Family
-
మా నాన్న ప్రవర్తనతో విసిగిపోయాము!
మా నాన్న గారిది మొదట్నుంచి వింత ధోరణే! ఇంటికి ఎవరైనా తెలిసినవారు, బంధువులు వస్తే అతిగా ప్రవర్తిస్తారు. ఫ్యాన్లు ఫుల్ స్పీడ్తో పెట్టడం, గట్టిగా మాట్లాడటం, వారితో తనకు పెద్ద పదవుల్లో ఉన్నవారంతా తెలుసునని, రోజూ వారితో ఫోన్లో మాట్లాడుతానని గొప్పలు చెబుతారు. ఎవరైనా అప్పు కావాలంటే తన అవసరాలు కూడా చూడకుండా, వారికి డబ్బులివ్వడం, ఏదైనా ఫంక్షన్కు వెళితే, మా తాహతుకు మించి ఖరీదైన గిఫ్ట్లు ఇవ్వడం కూడా మామూలే. మా నాన్న బలహీనత ఆసరాగా తీసుకుని, ఆయన చుట్టూ ఉన్నవారు ఆయన్ను ఎక్కువగా వాడుకుంటున్నారు. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే, చాలా గ్రాండ్గా చేయాలని, అప్పైనా చేసి ఖర్చు పెడ్తారు. తనకు పెద్ద పెద్ద ఆఫీసర్లు, రాజకీయ నాయకులు తెల్సని, తాను తల్చుకుంటే ఏదైనా చేయగలనని, అందరికీ తెలిసేలా చెబుతుంటారు. ఆయన ప్రవర్తన వల్ల, మేము ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా, ఒక్కోసారి నల్గురిలో తలెత్తుకోలేకపోతున్నాము. ఏం చేయాలో తెలియక మీ సలహా కోసం ఈ ఉత్తరం...– రమా కుమారి, బోధన్మీ బాధ అర్థం చేసుకున్నాను. మా ప్రాక్టీసులో ఇలాంటి మనస్తత్వమున్నవారిని తరచుగా చూస్తూనే ఉంటాము. ‘హైపోమేనిక్ పర్సనాలిటీ’ అనే ఒక ప్రత్యేక మనస్తత్వం కలవారు ఇలా ప్రవర్తిస్తారు. ఇది ఒక చిత్రమైన వ్యక్తిత్వ లక్షణం. మన చుట్టూ మీ నాన్న లాంటి వ్యక్తులు చాలా మందే ఉంటారు, ఇంటెన్సిటీలో తేడా అంతే! వీరు మొదట్నుంచీ అతిగా మాట్లాడ్డం, గొప్పలు చెప్పుకోవడం, ఎప్పుడూ ఓవర్ యాక్టివ్గా ఉండటం, ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తూనే ఉంటారు. వీరి గొప్పలు వింటూ ఉంటే, నిజమేమోనన్నంతగా నమ్మిస్తూ ఉంటారు. అయితే వీరికి నోటి దురదే తప్ప, వాస్తవానికి ఇతరులను మోసం చేయాలనే తలంపు సాధారణంగా ఉండదు. ఇతరులకంటే తాము గొప్ప అనిపించుకోవాలనే తపన వీరికి ఎక్కువ. ఇలాంటి వారు అతిగా ఊహించుకుని, రకరకాల వ్యాపారాలు మారుస్తూ, అనాలోచితంగా డబ్బులు పెట్టుబడి పెట్టి, ఆర్థికంగా కూడా నష్టపోతుంటారు. ఎప్పుడూ జోకులు వేస్తూ, అందరినీ నవ్విస్తూ ఉంటారు. ఏదైనా కష్టాలొచ్చినా, వారి మొహంలో బాధ, దిగులు కనిపించడం చాలా అరుదు. ఇలాంటి మనస్తత్వం సాధారణంగా జీన్స్ ద్వారా కొందరికి వారసత్వంగా సంక్రమిస్తుంది. మెదడులోని కొన్ని రసాయనాలు అధికంగా పనిచేయడం వల్ల కూడా కొందరిలా ప్రవర్తిస్తారు. తమ ప్రవర్తన వల్ల ఇంట్లో ఉన్నవారు ఇబ్బంది పడుతున్నారన్న స్పృహ వీరికి ఉండదు. విమర్శిస్తే తట్టుకోలేరు. ఇలాంటి వారు ఒక్కోసారి ‘బైపోలార్ డిసార్డర్’ అనే తీవ్రమైన మానసిక వ్యాధికి కూడా లోనయ్యే అవకాశముంది. మీ నాన్నగారి ప్రవర్తన మరీ శృతిమించి రాగాన పడేట్లయితే, ఒకసారి సైక్రియాట్రిస్టు సలహా తీసుకోండి. ‘మూడ్ స్టెబిలైజర్స్’ అనే కొన్ని మందుల ద్వారా వీరి ప్రవర్తనను చాలా వరకు మార్చే అవకాశముంది. ఆల్ ది బెస్ట్!డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
ఉమెన్ పవర్...పంచ్
‘అమ్మాయిలకు బాక్సింగ్ ఎందుకండీ!’ అనే మాట అప్పుడెప్పుడో కాదు ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది. లింగ వివక్షతతో కూడిన మాటలను, అడ్డంకులను పట్టించుకోకుండా తమ దారిలో తాము దూసుకుపోతూ సత్తా చాటుతున్నారు యువ మహిళా బాక్సర్లు. తాజాగా... ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్స్–2026లో మన దేశానికి చెందిన ఆరుగురు మహిళా బాక్సర్లు ఫైనల్లోకి దూసుకొచ్చి స్వర్ణపతక పోరులో స్థానాన్ని ఖరారు చేసుకున్నారు. వారు...మీనాక్షి (48 కేజి), ప్రీతి (54 కేజి), జాస్మిన్ (57 కేజి), ప్రియ (60 కేజీ), అరుంధతి చౌదరి (70 కేజీ), అల్ఫియా పఠాన్ (81 కేజి). కుంచె నుంచి పంచ్ దాకా...చిన్నప్పటి నుంచి ప్రీతి పవార్కు బొమ్మలు వేయడం అంటే ఇష్టం. బాక్సర్గా తన భవిష్యత్ చిత్రపటాన్ని కూడా అందంగా తీర్చిదిద్దుకుంది. భారత బాక్సింగ్లో అత్యంత ప్రతిభావంతులైన యువతారలలో ఒకరిగా వేగంగా ఎదిగింది. హరియాణాలో భివానీలో జన్మించింది ప్రీతి. బాక్సర్ల ఊరుగా భివానీకి పేరున్నప్పటికీ మొదట్లో బాక్సింగ్పై ప్రీతికి పెద్దగా ఆసక్తి లేదు. ఆమె మామ వినోద్ జాతీయస్థాయిలో పేరు తెచ్చుకున్న బాక్సర్. ఆయన ప్రోత్సాహంతో పద్నాలుగేళ్ల వయసులో బాక్సింగ్లోకి వచ్చింది ప్రీతి పవార్.పానిపట్లో జరిగిన ఓపెన్ స్టేట్ టోర్నమెంట్తో తన విజయయాత్ర మొదలుపెట్టింది. ఆ టోర్నమెంట్లో స్వర్ణం గెలుచుకుంది. జాతీయ స్థాయికి చేరుకోవడానికి ఆమెకు ఎంతోకాలం పట్టలేదు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన యూత్ ఆసియా ఛాంపియన్షిప్స్లో రజత పతకం గెలుచుకుంది. మరుసటి సంవత్సరం సీనియర్ స్థాయిలో ఆసియా ఛాంపియన్షిప్స్లో కాంస్య పతకం గెలుచుకుంది. 2023 ఆసియా గేమ్స్లో మహిళల 54 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకోవడం ప్రీతి కెరీర్లో కీలక మలుపుగా నిలిచింది. 2024లో కజకిస్తాన్లో జరిగిన ఆసియా అండర్–22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో స్వర్ణపతకం గెలిచిన ప్రీతి తన అద్భుతమైన ఫామ్ కొనసాగించింది. 2024లో ఒలింపిక్ ఆరంగేట్రం చేసింది.ఎంతోసేపు ఏడ్చిన తరువాత..రాజస్థాన్లోని కోటా శిక్షణ సంస్థలకు పెట్టింది పేరు. అలాంటి నగరంలో పెరిగిన అరుంధతి చౌదరి చదువులో ముందుండేది. గణితంలో కూడా అద్భుత ప్రతిభ చూపేది. అదే సమయంలో ఆమెకు ఆటలు అంటే కూడా ఇష్టం. ‘ఆటల్లో పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను’ అని తండ్రితో చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యంగా చూసి ‘ఆటలు వద్దు. ఐఐటీ చేయాల్సిందే’ అని ఆదేశించాడు. తండ్రి ఆదేశంతో ఇక ఆటలకు దూరం కావాల్సిందే అనుకున్న సమయంలో తల్లిని పట్టుకొని గట్టిగా ఏడ్చిన అరుంధతి తనకు ఆటలు అంటే ప్రాణం అని చెప్పింది. తండ్రిని తల్లి చాలాసేపు బతిమిలాడిన తరువాత ‘చదువుతో పాటు ఆటలు కూడా ఓకే’ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే అరుంధతికి అప్పట్లో బాక్సింగ్పై ఆసక్తి లేదు. బాస్కెట్ బాల్ అంటే ఇష్టం. రాష్ట్రస్థాయిలో కూడా ఆడింది. ఇండివిడ్యువల్ గేమ్ను ఎంచుకుంటే మంచిది అని చె΄్పాడు తండ్రి. అప్పుడే ‘బాక్సింగ్’ ఆలోచన ఆమె మదిలోకి వచ్చింది.‘బాక్సింగ్లో నీ పళ్లు ఊడిపోవచ్చు. ముఖం వికృతంగా మారిపోవచ్చు’ అని హెచ్చరించాడు తండ్రి. ‘నేను కూడా నా ప్రత్యర్థి పళ్లు ఊడగొడతాను. ఆమె ముఖాన్ని వికృతంగా మారుస్తాను’ అని అరుంధతి అన్నప్పుడు తండ్రి పెద్దగా నవ్వాడు. తన కూతురు బాక్సింగ్ ఆటపై సరదా పడుతుంది అనుకున్నాడేగానీ పెద్ద స్థాయికి వెళుతుందని ఆ తండ్రి అనుకోలేదు. కల కనలేదు. అతడు అనుకోక పోయినా, కల కనకపోయినా ప్రపంచ స్థాయిలో బాక్సింగ్లో మెరుస్తోంది అరుంధతి చౌదరి.మట్టి కరిపించేలా...మాజీ ప్రపంచ ఛాంపియన్ను మట్టి కరిపించి సంచలనం సృష్టించిన ప్రియ ఘంగాస్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. బాక్సింగ్ను తొలిసారిగా ప్రియకు పరిచయం చేసింది హరియాణా కోచ్ రవి సంగ్వాన్. మాజీ జాతీయ ఛాంపియన్ అయిన రవి దగ్గర ఏడేళ్ల పాటు శిక్షణ తీసుకున్న ప్రియ తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. తాజాగా... ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో ప్రియ ఫైనల్లోకి అడుగు పెట్టడం గురించి రవి సంతోషంతో పులకించిపోయారు.‘దాద్రీ బాక్సింగ్ అకాడమీ అనే ఒక అకాడమీని ప్రారంభించాను. అప్పుడు ప్రియ ఆరవ తరగతి చదువుతుంది కావచ్చు. తన సోదరుడితో కలిసి అకాడమీకి వచ్చేది. నేర్చుకోవాలి, గెలవాలి అనే తపన ఆ చిన్నారి కళ్లలో కనిపించేది. ఆమెలో అంకితభావంతో పాటు ప్రతిభ కూడా ఉంది’ అంటూ జ్ఞాపకాల్లోకి వెళ్లారు రవి. అప్పట్లో అకాడమీలో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉండేవి. అవేమీ పట్టించుకోకుండా పట్దుదలతో కష్టపడి ముందుకు సాగాలనే ఆమె సంకల్పబలం రవికి బాగా గుర్తుండి పోయింది.తాతగారు ససేమిరా అన్నా...జాస్మిన్ కుటుంబ సభ్యులు, బంధువులలో ఎంతోమంది బాక్సర్లు ఉన్నారు. అయినప్పటికీ జాస్మిన్ బాక్సింగ్ రింగ్లోకి అడుగు పెట్టడం ఆమె తాతగారికి నచ్చలేదు. అయితే బాక్సర్ అయిన బాబాయ్ ఆమెను ప్రోత్సహించాడు. జాస్మిన్ పతకాలు గెలుచుకున్నప్పుడల్లా ఆయన కళ్లలో వెలుగు కనిపించేది.‘నా కలలను నిజం చేస్తున్నావు’ అనేవాడు ఆనంద బాష్పాలతో. ‘రింగ్లోకి అడుగు పెట్టగానే నా మదిలోని ఆలోచనలన్నీ మాయమైపోతాయి. గెలవడం గురించి మాత్రమే ఆలోచిస్తాను’ అని తన సక్సెస్ మంత్రాను చెప్పనే చెప్పింది ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న జాస్మిన్. ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో 57 కేజీల విభాగంలో ఉబ్జెకిస్తాన్కు చెందిన నిగిన ఉక్తమోనాపై విజయం సాధించింది.కష్టమైనా... ఇష్టంగా!హరియాణాలోని రూర్కికి చెందిన మీనాక్షి హూడా తండ్రి ఆటోడ్రైవర్. ఆరుగురు కుటుంబ సభ్యులలో మీనాక్షి చిన్నది. బాక్సింగ్ అంటే మీనాక్షికి ఇష్టం. ‘ఆడపిల్లకు బాక్సింగ్ ఎందుకు?’ ‘నీకు బాక్సింగ్లో శిక్షణ ఇప్పించడానికి నా దగ్గర డబ్బులు లేవు’ అని ఆ తండ్రి అనలేదు. బాక్సింగ్ అంటే కూతురికి ఉన్న ఇష్టానికి ముచ్చటపడి శిక్షణ ఇప్పించాడు. బాక్సింగ్లో తన కూతురు పెద్ద పేరు తెచ్చుకుంటుందనే నమ్మకంతో ఆర్థిక కష్టాలు ఎదురైనా ఆయన వెనక్కి తగ్గలేదు. 2014లో ‘ఖేల్ ఇండియా’ పోటీలో బంగారు పతకం గెలుచుకుంది మీనాక్షి. తాజాగా... ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్స్లో మహిళల 48 కేజీల సెమీ ఫైనల్çలో థాయ్లాండ్కు చెందిన థిప్సచాపై విజయాన్ని సాదించి స్వర్ణపతక పోరులో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది.అనుకోకుండా వచ్చి...అల్ఫియా పఠాన్ సోదరుడు రాష్ట్ర స్థాయి బాక్సర్, నాగ్పూర్లో తన సోదరుడు శిక్షణ తీసుకుంటున్న సమయంలో హాల్ బయట అతడి కోసం ఎదురు చూస్తూ కూర్చునేది అల్ఫియా. ఆ తరువాత ఇద్దరూ ఇంటికి బయలుదేరేవారు. ఒకరోజు కోచ్ పురోహిత్ ఆమెతో సరదాగా ‘బాక్సింగ్ చేస్తావా?’ అన్నాడు. ‘ఆ.. ఏముంది గొప్ప. తన్నడం లేదా తన్నులు తినడం’ అన్నది అల్ఫియా. ఆమె చురుకుదనం చూసి ‘నువ్వు రేపటి నుంచి క్లాస్లో చేరాల్సిందే’ అంటూ వెళ్లిపోయాడు పురోహిత్. ఆయన యథాలాపంగా అన్నాడో, నిజంగానే అన్నాడో తెలియదుకానీ...ఆ మాటతో ఆల్ఫియా పఠాన్ బాక్సింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టి రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. -
కొబ్బరి నీళ్లు, సబ్జా గింజలు కలిపి తీసుకోవచ్చా..?
సమ్మర్ మొదలైపోయింది. బయట వేడి ఏ స్థాయిలో ఉందో చెప్పాల్సిన పనిలేదు. అదీగాక ఇండియన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ సైతం ఉత్తర కర్ణాటక, ఒడిశా, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో ఎండలు మండిపోతాయని ముందుగానే హెచ్చరించింది కూడా. అప్పుడే మే నెల రాక మునుపే సూర్యడి భగభగలు మాములుగా లేవు. ఈ సమయంలో అధికంగా తీసుకోవాల్సింది నీరు. ముఖ్యంగా శరీరం హైడ్రేషన్గా ఉండేలా చూసుకోవాలి. అందుకోసం ఎక్కువ మంది కొబ్బరి నీళ్లపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. అలాగే సబ్జా నీళ్లు కూడా తీసుకుంటుంటారు. అయితే కొందరు ఈ రెండిటిని కలిపి తీసుకుంటారు. అసలు ఇలా కలిపి తీసుకోవచ్చా..? ఆరోగ్యానికి మంచిదేనా..అంటే..వేసవిలో చాలామంది డీహైడ్రేషన్కి గురై మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను ఎదుర్కొంటుంటారని అంటున్నారు నిపుణులు. అందుకు కొబ్బరి నీళ్లు, సబ్జా రెండూ సమర్ధవంతంగా పనిచేస్తాయి. అసలు వేసవిలోనే మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఎందుకు అధికంగా ఉంటుందంటే..రికార్డు స్థాయిలో నమోదయ్యే అధిక ఉష్ణోగ్రతలు శరీర సాధారణ పనితీరుపై అధిక ఒత్తిడిని కలిగిస్తాయి. దీనిని 'హీట్ స్ట్రెస్' లేదా వడదెబ్బ అంటారు. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి అధికంగా నీరు కోల్పోవడం వల్ల డీహైడ్రేషన్ సంభవించవచ్చు. మూత్రం కూడా చిక్కగా మారుతుంది, దాని రంగును బట్టి శరీరం ఎంత డీహైడ్రేషన్కు గురైందో తెలుస్తుంది. అలాంటి టైంలో మన తీసుకునే ఆహారం శరీరానికి వేడిచేసేవి అయితే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఈ సమయంలో తగినంత నీరు తీసుకోవడంపై చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంతేగాదు శరీరంలో ఎలక్ట్రోలైట్లు, ఖనిజాలు, విటమిన్లు సమతుల్యంగా ఉండేలా చేసుకోవడానికి, వివిధ వనరుల ద్వారా నీటిని తీసుకోవడం అత్యంత అవసరం.కొబ్బరి నీరు: ప్రకృతి అందించే సహజసిద్ధమైన ఔషధం.. కొబ్బరి నీరు శరీరానికి ఎలక్ట్రోలైట్లు, యు పొటాషియంను అందించే ఒక సహజ జల వనరుగా పేర్కొంటారు. అంతేకాకుండా, దీనికి నిర్విషీకరణ, బాక్టీరియా నిరోధక, పునరుజ్జీవనం, జీర్ణక్రియ, మూత్రవిసర్జన వంటి ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. మూత్రపిండాల నుంచి లవణాలను బయటకు పంపడానికి తగినంత నీరు అందనప్పుడు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి, కాబట్టి ఇది వాటిని నివారించగలదు. తరుచుగా కొబ్బరి నీరు తీసుకోవడం వల్ల మూత్రం పలుచబడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.కొబ్బరి నీరు జీర్ణాశయ సంబంధిత సమస్యలు, రక్త విరేచనాలపై సానుకూల చికిత్సా ప్రభావాలను కలిగి ఉంటుంది. పిల్లలలో పోషకాహార లోపాన్ని పరిష్కరించడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి కొద్ది పరిమాణంలో తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల నుంచి మెరుగైన రక్షణ లభిస్తుంది.సబ్జా గింజలు:సబ్జా గింజల్లోని నీటిని శోషించుకునే లక్షణం మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫార్మా ఇన్నోవేషన్ జర్నల్ ప్రకారం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఖనిజాలను కలిగి ఉండే పోషక ప్రొఫైల్, మూత్ర సంబంధిత ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది, మూత్రపిండాల పనితీరుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.కొబ్బరి నీరు సబ్జా గింజల కలయికకొబ్బరి నీరు, సబ్జా గింజల సరైన కలయిక మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయని ఆయర్వేదం చెబుతోంది. ఇంటర్నేషనల్ బ్రాజ్ జె యూరల్లో ప్రచురించిన పరిశోధన ప్రకారం, కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల మీ మూత్రంలో ఉప్పు స్ఫటికాలు ఏర్పడటాన్ని తగ్గిస్తుంది కానీ సబ్జా గింజలు మూత్రపిండాల్లో రాళ్లను నివారిస్తాయనేందుకు ఆధారాలు లేవు అని పేర్కొంది.తీసుకోవాల్సిన జాగ్రత్తలు..కొబ్బరి నీళ్ళు లేదా తులసి గింజల వంటి సహజసిద్ధమైన హైడ్రేటింగ్ వనరులను సురక్షితంగా తీసుకోవడానికి వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించి అనుసరించడం ఉత్తమం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమకు అనుగుణంగా సురక్షితమైన విధంగా ఎలా తీసుకోవాలో సూచిస్తారని చెబుతున్నారు. అంతేగాదు లోబీపీతో బాధపడేవారు సబ్జాగింజలకు దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: హెచ్పీవీ వ్యాక్సిన్ అంటే..? ఎప్పుడు ఇవ్వాలంటే..) -
కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన నీతా..!
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్ నీతా అంబానీ సందర్భానికి తగ్గట్టు స్టైలిష్ రెడీ అవ్వడం ఆమె ప్రత్యేకత. ముఖ్యంగా హస్తకళలు, భారతీయ సంప్రదాయ వారసత్వ విలువ తెలిపేలా నీతా అలంకరణ ఉంటుంది. తాజాగా ఆమె తన తల్లి పూర్ణిమ దలాల్తో కలిసి కామాఖ్య ఆలయాన్ని సందర్శించారు. అక్కడ అమ్మవారికి విశేష పూజలు చేసి, ఆమె ఆవీర్వాదం కోరారామె. ఆలయ దర్శనం కోసం నీతా గులాబీ రంగులోని కుర్తాతో ఎంతో హుందాగా వచ్చారామె. పొడవాటి చేతులతో చుట్టు దుప్పటా దానిపై బంగారు ఎంబ్రాయిడరీ ఆమె లుక్ని మరింత హైలెట్ అయ్యేలా చేసింది. దానికి బంగారు బ్రోకేడ్తో అంచు ఎంబ్రాయిడరీ చేయబడిన స్ట్రెయిట్-ఫిట్ ప్యాంటుతో జత చేసింది. అందుకు తగ్గట్టుగా వదులుగా జుట్టుని వదిలేసి, చక్కటి పాపిడి బొట్టుతో సంప్రదాయంతో మిళితమైన ఆధునిక మహిళలా తళుక్కుమంది. సరళమైన సంప్రదాయ దుస్తులకు అనుగుణంగా మల్టీ-క్యారెట్ కాక్టెయిల్ రింగ్, స్టేట్మెంట్ డైమండ్ చెవిపోగులు ధరించారామె. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆలయం విశిష్టత..మా కామాఖ్య, లేదా కామేశ్వరి, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధిగాంచిన అమ్మవారు. ఈ ఆలయం గౌహతిలో ఉంది. భూమిపై ఉన్న 51 శక్తి పీఠాలలో ఇది అత్యంత పవిత్రమైనది, పురాతనమైనది కూడాతన భద్రతా సిబ్బందితో కలిసి వచ్చిన నీతా అంబానీ, ఈ ఆలయాన్ని సందర్శించి, పూజారుల మార్గదర్శకత్వంలో పూజలు నిర్వహించారు. ఆమె అమ్మవారికి ప్రార్థనలు చేయడం, పూజారులతో మాట్లాడటం, పూజలు నిర్వహించడం, ఆలయంలో ఉన్న భక్తులను పలకరించడం వీడియలో స్పష్టంగా కనిపిస్తుంది. View this post on Instagram A post shared by Learner (@decodingeliteclass) (చదవండి: మొట్టమొదటి డైనోసార్ లెదర్ హ్యాండ్ బ్యాగ్..! ధర ఎంతో తెలుసా..) -
హెచ్పీవీ వ్యాక్సిన్ అంటే..? ఎప్పుడు ఇవ్వాలంటే..
దేశవ్యాప్తంగా హెచ్పీవీ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ మొదలైంది. పద్నాలుగేళ్ల బాలికలు మొదలుకొని దేశంలో దాదాపు కోటీ పదిహేను లక్షల మంది యువతులకు ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందజేయాలనే లక్ష్యంతో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒక్క సింగిల్డోస్ (మోతాదు)తో మహిళల్లో సర్వైకల్ కేన్సర్ను సమర్థంగా నివారించే (93% నుంచి 100% వరకు రక్షణ కల్పించే) ఈ వ్యాక్సిన్ను ఇవ్వడం మొదలుపెట్టారు. మన దేశంలో విస్తృతంగా మొదలైన ఈ మహిళా ఆరోగ్య సంరక్షణ చర్య ద్వారా అంతర్జాతీయంగా కేన్సర్ నివారణ చర్యలు తీసుకున్న 160 దేశాల్లో మన దేశం కూడా ఒకటి కానుంది. ఈ నేపథ్యంలో ఈ హెచ్పీవీ వ్యాక్సిన్ గురించి అవగాహన కోసం...హ్యూమన్ పాపిలోమా వైరస్ మహిళలను ప్రభావితం ఏలా చేస్తుందంటే... ఇది (హెచ్పీవీ) మహిళల్లో సర్వైకల్ కేన్సర్కు దారితీస్తుంది. సెక్స్ ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. దాదాపు సగం జనాభాలో వాళ్ల జీవితంలో ఏదో ఒక సమయంలో హెచ్పీవీ వైరస్ను కలిగి ఉంటారు. అయితే హెచ్పీవీ ఉండటం వల్లనే తప్పక అది సర్వైకల్ కేన్సర్కు దారితీయదు. దురదృష్టవశాత్తూ కేవలం కొంతమందిలోనే అది కేన్సర్ను కలగజేస్తుంది. మల్టిపుల్ పార్ట్నర్స్తో సెక్స్లో పాల్గొనేవారికీ హెచ్పీవీ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువ. సాధారణంగా స్త్రీలలో అందునా గ్రామీణ మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. సర్విక్స్ అనే భాగం యోనిని, గర్భసంచితో కలుపుతుంది. ఈ భాగం మహిళ జీవితంలో ఎన్నో దశల్లో అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది. అలా అక్కడ అతి వేగంగా జరిగే కణవిభజన వల్ల కేన్సర్కు గురయ్యే అవకాశాలు ఎక్కువ.సర్వైకల్ కేన్సర్కు ఓ ప్రధాన రిస్క్ ఫాక్టర్ హెచ్పీవీ వైరస్... హెచ్పీవీ వైరస్ సోకడం సర్వైకల్ కేన్సర్కు ఓ ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పవచ్చు. మామూలుగానైతే చాలామందిలో హెచ్పీవీ వైరస్ దానంతట అదే నశించిపోతుంది. అలా ఒకవేళ నశించకపోతే అది కొంతకాలానికి అది క్కేన్సర్కు దారితీసే అవకాశాలు పెరుగుతాయి. హెచ్పీవీ వైరస్తో పాటు పొగతాగే అలవాటు ఉండటం, ఎయిడ్స్, ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువకాలం గర్భనిరోధక మాత్రలు వాడటం వంటి అంశాలు కూడా సర్వైకల్ కేన్సర్కు దారితీసే రిస్క్ఫ్యాక్టర్లలో కొన్ని.నివారణ ఎలా? నివారణకు తొలుత తోడ్పడే పరీక్ష పాప్స్మియర్ అనే వైద్యపరీక్ష. సర్వైకల్ కేన్సర్ నిర్ధారణలో పాప్స్మియర్ అనే వైద్యపరీక్షది చాలా కీలక భూమిక. ఇరవయొక్క ఏళ్లు నిండిన మహిళలు మొదలుకొని, తమ లైంగిక జీవితం ప్రారంభమయ్యాక మూడేళ్లు దాటిన ప్రతి మహిళా తప్పనిసరిగా క్రమంతప్పకుండా పాప్స్మియర్ పరీక్ష చేయించుకోవడం అవసరం. అంటే చిన్న వయసు బాలికలు తప్ప మహిళలందరూ క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవడం మంచిది. సర్వైకల్ కేన్సర్ రావడానికి దాదాపు పదేళ్లు ముందుగానే దాన్ని కనుగొనడానికి అవసరమైనంత ‘ప్రీ–కేన్సరస్ దశ’ ఉండటం మరో అడ్వాంటేజ్. అంటే అసలు కేన్సర్ రావడానికి పదేళ్ల ముందే దీన్ని కనుగొనే అవకాశమున్నందున... అది కేన్సర్గా పరిణమించకముందే అంటే ‘ప్రీ–కేన్సర్’ దశలోనే నయం చేసుకోవచ్చు. పూర్తిగా నయమయ్యేందుకు అవకాశం కూడా ఎక్కువే. హెచ్పీవీ వ్యాక్సిన్ ఎప్పుడు ఇవ్వాలంటే... గర్భాశయం ముఖద్వారం వద్ద వచ్చే కేన్సర్లను నివారించే ఈ వ్యాక్సిన్ను ఎప్పుడు ఇవ్వవచ్చనే విషయంలో అమెరికన్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ వారి సిఫార్సు మేరకు.. పదకొండేళ్లు నిండిన ప్రతి ఆడపిల్లకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఇప్పించాలి. తొమ్మిదేళ్లు నిండిన బాలికలు మొదలుకొని 26 ఏళ్ల వరకు మహిళలందరికీ వ్యాక్సిన్ ఇప్పించవచ్చు. అయితే మహిళలకు వాళ్ల వివాహానికి ముందే అంటే... వాళ్లు తమ లైంగిక జీవితాన్ని మొదలు పెట్టకమునుపే దీన్ని ఇప్పించడం అవసరం. వ్యాక్సిన్ తీసుకున్న మహిళల్లో 99% మందికి ఈ కేన్సర్ వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి సర్వైకల్ కేన్సర్ ముప్పు తాలూకు ఆందోళన లేకుండా వారు జీవితాంతం నిశ్చింతగా ఉండే నిర్భయత ఈ వ్యాక్సిన్ తీసుకున్న మహిళలకు ఉంటుంది.హెచ్పీవీ వ్యాక్సిన్తో ఇతరత్రా ప్రయోజనాలివే... హెచ్పీవీ వ్యాప్తినిఅరికట్టడంయోని దగ్గర వచ్చే పులిపిరుల(జెనిటల్ వార్ట్స్) సమస్య నుంచి రక్షణ గర్భాశయ క్యాన్సర్ నుంచి రక్షణయోని క్యాన్సర్ వంటి మరికొన్ని క్యాన్సర్ల ముప్పు నుంచి నివారణ దీర్ఘకాలిక రక్షణను అందిస్తుందిమహిళా సమూహాలకు సంయుక్త రక్షణ (హెర్డ్ ఇమ్యూనిటీ) కలగడంచికిత్స తర్వాత మళ్లీ పునరావృతమయ్యే అవకాశాలు బాగా తగ్గడంతద్వారా జనాభాలోని అందరికీ / ప్రజారోగ్య సంరక్షణకు తోడ్పడటండాక్టర్ సాయిలక్ష్మి డయానా, సీనియర్ కన్సల్టెంట్, గైనిక్ ఆంకాలజిస్ట్ – యాసీన్చదవండి: ‘వజైనల్ వాల్ట్ ప్రోలాప్స్’కు కారణం..! ఎందుకొస్తుందంటే.. -
‘వజైనల్ వాల్ట్ ప్రోలాప్స్’కు కారణం..! ఎందుకొస్తుందంటే..
మెనోపాజ్ తర్వాత మహిళల్లో సాధారణంగా కనిపించే పెల్విక్ ఫ్లోర్ కండరాల బలహీనత కారణంగా కనిపించే ప్రోలాప్స్ సమస్యను చాలా మంది సహజంగా తీసుకుంటూ మౌనంగా భరిస్తుంటారు. కానీ ఈ సమస్యకు సరైన సమయంలో చికిత్స తీసుకుంటే పూర్తిగా ఉపశమనం పొందవచ్చని కిమ్స్ కడల్స్ సికింద్రబాద్కు చెందిన కన్సల్టెంట్ యూరో గైనకాలజిస్ట్ డా. బిందుప్రియ తెలిపారు. తాజాగా పలుమార్లు శస్త్రచికిత్సలు చేసినప్పటికీ మళ్లీ వచ్చిన వజైనల్ వాల్ట్ ప్రోలాప్స్ కేసును విజయవంతంగా చికిత్స చేశామని వివరించారు.65 ఏళ్ల మహిళకు గతంలో గర్భాశయ గడ్డల కారణంగా హిస్టరెక్టమీ చేయబడింది. అనంతరం కొన్ని సంవత్సరాల తర్వాత యోనిలో బయటకు బల్జ్లా కనిపించడం ప్రారంభమై, రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. 2023లో ల్యాపరోస్కోపిక్ సర్జరీ చేయించుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో, 2024లో మరోసారి మెష్తో అబ్డొమినల్ సర్జరీ చేశారు. అయినప్పటికీ నాలుగు నెలల్లోనే సమస్య మళ్లీ తలెత్తింది.ఈ నేపథ్యంలో ఆమె మమల్ని సంప్రదించగా కేసును సమగ్రంగా పరిశీలించి, మొదట వజైనల్ పెస్సరీ ద్వారా కన్సర్వేటివ్ చికిత్సను సూచించగా, రోగి ఏడాది పాటు ఆ విధానాన్ని అనుసరించారు.తరువాత శాశ్వత పరిష్కారం కోసం రోగి ముందుకు రావడంతో వజైనల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ చేశాం. ఇందులో యాంటీరియర్ వజైనల్ వాల్ రిపేర్, యూటెరోసాక్రల్ లిగమెంట్ సస్పెన్షన్ ద్వారా బలమైన సపోర్ట్ ఇవ్వడంతో పాటు హై పెరినియోరాఫీ కూడా చేశాం. ఈ శస్త్రచికిత్సతో రోగి త్వరగా కోలుకుని, సమస్య నుంచి గణనీయమైన ఉపశమనం పొందింది. ఈ సందర్భంగా డా. బిందు ప్రియ మాట్లాడుతూ, ప్రతి రోగికి చికిత్సను వ్యక్తిగతంగా ప్రణాళిక చేయడం అత్యంత ముఖ్యమన్నారు. ప్రోలాప్స్ తీవ్రత, గత శస్త్రచికిత్సలు, ఇతర ఆరోగ్య సమస్యలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని చికిత్స నిర్ణయిస్తామని తెలిపారు. పెల్విక్ ప్రోలాప్స్, మూత్రం అదుపు లేకపోవడం వంటి సమస్యలు వయస్సు కారణంగా రావడం సహజమే అయినప్పటికీ, అవి తప్పనిసరిగా భరించాల్సినవికాదు. సిగ్గు, అపోహల కారణంగా ఆలస్యం చేయకుండా, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే జీవన నాణ్యత మెరుగుపడుతుందని సూచించారు. మహిళలు నిర్భయంగా తమ ఆరోగ్య సమస్యలను వెల్లడించేలా అవగాహన పెంపొందించడం సమాజ బాధ్యత అని డా. బిందు ప్రియ, డా. సాయి స్నేహిత పేర్కొన్నారు.యూరో గైనకాలజిస్ట్ డా. బిందుప్రియ, సికింద్రాబాద్(చదవండి: 'పన్ను' వసూలు చేసే బ్యాడ్ హ్యాబిట్స్) -
మొట్టమొదటి డైనోసార్ లెదర్ హ్యాండ్ బ్యాగ్..! ధర ఎంతో తెలుసా..
డైనోసార్లు 66 మిలియన్ సంత్సరాల క్రితమే అంతరించిపోయాయి కదా మరి దాని తోలుతో హ్యాండ్ బ్యాగ్ ఎలా సాధ్యం. బతికే ఉన్న జంతవుల తోలు నుంచి తయారు చేశారంటే అవునా అని అనొచ్చుగానీ, అస్సలు భూమ్మీద మనుగడ లేని ఆ జంతువుల తోలుతో చేసిన లేదర్ వ్యాండ్ బ్యాగ్ ఏంటి అని సందేహించకండి. ఎందుకంటే ఇది ముమ్మాటికి డైనోసార్ లెదర్ హ్యాండ్ బ్యాగే. దాని ధర తెలిస్తే విస్తుపోతారు. అసలు దీన్నెలా రూపొందించారు, ఎందుకంత ఖరీదు తదితర విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.ఒక ప్రాజెక్టులో భాగంగా నెదర్లాండ్ శాస్త్రవేత్తలు, డిజైనర్లు టైరన్నోసారస్ రెక్స్ శిలాజాలల(డైనోసార్ శిలాజాలు) నుంచి సేకరించిన కొల్లాజెన్ను ఇతర జంతువుల కణాలతో కలిపి ల్యాబ్లో కృత్రిమంగా పెంచారు. ఈ ప్రాజెక్ట్లో మొత్తం మూడు కంపెనీలు భాగస్వామ్యమయ్యాయి. ది ఆర్గానాయిడ్ కంపెనీ, జెనోమిక్ ఇంజనీరింగ్ సంస్థ ఆర్గానాయిడ్, క్రియేటివ్ ఏజెన్సీ VML అనే మూడు కంపెనీలు 2023లో ఉన్ని మామత్ DNAను గొర్రెల కణాలతో కలిపి ఒక భారీ మీట్బాల్ను తయారు చేసేందుకు పనిచేశాయి. మళ్లీ తాజాగా ఈ బృందం డైనోసార్ అవశేషాల నుంచి పురాతన ప్రోటీన్ శకలాలను సేకరించి, వాటిని ఒక గుర్తుతెలియని జంతువు కణాలలోకి ప్రవేశపెట్టి కొల్లాజెన్ను ఉత్పత్తి చేసింది. ఆ తర్వాత దానిని తోలుగా మార్చారు. అయితే చాలామంది దీనిపై సందేహం వ్యక్తం చేయడంతో..డచ్ శిలాజ శాస్త్రవేత్త ఇలా వివరణ ఇస్తూ.. వారి అనుమానాలను పటాపంచలు చేశారు. డైనోసార్ ఎముకలలో కొల్లాజెన్ కేవలం శకలాల రూపంలో మాత్రమే మిగిలి ఉంటుందని, దానిని ఉపయోగించి టి-రెక్స్ చర్మాన్ని పునఃసృష్టించలేమని అన్నారు. అలాగే సరిపోలిన ప్రోటీన్లలో కూడా, నిజమైన జంతు తోలుకు దాని విశిష్ట లక్షణాలను ఇచ్చే ఫైబర్ నిర్మాణం లోపిస్తుందని చెప్పారు. సరికొత్త ప్రయోగం చేసేటప్పుడే ఇలాంటి సందేహాలు మాములేనని, అయినా ఇంతవరకు డైనోసార్ చర్మం అనేలా ఎవ్వరూ అంత స్థాయిలో ప్రయోగం చేయలేకపోయారని కూడా అన్నారు. అదీగాక సంప్రదాయ లెదర్ బ్యాగ్లతో పోలిస్తే, ల్యాబ్ తో చేసిన టి. రెక్స్ లెదర్ అత్యంత విలాసవంతమైన వస్తువుగా నిలుస్తుందన్నారు. ఈ డైనోసర్ లెదర్ బ్యాగ్ని మే 11న ఆమ్స్టర్డామ్లోని ఆర్ట్ జూ మ్యూజియంలో సందర్శనకు ఉంచనున్నారట. అంతేగాదు దీన్ని వేలం వేయనున్నట్లు సమాచారం. పైగా దీని ప్రారంభ ధరే రూ. 4 కోట్లు అని చెబుతున్నారు పరిశోధకులు.(చదవండి: Kerala Techie: సాహసమా..? నాటకమా..?: కావాలనే చేసిందా ఆ టెకీ..) -
ఆ టెకీది సాహసమా..? నాటకమా..?
కర్ణాటకలోని మూడవ ఎత్తైన శిఖరం టేడీయాండమోల్ (Tadiandamol) వద్ద ట్రెకింగ్కు వెళ్లి అడవిలో దారి తప్పిన కేరళకు చెందిన 36 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ జి.ఎస్. శరణ్య కథ సుఖాంతమైంది అనుకుంటే..సర్వత్రా ఈ ఘటనపై అనుమానాలు వెల్లువెత్తాయి. అసలు ఆమె నిజంగానే తప్పిపోయిందా..? నాటకమా.. ? అని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి. ఆ టెకీ శర్యణ తానెలా తప్పిపోయిందో చెప్పిన విధం కూడా అనుమానాస్పదంగా ఉండటంతో ఈ ఘటనపై పెద్దఎత్తున ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో కేసు దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు . అసలు ఎందుకిలా అంటే..కేరళలోని కోజికోడ్ జిల్లా, నడపురానికి చెందిన 36 ఏళ్ల ఐటీ నిపుణురాలు శరణ్య, ఏప్రిల్ 2న కర్ణాటకలోని కొడగులో ఉన్న ఎత్తైన శిఖరం తడియండమోల్ను అధిరోహించడానికి బయలుదేరింది. ఆమె తన బృందంతో తప్పిపోయి నాలుగురోజుల తర్వాత రెస్కూ అధికారులు ఆమె ఆచూకుని కనిపెట్టి సురక్షితంగా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే అలా నాలుగు రోజుల పాటు మనుషులెవ్వరూ వెళ్లలేని ఆ దట్టమైన అడవిలో ఒక్కత్తే ఉండటమే ఆశ్చర్యం అనుకుంటే ఆమె కేవలం నీళ్లు తాగుతూ ఉండటం మరింత ఆశ్చర్యానికి లోనుచేసింది. ఎందుకంటే రెస్క్యూ బృందాలు ఆమెను గుర్తించి తీసుకొచ్చినప్పుడూ.. శరణ్య ముఖంలో ఏ మాత్రం అలసిపోయినట్లు గానీ, తప్పిపోయిన బడలికగానీ కనిపించకపోవడంతో సర్వత్ర అనుమానాలకు దారితీసింది. అదీగాక క్రూర మృగాలతో నిండిన ఆ అడవిలో ఆమె బతికి బయటపడే అవకాశమే లేదు, ఇదంతా ఆమె కావాలనే ఆడిన నాటకంగా ఆరోపణలు చేస్తున్నారు. అంతేగాదు ఆమె ప్రభుత్వం, ప్రజల విలువైన సమయాన్ని, డబ్బుని వృధా చేసినందుకుగానూ శరణ్యపై తక్షణమే కేసు నమోదు చేసి విచారణ జరపాలని బిజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు టెకీ శరణ్య అదృశ్యం కేసుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ నపోక్లు పోలీస్ స్టేషన్లో కేను కూడా నమోదైంది. ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా సమగ్ర దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో కోరారు బీజేపీ నాయకులు. అయితే దీనిపై పోలీసులు ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు కానీ ఒక పిటిషన్గా దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. అలాగే పోలీసులు రెస్క్యూలో ఆమెను చూసి మాట్లాడినప్పుడు ఎలాంటి అనుమానాలు కలగలేదని, కానీ ఇప్పుడు అనుమానాలు లేవనెత్తుతున్నందున ఆ కోణంలో దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు రెస్క్యూ పోలీసులు. ట్రెక్కింగ్ వెళ్లినప్పుడూ శరణ్యలా కాకూడదంటే..ఇలా ట్రెక్కింగ్ వంటి సాహసయాత్రలకు వెళ్లేటప్పుడూ..ఎండింగ్ పాయింట్ చేరుకునేవరకూ వెళ్లే మార్గం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు జరిగిన అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. అందువల్ల రూట్ మ్యాపును తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. మారు మూల ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలు ఉంటాయి. టెక్నాలజీపై పూర్తిగా ఆధారపడకుండా మాన్యువల్ మ్యాప్ను ఫాలో అవ్వాలి. ఎక్కువగా ట్రెక్కింగ్ చేసేవారు బృందాలుగా విడిపోవాలి. అలా వంతుల వారీగా గ్రూపుకు నాయకత్వం వహించేవారిని అనుసరించడం మంచిది. సొంత నిర్ణయాలు తీసుకోకుండా బృందంలో చర్చలు జరుపుతూ ఉండాలి. ఇలా చేస్తే ట్రెక్కింగ్లో మంచి అనుభూతి కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.సాహసయాత్రకు సిద్ధమైన ట్రెక్కింగ్ ప్రియులు పర్వతాలపైకి వెళ్లే సమయంలో పైకి ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తేమ ప్రాంతాల్లో రాళ్లపై నాచు పట్టి ఉండడం వల్ల కిందకి జారిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ట్రెక్కింగ్ చేసేటప్పుడు వేసే ప్రతి అడుగు చాలా దృఢంగా ఉండాలి. ట్రెక్కీలు వెళ్లే దారి మధ్యలో ఎండిపోయిన చెట్లు, రాళ్లు, విష పురుగులు, సర్పాలు, కీటకాలు, తేళ్లు ఉంటాయి. కాబట్టి సౌండ్ వచ్చే షూస్ ను వేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇవి అలికిడికి దూరంగా వెళ్లిపోతాయి.(చదవండి: మంచు కమలం..ముమ్మాటికీ ఇది అందరూ చూడలేరు!) -
ఇది అందరూ చూడగలిగే పువ్వు కాదు..!
ఈ ప్రకృతి ఎన్నో అద్భుతాలకు ఆలవాలం. తనలో ఇముడ్చుకున్న కొన్ని విచిత్రాలు మంత్రముగ్ధుల్ని చేసేలా కట్టిపడేస్తాయి. అలాంటి అరుదైన పుష్పమే ఈ మంచుతామర లేదా మంచు కమలం. అందరికీ దీన్ని చూడటం సాధ్యం కాదు. ఈ మంచు కమలం ఎక్కడ వికసిస్తుందో తెలుసా..!.ఈ మంచు పుష్పం ఐదు నుంచి ఎనమిదేళ్లు పెరిగి జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే వికసిస్తుందట ఈ పర్వత పుష్పం. 'అరుదైన అందం', 'జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే క్షణం' వంటి పదాలు సరిపోతాయేమో ఈ మొక్కను వర్ణించడానికి. దీనిని సాసురియా ఇన్వోలుక్రాటా లేదా సాసురియా లానిసెప్స్ అని కూడా పిలుస్తారు. చాలా ఏళ్లకు వికసించడం వల్లనే ఇది అందరు చూగలిగే పువ్వు కాదని అంటుంటారు. చాలా ఏళ్లకు వికసించడం వల్లనే కాకుండా హిమాలయాలు, టియాన్షాన్ పర్వతాల్లో నివశించే కొద్దిమందికే ఈ మంచు కమలం గురించి తెలుస్తుందట. ఈ పుష్పం దాదాపు 10 వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో పెరుగుతుంది కాబట్టి ఇది తీవ్రమైన చలిలో కూడా జీవించగలదు. అరుదైనది అందమైనది మాత్రమే కాకుండా రుమటాయిడ్ ఆర్థరైటిస్, వాపు వంటి సమస్యల చికిత్సలో ఉపయోగపడే ఔషధ గుణాలు కూడా ఉన్నాయట. నిజానికి పదివేల కంటే ఎక్కువ ఎత్తులో గడ్డకట్టే ఉష్ణోగ్రతలు, పలుచని గాలి, తీవ్రమైన సూర్యరశ్మి వంటివి దీని మనుగడను కష్టతరం చేస్తాయి. ఆ సవాళ్లన్నింటిని తట్టుకుని పెరుగుతుంది కాబట్టి ఇది ఎంతో ప్రత్యేకం. పైగా ఈ మొక్క తన మనుగడతో గొప్ప జీవన పాఠమే గాక ఈ ప్రకృతిలో ప్రతిది కష్టాలను ఓర్చుకునే తన మనగడను చాటుకోవాల్సిందే అనే విషయం నొక్కి చెబుతోంది కదూ. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి...!. View this post on Instagram A post shared by Times Now (@timesnow) (చదవండి: ఆ రోడ్డు ప్రమాదమే ఆమెను రక్షించింది..!) -
క్షమించడంతోనే విముక్తి
చాలామంది క్షమించడం అంటే ఎదుటివారు చేసిన తప్పును అంగీకరించడం లేదా వారిని మళ్ళీ దగ్గరకు తీయడం అనుకుంటారు. కానీ సైకాలజీ ప్రకారం, క్షమించడం అనేది ఎదుటివారి కోసం చేసేది కాదు.. అది మీ కోసం మీరు చేసుకునే 'విముక్తి'. మీ వ్యక్తిత్వం నుండి పగ, ద్వేషం అనే భారాలను తొలగించి, మిమ్మల్ని మీరు ఎలా ఫ్రీ చేసుకోవాలో ఈ ఆర్టికల్లో చూద్దాం.మీకు అన్యాయం చేసిన వ్యక్తిపై కోపం పెంచుకోవడం అంటే, ఆ వ్యక్తికి మీ మనసులో 'ఉచితంగా రెంట్' (Free Rent) ఇచ్చినట్లే. మీరు పగతో రగిలిపోతున్నంత సేపు, మీ జీవితం ఆ వ్యక్తి నియంత్రణలో ఉంటుంది. క్షమించడం అంటే ఆ నియంత్రణను తెంచుకుని, మీ 'ప్రశాంతత'ను మీరు తిరిగి పొందడం.పగ - ఒక మానసిక విషం (The Burden of Unforgiveness)మనం ఎవరినైనా క్షమించలేనప్పుడు మన శరీరంలో నిరంతరంCortisol (స్ట్రెస్ హార్మోన్) విడుదలవుతుంది. ఇది మీ బీపీని పెంచుతుంది, నిద్రను పాడు చేస్తుంది , అది మీ సృజనాత్మకతను చంపేస్తుంది. కోపాన్ని మోయడం అంటే, ఎదుటివారి మీద విసరాలని మండుతున్న నిప్పు కణికను మీ చేతిలో పట్టుకోవడం లాంటిది. కాలేది మీ చేయి మాత్రమే, అవతలి వారికి ఏమీ కాదు.క్షమించడం అంటే ఏమిటి? క్షమించడమంటే 'మర్చిపోవడం' కాదు.జరిగిన విషయాన్ని మీరు మర్చిపోలేరు, కానీ ఆ జ్ఞాపకం మిమ్మల్ని బాధించకుండా చూసుకోవచ్చు.వారు చేసింది తప్పు అని మీకు తెలుసు, కానీ ఆ తప్పు వల్ల మీ వర్తమానం పాడవ్వకూడదు అని మీరు నిర్ణయించుకుంటారు.క్షమించినంత మాత్రాన మీరు ఆ వ్యక్తితో మళ్ళీ స్నేహం చేయక్కర్లేదు. మీరు వారిని దూరం పెట్టవచ్చు, కానీ మనసులో కోపం లేకుండా.మోటివేషన్ మాయ vs సైకాలజికల్ హీలింగ్"మహాత్ముడిలా ఉండు, అందరినీ ప్రేమించు" అని మోటివేషన్ చెప్తుంది. ఇది ఒక్కోసారి ఆచరణలో కష్టం. కానీ సైకాలజీ... "నీ ఆరోగ్యం కోసం, నీ ఎదుగుదల కోసం ఆ విషాన్ని బయటకు కక్కేయ్" అని చెప్తుంది. క్షమించడం అనేది ఒక నైతిక బాధ్యత కంటే, ఒక 'సెల్ఫ్-కేర్' టెక్నిక్.విముక్తి పొందే మార్గంGenius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, క్షమాగుణాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి?Step 1: Break Victim Identity..."నాకు అన్యాయం జరిగింది, నేను బాధితుడిని" అనే ఆలోచనను 'Break' చేయండి. ఆ ఆలోచన మిమ్మల్ని బలహీనపరుస్తుంది. ఆ సంఘటన నుండి బయటకు వచ్చి, మీరు ఒక 'సర్వైవర్' (Survivor) అని గుర్తించండి.Step 2: Build Emotional Detachmentఆ వ్యక్తికి, మీ ఎమోషన్స్ కి మధ్య ఉన్న లింక్ ని 'Build' చేయండి. "వాడు ఇలా అన్నాడు కాబట్టి నేను బాధపడుతున్నాను" అనే వాక్యాన్ని "నేను నా పాత జ్ఞాపకం వల్ల బాధపడుతున్నాను, ఆ వ్యక్తికి ఇప్పుడు నా మీద అధికారం లేదు" అని మార్చుకోండి. మీ మనసును మీరు రీ-వైర్ చేసుకోండి.Step 3: Liberationక్షమించిన తర్వాత మీలో కలిగే ఆ తేలికపాటి భావనను అనుభవించండి. ఇప్పుడు మీ ఎనర్జీ పగ తీర్చుకోవడానికి కాకుండా, మీ 'లెగసీ'ని నిర్మించుకోవడానికి వాడుకోండి. ఇదే 'Beyond' స్టేజ్. ఒక వ్యక్తిని క్షమించిన రోజు మీరు నిజంగా స్వతంత్రులు అవుతారు.మీ మనసులో భారమెంత?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి:1. మీరు ఇంకా ఎవరి మీదైనా కోపం పెంచుకున్నారా? ఆ కోపం వల్ల ఆ వ్యక్తికి ఏమైనా నష్టం జరుగుతోందా లేక మీకేనా?2. ఆ వ్యక్తిని క్షమిస్తే మీ జీవితంలో ఎంత సమయం, ఎంత ఎనర్జీ ఆదా అవుతుంది?3. మీరు మీ పాత గాయాలను మీ వ్యక్తిత్వానికి అలంకారాలుగా మార్చుకుంటారా లేక భారాలుగా మోస్తారా?క్షమించడమే అసలైన వీరత్వం!బలహీనులు ఎప్పటికీ క్షమించలేరు. క్షమించడం అనేది బలవంతుల లక్షణం. మీరు ఒకరిని క్షమించినప్పుడు, మీరు వారిని విడుదల చేయడం లేదు.. ఒక ఖైదీని విడుదల చేస్తున్నారు, ఆ ఖైదీ మరెవరో కాదు..మీరే!"The weak can never forgive. Forgiveness is the attribute of the strong."- Mahatma Gandhi సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: వయస్సుతో పాటు పెరగాల్సిన పరిపక్వత) -
ఆచి తూచి అడుగు వేయండి
మనిషి తన జీవన విధానాలను మెరుగు చేసుకునే పద్ధతులను ప్రయత్నిస్తూనే ఉంటాడు. భారతీయ వివాహ వ్యవస్థ తిరుగులేనిదే అయినా ఇటీవల లివ్ ఇన్ రిలేషన్– సహజీవన విధానంలో స్త్రీ, పురుషులు జీవించడం పరిపాటి అయ్యింది. అయితే ఇందులో స్త్రీలకు ఎదురవుతున్న సవాళ్లను పరిశీలించిన సుప్రీంకోర్టు న్యాయవాది మోనిక అరోర ఫేస్బుక్ వేదికగా కొన్ని సూచనలు చేశారు.ఇటీవల నా దగ్గరకు వచ్చిన ఒక కేసు నన్ను తీవ్రంగా కలవరపరిచింది. అది సహజీవనం కేసు. ఒక మహిళ దాదాపు 10 సంవత్సరాలుగా ఒక వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఆమె ఆ బంధాన్ని ఎంతో నమ్మింది. ఈ పదేళ్ల కాలంలో అతని కోసం సమయాన్ని, యవ్వనాన్ని, భావోద్వేగాలను, శరీరాన్ని అర్పించింది. కానీ ఉన్నట్టుండి ఆ వ్యక్తి ఏమీ చెప్పకుండా ఆమె నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. వేరొకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ఆమెతో చె΄్పాడు. దాంతో ఆమె పూర్తిగా కుంగిపోయింది. ఆమె పోలీసుల వద్దకు వెళ్లాలనుకుంది. క్రిమినల్ కేసు పెట్టాలనుకుంది. అతడు చేసిన ఘోరమైన ద్రోహానికి చట్టం అతడిని శిక్షించాలని కోరుకుంది. కాని భావోద్వేగాలు వేరు... చట్టం పని తీరు వేరు. అందుకే లివ్ ఇన్ రిలేషన్లో ఉంటున్న, వెళ్లాలనుకున్న స్త్రీలకు, యువతులకు కొన్ని వాస్తవాలు చెప్పాలనుకుంటున్నాను.మీరు ఇది అర్థం చేసుకోండి‘సహజీవనం’ స్త్రీలకు సాధికారత ఇచ్చే సంబంధం అని అనుకుంటారు. ఈ భావన కేవలం అంచనా మాత్రమే అంటాను నేను. ఇది చూడటానికి, పైకి చెప్పుకోవడానికి ఎంపికకూ, స్వేచ్ఛకూ, ఆధునికతకూ తార్కాణం కావచ్చు. కాని ఒకసారి ఏదైనా తేడా జరిగితే నిజమైన కోర్టు గదులలో పరిస్థితి చాలా భిన్నంగా ఎదురవుతుంటుంది. లివ్ ఇన్ రిలేషన్ ఒక్కసారి విచ్ఛిన్నమైనదంటే ఆ సంబంధంలో ఉన్న మహిళకే అధిక నష్టం ఎదురవుతుంది. ఒంటరితనం, బాధ ఆమెను చుట్టుముడతాయి. చట్టపరంగా ఆమెకు దొరికే మద్దతు ఆశించినంతగా ఏమీ ఉండదు. అందుకే లివ్ ఇన్లో ఉన్న... లేదా వెళ్లాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన చట్టపరమైన అంశాలుసమ్మతికి ప్రాధాన్యంఇద్దరు వయోజనులు ఒక సంబంధంలో ఉండాలని నిశ్చయించుకుని, స్వచ్ఛందంగా పరస్పర అంగీకారంతో శారీరక సంబంధంలోకి ప్రవేశిస్తే, అప్పుడు విడిపోవడం నేరంగా పరిగణించబడదు.అది లైంగిక నేరంగా మారదులిన్ ఇన్ రిలేషన్ నుంచి పురుషుడు తప్పుకుంటే, ఆ సంబంధాన్ని విడిచిపెట్టినంత మాత్రాన, అప్పటివరకూ పరస్పర అంగీకారంతో సాగిన శారీరక సంబంధం అత్యాచారంగా మారిపోదు.మోసం, వంచనలకు శిక్షఅయితే లివ్ ఇన్ కోసం మొదటినుంచి మోసం, కుయుక్తి లేదా కేవలం సమ్మతి కోసమే పెళ్లి చేసుకుంటానని తప్పుడు వాగ్దానం చేసినట్లయితే ఈ అంశం చుట్టూ చట్టపరమైన సహాయం భిన్నంగా ఉండవచ్చు. అయితే ఈ విషయం కూడా స్పష్టంగా నిరూపించబడాలి.రక్షణ గురించిసహజీవన సంబంధం తనంతట తాను వివాహానికి ఉండే చట్టపరమైన రక్షణను కల్పించదు. వివాహం స్త్రీకి సామాజిక మద్దతు, చట్టపరమైన హోదాను ఇస్తుంది. నిలదీయదగ్గ, అమలు చేయదగ్గ హక్కులను స్త్రీకి ఇస్తుంది. భర్త విడిపోవాలంటే భార్య ఉమ్మడి ఇంటి నుంచి రక్షణ, భరణం, చట్టపరమైన పరిహారాలు, సామాజికం గా అవసరమైన మద్దతు, పెద్ద మనుషులను కూచోబెట్టి డిమాండ్స్ చేయడం.. ఇవన్నీ సాధ్యమవుతాయి.మరి లివ్ ఇన్లో?లివ్ ఇన్లో కొన్ని సందర్భాల్లో స్త్రీకి చట్టం నుంచి పరిమిత రక్షణ లభించవచ్చు. కానీ అది వివాహం ద్వారా స్త్రీకు వచ్చే రక్షణతో సమానం కాదు. వివాహ స్వభావం కలిగిన కొన్ని జీవన సంబంధాలను చట్టం రక్షించవచ్చు, కానీ ఆ రక్షణ పరిమితమైనది. పెళ్లి నుంచి విడిపోవాలంటే ఎదురయ్యే సహజమైన పరిణామాలు లివ్ ఇన్ వంటి వ్యవస్థలో మనిషి మనిషికి మారిపోతుంటాయి. అందుకే నేను ఏమంటానంటే⇒ అమ్మాయిలకు ‘నీ శరీరం, నీ ఇష్టం’ అని మనం చెప్పినప్పుడు, ‘విచక్షణతో కూడిన నిర్ణయం తీసుకో’ అని కూడా వారికి చె΄్పాలి ∙చట్టం నినాదాలను కాపాడదు. చట్టం హక్కులను కాపాడుతుంది. హక్కులు కేవలం భావోద్వేగాల వల్ల రావు ⇒ ఇది నీతిసూత్రాల బోధ అనుకోవడం లేదు. నా కేసులలో నేను పదేపదే చూస్తున్న చట్టపరమైన వాస్తవం గురించి చెబుతున్నాను ⇒ ఒక అమ్మాయి సహజీవనం స్వేచ్ఛ అని నమ్మి అందులోకి ప్రవేశించవచ్చు. కానీ ఆ సంబంధం ముగిసినప్పుడు తనకు వివాహంలోలాగా వచ్చే హక్కు, భరణానికి హామీ, స్పష్టమైన సామాజిక భద్రత, నివాస హక్కులు, భావోద్వేగ ద్రోహానికి సులభమైన చట్టపరమైన పరిష్కారం లేదని ఆమె తెలుసుకోవాలి.అందుకే, అనేక సందర్భాల్లో ‘సహజీవనాలు’ స్త్రీయే అధిక ప్రమాదాన్ని భరించాల్సిన ఒక వ్యవస్థగా పరిణమిస్తాయి. ఇటువంటి బంధంలోకి అడుగుపెట్టే ముందు, ప్రతి యువతి తనను తాను ఈ ప్రశ్నలు తప్పక వేసుకోవాలి.⇒ నా చట్టపరమైన హక్కులు ఏమిటి?⇒ ఒకవేళ అతను నన్ను వదిలి వెళ్లిపోతే నాకు లభించే రక్షణ ఏమిటి?⇒ ఆ బంధానికి సంబంధించిన వాగ్దానాలు నెరవేరకపోతే,నాకు లభించే పరిష్కారం ఏమిటి?⇒ ఇంతటి గాఢమైన మానసిక,శారీరక అంకితభావానికి ప్రతి ఫలంగా నేను కచ్చితంగా ఏమి పొందుతున్నాను? -
ఆ రోడ్డు ప్రమాదమే ఆమెను రక్షించింది..!
ఒక్కోసారి రోడ్డు ప్రమాదాలు బాధనే కాదు త్రుటిలో పెను ప్రాణాంతక ప్రమాదాల నుంచి రక్షిస్తాయి కూడా. ఒక్కోసారి విత్కర పరిస్థితి కూడా వరంగా మారిపోతుంది. అందుకు నిదర్శనమే ఈ మహిళ కథ. ఆ రోజు ఆమెకు ఆ యాక్సిడెంట్ జరగకపోతే..ప్రాణాలతో ఉండేది కాదు. ఇదేంటి అనుకోకండి ఈ కథ వింటే ఏం జరిగినా మన మంచికే అనే పెద్దల మాట తలపుకు వస్తుంది. అమెరికాలోని ఓవెన్స్ క్రాస్ రోడ్స్కు చెందిన 31 ఏళ్ల మెలిస్సా ఆడమ్స్ తన పెళ్లికి ఒక రోజు ముందు రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైంది. రిహార్సల్ డిన్నర్ నుంచి ఇంటికి వస్తుండగా సిగ్నల్ వద్ద ఉన్న ఆమె కారును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఢీ కొట్టారు. దాంతో ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఆమెకు చికిత్సి చేసే నిమిత్తం వైద్యులు సీటీ స్కాన్ చేయగా..ఆమె ప్రాణాంతక కేన్సర్ వాధి బారిన పడినట్లు నిర్థారణ అయ్యింది. అది నాలుగో స్టేజ్లో ఉన్నట్లు వెల్లడించారు వైద్యులు. ఒక్క క్షణంలో జీవితం తలకిందులైనట్లు అనిపించిందామెకు. ఇంతటి విపత్కర పరిస్థితిలోనూ తమ పెళ్లిని వాయిదా వేసుకోకూడదని ఆమె, తన భాగస్వామి తీర్మానించుకున్నట్లు ఆడమ్స్ పేర్కొంది. ఈ దురదృష్టకర ఘటన మరుసటి రోజే పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించింది. తన జీవితంలోని ముఖ్యమైన రోజుని దూరం చేసుకోవడం ఇష్టంలేక ఇలా చేసినట్లు తెలిపింది. తర్వాత వైద్యులు ఆమె శరీరంలోని మొత్తం 18 గడ్డలను గుర్తించి, ఆమెకు ఫోలిక్యులర్ డెండ్రిటిక్ సెల్ సార్కోమా (FDCS) అనే అత్యంత అరుదైన కేన్సర్ ఉన్నట్లు నిర్ధారించారు. అయితే ఆ గడ్డలు ఆమె శరీరంలోని గుండె దగ్గర నుంచి పొత్తికడుపు, ఛాతీతో సహా పలుచోట్ల ఉన్నట్లు తెలిపారు. అనేక ఆస్పత్రులు, ఆంకాలజీ క్లినిక్లను సందర్శించిన తర్వాత చివరకు ఏప్రిల్ 1, బుధవారం నాడు చికిత్సను ప్రారంభించారు. సుమారు 19-20 వారాలు వేచి ఉన్న తర్వాత కీమోథెరపీని ప్రారంభించడంతో తనకు ఉపశమనం, ఆశ కలిగిందని అన్నారు. ఆమె చికిత్సకు అయ్యే ఖర్చు కోసం గోఫండ్ సాయం తీసుకున్నట్లు తెలిపింది. నిజానికి తనకు అప్పటికే కొన్ని ఆటోఇమ్యూన్ సమస్యలు ఉన్నాయని, నడుము నొప్పితో బాధపడుతున్నానని చెప్పుకొచ్చింది. కానీ తనకు మొదటి నుంచి ఆసమస్యలు ఉండటంతో అందువల్ల ఇలా అనుకున్నాననే గానీ ఇలా ప్రాణాంతక కేన్సర్ బారిన పడతానని ఊహించలేదని కన్నీటిపర్యంతమైంది. తాను గత కొంతకాలంగా శరీరం అంతా పలు నొప్పులు ఎదుర్కొన్నట్లు గుర్తుచేసుకుంది. కణుతులు అవయవాలపై ఒత్తిడి తేవడం వల్లనేనని ఇప్పుడు అర్థమవుతోందని అంటోంది. వ్యాధి నిర్థారణ తర్వాత తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలంటూ ఇతరులకు సూచనలందిస్తోంది. అస్సలు తనకు గనుక ఆ కారు ప్రమాదం జరిగి ఉండకపోతే..తన అనారోగ్యాన్ని గురించి ఎప్పటికీ తెలుసుకోలేకపోయేదాన్ని అని అంటోందామె.అలాగే తనలాంటి లక్షణాలు ఉన్నా లేక శరీరం ముందుగా ఇచ్చే సంకేతాలనుక్ క్షణ్ణంగా అర్థంచేసుకోమని సూచిస్తోంది. తనలా నిర్లక్ష్యంగా ఉండొద్దని హితవు పలుకుతోంది. ఇక ఆడమ్స్ పరిస్థితి ఇంకా క్రిటికల్గానే ఉందని, పూర్తి స్థాయిలో కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతుండటం గమనార్హం. (చదవండి: 'పన్ను' వసూలు చేసే బ్యాడ్ హ్యాబిట్స్) -
పంటి సంరక్షణే.. ఆరోగ్యానికి రక్ష..!
పంటి రక్ష ప్రాణాలకు రక్ష అన్నా పర్వాలేదు. ఎందుకంటే నోరు అనే సింహద్వారానికి పళ్లు ద్వార పాలకులు.వాటిని దాటి ఏదీ రాలేదు. కానీ నోటి ఆరోగ్యం దెబ్బతింటే అది గొంతు ఇన్ఫెక్షన్లనూ, దీర్ఘకాలంలో అక్కడి నుంచి గుండెనూ దెబ్బతీసే ముప్పు లేకపోలేదు. అందుకే నోటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే పంటి ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవడమే. మనకు తెలియకుండా...మన రోజువారీ అలవాట్లలో భాగంగా చాలా పనులు చేస్తుంటాం.ఉదాహరణకు పంటికి లుంగజుట్టుకు పోయే చాక్లెట్లు తింటుంటాం. కూల్ వాటర్ తాగుతూ పంటి కిందికి ‘ఐస్’వస్తే నమిలేస్తుంటాం. ఇలా మనం చాలా తేలిగ్గా తీసుకుని చేసే కొన్ని పనులు పంటి ఆరోగ్యాన్నీ... దీర్ఘకాలంలో ఒంటి ఆరోగ్యాన్నీ దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటి అలవాట్లు ఏమిటో తెలుసుకుని, వాటి నుంచి దూరంగా ఉండటం ఎలాగో, తద్వారా పంటి, ఒంటి ఆరోగ్యాలను కాపాడుకోవడం ఎలాగో తెలుసుకుందాం...ఇప్పటి తరం పిల్లల దూకుడు గురించి చెప్పడానికి చాలానే ఉంటుంది. నేటి యువతలో నలుగురు కలిసి ఎక్కడో పిక్నిక్కు అంటూ కూల్డ్రింక్ బాటిల్స్ తీసుకెళ్లారనుకోండి. అక్కడ ఓపెనర్ దొరకకపోతే పళ్లతోనే బాటిల్ మూతలను ఓపెన్ చేసే నైపుణ్యం ఇప్పటి యువకుల సొంతం. అలాగే చాలామంది తమకు తెలియకుండానే పంటిని దెబ్బతీసే పనులు చాలానే చేస్తుంటారు. ఉదాహరణకు రాస్తూ రాస్తూ ఏదో ఆలోచిస్తూ పెన్ను చివరను నోట్లో పెట్టుకుని తేలిగ్గా కొరుకుతూ ఉండవచ్చు. అలాగే పొద్దున్నే బ్రష్ నోట్లో వేసుకుని నలుగురు కలిసి మాట్లాడుకునే టైమ్లో బ్రషింగ్కు బదులు బ్రష్ను నములుతూ ఉండిపోయే పల్లెల్లోని రచ్చబండ బ్యాచ్కు కొదవే లేదు. చల్లటి నీళ్లనో లేదా ‘ఛిల్ల్’టి డ్రింక్స్ తాగుతూ ఆ నీళ్లకు పళ్లు అదేపనిగా తాకుతూ ఉండేలా తాగేవారికి లోటు లేదు. మనం అంతగా పట్టించుకోకుండా చేసే ఇలాంటి చాలా పనులు పళ్లకు హాని చేయవచ్చు. నోరు అనేది దేహానికి సింహద్వారం అని చెప్పుకున్నాం కదా. మరి ఆ నోట్లోకి హానికరమైన బ్యాక్టీరియా వచ్చి చేరాక అవి గొంతులోకి... అక్కడ్నుంచి దేహంలోకీ పోతూ... మొత్తం ఒంటికే చేటు తెచ్చే ముప్పు ఎప్పుడూ ΄పొంచే ఉంటుంది. అందుకే అలాంటి కొన్ని చెడ్డ అలవాట్లను చిన్నారులు, యువత దృష్టికి తెచ్చి... వాటిని మాన్పించేలా చేయడమే ఈ కథనం ఉద్దేశం. టైటానిక్కు ఐస్బర్గ్ లాంటిదే... పంటికి ‘ఐస్’ వాటర్...మంచి టేస్టీ బిర్యానీతో పాటు చల్లటి కూల్డ్రింక్ తాగుతుండటం చాలామందికి అలవాటు. అంతేకాదు... ఇటీవలి ఫాస్ట్ ఫుడ్స్ అయిన బర్గర్, పిజ్జాలతో పాటు కోలా క్రిండ్స్ తీసుకోవడం ఇంకొందరికి పరిపాటి. ఒకవేళ వాళ్లు తీసుకోకపోయినప్పటికీ... ఇలాంటి ఫాస్ట్ఫుడ్స్తో పాటు కాంప్లిమెంటరీ డ్రింక్గా కూల్డ్రింక్స్ చాలా మాల్స్లో దొరుకుతూ ఉండటం మామూలే. అందునా ఆ డ్రింక్స్లో ఐస్ క్యూబ్స్ వేసి మరీ ఇస్తుంటారు. కొందరు నోట్లోకి వచ్చిన ఆ ఐస్ ముక్కను ఉమ్మేస్తే బాగుండదనుకుని నుములుతూ ఉండటమూ మామూలే. ఇక రకరకాల ఫ్లేవర్స్లో దొరికే ‘ఐస్’ఫ్రూట్స్ తినే చిన్నారులు ఒక దశవరకూ వాటిని చప్పరించాక... ఇక ఓపిక తగ్గిపోయి... వాటిని నమిలి మింగేస్తుంటారు. మరికొందరు బాక్సింగ్, కిక్బాక్సింగ్, ఫుట్బాల్ ప్లేయర్స్ తమ పళ్ల రక్షణ కోసం ఐస్ ముక్కల్ని నోట్లో పెట్టుకుంటారు. అలాంటి ఐస్ ముక్కల కారణంగా చాలామంది పళ్లు దెబ్బతింటాయి. తొలిదశలో కాస్తంత భరించేలా ఉన్న అవే ఐస్ ముక్కలు... పంటి ఎనామిల్ దెబ్బతిన్న తర్వాత జిల్లంటూ బాధించేవరకూ పరిస్థితి వెళ్తుంది. ఐస్ క్యూబ్స్ లేదా ఐస్ నోట్లోకి తీసుకోవడం కారణంగా నోట్లోని ఉష్ణోగ్రత అకస్మాత్తుగా మారిపోవడం వల్ల ఎనామిల్లో పగుళ్లు (క్రాక్స్) వచ్చే ప్రమాదం ఉంటుంది. పరిష్కారం: పెద్దవాళ్లు ఐస్ ముక్కలతో కూడిన డ్రింక్స్ తీసుకుంటున్నా... లేదా చిన్నారులు ఐస్ఫ్రూట్లూ, ఐస్క్యాండీ తింటున్నా వీలైనంతవరకు ఐస్ను నమలకూడదు. అసలు పంటికి ఐస్ తగలకుండా జాగ్రత్త పడాలి. ఇక బాక్సింగ్, కిక్బాక్సింగ్ వంటి ఆటగాళ్లు ఐస్కు బదులు పళ్ల రక్షణ కోసం మౌత్గార్డ్నే వాడటం మేలు.పళ్లను ఓపెనర్గా వాడటం సరికాదు... పిక్నిక్లకు వెళ్లేప్పుడు ఆర్భాటంగా కూల్డ్రింక్స్ తీసుకెళ్లే యువకుల్లో చాలామంది ఓపెనర్ను తీసుకెళ్లడం మరచిపోయి, సీసా మూతలు తీయడానికి పళ్లను వాడుతుంటారు. బట్టలు కుట్టే టైలర్లలో కొందరు దారం ఎక్కించే ముందర సూదిని పంటితో పట్టుకోవడమూ అక్కడక్కడా కనిపించే దృశ్యమే. అంతేకాదు వాళ్లలో కొందరు దారాన్ని పంటితోనే తెంపుతుంటారు. షాంపూ షాచేలను చింపడానికి కొందరు పళ్లనే ఉపయోగిస్తుంటారు.పరిష్కారం: పంటి రక్షణ కోసం గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... మన పళ్లు ఓపెనర్లు కాదు. అలాగే కత్తెరకు బదులుగా పళ్లను వాడటమూ సరికాదు. ఈ పనులు చేసే చాలామందిలో పళ్ల ఎనామిల్ దెబ్బతినే ప్రమాదముంది. పంటి తాలూకు చిన్న ముక్క ఊడిపోయే ముప్పు కూడా పొంచి ఉంటుంది. ఇలాంటి పనులతో పళ్లు త్వరగా దెబ్బతింటారు. అందుకే సీసా మూతలు తీయడానికి ఓపెనర్నే వాడాలి. షాంపూ షాచేలు చింపాలంటే కత్తెరనే వాడాలి. అంతేతప్ప పళ్లను వాడకూడదని గుర్తుంచుకోవాలి.పండ్లరసాల్లోని చక్కెర పళ్లకు ముప్పు... పండ్లరసాలు ఆరోగ్యానికి చాలామంచివంటూ చాలామంది వాటిని తాగేస్తూ ఉంటారు. అలాగే ఎనర్జీ డ్రింక్స్ అనీ, స్పోర్ట్స్ డ్రింక్స్ అనీ తాగేస్తూ తమకు ఆరోగ్యంతో కూడిన శక్తి సమకూరుతోందంటూ ఆనందిస్తుంటారు. నిజానికి ఫ్రూట్ జ్యూసుల్లో, స్పోర్ట్స్ డ్రింక్స్లో ఉండే చక్కెరతో పళ్లు పుచ్చిపోవడం, దంతక్షయానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాదు... లైమ్జ్యూస్ల వంటి పుల్లటి పండ్లరసాల్లోనియాసిడ్ వల్ల పళ్లు దెబ్బతినే ముప్పు పెరుగుతుంది. పరిష్కారం: చక్కెర మోతాదు ఎక్కువగా ఉండే పండ్లరసాలను వీలైనంత తక్కువగా తీసుకోవాలి. అలాంటి పానీయాలు తాగేటప్పుడు ఆ ద్రవం వీలైనంతవరకు పంటికి తగలకుండా తాగడం మేలు. ఇక తీపి ఎక్కువగా ఉండే డ్రింక్స్ లేదా పండ్లరసాలు తాగాక నోరు శుభ్రంగా కడుక్కోవడం మరచిపోవద్దు.పండ్లూ... పళ్లు... ప్రాధాన్యం దేనికి... ఏ సీజన్లో దొరికే మంచి తాజాపండ్లను ఆయా సీజన్లలో తినడం మంచి అలవాటే. అది ఆరోగ్యానికి మేలు చేసే అంశమే. కాకపోతే మరీ చక్కెర మోతాదులు ఎక్కువగా ఉండే పండ్లనూ, పులుపు మోతాదు కాస్తంత ఎక్కువగా ఉండే బత్తాయి, ద్రాక్ష, ఆరెంజ్ జ్యూస్లను వీలైనంత మేరకు పళ్లకు తగలకుండా తీసుకోవడం మేలు. ఎందుకంటే పుల్లటి పండ్లలో ఉండే ఆ పులుపులో ఉండే ఆమ్ల గుణం పంటిని దెబ్బతీసే ముప్పు ఎప్పుడూ ఉంటుంది.పరిష్కారం: పండ్లను ఫ్రూట్జ్యూస్లుగా తాగడం కంటే వాటిని కొరికి తినడం మంచిది. ఒకవేళ జ్యూస్ రూపంలో తాగాలనుకుంటే... ఆ పానీయంలో చక్కెర కలుపుకోవడం తగదు. ఇక జ్యూస్ రూపంలో తాగినప్పటికీ... వెంటనే నోరు కడుక్కోవడం మరచిపోవద్దు.కరకరలాడే చిప్స్తో కిరికిరి... చిప్స్ కరకరలాడుతూ నాలుకకు రుచిగా ఉండవచ్చు. కానీ పళ్లకు అంత మంచివి కాదు. పైగా కరకరలాడే పదార్థాలు పళ్లకు ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశాలెక్కువ. అంతేకాదు చిప్స్ లాంటి చిరుతిండ్లలో స్టార్చ్ కూడా ఎక్కువ. ఈ స్టార్చ్ లాలాజలం తగలగానే దాదాపు చక్కెరలా మారిపోయి పంటిని దెబ్బతీసే ముప్పు మరీ ఎక్కువ. అందుకే చిప్స్ లాంటివి తిన్న 20 నిమిషాల తర్వాత అవి పంటిని దెబ్బతీయడం మొదలు పెడతాయి. అంతేకాదు... పంటి మధ్యన చిక్కుకునే చిప్స్ తాలూకు చిన్న చిన్న ముక్కలతో దంత క్షయం ముప్పు మరింత పెరుగుతుంది. ఇక మరికొందరు పిల్లలూ, ఆ మాటకొస్తే కొందరు పెద్దలు కూడా ఎప్పుడూ ఏదో ఓ చిరుతిండిని నములుతూ ఉంటారు. దాంతో చిరుతిండిలో ఉండే పిండిపదార్థాలూ, చక్కెర వంటి పంటికి ముప్పు తెచ్చే అంశాలు పళ్లను దెబ్బతీస్తాయి.పరిష్కారం: వీలైతే తరచూ చిరుతిండ్లు తినే అలవాటుకు దూరంగా ఉండటం మేలు. లేదంటే చిరుతిండి తిన్న వెంటనే నోరు శుభ్రంగా కడుక్కోవాలి. చిరుతిండ్లకు బదులుగా క్యారట్ వంటిని నములుతూ ఉండటం మంచిది. ఇక చిప్స్ లాంటి చిరుతిండ్లను వీలైనంత తక్కువగా తినాలి. ఒకవేళ తప్పక తినాల్సివచ్చినప్పుడు తిన్నవెంటనే నోరు కడుక్కోవడం, వీలైతే ఫ్లాసింగ్ చేసుకోవడం (దారంతో పళ్ల మధ్య చేరే చిన్న చిన్న ముక్కలను శుభ్రపరచుకోవడం) తప్పనిసరి.కాఫ్ సిరప్తోనూ దంతక్షయం...చాలామంది కాఫ్ సిరప్ అనేది దగ్గు తగ్గేలా చేసే ఓ మందు అనుకుంటారు గానీ అందులో ఔషధంతో పాటు చక్కెర మోతాదులూ ఉంటాయి. ఆ చక్కెర పంటి ఆరోగ్యానికి ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశాలుంటాయి. పరిష్కారం: దగ్గు మందును వీలైనంత మేరకు పలువరసకు తగలకుండా గొంతులో పోసుకోవడం మేలు. అలాగే దగ్గు మందు తాగిన వెంటనే నోరు కడుక్కోవడం మరచిసెవద్దు.తప్పుడు బ్రష్షింగ్ సరికాదు... చాలామంది బ్రష్ చేసుకోడానికి నోట్లో బ్రష్ పెట్టుకుంటారు గానీ... ఆ ప్రక్రియను వేగంగా ముగించకుండా అదేపనిగా నములుతుంటారు. ఇక కొందరు తప్పుడు పద్ధతుల్లో బ్రష్షింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొందరు నోరు శుభ్రంగా ఉండాలనే తపనతో విపరీతంగా బ్రష్ చేసుకుంటారు. ఈ అన్ని చర్యలతోనూ పళ్లు త్వరగా అరిగిపోయే ముప్పు ఉంటుంది.పరిష్కారం: మృదువైన బ్రిజిల్స్ ఉన్న టూత్బ్రష్ను ఎంచుకోవాలి. పంటి మీద ఎక్కువ ఒత్తిడితో బ్రష్షింగ్ చేయకూడదు. బ్రష్షింగ్ చేసే సమయంలో పంటికి అడ్డంగా కాకుండా నిలువుగా బ్రష్ చేసేలా టూత్బ్రష్ను కదిలించాలి. సున్నాలు చుడుతున్నట్లుగా (సర్క్యులర్గా) కదిలిస్తూ బ్రష్ చేసుకోవడం సరైన పద్ధతి. ఈ సమయంలో చిగుర్లకూ మాలిష్ జరుగుతుండేలా బ్రష్ కదలికలు (స్ట్రోక్స్) ఉండాలి. బ్రషింగ్ పూర్తయ్యాక వేలిచివరతో చిగుర్లను మాలిష్ చేస్తున్నట్లుగా సున్నాలు చుడుతున్నట్లుగా కదిలించాలి. కనీసం ప్రతి మూడు నెలలకు ఒకసారైనా బ్రష్ను మార్చడం మేలు. ఒకవేళ జ్వరం రావడం లేదా ఆరోగ్యం చెడిపోవడం జరిగితే... కోలుకున్న వెంటనే బ్రష్ను మార్చడం మంచి పద్ధతి. ఇలా ఆరోగ్యం చెడిపోయినప్పుడు బ్రష్ మార్చడానికి మూడు నెలలు ఆగడం అనే నిబంధన పనికిరాదు.ఆ జబ్బుతో పంటికి ముప్పు... కొందరు ‘బ్రక్సిజం’ అనే జబ్బు కారణంగా పదే పదే పళ్లు కొరుకుతూ ఉంటారు. ఇలాంటి వారు రోజువారీ ఒత్తిడుల కారణంగా తమకు తెలియకుండానే నిద్రలో పళ్లు కొరుక్కుంటూ ఉంటారు. ఇలా పళ్లు కొరుకుతూ ఉండేవారిలో పళ్లు త్వరగా అరిగిపోతాయి. ఇక మరీ గట్టి పదార్థాలను అదేపనిగా నమలడం కూడా పంటి అరుగుదలను వేగవంతం చేస్తుంది.పరిష్కారం: నిద్రలో పళ్లు కొరికే అలవాటు ఉన్నవారు కారణాన్ని తెలుసుకుని, ఆ అలవాటును మానుకోవాలి. బ్రక్సిజం ఉంటే చికిత్స తీసుకోవడం, ఒత్తిడి ఉన్నవారు దాన్ని తగ్గించుకునేందుకు ధ్యానం, రిలాక్సేషన్ టెక్నిక్స్ అనుసరించాలి.ఎంత తక్కువ అయినా ముప్పే... గుండెపోటు నివారణకు తోడ్పడుతుందంటూ కొందరు రెడ్వైన్ తాగుతుంటారు. మిగతా ఆల్కహాలిక్ డ్రింక్స్తో ΄ోలిస్తే రెడ్వైన్ ఆరోగ్యకరమనే అపోహ చాలామందిలో ఉంటుంది. నిజానికి రెడ్వైన్లో క్రోమోజెన్ ట్యానిన్స్ అనే రంగునిచ్చే పదార్థాలు ఉంటాయి. ఇవి పంటి ఎనామిల్ను దెబ్బతీస్తాయి. దాంతో పళ్లు మెరుపును కోల్పోతాయి. అంతేకాదు... ఎంత తక్కువ మోతాదులోనైనా ఆల్కహాల్ ఒంటికి ముప్పు తెచ్చే అంశమే!పరిష్కారం: అది ఎంతటి ఖరీదైన లేదా నాణ్యమైన రెడ్వైన్ అయినప్పటికీ అది మద్యమే తప్ప ఆరోగ్యప్రదాయిని కానే కాదు. అదీ ఒకరకమైన మద్యమే కాబట్టి ఆ అలవాటును మానుకోవడమే మేలు.గోళ్లు కొరికే అలవాటు... పళ్లకు చేటు... కొందరు అదేపనిగా గోళ్లు కొరుక్కుంటుంటారు. ఈ చెడ్డ అలవాటుతో పళ్లు దెబ్బతింటాయి. గోళ్ల ద్వారా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నోటి ద్వారా కడుపులోకి వెళ్లి ఆరోగ్యం దెబ్బతినవచ్చు.పరిష్కారం: గోళ్లు కట్ చేసుకోవాలనుకుంటే నెయిల్ కట్టర్నే వాడాలి. టెన్షన్ వల్ల ఈ అలవాటు వస్తే... ధ్యానం, రిలాక్సేషన్ టెక్నిక్స్ వంటి వాటితో ఆ దురలవాటుకు దూరం కావాలి. పళ్లు కుట్టుకోవడం ఓ బ్యాడ్ హ్యాబిట్... చాలామంది ఏదైనా తినగానే టూత్పిక్స్తో పళ్లు కుట్టుకుంటారు. ఈ అలవాటు వల్ల పళ్ల మధ్య సందులు మరింత పెరిగే ముప్పు ఉంటుంది. ఫలితంగా పళ్ల మధ్య మరింత ఆహారం చిక్కుకుని, బ్యాక్టీరియా పెరగడం, దాంతో పళ్లు మరింత వదులు కావడం వంటి ముప్పు ఉంటుంది.పరిష్కారం: పళ్లు కుట్టుకునే అలవాటు మానేయాలి. వీలైతే ఫ్లాసింగ్ చేసుకోవాలి.చివరగా... ఇక్కడ పేర్కొన్న చెడు అలవాట్లను వదులుకుంటే అవి చాలావరకు నోటికీ, పలువరసకు, పంటి చిగుర్లకు మాత్రమే కాదు... మొత్తం దేహానికే మంచి చేస్తాయని, ఓవరాల్ ఆరోగ్యానికీ మంచిదని గుర్తుంచుకోవవడం మేలు.‘టీత్’కు ముప్పు తెచ్చిపెట్టే టీలు... కాఫీలుకొందరు కాఫీలు, టీలు చాలా ఎక్కువగా తాగుతుంటారు. ఇక తమ పనిలో ఒత్తిడిని అధిగమించడానికి టీ, కాఫీలను అలవాటు చేసుకుంటుంటారు. కొంతలో కొంత టీ వల్ల అంతగా ముప్పు ఉండదేమోగానీ... కాఫీలో ఉండే అసిడిక్ గుణం వల్ల పలువరస పచ్చగా మారే ముప్పు ఉంటుంది. టీ కూడా మరీ ఎక్కువగా తాగుతూ ఉంటే అదీ తెల్లటి పలువరస రంగుమారేలా చేస్తుంటుంది. అంతేకాదు... బాగా వేడివేడిగా ఉండే టీ, కాఫీలలోని ఉష్ణోగ్రత వల్ల పంటి ఎనామిల్ దెబ్బతీనే అవకాశమూ ఉంటుంది. అందుకే చాలాకాలం పాటు టీ, కాఫీలు మితిమీరి తాగుతుండే కొందరిలో పంటి మెరుపు తగ్గే ముప్పు కూడా ఉంటుంది. ఇక కాఫీ, టీలలో ఉండే చక్కెర పంటికి అంటుకుపోవడం వల్ల పళ్లమధ్య క్యావీటీలూ, పిప్పిపళ్లు వచ్చే ముప్పు కూడా ఎక్కువే. పరిష్కారం: కాఫీ, టీలు తాగే అలవాటు ఉన్నవారు వాటిని పరిమితంగానే తీసుకోవాలి. ఇప్పటికే ఈ అలవాట్ల కారణంగా పళ్లు పచ్చబారి ఉంటే బ్లీచింగ్ చేయించుకోవడం ద్వారా వాటిని మళ్లీ మెరిసేలా చేసుకోవచ్చు.పాన్లూ, జర్దా / ఖైనీలు వద్దు... చాలామంది అదేపనిగా పాన్ తింటూ ఉంటారు. అందులో వక్కలను నములుతూ ఉంటారు. ఇక అందులో జర్దా, ఖైనీ వంటి పొగాకు ఉత్పాదనలు నోటి ద్వారా తీసుకుంటూ ఉంటారు. ఇందులో పాన్లోని కఠినమైన వక్కలను తినడం ఒక ప్రమాదమైతే... ఇక నోటి ద్వారా పొగాకును తీసుకోవడం పంటికీ, ఒంటికీ... ఈ రెంటికీ చాలా ప్రమాదం. ఇక పాన్ తినేవారి నోట్లో పళ్లు ఎర్రగా, చాలాకాలం నుంచి అదే అలవాటు ఉన్నవారిలో నల్లబారి ఉండటం చూస్తుంటాం. పరిష్కారం: పాన్ తినే అలవాటు ఉన్నవారు తక్షణం ఆ అలవాటు మానివేయడం తప్పనిసరి. లేదంటే పళ్లకే కాదు మొత్తం దేహానికే ఈ అలవాటు చేటు తెచ్చిపెట్టవచ్చు. పాన్పరాగ్లూ, జర్దా వంటి పొగాకు ఉత్పాదనల వల్ల నోటి క్యాన్సర్ వచ్చే ముప్పు చాలా ఎక్కువ.సిగరెట్లతో వచ్చే ముప్పు ఎన్నో రెట్లు... సిగరెట్ అలవాటు అనేది కేవలం పళ్లను మాత్రమే దెబ్బతీయదు. అది పూర్తిగా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్నీ, గుండెనూ... ఒక్కోసారి పూర్తిగా శరీర ఆరోగ్యానికి ముప్పుగ పరిణమించవచ్చు. సిగరెట్ అలవాటు ఉన్నప్పుడు అది కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు... నోటి దుర్వాసనతో నలుగురిలో స్వేచ్ఛగా మాట్లాడగిగే సోషలైజింగ్కూ పరిమితులు విధిస్తుంది. పొగాకు వల్ల పంటి చిగుర్లకూ ఎన్నో రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు... నోటి క్యాన్సర్లూ, పెదవుల, నాలుక, గొంతు క్యాన్సర్ల (హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ల) ముప్పును తెచ్చిపెడుతుంది. పరిష్కారం: సిగరెట్లతో / పొగతాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే ముప్పు తప్పాలంటే తప్పక పొగతాగే అలవాటును వదిలివేయాల్సిందే. అప్పటికీ ఆ అలవాటును వదలలేకపోతే డాక్టర్ సలహా మేరకు కొంతకాలం పాటు చ్యూయింగ్ గమ్స్ వంటి ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. ఇలాంటి ప్రత్యామ్నాయాలు కూడా కొద్దికాలం కోసమే.పెన్సిల్ను కొరకవద్దు... కొందరు ఏదైనా రాస్తూ రాస్తూ ఉండి మధ్యమధ్యన ఏదో ఆలోచిస్తూ పెన్సిల్ను గానీ లేదా పెన్ క్యాప్ను గానీ పళ్ల మధ్య పెట్టుకొని కొరుకుతుంటారు. పెన్సిల్ మధ్యన ఉండే లెడ్ చాలా ప్రమాదకారి. ఈ లెడ్పాయిజన్ చిగుర్ల రంగును నల్లగా మారుస్తుంది. పైగా లెడ్ పాయిజన్ మేనికి కూడా ప్రమాదకరమే. పరిష్కారం: రాస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు పళ్లమధ్యకు పెన్నూ, పెన్సిల్ పెట్టుకోవద్దు. మరీ తప్పనప్పుడు చ్యూయింగ్గమ్ వంటివి నములుతూ ఉండటం కాస్తంత బెటర్. అసలు నమిలే అలవాటును మానుకోవడమే ఆరోగ్యానికి మేలు.పళ్లకు చుట్టుకుపోయే చాక్లెట్లు... తియ్యటి చాక్లెట్లు అంటే పిల్లలందరికీ ఇష్టమే. పైగా కొందరు పెద్దవాళ్లు కూడా తమకు మంచి ఆరోగ్య సమకూరడానికి డార్క్ చాక్లెట్లు తీసుకుంటూ ఉంటారు. అయితే చాక్లెట్లలో చాలావరకు పళ్లకు చుట్టుకుపోతూ ఉంటాయి. అలా చుట్టుకుపోవడంతో అందులోని చక్కెరను చాలాసేపు పంటిని అంటిపెట్టుకునే ఉంటూ... దంతక్షయానికి దారి తీస్తుంది. అంతేకాదు.. అలా చాలాకాలం పాటు చాక్లెట్లు చుట్టుకుపోవడం, పళ్లపైన ఉండే గుంటవంటి ప్రదేశంలో ఇరుక్కుపోవడం వల్ల పళ్లమధ్య రంధ్రాలు (క్యావిటీలు) పడే అవకాశాలెక్కువ. చదవండి: మగవారిపై కేన్సర్ పడగ.. భయపెడుతున్న గణాంకాలు..ఈ రంధ్రం లోతు పెరుగుతున్న కొద్దీ... అందులో ఆహారపదార్థాలూ, చాక్లెట్ల వంటి చుట్టుకుపోయే పదార్థాలు మరింత ఎక్కువగా ఇరుక్కుపోతూ ఆ రంధ్రాలను మరింత లోతు ఎక్కువయ్యే ముప్పు ఉంటుంది. ఇలాంటి చర్యల వల్లనే పిల్లల్లో పిప్పిపళ్లు వస్తుంటాయి. పరిష్కారం: పంటిని చుట్టుకుపోయే చాక్లెట్లు, క్యాండీలు తీసుకున్న వెంటనే బ్రష్ చేసుకోవడం లేదా ఆ చుట్టుకుపోయిన పదార్థాలు పూర్తిగా తొలగిపోయేలా వేలిని ఉపయోగించి నోరు కడుక్కోవాలి.పాల బాటిల్ పళ్ల మధ్య పెట్టడం సరికాదు... కొందరు పిల్లలు రాత్రంతా పాలసీసా పళ్ల మధ్య పెట్టుకుని నిద్రపోతుంటారు. పిల్లలు అల్లరి చేయకుండా ఉండటానికి చాలామంది తల్లులు ఈ అలవాటును ప్రోత్సహిస్తుంటారు. నిజానికి ఈ దురలవాటు వల్ల పిల్లలకు ‘మిల్క్బాటిల్ కేరిస్’ అనే సమస్య వచ్చే అవకాశముంది. దాంతో చిన్నారుల్లో పిప్పిపళ్లు వచ్చి పళ్లన్నీ దెబ్బతినే ప్రమాదం ఉంది. పైగా పాలలో ఉండే చక్కెరవల్ల కూడా పళ్లు పుచ్చిపోతాయి.పరిష్కారం: రాత్రివేళల్లో పిల్లల నోటికి పాలసీసా ఇవ్వడం సరికాదు. మరీ తప్పనిసరై చిన్నారులకు పాలను పట్టించాల్సి వస్తే గ్లాసు / స్పూన్ / ఉగ్గుగిన్నెతో పాలు పట్టించాలి. పిల్లలు పాలు తాగాక పెద్దపిల్లలకు బ్రషింగ్ చేయించడమూ లేదా బ్రషింగ్కు వీలుకాకపోతే కనీసం ఒక గ్లాసు నీళ్లయినా తాగించడం అవసరం.- డాక్టర్ ప్రత్యూష, కన్సల్టెంట్, డెంటల్ – కాస్మెటిక్ సర్జన్ నిర్వహణ యాసీన్ -
మగవారిపై కేన్సర్ పడగ.. భయపెడుతున్న గణాంకాలు..
