Family
-
వంట కాదు బాబోయ్... భగ భగ మంట... ఇవిగో టిప్స్
ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 దాటితే చాలు... వంటింట్లో అడుగుపెడితే నరకం. స్టవ్ సెగ ఒకవైపు, బయట ఎండ ఒకవైపు. చూస్తే 45 డిగ్రీలు... చేయాల్సింది మూడు పూటలా వంట! ఆడవాళ్లకి చికాకు రాకుండా ఎలా? చల్లగా, కూల్గా వంట చేసుకోవడం ఎలా? ఇంటి మగాళ్లూ... మీరూ చేయాల్సింది ఉంది. వంట... నూరేళ్ల తంట. అది ఒక రోజుతో అయ్యేది కాదు... ఒక పూటతో ముగిసేది కాదు. స్త్రీలను కట్టెల పొయ్యి నుంచి కిరోసిన్ స్టవ్కు ఆ తర్వాత గ్యాస్ స్టవ్కు మార్చారుగానీ వంట నుంచి మార్చలేదు. సీజన్ ఏదైనా తుఫాన్లు వచ్చినా వడగాడ్పులు వీచినా వంట చేయాల్సిందే. అయితే వారూ మనుషులే. వారికీ ఓపిక ఉండాలి. ఇప్పుడు సీజన్ ఎలా ఉంది? ఎండకు ఉడుకెత్తి పోతోంది. ఇలాంటి వేళ స్టవ్ దగ్గర నిలబడి వంట చేయడం ఎంత కష్టం? అయినా ఇది ఎవరితో చెప్పుకున్నా ఆర్చేది కాదు... తీర్చేది కాదు... అందుకే మనమే కొన్ని చిట్కాలు పాటించాలి.టైమింగ్ మార్చండివంట చేసే సమయాన్ని మార్చాలి. పొద్దున 6 నుంచి 8 లోపు, సాయంత్రం 7 తర్వాత వంట కానివ్వండి. మిట్ట మధ్యాహ్నం స్టవ్ వెలిగిస్తే చికాకు పెరగడం ఖాయం. ‘నేను కూరలు ఉదయాన్నే తరిగి పెట్టుకుంటా. మధ్యాహ్నానికి ముందే వేడి తగలకుండా 10 నిమిషాల్లో వండేస్తా’ అని అంటున్న గృహిణులు కొంత నయంగా ఈ వేడిని ఎదుర్కొంటున్నారు.ఒక గిన్నె వంటఈ ఎండల్లో రెండు బర్నర్లు, నాలుగు గిన్నెలు అనే హైరానా అక్కర్లేదు. అన్నం, పప్పు, కూర వేర్వేరుగా చేసే వంటలు తగ్గించాలి. ఒక గిన్నెలో వండ గలిగే ఖిచిడీ, బిసిబేళబాత్, వెజ్ పులావ్, సాంబార్ రైస్ వీటి మీద దృష్టి పెట్టాలి. ఇరవై నిమిషాల్లో వంట ముగుస్తుంది. అంతే కాదు ఈ వంటలన్నీ కడుపుకి చలువ, వంట గ్యాస్ ఆదా.కిచెన్ని చల్లబరచండివంట సెగ కంటే ఎండ వల్ల కిచెన్ వేడిగా ఉంటే చాలా ఇబ్బంది. అందుకే ముందు కిచెన్ చల్లగా ఉండేలా చూసుకోవాలి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ తప్పనిసరిగా అమర్చుకోవాలి. కిచెన్ డోర్ దగ్గర తడి టవల్ వేలాడదీయడం వల్ల ఫలితం ఉంటుంది. ఒక బకెట్ చల్లటి నీళ్లు మూలన పెడితే వేడి తగ్గుతుంది. మరో సంగతి... ఇంట్లో స్టాండ్ ఫ్యాన్ ఉంటే వెనక్కి తిప్పి కిచెన్ డోర్ దగ్గర పెడితే వేడి సెగ బయటికి పోతుంది.ఫ్రైలకు సెలవుఎండలు కాచే వేళ ఎక్కువ సేపు చేయాల్సిన డీప్ ఫ్రైలు, తాలింపులు బంద్ చేయాలి. ఆవిరి కూరలు, మజ్జిగ పులుసు, పెరుగు చట్నీ, సలాడ్లు చేస్తే కడుపుకి హాయి. అదీగాక డాక్టర్లు ‘వేయించినవి తింటే డీహైడ్రేషన్ వస్తుంది’ అని హెచ్చరిస్తున్నారు.నో కుకింగ్ డేవారంలో ఒకరోజు ఉద్యోగానికి సెలవు ఉన్నట్టే వంటకు కూడా సెలవు ఉండాలి. ఈ ఎండల్లో అది ఇంకా ముఖ్యం. వారంలో ఒక రోజు స్త్రీలు నో కుకింగ్ డే పాటించాలి. అంటే? పులిహోర, దద్దోజనం ముందురోజే చేసి ఫ్రిజ్లో పెట్టుకోండి. లేదా ఆ రోజుకి ఏదైనా ఆహారం ఆన్లైన్లో తెప్పించుకోండి. మొహమాటం వద్దు. మీరు కూల్గా ఉంటేనే ఇల్లు కూల్గా ఉంటుంది.మగమహారాజులూ... కిచెన్లోకి రండివంట చేస్తూ శ్రీమతి విసుక్కుంటుంటే మీరు టీవీ రిమోట్ నొక్కుతూ కూర్చోవద్దు. చిన్న సాయం చేస్తే ఆమె చికాకు తగ్గుతుంది.మీరు చేయగలిగే పనులుకూరగాయల కట్టింగ్ మాస్టర్ అవ్వండి. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక కొంచెం విరామం తీసుకుని మర్నాటి వంట కోసం ఉల్లి, టమాటా, క్యారెట్ తరిగి ఫ్రిజ్లో పెట్టండి. దీనివల్ల పొద్దున్న ఆమెకి 20 నిమిషాల సెగ తప్పుతుంది. ‘నో కుకింగ్ డే’ నాడు ఆమె వంట విరామం తీసుకుంటే మీరు పులావో, కిచిడీయో కాకపోయినా మ్యాగీ, ఆమ్లెట్ పెట్టినా ఆమెకి పండగే. ఎండలో కూరగాయలకి, పాలకి ఆమెను వెళ్లనివ్వకండి. లిస్ట్ తీసుకుని ఉదయం 7 లోపు తెచ్చేయండి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ చెడిపోయిందా? ఫ్రిజ్లో వాటర్ బాటిల్స్ నింపారా? మజ్జిగ చేయడానికి పెరుగు ఉందా? ఈ పనులు మీవి. అలాగే ‘ఈ ఎండలో కూడా టేస్టీగా చేశావే’ అని ఒక్క మాట చెప్పండి. ఖరీదైన ఏ.సి. కన్నా ఆ మాటే ఎక్కువ చల్లదనం ఇస్తుంది. వంకలు పెడితే వంటింటి హీట్ డబుల్ అవుతుంది. ఇల్లాలు చల్లగా ఉంటే, ఇంట్లో అందరూ చల్లగా ఉంటారు. గృహిణి కడుపు చల్లగాఎండల్లో వంట చేస్తూ కష్టపడే సమయంలో బాడీ కూల్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోద్దు. సబ్జా నిమ్మకాయ రసం, బార్లీ నీళ్లు, పుదీనా మజ్జిగ, రాగి అంబలి... ఇవన్నీ కిచెన్లోనే సులువుగా తయార వుతాయి. గంటకోసారి తాగండి. చికాకు మాయం. -
విశ్వాసానికి మరణం లేదు: కన్నీరు పెట్టిస్తున్న శునకం!
మలప్పురం: మనిషికి, మూగజీవికి మధ్య ఉండే బంధం కేవలం అన్నం పెట్టే దగ్గరే ఆగిపోలేదు.. అది రెండు ఆత్మల అనుసంధానమని కేరళలోని మలప్పురం సాక్షిగా మరోసారి రుజువైంది. ఎడవన్న ప్రాంతానికి చెందిన అమీనా అనే వృద్ధురాలు, తన ఇంటి ముందుకు వచ్చే ఒక వీధి కుక్కకు రోజూ ప్రేమతో అన్నం పెట్టేది. ఈ నేపధ్యంలో ఆ మూగజీవికి ఆమె ప్రాణప్రదమైన స్నేహితురాలిగా మారిపోయింది. అమీనా చూపిన ఆదరణను ఆ మూగ జీవి గుండెల్లో పదిలంగా దాచుకుంది.ఒక రోజు అమీనా తన ఇంటి బయట అనారోగ్యంతో అకస్మాత్తుగా కుప్పకూలిపోయినప్పుడు ఆ మూగజీవి విలవిల్లాడిపోయింది. తన ప్రాణదాత ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే తట్టుకోలేక, ఆ వీధి కుక్క ఆపకుండా అరుస్తూ, చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసేందుకు ప్రయత్నించింది. దాని అరుపులు విని, స్థానికులు స్పందించే లోపే, అమీనా ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. అయితే ఆ మూగ జీవి తనను ఆదుకున్న యజమాని ఇక లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోయింది.అమీనా అంతిమ యాత్ర మొదలైనప్పుడు, ఆ కుక్క కూడా అందరితో కలిసి మౌనంగా అడుగులు వేసింది. మసీదు శ్మశానవాటిక వరకు ఆ భౌతికకాయాన్ని అనుసరిస్తూ వెళ్లి, అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండిపోయింది. స్థానికులు చెబుతున్న ప్రకారం.. ఆమె మరణానికి కొన్ని రోజుల ముందు నుంచే ఆ కుక్క శ్మశానవాటిక పరిసరాల్లో తచ్చాడుతూ కనిపించింది. బహుశా ఆ మూగజీవికి అమీనా దూరం కాబోతోందనే ముందస్తు సంకేతం అందిందేమోనని పలువురు కంటతడి పెట్టుకున్నారు.అంత్యక్రియలు ముగిసి రోజులు గడుస్తున్నా, ఆ శునకం తన యజమానిని మరువలేకపోతోంది. అమీనా కుటుంబ సభ్యులు ఎప్పుడు సమాధిని సందర్శించడానికి వచ్చినా, ఆ కుక్క అక్కడే ప్రత్యక్షమవుతోంది. ఎటువంటి అలికిడి చేయకుండా, ఆమె సమాధి పక్కనే గంటల తరబడి నిశ్శబ్దంగా కూర్చుని నిరీక్షిస్తోంది. తన ఆకలి తీర్చిన మనిషి తిరిగి రాదని తెలిసినా, ఆ సమాధి వద్ద అది చూపుతున్న స్వచ్ఛమైన ప్రేమ.. అందరికీ ఒక గొప్ప పాఠంలా నిలుస్తోంది.ఇది కూడా చదవండి: ఈసీకి మహువా మోయిత్రా షాక్: బైక్ వద్దన్నారని.. -
రూ. 36 లక్షల ప్యాకేజీ.. పిల్లలను కనలేని పేదరికం
గుర్గావ్: ఏడాదికి 36 లక్షల రూపాయల జీతం.. ఈ మాట వినగానే ఎవరైనా ‘వామ్మో’ అని అంటారు. అయితే నగర జీవితంలో ఇంతటి భారీ ప్యాకేజీ.. ఒక సాధారణ కుటుంబాన్ని పోషించడానికి సరిపోవడం లేదట! దేశ రాజధానిని ఆనుకుని ఉన్న ఐటీ హబ్ గుర్గావ్కు చెందిన ఒక జంట, నెలకు మూడు లక్షలు సంపాదిస్తున్నా.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో తాము పిల్లల్ని కనే సాహసం చేయలేమని తేల్చి చెప్పారు. పెరుగుతున్న జీవన వ్యయం నగరాల్లోని యువత ఆలోచనా విధానాన్ని ఎలా మారుస్తుందో ఈ ఉదంతం తెలియజేస్తోంది.కాగితం మీదే భారీ జీతంగుర్గావ్లో నివసిస్తున్న 35 ఏళ్ల వ్యక్తి నెలకు రెండు లక్షల రూపాయలు సంపాదిస్తుండగా, అతని భార్య నెలకు లక్ష రూపాయలు ఆర్జిస్తోంది. వీరిద్దరి వార్షిక ఆదాయం ఏకంగా రూ.36 లక్షలు. ఈ జీతం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. అయితే, పెరుగుతున్న జీవన వ్యయం, ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసరాల ధరలు వారిని పిల్లలను కనకుండా అడ్డుకుంటున్నాయి. ఈ వివరాలను ఆ వ్యక్తి బంధువు, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న హర్ష్ గుప్తా సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో ఇది వైరల్గా మారింది.సొంతిల్లు లేదు.. స్కూల్ ఫీజులు కట్టలేం‘మాకంటూ గుర్గావ్లో కనీసం ఒక డీసెంట్ వన్ బీహెచ్కే ఫ్లాట్ కొనుగోలు చేసే స్థోమత లేదు. అలాంటప్పుడు పుట్టబోయే బిడ్డకు తగినంత స్థలం ఎలా కల్పించగలం?’ అని ఆ జంట వాపోతోంది. దీనికి తోడు ప్రైవేట్ పాఠశాలల్లో నెలకు కనీసం 35 వేల నుంచి 40 వేల రూపాయల వరకు ఫీజుల రూపంలోనే చెల్లించాల్సి రావడం కూడా వారిని భయపెడుతోంది. రియల్ ఎస్టేట్ ధరలు, విద్యా ఖర్చుల భారం మోయలేకే వారు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని గుప్తా తెలిపారు.పెరుగుతున్న ‘డింక్’ కల్చర్భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ, పిల్లలు వద్దు అనుకునే వారిని ‘డింక్’ జంటలు అని అంటారు. ఆధునిక నగరాల్లో ఈ సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. పట్టణాల్లో సంతానోత్పత్తి రేటు ఎందుకు పడిపోతోందో చెప్పడానికి ఈ ఘటనే సరైన ఉదాహరణ. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. భవిష్యత్తుకు ఆర్థిక భద్రత ఇవ్వలేనప్పుడు పిల్లల్ని కనకపోవడమే ఉత్తమమని కొందరు సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం వయసు దాడిపోయాక ఈ జంట బాధపడక తప్పదని అభిప్రాయపడుతున్నారు.ఇది కూడా చదవండి: మేఘాలయ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్! -
నా భర్త చనిపోయి ఏడాది.. ఇన్సూరెన్స్పై ఇప్పుడు అత్త కేసు!
నా భర్త చనిపోయి ఏడాది కావస్తుంది. నాకు ఒక కూతురు. ఆయన పేరుతో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. అన్నిటిలో నామినీగా నేనే ఉన్నాను. కానీ ఇప్పుడు మా అత్తగారు కన్జ్యూమర్ కోర్టులో కేసు వేసి ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్లో తనకు కూడా భాగం ఉంది అని అంటుంది. నేనంటే ఆవిడకి అస్సలు పడదు. లీగల్ హేర్ కోసం కూడా కేసు వేసింది. తన పేరును రాయకపోయినా మా అత్తగారికి ఇన్సూరెన్స్లో భాగం ఉంటుందా?– శ్రేష్ఠ, వికారాబాద్మీరు చెప్పిన అంశాలను రెండు భాగాలుగా విడదీసి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మొదటిది మీ అత్తగారికి ఉన్న చట్టపరమైన హక్కు. మీ భర్తకు తల్లిగా, ఎటువంటి వీలునామా లేని పక్షంలో మీ భర్తకి చెందిన ప్రతి ఆస్తిలోనూ, లబ్ధిలోను తనకు సమానమైన వాటా ఉంటుంది. అలాగే మీ కూతురికి కూడా వాటా వస్తుంది. దానిపై మీకు హక్కు ఉండదు. కాబట్టి తను అడుగుతున్న లీగల్ హేర్ కేసులో అన్ని ఆస్తులకుగాను తన కూడా సమాన భాగస్తురాలే అని కోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీ భర్త వీలునామా రాసి ఉంటే ఆ వీలునామా ప్రకారం మాత్రమే ఆస్తి పంపకాలు జరుగుతాయి. అప్పుడు లీగల్ హేర్ అనేది వర్తించదు. ఇక రెండవ అంశం... మీ భర్త ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకున్నారో చెప్పలేదు. ఏది ఏమైనా, ఇన్సూరెన్స్ చట్టం, 2015లో జరిగిన సవరింపు తర్వాత ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి ‘‘బెనిఫిషియల్ నామిని’’గా ఎవరైనా ఒక కుటుంబ సభ్యుల పేరు (తల్లి, భార్య, భర్త, పిల్లలు మాత్రమే) ప్రత్యేకంగా నిర్దేశించినట్లయితే కేవలం ఆ కుటుంబ సభ్యులకి మాత్రమే ఇన్సూరెన్స్ తాలూకా నగదు చెందుతుంది. ఇతరులకు ఎవరికీ ఆ నగదులో హక్కు ఉండదు. నామినీగా ఎవరి పేరునీ నిర్దేశించకపోతే చట్టపరంగా లీగల్ హేర్లు ఎంతమంది ఉంటే అంతమందికి సమాన వాటా వస్తుంది. మీరు చెప్పే దాన్ని బట్టి చూస్తుంటే, 2015 చట్ట సవరణ మీకు వర్తించవచ్చు. ఎందుకంటే మీ భర్త చనిపోయింది 2015 సవరింపు తర్వాతే గనుక! ఒకసారి ఇన్సూరెన్స్ పేపర్లు మొత్తం క్షుణ్ణంగా పరిశీలించండి. మిమ్మల్ని ఏ విధమైన బెనిఫిషియల్ గా నిర్ధారించారో చూడండి. మీ భర్త కోరిక మేరకు మాత్రమే ఆ నగదు ఎవరికి దక్కాలో వారికి దక్కుతుంది. మీ అత్తగారితో సామరస్యంగా పరిష్కారం సాధ్యమేమో చూడండి. ఆ దిశలో కూడా కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే కుటుంబ బంధాలు సాఫీగా సాగే అవకాశం ఉంటుంది. శ్రీకాంత్ చింతలహైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. -
'అప్గ్రేడ్' చేసుకుంటూనే పోవాలి..!
నిజమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఒక కోర్సు పూర్తి చేయడం కాదు, అది ప్రతిరోజూ మిమ్మల్ని మీరు 'అప్గ్రేడ్' చేసుకునే ఒక జీవనశైలి. "నేను అన్నీ నేర్చుకున్నాను, ఇక నేను పర్ఫెక్ట్" అని నువ్వు అనుకున్న మరుక్షణమే నీ ఎదుగుదల ఆగిపోతుంది. వ్యక్తిత్వం అనేది ఒక శిల్పం లాంటిది; దాన్ని ప్రతిరోజూ చెక్కుతూనే ఉండాలి.పర్ఫెక్షన్ కాదు.. ప్రోగ్రెస్ ముఖ్యం (Progress over Perfection)మనం ఎప్పటికీ 'పర్ఫెక్ట్' అవ్వలేము బ్రో, ఎందుకంటే మనిషి అన్నవాడు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటాడు. నిన్నటి కంటే ఈరోజు మీరు 1% మెరుగ్గా ఉన్నారా? లేదా? అన్నదే ముఖ్యం. తప్పులు చేయడం సహజం, కానీ చేసిన తప్పే మళ్ళీ చేయకపోవడం 'వికాసం'. మీ లోపాలను అంగీకరిస్తూనే, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం నిరంతరం సాగాలి.సెల్ఫ్-రిఫ్లెక్షన్: మీతో మీరు మాట్లాడుకోండిఈ ప్రయాణం కొనసాగాలంటే, మీకు మీరు ఒక అద్దంలా ఉండాలి.ప్రతి వారం లేదా ప్రతి నెల ఒకసారి కూర్చుని ఆలోచించండి: "ఈ నెలలో నేను ఏయే విషయాల్లో స్ట్రాంగ్ గా ఉన్నాను? ఎక్కడ బలహీనపడ్డాను?"మీ పునాది (Foundation) గట్టిగా ఉందా? మీ విలువలు (Integrity) మారుతున్నాయా?మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం ఆపిన రోజున, మీరు సమాజం చెప్పే మాటలకు బానిసలైపోతారు.కంఫర్ట్ జోన్ - మీ ఎదుగుదలకు శత్రువుమీరు ఒక స్థితికి చేరుకున్నాక "ఇక చాలు, నేను సెటిల్ అయ్యాను" అని అనిపిస్తుంది. అదే మీ పతనానికి ఆరంభం.The Stretching Principle: ఎప్పుడూ కొత్త సవాళ్లను (Challenges) స్వీకరించండి. మీకు భయం కలిగించే పనిని కనీసం నెలకు ఒకటైనా చేయండి.కొత్త మనుషులను కలవండి, కొత్త దేశాలను చూడండి, కొత్త పుస్తకాలు చదవండి. మీ ప్రపంచం ఎంత పెద్దదైతే, మీ వ్యక్తిత్వం అంత విశాలం అవుతుంది.హ్యూమిలిటీ: గెలిచినా ఒదిగి ఉండటం మీరు ఎంత ఎదిగినా, మీ కాళ్లు నేల మీదే ఉండాలి.అహంకారం (Ego) అనేది వ్యక్తిత్వ వికాసానికి పట్టిన చెద పురుగు. అది మిమ్మల్ని లోపలి నుండి తినేస్తుంది.గొప్ప వ్యక్తులు ఎప్పుడూ వినయంగా ఉంటారు, ఎందుకంటే వారికి తెలుసు—ఈ అనంతమైన విశ్వంలో తాము నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని. మీ సక్సెస్ ని తలకెక్కించుకోకండి, దాన్ని ఇతరులకు సాయం చేసే 'మెట్టు'గా వాడుకోండి.ఫైనల్ బ్లూప్రింట్: మీ జీవితమే ఒక పుస్తకంBe the Message:నువ్వు ఏయే విలువలు అయితే నేర్చుకున్నావో, అవి నీ ప్రవర్తనలో కనిపించాలి. నువ్వు చెప్పే మాటల కంటే నీ 'చేతలు' గట్టిగా వినిపించాలి.Legacy:నువ్వు లేకపోయినా నీ వ్యక్తిత్వం ఈ లోకంలో ఒక వెలుగును నింపాలి (Chapter 49).The Final Wordమనం ఈ ప్రయాణాన్ని ఇక్కడితో ముగిస్తున్నాం, కానీ నీ వ్యక్తిగత వికాస ప్రయాణం ఇక్కడి నుండే కొత్త వేగాన్ని అందుకోవాలి. నువ్వు ఒకప్పుడు ఎవరో నీకు అనవసరం.. ఇప్పుడు నువ్వు ఎవరు, రేపు నువ్వు ఏమవ్వాలి అనుకుంటున్నావు అనేదే ముఖ్యం. నువ్వు ఒక'నిరంతర విద్యార్థివి'. నువ్వు ఒక'యోధుడివి'. నువ్వు ఒక'మార్పువి'.గుర్తుంచుకో.."నువ్వు ఆగిపోతే అది మరణం, నువ్వు సాగిపోతే అది వికాసం. నీ ప్రయాణాన్ని ఆపకు. ఆకాశమే నీ హద్దు.. కాదు, ఆకాశం కూడా ఒక ఆరంభం మాత్రమే!"Final Mind-Work: (జీవితకాల ప్రతిజ్ఞ)1. ఈ 50 వ్యాసాలలో మీకు అత్యంత నచ్చిన, మీ జీవితాన్ని మార్చిన 5 సూత్రాలను ఒక చోట రాసుకోండి. వాటిని మీ జీవిత కాలం పాటించాలని మీకు మీరు 'ప్రమాణం' చేసుకోండి.2. ఈ సిరీస్ ద్వారా మీరు పొందిన అతిపెద్ద మార్పు ఏంటో ఒక్క ముక్కలో రాసుకోండి.3. ఈరోజు నుండి, ప్రతిరోజూ పడుకునే ముందు "నేను ఈరోజు నా ఉత్తమ వెర్షన్ (Best Version) లా బ్రతికానా?" అని ప్రశ్నించుకోండి. (చదవండి: 'లెగసీ' అంటే..? ఎలా పెంపొందించుకోవాలి..) -
డ్యాన్స్... అంతకు మించి...
డ్యాన్స్ అనేది కాస్త సరదా కోసం మాత్రమే కాదు. ఒత్తిడి నుంచి మనల్ని మనం విముక్తి చేసుకునే మార్గం. సామాజిక అంశాలపై జాగృత పరిచే సాధికార సందేశం. కథక్ ద్వారా స్త్రీ సాధికారత, లింగ సమానత్వంపై నృత్యరూపకాలు రూపొందిస్తున్నారు శోవన నారాయణ్. మానసిక సమస్యలకు చికిత్సగా డాన్స్ మూమెంట్ థెరపీ (డిఎంటీ)ని ఉపయోగిస్తున్నారు రెనెల్...సామాజిక నృత్యరూపకాలుతన కథక్ నృత్యానికి సామాజిక చైతన్యాన్ని జోడిస్తున్నారు పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, ప్రముఖ నర్తకి శోవన నారాయణ్. మూడేళ్ల వయసులోనే నృత్యం నేర్చుకోవడం మొదలుపెట్టింది శోవన. ‘నాట్యం’ అనగానే ఆమె తోటి పిల్లలుపారిపోయేవారు. శోవన మాత్రం శ్రద్ధగా నేర్చుకునేది.మహిళల సమస్యలు, దివ్యాంగుల సమస్యలు, రకరకాల సామాజిక అంశాలపై ఎన్నో నృత్యరూపకాలను రూపొందించారు శోవన. తీరిక లేని పనుల మధ్య కూడా రకరకాల స్వచ్ఛంద సంస్థల కోసం తగిన సమయాన్ని కేటాయిస్తారు. పిల్లలతో కలిసి ర్యాంప్ వాక్ చేస్తారు. కార్గిల్ యుద్ధం వల్ల ప్రభావితమైన కుటుంబాలు, సునామీ బారిన పడిన అమాయక ప్రాణులు, వినాశకరమైన వరదల వల్ల చితికిన జీవితాలు, భ్రూణ హత్యలు... ఇలా ఎన్నో సమస్యలు, విషాదాలను తన నాట్యానికి ఇతివృత్తంగా చేసుకుంటున్నారు శోవన. నృత్యకారుల ప్రతిభను గుర్తించడానికి, వారిని తగిన రీతిలో గౌరవించడానికి రకరకాల ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఆమె నిర్వహించే ‘రిథమ్ అండ్ జాయ్’వంటి కార్యక్రమాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది.ఆసవరి నృత్య పాఠశాల‘ఆసవరి’ పేరుతో గత మూడు దశాబ్దాలుగా నృత్య పాఠశాల నిర్వహిస్తున్నారు శోవన. కేవలం ఇద్దరు విద్యార్థులతో మొదలైన ‘ఆసవరి’ ఆ తరువాత కాలంలో ఎంతో ప్రాచుర్యం పొందింది. నృత్యంలో పెద్ద పేరు తెచ్చుకోవాలని కలలు కనే విద్యార్థులకు వేదికగా మారింది. ‘నా దృష్టిలోపాఠశాల అంటే ఇటుకలు, సిమెంట్ కాదు. విద్యార్థులు, వారు నేర్చుకునేపాఠాలు, వారి నిరంతర ఉత్సాహం’ అంటున్నారు శోవన. ‘ఆసవరి’ ఎంతో మందిని నృత్యకళాకారులుగా తీర్చిదిద్దింది. అన్నిటికంటే ముఖ్యంగా నృత్య విద్యార్థులలో మానవతా విలువలు, క్రమశిక్షణపాదుకొల్పింది. నృత్యాన్నే కాకుండా, సృజనాత్మక ఆలోచనలను, సహనంతో కూడిన విశాల దృక్పథాన్ని కూడా అలవరుస్తోంది ఆసవరి. కొన్నిసార్లు సంప్రదాయవాదులను ఆశ్చర్యపరిచే అసాధారణ అంశాలను నృత్యప్రదర్శనలుగా రూపొందిస్తుంది.డ్యాన్స్ మూమెంట్ థెరపీశరీరానికి, మనస్సుకు మధ్య సమతుల్యత సాధించేందుకు నృత్యం అనేది చికిత్సాపరమైన వ్యాయామంగా వివిధ పద్ధతులలో ప్రపంచవ్యాప్తంగా ఉనికిలో ఉంది. డ్యాన్స్ మూమెంట్ థెరపీ (డిఎంటీ) అనేది అటువంటి విధానాలలో ఒకటి. డిఎంటీ నృత్యప్రక్రియ ద్వారా మానసిక సమస్యలు, ఒత్తిడిని అధిగమించే మార్గాన్ని ప్రజలకు చూపించడంలో సహాయపడుతున్నారు పుణెకు చెందిన రెనెల్.రెనెల్కు మొదట్లో డ్యాన్స్ మూమెంట్ థెరపీ(డిఎంటీ) గురించి ఏమీ తెలియదు. అనుకోకుండా ఒకరోజు ముంబైలో డిఎంటీ క్లాస్కు హాజరయ్యారు. అది ఆమె జీవితాన్నే మార్చేసింది. ‘డిఎంటీ క్లాస్లలోపాల్గొన్న తరువాత మానసిక సమస్యలను అధిగమించడంలో నృత్య ప్రభావాన్ని స్వయంగా తెలుసుకునే అవకాశం దొరికింది. అందుకే డ్యాన్స్ మూమెంట్ థెరపీని ఇతరులకు కూడా పరిచయం చేయాలనుకున్నాను. డిఎంటీ నృత్యప్రక్రియ అమెరికాలాంటి దేశాల్లో చాలా ప్రసిద్ధి చెందింది. 1950లో అక్కడ మొదలైంది. మన దేశంలో మాత్రం కొత్త’ అంటున్నారు రెనెల్.ప్రశాంత మార్గంలో....లింగ ఆధారిత హింసకు గురైన వారు, మానవ అక్రమ రవాణా బాధితులు, ప్రమాదంలో ఉన్న పిల్లలు... మొదలైన వారిని స్వస్థపరచడానికి డిఎంటీ నమూనాను అభివృద్ధి చేసిన ‘కోల్కతా సంవేద్’ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తున్నారు రెనెల్. ‘అంతర్గత సంఘర్షణ లోపల అణచివేయబడినప్పటికీ, వారు చేసే ప్రతి పనిలో కోపం, ఆత్మన్యూనతా భావం, ప్రతికూలతలు వ్యక్తం అవుతుంటాయి. ఈ నేపథ్యంలో డ్యాన్స్ మూమెంట్ థెరపీ అనేది స్వీయ–వ్యక్తీకరణ ద్వారా వారిని సరిౖయెన మార్గంలోకి తీసుకువచ్చి ప్రశాంతంగా ఉండేలా, ప్రతికూల ఆలోచల నుంచి బయటపడేలా చేస్తుంది’ అంటున్నారు రెనెల్.ట్రాఫిక్ రూల్స్ డ్యాన్స్!ఇండోర్కు చెందిన ఎంబీఎ స్టూడెంట్ శుభీ జైన్ ట్రాఫిక్ అవేర్నెస్కు సంబంధించి వినూత్న విధానంతో సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. ‘ట్రాఫిక్ రూల్స్పాటించండి’ అని ఆమె ఉపన్యాసాలు ఇవ్వదు. ఫన్నీ డ్యాన్స్ మూమెంట్స్ ద్వారా ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కలిగిస్తోంది. ‘ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగించి, వాటినిపాటించేలా చేయడమే నా లక్ష్యం’ అంటున్న శుభీ జైన్ ట్రాఫిక్ నియమాలను తు.చ తప్పకుండాపాటించేవారికి వినూత్న డ్యాన్స్ స్టెప్స్తో సెల్యూట్ చేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తుంటుంది.సారీ... డ్యాన్స్ వయసు ఎరుగదు!డెబ్బై అయిదు సంవత్సరాల వయసులో వేగంగా నడవడమే కష్టం. ఈ బామ్మ మాత్రం అలా కాదు. ఒక హిందీపాటకు ఆమె చేసిన డ్యాన్స్ వీడియోకు 47.4 మిలియన్లకు పైగా వ్యూస్, లక్షలాది కామెంట్స్ వచ్చాయి. ‘ప్రతి విషయాన్ని వయసుతో ముడిపెట్టడం మనకు అలవాటైంది. వృద్ధులు కూడా ఒకప్పుడు పిల్లలే, యువతరంలో భాగమే. అభిరుచులు అనేవి ప్రాణవాయువులు. అవి వయసుతో పాటు ఆగిపోవు అని చెప్పడానికి ఈ వీడియో నిదర్శనం’ అని ప్రశంసించారు నెటిజనులు.ఎనభై సంవత్సరాల పూల్మణి సబర్ అనే వృద్ధురాలు జంషెడ్పూర్లోని గిరిజన సాంస్కృతిక కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ‘సబర్’ నృత్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. శారీరకంగా బలహీనంగా ఉన్నప్పటికీ, చెమటలు పడుతున్నప్పటికీ నృత్యం చేయడం ఆమెకు కష్టం కాలేదు. అలసట కనిపించకపోవడం మరో విశేషం. అస్సామీ సంప్రదాయ దుస్తులతో మరో బామ్మ బిహు సాంగ్కు వేసిన డ్యాన్స్ ఆహా అనిపించింది. కేరళకు చెందిన 82 సంవత్సరాల బామ్మ తన 25 సంవత్సరాల మనవడితో కలిసి చేసిన ఫోక్ డ్యాన్స్ ‘వారెవా’ అనిపించింది. -
పని ప్రదేశం..ఆరోగ్యానికి భారం కాకూడదంటే..!
ఇవాళ పని ప్రదేశంలో భద్రత, ఆరోగ్యంకి సంబంధించిన దినోత్సవం. ప్రతి ఏటా ఏప్రిల్ 28న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీని ముఖ్యోద్దేశం పని ప్రదేశాలలో ప్రమాదాలు, వ్యాధులను నివారించి సురక్షితమైన ఆరోగ్య పని సంస్కృతిని ప్రోత్సహించడమే. దీన్ని ఉద్యోగుల శ్రేయస్సు కోసం 2003లో అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO)ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ నేపథ్యంలో పనిప్రదేశాన్ని హెల్దీగా ఎలా మార్చుకోవాలో ఆరోగ్య నిపుణుల మాటల్లో తెలుసుకుందామా.పనిప్రదేశంలో చాలామంది ఉద్యోగులు బ్యాక్పెయిన్, మెడనొప్పి, ఛాతీ నొప్పి వంటి సమస్యలను ఫేస్ చేస్తుంటారు. అలాంటి వాళ్లు కూర్చోనే భంగిమపై అవగాహన ఏర్పరుచుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మానిటర్లను కంటి స్థాయిలో ఉంచడం, ప్రతి 30 నిమిషాలకు విరామం తీసుకోవడం, సాగదీయడం (స్ట్రెచింగ్) వంటివి చేయాలి.మోచేతులు డెస్క్ స్థాయిలో ఉండేలా కుర్చీ ఎత్తును సర్దుబాటు చేయాలి. ఇది మెడ/భుజాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. "తల ముందుకు వంగిన" భంగిమను నివారించడానికి, పాదాలు నేలపై చదునుగా ఉండేలా.. స్క్రీన్లు కంటి స్థాయిలో ఉండేలా చూసుకోవాలి.వెన్నెముకను నిటారుగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఒకే భంగిమలో ఎక్కువసేపు ఉండకూడదు. దాంతోపాటు ప్రతి 30–60 నిమిషాలకు ఒకసారి కదలడం వంటివి చేయాలి. కండరాలపై స్థిరమైన భారాన్ని తగ్గించడానికి, నిలబడి పనిచేసే డెస్క్లను లేదా కన్వర్టర్లను ఉపయోగించడం, తరచుగా భంగిమలను మార్చుకోవడం వంటివి చేయాలి.వీటన్నింటి తోపాటు చక్కటి జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు, శరీరానికి తగిని వ్యాయామం లేదా వాకింగ్ వంటి కదలికలు అవసరమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: వేసవిలో పానీపూరీ తినడం ప్రాణాంతకమా..?) -
వేసవిలో పానీపూరీ తినడం ప్రాణాంతకమా..?
జార్ఖండ్లో జరిగిన విషాద ఘటన అందరిలోనూ తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది.దాంతో సమ్మర్లో ఎలాంటి చిరుతిండ్లు మంచివనే చర్చలు లేవనెత్తాయి. అందులోనూ స్ట్రీట్ ఫుడ్స్ విషయంలో మరింత జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా అందరు మెచ్చే పానీపూరి విషయంలో మరింత కేర్ అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.జార్ఖండ్ గిరిడిహ్ జిల్లాలోని లేడా బజ్తో గ్రామంలో, శనివారం సాయంత్రం ఒక వీధి వ్యాపారి అమ్మిన పానీపూరీలు తిని చాలామంది వాంతులు, నీరసం వంటి అనారోగ్యం బారిన పడ్డారు. సుమారుగా 18 మందికి పైగా ఆసుపత్రిలో చేరగా, ఏడేళ్ల చిన్నారి మరణించింది. ఒక సాధారణ వీధి ఆహారం ఇంత మందికి ప్రాణాంతకంగా ఎలా మారిందన్న భయాలు సర్వత్రా నెలకొన్నాయి. అందుకు ప్రధాన కారణంగా దానిలో ఉపయోగించే నీరేనని వైద్యులు చెబుతున్నారు. పానీపూరీ అనగానే నీరు ప్రధానం. ఈ నీరు కలుషితం కాకుండా మంచి పరిశుభ్రమైనది వాడితే ఎలాంటి సమస్యలు ఉండవని అంటున్నారు. అదే నీరు కలుషితమైతే దానిలో కోలి లేదా సాల్మొనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియా ఉంటుందన్నారు. వేడి వాతావరణంలో ఈ బ్యాక్టీరియా చాలా వేగంగా వృద్ధి చెందుతుంది కాబట్టి కొన్ని గంటల్లోనే అస్వస్థతకు గురవ్వుతామని అన్నారు. అలాగే అందులో ఉపయోగించే కూరలోని బంగాళదుంపలు, శనగులు తాజాగా ఉంటే పర్లేదు గానీ, అవి కూడా అసురక్షితమైనవి అయితే ఈ బ్యాక్టీరియా మరింత వేగంగా పెరుతుందన్నారు. అలాగే దుకాణం వద్ద కూడా పరిశుభ్రత అనేది అత్యంత కీలకమని అన్నారు. ముఖ్యంగా అమ్మకందారులు వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం, పాత పాత్రలనే వాడటం, ఈగలు, దుమ్ముకు గురికావడం, తదితరాల వల్లే ఫుడ్పాయిజనింగ్ అయ్యి అనారోగ్యం బారిన పడతారని హెచ్చిరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్నిసార్లు, హాని కలిగించేవి కేవలం బ్యాక్టీరియా మాత్రమే కాదు, అవి వదిలిపెట్టే విషపదార్థాలు కూడా అనారోగ్య సమస్యలు వస్తయాన్నారు. ఆ బ్యాక్టీరియాలు ఉత్పత్తి చేసే విషపదార్థాల కారణంగా డీహైడ్రేషన్, అవయవాలపై ఒత్తిడి, చివరికి ప్రాణాంతకంగా కూడా మారుతుందని అంటున్నారు. వేసవిలో వేడి కారణంగా బ్యాక్టీరియా పెరుగుదల మరింత వేగవంతంగా ఉంటుందట. అందువల్ల ఈ కాలంలో ఎక్కువగ ఫుడ్పాయిజన్ కేసులు నమోదవుతాయని అంటున్నారు నిపుణులు. దకాణాదారుడు పరిశుభ్రతను పాటిస్తూ..నాణ్యమైన పదార్థాలనే ఉపయోగిస్తే ఎలాంటి ఢోకా లేకుండా ధైర్యంగా తినొచ్చని అన్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Watermelon: భోజనం తర్వాత తీసుకోకపోవడమే మంచిదా..?) -
క్రీమ్ కలర్ సిల్క్ చీరలో రష్మిక మందన్న గ్లామరస్ లుక్..!
టాలీవుడ్ నటి రష్మిక మందన్న, విజయ దేవర కొండల పెళ్లి ఫిబ్రవరి 26,2026న ఉదయ్పూర్లో అంగరంగ వైభవంగా చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మ సాంప్రదాయ శైలిని ఎలా ఉన్నతంగా తీర్చిదిద్దాలో పాఠాలు నేర్పుతూనే ఉంది. తన పెళ్లి వేడుక కోసం కిలోల కొద్దీ బంగారు ఆభరణాల నుంచి రిసెప్షన్లో ధరించి కూర్గీ శైలి చీర వరకు ప్రతి సందర్భంలోనూ ఫ్యాషన్ ప్రియులను గ్లామరస్ లుక్తో కట్టిపడేస్తోంది. ఒక అవార్డుల వేడుకు కోసం రష్మిక క్రీమ్ కలర్ సిల్క్ చీరలో తళుక్కుమంది. ఇన్స్టాగ్రామ్లో అందుకు సంబంధించిన ఫోటోలను రష్మిక షేర్ చేశారు. ఆమె స్టైలిస్ట్ గౌర్వి ప్రత్యర్తి మృణాలినీ రావు కలెక్షన్ల నుంచి ఎంపిక చేసుకున్నారు ఈ చీరను. ఈ సిల్క్ పట్టు మాదిరి చీరకు క్లిష్టమైన పూల జర్దోజీ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఈ చీరకు ఎరుపు రంగులోని ఎంబ్రాయిడరీ బ్లౌజ్ని జత చేశారు. దాంతో ఈ చీర అత్యంత హైలెట్గా నిలిచి అందరి చూపులను ఆకర్షించింది. అంతేగాదు ఈ చీర ధర వచ్చేసి దగ్గర దగ్గర రూ. 1.68 లక్షలు పైనే పలుకుతుంది. అందుకు తగ్గట్టుగా చాలా నేచురల్ మేకప్, హెయిర్ స్టైల్ కోసం మధ్యలో పాపిడి తీసిన పోనీటెయిల్తో తన ఆహార్యాన్ని పూర్తి చేశారు. అలాగే తన శారీకి అనుగుణంగా మధ్యలో పచ్చరాయితో మెరుస్తున్న స్టేట్మెంట్ చెవిపోగులు, చిన్న నెక్చైన్, మంగళ సూత్రంతో సాంప్రదాయబద్దమైన మహిళలా అద్భుతంగా కనిపించారామె. అంతేగాదు రష్మిక బ్యూటీఫుల్ ఫోటోలను రీపోస్ట్ చేస్తూ సదరు బ్రాండ్ ఇలా రాసింది. "మృణాలినీ రావు దుస్తులలో మిమ్మల్ని చూడటం మాకు ఎల్లప్పుడూ ఇష్టమే! ఈ చీరలో అద్భుతంగా కనిపిస్తున్నారు." అని పేర్కొంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) (చదవండి: విమానం గాల్లో ఉండగానే ప్రసవం..! అయితే..) -
భోజనం తర్వాత పుచ్చకాయ తినకూడదా..?
ముంబైలో బిర్యానీ, పుచ్చకాయ తిని ఓ కుటుంబం మరణించిదన్న ఘటన తీవ్ర ఆందోళన, అనుమానాలను రేకెత్తించింది. భోజనం తర్వాత సర్వసాధారణంగా పండ్లు తీసుకుంటాం. అలా.. సమ్మర్ ఫ్రూట్గా చెప్పే పుచ్చకాయను మాత్రం అలా తీసుకోకూడదా అంటే..పోషకాహార నిపుణులు ఔననే చెబుతున్నారు. అసలు దీన్ని ఎలా తినాలి?, ఎప్పుడు తింటే ఆరోగ్యానికి మంచిది? వంటి విషయాలు గురించి సవివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.!.పుచ్చకాయ పోషకాలు అధికంగా ఉండే పండు. ఇది తిన్న వెంటనే కడుపు నిండిన అనుభూతిని అందిస్తుంది. అయితే చాలామంది ఈ పుచ్చకాయ తిన్న వెంటనే కడుపు ఉబ్బరంగా ఉందంటూ ఫిర్యాదులు చేస్తుంటారు. ఎందుకిలా అంటే..రీజన్ ఏంటంటే..సర్వసాధారణంగా ఇలా ఎందుకు జరుగుతుందంటే భారీ భోజనం తర్వాత ఎప్పుడైతే పుచ్చకాయ తింటారో ఆ క్షణమే ఈ సమస్య ఉత్ఫన్నమవుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అందులోనూ వేసవి ఉష్ణోగ్రతలు కారణంగా పుచ్చకాయ వినయోగం ఆటోమేటిగ్గా పెరుగుతుంది. అందువల్ల ఇలా వేసవిలోనే ఈ సమస్య తీవ్రమవుతుందా? లేక ప్రతిసారి ఇలానే జరుగుతుందా అంటే..నిజనానికి వేసవిలో కడుపు ఉబ్బరం సర్వసాధారణమని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే అధిక వేడి కారణంగా శరీరం తన అంతర్గత ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఇబ్బంది పడుతుండటంతో జీర్ణక్రియ నెమ్మదిస్తుందని చెబుతున్నారు. తత్ఫలితంగా ఈ సమస్య వస్తుందని చెబుతున్నారు. కాబట్టి ఈ కాలంలో అధిక నీటి శాతం ఉన్న పండ్లు, తినే భోజనం రెండూ సమతుల్యంగా ఉంటే ఈ సమస్య రాదని అంటున్నారు. అంతేగాదు మనం పుచ్చకాయలను తీసుకునే విధానం కారణంగానే ఈ కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ సమస్య వస్తుందని చెబుతున్నారు. అంతేగాదు అలాంటి సమయంలోనే జీర్ణవ్యస్థపై పుచ్చకాయ ప్రభావం చూపిస్తుంది. అదీగాక ఈ పుచ్చకాయలో అధికంగా ప్రక్టోజ్ ఉండటం వల్ల పెద్దప్రేగుల్లో ఇది పులిసి, గ్యాస్ ఉత్పత్తి అవ్వడానికి దారితీసి కడుపు ఉబ్బరం, అసౌకర్యం వంటివి కలుగుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అదీగాక మనం తినే భోజనంతో పోలిస్తే పుచ్చకాయ వంటి పండ్లు జీర్ణాశయం గుండా వేగంగా ప్రయాణిస్తాయట. ఎప్పుడైతే ఈ రెండిటిని కలిపి తీసుకుంటామో దాని ఫలితం ఈ పుచ్చకాయ ముక్కలు జీర్ణం కావడాన్ని ఆలస్యం చేస్తుంది, దాంతో పులియబెట్టడం, గ్యాస్ ఏర్పడటం వంటివి జరుగుతాయని అన్నారు. అందువల్ల జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు సాధారణంగా భోజనం చేసిన వెంటనే పుచ్చకాయ తినడం మానుకోవడమే మేలని చెబుతున్నారు. అలాగే ఎసిడిటీ సమస్యతో ఉన్నవారు కూడా భోజనం తిన్న వెంటనే లేదా పుచ్చకాయ తిన్న వెంటనే భోజనం వంటివి చేయకూడదని హెచ్చరిస్తున్నారు.ఎప్పుడు తింటే మంచిదంటే..వైద్యులు మెరుగైన ఫలితాలు పొందాలంటే.. పుచ్చకాయను తీసుకునే సమయం కీలకమైనదని అంటున్నారు. అది తీసుకునే ఆధారంగానే మంచి ప్రయోజనాలను పొందగలమని అన్నారు. అంటే పూర్తి స్నాక్ ఐటెంగా లేక భోజనానికి చాలా సమయం ఉందనగా తీసుకోవడం మంచిదని అన్నారు. సరైన సమయంలో సరైన పద్ధతిలో తీసకోవాలని సూచిస్తున్నారు. అలాగే రాత్రి సమయంలో కూడా వద్దనే చెబుతున్నారు వైద్యులు. సరైన సమయం ఉదయం 11 నుంచి 3 గంటల లోపు భారీ బోజనం తీసుకోక మునుపు అయితే మంచిదని చెబుతున్నారు. రాత్రి ఏడు తర్వాత తీసుకోకపోవడమే మంచిదని అంటున్నారు. సూర్యాస్తమయం తర్వాత జీర్ణవ్యవస్థ నెమ్మదిగా ఉంటుంది, పైగా రాత్రి సమయంలో తేలకపాటి ఆహారాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. ఏదైనా సరే తగిన మోతాదులో తీసుకోవడం మంచిదనేది గుర్తురెగాలి. ఎందుకంటే 'అతి సర్వత్ర వర్జయేత్' అన్న నానుడి గుర్తించుకుని ఏదైన మితంగా సమతుల్యంగా తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉత్ఫన్నం కావని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: పుచ్చకాయ.. నిజంగానే ప్రాణాలు తీస్తుందా?) -
స్కిన్కు సన్స్ట్రోక్..!
నడివేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. అలా ఎండలోకి వెళ్లామో లేదో ఒళ్లంతా మండుతున్న ఫీలింగ్. టూ వీలర్ నడుపుతూ ఉంటే... దుస్తులతో కప్పిలేనిచోట చర్మం చిమచిలాడిపోతోంది.వేడిమి తీవ్రతా, స్పర్శజ్ఞానం... వీటిని తెలిసేదీ, తెలిపేదీ చర్మమే. ఆ కారణంగా ఎండవేడిమితో మొట్టమొదట ప్రభావితమయ్యేది కూడా చర్మమే. అందుకే వేసవిలో తమ వృత్తుల కారణంగానో లేదా ఇతరత్రానో తప్పనిసరిగా ఎండలోకి వెళ్లేవారిపై ఆ వేడిమీ, ఆ వడగాడ్పుల తీవ్రత ప్రభావాలేమిటో, వాటిని అధిగమిస్తూ చర్మాన్ని కాపాడుకోవడం ఎలాగో తెలిపే కథనమిది.తీక్షణమైన ఎండవల్ల కలిగే హాని ఏమిటంటే...ఎండకు ఎక్స్పోజ్ అయినప్పుడు సూర్యుడి రేడియేషన్ ప్రభావాలేమిటి, వాటి వల్ల చర్మంపై పడే రకరకాల ప్రభావాలూ, వాటి కారణంగా వాటిల్లే నష్టాలూ, వాటిని అధిగమించే మార్గాలేమిటో తెలుసుకుందాం...సూర్యుడి నుంచి భూమికి చేరే రేడియేషన్లో మనం చూడగలిగేదీ... చూపు అనే విజువల్ సెన్స్ కలిగించడానికి ఉపయోగపడేది చాలా తక్కువ. ఇందులో రేడియో తరంగాలూ, ఎక్స్–కిరణాలూ, మైక్రోవేవ్ తరంగాలూ ఇలా రకరకాల రేడియేషన్స్ అనేక వేవ్లెంత్స్లో ఉంటుంది. దీన్నింతా కలిపి ‘ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్’ అంటారు. అయితే ఇందులో మనకు దృష్టిజ్ఞానాన్ని ఇచ్చేందుకు అవసరమయ్యే ‘కాంతి’ చాలా తక్కువ. అయితే మొత్తం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లోని వివిధ రకాల కిరణాలు వేవ్లెంత్స్ కలిగి ఉంటాయి. ఒక కిరణం లేదా తరంగంలోన పక్కపక్కనే ఉండే అలలోని... ఒక పీక్కూ, మరో పీక్కూ మధ్యనున్న దూరాన్ని వేవ్లెంత్గా చెప్పుకుంటే మన కళ్లకు కనిపించే కాంతి తాలూకు వేవ్లెంత్ చాలా పరిమితంగా మాత్రమే ఉంటుంది. ఖచ్చితంగా చెప్పాలంటే 400 – 700 నానో మీటర్ల రేంజ్లో ఉండే దాన్ని మాత్రమే మనం కాంతిగా పేర్కొంటాం. అంతకంటే తక్కువ వేవ్లెంత్తో ఉండే కిరణాలను అల్ట్రా వయొలెట్ కిరణాలుగానూ, అంతకంటే ఎక్కువ వేవ్లెంత్తో ఉండేవాటిని ఇన్ఫ్రా రెడ్ కిరణాలుగా చెబుతారు.అల్ట్రా వయొలెట్ ఇన్ఫ్రా రెడ్ కిరణాలతోనే హాని...మనకు చేరే కాంతితోపాటు మన వాతావరణంలోకి వచ్చే ఈ అల్ట్రా వయొలెట్ (యూవీ), ఇన్ఫ్రా రెడ్ కిరణాలతో మన చర్మానికీ, కంటికి కూడా హాని కలిగే ప్రమాదం ఉంది. పైగా వేసవిలో ఈ కిరణాల తీవ్రత మరింత ఎక్కువగా ఉండటం వల్ల అమితమైన శక్తితో ఉండే ఈ కిరణాలు కంటికి హాని చేసే అవకాశాలు ఎక్కువ.అల్ట్రా వయొలెట్ కారణాలు..చర్మంపై ప్రభావం..సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్లోని హానికారకమైన చాలా రకాల రేడియేషన్ను మన భూమిపైన ఉండే ఓజోన్ పొర వడపోస్తుంది. మొత్తం రేడియేషన్లో కేవలం 3 శాతం అల్ట్రా వయొలెట్ కిరణాలు మాత్రమే భూమి ఉపరితలం వరకు చేరతాయి. ఇలా భూమిని చేరిన ఈ మూడు శాతం అల్ట్రా వయొలెట్ కిరణాల వల్ల చర్మంపై అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. వీటిల్లోనూ యూవీ–సీ అని పిలిచే ఒక రకం అల్ట్రా వయొలెట్ కిరణాలు చాలా చాలా ప్రమాదకరమైనవి. కొన్నిసార్లు వాటి ప్రభావంతో స్కిన్–క్యాన్సర్ వచ్చే ముప్పు కూడా ఉంటుంది. అదృష్టవశాత్తు యూవీ–సీ కిరణాలను ఓజోన్ పొర అడ్డుకొని మనతోపాటు సకల జీవరాశినీ కాపాడుతుంటుంది. నిజానికి 400 – 700 న్యానోమీటర్ల మేరకు కాంతిపటలం తప్ప... అంతకు మించిన వేవ్లెంత్ వల్ల... అలాగే అంతకంటే తక్కువ వేవ్లెంత్ వల్ల... ఇంకా చెప్పాలంటే... అల్ట్రావయొలెట్, ఇన్ఫ్రారెడ్ కిరణాలతో మన చర్మానికి ఎంతో ప్రమాదం. అంతటి ప్రమాదకరమైన వేవ్లెంట్ ఉన్న తీక్షణమైన రేడియేషన్ను మానవ చర్మం తట్టుకోలేదు.మన చర్మం రంగును బట్టి... మనం తట్టుకునే శక్తి...సాధారణంగా 308 న్యానోమీటర్ల వేవ్లెంట్ వరకు మనం తట్టుకోగలమని ఓ రఫ్ అంచనా. ఒకవేళ రేడియేషన్ తాలూకు వేవ్లెంత్ ఫ్రీక్వెన్సీ 308 న్యానోమీటర్లు ఉన్నప్పుడు మనుషుల చర్మం ప్రభావితమవుతుంది. అయితే ఈ రేడియేషన్ను తట్టుకునే శక్తి కూడా వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు నల్లటి చర్మం (డార్క్ స్కిన్) ఉన్నవారు ఎండ తీవ్రత తీక్షణంగా ఉన్నా తట్టుకోగలరు. కానీ చర్మం తాలూకు రంగులో డార్క్నెస్ తగ్గుతున్నకొద్దీ అంటే చర్మం ఫెయిర్గా అవుతున్న కొద్దీ ఎండ తీవ్రతను తట్టుకునే శక్తి కూడా తగ్గుతూ పోతుంది. అందుకే తెల్లటి చర్మం (ఫెయిర్ స్కిన్) ఉన్నవారు ఎండ తీవ్రతకు చాలా త్వరగా ప్రభావితమవుతారు. ఎండ తీవ్రత ప్రభావం రెండు రకాలుగా ఉంటుంది. మొదట తీవ్రమైన ఎండకు ఎక్స్పోజ్ అయినప్పుడు చర్మం నల్లబారుతుంది. మొదటి దశల్లో ఇది కేవలం తాత్కాలికం. ఎండకు వెళ్లడం తగ్గిస్తే ఇలా నల్లబారడమూ తగ్గుతుంది. ఇలా చర్మం నల్లబారడాన్ని పిగ్మెంటేషన్ అంటారు.తొలి దుష్ప్రభావాలు/తాత్కాలిక దుష్ప్రభావాలుచర్మంపై అల్ట్రావయొలెట్ కిరణాల దుష్ప్రభావాలు ఈ కింద పేర్కొన్న రీతిలో ఉంటాయి.ఎరిథిమా (సన్బర్న్స్)... సాధారణంగా సూర్యుడి తీక్షణత ప్రభావం వల్ల ఎండలోకి వెళ్లగానే మొదట చర్మం ఎర్రగా మారుతుంది. ఆ తర్వాత మాడినట్లుగా నల్లబడుతుంది. ఇలా జరగడాన్ని సన్బర్న్స్గా చెప్పవచ్చు. దీన్నే వైద్యపరిభాషలో ఎరిథిమా అని చెబుతారు.కొన్ని సందర్భాల్లో ఈ సమస్య చర్మంపైన ఎర్రగా పొక్కుల (బ్లిస్టర్స్) రూపంలోనూ కనిపించవచ్చు. ఎండ తీవ్రతను తట్టుకోగలిగే శక్తిలాగే... చర్మం రంగును బట్టి సన్బర్న్స్ తాలూకు తీవ్రత తగ్గడమూ, పెరగడం జరుగుతూ ఉంటుంది. అంటే... ఫెయిర్ చర్మం వారిలో సన్బర్న్ తీవ్రత ఎక్కువగానూ, నల్లటి చర్మం వారిలో తక్కువగానూ ఉంటుంది. బ్లిస్టర్స్ ఏర్పడితే ఎండ తీవ్రత అన్నది ఆ వ్యక్తి చర్మంపై చాలా ఎక్కువగా ఉందనడానికి ఈ సన్బర్న్స్ ఒక సూచన. కొందరిలో జ్వరం, వికారం, వాంతుల వంటివి కనిపించవచ్చు. అలాగే బాగా నీరసంగా, నిస్సత్తువగా అనిపిస్తూ బాగా బలహీనంగా ఫీల్ అవ్వడం కూడా జరగవచ్చు. కొందరిలో రక్త΄ోటు తగ్గడం, స్పృహతప్పడం వంటి పరిణామాలూ చోటుచేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితి వస్తే బాధితులను తక్షణం హాస్పిటల్కు తరలించాలి.పరిష్కారం / చికిత్స : సన్బర్న్కు గురై చర్మం ఎర్రబారిన వారిని తక్షణం నీడపట్టునకు తీసుకెళ్లాలి. దాదాపు 12 – 24 గంటల పాటు బాగా చల్లటి ప్రదేశంలో ఉన్నా లేదా ఎయిర్కండిషన్ గదిలో బాధితుడిని ఉంచినా... ఆ లక్షణాలన్నీ క్రమంగా తగ్గిపోతాయి. చర్మంపై చల్లటి నీటిలో తడిపిన టవల్తో తుడవటం లాంటి ఉపశమన ప్రక్రియలను చేయవచ్చు. అయితే సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు డర్మటాలజిస్టుల సూచన మేరకు నాన్స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ఎస్ఏఐడీస్), చర్మపు మంట తగ్గడానికి హైడ్రోకార్టికోసోన్ క్రీములు వాడాల్సిరావచ్చు. పొక్కులను పగలగొట్టకూడదు. మాయిష్చరైజింగ్ క్రీములతో ఈ సమస్య తగ్గుతుంది.పిగ్మెంటేషన్ఎండకు ఎక్స్పోజ్ అయ్యేవారి చర్మం రంగు నల్లబారడాన్ని ‘పిగ్మెంటేషన్’గా చెప్పవచ్చు. ఎండ తీవ్రత కారణంగా చర్మంలోని మెలనిన్ కణాల్లో ఫొటోపిగ్మెంటేషన్ చర్య జరగడం వల్ల చర్మం రంగు నల్లగా మారుతుంది. అయితే దీని తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు అంటే... ‘ఇమ్మిడియట్ పిగ్మెంటేషన్ డార్క్నెస్’ (ఐపీడీ)లో నీడలోకి వచ్చి చల్లటి ప్రదేశంలో ఉంటే... కేవలం రెండు గంటల్లోనే పిగ్మెంటేషన్ తాలూకు ప్రభావం తగ్గుతుంది. కానీ... వారి వృత్తి రీత్యాగానీ లేదా ఇతరత్రా ఎండకు తప్పనిసరిగా తిరిగే వ్యక్తుల్లో... ‘తాత్కాలిక ఐపీడీ’కి బదులుగా ‘పెర్సిస్టెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్’ (పీపీడీ) అనే కండిషన్ వృద్ధిచెందుతుంది. దీని ప్రభావం కొద్ది రోజులు మొదలుకొని, కొన్ని వారాల వరకు ఉండవచ్చు. కంటిన్యువస్గా నీడపట్టున ఉండటమే దీనికి నివారణ. ‘పెర్సిస్టెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్’ (పీపీడీ) కండిషన్ మొదలయ్యాక... ఇక ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా అదేపనిగా ఎండలో తిరగడం చర్మం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పరిష్కారం / చికిత్స : వీలైనంత మేరకు తీక్షణమైన ఎండకు అదేపనిగా ఎక్స్పోజ్ కాకుండా ఉండటం వల్ల ఈ సమస్యను చాలావరకు నివారించవచ్చు. అయితే చర్మం నల్లబారాక (డార్క్గా అయ్యాక) డర్మటాలజిస్ట్ను కలిసి తగిన చికిత్స తీసుకుంటే చాలావరకు చర్మం మునపటి రంగు సంతరించుకునే అవకాశముంటుంది.చెమట కాయలు (మిలీరియా)చెమటకాయలు అని మనమంతా చెప్పుకునే ఈ సాధారణ సమస్యలను వైద్యపరిభాషలో మిలీరియా అంటారు. చర్మంపై ఉండే చెమట గ్రంథుల్లో (స్వేదగ్రంధుల్లో) ఏదైనా అడ్డంకి ఏర్పడినప్పుడు అవి ఉబ్బినట్లుగా అవుతాయి. బాగా చెమట పట్టి... అది ఆవిరైపోయే పరిస్థితి లేనప్పుడు స్వేదగ్రంధుల చివర్లో చెక్కరతో కూడిన పదార్థం (పాలీశాకరైడ్ సబ్స్టాన్స్) రూపొందింది, అది చర్మగ్రంధి చివరన అడ్డుగా ఉండిపోతుంది. ఫలితంగా లోపల ఉన్న చెమట (స్వేదం) బయటికి రాలేక లోపలే ఉండిపోయి, స్వేదగ్రంథిలో ఒత్తిడి పెంచుతుంది. ఫలితంగా స్వేదం పక్క కణజాలాల్లోకి స్రవించి చెమటకాయలు రూపంలో కనిపిస్తూ అవి విస్తరించినట్లుగా అవుతాయి. ఇక ఏవైనా ఆరోగ్య సమస్యలతో పడకకే పరిమితమైన (బెడ్ రిడెన్) పేషెంట్స్లో చెమట ఎక్కువగా పట్టడం, వారు తమ దేహాన్ని అటు ఇటు కదిలించలేకపోవడంతో ఇవి ఎక్కువగా వస్తుంటాయి.ఈ చెమటకాయల్లోనూ మిలీరియా క్రిస్టలైన్ (సుడామినా), మిలీరియా రుబ్రా (ప్రిక్లి హీట్) ఉంటాయి. అవి మెడ, ఛాతీ, వీపు భాగంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. మిలీరియా క్రిస్టలైన్ (సుడామినా) కండిషన్లో చెమటకాయల తీవ్రత అంతగా ఉండకపోవడంతో చర్మంపై మంట ఉండదు. కానీ మిలీరియా రుబ్రా (ప్రీక్లీ హీట్)లో చెమటకాయలు ఎర్రగా కనిపిస్తుంటాయి. చేతికి తగులుతూ ముళ్లతో గుచ్చిన ఫీలింగ్ ఉంటుంది. ఇవి మంటనూ, తిమ్మిర్ల వంటి భావనను కలిగిస్తాయి. ఇక ‘మిలీరియా పుస్టులోజా’ అనే కండిషన్ మరింత తీవ్రమైనది. ఇందులో స్వేదగ్రంధిలోని స్వేదనాళానికి అడ్డంకి ఏర్పడటంతో పాటు అది దెబ్బతినడం కూడా జరగవచ్చు. ఇవి చర్మంలోని ఛాతీ, వీపు ప్రాంతాలలో తోపాటు ప్రైవేట్ పార్ట్స్లో కూడా విస్తరించవచ్చు. ఇది కొన్ని వారాల పాటు ఉంటుంది.పరిష్కారం / చికిత్స : చల్లటి ప్రదేశాల్లో ఉండటం, రోజూ క్రమం తప్పకుండా స్నానం చేయడం, ఒంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి చర్యలతో దీన్ని నివారించవచ్చు. అయితే చల్లటి నీటి కంటే గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల చెమటకాయలు త్వరగా తగ్గుతాయి. పిల్లలకు లేదా పెద్దలకు వాడే సాధారణ పౌడర్, తీవ్రత కాస్త ఎక్కువగా ఉన్నవారికి ప్రీక్లీ హీట్ ΄పౌడర్లతో ఉపశమనం ఉంటుంది. అయితే ‘మిలీరియా పుస్టులోజా’ అనే రకపు చమటకాయల తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నవారూ, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కూడా చెమటకాయలు కనిపిస్తున్నవారు తప్పనిసరిగా డర్మటాలజిస్టును సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది. ఫొటో ఏజింగ్ : అదేపనిగా చాలాకాలం పాటు ఎండలో తిరగడం వల్ల కొన్ని అవాంఛనీయ దీర్ఘకాలిక పరిణామాలు ఏర్పడతాయి. అందులో ముఖ్యమైనది ఫొటోఏజింగ్. ఈ కండిషన్లో (ఫొటోఏజింగ్లో) చర్మంపై అవాంఛితమైన ముడతలు, వెడల్పుగా ప్యాచ్ వచ్చిన రీతిలో మచ్చలు (సోలార్ లెంటిజిన్స్) రావచ్చు. ఇక చర్మం తన సాగే గుణాన్ని (ఎలాస్టిసిటీని) కోల్పోవడం; చర్మంపైన రక్తనాళాలు దారపు పోచల్లా కనిపించడం (టెలాంజిక్టాసియాస్ – అవే తర్వాత సాలెగూళ్లలా అల్లుకుని కనిపిస్తాయి. వాటినే స్పైడర్ వెయిన్స్ అని అంటారు); చర్మం ఎండిపోయినట్టుగా కనిపించడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. అటు తర్వాత చర్మం చాలా ముదురుగా (రఫ్గా) నిపిస్తుంటుంది. ఎవరిలోనైనా ఇలాంటి దశ వస్తే... ఇకపై ఈ దశ తర్వాతైనా చాలాసేపు ఎండకు వెళ్లకుండా చర్మాన్ని కాపాడుకోవాలి. తద్వారా ఫొటో ఏజింగ్ను నివారించవచ్చు.చివరగా... ఇక్కడ తెలిపిన సూచనలు పాటిస్తూ ఉండటం వల్ల వీలైనంత మేరకు చర్మానికి వచ్చే సమస్యలను నివారించుకోవడం, ఎండ తీక్షణత నుంచి తమను తాము కాపాడుకోవడం అన్నది చాలావరకు సాధ్యమవుతుంది.ఎండ నుంచి చర్మానికి రక్షణ ఇలా...వేసవిలో ప్రతి రోజు రెండుపూటలా స్నానం చేయడం. (చల్లటి నీటి కంటే గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం మంచిది). ఎండలోకి వెళ్లేవారు తప్పనిసరిగా గొడుగు తీసుకెళ్లడం. లైట్ కలర్ దుస్తులు వాడటం, (బాగా గాలి ఆడే కాటన్ దుస్తులు, ఎండ తగలనివ్వని లాంగ్స్లీవ్స్ దుస్తులు వాడటం మంచిది. అలాగే బాగా బిగుతుగా ఉన్న వస్తువులు ధరించడం వల్ల చెమట వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేదా మెటల్స్ వల్ల కలిగే అలర్జిక్ రియాక్షన్స్ వచ్చి... ఆ కారణంగా దురద వచ్చే అవకాశం ఉంటుంది. మరికొందరిలో వేలికి ఉంగరం ఉన్న చోట రెగ్యులర్గా సబ్బు నురగ ఇరుక్కుపోయి... ఆ డిటర్జెంట్ కారణంగా అలర్జీ రావచ్చు. ఇలాంటివారు తమ ఆభరణాలు మరీ బిగుతుగా లేకుండా చూసుకోవడం లేదా ఈ సీజన్లోవాటిని ధరించకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం మేలు). యాంటీ ట్యానింగ్ సన్స్క్రీన్స్, ఇన్ఫ్రారెడ్, అల్ట్రావాయొలెట్ నుంచి రక్షణ దొరికేలా మంచి సన్స్క్రీన్స్ వాడటం. (వేసవిలో డాక్టర్లు / డర్మటాలజిస్టులు సూచించిన... ఎస్పీఎఫ్ ఎక్కువగా ఉన్న సన్స్క్రీన్ లోషన్లను వాడాలి). అవసరమైనవారు డాక్టర్ సలహా మేరకు రాత్రి వేళల్లో డీ–పిగ్మెంటేషన్ క్రీమ్స్ వాడటం. ఈత వంటి ఆటల్లో పాల్గొనే క్రీడాకారులు వాటర్ప్రూట్ సన్స్క్రీన్స్ వాడటం. చర్మం తన సాగేగుణాన్ని (ఎలాస్టిసిటీని) కోల్పోకుండా ఉండటం కోసం నీళ్లు ఎక్కువగా తాగడం, ద్రవహారాలు ఎక్కువగా తీసుకోవడం. (ప్రతిరోజూ కనీసం 12 గ్లాసులకు తగ్గకుండా నీళ్లు తాగాలి. ఈ సీజన్లో నీళ్లతో పాటు మజ్జిగ (బటర్మిల్క్), కొబ్బరినీళ్లు, పండ్ల రసాల వంటి ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవడం మేలు. కోలా డ్రింక్స్ వంటివి చర్మానికి హాని చేస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండటం అవసరం). ఈ సీజన్లో తలకు రంగు వేసుకునే వారు చల్లటి వేళల్లో వేసుకోవడం మేలు.డియోడరెంట్స్ వాడేవారి కోసం కొన్ని సూచనలు... డియోడరెంట్స్ వాడేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా డియోడరెంట్స్లో బర్గ్యాప్టెన్ అనే సోరోలెన్స్ పదార్థం ఉంటుంది. దాంతోపాటు దీనికి మంచి సువాసన (ఫ్రాగ్రెన్స్) రావడానికి కొన్ని రసాయనాలు వాడతారు. ఎండాకాలంలో చెమటలు ఎక్కువగా పట్టడం వల్ల ఇవన్నీ చర్మంపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. కాబట్టి నేరుగా డియోడరెంట్స్ చర్మంపై రాసుకోవడం కంటే ఫ్రాగ్రెన్స్ను కోరుకునేవారు వాటిని బట్టలపై వేసుకునేలా (స్ప్రే చేసుకునేలా) వేసుకుంటే మంచిది. అందునా బట్టలు ధరించకముందే వాటిపై స్ప్రే చేసి... ఒక అరగంట తర్వాత దుస్తులు ధరించాలి. అలా ఉపయోగిస్తే చర్మానికి కలిగే హానిని తగ్గించినట్లు అవుతుంది. డా. స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ట్ నిర్వహణ: యాసీన్(చదవండి: Dementia: వంట చేయడంలో ఇంత మహత్తు ఉందా..? దెబ్బకు మతిమరుపు..) -
పుచ్చకాయ.. నిజంగానే ప్రాణాలు తీస్తుందా?
ముంబైలో బిర్యానీ, పుచ్చకాయ తిని ఓ కుటుంబం మరణించిదన్న వార్త కొత్త ఆందోళనలకు దారి తీసింది. సీజన్తో సంబంధం లేకుండా చాలామందికి బిర్యానీ ఫేవరెట్ ఫుడ్. అలాగే వేసవిలో ఎక్కువగా తినే పండ్లలో పుచ్చకాయ ఒకటి. అలాంటివి ప్రాణాలు తీసేంత ప్రమాదకరమా? అని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిపుణులు ఆ అపోహలపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ముంబైలో జరిగిందేంటి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు శనివారం రాత్రి 10.30గం. ప్రాంతంలో మొదట బిర్యానీ తిన్నారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఉన్న పుచ్చకాయ (వాటర్మెలన్)ను తిన్నారు. కొన్ని గంటల్లోనే వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించాయి. ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతూ 12 గంటల వ్యవధిలోనే ఆ నలుగురూ ప్రాణాలు కోల్పోయారు.ట్రీట్మెంట్ సమయంలో ఆ నలుగురికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఇది ఫుడ్ పాయిజనింగ్ జరిగిందనడానికి నిదర్శనమని వైద్యులు ప్రకటించారు. పోలీసులు మాత్రం దీన్నొక యాక్సిడెంటల్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాళ్లు తినగా మిగిలిన బిర్యానీ, పుచ్చకాయ ముక్కలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. పోస్ట్మార్టం.. హిస్టోపాథాలజీ రిపోర్టులు వచ్చాకే వాళ్లు ఎలా చనిపోయారన్న దానిపై స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఈలోపే.. బిర్యానీ తిన్న మిగతా బంధువులు బాగానే ఉండడంతో.. పుచ్చకాయనే ఈ మరణాలకు కారణమై ఉంటుందనే చర్చ(సోషల్ మీడియా రచ్చ) మొదలైంది. నిపుణులు చెబుతోంది ఏంటంటే.. పుచ్చకాయకు త్వరగా కలుషితమయ్యే గుణం ఉంటుందని. పుచ్చకాయ వేసవిలో తినడానికి అత్యంత ఆరోగ్యకరమైన పండు. ఇది 90% పైగా నీటితో నిండి ఉండి శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది, విటమిన్ A, C, లైకోపిన్, పొటాషియం వంటి పోషకాలు అందిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది, చర్మం, కళ్లకు మేలు చేస్తుందని డైటీషియన్ డాక్టర్ అర్చనా బాత్రా అంటున్నారు. అయితే ముంబై కేసుపై ఆమె స్పందిస్తూ.. పుచ్చకాయలో సాల్మొనెల్లా, లిస్టీరియా, ఎస్టరేషియా కొలై లాంటి హానికరమైన పాథోజెన్లు చేరితే కలుషితం అవుతుందని.. అప్పుడు అది ఫుడ్ పాయిజనింగ్కు కారణమవుతుందని చెబుతున్నారు. ‘‘ఈ ప్రభావంతో తిన్న వ్యక్తులు తీవ్రమైన డీహైడ్రేషన్కు గురవుతారు. ఇన్ఫెక్షన్ సోకి అవయవాలపై ప్రభావం చూపవచ్చు. ట్రీట్మెంట్ ఆలస్యమైతే ప్రాణాల మీదకు రావొచ్చు’’ అని ఆమె అంటున్నారు. పుచ్చకాయలో అధిక నీరు, సహజ చక్కెర ఉండడం కూడా బ్యాక్టీరియా వేగంగా పెరగడానికి కారణమని ప్రముఖ న్యూట్రీషనిస్ట్ రుపాలి దత్తా అంటున్నారు. కొన్నిసార్లు పుచ్చకాయల్లో తీపి పెంచడానికి గ్లూకోజ్ నీరు లేదంటే చక్కెర నీరు ఇంజెక్ట్ చేస్తారని.. ఆ సమయంలోనూ కలుషితం కావొచ్చని.. అలాంటివి ప్రాణాలకు ముప్పు తేవొచ్చని ఆమె హెచ్చరిస్తున్నారు.అలాగని పుచ్చకాయ ప్రాణం తీస్తుందని కాదు. పండ్లు కలుషితం కావడం, సరిగా నిల్వ చేయకపోవడంతో కచ్చితంగా ప్రమాదకరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయను కొనేటప్పుడు జాగ్రత్తగా ఎంచుకోవాలి తొక్కతో సహా బాగా కడగాలి.. చాలా మంది ఈ జాగ్రత్త పాటించరుపుచ్చకాయను కోయడానికి శుభ్రమైన కత్తులు, బోర్డులు వాడాలి.కట్ చేసిన పుచ్చకాయ గది ఉష్ణోగ్రత వద్ద త్వరగా చెడిపోతుంది పుచ్చకాయను కట్ చేశాక 2 గంటలకు మించి బయట ఉంచకూడదుకట్ చేసి ఫ్రిజ్లో ఉంచిన పుచ్చకాయను తింటే ప్రమాదమేం కాదని న్యూట్రీషనిస్ట్ రుపాలి దత్తా చెబుతున్నారుఅయితే ఫ్రిజ్లో ఎక్కువ కాలం నిల్వ చేస్తే రుచి, పోషకాలు తగ్గిపోతాయి. కాబట్టి కట్ చేసి ఫ్రిజ్లో పెట్టిన పుచ్చకాయను రెండు, మూడు రోజులకు మించి ఉంచకూడదని ఆమె సూచిస్తున్నారు.. సరైన పుచ్చకాయను ఎంచుకోవడం ఎలా..?1.తొక్క రంగు చూసుకోవాలిగాఢమైన ఆకుపచ్చ రంగులో ఉండి, గీతలు స్పష్టంగా కనిపిస్తే అది పండిన పుచ్చకాయ.చాలా మెరిసే తొక్క ఉంటే ఇంకా పండలేదని అర్థం.2. ఫీల్డ్ స్పాట్ (పసుపు మచ్చ) చూడాలినేలపై పెరిగిన చోట పసుపు లేదంటే క్రీమ్ రంగు మచ్చ ఉంటుంది. అది గాఢంగా ఉంటే పుచ్చకాయ బాగా పండింది.తెల్లగా లేదంటే లేతగా ఉంటే ఇంకా పండలేదు.3. తట్టి చూడాలిపుచ్చకాయను తట్టి చూసినప్పుడు లోపల ఖాళీగా ఉన్నట్టుగా “తక్కువ శబ్దం” వస్తే అది పండింది.ఎక్కువగా ఘనంగా శబ్దం వస్తే ఇంకా పండలేదని అర్థం.4. బరువు చూసుకోవాలిపరిమాణానికి తగినంత బరువుగా ఉంటే అది రసంతో నిండిన పుచ్చకాయ.తేలికగా ఉంటే లోపల నీరు తక్కువగా ఉంటుంది.5. ఆకారం గమనించాలిగుండ్రంగా, సమంగా ఉన్న పుచ్చకాయలు సాధారణంగా తీపిగా ఉంటాయి.పొడవుగా లేదంటే అసమంగా ఉన్నవి తక్కువ తీపి కలిగి ఉండే అవకాశం ఉంది.పుచ్చకాయ మాత్రమే కాదు.. రాత్రి ఆలస్యంగా ఏ పండ్లు తినడం జీర్ణక్రియను కష్టతరం చేస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం లేదంటే మధ్యాహ్నా సమయంలోనే పండ్లు తినడం మంచిదని సూచిస్తున్నారు. -
గ్యాస్ కష్టాలకు చెక్.. 52 ఏళ్ల మహిళ అద్భుత ఆవిష్కరణ
పశ్చిమాసియా(ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా)యుద్ధం, ఆర్థిక ఉద్రిక్తతల కారణంగా భారతదేశంలో గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇటివల కాలంలో గ్యాస్ సిలిండర్లు కొరతగా మారటం, ధరల పెరుగుదలతో వంటగదుల్లో కష్టాలను సృష్టిస్తోంది. చాలా రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్లు కొరత అనేక రంగాలను దెబ్బతీస్తోంది. వంటగ్యాస్ లేకపోవడంతో సామాన్యులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో కొందరు ఈ ఎల్పీజీ గ్యాస్ కష్టాల రాకమునుపే సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని చేసిన ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి ఈ 52 ఏళ్ల మహిళ రూపొందించిన పొయ్యి. ఎవరామె..?, ఆమెకు ఇదెలా సాధ్యమైందంటే..ఒడిశాకు చెందిన 52 ఏళ్ల సుభ్రా రాణి మొహంతి ఆవిష్కరణ ఎల్పీజీ గ్యాస్ కష్టాలకు ఊరటగానూ సామాన్యుడి పాలిటి వరంగానూ మారింది. ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లాలోని తారదాపడ గ్రామానికి చెందిన సుభ్రా రాణి మొహంతి 2018లో వంట ఖర్చులు తగ్గేలా, గ్రామీణ మహిళలు, అట్టడగు వర్గాల కుటుంబాలకు మద్దతిచ్చేలా తక్కువ ఖర్చుతో బయోమాస్ వంటపొయ్యిని రూపొందించారామె. పొగరహితమైన, సులభంగా తీసుకెళ్లగలిగే ఈ పొయ్యికి ఆమె 'రాకెట్ చుల్హా' అని పేరు పెట్టారు. కొబ్బరి పీచు, కట్టెలు, రంపపు పొట్టు వంటి స్థానికంగా లభించే పదార్థాలతో రూపొందించారు. తక్కువ ఖర్చుతో కూడుకున్నది మాత్రమే కాకుండా ఇంధన వినియోగాన్ని దాదాపు 50 శాతం తగ్గిస్తుంది. మరీ ముఖ్యంగా, సాంప్రదాయ కట్టెల ఆధారిత పొయ్యిలతో పోలిస్తే దీని నుండి వెలువడే పొగ చాలా తక్కువగా ఉంటుంది. సుమారు దశాబ్దం క్రితం గుజరాత్లోని బరోడాకు చెందిన ఒక శాస్త్రవేత్త నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందిన తర్వాత, మొహంతి తన సంస్థ ఎస్ఎస్ అసోసియేట్స్ ద్వారా తన నివాసంలోనే బయోమాస్ పొయ్యిల తయారీని ప్రారంభించారు. ఈ యూనిట్ సహజ డ్రాఫ్ట్ (రాకెట్-రకం), ఫోర్స్డ్ డ్రాఫ్ట్ వంటి వంట పొయ్యిలు రెండింటినీ ఉత్పత్తి చేస్తున్నారామె.సహజ డ్రాఫ్ట్ పొయ్యి కింద నుండి గాలిని తీసుకుంటుంది, ఇది బయోమాస్కు ఆక్సిజన్ను అందించి, దాదాపు పూర్తి దహనాన్ని నిర్ధారిస్తుంది. దీని ఫలితంగా సాంప్రదాయ పొయ్యిలతో పోలిస్తే వంటచెరుకులో 50 శాతం ఆదా, వంట సమయం 50 శాతం తగ్గడమేగాక మారు 70 శాతం మాత్రమే తక్కువ పొగ వస్తుంది. ఇది ఉపయోగించడానికి సులభమైనది, కంటి చికాకు, శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుందని అని మొహంతి చెబుతున్నారు.ఫోర్స్డ్ డ్రాఫ్ట్ పొయ్యి, దహన గదిలోకి గాలిని సరఫరా చేయడానికి బ్లోయర్ను ఉపయోగిస్తుంది, ఇది సమర్థవంతమైన దహనాన్ని నిర్ధారిస్తుంది. ఇది ఎల్పిజితో పోలిస్తే సుమారు 90 శాతం తక్కువ పొగను ఉత్పత్తి చేస్తుంది, 60 శాతం వరకు ఇంధనాన్ని, వంట సమయాన్ని ఆదా చేస్తుంది.ఆమె భర్త సత్యబ్రత్ మొహంతి ఈ పొయ్యిల మార్కెటింగ్లో ఆమెకు సహకరిస్తారు. కలహండి జిల్లాలోని సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ITDA) పాఠశాలలు, వసతి గృహాల వినియోగం కోసం ఈ పొయ్యిలను సేకరించింది. అంతేగాదు ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలతో పాటు మరో 18 రాష్ట్రాల్లో, అలాగే నైజీరియా, దక్షిణాఫ్రికా, కెనడా వంటి విదేశాల్లో కూడా ఈ స్టవ్లను విక్రయిస్తున్నామని ఆ దంపతులు తెలిపారు. ఈ కృషికి గాను, సుభ్రారాణి మొహంతికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శిక్షా సమ్మాన్తో సత్కారం, అనేక ప్రశంసలు, అవార్డులు, గౌరవాలను అందుకున్నారు కూడా. ప్రస్తుతం సుభ్రా రాణి ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడిన నేపథ్యంలో ఈ పొయ్యిల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించేలా మహిళా స్వయం సహాయక సంఘాలతో (SHGs) కలిసి పనిచేస్తున్నారు. View this post on Instagram A post shared by MY Bhubaneswar (@mybhubaneswar) (చదవండి: Dementia: వంట చేయడంలో ఇంత మహత్తు ఉందా..? దెబ్బకు మతిమరుపు..) -
‘ఓపెన్ఏఐ’ సంచలనం.. రూ. 845 కోట్లతో అల్జీమర్స్పై యుద్ధం
లండన్: వృద్ధాప్యంలో మనిషిని జ్ఞాపకాలకు దూరం చేసే ‘అల్జీమర్స్’ వ్యాధికి ఇప్పటివరకూ సరైన చికిత్స అందుబాటులోకి రాలేదు. అయితే కృత్రిమ మేధ (ఏఐ) ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేయగలదని, అల్జీమర్స్ అంతానికి బాటలు వేస్తుందని ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రాణాంతక వ్యాధికి విరుగుడు కనిపెట్టేందుకు ఏకంగా వంద మిలియన్ డాలర్ల(రూ. 845 కోట్లు) భారీ విరాళాన్ని ప్రకటించి, వైద్యరంగంలో సరికొత్త ఆశలు రేకెత్తించారు.సరికొత్త ఆవిష్కరణలకు ఏఐ తోడ్పాటుఅల్జీమర్స్ వ్యాధికి కారణాలు, వ్యాధి నిర్ధారణ, చికిత్స విధానాలను వేగవంతం చేయడంలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషిస్తుందని ‘టుడే’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆల్ట్మాన్ స్పష్టం చేశారు. మెడికల్ హిస్టరీలోని అత్యంత క్లిష్టమైన సమస్యల్లో అల్జీమర్స్ ఒకటని, సంక్లిష్టమైన డేటాను విశ్లేషించి ఖచ్చితమైన సమాచారాన్ని అందించడంలో ఏఐ అద్భుతాలు చేయగలదని ఆయన తెలిపారు. ఈ వ్యాధికి సరైన మందును కనిపెట్టే దిశగా ప్రపంచాన్ని మరింత వేగంగా నడిపించే సత్తా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఉందన్నారు.ఆరు సంస్థలతో భాగస్వామ్యంకేవలం మాటలకే పరిమితం కాకుండా, అల్జీమర్స్ పరిశోధనలను ముమ్మరం చేసేందుకు ఓపెన్ఏఐ ఫౌండేషన్ తరపున $100 మిలియన్ల నిధులను ఆల్ట్మాన్ కేటాయించారు. ఇందుకోసం ప్రపంచ స్థాయిలోని ఆరు ప్రముఖ పరిశోధనా సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నారు. కొత్త డేటాను సృష్టించడం, సరికొత్త ఔషధాలను డిజైన్ చేయడం, అలాగే ఇప్పటికే ఆమోదం పొందిన మందులను ఈ వ్యాధిపై ఎలా ప్రయోగించవచ్చో తెలుసుకోవడం ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశం. ఈ నిర్ణయం లక్షలాది బాధిత కుటుంబాలకు ఒక గొప్ప ఊరటనిస్తుందని అల్జీమర్స్ అసోసియేషన్ ప్రశంసించింది.భారత్లోనూ తీవ్ర ప్రభావంప్రపంచవ్యాప్తంగా వృద్ధులను పట్టిపీడిస్తున్న డిమెన్షియా కేసుల్లో 60-70 శాతం అల్జీమర్స్ వల్లే నమోదవుతున్నాయి. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారిలో ఈ ముప్పు అధికం. ఒక్క భారతదేశంలోనే దాదాపు 8.8 మిలియన్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని, అమెరికాలో 7 మిలియన్ల మంది బాధితులు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. మెదడులోని కణాలను నాశనం చేస్తూ, ప్రాణాలను బలిగొనే ఈ మహమ్మారికి చెక్ పెట్టేందుకు, ఏఐ సాంకేతికతతో జరుగుతున్న ఈ నూతన పరిశోధనలు మానవాళి భవిష్యత్తునే మార్చేయబోతున్నాయని వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ‘హార్ముజ్’ పేరెత్తాడని.. పాక్ యువకునికి నరకం! -
వంట చేయడంలో ఇంత మహత్తు ఉందా..?
ఇంట్లో స్వయంగా వండుకునే వృద్ధుల్లో మతిమరుపు సమస్యలు (డిమెన్షియా) వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని జపాన్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. వంట చేసేటప్పుడు కూరగాయలు తరగడం, సరైన మోతాదులో ఉప్పు, కారం, మసాలాలు వేయడం, వంటకాలకు తగ్గట్టుగా కావాల్సిన పదార్థాలను సరైన సమయానికి జోడించడం వంటి మల్టీ టాస్కింగ్ ఉంటుందని.. ఇది మెదడుకు వ్యాయామంలా పనిచేసి దాన్ని చురుగ్గా ఉంచుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.మెరుగైన మెదడు పనితీరు..: జపాన్ జెరోంటాలాజికల్ ఎవాల్యుయేషన్ స్టడీలో పాలుపంచుకున్న 65 ఏళ్లు పైబడిన వారిలో దాదాపు 11,000 మంది ఆరోగ్య సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. ఎంత తరచూ వారు ఇంట్లో వంట చేస్తారు? వంట సామర్థ్యంపై వారికున్న అంచనాలు, ఎంత మందికి మతిమరుపు వచ్చింది వంటి సమాచారాన్ని సేకరించారు. ఆ వివరాలను విశ్లేషించగా ఏమాత్రం వంట చేయని వృద్ధులతో పోలిస్తే రోజూ గరిట తిప్పే వృద్ధుల్లో డిమెన్షియా వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని గుర్తించారు. వంట నైపుణ్యం మెరుగైన మెదడు పనితీరుకు సంకేతమని ఈ అధ్యయనం తేల్చింది.జీవనశైలి మార్పుల ద్వారా..: వారానికి కనీసం ఒక్కసారైనా ఇంట్లో వంట చేసే వారిలో డిమెన్షియా రిస్క్ తగ్గినట్లు అధ్యయనాలు వెల్లడించాయి. క్రమం తప్పకుండా వంట చేసే పురుషుల్లో 23%, స్త్రీలలో 27% తక్కువ ప్రమాదం ఉండగా.. కొత్తగా వంట చేయడం ప్రారంభించిన వారిలో ఈ సమస్య వచ్చే అవకాశాలు 67% తక్కువగా ఉన్నాయి. ‘2020 లాన్సెట్ నివేదిక ప్రకారం ఆహారం, శారీరక శ్రమ వంటి జీవనశైలి మార్పుల ద్వారా సుమారు 40% డిమెన్షియా కేసులను నివారించవచ్చని తేలింది. అందుకే ఇంటి వంటపై దృష్టి సారించాం’ అని అధ్యయన సహ రచయిత, టోక్యో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ యుకాకో తాని చెప్పారు. అయితే వంట చేయడం ద్వారానే మతిమరుపు ముప్పు తగ్గుతుందని ఈ అధ్యయనం కచ్చితంగా నిరూపించలేదు. ఇది కేవలం ఇంటి వంటకు, మతిమరుపు ముప్పు తగ్గడానికి మధ్య ఉన్న సంబంధాన్ని మాత్రమే వెలుగులోకి తెచ్చింది. అంటే వంట చేసే అలవాటు ఉన్న వారిలో ఈ రిస్క్ తక్కువగా ఉందని మాత్రమే గుర్తించింది. పైగా ఈ పరిశోధన కేవలం జపాన్కు చెందిన వృద్ధులపైనే నిర్వహించారు. ‘మతిమరుపు వ్యాధి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ప్రజారోగ్య సమస్యగా మారుతోంది. ఖరీదైన చికిత్సల కంటే వంట చేయడం వంటి చిన్నచిన్న మార్పులు అందరికీ అందుబాటులో ఉండే పరిష్కారాలు, మెదడు పనితీరును కాపాడుకోవడం ఈ అలవాట్ల ముఖ్య ఉద్దేశం’ అని యుకాకో తాని వివరించారు.మెదడుకు వ్యాయామం..ప్రణాళిక: ఏం వండాలి, ఎలా వండాలి అని ప్రణాళిక రచించడం.ఎంపిక: సరైన పదార్థాలను ఎంచుకోవడం.పద్ధతి: వంటకాల తయారీ పద్ధతిని పాటించడం.ప్రయోజనాలు..పోషకాహారం: మంచి డైట్ లభిస్తుంది.శారీరక శ్రమ: వంట చేసేటప్పుడు కదలడం వల్ల వ్యాయామం అవుతుంది.మానసిక శక్తి: ఆలోచించి వండటం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది.నేషనల్ డెస్క్(చదవండి: విమానం గాల్లో ఉండగానే ప్రసవం..! అయితే..) -
విమానం గాల్లో ఉండగానే ప్రసవం..!
విమానం గాల్లో ఉండగానే ప్రసవించడం అత్యంత అరుదుగా జరిగే సంఘటన. ఇలాంటి పరిస్థితిని అత్యంత అరుదైన వైద్య పరిస్థితిగా పేర్కొంటారు కూడా. అదృష్టవశాత్తు ఆ విమానంలో ఒక డాక్టర్, ఇద్దరు నర్సులు ఉండటం వల్ల ఆ మహిళకు ఎలాంటి ఇబ్బంది పడకుండా విజయవంతంగా ప్రసవించింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..ఈ అరుదైన ఘటన డెల్టా ఫ్లైట్ 478 అట్లాంటా నుంచి పోర్ట్ల్యాండ్కు ప్రయాణిస్తుండగా చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి పోర్ట్ల్యాండ్కు ఐదు గంటల పాటు సాగిన విమాన ప్రయాణంలో ఒక మహిళ గాలిలోనే ప్రసవించింది. రాత్రి 9:30 గంటల ప్రాంతంలో వచ్చిన ప్రాథమిక అత్యవసర కాల్ ప్రకారం, సదరు మహిళ సుమారు 35 నిమిషాలుగా ప్రసవ నొప్పులతో బాధపడుతున్నట్లు తెలిసింది. దాంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వెంటనే అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఆ విమానంలో ఇద్దరు పైలట్లు, నలుగురు ఫ్లైట్ అటెండెంట్లతో సహా మొత్తం 153 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తూ, ప్రయాణికులలో ఒక డాక్టర్, ఇద్దరు నర్సులు ఉన్నారు. వారు వెంటనే రంగంలోకి దిగి, విమానం ల్యాండ్ కావడానికి ముందే శిశువును సురక్షితంగా ప్రసవింపజేయడానికి ఫ్లైట్ అటెండెంట్లతో కలిసి పనిచేశారు. ఆ తర్వాత శిశువు బొడ్డు తాడుని కట్ చేసి పాపకు చుట్టగానే విమానం కిందకు దిగుతుంది. నిజానికి వాళ్లు ఎలాంటి సీటు బెల్టులు పెట్టుకోకముందే కిందకు ల్యాండ్ అవుతోంది విమానం. వాళ్లు సీటును పట్టుకుని నిల్చున్నారు. ఆ తర్వాత పాపను తల్లికి తిరిగి ఇచ్చేసి విమానాన్ని రన్వేపై ముందుకు పోనిచ్చారు. దాంతో విమానంలో ఉన్నవారంతా ఆ తల్లిని చూసి హమ్మయ్యా..! తల్లిబిడ్డ సురక్షితంగా ఉన్నారంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా విమానం అత్యవసరంగా ల్యాండ్ కావడానికి 30 నిమిషాల ముందే చకచక జరిగిపోయింది. కాగా, తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని, విమానంలోనే పాప పుట్టిందని సదరు విమానాయన సంస్థ ప్రకటించింది.(చదవండి: 144 ఏళ్ల క్రితం కేదార్నాథ్ ఆలయం ఎలా ఉండేదో తెలుసా..!) -
'లెగసీ' అంటే..? ఎలా పెంపొందించుకోవాలి..
'లెగసీ' (Legacy) అంటే మీరు చనిపోయిన తర్వాత మీ పేరు మీద కట్టే విగ్రహాలు లేదా భవనాలు కాదు.. మీరు ఈ లోకంలో లేనప్పుడు కూడా మీ ఆలోచనలు, మీ విలువలు ఎంతమంది జీవితాలను వెలిగిస్తున్నాయి అనేదే అసలైన వారసత్వం.బ్రో, ప్రతి మనిషి ఈ భూమి మీద ఒక ముద్ర వేయడానికే పుడతాడు. కొందరు ఆ ముద్రను ఇసుక మీద వేస్తారు—అది కొద్దిసేపటికే చెరిగిపోతుంది. మరికొందరు ఆ ముద్రను రాతి మీద వేస్తారు—అది తరతరాలు నిలిచిపోతుంది. లెగసీ అనేది ఒక రోజులో నిర్మించేది కాదు, అది మీరు ప్రతిరోజూ బ్రతికే విధానం."నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రపంచం నన్ను ఎలా గుర్తుంచుకోవాలి?" అనే ప్రశ్నకు సమాధానమే మీ లెగసీ.ప్రభావం vs విజయం (Impact vs Success)విజయం (Success) అనేది మీ గురించి; ప్రభావం (Impact) అనేది ఇతరుల గురించి.మీరు కోట్లు సంపాదించవచ్చు, పెద్ద హోదాలో ఉండవచ్చు.. అది మీ సక్సెస్. కానీ మీ వల్ల ఒక్క వ్యక్తి అయినా తన జీవితాన్ని మార్చుకున్నాడా? మీ మాట ఒక్కరికైనా ధైర్యాన్ని ఇచ్చిందా? అది ఇంపాక్ట్. నిజమైన లెగసీ ఎప్పుడూ 'ఇతరులకు సేవ చేయడం' (Service to Others) అనే పునాది మీద నిర్మించబడుతుంది.విలువలే మీ ఆస్తి (Values as Your Asset)డబ్బు, ఆస్తులు కరిగిపోవచ్చు, కానీ మీ'Integrity' (నిజాయితీ) తరతరాలు మాట్లాడుకుంటుంది.మీరు కష్టకాలంలో కూడా విలువలు వదులుకోకుండా ఉన్నారా? మీ మాట మీద మీరు నిలబడ్డారా? మీ పిల్లలకు లేదా మీ శిష్యులకు మీరు ఇచ్చే గొప్ప ఆస్తి బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, మీరు నేర్పించిన క్రమశిక్షణ, సంస్కారం. మీ విలువలే మీ అడ్రస్ కావాలి.మెంటర్ షిప్: వెలుగును పంచడంటమీకు తెలిసిన జ్ఞానాన్ని మీతోనే ఉంచుకుంటే, అది మీతోనే అంతమైపోతుంది.మీ అనుభవాలను, మీ పాఠాలను ఇతరులకు నేర్పించండి. ఒక మెంటర్గా మారండి. మీరు లేకపోయినా మీ ఆలోచనలతో పని చేసే ఒక టీమ్ని లేదా ఒక వ్యవస్థను (System) తయారు చేయండి. మీరు నాటిన చెట్టు నీడలో మీరు కూర్చోలేకపోవచ్చు, కానీ ఆ నీడను అనుభవించే తర్వాతి తరం మిమ్మల్ని గుర్తుంచుకుంటుంది.సృజనాత్మక ముద్ర (Creative Contribution)మీరు రాసిన పుస్తకం, మీరు చేసిన ప్రసంగం, మీరు నిర్మించిన సంస్థ లేదా మీరు చేసిన ఒక మంచి పని—ఇవి మీ డిజిటల్, ఫిజికల్ లెగసీలు. మీ వృత్తిలో ఒక కొత్త ఒరవడిని సృష్టించండి. మీ ప్రతి పనిలో ఒక 'ఎక్సలెన్స్' (Excellence) ఉండాలి. "ఇది ఫలానా వ్యక్తి చేశాడు" అని జనం చెప్పుకునేలా మీ పనితీరు ఉండాలి.ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? (The Urgency of Legacy)లెగసీ అనేది ముసలితనం వచ్చినప్పుడు ఆలోచించేది కాదు బ్రో. అది ఈ క్షణమే మొదలవ్వాలి. మీరు ఈరోజు ఒకరితో ఎలా మాట్లాడారు? ఒక గొడవను ఎలా పరిష్కరించారు? మీ సమయాన్ని దేనికి ఖర్చు చేశారు? ఇవన్నీ కలిసి మీ లెగసీని నిర్మిస్తాయి. ప్రతిరోజూ ఒక 'లెజెండ్' లా బ్రతకండి.The Takeawayబ్రో,ఇది నీ జీవితానికి ఒక బ్లూప్రింట్. నువ్వు ఈ భూమి మీద ఒక సాధారణ మనిషిగా మిగిలిపోవడానికి పుట్టలేదు. నువ్వు ఒక అసాధారణమైన వ్యక్తిత్వం ఉన్న వాడివి మాత్రమే కాదు, నువ్వు ఒక 'ఆదర్శం'.నీ ప్రయాణం'Beyond'దశకు చేరుకుంది. ఇకపై నువ్వు కేవలం ఒక వ్యక్తివి కాదు.. నువ్వు ఒక సందేశానివి. నీ జీవితమే నీ లెగసీ కావాలి.గుర్తుంచుకో.."నువ్వు పుట్టినప్పుడు నువ్వు ఏడ్చావు, లోకం నవ్వింది. నువ్వు మరణించినప్పుడు లోకం ఏడవాలి, నువ్వు చిరునవ్వుతో వెళ్ళిపోవాలి. అప్పుడే నువ్వు అసలైన లెగసీని నిర్మించినట్టు!"వారసత్వ నిర్ణయంమీ అంతిమ యాత్రలో (Funeral) జనాలు మీ గురించి ఏ మూడు మంచి మాటలు చెప్పుకోవాలని మీరు కోరుకుంటున్నారు? (వాటిని ఇప్పుడే డైరీలో రాసుకోండి).ఆ మూడు మాటలకు తగ్గట్టుగా మీ ప్రవర్తన ఈరోజు ఉందా? లేకపోతే ఏం మార్చుకోవాలో ఆలోచించండి.ఈ రోజే కనీసం ఒక్క వ్యక్తికి ఏదైనా ఒక మంచి విషయాన్ని నేర్పించండి. మీ లెగసీని ఇక్కడే మొదలుపెట్టండి.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066psy.vishesh@gmail.com(చదవండి: గ్లోబల్ మైండ్సెట్ అంటే..? ఎలా పెంపొందించుకోవాలి..) -
సూక్ష్మంలో మోక్షం..నానో ఎరువులు!
పశ్చిమాసియా యుద్ధం ఇచ్చిన షాక్తో దేశంలో రసాయనిక ఎరువులకు తీవ్ర కొరత వచ్చి పడింది. యూరియా, డీఏపీ, ఫాస్ఫరస్ వంటి ఎరువులకు గత 60 ఏళ్లుగా మన రైతులు అలవాటైపోయారు. ప్రస్తుత సంక్షోభ కాలంలో ఈ అలవాటు మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. రసాయనిక ఎరువులకు బదులుగా సులువుగా వాడదగిన ఎరువులేవైనా ఉన్నాయా? అంటే.. తప్పకుండా ఉన్నాయి. అవే ‘నానో ఎరువుల’ని ‘ఇఫ్కో’ ఘంటాపథంగా చెబుతున్నది. నానో ఎరువులపై రైతులు ఇప్పటికీ, ఎప్పటికీ, పూర్తిగా ఆధారపడొచ్చని ‘ఇఫ్కో’ ఘంటాపథంగా చెబుతోంది. నానో ఎరువులను వాడుతున్న రైతుల అనుభవాలు కూడా ప్రోత్సాహకరంగానే ఉన్నాయంటున్నారు. సబ్సిడీ లేని సహకార ఎరువులు కావటంతో ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. ‘తక్షణ ఎరువుల కొరతను అధిగమించేందుకు నానో ఎరువులే ఉత్తమ మార్గం. దీర్ఘకాలంలో ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లోకి మారి పోవటమే ఉత్తమం..’ అని నిపుణులు నొక్కి చెబుతున్నారు. ఇంతకీ నానో ఎరువులంటే ఏమిటి? ఏయే పంటలు/తోటలకు ఎలా వాడాలి? రైతుల అనుభవాలేమిటి? పరిశీలిద్దాం.మన దేశంలో రైతులు ఏర్పాటు చేసుకున్న సహకార దిగ్గజ సంస్థల్లో ఒకటి ‘ఇఫ్కో’ (ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్. ఇఫ్కో దేశీయంగా తయారు చేస్తున్న నానో యూరియా, నానో డీఏపీ తదితర నానో ద్రవ రూప ఎరువులు ప్రపంచంలోనే అరుదైనవి. వీటిని గత ఐదేళ్లుగా ఇఫ్కో రైతులకు విక్రయిస్తోంది. సాంప్రదాయక గుళికల యూరియా, డీఏపీకి బదులుగా.. ద్రవరూపంలో ఉండే నానో యూరియా, నానో డీఏపీ, నానో పొటాష్ ఎరువులు వాడినప్పుడు ఎటువంటి దిగుబడి నష్టం లేదని, అధిక దిగుబడులే వస్తున్నాయని ఇఫ్కో క్షేత్రప్రయోగాల ద్వారా నిరూపించింది. రైతులు కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నానో ఎరువులు వల్ల దిగుబడి తగ్గుతుందన్న దిగుల్లేదు, ఖర్చు తక్కువ, నానో ఎరువులు దొరకవన్న భయం లేదు. నేల, నీరు, గాలి కాలుష్యం కూడా ఉండదని ఇఫ్కో చెబుతోంది. అర లీటరు సీసా ఒక బస్తాకు సమానం500 మి.లీ. నానో ద్రవ యూరియా సీసా ఒక బస్తా సాంప్రదాయ గుళికల యూరియాతో సమానం. ఎరువుల ఉత్పత్తిలో వాడే సహజ వాయువు విదేశీ దిగుమతులు తగ్గినా, నానో ఎరువుల రూపంలో రైతులకు అవసరమైన ఎరువులను సరఫరా చేసే సామర్థ్యం ఉందని ఇఫ్కో స్పష్టం చేసింది. నానో ఎరువుల గురించి రైతులకు నచ్చజెప్పే లక్ష్యంతో 19 రాష్ట్రాల్లో ఇఫ్కో తాజాగా భారీ ప్రచారోద్యమం చేపట్టింది. నానో ఎరువుల ప్రత్యేకతేంటి?గుళికల ఎరువులు: చిన్న గుళికల రూపంలో ఉండే యూరియా, డీఏపీ, పొటాష్ వంటి సాధారణ రసాయనిక ఎరువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సహజ వాయువుతో తయారు చేస్తారు. వీటిని భూమిలో వేస్తే, వేసిన ఒకటి, రెండు రోజుల్లోనే ఆకులు ముదురు ఆకుపచ్చగా మారతాయి. కానీ, ఎక్కువగా పెరిగి పంట పడిపోతుంది. ఎక్కువగా చీడపీడలు ఆశిస్తాయి. 30–40% పోషకాలను మాత్రమే మొక్కలు వాడుకోగలుగుతాయి. నానో ఎరువులు: నానో యూరియా ప్లస్, నానో డీఏపీ, నానో పొటాష్ తదితర నానో ఎరువులు ద్రవ రూపంలో ఉంటాయి. ఇఫ్కో దేశీయ పరిజ్ఞానంతో తయారు చేస్తోంది. తక్కువ ఖర్చు. విరివిగా దొరుకుతాయి. వీటిలో పోషకాల కణం చాలా చిన్నగా 20–50 నానో మీటర్ల సైజులో ఉంటాయి. నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేస్తారు. ఆకులు ఈ పోషకాలను 80–90% మేరకు త్వరగా ఉపయోగించుకోగలుగుతాయి. మామూలు స్ప్రేయర్లు, డ్రోన్లతో చల్లితే పంటలు వెంటనే ముదురు ఆకుపచ్చ రంగులోకి మారవు. కానీ, బలంగా పెరుగుతాయి. రొట్ట ఎక్కువగా పెరగదు. గాలులకు పడిపోదు. తాలు ఉండదు. దిగుబడి పెరుగుతుంది. చీడపీడల సమస్య తగ్గుతుంది. శాస్త్రవేత్తల ఆమోదం ప్రపంచ ప్రమాణాల ప్రకారం సురక్షితమైనవిగా గుర్తింపు పొందిన నానో ఎరువులు ఇతర జీవరాశికి సురక్షితమైనవి. కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ), నానో అగ్రి ఇన్పుట్ ప్రొడక్ట్స్–2020 మార్గదర్శకాలకు అనుగుణంగా తయారుచేసినవని ఇఫ్కో తెలిపింది. నానో ఎరువుల సామర్థ్యంపై శాస్త్రీయ ధ్రువీకరణ కోసం వ్యవసాయ పరిశోధనా సంస్థల్లో నిర్వహించిన పరీక్షలు విజయవంతమయ్యాయని ఇఫ్కో అధికారులు ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. హైదరాబాద్లోని కేంద్రీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–క్రీడ) వంటి అగ్రగామి వ్యవసాయ పరిశోధనా సంస్థల్లో విస్తృతమైన క్షేత్ర పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ అనుబంధ వ్యవసాయ కళాశాలల్లో జరుగుతున్న క్షేత్ర ప్రయోగాల్లో అత్యంత సంతృప్తికరంగా ఫలితాలు వస్తున్నాయని ఇఫ్కో అధికారులు ప్రకటించారు. ప్రభుత్వభాగస్వామ్యం, జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ, శాస్త్రవేత్తలు, తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ, ఐసీఏఆర్ పరిశో ధన సంస్థలు నానో ఎరువులపై విస్తృత ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇది నానో సాంకేతికతపై రైతుల్లో విశ్వాసాన్ని పెంచిందని చెబుతున్నారు. విస్తృతంగా ప్రదర్శనా క్షేత్రాలునానో ఎరువులపై రైతుల సందేహాలను నివృత్తి చేయటానికి, పంట దిగుబడిపై నానో ఎరువుల సానుకూల ప్రభావాన్ని కళ్ళారా చూపించడానికి ఇఫ్కో విస్తృతంగా ప్రదర్శనా క్షేత్రాలను నిర్వహిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తోంది. నానో ఎరువుల వ్యాప్తికి ఈ క్షేత్రాలు బలమైన పునాది వేశాయి. గ్రామీణ యువతకు, మహిళలకు డ్రోన్లను అందించి, ఎకరానికి రూ. 300 ఖర్చుతో డ్రోన్లతో నానో ఎరువుల పిచికారీ జరుగుతోంది. పిచికారీ సమయం, శ్రమ తగ్గటంతో ఈ సాంకేతికతను రైతులు వేగంగా స్వీకరిస్తున్నారని ఇఫ్కో చెబుతోంది. నానో ఎరువుల వాడకం వేగంగా పెరుగుతోందిసంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా ఇఫ్కో ప్రవేశపెట్టిన నానో యూరియా, నానో డీఏపీ ఎరువుల వాడకం వేగంగా పెరుగుతోంది. రైతులు అనూహ్య వేగంతో అందిపుచ్చుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2025–26లో వానాకాలం, యాసంగి కలిపి 10.46 లక్షల సీసాల నానో ఎరువులను రైతులు వాడటమే ఇందుకు నిదర్శనం. విత్తనం వేసే ముందు లేదా మొక్కలు నాటే దశలో సంప్రదాయ గుళికల యూరియా, డీఏపీలను వాడుకోవాలి. పంట మొక్కలకు ఆకులు పెరిగినాక రెండో విడత, మూడో విడత వేసే గుళికల ఎరువులకు బదులుగా నానో యూరియా, నానో డీఏపీలను నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. గుళికల రూపంలో ఉండే సంప్రదాయ యూరియా, డీఏపీ, పొటాష్ వంటి రసాయనిక ఎరువుల మోతాదును 25 నుంచి 50% వరకు తగ్గించి, పంట కొన్ని రోజులు ఎదిగిన తర్వాత నానో యూరియా, నానో డీఏపీ వంటి ద్రవ రూప ఎరువులను రెండు సార్లు పిచికారీ చేస్తున్న చాలా మంది రైతులు ఖర్చు తగ్గించుకుంటూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. అయితే, సంప్రదాయ గుళికల యూరియా, డీఏపీ ఎరువులను పూర్తిగా మానేసి.. కేవలం నానో ఎరువులు, జీవన ఎరువులు, సముద్రపు నాచు ద్రావణాలను కలిపి వాడి పంటలు పండిస్తూ మంచి దిగుబడులు పొందుతున్న రైతులు కూడా కొందరు ఉన్నారు. నానో ఎరువులు వాడితే ఎకరాకు సుమారు రూ. 2 వేల వరకు ఖర్చు తగ్గుతుందని, 8% వరకు దిగుబడి పెరుగుతుందని మా క్షేత్ర ప్రయోగాల్లో తేలింది. – ఎం.ఆర్. కృపాశంకర్, ఇఫ్కో, తెలంగాణ స్టేట్ మార్కెటింగ్ మేనేజర్ఊళ్లో నాదే అత్యధిక దిగుబడి!వరి పంటకు అడుగున కొద్దిగా డీఏపీ మాత్రమే వాడాను. మిగతా పోషకాలకు బస్తాలు వేయకుండా.. నానో యూరియా, నానో డీఏపీ, సాగరిక కలిపి డ్రోన్ ద్వారా పిచికారీ చేయించాను. మా చుట్టుపక్కల పొలాలన్నింటిలో ఎండాకు తెగులు వచ్చినా, నా పొలానికి అస్సలు రాలేదు. పంట బలంగా నిలబడింది, గింజ కూడా బరువుగా, నాణ్యంగా ఉంది. ఈ కొత్త నానో ఎరువులతో ఎకరానికి 33 క్వింటాళ్లు వరి ధాన్యం దిగుబడి వచ్చింది. మా ఊళ్లో నాదే అత్యధిక దిగుబడి!.– ఎం. కృష్ణార్జున రావు (90320 37954), మల్లుపల్లి, ఖమ్మం జిల్లాపత్తి దిగుబడి పెరిగింది!నేను పంటలతో పాటు పశువులను పెంచుకుంటూ సమగ్ర వ్యవసాయం చేస్తున్నా. పత్తి సాగులో ఖర్చులు తగ్గించుకోవాలని నానో ఎరువులు వాడటం మొదలుపెట్టా. సాధారణ ఎరువులు సగం తగ్గించి, వాటి బదులు నానో యూరియా, నానో డీఏపీ పిచికారీ చేశా. ఆశ్చర్యం ఏంటంటే, ఎరువుల ఖర్చు తగ్గి, దిగుబడి పెరిగింది! పక్క పొలంలో ఎకరానికి పత్తి 8.5 క్వింటాళ్లు వస్తే, నా పొలంలో 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. నానో ఎరువులతో రైతుకు లాభమే.– మల్లారావు (99597 13273), రవిపహాడ్, సూర్యాపేట జిల్లాపూర్తిగా నానో ఎరువులే వాడుతున్నా..గత మూడేళ్లుగా నేను ఒక్క బస్తా గుళికల యూరియా, డీఏపీ కూడా వాడలేదు. పూర్తిగా నానో ఎరువులపైనే ఆధారపడుతున్నా. నానో డీఏపీతో విత్తనశుద్ధి చేస్తా, ఆ తర్వాత మూడు సార్లు నానో యూరియా పిచికారీ చేస్తా. దీనికి అదనంగా జీవ ఎరువులను కూడా వాడుతున్నా. ఈ విధానంతో పత్తి, వరి, మొక్కజొన్నలో నాణ్యమైన దిగుబడి సాధిస్తున్నా. నా పొలంలో వచ్చిన ఫలితాలు చూసి, మా ఊరి రైతులు చాలా మంది నానో ఎరువులు వాడటం మొదలుపెట్టారు.– బోయపాటి నరసింహారావు (88970 07608), అనంతారం, వరంగల్ జిల్లానానో ఎరువులతో కొత్త మార్పు సోయా, పత్తి పంటల్లో రెండు సంవత్సరాలుగా నానో ఎరువులు వాడుతున్నా. ముందు బస్తాల ఎరువులు ఎక్కువ వేస్తేనే పంట బాగుంటుందని అనుకునేవాళ్లం. కానీ నానో ఎరువులు వేసాక మొక్కలు ఇంకా ఆరోగ్యంగా, సమానంగా పెరుగుతున్నాయి. పత్తిలో కాయ పరిమాణం పెరగడం, సోయాలో పూత సమానంగా వస్తోంది. స్ప్రే చేసిన తర్వాత మొక్కల పెరుగుదల బాగుంది. పెట్టుబడి తగ్గినా పంట నాణ్యత మాత్రం బాగుంది. నానో ఎరువులతో కొత్త మార్పు వచ్చింది.– ఉగ్గె రాము (90005 91246), చందా(టీ), ఆదిలాబాద్ రూరల్ మండలం, ఆదిలాబాద్ జిల్లా -
ఊరు మెచ్చిన దీదీ
పెద్ద చదువు చదువుకోలేకపోయినా, ఇంటి నాలుగు గోడలకే పరిమితం కానక్కర్లేదు. ఇల్లు దాటి బయటికి వస్తే సమాజం అనే విశ్వ విద్యాలయంలో ఎన్నో చదువుకోవచ్చు...ఈ ఎరుకతో ఇల్లు దాటి బయటికి వచ్చిన సామాన్య గృహిణి, పెద్దగా చదువుకోని చందా బాబర్(మధ్యప్రదేశ్) ఇప్పుడు ఎంతోమంది గ్రామీణ మహిళలకు స్ఫూర్తిని ఇస్తోంది. మధ్యప్రదేశ్ ఝుబువా జిల్లాలోని గుణవాడ్ గ్రామంలో మధ్యాహ్నం వేళ కొద్దిమంది మహిళలు వేపచెట్టు కింద కూర్చొని తమ సమస్యల గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ చర్చల్లో కీలక మహిళ... చందా బాబర్. తమకు ఏ సమస్యలు వచ్చినా గ్రామస్థులు మొదట చెప్పుకునేది ఆమెకే. ‘ప్రజలు ఎలాంటి సమస్యలతో వచ్చినా నేను వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను’ అంటుంది చందా. ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదివిన చందాకు చిన్న వయసులోనే వివాహం జరిగింది. చాలా సంవత్సరాలు ఇల్లే ప్రపంచంగా మారింది. ఇల్లు దాటి ఏదైనా చేయాలనే కోరిక ఆమెలో బలంగా ఉండేది.ఆ ప్రశ్నతో తొలి అడుగుఇప్పుడు చందా బాబర్ ట్రాన్స్ఫామ్ రూరల్ ఇండియా (టీఆర్ఐ) ద్వారా శిక్షణ పొందిన ‘పంచాయత్ బద్లాన్ దీదీ’గా పిలిచే క్షేత్రస్థాయి గ్రామీణ కార్యకర్త. గ్రామీణ మహిళలు స్థానిక పరిపాలన వ్యవస్థలతో మమేకమవడానికి, వారిలో తగిన అవగాహన, ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి ఉపయోగపడే టీఆర్ఐ సంస్థ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న చందా... ‘ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎందుకు చేరడం లేదు?’ అని ప్రశ్నించింది. ఆమెకు ఏ సమాధానం అందిందో తెలియదుగానీ, సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలనే సంకల్పంతో ఆనాటి నుంచి ఎన్నో వర్క్షాపులకు హాజరైంది. ఎన్నో విషయాలపై ఎంతో అవగాహన పెంచుకుంది. ‘పంచాయత్ బద్లావ్ దీదీ’ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడం ఆమెను మరో మెట్టు పైకి ఎక్కించింది. ‘పంచాయత్ బద్లావ్ దీదీ’ హోదాలో ఎవరికైనా వైద్య అవసరాలు ఉంటే వారికి అన్ని రకాలుగా సహాయంగా నిలుస్తోంది. ‘ఈ ప్రభుత్వ పథకాలు మీకు అందుబాటులో ఉన్నాయి. సద్వినియోగం చేసుకోండి’ అని ప్రచారం చేస్తోంది.‘మా గ్రామంలో చందా మార్పు తీసుకురావాలనుకుంటోంది. మా దగ్గర గతంలో లేనిది మాకు ఇచ్చింది.. అది ప్రశ్నలు అడిగే ధైర్యం’ అని చందాను ప్రశంసిస్తున్నారు గ్రామస్థులు.ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆరోగ్య సమస్యల వరకు... ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ చేయడం నుంచి ప్రజాచైతన్యం వరకు ‘పంచాయత్ బద్లావ్ దీదీ’ హోదాలో ఎన్నో మంచి పనులు చేస్తోంది. -
భారతదేశాన్ని ఫొటో తీశాడు
రఘురాయ్. ఈ పేరు చెప్పగానే ఢిల్లీ వీధుల్లో తిరిగే అంధ భిక్షువు గుర్తుకొస్తాడు. భోపాల్ విషవాయువులకు మరణించిన పసికందు తెరచిన రెప్పలను మూస్తున్న తల్లి చేయి గుర్తుకు వస్తుంది. బంగ్లాదేశ్ యుద్ధంలో ఒక తల్లి చెంప వెంట కారుతున్న అశ్రు బిందువు....మదర్ థెరిసా కైమోడ్పు చేతులు...మనవళ్లతో ఆడుతున్న ఇందిరా గాంధీ ఉల్లాసం... వై.ఎస్.రాజశేఖర రెడ్డి పాదయాత్ర... అతను దేశాన్ని తన కెమెరాలో నిక్షిప్తం చేశాడు. ఛాయా చిత్రంగా శాశ్వతం చేశాడు. అతనిపై నివాళి వ్యాసం.‘నా ఎదుట గొప్ప ఘటన జరిగినప్పుడు నా చేతిలో కెమెరా లేకపోతే పాపం చేసినట్టు భావిస్తాను’ అన్నాడు రఘురాయ్. ‘నువ్వు మంచి మనిషి కాకపోతే మంచి ఫొటోగ్రాఫర్వి కూడా కాలేవు’ అనీ అన్నాడు. ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫొటో జర్నలిజమ్’ గా ఖ్యాతి గడించిన 83 ఏళ్ల రఘురాయ్ కన్నుమూయడం భారతదేశాన్ని నిజ ఆత్మతో దర్శించే వాహిక కన్నుమూయడంతో సమానం. ఫొటో తీయడం అంటే కేవలం క్లిక్ చేయడం కాదనీ అది చె΄్పాల్సిన, చూపాల్సిన దృశ్యం సంపూర్ణంగా అవగతం చేయాలని అంటాడాయన. ఎందరెందరో ఫొటోగ్రాఫర్లకు గురువుగా ఉండి, ప్రపంచ దేశాల్లో భారత ఫొటోగ్రఫీ ఉనికి చాటిన రఘురాయ్ కెమెరా చేతబట్టిన చరిత్రకారుడు. కెమెరానే కలంగా మార్చి 1965 నుంచి 2025 దాకా 60 ఏళ్ల ఇండియాని ఫొటోలుగా భావితరాలకు ఇచ్చి వెళ్లాడాయన. → బుజ్జి గాడిద ఫొటోరఘురాయ్ది పంజాబీ కుటుంబం. దేశ విభజన సమయంలో ఢిల్లీ వచ్చి స్థిరపడింది. రఘురాయ్కు చిన్నప్పటి నుంచి ప్రకృతి, పరిసరాలు ఇష్టం. సంగీతకారుడు కావాలనుకున్నాడు. అయితే తండ్రి ‘నువ్వు ఇంజనీరువి కావాలి’ అనంటే సివిల్ ఇంజనీరింగ్ చదివి ఒక సంవత్సరం గవర్నమెంట్ ఉద్యోగం చేశాడు. ‘అయితే అదేమీ నాకు మజా ఇవ్వలేదు’ అంటాడు రఘురాయ్. ఉద్యోగం మానేసి 1965లో 23 ఏళ్ల వయసులో ఢిల్లీకి తన పెద్దన్నయ్య ఎస్.పాల్ దగ్గరకు వచ్చాడు. పాల్ అప్పటికే ‘ది స్టేట్స్మేన్’లో ఫొటోగ్రాఫర్. పాల్ స్నేహితులు ఒకరోజు ఫొటోలు తీయడానికి పల్లెటూరుకు వెళుతుంటే సరదా కొద్ది అన్న కెమెరా మెడలో వేసుకుని వారితో వెళ్లాడు. వాళ్లంతా రకరకాల ఫొటోలు తీస్తుంటే తను మాత్రం అక్కడ ఉన్న బుజ్జి గాడిద పిల్లను ఫొటో తీశాడు. అది రఘురాయ్ మొదటి ఫొటో. ఇంటికి వచ్చాక అన్నయ్య అది చూసి ‘ఈ ఫొటో చాలా బాగుంది’ అని లండన్లోని టైమ్స్ డైలీకి పంపితే వాళ్లు అరపేజీ ఫొటోగా వేశారు. అలా రఘురాయ్ ఫొటో యాత్ర ఘనంగా మొదలైంది. ఆ మరుసటి సంవత్సరానికే ‘స్టేట్స్మేన్’లో రఘురాయ్ చీఫ్ ఫొటోగ్రాఫర్ అయ్యాడు. → బ్లాక్ – వైట్ ఇండియా1980–90ల దాకా రఘురాయ్ ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్లోనే ఫొటోలు తీశాడు. ‘ఇండియా రంగుల దేశం కాదు, భావాల దేశం. మనుషుల శరీర ముడతల్లోని బాధ, కళ్లలోని ఆశ, చేతుల్లోని కష్టం... ఇవి బ్లాక్ అండ్ వైట్లోనే తెలుస్తాయి’ అంటాడాయన. ఆయన ఫొటోల్లో కాంతి ఒక పాత్ర. నీడ ఒక పాత్ర. రఘురాయ్ గొప్పతనం సామాన్యుడిని సెలబ్రిటీని చేయడంలో ఉంది. ఢిల్లీ వీధుల్లో చాయ్ అమ్మే కుర్రాడు, కాశీలో దీపం వెలిగించే పూజారి, రైల్లో సామాను మోసే కూలీ – వీళ్లందరినీ మదర్ థెరిసాతో, సత్యజిత్ రేతో సమానంగా ఫ్రేమ్ చేశాడు.→ చారిత్రక ఘట్టాలు1982–1991 మధ్య పత్రికల్లో రఘురాయ్ పని చేసిన కాలం కీలకమైనది. ఇందిరాగాంధీ నుంచి రాజీవ్ గాంధీ దాకా, పంజాబ్ ఉగ్రవాదం నుంచి మండల్ ఉద్యమం దాకా దేశాన్ని కదిలించిన ప్రతి ఘట్టాన్ని ఆయన కెమెరా సాక్ష్యమిచ్చింది. 1984 డిసెంబర్ 3న భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన ఉదయం ఎనిమిదిన్నరకే అక్కడ వాలిపోయి ’Burial of an Unknown Child’ ఫోటోతో ప్రపంచాన్ని కదిలించాడు. ఆ ఒక్క ఫొటోకే ‘వరల్డ్ ప్రెస్ ఫొటో అవార్డు’ వచ్చింది. ఎమర్జెన్సీ తర్వాత ఇండియా, పంజాబ్ ఉగ్రవాదం, అస్సాం ఆందోళన, మండల్ కమిషన్ గొడవలు... అన్నింటికీ రఘురాయ్ కెమెరా సాక్షి. ఎలైట్ ఇండియా, రియల్ ఇండియా రెండింటినీ సమానంగా చూపించాడు. → ఇందిరాగాంధీ ఫొటోలు1966లో రఘురాయ్ ఫొటో జర్నలిస్టుగా మారితే ఇందిరాగాంధీ అదే సంవత్సరం జనవరిలో ప్రధాని అయ్యారు. అంటే ఆమె పాలిటిక్స్లోకి, ఆయన ఫొటోగ్రఫీలోకి దాదాపు ఒకేసారి వచ్చారు. దాంతో ఆమెతో బాగా చనువు ఏర్పడింది. ఇందిరాగాంధీ ప్రైవేట్, పబ్లిక్ జీవితంలో ఎవరి అనుమతీ అక్కర్లేని ప్రవేశం రఘురాయ్కి ఉండేది. అందుకే ఇవాళ మనం చూస్తున్న ఇందిరాగాంధీ ఫొటోలెన్నో రఘురాయ్ తీయగలిగాడు. ప్రతి విమెన్స్ డేకు కనపడే ఇందిరాగాంధీ ఫొటో (చాలామంది మంత్రులు నిలబడి ఉండగా తను సీట్లో కూచుని ఉన్న ఇందిరాగాంధీ) రఘురాయ్ తీసిందే. ఇందిరాగాంధీ హత్య జరిగే ముందురోజు వరకూ రఘురాయ్ ఆమెను ఫొటోలు తీస్తూనే ఉన్నాడు.→ సత్యజిత్ రే భక్తుడురఘురాయ్ సినిమా రంగంలో పెద్దగా పని చేయలేదు కానీ సత్యజిత్ రేకు విపరీతమైన భక్తుడు. ఆయన సెట్స్లో తిరుగుతూ ఫొటోలు తీసేవాడు. రే కూడా రఘురాయ్ని ’He sees what others don't’ అని మెచ్చుకున్నాడు. ‘సలాం బాంబే’ సినిమాకు స్టిల్ ఫొటోగ్రాఫర్ రఘురాయే. ఆ తర్వాత సినిమా రంగంలో ఓంపురి, నసీరుద్దీన్ షా, షబానా అజ్మీ, స్మితా పాటిల్ వీళ్లందరి ఫొటోలను వారి వ్యక్తిత్వ ధోరణులకు తగినట్టుగా తీయగలిగాడు. ఇక గొప్ప సంగీతస్రష్టలు రఘురాయ్ తమను ఫొటో తీస్తే బాగుండు అనుకున్నారు. ప్రఖ్యాత తబలా విద్వాంసులు– తండ్రీ కొడుకులు అయిన ఉస్తాద్ అల్లారఖా, ఉస్తాద్ జకీర్ హుసేన్ల జుగల్బందీని రఘురాయ్ అద్భుతంగా కెమెరాలో ఒడిసిపట్టాడు.→ కెమెరా పట్టుకున్న రుషిరఘురాయ్ కెమెరా ‘కాలానికి సాక్షి’. రఘురాయ్ కెమెరా పట్టుకున్న ఒక ఋషి. రఘురాయ్ గొప్ప మానవతావాది, సంస్కర్త. అందుకే ఆయన దృష్టిలో ఇండియా అంటే పార్లమెంట్ కాదు. పార్లమెంట్ బయట టీ అమ్ముకునే కుర్రాడు. రాష్ట్రపతి భవన్ కాదు. దాని గేటు ముందు నిద్రపోయే యాచకుడు. ఈ హెచ్చుతగ్గుల వ్యవస్థలో ఎవరి పక్షం వహించాలో తెలిసిన ఛాయాచిత్ర తిరుగుబాటుదారుడు రఘురాయ్. ఆయన వెళ్లిపోయినా ఆయన వదిలిన ఛాయలు ఇక్కడే ఉన్నాయి. సరైన వెలుతురు రానంత కాలం ఆ ఛాయలు నిలదీస్తూనే ఉంటాయి.– ఖదీర్ -
డయాబెటిస్ ఉంటే చేయాల్సిన వ్యాయామాలు..!
