కరికి సుమారు రూ.25 వేల నుంచి రూ.45 వేల మధ్య బడ్జెట్ అయ్యే అవకాశం ఉంది. ప్రైవేట్ క్యాబ్ లేదా ప్రీమియం ప్యాకేజీలు తీసుకుంటే ఈ ఖర్చు రూ.55 వేల నుంచి రూ.75 వేల వరకు పెరగవచ్చు.స్టే కోసం ప్రతి రాత్రి రూ.1000 నుంచి రూ.3500 మధ్య మంచి రూమ్స్ లభిస్తాయి. ఫుడ్ కోసం ప్రతి రోజు రూ.400 నుంచి రూ.600 మధ్య వెజిటేరియన్ ఫుడ్ లభిస్తుంది.హెలికాప్టర్ సర్వీస్ ఉపయోగించాలనుకుంటే ముందుగానే బుకింగ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే సీజన్ సమయంలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. – ఎం.జి. కిశోర్, ప్రయాణికుడుగమనిక : ఇక్కడ ఇచ్చిన ట్రావెల్, బడ్జెట్ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. ప్రయాణానికి ముందు తాజా అప్డేట్స్ వెరిఫై చేసుకుని యాత్రను ప్లాన్ చేసుకోవడం మంచిది. -
ఈ ఐదు దేశాల్లో అసలు నదులే లేవు..
నది ఉన్న చోటే నాగరికత వెలుస్తుంది. నది లేని చోట ఉండరాదు అని ఆచార్య చాణిక్యుడు కూడా చెప్పాడు. నదుల వల్ల నీటి లభ్యతే కాదు, రవాణా సౌకర్యం, వ్యవసాయానికి కావాల్సిన సాగునీరు కూడా అందుతుంది. అయితే ప్రపంచంలో కొన్ని దేశాల్లో అసలు నదులే లేవు. అందులో ‘ఐదు’ దేశాల గురించి తెలుసుకుందాం.1. సౌదీ అరేబియాఅరేబియా ద్వీపకల్పంలోని అతిపెద్ద దేశం సౌదీ అరేబియా. ఈ దేశంలో ఒక్క నదీ లేదు. కానీ ఆధునిక డిసాలినేషన్ సాంకేతికత సాయంతో భూగర్భంలో ఉన్న నీటిని వినియోగించుకుంటుంది ఈ దేశం.2. బహ్రెయిన్ఈ చిన్న ఐలాండ్ దేశంలో నది లేదు . అందుకే తాగునీటి అవసరాల కోసం భూగర్భ జలాలపై, అడ్వాన్స్ డిసాలిటేషన్ టెక్నాలజీపై ఆధారపడతారు.3. కువైట్తన పొరుగు దేశాల్లాగే కువైట్ కూడా నదీజలాలపై ఆధారపకుండా నాగరికతను ముందుకు తీసుకెళ్తోంది. ఇక్కడ ప్రధానంగా డిసాలినేషన్ ప్లాంట్స్ వల్లే నీరు అందుతుంది. దీంతో పాటు వర్షాకాలలో ఎండిపోయిన నదుల్లో చేరిన నీటిని కూడా వినియోగించుకుంటారు.4.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్యూఏఈలో నదులు లేకపోయినా అది తన ప్రజల అవసరాల కోసం నీటిని అందించేందుకు ఆధునిక సాంకేతిక సాయం తీసుకుంటోంది. ప్రతీ నీటి బొట్టును ఒడిసిపట్టుకోవడం వంటి విధానాలతో పాటు, అత్యాధునిక డిసాలినేషన్ సాంకేతికత వల్ల ప్రజల దాహాన్ని తీర్చగలుగుతోంది.5. ఖతార్ఖతార్లో మంచి నీటిని మొత్తం డిసాలినేషన్ ప్రాసెస్లో సేకరించడంతో పాటు దిగుమతి చేసుకుంటారు. దీన్ని బట్టి ఆ దేశంలో నీరు ఎంత ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకోవచ్చు. చుక్క చుక్కను ఒడిసిపట్టుకుని జాగ్రత్తగా వాడుతారు.డిసాలినేషన్ అంటే..డిసాలినేషన్ అంటే సముద్రపు నీరు లేదా ఉప్పు శాతం ఎక్కువగా ఉన్న నీటిలోని ఉప్పు, ఇతర మలినాలను తొలగించడం. ఈప్రాసెస్ పూర్తి చేసి ఈ నీటిని ప్రజల అవసరాలకు అందుబాటులోకి తీసుకువస్తారు. ఈ నీటిని తాగడానికి, సాగుకోసం, పరిశ్రమల కోసం వినియోగిస్తారు. -
గంటకు 400 కిలోమీటర్ల వేగం!
మనం ఏదైనా వస్తువును తాకినా లేదా ఏదైనా ఆలోచించినా, ఆ సమాచారం మన నరాల ద్వారా మెదడుకు, అలాగే మెదడు నుంచి శరీర భాగాలకు అత్యంత వేగంగా చేరుకుంటుంది.ఈ సంకేతాలు మన నరాల వ్యవస్థలో ఏకంగా గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వేగం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఒక బుల్లెట్ ట్రైన్ లేదా ఒక సూపర్ కార్ టాప్ స్పీడ్ కంటే కూడా ఎక్కువ కావడం విశేషం.మన శరీరంలో ఉన్న ఈ అద్భుతమైన వైరింగ్ సిస్టమ్ వల్లే మనం ప్రమాదాల నుంచి త్వరగా తప్పించుకోగలుగుతున్నాం. ఉదాహరణకు, మనం ఏదైనా వేడి వస్తువును తాకగానే, మనం ఆలోచించే లోపే చేతిని వెనక్కి లాగేసుకుంటాం. దీనికి కారణం నరాల ద్వారా మెదడుకు అందే ఈ మెరుపు వేగపు సంకేతాలే! -
అది పామో లేక చెట్టు కొమ్మో..
గ్రీన్ వైన్ స్నేక్ (పసిరిక పాము) గా పిలిచే ఈ పాము రంగు అచ్చం పచ్చటి ఆకులా ఉంటుంది. ఇది చెట్ల కొమ్మల మధ్య ఉన్నప్పుడు, అది పామో లేక చెట్టు కొమ్మో కనిపెట్టడం చాలా కష్టం!శత్రువుల నుంచి తప్పించుకోవడానికి, ఆహారాన్ని పట్టుకోవడానికి ఈ రంగు దీనికి బాగా సహాయపడుతుంది. చాలా పాములకు చూపు అంతగా తెలియదు, కానీ పసిరిక పాములకు చూపు చాలా ఎక్కువ. వీటి కంటి పాపలు అడ్డంగా, తాళం రంధ్రం ఆకారంలో ఉంటాయి. దీనివల్ల ఇవి దూరంగా ఉన్న వస్తువులను కూడా చాలా స్పష్టంగా చూడగలవు. చాలా సన్నగా, బరువు తక్కువగా ఉండటం వల్ల ఇది ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మపైకి వేగంగా, సులువుగా వెళ్తుంది. పసిరిక పాములకు కొద్దిగా విషం ఉంటుంది, కానీ అది కేవలం అవి తినే చిన్న చిన్న బల్లులు, కప్పలను పట్టుకోవడానికే సరిపోతుంది. -
ఆధ్యాత్మి కథ : శాశ్వతానంద్రప్రాప్తి..
దశరథ మహారాజు ఎదురు చూస్తున్న శుభతరుణం రానే వచ్చింది. కౌసల్యాదేవి పరిపూర్ణ దివ్యత్వంతో ఉట్టిపడుతున్న శ్రీరామునికి జన్మనిచ్చింది. ఈ శుభవార్తను ఒక చెలికత్తె వెళ్లి దశరథ మహారాజుకు విన్నవించగా ఆయన పట్టలేని ఆనందంతో ఎంతో విలువైన ఒక రత్నాల హారాన్ని ఆమెకు కానుకగా అందించబోయాడు. అప్పుడా చెలికత్తె, ‘మహారాజా! నాకు ఇవేవీ వద్దు. నేను కోరుకునేది ఒకటి ఉంది. ఇప్పుడు జన్మించిన బిడ్డను ఎత్తుకొని ఆడించి పాడించి లాలించే భాగ్యాన్ని నాకివ్వండి, చాలు’ అన్నది. సామాన్యురాలైన ఒక చెలికత్తె ఎంతటి ఉత్కృష్టమైన కోరిక కోరుకుందో! ఒక్కొక్కరి జన్మాంతర సుకృతం చేత ఈ విధమైన పవిత్ర భావాలు వారిలో ఆవిర్భవిస్తుంటాయి.అరణ్యవాసానికి బయల్దేరిన సీతారామలక్ష్మణులు గంగానదిని దాటవలసి వచ్చింది. పడవ నడిపే గుహుడు, ‘ప్రభూ! నేను మిమ్మల్ని ఈ నది దాటిస్తాను. అందుకు ప్రతిఫలంగా నన్ను ఈ భవసాగరం దాటించాలి‘ అని రెండు చేతులు జోడించి అభ్యర్థించాడు. గుహుడు చదివిన చదువు ఏపాటిది! అతను కనబరచిన ఆధ్యాత్మిక పరిణతి ఎంత మహోన్నతమైనది!?ధ్రువుడు ఎలాగైనా శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొంది తన తండ్రి తొడపై కూర్చోవాలన్న కోరికతో తపస్సు చేశాడు. విష్ణుమూర్తి సాక్షాత్కరించి ఏం కావాలని అడుగగా ఆ పసివాడు. ‘స్వామీ ఈ దట్టమైన అడవిలో నేను తపస్సు చేస్తున్న సంగతి తెలిసిన మీకు నా మనసులోని కోరిక తెలియదా?’ అంటాడు.‘మనసులో ఉన్నది మాటలో వ్యక్తం చేయనిదే పరమివ్వడానికి వీలుకాద’ని విష్ణుమూర్తి వివరించగా, ‘స్వామీ నేను గాజు పెంకుకోసం వెతుకుతూ వస్తే నాకు అమూల్యమైన పజ్రమే లభించింది. మీ దర్శన భాగ్యం పొందిన నాకు ఇక తాత్కాలిక సంతోషాన్నిచ్చే రాజ్యాలు, భోగభాగ్యాలు అక్కర్లేదు. శాశ్వతానందాన్నిచ్చే మీ సాయుజ్యమే కావాల’ని కోరాడు. రాజ్యసుఖాలతోపాటూ పరమపదాన్ని కూడా ధ్రువునికి అనుగ్రహించాడు శ్రీమన్నారాయణుడు.భక్త ధ్రువునివలె శాశ్వతానంద్రపాప్తిని కోరుకుందాం. గుహునివలె భవసాగరాన్ని దాటించవలసిందిగా స్వామిని ప్రార్థిద్దాం. ఆ చెలికత్తెలా దైవసన్నిధిని ఒక పెన్నిధిగా భావించుకుందాం. – తరిగొప్పుల వీఎల్లెన్ మూర్తి -
ఘటోత్కచుని త్యాగం... పాండవులకు విజయం
మహాభారతంలో ఘటోత్కచుడు పాండవులలో ఎంతో బలశాలి అయిన భీముడు, రాక్షస మూలాలు కలిగిన హిడింబిల కొడుకు. ఘటోత్కచుడి గురించి సామాన్య ప్రజలకు తెలియాలంటే అలనాటి మాయాబజార్, ఘటోత్కచ సినిమాల్లో ఎంతో రక్తికట్టించే విధంగా అతని పాత్రను మలిచారు. ఘటోత్కచుడు చేసిన ఏ త్యాగం వల్ల ఏ విధమైన లాభం పాండవులకు దోహదపడిందో తెలుసుకుందాం....ముందుగా ఘటోత్కచునికి ఆ పేరు ఎలా వచ్చిందంటే... ఘటోత్కచుని తల బోర్లించిన ‘ఘట‘ (కుండ)‘ఉత్కచం’(బట్టతల) ఆకారంలో నున్నగా ఉండడంతో అతనికి ఘటోత్కచుడు అనే పేరు సార్థకమైనదని చెప్పుకోవచ్చు. ఘటోత్కచుడు పాండవుల పక్షాన మహాభారత యుద్ధంలో పాల్గొని స్వతహాగా తనకున్న ఇంద్ర, మహేంద్రజాల, టక్కు, టమార విద్యలను ప్రదర్శించాడు. సరిగ్గా 14వ రోజు నాటి మహాభారత యుద్ధంలో తన కుమారుడైన అంజనపర్వుడు, అశ్వత్థామ చేతిలో చనిపోవడంతో ఘటోత్కచుడు ఎంతో ఆగ్రహం చెందాడు. తన ఇంద్రజాల మహేంద్రజాల విద్యలన్నిటిని ప్రదర్శించి కౌరవ సైన్యాన్ని అతలాకుతలం చేశాడు. ఒకదశలో ద్రోణుడు, దుర్యోధనుడు, కర్ణుడు వంటి యోధులను కూడా భయభ్రాంతులకు గురి చేశాడు. ఇదిలా ఉండగా జయద్రథుడు మరణానంతరం, సూర్యాస్తమయం దాటి చీకటి పడినా యుద్ధం సాగుతుండగా స్వతహాగా ఉన్న తన శక్తితోపాటు రాక్షసశక్తి తోడవడంతో యుద్ధంలో తీవ్రంగా విజృంభిస్తూ అలాయుధ, అలంబసులను సంహరించాడు. సమయం ఇంకా గడుస్తున్న కొద్దీ ఘటోత్కచుని శక్తి, భీకర దాడులు పెరిగిపోతుండటంతో, అతనిని అదుపు చేసేందుకు, కర్ణునివద్ద ఉన్న ఎంతో శక్తిమంతమైన ‘వాసవీ’ అస్త్రాన్ని ప్రయోగించమని దుర్యోధనుడు కోరతాడు. వాసవీ అస్త్రం ఇంద్ర ప్రసాదితమని, ఎంతో శక్తిమంతమైనదని, కేవలం అర్జునునిపై ప్రయోగించేందుకు దాచానని, చెప్పినప్పటికీ దుర్యోధనుడు పదేపదే కోరడంతో విధిలేని పరిస్థితులలో కర్ణుడు తన వద్ద ఉన్న లక్ష్య¿ే దితమైన వాసవీ శక్తి అస్త్రాన్ని ఘటోత్కచునిపై ప్రయోగించడంతో కుప్పకూలాడు. ఆ విధంగా అర్జునుని కోసం దాచుకున్న వాసవీ అస్త్రం ఘటోత్కచునిపై ప్రయోగింపబడటంతో, పరోక్షంగా పాండవులకు మేలు కలిగింది.– సి.ఎన్. మూర్తి, సీనియర్ జర్నలిస్ట్ -
సత్యమే శివం.... సుందరం