దేశవ్యాప్తంగా కేన్సర్ బాధితుల సంఖ్య రానురాను పెరుగుతూనే ఉంది. అలాంటి ముప్పును ఎదుర్కుంటున్న వాటిలో అభివృధ్ధి పధంతో ఉన్న నగరాలే ముందుండడం ఆందోళన కరం. అదే క్రమంలో తెలుగు రాష్ట్రాలకే తలమానికంగా ఉన్న హైదరాబాద్ నగరం త్వరలోనే కేన్సర్ కేంద్రంగా మారనుందని ఓ ప్రతిష్టాత్మక ఆసుపత్రి హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై వైద్యులు ఏమంటున్నారంటే...ప్రమాద ఘంటికలు...ఆ గణాంకాలు...హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక నిజామ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, ఈ ఏడాదిలో కేన్సర్ కేసులు గణనీయంగా పెరగనున్నాయి. హైదరాబాద్లోని పురుషులలో కనిపించే అన్ని రకాల కేన్సర్లలో ఒక్క ప్రోస్టేట్ రూన్సర్ వాటాయే దాదాపు 6.9 శాతంగా ఉంది. తెలంగాణలో నమోదవుతున్న కేన్సర్ కేసుల్ని పరిశీలించి చూస్తే, ఈ 2026లో కేవలం పురుషులలోనే 21,252 కొత్త కేన్సర్ కేసులు నమోదవుతాయని మొత్తం రాష్ట్రవ్యాప్తంగా నమోదు కాబోయే కేన్సర్ కేసుల సంఖ్య 46,762గా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్లో 0 నుంచి 74 ఏళ్ల వయస్సు గల వ్యక్తులకు జీవితకాలంలో కేన్సర్ వచ్చే ముప్పు ప్రతి 8 మందిలో ఒకరికి ఉంటుందని అంచనా. ఇది ముందుగా కేన్సర్ను గుర్తించే మార్గాలను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను మరింతగా నొక్కి చెబుతోంది.నిర్ధారణ లేకపోతే నివారణ ఎలా?ఇంత తీవ్రంగా వ్యాధి విస్త్రుతి ఉన్నప్పటికీ, కేన్సర్ స్క్రీనింగ్ రేట్ మాత్రం 4 శాతం కంటే దిగువనే ఉండడం ఆందోళనకరం. పెరుగుతున్న కేన్సర్ కేసుల సంఖ్యకు, ముందస్తుగా గుర్తించడంలో ఉన్న పరిమితులకు మధ్య ఉన్న అసమతుల్యత కారణంగా, చాలా కేసులు వ్యాధి ముదిరిన దశలో నిర్ధారణ అవుతున్నాయి. ఆ దశలలో వచ్చిన రోగులకు చికిత్స ఫలితాలు చాలా అధ్వాన్నంగా ఉంటాయి. చాలా మంది రోగులు కేన్సర్ 4వ దశలో వైద్యులను సంప్రదిస్తున్నారు. దీని ప్రభావం చికిత్స ఫలితాలలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది, దేశవ్యాప్తంగా ప్రోస్టేట్ కేన్సర్ ముదిరిన కేసులలో దాదాపు 65 శాతం మృత్యువాత పడుతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.పొగతాగడం, ప్రాసెస్ తినడం...ఈ కేన్సర్ కేసులు సంఖ్య పెరగటానికి మారిన జీవనశైలితో పాటుగా వ్యవస్థాగత కారణాలు కూడా ఉన్నాయి. కొవ్వు అధికంగా ఉండే, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగం పెరగడం; ఊబకాయం, మధుమేహం, ధూమపానం పెరగటం; కూరగాయల వినియోగం బాగా తగ్గడం వంటివి ఈ న్సర్ విజృంభణకు ముఖ్య కారణాలు. అదే సమయంలో, తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి రావటం, మూత్ర ప్రవాహం బలహీనమైన రీతిలో ఉండటం లేదా పెల్విక్ అసౌకర్యం వంటి ప్రోస్టేట్ కేన్సర్ ప్రారంభ లక్షణాలను అవగాహన లోపంతో అలక్ష్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీటిని వయసుతో పాటు వచ్చే సమస్యలుగా పొరపాటు పడుతుంటారు. ఈ అపోహ వైద్య సహాయం అందుకోవడంలో ఆలస్యానికి దారితీస్తుంది,ప్రారంభంలో గుర్తిస్తే మేలు...‘ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రారంభ దశలో తీవ్రంగా ఉండదు, అది ప్రాణాంతకంగా మారకముందే దానిని గుర్తించడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది,‘ అని జూబ్లీ హిల్స్లోని అపోలో హెల్త్ సిటీ లో మెడికల్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ సురేష్ గడ్యాల్ పాటిల్ అంటున్నారు. అయితే చాలా మంది మగవారు వ్యాధి లక్షణాలను తరచుగా విస్మరిస్తున్నారనీ, రెగ్యులర్గా పరీక్షలు చేయించుకోవడం లేదని అన్నారాయన. సమస్య తీవ్రమైన తర్వాత హాస్పిటల్ కు వచ్చేసరికి, వ్యాధి ముదిరిపోతోవడం చికిత్సను మరింత క్లిష్టతరం చేస్తోందన్నారు. అందువల్లే ఫలితాలు అంత అనుకూలంగా ఉండడం లేదన్నారు. ‘‘ 50 ఏళ్ల వయసు దాటిన పురుషులు లేదా ప్రమాద కారకాలు కలిగిన వారు సకాలంలో పరీక్షలు చేయించుకోవడం అనే చిన్న ఆలోచన చేస్తే చాలు..అది ఈ పరిస్థితిని గణనీయంగా మార్చగలదు...‘ అని ఆయన అభిప్రాయపడ్డారు.ఆవిష్కరణలు కాదు..అవగాహనే ముందుశస్త్రచికిత్స, రేడియేషన్, హార్మోనల్ థెరపీ ఖచ్చితమైన చికిత్సా విధానాలు సహా చికిత్సలలో పురోగతి మనుగడ అవకాశాలను మెరుగుపరుస్తున్నప్పటికీ, వ్యాధిని చివరి దశలో గుర్తించడాన్ని తగ్గించడంలోనే అసలైన అవకాశం ఉంది. 2026 నాటికి భారతదేశంలో మొత్తం కేన్సర్ మరణాలు దాదాపు 7,05,000కు చేరుకుంటాయని అంచనా వేయగా, రాబోయే దశాబ్దాలలో ప్రోస్టేట్ కేన్సర్ కేసులు మరింత పెరిగే అవకాశం ఉన్న అంచనాలతో హైదరాబాద్ నగర ప్రస్తుత పరిస్థితి ఒక సవాలుగా నిలుస్తోంది. ఈ పరిస్థితిని వ్యాధి విస్త్రుతిని నివారించడం అనేది కొత్త వైద్య ఆవిష్కరణలపై కన్నా, ప్రోస్టేట్ స్క్రీనింగ్ను సాధారణ ఆరోగ్య పరీక్షలలో చేర్చడం, ముందుగానే వైద్య సంప్రదింపులను ప్రోత్సహించడం, తేలికపాటి లక్షణాలను ప్రారంభ సూచనలుగా పరిగణించి చికిత్స అందించడంపైనే ఎక్కువగా ఆధారపడి ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.(చదవండి: స్క్రీన్ అలవాటు ఇంత ప్రమాదకరమైనదా..?! ఆయర్వేద చిట్కాలు) -
నిజమైన ధైర్యం, తిరుగులేని శక్తికి కేరాఫ్ ఆమె..!
సకల సౌకర్యాలతో ఎటువంటి వైకల్యం లేకుండా సాధించిన విజయాలను ఎన్నో చూసి ఉంటాం. కానీ కడు పేదరికం, ఓ పక్క వైకల్యంతో సతతమతమై చిన్నారులు..ఏదో సాదించాలన్న ఆశతో బతుకుతున్న వైనం మనల్ని ఎంతగానో కదలిస్తుంది. పైగా అలాంటి వాళ్లు సాధించి విజయాలు అత్యంత స్ఫూర్తిదాయకమైనవి, ప్రశంసనీయమైనవి కూడా. అలాంటి వ్యక్తులు అసామాన్య ధైర్యానికి, తిరుగలేని శక్తికి అర్థాన్నిచ్చేలా నిలబడతారు, గెలుస్తారు అని చెబుతున్నారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా.ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రేరణాత్మక కథలను షేర్ చేసే ఆనంద్ మహీంద్రా ఈసారి కూడా మనసుని తాకే సరికొత్త స్ఫూర్తిదాయకమైన కథతో మన ముందుకొచ్చారు. తనకు నిరాశనిస్ప్రుహలు కలిగినప్పుడల్లా అలాంటి మహోన్నత వ్యక్తుల వైపుకి చూస్తానంటూ ఒడిశాకు చెందిన పాయల్ నాగ్ అనే పారా ఆర్చరీ కథను సోషల్ మీడియా ఎక్స్లో షేర్ చేశారు. ఆ పోస్ట్లో ఆనంద్ మహీంద్రా ఇలా రాసుకొచ్చారు. రోజువారీ కూలీ అయిన ఒక మేస్త్రీ కుటుంబంలో జన్మించిన పాయల్ బాల్యం అంతా కష్టాలతో నిండిపోయింది. కేవలం ఎనిమిదేళ్ల వయసులో, విద్యుదాఘాతానికి గురై తన నాలుగు అవయవాలనూ కోల్పోయింది. నిజానికి ఆమె ఎదుర్కొన్న ప్రమాదం జీవితానికి ముగింపు పలికేలా చేసే దారుణమైన ఘటన. అయితే పాయల్ తన పరిస్థితిని ధిక్కరించేలా అద్భుతమైన ఆరంభానికి నాంది పలకడం విశేషం. ఆమె నేరుగా ఈ విలువిద్య శిక్షణలోకి రాలేదు. ఆమె మొదటగా తన ఐడెంటీటిని చిత్రీకరణతో తెచ్చుకుంది. అవయవాలు లేకపోయినా..పట్టుదలతో చిత్రాలు గీయాలన్న ఆమె తాపత్రయం అందర్నీ కట్టిపడేసేది. ఆ విలక్షణ ప్రతిభను శీతల్ దేవికి శిక్షణ ఇచ్చిన కుల్దీప్ వేద్వాన్ గుర్తించారు. ఆమె పట్టుదల, స్ఫూర్తిని గుర్తించి, పారా ఆర్చరీ శిక్షణతో ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి మార్గనిర్దేశం చేశారు. అలా అలుపెరగని పట్టుదలతో పాయల్ తన పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ పొందింది. కాలక్రమేణ నైపుణ్యం, ఆత్మవిశ్వాసం రెండిటిని పెంపొందించుకుంటూ..ఉన్నత స్థాయికి ఎదిగింది. ఆమె సామర్థ్యాలు ప్రపంచానికే తెలిసేల చేసిన కీలక మలుపు ఏప్రిల్ 2026లో బ్యాంకాక్లో జరిగిన వరల్డ్ పారా ఆర్చరీ సిరీస్. ఆ పోటీల్లో ఫైనల్కు చేరుకుని తన ఆరాధ్య దేవత అయిన శీతల్ దేవిని ఎదుర్కొని, ఓడించింది. అలా ఆ పోటీల్లో పాయల్ స్వర్ణం సాధించి ప్రపంచ వేదికపైకి అద్భుతంగా అడుగుపెట్టింది. Here is that moment!! Payal Nag receives her GOLD medal at Bangkok and the national anthem plays.And right beside her, Sheetal - gracefully helping move her wheelchair.Two champions. One podium. One unforgettable frame.Pure inspiration. ❤️ pic.twitter.com/wrobtOCSIL— Manas Muduli (@manas_muduli) April 6, 2026 అంతేగాదు ప్రపంచంలోనే అవయవాలు లేని తొలి ఆర్చర్గా ఘనత అందుకుంది పాయల్. ఇది ఆమె పట్టుదలకు నిదర్శనం. ఇక్కడ కోచ్ కుల్దీప్ వేద్వాన్ ఆమె ప్రయాణంలో కీలక పాత్ర పోషించారు. ఆమె కృత్రిమ కాళ్లతో ఆపరేట్ చేయడానికి వీలుగా ఒక ప్రత్యేకమైన విల్లును తయారుచేశారు. ఇందులో భాగంగా, విల్లును పైకి ఎత్తడంలో సహాయపడటానికి ఆమె కుడి కృత్రిమ కాలుపై ప్రత్యేకంగా రూపొందించిన ఉక్కు పరికరాన్ని, అలాగే శీతల్ మాదిరిగానే ఛాతీ నుంచి విల్లును విడుదల చేసే యంత్రాంగాన్ని కూడా అమర్చారు. ఆమెను ఆ పరికరాలకు అలవాటు చేయడానికి సుమారు మూడు నెలల సమయం పట్టిందని వేద్వాన్ వెల్లడించారు. పాయల్ కేవలం 2023లో శిక్షణ ప్రారంభించి..జస్ట్ మూడేళ్లలోనే ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారులతో పోటీపడే స్థాయికి ఎదిగి, విజయకేతనం ఎగరవేసింది. అని పోస్ట్లో రాసుకొచ్చారు ఆనంద్ మహీంద్రా. అంతేగాదు తనకు ఎప్పుడైనా నిరాశగా లేదా నిరుత్సాహంగా అనిపించినప్పుడు నిలదొక్కుకోవడానికి, సరైన దృక్పథాన్ని పొందడానికి పాయల్, శీతల్ సక్సెస్ జర్నీల వైపు చూస్తానని అన్నారు. వీళ్లు ఒక్కరోజుకే పరిమితమై స్ఫూర్తిప్రదాతలు కాదని, అసాధారణమైన అడ్డంకులను చేధించిన మహోన్నతమైన క్రీడాకారిణులని, ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారని ప్రశంసించారు మహీంద్రా.Payal Nag.Daughter of a daily-wage mason from Odisha. Electrocuted at the age of eight. Lost all four limbs.And then, found a bow.Spotted through her paintings by coach Kuldeep Vedwan, the same man who shaped world champion Sheetal Devi. Defeated her idol Sheetal Devi at… pic.twitter.com/KdWGcuAJ9X— anand mahindra (@anandmahindra) April 6, 2026 (చదవండి: ఆ సమయంలో కూడా కూతురిపై ప్రేమ తగ్గదు..!) -
జస్ట్ రెండు నెలల్లో 12 కేజీల బరువు..! నో స్ట్రిక్ట్ డైట్, నో చీట్మీల్స్
బరువు తగ్గడం అనేది కొందరికి సంక్లిష్టమైనది, అంత సులభంగా సాధ్యమయ్యేది కాదు. కానీ కొందరికి మాత్రం సాధారణ డైట్తోనే అద్భుతంగా మ్యాజిక్ చేస్తారు. కేవలం నిలకడ, క్రమశిక్షణతో తన ఆహార్యాన్నే మార్చుకుని..స్మార్ట్గా బరువు తగ్గడం ఎలాగో చూపిస్తారు. ఇక్కడ ఇషాన్ కర్దే అలానే బరువు తగ్గి ఆశ్చర్యపరిచాడు. అదికూడా కేవలం రెండు నెలల్లో ఏకంగా 12 కేజీలు తగ్గాడు. స్ట్రిక్ట్ డైట్, కఠినమైన వ్యాయామాలు లేవు. ఇషాన్ కర్దే బరువు తగ్గడం అనేది ప్రాథమికంగా నిలకడ, సమతుల్య పోషణ, స్థిరమైన ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నాడు. క్రమబద్ధమైన రోజువారీ ఆహారంతో శక్తి స్థాయిలను కాపాడుకుంటూనే కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చని వెల్లడించాడు. వివిధ రకాల షార్ట్కట్ డైట్ల వైపుకి పరిగెట్టడం కంటే..సింపుల్గా, ఆరోగ్యప్రదంగా తేలికపాటి వాటితోనే స్మార్ట్గా బరువు తగ్గొచ్చని అంటున్నాడు. తాను నాలుగు పూటలా భోజనాన్ని ఆస్వాదిస్తూనే రెండు నెలల్లో 12 కేజీల దాక బరువు తగ్గానని చెబుతున్నాడు. ఇషాన్ కర్దే తనకు ఉపకరించిన డైట్ప్లాన్ గురించి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో షేర్ చేసుకున్నాడు. తాను డైట్ని 90% క్రమం తప్పకుండా పాటించానని, తీరిక లేని రోజుల్లో మధ్యాహ్న భోజనానికి బదులుగా ప్రోటీన్ అధికంగా ఉండే చికెన్ ర్యాప్లు/రైస్ బౌల్స్ తీసుకున్నానని చెప్పారు. అయితే చీట్ మీల్స్, చక్కెర, చిప్స్, బిస్కెట్లు వంటివి అస్సలు తీసుకోలేదని వెల్లడించాడు.అల్పాహారంఈషాన్ తన రోజును ప్రోటీన్ ఓట్స్, 150 ml పాలు, 1 స్కూప్ వే ప్రోటీన్తో కూడిన అల్పాహారంతో ప్రారంభించేవాడు. తన భోజనంలో పోషక విలువలను విశ్లేషించి మరి తీసుకునేవాడు. దాని ప్రకారం మొత్తం 35 గ్రాముల ప్రోటీన్, 35 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 8 గ్రాముల కొవ్వులు ఉండేలా కేర్ తీసుకున్నారు. ప్రోటీన్, ఫైబర్ ఆకలిని అదుపులో ఉంచి మధ్యాహ్నాం పూట నీరసించపోకుండా నివారించేవని అన్నారు.మధ్యాహ్న భోజనంఈషాన్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్ల మిశ్రమానికే కట్టుబడి ఉంటూ, కొవ్వు శాతాన్ని కొద్దిగా పెంచాడు. అతని భోజనంలో 200 గ్రాముల చికెన్ బ్రెస్ట్ లేదా పనీర్, 2 రోటీలు, తేలికపాటి గ్రేవీ, సలాడ్లు ఉన్నాయి. ఈ భోజనం నుంచి 50 గ్రాముల ప్రోటీన్, 45 నుంచి 50 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 10 నుంచి 12 గ్రాముల కొవ్వు అందుతుంది.సాయంత్రం స్నాక్స్..అతను సాయంత్రం ఒక పండు, గుప్పెడు నట్స్, 5 గుడ్డు తెల్లసొన తీసుకునేవాడట. ఇలా తింటే 22 నుంచి 24 గ్రాముల ప్రోటీన్, 25 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 8 గ్రాముల కొవ్వు లభిస్తాయి.రాత్రి భోజనంరోజులో చివరి భోజనంగా, ఈషాన్ తేలికపాటి ఆహారాన్ని తీసుకున్నాడు. అతను 200 గ్రాముల చికెన్ లేదా పనీర్ సలాడ్ తీసుకున్నాడు, దీనిలో 45 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 8 గ్రాముల కొవ్వు ఉంటాయి. అంతేగాదు బరువు తగ్గేందుకు ఎల్లప్పుడూ కష్టతరమైన ఆహారనియమాలు, తీవ్రమైన వ్యాయామాలు అవసరం లేదని ఈషాన్ వెయిట్లాస్ జర్నీ రుజువు చేస్తోంది. పైగా ఒక సాధారణ దినచర్యను క్రమంతప్పకుండా పాటించడం అనేది అత్యంత కీలకమని నొక్కి చెబుతోంది కూడా. View this post on Instagram A post shared by Eshaan Karde (@eshaankarde)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: స్క్రీన్ అలవాటు ఇంత ప్రమాదకరమైనదా..?! ఆయర్వేద చిట్కాలు) -
స్క్రీన్ అలవాటు ఇంత ప్రమాదకరమైనదా..?!
మొబైల్, లేదా బుల్లితెర వ్యసనం (స్క్రీన్ అడిక్షన్) మీ మెదడును కుంచించుకుపోయేలా చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సందర్భంగా, పబ్జీ గేమ్ వ్యసనానికి గురై, తిరిగి బయటకు వచ్చిన ఒక యువకుడి స్ఫూర్తిగాధ మీకోసంస్క్రీన్ అడిక్షన్ ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఆయుర్వేద సూచనలు"నేను 24 గంటలు నిరంతరాయంగా పబ్జీ గేమ్ ఆడేవాడిని. కాలేజీ చదువున మధ్యలో వదిలేశాను. ఐదు నిమిషాలు కూడా ప్రశాంతంగా కూర్చోలేకపోయేవాడిని," అని 25 ఏళ్ల చెన్నారెడ్డి చెబుతున్నాడు. ఇప్పుడు ఆయన పగలు సౌరశక్తి టెక్నీషియన్గా పని చేస్తూ, యోగా బోధిస్తున్నాడు. మరి ఆయనలో మార్పు ఎలా వచ్చింది?స్టాన్ఫర్డ్ లైఫ్స్టైల్ మెడిసిన్ చేసిన పరిశోధన ప్రకారం, రోజుకు రెండు గంటలకుపైగా కాలక్షేపం కోసం మొబైల్ చూసే 18–25 ఏళ్ల వయస్సు గల వ్యక్తుల్లో మెదడులోని సెరెబ్రల్ కార్టెక్స్ మందం తగ్గిపోతుంది. మెదడులోని ఈ భాగం నిర్ణయాలు తీసుకోవడం, జ్ఞాపకశక్తి, సమస్యల పరిష్కారం వంటి ముఖ్యమైన పనులకు బాధ్యత వహిస్తుందని మనం గుర్తించాలి.రోజుకు ఐదు గంటలకంటే ఎక్కువ స్క్రీన్ ముందు గడిపే పెద్దవారికి చిత్తభ్రమ, పక్షవాతం, పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. స్మార్ట్ఫోన్ వ్యసనం మెదడులోని గ్రే మ్యాటర్ పరిమాణాన్ని కూడా తగ్గిస్తుంది—ఇది కదలికల నుంచి భావోద్వేగాల వరకు అన్నింటిని నియంత్రిస్తుంది. స్క్రీన్ల నుంచి వచ్చే నీలి కాంతి మెలటోనిన్ ఉత్పత్తిని అణచి, సహజ నిద్ర చక్రాన్ని దెబ్బతీస్తుంది.ఇది మనసిక ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది - ఆందోళన, నిరాశ, నలుగురితో కలవకపోవటం వంటివి పెరుగుతాయి. డా. మణికంటన్ చెప్పినట్లుగా, “ఇప్పుడైనా ఒక అడుగు వెనక్కి వేసి, మన స్క్రీన్ అలవాట్లను నిజాయితీగా పరిశీలించాల్సిన సమయం వచ్చింది.”స్క్రీన్ అలవాటును తగ్గించడానికి ఆయుర్వేద సూచనలుస్క్రీన్ వినియోగం ఎక్కువగా ఉందని గుర్తించినవారికి డా. మణికంటన్ కొన్ని ప్రాయోగిక సూచనలు అందిస్తున్నారు:మీ ఇంట్లో కొన్ని ప్రాంతాలను బుల్లితెరకు, ఫోన్లకు నిషేధిత ప్రాంతాలుగా ఏర్పరచండి: ఇంట్లో భోజనపు టేబుల్, పడకగది వంటి ప్రదేశాలలో ఇవి లేకుండా చేయటం అనేది మన మనస్సును వర్తమానంలోకి తెస్తుంది.ఫోన్ లేదా టీవీ ఎంతసేపు చూడాలనే టైమ్ టేబుల్ ముందే వేసుకోండి: అవసరమైనప్పుడు మాత్రమే ఫోన్ లేదా ల్యాప్టాప్ ఉపయోగించండి. ఇది అలవాటుపై నియంత్రణ పెంచుతుంది.ఎంతసేపు వాటిని వినియోగిస్తున్నారనేది గమనించుకోండి: దానికోసం మొబైల్లోనే అనేక యాప్లు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా మీరు ఎంతసేపు ఉపయోగిస్తున్నారో గమనించండి. ఇది మార్పుకు ప్రేరణ ఇస్తుంది.సరైన శ్వాసకు గల శక్తి: కేవలం గాలి పీల్చుకోవటం కాదు, ప్రాణశక్తిని పెంపొందించుకోవటంచెన్నా రెడ్డి కథ, స్క్రీన్ వ్యసనంలో చిక్కుకున్న యువతకు ఆశ చూపుతుంది. 24 గంటల పాటు గేమింగ్, కోపం, చదువు మధ్యలో ఆగిపోవడం—ఇలాంటి పరిస్థితుల్లో ఆయన 2023 జనవరిలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వహించే యువనాయకత్వ శిక్షణ కార్యక్రమంలో చేరాడు.అక్కడ ఆయన సుదర్శన్ క్రియ అనే శక్తివంతమైన శ్వాసక్రియ సాధన నేర్చుకున్నాడు. ఈ సాధనాన్ని ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు, మానవతా నాయకుడు గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్ పరిచయం చేశారు. ఇది శరీరంలోని ఒత్తిడిని తగ్గించి, మనస్సులోని పాత అలవాట్లను విడిపిస్తుంది.కొద్ది రోజుల్లోనే చెన్నా రెడ్డి కోపం తగ్గిపోయింది, స్క్రీన్పై ఉన్న ఆకర్షణ క్రమంగా తగ్గింది, మనస్సులో ప్రశాంతత ఏర్పడింది. తరువాత ఆయన తన చదువును 70% మార్కులతో పూర్తి చేసి, యోగా ఉపాధ్యాయుడిగా మారి, సౌరశక్తి రంగంలో కెరీర్ నిర్మించుకున్నాడు.అధికంగా స్క్రీన్ వినియోగిస్తే, దాని ఫలితంగా చాలా సార్లు ఒత్తిడి లేదా ఆందోళన కలుగుతాయి. సుదర్శన క్రియ మన నాడీ వ్యవస్థను సమతుల్యం చేసి, మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఇది డోపమైన్ ఆధారిత అలవాట్లను కూడా నియంత్రిస్తుంది. స్క్రీన్ వ్యసనం కూడా ఇతర వ్యసనాల్లాగే ఉంటుంది; ఈ సాధన వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది.ఆయుర్వేద సహాయంనస్య చికిత్స: ముక్కులో ఔషధ తైలాన్ని వేసే విధానం. ఉదయం కొన్ని చుక్కలు ‘అణు తైలం’ ఉపయోగించడం మెదడుకు పోషణనిచ్చి, డిజిటల్ అలసటను తగ్గిస్తుంది.మేధ్య రసాయన: బ్రాహ్మి, అశ్వగంధ, శంఖపుష్పి వంటి మూలికలతో చేసిన ఈ ఔషధం ఏకాగ్రతను పెంచి, ఒత్తిడిని తగ్గిస్తుంది.జీవనశైలిలో మార్పులుప్రతి ఉదయం 15 నిమిషాలు ధ్యానం చేయండి.స్క్రీన్కు బదులుగా పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, పెయింటింగ్, నడక, ఇరుగుపొరుగువారితో మాట్లాడటాన్ని అలవాటు చేసుకోండి.ఇవి మెదడుకు సహజ ఆనందాన్ని ఇస్తాయి. క్రమంగా స్క్రీన్పై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి.డా. నిషా మణికంటన్, BAMS, MD (AM)ఆయుర్వేద వైద్యురాలు రచయిత సీనియర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ అంతర్జాతీయ డైరెక్టర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వెల్నెస్ ప్రోగ్రామ్స్(చదవండి: -
జీవన ఎరువులతో సేద్యానికి జీవం
పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం కారణంగా రసాయనిక ఎరువుల లభ్యత బాగా తగ్గిపోతుండటంతో పాటు.. వాతావరణ మార్పుతో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో రైతులు సాగు పద్ధతుల్లో తగిన మార్పులు చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. బత్తాయి సాగులో ద్రవ రూప జీవన ఎరువుల వాడకం ద్వారా రసాయనిక ఎరువుల వాడకాన్ని 60%, రసాయనిక పురుగుమందుల వాడకాన్ని 50% వరకు తగ్గించుకుంటూనే దిగుబడిని, ఆదాయాన్ని పెంచుకోవటం సాధ్యమేనని ఓ రైతు అనుభవపూర్వకంగా చెబుతున్నారు..బత్తాయి అంటేనే నల్లగొండ జిల్లా గుర్తుకు వస్తుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు లక్షల ఎకరాల్లో ఉండే బత్తాయి తోటలు ప్రస్తుతం అనేక సమస్యలతో 40 వేల ఎకరాలకు తగ్గిపోయింది. దశాబ్దాలుగా రసాయనిక ఎరువుల వాడకం వల్ల నేలలో పెరిగిన క్షార గుణం వల్ల, సూక్ష్మజీవరాశి నశించటం వల్ల భూసారం దెబ్బతిని దిగుబడులూ తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రసాయనిక ఎరువులు తగ్గించి, జీవన ఎరువులను ఉపయోగిస్తూ బత్తాయి పంటకు జీవం తెచ్చిన రైతు కట్టెబోయిన శ్రీనివాస్ తోటి రైతులకు మార్గదర్శకంగా నిలిచారు. ఏళ్ల తరబడి వ్యవసాయంలో అతిగా రసాయనిక ఎరువులు వాడకం వల్ల నేలలో సేంద్రియ కర్బనం తగ్గి, దిగుబడులు తగ్గిపోయిన పరిస్ధితుల్లో కొందరు రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లుతున్నారు. ఈ కోవలోని రైతే గుర్రంపోడు మండలం బ్రాహ్మణగూడెం బత్తాయి రైతు శ్రీనివాస్. గత 30 ఏళ్లుగా బత్తాయి సాగు చేస్తున్న శ్రీనివాస్ సాగులో కష్టనష్టాలను ఎదుర్కొన్నారు. నేలలో సూక్ష్మజీవరాశి నశించటం వల్ల సమస్యలు ఎదురయ్యాయి. నాణ్యమైన దిగుబడులు లేక లాభాలు తగ్గిపోవటంతో శాస్త్రవేత్తల సూచనల మేరకు గత మూడేళ్లుగా జీవన ఎరువులను వాడుతూ నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి జీవన ఎరువులు వాడటం ప్రారంభించారు. నేల సారాన్ని పెంపొందించి పంటలకు పోషకాలందించే జీవన ఎరువులను బత్తాయి తోటకు ఉపయోగించి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ద్రవ రూప జీవన ఎరువులు..రైతు కట్టెబోయిన శ్రీనివాస్ జీవన ఎరువులైన ట్రై కోడర్మా, బవేరియా, మైకోరైజా, సూడోమోనాస్, వామ్, వేస్ట్ డీ కంపోజర్, పీఎస్బీ, కేఎస్బీ, ఎన్పీకే బ్యాక్టీరియా, జింక్ సాల్యుబుల్ బాక్టీరియా, సీవీడ్ బ్యాక్టీరియా లాంటి సుమారు 40 రకాల ద్రవ రూప జీవన ఎరువుల కల్చర్ను పరిశోధనా కేంద్రాల నుంచి తెచ్చుకొని తన తోటలోనే వాటిని అభివృద్ధి చేసి, దశల వారీగా, అవసరాన్ని బట్టి వాడుతున్నారు. ఒక్కో జీవన ఎరువును ఒక్కో డ్రమ్ములో వేసి, తగినంత నీరు, బెల్లం కలిపి, రోజూ కలియ తిప్పుతూ, వాటిలో సూక్ష్మజీవులు అభివృద్ధి చెందే వరకు నాలుగైదు రోజులు అలాగే ఉంచి, డ్రిప్, జెట్ల ద్వారా నేరుగా బత్తాయి చెట్లకు అందిస్తున్నారు.మంచి నాణ్యత.. మంచి ధర.. ప్రస్తుతం మార్కెట్లో బత్తాయికి తోటల దగ్గర టన్నుకు రూ. 15 వేల నుంచి 20 వేల లోపు పలుకుతోంది. జీవన ఎరువులతో నాణ్యంగా పండించటంతో సైజు, నిగారింపు, నిల్వ సామర్థ్యం పెరిగాయి. దీంతో శ్రీనివాస్ తోటలో బత్తాయిలకు టన్నుకు రూ. 26–27 వేల ధర పలికింది. సాధారణంగా బత్తాయిలో గరిష్ట దిగుబడులు ఎకరాకు పది టన్నులు. అయితే, సరాసరిన ఐదారు టన్నులకు మించి రావటం లేదు. శ్రీనివాస్ ఎనిమిదిన్నర ఎకరాల (6–10 ఏళ్ల తోట)లో ప్రస్తుత ముందు కత్తెర కోతలో 104 టన్నుల దిగుబడి వచ్చింది. వచ్చే జూన్–జూలై సీజన్లో మరో 60–70 టన్నుల దిగుబడి వస్తుందని శ్రీనివాస్ ఆశిస్తున్నారు. గత మూడేళ్లుగా జీవన ఎరువులతో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న ఈ తోటను తెలంగాణ ఉద్యానవన శాఖ కమీషనర్ షేక్ యాస్మిన్ భాషా, ఇతర అధికారులు, శాస్త్రవేత్తలు సందర్శించి రైతును అభినందించటం విశేషం.రసాయనిక ఎరువులతో పాటు పురుగుమందుల అవసరమూ తగ్గిందిగత మూడేళ్లుగా ద్రవ రూప జీవన ఎరువులను వాడుతూ మంచి ఫలితాలు పొందుతున్నాను. రసాయనిక ఎరువులు 60% తగ్గించాను. పురుగుమందుల అవసరం కూడా 40–50% మేరకు తగ్గింది. రసాయనిక వ్యవసాయంలో సాగు వ్యయం ఎకరానికి రూ. 80 వేల నుంచి లక్ష వరకు అవుతుంది. నాకు పశువుల ఎరువు, ద్రవరూప జీవన ఎరువులతో కలిపి రూ. 50–60 వేలు మాత్రమే అయ్యింది. బత్తాయి అనే కాదు ఏ పంటలకైనా జీవన ఎరువులు పనిచేస్తాయి. మీరూ వాడండని ఇతర రైతులకూ చెబుతున్నా. గత ఏడాది వరకూ పెద్దగా స్పందన లేదు. ఈ ఏడాది దిగుబడులు, కమిషనర్ సందర్శించటం చూసి కొందరు రైతులు ఆసక్తి చూపుతున్నారు.– కట్టెబోయిన శ్రీనివాస్ (98484 53525), బత్తాయి రైతు, బ్రాహ్మణగూడెం, గుర్రంపోడు మం., నల్లగొండ జిల్లా– చింతరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సాక్షి, గుర్రంపోడు, నల్లగొండ జిల్లా -
ప్రకృతి వ్యవసాయంపై నీతి ఆయోగ్ కరదీపిక
ప్రకృతి వ్యవసాయాన్ని దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తిలోకి తేవాలన్న లక్ష్యంతో సమగ్రమైన ట్రైనింగ్ మాన్యువజీల్ను కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ ఇటీవలే వెలువరించింది. ‘రైతులకు సాధికారత కల్పించటం: ప్రకృతి వ్యవసాయ శిక్షణా కిట్ – ఉత్తమ పద్ధతుల మార్గదర్శిని’ పేరుతో రూపొందించారు. ప్రకృతి సేద్య మూల సూత్రాలతో పాటు.. ముఖ్యమైన 22 రకాల పంటల సాగులో క్షేత్రస్థాయిలో ఆచరించదగిన ప్రామాణిక ప్రకృతి సేద్య పద్ధతులను పొందుపరిచారు. నీతి ఆయోగ్ వ్యవసాయం–సాంకేతిక విజ్ఞాన విభాగం ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ నీలం పటేల్, కన్సల్టెంట్ పరెమల్ బనఫర్ ఆధ్వర్యంలో నిపుణుల బృందం దీన్ని రూపొందించింది.రైతులు, విస్తరణ సిబ్బంది, విధాన నిర్ణేతలకు సుస్థిర వ్యవసాయ విస్తరణ దిశా నిర్దేశం చేయటానికి ఈ శిక్షణా మాన్యువల్, ఉత్తమ ప్రకృతి సేద్య పద్ధతులకు అక్షర రూపం ఇచ్చినట్లు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరీ పేర్కొన్నారు. డాక్టర్ నీలం పటేల్ ఇలా అన్నారు: ‘దేశవ్యాప్తంగా రైతులు అనుసరిస్తున్న ప్రకృతి సేద్య పద్ధతులు, ఆవిష్కరణలు, సంప్రదాయ విజ్ఞానంతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ప్రకృతి సేద్య అనుభవాల ఆధారంగా ఈ శిక్షణా మాన్యువల్ను రూపొందించాం. దేశంలో సుస్థిర వ్యవసాయాన్ని విస్తరింపజేయటంలో ఇదొక కీలక ముందడుగు’. ప్రకృతి వ్యవసాయ వారసత్వాన్ని సుసంపన్నం చేసిన సుభాష్ పాలేకర్ (మహారాష్ట్ర), ఎల్. నారాయణరెడ్డి (కర్ణాటక), శ్రీపాద దబోల్కర్, జి. నమ్మాళ్వార్ (తమిళనాడు), దీపక్ సచ్దే (మధ్యప్రదేశ్), భాస్కర్ సావే (గుజరాత్)ల సేవలను ఇందులో ప్రస్తుతించారు. దేశవ్యాప్తంగా ప్రకృతి సేద్య పథకాలు అమలవుతున్నాయని, 9.4 లక్షల హెక్టార్లలో సుమారు 10 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని ఇందులో పేర్కొన్నారు. అధిక దిగుబడి.. అధిక నికరాదాయం!వరిని వరుసగా 4 ఏళ్లు ప్రకృతి వ్యవసాయం (ప్ర.వ్య.)లో పండిస్తే 2023 ఖరీఫ్లో ఎకరానికి 33.75 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. రసాయన వ్యవసాయం (ర.వ్య.)లో 31.5 క్వింటాళ్లు వచ్చింది. ఈ రెండు ధాన్యాలను క్వింటా రూ.2,040కే విక్రయించారు. ప్ర.వ్య.లో నికరాదాయం రూ.48 వేలు రాగా, రూపాయి ఖర్చుకు 2.3 రూపాయల ఆదాయం వచ్చింది. ర.వ్య.లో నికరాదాయం రూ.35,140 రాగా, రూపాయి ఖర్చుకు 1.2 రూపాయలు మాత్రమే ఆదాయం వచ్చింది. → ప్రధాన పంటలన్నింటిలో సాగు ఖర్చును కనీసం 5–10% తగ్గిస్తుంది. మరికొన్ని పంటల్లో, కొన్ని రాష్ట్రాల్లో 20–55% వరకు తగ్గింది. ∙ప్రకృతి వ్యవసాయం రైతులు, వినియోగదారుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. → నేలల్లో సేంద్రియ కర్బనం 1947లో 2.5% ఉండేది. ఇప్పటికి 0.4%కి తగ్గింది. ప్రకృతి వ్యవసాయం దీన్ని 45% వరకు పెంచుతుంది. ∙నీరు, విద్యుత్లో 50–60% ఆదా అవుతుంది. ∙కర్బన ఉద్గారాలను 55–85% తగ్గిస్తుంది. ∙పశువులను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పెంచటం రైతులకు లాభదాయకంగా ఉంటుంది.→ పంటల వైవిధ్యం, అంతరపంటలు, బహుళ అంచెల పంటలతో వ్యవసాయా దాయ భద్రత, పోషకాహార భద్రత పెరుగు తాయి. రసాయనిక సేద్యం ఏకపంట సాగుతో పోలిస్తే 20–40% అధిక నికర ఆదాయం వస్తుంది. జీవామృతం.. 48 గంటలు పులిస్తే చాలు!జీవామృతం కోసం పేడ, మూత్రం, పప్పుల పిండి, బెల్లం, మట్టిని డ్రమ్ము నీటిలో కలిపిన తర్వాత 2–3 రోజులు పులియబెట్టి పంటలకు వాడుకోడానికి సిద్ధమైనట్లే. కలిపిన 48 గంటల్లో బ్యాక్టీరియా పూర్తిస్థాయిలో వృద్ధి చెందుతుంది. సిద్ధమైన జీవామృతాన్ని వేసవిలో 7 రోజుల వరకు, శీతాకాలంలో 8–10 రోజుల్లో వాడుకోవచ్చని నీతి ఆయోగ్ ప్రకృతి వ్యవసాయ శిక్షణ మాన్యువల్ చెబుతోంది.ప్రకృతి సేద్యానికి మార్గదర్శకంరసాయనిక వ్యవసాయానికి ఒక సుస్థిరమైన ప్రత్యామ్నాయం ప్రకృతి వ్యవసాయం. ఇటు సంప్రదాయ విజ్ఞానాన్ని అటు ఆధునిక పర్యావరణ విజ్ఞానాన్ని ఇముడ్చుకొని ప్రకృతి వ్యవసాయ పద్ధతులు రూపొందాయి. ప్రస్తుతం ఆధునిక వ్యవసాయంలో ఎదురవుతున్న సవాళ్లకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు దీటైన సమాధానాలు ఇవ్వగలవు. తక్కువ వనరులతో, తక్కువ ఖర్చుతోనే వ్యవసాయానికి సుస్థిరత చేకూర్చటం సాధ్యమని ఈ పద్ధతులు చాటి చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా రైతులకు, విస్తరణ సిబ్బందికి ప్రకృతి సేద్య పద్ధతులపై శిక్షణ ఇవ్వటానికి ఈ మాన్యువల్ మార్గదర్శకంగా నిలుస్తుంది. – ప్రొఫెసర్ రమేశ్ చంద్, వ్యవసాయ ఆర్థికవేత్త, నీతి ఆయోగ్ సీనియర్ సభ్యులు -
ఆమె జీవితం..ఆమె ఇష్టం
మీరట్లో ఒక రిటైర్డ్ జడ్జి విడాకులు పొందిన తన కుమార్తెను మేళతాళాలతో ఇంటికి తీసుకువచ్చి అదే తన తీర్పు అన్నాడు. ‘ఐ లవ్ మై డాటర్’ టీ షర్ట్లు ధరించి బంధువులంతా ఆమెను స్వాగతించారు. మరోవైపు మధ్యప్రదేశ్ హైకోర్టు తన కంటే 20 ఏళ్లు ఎక్కువ వయసున్న భర్తతో వేగలేకపోతున్న భార్యను విడాకులకు ముందే తనకు నచ్చిన వ్యక్తితో కలిసి ఉండే తీర్పును వెలువరించింది. వివాహం ఎంతో బాధ్యతతో నిర్వహించాల్సిన బంధం. పురుషుల వ్యవహారశైలిలో మార్పును ఈ రెండు తీర్పులు సూచిస్తున్నాయి.‘వివాహ బంధంలో మా అమ్మాయి ఇబ్బంది పడుతోంది. అది సరయ్యే మార్గం లేదు. ఆమెను బయటకు తేవడమే ఉత్తమం అని భావించాను. అదే నా తీర్పు’ అన్నారు మీరట్కు చెందిన రిటైర్డ్ జడ్జి జ్ఞానేంద్ర కుమార్ శర్మ. శనివారం (ఏప్రిల్ 4న) ఆయన కుమార్తె ప్రణిత వశిష్టకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. కోర్టు నుంచి ఇంటికి ఆయన తన కూతురుని బ్యాండ్ బాజాలతో, పూలహారాలతో, స్వీట్స్తో ఊరేగింపుగా తీసుకొని వచ్చాడు. బంధువులు అందుకు తోడు నిలిచారు. వీరంతా నల్లటి టీషర్టులు ధరించారు. ఆ టీషర్ట్ల పై ‘ఐ లవ్ మై డాటర్’ అనే నినాదం ఉంది. సమాజానికి విడాకులంటే చిన్న చూపు పోవడానికే ఇదంతా చేయాల్సి వచ్చిందని ఆ తండ్రి తెలియచేశాడు.2018లో వివాహంజ్ఞానేంద్ర కుమార్ శర్మ తన కుమార్తె ప్రణిత వివాహాన్ని 2018లో షాజహాన్పూర్కు చెందిన ఒక ఆర్మీ మేజర్తో జరిపించారు. అయితే పెళ్లయిన నాటి నుంచి భర్త ఆమెను మానసికంగా, శారీరకంగా బాధిస్తున్నాడు. ఒక బిడ్డ జన్మించినా అతని వైఖరిలోమార్పు లేదు. తండ్రిగా ఇదంతా చూసి ఆమెకు ధైర్యమివ్వడానికి తోడు నిలిచాడు జ్ఞానేంద్ర కుమార్ శర్మ. ‘కుమార్తె బాధలో ఉంటే దాని నుంచి బయట పడేసే బాధ్యత తండ్రిగా నా మీద ఉంది. ఆమె గౌరవాన్ని కాపాడటం ముఖ్యం. ఏ కుమార్తే, తన తల్లిదండ్రులకు బరువు కాదు’ అన్నాడాయన. ప్రణిత పోస్ట్ గ్రాడ్యుయేట్. ఒక సంస్థలో ఫైనాన్షియల్ డైరెక్టర్గా పని చేస్తోంది. ‘మేము భరణం ఆశించలేదు. మాకు వద్దు కూడా’ అన్నారు ఆ తండ్రీ కూతుళ్లు. ‘ఇన్నాళ్లు అత్తగారింటిలో నేను మానసికంగా బలహీనపడుతూ వచ్చాను. దీనికి ముగింపు పలకాలనుకున్నాను. నేను చెప్పేది ఒకటే.... కష్టాలను సహిస్తూ కూచోవద్దు. పరిష్కారం వెతకండి’ అంది ప్రణిత. కళ్లకు కనపడుతున్న ఇలాంటి తీర్పులను చూసి వివాహ వ్యవస్థ లోటుపాట్లను తల్లిదండ్రులు, భార్యాభర్తలు మరింతా మెరుగ్గా సరి చేసుకోవాలి. ఎవరి బాధ్యతలు, హక్కులు వారు తెలుసుకోవాలి. విజ్ఞతతో వ్యవహరించాలి. నచ్చిన వ్యక్తితో ఉండొచ్చుమధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియెర్ బెంచ్ ఏప్రిల్ 2న ఇచ్చిన మరో తీర్పు కూడా స్త్రీ నిర్ణయానికి వత్తాసు పలికింది. 40 ఏళ్ల వయసు కలిగిన భర్త తన భార్య కనిపించడం లేదని హెబియస్ కార్పస్ పిటిషన్ వేయగా అతని 19 ఏళ్ల భార్య కోర్టు ముందు ప్రత్యక్షమైంది. తననెవరూ కిడ్నాప్ చేయలేదని, తన సమ్మతం ప్రకారమే మరో వ్యక్తి దగ్గరకు వెళ్లిపోయానని ఆమె కోర్టుకు తెలిపింది. కోర్టులో భర్త, అత్తామామలు, తల్లిదండ్రుల ఎదుట తన వాంగ్మూలాన్ని కోర్టుకు సమర్పించింది. దాని ప్రకారం 19 ఏళ్ల వయసున్న తనకు రెట్టింపు వయసున్న భర్తతో జీవించాలని లేదని, ఆ సంగతి ఎన్నిసార్లు చెప్పినా భర్త వినక బాధిస్తున్నాడనీ, ఇంటి నుంచి పుట్టింటికి వెళితే తల్లిదండ్రులు బలవంతంగా మళ్లీ అతని వద్దకే పంపుతున్నారనీ, ఈ నేపథ్యంలో తనకు నచ్చిన వ్యక్తి దగ్గరకు వెళ్లిపోవాలన్నది ఆమె అభ్యర్థన. ఈ వేడుకోలు విన్న కోర్టు ఇప్పటి వివాహంలో ఇంకా విడాకులు జరక్కపోయినా ఆమెను తనకు నచ్చిన వ్యక్తితో ఉండవచ్చని ఆర్డర్ పాస్ చేసింది. అంతే కాదు ఆమెకు నచ్చిన కుర్రాడిని పిలిచి లిఖిత పూర్వకంగా హామీ తీసుకుంది. విడాకులయ్యాక ఆమెను పెళ్లి చేసుకుంటానని, అంతవరకుగాని ఆ తర్వాత గాని ఆమెను ఏ విధంగానూ బాధించనని ఆ కుర్రాడు హామీ ఇచ్చాడు. అయినప్పటికీ కోర్టు ఆరునెలల పాటు ‘శౌర్య దీదీ’ పరిశీలనలో ఉండాలని ఆమెను ఆదేశించింది. కోర్టు నియమించిన మహిళా అడ్వకేట్ ఆమెతో పాటు ఒక మహిళా కానిస్టేబుల్ ఆరు నెలల పాటు ఆమె జీవితాన్ని పరిశీలిస్తూ ఏదైనా సహాయం కావాలంటే చట్టపరంగా తక్షణం అందిస్తారు. ఇది మధ్యప్రదేశ్ ప్రభుత్వం గత కొన్నాళ్లుగా ‘శౌర్య దీదీ’ పేరుతో ఏర్పాటు చేసిన వ్యవస్థ. -
మన అమెరికన్
స్టూడెంట్ లీడర్గా జాత్యహంకారంపై పోరాడిన రిని సంపత్కు సమస్యల మూలాలు తెలుసు. ఆ సమస్యలపై అలుపెరగని పోరాటం తెలుసు. ‘నేను వలస ప్రజల బిడ్డను’ అని గర్వంగా చెప్పుకునే రినికి ఆత్మగౌరవ నినాదం తెలుసు. తమిళనాడులోని తేనిలో జన్మించిన 31 ఏళ్ల రిని సంపత్, వాషింగ్టన్ డీసీ మేయర్ ఎన్నికల బరిలో నిలిచిన మొట్టమొదటి దక్షిణాసియా మహిళగా నిలిచారు.ఏడు సంవత్సరాల వయసులో రిని సంపత్ తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వెళ్లారు. ‘యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (యుఎస్సి)లో చదువుకున్న రిని విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. యుఎస్సీ అధ్యక్షురాలిగా విద్యార్థుల సమస్యలపై పోరాడారు. వారి హక్కుల కోసం నినదించారు. జాత్యహంకారాన్ని, వేధింపులను వ్యతిరేకించారు.వారే నిజమైన అర్హులుడెమొక్రటిక్ పార్టీకి చెందిన రిని సంపత్ ప్రభుత్వ కాంట్రాక్టర్. ప్రాథమిక అవసరాలు తీర్చండి’ ‘ఒక కొత్త డీసీ’ నినాదాలతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ‘నగరవాసులకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడం, వినాశకరమైన మురుగునీరు పొంగి పొర్లడాన్ని ఆపడం, గుంతలను పూడ్చడం, ధరలను తగ్గించడం అనేవి నా ప్రాధాన్యత అంశాలు. వాషింగ్టన్ డీసీని అందరికీ ఉపయోగపడేలా చేస్తాను. తమ వాగ్దానాలను నిలబెట్టుకునేవారే మేయర్ పదవికి అర్హులు’ అని తన ప్రచార వెబ్సైట్లో పేర్కొన్నారు రిని. వాషింగ్టన్ డీసీని ప్రధానంగా డెమొక్రాట్లు పాలిస్తున్నారు. 1975లో మేయర్ పదవికి ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుండి రిపబ్లికన్ మేయర్గా ఎవరూ ఎంపిక కాలేదు.ఇదే సరిౖయెన సమయంతాను రాజకీయనాయకురాలు కాదని నొక్కి చెబుతుంటారు రిని. ‘నేను సంప్రదాయ రాజకీయ నాయకురాలిని కాదు. నేను ఒక ఫెడరల్ కాంట్రాక్టర్ని. నా వృత్తిజీవితమంతా ప్రభుత్వ కార్యక్రమాలలో, పౌర సేవలను మెరుగుపర్చడంలో గడిపాను.మనకు ఒక కొత్త వ్యక్తి కావాలినగరానికి సేవలను అందించడంపై అవిశ్రాంతంగా దృష్టి సారించే వ్యక్తికి ఇది సరిౖయెన సమయం. అందుకే నేను మేయర్ రేస్లో ఉన్నాను. మనం కలిసి పనిచేసి, మెరుగైన డీసీని నిర్మించగలమని నమ్ముతున్నాను’ అని ప్రజలను ఉద్దేశించి అంటున్నారు రిని.విజయానికి స్పష్టమైన మార్గంఫిబ్రవరి ఆరంభంలో వచ్చిన మంచుతుఫాన్ సమయంలో ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు రాలేకపోయారు. వికలాంగులు ఎక్కడో ఒకచోట చిక్కుకుపోయారు. నిత్యావసర సేవలు అందలేదు. ఉద్యోగులు రకరకాలుగా సమస్యలు ఎదుర్కొన్నారు. తన ప్రచారయాత్రలో ఆనాటి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు రిని.‘విజయం సాధించడానికి మనకు స్పష్టమైన మార్గం ఉంది. కేవలం నాలుగు వారాల్లోనే డీసీ చరిత్రలో మేయర్ బ్యాలెట్కు స్థానం సంపాదించిన మొట్టమొదటి దక్షిణాసియా అభ్యర్థిగా నిలిచాము. తక్కువ వనరులతో, ప్రజల మద్దతుతో సాగిన ప్రచారం ఇంతటి విజయాన్ని సాధించింది. నగరవ్యాప్తంగా ప్రతి ఓటరును చేరుకోవడానికి అవసరమైన వనరులు మనకు సమకూరి ఉంటే ఇంకా పెద్ద విజయం సాధించవచ్చు’ అంటున్నారు రిని సంపత్. చారిత్రక మైలురాయిమేయర్ ప్రైమరీ ఎన్నిక జూన్ 16న జరగనుండగా, సాధారణ ఎన్నిక నవంబర్ 3న జరగనుంది. అమెరికా రాజకీయాలలో ప్రాతినిధ్యానికి సంబంధించి రిని ప్రచారం చారిత్రక మైలురాయిగా నిలవనుంది. ఉన్నత స్థాయికి ఎంపికైన పదవులలో భారతీయ అమెరికన్లకు తక్కువ ప్రాతినిధ్యం ఉంది. వారి రాజకీయ భాగస్వామ్యం పెరుగుతున్న తరుణంలో మేయర్ బరిలో రిని సంపత్ నిలవడం విశేషంగా మారింది. మేయర్గా ఎన్నికైతే ఆమె డీసీ చరిత్రలోనే అత్యంత పిన్నవయస్కురాలైన మేయర్ అవుతారు. చిన్న వయసులోనే అమెరికాకు వెళ్లినా తన మూలాలను ఎప్పుడూ మరచిపోలేదు రిని. ‘మా తాతగారు ఎప్పుడూ నాకు చోదకశక్తిగా, స్ఫూర్తితేజంగా ఉన్నారు’ అంటారు.ఆ శక్తి ఏమిటో నాకు తెలుసువాషింగ్టన్ డీసీ మేయర్ పదవికి బ్యాలెట్లో చోటు దక్కించుకున్న మొట్టమొదటి దక్షిణాసియా వ్యక్తిని కావడం సంతోషంగా ఉంది. అమెరికా కలను సాకారం చేసుకోవాలనే తపనతో తల్లిదండ్రులతో కలిసి ఏడేళ్ల వయసులో అమెరికాకు వచ్చాను. వలసదారుల కుమార్తెగా, కఠోర శ్రమ, పట్టుదలల శక్తి ఏమిటో నాకు తెలుసు. ఆ విలువలని నగర పాలక సంస్థ(సిటీ హాల్)లోకి తీసుకు రావడానికి, వాషింగ్టన్ వాసులందరికీ సత్ఫలితాలు అందించడానికి ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నాను. డీసీ మేయర్ పదవికి నన్ను బ్యాలెట్లో చేర్చడానికి నా పిటిషన్పై 4,500 మందికి పైగా సంతకాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. మన ఆర్థిక వ్యవస్థకు దక్షిణాసియా ప్రజల సహకారం ఎంతో ఉంది. కానీ ప్రభుత్వంలో వారికి చాలా తక్కువ ప్రాతినిధ్యం ఉండటం విచారకరం.– రిని సంపత్, మేయర్ అభ్యర్థి, వాషింగ్టన్ డీసీ -
అద్వితీయ అనువాదానికి స్వాగతం!
మలయాళ సాహిత్యంతో, సినిమాలతో మంచి పరిచయం ఉన్న చదువరులకు ఓ శుభవార్త. ఎన్నాళ్లనుంచో ఊరిస్తున్న ఓ సుప్రసిద్ధ మలయాళ రచన ఇప్పుడు తెలుగులోకి వచ్చింది. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత 'పద్మభూషణ్' ఎంటి వాసుదేవన్ నాయర్ నాలుగు దశాబ్దాల క్రితం రచించిన మలయాళ నవల 'రెండామూజం'(రెండోసారి - 1984) నవల.. సాహితీ లోకంలో సుప్రసిద్ధం. పురాణపాత్ర భీమసేనుడి దృక్కోణం నుంచి మహాభారత గాథని వినూత్నంగా పాఠకలోకం ముందు ఉంచిన ఈ ఐతిహాసిక నవల కొన్ని దశాబ్దాలుగా మలయాళంలో బెస్ట్ సెల్లర్. పదే పదే పునర్ముద్రణలు పొందడమే కాకుండా ఇప్పటికే ఇంగ్లీషు (సెకండ్ టర్న్, భీమ – లోన్ వారియర్), తమిళం (ఇరండామ్ ఇడమ్), కన్నడం (భీమాయణ)తో సహా వివిధ భారతీయ భాషల్లోకి అనువాదమైన మోస్ట్ పాపులర్ రచన.భీమసేనుడి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ని హీరోగా తీసుకొని, ఆ నవలని వెండితెరకు ఎక్కించాలని ఇప్పటికి దశాబ్దిన్నర క్రితమే పలు ప్రయత్నాలు జరిగాయి. దర్శకులు నిర్మాతలు మారుతూ వచ్చినా దురదృష్టవశాత్తూ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కనేలేదు. అపరిమితమైన ఆలస్యానికి కినిసిన రచయిత ఎంటి.. చివరకు సుప్రీమ్ కోర్ట్ దాకా వెళ్ళి, నిర్మాతలు తనకిచ్చిన కోటింబాతిక రూపాయల పెద్ద అడ్వాన్స్ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేసి మరీ, నవల ఆధారంగా తానే రాసిచ్చిన సినిమా స్క్రిప్ట్ని వెనక్కి తీసేసుకున్నారు. ఇది కొద్దిమందికే గుర్తున్న కథ. దాదాపు వెయ్యి కోట్ల పైగా బడ్జెట్తో, 2020 నాటికి రెండు భాగాల సినిమాగా తెలుగు సహా వివిధ భాషల్లో రావాల్సిన ఆ 'రెండామూజం' నవల ఎట్టకేలకు సినిమా కన్నా ముందుగా ఇప్పుడు 'అద్వితీయుని ఆత్మకథ' పేరిట అనువాద రచనగా తెలుగు సాహితీ లోకం ముందుకు వచ్చింది.మలయాళంలో మన 'మిథునం' దర్శకుడునిర్మాల్యం(1973)లాంటి పలు అవార్డు సినిమాలకు దర్శకత్వం వహించి దాదాపు 60 సినిమాలకు స్క్రిప్టులు రాసిన చరిత్ర ఎంటి వాసుదేవన్ నాయర్ది. రచయిత శ్రీరమణ ప్రసిద్ధ తెలుగు కథ 'మిథునం'ని తెలుగులో కన్నా పుష్కరకాలం ముందే మలయాళంలో 'ఒరు చెరు పుంచిరి'(చిరు నగవు – 2000) పేరిట సినిమాగా రూపొందించిన దర్శకుడు. అందుకు తగ్గట్టే, ఆయన ప్రసిద్ధ మలయాళ నవల ‘రెండామూజం’ తెలుగు అనువాదం ఆవిష్కరణ సైతం సాహితీ ప్రియులైన ముగ్గురు తెలుగు సినీ ప్రముఖుల సాక్షిగా ఏప్రిల్ 5న హైదరాబాద్లో జరిగింది. ప్రముఖ రచయిత వి.ఆర్.గణపతి తెలుగులో అనువాదం చేసిన ఈ పుస్తకాన్ని నటుడు,రచయిత,దర్శకుడు తనికెళ్ళ భరణి ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. మంచి పుస్తకాలకు వీలైనంత ప్రచారం కల్పించి, జనంలోకి తీసుకువెళ్ళాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ, ఎం.టి. వాసుదేవన్ నాయర్ రచన తెలుగులోకి రావడం ఎంతైనా ఆనందదాయకమని తనికెళ్ళ అన్నారు. ఇటీవల తాను ప్రత్యేకించి ‘హంసవింశతి’ కావ్యాన్ని తెలుగులో ప్రచురింపజేసి, ప్రచారం కల్పించడంతో లభిస్తున్న స్పందన గురించి ప్రస్తావించారు.రచయిత ముళ్ళపూడి వెంకట రమణ గారి సతీమణి – స్వయానా రచయిత్రి అయిన ముళ్ళపూడి శ్రీదేవి మాట్లాడుతూ, 'ప్రపంచంలో ఉన్నదంతా భారతంలో ఉంది. భారతంలో లేనిదేదీ ప్రపంచంలో లేదు' అంటూ వ్యాస భారతంలోని విశేషాలను ప్రస్తావించారు. భీమసేనుడు చెప్పినట్టుగా సాగే ఈ నవల రచయిత బ్నిమ్ మాటల్లో చెప్పాలంటే, “భీమసేనుడి సెల్ఫీ భారతం” అంటూ చమత్కరించారు.మన తెలియని మన భీముడి కోణంలో భారతంరచయిత్రి – కాలమిస్ట్ ప్రొఫెసర్ సి. మృణాళిని ప్రసంగిస్తూ.. దాదాపు పదేళ్ళ పైగా ఎం.టి.తో వ్యక్తిగతంగా తనకున్న సాహితీ అనుబంధాన్నీ, ఎంతో నిరాడంబరంగా ఉండే ఆయన జ్ఞాపకాలనూ పంచుకున్నారు. తెలుగు సాహిత్యలోకానికి భిన్నంగా... బిరుదులతో కాక, “మన ఎం.టి.” అంటూ ఆయనను ఆత్మీయంగా ఆహ్వానించే మలయాళీ సాహిత్య సంస్కృతిని ఆమె ప్రస్తావించారు. అలాగే, ఎం.టి. వాసుదేవన్ నాయర్ కేరళలో స్వస్థలమైన తిరూర్లో ప్రతి ఏటా ఫిబ్రవరిలో జరుపుతూ వచ్చిన ‘తుంజన్ సాహితీ ఉత్సవం’ తాలూకు గొప్పతనాన్ని వివరించారు. రామాయణ, భారత, భాగవతాలను మలయాళంలో అందించిన ‘మలయాళ ఆది కవి’, ‘ఆధునిక మలయాళ సాహిత్య పితామహుడు’ అయిన (తుంజత్ రామానుజన్) ఎళుత్తచ్చన్ పేరిట ఆ ఉత్సవాన్ని ఏటా ఎం.టి. అద్భుతంగా జరిపే తీరును మృణాళిని గుర్తు చేసుకున్నారు. “యాదృచ్ఛికంగా ఎం.టి.కీ, నాకూ మధ్య జరిగిన ఆఖరి సంభాషణ కూడా ఈ ‘రెండామూజం’ నవల గురించే! 2022లో క్యాలికట్లో మహాభారతంపై వివిధ భాషలతో వారితో జరిగిన జాతీయ సాహిత్య సదస్సులో పాల్గొన్నప్పుడు ఈ ‘రెండామూజం’ నవల తెలుగు అనువాదం ప్రస్తావన మా మధ్య వచ్చింది. ఈ నవల అప్పటికే ఇంగ్లీషులో అనువాదమైంది. అయితే, ఇంగ్లీషు నుంచి కాక, మలయాళం నుంచే ఆ తెలుగు అనువాదం సాగాలని ఆయన ప్రత్యేకంగా కోరుకున్నారు” అని మృణాళిని తెలిపారు.‘అద్వితీయుని ఆత్మకథ’ పుస్తకాన్ని కూలంకషంగా సమీక్షించిన మృణాళిని, “నటనలో దిలీప్ కుమార్ లాగా, రచనలో ఎం.టి. వాసుదేవన్ నాయర్ అలా! నాటకీయతకు అవకాశం ఉన్నా, ఆ జోలికి పోకుండా, అండర్ ప్లే చేస్తారు. భారతాన్ని ఎం.టి. చూసిన దృష్టి వేరు. గతంలో కొందరు రచయితలు కర్ణుడు, దుర్యోధనుడు, అశ్వత్థామ లాంటి పాత్రలను ప్రధానంగా ఎంచుకొని తమదైన పద్ధతిలో భారత కథ రాశారు. కానీ, నూర్గురు కౌరవులను సంహరించడంతో సహా భారతంలో కీలకంగా వ్యవహరించినప్పటికీ తన మనసులోని మాటలను ఎన్నడూ బయటకు చెప్పుకోని భీమసేనుడి దృష్టి నుంచి ఈ నవల సాగడం విశేషం. పాండవుల్లో ద్వితీయుడైనా, అందరికీ తెలిసిన భుజ పరాక్రమంతో పాటు మానసిక చిత్తవృత్తిలోనూ అద్వితీయుడిగా అనిపించే భీముడి పాత్ర తాలూకు రెండో కోణాన్ని సమాంతరంగా, అద్భుతంగా చెబుతుందీ నవల. ఎంతో పరిశోధించి, వ్యాసభారతంలో లేని అంశాలను కొన్నింటిని జొప్పించడంతో పాటు, వ్యాసుడు నిశ్శబ్దంగా ఉన్నచోట ఆ ఖాళీలను పూరిస్తూ ఎం.టి. ఈ అసాధారణ నవలను మలయాళంలో రచించారు. భారత ఇతిహాస కథలోని మాయలు, మహిమలను పరిహరించి, చాలా సహజంగా, హేతుబద్ధంగా, భీముని సున్నితత్వం, మానసిక చైతన్యం, స్త్రీల మానసిక స్థితిని అర్థం చేసుకొనే తత్వాన్ని ప్రధానంగా ఆవిష్కరిస్తూ ఈ నవల సాగడం గమనార్హం” అంటూ అనేక ఉదాహరణలతో లోతుగా విశ్లేషించారు.అందుకే... ఆ సాహిత్యం, సినిమా అంత విలక్షణం!చలం ‘దోషగుణం’ కథ ఆధారంగా ‘గ్రహణం’ మొదలు పలు ఆంగ్ల రచనల ఆధారంగా ‘అష్టాచెమ్మా’, ‘సారంగపాణి జాతకం’ దాకా పలు చిత్రాలను రూపొందించిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తన అభిప్రాయాలను పంచుకున్నారు. “ఇవాళ చరిత్రకూ, పురాణానికీ మధ్య తేడా ప్రమాదకరంగా చెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో పాత్రలకు సమకాలీనత ముఖ్యం. ఆ దృక్కోణంతో పాత్రలనూ, ఇతిహాసాలనూ ఆవిష్కరించగల రచయితల అవసరం ఉందిప్పుడు. మలయాళ సాహిత్యం, సినిమాల్లో ఆ పనే చేస్తుంటారు. అందుకే అవి విలక్షణంగా నిలుస్తున్నాయి” అని అభిప్రాయపడ్డారు.సినీ నటుడు – రచయిత – దర్శకుడు అవసరాల శ్రీనివాస్ సభలో మాట్లాడుతూ, సాహిత్యంపై తనకున్న అక్కరను పంచుకున్నారు. “తెలుగు సాహిత్యం కోసం బాధపడుతున్నవారితో నేనూ గొంతు కలుపుతున్నా. బహుశా, అందుకే ఇటీవల కాలంలో వివిధ సాహిత్య సమావేశాల్లో నాకూ స్థానమిస్తున్నారు. కోవిడ్ అనంతర కాలంలో చదవడం కొంత తగ్గింది. నేను చదవాల్సిన పుస్తకాలు చాలా ఉన్నాయి. అవి పూర్తి చేయడమే కాక, తెలుగు సాహిత్య ప్రచారం కోసం నా వంతు కృషి చేస్తా” అని ఆయన హామీ ఇచ్చారు.పలుకు తేనెల తెలుగు... ‘పాలక్కాడ్’ గణపతి!మలయాళ మాతృక ‘రెండామూజం’ తెలుగు అనువాద రచయిత వి.ఆర్. గణపతి ప్రత్యేకంగా ఈ సభ కోసం కేరళ సరిహద్దు నుంచి హైదరాబాద్కు రావడం గమనార్హం. ప్రస్తుతం ఆయన పాలక్కాడ్ వాస్తవ్యులు. తమిళ, మలయాళాల నుంచి తెలుగులోకి పలు అనువాదాలు చేస్తున్న ఆయన ఇప్పటికే ప్రముఖ మలయాళ రచయిత్రి పి. వత్సల రచన ‘ఆగ్నేయం’తో పాటు మరో ప్రసిద్ధ మలయాళ రచయిత ముకుందన్ రచన ‘దైవత్తిండ వికృతిగళ్’ను ‘వైకుంఠపాళి’గా తెలుగులోకి చేశారు. ఇంగ్లీషు నుంచి కాక, ఎం.టి. రచించిన మలయాళ మాతృకనే ఆధారంగా చేసుకొని, సరళమైన తెలుగులో, హాయిగా చదివించేలా ఆయన అనువాదాలు చేయడం విశేషం. మాతృకలోని ఆచారాలు, సంప్రదాయాలు, తిట్లు, సామెతలను అనువదించేటప్పుడు ఎదురయ్యే ఇబ్బందులను ప్రస్తావిస్తూనే, ఆయన ఈ తాజా అనువాద ప్రస్థానం విశేషాలను పంచుకున్నారు.“నేను పెరిగింది, చదివింది కరీంనగర్లోనే. తెలుగునాట ఉద్యోగం కూడా చేశాను. ఆంధ్రా బ్యాంక్ ఉద్యోగిగా ఎందరో మిత్రులను సంపాదించుకున్నాను. నిజానికి, ఎం.టి. తన రచనల అనువాదానికి అంత సులభంగా అనుమతినివ్వరు. సినిమా స్క్రిప్టుల కోసం తన వద్దకు వచ్చేవారిని సైతం ఆయన అనేక నెలలు తిప్పించుకొని, వారి శ్రద్ధను పరీక్షించాకనే ఒప్పుకొనేవారు. అలాంటిది... ఆయన సుప్రసిద్ధ రచన ‘రెండామూజం’ తెలుగులోకి చేయాలని ‘కథాప్రపంచం’ కిరణ్ నన్ను కోరినప్పుడు, ‘ఎం.టి. అనుమతి ఇచ్చినప్పుడు కదా’ అని తేలికగా తీసుకున్నా. కానీ, కిరణ్ పట్టువదలని విక్రమార్కుడిలా ఆయన అనుమతి సాధించి, నాతోనే అనువాదం చేయించారు. నిజానికి, 2024లోనే ఈ అనువాదం పూర్తయింది. ఎం.టి.కి చూపించి, ఆయన ఆశీర్వాదం తీసుకుందామనుకొనే లోగా ఆయన అనారోగ్యం పాలయ్యారు. మా ఆశ తీరకుండానే ఆయన కన్నుమూయడం మాకు తీరని లోటు” అంటూ ఎం.టి.కి గణపతి నివాళులర్పించారు.మరిన్ని అనువాదాల విందుకు మార్గం!నిజానికి, మలయాళంలో ‘రెండామ్ ఊజం’ (సంధి ప్రక్రియ వల్ల... ‘రెండామూజం’) అంటే... ‘రెండో సారి’ అని అర్థం. అయితే, ఆ పేరును తెలుగు పాఠకలోకానికి సన్నిహితమయ్యేలా అర్థవంతంగా ‘అద్వితీయుని ఆత్మకథ’గా సమర్పించడం అనువాదకుడి శ్రద్ధాభక్తులకు నిదర్శనం. మంచి అభిరుచితో మేలైన పుస్తకాలు ప్రచురించడంలో ముందుంటున్న తిరుపతికి చెందిన ‘కథా ప్రపంచం’ ప్రచురణల అధినేత కిరణ్ ఈ తెలుగు అనువాదాన్ని అందించారు. ఎంతో కాలం, ధనం, శ్రమ వెచ్చించి, పట్టుదలగా ఆయన ఈ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందించడాన్ని తనికెళ్ళ, ఇంద్రగంటి, అవసరాల సహా అతిథులందరూ ప్రత్యేకంగా ప్రశంసించారు.సీనియర్ జర్నలిస్ట్ రాజేశ్వరీ కల్యాణం సభా నిర్వహణ సాగించిన ఈ సమావేశంలో రచయిత వాసిరెడ్డి నవీన్, బ్నిమ్, సినీ సమాచార సేకర్త పంచకర్ల రమేశ్, సీనియర్ జర్నలిస్టు పద్మశ్రీ, ఆకాశవాణి వార్తావిభాగం జ్యోత్స్న సహా పలువురు సినీ, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు. అనువాద రచయితకు పూర్వాశ్రమ మిత్రులు – సహచరులైన ఆంధ్రా బ్యాంక్ ఉద్యోగులు పెద్దయెత్తున వచ్చి, ఆయనను అభినందించారు. తిరుపతి ‘కథా ప్రపంచం’ కిరణ్ అతిథులను సాదరంగా ఆహ్వానించి, ఆత్మీయతను పంచారు. ఎం.టి. వాసుదేవన్ నాయర్ బృహత్తర కృషిగా పేర్కొనే ‘కాలం’ (1969) సహా మరిన్ని నవలలు, కథలను తెలుగులోకి తెచ్చేందుకు ఈ ‘అద్వితీయుని ఆత్మకథ’ ఆవిష్కరణ కొత్త దారులు వేసినట్టే కనిపిస్తోంది. అదే జరిగితే... తెలుగు పాఠక లోకానికి అంతకన్నా అక్షరాల విందు మరేముంటుంది!-రెంటాల జయదేవ -
ప్రకృతి, హిమాలయాల అనుభవం కోసం ఆ ప్రదేశాలకు వెళ్లాల్సిందే..!
ఫస్ట్ టైమ్ యూరోప్కి వెళ్లాలని ప్లాన్ చేసే వారికి టిబిలిసి ఒక మంచి స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఫ్లైట్ దిగిన వెంటనే సిటీ వైబ్ చాలా కామ్గా, రిలాక్స్గా అనిపిస్తుంది. ఎక్కడా ఎక్కువ రష్ లేకుండా స్మూత్గా అడ్జస్ట్ అయ్యే ప్లేస్లా ఫీలవుతారు. సిటీలో వాక్ చేస్తుంటే పురాతన భవనాలు, రంగురంగుల బాల్కనీలు, కోబుల్ స్టోన్ వీధులు కలిసి ఒక సాఫ్ట్ విజువల్ క్రియేట్ చేస్తాయి. మార్నింగ్ లైట్లో స్ట్రీట్స్ స్లోగా వేక్ అవ్వడం చూస్తే, ఈ ప్లేస్తో కనెక్షన్ నాచురల్గా బిల్డ్ అవుతుంది.సందర్శనీయ స్థలాలు పాత టిబిలిసిలో చిన్న చిన్న ఇరుకైన సందుల్లో నడుస్తూ ఉంటే గతంలోకి వెళ్లినట్టుగా అనిపిస్తుంది. నరికలా కోటకి వెళ్లినప్పుడు సిటీ వ్యూ వైడ్గా కనిపిస్తుంది. బ్రిడ్జ్ ఆఫ్ పీస్ రాత్రి సమయంలో ప్రశాంతంగా వెలుగుతూ ఉంటుంది. అబానోతుబాని ప్రాంతంలో ట్రెడిషనల్ టిబిలిసి సంస్కృతి ఆనవాళ్లు కనిపిస్తాయి.ఏం తినాలి?ఇక్కడ ఫుడ్ సింపుల్గా కనిపించినా చాలా శాటిస్ఫయింగ్గా ఉంటుంది. ఖాచాపూరిలో కరిగిన చీజ్, సాఫ్ట్ బ్రెడ్తో కలిసి కంఫర్ట్ ఫుడ్లా ఉంటుంది. అలాగే ఖింకలి అనే డంప్లింగ్స్ చాలా జ్యూసీగా ఉంటాయి. వీటిని తినే విధానం కూడా ఒక ప్రత్యేక అనుభవంగా మిగులుతుంది.ఎప్పుడు వెళ్లాలి?స్ప్రింగ్ (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) సమయంలో వాతావరణం చాలా ఫ్రెష్ ఫీల్ను ఇస్తుంది. ఆటమ్లో సిటీ రంగులు చాలా సాఫ్ట్గా, అందంగా మారుతాయి.హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ కొన్ని సీజనల్గా అందుబాటులో ఉంటాయి.లేదంటే దుబాయ్ లేదా దోహా నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ సులభంగా లభిస్తాయి.ప్రయాణ సమయం సుమారు 7 నుంచి 10 గంటలు.టిబిలిసిలో గడిపే టైమ్ ఫాస్ట్గా వెళ్లి΄ోతుందిం కానీ మెమోరీస్ మాత్రం స్లోగా మనసులో నిలిచి΄ోతాయి. సింపుల్ ట్రిప్ప్లాన్ చేసినా, ఈ నగరం అనుభవం మాత్రం నేచురల్గా స్పెషల్గా మిగిలి΄ోతుంది.హిమాలయాల్లో రహస్య జీవనంహిమాలయ పర్వతాల మధ్య ఒక గుహలో మలచిన పుగ్తాల్ మొనాస్టరీని చూస్తే ఇలాంటి నిర్మాణం సాధ్యమేనా అనిపిస్తుంది. ఇక్కడ జీవితం చాలా ప్రశాంతంగా, సింపుల్గా గడుస్తుంది. అందుకే మనశ్శాంతి కోసం చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. ఈ ప్రాంతానికి చేరుకోవడం అనేది ఒక ప్రయాణం మాత్రమే కాదు. అది ఒక అద్భుతమైన అనుభవం కూడా.కాలం కొత్త రంగులుఈ మోనాస్టరీలో బౌద్ధ సన్యాసుల దినచర్య చాలా సింపుల్గా ఉంటుంది. ప్రతి ఉదయం ప్రార్థనల శబ్దం పర్వతాల మధ్య ఒక ఎకోలా మార్మోగుతుంది. చుట్టూ గోధుమ రంగులో మెరిసే పర్వతాలు, కింద నిశ్శబ్దంగా సాగే నది... ఈ కాంబినేషన్లో కాసేపు గడిపినా.. మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇక్కడ కాలం ఆగిపోయినట్టు జీవితం కొత్త రంగులను అద్దుకున్నట్టుగా అనిపిస్తుంది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్గా సాగుతున్న జీవితానికి ఈ ప్రదేశం ఒక స్పీడ్ బ్రేకర్లా పని చేస్తుంది. ప్రకృతితో సహజీవనంఎలక్ట్రిక్ లైట్స్ కన్నా సహజమైన సూర్యోదయానికి ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. గాలి శబ్దం, నీటి ప్రవాహం ఇవన్నీ కలిసి ఒక నేచురల్ రిథమ్ను క్రియేట్ చేస్తాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఈ వ్యూస్ను ఆస్వాదిస్తూ, నిశ్శబ్దంలో ప్రకృతి పలికే మాటలను వినడానికి ప్రయత్నిస్తారు.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు ఫ్లైట్ లేదా ట్రెయిన్లో వెళ్లాలి. అక్కడి నుంచి లేహ్కి ఫ్లైట్ తీసుకుని, లేహ్ నుంచి జాన్సా్కర్ ప్రాంతానికి రోడ్డు ప్రయాణం చేయాలి. చివరిగా ఒక చిన్న ట్రెక్ చేసి ఫుగ్తాల్ మొనాస్టరీకి చేరుకోవచ్చు. అయితే ఈ ప్రయాణాన్ని ఒక చెక్లిస్టుగా కాకుండా మనశ్శాంతికి మార్గంగా భావించి ΄్లాన్ చేసుకోవాలి.ఈ ప్రాంతంలో ప్రతి అడుగు ఒక డిస్కవరీలా అనిపిస్తుంది. ఈ రహస్య నిలయం ఈ బౌద్ధ ఆలయం మనసులో చాలా లోతుగా నిలిచి΄ోతుంది. మేఘాలలో దాగిన హరిత స్వర్గం(ఆగుంబే)ప్రకృతిలో కొన్ని ప్రదేశాలు మన మనసులను మెల్లిగా మార్చేస్తాయి. ఆగుంబే కూడా అలాంటి ఒక ప్రదేశమే. ఫస్ట్ టైమ్ వెస్టర్న్ ఘాట్స్ ఎక్స్పీరియెన్స్ అవ్వాలి అనుకునే వారి కోసం ఇది ఒక సాఫ్ట్ ఎంట్రీ ఫీల్ ఇస్తుంది. ఈ ప్రదేశం పచ్చదనానికి కేరాఫ్ అడ్రెస్గా అనిపిస్తుంది. రోడ్ జర్నీలోనే మార్పు మొదలవుతుంది. సిటీ సౌండ్స్ తగ్గి, చుట్టూ లష్ ఫారెస్ట్, మిస్ట్తో కప్పబడిన కొండలు కనిపిస్తాయి. ఆగుంబేలో వాక్ చేస్తుంటే ప్రతి కార్నర్లో తడిసిన ఆకుల సువాసన, తాజా గాలి టచ్ క్లియర్గా తెలుస్తుంది.సందర్శనీయ స్థలాలు సన్సెట్ పాయింట్ దగ్గర మెల్లిగా ఆకాశం రంగులు మారడం చూస్తే కాలం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఆగుంబే రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్ వద్ద చిక్కటి అడవులను పర్యాటకులు బాగా ఇష్టపడుతుంటారు. బర్కానా ఫాల్స్ చుట్టుపక్కల నేచర్ చాలా రా అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. చిన్న ఫారెస్ట్ ట్రైల్స్లో నడిస్తే సైలెన్స్ కూడా ఒక ఎక్స్పీరియెన్స్లా అనిపిస్తుంది.ట్రై చేయాల్సిన ఫుడ్ఇక్కడ ఫుడ్ చాలా సింపుల్గా ఉంటుంది. లోకల్ స్టైల్ మీల్స్ ఫ్రెష్గా సర్వ్ చేస్తారు. హాట్ రైస్, లైట్ కర్రీలు ఇంటి భోజనం ఫీల్ ఇస్తాయి. వర్షాకాలంలో చాయ్తో స్నాక్స్ ఎంజాయ్ చేయడం ఒక మెమరీలా ఉంటుంది.ఎప్పుడు వెళ్లాలి?జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాల్లో ఆగుంబే ఒక ఆకు పచ్చ ప్రపంచంలా మారిపోతుంది. చలికాలంలో కూడా ఇక్కడి అందాలు అలరిస్తాయి.ఎలా చేరుకోవాలి?హైదరాబాద్ నుండి మంగళూరు లేదా ఉడుపి వరకు ఫ్లైట్ లేదా ట్రైన్లో చేరి, అక్కడి నుండి రోడ్ జర్నీ ద్వారా ఆగుంబే చేరుకోవచ్చు. మొత్తం ట్రావెల్ టైమ్ సుమారు 10–12 గంటలు వరకు ఉంటుంది. ఆగుంబేలో లైఫ్ స్లోగా, నేచర్తో సింక్ అయిన ఫ్లోగా ఉంటుంది. ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా సమయాన్ని గడపవచ్చు. ఈ గ్రీనరీ జర్నీలో మీరు ఒక రీల్లో ఉన్నట్టే రియల్ అనుభూతిని పొందుతారు. – ఎం.జి.కిశోర్, ప్రయాణికుడు(చదవండి: తొలి చారిత్రక రవాణా సాధనాల ప్రదర్శనశాల..!) -
తొలి చారిత్రక రవాణా సాధనాల ప్రదర్శనశాల..!
మన దేశంలో తయారైన మొట్టమొదటి కారు ఎలా ఉంది.. అసలు మనిషి మొదటగా ఉపయోగించిన రవాణాసాధనం ఎలా ఉండేది.. ఎడ్ల బండి నుంచి ఏరోప్లేన్ వరకు.. మానవప్రయాణంలో చోటుచేసుకున్న రవాణాసాధనాలన్నింటినీ ఒకే చోట చూడాలని, వాటి గురించి తెలుసుకోవాలని, వాటిని ఈ వేసవిలో పిల్లలకు పరిచయం చేయాలని.. ఇలాంటి ఆలోచనలో ఉన్నట్లయితే ఈ వేసవిలో ‘హెరిటేజ్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియమ్ కు వెళ్లడం ఓ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.ఢిల్లీ నుంచి సోహ్నా–గుర్గావ్ రోడ్డు మార్గాన 8వ జాతీయరహదారి మీదుగా దాదాపు 63 కిలోమీటరు ప్రయాణిస్తే .... హర్యానా రాష్ట్రం, బిలాస్పూర్ చౌక్, టారు రోడ్లో ఉంది ఈ హెరిటేజ్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియమ్. భారతదేశంలో మొట్టమొదటి చారిత్రక రవాణా సాధనాల ప్రదర్శనశాల ఇదే!దాదాపు 90 వేల చదరపు అడుగుల్లో నాలుగు అంతస్తులుగా ఉన్న ఈ మ్యూజియమ్ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సందర్శకుల కోసం తెరిచే ఉంటుంది. ఇందులో సందర్శన గ్యాలరీలు, గ్రంథాలయం, పరిశోధనా కేంద్రం, సమావేశపు గదులు, మినీ ఆడిటోరియమ్, షాప్లు, రెస్టారెంట్ వసతులు కూడా ఉన్నాయి. రూపకర్త ఎవరు అంటే.. ఢిల్లీ నివాసి తరుణ్ థక్కర్కి పాతకాలం నాటి వస్తువులను సేకరించడం ఒక అలవాటుగా ఉండేది. ఆసక్తి, ఉత్సాహం, శోధన నలుగురిలో ప్రత్యేకంగా నిలుపుతాయి. ఇదే తరుణ్ థక్కిర్ విషయంలోనూ జరిగింది. గ్రామోఫోన్ల నుంచి టేబుల్ ల్యాంప్స్ వరకు రాజస్థాన్, గుజరాత్ చుట్టుపక్కల గ్రామాలు తిరిగి మరీ సేకరించేవారు. అందులో భాగంగా పాత కార్లను సేకరించడం ఒక అలవాటుగా మారింది. అదే ఈ హెరిటేజ్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియమ్ ఏర్పాటుకు దోహదం చేసింది. 20 ఏళ్ల అతని కృషి ఫలితంగా 2013లో ఈ చారిత్రాత్మక వాహన శాల ఏర్పాటైంది. సినిమా సన్నివేశాలకు వీలుగా!భారతీయ రోడ్లకు అనుగుణంగా తయారైన నాటి కార్లతో పాటు క్షణంలో కళ్లముందు మెరిసి, మాయమయ్యే స్పోర్ట్ కార్లను కూడా ఇక్కడ తిలకించవచ్చు. మోటారు వాహనాల సందర్శన గ్యాలరీలో భారతదేశ కార్ల పరిశ్రమకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడమే కాదు, అందులో పాత కార్లనూ వీక్షించవచ్చు. వాహనాల విడిభాగాల విభాగంలో పాతకాలపు నాటి పెట్రోల్ పంపు, బాలీవుడ్ సినిమాల్లో ప్రముఖంగా కనిపించిన కార్లనూ తిలకించవచ్చు. మినీ ఆడిటోరియమ్ పై భాగంలో సినిమాలో రవాణా ప్రాముఖ్యంగా ఉండే చిత్ర సన్నివేశాలను వీక్షించడానికి స్క్రీన్కూడా ఏర్పాటు చేశారు.బస్సుల పాత్ర ఎంతో..మానవ ప్రగతికి బస్సు చక్రం ఎలా ఉపయోగపడిందో తెలియజెప్పవచ్చు. పెద్ద పెద్ద వాహనపరికరాలు గల బస్ డిపోతో పాటు, రోడ్డు రవాణాలో బస్సు పాత్ర... అందుకు సంబంధించిన వివరాలన్నీ తెలియజెప్పే గ్యాలరీని సందర్శించవచ్చు. పూర్వకాలపు వ్యాన్లు, బస్సుల గురించి కూడా ఈ ప్రదర్శనలో తెలుసుకోవచ్చు. మేఘాలలో తేలిపోమ్మన్నది..సైకిల్, స్కూటర్, మోటార్సైకిల్, మోపెడ్స్... ఒకనాడు సింగిల్గానూ, కపుల్గానూ ప్రయాణించిన ద్విచక్రవాహనాలు ఈ మ్యూజియంలో కొలువుదీరి ఉన్నాయి. వీటితో పాటు చిన్నా, పెద్ద వాహనాలను పోలిన బొమ్మలూ ఇక్కడ ఎంతో కనువిందుచేస్తాయి. వీటన్నింటినీ ఈ మ్యూజియమ్లో చూడముచ్చటగా తీర్చిదిద్దారు. వీటిని చూస్తుంటే పెద్దవాళ్లు తమ చిన్ననాటి రోజుల జ్ఞాపకాల్లో వెళ్లకుండా ఉండలేరు.ఆకాశయానంఎప్పటి నుంచి విమానమార్గంలో మన దేశస్తులు ప్రయాణించారు.. విమానయానం మన దగ్గర ఎలా అభివృద్ధి చెందింది... దశలవారీగా తెలియజెప్పే విశేషాలన్నీ ఈ మ్యూజియంలో ఉన్నాయి. మన దేశ విమాయానపరిశ్రమకు ఉన్న ఘనచరిత్ర గురించి పరిశోధనాత్మకంగా తెలుసుకోవాలంటే ఈ హెరిటేజ్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియమ్ ఒక చక్కని వేదిక. స్వాతంత్య్రానికి పూర్వం ఉన్న విమానాన్నీ ఇక్కడ చూడవచ్చు.రైలు.. టికెట్లు..రైలు రవాణా మన దేశంలో ఎప్పుడు ప్రారంభమయ్యింది, నాటి నుంచి నేటి వరకు రైలు మార్గంలో, రైలు తయారీలో వచ్చిన మార్పులు. మొదటి రైలు మార్గం ఎప్పుడు ఏర్పాటయ్యింది, ఎంత సమయం పట్టింది? వివరాలతోపాటు 1930ల నాటి రైల్వే స్టేషన్ ΄ఫ్లాట్ఫామ్ నమూనా, సెలూన్ను ఇక్కడ చూసి తెలుసుకోవచ్చు. నాటి రైలుబండి ఛాయా చిత్రాలు, ట్రెయిన్ టికెట్లు, రైల్వే సిగ్నల్స్, రైల్వే మ్యాపులను కూడా ఇక్కడ చూడవచ్చు.నీటిపైన తేలియాడే...మన దేశంలో జలమార్గంలో ఉపయోగించిన అన్ని రకాల బోట్లు, ఓడలు.. వాటి వివరాలు, చిత్రాలు, మ్యాపులను ఒక గ్యాలరీలో పొందుపరిచారు. అంతేకాదు మారుమూల గ్రామాల్లోనూ, కొండకోనల్లో ఉండే గిరిపుత్రులు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశం చేరుకోవడానికి ఉపయోగించిన రవాణా సాధనాలు, వారి జీవనశైలిలో భాగమైన విధానాన్ని ఇందులో చూడవచ్చు. భారతదేశంలో రవాణాకు ఉపయోగపడిన పూర్తి చారిత్రక సేకరణ ఇది. మొత్తం రవాణా చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని ఒకే దగ్గర తెలుసుకునే మహత్తర అవకాశంగా ఈ మ్యూజియమ్ను చెప్పుకోవచ్చు. గుర్రపు స్వారీల నుంచి మానవ పరిణామక్రమం ఎన్నిదశలుగా అభివృద్ధి చెందుతూ వచ్చిందో ఈ ట్రాన్స్పోర్ట్ మ్యూజియమ్ మన కళ్లకు కడుతుంది.ఎక్కడ ఉందంటే...బిలాస్పూర్ – తౌరు రోడ్, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ 132 ఆఫ్ ఎన్.హెచ్ 8, బిలాస్పూర్, చౌక్, తౌరు, హర్యానాసందర్శన సమయంఉదయం 10 నుంచి సాయంత్రం 7 వరకు (సోమవారం సెలవు) టికెట్ ధర: పెద్దలకు రూ. 500, పిల్లలకు రూ.250, ఫొటోగ్రాఫ్స్ తీసుకునే సౌలభ్యం ఉంది. (చదవండి: 'షోలే' మూవీని తలపించేలా ఆ వృద్ధ స్నేహితులు..!) -
'షోలే' మూవీని తలపించేలా ఆ వృద్ధ స్నేహితులు..!