డయాబెటిస్ ఉన్నవారి చక్కెర స్థాయిలు అదుపులో ఉండేలా మరింత శక్తిని పొందేలా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి వాళ్లు సరైన పద్ధతిలో వ్యాయామాలు చేయడం అత్యంత ముఖ్యం.ఎందుకంటే..ఇన్సులిన్ సమస్యను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందితక్షణ కండర శక్తిని పెంచుతుందిబరువు నియంత్రణకు సహాయపడుతుందిచేయాల్సినవి..1. ఏరోబిక్ వ్యాయామంవేగంగా నడవడంసైక్లింగ్ఈతవ్యవధి: 30–45 నిమిషాలువారానికి కనీసం 5 రోజులు2. శక్తి శిక్షణతేలికపాటి బరువులు / రెసిస్టెన్స్ బ్యాండ్లుశరీర బరువు వ్యాయామాలు (స్క్వాట్లు, వాల్ పుష్-అప్లు)వారానికి 2–3 సార్లుకండరాలను పెంచుతుందిm గ్లూకోజ్ వినియోగం మెరుగుపడుతుంది. పైగా చక్కెర స్థాయిలు తగ్గుతాయి3. ఫ్లెక్సిబిలిటీ, చలనశీలతస్ట్రెచింగ్యోగాప్రతిరోజూ (10–15 నిమిషాలు)బిగుతును తగ్గిస్తుంది, కదలికను మెరుగుపరుస్తుంది. అలాగే గాయాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.ఎప్పుడు చేయాలంటే..భోజనం తర్వాత (ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత)భోజనం తర్వాత చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడాన్ని తగ్గించడంలో సహాయపడుతుందిఉదయాన్నే ఖాళీ కడుపుతో చాలా తీవ్రమైన వ్యాయామం చేయవద్దువ్యాయామానికి ముందు ..ముందుగా ఒక చిన్న స్నాక్ తీసుకోండితీవ్రమైన వ్యాయామం చేయవద్దు, జాగ్రత్తగా ఉండండివ్యాయామానికి ముందు తినదగిన స్నాక్స్ (అవసరమైతే)కొన్ని నట్స్సగం పండుపెరుగుఇది వ్యాయామం చేసేటప్పుడు చక్కెర స్థాయిలు తగ్గకుండా నివారిస్తుందితీసుకోవాల్సిన జాగ్రత్తలు..తల తిరగడంఅధికంగా చెమట పట్టడంనీరసంగుండె దడతక్షణమే వ్యాయమాలు ఆపేసి విశ్రాంతి తీసుకోవడం, అవసరమైతే చక్కెర స్థాయిలను తనిఖీ చేయడం తదితరాలు చేయాలి.వ్యాయామం తర్వాత పాటించాల్సిన చిట్కాలు:అప్పుడప్పుడు షుగర్ స్థాయిలను తనిఖీ చేసుకోవడంనీళ్ళను బాగా తాగండివ్యాయామం తర్వాత అతిగా తినడం మానుకోండిచేసే తప్పిదాలు..క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంకేవలం నడవడం, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయకపోవడంవార్మ్-అప్ మానేయడంఅకస్మాత్తుగా వ్యాయామాన్ని అతిగా చేయడంషుగర్ తక్కువగా/ఎక్కువగా ఉన్న లక్షణాలను పట్టించుకోకపోవడంవారంలో వర్కౌట్ల ప్లాన్..సోమవారం–శుక్రవారం:30 నిమిషాల వేగవంతమైన నడక10 నిమిషాల స్ట్రెచింగ్మంగళవారం నుంచి శనివారం:15–20 నిమిషాల స్ట్రెంగ్త్ ట్రైనింగ్ జోడించండిఆదివారం:తేలికపాటి కార్యకలాపాలు (నడక/యోగా)అప్పుడప్పుడు చేసే కఠినమైన వ్యాయామాల కంటే, క్రమం తప్పకుండా చేసే మితమైన వ్యాయామం మరింత ఉత్తమంగా పనిచేస్తుంది.చివరగా డయాబెటిస్కు వ్యాయామం అత్యంత శక్తిమంతమైన "మందులలో" ఒకటి. అయితే దానిని సరిగ్గా, క్రమం తప్పకుండా చేసినప్పుడు మాత్రమే ఫలితం అందుకోగలం అని చెబుతున్నారు నిపుణులు.డా. ఆదర్శ గౌడ, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (నీతి ఆయోగ్) సీఈవో, బెంగళూరు(చదవండి: క్లినికల్ ఫార్మసిస్ట్ వెయిట్లాస్ సీక్రెట్..! నో స్ట్రిక్ట్ డైట్, నో వర్కౌట్లు) -
ఎరుపు రంగు డ్రెస్లో ఇషా అంబానీ స్టన్నింగ్ లుక్..!
అంబానీ కుటుంబం ముంబైలోని తమ నివాసం ఆంటిలియాలో రిహానాకు ఆతిథ్యం ఇచ్చింది. తన బ్యూటీ బ్రాండ్ ఫెంటీ బ్యూటీ ప్రారంభోత్సవం కోసం ఈ గాయని భారతదేశంలో ఉన్నారు. రిహానా ఇషా అంబానీ, శ్లోకా మెహతా, రాధికా మర్చంట్, అనంత్ అంబానీలతో కలిసి ఫోటోలకు ఫోజులిస్తూ కనిపించారు. ఈ సందర్భంగా ఆషా అంబానీ ఆకర్షణీయమైన ఎరుపు రంగు చానెల్ డ్రెస్లో తన ఫ్యాషన్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ ఆకర్షణీయమైన ముదురు ఎరుపు రంగు దుస్తులలో సున్నితమైన పూసల పనితో కూడిన పారదర్శకమైన పైపొర, నేల వరకు జారే ప్లీటెడ్ స్కర్ట్ ఉన్నాయి. ఈ డిజైనర్వేర్ని మాథ్యూ బ్లేజీ రూపొందించారు. చానెల్ స్ప్రింగ్ సమ్మర్ 2026 కౌచర్ షో నుంచి తీసుకున్న ఒక సరికొత్త డిజైనర్వేర్. ఈ దుస్తులలో నడుము వరకు పొడవున్న అంచు, పూర్తి పొడవు చేతులు, ఓపెన్ ఫ్రంట్, గుండ్రని మెడ, అంచులపై సున్నితమైన పూసల ఎంబ్రాయిడరీ, చేతులపై రఫుల్స్తో కూడిన ప్రకాశవంతమైన ఎరుపు రంగు షీర్ ష్రగ్ ఉంది. అలాగే ఆమె రాశిచక్రం వృశ్చికం కూడా ఎంబ్రాయిడరీ చేసి ఉండటం విశేషం. ఇషా ఈ జాకెట్ను దానికి సరిపోయే ఎరుపు రంగు డ్రెస్ పైన ధరించి సరొకొత్త స్టైలిష్ లుక్ని పరిచయం చేశారామె. అందుకు తగ్గట్టుగా ఇషా తన డ్రెస్ మెటీరియల్తోనే తయారు చేసిన బంగారు గొలుసు బ్యాగ్, బ్లాక అండ్ వైట్ మేరీ జేన్స్ స్లిప్పర్స్, సున్నితమైన వజ్రాలు పొదిగిన చెవిపోగులతో సహా, తల నుంచి కాలి వరకు షానెల్ యాక్సెసరీలతో స్టైల్ చేసింది. ఆ డ్రెస్కి తగ్గట్టుగా పాపిడి తీసిన వదులైన జుట్టు, ముదురు రంగు కనుబొమ్మలు, మస్కారా పూసిన కనురెప్పలు, మౌవ్ రంగు లిప్ షేడ్, బ్లష్ పూసిన బుగ్గలతో హీరోయిన్ రేంజ్లో తళుక్కుమన్నారామె. మరీ ఈ డ్రెస్ ఖరీదు వచ్చేసి రూ. 70 లక్షలు పైనే పలుకుతుందట.(చదవండి: జస్ట్ ఆటో జర్నీ కాదు.. అంతకుమించి..!) -
మంచుకొండల్లో ఓంకార నాదం
హిమగిరి గుండెల్లో వెలిగిన జ్యోతిర్లింగం విశ్వనాథుడి కైలాస ధామం కేదార్నాథ్ ఈ యాత్ర అంటేనే మదిలోని గుబుళ్లన్నీ వదిలేసి పరమశివుని పాదాల దగ్గర మౌనంగా కూర్చోవడంలాంటిది. గాలిలో వినిపించే ‘ఓం నమఃశివాయ‘ మంత్రం, గంటల నాదం, ఆలయ ప్రాంగణంలో ఉండే అద్మాత్మిక దివ్య శక్తి మనకు తెలియకుండానే మనల్ని ఒక భక్తి లోకానికి తీసుకుని వెళ్తుంది.కేదార్నాథ్ కేవలం ఒక టూరిజం స్పాట్ మాత్రమే కాదు. ఇది ప్రతి భక్తుడి జన్మ ధన్యం అయ్యే ఒక పవిత్ర క్షేత్రం. హిమవంతుడి ఒడిలో, పర్వతాల మధ్య కొలువుతీరిన ఆ మహాదేవుని చూసే ప్రతి కన్ను ధన్యమే అని భక్తుడికి అనిపిస్తుంది. మహాదేవుడి దివ్య సన్నిధిలోకేదార్నాథ్ ఆలయం దగ్గర నిల్చుని ఆకాశంలో చూస్తే ఆ ధవళ వర్ణపు మంచు కొండలు, శివ భగవానుడి జటాజూటంలా కనిపిస్తాయి. ఆయలం లోపల ఉండే స్వయంభూ లింగం ముందు తలవంచితే ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ చిన్నవిగా అనిపిస్తాయి. ఆ చల్లటి గాలిలో కూడా భక్తుల గుండెల్లో ఉన్న భక్తి వేడిని నింపుతుంది.సందర్శనీయ ప్రదేశాలు ఆలయం వెనక ఉన్న భైరవనాథ్ క్షేత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడికి వెళ్తే మొత్తం కేదార్ లోయ మహాదేవుడి పాదాల దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది. అది చూస్తేనే భక్తి పరవశం కలుగుతుంది.కొంచెం దూరంలో ఉండే వాసుకి తల్ సరస్సు నిత్య ప్రశాంతతకు మారుపేరుగా నిలుస్తుంది. అది చూస్తే ప్రకృతి మొత్తం ఆ శివుడి రూపమే అని అర్థం అవుతుంది.తెలియాల్సినవి..దర్శన సమయం: ఆలయ ద్వారాలు అక్షయ తృతీయ నుంచి కార్తీక పౌర్ణమి వరకు భక్తుల కోసం తెరిచి ఉంటాయి.ప్యాకేజీలు: కేదార్నాథ్ వెళ్లాలనుకునే భక్తుల కోసం 5 రోజుల నుంచి 10 రోజుల వరకు బడ్జెట్ను బట్టి అనేక ప్యాకేజీలు లభిస్తాయి.రిజిస్ట్రేషన్: యాత్రకు వెళ్లే ముందు ఉత్తరాఖండ్ గవర్నమెంట్ పోర్టల్లో బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం. క్యూఆర్ కోడ్ పాస్ జాగ్రత్తగా కాపాడుకోవాలి.ప్రయాణం: ఉత్తరాఖండ్లోని రిషికేష్ నుండి రుద్రప్రయాగ్ మీదుగా గౌరీకుండ్ చేరుకోవాలి. అక్కడి నుండి 16 కి.మీ ట్రెక్కింగ్ ప్రారంభమవుతుంది.వసతి సదుపాయాలు: కేదార్నాథ్ టాప్ దగ్గర కాటేజీలు, రూమ్లు ఉంటాయి. అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే మంచిది.ఏం చూడాలి? ఏం తినాలి?కేదార్నాథ్ వెళ్తే సాయంత్రం జరిగే హారతి తప్పక చూడాలి. ఆ హారతి వెలుగులో ఆలయం బంగారు వర్ణంలో మెరిసి΄ోతుంది. కేదార్నాథ్లో భోజనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఖర్చు మాత్రం కాస్త ఎక్కువే ఉంటుంది. ఇక్కడ లభించే ‘పహాడి మ్యాగీ’ ఒక క్విక్ స్నాక్లా ఎంజాయ్ చేయవచ్చు.ఎలా వెళ్లాలంటే.. హరిద్వార్లో గంగా స్నానం చేసి రిషికేష్ నుంచి కేదార్ యాత్ర మొదలు పెట్టడం ఒక సంప్రదాయం. అక్కడి నుంచి రిషికేష్ సోన్ ప్రయాగ్ మార్గంలో నుండి గౌరీకుండ్ చేరుకోవాలి. అక్కడి నుంచి కాలినడకన యాత్రనున కొనసాగించాల్సి ఉంటుంది. చాలా మంది ఈ యాత్రను ట్రెక్కింగ్ అని పిలుస్తుంటారు. కానీ మనం మాత్రం దీనిని ఒక తపస్సులా భావించి అంతే పవిత్రంగా అడుగులు ముందుకేయాలి. ప్రతి అడుగులో ‘శంభో శంకర’ అంటూ భక్తులు పైకి వెళ్తుంటే ఆ పర్వతాలే స్పందిస్తున్నట్టుగా అనిపిస్తుంది.ఎక్కడ ఉండాలి?కేదార్నాథ్ లోయలో ఉండటం అంటే మహాదేవుడి ఒడిలో నిద్రించడం లాంటిదే. చిన్న చిన్న కాటేజీల్లో కూర్చుని బయట చూస్తే గుడి దగ్గర వెలిగే దీపాలు ఆకాశంలోని నక్షత్రాల్లా కనిపిస్తాయి. ఏం చేయాలి? ఆలయ ప్రాంగణంలో మౌనంగా కూర్చుని ధ్యానం చేయవచ్చు. ఫోన్లలో ఫొటోలు తీయడానికి బదులు కళ్లతో చూస్తూ మనసులో శివుడిని కొలుస్తూ గడిపిన క్షణాలు జీవితాంతం గుర్తుంటాయి. వీలు చూసుకొని మందాకిని నది తీరంలో కూర్చొని ఆ ప్రవాహాన్ని ఫీల్ అవ్వాలి. నది ప్రవాహంలో మన మదిలోని ఆలోచనలను కొట్టుకు పోతున్నట్టుగా భావించి, కడిగిన ముత్యంలాంటి మనసుతో ఇంటికి తిరిగి చేరుకోవచ్చు. సూర్యోదయం సమయంలో ఆలయం బంగారు వర్ణంలో మారడం చూడటాన్ని అస్సలు వదులుకోకూడదు.యాత్ర – బడ్జెట్ వివరాలుకేదార్నాథ్ యాత్ర ప్లాన్ చేస్తున్నప్పుడు ప్యాకేజీ అంటే కేవలం టికెట్ మాత్రమే కాదు. అది మన ప్రయాణం, భోజనం, వుండే చోటు అన్నీ కలిసిన ఒక పూర్తి ప్రణాళిక. ఈ యేడాది కేదార్నాథ్ ఆలయం ద్వారాలు ఏప్రిల్ 22న తెరుచుకున్నాయి. కాబట్టి మీరు ఇప్పుడే మీ యాత్ర ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చు. పర్యటను ఎలా ఎంచుకుంటున్నారు అనేదానిని బట్టి, మొత్తం ఖర్చు మారుతుంది.బడ్జెట్ అంచనాసాధారణంగా 5 రోజుల నుంచి 10 రోజుల వరకు యాత్రకు అయ్యే ఖర్చు బడ్జెట్లో రూ.25,000 నుంచి రూ.35,000 వరకు ఉంటుంది.కాస్త కంఫర్ట్గా వెళ్లాలి అనుకుంటే రూ.45,000 నుంచి రూ.65,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇక లగ్జరీగా, సౌకర్యవంతంగా యాత్ర చేయాలి అనుకుంటే మాత్రం రూ.1.4 లక్ష నుంచి రూ.2.3 లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది.రవాణా ఖర్చులుట్రావెల్ విషయానికి వస్తే.. రైలులో సుమారు రూ.5,000 వరకు ఖర్చు అవుతుంది. హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ వరకు అప్ అండ్ డౌన్ రూ.17,000 నుంచి రూ.33,000 వరకు, లేదా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు రూ.13,000 నుంచి రూ.17,000 వరకు ఖర్చు అవుతుంది. చాలా మంది ముందుగా ఢిల్లీ చేరుకుని, అక్కడి నుంచి హరిద్వార్ లేదా రిషికేష్కు బస్ లేదా ట్రైన్లో వెళ్లి యాత్రను కొనసాగిస్తారు.వసతి సదుపాయాలుగౌరీకుండ్, సోన్ ప్రయాగ్ ప్రాంతాల్లో బడ్జెట్ గెస్ట్ హౌజ్లు రూ.1,000 లోపు దొరుకుతాయి. స్టాండర్డ్ హోటల్స్ సుమారు రూ.3,000 వరకు ఉంటాయి. కేదార్నాథ్ టాప్ దగ్గర పీక్ సీజన్లో ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది. జీఎంవీఎన్ టెంట్స్ లేదా రూమ్స్ రూ.1,000 నుంచి ప్రారంభమవుతాయి కానీ ముందుగా ఆన్లైన్ బుకింగ్ చేసుకోవడం తప్పనిసరి.ఫుడ్ ఖర్చుఫుడ్ విషయానికి వస్తే సింపుల్ థాలీ లేదా స్నాక్స్ కోసం రోజుకు ఒక వ్యక్తికి సుమారు రూ.500 నుంచి రూ.1,000 వరకు ఖర్చు అవుతుంది. మొత్తంగా ఫుడ్, స్టే కలిపి రోజుకు రూ.1,200 నుంచి రూ.4,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.ప్యాకేజీలు, హెలికాప్టర్ఐఆర్సీటీసీ ఫ్లైట్ ప్యాకేజీలు ఎంచుకుంటే హైదరాబాద్ నుంచి సుమారు రూ.74,000లో సకల సౌకర్యాలతో ట్రిప్ పూర్తి చేసుకోవచ్చు. అదే కొన్ని బడ్జెట్ ప్యాకేజీలు రూ.27,000 నుంచే లభిస్తాయి. సోన్ ప్రయాగ్ నుంచి కేదార్నాథ్కు హెలికాప్టర్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుంది. దీనికి రూ.7,000 నుంచి రూ.10,000 వరకు ఖర్చు అవుతుంది. ఈ సర్వీస్ను ఐఆర్సీటీసీ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి.లోకల్ ట్రాన్స్పోర్ట్లోకల్ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండ్కు గవర్నమెంట్ షటిల్ ట్యాక్సీ ఫేర్ కేవలం రూ.50 మాత్రమే ఉంటుంది, అయితే ప్రైవేట్ ట్యాక్సీలు ఎక్కువగా చార్జ్ చేసే అవకాశం ఉంది.ముఖ్య సూచనలుమే, జూన్ నెలల్లో యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాస్త ప్రశాంతంగా యాత్ర చేయాలనుకుంటే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలోనూ న్ చేసుకోవచ్చు. వెళ్లే ముందు వాతావరణ అప్డేట్స్ తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. స్థానిక అధికారుల సూచనలు టించడం చాలా ముఖ్యం. ఈ బడ్జెట్ వివరాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే, ప్లాన్, సీజన్ ఆధారంగా ఖర్చులు మారవచ్చు. – ఎం.జి.కిశోర్, ప్రయాణికుడు -
144 ఏళ్ల క్రితం కేదార్నాథ్ ఆలయం ఎలా ఉండేదో తెలుసా..!
అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటైన కేదార్నాథ్ యాత్ర ప్రారంభకానుంది. ఉత్తరాఖండ్లోని గర్హ్వాల్ హిమాలయాలలో ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఈ ఆలయం, నెలల తరబడి శీతాకాలపు మూసివేత తర్వాత మరోసారి భక్తుల కోసం తలుపులు తెరుచుకోనుంది. ఛార్ధామ్ యాత్ర పేరుతో ఇక్కడకు వచ్చి ఆ మహాదేవుడిని కొలుస్తుంటారు భక్తులు. అయితే ఇప్పుడు ఆధునికత యాత్రను కొంచెం సులభతరం చేయగలిగింది. కానీ వందేళ్ల క్రితం ఈ కేదార్నాథ్ ఎలా ఉండేదో అందుకు సంబంధించిన ఫోటోని పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ఎలా ఉందంటే..1882లో తీసిన కేదార్నాథ్ ధామ్కు సంబంధించిన మొట్టమొదటి ఛాయాచిత్రాలలో ఒకటిగా భావిస్తున్న ఒక చిత్రాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఆ ఫోటో క్షణాల్లో వైరల్గా మారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సమయంలో ఆ పుణ్యక్షేత్రానికి వెళ్లడానికి రోడ్లు, రైల్వే స్టేషన్లు, హెలికాప్టర్లు ఏవీ లేవని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ప్రయాణం సౌలభ్యం అయిపోయాక..అక్కడున్న అందాల్ని ఆస్వాదించడం మర్చిపోతున్నాం అంటూ ఆలోచింపచేసే ప్రశ్నను లేవనెత్తారు. టెక్నాలజీ సౌలభ్యతను అందివ్వాలేగానీ..ఏదో వచ్చాం, వెళ్లిపోయాం అన్నట్లు కాదు కదా అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మహీంద్రా. ఆ మంచు కొండల మధ్య కొలువైన ఆ మహా దేవుడి చుట్టుతా ఉన్న అద్భుతాలు, ప్రకృతి రమ్యతను తనివితీరా ఆస్వాదించడం ఓ కళ. అప్పుడే ఆధ్యాత్మిక ప్రయాణం పరిపూర్ణమయ్యేది అనేది పలువురి ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయం. ఆ విషయాన్నే గుర్తుచేసేలా ఇలా నాటి ఫోటోని షేర్ చేశారు మహీంద్రా. కాగా, కేదార్నాథ్ యాత్ర ఊపందుకుంటున్న తరుణంలో మహీంద్రా ఈ పోస్ట్ చేశారు. యాత్ర ప్రారంభమైన మొదటి మూడు రోజుల్లోనే 1.1 లక్ష మందికి పైగా భక్తులు పుణ్యక్షేత్రాన్ని సందర్శించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ సీజన్లో యాత్రికుల రాకపోకలు సజావుగా సాగడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం చేపట్టిన మెరుగైన మౌలిక సదుపాయాలు, సమర్థవంతమైన ప్రణాళికే కారణమని ఆలయ అధికారులు అన్నారు. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో సుమారు 3,584 మీటర్ల ఎత్తులో ఉన్న కేదార్నాథ్, శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి. అలాగే దేశంలోని అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా నిలుస్తుంది. అక్కడి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా, ఈ ఆలయం ప్రతి ఏడాది పరిమిత కాలం వరకు మాత్రమే(ఆరు నెలలు) సందర్శనకు అందుబాటులో ఉంటుంది.Apparently, this is one of the earliest known photographs of the sacred Kedarnath Dham, taken in 1882.Couldn’t take my eyes off it. No roads. No railheads. No helicopters.Just the abode of Lord Shiva, cradled by the HimalayasBack then, the yatra demanded time, endurance,… pic.twitter.com/UfvWVsmLnf— anand mahindra (@anandmahindra) April 26, 2026 (చదవండి: పిలిస్తే పలికే దైవం కృష్ణా... గురువాయురప్పా...) -
లేక్ పక్కనే బొమ్మరిల్లు లాంటి గ్రామం..!
మనం చిన్నప్పుడు చూసిన ఫైయిరీ టేయిల్స్లో ఉండే గ్రామాలు నిజంగా ఉంటాయా అని ఎప్పుడైనా అనిపించిందా? హాల్స్టాట్కి వెళ్లినప్పుడు మనకి ఆ ఫీలింగే కలుగుతుంది. లేక్ పక్కనే ఉన్న హౌజెస్ చూస్తుంటే మనం ఏదో ఒక అందమైన పిక్చర్ ఫ్రేమ్లో ఉన్నాము అనే ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ టైమ్ ట్రావెలర్స్కి ఇది ఒక డ్రీమ్ డెస్టినేషన్ మాత్రమే కాదు, మనసుకి ప్రశాంతతను ఇచ్చే చక్కని ప్రదేశం.ఆస్ట్రియాలోని స్నో మౌంటెన్స్ అండ్ హాల్స్టాట్ లేక్ వాటర్ మధ్య పోల్చిచూస్తే మనకి ఒక కొత్త కోణంలో చూసే అవకాశం లభిస్తుంది. కొండాకోనల్లో నుంచి లేక్ వైపు చూస్తూ కూర్చోవడం ఒక పెద్ద రిఫ్లెక్షన్. ఇక్కడి నారో స్ట్రీట్స్లో నడుస్తుంటే నేచర్ సౌండ్స్ తప్పా ఇంకేమీ వినిపించవు. ప్రతీ ఇల్లు పూలతో అలంకరించుకుని ఉంటుంది. వుడెన్ ఆర్కిటెక్చర్తో చాలా అందంగా ఉంటుంది. ఎక్కడ చూసినా ఒక కళాత్మక వాతావరణం కనిపిస్తుంది.సందర్శనీయ స్థలాలుఇక్కడ ఉన్న సాల్ట్ మైన్ టూర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీని హిస్టరీ మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. స్కైవాక్ వ్యూ ఫ్లాట్ఫామ్ నుంచి విలేజ్ మొత్తం చూస్తుంటే వ్యూ చాలా బాగుంటుంది. హాల్స్టాట్టర్ లేక్లో బోటింగ్ చేస్తూ చుట్టూ ఉన్న పర్వతాలను ఆ నీటిలో నుంచి చూడటం అనేది మర్చి΄ోలేని అనుభూతిగా మిగిలి΄ోతుంది.ఏం తినాలి?లోకల్గా వెతికి ఫ్రెష్ డిషెస్ను ఆస్వాదిస్తే ఆ ఫ్రెష్నెస్ ఏంటో తెలుస్తుంది. దీంతో΄ాటు ఇక్కడి ట్రెడిషనల్ పేస్ట్రీస్ అండ్ హాట్ కాఫీ తింటూ లేక్ సైడ్ కూర్చోవడం ఒక స్పెషల్ ఎక్స్పీరియె¯Œ ్సగా మిగిలిపోతుంది.ఎప్పుడు వెళ్లాలి ? ఏప్రిల్ అండ్ మే నెలల్లో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా మంది ఈ సమయంలోనే ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు. స్థానిక అందాలు చూడచక్కగా కనిపిస్తాయి.మార్నింగ్ సమయంలో బయటకు వస్తే క్రౌడ్ తక్కువగా ఉంటుంది. ఇక్కడి లోకల్స్ చాలా కామ్గా ఉంటారు. ట్రావెల్ కంఫర్ట్ చాలా ఎక్కువ. సింపుల్గా నడుస్తూ ఈ విలేజ్ అందాలు చూస్తుంటే టైమ్ సైన్సు తెలియదు.హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి వియన్నాకి కనెక్టింగ్ విమానాలు ఉంటాయి. వియన్నా నుంచి ట్రెయిన్ లేదా కార్ జర్నీ ద్వారా 3 నుంచి 4 గంటల్లో హాల్స్టాట్ చేరుకోవచ్చు.హాల్స్టాట్ మనల్ని స్లో ట్రావెల్ వైపు తీసుకెళ్తుంది. ప్రతీ క్షణం ఎంజాయ్ చేయాలి అనే ఫీలింగ్ కలిగిస్తుంది. ఇక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత కూడా ఆ లేక్ అండ్ అందమైన ఇళ్లు మనకి ఎప్పుడూ గుర్తొస్తూనే ఉంటాయి. (చదవండి: పచ్చని స్వర్గధామం..సమ్మర్లో తప్పక చూడాల్సిన ప్రదేశం!) -
జస్ట్ ఆటో జర్నీ కాదు.. అంతకుమించి..!
చిన్న ఆటో అయినా..దాన్ని కస్టమర్లకు విభిన్నంగా పరిచయం చేసేలా సెట్ చేసే తీరు ఎవ్వరినైనా..ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇంతకు మునుపు వరకు చల్లదనం కోసం మొక్కలతో, పర్యావరణ అనుకూలంగా మార్చిన అందమైన ఆటోలను చూశాం. కానీ ఈ ఆటో డ్రైవర్ అంతకు మించి అన్నట్లుగా.. ఆటో జర్నీని అందిస్తున్నాడు ప్రయాణికులకు. అందుకోసం ఏం చేస్తున్నాడంటే..అందుకు సంబంధించిన వీడియోని వర్ష అనే యూజర్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకుంది. ఆ వీడియోలో ఒక సాధారణ ఆటో ప్రయాణంలా కనిపించేదాన్ని చిత్రీకరించినట్లు ఉంటుందే తప్ప, అందులో విభిన్నంగా ఏమీ కనిపించదు. కానీ కెమెరా లోపలికి మారినప్పుడు, మొత్తం ఆటోజర్నీనే మంచి అనుభూతిగా మార్చేస్తోంది. ఆ వీడియోలో సాధారణ ఆటో ప్రయాణంలా మొదట్లో కనిపించినా..ఆ తర్వాత డ్రైవర్ సీటు వెనుక, పుస్తకాలతో నిండిన ఒక చిన్న అర ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దొరికిన ఆ కొద్ది సమయం ఫోన్కి అంకితమవ్వకుండా కాసేపయినా పుస్తకాలు తెరిచేలా చేసే ప్రయత్నం ముచ్చటగొలుపుతుంది. వాటి తోపాటు ఆ ఆటోలో ప్రయాణికుల కోసం ఒక చిన్న క్యాండీల డబ్బా కూడా ఉంది. చిన్నపాటి ఆలోచన అయినా..ప్రయాణికులకు తమ జర్నీ సమయాన్ని విలువైనదిగా మార్చుకునేలా చేస్తోంది. పైగా ఫోన్ని స్క్రోల్ చేసే బదులు కొన్ని నిమిషాల పాటు చదువుకునేలా చేస్తుంది. మాములు ప్రయాణం అనుకున్నాం కానీ ఒక చిన్న లైబ్రరీగా మారింది అంటూ క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ షేర్ చేశారు. నెటిజన్లు సైతం ఈ వీడియోని సైతం “ఈ ఆటో సీఎన్జీతో గానీ, పెట్రోల్తో గానీ నడవడం లేదు, ఇది కేవలం కరుణతో నడుస్తోంది. అతడు అందిస్తున్న ప్రతిదానికి అంతకుమించిన ఆశీస్సులు అందాలి అని దీవిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by _np_ (@by.nanthithaparkavi) (చదవండి: సమానత్వానికి కేరాఫ్గా ఆ వివాహం..!) -
క్లినికల్ ఫార్మసిస్ట్ వెయిట్లాస్ సీక్రెట్..! నో స్ట్రిక్ట్ డైట్, నో వర్కౌట్లు
బరువు తగ్గడం అనేది తరుచుగా కఠినమైన డైట్లు, డిటాక్స్ పద్ధతులు, తీవ్రమైన వ్యాయామాలతో ముడిపడి ఉంటుంది. కొందరు తక్కువ వ్యవధిలో బరువు తగ్గించే షార్ట్కట్లు వెతుక్కుంటారు. కానీ ఇలాంటివి ఏవి అవసరం లేకుండానే స్థిరమైన మార్పులతో బరువు తగ్గగలరని చెబుతున్నారు పుణెకు చెందిన క్లినికల్ ఫార్మసిస్ట్ అండ్ ఆరోగ్య విద్యావేత్త డాక్టర్ ఇద్రిస్ దవాయివాలా. అదెలాగో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందాం..!.డాక్టర్ ఇద్రిస్ దవాయివాలా తన రోగులలో ఒకరు ఎలాంటి తీవ్రమైన డైట్ లేదా డిటాక్స్ కార్యక్రమాన్ని పాటించకుండా 8 కిలోలు ఎలా తగ్గగలిగారో ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఆ పేషెంట్ రక్త పరీక్షల్లో కొలెస్ట్రాల్ స్థాయి సాధారణం కంటే అధికంగా ఉంది. అతడు చాలా తక్కువగా ఫుడ్ తీసుకుంటున్నా ఇలా ఈ స్థాయిలో కొలెస్ట్రాల్ ఉండటం అతనిలో భయాన్ని రేకెత్తించి తన వద్దకు వచ్చినట్లు తెలిపారు. అయితే డాక్టర్ దవాయివాలా సమస్య అతను ఎంత తిన్నాడు అనే దానివల్ల కొలెస్ట్రాల్ పెరగదని అంటున్నారు. శరీరమే దీనికి కారణం అన్నారు.అదెలా అంటే..మన శరీరమే కొంత కొలెస్ట్రాల్ను ఉత్పత్తి చేస్తుంది. ఎందుకంటే ఇది మన జీవనానికి ముఖ్యమైన పదార్థం. ఇది కణ త్వచాలు, హార్మోన్లు, విటమిన్ డి కొవ్వును జీర్ణం చేసే పైత్యరస ఆమ్లాలకు ఒక కీలకమైన నిర్మాణ మూలకం. శరీరం సహజ ప్రక్రియలకు అంతరాయం కలిగినప్పుడు సాధారణంగా అదనపు కొలెస్ట్రాల్ ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. అందుకు గల కారణాలు ఏవంటే..సరిగా నిద్రపోకపోవడంవిటమిన్ డి లోపంఇన్సులిన్ నిరోధకతక్రమరహిత భోజనంకనీస శారీరక శ్రమఅందువల్ల సమస్య కొలెస్ట్రాల్ కాదు. ఇది దెబ్బతిన్న జీవనశైలి చక్రానికి సంబంధించిన ఒక లక్షణంకొలెస్ట్రాల్, బరువు తగ్గేలా ఏం చేయాలంటే..అదనపు ఫైబర్ (అవిసె, చియా, నానబెట్టిన ఓట్స్)ఒమేగా-3లుసమతుల్యమైన ఆహారం, ఏదీ మానకూడదుప్రతిరోజూ ఉదయం సూర్యరశ్మి, మెగ్నీషియంవిటమిన్ డి సప్లిమెంట్లుఈ మార్గదర్శక జీవనశైలి మార్పుల ద్వారా, రోగి మొత్తం కొలెస్ట్రాల్ 248 mg/dL నుంయి 187 mg/dLకి తగ్గింది. అతను 8 కిలోల బరువు తగ్గాడు, అతని విటమిన్ డి స్థాయిలు సాధారణ స్థితికి వచ్చాయి. పైగా అతని నిద్ర మెరుగుపడింది, అతిగా తినడం కూడా ఆపగలిగాడు.ఇందులో ఎలాంటి తీవ్రమైన డైట్లు లేదా జిమ్మిక్కులు లేవు. కేవలం స్థిరమైన, మార్గదర్శక ప్రయత్నం మాత్రమే. కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలని లేదా బరువును అదుపులో ఉంచుకోవాలని చూస్తున్నట్లయితే, పోషకాహార నిపుణులు లేదా ఫిట్స్ నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు డాక్టర్ దవాయివాలా.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Dr Idris Dawaiwala | AHealthyBeat (@ahealthybeat) (చదవండి: గ్లోబల్ మైండ్సెట్ అంటే..? ఎలా పెంపొందించుకోవాలి..) -
గ్లోబల్ మైండ్సెట్ అంటే..? ఎలా పెంపొందించుకోవాలి..
మనం ఒక గ్రామంలో పుట్టి ఉండవచ్చు, ఒక నగరంలో పెరిగి ఉండవచ్చు.. కానీ నేటి ఇంటర్నెట్ యుగంలో మనం కేవలం ఒక ప్రాంతానికి చెందినవారం కాదు, మనం 'ప్రపంచ పౌరులం' (Global Citizens). మీ ఆలోచనా విధానం మీ గీతలను దాటి విశ్వవ్యాప్తం అయినప్పుడే మీ పర్సనాలిటీకి ఒక అంతర్జాతీయ గౌరవం దక్కుతుంది.ప్రపంచ పౌరుడిలా ఆలోచించడం అంటే మీ మూలాలను మర్చిపోవడం కాదు బ్రో. మీ సంస్కృతిని ప్రేమిస్తూనే, ప్రపంచంలోని ఇతర సంస్కృతులను, ఆలోచనలను గౌరవించడం. ఒక గ్లోబల్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తి ఎప్పుడూ సంకుచితంగా ఆలోచించడు. అతను తనను తాను ఒక దేశానికో, ఒక కులానికో పరిమితం చేసుకోకుండా, మొత్తం మానవజాతిలో తానూ ఒక భాగం అని నమ్ముతాడు.సాంస్కృతిక మేధస్సు (Cultural Intelligence - CQ)గ్లోబల్ పర్సనాలిటీకి ఉండాల్సిన మొదటి లక్షణం CQ.ఇది కేవలం భాషలు నేర్చుకోవడం కాదు, వివిధ దేశాల మనుషుల ప్రవర్తనలను, వారి విలువలను అర్థం చేసుకోవడం.మీరు ఒక విదేశీయుడితో మాట్లాడేటప్పుడు వారి సంప్రదాయాలను గౌరవిస్తే, వారు మిమ్మల్ని ఒక 'పరిణతి చెందిన వ్యక్తి'గా చూస్తారు. వైవిధ్యం (Diversity) అనేది ఒక సమస్య కాదు, అది ఒక అందం అని గుర్తించడమే గ్లోబల్ మైండ్సెట్.గ్లోబల్ అవేర్నెస్: ప్రపంచం ఎటు వెళ్తోంది?ఒక ప్రపంచ పౌరుడికి తన చుట్టూ ఉన్న చిన్న ప్రపంచం కంటే, గ్లోబల్ గా ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. క్లైమేట్ చేంజ్, గ్లోబల్ ఎకానమీ, AI విప్లవం వంటి అంశాల మీద అవగాహన కలిగి ఉండటం."ఈ సమస్య కేవలం నా దేశానిది కాదు, ఇది మన అందరిది" అనే బాధ్యతాయుతమైన ఆలోచన (Shared Responsibility). ఇలా ఆలోచించినప్పుడే మీరు ప్రపంచ స్థాయి నాయకుడిగా (Global Leader) ఎదగగలరు.ఓపెన్ మైండెడ్నెస్: విభిన్న కోణాలను ఆహ్వానించడంగ్లోబల్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తి ఎప్పుడూ "నాదే కరెక్ట్" అని వాదించడు.mప్రపంచంలో రకరకాల జీవనశైలులు ఉంటాయని, ప్రతి దాని వెనుక ఒక తర్కం ఉంటుందని అతను గ్రహిస్తాడు.కొత్త ఆలోచనలను, విభిన్న దృక్పథాలను (Perspectives) అతను స్వాగతిస్తాడు. ఈ విశాల దృక్పథమే మిమ్మల్ని ప్రొఫెషనల్ లైఫ్ లోఅత్యున్నత శిఖరాలకు చేరుస్తుంది.గ్లోబల్ కమ్యూనికేషన్ స్కిల్స్మీ మాటలు ప్రపంచానికి అర్థం కావాలి అంటే, మీ కమ్యూనికేషన్ లో ఒక 'యూనివర్సల్ అప్పీల్' ఉండాలి.స్పష్టమైన ఇంగ్లీష్ లేదా ఏదైనా గ్లోబల్ లాంగ్వేజ్ నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే, ఎమోషన్స్ ని భాషతో సంబంధం లేకుండా పండించడం ఇంకొక ఎత్తు.డిజిటల్ ఎチケット (Chapter 36) పాటిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులతో నెట్వర్కింగ్ (Networking) చేయడం నేర్చుకోవాలి.హ్యూమనిజం: మానవత్వమే పరమావధిఅన్నిటికంటే మిన్నగా, గ్లోబల్ పర్సనాలిటీ అంటే మానవత్వాన్ని ప్రేమించడం. సరిహద్దులు లేని ప్రేమ, కరుణ (Compassion) కలిగి ఉండటం. మీరు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా.. ఒక మంచి మనిషిగా పేరు తెచ్చుకోవడం."వసుధైక కుటుంబకం" (ప్రపంచమంతా ఒకే కుటుంబం) అనే భారతీయ తత్వాన్ని మీ వ్యక్తిత్వంలో ప్రతిబింబించడం.The Takeawayబ్రో, బావిలో కప్పలా ఉండకండి. సముద్రంలో చేపలా ఈదండి. ప్రపంచం చాలా పెద్దది, అందులో మీకు అనంతమైన అవకాశాలు ఉన్నాయి. మీ ఆలోచనలు ఎంత విశాలంగా ఉంటే, మీ ఎదుగుదల అంత గొప్పగా ఉంటుంది. ఒక ప్రపంచ పౌరుడిలా జీవించడం అంటే, ఎక్కడికి వెళ్లినా మీరు 'పరాయి వ్యక్తి'లా కాకుండా 'సొంత వ్యక్తి'లా ఫీలవ్వడం.నీ నిరంతర వికాసంలో (Phase 5) ఈ 'గ్లోబల్ విజన్' నీకు ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చిపెడుతుంది.గుర్తుంచుకో.."నీ కాళ్లు నీ సొంత గడ్డ మీద ఉండవచ్చు, కానీ నీ ఆలోచనలు ఆకాశమంత విశాలంగా ప్రపంచాన్ని చుట్టి రావాలి. ప్రపంచం నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా నీ వ్యక్తిత్వాన్ని మలచుకో!"Mind-Workఈరోజు ఏదైనా ఒక అంతర్జాతీయ వార్తను చదివి, దాని ప్రభావం మీ మీద లేదా మీ వృత్తి మీద ఎలా ఉంటుందో విశ్లేషించండి.మీకు అస్సలు తెలియని ఒక విదేశీ సంస్కృతి లేదా వంటకం గురించి ఈరోజు తెలుసుకోండి.మీరు గ్లోబల్ గా కనెక్ట్ అవ్వడానికి సోషల్ మీడియాను (లింక్డిన్ వంటివి) ఎలా వాడుకుంటున్నారో ఒకసారి ఆడిట్ చేసుకోండి.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066psy.vishesh@gmail.com(చదవండి: హిమాలయంలాంటి అచంచలమైన పర్సనాలిటీ) -
కుక్కలు, పిల్లులు కాదు.. చైనాలో వింత ట్రెండ్!
ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ సరికొత్త టెక్నాలజీతో, ఆర్థిక విషయాలతో ఆశ్చర్యపరిచే చైనా.. ఇప్పుడు ఓ విచిత్రమైన ట్రెండ్తో వార్తల్లో నిలిచింది. ఇన్నాళ్లూ కేవలం వంటకాలకే పరిమితమైన కోళ్లు ఇప్పుడు అక్కడి ప్రధాన నగరాల్లో ముద్దులొలికే పెంపుడు జంతువులుగా మారిపోయాయి. ఏకంగా డైపర్లు వేసుకుని, వీధుల్లో షికారు చేస్తూ, ఇంటర్నెట్ సెన్సేషన్గా మారుతున్నాయి.అగ్వాయ్ ‘ఫీనిక్స్ ఫెయిరీస్’గువాంగ్డాంగ్ లాంటి ప్రాంతాల్లో కోడి కనిపిస్తే అది వంటకంలో ఉండాల్సిందే అన్న సామెత ఉంది. కానీ, అగ్వాయ్ అనే మహిళ తనకు బంధువులు ఇచ్చిన మూడు గుడ్లను పొదిగించి, ఆ కోడిపిల్లలను వండుకోకుండా ముద్దుగా పెంచుకుంటోంది. ఇవి అరుదైన, ఖరీదైన ‘తైహే బ్లాక్-బోన్డ్ సిల్కీ ఫౌల్’ జాతికి చెందినవి. మంచు లాంటి తెల్లటి ఈకలతో ఆకట్టుకునే వీటిని ‘ఫీనిక్స్ ఫెయిరీస్’ అని ముద్దుగా పిలుస్తారు. వీటి నిర్వహణ చాలా సులభమని, నెలకు కేవలం 30 యువాన్లు (సుమారు రూ. 450) మాత్రమే ఆహారం కోసం ఖర్చవుతుందని ఆమె తెలిపింది.కుక్కలు, పిల్లుల కంటే ఇవే బెటర్కోళ్లు చాలా తెలివైనవని, వాటికి ఎమోషన్స్ ఉంటాయని యజమానులు చెబుతున్నారు. జియాంగ్సు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తన కోడిపుంజు మనుషులతో భావోద్వేగాలను పంచుకుంటుందని, కళ్లతోనే కమ్యూనికేట్ చేస్తుందని తెలిపాడు. చిలుకలు, కుక్కలు, పిల్లులను పెంచిన అలిన్ అనే మరో యజమాని.. వాటన్నింటికంటే కోళ్లే మనుషులతో త్వరగా కనెక్ట్ అవుతాయని అంటోంది. సాధారణ పెంపుడు జంతువులకు అయ్యే ఖర్చు, వాటికి కేటాయించాల్సిన సమయం కంటే.. కోళ్ల నిర్వహణ చాలా సులభమని ఆమె అభిప్రాయపడింది.ఎక్కడి నుంచి వస్తున్నాయి?పెంపుడు జంతువులుగా మారుతున్న ఈ కోళ్లన్నీ ఎక్కువగా ఫారాల నుంచి వస్తున్నవే. గుడ్లు పెట్టలేని పుంజులు, మాంసం కోసం పెంచే బ్రాయిలర్ కోళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. కొన్ని సూపర్ మార్కెట్లు ఎగ్స్, పెరుగు కొన్నవారికి ఆఫర్ల రూపంలో ఈ కోడిపిల్లలను ఉచితంగా ఇస్తుండగా.. రైతులు సిటీ పార్కుల్లో ఒకటి నుంచి మూడు యువాన్లకే అతి చవకగా విక్రయిస్తున్నారు. ఇది నగరవాసులను, ముఖ్యంగా పిల్లలను విపరీతంగా ఆకర్షిస్తోంది. చైనీయుల జీవనశైలిలో కోళ్లు కొత్త ఫ్యామిలీ మెంబర్స్గా మారిపోయాయి.ఇది కూడా చదవండి: ‘22 నిమిషాల్లో శత్రువుల వెన్నువిరిచేశాం’ -
శల్య సారథ్యం అంటే..?
మహాభారత సంగ్రామంలో పాల్గొన్న వారిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేక శైలి. వారిలో శల్యుడు ఒకరు. ఒకరిపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సాయం చేసే నెపంతో చేతులారా చెడగొట్టడంతోపాటు వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడాన్ని శల్య సారధ్యం అంటారు.శల్యుడు మద్ర దేశానికి అధిపతి, పాండురాజుకు రెండవ భార్య అయిన మాద్రికి సోదరుడు. మాద్రి సంతానమైన నకుల, సహదేవులకు మేనమామ. శల్యుడు అస్త్రవిద్య, గదా యుద్ధం, ముఖ్యంగా రథసారథిగా గొప్ప నేర్పరి. అలాంటి శల్యుడు పాండవుల పక్షాన ఉంటే వారిని గెలవడం కష్టమని గ్రహించిన దుర్యోధనుడు ఒక పథకం పన్నాడు. పాండవులను కలవడానికి వెళుతున్న శల్యుడికి మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా అక్కడక్కడా పెద్దపెద్ద గుడారాలు వేయిస్తాడు. ఆ గుడారాలు పాండవులవేనని అనుకొన్న శల్యుడు వాటిలోకి ప్రవేశిస్తాడు. అక్కడి సేవకులు శల్యునికి ఎంతో సాదరంగా ఆహ్వానం పలికి, గౌరవ మర్యాదలు చేసి అద్భుతమైన విందును ఏర్పాటు చేశారు. ఇదంతా పాండవులు తన కోసమే చేశారనుకున్న శల్యుడు విందు ఆరగించి, వెంటనే సేవకునితో తక్షణమే వెళ్లి మీ యజమాని పిలుచుకొని రా... రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో నా మద్దతును తెలుపుతానని చెప్పాడు.సేవకులతో పాటు దుర్యోధనుడు రావడంతో ఆశ్చర్యపడ్డ శల్యుడు జరగాల్సిన పొరపాటు జరిగిపోయింది. ఇచ్చిన మాటను వెనుకకు తీసుకోలేక మహా భారత సంగ్రామంలో కౌరవుల పక్షాన ఉండేందుకు నిశ్చయించుకున్నాడు. అనంతరం శిబిరం నుండి బయలుదేరిన శల్యుడు పాండవులను కలుసుకొని జరిగిన సంఘటన వివరించాడు. అప్పుడు ధర్మరాజు శల్యుడితో మాట్లాడుతూ, కౌరవుల పక్షాన యుద్ధంలో పాల్గొన్నప్పటికీ తమకు అభ్యంతరం లేదని, కానీ ఒక సహాయం చేస్తాననే మాట ఇమ్మని శల్యుణ్ణి అడిగాడు. అలాగే, అదేమిటో చెప్పమన్న శల్యుడితో ‘‘రథం తోలడంతో నీకు అద్భుతమైన ప్రతిభ ఉంది కాబట్టి కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుని రథాన్ని తోలే అవకాశం వస్తే ఆ సమయంలో కర్ణుని అడుగడుగునా అవహేళన చేస్తూ, మానసికంగా, అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించాలి’’ అని ధర్మరాజు కోరాడు. అందుకు అంగీకరించాడు శల్యుడు.ఊహించిన విధంగానే మహాభారత సంగ్రామంలో 17వ రోజున కర్ణుని రథాన్ని తోలే బాధ్యతను శల్యునికి అప్పగించారు. కర్ణుని పరాక్రమాన్ని గమనించిన శల్యుడు అడుగడుగునా కర్ణుని అవహేళన చేస్తూ సూటిపోటి మాటలతో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. ఒక సమయంలో కర్ణుడు వదిలిన అస్త్రాన్ని అర్జునుని తలపైకి కాకుండా గుండెల వైపు గురి పెట్టమని శల్యుడు సూచిస్తాడు. అప్పటికే శల్యుని పట్ల అపనమ్మకం ఏర్పడ్డ కర్ణుడు అస్త్రాన్ని తలవైపునకే గురిపెట్టడం, అర్జునిని రథ సార థ, జగన్నాటక సూత్ర ధారి అయిన శ్రీ కృష్ణుడు రథాన్ని కిందకు తొక్కడంతో ఎంతో శక్తిమంతమైన అస్త్రం అర్జునుని తలపై నుండి వెళ్ళిపోయి వ్యర్థ మైపోయింది. ఈ లోగా కర్ణుని శాపాలు అన్నీ కలిసి రావటంతో అర్జునుడు విడిచిన అస్త్రంతో కర్ణుడు మరణిస్తాడు. అప్పటి నుండి శల్య సారథ్యం అనే నానుడి ప్రచారంలోకి వచ్చింది.– సి. ఎన్. మూర్తి,సీనియర్ పాత్రికేయులు -
కొండ హారతి
అది శేషాచలం కొండలకు కూత వేటు దూరంలో ఉన్న గ్రామం. ఆ ఊరి అబ్బాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఆ అబ్బాయికి కేరళ అమ్మాయితో పెళ్ళి జరిగింది. ఆ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగి.మొదటిసారిగా ఆ అమ్మాయి అత్తగారింటికి కారులో బయల్దేరింది. ఆ ఊర్లో ప్రతి ఇంటి ముందరో, వెనకాలో కొబ్బరిచెట్లు ఉండటం గమనించింది. చిన్నపిల్లలాగా గంతులేస్తూ కారును ఆపమని కోరింది. గబగబా ఒక కొబ్బరిచెట్టు దగ్గరకు వెళ్ళి చేత్తో తడిమి పరవశించిపోయింది. ‘మా కేరళలో లాగా ఇక్కడా కొబ్బరి చెట్లు ఉన్నాయి. చాలా సంతోషం. ఈ నేల కొబ్బరిచెట్లకు అనుకూలమైనదా’ అని అడిగింది. ఆమెను ఎప్పుడూ అంత ఆనందంగా ఉండటం చూడలేదు భర్త. పక్కనే ఉన్న భర్త ‘అంత అనుకూలమైన నేల కాదు కానీ, మా ఊర్లో ఈ కొబ్బరి చెట్లను పెంచడానికి ఓ కారణం ఉంది. మా నాన్నగారు వేంకటేశ్వర స్వామి భక్తుడు. ప్రతి శనివారం ఉపవాసం ఉండేవాడు. నుదుటిన నామం పెట్టేవాడు. ఆ రోజు ఉదయం శేషాచలం కొండలకి నేతి దీపాల హారతి ఇచ్చే వాడు. దాంతోపాటు కొబ్బరికాయ కూడా కొట్టేవాడు.ఒక్కోసారి, పట్టణం నుంచి కొబ్బరికాయ తెచ్చేది మరిచే వాడు. అలా కొబ్బరికాయ తీసుకురాని రోజు మా అమ్మ చాలా బాధపడేది. ఆ వారమంతా ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉండేది.అది గమనించిన మా నాన్న ‘ఇంట్లోనే కొబ్బరి చెట్టు నాటితే ఆ సమస్యనుంచి బయటపడవచ్చు కదా’ అని భావించాడు. అనుకున్నట్లే చేశాడు. ఇది చిన్న ఊరు కాబట్టి, ఒకర్ని చూసి మరొకరు కొబ్బరి చెట్లు నాటడం మొదలయ్యింది. అలాగే ప్రతి శనివారం కొండకి హారతి పట్టి టెంకాయ కొట్టడం అందరి ఇండ్లలోనూ అలవాటుగా మారింది’’ అని చెప్పాడు.‘అలాగా’ అని ఆశ్చర్యపోవడం ఆమె వంతయ్యింది.ఇద్దరూ ఇంటికి వెళ్ళి కాళ్ళూచేతులూ కడుక్కుంటూ ఉండగా– ఇంతలో ఆమె అత్తమామలు పిలవడంతో మిద్దెమీదకు వెళ్ళారు. వారు అప్పటికే నేతి దీప హారతికి అంతా సిద్ధం చేసి ఉన్నారు. పళ్ళెంలో దీపం వెలిగించి కొండకి హారతి ఇచ్చి, టెంకాయ కొట్టి గోవింద నామస్మరణలు చేశారు. ‘ఎంత అదృష్టవంతులు ఇక్కడి వారు, ఆదిశేషుడి రూపంలో ఉన్న శేషాచలం కొండని రోజూ చూసే భాగ్యవంతులు’ అని వారితో పాటు గోవింద నామస్మరణలు చేసింది. దైవభక్తి కల్గిన కోడలు దొరికిందని అత్తమామలు మురిసిపోయారు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు -
ఆధ్యాత్మికతతో సార్థక జీవనం
జీవిత లక్ష్యం, ఆధ్యాత్మికత ఒకదానికొకటి విడదీయలేనివి. సాధారణంగా మనం జీవిత లక్ష్యం అంటే లౌకిక విజయాలైన ఉద్యోగం, డబ్బు, హోదా తదితరాలే అనుకుంటాము, కానీ; ఆధ్యాత్మిక లక్ష్యం పరమార్థాన్ని వెతుకుతుంది. లౌకిక లక్ష్యాలు, సౌకర్యాలను ఇస్తాయి, కానీ ఆధ్యాత్మిక లక్ష్యం సంతృప్తిని ఇస్తుంది.బాహ్యంగా ఎంత ఎదిగినా, అంతరంగంలో ఆధ్యాత్మికత లేకపోతే జీవితం అసంపూర్ణంగానే అనిపిస్తుంది. అందుకే, బాహ్య వృద్ధిని అంతర్గత ప్రశాంతతతో ముడిపెట్టడమే నిజమైన జీవిత లక్ష్యం కావాలి. లౌకిక లక్ష్యం నేను ఏమి సాధించాలి?అనే ప్రశ్నపై ఆధారపడి ఉంటుంది. ఇది బయటి ప్రపంచంలో గుర్తింపును ఇస్తుంది. ఆధ్యాత్మిక లక్ష్యం నేను ఎవరు? అనే ప్రశ్నపై ఆధారపడి ఉంటుంది. ఇది అంతరంగంలో శాంతిని, సత్యాన్ని వెతుకుతుంది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే ‘ఆధ్యాత్మికత అంటే జీవితాన్ని మరింత అర్థవంతంగా జీవించడం’.మానవ జన్మ అనేది సృష్టిలో అత్యంత శ్రేష్ఠమైనది. సాధారణంగా మనిషి తన జీవితాన్ని ఆహార, నిద్ర, భయ, మైథునాలతోనే గడిపేస్తుంటాడు. కానీ, వీటికి అతీతంగా నేను ఎవరు? నా పుట్టుకకు పరమార్థం ఏమిటి?– అని ఆలోచించడమే ఆధ్యాత్మికతకు తొలి అడుగు. జీవిత లక్ష్యం కేవలం భౌతిక విజయాలకు పరిమితం కాకుండా, ఆధ్యాత్మికతతో మేళవించినప్పుడు మాత్రమే పరిపూర్ణత సిద్ధిస్తుంది. మానవ జీవితంలో రెండు రకాల ప్రయాణాలు ఉంటాయి. ఒకటి బాహ్య ప్రపంచంలో సాగే ప్రయాణం, రెండోది అంతరంగంలో సాగే అన్వేషణ. చదువు, ఉద్యోగం, సంపాదన, కుటుంబం సామాజిక హోదా. ఇవి శరీరానికి, మనస్సుకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తాయి. ఆధ్యాత్మిక లక్ష్యం– మనశ్శాంతి, ఆత్మజ్ఞానం, సార్వత్రిక ప్రేమ. ఆత్మకు ఇచ్చే తృప్తి అందిస్తుంది.భారతీయ సంప్రదాయంలో మోక్షం అనేది అత్యున్నత జీవిత లక్ష్యంగా పరిగణించబడుతుంది. మోక్షం అంటే మరణం తర్వాత వచ్చేది మాత్రమే కాదు., జీవించి ఉండగానే రాగద్వేషాల నుండి, అజ్ఞానం నుండి విముక్తి పొందడం. తనలోని పరమాత్మను గుర్తించి, ప్రకృతితో మమేకమవ్వడమే ఆధ్యాత్మిక ప్రయాణ గమ్యం.. జీవిత లక్ష్యం ఒక అందమైన భవనం అయితే, ఆధ్యాత్మికత అనేది దానికి బలమైన పునాది. పునాది లేని భవనం ఎలా కూలిపోతుందో, ఆధ్యాత్మికత లేని లౌకిక విజయం కూడా అంతే అస్థిరమైనది.బాహ్యవృద్ధిని అంతర్గత ప్రశాంతతతో ముడిపెట్టడమే పరిపూర్ణమైన జీవన విధానం. చేతులు పనిలో ఉండాలి, మనసు భగవంతునిపై (అంతర్గత శాంతిపై) ఉండాలి. ఇదే నిజమైన యోగం. భౌతిక ప్రపంచంలో బాధ్యతలను నెరవేరుస్తూనే, అంతరంగంలో ఆధ్యాత్మిక దీపాన్ని వెలిగించుకున్నప్పుడే మనిషి జీవన యానం ధన్యమవుతుంది.సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించే శక్తిని ఆధ్యాత్మికత ఇస్తుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు, ఫలితం మీద ఆశ లేకుండా కర్మను ఆచరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన ఉన్న వ్యక్తి తన లక్ష్య సాధనలో అధర్మానికి తావివ్వడు. సత్యం, అహింస, ధర్మం అనే పునాదుల మీద తన విజయాన్ని నిర్మించుకుంటాడు. తన ఎదుగుదల కేవలం తన కోసమే కాకుండా, సమాజ శ్రేయస్సు కోసం కూడా అని గుర్తించడం ఆధ్యాత్మికత నేర్పే గొప్ప పాఠం.ఆధ్యాత్మికత అంటే సంసారాన్ని వదిలి అడవులకు వెళ్లడం కాదు. మనం చేసే ప్రతి పనిలోనూ దైవత్వాన్ని చూడటం, నిస్వార్థంగా వ్యవహరించడం. అంతటా ఆ పరమాత్మనే ఉన్నాడు అనే భావనను అలవరుచుకోవడమే ఆధ్యాత్మికత సారాంశం. ఇది మనిషిని అహంకారం నుండి విముక్తుడిని చేసి, వినయాన్ని ప్రసాదిస్తుంది. జీవిత లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మనిషి అనేక ఒత్తిళ్లకు, ఓటములకు లోనవుతాడు. అటువంటి సమయంలో ఆధ్యాత్మికతఒక దిక్సూచిలా పనిచేస్తుంది:– ఆనంద ‘మైత్రేయ’మ్ -
అందం కోసం ఫేస్ప్యాక్గా రొట్టెల పిండి..!
వయసుతో పాటు వచ్చే ముడతలను తగ్గించడానికి బ్యూటీ క్లినక్స్లో సాధారణంగా గాఢమైన యాసిడ్లను వాడుతుంటారు. కానీ, ‘బీక్మన్ 1802’ సంస్థ ‘బెటర్–ఏజింగ్’ అనే కొత్త విధానంతో ముందుకు వచ్చింది. ఈ సంస్థ తాజా ఆవిష్కరణ మిల్క్ ఆర్ఎక్స్ కంప్రెస్. ఇది మాస్క్లా మాత్రమే కాకుండా, మెడికల్ గ్రేడ్ ట్రీట్మెంట్లా పనిచేస్తుంది. చాలా షీట్ మాస్క్లు నీళ్లలా ఉండే పల్చని సీరమ్లతో తయారవుతాయి. ఇవి త్వరగా ఆరిపోతాయి. కానీ మిల్క్ ఆర్ఎక్స్ కంప్రెస్, క్రీమ్తో నిండిన సాంకేతికతతో రూపొందించినది. రెనెక్సోసోమ్ కాంప్లెక్స్, మేకపాలు, మొండో గ్రాస్ పదార్థాలు ఈ మాస్క్కి ప్రత్యేకం. రెనెక్సోసోమ్ కాంప్లెక్స్ రెటినాల్ కంటే నాలుగు రెట్లు వేగంగా కొలాజెన్ను ఉత్పత్తి చేసి, చర్మంపై ముడతలను తగ్గిస్తుంది. మేకపాలలో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు, ప్రీబయోటిక్స్చర్మం పీహెచ్ స్థాయిని సమతుల్యం చేసి, దెబ్బతిన్న చర్మాన్ని కేవలం 20 నిమిషాల్లోనే రిపేర్ చేస్తాయి. మొండో గ్రాస్ చర్మానికి అవసరమైన తేమను అందించి, రక్షణ కవచంలా పనిచేస్తుంది.ఈ మాస్క్ ముఖానికి వేసుకున్నప్పుడు చల్లటి అనుభూతిని ఇస్తుంది. మంచు నీటిలో ముఖాన్ని ఉంచినట్లుగా చల్ల బరుస్తూ, రక్తనాళాలను కుంచించుకుపోయేలా చేస్తుంది. దీనివల్ల చర్మంపై ఉండే ఎరుపుదనం తగ్గి ఉపశమనం కలుగుతుంది. చర్మంపై దీర్ఘకాలిక వాపును కూడా ఇది సమర్థంగా అడ్డుకుంటుంది. ఈ మిల్క్ ఆర్ఎక్స్ కంప్రెస్ డిజైన్ కూడా భిన్నంగా ఉంటుంది. ఇందులో ప్రత్యేకమైన చిన్ స్ట్రాప్ ఉంటుంది. ఇది గడ్డం కింద చర్మాన్ని పట్టి ఉంచి, ముఖానికి తీరైన ఆకారాన్ని ఇస్తుంది. ఈ మాస్క్ను వారానికి ఒకసారి వాడటం వల్ల కొలాజెన్ స్థాయి గణనీయంగా పెరిగి, చర్మం యవ్వనంగా, కాంతి మంతంగా మారుతుంది.రొట్టెల పిండి ఫేస్ప్యాక్ప్రాచీన రోమన్ ప్రజలు రొట్టెల పిండిని ఫేస్ప్యాక్గా ఉపయోగించేవారు. రొట్టెల పిండిని ముఖానికి పట్టించుకోవడం వల్ల ముఖం ముడతలు పడకుండా ఉంటుందని నమ్మేవారు. క్రీస్తుశకం ఒకటో శతాబ్దికి చెందిన రోమన్ చక్రవర్తి ఓథో ప్రతిరోజూ స్నానానికి ముందు గడ్డం మీసం నున్నగా గీసేసుకుని, ముఖానికి రొట్టెల పిండి పట్టించుకునేవాడట!తాజా మెంతి ఆకులను మెత్తగా రుబ్బి రాత్రి పడుకునే ముందు ముఖానికి పట్టించి ఉదయం కడగాలి. మెంతి ఆకులను వాడేటప్పుడు వాటిని ముందుగా శుభ్రం చేయాలి. వాటి మీద చల్లిన క్రిమిసంహారక మందుల అవశేషాలు లేకుండా శుభ్రం చేసిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేయాలి. ఈ ప్యాక్ క్రమం తప్పకుండా మూడు వారాల పాటు వేస్తే మొటిమలు, బ్లాక్హెడ్స్, వైట్హెడ్స్ తొలగి చర్మం నునుపుగా మారుతుంది. -
నవతరానికి తెలియని... నిజామ్ కాలపు కళాకారిణి!
ఎక్కడో ఆస్ట్రేలియాలో పుట్టి, వయోలా వాద్యం నేర్చుకొన్న ఓ అమ్మాయి... ఓ అమెరికన్ సినిమాలో నేపథ్యంలో వినిపించిన ప్రసిద్ధ గాయకుడు నుస్రత్ ఫతే అలీ ఖాన్ పాట విని, దక్షిణాసియా ప్రాంతపు ప్రత్యేక సంగీత రీతులపై ప్రేమ పెంచుకుందంటే నమ్మగలరా? బ్రిటన్ చేరిన ఆ అమ్మాయి ఆ సంగీతాభిరుచిని కొనసాగించింది. ఏకంగా సంగీతంలోనే పరిశోధన చేసి, ఇవాళ నిజామ్ కాలపు సంగీతం, సంగీతజ్ఞుల కథలపై సాధికారిక రచయిత్రిగా మారింది. 18వ శతాబ్దంలో మొఘలాయీల యుగం నుంచి బ్రిటీషు పాలనా శకంలోకి భారతదేశం జారిపోతున్న వేళ... మన సంగీతం, సంగీతజ్ఞులు, తవాయిఫ్ల జీవితాలలో సాగిన ప్రయాణం, వచ్చిన మార్పులకు అక్షర రూపం ఇచ్చింది. స్లయిడ్ల రూపంలో అలనాటి చిత్రపటాలు, ఛాయాచిత్రాలు చూపిస్తూ, ఆ కథలన్నీ ఆమె చెబుతుంటే, ఎవరైనా కళ్ళు, చెవులు అప్పగించక తప్పదు.మరీ ముఖ్యంగా చాలామందికి తెలియని మన హైదరాబాదీ చరిత్ర చెబుతుంటే, నేటికీ నాంపల్లిలో ఆనవాళ్ళున్న నిజామ్ కాలపు అపురూప కళాకారిణి – కవయిత్రి – పలుకుబడి గల వేశ్యామణి మాహ్ లఖా బాయ్ (1768-1824) జీవితం వివరిస్తుంటే అబ్బురంగా అనిపిస్తుంది. లండన్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన క్యాథరిన్ బట్లర్ స్కోఫీల్డ్తో మన భాగ్యనగరం నడిబొడ్డున విద్యారణ్య స్కూల్ విశాల ప్రాంగణంలో ‘మంథన్’ సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రసంగం చరిత్ర, సంగీత, సంస్కృతీ ప్రియులకు అక్షరాలా అలాంటి అనుభవాన్నే అందించింది.మనకు తెలీని మన చరిత్ర... ఓ పాశ్చాత్య మహిళ పరిశోధన...క్యాథరిన్ ప్రాథమికంగా దక్షిణాసియా ప్రాంత సంగీతం, చరిత్రను అధ్యయనం చేసి, అక్షరబద్ధం చేస్తున్న చరిత్రకారిణి. ఇప్పటి వరకు లోచూపుకు నోచుకోని విస్తారమైన భారతీయ రచనలు, అలాగే అలనాటి చిత్రకారులు గీసిన బొమ్మల లాంటి విజువల్ సోర్స్లపై ఆమె ప్రధానంగా దృష్టి పెట్టారు. మౌలికమైన పరిశోధన సాగిస్తున్నారు. అందులో భాగంగా ఆమె మన హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తూ వస్తున్నారు. సంగీతంతో ముడిపడిన పలువురు పాతకాలపు కళాకారుల కథలను జనం ముందుకు తెస్తున్నారు. ఆ క్రమంలోనే ఆనాటి పరిస్థితులు, ఆ కాలపు వ్యక్తుల స్వతంత్రత, అనుబంధాలు, అనురాగాలు, అధికార వ్యవస్థ అన్నింటినీ అక్షరబద్ధం చేసి, చర్చకు పెట్టడం రచయిత్రిగా, పరిశోధకురాలిగా క్యాథరిన్ ప్రత్యేకత.ప్రస్తుతం క్యాథరిన్ లండన్లోని సుప్రసిద్ధ కింగ్స్ కాలేజ్లో డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యూజిక్కు హెడ్. దాదాపు 25 మంది దాకా పీహెచ్డీ విద్యార్థులు చరిత్ర, మానవశాస్త్రం, దక్షిణాసియాలోని పలు సంగీత సంస్కృతుల ప్రదర్శన లాంటి వివిధ అంశాలపై ఆమె సారథ్యంలోనే పరిశోధన చేయడం విశేషం. మొఘల్, దక్కనీ, దక్షిణాసియాలో వలస పాలకుల కాలపు కళలు, సంస్కృతి తదితర అంశాలపై క్యాథరిన్ ప్రసంగాలకు బోలెడంత డిమాండ్. బ్రిటీష్ లైబ్రరీ నుంచి మన జైపూర్ లిటరరీ ఫెస్టివల్ దాకా ఆమె ప్రసంగించని వేదిక లేదు. ఆఫ్ఘనిస్తాన్లో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం సంగీతం, సంగీత కళాకారులపై ఆంక్షలు విధించినప్పుడు దాన్ని నిరసిస్తూ, అంతర్జాతీయ వేదికపై అందరినీ కూడగట్టడంలోనూ ఆమె కీలకపాత్ర పోషించడం విశేషం. క్యాథరిన్ పరిశోధించి రాసిన ‘మ్యూజిక్ అండ్ మ్యుజీషియన్స్ ఇన్ లేట్ మొఘల్ ఇండియా: హిస్టరీస్ ఆఫ్ ది ఎఫిమెరల్ (1748 – 1858)’ అనేక ఇతర అంశాలతో పాటు మన నిజామ్ పాలనా కాలపు హైదరాబాద్ సంగతులనూ పాఠకుల ముందుకు తెచ్చింది. అందులో - మొఘల్ చక్రవర్తుల ఏలుబడిలో, ఆ పైన బ్రిటీషు వారి ఆరంభ కాలంలో... ఢిల్లీ నుంచి లక్నో, హైదరాబాద్, జైపూర్ దాకా వివిధ ప్రాంతాల్లో, పర్షియన్, వ్రజ భాష, ఉర్దూ, ఇంగ్లీషుల్లో సాగిన సంగీత రచనల ఆధారంగా తొమ్మిదిమంది సంగీత కళాకారుల జీవితాలను పాఠకుల ముందు పెట్టారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మొఘలాయీల యుగం నుంచి బ్రిటీషు వారి శకంలోకి మారుతున్న ఆ కాలంలో మన సాంస్కృతిక, కళా రంగం ఎలా దానికి ప్రతిస్పందించిందన్నది ఆ రచన ప్రధానమైన దృష్టి కోణం.అపురూపమైన ఆ పరిశోధనాత్మక కృషిని ప్రపంచ ప్రసిద్ధ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ 2022లో పుస్తకంగా ప్రచురించింది. ఆశ్చర్యపరిచే ఆ కృషికి అనుబంధంగానే, హైదరాబాద్లోని ‘మంథన్’ సంస్థ ఆధ్వర్యంలో ‘స్టోరీస్ ఆఫ్ మ్యూజికల్ లైఫ్ ఇన్ నిజామీ హైదరాబాద్ (క్రీ.శ. 1780-1830)’ అన్న అంశంపై ఏప్రిల్ 24న క్యాథరిన్ తన తాజా ప్రసంగం చేశారు. ఎంతో లోతైన వివరాలు, విశ్లేషణ, అందుకు ఆధారభూతమైన చరిత్ర గ్రంథాలు, పరిశోధనలో తనకు కలిగిన స్వీయాభిప్రాయాలను సభికులతో ఆమె పంచుకున్నారు.ప్రాణం పోసుకున్న నిజామ్ గజల్ గాథలు!సరిగ్గా గంటసేపు సాగిన ప్రసంగంతో అప్పటి నిజామ్ కాలానికి తీసుకువెళ్ళారు క్యాథరిన్. పరిశోధనలో భాగంగా హైదరాబాద్లోని సుప్రసిద్ధ సాలార్ జంగ్ మ్యూజియమ్, ఉస్మానియా యూనివర్సిటీ మొదలు లండన్ లోని బ్రిటీష్ లైబ్రరీ, అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీ దాకా అనేక చోట్ల నుంచి ఆమె ఎంతో అరుదైన సమాచారం సేకరించారు. అలా తాను సేకరించిన అనేక ప్రాచీన ఉర్దూ, పర్షియన్ రచనా ప్రతులలోని బొమ్మలు, సంగతులను ఆమె తన ప్రసంగంలో పంచుకున్నారు. మాటల్లో సందర్భానుసారంగా... నిజామ్ కాలపు చిత్రకారులు వెంకటచలం సహా పలువురు గీసిన చిత్రాలను ప్రదర్శించడంతో ఆనాటి సంగతులు కళ్ళకు కట్టినట్టయింది. జగత్ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ రాజా దీన్ దయాళ్ తీసిన అలనాటి హైదరాబాద్ ఛాయాచిత్రాలనూ ఉపయోగించారు.ప్రసిద్ధ నర్తకి మాహ్ లఖా బాయ్, ఆమెకు సంగీతం నేర్పిన గురువు - తాన్సేన్ వంశీకుడైన ఖుషాల్ ఖాన్ ‘అనూప్’, వారి గురు – శిష్య సంబంధం, అలాగే ఆమెతో సాన్నిహిత్యం సాగించిన మరాఠా యోధుడు రాజా రావ్ రన్భా తదితరులను వెరసి, ఆమె తన ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించించారు. వెరసి, అలనాటి నిజజీవిత పాత్రలు అనేకం ఆ అనర్గళ ప్రసంగంలో ప్రేక్షకుల ముందు ప్రాణం పోసుకున్నాయి. నిజామ్ చరిత్రలో ప్రసిద్ధుడైన మీర్ ఆలమ్ మరణానంతరం మహారాజా చందూలాల్ ప్రధానమంత్రి అయ్యారు. “బ్రిటీషు, రాజకీయ అతిథులను ఆకట్టుకొనేందుకు ఆయన మాహ్ లఖా బృందంతో భారీ నృత్య, గాన ప్రదర్శనలు ఏర్పాటు చేయించేవారు. . ఆయనకూ, మాహ్ లఖా బాయ్కీ అత్యంత సన్నిహిత సంబంధం ఉండేది” అని క్యాథరిన్ పాత కథలు తవ్వి పోశారు.1798లో నిజామ్కూ, ఈస్టిండియా కంపెనీ వారికీ మధ్య ఒప్పందం కుదిరింది. నిజామ్ సంస్థాన రక్షణ బాధ్యతలు చేపట్టిన బ్రిటీషు సేనలు ఆ నిమిత్తం అన్నట్టుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో దండు విడిచాయి. ఇక, హైదరాబాద్లో ప్రత్యేక బ్రిటీషు రాజప్రతినిధికి బ్రిటీష్ రెసిడెన్సీ ఏర్పాటైంది. ఆ సంగతులతో పాటు భారతీయ సంగీతం, సంగీత కళాకారులపై బ్రిటీషు వారి ప్రభావాన్ని క్యాథరిన్ ప్రస్తావించారు. మన సుదీర్ఘమైన రాగప్రదర్శన బ్రిటీషర్లకు అర్థం కావడం కష్టం. అందుకని, అప్పట్లో తవాయిఫ్లు గజల్స్ లాంటివి గానం చేసేవారు. నృత్యగీతాలతో అలరించేందుకు ప్రయత్నించేవారు అని తెలిపారు. ఆనాటి పాపులర్ నృత్యగీతాల బాణీని బ్రిటీషర్లు ఇట్టే పట్టుకొని, దాన్ని ఎలా తమదైన పద్ధతిలో పాడేదీ క్యాథరిన్ స్వయంగా ఆలపించి వినిపించి, సభికుల కరతాళధ్వనులు అందుకున్నారు.నాంపల్లి, మౌలాలీ సాక్షిగా... నేటికీ ఆ ఆనవాళ్ళు“1738 నాటికే... గోల్కొండ ప్రాంతం ఎంతో ప్రముఖమైనది. హైదరాబాద్ చాలా కీలకమైన కేంద్రం. పంజాబీ ఖత్రీల మొదలు ఇరానియన్ల వరకు ఎన్నెన్నో ప్రాంతాలు, వర్గాలకు చెందిన పలువురు మేధావులు, అధ్యయనశీలురు, సైనిక యోధులు, అద్భుతమైన వృత్తినిపుణులు హైదరాబాద్కు వలస వస్తుండేవారు. అదీ హైదరాబాద్ ఘన చరిత్ర” అని క్యాథరిన్ విశ్లేషించారు. 1768లో జన్మించిన మాహ్ లఖా బాయ్ జీవితంలోని ముఖ్యాంశాలను ఆమె వివరించారు. “1824లో చనిపోయే వరకు నాంపల్లి ప్రాంతంలోనే మాహ్ లఖా నివసించారు. ఆమె నమ్మి, ప్రార్థించిన మౌలాలీకి భక్తిసమర్పణంగా మరణానంతం సికింద్రాబాద్లోని మౌలాలీ గుట్ట పాదాల చెంత తన తల్లి సమాధి పక్కనే ఆమె భౌతికకాయాన్ని కూడా సమాధి చేశారు. ఇవాళ్టికీ వాటిని చూడవచ్చు.”స్వీయ ఉర్దూ గజల్స్ను సమగ్రమైన సంపుటిగా పుస్తక రూపంలో తెచ్చిన తొలి భారతీయ వేశ్యామణి (తవాయిఫ్) మాహ్ లఖా బాయ్. నిజామ్ సంస్థానంలో సాక్షాత్తూ పాలకులకే ప్రభుత్వ విధానాలు, దౌత్యానికి సంబంధించి సలహాలు, సూచనలు అందించిన బహుముఖ ప్రజ్ఞావంతురాలు. నాటి హైదరాబాద్ నిజామ్ సంస్థానంలోని ఓ ప్రియమైన వేశ్యకు దత్త పుత్రికగా పెరిగిన మాహ్ లఖా అత్యుత్తమ గురువుల వద్ద సమగ్ర శిక్షణ పొందారు. ఆ రోజుల్లోనే కళాకారిణిగా, చింతనాశీలిగా, గుర్రపుస్వారీ, ఈటె విసరడం, ధనుర్విద్య, వేటాడడంలో దిట్టగా, చివరకు యుద్ధం సైతం చేయగల వీరవనితగా ఎదిగిన తీరు ఇవాళ తలుచుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ రోజుల్లోనే ఆమెను రాజాస్థానంలో కులీనుల వర్గంలోని పెద్దల్లో ఒకరి (సీనియర్ ఉమ్రాహ్)గా నిజామ్ రాజు చేర్చుకోవడం విశేషం.ఆ రోజుల్లో నిజామ్ రాజు ఆమెకు ఇచ్చిన జాగీర్లలో... నేటి హైదర్ గూడా, చందానగర్, సయ్యద్ పల్లి, అడికిమెట్ తదితర ప్రాంతాలున్నాయి. మొత్తానికి, కవయిత్రిగా, కథక్ నర్తకిగా, హిందుస్తానీ శాస్త్రీయ గాయనిగా, ఆ లలిత కళలన్నీ ఆడపిల్లలకు నేర్పేందుకు పాఠశాలలు స్థాపించిన వ్యక్తిగా మాహ్ లాఖాది విలక్షణమైన కథ. ప్రస్తుతం నాంపల్లిలో బజార్ ఘాట్ దగ్గర, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్ కార్యాలయానికి సమీపంలో నెలకొన్న ఎం.ఎ.ఎం. గవర్నమెంట్ మోడల్ జూనియర్ కాలేజ్ ప్రాంగణం ఒకప్పుడు మాహ్ లాఖా కార్యక్షేత్రం. అక్కడే ఆమె ఎంతోమంది వనితలకు ఆట, పాటల్లో శిక్షణ నిచ్చినట్టు చరిత్ర.రెండొందల ఏళ్ళ నాటి మన రాతప్రతి... బ్రిటన్లో భద్రంగా!“నిజానికి, ఆమె అసలు పేరు చందా బీబీ. చంద్రబింబం లాంటి చెక్కిళ్ళు గలది అనే అర్థంలో నిజామ్ ఆమెకు పెట్టిన పేరు - మాహ్ లఖా బాయ్. ఆమె తల్లి రాజ్ కున్వర్. ఆ రోజుల్లో రాజ్పుతానా నుంచి వలస వచ్చిన రాజ్ కున్వర్ సంతానం లేని తన చెల్లెలికి మాహ్ లఖాను దత్తత ఇచ్చింది. ఆ చెల్లెలు నాటి నిజామ్కు ప్రధాని అయిన నవాబ్ రుక్న్ ఉద్దౌలాకు ప్రీతిపాత్రమైన వేశ్యామణి. అలా మాహ్ లఖా బాయ్ నిపుణులైన గురువుల వద్ద అత్యుత్తమ శిక్షణ పొందేందుకు వీలు కలిగింది. ఆ రోజుల్లో నిజామ్ మొదలు సంస్థాన ప్రధానమంత్రులు, ఉన్నత సైనికాధికారులు, చివరకు బ్రిటీష్ రెసిడెంట్ వరకు పలువురితో మాహ్ లఖాకు ఎంతో సాన్నిహిత్యం ఉండేది. ఫలితంగా, ఆమె ఎంతో పేరు, పలుకుబడి గల తవాయిఫ్గా రాణించింది.టిప్పు సుల్తాన్పై తమ సంయుక్త సేనల విజయాన్ని ఆస్వాదిస్తూ బ్రిటీషు వారికి నిజామ్ సంస్థానం భారీ విందు, వినోద కార్యక్రమం ఏర్పాటు చేసింది. 1799 అక్టోబర్ 18 రాత్రి నిజామ్ సంస్థాన ప్రధాన మంత్రి మీర్ ఆలమ్ నివాసంలో ఆ అపూర్వ గానాబజానా సాగింది. ఆ నృత్య ప్రదర్శన సమయంలో అందమైన క్యాలిగ్రఫీ చేతిరాతతో రూపొందిన తన గజల్స్ రాతప్రతిని ఆనాటి అసిస్టెంట్ బ్రిటీష్ రెసిడెంట్... సర్ జాన్ మాల్కోమ్కు ఆత్మీయంగా బహూకరించారు మాహ్ లాఖా బాయ్. అలా ఆ రోజు ఆమె స్వయంగా సంతకం చేసి, కానుకగా ఇచ్చిన ఆ గజల్స్ సంపుటి రాతప్రతి ఇప్పటికీ బ్రిటీష్ లైబ్రరీలో భద్రంగా ఉంది” అని క్యాథరిన్ చెబుతుంటే ‘మంథన్’ నిర్వహించిన ఈ ప్రసంగానికి హాజరైన సభికులు అబ్బురంగా చెవులప్పగించి విన్నారు. అలాగే, “మాహ్ లఖా బాయ్ ప్రోద్బలంతో ఆమె గురువు ఖుశాల్ ఖాన్ అనూప్ ‘రాగ్ దర్శన్’ అనే సంగీత శాస్త్ర గ్రంథం రచించారు. ఆ రచన రాతప్రతి పెన్సిల్వేనియా యూనివర్సిటీ లైబ్రరీలో నేటికీ పదిలపరచబడింది” అని ఆమె వివరించారు.ఆసక్తికరమైన ఆలోచనల ‘మంథన్’ప్రపంచ ప్రసిద్ధులైన ఆలోచనాపరులు మనసు విప్పి మాట్లాడే వేదికగా ‘మంథన్’ చిరకాలంగా భాగ్యనగర వాసులకు సుపరిచితం. సాహిత్యం, సంగీతం, సంస్కృతి, సమాజం... ఇలా పౌర జీవితాన్ని ప్రభావితం చేసే అన్ని రకాల అంశాలపైనా ఎప్పటికప్పుడు ప్రముఖులను ఆహ్వానించి, వారితో ప్రసంగాలు, ప్రశ్నోత్తరాలు, చర్చలు నిర్వహించడం కొన్నేళ్ళుగా ‘మంథన్’ చేస్తున్న మంచి పని. క్రియాశీలమైన ఈ సంభాషణల ద్వారా ప్రజాస్వామ్య, లౌకిక విలువలను బలోపేతం చేయాలన్నది ఈ పౌర సంస్థ ఆశయం. అందులో భాగంగానే, ఎప్పటికప్పుడు తాజా ప్రచురణలతో ముందుకొచ్చిన ప్రసిద్ధ పుస్తక రచయితలతో, అధ్యయనశీలుర ప్రసంగాలు, సంభాషణలు నిర్వహిస్తూ వస్తోంది. ఈ ఏప్రిల్లో ఇటీవలే ప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడు టి.ఎం. కృష్ణతో ఆలోచనాత్మక సంవాదం సాగించిన ‘మంథన్’, వారం తిరిగేసరికి సంగీత చరిత్రకారిణి క్యాథరిన్ బట్లర్ స్కోఫీల్డ్తో ఈ ఆసక్తికరమైన సంభాషణ జరపడం విశేషం. అయితే, ఇలాంటి అపురూప కార్యక్రమాలపై మీడియాలో ఎక్కడా మచ్చుకైనా మొక్కుబడిగా మూడు ముక్కలు కనిపించకపోవడమే విషాదం.రెంటాల జయదేవ(చదవండి: సమానత్వానికి కేరాఫ్గా ఆ వివాహం..!) -
సమానత్వానికి కేరాఫ్గా ఆ వివాహం..!
చిన్న పనే చాలా పెద్ద మార్పుకు అంకురార్పణ అవ్వడమే గాక ఆలోచింపచేసేలా చేస్తుంది కూడా. కొన్ని నినాదాలు మాటలకే పరిమితమైపోతాయి. కానీ కొందరు వాటిని ఆచరణలో పెట్టి చూపించి ఆదర్శంగా నిలుస్తారు. అలాంటి ఘటనే గుజరాత్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..గుజరాత్లోని నార్నౌల్లోని ఒక ప్రత్యేకమైన వివాహ పూర్వ ఆచారం అందర్నీ ఆకర్షించడమే కాదు లింగ సమానత్వానికి శక్తిమంతమైన చిహ్నంగా నిలిచింది. బీకామ్ పట్టభద్రురాలైన నేహా జాంగ్రా, తన పెళ్లికి ఒక రోజు ముందు, శనివారం రాత్రి తన పరిసర ప్రాంతాల్లో ఆడ గుర్రంపై ఊరేగుతూ కనిపించింది. సంగీతం, ఉత్సవ నృత్యాలతో సాగిన ఈ ఊరేగింపు ఆనందం, గర్వంతో నిండిన వాతావరణాన్ని సృష్టించింది. ఆమె తండ్రి హరిరామ్ జాంగ్రా చిన్న కిరాణ దుకాణం నడుపుతుంటారు.2017లో తన పెద్ద కుమార్తె వివాహ సమయంలో తానే ఈ ఆచారాన్ని మొదలుపెట్టానని చెప్పారు. సాధారణంగా ఇలాంటి ఆచారాలు కొడుకుల కోసమే ఉంటాయి కాబట్టి, అప్పట్లో ప్రజలు ఆశ్చర్యపోయారని అన్నారు. తాను కూతుళ్లు కూడా సమాన గౌరవానికి, అవకాశాలకు అర్హులని గట్టిగా నమ్ముతానని అన్నారు.‘బేటీ బచావో, బేటీ పఢావో’ ప్రచార స్ఫూర్తికి అనుగుణంగా తన ఇద్దరు కుమార్తెలకు నాణ్యమైన విద్యను అందించానని ఆయన అన్నారు. "ఇది కేవలం ప్రతీకాత్మకం కాదు; ఇది నిజ జీవితంలో సమానత్వాన్ని ఆచరించడం గురించి," అని ఆయన నొక్కి చెప్పారు. అలాగే వధువు నేహా తల్లి సునీత ఇలాంటి కార్యక్రమాలు కుమార్తెల మనోధైర్యాన్ని పెంచుతాయని, విస్తృత సామాజిక మార్పుకు స్ఫూర్తినిస్తాయంటూ ఆనందం వ్యక్తం చేశారు.పెళ్లికి ముందు బంధువులు, ఇరుగుపొరుగు వారు హాజరైన ఒక సామూహిక విందును కూడా ఏర్పాటు చేయడంతో, ఈ ఘటన చిరస్మరణీయంగా నిలిచింది. కాగావడోదరలోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న అహ్మదాబాద్కు చెందిన నిలేష్ కుమార్తో నేహా వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. (చదవండి: అక్కడ రైలులో ప్రయాణించాలంటే ఆక్సిజన్ మాస్క్ తప్పనిసరి..! ఎందుకో తెలుసా..) -
దాపుడు అరలో దాగిన గౌరవం..!
స్త్రీ జీవితంలో అనేక ఖాళీ అరలు ఉంటాయి. కాని స్త్రీ జీవితంలో తప్పక ఉండాల్సిన ఒక ‘దాపుడు అర’ గురించి ఎందరు ఆలోచిస్తారు? ‘తాయి కెళవి’ సినిమాలో ముసలవ్వ ఈ దాపుడు అర మాట్లాడుతుంది. ఆ ఒక్క అర ఎంత ఆత్మవిశ్వాసం ఇస్తుందో కూడా ఈ సినిమా చెప్పింది. ఇది అచ్చంగా ఒక బతుకు గోరే తల్లి కథ.‘తాయి కెళవి’ చూస్తే తెలుగు వారి గొప్పతనం తెలిసొస్తుంది. ఇది గతంలో అంటే 1990లోనే వచ్చిన నామిని సుబ్రహ్మణ్యం నాయుడు ‘బతుకుగోరే తల్లి’, ఆర్.ఎం.ఉమామహేశ్వర రావు ‘బిడ్డలు గల్ల తల్లి’ కథలను గుర్తు చేస్తుంది. పైకి గయ్యాళులుగా కనిపించే ఆ తల్లులు బిడ్డల క్షేమం కోసం లోపల ఎంత దయాళువుగా ఉంటారో పై రెండు కథలు గొప్పగా చూపాయి. అవి సినిమాలుగా తీసి ఉంటే మన గొప్ప తెలిసేది. తమిళంలో ‘తాయి కెళవి’ (జేజమ్మ) గా తీయడం వల్ల ఆ పేరు వారికి దక్కింది.పాటిబండ్ల రజని రాసిన ‘జేబు’ కథలో ఇలాగే ఒక తల్లి ఉంటుంది. ఆమెను అందరూ ‘జేబు రమణమ్మ’ అని పిలుస్తూ ఉంటారు. దానికి కారణం ఆమె తన చిన్నప్పుడు ‘మగవాళ్లకు జేబు ఉన్నట్టుగా ఆడవాళ్లకు ఎందుకు ఉండదు’ అని ప్రశ్నిస్తుంది. మగవాళ్ల బలానికి, అహానికి జేబు కారణం అని, దాని నుంచి పుట్టే డబ్బు కారణమని జేబు రమణమ్మ అర్థం చేసుకుంటుంది. తను మరణించే వరకు తన ఆర్థిక స్వాతంత్య్రం గురించి నిర్లక్ష్యం వహించదు. అంతేకాదు, సొంత కోడలి పేర్న ఉన్న ఆస్తిని కొడుకు అమ్మడానికి చూస్తూ... అమ్మమని కోడల్ని బలవంతం చేస్తుంటే కోడల్ని వారించి ‘నీ ఆస్తి వాడికిచ్చావంటే నువ్వు బానిస బతుకు బతకాల్సి వస్తుంది’ అని చెప్పి, కొడుకు ఆగ్రహానికి గురయ్యి చావు కొని తెచ్చుకుంటుంది. మగవాళ్లు ఆడవాళ్లకు డబ్బు అందనివ్వరు. వారి దగ్గర ఉన్నది లాక్కునే దాకా ఊరుకోరు.‘తాయి కెళవి’ పాత్ర పోషించిన రాధిక ఈ లోకరీతిని పూర్తిగా అర్థం చేసుకుంటుంది. మన దగ్గర పైసలు ఉంటే లోకం మన ముఖం చూస్తుంది, ఖాళీచేతులు ఉన్నవారిని ఈసడిస్తుంది అని గ్రహిస్తుంది. డబ్బు లేనప్పుడు దయచూపని లోకంతో దయగా వ్యవహరించాల్సిన పని లేదనుకుంటుంది. అందుకే కఠినంగా వడ్డీ వసూలు చేస్తుంటుంది. ‘సుఖంగా బతకడానికి డబ్బు కావాలో వద్దో తెలియదు గానీ గౌరవంగా బతకడానికి డబ్బు కావాలి’ అంటుంది. అందుకై మంచంలో ఒక రహస్య అరను ఏర్పాటు చేసుకుంటుంది. పైసా పైసా దాచి ఆ డబ్బుతో బంగారం కొని అదంతా ఆ అరలో భద్రం చేసుకుని ఉంటుంది. ప్రతి స్త్రీకి, గృహిణికి ఈ రహస్య అర అవసరం ఏమిటో సినిమా చూస్తే అర్థమవుతుంది.తాయి కెళవి కుమార్తె సురళిని మొగుడు మూడు తులాల బంగారం ఇవ్వలేదని వదిలేసి ఉంటాడు. అతను కూతురిని పీడించుకుని తింటున్నాడని రాధిక గ్రహిస్తుంది. సహించడం త్యాగం కాదు, బానిసత్వం ఆమె దృష్టిలో. అందుకే కూతురిని తన దగ్గర ఉంచుకుని స్వేచ్ఛాజీవిగా మారుస్తుంది. తల్లిగా తన దగ్గర డబ్బు లేక΄ోతే దీనమైన మాటలు చెప్పి భర్త దగ్గరకు పంపేదేమో. కాని ఈ తల్లి దగ్గర డబ్బు ఉంది. ఆ డబ్బుతో కూతురికి కొత్త జీవితం ఇవ్వగలదు. అందుకే నీచుడైన అల్లుడితో విడాకులు ఇప్పించి రెండో మనువు చేస్తుంది. సొంత డబ్బు కలిగి ఉన్న తల్లికి వచ్చే ధైర్యం ఎలాంటిదో ఈ సినిమా చూపి దోవను సంకేతం చేస్తుంది.‘చదువుకోండి. దానితోపాటు సంపాదించడం నేర్చుకోండి. మీ పర్సులో ఉన్న నాలుగు నోట్లే మీకు రక్షణ. మీ జీతమే మీకు స్వేచ్ఛ. మీరు డబ్బు దాచిన అర మీ పిల్లల జీవితాలు సరిదిద్దే మంత్రదండం’ అని నాలుగు తిట్లు కలిపి మరీ చె΄్తోంది ‘తాయి కెళవి’.– కె.(చదవండి: పెరిమెనోపాజ్ ఎఫెక్ట్: ఈ మధ్య బరువు పెరుగుతున్నారా!) -
ఈ మధ్య బరువు పెరుగుతున్నారా!
చాలామంది మహిళలు అటుఇటుగా మధ్యవయసుకు చేరుతుండగానే కాస్త లావెక్కుతుంటారు. ఈ దశలో వాళ్లకు ఒక సందేహం కూడా వేధిస్తుంటుందీ... ‘మేమేమీ ఎక్కువగా తినడంలేదు. మా ఆహార అలవాట్లలో మార్పులూ లేవు. అయినా ఇలా ఎందుకు బరువు పెరుగుతున్నామం’టూ బాధపడుతుంటారు. ఇలా జరగడానికి కారణాలేమిటో చూద్దాం. నిజానికి మధ్యవయసుకు చేరుతూ... రుతుక్రమం ఆగిపోయేందుకు తొలి దశ అయిన పెరీ–మెనోపాజ్, రుతుస్రావం పూర్తిగా ఆగిపోయే మెనోజ్కూ దగ్గరపడుతున్న సమయంలో అప్పటివరకూ వాళ్లలో స్రవిస్తున్న ఈస్ట్రోజెన్ మోతాదుల్లో తగ్గుదల మొదలవుతుంది. ఈ ఈస్ట్రోజెన్ మోతాదుల్లో తగ్గుదల జీవక్రియలూ (మెటబాలిజమ్), కొవ్వు నిల్వలూ, ఎనర్జీ వెలువడటాలనే పలు అంశాలలో మరికొన్ని మార్పులకు కారణమవుతుంది. మెనోపాజ్ దశలో స్థూలకాయం రావడానికి కారణాలేమిటి?నిజానికి ఈస్ట్రోజెన్ అనే హార్మోన్.... ఇన్సులిన్ చేసే పనిలోనూ, అది వివిధ కణాలకు చేరే తీరుతెన్నులు, జీవక్రియల వేగం రేటు... ఈ అన్ని విషయాల్లోనూ కీలక భూమిక ΄ోషిస్తుంది. ఈస్ట్రోజెన్ క్రమబద్ధంగా వెలువడుతున్న రోజుల్లో అది దేహంలోని గ్లూకోజ్ సమంగా నిర్వహితమవుతూ, కండరాలన్నీ (మజిల్ మాస్) సమానంగా ఉండేలా చూస్తుంది. దాంతో దేహం దాదాపుగా సన్నగానే కనిపిస్తుంటుంది. కానీ ఈస్ట్రోజెన్ స్రావాలు మోతాదులు తగ్గుతున్న కొద్దీ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దాంతో అది దేహంలో కొవ్వు పేరుకునే ప్రక్రియకు దారితీస్తుంది. ఈ క్రమంలో మొదట మహిళల పొట్టలో కొవ్వుపెరగడం దగ్గర్నుంచి మొదలై క్రమంగా ఒళ్లు లావెక్కడం కొనసాగుతుంది. తీసుకునే ఆహారం, చేసే వ్యాయామం అంతే ఉన్నప్పటికీ... ఈ మధ్యవయసు దశలో మహిళలు తాము తీసుకునే ఆహారమూ, చేస్తుండే వ్యాయామంలో మార్పులు లేనప్పటికీ... జీవక్రియల్లో వచ్చిన పై మార్పు కారణంగా వాళ్ల దేహం బరువు పెరగడం మొదలువుతుంది. పెరీ–మెనోపాజ్ దశల్లో ఈస్ట్రోజెన్ హార్మోనల్ మార్పులు క్రమంగా మజిల్ మాస్ తగ్గిస్తూ పోవడంతో పాటు దేహంలో ఇన్ఫ్లమేషన్ పెంచుతూ పోతాయి. కండరాల్లో ఏదైనా గాయమైనప్పుడు దాని నుంచి కోలుకునే వేగాన్ని కూడా తగ్గిస్తాయి. మనం చేసే రోజువారీ పనులతో కండరాల్లో అయ్యే చిన్నపాటి గాయాలు తగ్గే వేగం కూడా మందగిస్తుంది. ఇలా ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గడం అనే అంశం... మహిళలు తీసుకునే ఆహారాలు ఒంటికి పట్టడమూ (అబ్జార్బింగ్ ద న్యూట్రియెంట్స్), కండరాల నిర్మాణమూ, ఒత్తిడిని మేనేజ్ చేయడం (స్ట్రెస్ మేనేజ్మెంట్), నిద్ర... వీటన్నింటినీ ప్రభావితం చేస్తూ... బరువు పెరగడానికి కారణమవుతుంది. ఒత్తిడి పెరగడంతో దేహంలో కార్టిసోల్ అనే హార్మోన్లు స్రవించడానికి కారణం కావడమూ... దాంతో నిద్ర బాగా తగ్గడం... ఇలా కంటినిండా నిద్రలేనప్పుడు రెస్టింగ్ మెటబాలిజమ్ కూడా తగ్గడం వల్ల ఒళ్లు పెరుగుతుందని అనేక అధ్యయనాల్లో నిరూపితమైంది. అంటే... ఆహార అలవాట్లలో మార్పులు లేక΄ోయినప్పటికీ, ఇక్కడ పేర్కొన్న ఈ మార్పుల కారణంగా మధ్యవయసు రాగానే మహిళల్లో స్థూలకాయం పెరుగుతుంది. మెనోపాజ్ అనేది నివారించలేని దశ. అయితే ఈ ప్రక్రియల ద్వారా ఈస్ట్రోజెన్ తగ్గుదల వేగాన్ని నియంత్రించి, తద్వారా బరువు పెరగడాన్ని కూడా నియంత్రిస్తూ ఆరోగ్యంగా ఉండటం సాధ్యపడుతుంది. ఇక ఈస్ట్రోజెన్ తగ్గుదలతో వచ్చే పరిణామాల తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే... డాక్టర్ను సంప్రదించి అందుకోసం హార్మోన్ రీ–ప్లేస్మెంట్ చికిత్స (హెచ్ఆర్టీ) వంటి చికిత్సలు తీసుకోవాల్సి ఉంటుంది.ఈ సమస్యను అధిగమించడం ఎలా... ఏజింగ్ లేదా వయసు పెరుగుతుండటం వల్ల వచ్చే మార్పుల విషయంలో ఏమీ చేయలేక΄ోయినప్పటికీ, అలా జరిగే తీరు మెల్లగా జరిగేలా చేయడం ద్వారా ఈ ప్రక్రియలను సాధ్యమైనంత ఆలస్యంగా జరిగేలా చేయడంతో పాటు దీనివల్ల కలిగే దుష్పరిణామాలను వీలైనంతగా నివారించవచ్చు. అందుకు ఆరోగ్యకరమైన మంచి జీవనశైలి (లైఫ్స్టైల్) బాగా ఉపయోగపడుతుంది.మంచి పోషకాహారాలు తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అయితే మితిమీరిన వ్యాయామాలూ చేయకూడదు. దేహానికి మరీ శ్రమకలిగించని విధంగా కేవలం ఒళ్లు అలిసిపోయేలా మాత్రమే ఈ వ్యాయామాలు ఉండాలి. ఇందుకు వాకింగ్, ఈత వంటి వ్యాయామాలు మంచివి. ఒత్తిడిని (స్ట్రెస్ను) వీలైనంతగా తగ్గించుకోవాలి. ఇందుకోసం యోగా, ధ్యానం, రిలాక్సేషన్ టెక్నిక్స్ వంటి ప్రక్రియలను అనుసరించవచ్చు. మందకొడిగా కాకుండా ఎప్పుడూ చురుగ్గా ఉండేలా చూసుకోవాలి. కనీసం 7, 8 గంటలకు తగ్గకుండా కంటినిండా నిద్రపోవాలి. రూమా సిన్హా, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్టిట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్. (చదవండి: బాడీలోని ప్రతి అవయవం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..!) -
గుండెకు క్యాన్సర్ ఎందుకు రాదో తెలుసా?
శరీరంలోని దాదాపు అన్ని అవయవాలకు క్యాన్సర్ ముప్పు ఉంటుంది. కానీ ఎప్పుడైనా గుండెకు క్యాన్సర్ సోకడం గురించి విన్నారా? క్యాన్సర్ బారిన పడని ఏకైక అవయవం గుండె మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. ఈ దశాబ్దాల మిస్టరీని శాస్త్రవేత్తలు ఎట్టకేలకు ఛేదించారు. నిరంతరం కొట్టుకునే గుండె చప్పుడే, అందులో క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటోందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ‘మెకానికల్ ఫోర్సెస్’ క్యాన్సర్ జన్యువుల పనితీరును మార్చేస్తాయని తేల్చిచెప్పిన ఈ పరిశోధన వైద్య రంగంలో ఒక సంచలనంగా నిలిచింది.నిరంతర శ్రమతోనే క్యాన్సర్కు చెక్ప్రముఖ ‘సైన్స్’జర్నల్లో ప్రచురితమైన ఈ తాజా అధ్యయనం ప్రకారం.. గుండె నిరంతరం రక్తాన్ని పంప్ చేస్తూ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. ఈ యాంత్రిక ఒత్తిడి కారణంగా గుండె కణాల విభజన వేగం తగ్గుతుంది. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ (ఐసీజీఈబీ)కి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో, గుండె లోపలి ఈ ప్రత్యేకమైన వాతావరణం క్యాన్సర్ కణాల పెరుగుదలను క్రియాశీలంగా అడ్డుకుంటుందని తేలింది.ఎలుకల ప్రాజెక్టులో సంచలన నిజాలుదీనిని నిరూపించడానికి పరిశోధకులు ఎలుకలపై ఒక ప్రయోగం చేశారు. వారు ఒక దాత గుండెను ఎలుక మెడ భాగంలో అమర్చారు. ఈ కొత్త గుండెకు రక్తప్రసరణ జరుగుతుంది కానీ, రక్తాన్ని పంప్ చేసే యాంత్రిక ఒత్తిడి ఉండదు. ఆ తర్వాత ఈ ఒత్తిడి లేని గుండెలోకి, అలాగే సహజంగా రక్తాన్ని పంప్ చేస్తూ పనిచేస్తున్న ఎలుక సొంత గుండెలోకి మానవ క్యాన్సర్ కణాలను ఎక్కించి, కణతుల వృద్ధిని తులనాత్మకంగా పరిశీలించారు.పనిచేసే గుండెలో పెరగని కణాలుఈ ప్రయోగ ఫలితాలు క్యాన్సర్ పరిశోధనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించాయి. రక్తాన్ని పంప్ చేయని, అంటే మెకానికల్ ఒత్తిడి లేని మెడలోని గుండెలో క్యాన్సర్ కణాలు వేగంగా వృద్ధి చెంది, కణతులుగా మారాయి. కానీ సహజంగా నిరంతరం కొట్టుకుంటూ, ఒత్తిడిని ఎదుర్కొంటున్న అసలైన గుండెలో మాత్రం క్యాన్సర్ కణాలు పెరగలేదు. వివిధ రకాల క్యాన్సర్లలో కూడా ఇదే తరహా ఫలితాలు వచ్చాయి. దీనిని బట్టి గుండె పడే యాంత్రిక శ్రమే క్యాన్సర్ను అడ్డుకునే ప్రధాన ఆయుధం అని స్పష్టమైంది.‘నెస్ప్రిన్-2’.. క్యాన్సర్ను అడ్డుకునే హీరోఅసలు ఈ ఒత్తిడి క్యాన్సర్ను ఎలా ఆపుతుందనే విషయానికొస్తే.. ఇక్కడే ‘నెస్ప్రిన్-2’ (Nesprin-2) అనే ప్రొటీన్ కీలకంగా వ్యవహరిస్తుంది. గుండె కొట్టుకునేటప్పుడు ఏర్పడే భౌతిక సంకేతాలను ఈ ప్రొటీన్ కణ కేంద్రకానికి చేరవేస్తుంది. ఈ సంకేతాలు కణాలలోని డీఎన్ఏ అమరికను, హిస్టోన్ మిథైలేషన్ ప్రక్రియను మారుస్తాయి. దీనివల్ల క్యాన్సర్ కణాల వృద్ధికి కారణమయ్యే జన్యువులు బలహీనపడి, కణతుల పెరుగుదల పూర్తిగా ఆగిపోతుంది.భవిష్యత్ క్యాన్సర్ చికిత్సలకు కొత్త ఆశపరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు క్యాన్సర్ కణాల్లోని ఈ నెస్ప్రిన్-2 ప్రొటీన్ను సైలెంట్ (నిష్క్రియం) చేసి చూడగా, చురుగ్గా పనిచేసే గుండెలో కూడా క్యాన్సర్ కణాలు పెరగడం ప్రారంభించి కణతులు ఏర్పడ్డాయి. ఈ అద్భుతమైన ఆవిష్కరణ భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్సలో కొత్త శకానికి నాంది పలకనుంది. కణాలు అనుభవించే ఈ యాంత్రిక ఒత్తిడిని కృత్రిమంగా సృష్టించడం లేదా అనుకరించడం ద్వారా శరీరంలోని ఇతర భాగాల్లో వచ్చే క్యాన్సర్ను కూడా అరికట్టే సరికొత్త థెరపీలను అభివృద్ధి చేయవచ్చని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.ఇది కూడా చదవండి: భోపాల్ విషాద సాక్షి.. రఘు రాయ్ ఇకలేరు -
అక్కడ రైలులో ప్రయాణించాలంటే ఆక్సిజన్ మాస్క్ తప్పనిసరి..!