సనాతన ధర్మం కేవలం మతం కాదు; అనంత విశ్వాన్ని సుస్థిరంగా నిలిపేప్రాకృతిక నియమం. ధారణాత్ ధర్మమిత్యాహుః – ఏది సమస్తాన్ని ధరిస్తుందో, రక్షిస్తుందో అదే ధర్మం. మానవ ఉనికికి, ప్రకృతి సమతుల్యతకు ధర్మమే వెన్నెముక. వ్యక్తిగత స్వార్థం వీడి లోకకల్యాణం కోసం నడుచుకోవడమే అసలైన ధర్మశీలం. అస్థిరత నిండిన ఆధునిక జగత్తులో దిశానిర్దేశం చేసే అక్షయమైన ధ్రువతార ఈ ధర్మపథం.ధర్మానికి పునాది ధర్మానికి మొదటి మెట్టు సత్యం. సత్యం అంటే కేవలం నిజం మాట్లాడటం కాదు; మనసా, వాచా, కర్మణా ఏకరూపంలో ఉండటం. సత్యం ఒక మహా వృక్షానికి భూమిలో లోతుగా పాతుకుపోయిన వేరు వంటిది. వేరు బలంగా లేని వృక్షం గాలివానలకు కూలిపోయినట్లే, సత్యనిష్ఠ లేని వ్యక్తిత్వం కష్టకాలంలో నిలబడలేదు. ఉదాహరణకు, ఒక ఉద్యోగి తన వృత్తిలో నిజాయితీగా బాధ్యత నిర్వర్తించడం, ఒక వ్యాపారి తన వస్తువు నాణ్యత విషయంలో నిబద్ధత కలిగి ఉండటం అసలైన సత్య ధర్మ పరిపాలన. సత్యం కఠినంగా అనిపించినా, అది ఇచ్చే ఫలితం శాశ్వతం, నిర్భయం. నిప్పును మూటగట్టలేనట్లు, సత్యాన్ని ఎవరూ అణచివేయలేరు. సూర్యకాంతిని మేఘాలు తాత్కాలికంగా కప్పివేసినా, సత్యం స్వయంప్రకాశితమై విజయతీరాలకు చేరుస్తుంది.మంగళకరమైన జీవనం ధర్మం రెండవ రూపం శివం. శివం అంటే మంగళం, శుభప్రదం. మనం చేసే ప్రతి పని తోటివారికి మేలు చేసేదిగా ఉండాలి. పరహితమే పరమార్థంగా జీవించడం శివ తత్వం. ఇది వెలుగునిచ్చే దీపం వంటిది; దీపం తాను వెలుగుతూ చుట్టూ ఉన్న చీకటిని పారద్రోలినట్లే, మన జీవనం ఇతరుల కష్టాలను తొలగించేదిగా మారాలి. తన ఎదుగుదల కోరుకుంటూనే, సమాజ శ్రేయస్సును ఆకాంక్షించేవాడే ధర్మాత్ముడు. దైనందిన జీవితంలో ఆకలితో ఉన్నప్రాణికి అన్నం పెట్టడం లేదా అవసరంలో ఉన్న మిత్రుడిని ఆదుకోవడం వంటి చిన్న కార్యాలూ శివత్వాన్ని పొందుతాయి. లోక కల్యాణార్థం సాగే నిస్వార్థ జీవన యానమే మానవ జన్మకు అసలైన సార్థకత చేకూరుస్తుంది. ప్రతి జీవిలో శివుడిని దర్శించడమే అత్యున్నత ఆధ్యాత్మిక సంస్కారం. స్వార్థం సంకెళ్ళను తెంచుకున్నప్పుడే జీవుడు శివుడు కాగలడు.సుందరం: ధర్మబద్ధమైన సౌందర్యం సత్యం, శివం మేళవించిన చోట అద్భుతమైన సౌందర్యం ఉట్టిపడుతుంది. ఇది బాహ్య రూపం కాదు; అంతర్గత క్రమశిక్షణ వల్ల కలిగే మానసిక ప్రశాంతత. ధర్మబద్ధమైన జీవితం గడిపే వ్యక్తి ముఖంలో దివ్యమైన తేజస్సు ఉంటుంది. దీనికి ఉపమానం పద్మం; బురదలో పుట్టినా తన పవిత్రతను కాపాడుకునే పద్మం వలె, మనిషి లౌకిక బంధాల మధ్య ఉంటూనే ధర్మబద్ధంగా జీవిస్తే ఆ జీవితం సుందరమవుతుంది. క్రమశిక్షణతో కూడిన దినచర్య, ఇంద్రియ నిగ్రహం, ప్రకృతి పట్ల గౌరవం జీవితాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాయి. పర్యావరణాన్ని ప్రేమిస్తూ, సృష్టిలోని ప్రతి జీవిని దైవ స్వరూపంగా భావించడం ఈ సుందర ధర్మంలో అంతర్భాగం. కళాత్మకమైన హృదయం, ధార్మిక చింతన తోడైతే మానవ జీవితం ఒక అద్భుత కావ్యమవుతుంది. చిత్తశుద్ధి కలిగిన మనసే భగవంతుడు నివసించే అసలైన ఆలయం.బురదలో పుట్టినా తన పవిత్రతను కాపాడుకునే పద్మంలా, మనిషి లౌకిక బంధాల మధ్య ఉంటూనే ధర్మబద్ధంగా జీవిస్తే ఆ జీవితం సుందరమవుతుంది. క్రమశిక్షణతో కూడిన దినచర్య, ఇంద్రియ నిగ్రహం, ప్రకృతి పట్ల గౌరవం జీవితాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాయి. – కె. భాస్కర్ గుప్తా, వ్యక్తిత్వ వికాస నిపుణులు. -
శ్రీ కోదండరామాలయంలో ఆధ్యాత్మిక వైభవం.
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జూన్ నెలలో పలు విశేష ఆర్జిత, మాసోత్సవాలు భక్తి వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలను పొందాలని ఆలయ అధికారులు కోరారు.ప్రతి శనివారం అభిషేకం.జూన్ 6, 13, 20, 27 తేదీలలో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామలక్ష్మణుల మూలవర్లకు పవిత్ర అభిషేకం నిర్వహిస్తారు.అమావాస్యనాడు సహస్ర కలశాభిషేకం – హనుమంత వాహనసేవ.జూన్ 15న అమావాస్య సందర్భంగా ఉదయం 8.30 గంటలకు సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు శ్రీరామచంద్రునికి పరమభక్తుడైన ఆంజనేయస్వామి సేవను స్మరింపజేసే హనుమంత వాహనసేవ వైభవంగా జరుగనుంది.పునర్వసు నక్షత్రంలో శ్రీ సీతారాముల కల్యాణం.జూన్ 17న పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవార్లను తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడవీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు ఊరేగింపుగా తీసుకువెళతారు. సాయంత్రం 6.30 గంటలకు ఊంజల్సేవ నిర్వహించనున్నారు.పౌర్ణమినాడు అష్టోత్తర శతకలశాభిషేకం.జూన్ 29న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు తిరుచ్చి ఉత్సవం ఆలయ నాలుగు మాడవీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు సాగుతుంది. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు ఆస్థానం నిర్వహించనున్నారు. భక్తులు ఈ విశేష ఉత్సవాలలో పాల్గొని శ్రీ సీతారామచంద్రుల అనుగ్రహాన్ని పొందాలని ఆలయ అధికారులు కోరారు. టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది -
ప్రేతాత్మ చెప్పిన కథ..!
ప్రపంచ సాహిత్యంలో ఆత్మకథలు చాలానే ఉన్నాయి. ఆత్మకథల సంగతి అటుంచితే, ప్రేతాత్మ కథ కూడా ఒకటి ఉంది. ‘సేత్ స్పీక్స్’ అనే పుస్తకం అచ్చంగా ప్రేతాత్మ చెప్పిన కథేనట! ఈ పుస్తకం రచయిత్రి జేన్ రాబర్ట్స్– పుస్తకం రాసినది తానే అయినా, తనతో రాయించినది మాత్రం సేత్ అనే వ్యక్తి ఆత్మ అని ప్రకటించడం విశేషం. జేన్ రాబర్ట్స్, ఆమె భర్త రాబర్ట్ బట్స్ 1963 డిసెంబర్ 2న రాత్రివేళ సరదాగా ‘ఊజా బోర్డు’తో ఆత్మలను ఆహ్వానించే ప్రయోగం చేశారు. ఊజా బోర్డు ప్రయోగం చేస్తున్నప్పుడు జేన్కు ఒక అశరీరవాణి వినిపించిందట! ఇదివరకే మరణించిన ఒక పురుషుడి ఆత్మ తనను తాను ‘సేత్’గా పరిచయం చేసుకుని, తన కథ చెప్పడం మొదలుపెట్టింది. సేత్ ఆత్మ చెప్పిన కథనే తాను పుస్తకంగా రాశానని జేన్ రాబర్ట్స్ అప్పట్లో ప్రకటించడం సాహితీ ప్రపంచంలో కలకలం రేపింది. సేత్ తనకు చెప్పిన కథలను జేన్ వరుసగా పుస్తకాలుగా తీసుకొచ్చారు. అవి ‘సేత్ మెటీరియల్’గా ప్రాచుర్యం పొందాయి. ఈ ప్రేతాత్మ కథకు సంబం«ధించిన పుస్తకాలు ఇప్పటికీ పునర్ముద్రణ పొందుతూనే ఉన్నాయి.బంగారు మ్యూజియంప్రపంచంలోనే అత్యంత అరుదైన బంగారు వస్తుప్రదర్శనశాల ఇది. ఇందులోకి అడుగుపెడితే, ఎటు చూసినా పురాతనమైన బంగారు వస్తువుల ధగధగలు కళ్లు చెదిరేలా చేస్తాయి. ఈ మ్యూజియం కొలంబియా రాజధాని బొగోటాలో ఉంది. కొలంబియా స్పానిష్ పాలకుల అధీనంలోకి చేరక మునుపటి కాలానికి చెందిన పురాతన బంగారు, బంగారు మిశ్రమ లోహాల కళాఖండాలను ఇందులో భద్రపరచారు. ఈ మ్యూజియం చూడటానికి ఏటా ఐదులక్షలకు పైగా సందర్శకులు దేశ విదేశాల నుంచి వస్తుంటారు. -
ప్లాస్టిక్న తైలంబు! ఎలా మారుస్తారంటే..
ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిని, సముద్రాలను విషపూరితం చేస్తూ పర్యావరణానికి పెద్ద శాపంగా మారాయి. మరోవైపు, రోజురోజుకీ పెరిగిపోతున్న కాలుష్యానికి ప్రధాన కారణమైన పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా ఒక ‘స్వచ్ఛమైన ఇంధనం’ కోసం శాస్త్ర పరిశోధనా రంగం వెతుకులాటలో ఉంది. ఒకవేళ మనల్ని వేధిస్తున్న ఈ ప్లాస్టిక్కే... స్వచ్ఛమైన ఇంధనంగా మారిపోతే? ఆహా, ఆ ఊహే ఎంత ఊరటగా ఉంది!ఇకపై అది ఊహ కాకపోవచ్చు. త్వరలోనే ఈ అద్భుతం జరగొచ్చు. ఎందుకంటే శాస్త్రవేత్తలు సౌరశక్తిని ఉపయోగించి, ప్లాస్టిక్ వ్యర్థాలను అత్యంత స్వచ్ఛమైన ‘హైడ్రోజన్ ఇంధనం’గా మార్చే ఒక కొత్త సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. పర్యావరణాన్ని పాడుచేసే ఒక వ్యర్థ పదార్థాన్ని, దేశాన్ని నడిపించే ఇంధన వనరుగా మార్చే ఈ ప్రయోగం నిజంగానే సఫలం అవుతుందా?ఇందులో ఉన్న సవాళ్లు ఏమిటి? మైనస్ ఇంటూ మైనస్ = ప్లస్ ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న రెండు పెద్ద సమస్యలైన ప్లాస్టిక్ కాలుష్యం, పర్యావరణానికి హాని చేయని స్వచ్ఛమైన ఇంధనం (క్లీన్ ఎనర్జీ) కొరతలను ఒకేసారి పరిష్కరించడానికి శాస్త్రవేత్తలు నడుం బిగించారు. అడిలైడ్ యూనివర్సిటీకి చెందిన పీహెచ్డీ విద్యార్థిని జియావో లూ నేతృత్వంలో జరిగిన ఒక తాజా పరిశోధన దీని గురించి వివరించింది. పనికిరాని ప్లాస్టిక్ను సౌరశక్తితో.. హైడ్రోజన్, సింగ్యాస్, ఇతర పారిశ్రామిక రసాయనాలుగా ఎలా మార్చవచ్చో ఈ పరిశోధన చూపించింది. ప్లాస్టిక్ వస్తువులకు ఈ విధంగా మళ్లీ విలువ కల్పించడం ద్వారా, పర్యావరణానికి మేలు చేసే ఒక స్థిరమైన, ‘సర్క్యులర్ ఎకానమీ’ (వనరులను వృథా చేయకుండా వాటినే పదే పదే ఉపయోగించడం) వ్యవస్థను నిర్మించడానికి ఈ పద్ధతి ఎంతగానో సహాయపడుతుంది. సింగ్యాస్ అంటే.. ఒక రకమైన వాయువుల మిశ్రమం. ముఖ్యంగా కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ల కలయిక. దీనిని ఇంధనంగా వాడతారు. తివిరి ప్లాస్టిక్న తైలంబు..!ప్రపంచవ్యాప్తంగా యేటా 45 కోట్ల టన్నుల కంటే ఎక్కువ ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతోంది. ఆ ప్లాస్టిక్లో ఎక్కువ భాగం భూమిని, సముద్రాలను కలుషితం చేస్తోంది. అదే సమయంలో, పర్యావరణానికి హాని చేసే బొగ్గు, పెట్రోల్ వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాల్సిన అవసరం పెరగడంతో.. ప్రత్యామ్నాయంగా స్వచ్ఛమైన ఇంధనాల కోసం అన్వేషణ ముమ్మరమైంది. శిలాజ ఇంధనాలు అంటే తెలిసిందే. భూమి పొరల నుండి లభించే బొగ్గు, నూనె, గ్యాస్ వంటివి. వీటి వల్ల కాలుష్యం పెరుగుతుంది.‘కెమ్ క్యాటలిసిస్’ అనే సైన్స్ పత్రికలో ప్రచురితమైన ఈ పరిశోధన.. ప్లాస్టిక్లో కార్బన్, హైడ్రోజన్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ప్లాస్టిక్ను కేవలం ఒక వ్యర్థ పదార్థంలా కాకుండా, ఒక ఉపయోగకరమైన వనరుగా చూడవచ్చని చెబుతోంది. కార్బన్, హైడ్రోజన్.. ప్లాస్టిక్ తయారీలో ఉండే ముఖ్యమైన రసాయన మూలకాలు. ఇవే ఇంధనంగా మారడానికి దోహదపడతాయి.