మహారాష్ట్రలో ఇద్దరు వృద్ధ సహోద్యోగులు మధ్య మైత్రి బంధం చూడగానే షోలో మూవీలోని స్నేహితుల్లా కనిపిస్తారు. అచ్చం అందులో జై, వీరుల (ధర్మేంద్ర, అమితా బచ్చన్) మధ్య సాగే పాటలోని సీన్ గుర్తుకొస్తుంది. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. అసలేం జరిగిందంటే..మహారాష్ట్రలోని ఒక డిపొ నుంచి షేర్ చేసి ఒక వీడియో అందరి మనసులను హత్తుకుంది. పదవీ విరమణ చేసిన రాష్ట్ర రవాణా డ్రైవర్కు భావోద్వేగభరితమైన వీడ్కోలు చిత్రీకరించంది. ఇద్దరు వృద్ధ సహోద్యోగులు మధ్య చోటు చేసుకున్న దృశ్యం. అచ్చం యువకుల మాదిరిగా ఆ సహోద్యోగి పదవీవిరమణ చేస్తున్న తన స్నేహితుడైన బస్సు డ్రైవర్ని భుజాలపై తీసుకెళ్తున్న దృశ్యం అందర్నీ కదిలిస్తుంది. వృద్ధాప్యం మనసుకే గానీ..ఆప్యాయతను వ్యక్తం చేయడానికి కాదు అన్నట్లుగా తన సహోద్యోగిని ఎత్తుకుని వీడ్కోలు పలుకుతున్న కమనీయ దృశ్యం అందర్నీ ఆకర్షించింది. అది పనిలో తన చివరి రోజు కావడంతో, ఆ వీడ్కోలు అతను అక్కడ నిర్మించుకున్న జీవితానికి ఒక వేడుకగా మారింది. చూడటానికి చిన్న పనే అయినే ఎన్నో ఏళ్లుగా ఉన్న స్నేహబంధాన్ని, గౌరవాన్ని పంచుకున్న జ్ఞాపకాలను ప్రతిబింబించింది. అది సరిగ్గా షోలో మూవీలోని జై వీరుల ఐకానిక్ స్నేహం గుర్తు చేసింది. ముఖ్యంగా దోస్తీ పాటలో ధర్మేంద్ర అమితా బచ్చన్ భుజాలపై కూర్చునే ప్రసిద్ధ సన్నివేశం గుర్తుకు వస్తుంది. రిటైర్మెంట్ ఉద్యోగానికే కానీ, ఏర్పడిన స్నేహాలు, జ్ఞాపకాలు జీవితాంతం నిలిచిపోతాయని ఈ సన్నివేశం చెబుతోంది కదూ..!. View this post on Instagram A post shared by _VED_46_..!!❤️ (@__ved_46__) (చదవండి: ఆ సమయంలో కూడా కూతురిపై ప్రేమ తగ్గదు..!) -
వయస్సుతో పాటు పెరగాల్సిన పరిపక్వత
చాలామంది వయసు పెరుగుతుంటే భయపడతారు, సౌందర్యం తగ్గుతుందని బాధపడతారు. కానీ సైకాలజీ ప్రకారం, వయసు పెరగడం అంటే కేవలం చర్మం ముడతలు పడటం కాదు, అది మీ'పరిపక్వత' (Maturity)శిఖరాగ్రానికి చేరడం.వయసుతో పాటు మీ వ్యక్తిత్వం ఎలా ఒక 'వటవృక్షం'లా మారాలో ఈ ఆర్టికల్లో చూద్దాం.వయసు పెరగడం అనేది ఒక 'బయోలాజికల్ ప్రాసెస్' అయితే, పరిపక్వత చెందడం అనేది ఒక 'సైకలాజికల్ ఛాయిస్'. కొంతమంది 60 ఏళ్లొచ్చినా చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తారు, మరికొంతమంది 30 ఏళ్లకే ఎంతో నిలకడగా ఉంటారు. "Aging Gracefully" అంటే వయసును దాచడం కాదు, ప్రతి ఏటా మీ అనుభవంతో మీ వ్యక్తిత్వానికి కొత్త గౌరవాన్ని అద్దుకోవడం.ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతం (Integrity vs Despair)ప్రముఖ సైకాలజిస్ట్ ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం, వయసు పైబడినప్పుడు మనిషి మనసులో రెండు భావాలు ఉంటాయి:Despair (నిరాశ): "నా జీవితం వృథా అయిపోయింది, నేను ఏమీ సాధించలేదు" అని బాధపడటం.Integrity (పరిపూర్ణత): "నేను నా జీవితాన్ని అర్థవంతంగా గడిపాను, నా తప్పుల నుండి నేర్చుకున్నాను" అని తృప్తి చెందడం.మీరు'Integrity'స్టేజ్ లో ఉండాలంటే, మీ గతాన్ని మీరు ప్రేమించాలి, మీ వర్తమానాన్ని గౌరవించాలి.పరిపక్వత లక్షణాలు (Signs of Maturity)వయసుతో పాటు మీ పర్సనాలిటీలో ఈ మార్పులు రావాలి:Emotional Regulation:చిన్న చిన్న విషయాలకు ఆవేశపడటం తగ్గి, నిశ్శబ్దంగా గమనించే తత్వం పెరుగుతుంది.Detachment (నిర్లిప్తత):ప్రతి విషయంలోనూ తలదూర్చకుండా, ఏది ముఖ్యం ఏది కాదు అనే విచక్షణ జ్ఞానం వస్తుంది.Forgiveness:పాత పగలను, కోపాలను మోయడం ఆపేస్తారు. క్షమించడం అనేది ఎదుటివారి కోసం కాదు, మీ ప్రశాంతత కోసం అని అర్థం చేసుకుంటారు.మోటివేషన్ మాయ vs గ్రేస్ఫుల్ ఏజింగ్"ఎప్పుడూ యంగ్ గా కనిపించు, ముసలితనాన్ని దరిచేరనివ్వకు" అనిమోటివేషన్ మార్కెటింగ్ మాయలో పడేస్తుంది. ఇది మిమ్మల్ని మీ సహజత్వం నుండి దూరం చేస్తుంది. కానీ సైకాలజీ "నీ వయసును గౌరవించు. నీ ముడతలు నువ్వు గెలిచిన యుద్ధాలకు గుర్తులు. నీ జుట్టు రంగు నీ అనుభవానికి సాక్ష్యం" అని చెప్తుంది.వయసుతో పాటు వన్నె తగ్గకుండా..Genius Matrix Hubఫిలాసఫీ ప్రకారం, గ్రేస్ఫుల్ గా ఎదిగే మార్గం ఇది:Step 1: యవ్వనం పట్ల వ్యామోహాన్ని వదిలేయండి"నేను ముసలివాడిని అయిపోతున్నాను" అనే భయాన్ని 'Break' చేయండి. వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే. మీ మనసు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటే (Lifelong Learning), మీరు ఎప్పటికీ యంగ్ గానే ఉంటారు. మీ ఆలోచనల్లోని ముసలితనాన్ని వదిలేయండి.Step 2: Build Knowledge Sharingమీరు ఇన్నాళ్లు సంపాదించిన అనుభవాన్ని 'Build' చేయండి. దాన్ని తర్వాతి తరానికి ఎలా అందించాలో ప్లాన్ చేయండి. మీ పిల్లలకు లేదా మీ శిష్యులకు మీరు ఒక 'రోల్ మోడల్'గా నిలవాలి. మీ పరిపక్వతే మీ చుట్టూ ఉన్నవారికి ధైర్యాన్ని ఇవ్వాలి.Step 3: Spiritual Maturityశరీరం బలహీనపడుతున్నా, ఆత్మ బలంగా ఉండాలి. మరణాన్ని చూసి భయపడకుండా, ఒక అద్భుతమైన లెగసీని వదిలి వెళ్తున్నాననే తృప్తితో ఉండటమే 'Beyond' స్టేజ్. మీరు లేకపోయినా మీ సంస్కారం పదికాలాల పాటు ఉండాలి.మీరు ఎలా ఎదుగుతున్నారు?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి:1. గడిచిన పదేళ్లలో మీ ఆలోచనా విధానంలో వచ్చిన మార్పు ఏంటి? మీరు ఇంకా పాత కోపాలను మోస్తున్నారా?2. మీ కంటే చిన్నవారు మీ దగ్గరకు సలహా కోసం వస్తున్నారా?3. మీరు వయసును చూసి భయపడుతున్నారా లేక గర్వపడుతున్నారా?పాతబడే కొద్దీ విలువ పెరగాలి!పాతబడే కొద్దీ విలువ తగ్గేది వస్తువులకి మాత్రమే, మనుషులకి కాదు. ఒక పాత పుస్తకం లేదా ఒక పాత వైన్ లాగా మీ విలువ కాలంతో పాటు పెరగాలి. మీ పరిపక్వతే మీ సౌందర్యం. మీ నవ్వులో ఉండే ఆ నిశ్శబ్ద సత్యమే మీ పర్సనాలిటీకి అసలైన లెగసీ."Grow old along with me! The best is yet to be."• Robert Browningసైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: చిన్న అలవాట్లు.. పెద్ద మార్పులు) -
ఆ సమయంలో కూడా కూతురిపై ప్రేమ తగ్గదు..!
విడాకులు అనగానే మహిళల పరంగా ఒక కళంకంగా చూస్తుంది ఈ సమాజం. అటు అబ్బాయి తరుఫు వాళ్ల నుంచి సమస్యలే వచ్చినా..కూడా ఆ అమ్మాయే తప్పు చేసినట్లుగా, అభాగ్యురాలిగా చులకనగా చూస్తుంటుంది. దాని తోడు చుట్టపక్కల వాళ్ల ప్రభావంతో పుట్టింటివాళ్లు సైతం అండగా నిలబడేందుకు ముందుకు రారు. భర్త వదిలేసిన స్త్రీ పట్ల అనాదిగా ఉన్న భావనను తుడిచివేసేలా కొందరు తండ్రులు ముందుకు వస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇక్కడ ఈ తండ్రి కూడా అలానే కూతురికి అండగా నిలబడటమే గాదు ఆ క్షణాన్ని ఒక సంబరంలా సెలబ్రేట్ చేశాడు.ఈ అనూహ్య ఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లో చోటు చేసుకుంది. ప్రణిత అనే మహిళకు కుటుంబ న్యాయస్థానం నుంచి విడాకులు మంజూరు అయిన వెంటనే ఆమె తండ్రి రిటైర్డ్ జడ్జి కోర్టు ప్రాంగణం వెలుపల డబ్బులు వాయిస్తూ..మిఠాయిలు పంచుతూ ఆ క్షణాన్ని సెలబ్రేట్ చేశారు. బంధువులు డప్పుల శబ్దానికి నృత్యం చేస్తూ లడ్డూలు పంచుకున్నారు. ఈ వేడుకకు సంబంధించన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఆ వీడియోలో కుటుంబ సభ్యులు ప్రణిత ఫోటో తోపాటు "నా కూతురిని ప్రేమిస్తున్నాను. ఆమె హృదయం, ఆమెనా సర్వస్వం " అని సందేశం ముద్రించిన నల్లటి టీ షర్టులు ధరించి కనిపించారు. ప్రణిత కూడా "నా కుటుంబం, నా జీవితం" అని రాసి ఉన్న నల్లటి టీ-షర్టును ధరించింది. ఇక ప్రణిత మీరట్కు చెందిన డాక్టర్ జ్ఞానేంద్ర శర్మ ఏకైక కుమార్తె ఆమె తన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ..తాను తన వివాహాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించానని చెప్పింది. ఆమెకు 2018లో పంజాబ్లోని జలంధర్లో ప్రస్తుతం పోస్టింగ్ పొందిన భారత సైన్యంలో మేజర్ అయిన గౌరవ్ అగ్నిహోత్రితో వివాహం జరిగింది. ఆ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కాలక్రమేణా, ప్రణిత తన అత్తమామల నుంచి తీవ్రమైన వేధింపులను ఎదుర్కొంది. పరిస్థితి మరింత దిగజారడంతో, ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయం కుటుంబ న్యాయస్థానానికి చేరగా, ఆ తర్వాత కోర్టు ఆ విడాకులను ఆమోదించింది. కోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే డాక్టర్ శర్మ ఇతర కుటుంబ సభ్యులు డప్పులు, పూలమాలలు, మిఠాయిలు సిద్ధం చేసి మీరట్ జిల్లా కోర్టు బయట సంబరాలు చేసుకోవడం ప్రారంభించారు. కోర్టు ప్రాంగణంలో జరిగిన ఈ వింత ఘటన సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, శర్మ కుటుంబం ఇప్పటికే వ్యక్తిగత నష్టాన్ని చవిచూసింది. 2022లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రణిత సోదరుడు మరణించడం వారిని తీవ్రంగా ప్రభావితం చేసింది. అదే సమయంలో ప్రణిత తన అత్తగారి ఇంట్లో రోజూ వేధింపులను ఎదుర్కొంటుంటూ ఉండేది. ఈ నేపథ్యంలో ఆమెకు తండ్రి అండగా నిలిచి, తన శ్రేయస్సు కోసం ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రోత్సహించారు. విడాకులు మంజూరైన తర్వాత ఆ క్షణాన్ని నిశ్శబ్దంగా గడపకుండా, వేడుకగా జరుపుకోవాలని నిర్ణయించుకుంది.సెలబ్రేషన్స్ ఎందుకంటే..ప్రణిత తండ్రి, రిటైర్డ్ జడ్జి డాక్టర్ జ్ఞానేంద్ర శర్మ, ఈ వేడుక వెనుక గల కారణాన్ని వివరించారు. "మా కూతురు పుట్టినప్పుడు డప్పులు వాయించారు. ఒక కూతురి జీవితంలోని ప్రతి దశలోనూ ఆమె విలువ మారదని చూపించడానికి, ఈ రోజున మళ్ళీ ఇలా డప్పులతో సెలబ్రేట్ చేశాం. అని చెప్పారు.मेरठ: तलाक के बाद बेटी को ढोल-नगाड़ों के साथ घर लाए रिटायर्ड जज#Meerut pic.twitter.com/LpPhkU8aSg— NDTV India (@ndtvindia) April 5, 2026 (చదవండి: కృష్ణకాళి ఆలయాన్ని దర్శించుకున్న అనంత్-రాధిక) -
ప్రోస్టేట్ కేన్సర్ రోగుల్లో సరికొత్త ఆశాకిరణం
ఒక వ్యక్తికి ప్రోస్టేట్ కేన్సర్ వ్యాపించిందని చెప్పినప్పుడు, అతని మొదటి ప్రశ్న సాధారణంగా సమయం గురించి ఉంటుంది. “నేను ఇంకా ఎంతకాలం జీవిస్తాను?” అనేది. ఇన్నేళ్లుగా, అధునాతన ప్రోస్టేట్ కేన్సర్ చికిత్స ప్రధానంగా జీవన కాలాన్ని ఎంతవరకు పెంచగలదో అనే కోణంలో చర్చించలు జరిగాయి. కానీ ఇప్పుడు ఆ సంభాషణ విస్తరించింది, ఆశాజనకంగా మారింది. ఇప్పుడులక్ష్యం కేవలం జీవితం పొడిగించడం మాత్రమే కాదు, ఆ సమయంలో శక్తి, స్వతంత్రత, రోజువారీ జీవనవిధానాన్ని కాపాడడం కూడా.భారతదేశంలో ప్రోస్టేట్ కేన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రతి ఏడాది దాదాపు 37,948 కొత్త కేసులు నమోదవుతున్నాయి. వీటిలో గణనీయమైన శాతం కేసులు అధునాతన దశలోనే గుర్తించబడుతున్నాయి, అంటే కేన్సర్ ఇప్పటికే శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించి ఉంటుంది. కాలక్రమేణా, చాలామందిలో “కాస్ట్రేషన్ రెసిస్టెంట్ ప్రోస్టేట్ కేన్సర్” అభివృద్ధి చెందుతుంది, అంటే సాధారణ హార్మోన్ చికిత్సకు స్పందించకుండా వ్యాధి ముందుకు సాగుతుంది.ప్రోస్టేట్ కేన్సర్ ఎలా పెరుగుతుందో అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈ కేన్సర్ కణాలు ప్రధానంగా టెస్టోస్టెరోన్ అనే పురుష హార్మోన్పై ఆధారపడి పెరుగుతాయి. అందుకే, ఆండ్రోజెన్ డిప్రైవేషన్ థెరపీ (ADT) — అంటే శరీరంలో టెస్టోస్టెరోన్ స్థాయిని తగ్గించే చికిత్స — ఇప్పటివరకు ప్రధాన చికిత్సగా ఉపయోగించబడింది. ఇది కేన్సర్ పెరుగుదలను నెమ్మదింపజేస్తుంది, లక్షణాలను నియంత్రిస్తుంది.అయితే, కొన్ని సందర్భాల్లో టెస్టోస్టెరోన్ స్థాయులు తగ్గినా కూడా కేన్సర్ కణాలు “ఆండ్రోజెన్ రిసెప్టర్పాథ్వే”ను సక్రియం చేసి పెరుగుతూనే ఉంటాయి. ఆండ్రోజెన్ రిసెప్టర్ అనేది కణంలో ఉండే ఒక ప్రోటీన్, ఇది హార్మోన్ సంకేతాలను స్వీకరించి కణానికి పెరగమని సూచిస్తుంది. ఈ పరిస్థితిలో వ్యాధి కొనసాగితే దాన్ని కాస్ట్రేషన్ రెసిస్టెంట్ ప్రోస్టేట్ కేన్సర్ అంటారు.గత దశాబ్దంలో చికిత్సలో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. కేవలం హార్మోన్ స్థాయులనుతగ్గించడం కాకుండా, ఇప్పుడు “ఆండ్రోజెన్ రిసెప్టర్ పాథ్వే ఇన్హిబిటర్స్” అనే కొత్త ఔషధాలు ఉపయోగిస్తున్నారు. ఇవి కేన్సర్ కణాల్లో జరిగే పెరుగుదల సంకేతాలను నేరుగా అడ్డుకుంటాయి. ఇవిADT తో కలిపి ఉపయోగించినప్పుడు మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి. మెటాస్టాటిక్ హార్మోన్ సెన్సిటివ్ ప్రోస్టేట్ కేన్సర్ పై నిర్వహించిన క్లినికల్ అధ్యయనాలు చూపుతున్నాయి.ఈ రెండు చికిత్సల కలయిక వ్యాధి పురోగతిని గణనీయంగా ఆలస్యం చేస్తుంది. అంతేకాకుండా, కాస్ట్రేషన్ రెసిస్టెంట్ దశకు చేరే సమయాన్ని కూడా వాయిదా వేస్తుంది. ముఖ్యంగా ఎముకలకు వ్యాపించినప్పుడు వచ్చే నొప్పి కూడా ఆలస్యంగా వస్తుంది.ఇవి చాలా ముఖ్యమైన ఫలితాలు. ఎందుకంటే వ్యాధి పురోగతిని ఆలస్యం చేయడం అంటే లక్షణాలను నియంత్రిస్తూ, రోజువారీ జీవనాన్ని సజావుగా కొనసాగించే సమయం ఎక్కువగా లభించడం. చాలామందికి ఇది చలనశీలతను కాపాడుకోవడం, కుటుంబంతో సమయం గడపడం, సాధారణ కార్యకలాపాలను కొనసాగించడం వంటి ప్రయోజనాలను అందిస్తుంది.ఈ కొత్త చికిత్సల మరొక ముఖ్యమైన అంశం వాటి సహన శక్తి (tolerability). అధునాతన కేన్సర్చికిత్సలో తరచుగా కనిపించే అలసట వంటి సమస్యలు తక్కువగా ఉంటాయి. వృద్ధాప్యంలో ఉన్న రోగులకు, ముఖ్యంగా డయాబెటిస్ లేదా గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి, ఈ సమతుల్యత చాలా ముఖ్యం. కెమోథెరపీ అవసరం లేకుండా మంచి ఫలితాలను ఇస్తున్న ఈ కలయిక చికిత్సలు, తీవ్రమైన చికిత్సలకు అనుకూలం కానీ రోగులకు ఒక మంచి ప్రత్యామ్నాయం.భారతదేశం గ్లోబల్ క్లినికల్ రీసెర్చ్లో పాల్గొనడం కూడా పెరుగుతోంది. అంతర్జాతీయ పరిశోధనల్లో భారతీయ రోగుల భాగస్వామ్యం, చికిత్సల ప్రభావాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడంలో సహాయపడుతోంది. ప్రాక్టీస్లో ఆధారిత చికిత్సలను అమలు చేయడానికి దోహదం చేస్తోంది.అధునాతన ప్రోస్టేట్ కేన్సర్ ఒక తీవ్రమైన నిర్ధారణ అయినప్పటికీ, ఇప్పుడు దీనిని ఒక దీర్ఘకాలిక వ్యాధిగా నిర్వహిస్తున్నారు. ఈరోజు చికిత్స లక్ష్యం—రోజువారీ జీవనంపై కనిష్ట ప్రభావంతో వ్యాధిని నియంత్రించడం. ఈ వ్యాధిని ఎదుర్కొంటున్న పురుషులు, వారి కుటుంబాల కోసం, వైద్యుడితో సమాచార ఆధారిత, ముందస్తు చర్చ చాలా ముఖ్యమైనది. అందుబాటులో ఉన్న చికిత్సలను అర్థం చేసుకోవడంద్వారా, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చికిత్సను రూపొందించుకోవచ్చు. చికిత్స క్లినికల్ ఆధారాలతో పాటు వ్యక్తిగత లక్ష్యాలకు అనుసంధానమైనప్పుడు, జీవితం కేవలం పొడిగించడమే కాకుండా, దాన్ని మెరుగైన విధంగా గడపడం కూడా సాధ్యమవుతుంది.డాక్టర్ పాలంకి సత్య దత్తాత్రేయ, సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్రెనోవా సౌమ్య కేన్సర్ సెంటర్, కర్కాణా, హైదరాబాద్(చదవండి: ఈ తాత అందరికీ స్ఫూర్తి..! 90 ఏళ్ల వయసులో అంత ఫిట్గానా..) -
కృష్ణకాళి ఆలయాన్ని దర్శించుకున్న అనంత్-రాధిక
అనంత్, రాధికా అంబానీ హెలికాప్టర్లో మహారాష్ట్రలోని నేరల్కు చేరుకుని అక్కడ కృష్ణ కాళి ఆలయాన్ని సందర్శించుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఆయన పుట్టిన రోజు వేడుకులకు ముందు అనంత్ రాధికలు ఈ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ నెల ఏప్రిల్ 10న అనంత్కు 31 ఏళ్లు నిండనున్నాయి. పూజ అనంతరం ఆలయంలో ఆవులకు అన్నదనం చేసి, గోసేవ కూడా చేశారు. ఆ తర్వాతక రాధిక అంబానీ భక్తులను పలకరిస్తూ..మిఠాయిల, దుస్తులు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణ కాళి అమ్మవారి ప్రాశస్త్యం గురించి సవివరంగా తెలుసుకుందామా..!. View this post on Instagram A post shared by Deepender Thakur (@deepender_thakur)కృష్ణుడు, కాళి మాత ఒక్కరేనా..బృందావనంలో ఉండే కృష్ణుడు, కాళీ దేవి ఒక్కరేనా అంటే..ఒక్కరేనే చెబుతున్నాయి పురాణాలు. కృష్ణకాళిగా, కృష్ణ స్వరూప కాళిగా అమ్మవారి ఆరాధన కనిపిస్తుంది కలకత్తా, పశ్చిమబెంగాల్లో బాగా కనిపిస్తుంది. అందుకు ఒక పురాణ గాధ కూడా ఉంది. యశోద సోదరుడు శతగోపుడు. ఆయన భార్య రాధ (బృందావనేశ్వరి, గోలోక నాయిక అయిన రాధాదేవి వేరు. కృష్ణుని మేనమామ భార్య పేరు కూడా రాధ. అందుకే చాలా మంది రాధ అంటే కృష్ణుని మేనత్త అనుకుంటారు. కానీ ఆమె వేరు. ఆ స్వామి ప్రాణాధిక అయిన రాధాదేవి వేరు). ఆమె చిన్నప్పుడు కృష్ణుని ఎత్తుకొని పెంచింది. చిన్నికృష్ణుని సౌందర్యాన్ని ఆరాధించింది. ఆయన అనుగ్రహం పొందింది. అందుకే కృష్ణుడు ఆమె కోసం యువకుడిగా మారి విహరిస్తూ ఉండేవాడు. అది చూసి కొందరు శతగోపునికి ఆ విషయం చెప్పారు. ఒకసారి రాధతో కృష్ణుడు ఉన్నప్పుడు కొంతమంది శతగోపుని అక్కడికి తీసుకెళ్లారు. అక్కడకు వెళ్లి చూస్తే.. రాధాదేవి కాళీ దేవి విగ్రహాన్ని పూజిస్తున్నట్టుగా కనపడింది. దీంతో వారంతా ఆశ్చర్యపోయి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అందరూ వెళ్లిన తర్వాత కాళీదేవి విగ్రహం కృష్ణునిగా మారిపోయింది. శతగోపుని రాకను గుర్తించిన కృష్ణుడు రాధను రక్షించడం కోసం అలా కాళిగా మారాడు. ఈ కథ బృందావన గాథలలో చాలా ప్రసిద్ధమైనది. అలాగే.. నరకాసురుని జీవితంలో కూడా కాళీదేవి ప్రధాన పాత్రగా కనిపిస్తున్నది.నరకుని ఆరాధ్య దైవం కామాఖ్య కాళి. ఆమెను ఆరాధించి ఆమె అనుగ్రహం పొంది ఎన్నో అద్భుతమైన శక్తులు సాధించాడతడు. కానీ.. అతడు అధర్మబద్ధమైన సాధనలు చేయడం వల్ల కాళీ దేవి అతడి వద్ద నుంచి వెళ్లిపోయింది. ఎంత ప్రయత్నించినా ఆ తల్లి నరకునికి కనిపించలేదు. నరకుని మరణ సమయంలో మాత్రం.. కృష్ణుడిలో కాళి కనిపించింది. అధర్మాన్ని నశింపజేయడానికి అలా కృష్ణ కాళిగా వచ్చి నరకుని సంహరించిందన్నమాట. కృష్ణ కాళిగా అమ్మవారిని భక్తితో, ప్రేమ భావనతో పూజిస్తే ఆమె కృష్ణ స్వరూపిణిగా, ప్రేమ స్వరూపిణిగా, కృష్ణునిగా అనుగ్రహిస్తుంది. బృందావనంలో ప్రవేశించిన ఎందరో సిద్ధులు కృష్ణుడే కాళి అని తెలుసుకుని కృష్ణ కాళిగా పూజించి అనుగ్రహం పొందారు.(చదవండి: ఈ తాత అందరికీ స్ఫూర్తి..! 90 ఏళ్ల వయసులో అంత ఫిట్గానా..) -
ఈ తాత అందరికీ స్ఫూర్తి..! 90 ఏళ్ల వయసులో అంత ఫిట్గానా..
20, 30 లేదా 40 ఏళ్ల వయసులో ఉండి వ్యాయామం చేయాలంటే రకరకాల సాకులు చెబుతూ స్కిప్ చేస్తుంటారు. కొన్ని రోజులు మొక్కుబడిగా చేసి..మళ్లీ యథావిధిగా మానేస్తుంటారు. అలాంటివాళ్లు ఈ 90 ఏళ్ల వృద్ధుడిని చూస్తే కచ్చితంగా కనువిప్పి కలుగుతుంది, దృక్పథం కూడా మార్చుకోవచ్చని చెబుతున్నారు ఆ తాతగారి వ్యక్తిగత ఫిట్నెస్ ట్రైనర్. తేలికపాటి వ్యాయామాలు చేసే వయసులో యువకులకు పోటీ ఇచ్చేలా ఆయన చేసే స్ట్రెంగ్త్ వ్యాయామాలు చూస్తే కచ్చితంగా విస్తుపోతారు. ఇంతకీ ఎవరా తాతగారు..?, అతని ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో చూద్దామా..!.ఆ తాతగారి వ్యక్తిగత ఫిట్నెస్ ట్రైనర్ అయిన జెన్నిఫర్ మార్టిన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయన గురించి చెప్పుకొచ్చింది. ఆ వీడియోలో చాలామంది మంచం నుంచి లేవడానికి ఇబ్బంది పడే తొమ్మిది పదుల వయసులో స్వతంత్రంగా బతకాలనే ఆశయం, కఠోర శ్రమ ఫలితమే అతడి స్ట్రాంగ్ ఫిట్నెస్ సీక్రెట్ అని చెబుతోందామె. ఆమె వయసు పైబడటం సమస్య కాదని అంటోంది, బలం కోల్పోవడమే సమస్య. దీర్ఘాయువుకి కండరాలే కీలకం. ఆ విషయంలోనే ఈ తాతాగారు చాలా కేర్ఫుల్గా ఉంటారు. సవంత్సరాల తరబడి చేసిని నిరంతర వర్కౌట్లు..ఆయన్ని ఇంతలా బలంగా ఫిట్గా ఉండేలా చేశాయి. నిజానికి ఆయనకు 90 ఏళ్లు అంటే ఎవ్వరు నమ్మలేరు.పైగా ఆయన ఫిట్నెస్ దినచర్యలో ఏ యువకుడికైన గట్టి పోటీ ఇచ్చేలా చేయగలరు కూడా. ఆయన ఒంటరిగానే జిమ్కి వెళ్తారని, వారంలో మూడు రోజులు జిమ్కి కేటాయిస్తారని చెబుతోంది. ఆయన ఫుల్లింగ్ వ్యాయామాల దగ్గర నుంచి ట్రెడ్మిల్పై పరుగెత్తడం, క్లైంబింగ్ వర్కౌట్లను ఆస్వాదించడం వరకు అన్నింటిని చేస్తారు. మెషీన్లు, డంబెల్స్ను ఉపయోగించి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటివి కూడా చేస్తారాయన. ఈ వ్యాయామ దినచర్య కేవలం దీర్ఘాయువు కోసం కాదని, తుంటి మార్పిడి శస్త్ర చికిత్స నుంచి కోలుకోవడానికి కూడా సహాయపడిందని చెప్పుకొచ్చింది. శస్త్రచికిత్సకు ముందే ఆ వ్యక్తి శారీరకంగా చురుకుగా ఉంటూ, వ్యాయామం చేస్తుండటం వల్ల, ఇతర రోగుల కంటే వేగంగా కోలుకోగలిగారని చెప్పుకొచ్చింది. నెటిజన్లు సైతం ఆయన వ్యాయామాలకు సంబంధించిన వీడియోలను చూసి..ఆ వయసుల పట్టుదలను అభినందించడమే గాక..ఇది నిజంగా అద్భుతం అని కొనియాడారు. View this post on Instagram A post shared by JEN | Personal Trainer | Functional Movement & Longevity (@jennifermartinnn) (చదవండి: నాడు జేఈఈ ఫెయిల్యూర్ ఇవాళ ఏకంగా యూట్యూబ్లో..!) -
అశ్వత్థామ హతః ధర్మరాజు చెప్పిన అబద్ధం
అలనాటి ద్వాపర యుగంలో జరిగిన మహాభారతంలో ధర్మరాజు పాండవులలో పెద్దవాడు. యమధర్మరాజు అంశతో కుంతీదేవికి జన్మించినవాడు. ధర్మకోవిదుడు, నీతిపరుడు, సత్యవంతుడు... ఇన్ని సుగుణాలు కలిగిన ధర్మరాజు అబద్ధం ఆడాడా..?? అంటే నమ్మశక్యంగా ఉండదు. కానీ ఆపద్ధర్మం కోసం శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో అబద్ధం ఆడించాడు. లేకుంటే పాండవ వంశానికే ప్రమాదం వచ్చి ఉండేది. మహాభారత యుద్ధంలో పాల్గొన్న వ్యక్తులు అతిరథ మహారధులని చెప్పుకోవచ్చు. వారిలో అశ్వత్థామ ఒకరు. అశ్వత్థామ మహారథి కోవకు చెందుతాడు. యుద్ధరంగంలో అడుగుపెట్టాడంటే ఏకకాలంలో ఏడు లక్షల 20 వేల మందితో యుద్ధం చేయగలడు. కౌరవ సర్వ సైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుని కుమారుడు.ద్రోణాచార్యుడు, కృపి దంపతులకు పరమేశ్వరుడి వరప్రసాదంగా జన్మించిన వాడే అశ్వత్థామ. అశ్వత్థామ పుట్టినప్పుడు ఏడ్చిన ఏడుపు గుర్రం అరుపులా ఉండడంతో ఆ బాలునికి అశ్వత్థామ అని పేరు పెట్టారని, మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అశ్వత్థామ నుదుటిపై శివుని మూడో కన్నులా అనిపించే ఒక దివ్యమైన మణి ఉండటం వల్ల అశ్వత్థామకు ఏ ఆయుధం వల్ల కానీ, ఎవరి వల్ల కానీ భయం, పరాజయం ఉండవని వరం.. కౌరవ సర్వ సైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుడు మహాభారత యుద్ధంలో వీరవిహారం చేస్తూ పాండవ సైన్యాన్ని మట్టు పెడుతున్న సమయంలో ద్రోణాచార్యుని నిలువరించేందుకు ధర్మరాజుచే శ్రీ కృష్ణుడు అబద్ధం చెప్పిస్తాడు. ఎంతో సత్యవంతుడైన ధర్మరాజు చెప్తేనే అబద్ధాన్ని సైతం నిజమని నమ్ముతాడు ద్రోణాచార్యుడు. తాను అబద్దమాడనని ధర్మరాజు చెప్పినప్పటికీ ఆపద్ధర్మం కోసం అబద్ధమాడితే తప్పులేదని, శ్రీ కృష్ణు్ణడు ధర్మరాజుకు బోధించడంతో అయిష్టంగానే ధర్మరాజు అంగీకరిస్తాడు. ద్రోణాచార్యునికి వినబడేటట్లు అశ్వద్ధామ హతః... కుంజరహః అన్న సమయంలో కుంజరహః అనే మాట ద్రోణాచార్యునికి వినబడకుండా యుద్ధభేరీలు మోగించేటట్లు పథకం రూపొందించాడు శ్రీ కృష్ణుడు. ధర్మరాజు అన్న అశ్వత్థామ హతః అనే మాటను విన్న ద్రోణాచార్యుడు నిజంగానే తన కుమారుడైన అశ్వత్థామ మరణించాడని భావించి అస్త్ర సన్యాసం చేశాడు. ఇదే అదునుగా భావించిన ధృష్ట్యద్యుమ్నుడు ద్రోణాచార్యుల తలనరికి అంతమొందిస్తాడు.కాగా ధర్మకోవిదుడైన ధర్మరాజు ఒక చిన్నపాటి అబద్ధం ఆడటం వల్ల అప్పటివరకు మహాభారత యుద్ధంలో ధర్మరాజు పయనించిన రథం భూమికి నాలుగు అంగుళాలు పైన వెళ్లేదని, ఈ చిన్న అబద్ధం ప్రభావం వల్ల ధర్మరాజు రథం నేలను తాకిందని, మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు ఒకేఒక్కసారి నరకలోకాన్ని సందర్శించవలసి వచ్చిందని, ఆపై నేరుగా స్వర్గానికి వెళ్ళాడనే మరో కథనం కూడా వ్యాప్తిలో ఉంది.కాగా ప్రస్తుత కలియుగంలో అశ్వత్థామ హతః కుంజరహః అనే మాటను రాజకీయ నాయకులు ఎక్కువగా ప్రచారంలో వినియోగిస్తున్నారు. అంటే వారు ప్రజలకు ఇచ్చే హామీలలో కొన్ని మాత్రమే వినిపించేలా మిగిలినవి మెల్లగా చెప్తున్నప్పుడు ఈ నానుడిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.– సి. ఎన్. మూర్తి, సీనియర్ జర్నలిస్ట్ -
డోలీ
అదొక చిన్న మండల కేంద్రం. దానికి కూత వేటు దూరంలో ఒక పల్లెటూరు ఉంది. ఆ ఊర్లో గులాబీ తోటలున్నాయి. ఆ తోటల యజమానుల నుంచి గులాబీలు తీసుకుని మండల కేంద్రానికి వెళ్ళి పూలమ్ముతుంది ఓ ముసలవ్వ.ఆ మండల కేంద్రంలో ఒక గ్రామీణ బ్యాంకు ఉంది. రిటైర్ మెంట్ కు దగ్గరున్న ఓ మహిళా మేనేజర్ ఆ బ్యాంకుకు బదిలీ మీద వచ్చింది. నెత్తి మీద గంప పెట్టుకుని ఇంటింటికీ వెళ్ళి పూలమ్మే అవ్వ ఆ రోజు బ్యాంకు మేనేజర్ ఇంటికి వెళ్ళింది. పూలు తీసుకొమ్మని అడిగింది. పూలు తీసుకునే సమయంలో అవ్వ, ‘కొత్తగా వచ్చిన బ్యాంకు మేనేజర్ ఆమే’ అని తెలుసుకుంది.‘నాకు పదివేలు అప్పు కావాలి, నా దగ్గర కుదవ పెట్టడానికి ఏమీ లేదు. మీ బ్యాంకు నన్ను నమ్మి అప్పు ఇస్తుందా?’ అని అడిగింది. ‘అప్పు చేయాల్సిన అవసరం నీకేమి వచ్చింది?’ అని అడిగింది మేనేజర్. ‘నా వయసు డెబ్భై ఏళ్ళు. నాలుగేళ్ళుగా శబరిమలై వెళ్తున్నాను. కొండ ఎక్కడం ఇన్నాళ్ళూ సాధ్యమయ్యింది. ఈసారి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కొండ ఎక్కడం అసాధ్యమనిపిస్తోంది. ఎలాగైనా ఈసారి కూడా స్వామిని చూడాలని కోరికగా ఉంది. కాబట్టి పంబ నదినుంచి సన్నిధానం వరకు డోలీలో వెళ్ళాలనుకుంటున్నాను. నలుగురు మగ మనుషులు నన్ను మోయాలి కదా. దానికి కనీసం పదివేల రూపాయల అవసరం ఉంటుంది. నేను దాచిపెట్టుకున్న డబ్బు ప్రయాణానికి మాత్రమే సరిపోతుంది. మీరు మేనేజర్ కాబట్టి నాకెలాగైనా సహాయం చేయండి. మీ ఋణం పెట్టుకోను. నాకు రావాల్సిన డబ్బు రెండు నెలల్లో వస్తుంది. వెంటనే తీర్చేస్తాను’ అని వేడుకుంది.ఆ అవ్వ భక్తి భావానికి మేనేజర్ ఆశ్చర్యపోయింది. చిన్నగా తేరుకుని ‘నాక్కూడా చాన్నాళ్ళుగా శబరిమలై వెళ్ళాలని ఉంది. స్వామి దర్శనం చేసుకోవాలని ఉంది. కొండపైకి నడిచి వెళ్ళే శక్తి నాకుంది. నువ్వు ఇప్పటికే నాలుగేళ్ళుగా శబరిమలై వెళ్తున్నావు కాబట్టి ఎలా వెళ్ళాలో, ఎప్పుడు వెళ్ళాలో నీకు బాగా తెలుసు. ఆ దీక్షకు కొన్ని కట్టుబాట్లు, నియమాలు ఉంటాయి కదా. ఆ విషయంలో నాకు సహకరించు. ఒకరికొకరు తోడుగా వెళ్ళి వద్దాం. నీ డోలీ డబ్బులు నేను కడుతాను. అప్పు ఆలోచన పక్కన పెట్టేయ్’ అని బదులిచ్చింది. ఆ ముసలవ్వ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మేనేజర్కి ఇవ్వాల్సిన పూలకంటే మరి కొన్ని పూలు అదనంగా ఇచ్చి నమస్కరించి అక్కడినుంచి కదిలింది. నెల తర్వాత వచ్చిన కార్తీక మాసంలో ఇద్దరూ నల్ల వస్త్రాలు ధరించి ‘స్వామియే శరణం అయ్యప్ప’ అని పలుకుతూ కొట్టాయం రైలెక్కారు. – ఆర్సి. కృష్ణస్వామి రాజు -
వైరాగ్యం ఆధ్యాత్మికతకు ఆసరా
ఆధ్యాత్మిక పథంలో పయనించే ప్రతి సాధకుడికి ‘వైరాగ్యం’ అనేది ఒక బలమైన పునాది. సాధారణంగా లోకంలో వైరాగ్యం అంటే అన్నింటినీ వదిలేసి వెళ్ళిపోవడం అని పొరబడుతుంటారు. కానీ, నిజమైన వైరాగ్యం అంటే వస్తువులను వదలడం కాదు, వస్తువుల పట్ల ఉన్న ‘మమకారాన్ని’ లేదా ‘ఆసక్తిని’ వదలడం. ఒక చిన్న పిల్లవాడు బొమ్మలతో ఆడుకుంటాడు, కానీ పెద్దయ్యాక వాటిని వదిలేస్తాడు. అది బొమ్మల మీద కోపంతో కాదు, వాటికంటే విలువైనది ఏదో తెలిసిందనే అవగాహనతో. ఆధ్యాత్మిక వైరాగ్యం కూడా అటువంటిదే.వైరాగ్యం అంటే ‘రాగ రహిత స్థితి’. మనసు దేనినైనా చూసి ఆకర్షింపబడితే దానిని ‘రాగం’ అంటారు. ఆ ఆకర్షణ వల్ల కలిగే బంధం నుండి మనసును విముక్తం చేయడమే వైరాగ్యం. ఇది విరక్తి కాదు, ఒక రకమైన పరిణతి. ఇంద్రియ విషయాల నుండి మనసును మళ్ళించడానికి చేసే ప్రాథమిక ప్రయత్నం (యతమాన సంజ్ఞ ), కొన్ని విషయాల మీద నియంత్రణ సాధించి, కొన్నింటిపై ఇంకా పట్టు కోల్పోని స్థితి (వ్యతిరేక సంజ్ఞ), బాహ్యంగా కోరికలు లేకపోయినా, మనసులో మాత్రం సూక్ష్మంగా ఆ కోరికలు మిగిలి ఉండటం(ఏకేంద్రియ సంజ్ఞ). ఇక నాలుగోది ‘వశీకార సంజ్ఞ’ అత్యున్నత స్థితి. ఇక్కడ మనసు పూర్తి నియంత్రణలో ఉంటుంది. ఏ బాహ్య వస్తువూ మనసును చలింపజేయదు.సంస్కృతంలో ‘రాగ’ అంటే రంగు లేదా ఆకర్షణ అని అర్థం. ‘వైరాగ్య’ అంటే ఆ ఆకర్షణ లేని స్థితి. నీటిలో ఉన్నా కూడా తామర ఆకుకు నీరు అంటనట్లుగా, సంసారంలో ఉంటూనే దేనికీ అతిగా బందీ కాకుండా ఉండటమే వైరాగ్యం. సాధారణంగా వైరాగ్యాన్ని రెండు స్థాయులలో చూడవచ్చు. ప్రాపంచిక విషయాల వల్ల కలిగే దుఃఖాన్ని చూసి లేదా భయం వల్ల కలిగే తాత్కాలిక వైరాగ్యం (ఉదాహరణ – శ్మశాన వైరాగ్యం). ఇది ఎక్కువ కాలం నిలవదు. పర వైరాగ్యం అత్యున్నతమైనది. ఆత్మజ్ఞానం వల్ల, సత్యాన్ని గ్రహించడం వల్ల కలిగే స్థిరమైన స్థితి. ప్రపంచంలోని ఏ వస్తువూ శాశ్వతం కాదని గ్రహించినప్పుడు ఇది కలుగుతుంది.వైరాగ్యం సిద్ధించాలంటే రెండు ముఖ్యమైన పద్ధతులు అవసరమని భగవద్గీత చెబుతోంది. ‘అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే’. ఏది నిత్యం (శాశ్వతం), ఏది అనిత్యం (తాత్కాలికం) అని వేరు చేసి చూసే తెలివితేటలు. మనసుని పదే పదే ప్రాపంచిక కోరికల నుండి మళ్ళించి, అంతరాత్మ వైపు తిప్పుకోవడం. దేని మీద ఆశ లేనప్పుడు, అది దక్కలేదనే మానసిక ప్రశాంతత, కోల్పోతామనే భయం లేకపోవడం వైరాగ్యం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు.వైరాగ్యం అనేది ఒక మందు వంటిది. అది సంసార వ్యాధిని నయం చేసి, మనిషిని తన నిజ స్వరూపమైన ఆనందం వైపు నడిపిస్తుంది. జీవితాన్ని త్యజించడం వైరాగ్యం కాదు, జీవితాన్ని సరైన దృక్పథంతో దర్శించడమే నిజమైన వైరాగ్యం. జీవితం పట్ల సరైన అవగాహన. ఒక పక్షి పండును తింటున్నప్పుడు ఆ రుచికి బానిస కావచ్చు. కానీ మరొక పక్షి అదే చెట్టు మీద ఉండి, పండును తినకుండా కేవలం చూస్తూ సాక్షిగా ఉంటుంది. ఈ ‘సాక్షి భూత’ స్థితిలో ఉండటమే వైరాగ్యానికి సంకేతం. భగవద్గీత ప్రకారం వైరాగ్యం అంటే పనులను వదలడం కాదు, ఫలాపేక్షను వదలడం. వైరాగ్యం వల్ల మనిషికి నిర్భయత్వం కలుగుతుంది. ‘వైరాగ్యమేవ అభయం’ అని భర్తృహరి సుభాషితం చెబుతోంది. భోగంలో రోగ భయం ఉంటుంది, కులంలో పతనం ఉంటుందనే భయం ఉంటుంది, ధనంలో రాజుల భయం ఉంటుంది.. కానీ వైరాగ్యంలో మాత్రం ఎటువంటి భయం ఉండదు. ఇది మనిషికి సంపూర్ణ స్వేచ్ఛను ఇస్తుంది. వైరాగ్యం అంటే కేవలం బాహ్య ప్రపంచాన్ని లేదా బాధ్యతలను వదిలేసి అడవులకు వెళ్లడం కాదు. ఇది మనసుకి సంబంధించిన ఒక స్థితి. వస్తువుల మీద, వ్యక్తుల మీద లేదా ఫలితాల మీద ఉండే అతివ్యాప్తిని వదిలివేయడమే నిజమైన వైరాగ్యం.– ఆనంద ‘మైత్రేయ’మ్ -
నాడు జేఈఈ ఫెయిల్యూర్ ఇవాళ ఏకంగా యూట్యూబ్లో..!
ఐఐటీ జేఈఈలో ఫెయిల్ అయ్యి యూట్యూబ్లో ఉద్యోగం సంపాదించే రేంజ్కు చేరుకున్న జర్నీని సోషల్ మీడియా వేదిక షేర్ చేసుకున్నాడు ఓ భారత సంతత వ్యక్తి. అందుకు ఇద్దరు మహిళలు కారణమంటూ తన కథను పంచుకున్నాడు. అతడి కథ ప్రతిఒక్కరిని కదలించింది. హ్యూమన్స్ ఆఫ్ బాంబే' అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకున్న పోస్ట్లో అభిజయ్ అరోరా అనే వ్యక్తి తన కథను షేర్ చేసుకున్నారు. తన తల్లి ప్రభుత్వ ఉద్యోగిగా నగరాలు మారుతూ..తనను, తన చెల్లిని ఎలా పెంచిందో గుర్తుచేసుకున్నారు. సింగిల్ మదర్గా ఆమె పడ్డ కష్టం మర్చిపోలేనంటున్నాడు. కేజీ తరగతుల నుంచి ఐఐటీ ప్రవేశ పరీక్ష వరకు ప్రతి దశలోనూ తన తల్లి తనకు ఎలా సహాయం చేసిందో గుర్తు చేసుకున్నాడు. జేఈఈ టైంలో తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి టీ పెట్టి ఇచ్చేదని అన్నారు. అంతలా ఆమె కష్టపడ్డా..ఫెయిల్ అవ్వడంతో తన ఆశయాలన్నీ నీరుగారిపోయాయని బాధగా చెప్పుకొచ్చాడు. నిజానికి ఆ ఓటమి అమ్మ త్యాగాలకి చేసిన ద్రోహంగా అనిపించేది, అందుకే మరో మార్గంలో ఎలాగైన సక్సెస్ అందుకోవాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యానని రాసుకొచ్చాడు పోస్ట్లో. ఐఐటీ బెంగళూరులో హ్యాకథాన్లో గెలిచి మలేషియాలో ఉద్యోగం సంపాదించినట్లు చెప్పుకొచ్చాడు. బాగా సంపాదిస్తున్నప్పటికీ అదంత సంతృప్తినివ్వకపోవడంతో గూగుల్లో పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆరోరా పంచుకున్నాడు. తన అవకాశాలను మెరుపరుచుకోవడానికి ఐవీ లీగ్ ఎంబీఏ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు. ఐఐటి నేపథ్యం లేకుండా హార్వర్డ్ అసాధ్యమని కన్సల్టెంట్లు నవ్వారని నాటి పరిస్థితిని జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. ఆ సందేహాలన్నింటిని పక్కనపెట్టి తన కలను సాకారం చేసుకోవడానికి రూ. కోటి రూపాలయ రుణం తీసుకున్నాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగం కోసం పెద్ద పోరాటమే చేశానంటున్నాడు. ఉద్యోగం సంపాదించడానికి, దేశం విడిచి వెళ్లిపోవడానికి తన వద్ద 90 రోజుల సమయమే ఉన్న క్లిష్టతరమైన ఉద్యోగ మార్కెట్ని ఎదుర్కొన్నట్లు తెలిపాడు. తాను వారానికి వంద ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా..జాబ్ సంపాదించలేకపోయానని చెప్పుకొచ్చాడు. అప్పుడే తన జీవితానికి రెండో ఆధారంగా తన భార్య రంగప్రవేశం చేసిందని చెప్పుకొచ్చాడు. తనను నిరుద్యోగిగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని, కొండంత తిరస్కరణల నడుమ అండగా నిలబడి తన కుటుంబాన్ని ఒంటరిగా పోషించిందని రాసుకొచ్చాడు పోస్ట్లో. ఆమెకు తనపై ఉన్న నమ్మకమే తనను ఆవిష్కరణలు చేసేలా పురికొల్పిందని పేర్కొన్నాడు. అంతేగాదు అరోరా తన రెజ్యూమ్ని మెరుగుపరుచుకోవడానికి ఒక ఏఐ ఆధారిత సాధానాన్ని రూపొందించి ఉద్యోగ దరఖాస్తులకు సంబంధించిన కంటెంట్ను పంచుకోవడం ప్రారంభించారు. చివరికి అరోరా చేసిన పని గూగుల్ దృష్టిని ఆకర్షించింది. అలా ఆయన గూగుల్లో యూట్యూబ్లో ప్రొడక్ట్ మేనేజర్ జాబ్ పొందారు. ఆ ఫ్లాట్ఫాంలో ఆరు లక్షలకు పైగా ఫాలోవర్లతో ఒక కమ్యూనిటీనే ఏర్పరుచుకున్నట్లు వెల్లడించారు. ఆయన ఏఐ రంగంలోని సిలికాన్ వ్యాలీ నాయకులతో ఒక పాడ్కాస్ట్ను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతేగాదు తన తల్లిన కూడా గూగుల్ కార్యాలయానికి తీసుకువెళ్లానని పంచుకున్నారు. తన డెస్క్ గోడలపై యూట్యూబ్ లోగోని కన్నీళ్లతో అమ్మ తన వంక గర్వంగా చూసిన క్షణం మర్చిపోలేనంటూ భావోద్వేగంగా రాసుకొచ్చాడు. ఆ క్షణంలో తాను ఎదుర్కొన్న తిరస్కారాలు, నిద్రలేని రాత్రల కష్టం ఫలించదన్న ఆనందం కలిగిందన్నారు. తన విజయవంతమైన జర్నీని వివరిస్తూ..ప్రతి విజయవంతమైన పురుషుడి వెనుక ఒక మహిళ ఉంటుందని అంటుంటారు. కానీ తనకు ఇద్దరు మహిళలు ఉండటం అదృష్టం అని రాసుకొచ్చాడు. తనకు ఆరంబాన్ని ఇవ్వడం కోసం సర్వ త్యాగం చేసిన తల్లి, అలాగే తన ప్రస్థానాన్ని పూర్తి చేయడానికి సర్వ పణంగా పెట్టిన భార్య, ఈ ఇద్దరు లేకపోతే తాను లేనని అన్నారు. "ఈ కథ హృదయానికి హత్తుకునేలా ఉంది. నిజానికి విజయం కష్టానికి ప్రతిఫలమే అయినా..దాని వెనుకు మన ప్రియమైన వ్యక్తుల నిశబ్ద బలం, త్యాగం, ప్రోత్సహం కచ్చితంగా ఉంటాయన్నది మీ కథ నొక్కి చెబుతోంది అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు". నెటిజన్లు. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) (చదవండి: నొప్పులు పడుతూ కోర్టుకి హాజరు..! కారణం తెలిస్తే షాకవ్వుతారు) -
నొప్పులు పడుతూ కోర్టుకి హాజరు..!
అత్యంత అరుదైన వింత కేసు. నొప్పులు పడుతున్న టైంలో ఎవ్వరైన ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు. కానీ ఈ మహిళ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. భావోద్వేగభరితమైన ఆ సమయంలో విచారణకు హాజరుకావడం విచిత్రం అనుకుంటే..అక్కడ ఆమె వాదన న్యాయమూర్తిని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఎవ్వరిని ఎలాంటి నిర్ణయం తీసుకోకుండ కట్టుదిట్టం చేసి అందర్నీ భయాందోళనలకు గురి చేసింది. చివరికి ఆ మహిళ..ఇప్పటికీ కోర్టుని, వైద్యులపై ఆరోపణలు చేస్తూ తిట్టిపోస్తూనే ఉంది. అసలేం జరిగిందంటే..ఈ వింత ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఫ్లోరిడాకు చెందిన చెరీస్ డోయ్లిఆస్ప్రతి బెడ్పై నొప్పులు పడుతోంది. ఇంకొద్ది క్షణాల్లో డెలివరీ అనగా..బలవంతంగా కోర్టు ముందుకు హాజరుపరిచారు వైద్యులు. అంతేగాదు ఆమె అనుమతి లేకుండానే ఇదంతా జరగడం విశేషం. వర్చువల్ కోర్టు విచారణకు ప్రసవ వేదనతో ఉన్న గర్భణీని బలవంతంగా ప్రవేశపెట్టారు. ఈ దురదృష్టకర ఘటన 2024లో చోటుచేసుకుంది. ప్రసవ వేదన మొదలైన వెంటనే రాత్రికి రాత్రే ఆమె యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా హెల్త్ హాస్పిటల్కు చేరుకుంది.అయితే ఆమె 12 గంటల పాటు ప్రసవ నొప్పులు అనుభవిస్తోంది. ఆ సమయంలోనే ఆమెను వర్చువల్ కోర్టు ముందు హాజరుపరిచారు వైద్యులు. తను వర్చువల్ కోర్టు ముందున్న విషయం తెలుసుకుని ఆ నిండు గర్భిణీ కంగుతింది. డోయ్యి వృత్తిపరంగా ప్రసవ సహాయకురాలైన నర్సు. అయితే ఆమె నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నిస్తోంది. అయితే ఆమెకు కచ్చితంగా సీసెక్షన్ చేయాల్సిన ఎమర్జెన్సీ. కానీ అందుకు ససేమిరా అంటోంది డోయ్లి. ఎందుకంటే ముగ్గురు పిల్లల తల్లిగా గతంలో జరిగిన సీ సెక్షన్ల నుంచి కోలుకోవడం కష్టంగా ఉందని, దానివల్ల రక్తస్రావంతో అనేక సమస్యలు వస్తున్నాయని వాదిస్తోంది. ఆమె పరిస్థితి క్రిటికల్గా ఉన్నా..మొండిగా ప్రవర్తించడంతో అక్కడి ప్రభుత్వ అత్యవసర పిటిషన్ దాఖలు చేసి కోర్టు ముందు హాజరపర్చింది. ఆ విషయాన్నే పేషెంట్ డోయ్లికి వివరించారు కూడా. అందువల్లే డోయ్లి నొప్పులు పడుతూనే కోర్టులో విచారణకు హాజరైంది. అయితే వైద్యులు ఆమె గనుక నార్మల్ డెలివరీకి ట్రై చేస్తే..గర్భాశయం చిట్లిపోయే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీ సెక్షన్ చేయక తప్పదని వాదిస్తుండటం గమనార్హం. అంతేగాదు డోయ్లి వైద్యులు గనుక సాధారణ ప్రసవం చేయలేకపోతే గనుక మరొక ఆస్పత్రికి తరలించమని కూడా అభ్యర్థించింది. అయితే ఇరు వాదనలు విన్న న్యాయమూర్తి..ఆమెకు తక్షణమే ఆపరేషన్ చేయమని ఆదేశించలేదు గానీ, విపత్కర పరిస్థితి ఎదురైతే ఆమె సమ్మతితో పనిలేకుండానే ఆస్పత్రి శస్త్ర చికిత్స చేయవచ్చని సూచించింది. అయితే రాత్రికి ఆమె బిడ్డ పల్స్ రేట్ పడిపోవడంతో హుటాహుటినా..డోయ్లికి సర్జరీ చేసి బిడ్డను బయటకు తీయక తప్పలేదు వైద్యులకు.ఆ తర్వాత ఆమెను మళ్లా కోర్టు ముందు హాజరుపర్చారు. అప్పుడు కూడా, వైద్యులపై మండిపడుతూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూనే ఉంది. ఈ సంఘటన జరిగి ఏడాదికి పైగా గడిచినా ఇప్పటికీ దాన్ని ఆమె అవమానంగా భావిస్తూ..కోర్టుని, సదరు ఆస్పత్రి వైద్యులను తిట్టిపోస్తుండటం గమనార్హం. View this post on Instagram A post shared by Joel Bervell, MD (@joelbervell) (చదవండి: రూ. 50 లక్షల వేతనం వదులుకుంది..! కట్చేస్తే..) -
చిన్న అలవాట్లు.. పెద్ద మార్పులు
చాలామంది పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే పెద్ద పెద్ద పనులు చేయడమే అనుకుంటారు. కానీ, అసలైన విప్లవం చిన్న చిన్న అలవాట్లలోనే ఉంది. అవి మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టే ఇటుకలని జేమ్స్ క్లియర్ (James Clear) అంటాడు.మనం చేసే ప్రతి పనికి, మనకు ఒక 'ఐడెంటిటీ' (Identity) ఉంటుంది. మీరు రోజూ చదివితే మీరు 'రీడర్' అవుతారు. మీరు రోజూ వ్యాయామం చేస్తే మీరు 'అథ్లెట్' అవుతారు. మన పర్సనాలిటీ అనేది మనం రోజూ చేసే పనుల మొత్తమే. అయితే, కొత్త అలవాట్లను మొదలుపెట్టడం చాలా కష్టం. అందుకే, Habit Stacking అనే టెక్నిక్ మీకు అద్భుతంగా పనిచేస్తుంది.1. Habit Stacking అంటే ఏంటి?మీకు ఇప్పటికే అలవాటుగా ఉన్న ఒక పాత పనిని (Anchor Habit), కొత్తగా మీరు చేయాలనుకుంటున్న పనితో కలిపి (Stack) చేయడం.పాత అలవాటు (Anchor): కాఫీ తాగడం, పళ్ళు తోముకోవడం, బాత్రూమ్కి వెళ్లడం.కొత్త అలవాటు (New Habit): పుస్తకం చదవడం, మెడిటేషన్, ప్లానింగ్.ఉదాహరణకు, "నేను కాఫీ తాగాక, వెంటనే 5 నిమిషాలు నా గోల్స్ రాసుకుంటాను" అని నిర్ణయించుకుంటారు. ఇక్కడ 'కాఫీ తాగడం' అనేది పాత అలవాటు, 'గోల్స్ రాయడం' అనేది కొత్త అలవాటు. దీనివల్ల మీరు కొత్తగా ఏమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, పాతది దానంతట అదే మిమ్మల్ని కొత్త పనికి తీసుకెళ్తుంది.2. పర్సనాలిటీకి ఇది ఎందుకు కీలకం?ఒక రోజులో లేదా ఒక వారంలో లేదా ఒక నెలలో నా పర్సనాలిటీ మారిపోవాలనే లక్ష్యం పెట్టుకుంటే మెదడు భయపడుతుంది. అదే చిన్న అలవాట్లతో మనం మెదడుకు తెలియకుండానే గొప్ప మార్పులను తీసుకొస్తాం.Consistency: ఇది మిమ్మల్ని క్రమశిక్షణతో ఉంచుతుంది.Compound Effect: చిన్న అలవాట్లు రోజులు గడిచేకొద్దీ పెద్ద రిజల్ట్స్ని ఇస్తాయి.Self-Identity: "నేను ప్రతిరోజూ 5 నిమిషాలు మెడిటేషన్ చేస్తున్నాను" అని మీ మైండ్ నమ్మినప్పుడు, మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.3. మోటివేషన్ మాయ vs సైకలాజికల్ సిస్టమ్స్"రేపటి నుండి రోజూ రెండు గంటలు చదువుతాను" అనుకోవడం మోటివేషన్. కానీ రెండు రోజుల్లో ఆపేస్తారు"నేను ప్రతిరోజూ పడుకునే ముందు 1 పేజీ చదువుతాను" అని చిన్నదిగా మొదలుపెట్టడం అలవాటు చేసుకోండి. అలవాటు అనేది 'గోల్' కాదు, అది ఒక 'సిస్టమ్'.4. మీ 'Habit Stack' ని బిల్డ్ చేయండిGenius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, మీ కొత్త పర్సనాలిటీకి కావాల్సిన స్టాక్ ఇది.Step 1: చెడు అలవాట్లను బ్రేక్ చేయండిముందుగా మీకు ఉన్న చెడు అలవాట్లను గుర్తించి వాటిని 'బ్రేక్' చేయండి. ఉదాహరణకు, నిద్రలేవగానే ఫోన్ చూడటం. దానికి బదులుగా ఒక మంచి హ్యాబిట్ స్టాక్ పెట్టండి.Step 2: మీ స్టాక్ ని డిజైన్ చేయండిమీ డైలీ రొటీన్లో ఈ మూడు స్టాక్స్ను ప్రయత్నించండి:ఉదయం: "నేను లేవగానే, ఒక గ్లాసు నీళ్లు తాగి, రెండు నిమిషాలు నా పర్సనాలిటీ లక్ష్యం గురించి ఆలోచిస్తాను."మధ్యాహ్నం: "నేను లంచ్ చేశాక, ఒక పేజీ పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకం చదువుతాను."రాత్రి: "నేను పడుకునే ముందు, రోజంతా ఏం నేర్చుకున్నానో ఒక డైరీలో రాస్తాను."Step 3: ఆటో-పైలట్ పర్సనాలిటీఒక్కసారి ఈ స్టాక్స్ ఆటోమేటిక్ అయిపోతే, మీ వ్యక్తిత్వం దానంతట అదే మారుతుంది. అప్పుడు మీరు ఆలోచించక్కర్లేదు, మీ అలవాట్లే మిమ్మల్ని గెలిపిస్తాయి. ఇదే 'Beyond' స్టేజ్.5. ఈరోజు మీరు ఏ స్టాక్ మొదలుపెడతారు?ఈ రోజు మీరు ఒక చిన్న పని చేయండి.మీకున్న ఒక మంచి పాత అలవాటుని గుర్తించండి (ఉదా: టీ తాగడం). దానికి జత చేయాల్సిన ఒక చిన్న కొత్త అలవాటుని ఎంచుకోండి (ఉదా: రెండు నిమిషాల ప్రార్థన లేదా ప్లానింగ్). వచ్చే ఏడు రోజులు దీన్ని కచ్చితంగా చేయండి.మీ అలవాట్లే మీ వారసత్వం!బ్రో, ఒక మహా వృక్షం చిన్న విత్తనం నుండే మొదలవుతుంది. మీ పర్సనాలిటీ కూడా అంతే. చిన్న చిన్న అలవాట్లే రేపు మీ లెగసీ (Legacy) గా మిగిలిపోతాయి. గొప్ప వ్యక్తులు గొప్పగా ఉండటం వల్ల గొప్పవారు కాలేదు, వారు చేసే పనులు గొప్పవి కాబట్టి గొప్పవారు అయ్యారు."We are what we repeatedly do. Excellence, then, is not an act, but a habit." Aristotle సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: ఆంతరంగిక ప్రశాంతత) -
హీరో వెంకటేష్ మెచ్చిన 'బటర్ దోసె'..! ఎలా చేస్తారంటే..
దోసెలంటే ఇష్టపడని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో..!. అలాంటి దోసెలలో అత్యంత ఫేమస్ దోసె ఇది. కాసింత నూనె, మసాలా జోడిస్తే అబ్బో.. నోట్లో నీళ్లూరిపోవాల్సిందే. అలాంటి టేస్టీ.. టేస్టీ.. దోసెను దశాబ్దాలుగా అందిస్తోంది బెంగుళూరులోని ఓ ప్రముఖ రెస్టారెంట్. ఈ దోసె కోసం సామాన్యులు నుంచి సెలబ్రిటీల వరకు క్యూలు కడుతుంటారు. పైగా అదెలా తయారు చేస్తారనేది బయటకు పొక్కనివ్వకుండా కేర్ తీసుకుంటుందట ఆ రెస్టారెంట్. అంతలా పకడ్బందిగా తయారు చేసే ఆ దోసె మన టాలీవుడ్ హీరో మనసుని సైతం దోచుకుంది. మరి ఆ వంటకం విశిష్టత తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.బెంగళూరులోని అత్యంత ప్రసిద్ధ భోజనశాలలలో విద్యార్థి భవన్ ఒకటి. గాంధీ బజార్లోని రద్దీ వీధుల్లో ఉన్న దీనిని ఒక వారసత్వ ప్రదేశంగా చూస్తారు స్థానికులు. ఆహారం ద్వారా సంప్రదాయాన్ని పరిరక్షించడంలో పేరుగాంచిన ఈ రెస్టారెంట్ తరతరాలుగా వినియోగదారులను ఆకర్షిస్తూనే ఉంటుంది. సాంప్రదాయ దక్షిణ భారత వంటకాలను అందించడంలో మంచి పేరు సంపాదించుకుంది. ప్రత్యేకమైన బటర్ దోసె మెనూలో అత్యంత ప్రసిద్ధి చెందిన వంటకంగా నిలవడం విశేషం. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay)దోసె వెనుకున్న వారసత్వం..ఆ రెస్టారెంట్ని అరుణ్ కుమార్ అడిగా ఒక పకడ్బందీ ప్రణాళికగా తయారు చేస్తారట. ఈ వంటకం రుచి కోసం అక్కడ పాకనిపుణుల బృందం అవిశ్రాంతంగా పనిచేస్తుందట. ప్రత్యేకమైన కరకరలాడే ఈ ఆకృతి, బంగాళ దుంపల కూర, వెన్న సమపాళ్లలో ఉండేలా చూసుకుంటారట. ఇలాంటి దోసెలు రోజుకి సుమారు 1500 నుంచి 1800 దాక తయారు చేస్తారట. అత్యంత ప్రజాదరణ పొందిన వంటకంగా అక్కడ బాగా ఫేమస్ ఈ దోసె. ఈ రెస్టారెంట్ని 1943లో దక్షిణ కన్నడలో సాలిగ్రామానికి చెందని వెంకటరమణ ఉరల్ దీనిని స్థాపించారు. Honoured to host the ever-charming Mr. Venkatesh Daggubati @VenkyMama along with Mr. Rezwan Razack @indianbanknotes at Vidyarthi Bhavan for breakfast today!It was truly our pleasure to serve one of Tollywood’s finest!❤️ pic.twitter.com/zKQqJIcTrB— Vidyarthi Bhavan (@VidyarthiBhavan) March 29, 20261970వ దశకంలో, ఈ సంస్థ యాజమాన్యం అరుణ్ కుమార్ అడిగ తండ్రి అయిన రామకృష్ణ అడిగ నుంచి వారసత్వంగా బదిలీ అయ్యింది. ఆ కుటుంబికులు ఆ ప్రామాణికతను కాపాడుకునేలా వారసత్వాన్ని కొనసాగించడం విశేషం. ఇక ఇటీవల టాలీవుడ్ నటుడు హీరో వెంకటేశ్ కారణంగా మరోసారి ఈ దోసె, సదరు రెస్టారెంట్ గురించి నెట్టంట సంచలనంగా మారింది. రెస్టారెంట్ సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం..నటుడు విక్టరీ వెంకటేశ్ సందడిగా ఉన్న ఈ రెస్టారెంట్ని సందర్శించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. వెంకటేశ్ అక్కడ బటర్ దోసెను చట్నీ తోపాటు ఆస్వాదిస్తూ కనిపించారు. దీంతోపాటు వడ, ఇడ్లీ సాంబార్ చట్నీలను కడా రుచి చూశారు. చివరగా కాఫీతో తన బ్రేక్ఫాస్ట్ని ముగించారు. ఇంకెదుకు ఆలస్యం అందుకు సంబంధించిన వీడియోపై మీరు ఓ లుక్కేయండి.(చదవండి: కంటెంట్ క్రియేటర్ అవ్వాలని రూ. 50 లక్షల వేతనం వదులుకుంది..! కట్చేస్తే..) -
రూ. 50 లక్షల వేతనం వదులుకుంది..! కట్చేస్తే..
మంచి హోదాలో హుందాగా సాగిపోతున్న లగ్జరీ లైప్ని వదులుకుని నిలకడగా డబ్బులు రాని రంగంలోకి వెళ్లడానికి చాలా ధైర్యం కావాలి. పోనీ వెళ్లినా..నిలదొక్కుకోలేకపోతే అంతే సంగతులు. ఈ యువతి అలాంటి నిర్ణయం తీసుకుని ఎంతో సతమతమై చివరకు సక్సెస్ అయిన విధానాన్ని నెట్టింట షేర్ చేసుకుంది. అంతేగాదు తనలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేవాళ్లు ఎలా ధైర్యంగా ముందడుగు వేయాలో సూచనలివ్వడమే గాక, ఆ ఛాలెంజ్కి ఎలా కట్టుబడి ఉండాలో ఆలోచింపచేసేలా చెబుతుండటం విశేషం.ఆ అమ్మాయే సాన్యాబాత్ర. కంటెంట్ క్రియేషన్ రంగంలోకి ప్రవేశించడానికి మంచి జీతం వచ్చే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులకున్న తన ప్రయాణం గురించి సోషల్ మీడియా వేదికగా వివరించింది. ఆ నిర్ణయం వల్ల కలిగిన భయం, అనిశ్చితి, రిస్క్లు గురించి హైలెట్ చేసింది. ఏడాదికి రూ. 50 లక్షలు ఆర్జించే ఉద్యోగాన్ని వదిలేసినప్పటి క్షణాన్ని గుర్తు చేస్తుకుంటూ..ఆ నిర్ణయం ఏ మాత్రం సులభం కాదని త్వరలో అర్థమైందన్నారు. ముఖ్యంగా చుట్టూ ఉన్నవారి సందేహాలు, అనుమానాలు తనను వెంటాడాయని అన్నారు. అలాగే తన తీసుకున్న రంగంలో సక్సెస్ అందుకోగలనా అనే భయం అంకంతకు పెరిపోయిందని చెప్పుకొచ్చింది. ఎక్కువ జీతం వచ్చే స్థిరమైన ఉద్యోగాన్ని వదులుకున్న వెర్రిదాన్ని తానేనేమో అనే భయంతో నిద్ర కూడా పట్టేది కాదని అంటోంది. నిజానికి కంటెంట్ క్రియేషన్ అన్నది సరైన కెరీర్ కాదు. పైగా ఉద్యోగాన్ని వదిలేయడం అంటే ఆర్థిక భద్రతను కాదనుకోవడమే అని ఆ సమయంలోనే తెలుసొచ్చిందని అంటోంది. అయితే ఇన్ని సవాళ్లు, భయాలు వెన్నాడినా..స్థిరత్వంతో నీపై నువ్వు నమ్మకంతో సాగిపో అని అంతరాత్మ చెప్పే ప్రబోధం వైపుకే ధైర్యంగా సాగి విజయవంతమయ్యానని ఆనందంగా చెబుతోంది. అంతేగాదు కంటెంట్ను క్రియేట్ చేయడం, నేర్చుకోవడం, ప్రయోగాలు చేయడం చేస్తూ..నెమ్మదిగా మెరుగుపడ్డానని అంటోంది. కానీ నిలకడగా చేశానని అదే సక్సెస్ అయ్యేలా చేసిందని చెబుతోంది. అంతేగాదు సందిగ్థాలు ఎదురై టైంలో మనల్ని మనం నమ్మడం గురించి తెలుస్తుంది, దాని వాల్యూ తెలుస్తుందని అంటోంది. పెద్ద నిర్ణయం తీసుకుని దాని అంచున నిలబడి ఉంటే..బహుశా మిమ్మల్ని మీరు ఇంకొంచెం ఎక్కువగా నమ్మడానికి ఇది సంకేతం కావొచ్చు అని గుర్తించుకోండి అని చెబుతోంది. చివరగా ఏ నిర్ణయం తీసుకున్నా..ఎన్ని సవాళ్లు, భయాలు వెంటాడినా..నిలకడగా చేయడం అత్యంత ముఖ్యమైనది, అదే మిమ్మల్ని విజయతీరాల వైపుకి నడిపిస్తుందని చెబుతోంది. నెటిజన్లను ఈ పోస్ట్ అమితంగా ఆకర్షించడమే కాదు..మీలా ఎవ్వరూ ధైర్యం చేయలేరు మేడమ్..పలానా అవ్వాలని అనుకోవచ్చేమో గానీ..అంతలా డేర్ చేయలేరంటూ సాన్యపై పొగడ్తల వర్షం కురిపించారు. View this post on Instagram A post shared by Sanya Batra | Travel & Lifestyle (@insanyaty) (చదవండి: మహారాణిలా కియారా అద్వానీ.. చీర, నెక్లెస్ ధర తెలిస్తే విస్తుపోతారు!) -
మంచి జీర్ణక్రియకు మండూకాసనం
మండూకం అంటే కప్ప. ఈ ఆసనం వేసేటప్పుడు శరీరం కప్పలా కనిపిస్తుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఈ ఆసనంలో మోకాళ్లపై కూర్చొని, ముందుకు వంగి కడుపుపై ఒత్తిడి ఇస్తారు. ముఖ్యంగా జీర్ణక్రియ మెరుగుపరచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కప్పలా కూర్చుని, కడుపుకు మసాజ్ ఇచ్చే యోగానే మండుకాసనం.చేసే విధానం..ముందుగా మోకాళ్లపై వజ్రాసనంలో కూర్చోవాలి. ∙పిడికిళ్లను బిగించి నాభి దగ్గర పెట్టాలి. ∙శ్వాస విడిచేటప్పుడు ముందుకు వంగాలి. కడుపుపై ఒత్తిడి వచ్చేలా ఉంచాలి.15–20 సెకన్లు ఉండి నెమ్మదిగా పైకి రావాలి.జాగ్రత్తలు..కడుపు నొప్పి / అల్సర్ ఉంటే చేయకూడదు. గర్భిణులు చేయకూడదు. మోకాళ్ల నొప్పులు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకొని చేయాలి.ఉపయోగాలు..జీర్ణక్రియ మెరుగుపడుతుంది.∙గ్యాస్, అజీర్ణం తగ్గుతుంది.కడుపు భాగం బలపడుతుంది.ఇది డైలీ 2–3 సార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.అనిత పాతర్ల యోగా ట్రైనర్ -
మహారాణిలా కియారా అద్వానీ.. చీర, నెక్లెస్ ధర తెలిస్తే విస్తుపోతారు!
ఫ్యాషన్ ఐకాన్గా విలక్షణంగా ఉంటారు బాలీవుడ్ నటి కియారా అద్వానీ. ఏ సందర్భమైన ఆమె ఫ్యాషన్ స్టైలే వేరేలెవెల్. ధరించే డిజైనర్ వేర్ నుంచి ఆభరణాలు, హ్యాండ్ బ్యాగ్ వరకు ప్రతిదీ అత్యంత ప్రత్యేకంగా ఉంటాయి. మ్యాగజైన్ షూట్ అయినా పండుగైనా..కియారా స్టన్నింగ్ లుక్స్ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకునేలా, అనుకరించేలా ఉంటాయి. అలానే ఈసారి కూడా అత్యంత ఆకర్షణీయంగా మెరిశారు కియారా. ఆమె గత రాత్రి తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ముంబైలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఆమె ధరించిన అద్భుతమైన చీర, మసబా వారి మహారాణి నెక్లెస్తో ఆకట్టుకున్నారు. సిల్క్ క్రేప్తో రూపొందించిన 'గుల్పోష్' చీరపై ఉన్న సున్నితమైన బుటా వర్క్, ఆమె మొత్తం రూపాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చింది. ఆ చీర పల్లు మరింత హైలెట్గా నిలిచింది. బంగారు ఎంబ్రాయిడరీతో గులాబీ, ఆకుపచ్చ ఆర్గాంజా ప్యాచ్వర్క్ అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. పాంఖ్ బాగ్, గుల్ఝురోఖా మెటిఫ్లు చీరకు రాజససం ఉట్టిపడేలా చేయగా, ఫ్యాన్ ఆకారపు అంచులు ఈ చీర డిజైన్ని మరింత అందంగా కనిపించేలా చేశాయి. ఎంత అందమైన చీరకైనా మ్యాచింగ్ ఆభరణాలనేవి అత్యంత కీలకమైనవి. అందుకే కియారా మసబా వారి స్టేట్మెంట్ మహారాణి-శైలి నెక్లెస్ను ఎంచుకుంది. బంగారం, వజ్రాలు, ముత్యాలతో పొదగబడిని నెక్లెస్ని పొరలు పొరలుగా డిజైన్ చేశారు. ఇంతకీ కియారా ధరించిన చీర, నెక్లెస్ ధర తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. చీర ధర వచ్చేసి రూ. 1.30 లక్షలు, నెక్లెస్ ధర రూ. 1.85 లక్షలు. అలాగే నటి సింపుల్ మ్యాకప్తో ఉంగారాల జుట్టుతో తన ఆహార్యాన్ని పూర్తి చేసింది. అంతేగాదు చేతిలో బ్రౌన్ రంగు హెర్మెస్ మినీ కెల్లి పోచెట్ బ్యాగ్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. దీని ధర సైతం దగ్గర దగ్గర రూ. 33 లక్షల పైనే పలుకుతుందట. View this post on Instagram A post shared by Bollywood Celebrity Style (@bollywoodwomencloset)(చదవండి: NMACC వేడుకలో.. నీతా అంబానీ స్టన్నింగ్ లుక్..!) -
ముఖంపై వెంట్రుకలు పెరుగుతున్నాయా?
నాకు పద్దెనిమిది సంవత్సరాలు. ఇటీవల పైపెదవి, గడ్డం కింద ఒత్తుగా, దట్టంగా వెంట్రుకలు వస్తున్నాయి. బరువు కూడా పెరుగుతోంది. ఇది ఏ సమస్యకు సంకేతం? ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి?– మమత, జమ్మలమడుగు. మీరు చెప్పిన లక్షణాలను బట్టి ఇది హిర్సూటిజం (అనవసరంగా వెంట్రుకలు పెరగడం) అనే సమస్య కావచ్చు. సాధారణంగా మహిళల్లో పై పెదవి, గడ్డం, ఛాతీ, వెన్ను వంటి ప్రాంతాల్లో మందంగా, నల్లగా వెంట్రుకలు పెరగడం ఈ సమస్య లక్షణం. ఇది ఎక్కువగా శరీరంలో పురుష హార్మోన్లు (ఆండ్రోజెన్స్) అధికంగా ఉండటం వల్ల జరుగుతుంది. ముఖ్యంగా పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కొన్నిసార్లు అడ్రినల్ గ్రంథుల సమస్యలు, అరుదుగా ట్యూమర్లు కూడా కారణం కావచ్చు. ఈ సమస్యను నిర్ధారించడానికి గైనకాలజిస్ట్ను సంప్రదించాలి. డాక్టర్ ముందుగా పూర్తి శరీర పరీక్ష చేస్తారు. అవసరమైతే కొన్ని రక్తపరీక్షలు, హార్మోన్ టెస్టులు, అలాగే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా ఓవరీల పరిస్థితిని పరిశీలిస్తారు. చికిత్స సమస్య తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. హార్మోన్లను సరిచేసే మందులు, బరువు తగ్గించే చర్యలు. అవసరమైతే కాస్మెటిక్ ట్రీట్మెంట్స్, లేజర్ హెయిర్ రిమూవల్ వంటి జీవనశైలిలో మార్పులు చాలా ముఖ్యం. చక్కెర, స్వీట్స్, జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ తగ్గించడం, నియమిత వ్యాయామం చేయడం ద్వారా బరువు నియంత్రణలో ఉంచాలి. ఇది కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు, మానసికంగా కూడా ప్రభావం చూపొచ్చు. కొంతమందిలో ఆత్మవిశ్వాసం తగ్గడం, ఆందోళన వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి ఈ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడం మంచిది. సరైన వైద్య చికిత్సతో పాటు అవసరమైతే లేజర్ వంటి పద్ధతుల ద్వారా వెంట్రుకలను తగ్గించుకోవచ్చు. దీంతో జీవన నాణ్యత మెరుగుపడుతుంది. డా‘‘ భావన కాసుగైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్హైదరాబాద్ ∙ -
ఒక హత్య.. ముగ్గురు హంతకులు
సమయం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలు... హైదరాబాద్ శివార్లలోని ఒక విలాసవంతమైన విల్లాలో ప్రముఖ వ్యాపారవేత్త ముఖర్జీ దారుణ హత్యకు గురయ్యాడు. గది లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లేసరికి, ముఖర్జీ సోఫాలో ప్రాణాలు లేకుండా పడి ఉన్నాడు. అతని మెడపై గట్టిగా నొక్కిన గుర్తులు ఉన్నాయి. హత్యకు గురైంది ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో కమిషనర్ కూడా వచ్చాడు. క్లూస్ టీమ్ తన పని తాను చేసుకుపోతోంది.క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ విక్రమ్ వైపు చూసి అన్నాడు కమిషనర్... ‘‘మీరు ఎంత త్వరగా కేసు క్లోజ్ చేస్తే అంత మంచిది. ఈ కేసులో అనుమానితులు ముగ్గురు...ముఖర్జీ మేనల్లుడు అజయ్ భారీ అప్పుల్లో వున్నాడు.సెక్రటరీ స్నేహ– ముఖర్జీ తనను ఉద్యోగంలోంచి తీసేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. మరో వ్యక్తి ముఖర్జీ బిజినెస్ పార్టనర్ వినాయక్... ఈ ముగ్గురిలో అసలు హంతకుడు ఎవరో కనిపెట్టాలి.’’ఇన్స్పెక్టర్ విక్రమ్ క్రైమ్ స్పాట్ను నిశితంగా గమనిస్తున్నాడు. టేబుల్ మీద మూడు కాఫీ కప్పులు ఉన్నాయి. కాని, గదిలో ఇద్దరు మాత్రమే ఉన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఏసీ ఇంకా ఆన్లోనే వుంది. గదిలో ఏసీ 16 డిగ్రీల వద్ద ఉంది. ‘‘సర్ ... వేడివేడిగా ఫిల్టర్ కాఫీ తాగితే ఈ కూల్లో వెచ్చగా ఉంటుంది’’ పనిమనిషి ఏసీ ఆఫ్ చేయబోతుంటే వారిస్తూ అన్నాడు. ఇన్స్పెక్టర్ విక్రమ్ ఇన్వెస్టిగేషన్ స్టైల్ తెలిసిన కమిషనర్ కాఫీ తీసుకురమ్మని వంటమనిషికి పురమాయించాడు. ముఖర్జీ మేనల్లుడు అజయ్ని గదిలోకి పిలిచాడు. ‘‘మీ మేనమామను చంపాలనే బ్రిలియంట్ థాట్ ఎలా వచ్చింది?’’ సూటిగా చూస్తూ అడిగాడు.‘‘నేను చంపడం ఏంటి సర్! మా మామయ్య చనిపోతే నాకేంటి లాభం? బతికుంటే ఎంతోకొంత చిల్లర అయినా వస్తుంది’’ అని చెప్పాడు. అజయ్ని బయటకు పంపించి సెక్రటరీ స్నేహను పిలిచాడు. ‘‘పనిలో నుంచి తీసేస్తానని వార్నింగ్ ఇచ్చినందుకు లైఫ్లో నుంచే మీ బాస్ను తీసేశావా?’’ ఆమె వైపే చూస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్ విక్రమ్.‘‘సర్! నేను ఒక మాములు ఉద్యోగిని. నేనెలా చంపగలను? చంపితే నాకు ఒరిగేది ఏముంది?’’ సెక్రటరీ స్నేహ అంది.‘‘గుడ్ ఆన్సర్... యు మే గో...’’ అన్నాడు.స్నేహ బయటకు వెళ్ళగానే, ఆ గది మొత్తం మరోసారి పరిశీలించాడు. ఏసీ ఆఫ్ చేయడానికి వెళ్లి రిమోట్ తీసుకుని, ఒకసారి ఏసీ వంక చూశాడు. వంటమనిషి కాఫీ తెచ్చింది. కాఫీ తాగి వంటమనిషిని బయటకు పంపించి, మంచం ఎక్కి ఏసీని పరిశీలనగా చూశాడు.ఒక చిక్కుముడి వీడిపోయింది. ఇన్స్పెక్టర్ విక్రమ్ కిందకి దిగి ముఖర్జీ బిజినెస్ పార్టనర్ను పిలిపించాడు.‘‘మిస్టర్ వినాయక్! మీ లాయర్కు ఫోన్ చేస్తే మనం బయల్దేరుదాం’’ అన్నాడు.‘‘ఎందుకు ఎక్కడికి?’’ అయోమయంగా అడిగాడు వినాయక్.‘‘మీ బిజినెస్ పార్టనర్ను హత్య చేసినందుకు’’ అన్నాడు.‘‘ముఖర్జీ మేనల్లుడు అజయ్, సెక్రటరీ స్నేహ అంతా ఒప్పుకున్నారు’’ వినాయక్ వంక చూస్తూ చెప్పాడు.‘‘వాళ్ళ మాటలు విని నన్ను అరెస్టు చేస్తారా? సాక్ష్యం లేకుండా’’ వినాయక్ కోపంగా అన్నాడు.‘‘ఈ సాక్ష్యం సరిపోతుందా? నువ్వూ... అజయ్... స్నేహ కలిసి ముఖర్జీని చంపడం... ఎలాంటి ఎడిటింగులు లేకుండా ఉన్న ఆధారం ఓకేనా?’’ వినాయక్ను అడిగాడు.కమిషనర్ అలానే చూస్తుండిపోయాడు. ‘‘మీరు అన్నంత మాత్రాన అది నిజం అవుతుందా?’’ వినాయక్ అన్నాడు.‘‘అవుతుంది... ముఖర్జీ గదిలో ఉన్న స్మార్ట్ ఏసీకి మోషన్ సెన్సార్ కెమెరా ఉంది. అందులో మీ ముగ్గురి ముఖాలు స్పష్టంగా పడ్డాయి. నువ్వు అజయ్ని, స్నేహను ఇరికించాలనుకున్నావు. అజయ్ అప్పులను తీరుస్తానని ప్రామిస్ చేశావు. స్నేహను మంచి జీతంతో నీ దగ్గర సెక్రెటరీగా పెట్టుకుంటానన్నావు.స్నేహ నిద్రమాత్రలు ఇచ్చింది. అజయ్ నువ్వు రహస్యంగా ఇంట్లోకి రావడానికి సహకరించాడు.’’ముఖర్జీ చనిపోతే అతడి అన్ని వ్యాపారాలనూ తన వ్యాపారంలోకి కలిపేసుకోవచ్చని వినాయక్ అనుకున్నాడు.‘‘ముగ్గురూ కలిసి హత్య చేశాక గది లోపల గడియ పెట్టి కిటికీ గుండా బయటకు వెళ్లారు. కాని, వినాయక్ గమనించని విషయం ఏంటంటే, ముఖర్జీ గదిలో ఉన్న స్మార్ట్ ఏసీకి మోషన్ సెన్సర్ కెమెరా! అందులో రికార్డు అయిన వాళ్ళ మొహాలు...’’ అంటూ కమిషనర్ వైపు తిరిగి.‘‘ఇదిగోండి ఎవిడెన్స్ ఒక హత్య... ముగ్గురు హంతకులు.’’హత్య చేసినందుకు వినాయక్ను; డబ్బు మీద ఆశతో సహకరించినందుకు అజయ్ను, క్షణకాలం ఆవేశంతో, స్వార్థంతో చేతులు కలిపినందుకు స్నేహను అరెస్ట్ చేశారు.‘‘థాంక్యూ విక్రమ్! కేవలం గంట వ్యవధిలోనే కేసును మైండ్ గేమ్తో సాల్వ్ చేశావు’’ అభినందిస్తూ అన్నాడు కమిషనర్. -
ఈ వారం కథ: మరణం కంటే భయంకరం ఏమిటో తెలుసా?