ఎన్నో రైళ్ల జర్నీలు చేసి ఉంటారు. కానీ చైనాలో ఆ ప్రదేశంలోని రైలు జర్నీ ఓ ప్రత్యేక అనుభూతి మాత్రమే కాదు, ఆస్ప్రతిలో ఉన్నామా అనే భావన వస్తుంది. ఆ రైలు ఎక్కిన ప్రతి ఒక్కరు ఆక్సిజన్ మాస్క్ ధరించి తీరాల్సిందే. లేదంటే కష్టం. ఎందుకంటే..ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు మార్గమైన చైనా క్వింగ్హై-టిబెట్ రైల్వేలో కచ్చితంగా ఆక్సిజన్ మాస్క్ ధరించి ప్రయాణించాలి. ఆ రైలు "ఆసుపత్రి తరహా" ఏర్పాటుతో వస్తుంది. ఈ అసాధారణ ప్రయాణం మిమ్మల్ని టిబెట్ రాజధాని అయిన లాసా వరకు తీసుకువెళుతుంది. దాదాపు వెయ్యి కిలోమీటర్ల పైగా పొడవైన ఈ రైలు మార్గంలో అధిక భాగం సముద్ర మట్టానికి సుమారు 4 వేల మీటర్ల (13,123 అడుగులు) ఎత్తులో ప్రయాణిస్తుంది. దీనిలోని అత్యంత ఎత్తైన ప్రదేశం టాంగ్గులా కనుమ వద్ద 5,072 మీటర్ల(16,640 అడుగులు) ఎత్తుకు చేరుకుంటుంది. ఈ ఎత్తులో, సముద్ర మట్టంతో పోలిస్తే గాలిలో సుమారు 40 శాతం తక్కువ ఆక్సిజన్ ఉంటుంది. ప్రయాణాన్ని మరింత సురక్షితంగా సునాయాసంగా చేయడానికి, అలాగే అధిక ఎత్తులో ప్రయాణించేలా సహాయం చేయడానికి రెండు ప్రధాన ఆక్సిజన్ వ్యవస్థలను రూపొందించారు.మొదటిది డిస్పర్షన్ ఆక్సిజన్ సిస్టమ్. ఈ వ్యవస్థ రైలులోని ఎయిర్ కండిషనింగ్లో అదనపు ఆక్సిజన్ను కలుపుతుంది, తద్వారా ప్రతి కోచ్ లోపల మొత్తం ఆక్సిజన్ స్థాయి సుమారు 23.5 శాతానికి పెరుగుతుంది. రైలు సాధారణంగా గోల్ముద్ (2,829 మీ) చేరుకున్న తర్వాత ఈ వ్యవస్థను ప్రారంభిస్తుంది.రెండవది డైరెక్ట్ ఆక్సిజన్ అవుట్లెట్ సిస్టమ్. ఇది ప్రయాణికులు తమ సీట్ల దగ్గర ఉన్న అవుట్లెట్లకు అనుసంధానించబడిన చిన్న పైపుల ద్వారా ఆక్సిజన్ను పీల్చుకోవడానికి అనుమతిస్తుంది. హార్డ్ స్లీపర్ కంపార్ట్మెంట్లలో, ప్రతి బెర్త్కు దాని పక్క గోడల వెంబడి ఆక్సిజన్ అవుట్లెట్లు అమర్చబడి ఉంటాయి.హార్డ్ సీట్ కోచ్లలో, ఆక్సిజన్ అవుట్లెట్లు క్యారేజీ గోడల వెంబడి క్రమమైన విరామాలలో లేదా కొన్నిసార్లు సీట్ల కిందకూడా అమర్చబడి ఉంటాయి. ప్రతి అవుట్లెట్ను సుమారు 4 నుంచి 6 మంది ప్రయాణికులు పంచుకుంటారు. సాఫ్ట్ స్లీపర్ కంపార్ట్మెంట్లలో, ప్రతి బెర్త్కు మంచం దగ్గర దాని స్వంత ఆక్సిజన్ అవుట్లెట్ ఉంటుంది.ఈ రైలు మార్గం ప్రకృతి సౌందర్యానికి నెలవు..కింగ్హై-టిబెట్ రైలు ద్వారా లాసా చేరుకునే ప్రయాణం చాలా అందమైనది, ప్రత్యేకమైనది. ఈ రైలు బీజింగ్, షాంఘై, చెంగ్డూ, షినింగ్ వంటి నగరాల నుంచి టిబెట్లోని లాసా వరకు వెళుతుంది.ఈ ప్రయాణంలో, ప్రయాణికులు మార్గం పొడవునా ఉత్కంఠభరితమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు. వారు విశాలమైన నీలి ఆకాశాన్ని,తెల్లని మేఘాలను చూస్తారు. గాడిదలు, గొర్రెల మందలతో కూడిన విశాలమైన పచ్చిక బయళ్ళు ఉన్నాయి. ఈ రైలు కున్లూన్ పర్వత శ్రేణితో సహా మంచుతో కప్పబడిన పర్వతాలు, యాంగ్జీ వంటి ప్రధాన నదుల గుండా కూడా వెళుతుంది. ఈ ప్రయాణం హోహ్ షిల్ నేషనల్ నేచర్ రిజర్వ్ వంటి మారుమూల సహజ ప్రాంతాల గుండా సాగుతుంది.సాఫ్ట్ స్లీపర్, హార్డ్ స్లీపర్, హార్డ్ సీట్ల కోసం ఢిల్లీ నుంmr లాసాకు ప్రయాణిస్తుంటే, బీజింగ్ మీదుగా విమానంలో వెళ్లవలసి ఉంటుంది. దీనికి సుమారుగా రూ. 55,000 ఖర్చవుతుంది. బీజింగ్ నుంచి లాసాకు రైలులో వెళ్లాలి. ధర మీరు ఎంచుకునే సీటు రకంపై ఆధారపడి ఉంటుంది.మూడు రకాల సీట్లు ఉన్నాయి. సాఫ్ట్ స్లీపర్ అత్యంత సౌకర్యవంతమైన ఎంపిక, దీనిలోని ప్రతి క్యాబిన్లో నాలుగు బెర్త్లు ఉంటాయి. కంపార్ట్మెంట్లు విశాలంగా ఉంటాయి. లాక్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. టేబుల్, టీవీ స్క్రీన్, లగేజీ పెట్టుకునే స్థలం, ఆక్సిజన్ అవుట్లెట్ల వంటి సౌకర్యాలను కలిగి ఉంటాయి. పై బర్త్కు సుమారుగా రూ. 675, కింది బంక్కు రూ. 700 ఖర్చవుతుంది.తరువాతది హార్డ్ స్లీపర్. ప్రతి కంపార్ట్మెంట్లో ఆరు బెర్త్లు ఉంటాయి, దిండ్లు, దుప్పట్లు అందించబడతాయి. గోప్యత కోసం తలుపు ఉండదు, మరియు స్థలం ఇరుకుగా ఉంటుంది. ధరలు పై బర్త్కు రూ. 425 మధ్య బర్త్ రూ. 440, కింది బంక్కు రూ. 450 నుంచి ప్రారంభమవుతాయి.హార్డ్ సీట్లు అత్యంత చౌకైన సుదీర్ఘ ప్రయాణానికి మాత్రమే సాధారణ సీటింగ్ను అందిస్తాయి. దీనికి సుమారుగా రూ. 212 ఖర్చవుతుంది. View this post on Instagram A post shared by marina guaragna (@marinaguaragna) (చదవండి: బాడీలోని ప్రతి అవయవం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..!) -
బాడీలోని ప్రతి అవయవం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..!
శరీరం సంక్రమంగా పనిచేయాలంటే ఆరోగ్యకరమైన ఆహారం ఎంతో ముఖ్యం. నిజానికి శరీరం వివిధ భాగాలతో కూడిన ఒక జట్టులా పనిచేస్తుంది. ప్రతి అవయవానికి దానికంటూ ఒక పాత్ర, సొంత అవసరాలు, ఇష్టమైన పోషకాలు ఉండాయి. జీర్ణవ్యవస్థకు సహాయపడేది ఊపిరితిత్తులకు లేదా కళ్లకు సరిపడకపోవచ్చు. అందుకే తెలివిగా తినడం అంటే కేవలం స్వచ్ఛమైన ఆహారం తీసుకోవడం మాత్రమే కాదు అది బలవర్ధకమైనదై ఉండాలి కూడా అని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు లాన్విత్ బాత్ర. అవయవాలు సక్రమంగా పనిచేసేలా, ఏకాగ్రత, శ్వాస బాగుండేలా ఎలాంటి పోషకాహారం తినాలో, జీవనశైలిలో అందుకు తగ్గట్టుగా చిన్న చిన్న మార్పుల చోటు చేసుకోవాలో ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు.శరీరంలోని ప్రతి భాగానికి సరైన ఆహారాలు1. ఊపిరితిత్తులు: వాపు నివారణపై (Anti-Inflammation) దృష్టి సారించండిమెరుగైన శ్వాస, ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసంఅల్లం, పసుపు, సిట్రస్ పండ్లను (పుల్లని పండ్లు) ప్రత్యేకంగా సూచించారు. వీటిలో జింజెరోల్, కర్కుమిన్, విటమిన్ సీ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి వాపును తగ్గించడానికి, ఊపిరితిత్తుల కణజాలాన్ని రక్షించడానికి సహాయపడతాయి. అందుకోసం ఉదయపు టీ లేదా జ్యూస్లో తాజా అల్లం, పసుపును చేర్చుకోండి.2 కాలేయం (Liver): విషతుల్యాల నిర్మూలనకు (Detox), కొలెస్ట్రాల్ జీవక్రియకు మద్దతునివ్వండి. శరీరం నుంచి విషతుల్యాలను తొలగించడానికి (detox) కాలేయం ఎంతో కష్టపడి పనిచేస్తుంది. బ్రకోలి (సల్ఫోరాఫేన్ పుష్కలంగా ఉండేది), గ్రీన్ టీ, ఆలివ్ నూనె వంటి ఆహారాలు ఈ ప్రక్రియకు మద్దతునివ్వడానికి, కొవ్వు పేరుకుపోకుండా రక్షించడానికి సహాయపడతాయి. అంతేగాదు కొన్ని సులభమైన మార్పులతో, రోజువారీ ఆహారం ద్వారా వాటికి మద్దతు ఇవ్వవచ్చు.3. పేగు ఆరోగ్యం: మంచి బ్యాక్టీరియా కోసం.. ఆరోగ్యకరమైన పేగుకు ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ రెండూ అవసరం. పెరుగు మీకు సజీవ మంచి బ్యాక్టీరియాను అందిస్తుంది. అయితే అరటిపండ్లు, చియా గింజలు వాటికి ఆహారం అందించే ఫైబర్ను అందిస్తాయి.సులభమైన, జీర్ణవ్యవస్థకు మేలు చేసే చిరుతిండి కోసం పెరుగు, చియా గింజలను కలిపి ప్రయత్నించండి.4. కళ్ళు: ఒత్తిడి నుంచి రక్షణస్క్రీన్ సమయం పెరగడంతో, కంటి ఆరోగ్యం మునుపెన్నడూ లేనంతగా ముఖ్యమైంది. క్యారెట్లు, చిలగడదుంపలలో బీటా-కెరోటిన్ (విటమిన్ ఎ) పుష్కలంగా ఉంటుంది, అదే సమయంలో ఉసిరి రెటీనాను రక్షించడానికి విటమిన్ సీ ని అందిస్తుంది. రోజువారీ భోజనంలో కనీసం ఒక నారింజ రంగు కూరగాయను చేర్చుకోండి.చిన్న చిన్న ఆహార ఎంపికలు శరీరంలోని వివిధ భాగాలకు వివిధ రకాలుగా సహాయపడతాయి. అందువల్ల ఏమి తింటున్నారు, ఎందుకు తింటున్నారు అనే దానిపై కాస్త శ్రద్ధ పెట్టి తీసుకోవడం అనేది చాలా ముఖ్యమని చెబుతున్నారు పోషకాహారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే కాదు. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించాలి. (చదవండి: పాద' సేవలను గుర్తించండి!) -
'పాద' సేవలను గుర్తించండి!
పాదం ఓ సంక్లిష్టమైన అవయవం. నడక సరిగా సాగుతున్నంత సేపూ దాని గొప్పదనం తెలియదు. నిర్మాణపరంగా (అనటామికల్గా) చూస్తే అదొక అబ్బురపరచే అవయవం. పాదం ప్రాధాన్యమేమిటో తెలుసుకుందాం.పాదం గురించి తెలుసుకునే ముందు అసలు పాదం నిర్మాణాన్నీ, దాని పనితీరేమిటన్నది చూద్దాం.26 ఎముకలు / 107 లిగమెంట్లు / 19 కండరాలు మొత్తం కాలిలో 30 ఎముకలు ఉంటే... సైలెంట్గా తనపని తాను చేసుకుపోయే పాదంలో 26 ఎముకలు ఉంటాయి. అంటే కాలితో పోల్చి చూసినప్పుడు 90 శాతం ఎముకలు పాదంలోనే ఉంటాయి. ఇందులో నడవడానికి ఉపయోగపడేలా 107 లిగమెంట్లు, 19 కండరాలు కూడా ఉంటాయి. ఓ వ్యక్తి బరువు 70కిలోలు అనుకుంటే... అతడి బరువును బ్యాలెన్స్ చేసేందుకు దేహంలోని పొడవైన ఎముక ‘ఫీమర్’ తొడలో ఉంటుంది. దీన్నే తెలుగులో తొడ ఎముక అని పేరు.నడక... 70 కిలోల షాక్ తీసుకునే... సంక్లిష్ట ప్రక్రియ మనం మనకు తెలియకుండా యాంత్రికంగా నడుస్తుంటాంగానీ... నిజానికి నడక చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. పాదం నేల మీద మోపగానే 70 కిలోల బరువుతో మొదటి షాక్ పాదం పైనే పడుతుంది. కానీ ఆ షాక్ను పాదానికి అంతటా సమంగా విస్తరింపజేస్తూ... ఆ షాక్ను తట్టుకునే షాక్ అబ్జార్బర్గా పనిచేస్తుంది పాదం. ఇక ఆ పాదాన్ని వెనక్కుతోస్తూ తన గరిమనాభి (సెంటర్ ఆఫ్ గ్రావిటీ) ముందుకు పడేలా చేస్తూ నడక సాగిస్తున్న వ్యక్తి కదులుతాడు. ఇలా గ్రావిటీవల్ల ముందుకుపడిపోయే లోపే... మరో కాలు ముందుకు పడి ఆ 70 కిలోల షాక్ను ఆ కాలు తీసుకుని మనిషి పడిపోవడం నుంచి ఆపుతుంది. ముందుకు పడిపోయేలా కదులుతూ... అలా పడిపోయే లోపు మరో కాలిని ఆనిస్తూ నడక సాగుతుంది. ఇలా నడక సాగించడాన్ని ‘బైపెడల్’ మూవ్మెంట్ అంటారు. రోజులో 7,500 సగటు అడుగుల నడకలో జరిగేదేమిటంటే... ఓ వ్యక్తి నడవడం మొదలుపెట్టాక ప్రతి నిమిషానికి ఉజ్జాయింపుగా 100 అడుగులు వేస్తుంటాడని అంచనా. అంటే అతడి రెండు కాళ్ల మీద ప్రతి నిమిషానికీ 70 కిలోల బరువు పడుతూ... ఒక్కో ΄ాదం మీదా ఇలా 50 సార్లు పడుతుంది. మొదట పాదం మోపగానే బరువంతా మడమలోని బంతిలాంటి ఎముకపై పడుతుంది. ఆ తర్వాత కాలివేళ్లలోని ఎముకలైన ఐదు మెటాటార్సల్స్పై పడుతుంది. వాటి సాయంతో పాదం నేలను వెనక్కుతోస్తుంది. కానీ నేల కదలదు కాబట్టి... అలా వెనక్కు నెట్టడం వల్ల ఆ వ్యక్తే ముందుకెళ్తుంటాడు. ఇలా ఆరోగ్యవంతుడైన ఓ వ్యక్తి రోజుకు 7,500 అడుగులు వేస్తాడని ఉజ్జాయింపుగా ఓ అంచనా.ఏడాదికి 27,37,500 అడుగులూ... జీవితకాలంలో 22 కోట్ల అడుగులుఈ లెక్కన అతడు ఏడాదికి 27,37,500 అడుగులూ... ఒకవేళ అతడు ఆరోగ్యకరంగా 80 ఏళ్లు బతకగలిగితే... అతడి జీవితకాలంలో మొత్తం 21,90,00,000 అడుగులు (అంటే దాదాపుగా 22 కోట్ల అడుగులు) వేస్తాడు. అలా ఓ వ్యక్తి తన జీవిత కాలంలో లక్షా అరవై వేల కిలోమీటర్ల (లక్ష మైళ్ల) దూరాన్ని నడుస్తాడని ఒక అంచనా. (పుట్టిన ఐదేళ్ల వరకు పెద్దగా నడవడు కదా అనుకుని 75 ఏళ్లకే లెక్కవేస్తే... 20,53,12,500 అడుగులు వేస్తాడు. అంటే కనీసం 20 కోట్ల అడుగులైనా వేస్తాడు. ఆ నడిచే దూరాన్ని భూమ్మీద భూమధ్య రేఖ వెంట ఇలా నడుస్తూపోతే భూమిని నాలుగుసార్లు చుట్టి వస్తాడు. ఒకవేళ భూమి నుంచి చంద్రుడివరకూ నడవగలిగేట్లయితే... భూమికీ చంద్రుడికీ మధ్యనున్న దూరం 3,84,400 కిలోమీటర్ల దూరంలో అటుఇటుగా దాదాపు నాలుగో వంతు నడుస్తాడు. ఈ లెక్కలను బట్టి చూస్తే ఓ జీవితకాలంలో పాదాలపై పడే బరువూ, భారమూ ఎంత అన్నది ఆలోచిస్తే... మన పాదాలు చేసే కష్టమెంతో అర్థమవుతుంది. గచ్చు గట్టిదనంతో మరిన్ని గాయాలు... ఒకప్పుడు మనమందరం దాదాపు పాదరక్షలేమీ లేకుండానే మట్టిపై నడిచేవాళ్లం కానీ... ఇప్పుడు సిమెంట్తో రూపొందిన కఠినమైన పేవ్మెంట్లు లేదా అలాంటి ఉపరితలాల మీద నడవాల్సి వస్తుంది. నిజానికి ఇలాంటి కఠినమైన ఉపరితలాల మీద నడిస్తే పాదాలకు నష్టం. దీనికి బదులు నడిచే సమయాల్లో మెత్తటి నేల, లేదా కాస్తంత బౌన్స్ ఇచ్చేలాంటి గడ్డి మీద నడవటం వల్ల పాదాలకు రక్షణ దొరుకుతుంది. అందుకే కఠినమైన ఉపరితలాల మీద వాకింగ్ అంతగా సిఫార్సు చేయదగినది కాదు. అయితే ఇప్పుడు చాలావరకు ప్రతిచోటా రోడ్లతో హార్డ్ సర్ఫేస్లు ఉంటున్నందున మెత్తగా ఉండే షూస్ ఎంపిక చేసుకోడం వల్ల పాదానికి తగిన రక్షణ దొరుకుతుంది. పాదాలకు వచ్చే కొన్ని సమస్యలూ... పరిష్కారాలు...ఇటీవల అందరూ షూస్ / బూట్లు తొడుగుతున్నారు. అందునా స్కూల్ పిల్లల వయసు నుంచే ఇది జరుగుతోంది. అయితే ఇలా షూస్, బూట్లతో చాలాసేపు పాదాల్ని బంధించి ఉంచడం సరికాదు. ఇది పూర్తిగా ఎదగని చిన్నారుల పాదాల ఎదుగుదలను దెబ్బతీయవచ్చు. అందుకే పాద సంరక్షణ కోసం కాస్తంత వదులుగానూ, తొడిగాక పాదం ముందర కాస్త ఖాళీ ఎక్కువగానూ ఉండేలా షూ ఎంచుకోవాలి. షూ ముందు భాగం సన్నగా ఉండటం వల్ల కాలి బొటనవేలు లోపలి వైపునకు నొక్కుకుపోయి, దాని వెనకవైపు ఎముక ముందుకు పొడుచుకువచ్చినట్లుగా అవుతుంది. ఈ సమస్యను ‘బ్యూనియన్’ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్కు చూపించాలి.. చిన్నారులు స్కూల్ నుంచి రాగానే పిల్లలు షూస్ వదిలేసి... ఫ్రీగా ఉండే చెప్పులు, స్లిప్పర్స్ వంటి వాటిని తొడగాలి. ఇక మహిళల్లో విషయానికి వస్తే... వారు ధరించే హైహీల్స్ వల్ల పాదాలకు జరిగే ప్రమాదవకాశాలు పురుషులతో పొలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ. కొందరిలో బొటనవేలిపై ఉన్న గోరు లోపలివైపునకు పెరుగుతూ ఉంటుంది. ఇలా జరగకూడదంటే కాలి గోర్లు తీసే సమయంలో మూలల్లోంచి మరీ చిగుర్ల నుంచి కాకుండా కాస్తంత దూరం నుంచే కట్ చేసుకోవాలి. ఇక డయాబెటిస్ వంటి సమస్య ఉన్నవారు పాదాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తలతో పాదాలను చాలావరకు సంరక్షించుకోవచ్చు. షూ తొడిగినప్పుడు ఒకేచోట అదేపనిగా ఒత్తిడి పడుతుండటం వల్ల ఆనెకాయలు వచ్చే ప్రమాదం ఉంది. వాటిని కొందరు బ్లేడ్తో కోస్తుండటం, మరికొందరు యాసిడ్ చుక్కలతో మాడ్చటానికి ప్రయత్నిస్తుంటారు. అది సరికాదు. డాక్టర్కు చూపించి తగిన చికిత్స తీసుకోవాలి. ∙కొందరిలో పాదాలకు కాయకాచి అందులో పగుళ్లు ఏర్పడతుంటాయి. ఇలా జరిగినప్పుడు పాదాల డాక్టర్కు చూపించుకుని తగిన చికిత్స చేయించుకోవాలి.కొందరిలో ఫంగస్ కారణంగా అథ్లెట్స్ ఫుట్ అనే సమస్య వస్తుంది. నిజానికి ఈ ఫంగస్ పాదాలపై ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే పాదం ఎప్పుడూ తేమ, తడిలో ఉండటంతో అక్కడ ఫంగస్ పెరిగి, చర్మం చిట్లి, అథ్లెట్స్ ఫుట్ సమస్య వస్తుంది. అరికాళ్లలో ఉండే చెమట గ్రంథులు స్రావాలతో పాదం తడిసినప్పుడూ ఈ సమస్య మరింత త్వరగా రావచ్చు. ఇలాంటప్పుడు పాదాన్ని శుభ్రంగా కడిగి, వీలైతే ఆల్కహాల్ బేస్డ్ వాష్లను ఉపయోగించి శుభ్రం చేసి, పాదాల మీద పౌడర్ చల్లి, ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. అవసరాన్ని బట్టి డాక్టర్ల సూచన మేరకు యాంటీ ఫంగల్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాల్సి రావచ్చు.డా. సుధీర్ రెడ్డి, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్.నిర్వహణ: యాసీన్ -
బొమ్మజెముడు పొద మీద నెత్తుటి మరక!
హంగేరియన్ భాషలో ‘కెర్తేజ్’ అంటే తోటమాలి అని అర్థం. 2002లో నోబెల్ సాహిత్య పురస్కారాన్ని పొందిన హంగేరియన్ రచయిత ఇమ్రా కెర్తేజ్ పేరులోని ఆ మాటకూ అదే అర్థం! యూరప్లోని హరిత దేశాల్లో ఒకటిగా రూపుదిద్దుకుంటున్న హంగరీ అక్షర ఉద్యానంలో తొలి నోబెల్ పురస్కారాన్ని పూయించిన తోటమాలి ఇమ్రా కెర్తేజ్. అతని సాహిత్యం బొమ్మజెముడు పొద మీద నెత్తురు ముద్ద! తన సాహిత్యమంతటా, కెర్తేజ్ అనుభవించి పలవరించింది ఒకేఒక్క పీడకల. దాన్నే ‘హోలోకాస్ట్ నైట్మేర్’ అన్నారు తర్వాతి తరాలవారు. ఇది యూదులకూ, లౌకికవాదులకూ, ప్రగతిశీల రాజకీయపక్షాలకూ మరపురాని పీడకల. ఆ పీడకలలో కనిపించేవన్నీ తెగిన గాలిపటాలే! సంసార వృక్షం తాలూకు విరిగిపడిన కొమ్మలకు వేలాడుతూ కనిపిస్తాయవి. గాలివాటుగా కొట్టుకుపోయే ఆ గాలిపటాలు తరచు ముళ్ళకంపల్లో చిక్కుకుపోతుంటాయి. ఒకరో యిద్దరో ఈ స్థితి నుంచి బతికి బయటపడుతుంటారు. వారిలో ఒకరో యిద్దరో మాత్రమే ఎలాంటి ఉద్వేగం లేకుండా తమ కలతలూ కలవరాలను మనతో పంచుకుంటారు. కెర్తేజ్ అలాంటి ఒకరిద్దర్లో ఒకరు. అందుకే ఆయన రచనలు తేనుపొచ్చిన సలపరింతల్లా సాగుతుంటాయి! అలాంటి రచనలతో సామాన్య పాఠకులు తాదాత్మ్యం చెందలేరు. పరిణతి చెందిన కొద్దిమంది పాఠకులు మాత్రమే వాటితో అభేదావస్థ అనుభవించగలరు. అలాంటివాళ్ళలో కొందరు ‘నోబెల్ సాహిత్యపురస్కారం ఎంపిక సంఘం’లో సభ్యులుగా వున్నందువల్లనే కెర్తేజ్కు, 2002లో ఆ పురస్కారం దక్కింది!రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంగా చరిత్రను పరిశీలిస్తే, భయంకరమైన వైరుధ్యాలెన్నో కనిపిస్తాయి. వలసవాదం కాడిబరువు వదిలించుకుని ఎన్నో దేశాలు– మన దేశంతో సహా– విముక్త వాయువులు పీల్చుకున్న సందర్భమది. వైజ్ఞానిక, తాత్త్విక, కళాత్మక రంగాలన్నింటా సౌమ్య, సౌహార్ద వీచికలు ప్రసరించిన యుగమది. మానవాళి చిరకాలంగా కంటూవచ్చిన జంటకలలు–స్వేచ్ఛా సమానత్వాలుగా– విశ్వకేదారంలో మొలకలెత్తిన ఘడియలవి. అయితే, ఆ యుద్ధ నేపథ్యంలోనే, ‘పుట్టుక ప్రాతిపదికగా జాతిమత వివక్ష’ పడగవిప్పి బుసకొట్టిన దుర్ముహూర్తమూ అదే! ఈ అమానుష వికారం తాలూకు అత్యంత వికృతరూపాన్ని ప్రదర్శించినవారిగా నాజీలు చరిత్రలో పాతుకుపోయారు. నాజీలు ఎదురులేకుండా పాలించిన జర్మనీకి పొరుగుదేశం కావడమనే ఏకైక పాపానికి గానూ, హంగరీకి కూడా వివక్ష జ్వాలలు పాకిపోయాయి. అప్పట్లో నాజీల చేతికి చిక్కిన పద్నాలుగేళ్ళ కుర్రాడు ఇమ్రా కెర్తేజ్. పుట్టుకతో యూదు మతస్థుడు కావడమే అతని నేరం. దానికే అతన్ని ఆష్విట్జ్, బుషెన్వాల్ట్›్జ నిర్బంధ శిబిరాల్లోకి తోసి చిదిమి పారేయాలనుకున్నారు నాజీలు. కానీ, అంతలోనే ప్రపంచ యుద్ధం ముగిసిపోవడం– దానితోనే నాజీజం సహగమనం చెయ్యడం చకచకా జరిగిపోయాయి! అలా మృత్యువు నీడల్లోంచి వెంట్రుకవాసిలో తప్పించుకోగలిగాడు కెర్తేజ్. అయితే బతికి బయటపడినందుకు అతను సంతసించిన దాఖలాలు ఆయన సాహిత్యంలో ఎక్కడా కానరావు! ∙∙ నాజీ నిర్బంధ శిబిరాలన్నింట్లోకీ పెద్దది ఆష్విట్జ్. ఇది దక్షిణ పోలెండ్లో వుంది. పదకొండు లక్షల మంది అమాయకులైన పెద్దలూ పిన్నల ప్రాణాలను బలితీసుకున్న నరకకూపమిది. ప్రపంచ యుద్ధం ముగిసిన రెండేళ్ళకు, 1947లో ఆష్విట్జ్ను మ్యూజియంగా మార్చారు.నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత ఇమ్రా కెర్తేజ్, ఆష్విట్జ్ గురించి ఓ చోట ఇలా రాశారు:‘ఆష్విట్జ్ నిర్బంధ శిబిరంలో నేను అనుభవించిన నరకయాతనల గురించి తల్చుకున్నప్పుడల్లా, దాన్నుంచి బతికి బయటపడిన వాళ్ళ శక్తి సామర్థ్యాల గురించిన ఆలోచనల్లో మునిగిపోతాను. ఆష్విట్జ్ గురించి ఆలోచన తలెత్తినప్పుడల్లా నేను గతం గురించి కన్నా భవిష్యత్తు గురించే ఎక్కువ ఆందోళన చెందుతాను!‘ పద్నాలుగేళ్ళ వయసులో తన పాలబడిన నిర్బంధ శిబిరాల జీవితానుభవాన్ని ‘దిక్కుమాలినతనం‘ (ఫేట్లెస్నెస్) అనే నవలగా రాయడానికి మరో పద్నాలుగేళ్ళు తీసుకున్నాడు కెర్తేజ్. అయితే, 1975లో గానీ ఆ నవల అచ్చుకాలేదు. అందులోని ప్రధాన పాత్ర గ్యోర్గియ్–‘గ్యూరీ‘– కోవ్స్ కూడా పద్నాలుగేళ్ళ యూదు బాలుడే. రచయిత ఆ కుర్రాడి పేరు మార్చాడంతే– మిగతా కథ అంతా, అటూయిటూగా, ఒక్కటే! ఈ నవల వెలువడిన పదమూడేళ్ళకు ‘వైఫల్యం‘ (ఫియాస్కో) అనే మరో నవల వెలువరించాడు కెర్తేజ్. ఇది జరిగిన పుష్కరానికి ‘పుట్టని బిడ్డ కోసం ప్రార్థన’ (కాదిష్ ఫర్ యాన్ అన్ బోర్న్ చైల్డ్) అనే ఇంకో నవల రాశాడు. ఈ మూడు నవలలనూ కలిపి ‘హొలోకాస్ట్ ట్రైలజీ‘ అంటారు. ముఖ్యంగా, మూడో నవల రచనా సంవిధానం, విశిష్టంగా వుందని విమర్శకులు అంటారు.వాస్తవానికి కెర్తేజ్ ఆలోచనావరణం అంతటా నాజీ విలయమే ఆవరించుకుని ఉందని ఆయనకూ తెలుసు– పాఠకులకూ తెలుసు– విమర్శకులకు మరింత బాగా తెలుసు!‘నేను ఓ కొత్త నవలకు ఇతివృత్తం గురించి– ఆ మాటకొస్తే, ఏది రాసే విషయం పైనైనా– ఆలోచించడం మొదలుపెట్టగానే నాకు ముందుగా గుర్తుకొచ్చేది నిర్బంధ శిబిరాల జీవితానుభవమే! దానితో సంబంధం లేని విషయం గురించి మాటాడాలనుకున్నా, నాకు తెలియకుండానే ఆ విషయం గురించే మాటాడతా! ఆష్విట్జ్ ప్రేతాత్మ నా మీద సవారీ చేస్తోంది– అదే నా మాటల్లో పలుకుతోంది. దానితో పోలిస్తే మిగతా విషయాలన్నీ అర్థం లేనివని అనిపిస్తుంది నాకు!’ అన్నాడందుకే కెర్తేజ్ తన రచన ‘గ్యాలీ డయరీ’లో. 1961–91 మధ్యకాలంలో తాను రాసిన సర్వరచనల సంకలనంగా ‘గ్యాలీ డయరీ’ని 1993లో వెలువరించారాయన. ఆ తర్వాత పదేళ్ళకు విడుదలైన ‘ముగింపు’ (లిక్విడేషన్) ఇతివృత్తం సైతం హొలోకాస్ట్ పీడకలే కావడంలో వింతేముంది? మందలపర్తి కిషోర్ -
అడ్వెంచరస్ దాదీ!
‘ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్’ అని నిరూపిస్తున్నారు 73 ఏళ్ల ఒక బామ్మ. ఏమాత్రం భయం లేకుండా ఆకాశంలో విహరిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని ప్రసిద్ధ సాహస క్రీడల కేంద్రమైన బీర్ బిల్లింగ్లో ఆమె చేసిన పారాగ్లూడింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను పారాగ్లైడింగ్ ఇన్ స్ట్రక్టర్ అరుణ్ సింగ్ తన ఇన్ స్టాగ్రామ్లో షేర్ చేశారు. గాలిలో ప్రయాణిస్తున్న సమయంలో కూడా ఆ బామ్మ ఏమాత్రం కంగారు పడకుండా చాలా ప్రశాంతంగా, ఇన్ స్ట్రక్టర్తో నవ్వుతూ మాట్లాడుతుండటం విశేషం.ఇన్ స్ట్రక్టర్ ఆమె వయసు అడగగా, తనకు 73 ఏళ్లు అని ఆమె ఎంతో ఉత్సాహంగా సమాధానమిచ్చారు. అంతేకాకుండా ఇలాంటి సాహస కృత్యాలు చేయడం తనకు ఇదే మొదటిసారి కాదని, గతంలో ముస్సోరీలో కూడా ఇలాంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ చేసినట్లు తెలిపారు. పారాగ్లైడింగ్ అనేది చాలా ప్రత్యేకమైన అనుభూతి అని, తాను దీన్ని ఎంతో ఆస్వాదిస్తున్నానని ఆమె చెప్పారు.ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ బామ్మ ఆత్మవిశ్వాసాన్ని కొనియాడుతున్నారు. ‘నేను కూడా ఈ దాదీ లాగే తయారవ్వాలనుకుంటున్నాను అని ఒకరు కామెంట్ చేయగా.. ‘జీవితాన్ని మనకు నచ్చినట్లు జీవించాలి! కలలను ఎప్పుడూ వదులుకోవద్దు’ అని మరొకరు రాసుకొచ్చారు. ‘ఎంత ఉత్సాహవంతురాలైన బామ్మ!’ అంటూ మరొకరు ప్రశంసలు కురిపించారు. వయస్సుతో సంబంధం లేకుండా ఈ బామ్మ చేస్తున్న సాహసకృత్యాలు, చూపిస్తున్న ఆత్మవిశ్వాసం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. -
ఓవర్నైట్ చాంపియన్లు కారు
వరల్డ్ టేబుల్ టెన్నిస్ సింగిల్ టైటిల్స్ను గెలుచుకున్న మొదటి భారతీయురాలు ఆకుల శ్రీజ. ఆమె అర్జున అవార్డు సహా ఎన్నో పతకాలు గెలుచుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తోంది. ‘పిల్లలకు చదువు ఒక్కటే కాదు, క్రీడారంగాన్నీ పరిచయం చేసినట్లయితే అన్ని వైపులా అభివృద్ధి చెందుతారు’ అంటారు శ్రీజ తల్లిదండ్రులు ఆకుల ప్రవీణ్కుమార్, సాయిసుధ. పిల్లల పెంపకంలో తమ పాత్ర గురించి ప్రవీణ్కుమార్ తెలిపిన సంగతులు...‘‘నేను టేబుల్ టెన్నిస్ ప్లేయర్ని. రోజూ ప్రాక్టీస్కి వెళ్లేవాడిని. పిల్లల చిన్నప్పుడు వారిని రెండు, మూడు స్పోర్ట్స్ మీట్స్కు తీసుకెళ్లాను. అక్కడ మ్యాచ్లో గెలుపొందినవారికి ప్రైజులు ఇవ్వడం, అందరూ చప్పట్లు కొట్టడం చూసి, మా పెద్దమ్మాయి చాలా ఇంప్రెస్ అయ్యింది. ‘డాడీ నాకు కూడా ట్రైనింగ్ ఇప్పిస్తారా’ అని అడిగింది. అంతేకాదు, స్కూల్ నుంచి వస్తూనే స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని గ్రౌండ్కు వెళదామని రెడీ అయిపోయేది. ‘నేను కూడా చాంపియన్ని అవుతాను’ అనేది. రోజూ నాతో పాటు ప్రాక్టీస్కు రావడం చూసి, అకాడమీకి తీసుకెళ్లాను. అక్కడ తను బాగా ఆడటం చూసినవాళ్లు మెచ్చుకోవడంతో మరింతగా ప్రాక్టీస్ చేసేది. అక్కను చూసి చెల్లెలు..రవళి మెడల్స్ తీసుకోవడం చూసి, చిన్నమ్మాయి శ్రీజ ‘నేను కూడా టేబుల్ టెన్నిస్ ఆడతాను’ అంది. శ్రీజను కూడా టేబుల్ టెన్నిస్లో చేర్పించాను. ఇద్దరూ స్పోర్ట్స్లో మంచి ప్రతిభ చూపించేవారు. దీంతో ప్రతి కాంపిటిషన్లో వాళ్లు పాల్గొనేలా చూసేవాడిని. గేమ్ పూర్తయ్యేంతవరకు ఉండి, తీసుకొచ్చేవాడిని. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి ప్రైవేట్గా..!పిల్లల చిన్నప్పుడు నాకు ఓరియంటల్ ఇన్సూరెన్స్లో అసిస్టెంట్ ఉద్యోగం. నా భార్య ఎల్ఐసీలో జాబ్. ప్రభుత్వ ఉద్యోగాలే అయినా జీతాలు తక్కువ, ఖర్చులు ఎక్కువ ఉండేవి. దీంతో, ఆ జాబ్ మానేసి, జనరల్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా చేరాను. అప్పుడు ‘మా అమ్మనాన్నలు, బంధువులు గవర్నమెంట్ జాబ్ వదులుకోవద్దు’ అని చెప్పారు. కానీ, వాళ్ల మాటలను పట్టించుకోలేదు. నా భార్య సపోర్ట్ చేసింది. నెల జీతం పెరగడం వల్ల ఇద్దరమ్మాయిలను అకాడమీలో చేర్పించడం, వారు కాంపిటిషన్స్లో పాల్గొనేలా చూడటం సులువైంది. రాత్రికి రాత్రి చాంపియన్లు అవరుమనమేవో త్యాగాలు చేస్తున్నాం కాబట్టి పిల్లలు రాత్రికి రాత్రి చాంపియన్లు కావాలనుకోకూడదు. ‘గెలుపు ఓటములు పట్టించుకోకుండా, మీ కృషి మీరు చేయండి. ప్రతీసారీ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించండి’ అని పిల్లలకు చెబుతుండేవాళ్లం. పిల్లలు ఓడిపోయినప్పుడు మా బంధువులు ‘అయ్యో, మీరు గవర్నమెంట్ జాబ్ వదలుకున్నారు, కానీ వాళ్లు ఓడిపోయారు’ అన్నట్టుగా మాట్లాడేవారు. ‘పిల్లలను బెస్ట్గా ప్రయత్నంచమని చెప్పండి. అంతేకాని, వారు చిన్నబుచ్చుకునేలా మాట్లాడకూడదు’ అని మా పేరెంట్స్కి, బంధువులకు గట్టిగా చెప్పాం. బంగారు పతకాలుపెద్దమ్మాయి టెన్త్ పూర్తయ్యాక ఒక కాన్సెప్ట్ కాలేజీలో జాయిన్ చేశాం. వాళ్లు ముందుగా స్పోర్ట్స్కి సపోర్ట్ చేస్తాం అన్నారు. తర్వాత మూడు నెలలకు ‘మీ అమ్మాయి బాగా చదువుతోంది – గ్రేడ్స్ ముఖ్యం’ అన్నారు. దీంతో రవళి స్పోర్ట్స్ ప్రాక్టీస్ ఆపేసింది. చిన్నమ్మాయి విషయంలో అలా జరగకూడదని తనని బద్రుకా కాలేజీలో చేర్పించాం. ముందుగానే కాలేజీ యాజమాన్యంతో ‘స్పోర్ట్స్కు ప్రాముఖ్యం ఇస్తేనే చేర్పిస్తాం’ అని చెప్పాం. కాలేజీ వాళ్లు సపోర్ట్ చేశారు. శ్రీజ ఇంటర్మీడియట్లో కాలేజీ టాపర్గా గోల్డ్ మెడల్ సాధించింది. దానికి కారణం మా ఆవిడ సాయిసుధ. శ్రీజతో పాటు తనూ టోర్నమెంట్స్కు వెళ్లేది. ట్రెయిన్లో, రూములో, మ్యాచ్ మధ్యలో వీలు దొరికనప్పుడల్లా చదివించేది. ఇద్దరి కృషి...పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రులిద్దరి కృషి ఉండాలి. స్పోర్ట్స్లో నేను కేర్ తీసుకుంటే, చదువు విషయంలో సాయిసుధ శ్రద్ధ తీసుకుంది. పిల్లల కెరీర్ గురించి ఆలోచించి మా ఆవిడ జాబ్లో ప్రమోషన్లు కూడా తీసుకోలేదు. ప్రమోషన్ తీసుకుంటే ట్రాన్స్ఫర్లు అవుతాయని ఆలోచించి అధికారి హోదాను కూడా వద్దనుకుని, వీలైనంత టైమ్ పిల్లలకు కేటాయించేది. పిల్లలిద్దరూ స్పోర్ట్స్లో రాణిస్తూ, చదువులోనూ గోల్డ్ మెడల్స్ సాధించారు. స్పోర్ట్స్.. జాబ్..పెద్దమ్మాయి ఇంటర్మీడియట్లో ఆపేసిన స్పోర్ట్స్ సీబీఐటీలో చేరాక స్టార్ట్ చేసింది. ఇంటర్ కాలేజీ టోర్నమెంట్స్ లీడ్ చేసేది. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసింది. ఇప్పుడు అమెరికాలో సెటిలైంది. చిన్నమ్మాయి శ్రీజకి పద్దెనిమిదేళ్లకు ఆర్బీఐలో జాబ్ వచ్చింది. ప్రాక్టీస్కు, టోర్నమెంట్స్లో పాల్గొనడానికి వీలుంటుంది. డిగ్రీ పూర్తి చేసింది. ఉద్యోగం చేస్తూనే ఫిజికల్ ఫిట్నెస్, ప్రాక్టీస్, టైమ్ ప్లానింగ్ గురించి చాలా క్రమశిక్షణగా ఉంటుంది. తల్లిదండ్రులుగా పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచిస్తాం. వారికోసం ఏమైనా చేస్తాం. దానిని పిల్లలు అర్ధం చేసుకొని, వారి భవిష్యత్తును బాగా మలచుకుంటే పెద్దలుగా మనకూ ఆనందం. నేటి తల్లిదండ్రులు పిల్లల చదువు గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. దాంతో పిల్లలకు ఒకవైపు మాత్రమే అవకాశాలు ఉంటున్నాయి. స్పోర్ట్స్లో అన్నివైపులా వృద్ధి ఉంటుంది. -
బెస్టే ఫస్ట్
‘చేసే ప్రతి పనిలోనూ బెస్ట్ ఇస్తే అదే మనల్ని ఒకరోజు అందరిముందు గొప్పగా నిలుపుతుంది’ అంటున్నారు. హైదరాబాద్ వాసి చిలకలపూడి ఇందు ఫల్గుణి. ఈ నెల ఫెమినా మిస్ ఇండియా సౌత్ కిరీటం గెలుచుకొని దక్షిణాది అందాల భామగా నిలిచారు. ఈ సందర్భంగా ఇందు ఫల్గుణి పంచుకున్న విశేషాలు...బ్యూటీ రంగంలో రాణించాలనుకుంటున్నాను. ప్రస్తుతం హైదరాబాద్లోని ఆంధ్ర మహిళాసభలో ఎల్ఎల్బి థర్డ్ ఇయర్ చదువుతున్నాను. వృత్తిరీత్యా జడ్జిగా ఎదగాలనుకుంటున్నాను. తెలుగు భాషపైన పట్టు సాధించాలనే ఆలోచనతో సాహిత్యాన్నీ చదువుతుంటాను. – ఇందు ఫల్గుణి‘‘కలలను నెరవేర్చుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తుంటారు. నేనూ చిన్నప్పటి నుంచి మోడలింగ్లోకి వెళ్లాలి, అందాలపోటీలలో పాల్గొనాలి, సినిమాలలో నటించాలి, జాతీయస్థాయి బ్యూటీ కాంటెస్ట్ వేదికపైన నించోవాలి.. అనుకునేదానిని. ఈ కల చిన్నప్పటి నుంచి ఉన్నా ‘నేను చేయగలనా?’ అనే సందేహం ఎప్పుడూ ఉండేది. ఆ సందేహాన్ని తీసేసి, ‘చేయగలను..’ అని ఎప్పుడైతే అనుకున్నానో ఆ రోజు నుంచి కృషి చేయడం మొదలుపెట్టాను. నా చూపు బ్యూటీ కాంటెస్ట్ల వైపు ఉండేది కాబట్టి నన్ను నేను మెరుగ్గా చేసుకోవడానికి వరల్డ్ బ్యూటీస్గా పేరొందిన ఐశ్వర్యా రాయ్, లారాదత్తా, సుస్మితాసేన్ ల గురించి సమగ్రంగా తెలుసుకునేదానిని. ప్రోత్సాహంతో ముందడుగు...మా తమ్ముడు యాడ్ ఫిల్మ్లో పాల్గొనేవాడు. నేను ఆ యాడ్ ఫిల్మ్మేకింగ్కి వెళ్లి, దూరంగా కూర్చొని చూస్తుండేదాన్ని. కొన్ని రోజులకు ఆసక్తిగా అనిపించి, నేనూ ఆ యాడ్స్లో పాల్గొన్నాను. అలా తొమ్మిదేళ్ల వయసు నుంచి మోడలింగ్ చేస్తున్నాను. మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. కాలేజీకి వచ్చాక అమ్మ నాగలక్ష్మి, నాన్న మహేష్ ప్రోత్సాహంతో మళ్లీ మోడలింగ్ మొదలుపెట్టాను. కూచిపూడి డ్యాన్సర్గానూ సాధన చేస్తున్నాను. మధ్యతరగతి కుటుంబం నేపథ్యం నాకున్న కలను నెరవేర్చుకోవడానికి అమ్మానాన్నలకు భారం కాకూడదు అనుకున్నాను. అందుకు, యూ ట్యూబ్లో మేకప్, మేకోవర్ గురించి రెండేళ్లపాటు ప్రాక్టీస్ చేశాను. అది సరిపోదని, ముంబైకి వెళ్లి అక్కడి అకాడమీలో చేరి శిక్షణ తీసుకున్నాను.గ్లామర్ మాత్రమే కాదుఅందాలపోటీలు అంటే గ్లామర్ మాత్రమే అనుకుంటారు చాలామంది. క్యాన్సర్, ఆటిజం సమస్య ఉన్న చిల్డ్రన్ కోసం ఫండ్ రైజ్ చేస్తుంటాను. అంటే.. సేవాగుణం, ఆత్మవిశ్వాసం, ప్రతిభ, వ్యక్తిత్వం, ఆలోచన, కమ్యూనికేషన్ స్కిల్స్, సాధన.. అన్నీ ఈ కేటగిరీలోకి వస్తాయి. స్టేజ్పైన వాక్ కోసం ఆరు ఇంచుల హీల్ మీద గంటలు గంటలు నిల్చోవాలి. తర్వాత నేల మీద కాలు పెట్టి, నిలబడటానికిæఎంత నొప్పి ఉంటుందో చెప్పలేం. ఎంతో సహనం కూడా ఉండాలి. ఇంత తపన పడుతున్నా చుట్టుపక్కలవారి నుంచి, బంధువుల నుంచి విమర్శలు కూడా ఎదురయ్యాయి. అవన్నీ పట్టించుకోకుండా ఏం సాధించాలనుకున్నామో ఆ లక్ష్యంవైపే దృష్టి పెట్టాలనుకున్నాను.ప్రతి రాష్ట్రంలో ఓ ఇల్లు..భువనేశ్వర్లోని క్విట్ యూనివర్శిటీలో ఈ బ్యూటీ కాంటెస్ట్ జరిగింది. నలబైవేల మందికి పైగా విద్యార్థులు, లెక్చరర్లు పువ్వులతో మాకు స్వాగతం పలికారు. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనంత గొప్పది. ఈ అందాలపోటీకి దేశంలోని ప్రతి రాష్ట్రం నుంచి ఒక్కొక్కరు చొప్పున ముప్పైమందిమి ఎంపికయ్యాం. ఇరవై ఐదు రోజుల పాటు ముప్పైమందిమి తోబుట్టువుల్లా కలిసిపోయాం. అన్ని రాష్ట్రాల విభిన్న రుచులు, సంస్కృతులు.. మాకు పరిచయం అయ్యాయి. మేం ఉన్న రోజుల్లోనే ఒడిస్సా, కేరళ, తమిళనాడు నూతన సంవత్సరాది వేడుకలు కూడా జరిగాయి.పండగలు జరుపుకోవడం, ఒకరికొకరం సాయం చేసుకోవడం, అక్కచెల్లెళ్లలా సరదాగా గడపడం.. ప్రతిరోజూ ఒక వేడుకే. మేం ఇప్పుడు ఏ రాష్ట్రానికి వెళ్లినా, అక్కడ మాకో ఇల్లు ఉంది. అంతగా కలిసిపోయాం. లక్షలాది మంది ఈ బ్యూటీ కాంటెస్ట్కుపోటీ పడుతుంటారు. అంతమందితోపోటీపడి వేదికపై వరకు వెళ్లడమే గొప్ప అనుకున్నాను. అలాంటిది తెలుగు అమ్మాయిగా ఈ గౌరవం దక్కడం ఎంతో ఆనందంగా ఉంది’’ అంటూ పట్టువదలకుండా చేసిన కృషిని వివరించింది ఈ బ్యూటీ.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కథాకళి: డర్టీ మెటల్
ఐదేళ్ళుగా మేం ఐదుగురం మిత్రబృందం ప్రతి ఆదివారం రమ్మీ ఆడటం అలవాటు. అలా రోజు సిట్టింగ్లో... ‘‘మనిషి ఎక్కువగా దేన్ని ప్రేమిస్తాడు?’’ ఆ ఆదివారం వశిష్ట అడిగాడు.‘‘చాలావాటిని.’’ ఒకరు చెప్పారు.‘‘ఆ చాలావాటిలో దేన్ని అధికంగా ప్రేమి్తాడన్నది నా ప్రశ్న.’’‘‘అది మనిషికి మనిషికి మారుతూంటుంది.’’ చెప్పాను.‘‘నీకేం ఇష్టం? ఎన్నటికీ పోగొట్టుకోడానికి ఇష్టపడనిది.’’ వశిష్ట నన్ను అడిగాడు.‘‘మా నాయనమ్మ నా చిన్నప్పుడు ఇచ్చిన రూపాయి కాసు. దాన్ని ఖర్చు చేయకుండా దాచుకున్నాను.’’ చెప్పాను.‘‘నాకు ఉప్మా ఇష్టం. నేను చేసుకునే వెజిటబుల్ ఉప్మా.’’ మాలోని హాస్యప్రియుడైన లాయర్ చెప్పాడు.‘‘నువ్వు ఉప్మాని మించి ఇష్టపడేది ఏం లేదా?’’‘‘ఇష్టం అనేది కాలాన్ని, సమయాన్ని, సందర్భాన్ని బట్టి మారుతూంటుంది. నాకు ఉదయం కాఫీ ఇష్టం. సాయంత్రం టీ ఇష్టం. రాత్రికి బీర్ ఇష్టం. నేను పోయే టైమ్ని బట్టి ఆ సమయంలో కాఫీ లేదా టీ తాగుతూ లేదా ఉప్మా తింటూ పోవాలనుకుంటున్నాను.’’‘‘నాకు నా ఇంట్లో, నా పక్కలో, నిద్రలో మరణించడం ఇష్టం. ఓసారి ఓ బంధువుని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూశాను. స్ట్రెచర్ మీద తీసుకెళ్ళే ఓ వ్యక్తి, వెనకే ఆక్సిజన్ సిలిండర్ని తోసుకెళ్ళే ఓ అటెండర్. ఆయన కళ్ళల్లో భయాన్ని చూశాక అనిపించింది, రోగం రొష్టు రాకుండా, ఇంట్లోనే మరణించడానికి మించిన యోగం లేదని. ఇంట్లో మరణం నా జీవితంలో నాకు అత్యంత ఇష్టమైంది.’’ మరొకరు చెప్పారు.‘‘ఫిలసాఫికల్.’’ నేను చెప్పాను.‘‘చిన్న సవరణ. ఉప్మా కాదు. ఉప్మాలోని ఉప్పు. సరిపడ ఉప్పు. ఓసారి నేను ఎక్కువ ఉప్పు వేసి తినలేకపోయాను. సరిపడ ఉప్పు వేసిన ఉప్మా.’’ లాయర్ వృత్తిలోని అతను నవ్వుతూ సవరించాడు.‘‘నీకు?’’ నాలుగోవాడిని అడిగాను.‘‘మన జెండా.’’ వాడు చేతిలోని ముక్కలని చూసి, ఓ ముక్కని వేశాక చెప్పాడు.కొద్దిసేపు ఆగి నేను అడిగాను.‘‘వశిష్టా. తమరికి ఏమి ఇష్టమో సెలవివ్వనా? మీ ఆవిడ ముక్కంటే కదా?’’అంతా నవ్వారు.‘‘వశిష్ట తన భార్య ముక్కు మీద కవిత్వం రాశాడు.’’ చెప్పాను.‘‘కాని మీ ఆవిడకి బంగారం అంటే ఇష్టం. కాబట్టి నువ్వు కూడా బంగారాన్ని ఇష్టపడుతున్నావేమో?’’ ఒకరు అడిగారు.వశిష్ట ప్రతీ మేరేజ్ ఏనివర్సరీకి, తన భార్య పుట్టినరోజుకి, ఉమెన్స్ డేకి భార్యకి ఏదైనా బంగారు ఆభరణాన్ని బహుకరిస్తుంటాడని మాకు మా భార్యల ద్వారా తెలుసు. ‘మీరూ ఉన్నారు ఎందుకు? మీ ఫ్రెండ్ వశిష్ట వాళ్ళ ఆవిడకి ఏం కొనిచ్చాడో తెలుసా?’ అనే డైలాగ్ మేము చాలాసార్లు విన్నాం. ఇలాంటి ఆడవాళ్ళ ముచ్చట్లకి ఆ ఐదుగురికి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ‘‘ప్రపంచంలోని పద్దెనిమిది శాతం బంగారం ఇండియన్ భార్యల దగ్గరే ఉందని చదివాను. అది పాతికవేల టన్నుల బంగారమట. అందులో చాలా భాగం వశిష్ట భార్య దగ్గరే ఉంది.’’ ఒకరు నవ్వుతూ చెప్పారు.‘‘మా ఆవిడకి బంగారం ఇష్టం కాబట్టి ఆమెని సంతోషపెట్టడానికి కొనిస్తూంటాను. నాకు నా భార్యంటే ఇష్టం. నా భార్య మీద ఇష్టాన్ని నేను అలా ప్రదర్శిస్తూ ఉంటాను.’’ వశిష్ట చెప్పాడు.ఈ చర్చ జరిగిన కొంత కాలానికి వశిష్ట భార్య మరణించింది. ఈ కాలంలో అకాల మరణానికి కారణమైంది కేన్సర్. అది ఫోర్త్ స్టేజ్లో కాని బయటపడలేదు. బయటపడ్డ రెండు నెలలు తిరగకుండానే ఆమె గతించింది.వశిష్ట దుఃఖాన్ని పట్టలేకపోయాం. ఆ పదిహేను రోజులు మేము నలుగురం అతని వెన్నంటే ఉన్నాం. ఆ తర్వాత చాలా ఆదివారాలు మేము నలుగురమే రమ్మీ ఆడాం. తన భార్య పోయిన ఎనిమిదో ఆదివారం వశిష్ట వచ్చాడు. ఐదారు నిమిషాల తర్వాత వశిష్ట చెప్పాడు. ‘‘ఓసారి ‘మనిషి దేన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు?’ అనే అంశం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు నేను అధికంగా ప్రేమించేది మా ఆవిడని చెప్పాను. గుర్తుందా?’’‘‘అవును. అందులో మాకు ఎలాంటి సందేహం లేదు.’’ చెప్పాను.‘‘కాదు. మా ఆవిడ మరణించాక నాకు తెలిసింది. నేను ప్రేమించేది మా ఆవిడని కానే కాదు. ఆవిడ ప్రేమించే డర్టీ మెటల్ని. బంగారాన్ని.’’ నెమ్మదిగా చెప్పాడు.‘‘అంటే నువ్వు ఇంతకాలం మీ ఆవిడ ఇష్టపడుతుందని బంగారం కొనలేదా?’’ అడిగాను.‘‘ఆవిడ మరణించకపోతే అసలు నాకీ సంగతే తెలిసేది కాదు. ఆవిడ శవాన్ని వైకుంఠ రథంలో తరలించేటప్పుడు నేను ఆవిడ నోట్లోని రెండు బంగారు కట్టుడు దంతాలని కటింగ్ ప్లయర్తో పెకలించి తీసుకున్నాను. భార్యని ప్రేమించే ఎవరైనా, జీవం లేనంత మాత్రాన చేసే పనేనా అది?’’ వశిష్ట ప్రశ్నించాడు.అతని మెళ్ళోని బంగారు గొలుసుకి ఆవిడ రెండు దంతాలు మెరుస్తూ కనిపించాయి. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
కిరాయి సైన్యాలు!
అదృశ్య సైన్యాలు అంటే కిరాయి సైనికులు. వాళ్లు ఏ దేశానికీ, ఏ జెండాకూ కట్టుబడి ఉండరు. కేవలం వృత్తిపరమైన సైనికులు. ఎవరు డబ్బు ఇస్తే వారి తరపున ప్రాణాలకు తెగించి పోరాడతారు. రష్యాకు చెందిన ‘వాగ్నర్ గ్రూప్’ మొదలు, కొలంబియాకు చెందిన భయంకరమైన ‘డెజర్ట్ ఉల్వ్స్’ వరకు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సైన్యాలు చాలానే ఉన్నాయి. ఉక్రెయిన్ సరిహద్దులు, కాంగో అడవులు, ఇరాక్ ఎడారులు.. ఇలా యుద్ధం ఎక్కడ మొదలైతే అక్కడికి వాళ్లు కిరాయికి వెళ్లిపోతారు.ఔట్సోర్సింగ్ ‘యుద్ధం’!సాధారణ సైన్యానికి కొన్ని అంతర్జాతీయ యుద్ధ నియమాలు ఉంటాయి. కిరాయి సైన్యాలకు అవేమీ పట్టవు. అందుకే ప్రభుత్వాలు తాము నేరుగా చేయలేని పనులను వీరితో చేయిస్తుంటాయి. యుద్ధ క్షేత్రంలో శత్రువులను దెబ్బతీయడం, యుద్ధం వెలుపల తిరుగుబాట్లను అణచివేయడం, విదేశాల్లో ఉగ్రదాడులు చేయడం వీరి పని. వీరు ప్రభుత్వాల నీడలో పని చేస్తారు. ప్రస్తుతం ఇరాన్ తన శత్రువులను దెబ్బతీయడానికి ఈ కిరాయి ఏజెంట్లను వాడుకుంటోందని ఆరోపణలు వస్తున్నాయి. ఇరాన్ చేస్తున్న ఈ ‘ఔట్సోర్సింగ్’ యుద్ధంపై, బ్రిటిష్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘ఎం15’ (సెక్యూరిటీ సర్వీస్కు సంబంధించినది) చీఫ్ కెన్ మెకల్లమ్ ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. కేవలం గత ఏడాదిలోనే బ్రిటన్ లో ఇరాన్ మద్దతుతో జరిగిన 20కి పైగా ప్రాణాంతక కుట్రలను తమ ఏజెంట్లు అడ్డుకున్నారని ఆయన వెల్లడించారు!రెండు రకాల ‘కిరాయి’లు కిరాయి సైన్యంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి: ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీలు. ఇవి ప్రభుత్వాల అవసరాలకు, ఆదేశాలకు లోబడి పనిచేస్తాయి. రెండు: అక్రమ ముఠాలు. డబ్బు కోసం ఆ ముఠాలు ఎంతటి ఘాతుకానికైనా ఒడిగడతాయి. 1960లలో ఆఫ్రికా దేశాల్లో జరిగిన దాడుల్లో తొలిసారి వీరి గురించి ప్రపంచానికి తెలిసింది. అప్పట్లో ‘డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో’లో జరిగిన యుద్ధం– కిరాయి సైనికుల ఉనికికి ఒక ప్రత్యక్ష నిదర్శనం. కాంగోలోని ‘కటంగా’ అనే ప్రాంతంలో అపారమైన రాగి నిక్షేపాలు ఉండేవి. బెల్జియంకు చెందిన స్థానిక మైనింగ్ కంపెనీలు ఆ వనరులను కొల్లగొట్టటానికి బ్రిటన్, అమెరికాల మద్దతుతో కిరాయి సైనికులను అక్కడ దింపాయి. దేశాన్ని అస్థిరపరచి, ఆ ఖనిజ సంపదను దోచుకోవడమే లక్ష్యంగా కిరాయి మూకలు కటంగాలో బీభత్సాన్ని సృష్టించాయి.పెంచిన కుక్కే కరిచే ప్రమాదంప్రభుత్వాలు తమ పనుల కోసం కిరాయి ముఠాలకు ఆయుధాలు, డబ్బు ఇస్తాయి. ప్రభుత్వానికి, కిరాయి ముఠాకు మధ్య సయోధ్య ఉన్నంత వరకు అంతా బాగానే ఉంటుంది. కానీ, ఎప్పుడైతే కాస్త తేడా వస్తుందో అప్పుడు ఆ ముఠా, ప్రభుత్వం మీదకే తిరగబడుతుంది! దీనికి ఒక ఉదాహరణ అఫ్ఘానిస్తాన్ లోని ముజాహిదీన్లు. రష్యాతో పోరాడటానికి అమెరికా ముజాహిదీన్లకు ‘స్టింగర్’ క్షిపణులను అందించింది. ఆ తర్వాత అవే ఆయుధాలు అమెరికాకు తలనొప్పిగా మారాయి. ఒకసారి కనుక కిరాయి సైన్యానికి భారీగా ఆయుధాలు, సాంకేతిక నైపుణ్యం ఇస్తే.. వారు ప్రభుత్వ నియంత్రణలో ఉండరు. సొంతంగా ఒక శక్తిగా ఎదిగి ఆ దేశానికే ముప్పుగా మారుతారు.కిరాయి సైన్యాల అవసరం ఏంటి? ప్రభుత్వాలు ఈ ప్రైవేటు కాంట్రాక్టర్లను ఎంచుకోటానికి అనేక కారణాలు ఉన్నా, ప్రధానమైన కారణం మాత్రం సొంత సైనికుల రోటేషన్ సమస్య. ఏ దేశమైనా ఒక బెటాలియన్ సైన్యాన్ని యుద్ధంలో ఉంచాలంటే, మూడు బెటాలియన్లు అవసరం! మూడు ఎందుకంటే.. ఒకటి యుద్ధంలో ఉంటే, రెండోది సెలవులో ఉండాలి, మూడోది శిక్షణలో ఉండాలి. ప్రైవేటు కంపెనీలకైతే, కేవలం పని జరిగినన్ని రోజులు మాత్రమే డబ్బు ఇస్తారు. వారికి పెన్షన్లు ఇవ్వక్కర్లేదు, యుద్ధం అయిపోయాక వారి బాధ్యత ఉండదు. దీనినే మిలిటరీ భాషలో ‘ఫోర్స్ మల్టిప్లయర్’ అంటారు. అంటే సంఖ్యను పెంచకుండా, సామర్థ్యాన్ని పెంచుకోవటం. ఉక్రెయిన్పై యుద్ధానికి ఆఫ్రికా డబ్బు!2022లో మార్చి 27 నుంచి 31 వరకు మాలి దేశంలోని మౌరా పట్టణంలో ఊచకోత జరిగింది. దాదాపు 500 మంది అమాయకులను స్థానిక సైనికులు, ‘తెల్లటి చర్మం కలిగిన అపరిచిత భాష మాట్లాడే వ్యక్తులు’ (రష్యాకు చెందిన వాగ్నర్ సైనికులు) కలిసి చంపేశారని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో పేర్కొంది. రష్యా మాత్రం ఆ ఊచకోతను ‘ఉగ్రవాదంపై విజయం’గా అభివర్ణించింది. రష్యా పెంచి పోషిస్తున్న వాగ్నర్ గ్రూప్ ఆఫ్రికాలోని అవినీతి నియంతలకు లేదా మిలిటరీ పాలకులకు కూడా భద్రత కల్పిస్తోంది. దాని వెనుక పెద్ద ఆర్థిక ప్రయోజనమే ఉంది. డబ్బుకు బదులుగా ఆ దేశాల్లోని బంగారం, యురేనియం వంటి విలువైన ఖనిజాల తవ్వకం హక్కులను రష్యా పొందుతుంది. గత రెండేళ్లలోనే ఆఫ్రికా నుండి రష్యా çరూ. 20,000 కోట్లకు పైగా విలువైన బంగారాన్ని రాబట్టుకుంది. ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధానికి ఈ డబ్బునే రష్యా వాడుతోంది.వాట్సాప్లో రిక్రూట్మెంట్ కిరాయి సైనికుల నియామకం ఒక పద్ధతిలో సాగుతుంది! మాజీ సైనికులను వాట్సాప్ ద్వారా సంప్రదించి, వారికి దుబాయ్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఒక కిరాయి సైనికుడికి నెలకు సుమారుగా రూ. 3.3 లక్షల జీతం ఉంటుంది! అది వారు సైన్యంలో పొందే పెన్షన్ కంటే ఆరు రెట్లు ఎక్కువ! కొన్ని దేశాలు నేరుగా మద్దతు ఇచ్చే ‘మిలీషియా’ (తీవ్రవాద సైనిక దళాల) గ్రూపులు కూడా యుద్ధాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఇరాన్, మిలీషియాను పెంచి పోషిస్తోంది. తన సొంత సైన్యాన్ని నేరుగా రంగంలోకి దించకుండా, ఇతర దేశాల్లో ఉన్న కొన్ని గ్రూపులకు డబ్బు, ఆయుధాలు ఇచ్చి యుద్ధం చేయిస్తోంది. ఇరాన్ కనుసన్నలలో పనిచేసే హిజ్బుల్లా (లెబనాన్), హమాస్ (గాజా), హౌతీలు (యెమెన్) ఇలాంటి మిలీషియాలే. యుద్ధం ముగిశాక...?యుద్ధం ముగిశాక, శాంతిని కాపాడటానికి ప్రైవేట్ సైన్యాలు అవసరమవుతాయి. అవి కిరాయి సైన్యానికి భిన్నమైనవీ, చట్టపరిధిలో పని చేసేవీ. ఇలా – డబ్బు కోసం పోరాడే సైన్యం ఒకవైపు విధ్వంసాన్ని సృష్టిస్తుంటే, చట్టబద్ధమైన ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీలు యుద్ధం తర్వాత పరిస్థితులను చక్కదిద్దడంలో సహాయపడుతుంటాయి. డెసర్ట్ వుల్వ్స్ రష్యాకు చెందిన వాగ్నర్ గ్రూపులాగే, కొలంబియాకు చెందిన మాజీ సైనికులు కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల్లో పాల్గొంటున్నారు. వారిని ‘డెసర్ట్ వుల్వ్స్’ అని పిలుస్తారు. ప్రస్తుతం సూడాన్ లో జరుగుతున్న భీకర యుద్ధంలో, ‘రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్’ (ఆర్.ఎస్.ఎఫ్.) అనే గ్రూపు తరపున ఈ కొలంబియన్ కిరాయి సైనికులు పోరాడుతున్నారు. ఆర్.ఎస్.ఎఫ్. జాతి నిర్మూలన, సామూహిక అత్యాచారాలు, పసిపిల్లలను చంపడం వంటి ఘోరమైన యుద్ధ నేరాలకు పాల్పడుతోంది! అధికారం కోసం ఆర్.ఎస్.ఎఫ్., సూడాన్ అధికారిక సైన్యం మధ్య ఈ పోరు జరుగుతోంది. గత అక్టోబర్లో ఆర్.ఎస్.ఎఫ్. ‘ఎల్ ఫాషర్’ అనే నగరాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో దాదాపు 60,000 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. విషాదం ఏమిటంటే, కొలంబియాకు చెందిన టీనేజర్లు కూడా కిరాయి సైనికులుగా పోరాడాల్సి రావటం. వాగ్నర్ గ్రూప్ అమెరికా లేదా బ్రిటన్ దేశాల ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీలు కేవలం దేశ రక్షణ విధులను మాత్రమే చేపడతాయి. కానీ రష్యాకు చెందిన వాగ్నర్ గ్రూప్ కథే వేరు! ఇది రష్యా ప్రభుత్వం (క్రెమ్లిన్) నిధులు ఇచ్చి నడిపే ఒక రహస్య సైన్యం. 2023లో వాగ్నర్ గ్రూప్ అధిపతి యెవ్జెనీ ప్రిగోజిన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ పైనే తిరుగుబాటు చేసి సంచలనం సృష్టించటం మీకు గుర్తుండే ఉంటుంది. అయితే అంతా ఊహించిన విధంగానే వాగ్నర్ గ్రూప్ అధిపతి ప్రిగోజిన్ కథ విషాదాంతమైంది. పుతిన్ ను బాహాటంగా విమర్శించి, తిరుగుబాటు చేసిన ప్రిగోజిన్, ఒక ప్రైవేట్ జెట్ ‘ప్రమాదంలో’ ప్రాణాలు కోల్పోయాడు. ప్రిగోజిన్ మరణం తర్వాత, వాగ్నర్ గ్రూప్ ఇప్పుడు పేరు మార్చుకుని ‘ఆఫ్రికా కోర్స్’ గా చలామణి అవుతోంది. ∙ సాక్షి స్పెషల్ డెస్క్ -
రైవతుడి జననం
పూర్వం ఋతవాక్కు అనే మునికుమారుడు విద్యాభ్యాసం తర్వాత బ్రహ్మచర్యం వీడి, తగిన కన్యను వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడు. చాలాకాలమైనా సంతానం కలగకపోవడంతో సూర్యుడి కోసం తపస్సు చేశాడు. సూర్యుడి వర ప్రసాదం వల్ల ఋతవాక్కుకు కొడుకు పుట్టాడు. అతడు రేవతీ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించాడు.ఋతవాక్కు ఆ బాలుడికి యథావిధిగా జాతకర్మాదులు జరిపించాడు. అయితే, ఆ బాలుడు పెరిగేకొద్ది బుద్ధివికాసం పొందకపోగా, వెర్రివాడిలా తిరగసాగాడు. కొడుకు పరిస్థితికి ఋతవాక్కు, అతడి భార్య తీవ్రంగా కలత చెందారు. మనోవ్యధతో వారు వ్యాధిగ్రస్థులయ్యారు. కొడుకు పరిస్థితిని చక్కదిద్దడానికి తరుణోపాయం కోసం ఋతవాక్కు ఒకనాడు గర్గముని ఆశ్రమానికి వెళ్లాడు. గర్గమునిని దర్శించుకుని, తన కొడుకు పరిస్థితిని వివరించి, తరుణోపాయం చెప్పమని కోరాడు.‘‘మునిపుంగవా! నీ కొడుకు రేవతీ నక్షత్రం నాలుగో పాదంలో పుట్టాడు. నక్షత్రదోషం కారణంగానే అతడు మూర్ఖుడయ్యాడు’’ అని పలికాడు గర్గుడు. ఋతవాక్కు ఆ మాటలకు కోపించి, ‘‘రేవతీ నక్షత్రం ఆకాశం నుంచి నేల రాలిపోవు గాక!’’ అని శపించాడు.వెంటనే రేవతీ నక్షత్రం ఆకాశం నుంచి రాలిపోయి, కుముద పర్వతంమీద ఉన్న ఒక కొలనులో పడింది. ఆ కొలనులో అనేక పద్మాలు ఉండేవి. వాటిలోని ఒక పద్మం నుంచి రేవతీ నక్షత్రం ఒక కన్యక రూపంలో పుట్టింది. ప్రముచుడు అనే ముని ఆ కన్యకను చూసి, తన ఆశ్రమానికి తీసుకువెళ్లి, పెంచుకోసాగాడు. ఆమెకు రేవతి అని పేరు పెట్టాడు. కొన్నాళ్లకు రేవతి యుక్తవయస్కురాలైంది. ప్రముచుడు ఆమె కోసం వరాన్వేషణ ప్రారంభించాడు.ప్రముచుడు ఒకనాడు అగ్నిదేవుడిని ‘‘దేవా! నా కుమార్తెకు యోగ్యుడైన వరుడు ఎక్కడ దొరుకుతాడో నువ్వే చెప్పు’’ అని అభ్యర్థించాడు.‘‘మునీశ్వరా! కొద్దిరోజుల్లోనే దుద్ధముడు అనే రాజు నీ ఆశ్రమానికి వచ్చి, నీ కుమార్తెను చూస్తాడు. అతడే ఆమెకు తగిన వరుడు. నీ కుమార్తె రేవతిని అతడికిచ్చి వివాహం జరిపించు’’ అని పలికాడు అగ్నిదేవుడు.కొన్నాళ్లకు ప్రియంవద వంశీయుడైన దుద్ధముడు అడవిలో సంచరిస్తూ, ప్రముచుడి ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడే, ఆశ్రమంలోంచి ప్రముచుడు బయటకు వచ్చాడు. ‘‘ప్రియంవద వంశోద్భవా! నిన్ను చూసి చాలాకాలమైంది. నువ్వు నాకు అల్లుడివి’’ అని పలికి, అతడికి అర్ఘ్యమిచ్చి, లోనికి స్వాగతించాడు.‘‘మహర్షీ! మీ మాటలు ఆశ్చర్యంగా ఉన్నాయి. నేను మీకెలా అల్లుడినయ్యాను?’’ అడిగాడు దుద్ధముడు.‘‘రాజా! నా కుమార్తె రేవతిని నీకిచ్చి పెళ్లి చేయదలచాను. నువ్వు నా ఆశ్రమానికి వస్తావని, నా కుమార్తెకు తగిన వరుడివి నువ్వేనని అగ్నిదేవుడు చెప్పాడు’’ అన్నాడు ప్రముచుడు.తండ్రి మాటలు విన్న రేవతి, ‘‘తండ్రీ! నాకు ఈ రాజుతో వివాహం చేయదలిస్తే, రేవతీ నక్షత్ర ముహూర్త సమయంలోనే చేయాలి’’ అని చెప్పింది.ప్రముచుడు తన తపోమహిమతో రేవతీ నక్షత్రాన్ని ఆకాశంలో నిలిపి, అదే ముహూర్తంలో అగ్ని సమక్షంలో రేవతీ, దుద్ధముల వివాహం వేదోక్తంగా జరిపించాడు. వివాహం ముగిశాక, ‘‘జామాతా! నీకే వరం కావాలో కోరుకో’’ అని అడిగాడు ప్రముచుడు.‘‘మునివర్యా! నేను స్వాయంభువ మనువు వంశంలో పుట్టాను. నాకు నీ కుమార్తె రేవతి ద్వారా జన్మించే కుమారుడు ఈ మన్వంతరానికి అధిపతి అయ్యేలా వరం అనుగ్రహించండి’’ అని కోరాడు.‘‘తథాస్తు’’ అని ఆశీర్వదించాడు ప్రముచుడు.కొన్నాళ్లకు రేవతికి పండంటి కొడుకు పుట్టాడు. దుద్ధముడు అతడికి జాతకర్మాదులు జరిపించి, రైవతుడు అని నామకరణం చేశాడు.రైవతుడు సకల శాస్త్రాలను, అస్త్రశస్త్ర విద్యలను క్షుణ్ణంగా అభ్యసించాడు. కొన్నాళ్లకు దుద్ధముడు ఒక సుదినాన రైవతుడికి పట్టాభిషేకం జరిపించి, భార్యలతో కలసి వానప్రస్థానికి వెళ్లిపోయాడు.రైవతుడు సమస్త భూమండలాన్ని జయించి, రైవత మనువుగా ప్రఖ్యాతి పొందాడు.∙సాంఖ్యాయన -
క్లూషియల్: పాంట్రీ కారులో శవం
సమయం ఉదయం 10 గంటలు.. హైదరాబాద్లోని నాంపల్లి స్టేషన్ కు చెన్నై ఎక్స్ప్రెస్ చేరుకుంది. రైలు పాంట్రీకారులో సినిమా ప్రొడ్యూసర్ తంగవేలు శవమై కనిపించడం పెను సంచలనం సృష్టించింది. ఈ మిస్టరీని చేధించడానికి డిటెక్టివ్ సిద్ధార్థ రంగంలోకి దిగాడు.తంగవేలు మృతదేహం పాంట్రీకారులోని స్టోరేజ్ క్యాబిన్ దగ్గర పడి ఉంది. అతని గొంతుపై లోతైన గాయం ఉంది, కాని, ఆశ్చర్యకరంగా రక్తపు మరకలు చాలా తక్కువగా ఉన్నాయి.సిద్ధార్థ తన విచారణను పాంట్రీ సిబ్బంది నుంచి ప్రారంభించాడు.మొదటి అనుమానితుడిగా వంటవాడిని ప్రశ్నించాడు. అతడు ‘‘నేను రాత్రంతా బిజీగా ఉన్నాను, నాకేం తెలియదు’’ అని చెప్పాడు.రెండవ అనుమానితుడైన మేనేజర్ను ప్రశ్నించాడు సిద్దార్థ. తంగవేలు తనను డబ్బుల కోసం వేధించాడని ఒప్పుకున్నాడు కాని, తాను చంపలేదని వాదించాడు.సిద్ధార్థ పాంట్రీకారులోని డీప్ ఫ్రీజర్ని పరిశీలించాడు. అక్కడ గడ్డకట్టిన రక్తపు చుక్కలను గుర్తించాడు. అలాగే తంగవేలు చేతి గడియారం 11:30 గంటలకు ఆగిపోయి ఉంది. కానీ రైలు సిబ్బంది ఆయన 1:00 గంటకు కూడా సజీవంగా ఉన్నాడని సాక్ష్యం చెప్పారు.అదే సమయంలో రాత్రి ఒంటి గంటకు తంగవేలు బోగీలో నడుచుకుంటూ వెళ్లడం చూశానని అదే బోగీలో ప్రయాణిస్తున్న సంతోష్ అనే కుర్రాడు చెప్పాడు. తన తాతకు మూలికా వైద్యం కోసం చెన్నైలో ఉంటున్న ఆయుర్వేద వైద్యుడు సుబ్బారాయుడు దగరికి వెళ్లి అదే ట్రైన్లో అదే బోగీలో ప్రయాణించినట్టు సాక్ష్యం చెప్పాడు.‘రాత్రి 11:30 గంటలకు చనిపోయిన వ్యక్తి ఒంటి గంటకు నడుస్తూ కనిపించడం ఎలా సాధ్యం?’ అక్కడే సిద్దార్థ డిటెక్టివ్ బుర్ర వేగంగా పని చేసింది.రైలు నాంపల్లి స్టేషన్ కు చేరుకున్నాక, రైల్వే క్లీనింగ్ సిబ్బంది పాంట్రీకారులోని స్టోరేజ్ క్యాబిన్ (సామాన్లు ఉంచే గది) తలుపు తీసినప్పుడు అక్కడ తంగవేలు మృతదేహం బయటపడింది.అసలు ఏం జరిగింది? సిద్ధార్థ పరిశోధన మొదలుపెట్టాడు.రాత్రి 11:30 గంటలకే తంగవేలును పాంట్రీకారులోని సీక్రెట్ స్టోరేజ్ ఏరియాలో ఎవరో చంపేశారు.సిద్ధార్థ తంగవేలు చేతి గడియారాన్ని గమనించాడు. అది రాత్రి 11:30 గంటలకే ఆగిపోయి ఉంది. గొడవ జరిగిన సమయంలో గడియారం కింద పడి ఆగిపోయిందని గ్రహించాడు.శవాన్ని రైలు నుంచి బయట పడేయడం సాధ్యం కాదు కాబట్టి, హంతకుడు ఎవరికీ అనుమానం రాకుండా కూరగాయలు, ఖాళీ డబ్బాలు ఉంచే పెద్ద డీప్ ఫ్రీజర్ అడుగున శవాన్ని దాచిపెట్టి, పైన సామాన్లు సర్దేశారు.రాత్రి ఒంటి గంట సమయంలో తంగవేలులాగే డ్రెస్ వేసుకున్న ఒక సిబ్బంది, తల వంచుకుని పాంట్రీ నుంచి బయటకు వెళ్తున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు.రైలు నాంపల్లి స్టేషన్ ప్లాట్ఫారమ్ మీద ఆగడానికి సరిగ్గా 5 నిమిషాల ముందు, అందరూ సామాన్లు సర్దుకోవడంలో బిజీగా ఉన్నప్పుడు మేనేజర్ తెలివిగా శవాన్ని ఫ్రీజర్ నుండి తీసి, పాంట్రీకారులోని ఒక మూలగా ఉన్న సర్వీస్ డోర్ దగ్గర పడేశాడు. రైలు ఆగగానే అందరూ దిగిపోతుంటే, తను కూడా ఏమీ తెలియనట్టు పక్కకు తప్పుకున్నాడు.సిద్ధార్థ ఆ స్టోరేజ్ క్యాబిన్ తలుపుల దగ్గర రక్తపు మరకలు నేల మీద కాకుండా, పైభాగంలో ఉండటం గమనించాడు. అంటే శవాన్ని ఎక్కడి నుంచో తీసి ఇక్కడ పడేశారని గ్రహించాడు. ఫ్రీజర్ తెరిచి చూస్తే, అక్కడ తంగవేలు కోటు బటన్ దొరికింది. దాంతో అసలు రహస్యం బయటపడింది.మేనేజర్ గురించి ఎంక్వయిరీ చేస్తే అసలు విషయం బయటపడింది.తరచూ సినిమా పనుల మీద పెద్దమొత్తం డబ్బుతో తిరిగే తంగవేలుతో పరిచయం పెంచుకుని, అతని దగ్గర పెద్దమొత్తం డబ్బు ఉండటం గమనించి, అదంతా బ్లాక్ మనీ అని తెలుసుకుని దొంగిలించే ప్రయత్నం చేశాడు. కుదరకపోవడంతో పెనుగులాటలో చంపేశాడు.ఆ హత్యను కప్పి పుచ్చుకోవడానికి ఈ డ్రామా ఆడాడు. వ్యక్తిగతమైన విషయాలు అపరిచితులతో పంచుకోవడం తంగవేలు చేసిన తప్పయితే, అత్యాశతో నేరం చేసి కటకటాల్లోకి వెళ్లడం మేనేజర్ స్వయంకృతాపరాధం. నేరానికి శిక్ష తప్పదు. ∙శ్రీసుధామయి -
అలాంటి వ్యక్తి దొరకాలి!
చూడగానే పక్కింటి అమ్మాయిలా స్క్రీన్ మీద మెరిసిన ‘సీతామహాలక్ష్మి’ మన మృణాల్ ఠాకూర్. తన మనసులో ఏమున్నా దాచుకోకుండా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం ఆమె స్టయిల్. బాడీ ఇమేజ్ పోరాటాల నుంచి, తనపై వచ్చే గాసిప్స్ వరకు ప్రతి విషయాన్ని ధైర్యంగా పంచుకున్న ముచ్చట్లు ఇప్పుడు మీకోసం..గాసిప్స్? నవ్వేసి ముందుకెళ్తాను!నా పెళ్లి గురించి వచ్చే వార్తలు చూస్తే నాకే నవ్వొస్తుంది. ముఖ్యంగా ఒక తమిళ హీరోతో వచ్చిన పెళ్లి వార్తల్లో అస్సలు నిజం లేదు. అలాంటి వార్తలు చదివితే, ‘ఫిబ్రవరి 14 ఒక్కసారిగా ఏప్రిల్ 1 అయిపోయిందేమో’ అని అనిపిస్తుంది.ట్రోల్ చేసినా.. నిలబడ్డాను!బాడీ షేమింగ్ గురించి చాలా బాధపడ్డాను. నన్ను ‘మట్కా’ అని పిలిచినప్పుడు చాలా కుంగిపోయాను. కానీ ఇప్పుడు నా శరీరంపై నాకు గౌరవం ఉంది. ఎవరో నన్ను నిర్వచించడం కాదు. నేను నన్ను ఎలా చూసుకుంటున్నాననేదే ముఖ్యం.బ్రేకప్ ఇచ్చిన బలంప్రస్తుతం నేను సింగిల్గానే ఉన్నాను. నా కోసం ఎవరినీ వెతకడం లేదు. ఎందుకంటే, నాకు కియానూ రీవ్స్ లాంటి వ్యక్తి దొరికితే బాగుంటుంది అని అనిపిస్తుంది. గతంలో ఒక రిలేషన్ ఉంది. అయితే, నేను నటిని అనే నిజాన్ని అతను అంగీకరించలేక పోయాడు. ఆ బ్రేకప్ నన్ను మరింత బలంగా మార్చింది.అమ్మకు ఇచ్చిన మాట!చిన్నప్పుడొక బాధాకరమైన జ్ఞాపకం ఉంది. మా ఆర్థిక పరిస్థితి బాగోలేని రోజుల్లో, మా అమ్మను చుట్టాలు తమ కార్లలో కూర్చోనివ్వని సందర్భాలు చూశాను. అప్పుడే నేను ఒక మాట ఇచ్చాను. ‘ఒకరోజు నువ్వు ఊహించని కారు కొనిస్తాను’ అని. ఈ రోజు ఆ మాటను నిలబెట్టుకున్నాను.చీకటి దశ నుంచి వెలుగులోకి!నా జీవితంలో ఒకప్పుడు చాలా కష్టమైన దశ వచ్చింది. లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తూ ఆలోచించేటప్పుడు చాలాసార్లు నిరాశగా అనిపించేది. ఇప్పుడు ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి రావడం, నా పోరాటానికి నిదర్శనం. ప్రస్తుతం గ్లామర్ పాత్రలు చేసినా, టెలివిజన్ నుంచి వచ్చిన అమ్మాయి అనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోను. అదే నా పునాది.నేను సిద్ధంగా లేనప్పుడు నో వే!నా కెరీర్ మొదట్లో చాలా పెద్ద అవకాశాలు వచ్చాయి. కాని, ఆ పాత్రలకు నేను మానసికంగా సిద్ధంగా లేనప్పుడు వాటిని వదిలేశాను. ఒకవేళ అప్పుడు బలవంతంగా చేసి ఉంటే, నన్ను నేను కోల్పోయేదాన్ని. అలాగే, కెరీర్ మొదట్లో కొన్ని సన్నివేశాలు చేయాల్సి వస్తుందని తెలిసి, చాలా పెద్ద సినిమాలు వదిలేశాను. అవకాశాలు కోల్పోయినా, నా విలువల విషయంలో మాత్రం ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. అదే నా అసలైన విజయం. -
ఈ వారం కథ: గడ్డి మందు
అర్ధరాత్రి దాటింది. వీధుల్లో భోగి మంటలు ఇంకా ఉన్నాయి. పండగ రోజులు కావడంతో ఆసుపత్రి ప్రాంగణంలో పెద్ద హడావుడి లేదు. లోపల రోగులు మందుల మత్తులో నిద్రిస్తున్నారు. వాళ్ల అటెండర్లు మాత్రం బెంగతోనో, భయంతోనో బయట తచ్చాడుతున్నారు నాలాగ. నైట్ డ్యూటీలో ఉన్న స్టాఫ్ భోగి మంట చుట్టూ చేరి జోకులేసుకుంటున్నారు. తెల్లారితే సంక్రాంతి. ఎవరికి సెలవు కావాలి, ఎవరు కొత్త అల్లుళ్లు, పోయిన పండక్కి ఎవరు ఎవరికోసం త్యాగాలు చేశారు, పెద్ద డాక్టర్తో పండగపూటా తిట్లు తిన్నదెవరులాంటి విషయాలు వాళ్ల మధ్య చర్చకొస్తున్నాయి. ఇంతలోనే ఆసుపత్రి ముందుకి దూసుకొచ్చిన ఒక షేర్ ఆటో– అప్పటిదాకా భోగి మంట చుట్టూ అలముకున్న సరదాలతో పాటు అప్పుడప్పుడే కుదురుకుంటున్న ఆ రాత్రి నిశ్శబ్దాన్ని కూడా పటాపంచలు చేసింది. ఆటో పూర్తిగా ఆగేలోపే గబగబా నలుగురు దిగారు. ‘పట్టండి పట్టండి’ అంటూ ఆటో లోపలినుంచి మాటలు వినిపిస్తున్నాయి. డ్రైవర్ పరుగున వచ్చి ఆ నలుగురితో కలిశాడు. వాళ్లంతా కలిసి ఆటోలోంచి ఒక కుర్రాడ్ని చేతుల్లోకి తీసుకున్నారు. ఏమైందో చూద్దామని మునివేళ్లపై నిలబడి వాళ్ల మధ్యలోకి చూపు సారించాను. స్పృహలో లేని ఒక కుర్రాడు. అతడి నూనూగు మీసాల కంటే ముందు చెంపలకంటిన తెల్లటి నురుగు కనిపించింది. నిండా ఇరవై కూడా ఉండవు. కాళ్లూ చేతులూ పట్టుకుని నలుగురు మోసుకెళ్లడం చూసి నా మనసంతా అదోలా అయిపోయింది. దాదాపు ఆటోలో వచ్చినవాళ్లంతా లోపలికి పరుగు తీశారు. ఒక్క వ్యక్తి మాత్రం మెట్ల పక్కనే ఉన్న అరుగుమీద కూలబడి అలా గోడకు జారబడిపోయాడు. మోకాళ్ల పైకి కట్టిన గళ్ల పంచె అక్కడక్కడా తెల్లటి తడి మరకలు. చొక్కా మధ్యగుండీ, చివరిదీ వదిలేసి ఉన్నాయి. కాళ్లకు చెప్పులు లేవు. కాస్త పరిశీలించి చూస్తే మన్ను, పేడ కలిసి అంటుకుని ఆరిపోయినట్టుగా ఉన్నాయి పాదాలు. ముఖం చూస్తే రైతు అని అర్థమవుతుంది. చుట్టూ ఏమున్నా అతను చీకట్లో ఉన్నట్టే ఉన్నాడు. ఇంతలో ముగ్గురు మనుషులతో ఒక టూ వీలర్ వచ్చి ఆగింది. అందులో వెనక కూర్చున్న ఇద్దరూ బండి దిగుతూనే లోపలికి పరిగెడుతూ, పార్కింగ్ చేస్తున్న మూడో మనిషితో ‘‘ఒరేయ్ వెంకన్నా! చతురుడు ఇక్కడున్నాడు చూస్కో’’ అంటూ అరుగుమీద ఉన్న అతన్ని చూపిస్తూ వెళ్లిపోయారు. ‘చతురుడా..!’ అని నేను ఒక్కక్షణం ఆ పేరు దగ్గరే ఆగేలోపే వెంకన్న అతని దగ్గరగా వచ్చి పక్కనే కూర్చున్నాడు. అతని చెయ్యి భుజం మీద భరోసాగా పడేసరికి చతురుడు దుఃఖంతో వణికిపోయాడు. చేతిలో తుండు గుప్పెట నిండా పట్టుకుని నోట్లో కుక్కుకున్నాడు. గుండెల్లోని బాధ కళ్ల వెంట జలజలా జారుతున్నా అడ్డుకోలేకపోతున్నాడు. వెంకన్న తన చేతిని భుజం మార్చి సముదాయించే ప్రయత్నం చేస్తున్నాడు కాని, అతని ముఖంవైపు చూడలేకపోతున్నాడు. అప్పటికే వెంకన్న కళ్లు కూడా చెరువయ్యాయి. ఇంతలో లోపలినుంచి వచ్చిన ఒక వ్యక్తి గుమ్మం దగ్గర ఉన్న ఇద్దరినీ చూసి,‘‘ఒరేయ్! ఏంట్రా ఇది. వెంకన్నా నువ్వు కూడా ఏంటెహె, పక్కనే ఉండి దైర్నం సెప్తావంటే.’’ఆ మాటలు విన్న వెంకన్న కళ్లు తుడుచుకుంటూ నువ్వు చూసుకో అన్నట్టుగా అతనికి సైగ చేసి పక్కకు వెళ్లిపోయాడు. చతురుడి దుఃఖం పోటెత్తిన గోదారిలా ఉంది. అది గమనించి పక్కనే కూర్చున్నాడు ఆ వ్యక్తి. ‘‘ఊరుకోరా చతురూ... భయమేం లేదు. డాట్రగారు వచ్చేసేడు. ఆడికేం కాదురా. కుర్రోడు, ఉడుకురత్తం. గెంటుకొచ్చేత్తాడులే. బయటడిపోతాడు నువ్వు కంగారడక,’’ అంటూ నోటికి అడ్డంగా పెట్టుకున్న ఆ తువ్వాలు నెమ్మదిగా కళ్లమీదకు జరిపి చతురుడి కన్నీటిధారలు కట్టే ప్రయత్నం చేశాడు. హోరు వానలో పిల్లలగూడు చెదిరిన పక్షిలా వణుకుతున్నాడు చతురుడు. ఇప్పుడు అతన్ని తండ్రి స్థానంలో స్పష్టంగా చూస్తున్నాను నేను. తెలియకుండానే గుండె ఇంకాస్త బరువెక్కినట్టు అనిపించింది. అసలేం జరిగిందో? లోపలి నుంచి ఒక నర్సు పేపరు తీసుకొని వచ్చింది. కూడా వచ్చిన మనిషి చతురుడ్ని చూపించేసరికి, ఆ కాగితం మీద అతని వేలిముద్ర తీసుకొని వెళ్లిపోయింది.పక్కనే బైక్ను ఆనుకుని కూర్చున్న వెంకన్న వైపు మళ్లాయి నా చూపులు. పాదాలు కూడా అప్రయత్నంగానే అటు కదిలాయి. ఇంతలో అతని చొక్కా జేబులో ఉన్న ఫోన్ మోగడంతో పక్కకు తిరిగి రెండడుగుల దూరంలోనే ఆగాను. ఫోన్ ఎత్తి ‘హలో’... అనేలోగానే అవతలి గొంతు బయటకు వినిపిస్తోంది నాకు. ‘‘ఎంకన్నా... ఏవన్నారు, డాట్రగారు ఉన్నారా, పర్లేదు కదా! కళ్లు తెరిసి సూత్తన్నాడా..?’’ ఏం సమాధానం వినాల్సి వస్తుందో అనే భయంతో సాగుతున్న ప్రశ్నల వర్షంలా అనిపించింది నాకు. ‘‘డాట్రగారు వచ్చేరు, సూత్తన్నారు. మీరేం కంగారడకండి,’’ వెంకన్న సమాధానం నిశ్శబ్దంగా విన్నారు. ఆ వెంటనే...‘‘నువ్వు లోపలే ఉన్నావా, ఎలా ఉందిపుడు?’’ మళ్లీ అదే ప్రశ్న అవతలి నుంచి.‘‘లేదు, అందరూ లోపలికెలిపోతే డాట్రగారు దెబ్బలెడతారని బయటున్నాను. ఆడికేం అవదు. వదిన జాగ్రత్త!’’చతురుడు, వెంకన్న అన్నదమ్ములనే విషయం స్పష్టం చేసింది ఆ మాట. చెవులు ఫోన్ మీద పెట్టి ఒకసారి ఎందుకో చతురుడి వంక చూశాను. కళ్లు పొడిబారి ముఖమంతా బెంగటిల్లి ఉన్నాడు. ఇంతలో ఫోన్లో మాటలు నా దృష్టిని మరల్చాయి.‘‘ఏం జాగర్తరా బాబూ, ఎవరూ ఆపలేకపోతన్నారు. తల బాదేసుకుంటంది, నా కొడుకో... నా కొడుకో... అంటా నేలంతా పొర్లాడిపోతంది. నీళ్ల చుక్క ఇచ్చినా గిరాటేసి కొట్టేత్తంది. నన్ను తీసుకెళ్లండి ఆస్పటల్కి, నేను నా కొడుకును చూడాలంటంది. దాని బాధ సూళ్లాపోతన్నాంరా!’’ మాటలు విన్న వెంకన్న దుఃఖాన్ని ఆపుకుంటూనే, ‘‘అస్సలా... మీరెవరూ ఇటుకేసి రాకండి. మావున్నాం కదా!, ఏదైనా అవసరమైతే కవురెడతాం. బానేవుంది కళ్లు తెరిసాడని సెప్పండి వదినికి. ఇక్కడకి మాత్రం బయల్దేరొద్దు. కుసేపాగి నేనే పోన్ సేత్తాన్లే,’’ అంటూ కళ్లు తుడుచుకున్నాడు వెంకన్న. అవతలి నుంచి ’అలాగే అలాగే సెయ్యి ఎంకన్నా’ అనే మాట వినిపించింది. వెంకన్న ఫోన్ కట్ చేశాడు. ఇదంతా వింటున్నాడో లేదోగాని, గండిపడ్డ చెరువు ముందరి పంటచేనులా ఉన్నాడు చతురుడు. అన్నయ్య వైపు చూస్తే ఏమైనా అడుగుతాడేమో, ఏమైనా చెప్పాల్సి వస్తుందేమో అన్నట్టుగా అటుపక్కగా తిరిగిపోయాడు. దగ్గరకు వెళదాం అనిపించినా, అతను కాస్త కుదురుకున్నాక మాట కలుపుదామని ఆగిపోయాను. ఇంతలో లోపలి నుంచి ఇంకో వ్యక్తి బయటకు వచ్చాడు. వాళ్ల మనిషే, ఇంతకు ముందు ఆటోలోనుంచి దిగేటప్పుడు చూసిన గుర్తుంది. నేను ఉన్నవైపే నడుస్తూ వచ్చి,‘‘ఎంకన్నా, ఇంటికాడ ఎలావుందో, పోన్ సెయలాకపోయావా ఓసారి?’’ తోడొచ్చిన మనిషి కాబట్టి కాస్త నిబ్బరంగా ఉంది మాట.‘‘ఉప్పుడే ఇంటికాణ్ణుంచి సేసారు మాయా, డాట్రగారు సూత్తన్నారు కంగారడద్దొని సెప్పాను.’’ వెంకన్న కాస్త భయం భయంగానే,‘‘ఏవంటన్నారు మాయా?’’ ‘‘కాస్త కూస్తయితే పర్లేదుగానీ, ఈడమ్మ మొత్తం పట్టించేసాడ్రా కుర్రెదవ. మా సెడ్డా యాతన తెచ్చేడు. ఆయనగారు ప్రయత్నం సేత్తన్నాడు. చూద్దాం, భగమంతుడే ఉన్నాడు,’’ అంటూ వెంకన్న దగ్గర అగ్గిపెట్టె తీసుకొని జేబులో చుట్ట బయటకు తీసి దాని కొస కొరికి బయటకు ఊస్తూ, ఇప్పుడే వస్తా అన్నట్టుగా పక్కకు కదిలాడు ఆ వ్యక్తి. వయసు యాభై దాటి ఉంటుంది. జుట్టు నెరిసింది. ఇలాంటి మంచి చెడ్డా బాగా చూసి, నలుగురి కోసం తిరిగి నలిగినవాడిలా ఉన్నాడు. వెంకన్నను కదిపి బాధ పెంచడం కంటే ఇతనితో మాట కలపడం కరెక్ట్ అనిపించింది. ఆటో అవతల కాస్త దూరంగా పొగ వదులుతున్న ఆ పెద్దాయన్ను చూసి అటువైపు కదిలాను. ఆస్పత్రి ఆవరణం కదా, అందరూ ఏదో ఒక బాధ మోస్తూనే ఇక్కడ నిలబడతారని తెలిసిన మనిషిలా నన్ను పలకరింపుగా చూశాడు. అది చూసి నేను ఇంకాస్త దగ్గరకు అడుగులేశాను.‘‘ఏ ఊరండీ?’’ మాట కలిపాను.‘‘మన్యంవారిపాలెం, మీది?’’ ‘‘గండేపల్లి. మా అమ్మకు బాగోకపోతే తీసుకొచ్చాం. సడన్ గా మనుషుల్ని గుర్తుపట్టలేకపోతుంది. సోడియం తగ్గిందట. మందులిచ్చారు, రాత్రికి ఇక్కడే ఉంచమన్నారు. పొద్దున్నే రాజమండ్రి తీసుకెళ్లాలి స్కానింగ్ కోసం.’’ నేను అడగాల్సిన సంగతి ఎక్కడ ఆలస్యం అయిపోతుందో అని, ఆయన అడక్క ముందే నా వివరం మొత్తం పూర్తి చేసేశా. నా మాటలు విన్న ఆ పెద్దమనిషి నిట్టూర్పుగా,‘‘ఏంటో యింత యింత రోగాలు. ఒక వయసు దాటాక ఏది ఎలా ముంచుకొత్తందో చెప్పలాకపోతన్నాం. హాయిగా బతకాల్సిన కుర్రెదవలేమో ఇలా చేత్తన్నారు.’’ ప్రాణం మీదకు తెచ్చుకున్న ఆ కుర్రాడిపై బాధతో నిండిన కోపంతో అన్నాడు. ‘‘ఏమైంది..?’’ నా ప్రశ్నకు అతను చెప్పిన సమాధానం విన్నాక మళ్లీ చతురుడి వైపు చూడటానికి ధైర్యం సరిపోలేదు. నిజానికి అతని అసలు పేరు చతురుడు కాదు. ఎప్పుడూ చుట్టూ ఉన్న వాళ్లతో చతుర్లాడుతూ, నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడని ఊళ్లో అలా పిలుచుకుంటారు. అసలు పేరు వీరన్న. బయట ఊరోళ్లకు, ఇంట్లోవాళ్లకు, చుట్టాలకు తప్ప ఆ పేరు ఊళ్లో పెద్దగా తెలియదు. అతని నైజానికి పూర్తి విరుద్ధమైన స్థితిలో ఇప్పుడు వున్నాడనిపించింది. ఎప్పటిలాగే పొలం పని చూసుకొని కాస్త పెందరాడే ఇంటికి బయలుదేరిన చతురుడు, ఇంటికి దగ్గరలో ఉన్న గొడ్ల సావిడి దగ్గర ఆగాడు. అక్కడ అంతా శుభ్రం చేసుకుని పాలు పితుకుతున్నాడు. ఇంతలోనే ఇంటినుంచి కబురు. కుర్రాడు మందు తాగేశాడు అర్జంటుగా రమ్మని. కాళ్ల మధ్యలో ఉన్న పాలక్యానుతో పాటు అతని గుండె జారిపోక ఏమవుతుంది? ఉన్న మనిషి ఉన్నట్టే పరిగెత్తాడు. అక్కడ నుంచి నేరుగా ఆటో ఎక్కి ఆస్పత్రికి వచ్చి ఇక్కడ కూలబడిపోయాడు. ఒక్కడే కొడుకు. పేరు శ్యామ్సుందర్. పెద్దాయన ఆ పేరు చెప్పగానే నోటి వెంట తెల్లటి నురుగు కారుతూ ఉన్న ఆ పిల్లాడి ముఖం గుర్తొచ్చింది. పదవతరగతి మంచి మార్కులతో పాసయ్యాడు. తాను పెట్టిన కండిషన్ ప్రకారం స్మార్ట్ఫోన్ బహుమతిగా కొనిపించుకున్నాడు. ఇప్పుడు ఇంటర్ సెకండియర్. నెలరోజుల్లో పరీక్షలున్నాయి. ఇంతలోనే బలవంతపు చావుకి సిద్ధపడి కన్నవాళ్లకు ఇంత పెద్ద పరీక్ష పెట్టాడు. ‘‘ఏదైనా అనండి, ఇయ్యాలా రేపు పిల్లలకు అదుపు లేకుండా పోయిందండీ. ఏదడిగితే అది కొనేయడం, కొనకపోతే కొనేదాకా ఆళ్లు అమ్మాబాబుని తినేయడం,’’ ఆలోచనగా వింటున్న నన్ను చూసి ఇంకాస్త గట్టిగా తనే, ‘‘కాలేజీకి పోయే కుర్రగాళ్ల చేతికి పోనెందుకు సెప్పండి? ఆళ్లు పాటాలింటారా, పోనే సూత్తారా? గట్టిగా ఏవన్నా అంటే ఆ మేస్టర్ల మీదకి కూడా మనమే యుద్ధానికి పోతన్నాం. ఇదంతా ఎవరిని ఉద్దరించడానికి?’’ నిలదీసినట్టుగా అడిగేసరికి నేను తలూపాను. శ్యామ్సుందర్ ఎందుకిలా చేశాడో చెప్పేసరికి అతని ఆవేదన నాలోనూ అనేక ప్రశ్నల్ని రేపింది.స్మార్ట్ ఫోన్ చేతికొచ్చేసరికి చాలామంది కుర్రాళ్ల మాదిరే శ్యామ్సుందర్ లోకం కూడా మారిపోయింది. తెల్లారగానే చూసేది ఆ ఫోన్ ముఖమే, రాత్రి నిద్రపోయేది కూడా దాని ముఖం చూస్తూనే. ’ఎప్పుడూ ఆ పోన్లోనే తలకాయ పెట్టుకుని ఉంటావ్, ఏం చూత్తావ్రా గంటల గంటలు’ అనే మాట చాలామంది తల్లిదండ్రుల్లాగే చాలాసార్లు అన్నాడు చతురుడు. చదువుకు సంబంధించింది ఏదో చూస్తున్నామనో, ఫ్రెండు నోట్స్ పంపుతానన్నాడనో ఏదో ఒక కథ చెప్పి వాళ్లను ఏమార్చడం తప్ప మాట వినిందే లేదు సుందర్. అంతకు మించి పట్టించుకునే తీరిక ఆ కష్టజీవికి లేదు. ఆ అలవాటు నెమ్మదిగా సుందర్ను బెట్టింగ్ యాప్స్ వైపు ఆకర్షితుడయ్యేలా చేసింది. డబ్బులు రాగానే ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చేయడం, సినిమాలకు వెళ్లిపోవడం, డబ్బు పోతే ఎవర్నో అప్పు అడగటం, ఇంట్లో అయితే ఆ ఫీజులని, ఈ ఫీజులనీ అబద్ధం చెప్పి తీసుకోవడం అలవాటుగా మారిపోయింది. మొత్తానికి కొన్ని నెలలుగా ఆ మాయావలయంలో చిక్కుకు పోయాడు. ఇంట్లో డబ్బు దొంగతనంగా తియ్యడం నుంచి బీరువాలో అమ్మ నగలు కూడా చాటుగా తీసుకెళ్లి పట్నంలో తాకట్టు పెట్టేయడం వరకు అయిపోయింది. తెల్లారితే పెద్దపండగ. పెద్దలకు దండం పెట్టుకొని, మూలన పెట్టుకున్న కొత్త బట్టలు కట్టుకోవడం ఇంట్లో ప్రతి యేటా జరిగే తంతు. అమ్మ బీరువాలో నగలు కచ్చితంగా తీసుకొని వేసుకునే రోజు. ఎలాగైనా బెట్టింగ్ గెలిచి ఆ ముందు రోజే నగలు తెచ్చి బీరువాలో పెట్టేద్దాం అనుకున్నాడు సుందర్. కానీ... అతనికి అప్పటికీ తెలియంది ఏంటంటే, అది పోయే డబ్బు తప్ప వచ్చే డబ్బు కాదని; అదంతా పచ్చి మోసం అని. అమ్మ నగల కోసం అప్పు తెచ్చి పెట్టిన డబ్బు కూడా పోయింది. దిక్కుతోచక, ఇంట్లో అమ్మానాన్నకు నిజం చెప్పలేక, తెల్లారితే నిజం తెలిసిపోతుందనే భయంతో ఈ దారుణానికి ఒడికట్టాడు. చదువురాని తల్లిదండ్రులకు ఒక ఉత్తరం రాసిపెట్టి, పొలంలో కొట్టడానికి తెచ్చిన గడ్డిమందు గడగడా తాగేశాడు. ‘‘ఆడి పిచ్చిగానీ... ఇలా ఎదవ పని చేశానని ఇంట్లో అమ్మాబాబుకి సెప్పడానికి జడిసినోడు, చావడానికి ఎందుకు భయపడలేదని!? సచ్చి సెప్పాలనుకున్నది కూడా అదే కదండీ? ఇది కూడా అర్థమై ఏడ్వకపోతే ఇంకేం సదువులు సంకనాకడానికి. ఉప్పుడేదైనా ఐతే ఈడేవైపోను, ఆయమ్మి ఏమైపోను. ఉన్నదొక్కడే ఒంటిగాడు. ఈడ్ని సూసుకునే కదా ఆళ్లు బతుకుతుంటా!’’ పెద్దాయన ఆసుపత్రి లోపలికెళ్లి చాలాసేపైనా నాకు మాత్రం ఆయన ప్రశ్నలే లోపల తిరుగుతున్నాయి. ఎందుకోగాని కాళ్లు నిలవడం లేదు, ఒక్కసారి లోపలికెళ్లి సుందర్ని చూడాలనిపించింది. వీలైతే డాక్టరుతో మాట్లాడి ఆ భరోసాను బయటకొచ్చి చతురుడికి చెప్పాలనిపించింది. అమ్మని చూసి కూడా చాలాసేపయింది. చెల్లి నిద్రపోయిందో, మెలకువగా ఉందో కనపడినట్టు కూడా ఉంటుందని అనుకున్నాను. ఎమెర్జెన్సీ రూము బయట అంతా గడబిడగా ఉంది. సుందర్ను తీసుకొచ్చినవాళ్లు, ఆ తర్వాత చూద్దామని వచ్చిన వాళ్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు తప్ప ఎవరి కళ్లలోనూ ఆశ కనిపించడం లేదు. నిర్లిప్తంగా తచ్చాడుతున్నారే కానీ ఏం జరుగుతుందో అనే ఆందోళన కూడా లేదు. నా గుండె కొట్టుకునే వేగం పెరిగింది. మనసు కీడు శంకిస్తోంది. వాళ్లను తప్పించుకుని లోపలికి వెళ్లబోతుంటే ఒక ఏడుపు వినిపించింది. నన్ను నెట్టుకుంటూనే కట్టలు తెంచుకున్న దుఃఖంతో బయటకు వెళ్లిపోతున్నాడు వెంకన్న. తడిసిన కళ్లు తుడుచుకొని సుందర్ను చూసే ధైర్యం చేశాను. తెల్లటి గుడ్డ అతని ముఖం మీద నుంచి కప్పుతుండగా చూశాను చివరిసారి. తొలిసారి చూసినప్పటి కంటే బాగున్నాడు. నూనూగు మీసాలను కప్పేసిన నురుగు ఇప్పుడు లేదు. కాకపోతే ఇప్పుడు సుందర్ కూడా లేడు. గుండె బరువెక్కిపోయింది. ఊపిరి సలపనట్టుగా దేహం బిగుసుకుపోతున్నట్టుగా ఏదోలా ఉంది. వెంటనే అమ్మను చూడాలనిపించింది. నాలుగడుగులు వేసి పేషెంట్లు ఉన్న రూముల దగ్గరకు వెళ్లాను. బెంగగా అమ్మ బెడ్వైపు చూశాను. సెలైన్ బాటిల్ ఎక్కుతోంది. చెల్లెలు అక్కడే బెంచిమీద కూర్చుని అదే బెడ్ మీద అమ్మ కాళ్ల దగ్గర తలవాల్చి కునుకు తీస్తుంది. నెమ్మదిగా వెళ్లి అమ్మ పాదాలను ఒకసారి తాకి ముఖంవైపు చూశాను. సుందర్ తల్లి గర్తుకొచ్చింది. గబగబా నడుచుకుంటూ బయటకొచ్చాను. చతురుడ్ని చూడాలి అర్జంటుగా అన్నట్టు. తిరిగి వస్తుంటే ఎమెర్జెన్సీ రూమ్ దగ్గర అంతా ఇంకా గోలగానే ఉంది. కాగితాలు, సంతకాలు, అంబులెన్ ్స గొడవేదో నడుస్తుందక్కడ. వాళ్లందరినీ తప్పించుకుని బయటపడ్డాను. అరుగుమీద అటూ ఇటూ పొర్లుతున్న చతురుడ్ని చూసి గుండె చెరువైపోయింది. ఇందాక లోపలికి వెళ్లేటప్పుడైనా నాలుగు మాటలు మాట్లాడాల్సింది. పక్కనే వెంకన్న పరిస్థితి కూడా అలాగే ఉంది. అన్నకు ధైర్యం చెప్పే దారిలేక, వదినకు ఫోన్ చేసే ధైర్యం లేక, కాలి మునివేళ్లు నేలకు గుచ్చుతూ కన్నీళ్లు ఒంపుతున్నాడు.ఫార్మాలిటీస్ అయిపోయాయి. లోపలనుంచి ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారు. అంబులెన్ వెనకపక్కకు వెళ్లడం చూస్తూ ఒక్కసారిగా గొల్లుమన్నారు చతురుడు, వెంకన్న. ‘‘ఇంటికెవరూ పోన్ గట్టా చెయ్యకండిరా, ఆయమ్మిని కాయలేరు,’’ అంటూ జరగాల్సినవి చక్కబెడుతున్నాడు పెద్దాయన. ముందు చతురుడ్ని, వెంకన్నను ఆటో ఎక్కించమన్నాడు. వాళ్లు కాదన్నాసరే వినలేదు. ‘‘ఆ కుర్రోడి ముఖం సూత్తూ అంబులెన్సులో కూసోలేరు, ముందు ఆటో తీసేయండి, మీరు కదలండ్రా... వెనకాల అంబులెన్సు ఎంతసేపొత్తాది! నడండి,’’ అనేసరికి నలుగురూ కలిసి చతురుడ్ని లేవదీయ బోయారు. ఎక్కడా మనిషి నేలను అంటి పెట్టుకుని కదలడం లేదు. అది చూసిన పెద్దాయన కాస్త దగ్గరకెళ్లి, ‘‘రేయ్ చతురా! ఇంక లేదు మనకి, అంతే రుణం. నువ్వు ఎంత బాదుకున్నా ఎనక్కి తీసుకురాగలవా? ఇంటికాడ ఆడమనిషి పరిస్థితి ఏంటో ఆలోసించు కాస్త,’’ అంటుండగా నలుగురు మనుషులు అతన్ని పట్టుకుని బలవంతంగా ఆటో ఎక్కించారు. ‘‘ఇంత బాధ నా అన్న ఎలా తట్టుకుంటాడని ఎల్లిపోయావ్రా సుందరా,’’ అంటూ బోరున విలపిస్తున్న వెంకన్నను పెద్దాయన జబ్బ పట్టుకుని లేపి ఓదారుస్తూ,‘‘బాధే మరి, బాధ కాదేటి. కొరివెడతాడు అనుకున్నోడు మనకంటే ముందే కాటికెల్లిపోతే బాధ కాదా! ఏం చేత్తాం, రాతలు కనలేం,’’ అంటూ ఆటోలో కూర్చోబెట్టి పోనీమన్నాడు.ఇప్పుడు ఆటో వెళుతుంటే రాత్రి వచ్చినప్పుడు ఉన్నంత శబ్దం అనిపించలేదు నాకు. కానీ, అప్పటికంటే బరువుగా కదిలినట్టుంది. ఇంతలోనే హారన్ మోగింది. ఆస్పత్రి వెనకనుంచి వచ్చిన అంబులెన్సు ఆటో వెనకాలే వెళ్లిపోయింది తేలిగ్గా! సుందర్ని మోసుకుంటూ!మళ్లీ అక్కడంతా నిశ్శబ్దంగా అనిపించింది. అయితే అది మునుపటి నిశ్శబ్దం కాదు. సమయం తెల్లవారి నాలుగు కావొచ్చింది. అప్పుడప్పుడే లేచిన పేషెంట్ల అటెండర్లు, అంతవరకు జరిగిన విషయం గురించి ఆరా తీస్తున్నారు. ‘‘చిన్న వయసంటమ్మా... ఒక్కడే కొడుకంట... గడ్డి మందు తాగేశాడంట. చానా తంటాలు పడ్డారంట డాట్రగారు. అప్పుడుకే రక్తంలో పట్టేసిందంట. బతకలేదు, కన్నపేగు ఏమైపోద్దో,’’ అవే మాటలు నాకు చెవుల చుట్టూ తిరుగుతున్నాయి. లోపలికి వెళ్లబోయి మళ్లీ వెనక్కి వచ్చి అరుగుమీద కూర్చుని గోడకు తల ఆన్చాను.చతురుడు పొలంలో గడ్డి మందు కొడుతున్నాడు. బెట్టింగ్ యాప్లు అన్నీ పురుగుల్లా రాలిపోతున్నాయి. వాడిపోయి మాడిపోతున్న కలుపులో యావజ్జీవ ఖైదీల్లా వికారంగా కనిపిస్తున్నారు యాప్లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు. ఇంతలో ఎవరో గట్టుమీద నిలబడి చతురుడ్ని ‘వీరన్నా!’ అని పిలవడంతో ఉలిక్కిపడి లేచాను. ఎప్పుడు పట్టిందో చిన్న మాగన్ను పట్టేసినట్టుంది. కలత కల పడింది. నిజమైతే ఎంత బాగుండో! పూడి శ్రీనివాసరావు -
రణభారం
యుద్ధం ఎక్కడ జరిగినా, ఎవరెవరి మధ్య జరిగినా, యుద్ధ ప్రభావం ప్రపంచమంతటా ఉంటుంది. జరిగే యుద్ధంతో ఎలాంటి సంబంధం లేని దేశాలు సైతం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ప్రస్తుతం ఇరాన్కు, అమెరికా, ఇజ్రాయెల్లకు జరుగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగింది. ఉభయ పక్షాల సైనికులు సహా దాదాపు పదివేల మంది ఇప్పటికే మరణించారచమురు కేంద్రాలు, విద్యుత్ కేంద్రాలు సహా భారీ ఆస్తినష్టం కూడా జరిగింది. అయినా, ఇది ఇప్పుడిప్పుడే ముగిసే సూచనలు కనిపించడం లేదు. యుద్ధంలో వినియోగిస్తున్న అధునాతన విధ్వంసక ఆయుధాలు విపరీతమైన ప్రాణనష్టాన్ని, ఆస్తినష్టాన్ని మాత్రమే కాదు, పర్యావరణానికి కూడా అంతులేని చేటు తెచ్చిపెడుతున్నాయి. ఈ యుద్ధం వల్ల తలెత్తే విపరిణామాల గురించి ఒక విహంగ వీక్షణం...భారత్కు భారీ ఆర్థిక నష్టంప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని అమెరికా–ఇరాన్ యుద్ధంతో భారత్కు ఎలాంటి సంబంధం లేదు. అయినా, ఈ యుద్ధం భారత్లో ఆర్థిక భూకంపాన్ని సృష్టించిందనే చెప్పుకోవచ్చు. యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు భారత స్టాక్ మార్కెట్లో మదుపరుల సొమ్ము ఏకంగా రూ. 41 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు రూ.89 వేల కోట్లకు పైగా పెట్టుబడులను వెనక్కు తీసుకున్నారు.డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 93.30 మేరకు పడిపోయింది. రూపాయి విలువను నిలకడగా ఉంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నిల్వల నుంచి దాదాపు రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఇక ముడి చమురు బ్యారెల్ ధర వంద డాలర్లకు పైబడటంతో భారత్ ప్రతినెలా దిగుమతి బిల్లు వేలాది కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. యుద్ధం కారణంగా ‘ఇంధన’ సెగ భారత్నూ తాకుతోంది. దీనివల్ల వంటగ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు గణనీయంగా పెరిగాయి. వీటి పర్యవసానంగా నిత్యావసరాల ధరలూ పెరిగి, సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.భారత్పై యుద్ధ ప్రభావం⇒ డాలర్తో రూపాయి విలువ పతనం రూ. 93.30⇒ రిజర్వ్ బ్యాంకు నిల్వల నుంచి ఖర్చు రూ. 1.25 లక్షల కోట్లు⇒ స్టాక్ మార్కెట్ నష్టాలు రూ. 41.00 లక్షల కోట్లుఅమెరికా, ఇజ్రాయెల్ల సైనిక ఖర్చుయుద్ధం మొదలైన మొదటి ఆరు రోజుల్లోనే అమెరికా ఏకంగా రూ.1.01 లక్షల కోట్లు ఖర్చు చేసింది. యుద్ధం ప్రభావం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఇప్పటి వరకు పడిన భారం దాదాపు రూ.17.4 లక్షల కోట్లు ఉండవచ్చని ఆర్థిక నిపుణుల అంచనా. ఇరాన్పై దాడుల కోసం ఇజ్రాయెల్ వారానికి సగటున రూ. 27,000 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇజ్రాయెల్ ఇప్పటి వరకు రూ.1.56 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా. యుద్ధం కోసం అమెరికా రోజువారీగా సగటున రూ. 7,500 కోట్లు, ఇజ్రాయెల్ రోజువారీగా సగటున రూ. 2,700 కోట్లు చొప్పున ఖర్చు చేస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.ప్రపంచానికి ఆర్థిక విఘాతంప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధం ఫలితంగా యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న దేశాలే కాకుండా, ఇతర దేశాలకు కూడా ఆర్థిక విఘాతం తప్పని పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనాల ప్రకారం యుద్ధం కారణంగా ఈ ఏడాది పలు దేశాల స్థూల జాతీయోత్పత్తికి (జీడీపీ) గణనీయమైన నష్టం వాటిల్లనుంది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ ప్రకటించిన తాజా అంచనాల ప్రకారం యుద్ధం వల్ల ఇరాన్ జీడీపీకి అత్య«ధికంగా సుమారు 20%–25% మేరకు నష్టం వాటిల్లనుంది. ఇజ్రాయెల్ జీడీపీకి సుమారు 5%, అమెరికా జీడీపీకి 1.2% నష్టం కలగనుంది. యుద్ధంతో సంబంధం లేకున్నా, దీని ప్రభావం భారత్ జీడీపీని 1.1% మేరకు దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి.‘నాటో’ దేశాలు యుద్ధానికి దూరంగా ఉంటున్నా, చమురు ధరల భారం కారణంగా యూరోపియన్ యూనియన్, బ్రిటన్ సహా ‘నాటో’ దేశాల జీడీపీ 0.5% నుంచి 2% మేరకు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. యుద్ధ పరిస్థితుల వల్ల యూరోపియన్ యూనియన్ సహా ‘నాటో’ దేశాలు రక్షణ వ్యయాన్ని మరింతగా పెంచాల్సిన పరిస్థితులు అనివార్యం కానున్నాయి. రష్యాతో తెగతెంపులు చేసుకున్నాక యూరోపియన్ యూనియన్ దేశాలు చమురు కోసం గల్ఫ్ దేశాలపై ఆధారపడుతున్నాయి. హర్ముజ్ జలసంధి మూసివేత ఫలితంగా యూరోపియన్ యూనియన్ దేశాలలో ఇంధన ధరలు మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.యుద్ధం ఇలాగే మరిన్ని రోజులు కొనసాగేటట్లయితే, యుద్ధంతో ప్రత్యక్ష సంబంధంలేని దేశాలకు కూడా ఆర్థిక ఇబ్బందులు తప్పవు. యుద్ధం ఫలితంగా పలు దేశాలలో వృద్ధి గణనీయంగా తగ్గిపోవడమే కాకుండా, ధరల పెరుగుదల ఎక్కువై ‘స్టాగ్ఫ్లేషన్’ పరిస్థితి నెలకొనే అవకాశాలు ఉన్నాయని ప్రపంచబ్యాంకు సహా పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ‘స్టాగ్ఫ్లేషన్’ పరిస్థితుల్లో ఉత్పాదకత, ఉపాధి కుంటుపడతాయి. ఫలితంగా చాలా దేశాల్లో సామాన్యులపై పెనుభారం పడే అవకాశాలు ఉన్నాయి.విధ్వంసకరమైన ఆయుధాలుఅమెరికా–ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు ఈ యుద్ధంలో విధ్వంసకరమైన ఆయుధాలతో తలపడుతున్నాయి. ఇప్పటి వరకు వినియోగించిన ఆయుధాలు అత్యంత ఖరీదైనవి, అధునాతనమైనవి. ఈ ఆయుధాలు ఎంత ఖరీదైనవో, ఇవి సృష్టించే విధ్వంసం వల్ల సంభవించే నష్టం అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఉభయ పక్షాలూ ఈ యుద్ధంలో ఉపయోగిస్తున్న ప్రధానమైన ఆయుధాల వివరాలుఎఫ్ 35 లైటెనింగ్–2 విమానంరాడార్లకు చిక్కకుండా లక్ష్యాలపై బాంబులను జారవిడవగల యుద్ధవిమానం ఇది. ఈ విమానాలను అమెరికా పదుల సంఖ్యలోనే ఇరాన్పై దాడుల కోసం రంగంలోకి దించింది. ఇరాన్ క్షిపణుల దెబ్బకు ఇప్పటి వరకు ఎఫ్35 లైటెనింగ్ విమానాలు రెండు నేలకూలాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.960 కోట్లు.లూకాస్ డ్రోన్లుశత్రు స్థావరాల మీద దాడుల కోసం రూపొందించిన డ్రోన్ ఇది. తక్కువ ఖరీదు చేసే ఈ డ్రోన్లను అమెరికా బలగాలు ఇరాన్పై దాడుల్లో ఇప్పటికే వందల సంఖ్యలో ప్రయోగించింది. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.32 లక్షలు.టొమాహాక్ క్రూజ్ మిసైల్స్దాదాపు 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలిగిన క్షిపణి ఇది. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో అమెరికా బలగాలు దాదాపు 850 టొమాహాక్ క్షిపణులను ఉపయోగించింది. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.23 కోట్లు.ఎస్ఎం3 ఇంటర్సెప్టర్ క్షిపణులుశత్రువుల క్షిపణులను మార్గమధ్యంలోనే ధ్వంసం చేయడానికి రూపొందించిన శక్తిమంతమైన ఆయుధం ఇది. ఇరాన్పై జరిగిన దాడుల్లో ఇప్పటి వరకు అమెరికా బలగాలు దాదాపు వంద వరకు ఈ క్షిపణులను ఉపయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ. 116 కోట్లు.యారో–3ఇది శక్తిమంతమైన ఇంటర్సెప్టర్ క్షిపణి. శత్రు బలగాలు ప్రయోగించే క్షిపణులను 100 కిలోమీటర్ల ఎత్తులోనే నాశనం చేయగల సామర్థ్యం గల అధునాతన ఆయుధం ఇది. ఇరాన్పై జరుగుతున్న దాడుల్లో ఇజ్రాయెల్ బలగాలు ఇప్పటి వరకు దాదాపు 35 వరకు యారో–3 క్షిపణులను ఉపయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.33 కోట్లు.ఐరన్ డోమ్ఇది కూడా ఇంటర్సెప్టర్ క్షిపణి. శత్రు బలగాలు ప్రయోగించే క్షిపణులను 70 కిలోమీటర్ల దూరంలోనే పడగొట్టగల సామర్థ్యం గల ఆయుధం ఇది. ఇరాన్పై దాడుల్లో ఇజ్రాయెల్ బలగాలు ఐరన్ డోమ్ క్షిపణులను ఇప్పటి వరకు వందల సంఖ్యలోనే ప్రయోగించినట్లు సమాచారం. వీటి ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.42 లక్షలు.ఫతా–2ధ్వని వేగాన్ని మించిన వేగంతో దూసుకుపోయి, సుమారు 1500 కిలోమీటర్ల దూరంలోని శత్రు స్థావరాలను ధ్వంసం చేయగల శక్తిమంతమైన ఆయుధం. దీని ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.93 లక్షలు.ఖైబర్ షెకాన్ఇది దాదాపు రెండువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగల శక్తిమంతమైన ఆయుధం. అమెరికా బలగాలు ‘ఆపరేషన్ ఫ్యూరీ’ మొదలుపెట్టిన తర్వాత ఇరాన్ బలగాలు దాదాపు 180 వరకు ఖైబర్ షెకాన్ క్షిపణులను ప్రయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.35 కోట్లు.షాహెద్–136 డ్రోన్లుశత్రు స్థావరాలపై దాడుల కోసం తక్కువ ఖరీదుతో రూపొందించిన డ్రోన్లు ఇవి. అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలపై ఇరాన్ బలగాలు ఇప్పటి వరకు దాదాపు రెండువేల వరకు ఈ డ్రోన్లను ఉపయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.27 లక్షలు.ప్రపంచ దేశాలకు ఇక్కట్లుఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం ఫలితంగా ప్రపంచ దేశాలకు అనేక ప్రతికూల ఫలితాలు తప్పవని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు హెచ్చరిస్తున్నాయి. మరికొన్నాళ్లు ఇదే పరిస్థితి దొరికితే చాలా దేశాలు చమురు సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదు. ముడి చమురు ధరలు మరో ముప్పయి శాతం పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదని అంతర్జాతీయ నిపుణుల అంచనా. చమురు ధరల పెరుగుదల వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి, సామాన్యులు గడ్డు పరిస్థితుల్లో పడే అవకాశాలు ఉన్నాయి.ద్రవ్యోల్బణం, మాంద్యం ఏకకాలంలో ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీసే అవకాశాలు కూడా ఉన్నాయని ఐఎంఎఫ్ వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. దీనివల్ల పలు దేశాల జీడీపీ వృద్ధి తిరోగమనం చెందవచ్చని కూడా చెబుతున్నాయి. ఈ యుద్ధం వల్ల ఇరాన్తో పాటు పశ్చిమాసియా దేశాలకు తీవ్ర నష్టం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. పరస్పర దాడుల్లో ఇరాన్ సరిహద్దుల్లోని సౌదీ అరేబియా, యూఏఈ తదితర దేశాలలో భారీ నిర్మాణాలకు ముప్పుతో పాటు, తీవ్ర జననష్టం జరిగే ప్రమాదాలు ఉన్నాయి.చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి మూసివేత వల్ల అంతర్జాతీయ నౌకా వాణిజ్యానికి అవరోధాలు ఏర్పడి పశ్చిమాసియా దేశాలకు నిత్యావసరాల సరఫరా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల పశ్చిమాసియాలో ఆహార సంక్షోభం ఏర్పడే పరిస్థితులు తలెత్తవచ్చు. పశ్చిమాసియాకు వెలుపల చమురు ఉత్పాదనలో కీలకమైన రష్యా తనతో సానుకూల సంబంధాలు కలిగిన దేశాల చమురు లోటు తీర్చడానికి ముందుకు వచ్చి, బలమైన కూటమిని ఏర్పాటు చేసుకునే సూచనలు ఉన్నాయి. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఇప్పుడే అంచనా వేయడం కష్టమే! -
మల్లెల్లో మనమే టాప్!