ఆశాజనకమైన ఫలితాలుఅడిలైడ్ యూనివర్సిటీకి చెందిన ‘స్కూల్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్’ సీనియర్ ప్రొఫెసర్ జియావోగువాంగ్ డువాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల చేసిన ప్రయోగాలు చాలా అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయి. ఎలాంటి ఆటంకం లేకుండా 100 గంటలకు పైగా నిరంతరాయంగా ఈ సాంకేతికత ఎంత స్థిరంగా సమర్థంగా పనిచేయగలదో ఈ ప్రయోగాలు నిరూపించాయి. ఈ ప్రయోగాల ద్వారా పెద్ద మొత్తంలో హైడ్రోజన్ ఉత్పత్తి అవ్వడమే కాకుండా, పరిశ్రమలలో వాడే ఎసిటిక్ యాసిడ్, డీజిల్ లాంటి హైడ్రోకార్బన్లు కూడా తయారైనట్లు పరిశోధకులు గుర్తించారు. ఎసిటిక్ యాసిడ్ అనేది పరిశ్రమలలో రసాయనాల తయారీకి, నిత్యజీవితంలో వెనిగర్ రూపంలో వాడే ఒక ఆమ్లం. హైడ్రోకార్బన్లనేవి పరమాణువులతో తయారయ్యే సమ్మేళనాలు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఇంధనాలన్నీ హైడ్రోకార్బన్ల కిందికే వస్తాయి. సవాళ్లు కూడా ఉన్నాయిప్లాస్టిక్ వ్యర్థాలను ఇంధనంగా మార్చే ఈ పరిశోధనలో కొంత పురోగతి సాధించినప్పటికీ, ఈ సాంకేతికతను భారీస్థాయిలో అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ముందు కొన్ని ముఖ్యమైన సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. ‘‘ఇందులో ఉన్న ఒక పెద్ద సమస్య ఏమిటంటే, ప్లాస్టిక్ వ్యర్థాల స్వభావం చాలా సంక్లిష్టంగా ఉండటం’’ అని ప్రొఫెసర్ డువాన్ అంటారు. ‘‘వేర్వేరు రకాల ప్లాస్టిక్లు ఇంధనంగా మారేటప్పుడు వేర్వేరుగా స్పందిస్తాయి. అంతేకాకుండా, ప్లాస్టిక్లలో ఉండే రంగులు, స్టెబిలైజర్లు (ప్లాస్టిక్ మన్నికను పెంచే రసాయనాలు) ఈ ప్రక్రియకు అడ్డుపడవచ్చు. అందువల్ల, మంచి ఫలితాలను, నాణ్యమైన ఇంధనాన్ని పొందాలంటే.. ప్లాస్టిక్ వ్యర్థాలను సరిగ్గా వర్గీకరించడం, ముందుగా శుద్ధి చేయడం చాలా అవసరం’’ అని డువాన్ చెబుతున్నారు. భవిష్యత్తు ప్రణాళిక సిద్ధంఈ సాంకేతికతను ప్రయోగశాల నుండి పరిశ్రమల స్థాయికి ఎలా తీసుకువెళ్లాలో వివరించే కొన్ని ముఖ్యమైన దశలను పరిశోధకుల బృందం సిద్ధం చేసింది. రాబోయే దశాబ్దాలలో ఈ క్లీన్ హైడ్రోజన్ ఇంధన సామర్థ్యాన్ని పెంచడం, పరిశ్రమలలో ఇది అంతరాయం లేకుండా పనిచేసేలా చేయడమే వారి ప్రధాన లక్ష్యాలు. ‘‘ఇది చాలా ఆసక్తికరమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం’’ అని పరిశోధకురాలు జియావో లూ గొప్ప ఉత్తేజంతో చెబుతున్నారు. ‘‘కొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగితే.. సౌరశక్తితో ప్లాస్టిక్ను ఇంధనంగా మార్చే ఈ సాంకేతికతలు... భవిష్యత్తులో కాలుష్యం లేని, పర్యావరణహితమైన సమాజాన్ని నిర్మించడంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయని మేము నమ్ముతున్నాం’’ అని ఆమె అంటున్నారు.‘ఇంజినీరింగ్’ అడ్డంకులుఈ ప్రక్రియ ద్వారా చివరకు తయారయ్యే ఇంధనాలను, రసాయనాలను ఒకదానికొకటి వేరు చేయడం కూడా ఒక పెద్ద సవాలుతో కూడుకున్న పని. ఈ రసాయన చర్యల వల్ల వాయువులు, ద్రవాల మిశ్రమం ఉత్పత్తి అవుతాయి. వీటిని విడివిడిగా వేరు చేయాలంటే భారీగా శక్తిని (విద్యుతు, లేదా వేడిని) ఉపయోగించాల్సి వస్తుంది. దీనివల్ల, పర్యావరణాన్ని కాపాడాలనే ఈ మొత్తం ప్రక్రియ అసలు ఉద్దేశానికే నష్టం చేకూరే అవకాశం ఉంది. ఈ సమస్యలను దాటేందుకు, పరిశోధకులు అన్ని విభాగాలను సమన్వయం చేసే ఒక సమీకృత వ్యూహం అవసరమని గట్టిగా చెబుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను హైడ్రోజన్గా మార్చేందుకు వేటివేటిని మెరుగుపరచాలో వారు చెబుతున్నారు. అవి:క్యాటలిస్ట్ డిజైన్: కాంతి ఉత్ప్రేరకాల పనితీరును మరింత నాణ్యంగా మార్చటం.రియాక్టర్ ఇంజనీరింగ్: రసాయన చర్యలు జరిగే పాత్రలు లేదా యంత్రాలను మరింత సమర్థవంతంగా తయారు చేయడం.సిస్టమ్ ఆప్టిమైజేషన్: యంత్రాలు, రసాయనాలు, మానవ శ్రమతో కూడిన మొత్తం వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడం.పాస్టిక్ను ఇంధనంగా ఎలా మారుస్తారు?సౌరశక్తితో ప్లాస్టిక్ను ఇంధనంగా మార్చే విధానాన్ని ‘సోలార్–డ్రివెన్ ఫొటోరిఫార్మింగ్’ అంటారు. ఇది సూర్యకాంతికి స్పందించే ‘కాంతి ఉత్ప్రేరకాలు’ (ఫొటోక్యాటలిస్ట్లు) అనే ప్రత్యేక పదార్థాలపై ఆధారపడి పనిచేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ ప్రధానంగా 4 దశల్లో జరుగుతుంది. ప్లాస్టిక్ను సిద్ధం చేయడం సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను మొదట బాగా శుభ్రం చేస్తారు. ఆ తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు. ఎందుకంటే పెద్ద ప్లాస్టిక్ వస్తువుల కంటే చిన్న ముక్కలపై రసాయన చర్య చాలా వేగంగా జరుగుతుంది.ఫోటోక్యాటలిస్ట్ను కలపడంఈ చిన్న ప్లాస్టిక్ ముక్కలను ఒక ప్రత్యేకమైన ద్రవంలో ముంచుతారు. అందులో ‘ఫొటోక్యాటలిస్ట్’ అనే ప్రత్యేక పదార్థాన్ని కలుపుతారు. ఫొటోక్యాటలిస్ట్ అనేది సూర్యకాంతిని తనపై పడగానే క్రియాశీలం అయి, రసాయన చర్యలను అత్యంత వేగంగా జరిగేలా చేసే ఒక ఉత్ప్రేరకం.సూర్యకాంతి ప్రయోగంఇప్పుడు ఈ మిశ్రమంపై సూర్యకాంతి పడేలా చేస్తారు. ఇక్కడే అసలైన అద్భుతం జరుగుతుంది. ప్లాస్టిక్ ముక్కల్లో కార్బన్, హైడ్రోజన్ పరమాణువులు ఒకదానికొకటి గట్టిగా అంటుకుని ఉంటాయి. సూర్యకాంతిలోని శక్తిని ఫొటోక్యాటలిస్ట్ గ్రహించి, ఆ శక్తితో ప్లాస్టిక్లో ఉన్న ఈ కార్బన్– హైడ్రోజన్ బంధాలను ముక్కలు ముక్కలుగా విడగొడుతుంది.ఇంధనం విడుదల అవటంబంధాలు విడిపోగానే, ప్లాస్టిక్ నుండి విడిపోయిన హైడ్రోజన్ పరమాణువులన్నీ ఒకదానితో ఒకటి కలిసి హైడ్రోజన్ వాయువుగా మారి పైకి విడుదలవుతాయి. దీనిని శాస్త్రవేత్తలు ప్రత్యేక గొట్టాల ద్వారా సిలిండర్లలో భద్రపరుస్తారు. మిగిలిన కార్బన్ భాగం పరిశ్రమలలో వాడే ఇతర ఉపయోగకరమైన రసాయనాలుగా (ఎసిటిక్ యాసిడ్ లేదా డీజిల్ వంటి హైడ్రోకార్బన్లు) మారుతుంది. సాక్షి స్పెషల్ డెస్క్ -
76 కేజీల నుంచి 56 కేజీలకు..! జస్ట్ సింపుల్ వ్యాయమాలతోటే..
బరువు తగ్గడం అనగానే తీవ్రమైన జిమ్ సెషన్లు, అధిక వ్యాయామాలు, స్ట్రిక్ట్ డైట్ తప్పనిసరని అనుకుంటాం. అలాగే చాలామంది శ్రమతో కూడిన వ్యాయామాలు చేసి..చివరికి శరీరం అలిసిపోయి..మా వల్ల కాదని మధ్యలోనే వెయిట్లాస్ జర్నీని వదిలేస్తుంటారు. అయితే అలా ఇబ్బందిపడకుండా కొద్దిపాటి వ్యాయామాలతోనే సులభంగా కేజీల కొద్దీ బరువు తగ్గొచ్చని అంటున్నారు ఫ్యాట్ లాస్ కోచ్. కీళ్లపై అధిక ఒత్తిడిని కలిగించకుండా, కేలరీలను బర్న్ చేసే చిన్నపాటి వ్యాయామాలు కూడా ఉన్నాయని అంటున్నురామె. అదెలాగో తెలుసుకుందామా.!.అధికబరువుతో ఉండి కొవ్వు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటే..వర్కౌట్లు చాలా ప్రభావవంతంగా ఉంటాయంటున్నారామె. అయితే కీళ్లకు నొప్పి కలిగించి, ప్రేరణను దూరం చేసే అధిక ప్రభావ వ్యాయామాలతో ప్రయత్నించమని చెబుతున్నారు. మోకాళ్లు, కీళ్లను దెబ్బతీయకుండా కొవ్వును కరిగించే, క్రమబద్ధమైన, తక్కువ-ప్రభావం, అధిక-తీవ్రత గల వ్యాయామాలను ఎంచుకోమని చెబుతున్నారు.స్టాండింగ్ జాక్స్తక్కువ-ప్రభావం గల స్టాండింగ్ జాక్స్ మీ హృదయ స్పందన రేటును పెంచడానికి మరియు కేలరీలను కరిగించడానికి కీళ్లకు అనుకూలమైన మార్గం. ఒక పాదాన్ని నేలపై ఉంచడం ద్వారా, మొత్తం శరీరాన్ని నిమగ్నం చేస్తూనే ప్రభావాన్ని తగ్గిస్తారు. కొవ్వు తగ్గించే కోచ్ నియంత్రిత కదలికతో 20 సార్లు చేయమని సిఫార్సు చేస్తున్నారు.స్టాండింగ్ హై నీస్ఒక పాదాన్ని నేలపై ఉంచి, మోకాళ్లను మీ ఛాతీ వరకు పైకి లేపండి. ఈ వ్యాయామం మీ కోర్ను తీవ్రంగా నిమగ్నం చేస్తుంది, హృదయ స్పందన రేటును పెంచుతుంది. చేసే వేగం ఆధారంగా కచ్చితంగా ఎన్ని కేలరీలు ఖర్చు చేస్తారనేది ఆధారపడి ఉంటుంది. అందుకోస ఆన్లైన్ కేలరీ బర్న్ కాలిక్యులేటర్ను కూడా ఉపయోగించవచ్చు. ఈ కదలికను స్థిరమైన వేగంతో 20 సార్లు యండి.పల్స్ స్క్వాట్స్ఈ బాడీవెయిట్ వ్యాయామం కీళ్ళను సురక్షితంగా ఉంచుతూనే,క్వాడ్స్ (తొడ ముందు కండరాలు), గ్లూట్స్ (పిరుదులు), కోర్ (శరీర మధ్యభాగం) కండరాలను ఉత్తేజపరుస్తుంది. సాధారణ స్క్వాట్లో ఉండే పూర్తిగా నిలబడి, తిరిగి యధాస్థానానికి వచ్చే కదలికను తొలగించడం ద్వారా,కండరాలపై నిరంతర ఒత్తిడిని ఉంచుతారు. ఇది లీన్ కండరాలను నిర్మించడానికి, జీవక్రియ రేటు పెంచడానికి సహాయపడుతుంది.వాల్ క్లైంబర్పాదాలను నేలపై స్థిరంగా ఉంచి, 30 రెప్స్ చేయడం వల్ల భుజాలు, ఛాతీ, కోర్ కండరాలు ఉత్తేజితమవుతాయి. ఇది హృదయ స్పందన రేటును పెంచుతూ, మోకాళ్లు కీళ్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనివల్ల కేలరీలను కరిగించడంలో సహాయపడే కార్డియోవాస్కులర్ ప్రభావం ఏర్పడుతుంది.వివరాలకు ఈ వీడియోపై క్లిక్ చేయండి(చదవండి: పిల్లలకు సమయం కేటాయించాలి) -
బ్రీజీ ఔట్ఫిట్... క్రేజీ స్టయిల్
చిన్నప్పుడు అమ్మ కొనే బట్టలన్నీ లూజ్ లూజ్గా ఉన్నాయని ఫీల్ అయ్యిన వారే, ఇప్పుడు వెతికి వెతికి మరీ అవే కొనుక్కుంటున్నారు! కారణం, టాప్ ట్రెండీ ఫ్యాషన్స్లో ఇప్పుడు ఓవర్సైజ్డ్, రిలాక్స్డ్ ఫిట్ కూడా ఒక హాట్ స్టయిల్గా మారిపోయింది. అందుకే, లూజ్గా, లైట్గా, గాలి ఆడేలా ఉండే ఈ ఔట్ఫిట్స్ సమ్మర్లో కంఫర్ట్తో పాటు స్టయిల్ కూడా ఇస్తున్నాయి.హీరో లినెన్ !సమ్మర్ అనగానే గుర్తొచ్చేది లినెన్ బట్టలే. వీటిల్లో రిసార్ట్ కాలర్ అంటే ఓపెన్ కాలర్ షర్ట్స్ వేసుకుంటే పక్కా బీచ్ వైబ్ వస్తుంది. వీటికి లోపల ఒక ప్లేన్ ఫిట్టెడ్ టీషర్ట్ వేసి, పైన షర్ట్ బటన్స్ తీసేసి ఓపెన్గా వదిలేయండి. లేయర్డ్ లుక్ వస్తుంది, ఎండ కూడా తక్కువగా తగులుతుంది. నిట్టెడ్ పోలోస్కి క్లాస్రెగ్యులర్ కాలర్ టీషర్ట్స్ బోర్ కొడితే, ఈ నిట్టెడ్ అంటే అల్లిక డిజైన్ పోలోస్ ట్రై చేయండి. ఇవి గాలి బాగా ఆడేలా ఉండటంతో పాటు, ఒక ప్రీమియం లుక్ కూడా ఇస్తాయి.వైడ్ లెగ్ ప్లీటెడ్ ట్రౌజర్స్ కింద లూజ్గా ఉంటూ, పైన ప్లీట్స్ ఉండే ఈ ప్యాంట్లు వేసుకుంటే క్లాస్ లుక్ వస్తుంది. ఇటు గాలికి గాలి ఆడుతుంది, అటు ఆఫీస్ మీటింగ్స్ లేదా స్మార్ట్ క్యాజువల్ ఈవెంట్స్కి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. లైట్ కలర్స్లో ప్లీటెడ్ ట్రౌజర్స్ వేసుకుని, లోఫర్స్ జోడిస్తే సమ్మర్ ఫ్యాషన్లో మీరే టాపర్!డ్రాస్ట్రింగ్ లినెన్ ప్యాంట్స్బెల్ట్ పెట్టుకునే ఓపిక కూడా లేని ఎండల్లో తాడు ఉండే ఈ లినెన్ ప్యాంట్లు బెస్ట్ చాయిస్. క్యాజువల్ అవుటింగ్స్, ఈవినింగ్ వాక్స్, ట్రావెల్స్ ఏదైనా సరే ఈజీగా సెట్ అయిపోతాయి.జాగ్రత్తలు!లూజ్ ఫిట్ అంటే చాలా పెద్ద సైజ్ కాదు. లేదంటే బెడ్షీట్లా కనిపించే చాన్స్ ఉంది.లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ మాత్రమే ఎంచుకోండి. మందపాటి మెటీరియల్ అయితే సమ్మర్లో భరించలేరు.ఒక ఔట్ఫిట్లో చాలా ప్రింట్స్ వద్దు. రిలాక్స్డ్ ఫిట్ అంటే క్లీన్, సింపుల్ లుక్ బెటర్.లైట్ కలర్స్ వేసుకుంటే సమ్మర్లో కూల్గా కనిపిస్తారు. బ్లాక్తో పూర్తి ఔట్ఫిట్ అయితే సూర్యుడు కూడా మీతో పర్సనల్గా కనెక్ట్ అయిపోతాడు! కొండి దీపిక(చదవండి: ఆ కారణంగానే 56 ఏళ్ల నాటి ఆ కప్పులోనే 'టీ' ..! మానసిక నిపుణులు సైతం..) -
విదేశీ పర్యాటకుడి గొప్ప మనసు..! ఉత్తరాఖండ్లో..