దబ్బుమని చప్పుడు వచ్చింది. కొంచెం పెద్దదే. అందరికీ వినపడగలిగేంత పెద్దది. దాని వెంబడి ఒక మూలుగు, ఆర్తనాదం వంటిది. అది కొందరికైనా వినపడే అవకాశం తక్కువ. పద్దెనిమిది ఫ్లోర్ల వంతునున్న రెండు టవర్లు. ఫ్లోరుకు రెండు వంతున మూడు పడగ్గదుల ఇళ్లు. పైచివరి అంతస్తులో పొందికైన పెంట్ హవుసులు చెరొకటి. వెంటిలేషన్ కోసం అన్నట్టుగా రెండు టవర్ల మధ్య ఖాళీ సందు. చుట్టూతా వాహనం తిరగగలిగేపాటి బాట. ఓపాటి గార్డెన్ లాంటి ఏర్పాటు. లోపలకు బయటకు కూడా చూడగలిగేలా సీసీ కెమెరాలను పొదువుకున్న ఎత్తయిన ప్రహరీగోడ. దాని నెత్తిన శిరోభూషణంలాగా ఎలక్ట్రిక్ కంచె. మూడు షిఫ్టుల్లో అప్రమత్తంగా కాపలా ఉండే గార్డుల ఏర్పాటుతో ప్రధాన గేటు. అది ఒక చిన్న కమ్యూనిటీ.మొత్తానికి అక్కడే ఎక్కడో వచ్చింది చప్పుడు.పక్కనున్న ఖాళీ నేలలో బోరు డ్రిల్లింగ్ జరగడం లేదు. ఆకాశం ఉరమడం లేదు. జోరు వాన హోరు లేదు. ఆలయాలూ ప్రార్థనస్థలాల మైకుసెట్లు గొంతెత్తిన పాటలూ పిలుపులూ గాలిసవారీ చేయడం లేదు. పంచభూతాతీతమైన ఎటువంటి శబ్దోపద్రవాలూ ఆ సమయానికి అక్కడ లేవు. అలాగని, ఆ ప్రాంతమంతా నిర్జనంగా ఉందని కాదు– కిక్కిరించని జనసందోహం చెదురుమదురుగా ఒంటరి ఒంటరిగా పరచుకుని ఉన్నారు. పరివేష్టించిన జాగా ట్రాకుగా మార్నింగ్ వాకులు చేస్తున్నారు, పచ్చిక మేటలే మ్యాటుగా దేహాన్ని వంగదీస్తూ, సాగదీస్తూ యోగాది కసరత్తుల్లో మునిగి ఉన్నారు, ఒకరో ఇద్దరో సిమెంటు బెంచీలమీద ప్రాణాల్ని కుదేసి మాటలాడుకుంటున్నారు. కానీ ఆ చప్పుడు ఎవరికీ వినపడలేదు. అలాగని, బధిరులు కాదు, చెవులు దిబ్బెడలు వేయలేదు– అయినా ఎవరూ ఆ చప్పుడు వినలేదు. మరేం చేస్తున్నారు? మెజారిటీ చెవులు వాంఛిత కర్ణభూషణాలతో అలరారుతున్నాయి. ఫోను సంభాషణాలూ, సంగీతమూ, పాటలూ ఆ చెవుల్లోకి ప్రవహిస్తున్నాయి. కొందరి చెవుల్లోకి పక్కనున్నవాడి నోర్లు ప్రవహిస్తున్నాయి. ఆ నోర్లలోకి, ఆ ఇద్దరి సమక్షంలో లేని ఇంకొకరి ప్రెవేటు వ్యవహారాలన్నీ జలలాగా ఊరుతున్నాయి. ఏ ప్రవాహాలూ లేని చెవులు, నిష్క్రియగా పరధ్యానంలో ఉన్నాయి. ఎ..వ్వ..రూ ఆ చప్పుడు వినలేదు. క్షణాలూ నిమిషాలు కాదు, అరగంట గడిచిపోయింది. మైలో: నేను నిద్రలేచినంత మాత్రాన నా దినచర్య మొదలు కాదు. నా యజమాని కూడా లేవాల్సిందే. విశ్వాసం అనే పదాన్ని ముద్దర కొట్టి వదిలేసిన పరాధీన బతుకు. నా పేరు మైలో. కుక్కని. రాట్వీలర్ జాతి నాది. పేరును బట్టి నేను సోల్జర్ని. నన్ను పెంచుకునే అదృష్టాన్ని పొందిన వాడి పేరు రాజేంద్ర. అవును మరి.. అదృష్టం వాడిదే. వాడి మిత్రుల్ని, చుట్టాల్ని పోగేసినప్పుడెల్లా.. నన్ను వాడి హోదాకు ఒక చిహ్నంలాగా ప్రదర్శిస్తాడు. ‘మీ కుక్క భలే ఉంది గురూ’ అంటారు. నా జాతిలో ఏ కుక్కయినా ఒకలాగే ఉంటుంది. నా జాతికుక్కలు మాత్రమే ఎరిగిన వాడికి, బహుశా ఇక్కడి వీధుల్లో ఊరకుక్క ‘భలే’ అనే ఫీలింగిస్తుందేమో. ‘నువ్వు సూపర్ గురూ’ అంటారు రాజేంద్రని.నాలాగా నేను ఉండడంలో, వాడి సూపర్ ఏమిటో నాకు అర్థం కాదు! సరే, విషయానికి వస్తాను. నేను లేచి అరగంటైంది. వాడింకా లేవలేదు. బయటకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకోవాలి. నేను వెళ్లి, రాగలను. కానీ వాడు నన్ను ఒంటరిగా వెళ్లనివ్వడు. తలుపుకు గొళ్లెమే అయితే తీసుకుని వెళ్లేదాన్నేమో.. తాళమూ వేస్తాడు. అందమైన గొలుసు చేతిలో పట్టుకుని నా వెంట నడవడం వాడికి మజా. ఏసీ పడగ్గదిలో సుఖంగానే ఉన్నదిగానీ, దేహం తొందరపెడుతోంది. వాడి పడకమీదికి చేరి, ప్రేమగా చేత్తో నిమిరాను, మెలకువలోకి వచ్చి నన్ను వాటేసుకుని గిలిగింతలు పెట్టాడు. నేను గారాలు పోయాను! మొత్తానికి ట్రాక్ సూటు తొడిగి తయారై నా వెంట వచ్చాడు. ముందు బయటకు తీసుకెళ్లాడు. అవసరం తీర్చుకున్నాను. తిరిగొచ్చాక, రెండు టవర్లను ప్రదక్షిణం చేసినట్టుగా నాలుగు రౌండ్లు తిరిగాం. ఇంకో రౌండు తిరిగితే ఇంట్లోకి తీసుకెళ్లిపోతాడు. కానీ నా కుక్క బుద్ధికి ఏదో తేడా కొడుతోంది. కొంచెం గింజుకున్నాను. నడవకుండా మొరాయించాను. అటుకేసి గొలుసును ఈడ్వడానికి ప్రయత్నించాను. రాజేంద్రకు ఏదో అనిపించింది. అటువైపు ఆడకుక్క ఉందేమో అనుకున్నాడు. ‘యూ నాటీ బోయ్’ అంటూ చిలిపితనం ప్రదర్శిస్తూ వంగి నా మెడపట్టీ దగ్గరున్న క్లిప్ వదిలేశాడు. ఉరికాను. రెండు టవర్ల మధ్య, సన్నని ఇరుకైన చీకటి గుయ్యారం వంటి ఆ సందులోకి. ఫ్లాట్లలో వెంటిలేషన్ కోసం అని ఆ ఖాళీ వదిలారు గానీ, గ్రౌండ్ లెవెల్లో మసగ్గానే ఉంటుందక్కడ.అనుకున్నదానికంటె ఘోరంగా ఉంది. అరమీటరు మందాన కాస్త కుంకుమరంగు ఎరుపుతో పరచుకుని ఉంది. దగ్గరికెళ్లి చూద్దునుకదా.. తల పగిలే ఉంది. మొహానికి దగ్గరగా నా తల నిక్కించి వాసన చూశాను, శ్వాస లేదు. ఎడమకాలిని చాచి చిక్కబడుతున్న ఎరుపుని తడిమాను. జిగటగా తగిలింది. ఇంకా ఎక్కువసేపు స్టడీ చేయాల్సిందేమీ లేదు. కన్ఫర్మ్. ఒక్క పరుగున తిరిగి వెళ్లేసరికి.. ‘అప్పుడే వచ్చేశావా మైబోయ్’ అంటూ రాజేంద్ర గొలుసు క్లిప్ అందుకున్నాడు. తగిలించబోతే వెనక్కు తగ్గి రుంజుకున్నాను. అరుస్తూ, ఆ సందుకేసి గెంతి, ఆగి, రెండుసార్లు అరచి, మళ్లీ రాజేంద్ర కాళ్ల దగ్గరకు వచ్చి, సందు దిక్కుగా తిరిగి తోకాడిస్తూ నిల్చున్నాను. వాడు గ్రహించాడు. గొలుసు తగిలించకుండానే, నా వెనుక వచ్చాడు. చూసిన వాడికి విషయం అర్థమైంది. నేను అరవకుండా తోకాడిస్తూ వాడినే చూస్తున్నాను. నిజంగానే భయపడ్డాడు. పెద్దగా కేక పెట్టాడు.‘‘సె..క్యూ..రి..టీ..’’ఆ చప్పుడుకు– ఈ అరుపుకు మధ్య గంట గడిచింది!సెక్యూరిటీ పోస్టు:‘‘పతా హై.. యే హై కౌన్’’‘‘నహీ సాబ్’’నన్ను ఆశ్రయించి జీవిస్తున్న వాడు.. కనీసం ఆ శవం దగ్గరికెళ్లి మొహం చూసే ప్రయత్నాన్ని, మొహమాటానికైనా చేయకుండానే, జవాబిచ్చాడు. వాణ్ణి తప్పుబట్టలేం. నిజమే చెప్పాడు. వాడికి ఎవ్వరూ తెలియదు. చివరికి ‘పతా హై’ అంటూ అడిగిన వాడితో సహా! జాలిపడ్డాను. మావాడి మీద కాదు. చుట్టుముట్టిన వాళ్లందరి మీద! తమకు రక్షణగా ఎవరుంటున్నారో, వారికి తామెవ్వరో తెలియకపోవడమంత దౌర్బల్యం ఇంకేం ఉంటుంది. నా పేరు సెక్యూరిటీ పోస్టు. నా ఒంటి మీద ‘సెక్యూరిటీ’ అని రాయిస్తే సరిపోయేది. కానీ ‘పోస్టు’ అని కూడా జోడించారు. అదేదో నా కులం తోకలాగా! అందువల్ల నేను పోస్టు డబ్బా కంటె కొంచెం పెద్దదిగా ఉంటాను. ఫోర్ బై ఫోర్ స్క్వేర్ కట్టడం అనుకోండి. ఒకవైపు ద్వారం ఓకే. రెండు వైపుల నిలువెత్తు గవాక్షాలు! ప్రహరీ గేటు వైపుండే గవాక్షానికి వెలుపల ఓ పాత కుర్చీ, బల్ల. దాని మీద విజిటర్సు రిజిస్టరూ, దానికి ప్లాస్టికు దారంతో కట్టిన పేనా, పక్కనే ఇంటర్ కమ్ ఫోనూ. లోపల కిటికీ లేని వైపు యూనిఫాంలు తగిలించే కొక్కేలు. íసీసీ కెమెరాల ఫుటేజీ చూసే టీవీ, వాటిని రికార్డు చేసే హార్డ్ డిస్కు. నెత్తిన నెలవంక లాగా ఒక కెమెరా. ఇదీ నా స్వరూపం. కేక వినపడగానే నా చెంత ఉన్న ఇద్దరిలో ఒకడు పరుగెత్తుకుంటూ వెళ్లాడు. తర్వాత రెండోవాడిని కూడా పిలిచారు. వాడు కూడా తెలియదనే చెప్పాడు. ఎలా తెలుస్తుంది వాళ్లకసలు? మాది పోష్ డీలక్స్ అపార్టుమెంట్స్ అనే చెప్పాలి. వాచ్మెన్ ఫ్యామిలీకి ఓ చిన్న ఇల్లు వేసి ఇక్కడే కాపురం ఉంచడం, వాడికో ఇస్త్రీ బండి పెట్టివ్వడం వీళ్లకు నచ్చదు. సెక్యూరిటీని ఏజన్సీకి అప్పగించారు. ఆ ఏజన్సీ రోజూ తమ మనుషుల్ని పంపుతుంది. ఒక్కొక్కడికీ ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ. రోజుకు నలుగురు వస్తారు. ఒకసారి వచ్చినవాడు మరురోజు వస్తాడని గ్యారంటీ లేదు. వాళ్ల డ్యూటీ గేట్ సెక్యూరిటీ మాత్రమే. పైగా వీళ్లంతా పైనున్న ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు. మన భాషారాదు, ఇంగ్లీషూ రాదు. ఎవడైనా లోపలకు రావాలనుకుంటే ‘నామ్’ అంటారు.. ‘ఫ్లాట్’ అంటారు.. చెబితే ఆ ఫ్లాట్కు ఇంటర్ కమ్లో కాల్ చేసి చెప్తారు. పంపమంటే, సంతకం చేయించుకుని పంపుతారు.. లేదంటే లేదు అంతే!వాకింగులోని వాళ్లూ, యోగ ముద్రాంకితులూ, ఉదయపు ఎండకోసం వచ్చి తీరిగ్గా కూచుని కబుర్లు చెప్పుకుంటున్నవాళ్లూ.. ఓ యాభైమందికి పైగా ఆ చిన్న ఇరుకు సందులో.. అప్పటికే చుట్టూ చేరారు. రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అక్కడ చేరినవాళ్లు మొబైళ్లలో పైన తమ ఫ్లాట్స్లోని వాళ్లకు కాల్స్ చేస్తున్నారు. ఒక్కొక్కరూ వస్తున్నారు. అందరిలోకి కాస్త చొరవగా ఉన్న ఒక మనిషి.. ‘డిడ్ ఎనీ బడీ నో హిమ్.. ఇతనెవరో ఎవరికైనా తెలుసా.. ఇవన్ యారో..’ అని భాషలు మార్చి మార్చి పదేపదే అడుగుతున్నాడు. జవాబు రావడం లేదు. గుమికూడిన జనంలో.. ఒకరితో ఒకరికి పరిచయం ఉన్నట్టే లేదు.. చాలా వరకు!నా దగ్గరినుంచి వెళ్లిన రెండో సెక్యూరిటీ వాడు కొంచెం నయం.. ధైర్యం చేసి దగ్గరకు వెళ్లి చూసిన తర్వాత.. ‘‘ఫ్లాట్ తో మాలూమ్ నై సాబ్. యే తో అందర్వాలా హీ హై.. కన్ఫర్మ్’’ అన్నాడు. మహా అయితే అంతా డెబ్భయి ఇళ్లు. అందరూ మహా సంపన్నులు. పెద్దపెద్ద వాళ్లు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా టైం లేని వాళ్లు. ఇక పోయిన ప్రాణాన్ని, జిగటగా గడ్డకట్టిన ఒక చిన్న ఎర్రటి మడుగులో సగం మునిగిన మొహాన్ని ఎలా గుర్తుపడతారు. ఎవరనేది తెలియలేదు. ఎవరో అన్నారు.. ‘కాల్ ది పోలీస్ ఫస్ట్’.చొరవైన వాడే.. మొబైల్ అందుకుని 100 నొక్కాడు.ఆ చప్పుడుకు– ఈ నొక్కడానికి మధ్య గంటన్నర గడిచింది.రక్షక్:నా పేరు రక్షక్. సెక్టార్ వెహికల్ అంటుంటారు నన్ను. 100 నుంచి మా మాధాపూర్ స్టేషన్కు కాల్ వచ్చింది. అక్కడ నుంచి రౌండ్స్లో ఉన్న సెక్టార్ వెహికల్లోకి సెట్లో సమాచారం వచ్చింది. నన్ను అధిరోహించి ఒక హెడ్ కానిస్టేబులు, ఇంకో కానిస్టేబులు మాత్రమే ఉన్నారు. అయినా వాళ్లకు జంకేమిటి? ఎంచక్కా ఇక్కడకు వచ్చేసాం. ఇలాంటివి ఎన్ని చూసి ఉంటారని? ఏమీ జడుసుకోలేదు. ఆశ్చర్యపోలేదు. కాకపోతే, అక్కడ ఏడుపులూ పెడబొబ్బలు లేకపోవడం, అనుభవం కొద్దీ, గమనించి ‘‘ఇంకా ఎవరిదో గుర్తుపట్టలేదా’’ అని మాత్రం అన్నారు. ఆ మాటకు, గుమికూడిన వాళ్లలో ఎవరైనా సిగ్గుపడ్డారో లేదో నేను గమనించలేదు. ‘‘లైబ్రరీలో చూశాను.. ఫ్లాట్ తెలీదు గానీ..’’ అని ఒకే పెద్దాయన అన్నాడు. ఇప్పుడైనా వాళ్లు సిగ్గుపడ్డారో లేదో!మరో అరగంటలో మోటారు సైకిల్పై ఎస్సై కూడా వచ్చేశాడు. అనుభవమే వారికి పనిలో వేగం అందిస్తుందనుకుంటా. ఆయన వచ్చాక టైం వేస్ట్ జరగలేదు. ఆ ఇరుకు సందువైపు ఫేస్ చేస్తూ ఉన్న రెండు టవర్లలోని ఫ్లాట్స్ నంబర్లన్నింటినీ రెండు కాగితాలపై వరుసగా రాశాడు మొత్తం 36 తేలాయి. ఆ ఫ్లాట్స్ వాళ్ళు ఎవరైనా అక్కడ గుమికూడిన జనంలో ఉన్నారేమో అని ఒక్కొక్క నంబరూ ఎలుగెత్తి అరుస్తూ అటెండెన్స్ పిలిచినట్లుగా పిలవసాగాడు. 20 మంది దాకా అక్కడే ఉన్నారు. ఆ నంబర్లు అన్నింటినీ స్ట్రైక్ ఆఫ్ చేసిన కాగితాలను చెరో కానిస్టేబుల్ చేతికిచ్చి రెండు బ్లాకుల్లోని మిగిలిన ఫ్లాట్ల వద్దకు వెళ్లి ఇంట్లో ఎవరైనా కనిపించడం లేదేమో అడిగి రమ్మని పురమాయించాడు.ఆ చప్పుడుకు– ఈ పురమాయింపుకు మధ్య మూడు గంటలు గడిచాయి.కాఫీ కప్పు: ఏ13బీ. కాలింగ్ బెల్ మోగింది. ముందుగదిలోనే కూర్చుని కాఫీ తాగుతున్న అనిల్.. ‘‘అమ్మా వాకింగు నుంచి నాన్నొచ్చినట్టున్నాడు చూడూ’’ అని కేకేశాడు. వంటింట్లోంచి ఆమె వచ్చి తలుపుతీసింది. ఎదురుగా కానిస్టేబులు. విషయం తెలిశాక, ‘కిందికి వెళ్లి చూసొస్తా’నంటూ అనిల్ శాండల్స్లో కాళ్లు పెట్టాడు. ‘వాకింగుకు వెళ్లిన మీ నాన్న కూడా అక్కడే ఉంటాడేమో.. తొందరగా రమ్మను.. ఆయన టిఫినుకు లేటైంది’ వెనుకనుంచి అమ్మణ్ణమ్మ కేకేసింది. ఆ జనంలో ఆయన లేడని ఆమెకు తెలీదు. నా పేరు కాఫీ కప్పు. ఫిల్టర్ కాఫీ నా ప్రత్యేకత. ‘ఆయన’కు శ్రీమతి అందించే ప్రతి ఉదయపు జీవనోత్సాహాన్ని నేనే! ఆయన నాకు కొన్నేళ్లుగా చాలా బాగా తెలుసు. తెల్లారిందని పల్లెకు చెప్పడానికి తాము కూస్తున్నామని కోళ్లు అనుకుంటాయి. ఆకలేసిందని తనకు చెప్పడానికి అవి కూస్తున్నాయని ఆయన అనుకుంటాడు. వాటి కూత పూర్తికాక ముందే లేచి, మేతతో తయారవుతాడు. ఒక్కో గంపను ఎత్తి, కోళ్లను వదులుతూ గింజలు నేలపై చల్లుతూ తన రోజును మొదలెడతాడు. వేసిన గింజలన్నీ తిన్న కోళ్లు తమ స్వప్రయత్నం ప్రారంభిస్తూ పెరటి బాట పట్టేసరికి ఆరుగంటలవుతుంది. గంట కొట్టినట్టుగా అమ్మణ్ణి కాఫీ గ్లాసుతో వాకిట్లోకి వస్తుంది. (అది కూడా నేనే. పల్లెలో నా రూపం గ్లాసే) ఇద్దరూ కలిసి మట్టి అరుగు మీద కూర్చుని కాఫీ తాగుతారు. ఆ తర్వాతే మిగిలిన దినచర్య. అలా బతకడం అలవాటైన ఈశ్వరయ్యని తెచ్చి ఇక్కడ నాలుగు గోడల మధ్య బందీ చేశారు. తారసిల్లిన ప్రతిప్రాణినీ పలకరించుకుంటూ ఊరంతా తిరగడం, గుడికో పొలానికో వెళ్లి రావడం మాత్రమే తెలిసిన ఈశ్వరయ్య కొత్తగా వాకింగ్ నేర్వలేకపోయాడు. ప్రయత్నించాడు గానీ పలకరింపు కూడా ఉండని, మౌన శవయాత్ర లాంటి ఆ నడకలు రుచించక మానుకున్నాడు. ఎప్పుడైనా లైబ్రరీ దాకా వెళ్లి వచ్చేవాడు. ఇంతకుముందు ఎవరో ‘చూసినట్టుగా ఉన్న’దని అనడం అందువల్లే. ఇవాళ కూడా అమ్మణ్ణి ఆరు గంటలకే ఆయన చేతికి నన్ను అందించింది. అనిల్, అతడి భార్య అప్పటికి నిద్ర లేవలేదు. అప్పుడే లేవరు. నన్ను అందించి, ఆమె వంటగది శుభ్రం చేసే పనిలో పడింది. ఆయన నాతో సహా బాల్కనీలోకి చేరాడు. చివరి చుక్క వరకు, నాలోని ఉత్తేజాన్ని ప్రతిసారీ తనలోకి వంపుకునే ఈశ్వరయ్య.. కనీసం నన్ను ఒక్కసారైనా చుంబించకుండా.. పొగలు కక్కుతూ ఆశ్చర్యపోతున్న నన్ను రెయిలింగ్ గోడపై ఒక చివర్న ఉంచాడు. లోపల సుడిగుండాలు. ఎన్నో, ఏవేవో, ఎందుకు, ఎలా తిరుగుతున్నాయో ఎవరికి తెలుసు? నానుంచి కాస్త దూరం జరిగి రెయిలింగ్ మీదుగా ముందుకు వంగాడు. ‘రెయిలింగ్ యోగా’ భంగిమేమో అని నవ్వుకున్నాను, పొగలు కక్కుతూనే. ఇంకొంచెం వంగాడు. ఇంకా వంగాడు. ఇంకా.. వంగాడు! అసలు అది వంగడమేనా? నేను కంగారు పడేలోగానే అది జరిగింది.ఈశ్వరయ్య పైనుంచి కిందికి జారిపోయాడు. నేను నిశ్చేష్టనైపోయాను. పొగలూ చల్లారిపోయి, కాఫీ పొక్కు కట్టింది.కొన్ని క్షణాలకు దబ్బున చప్పుడు వినిపించింది. కొన్ని నిమిషాలకు, ఇప్పుడు, అనిల్ కిందకు వెళ్లిన తర్వాత, ఏడుపు వినిపించింది. నా అంతఃకర్ణాలను గ్రౌండ్ ఫ్లోర్ దాకా రిక్కించాను. వెక్కుతూ వెక్కుతూ ‘‘మా.. నాన్న’’ అంటున్నాడు. నా అంతఃచక్షువులను కూడా కిందికి సారించాను. నాన్న పక్కనే మోకాళ్లపై కూలబడ్డాడు. చుట్టూ ఉన్న గుంపు మొత్తం కాస్త స్థిమితపడ్డారు. అప్పటిదాకా ఉన్న సస్పెన్స్ తీరిపోయినందుకు! ‘‘ఏ ఫ్లాట్?’’ ఎవరిని ఉద్దేశించామనే స్పష్టత లేకుండా అనేక సిగ్గులేని గొంతుకలు గునగున గొణుగుతున్నాయి. కానిస్టేబుల్ ఎస్ఐ దగ్గరకెళ్లి ‘‘ఏ13బీ సార్’’ అనడంలో అందరికీ జవాబు దొరికింది. సస్పెన్స్ తీరిపోయింది గనుక.. ఒకరిద్దరు తమ ఇళ్లకు మళ్లుతున్నారు. ఒకరిద్దరు మళ్లీ చెవులకు తగిలించుకుంటున్నారు. ఈలోగా అంబులెన్సు సైరన్ కూడా వినిపించింది.ఆ చప్పుడుకు– ఈ సైరన్ చప్పుడుకు మధ్య మూడున్నర గంటలు గడిచాయి.గీతామందిరం: నా పేరు గీతామందిరం. ఈ గేటెడ్ ప్రపంచానికి నేనే కమ్యూనిటీ హాలును. నాలుగు అల్మరాలను ఓ మూలగా పేర్చిన లైబ్రరీ అనే పదార్థం కూడా యిక్కడే. పదిరోజుల కిందట తొలుత ఉస్మానియా అంబులెన్సు మీద, తర్వాత వైకుంఠరథం మీద సవారీ వెళ్లిన పెద్దాయన నాకు తెలుసు. ఇవాళ ఆయనకు పెద్దకర్మట. ఇక్కడ నా సమక్షంలో ప్రవచనం ఏర్పాటుచేశారు. ఆత్మానంద స్వామి వచ్చాడు. నీట్గా ట్రిమ్ చేసిన బెత్తెడు గడ్డం, పొందికైన బట్టతలతో ఉన్నాడు. కాషాయాంబరాలు, మెడలో రంగురంగుల పూసలు. దణ్ణం పెట్టించుకోడానికి తగిన గెటప్పులోనే ఉన్నాడు. స్వామీజీ వస్తున్నారని వాట్సాప్ గ్రూపులో బాగా ప్రచారం జరగడం వలన.. చాలా ఫ్లాట్స్ నుంచి మనుషులొచ్చారు. అనిల్ కుటుంబం ఎటూ ఉంది. ఆయన ప్రారంభించాడు.‘‘ఈశ్వరయ్య పరమేశ్వరుడిలో లీనమయ్యాడు. మీరందరూ ఇక్కడ ఉండేవాళ్లే.. కానీ, ఈశ్వరయ్య శివైక్యం చెందిన మూడున్నర గంటల దాకా ఆయన ఎవరో మీలో ఎవ్వరూ గుర్తుపట్టలేదంటే ఎంత సిగ్గు?’’ ఆత్మానంద పాజ్ ఇచ్చాడు.‘అలా గడ్డిపెట్టు వెధవలకి. ముదనష్టపు ప్రపంచం. ఇరుగు పొరుగు ఎవ్వరో తెలియకుండా ఇనుప తెరలు కట్టేసుకున్న ప్రపంచం. హృదయాల్ని హిడెన్ ఫోల్డర్లలో దాచేసి.. కృతకమైన బంధాల్ని, ఉద్వేగాల్ని వెలుపలినుంచి తమపైకి వెల్లువెత్తించుకునే ప్రపంచం! అమానవీయత తమ తరం లక్షణంగా మారుతోందనే స్పృహ కూడా లేని దౌర్భాగ్యపు ప్రపంచం!’ ఆత్మానందకు జేజేలు అనుకుంటూ మిగిలినోళ్లను ఈసడించుకున్నాను నేను. ఆయన కొనసాగించాడు. ‘‘ఇది తప్పు. మనుషుల మధ్య బంధాలు ఉండాలి. సత్సంగాలు జరుగుతూ ఉండాలి. కలుస్తూ ఉండాలి. మీలో మీరు కలవడం కాదు, గురువుల్ని పిలిచి, సద్బోధలు గ్రహిస్తూ ఉండాలి..’’ వీడి పాసుగూల. పెద్దదినాన్ని కూడా మార్కెటింగుకు వాడుకుంటున్నాడే! ‘‘ఈశ్వరయ్య మరణం లాంటిది మరొకటి జరగకూడదు. మంత్రంలాంటి మాట చెబుతాను పాటించండి’’‘నీ మార్కెటింగ్ ఎలా తగలడ్డా పర్లేదుగానీ, మంచి మంత్రం చెప్పు స్వామీ..’ ఆశగా ఎదురుచూస్తున్నాను. ‘‘తమ ఇళ్లలో పెద్దవాళ్లను, ముసలివాళ్లను ‘మెయింటైన్’ చేస్తున్న ప్రతి ఒక్కరూ..’’భళా.. ఇలాంటి పాఠాలే స్వాములనుంచి ప్రపంచానికి అందాలి. నా ఉత్సుకత పెరిగిపోయింది. ‘‘తమ బాల్కనీలకు గట్టి ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేసుకోండి..’’ ఆత్మానంద ఇంకా చెప్పుకుంటూ పోతున్నాడు. గంట ప్రవచనానికి మాట్లాడుకున్నారంట. అప్పుడే ఎందుకు ఆపుతాడు?చివరగా నేను: నా పేరు ఈశ్వరయ్య. ఆ రోజున నేను, నా విముక్తిని, బలవంతంగా, ఈశ్వరేచ్ఛతో నిమిత్తం లేకుండా, పుచ్చుకున్నాను. ఇవాళ్టిదాకా నేను ఇక్కడిక్కడే తిరుగుతూ ఉండాలని అందరూ అనుకుంటుండబట్టి.. ఏదైనా అద్భుతం జరుగుతుందేమో అని వేచిచూశాను. ఇక చాలు. «పరమేశ్వరుడి లీలలో లీనమయ్యే ముందు.. ఈ నాటకం చాలించేముందు, ఎవడో స్వామిట కదా, నాకోసమే వస్తున్నాడుట కదా.. విందామని ఆగాను. ఆ అమృతోపదేశాన్ని విన్నాను. రాయజాలని భాషలో, ఎవరికీ వినపడదని తెలిసినా, గట్టిగా తిట్టుకుని, నా దారిన చక్కాపోయాను. -
కథాకళి: మంచివాడు
చిత్రాంక్ని రెండు రోజుల నుంచి ఓ సమస్య బాధిస్తోంది. అతనికి ఎదురు చూడని డబ్బు వచ్చింది. అదీ పెద్ద మొత్తంలో. అతను పనిచేసే కంపెనీలోని ఓ సాఫ్ట్వేర్ని అభివృద్ధి చేస్తూండగా, ఆఖరి దశలో ఓ గడ్డు సమస్య వచ్చి ఆ ప్రాజెక్ట్ ముందుకి కదలడం లేదు. ఆ కంపెనీ సీఈవో ఆందోళనగా ఉన్నాడు. చిత్రాంక్ దాన్ని ఆవిష్కరించటంతో సీఈవో అతనికి పదిలక్షల రూపాయల నగదు బహుమతిని ఇచ్చాడు. సెకండ్ హ్యాండ్ కారుని అమ్మేసి ఆ పదిలక్షలతో కొత్త కారుని కొనాలని అనుకున్నాడు. కాని అందుకు అతనికి మరో ఆలోచన అడ్డం వస్తోంది. చిత్రాంక్కి చిన్నప్పటి నుంచి తన తండ్రివైపు బంధువులని ఆదుకోవాలని కోరిక. వారంతా పేదవారు. తన బీద అత్తయ్యకి అప్పుడప్పుడు చిన్న మొత్తాలు సహాయం చేస్తుండేవాడు. ఈ మధ్య చిత్రాంక్ని అతని అత్తయ్య తన ఇద్దరు పిల్లల కోసం పెద్ద మొత్తం అడిగింది. డబ్బు లేక ఆ కోరిక తీర్చలేకపోయాడు. తనకి ఆ పదిలక్షలు లేకపోయినా ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేదు. అన్ని అవసరాలకి ఇప్పుడున్న కారు చాలు. కాబట్టి ఆ పదిలక్షలని తన అత్తయ్య పిల్లలకి ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. కొద్దిరోజుల క్రితమే అత్తయ్య రెండో కొడుకు తనకి నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ షాప్ పెట్టుకోవాలని ఉందని మాటల్లో చెప్పాడు. అతనికి నాలుగు లక్షలు, మిగిలింది వాడి అక్క పెళ్ళికి ఇవ్వాలనే ఆలోచన వచ్చింది.ఆ ఆలోచన వచ్చినంత త్వరగా దాన్ని ఆచరించడానికి అతనికి మనసు రాలేదు. తక్కువ డబ్బు ఉన్నవాళ్ళు దాన్ని తేలిగ్గా దానం చేయగలుగుతారని, ఎక్కువ మొత్తం డబ్బున్న వాళ్ళు చేయలేరన్న నిజం అతనికి అనుభవపూర్వకంగా తెలిసింది. అతనికి ఆ సొమ్ముని అత్తయ్య కుటుంబానికి ఇచ్చి ఆదుకోవాలని ఉంది. అదే సమయంలో చూస్తూ చూస్తూ అంత మొత్తం ఇవ్వడానికి మనస్కరించడం లేదు. గత రెండు రోజులుగా చిత్రాంక్ మనసులో ఈ విషయం మీద తర్జనభర్జనలు, తర్కవితర్కాలు సాగుతున్నాయి. చిత్రాంక్ బ్రహ్మచారి. కాబట్టి సలహా తీసుకోడానికి భార్య కాని, తల్లితండ్రులు కాని లేరు.అతను ఆ ఆదివారం సాయంత్రం తను చాలాకాలంగా వెళ్ళాలనుకునే చెరువుకి చేరుకున్నాడు. చుట్టూ కొబ్బరి చెట్లు. దూరంగా కొండల వరుస. అతనికి అక్కడి ప్రశాంతత నచ్చుతుంది. కారుని పార్క్ చేసి నడిచి, చెరువు ఒడ్డున ఉన్న సిమెంట్ బెంచ్ దగ్గరికి చేరుకుని జేబురుమాలుతో దాని మీద దులిపి కూర్చున్నాడు. ఎదురుగా దాదాపు వంద ఎకరాలకి పైగా విస్తీర్ణం ఉన్న ఆ చెరువు మీంచి చల్లటి గాలి వీస్తోంది. అవతల ఓ చిన్న గ్రామం ఉంది. నీళ్ళ వంకే చూస్తూంటే అందులో కొన్ని బాతులు కనిపించాయి.కొద్దిసేపటికి ఒకాయన చెరువు దగ్గరికి వచ్చాడు. ఆయన ఒంటి మీద మాసిన ఖాకీ రంగు నిక్కర్, బనీన్ ఉన్నాయి. ఆయనకి అరవై ఏళ్ళ దాకా ఉండచ్చని తెల్ల జుట్టుని, మొహాన్నిబట్టి అంచనా వేశాడు. ఆయన బెంచ్ మీద కాక ఒడ్డున కూర్చున్నాడు. కొద్దిసేపాగి తనతో తెచ్చిన మూట తీసి అందులోంచి ఏదో తీసి నీళ్ళలోకి చల్లాడు. తర్వాత ఆయన వెల్లకిలా పడుకుని కూనిరాగం తీస్తూ ఆకాశంలోకి చూడసాగాడు. ఆయన లోకంలో ఎలాంటి దుఃఖం లేనివాడుగా చిత్రాంక్కి తోచింది. బాతులు దూరం నుంచి బిలబిలా ఆయనవైపు ఈదుకుంటూ వచ్చాయి. ఆయన నీళ్ళల్లో చల్లిన, నీటి మీద తేలే మరమరాలని అవి తినసాగాయి. చిత్రాంక్కి ఆశ్చర్యం వేసింది. ఆయన దరిద్రుడిలా ఉన్నాడు. ఆ బాతులు ఆయనవి కావు. అయినా ఆయన వాటికి మేత తెచ్చి వేస్తున్నాడు. దగ్గరికి వెళ్ళి అడిగాడు.‘‘ఏం చేస్తున్నావు?’’‘‘ఆకాశంలోకి చూస్తున్నాను.’’‘‘వాటికి ఏదో వేస్తున్నట్లున్నావు?’’‘‘అవును. మరమరాలు.’’‘‘అవి నీ పెంపుడు బాతులా?’’‘‘కావు.’’‘‘నువ్వు ఉండేది ఎక్కడ?’’దూరంగా ఉన్న గ్రామం వంక చేత్తో చూపించాడు.‘‘రోజూ వాటికి మరమరాలు తెచ్చి వేస్తుంటావా?’’‘‘మూడు నాలుగు రోజులకోసారి.’’తనకేమీ కాని బాతులని ఆయన ఆదుకుంటున్నాడు. తన తండ్రి మేనల్లుడిని, మేనకోడల్ని ఆదుకోవాలని చాలాకాలంగా అనుకుంటున్నా, అవకాశం వచ్చేసరికి తను వెనక్కి వెళ్ళడం సబబు కాదనే గట్టి నిర్ణయాన్ని ఆయన్ని చూసి చేసుకోగలిగాడు. ఆయన నిశ్శబ్దంగా మూటలోంచి గుప్పెడు మరమరాలు తీసి చిత్రాంక్ చేతిలో పోశాడు. చిత్రాంక్ వాటిని నీళ్ళలోకి చల్లగానే బాతులు వాటి మీదకి ఎగబడ్డాయి. తను మనిషి. స్వార్థం ఆవరించుకున్న మనిషి అనుకున్నాడు. తన సమస్యకి ఇంత తేలిగ్గా జవాబు దొరుకుతుందని ఎదురుచూడని చిత్రాంక్ ఆయనతో చెప్పాడు.‘‘నువ్వు చాలా మంచివాడివి.’’ఆయన జవాబు చెప్పలేదు. చిత్రాంక్ తన కారు దగ్గరికి నడిచి తాళం తీసి, లోపలకి ఎక్కి కూర్చుని తేలికపడ్డ మనసుతో ఇంటి దారి పట్టాడు. కారు శబ్దం బాగా దూరం అయ్యేదాకా ఆగి ఆ వ్యక్తి లేచి ఓసారి చుట్టూ చూశాడు. తర్వాత సంచీలోంచి మరమరాలని తీసి ఒడ్డున పోసి సంచీని ఖాళీ చేశాడు. కొన్ని బాతులు నీళ్ళల్లోంచి నేల మీదకి వచ్చి వాటిని తినసాగాయి. ఆయన ఓ బాతుని అందుకుని దాని మెడ విరిచాడు. అది రెక్కలు కొట్టుకుంటూంటే దాన్ని ఆ సంచీలో వేసుకుని లేచాడు. కొద్దిసేపట్లో ఎర్రబడ్డ సంచీ నిశ్చలమైంది. ఆ వ్యక్తి చెరువు వెనక ఉన్న తన గ్రామానికి బయలుదేరాడు. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
ప్రధాని మోదీని మెప్పించిన వంటలక్క యాదమ్మ..!
ఏదైన శుభకార్యానికి వెళ్లొస్తే మొదటగా అందరూ మాట్లాడుకునేది వడ్డించిన వంటల గురించే.. వెజ్ అయినా.. నాన్వెజ్ అయినా.. వంటకం ఎలా ఉంది..? ఎన్ని రకాలు వడ్డించారు? ఇలా ఓ చర్చే జరుగుతుంది. అయితే ఈ వంటలక్క చేయి పడితే రుచి చూడడం అవసరం లేదు. నాన్వెజ్లో బగారా, చికెన్, మటన్, ఫిష్, తలకాయ, బోటీతో పాటు వెజ్లో పచ్చిపులుసు, భక్షాలు, పప్పుచారు, పులిహోరాతో పాటు పంచభక్ష పరమాన్నాలు లొట్టలేసుకుని తింటారు. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీతో శభాష్ అనిపించుకున్న కరీంనగర్లోని సప్తగిరికాలనీకి చెందిన ప్రముఖ క్యాటరింగ్ నిర్వాహకురాలు గూళ్ల యాదమ్మ చేతి వంటను రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకులందరూ రుచిచూశారు. ఒకప్పుడు రూ.15కు దినసరి కూలీగా చేసి, ప్రస్తుతం వందల మందికి ఉపాధి కల్పిస్తున్న యాదమ్మ చేతివంటపై సండే స్పెషల్..!!విద్యానగర్(కరీంనగర్): యాదమ్మది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి. చిగురుమామిడి మండలం కొండాపూర్కు చెందిన చంద్రయ్యతో పదిహేనేళ్ల వయసులోనే వివాహమైంది. కొడుకు పుట్టిన మూడు నెలలకే చంద్రయ్య ఓ ప్రమాదంలో మరణించాడు. దీంతో కొడుకును తీసుకుని కరీంనగర్కు వలసొచ్చారు. కొన్ని రోజులు స్కూల్లో ఆయాగా పని చేశారు. తరువాత మంకమ్మతోటకు చెందిన వెంకన్న వద్ద వంటపనిలో హెల్పర్గా చేరారు. అందుకు రోజూ రూ.15 కూలీ తీసుకునేవారు. కాలక్రమేణ చిన్నచిన్న ఫంక్షన్లలో వంటచేస్తూ మన్ననలు పొందారు. క్రమేనా పెద్దపెద్ద ఫంక్షన్లకు క్యాటరింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు 50 వేల మందికైనా ఒంటిచేత్తో వంటచేసేలా ప్రావీణ్యం సంపాదించారు.మోదీ మెచ్చిన వంటలు2022లో హైదరాబాద్లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీతో పాటు పాల్గొన్న వందలాది మంది ప్రముఖులకు యాదమ్మ తన చేతి వంటలు రుచి చూపించి శభాష్ అనిపించుకున్నారు. హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ వంటలు రుచిచూసిన ప్రధాని యాదమ్మను ప్రత్యేకంగా అభినందించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం పలుమార్లు యాదమ్మ వంటలను మెచ్చుకున్నారు. కేటీఆర్ నిర్వహించిన మూడు బహిరంగసభలు, వేములవాడ శివరాత్రి ఉత్సవాలు, కొండగట్టు హనుమాన్ జయంతి, గోదావరి పుష్కరాల్లో వేలాది మందికి వంటలు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు పెళ్లిలో 30వేల మందికి, కరీంనగర్ తీగల వంతెన ప్రారంభం అప్పుడు 20వేల మందికి వంటలు చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసాల్లో జరిగిన ఫంక్షన్లకూ యాదమ్మ క్యాటరింగ్ చేశారు. గతనెల 27న కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో 25వేల మందికి రుచికరమైన వంటకాలు చేసిపెట్టారు.వందలాది మందికి ఉపాధికిరాయి పెంకుటిళ్లు నుంచి ఇప్పుడు సప్తగిరికాలనీలో తనకంటూ ఒక మంచి సొంతిళ్లు నిర్మించుకుని దుర్గా నిలయంగా పేరు పెట్టుకున్నారు. ఒక్కగానొక్క కొడుకును చదివించి రూ.12 లక్షలు ఖర్చు చేసి అమెరికా పంపింపారు. అక్కడి వాతావరణం పడక అనారోగ్యం పాలు కావడంతో స్వదేశానికి వచ్చి అతనూ క్యాటరింగ్ చేస్తున్నాడు. యాదమ్మ వద్ద దాదాపు 200 మంది వంటలు నేర్చుకుని సొంతంగా క్యాటరింగ్లు నిర్వహిస్తున్నారు. మీర్జాపూర్కు చెందిన 20 మంది మహిళలు వంటలు నేర్చుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు. సీజన్లో 200మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మిగతా రోజుల్లో నిత్యం 10 నుంచి 20 మంది యాదమ్మ వంటకు సాయంగా ఉంటారు.ఈ జన్మలో కలిగిన భాగ్యంకరీంనగర్లోని మారుమూల పల్లెలో పుట్టిన నేను ఈ దేశ ప్రధానికి నా చేతి వంట రుచి చూపిస్తానని కలలో కూడ అనుకోలేదు. శాకాహారమే కాకుండా నాన్ వెజ్ వంటకాలు కూడా బాగా చేస్తాను. గంగుల కమలాకర్, బండి సంజయ్లు నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారు. వారి ఇంట్లో, రాజకీయ పార్టీలకు, కాలేజీ ఫంక్షన్లకు, రాజకీయ సభలకు దాదాపు 20 నుంచి 30వేల మందికి వంట చేయగలను. నా వద్ద ప్రస్తుతం 40మంది వరకు పని చేస్తారు. నా దగ్గర పని నేర్చుకున్న వారు స్వయంగా క్యాటరింగ్ నిర్వహిస్తున్నారు. వారి పిల్లలను అమెరికా సైతం పంపించారు. – గూళ్ల యాదమ్మ -
క్లాసిక్స్ అంటే ఏమిటి
‘ప్రపంచంలోని పుస్తకాలన్నీ రెండే రకాలు! కొన్ని క్షణకాలం నిలిచేవి – మరికొన్ని కలకాలం నిలిచేవి’ అన్నాడు పందొమ్మిదవ శతాబ్దపు బహుముఖ ప్రజ్ఞావంతుడు జాన్ రస్కిన్. అలా కలకాలం నిలిచే పుస్తకాలనే ‘క్లాసిక్స్’ అంటూవుంటారు. సాహిత్య విమర్శలో ఏ మాట చెప్పినా, ఆలంకారికంగానే చెప్తారు; అంచేత ‘కలకాలం’ అంటే సుదీర్ఘకాలమనే మనం అర్థంచేసుకోవాలి. ‘ఎంత కాలంగా నిలువనున్న సరుకైతే అది అంత ప్రశస్తమైనది’ అనే ప్రమాణం చింతకాయ పచ్చడికీ ఉసిరిపచ్చడికీ వర్తించినంతగా క్లాసిక్స్కు వర్తించదు. ‘పురాతన కళాఖండాలు మనకు శ్రేష్ఠమైనవిగా అనిపించడానికి వాటి ప్రాచీనత కారణం కాదు! అలాంటి క్లాసిక్స్ ఎప్పుడు చదివినా ఎంతో తాజాగానూ, శక్తిమంతంగానూ, ఆరోగ్యదాయకంగానూ అనిపించడం వల్లనే అవి క్లాసిక్స్ అయ్యాయి‘ అన్నాడు గోథే. ప్రతి విషయాన్ని చమత్కారంగా చెప్పే అమెరికన్ మహారచయిత మార్క్ ట్వైన్ మాత్రం క్లాసిక్స్నూ వదలలేదు! ‘ప్రతిఒక్కరూ చదవాలని అనుకున్నప్పటికీ, ఏ ఒక్కరూ చదవని ఉద్గ్రంథాలే క్లాసిక్స్’ అన్నాడట ఆ మహానుభావుడు. అది తప్పని ఆయన విషయంలోనే రుజువైంది. హెమింగ్వేలాంటి వాళ్లు, ట్వైన్ రాసిన ‘హక్ల్ బెరీ ఫిన్’ నవలను క్లాసిక్గా పరిగణించిన మాట – దాన్ని చదవాలని ఒకప్పుడు మనమంతా ఉవ్విళ్లూరిన మాట నిజమే కదా! అంచేత, ఈ మాట అంటున్నప్పుడు మార్క్ ట్వైన్ తన గుబురు మీసాల మాటున నవ్వుకునే వుంటాడని గ్రహించాలి!! ఏతావాతా, దీర్ఘకాలం మనగలగడం ఒక్కటే క్లాసిక్స్ లక్షణం కాదు – కనీసం అది వాటి ప్రధాన లక్షణం కూడా కాదని తేలిపోయింది! జనజీవనంలో అనంతంగానూ, స్థిరంగానూ కొనసాగే కొన్ని ప్రమాణాలు క్లాసిక్స్లో ప్రముఖంగా కనిపించి తీరాలి. మానవమేధను మరింత రసవంతం చేసే లక్షణం దాంట్లో ఉండి తీరాలి. భూగోళమంతా విస్తరించుకుని వున్న మానవాళిలో ప్రతి నిత్యం దర్శనమిచ్చే భావావేశం క్లాసిక్స్లో పెల్లుబుకుతూ ఉండాలి. ఒక్కమాటలో చెప్పుకుంటే, క్లాసిక్స్లో – ఏదో ఒక రూపంలో– మౌలికమైన, విస్తృతమైన, లోతైన ఆలోచన – అనుశీలన – ఆవిష్కరణ వ్యక్తమై ఉండాలి. టీయస్ ఇలియట్ లాంటి నవ్య సంప్రదాయవాదుల లెక్క ప్రకారం, క్లాసిక్స్లో అంతర్నిహితంగా నిర్దిష్ట నైతికబోధన ఉండాలి. పాశ్చాత్య సాహిత్య ప్రపంచంలో, ఈ ప్రతిపాదనను సమర్థించేవాళ్లకన్నా, పట్టించుకోనివాళ్లే ఎక్కువ! విషయమేమిటంటే, కొన్ని తరాలపాటు పాఠక లోకాన్ని ప్రభావితం చేసే లక్షణాలున్న గొప్ప పుస్తకాలన్నీ క్లాసిక్సే. ఉదాహరణకి గురజాడ ‘కన్యాశుల్కం’, చలం ‘మైదానం’, విశ్వనాథ ‘కిన్నెరసాని పాటలు’, దేవులపల్లి ‘కృష్ణపక్షం’, సురవరం ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’, శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’, బుచ్చిబాబు ‘చివరికి మిగిలేది!’, దాశరథి ‘అగ్నిధార’, నవీన్ ‘అంపశయ్య’ – ఇవన్నీ క్లాసిక్సే. నాలాంటి వాడికి మల్లారెడ్డి, రాంభట్ల, సినారె అనువదించిన ‘మఖ్దూం కవిత’, సదాశివ ‘యాది’ కూడా క్లాసిక్స్ గానే కనిపిస్తాయి! అవి ఫలానా దేశంలో, ఫలానా భాషలో, ఫలానా కాలంలో వెలువడి వుండాలనేం లేదు. మనం ఈ విషయం గురించి ఇక్కడ చర్చించుకుంటూ ఉండగానే, ఏదో గొప్ప క్లాసిక్కు శ్రీకారం చుట్టడం జరిగివున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ మాటకొస్తే, ప్రతి క్లాసిక్ అలా వేర్వేరు కాలాల్లో, వేర్వేరు ప్రదేశాల్లో, వేర్వేరు భాషల్లో పుడుతూ వచ్చిందే! నోబెల్ బహుమతో – లేదా పులిట్జర్ పురస్కారమో – లేదా బుకర్ ప్రైజో పొందిన రచనలే క్లాసిక్స్ అని ఎవరూ అనరు – అనలేరు! సామాన్యయుగానికి పూర్వం ఏడో శతాబ్దిలో హోమర్ గానం చేసిన ‘ఇలియడ్’, ‘ఒడిస్సీ’లకు ఏ నోబెల్ ప్రైజ్ వచ్చిందని అవి క్లాసిక్స్ కాగలిగాయి? దానికి ఒక రెండువేల సంవత్సరాల తర్వాత వెలువడిన వాల్మీకి ‘రామాయణ’ కావ్యానికి ఏ పులిట్జర్ ప్రైజ్ వచ్చిందని అది క్లాసిక్ కాగలిగింది? దానికి ఒక రెండువేల సంవత్సరాల తర్వాత వెలువడిన వ్యాస ‘మహాభారత’ ఇతిహాసానికి ఏ బుకర్ ప్రైజ్ వచ్చిందని అది క్లాసిక్ కాగలిగింది? అంతెందుకు – టాల్ స్టాయ్ రాసిన ‘ఆనా కెరినినా’ గానీ, ‘యుద్ధం–శాంతి’ గానీ ఏ పురస్కారానికీ నోచుకోలేదు. అవి క్లాసిక్స్ కాదనడానికి ఎవరికైనా గుండెలున్నాయా? ఇక, జేమ్స్ జాయిస్ రాసిన ‘యులిసెస్’కు ఏ బహుమతీ దక్కకపోగా తీవ్రమైన ఆంక్షల పోటులూ, సెన్సార్ కత్తెర వేటులూ మాత్రమే ప్రాప్తమయ్యాయి. అది మేలిరకం క్లాసిక్ సుమా! అని పనిగట్టుకుని చెప్పాలా? హోర్హే లూయీ బోర్హే రాసిన ‘ఫిక్షన్’కు నోబెల్ పురస్కారం దక్కకపోవడానికి, ఆయన రాజకీయ అభిప్రాయాలే కారణం కావడం అందరికీ తెలిసిందే! అంతమాత్రాన అది క్లాసిక్ కాకపోతుందా? ఈ జాబితా సుదీర్ఘమైంది. జార్జ్ ఆర్వెల్, వర్జీనియా వూల్ఫ్, చినువా అచెబే, స్కాట్ ఫిట్జెరాల్డ్ లాంటి మహా రచయితల రచనలెన్నో ఉన్నాయి అందులో! క్లాసిక్స్ అంటే ఏమిటో – స్థూలంగా – అర్థం చేసుకోవడానికి ఈ చర్చ సరిపోతుందనుకుంటా. -
సాహిత్య దీపాన్ని అందించే ప్రయత్నం చేశా!
‘పిల్లలు ఎంత ఎదిగినా తల్లిదండ్రుల గుండెల్లో వారి స్థానం ఎప్పుడూ ప్రత్యేకమే! భవిష్యత్తుకు భరోసాగా నిలిచే ఈ తరం పిల్లల పెంపకంలో ఎప్పుడూ అశ్రద్ధగా ఉండకూడదు.’ అంటారు సినీ గీతరచయిత సుద్దాల అశోక్తేజ. పిల్లల పెంపంకంలో ఎదురయ్యే సాధకబాధకాల గురించి ఆయన పంచుకున్న ముచ్చట్లు...‘జోలాలి జోలాలి జోలాలి.. జోల పాడుతా బజ్జో నా తల్లి / నిదుర తల్లిని బతిమలాడని .. నీలి కళ్లలో నిదురపొమ్మని/ రా రమ్మని ఇమ్మని తీపికలలు ఎన్నో..’ ఇది నేను రాసిన సినిమా పాట. నిజానికి రాత్రివేళల్లో పిల్లలను జోకొడుతూ నిద్రపుచ్చితే, పిల్లలు చెప్పే విషయాలు వింటే.. వారు ఎంతో భరోసాగా ఫీలవుతారు. ఎన్ని పనులున్నా తల్లిదండ్రులు చేయాల్సిన పని రోజులో కొంతసేపు పిల్లలతో గడపడం. నాకు ఓ కూతురు, ఇద్దరు కొడుకులు. వారు పుట్టే సమయానికి మేం కడు పేదరికంలో ఉన్నాం. నాకు ఉద్యోగం లేదు. నా భార్య నిర్మల మిషన్ కుట్టేది, బీడీలు చుట్టేది. ఆ సమయంలో కరీంనగర్ జిల్లా మేడిపల్లిలో అతికష్టమ్మీద ప్రైవేట్స్కూల్ ప్రారంభించాను. అప్పుడు మా జీవనం కొంత మెరుగైంది. మా నాన్న హయాంలో కూడా ఆయనకు వచ్చేది కొద్దిపాటి ఆదాయమే. అయినా అంతా అందులోనే బతికాం. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా పిల్లల పెంపకంలో మా అమ్మనాన్నలు ఏం చేశారో, నేనూ అలాంటి జాగ్రత్తలే తీసుకున్నాను. మా అమ్మనాన్నలు మా దోసిట్లో పెట్టిన సాహిత్య దీపాన్ని మా పిల్లల చేతుల్లో పెట్టి, వెలిగించే ప్రయత్నం చేశాను. వాళ్లూ నా అంచనా మేరకు జీవితంలో చక్కగా స్థిరపడ్డారు. చలం ‘బిడ్డల శిక్షణ’..స్కూల్ నడుపుతున్న సమయంలో గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం వచ్చింది. అక్కణ్ణుంచి మా జీవనం మరికాస్త మెరుగైంది. ఇంటి పనులు, పిల్లల పనులు మా ఆవిడతో పాటు నేనూ కలిసి చేసేవాడిని. మా ఆవిడకు నేను చేసే పనులను చూసి, పిల్లలు కూడా ఇంటి పనుల్లో సాయం చేసేవారు. నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు చలం ‘బిడ్డల శిక్షణ’ పుస్తకం చదివింది. అది మా ఇంటి వాతావరణాన్నే మార్చేసింది. పిల్లలు ఎంత అల్లరి చేసినా, ఎంత చిరాకు సృష్టించినా ఒక్కనాడు కూడా వారి మీద చిన్న దెబ్బ కూడా వేయకుండా పెంచింది. మా ఇంట్లో పుస్తకాలు చదవడం, కథలు చెప్పడం అలవాటుండేది కాబట్టి, మా తమ్ముడు, చెల్లెలికి కథలు చెబుతుంటే మా పిల్లలు కూడా వినేవాళ్లు. ఇప్పుడు మా మనవలు, మనవరాళ్లకు మహాభారతం, భాగవతం చెప్పే ప్రయత్నం చేస్తుంటాను. అప్పట్లో సెల్ఫోన్లు, టీవీలు లేకపోవడం వల్ల సామాజిక పరిస్థితులు కూడా నాకు సహకరించాయి. ఇప్పుడు నా పిల్లల పిల్లలు వచ్చేసరికి పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. ఇప్పటి పిల్లలకు ‘చందమామ రావే.. ’ పాటలు, ‘చందమామ కథలు’ లేవు. యాంత్రికంగా పరుగులు వద్దుఈ రోజుల్లో భార్యభర్తలు ఉద్యోగం చేస్తే తప్ప కుటుంబం నడవని పరిస్థితులు వచ్చాయి. అందుకు ఇంట్లో అవసరానికి మించిన ఆడంబర వస్తువులూ వచ్చి చేరాయి. వాటి కోసం సంపాదన తప్పనిసరి అయ్యింది. కెరీర్ పరుగు పందెంలో జీవితాలు యాంత్రికం అయ్యాయి. స్మార్ట్ ఫోన్లకు, టీవీలకు, గూగుల్కు పిల్లలను అప్పజెబుతున్నారు. డిజటల్లో ఏం చూసి నేర్చుకుంటున్నారో, అదే నేటి పిల్లలు.పిల్లలతో ఆటలు మేలుపిల్లల చిన్నప్పుడు వారితో ఆటలాడేవాడిని. ఉదయం వాకింగ్కు తీసుకెళ్లేవాడిని.. వారితో మాట్లాడే ఆ కాసేపు ‘నా తండ్రి నా వెనకాల ఉన్నాడు’ అనే ఫీలింగ్ ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఇలా రోజూ కొంత సమయం గడిపితే పిల్లలు తప్పక మంచి స్థానంలో ఉంటారు. ఇప్పటికీ మించి పోయిందేమీ లేదు. సాధ్యమైనంత వరకు ప్రయత్నించవచ్చు. వంద పుస్తకాలు చదివినంత జ్ఞానం..సెలవుల్లో మా అమ్మ దగ్గరకు పిల్లలను తీసుకొని వెళ్లేవాళ్లం. ఇంట్లో పెద్ద తినుబండారాలేమీ లేకపోయినా వేడి అన్నంలో చింతకాయ పచ్చడి కలిపి, పిల్లలందరికీ తనే గోరుముద్దలు పెట్టేది. ఆ సమయంలో సహస్ర శిరచ్ఛేద అపూర్వచింతామణి వంటి కథలన్నీ చెప్పేది. ఇప్పుడు చిన్నకుటుంబాలు పెరిగాయి. అలాగే, పెంపకంలో చింతనలు కూడా పెరిగాయి. ఇప్పటి పిల్లలు ‘బియ్యం చెట్లు ఎలా ఉంటాయి?’, ‘ప్యాకెట్ల నుంచే కదా పాలు వచ్చేవి’ అని అడుగుతుంటారు. వాస్తవానికి దూరంగా పిల్లలు పెరుగుతున్నారు. పండుగల జీవన విధానం...మన పండగలన్నీ మానవసంబంధాలను కాపాడే క్రమంలో ఏర్పాటు చేసినవే. పెసర గారెలు, బూరెలు, భక్ష్యాలు, నువ్వులు బెల్లం కలిపిన ముద్దలు... ఇలా పండగలను బట్టి చేసే వంటలు పిల్లల ఆరోగ్యానికి మేలు చేసేవే. ఇప్పుడు డబ్బు ఉంటుంది, అందుకు తగిన జంక్ ఫుడ్ సులభంగా లభిస్తుంది. ఫలితంగా పిల్లలకు సరిగ్గా విరేచనాలు కావు, రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోరు. పిల్లల ఆరోగ్యం, లోకజ్ఞానం, పరిసరాల జ్ఞానం తప్పనిసరి. వీటిని ఈ రోజుల్లో సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి.నిర్మలారెడ్డి -
రూ.500 లంచం.. 36 ఏళ్ళు పోరాటం... ఏడాది జైలు
అవినీతికి పాల్పడిన ఉద్యోగులను తిమింగలాలతో పోలుస్తారు. తాజాగా అనకొండలను చేర్చారు. ఏ జంతువుతో పోల్చినా, కేసులు నమోదు చేస్తున్నా, కొన్ని ప్రభుత్వ శాఖల్లో ‘పైసా వసూల్’ కానిదే ఫైలు కదలదు, పని జరగదు. లంచం తీసుకోవడం తమ ప్రాథమిక విధుల్లో భాగమని, ఇవ్వడం ప్రజల బాధ్యతని కొంతమంది ఉద్యోగులు భావిస్తుంటారు. అంటే, ‘డ్యూటీకి వచ్చినందుకు జీతం... పనిచేయాలంటే లంచం’ మెజార్టీ ఉద్యోగులు ఇలానే ఉన్నారు. అడిగింది ఇచ్చేదాకా వేధిస్తుంటారు. అడ్డంకులు సృష్టిస్తుంటారు. అయితే, అందరూ వీటిని భరించరు. హక్కుగా పొందాల్సిన సేవలకు లంచం ఇవ్వరు. అవినీతి నిరోధక శాఖను ఆశ్రయిస్తారు. లంచగొండులను పట్టిస్తారు. ఇలా ఓ ఉద్యోగి దొరికాడు. కేసులో ఇరుక్కున్నాడు. చిన్న మొత్తమే కదా బయట పడతాననుకున్నాడు. కోర్టుల చుట్టూ తిరిగాడు. కాళ్లరిగాయి, ఏళ్లు గడిచాయి. చివరికి న్యాయం గెలిచింది. అవినీతికి శిక్ష ఖరారైంది. కానీ చాలా ఆలస్యమైంది.అది 1990... ఉత్తరాఖండ్లోని ఉద్ధమ్సింగ్ నగర్కి చెందిన రాజ్బహుదూర్ సింగ్ ఎక్సైజ్ కానిస్టేబుల్. ఓ గ్రామంలో తనిఖీలకు వెళ్లాడు. అక్రమ మద్యం ఉందంటూ ఓ వ్యక్తితో బలవంతంగా కొన్ని కాగితాలపై సంతకాలు చేయించుకున్నాడు. లంచంగా రూ. 500 డిమాండ్ చేశాడు. అడిగింది ఇవ్వకపోతే కేసు కోర్టుకు పంపుతానని బెదిరించాడు. వేధింపులు భరించలేక వ్యాపారి విజిలెన్స్ శాఖ ఎస్పీని కలిశాడు. జరిగింది చెప్పాడు. దీంతో వలపన్నారు. కానిస్టేబుల్ను రెస్టారెంట్కు రప్పించారు. డబ్బు తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేశారు. మూడు కోర్టులు... ముప్పయ్యారేళ్లుతొలుత ట్రయల్ కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. కోర్టు ఇద్దరు ప్రధాన సాక్షులను విచారించింది. అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 7, సెక్షన్ 13(2) కింద మార్చి 2006లో శిక్ష ఖరారు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. రెండేళ్లు జైలు శిక్ష, రూ. 2000 జరిమానా విధించింది. ఈ కోర్టులో కేసు 16 ఏళ్లు నడిచింది. ఈ తీర్పుపై నిందితుడు ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించాడు. కేసు కొట్టేయాలని అభ్యర్థించాడు. ఆరేళ్లు కేసు నడిచింది. ఏప్రిల్ 2012లో హైకోర్టు ఆ అప్పీల్ను తిరస్కరించింది. ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది. ‘సుప్రీం’కు చేరిన కేసుహైకోర్టులో చుక్కెదురవడంతో సుప్రీంకోర్టు మెట్లెక్కాడు. కేసు కొట్టేయాలని వేడుకున్నాడు .వాయిదాలతో 14 సంవత్సరాలు కేసు కొనసాగింది. 2012 ఆగస్టులో మొదటిసారి విచారణ జరిగింది. 21 సార్లు వివిధ బెంచ్ల ముందు విచారణకు వచ్చింది. ఎట్టకేలకు తుది తీర్పు వెలువడింది. ‘సాక్ష్యాలను సమగ్రంగా పరిశీలించిన ట్రయల్ కోర్టు, హైకోర్టులు నిందితుణ్ణి దోషిగా తేల్చడంలో ఎటువంటి పొరపాటు చేయలేదు’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. అందువల్ల ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు, దాన్ని హైకోర్టు సమర్థించిన నేపథ్యంలో ఈ కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తన తీర్పులో స్పష్టం చేసింది. కింది కోర్టు తీర్పును సమర్థిస్తూనే ‘నిందితుడికి ప్రస్తుతం 75 ఏళ్లు. అతడి వయస్సును దృష్టిలో పెట్టుకుని శిక్షను కనీస స్థాయికి తగ్గించవచ్చని మేం భావిస్తున్నాం’ అని తన ఆదేశంలో పేర్కొంటూ శిక్షను ఏడాదికి పరిమితం చేసింది. గతంలో కొంత కాలం జైలులో ఉండడంతో మిగిలిన కాలానికి శిక్ష అనుభవించాలని ఆదేశించింది. ఈ కేసులో తీర్పు ఆలస్యం అయింది. కానీ, న్యాయం గెలిచింది. తప్పుకు శిక్ష తప్పదని వెల్లడైంది. అయితే నాణేనికి ఇది ఒక వైపే! మరోపైపు చూస్తే, 40 ఏళ్ల వయసులో చేసిన నేరానికి 75 ఏళ్ల వయసులో శిక్ష పడింది. రూ. 500 లంచం తీసుకున్నందుకు చట్ట ప్రకారం శిక్ష ఖరారైంది. అవినీతి పరులను శిక్షించాల్సిందే కానీ, 36 ఏళ్ల కాలానికి విలువ కట్టేదెవరు? -
ఆర్డర్ పెడితే చాలు.. అర్ధరాత్రి కూడా ఎండ!
అర్ధరాత్రి బిర్యానీని ఆర్డర్ చేసినట్టు, ఇకపై రాత్రి పన్నెండు గంటల సమయంలోనైనా సరే, ‘కాస్త ఎండను పంపండి బాబూ.. బట్టలు ఆరేసుకోవాలి’ అని మనం ఆర్డర్ పెట్టుకునే కాలం.. దాదాపుగా దగ్గరకు వచ్చేసినట్లే! ‘రిఫ్లెక్ట్ ఆర్బిటల్’ అనే ఒక అమెరికన్ స్టార్టప్ కంపెనీ, అంతరిక్షంలోకి ఏకంగా 50,000 అద్దాలను పంపి, ఎవరికి కావలిస్తే వారికి రాత్రి పూట కూడా భూమి మీదకు ఎండను డెలివరీ చేసేందుకు త్వరలోనే ఒక ప్రయోగాన్ని చేపట్టబోతోంది.రిఫ్లెక్ట్ ఆర్బిటల్ ప్రయోగాత్మకంగా ఈ వేసవిలోనే సుమారు 60 అడుగుల (18.3 మీటర్లు) వెడల్పు ఉన్న ఒక మోడల్ అద్దాన్ని అంతరిక్షంలో అమర్చనుంది. అది భూమికి 640 కిలోమీటర్ల ఎత్తులో ఉండి, భూమి మీద ఉన్న సుమారు 5 కిలోమీటర్ల విస్తీర్ణంలోని చీకటి ప్రదేశాన్ని వెలుగుతో నింపేస్తుంది. ఇందుకు అమెరికా ప్రభుత్వం కనుక అనుమతి ఇస్తే ఇకపై రాత్రిపూట వెన్నెలతో పాటు కృత్రిమ సూర్యకాంతి కూడా భూమికి అందుబాటులోకి వస్తుంది. 30 ఏళ్ల క్రితమే రష్యా ప్రయోగం!నిజానికి ఇలాంటి ఆలోచన రావడం మానవ మేధావులకు ఇదే మొదటిసారి కాదు. 1993లో రష్యా వారు ‘జ్ఞామ్యా’ అనే ఒక ఉపగ్రహం ద్వారా 65 అడుగుల వ్యాసం కలిగలిన అద్దాన్ని అంతరిక్షంలో ఏర్పాటు చేసి, రెండు మూడు నిండు చంద్రుళ్లులు ఇచ్చేంత వెలుగును భూమి మీదకు పంపగలిగారు. సైబీరియా వంటి మంచు ప్రాంతాల్లో పగలు తక్కువగా ఉంటుంది కాబట్టి, అక్కడ పగటి సమయాన్ని పెంచాలని అలా చేశారు. కానీ అది అప్పట్లో అంతగా ఫలించలేదు. ఇప్పుడు ఈ ‘రిఫ్లెక్ట్ ఆర్బిటల్’ కంపెనీ అదే ఆలోచనను భారీ ఎత్తున ముందుకు తీసుకెళుతోంది. అందుకోసం దాదాపు 28 మిలియన్ల డాలర్ల (సుమారు రూ. 235 కోట్లు) పెట్టుబడులు కూడా సమకూర్చుకుంది.ఎండకు ‘సబ్స్క్రిప్షన్’ ‘‘మేము శిలాజ ఇంధనాల (పెట్రోల్, బొగ్గు) స్థానంలో ప్రపంచం మొత్తానికి ఈ అద్దాల కాంతితో విద్యుత్తును ఇస్తాం చూడండి..’’ అని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాస్ బెన్ నోవాక్ ధీమాగా చెబుతున్నారు. ఆయన చెబుతున్న దానిని బట్టి 2027 నాటికి మరో రెండు మోడల్ అద్దాలు పైకి పంపిస్తారు. 2028 నాటికి ఏకంగా 1,000 పెద్ద సైజు అద్దాల ఉపగ్రహాలను ఆకాశంలోకి పంపాలని చూస్తున్నారు. మొత్తం మీద ఆకాశంలో అద్దాలు అనే కొత్త నక్షత్రాలను మనం చూడబోతాం అన్నమాట. ఈ కంపెనీ ఉత్సాహం చూస్తుంటే భవిష్యత్తులో ఓటీటీ రీచార్జ్ లానే ఎండను కూడా చందా కట్టి కొనుక్కునే అవకాశం కల్పించేలా ఉంది. ‘రిఫ్లెక్ట్ ఆర్బిటల్’ కంపెనీ 2030 నాటికి 5,000 అద్దాలు, 2035 నాటికి ఏకంగా 50,000 అద్దాలను అంతరిక్షంలో పరచాలన్న కృత నిశ్చయంతో ఉంది. రిఫ్లెక్ట్ ఆర్బిటల్ కంపెనీ ప్రస్తుత అంచనాల ప్రకారం, రాత్రిపూట మనకు ఒక గంటసేపు సూర్యకాంతి కావాలంటే సుమారు 5,000 డాలర్లు (రూ. 4,62,000) చెల్లించాలి. అది కూడా కనీసం 1,000 గంటల ఒప్పందం చేసుకుంటేనే అంత తక్కువ ధర అట! ఇక, సోలార్ ప్లాంట్ యజమానులతో కూడా – ‘‘మేము రాత్రి పూట మీకు వెలుగు ఇస్తాం. దాని ద్వారా మీరు తయారు చేసే కరెంటు లాభాల్లో మాకు వాటా ఇవ్వండి’’ అని డీల్ కుదుర్చుకోబోతున్నారు.‘పొద్దు కుదరని’ ప్రమాదం!ఎన్ని ప్రయోజనాలున్నా, తక్కిన శాస్త్రవేత్తలు మాత్రం ఈ ప్రయోగాన్ని ‘సర్కాడియన్ రిథమ్’ (నిద్ర, మెలకువల లయ)పాలిట శాపంగా చూస్తున్నారు. మన శరీరంలో ఒక జీవ గడియారం ఉంటుంది. చీకటి పడగానే నిద్రపోవాలని, వెలుగు రాగానే లేవాలని అది చెప్తుంది. రాత్రి పూట అద్దాల వెలుగు వస్తే ఆ గడియారం దెబ్బతింటుంది. మన ఆరోగ్యాన్నీ దెబ్బ తీస్తుంది. ఇది అక్కడితో ఆగదు. జంతువులు ఆహారం దొరకని సమయంలో పిల్లల్ని కనడం, శీతకాలంలో నిద్రావస్థలోకి వెళ్లే జంతువులు మధ్యలోనే మేల్కొనడం వంటి ప్రకృతి విరుద్ధమైన పరిణామాలు సంభవిస్తాయి. ఎక్కడెక్కడికో వలస వెళ్లే పక్షులు ఈ కృత్రిమ వెలుగును చూసి ‘వేసవి కాలం వచ్చేసింది’ అని పొరబడి, చలి తీవ్రంగా ఉన్న చోట్లకు వెళ్లి ప్రాణాలు వదిలే ప్రమాదం ఉంది.. తేనెటీగలకు, పూలకు ‘పొద్దు’ కుదరక, ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది.పైలట్లు తికమక పడొచ్చుమనుషుల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. ఆకాశంలో హఠాత్తుగా మెరిసే ఈ అద్దాల వెలుగు విమాన పైలట్లను అయోమయానికి గురి చేయవచ్చు. టెలిస్కోపుల ద్వారా అంతరిక్షాన్ని పరిశోధించే శాస్త్రవేత్తలకు ఈ అద్దాలు పెద్ద అడ్డంకిగా మారవచ్చు. ఆరోగ్యం విషయానికొస్తే, రాత్రి పూట కూడా వెలుగు ఉంటే మన శరీరంలో నిద్రకు కారణమయ్యే హార్మోన్లు విడుదల కావు. ఫలితంగా ఇన్సోమ్నియా (నిద్రలేమి) వంటి రోగాలు దరి చేరవచ్చు. ఇవన్నీ అలా ఉంచి, ఈ ప్రయోగం వల్ల మొత్తంగా చీకటి మాయమైపోయే ప్రమాదం ఉందని ‘డార్క్ స్కై’ అనే సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.ఖగోళ శాస్త్రవేత్తల కలవరం!ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటికే అంతరిక్షంలో తిరుగుతున్న ఉపగ్రహాల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆకాశంలో వేల సంఖ్యలో పరిభ్రమిస్తు్తన్న ఉపగ్రహాల వల్ల నక్షత్రాలను, గ్రహాలను సరిగ్గా చూడటం వారికి కష్టమవుతోంది. ఒక పక్క స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీలు తమ శాటిలైట్లు తక్కువ వెలుగును ప్రతిబింబించేలా (వీటిని డార్కర్ శాటిలైట్స్ అంటారు) ప్రయత్నిస్తుంటే, ఈ రిఫ్లెక్ట్ ఆర్బిటల్ వాళ్లు మాత్రం తమ శాటిలైట్లను వీలైనంత ఎక్కువ మెరిసేలా అమర్చబోతున్నారు. మరోవైపు, టెలిస్కోపులతో తీసే అంతరిక్ష ఫోటోల్లో ఈ అద్దాల వెలుగు ఒక తెల్లటి గీతలా పడి, అసలైన నక్షత్రాల సమాచారాన్ని మింగేసే ప్రమాదం ఉందని కూడా శాస్త్రవేత్తలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆకాశం నుండి కాంతి కాలుష్యంప్రిన్స్ టన్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త ప్రొఫెసర్ గ్యాస్పర్ బాకోస్ ఈ అద్దాల ఆలోచనపై నిప్పులు చెరుగుతున్నారు. రిఫ్లెక్ట్ ఆర్బిటల్ కంపెనీ వాళ్లు.. ‘‘మేము కేవలం ఒక చిన్న ప్రదేశంలోనే (సుమారు 5 కిలోమీటర్ల విస్తీర్ణం) వెలుగు వచ్చేలా చూస్తాం, పక్కన ఉన్న టెలిస్కోపుల జోలికి వెళ్లము’’ అని నమ్మకంగా చెబుతున్నప్పటికీ, ‘‘ఆకాశం నుండి వచ్చే కృత్రిమ అద్దాల కాంతి.. వాతావరణంలోని మేఘాలు, గాలి కణాల వల్ల అటు ఇటు చెల్లాచెదురు అవుతుంది. దీనివల్ల ఆ ప్రాంతం చుట్టూ ఒక పెద్ద ‘లైట్ పొల్యూషన్’ ఏర్పడుతుంది. ఇది ఖగోళ పరిశోధనలను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది’’ అని ప్రొఫెసర్ గ్యాస్పర్ అంటున్నారు. ‘‘రిఫ్లెక్ట్ ఆర్బిటల్ లాంటి కంపెనీలను అంతరిక్షంలో అద్దాలు పెట్టకుండా ఖచ్చితంగా అడ్డుకోవాలి. ఇది మన పర్యావరణానికి చాలా రకాలుగా హాని కలిగిస్తుందని ఆయన కుండబద్దలు కొడుతున్నారు. ఏమైనా, ఈ రిఫ్లెక్ట్ ఆర్బిటల్ కంపెనీకి అమెరికా ప్రభుత్వం పచ్చ జెండా ఊపుతుందా, లేక శాస్త్రవేత్తల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటుందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.ఉపయోగాలు అనేకం!అంతరిక్షంలో అద్దాలు బిగించి, సూర్యకాంతిని భూమి పైన ఉన్న వారికి డెలివరీ చేయటం అనే ఈ ఐడియా వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా సన్నివేశంలా ఉన్నప్పటికీ, ఇది కనుక నిజంగా కార్యాచరణలోకి వస్తే, దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని రిఫ్లెక్ట్ ఆర్బిటర్ చెబుతోంది. రాత్రి పూటాసౌర శక్తి ఉత్పత్తిసోలార్ ప్యానెల్స్ రాత్రిపూట కరెంట్ తయారు చేయలేవన్నది తెలిసిందే. కానీ ఈ అద్దాలు ఉంటే, రాత్రి కూడా సూర్యకాంతిని ప్యానెల్స్ మీద వేసి 24 గంటలూ విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. అంటే సోలాన్ విద్యుత్తును నిల్వ ఉంచే బ్యాటరీల అవసరం తగ్గుతుంది.విపత్తు సమయాల్లో వెలుగుభూకంపాలు, వరదలు, దుర్ఘటనలు రాత్రివేళ సంభవించినప్పుడు కరెంట్ పోయి అంతా చీకటిగా ఉంటుంది. అలాంటి సమయాల్లో గాలింపు చర్యల బృందాలకు ఆకాశం నుండే వెలుగు అందించి ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చు.వేగంగా ప్రాజెక్టు పనులుమారుమూల ప్రాంతాల్లో మైనింగ్ లేదా నిర్మాణ పనులు జరిగేటప్పుడు, రాత్రి పూట కూడా పగలు మాదిరిగానే పని చేసుకోవడానికి ఈ అద్దాల వెలుగు ఉపయోగపడుతుంది. పని గంటలు పెరుగుతాయి, ప్రాజెక్టులు త్వరగా పూర్తవుతాయి.సైన్యానికి బాసటగా..!మిలిటరీ ఆపరేషన్లు జరిగేటప్పుడు నిరంతరాయంగా సోలార్ పవర్ అందించడానికి, చీకటిలో శత్రువుల కదలికలను కనిపెట్టడానికి ఈ అద్దాల వెలుగును వాడుకోవచ్చు.వ్యవసాయానికీ పండగేమొక్కల ఎదుగుదలకు సూర్యరశ్మి ముఖ్యం. కాబట్టి పంట కాలాల వ్యవధిని పెంచడానికి, మొక్కలకు కావాల్సినంత వెలుగును అందించి దిగుబడిని పెంచడానికి దర్పణకాంతిని వాడుకోవచ్చు.నగర వీధులు కళకళరోడ్ల మీద వేల సంఖ్యలో స్ట్రీట్ లైట్లు పెట్టే బదులు, నేరుగా పై నుండే వెలుగును వాడుకోవచ్చు. అంతేకాదు, దీనివల్ల భూమి మీద ‘లైట్ పొల్యూషన్’ తగ్గుతుందని కూడా ఈ కంపెనీ అంటోంది.కాంతులీనే వేడుకలుపెద్ద పెద్ద ఈవెంట్లు, బహిరంగ కార్యక్రమాలు, పర్యాటక క్షేత్రాలలో రాత్రి పూట ఒక వింతైన అనుభూతిని కలిగించడానికి ఈ ఆర్టిఫిషియల్ సన్ లైట్ ను వాడుకోవచ్చు. -సాక్షి స్పెషల్ డెస్క్ -
ఐశ్వర్య పయనం!
యాక్షన్ కింగ్ అర్జున్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటి ఐశ్వర్య అర్జున్. అతికొద్ది రోజుల్లోనే తన నటనతో మెప్పించి ప్రత్యేకమైన గుర్తింపును సాధించింది. ఇప్పుడు తెలుగు తెరపై ‘సీతా పయనం’ మొదలుపెట్టింది. ఆ ప్రయాణంలోని విశేషాలు ఆమె మాటల్లోనే మీకోసం...క్రమశిక్షణ నా బలంక్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నాన్నను చూస్తూ పెరగడం వల్ల కావచ్చు, క్రమశిక్షణ అనేది నా రక్తంలోనే ఉంది. ఫిట్నెస్ విషయంలో కూడా నేను చాలా కట్టుదిట్టంగా ఉంటాను. యోగా చేయకుండా నా రోజు గడవదు.విమర్శలే ఇష్టంసోషల్ మీడియాలో నా గురించి వచ్చే వార్తల కంటే, నా పని గురించి వచ్చే విమర్శలనే నేను ఎక్కువగా ఇష్టపడతాను. అవే మనల్ని మంచి నటిగా మారుస్తాయని నమ్ముతాను.నాన్న చాలా స్ట్రిక్ట్బెంగళూరులో పుట్టాను. కాని, నా విద్యాభ్యాసం అంతా చెన్నైలోనే సాగింది. సేక్రెడ్ హార్ట్ స్కూల్, తర్వాత స్టెల్లా మేరీస్ కాలేజీలో బీకామ్ పూర్తి చేశాను. ఫ్యామిలీ మొత్తం సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నా, చదువు విషయంలో నాన్న చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు.వెనుక పెద్ద పేరు ఉన్నా...వెనుక ‘అర్జున్ సర్’ అనే పెద్ద పేరు ఉండొచ్చు. కాని, సెట్స్లోకి వెళ్లినప్పుడు నేను కేవలం ఒక నటిని మాత్రమే. ‘పట్టాతు యానై’తో నా ప్రయాణం మొదలైనప్పుడు నాన్న చెప్పిన ఒకే మాట ఇప్పటికీ గుర్తుంది ‘‘నువ్వు చేసే పనికి వంద శాతం న్యాయం చెయ్, మిగిలింది ప్రేక్షకులు చూసుకుంటారు.’’ ఆ మాటలను ఇప్పటికీ పాటిస్తాను.ఫ్యాషన్ పై ఆసక్తియూకేలోని బర్మింగ్హామ్ సిటీ యూనివర్సిటీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశాను. గ్లామర్ ప్రపంచంలోకి రాకపోయి ఉంటే, నేను కచ్చితంగా ఒక ఫ్యాషన్ డిజైనర్గా స్థిరపడేదాన్ని. అందుకే నా దుస్తుల ఎంపికలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను.ఇంటి వంటలంటే ఇష్టంఎన్నో రకాల ఇంటర్నేషనల్ వంటకాలు తిన్నా, ఇంట్లో చేసే వేడి వేడి అన్నం, పప్పు రుచే వేరు. వీకెండ్స్లో నా చెల్లెలు అంజనతో కలిసి కొత్త కొత్త వంటలు ట్రై చేస్తుంటాను. అలాగే నాన్నతో కలిసి అప్పుడప్పుడు లాంగ్ డ్రైవ్స్కి వెళ్తుంటాను.నటిగా మరింత ముందుకుపవర్ఫుల్, ఎమోషనల్ పాత్రలు చేయాలని కోరుకుంటున్నాను. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటిగా నన్ను నేను నిరూపించుకునే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తున్నాను. -
అదే గ్లామర్ డిసైడర్!