వేసవి వచ్చేసింది. వేసవిలో ఎండల ధాటి ఎలా ఉన్నా, మల్లెల పరిమళాలు మనసుకు ఊరటనిస్తాయి. మల్లెల పరిమళాలే లేకుంటే, వేసవి తాపాన్ని భరించడం మానవమాత్రుల వల్ల అయ్యే పని కాదు. వసంతారంభం నుంచి గ్రీష్మం ముగిసే వరకు మల్లెలు విరివిగా పూస్తాయి. బొండు మల్లెలు, కాడ మల్లెలు సహా మల్లెల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. మల్లెలు అత్యధికంగా పూసే దేశాలలో మన దేశం అగ్రగామిగా ఉంటుంది. మల్లెలు విరివిగా పూసే దేశాల గురించి గణాంకాల్లో తెలుసుకుందాం...మల్లెల ఉత్పాదనలో మన దేశం మొదటి స్థానంలోనే ఉన్నా, ఎగుమతుల్లో మాత్రం రెండో స్థానంలో ఉంది. మన దేశంలో మల్లెల ఉత్పాదన స్థాయిలోనే స్థానిక వినియోగం కూడా భారీగానే జరుగుతుండటం దీనికి కారణం. -
చొక్కాకు పూలకళ
పూల డిజైన్లు కేవలం అమ్మాయిల దుస్తులపై మెరవడానికే అనుకుంటే, మీరు చెవిలో పూలు పెట్టుకున్నట్టే! ఎందుకంటే, ఒక అబ్బాయి సరైన స్టయిల్లో పూల చొక్కా వేసుకుంటే, ఆ లుక్ ముందు ఎవరైనా సరే కాస్త సైడ్ అవ్వాల్సిందే! అది ఎలాగో మీరే చూడండి!సందర్భాన్ని బట్టి పూల సైజ్ ఎంచుకోండిపెద్ద పూల ప్రింట్స్ క్యాజువల్ ఔటింగ్స్, బీచ్ డేస్కు బెస్ట్. చిన్న పూల ప్రింట్స్ పార్టీలు లేదా సెమీ ఫార్మల్ ఈవెంట్స్కి క్లాసీ లుక్ ఇస్తాయి. ఎక్కువ మందికి పెద్ద పూల కంటే చిన్న లేదా మధ్యస్థ పరిమాణంలో ఉన్న పూల డిజైన్లు అందంగా కనిపిస్తాయి. ఒక సిక్స్ ఫీట్ కటౌట్ ఉన్న అబ్బాయి రంగురంగుల పూల ప్రింట్స్ ధరిస్తే అది అతనిలోని ‘సాఫ్ట్ పవర్’ చెప్పకనే చెప్తుంది.లైట్ అప్ ది కలర్స్ఫేవరెట్ కలర్స్ కంటే ఎప్పుడూ సూట్ అయ్యే కలర్స్ మీ లుక్ను లైట్ అప్ చేస్తాయి. అందుకే, ఎలిగెంట్ లుక్ కోసం బ్లూ, బీజ్, బ్లాక్ లాంటి కలర్స్ బాగా సెట్ అవుతాయి. యెల్లో, పింక్, మింట్ గ్రీన్ కలర్స్ ఎనర్జీ, ఫన్ వైబ్ ఇస్తాయి. డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్పై లైట్ పూల డిజైన్ ఉంటే లుక్ మరింత షార్ప్గా కనిపిస్తుంది.బాటమ్స్తో పర్ఫెక్ట్ బ్యాలెన్స్పూల చొక్కాతో పాటు ప్లెయిన్ ప్యాంట్ లేదా జీన్స్ వేసుకుంటే లుక్ ఎక్కువ గందరగోళంగా కాకుండా నీట్గా కనిపిస్తుంది. ప్యాటర్న్ ఎక్కువైతే, మిగతా డ్రెస్ సింపుల్గా ఉంచండి. అలాగే, కూల్ లుక్ కోసం షార్ట్లు, బీచ్ వైబ్స్ కోసం లినెన్ షార్ట్లు, లోఫర్స్ ఫ్లోరల్ షర్ట్స్కు పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఇస్తాయి.రఫ్డ్ గేమ్అమ్మాయిలు పూల డ్రెస్సులు వేస్తే అది అలవాటు, అదే అబ్బాయిలు వేస్తే అది ఒక అడ్వెంచర్! ఆ అడ్వెంచర్ను మరింత రియలిస్టిక్గా చూపించడానికి, రఫ్గా ఉండే గడ్డం, హెయిర్కట్కు జతగా ఒక వైబ్రంట్ ఫ్లోరల్ షర్ట్ ఇచ్చే కిక్ వేరే లెవెల్!డిజైనర్ షర్ట్పూల చొక్కా వేసుకున్నప్పుడు మీరు గమనించాల్సింది, మీరు వేసుకున్నది డిజైనర్ షర్ట్లా హై క్వాలిటీతో ఉండాలి. కానీ, పొరపాటున అది మీ చెల్లెలి దుపట్టానో లేదా అమ్మ చీరనో కుట్టించుకున్నట్టుగా కనిపించకూడదు.బటన్ల మ్యాజిక్ప్లెయిన్ ప్యాంట్, స్లీవ్లెస్ బనియన్ పై ఓపెన్ ఫ్లోరల్ షర్ట్ లుక్కు ఒక ప్రత్యేకమైన వైబ్ ఉంటుంది. అలాగే, షర్ట్ పై బటన్లు రెండు వదిలేసి, చేతులు మడతపెట్టి పూల చొక్కాలో నడుస్తుంటే ఎవ్వరైనా మీపై నుంచి కళ్లు తిప్పుకోలేరు. అప్పుడు మీరు ‘నేనే వరల్డ్ హ్యాండ్సమ్, ఏమైనా సందేహమా?’ అన్నట్టుగా ఇచ్చే ఫొటో పోజులు కూడా అదిరిపోతాయి.దీపిక కొండి -
42 ఏళ్ల న్యాయపోరాటం... 100 ఏళ్ల వయసులో ముగింపు
‘న్యాయంలో జాప్యం న్యాయ నిరాకరణతో సమానం’ అని న్యాయ కోవిదులు చెబుతుంటారు... న్యాయం ఆలస్యం అయినా.. సుదీర్ఘకాలం ఎదురుచూసినా.. చివరకు తమకు న్యాయం దక్కింది.. అదే చాలని ఓ కుటుంబం సంతోషపడుతోంది.. కానీ ఆ సంతోషం వెనుక 42 ఏళ్ల నిరీక్షణ ఉంది.. కాలం మాటున కరిగిపోయిన ఓ వ్యక్తి జీవితం దాగుంది. మధ్య వయసులో నిందితుడిగా ఆ వ్యక్తిపై ముద్ర పడింది. కోర్టు జీవితఖైదు విధించింది. బెయిల్ వచ్చినా ‘పంజరం’ బతుకైంది. కాటికి కాళ్లు చాపిన వయసులో ఉన్నత న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. స్వేచ్ఛ లభించింది. కానీ, జీవితాన్ని అనుభవించడానికి వయసు, ఒంట్లో సత్తువ రెండూ మిగల్లేదు. కాలం వెనక్కి రాదు. అంతే కాదు, మరో విషాదమూ ఉంది.. ‘నేను ఏ నేరమూ చేయలేదు. నా కేసు కొట్టేశారు. నేను నిరపరాధిని’ అని సంతోషించేందుకు ఆ వ్యక్తికి జ్ఞాపకశక్తి లేదు.. ఎవరైనా చెబితే వినేందుకు వినికిడి శక్తీ మిగల్లేదు. 42 ఏళ్ల నిరీక్షణకు... 100 ఏళ్ల వయసులో కోర్టు ముగింపు పలికింది. ఆలస్యంగానైనా న్యాయం దక్కింది. నిందితుడనే మచ్చ తొలగింది. ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లా భువ్సీ గ్రామంలో భూ వివాదం ఓ వ్యక్తికి హత్యకు దారి తీసింది. పోలీసులు ముగ్గుర్ని నిందితులుగా గుర్తించి కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు పత్తా లేకుండా పోయాడు. మరో నిందితుడు అప్పీలు విచారణలో ఉండగానే చనిపోయాడు. సజీవంగా ఉన్న వ్యక్తి న్యాయం కోసం సుదీర్ఘకాలం ఎదురు చూశాడు. జీవిత చరమాంకంలో నిర్దోషిగా కేసు నుంచి బయటపడ్డాడు. హత్యకు దారి తీసిన భూ వివాదం1982 ఆగస్టు 9న రాజుభయ్యా, అతని సోదరుడు గునువా చెరువు నుంచి నీళ్లు తీసుకుని ఇంటికి వెళ్తున్నారు. అదే గ్రామానికి చెందిన మైకు, సత్తి్తదిన్, ధనీరామ్ ఎదురుపడ్డారు. గతంలో తన తుపాకీని లాక్కున్నాడని, తన భూమిని ఆక్రమించాడనే కోపం మైకులో ఉంది. ఇదే అదనుగా భావించి అతడిపై కాల్పులు జరిపాడు. తుపాకీ గుండు శరీరంలోకి దూసుకెళ్లింది. గునువా నేలకొరిగాడు. సత్తి్తదిన్, ధనీరామ్ చేతుల్లోనూ ఈటె, గొడ్డలి ఉన్నాయి. కాల్పుల శబ్దానికి చుట్టుపక్కల వారు రావడంతో ముగ్గురూ అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు–శిక్ష ఖరారుమైకు, సత్తిదిన్, ధనీరామ్లపై కేసు నమోదైంది. మైకు పరారయ్యాడు. ధనీరామ్ కోర్టులో లొంగిపోయాడు. 1984 జూన్లో హమీర్పూర్ అదనపు సెషన్స్ కోర్టు ఐపీసీ సెక్షన్ 302, సెక్షన్ 34 కింద దోషులుగా తేల్చి సత్తిదిన్, ధనీరామ్లకు జీవిత ఖైదు విధించింది. అదే ఏడాది ధనీరామ్కు బెయిల్ మంజూరైంది. అలహాబాద్ కోర్టులో అప్పీలులోయర్ కోర్టు విధించిన శిక్షపై ఇద్దరు నిందితులు హైకోర్టుకు అప్పీలుకు వెళ్లారు. అప్పీలు దశలోనే సత్తిదిన్ మృతి చెందాడు. ధనీరామ్ ఒక్కడే మిగిలాడు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు ఈ కేసు నడిచింది. ఇద్దరు సాక్షులను కోర్టు మరోసారి విచారించింది. కేసు పత్రాలన్నీ పరిశీలించింది. సాక్ష్యాలు.. ఎఫ్ఐఆర్లో తేడాలు కేసులో ప్రధాన సాక్షి రాజుభాయ్, మరో సాక్షి రామా కింది కోర్టులో చెప్పిన సాక్ష్యానికి, హైకోర్టులో చెప్పిన వివరాలకు తేడాలను గుర్తించింది.. వారు చెప్పిన దానికి భిన్నంగా వైద్య నివేదిక ఉంది. వారి వాంగ్మూలాలు నమ్మదగినట్టుగా లేవని కోర్టు నిర్ధారణకు వచ్చింది. ఎఫ్ఐఆర్లోనూ పలు లోపాలు విచారణలో బయటపడ్డాయి. ధనిరామ్ చేతిలో గొడ్డలి ఉంది తప్ప మృతుడిపై ఆ మారణాయుధం తాలూకు గాయాలు లేవని వైద్యుడి నివేదిక స్పష్టం చేసింది.కింది కోర్టు తీర్పు కొట్టివేతసాక్ష్యాధారాలను సహేతుకమైన సందేహాలతో కింది కోర్టు విశ్లేషించలేదని హైకోర్టు ధర్మాసనం భావించింది. ప్రాసిక్యూషన్ నిందితుడికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలను చూపించలేకపోయిందని పేర్కొంది. కేసు సుదీర్ఘకాలం నడవడం, నిందితుడి వయస్సు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు చెప్పింది. గతంలో ఈ తరహా కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులను ఉటంకిస్తూ ‘సాక్ష్యాల’ పరిశీలనపై ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. జీవితఖైదును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అప్పీలుదారుకి విముక్తి కల్పించింది. ‘నాతండ్రి నిర్దోషి అని తేలడం మాకు ఆనందం. చాలా ఆలస్యమైనా మాకు న్యాయం జరిగింది’ అని ధనీరామ్ కుమారుడు లల్లూరామ్ భావోద్వేగంతో స్పందించాడు. -
ఎప్పుడూ వేసవే..!
పిల్లలూ... మనం మూడు నెలలు ఉండే వేసవికే అష్షో బుష్షో అంటున్నాం కదా. అసలు ఎప్పుడూ వేసవే ఉండే ఊరు ఉందంటే నమ్ముతారా? అలాంటి ఊరు ఉంది. లక్కీగా ఇండియాలో కాదు. అమెరికాలో. అరిజోనా రాష్ట్రంలో. ఆ ఊరి పేరు యుమా.యుమాకి చుట్టూ ఎడారి, ఇసుక, కొండలు. మ్యాప్లో చూస్తే మెక్సికో దేశానికి దగ్గరగా కనిపిస్తుంది. దీనిని ‘ఎండల రాజధాని’ అంటారు. ఎందుకంటే ఏడాదికి 4000 గంటలు ఇక్కడ ఎండ కాస్తూనే ఉంటుంది. ఇక్కడ ఏడాదిలో 330 రోజులు ఆకాశంలో ఒక్క మబ్బు ముక్క కూడా ఉండదు. నీలం రంగు అద్దంలా మెరిసిపోతుంటుంది. చుట్టూ సోనోరాన్ ఎడారి. ఇసుక తొందరగా వేడెక్కిపోతుంది.పర్వతాలు అడ్డు: పెద్ద పర్వతాలు వాన మబ్బులను రానివ్వవు. దగ్గరలో సముద్రం లేదు. అందుకే తేమ, చల్లని గాలి రాదు. పంటల ఏడాదికి కేవలం 8 సెం.మీ. వాన పడుతుంది. మన హైదరాబాద్లో ఒక పెద్ద వానకు 5 సెం.మీ. పడుతుంది. యుమాకు అది ఏడాది వాన!గిన్నిస్ రికార్డ్: ‘ప్రపంచంలో అత్యంత ఎండ కాసే నగరం’ అని గిన్నిస్ బుక్లో ఈ ఊరుకి పేరుంది. యుమాలో గొడుగులు అమ్మే షాపులు చాలా తక్కువ. ఎందుకంటే అవసరమే ఉండదు. పిల్లలు ‘వాన పాట’ పాడాలంటే యూట్యూబ్ పెట్టుకోవాలి. బయటికి వెళ్లాలంటే మొహం, చేతులకు సన్క్రీమ్ రాయడం మర్చిపోరు. లేదంటే 10 నిమిషాల్లో టమాటో అయిపోతారు. ప్రతి ఇంట్లో, స్కూల్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. మనకు వాన సెలవు ఇస్తారు కదా? యుమాలో ‘చాలా ఎక్కువ వేడి’ అని ఎండకు బడికి సెలవు ఇస్తారు. 48 సెంటిగ్రెడ్లు దాటితే బయట ఆడుకోవడం బ్యాన్! ఇంత ఎండలో కూడా యుమాలో పాలకూర’ పండిస్తారు. అమెరికాకి కావాల్సిన లకూరలో 90% ఇక్కడి నుంచే వెళ్తుంది. చలికాలంలో పండిస్తారులే! -
కుటుంబ జీవితం, కెరీర్ ప్లాన్పై సింగపూర్ మాజీ ప్రధాని సలహా!
వివాహం, పిల్లలు కనడం గురించి ఇటీవల కొందరు ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు యువత కెరీర్, మంచిగా సెటిల్ అవ్వడమే ప్రధానం అనుకునేవాళ్లను ప్లీజ్ అలా ఆలోచించద్దు అని బతిమాలుతున్నారు. ఫ్యామిలీ లైఫ్కే ప్రాధాన్యత ఇవ్వండని వేడుకుంటున్నారు. ఆ దిశగా ఆలోచించేలా ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై సాక్షాత్తు సింగపూర్ మాజీ ప్రధాని సైతం సలహలిస్తుండటం విశేషం. అందుకు సంబధించిన వీడియోని షేర్ చేస్తూ ప్రముఖ టెక్ దిగ్గజం జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు కూడా ఆయన మాటలకే మద్దతిస్తూ యువతకు చక్కటి సందేశం ఇచ్చారు.శ్రీధర్ వెంబు షేర్ చేసిన ఎక్స్ పోస్ట్లో సింగపూర్ మాజీ ప్రధాని లీ క్వాన్ యూ యువతకు సలహాలిస్తున్నారు. ప్లీజ్ వివాహాన్ని, కుటుంబాన్ని ప్రారంభించడాన్ని ఆలస్యం చెయ్యొద్దు అని ఒక పీహెచ్డీ విద్యార్థికి సలహా ఇస్తున్నారు. ఆ వీడియోలో లీ ఆమె విద్యా ప్రణాళికలను ప్రశ్నిస్తూ, కుటుంబ నిర్ణయాలను వాయిదా వేయకూడదని సూచిస్తున్నారు. మాజీ ప్రధాని లీ ఆ విద్యార్థిని వ్యక్తిగత విద్యా జీవితం గురించి వరుసగా ప్రశ్నలు అడగడం కనిపిస్తుంది. ఆమెకు పెళ్లయిందా, బాయ్ఫ్రెండ్ ఉన్నాడా, పీహెచ్డీ ఎప్పుడు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తోందా అంటే ప్రశ్నిస్తారు. ఆమె సుమారు రెండేళ్లలో పీహెచ్డీ పూర్తి చేస్తుందని తెలుసుకున్న తర్వాత ఆయన ఆ విద్యార్తి నేరుగా సలహా ఇచ్చారు. “దయచేసి సమయాన్ని వృధా చేయకండి. కుటుంబ జీవితం మీ పీహెచ్డీ కంటే ముఖ్యమైనది. సంతృప్తినిచ్చే జీవితం కూడా. మీకు ఇదే నా శుభాకాంక్షలు నీకు పీహెచ్డీ, మంచి బాయ్ఫ్రెండ్ దొరకాలని ఆశిస్తున్నా అంటూ లీ ముగించారు. ఆ వీడియో గురించి ప్రస్తావిస్తూ..శ్రీధర్ వెంబు తన ప్రారంభ సంవత్సరాల నుంచి లీ జీవితాన్ని సునిశితంగా పరిశీలించానని అన్నారు. ఆయనపై తనకు ప్రగాఢమైన గౌరవం ఉందని పేర్కొన్నారు. తాను ఇటీవల సంభాషణలలో ఇలాంటి సలహానే ఇచ్చానని ఆయన చెప్పారు. ఇటీవల కాలంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేట్ల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆయన, ఎలాన్ మస్క్ తరచుగా పంచుకునే అభిప్రాయాలను ప్రతిధ్వనించారు. ఉన్నత ఆశయాలున్న మహిళలు తమ కెరీర్ను కొనసాగిస్తూనే, పిల్లలను కనేలా ప్లాన్ చేసుకోవలని చెబుతున్నారు శ్రీధర్వెంబు. మన సమాజ సాంస్కృతిక, ఆర్థిక నిర్మాణాలు సర్దుబాటు కావాలంటే కుటుంబ వ్యవస్థ ఉండాలని యువతకు పిలుపునిచ్చారు. కాగా, కెరీర్ లక్ష్యాలు, ఆర్థిక ఒత్తిళ్లు, మారుతున్న సామాజిక ప్రాధాన్యతల కారణంగా చాలామంది వ్యక్తులు వివాహాన్ని, సంతాన సాఫల్యాన్ని ఆలస్యం చేస్తున్నారు. తీరా కెరీర్లో సెటిల్ అయ్యాక..సంతానం కలుగక నరకం చూస్తున్నారు. అదే సమయంలో గతకాలంటే గణనీయంగా జననరేటు తగ్గిపోతోంది. దాంతో పలువురు వ్యాపార నాయకులు, విధాన రూపకర్తలు దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తరాలను ఆ దిశగా ఆలోచించేలా సలహాలు సూచనలతో మేల్కొలుపుతున్నారు. I studied the life and work of Lee Kuan Yew, the Founder-Prime Minister of Singapore intensely during my early 20s. Immense respect for him.In this video clip, he advises a young woman pursuing a PhD not to neglect marriage and kids. I recently gave very similar advice. Elon… https://t.co/BVlUSDsBnP— Sridhar Vembu (@svembu) April 24, 2026 (చదవండి: ఆ బేకరీకి వెళ్తే..ఎవ్వరైనా సైలెంట్ అవ్వాల్సిందే!) -
ఆ బేకరీకి వెళ్తే..ఎవ్వరైనా సైలెంట్ అవ్వాల్సిందే!
ఎన్నో పర్యాటనలకు వెళ్తుంటాం. కొన్ని ప్రదేశాలు, అక్కడ చూసిన బ్యూటీఫుల్ స్పాట్లు మదిలో అలా నిలిచిపోతుంటాయి. అలాంటి వాటిలో ఒకటి ఈ పర్యాటక ప్రదేశంలోని బేకరీ స్టాల్. ఇక్కడకు వెళ్తే..ఎవ్వరైన నిశబ్దంగా మారి..చిరునవ్వులు చిందిస్తుంటారు. ఎందుకంటే..నేపాల్లో ఒక బదిర దంపతులు నడుపుతున్న బేకరీ ఇది. అక్కడ నేపాల్లో అందమైన ప్రదేశాలన్ని తిలకించాక లాంట్టాంగ్ లోయ వద్దకు చేరుకునే యాత్రికులకు మధుమైన జ్ఞాపకంగా నిలిచిపోతుంది ఈ బేకరి. అక్కడే ఈ బదిర దంపడుతు 'పీస్ఫుల్ బేకరీ', ఉంది. పర్వతాల మధ్య నెలకొన్న ఈ బేకరీ బెస్ట్ టూరిస్ట్ స్పాట్ కంటే ఇంత అందమైన జ్ఞాపకంగా మార్చిన దంపతులకే క్రెడిట్ మొత్తం ఇవ్వలి. సైగలతో మాట్లాడే ఆతిధ్యం మనల్ని కట్టిపడేయేగా, అక్కడ మనం చిరునవ్వులు చిందిస్తూనే ఉంటాం. ఎక్కడకు వెళ్లినా ఇంతలా నవ్వే ఛాన్స్ లేదన్నట్లుగా ఆ దంపతులు తమ ఆప్యాయత, ప్రేమతో నవ్విస్తుంటారు. ఈ బేకరీలో ఆపిల్ మోమో(ఆపిల్ పైస్) అత్యంత రుచికరమైన వంటకంగా గూగుల్ రివ్యూలు చెబుతున్నాయి. చాలామంది సందర్శకులు పర్వత ట్రెక్కింగ్ తర్వాత తప్పకుండా ఇక్కడకు వచ్చి ఈ వంటకాన్ని రుచిచూసే ప్రయత్నం చేస్తుంటారు. అందుకు సంబంధించిన వీడియో ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయ్యాక దీనికి మరింత క్రేజ్ వచ్చింది. ఎలా చేరుకోవాలంటే..నేపాల్లో ఈ బేకరీని సందర్శించాలనుకుంటే.. కాఠ్మండు నుంచి ఏడు గంటల బస్సు ప్రయాణం, ఆ తర్వాత పర్వతాలలో రెండు రోజుల పాటు ట్రెక్కింగ్ చేయాలి. ఇక్కడకు వెళ్లడం అనేది చాలా సవాలుతో కూడుకున్నది. రైలు పట్టాల పక్కన ఉన్న ఒక మనోహరమైన చిన్న ప్రదేశం వద్ద ఈ బేకరీ ఉంటుంది. వారు సైగ భాషలోనే అద్భుతమైన ఆతిథ్యం అందిస్తారు. ఇంకెందుకు ఆలస్యం అస్సలు మిస్ కాకండి మరి..అయినా ఏ పర్యాటకంలోనైనా అత్యంత మధురమైన స్మృతులు అక్కడ కలిసిన వ్యక్తులేనని ఈ బేకరీ సందర్శన గుర్తు చేస్తుంది అని చెబుతున్నారు చాలామంది పర్యాటకులు. View this post on Instagram A post shared by Travis Fein (@travisfeintravel) (చదవండి: పెరుగు అన్నం vs లెమన్ రైస్: ఈ సమ్మర్లో డయాబెటిస్ రోగులకు ఏది మంచిదంటే..) -
గుండెపోటుకు కారణాలివే...
విజయవాడ గొల్లపూడికి చెందిన 35 సంవత్సరాల చందు ఉదయాన్నే నిద్రలేవగానే ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని తొలుత సమీపంలోని ఆస్పత్రికి, అనంతరం విజయవాడలోని గుండె ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విజయవాడ లబ్బీపేటకు చెందిన రమేష్ వయసు 40 సంవత్సరాలు. ఇటీవల వేకువ జామున 4 గంటలకు ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పాడు. గ్యాస్ నొప్పిగా భావించి ఒక మాత్ర వేసుకుని పడుకున్నాడు. మళ్లీ 6 గంటలకు ఛాతీలో పెయిన్ ప్రారంభమైంది. దీంతో తమ ఇంటికి 300 మీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ గుండె వైద్యుడు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. ఇలా వీరిద్దరే కాదు.. గుండెపోటుతో ఆకస్మికంగా మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంది. వాకింగ్ చేస్తూ... క్లాస్రూమ్ లో పాఠాలు వింటూ... కుప్పకూలి మరణిస్తున్న వారిని నిత్యం చూస్తున్నాం. ప్రస్తుతం అతిపెద్ద కిల్లర్గా గుండెపోటు మారిందని వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ పేర్కొంది. గుండెపోటు మరణాలను నివారించాలంటే ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. జీవనశైలిని మార్పు చేసుకోవడంతో పాటు, ముందస్తు నిర్ధారణ పరీక్షల ద్వారా గుండెపోటు మరణాలను నివారించవచ్చునని వైద్యులు అంటున్నారు. ఉరుకుల పరుగుల జీవనంలో వత్తిడిని తగ్గించుకోవడం కూడా చాలా అవసరం అంటున్నారు. గుండెపోటుకు కారణాలివే... ∙ వయస్సు రీత్యా వచ్చే గుండెపోటు, ఇవి 45 ఏళ్లు నిండిన వారికి వస్తుంటాయి. ∙ రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న వారు 40 ఏళ్ల లోపు గుండె పోటుకు గురవుతున్నారు. అందుకు కారణాలిలా ఉన్నాయి. ∙ ఫ్యామిలీ(తల్లి, తండ్రి) గుండెపోటుకు గురైన వారు ఉండటం∙ స్మోకింగ్ చేయడం ∙ కోవిడ్ ప్రభావం ∙ పుట్టుకతోనే కొన్ని రకాల జన్యుపరమైన లోపాలు ఉండటం ∙ ప్రొటీన్ డెఫిషియన్సీ ∙ జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అధిక కొలస్ట్రాల్, ఒబెసిటీ రావడం ముందస్తుగా ఏమి చేయాలి... ∙ ప్రతి ఒక్కరూ 40 ఏళ్లు దాటిన తర్వాత సీటీ యాంజియో చేయించుకోవడం ద్వారా గుండె రక్తనాళాల్లోని బ్లాక్లను గుర్తించవచ్చు. ∙ రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న వారు వయస్సుతో సంబంధం లేకుండా వైద్యుల సూచన మేరకు సీటీ యాంజియో చేయించుకోవాలి ∙ రక్తపోటు, మధుమేహం ఉన్న వారు వాటిని అదుపులో ఉంచుకుంటూ, కొల్రస్టాల్ మందులు రెగ్యులర్గా వాడాలి. వ్యక్తిగత జాగ్రత్తలు ∙ వత్తిడిని తగ్గించుకోవాలి. మంచి నిద్రపోవాలి ∙ స్మోకింగ్ అలవాటు ఉంటే మానుకోవాలి ∙ ఆహారపు అలవాట్లను మార్పుకోవాలి ∙ నాన్ వెజ్ వంటకాలు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది ∙ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి మధుమేహమూ కారణమే... మధుమేహం అదుపులో లేని వారు గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది. మెదడు, పాదాలకు రక్త ప్రసరణ సరిగా లేని శరీర తత్వం ఉన్న వారిలో గుండె రక్తప్రసరణలోనూ లోపాలు తలెత్తే అవకాశం ఉంది. అలాంటి వారు గుండె, మధుమేహ పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండటం, క్రమం తప్పకుండా మందులు వాడటం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చు. సమతుల ఆహారం, క్రమం తప్పని వ్యాయామంతో పాటు, అధిక రక్తపోటు, కొలస్ట్రాల్లను మెరుగ్గా నియంత్రించుకోవాలి. వాకింగ్తో బ్లాక్స్కు చెక్ ప్రతిరోజూ 45 నిమిషాల పాటు వాకింగ్ చేయడం ద్వారా రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడకుండా చూడవచ్చునని వైద్యులు చెపుతున్నారు. వాకింగ్ చేసే వారిలో రక్తనాళాల్లోని కొల్రస్టాల్ బ్లాక్స్ పెరిగే అవకాశం ఉండదంటున్నారు. ముఖ్యంగా మధుమేహుల్లో రక్తనాళాలు సన్నబడి రక్త ప్రసరణకు అవరోధం ఏర్పడుతుందని, వాకింగ్ చేస్తే అలాంటి సమస్యలు రావంటున్నారు. మొత్తంగా రోజుకు 45 నిమిషాల చొప్పున వారంలో 5 రోజులు వాకింగ్ చేస్తే రక్తనాళాల్లో బ్లాక్స్ రాకుండా చూడటంతో పాటు, గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గించుకోవచ్చునంటున్నారు. ముందస్తు పరీక్షలతో మేలు 40 ఏళ్లు నిండిన వారు గుండె రక్తనాళాల్లోని బ్లాక్స్ను నిర్ధారించేందుకు సీటీ యాంజియో చేయించుకుంటే మంచిది. ఆరోగ్యకర జీవన విధానం, వత్తిళ్లను తగ్గించుకోవడం, ఆహార నియమాలు పాటించడం, రెగ్యులర్గా వాకింగ్ చేయడం ద్వారా గుండెపోటు రాకుండా చూసుకోవచ్చు. స్మోకింగ్ చేసే వారిలో, కోవిడ్ ప్రభావం ఉన్న వారిలో చిన్న వయస్సులోనే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. – డాక్టర్ కృష్ణచంద్ కాగిత, కార్డియాలజిస్ట్,సెంటినీ, విజయవాడ -
పెరుగు అన్నం vs లెమన్ రైస్: ఈ సమ్మర్లో ఏది మంచిదంటే..
డయబెటిస్ రోగులు రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండేలా మితంగా అన్నం తినడమే మేలు అని వైద్యులు సూచిస్తుంటారు. అందులోనూ మన భారతీయ ఆహారంలో ప్రధానంగా ఉండే రైస్ని తక్కువగా, కూర ఎక్కువగా కలుపుకుని తినమని చెబుతుంటారు. పైగా ఇలాంటి హాట్ సమ్మర్లో ప్రజలంతా తేలికపాటి వంటకాల వైపే మొగ్గు చూపుతారు. ముఖ్యంగా పెరుగన్నం, నిమ్మకాయ పులిహార వంటి తేలికపాటి వంటకాలనే తరుచుగా చేసుకుంటారు. మరి రైస్ కంటెంట్ తక్కువగా తీసుకోవాల్సిన మధుమేహ రోగులకు మరి ఇవి మంచివేనా అంటే..మరి ఈ రెండు వంటకాలలోని పోషక విలువలు వేరువేరుగా పరిశీలించి ఏది తీసుకోవడం మంచిదో పోషకాహార నిపుణులు మాటల్లో తెలుసుకుందామా..!.అన్నం తింటే చక్కెర స్థాయిలు పెరగడానికి రీజన్..రైస్ రక్తంలో చక్కెరను ఎందుకు పెంచుతుందంటే..శుద్ధి చేసిన తెల్ల బియ్యం రకాన్ని బట్టి దాని గ్లైసెమిక్ ఇండెక్స్ 58గా ఉంటుందని తెలుస్తోంది. ఒకేసారి ఎక్కువగా అన్నం తింటే రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది, కాబట్టి వైద్యులు డయాబెటిస్ పేషెంట్లను అన్నం తీసుకునే పరిమాణాన్ని నియంత్రించుకోవాలని సూచిస్తుంటారు.పెరుగు అన్నం..పెరుగు, అన్నంతో పాటు రకరకాల మసాలాలు, కరివేపాకు కలిపి తయారు చేస్తారు. ఇది రుచిని జోడించడమే కాకుండా, రక్తంలో చక్కెరను పెంచే ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. వేడి తీవ్రంగా ఉన్నందున మధ్యాహ్న భోజనానికి ఇది చాలా అనువైనది. శరీరానికి చల్లదనాన్ని అందిస్తూ..రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉండేలా చూసుకునే పోషకమైన ఆహారం.దీని తయారీలో సాదా అన్నాన్ని పెరుగుతో కలుపుతారు. దీనిలో ప్రయోజనకరమైన ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇది కార్బోహైడ్రేట్ల శోషణ రేటును నెమ్మదింపజేస్తుంది. అన్నంలో పెరుగు కలపడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వంపై దాని ప్రభావం నెమ్మదిగా ఉంటుంది. ఇది మెదడుని ప్రశాంతంగా ఉంచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతుంది. దీనిలో ప్రోటీన్, మెరుగైన కొవ్వులు ఉంటాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయి. వేసవి వేడికి చక్కటి ఉపశమనం కూడా. అలాగే గ్లూకోజ్ ప్రతిస్పందనను స్థిరీకరిస్తుంది కూడా. రక్తంలో చక్కెర నియంత్రణ కోసం ఇది బెస్ట్ ఆహారం.నిమ్మకాయ పులిహోర(లెమన్ రైస్)ఇది కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను కూడా నెమ్మదింపజేస్తుంది, అందువల్ల ఇది ఇతర వేసవి ఆహారాల కంటే మెరుగైన ప్రత్యామ్నాయంగా ఉంటుంది. దీని తయారీకి ఉపయోగించే నూనె, వేరుశెనగలు మరియు ఆవాలు కలపడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణ మరింత మెరుగుపడుతుంది.ఏది మంచిదంటే..పెరుగు అన్నం సాధారణంగా భోజనం తర్వాత గ్లూకోజ్ పెరుగుదలను నెమ్మదింపజేస్తుంది, కాబట్టి దానిని ఎలా తీసుకుంటే మంచిదనే దానిపై అవగాహన అవసరం. నియంత్రించుకోవడం అవసరం.నిమ్మకాయ అన్నం ఇందులో ఉపయోగించే నూనె పరిమాణంపై ఆధారపడి ఉంటుంది , అలాగే తినే పరిమాణం కూడా అత్యంత ముఖ్యం.రోజులోని సమయం, శారీరక శ్రమ స్థాయి, వ్యక్తిగతంగా గ్లూకోజ్ తట్టుకునే సామర్థ్యం వంటి అంశాలు రక్తంలో చక్కెరను ప్రభావితం చేస్తాయి. అందువల్ల ఆ రెండింటిని తీసుకునే పరిమాణం అనేది అత్యంత ప్రధానం అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. తీపిలేని పెరుగు, మిగతా కూరగాయలు జోడించి తీసుకుంటే శరీరంలో చక్కెర స్థాయిలు సమంగా ఉంటాయి. ఇక నిమ్మకాయ పులిహోరలో వేరుశెనగలు తక్కువగా వేసుకుంటూ..మిగతా కూరగాయలు జోడిస్తే ఇది కూడా మధుమేహ రోగులకు మంచి బలవర్ధకమైన ఆహరమే అవుతుంది. ఇవి రెండూ కూడా డయాబెటిస్ రోగులకు మంచివే గానీ చేసే విధానం, పరిమాణం వంటి ఆధారంగానే మంచి ప్రయోజనాలను పొందగలరని వైద్యులు చెబుతున్నారు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: అతిగా వ్యాయామాలు చేయడం ఇంత ప్రమాదమా..! ? పాపం ఆ తల్లి..) -
2040లో చంద్రుడిపై మన జెండా
పిల్లలూ, రాత్రి పూట ఆకాశంలో నవ్వుతూ కనిపించే చందమామ మీదకు మనం వెళ్లొచ్చా? వెళ్లడమే కాదు, అక్కడ మన మువ్వన్నెల జెండా కూడా పాతేయొచ్చా? పాతేయొచ్చు’ అని గట్టిగా చెప్పారు నారాయణన్. హైదరాబాద్లో ఒక మీటింగ్లో మాట్లాడుతూ ‘2040 సంవత్సరానికి ఒక భారతీయుడు చందమామ మీద కాలు పెడతాడు. చేతిలో త్రివర్ణ పతాకం ఉంటుంది’ అని మాట ఇచ్చారు. నారాయణన్ చెప్పిన విశేషాలు ఇలా అర్థం చేసుకోవాలి.మొదట గగనయాన్చందమామ చాలా దూరం. వెళ్లడం చాలా కష్టం. అందుకే మన సైంటిస్ట్లు ఇప్పటి నుంచే ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. మొదట 2027లో ‘గగనయాన్’ మిషన్ నిర్వహిస్తారు. అంటే ముగ్గురు వ్యోమగాములను భూమి చుట్టూ తిప్పి తీసుకువస్తారు. ఇందుకోసం నలుగురు వ్యోమగాములు గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ సింగ్, కమాండర్ శుభాంశు శుక్లా లను సెలెక్ట్ చేశారు. వీరిలో ముగ్గురు వెళ్లి వస్తారు.చంద్రయాన్– 4,5:చంద్రయాన్లో భాగంగా 2027లో ఎ20 ఉపగ్రహం పంపుతారు. అది ఆకాశంలోంచి భూమిని చూస్తూ, ‘అమ్మో, ఇక్కడ కాలుష్యం ఎక్కువైంది, అక్కడ వర్షాలు తక్కువైయ్యాయి’ లాంటి వార్తలు చేరవేస్తుంది. 2028కి వచ్చేసరికి అంతరిక్షంలో మనం ఒక చిన్న ఇల్లు కట్టుకుంటాం. దాని పేరు ‘భారతీయ అంతరిక్ష కేంద్రం’. మన శాస్త్రవేత్తలు అక్కడికి వెళ్లి అక్కడే ఉండి పరిశోధనలు చేస్తారు. ఇక చంద్రయాన్–4లో మన రాకెట్ని పంపి, చందమామ మీద వాలేలా చేస్తారు. అది అక్కడి మట్టిని, రాళ్లను ఒక డబ్బాలో పెట్టుకుని మళ్లీ భూమి మీదకు తీసుకొస్తుంది. ఆ మట్టిలో ఏముందో ల్యాబ్లో చూస్తాం. 2030లో నిర్వహించే చంద్రయాన్–5 ఇంకా పెద్దది. అది ఒక పెద్ద ల్యాండర్ని, చిన్న కారు లాంటి రోవర్ని చందమామ మీద దింపుతుంది. ఆ రోవర్ వంద రోజులు చందమామ వీధులన్నీ తిరిగి ఫోటోలు, వీడియోలు పంపుతుంది. ఇవన్నీ అయ్యాక, అన్నీ సక్సెస్ అయ్యాక... 2040లో ‘మానవ సహిత చంద్రయాన్’ నిర్వహిస్తారు. ఆ రోజున మన భారతీయుడు రాకెట్ ఎక్కి, చందమామ మీద దిగి, ‘భారత్ మాతా కీ జై’ అని అక్కడ మన జెండా పాతుతాడు. ఇదీ చదవండి: సెలబ్రిటీ చెఫ్కు నీతా అంబానీ అద్భుత గిఫ్ట్, వీడియో వైరల్మీరూ వెళ్లొచ్చుపిల్లలూ... ఇప్పుడు నీకు 12 ఏళ్లా? 2040కి మీకు 28 ఏళ్లు. అంటే ఆ రాకెట్ ఎక్కేది మీరే కావచ్చు! అందుకే ఇప్పటి నుంచి బాగా చదువుకోవాలి. లెక్కలు, సైన్స్ అంటే భయపడకూడదు. ఆటలు ఆడాలి. అన్నం బాగా తిని బలంగా తయారవ్వాలి. చందమామ మన కోసం చూస్తున్నాడు. వెళ్లి ‘జైహింద్’ చెప్పొద్దూ? -
అతిగా వ్యాయామాలు చేయడం ఇంత ప్రమాదమా..! ? పాపం ఆ తల్లి..
వ్యాయామాలు కూడా ఎలా పడితే అలా చేసేయకూడదు అనే చెప్పే ఘటన ఇది. బరువు తగ్గడం కోసం లేదా ఫిట్నెస్ గురించి అయినా..నిపుణులు సలహాలు సూచనలతో చేయడమే మేలు. ఎందుకంటే అతి వేగవంతంగా చేసే వ్యాయామాలు ఒక్కోసారి ప్రాణాంతకంగా మారతాయి కూడా. అందుకు ఈ అనూహ్య ఘటనే ఉదాహరణ.ఇది నాగ్పూర్లోని ఒక జిమ్లో చోటు చేసుకుంది. 23 ఏళ్ల ఓం భోయార్ జిమ్లో నాలుగు గంటల పాటు వ్యాయామం చేశాడు. అక్కడ డెడ్లిఫ్ట్ చేయడానికి తాను చేసిన ప్రయత్నాలకు సంబంధించిన ఒక రీల్ను పోస్ట్ చేశాడు. ఆ తర్వాత ఇంటికి రాగానే క్షణాల్లో కుప్పకూలి స్పృహ కోల్పోయాడు. వృత్తిరీత్యా నర్సు అయిన అతడి తల్లి ఆర్తి భోయార్ గోల్డెన్ అవర్గా చెప్పే తొలి 3-4 గంటల సమయం అవసరమయ్యే వైద్య పరిస్థితిని వృధా కానివ్వకుండా హుటాహుటినా ఆస్ప్రతికి తీసుకువెళ్లింది. అక్కడ వైద్యులు రోగ నిర్థారణ పరీక్షలలో అతని మెదడులో రక్తం గడ్డకట్టినట్లు కనుగొన్నారు. దానిని మెకానికల్ థ్రాంబెక్టమీ విధానం ద్వారా తొలగించారు. తత్ఫలితంగా దీనివల్ల అతని మెదడుకు రక్త ప్రసరణ సజావుగా జరిగి, త్వరితగతిన కోలుకోవడానికి సహాయపడింది. ఈ ఘటనలో అతని తల్లి సకాలంలో స్పందించడం వల్లే ఓం భోయార్ ఆరోగ్యం వేగంగా మెరుగుపడింది. అంతేగాదు ఆరోగ్య నిపుణులు శారీరక సామర్థ్యానికి మించి మితిమీరి వ్యాయామాలు చేసేవాళ్లందరకీ ఇదొక హెచ్చరికని అని చెబుతున్నారు. ఇక్కడ హెమరేజిక్ స్ట్రోక్లో, మెదడులోని రక్తనాళం చిట్లి, రక్తం చుట్టుపక్కల కణజాలంలోకి లీక్ అవుతుంది. ఇది మెదడులోని సంబంధిత భాగాలకు, వాటికి అనుసంధానించబడిన శరీర భాగాలకు మధ్య ఉన్న సంబంధాన్ని తెంచుఉంది. దాంతో శరీర భాగాలు పక్షవాతానికి గురవుతాయని చెబుతున్నారు వైద్యులు. సకాలంలో శస్త్ర చికిత్స అందించి మెదడులో పేరుకుపోయిన రక్తాన్ని తొలగించి, పక్షవాతం ప్రభావాలను తగ్గించి, కోలుకునే అవకాశాలను పెంచవచ్చు.(చదవండి: సెరిబ్రల్ పాల్సీతో పోరాడుతూ..టెన్త్లో టాపర్గా!) -
సెరిబ్రల్ పాల్సీతో పోరాడుతూ..టెన్త్లో టాపర్గా!
కొందరు ఎలాంటి శారీరక లోపం లేకుండా, సమస్త సౌకర్యాలు ఉండి విద్యలో పెద్దగా రాణించలేక చతికిలపడుతుంటారు. ట్యూషన్లని, స్పెషల్ క్లాస్లని చెప్పించినా.. కొందరికి వచ్చే మార్కులు అంతంత మాత్రమే. కానీ ఈ కుర్రాడు. సెరిబ్రల్ పాల్సీతో పోరాడుతూ..మొత్తం శరీరం తనకు సహకరించే పరిస్థితి లేకున్నా కూడా పదోతరగతి పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచి అందర్నీ విస్తుపోయేలా చేశాడు. పైగా తనకు ఈ పరిస్థితి లేకుంటే ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకునే వాడిని అని చెబుతుండటం విశేషం. ఆ విద్యార్థే జార్ఖండ్లోని గొడ్డాకు చెందిన ఫైజాన్. తీవ్రమైన సెరిబ్రల్ పాల్సీ ఉన్నప్పటికీ, 10వ తరగతి బోర్డు పరీక్షల్లో 93.8 శాతం మార్కులు సాధించి, దివ్యాంగుల విభాగంలో అగ్రస్థానంలో నిలిచాడు. శరీర కదలికల సవాళ్లను అధిగమించి, నోటితో పెన్ను పట్టుకుని రాసి ఇన్ని మార్కులు తెచ్చుకోవడం విశేషం. తన అనారోగ్య పరిస్థితి వల్లే ఇంతకు మించి సాధించలేకపోయానని, లేదంటే ఇంకా ఎక్కువ మార్కులే వచ్చేవని అంటున్నాడు. అంతేగాదు ఫైజాన్ చేతితో రాసే విధానానికి సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ ఫైజాన్ గురించి వివరించారు. ఇక ఫైజాన్ తాను కొన్ని పరీక్షల్లో బొమ్మలు గీయలేకపోయానని, ముఖ్యంగా రేఖచిత్రాలు నోటితో స్పష్టంగా గీయడంలో కాస్త తడబడ్డట్లు వెల్లడించాడు. కాగా, జార్ఖండ్ అకాడమిక్ కౌన్సిల్ (JAC) గురువారం 10వ తరగతి (మెట్రిక్యులేషన్) పరీక్ష ఫలితాలను ప్రకటించింది, మొత్తం ఉత్తీర్ణత శాతం 95.27గా నమోదైంది.సెరిబ్రల్ పాల్సీ అంటే..నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్స్ ప్రకారం, సెరిబ్రల్ పాల్సీ అనేది శిశువుగా ఉన్నప్పుడు లేదా చిన్నతనంలోనే కనిపించే ఒక మెదడు రుగ్మత. ఇది శరీర కదలికలు, కండరాల సమన్వయంపై శాశ్వతంగా ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితి కదలికలను నియంత్రించే, శరీర భంగిమ సమతుల్యతను కాపాడే మెదడు సామర్థ్యానికి అంతరాయం కలిగిస్తుంది.VIDEO | Jharkhand boy overcomes cerebral palsy to top Jharkhand Class 10 boards. Holding a pen in his mouth, Faizan has overcome challenges that many regular physically able students would find difficult.He has topped the Class 10 board examinations in Jharkhand under the… pic.twitter.com/WXrfElGdCL— Press Trust of India (@PTI_News) April 24, 2026 (చదవండి: చిన్నారుల కోసం అపర'కాళి'లా ఆ శునకం!) -
ఉ‘మెన్’కోసమే!
స్త్రీలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. వారిపట్ల సమాజ ధోరణి వేగంగా మారాలన్నా, వేధింపులు తగ్గాలన్నా ముందు పురుషుల్లో మార్పురావాలి. దానికోసమే ‘స్టాండ్ విత్ హర్’ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు సీనియర్ ఐపీఎస్ అధికారి చారు సిన్హా. డీజీపీగా పదోన్నతి పొందిన నేపథ్యంలో ‘సాక్షి’తో చారు సిన్హా మాటామంతి.‘‘ప్రయాణ సమయంలో మహిళల భద్రత కోసం ‘సేఫ్ మొబిలిటీ ఇనీషియేటివ్’ను నిర్వహించాం. దీనికి సంబంధించిన కార్యక్రమాల్లో భాగంగా అనేక విద్యాసంస్థలతో పాటు స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహించి వారితో సంభాషించాం. విద్యార్థినులు 90 శాతం, స్వయం సహాయక సంఘాల సభ్యులు 100 శాతం ప్రయాణ సమయంలో వేధింపులకు గురయ్యారని తెలిసింది. బస్సులు, మెట్రోలు, రైళ్లల్లో వీరిని అసభ్యంగా తాకడం, అత్యంత హేయంగా మాట్లాడటం ఆ వేధింపుల్లో భాగం. ఈ వేధింపుల భయంతో అనేకమంది విద్యార్థినులు తాము ప్రయాణించే మార్గం, వినియోగించే రవాణా, రాకపోకల సమయాలు మార్చుకున్నారు. మా అధ్యయనం ప్రకారం ప్రయాణ సమయంలో మహిళలు 20 రకాల వేధింపులను ఎదుర్కొంటున్నట్లు తెలిసింది.సైబర్లోనూ డాడులే!ఒకప్పుడు మహిళలకు ఇంట్లో, వీధిలో, విద్యాసంస్థలు, పనిప్రదేశాల్లోనే వేధింపులు ఉండేవి. సోషల్మీడియా విస్తరణ తర్వాత ఇది ఆన్లైన్కూ పాకింది. ఏదైనా అంశానికి సంబంధించి ఓ మహిళ పోస్టు పెడితే... వారిపై వేలమంది కామెంట్లతో దాడి చేస్తున్నారు. ఈ సైబర్ మాబ్ అబ్యూజ్ విషయంలో పోలీసులూ పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోలేకపోతున్నారు. కేవలం అసభ్యకరమైన కామెంట్లు ఉండే మాత్రమే కేసు నమోదు తదుపరి చర్యలకు ఆస్కారం ఉంటుంది. మహిళల మనసును గాయపరిచే వారిలో అసభ్యతతో పాటు అనేక అంశాలు ఉన్నాయి. దీనికితోడు ఓ పోస్టుకు వేల కామెంట్లు ఉన్నప్పుడు అందరిమీదా చర్యలు తీసుకోవడం ఆచరణ సాధ్యం కాని విషయం.పురుషుల్లో మార్పు రావాలిమహిళలను వివిధ రకాలైన వేధింపులకు గురి చేస్తున్న వారికి అది అలవాటుగా మారింది. కనీసం అది తప్పని కూడా తెలియట్లేదు. ఇప్పటివరకు మహిళల భద్రతకు సంబంధించి అనేక క్యాంపెయిన్స్ జరిగాయి. అవన్నీ స్త్రీలలో అవగాహన కల్పించడానికి ఉద్దేశించినవే. అయితే సమాజంలో ఉన్న పురుషుల్లో మార్పు తీసుకువస్తేనే ఈ సమస్య తీరుతుంది. బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా పోకిరీ యువతి లేదా మహిళకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తుంటే... అదేబస్సులో ఉన్న ఎవరైనా అడ్డుకోవాలి. ఘర్షణ, దాడి వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. కనీసం నిలువరిస్తే మరోసారి ఆ పోకిరీ అలాంటి పని చేయడానికి ఆలోచిస్తాడు. దీంతోపాటు ఎవరికి వారుగా మహిళలను గౌరవించడం, వారి ఆత్మాభిమానాన్ని గుర్తించడం అలవర్చుకోవాలి. దీనికోసమే ‘స్టాండ్ విత్ హర్’ క్యాంపెయిన్ ప్రారంభించాం’’ అని చెప్పారు చారు సిన్హా.వర్శిటీల్లో చర్చలుఈ క్యాంపెయిన్ ఏడాది పాటు చేస్తాం. సెలబ్రెటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లతో కలిసి ప్రతి నెలా ఒక్కో థీమ్తో ప్రజల్లోకి వెళ్తున్నాం. ఇందులో భాగంగా నాలుగు వీడియోలు, ఒక ప్యానల్ డిస్కషన్ నిర్వహిస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం (జూన్, జులై) నుంచి యూనివర్శిటీలకు వెళ్లనున్నాం. ప్రతి వర్శిటీలో ప్రొఫెసర్ల నేతృత్వంలో గ్రూపులు ఏర్పాటు చేసి మేము రూపొందించిన వీడియోలు చూపించి ప్యానల్ డిస్కషన్ పెడతాం. ఆపై ఏది గుడ్ బిహేవియర్, ఏది బ్యాడ్ బిహేవియర్ గుర్తింమని వారినే అడుగుతాం. ఇలా యువతరం నుంచే బాధ్యత పెంచి... వారిలో మార్పు కోసం ప్రయత్నిస్తాం. – చారు సిన్హా, డీజీ – సీఐడీ, ఏసీబీ, మహిళ భద్రత విభాగాల చీఫ్– శ్రీరంగం కామేష్, క్రైమ్ రిపోర్టర్, హైదరాబాద్ -
రేస్ స్టార్
వైట్ అండ్ వైట్ సూట్, కళ్ళకి నల్ల కళ్ళజోడు... గంభీరమైన చూపు... తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బూత్ దగ్గర కనిపించిన అజిత్.. ఓటర్లు రికార్డు స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకున్నా, ఉదయం అందరికంటే ముందు వచ్చి ఓటు వేసిన అజిత్ గురించే తమిళనాడు మొత్తం ఈరోజు మాట్లాడింది. అజిత్ ను చూస్తే ఎంజిఆర్ను చూసినట్లే ఉందంటూ సామాన్య ప్రజలు మాట్లాడుకున్నారు.సినిమాల్లోనే కాదు సినీ ప్రపంచానికి ఆవల కూడా అజిత్ జీవితం ఆసక్తికరం. ఒకసారి ఫోటోగ్రఫీ, మరోసారి డ్రోన్ టెక్నాలజీ, ఇప్పుడు కార్ రేసింగ్... సినిమాకు అవతల ఎన్నో....కార్ రేసింగ్... ఒక హీరోని తలచుకోగానే అతను నటించిన సినిమా సన్నివేశాలో, డైలాగులో డ్యాన్సులో...గుర్తుకొస్తాయి. కానీ తమిళ స్టార్ హీరో అజిత్ గుర్తొస్తే సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ నుంచి ఆయన కార్ రేసింగ్ హాబీ దాకా మరెన్నో గుర్తొస్తాయి. తెరపై టాప్ హీరోల్లో ఆయన ఒకరు కానీ తెరవెనుక మాత్రం ఆయన ఒక్కరే. ఆయన గత సెప్టెంబర్లో ‘54 ఏళ్ల అజిత్ కుమార్ రేసింగ్’ పేరుతో తన జట్టును కూడా ప్రారంభించారు. ఇటీవల బెల్జియంలో జరిగిన ఒక ప్రధాన కార్ రేసింగ్ ఈవెంట్లో అజిత్ జట్టు రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. అలా యూరప్లో విజయవంతమైన కార్ రేసింగ్ ప్రదర్శన తర్వాత తమిళనాడు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడం కోసం చెన్నైకి తిరిగి వచ్చారు.సాల్ట్ అండ్ పెప్పర్... సాదా సీదాగా కనిపించే హీరోల్లో అజిత్ ముందున్నా ఆయన స్టైల్స్ ఎప్పుడూ టాక్ ఆఫ్ ద టౌన్ అవుతూనే ఉంటాయి. చెన్నై విమానాశ్రయంలో అజిత్ తన ట్రేడ్మార్క్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్తో సాధారణ దుస్తులలో రిలాక్స్డ్గా, నిరాడంబరంగా కనిపించినప్పటికీ.. ఆయన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అనేక మంది ఆయన లుక్ను ‘క్లాసీ లుక్’ అని ‘అప్రయత్నంగా స్టైలిష్’ అని అభివర్ణించారు. నిజానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేకమంది సెలబ్రిటీలకు అనుసరణీయంగా మారిన ఈ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ పరిచయం చేసింది ఆయనే. ఆ మాట కొస్తే... ఆయన లుక్లో మాత్రమే కాదు ఆయన జీవితంలో కూడా వెలుగు నీడలు చాలానే ఉన్నాయి. ఆ విషయాలు ఆయనే పలు మార్లు పంచుకున్నారు కూడా.కొన్ని పరిణామాల నేపథ్యంలో ఇటీవలే అజిత్ దుబాయ్లో నివసించాలని నిర్ణయించుకున్నారు. ‘‘ప్రధానంగా మోటార్ స్పోర్ట్స్ కోసమే ఈ నిర్ణయం. ఎందుకంటే ప్రధాన సర్క్యూట్లు అన్నీ ఇక్కడే జరుగుతాయి’’ అని ఆయన చెప్పారు. గత 2025లో ‘విడాముయార్చి’ ’గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాలు విడుదలైన తర్వాత, అజిత్ తన దృష్టిని మరింత ఎక్కువగా రేసింగ్ వైపు మళ్లించారు.స్వంతంగా వంట... తన పనులన్నీ తానే స్వయంగా చూసుకోవాలనే తన నిర్ణయం గురించి మాట్లాడుతూ ‘నేను మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాను. నాకు అడ్వాన్స్ డ్గా ఆలోచించే అద్భుతమైన తల్లిదండ్రులు ఉన్నారు, మా పనులు స్వయంగా చేసుకునేలా మమ్మల్ని పెంచారు. మాకు చిన్న వయసులోనే వంట నేర్పించారు’ అని అజిత్ అంటారు.– ఎస్. సత్యబాబు, సాక్షి, హైదరాబాద్ -
అధిక వేడితో పెనుముప్పు
తీవ్రమైన వేడి ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం, అనుబంధ రంగాలను ప్రమాదం అంచుకు నెడుతోంది. ప్రధాన వ్యవసాయ ప్రాంతాల్లో వడగాలులు తీవ్రతరం అవుతుండటంతో పంటలు, పశుసంపదపై ఒత్తిడి పెరుగుతోంది. యావత్ సమాజం ఉద్గారాలను తగ్గించుకునేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటే తప్ప ఆహార, వ్యవసాయ వ్యవస్థలకు, 120 కోట్లకు పైగా ప్రజల జీవనోపాధులు, ఆహార భద్రత పెను ముప్పును ఎదుర్కోక తప్పదని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ), ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) హెచ్చరించాయి. ధరిత్రీ దినోత్సవం సందర్భంగా బుధవారం ఐక్యరాజ్యసమితి సంస్థలు ఉమ్మడి నివేదికను విడుదల చేశాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తరచుగా సంభవిస్తున్న వడగాలులు ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఆహారోత్పత్తిని దెబ్బతింటున్నది. తీవ్రమైన వేడి కారణంగా ఇప్పటికే పనులు చేసుకోలేని పరిస్థితులు పెరుగుతున్నాయని, ప్రతి సంవత్సరం 50 వేల కోట్ల పని గంటలు కోల్పోతున్నామని, ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ ఈ ప్రభావాలు మరింత తీవ్రతరం కానున్నాయని ఈ నివేదిక హెచ్చరించింది.పశువులు, పంటలకు కష్టంవ్యవసాయ పద్ధతులన్నింటిలోనూ అధిక వేడి ప్రభావాలు ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నాయి. 30 డిగ్రీల సెల్సియస్ కంటే ఉష్ణోగ్రత పెరిగినప్పటి నుంచే మొక్కజొన్న, సోయా వంటి అనేక ప్రధాన పంటలదిగుబడులు తగ్గడం మొదలవుతోంది. దీనివల్ల పంట మొక్కలు బలహీనపడి, ఉత్పాదకత తగ్గుతోంది. ఉష్ణోగ్రత 25 డిగ్రీలు దాటినప్పటి నుంచే పశువులు, ముఖ్యంగా పందులు, కోళ్లు ఒత్తిడికి గురవుతుంటాయి. వేడిని తట్టుకోలేనందున వాటి పెరుగుదల తగ్గిపోతుంది. పాల దిగుబడి తగ్గుతుంది. తీవ్రమైన సందర్భాల్లో అవయవ వైఫల్యం కూడా సంభవిస్తుందని నివేదిక హెచ్చరించింది. సముద్రాలలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఆక్సిజన్ స్థాయిలను తగ్గిస్తున్నాయి. దీనివల్ల సముద్ర జలాల్లోని చేపలు ఒత్తిడికి గురవుతున్నాయి. తీవ్రమైన వేడి కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం కలిగించి, కార్చిచ్చుల ప్రమాదాన్ని పెంచుతుండటంతో అడవులు కూడా ప్రభావితమవుతున్నాయి. తీవ్రమైన వేడి నేరుగా నష్టపరచటమే కాకుండా ఇతర పర్యావరణ సమస్యలను సైతం ప్రేరేపిస్తుంది. కరువులను ప్రేరేపించగలదు, నీటి కొరతను మరింత తీవ్రతరం చేయగలదు, కార్చిచ్చు ప్రమాదాలను పెంచగలదు. అంతేకాదు, తెగుళ్లు, వ్యాధుల వ్యాప్తిని వేగవంతం చేయగలదు. ఇలాంటివన్నీ కలిసి మొత్తం పర్యావరణ వ్యవస్థలపై పెను ప్రభావం చూపే స్థితికి చేర్చుతాయని నివేదిక తెలిపింది.పనులు చెయ్యలేని రోజులు..తీవ్రమైన వేడి ఒత్తిడి ప్రభావాలు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే తీవ్రంగా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. పంటలు, పశువులకే కాదు మనుషులకు కూడా నష్టం అంతే తీవ్రంగా ఉంది. దక్షిణాసియా, సహారా ఉప–ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఆరుబయట పనులు చేయడానికి వీలుకాని రోజుల సంఖ్య సంవత్సరానికి 250కి పెరగొవచ్చు. ఇది లక్షలాది మంది వ్యవసాయ కార్మికుల జీవనోపాధిని ప్రమాదంలో పడేసి, ఆహార ఉత్పత్తిని దెబ్బతీస్తుందని నివేదిక హెచ్చరించింది.ఉదాహరణకు, 2025లో కిర్గిజ్స్థాన్లో సంభవించిన వడగాడ్పుల కాలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే సుమారు 10 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగాయి. ఇది ధాన్యం దిగుబడుల్లో 25 శాతం తగ్గుదలకు కారణమవ్వటానికే కాకుండా, ఎడారి మిడతల దండును ప్రేరేపించి, నీటిపారుదల సామర్థ్యాన్ని కూడా తగ్గించింది.ఇతర ప్రాంతాలలో, 2023 మరియు 2024లో బ్రెజిల్లో దీర్ఘకాలం పాటు కొనసాగిన వేడి మరియు కరువు పరిస్థితులు సోయాబీన్ దిగుబడులను 20 శాతం వరకు తగ్గించాయి , అదే సమయంలో 2021లో ఉత్తర అమెరికా అంతటా సంభవించిన తీవ్రమైన వడగాలులు పండ్ల పంటలలో గణనీయమైన నష్టాలకు మరియు అటవీ అగ్నిప్రమాదాలలో తీవ్రమైన పెరుగుదలకు దారితీశాయి.తక్షణ చర్యలు తీసుకోవాలిఅధిక వేడిని తట్టుకునే పంట రకాలను తయారు చేసుకోవటం, నాట్లు వేసే సమయాలను వేడికి అనుగుణంగా సర్దుబాటు చేయటం, వ్యవసాయ పద్ధతులను మెరుగుపరచడం వంటి తక్షణ చర్యలతో నష్టనివారణకు గల అవకాశాలను అందిపుచ్చుకోవాలని పాలకులకు పిలుపునిచ్చింది. పెరుగుతున్న వాతావరణ ప్రమాదాలను ఎదుర్కోవడంలో రైతులకు సహాయపడటానికి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, బీమా, సామాజిక భద్రత వంటి ఆర్థిక సహాయ పథకాలను అందుబాటులోకి తేవటం కూడా చాలా కీలకం. చదవండి: 'అరటిపండు'ని ప్రపంచ ఫలం అంటారు ఎందుకో తెలుసా..!వ్యవసాయ భవిష్యత్తును పరిరక్షించడానికి, ప్రపంచ ఆహార భద్రత పరిరక్షణకు, వాతావరణ మార్పును తట్టుకునే శక్తిని పంటలకు పెంపొందించాలి. కర్బన ఉద్గారాలను భవిష్యత్తులో భారీగా తగ్గించుకోవటం కూడా అవసరమని ΄పాలకులకు ఎఫ్ఏఓ, ఐడబ్ల్యూఓ పిలుపునిచ్చాయి.బలహీనతలు తీవ్రతరంవ్యవసాయం, అనుబంధ రంగాలు, ఆహార పంపిణీ వ్యవస్థల్లో పని పరిస్థితులను తీవ్రమైన వేడిమి అతలాకుతలం చేస్తోంది. వ్యవసాయ, ఆహార పంపిణీ వ్యవస్థల్లో ఇప్పటికే ఉన్న బలహీనతలను మరింత తీవ్రతరం చేసే ఒక ‘సంక్లిష్ట ప్రమాద కారకం’గా అధిక వేడి పనిచేస్తోందని ΄ాలకులు గుర్తించాలి.– సెలెస్ట్ సౌలో, డైరెక్టర్ జనరల్, ప్రపంచ వాతావరణ సంస్థ ఆహార భద్రతపై ఒత్తిడితీవ్రమైన వేడి పంటలు, పశుసంపద, మత్స్య సంపద, అడవులపై, అలాగే వాటిపై ఆధారపడి జీవిస్తున్న రైతులు, కార్మికుల జీవనోపాధిని దెబ్బతీస్తోంది. ఆహార భద్రతపై ఒత్తిడిని పెంచుతోంది. – క్యు డోంగ్యు, డైరెక్టర్ జనరల్, ఐక్యరాజ్యసమితి ఆహార–వ్యవసాయ సంస్థ నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడిడెస్క్ -
ముందస్తు పరీక్షలతోనే కిడ్నీ కేన్సర్కు చెక్!
ఆధునిక జీవనశైలిలో ఆరోగ్య పరీక్షల పట్ల అప్రమత్తంగా ఉండటం ప్రాణాలను కాపాడుతుందని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) వైద్యులు నిరూపించారు. ఎటువంటి ముందస్తు లక్షణాలు లేకపోయినప్పటికీ, సాధారణ హెల్త్ చెకప్తో ఓ వ్యక్తికి ప్రాణాంతక కిడ్నీ కేర్ను గుర్తించి విజయవంతంగా చికిత్స అందించారు.నగరానికి చెందిన 42 ఏళ్ల వ్యక్తికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు (బీపీ, షుగర్ వంటివి) లేవు. ధూమపానం అలవాటు కూడా లేదు. అయితే, ఇటీవల ఆయన చేయించుకున్న సాధారణ మాస్టర్ హెల్త్ చెకప్లో భాగంగా చేసిన అబ్డామినల్ అల్ట్రాసౌండ్ పరీక్షలో ఎడమ కిడ్నీలో సుమారు 8 సెంటీమీటర్ల మేర పెరిగిన గడ్డ (మాస్) బయటపడింది. వెంటనే సీటీ స్కాన్ నిర్వహించగా అది కిడ్నీ కేన్సర్గా నిర్ధారణ అయింది.AINU యూరాలజీ హెచ్ఓడి సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస నారాయణం నేతృత్వంలోని బృందం ఆ రోగికి రాడికల్ నెఫ్రెక్టమీ (సర్జరీ ద్వారా కిడ్నీ తొలగింపు) నిర్వహించింది. పరీక్షల్లో అది 'క్లియర్ సెల్ రీనల్ సెల్ కార్సినోమా'గా తేలింది. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస నారాయణం మాట్లాడుతూ.. "ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 4.3 లక్షల కొత్త కిడ్నీ కేన్సర్ కేసులు నమోదవుతున్నాయి. విచారకరమైన విషయం ఏమిటంటే.. 70 నుంచి 80 శాతం కిడ్నీ కణితులు ఎటువంటి లక్షణాలు లేకుండానే పెరుగుతాయి. మూత్రంలో రక్తం రావడం, నడుము నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే అది వ్యాధి ముదిరినట్లు లెక్క. అందుకే ముందస్తు పరీక్షలు చాలా ముఖ్యం" అని వివరించారు. ధూమపానం, ఊబకాయం, రక్తపోటు ఉన్నవారికి ముప్పు ఎక్కువ. కొందరిలో వంశపారంపర్యంగా కూడా రావచ్చు.చిన్న గడ్డలను 'పార్షియల్ నెఫ్రెక్టమీ' ద్వారా కిడ్నీని కాపాడుతూనే తొలగించవచ్చు. పెద్ద గడ్డలకు మొత్తం కిడ్నీ తొలగించాల్సి ఉంటుంది. ఏడాదికి ఒకసారి కనీసం అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించుకోవడం వల్ల ఇలాంటి సైలెంట్ కిల్లర్స్ నుంచి ప్రాణాలు కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. కిడ్నీ సంబంధిత సమస్యలు లేదా స్కానింగ్లో ఏవైనా తేడాలు కనిపిస్తే వెంటనే నిపుణులైన యూరాలజిస్టులను సంప్రదించాలని AINU యాజమాన్యం కోరింది. డాక్టర్ శ్రీనివాస నారాయణం,AINU సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్(చదవండి: చిన్నారుల కోసం అపర'కాళి'లా ఆ శునకం!) -
చిన్నారుల కోసం అపర'కాళి'లా ఆ శునకం!
మూగజీవులు మనుషులకు మించి ప్రేమ, విశ్వాసాన్ని చూపిస్తాయి. అవసరమైతే తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టడమే గాదు..అలా రక్షించిన ఘటనలు కోకొల్లలు. తనకు ఎలాంటి ప్రమాదం లేదంటేనే రక్షించేందుకు ముందొకస్తాడు మనిషి. కానీ ఈ శునకం తనకు అపాయం అని తెలిసి చిన్నారుల కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టింది .అసలేం జరిగిందంటే..ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో,కాళి అనే వీధి కుక్క చేసిన సాహసం అక్కుడున్న ప్రతి ఒక్కరిని కదిలించింది. అక్కడ పాఠశాల సమీపంలో ఆరుబయట సుమారు 30 మందికి పైగా చిన్నారులు ఆడుకుంటారు. తమ వైపు బుస్సు బుస్సు మని నిశబ్దంగా వస్తున్న ప్రమాదం గురించి వారికి ఏ మాత్రం తెలియదు. దాన్ని తత్క్షణమే పసికట్టిన కాళీ అనే వీధి కుక్క ఆ చిన్నారులందర్నీ కాపాడేందుకు ఆ విషసర్పంతో పోరాడేందుకు ముందుకు దూకింది. ఆ పాము వైపుకి దూసుకెళ్లి మరి నిర్విరామంగా పోరాటం చేసింది. చిన్నారుల వైపుకి ఆ పాముని రానివ్వకుండా వీరోచితంగా పోరాడింది. చెప్పాలంటే ప్రమాదానికి పిల్లలకు మధ్య నిలబడి ఆ కాళి అనే కుక్కతో అపరకాళిలా పోరాడింది. పామును చంపేంత వరకు పోరాటం చేయడం విశేషం. అయితే ఆ పోరాటంలో ఆ పాము ఆ కుక్క ముఖం, నోటిపై కాటేసినా.. లెక్కచేయకుండా పోరాడి దాన్ని అక్కడ నుంచి తరిమికొట్టింది. ఆ తర్వాత కొద్ది క్షణాలకే కుప్పకూలిపోయింది ఆ శునకం. అప్పటికే ఆ కుక్కకి తక్షణ సహాయం అందడంలో ఆలస్యమైపోయింది. ఆ విషం అప్పటికే దాని ప్రాణాలను బలిగొంది. ఒక్క బిడ్డకు కూడా హానికలగకుండా వీరోచితంగా పోరాడి యావత్తు గ్రామం మనసుని దోచుకుంది. నిజానికి ఆ కాళి అనే కుక్క వీది కుక్క కాదు, తమ రక్షకురాలు అని భావోద్వేగంగా అంటున్నారు స్థానికులు. దాని త్యాగానికి గుర్తుగా మొత్తం గ్రామమే కదిలివచ్చి మరి వీడ్కోలు పలికారు. దాన్ని ఒక తెల్లటి వస్త్రంలో చుట్టి, పూలమాలతో అలంకరించి, గ్రామం గుండా అంత్యక్రియలకు ఊరేగింపుగా తీసుకువెళ్తూ..ఆ శునకానికి నివాళులు అర్పించారు. విశ్వాసంలో కుక్కకు మించిన వారు లేరని రుజువు చేసే ఘటన ఇది. (చదవండి: జంతువుల నుంచి మనుషులకు ఏటా 5 కొత్త వ్యాధులు..!) -
ఆరోగ్యకరంగా భావించేవే కేన్సర్కి కారణమా..!
ఇన్నాళ్లు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఆరోగ్యానికి మంచివని చెబుతుండేవారు పోషకాహార నిపుణులు. కానీ ఇప్పుడు అవే ప్రమాదకరమైనవని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా ఊపితిత్తుల కేన్సర్ స్మోకింగ్ చేసేవాళ్లకే వస్తుందనేది జగమెరిగిన సత్యం. కానీ చాలా కేసుల్లో ధూమపానం చేయకుండానే ఈ వ్యాధి బారినపడ్డట్లు తేలింది. అందుకు గల కారణాలు తెలిస్తే విస్తుపోవాల్సిందే.యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (USC) పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం..పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఉండే ఆహారాన్నే అధికంగా తీసుకున్న యువకులలోనే ఊపిరితిత్తుల కేన్సర్ అధికమని తేలింది. దీనికి ప్రధాన కారణం సాంప్రదాయ పద్దతలిలో పండించకపోవడమేనని చెబుతున్నారు పరిశోధకులు. ఫెర్టిలైజర్లు ఉపయోగించి పండించిన పండ్లు, కూరగాలు, తృణధాన్యాలు తీసుకువడంతో..వాటిపై పురుగుల మందులు అవశేషాలు ఉండటంతో చిన్న వయసులోనే యువత ఈ కేన్సర్బారిన పడుతున్నట్లు వెలడైంది. ఈ మేరకు అమెరికన్ అసోసియేషన్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ 2026 వార్షిక సమావేశంలో 187 మంది రోగుల ఆహార విశ్లేషణ నివేదికను సమర్పించారు. ఈ నివేదికలో సుమారు 50 ఏళ్లలోపు వయసున్న రోగులకు ఊపిరితిత్తుల కేన్సర్ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. 'హెల్తీ ఈటింగ్ ఇండెక్స్'ను ఉపయోగించి ఆయా రోగుల్లో పరీక్షించగా, వారందరి సగటు స్కోర్ 65గా ఉందని అన్నారు. సాధారణ అమెరికన్లతో పోలిస్తే ఈ యువ రోగులు ముదురు ఆకుపచ్చ కూరగాయలు, చిక్కుళ్ళు,తృణధాన్యాలను ఎక్కువగా తీసుకున్నట్లు వెల్లడించారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా మహిళల్లో ఈ స్కోర్ మరింత అధికంగా ఉంది. పాల ఉత్పత్తులు, మాంసం, అనేక ప్రాసెస్ చేసిన ఆహారాలతో పోలిస్తే..ఆరోగ్యకరమైనవిగా పిలిచే ఈ పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలలోని పురుగుల మందుల అవశేషాల వల్లే ఈ కేన్సర్ వచ్చే ప్రమాదం అధికం అని తేలింది. అంతేగాదు ఈ పురుగలమందుల ప్రభావానికి గురైన రైతుల్లో సైతం ఊపిరితిత్తల కేన్సర్ వచ్చే అవకాశం అత్యంత అధికంగా ఉందని డాక్టర్ జార్జ్ నీవా పేర్కొన్నారు. అలాగే చాలామటుకు ఊపిరితిత్తుల కేన్సర్ కేసుల్లో స్మోకింగ్ కారణం కాదని చెప్పారు. పైగా 50 ఏళ్లలోపు ధూమపానం చేయని వారిలో, ముఖ్యంగా మహిళల్లో ఈ కేన్సర్ సర్వసాధరంగా మారిందని అన్నారు. అంతేగాదు ఆయా రోగులు ఈ వ్యాధి నిర్థారణకు మందు వరకు చాలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నవారేనని చెప్పుకొచ్చారు. ఇదెంత వరకు నిజం అన్న దిశగా దీనిపై మరింత లోతుగా పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు శాస్త్రవేత్తలు. కానీ ఈ పరిశోధన ఫెస్టిసైడ్స్ వినియోగించకుండా సేంద్రియ పద్ధతిలో పండించిన ఆహారాలకే ప్రాధాన్యత ఇవ్వాలనే విషయాన్ని హైలెట్ చేసింది కదూ..!.(చదవండి: వ్యాయామం లేకుండానే 12 కిలోలు..! డాక్టర్ వెల్నెస్ మంత్ర) -
జంతువుల నుంచి మనుషులకు ఏటా 5 కొత్త వ్యాధులు..!
సృష్టిలో ప్రతి జీవరాశి తన మనుగడను కొనసాగించడానికి శక్తి అత్యవసరం. ఈ శక్తి ప్రధానంగా ఆహారం ద్వారానే లభిస్తుంది. ముఖ్యంగా మానవాళికి అవసరమైన పోషకాలు పంటలు, పశుసంపద ద్వారా లభించే ఆహార పదార్థాలపై ఆధారపడి ఉంటాయి. పశువైద్యులు కేవలం జంతువులకు చికిత్స చేసే వైద్యులు మాత్రమే కాదు. ఆహార భద్రతకు రక్షకులు కూడా. ఆరోగ్యదాయక పశుపోషణ ద్వారా ప్రజారోగ్యాన్ని, పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్నారు. ‘పశు వైద్యులు– ఆహార ఆరోగ్య సంరక్షకులు’ అనే థీమ్తో ఈ సంవత్సరం ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని జరుపుకోవటం అత్యంత సముచితం.పశు సంపద ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంది. పెరుగుతున్న జనాభా, మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న పోషక అవసరాల నేపథ్యంలో పశు వైద్య రంగం ప్రాముఖ్యత మరింత పెరుగుతోంది. మన పూర్వీకులు పశువులను, ప్రకృతిని సమానంగా గౌరవించి, పర్యావరణహితమైన విధానాలతో వ్యవసాయం, జీవన విధానాన్ని అభివృద్ధి చేశారు. ఈ సమతుల్య జీవన విధానాన్ని మళ్లీ ఆచరిస్తే, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, సుస్థిరమైన జీవితం అందించవచ్చు.ఆరోగ్యంపై సమగ్ర దృక్పథంపశువైద్యం కేవలం జంతువుల వైద్యంతో పరిమితం కాకుండా.. మనుషుల ఆరోగ్యం, పశువుల ఆరోగ్యం, పర్యావరణ ఆరోగ్యం వేర్వేరు కాదు అంతా ఒక్కటే (వన్ హెల్త్) అనే సమగ్ర విధానాన్ని అనుసరిస్తుంది. ఈ మూడూ పరస్పరం అనుసంధానమైనవి. పశువైద్యులు పశువుల ఆరోగ్యాన్ని మాత్రమే కాపాడటమే కాకుండా పరోక్షంగా ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తున్నారు. ముఖ్యంగా ఆహారంగా ఉపయోగించే పశువులకు చికిత్స ఇచ్చేటప్పుడు మందుల అవశేషాలు పాలు, మాంసం, గుడ్లు వంటి ఆహార పదార్థాలలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత కీలకం.సంక్రమిత వ్యాధుల నియంత్రణపశువుల నుండి మనుషులకు, అలాగే మనుషుల నుండి పశువులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటారు. ఉదాహరణకు: రేబీస్, బ్రూసెల్లోసిస్, టీవీ వంటివి. ప్రస్తుతం గుర్తించిన సంక్రమిత వ్యాధులలో సుమారు 60% జంతువుల ద్వారా వ్యాపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం కనీసం 5 కొత్త వ్యాధులు జంతువుల నుండి మనుషులకు వస్తున్నాయని అంచనా. అరణ్య ప్రాంతాలలో మానవ జోక్యం పెరగటం ఈ వ్యాధుల వ్యాప్తికి ముఖ్య కారణం. ఈ నేపథ్యంలో పశువైద్యులు ఆధునిక సాంకేతిక పద్ధతులతో వ్యాధులను ముందుగానే గుర్తించి నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) ప్రపంచ ఆరోగ్యానికి అత్యంత పెద్ద సవాళ్లలో ఒకటి. అనవసరంగా, అధికంగా యాంటీ బయోటిక్స్ వాడటం వల్ల మందుల ప్రభావం తగ్గుతుంది. ఆహారంలో అవశేషాలు చేరి ప్రజారోగ్యానికి హాని కలుగుతుంది. ఈ సమస్యను నివారించడానికి పశువైద్యులు బాధ్యతాయుతమైన ఔషధ వినియోగాన్ని ప్రోత్సహించాలి. పశుసంపద సుస్థిర ఆహార భద్రతలో కీలకపాత్ర పోషిస్తోంది. ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) అంచనాలప్రకారం, ప్రపంచానికి అవసరమైన ప్రోటీన్లో సుమారు 30–40% జంతువుల నుంచి లభిస్తుంది. అయితే, ప్రతి సంవత్సరం సుమారు 20% ఆహారం పశువ్యాధుల వల్ల కోల్పోతున్నాం. పశువుల విసర్జితాల పునర్వినియోగం ద్వారా సేంద్రియ వ్యవసాయం, గోఆధారిత వ్యవసాయం వర్థిల్లుతుంది. తద్వారా పర్యావరణం, పశువులు, మనుషుల మధ్య సమన్వయంతో ఆహార గొలుసును కాపాడుకోవచ్చు.14.5% వరకు పశువుల ఉద్గారాలుప్రస్తుతం పశువైద్య రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు వాతావరణ మార్పు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 14.5% హరిత గృహ ఉద్గార వాయువులు పశుసంపద నుంచి వెలువడుతున్నాయని అంచనా. దీర్ఘకాలిక సగటు ప్రపంచ ఉష్ణోగ్రత 1 డిగ్రీల సెల్షియస్ పెరిగితే 10–15% వరకు పశువుల పెరుగుదల, వ్యవసాయోత్పత్తి తగ్గుతుంది. అయితే, పశుసంపద మనకు ముఖ్యమైన ప్రోటీన్ వనరుగా కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో పశువైద్యులు మీథేన్ ఉద్గారాలను తగ్గించే పద్ధతులు, సుస్థిర పశుసంవర్ధన విధానాలు, కార్బన్ క్రెడిట్ అవకాశాలపై దృష్టి సారిస్తున్నారు. రైతులకు అదనపు ఆదాయం కల్పించే విధంగా కార్బన్ మార్కెట్లో భాగస్వామ్యం కల్పించడం కూడా ఒక ముఖ్య లక్ష్యం.మీథేన్ ఉద్గారాలుప్రపంచంలో అత్యధిక పశుసంపద కలిగిన దేశం మనదే. ఎఫ్ఏఓ, ఐసీఏఆర్ అంచనాల ప్రకారం భారతదేశంలో మొత్తం హరిత గృహ వాయువు ఉద్గారాల్లో సుమారు 14–16% వ్యవసాయం నుంచి వెలువడుతుంటే, అందులో పశుసంపద ఉద్గారాల వాటా 55–60%. పాల ఉత్పత్తిలో దేశంలోనే ముఖ్య రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఏపీలో వ్యవసాయ ఉద్గారాల్లో పశుసంపద వాటా 30–35%గా ఉంది. ముఖ్యంగా డెయిరీ రంగంలో గేదెల ద్వారా ఎక్కువ మీథేన్ వెలువడుతోందని అంచనా. నెమరు వేసేటప్పుడు జీర్ణప్రక్రియ వల్ల వెలువడే మీథేన్ పశు ఉద్గారాల్లో 85%ను ఆక్రమిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో వెలువడే వ్యవసాయ ఉద్గారాలలో పశుసంపద ఉద్గారాల వాటా 25–30%. తెలంగాణలో గొర్రెలు, మేకల సంఖ్య అధికంగా ఉండటం వల్ల ఉద్గారాల తీరు భిన్నంగాఉంటుంది. తెలంగాణ ఎస్ఏపీసీసీ చెబుతున్న దాని ప్రకారం మీథేన్ ఉద్గారాలు పశువుల నుండే ఎక్కువ వెలువడుతున్నాయి.ముఖ్యమైన విశేషాలుప్రపంచంలోని అన్ని దేశాల కంటే మన దేశంలో పశుసంపద ఎక్కువ. కానీ తక్కువ. కానీ, ముఖ్యంగా ఒక్కో పశువు తలసరి ఉత్పాదకత తక్కువ. ప్రపంచంలోని గేదెల సంఖ్యలో 50% మన దేశంలోనే ఉంది. ఈ కారణంగా మొత్తం ఉద్గారాలు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తి క్రమంలో వెలువడే ఉద్గారాలను తగ్గించే అవకాశం ఉంది. పశువైద్యులు కేవలం జంతువుల వైద్యులు మాత్రమే కాదు. ఆహార భద్రతకు రక్షకులు కూడా. ఆరోగ్యదాయక పశుపోషణ ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నారు. పర్యావరణ సమతుల్యతకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. వన్ హెల్త్ దృక్పథంతో పశువైద్యులు సమగ్ర సుస్థిర అభివృద్ధికి మార్గం సుగమం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘పశు వైద్యులు– ఆహార, ఆరోగ్య సంరక్షకులు’ అనటంలో ఎంతమాత్రమూ అతిశయోక్తి లేదు. – డా. మల్లంపల్లి సాయిబుచ్చారావు (99122 92229), అసిస్టెంట్ డైరెక్టర్(ఏహెచ్), ఏరియా వెటర్నరీ ఆసుపత్రి, జీలుగుమిల్లి, ఏలూరు జిల్లా. saii@doctor.com(చదవండి: World Banana Day: 'అరటిపండు'ని ప్రపంచ ఫలం అంటారు ఎందుకో తెలుసా..!) -
వ్యాయామం లేకుండానే 12 కిలోలు..! డాక్టర్ వెల్నెస్ మంత్ర
బరువు తగ్గడంలో పలువురు పలు విధానాలతో తగ్గించుకునే యత్నం చేస్తూ..ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో ఎన్నో వెల్నెస్ మంత్రాలు పుట్టుకొస్తున్నాయి. అలా కాంకుండా వైద్యం అందించే ఓ డాక్టరే వ్యాయామం లేకుండా 12 కిలోలు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచారు. సర్వసాధారణంగా డాక్టర్లు ఎంతకాదన్న చిన్నపాటి వర్కౌట్లు లేదా వాకింగ్ అన్న చేస్తుంటారు. కానీ ఈ డాక్టర్ కేలరీల బేరీజు, వ్యాయమాలతో పనిలేకుండా ఆరోగ్యకరమైన రీతీలో ఎలా తగ్గారో తెలిపారు. అంతేగాదు అందుకోసం ఎలాంటి ఫిట్నెస్ రూల్ పాటిస్తే మంచిదో కూడా సవివరంగా వివరించారు. బరువు తగ్గడానికి సంబంధించి..డైటింగ్ నుంచి వర్కౌట్ల వరకు పలు టిప్స్ ట్రెండ్ అవుతున్న తరుణంలో పూణెకు చెందిన డాక్టర్ మల్హర్ గన్లా అద్భుతమైన వెల్నెస్ మంత్ర గురించి తెలిపారు. తాను ఆ రూల్ని పాటించి ఎలా 12 కిలోలు తగ్గారో ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. ఆయన తన వెయిట్లాస్ జర్నీని రక్తపరీక్షతో ప్రారంభించినట్లు తెలిపారు. తనకు ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే తనకు B12, డీ3 చాలా తక్కువగా ఉన్నాయనేది గుర్తించారు. తనకు అధికంగా ఆకలిగా ఎందుకో అనిపిస్తోంది అర్థం చేసుకోవడానికి ఈ బ్లెడ్ టెస్ట్ ఉపయోగింపడిందని చెప్పారు. ఆ వైద్యుడి మార్గదర్శకత్వంలో పోషకాహార లోపాలను సరిదిద్దుకోవడానికి సప్లిమెంట్లు, స్మూతీలు, సలాడ్లతో డైట్ని ప్రారంభించినట్లు తెలిపారు. వెయిట్లాస్ ప్లాన్..జంక్ ఫుడ్ నియంత్రణ)ఆయన పోషకాలు మెరుగుపడటం మొదలయ్యాక, ఆయన క్రమంగా ఉప్పు, చక్కెర,నూనెను మానేసినట్లు తెలిపారు. అయితే వీటన్నింటిని రాత్రికి రాత్రే మానేయలేదని, నెమ్మది నెమ్మదిగా దూరం చేసుకున్నట్లు తెలిపారు. అంతేగాదు బయటి భోజనంపై ఇష్టం పోవడానికి తనకు సుమారు ఒక నెల సమయం పట్టిందని కూడా అన్నారు.కార్బోహైడ్రేట్లను తగ్గించడంతర్వాత కార్బోహైడ్రేట్లను తగ్గించడం మొదలుపెట్టారు. ఆయన కార్బోహైడ్రేట్లను రోజుకు ఒక పూటకు (రాత్రి భోజనానికి) మాత్రమే పరిమితం చేశారు.అల్పాహారం: ప్రోటీన్ ఆధారితం (గుడ్ల వంటివి)మధ్యాహ్న భోజనం: పప్పు, కూర, సలాడ్ (రోటీ లేదా అన్నం వద్దు)తాను పాటించిన డైటింగ్ విధానాన్ని "23-1" రూల్గా పిలిచారు. ఈ విధానంలో శరీరం కొలెస్ట్రాల్పై ఆధారపడి పనిచేస్తుందట, అలాగే ఒక గంటపాటు కార్బోహైడ్రేట్లను తీసుకుంటుందని అన్నారు. ఆ తర్వాత తాను తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉన్నట్లు తెలిపారు. అది కూడా స్వేచ్ఛయుతం, ఆరోగ్యప్రదంగా చేసినట్లు తెలిపారు. శరీరాన్ని కష్టపెట్టలా కాకుండా పండ్లు, ద్రవపదార్థాలపై ఆధారపడుతూ చేసినట్లు పేర్కొన్నారు. ఇది ఆయనకు మరింత బరువు తగ్గడానికి ఉపయోగపడిందన్నారు. కాలక్రమేణ తన ఆకలిలో పెద్ద మార్పును గమనించారు. దెబ్బకు తన నడుము చుట్టుకొలత సుమారు 29 అంగుళాలకు తగ్గిందని అన్నారు. ఇది సామాన్యులు సైతం సులభంగా అనుసరించగలిగేదని అన్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: వేడివేడిగా వడ్డించాలని ఎంత పనిచేశావ్ అమ్మ..!) -
దేశీయ ఫ్రిడ్జ్కు జై!
‘జ్ఞానం లేకపోయినా వారసత్వ జ్ఞానం అయినా ఉండాలి’ అంటారు. మన తాతముత్తాతలు, మన పూర్వీకులు మన కోసం ఎన్నో దారులు ఏర్పాటు చేశారు. వారసత్వ జ్ఞానంతో కొందరు, సొంత జ్ఞానంతో కొందరు ‘దేశీయ ఫ్రిడ్జ్’లు తయారుచేస్తున్నారు. విద్యుత్ వినియోగాన్ని, కర్బన ఉద్గారాల తగ్గింపునకు పర్యావరణ హితమార్గాన్ని అనుసరిస్తున్నారు...తీగలు, కంప్రెసర్లు, గ్యాస్ రీఫిల్ అవసరం లేదు. కొంచెం ఓపిక ఉంటే చాలు, ఒక్క యూనిట్ విద్యుత్ కూడా అవసరం లేకుండానే సంప్రదాయ శీతలీకరణ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే విధానాలు మన సంప్రదాయ చరిత్రలో ఉన్నాయి.వారసత్వ జ్ఞానం... మళ్లీ ఒకసారిరాజస్థాన్లోని ఎడారి ప్రాంతాల నడిబొడ్డున వేసవి తాపం భరించలేనంతగా ఉండే చోట, సంప్రదాయ బంధానీ చీర కట్టుకున్న మహిళ చిన్న గుడిసెలాంటి నిర్మాణం వైపు వెళ్లింది. చిన్న తలుపు తెరిచి లోపల ఉన్న పాలు, పెరుగు, రొట్టెలు... మొదలైన వాటిని బయటకి తీసుకువచ్చింది.ఇంతకీ ఆ చిన్న గుడిసె ఏమిటంటే... విద్యుత్ లేకుండా నిర్మించిన ఒక రిఫ్రిజిరేటర్!మట్టి, ఆవుపేడ, ఖి్రపా గడ్డితో రూపొందించిన గుడిసె అది. విద్యుత్ అవసరం లేకుండానే సహజ శీతలీకరణ దీని ప్రత్యేకత.ఈ దేశీయ ఫ్రిడ్జ్కు ఉపయోగించిన శాస్త్రం సూక్ష్మమైనది కానీ ప్రభావ వంతమైనది. రంధ్రాలు గల బంక మట్టి నీటిని నెమ్మదిగా ఆవిరైపోయేలా చేసి, లోపల ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. పైన కప్పిన గడ్డి ఒక ఇన్సొలేషన్లా పనిచేస్తూ, లోపలి భాగాన్ని తీవ్రమైన ఎండ నుండి కాపాడుతుంది. సహజంగా చల్లబడే ఈ గది వల్ల అధిక వేడిలో కూడా ఆహారపదార్థాలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. తరతరాలుగా గ్రామీణ రాజస్థాన్లో ఇలాంటి ‘దేశీ ఫ్రీజ్’లు ఉన్నాయి. ఈ దేశీ ఫ్రిజ్లు పాలు పాడవకుండా కాపాడతాయి. పెరుగు చక్కగా గడ్డకట్టడానికి సహాయపడతాయి. రొట్టెలను రోజంతా తాజాగా ఉంచుతాయి... ఇవన్నీ ఒక్క యూనిట్ విద్యుత్ అవసరం లేకుండా జరుగుతాయి!ఒకప్పుడు అందరికీ సులభంగా అందుబాటులో ఉండే ఈ వ్యవస్థలు, వారసత్వ జ్ఞానం కనుమరుగవుతున్నట్లు కనిపించినా.... ఆ సంప్రదాయ పద్ధతులు తిరిగి వెలుగు చూస్తున్నాయి.మిట్టీ కూల్విద్యుత్ అవసరం లేకుండా ఆహారాన్ని తాజాగా ఉంచే ఫ్రిజ్ తయారుచేశాడు గుజరాత్కు చెందిన మన్సుఖ్ భాయ్. ఈ ఫ్రిజ్కు ‘మిట్టీ కూల్’ అని పేరు పెట్టాడు. ఈ మట్టి ఫ్రిజ్ బాష్పీభవన సూత్రంపై పనిచేస్తుంది. ఫ్రిజ్లో పై గదులలోని నీరు కిందికి కారి ఆవిరైపోతుంది. దీనివల్ల లోపల ఉన్న వేడి తొలగిపోయి, గదులు చల్లబడతాయి. పై గదిని నీటిని నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. దానిపైన మట్టితో చేసిన చిన్న మూత ఉంటుంది. కిందిగదిలో ఆహారపదార్థాలను నిల్వ చేయడానికి రెండు అరలు ఉంటాయి. మొదటి అరలో కూరగాయలు, పండ్లు... మొదలైన వాటిని నిల్వ చేయడానికి, రెండవ అరలో పాలు మొదలైన వాటిని నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. తాగడానికి నీటిని తీసుకోవడానికి ముందుభాగంలో చిన్న కుళాయి ఉంటుంది.పాత సంప్రదాయాలతో... ప్రకృతికి దగ్గరగా...కర్నాటక లోని ముగడ్ గ్రామానికి చెందిన 58 సంవత్సరాల శేఖప్ప కుంబార్ చెరువు మట్టి, యూపటోరియం మొక్కను ఉపయోగించి దేశీయ ఫ్రిజ్ను తయారుచేశాడు. దీనివెనుక 25 సంవత్సరాల కృషి ఉంది. కొన్నిసార్లు ప్రయోగాలు విఫలమైనా మళ్లీ మళ్లీ ప్రయత్నించి సఫలం అయ్యాడు.కంబార్ తయారు చేసిన ఫ్రిజ్లో రెండు వారాల పాటు కూరగాయలు, పండ్లు నిల్వ చేసుకోవచ్చు. ఈ ఫ్రిజ్ పదిహేను లీటర్ల సామర్థ్యంతో విశాలంగా ఉంటుంది. దీనిని రెండు, మూడు అంగుళాల ఖాళీ వదిలి ఇసుకతో నింపిన ఒక చిన్న బాక్స్లాంటి దానిలో ఉంచాలి. దీన్ని ఇటుకలతో తయారు చేసుకోవచ్చు. వారానికి ఒకసారి నీరు పోస్తే సరిపోతుంది,తాను తయారుచేసిన ఫ్రిడ్జ్కు మంచి స్పందన లభిస్తోందని చెబుతున్నాడు కంబార్.కంబార్ తయారు చేసిన ఫ్రిడ్జ్ను గత ఏడాదిగా వాడుతున్న వినాయక్ హోంగల్ ఇలా అంటున్నాడు...‘కూరగాయలు, పండ్లను మట్టి శుద్ధి చేయగలదని మేము నమ్ముతాము. ఈ ఫ్రిజ్ను ఉపయోగించడం ద్వారా మేము విద్యుత్తును ఆదా చేస్తున్నాం’‘గ్లోబల్ వార్మింగ్లో విద్యుత్ వాటా 26 శాతం. దేశీయ ఫ్రిజ్ల వల్ల విద్యుత్ వాడకాన్ని ఎంతో కొంత తగ్గించవచ్చు. పర్యావరణ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఇది ప్రశంసనీయం’ అంటున్నారు సస్టెయినబుల్ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్ డా.ప్రకాష్ భట్.‘ఆహా’ అనుకోవడానికే కాదు ‘దేశీయ ఫ్రిడ్జ్’వంటి ప్రత్యామ్నాయాల ద్వారా విద్యుత్ వినియోగం, కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. ప్రకృతికి దగ్గరలో ఉండే గత జీవిత విధానాలను, వారి సరళమైన జీవితాలను అర్థం చేసుకోవడానికి కూడా ఈ ఆవిష్కరణలు ఉపకరిస్తాయి.పర్యావరణ స్పృహతో జీవితాన్ని గడపడానికి, ప్రకృతిని ప్రేమించడానికి మార్గనిర్దేశం చేస్తాయి. కావి ఫ్లోరింగ్ ఎంతో చల్లగా...హాయిగా!మన దేశంలో తరతరాలుగా పర్యావరణ హితమైన, సహజ పద్ధతులు ఉనికిలో ఉన్నాయి అని చెప్పడానికి మరో ఉదాహరణ... కేరళలో మూడు వందల ఏళ్లుగా వాడుకలో ఉన్న ఒక ప్రత్యేకమైన నేల నిర్మాణ పద్ధతి. ‘కావి ఫోర్లింగ్’ అని పిలిచే ఈ సాంకేతికత వేసవి తీవ్రతలోనూ ఇళ్లను చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. దీనిలో సిమెంట్, రసాయనాలు వాడరు. వేసవిలో మధ్యాహ్నపు ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ ‘కావి ఫ్లోర్’ మీద అడుగుపెడితే హాయిగా, చల్లగా ఉంటుంది!కావి ఫ్లోర్ ప్రత్యేకత... అద్భుతమైన మన్నిక. కాలం గడిచేకొద్దీ దీని ఉపరితలం మరింత మెరుస్తూనే ఉంటుంది. అడుగుల రాపిడి దీనిని అరిగించకపోగా మరింత మెరుగుపరుస్తుంది. ఎటువంటి గీతలు పడకుండా ఇది ఏకంగా దశాబ్దాల పాటు చెక్కు చెదరకుండా నిలిచి ఉంటుంది. -
పిల్లలు ఆడాలి... పడకూడదు
తల్లిదండ్రుల నిర్లక్ష్యం... పిల్లలకు ప్రమాదకరం వేసవి సెలవులంటే... పిల్లలకు తోకలొస్తాయి... రెక్కలొస్తాయి.వారికి ఎలాగోలా ఎగిరే మాయాకంబళి కూడా దొరుకుతుంది. ఎగరాలనుకుంటారు... దూకాలనుకుంటారు... అది వారి వయసు. వారిని కనిపెట్టుకొని ఉండటం పెద్దల అనుభవం. వేసవి సెలవుల్లో దేశవ్యాప్తంగా ప్రమాదాల బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నవారి సంఖ్య పెరిగింది. 2025లో ఒక్క చెన్నైలోనే 55 మంది పిల్లలు మేడ మీద నుంచి కింద పడి హాస్పిటల్స్లో చేరారు. ఈ వేసవి వారికి మంచి జ్ఞాపకంగా మిగలాలంటే ఏం చేయాలో చూద్దాం...‘పిల్లాడు హాల్లో ఆడుకుంటున్నాడు కదా, నేను వంట చేసుకుంటూ రీల్స్ చూస్తా’– ఈ ఒక్క మాట చాలు పిల్లలు ప్రమాదంలో పడటానికి. ఒక్క నిమిషంలో ఏం జరుగుతుంది?పిల్లాడు స్టూల్ లాక్కెళ్లడానికి 10 సెకన్లు... గ్రిల్ ఎక్కడానికి 5 సెకన్లు... పడిపోవడానికి 2 సెకన్లు. మీ రీల్ అయిపోయే లోపు వాడి రియల్ లైఫ్ మారిపోవచ్చు. దేశవ్యాప్తంగా ప్రతి వేసవి సెలవుల్లో ఇలాగే జరుగుతోంది. తమిళనాడు డేటా ప్రకారం ప్రమాదాల బారిన పడుతున్న పిల్లల్లో ఏటా 9.1 శాతం పిల్లలు ప్రమాదవశాత్తు ‘పడిపోవడం’ వల్ల గాయాల పాలవుతున్నారు. వీరిలో పదేళ్లలోపు పిల్లలే ఎక్కువ. దాంతో శాశ్వత వైకల్యం కేసులూ పెరుగుతున్నాయి. చెన్నైలోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్, ఎగ్మూర్’ లెక్కల ప్రకారం ఒక్క 2025లోనే 55 మంది పిల్లలు ‘బాల్కనీ, కిటికీ, మెట్ల మీద నుంచి పడి’ చికిత్స కోసం వచ్చారు. ఇక చెన్నైలోని కంచి కామకోటి చిల్డ్రన్స్ ట్రస్ట్ హాస్పిటల్కి గత పదేళ్లుగా ఇలా వస్తున్న పిల్లల కేసులు కామన్ అయ్యాయి. తలకు దెబ్బ, ఎముకలు విరగడం, ఐ.సి.యు.లో వారాల తరబడి ఉండాల్సి రావడం.... కొందరు దేవుడి దయవల్ల బతికారు, కొందరు శాశ్వత వైకల్యంతో మిగిలారు. బాధాకరం ఏంటంటే– ఈ యాక్సిడెంట్స్ ఇంట్లోనే, పేరెంట్స్ కళ్లముందే జరుగుతున్నాయి.వేసవిలోనే ఎందుకు ప్రమాదం ఎక్కువ? ∙స్కూల్ లేదు కాబట్టి పిల్లలు రోజంతా ఇంట్లోనే ఉంటారు. బాల్కనీ, కిటికీ, మెట్లు– ఇవే వాళ్లకు ప్లే గ్రౌండ్ అవుతాయి. ∙తలుపులు, కిటికీలు తెరిచే ఉంటాయి. వేసవి వేడికి వెంటిలేషన్ కోసం అన్ని తలుపులు తీస్తాం. బాల్కనీ డోర్ కూడా. పిల్లలకు ‘బయట ప్రపంచం’ ఈజీ యాక్సెస్ అయిపోతుంది. ∙ఫోన్ పేరెంటింగ్. ఇదే అసలు విలన్. పిల్లాడు హాల్లో ఆడుకుంటున్నాడు కదా అని బెడ్రూమ్లో రీల్స్ చూస్తుంటాం. వంటింట్లో సీరియల్ పెట్టుకుంటాం. 30 సెకన్ల చూపు తిప్పితే చాలు – పిల్లాడు స్టూల్ లాక్కెళ్లి బాల్కనీ గ్రిల్ ఎక్కేస్తాడు.ప్రమాదాలకు ఇవీ హేతువులు... 1. పొట్టి గోడలు: బాల్కనీ, టెర్రస్ గోడలు 3 అడుగుల కంటే తక్కువ ఉంటే ప్రమాదం. పిల్లాడు వంగి చూస్తూ బ్యాలెన్స్ తప్పుతాడు.2. వెడల్పు గ్రిల్స్: బాల్కనీ గ్రిల్స్ మధ్య గ్యాప్ 4 అంగుళాలు దాటితే పిల్లల తల దూరిపోతుంది. 5–7 అంగుళాల గ్యాప్ అత్యంత డేంజర్. బాల్కనీ దగ్గర స్టూల్, కుర్చీ, పూల కుండీలు ఉంటే పిల్లలు అవి ఎక్కి గ్రిల్ దాటేస్తారు. 3. ఓపెన్ మెట్లు, స్టెయిర్కేస్: గ్రిల్ లేని మెట్లు, తలుపు లేని టెర్రస్ మెట్లు... ఇవి ప్రమాదం. ‘మాది ఫస్ట్ ఫ్లోరే కదా, ఏమవుతుంది?’ అని కొందరు అనుకుంటారు. నేషనల్ ట్రామా స్టడీస్ ప్రకారం పిల్లల్లో 3–4 అడుగుల నుంచి పడినా బ్రెయిన్ ఇంజురీ, వెన్నెముక దెబ్బ, లైఫ్లాంగ్ డిసేబిలిటీ రావచ్చు.ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?సేఫ్టీ నెట్ మ్యాండేటరీ: బాల్కనీ, కిటికీలకు పూర్తిగా సేఫ్టీ నెట్/గ్రిల్ వేయించండి. స్టూల్స్, డబ్బాలు, పూల కుండీలు అన్నీ గ్రిల్స్కి, కిటికీలకు 3 అడుగుల దూరంలో పెట్టండి. బాల్కనీ, టెర్రస్ తలుపులు ఎప్పుడూ తాళం వేసి ఉంచండి. పిల్లలకు అందకుండా పైన గడియ పెట్టండి. మెట్లకు పైన, కింద బేబీ గేట్ పెట్టండి. లూజ్ గ్రిల్స్ రిపేర్ చేయించండి. బాల్కనీలో, టెర్రస్ మీద, మెట్ల దగ్గర పిల్లల్ని ఒక్క నిమిషం కూడా ఒంటరిగా వదలొద్దు. అపార్ట్మెంట్స్లో ఉన్నవారు సేఫ్టీ ఆడిట్ చేయించాలి. అన్ని బ్లాక్స్లో విరిగిన గ్రిల్స్, ఊడిన రెయిలింగ్స్, తాళం లేని టెర్రస్ డోర్స్ చెక్ చేయాలి. అన్ని బిల్డింగ్స్లో పారాపెట్ గోడలు నేల నుంచి కనీసం 1 మీటర్ ఎత్తు ఉండేలా రూల్ తెస్తే బాగుంటుంది. రోజులో 2 గంటలు ఫోన్ పక్కన పడేసి పిల్లలతోనే గడపండి. మీ చూపు మీదే వాళ్ల భద్రత ఆధారపడి ఉంది. పిల్లల్ని బిజీగా ఉంచే సేఫ్ ఐడియాబెడ్షీట్తో గదిలో టెంట్ వేయండి. సరదాగా ఆడుకుంటారు. బాత్రూమ్లో పెద్ద టబ్లో నీళ్లు పోసి మీ పర్యవేక్షణలో ఆడించండి. పేపర్, కలర్స్, క్లే ఇవ్వండి. రోజూ ఒక గంట మీరే కథ చెప్పండి. కిందకు వెళ్లి ఆడుకునే వీలుంటే అక్కడకు పంపండి. ఇక సైకిళ్లు, అనుమతి లేకుండా బండ్లు తీసుకొని రోడ్డు మీదకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత మీదే. నీళ్లున్న చోటుకు చెరువు, స్విమింగ్ పూల్ వీటి వద్దకు వెళ్లకుండా చూసుకోవాలి. -
స్త్రీల ఆత్మాభిమానానికి ప్రతీక శ్రీవాసవీ కన్యక
వైశ్యుల కులదేవత శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి. పదకొండవ శతాబ్దంలో పెనుగొండను పాలించిన కుసుమశ్రేష్ఠి, కుసుమాంబల ముద్దుబిడ్డగా ఆమె జన్మించింది. తల్లిదండ్రులు సంతానం కోసం చేసిన పుత్రకామేష్ఠి యజ్ఞ ఫలితంగా విరూపాక్షుడు అనే కవల సోదరునితో బాటు ప్రభవించిన కన్యక అందచందాలతో, విద్యావినయాలు, గుణ గణాలతోబాటు ఆధ్యాత్మిక విలువలనూ కలిగి అందరి మన్ననలనూ పొందింది. వివాహం చేసుకోకుండా కన్యగానే జీవించాలనే ప్రగాఢేచ్ఛ ఆమె తల్లితండ్రులను కూడా విస్మితులను చేసింది. ఆమె నిర్ణయానికి తలొగ్గి ఆమె సోదరుడు, విరూపాక్షుని వివాహం రత్నావతితో అతి వైభవంగా జరిపించారు తల్లిదండ్రులు. ఇలా ఉండగా... వేంగిరాజ్య పాలకుడు,పాండవుల వంశంలోని వాడైన నాటి చాళుక్యరాజు విష్ణువర్ధనుడు తన సామంతరాజ్యమైన పెనుగొండకు పర్యటనకు రాగా, కుసుమశ్రేష్ఠి, తదితరులు ఆ చక్రవర్తికి సకల రాజోచిత మర్యాదలనూ చేశారు. విమలాదిత్యు డనే మరొక పేరూ కలిగిన విష్ణువర్ధనుడు పెనుగొండ వైభవాన్ని చూచి ఆశ్చర్యపోయాడు. అంతకంటే ఎక్కువగా వింధ్యవాసినీదేవి దర్శనానికి వెడుతున్న వాసవాంబ అసామాన్యమైన సౌందర్యానికి విమోహితుడైపోయాడు. ఆమెను తనకిచ్చి వివాహం జరిపించవలసిందిగా కుసుమ శ్రేష్ఠికి తన మంత్రులతో కబురంపాడు. వయసులో వాసవాంబ కన్నా చాలా పెద్దవాడు, పెళ్ళీడుకు వచ్చిన కొడుకు ఉన్నవాడు అయిన చక్రవర్తి వాసవాంబను కోరడం కుసుమ శ్రేష్ఠి కుటుంబానికి నచ్చలేదు. పైగా తన కూతురు కన్యగానే జీవింపదలచి ఉంది. అలాగని బలవంతుడైన చక్రవర్తిని ఎదిరించనూ లేడు. దిక్కుతోచని స్థితిలో కుసుమ శ్రేష్ఠి తన కులగురువైన భాస్కరాచార్యుని అధ్వర్యంలో 714 గోత్రాలుగా విస్తరించి ఉన్న తమ ఆర్య వైశ్యులతో సమావేశమయ్యాడు. వారిలో 612 గోత్రాలవారు విష్ణువర్ధనుని ఎదిరించడం బలవద్విరోధాన్ని కొని తెచ్చుకోవడమేననీ, వాసవాంబను అతనికిచ్చి పెండ్లి జరిపిస్తే యుద్ధప్రమాదం, అందువలన కలిగే కులక్షయం అనే ముప్పూ తప్పుతాయని భావించగా; 102 గోత్రాల వారు మాత్రం కుల ధర్మానికి విరుద్ధంగా, దైవాంశగా భావించబడుతున్న వాసవిని ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా చక్రవర్తికి అప్పగించడం తప్పని అభిప్రాయ పడ్డారు. ఇంతలో అనూహ్యంగా వాసవీదేవి ఆ సమావేశ మందిరంలోకి ప్రవేశించింది. ‘అన్నలారా, తండ్రులారా! ఒక వినూత్న ప్రణాళికతో చక్రవర్తిని దెబ్బ తీయాలనుకొంటున్నాను. నేనతనిని నిరాకరిస్తే, అతడు మనపైకి దండెత్తి వచ్చి మన సైన్యాన్ని, పౌరులను ఊచ కోత కోస్తాడు. అహింస, సత్యాగ్రహం అనే విధానంతో మనలను మనం ఆత్మార్పణ గావించుకొని అతనికి బుద్ధి చెబుదాం. దృఢమైన సంకల్పదీక్షతో నన్ను అనుసరించ గలవారు మాత్రమే ఈ నా పోరాటంలోపాల్గొనగలరు’ అని ఆమె పలికిన పలుకులకు ఆమె తల్లిదండ్రులతోబాటు, 102 గోత్రాల వారు తమ అంగీకారాన్ని తెలిపారు.గోదావరీ తీరంలో బ్రహ్మకుండమనేపావన ప్రదేశంలో 103 అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు. ఆ రోజు మాఘ శుద్ధ పాడ్యమి. తమ కన్ను పడిన కన్నె పిల్లలు తమ వశం కావలసిందే అని విర్రవీగే నాటి రాజుల ఆగడాలకు చరమ గీతం పాడడానికి; ఆడపిల్లల అభిప్రాయాలకూ విలువనివ్వాలనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వడానికి; ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కంటే ్ర΄ాణాలు గొప్పవి కావని నిరూపించడానికి, ‘ఆత్మార్పణ‘ మార్గాన్ని ఎంచుకొన్నది వాసవీమాత. తనతోబాటూ ఆ యజ్ఞంలో ఆహుతి కావడానికి సంసిద్ధులై ఉన్న 102 గోత్రాల వారికి తన నిజరూపాన్ని ప్రదర్శించింది ఆమె. తనతోబాటు తన 102 గోత్రాల వారికీ మోక్షం కావాలని కోరుకొన్న ‘సమాధి’ అనే వైశ్యశ్రేష్ఠుడే ఇప్పుడు తన తండ్రియైన కుసుమ శ్రేష్ఠి అంటూ తమ జన్మవృత్తాంతాన్ని వివరించింది వాసవీదేవి.దేశభక్తి, నిజాయితీ, దేహ బలం, బుద్ధిబలం, సమాజసేవల గురించి ప్రబోధించింది. ‘రాజా! చేతనైనే నన్ను ఇప్పుడు చెరబట్టు’ అంటూ అగ్నిలో ప్రవేశించింది. ఆ దృశ్యం చూసి తన గర్వం మట్టిలో కలిసిపోగా, రక్తం కక్కుకొని, తల పగిలి రాజు మరణించాడు. కోరుకొన్న కన్య లభించక పోగా అపకీర్తి, ఆకస్మిక మరణం రాజును వరించాయి. గురజాడ వారు అన్నట్లు ‘పట్టమేలే రాజు గర్వం మట్టి కలిసెను/ పదం పద్యం పట్టి నిలిచెను కీర్తులపకీర్తుల్‘. వాసవీ కన్యక కీర్తి, రాజు అపకీర్తి ఆ చంద్ర తారార్కం నిలిచి పోయాయి. విషయం తెలుసుకొని విష్ణువర్ధన చక్రవర్తి కుమారుడు రాజరాజ నరేంద్రుడు పెనుగొండకు తరలిరాగా, విరూపాక్షుడు అతడిని స్నేహపూర్వకంగా పరామర్శించి, ‘గతాన్ని మరచి నవ్యమైన భవిష్యత్తును నిర్మించుకొందాం‘ అంటూ చేయి కలిపాడు. అంగీకరించిన రాజరాజ నరేంద్రుడు పెనుగొండలోని నగరేశ్వర స్వామి దేవస్థానం లోనే వాసవీ మాత విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిపాడు. అప్పటినుండీ వైశ్యుల కుల దేవతగా వాసవీ కన్యకా పరమేశ్వరి సర్వత్రా పూజలందుకొంటూ ఉంది. దాదాపు ప్రతి పట్టణంలోనూ ఆమెకు ఆలయాలు వెలిశాయి.– డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి -
దౌర్జన్యానికి దైవశిక్ష తప్పదు!