కొందరు కేవలం పర్యాటనలకు వెళ్లి వచ్చేయరు. పర్యావరణ స్ఫూర్తిని రగిలించే ఆలోచింప చేస్తారు. అందుకు దేశం, సరిహద్దుతో పనిలేదు. మంచి మనసు, తనవంతుగా పర్యావరణానికి మేలు చేయాలన్న దృక్పథం చాలు అని నిరూపిస్తున్నాడు ఈ విదేశీయుడు. అంతేగాదు అతడి చర్యకు అక్కడి ప్రభుత్వం స్పందించి కదలివచ్చింది కూడా.పర్యావరణ బాధ్యతకు ఉదాహరణగా నిలుస్తూ..అందర్నీ ఆలోచింపచేస్తున్నాడు బ్రిటన్కు చెందిన మార్క్. ఆయన ఉత్తరాఖండ్లోని కాసర్ దేవి ప్రాంతంలో అటవీ మార్గాలు, పరిసరాల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధాలను నిశబ్దంగా ఏరుతున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో సంచులు చేత బట్టుకుని సుందరమైన కొండ ప్రాంతంలో పడి ఉన్న ప్లాస్టిక్ను, చెత్తను ఏరుతూ కనిపించాడు. అక్కడి స్థానికుల ప్రకారం..మార్క్ చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నాడట. పైగా పరిశుభ్రతను తన వ్యక్తిగత దినచర్యగా మార్చుకున్నాడని చెబుతున్నారు. అతను ప్రతిరోజూ దాదాపు రెండు నుంచి మూడు గంటలపాటు సమీపంలోని అటవీ ప్రాంతాలను కాలిబాటను శుభ్రం చేస్తూ..ఆ ప్రాంత సహజ సౌందర్యాన్ని పరిరక్షించడంలో సహాయపడుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. అతని కృషి ఆన్లైన్లో విశేష ప్రచారం పొందింది. అతడు చేస్తున్న పని ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించడంతో పాటు వాటిని పరిరక్షించే బాధ్యతను కూడా కలిగి ఉండాలనే విషయాన్ని నేర్పిందని అక్కడకి వస్తున్న పలువురు పర్యాటకులు చెబుతుండటం విశేషం.అంతేగాదు అతడొ చొరవకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఫిదా అవ్వతూ అతడిని అభినిందించింది. అలాగే అతడికి అన్ని విధాల మద్దతివ్వనున్నట్లు పేర్కొంది. అంతేగాదు అక్కడి అధికారులు పర్యావరణం, పరిశుభ్రత విషయాల్లో అవగాహన కల్పించడంలో సానుకూల ఉదహారణగా నిలిచాడని ప్రశంసించారు. అంతేగాదు పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత పట్ల విద్యార్థులను, యువతను ప్రేరేపించే విధంగా మార్క్ను ఒక "మార్పు కారకుడిగా" ప్రోత్సహించాలని పరిపాలన యంత్రాంగం భావిస్తున్నట్లు జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. View this post on Instagram A post shared by India 🇮🇳 (@postingfornation) (చదవండి: 52 ఏళ్ల వయసులో సీఏ..! తండ్రి 75వ పుట్టినరోజుకి..) -
52 ఏళ్ల వయసులో సీఏ..! తండ్రి 75వ పుట్టినరోజుకి..
చదవాలన్న కోరిక బలంగా ఉంటే వయసు పెద్ద అడ్డంకి కాదని ఎందరో నిరూపించారు. అయితే ఓ మహిళ కుటుంబ బాధ్యతలతో తలమునకలులవ్వుతూ ఐదుపదుల వయసులో చదవాలనుకోవడం అంటే.. అంత ఈజీ కాదు. మాటల్లో చెప్పినంత సులువు కూడా కాదు. కానీ ఓ మహిళా దాన్ని సాధ్యం చేసి చూపించింది అది కూడా 52 ఏళ్ల వయసులో. కష్టపడి చదవడానికి భయపడే యువతరానికి ఆమె కథ ఓ స్ఫూర్తి.గుజరాత్కు చెందిన, కామర్స్ గ్రాడ్యుయేట్ అనితా కప్డి 23 ఏళ్ల పాటు విద్యార్థులకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బోధించారు. అయితే, ఆమెకు గణితం, అకౌంటెన్సీలో మంచి అభిరుచి, నైపుణ్యం ఉన్నాయామెకు. పూర్తికాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూనే ఎంకామ్, బీఎడ్ పూర్తి చేశారామె. అలాగే ఆమెకు సీఏ చేయాలనే జీవితకాల డ్రీమ్ కూడా ఉంది. ఆ నేపథ్యంలోనే 48 ఏళ్ల వయసులో, పదవీ విరమణకు దగ్గరవుతున్నప్పుడు ఎలాగైనా సీఏ చేయాలని గట్టిగా నిశ్చయించుకుంది. పైగా ఆ సీఏ డిగ్రీని తన సీఏ తండ్రి (ఒక కంపెనీ సెక్రటరీ) 75వ పుట్టినరోజుకి గిఫ్ట్గా ఇవ్వాలని స్ట్రాంగ్గా నిర్ణయించుకుంది. అలా ఆమె 2012లో, ఆమె ICAI డైరెక్ట్ ఎంట్రీ మార్గం ద్వారా సీఏ(CA) కోసం నమోదు చేసుకున్నారామె. అలా అని హాయిగా కూర్చొని చదువుకునే తీరిక మాత్రం లేదు. ఆమె చదవుకోవాలనే జర్నీ ఎంతో సవాలుతో మొదలైంది. ఒక పక్క కుమార్తె వివాహ సన్నహాలు, మరోవైపు కుమారుడి బోర్డు పరీక్షలకు మద్దతివ్వడం, వంటి కుటుంబ బాధ్యతలతో సతమతమవ్వుతూనే సీఏకి ప్రిపరయ్యారామె. పైగా కోచింగ్ లేకుండా సీఏ రెండో దశ ఐపీసీసీ(IPCC)ని క్లియర్ చేసింది. ఆ తర్వాత కూడా సరిగ్గా చదువుకునే అవకాశం చిక్కలేదు అనితకు. సరిగ్గా సీఏ ఫైనల్ పరీక్షలకు సన్నద్ధమవ్వుతుండగా అత్తగారిని కోల్పోవడం, ఆ బంధువుల హడావిడి మధ్య అలానే నిశబ్దంగా చదువు కొనసాగించి అనుకున్నట్లుగా క్లియర్ చేసి సీఏ అయ్యారామె. అలాగే అనిత తను కోరుకున్నట్లుగానే తండ్రి 75వ పుట్టినరోజు నాడు సీఏ డిగ్రీని గిఫ్ట్గా ఇచ్చింది. అలా అనిత 52 ఏళ్ల వయసులో సీఏ అయ్యింది. (చదవండి: ఆ కారణంగానే 56 ఏళ్ల నాటి ఆ కప్పులోనే 'టీ' ..! మానసిక నిపునులు సైతం..) -
స్వీట్స్, చిప్స్, బిర్యానీ... మీ మనసులో ఏముందో చెప్పేస్తాయి!
రోజంతా అలసిపోయిన తర్వాత లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు మీరు ఏదైనా ప్రత్యేకమైన ఆహారం కోసం ఆరాటపడుతున్నారా? అది ఐస్క్రీమ్ కావచ్చు, వేడి వేడి ఫ్రైస్ కావచ్చు లేదా ఇంట్లో వండిన పప్పు అన్నం కావచ్చు. కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా, మనసులోని భావోద్వేగాలకు ఉపశమనంగా కంఫర్ట్ ఫుడ్ పనిచేస్తుందని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు.తీపి వంటకాలతో ఓదార్పుచాలామంది కష్టకాలంలో చాక్లెట్లు, స్వీట్లు తినడానికి ఇష్టపడతారు. చక్కెర పదార్థాలు మెదడులో తాత్కాలికంగా ‘ఫీల్-గుడ్’ రసాయనాలను విడుదల చేస్తాయి. ఒంటరితనంగా లేదా బాధగా ఉన్నప్పుడు, ఈ తీపి పదార్థాలు మనసుకు ఉపశమనాన్ని ఇస్తాయి. ఇవి మనసుకు అశాంతి నుంచి తాత్కాలిక ఊరటను ప్రసాదిస్తాయి.జ్ఞాపకాలతో ముడిపడిన ఆహారంవేడి సూప్ లేదా తరతరాలుగా వస్తున్న ప్రత్యేక వంటకాలు మనకు భద్రతా భావాన్ని, ఆత్మీయతను అందిస్తాయి. అలాగే, స్పైసీ ఫుడ్ తినేవారిలో ఉత్సాహం కోసం లేదా బోర్ కొట్టినప్పుడు ఏదైనా కొత్తదనం కోసం ఆరాటపడే మనస్తత్వం ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఒత్తిడిలో కరకరలాడే ఆహారంచిప్స్ లేదా పాప్కార్న్ వంటి కరకరలాడే ఆహారాలు తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని కొందరు నమ్ముతారు. నమలడం అనే ప్రక్రియ శారీరక ఉద్రిక్తతను విడుదల చేయడానికి సహాయపడుతుంది. మీ మనసు ఏం కోరుకుంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ప్లేట్లో ఉన్నది కేవలం ఆహారం మాత్రమే కాదు, మీ హృదయపు అలజడి.ఇది కూడా చదవండి: కార్పొరేట్ ఒత్తిడికి బై బై.. ఆటో డ్రైవింగ్తో లైఫ్ హ్యాపీ! -
ఆ కారణంగానే 56 ఏళ్ల నాటి ఆ కప్పులోనే 'టీ' ..!
కొన్ని వస్తువులతో గొప్ప ఎమోషన్ ఉంటుంది. ఎన్ని సరికొత్త ట్రెండ్లు వచ్చినా..ఆ వస్తువులనే పదేపదే వాడతాం. అవి మనకు ఓదార్పు, ప్రియమైన లేదా ఇష్టమైన వ్యక్తులు మనతో ఉన్న అనుభూతిని అందిస్తూ సదా ధైర్యాన్ని ఇస్తుంటాయ్. ఆ విషయమైన చెబుతున్నాడు ఈ బాలీవుడ్ బుల్లితెర నటుడు. మనలో ఇలాంటి భావోద్వేగ కనెక్టివిటీ ఉన్నవాళ్లు ఉన్నారంటూ తన భావోద్వేగ కథను పంచుకున్నారు. బుల్లితెర నటుడు, హోస్ట్ రాజీవ్ ఖండేల్వాల్, ప్రతి ఉదయం 56 ఏళ్ల నాటి టీ కప్పులలో టీ తాగే తన దినచర్యకు సంబంధించిన ఒక భావోద్వేగ జ్ఞాపకాన్ని షేర్ చేసుకున్నారు. తన అమ్మ నాన్న చనిపోయినప్పుడు 70వ దశకంలో తను కొన్న కప్పులను మాత్రమే వాడాలని నిర్ణయించుకుని ఇప్పటికీ వాటిల్లోనే టీ తాగుతుంటానని అన్నారు. తన రోజు మొదలయ్యేది కూడా ఆ కప్పులోని టీ సిప్తోనే అని అన్నారు. అవే ఎందుకంటే..1970లో వాళ్ళ పెళ్లి సమయంలో... ఈశాన్యంలో బంగ్లాదేశ్ సరిహద్దుకు వెళ్లారని, అక్కడే తన తండ్రికి పోస్టింగ్ ఉండేదని చెప్పుకొచ్చారు. 2019లో అమ్మ, 2022లో నాన్న చనిపోయినప్పుడూ..ఏమేమి తీసుకువెళ్లాలని చర్చిస్తుండగా..తాను ఈ కప్పులు కావాలని అడిగానని అన్నారు. తన తల్లి కొన్న ఆ ఐదు కప్పులు, సాసర్లు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయన్నారు. ప్రతి ఉదయం వీటిలోనే టీ తాగుతానని చెప్పారు. ఈ అలవాటు మన వాళ్లను కోల్పోయిన బాధకు ఉపశమనంగా, ఆ వస్తువులు వ్యామోహంతో కూడిన విలువను కలిగి ఉంటాయన్నారు. మానవువుల కేవలం మనుషులతోనే బంధాలు ఏర్పరుచుకోరని మనం ప్రేమించే వ్యక్తులతో ముడిపడి ఉన్న ఆచారాలను, వాసనలు, ప్రదేశాలు, దినచర్యలు, వస్తువులు, స్పర్శలు, వంటి వాటితో బంధాలను ఏర్పరుచుకుంటామని అన్నారు. చూడటానికి అవి వస్తువులే గానీ అంతకుమంచి.. అనుబంధాన్ని ఇచ్చేవి. ముఖ్యంగా దఃఖం నుంచి కోలుకుని ముందుకు సాగడానికి, భావోద్వేగపరంగా స్ట్రాంగ్గా మారడానికి హెల్ప్ అవుతాయని అంటున్నారు. భద్రత, అనుబంధాన్ని కొనసాగించడం..మానసిక నిపుణులు దుఃఖానికి మందు, భావోద్వేగ భద్రతను ఇస్తుందని ఇది సరైనదనే అంటున్నారు. ఒక తండ్రి తన దివంగత భార్య మొక్కలకు నీరు పోసినట్లుగానే తాను చేస్తుంటాడు. ఒక కుమార్తె తన తల్లి శాలువాను మడిచి దిండు పక్కన పెట్టుకుంటుంది. ఒక కుమారుడు ప్రతి ఉదయం తన తల్లిదండ్రులకు ఇష్టమైన కప్పులో టీ తయారుచేస్తూనే ఉంటాడు. ఇవన్నీ వాళ్లతో ఉన్న అనుబంధాలకు సజీవ సాక్ష్యాలు, కొనసాగింపు అంటున్నారు. ఇవి వారికి దుఃఖం నుంచి బయటపడేసి, కోల్పోయిన వ్యక్తులు తమతో ఉన్నారనే భావోద్వేగ భద్రత, మద్దతను ఇవ్వడమే గాక, ధైర్యంగా లైఫ్ని లీడ్ చేసేందుకు దోహదపడుతుందని అంటున్నారు. ఒక్కోసారి వారి జ్ఞాపకాలు మోయలేనంతగా మారినప్పుడూ..ఒంటరిగా ఉండకుండా..సాముహిక సేవ, ప్రార్థన, పని, వ్యాయామం వంటి పనులతో మమేకమవ్వాలంటున్నారు. అలానే పూర్తిగా ఆయా వ్యక్తులకు సంబంధించిన ఆ వస్తువులే పరమావధిగా కాకుండా ఆ జ్ఞాపకాలతో ముందుకు సాగండని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఒక్కోసారి ఆయా వస్తువులు కూడా కాలక్రమేణ పాడయ్యే అవకాశం ఉంది, కాబట్టి అది మనల్ని కుంగదీయకముందే అంతరంగికంగా స్ట్రాంగ్గా ఉండేలా స్థిరంగా ఉండండని చెబుతున్నారు. View this post on Instagram A post shared by Curly Tales | A Fork Media Group Co. (@curly.tales) (చదవండి: డెలివరీ సమయంలో బ్లడ్ అరేంజ్మెంట్కి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు?) -
యూట్యూబ్ను షేక్ చేస్తున్న ఎన్నారై రాపోలు నందు..!