సహజమైన అందం, కంఫర్ట్ ఫ్యాషన్ తోనే గ్లామర్కి కొత్త నిర్వచనం ఇస్తూ, తనదైన గ్రేస్తో ప్రతి లుక్ను ప్రత్యేకంగా మలుస్తోంది నటి రుక్మిణి వసంత్. ఇందుకోసం ఆమె పాటించే ఫ్యాషన్ టిప్స్ ఇప్పుడు మీకోసం...లెహంగా.. స్టయిలింగ్: రుతుజ స్టయిల్స్జ్యూలరీ బ్రాండ్: కుందన్కలీ జ్యూలరీ ధర: డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.సింప్లిసిటీనే నా సూపర్పవర్. హెవీ మేకప్ కంటే కాన్ఫిడెన్స్ ఇచ్చే మెరుపు అసలైన గ్లామర్ని డిసైడ్ చేస్తుంది. ఇక ఫ్యాషన్లో నాకు హెరిటేజ్ టచ్ను మోడ్రన్ గా క్యారీ చేయడం ఇష్టం. – రుక్మిణి వసంత్.రంగురంగుల హారం!ఏ డ్రెస్లోకైనా ఇట్టే మ్యాచ్ అయ్యే ఆల్–ఇన్ –వన్ హారం కావాలా? అయితే ఈ మల్టీ కలర్డ్ నెక్పీస్ మీ వార్డ్రోబ్లో ఉండాల్సిందే! మెడపై ఒక్కసారి రంగుల హరివిల్లు విరిసినట్టే అనిపిస్తుంది. ఒక్క రంగులోనే కాదు, ఎన్నో రంగులు కలిసిన ఈ హారం ఏ ఔట్ఫిట్కైనా ఈజీగా మ్యాచ్ అవుతుంది. అయితే, ఈ హారం వేసుకుంటే ఇయర్రింగ్స్ సింపుల్గా ఉండాలి. లేకపోతే మీ లుక్ కంటే జ్యూలరీ మీపై ఓవర్టేక్ చేస్తుంది! అలాగే, నెక్లైన్ సింపుల్గా ఉంటేనే ఈ హారం ఫుల్గా షైన్ అవుతుంది. హై నెక్తో అయితే అది కొంచెం ‘హైడ్ అండ్ సీక్’ ఆడేస్తుంది, కాబట్టి అప్పుడు దీనిని అవాయిడ్ చేయడం మంచిది.హెయిర్ ఓపెన్ గా కంటే, బన్ లేదా జడగా కట్టుకుంటే ఈ హారం క్లియర్గా హైలైట్ అవుతుంది. అప్పుడు ఫొటోలలో కూడా ఫుల్ మెరుపే మీదే! చేతిలో పెద్దగా ఆభరణాలు పెట్టకపోయినా పర్లేదు; ఒక్క ఈ రంగురంగుల హారం చాలు మీ మొత్తం లుక్ని హైలైట్ చేసేస్తుంది. మార్కెట్లో సింపుల్ నుంచి గ్రాండ్ వరకు ఎన్నో డిజైన్లలో అందుబాటులో ఉండటంతో, ప్రతి స్టయిల్ ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ దొరుకుతుంది. -
మృత్యువుపై ఘనవిజయం... క్రీస్తు పునరుత్థానం
ఈస్టర్ ఓ జయధ్వని; ఈస్టర్ ఓ ఆశల హారం; ప్రతి హృదయంలో వికసించిన ప్రేమ పరిమళం. సమాధి తలుపులు తెరిచి దివ్యవర్చస్సుతో క్రీస్తు నిలిచిన రోజు. ప్రతి హృదయంలో ప్రేమ సందేశం మార్మోగుతున్న సమయం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొంటున్నారు. మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు మహాత్మ్యాన్ని కీర్తిస్తూ భక్తిపారవశ్యంతో పునీతులవుతున్నారు. మరణపు మెడలు వంచి మరణభయం నుంచి మనిషిని విడిపించడానికి యేసు పునరుత్థానుడయ్యాడు. ప్రస్తుతం యెరూషలేములోని యేసు ఖాళీ సమాధి క్రీస్తు పునరుత్థానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. మహిమాన్వితమైన ఆ చారిత్రక సంఘటన మనిషికి నిరీక్షణను, అపరిమితమైన ధైర్యాన్ని, మనో నిబ్బరాన్ని ప్రసాదిస్తుంది.యేసుక్రీస్తు జీవితం ప్రత్యేకమైనది, విలక్షణమైనది. ముప్పయి మూడున్నర సంవత్సరాల ఆయన జీవిత ప్రస్థానం ప్రపంచ చరిత్రలో పెనుమార్పులను తెచ్చింది. ప్రేమ, దయ, వినయం వంటి అనేకమైన ఆత్మీయ పదాలకు మనిషి మనసులో చోటు లభించింది. ఒక వ్యక్తి గెలుపుబాటలో అప్రతిహతంగా దూసుకుపోవాలన్నా; పరీక్షా ఘట్టాలను, గడ్డు సవాళ్లను అధిగమించి; కీర్తి కిరీటం దక్కించుకోవాలన్నా; పరమాత్ముని బాటలో నడవాలని బైబిల్ ప్రబోధిస్తు్తంది. మొదటి శతాబ్దకాలంలో ఇశ్రాయేలు దేశంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో పౌలు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు యూదుజాతిలో పేరెన్నికగలవాడు. తార్సు ప్రాంతంలో జన్మించి ధర్మశాస్త్రంలో అమితాసక్తిని కలిగియుండి గమలియేలు అనే వ్యక్తి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. శరీరాకారంలో దేవుడు ఈ లోకానికి వచ్చాడన్న సత్యంతో పౌలు మొదట్లో ఏకీభవించలేదు. క్రీస్తు మార్గాన్ని అనుసరిస్తున్న వారిపై అపరిమితమైన ద్వేషాన్ని పెంచుకున్నాడు. యేసు ‘క్రీస్తు’ కాదని వాదించుటే గాక, యేసుక్రీస్తును విశ్వసించినవారిని హింసించుటకు, దూషించుటకు ఇష్టపడ్డాడు.సిరియా దేశంలోని దమస్కు ప్రాంతంలో క్రైస్తవులు ఉన్నారని తెలిసి వారిని నాశనం చేయడానికి బయలుదేరాడు. దానికి యెరూషలేములోని క్రీస్తును ద్వేషించే మతపెద్దలు అంగీకరించారు. సరిగ్గా దమస్కు పొలిమేరకు చేరుకొనేసరికి మతగర్వంతో, ద్వేషంతో రగిలిపోతున్న పౌలుకు క్రీస్తు ప్రత్యక్షత దొరికింది. సమున్నతమైన క్రీస్తు రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. తల్లిఒడిలో పరవశించే బిడ్డవలే దేవుని దివ్యరూపాన్ని చూసి పరవశించిపోయాడు. తన గత జీవిత దౌర్భాగాన్ని తలచుకొని కన్నీళ్ళు విడిచి నూతన వ్యక్తిగా మార్పు చెందాడు.ఈ విశిష్ట సంఘటనలను పౌలు స్వయంగా రోమన్ గవర్నర్ ఫేస్తు ముందు, రాజు అగ్రిప్ప ముందు వివరించాడు.ఒకానొక సందర్భంలో రోమా పట్టణంలో ఉన్న దేవుని ప్రజలకు ఓ పత్రిక వ్రాస్తూ యేసుక్రీస్తు మరణాన్ని గురించి ఇలా అన్నాడు: ‘మనుష్యులమైన మనమంతా బలహీనులముగా ఉన్నప్పుడే క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. మంచివాని కొరకు ఎవరైనా ఒకవేళ చనిపోవ తెగించవచ్చును గాని, మనమింకను పాపులమై యుండగానే యేసు మన కొరకు చనిపోయెను, సర్వశక్తుడైన దేవునితో సమాధానాన్ని గలిగి రక్షించబడు నిమిత్తం క్రీస్తు సిలువమీద మరణించాడు’. దేవుడు ప్రేమాస్వరూపి అనే బైబిల్ బోధకు ఋజువు క్రీస్తు సిలువ మరణమే. పౌలు మూడు సువార్తయాత్రలు చేశాడు. వాటిలో ప్రతిచోటా తాను ఎక్కువగా మాట్లాడింది, తన వ్రాతల్లో వ్రాసింది క్రీస్తు మరణ పునరుత్థానాలను గురించే!‘యేసుప్రభువు సిలువపై చనిపోయారా? ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారా?’ అని ప్రశ్నించే చాలామందికి ఇటలీ దేశంలోని ట్యురిన్ నగరంలో ఉన్న ట్యురిన్ వస్త్రం నిలువెత్తు నిదర్శనంగా ఉంది. యేసు చనిపోయిన తర్వాత ఆయన మీద ఒక విలువైన వస్త్రాన్ని కప్పారు. యూదుల ఆచారం ప్రకారం చనిపోయిన వ్యక్తికి సుగంధ ద్రవ్యాలు పూసి నారబట్ట చుడతారు. యేసు చనిపోయిన తరువాత ఆయనకు చుట్టబడిన వస్త్రం నేటికి ఉందని పండితులు నిర్థారించారు. ఒక మనిషి ఆకారం దానిలో కనబడుతుంది. అతని చేతుల్లో మేకులు గాయాలు ఉన్నాయి. అతని దేహమంతా కూడా తూట్లు తూట్లుగా ఎవరో విభజించినట్లు విపరీతమైన గాయాలు కనబడుతున్నాయి.శాస్త్రవేత్తలు ఈ వస్త్రాన్ని చాలా సంవత్సరాల తర్వాత కనుగొని, దానిమీద పరిశోధనలు చేశారు. ఈరోజుకు కూడా ఇటలీలోని ట్యూరిన్ నగరంలో ఈ వస్త్రాన్ని మనం చూడవచ్చు. క్రీస్తు మరణ పునరుత్థానములకు సాక్ష్యం ఆ వస్త్రం. చరిత్రలో చాలామంది ఆ వస్త్రాన్ని దొంగిలించాలని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు కాని, వారి వల్ల కాలేదు. అయితే ఆ వస్త్రం యేసుకు సంబంధించినది కాదు, 12 లేదా 13వ శతాబ్దికి చెందిన వస్త్రమని వాదించేవారు లేకపోలేదు. వాస్తవమేమంటే క్రీస్తు ప్రభువు మీద కప్పబడిన వస్త్రం ఆ తర్వాత కాలంలో చాలామంది చేతులు మారడం వలన అక్కడక్కడ పాడైంది. కొంతమంది మఠకన్యలు క్రీ.శ . 1534లో పాడైపోయిన వస్త్రానికి ఎక్కడెక్కడ అయితే రంధ్రాలు పడ్డాయో అక్కడ బాగు చేశారు. ఆ కారణాన్ని బట్టి ఆ వస్త్రం అనేది 13వ శతాబ్దానికి చెందినదని చాలామంది భావించడానికి అవకాశం దొరికింది. ఇటలీలో ఉన్న ట్యురిన్ వస్త్రాన్ని కొందరు ‘ద ఫిఫ్త్ గాస్పెల్’ అని కూడా పిలుస్తారు. యేసుక్రీస్తు సిలువ మరణానికి ముందు రోజు కొన్ని సంఘటనలు జరిగాయి. గెత్సేమనే తోటకు ప్రభువు రాకమునుపు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. శిష్యులను వెంట బెట్టుకొని గెత్సెమనేకు వచ్చిన తర్వాత ఆయన ప్రార్థించుట మొదలు పెట్టెను. నేటికీ యెరూషలేములో గెత్సేమనే తోట ఉంది. దానిలోని కొన్ని ఒలీవ చెట్లు యేసుక్రీస్తు కాలానికి సంబంధించినవే. అక్కడ ఆయన ప్రార్థించిన రాయి కూడా ఉంది. దానిమీద ఓ గొప్ప దేవాలయం నిర్మించబడింది. దానిని ‘చర్చ్ ఆఫ్ ఆల్ నేషన్స్’ అని పిలుస్తారు. ఇశ్రాయేలును సందర్శించే వారందరూ కచ్చితంగా వాటిని చూస్తారు. ఆ తోటలో శిష్యులు నిద్రించుట చూసిన ప్రభువు వారిని మేల్కొల్పెను.అతి వేదనతో ప్రార్థించుట వలన చెమట రక్తబిందువులుగా మారింది. వైద్య పరిభాషలో దానిని హెమటోహైడ్రోసిస్ అంటారు. ఒక వ్యక్తి అత్యంత తీవ్రమైన ఒత్తిడికి లోనైనపుడు అతని స్వేద రంధ్రాలనుండి రక్తం స్రవిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు దేహం నుండి కూడా రక్తం స్రవించడానికి కారణం ఇదే. పొందబోయే ఆ భయంకర శిక్ష తీవ్రత గ్రహించినవాడై వేదనతో ప్రార్థించాడు. పండిత పురుషోత్తమ చౌదరి అనే కవి క్రీస్తు గెత్సేమనే అనుభవాన్ని ఓ అద్భుతమైన పాటలో ఇలా వర్ణించాడు. ‘శ్రమచేత తన దీన శరీరము నుండి దిగజార చెమట రక్తపు బొట్లుగా నమితమౌ లోకపాపము చూచి నిట్టూర్పులప్పటప్పటికి బుచ్చి క్రమముగా దూత తన కడకరుగుదెంచి శాంతము బల్కి చనిన పిదపం తమ మనంబుల బోలు తమసమున యూద సైన్యము లేగుదెంచెనపుడు గెత్సేమనే వనికి’. ‘అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను’ (యెష 53:8). జగద్రక్షకుడైన యేసుక్రీస్తు సిలువ మరణాన్ని గూర్చిన ప్రవచనాలు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో స్పష్టంగా చూడగలము. ఏడువందల సంవత్సరాలకు పూర్వమే రక్షకుని గూర్చిన సిలువ మరణంతో పాటుగా ఆయన అన్యాయపు తీర్పు తీర్చబడతాడు అని తెలియచెప్పబడింది. కఠినమైన సిలువ మరణానికి ముందు ఆయన ఎందుకు తీర్పు తీర్చబడ్డాడు? ప్రభువు తీర్చబడిన తీర్పు అన్యాయమైనదిగా ఎందుకు ఎంచబడింది? ఇస్కరియోతు యూదా ద్వారా అప్పగింపబడిన యేసుక్రీస్తు ప్రభువు నేరుగా అన్న, కయపల యొద్దకు తీసుకొని రాబడ్డారు. వాస్తవానికి మొదట అన్న యొద్దకు ఆ తదుపరి కయప యొద్దకు కొనిపోబడ్డారు. ఈ విషయం లేఖనాల్లో రెండు చోట్ల ప్రస్తావించబడింది.(యోహాను 18:1224, మత్తయి 26:57) వీరిద్దరూ యేసును అవమానించారు, హేళన చేశారు. ఆయన మీద ఉన్న అక్కసును వెళ్ళగక్కారు. అక్కడ నుండి రోమన్ గవర్నర్ అయిన పొంతి పిలాతు నొద్దకు తీసుకొని వెళ్ళారు. క్రీస్తు ప్రభువు గలలియ ప్రాంతంలో పెరిగినవాడు గనుక హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశానికి చెందినవాడని గ్రహించి పిలాతు హేరోదు నొద్దకు పంపెను.హేరోదు మొదట యేసును చూచి మిగుల సంతోషించాడు. ఎన్నో ప్రశ్నలు అడిగినప్పటికి యేసు అతనికి బదులియ్యలేదు. కాసేపటి తరువాత హేరోదు యేసు ప్రభువును తృణీకరించి అపహసించి పిలాతు నొద్దకు తిరిగి పంపివేశాడు. చివరగా పొంతి పిలాతు అన్యాయపు తీర్పు తీర్చి యేసుక్రీస్తు ప్రభువును సిలువకు అప్పగించాడు. యేసుక్రీస్తు అన్యాయపు తీర్పు ఎలా తీర్చబడ్డాడు?మానవ చరిత్రలో ఏ వ్యక్తిని పన్నెండు గంటలు వ్యవధిలో ఆరు సార్లు న్యాయస్థానం ముందు నిలువబెట్టలేదు. కాని, యేసుక్రీస్తును నిలువబెట్టారు. సిలువ మరణానికి ముందు యేసుక్రీస్తును యూదా మతపెద్దల ముందు మూడుసార్లు, రాజుల ముందు మూడుసార్లు నిలువబెట్టారు. అప్పటి కాలపు ప్రధాన యాజకుడైన కయప, అతని మామయైన మాజీ ప్రధాన యాజకుడు అన్న, యూదుల ఆలోచన సభయైన ‘సన్హెడ్రీన్’ ముందు యేసును దోషిగా నిలువబెట్టారు. యేసు తాను దేవుడనని, దేవుని కుమారుడనని ప్రకటించుకున్నాడు, మోషే ధర్మశాస్త్రమునకు విరుద్ధంగా ప్రవర్తించాడన్నది వారు చేసిన నేరారోపణ. ఆ తదుపరి మూడుసార్లు రోమన్ న్యాయస్థానం ముందు నిలువబెట్టారు.రోమన్ కైసరుకు పన్నులు కట్టవద్దన్నాడని, ప్రజలను రోమన్ చక్రవర్తులకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాడని, తాను రాజునని చెప్పుకొనుచున్నాడని యేసుక్రీస్తు మీద నేరారోపణ చేశారు. అయితే పిలాతు ఏ నేరమును కనుగొనలేకపోయాడు. ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టించాడు. చివరగా పస్కాపండుగ సమయంలో ఒక నేరస్థుని విడుదల చేయగలిగే అధికారాన్ని వినియోగించాలని చూచినా, ప్రజల ఒత్తిడికి లోనై సిలువ మరణాన్ని అమలు చేయడానికి ఒప్పుకున్నాడు. తన తీర్పులో న్యాయంలేదని తెలిసినా ‘ప్రజల’ కోసం అన్యాయ తీర్పును అమలుపరచాడు. ధర్మశాస్త్ర ప్రకారం పస్కా పండుగ సమయంలో ఎవరినీ తీర్పు తీర్చకూడదు, శిక్ష విధించకూడదు. అయితే జరిగిందేమిటి? యేసుక్రీస్తు విషయంలో తీర్పు తీర్చారు. మరణశిక్షను అమలు పరిచారు. అపొ.కా 12:4 ప్రకారం పేతురును చెరసాలలో పెట్టింది పస్కా పండుగ సమయంలోనే. అంతకుముందు యాకోబును ఖడ్గంతో చంపేశారు. పేతురును కూడా పట్టుకున్నారు. అయితే పస్కా సమయంలో శిక్ష అమలు చేయకూడదు కాబట్టి పేతురును చెరసాలలో పెట్టారు. శాస్త్రులు, ప్రధాన యాజకులు, యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. అయితే అసలు వాస్తవం ధర్మశాస్త్రోపదేశకులు అని చెప్పుకొనేవారే ధర్మాన్ని అతిక్రమించారు. యూదుల ఆలోచన సభ లేదా న్యాయస్థానమైన సన్హెడ్రీన్లో గాని, రోమన్ కోర్టులో గాని నిబంధన ప్రకారం ఒక వ్యక్తి నేరస్థుడు అని తీర్పు వెలువడాలంటే ఆ న్యాయస్థానంలోని ప్రతి సభ్యుడు వారి వారి అభిప్రాయాలు తెలిపాక అందరి సమ్మతి, అంగీకారంతో శిక్ష అమలు చేయాలి. కాని యేసుక్రీస్తు ప్రభువు విషయంలో ప్రజల కేకలే గెలిచాయి.ఒక వేళ నేరం ఋజువై మరణశిక్ష విధించబడితే, అలా శిక్ష విధింపబడిన వ్యక్తికి కనీసం ఒక రోజు లేదా ఒక రాత్రి గడువును ఇవ్వాలి. ఆ వ్యక్తి మానసికంగా మరణానికి సిద్ధపడడానికి ఆ సమయం అవసరం. అయితే యేసుక్రీస్తు విషయంలో అలా కూడా జరగలేదు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే అత్యంత క్రూరమైన మరణాన్ని అమలుపరచారు. ఈ మానవ ప్రపంచ చరిత్రలో ఎంత భయంకర నేరస్థుడినైనా కూడా రాత్రివేళ న్యాయస్థానాల్లో నిలువబెట్టలేదు. నిబంధనల ప్రకారం చీకటి పడేలోపు తీర్పు వెలువరించాలి లేదా వాయిదా వేయాలి. అయితే యేసుక్రీస్తును ఆరు సార్లు న్యాయస్థానం ముందు నిలువబెట్టింది రాత్రివేళలోనే! ఇది అన్యాయం కాకపోతే మరేమిటి?ఏ దేశంలోనైనా ఏ న్యాయస్థానంలోనైనా నేరారోపణ ఎదుర్కొను వ్యక్తి తరుపున కనీసం మరొక వ్యక్తి వాదిస్తాడు. అటువంటి వ్యక్తి కోసం వాదించడానికి ఎవరూ లేకపోయినా, ఒకవేళ అడ్వొకేటుకు డబ్బులు చెల్లించే పరిస్థితి లేకపోయినా ప్రభుత్వం గాని, కోర్టువారు గాని ఆ వ్యక్తి కోసం వాదించడానికి ఒక ఉత్తరవాదిని నియమిస్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు కోసం వాదించేవారు ఒక్కడు కూడా లేడు. ఎన్నిసార్లు ప్రశ్నలు అడిగినా కొన్నింటికి సమాధానాలు చెప్పారు; కొన్ని సార్లు ఆయన నోరు తెరవలేదు. ఆయన పక్షాన వాదించే వ్యక్తి లేకపోయినా తీర్పు తీర్చేశారు. ఇదికూడా అన్యాయమే!న్యాయవంతుడైన దేవునికి ఈ లోకం అన్యాయపు తీర్పు తీర్చింది. దేవున్ని విడిచి, మరచి బతుకుతున్న కర్కశ సమాజం ఆఖరకు సృష్టికర్తనే అన్యాయానికి గురిచేసింది. కొన్నిసార్లు నాకు అన్యాయం జరిగిందని అనుకుంటున్నావు కదూ! నీ ప్రభువునే విడిచిపెట్టలేదు ఈ లోకం. నీవు నేను ఓ లెక్కా ఈ పాషాణ సమాజానికి? అయితే యేసుక్రీస్తు అన్యాయపు తీర్పును ఎందుకు సహించాడు? నిలదీసి అడుగుతున్న వ్యక్తులకు సమాధానం చెప్పలేక యేసు మౌనంగా ఉండిపోలేదు, ఆయన ఓ అద్భుత కార్యం నెరవేర్చబోతున్నాడు కాబట్టే అన్యాయాన్ని సహించాడు. ఆయన సహించింది కేవలం నీకోసం, నాకోసం. తప్పు చేసినపుడు శిక్షను భరించడం సమంజసమే కాని, ఏ నేరం లేని నిర్దోషియైన ప్రభువు ఘోర శిక్షను భరించాడంటే ఏదో బలమైన కారణం ఉంది. అదే అవధులు లేని ఆయన ప్రేమ! శుభ శుక్రవారం రోజున యెరూషలేములోని కల్వరి కొండపై యేసు తన ప్రాణాన్ని సకలలోక పాప పరిహారార్థమై అర్పించారు. అమూల్యమైన ఏడు మాటలు సిలువలో పలికి తన ప్రాణాన్ని అర్పించారు. ‘తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము’ అని క్షమాపణ ప్రాముఖ్యతను తెలిపాడు. ‘నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు’ అని తన పక్కన వేలాడుచున్న దొంగతో మాట్లాడి నిత్యత్యపు పరమార్థాన్ని తెలిపాడు. ‘అమ్మా! ఇదిగో నీ కుమారుడు’ అని మరియమ్మతో పలికి తల్లి బాధ్యతను శిష్యుడైన యోహానుకు అప్పగించాడు. ‘ఏలీ ఏలీ లామా సక్తాని’ అని పలికి దేవునితో ఎడబాటు తీవ్రతను తెలిపాడు.‘దప్పిగొనుచున్నాను’ అని పలికి తాను మానవునిగా శ్రమను అనుభవిస్తున్నానని తెలిపాడు. ‘సమాప్తమైనది’ అని పలికి తాను ఎందుకు ఈ లోకానికి వచ్చాడో దాని అర్థాన్ని నెరవేర్చాడు. ‘తండ్రీ నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను’ అని పలికి రక్షింపబడిన వ్యక్తి గమ్యస్థానము దేవున్ని చేరుకొని శాశ్వత ఆనందాన్ని పొందడమే అనే సత్యాన్ని తెలిపాడు. క్రీస్తు సిలువలో పలికిన ప్రతి మాట సర్వలోకానికి ఓ అద్భుత సందేశమే! క్రీస్తు మరణం శాస్త్రీయంగా ధ్రువీకరించబడింది. వందలాదిమంది రోమన్ సైనికులు క్రీస్తును సిలువ వేసినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. యేసు విచారించి అన్యాయపు తీర్పు తీర్చిన పిలాతు గురించిన చారిత్రక విషయాలు ఈ మధ్య కాలంలో కైసరయలో బయటపడ్డాయి. ఆకాలంలో ప్రధాన యాజకుడైన కయపకు సంబంధించిన విషయాలను కూడా పురాతత్వ శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. యేసుప్రభువును బల్లెపుపోటు పొడిచినప్పుడు ఆయన దేహంలో నుండి రక్తం, నీళ్లు బయటకు వచ్చిన అంశాన్ని అనేకమంది శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఒక వ్యక్తి పూర్తిగా చనిపోయినప్పుడే ఆ వ్యక్తి దేహంలో నుంచి ఆ నీరులాంటి ద్రవం బయటకు వస్తుందని వారు కూడా ధ్రువీకరించారు.క్రీస్తు సిలువపై మరణించినప్పుడు అనేక అద్భుత సంఘటనలు చోటుచేసుకున్నాయి. అన్నింటిలోనూ ముఖ్యమైనది దేవాలయపు తెర చినిగిపోవుట. పాతనిబంధన కాలంలో నిర్మించబడిన దేవాలయంలో పరిశుద్ధ స్థలాన్ని అతిపరిశుద్ధ స్థలాన్ని వేరుచేయడానికి మూడు వందలమంది యాజకులచే తయారుచేయబడిన తెర ఉండేది. దాని మందం నాలుగు అంగుళాలు. మనుష్యులెవ్వరూ దానిని చింపలేనంత బలంగా ఉండేది. క్రీస్తు ప్రభువు మరణించగానే, ఆ తెర పైనుండి కిందకు చిరిగిపోయిందని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. దాని అర్థం ‘దేవుడు రక్షణను మనిషికి అనుగ్రహించడం ద్వారా పరిశుద్ధ స్థలాన్ని ప్రతి ఒక్కరి కోసం తెరిచాడు’. విశ్వాసంతో ఆయన్ను అంగీకరించే ప్రతి ఒక్కరూ ఆయన దివ్య సన్నిధిని ధారాళంగా అనుభవించవచ్చును. యేసుక్రీస్తు మరణించిన సిలువపై ‘ఐఎన్ఆర్ఐ’ అనే మాటలు ఒక పత్రంపై వ్రాయబడ్డాయి. సిలువ వేయబడిన వ్యక్తి చేసిన నేరమేంటో బాహాటంగా అందరికీ తెలిసేటట్లు ఒక పత్రంపై అలా వ్రాసి దానిని అతని తలకుపైగా సిలువమీద పెట్టేవారు. కాబట్టి క్రీస్తుకు తీర్పు తీర్చిన రోమన్ గవర్నర్ పిలాతు ‘నజరేయుడైన యేసు యూదులకు రాజు’ అనే పై విలాసాన్ని వ్రాయించి సిలువమీద పెట్టించాడు. అది హెబ్రీ, గ్రీకు, రోమా(లాటిన్) భాషలలో వ్రాయబడింది. పిలాతు పై విలాసాన్ని ఆ విధంగా వ్రాయించడం ప్రధాన యాజకులకు నచ్చలేదు. యూదులరాజు అనికాక, యూదుల రాజునని తాను చెప్పుకున్నాడు అని వ్రాయమని కోరారు. వ్రాయబడిన పైవిలాసాన్ని మార్చడానికి పిలాతు నిరాకరించాడు. కొన్ని విషయాలను మార్చడం ఎవరివల్లా కాదు అని ఋజువైంది.అలెగ్జాండర్ అనే వ్యక్తి ఈ విషయాలన్ని ఇలా వ్యాఖ్యానించాడు. ‘హెబ్రీ, గ్రీకు, లాటిన్ ఈ మూడు భాషలూ మూడు జాతులను, వారి భావాలైన ప్రత్యక్షత, కళ, సాహిత్యం, అభివృద్ధి, యుద్ధం, ధర్మశాస్త్రం అనువాటిని తెలియచేస్తున్నాయి. ఎక్కడయితే మానవజాతికి గల ఈ మూడు కోరికలు ఉనికిలో ఉంటాయో, ఎక్కడయితే మానవ భాషలో ప్రాచుర్యం సాధ్యపడుతుందో, ఎక్కడయితే పాపం చేయడానికి ఒక హృదయం ఉంటుందో, మాట్లాడడానికి నాలుక ఉంటుందో, చదవడానికి కన్ను ఉంటుందో అక్కడ సిలువ ఒక సందేశాన్ని కలిగి యుంటుంది. శుభశుక్రవారం రోజున క్రీస్తు సిలువపై మరణించిన తరువాత ఆ సాయంత్రం ఆయన్ను సిలువమీద నుండి క్రిందకు దించి అరిమతమయి యోసేపు అనే ధనికుని సమాధిలో ఉంచారు. వాస్తవానికి యోసేపు పిలాతు దగ్గరకు వెళ్లి యేసు దేహాన్ని తనకిమ్మని అడిగాడు. యోసేపు ప్రఖ్యాతిగాంచిన సన్హెడ్రీన్ సభ్యుడు గనుక పిలాతు అతని విన్నపాన్ని మన్నించి క్రీస్తు దేహాన్ని అప్పగించాడు. వాస్తవానికి యోసేపు తన కొరకు తొలిపించుకున్న రాతి సమాధిని క్రీస్తు ప్రభువుకు ఇచ్చివేశాడు. ఆ దినాల్లో ధనికులు తన మరణానికి ముందే తమ సమాధిని సిద్ధపరచుకొనేవారు. క్రీస్తు మరణించి సమాధి చేయబడి మూడవరోజున సజీవుడై తిరిగిలేచాడు. బైబిల్ ప్రబోధించే అనేక దివ్యసత్యాల్లో ఒకటి క్రీస్తు పునరుత్థానము. మానవ చరిత్రలోనే ఓ అపూర్వ సంఘటన.వాస్తవానికి క్రీస్తు పునరుత్ధానం గూర్చి పాతనిబంధన గ్రంథంలో అనేక ప్రవచనాలు, పోలికలు పుష్కలంగా ఉన్నాయి. ఆదికాండం మొదలుకొని మిగతా లేఖనాల్లో కూడా పునరుత్థానం గురించి తెలియపరచబడింది. లేవీయకాండం పదునాలుగవ అధ్యాయంలో రెండు పక్షులు కనబడతాయి. యేసులోని రెండు ప్రాముఖ్యమైన క్షణాలు ఆ పక్షులలో మనకు తారసపడతాయి. ఒక వ్యక్తికి కుష్ఠు వ్యాధి గనుక వస్తే ఆ వ్యాధి తగ్గేంతవరకు పాళెమునకు వెలుపల జీవించాలి. తన్ను తాను ప్రత్యేకించుకుని ప్రజలకు దూరంగా నివసించాలి. కనీసం తమ ఇంటివారితో కూడా కలవకూడదనే నిబంధన ఉండేది.కొంతకాలానికి ఆ వ్యక్తికి కుష్ఠు తగ్గినట్లు అతడు భావిస్తే దానిని నిర్ధారించడానికి ఆ కాలంలో ఉండే ప్రధాన యాజకునికి తన్నుతాను కనుపరచుకోవాలి. ఒకవేళ రోగి యొక్క దేహమును పరిశీలించి రోగము నుండి అతని దేహము బాగుపడిందని ప్రధాన యాజకుడు నిర్ధారిస్తే ఆ వ్యక్తి పవిత్రుడుగా కొనసాగేవాడు. తిరిగి సమాజంలో కలిసేందుకు ముందు ఆ వ్యక్తి రోగము నుండి విడుదల పొందాక ప్రధాన యాజకుడు నియమించిన ధర్మశాస్త్ర కట్టడి ప్రకారం అతడు రెండు పక్షులు తీసుకురావాలి. అవి సజీవమైన పక్షులై ఉండాలి. సదరు వ్యక్తి వాటిని యాజకుని యొద్దకు తీసుకువచ్చిన తర్వాత ఒక పక్షిని మట్టి పాత్రలో పెట్టి చంపాలి. చంపిన తర్వాత ఆ పాత్రలోని రక్తాన్ని ఎవరైతే పవిత్రత పొందాలి అని అనుకుంటున్నారో అతని మీద ఏడుసార్లు ప్రోక్షించాలి.అలా చేసిన తర్వాత ఆ మిగిలిన రెండో పక్షిని ఆ రక్తంలో ముంచి ఆ రక్తపు ముద్రలు దానిమీద ఉండగానే దానిని విడిచి పెట్టాలి. ప్రస్తావించబడిన ఆ రెండు పక్షులు యేసుప్రభువు జీవితంలోని రెండు ప్రధానమైన అనుభవాలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఒక పక్షి మట్టి పాత్రలో చంపబడింది. మట్టి పాత్ర యేసయ్య మంటి దేహాన్ని ధరించుకుని ఈ భూమి మీదకు వచ్చాడు అని సూచిస్తుంది. మట్టి పాత్రలో చంపబడిన ఆ పక్షి యేసుక్రీస్తు ప్రభువు మరణించాడు అనేదానికి ఒక సూచనగా కనబడుతుంది. ఆయన మరణించడం ద్వారా పాపంలో పుట్టి పాపంలో జీవిస్తున్న ఒక మనిషికి ఆయన రక్తాన్ని ఆ మనిషి మీద ప్రోక్షించడం ద్వారా ఆయన మరణం ద్వారా విడుదల అనేది కలిగిందని ఆ రెండో పక్షి సూచిస్తుంది. విడిచిపెట్టబడిన రెండవ పక్షి క్రీస్తు పునరుత్థానమును సూచిస్తుంది.‘‘మరియు క్రీస్తు లేపబడియుండిన యెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే’’ (1 కొరింథీ 15:14). యేసుక్రీస్తు మరణాన్ని జయించి లేచాడా? అన్నది ఈ రోజుల్లో అనేకుల మదిలో మెదలుతున్న ప్రశ్న! అసత్యానికి, సత్యానికి మధ్య ఎప్పుడూ పోరాటం జరుగుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొందరు వాదించే అంశాలు చాలా విడ్డూరంగా విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. వాస్తవాన్ని దాచిపెట్టి, అసత్యాన్ని ప్రతిబింబించేలా అపవాది వారిని ప్రోత్సహిస్తున్నాడు అనుటలో ఏ సందేహం లేదు. యేసుక్రీస్తు సిలువపై మరణించలేదని, సుగంధ ద్రవ్యాలు పూసి, ఔషధాలు ఇచ్చి, స్పృహ కోల్పోయిన వ్యక్తిని బ్రతికించారని; ఆ తదుపరి ఆయన మగ్దలేనే మరియను పెండ్లి చేసుకొన్నాడని; కొందరైతే ఆయన కాశ్మీర్ వచ్చాడని రకరకాల కథలు చెబుతూవున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ఇప్పటివేమీ కాదు. మొదటి శతాబ్దం నుండి ఉన్నవే. శిష్యులు ఆయన దేహమును ఎత్తుకొనిపోయి దాచిపెట్టి మృత్యుంజయుడైనాడని ప్రకటించారని వారి వాదన. పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే యేసు సమాధి దగ్గర ఉంచినంత కావలివారిని బహుశా ఎవరి సమాధి దగ్గర పెట్టలేదేమో! ఆ తరువాతి కాలంలో ఒక్క యోహాను తప్ప క్రీస్తు శిష్యులందరూ పునరుత్థానాన్ని గూర్చి సాక్ష్యమిస్తూ ప్రపంచం నలుమూలల హతసాక్షులయ్యారు. ఈస్టర్ శుభదినాన అనేక క్రైస్తవ సంఘాల్లో మిక్కిలి సమూయేలు వ్రాసిన ఈ భక్తిగీతాన్ని ఆలపిస్తారు. క్రీస్తు పునరుత్థాన సత్యాన్ని కీర్తిస్తారు. ‘యేసు పునరుత్థానమాయెను... చావునొంది క్రీస్తేసు పునరుత్థానమాయెను దాసులెల్ల నుతింప వింతగ భాసురంబుగ భక్తలన్బరవాసులుగ దాజేయు నిప్పుడు’. యేసుక్రీస్తు జీవితాన్ని అద్భుతంగా వివరించే నాలుగు సువార్తలు బైబిల్లో ఉంటాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ నాలుగు సువార్తలలో క్రీస్తు పునరుత్థానం గూర్చి చాలా స్పష్టంగా వివరించబడింది. శిష్యులైన మత్తయి, యోహానులు క్రీస్తు పునరుత్థానానికి ప్రత్యక్ష సాక్షులు. వైద్యుడైన లూకా రెండు గ్రంథాలను వ్రాశాడు. యేసుక్రీస్తును సమాధిలో పెట్టిన తరువాత విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లియైన మరియయు, సలోమేయు సుగంధ ద్రవ్యములను కొని తమ దగ్గర ఉంచుకున్నారు. ఆదివారం పెందలకడ లేచి సూర్యోదయమైనప్పుడు సమాధి దగ్గరకు వస్తూ సమాధి ద్వారము నుండి మనకొరకు ఎవరు ఆ రాయిని పొర్లించును అని మాట్లాడుకున్నారు. ఆ రాతికి రోమా వారు ముద్రవేసి సైనికులను కావలి ఉంచారని కూడా వారికి తెలుసు. అయితే వారు వచ్చి చూసేసరికి అప్పటికే రాయి దొర్లించి ఉంది. రాయి దొర్లింపబడకుండా కూడా పునరుత్థానుడైన క్రీస్తు బయటకు వచ్చుండేవాడే కానీ మనుష్యులు లోపలికి వెళ్ళి పునరుత్థానం గూర్చి సాక్ష్యమిచ్చునట్లుగా రాయి దొర్లించబడింది.వారు సమాధిలో ప్రవేశించి నిలువుటంగీ ధరించిన ఒక పడుచువానిగా కనిపిస్తున్న ఒక దేవదూతను చూశారు. ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచాడని చెప్పి వారిలో ఉన్న భయాన్ని పోగొట్టి అద్భుతమైన కొన్ని విషయాలను వారికి తెలియచేశాడు. యోహాను భక్తుడు తాను వ్రాసిన సువార్తలో క్రీస్తు పునరుత్థాన ప్రత్యక్షలను చాలా స్పష్టంగా వివరించాడు. మగ్దలేనే మరియ క్రీస్తు పునరుత్థానుడయ్యాడన్న సత్యాన్ని పేతురు, యోహానులకు తెలిపింది. వారు పరుగెత్తుకుంటూ సమాధి దగ్గరకు వచ్చారు. సమాధి ఖాళీగా ఉంది. సమాధి లోపల నారబట్టలు పడియుండడం చూశారు.ఇక్కడ ఓ ప్రత్యేకమైన విషయాన్ని యోహాను ప్రస్తావించాడు. క్రీస్తు ప్రభువు తలకు చుట్టబడిన రుమాలు నారబట్టల యొద్ద ఉండకుండా వేరుగా ఒకచోట చుట్టిపెట్టి యుండడం చూశారు. యేసుక్రీస్తు సమాధి నుండి ఏదో తొందరపాటుతో వెళ్ళిపోలేదని, అక్కడ జరిగిన సంఘటనలన్నియు ఒక పద్దతి ప్రకారం జరిగాయని చూపడానికి ఈ వివరణ అందించబడింది. ఒకవేళ క్రీస్తు దేహాన్ని ఎవరైనా ఎత్తుకుపోయినా, వారు తల రుమాలును ఇంత జాగ్రత్తగా చుట్టిపెట్టి ఉంచరు. పునరుత్థానం జరిగిన ఆదివారం సాయంత్రం శిష్యులందరూ సమావేశమయ్యారు. వారిలో ఏదో తెలియని కలవరం, భయం ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. భయం వలన వారు కూడియున్న గది తలుపులు గట్టిగా బిగించుకొనియున్నారు. అకస్మాత్తుగా క్రీస్తు వారి మధ్య నిలిచి ‘‘మీకు సమాధానం కలుగును గాక’’ అని ప్రకటించాడు. వారికి ఏది అవసరమో ఆయనకు తెలుసు కదా. తలుపులు తెరవకుండానే లోపలికి ప్రవేశించడం క్రీస్తు మహిమ. దేహాన్ని కలిగియుండుట వలన అది సాధ్యమయింది. యేసు చేసిన ప్రతి పనిలోనూ మనిషికి సమాధానం అనుగ్రహించడం చూస్తాం. ప్రస్తుత రోజులో మనిషికి అన్నీ ఉన్నాయి గాని, నిజమైన సమాధానం లేదు. వ్యక్తిగతంగా మనశ్శాంతి లేకపోవడం, కుటుంబంలో కలహాలు, సమాజంలో గొడవలు, రాజ్యం మీదకి రాజ్యాలు లేవడం సర్వసాధారణంగా కనబడుతూనే ఉన్నాయి. నిజమైన శాంతి సమాధానాలు మనిషికి ఎక్కడ లభిస్తాయి? దేవుడు సమాధానకర్త గనుక ఆయన్ను ఎవరైతే తమ హృదయాలలోనికి ఆహ్వానిస్తారో వారికి సమాధానం, పాపక్షమాపణ, ఆత్మరక్షణ, మోక్షరాజ్యం లభిస్తాయని బైబిల్ ప్రబోధిస్తుంది. పాప పశ్చాత్తాపంతో నూతన జీవితాన్ని ఆకాంక్షిస్తూ క్రీస్తు సిలువ చెంతకు చేరి ఆయన దివ్య చరణాలను ఆశ్రయించి ఆయన రక్తం ద్వారా తమ పాపములను కడుగుకొని, క్రీస్తు అనుగ్రహించు పునరుత్థాన శక్తితో జీవితయాత్రలో ఒక గమ్యాన్ని కలిగి విశ్వాసంతో సాగిపోవడం ద్వారా సర్వశక్తుడైన దేవుని మహిమపరచగలము అని క్రైస్తవులు విశ్వసిస్తారు. యేసు వారిని ఎదుర్కొని వారికి శుభమని చెప్పెను అని వ్రాయబడినట్లుగా ఈ మాటలు చదువుచున్న ప్రతి ఒక్కరికి ప్రేమమయుడైన క్రీస్తు ప్రభువు కృపాసింహాసనం నుండి అన్ని విషయాల్లో శుభం కలుగును గాక. ఈస్టర్ శుభాకాంక్షలు.‘దేవుడు రక్షణను మనిషికి అనుగ్రహించడం ద్వారా పరిశుద్ధ స్థలాన్ని ప్రతి ఒక్కరి కోసం తెరిచాడు’. విశ్వాసంతో ఆయన్ను అంగీకరించే ప్రతి ఒక్కరూ ఆయన దివ్య సన్నిధిని ధారాళంగా అనుభవించవచ్చును.మానవ చరిత్రలో ఏ వ్యక్తిని పన్నెండు గంటలు వ్యవధిలో ఆరు సార్లు న్యాయస్థానం ముందు నిలువబెట్టలేదు. కాని, యేసుక్రీస్తును నిలువబెట్టారు. శుభశుక్రవారం రోజున క్రీస్తు సిలువపై మరణించిన తరువాత ఆ సాయంత్రం ఆయన్ను సిలువమీద నుండి క్రిందకు దించి అరిమతయయి యోసేపు అనే ధనికుని సమాధిలో ఉంచారు. వాస్తవానికి యోసేపు పిలాతు దగ్గరకు వెళ్లి యేసు దేహాన్ని తనకిమ్మని అడిగాడు. యోసేపు ప్రఖ్యాతిగాంచిన సన్హెడ్రీన్ సభ్యుడు గనుక పిలాతు అతని విన్నపాన్ని మన్నించి క్రీస్తు దేహాన్ని అప్పగించాడు. వాస్తవానికి యోసేపు తన కొరకు తొలిపించుకున్న రాతి సమాధిని క్రీస్తు ప్రభువుకు ఇచ్చివేశాడు.యేసు పునరుత్థానమాయెను... చావునొంది క్రీస్తేసు పునరుత్థానమాయెను దాసులెల్ల నుతింప వింతగ భాసురంబుగ భక్తలన్బరవాసులుగ దాజేయు నిప్పుడు. డా. జాన్ వెస్లీ క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమహేంద్రవరం -
హోమియోలో మనమే టాప్
ప్రపంచంలోని ప్రధాన వైద్యవిధానాల్లో ఒకటైన హోమియోపతికి పుట్టినిల్లు జర్మనీ. పద్దెనిమిదో శతాబ్ది చివరినాళ్లలో జర్మన్ వైద్యుడు శామ్యూల్ హానిమన్ ఈ వైద్యవిధానాన్ని రూపొందించాడు. తొలినాళ్లలో ఆనాటి వైద్యుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నా, హానిమన్ తన ప్రాక్టీసు కొనసాగించాడు. ఆయన వద్దకు రోగులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చేవారు. వార్ధక్యంలో జర్మనీని విడిచిపెట్టి 1835లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్కు వలసవెళ్లిపోయి, అక్కడే తాను 1843లో మరణించేంత వరకు విజయవంతంగా ప్రాక్టీసు కొనసాగించాడు. జర్మనీలో పుట్టిన హోమియో వైద్య విధానం యూరోపియన్ మిషనరీల ద్వారా పంతొమ్మిదో శతాబ్ది తొలినాళ్లలో భారత్లోకి అడుగుపెట్టింది. గడచిన రెండు శతాబ్దాల కాలంలో భారత్ హోమియో వైద్యానికి ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరుకోగలిగింది. ప్రపంచవ్యాప్తంగా హోమియో వైద్యులు, రోగుల సంఖ్యలో టాప్–5 దేశాలను ఒకసారి పరిశీలిద్దాం... -
మరణములో నుండి జీవములోనికి
దేవుడు తన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపాడు (ఎఫెసీ 1:20,21). అన్నదే విశ్వసించదగ్గ అపొస్తలుల సువార్త సంబంధిత బోధయై ఉంది.సత్యవాక్యమను రక్షణ సువార్తగా కూడా ఇది ఉంది. లేచాడు అన్నది సువార్త కాదు. సర్వశక్తి సంపన్నుడైన అద్వితీయ సత్య దేవుని చేత యేసు మృతులలో నుండి సజీవంగా లేపబడ్డాడు అనునదే లేఖనానుసార సత్య సువార్త. తండ్రికి విలువిచ్చే క్రీస్తు అపార విధేయతను ఇదే ఘనంగా చాటుతుందనుటలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ’వాక్యము నీ వద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా – యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు’ (రోమా 10: 8–10). యేసు సజీవుడుగు దేవుని కుమారుడైన క్రీస్తు అనేది అపొస్తలుల అమూల్య విశ్వాసం. దేవుని కుమారుడు అంటే ఆయన ఆత్మ సంబంధ ఇశ్రాయేలీయుల రాజు అని అర్థం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముతూ ఆయన నామమందు జీవము పొందాలి అన్నదే ప్రతి ఒక్కరి ఆత్మ సంబంధ విజయానికి మూలం. ఈ లోకం మీద విజయం యేసు దేవుని కుమారుడు అనుటలోను , ఆయన్ను దేవ దేవుడు ఈ లోకానికి శరీరధారిగా పంపాడని విశ్వసించుటలోనే విజయం దాగి ఉంది (1యోహాను 5:5 ).మరి క్రీస్తు విజయానికి మూలం ఎక్కడ అన్నది లోతుగా పరీశీలన చేస్తే అది ఒక్క ఆయన విధేయతే అనేది బహు తేటగా వెల్లడవుతూ ఉందన్నది ఆశ్చర్యకర విశేషం.ఆజ్ఞలకు లోబడి పాపం చేయకపోవడం ద్వారా పరిశుద్ధత, దాని విధేయత ఈ రెండూ ఎప్పుడు నిలుపుకొనే వేకువ ప్రార్థనలతో అవిశ్రాంత విన్నపాలతో క్రీస్తు అసాధారణ విజయుడిగా, జగజ్జేతగా చరిత్రకెక్కాడు.దేవుడు తనకు అత్యంత విధేయుడైన తన కుమారుడను మరణంలో నుండి జీవములోనికి దాటించాడు. మరణంలోనుండి జీవములోనికి రావడం, పునరుత్థానం చెందడం ఇలా యేసు మరణాన్ని జయించడం దేవుని గొప్ప సంకల్పం.అయితే తనను మరణం నుండి రక్షింపగల తండ్రియైన దేవునికి ప్రార్థనలు, యాచనలు సమర్పించినందున యేసు అంగీకరించబడ్డాడనేది ఇదే ఆయన సాహసోపేత విజయానికి మూలం అయ్యింది. ఇక్కడ మరణం అంటే సిలువ మరణం కాదు, ఆత్మ సంబంధ మరణం. యేసుకు సిలువ మరణం తప్పదు. ఎందుకంటే ఇది దేవుని సంకల్పం. ఆయన మరి ఎలాంటి మరణం మీద గురిపెట్టి విజయం సాధించాలనుకున్నాడు అన్నది చూస్తే అదే ఆత్మ సంబంధ మరణం. ఆయన పరిశుద్ధుడు గనుక మరణం ఆయన మీద ఏలుబడి చేయుటకు అన్ని కోణాల్లో అన్ని దారులు వెదకి అది బాగా అలసిపోయింది. పారదర్శకంగా పరిశుద్ధ జీవితం ఆచరించి చూపుతూ యేసు మరణానికి సంపూర్తిగా తలవంచాడు. అంతే, మరణం ఆయన ముందు తలవంచి మోకరిల్లి సాగిలపడింది.మతంతో సంబంధం లేని మార్గంమన తోటి ఇరుగు పొరుగు వాని చుట్టురా ఉన్న సమాజం మేలుకై ప్రతి పని, పరిచర్య, సేవా విధానం శుద్ధ హృదయంతో ఆచరించుట ద్వారానే దేవుని మెప్పు పొందగలం. నిత్య సత్య జీవమనే క్రీస్తు మార్గం మతంతో ఎలాంటి సంబంధం లేనిది. ఇదొక ఆత్మ సంబంధ అసాధారణ ఆధ్యాత్మిక జీవన విధానం. ఇందులో వ్యక్తిగతమైన స్వయం స్వశక్తితో కూడిన పాప నివారణ సంబంధిత పరిశుద్ధ అభ్యాస ప్రయత్నాలు మచ్చుకైన కనపడవు. క్రీస్తును బట్టి దేవుని మీద ఆధారపడిన జీవితాలు ఏంతో పురోగమనం సాధించే స్థితిలో ఉంటుంటాయి. తమ మానవ జ్ఞానంతో ముడిపెట్టక తమ మంచి చెడ్డల విచక్షణ విషయమైన జ్ఞానం దేవునికే అప్పగించి అన్నింటా దేవునికే మహిమ చెందేలా ఆయన్ను ఘన పరచుటే అతి శ్రేష్టమైన సద్భక్తి జీవిత విధానం.నిత్యజీవము పొందుటకు నేనేం చేయాలి? అన్నదానికి సమాంతర ప్రశ్నయే ‘మరణంలో నుండి జీవంలోనికి దాటుట ఎట్లు?’ అనేది. మరణంలో నుండి జీవములోనికి దాటుటలో గొప్ప అనుభవం సంపాదించినవాడు, అత్యంత ప్రతిభ, ప్రభావ సంపన్నుడు యేసు మాత్రమే అన్న సర్వసత్యాన్ని బహు తేటగా గ్రహించినవారై మొదటగా ఆయన శిష్యులైన అపొస్తలులు ఆ తదుపరి ఆదిమ సంఘము ఆయన అడుగుజాడలలోనే నడిచి అన్నింటా గెలిచింది. ఆ ఆదిమ సంఘాన్ని అనుసరించి ఒక్కటే క్రీస్తు శరీరమను సంఘాలు నేడునూ పాపం నుండి పరిశుద్ధతలోనికి అనగా మరణంలో నుండి జీవములోనికి విజయవంతంగా దాటుతున్నాయి. అనేకులను దాటించుటలో పేరొందిన గొప్ప సువార్త పరిచర్యను అవి నిరంతరాయంగా చేస్తూ వారివలె ముందుకు కొనసాగిస్తూ విధేయంగా ఎంతో శ్రమిస్తున్నాయి. దేవదేవుడు తనదైన బలాతిశయం చేత యేసును మృతులలో నుండి లేపాడు అన్నదే నేటి పునరుత్థాన దినం. ఇదే క్రైస్తవ నిరీక్షణ జీవితానికి గొప్పదైన పునాది. సమభావపు ఏకత్వం కలిగించే ఒక్కటే నిరీక్షణయందుండుటకు పిలువబడిన వారు ధన్యులు అంటుంది గ్రంథము.‘‘నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక ‘మరణములో నుండి జీవము లోనికి’ దాటి యున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను’’– యేసుక్రీస్తు – జేతమ్ -
మలి దశ... మరో కోణం
జీవితం మలి దశలో భావోద్వేగ పరంగా మోసపోయే అవకాశాలు మెండుగా ఉంటాయి అంటున్నారు మనస్తత్వ నిపుణులు. మగవారిలోనూ ఈ సమస్య ఉన్నప్పటికీ మహిళలు ఇటీవల కాలంలో దీని వల్ల ఎక్కువ మోసపోతున్నారని చెబుతున్నారు. జీవితం మలిదశలో ఏర్పడిన శూన్యతను తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో ఏం చేయాలో అవగాహన కలిగి ఉంటే అధిగమించడం సులువు అవుతుంది.చదువు, సంపాదన, వివాహం, కుటుంబ బాధ్యతలు.. ఒక్కోదశ ను దాటుకుంటూ ప్రయాణం చేస్తుంటాం. ఐదు పదులు దాటిన తర్వాత బాధ్యతల బరువు తగ్గి కొంత విశ్రాంతి లభిస్తుంది. ఎప్పుడో వదిలేసిన భావాలు మనసును ముట్టడిస్తాయి. ఖాళీ సమయాన్ని టీవీ కో, సోషల్ మీడియాకో కేటాయిస్తుంటారు చాలా మంది. కొందరు లోపలి ఖాళీని పూరించడానికి మానసికంగా కొత్త సంబంధాలవైపు మొగ్గు చూపుతారు. ఇటీవలి కాలంలో వయసు పైబడిన వారిలో అన్లైన్ డేటింగ్ పెరుగుతోందని అమెరికన్ ఫ్యూ రీసెర్చి సెంటర్ ఓ నివేదికను విడుదల చేసింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఏజింగ్ ఆన్లైన్ డేటింగ్ను ఎంచుకునేవారికి సూచనలూ ఇచ్చింది.తమకు తామే మోసం..వయసు పైబడిన వారిలో అప్పటికే శారీరక మార్పులు చుట్టుముడతాయి. దీంతో హఠాత్తుగా లైఫ్స్టైల్లో మార్పులు చేసుకోవాలనే ప్రయత్నాలు మొదలవుతాయి. ఇన్నాళ్లూ తాము ఏం కోల్పోయోమో అర్థం అవుతుంది. వదిలేసిన అన్నింటినీ తిరిగి జీవితంలోకి తెచ్చుకోవాలనే ఆతృత పెరుగుతుంది. పూర్తి చేయలేక ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఫలితం గా తమను తాము హింసించుకోవడమూ పెరుగుతుంది.అర్థం చేసుకోవడం ముఖ్యం..ఈ వయసులో‘అందరూ ఏవేవో సాధిస్తున్నారనో, తాము వెనకబడిపోయామనో, గుర్తింపు కోసమో, ఖాళీని భర్తీ చేయడం కోసమో.. పరిగెత్తడం కాదు. తమని తాము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.→ మెనోపాజ్ సమస్యల వల్ల వచ్చే భావోద్వేగాల సమతుల్యతనూ సాధించాలి. → నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం, ప్రశాంత జీవితాన్ని గడపడం, లోపలి స్వరాన్ని వినడం, సేవ, సృజన, ఆధ్యాత్మికత వైపు మనసును మళ్లించాలి. → సెకండ్ లైఫ్కి ఇది ప్రారంభ దశగా గుర్తించాలి.రిలేషన్స్ కూలిపోవచ్చు.. యవ్వనంలో ఇద్దరు వ్యక్తుల మధ్య అవసరం, భద్రత, కలిసి బతకడం.. వంటివే వారిని కలిపి ఉంచే బంధాలు. మధ్య వయసుకొచ్చేసరికి అర్థం చేసుకోవడం, భావోద్వేగ కలయిక, నిజాయితీగా ఉండటం సాధ్యం కాకపోవచ్చు. కొత్త బంధాలను ఏర్పరుచుకోవడంతో ఇద్దరి మధ్య తెలియకుండానే చీలిక ఏర్పడుతుంది. ఆ తర్వాత బంధాల పట్ల విముఖత ఏర్పడుతుంది. అనవసరపు ప్రయాస అనిపిస్తుంది.దంపతుల మధ్య దూరం..పిల్లలు పెద్దవాళ్లు అయ్యాక బాధ్యత తగ్గుతుంది. అలాగే, వారితో సమయం కేటాయించడం కూడా తగ్గిపోతుంది. దంపతులుగా ఇన్నాళ్లూ పిల్లల కోసమే కలిసి ఉన్నామా.. అనే ఆలోచన మొదలవుతుంది. చెప్పుకోలేని సందేహాలతో దంపతుల మధ్య దూరం పెరుగుతుంది. ఓపిక, సహనం తగ్గుతాయి. అప్పటివరకు నొక్కి పెట్టిన నిర్లక్ష్యం, అవమానం, త్యాగం.. అన్నీ పైకి ఉబికి వస్తాయి. ఇక ‘ఇప్పుడు భరించలేను’ అనే దశ వస్తుంది. ‘అందరూ నన్ను చీట్ చేశారు. వీళ్లకోసమా నేను త్యాగం చేశాను’ అనే ఆలోచన కలుగుతుంది.ప్రయోజనకరంగా! పాజిటివ్ ఆలోచనలవైపు మొగ్గు చూపాలి. శారీరక–మానసిక వ్యాయామాలు నిరాశను తగ్గిస్తాయి. మానసికంగా చురుకుగా ఉండటానికి పజిల్స్ పూరించడం, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, వదిలేసిన అభిరుచులను తిరిగి మెరుగుపెట్టడం, స్వచ్ఛంద సేవ.. వంటి అర్థవంతమైన కార్యకలాపాల్లో పాల్గొనడం మేలు చేస్తుంది. ఈ దశలో శరీరంలో వచ్చే ప్రకృతి సిద్ధ మార్పుల (మెనోపాజ్, వెంట్రుకలు తెల్లబడటం, రాలిపోవడం, చర్మంలో కాంతి తగ్గడం..) వల్ల నిరాశకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. పోషకాహార, చర్మ వైద్య నిపుణుల సూచనలతో శరీరంలో వచ్చే మార్పులను అర్థం చేసు కుంటూనే ఆరోగ్యకరమైన బంధాలపై అవగాహన పెంచుకోవడం అవసరం.అవగాహనతోనే వికాసంసంబంధాలలో ఏర్పడిన మార్పుల వల్ల మన ఆలోచనా విధానంలోనూ చాలావరకు మార్పు వస్తుంది. శారీరకంగా కన్నా మానసికపరమైన మోసం ఎక్కువ హానికరంగా అనిపిస్తుంది. అది తమ భాగస్వామి, పిల్లలు, బయటి వ్యక్తులు.. ఎవరైనా కావచ్చు. భావోద్వేగ బంధం స్పర్శకంటే లోతైనా సాన్నిహిత్యాన్ని సృష్టిస్తుంది కాబట్టి, దానిని కోల్పోవడం అంటే ఆ బంధాన్ని కోల్పోయినట్టే అనిపిస్తుంది. అప్పుడు మోసం జరిగింది అనుకుంటారు. ఇలాంటప్పుడు నిపుణులను సంప్రదించి, సూచనలు తీసుకోవడం మేలు కలిగిస్తోంది.– డాక్టర్ డోనాసింగ్, క్లినికల్ సైకాలజిస్ట్– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
పసి గుండెకు గురిపెట్టే ఫీవర్
చిన్నపిల్లల్లో జలుబు చేయడం చాలా మామూలు విషయం. జలుబు తర్వాత కాస్తంత గొంతునొప్పి రావడమూ మామూలే. వీటితో పాటు జ్వరం కనిపించడం చాలా సాధారణమే. అయితే ఇలా జ్వరమూ (హైఫీవర్), జలుబూ, గొంతునొప్పి కనిపించడమన్నది సాధారణమే కదా అంటూ మామూలుగా తీసుకోవడం సరికాదంటున్నారు వైద్య నిపుణులు. ఈ మామూలు లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదనీ, అదే చాలా తీవ్రమైన రుమాటిక్ ఫీవర్గా పరిణమించి చిన్నారుల ‘గుండె’నూ దెబ్బతీస్తుందంటే అది చాలామందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ అది వాస్తవం. అందుకే ఒక్కోసారి ఈ చిన్న లక్షణాలనూ చాలా సీరియస్గా తీసుకోవాలని గుర్తుంచుకోవాలి. అదెప్పుడో తెలుసు కునేందుకు ఉపయోగపడేదే ఈ కథనం.చిన్న పిల్లల్లో వచ్చే ఈ జలుబు, గొంతునొప్పి, జ్వరాలను చాలామంది సాధారణ సమస్యగానే చూస్తారు. చిన్న పిల్లలకు జలుబు చేశాక వారు గొంతునొప్పితో బాధపడుతున్నప్పుడు దాన్ని కేవలం ఓ చిన్న సమస్యగానే చూడకూడదని తప్పక గుర్తుంచుకోవాలి. ఎందుకంటే... జలుబు, గొంతునొప్పి, జ్వరం లాంటి లక్షణాలు కనిపించినప్పుడు తొలుత అది టాన్సిల్స్కు ఇన్ఫెక్షన్ వచ్చే టాన్సిలైటిస్కు దారితీయవచ్చు. ఇక కొందరిలో గ్రూప్–ఏ స్ట్రె΄్టోకోకస్ అనే బ్యాక్టీరియా కారణంగా వచ్చినట్లయితే... దానికి డాక్టర్ సూచించే పూర్తి స్థాయి యాంటీబయాటిక్స్ కోర్సు వాడాలి. అలా వాడకపోతే... ఈ సమస్య వచ్చిన ఒకటి నుంచి ఐదు వారాలలోపు రుమాటిక్ ఫీవర్ అనే మరో సమస్యకు దారితీసే ప్రమాదం ఉందని తెలుసుకోవాలి. అలా జలుబు, జ్వరాల తర్వాత మళ్లీ మరోసారి జ్వరం... మునుపు డాక్టర్లు ఇచ్చిన అవే మందులు వాడుతూ నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించాలి. ఎందుకంటే అది రుమాటిక్ ఫీవర్కు దారి తీసే ప్రమాదమూ ఉందని తల్లిదండ్రులకు ఏమాత్రం తెలిసే అవకాశం ఉండదు. అందుకే జ్వరం వచ్చి తగ్గి, మళ్లీ ఒకటి నుంచి ఐదు వారాలలోపు జ్వరం వస్తే గనక... అప్పుడు తల్లిదండ్రులు కాస్త అప్రమత్తంగా ఉండాలి.రుమాటిక్ ఫీవర్తో ఎలాంటి ప్రమాదం వస్తుందంటే... రుమాటిక్ ఫీవర్ అనేది సాధారణంగా 5 – 15 ఏళ్ల చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రుమాటిక్ ఫీవర్ వచ్చిన తర్వాత భవిష్యత్తులో అది గుండె కవాటాల (వాల్వ్స్)ను తీవ్రంగా ప్రభావితం చేసి గుండెకు తీవ్రమైన ముప్పు తెచ్చిపెడుతుంది.లక్షణాలు.. మొదట జలుబు, గొంతునొప్పి, తీవ్రమైన జ్వరం వచ్చి తగ్గాక ఒకటి నుంచి ఐదు వారాల లోపు మళ్లీ మరోమారు జ్వరం వస్తుంది. ఆ జ్వరంతో పాటు కీళ్లనొప్పులు, కీళ్లవాపులు, ఒంటి మీద ర్యాష్ రావడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని రుమాటిక్ ఫీవర్గా అనుమానించాలి. అలాగే తొలుత ఈ లక్షణాలు కనిపించిన పిల్లల్లో... తర్వాత శ్వాసతీసుకోవడం వంటి ఇబ్బంది కూడా కనిపిస్తుంది. తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ వంటివీ కనిపిస్తాయి. ఇంకా మరికొన్ని లక్షణాలూ కనిపించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ పేర్కొన్నవి మాత్రం రుమాటిక్ ఫీవర్ను గుర్తించేందుకు తోడ్పడే ప్రధాన లక్షణాలుగా పరిగణించి... ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించాలి. ఇక్కడ పేర్కొన్న అంశాలను బట్టి ఇది ఎంతో పెద్ద సమస్యగా అనిపిస్తున్నప్పటికీ... కేవలం ఒక పూర్తి కోర్సు యాంటీబయాటిక్ మందులతో దీన్ని పూర్తిగా నివారించవచ్చనీ, దాంతో పిల్లల అద్భుతమైన భవిష్యత్తును కాపాడుకోవచ్చని తల్లిదండ్రులు అవగాహన పెంచుకుంటే చాలు... పేరెంట్స్ ఆ చిన్నారి గుండెకు తగిన రక్షణ కల్పించినవారవుతారు. చికిత్స / నివారణవాస్తవానికి తొలిదశలోనే పూర్తిగా తగ్గిపోయేలా తగిన చికిత్స అందిస్తే... కేవలం చాలా చిన్న కోర్సు యాంటీబయాటిక్స్తోనే సమస్య పూర్తిగా సమసిపోతుంది. కానీ తొలిదశల్లో ఆ చిన్న చికిత్సే అందించకపోతే అది గుండె వైఫల్యానికీ (హార్ట్ ఫెయిల్యూర్కూ) దారితీయవచ్చు. చికిత్స అందించాక కూడా కొంతమంది పిల్లల్లో అది వాల్వ్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అవసరం పడేవరకూ వెళ్లే అవకాశం ఉంది గానీ... చాలా కొద్దిమంది పిల్లల్లోనే ఇలా జరిగే అవకాశముంది. మరికొందరు చిన్నారుల్లో జీవితాంతమూ బ్లడ్థిన్నర్స్ (రక్తం పలుచబార్చే మందులు) కూడా వాడాల్సి రావచ్చు. ఇలాంటి చిన్నారుల్లో ఆడ పిల్లలు ఉండి, వారు పెద్దయ్యాక గర్భం దాల్చినప్పుడు... వారికి ఆ గర్బధారణ కూడా ఓ సమస్యగా పరిణమించవచ్చు. అందుకే పిల్లల్లో జబులు, గొంతునొప్పితో కూడిన తీవ్రమైన జ్వరం వస్తే దాన్ని చిన్న సమస్యగా పరిగణించకుండా ఒకసారి మీ పిల్లల డాక్టర్ను తప్పనిసరిగా సంప్రదించాలి. అంతేకాదు... ఇలా జలుబు, గొంతునొప్పి, జ్వరం వచ్చిన పిల్లల విషయంలో వారు తగినంత వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) పాటించేలా చూడాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులదే.డా‘‘ శివనారాయణ రెడ్డి వెన్నపూససీనియర్ నియోనేటాలజిస్ట్ – పీడియాట్రీషియన్నిర్వహణ: యాసీన్ -
గర్భసంచి జారడం అంటే...?
సాధారణంగా మహిళల్లో మధ్యవయసు దాటిన కొందరిలో ‘గర్భసంచి జారడం’ అనే మాట వినిపిస్తుంటుంది. మహిళల పొత్తికడుపులో గర్భసంచి అంటూ అందరూ సామాన్యంగా పిలిచే యుటెరస్తో పాటు పెద్దపేగు, మూత్రపు సంచి లాంటివి కూడా ఉంటాయి. ఇవి కాస్తంత జారిపోయి యోని పైభాగం మీద ఒత్తిడి కలిగిస్తూ మహిళల్లో తీవ్రమైన నొప్పినీ, ఇబ్బందినీ కలిగిస్తాయి. ఇలా పొత్తికడుపులోని యుటెరస్, పెద్దపేగు, మూత్రపు సంచి (బ్లాడర్) వంటి దేహ భాగాలు యోని పైభాగంలోకీ లేదా ఒక్కోసారి యోనిలోనికి జారిపోవడాన్నే వైద్యపరిభాషలో ‘పెల్విక్ ఆర్గాన్ ప్రొలాప్స్’ అని పేర్కొంటారు. అవి ఎందుకలా జారతాయో, అప్పుడు ఏం చేయాలో చూద్దాం. నిజానికి మహిళల్లో తమ పొత్తికడుపులోని అవయవాలన్నీ చాలా దగ్గర దగ్గరగా అమరి ఉంటాయి. పొత్తికడుపులోపల ఉండే గర్భసంచి వంటి అనేక అంతర్గత అవయవాలన్నీ ‘పెల్విక్ ఫ్లోర్’ అని పిలిచే ఓ పొర లాంటి కండరంపై ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే ఆ ‘పెల్విక్ ఫ్లోర్’ ఆ అంతర్గత అవయవాలను మోస్తూ ఉంటుంది.ప్రొలాప్స్కు మరికొన్ని కారణాలు పొత్తికడుపు అవయవాలు ఇలా కిందికి జారడానికి చాలా అంశాలు కారణమవుతాయి. ఉదాహరణకు వయసు పెరగడం వల్ల పెల్విక్ఫ్లోర్ కండరం బలహీనపడటం అనే ముఖ్యకారణంతో పాటు...→ బిడ్డలకు జన్మనివ్వడం (ఛైల్డ్ బర్త్) → రుతుక్రమం ఆగిపోవడం (మెనోపాజ్) → బరువు పెరగడం (ఒబేసిటీ) → తీవ్రమైన మలబద్ధకం (క్రానిక్ కాన్స్టిపేషన్)తో ముక్కడం వల్ల కొందరిలో గర్భసంచి తొలగింపు ఆపరేషన్ (హిస్టరెక్టమీ) జరగడం... వంటి అంశాలు ప్రొలాప్స్కు కారణమవుతాయి. నివారణపెల్విక్ ప్రొలాప్స్ నివారణ చాలా పరిమితమైన మేరకే సాధ్యమవుతుంది. పెల్విక్ ఫ్లోర్ కండరాన్ని బలోపేతం చేసే ‘కెగెల్స్ ఎక్సర్సైజెస్’ అని పిలిచే పొత్తికడుపు వ్యాయామాలను చేయడం ద్వారా కొంతవరకు ఈ పరిస్థితిని నివారించవచ్చు. మలబద్ధకాన్ని నివారించేందుకు ఆహారంలో పీచు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం, మంచి విసర్జక అలవాట్లు (గుడ్ టాయిలెట్ హ్యాబిట్స్... అంటే రోజూ ఒకేవేళకు మలవిసర్జనకు వెళ్లడం), స్థూలకాయాన్ని నివారించుకోవడం అంటే బరువు పెరగకుండా జాగ్రత్తపడటం, బరువైన వస్తువుల్ని అకస్మాత్తుగా ఎత్తకుండా జాగ్రత్తగా ఉండటం వంటి వాటితో పెల్విక్ ప్రొలాప్స్ను కొంతమేర నివారించవచ్చు. జారడం ( ప్రొలాప్స్) అంటే ఏమిటి, ఎందుకలా జరుగుతుందంటే...? మహిళల్లో వయసు పెరుగుతున్న కొద్దీ ఈ కండరం బలహీనపడుతుంది. ఆ క్రమంలో ఒక్కోసారి పొత్తికడుపులో ఉండే అంతర్గత అవయవాలు ‘బలహీనపడ్డ’ ఆ పెల్విక్ఫ్లోర్ నుంచి జారి... యోనిలోకి గానీ లేదా యోని పైభాగంలోకి వచ్చేస్తాయి. ఇలా జారి కిందకు రావడాన్నే ‘్రపొలాప్స్’అంటారు. ఏ అవయవం జారిందో దాన్ని బట్టి ఆ జారిన ప్రక్రియకు ( ప్రొలాప్స్కు) ఆ పేరు పెడతారు. ఉదాహరణకు గర్భసంచి జారితే దాన్ని ‘యుటిరైన్ ప్రొలాప్స్’ అనీ, పెద్దపేగు జారితే ‘బవెల్ ప్రొలాప్స్’ అనీ, మూత్రపు సంచి జారితే ‘బ్లాడర్ ప్రొలాప్స్’ అని చెబుతుంటారు. సాధారణంగా వీటన్నింటినీ కలిపి ‘పెల్విక్ ఆర్గాన్స్’గా పేర్కొంటారు కాబట్టి అవి జారినప్పుడు... అలా జరడాన్ని ‘పెల్విక్ ఆర్గాన్ ప్రొలాప్స్’ అనే ఒక్క మాటతో సూచిస్తుంటారు. నిజానికి ఇవేవీ ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టే సమస్యలు కాదు. అయితే ఇలా జారడం వల్ల ఒక్కోసారి తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది. కొన్నిసార్లు తీవ్రంగా నొప్పి కూడా వస్తుంటుంది.చికిత్సకొన్ని జీవనశైలి మార్పులు అనుసరిస్తూ కొంతమందిలో హార్మోన్ చికిత్స ఇవ్వడం ద్వారా ఈ కండిషన్ను డాక్టర్లు చక్కదిద్దడం జరిగినప్పటికీ... ఇలాంటి చర్యలతో అంతగా ఫలితం లేనప్పుడు జారిన అవయవాన్ని / అవయవాలను తిరిగి వాటి వాటి స్థానాల్లో అమర్చేలా శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. చాలా సందర్భాల్లో శస్త్రచికిత్సతో ఆయా అవయవాలను వాటి స్థానాల్లో తిరిగి అమర్చడం మాత్రమే ప్రొలాప్స్కు శాశ్వత చికిత్సగా చెప్పవచ్చు.డా‘‘ సరోజ బానోతు, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ -
రూ.500 లంచం... 36 ఏళ్లు పోరాటం... ఏడాది జైలు
అవినీతికి పాల్పడిన ఉద్యోగులను తిమింగలాలతో పోలుస్తారు. తాజాగా అనకొండలను చేర్చారు. ఏ జంతువుతో పోల్చినా, కేసులు నమోదు చేస్తున్నా, కొన్ని ప్రభుత్వ శాఖల్లో ‘పైసా వసూల్’ కానిదే ఫైలు కదలదు, పని జరగదు. లంచం తీసుకోవడం తమ ప్రాథమిక విధుల్లో భాగమని, ఇవ్వడం ప్రజల బాధ్యతని కొంతమంది ఉద్యోగులు భావిస్తుంటారు. అంటే, ‘డ్యూటీకి వచ్చినందుకు జీతం... పనిచేయాలంటే లంచం’ మెజార్టీ ఉద్యోగులు ఇలానే ఉన్నారు. అడిగింది ఇచ్చేదాకా వేధిస్తుంటారు. అడ్డంకులు సృష్టిస్తుంటారు. అయితే, అందరూ వీటిని భరించరు. హక్కుగా పొందాల్సిన సేవలకు లంచం ఇవ్వరు. అవినీతి నిరోధక శాఖను ఆశ్రయిస్తారు. లంచగొండులను పట్టిస్తారు. ఇలా ఓ ఉద్యోగి దొరికాడు. కేసులో ఇరుక్కున్నాడు. చిన్న మొత్తమే కదా బయట పడతాననుకున్నాడు. కోర్టుల చుట్టూ తిరిగాడు. కాళ్లరిగాయి, ఏళ్లు గడిచాయి. చివరికి న్యాయం గెలిచింది. అవినీతికి శిక్ష ఖరారైంది. కానీ చాలా ఆలస్యమైంది.అది 1990... ఉత్తరాఖండ్లోని ఉద్ధమ్సింగ్ నగర్కి చెందిన రాజ్బహుదూర్ సింగ్ ఎక్సైజ్ కానిస్టేబుల్. ఓ గ్రామంలో తనిఖీలకు వెళ్లాడు. అక్రమ మద్యం ఉందంటూ ఓ వ్యక్తితో బలవంతంగా కొన్ని కాగితాలపై సంతకాలు చేయించుకున్నాడు. లంచంగా రూ. 500 డిమాండ్ చేశాడు. అడిగింది ఇవ్వకపోతే కేసు కోర్టుకు పంపుతానని బెదిరించాడు. వేధింపులు భరించలేక వ్యాపారి విజిలెన్స్ శాఖ ఎస్పీని కలిశాడు. జరిగింది చెప్పాడు. దీంతో వలపన్నారు. కానిస్టేబుల్ను రెస్టారెంట్కు రప్పించారు. డబ్బు తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేశారు. మూడు కోర్టులు... ముప్పయ్యారేళ్లుతొలుత ట్రయల్ కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. కోర్టు ఇద్దరు ప్రధాన సాక్షులను విచారించింది. అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 7, సెక్షన్ 13(2) కింద మార్చి 2006లో శిక్ష ఖరారు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. రెండేళ్లు జైలు శిక్ష, రూ. 2000 జరిమానా విధించింది. ఈ కోర్టులో కేసు 16 ఏళ్లు నడిచింది. ఈ తీర్పుపై నిందితుడు ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించాడు. కేసు కొట్టేయాలని అభ్యర్థించాడు. ఆరేళ్లు కేసు నడిచింది. ఏప్రిల్ 2012లో హైకోర్టు ఆ అప్పీల్ను తిరస్కరించింది. ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది. ‘సుప్రీం’కు చేరిన కేసుహైకోర్టులో చుక్కెదురవడంతో సుప్రీంకోర్టు మెట్లెక్కాడు. కేసు కొట్టేయాలని వేడుకున్నాడు. వాయిదాలతో 14 సంవత్సరాలు కేసు కొనసాగింది. 2012 ఆగస్టులో మొదటిసారి విచారణ జరిగింది. 21 సార్లు వివిధ బెంచ్ల ముందు విచారణకు వచ్చింది. ఎట్టకేలకు తుది తీర్పు వెలువడింది. ‘సాక్ష్యాలను సమగ్రంగా పరిశీలించిన ట్రయల్ కోర్టు, హైకోర్టులు నిందితుణ్ణి దోషిగా తేల్చడంలో ఎటువంటి పొరపాటు చేయలేదు’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.అందువల్ల ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు, దాన్ని హైకోర్టు సమర్థించిన నేపథ్యంలో ఈ కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తన తీర్పులో స్పష్టం చేసింది. కింది కోర్టు తీర్పును సమర్థిస్తూనే ‘నిందితుడికి ప్రస్తుతం 75 ఏళ్లు. అతడి వయస్సును దృష్టిలో పెట్టుకుని శిక్షను కనీస స్థాయికి తగ్గించవచ్చని మేం భావిస్తున్నాం’ అని తన ఆదేశంలో పేర్కొంటూ శిక్షను ఏడాదికి పరిమితం చేసింది.గతంలో కొంత కాలం జైలులో ఉండడంతో మిగిలిన కాలానికి శిక్ష అనుభవించాలని ఆదేశించింది. ఈ కేసులో తీర్పు ఆలస్యం అయింది. కానీ, న్యాయం గెలిచింది. తప్పుకు శిక్ష తప్పదని వెల్లడైంది. అయితే నాణేనికి ఇది ఒక వైపే! మరోపైపు చూస్తే, 40 ఏళ్ల వయసులో చేసిన నేరానికి 75 ఏళ్ల వయసులో శిక్ష పడింది. రూ. 500 లంచం తీసుకున్నందుకు చట్ట ప్రకారం శిక్ష ఖరారైంది. అవినీతి పరులను శిక్షించాల్సిందే కానీ, 36 ఏళ్ల కాలానికి విలువ కట్టేదెవరు?దిలీప్ మాదిరెడ్డి -
సమగ్ర కలుపు నిర్వహణ పద్ధతులు
కలుపు.. అంటే రైతులు ఆ పొలంలో ఆ పంట సాగు కాలంలో అవాంఛితంగా పెరుగుతున్న రకరకాల మొక్కలను కలుపు మొక్కలు అని పిలుస్తున్నాం. వేల సంవత్సరాల సుసంపన్న సంప్రదాయ వ్యవసాయ విజ్ఞానం కలిగిన భారతీయ రైతాంగానికి ఒక్క గ్రాము కలుపు మందును వాడకుండా వ్యవసాయం చేసే వారసత్వం ఉంది. అయినా, ఆధునిక వ్యవసాయ పోకడల నేపథ్యంలో కలుపు మొక్కలను నియంత్రించే మందుల వినియోగం పెరిగిపోయింది. రసాయనిక లేదా పారిశ్రామిక వ్యవసాయం ఊపందుకున్నాక.. ఏదో ఒకటే పంటను పొలమంతా వేసి పండించే ఏక పంటల (మోనోకల్చర్) సాగు విస్తృతం అయిన తర్వాత.. గడ్డి లేదా కలుపు నిర్మూలన మందుల వాడకం పెరిగింది. అప్పటికి ఇది రైతుకు సులువైన పరిష్కారంగా, ఖర్చు తక్కువతో పూర్తయ్యే పనిగా తోచినప్పటికీ.. గడ్డి మందులకు అనేక రకాలుగా దుష్పరిణామాలు ఉంటాయని ప్రపంచ దేశాల అనుభవాలు చెబుతున్నాయి. మట్టిలో సూక్ష్మజీవరాశి నశించి వ్యవసాయం సమస్యల్లో పడుతుంది. గాలి, నీరు కలుషితమవుతుంది. మనుషుల ఆరోగ్యం దెబ్బతింటుంది. పారాక్వాట్, గ్లైఫొసేట్ వంటి కలుపు మందుల వాడకంతో రైతులు, రైతు కూలీలు, వినియోగదార్లలో కేన్సర్లు, ప్రాణాంతక జబ్బులు ప్రబలుతున్నాయని చెప్పటానికి ప్రపంచ దేశాల్లో ఆధారాలకు కొదువ లేదు. కాబట్టి, రసాయనాలు చల్లకుండా కలుపు నిర్వహణపై భారతీయ వ్యవసాయ వారసత్వాన్ని పునరుజ్జీవింపజేయడం అవసరమని కొందరు నిపుణులు చెబుతున్నారు. దేశంలో ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విస్తరణకు గతంలో కన్నా ఎక్కువగా కృషి జరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో ఇది ఒక అనివార్యం. కలుపు మందుల నిరోధకత, కలుపు మందులతో వ్యవసాయ – పర్యావరణ ప్రభావాలు, కలుపు మొక్కలపై ప్రాకృతిక దృక్పథం, సమగ్ర కలుపు నిర్వహణ పద్ధతులు ఏమిటో చర్చించటమే ఈ కథనం లక్ష్యం. కలుపు మొక్కల ‘ఉపయోగాలు’ మీకు తెలుసా! రైతులు సాగుచేసే పంటలతో సూర్యరశ్మి, తేమ, పోషకాల కోసం కలుపు మొక్కలు పోటీ పడుతుంటాయి. తద్వారా పంట దిగుబడిని, నాణ్యతను ప్రభావితం చేస్తాయి. పంటకు తెగుళ్ళు, ఇతర చీడపీడలను కలిగిస్తాయని కూడా భావిస్తారు. కలుపు మొక్కలు మామూలు పంటలకన్నా చాలా ఎక్కువ మొత్తంలో విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి, చాలా వేగంగా పెరుగుతాయి. కొన్ని గడ్డి మొక్కలు రకాలు మొలకెత్తిన ఒక నెల కంటే తక్కువ సమయంలోనే విత్తనాల ఉత్పత్తిలో చివరి దశకు చేరుకోగలవు. ఇంకా కొన్ని కలుపు మొక్కలు అల్లెలోపతి (రసాయనాలను ఉత్పత్తి చేసే లక్షణం) ప్రభావాలను కూడా సృష్టిస్తాయి. తద్వారా ఆర్థికంగా రైతుకు ముఖ్యమైన పంటల పెరుగుదలకు సవాళ్లు విసురుతాయి. అవి మనం తీసుకునే నియంత్రణ చర్యల కంటే ఒక అడుగు ముందే ఉంటాయి!మనకు అవసరమైన పంట మొక్కల కన్నా వేగంగా పెరిగే ఈ కలుపు మొక్కలు వాటిని నియంత్రించటానికి మనం చేసే ప్రయత్నాలన్నింటినీ తప్పించుకుంటాయి. అన్నిటికంటే నష్టం కలిగించే వార్షిక కలుపు మొక్కలు బతికేది స్వల్పకాలమే కావచ్చు, కానీ వాటి విత్తనాలు మార్గం దీర్ఘ కాలం బతికి వుండి చాన్నాళ్ల తర్వాత కూడా మొలకెత్తుతాయి. అందువల్ల కలుపును పూర్తిగా నిర్మూలించడం దాదాపు అసాధ్యం అవుతోంది. ఒక సంవత్సరం విత్తనంతో ఏడు సంవత్సరాల పాటు కలుపు మొక్కలు మొలుస్తూనే ఉంటాయట. స్థానిక వాతావరణంలో పుట్టి పెరిగే కలుపు మొక్కలు కొన్నయితే, విదేశాల నుంచి వచ్చి చేరి స్థానిక మొక్కలకు చోటివ్వకుండా విపరీతంగా పెరిగిపోయే పార్థీనియం/ వయ్యారిభామ వంటి ప్రమాదకరమైన కలుపు మొక్కలు కొన్ని.కలుపు మొక్కల వల్ల పర్యావరణానికి మేలు కలుగుతుంది. మట్టి పైపొరలో క్షీణించిన ఖనిజాలను భూగర్భం నుంచి పైపొర మట్టిలోకి తీసుకువచ్చి, పంట మొక్కలకు అందుబాటులో ఉంచుతాయి. కలుపు మొక్కలు గట్టి మట్టిపెడ్డలను విచ్ఛిన్నం చేసి నేలను గుల్లచేస్తాయి. తరువాత వేసే పంటల వేర్లు లోతుగా వెళ్లడానికి మార్గం సుగమం చేసాయి. సూక్ష్మజీవులకు మంచి వాతావరణాన్ని అందించడానికి అవి నేలను వదులుగా, పొరలుగా చేస్తాయి. తద్వారా నేలను సుసంపన్నం చేస్తాయి. నేల స్థితిగతులు ఎలా ఉన్నాయో, మట్టిలో పోషక లోపాలు ఏమిటో సూచిస్తాయి.భూమి లోతుల్లోకి వేర్లను చొప్పించే కలుపు మొక్కలు పోషకాలను తీసుకుంటూ.. పైపైన వేర్లతో ఉండే ఇతర జాతుల మొక్కలు కరువు బారిన పడకుండా తట్టుకునేలా దోహదం చేస్తాయి.సాగు చేసే పంటల వేర్లకు అందుబాటులో లేని పోషకాలను అందుకోవటానికి ‘సహచర పంటలు’గా కలుపు మొక్కలు సహాయపడతాయి.కలుపు మొక్కలు మట్టి పైపొరను కప్పి ఉంచటం ద్వారా ఆ మట్టి నుంచి ఖనిజాలు, పోషకాలు కొట్టుకుపోకుంగా నిల్వ చేస్తాయి, అందుబాటులో ఉంచుతాయి.కలుపు మొక్కల వల్ల పర్యావరణానికి మేలు కలుగుతుంది. మట్టి పైపొరలో క్షీణించిన ఖనిజాలను భూగర్భం నుంచి పైపొర మట్టిలోకి తీసుకువచ్చి, పంట మొక్కలకు అందుబాటులో ఉంచుతాయి.కలుపు మొక్కలు గట్టి మట్టిపెడ్డలను విచ్ఛిన్నం చేసి నేలను గుల్లచేస్తాయి. తరువాత వేసే పంటల వేర్లు లోతుగా వెళ్లడానికి మార్గం సుగమం చేసాయి. సూక్ష్మజీవులకు మంచి వాతావరణాన్ని అందించడానికి అవి నేలను వదులుగా, పొరలుగా చేస్తాయి. తద్వారా నేలను సుసంపన్నం చేస్తాయి.నేల స్థితిగతులు ఎలా ఉన్నాయో, మట్టిలో పోషక లోపాలు ఏమిటో సూచిస్తాయి.భూమి లోతుల్లోకి వేర్లను చొప్పించే కలుపు మొక్కలు పోషకాలను తీసుకుంటూ.. పైపైన వేర్లతో ఉండే ఇతర జాతుల మొక్కలు కరువు బారిన పడకుండా తట్టుకునేలా దోహదం చేస్తాయి. సాగు చేసే పంటల వేర్లకు అందుబాటులో లేని పోషకాలను అందుకోవటానికి ‘సహచర పంటలు’గా కలుపు మొక్కలు సహాయపడతాయి. కలుపు మొక్కలు మట్టి పైపొరను కప్పి ఉంచటం ద్వారా ఆ మట్టి నుంచి ఖనిజాలు, పోషకాలు కొట్టుకుపోకుంగా నిల్వ చేస్తాయి, అందుబాటులో ఉంచుతాయి.నేలను కప్పి ఉంచుతూ సూర్యకాంతి నుంచి రక్షిస్తాయి. ప్రవహించే వాన నీరు, గాలుల వల్ల నేల కోతకు గురికాకుండా కలుపు మొక్కలు కాపాడతాయి. అనేక ప్రయోజనకరమైన కీటకాలు, మాంసాహారులు, పరాన్నజీవులు, పరాగ సంపర్కాని ఉపయోగపడే జీవులకు కలుపు మొక్కలు ఆహారాన్ని, ఆశ్రయాన్ని కల్పిస్తాయి.చాలా జంతువులకు, మానవులకు ఆహారంగా, ఔషధాలుగా ఉపయోగపడతాయి. వాటి ఔషధ విలువలు తెలియక మనం అవి కలుపు మొక్కలనుకొని నిర్మూలిస్తుంటాం.చాలా రకాల కలుపు మొక్కలు నిజానికి పుష్కలంగా పోషక విలువలను కలిగి వుంటాయి. సాగు చెయ్యని ఆకుకూరలుగా, మందు మొక్కలుగా వ్యవసాయ కుటుంబాలకు గొప్పగా దోహదపడతాయి. అలాగే కరువు సమయాల్లో ఆహారాన్ని కూడా అందిస్తాయి. వీటిలో చాలా వాటిని కొందరు గ్రామీణులు సేకరించి మార్కెట్లలో కూడా అమ్ముతారు.కేరళలోని వాయనాడ్ జిల్లాలో ‘థనల్’ సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనంలో, 83 రకాల ఆకుకూరలను (సాధారణంగా కలుపు మొక్కలుగా వర్గీకరించబడినవి) ఆ ప్రాంత ప్రజలు ఆహారంగా వినియోగిస్తున్నట్లు కనుగొన్నారు. వాటిలో 20 రకాలు వరి పొలాల్లో లభించాయి.ప్రకృతిలో అన్నీ మొక్కలే.. ‘కలుపు’ మొక్కల్లేవు! ప్రకృతి దృష్టికోణంలో ‘కలుపు మొక్కలు’ అనేవి ఉండవు. కలుపు అనేది మానవుల భావన. ఎందుకంటే మనం ఒక పంటను ΄పొలంలో పెంచుకుంటూ ఉంటే మనం కోరకుండా వాటంతట అవే పెరిగే మొక్కలను మనం ‘కలుపు మొక్కలు అని పిలుస్తున్నాం. అయితే, మనం కలుపు అనుకునే మొక్కలు ఒక ప్రత్యేక వాతావరణంలో, ప్రత్యేకమైన మట్టిలో కొన్ని కలుపు మొక్కలు పెరగడానికి ప్రకృతి సంబంధమైన కారణాలు అనేకం ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వాటికి ప్రకృతిపరంగా ముఖ్యమైన పాత్రలు, విధులు ఉంటాయి. కలుపు మొక్కలు ప్రకృతిపరంగా బాగా అనుకూలతను కలిగి ఉంటాయి. మనం విత్తనాలు/మొక్కలు నాటి సాగు చేసే పంటలు జీవించడం కష్టతరమైన పరిస్థితుల్లో కూడా ఆ పొలంలోనే అనేక కలుపు మొక్కలు పెరగడానికి ఇదే కారణం. కొన్ని పరిస్థితులలో పంట మొక్కల కంటే కలుపు మొక్కలు మరింత దృఢంగా ఉంటాయి. కలుపు మొక్కలు సూక్ష్మమైన శక్తులు. అవి ప్రకృతి సమతుల్యతకు సహాయపడతాయి.అందుకనే, ‘నేలపై నియంత్రణ సాధించడంలో కలుపు మొక్కలు మానవ వైఫల్యాన్ని సూచిస్తాయి. ప్రజలు తప్పులు చేసిన చోట అవి సమృద్ధిగా పెరుగుతాయి. అవి మన తప్పులను, ప్రకృతి చేపట్టిన దిద్దుబాట్లను సూచిస్తాయి’ అంటారు అమెరికాకు చెందిన ప్రసిద్ధ బయోడైనమిక్ శాస్త్రవేత్త డా. ఎహ్రెఫ్రై డ్ ఫైఫర్.ఉదాహరణకు.. సియామ్ కలుపు మొక్క లేదా ఫ్లాస్ ఫ్లవర్ (క్రోమోలీనా ఒడోరాటా) అనేది ఒక భయంకరమైన కలుపు మొక్క. ఇది అడవులను అక్రమిస్తూ అక్కడ అనాదిగా సహజంగా పెరిగే మొక్కలు, చెట్ల జాతుల జీవవైవిధ్యాన్ని తగ్గించడానికి కారణమవుతుంది. అయితే, ఇది చెట్లు లేని వాలు ప్రాంతాల్లో పెరిగి, నేలను త్వరగా ఆక్రమించుకుంటుంది, ఇతర మొక్కలు పెరగడానికి అనుమతించదు. చాలా సందర్భాలలో, ఇది నేలను పట్టి ఉంచి, నేల కోతను నిరోధించే ఏకైక మొక్క. త్వరగా కుళ్ళిపోయే దాని ఆకులు తూర్పు భారతదేశంలో ఝుమ్ వ్యవసాయ పద్ధతిలో పండించే వివిధ రకాల పంటలకు మంచి ఎరువుగా ఉయోగపడుతుంటాయి. కొన్ని రకాల పోషకాలు లోపించిన నేలల్లో కొన్ని రకాల ప్రత్యేక కలుపు మొక్కలు పెరుగుతాయట. రైతులు సాగుచేసే పంటలతో సూర్యరశ్మి, తేమ, పోషకాల కోసం కలుపు మొక్కలు పోటీ పడుతుంటాయి. తద్వారా పంట దిగుబడిని, నాణ్యతను ప్రభావితం చేస్తాయి. పంటకు తెగుళ్ళు, ఇతర చీడపీడలను కలిగిస్తాయని కూడా భావిస్తారు. కలుపు మొక్కలు మామూలు పంటలకన్నా చాలా ఎక్కువ మొత్తంలో విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి, చాలా వేగంగా పెరుగుతాయి. కొన్ని గడ్డి మొక్కలు రకాలు మొలకెత్తిన ఒక నెల కంటే తక్కువ సమయంలోనే విత్తనాల ఉత్పత్తిలో చివరి దశకు చేరుకోగలవు. ఇంకా కొన్ని కలుపు మొక్కలు అల్లెలోపతి (రసాయనాలను ఉత్పత్తి చేసే లక్షణం) ప్రభావాలను కూడా సృష్టిస్తాయి. తద్వారా ఆర్థికంగా రైతుకు ముఖ్యమైన పంటల పెరుగుదలకు సవాళ్లు విసురుతాయి. అవి మనం తీసుకునే నియంత్రణ చర్యల కంటే ఒక అడుగు ముందే ఉంటాయి! మనకు అవసరమైన పంట మొక్కల కన్నా వేగంగా పెరిగే ఈ కలుపు మొక్కలు వాటిని నియంత్రించటానికి మనం చేసే ప్రయత్నాలన్నింటినీ తప్పించుకుంటాయి. అన్నిటికంటే నష్టం కలిగించే వార్షిక కలుపు మొక్కలు బతికేది స్వల్పకాలమే కావచ్చు, కానీ వాటి విత్తనాలు మార్గం దీర్ఘ కాలం బతికి వుండి చాన్నాళ్ల తర్వాత కూడా మొలకెత్తుతాయి. అందువల్ల కలుపును పూర్తిగా నిర్మూలించడం దాదాపు అసాధ్యం అవుతోంది. ఒక సంవత్సరం విత్తనంతో ఏడు సంవత్సరాల పాటు కలుపు మొక్కలు మొలుస్తూనే ఉంటాయట. స్థానిక వాతావరణంలో పుట్టి పెరిగే కలుపు మొక్కలు కొన్నయితే, విదేశాల నుంచి వచ్చి చేరి స్థానిక మొక్కలకు చోటివ్వకుండా విపరీతంగా పెరిగిపోయే పార్థీనియం/ వయ్యారిభామ వంటి ప్రమాదకరమైన కలుపు మొక్కలు కొన్ని.కలుపు మందులకు నిరోధకతకలుపు మందుల మార్కెట్ మన దేశంలో 2025లో 393 మిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. 2030 నాటికి 608 మిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. పెరుగుతున్న కలుపు కూలీల ఖర్చు తగ్గించుకోవటానికి రైతులు కలుపు మందులు చల్లుతున్నారు. అయితే, కలుపు కూలీల ఖర్చే కాదు మొత్తంగా సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. రైతు అధికంగా ఖర్చు పెట్టిన తర్వాత గిట్టుబాటు ధర లభించనప్పుడు కూలీల ఖర్చు భరించటం వారికి సమస్యగా మారుతోంది. కలుపు మందుల మార్కెట్లో సింహభాగం గ్లైఫోసేట్, 2,4–డి ఆక్రమిస్తున్నాయి. గ్లైఫోసేట్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన వ్యవసాయ రసాయనం. 2024లో రైతులకు వచ్చిన ఆదాయంలో నేల కోసం పెట్టిన ఖర్చు వాటా 46.5%కు పెరిగిందని అంచనా. కలుపు మందును తట్టుకునే నిషిద్ధ బీటీ పత్తితో సహా వాణిజ్య పంటల విస్తరణ ఏటా 9.31% పెరుగుతున్నట్లు చెబుతున్నారు.కలుపు మందులు కొట్టినా కలుపు చనిపోకుండా నిరోధకత పెంచుకోవటం ప్రపంచవ్యాప్తంగా సమస్యగా మారింది. దీర్ఘకాలికంగా బీటీ పంటలను సాగుచేస్తున్న దేశాల స్థాయిలో మన దేశంలో ఇంకా నిరోధకత లేదు. అయినప్పటికీ, కలుపు మందును తట్టుకునే నిషిద్ధ పత్తి సాగు వ్యాప్తితో పెరుగుతున్న కలుపు మందుల వాడకం ఆందోళన కలిగిస్తున్నది. వరి పొలాల్లో కూలీలతో కలుపు తీసే పద్ధతిలో కూడా కలుపు మొక్కలు రంగు మార్చుకొని తప్పించుకుంటున్నాయి.మన దేశంలో కలుపు మందులకు నిరోధక శక్తిని పెంచుకున్న కలుపు మొక్కల సంఖ్య పెరుగుతున్నది. తట్టుకునే శక్తిని పెంచుకున్న కలుపు మొక్కలను లక్ష్యంగా చేసుకునే కొత్త కలుపు మందుల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. మొండి కలుపుపై చల్లటానికి అనేక కొత్త మందులు అభివృద్ధి చెందే క్రమంలో ఉన్నాయి. గ్లైఫోసేట్ కలుపు మందుకు 50కి పైగా కలుపు జాతులు ఇప్పుడు నిరోధకతను ప్రదర్శిస్తున్నాయి. పాత కలుపు మందులు పనిచేయకపోతే మరింత విషపూరిత కలుపు మందులను రైతులు వాడాల్సిన పరిస్థితి వస్తోంది. ఇది పొలంపై, పంటపై రసాయనాల భారాన్ని తీవ్రతరం చేస్తోంది. ఈ పొలాల్లో నుంచి నీరు పొంగి పొర్లిన సందర్భంలో నాచుకు, ఉభయచరాలకు ఈ రసాయనాలు హాని చేస్తాయి.ప్రాక్వాట్ అనే కలుపు మందు మట్టికి గట్టిగా అంటుకుంటుంది. అది పై పొరలలో ఉండి ఉత్పాదకతకు కీలకమైన నత్రజనిని స్థిరీకరించే మంచి బ్యాక్టీరియాకు హాని కలిగిస్తుంది. తక్కువ సాంద్రతలలో కూడా ఈ మందు జలచరాలు, తేనెటీగలు, ప్రయోజనకరమైన కీటకాలకు అత్యంత విషపూరితమైనది. 30 కంటే ఎక్కువ కలుపు జాతులు ఇప్పుడు దానికి నిరోధకతను సంతరించుకున్నాయి. అంటే, ఈ మందు కొట్టినా ఈ కలుపు మొక్కలు మళ్ళీ పెరుగుతున్నాయి. ఎక్కువసార్లు పిచికారీ చేయటం వల్ల కలుపు మొక్కల రకాలు తట్టుకొని దీర్ఘకాలం బతికే జాతులుగా మారుతున్నాయి. ప్రాక్వాట్ నేల ఆరోగ్యాన్ని, వాన పాముల సంఖ్యను భారీగా తగ్గిస్తుంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిషేధం విధించటం హర్షదాయకం. అదే విధంగా, 2,4 డిని 80 సంవత్సరాలకు పైగా ఉపయోగించిన తర్వాత 40 కంటే ఎక్కువ కలుపు జాతులు దానికి నిరోధకతను పెంచుకున్నాయి. పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాలురసాయనిక కలుపు మందులకు అనేక పర్యావరణ హితమైన సమర్థ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. కొందరు రైతులు కలసి సహకార యాజమాన్యంలో యంత్రాలతో కలుపుతీసే పద్ధతులతో పాటు సేంద్రియ/ప్రకృతి సేద్య మిశ్రమ పంటల సాగు పద్ధతులను అనుసరించవచ్చు. కలుపు మొక్కలు పెరగనీయకుండా అంతరాయం కలిగించే అంతర పంటలు, పంటల మార్పిడి, నేలను కప్పి వుంచే పంటలు సాగు చెయ్యటం, పంట వెయ్యటానికి ముందు పొలానికి నీటి తడి పెట్టి కలుపు మొలిచిన తర్వాత దుక్కి చేసి ఆ తర్వాత పంట వేసుకోవటం ద్వారా కలుపు సమస్యను అధిగమించటం వంటి అనేక పద్ధతులు కలుపు మందులకు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. ఈ పద్ధతులు కలుపు మొక్కలను అణచివేయటం, నేల ఆరోగ్యాన్ని పెంపొందించటంతో పాటు విలువైన పర్యావరణ సేవలను అందిస్తాయని గుర్తించడం అవసరం.ఎద్దులతో గుంటకలు తోలి కలుపు నివారించే సాధనాలను ఉపయోగించే సాంప్రదాయ పద్ధతులు, కోనో–వీడర్లు, రోటరీ వీడర్లు, సైకిల్ వీడర్లు వంటి ఆధునిక ఆవిష్కరణలతో కలిపి సమర్థవంతమైన కలుపు తొలగింపు మార్గాలను అనుసరించవచ్చు. దానితో పాటు ఈ పనుల ద్వారా మట్టి లోపలికి గాలిని ప్రసరింపజేయటం, తెగుళ్లు కలిగించే పురుగుల జీవిత చక్రాలకు అంతరాయం కలిగించటం, కలుపు మొక్కలను పచ్చి రొట్ట ఎరువుగా తయారుచేసి నేలలో కలపటం ఈ పద్ధతుల్లో సాధ్యపడుతుంది. తద్వారా రసాయన ఉత్పాదకాలపై ఆధారపడకుండా బహుళ వ్యవసాయ ప్రయోజనాలను ఈ పద్ధతులు సాధిస్తాయి.అంతేకాదు, ఈ విధానాలు రైతు స్వయం ప్రతిపత్తిని బలోపేతం చేస్తాయి. గ్రామీణ ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి. తరతరాల పర్యావరణ జ్ఞానాన్ని కాపాడతాయి. నేల సారానికి నష్టం చేయకపోగా పెంపొందిస్తాయి. విషం లేని ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి.రసాయనాలు లేకుండా కలుపు మొక్కలను నియంత్రించటం అనేది సాంకేతికమైన విషయమా లేదా రాజకీయ, ఆర్థిక విషయమా అనేది ప్రాథమిక ప్రశ్న. వ్యవసాయదారులు, వ్యవసాయ కార్మికులు పర్యావరణ మార్పును తట్టుకునే స్థితిని కల్పించటానికి ఉపయోగపడే వ్యవసాయ పర్యావరణ శాస్త్రం అభివృద్ధిపై భారతదేశం పెట్టుబడి పెడుతుందా లేదా రసాయనాల వాడకాన్ని పెం΄÷ందించే పద్ధతులను ప్రోత్సహిస్తుందా అన్నది కాలం తేల్చాల్సిన విషయం.హెక్టారులో 40 కోట్ల పార్థీనియం విత్తనాలు!ఒక పార్థీనియం మొక్క 15 వేల నుంచి 20 వేల విత్తనాలను ఉత్పత్తి చేయగలదు. ఇది పొలంలోనే లేదా నేలలోనే ఒక భారీ, నిరంతర విత్తన బ్యాంకు ఏర్పడటానికి దారి తీస్తుంది. హెక్టారు భూమిలో విత్తనాల దశ వరకు పార్థీనియం మొక్కలను పెరగనిస్తే ఆ పొలంలో 40 కోట్ల విత్తనాలు తయారు చేసినట్లే. అవి మైళ్ళ దూరం ప్రయాణించి, అనేక దశాబ్దాల పాటు జీవిస్తాయి. అవి మానవులను, జంతువులను అంటుకొని ప్రయాణిస్తాయి. మరికొన్ని మన పొలాల్లో వాలే పక్షుల ద్వారా ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతాయి.చాలా ఏళ్లపాటు బతికే కలుపు మొక్కలు విత్తనాల ద్వారా కాకుండా వేర్ల ద్వారా, ఊడల్లాంటి (రన్నర్లు లేదా స్టోలన్) తీగల ద్వారా వ్యాప్తిచెందుతాయి. తెల్ల క్లోవర్ కలుపు మొక్క 50 మీటర్ల పొడవున తీగను పాకించగలదు. వేరు దుంపల ద్వారా కొన్ని కలుపు మొక్కలు నిరంతరం విస్తరిస్తూ ఉంటాయి. హార్స్టెయిల్ వేరు దుంపలు 5 మీటర్ల లోతులో 100 మీటర్ల దూరం వరకు చొచ్చుకెళ్లి మొక్కల్ని మొలిపించగలదు. నేలపై ఒక చోట కలుపు మందుతోనో, చేతితోనే తీసేసి నిర్మూలించినా నేలలో దుంప నుంచి మళ్లీ పెరుగుతూనే ఉంటుందన్న మాట. చాలా కలుపు మొక్కలు లోతైన వేర్లను కలిగి ఉంటాయి. ఇవి కొమ్మలు, రెమ్మలను తొలగించినప్పుడు కూడా పునరుత్పత్తి చేయగలవు. ఆక్సాలిస్ జాతి దుంప రకం కలుపు మొక్క ఒక సీజన్లో 6900 మొక్కలుగా పెరుగుతుంది. నేలకు కరుచుకొని, పొట్టిగా, పాకుతూ పెరుగుతుండటం వలన యంత్రాలతో వీటిని తొలగించినప్పటికీ తప్పించుకుని బతుకుతాయి. -
ఊబకాయం నుంచి స్మార్ట్గా..! ఏకంగా 204 కిలోల నుంచి 92 కిలోలకు..
కొందరు సుమోలు మాదిరిగా భారీ శరీరంతో ఉంటారు. వాళ్లు వెయిట్లాస్ అవ్వడం చాలాకష్టం. బరువు తగ్గే సర్జరీలు, ఫిట్నెస్ నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే కాస్త బరువు తగ్గగలిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఊబకాయులు బరువు తగ్గడం అంత సులభం కాదు. పైగా ఆ క్రమంలో చాలా నరకం చవి చూడాల్సి ఉంటుంది. కానీ ఈ మహిళ బరువు తగ్గాలనే కోరిక బలంగా ఉంటే..పట్టుదలతో ఇట్టే ఆ సమస్యను జయించొచ్చు అని నిరూపించిందామె.ఆ మహిళ అమెరికాలోని కొలరాడోకు చెందిన కంటెంట్ క్రియేటర్ అనా అలోన్సో. తన శరీర బరువులో సగానికి పైగా బరువు తగ్గిన జర్నీని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. నిజానికి ఆమె బరువు 204 కిలోలు. పట్టుదల, మానసిక స్థైర్యంతో బరువు తగ్గడానికి స్థిరంగా కట్టుబడి మరి స్మార్ట్గా మారింది ఆ పిల్లల తల్లి. ఒకప్పుడు అధిక బరువుతో..చిన్నపాటి కదలికలకే అల్లడిపోయే సవాళ్లను ఎదుర్కొంది. నిరంతర ఆయాసంతో బయటకు అడుగుపెట్టాలంటేనే ఇబ్బంది పడేది. ముఖ్యంగా తన రూపం కారణంగా నలుగురిలోకి రావడానికి చాలా ఇబ్బందిపడేది. తాను ఎలాగైన చురుకైన తల్లిగా ఆత్మవిశ్వాసంతో ఉండాలన్న ఆరాటం ఆమెను బరువు తగ్గేందుకు పురికొల్పొంది. ముఖ్యంగా బరువు తగ్గి మంచి శరీరాకృతితో ఆత్మగౌరవంతో ఉండాలనే ఆకాంక్షతో చాలా పట్టుదలతో నిలకడగా బరువు తగ్గేందుకు ఉపక్రమించానని చెప్పుకొచ్చింది అనా.శారీరక పరివర్తన ఎలా సాధించిందంటే..మొదట్లో చిన్న పాటి కదలికలు కూడా కష్టమైందామెకు. సాధార వ్యాయామాలకే అలిసిపోయేది. అయితే అసౌకర్యాన్ని భరిస్తూ ముందుకు సాగింది. అయితే నిలకడగా చేయడం ప్రతీది మార్చేసింది. కాలక్రమేణ బరువులు ఎత్తడం, స్క్వాట్స్ చేయడం, బహిరంగ పోటీల్లో పాల్గొనేంత వరకు పురోగతి సాధించింది. ఆమె పరివర్తన మొత్తం రాత్రికి రాత్రే జరగలేదు. మంచి జీవనశైలిని అవలంభిస్తూ..క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ..తగ్గడం సాధ్యమే అని నిరూపించింది. ఎలా విజయవంతమైందంటే..ఆరోగ్యకరమైన బరువు తగ్గడం కోసం అనా అనుసరించిన ముఖ్యమైన సూత్రాలేంటంటే..క్రమం తప్పని వ్యాయామాలు కాలక్రమేణ బలాన్ని పెంచుకోవడానికి, కొవ్వును కరిగించుకోవడానికి, ఓర్పును మెరుగుపరుచుకోవడానికి సహయాపడ్డాయి. మొదట్లో ఎక్కువ దూరం వాకింగ్ చేసేది. ఆ తర్వాత రోజుకు రెండుసార్లు వ్యాయామాలు చేసేలా జిమ్లో చేరింది. అక్కడ బరువైన బార్బెల్స్, స్క్వాట్స్ వంటివి చేసింది.జీవనశైలిలో మార్పులుతీవ్రమైన డైటింగ్కు బదులుగాచ నిలకడైన అలవాట్లపై దృష్టి పెట్టింది.మానసిక స్థైర్యంఒక్కోసారి వద్దు అనుకునే టైంలో భావోద్వేగంగా బలంగా ఉండటం ఎలాగో తెలుసుకుంది. ఎందుకు ఈ లక్ష్యం అనేది మననం చేసుకుంటూ..నిలకడగా చేస్తుండేది. ఆ తర్వాత సమర్థవంతంగా బరువు తగ్గినా.. ఎక్సెస్ స్కిన్తో కొంచెం ఇబ్బంది పడింది. కానీ ప్రతిపని సునాయాసంగా చేసుకునే సామర్థ్యం పెంపొందించుకోగలిగానని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది. ఇక్కడ అనా కథ ఎందరికో స్ఫూర్తి. ఆమె వెయిట్లాస్ స్టోరీ ఆరోగ్యం అనేది మనస్తత్వంతో గాఢంగా ముడిపడి ఉంటుందనే విషయాన్ని నొక్కి చెబుతోంది. నిరంతర కృషి, మానసిక బలం స్థిరమైన అలవాట్లతో, అత్యంత సవాలుతో కూడిన వెయిట్లాస్ జర్నీ అద్భుతమైన ఫలితాలకు దారితీస్తుంది అనేందుకు అనానే ఉదాహరణ. గమనిక: ఇదికేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Ana Alonso (@ana.fitness.vsg) (చదవండి: సూపర్ స్టార్ రజనీకాంత్ పేరెంటింగ్ టిప్స్..! తండ్రిగా, హీరోగా ఎలా బ్యాలెన్స్ చేశారంటే..) -
వ్యాయామాలు తప్పనిసరా..? చేయాల్సిందేనా..
వ్యాయామం అంటే కేవలం బరువు తగ్గడం కోసం మాత్రమే అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ అది సరికాదు. వ్యాయామం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, టైప్–2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా, వ్యాయామం వల్ల విడుదలయ్యే ఎండార్ఫిన్లు ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తాయి. అందువల్ల బద్ధకించకుండా బాధ్యతగా చేసే పనిగా గుర్తించాలి.ముందుగా ప్లాన్ చేసుకోకపోతే వ్యాయామం అనేది ఎప్పటికీ చేయలేము. పిల్లలు నిద్రలేవక ముందే, లేదంటే వారి మధ్యాహ్నం నిద్ర సమయంలో ఒక 20 నుంచి 30 నిమిషాలు ప్లాన్చేసుకోవాలి. ఉదయాన్నే ‘ఏం బట్టలు వేసుకోవాలి? బాటిల్ ఎక్కడ ఉంది?’ అనే గందరగోళం లేకుండా, ముందు రోజే మీ వర్కవుట్ దుస్తులను, వాటర్ బాటిల్ను సిద్ధం చేసుకోండి. ఇది మీ మెదడుపై నిర్ణయాల భారాన్ని తగ్గిస్తుంది.చిన్నపాటి వర్కవుట్లు చాలు..జిమ్లో గంటల తరబడి గడపాల్సిన అవసరం లేదు. పుష్–అప్స్, స్క్వాట్స్, ప్లాంక్స్ వంటివి ఎక్కడైనా చేయవచ్చు. వారానికి కనీసం 150 నిమిషాల మోస్తరు వ్యాయామం ఉండేలా చూసుకోండి.పిల్లలతో కలిసి..పిల్లల పనులు చేయాలనే సాకుతో చాలామంది వ్యాయామాన్ని వాయిదా వేస్తుంటారు. నిజానికి పిల్లల పనులు కానీ, పిల్లలు కానీ మీ ఫిట్నెస్కు అడ్డంకి కానే కాదు, వారితో కలిసే వ్యాయామం చేయండి. వారితో కలిసి డ్యాన్స్ చేయడం లేదా పార్కులో ఆడుకోవడం ద్వారా వారికి కూడా ఆరోగ్యకరమైన అలవాట్లు అలవడతాయి. చురుకైన తల్లిదండ్రులను చూసి పెరిగే పిల్లలు భవిష్యత్తులో కూడా యాక్టివ్గా ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయిక్రమం తప్పకుండా..ఒక్కోసారి చాలా బిజీగా ఉండవచ్చు. అటువంటప్పుడు కనీసం 10 నిమిషాల స్ట్రెచింగ్ లేదా యోగా చేయండి. అన్నీ చేయాలి లేదా ఏదీ చేయకూడదు అనే ధోరణి కంటే, కొద్దిగానైనా క్రమం తప్పకుండా చేయడం ముఖ్యం.వారానికి రెండుసార్లు..మహిళలకు కార్డియోతో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్ చాలా ముఖ్యం. ఇది ఎముకల సాంద్రతను పెంచుతుంది, కండరాల పటుత్వాన్ని కాపాడుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే గాయాలను నివారించడానికి ఇది అవసరం. వారానికి కనీసం రెండుసార్లు దీనిని ప్రయత్నించండి.(చదవండి: -
తెల్లటివి కంటే గోధుమ రంగు గుడ్లు మంచివా..?