మానవ సంబంధాలన్నింటిలోకి అత్యంత పవిత్రమైనది ’సహోదరత్వం’. అయితే నేటి సమాజంలో స్వార్థం, అహంకారం పెరిగిపోయి ఇతరుల హక్కులను కాలరాయడం, బలహీనులపై దౌర్జన్యం చేయడం సర్వసాధారణమైపోయింది. కానీ, ఇస్లామీయ బోధనల ప్రకారం దౌర్జన్యం (జులుమ్) అనేది అల్లాహ్ దృష్టిలో క్షమించరాని మహాపరాధం.దౌర్జన్యం అంటే ఏమిటి?అరబీలో ’మజాలిమ్’ అంటే అకారణంగా ప్రజలను వేధించడం, ఒకరి ఆస్తిని అక్రమంగా కబళించడం మరియు ఒకరి హక్కులను బలవంతంగా లాక్కోవడం. వివేకవంతులైన విశ్వాసులు అల్లాహ్ హెచ్చరికను గుర్తుంచుకోవాలి: ‘దుర్మార్గులు చేస్తున్న దానిని అల్లాహ్ పట్టించుకోవడం లేదని భావించకండి. ఆయన వారిని శిక్షించే రోజును వాయిదా వేస్తున్నాడు మాత్రమే.‘ ఆనాడు ఏ అధికార బలగం, ఏ సంఖ్యా బలం వారిని రక్షించలేదు.పరలోకంలో శిక్షా రూపంప్రవక్త ముహమ్మద్ (సఅసం) హెచ్చరించినట్లుగా, ఈ లోకంలో ఇతరులపై చేసే దౌర్జన్యం ప్రళయదినాన దట్టమైన చీకటిగా మారుతుంది. పీడితుని ఆక్రందనకూ, అల్లాహ్ కీ మధ్య ఎలాంటి అడ్డుతెర ఉండదు. ఒక వ్యక్తి వేరొకరి జానెడు భూమిని అన్యాయంగా ఆక్రమిస్తే, ప్రళయదినాన ఏడు భూభాగాల గుదిబండను అతని మెడలో వేయడం జరుగుతుంది. ఇది కేవలం భూమికే కాదు, ఇతరుల మాన మర్యాదలను మంటగలిపేవారికి కూడా వర్తిస్తుంది.అసలైన సహాయం: బాధితునికీ, దౌర్జన్యపరునికీ!మత సామరస్యం, సామాజిక న్యాయం వెల్లివిరియాలంటే ముస్లింలు తమ తోటి సోదరులకు అండగా ఉండాలి. ప్రవక్త (సఅసం) ఒక అద్భుతమైన సూత్రం చెప్పారు: ‘మీ సోదరునికి అతను దౌర్జన్యపరుడైనా, బాధితుడైనా తోడ్పడండి. బాధితునికి సహాయం చేయడం అంటే అతనికి న్యాయం జరిగేలా చూడటం. మరి దౌర్జన్యపరునికి సహాయం చేయడం అంటే ఏమిటి? అతను అన్యాయం చేయకుండా అతని చేతిని పట్టుకోవడం, అతన్ని తప్పు నుండి మళ్ళించడం.క్షమ – ప్రాయశ్చిత్తంఒక వ్యక్తి చేసిన పాపాలను అల్లాహ్ క్షమిస్తాడేమో కానీ, తోటి మనిషికి చేసిన అన్యాయాన్ని ఆ బాధితుడు క్షమించే వరకు అల్లాహ్ కూడా క్షమించడు. అందుకే పారలౌకిక విచారణ రాకముందే, ఈ లోకంలోనే బాధితుని వద్ద క్షమాపణ పొంది, వారి హక్కులను తిరిగి చెల్లించాలి. లేదంటే, పుణ్యాలన్నీ బాధితుని ఖాతాలోకి వెళ్లిపోయి పాపాలే మిగిలే ప్రమాదం ఉంది.ఆక్రందనలు అరణ్య రోదనలు కావులోకంలో పీడితుల ఆక్రందనలు అరణ్య రోదనలు కావు. న్యాయం ఆలస్యం కావచ్చు కానీ తప్పక జరుగుతుంది. ఒక విశ్వాసి మరో విశ్వాసికి భవనంలోని ఇటుకల వలె ఒకరికొకరు బలం చేకూర్చుకోవాలి. అప్పుడే సమాజంలో శాంతి, అల్లాహ్ కారుణ్యం లభిస్తాయి. క్షమించడం, సర్దుకుపోవడం అనేది కేవలం బలహీనత కాదు, అది ఒక గొప్ప సాహసం, దృఢ సంకల్పం.– ముహమ్మద్ ముజాహిద్ -
పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఉత్సవాలు : ముస్తాబైన మఠం
భారతదేశం ఎందరో గురుదేవుళ్ల పుణ్యధామం. వారు సమాజంలో జ్ఞాన దీప్తులు వెలిగించారు. అలాంటి వారిలో సుప్రసిద్ధులు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన ఆరాధన గురుపూజ మహోత్సవాలు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం బ్రహ్మంగారి మఠం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నేపథ్యంలో స్వామి చరిత్ర, ఉత్సవ విశేషాలపై ప్రత్యేక కథనం. శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి గొప్ప కాలజ్ఞానిగా భూ మండలంపై కీర్తి గడించారు. అంతేకాక ఆయన రాజయోగి, హేతువాది, తత్త్వవేత్తగా ప్రసిద్ధి చెందారు. ప్రపంచంలో ఏ వింత జరిగినా ‘బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు’ అనడం మనం వింటుంటాం. రాబోయే కాలంలో జరిగే విపత్తులపై కాలజ్ఞానం ద్వారా వివరించి.. మానవాళికి ఎన్నో సూచనలు, హెచ్చరికలు చేశారు. ఆయన చెప్పిన ఎన్నో విషయాలు ఇప్పటికే జరిగాయి. కావున మిగతావి కూడా జరుగుతాయని భక్తులు నమ్ముతున్నారు. వీటి నుంచి తప్పించుకోవాలంటే.. సన్మార్గంలో నడవాలని బోధించారు. ఎన్నో మహిమలు చూపి మహిమాన్వితుడిగా విరాజిల్లారు. కులమతాలను రూపుమాపేందుకు కృషి చేసి సంఘ సంస్కర్తగా పేరు పొందారు. కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాల ద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసి జగద్గురువుగా ప్రఖ్యాతి గాంచారు. చివరికి దైవ స్వరూపులుగా వినుతి కెక్కారు. సజీవసమాధి నిష్ట పొంది భక్తులను అనుగ్రహిస్తు న్నారు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి 333వ ఆరాధన గురుపూజ మహోత్సవాలు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠంలో నేటి నుంచి 28 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.సన్మార్గంలో నడిపించడం కోసం...మానవులకు జ్ఞాన బోధ చేసి, సన్మార్గంలో నడిపించడం కోసం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి అవిశ్రాంతంగా కృషి చేశారు. తెలుగు నేల నలుచెరగులా సంచరించి బోధనలు చేసి 85 ఏళ్ల వయసులో (1693) వైశాఖ శుద్ధ దశమినాడు సజీవ సమాధి నిష్ట వహించారు. (ఆ ్ర΄ాంతంలోనే ప్రస్తుతం శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి క్షేత్రం ఉంది.) నాటి నుంచి జగత్ కల్యాణం కోసం యోగనిద్ర ముద్రితులై భక్తాదుల నీరాజనాలు స్వీకరిస్తున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామిచే ప్రసిద్ధి పొందుట చేత కందిమల్లాయపల్లె తర్వాతి కాలంలో బ్రహ్మంగారి మఠంగా పేరు పొందింది.ఏటా వేడుకలుస్వామి సజీవసమాధి నిష్ట పొందిన వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా ఏటా ఆరాధన గురుపూజ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆరు రోజుల పాటు కనుల పండువగా నిర్వహిస్తారు. దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిస్సాతోపాటు పలు రాష్ట్రాల నుంచి అశేష భక్తజనం తరలిరానున్నారు. స్వామి మాల ధరించిన భక్తులు ఇప్పటికే చేరుకుంటున్నారు. వారితో కందిమల్లాయపల్లె కళకళలాడుతోంది. ఆరాధనోత్సవానికి ఇంకా పెద్ద ఎత్తున రానున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు.. మఠం నిర్వాహకులు, దేవదాయ శాఖ అధికారులు, స్వామి శిష్యబృందం ఏర్పాట్లు చేస్తున్నారు.ఉత్సవాలు ఇలా..శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి గురుదేవుడిగా ప్రసిద్ధి చెందారు కావున.. ఏటా ఆయన శిష్యబృందం, భక్తులు.. ఆరాధన గురుపూజ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 23 నుంచి ఉత్సవాలు 28 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా రోజూ ఉదయం శ్రీ వీరబ్రహ్మ సుప్రభాతం, నామ సంకీర్తనం, అభిషేకం, సహస్ర నామార్చన కార్య్రçకమాలు నిర్వహిస్తారు. తర్వాత గుడి ఉత్సవం ఉంటుంది. రాత్రి భక్తుల కాలక్షేపం కోసం హరికథలు, సాంస్కృతిక కార్యక్రమాలు, బ్రహ్మంగారి నాటకాలు తదితర ప్రదర్శనలు ఉంటాయి. అలాగే గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి రోజూ ఒక్కో వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. 23న శేషవాహనోత్సవం, 24న గజవాహనోత్సవం, 25న నరనంది ఉత్సవం, 26న నంది ఉత్సవం, 27న బ్రహ్మరథోత్సవం నిర్వహిస్తారు. 26న సజీవ సమాధి నిష్ట వహించిన పవిత్ర దినం కావడంతో.. స్వామి వారు దీక్షాబంధన అలంకారోత్సవంలో దర్శనమిస్తారు. బ్రహ్మంగారి మాలధారణ చేసిన భక్తులు ఇరుముడి సమర్పిస్తారు. 28న మహాప్రసాదం నివేదనతో ఉత్సవాలు ముగుస్తాయి.– వడ్ల మల్లికార్జున ఆచార్య, సాక్షి, వైఎస్ఆర్ కడప జిల్లాఘనంగా ఏర్పాట్లుశ్రీ వీరబ్రహ్మేంద్రస్వాముల ఆరాధనోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఏటా భక్తుల సంఖ్య పెరుగుతోంది. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు.. వసతి, భోజనం, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఈ ఏడాది కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాను.– శ్రీ వీరధర్మజ వెంకటాద్రిస్వాముల వారు, మఠాధిపతులు, బ్రహ్మంగారిమఠం -
పెళ్లిచేస్తే మా అబ్బాయి బాగు పడతాడా?
మా అబ్బాయి వయసు ఇరవై నాలుగు. మాది మేనరికం కావడం వల్ల అనుకుంటాను, చిన్నప్పటి నుంచి అతనికి నడక, మాటలు కొంచెం ఆలస్యంగా వచ్చాయి. ఐదేళ్ల వయసులో స్కూల్కు పంపించాము. ఐదవ తరగతి వరకు బాగానే చదివాడు. కానీ ఆరవ తరగతి నుంచి విషయాలు గుర్తుంచుకోలేకపోవడం, సబ్జెక్టుల్లో ఫెయిల్ అవడం జరుగుతుండేది. టీచర్లు మమ్మల్ని పిలిచి, అబ్బాయికి చదువు కష్టంగా ఉందని చెప్పేవారు. అయితే, మేము అతన్ని ఎలాగోలా పదోతరగతి పాస్ చేయించాము. తర్వాత ఓపెన్ స్కూలింగ్ ద్వారా ఇంటర్, డిగ్రీ కూడా పూర్తి చేయించాము. అబ్బాయి చూడడానికి బాగుంటాడు. బైక్ కూడా బాగా నడుపుతాడు. మేము బయటకి పంపించి ఏదైనా తీసుకు రమ్మంటే తీసుకు వస్తాడు. కానీ తనంతట తానే నిర్ణయాలు తీసుకోలేడు. అతను సినిమా లేదా టీవీలో హీరోయిన్ ను చూసినప్పుడు, లేదా బయట ఆడవాళ్లను చూసినప్పుడు కొంచెం ఎగ్జైట్ అవుతున్నాడు. మాకు ఆ విషయం అర్థమవుతోంది. ఇప్పుడు మేము అతనికి పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. పెళ్లి వల్ల అతని తెలివితేటలు పెరుగుతాయని మా చుట్టాలందరూ అంటున్నారు. పెళ్లి చేస్తే నిజంగా మా అబ్బాయి బాగుపడతాడా? దయచేసి మాకు సరైన సలహా ఇవ్వగలరు.– రామకృష్ణారావు, రాయచూరుమీ అబ్బాయి విషయంలో మీరు పడుతున్న తాపత్రయం అర్థమవుతోంది. మేనరికం వల్ల కలిగే జన్యుపరమైన ప్రభావాల వల్ల కొందరిలో శారీరక ఎదుగుదల బాగున్నా, మెదడు పరిణతి ఆశించిన స్థాయిలో ఉండదు. దీనినే ‘మేధోపరమైన వైకల్యం’ అంటాము. మీరు గమనించినట్లు చదువులో వెనుకబడటం, సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం కేవలం నిర్లక్ష్యం వల్ల వచ్చేవి కావు, అవి అతని మెదడు గ్రహణశక్తి పరిమితులను సూచిస్తాయి. మన సమాజంలో ‘పెళ్లి చేస్తే బాధ్యత వస్తుంది, తెలివి తేటలుపెరుగుతాయి’ అనే ఒక బలమైన అపోహ ఉంది. కానీ శాస్త్రీయంగా పెళ్లి వల్ల మేధోశక్తి పెరగదు, పైగా కొత్తగా వచ్చే సామాజిక వైవాహిక బాధ్యతలు అతనిపై మానసిక ఒత్తిడిని పెంచుతాయి. వైవాహిక జీవితంలో కేవలం శారీరక ఆకర్షణే కాకుండా, ఎదుటి వ్యక్తి భావాలను అర్థంచేసుకోవడం, ఆర్థికంగా కుటుంబాన్ని నడపడం, సమస్యలను పరిష్కరించుకోవడం వంటి ‘అడాప్టివ్ ఫంక్షనింగ్’ నైపుణ్యాలు చాలా కీలకం. కేవలం చూసేందుకు బాగున్నాడు కదా అని లేదా కోరికలు ఉన్నాయి కదా అని పెళ్లిచేయడం సరైన పరిష్కారం కాదు. ఇది ఇటు మీ అబ్బాయికి, ఇటు పెళ్లి చేసుకుని వచ్చే అమ్మాయికి కూడా ఇబ్బందికరంగా మారవచ్చు. పెళ్లి చేస్తే తిక్క కుదురుతుందనేది పాత నానుడి. కానీ సరైన మానసిక పరిణితి లేని పెళ్లి కొత్త చిక్కులకు నాంది అనేది నేటి పరిస్థితి. మొదట స్థానికంగా ఉన్న మనోవైద్యుని సంప్రదించి అతనికి ఐక్యూ సోషల్ మెచ్యూరిటీ పరీక్షలు చేయించండి. అతని మానసిక వయసు ఎంతో తెలుసుకోవడం వల్ల, అతను ఒక సంసారాన్ని మోయగలడా లేదా అనేది స్పష్టమవుతుంది. ఆ నివేదికల ఆధారంగా నిపుణుల సలహాతో ముందడుగు వేయడం మీ అందరికీ శ్రేయస్కరం. అలాగే, పెళ్లి సంబంధం చూసేటప్పుడు అవతలి వారికి అన్నీ నిజాలు చె΄్పాలి. నిజం దాచి పెళ్లిచేస్తే, భవిష్యత్తులో రకరకాలైన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి తొందరపడకండి. అన్ని వైపుల నుంచి ఆలోచించి సరియైన నిర్ణయం తీసుకోండి. డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్,విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
హిమాలయంలాంటి అచంచలమైన పర్సనాలిటీ
మనం ఇప్పటివరకు నేర్చుకున్నవన్నీ ఒక ఎత్తు, వాటన్నిటినీ కష్టకాలంలో నిలబెట్టే 'Mental Toughness' (మానసిక దృఢత్వం) ఇంకొక ఎత్తు. బయట ఎన్ని తుఫానులు వచ్చినా, లోపల హిమాలయంలా నిశ్చలంగా ఉండే అచంచలమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడమే ఈ చాప్టర్ ఉద్దేశ్యం.చాలామంది జీవితం సాఫీగా సాగుతున్నప్పుడు చాలా గొప్పగా కనిపిస్తారు. కానీ ఒక్క చిన్న దెబ్బ తగిలినా లేదా అనుకోని అపజయం ఎదురైనా కుప్పకూలిపోతారు. బ్రో, నిజమైన పర్సనాలిటీ అంటే సంతోషంలో నవ్వడం కాదు, సంక్షోభంలో (Crisis) నిలబడటం. మెంటల్ టఫ్ నెస్ అంటే భావాలు లేకపోవడం కాదు, భావాల ప్రవాహంలో కొట్టుకుపోకుండా గట్టున నిలబడే ధైర్యం ఉండటం.మీ చేతుల్లో ఏముంది? (Locus of Control)మానసిక దృఢత్వం ఉన్న వ్యక్తికి ఒక స్పష్టత ఉంటుంది.Circle of Influence:నా ప్రయత్నం, నా ఆలోచనలు, నా ప్రతిస్పందన—ఇవి నా చేతుల్లో ఉన్నాయి. వీటి మీద నేను 100% దృష్టి పెడతాను.Circle of Concern: ఇతరుల విమర్శలు, గతం, ఆర్థిక మాంద్యం, వాతావరణం—ఇవి నా చేతుల్లో లేవు. వీటి గురించి నేను చింతించను. మీరు ఎప్పుడైతే మీ కంట్రోల్లో లేని వాటిని వదిలేస్తారో, అప్పుడే మీ మెంటల్ పవర్ రెట్టింపు అవుతుంది.4C మోడల్: దృఢత్వానికి నాలుగు స్తంభాలుసైకాలజీలో మెంటల్ టఫ్ నెస్ ని నాలుగు భాగాలుగా వివరిస్తారు:1. Control (నియంత్రణ): కష్టాల్లో కూడా నా జీవితం నా చేతుల్లోనే ఉందనే నమ్మకం.2. Commitment (అంకితభావం):ఎన్ని అడ్డంకులు వచ్చినా లక్ష్యాన్ని వదిలిపెట్టకపోవడం.3. Challenge (సవాలు):మార్పును భయంలా కాకుండా, ఒక అవకాశంగా (Opportunity) చూడటం.4. Confidence (నమ్మకం):నా సామర్థ్యం మీద నాకు తిరుగులేని నమ్మకం ఉండటం.అసౌకర్యాన్ని ప్రేమించండి (Embrace Discomfort)మనం ఎప్పుడూ 'కంఫర్ట్ జోన్' లో ఉండాలని కోరుకుంటాం. కానీ కండరాలు పెరగాలంటే జిమ్ లో బరువులు ఎత్తాలి, మనసు దృఢపడాలంటే కష్టాలను ఎదుర్కోవాలి.మెంటల్ టఫ్ నెస్ ఉన్నవాడు కష్టాన్ని చూసి పారిపోడు. "ఇది నన్ను ఇంకా బలవంతుడిని చేస్తుంది" అని నమ్ముతాడు.ప్రతిరోజూ మీకు నచ్చని, కానీ అవసరమైన ఒక పనిని చేయడం వల్ల మీ'Will Power'పెరుగుతుంది.నెగటివ్ సెల్ఫ్-టాక్ ని జయించడంమనలో మనమే మాట్లాడుకునే మాటలు మనల్ని బలహీనపరుస్తాయి. "నేను ఇది చేయలేను", "నాకు అదృష్టం లేదు" వంటి మాటలు మీ మనసుకి మీరు ఇచ్చుకునే విషం. ఒక యోధుడిలా ఆలోచించండి. విమర్శలను ఫీడ్బ్యాక్గా (Chapter 34), ఓటమిని ఒక పాఠంగా మార్చుకోండి.మీ మనసు మిమ్మల్ని ఆపేయాలని చూసినప్పుడు, "ఇంకొక్క అడుగు ముందుకు వేయి" అని దానికి ఆర్డర్ వేయండి.భావోద్వేగాల క్రమబద్ధీకరణ (Emotional Regulation)మానసిక దృఢత్వం అంటే ఏడవకపోవడం కాదు. బాధ కలిగినప్పుడు బాధపడండి, కానీ ఆ బాధలోనే ఉండిపోకండి. గొడవలు జరిగినప్పుడు లేదా ఒత్తిడి పెరిగినప్పుడువెంటనే రియాక్ట్ అవ్వకుండా మౌనంగా ఉండటం నేర్చుకోండి. మీ ప్రశాంతతను ఎవరికీ ఇచ్చేయకండి. మీరు ఎంత నిశ్చలంగా ఉంటే, అంత బలంగా కనిపిస్తారు.The Takeawayబ్రో, హిమాలయం ఎందుకు అంత గొప్పది అంటే—ఎండ వచ్చినా, వాన వచ్చినా, మంచు కురిసినా అది అక్కడే నిశ్చలంగా ఉంటుంది. నీ వ్యక్తిత్వం కూడా అలానే ఉండాలి. పరిస్థితులు నిన్ను మార్చకూడదు, నీ వ్యక్తిత్వమే పరిస్థితులను మార్చాలి. ఈ మెంటల్ టఫ్ నెస్ నీకు కేవలం విజయాన్ని మాత్రమే కాదు, నీ మీద నీకు తిరుగులేని గౌరవాన్ని (Self-Respect) ఇస్తుంది.నీ నిరంతర వికాసంలో (Phase 5) ఈ 'దృఢత్వం' నీకు రక్షణ కవచంలా నిలుస్తుంది.గుర్తుంచుకో.."నువ్వు ఎంత వేగంగా పరిగెడుతున్నావు అన్నది ముఖ్యం కాదు, ఎన్ని దెబ్బలు తగిలినా నువ్వు ఇంకా నిలబడే ఉన్నావా లేదా అన్నదే ముఖ్యం. నిలబడు.. ఒక హిమాలయంలా!"Mind-Work ఈరోజు మీకు అస్సలు ఇష్టం లేని, కానీ మీరు చేయాల్సిన ఒక పనిని (ఉదా: వ్యాయామం లేదా క్లిష్టమైన ప్రాజెక్ట్) ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయండి.ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే బాధపడకుండా, "ఈ సిట్యువేషన్ లో నా కంట్రోల్ లో ఉన్న విషయాలు ఏంటి?" అని ఒక లిస్ట్ రాయండి.రాత్రి పడుకునే ముందు, ఈరోజు మీరు ఎంత దృఢంగా ఉన్నారో 1 నుండి 10 వరకు రేటింగ్ ఇచ్చుకోండి. రేపు ఆ రేటింగ్ ని పెంచడానికి ప్రయత్నించండి.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066psy.vishesh@gmail.com (చదవండి: నిరంతరం నేర్చుకునే తత్వం..!) -
ఫేక్ అయితేనేం... ఫేమ్ అయ్యింది!
సమాజం సవ్యంగా ఉండాలంటే కుటుంబాలు బాగుండాలి. ఆ కుటుంబాల కోసం పిల్లల పెంపకం నుంచి ఇంటిపనుల వరకు మహిళలు ఎంతో శ్రమిస్తారు. తల్లుల కష్టమే కుటుంబ రథానికి ఇంధనం అవుతుంది. అయితే వారి శ్రమ ఎప్పుడూ నిర్లక్ష్యానికి గురవుతుంటుంది. పైగా... ‘పురుషులు బయటకి వెళ్లి కష్టపడతారు. స్త్రీలు ఇల్లు కదలకుండా సుఖంగా ఉంటారు’ అనే ప్రచారం ఒకటి. వారి శ్రమకు వెల కట్టేవారు లేరు. వారి శ్రమ కనిపించని శ్రమ అయింది. తాజా విషయానికి వస్తే.,...‘ఏమీ చేయని స్త్రీ’ అని పేరు పెట్టిన ఒక శిల్పం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. తల్లుల కనబడని శ్రమకు గౌరవసూచకంగా రూపొందించిన ఈ శిల్పం స్పెయిన్లో ఉందని చెబుతుంటారు.‘ఇంటికి పరిమితమైన మహిళలు ఏమీ చేయరు’ అనే పురుషాధిక్య భావజాలాన్ని బద్దలు కొట్టే శిల్పం ఇది. జోస్ లూయిస్ ఫెర్నాండేజ్ రూపొందించారని చెబుతున్న ఈ శిల్పంలో... ఒకవైపు పిల్లలను చేతిలో పట్టుకొని, మరోవైపు... చీపురు, వాషింగ్ మెషిన్, బకెట్లాంటి ఇంటిబరువును వీపున మోస్తున్న స్త్రీ కనిపిస్తుంది. ముగ్గురు పిల్లలను, ఇంటి పనులను వీపుపై మోస్తున్న ఈ స్త్రీ శిల్పం సోషల్ మీడియాలో విపరీతమైన ప్రజాదరణ పొందింది. అసలు విషయం ఏమింటే, ఇలాంటి శిల్పం నిజంగా లేదు. పూర్తిగా కల్పితం. అయినప్పటికీ ఈ కల్పిత శిల్పం విపరీతంగా వైరల్ అయింది. లక్షలాది వ్యూస్ను సొంతం చేసుకొని ‘వైరల్ స్టాచ్యూ’ గా పేరు తెచ్చుకుంది. ‘ఏమీ చేయని స్త్రీ’ అని పేరు పెట్టిన ఒక శిల్పం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. తల్లుల కనబడని శ్రమకు గౌరవసూచకంగా రూపొందించిన ఈ శిల్పం స్పెయిన్లో ఉందట! ‘ఇంటికి పరిమితమైన మహిళలు ఏమీ చేయరు’ అనే పురుషాధిక్య భావజాలాన్నిబద్దలు కొట్టే శిల్పం ఇది. -
కుంగిపోలేదు... రంగుల బాట పట్టింది
ఆమె దివ్యాంగురాలు.. దానికితోడు భర్త మరణించాడు. ఎదిగిన కొడుకు ప్రమాదంలో కన్నుమూశాడు. కష్టపడి పెళ్లి చేస్తే... కూతుర్ని కాస్తా అల్లుడు వదిలేశాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆమె మాత్రం జీవితం నుంచి పారిపోలేదు.. వైకల్యాన్ని ధైర్యంగా ఎదిరిస్తూ.. పెయింటింగ్ పనులను గుత్తకు తీసుకుని శెభాష్ అనేలా పని చేయిస్తోంది. ఆమే కరీంనగర్లోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ములిగె బాలవ్వ.బాలవ్వ పుట్టినిల్లు సిరిసిల్ల. గోపాల్రావుపల్లెకు చెందిన శంకరయ్యతో 40 ఏళ్ల కిందటే పెళ్లి అయింది. భర్తతో పాటు సున్నం వేసే పనికి వెళ్లేది. బాలవ్వ, శంకరయ్య దంపతులకు ఇద్దరు పిల్లలు, ఒక్క కొడుకు, ఒక బిడ్డ. భర్తతో కాపురం సాగుతుండగా.. శంకరయ్య గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన ఆమెను కుంగదీసినా.. కుటుంబ భారాన్ని మీదేసుకుని భర్త చేసిన పనిలోనే కొనసాగుతూ.. పెయింటింగ్ పనిలో చేరి కొడుకు నాగరాజు, కూతురు సంధ్యలకు పెళ్లి చేసింది.→ వెంటాడిన విధి..పెయింటింగ్ పని చేస్తూ.. జీవిస్తున్న బాలవ్వను విధి వెంటాడింది. పని చేసే చోటి నుంచి కింద పడడంతో కాలు విరిగి దివ్యాంగురాలైంది. అయినా సరే, కుంగిపోలేదు. మెతుకువేటలో.. బతుకుబాటలో మళ్లీ పెయింటింగ్ పని చేపట్టింది. ఇంతలో కొడుకు నాగరాజు సెంట్రింగ్ పనిలో ఉండగా ప్రమాదవశాత్తూ కింద పడి తలపగిలి మరణించాడు. నాగరాజు భార్య, ఇద్దరు పిల్లలు ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యారు. వాటిని అధిగమించి వారు ఇప్పుడు వేరుగా జీవిస్తున్నారు. కూతురు సంధ్యను ఖమ్మం ఇవ్వగా.. అతను ఆమెను వదిలేయడంతో సంధ్య ఒంటరిగానే ఉంటోంది. ఇన్ని సమస్యల మధ్య బాలవ్వ మాత్రం మొక్కవోని ధైర్యంతో తనకున్న చిన్న ఇంట్లో ఒంటరిగానే జీవిస్తూ.. నిత్యం పెయింటింగ్ పని చేస్తూ.. కష్టాలను ఎదురిస్తోంది.→ కష్టమైన పనిలో రాణిస్తూ...పెయింటింగ్ పని చాలా కష్టంగా ఉంటుంది. భవనం పైకి ఎక్కాలి.. జోలె కట్టుకుని రంగులు వేయాలి. అయినా భయపడదు.. పెద్ద ఇళ్ల పనులను కాంట్రాక్టు తీసుకుంటూ.. ఇతర లేబర్లను తోడుగా తీసుకెళ్తూ... పనిని సకాలంలో సక్రమంగా పూర్తి చేస్తుంది. దివ్యాంగురాలైన బాలవ్వకు ప్రభుత్వం ఆరు నెలల కిందట మూడు చక్రాల ఈ–బైక్ ఇచ్చింది. ఆ బైక్పై ప్రయాణం చేస్తూ... ఉపాధి పొందుతుంది.మంచి రోజుల్లోనే పని ఎక్కువగా ఉంటుందిదసరా నుంచి ఉగాది వరకు పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉన్న రోజుల్లో పని చేతినిండా ఉంటుంది. ఇతర రోజుల్లో అందుబాటులో ఉన్న పనులు చేస్తూ.. ΄పొట్టపోసుకుంటా. నాకు ప్రభుత్వం ద్వారా చేయూత పెన్షన్ నెలకు రూ.4వేలు వస్తుంది. ప్రభుత్వం ఈ–బైక్ ఇవ్వడంతో నా కష్టాలు కొంత తీరినయి. నేను పనిని గుత్త(కాంట్రాక్టు) తీసుకుని ఓ నలుగురికి పని కల్పిస్తూ.. జీవనం సాగిస్తున్నా... కాలు మంచిగ లేకున్నా.. తోడు ఎవరూ లేకున్నా... పని చేస్తూ బతుకడమే జీవితం. – ములిగె బాలవ్వ, దివ్యాంగురాలు – వూరడి మల్లికార్జున్, ‘సాక్షి’ రాజన్న సిరిసిల్ల– ఫొటోలు: వంకాయల శ్రీకాంత్,స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిరిసిల్ల -
హండ్రెడ్స్ ఆర్ వెయిటింగ్
ఒక మహిళ గర్జన ఇప్పుడు దేశాన్ని ఆకర్షిస్తోంది. రాజకీయ ర్యాలీలు, నిరసనల పేరుతో రోడ్లు బ్లాక్ చేసి, స్కూల్ పిల్లలను, అంబులెన్స్ లను, ఆఫీస్కి వెళ్లే వాళ్లను గంటలు గంటలు ఆపేయడం మామూలైపోయిన ఈ రోజుల్లో ఒక నిరసన స్వరం దేశానికి తన బాధ్యతను గుర్తు చేస్తోంది. ‘ఎవరూ మాట్లాడరులే’ అనే ధైర్యంతో ఇష్టారాజ్యంగా ఉన్న వారికి ‘సామాన్యులతో పెట్టుకోకు’ అని ఈ ఘటన చెప్పినట్టయ్యింది.అసలేం జరిగింది?ఏప్రిల్ 22, మంగళవారం ముంబైలోని వర్లీలో బిజెపి పార్టీ ‘మహిళా రిజర్వేషన్ బిల్లు’కి మద్దతుగా ఒక ర్యాలీ నిర్వహించింది. దాంతో వర్లీ జంభోరీ మైదాన్ నుంచి డోమ్ వరకు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఒక స్థానిక మహిళ తన బిడ్డను స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తూ గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కుపోయింది. విసుగెత్తి పోయిన ఆవిడ కారు దిగి, నేరుగా ర్యాలీ మధ్యలోకి వెళ్లి మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి గిరీష్ మహాజన్ తో వాగ్వాదానికి దిగింది. ‘గెట్ అవుట్ ఆఫ్ హియర్! మీరు ట్రాఫిక్ జామ్ క్రియేట్ చేస్తున్నారు’ అని నిలదీసింది. ‘వందలమంది వెయిట్ చేస్తున్నారు. అక్కడ ఖాళీ గ్రౌండ్ ఉంది కదా’ అని పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని చూపిస్తూ గట్టిగా అరిచింది. పోలీసులు జోక్యం చేసుకోబోతే వాళ్ల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ‘సీనియర్ ఆఫీసర్స్తోనే మాట్లాడతా’ అని తెగేసి చెప్పింది. మంత్రి మహాజన్ సర్ది చెప్పబోయినా ఆవిడ వినలేదు. వెళ్లి మళ్లీ వచ్చి ‘మీకు అర్థం కాలేదా? వందల మంది వెయిట్ చేస్తున్నారు’ అని మళ్లీ గట్టిగా అడిగింది. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీఐపీ కల్చర్కి చెక్ పెట్టాలని చాలామంది కోరుతున్నారు. నగరాల్లో అసలే ట్రాఫిక్ జామ్లతో బాధ పడుతున్న జనం ఈ ర్యాలీలు, ప్రదర్శనల వల్ల మరెంత అవస్థ పడుతున్నారో అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది. జనం ఆగ్రహం ఇలా కట్టలు తెంచుకోక ముందే పాలనా వ్యవస్థలు మేలుకోవాలి. -
అక్షరాలా ఆమె కోసం...
పుస్తకాల రూపంలోని మహిళల క్రియేటివిటీని సెలబ్రేట్ చేసే పండగ, ప్రతిష్ఠాత్మకమైన... విమెన్స్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్. సాహిత్య ప్రపంచంలో లింగ వివక్షకు అడ్డుకట్ట వేసి, రచయిత్రులకు తగిన ప్రాతినిధ్యం కల్పించి, ప్రపంచానికి పరిచయం చేయడానికి ఏర్పాటైన అపురూపమైన బహుమతి... విమెన్స్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్. ఈ సంవత్సరం విమెన్స్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ లాంగ్లిస్ట్కు ఎంపికైన పదహారు పుస్తకాలలో కొన్ని పుస్తకాల పరిచయం...గోడలు కూలుతున్నాయి...జీవితాలు మారుతున్నాయిషీనా కలయిల్ రాసిన హృదయాన్ని కదిలించే నవల... ది అదర్స్. అది 1989 సంవత్సరం. తూర్పు జర్మనీలోని డాయిష్ డెమోక్రటిక్ రిపబ్లిక్లో విభిన్న నేపథ్యాలు ఉన్న ముగ్గురు యువతీ యువకులు స్నేహితులవుతారు. మొజాంబిక్కు చెందిన ఆర్మాండో ఫ్యాక్టరీ కార్మికుడు. లోలిత భారతదేశానికి చెందిన వైద్యవిద్యార్థిని. థియో తూర్పు బెర్లిన్కు చెందిన యువకుడు. రచయిత కావాలని కలలు కంటుంటాడు. తూర్పు ఐరోపా అంతటా నిశ్శబ్ద విప్లవం వ్యాపిస్తుండగా ఈ ముగ్గురి జీవితాల్లో చోటు చేసుకున్న కీలక పరిణామాలే... ది అదర్స్.కాసింత ప్రేమ కోసం...పందొమ్మిదేళ్ల గ్లోరియా కాలేజీకి వెళ్లదు. మరి ఏం చేస్తుంది? పార్కుల చుట్టూ తిరుగుతుంది. స్నేహితుల కోసం వెదుకుతుంది. రోజూ జాక్ ఇంటికి వెళుతుంటుంది. ఈ జాక్ ఉన్నట్టుండి అనూహ్యంగా ప్రవర్తిస్తాడు. లోకం మీద కోపంతో రగిలిపోతుంటాడు. ఒక హింసాత్మక సంఘటన తరువాత గ్లోరియా, జాక్ల స్నేహం ముగిసిపోతుంది. గ్లోరియా ఒంటరిదైపోతుంది. ఈ హింసాత్మక ప్రపంచంలో అనుబంధాలు, కాసింత ప్రేమ కోసం ఆరాటపడే ఒక మహిళ అంతరంగాన్ని లోతుగా చిత్రించే నవల... గ్లోరియా డోంట్స్పీక్. ‘లూసీ యాప్స్ రాసిన గ్లోరియా డోంట్ స్పీక్ ఒక అద్భుతమైన పుస్తకం. హింస, దోపిడి, స్వీయనిర్ణయాధికారం... మొదలైన అంశాలతో రాసిన శక్తిమంతమైన పుస్తకం’ అన్నారు విమర్శకులు.చరిత్రపై ఫ్లాష్లైట్యుద్దం తరువాత జపాన్ పరిస్థితి, అమెరికాలోని శివారు ప్రాంతాలు, ఉత్తర కొరియా పాలన... ఇలా 20వ శతాబ్దపు పరిణామాలకు సాక్షిగా నిలిచిన ఒక కుటుంబంపై రాసిన పుస్తకం... ఫ్లాష్లైట్. కొరియా నుండి అమెరికాకు వలస వచ్చి అమెరికన్ విశ్వవిద్యాలయంలో పనిచేసే సెర్క్, అతడి పదేళ్ల కూతురు లూయిసా, సెర్క్ భార్య ఈ పుస్తకంలోని ప్రధాన పాత్రలు. లూయిసా తండ్రి అదృశ్యం కావడం ఆ చిన్న కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది. సుసాన్ చోయ్ రాసిన ‘ఫ్లాష్లైట్’ ఒక కుటుంబం చుట్టూ తిరిగే చారిత్రక పుస్తకం. అడుగడుగునా ఆశ్చర్యపరుస్తూ ఆసక్తిని రేకెత్తించే పుస్తకం.ఉత్తరాలమ్మ‘ఉత్తరాలు రాయడానికే జన్మించిందా!’ అన్నట్లుగా ఉంటుంది సిబిల్ వాన్. ప్రతి ఉదయం ఉత్తరాలు రాయడానికి కూర్చుంటుంది. తన సోదరుడికి, ప్రాణస్నేహితురాలికి, విశ్వవిద్యాలయ అ«ధ్యక్షుడికి, తన అభిమాన రచయితల తాజా పుస్తకాలపై అభి్రపాయాన్ని తెలియజేయడానికి ఉత్తరాలు రాస్తుంటుంది. డెబ్బై మూడు సంవత్సరాల సిబిల్ చమత్కారమైన, వివేకవంతమైన ఉత్తర ప్రత్యుత్తరాలతో ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. వర్జీనియా ఇవాన్స్ రాసిన ‘ది కరస్పాండెంట్’ ఒక వృద్ధ మహిళ దృష్టి కోణం నుంచి ఉత్తరాల రూపంలో వినూత్నంగా, భావోద్వేగ తీవ్రతతో రాసిన నవల. ‘సిబిల్ ఉత్తరాలు అసాధారణమైనవి కాకపోవచ్చు. అయితే మీకు బాగా గుర్తుండిపోయే పాత్రలలో ఆమె ఒకరు కావచ్చు’ అన్నారు విమర్శకులు.దొంగా... సంరక్షకులు!ఒక వారం వ్యవధిలో సాగే పరిణామాలతో ‘ఎ గార్డియన్ అండ్ ఎ థీఫ్’ రెండు కథలను చెబుతుంది. మా, బూంబా అనే రెండు పాత్రల కేంద్రంగా నడిచే పుస్తకం ఇది. ఈ రెండు పాత్రలు తమ కుటుంబం కోసం ఒకే సమయంలో సంరక్షకుడిగా, దొంగగా ప్రవర్తిస్తాయి. తన కుటుంబాన్ని పోషించాలనే ఆరాటం బూంబాను దొంగగా మారుస్తుంది. వరుస నేరాలకు పాల్పడేలా చేస్తుంది. ప్రగాఢమైన తల్లిదండ్రుల ప్రేమ, మెరుగైన జీవితం కోసం ఆరాటం, లోపిస్తున్న నైతిక విలువల చుట్టూ తిరిగే నవల ఇది. తమ ప్రియమైన వారిని రక్షించుకునే నేపథ్యంలో నిస్సహాయ పరిస్థితులు ప్రజలను విలన్ లేదా హీరోగా ఎలా మారుస్తాయో ఈ నవల కళ్లకు కడుతుంది. ‘మేఘా మజుందార్ రాసిన ఎ గార్డియన్ అండ్ ఎ థీఫ్ మానవజాతి నైతిక సందిగ్ధతల గురించి పాఠకులను నిరంతరం సవాలు చేసేలా రాసిన అద్భుతం పుస్తకం’ అన్నారు విమర్శకులు.లింగ వివక్ష ను నివారించడానికి...మహిళల రచనలను ఉన్నతస్థాయికి తీసుకువెళ్లాలి, కొత్త గొంతులను ప్రపంచానికి పరిచయం చేయాలి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠకులను ఒకే వేదిక మీదికి తీసుకురావాలనే లక్ష్యంతో ‘విమెన్స్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్’ ప్రారంభమైంది. సాహిత్య ప్రపంచంలో లింగ వివక్షను నివారించడానికి, రచయిత్రులకు తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి యూకేలో 1996లో ఈ పురస్కారానికి శ్రీకారం చుట్టారు. విజేతకు నగదు బహుమతితోపాటు కళాకారిణి గ్రిజెల్ నివెన్ తయారు చేసిన ‘బెస్సీ’ అనే కాంస్య విగ్రహాన్ని ప్రదానం చేస్తారు. బాగా పుస్తకాలు చదివే, వివిధ రంగాలలో అగ్రస్థానంలో ఉన్న అయిదుగురు మహిళలతో కూడిన ప్యానెల్ ‘విమెన్స్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్’ విజేతను ఎంపిక చేస్తుంది. లాంగ్లిస్ట్కు ఎంపికైన పుస్తకాలలో కొన్ని షార్ట్ లిస్ట్కు ఎంపిక అవుతాయి. షార్ట్ లిస్ట్ నుంచి విజేతను ఎంపిక చేస్తారు. -
వేడివేడిగా వడ్డించాలని ఎంత పనిచేశావ్ అమ్మ..!
రైలు ప్రయాణం అనగానే సర్వసాధారణంగా చిన్న బాక్స్లో భోజనం పెట్టుకుని తెచ్చుకుంటారు. ఓవర్నైట్ ప్రయాణమైతే సాధ్యమైనంత వరకు చాలామంది ప్రయాణికులు ఇలానే తెచ్చుకుంటారు. మరికొందరు ట్రైన్లో అమ్మే ఆహారాలతో పనికానిస్తారు. కానీ ఈ అమ్మ అంతకు మించి ఆలోచించింది తన పిల్లలు గురించి. వాళ్ల ఆరోగ్యం బేషుగా ఉండాలని ఏం చేసిందో తెలిస్తే నవ్వు ఆగదు.అందుకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రాత్రిపూట రైలు ప్రయాణం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. పాపం ఆ తల్లి సామాన్లు సర్దడంలో ఎంత శ్రమపడిందో ఆమె ఆహారం సర్వ్ చేసిన విధం చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఆ వీడియో ఒక అమ్మాయ్ ప్రెషర్ కుక్కర్ను బ్యాలెన్స్ చేస్తూ నవ్వడంతో మొదలవుతుంది. తన తల్లి బ్యాగ్ నుంచి కుక్కర్ బయటకు తీసి..రైలులోనే తన కుటుంబ సభ్యులకు వేడి వేడి పలావ్ను చాలా మామూలుగా వడ్డించడం మొదలుపెట్టింది. ఆ వీడియోకి “అమ్మకు ఇది రాత్రిపూట రైలు ప్రయాణం అని చెప్పాను... ఆమె కుక్కర్ సర్దింది.” అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. నెటిజన్లు సైతం ఈ వీడియోని చూసి మా కుటుంబంతో కలిసి ప్రయాణించిన రోజులు గుర్తొస్తున్నాయని కొందరు, ఇంకొందురు వేడిగా పెట్టాలన్న ఆత్రం, ఆ తల్లి ప్రేమ రెండు కనిపిస్తున్నాయ్ అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Ashritha & Hanish | Couple Reels | Hyderabad (@ashshaniii) (చదవండి: గెలిచా అనుకునేలోపే ఓటమి హగ్ ఇచ్చిందిగా..!) -
భార్యకు ఆస్తి ఉన్నా భర్త భరణం ఇవ్వాలా?
నేను ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. నా భార్య ఇంజినీరింగ్ చేసింది కానీ కావాలనే ఉద్యోగం చేయకుండా ఇంటిపట్టునే ఉంటోంది. ఇటీవల కొంతకాలంగా నా భార్య – ఆమె కుటుంబ సభ్యులతో నాకు తరచూ వివాదాలు జరుగుతున్నాయి. ఆమె నాపై కేసులు వేస్తానని, నా ఆస్తులను, డబ్బును తీసుకుంటానని హెచ్చరిస్తోంది. ఒకవేళ నిజంగానే భవిష్యత్తులో అలాంటిదేమైనా జరిగితే, నా ఆర్థిక వనరులను రక్షించుకోవడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నాను. నా సంపాదన ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్లు, పీఎఫ్ రూపంలో దాచుకున్నాను. కొంత భూమి కూడా కొన్నాను. స్టాక్ పెట్టుబడులను భరణం/మెయింటెనెన్స్ నిర్ణయించేటప్పుడు పరిగణనలోకి తీసుకుంటారా? ముందుగా నా తల్లితండ్రులకు నగదు, స్థిరాస్తులు అన్నీ బదిలీ చేస్తే సరిపోతుందని, వీలైతే జీతం కూడా వేరే అకౌంట్లోకి తీసుకుంటే భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని మిత్రులు చెప్తున్నారు. నిజానికి నా భార్యకి చాలా ఆస్తి ఉంది కానీ ప్రస్తుతం వాళ్ళ నాన్న పేరిట ఉంది. తన తదనంతరం నా భార్యకేనని రిజిస్టర్డ్ వీలునామా కూడా ఉంది. అయినా నేను భరణం ఇవ్వాలా?– రఘురామ్, విజయవాడ ఆస్తులను/నగదును దాచిపెట్టే ఉద్దేశంతో చేసే ఏ విధమైన నిధుల బదిలీలు అయినా బ్యాంకింగ్ రికార్డుల ద్వారా సులభంగా గుర్తించబడతాయి. కోర్టులకు బ్యాంకులనుండి, కంపెనీల నుండి, ఇతర సంస్థల నుండి కూడా ఆర్థిక వివరాలను సమీకరించే అధికారాలు ఉన్నాయి. వివాహ సంబంధిత కేసుల్లో, కోర్టు సాధారణంగా వివాహం జరిగిన తేదీ నుండి మీ ఆదాయం, ఆస్తులు ఆర్థిక ప్రవర్తనను పరిశీలిస్తుంది. మెయింటెనెన్స్/భరణం కోరిన తేదీ నుండి గత మూడు సంవత్సరాల ఆర్థిక వివరాలు, బ్యాంక్ స్టేట్మెంట్, ఆస్తుల వివరాలు, ఖర్చులు, ఐటీ చరిత్ర మొదలగు అంశాలు వెలువరిస్తూ ఆస్తులు– అప్పుల వివరాలతో కూడిన అఫిడవిట్ కోర్టుకి ఇవ్వాల్సి ఉంటుంది. జీతాన్ని ఇతరుల ఖాతాలకు మళ్లించడం వంటి ప్రయత్నాలు వంటివి చేసినా, అనవసర ఆస్తి బదిలీ చేసినా, సులభంగా దొరికి΄ోతారు. అవి దురుద్దేశపూర్వక చర్యలుగా పరిగణించబడతాయి. పీఎఫ్, పీపీఎఫ్, ఫిక్స్డ్ డి΄ాజిట్లు, స్టాక్ పెట్టుబడులు వంటి అన్ని ఆర్థిక ఆస్తులను భరణం లేదా మెయింటెనెన్స్ నిర్ణయించేటప్పుడు సాధారణంగా పరిగణనలోకి తీసుకుంటారు. కోర్టు మీ నిజమైన ఆర్థిక స్థితి, సంపాదన సామర్థ్యాన్ని అంచనా వేయడమే లక్ష్యంగా చేసుకుంటుంది. ఆస్తులను దాచడం లేదా మాయ మాటలు చెప్పడం చట్టపరంగా ప్రమాదకరం, మీ కేసులో హానికరం. ఆస్తుల గురించి తప్పుడు సమాచారం ఇవ్వడం కోర్టు ముందు మీ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. దీనికి బదులుగా, ఒక నిపుణుడైన కుటుంబ న్యాయవాదిని సంప్రదించి చట్టబద్ధమైన వ్యూహాన్ని రూపొందించాలి. మీపై మెయింటెనెన్స్ క్లెయిమ్ వస్తే, మీరు కింది అంశాల ఆధారంగా దాన్ని వ్యతిరేకించవచ్చు.మీ భార్య విద్యార్హతలు, ఉద్యోగం చేసే సామర్థ్యం ∙ఆమె సంపాదించగలగడం, ఉద్యోగం చేయాల్సిన అవసరం కావాలని ఉద్యోగం మానేయటం గురించిన వివరాలు మీ ఆర్థిక బాధ్యతలు, అప్పులు, మొత్తం ఆర్థిక పరిస్థితి స్పష్టతతో, చట్టబద్ధంగా వ్యవహరించడం ద్వారా మీ ప్రయోజనాలను మెరుగ్గా రక్షించుకోవచ్చు. మైనర్ పిల్లలు, పెళ్లికాని అమ్మాయిలు ఉంటే మాత్రం, మీరు ఎంత ప్రయత్నించినా కాస్తో కూస్తో తగ్గవచ్చు గానీ మెయింటెనెన్స్ మాత్రం కట్టాల్సిందే. -
కాంటాక్ట్ లెన్సులు పెట్టుకుని స్నానం చేస్తున్నారా..? పాపం ఆ మహిళ..
చాలామంది కళ్లద్దాల కంటే కాంటాక్ట్ లెన్స్లే ధరిస్తుంటారు. ఎందుకంటే కళ్లజోడు అయితే ముఖంపై ఆనవాలు పడిపోవడం, లేది ఇబ్బందిగా ఉంటుంది. అదే కాంటక్ట్ లెన్స్లు కంఫర్ట్ తోపాటు చూపు మెరుగ్గా ఉంటుంది. అదే టైంలో ముఖానికి సరికొత్త లుక్ని అందిస్తుంది కూడా. అందుకే చాలామంది కాంటాక్ట్ లెన్స్ ధరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలానే ఇక్కడ ఈ యువత కూడా కాంటాక్స్ లెన్సులు ఉపయోగించేది. అయితే వాటిని ఉపయోగించే విషయంలో చూపిన చిన్న అజాగ్రత్త ఆమె కంటి చూపునే కోల్పోయే పరిస్థితికి దారితీసింది. అసలేం జరిగిందంటే.. అమెరికాకు చెందిన 20 ఏళ్ల గ్రేస్ జేమిసన్ కాంటాక్ట్ లెన్స్ ధరించే ప్రతి ఒక్కరికి ఇదొక పాఠంగా, హెచ్చరికగా ఉంటుందంటూ తన కథను షేర్ చేసుకుంది. సరదాగా సాగిన టూర్ ప్రయాణం నెలల తరబడి చీకటి, రోగ నిర్థారణతో ముగిసింది. ఆమె సరదాగా రిపబ్లిక్ పర్యటనకు వెళ్లడమే కష్టాలు తెచ్చిపెట్టింది. అమెరికాలో తన ఇంటికి తిరిగి వచ్చేంత వరకు ఆ కష్టాలు పడింది. అక్కడ సరదాగా స్నాన చేస్తున్నప్పుడు కూడా కాంటాక్ట్ లెన్స్ ధరించే ఉంది. లెన్స్లు ఉపయోగించే వాళ్లు తరుచుగా చేసే పెద్ద తప్పిదమే ఇది. అలా స్నానం చేయడంతో జేమిసన్ కళ్లు అకాంతమీబా అనే సూక్ష్మజీవికి గురయ్యాయి. ఈ సూక్ష్మజీవి నీటిలో నివశిస్తుంది. అయితే నేత్ర వేద్యుడు ఆమె పరిస్థితిని తప్పుగా నిర్థారించి స్టెరాయిడ్ చుక్కల మందును సూచించాడు. ఆ మందులు తనకు సహాయపడకపోగా, ఇన్ఫెక్షన్ను మరింత తీవ్రతరం చేశాయి. కేవలం ఒక వారంలోనే అకాంతమీబా కెరటైటిస్ కారణంగా తన దృష్టిని పూర్తిగా కోల్పోయింది. ఒక్కసారిగా జేమిసన్కి జీవితం తలకిందులైనట్లుగా అనిపించింది. సరైన రోగనిర్ధారణ ఆలస్యం కారణంగా ఆ కంటి ఇన్ఫెక్షన్ తనను రెండు నెలలపాటు అంధురాలిగా గడిపేలా చేసిందని వాపోయింది. తాను ఇప్పుడు పక్కల నుంచి చూడగలను తప్ప ముందు నుంచి చూడలేనని చెప్పుకొచ్చింది. ఎందుకంటే ముందువైపు కనుపాపపై ఇన్ఫెక్షన్ వల్ల ఏర్పడిన మచ్చ పూర్తిగా కప్పివేయడం వల్ల చూడలేనని పేర్కొంది. అది మడ్డులాంటి తెల్లదనాన్ని మాత్రమే చూపిస్తుందని తెలిపింది. అందువల్ల దయచేసి తనలా నీటిలో ఉన్నప్పుడు కాంటాక్స్ లెన్స్లను ధరించొద్దని హెచ్చరిస్తోందామె. ప్రస్తుతం తాను కొనసాగుతున్న చికిత్సల వల్ల కొంత దృష్టిని పొందగలిగినప్పటికీ..మన కళ్లు మునపటిలా పనిచేయవని అంటోంది. తాను తన చూపుని మరింత మెరుగుపరుచుకునేలా భవిష్యత్తులో మరిన్ని శస్త్ర చికత్సలు చేయించుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించింది. సో ఫ్రెండ్స్ స్నానం చేసేటప్పుడూ, ఈత కొట్టేటప్పుడూ, షవర్బాత్ సమయంలో కాంటాక్ట్ లెన్స్లను ధరించొద్దని అన్నారామె. ఎందుకంటే నీటిలో గనుక హానికరమైన సూక్ష్మజీవులు ఉంటే లెన్స్లకు అంటిపెట్టుకుని ఇలాంటిఇన్ఫెక్షన్ను కలిగించే అవకాశం ఉటుందని హెచ్చరిస్తోంది జేమిసన్.(చదవండి: ఏడు రోజుల్లో ఐదు కిలోల బరువు..! అమ్మ చెప్పే డైట్ ప్లాన్) -
ఏడు రోజుల్లో ఐదు కిలోల బరువు..! అమ్మ చెప్పే డైట్ ప్లాన్
బరువు తగ్గడం ఇటీవల కాలంలో ఓ క్రేజీ ట్రెండ్గా మారింది. అందులోనూ క్రాష్ డైట్లు, బరువు తగ్గే మందులు జోలి పోకుండా ఆరోగ్యకరంగా తగ్గడం అనేది అందర్నీ ఆకర్షిస్తున్న ఫిట్నెస్ మంత్రలా మారింది. పైగా అందరు ఆరోగ్య స్పృహతో బరువు తగ్గే ప్రయత్నమే చేస్తుండటం విశేషం. ఈసారి అలానే 40 ఏళ్ల తల్లి చాలా సింపుల్ డైట్ప్లాన్తో కేవలంలో ఏడు రోజుల్లో 5 కిలోలు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. వారంలోనే ఇంతలా బరువు తగ్గేందుకు సమతుల్య ఆహారంపైనే ఆధారపడ్డానని చెబుతోందామె. మరి ఆమె ఎలాంటి డైట్ప్లాన్తో తగ్గిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందామా..!.40 ఏళ్ల వయసులో ఇద్దరు పిల్లల తల్లి కంటెంట్ క్రియేటర్ రత్న చందు కేవలం ఏడు రోజుల్లోనే ఐదు కిలోలు బరువు తగ్గేందుకు ఆ డైట్ ప్లాన్ సహాయపడిందని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. తాను సమతుల్య ఆహారంపైనే ఫోకస్ పెట్టి బరువు తగ్గినట్లు వెల్లడించింది. మీ ఉదయాన్ని గోరువెచ్చని నిమ్మరసం, చిటికెడు సైంధవ లవణంతో ప్రారంభించాలని సిఫార్సు చేశారు. ఆ తర్వాత జీలకర్ర, వాము, సోంపు గింజలతో ఇంట్లో తయారుచేసిన డిటాక్స్ డ్రింక్ను తీసుకున్నట్లు తెలిపింది. దీనివల్ల అల్పాహారానికి ముందు జీర్ణక్రియను నెమ్మదిగా యాక్టివ్ అయ్యేలా చేస్తుంది. ఇక బ్రేక్ఫాస్ట్గా గిన్నెడు పండ్ల మిశ్రమం, నానబెట్టిన గింజలు, ఒక మిల్లెట్ దోస, బుల్లెట్ కాఫీ ఉంటాయి. ఉదయంపూట మిమ్మలని చురుకుగా ఉంచే శక్తివంతమైన ఆహారాల మిశ్రమం ఇది.ఉదయంపూట శక్తి కోసం..పాలకూర, దోసకాయ, అల్లంతో చేసిన గ్రీన్ జ్యూస్ తాగమని సూచించారు. కానీ వర్షాకాలంలో కడుపు సమస్యలను నివారించడానికి పచ్చి పదార్థాలను తినవద్దని కూడా ఆ కంటెంట్ క్రియేటర్ పేర్కొన్నారు.సమతుల్యమైన మధ్యాహ్న భోజనం ముఖ్యంమధ్యాహ్న భోజనం చాలా తేలిగ్గా ఉండాలని చెప్పారు. రోటీలు, వండిన కూరగాయలు, పప్పు, పనీర్, చోలే, గ్రీక్ యోగర్ట్, వంటి ప్రోటీన్ మూలం తీసుకునేలా చూసుకున్నట్లు తెలిపారామె. ఇందులో తగినన్ని కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్తో కూడిన శక్తిమంతమైన భోజనం.స్నాక్స్..ప్రాసెస్ చేసిన స్నాక్స్కు బదులుగా, వేయించిన శనగలు, మఖానా, వేరుశెనగలు, గ్రీన్ టీ తినమని తెలిపారు.తేలికపాటి రాత్రి భోజనం, త్వరగారాత్రి భోజనానికి కూరగాయల సూప్, కిచిడీ, లేదా పనీర్తో వేయించిన కూరగాయల వంటి వాటిని ఎంచుకున్నట్లు తెలిపింది. అయితే ఈ భోజనం తప్పకుండా సాయంత్రం ఏడు గంటలకల్లా తీసుకోవాలని అన్నారు.నిద్రపోయే ముందు అది తప్పనిసరి..పంచదార, పాలు కాకుండా ఒక కప్పు మునగ టీతో రోజును ముగించమని చెబుతోంది. ప్రతిరోజూ ఒక గంట పాటు నడవడం, యోగా వంటి వర్కౌట్లు చేయాలని నొక్కి చెప్పింది. కచ్చితంగా జంక్ఫుడ్కి మాత్రం తప్పనిసరిగా దూరంగా ఉండాలని సూచించింది. చివరగా ఇన్ఫ్లుయెన్సర్ ఒక వారంలో 5 కిలోలు తగ్గడం అనేది వ్యక్తిని బట్టి మారుతుందని చెబుతుండటం గమనార్హం. ఈ డైట్ప్లాన్ని చిన్నగా మొదలుపెడితేనే మొత్తం ఆరోగ్యంపై ప్రభావంతమైన మెరుగుదలను తప్పక చూస్తారని అంటోంది ఇద్దరు పిల్లల తల్లి రత్న చందు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ చిట్కాలను పాటించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను అనుసరించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Ratna Chandu (@glow_fit_mom)(చదవండి: ఇప్పటికీ ఆ దృశ్యం నీలినీడలా వెంటాడుతోంది..! పహల్గామ్ బాధితురాలి మనో వ్యథ) -
‘కీమో వద్దు.. పసరు ముద్దు’.. క్యాన్సర్ రోగికి ఏఐ షాక్!
లండన్: ఆధునిక కాలంలో ఏ చిన్న అనారోగ్య సందేహానికైనా ఇంటర్నెట్ను అశ్రయించడం సర్వసాధారణంగా మారింది. ఇప్పుడు దీనికి తోడు కృత్రిమ మేధస్సు (ఏఐ) చాట్బాట్లను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరిగిపోయింది. అయితే అత్యంత సున్నితమైన క్యాన్సర్ చికిత్స విషయంలో ఈ ఏఐ సాధనాలు ఇస్తున్న సలహాలు రోగుల ప్రాణాల మీదకు తెస్తున్నాయని ఒక పరిశోధనలో వెల్లడైంది. కీమోథెరపీ లాంటి శాస్త్రీయ చికిత్సలకు బదులుగా ఎటువంటి ఆధారాల్లేని ప్రత్యామ్నాయాలను సూచిస్తూ, ఇవి రోగులను ప్రాణాపాయంలోనికి నెడుతున్నాయి.సగం సమాధానాలు పచ్చి అబద్ధాలేలుండ్క్విస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ బయోమెడికల్ ఇన్నోవేషన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన ‘బీఎంజే ఓపెన్’ జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనం అనేక విషయాలను బయటపెట్టింది. పరిశోధకులు చాట్జీపీటీ, జెమిని, మెటా ఏఐ, డీప్పీక్, గ్రోక్ వంటి ప్రముఖ చాట్బాట్లను పరీక్షించారు. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల గురించి అడిగినప్పుడు ఇవి ఇచ్చే సమాధానాల్లో దాదాపు 50 శాతం తప్పుల తడకగా ఉన్నాయని తేలింది. ఇందులో 19.6 శాతం సమాచారం పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉండగా, 30 శాతం సమాధానాల్లో సరైన స్పష్టత లేదు. ముఖ్యంగా పరీక్షించిన అన్ని మోడళ్లలో ‘గ్రోక్’ పనితీరు అత్యంత పేలవంగా ఉందని వెల్లడైంది.ప్రాణాలు తీస్తున్న ఉచిత సలహాలుకీమోథెరపీకి ప్రత్యామ్నాయాలు ఏమిటని అడిగినప్పుడు, ఈ బాట్లు ముందుగా చిన్నపాటి హెచ్చరికలు చేసినప్పటికీ.. ఆ వెంటనే ఆక్యుపంక్చర్, మూలికా వైద్యం, ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేని ‘క్యాన్సర్ డైట్’లను సూచించాయి. అసలు సంప్రదాయ వైద్య చికిత్సలనే వ్యతిరేకించే ‘గెర్సన్ థెరపీ’ వంటి వాటిని కూడా ఈ ఏఐలు ప్రస్తావించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఎన్నో ఏళ్ల పరిశోధనల తర్వాత నిరూపితమైన కీమోథెరపీతో ఇలాంటి ప్రామాణికత లేని చికిత్సలకు ఈ చాట్బాట్లు సమానమైన ప్రాధాన్యత ఇస్తుండటంతో రోగులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.ఏఐ డాక్టర్ కాదు.. అప్రమత్త తప్పనిసరిఏఐ ఇచ్చే ఈ తప్పుడు సమాచారం వల్ల రోగులు ప్రాణాలను నిలబెట్టే కీమోథెరపీ, రేడియేషన్ లాంటి చికిత్సలను వాయిదా వేసుకోవడం లేదా పూర్తిగా పక్కనపెట్టడం జరుగుతోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చాట్బాట్లు రోగుల ఆయుర్దాయం గురించి అవాస్తవ అంచనాలను ఇస్తూ, వారిలో లేనిపోని ఆందోళనను నింపుతున్నాయి. ఏఐ అనేది కేవలం ప్రాథమిక సమాచారం తెలుసుకోవడానికి మాత్రమేనని, కచ్చితమైన రోగ నిర్ధారణ, చికిత్స కోసం ఎల్లప్పుడూ అర్హత కలిగిన ఆంకాలజిస్ట్ (క్యాన్సర్ వైద్య నిపుణులు)ను మాత్రమే సంప్రదించాలని నిపుణులుహెచ్చరిస్తున్నారు.ఇది కూడా చదవండి: ‘తలొంచం.. తరిమికొడతాం’: ‘పహల్గామ్’పై ప్రధాని మోదీ -
మేమూ చేయగలం హజ్ యాత్ర
హజ్ యాత్ర చేసేందుకు స్త్రీలు ‘మెహ్రమ్’ పాటించాలి. ‘మెహ్రమ్’ అంటే ఏ విధంగా చూసినా వివాహానికి వీలులేని బంధుత్వం ఉన్న పురుషుడి తోడు. అయితే ఒంటరి స్త్రీలు, వితంతువులు, పిల్లలు దగ్గర లేని వారు హజ్ చేసే హక్కు కలిగి ఉన్నారని భారత ప్రభుత్వం, సౌదీ గుర్తించాయి. 45 ఏళ్లు పైబడ్డ స్త్రీలు 2023 నుంచి మెహ్రమ్ లేకుండా హజ్ యాత్ర చేయడానికి అనుమతి దొరికింది. ఈ సంవత్సరం మన దేశం నుంచి రికార్డు స్థాయిలో 5,446 మంది స్త్రీలు ‘లేడీస్ వితౌట్ మెహ్రమ్’ హజ్ యాత్ర చేస్తున్నారు. హజ్ చేయాలనుకునే స్త్రీలకు ఇది స్ఫూర్తి.మే 25 నుంచి మే 30 వరకూ హజ్ ప్రధాన రోజులు. అందుకే దేశంలో హజ్ యాత్రికులు ప్రయాణ ఏర్పాట్లలో తలమునకలుగా ఉన్నారు. ఏప్రిల్ 18న మొదటి హజ్ విమానం ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లింది. ఈ సంవత్సరం మన దేశం నుంచి మొత్తం లక్షా డెబ్భై ఐదువేల మంది హజ్ యాత్ర చేస్తున్నారు. అయితే వీరిలో ‘లేడీస్ వితౌట్ మెహ్రమ్’ విభాగం కింద 5,446 మంది మహిళలు ఉండటం విశేషం. వీరిలో మళ్లీ అత్యధికంగా కేరళ నుంచి 4,477 మంది అనుమతి పొందడం మరో విశేషం.మెహ్రమ్ అంటే?హజ్ యాత్రకు వెళ్లే ఆడవారితో పాటు తప్పకుండా వెళ్లాల్సిన మగతోడుని ‘మెహ్రమ్’ అంటారు. ఇస్లాం ప్రకారం ఎప్పటికీ పెళ్లి చేసుకోవడానికి వీలు లేని దగ్గరి బంధువు (తండ్రి, కన్నకొడుకు, అన్న, తమ్ముడు, తాత, మనవడు, బాబాయి, మేనల్లుడు) మెహ్రమ్ గా వెళ్లవచ్చు. భర్త తోడు వస్తే ఇక ఏ విధమైన అభ్యంతరమూ ఉండదు. ఆ రోజుల్లో స్త్రీల భద్రత కోసం ఈ జాగ్రత్త తీసుకున్నారు. ఎడారి ప్రయాణంలో స్త్రీల రక్ష కోసం, కొత్త ప్రాంతంలో వారు ఆందోళన చెందకుండా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కాలం మారినా, ఆధునిక సురక్షిత పద్ధతులు వచ్చినా మెహ్రమ్ వీలు కాని స్త్రీలు హజ్ చేయడానికి ఇబ్బంది పడాల్సి వచ్చేది.2023 నుంచి మార్పుమన ప్రభుత్వం 2018 నుంచి 45 ఏళ్లు పైబడిన స్త్రీలు నలుగురేసి చొప్పున గ్రూప్గా హజ్ యాత్ర చేయవచ్చని సడలింపు చేసింది. అయితే 2023 నుంచి సౌదీ అరేబియా అధికారికంగా ‘లేడీస్ వితౌట్ మెహ్రమ్’ను వెసులుబాటు కల్పించింది. దాంతో 2023 నుంచి మన దేశంలో ‘లేడీస్ వితౌట్ మెహ్రమ్’ పేరుతో స్త్రీలు హజ్ యాత్రను చేస్తున్నారు. కేరళ నుంచి 2023లో పెద్ద సంఖ్యలో స్త్రీలు ఈ విభాగం కింద హజ్ యాత్ర చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల నుంచి వీరి సంఖ్య ఈ సంవత్సరం పెరిగింది. 45 ఏళ్ల లోపు స్త్రీలు హజ్ చేయాలంటే ఇప్పుడూ ‘మెహ్రమ్’ తప్పనిసరి.జుబేదా ముహమ్మద్ కల నెరవేరిందిమలప్పురంకు చెందిన 58 ఏళ్ల జుబేదా మహమ్మద్కి ఎన్నో ఏళ్లుగా ఒకటే కల. భర్త చేయి పట్టుకుని హజ్ యాత్ర చేయాలి. కానీ విధి వేరేలా రాసింది. 2019లో భర్త హఠాత్తుగా గుండె పోటుతో కన్నుమూయడంతో ఆమె హజ్ కల సమాధి అయ్యింది అనుకున్నారు అందరూ. ‘ఆడదానివి, ఒంటరిగా ఎక్కడికి వెళ్తావ్? మెహ్రమ్ లేకుండా హజ్ కుదరదు’ అని చుట్టాలు, బంధువులు చె΄్పారు. కొడుకులు విదేశాల్లో ఉన్నారు. ఇంట్లో ఒంటరి. కానీ 2023లో ఒక వార్త ఆమె జీవితాన్ని మార్చేసింది. భారత ప్రభుత్వం, సౌదీ ప్రభుత్వం కలిసి 45 ఏళ్లు పైబడిన మహిళలు నలుగురు గ్రూప్గా మెహ్రమ్ లేకుండా హజ్కి వెళ్లొచ్చు అని ప్రకటించాయి.కొడుకులకు జుబేదా ఒక్కటే చెప్పింది – ‘మక్కాకు వెళ్లకుండా నేను కళ్లు మూయలేను. నా భర్త ఆత్మ శాంతించదు’ అని. హజ్ ఖర్చు దాదాపు 4 లక్షలు. భర్త పెన్షన్, కొంత పొదుపు, కొడుకులు పంపిన డబ్బు కలిపింది. వైద్య పరీక్షలు, వ్యాక్సిన్లు, పాస్ పోర్ట్, శిక్షణా తరగతులు – అన్నీ ఒంటిచేత్తో చేసుకుంది. ‘రాత్రిళ్లు మోకాళ్ల నొప్పులతో ఏడ్చేదాన్ని. కానీ కాబాను తలచుకుంటే నొప్పి మాయం అయ్యేది’ అందామె. విమానం జెద్దా ఎయిర్ పోర్టులో దిగగానే కళ్లలో నీళ్లు. 40 ఏళ్ల కల నెరవేరిన క్షణం. హజ్ చేసి వచ్చాక జుబేదా మాటలు ఇవి: ‘ఒంటరిని అని భయపడకండి. ప్రభుత్వం దారి ఇచ్చింది. నలుగురు తోడు దొరుకుతారు. అడుగు ముందుకు వేయండి. కాబా మిమ్మల్ని పిలుస్తోంది.’ -
పీసీఓఎస్ ఉన్నా..బరువు తగ్గొచ్చు ఇలా..!
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలను ప్రభావితం చేస్తోంది. దీనికారణంగా మహిళలు అధిక బరువు సమస్యను ఎదుర్కొంటుంటారు. సంతానోత్పత్తి వయసు ఉన్న ప్రతి ఐదుగురి అమ్మాయిల్లోఓ ఒకరు ఈ సమస్య బారినపడతారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీనికి ప్రధాన కారణం జీవనశైలి మార్పులు, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు అని చెబుతున్నారు నిపుణులు. ఈ సమస్యను చక్కటి జీవనశైలి, చక్కటి ఆహారపు అలవాట్లతో చక్కదిద్దొచ్చని చెబుతున్నారు నిపుణులు. అదెలాగో వైద్యుల మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్నమహిళలు తీసుకోవాల్సిన ఆహారాలు గురించి వెల్లడించారు. అవేంటంటే..వాటిలో గుడ్లు మంచి ఆహారమని చెబుతున్నారు. ఎందుకంటే ఇది ప్రోటీన్లతో నిండి ఉంటుంది. మిమ్మల్ని ఎక్కువసేపు కడుపునిండుగా ఉంచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు వైద్యులు. అవకాడోలు హార్మోన్ల నియంత్రణకు సహాయపడే ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయట. అలాగే బెర్రీలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచకుండా, తీపి తినాలనే కోరికను నివారించేలా తక్కువ చక్కెర, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు.చియా గింజలు మెరుగైన జీర్ణక్రియకు, మంచి ఫైబర్కు ఉపయోగపడతాయని అన్నారు. అలాగే పెరుగు పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడమే గాక జీవక్రియకు మద్దతిస్తుందని అన్నారు. దీంతోపాటు ఈ సమస్యను తీవ్రతరం చేసే ఆహారాలకు దూరంగా ఉండేలా కేర్ తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, ప్రాసెస్ చేసిన స్నాక్స్ తరచుగా శక్తిని కోల్పోయేలా చేస్తాయి. అలాగే హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయని చెప్పారు. కాబట్టి సాధ్యమైనంతవరకు వాటిని పరిమితం చేయాలని అన్నారు. ఆహారం తోపాటు చక్కటి జీవనశైలిని పాటించాలన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ..సమతుల్య భోజనం చేసేలా స్థిరత్వాన్ని పాటించాలన్నారు. చిన్నచిన్నగా పాటిస్తే..మెత్తం ఆరోగ్యంలో పెద్ద మార్పులోను, మెరుగుదలను చూడగలమని అన్నారు. డాక్టర్ ఆదర్శ గౌడచీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (నీతి ఆయోగ్)ICAR-నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్AIC-SRS-ICAR-NDRI ఫౌండేషన్ -
ఫీటల్ మెడిసెన్: పిండ దశలో బ్రహ్మాండ వైద్యం..
కడుపులో ఉన్న బిడ్డకు వచ్చే సమస్యలను పిండదశలోనే సరిచేయగలిగేంత పరిజ్ఞానం ఇప్పుడుంది. జన్యుసమస్యల విషయంలో ఏమీ చేయలేక΄ోయినప్పటికీ... ఒకప్పటితో పోలిస్తే ‘ఫీటల్ మెడిసిన్’ అనే వైద్యవిభాగంలోని పురోగతితో బిడ్డ పిండదశలో ఉన్నప్పుడు కనిపించే సమస్యలకు పరిష్కారాలు అందించగలగడం ఇప్పుడు చాలావరకు సాధ్యమే. కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు కాబోయే తల్లిదండ్రులకు ఉండే భయాలూ, ఆందోళనలకు ఎలాంటి పరిష్కారాలు దొరుకుతున్నాయో తెలుసుకోవడం కోసం ఉపయోగపడేదే ఈ కథనం.ఒక కొత్త జీవి ఆవిర్భవించే ప్రక్రియ ఎంత సంక్లిష్టమో, ఎంతగా అబ్బురం కలిగించే అంశమో తెలుసుకోవడం ప్రతినిత్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఓ బిడ్డ ఉద్భవించేప్పుడు మొట్టమొదట జరిగేదే ఎంత అద్భుతంగా ఉంటుందో చూద్దాం. పురుషుడి శుక్రకణం, అలా మహిళ అండంతో కలిసిన ఆ క్షణంలో అక్కడ ఓ అద్భుతమైన వెలుగు ఓ ఫ్లాష్లైట్లా తటాల్న వెలుగుతుందంటారు వైద్య నిపుణులు. అలా ఫ్లాష్లా వెలిగే ఆ లైట్ను ‘జింక్ స్పార్క్’ అని పిలుస్తారు. అలా మొదటి అద్భుతం నుంచి ఇక పిండం పెరుగుతుండే అనుక్షణం కడుపులోపల అబ్బురాల వరస అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది.46 క్రోమోజోముల సంఖ్య కొనసాగేందుకు... స్త్రీ, పురుషులిద్దరి అండ, శుక్రకణాల్లో చెరిసగాలే...ఓ జీవి ఫలానా జీవిగానే కొనసాగేందుకు జీవిలోని క్రోమోజోముల సంఖ్య కీలకమవుతుంది. ఆ జీవిలోని క్రోమోజోముల సంఖ్యను బట్టే అది ఏ జీవి అన్నది తెలుస్తుంది. ఇలా మనిషి కణంలోని క్రోమోజోముల సంఖ్య 46. ఈ సంఖ్య అన్నది ఎన్ని తరాలు గడుస్తున్నా క్రమబద్ధంగా కొనసాగుతూ ఉండటం కోసం మహిళలోని అండం 23 క్రోమోజోములుగా, పురుషుడిలోని శుక్రకణం 23 క్రోమోజోములుగా విడిపోతాయి. మళ్లీ శుక్రకణాలూ, అండమూ మహిళలో సంయోగం చెంది, 46 క్రోమోజోములున్న ఒకే ఒక్క కణమున్న పిండం నుంచి అనేకానేక కణాలు (సెల్స్)గా విడిపోయి, ఆ కణాలు మళ్లీ అనేక రకాల కణజాలాలు(టిష్యూస్)గా, ఆ కణజాలాలన్నీ ప్రత్యేక అవయవాలుగా, ఆ అవయవాలు ఒకదానితో మరొకటి అనుసంధానితమవుతూ ప్రత్యేక వ్యవస్థలు (సిస్టమ్స్)గా రూపుదిద్దుకుంటూ ఉంటాయి. పిండం పెరుగుదల అన్నది ఇంతటి సంక్లిష్టమైనది. ఉదాహరణకు గుండె కణాలూ, కణజాలాలూ కలిసి గుండెగా రూపొంది, రక్తప్రసరణ వ్యవస్థ ఏర్పడతాయి. అదే జీర్ణకోశం, కాలేయం, పేగులూ లాంటి కణాలు, కణజాలాలూ కలిసి జీర్ణవ్యవస్థను ఏర్పరుస్తాయి. ఇలా మనదేహంలోని రకరకాల వ్యవస్థలన్నీ రూపుదిద్దుకుంటాయి.లోపరహితంగా జరిగే ప్రక్రియ ఇది... అయితే ఒకవేళ లోపమే జరిగితే... ఇంతటి సంక్లిష్టమైన పిండం పెరుగుదల ప్రక్రియ దాదాపు పూర్తి లోపరహితంగా జరుగుతుంటుంది. అలా లోపరహితంగా జరిగినప్పుడే ఒక ఆరోగ్యకరమైన బిడ్డ ఆవిర్భవిస్తుంది. అయితే ఈ సమయంలో ఎక్కడైనా చిన్నపాటి లోపం జరిగినప్పుడు అది పుట్టబోయే బిడ్డకు వైకల్యాన్నో, ఆరోగ్య సమస్యనో తెచ్చిపెడుతుంది. ఆ సమస్యలను పిండ దశలో తెలుసుకోవడం ఇప్పుడు చాలావరకు సాధ్యమే. ఇందుకు ఉపయోగపడే వైద్య శాస్త్ర విభాగమే ‘ఫీటల్ మెడిసిన్’. గర్భవతికి సంబంధించిన అధ్యయనాలతో కూడిన ‘ఆబ్స్టెట్రిక్స్’కు కొనసాగింపుగా ఇటీవల ఈ ఆధునిక వైద్యవిజ్ఞాన శాస్త్రం కొత్తపుంతలు తొక్కుతూ చాలా చాలా వినూత్న విషయాలను తెలుసుకుంటోంది. పిండదశలో వచ్చే ఎన్నో ఎన్నో సమస్యలకు పరిష్కారాలూ కనుగొంటోంది. పుట్టుకతో రాబోయే కొన్ని సమస్యలు... ఉదాహరణకు కొన్ని గుండె సమస్యలు వస్తే... దాన్ని కడుపులోని పిండానికే శస్త్రచికిత్స చేసి మరీ చక్కదిద్దేంత పరిజ్ఞానం, నైపుణ్యం ఇప్పుడు అభివృద్ధి అయ్యాయి.కొన్ని లోపాలేమిటి... ఆ లోపాలతో వచ్చే సమస్యలేమిటి...?సాధారణంగా 90 శాతం ప్రెగ్నెన్సీలలో అంతా సజావుగా జరిగిపోయినా, కొందరిలో మాత్రం మహిళ గర్భవతిగా ఉన్నప్పుడే ఆ బిడ్డకు పిండదశలోనే కొన్ని సమస్యలు కనిపించవచ్చు. పుట్టుకతోనే వచ్చే ఆ సమస్యలను కంజెనిటల్ సమస్యలుగా పేర్కొంటారు. అందులో కొన్నింటికి చికిత్స అందుబాటులో ఉంటుంది. ఉదాహరణకు గ్రహణం మొర్రి (క్లెఫ్ట్ పాలెట్) వంటి చిన్న సమస్యలను చిన్నపాటి శస్త్రచికిత్సతో సరిదిద్దవచ్చు. మరికొన్ని పెద్ద సమస్యలను ఇలా బిడ్డ పుట్టిన వెంటనే చికిత్స చేయవచ్చు. ఉదాహరణకు అప్పుడే పుట్టిన బిడ్డకు హెర్నియా సమస్య (కంజెనిటల్ డయాఫ్రమాటిక్ హెర్నియా) ఉంటే పుట్టిన వెంటనే వెంటిలేటర్పై ఉంచి మరీ శస్త్రచికిత్స చేయాలి. కాకపోతే కాస్తంత కష్టసాధ్యమైన ఈ విషయానికి మంచి నైపుణ్యంతో కూడిన చికిత్స అవసరం. పరిష్కారం లేని సమస్యలూ ఉండవచ్చు... ఈ క్రమంలో పిండానికి ఉన్న మరికొన్ని సమస్యలు సరిదిద్దలేనంత సంక్లిష్టంగా ఉండే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకు అనెన్సెఫాలీ అనే కండిషన్లో బిడ్డలో తల సరిగా రూపొందదు. తలలోని ఎముకలు సరిగా ఏర్పడవు. ఇలాంటి సందర్భాల్లో ఆ విషయాన్ని ముందుగానే తెలుసుకుంటే సమస్య తీవ్రతను బట్టి తీసుకోవాల్సిన నిర్ణయమేమిటి అన్నది జన్యుపరీక్షల నిపుణుల ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ తర్వాత తెలిసే అవకాశాలున్నాయి. అయితే ఇది త్వరగా జరగాలి. ఎందుకంటే... ఒకవేళ బాగా ఆలస్యమైతే... పిండం బాగా పెరిగాక ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే... ఇది పెద్దప్రాణానికి ముప్పు తెచ్చిపెట్టే అవకాశముంటుంది. ఇలాంటి సమస్యలన్నీ ఫీటల్ మెడిసిన్ విభాగంలోని డయాగ్నసిస్ (సమస్య నిర్ధారణ)పై ఆధారపడి ఉంటాయి. ఆయా సమస్యలను అనుసరించి, పిండదశలోనే చికిత్స చేయాలా లేక పుట్టిన వెన్వెంటనే చికిత్స చేయాల్సిన అవసరం ఉందా అన్నది నిర్ణయం తీసుకుని, ఆ ప్రకారం ప్రసవాన్నీ, అటు తర్వాత బిడ్డకు అవసరమైన చికిత్సలనూ డాక్టర్లు ప్లాన్ చేస్తుంటారు.పిండం పెరుగుదల – నిరంతర పర్యవేక్షణ...ఓ మహిళ గర్భందాల్చాక డాక్టర్లు (సాధారణంగా ఆబ్స్టెట్రీషియన్లు / గైనకాలజిస్టులు) నిర్ణీత వ్యవధుల్లో మహిళను చెకప్కు రమ్మని చెబుతూ ఉంటారు. ఎందుకంటే కడుపులోని పిండం క్రమక్రమంగా పెరుగుతూ ఉన్న కొద్దీ... ఏయే వారానికి లేదా ఏయే త్రైమాసికానికి (ట్రైమిస్టర్కు) ఎంత పెరగాలో, ఏయే వారాల్లో ఏయే అవయవాలు రూపుదిద్దుకోవాలన్న అంశాలను బట్టి... పిండం పెరుగుదల అన్నది ఆయా వారాల్లో అలాగే జరుగుతోందా లేదా అని డాక్టర్లు నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు. బిడ్డలో ఆ ఎదుగుదల అన్నది నార్మల్గానే ఉంటే ఇక దాని గురించి ఆలోచించాల్సిందేమీ ఉండదు. అంతా సజావుగా జరిగి, నెలలు నిండాక ప్రసవం తర్వాత నార్మల్ బిడ్డ పుడతాడు.‘కలర్ డాప్లర్’ సాంకేతికతతో... కడుపులోనే బిడ్డ సమస్యలు తెలుసుకునే అవకాశం...ఒకవేళ కడుపులోని బిడ్డలో నార్మల్ పెరుగుదల కనిపించకపోయినా లేదా ఏవైనా అవంతరాలూ అవకరాలూ (అనామలీస్) కనిపిస్తుంటే... దానికి కారణాలు తెలుసుకోవాల్సిన అవసరముంటుంది. దాని ప్రకారం తగిన నిర్ణయాలు తీసుకునేందుకు ‘ఫీటల్ మెడిసిన్’ సహాయపడుతుంది. ఇప్పుడున్న అత్యాధునిక పరిజ్ఞానంతో కడుపులోని బిడ్డ బరువునూ తెలుసుకునేంత సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇందుకు సహాయపడే అత్యాధునిక వైద్య విజ్ఞానమే ‘కలర్ డాప్లర్’ సాంకేతికత! దీని సహాయంతో బిడ్డలోని ఎదుగుదల ఏయే సమయాల్లో ఎంత ఉండాలో, ఆయా టైములో అలా కొనసాగుతోందా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. దీని ద్వారా బిడ్డ పుట్టబోయే సమయాన్ని కూడా దాదాపుగా సరిగానే అంచనా వేయడమూ జరుగుతుంది.డాక్టర్లు తెలుసుకునే మరికొన్ని సమస్యలూ... పరిష్కారాలు...ఓ మహిళ గర్భవతి అని తెలియగానే ప్రతి డాక్టరూ ఆమెకు తొలుత సూచించే టాబ్లెట్లు... ‘ఫోలిక్ యాసిడ్’ మాత్రలు. పాలకూరలాంటి మామూలు ఆకుకూరల్లో ఉండే ఒక రకం పోషకమే ఈ ‘ఫోలిక్ యాసిడ్’. ఈ పోషకం వల్ల పుట్టబోయే బిడ్డలో... మున్ముందు వెన్నుపాముగా రూపొందబోయే ‘న్యూరల్ ట్యూబ్’ సరిగ్గా ఏ లోపమూ లేకుండా రూపుదిద్దుకుంటుంది. ఇలా న్యూరల్ ట్యూబ్ ఏర్పడటాఇకి అవసరమైన ఆ సంకేతాన్ని తీసుకెళ్లాల్సిన ఒక ‘డీఎన్ఏ’ సరైన రీతిలో ఆ సంకేతాన్ని తీసుకెళ్లేలా ఈ పోషకం సహాయపడుతుంది. మామూలు ఆకుకూరలతోనే అందే ఈ పోషకం ఒకవేళ తగినంతగా అందకపోతే బిడ్డలో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ (లోపం) ఏర్పడేందుకు అవకాశం ఉంది. అందుకే డాక్టర్లు తల్లికాబోతోందన్న విషయం తెలియగానే ఈ లోపాన్ని ముందే నివారించేందుకు ఈ ‘ఫోలిక్ యాసిడ్’ మాత్రలను సూచిస్తుంటారు. ఒకవేళ ఆ పోషకం లోపం ఉండి... సదరు డీఎన్ఏ ఆ నిర్దిష్టమైన సంకేతాలను సరిగా అందించకపోతే... పుట్టబోయే బిడ్డలో వెన్నుపాముకు సంబంధించిన లోపాలు ఏర్పడతాయి. వీటినే వైద్య పరిభాషలో ‘స్పైనా బైఫిడా’ అంటారు. ఈ సమస్య వల్ల బిడ్డ పురిటిలోనే చనిపోయే అవకాశం ఉంది. ఒకవేళ బతికితే శారీరకంగానూ, మానసికంగానూ వైకల్యం వచ్చే అవకాశం ఉంది.క్రోమోజోమల్ సమస్యలు...ముందుగా చెప్పినట్టుగా ప్రతి జీవిలోని ప్రతి కణంలోనూ నిర్దిష్టంగా నిర్ణీత క్రోమోజోముల సంఖ్య ఉంటుంది. వాటిని బట్టే అది ఏ జీవి అన్నది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మానవుల్లోని క్రోమోజోముల సంఖ్య 46 అన్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఈ క్రోమోజోముల సంఖ్యలో మార్పు వస్తే... పుట్టబోయే బిడ్డలో జన్యులోపాలు ఏర్పడటాయి. దాంతో అలా జన్యులోపంతో పుట్టే బిడ్డలకు బుద్ధిమాంద్యమూ, అవయవలోపాలూ వచ్చే అవకాశాలున్నాయి. ఉదాహరణకు ‘డౌన్స్ సిండ్రోమ్’. ఇలా డౌన్స్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలను తెలుసుకోడానికి ‘ద కంబైన్డ్ టెస్ట్’ అనే పరీక్షను చేయాల్సి ఉంటుంది. ఇందులో తల్లి రక్తాన్ని, పిండం విడుదల చేసే ప్రోటీన్లను కలిపి పరీక్షిస్తారు. అందుకే దీన్ని కంబైన్డ్ టెస్ట్ అని పిలుస్తారు. ఈ పరీక్షను గర్భధారణ జరిగిన 11వ వారం, 13వ వారంలో నిర్వహిస్తారు. ఈ లోపాలను తెలుసుకునేందుకు పరీక్షలు... స్పైనా బైఫిడా లాంటి లోపాలు వచ్చే మరికొన్ని అవకాశాలను తెలుసుకునేందుకు కొన్ని స్క్రీనింగ్ పరీక్షలను తప్పనసరిగా చేయించాల్సి ఉంటుంది. ఇవన్నీ ‘ఫీటల్ మెడిసిన్’లో భాగమే. ఉదాహరణకు ఈ వెన్నుపాము సమస్య అయిన ‘స్పైనా బైఫిడా’ను నిర్ధారణ చేసేందుకు ట్రిపుల్ లేదా క్వాడ్రపుల్ పరీక్ష చేస్తారు. ఇందులో ఆల్ఫా ఫీటో అనే ప్రోటీన్ను పరిశీలిస్తారు. దాంతో పాటు బీటా హెచ్సీజీ పాళ్లు, ఎస్ట్రాడోయిల్, ఇన్హిబిన్ మోతాదులను తెలుసుకుంటారు. ఈ పరీక్షను గర్భం ధరించిన 15వ వారం నుంచి 20 వ వారం మధ్యన చేస్తారు. అయితే ఈ పరీక్షలో పాజిటివ్ వచ్చినంతనే బిడ్డకు తప్పనిసరిగా అంగవైకల్యం కలుగుతుందని చెప్పడానికి ఉండదు. కాకపోతే ఇలా ΄పాజిటివ్ ఫలితం వచ్చినప్పుడు ఆ తర్వాత గర్భం దాల్చిన 16వ వారంలో తప్పనిసరిగా సీవీఎస్ అనే పరీక్ష„ý నూ, యామ్నియోసెంటైసిస్ అనే పరీక్షలను నిర్వహించి, తొలుత కనిపించిన పాజిటివ్ ఫలితం నిజంగా వాస్తవమైనదేనా లేక తప్పుడు పాజిటివా (ఫాల్స్ పాజిటివ్నా) అన్నది నిర్ధారణ చేస్తారు.జెనెటిక్ సోనోగ్రామ్ పరీక్షలతో...పుట్టబోయే బిడ్డ అవయవ నిర్మాణంలో ఏవైనా లోపాలు ఉన్నాయా అన్న సంగతి ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది. ఇందులో క్రోమోజోమల్ సమస్యలతో పాటు... బిడ్డలోని అంతర్గత అవయవాలైన గుండె, మెదడు, మూత్రపిండాలు, కాళ్లూ–చేతులు, ముఖం, కళ్లు, ఊపిరితిత్తులు, వెన్నెముక, ఆబ్డామినల్ అవయవాల (కడుపులోపలి భాగాల) గురించి తెలుసుకోవచ్చు.జెనెటిక్ కౌన్సెలింగ్ అంటే...ఇలా అవసరమైనప్పుడుగానీ లేదా డాక్టర్లు ఫలానా పరీక్ష చేయాలని భావించినప్పుడుగానీ... నిర్వహించే పరీక్షల్లో పుట్టబోయే బిడ్డలో జన్యుపరమైన సమస్యలున్నాయని తెలిస్తే... అప్పుడవి మున్ముందు జరగబోయే గర్బధారణల్లో (అంటే తొలిచూలు బిడ్డ తర్వాతి ప్రెగ్నెన్సీలలో) తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. దాన్ని బట్టి తల్లిదండ్రులు తమ గర్భం విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోడానికి వీలవుతుంది. ఒకవేళ అలాంటి జన్యుపరమైన సమస్యలేమీ లేవని తేలితే అప్పుడు తల్లిదండ్రులు నిర్భయంగా తమ ప్రెగ్నెన్సీని కొనసాగించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఫీటల్ మెడిసిన్ విభాగపు నిపుణులు... తల్లిదండ్రులిద్దరికీ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఒకవేళ తొలిచూలు బిడ్డకు ఏవైనా క్రోమోజోమల్ సమస్యలు ఉన్నప్పుడు... ఆ తల్లిదండ్రులిద్దరూ దగ్గరి రక్తసంబంధీకులా అన్న విషయాన్ని తెలుసుకుని, దానికి అనుగుణంగా రెండో గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు. తొలిచూలు బిడ్డకు కొన్ని రక్త పరీక్షలు చేయించి వాటిలో వచ్చిన ఫలితాల ఆధారంగా మలిచూలు బిడ్డ కడుపులో ఉన్నప్పుడు మొదటి నాలుగు నెలల్లోనే కొన్ని పరీక్షలు చేయించాలని సూచిస్తారు. ఆ బిడ్డకు ఏవైనా సమస్యలు రాబోతున్నాయా అని పరీక్ష చేసి, ఆ పరీక్షల ఫలితాలను బట్టి కొన్ని వైకల్యాలు వచ్చే అవకాశం ముందే తెలుసుకుంటే, దానికి అనుగుణంగా తల్లిదండ్రులకు సలహాలు ఇస్తారు.ఒకవేళ దంపతులిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారైతే... సాధారణంగా వారిద్దరి జన్యువులూ ఒకేలా ఉండే అవకాశాలు ఎక్కువ. అంటే ఇద్దరిలోనూ రిసెసివ్ జీన్సే ఉంటాయి. దాంతో ఆటోజోమల్ రెసెసివ్ జెనెటిక్ డిసీజెస్ అని పిలిచే జన్యుపరమైన లోపాలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. కాబట్టి తల్లిదండ్రులిద్దరి జన్యువుల్లోనూ ఒకే తరహా లోపాలు ఉన్నప్పుడు ఆ లోపాన్ని అధిగమించేలా చేయడానికి డామినెంట్ జన్యువు లేక΄ోవడంతో బిడ్డలో జన్యుపరమైన లోపాలు వచ్చేందుకు అవకాశాలెక్కువ. అందుకే రక్తసంబంధీకుల్లోనే పెళ్లిళ్లు జరిగితే జన్యుపరమైన లోపాలు వచ్చే ముప్పు (రిస్క్) ఎక్కువనీ, అందుకే వీలైనంత వరకు రక్తసంబంధీకుల్లో వివాహాలు వద్దంటూ ఆధునిక ‘ఫీటల్ మెడిసిన్’ నిపుణులు సూచిస్తుంటారు. రక్తసంబంధీకుల బిడ్డల్లోనే జన్యుసమస్యలు ఎందుకు ఎక్కువ? చాలా సందర్భాల్ల రక్తసంబంధీకుల మధ్య వివాహాలు (కన్సాంజియస్ మ్యారేజెస్) జరిగితే... వాళ్లకు పుట్టబోయే బిడ్డల్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయని చాలా మంది చెబుతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో చూద్దాం. ఓ కొత్త జీవి ఆవిర్భవించడానికి తల్లికి సంబంధించిన 23 క్రోమోజోములు, తండ్రికి చెందిన 23 క్రోమోజోములు కలిసి ఒక పిండం ఏర్పడుతుందన్న విషయం తెలిసిందే. ఈ క్రోమోజోములు ‘జన్యువుల’తో రూపొందుతాయి. జన్యువులు అంటే తల్లిదండ్రుల నుంచి వివిధ అంశాలను బిడ్డలకు చేరవేసే కణంలోని లోపలి భాగాలు అని అర్థం. దంపతులిద్దరూ రక్తసంబంధీకులు కాకుండా, ఒకరికొకరు సంబంధం లేని వేర్వేరు కుటుంబాల వారైతే... అప్పుడు ఒక సమాచారాన్ని బిడ్డకు చేరవేసే ఫలానా ఓ జన్యువు దంపతులిద్దరిలోనూ ఒకరిలో లోపంతో ఉందని అనుకుంటే ఆ జన్యువును ‘రిసెసివ్ జీన్’ అంటారు. ఉదాహరణకు తండ్రిలోని ఓ జన్యులో లోపం ఉందనుకుందాం. అప్పుడు ఆ జన్యులోపాన్ని నివారించడానికి తల్లిలో ఉండే అదే జన్యువు... లోపంతో కూడిన తండ్రి తాలూకు జన్యువును డామినేట్ చేస్తుంది. ఇలా డామినేట్ చేసే జన్యువును ‘డామినెంట్ జీన్’ అంటారు. దాంతో ఈ డామినెంట్ జీన్ కారణంగా బిడ్డకు రాబోయే ఆ లోపాన్ని అధిగమించడానికి వీలవుతుంది.ఫీటల్ థెరపీస్ అంటే...?పుట్టబోయే బిడ్డకు పిండ దశలోనే ఇలాంటి సమస్యలేమైనా ఉన్నాయా అన్న విషయాన్ని ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్టులు మొదటే నిర్ధారణ చేస్తే... అప్పుడు ఆ బిడ్డకు పుట్టీపుట్టగానే అవసరమైన చికిత్స అందించేందకు వీలుంటుంది. (అందుకే ఇలాంటివేవైనా సమస్యలు ఉన్నట్టు పిండ దశలో ఉన్నప్పుడు చేసే వైద్య పరీక్షల్లో తెలిస్తే... అత్యంత అధునాతన వైద్య సదుపాయాలు ఉన్న పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో (టెరిషియరీ సెంటర్)లో ప్రసవం జరిగేలా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది). ఇక కొన్ని సమస్యలు ఉన్నప్పుడు కడుపులో ఉండగానే, ఆ పిండ దశలోనే చికిత్స చేయాల్సి రావచ్చు. ఇలా చేసే చికిత్సను ‘ఫీటల్ థెరపీ’గా పేర్కొంటున్నారు. డాక్టర్ ఎ మిత్రవింద, సీనియర్ కన్సల్టెంట్, ఫీటల్ మెడిసిన్(చదవండి: కండలు తిరిగిన దేహంతో నిర్మాణ కార్మికుడు..! కేవలం ఆ ఆహారంతోనే..) -
శూన్యమే మిగిలింది..! పహల్గామ్ బాధితురాలి మనో వ్యథ
సరిగ్గా ఏడాది క్రితం జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్ నెత్తురోడింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మతం పేరుతో 26 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్న ఆ చీకటి రోజును యావత్ దేశం ఇంకా మర్చిపోలేదు. ఆనాటి ఉగ్రదాడికి ఏప్రిల్ 22తో ఏడాది పూర్తవుతున్న తరుణంలో బాధిత కుటుంబాలను పలకరించగా..ఇంకా ఆ దృశ్యం కళ్లముందు మెదులుతూనే ఉందంటున్నారు. ఆ ఘటన మిగిల్చిన కన్నీళ్లని అంతతేలిగ్గా మర్చిపోలేమంటున్నారు భర్తలను పోగోట్టుకున్న మహిళలు. అంతేగాదు తమ కళ్లలోని కన్నీటి చెమ్మ తడి ఆరదు అని గద్గద హృదయంతో చెబుతోంది ఆ పహల్గామ్ బాధితుల్లో ఒకరైన డాక్టర్ సుజాత. గుండెల్ని పిండేసే ఆమె మనో వ్యథ వింటే ప్రతి ఒక్కరి మనసు ద్రవించిపోవడమే కాదు ఈ ఉగ్రవాదం సమూలంగా పోయేదెప్పుడూ అన్న ఆక్రోశం కట్టలుతెచ్చుకుంటుంది.నాటి పహల్గామ్ దాడిలో డాక్టర్ సుజాత ఎంబీఏ పట్టభద్రుడైన భర్త భరత్ భూషణ్ని పోగొట్టుకుంది. అతడికి ప్రపంచం గురించి తెలిస్తే..ఆమెకు రోగుల గురించి తెలుసు. అలా ఒకరికొకరం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండేవాళ్లం అని భోరున విలపిస్తున్నారు సుజాత. ఆ దాడిని తన నాలుగేళ్ల కుమారుడు ప్రత్యక్ష్యంగా చూశాడంటూ నాటి భయంకర ఘటనను గుర్తుచేసుకున్నారు. నాన్నకు దెబ్బ తగిలింది, చాలా రక్త కారింది అన్నమాటలు ఇంకా తన చెవిలో వినిపిస్తూనే ఉన్నాయంటున్నారు. ఆ దాడి నీలి నీడలా వెంటాడుతూనే ఉందంటున్నారామె. ఆ బాధను తట్టుకోవడం అంత ఈజీకాదు. ఆ ఘటన తన భావోద్వేగాల నుంచి చిరునవ్వు వరకు అన్నింటి దూరం చేసిందని, కేవలం శూన్యమే మిగిలిందని చాలా నిర్వేదంగా చెప్పుకొచ్చారామె. అంత తేలిగ్గా మర్చిపోలేను ఆ విషాదకరమైన రోజుని, తాను, తన కుమారుడు రక్తంతో తడిచిపోయిన ఆ భయంకపితమైన క్షణాలు బతుకున్నంత వరకు మర్చిపోలేనంటున్నారామె. ఆ కన్నీటి దృశ్యం ఇంకా కళ్లముందు మెదులుతూనే ఉందన్నారామె. అందుకే తాను ఉదయం నుంచి రాత్రి వరకు క్షణం తీరిక లేకుండా పనిలో నిమగ్నమయ్యేలా చూసుకుంటూ ఆ బాధను మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పారామె. కాస్త ఖాళీ దొరికినా..ఆ బాధ వెన్నాడుతుంటుందని ఆవేదనగా చెప్పుకొచ్చారు. ఇలాంటి ఘటనలు ఎంత భయానకమైనవంటే..మనం అనుభవించిన సంతోషకరమైన క్షణాల కంటే ..ఆ బాధే అత్యంత భారంగా అధికంగా ఉంటుందని కన్నీటి పర్యంతమయ్యారు. అన్నేసి గంటలు ఆస్పత్రిలో పనిచేసినా..ఒక్క ఆదివారం మాత్రం కొడుకు కోసం కేటాయించుకుంటానని చెప్పారు. భతవంతుడి దయవల్ల తన కొడుడు చాలా మంచివాడని అంటున్నారు. ఎందుకుంటే ఆ ఘటన జరిగిన తర్వాత ఒక్కసారి కూడా తండ్రి గురించి అడగలేదు. ప్రశాంతంగా ఉన్నాడని అన్నారు. పైగా తాను లేనప్పుడూ అస్సలు అల్లరి చేయడు, తాను ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం నాతో అల్లరి చేస్తుంటాడని నవ్వుతూ చెప్పారు. ఈ విషయంలో భగవంతుడికి సదా కృతజ్ఞతతో ఉంటానని అన్నారు. అంతేగాదు తన కొడుకుకి తండ్రిన కోల్పోయినట్లు తెలుసు, కానీ ఆ లోటు వాడికి కనపడకుండా అన్నీతానై పెంచుకుంటున్నానని చెప్పారామె. నిజానికి ఏప్రిల్ నెల ఎప్పుడూ పండుగ మాసం, కానీ అది మాకు సర్వం కోల్పోయేలా చేసిన విషాదకరమైన మాసంగా మిగిలిందన్నారు. "ఈ పహల్గామ్ దాడికి కొన్ని రోజుల ముందు తన భర్త పుట్టినరోజు వేడుకులు చేసుకున్నాం అని అన్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 14న విహారయాత్రకు వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నాం. నిజానికి తాము ఎప్పుడు గుడికి వెళ్లి..ఆ తర్వాత బయటకు వెళ్లేవాళ్లం. ఆరోజు తన తల్లిదండ్రలు కూడా కాశ్మీర్లో గట్టి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయని చెప్పినప్పుడూ కూడా అంతగా ఆందోళన చెందలేదు. పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తుంటే టపాసులు అనుకున్నా..భద్రతా సిబ్బంది అంతా చూసుకుంటారిని అనుకున్నా. కానీ ఆ ప్రాంతంలో భద్రత లేదు, ఒక్క మనిషి గానీ, సాయుధగార్డు గానీ ఉంటే ఆ ఘటనను నివారించి ఉండేవారంటూ". ఆ విపత్కర పరిస్థితిని గుర్తు చేసుకున్నారు. బహుశా తీవ్రవాద భావజాలం ఈ దాడులు చేసేవాళ్ల మెదడులను పూర్తిగా బ్రెయిన్ వాష్ చేశారన్నారు. తాము చేస్తుంది తప్పు కాదు సరైనదే అన్నంత క్రూరంగా మార్చేశారన్నారు. అయితే ఈ ఉగ్రవాదాన్ని ఎలా మట్టుపెట్టాలో తనకు తెలియదు గానీ..ఇక్కడితో ఈ మారణకాండ ఆగిపోవాలి అని ఉద్విగ్నంగా అన్నారామె. ఆ దాడి జరిగిన రోజు తమ పెళ్లిరోజు అని, ఆయనతో తనకు అదే చివరి భయానక జ్ఞాపకమని కన్నీళ్లుపెట్టుకున్నారామె. కాగా, పహల్గామ్ సంఘటన జరిగినప్పుడు ఆ దంపతులకు పెళ్లై ఆరేళ్లయింది. ప్రస్తుతం ఆమె తనను ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుతున్నా..కానీ ఈ నష్టం ఏ స్త్రీకైనా పూడ్చలేనది అని గద్గద స్వరంతో అన్నారు డాక్టర్ సుజాత.#PahalgamTerroristAttackDr. Sujatha, a pediatrician from Bengaluru, witnessed the tragic killing of her husband, Bharath Bhushan, during a terrorist attack in Pahalgam, Jammu and Kashmir, on April 22, 2025. #DrSujatha, her husband, and their three-year-old son were vacationing… pic.twitter.com/Wn5D9ZnMuL— Dr Parveen Yograj (@ParveenYograj) April 24, 2025 (చదవండి: ఊపిరి ఉన్నంత వరకు..’ పహల్గామ్ బాధితుల వ్యథ) -
ఎండతో గుండెకు ముప్పు.. తప్పేదెలా?
వేసవి ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ గుండెపోటు ప్రమాదం కూడా పెరుగుతోంది. అధిక వేడి, డీహైడ్రేషన్, రక్తపోటు మార్పులు గుండెపై అదనపు ఒత్తిడి తెచ్చి ప్రాణాల మీదకు తేవొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు, హై బీపీ, డయాబెటిస్ ఉన్నవాళ్లు వేసవిలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా.. శరీరం చల్లబడేందుకు గుండె ఎక్కువగా పని చేసే క్రమంలో అలసిపోతుంది. అదే సమయంలో డీహైడ్రేషన్ కారణంగా నీరు, ఎలక్ట్రోలైట్స్ (సోడియం, పొటాషియం, మాగ్నీషియం) కోల్పోవడం వల్ల రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది. వేడి కారణంగా రక్తనాళాలు విస్తరించి బ్లడ్ ప్రెషర్(రక్తపోటు) పడిపోవడం కూడా జరగొచ్చు. వీటితో పాటు..వేసవిలో అధిక ఉప్పు, కొవ్వు, మద్యం తీసుకోవడం గుండెపై ఒత్తిడి పెంచుతుంది. అవుట్సైడ్ ఫ్యాకర్లుగా.. కాలుష్యం కూడా ఓ ముప్పుగా మారుతోంది.ఎవరికీ ఎక్కువ ప్రమాదం?వృద్ధుల్లో.. చెమట పట్టే సామర్థ్యం తగ్గిపోవడం వల్లే ఎక్కువ రిస్క్ ఉంటుంది. హైబీపీ, డయాబెటిస్ ఉన్నవాళ్లకు.. గుండెపై అదనపు ఒత్తిడి పడొచ్చు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవా ఇప్పటికే బలహీనమైన గుండె మరింత ఒత్తిడిని తట్టుకోలేకపోవచ్చు. డయూరెటిక్స్(వాటర్ పిల్స్), బీటా బ్లాకర్స్(గుండె కొట్టుకునే వేగాన్ని తగ్గిస్తాయి). NSAIDs మెడిసిన్స్ వాడేవాళ్లలో డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అసమతుల్యతను పెంచుతాయి. ఈ మందులు వేసవిలో వాడేవారు నీరు ఎక్కువగా తాగడం, ఎలక్ట్రోలైట్ పానీయాలు తీసుకోవడం, డాక్టర్ సూచన మేరకు పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.వేసవిలో గుండెపోటు నివారణకు జాగ్రత్తలుతగినంత నీరు తాగండి.. రోజుకు కనీసం 8 గ్లాసులు, బయటకు వెళ్లేవాళ్లు మరింత ఎక్కువగాకాఫీ, మద్యం, అధిక చక్కెర పానీయాలు తగ్గించండి – ఇవి డీహైడ్రేషన్ను పెంచుతాయి.ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో (10 AM – 4 PM) బయటకు వెళ్లకండి.తేలికపాటి, గాలి చొరబడే దుస్తులు ధరించండి.. కాటన్, లినెన్ ఉత్తమం.తీవ్రమైన వ్యాయామం వేసవిలో మధ్యాహ్నం చేయకండి. ఉదయం లేదా సాయంత్రం మాత్రమే చేయడం మంచిది.ఫ్యాన్స్, కూలర్లు, ఏసీలు.. వేడి నుంచి రక్షణ కోసం ఏదైనా ఉపయోగించండి.వేసవిలో ఆహారం నియంత్రించండి – ఉప్పు, కొవ్వు, మద్యం తగ్గించండి.హీట్ స్ట్రోక్ లక్షణాలు గుర్తించి అప్రమత్తం కావాలి. అధిక చెమట, తల తిరగడం, గందరగోళం, వేడి చర్మం, అధిక జ్వరం. ఇవి ఉంటే వెంటనే వైద్య సహాయం పొందాలి. -
60లోనూ 40లా.. వృద్ధురాలి యంగ్లుక్!
వయసు పైబడిన..చిన్నవాళ్లలా యంగ్లుక్లో కనిపించాలని పరితపిస్తుంటారు చాలామంది. అయితే అందుకు తగ్గట్టుగా జీవనశైలిలో మార్పులు చేసుకోరు. అలాగే శరీరానికి కావాల్సినంత వ్యాయామాలు వంటి వాటిపై దృష్టిసారించరు. యంగ్ లుక్ అటుంచి..ఆరోగ్యంగా ఉండటం కోసం అయినా చేయరు..ఇక యవ్వనంగా ఎలా కనిపిస్తారు అని అంటోంది ఈ చెన్నైకి చెందిన వృద్దురాలు. 67 ఏళ్ల వయసున్న ఆమెని చూస్తే జస్ట్ 40 ఏళ్లే అన్నట్లుగా ఉంటుంది ఆ వృద్ధురాలి ఆహార్యం. మరి ఆమె చెప్పే పిట్నెస్ రహస్యలేంటో సవివరంగా చూద్దామా..!.కంటెంట్ క్రియేటర్ జయచంద్రన్ తమిళరసన్ ఆ వృద్ధరాలి గురించి ఇన్స్టాగ్రామ్లో వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో ఆయన ఆమెను ఫిట్నెస్ రొటీన్ గురించి అడగడం చూడొచ్చు.మంచి ఆరోగ్యానికి వ్యాయామమే కీలకంవయసు పెరిగే కొద్దీ శరీరం బలహీనపడుతుంది; ఇది సాధారణ జీవశాస్త్రం. అయితే, క్రమం తప్పని వ్యాయామంతో మన శరీరానికి శిక్షణ ఇస్తే..న క్రియాత్మక బలం, సామర్థ్యాలను నిలుపుకోవచ్చు. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని అంటోందామె. ఆమె ఉదయం 5:30 నుంచి 5:45 గంటల మధ్య నిద్రలేచి, ఇంటి పనులు ముగించుకుని, యోగాతో రోజుని ప్రారంభిస్తానని అంటోంది. ఇక ఉదయం 7:30 గంటలకు పార్కులో వాకింగ్ చేస్తానని చెప్పారు. ఆరోగ్యంగా ఉండటానికి కేవలం వాకింగ్ సరిపోదని అన్నారు. శక్తినిచ్చే వ్యాయామాలు, ఆరోగ్యకరమైన ఆహార తీసుకోవడం తప్పనిసరి అని అన్నారు. అలాగే తానేమి సప్లిమెంట్లని ఉపయోగించనని అన్నారు. అల్పాహారంగా కేవలం మజ్జిగ మాత్రమే తీసుకుంటానని చెప్పారు. మధ్యాహ్న భోజనంలో మాత్రం అవసరమైన పోషకాలు, ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకుంటానని చెప్పారు. మధ్యాహ్నం ప్రోటీన్ కోసం చికెన్, మటన్ లేదా గుడ్లతో కూడిన చాలా మంచి భోజనం చేస్తాను. ప్రత్యేకంగా పాటించే డైట్ అంటూ ఏమి లేదని అన్నారామె. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఒక కప్పు టీ లేదా కాఫీ తాగుతానని అన్నారు. భోజనం మధ్యలో ఆకలి వేస్తే నచ్చిన పండ్లను తీసుకుంటానని చెప్పారు. కానీ వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటానని అన్నారు. మంగళవారం, శనివారాలు తప్పనిసరిగా ఉపవాసం ఉంటానని చెప్పారు. గృహిణిగా ఉంటూనే ఆరోగ్యం పట్ల ఇంత కేర్ తీసుకుంటున్నా ఆమె అందరికీ స్ఫూర్తి. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే సరైన ఆహారం తీసుకోవడం, శరీరానికి తగిన వ్యాయామం చేయడం తదితరాలే అత్యంత ముఖ్యమని అని చెబుతున్నారామె. ఎక్కువగా మానసిక ఆరోగ్యంపై దృష్టిపెడితేనే ఏదైన సాధ్యమని అన్నారు. ఆడవాళ్లు, ఇంట్లో శాంతి, సంతోషంగా ఉండేలా చూసుకోవడం ప్రధానమని అన్నారు. అలాగే ఒత్తిడిని దరిచేరకుండా చూసుకోవాలని అన్నారు. అలాగే విషయాలను పట్టుకుని వేలాడకుండా..జీవితంలో ఏది వచ్చినా..యథాతథంగా స్వీకరించడం అత్యంత ముఖ్యం అని అన్నారు. అప్పుడే మనం శారీరకంగా ఫిట్గా ఉండగలుగుతామని అన్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Jhaal Muri: మోదీ మెచ్చిన చిరుతిండి..! ఇన్ని పేర్లతో పిలుస్తారా..) -
మోదీ మెచ్చిన చిరుతిండి..! ఇన్ని పేర్లతో పిలుస్తారా..
బెంగాల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రఖ్యాత చిరుతిండి ఝాల్మురీని మోదీ రుచి చూశారు. దీన్ని మరమరాలు, పచ్చి మిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు, ఇతర మసాలాలతో తయారు చేస్తారు. ఝార్గ్రామ్ జిల్లాలో మోదీ కాన్వాయ్ ఓ దుకాణం ముందు హఠాత్తుగా ఆగింది. మోదీ వాహనం దిగి దుకాణదారును పలకరించారు. ‘‘సోదరా! ఝాల్మురీ ఎంత? నాకు రుచి చూపించు. రుచికరంగా త యారు చెయ్’’ అని కోరా రు. తను వెంటనే ఝాల్ మురీ చేసి ప్రధానికి అందించాడు. డబ్బులు తీసుకోవడానికి నిరాకరించగా మోదీ బలవంతంగా అతడి చేతిలో పెట్టారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఈ చిరుతిండి హాట్టాపిక్గా మారింది. ఈ వంటకానికి యావత్తు భారతదేశంలో ప్రజలంతా చేసుకుంటారు. కాకపోతే ఆయా ప్రాంతాల వారీగా పలుల పేర్లు ఉన్నాయంతే. కానీ దీని రుచికి అందరు ఫిదా అనే చెప్పాలి. విదేశీయలు సైతం అబ్బా అని లొట్టలేసుకుంటూ తినేలా చేసే స్నాక్ ఐటెం ఇది. మరి నోరూరించే ఈ ఝల్మురి వంటకాల కహానీ గురించి సవివరంగా చూద్దామా..!.ఝల్మురి అంటే..కోల్కతా స్ట్రీట్ చిరుతిండి ఇది. మరమరాలు, ఆవనూనె, మసాలాలు, టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, వేరుశెనగుళ్లు, సెనగపప్పులు వేసి కమ్మగా, కారంగా చేసే వంటకం. ఇది ఏమి స్టవ్ వెలిగించే చేసే వంటకం కాదు. ఇది మొత్తం పదార్థాలు కలపడం పైనే రుచి ఆధాపడి ఉంటుంది. ఆ పేరు ఎలా వచ్చిందంటే..బెంగాలీలో “ఝల్” అంటే కారం, “మురి” అంటే మరమరాలు. ఈ రెండింటినీ కలిపితే,కారం కారం మరమరాలు అని అర్థం. అమ్మకందారులు స్టీల్ పాత్రలలో దీన్ని కలుపుతూ..పదార్థాలను గాల్లోకి ఎగరువేస్తూ..కోన్ల వార్తాపత్రికలను చుట్టి సర్వ్ చేస్తుంటారు. చవకైనది..మనసుకు ఆహ్లాదాన్ని, కాలక్షేపాన్ని ఇచ్చే చిరుతిండి ఇది. వలసవాద కాలంలో బెంగాల్లో ఉద్భవించిందని చెబుతుంటారు. మాములు చిరుతిండిగా మొదలైన రైళ్లలో, బీచ్లలో, కళాశాల ప్రాంగణాలలో విరివిగా అమ్ముతుంటారు. ఇంకా పెద్ద పెద్ద కేఫ్లు సైతం లభిస్తోంది. ఈ స్ట్రీట్ భారతదేశమంతటా ఫేమస్. పైగా ఆయా ప్రాంతాల వారీగా పలు రకాలుగా పిలుస్తారు. చేసే విధానం ఒక్కటే. మరి ఆ పేర్లేంటో చూసేద్దామా..! ఇన్ని పేర్లా..?!ముంబైలో దీన్ని భేల్పురిగా తీపి కారంల కలయికతో తయారు చేస్తారు. ఇక బెంగళూరు చురుమురిలో తురిమిన కొబ్బరితో దక్షిణ భారత రుచితో మిళితం చస్తారు. ఒడిశాలో మసాల మురిగా..అందులో అన్ని ఎక్కువ పదార్థాలు జోడించనప్పటికీ ఘాటుగా ఉంటుంది. ఇక దక్షిణ భారతదేశం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ వంటి ప్రాంతాలో ముంతమసాల, పిడతకింద పప్పు, ఉగ్గాణి వంటి పేర్లోతో పిలుస్తారు.ముంతమసాల: రమరాలు, మసాలా దినుసులు, వేరుశెనగ గుళ్లు, ఉల్లిపాయలు, టొమాటోలు, కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు తదితరాలను కలిపి గిన్నెలో ఇస్తారు కాబట్టి ముంత మసాల. అంటే ఇక్కడ ఒక చిన్న అల్యూమినియం ముంతలో (గిన్నె)లో సర్వ్ చేస్తారు. ఇది కోస్తాంధ్ర, రాయలసీమలో సాయంత్రం వేళల్లో దొరికే ప్రసిద్ధ స్ట్రీట్ ఫుడ్.పిడతకింద పప్పు: ఇది కూడా ముంతమసాల లాంటిదే, కానీ ఇందులో మిరపకాయ బజ్జీలను చిన్న ముక్కలుగా చేసి కలుపుతారు. అలాగే మరమరాలు మెత్త బడకుండా చిన్న మట్టి కుండలో నిప్పులు వేసి మరమరాలపై ఉంచుతారు అందువల్ల ఆ పేరుతో పిలుస్తారు. ఇది ముఖ్యంగా కోస్తాంధ్ర (గుంటూరు, కృష్ణా జిల్లాలు) లో ఎక్కువగా కనిపిస్తుంది.ఉగ్గాణిమరమరాలను నీటిలో నానబెట్టి, తాలింపు పెట్టి చేసే ఒక రకమైన తడి మిశ్రమం. దీనికి పసుపు, వేరుశెనగ గుళ్లు, పుట్నాల పొడి (పుట్నాల పప్పు పొడి) ప్రధానంగా ఉపయోగిస్తారు. దీన్ని సాధారణంగా మిరపకాయ బజ్జీలతో కలిపి తింటారు, అందుకే దీనిని 'ఉగ్గాణి బజ్జీ' అని పిలుస్తారు. రాయలసీమ ప్రాంతంలో (కర్నూలు, అనంతపురం) ఇది చాలా ఫేమస్. అక్కడ దీన్ని బ్రేక్ఫాస్ట్గా కూడా తింటారట. ఆరోగ్యదాయకం కూడా..ఈ మరమరాలతో తయారు చేసే ఈ వంటకం ఆరోగ్యప్రదం కూడా. ఎందుకంటే ఇందులో ఆయిల్ కంటెంట్ తక్కువ. పైగా అన్ని నేచురల్గా కలిపేస్తారు. ఇక్కడ డీప్ఫ్రైకి ఛాన్స్లేదు. టమటా, ఉల్లిపాయలు నుంచి అన్ని కూడా పచ్చిగానే కలుపుతారు. ఒకరకంగా సలాడ్ మాదిరి ఐటెం. కాకపోతే కాస్త మరమరాలతో రుచికరంగా మారుతుంది. పైగా వెయిట్లాస్ స్నాక్ ఐటెం అని అంటున్నారు. ఇది కడుపు నిండిన అనుభూతితోపాటు మనసుకు హాయినిచ్చే స్నాక్ ఐటెం అట. ఇక మరమరాల్లో కార్బోహైడ్రేట్లు కూడా తక్కువగానే ఉంటాయని అంటున్నారు. పైగా తేలిగ్గా అరిగిపోతుంది కూడా అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మంచి ఫైబర్ తోపాటు, సులువుగా జీర్ణమయ్యే బలవర్ధకమైన చిరుతిండి అట. -
గెలిచా అనుకునేలోపే ఓటమి హగ్ ఇచ్చిందిగా..!