ఒక్క చాన్స్.. ఒకే ఒక్క చాన్స్ అంటూ చిత్ర పరిశ్రమలో వేలాది మంది అవకాశాల కోసం తిరుగుతుంటారు. చాలా మందిలోని కళ కేవలం కలగానే మిగిలిపోతుంది. కానీ, డ్యాన్స్ చేసి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన అతడికి లక్షలాది మంది అభిమానులు దొరికారు. సినిమాపై ఉన్న మక్కువే అతడికి అవకాశాలు వెతుక్కుంటూ తెచ్చింది. కోలీవుడ్లో హీరోగా అరంగేట్రం చేసిన జనగామ జిల్లా పాలకుర్తి ప్రాంతానికి చెందిన ప్రవాస భారతీయుడు నందు రాపోలుపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ..పాలకుర్తి టౌన్: ఎన్నారై రాపోలు నందు బాల్యం మొత్తం పాలకుర్తి పరిసర ప్రాంతంలోనే గడిచింది. ఉద్యోగ రీత్యా ఆయన సింగపూర్లో సెటిలయ్యారు. అక్కడ బ్యాంకులో ఉద్యోగం చేసూ్తనే తెలుగు ఫిలిమ్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు. కోవిడ్ సమయంలో ఇంటికే పరిమితమైన నందు సరదాగా రీల్స్ చేయడం ప్రారంభించారు. అమెరికాలోని అట్లాంటాలో ఉన్న తన బంధువు సురేఖ నున్నతో కలిసి చేసిన వీడియోలు మిలియన్ల వ్యూస్ సాధించాయి. ఇద్దరూ వేర్వేరు ఖండాల్లో ఉన్నప్పటికీ, ఒకే పాటలో హీరోహీరోయిన్ పాత్రలను విభజించుకుని, ఎక్కడా తేడా తెలియకుండా సింక్ చేస్తూ చేసిన వీడియోస్ బాగా పాపులరయ్యాయి. వారు చేసిన 25 రీల్స్లో 20 వీడియోలు ఒక మిలియన్ (10 లక్షలు) వ్యూస్ దాటాయి. నందు ఆత్మవిశ్వాసంతో కూడిన డాన్స్, సినిమాపై ఆయనకున్న ప్రేమ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. నిర్మాత కోన వెంకట్ సైతం నందు చేసిన ఒక రీల్ను తన ఇన్స్టాలో షేర్ చేయడంతో నందుకు మంచి గుర్తింపు వచ్చింది. కోలీవుడ్ హీరోగా..నందు డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి హీరో పాత్రకు ఎంపిక చేశారు. మలేషియా, తమిళనాడులో చిత్రీకరించిన ‘13/13 లక్కీ నన్’ చిత్రంలో నందు లవర్ బాయ్ పాత్రలో నటించారు. ఈ తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ తమిళనాడు, సింగపూర్, అమెరికా, మలేషియాలో ఏకకాలంలో విడుదల కానుంది. కాగా, నందు 2014 నుంచి సింగపూర్లో తెలుగు సినిమాలను పంపిణీ చేస్తున్నారు. స్థానిక పంపిణీదారులతో కలిసి ఇప్పటివరకు 25కు పైగా సినిమాలు విడుదల చేశారు. సరదాగా చేసిన రీల్స్తో హీరోగా అవకాశం..కోవిడ్ సమయంలో సరదాగా చేసిన రీల్స్ నా జీవితాన్నే మార్చేస్తాయని అస్సలు ఊహించలేదు. ఐటీ ఉద్యోగం చేసూ్తనే నటనపై అభిరుచిని కొనసాగించాను. సోషల్ మీడియా ద్వారా వచ్చిన గుర్తింపే నాకు కోలీవుడ్లో హీరో అవకాశం తెచ్చింది. ఉద్యోగం నా జీవనాధారం. సినిమాలు నా ఫ్యాషన్, ప్రేక్షకుల ప్రేమతో ఇంకా మంచి పాత్రలు చేయాలని ఉంది.– రాపోలు నందు, సింగపూర్ -
మండే ఎండల్లో పచ్చి ఉల్లిపాయలు తినొచ్చా?
దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు శరీరాన్ని చల్లబరుచుకోవడానికి పూర్వ కాలపు వేసవి చిట్కాలను ఆశ్రయిస్తున్నారు. మజ్జిగ నుంచి నానబెట్టిన సబ్జా గింజలు, పచ్చి ఉల్లిపాయల వరకు... సాంప్రదాయ చలవ చేసే ఆహారాలు ఇప్పుడు ప్రతిచోటా కనిపిస్తున్నాయి. అయితే ఈ చిట్కాలలో కొందరు వేసవిలో పచ్చి ఉల్లిపాయలు తినాలని కచ్చితంగా చెబుతుంటే, మరికొందరు ఇవి ఎసిడిటీకి కారణమవుతాయని, కాబట్టి వీటిని అస్సలు తినకూడదని నమ్ముతారు. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. తీవ్రమైన ఎండలు ఉన్నప్పుడు నిజంగా పచ్చి ఉల్లిపాయలు తినవచ్చా? అవి సమస్యను మరింత తీవ్రం చేస్తాయా? వంటి ప్రశ్నలకు సమాధానం ఇదిగో..డీహైడ్రేషన్ను తగ్గించడంలో పచ్చి ఉల్లిపాయలు సహాయపడతాయని చాలామంది నమ్ముతారు. పచ్చి ఉల్లిపాయలు వేడి వాతావరణంలో శరీరానికి కొన్ని విధాలుగా సహాయకరమే కానీ వాటిని ఎక్కువగా తినడం వల్ల కొంతమందికి సమస్యలు కూడా రావచ్చు. తరతరాలుగా ఉల్లిపాయలకు, వేసవి కాలానికి బలమైన సంబంధం ఉంది. చాలా ఇళ్లలో, ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు భోజనంతో పాటు ఉల్లిపాయ ముక్కలు తింటారు. ఉల్లిపాయలు వడగాల్పులు నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయని గ్రామాలు, చిన్న పట్టణాల ప్రజలు ఇప్పటికీ నమ్ముతారు.ఉల్లిపాయలు, ఎండ నుండి రక్షణకు సంబంధించి రాజస్థాన్లో ఒక ఆసక్తికరమైన సాంప్రదాయ పద్ధతి కూడా ఉంది. రాజస్థాన్లోని ఒక సాంప్రదాయం ప్రకారం, ప్రజలు శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి తమ ఛాతీపై, చెవుల వెనుక ఉల్లిపాయ పేస్ట్ను రుద్దుకుంటారు. సైన్స్ ప్రతి సాంప్రదాయ చిట్కాను పూర్తిగా నిర్థారించకపోవచ్చు. కానీ ఈ పద్ధతులు చాలా వరకు తరతరాలుగా కొనసాగుతూనే ఉన్నాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.వేసవి కాలంలో ఉల్లిపాయలను ఉపయోగించడానికి ప్రధాన కారణం నీటి శాతం. పచ్చి ఉల్లిపాయలలో అధిక మొత్తంలో నీరు ఉంటుంది. ఇది తీవ్రమైన వేడి వాతావరణంలో శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి సహాయపడుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు, శరీరం చెమట ద్వారా నిరంతరం నీటిని కోల్పోతుంది. కాబట్టి, ఎక్కువ నీటి శాతం ఉన్న ఆహారాలు శరీరానికి ఉపశమనాన్ని ఇస్తాయి.అయితే వేసవిలో ఉల్లిపాయలు ఉపయోగపడటానికి అది ఒక్కటే కారణం కాదు. సాంప్రదాయ వైద్యం ప్రకారం, ఉల్లిపాయ మన శరీరంపై చలవ చేసే ప్రభావాన్ని చూపుతుంది. వీటిలో క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్, ప్రిబయోటిక్స్, మంచి నీటి శాతం ఉంటాయని న్యూట్రిషనిస్టులు అంటున్నారు. అలాగే పచ్చి ఉల్లిపాయలు వడదెబ్బ నుంచి పూర్తి రక్షణ ఇవ్వలేవని.. అవి తమలోని పోషకాలు, నీటి శాతం కారణంగా శరీరానికి తోడ్పడగలవు కానీ, అవి మంచినీళ్లు తాగడానికి ప్రత్యామ్నాయం కాదంటున్నారు.కొంతమంది ఎటువంటి సమస్య లేకుండా ప్రతిరోజూ వీటిని తినగలిగినప్పటికీ, మరికొందరు ఎక్కువ పచ్చి ఉల్లిపాయలను తిన్న తర్వాత ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలను ఎదుర్కోవచ్చుని వైద్య నిపుణులు చెబుతున్నారు. తీవ్రమైన ఎండలు ఉన్నప్పుడు, జీర్ణక్రియలో వచ్చే ఇబ్బందులు మరింత అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అధికంగా పచ్చి ఉల్లిపాయలు తిన్న తర్వాత కొందరు అసౌకర్యంగా భావించడానికి కారణం ఇదే. ఇక్కడ సమస్య ఉల్లిపాయది కాదు, దానికి మన జీర్ణవ్యవస్థ ఎలా స్పందిస్తుందనేది ముఖ్యం.ఎసిడిటీతో బాధపడేవారు పచ్చి ఉల్లిపాయలు తిన్న తర్వాత మరింత సమస్యను ఎదుర్కొంటారు. పచ్చి ఉల్లిపాయలు నేరుగా వడదెబ్బకు కారణమవుతాయని చెప్పడానికి ప్రస్తుతం ఎటువంటి స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే, ఎక్కువ పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల వికారం, ఎసిడిటీ, కడుపు నొప్పి కలిగితే.. హీట్వేవ్ సమయంలో మనిషిని మరింత నీరసపరుస్తుందని వైద్యులు చెబుతున్నారు. -
నిమ్మతో నిగనిగలాడే మెరిసే అందం..
సాధారణంగా చుండ్రు, బ్లాక్హెడ్స్, నిర్జీవమైన చర్మం వంటి సమస్యలకు ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయితే, వీటన్నింటికీ మన వంటింట్లో ఉండే నిమ్మకాయతోనే సులభంగా చెక్ పెట్టవచ్చు. నిమ్మకాయలో ఉండే విటమిన్–సి చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు బ్లాక్హెడ్స్ ఉన్న ప్రాంతంలో కొద్దిగా నిమ్మరసం రాయాలి. ఉదయాన్నే చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. బ్లాక్హెడ్స్ పూర్తిగా తగ్గే వరకు ఈ చిట్కా పాటించవచ్చు. పొడి చర్మం ఉన్నవారు ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి ప్యాక్లా వేసుకోవాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే చర్మం మృదువుగా మారుతుంది. నిర్జీవంగా మారిన జుట్టుకు మెరుపును తీసుకురావడానికి 3 చెంచాల నిమ్మరసం, అర కప్పు తేనె, ముప్పావు కప్పు ఆలివ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని తడి జుట్టుకు రాసి, అరగంట తర్వాత తలస్నానం చేయాలి. చుండ్రు ఎక్కువగా ఉన్నప్పుడు 3 చెంచాల నిమ్మరసంలో ఒక గుడ్డు తెల్లసొన కలిపి తలకు పట్టించాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. నెల రోజుల పాటు ఇలా చేస్తే చుండ్రు సమస్య మాయమవుతుంది.చర్మటానిక్కొరియాకు చెందిన జోసెయోన్ రాజవంశంలోని మహిళలు తమ అందాన్ని పెంచుకోవడానికి పులియబెట్టిన బియ్యపు నీటిని చర్మ టానిక్గా ఉపయోగించేవారు. అమినో యాసిడ్లు, విటమిన్లు, పిండిపదార్థాలు పుష్కలంగా ఉండే ఈ నీరు చర్మాన్ని సహజంగా మెరిసేలా చేస్తుంది. దీనిని అప్పట్లో మిగ్వామ్ అని పిలిచేవారు. ఈ నీరు మురికిని, మృతకణాలను సున్నితంగా తొలగిస్తుంది. బియ్యపు నీటిని పులియబెట్టడం వల్ల అందులో పిటెరా వంటి యాంటీఆక్సిడెంట్లు పెరుగుతాయి. ఇవి ముడతలను తగ్గించి, చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. ఎండ వల్ల దెబ్బతిన్న చర్మానికి మంచి ఉపశమనాన్ని ఇస్తాయి.ప్రముఖ హెయిర్ కేర్ బ్రాండ్ ‘చి’ సరికొత్త సాంకేతికతతో కూడిన హెయిర్ స్టైలింగ్ సాధనాలను మార్కెట్లోకి విడుదల చేసింది. జుట్టును స్టయిలింగ్ చేయడంతో పాటు రక్షణ ఇచ్చేలాగా ‘కెరాటిన్’ ప్రొటీన్ను ఈ పరికరాలలో పొందుపరచారు. ఈ కెరాటిన్ ఎన్హ్యాన్స్డ్ ప్రొడక్ట్ లైన్లో స్టైలర్, హెయిర్ డ్రైయర్, స్ట్రెయిటెనర్ వంటి మల్టీఫంక్షనల్ గాడ్జెట్స్ ఉన్నాయి. సాధారణంగా హెయిర్ స్ట్రెయిటెనింగ్, డ్రైయింగ్ చేసినప్పుడు వేడి వల్ల జుట్టు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కానీ, ఈ సరికొత్త టూల్స్ స్టయిలింగ్ ప్రక్రియలోనే కెరాటిన్ను జుట్టుకు అందిస్తాయి. దీనివల్ల జుట్టుకు మెరుపు వస్తుంది. జుట్టులోని తేమ తగ్గిపోకుండా ఉంటుంది. ముఖ్యంగా పొడిబారిన, కలరింగ్ చేయించుకున్న జుట్టు ఉన్నవారికి ఈ టూల్స్ ఎంతో మేలు చేస్తాయి. ఈ పరికరాలలో ఉపయోగించిన సెరామిక్ హీటింగ్ ఎలిమెంట్స్, అయాన్ జనరేషన్ టెక్నాలజీ కారణంగా జుట్టు కుదుళ్లకు వేడి వల్ల జరిగే నష్టం చాలా వరకు తగ్గుతుంది. ఇది మల్టీ–ఫంక్షనల్ స్టైలర్ కావడంతో ఈ కలెక్షన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకే పరికరంతో జుట్టును ఆరబెట్టుకోవడానికీ, కర్లింగ్కు, బ్రషింగ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది.ప్రముఖ హెయిర్ కేర్ బ్రాండ్ ‘చి’ సరికొత్త సాంకేతికతతో కూడిన హెయిర్ స్టైలింగ్ సాధనాలను మార్కెట్లోకి విడుదల చేసింది. జుట్టును స్టయిలింగ్ చేయడంతో పాటు రక్షణ ఇచ్చేలాగా ‘కెరాటిన్’ ప్రొటీన్ను ఈ పరికరాలలో పొందుపరచారు. ఈ కెరాటిన్ ఎన్హ్యాన్స్డ్ ప్రొడక్ట్ లైన్లో స్టైలర్, హెయిర్ డ్రైయర్, స్ట్రెయిటెనర్ వంటి మల్టీఫంక్షనల్ గాడ్జెట్స్ ఉన్నాయి. సాధారణంగా హెయిర్ స్ట్రెయిటెనింగ్, డ్రైయింగ్ చేసినప్పుడు వేడి వల్ల జుట్టు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కానీ, ఈ సరికొత్త టూల్స్ స్టయిలింగ్ ప్రక్రియలోనే కెరాటిన్ను జుట్టుకు అందిస్తాయి. దీనివల్ల జుట్టుకు మెరుపు వస్తుంది. జుట్టులోని తేమ తగ్గిపోకుండా ఉంటుంది. ముఖ్యంగా పొడిబారిన, కలరింగ్ చేయించుకున్న జుట్టు ఉన్నవారికి ఈ టూల్స్ ఎంతో మేలు చేస్తాయి. ఈ పరికరాలలో ఉపయోగించిన సెరామిక్ హీటింగ్ ఎలిమెంట్స్, అయాన్ జనరేషన్ టెక్నాలజీ కారణంగా జుట్టు కుదుళ్లకు వేడి వల్ల జరిగే నష్టం చాలా వరకు తగ్గుతుంది. ఇది మల్టీ–ఫంక్షనల్ స్టైలర్ కావడంతో ఈ కలెక్షన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకే పరికరంతో జుట్టును ఆరబెట్టుకోవడానికీ, కర్లింగ్కు, బ్రషింగ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. -
డెలివరీ సమయంలో బ్లడ్ అరేంజ్మెంట్కి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు?