కోడిగుడ్డు ఒక సంపూర్ణ ఆహారం. తక్కువ ధరలో ఎక్కువ ప్రోటీన్ లభించే ఆహారం ఇదే. అయితే, కోడిగుడ్ల వినియోగంపై సమాజంలో ఎన్నో రకాల అ΄ోహలు ఉన్నాయి. అనవసరమైన భయాలను పెట్టుకోకుండా గుడ్లను ఆహారంలో చేర్చుకుందాం.. మెరుగైన ఆరోగ్యాన్ని పొందుదాం. అందుకోసం అపోహలను తొలగించుకుందాం.నమ్మకాలు కోడిగుడ్డులో తెల్లసొన మాత్రమే తినాలి, పచ్చసొనలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానిని వదిలేయాలి.తెల్లటి గుడ్ల కంటే గోధుమ రంగు గుడ్లు ఆరోగ్యానికి మంచివి.గుడ్లు తినడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి, గుండె జబ్బులు వస్తాయి.నిజాలుపచ్చసొనలోనే శరీరానికి అవసరమైన ముఖ్యమైన విటమిన్లు, ఖనిజ లవణాలు నిండి ఉంటాయి. తెల్ల గుడ్లు, గోధుమ రంగు గుడ్లు రెండూ సమానమైన ΄ోషక విలువలను కలిగి ఉంటాయి.గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరగదు పైగా ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి.రోజుకు రెండు కంటే ఎక్కువ గుడ్లు తినడం ఆరోగ్యానికి హానికరం.ఆరోగ్యంగా ఉన్నవారు రెండు కన్నా ఎక్కువ గుడ్లను తిన్నా ఏమీ కాదు. అది వారి ఇష్టం. అంతే! .(చదవండి: జస్ట్ ఆ నాలుగు జీవనశైలి మార్పులతో.. 90 నుంచి 55 కేజీల బరువు!) -
సూపర్ స్టార్ రజనీకాంత్ పేరెంటింగ్ టిప్స్..!
తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. ఐదు దశాబ్దాలకుపైగా సుమారు 170 సినిమాల్లో నటించారు. ఇందులో కేవలం తమిళ సినిమాలు మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం మొదలైన భాషల సినిమాలు ఉన్నాయి. తన నటనతో, స్టైల్తో ఎంతోమంది అభిమానుల మనసుదోచుకున్న ఈయన ఏడు పదులు వయసుదాటినా..అభిమానులను అలరించేలా యంగ్ హీరోల మాదిరిగా స్టెప్పులు వేస్తూ నటిస్తుండటం విశేషం. సినీ పరిశ్రమలో నటుడుగా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకోవడం తోపాటు అటు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేస్తూ మంచి తండ్రిగా మన్నననలను అందుకున్నారు. రజనీకాంత్, భార్య లత దంపతులకు ఐశ్వర్య, సౌందర్య అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన కుమార్తెలు కూడా ఇప్పటికే చిత్ర పరిశ్రమలో దర్శకులుగా, నిర్మాతలుగా కళాకారిణులుగా స్థిరపడ్డారు. ఆయన ఆడిపిల్లలు అనే తారతమ్యం చూపకుండా నచ్చిన రంగంలోకి వచ్చే స్వేచ్ఛను ఇవ్వడమే కాకుండా తండ్రిగా అన్ని విధాలుగా సపోర్టు చేస్తూ..నాన్న అనే పదానికి గొప్ప అర్థం ఇచ్చారాయన. అలాంటి సూపర్స్టార్ నుంచి నేర్చుకోవాల్సిన పేరెంటింగ్ పాఠాలేంటో తెలుసుకుందామా..!పిల్లల వ్యక్తిత్వాన్ని గౌరవించడం..తల్లిదండ్రులు పిల్లల జీవితాన్ని నియంత్రించడానికి బదులుగా సొంత మార్గాన్ని ఎంచుకునేలా కుమార్తెలను ప్రోత్సహించారు రజనీ. ఇక్కడ పిల్లలను ఫలానా చేయమని డైరెక్షన్ ఇవ్వడం లేదా బలవంతం చేయడం వంటివి చేయకూడదు. వారి భావనలు, ఆలోచనలు, వ్యక్తిత్వాన్ని గౌరవించాలి. అందులో ఉండే సాధకబాధలు అర్థమయ్యేలా వివరించాలే తప్ప..నిర్బంధించకూడదు. ఇక్కడ మంచి తండ్రిగా రజనీ తన కుమార్తెల విషయంలో అదే చేశారు. ముఖ్యంగా పిల్లలను అర్థం చేసుకోవాలని నొక్కి చెబుతున్నారు రజనీ. పిల్లలతో సన్నిహితంగా ఉండటం..అతిముఖ్యమైన పేరెంటింగ్ పాఠం పిల్లలతో అత్యంత సాన్నిహిత్యంగా ఉండటం. ఇక్కడ నటుడు రజనీకాంత్ తన కుమార్తెలు, కుటుంబంతో చక్కటిన సత్సంబంధాలను నెరుపుతారు. తల్లిదండ్రులు పిల్లలతో మంచి కమ్యూనికేషన్ ఉంటేనే వాళ్లు తాము అత్యంత సురక్షితంగా ఉన్నామనే భావన ఏర్పడుతుంది. అలాగే తల్లిదండ్రులపై మంచి నమ్మకాన్ని ఏర్పరచుకుంటారు. స్ట్రిక్ట్గా ఉండటం కంటే..పిల్లలతో స్నేహపూర్వకంగా మెలిగే పెంపకమే మంచిదని చెబుతున్నారు మానసిక నిపుణులు.పిల్లల డ్రీమ్స్కి మద్దతివ్వండి..రజనీ కూతుళ్లు ఇద్దరు సినీ రంగాన్నే ఎంచుకున్నారు. చిత్రపరిశ్రమలో తమకంటూ మంచి కెరీర్ని నిర్మించుకున్నారు. రజనీకాంత్ తన పిల్లల కలలకు, ఆశయాలకు మద్దతిచ్చారు. పిల్లల కోసం అన్నీ చేయడం పెంపకం కాదు, కష్ట సమయాల్లో పిల్లలకు అండగా నిలవడం, వారి పక్కన ఉండటమే అసలైన పెంపకం. అంతేగదు పిల్లల కలలకు, ఆశయాలకు మద్దతిచ్చినప్పుడే పిల్లలు స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుగుతారు. ఆధనిక తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పెంపక పాఠం.కుటుంబానికే తొలి ప్రాధాన్యత..అలాగే పేరెంట్స్ తమ తమ ఉద్యోగాల్లో ఎంత బిజీగా ఉన్నా..కుటుంబానికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ సూపర్స్టార్ రజనీ నుంచి నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పేరెంటింగ్ పాఠం ఇది. ఆయన నటుడిగా బిజీగా ఉన్నా..కుటుంబంతో గడిపే సమయానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తానని ఆయనే స్వయంగా పలుమార్లు చెప్పారు కూడా. కుటుంబమే లేకుంటే మనం లేం, అందువల్ల మొదటి ప్రాధాన్యత ఫ్యామిలీకే ఇవ్వండి అప్పుడే ఎందులోనైనా సక్సెస్ అవ్వగలం అని చెబుతున్నారు రజనీ. -
ఫ్లూట్లు అమ్ముకునే వ్యక్తి కథ..!
సంగీతానికి సంబంధించిన పరికరాలు అమ్మే వ్యక్తి..ఇతర పండ్లు, కూరగాయలు అమ్మే విక్రేతగా అరుస్తూ అమ్మడు. మాధుర్యంగా వాయిస్తూ ప్రజల అటెన్షన్ తనపై పడేలా నిశబ్దంగా అమ్ముకుంటాడు. ప్రజలు కూడా ఆ సంగీతానికి పరవశమై కాసేపు జాలీగా, బాధగా చూసి వెళ్లిపోవడమో లేక కుదిరితే కొనడమో చేస్తుంటారు. ఈసారి మాత్రం అలా చెయ్యొద్దు అని చెబుతున్నాడు ప్రభ్జోత్ సంగ్ అనే వ్యక్తి. ఇంతకీ ఏం చేయాలంటే..ఢిల్లీకి చెందిన సూరజ్ అనే ఫ్లూట్లు అమ్మే వ్యక్తి కథను సోషల్ మీడియాలో పంచుకున్నాడు ప్రభ్జోత్ సింగ్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. సూరజ్ అనే ఫ్లూట్ల విక్రేత బెలూన్ల తోపాటు ఆ ఫ్లూట్లను అమ్మే విధానం ముగ్ధమనోహరంగా ఉంటుంది. అతడు ఫ్లూట్ పట్టుకుని వాయిస్తూ ప్రజలందరీ అటెన్షన్ తనపై పడేలా వాయించే విధానం ప్రతి ఒక్కరి మనసుని కదిలిస్తుంది. అంత అద్భుతంగా వేణువుని ఆలపిస్తాడు సూరజ్. అందుకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేస్తూ..అతను వేణువుని వాయిస్తున్నప్పుడు అందంగా కదిలే ఆ బుడగల దృశ్యం ఎవ్వరినైన కట్టిపడేస్తుందని రాసుకొచ్చాడు. అతను ఒకేసారి ప్రదర్శకుడిగా, అమ్మకందారుడిగా రెండు పాత్రలను భలే సమతుల్యం చేస్తున్నాడని మెచ్చుకున్నాడు. అయితే ఆ రెండు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం అతడి కుటుంబ అవసరాలకు ఎంత మాత్రం సరిపడదనేది అందరికీ తెలిసిందే. అయితే మనమంతా అలాంటి వ్యక్తుల ప్రతిభను చూసి ఆశ్చర్యపోతూ..జాలిని వ్యక్తం చేసి వదిలేస్తుంటాం. ఎలాంటి సాయం చేయూత అందించే యోచన చేయమని, తాను కూడా మొదటిసారి అలానే చేశానని చెప్పుకొచ్చాడు ప్రభ్జోత్. అయితే ఈసారి అలా చేయాలనుకోలేదని వివరించాడు. ఈసారి అతడితో కాసేపు ముచ్చటించినట్లు తెలిపాడు. తన తండ్రి వేణువుని వాయించేవాడని, ఇప్పుడు తన కొడుకు కూడా తనలా వాయించేలా నేర్చుకుంటున్నాడని సూరజ్ చెప్పుకొచ్చినట్లు వెల్లడించాడు. ఇక అమ్మేందుకు ఇలా ప్రదర్శన ఇవ్వడం కాకుండా తన టాలెంట్న ప్రదర్శించేందుకు వాయిస్తాడని పోస్టులో రాసుకొచ్చాడు ప్రభ్జోత్. అంతేగాదు ఇతరులను కూడా అలానే చేయమని ప్రోత్సహిస్తున్నాడు కూడా. వీధి సంగీతకారులను చూసి కేవలం విని వదిలేయొద్దు..వారి దగ్గర నుంచి ఫోన్ నెంబర్ తీసుకోండి, మీ ఇంట్లో జరిగే ఫంక్షన్లకో లేదా హౌస్ పార్టీలోనే చక్కగా తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఇవ్వండి, తోచినంత మొత్తం చెల్లించండి. మనం వాళ్లని అమ్మకందారులుగా కాకుండా కళకారులుగా పిలిచి గౌరవిద్దాం అని పిలుపునిస్తున్నా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రభ్జోత్. నిజానికి మనం మొత్తం వ్యవస్థను మార్చలేకపోవచ్చు..ఇలాంటి చిన్న ప్రయత్నాలతో వాళ్ల జీవితంలో వెలుగు రావొచ్చేమో..లేక మార్పు సంతరించుకోవచ్చేమో..! అంటూ పోస్ట్ ముగించాడు. నెటిజన్లు సైతం అతడికి మద్దతిస్తూ..ఆలోచన బాగుంది సార్ అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Prabhjot Singh (@intent.content.form) (చదవండి: NMACC వేడుకలో.. నీతా అంబానీ స్టన్నింగ్ లుక్..!) -
NMACC వేడుకలో.. నీతా అంబానీ స్టన్నింగ్ లుక్..!
కళలు, సంస్కృతికి నిలయమైన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్(NMACC) మూడో వార్షికోత్సవం ఏప్రిల్ 3, 2026న ముంబైలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె ఆరుగజాల మెటాలిక సిల్క్ చీర, దానికి మ్యాచింగ్గా ఆభరణాలను ధరించి రాజసం ఉట్టపడే ఆహార్యంతో కట్టిపడేశారు. ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖ తారలంతా విచ్చేశారు. ముఖ్యంగా షాహిద్ కపూర్, మీరా కపూర్, రణవీర్ సింగ్, సల్మాన్ ఖాన్, సిద్ధార్ధ్ మల్హోత్ర, కియార అద్వానీ తదితర తారాగణం హాజరయ్యారు. ఈ వేడుకలో నీతా అంబానీ రాజసం ఉట్టిపడే పట్టుచీరలో ధగధగ మెరిసిపోయారామె. సాంప్రదాయ భారతీయ హస్తకళకు అద్భుతమైన నిదర్శనంగా నిలిచింది ఆమె ధరించిన చీర. బంగారు, ముదురు ఎరుపు రంగుల ప్రకాశవంతమైన కలయికతో కూడిన చరీపై క్లిష్టమైన జరీ పని అద్భుతంగా ప్రతిబింబిస్తూ..ద్రవరూపంలో ఉన్న మెరుపని సృష్టిస్తోంది. సాంప్రదాయ పైస్లీ నమూనాలతో కూడిన వెడల్పాటి అంచు, చీరకు చక్కటి రూపాన్ని ఇవ్వగా పల్లుపై సూక్ష్మమైన నమూనాలు మరింత హైలెట్గా నిలిచాయి. దానికి మ్యాచింగ్గా మెరూన్ గోల్డ్ రంగులో పొట్టిచేతులతో కూడిన బ్లౌజ్ చీర లుక్ని అమాంతం పెంచేసింది. ఆ పట్టుచీరకు తగ్గట్టుగా ప్రకాశవంతమైన పచ్చులు, కెంపులతో పొదిగిన నెక్లెస్, చేతులకు బంగారు గాజులు, చెవులకు స్టేమెంట్ రింగులతో.. పండుగ వాతావరణాన్ని తలపించే రాయల్ లుక్లో ఆకర్షణీయంగా కనిపించారు నీతా. సాంప్రదాయ మహిళలా మధ్యపాపిడి చక్కటి కొప్పు, తేలికైన మేకప్తో హుందాగా మెరిశారామె. సింపుల్గా చెప్పాలంటే ఆమె మొత్తం రూపంలో సాంస్కృతికత ప్రతిధ్వనించింది. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) (చదవండి: రెండుసార్లు ఉద్యోగం కోల్పోయి, మాృతృత్వం కోసం బ్రేక్ ఇచ్చి..మళ్లీ..!) -
మనం చాక్లెట్ అంటే పడి చావడం లేదు!!
చాక్లెట్ అంటే అందరికీ ఇష్టమే. కానీ ఎంత ఇష్టమన్నదే ఇక్కడపాయింట్. యూరప్, యూఎస్లోచాక్లెట్ అంటే పడి చస్తుంటే.. ఆసియాలో మాత్రం చాక్లెట్ కన్నా.. స్థానిక మిఠాయిలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రపంచంలో జర్మనీ వాసులు అత్యధికంగా చాక్లెట్ను తింటున్నారు. తాజా అధ్యయనం ప్రకారం అక్కడ ఒక్కో వ్యక్తి ఏడాదికి 8.1 కిలోల చాక్లెట్ను తింటున్నాడట. తర్వాతి స్థానంలో స్విట్జర్లాండ్ ఉంది. చివరి స్థానాల్లో భారత్, చైనాలు ఉన్నాయి. ఓసారి ఆ లెక్కలేంటో చూసేద్దామా.. -
రెండుసార్లు ఉద్యోగం కోల్పోయి, మాృతృత్వం కోసం బ్రేక్ ఇచ్చి..మళ్లీ..!
రెండుసార్లు ఉద్యోగం కోల్పోయి..తల్లి అయ్యాక మళ్లీ కెరీర్కి బ్రేక్ ఇస్తే..తిరిగి ఉద్యోగం సంపాదించుకోవడం అంత ఈజీ కాదు. ఉద్యోగం కోల్పోవడంతో కొంత భయం, కాన్ఫిడెన్స్ మాయం అవ్వడం సహజం. అందులోనూ ఓ పక్క తల్లి అవ్వడంతో పెరిగిన బాధ్యతలు నడుమ ఒక విధమైన మానసిక ఒత్తిడి ఎదురవ్వుతుంది. అవన్నీ తట్టుకుని మళ్లీ ఉద్యోగం సంపాదించుకుని తన కాళ్లపై నిలబడాలంటే చాలా ధైర్యం, ఆత్మవిశ్వాసం కావాల్సి ఉంటుంది. ఆ విషయాన్నే ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది 39 ఏళ్ల మహిళ.డాక్టర్ ప్రియా పోర్వాల్ రెండుసార్లు ఉద్యోగాన్ని కోల్పోయి, తల్లి అయ్యాక కొంత కాలం కెరీర్కి విరామ ఇచ్చి..మళ్లీ తన ఉద్యోగ కెరీర్ని నిర్మించుకోవడానికి ఎంతలా పాట్లు పడిందో పంచుకున్నారు. విద్యారంగంలో ప్రారంభమైన తన ఉద్యోగ కెరీర్ ఊహించని మలుపు తీసుకునే ముందు..దశాబ్దానికి పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారామె. ప్రియ తాను 35 ఏళ్ల వయసులో తల్లి అయ్యానని, ఈ మైలు రాయి తన 12 ఏళ్ల కెరీర్కు విరామం ఇచ్చేలా చేసిందని చెప్పారు. అదే సమయంలో ఉద్యోగాన్ని కోల్పోయి చాలా ఏళ్లు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఆ అనుభవం తనను చాలా కలవరపరిచిందని అన్నారు. కోలుకోవడానికి నెలలు పట్టిందని, తన కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లుగా అనిపించిందంటూ ఆ మానసిక క్షోభను గుర్తుచేసుకున్నారు. తిరిగి ఎలాగైన పుంజుకోవాలనే పట్టుదలతో ప్రియా పలు సంస్థలలో విజిటింగ్ ఫ్యాకల్టీ సభ్యురాలిగా అవకాశాలు అన్వేషించారు. ఆ తర్వాత మరో విద్యాసంబంధమైన పదవిని కూడా పొందారు. అయితే అక్కడి వాతావరణం ఆమె అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో మరోసారి అక్కడ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్డీ వంటి అర్హతలు ఉన్నప్పటికీ, తిరిగి ప్రారంభించడం అంత సులభం కాదని తేలింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆమె జీవితంలో ఒక అనూహ్యమైన మలుపు తీసుకుంది. 37 ఏళ్ల వయసులో, ఒక చిన్న బిడ్డను పెంచుతూ, అనిశ్చితిని ఎదుర్కొంటూ..తన కెరీర్పై పూర్తి నియంత్రణ సాధించాలని స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నారామె. తాను తిరిగి కెరీర్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను, అదికూడా తనకు నచ్చిన విధంగా అని చెప్పుకొచ్చింది. ఆర్థిక స్వాతంత్యానికి మించిన చోదకశక్తి మరొకటి లేదని అంటోంది. తన సొంత వ్యాపారాన్ని నిర్మించుకోవడానికి డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టానని, కేవలం డబ్బుకోసం కాదు, వ్యక్తిగత ప్రాముఖ్యత రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ రోజు, ఆ నిర్ణయం ఫలించిందని, గతేడాది తాను డాలర్లలో ఐదు అంకెల జీతం కూడా సంపాదించినట్లు పేర్కొంది. ఇతర మహిళలకు ఆమె ఇచ్చే సందేశం ఏంటంటే.. “ప్రసూతి అనేది వృత్తికి ముగింపు కాదు.” అని నొక్కి చెబుతోంది. (చదవండి: వివాహిత మహిళలు గూగుల్లో ఏం సర్చ్ చేస్తున్నారో తెలుసా..!) -
ఆంతరంగిక ప్రశాంతత
ఆధ్యాత్మికత (Spirituality) అంటే కేవలం పూజలు, పునస్కారాలు అనుకుంటారు. కానీ సైకాలజీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోణంలో స్పిరిచువాలిటీ అంటే—మీ అంతరంగంతో మీరు కనెక్ట్ అవ్వడం. బయట ప్రపంచంలో మీరు ఎంత సక్సెస్ సాధించినా, లోపల ప్రశాంతత లేకపోతే ఆ వ్యక్తిత్వం వెలిగిపోదు. ఆంతరంగిక ప్రశాంతత మీ పర్సనాలిటీని ఎలా ఒక 'స్థితప్రజ్ఞుడి'లా మారుస్తుందో ఈ ఆర్టికల్లో చూద్దాం.పర్సనాలిటీ అనేది ప్రపంచం చూసే 'బయటి కవచం' అయితే, స్పిరిచువాలిటీ అనేది ఆ కవచం లోపల వెలిగే 'దీపం'. ఆధ్యాత్మికత ఉన్న వ్యక్తి పర్సనాలిటీలో ఒక రకమైన నిలకడ (Stability), కరుణ (Compassion), స్పష్టత (Clarity) ఉంటాయి. ఇది మిమ్మల్ని కేవలం ఒక 'సక్సెస్ఫుల్ మ్యాన్' నుండి ఒక 'వైజ్ మ్యాన్' (Wise Man) గా మారుస్తుంది.అంతర్గత నియంత్రణ (Locus of Control)స్పిరిచువల్ పర్సనాలిటీ ఉన్నవారికి తమ సంతోషం కోసం బయటి వ్యక్తుల మీద లేదా పరిస్థితుల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ‘‘నా ప్రశాంతత నా చేతుల్లోనే ఉంది. ఎవరో నన్ను విమర్శించినా, నా ప్లాన్ ఫెయిల్ అయినా నా 'కోర్' (Core) కదలదు’’ అనుకుంటారు. దీన్నే Internal Locus అంటారు. దీనివల్ల మీరు ఒత్తిడిలో కూడా అద్భుతంగా పనిచేయగలరు. మీ పర్సనాలిటీకి ఇది ఒక 'బుల్లెట్ ప్రూఫ్' కవచంలా పనిచేస్తుంది.Ego vs SoulEgo-Driven Personality: "నేను గెలవాలి, నేను అందరికంటే గొప్పగా కనిపించాలి" అనుకుంటారు. ఇది ఎప్పుడూ భయం మరియు అసూయతో నిండి ఉంటుంది.Soul-Driven Personality: "నేను నా ధర్మాన్ని (Purpose) నెరవేర్చాలి, అందరికీ మేలు చేయాలి" అనుకుంటారు. ఇందులో ప్రశాంతత మరియు నిస్వార్థం ఉంటాయి.ఎప్పుడైతే మీ పర్సనాలిటీ ఈగో నుండి సోల్ వైపు ప్రయాణిస్తుందో, మీ కరిష్మా వెయ్యి రెట్లు పెరుగుతుంది. మనుషులు మిమ్మల్ని చూసి గౌరవించడం కాదు, మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందుతారు.మోటివేషన్ మాయ vs ఆంతరంగిక ప్రశాంతతమోటివేషన్ "బయట గెలువు, ప్రపంచాన్ని జయించు" అని మిమ్మల్ని నిరంతరం ఉరుకులు పెట్టిస్తుంది. ఇది మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది (Burnout).స్పిరిచువాలిటీ (Mindfulness)... "లోపల ప్రశాంతంగా ఉండు, అప్పుడు ప్రపంచం నీ వెనుక వస్తుంది" అని చెప్తుంది. ఇది మీకు 'శాశ్వతమైన శక్తిని' (Enduring Power) ఇస్తుంది.ఆంతరంగిక ప్రశాంతతను ఎలా సాధించాలి?Step 1: Break External Validation"నలుగురు ఏమనుకుంటారు?" అనే ఆలోచనను 'Break' చేయండి. మీ విలువలకు విరుద్ధంగా ఏ పని చేయకండి. మీ మనస్సాక్షికి మీరు సమాధానం చెప్పుకోగలిగితే, అదే అతిపెద్ద ప్రశాంతత. పాత మొహమాటాలను వదిలేయండి.Step 2: Build Solitudeప్రతిరోజూ కనీసం 20 నిమిషాలు మీతో మీరు గడపడం 'Build' చేయండి. అది మెడిటేషన్ కావచ్చు, లేదా ఒక డైరీ రాయడం కావచ్చు. మీ లోపల జరుగుతున్న సంభాషణను గమనించండి. మీ అంతరాత్మ చెప్పే మాటలను వినడం మొదలుపెడితే, మీ నిర్ణయాల్లో తప్పులు జరగవు.Step 3: Universal Compassionమీ ప్రశాంతత కేవలం మీకే పరిమితం కాకుండా, మీ చుట్టూ ఉన్నవారికి కూడా అందాలి. ఒక చిన్న చిరునవ్వుతో, ఒక ఓదార్పు మాటతో మీరు ఇతరుల జీవితాల్లో వెలుగు నింపాలి. మీరు ఒక 'ప్రేరణ'గా (Inspiration) మారడమే 'Beyond' స్టేజ్.మీ లోపల ఏముంది?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి:1. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీకు భయం వేస్తోందా లేక ప్రశాంతంగా అనిపిస్తోందా?2. మీ సంతోషం వేరే ఎవరి చేతుల్లోనైనా ఉందా?3. మీరు చేసే పని వల్ల మీ ఆత్మ తృప్తి పొందుతోందా?ప్రశాంతతే అసలైన సంపద!ప్రపంచాన్ని గెలిచి మిమ్మల్ని మీరు ఓడిపోతే అది విజయం కాదు. మిమ్మల్ని మీరు గెలిచి ప్రపంచానికి సేవ చేస్తేనే అది పరిపూర్ణమైన వ్యక్తిత్వం. ఆంతరంగిక ప్రశాంతత ఉన్న వ్యక్తి యుద్ధ భూమిలో కూడా ప్రశాంతంగా ఉండగలడు. అదే 'జీనియస్' లక్షణం."Peace comes from within. Do not seek it without."Gowthama Buddha సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: లక్ష్యంతో మారే పర్సనాలిటీ!) -
రుతుక్రమం వైకల్యం కాదు
కర్ణాటక ప్రభుత్వం మహిళల కోసం ప్రకటించిన బహిష్టు సెలవుల ఉత్తర్వు చట్టపరమైన చర్చకు దారితీసింది. దీనిని సవాలు చేస్తూ 15 మంది మహిళా వృత్తి నిపుణులు హైకోర్టు మెట్లెక్కారు. రుతుక్రమ సెలవును ‘కపట వివక్షగా’ అభివర్ణించారు. ఇది బంగారు పంజరం లాంటిదని.. పైకి మహిళల మేలు కోసమే అన్నట్లుగా కనిపించినా.. ఇలాంటివి వారి కెరీర్ని దెబ్బతీస్తాయని వారు వాదించారు. మూసధోరణులకు ముగింపు పలకాలన్నారు.ఉత్తర్వు ఏం చెబుతుంది?కర్ణాటక ప్రభుత్వం బహిష్టు సెలవు విధానాన్ని నవంబర్ 2025లో ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా ప్రవేశపెట్టారు. ఇది మహిళా ఉద్యోగులకు నెలకు ఒక రోజు వేతనంతో కూడిన సెలవును తప్పనిసరి చేస్తుంది. అంటే ఏడాదికి 12 రోజులు. ఈ ఉత్తర్వు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగాలకూ వర్తిస్తుంది. అంటే ఐటీ సంస్థలు, దుకాణాలు, ఇతర సంస్థలలో పనిచేసే 18 నుంచి 52 ఏళ్ల మధ్య వయసులో ఉన్న అవసరం గల ప్రతి మహిళా సెలవు తీసుకోవచ్చు. దీనికి మెడికల్ సర్టిఫికేట్ అవసరం లేదు. అయితే ఉపయోగించని సెలవులను తదుపరి నెలకు బదిలీ చేయడం సాధ్యపడదు.మూసధోరణుల్ని ప్రోత్సహించడమేప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ‘బహిష్టు సెలవు’పై ప్రశ్నిస్తూ ఉన్నత హోదాల్లో ఉన్న 15 మంది మహిళలు పిటిషన్ దాఖలు చేశారు. ఇది మృదువైన వివక్షకు నిదర్శనమన్నారు. సమానత్వాన్ని పెం పొందించడానికి బదులుగా, ఈ విధానం దానికి విరుద్ధమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి సెలవులను తప్పనిసరి చేయడం వల్ల నియామక ప్రక్రియలలో అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకోవచ్చని, యజమానులు మహిళలను పురుషుల కంటే తక్కువ సామర్థ్యం కలవారిగా చూసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ చర్య ఆనాటి మూస పద్ధతులను బలపరిచే ప్రమాదం ఉందని, వారి ఎదుగుదలను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సెలవు మహిళలను బలహీనులుగా చిత్రీకరిస్తుందని, తద్వారా సమానత్వ చట్టాల అసలు ఉద్దేశ్యాన్ని ఇది దెబ్బతీస్తుందని వారు వాదించారు. ‘‘ఈ పోటీ ప్రపంచంలో మహిళలు ప్రత్యేక రాయితీలు, నిర్బంధ సెలవులు కోరుకోవడం లేదు, కేవలం సమాన అవకాశాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు కోరుతున్నారు. రుతు క్రమాన్ని ఒక వైకల్యంగా మార్చడం తమ వృత్తిపరమైన ఎదుగుదలకు ఆటంకం’’ అని ఈ మహిళల వాదన.పని ప్రదేశాల్లో ఈ రకమైన వివక్షను గుర్తించడం కష్టం, ఎందుకంటే ఇది ప్రేమ, మర్యాద రూపంలో వస్తుంది. ఈ బంగారు పంజరం నుంచి బయటపడాలంటే, మహిళలను కేవలం రక్షించాల్సిన వ్యక్తులుగా కాకుండా, సమాన సామర్థ్యం గల భాగస్వాములుగా గుర్తించడం నేటి పోటీ ప్రపంచంలో ఎంతో అవసరం. -
సోలో లైఫ్.. సోషల్ మీడియా
ఉదయం లేస్తూనే సోషల్మీడియా వాకిట్లో పక్షుల్లా వాలిపోతుంటారు. రీల్స్, రివైవల్, కబుర్లు, మెసేజ్లు, ఫొటోలు, వీడియోలు.. వయసు తేడా లేకుండా ఆన్లైన్ వేదికగానే ఎన్నో విశేషాలను పంచుకుంటూ, పెంచుకుంటూ ఉంటారు. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా డంప్ అయ్యే ఎన్నో మానసిక సమస్యలనూ నెత్తిన మోస్తున్నారు. ‘ప్రపంచం అంతా ‘పర్ఫెక్ట్’గా ఉందన్న భ్రమతో తమను తాను హింసించుకునేవారి శాతం ఇటీవల పెరుగుతోంది..’ అంటున్నారు నిపుణులు.వైజాగ్ వాసి పదిహేడేళ్ల అనన్య భోజనం తినడం తగ్గించడం మొదలుపెట్టింది. ఈ సమస్య ఎంతగా అంటే ఒకరోజు ఆమెను బలవంతంగా హాస్పిటల్లో చేర్చి, సెలైన్ పెట్టించాల్సి వచ్చింది. సోషల్ మీడియా ప్రభావంతో ఆమె తన శరీరం గురించి ఎక్కువగా ఆలోచిస్తుండేది. తినమని తల్లి ఒత్తిడి చేస్తే ‘లైక్స్ రావడం లేదంటే అర్థం, నేను బాగా లేనట్టేగా..’ అని గట్టిగట్టిగా అరుస్తోంది.. అని అనన్య తల్లి ఆవేదన చెందుతోంది.. ∙∙ ఉద్యోగంలో బిజీగా ఉండే మాధవి రిలాక్స్ కావడానికి సోషల్మీడియా ఒక మార్గంగా మారింది. మొదట్లో ఫ్రెండ్స్తో కనెక్ట్ అవడానికి ఆ తర్వాత ఫొటోలు షేర్ చేసేది. ఆ పోస్టులకు లైక్స్, కామెంట్స్ పెరుగుతుండటంతో తరచు చెక్ చేసుకోవడం ఒక అలవాటుగా మారింది. ఒకట్రెండుసార్లు ఆమె పెట్టిన ఫొటోకు తక్కువ లైక్స్ రావడంతో నిరాశ మొదలైంది. ‘అందరూ నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు, ఎందుకో’ అనుకోవడం మొదలుపెట్టింది. ఇతరుల ఫొటోలు చూసి, తనను తాను పోల్చుకుంటుంది. ‘వారితో పోల్చితే, అంత అందంగా లేను. అందుకే లైక్స్ రావడం లేదు’ అనే భావన పెరిగింది. పనిమీద దృష్టి తగ్గింది. దీంతో ఆందోళన పెరగడం, ఆత్మవిశ్వాసం తగ్గడం వంటి సమస్యలు మొదలయ్యాయి. కనిపించని ఒత్తిడులుఇప్పటికాలంలో సోషల్ మీడియా మహిళల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. కానీ అదే సమయంలో ఇది మానసిక ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపిస్తోంది. బయటికి కనిపించేది ఫొటోలు, వీడియోలు, లైక్స్, కామెంట్స్ మాత్రమే. కానీ అంతరంగంలో జరిగే మానసిక ఒత్తిడి వేరుగా ఉంటోంది. అందం, ఆనందం, ఆర్థిక విషయాలు, తన చుట్టూ ఏమీ బాగోలేదనే ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.ప్రధాన సమస్యలుఇతరులతో పోల్చుకోవడం. ఇతరులు అందంగా, ఆనందంగా ఉన్న ఫొటోలు, రీల్స్.. చూసి వారి జీవితం వడ్డించిన విస్తరి అనే భావనకు లోనవుతున్నారు. అదే సమయంలో తమ జీవితం ఎంత నిస్సారంగా ఉందో అంచనా వేసుకుంటున్నారు. దీంతో మిగతావారికంటే తమ జీవితం చాలా తక్కువ అనే భావనకు లోనవుతున్నారు. → ఫొటోలు, వీడియోలకు వాడే ఫిల్టర్లు, ఎడిటింగ్, ఏఐ.. వంటి వాటి వల్ల అంచనాలు పెరుగుతున్నాయి. నిజానిజాలు అర్ధం చేసుకోలేకపోతున్నారు.→ తమపై తమకు ఆత్మవిశ్వాసం లోపిస్తోంది. కుటుంబంపైనా ఈ ప్రభావం పడుతోంది.→ లైక్స్, కామెంట్స్ ద్వారా ఆనందం పొందడం అలవాటై, తక్కువ రెస్పాన్స్ వస్తే ‘బాధ’కు లోనవుతున్నారు. → ట్రోలింగ్, నెగటివ్ కామెంట్స్ వల్ల డిప్రెషన్, భయాందోళనకు లోనవుతున్నారు. → ఇతరుల ఆనందం చూసి ‘నేను ఏదో మిస్ అవుతున్నాను’ అనుకుంటున్నారు. → అతి ఎక్కువగా స్క్రీన్ టైమ్లో గడపడం వల్ల మానసిక అలసటకు లోనవుతున్నారు. → సోషల్ మీడియా అంటే రెండువైపులా పదును ఉన్న కత్తి లాంటిది. సరైన విధంగా వాడితే సమాచారం, ప్రపంచంతో కనెక్టివిటీ ఇస్తుంది. కానీ నియంత్రణ లేకుండా వాడితే మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.నియంత్రణ తప్పనిసరి→ రోజుకు ఒక పరిమితి పెట్టుకోవాలి.→ సోషల్ మీడియాలో కనిపించేది పూర్తి నిజం కాదని గుర్తుంచుకోవాలి.→ వారానికి ఒక రోజు సోషల్ మీడియా నుంచి పూర్తి బ్రేక్ తీసుకోవడం మంచిది.→ ప్రేరణ, ఉత్సాహం, అవగాహన కలిగించే కంటెంట్ను ఫాలో అవడం మంచిది. → మన విలువలను లైక్స్తో కాకుండా మనసుతో కొలవాలి. కుటుంబం, స్నేహితులతో రోజువారీ అంశాలపై చర్చ, మాట్లాడం.. వంటివి చేస్తుంటే సోషల్ మీడియా ఒత్తిడి నుంచి దూరం అవ్వచ్చు. సోషల్ మీడియా అనేది ఒక వర్చువల్ ప్రపంచం. అక్కడ మనం చూస్తున్నది పూర్తినిజం కాదు. కానీ, మన మెదడు దాన్ని నిజం అనేలా స్వీకరిస్తుంది. అదే సమస్యకు మూలం అవుతుంది. పాజిటివ్గా వచ్చే లైక్స్, కామెంట్స్ వల్ల మన బ్రెయిన్లో డోపమైన్ అనే ‘ఫీల్గుడ్’ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దీంతో ఇది ఒక అలవాటుగా మారుతుంది. ఫోన్ను పదే పదే చెక్ చేయడం, సోషల్ మీడియా లేకపోతే అసహనం, నిద్రలేమి, పనిమీద దృష్టి తగ్గడం.. వంటి సమస్యలన్నీ తలెత్తుతాయి. రోజులో కొంత సమయమే సోషల్ మీడియా ఉపయోగించడం, అభి రుచులు, వ్యాయామం, కుటుంబంతో సరైన టైమ్ గడపడం వంటివాటి వైపు మనసును మళ్లించగలిగితే సరైన జీవన ఆనందాన్ని పొందగలరు. సమస్యను నియంత్రించుకోలేకపోతే నిపుణులను సంప్రదించి, వారి సూచనలు పాటించడం మేలు చేస్తుంది.– పి.జ్యోతిరాజ, సైకాలజిస్ట్ -
మరో చరిత్రకోసం...
‘మానవులుగా మనం గీసుకునే గీతలు, సరిహద్దు రేఖలు అన్నీ మనం సృష్టించుకున్నవే. వాటికి ఎలాంటి అస్తిత్వం లేదు’ అనే క్రిస్టినా కోచ్ శాస్త్రీయ విషయ సంపన్నురాలే కాదు, సామాజిక స్పృహ మూర్తీభవించిన మహిళ. చంద్రుడిని చుట్టి రావడానికి, ‘ఆర్టెమిస్–2’ మిషన్లో భాగంగా నింగిలోకి దూసుకెళ్లిన నలుగురు వ్యోమగాములలో ఆమె ఒకరు. అంతరిక్షంలో సుదీర్ఘకాలం గడిపిన మహిళగా గతంలో రికార్డ్ సృష్టించిన కోచ్ తాజాగా... చంద్రుడి కక్ష్యలో ప్రయాణించనున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించనున్నారు.మిచిగాన్ (అమెరికా)లోని గ్రాండ్ రాపిడ్స్లో జన్మించి, నార్త్ కరోలినాలోని జాక్సన్విల్లేలో పెరిగిన క్రిస్టినా కోచ్ నార్త్ కరోలినా యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీలు చేశారు. ఆమెకు నాసా మిషన్లు కొత్తేమీ కాదు. 2013లో తొలిసారిగా నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు.రికార్డ్ సృష్టించి...2019లో అంతరిక్షంలో 328 రోజుల పాటు సుదీర్ఘకాలం గడిపిన మహిళగా రికార్డ్ సృష్టించారు కోచ్. అక్టోబర్ 2019లో జెస్సికా మీర్తో కలిసి ఆల్ ఫిమేల్ స్పేస్ వాక్లో కూడా కోచ్ పాల్గొన్నారు. అల్ఫా మాగ్నెటిక్ స్పెక్ట్రోమీటర్ అప్గ్రేడ్ కోసం రోబోటిక్స్ చేయడం, ఫార్మాస్యూటికల్ పరిశోధన కోసం ప్రోటీన్ క్రిస్టల్స్ పెంచడం, సూక్ష్మ గురుత్వాకర్షణలో 3డీ బయోలాజిక్ ప్రింటర్లను పరీక్షించడం... మొదలైనవి ఆమె చేపట్టిన శాస్త్రీయ పరిశోధనలు.అంటార్కిటికాలో...‘ఆర్టెమిస్–2’ మిషన్కు ఎంపిక కావడానికి ముందు ‘నాసా’ ఆస్ట్రోనాట్ ఆఫీస్లో అసైన్డ్ క్రూ బ్రాంచ్కు చీఫ్గా... నాసా జాన్సన్ స్పేస్ సెంటర్లో సెంటర్ డైరెక్టర్కు టెక్నికల్ ఇంటిగ్రేషన్ అసిస్టెంట్గా పనిచేశారు కోచ్. ఇంజినీరింగ్ నేపథ్యం ఉన్న కోచ్ అంటార్కిటికాలోని స్కాట్ సౌత్ పోల్ స్టేషన్, పామర్ స్టేషన్లలో అగ్నిమాపక, శోధన, రక్షణ బృందాలలో పనిచేశారు.అంతరిక్ష యోగా!‘మనసు ఉండాలేగానీ మార్గం ఉంటుంది’ అని చెబుతారు పెద్దలు. క్రిస్టినా కోచ్కు యోగా చేయడం అంటే ఇష్టం. మరి అంతరిక్షంలో అది సాధ్యపడుతుందా?‘యస్’ అంటున్నారు కోచ్. తన గత అంతరిక్ష యాత్రలో యోగా ప్రముఖ పాత్ర పోషించిందని చెబుతుంటారు కోచ్. ‘నేను ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు చాలాసార్లు యోగా చేశాను. అక్కడ యోగా చేయడం చాలా కష్టం అనుకుంటారు. కాని అది నిజం కాదు. కొన్ని ఆసనాలు చేయడం కష్టంగా అనిపించినప్పటికీ అక్కడ యోగా చేయడం చాలా సరదాగా ఉంటుంది. యోగా అనేది అద్భుతమైనది.మైక్రో గ్రావిటీ (బరువు లేని స్థితి) లో కూడా అన్వేషించడానికి అనేక రకాల ఆసనాలు ఉంటాయి. అంతరిక్షంలో సాధన చేసినా, భూమిపై చేసినా యోగా ఎప్పటికీ యోగానే. అది అంతరిక్షం అయినా సరే, అన్వేషణ మన నుంచి దూరం కాదు. అన్వేషణ అనేది ఎందుకు మానవ సహజమో మనకు అక్కడ అర్థమవుతుంది. అన్వేషణ అనేది మన డీఎన్ఏలోనే ఉంది. మనం ఇష్టపడే వాటిని కొత్త వాతావరణానికి అనుగుణంగా మార్చుకోవడం మనం సహజంగా చేసే పని’ అంటారు క్రిస్టినా కోచ్. శాస్త్ర ప్రపంచానికి ఆవల కోచ్కు సర్ఫింగ్, ఐస్ క్లైంబింగ్, రాక్ క్లైంబింగ్, సామాజిక సేవ అంటే ఇష్టం.రికార్డ్లు బద్దలు కావాల్సిందే!→ మీరు ఇప్పటికే సుదీర్ఘమైన అంతరిక్ష యాత్రకు సంబంధించిన రికార్డ్ను బద్దలు కొట్టారు. మరో రికార్డ్ను కూడా సృష్టించడానికి రెడీ కావడం ఉలా ఉంది?క్రిస్టినా కోచ్: నేను రికార్డ్లు, వ్యక్తిగత విజయాల గురించి ఆలోచించను. మరొకరికి స్ఫూర్తినివ్వడం గురించి, అత్యాధునిక సాంకేతికతకు సంబంధించిన విషయాలను ప్రజలకు తెలియజేయడం గురించి ఆలోచిస్తాను. ఇక రికార్డ్ల విషయానికొస్తే... మీరు ఎక్కడికి వెళ్లారు? అంతరిక్షంలో ఎన్ని రోజులు గడిపారు... అనేది ముఖ్యం కాదు. ఆ సమయంలో మీరు ఏం చేశారు అనేది ముఖ్యం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నా లక్ష్యం ఎప్పుడూ అదే. రికార్డ్లు వీలైనంత త్వరగా బద్దలు కావాలనేది నా కోరిక. రికార్డ్లు బద్దలు కావడం అంటే దాని అర్థం మనం నిరంతరం విస్తరిస్తున్నామని!→ శాస్త్రీయ అన్వేషణకు సంబంధించి నాసా వైఖరి?కోచ్: ఒక శాస్త్రీయ అన్వేషణకు మనం స్పందించి, మానవాళి మొత్తానికి ప్రాతినిధ్యం వహించడం ముఖ్యమని నాసా చాలాకాలం క్రితమే నిర్ణయం తీసుకుంది. ఇది సంతోషకరమైన విషయం. వ్యోమగాముల బృందం మానవాళి మొత్తానికి ప్రతినిధిగా ఉంది. అన్వేషణకు సంబంధిన ఆసక్తి, ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరూ వ్యోమగాముల బృందంలో భాగమయ్యేలా చేసుకోవడమే విజయానికి అత్యత్తమ మార్గం.→ అంతరిక్ష అనుభూతి గురించి...కోచ్: అంతరిక్షం నుంచి వెనక్కి తిరిగి భూమిని చూడడం అనేది అద్భుత అవకాశం. అనంతమైన విశ్వంలో భూమి ఎలా కనిపిస్తుందో చూడడం అనేది జీవితంలో ఎన్నో అనుభవాల కంటే అతి ముఖ్యమైనది. వాతావరణానికి సంబంధించి పలుచని నీలి గీతను చూడడం ద్వారా మన మధ్య తేడాల కంటే పోలికలే ఎక్కువగా ఉన్నాయని, మనమందరం సంతోషంగా జీవించడానికి ఒకే విధానంపై ఆధారపడుతున్నామని, మానవులుగా మనం గీసుకునే గీతలు, సరిహద్దు రేఖలు, విభజనలు అన్నీ మనం సృష్టించుకున్నవే అని, నిజానికి వాటికి ఎలాంటి అస్థిత్వం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. -
మనసును తాకే స్టోరీ..! తాత జ్ఞాపకాల కోసం..
రాజస్థాన్లోని సింధారి జిల్లాలోని కర్దాలి గ్రామంలో... యాభై ఏళ్ల నాటి పూరి గుడిసె పునాది బలహీన పడడంతో కూలిపోయే ప్రమాదంలో పడింది. ఈ గుడిసె పూర్ణారామ్ అనే వ్యక్తి తాతది. పూర్ణరామ్కు అది పాత గుడిసె కాదు. ఒక అమూల్యమైన జ్ఞాపకం. ఆ జ్ఞాపకాన్ని కాపాడుకోవాలనుకున్నాడు పూర్ణారామ్. హైడ్రాలిక్ క్రేన్ సహాయంతో గుడిసెను వేరే చోటికి తరలించాడు. చెదల వల్ల గుడిసె పునాది దెబ్బతిందని, అందుకే దాన్ని తరలించాల్సి వచ్చిందని పూర్ణారామ్ వివరించాడు. గుడిసె పై కప్పు మరమ్మతు చేస్తే అది 30 నుండి 40 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉంటుందని అతను భావిస్తున్నాడు.‘లక్ష రూపాయల విలువ కూడా లేని ఈ పాత గుడిసె కోసం ఇంత శ్రమ ఎందుకు?’ అనే ప్రశ్నకు పూర్ణారామ్ ఇచ్చిన జవాబు...‘నా దృష్టిలో అది కోట్లాది రూపాయల కంటే విలువైన గుడిసె. ఈ గుడిసె చుట్టూ ఎన్నో విలువైన జ్ఞాపకాలు ఉన్నాయి’. View this post on Instagram A post shared by Social Mela (@social_mela) (చదవండి: వివాహిత మహిళలు గూగుల్లో ఏం సర్చ్ చేస్తున్నారో తెలుసా..!) -
వివాహిత మహిళలు గూగుల్లో ఏం సర్చ్ చేస్తున్నారో తెలుసా..!
పెళ్లికి ముందు వరకు అమ్మాయిల లైఫ్ చదువులు, కాలేజ్ లైఫ్ తదనంతర ఉద్యోగం వంటివాటితో హాయిగా తుళ్లుతూ సాగిపోతుంది జీవితం. పెద్దగా ట్రబుల్స్ ఏమి ఉండవు. తల్లిదండ్రుల వద్ద గారాభంగా, ముద్దుగా ఏ చీకు చింత లేకుండా గడిపేస్తారు. పెళ్లి అనే రెండే అక్షరాల బంధంలోకి ఎప్పుడైతే అడుగుపెడతారో అప్పుడే బాధ్యతలు, బరువు ఒకేసారి మీద పడినట్లుగా ఉంటుంది జీవితం. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి అనే వాటిపై అటెన్షన్ ఎక్కువై ఒకటే ఆత్రం, ఆందోళన వెంటాడుతూ ఉంటాయి. దాంతో పెళ్లి తర్వాత అమ్మాయిలంతా గూగుల్ని అవే ఎక్కువ అడుగుతున్నారట. వాళ్లంతా చిటికెలో దొరికే పరిష్కారాల కోసం గూగుల్ని అడుగుతున్న విచిత్రమైన ప్రశ్నలేంటంటే..1. చాలా మంది మహిళలు వివాహం తర్వాత తమ భర్తలను సంతోషంగా ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. పర్యవసానంగా, వారు తమ భర్త ఇష్టాయిష్టాలను అర్థం చేసుకోవడం ఎలా?, ఏం చేయకూడదు, ఎలా తీసుకోకూడదు వంటి వాటిని సర్చ్ చేస్తున్నారట. ముఖ్యంగా తమ భర్త సంతోషం కోసం రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారట.2. వివాహిత మహిళలల్లో సర్వసాధారణంగా కనిపించే ఒక ప్రశ్న, తమ భర్త మనసును గెలుచుకోవడం ఎలా అనేది. భర్త సంతోషంగా ఉంటేనే కదా మనల్ని సంతోషంగా ఉంచుతాడనే నమ్మకంతో దానికోసం చిట్కాల కోసం వెతుకుతారట. .3. తమ భర్తలను విధేయులుగా ఎలా మార్చుకోవాలి అనేదాని గురించి కూడా ఎక్కవగా సర్చ్ చేస్తున్నారట. కొంతమంది మహిళలు తమ భర్తలు తమ మాట వినడాన్ని ఇష్టపడతారు. అందుకే దీనిపై గూగుల్ని ఎక్కువగా సలహాలు కోరుతున్నారట.4 కొత్తగా పెళ్లైన వారిలో పిల్లలను కనడానికి సరైన సమయం గురించిన ప్రశ్నలు కూడా వస్తుండటం విశేషం. ఈ విషయంలో స్పష్టమైన మార్గదర్శకత్వం లేకపోవడంతో, చాలా మంది మహిళలు జాగ్రత్తగా, ప్రణాళికతో మాతృత్వాన్ని స్వీకరించాలనే ఉద్దేశ్యంతో గూగుల్ని ఆశ్రయిస్తున్నారట.5. కొత్త కుటుంబంలో ఎలా సర్దుకుపోవాలనే ఆందోళన ఎక్కువగా ఉంటుంది. దాంతో చాలామంది కొత్త వధువులు కొత్త ఇంట్లో తమ సంబంధాలను ఎలా నిర్వహించుకోవాలిని కుటుంబసభ్యులతో సముచితంగా ఎలా మెలగాలి వంటి సలహాలు కూడా అడుగుతున్నారట.6. వివాహంతో వచ్చే బాధ్యతలు అధిక భారాన్ని మోపవచ్చు. మహిళలు తరచుగా ఈ కొత్త విధులను నిర్వహించడానికి వ్యూహాల కోసం వెతుకుతున్నారట. ఎందుకంటే అప్పటి వరకు తల్లిదండ్రుల వద్ద హాయిగా సాగిన జీవితాల్లోకి ఒక్కసారిగా వచ్చిపడిన బాధ్యత భారం ఎలా నిర్వహించాలనే ఆందోళన ఎక్కువగా ఉంటుందట మహిళల్లో. 7. కొందరైతే ఫ్యామిలీ లైప్, వృత్తి జీవితాన్ని ఎలా సమతుల్యం చేసుకోవాలనే దానిపై ఆందోళన చెందుతున్నారట. వృత్తిపరమైన ఆశయాలకు కుటుంబ జీవితం ఆటంకంగా మారకూడదనే ఆందోళన నేపథ్యంలో దీనిపై ఎక్కువగా గూగుల్లో సర్చ్ చేస్తున్నారట. చెప్పాలంటే మహిళలు సమర్థవంతమైన సమయ నిర్వహణతో రెండింటిని ఎలా బ్యాలెన్స్ చెయ్యొచ్చు అని సలహాలు అడుగుతుండటం విశేషం. (చదవండి: జస్ట్ ఆ నాలుగు జీవనశైలి మార్పులతో.. 90 నుంచి 55 కేజీల బరువు!) -
సక్సెస్కి చిరునామా అతడు..!
‘హాయిగా గడిచిపోతుంది కదా...రిస్క్ ఎందుకు!’ అనుకునే వాళ్లకు రిస్క్తోపాటు సక్సెస్ కూడా దూరంగానే ఉంటుంది! ‘సక్సెస్ దక్కాలంటే రిస్క్ చేయాల్సిందే’ అనుకునేవాళ్లే విజేతలవుతారు. రోహిత్ రేజి కొన్ని స్టార్టప్లలో ఉద్యోగాలు చేశాడు. ‘నేనే ఒక స్టార్టప్ ఎందుకు మొదలు పెట్టకూడదు’ అనే ఆలోచనతో నియోక్రెడ్ టెక్నాలజీస్ మొదలు పెట్టి అద్భుత విజయం సాధించాడు... బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేలా చూసే సాంకేతికతను, సమస్యల పరిష్కారాలను ‘నియోక్రెడ్ టెక్నాలజీస్’ రూపొందించింది. ఇది బి2బి2సి స్టార్టప్. నియోక్రెడ్ అనేది డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో పనిచేసే సంస్థ. మన దేశంలోని అగ్రశేణి బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలు, రేజర్పే, పేటీఎం వంటి ఫిన్టెక్లు ‘నియోక్రెడ్’ కస్టమర్లు.అసలైన సామర్థ్యం అదే!‘ఏఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ నుండి బీకామ్ పూర్తి చేసిన తరువాత ‘ఎక్స్పెడైట్’ అనే స్టార్టప్లో నాలుగు సంవత్సరాలు పనిచేశాడు రోహిత్. ‘లార్సెన్ అండ్ టర్బో (ఎల్ అండ్ టి)’లో కొంతకాలం పనిచేసిన తరువాత టెడ్ఎక్స్ టాక్ షోలను నిర్వహించడానికి ఉద్యోగాన్ని వదులుకున్నాడు. ఆ తరువాత బెంగళూరులో ‘ఎంఎస్ఎస్’ పేమెంట్స్ అనే స్టార్టప్లో చేరాడు. అక్కడ పనిచేస్తున్న సమయంలోనే సొంత స్టార్టప్ గురించి ఆలోచించాడు.‘ఓపెన్ బ్యాంకింగ్ రంగంలో పరిష్కారాలను రూపొందించడంలోనే అసలైన సామర్థ్యం ఉందని గ్రహించాను’ అంటున్న రోహిత్ ఆ సమస్యల పరిష్కార వేదికగా ‘నియోక్రెడ్ టెక్నాలజీస్’కు శ్రీకారం చుట్టాడు. ఓపెన్ బ్యాంకింగ్ అనేది సురక్షితమైన ఏపీఐలను ఉపయోగించే ఒక వ్యవస్థ. దీనిద్వారా అధీకృత థర్డ్–పార్టీ ప్రొవైడర్లు(ఫిన్టెక్ల వంటివి) కస్టమర్ల బ్యాంక్ డేటాను వారి అంగీకారంతో యాక్సెస్ చేస్తాయి.నమ్మకం ప్లస్ గుర్తింపుయెస్ బ్యాంక్తో కలిసి 2018–19లలో ప్రీపెయిడ్ కార్డులను ప్రారంభించింది నియోక్రెడ్. కోవిడ్ కల్లోల కాలం తరువాత ‘రూపే ఆన్ ది గో’ అనే పైలట్ భాగస్వామ్య కార్యక్రమంలో భాగంగా ఎన్పీసీఐ(నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్స్ ఆఫ్ ఇండియా)తో కలిసి సహ–భాగస్వామ్యం కుదుర్చుకుంది. ‘ఇది మాకు నమ్మకాన్ని, గుర్తింపు రెండిటినీ ఇచ్చింది’ అంటాడు రోహిత్. కొన్ని సంవత్సరాల క్రితం రోహిత్ స్టార్టప్కు విరెంక్సియా, ఏంజెల్ ఇన్వెస్టర్ రాజేష్ జైన్ నుంచి ఎనిమిది కోట్ల సీడ్ ఫండింగ్ వచ్చింది. ప్రొడక్ట్స్లైన్స్ నియోక్రెడ్కు మూడు ఉత్పత్తి శ్రేణులు(ప్రొడక్ట్ లైన్స్) ఉన్నాయి. ఐడెంటీ మెనేజ్మెంట్ (ప్రొఫైల్ ఎక్స్), ప్రైవసీ(బ్లూటిక్), పేమెంట్స్ (కలెక్ట్ బాట్)‘నియోక్రెడ్’ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నంలో ఉన్నాడు రోహిత్ రెజి,‘ఇతర దేశాలలో ఐడెంటిటీ ప్రొఫైలింగ్, ప్రైవసీ, పేమెంట్స్ ఫ్లాట్ఫామ్లను నిర్మించాలనుకుంటున్నాం. మౌలిక సదుపాయాలకు సంబంధించి స్థానిక అవసరాలు తీర్చాలనుకుంటున్నాం’ అంటున్నాడు రోహిత్. దీనికి సంబంధించి సింగపూర్, దుబాయ్లోని పార్టీలతో ప్రాథమిక చర్చలు జరుపుతున్నాడు. ‘నియోక్రెడ్’లో ప్రస్తుతం 140 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరిలో సగం మంది టెక్ నిపుణులు. ‘తమ లక్ష్యం గురించి నిరంతరాయంగా కష్టపడడం, నిబద్ధత నియోక్రెడ్ విజయానికి కారణం’ అంటున్నారు ‘అల్వారెజ్ అండ్ మార్సల్’ గ్లోబల్ ట్రాన్సాక్షన్ అడ్వైజరీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ భావిక్ హతి. సక్సెస్ అనేది కంఫర్ట్ జోన్ నుంచి రాదు. సవాళ్లను అధిగమించే శక్తి నుంచి వస్తుంది.'– రోహిత్ రెజి(చదవండి: 14 ఏళ్లకే స్కూల్ డ్రాపౌట్..కానీ ఆ ఆవిష్కరణ..!) -
జస్ట్ ఆ నాలుగు జీవనశైలి మార్పులతో.. 90 నుంచి 55 కేజీల బరువు!
వెయిట్లాస్ అనగానే కఠినమైన ఆహారాలు, ఇష్టమైన ఫుడ్ని వదులుకోవడం, తీవ్రమైన వ్యాయామాలు గంటలు తరబడి చేయడం అని భావిస్తుంటారు చాలామంది. కానీ అవేమి కానేకాదు అని కొందరు అనుభవ పూర్వకంగా తెలుసుకోవడమే గాక, చాలా సింపుల్ లైఫ్స్టైల్స్తో కిలోల కొద్ది బరువు తగ్గి ఇతరులకు ప్రేరణగా నిలుస్తుంటారు. అలాంటి కోవకు చెందిందే ఈ ముంబైకి చెందిన ఇన్ఫ్లుయెన్సర్. ఇంతకీ ఆమె బరువు తగ్గడం కోసం ఎలాంటి మార్పులు జోడించిందంటే..కంటెంట్ క్రియేటర్ మల్లికా ఫతేపురియా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా సరికొత్త వెయిట్లాస్ జర్నీని పంచుకున్నారు. ఒకప్పుడు తాను 90 కిలోల బరువు ఉండేదాన్ని అని , ప్రస్తుతం 55 కిలోలకు చేరి సుమారు 35 కేజీ బరువు తగ్గానని చెప్పుకొచ్చారు. అయితే తన వెయిట్లాస్ జర్నీలో ఏం చేసింది అనేదానికంటే..ఏం మానేశాను, వేటికి దూరంగా ఉన్నాను అనేదే ఎక్కువగా ఉంటుందని అంటోందామె.బరువు తగ్గడం కోసం..డైట్లు చేయడం:తాను కఠినమైన డైట్లు పాటించిన ప్రతిసారీ కొంత బరువు తగ్గినట్లు తగ్గి..మళ్ళీ యథావిధి బరువుకి వచ్చేసేదాన్ని అని కంటెంట్ క్రియేటర్ పంచుకున్నారు. బరువు తగ్గడాన్ని ఒక స్వల్పకాలిక లక్ష్యంగా చూడటం మానేసి, తాను పాటించగలిగే అలవాట్లపై దృష్టి పెట్టడంతో ఆమె జీవితంలో అనూహ్య మలుపు వచ్చింది.కార్బోహైడ్రేట్లను తగ్గించడంరొట్టె, అన్నం, లేదా పాస్తా వంటి ఆహారాలను పూర్తిగా మానేయడానికి బదులుగా, తక్కువ మొత్తంలో తీసుకునేలా కేర్ తీసుకున్నానని అంటోంది. ఆమె ప్రకారం, అసలు సమస్య ఈ ఆహారాలు కాదని.. సమతుల్యంగా తినడంలోనే సమస్య అంతా ఉందని అంటున్నారు.విసుగు పుట్టించే భోజనాన్ని బలవంతంగా తినడం..కఠినమైన ఆహార డైట్లు శిక్షలా మారాక..బరువు తగ్గడం కంటే..సమస్యే అధికంగా మారే అవకాశాలే ఎక్కువని అంటోంది. అందుకే ఆస్వాదించకలిగేలా భోజనాన్ని ఆరోగ్యమైన విధంగా తీసుకుంటే..ఏదో కోల్పోయానన్న భావన దరిచేరదు. హెల్దీగా, ఆనందంగా బరువు తగ్గుతాం అని అంటోంది.అతిగా వ్యాయామం చేయడంతీవ్రమైన రోజువారీ వ్యాయామాలు అవసరమని తాను భావించేదాన్ని అని మల్లిక చెప్పారు. కానీ కాలక్రమేణా, నడవడం, శక్తి శిక్షణ, క్రమం తప్పకుండా చురుకుగా ఉండటం వంటి సాధారణ విషయాలు చాలా బాగా పనిచేస్తాయని గ్రహించానని అంటున్నారామె. అంతేగాదు బరువు తగ్గడం అంటే మంచి ఆహారాన్ని వదులుకోవడం లేదా మిమ్మల్ని బాధకు గురిచేసుకోవడం వంటివి కానేకాదు అని అంటోంది. నిలకడతో సమతుల్యానికి పీటవేస్తే చాలు బరువు తగ్గడం సులభం అని అంటోంది మల్లికా.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Mallika Fatehpuria (@mallikafatehpuria) (చదవండి: 14 ఏళ్లకే స్కూల్ డ్రాపౌట్..కానీ ఆ ఆవిష్కరణ..!) -
14 ఏళ్లకే స్కూల్ డ్రాపౌట్..కానీ ఆ ఆవిష్కరణ..!
అవసరం, ఆకలి బాధ ఆ యువకుడని ఆవిష్కరణ బాట పట్టేలా చేసింది. అతడిలోని టాలెంట్ని వెలికితెచ్చేలా చేసి..జీవితానికి మార్గం చూపింది. అంతేగాదు ఎప్పుడో వదిలేసిన చదువు వైపుకి వెళ్లేలా చేసి..ఆకాశమంత ఎత్తుకు ఎదిగేలే అభ్యున్నతిని సాధించేందుకు దారితీసింది. తన జీవితంలోకి వచ్చిన ఆ వెలుగుని పదిమందికి పంచి తనలాంటి వాళ్ల అభ్యున్నతికి పాటుపడుతూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు.అతడే కమ్క్వాంబా. దక్షిణాఫ్రికా మలావిలోని మసితాలా అనే గ్రామీణ గ్రామంలో పెరిగాడు క్వాంబా. అతని కుటుంబాని మొక్కజొన్న పంటే ఆధారం. 2001లో కరువు, భారీ వర్షాలు దీనికి తోడు ప్రభుత్వం ధాన్యం నిల్వలు అమ్మేయడంతో ఏర్పడిన తీవ్రమైన ఆహార సంక్షోభం కారణంగా కరువు సంభవించింది. దాంతో అతడి కుటుంబం స్కూల్ ఫీజులు భరించలేక అతడిని పాఠశాలకు పంపించడం మానుకుంది. అయితే ఒకరోజు తన గ్రామ గ్రంథాలయంలో 'యూజింగ్ ఎనర్జీ' అనే పుస్తకాన్ని అరువుతెచ్చుకుని మరి తన చదవుని కొనసాగించే ప్రయత్నం చేశాడు. అందులోని గాలిమర అతడిని తెగ ఆకర్షిస్తుంది. అయితే ఆ పుస్తకం పూర్తిగా ఆంగ్లంలో ఉంది. అతనికి ఇంగ్లీష్ అంత బాగా రాదు. అయితే అందులోని బొమ్మలు అతడికి మార్గాన్ని చూపాయి. దాంతో అతడు పనికిరాని లోహపు ముక్కలు, ట్రాక్టర్ భాగాలు, సైకిల్ ముక్కలు, ప్లాస్టిక్ వస్తువులు, చెట్లకొమ్మలతో 16 అడుగుల గాలిమరను రూపొందించాడు. అయితే పనిచేస్తుందా లేదా అనే సందేహంతో భయపడతాడు. కానీ అనుహ్యంగా ఆ యంత్రం పనిచేస్తుంది. పైగా అది అతడి ఆకలి జీవితాన్ని మార్చేసింది. ఆ గాలిమర అతన కుటుంబంలో నాలుగు లైట్లు, రెండు రేడియోలకు విద్యుత్ అందించింది. త్వరలోనే పొరుగువారు ఫోన్లను ఛార్జ్ చేసుకునేందుకు వచ్చేవారు. అలా ఆ ఒక్క ఆవిష్కరణ కామ్క్వాంబాను స్థానికంగా, జాతీయంగా వేలాదిమందికి సుపరిచితమైన వ్యక్తిగా మార్చింది. అతడి కథ వార్తపత్రికల నుంచి ఆన్లైన్లో వ్యాపించి..చివరికి టెడ్ దృష్టిని ఆకర్షించింది. ఆ విధంగా అతనికి TEDGlobalకు ఫెలోషిప్ ఆహ్వానం అందింది. అక్కడ క్వాంబ్ తన ఆవిష్కరణ గురించి, నీటి పారుదల కోసం గాలిమరను నిర్మించాలనే తన ఆకాంక్ష తిరిగి చదువుకోవాలనే చిరుఆశ గురించి మాట్లాడాడు.అలా అతడు నిర్మించిన యంత్రం అతడి చదువుకి వారధిగా మారి..దక్షిణాఫ్రికాలోని ఆఫ్రికన్ లీడర్షిప్ అకాడమీలో చేరి చదువుకునే అవకాశం దక్కేలా చేసింది. ఆ తర్వాత 2014లో డార్ట్మౌత్ కాలేజీ నుంచి పర్యావరణ అధ్యయనాల డిగ్రీ పట్టాను పొందాడు. క్వాంబా ఆవిష్కరణలు అక్కడితో ఆగలేదు..తన గ్రామంలో విద్యుత్తుని ఉత్పత్తి చేయడానికి, నీటిని తోడటానికి ఇతర గాలిమరలను కూడా నిర్మించాడు. 2008లో, అతను 'మూవింగ్ విండ్మిల్స్ ప్రాజెక్ట్'ను సహ-స్థాపించాడు. ఈ ప్రాజెక్ట్ మసిటాలా ప్రాంత నివాసితులతో కలిసి స్వచ్ఛమైన నీటి బావులు, పాఠశాలలు, కమ్యూనిటీ సెంటర్ల కోసం సౌర ఫలకాలు, రోజువారీ వ్యవసాయ సమస్యలకు సరళమైన పరిష్కారాలపై పనిచేస్తుంది. ఆ ఒక్క ఆవిష్కరణ మౌలిక సదుపాయల దిశగా నడిపించింది క్వాంబాని. తన ఇంటికే కాదు మొత్తం సమాజానికే ఉపయోగపడేలా సామాజిక సేవలో భాగమవుతున్నాడు. ఓ పేద బాలుడు..అతడి ఆకలి, అవసరాలు ఆవిష్కరణ దిశగా అడుగులు వేసి..ఎన్నో గొప్ప పనులు చేసేలా శ్రీకారం చుట్టింది. చిన్న చిన్న అవరోధాలు, సమస్యలకు బాధపడిపోయే యువత..క్వాంబా కథ గొప్ప ప్రేరణ. ఏం రాదు, నావల్ల కాదు అనుకుంటూ కాలక్షేపం చేయకూడదు..అందుబాటులో ఉన్నవే గొప్పవిగా..అవే మనకు గమ్యాన్ని చూపే ఆయుధాలుగా మార్చుకోవాలని క్వాంబా కథ చెబుతోంది కదూ..!.(చదవండి: రైజింగ్ కాన్షియస్ డాటర్స్’ ..! ప్లీజ్ కూతుళ్లను ఇలా పెంచుదాం..) -
’రైజింగ్ కాన్షియస్ డాటర్స్’ ..! ప్లీజ్ కూతుళ్లను..
‘ఆ అమ్మాయి ఎంత నల్లగా ఉందో..’‘అమ్మో, ఆమె బరువుకు ఆ స్టేజ్ విరిగిపోతుందేమో..!’‘ఆ ముక్కు ఎంత వంకరో ...’‘ఎత్తు పళ్లు..’ ‘చీమ కళ్లు..’ఇలా సూదుల్లా మనసును గాయపరిచే మాటలకు ఆత్మన్యూనతతో కుంగిపోతూ... ‘శరీరాన్ని సరిచేసుకోవాలి’ అనే మనస్తత్వాన్ని పెంచుకుంటున్నారు అమ్మాయిలు. ఈ క్రమంలో కెరియర్ వైపు కాకుండా రూపం కోసం తమ సమయాన్ని, డబ్బును ఖర్చు చేస్తున్నారు. ‘శారీరక సౌందర్యం మనల్ని పరిపూర్ణ వ్యక్తులను చేయదు. మన శరీరం ఓ వస్తువు కాదు, సరిచేసుకోవడానికి’ అంటున్నారు మనస్తత్వ నిపుణులు.‘బాడీ షేమింగ్’ అనేది రూపానికి సంబంధించినది మాత్రమే కాదు. తరతరాలుగా మన సమాజంలో పాతుకుపోయిన ఒక లోతైన సమస్య. కొందరు ఎదుటివారి శారీరక లోపాలను ఎగతాళి చేస్తే, మరికొందరు తమ శరీర లోపాలకు తమను తామే తిట్టుకుంటుంటారు. కాలేజీకి వెళ్లాల్సిన స్నేహ రెడీ అవడానికి ఈ మధ్య అద్దం ముందు నిలబడటం లేదు. ఫొటోలకు దూరంగా ఉంటోంది. గ్రూప్లో ఉన్నా, తనకి తాను కనిపించనట్టు వెనకే ఉంటోంది. ఒక రోజు క్లాస్లో సబ్జెక్ట్పై ప్రెజెంటేషన్ ఉంది. ఆమె దానికి ప్రిపేర్ అయ్యి వచ్చింది. కానీ స్టేజ్ మీదకు వెళ్లే ముందు, వెనుక నుండి ఎవరో ‘స్టేజ్ బ్రేక్ అవుతుందేమో?’ అనే జోక్కి కొంతమంది నవ్వారు. మరికొంతమంది నవ్వు ఆపుకున్నారు. అంతే, స్టేజీ ఎక్కకుండానే వచ్చి తన సీటులో కూర్చొంది. ఆ రోజు తర్వాత ఆమె మాట్లాడటం తగ్గించింది. స్నేహితులతో కలవడం లేదు. ఇంట్లో కూడా ఓ మూలన ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్టు కూర్చుంటుంది. తల్లిదండ్రులు ఎంత అడిగినా.. ‘ఏమీ లేదని’ దాటేస్తోంది.∙∙ 2025లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇండియన్ సైకాలజీ రీసెర్చ్ ప్రకారం, బాడీ షేమింగ్ అనుభవం జెండర్ పరంగా చూస్తే భిన్నంగా ఉంది. మైసూరులో 10–19 ఏళ్ల మధ్య 155 మంది యువతులపై చేసిన అధ్యయనంలో, అమ్మాయిలలో 23.2 శాతం మంది బాడీ షేమింగ్ సమస్య అనుభవిస్తున్నారని చెప్పారు. అబ్బాయిలలో ఈ సమస్య 7.1 శాతం మాత్రంగానే ఉంది.మనసుపై ఒక నిశ్శబ్ద దాడిబాడీషేమింగ్ ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. మైండ్లో బ్లాక్ స్పాట్స్ ఏర్పడి, మానసిక వికాసానికి అడ్డంకి అవుతాయి.ఆందోళన పెరిగి, మనో నిగ్రహంపైన ప్రభావం చూపుతుంది.డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయి. తాను ‘దేనికీ సరికాదు’ అనే భావన పెరుగుతుంది.శరీరాన్ని కరెక్ట్ చేసుకోవాలనే ఆలోచనతో ‘జిమ్కి వెళ్ళాలి, కాస్మటాలజీ చికిత్స చేయించుకోవాలి, మందులు వాడాలి, పోషకాహారం తినాలి...’ ఇలా వీటిమీద ఫోకస్ పెరుగుతుంది. దీంతో బ్యూటీ సెంటర్స్కు నెలకు రూ.40 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చుపెడుతున్నవారున్నారు. స్లిమ్మింగ్ సెంటర్స్వైపు మొగ్గుచూపుతున్నారు. మధ్య, దిగువ తరగతికి ఇది పెను భారం అవుతోంది. కలర్ ట్రీట్మెంట్స్ ఇటీవల బాగా పెరుగుతున్నాయి. బ్యూటీ మెయింటెనెన్స్ విషయంలో అమ్మాయిలు ఇంట్లో వాళ్లమీద ఒత్తిడి పెంచుతున్నారు. బ్యూటీ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ కుటుంబ స్థితిగతులపైనా ప్రభావం చూపుతుంది. కెరియర్ పరంగా ఎదగాలనుకునేవారు బాడీషేమింగ్ వల్ల శరీరంపై దృష్టిపెట్టి, తమపైన తాము ఒత్తిడిని పెంచుకుంటున్నారు. ఏం చేయాలంటే...డిజిటల్ ఫ్లాట్ఫారమ్లలో శరీరాకృతిని విమర్శించడం సైబర్ బుల్లియింగ్కు సంబంధించినదే. ఆన్లైన్–ఆఫ్లైన్ లో శరీరాకృతిని విమర్శించే వారిని ఎదుర్కోవడానికి, వారు కలిగించే బాధను, వేదనను అధిగమించడానికి, ఆత్మగౌరవాన్ని తిరిగి పొందడానికి మార్గాలు ఉన్నాయి. ప్రతిభను అణచివేయడానికి అసూయ వల్ల ఇలా ‘బాడీషేమింగ్’కు పాల్పడుతున్నారని గ్రహించాలి. ఆహారాన్ని తగ్గించడం వల్ల పోషకాలు మైండ్కు చేరకపోవచ్చు. అందుకని సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. కరుణ, సహనం .. వంటివి అలవర్చుకోవడానికి సాధన చేయాలి. శారీరక సౌందర్యం కంటే, ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇతరులు ఎగతాళి చేసే రూపం కంటే తమలో తమకు నచ్చిన విషయాల పట్ల దృష్టి పెట్టాలి. ఒక రోజు స్నేహ అద్దం ముందు నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటుండగా తల్లి చూసి అడిగింది. బాడీషేమింగ్ విషయం చెబుతూ ‘నా త΄ప్పా?!’ అని అడిగింది. ‘అలా అన్నవారి ఆలోచనలే తప్పు’ అని కూతురిని దగ్గరకు తీసుకుంది. విమర్శలను కాదని, తన శరీరాన్ని తాను అంగీకరించడం నేర్చుకుంది.తప్పక ఛేదించాల్సిందే!మన కూతుళ్లు తమ శరీరానికి సంబంధించి అన్ని విధాలుగా పరిపూర్ణంగా ఉండాలనే ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ గాయాలు ఒక రోజులో అనుకోకుండా అయినవి కావు. మనం ఈ బాధాకరమైన సాంస్కృతిక వారసత్వాన్ని తప్పక ఛేదించాల్సిందే. ఈ కాన్సెప్ట్ ఆధారంగానే ’రైజింగ్ కాన్షియస్ డాటర్స్’ వర్క్షాప్ నిర్వహిస్తున్నాను. ఇందులో అమ్మాయిలు తమ బాల్యం నుండి ఎదుర్కోవాల్సిన అవసరం లేనివి, స్వేచ్ఛగా పెరగడానికి అవసరమైన సాధనాలను అందిస్తుంటాను. మనందరం కలిసి మానసిక ఒత్తిడి లేని ఒక కొత్త తరాన్ని పెంచుదాం. – డాక్టర్ షెఫాలీ సబేరీ, క్లినికల్ సైకాలజిస్ట్ పాజిటివ్గా మార్చుకోవాలికొందరి ఇండ్లలో తల్లిదండ్రులు, కజిన్స్, బంధువులు.. కూడా శారీరక లోపాలతో పిలిచేవారుంటారు. ఈ పద్ధతిని మార్చుకోవాలి. ఆత్మవిశ్వాసం లేనివారే ఎదుటివారి మనస్తత్వాన్ని దెబ్బతీస్తారనే విషయాన్ని ‘బాడీషేమింగ్’ అనుభవించేవాళ్లు అర్థం చేసుకోవాలి. మనసులో వచ్చే నెగటివ్ ఆలోచనలను గుర్తించి తమను తాము మార్చుకోవడం చాలా ముఖ్యం. మన శరీరం గురించి మనమే మంచి మాటలు చెప్పుకుంటే అది ఒక థెరపీలా పనిచేస్తుంది. పోలికల నుంచి దూరంగా ఉండాలి. వ్యక్తిత్వం, టాలెంట్ ముందు మిగతా వన్నీ చిన్నవే అని గ్రహించాలి.– డాక్టర్ సునీతా ప్రసాద్, సైకాలజిస్ట్ – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి(చదవండి: ఒంటరితనం తెచ్చిపెడుతున్న ముప్పు..! నివేదికలో షాకింగ్ విషయాలు) -
లక్ష్యంతో మారే పర్సనాలిటీ!
చాలామందికి 'గోల్' (Goal) కి 'పర్పస్' (Purpose) కి తేడా తెలియదు. గోల్ అనేది మీరు 'ఏమి' సాధించాలనుకుంటున్నారు అనేది చెబితే, పర్పస్ అనేది మీరు అది 'ఎందుకు' సాధించాలనుకుంటున్నారు అని చెబుతుంది. ఒక బలమైన ఉద్దేశ్యం (Purpose) ఉంటే, మీ పర్సనాలిటీ ఒక సామాన్యుడిలా ఉండదు.. అది ఒక 'మిషన్' లా మారుతుంది. సైకాలజీలో దీనిని'Sense of Purpose'అంటారు.విక్టర్ ఫ్రాంక్ల్ (Viktor Frankl) అనే సైకాలజిస్ట్, నాజీ కాన్సెంట్రేషన్ క్యాంపుల్లో మరణానికి దగ్గరగా ఉండి కూడా బ్రతికి బయటపడ్డారు. ఆయన కనిపెట్టిన సత్యం ఏంటంటే..."ఎవరి జీవితానికైతే ఒక అర్థంఉంటుందో, వారు ఎలాంటి కష్టాన్నైనా భరించగలరు."మీ పర్సనాలిటీని ఒక అయస్కాంతంలా మార్చే శక్తి ఈ 'పర్పస్'కు ఉంది.పర్పస్ ఉంటే మీలో వచ్చే మార్పులు (Psychological Shifts): ఒక ఉద్దేశ్యం ఉన్న వ్యక్తి పర్సనాలిటీలో ఈ మూడు స్పష్టంగా కనిపిస్తాయి.Laser Focus: మీకు పర్పస్ ఉన్నప్పుడు, అనవసరమైన పనులు, గాసిప్స్, డిస్ట్రాక్షన్స్ మీకు చిన్నవిగా కనిపిస్తాయి. మీ సమయం దేనికి ఖర్చు చేయాలో మీకు స్పష్టత ఉంటుంది.Resilience: సమస్యలు వచ్చినప్పుడుపర్పస్ లేనివాడు కుంగిపోతాడు. కానీ పర్పస్ ఉన్నవాడు "ఇది నా ప్రయాణంలో ఒక భాగం మాత్రమే" అని మరింత బలంగా లేస్తాడు.Gravitas: మీ మాటల్లో, నడకలో ఒక రకమైన 'బరువు' వస్తుంది. మీరు ఏదో సాధించడానికి పుట్టారు అనే నమ్మకం ఎదుటివారికి మీ ప్రెజెన్స్ ద్వారానే అర్థమవుతుంది.గోల్ vs పర్పస్: తేడా ఏంటి?గోల్ అనేది ఒక మైలురాయి అయితే, పర్పస్ అనేది ఒక దిక్సూచి (Compass). "నేను ఒక కోటి రూపాయలు సంపాదించాలి" లేదా "నేను ఈ పదవిని అందుకోవాలి"అనే గోల్ ఇది సాధించగానే ఆగిపోతుంది. కానీ "నేను నా జ్ఞానంతో ఒక లక్ష మంది జీవితాలను మార్చాలి" అనే పర్పస్ నిరంతరం సాగుతుంది.మోటివేషన్ మాయ vs పర్పస్ డ్రివెన్ పవర్మోటివేషన్ బయట నుండి వచ్చే 'కిక్'. వీడియో చూస్తే వస్తుంది, కాసేపయ్యాక పోతుంది. పర్పస్ లోపల నుండి వచ్చే 'జ్వాల'. ఎవరూ మిమ్మల్ని ప్రోత్సహించకపోయినా, పరిస్థితులు బాగోకపోయినా ఇది మిమ్మల్ని నిద్రపోనివ్వదు.మీ పర్పస్ ని ఎలా కనుక్కోవాలి?పర్పస్ ఫుల్ పర్సనాలిటీగా మారడానికి మూడంచెలు... Step 1: Break Selfish Thoughtsకేవలం "నాకు ఏం వస్తుంది?" అనే చిన్న ఆలోచనను 'Break' చేయండి. పర్పస్ ఎప్పుడూ మీకంటే పెద్దదై ఉండాలి. మీరు సమాజానికి లేదా మీ వృత్తికి ఏ Valueఇస్తున్నారో ఆలోచించండి.Step 2: Build Ikigaiమీకు ఇష్టమైనది, మీరు చేయగలిగేది, ప్రపంచానికి అవసరమైనది—ఈ మూడూ కలిసే చోటే మీ పర్పస్ ఉంటుంది. దాన్ని ప్రతిరోజూ మీ పనుల్లో 'Build' చేయండి. మీ పర్సనాలిటీ మీ పర్పస్ కి ప్రతిరూపం కావాలి.Step 3: Legacy Building మీ పర్పస్ ని ఒక సిస్టమ్ గా మార్చండి. మీరు లేకపోయినా ఆ ఉద్దేశ్యం కొనసాగాలి. మీరు చనిపోయిన తర్వాత కూడా మీ పర్పస్ ద్వారా మనుషులు ప్రభావితం అవ్వడమే 'Beyond' స్టేజ్.మీ 'ఎందుకు' (Why) ఏంటి?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి:1. రేపు పొద్దున్నే మీరు బెడ్ మీద నుండి ఎందుకు లేవాలి? దానికి డబ్బులు కాకుండా వేరే బలమైన కారణం ఉందా?2. మీ జీవితంలో మీరు సాధించే విజయం వల్ల మీ కుటుంబం కాకుండా మరో పదిమందికి ఏమైనా లాభం ఉందా?3. మీరు చేస్తున్న పనిలో మీకు 'సార్థకత' (Fulfillment) కనిపిస్తోందా?పర్పస్ ఉంటే మీరు అజేయులు!పర్పస్ లేని జీవితం చుక్కాని లేని పడవ లాంటిది. అలలు ఎటు తీసుకెళ్తే అటు వెళ్తుంది. కానీ ఒక పర్పస్ ఉంటే, మీరు సముద్రాన్నే శాసిస్తారు. మీ వ్యక్తిత్వం ఒక వెలుగు కిరణంలా మారుతుంది."The two most important days in your life are the day you are born and the day you find out why."Mark Twain సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com (చదవండి: మీ గరిష్ట సామర్థ్యాన్ని అందుకోవడం ఎలా?) -
అవధులు లేని దేవుని ప్రేమ
ఒక నీతిమంతుని మరణం నశించిపోయే మానవ జాతికి శుభం చేకూర్చింది. మరణానికి వారసులైన నరజాతికి యేసుక్రీస్తు రూపంలో గొప్ప విమోచకుడ్ని అందించింది. పాపపరిహారార్థ బలిగా, సజీవ యాగంగా దేవాదిదేవుడే సిలువపై తన విలువైన పరిశుద్ధ రక్తాన్ని ధారవోశాడు. మానవుల పట్ల తన అపార ప్రేమను తన బలి అర్పణ ద్వారా చాటుకున్నాడు.ఈ లోకంలో జన్మించిన ప్రతి వ్యక్తికి చివరికి రెండు తేదీలే మిగిలి పోతాయి. ఒకటి పుట్టుక రెండవది మరణ తేదీ. పుట్టిన ప్రతి మనిషి మరణించాల్సిందే. అందులో ఎవ్వరికీ మినహాయింపు లేదు. ప్రపంచ అధినేత అయినా సరే, మారుమూల గ్రామంలో పుట్టిన సామాన్యుడైనా చావు ముందు తల వంచాల్సిందే. మరణం ముందు ఓడి పోవాల్సిందే. అందుకే మనిషికి చావంటే చచ్చేంత భయం. కొంతమంది బతకడానికి కావలసినంత ధైర్యం లేక చావును ఆశ్రయిస్తారు. అదీ శాశ్వత పరిష్కారం కాదు. ఎందుకంటే మనకథ మరణంతో ఆగి పోదు. మనం చేసిన పాపాలకు ఆ తర్వాత రెండో మరణం కాచుకోని ఉంటుంది. మరణాన్ని తలపించే నిత్య నరకం. ఆ నరకం నుంచి తప్పించేందుకు తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపి మన పాపాలకు విమోచన క్రయధనముగా అర్పించాడు.పాపపరిహారార్థ బలిగా క్రీస్తు తన స్వరూపంలో తన పోలిక చొప్పున దేవుని చేత సృజించబడ్డ ఆదిమానవుడైన ఆదాము, అతని భార్యకు తమ ఇష్టం చొప్పున బతికే అవకాశం ఇచ్చాడు. దీన్ని ఆసరాగా తీసుకొని ఈ లోక అధిపతిగా పిలవబడ్డ దుష్టుడైన సాతాను వారిద్దరినీ మోసం చేసి దేవుని ఆజ్ఞను మీరేలా చేశాడు. పాపం చేసిన వారిద్దరూ పాపం ద్వారా వచ్చే జీతం మరణాన్ని కొని తెచ్చుకున్నారు. వారిలో ఉన్న ఆ పాపపు బీజం ఆ తర్వాత ప్రతి మనిషిలో కొనసాగుతూ వచ్చింది. ఆ పాపాన్ని తీసివేసుకోడానికి మనిషి చేయని ప్రయత్నం లేదు. ప్రధానంగా జంతువుల రక్తం బలి ఇవ్వడం ద్వారా దేవుని ప్రసన్నం చేసుకోవాలని చూసాడు. అయినా నరునిలో వున్న పాపబీజం అతని వెంటాడుతూనే ఉంది. పలు బలి అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు పాపము నుండి మానవులను వేరుచేయవని గ్రహించిన దేవుడు తన కుమారుని ఈ భూమిపైకి పంపి అతని బలి అర్పణ ద్వారా, పరిశుద్ధ రక్తాన్ని చిందించడం ద్వారా సమస్త మానవులకు ఆ పాపపు శాపాన్ని విడిపించి తిరిగి దేవునితో మొదటి మానవుడి ద్వారా విడిపోయిన ఆ సంబంధాన్ని పునరుద్ధరింప జేశాడు. అందుకు నీతిమంతుడైన యేసు అప్పటి రోమా పాలకులు, తన స్వజనమైన యూదా ప్రజల ద్వారా ఘోరమైన శ్రమలు సిలువ ద్వారా అనుభవించాల్సివచ్చింది. మానవుల పాపం కోసం పాపంగా చేయబడ్డాడు. సమస్త మానవ కోటి పాపభారాన్ని, శాపాన్ని తనపై మోశాడు. శిలువపై తన పవిత్ర రక్తాన్ని చిందించాడు.క్రీస్తు ప్రశస్తమైన మాటలుశిలువ మరణానికి ముందు క్రీస్తు యేసు భూమ్మీద పలికిన ప్రతి మాట జీవపు ఊటై అప్పుడు ఇప్పుడూ ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తూనే ఉంది. భూమి గతించినా నా మాటలు మాత్రం నిత్యం నిలిచి ఉంటాయని క్రీస్తు చె΄్పాడు. క్రీస్తు మరణ సమయంలో సిలువ మీద పలికిన 7 మాటలు ఈ శుభ శుక్రవారం ప్రపంచంలోని క్రైస్తవ విశ్వాసులందరూ ధ్యానిస్తారు. వాటిలో ముఖ్యంగా తనను క్రూరంగా హింసిస్తున్న సైనికులను, హేళన చేస్తున్న యూదా మతాధికారులు, ప్రజలను చూసి తండ్రీ వీరేమీ చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని కోరాడు. మానవుల పట్ల మితిలేని ప్రేమగల దేవుడు కాబట్టే ఇట్టి క్షమాపణగుణం కనబరిచాడు. కుడిచేతి వైపు సిలువ వేయబడిన దొంగ యేసును గమనిస్తూ ఆయన నిజమైన పాపుల రక్షకుడు, దేవుడని గ్రహించి యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొనవా అని అర్థించినప్పుడు నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని అభయం ఇచ్చాడు. నిజంగా ఒకడు పరలోకం చేరాలంటే దేవుని నమ్మి రక్షణ పొంది బాప్తీస్మం తీసుకోవాలి. కానీ ఇదేమీ లేకుండా ఒక బందిపోటు దొంగకు అతని విశ్వాసం చొప్పున నేరుగా పరలోకం అనుగ్రహించాడు. రోదిస్తున్న తల్లిని చూచి తన ప్రియమైన శిష్యుడికి అమ్మ బాధ్యతలు అప్పగించాడు. సిలువ యాగం ద్వారా తాను భూలోకానికి వచ్చిన రక్షణ కార్యం పూర్తయిందని గ్రహించి తండ్రికి తన ఆత్మను అప్పగించి చివరకు సమాప్తమైనదని చెప్పి యేసు ప్రాణం విడిచాడు. యేసు చనిపోయాడో లేదో నిర్ధారించుకోడానికి ఒక సైనికుడు పక్కటెముకల్లో బల్లెంతో ΄÷డిచాడు. ఇదంతా గమనిస్తున్న కఠినమైన రోమా శతాధిపతి హృదయం కరిగిపోయింది. ఈయన నిజముగా దేవుని కుమారుడే అంటూ ప్రకటించాడు. యేసు చనిపోయిన వెంటనే కొన్ని అద్భుతాలు జరిగాయని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పేర్కొంది. ప్రసిద్ధ యెరూషలేము దేవాలయపు గర్భగుడిలో ఉండే పెద్ద తెర పైనుంచి క్రిందికి రెండుగా చీలిపోయిందని, ఆ ప్రాంతంలో భూమి కంపించిందని, బండలు బద్దలవడం, సమాధులు తెరవబడి మృతులైన పరిశుద్ధులు పట్టణములో ప్రవేశించి అనేకులకు కనపడ్డారని పేర్కొంది. క్రీస్తు కథ సిలువ మరణంతో ఆగిపోలేదు. చరిత్ర పుటల్లో మరణాన్ని జయించి మూడవ దినమున పునరుత్థానుడైన ఒకే వ్యక్తిగా పేర్కొనడం జరిగింది. అందుకే ఇప్పటికీ క్రీస్తు ఖాళీ సమాధి యెరూషలేములో మనకు దర్శనమిస్తుంది. సజీవుడైన క్రీస్తుకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిపోయింది. అందుకే అగస్టిన్ అనే భక్తుడు ’సిలువ దేవుని ప్రేమను ప్రకటించిన గొప్ప వేదిక’ అంటాడు.– స్టెర్జి రాజన్ బందెల, సీనియర్ జర్నలిస్ట్ -
ఆఖరి మజిలీకి ఆమె చేయూత!