ఎప్పుడైన గెలవాలని అనుకున్నప్పుడు చివరవరకు ఓపికతో పోరాడాలి. గెలిచాక సంబరాలు చేసుకోవాలి. అప్పటి వరకు సంయమనంతో ఉండాలి లేదంటే ఘోరంగా అవమానపాలు కావాల్సిందే. అందుకు నిదర్శనం ఈ ఘటన. డెలావేర్ మారథాన్ రన్నింగ్ కాంపిటీషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫినిష్ చేయాల్సిన గీతకు కొన్ని అంగుళాల ముందే యాహు గెలిచేశా అంటూ సంబరాలు చేసుకుటూ చేతులు పైకెత్తాడు. కొద్ది దూరంలోనే వేగాన్ని తగ్గించి ఆనందంగా గెంతులేస్తూ వస్తున్నాడు. ఇంతలో అతడి ప్రత్యర్థి 24 ఏళ్ల జాషువా జాక్సన్ అనూహ్యంగా వెనుక నుంచి దూసుకొచ్చి..అతడిని ఓడించేటప్పటికీ..అతన ఒక్కసారిగి కంగుతింటాడు. గెలిచానన్న ఆనందం క్షణాల్లో చూస్తుండగానే ఆవిరైపోయిందా అని షాక్లో ఉండిపోయాడు. అందుకే అంటారు పెద్దలు గెలుపుని పాదాక్రాంతం చేసుకునేంత వరకు చప్పుడు చేయకూడదు అనేది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారంది. జాక్సన్ అనే వ్యక్తి మారథాన్ రేసు గెలిచి..అద్భుతమైన 2:43:11 సమయాన్ని నమోదు చేశాడు. ఈ ఘటన అందరికి అద్భుతమైన గుణపాఠం కదూ..!.(చదవండి: అరుదైన ఘటన: కూతురిని చితకబాదిన అమ్మ..!) -
నిరంతరం నేర్చుకునే తత్వం..!
పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఒక గమ్యం కాదు, అది ఒక నిరంతర ప్రయాణం అని మనం చెప్పుకున్నాం. ఆ ప్రయాణానికి కావలసిన ఇంధనమే 'Intellectual Curiosity' (మేధోపరమైన జిజ్ఞాస). అంటే, ప్రపంచాన్ని ఒక చిన్న పిల్లాడిలా కుతూహలంతో చూడటం, ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటంచాలామంది డిగ్రీ రాగానే లేదా ఉద్యోగం రాగానే చదవడం, నేర్చుకోవడం ఆపేస్తారు. కానీ బ్రో, ఎప్పుడైతే మీరు నేర్చుకోవడం ఆపేస్తారో, అప్పుడే మీ ఎదుగుదల ఆగిపోతుంది. మేధోపరమైన జిజ్ఞాస ఉన్న వ్యక్తికి ఈ ప్రపంచం ఒక పెద్ద లైబ్రరీలా కనిపిస్తుంది. అతను కేవలం తన సబ్జెక్టులోనే కాదు, సైన్స్, ఆర్ట్, హిస్టరీ, టెక్నాలజీ.. ఇలా ప్రతి దాని గురించి తెలుసుకోవాలని తపిస్తాడు. ఈ కుతూహలమే మిమ్మల్ని పదిమందిలో ఒక'ఆసక్తికరమైన వ్యక్తి'గా (Interesting Person)నిలబెడుతుంది.ఎమర్జింగ్ మైండ్సెట్: "నాకు ఇంకా తెలియదు""నాకు అన్నీ తెలుసు" అనుకోవడం అహంకారం, "నాకు ఇంకా తెలియాల్సింది చాలా ఉంది" అనుకోవడం మేధస్సు.Shoshin: జపనీస్ సంస్కృతిలో దీన్ని 'బిగినర్స్ మైండ్' అంటారు. అంటే ఎంతటి అనుభవం ఉన్నా, ఒక కొత్త విషయాన్ని నేర్చుకునేటప్పుడు ఏమీ తెలియని విద్యార్థిలా వినడం. ఈ లక్షణం మీలో వినయాన్ని (Humility) పెంచుతుంది. మీరు అందరి దగ్గర నుండి ఏదో ఒకటి నేర్చుకోగలరు—ఒక చిన్న పిల్లాడి నుండి లేదా ఒక కూలీ నుండి కూడా.ఎందుకు? ఎలా? జిజ్ఞాస ఉన్న వ్యక్తి ప్రశ్నలు అడగడానికి భయపడడు.లోకం "ఇది ఇంతే" అని సరిపెట్టుకుంటే, అతను "ఎందుకు ఇలా ఉంది? దీన్ని ఇంకా మెరుగ్గా ఎలా చేయొచ్చు?" అని ఆలోచిస్తాడు.ఈ ప్రశ్నలే కొత్త ఆవిష్కరణలకు (Innovations) దారి తీస్తాయి. మీ ఆఫీసులో గానీ, ఇంట్లో గానీ మీరు ప్రశ్నలు వేయడం మొదలుపెడితే, మీరు సమస్యలను మూలాల నుండి అర్థం చేసుకోగలుగుతారు.క్రాస్-లెర్నింగ్: విభిన్న రంగాల కలయికమీరు కేవలం ఒకే రంగానికి పరిమితం అవ్వకండి.మీరు ఒక ఇంజనీర్ అయితే, సైకాలజీ చదవండి. మీరు ఒక డాక్టర్ అయితే, ఫైనాన్స్ గురించి తెలుసుకోండి.విభిన్న రంగాల జ్ఞానాన్ని కలిపినప్పుడు మీకు 'క్రియేటివ్ ఐడియాస్' వస్తాయి. స్టీవ్ జాబ్స్ కాలిగ్రఫీ (అక్షరాల కళ) నేర్చుకోవడం వల్లే ఆపిల్ కంప్యూటర్లలో అందమైన ఫాంట్లు వచ్చాయి.మీ వ్యక్తిత్వానికి ఇది ఒక'మల్టీ-డైమెన్షనల్'లుక్ ఇస్తుంది.డిజిటల్ యుగంలో జిజ్ఞాస (Learning in AI Era)ఇప్పుడు సమాచారం మన వేళ్ల చివర ఉంది. సోషల్ మీడియాలో టైమ్ వేస్ట్ చేసే బదులు, కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ఇంటర్నెట్ ని వాడుకోండి. AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వంటి కొత్త టెక్నాలజీలను అర్థం చేసుకోండి. మారుతున్న కాలంతో పాటు మారని వాడు వెనకబడిపోతాడు. నేర్చుకునే తత్వం ఉన్నవాడు ఎప్పుడూ'అవుట్ డేటెడ్'అవ్వడు.మెదడు ఆరోగ్యం, యవ్వనంసైంటిఫిక్గా చూస్తే, మీరు కొత్త విషయాలు నేర్చుకుంటున్నప్పుడు మీ మెదడులో కొత్త న్యూరాన్లు పుడతాయి (Neurogenesis).ఇది మిమ్మల్ని మానసిక ఉల్లాసంతో ఉంచుతుంది. వయస్సు పెరిగినా (Chapter 44), మీ ఆలోచనలు ఎప్పుడూ యవ్వనంగా ఉండాలంటే నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి.The Takeawayబ్రో, నేర్చుకోవడం అనేది ఒక బరువు కాదు, అది ఒక సాహసం. నీ వ్యక్తిత్వం ఎప్పుడూ వికసించాలి అంటే, నీలోని ఆ చిన్న పిల్లాడిని చనిపోనివ్వకు. ప్రతిరోజూ ఒక కొత్త విషయం నేర్చుకోకుండా నిద్రపోకు. జ్ఞానం అనేది పంచుకుంటే పెరుగుతుంది, నేర్చుకుంటే వెలుగుతుంది. నీ సామాజిక వికాసం, నిరంతర వికాసం ఈ 'జిజ్ఞాస' మీదే ఆధారపడి ఉన్నాయి.గుర్తుంచుకో.."నువ్వు నేర్చుకోవడం ఆపేసిన రోజున నువ్వు ముసలివాడివి అయిపోతావు. నువ్వు నేర్చుకుంటూ ఉన్నంత కాలం నువ్వు ఎప్పుడూ యవ్వనంగానే ఉంటావు. జ్ఞానమే నీ అసలైన ఆస్తి."Mind-Work మీకు ఏమాత్రం సంబంధం లేని ఒక కొత్త విషయం (ఉదా: ఖగోళ శాస్త్రం లేదా వంట చేయడం) గురించి ఈరోజు 10 నిమిషాలు చదవండి లేదా వీడియో చూడండి.ఈరోజు మీరు కలిసిన ఒక వ్యక్తిని, వారికి తెలిసిన ఒక స్కిల్ గురించి అడిగి తెలుసుకోండి."నాకు అన్నీ తెలుసు" అని మీరు అనుకున్న సందర్భాలను గుర్తు తెచ్చుకుని, అక్కడ మీరు నేర్చుకోగలిగే అవకాశం ఏముందో ఆలోచించండి.(చదవండి: క్షమించడంతోనే విముక్తి) -
లైఫంతా టెస్ట్ ఇంటర్లో బెస్ట్
అప్పుల బాధతో....తండ్రి ఆత్మహత్య. పద్దెనిమిదేళ్లకే కుటుంబ బాధ్యత. పెళ్లయిన రెండేళ్లకే కన్నుమూసిన భర్త విషాదం తట్టుకోలేక... పక్షవాతానికి గురైన తల్లి. జీవితమే పరీక్షగా మారింది. చేతిలో పసిబిడ్డతో ఆ పరీక్షలో నెగ్గడానికి మళ్లీ చదువు బాట పట్టింది హిమబిందు. డాక్టర్ కావాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న పేదింటి బిడ్డ హిమబిందు ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 985 మార్కులు సాధించింది. కోచింగ్ తీసుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో సహాయం కోసం అర్థిస్తోంది.డాక్టర్ కావాలనేది తన చిన్నప్పటి కల. దర్జీ పనులు చేసుకునే తండ్రి బట్టలు కొలిచే టేప్ మెడలో వేసుకుంటే, ఆదే టేప్ తాను వేసుకొని ‘ఇది నా స్టెతస్కోప్’ అని సంబరపడేది హిమబిందు. ‘కచ్చితంగా నువ్వు డాక్టరవుతావు బిడ్డా’ అని ఎప్పుడూ ఆశీర్వదించే తండ్రి అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ బాధ్యతలను తల్లి భుజాన వేసుకుంది. పద్దెనిమిది సంవత్సరాల వయసులో హిమబిందుకు పెళ్లి చేసింది. పెళ్లి అయిన రెండేళ్లకు అప్పుల పాలైన బిందు భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదం తట్టుకోలేని తల్లికి పక్షవాతం వచ్చింది.→ దుఃఖసముద్రంలో...ఒకవైపు అనారోగ్యంతో తల్లి, మరోవైపు పసిబిడ్డ... దుఃఖసముద్రంలో మునిగిపోతున్నట్లుగా అనిపించింది హిమబిందుకు. అయినా ఆ విషాదాన్ని తట్టుకొని నిలబడింది.‘ఎన్ని కష్టాలు వచ్చినా చదువుకోవాల్సిందే’ అని గట్టిగా అనుకుంది హిమబిందు. మళ్లీ చదువు కొనసాగించింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 985 మార్కులు సాధించి డాక్టర్ కావాలనే తపనతో పుస్తకాలతో కుస్తీ పడుతోంది తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా నడివాడకు చెందిన దుస్సా హిమబిందు.→ ఎంత కష్టమైనా..‘ఇంటర్లో తెచ్చుకున్న మార్కులు నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ప్రస్తుతం నా ముందు ఉన్న లక్ష్యం... నీట్. కోచింగ్ తీసుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఇంటి దగ్గరే సొంతంగా ప్రిపేరవుతున్నాను. దాతలు సహకరిస్తే నా లక్ష్యానికి త్వరగా చేరగలననుకుంటున్నాను’ అంటోంది హిమబిందు.కన్నీళ్లు దిగమింగుతూ.. కాలేజీకి..చిన్నతనంలోనే తండ్రి, పెళ్లి అయిన రెండు సంవత్సరాలకే 11 నెలల పసిపాపను చేతిలో పెట్టి భర్త ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు తల్లి ఆనారోగ్యానికి గురైనా తన లక్ష్యం మాత్రం మరచిపోలేదు హిమబిందు. అటు తల్లిని, ఇటు బిడ్డనూ చూసుకుంటూ పెళ్లితో ఆగిపోయిన ఇంటర్ చదువును మళ్లీ మొదలు పెట్టింది. లెక్చరర్లు, తోటి విద్యార్థుల సహకారంతో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష రాసి వెయ్యి మార్కులకు 985 మార్కులు సాధించింది. ఇప్పుడు నీట్ పరీక్షకు సిద్ధం అవుతోంది. – ఈరగాని బిక్షం, సాక్షి, మహబూబాబాద్ఫొటో: మురళీ మోహన్ -
బహుభాషావేత్త... సోలో ట్రావెలర్ అందం బహుముఖం
ముప్పై రాష్ట్రాల అందాల ప్రతినిధులతో భువనేశ్వర్లో జరిగిన ‘మిస్ ఇండియా వరల్డ్ 2026’ పోటీలో విజేతగా నిలిచిన గోవా అమ్మాయి సాధ్వీ సతీష్ విశేషాలు తెలుసుకునేకొద్దీ ఆశ్చర్యపోతున్నారు అంతా. ఆమె రెండు చేతులతోనూ రాస్తుంది. చాలా స్పీడ్గా కారు నడుపుతుంది. ఏడు భాషలు అనర్గళంగా మాట్లాడుతుంది. కెనెడాలో ఎకనామిక్స్ చదివి సోలో ట్రావెలర్గా దేశాలు తిరుగుతుంది. ‘మిస్ ఇండియా’ కిరీటాన్ని గెలిచి, గోవా ఘనతను చాటింది. ఈ కాలపు అమ్మాయంటే సాధ్వీ సతీషే.‘చిన్నప్పటి నుంచి నేను కొంచెం తేడా. నలుగురితో పెద్దగా కలిసే దాన్ని కాదు. చిన్నప్పుడు ఖాళీ టైమ్ దొరికితే రెండు చేతులతో ఒకేసారి రాయడం ప్రాక్టీసు చేసేదాన్ని’ అంటోంది గోవా అందాల బరిణె సాధ్వీ సతీష్. గోవా ఇసుక తీరాల్లో ఆడుకున్న ఈ అమ్మాయి ‘మిస్ ఇండియా 2026 వరల్డ్’ టైటిల్ గెలుచుకొని 2027లో జరగనున్న ‘మిస్ వరల్డ్’ పోటీలలో మన దేశానికి ప్రాతినిధ్యం వహించనుంది.→ మొదటి గోవా అమ్మాయిభువనేశ్వర్లోని ‘కె.ఐ.ఐ.టి. విశ్వవిద్యాలయం’లో ఏప్రిల్ 18న వైభవంగా జరిగిన ‘ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026’ ఫైనల్స్లో 25 ఏళ్ల సాధ్వీ సతీష్ విజేతగా గెలిస్తే, మొదటి రన్నరప్గా మహారాష్ట్రకు చెందిన రజ్నందిని పవార్, రెండో రన్నరప్గా జమ్మూ కశ్మీర్కు చెందిన శ్రీఅద్వైత నిలిచారు. న్యాయనిర్ణేతలుగా జీనత్ అమన్, నేహా ధూపియా, మధుర్ భండార్కర్, ఒలింపిక్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ లాంటి దిగ్గజాలు ఉన్నారు. సాధ్వీ సతీష్ ఈ టైటిల్ను గెలవడం వల్ల ‘మిస్ వరల్డ్’కు భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించబోతున్న తోలి గోవా అమ్మాయి అయ్యింది. స్వాధ్వీ సతీష్ కర్ణాటకలోని కార్వార్లో పుట్టినా తను పెరిగిన గోవానే∙ఊపిరిగా భావిస్తుంది. ఆమెకు చిన్నప్పటి నుంచి గోవా సంస్కృతి, సముద్రం ఇష్టం. బెంగళూరులోని అమృత విద్యాలయంలో చదివి, ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లి అక్కడ యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాలో ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో డబుల్ మేజర్ పూర్తి చేసింది. ఆ తర్వాత మోడలింగ్లో ప్రవేశించి అందాల పోటీ వరకూ ఎదిగింది.→ నాన్న ప్రోత్సాహంఅమ్మా నాన్నల ప్రోత్సాహం లేకుండా పిల్లలకు ఏ విజయమూ సిద్ధించదు. సాధ్వీ సతీష్ విజయం వెనుక తండ్రి సతీష్ కృష్ణ సెయిల్, తల్లి ప్రియాంక సెయిల్ ఉన్నారు. ముఖ్యంగా తండ్రి సతీష్ కూతురి కలలకు రెక్కలు తొడిగిన వ్యక్తి. ‘ఆడపిల్ల అయినా ప్రపంచం చుట్టి రావాలి’ అని కెనడా చదువుకు, సోలో ట్రావెలింగ్కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. తల్లి ప్రియాంక గోవా సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలను సాధ్వీలో నింపింది. ‘నాన్న నన్ను ఆకాశానికి ఎగిరేలా చేశారు. అమ్మ నా కాళ్లు నేల మీద ఉంచింది. మిస్ ఇండియా కిరీటం నాది కాదు, మా అమ్మా నాన్నలది’ అంది సాధ్వీ.→ సోలో ట్రావెలర్‘కెనెడాలో చదువు పూర్తయ్యాక మెక్సికోకు మొదటి సోలో ట్రావెల్ చేశాను’ అని తెలిపింది సా«ధ్వీ. లోకం చూడటానికి ఇష్టపడే సాధ్వీ మూడేళ్లలో పది దేశాలు ఒంటరిగా తిరిగింది. కొత్త సంస్కృతులు, కొత్త మనుషులు, కొత్త సవాళ్లు అన్నింటినీ ఆహ్వానించింది. ఈ ప్రయాణాలే తనకు స్వతంత్రంగా ఆలోచించడం, త్వరగా నిర్ణయాలు తీసుకోవడం నేర్పాయి అంటుందామె. మరో విశేషం ఏమిటంటే సాధ్వీకి తేనెటీగలంటే విపరీతమైన భయం. ఫోబియా. ఆ ఫోబియాను జయించడానికి సర్టిఫైడ్ బీకీపర్గా శిక్షణ తీసుకుంది. భయాన్ని బలంగా మార్చుకోవడం అంటే ఇదే.→ బ్యూటీ విత్ ఏ పర్పస్మిస్ ఇండియా పోటీకి కేవలం మూడు నెలల ముందే సిద్ధమైన సాధ్వీ క్రమశిక్షణతో పది కిలోలకు పైగా బరువు తగ్గి ‘టాప్ 5 బెస్ట్ బాడీ’లో నిలిచింది. తర్వాత కిరీటం గెలుచుకుంది. కానీ ఆమె లక్ష్యం కిరీటం కంటే పెద్దది. వినికిడి, మాటల లోపం ఉన్న పిల్లలకు మెరుగైన పోషకాహారం, సమాన అవకాశాలు కల్పించడం ఆమె ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ ప్రాజెక్ట్. టాంజానియా వేదిక కానున్న ‘మిస్ వరల్డ్ 2027’ పోటీలో భారత్ తరపున ఇలాగే విజయం సాధించాలని కోరుకుందాం. -
అత్తారింట్లో కూతురి నిర్వాకం..చితకబాదిన అమ్మ
ఇటీవల కాలంలో కోడళ్లు ఎలా ఉంటున్నారో తెలిసిందే. ఆధునిక కాలం అత్తలకు కోడళ్లు దడవడం లేదు. కోడళ్లే అత్తలను భయపెట్టే రేంజ్లో ఉంటున్నారు. పైగా ఏ మాత్రం తేడా వచ్చినా..వేరు కాపురం, ఆస్తులు కావాలని డిమాండ్ ఒకటి కాదు..రెండు కాదు ఎన్నో వింతలు విడ్డూరాలు జరుగుతున్నాయి. అత్తలకు భయపడే కోడళ్ల కాలం చెల్లినదిగా మారిపోయింది. అంత వరకు ఓకేగానీ కనీసం అత్తమామలను స్నేహితుల్లా లేదా సాటి మనిషిగా చూడకుండా నానాయాతను పెడుతున్నారు నేటితరం కొందరు కోడళ్లు. దానికి పుట్టింటివాళ్లు వత్తాసు పలికి పెళ్లిని మూణ్ణాళ్ల ముచ్చటలా మార్చేస్తున్న ఘటనలు కోకొల్లలు. అలాంటి కాలంలో నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఘటన అత్యంత అరుదైనది , రికార్డు ఘటనగా చెప్పొచ్చు.ఇంతకీ ఏం జరిగిందంటే..కోడలు తన అత్తమామల కోసం వంట చేయలేదు. ఆ విషయం తెలుసుకున్న తల్లి అక్కడకు చేరుకుని నేరుగా కూతరు వద్దకు పోయి చితకబాదింది. అంతేగాదు అత్తమామలకు భోజనం వడ్డించమని ఆదేశించింది. ఇటీవలకాలంలో ఇది అత్యంత అరుదైన ఘటన అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.The daughter in-law did not cook food for her in- laws. Her mother arrived at the scene, gave her daughter a thrashing, and immediately instructed her to serve her in lawsThis is rarest of rare case in India in recent history, you know what i mean. pic.twitter.com/5h1VdYtYh1— Woke Eminent (@WokePandemic) April 19, 2026 (చదవండి: కూరగాయలు అమ్మడం నుంచి సైనికుడిగా! కట్చేస్తే..) -
పచ్చని స్వర్గధామం..సమ్మర్లో తప్పక చూడాల్సిన ప్రదేశం!
కాశ్మీర్ వేసవి అనుభవం కేవలం ఒక ప్రయాణం కాదు.. ప్రకృతి, సంస్కృతి ప్రశాంతత కలిసిన ఒక సజీవ కావ్వధార. ‘భూమిపై స్వర్గం’గా పేరొందిన ఈ ప్రాంతం, వేసవి కాలంలో తన సంపూర్ణ సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది. మంచుతో కప్పబడిన శిఖరాలు, పచ్చని పర్వత లోయలు, నీలిరంగు సరస్సులు, పూలతో నిండిన తోటలు... ఇవన్నీ కలిపి కాశ్మీర్ను ఒక కలల ప్రపంచంలా మార్చేస్తాయి.. పూలతో నిండి బోట్లుశ్రీనగర్కి ఆభరణంలా వెలుగొందే దాల్ సరస్సు, కాశ్మీర్ పర్యాటకానికి కేంద్రబిందువుగా నిలుస్తుంది. ఇక్కడి ప్రశాంత వాతావరణం మనసును వెంటనే ఆకర్షిస్తుంది. శికారా పడవలో సరస్సు మీద నెమ్మదిగా ప్రయాణించడం ఒక మధురమైన అనుభవం. నీటి మీద తేలియాడే తోటలు, పూలతో నిండిన హౌస్బోట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రత్యేకంగా తెల్లవారుజామున జరిగే తేలియాడే కూరగాయల మార్కెట్ అనుభవం మరచిపోలేనిది. స్థానిక రైతులు తమ పడవలలో తాజా కూరగాయలను విక్రయించే ఈ దృశ్యం, కాశ్మీర్ జీవనశైలిని దగ్గరగా పరిచయం చేస్తుంది.మొఘల్ తోటలువేసవి ప్రారంభంలో శ్రీనగర్ చుట్టూ ఉన్న తోటలు పుష్పాలతో కళకళలాడుతుంటాయి. టులిప్ ఉత్సవం ఏప్రిల్లో ముగిసినా, షాలిమార్ బాగ్ మరియు నిషాత్ బాగ్ వంటి మొఘల్ తోటలు ఇంకా అందంగా వికసిస్తూనే ఉంటాయి. ఈ తోటల్లో విహరించడం ఒక రొమాంటిక్ అనుభూతిని కలిగిస్తుంది. ప్రతి మూలలోనూ ప్రకృతి అందాల పరిమళం మనసును హత్తుకుంటుంది.పచ్చని స్వర్గధామం..‘పూల మైదానం’గా పేరొందిన గుల్మార్గ్ వేసవిలో మరింత ఆకర్షణీయంగా మారుతుంది. మంచు కరిగిపోయిన తర్వాత పచ్చని గడ్డి మైదానాలు విస్తరించి, కనిపిస్తాయి. గుల్మార్గ్ గోండోలా రైడ్ ఆసియాలోనే అత్యంత ఎతైన కేబుల్ కార్లలో ఒకటి. ఈ ప్రయాణంలో హిమాలయ పర్వతాల అద్భుత దృశ్యాలు కళ్లముందు ప్రత్యక్షమవుతాయి.దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రవాణా, వసతి సదుపాయాలు ఉన్నాయి. ఐఆర్సిటితోపాటు ఇతర ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు కూడా ప్యాకేజీని అందిస్తున్నాయి.నాలుగు, ఐదు, ఎనిమిది రోజులకు గాను రూ.20 వేల నుంచి రూ. 2.5 లక్షల వరకు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. కాశ్మీర్ వేసవి అనుభవం ఒక కలలా ఉంటుంది. ప్రతి ప్రదేశం ఒక కథ చెబుతుంది. ప్రకృతి అందాలు, సాంస్కృతిక సంపద, ప్రశాంత జీవనం కలిసిన ఒక అద్భుత ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. నూతన సంవత్సరాది బోహాగ్ బిహుదేశంలో చల్లని ప్రదేశంగా పేరొందిన అస్సాంలో ఆనందంగా జరుపుకునే సంవత్సరాది పండగ బోహాగ్ బిహె. దీనిని ‘రొంగలీ బిహు’ అని కూడా పిలుస్తారు. ఉత్సాహభరితమైన పండుగగా పేరొందింది ఇది అస్సామీ నూతన సంవత్సరాన్ని, వసంతకాలం ఆగమనాన్నీ సూచిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో సంవత్సరాది ఉగాది. అస్సామీల సంవత్సరాది బోహాగ్ బిహు. ఈ పండుగ సాధారణంగా ఏప్రిల్ నెల మధ్యలో (అస్సామీ నెల ’బోహాగ్’ మొదటి రోజు) వస్తుంది. దీనిని వాళ్లు వారం రోజుల పాటు జరుపుకుంటారు.పంటల కోసం దేవుని ఆశీర్వాదం..ఈ పండగ వ్యవసాయ సీజన్ ప్రారంభాన్ని సూచిస్తుంది. రైతులు ఏడాది అంతా పంటలు బాగా పండాలని, ఈ రోజున వారు దేవుని ఆశీర్వాదం కోరుకుంటారు. ‘రొంగలి’ అంటే ఆనందం, రంగుల పండుగ అని కూడా అర్థం.పండగ మొదటి రోజును గోరు బిహు అంటారు. ఆ రోజున ఆవులను, ఎద్దులను పసుపు, ఇతర ఔషధ మూలికలతో కడిగి, పూల దండలు వేసి, పూజలు జరుపుతారు. బెండకాయలు, పొట్లకాయలు తినిపిస్తారు.పండగ రెండవ రోజున మనుహ్ బిహు అంటారు. ఆ రోజున ప్రజలు కొత్త బట్టలు ధరించి, పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. స్నేహితులు, బంధువుల దగ్గరకు వెళ్లి, పిఠా అనే సంప్రదాయ వంటకాన్ని, రుచికరమైన పదార్థాలను పంచుకుంటారు.ఆనందంగా నృత్యాలు..యువతీ–యువకులు సంప్రదాయ దుస్తులను అలంకరించుకుంటారు. డ్రమ్స్ వాయిస్తూ, కొమ్ముతో చేసిన వాయిద్యాలతో శబ్ధం చేస్తూ నృత్యం ఆనందంగా చేస్తారు. ఈ ఏడురోజుల పండగను చూడటానికి టూరిస్టులు ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా వెళుతుంటారు. (చదవండి: సమ్మర్లో ఆ ప్రదేశాలకు వెళ్తే..వేసవి కూడా చిల్గా..!) -
కొత్త బంగారు లోకం..! బెస్ట్ డెస్టినేషన్ ప్లేస్ ఇది..
యూరోప్లో అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్ ఉన్న ప్రాంతంగానే కాదుఅందమైన కిరీటంగా భాసిల్లుతోంది జంగ్ఫ్రాజోచ్ భూమి మీద నుంచి ఆకాశాన్ని హత్తుకున్నట్టుమంచు కొండల మధ్యలో గడిపిన క్షణాలు...ఎండాకాలంలో చల్లని గాలి పలకరింపు.. మాటలకు అందని ప్రయాణానుభూతిని జంగ్ఫ్రాజోచ్ అందిస్తుంది. స్వర్గపు తలుపు తెరిచి కొత్త లోకంలోకి వెళ్లామా..! అనే ఆశ్చర్యానందంలో ముంచెత్తుతుంది.స్విట్జర్లాండ్లోని ఇంటర్లేకన్ దగ్గర మొదలై.. పచ్చని కొండల మధ్య నుంచి మెల్లిగా మంచు మెరుపుల వైపు వెళ్లే జంగ్ఫ్రాజోచ్ ప్రయాణం మనసును మృదువుగా తాకుతోంది. జీవితకాలపు అనుభూతిని అందిస్తుంది.సందర్శనీయ ప్రదేశాలుఐగర్ గ్లేషియర్ నుంచి మొదలై స్పింక్స్ అబ్జర్వేటరీ దాకా వెళ్లే ప్రతీ అడుగు ఒక కొత్త పరిశోధనలా ఉంటుంది. ఐస్ ప్యాలెస్లోని టన్నెల్స్లో నడస్తుంటే మనం ఒక డ్రీమ్ వరల్డ్లో ఉన్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది. ఐస్తో చేసిన కళాఖండాలు మనిషి, ప్రకృతి కలిసే చేసే సృజన అద్భుతంగా ఎలా ఆవిష్కరిస్తుందో అర్థం అవుతుంది.ఐస్ ప్యాలెస్లో అనుభవాలుగ్లేషియర్ లోపల తవ్విన ఈ టన్నెల్స్లో నీలి రంగు మెరుపులు మన కళ్ల ముందు ఒక మేజిక్లా కదులుతూ ఉంటాయి. ఇక్కడ గద్ద, ఎలుగుబంటుల రూపంలో చేసిన మంచు శిలలు చాలా సహజసిద్ధంగా అనిపిస్తాయి. ఉదయం వేళలో ఈ ఐస్ ప్యాలెస్కి వెళ్లడం ఎంతో మధురానుభూతిని కలుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో క్రౌడ్ తక్కువగా ఉంటాయి. ఆ ప్రశాంతతను ఆస్వాదించవచ్చు.ఎక్కడ ఉండాలి?ఇంటర్లేకన్ లేదా గ్రైండెల్వాల్డ్ విలేజెస్లోని ట్రెడిషనల్ స్విస్ చాలెటట్స్ ఉంటే ప్రతీ ఉదయం మంచు కొండలు పలకరిస్తాయి. వుడెన్ వాల్కనీస్ నుంచి కనిపించే వ్యూ, రాత్రి పూట మెరిసే నక్షత్రాలు మనకు మర్చిపోలేని మధురానుభూతులను ఇస్తాయి. ఈ ప్రాంతంలో ఉండే హోటల్స్లో బస ప్రకృతికి దగ్గరగా ఉన్నాం అనే ఫీలింగ్ని ఇస్తుంది.ఎలా వెళ్లాలి? ప్రయాణం స్విట్జర్లాండ్లోని ఇంటర్లేకన్ నుంచి మొదలవుతుంది. అక్కడి నుంచి గ్రైండెల్వాల్డ్ టర్మినల్ రీచ్ అయ్యి, అక్కడి నుండి ఐగర్ ఎక్స్ప్రెస్ కేబుల్ కార్ ఎక్కితే గంటలోనే పీక్స్ వరకు వెళ్లిపోవచ్చు.ట్రైన్ వెళ్లేప్పుడు విండో సీట్ దగ్గర ఉంటే నేచర్లో వచ్చే వ్యూస్ని కెమెరాలో బంధించవచ్చు.ఏం చూడాలి?స్పింక్స్ అబ్జర్వేటరీ నుంచి ఆలెష్ గ్లేషియర్ను చూడటం ఒక సీ ఎక్స్పీరియెన్స్ అవుతుంది.యూరోప్లోని పెద్ద గ్లేషియర్లో అలెష్ గ్లేషియర్ని చూస్తే తెల్లని నదిలా పర్వతాల మధ్యలో నుంచి ప్రవహిస్తుందా అనిపించక మానదు. మధ్యాహ్నం సమయంలో గ్లేషియర్పై సూర్య కిరణాలు ఒక కొత్త రంగును పరిచయం చేస్తాయి. ఆ దృశ్యాన్ని చూసేందుకు రెండు కనులు సరిపోవు.ఏం తినాలి ?ఇక్కడ చాకొలెట్ షాప్లో దొరికే ఫ్రెష్ స్విస్ ఛాకోలేట్స్ ఒక ప్రత్యేక రుచిని పరిచయం చేస్తాయి. చల్లగా ఉన్న శిఖరాల మధ్యలో వేడిగా ఉండే స్విస్ ఛీజ్ లేదా ట్రెడిషనల్ సూప్ సేవిస్తూ ఉంటే ఆ టేస్ట్ని ఎప్పటికీ మర్చిపోలేం. లిండ్ట్ చాకొలేట్ హెవెన్లో దొరికే హాట్ చాకొలేట్ ఆ కోల్డ్ వెదర్లో ఒక వేడిని, ఎనర్జీని ఇస్తుంది. యాక్టివిటీస్స్నో ఫన్ పార్క్లో మంచు మీద ప్రయాణం, ఐస్ ప్యాలెస్లోని టన్నెల్స్లో ఫోటోస్ తీసుకోవడం, ఆల్పైన్ సెన్సేషన్ కారిడార్లో నడుస్తూ జంగ్ఫ్రాజోచ్ హిస్టరీ గురించి తెలుసుకోవచ్చు.యూరోప్లోని హయ్యెస్ట్ పోస్ట్ ఆఫిస్ నుంచి ఒక పోస్ట్ కార్డు పంపడం మర్చిపోలేని ఙ్ఞాపకంగా. స్పింక్స్ డెక్పై నుంచి చుట్టూ ఉన్న పీక్స్ని అబ్జర్వ్ చేస్తూ ప్రశాంతంగా కూర్చోవచ్చు.సమ్మర్లో ట్రిప్ ప్లాన్ చేస్తే సన్గ్లాసెస్ మర్చిపోకండి. స్నో రిఫ్లెక్షన్ కంటి చూపుపై ప్రభావం చూపిస్తుంది.– ఎం.జి.కిశోర్, ప్రయాణికుడు (చదవండి: పర్ఫెక్ట్ సమ్మర్ డెస్టినేషన్..! అక్కడ సమయం గడవదు..) -
కూరగాయలు అమ్మడం నుంచి సైనికుడిగా! కట్చేస్తే..
చదివే అవకాశంలోని కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినా..వెనకడుగు వేయలేదు. ఫీజు చెల్లించే పరిస్థితి లేకపోయినా..కూరగాయలు అమ్ముతూ చదువు సాగించాడు. అలా దేశ సేవ చేయాలని ఆర్మీలో చేరాడు. రిటైర్ అయ్యాక కూడా చదవాలనే కోరికను కొనసాగించాడు. ఆ ఆసక్తితో ఎన్ని డిగ్రీలు పూర్తి చేశాడో తెలిస్తే విస్తుపోతారు. పైగా అన్ని డిగ్రీలు పూర్తి చేసి ఎన్ని రికార్డులు నెలకొల్పాడో తెలిస్తే 'జయహో సైనికుడా' అని ప్రశంసించకుండా ఉండలేరు.అతడే రాజస్థాన్లోని ఝున్ఝును జిల్లాలోని ఖిరోడ్ గ్రామానికి చెందిన దశరథ్ సింగ్. తన కుటుంబంలో అంతగా విద్యకు ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదు. ఎందుకంటే పూటగడవడమే కష్టం కావడంతో ఆ ఆలోచనే వచ్చేది కాదు. అయినా సరే ఆ ఆర్థిక ఇబ్బందులను తట్టుకుంటూ చదువు సాగించాడు. కానీ కాలేజీ చదువులకు ఫీజులు చెల్లించలేక స్వస్తి పలకాల్సి వచ్చింది. అయినా కూడా ఆశను వదులకోలేదు. పొలంలో పండిన కూరగాయలు అమ్మేందుకు ఏకంగా 13 కిలోమీటర్లు నడిచి మరి చదువుకి నిధులు సమకూర్చుకున్నాడు. ఆ తర్వాత భారత సైన్యంలో చేరి పంజాబ్, జమ్మూ కాశ్మీర్లలో పోస్టింగ్తో సహా 16 ఏళ్లు పనిచేశాడు. సర్వీస్లో ఉన్నప్పుడు కూడా తన వార్షిక సెలవులను చదువు కోసం ఉపయోగించేవాడు. సైనిక విధులతో పాటు నిశ్శబ్దంగా బలమైన విద్యా పునాదిని నిర్మిచుకున్నాడు దశరథ్ సింగ్. ఇక 2004లో పదవీ విరమణతో సింగ్ తన చిరకాల ఆశయం నిజం చేసుకునే దిశగా అడుగులు వేసి..ఎవ్వరూ ఊహించన విధంగా వందలకొద్దీ డిగ్రీలు పూర్తి చేశాడు. మొత్తం తన జీవితాన్ని చదువుకే అంకితం చేశాడు. సుమారు 138 డిగ్రీలు పూర్తి చేశాడు. తన విద్యా విజయాలు కారణంగా మొత్తం 11 ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. అలాగే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వంటి సంస్థల నుంచి గుర్తింపు పొందాడు. వీటిలో చాలామటుకు డిగ్రీలు ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ వంటి గుర్తింపు పొందిన సంస్థల నుంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో పూర్తి చేశారు. చదవడానికి వయసుతో సంబంధం లేదని నిరంతర కృషి, అచంచలమైన పట్టుదల ఉంటే..నిరంతరాయంగా కొనసాగించవచ్చు అనడానికి ఈ మాజీ సైనికుడే ఉదాహరణ. (చదవండి: ఆలయాన్ని తలపించే కేఫ్..! ఏకంగా ప్రపంచంలోనే..) -
ఆలయాన్ని తలపించే కేఫ్..! ఏకంగా ప్రపంచంలోనే..
ఎన్నో కేఫ్లు చూసుంటాం. ఇలాంటి కేఫ్ చూసే ఛాన్సే లేదు. ఎందుకంటే..మనసుకి హాయినిచ్చే ఆధ్యాత్మికత, కడుపు నింపే కమ్మని భోజనం ఒకే చోట లభించే హోటల్ లేదా రెస్టారెంట్ గురించి ఇంతవరకు చూడలేదు. అలాంటి అపురూపమైన దృశ్యం ఆ కేఫ్లో చూడొచ్చు. ఆలయానికి వెళ్తున్నామా లేక కేఫ్కి వెళ్తున్నామా అనే గందరగోళానికి గురి చేసే అద్భుతమైన కేఫ్ ఇది. ఎక్కడ ఉందంటే..బొమ్మసంద్రలోని బెంగళూరు కొత్త రామేశ్వరం కేఫ్, 9 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో 'ప్రపంచంలోనే అతిపెద్ద కేఫ్'గా అలరారుతోంది. ఇందులో 600 మందికి పైగా కూర్చునే సౌకర్యం ఉంది. ఆదియోగి విగ్రహంతో కూడిన ఒక జలాశయం కూడా ఉంది. బొమ్మసంద్రలో రామేశ్వరం కేఫ్ సరికొత్త అతిపెద్ద అవుట్లెట్తో బెంగళూరు పాక ప్రపంచాన్ని ఓ రేంజ్కి తీసుకెళ్లింది. ఆలయ ప్రాంగణాన్ని తలపించే ప్రవేశ ద్వారం అత్యంత ఆకర్షణీయంగా ఆకట్టుకుంటుంది. అతిథులు రాగానే, మధ్యలో ఆదియోగి విగ్రహం, ఫౌంటెన్తో కూడిన ప్రశాంతమైన జలాశయం వారికి స్వాగతం పలుకుతుంది. దక్షిణ భారత దేవాలయ వాస్తుశిల్పాన్ని ఆధునికతను జోడించి..భోజనాన్ని కేవలం ఒక పూట భోజనంగా కాకుండా ఒక ఆధ్యాత్మిక ఆచారంగా అందంగా మార్చారు. 'దైవ స్పర్శ' అనే థీమ్తో ఈ కేఫ్ని నిర్మించారట. ఈ కేఫ్లో హైలెట్గా దేవి లింగ భైరవి ఆలయం, అలాగే కర్ణాటక వారసత్వానికి ప్రతీక అయిన భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యాలు, వీణా కచేరీలతో సహా సంగీత ప్రదర్శనల కోసం రూపొందించిన ఒక యాంఫీథియేటర్ కూడా ఉంది. అలాగే అక్కడ సేవ కౌంటర్ల వద్ద విత్ర చిహ్నాల క్లిష్టమైన చెక్క శిల్పాలు చూపురులను ఆకర్షిస్తాయి. ఇక్కడ ఒక ప్రత్యేక గోశాల కూడా ఉంది. ఆధ్యాత్మిక దృశ్యాలను ప్రదర్శించే హై-టెక్ డిజిటల్ స్క్రీన్లు, పురాతన రాతి విగ్రహాల వైభవంతో చాలా అందంగా తీర్చిదిద్దారు. 'ది రామేశ్వరం కేఫ్' వ్యవస్థాపకుడు రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. ఈ భారీ ప్రాజెక్ట్ వెనుక ఉన్న తత్వాన్ని గురించి వెల్లడించారు. ఇది సంస్కృతి, నమ్మకం, ఆహారం ఏకమై ఉండే ఒక ప్రదేశాన్ని సృష్టించడమే లక్ష్యంగా ఇలా కేఫ్ని తీర్చిదిద్దామని అన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అంతేగాదు పోస్ట్లో రామేశ్వరం కేఫ్ ఇలా పేర్కొంది. ఇక్కడ ప్రతి దేవాలయం, ప్రతి విగ్రహం, ప్రతి వివరం ఒక ఉద్దేశ్యంతోనే ఉంచాం. కేవలం సర్వీస్ మాత్రమే కాదు సంస్కృతి, నమ్మకం, ఆహారం కలగలిసిన అనుభూతికి కేంద్రబిందువుగా ఒక దేవాలయ అనుభూతిని తీసుకొచ్చే.. ఒక దివ్యమైన భోజన అనుభవం అని ప్రకటించింది. View this post on Instagram A post shared by Aditya Raj | Dev & Creator (@addywithlens) (చదవండి: లండన్ వ్లాగర్ మదిని దోచిన వంటకం..! అత్యంత ఆరోగ్యకరం కూడా..) -
వృథా కానీ ఎకానమీగా వెదురు.. సాగు ఒక్కటే చాలదు!
వెదురు వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఔషధ గుణాల దగ్గరి నుంచి సౌందర్య సాధనాల తయారీలోనూ దీని వినియోగిం పెరిగింది. దీంతో భారత్ సహా చాలా దేశాలు సాగును పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నాయి. అయితే పంటకు ప్రాముఖ్యత ఇచ్చినంత మాత్రన సరిపోదంటున్నారు శాస్త్రవేత్తలు. వెదురు విప్లవం సాగుకే పరిమితం కాకూడదని, దాన్నో ఎకానమీగా మారాలంటే రీసెర్చ్ అవసరమని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (నీతిఆయోగ్)–ICAR–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సీఈవో డాక్టర్ ఆదర్శ గౌడ. మరి అదెలాగో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందాం..వెదురు ఇండస్ట్రీని తీసుకురావాలంటే.. కేవలం భావోద్వేగ ప్రచారాలు, హ్యాష్ ట్యాగులు కాదని.. రీసెర్చులు జరిగితేనే ఆ పరిశ్రమలు నిలబడతాయని చెబుతున్నారు ఆదర్శ గౌడ. ఆ అవసరం ఎందుకో ఆయన వివరించారు. ఐరన్ వెదురు (Guadua) షూట్స్లోని చేదు రుచి కారణమైన బయో–యాక్టివ్ ఫ్లేవనోయిడ్లు, ఫెనాలిక్ కంపౌండ్లు, ప్రాసెసింగ్ చేయకపోతే హానికరమైన సైనోజెనిక్ గ్లైకోసైడ్లను సూచిస్తుందని చెబుతున్నారాయన. ఈ చేదులో ఆంటీ–డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయని.. రక్తంలో చక్కెర నియంత్రణకు తోడ్పడే ఫంక్షనల్ ఫుడ్గా నిలిచే అవకాశాలు ఉన్నప్పటికీ, శాస్త్రీయ ధృవీకరణ, సేఫ్ ప్రాసెసింగ్ కీలకమని ఆయన హెచ్చరించారు.అలాగే ఐరన్ వెదురులో తక్కువ సిలికా కంటెంట్ ఉండటంతో ఎకో–టూరిజం పార్కులు, వినోద అరణ్యాలు వంటి పర్యావరణ హితమైనవి తీసుకురావొచ్చని అన్నారు. దీంతోపాటు వెదురు ఫైబర్తో తయారయ్యే ఎండీఎఫ్ బోర్డులు రైలు మార్గాల సౌండ్ బ్యారియర్లు, భవనాల ఇన్సులేషన్, అకౌస్టిక్ ప్యానెల్స్ వంటి రంగాల్లో భారీ మార్కెట్ను ఆకర్షించే సామర్థ్యం ఉందన్నారు. అలాగే వెదురు ఆకులు, కొమ్మలతో తయారయ్యే బయోడిగ్రేడబుల్ ఎగ్ ట్రేస్, ప్లేట్లు, ప్యాకేజింగ్ పల్ప్ ప్లాస్టిక్కి అడ్డుకట్ట వెయ్యొచ్చు. పైగా అగ్రికల్చరల్ వ్యర్థాన్ని ఆదాయంగా మార్చే గొనంన అవకాశం కూడా అని అన్నారు. ఆఖరికి వెదురు ఆకులు, కొమ్మలతో తయారయ్యే బయోడిగ్రేడబుల్ ఎగ్ ట్రేస్, ప్లేట్లు, ప్యాకేజింగ్ పల్ప్ ప్లాస్టిక్కి అడ్డకట్ట వెయ్యొచ్చుని చెప్పారు. అలాగే వెదురు షూట్స్(తినదగిని వెదురు లేత రెమ్మలు) స్నాక్స్గా, ఫ్లవర్, ఫెర్మెంటెడ్ ఫుడ్స్, అలాగే టెక్స్టైల్ ఫైబర్లు, పశువుల మేత, మెడికల్ ఎక్స్ట్రాక్టుల వరకు దీన్ని విస్తరించవచ్చని చెబుతున్నారు. ఇవన్నీ జరగాలంటే రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ వల్లే సాధ్యమని, ఇది కేవలం ల్యాబ్ కాదని పరిశ్రమకు బ్రెయిన్ లాంటిదని చెబుతున్నారు. ఈ సెంటర్ ద్వారా ఉపయోగాలేంటంటే..ఎలాంటి చోట వెదురు పెంచాలో రైతులకు చెప్పడంఎలాంటి వెదురు మొక్కలను పెంచాలో రైతులకు సూచనలు ఇవ్వడం..ఏ పొడక్ట్లకు మార్కెట్ సుస్థిరమో ఇన్వెస్టర్లకు క్లారిటీ ఏ రంగాల్లో సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలో ప్రభుత్వానికి గైడ్స్టాండర్డ్స్, క్వాలిటీ కంట్రోల్, పేటెంటబుల్ ఇన్నొవేషన్లు సిస్టమాటిక్గా బయటకు రావడంఅంతేగాదు ఈ ఆర్ అండ్ డీ సెంటర్ వల్ల నేరుగా ఇంజినీర్లు, టెక్నీషియన్లు, ప్రోడక్ట్ డెవలపర్లు, డేటా అనలిస్టులకు ఉద్యోగాలు వస్తాయని, పక్కనే రైతులు, ఇండస్ట్రీ వర్కర్లు, లాజిస్టిక్స్, మార్కెటింగ్, ఎక్స్పోర్ట్ రంగాల్లో కూడా కొత్త ఉపాధి అవకాశాలు తెరుచుకుంటాయని తెలిపారు. ఇది “లైవ్లీహుడ్ ప్రాజెక్ట్” స్థాయిలో ఉండే వెదురు సాగును, నిజమైన ఆర్థిక రంగంగా మారుస్తుందని డా. గౌడ అభిప్రాయపడ్డారు. అందువల్ల వీటిని సాగు ఒక్కటే భవిష్యత్తు కాదని, మరింత లోతుగా అధ్యయనం చేయడం దాని వాల్యూ తెలుసుకోవడం అత్యంత ముఖ్యమని నొక్కి చెప్పారు. అందువల్ల ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో వెదురు విప్లవం మొదలైంది. గ్రామీణ సమాజాన్ని పేదరికం నుంచి బయటపడేసే హీరోగా, భూమిని రక్షించే మొక్కగా, అలాగే నిర్మాణ రంగానికి ఆయువు పట్టుగా కీర్తిస్తున్నారు. అలాంటి వెదురు కలప పరిశ్రమ వాస్తవికతలోకి రావాలంటే పరిశోధనల్లో పెట్టుబడులు పెడితేనే సాధ్యమని లేదంటే ప్రచారంగానే మిగిలిపోతుందని హెచ్చరించారాయన.(చదవండి: ముంచుకొస్తున్న వ్యవసాయ, ఆహార విపత్తు! ఎఫ్ఏఓ ఆందోళన) -
కండలు తిరిగిన దేహంతో నిర్మాణ కార్మికుడు..! కేవలం ఆ ఆహారంతోనే..
సల్మాన్లాంటి శరీరాకృతి, కండలు తిరిగిన దేహం కోసం యువత ఎంతలా పరితపిస్తూ జిమ్లో కష్టపడుతుంటారో చూస్తుంటాం. కొందరు స్టెరాయిడ్ల వంటి షార్టకట్లను ఆశ్రయిస్తుంటారు. అలా ఉంటేనే తమకు క్రేజ్, స్టార్డమ్ అన్నట్లుగా ఫీలయ్యేవాళ్లు ఉన్నారు. కానీ ఓ సాధారణ భవన నిర్మాణ కూలీ కండలతిరిగి దేహంతో ఉండటం అనేది అత్యంత అరుదు. పైగా అంత పోషకాహారంతో కూడిన భోజనం తినే అవకాశం, వ్యాయామాలు చేసే అవకాశం ఉండదు. కానీ ఆ కార్మికుడిని చూస్తే మన ఆలోచన తీరు మారుతుంది. తనకున్న వనరుల రీత్యా..తన బాడీని ఎలా ఫిట్గా ఉంచాలో కేర్ తీసుకుంటూ కండలు తిరిగిన దేహంతో అబ్బురపరుస్తున్నాడు. అతడి అనుసరిస్తున్న డైటింగ్ విధానం, వర్కౌట్లు గురించి తెలిస్తే విస్తుపోతారు. అన్నింట్లకంటే ఆశ్చర్యకరమైనది అతడు జిమ్కే వెళ్లడట. అలాంటప్పడు అతడికి ఇంతలా కండలు పెంచడం ఎలా సాధ్యమైంది అంటే ..కంటెంట్ క్రియేటర్ జయచంద్రన్ తమిళరసన్ ఇటీవల ఓ చెన్నై కార్మికుడి శరీర సౌష్టవాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తమ మధ్య జరిగిన సంభాషణ మొత్తం వీడియో రూపంలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది. ఆ వీడియోలో భవన నిర్మాణ పనులు చేసే అతడికి ఇలాంటి దేహం ఎలా సాధ్యమైందని కుతూహలంతో అడుగడం సష్టంగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి తన శరీరాకృతికి సహాయపడిని వ్యాయామ దినచర్య, ఆహారపు అలవాట్లు గురించి కూడా ప్రశ్నిస్తాడు కంటెంట్ క్రియేటర్ జయచంద్రన్. తాను నిర్మాణ కార్మికుడుగా మండుటెండలో తీవ్రమైన శ్రమతో కూడిన పనలు చేస్తుంటానని తెలిపాడు. తనకు రోజు కఠినమైన దినచర్య, ఎక్కువ పనిగంటలు ఉన్నప్పటికీ..వారానికి కనీసం ఐదుసార్లు వ్యాయామం చేసేలా చూసుకుంటానని చెప్పాడు. సోమవారం ఛాతీ వ్యాయామం, మంగళవారం భుజాల వ్యాయామం, బుధవారం వీపు వ్యాయామం, గురువారం బైసెప్స్, ట్రైసెప్స్ కోసం కేటాయిస్తుంటానని అన్నారు. శుక్రవారం కాళ్ల వ్యాయామం చేస్తుంటానని చెప్పారు. అతడు చేసేది శ్రమతో కూడిన పని కాబట్టి తీవ్రమైన కాళ్ల వ్యాయమాలు చేయనని అన్నారు. తన పనిలో కష్టపడ్డాక తన బాడీ కోసం ఎలా కేర్ తీసుకువాలో అలాగే దాన్ని ఎలా అమలు చేయాలో అనే దానిపై అతనికి ఉన్న స్పష్టత స్ఫూర్తిని కలిగిస్తోంది. డైటింగ్..కండలు తిరిగిన దేహం కోసం ప్రయత్నిస్తున్న వారికి అధిక కార్బోహైడ్రేట్ల ఆహారం సాధారణంగా ప్రతికూల ఫలితాలనిస్తుందని భావిస్తారు. అందుకే వాళ్లంతా తరుచుగా ప్రోటీన్ అధికంగా ఉండే భోజనాన్ని ఎంపిక చేసుకుంటారు. కానీ చెన్నైకి చెందిన ఈ నిర్మాణ కార్మికుడు అందుకు భిన్నంగా ఎంచుకోవడం విశేషం. అతడికి వృత్తిపరంగా అధిక కార్బోహైడ్రేట్లు అవసరం. అందుకే రోజుకు మూడుసార్లు అధిక కార్బోహైడ్రేట్లు ఉండే భోజనాన్ని ఎంచుకుంటాడు. అందులో అన్నం, అరటిపండ్లు, గంజి ఉంటాయి. పండ్లు తినడం కూడా అరుదని చెప్పాడు. అయితే వారానికి ఒకసారి మాంసాహారం తింటానని చెప్పాడు. తాను చికెన్ లేదా చేపలు మాత్రం తీసుకోనని చెప్పుకొచ్చాడు. అలాగే తాను కండలు కోసం ఎలాంటి స్టెరాయిడ్లు తీసుకోలేదని వెల్లడించాడు. అలాగే ఎలాంటి వాణిజ్య డైట్ప్లాన్లు లేదా వే ప్రోటీన్లు గానీ తీసుకోనని, కేవలం శుభ్రమైన ఆహారమే తీసుకుంటానని అన్నారు. ప్రతిరాత్రి కనీసం ఏడు గంటలు నిద్రపోయేలా చూసుకుంటానని చెప్పారు. తాను ఇంట్లో వండిన ఆహారమే తింటానని అన్నాడు. చివరగా అందర్నీ జండ్ ఫుడ్ తినొద్దని, మధ్యం, ధూమపానానికి దూరంగా ఉండమని సూచించాడు. ఆ కార్మికుడు నిబద్ధత ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది, పైగా అతడిని చూస్తే..ఏ పనైనా నూటికి నూరు శాతం కష్టపడితే సాధ్యం కానిది అంటూ ఉండదు అని చెబుతోంది కదూ అంటూ వీడియోని ముగిస్తాడు కంటెంట్ క్రియేటర్ జయచంద్రన్ ..!. View this post on Instagram A post shared by Jayachandran Tamilarasan (@fit.blog.by.jc) (చదవండి: దివ్యాంగుడైన తండ్రిని భుజాలపై మోస్తూ..! కన్నీళ్లు తెప్పించే దృశ్యం) -
సైంధవుడిలా అడ్డు పడ్డట్టు....
ఎవరైనా ఏదైనా పనికి అడ్డుపడితే ‘సైంధవునిలా అడ్డు పడుతున్నాడు‘ అనే నానుడి సమాజంలో ఉంది. ఇందుకు సంబంధించి ఈ నానుడి ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం.మహాభారతంలో కౌరవుల ఏకైక సోదరి దుస్సల అని అందరికీ తెలిసిందే. ఆమె భర్తే సైంధవుడు. ఇతడి అసలు పేరు జయద్రథుడు. సింధు దేశాన్ని పాలించిన రాజు కాబట్టి సైంధవుడు అని పేరు వచ్చింది. సైంధవునికి దుస్సలతో పాటు మందాకిని, కుముద్వతి అనే ఇరువురు భార్యలున్నారు.పాండవులు జూదంలో ఓడిపోయి అరణ్యవాసం చేస్తున్న రోజులలో ఒంటరిగా ఉన్న ద్రౌపదిని వావి వరసలు మర్చిపోయి బలవంతంగా రథం పైకి తీసుకువెళ్లడానికి సైంధవుడు ప్రయత్నించాడు. భీముడు సైంధవుని బంధించి ధర్మరాజు ముందు ప్రవేశపెట్టాడు. తమ చేతులతో అతడి ప్రాణాలు తీసి, చెల్లెలికి వైధవ్యం కలిగించకూడదనే ఉద్దేశంతో అందుకు సమానమైన శిక్షగా.. శిరోముండనం చేసి వదిలి పెట్టారు. దీంతో పాండవులపై పగతో సైంధవుడు శివుని గురించి తపస్సు చేసి అర్జునుడు మినహా మిగిలిన పాండవులను ఒక్కరోజు అడ్డుకునే వరాన్ని పొందాడు. కురుక్షేత్ర యుద్ధంలో 13వ రోజున ద్రోణుడు రచించిన పద్మవ్యూహంలోకి అభిమన్యుడు ప్రవేశించగా అతని వెనక పద్మవ్యూహంలోకి ప్రవేశించే అర్జునుడు మినహా మిగిలిన నలుగురు పాండవులను శివుని వరం వల్ల సైంధవుడు అడ్డుకున్నాడు. దీనివల్ల పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడు ఒంటరివాడై అసువులు బాసాడు. ఇదిలా ఉండగా అభిమన్యుడి మరణానికి కారణమైన సైంధవుడిని ఆ మర్నాడు సూర్యాస్తమయంలోగా చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. అర్జునుని ప్రతిజ్ఞ నెరవేర్చేందుకు సూర్యాస్తమయానికి ఇంకా సమయం ఉండగానే శ్రీ కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి, యోగమాయతో సూర్యునికి అడ్డువేశాడు. దీంతో చీకట్లు కమ్మడంతో సూర్యాస్తమయం అయిపోయిందని సైంధవుడు భావించి బయటకు రాగా అర్జునుడు సైంధవుడిని పాశుపతాస్త్రంతో వధించి అతని తల నేలపై పడకుండా అతని తండ్రి అయిన వృద్ధక్షతుడి చేతిలో పడేలా చేయమని శ్రీ కృష్ణుడు చెబుతాడు. ఎందుకంటే సైంధవుడి తల ఎవరి చేతిలోనుంచి కింద పడుతుందో వారి తల నూరు చెక్కలవుతుందన్న వృద్ధక్షతుడి శాపం అతనికే తగిలి అతడు కూడా మరణిస్తాడు. అప్పటినుంచి ఎవరైనా ఏ పనికైనా అడ్డుపడుతుంటే సైంధవుడిలా అడ్డు పడుతున్నాడన్న సామెత వ్యాప్తిలోకి వచ్చింది. – సి. ఎన్. మూర్తి, సీనియర్ పాత్రికేయులు -
రామ చరిత మానసం
బంగారు వ్యాపారం చేసే ఒక యువకుడు తన భార్యా బిడ్డలతో కలిసి అయోధ్య వెళ్ళదలిచాడు. మూడు నెలల ముందే రైలు ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ప్రయాణించే రోజు రానే వచ్చింది. భార్యా పిల్లలతో పాటు లగేజీ తీసుకుని రైల్వే స్టేషన్ చేరాడు. వారు ఎక్కాల్సిన రైలు వచ్చి ప్లాట్ మీద ఆగింది. వెంటనే పిల్లల్ని ఎక్కించి తను ఎక్కాడు.భార్య ప్లాట్ ఫాం మీద నిలబడి ఒక్కొక్క లగేజీ అందిస్తోంది. అతడు అందుకుంటున్నాడు. ఇంతలో రైలు కదిలింది. భార్య ప్లాట్ ఫాం మీదనే ఉంది. అమ్మకోసం పిల్లలు ఏడవటం ప్రారంభించారు. అతడిలో గాబరా మొదలయ్యింది. రైలు మరింత వేగం పుంజుకుంది. ఏం చేయాలో తెలియలేదు అతడికి. చైనులాగి రైలు ఆపమని తోటి ప్రయాణీకులు కొందరు సలహా ఇచ్చారు. అతడు అలాగే చేశాడు.రైలు ఆగింది. భార్య పరుగులు తీస్తూ వచ్చి రైలు పెట్టెలోకి వచ్చి చేరింది. వారి పక్క సీటులోనే ఒక వృద్ధ జంట కూర్చుని ఉంది. వృద్ధుడు సుందరకాండ చదువుతూ ఉన్నాడు. వృద్ధురాలు– ‘మన పక్క సీటు ఆమె, రైలు ఎక్క లేకపోవడం, ఆమె భర్త చైను లాగడం లాంటి హడావుడి జరుగుతున్నా మీకు చీమ కుట్టినట్లు కూడా లేదు. రైల్వే సిబ్బంది కూడా వచ్చి వెళ్ళారు’ అని నిష్టూర పోయింది. ఆ వృద్ధుడు చిన్న నవ్వు నవ్వి ‘అంతా గమనించాను. ఈ యువకుడు భక్తి భావంతో అయోధ్యకు బయలుదేరాడు కానీ, రామ చరిత మానసం చదివినట్లు లేడు’ అన్నాడు. పక్కనే ఉన్న ఆ యువకుడు ‘అలా అంటున్నారేమిటి? దానికీ దీనికీ సంబంధం ఏమిటి?’ అని ప్రశ్నించాడు. యువకుడి కళ్ళలోకి చూస్తూ ఆ వృద్ధుడు ‘అరణ్య వాసం వెళ్ళేటప్పుడు గంగానది దాటే సమయంలో పడవలోకి మొదటగా సీతను, తర్వాత లక్ష్మణుడినీ ఎక్కించి ఆ తర్వాత రాముడు ఎక్కుతాడు. మనం రామాయణం చదివితే ఇలాంటి మంచి మంచి సూక్ష్మ విషయాలెన్నో తెలుసుకోవచ్చు. వాటిని మన నిత్యజీవితంలోకి అన్వయించుకుని సుఖమైన జీవితాన్ని అనుభవించవచ్చు’ అన్నాడు. ‘నిజమే... ఎప్పుడూ రైలు ప్రయాణాల్లో ఆడవారిని మొదటగా ఎక్కించి మగవారు ఆ తర్వాత ఎక్కాలి. చీరలు కట్టుకునే స్త్రీలు రైలు వెనుక పరుగులు తీసి వాహనాన్ని అందుకోలేరు కదా’ అని వృద్ధురాలు హితవు మాటలు చెప్పింది.అప్పుడు గుర్తుకొచ్చింది ఆ యువకుడికి– చాలా నెలల క్రితం గోస్వామి తులసీదాస్ రచించిన రామ చరిత మానసం తెలుగు అనువాదం ఇంట్లో తెచ్చి పెట్టుకున్న విషయం. ప్రయాణం పూర్తయిన తర్వాత ఖచ్చితంగా చదివి తీరాలని అప్పటికప్పుడే నిర్ణయించుకున్నాడు. అందరూ రామ నామ స్మరణలు చేస్తూ అయోధ్య ప్రయాణం కొనసాగించారు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు -
మానవీయత మనిషికి అసలైన మకుటం
మానవ జన్మ ఒక అద్భుత కావ్యం అయితే, దానికి మాననీయత ఒక మకుటం వంటిది. మనిషి రూపం కేవలం ప్రకృతి ప్రసాదం, కానీ మనిషి వ్యక్తిత్వం అతను స్వయంగా మలచుకున్న శిల్పం. సమాజమనే అడవిలో అందరూ మనుషులుగా తిరుగుతుంటారు, కానీ సంస్కారమనే చందన గంధాన్ని పూసుకున్నవారే ‘మాననీయులు’ గా గుర్తింపు పొందుతారు. బాహ్యమైన అలంకారాలు కంటికి కనిపిస్తాయి, కానీ మాననీయత అనే అలంకారం గుండెలను తాకుతుంది.నిజమైన మాననీయత అంటే ఎవరూ చూడనప్పుడు కూడా ధర్మాన్ని అనుసరించడం. అధికారమున్నప్పుడు అణకువగా ఉండటం, శక్తి ఉన్నప్పుడు క్షమించడం మాననీయుల లక్షణం. మనిషిని కేవలం ఒక జీవిగా కాకుండా, ఒక మానవీయ శక్తిగా మార్చేది మాననీయత. గౌరవప్రదమైన ప్రవర్తన, ఉన్నతమైన నైతిక విలువలు., ఇతరుల పట్ల చూపే ఆదరాభిమానాల కలయికే మాననీయత. సృష్టిలో అత్యున్నతమైనది మానవ జన్మ. అయితే, కేవలం పుట్టుకతోనే ఎవరూ గొప్పవారు కాలేరు. మనిషిని మహనీయుడిగా, గౌరవప్రదమైన వ్యక్తిగా మార్చేది మాననీయత. సమాజ గమనానికి, మానవ సంబంధాల మనుగడకు మాననీయతే మూలాధారం.మాననీయత– అనే పదం గౌరవానికి చిహ్నం. ఒక వ్యక్తి తన మాట తీరు, ప్రవర్తన, పనుల ద్వారా ఇతరుల మనస్సులో సంపాదించుకునే స్థానమే ఇది. ఇది కేవలం బాహ్య రూపానికి సంబంధించినది కాదు, అంతర్గత సంస్కారానికి సంబంధించినది.ఏ పరిస్థితిలోనైనా సత్యాన్ని పలకడం, నమ్మకద్రోహం చేయకపోవడం. వ్యక్తిగత సామాజిక జీవితంలో నియమ నిబంధనలను పాటించడం. ఎదుటివారి కష్టాన్ని తన కష్టంగా భావించి సహాయం చేయడం. ఎంతటి ఉన్నత స్థితికి వెళ్లినా గర్వం లేకుండా సామాన్యులతో కలసిపోవడం. ఇలా మన ప్రవర్తనల వల్ల ఏ రంగంలోనైనా నైతికత పాటిస్తూ పనిచేసేవారికే శాశ్వతమైన గుర్తింపు లభిస్తుంది.నేటి పోటీ ప్రపంచంలో విలువలు కనుమరుగవుతున్నాయి. స్వార్థం, అసూయ వంటి గుణాలు మనిషిని పట్టి పీడిస్తున్నాయి. ఇటువంటి సమయంలో మాననీయత ఒక వెలుగు దివిటీలా పనిచేస్తుంది. పెద్దలను గౌరవించడం, పిల్లలకు సంస్కారాన్ని నేర్పడం ద్వారా కుటుంబాలు బలపడతాయి. లంచగొండితనం, అక్రమాలకు తావు లేకుండా పనిచేయడం వల్ల వృత్తికి గౌరవం పెరుగుతుంది. సమాజంలో అన్యాయం జరిగినప్పుడు ధైర్యంగా ధర్మం వైపు నిలబడటం కూడా మాననీయతలో భాగమే. మంచిని ఆలోచించడం, మంచిని పలకడం, మంచిని చేయడం అనే త్రివిధ శుద్ధిని పాటిస్తూ మనమందరం మాననీయులుగా ఎదగడానికి ప్రయత్నిద్దాం. మనుషుల మధ్య గౌరవం ఉన్నప్పుడే శాంతియుత సమాజం ఏర్పడుతుంది.మాననీయత అనేది అంగడిలో కొంటే దొరికేది కాదు, అది మన ఆలోచనల నుండి, మన పెంపకం నుండి పుడుతుంది. వ్యక్తిగత గౌరవమే సమాజ గౌరవంగా మారుతుందని గుర్తించి, ఉన్నతమైన విలువలతో జీవించడం మనందరి బాధ్యత. మాననీయత అనేది వ్యక్తిత్వాన్ని పరిమళించేలా చేస్తుంది. మనం ఇతరులకు ఇచ్చే గౌరవమే తిరిగి మనకు మాననీయతగా లభిస్తుంది. సాంకేతికత పెరుగుతున్నా, మానవీయ విలువలు తగ్గకుండా చూసుకోవడమే నేటి అవసరం. రూపం కన్నా శీలం మిన్న, ఆస్తి కన్నా వ్యక్తిత్వం మిన్న. ఆ వ్యక్తిత్వమే మనిషిని మాననీయుడిగా నిలబెడుతుంది.పువ్వు వాడిపోయినా దాని సువాసన గాలిలో నిలిచి ఉన్నట్లు, మనిషి భౌతికంగా మరుగైనా అతని మాననీయత తరతరాలకు స్ఫూర్తినిస్తుంది. రాసే ప్రతి అక్షరం, మనం వేసే ప్రతి అడుగు మాననీయతకు దర్పణం పట్టాలి. ‘శీలం లేని విద్య, సువాసన లేని కాగితపు పువ్వు’ వంటిది. మాననీయతకు పునాది శీలమే. ఎదురుగాలి వీస్తున్నా, ధర్మమనే దీపాన్ని ఆరిపోకుండా కాపాడుకోవడమే మాననీయుడి పంథా.– ఆనంద ‘మైత్రేయ’మ్ -
లండన్ వ్లాగర్ మదిని దోచిన వంటకం..! అత్యంత ఆరోగ్యకరం కూడా..
లండన్కు చెందిన ఫుడ్ వ్లాగర్ బెంగళూరులో ఉండగా మన వంటకాలు నేర్చుకోవడమే గాక తయారు చేసి చూపించి ఔరా..! అనిపించుకున్నాడు. పైగా మన వంటకాల రుచులను మెచ్చకుంటూ వాటి గుణగణాల గురించి చెప్పేస్తున్నాడు కడా. మరి ఎవరా వ్లాగర్?, అతడి మనసుని దోచిన వంటకం ఏంటి?..అంటే..యూకేకు చెందని వ్లాగర్ జూలియస్ ఫ్లీడర్ బెంగళూరులో వంటకం నేర్చుకున్న తర్వాత ఇంట్లో వంటకాన్ని తయారు చేసిన అనుభవాన్ని పంచుకున్నారు. ఆవికి మీద వండే ఆ వంటకం వివిధ పప్పుల మిశ్రమాలను కలపడం, నానబెట్టడం దగ్గర నుంచి రుబ్బి పులిబయెట్టడం వరకు వివిద ప్రక్రియలను పంచుకున్నారు. కొన్ని ఆహారాలు మన మనసుని తాకుతాయి. వాటి రుచి నాలుకపై అలా నిలిచిపోతుంది. మెత్తగా దూదిలా ఉండే ఆ బ్రేక్ఫాస్ట్ ఎప్పటికీ విసుగు చెందని ఆహారం. వేడి వేడి సాంబార్ లేదా చట్నీతో తింటే అబ్బా ప్రాణం లేచవచ్చినట్లుగా అనిపిస్తుంది, సంతృప్తిగా అనిపిస్తుంది.జూలియస్ ఫీడ్లర్ బియ్యం, మిన పప్పుల పిండిని పులియబెట్టడంతో తన వంట ప్రక్రియను ప్రారంభించారు. సరైన మెత్తదనం కోసం ఈ రెండు పదార్థాలను విడివిడిగా కొన్ని గంటల పాటు నానబెట్టాలని ఆయన సూచించారు. ఆ తర్వాత, నానబెట్టిన నీటిలో కొంత భాగాన్ని బియ్యంతో కలిపి గరుకైన పిండిలా రుబ్బుకోవాలి, అదే సమయంలో మినప పప్పును నీటిలో తేలేంత మెత్తగా రుబ్బుకోవాలి. అనంతరం, అతను ఆ పిండిని కలిపి చేతితో కలపడం ద్వారా పులియబెట్టే ప్రక్రియను ప్రారంభించారు.ఆ వంట నిపుణుడు పిండి పరిమాణం పెరిగి, బుడగలు వచ్చినట్లు పులిసేంత వరకు ఉంచి, చివరగా చిటికెడు ఉప్పు చల్లారు. ఇడ్లీలకు సరైన అండాకారపు ఆకారం రావడానికి, సాంప్రదాయక ఇడ్లీ మేకర్లో వేసి, మరుగుతున్న నీటిపై ఆవిరి మీద ఉడికించి, అవి చక్కగా ఉబ్బేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేశారు. ఇడ్లీ వద్దనుకుంటే మీడియం మంటపై పెనం పెట్టుకుని ఊతప్పంలా కూడా వేసుకోవచ్చని చెప్పారు. .పులియబెట్టడం వల్ల కార్బోహైడ్రేట్లు విచ్ఛిన్నమై, ఆరోగ్యకరమైన అమైనో ఆమ్లాలు పెరుగుతాయి. ఆ వీడియో చివరలో, ఆ ఇన్ఫ్లుయెన్సర్ వేడి వేడి ఇడ్లీలను సాంప్రదాయ అరటి ఆకులో అమర్చి, వాటితో పాటు చల్లని కొబ్బరి చట్నీతో జతచేశారు. వాటిని చూస్తే కచ్చితంగా నోరూరుతుంది. మన లండన్ వ్లాగర జూలియస్ మాత్రం ఆ అల్పాహారానికి అద్భుతం అని కితాబిచ్చాడు. View this post on Instagram A post shared by Julius Fiedler (@hermann) (చదవండి: దివ్యాంగుడైన తండ్రిని భుజాలపై మోస్తూ..! కన్నీళ్లు తెప్పించే దృశ్యం) -
లిట్వరల్డ్: కథబంధ ప్రహేళిక!
ఇరవై ఒకటో శతాబ్దిలో నోబెల్ పురస్కారాలు అందుకున్న పాతికమంది రచయితల్లో ప్రథముడు సర్ విదియాధర్ సూరజ్ పర్సాద్ నైపాల్. ఇక ఈ వరసలో ఇరవైఆరో రచయిత పేరు ఈ అక్టోబర్లో వెల్లడవుతుంది– అందాకా వేచిచూద్దాం! 1932లో కరీబియన్ దేశం ట్రినిడాడ్లో పుట్టి– పదిహేడోయేట బ్రిటన్ కు మెట్టి– 2018లో కన్నుమూసిన నైపాల్ను వ్యక్తిగా గానీ, రచయితగా గానీ ఓ చట్రంలో బిగించడం దాదాపు అసాధ్యం! ఐనా అలాంటి మెట్ట వడ్రంగానికి మనమెందుకు పూనుకోవాలి? నైపాల్ను మనవాళ్ళు ‘నోబెల్ పురస్కారం పొందిన రెండో భారతీయుడు’గా చెప్పుకుని జబ్బలు చరుచుకుంటూ ఉంటారు. కానీ సర్ విదియా తనను తాను భారతీయ రచయితగా ఎన్నడూ చెప్పుకోనూలేదు– గర్వించింది అసలే లేదు! నైపాల్ తనను ట్రినిడాడియన్–బ్రిటిష్ రచయితననే భావించుకున్నాడు, అలాగే సంభావించుకున్నాడు! అందుకాయన్ని తప్పుపట్టాల్సింది కూడా ఏమీ లేదు!!అంచేత, సాహిత్యానికి నోబెల్ ప్రైజ్ పొందిన ఏకైక భారతీయుడు రబీంద్రనాథ్ టాగోర్. ‘గీతాంజలి’ కావ్యానికి ఆయనకా బహుమతి 1913లో దక్కింది. 88 యేళ్ళ తర్వాత నైపాల్ రాసిన ‘ద ఎనిగ్మా ఆఫ్ అరైవల్’ అనే ఆత్మకథాత్మక నవలకు సైతం నోబెల్ పురస్కారం దక్కింది. సదరు పురస్కారం అందుకుంటూ, నైపాల్ చేసిన ప్రసంగానికి ఆయన ఇచ్చిన శీర్షిక ‘రెండు ప్రపంచాలు.’ అవి ప్రాచ్య– పాశ్చాత్య ప్రపంచాలు కావు. అమెరికన్– బ్రిటిష్ ప్రపంచాలు మాత్రమే!ట్రినిడాడ్ లోని ‘హిందువుల’ జీవన సరళి నైపాల్కు కొట్టిన పిండి. అందుకే ఆయన ‘కాల్పనిక’ సాహిత్యంలో ప్రముఖంగా ప్రతిఫలించేది అదే. ఐతే, 1961లో అచ్చయిన ‘ఎ హౌస్ ఫర్ మిస్టర్ బిశ్వాస్’తోనే నైపాల్కు నవలా రచయితగా చెప్పుకోదగిన గుర్తింపు దక్కింది. 1998 నాటి మోడర్న్ లైబ్రరీ ‘20వ శతాబ్దిలో వచ్చిన నూరు ఉత్తమ నవలల’ జాబితాలో ఈ నవలకు 72వ స్థానం దక్కింది. టైమ్ మ్యాగజీన్ రూపొందించిన ‘1928–2005 మధ్యకాలంలో ఇంగ్లిష్లో వచ్చిన నూరు ఉత్తమ నవలల’ జాబితాలో కూడా ఈ నవలకు చోటు దక్కింది. 1971లో ఆంద్రె డాయిష్చ్ ప్రచురణ సంస్థ వెలువరించిన ‘ఇన్ ఎ ఫ్రీ స్టేట్’ అనే నవల అదే యేడాది బుకర్ ప్రైజ్ గెల్చుకుంది. నిజానికిది మూడు గొలుసు కథల సంకలనం. ఈ శిల్పం మరీ అపూర్వమేమీ కాదు– బృహత్కథ, పంచతంత్రం, వెయ్యిన్నొక్క రాత్రులు, క్యాంటర్బరీ టేల్స్ నుంచి మన కాశీ మజిలీ కథల వరకూ అన్నీ ఇలాంటి గొలుసుకట్టు చట్రంలో బిగించిన కథలే! 1983లో నైపాల్కు ‘జెరూసలేం పురస్కారం’, 1990లో ట్రినిడాడ్ టొబాగో అత్యున్నత జాతీయ పురస్కారం ‘ద ట్రినిటీ క్రాస్’ బహుమతి దక్కాయి. అదే సంవత్సరం బ్రిటిష్ రాజరికం ఈ ట్రినిడాడియన్– బ్రిటిష్ రచయితకు నైట్హుడ్ ప్రసాదించింది. ఈ బహుమతులన్నిటికీ తలమానికంగా, సర్ విదియాకు 2001లో నోబెల్ సాహిత్య పురస్కారమూ దక్కింది! అది కూడా ఓ నవలకే దక్కడం గమనార్హం. అర్ధశతాబ్దికి పైగా విస్తరించి వున్న తన సాహిత్య జీవితంలో నైపాల్ 11 నవలలు ఎందుకు రాశాడో ఈ నేపథ్యం వివరిస్తోంది!కాలుగాలిన పిల్లిలా ప్రపంచమంతా కలతిరిగిన నైపాల్ తొమ్మిది పది యాత్రా చరిత్రలు రాసివుండడంలో వింతేముంది? తన– తన కుటుంబ సభ్యుల పౌరసత్వ–వారసత్వాల గురించి ఆలోచించడానికే జీవితమంతా ఖర్చు పెట్టిన నైపాల్ తన పూర్వికుల పురిటిగడ్డ భారతదేశం గురించి మూడు పుస్తకాలు రాశాడు. ‘యాన్ ఏరియా ఆఫ్ డార్క్నెస్’, ‘ఇండియా–ఎ వూండెడ్ సివిలిజేషన్’, ‘ఇండియా– ఎ మిలియన్ మ్యూటినీస్ నౌ’ అనే ఈ పుస్తకాలు మూడూ నైపాల్ యాత్రా చరిత్రల్లో ముఖ్యమైనవి. వాటిని రాజకీయ– చారిత్రక యాత్రా చరిత్రలనవచ్చు. వాటిల్లో ఏ కోశాన్నా భారతదేశమన్నా, దాని చరిత్రన్నా ప్రేమాదరాలు వ్యక్తమైనట్టు నాకెక్కడా కనిపించలేదు!అయితే, ఈ వరసలోని మూడో పుస్తకంలో భారతదేశంలోని పీడిత తాడిత వర్గాల పట్ల ఒకింత సహానుభూతి వ్యక్తమైందని ‘నైపాల్ నిపుణులు’ కొందరు అంటారు.నైపాల్ పూర్వికులు ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్గా పిల్చుకునే ప్రాంతంలో తూర్పు భాగానికి చెందినవాళ్ళు. ఒకప్పుడు దాన్ని యునైటెడ్ ప్రావిన్సెస్ అనేవాళ్ళు. అలా, అది అప్పుడూ యూపీయే, ఇప్పుడూ యూపీయే! ఆనాటి మరో బ్రిటిష్ వలస ట్రినిడాడ్–టొబాగోకు నైపాల్ పూర్వికులు వలస వెళ్ళారు. 1837–’38లో, యూపీ డెల్టా అనే ‘గంగా జమునా దోఅబ్’ ప్రాంతాల్లో ఘోరమైన కరువు వచ్చింది. దాని ధాటికి తట్టుకోలేక విదేశాలు పట్టిపోయిన వాళ్ళలో నైపాల్ పితామహుడు పండిత దూబే, మాతామహుడు పండిత కపిల్ దేవ్ కూడా వున్నారు. ఈ పండితులు ఇద్దరూ, గత్యంతరం లేక, ఇండెంచర్డ్ లేబర్ (ఇప్పటి వాడుక ప్రకారం కాంట్రాక్టు కూలీలు అనాలేమో!)గా మారవలసివచ్చింది. ట్రినిడాడ్ చెరుకు తోటల్లో కూలిపని చేసుకుంటూనే పిల్లల్ని చదివించుకున్నారు; వృత్తివ్యాపారాల్లో రాణించేలా తీర్చిదిద్దుకున్నారు. నైపాల్ పితామహుడి పేరు కూడా నాకెక్కడా తగల్లేదు కానీ, అతగాడు తన కుమారుడు ‘శీకుమార్ నైపాల్’ను ఇంగ్లిష్ జర్నలిస్టుగానూ, రచయితగానూ స్థిరపడే రీతిలో పెంచుకోగలిగాడు. ఇంగ్లిష్ సాహిత్యమన్నా, రచయితలన్నా అభిమానించే శీకుమార్ పెంపకంలో విదియాధర్ సూరజ్ పర్సాద్ నైపాల్ నోబెల్ లారియెట్ కావడంలో విడ్డూరమేముంది? ∙ _ - మందలపర్తి కిషోర్ -
నలభై గంటలు, నాలుగు వేలసార్లు క్లిక్..చివరికి ఆ అద్భుతం!
తకిట తధిమి తకిట తధిమి తందానా పదహేల మొండిమాను వేదికపై ఉడుతగారి నృత్యలీల అమెరికా–కెనడా ద్వంద్వ పౌరసత్వం కలిగిన డచ్ ఫొటోగ్రాఫర్ స్టాన్ బౌమన్ కెమెరాకు చిక్కిన అద్భుత దృశ్యం ఇది. సోనీ వరల్డ్ ఫొటోగ్రఫీ అవార్డ్స్–2026 బహుమతి గెలుచుకున్న ఈ ఫొటో కోసం బౌమన్ ఏకంగా నలభై గంటలు శ్రమించి, దాదాపు నాలుగువేల సార్లు కెమెరాను క్లిక్మనిపించాడు. చివరకు ఉడుత ప్రదర్శించిన ఈ అద్భుత భంగిమను కెమెరాలో బంధించగలిగాడు. కాగా, ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ సింగిల్ ఇమేజ్లకు బహుమతులు ప్రధానం చేస్తారు. ఈ పోటీలో ప్రవేశం ఉచితం. అలాగే గరిష్టంగా మూడు సింగిల్ చిత్రాలను ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. జేతగా నిలిచిన ఒకరికి ' ఓపెన్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్' బిరుదు లభిస్తుంది కూడా. (చదవండి: ఫెమినా మిస్ ఇండియా వరల్డ్గా సాధ్వి సతీష్ సైల్) -
ఎండాకాలం.. జర భద్రం..!
ఎండా కాలంలో వడదెబ్బ (సన్స్ట్రోక్), డీ హైడ్రేషన్ వంటి వ్యాధులు ప్రబలడం సర్వసాధారణం. వీటికి సరైన చికిత్స, జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు. ఈ సీజన్లో ఏం చేయాలి, ఏం చేయకూడదనే విషయాలు తెలుసుకుందాం. తీసుకోవలసిన జాగ్రత్తలు.. ఎండలు ఉండే సమయంలో ఎక్కువగా తిరగరాదు. ఉదయం, సాయంత్రం వేళల్లో బయట పనులు ముగించుకుని త్వరగా ఇంటికి చేరుకోవాలి. రోడ్లమీద అమ్మే రంగు రంగుల డ్రింక్స్ సేవించకూడదు. వీటిలో ఉండే రసాయనాలు ఆరోగ్యానికి హాని చేస్తాయి. జంక్ఫుడ్ తీసుకోకూడదు. మాంసాహారం తగ్గించి, ఆకుకూరలు, తాజా కూరగాయలు తీసుకోవడం మంచిది ఎండల వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంటుంది. కనుక ఎప్పటికప్పుడు నీరు, కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. రోజుకు కనీసం 15 గ్లాసుల నీళ్లు తాగడం ఈ సీజన్లో అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తేలికైన కాటన్ దుస్తులు ధరించడం మంచిది. ఎండాకాలం రాత్రివేళల్లో చాలా మంది ఆరుబయట పడుకుంటుంటారు. ఇటువంటి సందర్భాల్లో దోమతెరల వంటివి ఉపయోగించాలి ఎండలు అధికంగా ఉండే సమయంలో ఇంటి దగ్గరే ఉండాలి. మరీ అత్యవసరమైతే గొడుగు, టోపీ వంటివి తీసుకెళ్లాలి.వడదెబ్బతో జాగ్రత్త ఎండ వేడిమికి ఎక్కువగా ఎదుర్కొనే సమస్య వడదెబ్బ (సన్స్ట్రోక్). ఎండలో బయటికి వెళ్లడం వలన శరీరంలో నీరు తరిగిపోవడం వల్ల వెంటనే శరీరం నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోతుంది. ఇటువంటి పరిస్థితిలో మళ్లీ శరీరం మామూలు స్థితికి వచ్చే వరకు కొన్ని ప్రాథమిక విషయాలు పాటించాలి. వడదెబ్బ తగిలినట్లయితే అటువంటి వ్యక్తిని వెంటనే నీడ గల ప్రదేశానికి చేర్చాలి. చల్లటి నీటిలో తడిపిన గుడ్డతో శరీరం తుడవాలని, శరీర ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి వచ్చే వరకు అలా చేస్తుండాలని వైద్యులు సూచిస్తున్నారు. గాలి తగిలే చోట వారిని పడుకోబెట్టాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, ఓఆర్ఎస్ వంటి ద్రావణాలు తాగించాలి వీలైనంత త్వరగా దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి.వేసవిలో పానీయాలే రక్షిస్తాయి వృద్ధులు, చిన్నపిల్లలు సాధ్యమైనంత వరకు ఎండలో బయటికి వెళ్లకుండా చూసుకోవాలి. మరీ అవసరమైతే ఉదయం 7లోపు పనులు ముగించుకోవాలి. ఈ సీజన్లో సాధ్యమైనంత వరకు కూల్ డ్రింక్స్ జోలికి పోకుండా మన ఇంట్లోనే దొరికే సహజమైన మజ్జిగ, కొబ్బరినీరు, నిమ్మరసం, పండ్ల రసాలు తీసుకోవాలి. పుచ్చకాయ, కీరదోసకాయ, తాటిముంజలు, సబ్జాగింజలు, రాగి అంబలి వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన నీరు అందుతుంది. వేసవిలో మనం తీసుకునే పానీయాలే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దాహం వేసినా వేయకపోయినా ప్రతి గంటకు మంచినీరు తాగాలి. – డాక్టర్ వెలగపూడి ఉమామహేశ్వర్రావు, లయన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్త్వరగా నిద్ర పోవాలివేసవిలో సమయానికి పడుకోవడం చాలా ముఖ్యం. ఆలస్యంగా పడుకోవడం వల్ల ఆలస్యంగా లేచి ఎండలో బయటికి వెళ్లాల్సి వస్తుంది. త్వరగా బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేయాలి. ఈ సీజన్లో వాకింగ్, జాగింగ్కు వెళ్లే వారు ముందుగా ద్రవపదార్థాలు తీసుకోవాలి. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి కొంచెం నీరు, కొబ్బరినీళ్లు, మజ్జిగ వంటివి తాగుతుండాలి. ఏమీ తాగకుండా నడవడం, పరిగెత్తడం వల్ల త్వరగా నీరసం వస్తుంది. ఎండలో ప్రయాణించేవారు, ఉద్యోగాల నిమిత్తం బయట పనులు చేసుకునే వారు తమతో పాటు మంచినీరు తీసుకువెళ్లడం మంచిది. గంటకు కనీసం ఒకసారి నీరు తాగడం వల్ల అలసట తగ్గుతుంది. – డాక్టర్ శైలేష్ మోడి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, కిమ్స్ ఐకాన్ హాస్పిటల్, సీతమ్మధారపిల్లలు, వృద్ధులు జాగ్రత్తవేసవిలో పిల్లలు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వీరు త్వరగా రుగ్మతలకు లోనయ్యే అవకాశాలు ఉంటాయి. పిల్లలను ఎక్కువ సేపు ఎండలో తిరగనీయకూడదు. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే పిల్లలను బయట ఆటలకు అనుమతించాలి. సాధ్యమైనంత వరకు ఈ సీజన్లో ఇంట్లోనే ఉండి ఆడుకునే చెస్, క్యారమ్స్, లూడో వంటి ఇండోర్ గేమ్స్, డ్రాయింగ్స్, పెయింటింగ్స్ వంటివి అలవాటు చేస్తే మంచిది. వీటి ద్వారా పిల్లల్లో సృజనాత్మకత కూడా మెరుగవుతుంది. ఎక్కువగా మొబైల్, టీవీలకు అతుక్కుపోకుండా పిల్లలను వేరే సమ్మర్కోచింగ్ వంటి వాటిలో చేరి్పంచినా మంచిది. – శంకర్ నీలు భాగవతుల, రచయిత, పరిశోధకుడు -
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్గా సాధ్వి సతీష్ సైల్
గోవాకు చెందిన సాధ్వి సతీష్ సైల్ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026 టైటిల్ను గెలుచుకున్నారు. 61వ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ పోటీలు ఒడిశాలోని భువనేశ్వర్లో ఏప్రిల్ 18, 2026న జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఈ ఘనత సాధించారామె. ఈ పోటీలు మరపురాని ప్రదర్శనలను అందించడమే కాకుండా, భారతదేశపు కొత్త అందాల రాణికి కిరీటాన్ని కట్టబెట్టాయి. రజనీగంధ పెర్ల్స్ సహకారంతో KIIT భువనేశ్వర్ సమర్పించిన 61వ ఫెమినా మిస్ ఇండియా వేడుకలో, ఫెమినా మిస్ ఇండియా గోవా, ఫెమినా మిస్ ఇండియా వరల్డ్గా కిరీటాన్ని దక్కించుకున్నారు. ఇక సాధ్వి సతీష్ సైల్ ఒక మోడల్, సామాజిక కార్యకర్త. ఆమె పిల్లలు, ఆరోగ్య సంరక్షణ కోసం నిధులు సేకరణతో సహా అర్థవంతమైన కార్యక్రమాలకు నిరంతరం మద్దతు ఇస్తున్నారు. అంతేగాదు ట్రెండ్రీల్స్ నుంచి ఫిట్నెస్ అప్డేట్ల వరకు వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలకు సంబంధించి ప్రతిదీ తన అభిమానులతో షేర్ చేసుకుంటుంటారు. ఆమె పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు, ముఖ్యంగా వినికిడి, మాటల లోపాలు ఉన్నవారికి మద్దతు ఇవ్వడానికి తీవ్రంగా కట్టుబడి ఉన్నారు. ఇక ఫైనల్ పోటీల్లో సాధ్వి డిజైనర్ లేబుల్ వాజనే రూపొందించిన, వెండి రంగు మెటాలిక్ పూసల పనితో కూడిన హాల్టర్-నెక్, శరీరానికి అతుక్కుపోయే గౌనును ధరించారు. కిరీటం దగ్గర సగం ముడివేసిన సాధారణ కేశాలంకరణతో జత చేసిన చెవిపోగులు ఆమె రూపాన్ని మరింత ఆకర్షణీయంగా చేశాయి. ఆమె అంతర్జాతీయ మిస్ వరల్డ్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. ఈ మేరకు సాధ్వి మాట్లాడుతూ..సామాన్య పట్టణం నుండి వచ్చి, విదేశాల్లోని ప్రపంచ వేదికపైకి అడుగుపెట్టినప్పుడు,తనసొంత ఆలోచన విధానమే ప్రధాన అడ్డంకిగా నిలిచింది. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) ఇతరుల అద్భుత విజయాలు తనలో సందేహాలు కలిగించి తన కలల సాహసాన్ని చేరుకోలేనోమో అనే భయాన్ని పెంచేసేవి అని చెబుతోంది. అయితే ఈ భయాల నుంచి బయటపడి, ఇతరులతో తనను పోల్చుకోవడం మానేసి, మనస్ఫూర్తిగా అభినందించడం వంటివి తనను స్ట్రాంగ్గా మార్చాయని అంటోంది. ఇక భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం అంటే దాని స్థితిస్థాపకత, పట్టుదల స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడమేగాక, సవాళ్లు ఎదురైనా ధైర్యంగా నిలబడి, దృఢ సంకల్పంతో ముందుకు సాగడం అని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది. కాగా, ఫెమినా మిస్ ఇండియా మహారాష్ట్ర 2026 రజనందిని పవార్ మొదటి రన్నరప్ స్థానాన్ని కైవసం చేసుకోగా, జమ్మూ కాశ్మీర్కు చెందిన ఫెమినా మిస్ ఇండియా యూనియన్ టెరిటరీ 2026 డాక్టర్ శ్రీ అద్వైత రెండవ రన్నరప్గా నిలిచారు. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) (చదవండి: దివ్యాంగుడైన తండ్రిని భుజాలపై మోస్తూ..! కన్నీళ్లు తెప్పించే దృశ్యం) -
దివ్యాంగుడైన తండ్రిని భుజాలపై మోస్తూ..! కన్నీళ్లు తెప్పించే దృశ్యం
మనం సాధించే గెలింపు మనొక్కరిదే కాదు. అందుకు సహకరించి కుటుంబసభ్యులది కూడా. అయితే వారి క్రెడిట్ కనబడదు. కానీ ఈ మహిళ తన సక్సెస్ వెనుక తన తండ్రి ఉన్నాడంటూ..అందరికీ తెలియజేసేలా ఆమె చేసిన పని..అక్కడున్న వారి కళ్లలో నీళ్లుగిర్రున తిరిగేలా చేశాయ్. ఆ కమనీయ దృశ్యం ఓ ప్రేరణ కూడా.అసలేం జరిగిందంటే..మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో, సుమేధా షేక్ ఇంటిని చక్కబెడుతూ, ఇద్దరు పిల్లల భాద్యత, దివ్యాంగుడైన తండ్రి బాగోగులు చూసుకుంటూ పోలీస్ అధికారిణి అయ్యారు. ఆమె తన విజయాన్ని జరుపుకున్న విధానం అందర్నీ కంటతడి పెట్టేలా చేసింది. తండ్రిని భుజాలపై ఎత్తుకుని ఆ క్షణాన్ని ఒక హృదయపూర్వక నివాళిగా మార్చారు. ఈ భావోద్వేగభరితమైన వీడియో నెట్టింట వైరల్గా మారి అందరి హృదయాలను గెలుచుకుంది. తల్లిదండ్రుల త్యాగం ఎప్పుడూ పెద్దగా వినిపించకపోవచ్చు. కానీ మన జీవితాంతం ప్రతిధ్వనిస్తుందని అని చెప్పేలే ఈ మహిళ సెలబ్రేషన్ చేసుకుంది తన సక్సెస్ని. ఈ మేరకు కొత్తగా పోలీసు అధికారిణిగా నియమితురాలైన సుమేధా మట్లాడుతూ..తన కష్టసుఖాల్లో అండగా నిలిచి, తన లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడిన తండ్రికి ఇలా కృతజ్ఞతలు తెలిపినట్లు వెల్లడించారు. ఆయన రుణం ఏమిచ్చి తీర్చుకోగలను అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. ఆ వీడియోలో సుమేధా దివ్యాంగుడైన తన తండ్రిని భుజాలపై మోస్తూ ఆనందంగా నృత్యం చేస్తూ తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది. అక్కడున్న వారు కూడా ఆమె సంతోషంలో భాగమయ్యారు. కొందరు ఆమె తన అసాధారణ విజయాన్ని తన తండ్రికే అంకితం చేస్తూ.. వేడుకగా చేసుకున్న తీరుని చూసి కళ్లల్లో నీళ్లు తిరిగాయ్. నెటిజన్లు కూడా ఈ వీడియోని చూసి ఇది 'ఉత్తమ తండ్రీ-కూతుళ్ల బంధం' అని అభివర్ణించగా మరికొందరు విజయం అనేది కేవలం వ్యక్తిగత విజయంగానే కాకుండా..ఆ ప్రయాణానికి సహకరించి బంధాలది కూడా అని చెప్పే ఘటన అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) (చదవండి: బ్లింకిట్ డెలివరీ బాయ్గా 66 ఏళ్ల రిటైర్డ్ క్లర్క్..! కారణం తెలిస్తే అవాక్కవుతారు) -
బ్లింకిట్ డెలివరీ బాయ్గా 66 ఏళ్ల రిటైర్డ్ క్లర్క్..!
పదవీ విరమణ తర్వాత కూడా ఉద్యోగిగా కొనసాగడం అత్యంత అరుదు. అందులోనూ పిల్లలు స్థిరపడ్డాక, ఎలాంటి చీకు చింత లేకుండా పదవీ విరణమ చేశాక ఎవ్వరైన రెస్ట్ తీసుకుంటారు. కానీ ఈ తాతగారు అందుకు విభిన్నం. అదికూడా యువకులు చేసే గిగ్వర్క్ జాబ్లో జాయిన్ అవ్వడం..పైగా ఎన్ని డెలివరీలు కంప్లీట్ చేశారో తెలిస్తే..తాతగారు మీరు సూపర్ అని ప్రశంసించకుండా ఉండలేరు. మరి ఎందుకు ఆయన ఇంత వయసులో ఇంత కష్టపడుతున్నారంటే..అహ్మదాబాద్కు చెందిన 66 ఏళ్ల వ్యక్తి, మాజీ క్లర్క్ దినేష్ మహంత్ ఠాకోర్దాస్ మంచి స్థిరపడ్డ కుటుంబం. ఆయనకు ముగ్గురపిల్లలు వాళ్లు కూడా బాగా స్థిరపడ్డారు. ఆయనకు ఏమి అంత ఆర్థిక బాధ్యతలు కూడా ఏమిలేవు. కానీ తన పరిసర ప్రాంతంలో ఒక బ్లింకిట్ డెలివరీ పార్టనర్గా పనిచేస్తున్నారు. ఆయనకు అదొక ఆసక్తికరమైన ఉద్యోగంలా అనిపించి చేయాలనకున్న జాబ్ కాస్తా సాధారణ కార్యకలాపంగా మారింది. అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియా ఎక్స్లో న్యూస్ ఆల్జీబ్రా ఖాతా నుంచి షేర్ అవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆయన రోజు ఉదయం 5.00లతో రోజు ప్రారంభించి ఉదయం 6.00లకు కంపెనీ స్థానిక డార్క్ స్టోర్కు చేరుకుంటారట. తన ఇష్టపడే షిఫ్ట్ సుమారు రూ. 11.30 గంటలకు మొదలవుతుందట. ఆ తర్వాత దీన్ని కొనసాగించాలా లేదా ముగించాలా అని నిర్ణయించుకుంటారట. ఇలా గత రెండేళ్లలో సుమారు 10,220 డెలివరీలను పూర్తి చేశారట. అయితే ఈ సంపాదన మాత్రం ఇంటి ఖర్చుల కోసం కాదట. కొత్త నగరాలు, రాష్ట్రాలు, దేశాలు సందర్శించడానికి వినియోగిస్తారట. అంతేగాదు ఆయన అనుభవమే గొప్ప గురువు అనే సిద్ధాంతాన్ని గట్టిగా నమ్ముతారట. ఈ పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే కాదు..మన పాత తరం వారి వృత్తిపరమైన నిబద్దతత చూసి ఎంతగానో ఆశ్చర్యం కలిగిందంటూ ..పోస్టులు పెట్టారు. కొందరు మాత్రం ఈ వయసులో ఇంత శారీరక శ్రమ అనారోగ్య సమస్యల బారిన పడేలా చేస్తుందంటూ హెచ్చరిస్తూ పోస్టులు పెట్టారు.A 66-year-old retired clerk from Ahmedabad is delivering on Blinkit, and he has no plans to stop.Dinesh Mahant Thakordas spent 26 years at a life insurance company, raised a family, and built a stable life. He and his wife have three children, all well-settled. With no… pic.twitter.com/iUZ6WENJv1— News Algebra (@NewsAlgebraIND) April 17, 2026 (చదవండి: ‘వార్’ఇంటీ వాకిట్లో... కష్టాల చెట్లు!) -
తామస మనువు జననం
పూర్వం సురాష్ట్రుడు అనే రాజు ఉండేవాడు. వీరాధి వీరుడిగా విఖ్యాతి పొందిన సురాష్ట్రుడి సుపరిపాలనలో అతడి రాజ్యం సుభిక్షంగా ఉండేది. అతడి మంత్రి నరసింహ శర్మ. అమిత రాజభక్తి కలిగినవాడు. రాజుకు అన్ని వ్యవహారాల్లోనూ చేదోడు వాదోడుగా ఉండేవాడు.రాజుకు మరింత మేలు చేయాలనే తలంపుతో నరసింహ శర్మ సూర్యుడి కోసం తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చిన సూర్యుడు ప్రత్యక్షమై, వరం కోరుకోమన్నాడు. ‘సూర్య భగవంతుడా! మా మహారాజుకు అమితమైన ఆయుర్దాయాన్ని అనుగ్రహించు. అది చాలు నాకు’ అన్నాడు నరసింహ శర్మ. ‘తథాస్తు’ అని వరాన్ని అనుగ్రహించి, సూర్యుడు అదృశ్యుడయ్యాడు.వెంటనే మంత్రి నరసింహ శర్మ రాజు వద్దకు వెళ్లి, జరిగినదంతా చెప్పాడు.తన గురించి మంత్రి పొందిన వరం తెలుసుకున్న రాజు సురాష్ట్రుడు ధర్మబద్ధంగా ప్రజాపాలన చేయసాగాడు.రాజుకు అమితాయుర్దాయం కలిగినా, అతడి భార్యలకు అంత ఆయుర్దాయం లేనందున, వారు ఒక్కొక్కరు గతించిపోయారు. భార్యలు ఒక్కొక్కరుగా గతించిపోవడంతో సురాష్ట్రుడికి విరక్తి కలిగింది. రాజ్యాన్ని మంత్రికి అప్పగించి, తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్లిపోయాడు.అతడు తపస్సు చేసుకుంటూ ఉండగా, కొంతకాలానికి వర్షాకాలం వచ్చింది. ఒకసారి విపరీతమైన వర్షం కురిసింది. వరదనీటితో అడవి జలమయమైంది. సురాష్ట్రుడు ఆ వరదనీటిలో కొట్టుకుపోసాగాడు. అదే నీటిలో కొట్టుకు వస్తున్న ఒక లేడి అతడికి ఆధారంగా దొరికింది. లేడిని పట్టుకుని ఎలాగోలా సురాష్ట్రుడు కాసేపటికి ఒడ్డుకు చేరుకున్నాడు.ఒడ్డుకు చేరుకున్నాక సురాష్ట్రుడు కృతజ్ఞతతో ఆ లేడిని దువ్వుతూ, దాని మీద మోహంలో పడ్డాడు. లేడి మీద తనకు మోహం కలగడం అతడికి ఆశ్చర్యం అనిపించింది. ఇది మామూలు లేడి కాదనుకున్నాడు.‘ఓ హరిణమా! నువ్వెవరివి? నిన్ను తాకగానే నాకు నీ మీద మోహం మొదలైంది. దీనికి కారణమేంటి?’ అని అడిగాడు.‘మహారాజా! గతజన్మలో నేను దృఢధన్వుడు అనే రాజు కుమార్తెను. నీ గతించిన భార్యలలో నేను మొదటిదానిని. నా పేరు ఉత్పలమాల’ అని పలికింది. సురాష్ట్ర మహారాజు సంభ్రమాశ్చర్యాలు చెందాడు. ‘మరి నీకు ఈ లేడి జన్మ ఎందుకు కలిగింది?’ అని అడిగాడు.‘నేను దృఢధన్వుని కుమార్తెగా ఉన్నప్పుడు ఒకసారి చెలికత్తెలతో వనవిహారం చేస్తుంటే, ఒక ముని కుమారుడు ఎదురయ్యాడు. అతడు నన్ను మోహించి, వివాహం చేసుకోమని అడిగాడు. నేను క్షత్రియ కన్యను. నిన్ను వివాహమాడలేను. యోగ్యురాలైన బ్రాహ్మణ కన్యను చూసుకుని వివాహం చేసుకోమని అతడికి నచ్చజెప్పాను. అతడు కినుక వహించి, వచ్చే జన్మలో హరిణమవుతావని శపించాడు. శాప విముక్తి చెప్పవలసిందిగా ప్రార్థిస్తే, నీ పూర్వజన్మ భర్త అయిన రాజు ప్రవాహంలో కొట్టుకువస్తూ, నిన్ను ఆధారంగా పట్టుకుని ఒడ్డుకు వస్తాడు. అతడు నీ కంఠాన్ని ఆలింగనం చేసుకున్నప్పుడు నీకు పూర్వరూపం వస్తుంది అని చెప్పాడు. మహారాజా నా కంఠాన్ని ఆలింగనం చేసుకోండి’ అంది లేడి రూపులోనున్న ఉత్పలమాల. సురాష్ట్రుడు ఆ లేడి మెడను ఆలింగనం చేసుకున్నాడు. లేడికి పూర్వరూపం వచ్చింది. ఆమెను వెంటతీసుకుని, సురాష్ట్రుడు రాజధానికి చేరుకున్నాడు. మంత్రికి, పరివారానికి జరిగినదంతా చెప్పాడు. వారంతా సంతోషించారు.కొన్నాళ్లకు ఉత్పలమాల గర్భందాల్చింది. నెలలు నిండాక ఆమెకు పండంటి మగబిడ్డ పుట్టాడు. సురాష్ట్ర మహారాజు పుత్రుడికి జాతకర్మ జరిపించి, తామసుడు అని నామకరణం చేసి, అల్లారుముద్దుగా చూసుకోసాగాడు. ఇలా రోజులు సాగుతుండగా, ఒకనాడు ఆకాశవాణి ‘రాజా! నీ కుమారుడు తామసుడు మనువుగా ప్రఖ్యాతి పొందుతాడు’ అని పలికింది. తామసుడు సూర్యోపాసన చేసి, సకల విద్యలూ నేర్చుకున్నాడు. సమస్త భూమండలాన్నీ జయించి, పాలించాడు. అతడి పాలనాకాలం తామస మన్వంతరంగా ప్రసిద్ధి పొందింది.∙సాంఖ్యాయన -
భర్తను భయపెట్టి చంపే ప్లాన్.. చివరికి జైలుకెళ్లిన భార్య!