నా వయసు ఇరవై ఐదేళ్లు. మొదటిసారి గర్భం దాల్చాను. రెండు నెలలు నిండాయి, పరీక్ష చేస్తే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. కానీ నా బ్లడ్ గ్రూప్ ‘బి నెగటివ్’ అని తేలింది. దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉందా? అసలు ఇలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, అలాగే ఒకవేళ ప్రెగ్నెన్సీ సమయంలో తల్లికి ఈ నెగెటివ్ బ్లడ్ గ్రూప్ సమస్య అసలు రాకుండా ఉండటానికి ఇంకా ఎలాంటి సమయాల్లో యాంటీ–డి ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందో, డెలివరీ సమయంలో బ్లడ్ అరేంజ్మెంట్ గురించి ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తారో దయచేసి వివరంగా చెప్పండి.– లక్ష్మీ ప్రసన్న, హైదరాబాద్.సాధారణంగా కాబోయే తల్లి బ్లడ్ గ్రూప్ నెగటివ్ (ఆర్హెచ్ నెగటివ్) ఉండి, భర్త బ్లడ్ గ్రూప్ పాజిటివ్ అయితే పుట్టబోయే బిడ్డపై ఆ ప్రభావం పడకుండా ఉండటానికి కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో భాగంగా మొదటగా భర్తకు కూడా బ్లడ్ టెస్ట్ చేస్తాము. ఒకవేళ ఆయనది కూడా నెగటివ్ బ్లడ్ గ్రూప్ అయితే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ భర్తది పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయితే మాత్రం, ఈ ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి శరీరంలో యాంటీబాడీలు తయారై బిడ్డపై ప్రభావం పడకుండా ఉండటానికి ‘ఇండైరెక్ట్ కూంబ్స్ టెస్ట్’ (ఐసీటీ) అనే రక్త పరీక్షను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ఒకసారి చేస్తారు. ఒకవేళ ఈ పరీక్ష ఫలితం సాధారణంగా (నెగటివ్) వస్తే తల్లి శరీరం ఇంకా సెన్సిటైజ్ అవ్వలేదని అర్థం. కాబట్టి గర్భాధారణ ఇరవై ఎనిమిదవ వారంలో మళ్ళీ ఈ పరీక్ష చేసి, అప్పుడు కూడా నెగటివ్ వస్తే తల్లికి ’యాంటీ–డి’ నివారణ ఇంజెక్షన్ ఇస్తారు. అలాగే కాన్పు అయిన తర్వాత పుట్టిన బిడ్డ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ అని తేలితే డెలివరీ అయిన డెబ్బై రెండు గంటల లోపు తల్లికి మళ్ళీ యాంటీ–డి ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా ఆమెను, భవిష్యత్తులో వచ్చే గర్భాలను సురక్షితంగా కాపాడుకోవచ్చు. అయితే, ఒకవేళ ఈ ఐసీటీ పరీక్ష ఫలితం పాజిటివ్ వస్తే మాత్రం దానిని ‘ఇమ్యూనైజ్డ్ ప్రెగ్నెన్సీ’ అంటారు, అప్పుడు బిడ్డకు రక్తహీనత (ఎనీమియా) వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, స్కానింగ్ (మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ డాప్లర్ పరీక్ష) ద్వారా బిడ్డ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైతే కడుపులోనే బిడ్డకు రక్తం ఎక్కించే (ఇంట్రా యూట్రైన్ ట్రాన్స్ఫ్యూషన్) అత్యాధునిక వసతులు, నియోనేటాలజీ విభాగాలు ఉన్న పెద్ద ఆసుపత్రిలోనే (టెర్షియరీ సెంటర్) డెలివరీ చేయించుకోవడం చాలా సురక్షితం. ప్రెగ్నెన్సీ కొనసాగుతున్న సమయంలో మొదటి మూడు నెలల కాలంలో గర్భస్రావం అయినా, మహిళలు స్వచ్ఛందంగా గర్భాన్ని తీసివేయించుకున్నా, గర్భాశయాన్ని క్లీన్ చేసే ప్రక్రియ జరిగినా, గర్భాశయం వెలుపల పిండం పెరిగే ‘ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ’ లాంటి సమస్యలు ఉన్నప్పుడు, మధ్యమధ్యలో కొద్దిగా బ్లీడింగ్ కనిపిస్తున్నా, గర్భం చివరలో బిడ్డ చుట్టూ ఉండే ఉమ్మనీరు తీసి పరీక్షించే ‘అమ్నియోసెంటసిస్’ లాంటి ప్రత్యేక పరీక్షలు చేసినా, లేదా నెలలు నిండకుండానే కాన్పు అయినా సరే తల్లి శరీరం సెన్సిటైజ్ అవ్వకుండా ఉండటానికి ఈ యాంటీ–డి ఇంజెక్షన్ కచ్చితంగా రక్షణగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక డెలివరీ సమయంలో రక్త లభ్యత (బ్లడ్ అరేంజ్మెంట్) విషయానికి వస్తే, ’నెగటివ్’ బ్లడ్ గ్రూపులు అనేవి చాలా అరుదైనవి కావడంతో అత్యవసర సమయంలో ఇవి బయట త్వరగా దొరకవు, కాబట్టి డెలివరీ సమయంలో ఒకవేళ తల్లికి అధిక రక్తస్రావం లాంటి అత్యవసర పరిస్థితి ఎదురైతే రక్తం కోసం ఇబ్బంది పడకుండా ఉండటానికి ముందస్తు జాగ్రత్తగా ఒక బ్లడ్ డోనర్ను సిద్ధంగా ఉంచుకోవడం, ఆసుపత్రిలో రక్తం అందుబాటులో ఉండేలా చూసుకోవడం తల్లి, బిడ్డ ఇద్దరి ప్రాణాలకూ ఎంతో రక్షణ ఇస్తుంది. సరైన జాగ్రత్తలు పాటిస్తూ క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో ఉంటే నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నప్పటికీ ప్రెగ్నెన్సీ మరియు డెలివరీని సురక్షితంగా పూర్తి చేసుకోవచ్చు, ఎలాంటి ఆందోళన అవసరం లేదు.డా. కప్పగంతుల అపర్ణ, సీనియర్ గైనకాలజిస్ట్, అబ్స్టెట్రీషియన్, ల్యాపరోస్కోపిక్ సర్జన్, సికింద్రాబాద్ (చదవండి: ఎనిమిది దశాబ్దాలు, ఒక దుకాణం: వైరల్గా 94 ఏళ్ల వ్యాపారి కథ!) -
పాడు పొగతో మూడింతల సెగ
సిగరెట్ తెల్లగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ దాంతో కలిగే నష్టం దాని పొగంత నల్లగా ఉంటుంది. స్టైల్గా రెండు వేళ్లతో పట్టుకోడానికి అనువుగా ఉండవచ్చు. కానీ దానితో వచ్చే నష్టాలు వేలు కాదు కదా... లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టినా సరిపోనంతగా లేదా బాగు చేయలేనంతగా భారీగా ఉంటాయి. ఒక్కోసారి జీవితాన్నే మూల్యంగా కోరవచ్చు కూడా. రెండు వేళ్లతో కలిగే మూడు చేతుల నష్టాలేమిటో చూద్దాం.ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్... నష్టాలు..సిగరెట్ లేదా పొగతాగడం అలవాటున్న వ్యక్తి... ఆ దుష్ప్రభావాల వల్ల తానే స్వయంగా నష్టపోతాడు. ఆ అలవాటుకు తన ప్రాణాన్నే పణంగా పెడతాడు. తల మీద ఉన్న వెంట్రుకలూ, తలలోని కీలక అవయవాలు మొదలుకొని కాలూ, కాలి వేలి వరకు పొగాకు వల్ల ప్రభావితం కాని అవయవమంటూ ఏదీ ఉండదు. తలలోని అవయవాలూ, మెడ (హెడ్ అండ్ నెక్) క్యాన్సర్లు మొదలుకొని ఊపిరితిత్తులూ, కడుపు... ఇలా ప్రతి అవయవమూ క్యాన్సర్తో ప్రభావితం కావడానికి కారణం... పొగాకులో దాదాపు 5000 హానికరమైన రసాయనాలు దేహానికి హాని చేస్తాయి. అంతేకాదు... దాదాపు 60 రకాల రసాయనాలైతే నేరుగా క్యాన్సర్ను కలగజేస్తాయి కాబట్టి వాటిని కార్సినోజెన్స్ అని కూడా పిలుస్తారు. ఇలా తానే స్వయంగా నష్ట΄ోతున్నందున దీన్ని ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు.సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ – అనర్థాలు...నేరుగా పొగతాగే వ్యక్తితోపాటు పక్కనే ఉండే స్నేహితులకూ, తనతోపాటు గడిపే మిత్రులతోపాటు జీవిత భాగస్వామి పొగపీల్చడాన్ని సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు. దీంతో వాళ్లు నేరుగా సిగరెట్ తాగక΄ోయినప్పటికీ పొగాకు దుష్ప్రభావాలకు లోనవుతారు. ప్రధానంగా జీవిత భాగస్వామీ, పిల్లలూ ఇలా ప్యాసివ్ స్మోకింగ్కు గురవుతారు. మరీ ముఖ్యంగా భర్త తాలూకు ఆ అలవాటు భార్య గర్భధారణ విషయంలోనూ ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. భర్త తాలూకు సిగరెట్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ సంతాన సాఫల్యంపై దాని ప్రభావమూ పెరుగుతుంది. భర్త పొగతాగే అలవాటుతో భార్య జీవరసాయనాల్లో మార్పు వచ్చి, అండాల సంఖ్య తగ్గడం జరుగుతుంది. ఒకసారి అండాల సంఖ్య తగ్గితే వాటిని తిరిగి పొందడం సాధ్యంకాదు. సిగరెట్ పొగలో ఉన్న రసాయనాల వల్ల మహిళలకు చాలా త్వరగా మెనోపాజ్ వచ్చే అవకాశం ఉంటుంది. నెలలు నిండకముందే బిడ్డపుట్టడమూ, అలా పుట్టే పిల్లల్లో బరువు చాలా తక్కువగా ఉండటమూ, ఆ పిల్లలకు భవిష్యత్తులో డయాబెటిస్, గుండెజబ్బులు, స్థూలకాయం వచ్చే అవకాశాలు పెరగడమూ జరుగుతాయి.థర్డ్ హ్యాండ్ స్మోకింగ్... దుష్ప్రభావాలు...నేరుగా సిగరెట్ కాల్చేవారిది ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్. మన స్నేహితుడో లేదా కుటుంబసభ్యుడైనందువల్లనో ఆ అలవాటు ఉన్నవారి నుంచి పొగ పీల్చడాన్ని సెకండ్హ్యాండ్ స్మోకింగ్ అంటారు. ఇక ఓ వ్యక్తి మూసి ఉన్న ఓ గదిలోనో లేదా లిఫ్ట్లోనో కొద్దిసేపటి కిందట సిగరెట్ కాల్చి వెళ్లిపోయినప్పటికీ... చాలాసేపటి తర్వాత ఎవరైనా ఆ గదిలోకి వెళ్తే అప్పటికీ ఆ సిగరెట్ వాసన వస్తుండటం, అక్కడ ఉన్న నుసిలాంటి ఇతరత్రా చాలా సూక్ష్మమైన వ్యర్థాలు ఆ గదిలోకి వెళ్లినవారి బట్టలకు అంటుకుపోవడం, మన బట్టల్ని వాసన చూసినవారు కూడా సిగరెట్ వాసనను పసిగట్టడం... ఇవన్నీ ‘థర్డ్ హ్యాండ్ స్మోకింగ్’ కిందకు వస్తాయి. ఈ థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ కారణంగా గదిలో ఉండిపోయే నుసి, అతి సూక్ష్మమైన సన్నటి ధూళి కణాలు... పొగకు ఎక్స్పోజ్ అయిన బట్టలపై కొన్ని నెలలపాటు, ఆ మాటకొస్తే కొన్నేళ్ల వరకు కూడా అలాగే ఉండిపోతాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. మరీ ముఖ్యంగా గాలి ప్రవేశించలేకుండా ఉండి, గట్టిగా మూసి ఉన్న గదుల్లో స్మోకింగ్ చేసినప్పుడు, ఇతరులు అందులోకి వెళ్లినప్పుడు ఈ థర్డ్ హ్యాండ్ దుష్ప్రభావాలు మరింత ఎక్కువకాలం కొనసాగుతుంటాయి. ఈ పరిశోధనల్లో తేలినదేమిటంటే.. థర్డ్ హ్యాండ్ స్మోకింగ్కు గురైన 22 గంటల తర్వాత కూడా... వ్యక్తులపై ఆ దుష్ప్రభావాల ప్రభావం కనిపిస్తుందన్నది పరిశోధకుల మాట. యూఎస్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, రివర్సైడ్లో సెల్బయాలజిస్ట్ ప్రూ టాల్బోట్ చెబుతున్న దాని ప్రకారం... థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ దుష్ప్రభావాలపై ఇప్పటివరకూ ప్రజల్లో పెద్దగా అవగాహన లేదనీ, పొగతాగే అలవాటున్న వ్యక్తుల తాలూకు కార్లు వాడేవారూ, కొనేవారూ లేదా హోటళ్లలో అంతకుముందు స్మోకర్స్ ఉండి ఖాళీ చేసిన గదులు షేర్ చేసుకునేవారు, క్యాసినోలకు వెళ్లేవారందరికీ ఈ ముప్పు చాలా ఎక్కువనీ, అన్ని అవయవాలకంటే చర్మానికి నేరుగా ఈ ముప్పు ఉంటుందంటూ చెబుతున్నారు.క్యాన్సర్ను సిగరెట్ బాక్స్లో ప్యాక్ చేసి, పిల్లలకు ఇవ్వడం సబబేనా?