చావులకు వెళ్లాలంటే చాలా మంది ఆలోచిస్తుంటారు. కొందరైతే చావుకు వెళ్లినా అంత దూరాన ఉండి అంత్యక్రియలు ఎప్పుడు పూర్తవుతాయోనని ఎదురు చూస్తుంటారు. అలాంటిది కొందరు మహిళలు వారసత్వంగా వచ్చిన పాడె కట్టడం, చితి పేర్చడం, బొంద తవ్వడం వంటి వృత్తులు నిర్వహిçస్తూ, ఉపాధి పొందుతున్నారు. సాధారణంగా అలాంటి పనులు మగవారే చేస్తుంటారు. కానీ కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహిళలే అన్నీ తామై పాడె కట్టడం నుంచి చితిని పేర్చి శవం కాలి బూడిదయ్యేదాకా అన్నీ తామై వారసత్వంగా వస్తున్న ఆ వృత్తిలో ఆఖరి మజిలీ వరకు చేయూతనిస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో ఎవరైనా చనిపోయినట్లు సమాచారం అందగానే అంత్యక్రియలకు అవసరమైన కుండతో పాటు పాడె కట్టడానికి అవసరమైన కట్టెలు తీసుకుని వెళతారు. చనిపోయిన వ్యక్తి ఇంటికి వెళ్లి డప్పుల చప్పుడు మధ్యన పాడె కడతారు. శవాన్ని పాడె మీద పడుకోబెట్టగానే బట్ట కప్పేసి శవం పడిపోకుండా తాడుతో కట్టేస్తారు. మరో బృందం చితికి అవసరమైన కట్టెలు తీసుకువచ్చి శ్మశానవాటికలో పేర్చి, శవాన్ని చితిపై పడుకోబెట్టగానే కట్టెలతో నింపేస్తారు. కుటుంబ సభ్యులు చితికి నిప్పంటించగానే, దహనమయేదాకా అక్కడే ఉంటారు. కొన్ని కుటుంబాల వాళ్లు శవాలను ఖననం చేస్తుంటారు. అలాంటి పనుల్లో శవాన్ని ఖననం చేయడానికి గుంత తవ్విన తరువాత శవాన్ని అందులో పూడ్చేసే కార్యక్రమం పూర్తయ్యేదాకా ఉంటారు. కామారెడ్డి పట్టణానికి చెందిన వారంతా పట్టణంతో పాటు దేవునిపల్లి, క్యాసంపల్లి, సరంపల్లి గ్రామాల్లో చనిపోయిన వారి ఆఖరి మజిలీలో తమ పాత్ర పోషిస్తున్నారు. కరోనా అప్పుడు కూడా పనిచేసినంనేను నలభై ఏండ్ల సంది పాడె కడుతున్న. ఎవరు చనిపోయినా వచ్చి మాట్లాడుకుని వెళతారు. చావుకు అవసరమైన కుండ, పాడె కట్టెలు కొనుక్కుని వెళతాం. ఇంటిముందర కుండలో అన్నం వండి ఇవ్వడం నుంచి పాడె కట్టడం, శవాన్ని పాడెమీద పడుకోబెట్టి తీసుకువెళ్లేదాకా అన్ని పనులు చూసుకుంటాం. ఇంటి వాళ్లు ఇచ్చే డబ్బులు తీసుకుని జీవనం సాగిస్తుంటాం. అయితే మేము చేసేది పుణ్యకార్యంగానే భావిస్తాం. కరోనా సావులు కూడా చేసినం.– బైరం సిద్దవ్వఇరవై ఏండ్ల సంది చేస్తున్న...నేను ఇరవై ఏండ్ల సంది వృత్తిలో ఉన్న. మా కుటుంబ వారసత్వంగా వచ్చిన దానిని అలాగే కొనసాగిస్తున్నం. పెద్ద ఊరు కావడం వల్ల ఒక్కోసారి ఒకేరోజు మూడు, నాలుగు సావులు కూడా చేయాల్సి ఉంటది. ఆ రోజు తినడానికి కూడా టైం సరిపోదు. అన్ని సావుల కాడికి వెళ్లాలి. పాడె కట్టాలి. జీవితం ఉన్నన్ని రోజులు చేయాల్సిందే. ఇబ్బందే అయినా బతకుదెరువుకు చేయాల్సిందే. – బైరం హేమలత– సేపూరి వేణుగోపాలచారి, సాక్షి ప్రతినిధి, కామారెడ్డి -
అతనే.. భామ
ఆమె నృత్యం చేస్తున్నంతసేపూ అపురూప అందాల రాశి అనుకుంటూ కనురెప్పలు కొట్టడమే మానేసి కళ్ళప్పగించి చూస్తాం! ప్రదర్శన పూర్తయ్యాక కరతాళ ధ్వనుల మధ్య ఆమె ఆమె కాదు, అతను... పేరు సంజయ్ వడపల్లి అని వ్యాఖ్యాత ప్రకటించగానే హాలు అంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోతుంది! అవును అతను సంజయ్ వడపల్లి! ఆంధ్రనాట్యంలో అద్భుత నర్తకిగా అంతర్జాతీయ గుర్తింపు పొందారు. భరత కళాప్రపూర్ణ డాక్టర్ నటరాజ రామకృష్ణ, కేంద్ర సంగీత నాటక అకాడమి అవార్డు గ్రహీత, అభినవ సత్యభామ డాక్టర్ కళాçకృష్ణ ఆయన గురువులు. ప్రస్తుతం హెచ్.ఎస్.బి.సి హాంగ్ కాంగ్ బ్రాంచ్లో అసోసియేట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ శనివారం హైదరాబాద్ తెలుగు విశ్వ విద్యాలయంలో ఎన్టీఆర్ ఆడిటోరియంలో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వడానికి విచ్చేసిన సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.తన 8వ ఏట డాక్టర్ నటరాజ రామకృష్ణ దగ్గర లాస్య, తాండవ నృత్య సాధనతో ఆరంభించి నృత్యం పట్ల ఆసక్తి పెంచుకున్నారు. డాక్టర్ కళాçకృష్ణ దగ్గర ప్రబంధ సాంప్రదాయ నవ జనార్ధన పారిజాతం నేర్చుకున్నారు. తొలిసారి సత్యభామ వేషం ధరించి నాట్యం చేసినప్పుడు లభించిన ప్రశంసలతో నాట్య రంగంలో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు సంజయ్ తెలిపారు. తాను సత్యభామగా నర్తించినప్పుడు వేదికపై చూసిన వారు, ఆ తరువాత మేకప్ తొలగించుకుని పలకరిస్తే ఆశ్చర్య పోయేవారని, తానే సత్యభామ అంటే నమ్మే వారు కాదంటూ తొలినాటి ప్రదర్శనల అనుభూతులను గుర్తు చేసుకున్నారు. సంజయ్ వడపల్లి సత్యభామగా నవ జనార్దన పారిజాతంతో1985 నుంచి దేశంలోని వివిధ నృత్యోత్సవాల్లో, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. యునెస్కో, హాంగ్ కాంగ్ ఇన్–క్రెడిబుల్ ఫెస్టివల్, అమెరికాలో జరిగిన నటరాజ రామకృష్ణ జయంతి ఉత్సవాలు తనకు ప్రత్యేక గుర్తింపునిచ్చాయని సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు.డాక్టర్ నటరాజ రామకృష్ణ నృత్య రత్న పురస్కారంఆంధ్రనాట్యం, పేరిణి నాట్య సృష్టికర్త డాక్టర్ నటరాజ రామకృష్ణ పేరిట తమ డ్యాన్సింగ్ బెల్స్ సంస్థ నుంచి జాతీయస్థాయిలో నృత్య రత్న అవార్డును ప్రవేశ పెడుతున్నట్లు వివరించారు. ఆంధ్రనాట్యం, పేరిణి నృత్యాల్లో విశేష కృషి చేస్తూ విశ్వవ్యాప్తం చేసే గురువులకు ఈ అవార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ పురస్కారం కింద 20 వేల రూపాయల నగదు, శాలువా, జ్ఞాపికతో ప్రతి యేటా గురువులను సత్కరిస్తామని, యువ నర్తకులకు స్ఫూర్తినిచ్చే లక్ష్యంతో ఏర్పాటు చేసినట్లు సంజయ్ తెలిపారు. ఆంధ్రనాట్య సోలో ప్రదర్శనలతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన సంజయ్ ప్రతిష్టాత్మక సత్రాజితి అవార్డుతో పాటు ఇంటర్నేషనల్ ట్రెడిషనల్ డ్యాన్స్ కాంగ్రెస్ అవార్డు, ఆంధ్రనాట్య కళాశౌర్య అవార్డు, సింగిడి తెలంగాణ పురస్కారం, నృత్యకౌముది, ముంబయి వారి జాతీయ సమైక్యతా నృత్య పురస్కారం లాంటి పలు అవార్డులు అందుకున్నారు. బాలనటుడైన సంజయ్ వడపల్లి కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శృతి లయలు సినిమాలోనూ నటించారు. ప్రబంధ సాంప్రదాయ నవజనార్ధన పారిజాతం ప్రదర్శన విశ్వవ్యాప్తం చేయడంతోపాటు నాట్యాచార్య డాక్టర్ నటరాజ రామకృష్ణ, డాక్టర్ కళాకృష్ణ తెలుగు జాతికి అందించిన నృత్యాంశాలను భావి తరాలకు అందించే ప్రయత్నమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ‘అభినవ అంతర్జాతీయ సత్యభామ’ సంజయ్ వడపల్లి తెలిపారు. ఈనెల 4న నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగే తన ప్రదర్శనకు ఉచిత ప్రవేశం అని, కళాప్రియులందరూ విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. – పురుమాండ్ల నరసింహారెడ్డి, సాక్షి, బంజారాహిల్స్, హైదరాబాద్ -
పరిశుభ్రతే పర్యాటకాకర్షణ
ఆ పల్లె కీర్తి...దేశానికే స్ఫూర్తి వేసవిలో హిల్ స్టేషన్స్కు , పండగలు, జాతరలు ఉన్న రోజుల్లో ఆధ్యాత్మిక ప్రాంతాలకు.. ఇలా ఏడాది మొత్తం సీజన్ను బట్టి టూర్ ‘ఇష్టుల’ అభిరుచులు కూడా మారుతుంటాయి. అయితే అత్యంత పరిశుభ్రంగా ఉన్న పల్లెటూర్లకు, చక్కని జీవనశైలికి పట్టం కడుతున్న గ్రామాలకు కూడా ఇటీవల పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. దుమ్మూ థూళి, అపరిశుభ్రవాతావరణం, కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరవువున్న నగరాల నుంచి ఇలాంటి పల్లెలకు ప్రయాణాలు పెరుగుతున్నాయి. అదే క్రమంలో ఒడిశా రాష్ట్రంలోని ఓ పల్లె సైతం పర్యాటక ఆకర్షణగా మారడం విశేషం. పరిశుభ్రత అనేది భూతద్ధంతో వెదకాల్సిన అంశంగా ఉన్న పరిస్థితుల్లో , ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు పరిశుభ్రతపై తన శ్రద్ధతో పౌర స్పృహకు కొత్త అర్థాన్ని ఇస్తోంది. బాబోజోలా అనే ఈ సాదాసీదా గ్రామం చెత్త, వ్యర్ధాల రహిత వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. బాబోజోలాలో నివసించే గ్రామస్తులకు, పరిశుభ్రత అనేది కేవలం ఒక నియమం కాదు, అది ఒక జీవన విధానం. ప్రతి ఇంటివారు ఎంతో శ్రద్ధగా పాటించే ఒక విధి.పరిశుభ్రతే జన‘పధం’ నిషేధం ఓ ఆయుధం...మహిళలు రోజుకు మూడుసార్లు గ్రామాన్ని ఊడ్చి శుభ్రం చేస్తారు. అంతేకాదు ఇంటింటి నుంచీ చెత్తను డబ్బాలలో సేకరిస్తారు. మరుసటి రోజు మగవారు ఆ చెత్తను తొలగిస్తారు. ఈ గ్రామంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా «నియంత్రించారు. అంతేకాకుండా, ప్రజారోగ్యంపై అవగాహన పెంచడానికి ప్రతి మూలలో ’ధూమపానం నిషేధం’ అనే బోర్డులను ఏర్పాటు చేశారు. , ఇంకా బహిరంగంగా ఉమ్మివేయడం లేదా పొగాకు నమలడం కూడా నిషిద్ధం. ఈ నిషేధాజ్ఞలను పక్కాగా అమలు చేస్తుండడంతో ఈ గ్రామంలో ఎవరూ గుట్కా సేవిస్తూ కనిపించరు ప్లాస్టిక్ జాడ కూడాఎక్కడా కనిపించదు.ఉపాధ్యాయుడి...పాఠం...బాబోజోలాను ఒక ఆదర్శ గ్రామంగా మార్చాలనే ఆకాంక్షతో, మధుసూదన్ మారండీ అనే స్థానిక పాఠశాల ఉపాధ్యాయుడు 15 సంవత్సరాల క్రితం ఈ పారిశుధ్య ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆయన బాటలో గ్రామస్తులు దీనిని ఒక నైతిక బాధ్యతగా స్వీకరించి, పారిశుధ్య కార్యక్రమాలను పర్యవేక్షించడానికి సీసీటీవీలు, చెత్తబుట్టలు, సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు కోసం నిధులు సేకరించడానికి ఒక క్లబ్ను ఏర్పాటు చేశారు.శుభ్రమైన ఇళ్లు...అందాల లోగిళ్లు...ప్రస్తుతం, బాబోజోలాలో సుమారు 70 సంతల్ కుటుంబాలు నివసిస్తున్నాయి, వారి గడ్డి ఇళ్లు సహజసిద్ధంగా, ప్రకృతి వనరులతో నిర్మితమయ్యాయి. ఆసక్తికరంగా, ప్రతి ఇంటి గోడలను మహిళలు రంగురంగుల పువ్వులు ఆకుల నమూనాలతో పాటు, జంతువులు సాంప్రదాయ థీమ్స్తో అందంగా అలంకరిస్తారు. స్థానిక భాషలో దీనిని ’భిత్ పోటావ్’ అని పిలుస్తారు. ఈ చిత్రణలలో ఉపయోగించే రంగులన్నీ నదీ తీరంలోని బంకమట్టి, రాళ్ళు, చెట్ల బెరడు పువ్వుల నుంచి సహజంగా లభించేవే కావడం విశేషం.ఫిబ్రవరిలో జరిగే పటపర్వ పండుగ సమయంలో, గ్రామస్తులు తమ ఇళ్లకు కొత్తగా రంగులు వేసి, పారిశుధ్య భావనను ప్రచారం చేసే సాంప్రదాయ పాటలు నృత్య కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆ సమయంలో ఎక్కువగా ఉండే సందర్శకులు పర్యాటకుల రద్దీని పురస్కరించుకుని నిబంధనలు పాటిస్తున్నారో లేదో గమనించడానికి, ఈ గ్రామం అంతటా సీసీటీవీలను ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారు జరిమానా చెల్లించడాల్సి ఉంటుంది. లేదా ఆ ప్రదేశాన్ని స్వయంగా శుభ్రం చేయవలసి ఉంటుంది.ఈ పల్లెను సందర్శించాలంటే...విమాన మార్గంలోనైతే... భువనేశ్వర్ విమానాశ్రయానికి విమానంలో చేరుకుని, అక్కడి నుంచి మయూర్భంజ్కు క్యాబ్ లేదా బస్సులో ప్రయాణించి, ఆ తర్వాత బాబోజోలాకు స్థానిక రవాణాలో వెళ్లాలి. అదే విధంగా రైలు ద్వారా చేరుకోవాలంటే.. సమీపంలో ఉన్న బారిపద బాలాసోర్ రైల్వే స్టేషన్లలో దిగాలి. అక్కడి నుంచి స్థానిక బస్సును లేదా షేర్డ్ క్యాబ్/జీప్ను ఎక్కవచ్చు. ఇక రోడ్డు మార్గం ద్వారా అయితే తొలుత బారిపదకు చేరుకుని, అక్కడి నుంచి స్థానిక బస్సు, ఆటో లేదా ఏదైనా షేర్డ్ వాహనాన్ని ఎంచుకోవాలి. -
Easter పునరుత్థానుడైన క్రీస్తు
వృక్షము నరకబడిప్పుడు అది తిరిగి చిగురిస్తుంది. అయితే నరుడు మరణమై కదలలేక పడి ఉంటాడని యోబు అనే భక్తుడు యోబు గ్రంథం 14:7లో స్పష్టీకరించాడు. ఆ గ్రంథంలో దేవుడు నరావతారిగా తన కుమారుడైన యేసుక్రీస్తుగా జన్మించి శ్రమకు ఓర్పు ముఖ్య లక్షణమని, కష్టాలు, శ్రమలు భరించి, కాలం సంపూర్ణమైనప్పుడు ప్రతి ఒక్కరు కాలము చేయుదురని, కాని నిస్సహాయతలో దేవునివైపు తిరగడం మానవ విజ్ఞతకు సంకేతమని నిరూపించి సంధించిన పునరుత్థానం లేక మరణానంతరం ఏమిటన్న ప్రశ్నకు సమాధానమే‘ఈస్టర్’ పండుగ.యేసుక్రీస్తు యూదామతంలో జన్మించారు. ఆయన మీ ΄ాపములు క్షమించానని అనడం, కుష్ఠ రోగులను ముట్టుకోవడం, స్వస్థపరిచాడన్న విషయం కంటే వారిని ముట్టడమే నేరమని, నలుబది సంవత్సరాలు శ్రమపడి కట్టిన దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజులలో లేపుతానంటూ చేసిన ప్రసంగాలు యూదులు సహించక, ఆ చర్యలను దేవదూషణ, దేశద్రోహంగా చిత్రీకరించి ఆయనను రోమా సామ్రాజ్యపు అధికారులకు అప్పగించారు. యూదులలో ఛాందసుల కోరిక ప్రకారం రోమీయులకు యేసుక్రీస్తును అత్యంత కిరాతకంగా సిలువ వేసి, రాతి సమాధిలో ఉంచి, సమాధి ద్వారానికి పెద్ద రాయి పొర్లించి ద్వారమునకు ముద్రను వేయించి కావలి వారిని కాపలాగా ఉంచారు.కానీ ఆదివారం తెల్లవారుతున్నప్పుడు ప్రభువు దూత రాయిని ΄÷ర్లించగా మహా భూకంపం కలిగింది. కావలివారు వణికిపోయారు. ఆయనను చూడటానికి వచ్చిన స్త్రీలు ఈ విషయం శిష్యులకు చె΄్పారు. ఆయన వారికి ప్రత్యక్షమై మీకు శుభమని చెప్పగా వారు ఆయన శరీరంతో సజీవుడై ఉండుట చూచి ఆయన ΄ాదములను పట్టుకొని మొక్కారు. అనంతరం యేసు ప్రభువు వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకానికి ఆరోహణుడయ్యాడు. అటువలె యేసుక్రీస్తునందు విశ్వాసముంచు వారు ఆయన ఏ రీతిగా చని΄ోయి బతికెనో, ఆ విధంగా ఆయన యందు విశ్వాసముంచువారు చని΄ోయినను ఆయనవలే తిరిగి మహిమ శరీరంతో తిరిగి లేపబడుతారు (యోహాను 14:6).– బి.బి.చంద్రపాల్ కోట మార్గం, సత్యం జీవం, రెండువేల యేళ్ళనాటి ఈస్టర్ రోజున, మొదట యేసుక్రీస్తు ఉదయించాడు, ఆ తర్వాతే ఆ రోజున సూర్యుడుదయించాడు. ఉదయం చీకటితోనే ప్రభువు సమాధి వద్దకు వెళ్లిన మగ్దలీనా మరియకు యేసుప్రభువు ఆనాడు తనను సజీవుడుగా కనపర్చుకోవడంతో ఈస్టర్ నవశకం ఆరంభమయ్యింది. శుక్రవారం నాడాయన అత్యంత బలహీనుడు, నిస్సహాయుడు, రోమా ప్రభుత్వం దృష్టిలో నేరస్థుడు, యూదుమతాధిపతుల దృష్టిలో దైవ ద్రోహి. అంతా చూస్తుండగానే సిలువలో ఆయన మరణించాడు, పలువురి సమక్షంలో రోమా ప్రభుత్వం కనుసన్నల్లో ఆయన సమాధి కార్యక్రమం జరిగింది. ఆదివారం ఉదయం నాటికి ఆయన మళ్ళీ సజీవుడయ్యాడు. తన వాళ్లందరికీ సజీవుడై కనిపించాడు, మళ్ళీ ఎన్నో అద్భుతకార్యాలు కూడా చేసి తన శిష్యులకు, అనుచరులకు స్పష్టంగా దిశా నిర్దేశం చేసి 40 వ రోజున పరలోకానికి ఆరోహణుడయ్యాడు. దిశానిర్దేశం చెయ్యడమంటే, ప్రభువు తన పునరుత్థాన శక్తిలో వారిని అంతర్భాగం చేశాడు. ‘మీరు త్వరలో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడేవరకు యెరూషలేములోనే కనిపెట్టి ఉండండి. ఆ తర్వాత భూదిగంతాల దాకే నాకు మీరు సాక్షులవుతారు’ అని ప్రభువు వారికి తెలిపాడు (అపో.కా .1:8). అలా ఆరంభమైన ఆదిమ చర్చి ఆ పునరుత్థానశక్తి తోనే పరవళ్లు తొక్కి, ప్రభువుకోసం నవ్వుతూనే ప్రాణత్యాగం చెయ్యడానికి కూడా సంసిద్ధ మయ్యింది. ఆ శక్తితోనే అనూహ్యంగా విస్తరించింది. పరిశుద్ధాత్మ శక్తి కేవలం భాషల్లో మాట్లాడేందుకు, అద్భుతాలు, స్వస్థతలు చేసేందుకే తోడ్పడుతుందనుకోవడం, కిటికీ లోంచి గదిలోకొస్తున్న సూర్యకిరణాలు కేవలం గదిని వెలుగుతో నింపడానికేనని అనుకోవడం లాంటి సంకుచితమైన అవగాహన. సూర్యుడు తన కిరణాలతో మన గదిలో వెలుగు నింపుతాడు సరే, కానీ విశ్వానికంతటికీ జీవప్రదాత ఆ సూర్యుడే అని, సూర్యుడు లేకపోతే జీవకోటికి మనుగడే లేదని ముందు తెలుసుకోవాలి. ఒక పెద్ద బండరాయిని కొండమీదినుండి కిందికి తొయ్యడానికి ఎంతో బలం కావాలి. కాని అదే బండరాయిని భూమ్మీదినుండి కొండమీదికి దొర్లించుకు పోవడానికి మాత్రం పునరుత్తాన శక్తి కావాలి. క్రీస్తు తన పునరుత్థానం ద్వారా ఈ లోకానికిచ్చినది ఆ పునరుత్థాన శక్తే!!! హ్యాపీ ఈస్టర్. – సందేశ్ అలెగ్జాండర్ -
Good Friday బలియాగమైన యేసు
క్రీస్తు కేంద్రకంగా దేవుడు సంకల్పం చేశాడు. ఇందులో క్రీస్తు మరణం అత్యంత ప్రధానం. ఈ సర్వ జగత్తుకు పూర్వమే క్రీస్తు బలి ఏర్పాటు చేయబడింది. పాపము లేనప్పుడే క్రీస్తు పరిశుద్ధ రక్తానికి ప్రాధాన్యం ఇవ్వడం అంటేనే దేవుడు అద్వితీయ జ్ఞాన సంపన్నుడుగా మనకు దర్శనమిస్తున్నాడు. దూరదృష్టి, ముందుచూపు అనేవి దేవుని నుండి నేర్చుకోగలిగే జీవితాలు ఏంతో ఉన్నతంగా ఉంటాయి. మానవాళి పాపాలకు ప్రతిగా యేసును నలగగొట్టడం దేవుడైన యెహోవాకు ఇష్టమైంది. క్రీస్తు వారి మరణం దేవుని చిత్తం. నీ చిత్తమే సిద్ధించును గాక అంటూ తలవంచిన క్రీస్తు ముందుకు అడుగు వేశాడు. దేవుడు తన ప్రజల పరిశుద్ధత కొరకు యుక్త కాలాన యేసును ప్రాణం పెట్టమన్నాడు. అందుకు క్రీస్తు సంతోషంగా సమ్మతించాడు. బలి ఆగుటకు ఏంతో ఇష్టపూర్వకంగా విధేయంగా తన తండ్రియైన దేవుని చిత్తానికి తనను తాను సమర్పించుకున్నాడు .యేసు తనను గూర్చి తన రాకను గూర్చి ఇలా వివరణ ఇచ్చుకున్నారు. నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణము ఇచ్చుటకు వచ్చాను (మత్త 20:28). ప్రాణత్యాగాన్ని మించిన గొప్ప పరిచర్య ఏముంటుంది? నీతి కలిగిన మంచి వ్యక్తులకొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవతెగించవచ్చు. మంచి వాడైనా చెడ్డ వాడైనా ’తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటె ఎక్కువైన ప్రేమగల వాడెవడును లేడు’ అన్నది ఆయన ఉన్నత బోధే (యోహాను 15:13). ఒక్క దేవుని మెప్పు ఉంటే కోల్పోయేది ఎలాంటిదైనా ఎంతటిదైనా ఏముంది? తనదైన బోధలకు అనుగుణంగా అనగా, సాహసొపేతంగా జీవిస్తూ ఈ ప్రపంచాన్ని ఆశ్చర్యపరచిన వాడు యేసు. ప్రత్యేకంగా ఇదే యేసు జీవితానుభావం నుండి మనం నేర్చుకొనేది. క్రీస్తు భక్తిహీనులైన పాపుల కొరకు చని΄ోయారు (రోమా 5:6–8 ).క్రీస్తు మరణానికి కొద్దిరోజుల ముందు ప్రధాన యాజకుడైన కయప ఇలా ప్రవచించాడు. ‘మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట మీకు ఉపయుక్తం... యేసు ఆ జనము కొరకును, ఆ జనము కొరకు మాత్రమేగాక చెదరి΄ోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనైయున్నాడు’ ( యోహాను 11:49–52 ) అంటూ..దేవునిలో స్థిరపడి నిలకడగా ఉన్న యూదులైన దేవుని పిల్లలు, దారితప్పి చెదరి దూరమైన వేరే దొడ్డి గొర్రెలు అనబడే అన్యజనులు ఇప్పుడు క్రీస్తు మరణం వలన ఏకం కాబోతున్నారు. విద్వేషం లేని ఆత్మ సంబంధ ఏక ప్రపంచం త్వరలో రూపుదిద్దుకోబోతోంది. ఈ పై రెండు వచనాలు క్రీస్తు ’మరణ శాసనం’ గుర్తు చేస్తున్నాయి. ఇదీ చదవండి: రెండు అణుబాంబుదాడులు : బయటపడిన ఏకైక వ్యక్తియేసు తన మరణాన్ని తానే నిర్ణయించుకొని అనగా ప్రాణం పెట్టుటకును తిరిగి తీసికొనుటకును దేవుని వలన అధికారం పొందియున్నారు. యేసుక్రీస్తు తన మరణ శాసనాన్ని అనగా కొత్త నిబంధన లేదా నూతన ఒడంబడికను తన రక్తంతో వ్రాసుసుకున్నారు. ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అంటూ తన మరణానికి ముందే చెప్పకనే చెప్పారు. క్రీస్తును బట్టే దేవుడు తన ప్రజలతో నిబంధన చేసుకున్నాడు. అట్టి నిబంధనకు తన దైన సొంత రక్తం ద్వారా రూపకల్పన చేసినది మాత్రం క్రీస్తు వారే. రక్తము లేకుండా ఏ నిబంధన లేదు. క్రొత్త నిబంధన ఎంత ఉన్నతమైనదంటే ఇది క్రీస్తు వారి రక్తంతోనే ప్రతిష్టించబడింది.– జేతమ్ -
చైత్ర పూర్ణిమ.. ఎవరిని పూజించాలి?
సాధారణంగా పున్నమి అనగానే వెన్నెల గుర్తుకొస్తుంది. సంవత్సరంలో పన్నెండు పున్నములు వస్తాయి. ప్రతి పున్నమికీ ఒక ప్రత్యేకత ఉంటుంది. పున్నమి నాడు మనఃకారకుడైన చంద్రుని పూజించడం మంచిదని పెద్దలు చెబుతారు. నేడు చైత్ర పౌర్ణమి. ఈ రోజున హనుమంతుడిని, సత్యనారాయణ స్వామిని పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. అలాగే అమ్మవారిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. దీపోత్సవం, అన్నదానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.పౌర్ణమి రోజున వ్రతమాచరించి సాయంత్రంపూట చంద్రుడిని ఆరాధించడం శుభఫలితాలను ఇస్తుంది. ఆ రోజున లలిత సహస్ర నామ పారాయణ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి.. శివకేశవుల ఆరాధన చేయడం మంచిది. అలాగే సత్యనారాయణ స్వామి పూజతో సకలసంపదలు చేకూరుతాయి. ఆ రోజున ఉపవాసం చేసేవారు ఉప్పు వాడిన ఆహార పదార్థాలను తీసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది.పౌర్ణమి వ్రతం ఆచరించడం ద్వారా మానసిక సంబంధిత మార్పులు జరుగుతాయి. చంద్రుడు మనఃకారకుడు కావున మానసిక బలం చేకూరుతుంది. చైత్ర పౌర్ణమి నేతి దీపాలను వెలిగించడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు. హనుమంతునికి, నారాయణ స్వామికి నేతి దీపం వెలిగించడం విశిష్ట ఫలితాలను ప్రసాదిస్తుంది.అక్కమహాదేవి జయంతి నేడు12వ శతాబ్దపు ప్రసిద్ధ కన్నడ కవయిత్రి అక్కమహాదేవి జయంతిని ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి నాడు ఘనంగా నిర్వహిస్తారు.శ్రీశైలంలో ఆమె తపస్సు చేసినట్లుగా భావించేప్రాంతం, మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.పరమశివుని భర్తగా భావించి,వచన సాహిత్యానికి ఆమె చేసిన కృషి అద్వితీయం. 12వ శతాబ్దపు వీరశైవ భక్తి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తొలి మహిళా కవయిత్రి.కర్ణాటకకు చెందిన ఆమె శ్రీశైలంలోని మల్లికార్జున స్వామిని ఆరాధించి, తపస్సు చేసిందామె.అక్కమహాదేవి జయంతిని పురస్కరించుకుని, శ్రీశైల దేవస్థానంతో పాటు కర్ణాటకలోని అనేక ప్రదేశాలలో, మహిళా విశ్వవిద్యాలయాలలో ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి.నేడు (ఏప్రిల్ 2, గురువారం) చైత్రపూర్ణిమ– డి.వి.ఆర్ -
మీ గరిష్ట సామర్థ్యాన్ని అందుకోవడం ఎలా?
చాలామంది తమ జీవిత కాలమంతా కేవలం అవసరాల కోసమే బ్రతుకుతారు. కొద్దిమంది మాత్రమే తమ 'గరిష్ట సామర్థ్యాన్ని' (Full Potential) అందుకుంటారు. సైకాలజీలో Abraham Maslow చెప్పిన 'Hierarchy of Needs'లో అత్యున్నత శిఖరం ఈ'Self-Actualization' (ఆత్మ సాక్షాత్కారం లేదా స్వయం పరిపూర్ణత).సెల్ఫ్-యాక్చువలైజేషన్ అంటే పర్ఫెక్ట్ గా మారిపోవడం కాదు, మీలోని 'యథార్థమైన వెర్షన్' (Authentic Version) ని ఆవిష్కరించడం. మీరు ఒక డాక్టరో, ఇంజనీరో లేదా సైకాలజిస్టో కావచ్చు.. కానీ ఆ వృత్తిలో మీరు మీ ప్రత్యేకతను (Uniqueness) ఎలా చూపిస్తున్నారు అనేదే ముఖ్యం.మాస్లో పిరమిడ్లో మీరు ఎక్కడ ఉన్నారు?మాస్లో ప్రకారం, మనిషికి ఐదు రకాల అవసరాలు ఉంటాయి.1. శారీరక అవసరాలు: తిండి, నిద్ర.2. భద్రత: ఇల్లు, ఉద్యోగం.3. ప్రేమ/సంబంధాలు: కుటుంబం, స్నేహితులు.4. గౌరవం (Esteem): గుర్తింపు, ఆత్మగౌరవం.5. Self-Actualization: మీ అంతిమ లక్ష్యం, సృజనాత్మకత.చాలామంది మొదటి నాలుగు మెట్ల దగ్గరే ఆగిపోతారు. మీరు ఐదో మెట్టు ఎక్కాలంటే, మీ భయాలను దాటి మీ Purpose వైపు ప్రయాణించాలి.సెల్ఫ్-యాక్చువలైజ్డ్ వ్యక్తి లక్షణాలుమీరు గరిష్ట సామర్థ్యాన్ని అందుకుంటున్నారని చెప్పడానికి కొన్ని సంకేతాలు:Reality Perception: మీరు ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూస్తారు, భ్రమల్లో ఉండరు.Acceptance: మిమ్మల్ని మీరు, ఇతరులను ఏ విధమైన జడ్జిమెంట్ లేకుండా అంగీకరిస్తారు.Spontaneity: మీ ఆలోచనల్లో, పనుల్లో ఒక సహజత్వం ఉంటుంది.Peak Experiences: పని చేస్తున్నప్పుడు సమయాన్ని మర్చిపోయే Flow Stateని అనుభవిస్తారు.మోటివేషన్ మాయ vs యథార్థ వికాసం"వేరే ఎవరో సాధించిన దాన్ని చూసి నువ్వు కూడా అదే సాధించు" అని మోటివేషన్ చెప్తుంది. ఇది మిమ్మల్ని 'కాపీ' గా మారుస్తుంది. కానీ సైకాలజీ, "నీ లోపల ఉన్న ప్రత్యేకమైన విత్తనం ఏంటో చూడు, అది వృక్షం అయ్యేలా చెయ్యి" అని చెప్తుంది. సెల్ఫ్-యాక్చువలైజేషన్ అంటే ఇతరులతో పోటీ పడటం కాదు, మీ నిన్నటి వెర్షన్ని అధిగమించడం.మీ పొటెన్షియల్ని అన్లాక్ చేయండిGenius Matrix Hubఫిలాసఫీ ప్రకారం, ఈ శిఖరాన్ని చేరే మార్గం:Step 1: Break Social Conditioning"లోకం ఏమనుకుంటుందో" అని మీ కలలను చంపుకునే ఆ పాత మనస్తత్వాన్ని 'Break' చేయండి. ఇతరుల అంచనాల కోసం కాకుండా, మీ ఆత్మ తృప్తి కోసం జీవించడం మొదలుపెట్టండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకునే ఆ 'లిమిటింగ్ బిలీఫ్స్' ని తొలగించండి.Step 2: Build Purpose Driven Lifeమీకు నచ్చిన పనిని, ప్రపంచానికి అవసరమైన పనిని గుర్తించి దాన్ని 'Build' చేయండి. మీ ప్రతిభను పదును పెట్టుకోండి. ప్రతిరోజూ 1% మెరుగవ్వాలనే 'Kaizen' సూత్రాన్ని పాటించండి. మీ సామర్థ్యం పెరిగే కొద్దీ మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.Step 3: Beyond Transcendenceమీరు ఒక స్థాయికి చేరాక, మీ పొటెన్షియల్ ని ఇతరుల మేలు కోసం వాడండి. మీరు కేవలం మీ కోసం కాకుండా, సమాజం కోసం ఒక 'వారసత్వాన్ని' వదిలి వెళ్ళినప్పుడే మీరు సంపూర్ణంగా సెల్ఫ్-యాక్చువలైజ్డ్ అయినట్లు. ఇదే 'Beyond' స్టేజ్.మీరు మీ పూర్తి స్థాయిలో ఉన్నారా?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి:1. మీలో ఉన్న ఆ ఒక్క ప్రత్యేకమైన టాలెంట్ ఏంటి? దాన్ని మీరు 100% వాడుతున్నారా?2. మీకు ఏ పనులు చేస్తున్నప్పుడు సమయాన్ని మర్చిపోతున్నారు? (Flow State)3. మీరు చనిపోయిన తర్వాత, జనం మిమ్మల్ని ఏమని గుర్తుంచుకోవాలి అని కోరుకుంటున్నారు?మీరే ఒక మాస్టర్ పీస్!బ్రో, ప్రతి విత్తనంలో ఒక అడవి దాగి ఉంటుంది. అలాగే మీలో ఒక అసాధారణమైన శక్తి ఉంది. దాన్ని బయటకు తీయడమే మీ జీవిత లక్ష్యం కావాలి. సెల్ఫ్-యాక్చువలైజేషన్ అనేది ఒక పాయింట్ కాదు, అది ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో మీరు ఎంత ఎదిగితే, ప్రపంచం అంత వెలుగుతుంది."What a man can be, he must be."- Abraham Maslow సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: మీ వ్యక్తిత్వాన్ని చంపేసే మనుషులకు దూరంగా..) -
పాజిటివ్గా ఆలోచిద్దాం
మానసిక ఎదుగుదల లేని పిల్లలున్న తల్లి మనస్తత్వం.. ఒత్తిడిని అధిగమించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. నిపుణుల సూచనలు.. సమస్యను ఎదుర్కొనే తల్లులకే కాదు, ఎదుటివారి కష్టాన్ని అర్ధం చేసుకోవాలనుకునేవారికీ అవగాహన అవసరం.. ‘వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే’ సందర్భంగా రేపటిని నిర్మించే తల్లుల కోసం..కీర్తి పెళ్లయ్యి ఎనిమిదేళ్లయ్యింది. పిల్లలు కలగడం లేదని ఆందోళన చెందుతున్న ఆమెకు మరో ఏడాది లో బిడ్డ పుట్టాడు. ఆ ఇంట్లో ఎంతో ఆనందం. అయితే బాబుకు రెండేళ్ల వయసు వచ్చినా మాటలు రావడం లేదు. పిలిచినా స్పందన లేదు. ఇంట్లోవాళ్లు ‘కొందరు పిల్లలకు ఆలస్యంగా మాటలు వస్తాయి, అదేమంత పెద్ద విషయం కాదు...’ అనేవారు. కానీ, కీర్తి మనసులో ఏదో ఆందోళన. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. రకరకాల పరీక్షల తర్వాత డాక్టర్ ‘మీ పిల్లవాడికి ఆటిజమ్ సమస్య ఉంది’ అని చెప్పగానే ఆమె ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయినట్టు అనిపించింది. ఇంట్లో వాళ్లకు ఈ విషయం తెలిసింది. అందరూ మౌనంగా ఉండిపోయారు. ఆరోజు నుంచి కీర్తి ‘నా పిల్లవాడికే ఎందుకు ఇలా జరిగింది...?’ అంటూ ఏడుస్తూనే ఉంది. పారిపోతే పరిష్కారం ఉందా?!మానసికంగా, భావోద్వేగంగా ఆటిజం పిల్లలున్న తల్లులు ప్రతి రోజూ సవాళ్లను ఎదుర్కొంటుంటారు. ∙ఆటిజం పిల్లల్లో శారీరకంగా ఎదుగుదల ఉంటుంది. కానీ, మానసికంగా ఇతరులపైనే ఆధారపడతారు కాబట్టి వారి భవిష్యత్తు గురించి తల్లి ఆందోళన చెందుతుంటుంది. ∙‘ఎప్పుడు ఏ పాపం చేశానో అని..’ తనను తాను నిందించుకుంటుంది. సమస్యకు దూరంగా ‘పారిపోదాం/ వదిలించుకుందాం’ అనుకునే సందర్భాలూ ఉంటాయి. ∙ఉద్వేగపూరిత ఆలోచనలు, పనుల ఒత్తిడి వల్ల తల్లి తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటుంది. లేదంటే, తనను తాను అస్సలు పట్టించుకోదు. నలుగురిలో కలవడానికి ఇష్టపడదు. ఇలాంటి సందర్భంలో అనేకమంది నిపుణులను కలిసింది కీర్తి. వారి ఫీడ్బ్యాక్తో పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టింది.తనలో శక్తిని నింపుకుంటూ...మొదట్లో నెగిటివ్గా ఉన్నా... థెరపిస్ట్ సూచనలతో ఐ కాంటాక్ట్, సింపుల్ పదాలు, రోజువారీ పనులు చేయించడం.. మొదలు పెట్టింది. ప్రతీ చిన్న సాధన ఆమెకు ఒక ప్రోగ్రెస్ అయ్యింది. ఇప్పుడు ఆ పిల్లవాడిలో చిన్న చిన్న మార్పులు కనిపిస్తున్నాయి. అవి చూశాక.. తనను తాను ఇంకా బలంగా మార్చుకుంది. తన బిడ్డను స్వతంత్రంగా తయారుచేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆటిజం సమస్య ఉన్న తల్లికి ఆ బిడ్డ ఎంత ప్రత్యేకమో అర్థం చేసుకుంటే మనసు తేలికపడుతుంది. అప్పటినుంచి రోజు తర్వాత రోజు మెరుగ్గా మార్చుకోవడం ఎలాగో మార్గాన్ని అన్వేషిస్తుంది. భవిష్యత్తును ఆ తల్లి అందంగా నిర్మిస్తుంది. ప్లానింగ్తోనే ప్రోగ్రెస్! ∙పరిస్థితిని అర్థం చేసుకొని, అంగీకరించడం.. ఇది బలహీనత కాదు బలం అని గుర్తించడంతోపాటు సరైన శిక్షణ, సపోర్ట్ సిస్టమ్ ఉంటే భయం, ఆందోళన తగ్గుతాయి. ∙తల్లి బలంగా ఉంటేనే పిల్లలకు తగినంత సపోర్ట్ ఇవ్వగలదు. బిడ్డల మానసిక స్థితి బాగుండాలంటే నిపుణుల సహాయం తీసుకోవాలి. ∙ఆటిజం పిల్లలు ఎంత చిన్న పని చేసినా పెద్ద విజయంగా భావించి, ప్రోత్సహించాలి. తమకు తాముగా ధ్యానం, వాకింగ్, చదవడం.. వంటివి రోజువారీ ప్లానింగ్లో భాగం చేసుకోవాలి. ఈ అలవాట్లు మానసికంగా రీఛార్జ్ చేస్తాయి. ∙లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్, ఫ్యామిలీ సపోర్ట్, ఆర్థిక ప్రణాళికలు .. భవిష్యత్తు గురించిన ఆందోళన తగ్గిస్తాయి.అంగీకరించాల్సిందే..!పిల్లల్లో ఆటిజం సమస్య ఉందని తెలిశాక తల్లులపై మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది. అయితే భావోద్వేగంతో కాకుండా వాస్తవపరిస్థితిని అంగీకరించి, సమస్యను అర్థం చేసుకోవాలి అని చెబుతుంటాం. పూర్తిగా నయం కావడానికి ఇది జబ్బు కాదు. కొన్ని మార్చలేనివి కూడా ఉంటాయి. ప్రతి చిన్న ప్రయత్నాన్ని సహనంగా చేస్తూ ఉంటే, పిల్లల్లో మెల్ల మెల్లగా మార్పు వస్తుంది. మిగతావారితో పోల్చుకోకుండా, తమ బిడ్డను ప్రత్యేకంగా, ధైర్యాన్ని, మమకారాన్ని అందిస్తూ పెంచాల్సి ఉంటుంది. దీనికి కుటుంబ సభ్యులు మద్దతుగా నిలిస్తే తల్లుల మీద ఒత్తిడి తగ్గుతుంది.– పటోళ్ల హారిక, బిహేవియర్ అనలిస్ట్ – నిర్మలారెడ్డి, సాక్షి పీచర్స్ ప్రతినిధి -
అచ్చం అమ్మలా...
సాంకేతికతకు, సామాజిక స్పృహ తోడైతే అది మానవత్వానికి మరో అడుగు అవుతుంది. ఆటిజం ఉన్న పిల్లల కుటుంబాలు ఎదుర్కొనే సమస్యలు, సవాళ్ల గురించి తెలుసుకున్న ముగ్గురు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ‘అయ్యో!’ అనుకోవడానికి మాత్రమే పరిమితం కాలేదు. తమ ఆలోచనలు, సాంకేతిక జ్ఞానానికి పదును పెట్టి ఆటిజం ఉన్న పిల్లల పేరెంట్స్ను అన్ని రకాలుగా గైడ్ చేసే 24/7 థెరపిటిక్ ఏఐ–చాట్బాట్ను రూపొందించి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.సాంగ్లీ (మహారాష్ట్ర)లోని రాజారాంబాపు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్లో తెల్లవారుజామున అక్కడొకరు, ఇక్కడొకరు నిద్ర లేస్తున్నారు. అయితే ఒక కంప్యూటర్ ల్యాబ్ లోపల ముగ్గురు యువ ఇంజినీర్లు మాత్రం నిద్ర అనేదే లేకుండా దీక్షగా పనిలో నిమగ్నమయ్యారు. కోడ్ను మెరుగు పరుస్తూ, రెస్పాన్స్ను పరీక్షిస్తూ ఏఐ సిస్టమ్కు శిక్షణ ఇస్తున్నారు. ‘న్యూరోస్టార్స్’గా పిలవబడే వైష్ణవి రాజ్కుమార్ పాటిల్, అభిషేక్ శివప్రసాద్, గణేష్ రామచంద్రలకు అదొక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్గా మారింది.ఆటిజం ఉన్న పిల్లల తల్లిదండ్రులు రోజూ ఎదుర్కొనే సవాళ్లను పరిష్కరించడంలో సహాయపడడానికి రూపొందించిన వారి ఏఐ–ఆధారిత చాట్బాట్ నేషనల్ ఏఐ హ్యాక్థాన్లో గ్రాస్ప్ 2026 గెలుచుకుంది. అయిదువేల మంది విద్యార్థులతో పోటీపడి ఈ ముగ్గురు ‘ఏఐ ఫర్ సోషల్ గుడ్’ విభాగంలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. లక్ష రూపాయల నగదు, మెంటర్షిప్ అవకాశాలు, ఇంటర్న్షిప్స్, ఒక యూరోపియన్ యూనివర్శిటీతో కలిసి పనిచేసే అవకాశం వారికి లభించింది.ఆ రోజు నుంచే...ఈ ముగ్గురు మిత్రుల క్లాస్మేట్ ఒకరు ఒకరోజు తన సోదరికి ఉన్న ఆటిజం సమస్య గురించి వివరిస్తూ, తమ కుటుంబం పడే బాధలను చెప్పుకుంటూ వచ్చాడు. ‘అయ్యో!’ అనుకోవడానికే పరిమితం కాలేదు వారు. ఎంతోమంది యువతీయువకులతో ‘యునైటెడ్ ఫర్ ఆటిజమ్’ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఊరూవాడ, పాఠశాలలు తిరుగుతూ ఆటిజం గురించి అవగాహన పరిచేవారు. కాలక్రమంలో ఇది ‘డ్రీమ్ ఉడాన్ ఫౌండేషన్’ అనే రిజిస్టర్డ్ ఎన్జీవోగా రూపాంతరం చెందింది.‘డ్రీమ్ ఉడాన్ ఫౌండేషన్’తో ప్రయాణం ప్రారంభించిన తరువాత లోపాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోగలిగారు. మన దేశంలో ఆటిజం అనేది నిర్మాణాత్మక సవాళ్లతో కూడుకొని ఉంది. ఆటిజం గురించి బొత్తిగా అవగాహన లేని తల్లిదండ్రులు, పరిమిత సంఖ్యలో థెరపిస్ట్లు, అరుదైన సెషన్లు, అధిక ఖర్చులు... ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఉన్నాయి. కోవిడ్ కల్లోల కాలం తరువాత ఆటిజం కేసుల సంఖ్య 30 శాతం పెరిగిందనే వార్త ముగ్గురు మిత్రులను ఆందోళనకు గురి చేసింది.ఆ పరిశోధన ఫలితమే....శాస్త్రీయమైన మార్గదర్శకత్వం ఉంటే ‘ఇలా చేయాలి...అలా చేయకూడదు’ అనే అవగాహన తల్లిదండ్రులకు ఉంటుంది. అయితే చాలామంది తల్లిదండ్రులకు శాస్త్రీయ మార్గదర్శకత్వం దొరకడం లేదు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని టెక్నికల్ స్టూడెంట్స్గా ‘ఆటిజం కేర్’కు సంబంధించి అందుబాటులో ఉండే, తక్కువ ఖర్చు అయ్యే సాంకేతికత వైపు దృష్టి పెట్టిన ముగ్గురు మిత్రులు ఎన్నో పరిశోదనలు చేశారు. వారి పరిశోధన ఫలితమే.. 24/7 థెరపటిక్ ఏఐ–పవర్డ్ చాట్బాట్.‘ఇలా ఉండాలి... అంటూ చాట్బాట్కు సంబంధించి ఐడియా అయితే ఉందిగానీ, ఎలాంటి టూల్స్ను ఉపయోగించాలనేది మాకు తెలియదు’ అని తొలిరోజులను గుర్తు చేసుకున్నాడు అభిషేక్.సాంకేతికతకు సంబంధించి తమ డిపార్ట్మెంట్ హెడ్ సహాయం తీసుకున్నారు. దీనికి ముందు...‘చాట్జీపీటి కూడా ఆటిజంకు సంబంధించి మనం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతుంది కదా, మరి మీ ప్రత్యేకత ఏమిటి?’ అని డిపార్ట్మెంట్ హెడ్ ప్రశ్నించారు. దీంతో మరింత లోతుగా పరి«శోధించాలనుకున్నారు. గూగుల్ సహకారంతో జరిగిన ‘హాక్థాన్’ వారికి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. నెలరోజుల పాటు మెంటార్షిప్, గూగుల్ క్లౌడ్ టూల్స్కు యాక్సెస్ దొరకడంతో తమ సాంకేతిక విధానాన్ని అన్ని రకాలుగా మెరుగుపర్చుకునే అవకాశం వచ్చింది.స్కోర్ ఆధారంగా....డిపార్ట్మెంట్ హెడ్ ప్రశ్న ముగ్గురిని విస్తృతమైన పరిశోధన క్షేత్రంలోకి తీసుకువెళ్లింది. తమ అన్వేషణలో భాగంగా రీట్రైవల్–అగ్మెంటెడ్ జనరేషన్ (ఆర్ఏజీ), ఆగ్నెటిక్ ఏఐలాంటి సాంకేతికతను అధ్యయనం చేయడం ప్రారంభించారు. కుటుంబాలతో ఎక్కువ సమయం గడిపిన కొద్దీ ప్రతి బిడ్డ అవసరాలు భిన్నంగా ఉంటాయని, ఆ అవసరాలకు తగినట్లుగా పరిష్కారాలు ఉండాలని ఆలోచించారు. అప్లికేషన్లో ఏక్యూ పరీక్షను ప్రవేశపెట్టారు. ఇది ప్రామాణికమైన క్లినికల్ స్క్రీనింగ్ సాధనం. దీనిని మరింత పర్సనలైజ్డ్గా తీర్చిదిద్దారు.‘తల్లిదండ్రుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చినప్పుడు చాట్బాట్ స్కోర్ను రూపొందిస్తుంది. స్కోర్ 20 కంటే తక్కువ ఉంటే తక్కువ అని, 20 నుండి 30 మధ్య ఉంటే మధ్యస్థం అని, 30 కంటే ఎక్కువ ఉంటే సమస్య అధికం అని అర్థం. వీటి ఆధారంగా మేము సమాధానాలను సర్దుబాటు చేస్తాం’ అని విపులీకరించాడు అభిషేక్.రెండో దశలో భాగంగా థెరపిస్ట్లతో మాట్లాడి వారు నిర్వహించే సెషన్లలోని విషయాల గురించి తెలుసుకున్నారు. ఆటిజం పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులు రోజువారీగా ఎదుర్కొనే ఇబ్బందులు... అస్మాత్తుగా తీవ్రమైన కోపం, నిద్ర సమస్యలు... మొదలైన వాటిని దృష్టిలో పెట్టుకొని బిహేవియరల్ ట్రాకర్ను రూపొందించారు. డైలీ ట్రాకర్పిల్లల్లో కొన్ని కీలక ప్రవర్తనలను (కీ బిహేవియర్స్) గుర్తించాం. నిద్ర తీరు, సంభాషణ, మానసిక స్థితి... మొదలైన వాటి ఆధారంగా తల్లిదండ్రులు తమ పిల్లల అవసరాలను నిరంతరం పర్యవేక్షించేలా డైలీ ట్రాకర్ను రూపొందించాం. తల్లిదండ్రులు రోజూ నమోదు చేసే వివరాలను వీక్లి ఇన్సైట్స్గా కన్వర్ట్ చేస్తుంది సిస్టమ్. కీలకమైన ప్రవర్తనల ఆధారంగా ఆటిజం ఉన్న పిల్లలను దృష్టిలో పెట్టుకొని డ్యాష్బోర్డ్ తయారవుతుంది. పిల్లలకు ఏమైనా సమస్యలు ఎదురైనప్పుడు ఏం చేయాలో తల్లిదండ్రులకు అర్థం కాకపోతే చాట్బాట్ను అడగవచ్చు. అది క్షణాల్లోనే సమాధానం ఇస్తుంది.– అభిషేక్ -
ఆ ఒక్క ఫోన్ కాల్తో జీవితం మారిపోయింది!
1973 ఏప్రిల్ 3. న్యూయార్క్ నగరంలోని మన్హటన్ వీధులు ఎప్పటిలాగే రద్దీగా ఉన్నాయి. సిక్స్త్ ఎవెన్యూలో అటు ఇటు నడుస్తున్న జనం మధ్య ఒక వింత దృశ్యం ఆవిష్కృతమైంది. మోటరోలా కంపెనీలో పనిచేసే మార్టిన్ కూపర్ (martin cooper) అనే ఇంజినీర్ ఒక కిలో బరువు, తొమ్మిది అంగుళాల పొడవున్న ఒక ఇటుక లాంటి వస్తువును చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నాడు. చుట్టుపక్కల వారు ఆశ్చర్యంగా చూస్తున్నారు.అప్పటి వరకు ఫోన్ అంటే ఒక వైరుతో గోడకు అతుక్కుని ఉండాలి, లేదా కారులో భారీ బ్యాటరీల సాయంతో నడవాలి. కానీ కూపర్ చేతిలో ఉన్నది ఒక ‘పోర్టబుల్’ సెల్యులార్ ఫోన్. పేరు డైనాటాక్. దాని నుంచి వెళ్ళిన మొదటి కాల్ ఎవరికో తెలుసా? అతని ప్రత్యర్థికి! అవును, బెల్ లాబొరేటరీస్లో తనలాగే మొబైల్ టెక్నాలజీపై పనిచేస్తున్న జోయెల్ ఏంగెల్కు కూపర్ కాల్ చేశాడు. ‘జోయెల్, నేను ఒక నిజమైన పోర్టబుల్ సెల్యులార్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను’ అని గర్వంగా ప్రకటించాడు. ఈ మాటలు విన్న ప్రత్యర్థి నుంచి చాలాసేపటివరకూ నిశ్శబ్దమే సమాధానం అయ్యింది. అది కేవలం ఒక ఫోన్ కాల్ మాత్రమే కాదు, ఒక ఆధిపత్య పోరాటంలో విజయ ప్రకటన!అప్పట్లో అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ (ఏటీ అండ్ టీ) సంస్థకు టెలిఫోన్ రంగంలో గుత్తాధిపత్యం ఉండేది. కారులో బ్యాటరీ సాయంతో పనిచేసే మొబైల్ రేడియో ఫోన్లను ఆ కంపెనీ తయారు చేసేది. కూపర్ ‘మనిషికి విముక్తి కావాలి, కారుకు ఫోన్ కట్టేయడం ఏమిటి?’ అని ప్రశ్నించేవాడు. 1947లోనే బెల్ లాబ్స్ శాస్త్రవేత్తలు ఒక పెద్ద ప్రాంతాన్ని చిన్న చిన్న ‘సెల్స్’గా విభజించి సమాచారాన్ని చేరవేయవచ్చని సిద్ధాంతీకరించారు. ఆచరణలో అది సాధ్యం కావడానికి దశాబ్దాలు పట్టింది.చదవండి: గుర్రం లాగిన రైలుబండి1950ల నాటి మొబైల్ ఫోన్లు సుమారు 18 నుంచి 36 కిలోల బరువుండేవి. కూపర్ సృష్టించిన డైనాటాక్ వచ్చే వరకు అవి మనిషి చేతిలోకి రాలేదు. అది సామాన్యులకు అందుబాటులోకి రావడానికి మరో పదేళ్లు పట్టింది. 1983లో మోటరోలా డైనాటాక్ గీ మార్కెట్లోకి వచ్చినప్పుడు దాని ధర 3,995 డాలర్లు. ధనవంతులకు, వ్యాపార వేత్తలకు మాత్రమే అది పరిమితమైంది.అదృశ్య బంధనాల్లో మనిషిఈ మొబైల్ విప్లవం మనిషి జీవన శైలిని పూర్తిగా మార్చేసింది. ఇంటికి వెళ్తే ఆఫీసు పనితో సంబంధం ఉండేది కాదు. కానీ ఇప్పుడో? 24 గంటలూ ఎవరో ఒకరికి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి! సామాజికంగా చూస్తే, మనుషుల మధ్య దూరం పెరుగు తోంది. పక్కనే కూర్చున్న వ్యక్తితో మాట్లాడటం మానేసి, వేల మైళ్ల దూరంలో ఉన్న వ్యక్తితో ఫోన్లో గడపడం మనకు అలవాటైంది. ఉద్యోగ ఒత్తిడి మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకప్పుడు ‘ఇటుక’లా ఉన్న ఫోన్, ఇప్పుడు మన మెదడును నియంత్రించే ఒక మహాశక్తిగా మారింది.చదవండి: జేఈఈ మెయిన్స్ ఆఫ్లైన్లో పెట్టలేరా?సాంకేతికత రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. అది ఇచ్చే సౌకర్యాలను అనుభవిస్తూనే, అది మన సామాజిక విలువ లను, వ్యక్తిగత ప్రశాంతతను దెబ్బతీయకుండా చూసుకోవడం మన బాధ్యత. కూపర్ ఆ రోజు వేసిన అడుగు ప్రపంచాన్ని దగ్గర చేసింది, కానీ మనల్ని మనకు దూరం చేయకుండా చూసు కోవాల్సిన బాధ్యత మన పైనే ఉంది. మొబైల్ కాల్ కేవలం ఒక ఇంజినీరింగ్ విజయం మాత్రమే కాదు, అది మానవ పరిణామ క్రమంలో ఒక కొత్త అధ్యాయం. -
ఒంటరితనం తెచ్చిపెడుతున్న ముప్పు..
ఇల్లు ఆమెదే! ఆ ఇంటికి ఆమే యజమానురాలు! ఉదయం లేచింది మొదలు భర్త, పిల్లలు, అత్త, మామ..ఇంటిల్లిపాది అవసరాలు చూడటంలో క్షణం తీరికలేనట్టు ఉరుకులు, పరుగులు.. కానీ, ఆమె ఎప్పుడూ ఒంటరితనం మూటను భుజాన వేసుకునే ఉంటుంది. ఎవ్వరితోనూ చెప్పుకోలేని సమస్యల నిశ్శబ్దాన్ని మోస్తుంది.శరీరంలో వచ్చే మార్పులు, కుటుంబ బాధ్యతల చిక్కులు, ఆర్థిక అవసరాలు, సామాజిక ఒత్తిళ్లు... వీటిల్లో తనను తాను ఎక్కడో పోగొట్టుకున్నట్టు తెలియని శూన్యం ఆవరించినట్టు ఆత్మహత్యలవైపు అడుగులు వేస్తుందా..?! ఈ రోజుల్లో వివిధ దశలలో మహిళలు ఒంటరితనం అనుభవిస్తూ ఆత్మహత్యలు చేసుకునే శాతం పెరుగుతోందని నివేదికలు చూపుతున్నాయి. కారణాలు ఉంటే.. పరిష్కారమూ ఉంటుంది..యాభై ఏళ్ల కిరణ్మయి చెన్నైలో తన కుమార్తె ఇంట్లో ఆత్మహత్యకు ప్రయత్నించింది. భర్త రిటైర్ అయిన తర్వాత ఆమె కుమార్తె కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఓరోజు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. సకాలంలో ఆమెను ఆసుపత్రిలో చేర్చడంతో గండం నుంచి బయటపడింది. ఎందుకిలా చేశావని అడిగితే – ‘నా ఇంట్లో నేనే కనిపించకుండా పోయినట్టుగా అనిపించింది. నా మాటకు ఎక్కడా విలువలేదు’ అని చెబుతూ ఎంతో బాధపడింది. మెనోపాజ్ సమయంలో ఆమె భావోద్వేగ సంబంధ మార్పులు, చిరాకు, నిద్రలేమి వంటి సమస్యలను ఎదుర్కొంది. తన పరిస్థితిని ఎవరికైనా చెప్పుకోబోతే ‘అతిగా ఆలోచిస్తున్నావు, అంతే’ అని తేలికగా కొట్టిపారేసేవారు ఇంట్లో. అందుకే, ఆ నిర్ణయం తీసుకుందామె. రవీనా శరణ్ అనే న్యాయవాదికి నాల్గవ నెల ప్రెగ్నెన్సీలో గర్భస్రావం జరిగింది. ఆ బాధకన్నా ‘మేం ముందే చెప్పాం, జాగ్రత్తగా ఉండమని..’ అనే మాటలు తరచూ వినాల్సి రావడమే పెద్ద బాధ. దానిని అధిగమించలేక... ఎవరితో కలవలేక ఒంటరితనంతో బాధపడుతూ ‘ఈ గిల్ట్తో నేను చనిపోయేదాన్నే’ అంటోంది.ఈ మహిళల వయస్సు, పరిస్థితులు వేరయినా, వారి బాధ ఒకటే. భారతదేశంలో మహిళల మానసిక ఆరోగ్య సమస్యలకు సామాజిక ఒత్తిళ్లు, హార్మోన్ల మార్పులు, లింగవివక్ష, ఆర్థిక సమస్యలు ప్రధాన కారణాలు అవుతున్నాయి. కొన్ని హెల్త్ సర్వేల ప్రకారం ఇటీవల మహిళల్లో డిప్రెషన్, ఆందోళన ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా పురుషుల కంటే మహిళల్లోనే కుంగుబాటు ఎక్కువగా ఉందట.నిశ్శబ్దానికి బ్రేక్...ఆత్మహత్యల్లో 15–34 సంవత్సరాల లోపు మహిళలు 63 శాతం ఉండగా, తల్లుల మరణాల్లో ఈ శాతం 39గా ఉంది. ప్రతి 5గురిలో ఒక తల్లి మానసిక ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటుంది.70–80 శాతం మందికి తగిన చికిత్స అందట్లేదు. మహిళలు మౌనంగా బాధపడుతూ ‘బలంగా’ ఉండాలని చెప్పే గతకాలపు సూక్తుల వల్ల కూడా బయటకు చెప్పుకోలేని మధనంలో కాలం వెళ్లదీస్తున్నారనేది నిపుణుల మాట. మహిళల్లో సాధికారత పెరిగితే, ఒంటరితనం సమస్యలు తగ్గుముఖం పడతాయి.గుర్తించకపోవడమే అసలు సమస్య...మన దేశంలో మనస్తత్వ నిపుణుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మానసిక వ్యాధుల ఆర్థిక భారం దేశంలో 2030 నాటికి లక్ష కోట్లు దాటే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ఆశ్చర్యం ఏమిటంటే మహిళల మానసిక సమస్యలను ఒక సమస్యగా గుర్తించకపోవడం కూడా దీనికి ప్రధానకారణం.ఎందుకు ఒంటరితనం అంటే...జీవితం అంతా కుటుంబానికే అంకితం చేయడం. వ్యక్తిగత ఆసక్తులు, స్నేహితులను, కెరియర్ను వదిలేయడం. భర్త బిజీగా ఉండి, ఎమోషనల్గా కనెక్ట్ అవకపోవడం. చుట్టూ అందరూ ఉన్నా మనసులో ఎవరూ లేనట్టుగా అనిపించడం. ఇది చాలా చిన్న విషయం, ఎవరో దీనికన్నా పెద్ద సమస్యలు ఎదుర్కొంటున్నారని భావించడం. ఇవి ఇలాగే కొనసాగితే, జీవితంలో ఉత్సాహం స్థానంలో నిస్సత్తువ ఆవరిస్తుంది. ఎలా అధిగమించాలంటే..ముందు తనకు తాను ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. సమస్యను ఒక బలహీనతగా చూడకూడదు. నచ్చిన పనులవైపు దృష్టి పెట్టమని చెప్పే ఒక సంకేతంలా భావించాలి. స్వీయ ఆసక్తులు, అభిరుచులవైపు మనసు మళ్లించుకోవాలి. కొత్తగ్రూప్స్తో కనెక్ట్ అవ్వాలి. అంటే, ఉదయం వేళల్లో యోగా, వాకింగ్ గ్రూప్లలో చేరడం, అభిరుచికి తగిన క్లాసుల్లో చేరితే కొత్త నైపుణ్యాలవైపు దృష్టి మరల్చవచ్చు, కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవచ్చు. దీనివల్ల మైండ్లో చేరిన గ్యాప్ మెల్ల మెల్లగా ఫిల్ అవుతుంది.ఉద్యోగినులైతే సాయంకాలం ఇంటికి చేరుకున్నాక వెంటనే తమ ఒంటరి ప్రపంచంలోకి వెళ్లకుండా, గంటసేపైనా ఇంట్లో వాళ్లతో కబుర్లు చెప్పగలగాలి. లేదా, తమవారితో ఫోన్లోనైనా మనసు విప్పి మాట్లాడగలగాలి. ఎంత పెద్దసమస్య అయినా తన భావాలను ఎవరితోనైనా పంచుకోవాలి. మనసుకు నచ్చిన విషయాలను రాయడం, చదవడం వంటివి కూడా ఒంటరితనాన్ని దూరం చేస్తాయి. మహిళలు ఎప్పుడూ ఇతరుల కోసం జీవిస్తారు. కానీ, తమకోసం తాము జీవించడం నేర్చుకున్నప్పుడు జీవనశైలి కూడా మెరుగవుతుంది. కొత్త గ్రూప్స్తో కనెక్ట్ అవ్వాలిమనిషి ఇంట్లో ఉన్నా మనసు ఎక్కడో ఉన్నట్టు ఫీలయితే ఒంటరితనాన్ని మోస్తున్నట్టే. మనిషి ఎంత దూరంలో ఉన్నా మనసు తమ వారికి దగ్గరగా ఉంటే ఒంటరి కానట్టే. ఇంట్లో తమ ప్రాధాన్యత తగ్గిందనో, ఎవరూ పట్టించుకోవడం లేదనో, ఏదైనా అపరాధన భావనో, సన్నిహితులు దూరమయ్యారనో, ఆర్థిక పరిస్థితులు బాగా లేవనో, బతుకు భారంగా మారిందనో.. అందరిలో ఉన్నా ఒంటరితనాన్ని అనుభవించే రోజులు పెరిగితే, ఇక జీవితాన్ని చాలించాలనుకునే ఆలోచనలూ పెరుగుతుంటాయి. సూసైడ్ టెండెన్సీ ఉన్న వాళ్లలో రెండు నెలల ముందు నుంచే ఆత్మహత్య చేసుకుంటామన్న విషయాన్ని బయటకు ఏదో ఒక రూపకంగా చెబుతుంటారు. ఇలాంటి మాటలు విన్నప్పుడు ఇంట్లోనూ, సన్నిహితులు అలెర్ట్ అయ్యి, కౌన్సెలర్ సాయం తీసుకుంటే ఈ సమస్యను అధిగమించవచ్చు. – డాక్టర్ సునీతా ప్రసాద్, సైకాలజిస్ట్ – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఐసీఏఆర్-ఐఏఆర్ఐ డైరెక్టర్కి ఎం.ఎస్. స్వామినాథన్ పురస్కారం
ఐసీఏఆర్–భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ICAR–IARI) డైరెక్టర్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.హెచ్. శ్రీనివాసరావును ప్రతిష్టాత్మక 'ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్' జాతీయ అవార్డు (2024–25)కు ఎంపిక చేసినట్లు రిటైర్డ్ ఐసీఏఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (RICAREA) ప్రకటించింది. భారత ఆహార భద్రత కోసం విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలకు గుర్తింపుగా నుజివీడు సీడ్స్ లిమిటెడ్ (NSL) సహకారంతో 2004-05లో ఈ అవార్డును నెలకొల్పారు. డా. ఎం.ఎస్. స్వామినాథన్ జన్మ శతాబ్ది సంవత్సరంలో ఈ అవార్డును ప్రకటించడం విశేషం.వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఎనిమిది మంది ప్రముఖ శాస్త్రవేత్తలు ఇప్పటివరకు ఈ గౌరవాన్ని పొందారు. ఆ జాబితాలో ఇప్పుడు డా. శ్రీనివాసరావు చేరారు. గతంలో ఈ అవార్డు పొందిన వారిలో డా. గెండా లాల్ జైన్ (పౌల్ట్రీ), డా. ఎస్. నాగరాజన్ (ప్లాంట్ పాథాలజీ), డా. వి. ప్రవీణ్ రావు (మైక్రో ఇరిగేషన్), డా. పి.వి. సత్యనారాయణ (వరి వంగడాలు) వంటి ప్రముఖులు ఉన్నారు.మాజీ ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డా. త్రిలోచన్ మోహపాత్ర అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ అత్యంత పారదర్శకంగా ఈ ఎంపికను చేపట్టింది. ఈ కమిటీలో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ గ్రహీత డా. విజయ్ గుప్తా, డా. బాల రవి, ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ డా. సౌమ్య స్వామినాథన్ సభ్యులుగా వ్యవహరించారు.విశిష్ట సేవలు..వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులు, సహజ వనరుల యాజమాన్యంలో డా. రావు చేసిన పరిశోధనలు అమోఘం.పర్యావరణ ప్రభావం: 40 లక్షల హెక్టార్లలో వనరుల పరిరక్షణ సాంకేతికతను అమలు చేయడం ద్వారా ఏటా రూ. 380 కోట్ల డీజిల్ ఖర్చును ఆదా చేయడంలో కీలక పాత్ర పోషించారు.వాతావరణ అనుకూలత: 637 జిల్లాలకు వ్యవసాయ ఆకస్మిక ప్రణాళికలు, 151 వాతావరణ తట్టుకునే గ్రామాలను రూపొందించారు.విద్యా రంగం: ఇప్పటివరకు 363 పరిశోధనా పత్రాలను, 57 పుస్తకాలను ప్రచురించారు.అవార్డు ప్రధానోత్సవం:బంగారు పతకం, ప్రశంసా పత్రం రూ. 2,00,000 నగదుతో కూడిన ఈ పురస్కారాన్ని ఏప్రిల్ 18న అందజేయనున్నారు.(చదవండి: సాహసం శ్వాసగా సాగిపో బామ్మ..!) -
తొమ్మిది పదుల వయసులో స్కూల్కి..! ఏకంగా 98% మార్కులు ..
తొమ్మిది పదుల వయసులో చదవాలనుకోవడమే ఓ గొప్ప. అలాంటిది ఏకంగా పాఠశాలకు వెళ్లి చదవుకోవడమే గాక, పరీక్షల్లో రికార్డు స్థాయి మార్కులతో అందర్నీ ఆశ్చర్యపరిచింది. నడు వండిపోయి, కనికనిపించని కళ్లతో చదవాలనే ఆమె ఆసక్తి అందర్నీ అమితంగా ఆకర్షించింది. ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి వయసు ఎన్నటికి అడ్డంకి కాదని ఈ బామ్మ తన విజయంతో నిరూపించింది. ఆ బామ్మే కేరళకు చెందిన కార్త్యాయని అమ్మ. కేరళలోని అలప్పుజ జిల్లాలోని చెప్పాడ్ గ్రామంలో 1922లో జన్మించారు. తన తరంలోని చాలామంది అమ్మాయిలులాగే చదువు అనేది ఆమెకు అంత ప్రాధాన్యం లేనిదిగా ఉంది. ఆమెకు ఆ సమయంలో కనీసం ప్రాథమిక విద్యను చదువుకునే అవకాశం కూడా లేదు. పేదరికం, కుటుంబ బాధ్యతలు, ఆమెను చిన్న వయసులోనే బడికి దూరం చేశాయి. తరగతి గదులకు బదులుగా ఆమె బాల్యం పనితో నిండిపోయింది. చివరికి ఆమెకు పెళ్లై, ఆరుగురు పిల్లలను పెంచింది. ఏళ్ల తరబడి ఇంటి పనిమనిషిగా వీధి ఊడ్చే పనిచేస్తూ శారీరక శ్రమోత కూడిన పనులతో కుటుంబాన్ని పోషించుకునేది. ఆమెకు చదవడం, రాయడం ఇతరులకు తెలిసిన నైపుణ్యాలుగా మిగిలిపోయాయి. దశాబ్దాలుగా ఆమె జీవితం అలానే గడిచిపోయింది. అయితే ఆమె కథ అక్కడితో ఆగిపోలేదు. తొంభై ఏళ్ల వయసులో అనూహ్యమైన మలుపు తీసుకుంది. మళ్లీ చదువుపైకి ధ్యాస..ఆమెను చదువుపైకి ఆసక్తి కలిగించే క్షణం ఆమె కూతురు కారణంగానే వచ్చింది. ఆమె కూతురు 60 ఏళ్ల వయసులో అక్షరాస్యత తరగతిలో చేరి పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించినప్పుడు ఈ బామ్మలో గొప్ప చైతన్యం వచ్చింది. నా కూతురే చేయగలిగినప్పుడు తను ఎందుకు చేయకూడదు అనుకుంది. అంతే అనుకున్నదే తడువుగా 96 ఏళ్ల వయసులో కార్తాయని అమ్మ కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ అథారిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న కేరళ అక్షరలక్ష్యం అక్షరాస్యత కార్యక్రమంలో చేరారు. పాఠశాల విద్యను కోల్పోయిన పెద్దలకు చదవడం, రాయడం ప్రాథమిక గణితం నేర్పించడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇక్కడ కార్త్యాయని అమ్మ చదువుకి అండగా మనవళ్లు, మునిమనవళ్లు నిలిచారు. వారు అక్షరాలు, పదాలు, అంకెలు నేర్చుకోవడంలో సహాయపడ్డారు. కొన్నిసార్లు ఇంట్లోనే మరికొన్ని సార్లు సాయంత్రం పూట మసక వెలుతురులో పాఠాలు జరిగేవి. నెమ్మదిగా ఆమెకు అక్షరమాల అర్థమవ్వడం మొదలైంది. ఆ తర్వాత బామ్మ 2018లో కేరళ వ్యాప్తంగా 40,000 మందికి పైగా అభ్యర్థులతో కలిసి అక్షరాస్యత పరీక్ష రాశారు. వారిలో ఆమెనే అత్యంత వయసు పైబడిన అభ్యర్థి. ఆ పరీక్ష మొత్తం రీడింగ్, రైటింగ్, గణితం ఇలా మూడిటిపై జరిగింది. ఎందో ఆసక్తిగా ఎదురుచూసిన ఫలితాలు వెలువడ్డాయి. ఆ తొంభై ఏళ్ల వృద్ధురాలు ఆ పరీక్షలో నూటికి 98 మార్కులు సాధించి మొత్తంలో కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిలో ఒకరిగా నిలిచింది. ఆమె రీడింగ్, గణితం రెండింటిలోనూ పూర్తి స్కోరు సాధించగా, రీడింగ్ దాదాపు వంద శాతం మార్కులు సాధించింది. ఆ బామ్మ విజయం స్థానికంగానే కాకుండా రాష్ట్రవ్యాపతంగా గణనీయమైన దృష్టిని ఆకర్షించింది. మీడియా ఆ బామ్మను గొప్ప అక్షరాస్యత ఉద్యమానికి గౌరవనీయమైన "ఆదర్శప్రాయమైన అమ్మమ్మ"గా కీర్తించాయి. అంతేగాదు అధికారులు ఆమె విజయాలను ప్రశంసా పత్రాలతో సత్కరించడానికి ముందుకు రావడం విశేషం. 96 ఏళ్ల ఈ బామ్మ కథ వేలాదిమందికి, యువతకు స్ఫూర్తిగా నిలిచింది. ఆమె విజయానికి ఎంత గుర్తింపు లభించిందంటే..2019లో విద్యను ప్రోత్సహించే అంతర్జాతీయ సంస్థ అయిన కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్కు గుడ్విల్ అంబాసిడర్గా ఎంపకయ్యేలా చేసింది. ఇక ఈ బామ్మ 2023 అక్టోబర్లో 101 ఏళ్ల వయసులో మరణించారు. ఆమెకు చదువుకోవాలన్న కోరిక ఉన్న దశాబ్దాలు సాధ్యం కాలేదు. దొరకిన అవకాశాన్ని ఈ వయసులోనా అనే సంశయానికి తావివ్వకుండా వినియోగించుకోవడం విశేషం. అలాగే అందర్నీ ఆశ్చర్యపరిచేలా రాణించి..మరణాంతరం కూడా ఆమె విజయం గుర్తుండిపోయేలా ప్రేరణగా నిలిచింది కార్త్యాయని. (చదవండి: పిల్లలను అలా పెంచాలి..! న్యూరో సెంటిస్ట్ పేరెంటింగ్ టిప్స్) -
‘డాడీ’ అని పిలుస్తున్న పిల్లలు… కానీ చట్టం ఒప్పుకోదా..?
ఆమె తన మొదటి భర్తతో హిందూ వివాహ చట్టం ద్వారా 2015లో విడాకులు పొందిన తర్వాత నేను ఆమెను 2016లో వివాహం చేసుకున్నాను. ఆమెకు మొదటి వివాహం ద్వారా ఒక అబ్బాయి, ఇద్దరు కవల అమ్మాయిలు ఉన్నారు. అబ్బాయిని తండ్రి తన సంరక్షణలోకి తీసుకున్నాడు కానీ అమ్మాయిల బాధ్యత ఏనాడూ పట్టించుకోలేదు. ఇద్దరు అమ్మాయిలు 2015 నుండి నా భార్యతోనే ఉంటున్నారు. ప్రస్తుతం వారికి 12 సంవత్సరాలు. నేను వారిని నా పిల్లల్లాగే చూసుకుంటున్నాను. నన్ను వాళ్ళు ‘డాడీ’ అని పిలుస్తారు. అందువల్ల ఇంక నాకు మళ్ళీ పిల్లలు వద్దు అని నిర్ణయించుకున్నాను. నా భార్య గతంలో తన మాజీ భర్త నుండి తీవ్రమైన గృహహింసకు గురైంది, ముఖ్యంగా కవల పిల్లలకు (అమ్మాయిలకు) జన్మనిచ్చిన కారణంగా. ఇద్దరు అమ్మాయిలను నేను చట్టపరంగా దత్తత తీసుకుని, నా ఇంటిపేరు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అతని నుంచి దత్తతకు అనుమతి పొందడం అసాధ్యం. నా మీద కూడా కక్షధోరణి ఉంటుంది. తండ్రి అనుమతి లేకుండా దత్తత తీసుకోవడం సాధ్యమా? సాధ్యం కాకపోతే, ఏ చట్టపరమైన మార్గాలు ఉన్నాయి?– మచ్చా అనికేత్, విశాఖపట్నం ముందుగా మీకు మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. కంటేనే సంతానం కాదు – ప్రేమానురాగాలకు పేగుబంధమే అవసరం లేదు అని నిరూపించారు. మీరు తీసుకున్నది చాలా మంచి నిర్ణయం.మీ సమస్యలోని సున్నితత్వాన్ని , భావోద్వేగాలను అర్థం చేసుకోగలను. భారతదేశంలో, పైగా హిందూ చట్టాలలో పిల్లల తల్లి/తండ్రి బతికే ఉంటే, సాధారణంగా ఏ ఒక్కరి అనుమతి లేకుండా దత్తత సాధ్యం కాదు. మీ కేసులో కూడా తండ్రి అనుమతి కావాలి.ఎందుకంటే...1. దత్తత తీసుకున్న తర్వాత జన్మనిచ్చిన తండ్రి హక్కులు పూర్తిగా ముగుస్తాయి.2. మీరు చట్టపరంగా తండ్రిగా మారతారు.3. ఆస్తి, వారసత్వ హక్కులు మారతాయి.ఈ పరిస్థితుల్లో తండ్రి అనుమతి లేకుండా కోర్టు దత్తతకు అనుమతించాలి అంటే ఈ కింది అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది.1. తండ్రి పిల్లలను ఉద్దేశపూర్వకంగా వదిలేశారా?2. పిల్లలను ఇన్ని సంవత్సరాలుగా చూసుకున్నారా లేదా – కనీసం వారి బాగోగులు పట్టించుకున్నారా లేదా?3. తండ్రి హింసాత్మకంగా లేదా పిల్లల పోషణకు అనర్హుడిగా ఉన్నారా?4. పిల్లలకు అతని వల్ల హానికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందా?ఈ అంశాలను కోర్టు మాత్రమే నిర్ణయించగలదు – మీ సొంత నిర్ణయాలు చెల్లవు. ముందుగా కస్టడీ/గార్డియన్షిప్ పొందడం కోసం మీ భార్య ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలి. పిల్లలు 2015 నుండి తనతోనే ఉన్నారని. తండ్రి బాధ్యతలు నిర్వర్తించలేదని / హింస (ఆర్థిక, మానసిక, శారీరక) చేశాడని, పైన తెలిపిన అంశాలకు ΄ాల్పడ్డాడు అని నిరూపించాలి.ఆ తర్వాత మీరు దత్తత కోసం కోర్టులో పిటిషన్ వేయవచ్చు. అందులోనే తండ్రి అనుమతి అవసరం లేదని కూడా కోర్టును అభ్యర్థించవచ్చు. పిల్లలు 12 సంవత్సరాలు ఉన్నందున కోర్టు వారి అభి్ర΄ాయం అడగవచ్చు. వారు మీతోనే ఉండాలని కోరుకుంటున్నారు, జన్మనిచ్చిన తండ్రిపై వారికి ఎటువంటి ప్రేమ లేదు అంటే అది మీకు బలమైన అంశంగా మారుతుంది. చట్టపరంగా దత్తత తీసుకోకుండా సర్టిఫికెట్లలో ఎటువంటి మార్పులు చేయకండి. భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు తల ఎత్తవచ్చు. మీ దగ్గరలోని మంచి లాయర్ గారిని కలవండి. మీ భార్యకు తన మాజీ భర్తకు జరిగిన కోర్టు వివాదాలు, పత్రాలు, ఒప్పందాలు ఏవైనా ఉంటే తీసుకుని వెళ్ళండి. మాజీ భర్త తన పిల్లలను ఏనాడు పట్టించుకోలేదు అని చెప్పడానికి ఆధారాలు సేకరిస్తే మరీ మంచిది. -
పిల్లలను అలా పెంచాలి..! న్యూరో సెంటిస్ట్ పేరెంటింగ్ టిప్స్
పిల్లల పెంపకంపై చాలామంది నిపుణులు, ప్రముఖులు అమూల్యమైన సలహాలు అందించడం తెలిసిందే. కానీ తాజాగా దీనిపై న్యూరో సైంటిస్ట్ ఆసక్తికరమైన సలహాలు సూచనలందించారు. పిల్లను అలా పెంచితేనే ప్రయోజకులవుతారని నమ్మకంగా చెప్పారు. సిస్టమేటిక్వేలో పెంచడం కాదు..ఛాలెంజ్లను ఎదుర్కొనే ధీరుల్లా పెంచడం ఎలాగో సవివరంగా వివరించారు. మరి అవేంటో తెలుసుకుందామా..!.అమెరికాకు చెందిన న్యూరోసైంటిస్ట్, వ్యవస్థాపకురాలు వివియెన్ మింగ్ నేటి విద్యావ్యవస్థ ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్(ఏఐ) రూపుదిద్దుకునే భవిష్యత్తుకు అనుగుణంగా పెంచడం లేదని అన్నారు. చాలా పాఠశాలలు ఇప్పటికీ బట్టిపట్టడం, పరీక్ష స్కోర్లపైనే దృష్టిసారిస్తున్నాయని అన్నారు. అయితే వీటన్నింటిని ఐఏ ఇప్పటికే వేగవంతంగా సమర్థవంతంగా చేయగలదని అన్నారు. తమ పిల్లలు భవిష్యత్తులో మంచి ప్రయోజకులుగా మారాలనకునే తల్లిదండ్రులు ఈ మూడు చిట్కాలను ఫాలో అవ్వాలని అన్నారు. అలాగే వారిని రోబోట్ ప్రూఫ్గా ఎలా పెంచాలో కూడా తెలిపారు. ఆమె దీనిని వేలాదిమంది పరిశోధన చేసి మరి చెబుతున్నారు. లోతైన పరిశోధనలకు మూలం తప్పిదాలే అని అన్నారు. వైఫల్యాలను అంగీకరించే విద్యార్థులు స్ట్రాంగ్గా తయావుతారని, పైగా బలమైన నైపుణ్యాలను అందిపుచ్చుకోగలరని అన్నారు.హార్వర్డ్ ఎఫెక్ట్..అంటే ఊహకందని ఆవిష్కరణలను ప్రోత్సహించే వాతావరణాన్ని ఉద్దేశపూర్వకంగా సృష్టిచడం అని చెప్పారు. పిల్లల్లో దాగున్న విభిన్న ఆసక్తులను అన్వేషించాలి, ప్రశ్నలు అడగాలి, ముగింపు లేని సమస్యలపై పనిచేసేలా చేయాలి. అది వాళ్లను జ్ఞానాన్ని సముపార్జించేలా చేసి సామర్థ్యాలను పెంపొందించేలా చేస్తుందని అన్నారు.ఏఐ కంటే జీనియస్గా..ఇక పిల్లలు ఏఐని సాధనంగా ఉపయోగించాలి కానీ, ఆలోచనలకు ప్రత్యామ్నాయంగా కాదని అన్నారు. ఫీడ్బ్యాక్ కోసం ఉపయోగించొచ్చు కానీ, ముందుగా మాత్రం వారి స్వంత ఆలోచనలను పెంపొదించుకోవాలని అన్నారు. తాను 30 ఏళ్లుగా మెషిన్ లెర్నింగ్తో ఆడుకుంటున్నాను అయితే లార్జ్ లెర్నింగ్ మోడల్స్ (LLMలు) నిరంతర సహచరుడిగా ఉండే ప్రపంచంలోకి ఇప్పుడిప్పుడే అడుగుపెడుతున్న ఈతరానికి కష్టమైనది దానికే వదిలేయాలన్న బలహీనతగా ఎక్కువగా ఉంటుందనేది గుర్తెరగాలని అన్నారు. అందుకే పిల్లలను ఐఏకి మించిన నైఫుణ్యలను అందిపుచ్చుకునేలా పెంచాలి. అంటే వారిలో..సృజనాత్మకత: పిల్లలకు సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం, వారు కొత్త ఆలోచనలు, పరిష్కారాలను కనుగొనేలా చేయడంభావోద్వేగ నైపుణ్యాలు: ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం, సహాయం చేయడం, సానుభూతి చూపించడం వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేయడం.సామాజిక నైపుణ్యాలు: పిల్లలు ఇతరులతో ఎలా మాట్లాడాలో, సంబంధాలు ఎలా నిర్మించాలో నేర్చుకోవడం.సమస్యలు పరిష్కరించే సామర్థ్యం: సాంకేతికతను ఉపయోగించి సమస్యలను ఎలా పరిష్కరించాలో నేర్చుకోవడం.ఈ విధంగా, పిల్లలు రోబోట్స్ చేయలేని పనులను చేసేలా పెంచితే..భవిష్యత్తులో మరింత విలువైన వ్యక్తులుగా, గొప్ప ప్రయోజకులుగా మారతారని చెబుతున్నారు న్యూరో సైంటిస్ట్ మింగ్.(చదవండి: గాయనికి 'స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్'..! ఎందువల్ల వస్తుందంటే..) -
గాయనికి 'స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్'..! ఎందువల్ల వస్తుందంటే..
ప్రపంచ ప్రఖ్యాత ఫ్రెంచ్ కెనడియన్ పాప్ గాయని సెలిన్ డియోన్ తన గాత్ర నైపుణ్యం, ఉద్వేగభరితమైన మ్యూజిక్ ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందింది. 'టైటానిక్' చిత్రంలోని 'మై హార్ట్ విల్ గో ఆన్' పాటతో పాటు 90ల నాటి అనేక అంతర్జాతీయ హిట్లకు ప్రసిద్ధి చెందింది. అంత ప్రసిద్ధి గాంచిన గాయని 'స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్' అనే అరుదైన వ్యాధి బారినపడింది. దాంతో సంగీతానికి గత కొంతకాలంగా పూర్తిగా విరామం ఇచ్చేశారామె. మళ్లీ ఇన్నేళ్లకు తన 58వ పుట్టిన రోజు నేపథ్యంలో మ్యూజిక్ లైవ్ షోలలో పాల్గొననుట్లు అభిమానులతో పంచుకుంది. సెలిన్ని కెరీర్కి దూరమయ్యేలా చేసిన అరుదైన 'స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్' వ్యాధి అంటే ఏంటి? ఎందువల్ల వస్తుందంటే..గాయని సెలిన్ డియోన్కు డిసెంబర్ 2022లో స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్ అనే అరుదైన ఆటోఇమ్యూన్ న్యూరోలాజికల్ డిజార్డర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దాంతో ఆమె గతకొలంగా లైవ్షోలకు బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె లైవ్షో వేదికపైకి తిరిగి రావడానికి సంసిద్ధంగా ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలలో లా డిఫెన్స్ ఎరీనాలో 10 రాత్రుల పాటు ప్రదర్శనలు ఇవ్వనుంది. ఇలా మళ్లీ పూర్తి స్థాయిలో కోలుకుని యథావిధిగా తన కెరీర్ని కొనసాగిచడాన్ని తన జీవితంలోని అత్యుత్తమమైన బహుమతిగా అభివర్ణించింది. మార్చి 2020లో అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన చివరి లైవ్ షో అనంతరం డియోన్ మళ్లీ తొలిసారిగా వేదికపైకి పునరాగమనం చేయనుండటం విశేషం. ఇక డియోన్ ఈ అరుదైన వ్యాది తన గొంతు కదలికలపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు. తన అభిమానులు, శ్రేయాభిలాషుల మద్దతతులో పూర్తి స్థాయిలో కోలుకున్నానని, అందుకు అందరికి కృతజ్ఞతలు అని పేర్కొంది. ఇంతకీ ఆమె ఎదుర్కొన్న అరుదైన వ్యాధి 'స్టిఫ్-పర్సన్ సిండ్రోమ్'అంటే ఏంటి? ఎందువల్ల వస్తుందంటే..స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్ అంటే ?స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్ (SPS) అనేది ఒక అరుదైన ఆటోఇమ్యూన్ న్యూరోలాజికల్ రుగ్మత. ఇది మొండెం, పొత్తికడుపులో కండరాల బిగుతుకు కారణమవుతుంది. కాలక్రమేణ ఈ పరిస్థితి మరింత తీవ్రతరమయ్యే అవకాశాలు ఉన్నాయి కూడా. దీని కారణంగా సంబంధిత రోగులు కాళ్లు, ఇంతర కండరాల్లో బిగువు, ఒక విధమైన నొప్పులను అనుభవిస్తారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు సాధారణ కదలికలు కష్టతరమవుతాయట. ముఖ్యంగా నడవడం కష్టంగా మారిపోతుందట.లక్షణాలు దీనిలో రెండు ప్రధాన లక్షణాలు ఉన్నాయి:కండరాల బిగుతుఈ వ్యాధిలో కనిపించే తొలి సంకేతం ఇదే. ముఖ్యంగా మొండెం భాగంలో - అంటే పొట్ట, ఛాతీ, వీపులో మొదలవుతుంది. ఇది నిరంతర బిగుతుగా లేదా నొప్పితో కూడిన బాధగా అనిపిస్తుందట. ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా ఈ బిగుతు రావచ్చు, పోవచ్చు. ఇది తీవ్రమవుతున్న కొద్దీ, చేతులు, కాళ్ళను కూడా ప్రభావితం చేయవచ్చు.కండరాల నొప్పులు (స్పాజమ్స్)ఇవి ఆకస్మికంగా, బాధాకరంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఒక భాగాన్ని లేదా మొత్తం శరీరాన్ని ప్రభావితం చేయవచ్చు. ఈ నొప్పులు కొన్ని సెకన్లు, నిమిషాలు లేదా కొన్నిసార్లు గంటల పాటు కూడా ఉండవచ్చు.లక్షణాలను ప్రేరేపించే అంశాలుబిగ్గరగా లేదా ఊహించని శబ్దాలుశారీరక స్పర్శఉష్ణోగ్రతలో మార్పులు (ముఖ్యంగా చలి)ఒత్తిడితో కూడిన పరిస్థితులుమొత్తం మీద, ఈ పరిస్థితి కాలక్రమేణా కదలికలను కష్టతరం చేస్తుంది, మంచానికే పరిమితమయ్యేలా చేస్తుంది కూడా.కారణాలు :ఇది ఒక స్వయం ప్రతిరక్షక వ్యాధి (Autoimmune disorder), అంటే శరీర రోగనిరోధక వ్యవస్థ పొరపాటున స్వంత నాడీ కణాలపై దాడి చేస్తుంది.చాలా మంది రోగులలో గ్లుటామిక్ యాసిడ్ డెకార్బాక్సిలేస్ (GAD) యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయి.నిర్ధారణఈ వ్యాధి నిర్ధారణకు రక్త పరీక్షలు (GAD యాంటీబాడీ టెస్ట్), EMG (Electromyography) ఉపయోగిస్తారు. చికిత్స, నిర్వహణ:దీనికి కచ్చితమైన చికిత్స లేనప్పటికీ, లక్షణాలను నిర్వహించవచ్చు. ముందుగా కండరాలను సడలించడానికి డయాజెపామ్ (Valium) లేదా బాక్లోఫెన్ (Baclofen) వంటి మందులు ఉపయోగిస్తారు.ఇమ్యునోథెరపీ: IVIG (Intravenous Immunoglobulin) చికిత్స తరచుగా మొదటి ప్రాముఖ్యతగా చేస్తుంటారు వైద్యులు. వాటితోపాటు ఫిజియోథెరపీ, ఇతర వ్యాయామాలు కదలికను మెరుగుపరచడానికి సహాయపడతాయి. నిజానికి ఈ వ్యాధి స్త్రీలలో, ముఖ్యంగా 40-50 ఏళ్ల మధ్య వయస్సులో ఎక్కువగా కనిపిస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: పుచ్చకాయ తినే ముందు చిటికెడు ఉప్పు ఎందుకు చల్లుతారో తెలుసా..!) -
నాటి నర్స్.. నేటి ఆరోగ్య మంత్రి
ఢిల్లీలోని ఎయిమ్స్లో... నర్సుగా శిక్షణ పొందిన నిశా మెహతా. నేడు నేపాల్ ఆరోగ్య మంత్రి అయ్యారు. ఆమె పరిచయం.రాజకీయాలలోకి వచ్చిన డాక్టర్లు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో ఆరోగ్యశాఖా మంత్రులుగా పని చేయడం చూశాం. అయితే నేపాల్లో ఒక నర్సు కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. మార్చి 27న ప్రధాని బాలేంద్ర షా మంత్రి వర్గంలో నర్స్ నిశా మెహతా ఆరోగ్యశాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇది ఒక విశేషమైతే ఆమెకు భారత్తో అనుబంధం ఉండటం మరో విశేషం.ఎయిమ్స్లో చదువుకునినేపాల్లోని కోషిప్రాంతానికి చెందిన 39 ఏళ్ల నిశా మెహతా ఢిల్లీలోని ఎయిమ్స్లో బీఎస్సీ నర్సింగ్ చదివారు. ఆ తర్వాత గ్వాలియర్ యూనివర్సిటీలో నర్సింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. తమ పూర్వవిద్యార్థిని నేపాల్ ఆరోగ్యమంత్రిగా ఎదగడం తమ సంస్థకే కాకుండా, మొత్తం నర్సింగ్ వృత్తికే ఘనతగా మారిందని ఎయిమ్స్ ఒక ప్రకటనలో తెలిపింది.మెహతా చురుకైన వ్యక్తి అని, బహుముఖ ప్రజ్ఞ గల విద్యార్థిని అని ఆమె చదువుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ లతా వెంకటేశన్ తెలిపారు. మెహతా విద్యార్థి దశలో రాజకీయంగా చురుకుగా లేనప్పటికీ నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటూ, ఆమె ఒక విశేషమైన వ్యక్తిగా కనిపించేవారని కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మంజు వత్సా గుర్తు చేసుకున్నారు. చదువు పూర్తయ్యాక నేపాల్ తిరిగి వెళ్లిన నిశా అక్కడి ధారణ్లోని బి.పి.కోయిరాల ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో క్లినికల్ నర్స్గా పని చేశారు. తర్వాత రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆవిర్భావం నుంచి పని చేయడం మొదలుపెట్టారు. 2022 ఎన్నికలలో పదవికి కొద్దిదూరంలో ఆగిపోయినా ఈసారి కేంద్రమంత్రి కాగలిగారు.నర్స్గా సామాన్యుల సమస్యలను దగ్గరి నుంచి చూడటం వల్ల జాతీయ స్థాయిలో ఆమె చేయనున్న హెల్త్ పాలసీలపై అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ల విషయంలో ఆమె గట్టి మార్పు తేనున్నారని భావిస్తున్నారు. -
మీ వ్యక్తిత్వాన్ని చంపేసే మనుషులకు దూరంగా..