‘‘నన్నెవరో చంపడానికి వెంట పడుతున్నారు’’ అంటూ దివాకర్ అనే వ్యక్తి అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. స్టేషన్లో వణుకుతూ కూర్చున్న దివాకర్ను చూసి ఇన్స్పెక్టర్ సూర్యకు మొదట జాలి కలిగింది. తాగడానికి నీళ్లు ఇచ్చి, ‘‘ఏం జరిగిందో ధైర్యంగా చెప్పు’’ అన్నాడు.‘‘ఈ మధ్య నా మీద హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి... సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు కూడా ఒక వ్యక్తి నన్ను వెంబడించాడు’’ భయం భయంగా చెప్పాడు దివాకర్. వెంటనే ఇన్స్పెక్టర్ సూర్య – దివాకర్ ఆఫీస్ నుంచి వచ్చే దారిలో సీసీటీవీ ఫుటేజ్ తెప్పించాడు. అందులో దివాకర్ ఒక్కడే పరిగెత్తుకుంటూ రావడం చూశాడు. అంత రాత్రివేళ ఒక్కడినే ఇంటికి బలవంతంగా పంపడం సేఫ్ కాదని ఇన్స్పెక్టర్ సూర్య స్వయంగా అతడిని ఇంటి దగ్గర దింపాడు. దివాకర్ భార్య అప్పటికే భర్త కోసం ఎదురు చూస్తోంది. ఇన్స్పెక్టర్ విషయం చెప్పాడు. దివాకర్ భార్య రవళి మౌనంగా లోపలికి వెళ్లి, కొన్ని కాగితాలు తెచ్చి ఇన్స్పెక్టర్కు ఇచ్చింది. అవి డాక్టర్ ఇచ్చిన మెడికల్ రిపోర్ట్స్, ప్రిస్క్రిప్షన్...దివాకర్కి ‘పారనాయిడ్ స్కిజోఫ్రీనియా’ అనే సైకలాజికల్ డిజార్డర్ ఉందని డాక్టర్లు నిర్ధారించారు. వాటికి సంబంధించిన రిపోర్ట్స్ అవి.ఇన్స్పెక్టర్ సూర్య– దివాకర్ వైపు జాలిగా చూసి ఒక నిట్టూర్పు విడిచి బయటకు వచ్చాడు.ఇన్స్పెక్టర్ బయటకు వస్తుంటే, దివాకర్ తనని కాపాడమని తనను ఎవరో చంపేస్తారని అరవడం గుర్తొచ్చింది. జీపులో స్టేషన్కు బయల్దేరిన సూర్య రెడ్ సిగ్నల్ దగ్గర ఆగిపోయాడు. అది దివాకర్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే రోడ్డు. కుడి వైపు పోలీస్ స్టేషన్కు వెళ్లే రోడ్డు వస్తుంది. సూర్యకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది. ఆ సిగ్నల్ దగ్గర సీసీ కెమెరాలు బిగించి ఉన్నాయి. వెంటనే దివాకర్ ఇంటికి వెళ్లే రోడ్డుకు ఉన్న సీసీ ఫుటేజ్ చూశాడు. అందులో దివాకర్ను ఒక వ్యక్తి బైక్ మీద వెంబడిస్తున్నాడు. అప్పుడు దివాకర్ వెనక్కి వచ్చి పోలీస్ స్టేషన్ వైపు పరుగెత్తాడు.అతడిని బైక్ మీద వెంబడించిన వ్యక్తి అక్కడే ఆగిపోయాడు. అందుకే ఆఫీస్ నుంచి పోలీస్ స్టేషన్కు వచ్చే రూట్లో సీసీ ఫుటేజ్లో అతను కనిపించలేదు. అప్పుడు గుర్తొచ్చింది సూర్యకు– తను దివాకర్ను ఇంటి దగ్గర దింపినప్పుడు దివాకర్ ఇంటికి దూరంలో ఉన్న బైక్... దివాకర్ను వెంబడించిన అదే బైక్...వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జీపు వెనక్కి తిప్పాడు. దివాకర్ ఇంటి వైపు...దివాకర్ అపరిచిత వ్యక్తి వైపు భయంగా చూస్తున్నాడు. ముఖానికి మాస్క్ వుంది. అతని చేతిలో చీర వుంది. ఈ చీరతో ఉరేసుకో... నిన్ను నేను చంపను... నువ్వే హాయిగా చచ్చిపోవచ్చు...దివాకర్ పారిపోవాలని చూస్తున్నాడు. ఎదురుగా ఉన్నది ప్రాణంగా ప్రేమించిన భార్య రవళి.‘‘చచ్చిపో దివాకర్... నిన్ను చంపి నేను జైలుకు వెళ్లడానికా ఇంత ప్లాన్ చేసింది. నువ్వు చచ్చిపోతే, పారనాయిడ్ స్కిజోఫ్రీనియాతో చచ్చిపోయావని నమ్మించొచ్చు. దానికి ఇన్స్పెక్టర్ కూడా సాక్ష్యం. రవళి నవ్వుతోంది వికృతంగా... అదంతా చూస్తున్న ఇన్స్పెక్టర్ సూర్య లోపలికి అడుగు పెట్టాడు.‘‘ఇప్పుడు సాక్ష్యంతోనే వచ్చాను మిసెస్ రవళి. నీ భర్తకు ఉన్న పారనాయిడ్ స్కిజోఫ్రీనియాను అడ్డం పెట్టుకుని నీ ప్రియుడితో నాటకం ఆడి నువ్వు చేసిన ప్లాన్ ఇప్పుడు నీకే బెడిసికొట్టింది. నీ భర్తను పోలీస్ స్టేషన్కు వెళ్లేలా భయపెట్టి సాక్ష్యాన్ని సృష్టించుకోవాలనుకున్నావు. కాని, ఇలా చట్టం చేతికి చిక్కావు. ఆస్తి కోసం, అక్రమ సంబంధం కోసం భర్తను వదిలించుకోవాలని వేసే ఇలాంటి క్రిమినల్ ప్లాన్స్ ఎప్పటికైనా పోలీసుల చేతికి చిక్కాల్సిందే!’’ అని రవళిని చూసి చెప్పాడు. ‘‘ఒక సీసీ ఫుటేజ్ నీ ప్రాణాన్ని కాపాడింది. నీ భార్య ప్రియుడితో కలిసి ఆడిన నాటకానికి చెక్ పెట్టింది’’ దివాకర్కు ధైర్యం చెబుతూ అన్నాడు. రవళిని, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
ఈ వారం కథ: ప్రాణదాత
‘‘లే నాయనా! మరేమీ భయం లేదు’’ అన్నారు శాస్త్రిగారు. రామచంద్ర వినయంగా లేచి నిలబడ్డాడు. జేబులోంచి ఓ కాగితం తీసి ఆయన చేతిలో పెట్టాడు. మడతవిప్పి చదువుతుండగానే, ఆ ఉత్తరంలో తన తండ్రి శాస్త్రిగారికి వ్రాసిన సందేశాన్ని క్లుప్తంగా వినిపించాడు.‘‘రుణాలు దారుణంగా ఉన్నాయి స్వామీ! తొందరలో తీర్చకపోతే ఇల్లు అప్పులవాళ్ల పరమైపోతుంది. నాకేమో శిల్పాలు చెక్కడం తప్ప మరే పనీ చేతకాదు. ఈ మధ్యన చేతినిండా పని దొరకడం లేదు. డబ్బుకి చాలా ఇబ్బందిగా ఉంది. డబ్బుకోసం, పని కోసం పట్టకూడని వాళ్ల కాళ్లు కూడా పట్టాను. ఈ కష్టాలకు అంతూదరీ చిక్కడం లేదు. దీనికి పరిష్కారం మీరే చూపించగలరని మా నాన్న చెప్పాడు. అన్యథా శరణం నాస్తి’’ అంటూ మళ్లీ శాస్త్రిగారి కాళ్లమీద పడ్డాడు రామచంద్ర.‘‘ఇలా మాటిమాటికీ ఇబ్బంది పెట్టకు నాయనా! ఏదీ జాతకం కాగితాలు తెచ్చావా?’’ అని అడిగారు శాస్త్రిగారు అంతకుముందు అతడిచ్చిన కాగితాన్ని పక్కన పెడుతూ... మరో కాగితాల దొంతర తీసి ఆయనకు అందించాడు రామచంద్ర. శాస్త్రిగారు పరీక్ష చేస్తున్నారు. ద్వితీయాధిపతి దశ నడుస్తోంది. అష్టమ వ్యయాధిపతులు అంతర ప్రత్యంతర దశల్లో ఉన్నారు. గోచార రీత్యా క్రూరగ్రహమైన వ్యయాధిపతి ధన స్థానంలోకి చేరబోతున్నాడు. అన్నీ అపశకునాలే కనిపిస్తుండగా శాస్త్రిగారి మనస్సు కలవరపడింది. రామచంద్ర దీనంగా ముఖంపెట్టుకుని శాస్త్రిగారినే చూస్తున్నాడు. ఆయన ఒక్కక్షణం కళ్లుమూసుకుని తన ఉపాస్యదేవతను స్మరించారు. ఆయన భృకుటియందు ఒక దృశ్యం ఆవిష్కృతమైంది.మహాకాలసర్పం ఒకటి సూర్యుణ్ణి మింగబోతుండగా, ఒకానొక త్రిశూలం దాన్ని ఎత్తి గిరవాటేసింది. శివుని జటాజూటంలో జారిపడ్డ ఆ పాము గంగలో ఈదులాడుతోంది... ఈ దృశ్యాన్ని చూసిన తరువాత నెమ్మదిగా కళ్లు తెరిచారు శాస్త్రిగారు.ప్రసన్న వదనంతో చిరునవ్వు నవ్వుతూ, ‘‘నాయనా! నీకు తళుకేశ్వరం తెలుసా?’’ అని అడిగారు. ‘‘తెలియదండి.’’‘‘ఇప్పుడు దాన్నే తడికలపూడి అంటున్నారు. ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్లే దారిలో ఉంది. అక్కడ గాంగేశ్వరస్వామి ఆలయం ఉంది. గంగాపుత్రుడైన భీష్మపితామహుడు ప్రతిష్ఠించిన శివలింగం...’’శాస్త్రిగారు చెబుతున్నారు. రామచంద్ర వింటున్నాడు.‘‘వచ్చే అమావాస్య... సోమవారం. సోమావతీ అమావాస్య అంటారు. పవిత్రమైన రోజు. ఆ రోజు ఉదయం ఆ స్వామికి శక్తివంచన లేకుండా అభిషేకం చేయించుకో.’’‘‘స్వామీ! నా ఆర్థిక పరిస్థితి చెప్పాను కదా’’ ఆదుర్దాగా మాటకడ్డం వచ్చాడు రామచంద్ర.‘‘మరేం పరవాలేదు. శక్తివంచన లేకుండా అంటే భక్తిలోపం లేకుండా మనసు తీరా చేయమని కానీ, డబ్బు ఖర్చుపెట్టమని కాదు.’’ వివరించారు శాస్త్రిగారు. ‘‘అలాగే స్వామీ!’’‘‘ఆనాటి ఉదయం అక్కడ అభిషేకం చెయ్యి. అక్కడి నుంచి తూర్పుకు ఐదుమైళ్ల దూరంలో కుడివైపున తోటల మధ్యలో అష్టభైరవ నిర్మితమైన శివాలయం ఉంటుంది. ఆ రాత్రికి నీవు ఆ ఆలయంలో జాగారం చేయాలి. జాగ్రత్త సుమా! అసలే నిర్జన ప్రదేశం. తగిన ఏర్పాట్లతో వెళ్లు. మెలకువతో రాత్రంతా ఉండి, తెల్లవారిన తరువాత నా వద్దకు నేరుగా రా’’ అంటూ కొంత డబ్బుతీసి రామచంద్ర ముందు పెట్టారు శాస్త్రిగారు.‘‘అయ్యో! నేనివ్వాల్సింది పోయి మీరే ఎదురిస్తున్నారా?’’ మొహమాట పడ్డాడు రామచంద్ర.‘‘ఇన్నేళ్లుగా నా మొగమైనా తెలీని నిన్ను, మీ నాన్న ఇప్పుడే నా దగ్గరకు పంపాడంటే దానికేదో కారణం ఉంటుందని గ్రహించు. ఈ డబ్బు మీ నాన్న ఇచ్చిందే అనుకో’’ లాలనగా చెప్పారు శాస్త్రిగారు.రామచంద్ర సెలవు తీసుకుని అక్కడి నుంచి బయటపడ్డాడు. అది 1966వ సంవత్సరం, ఫాల్గుణమాసం. అమాసోమవారం తెల్లవారింది. ఆ వేళ ఉదయం ఎనిమిది కావస్తుండగా రామచంద్ర తడికలపూడికి చేరుకున్నాడు. ప్రధాన రహదారి నుంచి ఎడమ పక్క సందులోకి ప్రవేశించాడు. అల్లంత దూరాన వేంగీ చాళుక్యుల కాలంనాటి ఆలయ శిఖరం నీరెండ ఛాయలో మెరుస్తూ కనిపిస్తోంది. నడుచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. జనావాసాల మధ్యలోనే ఉన్న మల్లెతోటల నుంచి సువాసనలు దారంతా విరజిమ్ముతున్నాయి. జనాలంతా నీళ్లకావిళ్లతో ఎదురొస్తున్నారు. చెరువు దూరంగా ఉన్నట్లుంది. రామచంద్ర ఆలయాన్ని సమీపించాడు. ఆలయ ప్రాకారాన్ని చుట్టిరావడానికి వీలులేదు. రెండుపక్కల ఇళ్లు. అయిమూలగా దక్షిణదిక్కున ఒక రోడ్డుంది. గుడిలోకి ప్రవేశించాడు రామచంద్ర. తువ్వాలు చుట్టుకున్న ఆలయ పూజారి బలిపీఠం దగ్గర శుభ్రం చేసుకుంటున్నాడు. కుడివైపు బావి వుంది. ‘‘అయ్యా! ఆ బావిలో నీళ్లు స్నానానికి పనికొస్తాయా?’’ అడిగాడు రామచంద్ర.ఒక్కక్షణం అతణ్ణి పరకాయించి చూసి, ‘‘ఆ బావిలో నీళ్లు తోడటం నీవల్ల కాదు. స్నానానికైతే చెరువుంది’’ చెప్పాడు పూజారి.నిజమే. బావి చాలా లోతుగా ఉంది. నీళ్లు అట్టడుగున ఉన్నాయి.‘‘పేరుకి గాంగేశ్వర స్వామి వెలసిన క్షేత్రం. ఊళ్లో నీటిచుక్క ఉండదు. వేసవికాలం వస్తే ఉన్న ఒక్క చెరువూ ఎండిపోతుంది. జీవుడికి తాగునీటికి కరవు. గుళ్లో అయ్యవారి స్నానానికి కరవు’’ పూజారి తనలో తానే గొణుక్కుంటున్నాడు.రామచంద్ర ఎడమభుజం మీద సంచీని ఎగదోసుకుని ముందుకి కదిలాడు. ‘‘బాబూ! వచ్చేటప్పుడు ఆ కావిడితో నీళ్లు తెచ్చిపెట్టగలవా?’’ అడిగాడు పూజారి. ‘‘మహద్భాగ్యం’’ అంటూ కావిడిని కుడిభుజం మీదకు ఎత్తుకున్నాడు రామచంద్ర. చెరువులో స్నానం చేసి, నీళ్లు తీసుకుని వచ్చాడు. అప్పటికే అభిషేకం మొదలైనట్లుంది. పూజారితో గొంతు కలుపుతూ గాంగేశ్వరస్వామిని నమక చమకాలతో అర్చించాడు రామచంద్ర. అనంతరం కొంత దక్షిణ ఆయనకు సమర్పించాడు. ‘‘లేచిన వేళ బాగుంది’’ అనుకుంటూ దానిని అందుకున్నాడు పూజారి. ‘‘బాబూ! చాలాదూరం నుంచి వచ్చినట్లున్నావు’’ రామచంద్రని అడిగాడు ఆప్యాయంగా.‘‘అవునండీ. ఒక పని మీద వచ్చాను. ఈవేళ ఇక్కడే ఉంటాను’’ చెప్పాడు రామచంద్ర.‘‘అయితే ఈ పూటకి మా ఇంటిలో చేయి కడుక్కోవచ్చు’’ ఆదరంగా చెప్పాడు పూజారి.కృతజ్ఞతగా నమస్కరించాడు రామచంద్ర. భోజనం తరువాత, కాసేపు ఆలయ శిల్పాలను గమనిస్తూ గడిపాడు. కొద్దిసేపటికి దూరంగా ఆకాశంలో ఉరుముల సవ్వడులు వినిపించసాగాయి. ఎండ పూర్తిగా తగ్గలేదు కానీ వాతావరణం చల్లబడింది. శాస్త్రిగారు చెప్పిన గుర్తుల ప్రకారం ఆలయానికి తూర్పుముఖంగా సాగిపోయాడు రామచంద్ర. ఒక గంటన్నర వ్యవధిలో జీడిమామిడి తోటల మధ్యలో ఉన్న ఒక శిథిలాలయాన్ని కనుగొన్నాడు. మహా అయితే నాలుగడుగుల ఎత్తుంటుంది. అయిదడుగుల పొడవు, మూడడుగుల వెడల్పు ఉంటుంది. ఆ కాస్తచోటులోనే ఎనిమిదివైపులా భైరవశిల్పాలున్నాయి. ఆ శిల్పసౌందర్యం అమోఘంగా ఉంది. రామచంద్ర గుడిచుట్టూ పరికిస్తుండగా, తోట రైతు కాబోలు వచ్చాడు. ‘‘ఎవురు బాబూ! ఈయేళప్పుడు వచ్చారు? బేగ ఎల్లిపోండి. వాన పడేనాగుంది’’ అని సలహా ఇచ్చాడు. రామచంద్ర చిరునవ్వు నవ్వి, ‘‘లేదు. ఈరాత్రికి ఇక్కడే ఉండాలని వచ్చాను’’ అన్నాడు.రైతు అతడిని అయోమయంగా చూశాడు. ‘‘సూడు బాబూ! ఈడ రాత్రైతే మావే ఉండలేం. కట్టం. ఏడనుంచొస్తాయో... ఎందుకొస్తాయో తెలవదు గానీ, చీకటి పడగానే ఈడకి కుక్కలొస్తాయి. మనుషుల్ని చెండాడేస్తాయి. ఆటితో నువ్వు పడలేవు బాబూ! నా మాటిని ఎల్లిపో’’ బుజ్జగింపుగా చెప్పాడు.‘‘ఈ గుడిలో నిద్ర చేస్తానని మొక్కుకున్నాను. అంచేత ఈ రాత్రికి ఉండాల్సిందే’’ చెప్పాడు రామచంద్ర.‘‘ఈ గుడికి ఇట్టాంటి మొక్కులతో కూడా జనాలొత్తన్నారా? ఇడ్డూరంగా ఉందే. సరే బాబూ! జాగ్రత్త’’ అంటూ రైతు అక్కడినుంచి వెళ్లిపోయాడు.ఇంకా సంధ్యాసమయం కాలేదు. కానీ ఆకాశం మేఘావృతం కావడం వల్ల చీకట్లు కమ్ముకుంటున్నాయి. కనుచీకటి ఉండగానే రామచంద్ర గుళ్లో ప్రవేశించాడు. అడుగున్నర ఎత్తున్న ద్వారానికి తలుపులేమీ లేవు. వంగి పాక్కుంటూ లోపలికి వెళ్లి చూస్తే గుడికి మధ్యలో పానపట్ట రహితంగా నేలలో పాతేసినట్లుగా శివలింగం ఉంది.ఇంకు సీసా మూతకి కన్నంపెట్టి ఒత్తిని దూర్చి, లోపల కిరసనాయిల్ పోసి మూతపెడితే ఇల్లాయిబుడ్డి తయారవుతుంది. ఆ బుడ్డిలో కిరసనాయిల్ బదులుగా ఆవునెయ్యి పోసి తెచ్చాడు రామచంద్ర. దేవుడిముందు వెలిగించాడు. ఆ వెలుగులో రాత్రంతా అక్కడ కాలక్షేపం చెయ్యాలి. అందుకోసం కూడా తగిన ఏర్పాట్లు ముందే చేసుకున్నాడు. ఏవైనా బొమ్మలు గీసుకోవచ్చని కొన్ని కాయితాలు తెచ్చుకున్నాడు. ఆ గుడిని చూసేవరకు ఏం గీయాలో అనుకోలేదు. కానీ అక్కడికి వచ్చిన తరువాత, ఇదే గుడి అర ఎకరం నేలలో విశాలమైన గుడిగా ఉంటే ఎలా ఉంటుందో ఊహించి, బొమ్మ గీయాలనిపించింది. ఆ పనే మొదలుపెట్టాడు. బయట ఉరుముల శబ్దం అంతకంతకూ ఎక్కువవుతోంది. సన్నగా చినుకు కూడా ప్రారంభమైనట్లుంది. ఇంతలో ఉన్నట్లుండి అక్కడికో కుక్క వచ్చింది. ఆ గూడులో రెండు జీవులు తలదాచుకోవడానికి అవకాశం లేదు. కానీ ఆ కుక్క ముందరికాళ్లను బాగా ముందుకు జాపి, విశ్రాంతిగా ద్వారానికి అడ్డంగా కూచుంది.రామచంద్ర కొద్దిసేపు ఆ కుక్కని గమనించి, తన పనిలో మునిగిపోయాడు. ఆలయం బయటి దృశ్యాన్ని మొదటిబొమ్మగా గీయడం పూర్తయ్యేసరికి సుమారుగా మూడుగంటల సమయం పట్టింది. లోపలి ఆలయాన్ని గీయాలని రెండో బొమ్మ మొదలుపెట్టాడు.ఇంతలో వర్షం పూర్తిగా పెద్దదయింది. గాలి తాకిడి కూడా ఉద్ధృతంగా ఉంది. తానున్నది చిన్న గూడు కనుక గాలి లోపలికి పెద్దగా రావడం లేదు. అందువల్లనే దీపం నిలబడింది కానీ లేకపోతే కష్టమయ్యేది. మరో గంట గడిచింది. రామచంద్ర కూర్చుని ఉన్నచోట నేల చెమ్మతేరడం మొదలయ్యింది. వెంటనే పక్కన పెట్టిన సంచీని తీసి ఒళ్లో పెట్టుకున్నాడు. వర్షం ఇంకా పెద్దదయితే, నీళ్లు లోపలికి వచ్చేస్తాయి కాబోలు... అప్పుడెలా అని మథన పడసాగాడు.అతను ఊహించిందే నిజమైంది. రెండో బొమ్మ ఇంకా పూర్తి కాకుండానే గుళ్లోకి నీళ్లు రాసాగాయి. అప్పటికే రామచంద్ర కట్టుకున్న పంచె పూర్తిగా తడిసిపోయింది. గొంతుకు కూర్చుంటే చీలమండల వరకు నీళ్లు వచ్చేశాయి. ఇక అక్కడ ఉంటే క్షేమం కాదనిపించింది. లోపలినుంచి బయటికి వెళ్దామంటే కుక్క అడ్డంగా ఉంది. దానికి బయటికి పోవడం ఇష్టం లేదు కాబోలు, చేత్తో ముందుకు తోసినా కదలలేదు. కొద్దిసేపటికి రామచంద్రకు బయటకు వెళ్లడానికి తోవ ఇచ్చింది. అతడితోపాటు తాను కూడా బయటకు నడిచింది. యట అంతా గాఢాంధకారంగా ఉంది. నేలమీద పిక్కలవరకు నీళ్లున్నాయి. ‘ఇంతలోనే ఎంత వర్షం పడింది?’ అని ఆశ్చర్యపోతూనే, ఒక్క ఉదుటన ఆలయంపైకి ఎక్కి కూచున్నాడు. ఎలా ఎక్కిందో తెలియదు కానీ ఆ కుక్క కూడా ఆలయంపైకి చేరింది. అక్కడ కూచునేందుకు బాగుంది. ఎటొచ్చీ పైనుంచి కుండపోత వాన. చప్పగా తడిసిపోయాడు. కొద్దిగా ఒణుకు కూడా వస్తోంది. ఆకాశం చిల్లుపడినట్లుగా ఆ రాత్రంతా వాన పడుతూనే ఉంది. గాలి విసిరి కొడుతూనే ఉంది. మెరుపు వెలుగు పడినప్పుడల్లా నీటిమట్టం పెరుగుతున్నట్లుగా తెలుస్తూనే ఉంది. కొద్దిసేపటి తరువాత ఉన్నట్లుండి కుక్క మొరగడం ప్రారంభించింది. అది ఎందుకు మొరుగుతోందో ముందు అర్థం కాలేదు. అప్పుడే ఆకాశంలో మెరుపు మెరిసింది. ఆ మెరుపు వెలుగులో... గుడిపైకి ఒక నల్లత్రాచు వచ్చి పడగ విప్పి వుండడం రామచంద్ర కంటపడింది. గుండె గుభేలుమంది. ఆ త్రాచు కాటువేసేందుకు సన్నద్ధంగా ఉంది. రామచంద్రకి కిందికి దూకి తప్పించుకుపోయే అవకాశం లేదు. కుక్క కూడా అక్కడే ఉండి నిస్సహాయంగా చూస్తోంది. పామును నేర్పుగా పట్టుకుని విసిరేయగలిగితే బాగానే ఉంటుంది కానీ, ధైర్యం చాలలేదు. కొద్దిగా వెనక్కి జరిగాడు. వీపుకి భైరవశిల్పం తగిలింది. దాని చేతికి త్రిశూలం ఉందనే సంగతి స్ఫురణకు వచ్చింది. చేతులు రెండూ వెనక్కి పెట్టి ఆ త్రిశూలాన్ని ఊడబెరికాడు. త్రాచుపామును త్రిశూలంతో ఎత్తిపట్టి, దూరంగా విసిరేశాడు. అదికాస్తా నీళ్లలో పడి, ఎటో కొట్టుకుపోయింది. ఆ తరువాత కొద్దిసేపటికే తెల్లవారింది. కానీ గుడిమీద నుంచి కిందికి దిగే అవకాశం మాత్రం లేదు. నేలమట్టానికి నాలుగడుగుల ఎత్తులో ఉన్న ఆ ఆలయానికి దాదాపు సమానంగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఆ నీళ్లలో కిందికి దిగితే తాను బయటపడగలనో లేదో తెలియని పరిస్థితి. ఎందుకైనా మంచిదని మరో భైరవశిల్పం చేతిలోని శూలాన్ని ఊడబెరికి పట్టుకున్నాడు.రాత్రి నుంచి తనతోపాటు ఉన్న కుక్క తప్ప మరో తోడు లేదు. ఇప్పట్లో ఎవరైనా వచ్చే అవకాశమూ కనిపించడం లేదు. ఆ కుక్కకి పాపం ఆకలి వేస్తున్నట్టుంది. కానీ చేసేదిలేక దిక్కులు చూస్తూ కూచుండిపోయింది. ఆ పూట సూర్యుడు ఉదయించలేదు. మధ్యాహ్నం కావస్తుండగా వర్షం తగ్గుముఖం పట్టింది. రామచంద్రకు తాను కూచున్న ప్రదేశం నుంచి కిందికి దిగడానికి ధైర్యం చాలలేదు. అంతలోతు నీళ్లలో దిగి నడవడం కానీ, ఈదుకుంటూ వెళ్లడం కానీ మహాప్రమాదంగా తోచింది.ఇంతలో, ‘‘ఒహోయ్ పెద్దమడిసీ! మెల్లిగా దిగిరా’’ అని అల్లంత దూరంలో ఎత్తయిన గట్టుమీద నుంచి ఎవరిదో తోట రైతు అరుస్తున్నాడు.‘నువ్వే దగ్గరకు రా!’ అన్నట్లు సైగ చేశాడు రామచంద్ర. రైతు నవ్వుకుంటూ, ‘‘బయపడమాకు. అవకాడ సెరువుకి గండి కొడతన్నాం. ఓ గంటలో నీళ్లన్నీ తీసేస్తాయి. ఆనక వద్దువు గానిలే’’ అని చెప్పి వెళ్లిపోయాడు.రైతు చెప్పింది నిజమయ్యేందుకు సుమారుగా రెండుగంటల సమయం పట్టింది. సాయంత్రం నాలుగు కావస్తుండగా తోటలో నీళ్లు తగ్గి, బురదనేల బయటపడింది. రామచంద్రతో పాటు పక్కనే ఉన్న కుక్క కూడా నేలకు దిగింది. గబగబా అడుగులు వేస్తూ గట్టుమీదికి వెళ్లిపోయింది. రామచంద్ర భయంభయంగా అడుగులు వేస్తున్నాడు. చీలమండల వరకు బురద నిలిచి ఉంది కానీ, మరేమీ ప్రమాదం లేదు. ఒక్కోచోట కాలు దిగబడి పిక్కల వరకు బురద వస్తోంది. నిన్నరాత్రి నుంచి తన చేతిలోని శూలాన్ని అలాగే ఉంచుకున్నాడు. ఆ శూలాన్ని నేలలో గుచ్చుతూ, ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తరువాతే అడుగు వేస్తున్నాడు. పాతిక అడుగులు వేసేసరికి ఒకచోట శూలం బొరియలో దిగబడినట్లుగా లోపలికి పోయింది. కొద్దిగా పక్కకు జరిగి అదే చోట మళ్లీ నేలలో బలంగా గుచ్చాడు రామచంద్ర. సందేహం లేదు... అక్కడ రాళ్లున్నాయి. అందుకే శూలం కంగున మోగుతోంది.‘‘జాగర్తయ్యోవ్’’ అన్నాడు గట్టుమీదనుంచి రైతు. రామచంద్ర అదేమీ పట్టించుకునే స్థితిలో లేడు. శూలంతో చుట్టూ గీస్తూ ఏదో పరీక్షిస్తున్నాడు. చివరకు అతడు తాను గతరాత్రి ఊహించినది నిజమే అయినందుకు సంబరపడ్డాడు. ఈ ఆలయం కిందనే పూర్వం అతిపెద్ద ఆలయమేదో ఉండేది. అది శిథిలం కాగా, ఎవరో దానిపై చిన్న ఆలయాన్ని నిర్మింప చేశారు అనే నిర్ధారణకు వచ్చాడు. ఆ లోపలి ఆలయం ఇప్పుడు ఉండి ఉంటే ఎలా ఉండేదన్న ఊహతో రాత్రి తాను గీసిన నమూనా కాయితాలన్నీ వానలో నానిపోయి, ఎందుకూ పనికిరాకుండా పోవడంతో రామచంద్రకు మనసులో కష్టం వేసింది. కానీ ఇప్పుడు స్థిమిత పడ్డాడు. గట్టుకు వస్తూనే, ‘‘చూడు బాబూ! ఈ ప్రాంతంలో ఇదివరకు ఏదైనా పెద్దగుడి ఉండేదా?’’ అడిగాడు రైతుని రామచంద్ర.‘‘అదేమో తెలవదు. నాకు ఊహ తెలిసినప్పటినుంచి అదే గుడి’’ చెప్పాడు రైతు.‘‘కాదు. నాకు అర్థమైనంత వరకు ఇక్కడ ఓ పెద్ద గుడి ఉండేది. ఉండేది ఏమిటి ఉంది. నేను చూశాను. నువ్వొప్పుకుంటే నేను దాన్ని వెలికి తీస్తాను’’ ఉత్సాహంగా చెప్పాడు రామచంద్ర.‘‘సూడయ్యా! మమ్మల్నిలా బతకనియ్యి. ఈ తోటంతా మాదే అయినా ఆ గుడి వున్నంతమేరా సెట్టు పెట్టకుండా వదిలేసి మా పొట్ట మేం పోషించుకుంటున్నాం. ఇప్పుడు గుడీ అదీ అంటూ అల్లరి మొదలెట్టావంటే... గవర్నమెంటోళ్లతో, బత్తులతో నానా తలనొప్పులూ పడాల్సొస్తుంది. ఆనక మా తోట ఏటవుద్దో నువ్వు గేరంటీ సెప్పగలవా?! అంచేత సూసిందంతా మర్సిపో. దీనికింద పెద్దగుడి వుందని నాకూ తెలుసు. కానీ చెప్పాను కదా, ఇక్కడ పలుగు పడితే భైరవసామి ఊరుకోడు. కుక్కలొచ్చి కండలు పీకేస్తాయి. ఇగ తొవ్వడం మొదలెడితే ఇంకేం వత్తాయో సెప్పలేం. వచ్చిన పని పూర్తయింది కాబట్టి, జాయిగా ఇల్లు జేరుకో’’ అని చెప్పేసి వెళ్లిపోయాడు రైతు.రామచంద్ర అక్కడినుంచి మళ్లీ తడికలపూడి గాంగేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నాడు. స్వామికి నమస్కరించి బయలుదేరాడు. ఆ రాత్రికి రాత్రి నడుచుకుంటూ వెళ్లి తెల్లవారేసరికి శాస్త్రిగారి ఇంటిముందు నిలబడ్డాడు.‘‘నిన్నంతా ఏమైపోయావు? తుపానులో చిక్కుకుపోయావేమో అని కంగారు పడ్డాను’’ అడిగారు శాస్త్రిగారు అతడిని చూస్తూనే.‘‘నిజమేనండీ. మీ ఆశీస్సులు ఉండబట్టి బతికిపోయాను. లేకపోతే ఈపాటికి చనిపోయే వాడిని’’ అంటూ ముందురోజు రాత్రి తనకు ఎదురైన అనుభవాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పాడు రామచంద్ర.‘‘హమ్మయ్య. గండం గడిచింది. ఇంక నీకేమీ భయం లేదు. నీ వృత్తిలో కూడా పైకొస్తావు. ఇదిగో ఈ ఉత్తరం తీసుకో. హైదరాబాదులో ఉన్న మా స్నేహితుడికి నీ గురించి రాశాను. అక్కడేదో గుడి కడుతున్నారట. నీకేదైనా పని దొరకచ్చు. కానీ రాతి శిల్పాలే చెక్కుతా... సిమెంటు తాపీ పట్టుకోను అంటూ పిచ్చి సిద్ధాంతాలు వల్లెవేయకు. దొరికిన పనిలో దూరిపో. రోజులు బాగుపడితే మనసుకు నచ్చిన పని దొరకచ్చు’’ అని బోధించారు శాస్త్రిగారు.ఆయనకు మరోసారి నమస్కరించి వచ్చేశాడు రామచంద్ర. ...ఇదంతా నా కథ. ఇందులోని రామచంద్రను నేనే. ఆనాడు శాస్త్రిగారి వద్దనుంచి వచ్చిన తరువాత ఎంతో జీవితాన్ని చవిచూశాను. ఎన్నెన్నో అనుభవాలను పొందాను. నాకొచ్చిన కళను నా పిల్లలకు నేర్పించాను. కానీ వారికి రాతిశిల్పాలతో పనిచేసే అవకాశం రాలేదు. ఇప్పుడు నా మనుమళ్లు రాతిశిల్పాలను కంప్యూటర్ల సాయంతో చెక్కుతున్నారని తెలిసి ఆనందంగా ఉంది. స్థాపత్య కళలో వారు సాధిస్తున్న విజయాలు చూస్తుంటే గర్వంగా అనిపిస్తుంది. ముఖ్యంగా మళ్లీ మన ఆలయాలకు పూర్వవైభవం వస్తోంది కదా అని చాలా సంతోషంగా ఉంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు నాకు ప్రాణదానం చేసిన ఆ అష్టభైరవ నిర్మిత ఆలయాన్ని మరిచిపోలేదు నేను. ఇప్పటివరకు ఆ ఆలయాన్ని మూడుసార్లు సందర్శించాను. అక్కడికి వెళ్లిన ప్రతిసారీ ఏవేవో కొత్త అనుభూతులు కలిగేవి. ప్రతిసారీ ఆ రైతును కలిసేవాడిని. పెద్దగుడిని బయటికి తీయడానికి కానీ, తోటను అమ్మడానికి కానీ అతడెప్పుడూ ఒప్పుకోలేదు. ఇప్పుడు నాకు వయసు మీరింది. బహుశా ఈపాటికి ఆ తోట రైతు మనవళ్ల పరమై ఉంటుంది. వాళ్లయినా అక్కడ తవ్వకాలకు ఒప్పుకుంటారని నేను అనుకోవడం లేదు. ఇటీవలే గాంగేశ్వర స్వామి ఆలయానికి పునరుద్ధరణ జరిగిందని తెలిసి సంతోషించాను. ఇక ఆ గుడి కూడా జీర్ణోద్ధరణ పొందితే... అది కూడా నా వంశం వారివల్ల జరిగితే నాకు కావాల్సింది అంతకంటే ఏమీ లేదు.ఇట్లురామచంద్ర అని రాసివున్న డైరీని మూడోసారి చదివి, మూసి పక్కన పెట్టాడు కిషోర్. తన తాతయ్య ప్రాణం కాపాడిన ఆ మందిరాన్ని ఒక్కసారి చూసి రావాలనిపించింది అతనికి.నేల నాలుగుచెరగులా ఎక్కడ తడిమి చూసినా శిథిలాల కింద చరిత్ర మూలుగుతూ ఉంటుంది. కొన్నింటికి మహర్దశ పడుతుంది. బయటికి వస్తాయి. రాజ్యమేలతాయి. మరికొన్నింటి భవిష్యత్తు కాలాలమీద కానీ తేలదు. ఏ స్వార్థమూ లేకుండా ఒకనాటి జ్ఞాపకాలను తవ్వితీసి మళ్లీ అందరిముందు ఠీవిగా నిలబెట్టాలని తపించేవారు నూటికో కోటికో ఒక్కరుంటారు. కొన్నిసార్లు వాళ్లు తమ ప్రయత్నంలో విజయం సాధిస్తారు కూడా. -
కథాకళి: ఫటాఫట్
అతని శ్రావ్యమైన కంఠం, మెత్తని నడవడిక అతనిలోని దుర్మార్గానికి తెరలని ఆమె ఆలస్యంగా తెలుసుకుంది.ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సుజీవ్ ఆమెని ఇంటర్వ్యూ చేశాడు. ఆమె అందం అతన్ని ఆకర్షించింది. పౌడర్ తప్ప మరే మేకప్ లేని, కనుబొమలని కట్ చేసుకుని దిద్దుకోని ఆమె సహజమైన అందం, ఆమె చురుకుదనం అతన్ని ఆకర్షించాయి.సుజీవ్ తండ్రి ఉద్యోగరీత్యా తూర్పు గోదావరి జిల్లాకి పోలీస్ సూపరింటెండెంట్. ఆయన అన్యాయార్జితంతో తన పేర స్థాపించిన ఫైనా¯Œ ్స కంపెనీని సుజీవ్ మేనేజ్ చేస్తున్నాడు. హైద్రాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ఇరవై ఆరు అంతస్తుల భవంతిలో, టాప్ ఫ్లోర్లో ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణం గల అపార్ట్మెంట్లో సుజీవ్ ఒంటరిగా ఉంటాడు. అది సుజీవ్ తండ్రి అక్రమసంపాదనతో తన భార్య పేర కొన్న ఆస్తి.ఓరోజు ఆఫీస్లో లంచ్ చేస్తూ సుజీవ్ ఆమె వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించి తెలుసుకున్నాడు. ‘‘నా భార్యకి పబ్ కల్చర్ అంటే ఇష్టం. వద్దన్నానని అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. నేను వెళ్ళి బతిమాలి తెస్తానని ఎదురుచూసింది. కాని విడాకులు తీసుకుంటానని ఆమె ఊహించలేదు. నువ్వు అన్నీ ఫటాఫట్ చేసేస్తూంటావు. మన వ్యాపారానికి అది ముఖ్యం. నీకు అభ్యంతరం లేకపోతే మన పెళ్ళి గురించి మీ పెద్దలతో మాట్లాడతాను.’’ఆమె దిమ్మెరపోయింది. తను ఎక్కడ? అతను ఎక్కడ? ఆమె గాల్లో తేలుతూ ఇంటికి వెళ్ళింది. వారం తర్వాత ఆమె అర్జెంట్ కాగితాల మీద సంతకాలు తీసుకోడానికి అతని అపార్ట్మెంట్కి వచ్చింది. అతను చొరవ తీసుకుంటే ఆమె సిగ్గుగా అభ్యంతరం చెప్పింది తప్ప ఎదురు తిరగలేదు.మూడు వారాల తర్వాత ఓరోజు ఆమెకి సుజీవ్ నించి ‘నువ్వు అర్జెంట్గా నా ఇంటికి వస్తావా?’ అనే మెసేజ్ వచ్చింది. ‘మా నాన్నగారికి వడదెబ్బ కొట్టి ఇప్పుడే తేరుకుంటున్నారు. అందుకే సెలవు పెట్టాను సర్. ఆయన్ని చూసుకోవాలి’ సమాధానం పంపింది.‘‘పర్సనల్గా మాట్లాడాలి. ఓ అరగంట వచ్చి వెళ్ళలేవా?’’ ఫోన్ చేసి అడిగాడు.‘‘సరే సర్.’’ అతని కంఠంలోని అభ్యర్థనని గుర్తించి చెప్పింది.‘‘జాగ్రత్తమ్మా. నగరంలో హీట్ వేవ్తో రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయని టీవీలో చూపిస్తున్నారు.’’ తల్లి హెచ్చరించింది. ఆమెని చూడగానే సుజీవ్ చెప్పాడు.‘‘మా నాన్నగారు చిక్కుల్లో పడ్డారు. బయటపడటానికి ఒకరిని మంచి చేసుకోవాలి. లేదా ఆయన ఉద్యోగం ఊడొచ్చు.’’‘‘అయ్యో.’’‘‘అందుకు నువ్వో మనిషిని సంతోషపెట్టాలి.’’‘‘నాకు అర్థం కాలేదు సర్.’’ అయోమయంగా చూస్తూ చెప్పింది.‘‘అర్థం కాకపోడానికి ఏంలేదు. నన్ను సంతోషపెట్టినట్లే. అతన్ని వచ్చే బుధవారం మన ఆఫీస్ గెస్ట్ హౌస్లో కలుసుకోవచ్చు.’’ఆమె తను విన్నది నమ్మలేకపోయింది. తనని పెళ్ళి చేసుకుంటానని అడిగిన ఇతనేనా ఈ మాట అన్నది? అతను తనని పెళ్ళి చేసుకోడని ఆమెకి వెంటనే తట్టింది. ఆమె దుఃఖం కోపంగా మారడంతో కంఠం పెంచి చెప్పింది.‘‘సారీ! నేను అలాంటిదాన్ని కాదు. నేను ఇప్పుడే రాజీనామా చేస్తున్నాను.’’‘‘నీకా అవకాశం లేదు. ఆ ఏíసీబీ డైరెక్టర్ని నువ్వు తృప్తి పరచాలి.’’అతను లేప్టాప్లో వాళ్ళిద్దరి రతికేళి వీడియోని ప్లే చేసాడు.‘‘ఏమిటిది? ఏమిటీ మోసం?’’ ఆమె మరోసారి నిర్ఘాంతపోతూ గట్టిగా అరిచింది.‘‘దీన్ని మీ తల్లిదండ్రులు చూడకూడదనుకుంటే, బుధవారం ఎక్కడ పికప్ చేయటం నీకు సౌకర్యమో చెప్పు.’’తను బ్లాక్మెయిల్లో చిక్కుకుందని ఆమెకి అర్థమైంది. ఆమె కన్నీళ్ళు ఆపుకుంటూ లేచి మెట్లెక్కి టెర్రేస్లోకి వెళ్ళింది.ఆమె ఏకాంతంగా ఏడవడం కోసం పైకెళ్ళిందని సుజీవ్కి అర్థమైంది. పది నిమిషాలు గడిచినా ఆమె రాకపోవడంతో అతను టెర్రేస్లోకి వెళ్ళాడు. తలుపు వెనక పొంచి ఉన్న ఆమె చటుక్కున మెట్లమీదకి వెళ్ళి టెర్రేస్ తలుపు మూసి గడియ పెట్టింది.‘‘తలుపు తీయి. ఏమిటిది?’’ సుజీవ్ తలుపు బాదుతూ అరిచాడు.తలుపు తెరచుకోలేదు. పావుగంట తర్వాత ఇక ఆమె తలుపు తెరవదని బోధపడింది. పిట్టగోడ మీంచి దూకడానికి వీలులేకుండా లోపలివైపు ఆరడుగుల ఎత్తున గ్లాస్ వాల్ ఉండటంతో, అతను కింద రోడ్ మీద వారిని సహాయం కోరే అవకాశం లేకపోయింది. ఎక్కడా నీడ కనిపించలేదు. ఎండకి చెమటతో అతని షార్ట్స్, టీషర్ట్ తడిసిపోయాయి. టీషర్ట్ విప్పి తల మీద కప్పుకున్నాడు. అతని ఒంట్లోని నీరు చెమట రూపంలో కారిపోతూ దాహంతో నాలుక పిడచకట్టుకు పోయింది. లేప్టాప్లోని తమ వీడియోని డిలీట్ చేశాక, టీవీ చూస్తూ కాలక్షేపం చేసిన ఆమె సూర్యాస్తమయ సమయంలో పైకెళ్ళి టెర్రేస్ తలుపు తెరిచింది. ఆమె ఆశించినట్లుగా నేల మీద మగతగా పడున్న సుజీవ్కి వడదెబ్బ కొట్టింది. చక్కెర, ఉప్పు నీళ్ళు తాగించి, సెలైన్ ఎక్కిస్తే అతను జీవిస్తాడని ఆమెకి తెలుసు. అతన్ని కిందకి మోసుకెళ్ళి పక్క మీద పడుకోబెట్టింది. అతను ఏం జరుగుతోందో కూడా అర్థం కానంత అపస్మారకంలో ఉన్నాడు. ఆమెని వంచించడానికి సుజీవ్ ఏ మంచాన్ని ఆయుధంగా చేసుకున్నాడో ఆ మంచం మీదే ఆ రాత్రి ఆమె ఫటాఫట్ నిర్ణయంతో ప్రాణం వదిలాడు. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
ఇవ్వాల్సింది ధైర్యమే!
భవిష్యత్తులో పిల్లలు ఇబ్బందులు పడకూడదని, అందుకు ఆస్తులు సంపాదించి పెట్టాలని చాలావరకు తల్లిదండ్రులు అనుకుంటుంటారు. ‘కానీ, పిల్లలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు, ధైర్యమే!’ అంటారు నీలిమ. కోర్టు సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయిన శ్రీదేవి అప్పల్ల నీలిమ కూతురు.సింగిల్ పేరెంట్గా ఇద్దరు కూతుళ్ల పెంపకంలో తను తీసుకున్న జాగ్రత్తలు, జీవితంలో ఎదురైన సవాళ్లను అధిగమించిన విధానాలను ఇలా మన ముందుంచారు..‘‘నేను రియల్ఎస్టేట్ వ్యాపారం చేసేదాన్ని. చాలా పనుల్లో ఆడ మగ అనే తేడా చూపుతారు. నేను చిన్నప్పటి నుంచి అలా చూసేదాన్నికాదు. అందుకే, ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఇద్దరు అమ్మాయిలను పెంచాను. మాది కాకినాడ. మాకు కొద్దిపాటి ఆస్తి ఉంటే, దాన్ని అమ్మి, తిరిగి మరో ఆస్తి కొని, అమ్మి... అలా వచ్చిన డబ్బులతో పిల్లలిద్దరినీ సాకాను. నా పిల్లలు కూడా నాలాగా ధైర్యంగా ఉండాలనుకుంటాను. నా పెద్ద కూతురు దివ్యజ్యోతి బీఎస్సీ పూర్తయ్యాక, జాబ్ చేస్తుంది. చిన్నమ్మాయి శ్రీదేవి సినిమాలలో తనను తాను ప్రూవ్ చేసుకుంటోంది. సినిమా స్టార్ కావాలనుకున్నాను...మా అక్క తమిళ, మలయాళ సినిమాలలో నటించేది. ఆ సమయంలో నేను నాకు కూతురు పుడితే, సినిమాల్లోకి తీసుకురావాలని ఆ రోజుల్లోనే అనుకునేదాన్ని. కానీ, ఆ విషయాన్ని కాలక్రమంలో మర్చిపోయాను. ఆ తర్వాత మా అక్క సినిమాలు మానేసి, కుటుంబ వాతావరణంలోకి వచ్చేసింది. నాకూ కుటుంబ పరిస్థితుల వల్ల చిన్న వయసులోనే పెళ్లయ్యింది. ఇద్దరు కూతుళ్లు పుట్టాక, ఒంటరిగా జీవితాన్ని మొదలుపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దివ్యకు బాగా చదువుకొని డాక్టర్ అవ్వాలని ఉండేది. శ్రీదేవికి టీచర్ అవ్వాలని ఉండేది. ఇద్దరినీ చదువుకోమనే ప్రోత్సహించాను. అయితే, ఇంట్లో శ్రీదేవి టీచర్లా యాక్ట్ చేస్తుండేది. అది చూసి, ఈ అమ్మాయి చేత రీల్స్ చేయిస్తే బాగుంటుందనుకున్నాను. తను స్కూల్ నుంచి రాగానే ఓ గంట రెస్ట్ ఇచ్చి, గ్రీనరీ ప్లేస్ల్లోకి తీసుకెళ్లి రీల్స్ చేసేవాళ్లం. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో శ్రీదేవికి మంచి పేరు రావడంతో పాటు, సినిమా అవకాశాలూ వచ్చాయి. మంచి – చెడు చూసే విధానంలోనే..!ఒకప్పటి రోజులకు ఇప్పటి రోజులకు అన్ని చోట్లా చాలా మార్పులు వచ్చాయి. అవకాశాలూ పెరిగాయి. అమ్మాయిలు ఒంటరిగానే ప్రతి సమస్యను సాల్వ్ చేసుకుంటున్నారు. ‘ఎవరినో తప్పు పట్టడం కాదు, మనం మన జాగ్రత్తలో ఉండాలి’ అని చెబుతుంటాను. దానిని శ్రీదేవి కూడా బాగా అర్థం చేసుకుంటుంది. ఏ పని చేసినా డబ్బు సంపాదించడానికే. కానీ, చదువు మాత్రం ఉండాలి. శ్రీదేవి జూనియర్ ఇంటర్ పూర్తి చేసింది. పై చదువుల కోసం డిస్టెన్స్లో ప్లాన్ చేస్తున్నాం. నేను చెప్పేవి ఇద్దరూ బాగా వింటారు. వారేం అనుకున్నారో అవి కూడా స్పష్టంగా చెబుతారు. వాటిలో మంచి చెడులు చెబుతాను. సంతోషంగా ఉండటానికి ఏం చేయాలో కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. కలిసే టూర్లు..బయటి స్నేహాలను ఎంకరేజ్ చేయడం లేదు. ఫ్రెండ్స్తో టూర్స్కి వెళ్లచ్చు కదా అంటారు. కానీ, ‘నో’ అనే చెబుతాను. నాకూ ట్రావెలింగ్ అంటే ఇష్టం కాబట్టి మేం ముగ్గురం కలిసి టూర్స్కి వెళుతుంటాం. దివ్యకు సినిమా డైరెక్షన్ అంటే ఇష్టం అని చెబుతుంటుంది. కానీ, చదువుకు న్యాయం చేసే జాబ్ కొన్నాళ్లు తప్పక చేయమని చెబుతాను. శ్రీదేవికి సావిత్రి, సౌందర్యలాగా పేరు తెచ్చుకోవాలని కోరిక. వారిలాగే ట్రెడిషనల్గా ఉండటం, అలాంటి పాత్రలతో మెప్పించడం ఇష్టం. నేను కూడా అలాంటి ఇష్టాలను ఎంకరేజ్ చేస్తుంటాను. నాటి నటీనటుల సినిమాలు కలిసి చూస్తాం.కష్టం విలువ తెలుసుకున్నారు.. సింగిల్ పేరెంట్గా పిల్లల పెంపకంలో కష్టపడ్డాను అని చెప్పలేను. ఎందుకంటే, నా కష్టాన్ని పిల్లలు అర్థం చేసుకున్నారు. నా మాట విన్నారు. నా వరకు చూసుకుంటే తండ్రి ఉంటేనే పిల్లల్ని బాగా పెంచగలుగుతారు అనుకోవడం తప్పు అనిపిస్తుంది. నా భర్త సపోర్ట్ లేకపోయినా పిల్లల్ని పెంచాను. అయితే, పిల్లలిద్దరూ నా మాట విన్నారు కాబట్టి వారి పెంపకం సులువై ఉంటుంది. అందరి పిల్లలు అలా వినాలని ఏమీ లేదు. నేను ఏదైనా విషయంలో బాధపడితే పిల్లలిద్దరికీ విషయం వెంటనే అర్థమైపోతుంది. వాళ్లు అర్థం చేసుకుని, నన్ను కష్టపెట్టకూడదని సెట్ అయిపోతారు. సాయం చేసే గుణం..నేను ఒక్కదాన్నే పిల్లల్ని కష్టపడి పెంచుకుంటున్నప్పుడు ఎవరూ సాయం చేయలేదు. కానీ, పిల్లలకు ఇప్పుడు కొంచెం ఫేమ్ వచ్చి, డబ్బు సంపాదిస్తున్నారని.. కొందరు దగ్గరవుతుంటారు. అలాంటప్పుడు పిల్లలు వాళ్లను దూరం పెట్టమని చెప్పరు. ‘కష్టంలో ఉన్నారు కదా! హెల్ప్ చేయమ్మా!’ అని నాకే చెబుతారు. ఎదుటివారికి సాయపడే గుణం ఇద్దరికి వచ్చిందని సంతోషిస్తాను.. ‘మీకు భవిష్యత్తులో పెళ్లిళ్లు అయ్యి, మీ కుటుంబాలు మీకు ఉన్నా.. నేను నాలాగే, మీకు తల్లిలా, ఓ స్నేహితురాలిగా ఉంటాను’ అని చెబుతాను. ‘నువ్వు కోల్పోయిందంతా మేం తిరిగి తీసుకొస్తాం అమ్మా!’ అని పిల్లలు అంటుంటారు. వాళ్లు జీవితంలో మంచిగా స్థిరపడితే అంతే చాలు అనుకుంటాను. నేను, నా ఇద్దరు కూతుళ్లు ఫ్రెండ్స్లా ఉంటాం. మా ఇద్దరి కూతుళ్లతో పాటు మైకి అని ఓ పెట్ ఉంది. అది కూడా మా కుటుంబంలో ఓ సభ్యురాలే. నలుగురం ఒకదగ్గర ఉంటే మా సందడి అంతా ఇంతా కాదు. మా ఆనందం ఇలా మాతో ఎప్పటికీ ఉండాలని కోరుకుంటాను’’ అని వివరించారు తల్లిగా నీలిమ.∙నిర్మలారెడ్డి -
'లివర్' అనే నేను..! జస్ట్ ఏడంగుళాల్లో..
లివర్ చాలా కీలకం. ఇది పనిచేయకపోతే మాత్రం ఏ పరికరాలూ, ఉపకరణాలూ రక్షించలేవు. అయితే లివర్ (కాలేయం) గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. లివర్ దెబ్బతిన్నప్పుడల్లా ఎప్పటికప్పుడు తనను తాను రిపేర్ చేసుకుంటూ ఉండడంతో పాటు నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ పోతుంది. నేడు వరల్డ్ లివర్ డే. ఈ సందర్భంగా కాలేయం ఎంత కీలకమైనదో, ఎంతటి వైవిధ్యమైన పనులు చేస్తుందో చెప్పడంతోపాటు ఈ ఏడాది థీమ్... సాలిడ్ హ్యాబిట్స్ – స్ట్రాంగ్ లివర్ అంటే ‘దృఢమైన అలవాట్లతో – బలమైన కాలేయ రక్షణ’ పొందడం ఎలాగో తెలుసుకుందాం.లివర్ పని సైలెంట్. కానీ దాని యాక్టివిటీస్ వైబ్రెంట్. ఎందుకంటే ఓ వ్యక్తి గోల్ఫ్ ఆడాలన్నా, బాల్ కొట్టాలన్నా, కాలు కదపాలన్నా, చెయ్యి కదిలించాలన్నా, తిన్నది అరగాలన్నా, పరుగులు తీయాలన్నా అది కాలేయం చేసే జీవక్రియల వల్లనే సాధ్యమవుతుంది. వాటిలో కొన్నింటిని చూద్దాం.ఉన్నది ఏడంగుళాల స్థలంలోనే... కానీ ఎకరాల కొద్దీ కెమికల్ ఫ్యాక్టరీలంత పని... లివర్.. జస్ట్... ఏడంగుళాల విస్తీర్ణంలోనే... ఎకరాల కొద్దీ విస్తరించి ఉండే కెమికల్ ఫ్యాక్టరీలంత సంక్లిష్టమైన పనులు చేస్తుంటుంది. చాలామంది అపోహ ఏమిటంటే... లివర్ జీర్ణక్రియలకు పనికివచ్చే ఎంజైములు విడుదల చేసి... అన్నం అరుగుదలకే పరిమితమవుతుందని. కానీ పొరబాటున ఓ వ్యక్తి వేలు తెగిందనుకోండి. అతడి రక్తస్రావం ఆగడానికి అవసరమైన రక్తం గడ్డకట్టించే ‘బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్’ వరకు అదే ఉత్పత్తి చేస్తుంది. వ్యాధులను ఎదుర్కోవడానికి కావాల్సిన యాంటీబాడీస్ పుట్టేందుకు తోడ్పడుతుంది. టాబ్లెట్ వేసుకుంటే వచ్చే సైడ్ఎఫెక్ట్లు ఇచ్చే చిరు విషాలను విరిచేయడం దగ్గర్నుంచి... మద్యం తాగేప్పుడు పుట్టే పెను విషాలను నిర్వీర్యం చేస్తుంది. గుండెకు ఓ సేఫ్టీ వాల్వ్లా పనిచేస్తూ... హెపాటిక్ వెయిన్ ద్వారా గుండెకు వెళ్లే రక్తం వెళ్లేటప్పుడు ఆరు నుంచి పది సెకండ్ల పాటు ఆ రక్తపు వేగాన్ని తగ్గించి, ఎక్సెస్ రక్తంతో గుండె ఉక్కిరిబిక్కిరి కాకుండా కానాడుతుంది.దేహంలో తగినన్ని లవణాలు ఉంచేందుకు కిడ్నీపైనుండే అడ్రినల్ గ్రంథులు ప్రయత్నిస్తున్నప్పుడు... అవి పరిమితికి మించి ఉండకుండా చూసేది లివరే. ప్రతి ఒక్కరి ఒంట్లో ప్రతి సెకండ్కూ లక్షలాది ఎర్ర రక్తకణాలు పుడతాయీ, చనిపోతుంటాయి. వాటిని పుట్టించడం, గిట్టించడం కాలేయం పనే! ఎవరూ ఊహించడానికి కూడా వీల్లేని ఇలాంటి పనులెన్నో లివర్ చేస్తుంటుంది.ఆ శక్తే వరమూ... శాపం కూడా! కాలేయంలోని 75 శాతం పనిచేయక పోయినా అది మళ్లీ రిపేర్ చేసుకుని మామూలుగా కాగలదు. ఇంకా అంతకంటే మించితే అది ప్రమాదకరం. అంటే కాలేయం సామర్థ్యం 25 శాతం కంటే తక్కువకు పడిపోయినప్పుడు ప్రమాదం ఎక్కువ. లివర్లో క్యాన్సర్గడ్డ ఏదైనా వస్తే చుట్టూ చాలావరకు తొలగించాక మనిషి మళ్లీ మామూలైనొతాడు. తీసేసిన లివర్ భాగం మళ్లీ పెరుగుతుంది. కానీ అంత ఎక్కువ సామర్థ్యం ఉన్నందున ఏదైనా ప్రమాదవశాత్తూ లివర్కు సిర్రోసిస్ అనే సమస్య వచ్చి పనిచేయడం మందగిస్తుంటే, లక్షణాలేవీ కనిపించవు కాబట్టి అది ఎక్కువగా పాడయ్యేవరకూ ఆ విషయమే తెలియదు. ఇది ఒకరకంగా శాపం. లివర్లో కొవ్వుకణాలు పేరుకుపోవడం వల్ల వచ్చే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్, బాగా మద్యం తీసుకోవడం వల్ల వచ్చే ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్, సిర్రోసిస్ వంటి సమస్యలు లివర్కు వస్తుంటాయి. బాగా బరువు పెరుగుతుంటే, దాన్ని అదుపు చేసుకోవాలి. దేహంపైన రక్తనాళాలు సాలీడు ఆకృతిలో కనిపిస్తున్నా, ఆకలి లేకపోయినా, బాగా నిస్సత్తువగా అనిపిస్తున్నా, పొట్టలో విపరీతంగా నీరు పేరుకుంటున్నా, కళ్లు పసుపురంగులో కనిపిస్తున్నా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.డాక్టర్ ఆర్.వి. రాఘవేంద్రరావు, సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ –లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ (చదవండి: Summer Health tips: సమ్మర్లో హైడ్రేషన్ కోసం..! కానీ ఈ పొరపాట్లు చెయ్యొద్దు..) -
‘వార్’ఇంటీ వాకిట్లో... కష్టాల చెట్లు!
అదేంటోగానీ రేలంగి మావయ్యకు అంతా మంచిగానే అనిపిస్తుంటుంది. అంతటా మంచే కనిపిస్తుంటుంది. చివరకు నిన్నమొన్నటి యుద్ధం టైమ్లో కూడా. ఆ వార్ తాలూకు కష్టాల్లోనూ మంచిని వెతుక్కుంటుంటాడు మన రేలంగి మామయ్య. ‘‘సార్... రేలంగి అంకుల్ సార్. యుద్ధమంటేనే చెడ్డది. ఆ చెడ్డదాంట్లో కూడా... ఆ యుద్ధాల వాకిట్లో... కష్టాల చెట్లనీ... చెట్లలో కూడా నీడను చూస్తున్నారంటే మీరు మామూలు వ్యక్తులు కారు సార్’’ అన్నాడు రేలంగి మామయ్యగారి వూరి వ్యక్తి ఒకాయన. ‘‘కష్టాలను చెట్టుతో పోల్చారంటే... అసలు మీకంటే గొ΄్పోడెవరుంటార్సార్. ఈ మండు వేసవికాలంలో ఆ చెట్టు నీడకు క్రమంగా అలవాటయ్యామంటే అంతకంటే చల్ల గాలి ఏముంటుందీ. అంతకంటే నేచురాలిటీ ఏముంటుందండీ’’ అంటూ వాక్రుచ్చాడు రేలంగి మామయ్య. ఈ సంభాషణకు నేపథ్యం ఏమిటంటే... ‘‘ఈ ట్రంప్ ఉన్నాడే. వాడు మా చెడ్డవాడు సార్. అనవసరంగా కెలికి లోకమంతటికీ యుద్ధం కష్టాలు తెచ్చిపెట్టాడు. వార్ చేసుకుంటున్నవారు సరే... అసలా వార్తో ఏ సమ్మంధమూ లేనివారిక్కూడా ఎందుకండీ ఈ పాట్లూ... ఈ తిప్పలూ’’ అన్నాడు అక్కడి పల్లెవాసుల్లో ఒకడు. తండ్రికి ఇరువైపులా కూర్చున్న ఆయన కొడుకులు కూడా అదేమాటన్నారు. అంతే... ఒక్కపెట్టున వాళ్లకో క్లాసు తీసుకుంటూ చెలరేగి΄ోయాడు రేలంగి మామయ్య. ఇలా తన స్పీచందుకున్నాడు. ‘‘ఈ యుద్ధం కష్టాలు చూశావా? ఇందులో సీఎన్జీ గ్యాసు దొరకని ఆటోవాడున్నాడూ. టైమ్కు ఇంటికి గ్యాసు సిలెండర్ రానివాడున్నాడూ. రెండ్రోజులపాటు పెట్రోలు బంకుల్లో వరసగా బండ్లను పెద్ద... పే...ద్ద... క్యూల్లో నిలబెట్టినవారున్నారూ. మార్కెట్కెళ్లి పచారీసామాన్ల రేట్లు చూసి గుండెలు బాదుకున్నవారున్నారూ. వీళ్లందరిదీ ఒకటే మాట. ‘దేవుడా నేను మంచోణ్ణి. నాకు గ్యాసు దొరికేలా చూడూ... దేవుడా మేము మంచోళ్లం... మా స్టవ్వుకు గ్యాస్సిలెండరు లోటు రానివ్వకుండా చూడు. మాకు యుద్ధంతో సమ్మంధం లేదు. మాకెలాంటి సరుకుల కొరతా రానివ్వకు’ అని. కానీ ట్రంపు మంచోడ్రా. ట్రంపంటేనే మంచోడు. అందరికీ సరిసమానంగా కష్టాలు తెచ్చిపెట్టాడు. ఎప్పుడో మా చిన్నతనాన కట్టెల పొయ్యి మీద వండిన టేస్టీ వంటకాల రుచి చూశామా. మళ్లీ ఇన్నాళ్లకి మనందరికీ కట్టెల పొయ్యి మీద వండిన వంటకాల కమ్మటి రుచిని పరిచయం చేశాడు. మన నాస్టాల్జియా రోజుల తాలూకు వంటల రుచి మనకు మళ్లీ చూపించాడు. అందుకు మనమంతా ట్రంపుకి రుణపడి ఉండాల్రా. బజ్జీల బండ్లకూ, టిఫెన్ హోటళ్లకు బ్లాకులో తప్ప కమర్షియల్ సిలెండర్లు దొరక్కుండా చేశాడా... దాంతో కర్రీ΄ాయింట్ల నుంచి కూరలు తెచ్చుకోకుండా, బజార్నుంచి ఏ జంకుఫుడ్డో ఇంటికి తెచ్చుకోకుండా... అందరూ హెల్దీగా హాయిగా హోమ్ఫుడ్డు మాత్రమే వండుకునేలా చేస్తున్నాడు. ఇలా మనందరి ఆరోగ్యాలూ కాపాడుతున్నాడు. అందుకే ట్రంపు మంచోడ్రా. ట్రంపంటేనే మంచోడు. ఒరేయ్... భలే తెచ్చార్రా. భలేగా కట్టెలు కొట్టుకొచ్చారు గొడ్డలితో. ఏదేమైనా... టైముకు తగ్గట్లు – సిచ్యువేషన్ కు సింకయ్యేట్లుగా అలా అందుకోవాల్రా. అన్నట్టొరేయ్... ఈ వార్ వరకే రా – ఈ కష్టాలన్నీ! తర్వాత మరో సంక్షోభమేదో వెతుక్కుంటూ వస్తుంది కదా. మళ్లీ అప్పుడీ కష్టాలు ఉండవు రా. అప్పుడొచ్చేవన్నీ మళ్లీ ఫ్రెష్షు కష్టాలూ... చాలా పెద్ద పెద్ద కష్టాలున్నూ! అష్టకష్టాల్రా అవి. ఓ రకంగా చెప్పాలంటే ముందుముందొచ్చే పెద్ద పెద్ద కష్టాలకు ప్రీవ్యూల్లాంటివి రా... ఈ ట్రైలర్ కష్టాలన్నీ. రాబోయే పాట్లు పెద్దవిగా అనిపించకూడదని... ఇప్పుడే మనకీ శిక్ష–ణ దొరికేలా చూస్తున్నాడురా ట్రంపు. అందుకే ట్రంపు మంచోడ్రా. అసలు ట్రంపంటేనే మంచోడు’’ అంటూ తన మంచితనపు ఉపదేశాన్ని మంచిమంచి మాటల్తో... మంచిగా ముగించాడు మన రేలంగి మావయ్య. ఆ స్పీచ్ విని దారిన పోతున్న ఒక దానయ్య గారికి అకస్మాత్తుగా రావు రమేశ్ పూనాడు. అప్పుడా రావు రమేశ్ పూనిన వ్యక్తి అన్న మాటేవిటో తెలుసా... ‘‘ఈలోకంలో అన్నింటికీ సూత్రాలు కనిపెట్టారుగానీ... ఈ రేలంగి మాయ్యేవిటో... ఈడి విదానాలేవిటో మనకర్దంగావడం లేదు. మావయ్యగారిని ఎవరికన్నా సూపించండ్రా. వదిలేయకండ్రా బాబు అలాగ. సూపించండ్రా’’ అంటూ సవిలెంటుగా డవిలాగు అంటూ మాయమయ్యాడు తెగ మండిపోతూ ఉన్న అపరిచితుడొకడు!– యాసీన్ -
హైదరాబాద్ బిర్యానీ కోసం అమెరికా నుంచి వచ్చేశా..!
హైదరాబాద్ బిర్యానీకి విశ్వవ్యాప్తంగా అభిమానులున్నారు. ఈ రుచి కోసమే ఎంతో మంది సెలబ్రిటీలు ఉవి్వళ్లూరుతుంటారు. నగరానికి వస్తే బిర్యానీ రుచిని ఆస్వాదించకుండా ఉండరు. ఈ క్రమంలోనే.. ‘నేను కేవలం బిర్యానీ తినడానికే హైదరాబాద్కు విమానంలో వచ్చాను’ అనే క్యాప్షన్తో ఓ యూట్యూబర్ వీడియో అప్లోడ్ చేస్తే దానికి ఏకంగా దాదాపు 5.1 మిలియన్ల పైగా వీక్షణలు వచ్చాయి. నగరం వైపు పర్యాటకుల్ని ఆకర్షిస్తున్న అంశాల్లో హైదరాబాదీ క్యుజిన్ టాప్లో ఉందనే విషయాన్ని ఇది నిరూపిస్తుంది. ప్రస్తుతం యూట్యూబ్ లేదా ఇన్స్ట్రాగాంలో ’హైదరాబాద్’ అని సెర్చ్ చేస్తే.. బిర్యానీ, బన్ మస్కా, లేదా జూబ్లీహిల్స్ కేఫ్లోని మరో ఫ్యూజన్ డిష్.. తదితర వీడియోలతో స్క్రీన్ నిండిపోతుంది. ఒకప్పుడు చార్మినార్ లాంటి చారిత్రక నిర్మాణాలు దర్శనమిచ్చే చోట ఇప్పుడు హైదరాబాదీ క్యుజిన్ చవులూరిస్తోంది. 2019లో హైదరాబాద్కు యునెస్కో ద్వారా క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ హోదా లభించింది. ఈ హోదా, చారిత్రక రుచిని ఆస్వాదించేవారు తప్పక సందర్శించాల్సిన స్థలంగా నగరాన్ని ప్రాచుర్యంలోకి తెచి్చంది. దీంతో నవతరపు పర్యాటకుల అభిరుచుల్లో.. నగర చారిత్రక, వాస్తు నిర్మాణ కళల కన్నా మన పాకశాస్త్ర కళలే కొంత ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. సోషల్లో హల్చల్.. ‘నేను కేవలం బిర్యానీ తినడానికే ఇక్కడికి విమానంలో వచ్చాను’ అని ఇటీవలే నగరాన్ని సందర్శించిన ప్రముఖ యూట్యూబర్ డైలీ మాక్స్ ప్రకటించారు. అలాగే.. తమ జాబితాలో ఒక ప్రసిద్ధ వంటకాన్ని పూర్తి చేయాలనే నిర్దిష్ట ఉద్దేశ్యంతో నగరానికి ప్రయాణించినట్టు మరో ప్రముఖ జంట, అల్ఫోన్సో జెస్సికాల వ్లాగ్ చూపిస్తుంది. మరో యూ ట్యూబర్ క్రిస్ లూయిస్ హైదరాబాద్ వంటల ప్రపంచం గురించి దఫాలుగా అనేక వీడియోలను రూపొందించారు. ఇక ముంబైకి చెందిన చెఫ్ వెల్టన్ సల్దానానే ఇటీవల తన బిర్యానీ భక్తితో వార్తల్లో నిలిచారు. ఆయన నగరం నుంచి తిరిగి వెళుతూ రూ.5000 విలువైన బిర్యానీ ప్యాకెట్లను తీసుకెళ్లారు. అయితే.. దీని కోసం ఆయన విమానాశ్రయంలో రూ. 4,200 రుసుము సర్చార్జిగా చెల్లించారు. దీంతో ఆయన బిర్యానీ ప్యాకెట్లు రూ.9,200 ఖర్చు చేసినట్టయింది. లైఫ్స్టైల్ కంటెంట్ క్రియేటర్లు సైతం.. కేవలం ఫుడ్ బ్లాగర్లే కాకుండా, లైఫ్స్టైల్ కంటెంట్ క్రియేటర్లు కూడా హైదరాబాద్ ఆహార సంస్కృతి వ్యాప్తికి కారణమవుతున్నారు. మానవ సంబంధాలపై దృష్టి సారించే దుబాయ్కు చెందిన అంతర్జాతీయ కథకుడు ఖలీద్ అల్ అమెరి, ‘భారతదేశంలోనే అత్యుత్తమ బిర్యానీ‘ని కనుగొనడానికి నగరంలో తాను చేసిన తన 72 గంటల ప్రయాణం పంచుకున్నారు. ఇక ప్రముఖ నటుడు యూట్యూబర్ కూడా అయిన ఆశిష్ విద్యార్థి నగరంలోని ఆహార అభి‘రుచుల’ను ఆస్వాదిస్తారు. తెల్లవారు జామున పాయా, నహారీ తినే ఆచా రాన్ని అనుసరించేందుకు హోటల్ నయాబ్ ను సందర్శించడం ఒక మరపురాని అనుభవ ంగా ఆయన వర్ణిస్తారు. దాదాపు ప్రతీ వారం ఒక హైదరాబాద్ ఫుడ్ పోస్ట్ వైరల్ అవుతుండడం కనిపిస్తోంది. అలా చూస్తే త్వరలోనే మన దేశపు ఫుడ్ టూరిజమ్కి భాగ్యనగరం కేరాఫ్గా నిలవడం తథ్యం అనిపిస్తోంది. -
బిడ్డ బాగానే ఉందా?
నాకు 26 సంవత్సరాలు. మా పెళ్లై ఆరు నెలలు మాత్రమే అయ్యింది. ఇప్పుడు నాకు రెండు నెలల గర్భం ఉంది. ఇది నా మొదటి గర్భధారణ. ఎలాంటి ఆరోగ్య సమస్యలు నాకు గతంలో లేవు. కాని, నా కడుపులో ఉన్న బిడ్డ బాగానే ఉందా, ఎదుగుదల సరిగ్గా జరుగుతుందా అని కొంచెం ఆందోళనగా ఉంది. ఇలాంటి సమయంలో ఏయే పరీక్షలు చేయించుకోవాలి? – స్వప్న, తిరుపతి.ఒక ప్రైమీ పేషెంట్, అంటే మొదటిసారి గర్భం దాల్చిన మహిళ, మీకు మొదటగా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత సాధారణంగా ఐదు నుంచి ఆరు వారాల సమయంలో ఒక స్కాన్ చేస్తాము. ఈ స్కాన్ ద్వారా గర్భసంచిలో జెస్టేషనల్ సాక్ సరైన స్థానంలో ఉందా లేదా అన్నది చెక్ చేస్తాము. అంటే గర్భం గర్భసంచిలోనే సరిగ్గా ఉందా లేదా అన్నది నిర్ధారించుకుంటాము. దాని తర్వాత సుమారు ఏడు నుంచి ఎనిమిది వారాల సమయంలో మళ్లీ ఒకసారి స్కాన్ చేస్తాము. దీనిని వయబిలిటీ స్కాన్ అంటారు. ఇందులో బిడ్డ హార్ట్బీట్ సరిగ్గా ఉందా, ఎదుగుదల ఎలా జరుగుతోంది అన్నది చెక్ చేస్తాము. హార్ట్బీట్, ఎదుగుదల సరిగ్గా ఉంటే తగిన ఫోలిక్ యాసిడ్ వంటి మందులు ఇచ్చి గర్భధారణను కొనసాగిస్తాము. తర్వాత 11 నుంచి 14 వారాల మధ్య, అంటే దాదాపు మూడు నెలల సమయంలో ఒక ప్రత్యేక స్కాన్, రక్తపరీక్ష చేస్తాము. దీనిని మొదటి త్రైమాసిక స్క్రీనింగ్ అంటారు. ఇందులో బిడ్డలో ముఖ్యమైన అవయవాల నిర్మాణం ఎలా ఉందో స్కాన్ ద్వారా పరిశీలించి, రక్తపరీక్ష ఫలితాలతో కలిపి కొన్ని జన్యు సమస్యల ప్రమాదం ఎంత ఉందో అంచనా వేస్తాము. ఉదాహరణకు డౌన్ సిండ్రోమ్ వంటి సాధారణ జన్యు సమస్యల రిస్క్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఈ పరీక్షల్లో రిస్క్ తక్కువగా ఉంటే గర్భధారణను సాధారణంగా కొనసాగిస్తాము. తర్వాత ఐదో నెలలో ఒక ముఖ్యమైన స్కాన్ చేస్తాము. దీనిని టిఫా స్కాన్ అంటారు. ఇందులో బిడ్డ అన్ని అవయవాలు సరిగ్గా ఏర్పడ్డాయా లేదా అన్నది పూర్తిగా పరిశీలిస్తాము. టిఫా స్కాన్ లో కూడా ఎలాంటి సమస్యలు కనిపించకపోతే ఎక్కువగా ఇది ఆరోగ్యకరమైన గర్భధారణగా భావిస్తాము. కానీ మొదటి త్రైమాసిక పరీక్షల్లో రిస్క్ కొంచెం ఎక్కువగా లేదా మధ్యస్థంగా కనిపిస్తే, తదుపరి కొన్ని ప్రత్యేక పరీక్షలు చేయాల్సి రావచ్చు. ఉదాహరణకు మరింత కచ్చితమైన రక్తపరీక్షలు లేదా అవసరమైతే ఉమ్మనీరు పరీక్ష చేసి బిడ్డలో జన్యు సమస్యలు ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోవచ్చు. అలాగే టిఫా స్కాన్ లో ఏదైనా మార్పులు కనిపిస్తే, ఉదాహరణకు మెదడు లేదా గుండె అభివృద్ధిలో ఏదైనా తేడా ఉంటే, దానికి అనుగుణంగా ప్రత్యేక పరీక్షలు చేయవచ్చు. ఉదాహరణకు బిడ్డ గుండె పనితీరును తెలుసుకోవడానికి ప్రత్యేక హార్ట్ స్కాన్ లేదా మెదడు అభివృద్ధిని చూడటానికి మరింత వివరమైన స్కాన్ చేయవచ్చు. ఇంకా కుటుంబంలో ఎవరికైనా జన్యు సమస్యలు ఉన్నాయా లేదా దగ్గరి బంధువుల మధ్య వివాహం జరిగిందా అన్నది కూడా తెలుసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో జెనెటిక్ కౌన్సెలింగ్ ద్వారా రిస్క్ ఎంత ఉందో అంచనా వేసి, అవసరమైన పరీక్షలు చేయవచ్చు. సాధారణంగా ఈ అన్ని పరీక్షలు క్రమంగా చేయించుకుంటూ వెళ్తే గర్భధారణ సురక్షితంగా కొనసాగుతుందా లేదా అన్నది స్పష్టంగా తెలుసుకోవచ్చు. అన్ని పరీక్షలు సాధారణంగా ఉంటే ఎక్కువగా గర్భధారణ ఆరోగ్యకరంగానే కొనసాగుతుంది. డా. కె. అపర్ణ సీనియర్ గైనకాలజిస్ట్, అబ్స్టెట్రీషియన్, ల్యాపరోస్కోపిక్ సర్జన్, సికింద్రాబాద్ -
ఆశాకు ఆమె నేర్పిన షాహీ కబాబ్
ఆశా భోంస్లేకు దుబాయ్, కతార్, సింగపూర్, యూరప్లలో ‘ఆశాస్’ పేరుతో రెస్టరెంట్లు ఉన్నాయి. అన్నింట్లోనూ ఒక పదార్థం చాలా గిరాకీ. దాని పేరు ‘షాహీ కబాబ్’. మెనూ తెరిస్తే షాషీ కబాబ్ పక్కన చిన్న అక్షరాల్లో ‘లెర్న్›్ట ఫ్రమ్ మిసెస్ మజ్రూ సుల్తాన్ పురి’ అని ఉంటుంది. ప్రఖ్యాత సినీ కవి మజ్రూ శ్రీమతి బేగంజీ నేర్పిన షాహీ కబాబ్ రెసిపీ ఆశాకు ఒక పెద్ద వరంగా మారింది. ఆ వంట మహత్యం కథ ఇది.ఆశా రికార్డింగ్స్తో బిజీగా ఉన్నా ఇంటికి వచ్చి పిల్లలకు ఏదో ఒకటి వండి పెట్టాలని తల్లిగా కోరుకునేది. ఒక్కోసారి వీలయ్యేది కాదు. ఒకరోజు ఆమె ఇంటికి వచ్చేసరికి చిన్న కుమారుడు ఆనంద్ చాలా హుషారుగా ఉన్నాడు. ‘ఏంట్రా’ అని అడిగితే బజారులో కబాబ్ తిన్నాడట... అది తినడం మొదటిసారట... ‘చాలా బాగుంది... ఇక మీదట దానిని చేసి పెడుతుండు’ అని అడిగాడు. కాని ఆశాకు కబాబ్ చేయడం రాదు. కబాబ్ చేయడం ఎవరు నేర్పిస్తారా అని ఆలోచిస్తే మజ్రూ సుల్తాన్పురి శ్రీమతి గుర్తుకొచ్చింది. మజ్రూ స్నేహితులు, బంధువులు అందరూ ఆమెను ‘బేగంజీ’ అని పిలుస్తారు. బేగంజీకి ఫోన్ చేసి ‘నా కొడుకు కోసం కబాబ్ ఎలా చేయాలో నేర్పిస్తావా?’ అని అడిగింది ఆశా. ‘ఓ అదెంత సేపు... ఇంటికి రా’ అని పిలిచింది బేగంజీ.అలా మజ్రూ ఇంటికి నాలుగైదుసార్లు వెళ్లిన ఆశా ‘కబాబ్’ చేయడం నేర్చుకుంది. అయితే ఆమెకు మెల్లగా ఒక విషయం అర్థమైంది. ముంబైలో ఆ తర్వాత ఎన్నోచోట్ల ఆశా కబాబ్ ట్రై చేసినా మజ్రూ శ్రీమతి చూపించిన కబాబ్ రుచి వేరు బయట బజారులో దొరుకుతున్న కబాబ్ రుచి వేరు. ఏంటా అని ఆలోచించి మళ్లీ మజ్రూ ఇంటికి వెళ్లింది ఆశా. అప్పుడు బేగంజీ నవ్వేసి ‘ఆశా... నీకు నేర్పింది షాబీ కబాబ్. అది కేవలం లక్నోలో ఉండే కొందరు నవాబుల ఇళ్లల్లోని స్త్రీలకు మాత్రమే తెలిసిన రెసిపీ. ఆ రెసిపీ రహస్యాన్ని నీకు చెప్పాను’ అంది. షాహీ అంటే బాదుషాహీ... రాజస అని అర్థం. అలనాడు ఒక లక్నో నవాబు గారికి నోట్లో పళ్లు లేకపోతే నోట వేయగానే మెత్తగా కరిగిపోయే షాహీ కబాబ్ను వంటవాళ్లు కనిపెట్టారట. అలా పుట్టిందా కబాబ్. దాని రెసిపీ బేగంజీ దయ వల్ల ఆశా వశమైంది.బేగంజీ ఆశాకు నేర్పిన పాఠం ఏమిటి? ‘ఆశా... కబాబ్ చేయడానికి కావాల్సింది మసాలా కాదు... సబర్. అంటే ఓర్పు. రాత్రంతా మాంసాన్ని మసాలాలో నానబెట్టాలి. మెత్తగా రుబ్బిన జీడిపప్పు, గసగసాలు, దహీ, పచ్చి బొప్పాయి... ఇవన్నీ కలిపి 12 గంటలు ఊరనివ్వాలి. తొందరపడితే రుచి రాదు. పాటలాగే వంట కూడా సాధన చేస్తేనే వస్తుంది’ అని చెప్పిందామె. తర్వాతి రోజుల్లో ఆశా చేసిన షాహీ కబాబ్లు తిన్న భర్త, సంగీత దర్శకుడు ఆర్.డి. బర్మన్ ‘ఆశా... నువ్వు పాడటం మానేసినా పర్లేదు. కబాబ్లు చేస్తూ బతికేయొచ్చు’ అనేవాడు. ఆశా ఇంట్లో పార్టీ జరిగితే మెనూలో షాహీ కబాబ్ తప్పనిసరి. అక్కాచెల్లెళ్ల మధ్య ఎన్ని స్పర్ధలు ఉన్నా ఆశా చేసిన కబాబ్ని లతా ఇష్టపడేది. ఒకసారి లతాకి నలతగా ఉంటే ఆశా స్వయంగా షాహీ కబాబ్ చేసి పంపిందట. తిన్నాక లతా ఫోన్చేసి ‘చాలా బాగుంది’ అని ఒక్క మాట అందట. మాటల్లేని తమ మధ్య షాహీ కబాబ్ అలా మాట కలిపింది. అన్నట్టు కబాబ్ వెనక కన్నీళ్లు కూడా ఉన్నాయి. ఒక ఇంటర్వ్యూలో ఆశా చెప్పింది – ‘నేను బాధలో ఉన్నప్పుడు వంటగదిలోకి వెళ్తాను. కబాబ్ కోసం మసాలా దంచుతూ, ఉల్లిపాయ కోస్తూ ఏడుస్తాను. కన్నీళ్లు ఉల్లిపాయవే అని అందరూ అనుకుంటారు’ అని. ఏమైనా మజ్రూహ్ సుల్తాన్ పురి తన కలంతో అక్షరాలకు రుచి అద్దితే, ఆయన భార్య బేగంజీ కబాబ్కి రుచి అద్దింది. ఆ రుచిని ఆశా ప్రపంచమంతా పంచుతోంది. – కె -
వెండితెర తార... నేల పైకి
మాధవన్ విలక్షణ పాత్రలకు పేరొందిన ఆర్.మాధవన్ హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ దాకా సాగించిన వైవిధ్యభరిత ప్రయాణం మనందరికీ తెలిసిందే. అయితే మనలో చాలా మందికి తెలియనిది రైతుగా ఆయన సాధించిన అపురూపమైన విజయం....తమిళనాడులోని పళనిలో ఉన్న ఒక బీడు భూమి మాధవన్ విజయానికి కేంద్రబిందువుగా మారింది. ఆ బీడు భూమిని కొనుగోలు చేసిన మాధవన్ ... కేవలం మూడేళ్లలోనే ఫలవంతమైన కొబ్బరితోటగా మార్చారు. నిరంతర కృషి, ప్రయోగాల ద్వారా సాధించిన ఈ మార్పు, తీయని నీరు, విలక్షణమైన సువాసనకు ప్రసిద్ధి చెందిన నాన్ –హైబ్రీడ్ కొబ్బరి తోటగా రూపుదిద్దుకుంది.నేలతల్లి నుంచి నేర్చుకున్నా...‘వ్యవసాయంలో ప్రతి అడుగు ఒక కొత్త విషయాన్ని నేర్చుకునేలా చేసింది. ఇది ఎంతో సంతృప్తికరమైన అనుభవం. నా జీవితంలో అత్యంత ప్రతి ఫలదాయకమైన అనుభవాలలో ఒకటి. భూమి పునర్జీవం ΄పొంది, అది ఫలాలను ఇవ్వడాన్ని చూడటం అద్భుతంగా అనిపించింది. సరైన మల్చ్తో భూమిని సిద్ధం చేయడం నుంచి బావిలో సరైన చేపలను వదలడం వరకు నేను నేర్చుకున్న ప్రతి విషయం అమూల్యమైనది. ఎంతో విలువైనది’ అంటారు మాధవన్ ఎంతో సంతోషంగా...కొబ్బరిచెట్ల ప్రాజెక్ట్!తన కొబ్బరి చెట్ల పెంపకాన్ని ఒక ప్రాజెక్ట్‘ గా పేర్కొంటారు మాధవన్ . ‘ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. దీనిలో దాదాపు బీడుగా ఉన్న భూమిలో అత్యంత తీయని, సువాసనగల నాన్ –హైబ్రిడ్, స్వచ్ఛమైన ΄పొట్టి రకం కొబ్బరికాయలను పండించాము. త్వరలో నేను స్థానిక రైతుల కోసం ఒక వ్యాసం రాస్తున్నాను’ అంటున్నారు మాధవన్. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి నాన్ హైబ్రిడ్ కొబ్బరి తోటల గురించి కల కంటున్నారు మాధవన్.కొత్త ఫలంకోవిడ్ లాక్డౌన్ సమయంలో, మాధవన్ తన అందమైన టెర్రస్ గార్డెన్ను వీడియోల ద్వారా చూపించారు. ఒక వీడియోలో చిన్న చెర్రీ పండ్లను చూపిస్తూ, ‘ముంబై టెర్రస్కు ఒక కొత్త ఫలం వచ్చింది’ అంటూ సంబరంగా చెప్పారు. నటిస్తే ఆదాయం, అవార్డులు రావచ్చు. రైతుగా అడుగులు వేస్తే... ఆ అడుగులు ముందుతరాలకు కొత్త దారులు చూపిస్తాయి. ఈ విషయంలో మార్గదర్శిగా నిలుస్తున్నారు మాధవన్.సామాజిక గళంసామాజిక సందేశాల కోసం గళాన్ని వినిపించడంలో ముందుంటారు మాధవన్. పశుపోషణకు సంబంధించిన విషయాలను, దాని పర్యావరణ ప్రభావాన్ని తెలియజేసేలా పెటా ఇండియా విడుదల చేసిన ‘గ్లాస్ వాల్స్’ అనే వీడియోకు మాధవన్ వ్యాఖ్యానం అందించారు. ‘వధశాలలకు గాజు గోడలు ఉంటే, ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారిపోయేవారు’ అన్న ఒక ప్రసిద్ధ ఆంగ్లోక్తిని ఆయన ఈ వీడియోలో మనకు వినిపిస్తారు. మాంసం, పాల పరిశ్రమలలోని రకరకాల దశలను ఈ వీడియో చిత్రీకరిస్తుంది. జంతువుల పట్ల వ్యవహరించే తీరును చూపిస్తూ, నైతికతకు సంబంధించి ప్రశ్నలను లేవనెత్తుతుంది. తెర వెనుకసినిమా తారలు తెర వెనుక తమను తాము సరికొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. ఒకవైపు నటనను కొనసాగిస్తూనే మరోవైపు తమవైన అభిరుచులను ఆస్వాదిస్తున్నారు. బైక్, కార్ రేసింగ్లకు పేరొందిన అజిత్ లాంటి తమిళ టాప్ హీరోల నుంచి వెయిట్ లిఫ్టింగ్లో సత్తా చాటుతున్న ప్రగతి లాంటి టాలీవుడ్ నటీమణుల దాకా...విభిన్న రంగాల్లోనూ తమను తాము నిరూపించుకుంటున్నారు. వృత్తిజీవితాన్ని, ప్రవృత్తిని సమన్వయం చేసుకుంటున్నారు.– ఎస్. సత్యబాబు, సాక్షి, హైదరాబాద్ -
నా లోపల రెబెల్
సౌమ్యమైన చూపులు, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చే పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మాళవిక నాయర్, జీవితంలోని ఆసక్తికరమైన విషయాలు ఆమె మాటల్లోనే...నా బాల్యమే నా బలం!నేను ఢిల్లీలో ఒక మలయాళీ కుటుంబంలో పుట్టాను. నా బాల్యం నాన్నగారి వృత్తిరీత్యా కొన్నిసార్లు ఢిల్లీ హడావుడి, మరికొన్నిసార్లు కేరళ ప్రశాంతత మధ్య సాగింది. ఒకసారి మా కుటుంబంలో జరిగిన బైక్ ప్రమాదం నాపై చాలా ప్రభావం చూపింది. అప్పటి నుంచి నేను స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.నాన్న నా పెద్ద సపోర్టర్!‘అమ్మాయివి, బైక్ ఎందుకు?’ అని చాలామంది చెప్పినా, మా నాన్న వినలేదు. నాకు బైక్ నేర్పించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నన్ను నేనే కాపాడుకోగలగాలి అని ఆయన కోరుకున్నారు.కెమెరా బయట నా ప్రపంచం!షూటింగ్ లేకపోతే నేను ఎక్కువగా పుస్తకాల్లో మునిగిపోతుంటాను లేదా స్కెచింగ్ చేస్తుంటాను. నేను ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో తత్త్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశాను. ఆ చదువు నాకు పాత్రలను కొత్త కోణంలో అర్థం చేసుకునే దృష్టిని ఇచ్చింది.నేను కేవలం నటించను!నా ప్రయాణం చిన్నప్పుడే మలయాళం సినిమా ‘కరుత్త పక్షికల్’లో మొదలైంది. కానీ, ‘కుక్కూ’ నాకు అసలైన గుర్తింపు ఇచ్చింది. అంధురాలైన పాత్రలో కళ్లతో కాదు, మనసుతో ప్రపంచాన్ని చూడటం నేర్చుకున్న అనుభవం. అందుకే, పాత్రలోని భావాలను లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను.చిన్న సీక్రెట్స్!ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతాను. కానీ నా లోపల ఒక చిన్న రెబెల్ ఉంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే నాకు కొన్ని టాటూలు ఉన్నాయి. ఒక చిన్న నిమ్మకాయ ముక్క ఆకారంలో ఒక టాటూ ఉంది. అలాగే పోలినేషియన్ స్టయిల్లో ట్రయాంగిల్స్, ట్రైబల్ డిజైన్స్ తో మరో టాటూ కూడా ఉంది. అవి నా జీవితంలో ప్రత్యేకమైన గుర్తుల్లాంటివి.వ్యక్తిత్వం ముఖ్యం!మొదట్లో ‘గ్లామర్’ అనే భావన నాకు పెద్దగా నచ్చేది కాదు. ఇండస్ట్రీలో ప్రెజెంటబుల్గా ఉండాలి కానీ, వ్యక్తిత్వాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు అని నేను నమ్ముతాను.అరుదైన గుర్తింపు!చిన్నప్పుడే ఉత్తమ బాలనటి అవార్డు అందుకున్నందుకు, కొందరు నన్ను ప్రముఖ నటి శారదతో పోలుస్తుంటారు. ఆ గుర్తింపు కాపాడుకోవడానికే పారితోషికం కంటే భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న కథలను ఎంచుకోవడానికే ఎక్కువ ఇష్టపడతాను.ఫుడ్ అంటే ఫుల్ లవ్!నేను పక్కా ఫూడీని. ఢిల్లీలో పెరిగాను కాబట్టి అక్కడి స్ట్రీట్ ఫుడ్, మసాలా చాట్ ఎప్పటికీ నా ఫేవరెట్. అలాగే మా ఇంట్లో చేసే మటన్ రసం కలిపిన అన్నం. నెమ్మదిగా ఉడికిన ఆ మాంసం నోట్లో కరిగిపోతుంది. అది నా ఆల్టైమ్ కంఫర్ట్ ఫుడ్. ఇప్పుడు షూటింగ్లు ఎక్కువగా ఉండటంతో, శక్తి కోసం ఆర్గానిక్, హెల్తీ ఫుడ్ కూడా నా మెనూలో చేరింది.ఇష్టమైన స్టార్!చిన్నప్పటి నుంచే నేను మోహన్ లాల్ సర్కి పెద్ద అభిమానిని. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనతో కలిసి పని చేసిన రోజు నాకు ఒక కలలా అనిపించింది. అలాగే జ్యోతిక నటనలోని శక్తి, ఒక సినిమాను తన భుజాలపై మోసే ధైర్యం నాకు పెద్ద ఇన్ స్పిరేషన్ . -
తలకట్టు... కనికట్టు
అబ్బాయిలకు ఏం స్టయిల్ ఉంటుందిలే అని చాలామంది అనుకుంటారు. కాని, బార్బర్ కుర్చీలో కూర్చునే పది నిమిషాలు చాలు, మామూలు అబ్బాయి కూడా సినిమా హీరోలా మారిపోవడానికి. సరైన హెయిర్ కట్ ఇచ్చే కాన్ఫిడెన్స్ వేరే లెవల్! చక్కని తలకట్టుతో రూపం కనికట్టు చేసినంతగా మారిపోతుంది. అందుకే ఈ సమ్మర్లో కంఫర్ట్తో పాటు కూల్గా కనిపించే కొన్ని ట్రెండీ హెయిర్ స్టయిల్స్ చూద్దాం...జెంటిల్మన్ ఫ్యాడ్ – క్లాసీ స్టయిల్! జెంటిల్మన్ ఫ్యాడ్ అనేది ఇప్పటికీ ఎవర్గ్రీన్ స్టయిల్! చెవుల దగ్గర జుట్టు క్రమంగా తగ్గుతూ, పైన మాత్రం సెట్ చేసుకునేలా ఉండటం. ఈ కట్ వేసుకుంటే ముఖం మరింత షార్ప్గా, సన్నగా కనిపిస్తుంది. ఆఫీస్కు వెళ్లినా, ఫంక్షన్ కు వెళ్లినా సూట్ అయ్యే సేఫ్ అండ్ స్మార్ట్ స్టయిల్ ఇదే! అండర్కట్ – యూత్ ఫేవరెట్అండర్కట్ అనేది కొంచెం బోల్డ్గా, ట్రెండీగా కనిపించాలనుకునే వాళ్లకు బెస్ట్. సైడ్స్ షార్ట్గా, పైన కొంచెం లెంగ్త్ ఉంచడం వల్ల మీరు స్టయిల్ను మీకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. ఫార్మల్గా నీట్గా దువ్వుకోవచ్చు, లేదా క్యాజువల్గా మెస్సీగా వదిలేయొచ్చు. ఒకే కట్తో రెండు వేర్వేరు లుక్స్ రావడం దీని కున్న ప్లస్ పాయింట్. టాప్ నాట్ – డిఫరెంట్ టచ్జుట్టు కొంచెం పొడవుగా ఉంటే, టాప్ నాట్ వేసుకోవడం ఒక స్మార్ట్ ఐడియా. జుట్టు మొత్తాన్ని పైకి తీసుకుని చిన్న ముడి వేయడం వల్ల కూల్గా, కంఫర్ట్గా ఉంటుంది. ఈ స్టయిల్ మీకు కొంచెం ఆర్టిస్ట్ లుక్ లేదా ట్రావెలర్ వైబ్ ఇస్తుంది. ముఖ్యంగా వేసవిలో జుట్టు ముఖంపై పడకుండా క్లీన్ గా ఉంచుతుంది. బజ్ కట్ – కంఫర్టబుల్ చాయిస్వేసవిలో చాలామంది ఇష్టపడే సింపుల్ స్టయిల్ ఈ బజ్ కట్. జుట్టు చిన్నగా ఉండటం వల్ల చెమట తక్కువగా ఉంటుంది, మెయింటెనెన్స్ ఈజీ, పైగా షాంపూ, నూనె ఖర్చును ఆదా చేస్తుంది. ఉదయం లేట్గా లేచినా, దువ్వుకోవాల్సిన టెన్షన్ ఉండదు. టైమ్ కూడా సేవ్ చేస్తుంది. కట్ చిన్నదే అయినా, కంఫర్ట్ మాత్రం పెద్దది.టెక్చ్సర్డ్ క్రాప్ – మెస్సీగా.. మోడ్రన్ గా..నేచురల్గా, కొంచెం మెస్సీగా కనిపించే స్టయిల్ కావాలనుకుంటే టెక్స్చర్డ్ క్రాప్ మంచి ఎంపిక. ఈ కట్ వల్ల జుట్టు మరింత వాల్యూమ్గా కనిపిస్తుంది. ముఖ్యంగా థిన్ హెయిర్ ఉన్నవాళ్లకు ఇది మంచి సొల్యూషన్ . ఎక్కువగా సెట్ చేయకపోయినా, స్టయిల్గా కనిపిస్తారు. ఇలా స్టయిలిష్గా కనిపించడానికి పెద్ద ఖర్చు అవసరం లేదు. మీ ఫేస్ షేప్కు సరిపోయే చిన్న హెయిర్ కట్ చాలు, మీ లుక్కి వెంటనే కొత్త చార్మ్ వస్తుంది. -
ఈ ఆభరణాలూ సువర్ణాలే!
ప్రపంచం ఏమైనా సరే, యుద్ధాలు వచ్చినా, ఆర్థిక మాంద్యం తలుపు తట్టినా మన మధ్యతరగతిని వణికించేవి రెండు మాత్రమే! మొదటిది ఇంధన ధరలు, రెండోది బంగారం ధరలు. ఇప్పుడు బంగారం ధర ఆకాశానికెక్కి, అందని నక్షత్రంలా మెరుస్తోంది. బంగారం కేవలం లోహం మాత్రమే కాదు, తరతరాల సంప్రదాయం కూడా! నేటి ట్రెండ్, రేపటి భద్రత. ‘ఏమైనా సరే, నగలు కొనాల్సిందే!’ అనుకునే వారికి రంగు రంగుల్లో దొరికే బంగారు మిశ్రమ లోహాలు సహా పలు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అక్షయ తృతీయ సందర్భంగా బడ్జెట్లోనే మెరిపించే బంగారు మార్గాల గురించిన ప్రత్యేక కథనం...బంగారానికి ప్రత్యామ్నాయ లోహాలు...బంగారం అంటే భారతీయులకు తగని మోజు. ముఖ్యంగా భారతీయులకు బంగారం చూసినప్పుడల్లా దాని మెరుపు మాయలో పడిపోవటం అలవాటు. కాని ఇప్పుడు దానిని తాకగానే, బడ్జెట్ ఒక్కసారిగా సీరియస్ అయి ఇబ్బంది పెడుతుంది. అందుకే ఇప్పుడు మార్కెట్లో ఒక కొత్త కథ మొదలైంది. ‘బంగారం మాత్రమే కాదు, మేమూ ఉన్నాం’ అని చెప్పే లోహాలు ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టాయి. పెరుగుతున్న ధరలు, రోజురోజుకీ మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్స్, తేలికగా ఉండే డిజైన్లపై పెరుగుతున్న ఆసక్తి, ఇలా ఇవన్నీ కలిసి బంగారానికి ప్రత్యామ్నాయ ఆభరణాలుగా మారి చిన్న చిన్న తారల్లా తళుక్కుమంటున్నాయి.పైగా ఇవి సరసమైన ధరల్లో దొరుకుతుండటమే కాకుండా, స్టయిల్లో కూడా తగ్గేదే లేదంటూ సూపర్ మోడల్స్లా మెరిసిపోతున్నాయి. దీంతో అన్ని వయసుల వారూ వీటిపై ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు బంగారం మాత్రమే వివాహాది శుభకార్యాలకు తప్పనిసరి ఎంపికగా ఉండేది. ఇప్పుడు ఆ ఎంపికల ప్రపంచం పెద్దదైంది. అందుకే ఇప్పుడు ఈ ‘న్యూ హీరోస్’ గురించి తెలుసుకోవడం కూడా ఒక చిన్న ఫ్యాషన్ అడ్వెంచర్లాంటిదే!ప్లాటినమ్ – లగ్జరీ లెజెండ్ జ్యూలరీ ప్రపంచంలో ఒక సైలెంట్ కింగ్ ప్లాటినమ్. ఎక్కువ హడావిడి చేయకుండా, తన క్లాస్తోనే అందరినీ ఆకట్టుకుంటుంది. సహజంగా వెండిలాంటి తెల్లటి మెరుపుతో కనిపించే ఈ లోహం చాలా బలమైంది. కాలం గడిచినా తన అందాన్ని కోల్పోదు. అందుకే ‘ఒకసారి కొనిస్తే, సంవత్సరాలు గడిచినా కొత్తదానిలానే మెరిసిపోతుంది’ అంటారు. చరిత్రలో కూడా ప్లాటినమ్ రాజరికపు కథలతో నిండిపోయింది. ఒకప్పుడు ఇది చాలా అరుదుగా దొరికే లోహం కావడం వల్ల రాజులు, ధనవంతులు మాత్రమే దీనితో నగలు చేయించుకునేవారు.ఆ కాలంలో ప్లాటినమ్ ధర కేవలం డబ్బుతో కాదు, ప్రతిష్ఠతో కూడా కొలిచేవారు. ఇప్పటికీ పెళ్లి ఉంగరాలు, ఎంగేజ్మెంట్ రింగ్స్, ప్రీమియం జ్యూలరీలో ప్లాటినమ్ను ఒక శాశ్వత బం«ధానికి గుర్తుగా భావిస్తారు. స్క్రాచ్లు వచ్చినా, వేడి, చెమట, నీరు ఏదైనా సరే తన మెరుపును అలాగే నిలబెట్టుకుంటుంది. అందుకే మెడికల్ పరికరాలు, ఆధునిక సాంకేతిక పరికరాల తయారీ రంగాల్లో కూడా ప్లాటినమ్ కీలక పాత్ర పోషిస్తోంది. ధరలో సాధారణంగా బంగారంతో సమానంగా, కొన్నిసార్లు కొంచెం ఎక్కువ ధరలో లభిస్తుంది. వెండి – బంగారానికి దగ్గరి బంధువుప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా లభించే విలువైన లోహం వెండి. ఇది బంగారానికి దగ్గరి బంధువు లాంటిది. మెరుపులో ఏమాత్రం తగ్గదు, కానీ ఖర్చులో మాత్రం మనసుకు కాస్త హాయినిస్తుంది. బంగారం కంటే ఎక్కువగా అందుబాటులో ఉండటం వల్ల వెండి తక్కువ ధరలో సులభంగా దొరుకుతుంది. అయితే వెండి కథ కేవలం ఫ్యాషన్ తోనే మొదలైపోలేదు; దానికి గొప్ప చరిత్ర, సంప్రదాయం కూడా ఉన్నాయి.పురాతన కాలంలో రాజులు, సంపన్నులు వెండి పాత్రల్లోనే భోజనం చేసేవారు. ఆరోగ్యానికి మంచిదని, నీటిని శుభ్రంగా ఉంచుతుందని నమ్మకం ఉండేది. అందుకే ఇప్పటికీ చాలా ఇళ్లలో చిన్నపిల్లలకు వెండి గ్లాస్, వెండి చెంచా వాడే సంప్రదాయం కొనసాగుతోంది. అంతేకాదు, వెండి సహజంగా బ్యాక్టీరియాను తగ్గించే లక్షణం కలిగి ఉంటుంది. అందుకే పాతకాలంలో చిన్న గాయాలకు కూడా వెండి పూత వాడేవారు. అలాగే పండుగల సమయంలో, ముఖ్యంగా శుభకార్యాల్లో వెండి నాణేలను కానుకగా ఇవ్వడం శుభప్రదంగా భావిస్తారు. ఇక పరిశ్రమల ప్రపంచంలో కూడా వెండి ఒక ట్రెండీ హీరోనే. ఇప్పుడు ఫ్యాషన్ రంగంలోనూ అడుగుపెట్టి రోజువారీ నగలు, స్టయిలిష్ అండ్ సింపుల్ గొలుసులు, మోడ్రన్ జ్యూలరీ డిజైన్ల రూపంలో అందరి చేతుల్లో మెరిసిపోతోంది. సింపుల్గా చెప్పాలంటే సంప్రదాయం, ఆరోగ్యం, స్టయిల్, అందుబాటు ఈ నాలుగు కలిసి వెండిని ఒక స్మార్ట్ చాయిస్గా నిలబెడుతున్నాయి.పలేడియమ్ – సైలెంట్ స్టార్పలేడియమ్ ప్లాటినమ్ కుటుంబానికి చెందిన అరుదైన లోహం. అందుబాటు కొంచెం తక్కువే, కానీ స్టయిల్లో మాత్రం ఫుల్ మార్కులు కొట్టేస్తుంది. మొదట్లో ఇది పెద్దగా ఫ్యాషన్ లో కనిపించలేదు. కాని, ఇప్పుడు వెడ్డింగ్ రింగ్స్, ప్రీమియం డైలీ వేర్ జ్యూలరీలో ఇది సైలెంట్గా ట్రెండ్ సెట్ చేస్తోంది. సహజంగా తెల్లటి మెరుపుతో ఉండటం వల్ల ప్రత్యేక కోటింగ్ అవసరం లేకుండా సింపుల్గా మెరిసిపోతుంది. మెయింటెనెన్స్ తక్కువ, బరువు తక్కువ, లుక్ మాత్రం హై–ఎండ్. ఇదే దీని అసలు స్టయిల్ సీక్రెట్. 19వ శతాబ్దంలో శాస్త్రవేత్తలు దీనిని కనుగొన్నారు.ఆ తర్వాత కాలక్రమేణా జ్యూలరీ ప్రపంచం దాని ప్రత్యేకతను గుర్తించింది. ముఖ్యంగా వైట్ గోల్డ్కు ఒక సులువైన ప్రత్యామ్నాయంగా దీనిని భావిస్తున్నారు. ధర విషయానికి వస్తే, పలేడియమ్కు కూడా కొంచెం మూడ్ స్వింగ్స్ ఉన్నాయి. కొన్ని రోజులు బంగారంతో పోలిస్తే తక్కువ ధరలో ఉంటుంది, మరికొన్ని రోజులు ‘నేను కూడా లగ్జరీనే!’ అని అంటుంది. బడ్జెట్కి పెద్ద షాక్ ఇవ్వకుండా లగ్జరీ ఫీలింగ్ ఇచ్చే స్మార్ట్ ఎంపికగా పలేడియమ్ నిలుస్తోంది.టైటానియమ్ – ఫ్యూచర్ మెటల్ టైటానియమ్ అంటే మోడర్న్ జ్యూలరీ ప్రపంచంలోకి కొత్తగా అడుగుపెట్టిన హీరోయిన్. బరువు తక్కువ, బలం ఎక్కువ. ఇదే దీని అసలైన స్టయిల్. చేతిలో పెట్టుకున్నప్పుడు లైట్గా అనిపించినా, మన్నికలో మాత్రం స్టీల్కే చాలెంజ్ చేస్తుంది. అందుకే స్పోర్టీ లుక్ కోరుకునే వారికి టైటానియమ్ బెస్ట్ చాయిస్. అయితే, టైటానియమ్ మొదట విమానాలు, రాకెట్ల తయారీలో ఉపయోగించారు.అక్కడ తన దారుఢ్యాన్ని నిరూపించుకున్న తర్వాతే ఇది ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు మెన్స్ జ్యూలరీ, స్మార్ట్ వాచ్ స్ట్రాప్స్, ఫ్యాషన్ యాక్సెసరీస్లో ఇది ఫుల్ స్పీడ్తో ట్రెండ్ అవుతోంది. ఇది తుప్పు పట్టదు, స్క్రాచ్లు తక్కువగా పడతాయి, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. పైగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి కూడా సేఫ్. దీంతో, అలెర్జీ సమస్యలు తక్కువగా ఉంటాయి. అందుకే రోజువారీ వాడకానికి చక్కగా సరిపోతుంది. ఇది బంగారంతో పోలిస్తే చాలా తక్కువ ధరలో లభిస్తుంది.బంగారం రంగుల రహస్యం.. బంగారం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది దాని పసుపు రంగు మెరుపు. అయితే, బంగారం కేవలం ఒక రంగు కథ మాత్రమే కాదు, అది ఒక రంగుల పండుగ. శతాబ్దాలుగా మనుషులను ఆకట్టుకుంటూ వచ్చిన ఈ విలువైన లోహం, కాలంతో పాటు కొత్త కొత్త అవతారాలు తీసుకుంటూ ఫ్యాషన్ లో కొత్త ట్రెండ్స్ను సృష్టిస్తోంది. పసుపు నుంచి తెలుపు, గులాబీ, ఆకుపచ్చ, ఇంకా నీలం, నలుపు వరకు ఇలా ప్రతి రంగు వెనుక ఒక ప్రత్యేక కథ, ప్రత్యేక మిశ్రమం, ప్రత్యేక స్టయిల్ దాగి ఉంది.యెల్లో గోల్డ్ – సంప్రదాయానికి చిరునామా..బంగారం అసలైన రూపం యెల్లో గోల్డ్. ఇది శతాబ్దాలుగా సంపద, రాజసం, శుభం అనే భావాలకు ప్రతీకగా నిలిచింది. 24 క్యారెట్ల బంగారం అత్యంత శుద్ధమైన రూపం. దాదాపు 99.9 శాతం బంగారం ఉంటుంది. కానీ అది చాలా మృదువుగా ఉండటం వల్ల ఆభరణాల తయారీలో 22 క్యారెట్లు, 18 క్యారెట్లు లాంటి మిశ్రమాలను ఎక్కువగా వాడుతారు. పెళ్లి నగలు, గొలుసులు, సంప్రదాయ ఆభరణాలు తదితరమైన వాటన్నింటికీ ఇప్పటికీ ఇది మొదటి ఎంపిక. అలెర్జీ సమస్యలు తక్కువగా ఉండటం, మెరుపు ఎక్కువ కాలం నిలవడం, సింపుల్గా మెయింటైన్ చేయగలగడం దీని ప్రధాన ప్లస్ పాయింట్స్. అయితే ఎక్కువ క్యారెట్ల బంగారం కొంచెం సాఫ్ట్గా ఉండటం వల్ల సులభంగా గీతలు పడే అవకాశం ఉంటుంది. అయినా కూడా ‘క్లాసిక్ లుక్’ అంటే ఇప్పటికీ యెల్లో గోల్డ్నే.వైట్ గోల్డ్ – స్టయిల్కు సిల్వర్ టచ్ వైట్ గోల్డ్ అంటే మోడ్రన్ ఫ్యాషన్ కు సింబల్. సాధారణ పసుపు బంగారానికి భిన్నంగా, బంగారంలో నికెల్, పలేడియమ్ లేదా వెండిలాంటి ఇతర తెల్లటి లోహాలను కలిపి ఈ ప్రత్యేక రంగు బంగారాన్ని తయారు చేస్తారు. తర్వాత దీనిపై రోడియమ్ అనే మెటల్తో కోటింగ్ వేయడం వల్ల ఇది మరింత ప్రకాశవంతంగా, ప్లాటినమ్లా మెరిసే లుక్ను ఇస్తుంది. చరిత్రలో చూస్తే, 1920ల కాలంలో ప్లాటినమ్ చాలా ఖరీదుగా ఉండటంతో, తక్కువ ఖర్చులో అందించడానికి వైట్ గోల్డ్ ప్రాచుర్యం పొందింది.అప్పటి నుంచి ఇప్పటివరకు ఇది మోడ్రన్ జ్యూలరీలో ఒక ముఖ్యమైన ట్రెండ్గా కొనసాగుతోంది. ఇది స్ట్రాంగ్గా ఉండటం, స్క్రాచ్లు తక్కువగా కనిపించడం దీని ప్రత్యేకత. అయితే రోడియం కోటింగ్ కొంతకాలానికి తగ్గిపోవచ్చు కాబట్టి అప్పుడప్పుడు మళ్లీ కోటింగ్ చేయాల్సి ఉంటుంది. అయినా కూడా స్లీక్, స్మార్ట్, మోడ్రన్ లుక్ కోసం వైట్ గోల్డ్ బెస్ట్ చాయిస్.గ్రీన్ గోల్డ్ – అందాల ఆకుపచ్చ మెరుపుగ్రీన్ గోల్డ్ కొంచెం డిఫరెంట్ అండ్ రేర్. బంగారంలో ఎక్కువ శాతం వెండి కలిపితే ఆకుపచ్చ రంగు వస్తుంది. పాత కాలంలో దీనిని ‘ఎలెక్ట్రం’ అని పిలిచేవారు. ఇది మార్కెట్లో ఎక్కువగా కనిపించదు. కాని, ఫ్యాషన్లో చాలా పాత ట్రెండ్. ప్రాచీన రాజులు, కళాకారులు ప్రత్యేక ఆభరణాల కోసం ఈ మిశ్రమాన్ని వాడేవారు, ఎందుకంటే ఇది బంగారంతో పోలిస్తే కాస్త భిన్నంగా కనిపించేది.కొన్నిసార్లు రాగిలాంటి లోహాలను కూడా బంగారంలో కొద్దిగా కలిపి మరింత స్ట్రెంగ్త్ ఇస్తారు. ఇది కాస్త నేచురల్ గ్రీన్ టచ్లా సాఫ్ట్గా కనిపిస్తుంది. కాలక్రమేణా ఇందులో ఉన్న వెండి కారణంగా రంగు కొంచెం డార్క్ కావచ్చు, అదే దానికి ఒక యూనిక్ క్యారెక్టర్ను ఇస్తుంది. భారతీయ దుస్తులైనా, వెస్ట్రన్ ఔట్ఫిట్లైనా ఏ స్టయిల్కైనా ఇది మ్యాచ్ అవుతుంది. కొంచెం డిఫరెంట్, క్లాసీ లుక్ కావాలని అనుకునే వారికి గ్రీన్ గోల్డ్ ఒక బెస్ట్ చాయిస్.రోజ్ గోల్డ్ – ప్రేమకు గులాబీ మెరుపు స్టయిల్లో సాఫ్ట్నెస్ ఇచ్చేదే ఈ రోజ్ గోల్డ్. దీని రంగు కాస్త రొమాంటిక్ లుక్ ఇస్తుంది. బంగారంలో రాగి ఎక్కువగా కలిపితే ఈ అందమైన గులాబీ టోన్ వస్తుంది. అందుకే దీనిని ‘పింక్ గోల్డ్’ అని, పాతకాలంలో ‘రష్యన్ గోల్డ్’ అని పిలిచేవారు, ఎందుకంటే 19వ శతాబ్దంలో రష్యాలో ఇది మొదట ప్రాచుర్యం పొందింది. చరిత్రలో రాజ కుటుంబాలు, ప్రత్యేక సందర్భాల ఆభరణాల్లో ఈ రంగును ఉపయోగించేవారు.ఇది సాఫ్ట్గా కనిపించినా, రాగి కారణంగా ఇతర గోల్డ్ రకాల కంటే కొంచెం బలంగా ఉంటుంది. పైగా దీని రంగు కాలక్రమేణా తగ్గిపోకుండా స్థిరంగా ఉంటుంది. అన్నిరకాల చర్మానికి ఈ రంగు సూట్ అవ్వడం వల్ల యువతలో ఇది ఒక ఫ్యాషన్ ట్రెండ్గా మారింది. ముఖ్యంగా ఎంగేజ్మెంట్ రింగ్స్, గిఫ్ట్ జ్యూలరీ, డైలీ వేర్ ఆభరణాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. రొమాంటిక్గా, ట్రెండీగా కనిపించాలనుకునే వారు రోజ్ గోల్డ్ ఎంచుకోవటం మంచిది.బ్లూ గోల్డ్ – అరుదైన నీలి మెరుపుజ్యూలరీలో రేర్ స్టార్ బ్లూ గోల్డ్. బంగారంలో ఇండియమ్ లేదా ఐరన్ వంటి లోహాలను కలిపి, నియంత్రిత ప్రక్రియలో ఆక్సిడేషన్ చేయడం వల్ల దీనికి నీలి రంగు వస్తుంది. ఈ షేడ్ గాఢంగా కాకుండా, మెటాలిక్ టచ్తో సాఫ్ట్గా మెరుస్తూ కనిపిస్తుంది. ఈ రకం బంగారం ఎక్కువగా ఆధునిక కాలంలోనే అభివృద్ధి చెందింది, ముఖ్యంగా ప్రత్యేక డిజైన్లు, ఆర్టిస్టిక్ జ్యూలరీ కోసం దీనిని ఉపయోగించేవారు. ఇది మార్కెట్లో అసలు కనిపించదు; ఎక్కువగా స్టేట్మెంట్ జ్యూలరీ, కలెక్షన్ పీసెస్, ప్రత్యేక ఆర్డర్ డిజైన్లలో మాత్రమే కనిపిస్తుంది. తయారీ ప్రక్రియ క్లిష్టంగా ఉండటం, నైపుణ్యం అవసరం కావడం వల్ల దీని ధర కూడా ఎక్కువే. బ్లూ గోల్డ్ ఎక్కువగా కలెక్షన్ ఐటమ్స్ లేదా ప్రత్యేక సందర్భాల కోసం మాత్రమే తయారు చేస్తారు, అందుకే బ్లూ గోల్డ్ ఒక లగ్జరీ స్టేటస్గా నిలుస్తోంది.బ్లాక్ గోల్డ్ –బోల్డ్ స్టయిల్ బ్లాక్ గోల్డ్ అంటే బోల్డ్ స్టేట్మెంట్. ఇది సహజంగా ఏర్పడే రంగు కాదు. ప్రత్యేక టెక్నాలజీ, కోటింగ్ లేదా ట్రీట్మెంట్ ద్వారా తయారు చేసే మిశ్రమం. రోడియం ప్లేటింగ్, ఆక్సిడేషన్ లేదా లేజర్ ట్రీట్మెంట్ వంటి ఆధునిక పద్ధతులతో బంగారానికి ఈ నలుపు రంగు అందిస్తారు. ముఖ్యంగా మోడ్రన్ జ్యూలరీ ట్రెండ్స్ పెరిగిన తర్వాత ఎక్కువగా పురుషుల జ్యూలరీ, హై ఫ్యాషన్ డిజైన్లు, స్టేట్మెంట్ రింగ్స్, బ్రేస్లెట్స్లో ఇది కనిపిస్తుంది. జ్యూలరీతో అటెన్షన్ గ్రాబ్ చేయాలంటే బ్లాక్ గోల్డ్ ఒక ట్రెండీ ఆప్షన్.కొత్త డిజైన్లు..బంగారం ధరలు రోజు రోజుకీ పైకి ఎగబాకుతున్నాయని, స్టయిల్లో తగ్గాల్సిన అవసరం లేదు. ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు కొంచెం స్మార్ట్గా డిజైన్స్ ఎంపిక చేసుకుంటే, తక్కువ ఖర్చులోనే అందమైన నగలను పొందుతూ అందం, ఆనందం రెండింటినీ ఆస్వాదించవచ్చు.అవతారాలు ఎత్తే ఆభరణంఒకే నగను మూడు విధాలుగా మార్చుకునే డిజైన్లు ఇప్పుడు చాలా పాపులర్. పెద్ద హారం నుంచి చిన్న చైన్గా, లేదా లాంగ్ నెక్లెస్ను రెండు చిన్న నెక్లెస్లుగా మార్చుకోవచ్చు. ఒకసారి కొనుగోలు చేసి, మూడు సందర్భాల్లో వివిధ విధాలుగా వాడుకోవచ్చు.పాతకు కొత్త రూపం పాతకాలపు ఆభరణాలను కొత్తగా మార్చి, ఆధునిక డిజైన్స్ తో కలిపి తయారు చేయడం ఇప్పుడు ట్రెండ్గా మారుతోంది. దీంతో పాత బంగారం అమ్మి కొత్తవి కొనాల్సిన అవసరం లేకుండా, వాటినే కొత్తగా మార్చుకోవచ్చు. పెళ్లి కూతురి నగలలో కూడా కొత్త ఆకృతులు, కొత్త కలయికలు కనిపిస్తున్నాయి. అందుకే, ఇప్పుడు బంగారం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, సృజనాత్మకతకు కొత్త వేదిక.హాలో టెక్నిక్ ఈ టెక్నిక్ ఒక చిన్న మ్యాజిక్లాంటిది. నగ లోపల ఖాళీగా ఉండేలా తయారు చేస్తారు. బయట నుంచి చూస్తే మాత్రం పెద్దగా, ఘనంగా కనిపిస్తుంది. 40 గ్రాముల్లా కనిపించే నెక్లెస్ అసలు బరువు 20 నుంచి 25 గ్రాములే ఉండొచ్చు. పాతకాలపు భారీ టెంపుల్ జ్యూలరీ కూడా ఇప్పుడు ఈ కొత్త వెర్షన్ లో వస్తోంది. అంటే స్టయిల్ డబుల్, ఖర్చు హాఫ్.రెండు మెరుపులు బంగారాన్ని ఇతర లోహాలతో కలిపి తయారు చేసే మిక్స్డ్ మెటల్ డిజైన్స్ ఇప్పుడు ఫ్యాషన్ లో టాప్లో ఉన్నాయి. ఒకే నగలో రెండు రంగుల మెరుపు కనిపించడం వల్ల అది కొత్తగా, మోడర్న్గా కనిపిస్తుంది. ఖర్చు తగ్గుతుంది, డిజైనర్ లుక్ కూడా వస్తుంది.పూత పరి^è యాలుఈ టెక్నిక్లో నగ పూర్తిగా బంగారంతో కాకుండా, పైపైన మాత్రమే బంగారం పొర వేస్తారు. దీంతో అది గోల్డ్లా మెరిసిపోతుంది, కానీ ధర మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. వన్ గ్రాము గోల్డ్ లాంటివే కనిపిస్తాయి, కానీ అసలు బంగారం కాదు. పార్టీలు, ఫంక్షన్ లలో గ్రేస్ చూపించడానికి ఇది సూపర్ చాయిస్.తక్కువలో ఎక్కువ అందం. ఇప్పటి యువత ఎక్కువ నగలు ధరించడం కన్నా, ఒకే నగతో ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటున్నారు. ఒక చిన్న గొలుసు, ఒక అందమైన ఉంగరం, ఒక జత చెవిపోగులు. ఇవే ఇప్పుడు పూర్తి అలంకరణగా మారుతున్నాయి. సాదాసీదాగా, కానీ ఆకర్షణీయంగా కనిపించడం – అందానికి ఇదే నేటి కొత్త మంత్రం.సంప్రదాయం చిన్న ప్యాక్లో జ్యూలరీలో ‘లైట్ ఈజ్ రైట్’ అనే ట్రెండ్ సూపర్ హిట్గా మారింది. పెద్దగా కనిపించే హారం అయినా, చెవి రింగులు అయినా లోపల స్మార్ట్గా తక్కువ బంగారంతో డిజైన్ చేసి, బయటకు మాత్రం బీడ్స్, రంగురంగుల స్టోన్స్ , మెరిసే ముత్యాలు జోడించి ఫుల్ రిచ్ లుక్ తీసుకొస్తున్నారు. చేతిలో పెట్టుకుంటే బరువు తక్కువగా ఉంటుంది, కానీ చూసినవారికి మాత్రం ‘ఇది ఎంత గ్రాండ్గా ఉంది!’ అనిపించేలా మెరుస్తుంది.కాలం మారుతోంది, ఖర్చులు పెరుగుతున్నాయి, బంగారం ధర రోజూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అయినా మన ఇంట్లో ఒక మాట మాత్రం మారదు. ‘బంగారం కొంటేనే భద్రత’ అనే నమ్మకం. అందుకే, బంగారం ఎప్పటికీ ప్రత్యేకమే! ∙ దీపిక కొండి -
డ్రైవింగ్ లైసెన్స్ కోసం... 139 విఫలయత్నాలు
సాధారణంగా మనం డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే థియరీ, ప్రాక్టికల్ టెస్ట్లలో ఒకటి రెండుసార్లు ప్రయత్నం చేస్తాం. అలా సాధ్యం కాకపోతే ‘ఇక మనకు డ్రైవింగ్ సెట్ కాదులే’ అని అనుకుని ఏ ఓలానో, ఊబర్నో ఆశ్రయిస్తాం. కానీ పోలండ్లోని టార్నోకి చెందిన ఓ వ్యక్తి మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా అలుపెరుగకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అలా ఎన్ని రోజులు, ఎన్నిసార్లు అనుకుంటున్నారా... ఏకంగా 139 సార్లు, తొమ్మిదేళ్ల పాటు విసుగు చెందకుండా విఫల యత్నాలు చేశాడు. డ్రైవింగ్ లైసెన్స్ థియరీ టెస్ట్లో పాస్ కావడం కోసం ఏకంగా రూ. 1,90,000 కూడా ఖర్చు చేశాడు.చివరికి అంటే 140వ ప్రయత్నంలో ఎట్టకేలకు థియరీ టెస్ట్లో పాసయ్యాడు. అయితే, అసలైన మరో ట్విస్ట్ మరొకటి ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే థియరీ పాస్ అయిపోతే సరిపోదు. ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్ కూడా పాసై పోవాలి. కారు నడపడంలో తడబడినా, రివర్స్ సరిగ్గా తీయకపోయినా.. రూల్స్ ప్రకారం మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టాలి. మరోవిషయం.. 140 సార్లే ఎక్కువ అనుకుంటే, పోలండ్లోనే ఇతడిని మించిన ఇంకో ఘనుడు కూడా ఉన్నాడు. అతను డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఏకంగా 163 ప్రయత్నాలు చేశాడట. అది కూడా 17 ఏళ్ల పాటు! -
ఈ కోర్టే నకిలీది!