ప్రాణాంతకమైన క్యాన్సర్ను అందమైన సిగరెట్ పెట్టెలో ప్యాక్ చేసి తీసుకెళ్లి ఇంట్లోని అమాయకమైన పిల్లలకు గిఫ్ట్గా ఇవ్వడం ఎంతవరకు సబబంటూ పరిశోధకులూ, వైద్య ప్రముఖులు పొగాకు వాడేవారిని నేరుగా ప్రశ్నిస్తున్నారు. పొగతాగే అలవాటు ఉన్న తండ్రులు తమ పిల్లలకు పొగ వల్ల దెబ్బతిన్న డీఎన్ఏను సంక్రమింపజేస్తున్నారని వాపోతున్నారు. పిల్లలకు లోపభూయిష్టమైన డీఎన్ఏ దక్కడానికి కారణాన్ని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్నేళ్ల కిందట బ్రాడ్ఫోర్ట్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో తల్లిదండ్రుల్లో పొగతాగే అలవాటు ఉంటే పిల్లలకు క్యాన్సర్లు... అందునా ప్రధానంగా ల్యుకేమియా వచ్చే అవకాశం ఎక్కువని తేలింది. తమ పొగతాగే అలవాటు కారణంగా తండ్రులు తమ పిల్లలకు దెబ్బతిన్న (డ్యామేజ్డ్) డీఎన్ఏ ను సంక్రమింపజేస్తున్నారని, దాంతో తండ్రి తప్పిదం వల్ల పిల్లలు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తోందని ఆ అధ్యయనం చెబుతోంది. దీనికి కారణమేమిటంటే... పురుషుల వీర్యకణాల్లోని డీఎన్ఏ... పొగవల్ల తీవ్రంగా దెబ్బతింటుంది. దాంతో లోపభూయిష్టమైన ఆ డీఎన్ఏ కారణంగా పిల్లల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు బాగా పెరిగిపోతాయి. పుట్టబోయే పిల్లల్లో కనిపించే రిస్క్ను తప్పించుకునేందుకు ఒక ఉపాయాన్ని చెబుతున్నారు ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న డాక్టర్ డయానా యాండర్సన్. ఒక వీర్యకణం ఉద్భవించాక అది పూర్తిస్థాయిలో పరిణతి చెందేందుకు కనీసం మూడు నెలల సమయం అవసరం. అందుకే కనీసం మూణ్ణెల్ల పాటు పొగతాగే అలవాటుకు దూరంగా ఉంటే డీఎన్ఏ దెబ్బతిన్న వీర్యకణాల స్థానంలో ఆరోగ్యకణాలు వస్తాయి కాబట్టి పిల్లల్లో క్యాన్సర్ అభివృద్ధి చెందే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయంటున్నారామె. ఈ అనర్థాలన్నిటి కంటే... స్వయానా తానూ, జీవన సహచరి అయిన తన భార్య, తమకు పుట్టే పిల్లలూ, తన తోటి స్నేహితులూ, వారితోపాటు సమస్త సమాజమంతా ఆరోగ్యంగా ఉండటానికి పొగతాగడమూ, పొగాకు వినియోగాన్ని పూర్తిగా మానేయడమే మంచిదంటూ డాక్టర్లూ, వైద్య పరిశోధకులూ, ఆరోగ్యాన్ని కోరుకునే అందరూ సూచిస్తున్నారు. ఇక్కడ పొగతాగడం అంటే కేవలం సిగరెట్, బీడీ, చుట్ట అనే కాదు... జర్దా, ఖైనీ, పాన్మసాలా... ఇలా పొగాకు ఏ రూపంలో ఉన్నా అంతే ప్రమాదకారి అని గుర్తించడం అవసరం. నిర్వహణ: యాసీన్ (చదవండి: పిల్లలకు సమయం కేటాయించాలి) -
పిల్లలకు సమయం కేటాయించాలి
‘పిల్లలకు డబ్బు, ఆస్తులు ఇవ్వడం కాదు, రోజూ తగినంత సమయం కేటాయించడం ముఖ్యం’ అంటున్నారు సైకాలజిస్ట్ పి.జ్యోతిరాజ. ఇరవయ్యేళ్లుగా సైకాలజిస్టుగా చిల్డ్రన్, ఫ్యామిలీ కౌన్సెలర్గా ఉన్న జ్యోతిరాజ పిల్లల పెంపకంలో తాను తీసుకున్న జాగ్రత్తలను ఇలా తెలిపారు...‘‘నిన్నటి తరం పిల్లలు అమ్మనాన్నలు ఏం చెబితే అది విన్నారు. తర్వాతి తరం నిర్ణయాలలో పిల్లల అభిప్రాయాలు తీసుకున్నారు. ఇప్పుడు పిల్లలు ఎంత చెబితే అంత అనే విధంగా ఉంది. ఆరవ తరగతి చదువుతున్న ఒక అమ్మాయిని కౌన్సెలింగ్కు నా దగ్గరకు తీసుకువచ్చారు. ఇంట్లో ఆ అమ్మాయికి నచ్చినట్టే తల్లిదండ్రులు ఉండాలి. లేదంటే, ఇంట్లో పెద్ద గొడవ. రెండు విషయాల్లో మరీ సమస్య పెద్దదిగా కనిపిస్తోంది. ‘ఒకటి ఫోన్ వాడకం, రెండవది చదువుకోమని చెప్పడం.’ ఈ రెండింటిలోనూ పిల్లలు అతిగా స్పందిస్తున్నారు. పిల్లలకు ఇచ్చింది సమయాన్నే..!నాకు అమ్మాయి, అబ్బాయి ఇద్దరు సంతానం. వారిని మూడో క్లాస్ నుంచి ఒంటరిగా పనులు చేసుకోవడం, బయటకు వెళ్లిరావడం, వారికి కావల్సినవి వారే కొని తెచ్చుకోవడం వంటివి అలవాటు చేస్తూ వచ్చాను. దీని వల్ల పై చదువుల సమయంలో మాకు దూరంగా ఉన్నా పిల్లలు ఇబ్బందులు పడలేదు. వారికి స్వేచ్ఛగా ఉండే అవకాశం ఇస్తూనే, క్రమశిక్షణనూ అలవాటు చేశాను. పిల్లలు పెద్దవుతున్న కొద్దీ ఇంటి విషయాలలో కూడా వారి అభిప్రాయం తీసుకునేదానిని. అది నచ్చకపోయినా కొట్టిపడేసిన దాన్ని కాదు. వాళ్లు చెప్పినవన్నీ అనుకూలంగా, వాడదగినవిగా ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు వెంటనే ‘నో’ చెప్పకుండా ఎలా చేస్తే బాగుంటుందో కాస్త సమయం తీసుకునైనా చెప్పేదాన్ని. దీని వల్ల పిల్లలు అర్థం చేసుకునేవారు. అర్థం చేసుకోవడమే ముఖ్యంపిల్లలు చదువులో టాపర్స్గా ఉన్నారా, గ్రేడ్స్ వస్తున్నాయా అని చూసేదాన్ని కాదు. వారు ఆ చదువును ఎంతబాగా అర్థం చేసుకోగలుగుతున్నారు.. అనేదానిపై దృష్టి పెట్టమనేదాన్ని. స్కూల్ నుంచి వచ్చాక ‘టీచర్లు ఏం చెప్పారు, ఏం విన్నావు, ఏం నేర్చుకున్నావు, స్కూల్లో ఏం జరిగింది?’ అని అడిగేదాన్ని. వాళ్లు చెప్పేదంతా వినేదాన్ని. అంతేకానీ, హోమ్వర్క్, క్లాస్ వర్క్, మార్కుల గురించి అడిగేదాన్ని కాదు. మా పిల్లలు చదువుకునే టైమ్లో కంప్యూటర్స్ బూమ్లో ఉంది. కానీ, మా అమ్మాయి ఆర్కిటెక్చర్ చేస్తానంది. సరే అన్నాను. మంచి ర్యాంక్ తెచ్చుకుంది. మా అబ్బాయిని సైన్స్ వైపుగా వెళతావా అని అడిగాను. లేదు ఇంజనీరింగ్ అన్నాడు. వారి ఇష్టాలను కాదనలేదు. వాళ్ల మాటకు మేం విలువ ఇచ్చాం. వాళ్లూ మా మాటలకు విలువ ఇచ్చారు. లేట్ నైట్స్ బయట తిరగడం మాత్రం ఒప్పుకునేదాన్ని కాదు. రాత్రి సమయాల్లో బయట ఉంటే సమస్యలు ఏ విధంగా వస్తాయో వివరించేదాన్ని. నేను మీతో ఉన్నాను అనే భరోసా! మా బాబుకి బిట్స్లో సీట్ వచ్చేముందు కొంతకాలం హాస్టల్లో ఉండేవాడు. అక్కడ ఉన్నన్ని రోజులూ ఏదో తెలియని ఆందోళన ఫీలవుతున్నట్టు గమనించాను. దీంతో ఇంటికి తీసుకువచ్చేశాను. ఇంట్లోనే చదువు, టెస్ట్.. జరిగేలా ప్రతిరోజూ ప్లాన్ చేశాం ‘ఏం టెన్షన్ పడకు. ర్యాంకు రాకపోయినా పర్వాలేదు. ఇది కాకపోతే మిగతా చాయిస్లు కూడా ఉన్నాయి’ అని చెప్పదాన్ని. నీకు నేను ఉన్నాను అని మోరల్గా సపోర్ట్ ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ చూశాను. మా అమ్మాయి పెళ్లయ్యి, అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. వాళ్లకు ఒక బాబు. నాలుగేళ్ల వయసు. బోలెడన్ని ప్రశ్నలు వేస్తుంటాడు. పిల్లలు అడిగే సందేహాలకు ఓపికగా సమాధానాలు చెప్పకపోతే నిరుత్సాహపడిపోతారు. వారి ఆలోచనలు మరోవైపుకు మళ్లుతాయి. తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వదగిన ఆస్తి తగినంత సమయం వారితో గడపడమే. మా అబ్బాయి కూడా విదేశాలలోనే జాబ్ చేస్తున్నాడు. ఇద్దరూ వారి వారి జీవితాల్లో సంతోషంగా ఉన్నారు.’’∙నిర్మలారెడ్డిమనం వింటే.. వాళ్లు వింటారు..! ఈ మధ్య ఒక పదమూడేళ్ల అబ్బాయిని వారి తల్లిదండ్రులు కౌన్సెలింగ్కు తీసుకువచ్చారు. ఆ అబ్బాయి ధోరణి ఎలా ఉందంటే, పేరెంట్స్ ఏది చెబితే అది రివర్స్ చేస్తాడు. మొదట ఆ అబ్బాయి అడిగిందల్లా ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత క్రమశిక్షణ పేరుతో కఠినంగా ఉండేవారు. అది కాస్తా బెడిసికొట్టింది. ఆ అబ్బాయితో తల్లిదండ్రులు గడపాల్సిన విధానం, సమయం,.. అన్నీ చెబుతూ కొన్ని సెషన్స్ ఇస్తే కొంతవరకు మార్పు వచ్చింది. పేరెంటింగ్ ఒక్కరోజులో పూర్తయ్యే ప్రక్రియ కాదు. ప్రతిరోజూ వారితో కనెక్టివ్గా ఉండాలి.డబ్బులు ఉన్నాయని అడిగినవన్నీ కొనిస్తే అమ్మనాన్నలు డబ్బు మిషన్లలాగే కనిపిస్తారు. మా పిల్లలకు ఏది అవసరమో అదే కొనేదాన్ని. అవసరం లేనిదాని గురించి చెప్పేదాన్ని. డ్యూటీ టైమ్ అయిపోయి ఇంటికి వచ్చానంటే పిల్లలకే సమయం కేటాయించేదాన్ని. ఇప్పటికీ ప్రతిరోజూ ఫోన్ ద్వారా పిల్లలతో కమ్యూనికేషన్లో ఉంటాను. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఓపెన్ కమ్యూనికేషన్ ఉంటే సమస్యలు వచ్చినా సాల్వ్ చేసుకోవడం సులువు అవుతుంది.మనం వింటే.. వాళ్లు వింటారు..! ఈ మధ్య ఒక పదమూడేళ్ల అబ్బాయిని వారి తల్లిదండ్రులు కౌన్సెలింగ్కు తీసుకువచ్చారు. ఆ అబ్బాయి ధోరణి ఎలా ఉందంటే, పేరెంట్స్ ఏది చెబితే అది రివర్స్ చేస్తాడు. మొదట ఆ అబ్బాయి అడిగిందల్లా ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత క్రమశిక్షణ పేరుతో కఠినంగా ఉండేవారు. అది కాస్తా బెడిసికొట్టింది. ఆ అబ్బాయితో తల్లిదండ్రులు గడపాల్సిన విధానం, సమయం,.. అన్నీ చెబుతూ కొన్ని సెషన్స్ ఇస్తే కొంతవరకు మార్పు వచ్చింది. పేరెంటింగ్ ఒక్కరోజులో పూర్తయ్యే ప్రక్రియ కాదు. ప్రతిరోజూ వారితో కనెక్టివ్గా ఉండాలి. డబ్బులు ఉన్నాయని అడిగినవన్నీ కొనిస్తే అమ్మనాన్నలు డబ్బు మిషన్లలాగే కనిపిస్తారు. మా పిల్లలకు ఏది అవసరమో అదే కొనేదాన్ని. అవసరం లేనిదాని గురించి చెప్పేదాన్ని. డ్యూటీ టైమ్ అయిపోయి ఇంటికి వచ్చానంటే పిల్లలకే సమయం కేటాయించేదాన్ని. ఇప్పటికీ ప్రతిరోజూ ఫోన్ ద్వారా పిల్లలతో కమ్యూనికేషన్లో ఉంటాను. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఓపెన్ కమ్యూనికేషన్ ఉంటే సమస్యలు వచ్చినా సాల్వ్ చేసుకోవడం సులువు అవుతుంది. డా.పి.జ్యోతిరాజ, సైకాలజిస్ట్ నిర్మలారెడ్డి(చదవండి: తల్లిదండ్రులే పిల్లలను కష్టపెడుతున్నారు) -
న్యాయం దక్కలేదు.. చట్టం మారింది