నకిలీ డాక్టర్ల గురించి విన్నాం. నకిలీ లాయరు. నకిలీ జడ్జి గురించి చదివాం. ఫేక్ ఆఫీసర్లు.. డూప్లికేట్ ప్రొడక్టులు.. ఇవన్నీ మనకు తెలిసినవే. అయితే, గుజరాత్లో ఓ వ్యక్తి ఓ కొత్త మోసానికి తెరలేపాడు. ఏకంగా నకిలీ కోర్టే ఏర్పాటు చేశాడు.. ఏంటీ కోర్టా? అని ఆశ్చపోతున్నారా.. కోర్టే కాదు.. లాయర్లు, ఉద్యోగులు, తీర్పులు అన్నీ నకిలీనే...సివిల్ కేసులు.. ఓ పట్టాన పరిష్కారం కావు. తరాలు మారినా ఎటూ తెగవు. ఏళ్లతరబడి ఎదురుచూపులు. కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు తప్పవు. ఇలా తిరిగి. విసిగి వేసారిన వారినే లక్ష్యంగా చేసుకున్నాడు. ప్రభుత్వం నియమించిన ఆర్బిట్రేటర్ని అని చెప్పాడు.. కోర్టు సెటప్ వేసి నమ్మించాడు. కేసులు పరిష్కరించినట్టు, తీర్పులు చెప్పినట్టు నటించాడు. లక్షల్లో ఫీజులు గుంజాడు. ఐదేళ్ల పాటు ఈ దందా సాగించాడు.ఓ కేసు వ్యవహారంలో ‘అసలు’ కోర్టుకు అనుమానం వచ్చి, ఆరా తీసింది. మోసం బట్టబయలైంది. ‘నకిలీ’ని కటకటాల్లోకి పంపింది. గుజరాత్లోని గాంధీనగర్లో ఈ ఉత్తుత్తి కోర్టు వెలిసింది. మోరిస్ శామ్యూల్ అనే వ్యక్తి ఈ మోసానికి పాల్పడ్డాడు. ఓ గదిలో కోర్టు సెటప్ ఏర్పాటు చేసి, జడ్జిగా గెటప్ వేశాడు. కొంతమంది నకిలీ లాయర్లు, ఉద్యోగులను నియమించుకున్నాడు. భూమి వివాద బాధితులే లక్ష్యంభూ సంబంధిత కేసుల్లో బాధితులను టార్గెట్ చేసేవాడు. అమాయకులను గుర్తించి, బుట్టలో వేసుకునేవాడు. ప్రభుత్వం తనను ‘అధికారిక మధ్యవర్తి’గా నియమించిందని నమ్మించేవాడు. కోర్టుల్లో కేసుల పరిష్కారానికి ఎక్కువ కాలం పడుతుందని, తాను త్వరగా పరిష్కారం చూపుతామని నమ్మించి..‘ఉత్తుత్తి’ కోర్టుకు రప్పించేవాడు. ఐదేళ్ల పాటు కొనసాగిన మోసంఈ ఉత్తుత్తి కోర్టు కార్యకలాపాలు 2019 నుంచి 2024 వరకు కొనసాగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. శామ్యూల్కు ఆర్బిట్రేటర్గా ఎటువంటి అధికారిక హోదా లేదని, ఐదేళ్లలో అనేక కేసుల్లో నకిలీ ఆదేశాలు జారీ చేశాడని గుర్తించారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తుల పేర్లపై మార్చేలా కలెక్టర్లకు సైతం ఆదేశాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. నకిలీ ఆర్బిట్రేటర్ కోర్టులో తన క్లయింట్లకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసేవాడు. ఆ తర్వాత ఆ నకిలీ క్లెయిమ్లను కోర్టులో సమర్పించి తన క్లయింట్లకు అక్రమ లాభం కలిగించేవాడు. ఎలా బయటపడిందిఈ ‘నకిలీ’ వ్యవహారం ఒక కేసు ద్వారా వెలుగులోకి వచ్చింది. శామ్యూల్ ఇచ్చిన తీర్పు కాపీని ఓ కేసులో అహ్మదాబాద్లోని సిటీ సివిల్ కోర్టులో సమర్పించగా, ఆ పత్రాలను పరిశీలించిన కోర్టు అధికారి అనుమానాస్పద అంశాలను గుర్తించారు. వాస్తవాలను పరిశీలించి, విచారణలో ఆ తీర్పు నకిలీదిగా తేల్చారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరెస్ట్.. కేసుల నమోదుపోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతని కార్యాలయంలో నకిలీ పత్రాలు, కోర్ట్ ఏర్పాటుకు సంబంధించిన ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. మోరిస్ శామ్యూల్ను అరెస్టు చేశారు. మోసం చేయడం, నకిలీ పత్రాలు తయారు చేయడం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. న్యాయవ్యవస్థపై ప్రజలకు అపారమైన విశ్వాసం ఉంది. ఆ నమ్మకాన్ని ఆధారంగా చేసుకుని శామ్యూల్ మోసానికి పాల్పడ్డాడు. ‘జాప్యాన్ని’ సాకుగా చూపి బాధితుల నిస్సహాయతను తనకు అనుకూలంగా మలచుకున్నాడు. చట్టపరమైన వ్యవహారాల్లో సరైన అధికారిక మార్గాలనే ఎంచుకోవాలని, అనుమానాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన రుజువు చేస్తోంది. అరుదైన మోసమే కాదు, అనేక ప్రశ్నలు లేవనెత్తే ఉదంతంగానూ దీన్ని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు.దిలీప్ మాదిరెడ్డి -
అరటిపండు షేప్ అలా ఎందుకు ఉంటుంది?
అరటిపండు (banana) అలా వంగి ఎందుకు ఉంటుంది?ఈ డౌన్ మీకు వచ్చిందా? అరటి గెలలో ప్రతి పండూ వంగే ఉంటుంది. దీనికి కారణం ఉంది. అదేంటో తెలుసుకుందామా?అరటి చెట్టుకి కాసిన గెల కిందకు వేలాడుతున్నా దాని పండ్లు మాత్రం ఆకాశం వైపుకు చూస్తుంటాయి. దీన్ని ‘నెగటివ్ జియోట్రోపిజం’ అంటారు. అంటే సూర్యుడి వైపు పెరగడం. చిన్నప్పుడు అన్ని పండ్లు కిందకే ఉంటాయి. పెరిగే కొద్దీ ఎండ కోసం పైకి వంగుతాయి. అందుకే అరటిపండు షేప్ వంకరగా వస్తుంది. అరటిపండులో పొటాషియం ఎక్కువ. అది గుండెకు, కండరాలకు మంచిది. పండిన అరటిపండు మీద నల్ల మచ్చలు వస్తాయి. వాటిని షుగర్ స్పాట్స్ అంటారు. ప్రపంచంలో 1000 రకాల అరటిపండ్లు ఉన్నాయి.ఇదీ చదవండి: మీటింగ్లో అనుకోని అతిథి.. అవాక్కైన అధికారులు వింత పండు ’రంబుటాన్’ ’రంబుటాన్’ పేరే వింతగా ఉందే? అవును. ’రంబుటాన్’ అంటే మలేషియా భాషలో ’వెంట్రుకలు’ అని అర్థం. ఎందుకంటే ఈ పండు బయటంతా పచ్చ, ఎరుపు రంగులో వెంట్రుకల్లాంటి మెత్తటి ముళ్లు ఉంటాయి. చూడ్డానికి చిన్న సముద్రపు జీవిలా ఉంటుంది. మలేషియా, థాయ్లాండ్, ఇండోనేషియా లాంటి దేశాల్లో రోడ్డు పక్కన బళ్ల మీద గుట్టలు గుట్టలుగా అమ్ముతారు. అక్కడి పిల్లలు స్కూల్ అయిపోగానే రంబుటాన్ కొనుక్కుని తింటూ ఇంటికెళ్తారు. మన దగ్గర మామిడిపండు లాగా అన్నమాట. పై తొక్క తీస్తే లోపల తెల్లగా, జెల్లీలా, మెరుస్తూ ఉంటుంది. సరిగ్గా మన లిచీ పండు లాగానే. మధ్యలో ఒక చిన్న గింజ ఉంటుంది. దానిని తినకూడదు.ఈ పండు రుచి కొంచెం పుల్లగా, జ్యూసీగా ఉంటుంది. లిచీ + ద్రాక్ష కలిపినట్టు. అక్కడి పిల్లలు ‘ఒకసారి మొదలుపెడితే ఆపలేం‘ అంటారు. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. కొందరు జ్యూస్ చేసుకుంటారు, ఐస్ క్రీంలో వేసుకుంటారు.హెల్త్కి చాలా మంచిది! విటమిన్ ఇ ఉంటుంది – జలుబు దగ్గరికి రాదు. ఐరన్ ఉంటుంది – రక్తం బాగా పడుతుంది. ఫైబర్ ఉంటుంది – కడుపు హ్యాపీ. మొదటిసారి చూసిన వాళ్లు ‘అయ్యో ఇది పండా? బొమికా?‘ అని భయపడతారు. కానీ టేస్ట్ చూశాక ‘ఇంకోటి ఇంకోటి’ అని అడుగుతారు. ఇదీ చదవండి: ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి -
పెట్రోలుకు నీటి వాకిలి హార్మోజ్ జలసంధి
ఇప్పుడు రోజూ హార్మోజ్ జలసంధి వార్తల్లో ఉంది. యుద్ధం జరుగుతుంటే దానిని ఒక దేశం మూసేస్తానంటే మరో దేశం తెరుస్తాను అంటోంది. దీని వివరాలు చూద్దాం. అసలు జలసంధి అంటే ఏంటి? రెండు పెద్ద సముద్రాలను కలిపే సన్నటి నీటి దారిని ‘జలసంధి’ అంటారు. ఇది ఒక నీటి వంతెన లాంటిది. మన ఇంటి సందులో నుంచి మెయిన్ రోడ్కి వెళ్లినట్టు. హోర్ముజ్ జలసంధి కూడా అలాంటిదే. ఇది ఇరాన్ దేశం, ఒమన్ దేశం మధ్యలో ఉంది. పర్షియన్ గల్ఫ్ అనే సముద్రాన్ని అరేబియా సముద్రంతో కలుపుతుంది. మ్యాప్లో చూస్తే V షేప్లో కనిపిస్తుంది. దీని పేరు ‘హోర్ముజ్’ అనే దీవి పేరు మీదుగా వచ్చింది. ఆ దీవి ఒకప్పుడు వ్యాపారానికి చాలా ఫేమస్.ఏమిటి ఈ జలసంధి ప్రత్యేకత?ప్రపంచంలో రోజూ వాడే పెట్రోల్, డీజిల్లో దాదాపు 20%– అంటే రోడ్డు మీద తిరిగే 5 పెట్రోలు ట్యాంక్ లారీల్లో 1 లారీలోని సరుకు– ఇదే దారిలో షిప్పుల్లో వెళ్తుంది. అందుకే దీన్ని ‘ఆయిల్ హైవే’ అంటారు. ఈ జలసంధి మొత్తం వెడల్పు 33 కిలోమీటర్లు. కానీ పెద్ద పెద్ద షిప్పులు వెళ్లడానికి కేవలం 3 కి.మీ. దారి మాత్రమే వాడతారు. రెండు వైపులా వెళ్లే, వచ్చే షిప్పులకు వేరు వేరు లైన్లు ఉంటాయి – రోడ్ మీద లాగా. రోజుకి దాదాపు 20–30 పెద్ద ఆయిల్ ట్యాంకర్ షిప్పులు ఇక్కడి నుంచి వెళ్తాయి. ఒక్కో షిప్ 2 కోట్ల లీటర్ల ఆయిల్ తీసుకెళ్లగలదు!ఇక్కడ ఎందుకు గొడవలు?ఈ దారి చాలా చిన్నది కాబట్టి, ఏదైనా దేశం దీన్ని మూసేస్తే ప్రపంచానికి పెట్రోల్ దొరకడం కష్టం. పెట్రోల్ రేట్లు ఒక్కసారిగా పెరిగిపోతాయి. అందుకే అన్ని దేశాలు దీన్ని జాగ్రత్తగా చూస్తాయి. మనం వాడే పెట్రోల్, డీజిల్లో చాలా భాగం గల్ఫ్ దేశాల నుంచి ఇదే దారిలో వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏదైనా జరిగితే మన బైక్, బస్ రేట్లు కూడా పెరుగుతాయి. హోర్ముజ్ జలసంధి అంటే ప్రపంచానికి పెట్రోల్ పంచే ‘సన్నటి డోర్’. ఆ డోర్ సేఫ్గా ఉంటేనే మన వాహనాలు స్మూత్గా నడుస్తాయి. -
చిట్టి చేతుల్లో పచ్చని ప్రపంచం
చెట్లు మనకు ఆక్సిజన్ ఇస్తాయి, నీరు లేకపోతే జీవం ఉండదు, పక్షులు, జంతువులు ప్రకృతి సమతుల్యతను కాపాడుతాయి... ఇలా ఒక్కో విషయాన్ని పిల్లలకు వివరించి చెప్పడమే కాదు, ఆచరణలో పెట్టేలానూ చేయాలి. అప్పుడే భవిష్యత్తులో మార్పులు వస్తాయి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, చెత్తను సరైనచోట వేయడం, నీటిని పొదుపు చేయడం, వస్తువులను రీసైక్లింగ్ విధానంలో వాడటం.. ఇవన్నీ పెద్దలు ఆచరిస్తూ పిల్లలకు నేర్పించాలంటున్నారు నిపుణులు.గాలి, నీరు, నేల, చెట్లు, జంతుజాలం.. ఇవన్నీ మన జీవనానికి ఆధారం. పిల్లలకు వీటి ప్రాముఖ్యతను తెలియజేయాలి. పర్యావరణానికి సంబంధించి కథలు, పెయింటింగ్, ఆటల ద్వారా అవగాహన తీసుకురావచ్చు. ప్రయోగాత్మకంగా నేర్పాలంటే పిల్లలతో మొక్కలు నాటించడం, వాటికి నీరు పోయించడం, పర్యావరణ పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, సేంద్రీయ ఎరువుల తయారీ.. లాంటి పనులలో భాగస్వాములను చేయడం వల్ల వారికి ప్రకృతిపై ప్రేమను కలుగుతుంది.చిన్న ఆలోచనతో పెద్ద మార్పు...→ ప్రకృతి సహజవనరులు–ప్రతికూల అంశాల గురించి ప్రాజెక్ట్ వర్క్స్ ఇవ్వవచ్చు. → స్థానిక పార్కుల వద్దకు తీసుకెళ్లి, చుట్టుపక్కల ఉన్న చెత్తను సేకరించడం, రీసైక్లింగ్ పట్ల అవగాహన కలిగించడం, కాలుష్య నివారణలో భాగస్వాములను చేయాలి. → గ్లోబల్ స్థాయిలో పర్యావరణంలో పిల్లలను ఇన్వాల్వ్ చేస్తున్న సంస్థలు, అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి తెలియజేయాలి. → వాహనాలు, ఫ్యాక్టరీలు వదిలే పొగ, ఎండ వేడిమి పెరగడానికి కారణాల గురించి తెలియజేయాలి.కీడు చేసే రసాయనాలు→ ఇంటి శుభ్రతలో వాడే క్లీనర్లలో ఉండే విషపూరిత రసాయనాలు, వీటి వాడకం వల్ల భూగర్భ జలాలు కలుషితం అవడం, మూగజీవాల ఆరోగ్యం దెబ్బతినడం వంటి ప్రమాదాల గురించి అవగాహన కలిగించాలి. ఇంటి శుభ్రతలో సేంద్రీయ ఉత్పత్తుల తయారీని పరిచయం చేసి, పర్యావరణ హానిని తగ్గించవచ్చు. → పర్యావరణ అనుకూల వస్తువుల వాడకం వల్ల జంతువులకు, మానవ మనుగడకు ఎంత మేలు చేస్తుందో తెలియజేయవచ్చు. → ఔషధ మొక్కల ఆధారిత పదార్థాల నుండి తయారుచేసిన ఉత్పత్తులు, నీటి వ్యవస్థల గురించి అవగాహన కలిగించాలి. ఇంటా బయట మనవంతుగా కర్బన ఉద్గారాలను తగ్గించి, పర్యావరణ స్వచ్ఛత లో భాగస్వాములు అవ్వాలని చెప్పవచ్చు. → ఆన్లైన్ – ఆఫ్లైన్ వేదికలుగా జరిగే పర్యావరణ సంబంధిత వర్క్షాప్స్, కార్యక్రమాలలో పాల్గొనేలా ప్రోత్సహించాలి.ఫ్యాబ్రిక్ ప్లాంట్ టాయ్స్పిల్లలకు బొమ్మలతో ఆడుకోవడం అంటే ఇష్టం. అందుకోసం వారికి ఫ్యాబ్రిక్ ప్లాంట్ టాయ్స్ తయారీని పరిచయం చేయడం, లేదా కొనుగోలు చేసి వాటి, ఉపయోగాలను వివరించాలి. కొబ్బరిచిప్పలు, వెదురు కొమ్మలు, మట్టి కుండలలో చిన్న చిన్న మొక్కల పెంపకం తెలిసిందే. టెడ్డీబేర్ క్లాత్ను ఉపయోగించి, బొమ్మ ఆకారం వచ్చేలా కుట్టి, అందులో కోకోపిట్ నింపి, తల భాగంలో జుట్టు ఎలా అయితే ఉంటుందో, అలా గోధుమ గడ్డి పెరిగేలా ఏర్పాటు చేయవచ్చు. కళ్లూ, ముక్కు.. వంటివి పెట్టి బొమ్మ చేయవచ్చు. బొమ్మ తల భాగంలో పైన కొన్ని నీళ్లు చల్లుతూ ఉంటే వారం రోజుల్లో మొలకలు ఏపుగా పెరుగుతాయి. వరి, ఇతర చిరుధాన్యాలతోనూ ఇలాంటి బొమ్మలను తయారు చేయించవచ్చు. ఓల్డ్ క్లాత్స్తో తయారు చేసిన ప్లాంట్ టాయ్స్ని పిల్లల చేత చేయించడానికి ఈ సీజన్ చాలా అనుకూలమైనది. పెద్దలు పర్యావరణాన్ని కాపాడేందుకు చేసే ప్రతి పని, పిల్లల్లో ఆలోచనను కలిగిస్తుంది. ప్రకృతి పట్ల బాధ్యతగా నడుచుకునేందుకు తగిన అవగాహన ఏర్పడుతుంది. ప్రకృతికి దగ్గరగా...మన భూమిని కాపాడుకుంటేనే మనకు భవిష్యత్తు అనే ఆలోచనతో పిల్లల చేత పర్యావరణ సంబంధిత కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. ప్రకృతికి నష్టం కలగకుండా ఎలా జీవించాలి, కమ్యూనిటీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చెరువుల చుట్టూ పేరుకుపోయిన చెత్తను శుభ్రపరచడం, ఎకో–ఫ్రెండ్లీ ఉత్పత్తుల తయారీ, వాడకం, ప్లాంటేషన్ డ్రైవ్ చేస్తుంటాం. ప్రకృతికి దగ్గరగా ఉండే ప్రతీ పనిలోనూ పిల్లల్లో మనోవికాసం వృద్ధి చెందుతుంది. – మేఘనా ముసునూరి, పర్యావరణ వేత్త, ఫౌంటెన్హెడ్ గ్లోబల్ స్కూల్ ఫౌండర్ – నిర్మలారెడ్డి, సాక్షి పీచర్స్ ప్రతినిధి -
మౌన్ జారో పెళ్లికూతురు
పెళ్లి పీటలెక్కే ముందు నాజూగ్గా కనిపించాలన్న ఆకాంక్ష కొత్తది కాదు. కానీ ఇప్పుడు ఆ ఆకాంక్ష ఢిల్లీలో కొత్త రూపం తీసుకుంది. దాని పేరే ‘మౌన్ జారో పెళ్లికూతురు’. ‘మౌన్ జారో’ అనే టైప్ 2 డయాబెటిస్ ఇంజెక్షన్లను ఇస్తూ ఢిల్లీలోని వెల్నెస్ క్లినిక్లు, బరువు తగ్గించే కేంద్రాలు పెళ్లికూతుళ్ల కోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి.క్షేమకరం కాని ఈ ట్రెండ్ పై కథనం.అదేమిటో... పెళ్లంటే అమ్మాయే అందంగా కనిపించాలని సామాజిక చట్టం. అబ్బాయి ఎలా ఉన్నా పర్వాలేదు. అమ్మాయి రూపానికి సంబంధించి ఎన్నో పట్టింపులు, ఆరాలు, నఖశిఖ పర్యంత పరీక్షలు. కాబట్టే పెళ్లంటే ఈ కాలంలో కూడా అమ్మాయిలు టెన్స్ అయ్యే పరిస్థితి ఉంది. వీరి కోసమని ‘మేకోవర్’లూ, ‘బ్రైడల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్యాకేజీ’లు మార్కెట్లో బయలుదేరాయి. ఈ పరిస్థితి ఢిల్లీలో కొత్త రూపం తీసుకుంది. దాని పేరే ‘మౌన్ జారో పెళ్లికూతురు’.‘మౌన్ జారో’ అనేది టైప్ 2 డయాబెటిస్ చికిత్సకు వాడే ఔషధం. దీనిలోని ‘టిర్జెపటైడ్’ అనే పదార్థం ఆకలిని తగ్గించి బరువు తగ్గేలా చేస్తుంది. ఈ ఔషధం పేరుతోనే ఇప్పుడు ఢిల్లీలోని వెల్నెస్ క్లినిక్లు, బరువు తగ్గించే కేంద్రాలు పెళ్లికూతుళ్ల కోసం ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి.ఎందుకు ఈ ట్రెండ్?పెళ్లికి మూడు నుంచి ఆరునెలల ముందు 10నుంచి 15 కిలోలు తగ్గాలని చాలామంది యువతులు కోరుకుంటున్నారు. జిమ్, డైట్తో సాధ్యం కాని ఫలితాలు త్వరగా కావాలనుకునే వారు ఈ ప్యాకేజీల వైపు మొగ్గుతున్నారు. పెళ్లికి అవసరమైన లెహంగా ఫిట్టింగ్, ఫొటో షూట్, సోషల్ మీడియా ఒత్తిడి కూడా దీనికి కారణమవుతున్నాయి.ప్యాకేజీల్లో ఏముంది?ఢిల్లీలోని క్లినిక్లు ‘బ్రైడల్ ట్రాన్స్ఫర్మేషన్’, ‘వెడ్డింగ్ రెడీ’ పేర్లతో ప్యాకేజీలు ఇస్తున్నాయి. వీటిలో వైద్యుల పర్యవేక్షణలో మౌన్ జారో ఇంజెక్షన్లు, డైట్ కౌన్సెలింగ్, బాడీ కాంటూరింగ్ (నిర్దిష్ట శరీర భాగం సన్నబరచడం) సెషన్లు కలిపి అందిస్తున్నారు. వీటి ధర 50 వేల నుంచి 2 లక్షల వరకు ఉంటోంది. పెళ్లి డేట్ చెప్పగానే ఆ డేట్కు టార్గెట్ బరువు సెట్ చేసి ప్లాన్ ఇస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.వైద్యుల హెచ్చరికఅనన్య లాంటి కేసులపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మౌన్ జారో అనేది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడని ఔషధం. వికారం, వాంతులు, ప్యాంక్రియాటైటిస్ వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కేవలం కాస్మెటిక్ కారణాలతో, వైద్య అవసరం లేకుండా దీన్ని వాడడం ప్రమాదకరమని ఎండోక్రై నాలజిస్టులు కూడా హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గిన తర్వాత జీవనశైలి మార్చుకోకపోతే తిరిగి బరువు పెరిగే అవకాశం 80 శాతం వరకు ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.నా రూపమే నా సౌందర్యంఇలాంటి ట్రెండ్ సమాజంపై ఒత్తిడిని పెంచుతోందనీ సాదాసీదా అమ్మాయిల ఆత్మవిశ్వాసం దెబ్బతీస్తోందని సామాజికవేత్తలు అంటున్నారు. పెళ్లంటే సన్నగా ఉండాలనే భావన బలపడేలా చేస్తున్న సౌందర్య సాధనాల సంస్థల ప్రచారాన్ని నిరోధించాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. ‘మౌన్ జారో పెళ్లికూతురు’ ట్రెండ్ యథాతథ రూపంలోని ఒరిజినాలిటీని సవాలు చేస్తోంది. ‘నా రూపమే నా సౌందర్యం’ అనే ఆత్మవిశ్వాసాన్ని పెళ్లగిస్తోంది. ‘ఆరోగ్యంగా ఉండటమూ అందంగా ఉండటమే’ అనే సంగతిని ఆడపిల్లలు మర్చిపోతున్నారు. పెళ్లిరోజున అందంగా కనిపించాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ ఆ ప్రయత్నంలో ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం సరైనదేనా అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరిని మర్చిపోవద్దు. అలాగే నకిలీ వెల్నెస్ క్లినిక్ల బారిన పడొద్దు. పెళ్లిలో బాగా కనిపించాలని..ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల అనన్య శర్మ (పేరు మార్చబడింది) అనుభవం ఈ ట్రెండ్కు అద్దం పడుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన అనన్యకు 2026 ఆగస్టులో వివాహం నిశ్చయమైంది. ఆమె బరువు 78 కిలోలు. డిజైనర్ లెహంగా సెట్ అవ్వాలంటే కనీసం 65 కిలోలకు రావాలని బోటిక్ వారు సూచించారు. జిమ్లో చేరినా ఉద్యోగ ఒత్తిడి వల్ల క్రమం తప్పకుండా వెళ్లలేకపోయింది. దీంతో స్నేహితురాలి సలహాతో సౌత్ ఢిల్లీలోని ఒక ప్రముఖ స్లిమ్మింగ్ క్లినిక్లో ‘బ్రైడల్ మౌన్ జారో ప్యాకేజీ’ తీసుకుంది. నాలుగు నెలల ప్యాకేజీ ఖరీదు 1.4 లక్షలు. వారానికి ఒకసారి టిర్జెపటైడ్ ఇంజెక్షన్, నెలకు రెండుసార్లు డైటీషియన్ కన్సల్టేషన్, 8 సెషన్ల బాడీ కాంటూరింగ్ ఇందులో భాగం. ‘మొదటి నెలలోనే ఆకలి బాగా తగ్గింది. 4 కిలోలు తగ్గాను’ అని అనన్య చెప్పింది. నాలుగు నెలలు పూర్తయ్యేసరికి ఆమె 12 కిలోలు తగ్గి 66కిలోలకు చేరింది. అయితే ఈ క్రమంలో తరచూ వికారం, నీరసం, మలబద్ధకం వంటి సమస్యలు ఎదుర్కొన్నానని తెలిపింది. ‘పెళ్లి అయ్యాక మందు ఆపేస్తే మళ్లీ బరువు పెరుగుతానేమో అనే భయం ఉంది. కానీ పెళ్లి రోజు ఫోటోల్లో బాగా కనిపించడం నాకు ముఖ్యం’ అని ఆమె అంది. -
సమ్మర్లో హైడ్రేషన్ కోసం..!
వైశాఖం రాకమునుపే సూర్యుడు భగ్గుమంటున్నాడు. ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతలతో ప్రజలు అల్లాడి పోతున్నారు. భానుడి సెగ మాములుగా లేదు. ముఖ్యంగా పెద్దలు, చిన్నపిల్లలు, గర్భిణిలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ముఖ్యంగా డీ హైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందరూ సమ్మర్లో హైడ్రేటెడ్గా ఉండటం కోసం.. నీళ్లు దగ్గర నుంచి పండ్లు, తీసుకునే ఆహారం వరకు ఈ పొరపాట్లు చేస్తుంటారని హెచ్చరిస్తున్నారు. దాంతో తీవ్ర డీహైడ్రేషన్ బారినపడి లేనిపోని సమస్యలు కొనితెచ్చుకుంటారుని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎండకాలం హైడ్రేషన్గా ఉండటం కోసం చేయకూడని పొరపాట్లు ఏంటో ఆరోగ్య నిపుణుల మాటల్లోనే చూద్దామా..!.ఒకేసారి ఎక్కువగా నీరు త్రాగడందాహం వేసిందనో మరే కారణంగానో ఒకేసారి ఎక్కువ నీరు తీసుకోకూడదని చెబుతున్నారు నిపుణులు. దీనివల్ల ఎక్కువ పరిమాణాంలోని నీరు కణాలకు సమర్ధవంతంగా అందుకుండానే బయటకు వెళ్లిపోతుందట. అరలీటరు నీరు తాగితే నాడీ వ్యవస్థ కార్యచరణ మెరుగ్గా ఉంటుందట. అంతకుమించి తాగితే శరీరంలోని కణాలకు తేమ అందకుండా పోతుందని అధ్యయనాల్లో వెల్లడైందని చెబుతున్నారు.నీరు శాతం ఎక్కువగా ఉండే పండ్లను ఎంచుకోకపోవడం..శరీరానికి తేమను అందించడానికి కేవలం నీరు మాత్రమే కాకుండా ఆహారం కూడా తోడ్పడుతుంది. పుచ్చకాయ, దోసకాయ, నిమ్మజాతి పండ్ల వంటివి ద్రవాల శరీరానికి అవసరమైన ఖనిజాలను అందిస్తాయి. ఇవి వేడి వాతావరణంలో తేమను నిలుపుకోవడానికి, శక్తి స్థాయిలను కాపాడుకోవడానికి సహాయపడతాయి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులుడీహైడ్రేషన్ను తీవ్రతరం చేసే పానీయాలు ..చాలామంది ఎంత ఎండకాలం అయినా.. కాఫీ, టీలు పడాల్సిందే లేదంటే కష్టం. వేసవిలో ఇవి శరీరానికి తగినంత నీరు సమర్థవంతంగా అందకుండా చేస్తుందట. అలాగే కూల్డ్రింక్లు, ఇతర పానీయాలు శరీరానికి నీరు అందుతుందన్న భావనను కలిగిస్తాయి గానీ ఇవన్నీ డీహైడ్రేషన్ను మరింత తీవ్రతరం చేస్తాయని అంటున్నారు.హైడ్రేషన్ స్థిరంగా ఉండదట..హైడ్రేషన్ అవసరాలు స్థిరంగా ఉండవని అంటున్నారు. శారీరక శ్రమ, వయస్సు, మొత్తం ఆరోగ్యం ఆధారంగా మారుతూ ఉంటాయి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా, ముఖ్యంగా ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో శరీరం ద్రవాలను కోల్పోతూనే ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మన యూరిన్ రంగు ఆధారంగా మన శరీరం హైడ్రేటెడ్గా ఉందా లేదా అని తెలుసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. అదెలా అంటే..మూత్రం రంగు మరి చిక్కగా పసుపు రంగులో ఉంటే వేడి అధికంగా ఉందని, తక్కువ పసుపు రంగులో ఉంటే..తగినంతగా నీరు తీసుకోవాలని..అలా కాకుండా నీళ్లలా ప్యూర్గా ఉంటే..శరీర హైడ్రేటెడ్గా ఉందని అర్థమట.వేళకు తగిన నీరు అత్యంత ముఖ్యం..నీరు తాడం మాత్రమే చూస్తాం. ఎంత వ్యవధిలో తాగుతున్నాం అనేది ముఖ్యం. చాలా సమయం అయ్యాక తగితే..అంత ప్రభావవంతగా ఉండదు. పైగా దీని కారణంగా బయటకు వెళ్లిన వెంటనే వడదెబ్బ బారిన పడతామని అంటున్నారు. అలాగే భోజనంలో బాగా ఆయిల్తో చేసే పదార్థాలకు దూరంగా ఉండాలంటున్నారు. తేలికపాటి కాలనుగుణ భోజనమే మేలని చెబుతున్నారు.ఎండకు గురైన వెంటనే నీళ్లు తాగటం..తీవ్రమైన ఎండ నుంచి వచ్చిన వెంటనే చల్లటినీళ్లు అస్సలు తాగకూడదల. ఇది జీర్ణక్రియకు ఆటంకం కలిగించి, శరీర ద్రవాలు సమర్థవంతంగా శోషించబడటాన్ని నెమ్మదింపచేస్తుందట. అందుకుని నీళ్లు లేదా కొబ్బరి నీళ్లను తాగే ముందు ఎండకు గురైన శరీరం తగిన ఉష్ణోగ్రతకు స్థిరపడే వరకు ఆగి తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.ఇళ్లలో, జర్నీ సమయాల్లో చేసే తప్పిదాలు..ఇంటి వద్ద, కార్యాలయాల్లో ఉన్నప్పుడూ అంతగా నీరు తీసుకోవడం మర్చిపోతుంటారట. రిలాక్స్ అయిపోయి నీడ పట్టునే ఉన్నాం కదా అని తగినంత నీరు తీసుకోరని అంటున్నారు. అందువల్ల ఇలా అస్సలు చెయ్యొదని హెచ్చరిస్తున్నారు.ఉప్పుని మరింత దూరంగా ఉంచడం..ఈ కాలంలో చెమటలు పట్టి..శరీరంలో ఎలక్ట్రోలైట్లు నష్టం ఎక్కువగా ఎదుర్కొనాల్సి ఉంటుందట. వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఉప్పును పూర్తిగా మానుకోవడం వల్ల, ఖనిజాలు కోల్పోయి కొన్నిసార్లు నీరసం, తలతిరగడం వంటి సమస్యలు ఎదురవ్వుతాయని అంటున్నారు.డీహైడ్రేషన్ పెద్ద సమస్య కాదనే అభిప్రాయం..నిజానికి డీ హైడ్రేషన్ మన మానసిక స్థితి, ఏకాగ్రతపై తీవ్ర ప్రభావం చూపిస్తుందట. అధిక వేడి పరిస్థితులు దేనిపై స్థిమ్మితంగా ఆలోచించేలా చేయనివ్వదట. అందుకే తగినంత నీరు తాగితేనే మన శరీరం యాక్టివ్గా ఉండి..ఏ పనైనా సులభంగా చేయగలుగులతామని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: Weight loss: వ్యాయామాలు చేయకుండానే 13 కిలోలు..! ఆ అమ్మ ఫిట్నెస్ మంత్ర..) -
ఆ నవవధువు ధైర్యానికి..అందరి కళ్లల్లో నీళ్లు తిరిగాయ్..!
ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది. కానీ శారీరక లోపం పైకే కనిపిస్తుంది కాబట్టి ఈజీగా చులకనగా చూసేస్తాం. ఎక్కడో కొందరే మెచ్యూరిటీగా వ్యవహరిస్తారు. కానీ అలాంటి వాళ్లు పక్కనే ఉంటే జీవితంలో ప్రతిదాన్ని ఇట్టే జయించగలరు. ముఖ్యంగా తమలోని లోపాన్ని ఆనందంగా స్వీకరించి ధైర్యంగా నిలబడగలుగుతారు, స్ఫూర్తిగా నిలుస్తారు. అందుకు నిదర్శనం ఈ నవవధువే. ఆమె కథ వింటే అందం గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఆ అమ్మాయే మహిమా ఘాయ్. ముంబైకి చెందిన మహిమ తన పెళ్లి రోజున జుట్టు లేకుండా వేడుకలోకి అడుగుపెట్టి..అందర్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది. పైగా అక్కడ ఎవ్వరు నవవధువు బట్టతలను చూడలేదు. ఆమె స్థైర్యం, ఆత్మవిశ్వాసం అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది. సహజత్వం గొప్పతనాన్ని చాటుతున్నట్లుగా అనిపించింది. అందం ప్రమాణాలకు అతీతమైనదని నిరూపించిన గొప్ప దృశ్యం అది. హుందాతనం, ఆత్మవిశ్వాసానికి మించిన సౌందర్యం ఇంకొకటి లేదని ఆ ఘటన నిరూపించింది. పెళ్లికూతురు అంటే ఇలానే ఉండాలనే అభిప్రాయాల్ని బేఖాతురు చేస్తూ వచ్చిన విధం అందర్నీ కట్టిపడేసింది. మహిమ అంత ధైర్యంగా అంత ముఖ్యమైన ఘట్టంలో అలా ఎలా కనిపించిందంటే..మహిమ కథేంటో తెలుసుకోవాల్సిందే..!.అంగీకరించక తప్పని పరిస్థితి..మహిమ చిన్నతనంలో అలోపేసియా బారిన పడింది. దాంతో జుట్టు ఊడిపోతుండేది. ఆమె పెరుగుతున్న కొద్దీ తలపై జుట్టపెరగక మచ్చలు ఎక్కువవుతుండేవి. మళ్లీ జుట్టురావాలనే ఉద్దేశ్యంతో ఎన్నో ఇంటి చికిత్సలు, వైద్య చికిత్సలు ఎన్నో చేయించుకుంది. ఏవి ఫలితం ఇవ్వలేదు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది ఆమె కుటుంబం. చివరికి వైద్యులు ఆమె వ్యాధిని నిర్థారించారు. ఆ పరిస్థితిని అర్థం చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని తేల్చి చెప్పారు. నవ్వు మాయమైన క్షణం..పెద్దయ్యే కొద్ది ఆత్మనూన్యత భావంతో తీవ్ర క్షోభని అనుభవించింది. తనలో తాను కుంగిపోవడం, తరచుగా ఎవరు పట్టించుకోవడం లేదనే భావన వంటి అభద్రతాభావం ఎక్కువైపు తుండేవి. తన పరిస్థితిని దాచేందుకు, అందరి దృష్టిని మరల్చడానికి విగ్గులు ధరిస్తుండేది. ఇది కూడా ఆమెకు ఉపశమనం ఇవ్వకపోగా ఆభద్రతా భావాన్ని మరింత ఎక్కువయ్యేలా చేసేవి. ఒక రోజు కాలేజ్లో చేసిన చిలిపి పని అందరి ముందు ఆమె నిజరూపం భయటపడంతో అలా గంటల తరబడి ఏడుస్తూ ఉండిపోయింది. ఆ రోజు నుంచి ఆమె ముఖంలో నవ్వు మాయమైపోయింది. సరిగ్గా ఆ కష్టసమయంలో తాను చేసే కళాకృతులే మహిమకు కొండంత బలాన్ని ఇచ్చేవి. మహిమ స్వతహగా విజువల్ ఆర్టిస్ట్. బొమ్మలేయడంలో దిట్ట.అతడి రాకతో వచ్చిన మార్పు..ఆ క్రమంలో ఆన్లైన్ ఆర్డర్లపై ప్రాజెక్టులు తీసుకోవడంతో..శశాంక్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. ఆ వృత్తిపరమైన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అతని ఆలోచనాత్మక ప్రవర్తన, నిజాయితీ ఆమెను ఎంతగానో ఇంప్రెస్ చేశాయి. అతడితో ఉంటే మహిమకు అభ్రతభావం మొత్తం తొలిగిపోయేది. అయితే తన గురించి శశాంక్కి పూర్తిగా తెలియాలని విగ్గు తీసి చూపింది. తన నిజ స్వరూపాన్ని చూసినప్పుడు కూడా శశాంక్ ఆమెతో మెలిగిన తీరు మహిమను మరింతగా ఆకట్టుకున్నాయి. అది శారీరక లోపం కంటే మంచి మనసుని చూసే అతడి విధానం మహిమలో ఉన్న అనుమానాలన్నింటిని పటాపంచలు చేసింది. ఆ తర్వాత ఇద్దరు 2025లో పెళ్లి చేసుకోవాలని నిర్ణియించుకున్నారు. అయితే శశాంక్ కుటుంబ తనను ఎలా చూస్తుందో అని ఆందోళన చెందింది. వాళ్లు కూడా ఆమెను మనస్ఫూర్తిగా తమ కుటుంబంలోకి స్వాగతించారు. ఆ నేపథ్యంలోనే మహిమ ఇక ఎప్పటికి ముసుగు వెనుక దాగుడు మూతలు వద్దు అనుకుని ఇలా జుట్టు లేకుండానే నవ వధువుగా పెళ్లిపందిరిలోకి వచ్చింది. ఆ పెళ్లికి వచ్చిన వాళ్లు సైతం ఆమె బట్టతలను చూడలేదు, పెళ్లి కూతురు ఆత్మవిశ్వాసం, స్థైర్యం అందరి మనసులను కదిలించాయి. తన వ్యక్తిత్వానికి ప్రతిరూపంగా నిలిచిన ఆ వధువుని అంతా గౌరవప్రదంగా చూశారు. మన లోపాన్ని(స్థితిని) మనం అంగీకరించడంతోనే గుర్తింపు మొదలవ్వుతుందని ఈ వధువు మహిమ నిరూపించింది. తనను తాను యథావిధిగా స్వీకరించడమే అందం అని అంటోంది మహిమ..! View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) (చదవండి: సైకిల్పై సవారీ.. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మహిళ!) -
సైకిల్పై సవారీ.. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మహిళ!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరమైన మౌంట్ ఎవరెస్టు బేస్ క్యాంప్ను (17,560 అడుగుల ఎత్తులో ఉన్న) సైకిల్పై చేరుకున్న తొలి మహిళగా రికార్డు సృష్టించింది దివ్యసింగ్. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సాహసాన్ని చేసిన రెండో మహిళగా దివ్య చరిత్ర సృష్టించింది. అంతేగాదు ఆ సమయంలో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద ఉష్ణోగ్రత -12 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. మార్చి 16న కాఠ్మండు నుంచి ప్రారంభమైన ఆమె సైకిల్ యాత్ర సుమారు 14 రోజుల పాటు సాగింది. ఈ ప్రయాణంలో ఆమె కాఠ్మండు, సల్లేరి, సుర్ఖే, ఫక్డింగ్, సాగర్మాత నేషనల్ పార్క్, నామ్చే బజార్, డెబోచే, ఫెరిచే, లోబుచే, గోరక్ షేప్ గుండా వెళ్లింది. చివరగా ఆమె మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను చేరుకుంది.దీని వెనుక ఉన్న ప్రేరణ..సుమారు ఏడాదిన్నర క్రితం తాను మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్కు ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు.. ఏ భారతీయ మహిళా ఇంతవరకు సైకిల్పై అక్కడికి చేరుకోలేదని తెలియడం వల్ల ఈ సాహసానికి పూనుకున్నట్లు తెలిపింది. అదీగాక ఈ మౌంట్ ఎవరెస్ట్ గురించి తెలిసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడూ దాన్ని చూస్తానా అని వేయికళ్లతో ఎదురుచూశానని ఆనందంగా చెబుతోందామె. యాత్రలో ఎదురైన సవాళ్లుఅధిక ఎత్తులో ఉండే వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ప్రయాణం అత్యంత సవాలుతో కూడుకున్నదని చెబుతోంది దివ్య. ఈ జర్నీలో ట్రావెల్ హెల్త్ సిక్నెస్, వేగంగా గుండె చప్పుడు వంటి శారీరక ఇబ్బందులు తలెత్తాయని వెల్లడించింది. అలాగే తక్కువ ఆక్సిజన్ స్థాయిలకు అలవాటు పడాల్సి వచ్చిందని పేర్కొంది. ఇక దివ్య గురువు కుమార్ సింగ్ మాట్లాడుతూ..ఇంతరకు ఏ భారతీయ మహిళ సైకిల్పై ఇలాంటి సాహస యాత్ర చేయలేదని అన్నారు. అందువల్ల దివ్య ఈ సవాలు స్వీకరించిందని చెప్పారు. వ్యక్తిగతంగా ఏర్పర్చుకున్న ఈ లక్ష్యం కోసం దివ్య తన శరీరాన్ని సన్నద్ధం చేసుకునేలా తీవ్రమైన శిక్షణను ప్రారంభించినట్లు తెలిపారు. చివరికి అనుకున్నట్లుగా విజయాన్ని సాధించిందన్నారు. ఇక దివ్య గోరఖ్పూర్ జిల్లాలోని బనౌడా గ్రామానికి చెందింది. ఆమె తండ్రి సంత్రాజ్ సింగ్ రైతు కాగా, తల్లి ఊర్మిళ సింగ్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు. కాగా, దివ్య కూడా తల్లిలానే టీచర్ వృత్తిలో కొనసాగడం విశేషం. (చదవండి: వ్యాయామాలు చేయకుండానే 13 కిలోలు..! ఆ అమ్మ ఫిట్నెస్ మంత్ర..) -
‘ఫ్యామిలీతో చూడదగ్గ కొత్త సినిమా ఏదైనా ఉందా?’
మొబైల్ డేటాతోనో లేకుంటే ఇంట్లో వైఫై నెట్తోనో చేతిలో స్మార్ట్ ఫోన్లో చేతిని పైకి కిందకు ఆడిస్తూ గడిపేస్తున్న కాలమిది. దీనికి తోడు వారాంతంలో ప్రశాంతంగా ఓ సినిమానో, వెబ్సిరీసో చూడడం కుటుంబరావులకు పెద్ద టాస్క్గా మారింది. ఇప్పటి ప్రేక్షకుల పెద్ద సమస్య ఏమిటంటే.. ఏం చూడాలి? ఏది ట్రెండింగ్లో ఉంది? ఏది సరదాగా ఉంటుంది? అనే. ఈ ప్రశ్నలతోనే ఎక్కువ సమయం వృథా అవుతోందట. ఇది ఎంతలా అంటే.. ఒక సినిమా చూసే సమయం కంటే ఎక్కువే!అవును.. ఆశ్యర్యం కలిగించినా పైన చెప్పుకున్నదే ఇదే నిజం. యూజర్టెస్టింగ్ అనే సర్వే ప్రకారం.. మన దేశంలో ఒక యూజర్ ‘ఏం చూడాలి’ అని నిర్ణయించుకోవడంలోనే ఒక ఏడాదిలో 110 గంటలు.. అంటే సుమారుగా ఐదు రోజులు వేస్ట్ చేస్తున్నారని వెల్లడైంది. అలాగే డెలాయిట్ సర్వే ప్రకారం.. ఈ గందరగోళంలోనే ఒక వ్యక్తి రోజుకు సగటున ఆరు రకాల డిజిటల్ వినోదం (సిరీస్, షార్ట్ వీడియోలు, సోషల్ ఫీడ్స్) మధ్య చక్కర్లు కొడుతున్నాడు. అయితే.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఈ పరిస్థితి మార్చేయబోతోంది. ఈరోజుల్లో విరామం దొరికితే విశ్రాంతి కోసం కాకుండా వినోదం కోసం వెతికే పనిలోనే బిజీ అయిపోతున్నాం. చాలా ఇళ్లలో ఏం చూడాలి అని ఎంచుకోవడానికి పట్టే సమయం పెరిగిపోతూ వస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఏం చూడడం బెస్ట్ అనే అడిగేవాళ్లు.. దానికి తమ రివ్యూలతో ఆన్సర్లు ఇచ్చేవాళ్లు పెరిగిపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్లే నడుం బిగించాయి. ఇప్పుడు AI ఆధారిత కంటెంట్ డిస్కవరీ వైపు అడుగులు వేస్తున్నాయి. అది ఎలాగంటే.. ఏఐ సెర్చ్ బార్లోనూ సాధారణ కీవర్డ్ సెర్చ్ కాకుండా.. అంటే చేతి వేళ్లు నొప్పి పుట్టేలా, రిమోట్ బటన్లు అరిగిపోయేలా టైప్ చేయాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు.. ‘నేను ఫ్యామిలీతో కొత్త సినిమా ఏదైనా చూడాలనుకుంటున్నా.. ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాల్లేని సినిమా ప్లే చేయి’, ‘లేటెస్ట్ రిలీజ్లు ఏమున్నాయో చూపించు’, ‘తక్కువ రన్టైంలో పూర్తయ్యే సినిమాలు ఏమైనా ఉన్నాయా?’’ అలా వాయిస్ కమాండ్ ద్వారా కావాల్సినవి ఎంచుకోవచ్చు. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. యూజర్ మూడ్ను, సందర్భాన్ని, ఉద్దేశం అర్థం చేసుకుని కూడా సరైన సజెషన్లు ఇస్తుంది. సో.. ప్రేక్షకులు ఇప్పుడు జానర్ మాత్రమే చెప్పాల్సిన అవసరం లేదు.. ఫీలింగ్స్ చెప్పినా సరిపోతుందన్నమాట!. ‘‘రోజంతా అలసిపోయాను.. రిలాక్సేషన్ కోసం ఫన్నీగా ఏదైనా ఇవ్వు”, ‘‘ఆదివారం సాయంత్రం బయట వాతావరణం వర్షం పడేలా ఉంది.. ఈ మూడ్కు తగ్గట్లు మంచి పాటలు ప్లే చేయు’.. ఇలాగన్నమాట. అలాగే ఏఐ కాబట్టి భాషతోనూ పెద్దగా ఇబ్బంది లేకుండా చూసుకుంటోంది. జియో హాట్స్టార్ ఓపెన్ఏఐతో కలిసి ChatGPT ఆధారిత వాయిస్ డిస్కవరీని భారతీయ ప్రేక్షకులకు అందిస్తోంది. నెట్ఫ్లిక్స్ ChatGPT ఆధారిత సెర్చ్ని మొదట ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ప్రారంభించి.. ఇప్పుడు భారత్కు విస్తరించింది. Amazon Prime Video కూడా ఏఐ జానర్ క్లస్టర్లు (fantasy quest, mind‑bending sci‑fi”) చూపిస్తూ యూజర్కు ఎంపిక చేసుకోవడంలో సహాయం చేస్తోంది. సో.. ఇకపై ప్రేక్షకులు ఎంత స్క్రోల్ చేసినా ఏదో దొరకడం లేదు అనే సమస్యతో బాధపడాల్సిన అవసరం లేదు. AI ఆధారిత డిస్కవరీ వల్ల ‘ఏం చూడాలి?’ అనే ప్రశ్నకు నేరుగా సమాధానం దొరుకుతుందన్నమాట. -
ముంచుకొస్తున్న వ్యవసాయ, ఆహార విపత్తు!
అత్యవసర వ్యవసాయ ఉత్పాదకాలైన ఎరువుల ఉత్పత్తి కోసం సహజ వాయువును తీసుకువెళ్లే ఓడలను హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించటాన్ని వెంటనే పునఃప్రారంభించకపోతే ప్రపంచ ఆహార ధరలు ఈ ఏడాది చివర్లో విపరీతంగా పెరిగే ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) తీవ్రస్వరంతో హెచ్చరిస్తోంది. హార్ముజ్ జలసంధిలో రవాణాకు దీర్ఘకాలిక అంతరాయాలు కోవిడ్–19 అనంతర కాలాన్ని గుర్తుచేసే విధంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను, సరఫరా గొలుసులో ఆటంకాలను ప్రేరేపించగలవని ఎఫ్ఏఓ హెచ్చరించింది.పంటల క్యాలెండర్ల ప్రకారం ఎరువులు, ఇంధన ఉత్పాదకాలు సకాలంలో అందకపోవటం, అధిక ధరల కారణంగా పేద దేశాలు అత్యధిక ప్రమాదంలోకి కూరుకుపోతున్నాయని ఎఫ్ఏఓ ముఖ్య ఆర్థికవేత్త మాక్సిమో టొరెరో ఆందోళన వ్యక్తం చేశారు. ఎఫ్ఏఓ ఆర్థిక విభాగం డైరెక్టర్ డేవిడ్ లాబోర్డ్తో కలిసి ఇటీవల ఒక పాడ్కాస్ట్లో ఆయన మాట్లాడారు. ముడి చమురు, నత్రజని ఎరువుల తయారీకి ఉపయోగించే సహజ వాయువు, ఇంకా ఇతర ఎరువులు రవాణా కావడం లేదు. ఫాస్ఫేట్ ఎరువుల తయారీకి ఉపయోగించే సల్ఫర్ రవాణా కూడా స్తంభించిందని ఆయన అన్నారు. నౌకలు కదలకపోతే, ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ–ఆహార వ్యవస్థకు, ఆర్థిక వృద్ధికి, ఇంకా అనేక రంగాల రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన కీలక వనరులపై గణనీయమైన ప్రభావం పడుతుందని టొరెరో హెచ్చరించారు. రాబోయే రోజుల్లో నౌకలు కదలడం ప్రారంభిస్తాయని ఆశిస్తున్నానన్నారు. ‘సమయం గడిచిపోతోంది..’ ‘సమయం గడిచిపోతోంద’ని ఎఫ్ఏఓ ప్రధాన ఆర్థికవేత్త టొరెరో అన్నారు. వ్యవసాయ–ఆహార వ్యవస్థకు సంబంధించిన ప్రతిదీ పంటల క్యాలెండర్తో ముడిపడి ఉందని వివరించారు. మనం పంటల క్యాలెండర్ను పాటించకపోతే, విత్తనాలు/ నాట్లు వేసే సమయంలో రైతుల దగ్గర పెట్టుబడులు లేక΄ోతే తక్కువ పెట్టుబడులతో వ్యవసాయం చేయవలసి వస్తుంది. అందువల్ల రానున్న ఒకటి, రెండు పంటకాలాల్లో దిగుబడులు తగ్గి΄ోవచ్చు. అలాగే ఆహారం, నిత్యావసరాల ధరలు పెరిగిపోవచ్చు. ప్రస్తుతం మనం ఈ అత్యవసర పరిస్థితిలో ఉన్నాం. దీనివల్ల వడ్డీ రేట్లు పెరుగుతాయని, అది ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందన్నారు. కోవిడ్–19 నుండి కోలుకున్న తర్వాత అనుసరించిన విధానాల మాదిరిగానే, అన్ని దేశాలు ధరలను తగ్గించే విధానాలను అమలు చేయాల్సి ఉంటుంది. అందువల్ల, ఈ నౌకలు ఇప్పుడు కదలడం ప్రారంభించడం చాలా ముఖ్యం అని టొరెరో నొక్కి చెప్పారు.ఆహార పంటల సాగు తగ్గొచ్చుధరల సూచి ఏప్రిల్లో పెరుగుతోందని, మేలో అది మరింత తీవ్రమవుతుందని టొరెరో పేర్కొన్నారు. ఎరువుల లభ్యతకు అనుగుణంగా పంటల ఎంపికలను మార్చుకోవాలా వద్దా? పెరిగిన చమురు ధరలతో ప్రయోజనం పొందడానికి జీవ ఇంధనాల ఉత్పత్తికి అనువైన పంటల సాగుకు ఎక్కువ భూమిని, వనరులను కేటాయించటంపై రైతులు నిర్ణయాలు తీసుకుంటారు. దీని వల్ల ప్రపంచ ఆహార సరఫరా తగ్గిపోతుంది. అందుకే కాల్పుల విరమణ కొనసాగడం, జలసంధిలోని నౌకలు కదలటం అత్యవసరమని అన్నారు. ముఖ్యంగా ఇంధనం, ఎరువులపై ఎగుమతి ఆంక్షలను నివారించాలని ఎఫ్ఏఓ అన్ని దేశాలను కోరింది.మాక్సిమో టొరెరో ఎఫ్ఏఓ ముఖ్య ఆర్థికవేత్త -
వ్యాయామాలు చేయకుండానే 13 కిలోలు..! ఆ అమ్మ ఫిట్నెస్ మంత్ర..
ఇటీవల బరువు తగ్గడం ఆధునిక ట్రెండ్గా మారింది. అందరూ చక్కటి శరీరాకృతిలో యంగలుక్లో కనిపించడం కోసం రకరకాల డైటింగ్లు, వర్కౌట్లతో పాట్లుపడుతున్నారు. కానీ కొందరు సింపుల్ చిట్కాలతో అద్భుతంగా బరువు తగ్గి ఆశ్చర్యపరుస్తున్నారు. బరువు తగ్గిన చాలామంది ఎంతో కొంత వ్యాయామాలు, వాకింగ్ వంటివి చేశామని చెప్పగా ఈ పిల్లల తల్లి మాత్రం అవేమి చేయకుండానే బరువు తగ్గానంటోంది. పైగా ఆరోగ్యకరమైన రీతీలోనే తగ్గానని చెబుతుండటం విశేషం. మరి అదెలాగో ఆమె మాటల్లోనే చూద్దామా..!.ముంబైకి చెందిన పిల్లల తల్లి, కంటెంట్ క్రియేటర్ సురభి పిసల్ తన వెయిట్లాస్ జర్నీని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. తాను ప్రసవానంతరం గుర్తుపట్టలేనంతగా మారిపోయానని చెప్పుకొచ్చింది. మళ్లీ తనలా మార్పు కోసం నెమ్మదిగా బరువతగ్గే యత్నం చేశానని చెప్పుకొచ్చింది. అయితే తాను వ్యాయామాలు చేయలేదని చెబుతోంది. తన జీవనశైలికి సరిపోయే విధంగా చిన్న, చిన్న స్థిరమైన మార్పులు మాత్రమే చేశానని అంటోంది. అయితే డెలివరీ తర్వాత పరిస్థితులు కాస్త కష్టంగా ఉన్నాయని, ఏ డైట్చేసినా కడుపు ఉబ్బరం, బరువు పెరడం వంటి సమస్యలతో ఇబ్బందిపడ్డట్లు వివరించారామె. అప్పుడే తాను ఆపిల్ సైడ్ వెనిగర్ని ఉపయోగించటం ప్రారంభించానని అన్నారు. ఇది తన జీవక్రియను మెరుగుపరిచి, ఆకలి కోరికలను నియంత్రించడానికి సహాయపడిందని అంటోంది. అది క్రమంగా తన బరువులో మార్పులకు దారితీసింది. ఇంతకుమునుపు సరిపోని బట్టలు సరిపోవడంతో మానసికంగా కాస్తం స్థైర్యం రావడం మొదలైందని తెలిపింది. కేవలం బరువు తగ్గడం పైనే కాకుండా మొత్తం ఆరోగ్యంపై కూడా ఫోకస్ పెట్టానన్నారు. అందుకోసం ఏ చాశారో కూడా చెప్పారు.నల్ల జీలకర్ర నూనె (ఖాళీ కడుపుతో): జీవక్రియను పెంచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానిక హెల్ప్ అవుతుందట.బుల్లెట్ప్రూఫ్ కాఫీ (బ్లాక్ కాఫీ + కొబ్బరి నూనె): ఇది తక్షణ శక్తిని అందిస్తుందట. పైగా కొబ్బరినూనెలోని ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరంలోని కొలెస్ట్రాల్ని కరిగిస్తుందట.ఎల్డర్బెర్రీ పొడి: దీన్ని పెరుగుతో కలిపి తీసుకుంటే దీనిలోని యాంటీఆక్సిడెంట్లను మెరుగైన రోగనిరోధక శక్తికి, జీర్ణక్రియకు మద్దతిస్తుందని చెప్పుకొచ్చారామె.తాను తన ఆరోగ్యంపై దృష్టిపెట్టడంతో ఆటోమేటిగ్గా బరువు తగ్గిపోయానని అంటోంది. నిజం చెప్పాలంటే వెయిట్లాస్ దానంతట అది జరిపోయిందని చెబుతోంది ఈ న్యూ మామ్. View this post on Instagram A post shared by Surabhi Pisal (@surabhi_littlereviews) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: Weight Loss Tips: చూయింగ్ గమ్ నమలడం నుంచి 3-2-1 రూల్..! ఏకంగా 80 కిలోలు..) -
'అరటిపండు'ని ప్రపంచ ఫలం అంటారు ఎందుకో తెలుసా..!
ప్రపంచవ్యాప్తంగా సామాన్యులకు కూడా అత్యంత అందుబాటులో ఉండే పండు అరటి పండు. అంతర్జాతీయ వాణిజ్యంలో అత్యధికంగా ఎగుమతయ్యే పండు అరటి పండు. ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల మందికి అరటి పంట జీవనాధారంగా నిలిచింది. దీన్ని సాగు చేసి విక్రయించి ఆదాయాన్ని పొందుతున్న రైతులు కొందరైతే... అరటి ఉత్పత్తులనే దైనందిన ప్రధాన ఆహారంగా తీసుకుంటూ ఆధారపడుతున్న వారు మరికొందరు. ప్రపంచ అరటిపండు దినోత్సవం ప్రతి ఏప్రిల్ నెల మూడో బుధవారం జరుపుకుంటున్నారు.ప్రపంచంలో అత్యధికంగా ప్రజలు తింటున్న, ఎగుమతి చేస్తున్న పండ్లలో అరటి ఒకటి. పండుగా తినటమే ఎక్కువ. పచ్చి కాయను కూరగా వండి లేదా కాల్చి లేదా పిండి చేసి నిల్వచేసుకొని దైనందిన ఆహారంగా తినే దేశాలూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న పరిమాణ పరంగా మొదటి పది ప్రధాన పంటల్లో అరటి ఒకటిగా నిలుస్తుంది. ప్రపంచ అరటి పరిశ్రమ విలువ సంవత్సరానికి సుమారు 2,500 కోట్ల డాలర్లు. ఆహార భద్రత, పౌష్టికత, గ్రామీణాభివృద్ధిలో అరటి పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి.150కి పైగా దేశాలలో అరటిని పండిస్తారు. ముఖ్యంగా తక్కువ ఆదాయం గల, ఆహార కొరత ఉన్న దేశాల్లో రోజువారీ ముఖ్యమైన ఆహారంగా అరటిని ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా, లక్షలాది మంది చిన్న రైతులకు వాణిజ్య పంటగా కీలకమైన ఆదాయ వనరుగా కూడా ఉంది. మొత్తంగా, ప్రపంచవ్యాప్తంగా అరటి ఆర్థిక వ్యవస్థ సుమారు 40 కోట్ల మంది ప్రజల జీవనోపాధికి దోహదం చేస్తోందని అంచనా. అరటి తోటల్లో లక్షలాది మంది కార్మికులకు ప్రత్యక్ష ఉపాధి దొరుకుతోంది. ప్యాకింగ్, రవాణా, మార్కెటింగ్లో పరోక్ష ఉద్యోగాలు పొందే వారు చాలా మంది ఉన్నారు. ఉత్పత్తి చేసే దేశాల్లోనే కాకుండా అరటి ఆధారిత పరిశ్రమ ముడిసరుకుల తయారీ నుండి అంతర్జాతీయ రవాణా, ఓడరేవు సేవలు, టోకు మార్కెట్లు, చిల్లర మార్కెట్ల వరకు ప్రపంచ అరటి విలువ గొలుసు అంతటా ఎంతో మందికి అరటి ఉపాధిని కల్పిస్తోంది.ప్రపంచ అరటి పండ్ల ఉత్పత్తి గత కొన్ని దశాబ్దాల్లో గణనీయంగా పెరిగింది. 2023 నాటికి ఇది 13.93 కోట్ల టన్నులకు చేరుకుంది. భారతదేశం, చైనా, ఇండోనేషియా, నైజీరియా, ఈక్వెడార్ అగ్రగామి అరటి ఉత్పత్తిదారులుగా ఉన్నాయి. అధిక శాతం అరటిపండ్లు స్థానికంగా వినియోగించబడుతుంటాయి. సుమారు 15 శాతం అంతర్జాతీయ వాణిజ్యంలోకి ప్రవేశిస్తున్నాయి. 2024 నాటికి ప్రపంచ ఎగుమతులు 19.7 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. ప్రపంచ నికర అరటిపండ్ల ఎగుమతులలో దాదాపు 80 శాతం వాటాతో ఈక్వెడార్, ఫిలిప్పిన్స్, కోస్టారికా, గ్వాటెమాల, కొలంబియా అగ్రగామి ఎగుమతి దేశాలుగా ఉన్నాయి. యూరోపియన్ యూనియన్, అమెరికా, చైనా, రష్యా, జపాన్ అతిపెద్ద దిగుమతి మార్కెట్లుగా కొనసాగుతున్నాయి.అరటి సాగులో భారత్ వాటా29% ప్రపంచ అరటి ఉత్పత్తిలో 25–29% వాటాతో భారత్ అగ్రస్థానంలో ఉంది. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్లలో అరటి తోటల సాగు విస్తారంగా ఉంది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి 1993లో తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జాతీయ అరటి పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పింది. ఈదురుగాలులకు అరటి తోటలు కూలిపోవటం రైతులకు అపారమైన నష్టాన్ని కలిగిస్తోంది. ఈ సమస్యను అధిగమించటానికి జీ9 మాదిరిగా అధిక దిగుబడినిచ్చే పాటి అరటి రకాన్ని ఈ కేంద్రం ఇటీవలే రూపొందించటం విశేషం.వెయ్యికి పైగా అరటి రకాలుప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా అరటి రకాలు ఉన్నాయని అంచనా. అయితే, ప్రపంచ ఎగుమతులలో ప్రధానంగా ‘కావెండిష్’ అరటి పండు రకానిదే ఆధిపత్యం. మన దేశంలో వాణిజ్యపరంగా ఉత్పత్తి చేస్తూ విరివిగా విక్రయిస్తున్న గ్రాండె నైన్ (జీ9) రకం దీనికి సంబంధించినదే. 20వ శతాబ్దం మధ్యకాలం వరకు, ప్రధాన ఎగుమతి రకం గ్రోస్ మిషెల్. రుచికి మరియు రవాణాలో తట్టుకునే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. అయితే, ఫ్యూసేరియం విల్ట్ రేస్ 1 అనే మట్టి ద్వారా వ్యాపించే శిలీంధ్రపు తెగులు మహమ్మారిగా మారి లాటిన్ అమెరికా అంతటా గ్రోస్ మిషెల్ తోటలను నాశనం చేసింది. దీంతో ఆ తెగులును తట్టుకోగల కావెండిష్ రకాల వైపు మళ్లవలసి వచ్చింది.కావెండిష్ అరటిపండ్లు సాగులోకి వచ్చిన కొద్ది కాలంలోనే అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రాధాన్యత గల ఎంపికగా మారాయి. అధిక దిగుబడి, ఏకరీతి రూపం, ఎక్కువ కాలం నిల్వ ఉండే గుణం, సుదూర ప్రాంతాలకు రవాణాలో తట్టుకునే శక్తి, స్పష్టమైన పక్వ లక్షణాలే ఇందుకు కారణాలు. నేడు ప్రపంచ అరటి ఎగుమతులలో 90 శాతం, ప్రపంచ ఉత్పత్తిలో దాదాపు సగం వాటా కావెండిష్ అరటి పండ్లదే. అయినప్పటికీ, కావెండిష్ రకంతోపాటు, ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అరటిపండ్లు సాగులో ఉన్నాయి. ఇవి స్థానిక ఆహారపు అలవాట్లు, మార్కెట్లు, సంస్కృతులలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. వీటిలో వంటకు ఉపయోగించే రకాలు (ప్లాంటైన్లు, ఇతర పిండి పదార్థాలు అధికంగా ఉండే అరటిపండ్లు), పండించి తినే అనేక ఇతర రకాల అరటి రకాలు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటీ ప్రత్యేకమైన వ్యవసాయ లక్షణాలు, పోషక ప్రయోజనాలు, గుణాలను కలిగి ఉండి జీవవైవిధ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. కొత్త రకాల అభివృద్ధిఅరటిపండ్లు ఆగ్నేయాసియాలో ఉద్భవించాయి. అడవి అరటిపండ్ల సహజ సంకరీకరణ వలన ఆ ప్రాంతంలో, పసిఫిక్లో వాటిని తొలుత సాగు చెయ్యటం ప్రారంభమైంది. అన్ని అరటిపండ్లు ముసేసి కుటుంబంలోని మూసా ప్రజాతికి చెందినవి, ఇందులో ఎన్సెటే, ముసెల్లా ప్రజాతులు కూడా ఉన్నాయి. కాలక్రమేణా కొత్త రకాల అభివృద్ధి జరిగింది. తోటల సాగు, పోషకాల అవసరాలు, పంటకోత అనంతర సవాళ్లను పరిష్కరించడానికి మెరుగైన రకాలను అభివృద్ధి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం విస్తృత శ్రేణిలో ప్రజనన (బ్రీడింగ్) ప్రయత్నాలు జరుగుతున్నాయి. అరటి, ప్లాంటైన్ ప్రజనన కార్యక్రమాల ముఖ్య ఉద్దేశాలలో ఫ్యూసేరియం విల్ట్ ట్రాపికల్ రేస్ 4 (టిఆర్4), బ్లాక్ సిగాటోకా (మైకోస్ఫెరెల్లా ఫిజియెన్సిస్), ఎల్లో సిగాటోకా (సూడోసెర్కోస్పోరా ముసే), బనానా బంచీ టాప్ వైరస్ (బీబీటీవీ) వంటి ప్రధాన వ్యాధులను తట్టుకునే రకాలను అభివృద్ధి చేస్తున్నారు.అరటి ప్రజనన కార్యక్రమాలు కరువు, లవణీయత, తీవ్ర ఉష్ణోగ్రతలు వంటి ఒత్తిళ్లను తట్టుకునే రకాలను అభివృద్ధి చేయడం ద్వారా మెరుగైన, నాణ్యమైన రకాలను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు రూపొందిస్తున్నాయి. తద్వారా మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో స్థిరమైన దిగుబడిని పొందటం సాధ్యపడుతుంది. పండ్ల నిల్వ కాలాన్ని పొడిగించడం, ఎంజైమాటిక్ బ్రౌనింగ్ను తగ్గించడం, పండ్ల దృఢత్వాన్ని, నిర్వహణ నష్టాన్ని తట్టుకునే శక్తిని పెంచడం ద్వారా కోత అనంతర సమస్యలను తగ్గించటంపై కూడా దృష్టి సారిస్తున్నారు. అదే సమయంలో, విటమిన్ ఎ, ఇనుము, జింక్తో బయోఫోర్టిఫికేషన్ ద్వారాపోషకాలను పెంచుతున్నారు. అలాగే అరటిపండ్లు, కూర అరటి రకాల నాణ్యతను మెరుగుపరచడానికి పిండిపదార్థం, చక్కెర కూర్పును సరిచేయడంపై కూడా ఈ ప్రజనన కార్యక్రమాలు దృష్టి సారిస్తున్నాయి. అదే సమయంలో, మారుతున్న మార్కెట్, వినియోగదారుల డిమాండ్లను తీర్చడానికి మెరుగైన రుచి, ఆకృతి, ప్రాసెసింగ్ అనుకూల లక్షణాలతో కూడిన రకాలను అభివృద్ధి చేయడం కూడా జరుగుతోంది.ఒకే రకం సాగుతో ముప్పుఆర్థిక అనిశ్చితి, వాతావరణ మార్పులు అరటి పంటపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జీవనోపాధి కోసం, ఆహార భద్రత కోసం లక్షలాది మంది ఆధారపడే అరటి పంట ఉత్పత్తి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది. ఒకే రకంపై ఎక్కువగా ఆధారపడటం, అరటిలో అంతర పంటలు వెయ్యకుండా ఏక పంట సాగుపై ఆధారపడటం వల్ల అరటి తోటల సాగు పర్యావరణ పరంగా, చీడపీడల పరంగా ఒత్తిళ్లకు గురవుతోంది. అదేవిధంగా మార్కెట్లో ఎదురయ్యే ఒడిదుడుకులు అరటి రంగాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. కావెండిష్ అంటే జీ9 రకం ఒక్కదాన్నే సాగు చెయ్యటం మానుకోవాలని ప్రపంచ అరటి ఫోరమ్ ప్రచారం చేస్తోంది. ‘అరటి రకాల్లో ఇప్పటికీ విస్తృతంగా సాగు చెయ్యని అపారమైన వ్యవసాయ వైవిధ్యం ఉంది. ఆ వైవిధ్యపూరిత రకాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చెయ్యాలి. స్థానిక మార్కెట్లలో అత్యంత ప్రజాదరణ పొంది, సాగు జరిగే ప్రాంతాల్లోని సాంస్కృతిక వారసత్వంలో భాగమైనవైనప్పటికీ, అంతర్జాతీయ వాణిజ్య అవసరాలకు మనం ఇచ్చిన ప్రాధాన్యం రీత్యా మరుగునపడ్డాయి. ఈ అరటి రకాలను తిరిగి సాగులోకి తేవాలి. ఉదాహరణకు.. మైసూరు అరటి రకం. ఈ సంప్రదాయ రకాలు అరటి తోటల్లో వ్యవసాయ జీవవైవిధ్యాన్ని పెంపొందిస్తాయి. చీడపీడలను, కరువు వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవటంలో అరటి రంగం సామర్థ్యాన్ని పెంచడానికి, కొత్త మార్కెట్ అవకాశాలను తెరవడానికి ఈ స్థానిక రకాలు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ విషయాలను ప్రచారంలోకి తేవాల’ని ప్రపంచ అరటి ఫోరమ్ ప్రపంచ దేశాలకు సూచిస్తోంది. అరటి సాగులో సవాళ్లుఅంతర్జాతీయంగా అరటి పంట బాగోగులు, తీరుతెన్నులను పరిశీలిస్తూ ప్రపంచ దేశాలకు తగిన సూచనలు ఇచ్చే సంస్థ ప్రపంచ అరటి ఫోరమ్. ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఉండే ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ఏర్పాటు చేసిన ఈ ఫోరం ఏమంటోందంటే? ‘ప్రపంచంలో అత్యధికంగా ఎగుమతి అయ్యే తాజా పండ్లు అరటి పండ్లే. సంవత్సరానికి దాదాపు వెయ్యి కోట్ల డాలర్లు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని వేలాది గ్రామీణ కుటుంబాలకు అరటి పండ్లు ఒక ముఖ్యమైన ఆదాయ వనరు. అయితే, అరటి సాగులో వ్యవసాయ రసాయనాలపై అధికంగా ఆధారపడటం, రైతుల చేతికందే ఆదాయం బాగా తగ్గటంతోపాటు గణనీయమైన పర్యావరణ, సామాజిక సవాళ్లు తలెత్తాయి. సంబంధిత వర్గాలన్నీ చురుకుగా సహకరించుకుంటేనే వీటిని సమర్థవంతంగా పరిష్కరించగలం’.– నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: రైతమ్మల గెలుపుకి.. సాంకేతిక సామాజిక స్ట్రాటజీ..) -
"రాయల్ చాయ్"..! ఆ ఐడియాకు మాటల్లేవ్ అంతే..
కార్యాలయాల్లో లేదా ఏదైనా ప్రదేశానికి వెళ్లినా..కాసింతా వేడివేడి చాయ్ తాగితే దెబ్బకు రిలీఫ్గా ఉంటుంది. మళ్లీ నూతనోత్సాహంతో మన పనిలో పడిపోతాం. అందుకే చాయ్ప్రియులకు ఇదంటే అంత మక్కువ. అలాంటి చాయ్ని అత్యంత లగ్జరీయస్ అందించే ప్రయత్నం చేశాడు. ఆ ఆలోచనే కనీవినీ ఎరుగని అద్భుతం. మరి ఆ వెరైటీ సర్వింగ్ స్టైల్ ప్రజలకు నచ్చిందా అంటే..ఎన్నో టీ స్టాల్స్ చూశారు గానీ ఇలాంటి వినూత్న చాయ్ స్టాల్ని మాత్రం చూసే ఛాన్సేలేదు. తన టీ స్టాల్ కోసం లక్ష రూపాయల రోల్స్రాయ్స్ను అద్దెకు తీసుకున్నాడు. చిన్నిచాయ్ స్టాల్కి అంత లగ్జరీ కారు దేనికి అనుకోకండి మనోడు ఆలోచన ఏ రేంజ్లో చూద్దాం రండి. అతడు తాను విలావంతమైన కారులో టీ సర్వీస్ని అందివ్వాలనుకున్నాడట. అందుకు రోల్స్రాయ్స్ కారుని అద్దెకు తీసుకున్నారు. ఈ ఆలోచను టీ స్టాల్ యజమానితో పంచుకోగా వాళ్లు కూడా అంగీకరించారు. అందుకోసం వాళ్లు బోర్డును ప్రింట్ చేసి కస్టమర్ల కోసం రెడ్కార్పెట్ పరిచాడు. 'టీ' తోపాటు కుకీలు, బిస్కెట్లు ఏర్పాటు చేసి..అమ్మకాలు ప్రారంభించాడు. ఇది చూసిన అక్కడున్న జనాలకు భలే ఆసక్తిగా అనిపించింది. ఒక్కసారి ఆ అనుభవం పొందాలనే ఉద్దేశ్యంతో అందరు ఆ లగ్జరీ కారులో జర్నీ చేస్తూ టీ తాగే అనుభవాన్ని పొందారు. ఈ లగ్జరీ చాయ్ స్టాల్కి అయిన ఖర్చు రూ. 1,08,000 అయితే అతను సంపాదించింది రూ. 88,400. పాపం అతనికి నష్టమే అయినా..చాలామంది జీవితంలో ఇలాంటి కారు కొనగలమో లేదో తెలియకపోయినా..తమ కుటుంబాలతో టీ తాగుతూ ఆనందించారు అదే చాలు అని అంటున్నాడు. ఏ వ్యాపారమైన మొదట్లోనే లాభాలు వచ్చేయవు కదా..రాను రాను ఊపందుకోవచ్చు కూడా. ఏదీఏమైనా ఈ ఐడియా అదుర్స్ కదూ..!. అతడి ఆలోచన అలా ఇలా లేదు బ్రో..ఇలా మరెవ్వరకీ సాధ్యం కాదేమో అని ప్రశంసిస్తూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by deluxe (@deluxebhaiyaji) (చదవండి: చూయింగ్ గమ్ నమలడం నుంచి 3-2-1 రూల్..! ఏకంగా 80 కిలోలు..) -
మరణం వరకు వెళ్ళి.. మళ్ళీ ఆరోగ్యంగా తిరిగి రావడం సాధ్యమేనా?
Patricia Dilts అనే మహిళకు 1978లో Breast Cancer నిర్ధారణ అయింది. వెంటనే Radical Mastectomy చికిత్స అందించారు. "చికిత్స విజయవంతమైంది, ఆందోళన అవసరం లేదు" అని వైద్యులు ఎంతో నమ్మకంగా చెప్పారు. కానీ కాలం పగబట్టింది. 1982లో క్యాన్సర్ మహమ్మారి తిరిగి దాడి చేసింది. ఈసారి అది మరింత భీభత్సంగా స్కల్, స్పైన్, రిబ్స్, పెల్విస్ వరకు పాకిపోయింది. బోన్ బయాప్సీ రిపోర్టులు చూసిన నిపుణులు చేతులెత్తేశారు. "ఇక మేము చేయగలిగేది ఏమీ లేదు. ఆమెకు చివరి రోజులు సుఖంగా గడిచేలా చూద్దాం" అని తేల్చి చెప్పారు.కానీ ప్యాట్రిసియా ఆ తర్వాత 13.5 సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించారు. వారానికి అనేక సార్లు అర మైలు ఈత కొడుతూ, ఐరోపా అంతటా యాత్రలు చేస్తూ, జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించారు.అదెలా సాధ్యం? ఒక సైకాలజిస్ట్ గా, న్యూరో లింగ్విస్టిక్ సైకోథెరపిస్ట్ గా, ఈ అసాధారణమైన కేసును నేను కేవలం ఒక అద్భుతంగానో, అదృష్టంగానో పరిగణించను. దీని వెనుక మన Neuro-Biology లో దాగి ఉన్న అపారమైన, నిగూఢమైన శక్తి దాగి ఉంది. దీనిని మనం లోతుగా విశ్లేషించాలి.అసలైన స్వస్థత ఎక్కడ, ఎలా మొదలవుతుంది?ప్యాట్రిసియా తన ఈ అసాధారణమైన అనుభవాన్ని My Pathway to Wholeness అనే పుస్తకంలో అక్షరబద్ధం చేశారు. ఆమె ఆ పుస్తకంలో చెప్పిన అతి ముఖ్యమైన, మన కళ్ళు తెరిపించే మాట... "Healing comes from within — it is not a function of techniques. It is the commitment of an individual to release the tremendous natural self-correcting capabilities of the human body."మన శరీరానికి self-healing శక్తి అద్భుతంగా ఉంది. కానీ ఆ శక్తికి తాళం వేసి ఉంటుంది. ఆ తాళం చెవి మరెక్కడో లేదు, మన మనసులోనే భద్రంగా ఉంది!వారసత్వంగా వచ్చిన నమ్మకం! ప్యాట్రిసియా తల్లి రొమ్ము క్యాన్సర్తోనే చనిపోయారు. ఆమె అక్క కూడా అదే విధంగా అకాల మరణం చెందారు. దీంతో ఆమె subconscious mind లో ఒక లోతైన, నిశ్శబ్దమైన, కానీ విధ్వంసకరమైన నమ్మకం పాతుకుపోయింది. మన కుటుంబంలో రొమ్ము క్యాన్సర్ వస్తే చనిపోవాల్సిందే. ఒకవేళ నేను బతికితే, చనిపోయిన నా తల్లికి, అక్కకు నేను ద్రోహం (disloyal) చేసినట్టే అని ఆమె ఒక ప్రమాదకరమైన సమీకరణాన్ని నిర్మించుకున్నారు. ఇది rational thought కాదు. కానీ ఇది ఆమె nervous system లో చాలా లోతుగా పాతుకుపోయింది. ఇలాంటి ప్రాణాంతక నమ్మకాన్ని కేవలం పైపై మార్పులతో తొలగించడం సాధ్యం కాదు. Beliefs & Values స్థాయిలో లోతైన మానసిక విశ్లేషణ, పునర్నిర్మాణం జరగాల్సిందే.ఒక జీవితాన్ని మలుపు తిప్పిన నాలుగు రోజులుPatricia కుమారుడు, NLP pioneer అయిన Robert Dilts, తన తల్లితో కలిసి నాలుగు రోజుల పాటు సుదీర్ఘంగా ఎన్ఎల్పి చికిత్స చేశారు. ఆ నాలుగు రోజులూ వారు విరామం లేకుండా పనిచేశారు. పని చేయని సమయాల్లో ఆమె కేవలం ఆహారం తీసుకోవడం లేదా నిద్రపోవడం మాత్రమే చేసేది. అంతటి exhausting inner work అది.ఆ నాలుగు రోజులలో వారు సాధించిన విజయాలు...🔹 ఆమె కుటుంబం నుండి వారసత్వంగా వచ్చిన inherited limiting beliefs ను గుర్తించి, వాటిని నిర్మూలించడం.🔹 ఆమె జీవితంలో ఎదురైన major internal conflicts గుర్తించి, వాటిని పరిష్కరించి, ఒకదానితో ఒకటి అనుసంధానించడం (integrate).🔹 తనను తాను "ఒక రోగిని" (patient identity) గా భావించే స్థితి నుండి "నేను సంపూర్ణంగా, ఆరోగ్యంగా జీవించే వ్యక్తిని" (wholeness identity) అనే నూతన గుర్తింపుకు మారడం.🔹ఈ మానసిక మార్పు జరిగిన తక్షణమే, ఆమె శరీరం అద్భుతంగా స్పందించడం మొదలుపెట్టింది. క్యాన్సర్ కణాలు నశించడం, శరీరం స్వస్థత వైపు అడుగులు వేయడం డాక్టర్లను ఆశ్చర్యపరిచింది.సైన్స్ ఏం చెప్తోంది? — Psychoneuroimmunologyమనం నమ్మే ప్రతి నమ్మకం మన నాడీ వ్యవస్థకు నేరుగా సంకేతాలను పంపుతుంది. ఆ సంకేతాలకు అనుగుణంగా మన మెదడు Neuropeptides విడుదల చేస్తుంది. ఈ న్యూరోపెప్టైడ్లు మన రోగనిరోధక వ్యవస్థను (Immune system) ఉత్తేజపరుస్తాయి లేదా బలహీనపరుస్తాయి.🔹 "నేను చనిపోతాను" అనే బలమైన నమ్మకం ఉంటే.. శరీరం ఆ నమ్మకానికి లోబడి, పోరాటాన్ని ఆపేసి, వ్యాధికి లొంగిపోతుంది. దీనినే Nocebo Effect అంటారు.🔹 "నేను బతుకుతాను, ఆరోగ్యం నా హక్కు" అనే దృఢమైన నమ్మకం ఉంటే.. శరీరం ఆ నమ్మకాన్ని నిజం చేయడానికి తన శక్తులన్నింటినీ సమీకరించి, వ్యాధితో పోరాడుతుంది. దీనినే Mind-Body Medicine అంటారు. ప్యాట్రిసియా చేసిన అద్భుతం ఇదే. ఆమె doctor verdict ను ధైర్యంగా తిరస్కరించింది. తన మనసులో, తన నాడీ వ్యవస్థలో తన మనుగడపై ఒక దృఢమైన, తిరుగులేని expectancy నిర్మించుకుంది.Wholeness అంటే కేవలం నయమవడం మాత్రమే కాదు!ప్యాట్రిసియా లక్ష్యం కేవలం "క్యాన్సర్ నయమవడం" (cure) మాత్రమే కాదు. ఆమె దృష్టిలో 'స్వస్థత' అంటే... శరీరం, మనసు, భావోద్వేగ జీవితం, కుటుంబ సంబంధాలు, తన identity... ఇవన్నీ కలిసి ఒక పరిపూర్ణమైన స్థితిగా (wholeness) మారడం. అందుకే ఆమె తన పుస్తకానికి పెట్టిన పేరు "Pathway to Wholeness", "Pathway to Cure" కాదు. ఈ తేడాను గమనించడం చాలా ముఖ్యం.జీవితంలో సంక్షోభాలు వివిధ రూపాల్లో రావచ్చు. అవి శారీరక వ్యాధిగా, మానసిక ఒత్తిడిగా, relationship failures, లేదా career collapse గా పరిణమించవచ్చు. కానీ ప్యాట్రిసియా కథ మనకు ఒక స్పష్టమైన, శక్తివంతమైన సత్యాన్ని బోధిస్తుంది. "మీ శరీరం మీకు వ్యతిరేకంగా పని చేసే ముందు, మీ నమ్మకాలు మీకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయా అని ఒకసారి పరీక్షించుకోండి." మీరు మీ అంతర్గత సంభాషణను, మీ మూల నమ్మకాలను మార్చుకోగలిగితే, మీ జీవన గమనాన్ని మార్చుకోగలరు. మీలో స్వస్థత కలిగించే అపారమైన శక్తి ఉంది. ఆ శక్తిని గుర్తించండి!కౌన్సెలింగ్ సెషన్లలో మేము చేసేది ఇదే... 🔹 మీ unconsious mindలో పాతుకుపోయిన Limiting Beliefs ను గుర్తించి, వాటిని నిర్మూలించి, కొత్త, అనుకూల నమ్మకాలను ప్రతిష్టించడం.🔹 Scientific NLP protocols ద్వారా మీ natural resourcefulness అన్లాక్ చేయడం.🔹 శరీరం, మనసు, జీవితం — ఈ మూడింటినీ కలిపి wholeness వైపు, సంపూర్ణ ఆరోగ్యం వైపు నడిపించడం.-సైకాలజిస్ట్ విశేష్. -
లిటిల్ డాక్టర్
పిల్లలు రోజులో ఎన్ని నీళ్లు తాగాలి, వ్యాయామం ఎందుకు అవసరం, కూల్ డ్రింక్స్ ఎందుకు తాగకూడదు, రోజులో విశ్రాంతి ఎంత అవసరం, సన్స్ట్రోక్ తగిలితే ఏం చేయాలి, చిన్న చిన్న గాయాలకు ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి... ఇలా ఈ వేసవిలో ఆరోగ్య అవగాహన వల్ల పిల్లల భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుంది అంటున్నారు నిపుణులు. ఫన్గా, ఉపయుక్తంగా హెల్దీ కిట్ను అందిద్దాం..ఎండ వేడికి ఒంట్లోని నీరు ఆవిరైపోతుంటుంది. శరీరం అలసటగా మారిపోతుంటుంది. స్కూల్ లేదని రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం లేటుగా లేవడం సాధారణమే. పెద్దలు కూడా సెలవులే కదా... అని వదిలేస్తుంటారు. అలాగే ఆహారం, శారీరక శ్రమ గురించి అంతగా శ్రద్ధ చూపరు. ఆ నిర్లక్ష్యం మిగతా వాటిపైనా ప్రభావం చూపుతుంది. ఎండ తీవ్రతకు డీహైడ్రేషన్ , స్కిన్ ర్యాషెస్, కడుపునొప్పి, తలనొప్పి.. వంటి సమస్యలూ తలెత్తవచ్చు. అవగాహన పాఠాన్ని ఆచరణలో చూపిస్తే మేలైన ప్రయోజనాలను సులువుగా పొందవచ్చు.→ సూపర్ హీరో ఛాలెంజ్→ నీళ్లు తాగడం బోర్ అని పిల్లలు అనకుండా ఉండాలంటే రోజుకు 6–8 గ్లాసుల ‘వాటర్ ఛాలెంజ్’ ఇవ్వచ్చు. ‘నీళ్లు తాగకుంటే శరీరం వేడెక్కుతుంది’ అని చెప్పి, ప్రతి గ్లాస్కు ఒక స్టార్, వారం రోజులు పూర్తయితే చిన్న రివార్డ్ ఇచ్చి ప్రోత్సహించవచ్చు. కూల్ డ్రింక్స్ కాకుండా కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, బటర్మిల్క్... వంటి సహజ పానీయాల గురించి చెప్పి వాటిని తయారు చేయించవచ్చు. → ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటలలోపు బయటకు వెళ్లాల్సి వస్తే ఎండ నుంచి రక్షణగా టోపీ, సన్ గ్లాసెస్, సన్స్క్రీన్, కాటన్ దుస్తులు, బ్యాగ్, వాటర్ బాటిల్.. ఇలా ఏయే వస్తువులు ఉపయోగించాలో ఒక పజిల్ టాస్క్గా ఇవ్వచ్చు. → ఐస్క్యూబ్స్ వేసిన పానీయాలు గొంతునొప్పి, జలుబు .. వంటి సమస్యలకు ఎలా కారణం అవుతాయో డిజిటల్ మీడియాలో వచ్చిన వీడియోలను చూపి తెలియజేయవచ్చు. → పొట్ట తేలికగా ఉండేలా పండ్లు, కూరగాయలు ఏ విధంగా ఉపకరిస్తాయో చెప్పి, జంక్ ఫుడ్, వేయించిన పదార్థాలకు ఎందుకు దూరంగా ఉండాలో వివరించవచ్చు. ∙చెమట వల్ల వచ్చే స్కిన్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణకు రోజూ స్నానం చేయడం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి వాటిని అలవాటు చేయాలి. → ఎండ తీవ్రత తక్కువ ఉన్నప్పుడు ఆరు బయట ఆటలను ప్రోత్సహించాలి.→ తలనొప్పి, తిమ్మిరి, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే పెద్దలకు తెలియజేయడం వల్ల సమస్యకు సత్వర పరిష్కారం ఉంటుందని చెప్పాలి.→ ఆటగా డాక్టర్ గేమ్...పిల్లలకు ఫస్ట్ ఎయిడ్ నేర్పడం అంటే కేవలం గాయాలకు ఎలా చికిత్స చేయాలో చెప్పడం మాత్రమే కాదు, అత్యవసర పరిస్థితుల్లో ధైర్యంగా, తెలివిగా స్పందించేలా తయారు చేయడం కూడా. → ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఉండాల్సిన వస్తువుల గురించి అవగాహన కల్పిస్తూనే, గాయాలకు ప్రథమ చికిత్స ఎలా చేసుకోవాలో నేర్పించాలి. → ముక్కు నుండి రక్తస్రావం అయితే ఏం చేయాలి, ఏదైనా కారణం చేత పెద్ద గాయం అయినా, వాపు సంభవించినా పెద్దలను లేదా డాక్టర్ను సంప్రదించడం గురించి చెప్పాలి.→ అత్యవసర నంబర్లను పిల్లలకు నేర్పాలి. డాక్టర్–పేషంట్ గేమ్ను ఆడించవచ్చు. → హెల్త్ అవేర్నెస్ క్యాంపులకు తీసుకెళ్లవచ్చు. చొరవ తీసుకొని తమ కమ్యూనిటీలలో హెల్త్ అవేర్నెస్ వర్క్షాప్స్ నిర్వహించవచ్చు. → మార్కెట్లో లభించే డాక్టర్ కిట్ టాయ్, ఆర్గాన్ టాయ్స్తోనూ అవగాహన కలిగించవచ్చు.→ ప్లేటు నిండుగా ఆరోగ్యం..హెల్త్ టాపిక్ను ఒక క్లాస్లా చెబితే... దూరంగా వెళ్లిపోతారు. అలా కాకుండా ప్లేట్ మీద చూపించవచ్చు. పుచ్చకాయ ‘ఇది నీళ్లు ఎక్కువగా ఇస్తుంది. కీరా.. ఇది శరీరాన్ని కూల్ చేస్తుంది’ ఇలాంటి ఉదాహరణలు పరిచయం చేయవచ్చు. జంక్ ఫుడ్ ఎక్కువైతే బాడీ ఏ విధంగా అలసిపోతుందో చెప్పవచ్చు. వాస్తవానికి దగ్గరగా! వేసవిలో నిద్ర, ఆహారం విషయంలో క్రమశిక్షణ ఉండదు. దీని వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపైనా చెడు ప్రభావం చూపుతుంది. టీవీ, మొబైల్స్ను ఉపయోగించడం వల్ల కంటి సమస్యలు, మానసిక సమస్యలు ఎలా ఉత్పన్నం అవుతాయో చూపాలి. స్కూల్ టైమ్ పాఠాల మాదిరి ఆరోగ్య సందేశాలను ఇవ్వకూడదు. ప్రతీది ప్రాక్టికల్గా చూపుతూ, పిల్లలను ఇన్వాల్వ్ చేస్తూ ఆరోగ్య అవగాహన కలిగించాలి. – డా.పి.జ్యోతిరాజ, లైఫ్ స్కిల్ ట్రైనర్– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అమ్మ ట్రైనింగ్కు టైమ్స్‘వంద’నం
రోజులు ఎంత మారినా వంట చేసే మగవారిపైజోకులు ఉండనే ఉంటున్నాయి. కాని వంట కూడా ఒక గొప్ప విజయపథం కాగలదు అని నిరూపించాడు వికాస్ ఖన్నా.వంట గదిలో తల్లి వెనుక తిరుగుతూ ఆమె ద్వారా వంట నేర్చుకున్న వికాస్ ఖన్నా మాస్టర్ షెఫ్గా ఎదిగి నేడు ‘టైమ్ 100– 2026’లో ఒకడిగా ఎంపికయ్యాడు. ఇది వికాస్ తల్లికి లభించిన గౌరవం కూడా. ‘టైమ్ 100’లో కేవలం ముగ్గురు భారతీయులు ఉంటే వారిలో సుందర్ పిచాయ్, రణ్బీర్ కపూర్తోపాటు వికాస్ ఖన్నా ఉన్నాడు. వికాస్ ఖన్నాకు చోటు భారతీయ వంటగది విజయం.ప్రతి ఏటా టైమ్ పత్రిక విడుదల చేసే అత్యంత ప్రభావపూరిత వ్యక్తుల పట్టిక్ట ‘టైమ్ 100’ 2026 సంవత్సరానికి బుధవారం విడుదలైంది. ఈసారి ఎంపికైన నూరుగురిలో భారతీయ స్త్రీలు ఒక్కరూ లేకపోయినా ముగ్గురు పురుషులకు చోటు దక్కింది. వారిలో గూగుల్ సి.ఇ.ఓ. సుందర్ పిచాయ్, ‘యానిమల్’ హీరో రణ్బీర్ కపూర్తో పాటు అమెరికాలో స్థిరపడ్డ ప్రఖ్యాత షెఫ్ వికాస్ ఖన్నాకు చోటు దొరికింది. షెఫ్గా, రెస్టరెంట్ల యజమానిగా ఉన్న గుర్తింపుకే కాదు... అతను చేస్తున్న సామాజిక సేవకు కూడా ‘టైమ్’ ఈ గుర్తింపు ఇచ్చింది. అమృత్సర్ వంట గది నుంచి మొదలైన అతని ప్రయాణం ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందడం కచ్చితంగా విశేషం. ఇందుకు అతడి తల్లి కారణం.అమృత్సర్లో...వికాస్ ఖన్నా పుట్టింది అమృత్సర్లో. చిన్నప్పుడు ‘క్లబ్ఫుట్ సమస్య’ వల్ల కాళ్లలో సత్తువ లేక సరిగా నడవలేకపోయేవాడు. స్కూల్లో పిల్లలు ‘పోలియో వాలా లడ్కా’ అని ఏడిపించేవారు. దాంతో స్కూలుకు వెళ్లడానికి నిరాకరించి ఇంట్లో అమ్మ బిందూ ఖన్నా వెంట వంటగదిలో ఎక్కువ ఉండేవాడు. అక్కడి బంగాళదుంపల వాసన, వేగే జీలకర్ర చిటపటలు, రొట్టె కాల్చే వేడి – ఇవే అతనికి ఊరటనిచ్చేవి. ఆ వంటగదికి పసుపు రంగు తలుపు ఉంటే రాను రాను వికాస్కి అది ‘హల్దీ’లా కనిపించేదట. ‘నేను నడవ లేకపోతే ఏంటి... నా చేతులు వంట చేయగలవు కదా’ అనిపించిందట!అమ్మ వంట స్టైల్అమ్మ వంట స్టైల్ను వికాస్ నిశితంగా గమనించేవాడు. ఆమె పంజాబీ వంట చేసేది. మిక్సీలు, అవెన్లు లేకపోయినా వంటలో ఓపిక, శుభ్రత తప్పేది కాదు. ఉదయం మార్కెట్లో తాజా కూరగాయలు బేరమాడటం, మోపెడ్ మీద గ్యాస్ సిలిండర్ తేవడం ఆమే చేసేది. ‘వంటవాడికి ఏ పనీ చిన్నది కాదు. గుర్తు పెట్టుకో’ అని కొడుక్కి చెప్పింది. ఆటా గూంద్నా... ఫుల్కే బనానా...‘పిండిని ప్రేమతో కలిపి మెత్తగా, పొంగుతూ వచ్చేలా కాల్చడం నేర్చుకుంటే నీకు వంట వచ్చినట్టే’ అని చెప్పిందామె. అలా కొడుకు చేత తొలిపాఠం మొదలు పెట్టించింది. ఆ తర్వాత బెండకాయ, ఆలూ గోబీ, దాల్ లాంటి పది రకాల వంటల్ని రొటేషన్ లో చేయించేది. ఇక ఆమె శీతాకాలంలో చేసే స్పెషల్– గాజర్ కా హల్వా. ఇదంటే వికాస్కు ప్రాణం. తల్లి నుంచి వంట నేర్చుకున్న వికాస్ 16 ఏళ్ల వయసులో సొంతగా ‘లారెన్స్ గార్డెన్’ అనే క్యాటరింగ్ నడిపేవాడు. బుకింగ్ తీసుకోవడం నుంచి డెలివరీ వరకూ అన్నీ తనే. ‘కస్టమర్ల నమ్మకమే నిజమైన ధనం’ అని తల్లి వ్యాపార పాఠం వికాస్కు నేర్పింది. ‘వంటతో పాటు ఆప్యాయతను వడ్డించడం మరువకు’ అని చెప్పిందామె. వికాస్ కేవలం చెఫ్ మాత్రమే కాదు. రచయిత, ఫిల్మ్ మేకర్, మానవతావాది. 40కి పైగా వంటల పుస్తకాలు రాశాడు. ‘ది లాస్ట్ కలర్’ అనే సినిమా తీశాడు. ఎక్కడికి వెళ్లినా ‘నేను ముందు వంటవాడిని‘ అని గర్వంగా చెప్పుకుంటాడు. ‘వంట నాకు భాష నేర్పింది. అమెరికాలో నాకు ఇంగ్లీష్ సరిగా రానప్పుడు నా వంట మాట్లాడింది. నా బాధను, నా ప్రేమను, నా దేశాన్ని ప్లేట్లో పెట్టి ప్రపంచానికి అందించాను’ అంటాడు వికాస్ ఖన్నా.తల్లి ఆశీస్సు.... చేసే పని పట్ల ఇంత నిబద్ధత, ఆర్తి, శ్రద్ధ, హృదయం ఉన్నవాడు ‘టైమ్ 100’లో చేరక ఎలా ఉంటాడు?వంట నా ప్రార్థన‘వంట నాకు వృత్తి కాదు, అది నా ప్రార్థన’ అంటాడు వికాస్ తల్లి నుంచి నేర్చుకున్న వంట గురించి. చిన్న వయసులోనే అమృత్సర్లో షెఫ్గా పేరు పొందిన వికాస్ ఆ తర్వాత అమెరికా వెళ్లి న్యూయార్క్లో∙రెస్టరెంట్లు తెరిచాడు. అమెరికా సంస్థలు ఇండియన్ రెస్టరెంట్లకు ఇవ్వని ‘మిచెలిన్ స్టార్’ హోదాను పొందాడు. ఆ తర్వాత సామాజిక సేవ మొదలుపెట్టాడు. కోవిడ్ టైంలో భారత్లో లక్షల మందికి ‘ఫీడ్ ఇండియా’ పేరుతో అన్నం పెట్టాడు. ‘ఒకరి ఆకలి తీర్చడం కంటే గొప్ప సంతృప్తి ఇంకోటి లేదు’ అంటాడు. -
మజ్జిగ లేదా నిమ్మరసం చాలా.. డీహైడ్రేషన్కు అదే మేలా?
దేశంలో మునుపెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, తీవ్రమైన వేసవికాలంతో పాటు అధిక తేమ కూడా తోడవుతోంది. వాస్తవానికి, రాబోయే కొన్నేళ్లు దేశ చరిత్రలోనే అత్యంత వేడిగా ఉండే కాలంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది, దీనివల్ల ఎక్కువ మంది డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంది. దీనిలో భాగంగా, దక్షిణ భారతదేశం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు వడగాలుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నేపధ్యంలో సరైన హైడ్రేషన్ ఉత్పత్తులపై అవగాహన అవసరం అంటున్నారు వైద్య నిపుణులు.ఎలక్ట్రోలైట్ల లోపం కీలకం...అనారోగ్యం లేదా విరేచనాల సమయంలోనూ, అలాగే రోజువారీ సంరక్షణలోనూ, ఉన్నతమైన హైడ్రేషన్ ఉత్పత్తులతో శరీరానికి తగినంత నీరు అందించడంపై అవగాహనను పెరగాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలలో, డీహైడ్రేషన్ కు ఇప్పటికీ మజ్జిగ లేదా నిమ్మరసం వంటి ఇంటి చికిత్సలే మొదటి పరిష్కారంగా ఉన్నాయి. ఒక వ్యక్తి డీహైడ్రేషన్ కు గురైనప్పుడు, వారు కేవలం ద్రవాలను మాత్రమే కాకుండా సోడియం, క్లోరైడ్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం మొదలైన ఎలక్ట్రోలైట్లను కూడా కోల్పోతారు. నిజానికి ఎలక్ట్రోలైట్లు శరీరంలోని సంకేత అణువులు. అవి నరాల ద్వారా ప్రయాణించి, కదలికలకు సహాయపడి, వ్యక్తులు చురుకుగా ఉండేలా చేస్తాయి అని అంటున్నారు హైదరాబాద్కు చెందిన వైద్యులు డా. అశుతోష్. మరి అలాంటి ఎలక్ట్రోలైట్ల లోపం కండరాల కదలికను తగ్గించి, అలసట నీరసానికి దారితీస్తుంది. మరి వీటిని పునరుద్ధరించుకోవడానికి ఏం చేయాలి?స్పోర్ట్స్ డ్రింక్స్, ఎనర్జీ పానీయాలు, గ్లూకోజ్ పౌడర్లు వివిధ ఎలక్ట్రోలైట్ ఉత్పత్తులు మార్కెట్లోకి ప్రవేశించడంతో, హైడ్రేషన్ ఎలక్ట్రోలైట్ విభాగం పోటాపోటీగా మారింది. పెరుగుతున్న ఆరోగ్య స్పృహ భారతదేశ వాతావరణ పరిస్థితులలో మార్పుల కారణంగా హైడ్రేషన్ విభాగం విపరీతమైన వృద్ధిని సాధించింది. ఈ నేపథ్యంలో, వినియోగదారులు అనారోగ్య సమస్యలకు అతీతంగా, శక్తి క్షీణించినప్పుడు లేదా అలసిపోయినప్పుడు వేగంగా కోలుకోవడానికి అనేక రకాల ఆరోగ్యకరమైన హైడ్రేషన్ సొల్యూషన్లను కోరుకుంటున్నారు. డీహైడ్రేషన్ ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్యగా మారుతున్నందున, విరేచనాలు రోజువారీ హైడ్రేషన్ అవసరాలను తీర్చడానికి కెన్ వ్యూ ఓఆర్ఎస్ఎల్, ఇఆర్జెఎల్ వంటి బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి. వడదెబ్బ, కండరాల నొప్పులు మొదలైన రోజువారీ సందర్భాలలో నీరసంగా అనిపించినప్పుడు లేదా అలసట, బలహీనత కారణంగా నిస్సత్తువగా ఉన్నప్పుడు ఇవి సహాయకారిగా పనిచేస్తున్నాయి. రోజువారీ హైడ్రేషన్ కోసం రూపొందిన ఎలక్ట్రోలైట్ డ్రింక్, మూడు ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లను (సోడియం, పొటాషియం, క్లోరైడ్) విటమిన్ సి లను వేగవంతమైన హైడ్రేషన్ ను అందిస్తూనే, పండ్ల రసాల తరహాలో రుచికరంగా ఉండేవి అందుబాటులో ఉన్నాయి.అయితే సరైన సందర్భాలకు సరైన హైడ్రేషన్ ద్రావణాలను ఎంచుకోవడంపై అవగాహన కల్పించడానికి కల్పించాలి. ఉదాహరణకు, విరేచనాల కోసం డబ్లు్యహెచ్ఓ ఆమోదించిన ఓఆర్ఎస్ ద్రావణాలు రోజువారీ హైడ్రేషన్ కోసం ఎలక్ట్రోలైట్ ద్రావణాలు వినియోగించాలి. ఇలాంటి అవగాహన పెంచేందుకు తెలుగు రాష్ట్రాలలో వైద్య నిపుణులు ఆరోగ్య సంరక్షణ సంస్థలతో కెన్ వ్యూ బ్రాండ్ కలిసి పనిచేస్తోంది అని చెప్పారు సంస్థ కు చెందిన ప్రశాంత్ షిండే.ఏడాది పొడవునా...డీహైడ్రేషన్పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణంపై పెరిగిన అవగాహన మహమ్మారి అనంతర ఆరోగ్యం పై దృష్టి సారించడం వంటి అంశాలన్నీ కలిసి, క్రియాశీల నివారణ సంరక్షణ వైపు మార్పును వేగవంతం చేశాయి. చాలా మంది ప్రతిరోజూ తగినంత నీరు తాగడాన్ని ఒక ఆరోగ్యకర అలవాటుగా పరిగణిస్తున్నారు. అయితే నిలకడ లేని వాతావరణ పరిస్థితులతో పాటు తీరికలేని జీవనశైలిని గడుపుతున్నందున, డీహైడ్రేషన్ కేవలం వేసవి కాలానికే పరిమితం కావడం లేదు. ఎండలో , ఏసీ ఉన్న ప్రదేశాలలో ఉన్నప్పుడు, అలాగే జ్వరం, జలుబు, దగ్గు వంటి అనారోగ్యాల సమయంలో కూడా సంభవించవచ్చు. వడదెబ్బ లేదా నీరసం, బలహీనత కారణంగా నిస్సత్తువగా అనిపించినప్పుడు, రోజువారీ సందర్భాలలో ఎలక్ట్రోలైట్లు నీరు తగ్గిపోయినట్లు అనిపించినప్పుడు, వాటిని తిరిగి నింపడానికి ఇఆర్జెఎల్ వంటివి సహాయపడుతుందన్నాయి.డీహైడ్రేషన్ , పిల్లలు, వృద్ధులు శారీరకంగా శ్రమతో కూడిన జీవనశైలి కలిగినవారు ఎక్కువ సమయం ఆరుబయట గడిపేవారితో సహా కొన్ని వర్గాలు డీహైడ్రేషన్ కు ఎక్కువగా గురవుతాయి. చిన్న పిల్లలు తమ దాహాన్ని సరిగ్గా చెప్పలేరు, దీనివల్ల డీహైడ్రేషన్ కు సులువుగా లోనవుతారు. వృద్ధులలో దాహానికి గురి చేసే యంత్రాంగం బలహీనంగా ఉంటుంది, వారు అనారోగ్యం వేడి సంబంధిత డీహైడ్రేషన్ రెండింటికీ గురయ్యే అవకాశం ఉంది. మధుమేహం వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు డీహైడ్రేషన్ కు ఎక్కువ గురయ్యే అవకాశం ఉంది వారి డీహైడ్రేషన్ ను జాగ్రత్తగా పరిష్కరించడం అవసరం. ఇలాంటి వినియోగదారుల సమూహాలకు, కోల్పోయిన వాటిని భర్తీ చేయడానికి నీటితో పాటు తగినంత ఎలక్ట్రోలైట్లను తీసుకుంటూ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అతిసారం అనేది ఒక ముఖ్యమైన ప్రజారోగ్య సమస్య, ఇది చిన్నపిల్లల మరణాలకు కారణమవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ అతిసారం చికిత్సలో ఉపకరిస్తుంది.అవగాహన కార్యక్రమాలు... నిర్వహిస్తున్నాం డీహైడ్రేషన్ గురించి అవగాహన చాలా తక్కువగా ఉంది. కోల్పోయిన ద్రవాలను తిరిగి నింపడానికి నీరు తాగితే సరిపోతుందని తరచుగా నమ్ముతారు. అయితే, శరీరంపై డీహైడ్రేషన్ మొత్తం శారీరక విధులపై ప్రభావం, ఎలక్ట్రోలైట్ పానీయాలు పోషించే కీలక పాత్రల గురించి పరిమిత అవగాహన మాత్రమే ఉంది. మా ప్రచారాల ద్వారా నీరు తాగే అలవాట్లను సరిదిద్దడం, దేశంలో డీహైడ్రేషన్ ఒక కీలకమైన ప్రజారోగ్య సమస్యగా అవగాహన కల్పించడంపై కృషి చేస్తున్నాం –ప్రశాంత్ షిండె, కెన్ వ్యూ -
సనాతన సారథి ఆదిశంకరులు
‘దేవుడనే వాడున్నాడా ‘అని వితండవాద నాస్తికవాదులకు ఎదురుగా అగుపడే వ్యక్తి దేవుడే అయితే అంత కన్నా సరి అయిన ఋజువు, సమర్థన మరేం కావాలి? కథల్లో, పురాణాల్లో భగవంతుడు వచ్చాడని, రక్షించాడని విన్నాం, నమ్మాం.. నిజంగా నిలబడి నడిచొస్తూ నాస్తికత్వాన్ని ఖండించి అద్వైత తత్త్వాన్ని సుస్థిరం చేసి అద్వైత వాదిగా అరుదెంచి హిందూమతాన్ని రక్షించి జాతిని నడిపించే దేవుడే శంకర భగవత్పాదులు.. పరమాచార్య శంకరాచార్యులు...శివుడే శంకరులుగా...హిందూమతం క్షీణదశలో ఉన్నప్పుడు ఆ మత పరిరక్షణకై పుణ్యదంపతులు శివగురు, ఆర్యాంబలు చేసిన తపః ఫలంగా కాలాడి అగ్రహారంలో సాక్షాత్తు ఈశ్వరుడే శంకరులుగా జన్మించాడు.. ఆవేళ ప్రకృతి పరవశించింది. ప్రపంచంలో పరమశాంతి పరిమళించింది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. ఆ బాలుడిలో చంద్రవంక, మూడవ నేత్రం, శూలం ఉన్నాయి. తెల్లని కాంతి.. లక్షణాల్లో సూర్యుడు.. మేరు పర్వతం.. సరస్వతీదేవి పోలిక.. ఈశ్వర వర ప్రసాదుడు. తోటి బాలురు తప్పటడుగులు వేస్తుంటే శంకరాచార్యులు సర్వ భాషలందు ప్రావీణ్యం, ప్రజ్ఞ సాధించి అసాధారణ బుద్ధితో వేద, వేదాంగాల్లో బ్రహ్మని, బృహస్పతిని మించి΄ోయాడు. శివ రహస్యంలోనూ, కూర్మ పురాణం లోనూ ఈ అవతార ప్రస్తావన ఉంది.అద్వైత తత్వ స్థాపన –జైత్రయాత్రశంకరాచార్యుల తన ప్రజ్ఞాపాటవాలతో, వాగ్ధాటితో నాస్తిక మతాన్ని మట్టుపెట్టటానికి విద్వాంసులతో వాద ప్రతి వాదనలకు దిగి అందరినీ ఓడించారు. ఒకసారి వేయిమంది పండితులను అవలీలగా జయించారు. విష్ణు సముడైన వ్యాసభగవానుడినే తన వాదనతో మెప్పించారు. దేశంలో నలు మూలల్లో పీఠాలు స్థాపించి సనాతన మత పునరుద్ధరణలో భాగంగా తత్వ, వేదాంత పూజాది నియమాలు, సంప్రదాయాలు నెలకొల్పి జ్ఞాన జ్యోతులను వెలిగించారు.ఎన్నెన్నో రచనలు – నిత్య సాధనలుబ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గిత, విష్ణు సహస్ర నామం, గాయత్రి మంత్రానికి భాష్యాలు రచించారు. వీటివల్ల మనకి దైవ సన్నిధి, పెన్నిధి ఏర్పడ్డాయి. పలు ప్రకరణ గ్రంథాలు రచించారు. మనం రోజు చదివే స్తోత్రాలలో ఎక్కువ వారు రాసినవే. వివేక చూడామణి, నిర్గుణ మానస పూజ, శివానంద లహరి, సౌందర్యలహరి, ఆనంద లహరి, కనకధార స్తోత్రం.. ఇలా ఎన్నెన్నో. తాను నడుస్తూ మన అందరిని మంచి ద్రోవలో నడిపిస్తున్న ఆ దేవుడికి జేజేలు. ఇదీ చదవండి: Ramanuja Jayanthi 2026 ఈ ఆసక్తికకర విషయాలు తెలుసా? – డా. కందాళ సత్యనారాయణ మూర్తి -
రామానుజ జయంతి : ఈ ఆసక్తికకర విషయాలు తెలుసా?
మిగిలినవారంతా భగవంతుని చేరుకోవడానికి నేనొక్కడినీ నరకానికి పోయినా పర్లేదని అప్పుటి కట్టుబాట్లను దాటి మానవు లందరికీ భగవంతుని చేర్చే అష్టాక్షరీ మహామంత్రాన్ని బహిరంగంగా గోపురమెక్కి అందరికీ చెప్పిన భగవదవతారం శ్రీమద్రామానుజులు. శ్రీ మహావిష్ణువు శేషపానుపే రామానుజులుగా ఈ భూమిపై అవతరించి వెయ్యేళ్లు దాటింది. ఈ నెల 22న రామానుజ జయంతి. ఈ సందర్భంగా రామానుజులవారి జీవిత విశేషాలు...రామానుజులవారు తమిళనాడులో శ్రీపెరంబుదూరు అనే ఉరిలో కలియుగం మొదలైన 4118 అంటే సామాన్యశకంలోని 1016 వ సంవత్సరంలో.. భారతీయ కాలమానంలో పింగళనామ సంవత్సరం వైశాఖ శుద్ధ షష్ఠి, శుక్రవారం నాడు సూర్యుడు మేషరాశిలో ప్రవేశించిన ఆర్ద్రా నక్షత్రంలో ఆసూరి కేశవ సోమయాజి, కాంతిమతి అనే పుణ్యదంపతుల నోముల పంటగా జన్మించారు..గురువుకే గురువు శ్రీరామానుజాచార్యులవారు 16 సంవత్సరాల వరకూ శ్రీపెరంబుదూరులో, ఆ తర్వాత 8 ఏళ్లపాటు తిరుప్పుట్ కుళిలోనూ, పదేళ్లపాటు కంచిలో వేదాంత విద్యను అధ్యయనం చేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడే అమేయ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. రామానుజులవారి ప్రజ్ఞ గురువుకు, ఇతర శిష్యులకు కంటగింపుగా మారింది. వారిని చంపడానికి గురుశిష్యులంతా పన్నాగం పన్నారు. సాక్షాత్తూ కంచి వరదరాజస్వామివారే రామానుజులును ఆ ప్రాణాపాయం నుంచి తప్పించారు. చివరికి కంచికి చేరారు. ఆనాటి నుంచి నిత్యం వరదరాజ పెరుమాళ్ కోవెలలో తిరుమంజన, తిరువారాధన కైంకర్యాలు చేసుకుంటూ వచ్చారు రామానుజులు.విశిష్టాద్వైతం అంటే? దేవుడు – జీవుడు రెండుగా లేరు. ఇద్దరూ ఒకటే అంటూ చెప్పేదే అద్వైతం. ప్రకృతిని ఉపాయంగా చేసుకొని ఒక్కటిగా ఉండటమే విశిష్టాద్వైతం. ఈ మార్గాన్ని శ్రీరామానుజాచార్యులవారు బోధించారు. ఎవరైనా శరణాగతిమార్గం ద్వారా పరమాత్మను చేరుకోవచ్చని, ఆయనతో కలిసి ఒకటిగా ఉండవచ్చని తెలిపారు.పాండిత్యం... ప్రాచుర్యంరామానుజులవారు శ్రీ భాష్యమనే పేరుతో ప్రస్థాన త్రయానికి భాష్యం రచించారు. శ్రీవైష్ణవాలయాలలో పాంచరాత్రాగమోక్తంగా విశిష్టసేవలను, కైంకర్యాలను అందించేందుకు, శ్రీవైష్ణవ క్షేత్రాలను పునరుద్ధరించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ద్రవిడ వేదంపట్ల అందరూ గౌరవ ప్రపత్తులతో మెలిగేటట్లు విశిష్టాద్వైత వ్యాప్తి చేశారు.మూర్తీభవించిన సమతభగవంతుని దృష్టిలో అందరూ సమానులే. అందరూ మోక్షానికి అర్హులే అంటూ సర్వమానవ సమానత్వ భావాన్ని, సౌభ్రాతృత్వాన్ని బోధించారు రామానుజులు. ఆయన పాతికేళ్ల వయస్సులో గార్హస్థ్యాన్ని వీడి యతిగా మారారు. దేశమంతటా సంచరిస్తూ... తన వాదం ద్వారా ప్రతి మానవునిలో మాధవుడు కొలువు దీరాడని నిరూపించారు. 125 ఏళ్ల సుదీర్ఘ జీవితంలో సమతామూర్తిగా పేరు పొంది తన అవతార పరమార్థాన్ని నిరూపించుకున్నారు. – డి.వి.ఆర్. -
చూయింగ్ గమ్ నమలడం నుంచి 3-2-1 రూల్..! ఏకంగా 80 కిలోలు..
ఆధునిక కాలంలో బరువు తగ్గడం అనేది చాలా సమస్యాత్మకంగా మారింది. చాలామంది వెయిట్లాస్ అయ్యేలా సర్జరీలు, మందుల వెంట పరిగెడుతున్నారు. మరికొందరు ఆరోగ్యకరంగా తగ్గేందుకు పాట్లు పడుతున్నారు. ఆ క్రమంలో కొందరు ఇతరులకు ప్రేరణ కలిగించేలా అద్భుతంగా ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గారు కూడా. కానీ వాళ్లందరూ చెప్పేది కొద్దికిద్దిగా తింటూ ఎక్కువసార్లు తినమని, మంచి ఆహారపు అలవాట్లు తదితర టిప్స్ ఇస్తే. ఈ వ్యక్తి మాత్రం అత్యంత వింత వెయిట్లాస్ చిట్కాలు ఇచ్చాడు. అవి చూస్తే ఇవేం చిట్కాలు అనిపించినా..అంతకుమునుపు, తదుపరి పరివర్తన చూస్తే నిజంగా అవే సరైనవా? అనే ఆశ్చర్యం కలుగకమానదు. మరి ఆ చిట్కాలేంటో చూద్దామాకువార్ కపూర్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ వేదికగా తన వెయిట్లాస్ జర్నీని షేర్ చేశారు. తాను ఒకప్పుడు 142 కిలోల బరువు ఉండేవాడినని తెలిపాడు. పైగా కొన్ని రకాల వింత ఫిట్నెస్ టిప్స్, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన ఆహారం తదితరాలు తన వెయిట్లాస్ సీక్రెట్ అని చెబుతున్నాడు. వర్కౌట్లు, మంచి ఆహారపు అలవాట్లు వరకు ఓకే. కానీ ఈ వింత ఫిట్నెస్ టిప్స్ ఏంటి..?. బరువు తగ్గడానికి అవెలా ఉపయోగపడ్డాయ్?డైట్ సోడా తాగడంబరువు తగ్గే ప్రయాణంలో డైట్ కోక్, సోడా, శీతల పానీయాలు, ఇతర చక్కెర పానీయాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. కానీ భోజనంతో పాటు డైట్ సోడా తాగడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుందని కువార్ నొక్కి చెప్పారు. కేలరీలు లేని, సాధారణ ఫిజీ డ్రింక్ లాగే రుచిగా ఉండే సోడాను ఎంచుకోవాలని ఆయన సూచిస్తున్నారు.చక్కెర లేని చూయింగ్ గమ్ నమలడంభోజనం తర్వాత చక్కెర లేని చూయింగ్ గమ్ నమలడం వల్ల అతిగా తినాలనే కోరికలను నివారిస్తుందట. కొలెస్ట్రాల్ తగ్గేలా ఎక్కువ కేలరీలు తీసుకోకుండా చేస్తుందట. ముందుగా ప్రోటీన్ప్రోటీన్కు ప్రాధాన్యత ఇవ్వడం వింతైన చిట్కా కాదు. బరువు తగ్గడానికి ప్రయత్నించే వాళ్లకు ఇది చాలా అవసరం. ప్లేట్లో ఎల్లప్పుడూ ముందుగాప్రోటీన్, తర్వాత కార్బోహైడ్రేట్లు చేర్చుకోవాలని కువార్ పేర్కొన్నారు.టీ మాక్సింగ్రోజంతా ఎక్కువగా కదలడం, ఉదాహరణకు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కాలు ఊపడం లేదా అటూ ఇటూ తిరగడం వంటివి, మనకు తెలియకుండానే అదనపు కేలరీలను ఖర్చు చేస్తాయంట. పైగా అనుకున్నదానికంటే వేగంగా కేలరీలు ఖర్చు అవుతాయట.ఎక్కువగా నిలబడటంకువార్ ప్రకారం, మీరు స్క్రీన్ చూసే సమయంలో సగం సేపు కేవలం నిలబడటం వల్ల ఎక్కువ శక్తిని ఖర్చు అవుతుందట. జువారీ కేలరీల ఖర్చులో ఇది కూడా చిన్నగా బరువు తగ్గడంలో హెల్ప్ అవుతుందట3-2-1 రూల్..3-2-1 రూల్ కువార్కు మరింత స్థిరంగా కొవ్వును తగ్గించుకోవడానికి సహాయపడింది. దీని ప్రకారం నిద్రపోయే మూడు గంటల ముందు చివరి భోజనం ముగించడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రపడటానికి సమయం లభిస్తుంది. త్వరిత గతిన బరువు తగ్గడంలో హెల్ప్ అవుతుందట. ఇక రెండు గంటలు హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకోవడం,ఇక ఒక గంట స్క్రీన్టైమ్ కోసం. ఇలా ప్లాన్చేస్తే అమాంతం చాలా బరువు తగ్గుతామని చెబుతున్నాడు.మంచి అరుగుదల కోసం నడకభోజనం చేసిన వెంటనే ఐదు నిమిషాల పాటు వేగంగా నడవడం వల్ల శరీరం కార్బోహైడ్రేట్లను నిల్వ చేయడానికి బదులుగా కండరాలకు చేరవేయడానికి సహాయపడుతుంది, అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంటాయి. View this post on Instagram A post shared by Kuwar Kapur (@fitnessbykuwar) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. అందరికీ ఈ టిప్స్ వర్తించవు. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: వీధి దీపాల కింద చదివి.. బోర్డు ఎగ్జామ్లో టాపర్గా..!)