లైంగిక హింసకు గురైన ఓ ఆదివాసీ మహిళకు అండగా నిలబడి, ఆమె గౌరవాన్ని రక్షించడంలో వ్యవస్థ విఫలమైంది. న్యాయవ్యవస్థ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే ఘటనల్లో ఇది ఒకటి.– సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ రక్షకభట నిలయంలోనే తనకు రక్షణ కరువైందని, న్యాయం చేయాలని, మృగాళ్లను శిక్షించాలని ఓ యువతి వేడుకుంది. అయితే, న్యాయస్థానాల్లో ఆమెకు చుక్కెదురైంది. వ్యక్తిగతంగా ఆమెకు న్యాయం దక్కలేదు. నిందితులకు శిక్షపడలేదు. కాని, భారత న్యాయవ్యవస్థలో పలు మార్పులకు, మహిళా రక్షణ చట్టాల బలోపేతానికి ఈ కేసు నాంది పలికింది. అదే తుకారాం వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు. ‘మథుర’ కేసుగా ఇది ప్రాచుర్యం పొందింది. ఇదీ విషాదంఅక్షరం ముక్క రాకపోయినా, తల్లిదండ్రులు చిన్నతనంలోనే మృతి చెంది అనాథగా బతకాల్సి వచ్చినా, ఆమె వెరవలేదు. తన కాళ్లపై నిలబడింది. కూలి నాలి చేసుకుంటూ సోదరుడు గామాతో కలిసి జీవిస్తూ, తన మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంది. అదే ఆమె పాలిట శాపమైంది. సోదరుడు పెట్టిన కేసు నిమిత్తం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఆ యువతే మథుర. కూలి పనులతో పాటు స్థానికంగా ఒకరి ఇంట్లోనూ పని చేసేది. ఆ ఇంటి యజమానురాలి బంధువు అశోక్తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఇది ఆమె సోదరుడు గామాకు నచ్చలేదు. దీంతో ఆమె యజమానురాలు నున్షి, ఆమె భర్త, అశోక్లు మథురను అపహరించారని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసు నిమిత్తం ఆమెను మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా దేశాయ్గంజ్ పోలీస్స్టేషన్కు రాత్రి సమయంలో తీసుకువచ్చారు. ఆమె వయస్సు ధ్రువీకరణ పత్రం తీసుకుని మర్నాడు స్టేషన్కు రావాలని చెప్పి రైటర్ బయటకు వెళ్లాడు. తుకారాం, గణపత్ అక్కడే కానిస్టేబుళ్లుగా పని చేస్తున్నారు.ఏం జరిగిందిమ«థుర వాంగ్మూలం ప్రకారం..‘అందరం బయటకు వెళుతున్న సమయంలో గణపత్ తనను ఆపాడని, మిగతా వాళ్లు వెళ్లిపోవాలని తుకారామ్ ఆదేశించాడు. పోలీస్ స్టేషన్ తలుపులు మూసేశారు. లైట్లు ఆర్పేశారు. ఒంటరిగా ఉన్న తనను భవనం వెనుక వైపు ఉన్న బాత్రూమ్లోకి లాక్కెళ్లి తుకారామ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతడ్ని తప్పించుకుని బయటకు వస్తుండగా గణపత్ సైతం లైంగిక దాడికి యత్నించాడు. అతడు మద్యం మత్తులో ఉండడంతో తప్పించుకుని పోలీస్స్టేషన్ వెలుపలికి వచ్చాను’. ఈ ఘటనపై స్థానికుల నుంచి సైతం ఒత్తిడి రావడంతో కేసు నమోదైంది. కోర్టులో విచారణతొలుత చంద్రపూర్ సెషన్స్ కోర్టులో కేసు విచారణకు వచ్చింది. లైంగిక నేరం జరిగిందనడానికి బలమైన కారణాలు లేవని, ఆమె ప్రైవేట్ పార్ట్స్ వద్ద ఎటువంటి గాయాలు, ప్రతిఘటనకు సంబంధించిన ఆనవాళ్లు లేవని తేల్చింది. ఆమె అంగీకార పూర్వకంగానే ఇది జరిగి ఉండొచ్చని పేర్కొంది. కానిస్టేబుళ్లను నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో కేసు హైకోర్టుకు చేరింది. సెషన్స్ కోర్టు వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. భయం, నిస్సహాయత కారణంగా ఆమె ప్రతిఘటించకపోవడాన్ని ‘సమ్మతి’గా భావించలేమని తుకారామ్కు ఐదేళ్లు, గణపత్కి ఏడాది జైలు శిక్ష విధించింది.సుప్రీంకోర్టులోనూ..హైకోర్టు తీర్పుపై నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నిస్సహాయ లొంగుబాటును అత్యాచారంగా పరిగణించడానికి సరిపడా ఆధారాలు లేవని పేర్కొంది. నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. వెల్లువెత్తిన నిరసనలుకోర్టులో కేసు నిలబడలేదు. ఆమె కోరుకున్న న్యాయం దక్కలేదు. కాని, సమాజం నుంచి అనూహ్యంగా మద్దతు వెల్లువెత్తింది. సుప్రీం కోర్టు తీర్పుపై మేధావులు కలమెత్తారు. ఇది వాంఛనీయం కాదంటూ నలుగురు న్యాయ శాస్త్ర ప్రొఫెసర్లు అప్పటి చీఫ్ జస్టిస్కు బహిరంగ లేఖ రాశారు. చట్టం, రాజ్యాంగం ప్రకారం మహిళలకు సంక్రమించిన హక్కులను హరించేలా తీర్పు ఉందంటూ ఆక్షేపించారు. మథురకు జరిగిన అన్యాయాన్ని కోర్టు గుర్తించినప్పటికీ సాంకేతికపర అడ్డంకులు న్యాయానికి ప్రతిబంధకాలుగా, నిందితులకు అనుకూలంగా మారాయి. మథురకు న్యాయం జరగలేదంటూ పౌర సమాజం స్పందించింది. లైంగిక నేరాలకు వ్యతిరేకంగా మొదటిసారి గొంతెత్తి నినదించింది. ప్రభుత్వాన్ని కదిలించింది. చట్టాల్లో మార్పులకు ఈ కేసు నాంది పలికింది.మార్పులు ఇలా..అన్యాయానికి గురైన మహిళలకు రక్షణగా చట్టాల్లో మార్పులకు ఈ కేసు నాంది పలికింది. ఈ సవరణలు భారత న్యాయవ్యవస్థలో కీలక మార్పులు తీసుకువచ్చింది.‘కస్టోడియల్ రేప్’ అంటే నిర్దిష్టమైన నిబంధనలను నిర్వచించింది. పోలీసు అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తమ అధీనంలో ఉన్న, పని చేస్తున్న వారిపై లైంగిక దాడికి పాల్పడితే పదేళ్ల వరకు శిక్ష విధించేలా మార్పులు చేసింది. తన సమ్మతి లేకుండానే లైంగిక దాడికి పాల్పడ్డాడని మహిళ ఫిర్యాదు చేస్తే, తాను నిర్దోషినని నిందితుడే నిరూపించుకునేలా భారతీయ సాక్ష్యాధారాల చట్టంలో మార్పులు చేశారు.బాధితురాలి గౌరవాన్ని కాపాడేందుకు లైంగిక దాడి కేసులను బహిరంగ విచారణ కాకుండా, ఇన్ కెమెరా ట్రయల్స్ను తప్పనిసరి చేస్తూ నిబంధనలు రూపొందించారు.బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేసేలా మీడియాలో పేరు రాయడం, ఫొటోలు ప్రచురించడాన్ని నిషేధించారు. \భయం, బెదిరింపులు, నిస్సహాయత కారణంగా ప్రతిఘటించకపోవడాన్ని ‘సమ్మతి’గా, నిశబ్దాన్ని అనుమతిగా భావించరాదని గుర్తించారు. -దిలీప్ మాదిరెడ్డి -
అటు ప్రయోగం ఇటు ప్రయోజనం!
అందమైన పరిసరాల్లో పుట్టి పెరిగిన కళాకారుల రచనల్లో సౌందర్యం జాలువారుతుందని వర్డ్స్వర్త్, కీట్స్, కాలెరిజ్ తదితర ఇంగ్లిష్ భావకవులు– మూడువందల యేళ్ళ కిందట – ఓ సిద్ధాంతం చెప్పారు. విలియం గిల్పిన్ అనే విమర్శకుడు వారి సిద్ధాంతానికి ‘పిక్చరెస్క్ ఈస్థెటిక్స్‘ (రమణీయ సౌందర్యశాస్త్రం) అని పేరుపెట్టారు. అంతకు వెయ్యిన్నర సంవత్సరాల కిందట భామహుడు మొదలుకొని ఆనందవర్ధనుడి వరకు ఎందరో భారతీయ ఆలంకారికుల సిద్ధాంతాల్లోనూ అలాంటి భావాలున్నాయనే మాట నిజమే– అయితే అదలా వుంచండి! ఇరవయ్యొకటో శతాబ్దిలో ఈ భావనకు ఉదాహరణగా చెప్పదగిన రచయిత జ్షాన్ మారీ గుస్తావ్ లా క్లేజ్యో ఒకరు. లా క్లేజ్యోకు 2008లో నోబెల్ సాహిత్యపురస్కారం ప్రకటిస్తూ ‘ఆయన రచనలు సరికొత్త ప్రయోగాలూ, కవితాత్మక సాహసకృత్యాలూ, ఆనందానుభూతుల చిత్రణలతో నిండి వుంటాయ’ంది స్వీడిష్ ఎకాడెమీ. (నోబెల్ సాహిత్య పురస్కారం ఎవరికివ్వాలో నిర్ణయించేది ఈ ఎకాడెమీయే.) అంతేకాదు– ‘ప్రస్తుతం చెలామణీలో వున్న నాగరికతను మించినవారి కథలనూ, దాని పరిధిలోకి రానివారి కథలనూ కూడా చిత్రించిన రచయిత’గా లా క్లేజ్యోను ప్రశంసించింది స్వీడిష్ ఎకాడెమీ. నవలాకారుడిగానూ, కథానిక రచయితగానూ, వ్యాసకర్తగానూ, అనువాదకుడిగానూ సుప్రసిద్ధుడు లా క్లేజ్యో. ఇటలీ సరిహద్దుకు చేరువగా వుండే ఫ్రెంచ్ నగరం నీస్లో పుట్టారాయన. అది ఆయన తల్లి తరఫు బంధువుల స్వస్థలం. లా క్లేజ్యో తండ్రి తరఫు బంధువులు వందల సంవత్సరాల కిందటే తరలి వెళ్ళిపోయారు. అలా ఆయన పుడుతూనే ద్విజాతీయుడు. అందుకే లా క్లేజ్యో తనను తాను ఫ్రాంకో–మారిషియన్గా చెప్పుకుంటారు.ఇంగ్లండ్– ఫ్రాన్స్– మెక్సికో దేశాల్లో చదువుకుని డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు లా క్లేజ్యో. అండర్ గ్రాడ్యుయేట్ పట్టాకోసం ఆయన ఆంగ్ల సాహిత్యం చదువుకున్నారు. మాస్టర్స్ కోసం, ఫ్రెంచ్ ప్రయోగాత్మక కవి– రచయిత– చిత్రకారుడు హెన్రీ మిషో రచనలను ఎంచుకున్నారు. తీరా డాక్టరేట్ విషయానికి వచ్చేసరికి ఆధునిక చరిత్ర ఆవిర్భవిస్తున్న దశను లా క్లేజ్యో ఎంపిక చేసుకున్నారు. సామాన్య శకం 1525 వరకూ, స్వతంత్రంగా జీవించిన పూరిపెచా ప్రజలు ఆ దశలో మశూచికం తదితర అంటువ్యాధుల పాలబడ్డారు. ఆ పరిస్థితిలో, వారి నాయకులు ప్రజల సంక్షేమం కోసం యుద్ధాన్ని నివారించాలని భావించారు. స్పెయిన్ రాజుకు సామంతరాజ్యంగా ఉంటామని స్వచ్ఛందంగా ప్రకటించారు. దాన్నే ‘పూరిపెచా జాతిపై దిగ్విజయం’గా వక్రీకరించారు స్పానిష్ చరిత్రకారులు. లా క్లేజ్యో తన సిద్ధాంత గ్రంథంలో ఈ వంచనను వెలికితీశారు! పదహారో శతాబ్ది నాటి రాతప్రతుల ఆధారంగా ఆయన ఈ గుట్టు రట్టు చేయగలిగారు. ఆయన అధ్యయన ప్రణాళిక ఇంత క్లిష్టంగా వున్నందువల్లనే అది పూర్తికావడానికి పాతికేళ్ళు పట్టింది.రచయితగా, ప్రయోగశీలతనూ – ప్రయోజన దృష్టినీ గొప్పగా సమ్మిళితం చేశారు లా క్లేజ్యో. రాబర్ట్ లూయీ స్టీవెన్సన్, శాలింగర్, మిషో, హెమింగ్వే, ఫాక్నర్– లా క్లేజ్యోను ప్రభావితం చేసినవారు. అలాంటి రచయిత ప్రయోగం– ప్రయోజనం అనే రథచక్రాల మీద వీరవిహారం చెయ్యడంలో వింతేముంది? ఏడేళ్ళ పసితనంలోనే సముద్రం గురించి చిన్న పుస్తకం రాసేశాడు ఈ పిడుగు! నైజీరియాలో వున్న తండ్రిని మరుసటి సంవత్సరం –1948లో– కుటుంబ సమేతంగా కలవబోతున్నానన్న ఊహే, లా క్లేజ్యో చేత ఆ పుస్తకం రాయించింది. ఇదే ఊహ, 44 సంవత్సరాల తర్వాత ‘అనీత్సా’ అనే నవలగానూ రూపుదిద్దుకుంది. అదీ పూర్తిగా కల్పన కాదంటారు లా క్లేజ్యో సాహిత్య నిపుణులు. బహుశా అందుకేనేమో, వారెన్ మాటీ అనే విమర్శకుడు ఈ 44 యేళ్ళ కాలాన్ని లా క్లేజ్యో శిక్షణకాలంగా అభివర్ణించాడు! ఈ కథ 1848లో జరిగిందని రచయిత ప్రత్యేకంగా ప్రకటించడం విశేషం! ఫ్రాన్స్ దక్షిణ తీరం నుంచి ఓ పాత నావలో బయల్దేరిన తల్లీ కొడుకులు పశ్చిమ ఆఫ్రికా తీరం పొడుగునా సాగించే సుదీర్ఘ యాత్రే ఈ నవలకు ఇతివృత్తం. ఈ రెండు పుస్తకాలూ రాయడానికి మధ్య కాలంలో లా క్లేజ్యో ఎన్నో మెరుపులు మెరిపించారు. 1963లో వెలువడిన ‘లా ప్రాసెస్ వెర్బల్’ (విచారణ– ఇంటరాగేషన్) అనేది లా క్లేజ్యో తొలి నవల. దానికే ‘ప్రీ రెనాడో‘ పురస్కారం అందుకున్నాడాయన. ఇదే రచన మరో పోటీల్లో కూడా షార్ట్ లిస్ట్ కావడం విశేషమే మరి. లా క్లేజ్యో ప్రయోగాల్లో అత్యధిక పాఠకాదరణ పొందిన నవల ‘డెజెర్ట్.’ ఉత్తర ఆఫ్రికాలో కనిపించే సంచార ఆదివాసుల ప్రణయగాథ దానికి ఇతివృత్తం. ఈ నవల వేర్వేరు కాలాల్లో జరిగిన కథను వేర్వేరు వ్యక్తుల దృష్టికోణం నుంచి చూపిస్తాడు కథకుడు. ఇలాంటి శిల్పవిన్యాసం పాఠకులను రంజింప చెయ్యడంలో వింతేముంది?లా క్లేజ్యోతో పొల్చదగిన రచయితలు అతని సమకాలికుల్లో ఎవరూ లేరనే చెప్పొచ్చు. అయితే అతనికన్నా ముందుగా నోబెల్ సాహిత్య పురస్కారం అందుకున్న ఫ్రెంచ్ రచయితలు కూడా ఎవరికీ తీసిపోరు మరి! ఈ పురస్కారం మొదలైన యేడాదే, 1901లో, దాన్ని గెల్చుకున్నవాడు సూలీ ప్రూదాం. ఆయన రాసిన ప్రతీకాత్మక కవిత్వం సుప్రసిద్ధం. ముఖ్యంగా, ప్రూదాం రాసిన ‘ద బ్రోకెన్ వేజ్ – పగిలిన కలశం’ కవితను నెట్ లో చూడొచ్చు! ఇక 85 ఏళ్ళ తర్వాత ఈ పురస్కారాన్ని తెచ్చిపెట్టిన క్లాడ్ సిమో కూడా తక్కువ వాడేం కాడు. శైలీ విన్యాసానికీ, ప్రయోగశీలతకూ సిమో సుప్రసిద్ధుడు. పోతే, 2000 సంవత్సరానికి గానూ నోబెల్ సాహిత్య పురస్కారం అందుకున్న గావ్ షింజియాంగ్ ఫ్రెంచ్ జాతీయుడే కానీ ఫ్రెంచ్ రచయిత కారు! అయినా, పెద్దలతో పోలికలెందుకు మనకు? ఎవరంత వాళ్ళు వారనుకుంటే పోలా? -లిట్వరల్డ్