ఒక మొక్కకి ఎంత నీరు పోసినా, దాని చుట్టూ కలుపు మొక్కలు ఉంటే అది ఎండిపోతుంది. అలాగే టాక్సిక్ మనుషుల మధ్య ఉంటే మీ ప్రగతి ఆగిపోతుంది. టాక్సిక్ మనుషులు అంటే కేవలం మనల్ని తిట్టే వారు కాదు. మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే వారు, మీ కలలను ఎగతాళి చేసేవారు, మీలోని నెగటివిటీని బయటకు తీసే ప్రతి ఒక్కరూ టాక్సిక్ వ్యక్తులే. వీరిని గుర్తించడం ఒక ఎత్తు అయితే, వారి నుండి దూరంగా జరగడం మరొక ఎత్తు.టాక్సిక్ వ్యక్తులను గుర్తించడం ఎలా?సైకాలజీ ప్రకారం టాక్సిక్ వ్యక్తుల్లో ఈ లక్షణాలు కనిపిస్తాయి.Gaslighting: మీరు చెప్పేది అబద్ధం అని, మీ ఆలోచనలే తప్పు అని మిమ్మల్ని మీరు అనుమానించుకునేలా చేస్తారు.Emotional Drain: వారితో కాసేపు మాట్లాడితే చాలు, మీ ఎనర్జీ అంతా అయిపోయినట్లు అనిపిస్తుంది.Constant Criticism: మీరు ఏం చేసినా అందులో తప్పు వెతుకుతారు. మెచ్చుకోవడం వారికి అస్సలు తెలియదు.The Victim Card: ఎప్పుడూ తామే బాధితులం అని ఏడుస్తూ, మీపై 'గిల్ట్' ని రుద్దుతారు.మీ వ్యక్తిత్వంపై దీని ప్రభావం...మీరు ఎంత పవర్ఫుల్ పర్సనాలిటీ బిల్డ్ చేసుకున్నా, టాక్సిక్ రిలేషన్స్ వల్ల మీ Decision Making పవర్ తగ్గిపోతుంది. మీలో Self-Doubt పెరుగుతుంది. మీరు మీ ఒరిజినాలిటీని కోల్పోయి, వారిని మెప్పించడానికి ప్రయత్నిస్తారు.మోటివేషన్ మాయ vs రియల్ బౌండరీస్మోటివేషన్ "అందరినీ ప్రేమించు, అందరినీ మార్చడానికి ప్రయత్నించు" అని చెప్తుంది. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.సైకాలజీ "నువ్వు అందరినీ మార్చలేవు. నీ ప్రశాంతత కోసం కొన్ని సంబంధాల నుండి తప్పుకోవడంలో తప్పులేదు" అని చెప్తుంది. దూరం జరగడం అంటే ద్వేషించడం కాదు, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం.టాక్సిక్ ఫ్రీ లైఫ్Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఈ సమస్య నుండి బయటపడే మార్గం.Step 1: Break Attachment"వారు నా పాత స్నేహితులు" లేదా "వారు నా బంధువులు" అనే ఎమోషనల్ అటాచ్మెంట్ని 'Break' చేయండి. మీ ఎదుగుదలకు అడ్డుపడే ఏ బంధమైనా అది భారమే. వారు బాధపడతారేమో అనే 'గిల్ట్' నుండి బయటపడండి. మీ జీవితానికి మీరే యజమాని.Step 2: Build Healthy Boundariesప్రతి ఒక్కరికీ మీ జీవితంలోకి పూర్తి యాక్సెస్ ఇవ్వకండి. ఎవరితో ఎంతవరకు ఉండాలో ఒక 'లైన్' ని 'Build' చేయండి. "నో" చెప్పడం నేర్చుకోండి. మీ సమయాన్ని, మీ ఎనర్జీని గౌరవించే వారిని మాత్రమే దగ్గరకు రానివ్వండి.Step 3: Healing & Growthటాక్సిక్ వ్యక్తుల నుండి దూరమయ్యాక, ఆ ఖాళీని 'సెల్ఫ్-లవ్' తో నింపండి. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మీరు ఎప్పుడైతే ఉన్నత స్థాయికి చేరుకుంటారో, ఆటోమేటిక్గా మీ చుట్టూ పాజిటివ్ వ్యక్తులే మిగులుతారు. ఇదే 'Beyond' స్టేజ్.మీ చుట్టూ ఉన్నది ఎవరు?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.1. మీ కాంటాక్ట్ లిస్ట్ లోని టాప్ 5 వ్యక్తులు మీ గురించి ఏం మాట్లాడుతారు?2. మీరు ఎవరికైనా భయపడి మీ అభిప్రాయాలను దాచుకుంటున్నారా?3. మిమ్మల్ని మానసిక ప్రశాంతతకు దూరం చేస్తున్న ఆ ఒక్క వ్యక్తి ఎవరు?మీ ప్రశాంతతే మీ లెగసీ!బ్రో, ప్రపంచంలో ఏ విజయం కూడా మీ మనశ్శాంతి కంటే పెద్దది కాదు. టాక్సిక్ వ్యక్తుల నుండి దూరంగా జరగడం అనేది మీ బలహీనత కాదు, అది మీ 'బలం'. మీ పర్సనాలిటీ ఒక స్వచ్ఛమైన గాలి లాంటిది, దాన్ని కలుషితం చేసే వారిని అనుమతించకండి."You cannot heal in the same environment that made you sick."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: మౌనం మీ వ్యక్తిత్వాన్ని ఎలా పెంచుతుంది?) -
అయిననూ... పొయ్యి వెలిగించవలే!
యుద్ధం ఆగడం లేదు. మన ఇంటి గ్యాస్ కష్టాలు, ఆందోళనలు ఆగడం లేదు. ఈ సంక్షోభ కాలంలో సామాన్యుల నుంచి శాస్త్రవేత్తల వరకు ప్రత్యామ్నాయ ఇంధన మార్గాల గురించి ఆలోచిస్తున్నారు. కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. తాజా విషయానికి వస్తే... పుణెలోని సిఎస్ఐఆర్–నేషనల్ కెమికల్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా డైమిథైల్ ఈథర్ (డీఎంయీ) ని తయారు చేయడానికి స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేశారు. కార్బన్ డయాక్సైడ్ను వంట ఇంధనమైన డైమిథైల్ ఈథర్గా మార్చే సాంకేతికతను బిట్స్ పిలాని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు...పుణెలోని సిఎస్ఐఆర్–నేషనల్ కెమికల్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా డీఎంయీని తయారు చేయడానికి స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఇది దేశం ఎల్పీజీ దిగుమతిపై ఆధారపడడాన్ని తగ్గించడంతోపాటు మన దేశ ఇంధన స్వయం సమృద్ధికి ఉపకరిస్తుంది. అంతేకాదు, తక్కువ ఖర్చుతో కూడిన ఉత్ప్రేరకాన్ని (కెటలిస్ట్) ఉపయోగించి మిథనాల్ను డైమిథైల్ ఈథర్గా మారుస్తుంది. పరిశోధన బృందానికి తిరుమలైస్వామి రాజా నాయకత్వం వహించారు.స్వచ్ఛమైన ఇంధనంసంప్రదాయ ఇంధనాలతో పోలిస్తే... డైమిథైల్ ఈథర్(డిఎంఈ) చాలా తక్కువ పరిమాణంలో మసి, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్, కణ పదార్థాలను విడుదల చేస్తుంది. అందుకే దీనిని స్వచ్ఛమైన ఇంధనంగా పరిగణిస్తారు. దీంతో పాటు ఇది ఎల్పీజీకి సమానమైన వేడిమిని అందిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని వినియోగానికి సంబంధించి ‘బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్’ ఇప్పటికే నియమాలను నిర్దేశించింది.గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం ఎల్పీజీలో 20 శాతం వరకు డిఎంఈని కలపవచ్చు. ఎల్పీజీ మౌలిక సదుపాయాలలో ఎలాంటి మార్పులు చేయకుండానే ఎల్పీజీలో 8 శాతం వరకు డిఎంఈ కలపవచ్చు. వంటగది ఏర్పాట్లు మార్చకుండానే ఈ మిశ్రమ ఇంథనాన్ని ఉపయోగించవచ్చు.ఈ ఇంధనంతో ఎంతో ఆదా!మన దేశం 2024లో దాదాపు 21 మిలియన్ టన్నుల ఎల్పీజీని దిగుమతి చేసుకుంది. కేవలం 8 శాతాన్ని డిఎంఈతో భర్తీ చేయడం ద్వారా ప్రతి సంవత్సరం సుమారు ’9,500 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. వంట ఇంధనం, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకే కాకుండా ఏరోసోల్ ఉత్పత్తులలో ప్రోపెల్లెంట్గా పనిచేస్తోంది డిఎంఈ. తమ సాంకేతికతను రోజువారీ వినియోగానికి మరింత చేరువ చేయడానికి సిఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు పేటెంట్ పొందిన ఒక బర్నర్ నమూనాని కూడా రూపొందించారు.ఈ బర్నర్ 100 శాతం ఎల్పీజీ నుండి 100 శాతం డిఎంఈ వరకు, అలాగే ఈ రెండింటి మధ్య ఏ మిశ్రమంతోనైనా ఫ్లెక్సిబుల్ మోడ్లో పనిచేయగలదు. దీనికి సంబంధించి బెంగళూరులోని ఎల్పీజీ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన పరిశోధనల ద్వారా రోజుకు 2.5 టన్నుల డిఎంఈ ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్న ఒక ప్లాంట్ను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. రాబోయే ఆరు నుండి తొమ్మిది నెలల్లో దీని ఏర్పాటుకు శాస్త్రవేత్తలు లక్ష్యంగా పెట్టుకున్నారు.బలమైన ముందడుగుపర్యావరణ సంరక్షణ, ఇంధన భద్రత మధ్య అంతరాన్ని పూరిస్తూ, స్వావలంబన, స్వచ్ఛమైన ఇంధన ప్రత్యామ్నాయాల దిశగా వేసిన బలమైన ముందడుగుగా ఈ ఆవిష్కరణ నిలవనుంది.‘అనుసంధాన్ నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్’ నిధులతో కొన్ని సంవత్సరాల క్రితం మేము మొదలు పెట్టిన ప్రాజెక్ట్ ఇది. కార్బన్డయాక్సైడ్ అనేది గ్రీన్హౌస్ వాయువు. దీనిని నియంత్రించడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. అందులో ఒకటి... కార్బన్ కాప్చర్ అండ్ స్టోరేజ్. మేము మరో అడుగు ముందుకు వేసాం. దీనిద్వారా రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. గ్రీన్హౌస్ వాయువులను గణనీయంగా తగ్గించవచ్చు. అలా చేస్తూనే శక్తిని కూడా ఉత్పత్తి చేయవచ్చు’ అంటున్నారు ప్రోఫెసర్ సౌనక్ రాయ్.సీవో2 టు గ్యాస్!కార్బన్ డయాక్సైడ్ (సీవో2)ను స్వచ్ఛంగా మండే వంట ఇంధనమైన డైమిథైల్ ఈథర్గా మార్చే విప్లవాత్మక సాంకేతికతను హైదరాబాద్లోని బిట్స్ పిలాని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ప్రోఫెసర్ సౌనక్ రాయ్, ప్రోఫెసర్ సత్యపాల్ సింగ్, ప్రోఫెసర్ బి.ఎం.రెడ్డి ఈ పరిశోధనలకు నేతృత్వం వహించారు.‘మేము ఇప్పటివరకు చేసింది ఒక ప్రయోగశాల–స్థాయి ప్రదర్శన మాత్రమే. తగిన సహాయ సహకారాలతో మేము దీనిని పైలట్ స్థాయికి తీసుకువెళ్లి ఆపై వాణిజ్యీకరణ వైపు వెళ్లగలం. ఇందుకు కొంత సమయం పడుతుంది. మేము ఇప్పటికే ఒక పేటెంట్ కోసం దరఖాస్తు చేశాం. మా రీసెర్చ్ గురించి ఒక సైంటిఫిక్ జర్నల్కు తెలియజేశాం’ అని ప్రోఫెసర్ రాయ్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పా రు. -
రాధిక మర్చంట్ లైలాక్ వాచ్..! ప్రపంచంలోనే..
మార్చి 29న జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్లో రాధికా మర్చంట్ తళుక్కుమన్నారు. ఆమె నీతా అంబానీ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కనిపించారు. ఆమె సింపుల్ దుస్తుల్లో నిరాడంబరంగా కనిపించినప్పటికీ..తన చేతికి ఉన్న వాచ్ అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. చోటి బాహుగా పేరుగాంచిన ఆమె లైలాక్ రిచర్డ్ మిల్లే వాచ్తో తన లుక్ను హైలెట్ కనింపిచేలా చేశారామె. ఈ వాచ్లు ప్రపంచవ్యాప్తంగా కేవలం 10 మాత్రమే ఉన్న అత్యంత అరుదైన వాచ్. దీని ధర వింటే కళ్లుబైర్లుకమ్మడం ఖాయం. రాధిక మణికట్టుపై ఉన్న ప్రత్యేక ఆకర్షణగా ఉన్న రిచర్డ్ మిల్లే వారి అత్యద్భుతమైన RM 75-01 ఫ్లయింగ్ టోర్బిల్లాన్ సఫైర్ వాచ్ ఇది. సముద్ర స్ఫటికపు పారదర్శకత, గోతిక్ వాస్తుశిల్ప వైభవంతో మిళితమైన వాచ్. అద్భుత కళారూపానికి నిలయం ఈ వాచ్. దీన్ని అసాధారణంగా మార్చేది దాని పూర్తిగా ట్రాన్స్పరెంట్గా కనింపిచేలా చేసే డిజైన్. ఇది లోపల ఉన్న క్లిష్టమైన మెకానిజంను ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసే వీలు కల్పిస్తుంది. దీని పారదర్శక కేస్, రంగు, కాంతిని సున్నితంగా వెదజల్లుతూ, ఒక మృదువైన, ఛాయతో ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రత్యేకతలు..వాచ్ తయారీకి 40 రోజుల నిరంతర గ్రైండింగ్తో సహా, వెయ్యి గంటలకు పైగా మెషీనింగ్ సమయం పడుతుంది. దీనిలోని భాగాలను అత్యంత సూక్షంగా ఉంటాయట, వాటిని ఎంతో సహనంతో అమర్చాల్సి ఉంటుందట. ఈ వాచ్ని టైటానియం స్క్రూలు, టైటానియం బేస్ప్లేట్ మెకానిజంతో రూపొందిస్తారు. అదే సమయంలో 6 గంటల వద్ద ఉన్న ఫ్లయింగ్ టూర్బిల్లాన్ ప్రతి 60 సెకన్లకు ఒక పూర్తి భ్రమణం చేస్తుంది. అంతేగాదు ఈ వాచ సుమారు 65 గంటల వరకు ఫుల్ చార్జ్ ఉంటుందట. ఈ వాచ్ ధర వచ్చేసి దగ్గర దగ్గర రూ. 21 కోట్లు. View this post on Instagram A post shared by THEINDIANHOROLOGY (@theindianhorology) (చదవండి: సాహసం శ్వాసగా సాగిపో బామ్మ..!) -
సాహసం శ్వాసగా సాగిపో బామ్మ..!
యంగ్గా ఉన్నప్పుడు నేర్చుకోవడం వేరు..పెద్ద వయసు వచ్చాక కొత్తవి నేర్చుకోవాలన్న లోలోన ఏదో బెరుకు ఉంటుంది. కొందరు మాత్రం చాల డేర్గా నచ్చిన నైపుణ్యాలను అందుపుచ్చుకునేందుకు ముందుకొస్తారు. అలాంటి కోవకు చెందిందే ఈ విద్యాకౌర్.మాజీ ఉపాధ్యాయురాలు, ప్రిన్సిపాల్ అయిన విద్యాకౌర్కి డ్రైవింగ్ అంటే మహా ఇష్టం. ఎలాగైన నేర్చుకోవాలన్నది ఆమె డ్రీమ్. అయితే 59 ఏళ్ల వయసులో డ్డ్రైవింగ్ నేర్చుకుందామనుకుంటే..చాలా పెద్ద వయసు అని తిరస్కరించారు అధికారులు. అయితే విద్యాకౌర్ తగ్గేదే లే అంటూ ముందుకు సాగింది. ఆమెనే స్వయంగా కారు కొనుక్కుని పొరుగువారి సాయంతో డ్రైవింగ్ నేర్చుకున్నారామె. ప్రస్తుతం ఆమెనే స్వయంగా కారుని రయ్ రయ్మని నడిపేస్తోంది. సీనియర్ సిటిజన్ అనే మూసధోరణిని బద్దలు కొడుతూ..స్వేచ్ఛగా సాగిపోతోందామె. ఇక్కడ విద్యాకౌర్ కథ ఎవరో మన పరిమితుల్ని డిసైడ్ చేయడం కాదు..మన శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంటే ధైర్యంగా ముందుకు సాగిపోచ్చు అని చాటి చెబుతోంది ఈ సూపర్ బామ్మ స్టోరీ. View this post on Instagram A post shared by Pune Times Mirror (@thepunemirror) (చదవండి: చాయ్వాలాగా 103 ఏళ్ల బామ్మ..!) -
పుచ్చకాయ తినే ముందు చిటికెడు ఉప్పు ఎందుకు వేయాలంటే..?
సమ్మర్ అనగానే అందరికి గుర్తొచ్చేది పుచ్చకాయ. వేసవి దాహార్తిని చల్లార్చేది పుచ్చకాయ ఒక్కటే. అది తినగానే తక్షణ శక్తి, దాహం తీరుతుంది కూడా. అలాంచి పుచ్చకాయను తినేముందు చిటికెడు ఉప్పు ఎందుకు జల్లుతారో తెలుసా!. అలా తింటేనే మంచిదా అంటే..సాధారణంగా చాలామంది పుచ్చకాయను అలానే తినేస్తారు. కొందరు మాత్రం తప్పనిసరిగా చిటికెడు ఉప్పు జల్లుకునే తింటుంటారు. ఇలా తింటే ఏం జరుగుతుందో తెలుసా..!.సహజమైన తీపి..చిటికెడు ఉప్పు పుచ్చకాయ రుచిని మరింత తీపిగా చేస్తుంది. రుచి గ్రాహకాలు రుచిని గ్రహించే విధానాన్ని ఉప్పు ప్రభావితం చేస్తుంది కాబట్టి ఇలా మరింత తీపిగా అనిపిస్తుందట. అలాగే ఉప్పులో ఉండే క్లోరైడ్ అయాన్లు తీపి రుచి గ్రాహకాలతో చర్య జరిపి తక్కువ గాఢతలో తీపిని గ్రహించే శక్తినిపెంచి, చేదుని తగ్గిస్తాయి. అంటే ఉప్పు పండులోని సహజ చక్కెరలను ఉత్తేజపరిచి వాటి ప్రభావాన్ని పెంచుతుంది, మరింత రుచికరంగా ఉంటుంది కూడా.కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను భర్తీ చేస్తుంది. .పుచకాయలో సహజంగా నీటి శాతం ఎక్కువ. ఇందులో సోడియం తక్కువగా ఉంటుంది. చిటికెడు ఉప్పు కలపడంతో శరీరానికి తగిని సోడియం అంది, ద్రవాలను నిలుపుకోవడానికి హైడ్రేషన్కు హెల్ప్ అవుతుంది. ఇది ప్లాస్మా పరిమాణాన్ని నిర్వహించడంలో అలాగే శరీరం తీసుకున్న నీటిని త్వరగా బయటకు పంపకుండా నిలుపుకోవడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే వేడికి గురైన వెంటనే లేదా అధిక శ్రమ తర్వాత నీరు, సోడియం కలియిక నీరు రీహైడ్రేషన్కి ప్రభావవంతంగా ఉంటుందట.రుచి సమతుల్యతను మెరుగుపరుస్తుందికొన్నిసార్లు పుచ్చకాయ రుచి చప్పగా లేదా మరీ నీళ్ళగా అనిపించవచ్చు. చిటికెడు ఉప్పు రుచిని సమతుల్యం చేయడం తోపాటు ప్రతి ముక్కను మరింత రుచికరంగా మారుస్తుంది.జీర్ణక్రియకు సహాయపడుతుంది..తక్కువ పరిమాణంలో జీర్ణరసాలను ప్రేరేపించడంలో ఉప్పు సహాయపడుతుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేసుకోవడాన్ని సులభతరం చేస్తుంది. సాధారణంగా పుచ్చకాయ చాలా సులభంగా జీర్ణమవుతుంది, ఈ చిన్న చేర్పు మొత్తం తినే అనుభవాన్ని మెరుగుపరుస్తుంది, ముఖ్యంగా భోజనం తర్వాత లేదా స్నాక్గా తీసుకున్నప్పుడు.శ్రద్ధగా తినేలా చేస్తుంది.. పుచ్చకాయకు ఉప్పు కలపడం వల్ల తినే వేగాన్ని తగ్గిస్తుంది. ఒక గిన్నెను త్వరగా పూర్తి చేయడానికి బదులుగా, ప్రతి ముక్కను ఆస్వాదించడానికి ఆసక్తి చూపుతారు. ఇది పరిమాణ నియంత్రణకు సహాయపడటం తోపాటు సంతృప్తికరంగా అనిపించేలా చేస్తుంది. కాబట్టి, పుచ్చకాయకు చిటికెడు ఉప్పు కలపడం వల్ల పండు పోషక విలువలు పెద్దగా మారవు, కానీ అది తినే అనుభవాన్ని ఆనందదాయకంగా, సమతుల్యంగా చేస్తుంది. ఇక్కడ చిటికెడు ఉప్పు చాలు. ఎక్కువైతే పండు సహజ రుచిని డామినేట్ చేసి, సోడియం తీసుకోవడం అధికమయ్యే అవకాశం ఉంటుంది. అవసరమైతే అదనపు రుచి కోసం నల్ల ఉప్పు, కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపునులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: చాయ్వాలాగా 103 ఏళ్ల బామ్మ..!) -
చాయ్వాలాగా 103 ఏళ్ల బామ్మ..!
60 దాటగానే చాలామంది విశ్రాంతి తీసుకుంటారు. అలాంటిది ఈ బామ్మ 103 ఏళ్ల వయసులోనూ టీ స్టాల్ నడుపుతూ స్ఫూర్తిగా నిలిచింది. ఎవ్వరిమీద ఆధారపడకుండా స్వతంత్రంగా బతకాలన్న ఆమె దృఢసంకల్పానికి హ్యాట్సాప్ అనాల్సిందే. అంతేగాదు కష్టపడేతత్వానికి వయసుతో సంబంధం లేదని ఈ బామ్మ ప్రూవ్ చేసింది.ఆ బామ్మే గుజరాత్లోని వడోదరకు చెందిని 108 ఏళ్ల కాశీబా. ఆమె మహారాజా సయాజీరావు విశ్వవిద్యాలయం సమీపంలోని చొన్న టీ స్టాల్ నడుపుతూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందామె. ఆమె అల్లం టీకి ఉన్న క్రేజీ అంత ఇంత కాదు. అక్కడ విద్యార్థులకు దశాబ్దాలుగా తన టీ రుచితో ఆకర్షిస్తుంటుందామె. స్వయంగా ఆమె అల్లం తురిమి తయారు చేస్తుంటుంది ఈ బామ్మ. ఆమె వయసులో అందరూ విశ్రాంతి ఆశిస్తారు..కానీ ఆమె అచంచలమైన సంకల్పంతో తన చిరు వ్యాపారాన్ని నడుపుతూ ఆత్మనిర్భరతకు అసలైన అర్థంగా మారింది. 1993 నుంచి ఆమె ఈ టీస్టాల్ని నడుపుతుంది. అక్కడ ఎందరో విద్యార్థులకు అదొక మధుర జ్ఞాపకాల ప్రదేశం. కొందరు విద్యార్థులు అక్కడకు వచ్చి స్నేహితులతో కలిసి ఈ బామ్మ చేతి టీ తాగుతూ నాటి మధురస్ముతులను గుర్తుచేసుకుంటుంటారట. ఆమెకు కొడుకు, కోడలు, మనవళ్లు ఉన్నా..తను మాత్రం స్వతంత్రంగా బతికేందుకే ఆసక్తి కనబరుస్తుందట. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. నెటిజన్లు కూడా హ్యాట్సాఫ్ బామ్మ..అందంగా జీవించడం అంటే ఇదే అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Sakshi Singh l Journalist (@_.sakshieee) (చదవండి: కేవలం 'ఫ్లవర్ అనుకుంటివా.. పోషక విలువలున్న ఫుడ్'..!) -
క్యాన్సర్ చికిత్సలో సంచలనం
న్యూఢిల్లీ: వైద్య రంగంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రాణాంతకమైన మెదడు క్యాన్సర్ను నయం చేసే దిశగా శాస్త్రవేత్తలు ఒక సంచలన విజయాన్ని సాధించారు. అమెరికాలోని మసాచుసెట్స్ జనరల్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు అభివృద్ధి చేసిన సరికొత్త ‘కార్-టీ సెల్ థెరపీ’ చికిత్సతో, కేవలం ఐదు రోజుల్లోనే ఒక రోగి మెదడులోని కణితి దాదాపుగా మటుమాయమయ్యింది.ఏమిటీ ‘మ్యాజిక్’ థెరపీ?సాధారణంగా గ్లియోబ్లాస్టోమా (Glioblastoma) అనేది అత్యంత వేగంగా వ్యాపించే, ప్రమాదకరమైన బ్రెయిన్ క్యాన్సర్. దీనికి చికిత్స అందించడం వైద్యులకు పెద్ద సవాలుగా ఉండేది. అయితే ‘CARv3-TEAM-E’ అనే సరికొత్త ప్రయోగాత్మక మందు పరిష్కారంగా మారింది. ఈ పద్ధతిలో రోగిలోని రోగనిరోధక కణాలను సేకరించి, వాటికి జన్యుపరమైన మార్పులు చేస్తారు. ఈ మార్పు చెందిన కణాలు నేరుగా క్యాన్సర్ కణాలను గుర్తించి, వాటిని నాశనం చేస్తాయి.క్లినికల్ ట్రయల్స్లో అద్భుత ఫలితాలు‘ఇన్సిపియంట్’ (INCIPIENT) పేరుతో నిర్వహించిన మొదటి దశ క్లినికల్ ట్రయల్స్లో 57 నుండి 74 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురు రోగులకు ఈ థెరపీని అందించారు. వీరందరూ ఇప్పటికే రేడియేషన్, కీమోథెరపీ వంటి ప్రామాణిక చికిత్సలు పొంది, సరైన ఫలితాలను అందుకోలేకపోయారు. ఇప్పుడు ఒక రోగికి కేవలం ఒకే ఒక్క ఇంజెక్షన్ ఇవ్వగా, ఐదు రోజుల్లోనే కణితి దాదాపు పూర్తిగా కరిగిపోయింది. మరో రోగిలో.. ఆరు నెలల పాటు కణితి పరిమాణం 60 శాతం వరకు తగ్గింది. ఈ మందును నేరుగా మెదడులోకి ఇంజెక్ట్ చేయడం ద్వారా వైద్యులు గరిష్ట ఫలితాలను సాధించారు.సవాళ్లు.. భవిష్యత్తు ఆశలుఈ చికిత్స పొందిన రోగులకు జ్వరం లాంటి కొన్ని సాధారణ దుష్ప్రభావాలు మినహా పెద్దగా ఇబ్బందులు కలగలేదు. అయితే ఈ థెరపీ వల్ల లభించిన ఫలితాలు ప్రస్తుతం తాత్కాలికంగానే ఉన్నాయి. కణాలు ఎక్కువ కాలం మెదడులో మనుగడ సాగించలేకపోవడం వల్ల కొంతకాలం తర్వాత క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. దీంతో మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు. ‘న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురితమైన ఈ అధ్యయనం భవిష్యత్తులో క్యాన్సర్ రహిత ప్రపంచాన్ని నిర్మించే దిశగా ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: ‘జైషే’కు భారీ దెబ్బ.. తాహిర్ అనుమానాస్పద మృతి -
'ఫ్లవర్ అనుకుంటివా.. ఫుడ్'..!
సరదాగా చెప్పాలంటే...‘‘తినదగు నిపుణులు చెప్పిన తినినంతనే వేగిరపడక పోషక విలువలు తెలుసుకోదగన్...ఇలా నిజము దెలుసుకుని ‘పువ్వులనూ తినెడివాడే మనుజుడు మహిలో...’’ అంటే కాస్త వినోదంగానో, వెటకారంగానో ఉండవచ్చు. ఇక అచ్చతెలుగులో పువ్వుల్నీ తినవచ్చంటే కూడా కొద్దిగా ఇబ్బందిబ్బందిగానే అనిపించవచ్చుగానీ...నిజానికి పువ్వుల్లోనూ ఎన్నో పోషకవిలువలూ, ఆరోగ్యానికి మేలు చేసే గుణాలంటాయంటున్నారు ఆహార నిపుణులు. ‘‘మొక్కమొక్కకో పువ్వు... మనుషులందరికీ హెల్తు’’ అంటూ పువ్వులోని పోషక విలువలనూ ప్రయోజనాలనూ చెబుతున్న ఆ న్యూట్రిషనిస్టుల మాటలేమిటో తెలుసుకుందాం... కాలీఫ్లవర్లాంటి పువ్వులను కూరలకోసమే ఉపయోగిస్తామంటే సరే. అయితేమామూలుగానైతే కొన్ని పువ్వులూ తినడానికి పనికివస్తాయంటే వెంటనే నమ్మలేని పరిస్థితి. అయినప్పటికీ అది వాస్తవం. అలాంటి కొన్ని పువ్వులూ వాటి పోషక విలువలేమిటో చూద్దాం...అరటిపువ్వుఅరటికాయను ‘కూర అరటి’గా పిలుస్తూ... కూర చేయడం అందరికీ తెలిసిన విషయమే. కానీ అరటి పువ్వు (మొవ్వ)ను కూడా కూరగా వండటం ఓ సంప్రదాయంలా పాటించే కుటుంబాలు చాలా ఎక్కువే ఉన్నాయి. అరటి పువ్వు పోషక విలువలు ఇందులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, పీచుపదార్థం, కొవ్వులు, క్యాల్షియమ్, ఫాస్ఫరస్, ఐరన్, కాపర్, పొటాషియమ్, మెగ్నీషియమ్, విటమిన్ ఈ సమృద్ధిగా ఉంటాయి. అరటిపువ్వులోని పోషకగుణాలు ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి ఉపయోగపడతాయి. అరటిపువ్వు నుంచి సేకరించిన పోషకాలు మలేరియా కారక క్రిములను ఎదుర్కొంటాయని ఒక అధ్యయనం చెబుతోంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణం కారణంగా అరటిపువ్వు ఫ్రీరాడికల్స్ను హరిస్తుంది. దాంతో క్యాన్సర్ నివారణా సాధ్యమవుతుంది. అంతేకాదు... ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ వయసుపైబడే ప్రక్రియనూ ఆలస్యం చేసి ఏజింగ్ ప్రక్రియను మందకొడిగా జరిగేలా చేస్తాయి. అరటిపువ్వు రక్తంలోని చక్కెర పాళ్లను నియంత్రిస్తుంది. ఇందులో ఐరన్ ఎక్కువ కాబట్టి రక్తహీనత దూరం చేస్తుంది. ముఖ్యంగా ఇది మహిళలకు బాగా ఉపయోగపడుతుంది. ఇక స్త్రీలలో రుతు సమస్యల నివారణకు అరటిపువ్వుల కూర బాగా మేలు చేస్తుంది. అరటిపువ్వుతో అనేక రుతుబాధలు దూరమవుతాయి. పీరియడ్స్ టైమ్లో ఎక్కువగా బ్లీడింగ్ కావడం తగ్గుతుంది. రుతుస్రావం వచ్చే ముందు మూడ్స్ త్వరత్వరగా మారి΄ోవడం, కడుపునొప్పి వంటి అనేక లక్షణాలతో వ్యక్తమయ్యే పీ–మెనుస్ట్రువల్ సిండ్రోమ్ (పీఎమ్ఎస్) తగ్గుతుంది. ఇందులోని మెగ్నీషియమ్ వల్ల యాంగై్జటీ తగ్గడంతో మూడ్స్ బాగుపడతాయి. బిడ్డకు పాలిచ్చే తల్లుల్లో బాగా పాలు పడేలా చేస్తుంది అరటిపువ్వు.గుమ్మడి పూలుఇటీవల కొందరు గుమ్మడిపూలను కొన్ని రకాల కూరగాయలతో కలిపి స్టఫ్ చేయడం, ఫ్రై చేయడంతోపాటు కూరగా వండటం పరిపాటి అయ్యింది. గుమ్మడి పూల పోషక విలువలుఇందులో విటమిన్లు ఏ, సీ లతోపాటు క్యాల్షియమ్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభ్యమవుతున్నాయి. ఇక పీచుపదార్థాలూ (డయటరీ ఫైబర్) కూడా చాలా ఎక్కువ. అందుకే వీటిని ఆహారంగా తీసుకునేవారిలో ఆకలి త్వరగా తీరడం వల్ల స్థూలకాయం నివారితమవుతుంది. ఫలితంగా డయాబెటిస్, హైబీపీలు నివారితం కావడంతోపాటు డయటరీ ఫైబర్ వల్ల జీర్ణాశయ ఆరోగ్యం బాగుండటమూ, మలబద్ధకం వంటివి దూరం కావడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలూ చేకూరతాయి.ఆవపూలుకాస్తంత ఆవాల రుచితోనే ఉంటూ కొన్ని రకాల క్రిస్పీ వంటకాల్లోనూ, మరికొన్ని ఫ్రైలతోపాటు రుచి పెంపొందించడం కోసం, అలాగే కొన్ని రకాల వడల్లాంటి (ఫ్రిట్టర్) రూపంలో చేసే వంటకాల్లో ఆవపూలను ఒక రకమైన మంచి రుచి (ఫ్లేవర్) కోసం ఉపయోగించడమనేది పశ్చిమ బెంగాల్తోపాటు అక్కడి చాలా ప్రాంతాల్లో వాడుకగా ఉంది. కూర (సబ్జీ)గా వండటం కూడా మామూలే. ఆవ పూల పోషక విలువలుఆవపూలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇవి అనేక రకాల క్యాన్సర్లనుంచి కాపాడుతుంటాయి. అయితే వీటిల్లో యాంటీ సెప్టిక్ గుణాల వల్ల గాయాలను త్వరగా మాన్పివేస్తాయి. ఇందులోని విటమిన్ సి కూడా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది.మునగ పూలుమామూలుగానైతే మునక్కాడలని పిలిచే ఆ ములక్కాయలను కూర వండుకు తినేయడం చాలా సాధారణం. ఇటీవల కొందరు మునగాకును కూరగా వాడుతున్న సంగతీ తెలుసు. అయితే మునగాకుకు దీటుగా దాని పూలూ ఆహారంగా వాడుకునేవారూ ఉన్నారు. ఎందుకంటే సూపర్ ఫుడ్ అనే మాట నిజంగా మునగకే నప్పుతుంది. ఇందుకు కారణమూ ఉంది. మునగ పూల పోషక విలువలుమునగ పూలను ఆహారంగా తీసుకుంటే ఇందులో విటమిన్లు ఏ, సీ, ఈ...లతో పాటు పొటాషియమ్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. నారింజతో ΄ోలిస్తే ఇందులో విటమిన్ సీ 7 రెట్లు ఎక్కువ. ఇక క్యాల్షియమ్ మోతాదులు చాలా చాలా ఎక్కువ. యాంటీ ఆక్సిడెంట్ల వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో అనేక క్యాన్సర్ల నుంచి నివారణ. ఇందులోని పీచు మోతాదుల వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. జీర్ణక్రియను క్రమబద్దీకరించి, బరువును తగ్గిస్తుంది.మందారపువ్వుచాలా మంది దీన్ని పువ్వులను ఎండబెట్టుకొని టీ కాచుకొని తాగడం గానీ లేదా ఆకర్షణీయమైన ఎరుపు రంగులో ఉండే మందారపువ్వులను పానియాల రూపంలో చేసుకుని తాగడం చాలా చోట్ల సంప్రదాయంగా కొనసాగే ప్రక్రియే. మందారలో పోషక విలువలుమందారపువ్వులో చాలా శక్తిమంతమైన విటమిన్–సి ఉంటుంది. దీంతో మంచి వ్యాధినిరోధకత సమకూరడమే కాకుండా చాలా రకాల గుండెజబ్బులూ నివారితమవుతాయని అనేక అధ్యయనాల్లో తేలింది. కొద్దిగా మాత్రమే పులుపుగానూ, కాస్తంత ఘాటుగానూ ఉండే దీని రుచి (ఫ్లేవర్) కారణంగా దీన్ని తేనీటి రూపంలో తాగడం చాలా చోట్ల జరిగేదే. దీనిలోని పోషకగుణాల కారణంగా జీర్ణశక్తి మెరుగుపడుతుది. ఈ పూలతో చేసే పదార్థాలు రక్తంలోని కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. శరీర జీవక్రియలు క్రమబద్ధం చేస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్తోపాటు ఉండే విటమిన్ సి వల్ల కాలేయ క్యాన్సర్తో పాటు అనేక క్యాన్సర్లు నివారితమవుతాయి. మందరపూలతో కాచిన టీతో రక్తపోటు, యాంగై్జటీ కూడా తగ్గుతాయి. అయితే ఈ మందార చాయ్ను పరిమితంగా తాగితేనే మేలన్నది న్యూట్రిషన్ నిపుణుల మాట.బంతి / చేమంతి పూలుఇంగ్లిష్లో మేరీగోల్డ్ గా పిలిచే ఈ బంతి / చేమంతిలోని అనేక రకాల పూల రేకులను అనేక వంటకాల్లో వాడతారు. వీటిని ఎండబెట్టి పానీయాలుగా, కుంకుమపువ్వు (శాఫ్రాన్) తరహాలో గార్నిషింగ్ కోసం వాడుతుంటారు. ఇందులోనూ కాస్తంత పులుపు, వగరు, కారం కలగలసిన రుచి (సిట్రసీ, స్పైసీ, బిట్టర్–ట్యాంజీ ఫ్లేవర్) ఉండటం వల్ల దీన్ని అనేక వంటకాల్లో ఒక దినుసుగా ఉపయోగించడం కూడా పరిపాటి. ఇలా వంటల కోసం ఉపయోగించే మేరీగోల్డ్ మొక్కలపై ఎలాంటి రసాయన ఎరువులూ వేయకుండా పెంచుతుంటారు. దీని పూల రేకలను పైన అలంకరణగా (సీజనింగ్గా) వాడటంతో పాటు కొన్ని సందర్భాల్లో పసుపు పచ్చ రంగునిచ్చేందుకు కలరెంట్గా కూడా వాడతారు. కుంకుమపువ్వుకు ప్రత్యామ్నాయంగా వాడటమూ కొన్ని చోట్ల వాడుకలో ఉంది. దీని పూల రేకలను ఎండబెట్టి టీ రూపంలో వాడతారు. (ఇక మెడిసిన్ విలువలు ఉండటంతో క్యాలండ్యులా నుంచి తీసిన నూనెను చర్మంపైన గాయాలు మానేయందుకు పైపూత మందుగానూ ఉపయోగిస్తారు. బంతి / చేమంతులలోని పోషక విలువలుబంతి / చేమంతి (మేరీగోల్డ్) పూలలోని జీవరసాయనాలు తెల్లదోమ (వైట్ ఫ్లై) వంటి పరాన్నజీవులను దూరంగా ఉంచే గుణం ఉండటం వల్ల పూలతోటలలో కొన్ని రకాల పరాన్నజీవులనూ, తెగుళ్లను దూరంగా ఉంచేందుకూ ఈ మొక్కలను పెంచుతుంటారు. అంతేకాదు... ఈ ప్రజాతికి చెందిన క్యాలెండ్యులా వంటి పూలలో యాంటీ ఆక్సిడెంట్స్తోపాటు ల్యూటిన్, బీటా ల్యూటిన్, ఫ్లేవోగ్జాంథిన్ వంటి కెరటనాయిడ్స్తోపాటు ఫ్లేవనాయిడ్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇందులోని ఓలియోనిక్ యాసిడ్, క్యాలెండిక్ యాసి వంటి ఫ్యాటీ యాసిడ్స్తోపాటు విటమిన్–సి ఉండటం వల్ల తన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణంతో గాయాలను త్వరగా మాని΄ోయేలా చేయడం, నొప్పులను తగ్గించడం వంటి ప్రయోజనాలనిస్తాయి. అందుకే దీన్ని ఓ ఔషధమొక్కగానూ, దీని పువ్వును ఔషధాల్లోనూ ఉపయోగిస్తుంటారు.గులాబీ మన దగ్గర ఆహారంలో దీని ఉపయోగం చాలా తక్కువే అయినా చైనీయులు తమ ఔషధాల్లో దీన్ని ఉపయోగిస్తుంటారు. అయితే మన దగ్గర కూడా పాన్లో వేసే గుల్ఖంద్ అనే స్వీటెనర్ను గులాబీ పూల రేకలతోనే తయారు చేస్తారని ప్రతీతి. ఇక రోజాపువ్వు రేకులతో టీ కాచుకోవడం అనేది చాలా చోట్ల ఉన్న ఒక సంప్రదాయం. ఆరోగ్యానికి మంచిదంటూ కొందరు ఈ పూల రేకులను అలాగే తినేస్తుంటారు కూడా. గులాబీపూలలోని పోషక విలువలు : ఈ పూల రేకుల్లో ఫీనాలిక్స్ అనే పోషకాలు ఉన్నాయి. వాటిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం వల్ల అవి గాయం వల్ల కలిగే మంటను తగ్గిస్తాయి. రోజాపువ్వు రేకులతో కాచే టీతో గుండెజబ్బు ముప్పు, క్యాన్సర్, డయాబెటిస్లనూ రిస్క్ తగ్గుతాయని అనేక అధ్యయనాల్లో తేలింది. కేవలం. రోజా అన్నది పూలలో రాజా వంటిది అనే ప్రతీతి దీని తాలూకు గాయాలు మాన్పే శక్తికీ వర్తిస్తుంది. ఇందుకే హీలింగ్ గుణంలో కూడా ఇది కింగ్ అంటూ దీనికి ఓ ప్రశస్తి ఉంది. దీన్ని టీ కాచుకోడానికీ లేదా ఫ్లేవర్గా పరిమితంగా ఉపయోగించడమే మంచిదనేది న్యూట్రిషనిస్టుల సలహా.తామరపువ్వులు (కమలం పువ్వులు)దీని గింజలను ‘మఖానా’ గింజలనీ, దీని పూలను ‘ఫూల్ మఖానా’ అంటూ పిలుస్తూ, ఈ పూలనూ ఆహారంగా తీసుకోవడం చాలా చోట్ల వాడుకలో ఉంది. తామరపూలతో చాలా మంది టీ కాచుకొని తాగుతుంటారు. అయితే ఆసియా ఖండంలోని చాలా ప్రాంతాల్లో అనేక మంది తామరతూళ్లను వంటకోసం ఉపయోగిస్తుంటారు. ఇటు మఖానా గింజలనూ, అటు ఫూల్ మఖానాను కూరలలో (కర్రీ), కొన్ని రకాల స్వీట్లలో, కొన్ని సందర్భాల్లో మసాలా దినుసుల మాదిరిగా కూడా వాడతారు. తామరపూల పోషక విలువలుతామరపూలలో విటమిన్ ఏ, బీ, సి లు చాలా ఎక్కువ. విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇక విటమిన్ బి కాంప్లెక్స్లో అనేక పోషకాలతోపాటు పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అయిన విటమిన్ సి వల్ల చాలా శక్తిమంతమైన వ్యాధి నిరోధక వ్యవస్థ రూపొందుతుంది. ఫలితంగా అనేక రకాల క్యాన్సర్లను ఈ పూలు నివారిస్తాయి. ఈ పూలలోని విటమిన్ బి కాంప్లెక్స్ అలాగే విటమిన్–సి కలగలసి దేహంలో వ్యాధి నిరోధకశక్తిని పెంచి ఎన్నో వ్యాధులకు కవచంగా నిలుస్తాయి. వీటలోని క్యాల్షియమ్ వల్ల ఎముకలు బలంగా మారతాయి. రక్తపోటు (హైబీపీ)ని నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. మెగ్నీషియమ్, ఐరన్, ఫాస్ఫరస్ వంటి ఖనిజలవణాల వల్ల మంచి ఆరోగ్యం సమకూరుతుంది.మొగలి పువ్వు (ఫ్రాగ్రెన్స్ స్క్రూపైన్ / కేవ్డా) మనదేశంలోని అనేక ్ర΄ాంతాల్లోని ప్రజలతో ΄ాటు దక్షిణ ఆసియాలోని అనేక మంది మొగలి పువ్వును వంటలో ఉపయోగిస్తుంటారు. దీన్ని రుచిని ఇచ్చే పదార్థంగా (ఫ్లేవరింగ్ ఏజెంట్గా) వాడుతుంటారు. దక్షిణ భారతదేశంలో మొగలిపూలతో కూర వండుకోవడమూ చాలా చోట్ల వాడకులో ఉన్న సంప్రదాయమే. ఇక రసగుల్లా, రస్మలాయ్ వంటి పాయసాల్లోనూ, కొన్ని రకాల పానీయాల్లో కొంత తియ్యటి రుచి / వాసన ఇచ్చేందుకు ఫ్లేవరింగ్ ఏజెంట్గా చాలా చోట్ల వాడుతుంటారు. దీన్ని ఔషధ మొక్కగానూ, దీని పువ్వును ఔషధాల్లోనూ వాడటమూ చాలా సాధారణంగా జరుగుతుండేదే. మొగలిపువ్వులోని పోషక విలువలుఈ పూలలో విటమిన్–సి వంటివీ అలాగే, థయామిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్ వంటి విటమిన్–బి కాంప్లెక్స్లోని విటమిన్లతోపాటు అనేక పోషకాలు ఉంటాయి. ఇక గాయాలను మాన్పించే, నొప్పులను తగ్గించే యాంటీసెప్టిక్, యాంటీ స్పాస్మోడిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలూ ఈ పూలలో ఉంటాయి. ఇక ఇదొక ఔషధ మొక్క కూడా కావడం వల్ల దీనిలోంచి తీసే నూనెలను పైపూత మందుగా ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పులలో వాడుతుంటారు. దాదాపుగా అందరికీ తెలిసిన తినే పూలుపొద్దుతిరుగుడు పువ్వు (సన్ఫ్లవర్)దీని గింజల నుంచి తీసిన నూనెలో వంటల్లో విరివిగా వాడతారన్న విషయం తెలిసిదే. అయితే దీని ఆకులూ, వేళ్లతో పాటు పూల రేకులను సైతం కొన్ని రకాల సలాడ్స్లోనూ, వేయించిన పూలరేకులను కొన్ని ఫ్రై వంటకాల్లో, శ్నాక్స్లో క్రంచీగానూ వాడుతుంటారు. పూర్తిగా వికసించకముందే మొగ్గగా ఉన్నప్పుడే కోసిన పూలను పేలాల్లా (కార్న్లా) వేపి / వేగించి తినడంతో పాటు కొన్ని సలాడ్స్లో కలిపి వడ్డిస్తారు. పొద్దుతిరుగుడు పువ్వు పోషక విలువలు : ఈ పూలను పవర్΄్యాక్డ్ పవర్హౌజ్గా పరగణించడం పరిపాటి. ఎందుకంటే ఇందులో ప్రోటీన్లు, కొవ్వులూ, పీచు (ఎడిబుల్ ఫైబర్), విటమిన్–ఈ వంటి విటమిన్లు, కాపర్, సెలేనియమ్, మ్యాంగనీస్, మెగ్నీషియమ్ వంటి ఖనిజాలు (మినరల్స్) పుష్కలంగా ఉంటాయి. విటమిన్–ఈ అనేది చాలా శక్తిమంతమైన ఆంటీ ఆక్సిడెంట్ కావడంతో చాలా రకాల వ్యాధుల నుంచి క్యాన్సర్లనుంచి కా΄ాడుతుంది. ్ర΄ోటీన్ల కారణంగా కండరాలు శక్తిమంతం కావడంతో ΄ాటు కండరాల రిపేర్లకు ఇది సహాయపడుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గించడానికి సెలేనియమ్ ఉపయోగపడుతుంది.కాలీఫ్లవర్ గోబీ పువ్వు అని తెలుగులోనూ ఫూల్ గోబీ అని హిందీలోనూ పిలుచుకునే ఈ పువ్వు కూరలా అందరూ వండుకోడానికి ఉపయోగించేదే. గోబీ పకోడీలంటూ శ్నాక్స్ రూపంలోనూ తింటుంటారు. కాలీఫ్లవర్ పోషక విలువలు : ఈ పువ్వు క్యాన్సర్ను నివారిస్తుంది. కాలీఫ్లవర్లోని సల్ఫోరఫేన్ వంటి వృక్షరసాయనాలు (ఫైటో కెమికల్స్) క్యాన్సర్లతో పోరాడతాయి. సల్ఫోరఫేన్ అనే ΄ోషకం ఆటిజమ్ను నివారించడంలో కూడా తోడ్పడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాలీఫ్లవర్లోని ఇండోల్–3–కార్బినాల్ అనే స్టెరాల్ కూడా క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడుతుందని తేలింది. ఇది ప్రోస్టేట్, పెద్దపేగు, రొమ్ము, ఒవేరియన్ క్యాన్సర్ల నివారణకు సమర్థంగా ఉపయోగపడుతుంది. దేహంలోని కణాలు క్యాన్సరస్గా మారి΄ోతున్న సందర్భాల్లో ఆ కణాల్లోనే అంతర్గతంగా క్యాన్సర్ తాలూకు విషాలను (సైటోటాక్సిన్స్)ను ఉత్పన్నమయ్యేలా పుట్టించి ఆ క్యాన్సర్లను ఈ పువ్వు నివారిస్తుంది. కుంకుమపువ్వుకుంకుమపువ్వును చరిత్రపూర్వ యుగాల నుంచీ అనాదిగా మనమంతా ఓ సుగంధద్రవ్యంగా వాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. బిర్యానీలోనూ, కశ్మీరీ వంటకాల్లోనూ ఈ పువ్వును ఉపయోగిస్తుంటారు.కుంకుమపువ్వు పోషక విలువలు : కుంకుమపువ్వులో యాంటీసెప్టిక్, యాంటీడిప్రెసెంట్ గుణాలున్నాయి. క్యాన్సర్లతో పోరాడే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. కుంకుమ పువ్వు వాడటం వల్ల కడుపులోని బిడ్డ మంచి రంగుతో పుడుతుందన్న నమ్మకం చాలామందిలో ఉంది. ఇది చాలావరకు అ΄ోహ మాత్రమే. అయితే కుంకుమపువ్వును ఒక హెర్బ్గా, సుగంధద్రవ్యంగా పరిమితంగా తీసుకుంటే మాత్రం దానితో చాలా రకాల న్యూట్రిటివ్ ప్రయోజనాలు ఒనగూరతాయి. కుంకుమపువ్వు రక్తపోటును నియంత్రించి, మూడ్స్ త్వరత్వరగా మారి΄ోవడాన్ని అరికడుతుందని కొన్ని అధ్యయన ఫలితాల్లో తేలింది. ఇందులో బీ–కాంప్లెక్స్ విటమిన్కు సంబంధించిన థయామిన్, రైబోఫ్లేవిన్ అన్న విలువైన పోషకాలు ఉన్నాయి. ఇవి గర్భవతుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక గర్భవతుల్లో ప్రోజెస్టెరాన్ అన్న హార్మోన్ కారణంగా మలబద్దకం రావడం చాలా సహజం. చాలా పరిమితమైన మోతాదులో తీసుకుంటే కుంకుమపువ్వు జీర్ణప్రక్రియను సాఫీగా జరిగేలా చేస్తుంది. ఆకలిని కూడా పెంచుతుంది. ఆ రకంగా గర్భవతులకు ఇది మేలు చేస్తుంది. దీన్ని చిటికెడుకు మించకుండా తీసుకోవడమే సురక్షితం.అపోహే కానీ... ప్రయోజనమూ ఉంది ఇలా... కుంకుమపువ్వు కడుపులోని బిడ్డ రంగును ఆకర్షణీయంగా మార్చుతుందనేది శాస్త్రీయంగా నిర్ధారణ కాని అ΄ోహ మాత్రమే అయినప్పటికీ పాలలో చాలా పరిమితమైన మోతాదులో తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఉదాహరణకు సంపూర్ణాహారమైన పాలను గర్భవతులు తాగడం వాళ్లకు చాలా మేలుచేసే అంశం. అయితే గర్భధారణ సమయంలోని మొదటి మూడు నెలల పాటు తమ వేవిళ్లు, వికారం కారణంగా గర్భవతులు పాలు తాగడానికి అంతగా ఇష్టపడరు. అయితే కుంకుమపువ్వు కలిపిన పాలు మరింత రుచికరంగా, సుగంధభరితంగా ఉంటాయి. అందునా బిడ్డ మంచి రంగులో పుడతాడనే అంశం వాళ్లను పాలు తాగేలా ప్రోత్సహిస్తుంది. ఇక కొన్నిచోట్ల సంప్రదాయ వంటకాల్లోనూ దీన్ని ఒక దినుసుగా ఉపయోగించి వంటలకు మరింత రుచిని ఆపాదిస్తారు. కుంకుమపువ్వు గురించి ఓ హెచ్చరిక కుంకుమపువ్వునువాడే గర్భవతులగుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... పాలలో దీన్ని చిటికెడు కంటే ఎక్కువగా వేసుకోకూడదు. ఎందుకంటే ఇది ఒక నేచురల్ హెర్బ్ కాబట్టి పరిమితికి మించినప్పుడు అది గర్భసంచిని ముడుచుకుపోయేలా చేస్తుంది. ఈ కారణంగా మరీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే దాంతో గర్భస్రావమూ అయ్యే ముప్పు కూడా ఉంటుందని తెలుసుకుని చిటికెడంటే చిటికెడే వాడటమే శ్రేయస్కరం.బ్రాకలీ / బ్రోకలీఒకప్పుడు అందరికీ అంతగా తెలియని బ్రాకలీ అనే ఈ పువ్వు ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద మాల్స్లోనూ లభ్యమవుతోంది. బ్రాకలీ అనేది నిజానికి ఇటాలియన్ పేరు. ఇటాలియన్ భాషలో ‘బ్రకోలో’ అంటే క్యాబేజీ తాలూకు పుష్ప శిఖరాగ్రం (ఫ్లవరింగ్ క్రెస్ట్ ఆఫ్ క్యాబేజీ) అని అర్థం. బ్రాకలీ పోషక విలువలు : ఇందులో విటమిన్ ఏ మోతాదులు చాలా ఎక్కువ. ఒంటి నిగారింపుకూ, మంచి కనుచూపుకూ ‘విటమిన్–ఏ’ బాగా ఉపయోగపడుతుందన్న విషయం తెలిసిందే. ఇందులోని పోషకాలు శరీరంలో దేహంలోని అనేక రకాల విషాలనూ వాటి ప్రభావాలను తొలగించే ‘డీ–టాక్సిఫైయర్స్’గా ఉపయోగపడతాయి. డాక్టర్ హరిత శ్యామ్, సీనియర్ డైటీషియన్నిర్వహణ యాసీన్ (చదవండి: హీరో వరుణ్ ధావన్ కుమార్తెకు డీడీహెచ్..? ఎందువల్ల వస్తుందంటే..) -
నదిని శుభ్రం చేసిన ఒకే ఒక్కడు..! ఆనంద్ మహీంద్రా సైతం..
పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఎప్పటిలా ఈసారి సోషల్ మీడియా వేదికగా సరికొత్త స్ఫూర్తిదాయకమైన స్టోరీతో మనముందుకొచ్చారు. ఈసారి షేర్చేసిన కథ..మనిషి తలుచుకుంటే ఏదైన సాధించగలడు..మందితో పనిలేదని చెప్పే సందేశాత్మక స్టోరీ.మధ్యప్రదేశ్లోని బియోరాకు చెందిన 20 ఏళ్ల బిట్టు తబాహి తీవ్రంగా కలుషితమైన అజ్నార్ నదిని ఒంటరిగా శుభ్రం చేసి రాత్రికి రాత్రికే స్టార్గా మారాడు. అతని అద్భుతమైన ప్రయత్నానికి అబ్బురపడటమే గాక అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా. ఈ సోమవారం ఒంటరి యోధుడు బిట్టునే మనకు ప్రేరణ అంటూ అతడి కథను పంచుకున్నారు. సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్లో ఆ కుర్రాడి గురించి ఇలా రాసుకొచ్చారు. బిట్టు నదిలో కొన్ని భాగాలను శుభ్రం చేశానని చెప్పుకున్నందుకు విమర్శలపాలయ్యాడని అన్నారు. కేవలం వ్యూస్కే ఇదంతా అని ట్రోల్ చేసినట్లు తెలిపారు. సోషల్మీడియా కూడా నిజమైన కృషి కంటే అల్పమైన వాటికే ప్రాధాన్యత ఇస్తుంటుందని విమర్శించారు. పోనీ వాళ్లన్నట్లు బిట్టు లైక్లు, వ్యూస్ కోసం చేసినా..అది ప్రపంచాన్ని మార్చే మంచి పనైతే కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే కదా, విమర్శలు దేనికని ప్రశ్నించారు. ఇక బిట్టు బిట్టు జనవరి 26న కొందరు స్నేహితులతో కలిసి నదిని శుభ్రం చేయడం ప్రారంభించాడని చెప్పారు. అయితే కొన్ని రోజులకే ఒంటరిగా ఆ పని చేయాల్సి వచ్చింది. ప్రాథమిక పనిముట్ల సాయంతో కలుషితమైన నీటిలోకి దిగి, పట్టుదలతో ప్లాస్టిక్ వ్యర్థాలను, నాచు, చెత్త తదితరాలను బయటకు తీశాడు. విమర్శలు వచ్చినా బిట్టు తన ప్రయత్నాన్ని ఎక్కడ విరమించలేదు. పైగా నది సహజ సౌందర్యాన్ని సంతరించుకునేలా పట్టుదలతో పనిచేశాడు. అతడి కృషి ఫలితంగా ఇప్పుడు స్వచ్ఛమైన నీరు పారుతూ అందంగా మారింది ఆ నది అని చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన దృశ్యాలను కూడా బిట్టు తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడని అన్నారు. డిజిటల్ స్టార్డమ్ కోసం చేసినా..అది సమాజ హితానికి ఉపయోగపడేదే అయితే మెచ్చుకుందా, ప్రోత్సహిద్దాం అని అన్నారు మహీంద్రా. నెటిజన్లు సైతం ఒంటిరి యోధుడు, రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపించారు. కొందరు మాత్రం ఒక వ్యక్తి నదిని శుభ్రం చేయగలిగితే.. మొత్తం దేశం పరిశుభ్రతను సీరియస్గా తీసుకుంటే..కచ్చితంగా స్వచ్ఛ భారత్ కాగలదేమో అని పోస్టులు పెట్టారు.This young man from Biaora, M.P, was criticised for claiming to have cleaned parts of a river just in order to gain social media views.Well, we usually complain that social media rewards the trivial rather than the meaningful So If a desire for ‘likes’ can become a force for… pic.twitter.com/ARgEhphuQN— anand mahindra (@anandmahindra) March 30, 2026 (చదవండి: ఆ బాబా ఇంగ్లీష్ ఫ్లుయెన్స్కి మతిపోవాల్సిందే..!) -
తరాలు మారినా తరగని ఆదరణ
ఉదయం లేచాక అల్పాహారం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఇడ్లీ.. నూనె లేకుండా తయారయ్యే ఈ వంటకం అల్పాహారాల్లో ముందు వరుసలో ఉంటుంది. చిన్నారులు, వృద్ధులకు సైతం సులభంగా జీర్ణమయ్యే దీనిని తినేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. మరీ ముఖ్యంగా దక్షిణ భారత దేశ ప్రజలకు ఇదే ప్రధాన అల్పాహారం. వైద్యులు సైతం దీనిని పోషకాహారంగా చెబుతుంటారు. ఇవన్నీ తెలిసినవే.. ఇప్పుడిదంతా ఎందుకు? అంటే.. ఇడ్లీ గురించిన కొన్ని విశేషాలు.. ‘హెవీగా ఏం వద్దు.. జస్ట్ ప్లేట్ ఇడ్లీ ఉంటే చాలు.. పొద్దున్నే గారెలు, వడలు.. మనకి కష్టం గానీ.. నాలుగు ఇడ్లీ అయితే.. లైట్గా ఉంటుంది..’ ఇలాంటి మాటలు చాలా మంది నోటి నుంచి వింటూనే ఉంటాం. ఇడ్లీ అంటే మనకంత క్రేజ్ మరి. ఇంటర్నేషనల్ రుచులు ఎన్ని పరిచయమైనా.. ఇండియాలో ఇడ్లీ అంటే ఇప్పటికీ ఇంటి వంటకమే. ఇటీవల నగరవాసులు ఫేవరెట్ బ్రేక్ ఫాస్ట్పై పలు ఫుడ్ డెలివరీ యాప్స్ చేసిన అధ్యయనంలోనూ ఇడ్లీ టాప్ ప్లేస్లో నిలిచింది. నేపథ్యం ఇదీ.. కొన్ని అధ్యయనాల ప్రకారం.. ఈ వంటకం ఇండోనేషియాలో పుట్టి భారతదేశానికి వచ్చింది. శతాబ్దాల చరిత్ర కలిగి ప్రసిద్ధ దక్షిణ భారత ఆవిరి వంటకంగా నిలిచిన ఇడ్లీని గౌరవించటానికి, ప్రతి సంవత్సరం మార్చి 30న ప్రపంచ ఇడ్లీ దినోత్సవాన్ని జరుపుకునే సంప్రదాయం 2015లో ప్రారంభమైంది. దీనిని చెన్నైకి చెందిన ఓ ప్రముఖ క్యాటరర్ ఎం.ఎనియవన్ ప్రారంభించారు. 2015 మార్చి 30న 1,328 రకాల ఇడ్లీలను సృష్టించి ఇడ్లీ మ్యాన్గా గుర్తింపు పొందాడు. దీంతో పాటే వరల్డ్ ఇడ్లీ డేకి గుర్తింపు తెచ్చారు. 2022లో రెండు వేల రకాలను చేసి మతిపోగొట్టారు. అంతేకాదు 125 కేజీల బరువున్న ఇడ్లీతో గిన్నిస్ రికార్డుకెక్కాడు. నగరంలో ఇడ్లీ ప్రియులు.. ఇటీవల ఫుడ్ డెలివరీ యాప్స్ నిర్వహించిన ఓ అధ్యయనంలో పోషక విలువలు అధికంగా అందించేదిగా ఈ అల్పాహారాన్ని అత్యధికులు అభిమానించే, ఎక్కువగా ఆర్డర్ చేసే అల్పాహారంగా నిలిచింది.. ఇడ్లీ వినియోగంలో దక్షిణాది నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నైతో పాటు తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని తేలింది. దీని వ్యక్తిగత వినియోగంలో హైదరాబాద్కు చెందిన ఒక వినియోగదారుడు ఒక సంవత్సరంలో కేవలం ఇడ్లీ కోసం రూ.7.3 లక్షలు ఖర్చు చేయడం ద్వారా రికార్డ్ సృష్టించారు. పొడి పొడిగా.. నగరంలో లభించే ఇడ్లీలు తమిళనాడు స్టైల్ కంటే కొద్దిగా భిన్నంగా ఉంటాయి. పిండిని బియ్యానికి బదులు ఇడ్లీ రవ్వతో తయారు చేస్తారు. ఇది వాటికి ప్రత్యేకమైన ఆకృతి ఇస్తుంది. నగరవ్యాప్తంగా అవుట్లెట్స్ ఉన్న వరలక్ష్మి టిఫిన్స్, తాజా కిచెన్, మాదాపూర్లోని నన్నయ్య, బాబాయ్ హోటల్ వంటివి ఈ పొడి ఇడ్లీలకు పేరొందాయి.ఎన్నెన్నో వెరైటీలు.. ఇడ్లీని కాలానికి తగ్గట్టుగా.. ప్రతి ఒక్కరికీ ప్రియమైన ఆహారంగా మార్చడంలోనూ అనేక మంది ప్రయత్నాలు ఫలించాయి. ఇందులో నెయ్యి, పొడి ఇడ్లీ, రవ్వ, కాంచీపురం, చిట్టి ఇడ్లీ వంటివి గత కొంత కాలంగా ప్రసిద్ధ రకాలు. కాగా ఇటీవల మరింతగా పెరిగిన ఆరోగ్య స్పృహతో రాగి ఇడ్లీ, మిల్లెట్ ఇడ్లీ.. వంటివి కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇడ్లీకి జతగా సాంబార్ కొబ్బరి చట్నీ, కారం పొడి.. వంటివి అదిరిపోయే కాంబినేషన్గా అల్పాహార ప్రియులు వరి్ణస్తుంటారు. ఈ నేపథ్యంలో నగరంలో కొన్ని బెస్ట్ ఇడ్లీ ప్లేసెస్ విశేషాలివీ..నేతితో నేర్పుగా.. నగరంలో బాగా పేరొందినవి ఘీ ఇడ్లీ. వేరుశెనగలు, మినపపప్పు, శనగపప్పు వంటి పప్పుధాన్యాలు, వెల్లుల్లి, ఎండు మిరపకాయల ముతక మిశ్రమమైన పొడిని, ఆవిరి మీద ఉడికించిన ఇడ్లీల మీద దట్టంగా పూసి, దానిపై నెయ్యిని చిలకరిస్తారు. కొన్ని చోట్ల తాజాగా తీసిన వెన్నను కొద్దిగా కలుపుతారు, జూబ్లీహిల్స్లోని సదరన్ స్పైస్, సికింద్రాబాద్ క్లాక్ టవర్ సమీపంలోని కేఫ్ కాడలే, నగరంలో పలు చోట్ల ఉన్న పంచకట్టు దోస ఔట్లెట్లు, మాదాపూర్ కొంపల్లిలోని కాంచి కేఫ్.. వంటి ప్రదేశాల్లో ఇది ఫేమస్.మినీ కోసం మెనీ.. సాంబార్లో ముంచిన మినీ ఇడ్లీలు/ కారంగా ఉండే పిస్తా పొడిలో వేయించినవి సిటీలో బాగా ఫేమస్. ఇవి దాదాపు ఫింగర్ ఫుడ్ లాగా ఉన్నా, దేశీ స్టైల్లో ఉంటాయి. ఈ రకం ఇడ్లీలు జూబ్లీహిల్స్లోని కాఫీ సంగం వంటి చోట్ల ఆదరణ పొందుతున్నాయి.కర్రీ కూరి.. మెత్తటి ఇడ్లీలను చిక్కటి గ్రేవీలతో మేళవిస్తారు. ఇడ్లీలు ఆ గ్రేవీని పూర్తిగా పీల్చుకుని, సాధారణంగా తేలికపాటి టిఫిన్గా ఉండేదాన్ని కడుపు నింపే భోజనంగా మారుస్తాయి. బ్రేక్ ఫాస్ట్ లంచ్ మేళవించే బ్రంచ్ లవర్స్కు ఇవి బెస్ట్. కూరలతో ఇడ్లీ తినడం ఒక విభిన్నమైన అనుభూతి. చికెన్ కర్రీ ఇడ్లీ, పాయా షోర్బా ఇడ్లీ, మటన్ ఇడ్లీ సైతం నగరంలో అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి ఇడ్లీ రుచి చూడాలంటే.. కూకట్పల్లిలోని చిత్తూరు నాయుడు రెస్టారెంట్ వంటి ప్రదేశాల్లో లభిస్తాయి. -
మనుషులతో ఎలా కనెక్ట్ అవ్వాలి?
చాలామందికి నెట్వర్కింగ్ అంటేనే ఒక రకమైన విరక్తి. ఎందుకంటే అందులో కృత్రిమమైన నవ్వులు (Fake Smiles), అవసరం కోసం చేసే పొగడ్తలు ఉంటాయని భయపడతారు. కానీ, నిజమైన నెట్వర్కింగ్ అంటే మీ ముసుగును తీసివేసి, మీ సహజత్వంతో (Authenticity) ఎదుటివారిని ఆకట్టుకోవడం.మనుషులు 'ఫేక్'ని కనిపెట్టడంలో చాలా దిట్ట. మీరు పళ్ళు ఇరవదీసి నవ్వినా, లోపల ఏదో ఆశిస్తున్నారని వారికి అర్థమైపోతుంది. నెట్వర్కింగ్ అనేది ఒక 'బిజినెస్ డీల్' కాదు, అది ఒక 'హ్యూమన్ కనెక్షన్'. మీరు మీలా ఉంటూనే ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేయవచ్చో చూద్దాం.'The Power of Being Real…సైకాలజీలో 'Pratfall Effect' అనే కాన్సెప్ట్ ఉంది. దీని ప్రకారం, మనుషులు పర్ఫెక్ట్గా ఉండేవారి కంటే, చిన్న చిన్న లోపాలు ఉండి సహజంగా ఉండేవారిని ఎక్కువగా ఇష్టపడతారు.అందువల్ల మీరు అంతా తెలిసినట్టు నటించనవసరం లేదు. "నాకు ఈ విషయం తెలియదు, మీరు వివరిస్తారా?" అని అడగడం కూడా ఒక అద్భుతమైన కనెక్టింగ్ టూల్. ఇది ఎదుటివారికి 'వాల్యూ' ఇస్తుంది.Curiosity Over Presentationనెట్వర్కింగ్ ఈవెంట్లలో చాలామంది "నేను నా గురించి ఏం చెప్పాలి?" అని టెన్షన్ పడతారు. కానీ అసలైన టెక్నిక్ ఏంటంటే, మీ గురించి చెప్పడం తగ్గించి, ఎదుటివారి గురించి అడగడం పెంచండి.ఒక వ్యక్తిని కలిసినప్పుడు "మీరు ఏం చేస్తారు?" అనే రొటీన్ ప్రశ్న కంటే, "ప్రస్తుతం మీరు ఏ ప్రాజెక్ట్ గురించి ఎక్సైటెడ్ గా ఉన్నారు?" లేదా "మీ ప్రయాణం ఎలా మొదలైంది?" అని అడగండి.మీరు వారిపై చూపే 'నిజమైన ఆసక్తి' (Genuine Interest) వెయ్యి నవ్వుల కంటే ఎక్కువ ప్రభావం చూపుతుంది.మోటివేషన్ మాయ vs సహజ సిద్ధాంతం"అందరితో కలవాలి, అందరికీ కార్డులు ఇవ్వాలి, అందరినీ ఇంప్రెస్ చేయాలి" అని మోటివేషన్ స్పీకర్లు చెప్తారు. దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇది మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది."వందమందిని కలవనక్కర్లేదు. ముగ్గురిని కలిసినా, వారితో లోతైన కనెక్షన్ ఏర్పరచుకో" అని సైకాలజీ చెప్తుంది. క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.సహజమైన కనెక్షన్ బిల్డింగ్Genius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, ముసుగులు లేని నెట్వర్కింగ్ ఇలా ఉంటుంది.Step 1: ఇంప్రెస్ చేయాలనే తపన తగ్గించుకోండిఎదుటివారిని మెప్పించాలి లేదా వారిని బురిడీ కొట్టించాలి అనే ఆలోచనను 'Break' చేయండి. మీరు ఎవరికైనా ఏదైనా 'అమ్మడానికి' వెళ్లడం లేదు, ఒక 'సంబంధాన్ని' నిర్మించడానికి వెళ్తున్నారు. ఆ ఒత్తిడి పోతే మీ ముఖంలో సహజమైన ప్రశాంతత వస్తుంది.Step 2: Build Common Groundమీకు, అవతలి వ్యక్తికి మధ్య ఉన్న పోలికలను వెతకండి. అది ఒక హాబీ కావచ్చు, ఒక ఊరు కావచ్చు, లేదా ఒకే రకమైన సమస్య కావచ్చు. మనుషులు తమలాంటి వారితో కనెక్ట్ అవ్వడానికి ఇష్టపడతారు. దీనికి నకిలీ నవ్వులు అవసరం లేదు, కేవలం Observation ఉంటే చాలు.Step 3: Beyond (నిస్వార్థ సహాయం - Selfless Value)కనెక్షన్ ఏర్పడిన తర్వాత, "నేను వారికి ఎలా సహాయపడగలను?" అని ఆలోచించండి. వారికి ఒక మంచి కాంటాక్ట్ ఇవ్వడం లేదా ఒక ఉపయోగపడే సమాచారాన్ని షేర్ చేయడం చేయండి. మీరు ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేసినప్పుడు, ఆ కనెక్షన్ జీవితకాలం నిలుస్తుంది. ఇదే 'Beyond' స్టేజ్.మీ కనెక్షన్స్ ఎంత నిజం?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.1. మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వారిలో, ఎంతమందితో మీరు కేవలం అవసరం లేకుండా పలకరిస్తారు?2. మీరు కొత్తవారిని కలిసినప్పుడు మీ గురించి గొప్పలు చెప్పుకుంటున్నారా లేక వారి గురించి వింటున్నారా?3. మీరు మాట్లాడేటప్పుడు మీ నవ్వు మనస్ఫూర్తిగా వస్తోందా లేక అది ఒక 'డ్యూటీ' లా అనిపిస్తోందా?సహజత్వమే మీ అసలైన బ్రాండ్!బ్రో, ప్రపంచం నకిలీలతో నిండిపోయింది. అక్కడ మీరు మీలా 'ఒరిజినల్' గా ఉండటమే అతిపెద్ద ఆకర్షణ. ఫేక్ స్మైల్స్ అవసరం లేదు, మీ కళ్ళలో నిజాయితీ ఉంటే చాలు. మనుషులు మీ తెలివితేటల కంటే మీ వైబ్ తోనే ఎక్కువగా కనెక్ట్ అవుతారు."Be yourself; everyone else is already taken." - Oscar Wild సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com -
రైతులకు అండగా ‘టాప్కో’
చిన్న, సన్నకారు రైతులను కూడగట్టి పంచాయతీ స్థాయిలో వారికి అవసరమైన అన్ని రకాల సేవలు అందించటంలో తిరునెల్లి అగ్రి ప్రొడ్యూసర్ కంపెనీ (టాప్కో) ఆదర్శప్రాయమైన కృషి చేస్తోంది. కేరళలోని వాయనాడ్ జిల్లా తిరునెల్లి పంచాయతీలో 9 ఏళ్ల క్రితం 51 మంది రైతుల భాగస్వామ్యంతో ప్రారంభమైన ఈ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ప్రకృతి వ్యవసాయ శిక్షణ, దేశీ వరి వంగడాల పరిరక్షణ, రైతులు పండించిన ప్రతి గింజనూ సమంజసమైన ధరకు కొనుగోలు చెయ్యటం కీలకపాత్ర పోషిస్తోంది. దేశీ వరి, కూరగాయ విత్తనాలను సుమారు 5 వేల మంది రైతులకు అందిస్తోంది. కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ తోడ్పాటుతో ప్రతి మంగళవారం గ్రామస్థాయిలో వాతావరణ సంబంధమైన సూచనలు, సలహాలను అందించటం విశేషం.గ్రామ స్థాయిలో వాతావరణ సూచనలు: వరి, కాఫీ, మిరియాలు, దుంప పంటలు, కూరగాయలు.. ఈ ఐదు రకాల పంటలకు సంబంధించి పంచాయతీలోని 8 కొండ ప్రాంత గ్రామాల్లో ప్రతి 5 కిలోమీటర్లను ఒక యూనిట్గా తీసుకొని వాతావరణ సూచనలు ఇందిస్తోంది. భారత వాతావరణ శాఖ జిల్లా స్థాయి వాతావరణ సూచనలతో సరిపెట్టుకుంటూ ఉన్నందున తాము గ్రామ స్థాయి సూచనలు అందించటం రైతులకు ఉపయుక్తంగా ఉంటున్నదని టాప్కో సీఈవో, సేంద్రియ రైతు రమేశ్ కృష్ణన్ చెప్పారు. మైసూరులో ఇటీవల జరిగిన ఆషా కిసాన్ స్వరాజ్ సమ్మేళనంలో ఆయన ‘సాక్షి సాగుబడి’తో ముచ్చటించారు. అనూహ్యంగా మారుతున్న వాతావరణ పరిస్థితులపై పంచాయతీ స్థాయిలో పరిశోధనలు చెయ్యటం, గమనించిన మార్పులను, వాటిని తట్టుకునేందుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజెయ్యటం ద్వారా టాప్కో సత్ఫలితాలు సాధిస్తోంది. తిరునెల్లి పంచాయతీ కూడా ఏమీ వెనుకబడి లేదు. ఈ ఏడాది నుంచి ప్రతి వార్డులో ఉష్ణోగ్రత, గాలిలో తేమ, వర్షం తదితర వాతావరణ సమాచారాన్ని హ్యూమెస్ ట్రస్టు తోడ్పాటుతో ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు పంచాయతీ ప్రజలకు అందిస్తోందన్నారు. ఉత్పత్తి వ్యయాన్ని బట్టి ధర: తమ సంస్థ సభ్యులైన రైతులు ఏమేమి పంటలు, ఎంత విస్తీర్ణంలో పండించాలన్నది ప్రతి ఏటా ఖరీఫ్కు ముందు క్రాప్ కేలండర్ను రూపొందించుకుంటున్నామని రమేశ్ కృష్ణన్ వివరించారు. ముఖ్యంగా అంతరించిపోతున్న సంప్రదాయ వరి వంగడాలను గుర్తించి, మార్కెట్ అవసరాల మేరకు సాగు చేయిస్తున్నామన్నారు. పూర్వం నుంచి వరి సాగు చేస్తున్న భూములను ఇతర అవసరాలకు మళ్లించకుండా రైతులకు నచ్చజెప్పటంతో పాటు సేంద్రియ సేద్యానికి, మార్కెటింగ్ సదుపాయం ద్వారా మంచి ఆదాయం రైతులకు అందించటానికి కృషి చేస్తున్నామన్నారు. ఏ రకం దేశీ వరి దాన్యం సగటున ఎకరానికి ధిగుబడి ఎంతో ఆ ఉత్పత్తి వ్యయాన్ని బట్టి సీజన్కు ముందుగానే రైతు నుంచి కొనుగోలు చేసే ధరను టాప్కో నిర్ణయించటం మరో విశిష్టత. ఎక్కువ దిగుబడి వచ్చే వంగడం ధాన్యం ధర తక్కువగా ఉంటుంది. తక్కువ దిగుబడి వచ్చే రకం ధర ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు.. ఎకరానికి 2 టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే రెడ్ రైస్ ధాన్యానికి కిలో రూ. 34, తక్కువ దిగుబడినిచ్చే రకానికి రూ.130 చెల్లిస్తున్నారు.వయనాడ్ తొండి, పాల్ తొండి, చెంతడి, వలై చెన్నెల్లు, నవార, గంధకశాల, జీరకశల, ముల్లంకైమ తదితర రకాల దేశీ వరి రకాల బియ్యం, పిండి, రవ్వ, అటుకులను టాప్కో ప్రత్యేక దుకాణంలో విక్రయిస్తున్నారు. స్థానిక వాతావరణానికి పూర్వకాలం నుంచి అనువుగా ఉండే పాత పంటలను పరిరక్షించుకోవటం, రసాయనాలు వాడకుండా ఆరోగ్యదాయక మైన ఆహారాన్ని ప్రజలకు అందించటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ఈ పనులను రైతులకు గిట్టుబాటయ్యేలా చెయ్యటంలో తమ ఎఫ్పీసీ విజయం సాధిస్తోందని రమేశ్ కృష్ణన్ సంతోషంగా చెప్పారు. -
సక్సెస్ బాటలో సహజ ఆర్గానిక్స్
దేశంలో సేంద్రియ వ్యవసాయానికి పెరుగుతున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సిన నియంత్రణ చర్యలపై అధ్యయనం చెయ్యటానికి కేంద్ర ప్రభుత్వం డాక్టర్ కున్వర్జి భాయ్ జాధవ్ అధ్యక్షతన తొలి ఆర్గానిక్ ఫార్మింగ్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. దీని నివేదిక ఆధారంగానే ‘నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్’ (ఎన్పీఓపీ) పేరిట తొలి ఆర్గానిక్ సర్టిఫికేషన్ వ్యవస్థ 2000 మార్చిలో అమల్లోకి వచ్చింది. సేంద్రియ వ్యవసాయం, సర్టిఫికేషన్ వ్యవహారాలను సమన్వయపరచడానికి ‘నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ (ఎన్సీఓఎఫ్)’ 2004లో ప్రారంభమైంది. తదనంతరం ఈ సంస్థ పేరులో ‘నేచురల్’ అనే పదాన్ని చేర్చటం ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని కూడా కేంద్ర వ్యవసాయ శాఖ దీని పరిధిలోకి తెచ్చింది. అదే ఏడాది తొలి సేంద్రియ వ్యవసాయ విధానాన్ని 2004 మార్చి 24న అమల్లోకి తెచ్చిన ఘనత కర్ణాటక రాష్ట్రానికి దక్కింది. ఈ నేపథ్యంలో రూపుదిద్దుకున్న బెంగళూరుకు చెందిన సహజ ఆర్గానిక్స్ ఎఫ్పీఓ ప్రజల ఆదరణ పొందుతోంది.130 ఉత్పత్తులు... రూ.28 కోట్ల టర్నోవర్కర్ణాటకలో ఏర్పాటైన తొలి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ‘సహజ సమృద్ధ ఆర్గానిక్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్’. 16 ఏళ్ల క్రితం కంపెనీ చట్టం ప్రకారం బెంగళూరులో రిజిస్టరైన ఈ ఎఫ్పీఓ తన వాటాదారులైన 1,024 మంది సేంద్రియ రైతులకు అధిక నికరాదాయాన్ని అందిస్తోంది. దానితో పాటు, 15 రాష్ట్రాల్లోని సేంద్రియ రిటైల్ విక్రయదారులకు, వినియోగదారులకు నమ్మకమైన రసాయన అవశేషాల్లేని ఆహారోత్పత్తులను ‘సహజ ఆర్గానిక్స్’ బ్రాండ్తో చేరవేస్తోంది. 130 పచారీ సామాన్లతో పాటు వంద రకాలకు పైగా కూరగాయలు, పండ్లను టోకుగా, రిటైల్గా విక్రయిస్తూ గత ఏడాది రూ.28 కోట్ల వార్షిక టర్నోవర్ సాధించింది. ప్రతిష్టాత్మక జైవిక్ ఇండియా ఫస్ట్ ప్రైజ్ సహా అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు గెల్చుకుంది. అన్నిటికీ మించి, 2018 జూన్ 24న ‘మన్ కీ బాత్’లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు పొందటం విశేషం.రైతుకు 15–20% అదనపు ధరసహజ ఆర్గానిక్స్ తన వాటాదారులైన రైతుల నుంచి, దేశవ్యాప్తంగా 25కు పైగా సేంద్రియ రైతు బృందాల నుంచి∙ఈ ఎఫ్పీఓ దేశీ వరి బియ్యం, పప్పులు, నూనె గింజలు, పండ్లు, బెల్లం, తేనె తదితరాలను సేకరిస్తుంది. బెంగళూరు పరిసరాల్లోని 5 గ్రామాల్లో సేంద్రియ రైతుల నుంచి కూరగాయలు, పండ్లను సేకరిస్తుంది. రైతులకు, ప్రాసెసింగ్ యూనిట్, మిల్లులకు ఎన్పీఓపీ ఆర్గానిక్ సర్టిఫికేషన్తో పాటు ఐఎంఓ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ తప్పనిసరి చేశారు. రైతులకు మార్కెట్ ధరపై 15–20% అదనపు ధర చెల్లిస్తున్నట్లు సహజ ఆర్గానిక్స్ ప్రతినిధి ప్రసాద్ బెంగళూరులోని ప్రాసెసింగ్ యూనిట్ను సందర్శించిన ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. ప్రతి పంటకు బేస్ ధర ఉంటుంది. బహిరంగ మార్కెట్లో అంతకన్నా ధర పతనమైనా ఎఫ్పీఓ ఆ ధర చెల్లిస్తుందన్న మాట. ఉదా.. టొమాటో బేస్ ధర కిలోకు రూ. 10–12. ఎఫ్పీఓ ఖరారు చేసిన ముందస్తు ప్రణాళిక ప్రకారం.. రైతులు మిశ్రమ సేంద్రియ పంటలను నిర్దేశిత విస్తీర్ణంలో సాగు చేస్తారు. అవసరానికి మించి పండితే సాధారణ ధరలకే స్థానిక మార్కెట్లలో విక్రయిస్తారు. రైతులకు వారానికోసారి పైకం చెల్లిస్తున్నారు. ఎఫ్పీఓకి వచ్చిన లాభాల్లో నుంచి ఏడాదికి ఓసారి బోనస్ (విత్హెల్డ్ ప్రైస్) చెల్లిస్తున్నారు.అంతర్జాతీయ ప్రమాణాల వల్లనే ప్రజల ఆదరణఆరోగ్యకరమైన సేంద్రియ ఆహారోత్పత్తి ద్వారా వినియోగదారులకు, రైతులకు, మట్టికి, పర్యావరణానికి మేలు జరుగుతోంది. దీని ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రజలు మున్ముందు ఇంకా ఎక్కువగా గుర్తిస్తారు. బెంగళూరు, చెన్నై, కేరళ తదితర ప్రాంతాల్లో మా ఉత్పత్తులు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. మా వద్ద ఆర్గానిక్ ఉత్పత్తులను టోకుగా కొనుగోలు చేసి, ఎక్కడైనా రిటైల్గా విక్రయించుకునే వారి కోసం వైట్ ప్యాకింగ్తో లేదా వారి బ్రాండ్ కవర్తో ప్యాక్ చేసి ఇస్తున్నాం. నాణ్యత, విశ్వసనీయత, ట్రేసబిలిటీలకు సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నాం. మా సేంద్రియ ఉత్పత్తులకు గత 16 ఏళ్లుగా ప్రజాదరణ పెరుగుతోంది.– బి. సోమేశ్, సీఈవో, ఎండీ, సహజ సమృద్ధ ఆర్గానిక్ ప్రొడ్యూసర్ కంపెనీ, సిద్ధనపాల్య, బెంగళూరు somesh@sahajaorganics.com -
పాతికేళ్లకే కుంగుబాటు!!
ఆమె శరీరానికి జ్వరం వస్తేనే ఇంట్లో సరిగా పట్టించుకోరు. ఇక మనసుకు జ్వరం వస్తే? మన దేశంలో స్త్రీల మానసిక సమస్యలను గుర్తించడం, వైద్యం చేయించడం చాలా తక్కువ. తల్లి, భార్య, చెల్లెలు, అక్క, కుమార్తె... వీరి మానసిక ప్రవర్తనలో మార్పు వచ్చిందని తెలుసుకునేలోపు మానసిక సమస్యలు ముదిరిపోయి ఉంటాయి. అనేక వొత్తిళ్లు, పరిమితులు స్త్రీల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. వాటి పట్ల అవగాహనే సగం వైద్యం. ఇంటిల్లిపాది తెలుసుకోవాల్సిన వరుస కథనాలు నేటి నుంచి...హాస్పిటల్స్లో సైకియాట్రీ, సైకాలజీ విభాగాల్లోని వెయిటింగ్ రూమ్స్లోకి చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేం. ఎందుకంటే, అక్కడ మానసిక సమస్యలతో కనిపిస్తున్నవారు 35 ఏళ్ల లోపువారే ఉంటున్నారు. 84 దేశాలలో వరల్డ్ మెంటల్ హెల్త్ రిపోర్ట్ చేసిన మైండ్ హెల్త్ కోషెంట్ స్కోర్లో భారతీయ యువత 60వ స్థానంలో ఉండి, తక్కువ పనితీరును కనబరిచినట్టు వెల్లడైంది. ఈ విషయంలో ఇండియన్ సైకియాట్రీ సొసైటీ ఆందోళన వ్యక్తం చేసింది. అంటే, మన దేశ యువత మానసిక ఆరోగ్య సమస్యల ముఖచిత్రం ఇప్పుడు చిన్నవయసుకే చేరిపోయిందన్నమాట.వరల్డ్ మెంటల్ హెల్త్ పరిశోధనలో భారతదేశంలోని యువత ఎం.హెచ్.క్యూ స్కోరు సుమారు 33గా ఉంది. ఇది ‘బాధపడుతున్న, ఇబ్బంది పడుతున్న’ వర్గం కిందకు వస్తుంది. దీని వల్ల 18–34 ఏళ్ల లోపు వయసు ఉన్నవారిలో దాదాపు 64 శాతం మంది ఇంకా కుటుంబాలపై ఆధారపడుతున్నట్టుగానే తెలిసింది. సాధారణంగానే ఇటీవలి కాలంలో పదమూడు, పద్నాలుగేళ్ల లోపు వయసు నుంచే మానసిక సమస్యలు మొదలవుతున్నాయి. ఇక 25 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆ సమస్యలు 62 శాతానికి పెరుగుతున్నాయి. వీరిలో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, మత్తు పదార్థాలపై ఆధారపడటం.. వంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. వీటిని త్వరగా గుర్తించకపోతే తాత్కాలిక సమస్యలుగా ఉండాల్సినవి, జీవితాంతం వెంటాడే పెను భారంగా మారిపోతాయి.మానసిక ఒత్తిడిఈ రోజుల్లో యువత డబ్బును సంపాదించడంలోనూ, విచ్చలవిడిగా ఖర్చు చేయడంలోనూ ఇండిపెండెంట్గా ఉంటున్నారని అనుకుంటారు. కానీ, మానసికంగా, భావోద్వేగ పరంగా ఇతరులపై ఆధారపడుతున్నారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. డిజిటల్ ప్రపంచం, గ్లోబల్ పోటీ వల్ల విస్తృతంగా అవకాశాలు పెరిగాయి. కానీ అదే సమయంలో అవన్నీ మనసుపై ఒత్తిడిని కూడా పెంచుతున్నాయి. దీని వల్ల 20–25 ఏళ్ల వయస్సులోనే బర్నౌట్, క్లినికల్ డిప్రెషన్ కేసులు కనిపిస్తున్నాయి అంటున్నారు సైకియాట్రిస్టులు.సామాజిక ఒత్తిడిఈ రోజులు ఎలా ఉంటున్నాయంటే చిన్న వయస్సులోనే ‘పనితీరును అద్భుతంగా ప్రదర్శించాలి’ అనే ఒత్తిడి మొదలవుతోంది. పిల్లల్లో వారి మైండ్ పూర్తిగా ఎదగకముందే ‘కంపారిజన్’ అనే భారం పడుతోంది. ఒక దశలో చదువుల ఒత్తిడి, మరొక దశలో ఉద్యోగ అనిశ్చితి, వివిధ రకాల ప్రతిభ, డిజిటల్ స్మార్ట్.. రోజువారీ స్ట్రెస్గా మారిపోయాయి. అన్నీ సాధించేయాలనే తపన కూడా మైండ్ను ప్రశాంతంగా ఉండనివ్వడంలేదు. డిజిటల్ అడిక్షన్ – కంపారిజన్ ట్రాప్సోషల్ మీడియాలో అందరి జీవితాలు ‘పర్ఫెక్ట్’గా కనిపిస్తాయి. అవి నిజం కాకపోయినా మనలో మనకే తక్కువవాళ్లమనే భావనను పెంచుతాయి. తెలిసినవారి, పరిచయస్తుల సోషల్మీడియా పర్ఫెక్ట్ ఫొటోలు చూసి పోల్చుకోవడం పెరిగింది. ‘నేను అంతగా బాగోలేను, నేనేమీ చేయలేను’ అనే భావనలో సెల్ఫ్–ఎస్టీమ్, సోషల్ ఐసోలేషన్... వంటివి పెరుగుతున్నాయి.ఒంటరితనం సృష్టించిన వలయంఇప్పటి జనరేషన్ సామాజిక మాధ్యమాలతోనే ఎక్కువగా కనెక్ట్ అయి ఉంది. కానీ, గాఢమైన, వాస్తవ సంబంధాలు మాత్రం తగ్గిపోయాయి. అదే ఒంటరితనానికి, డిప్రెషన్ కు ప్రధాన కారణంగా మారుతోంది. యువత ఈ విధంగా ఉండటం వల్ల దేశ భవిష్యత్తు ముఖ చిత్రం మారే అవకాశం ఉంది. యువత ఆరోగ్యంగా, ఉత్పాదకంగా ఉంటేనే దేశం సర్వ సంపన్నంగా ఎదుగుతుంది. కానీ, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిలో 70–80 శాతం మందికి సరైన సమయంలో చికిత్స అందడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే ఒక తరం యువత తమ సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.నియంత్రణ తప్పనిసరి→ చాలా మానసిక సమస్యలు ముందే గుర్తించి, నిపుణులను సంప్రదించి, తగిన సూచనలు పాటిస్తే నియంత్రణలో ఉంటాయి.→ ఆలస్యమైతే సులభంగా నయం అయ్యే సమస్య జీవితాంతం ఉండే డిసేబిలిటీగా మారిపోతుంది.→ స్కూళ్లు, కాలేజీల్లో మెంటల్ హెల్త్ స్క్రీనింగ్ తప్పనిసరి ఏర్పాటు చేయాలి. → నేటి తరాన్ని మన ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మెరుగైన ఫలితాలను పొందుతాం.చర్చించే స్వేచ్ఛ ఉండాలిమానసిక కుంగుబాటు, సమస్యలను ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. మన దేశంలో ఇప్పటికీ కొన్నిచోట్ల మానసిక సమస్య అంటే ‘సంకోచం’తో ఆగిపోతారు. ఇతరులతో పోటీ, పోలిక అనేవి ఈ రోజుల్లో చిన్నప్పటి నుంచే బాగా పెరిగాయి. అలా కాకుండా స్వీయ సమర్థతను వెలికి తీయగలగాలి. ఏ పని ఎంతవరకో హద్దులు ఏర్పాటు చేసుకోవాలి. సమయ పాలన, పోషకాహారం, ఉత్సాహభరితమైన జీవనశైలి.. మానసిక ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతాయి. ఎలాంటి సంకోచం లేకుండా మానసిక సమస్యలపై కుటుంబంలోనూ, సమాజంలోనూ చర్చించే స్వేచ్ఛ ఉండాలి. మానసిక ఆరోగ్యానికి సంబంధించి యువతకు అనుకూలమైన హెల్త్కేర్ సిస్టమ్ అవసరం.– డాక్టర్ మంజులారావు, క్లినికల్ సైకాలజిస్ట్– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఆమె... అమెజాన్
తమ సంస్థకు సంబంధించి అన్ని విభాగాలలో ఏఐ–సాంకేతికతను అనుసరిస్తోంది ప్రముఖ ఇ–కామర్స్ కంపెనీ అమెజాన్ ఇండియా. అమెజాన్ ఇండియాలో ఏఐ ఇన్నోవేషన్కు సంబంధించి ముగ్గురు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అమెజాన్ ఇండియా లీడర్స్ గీతాంజలి భుతాని, పాయల్ గుప్తా, శ్వేత శంకర్ జెన్ ఏఐ ఆధారిత షాపింగ్ ఆవిష్కరణను ముందుకు నడిపిస్తూనే అమెజాన్ విట్, విల్, కెటపల్ట్, అమెజాన్ సహేలి కార్యక్రమాల ద్వారా మహిళలకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు.మూడింతలు పెంచేలా...సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డైరెక్టర్ అయిన గీతాంజలి భుతాని హై–వాల్యూమ్ సిస్టమ్లను అభివృద్ధి చేసే బృందాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ సిస్టమ్ల ద్వారా జరిగే లావాదేవీలను మూడు రెట్లు పెంచడం ఆమె లక్ష్యం. సాంకేతిక పరిజ్ఞానం, వ్యూహాత్మక ఆలోచన రెండూ అవసరమయ్యే క్లిష్టమైన ఇంజినీరింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు గీతాంజలి, ‘పని విషయంలో ఉత్సాహవంతులైన ఉద్యోగులు ఉంటే అత్యుత్తమ పనితీరును కనబరిచే సాంకేతిక వ్యవస్థలను సులభంగా నిర్మించవచ్చు. ఆవిష్కరణలకు ఎప్పుడూ కొరత ఉండదు. ఉద్యోగులకు వారు ఊహించని అవకాశాలు ఇవ్వడం, విశ్వాసం ఉంచడం ద్వారా వారిలోని సామర్థ్యాన్ని ఎలా వెలికి తీయవచ్చో నేను ప్రత్యక్షంగా చూశాను’ అంటారు గీతాంజలి. అమెజాన్విట్, ఉమెన్ ఇన్ లీడర్షిప్ లాంటి కార్యక్రమాల ద్వారా మహిళా ఇంజినీర్లకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు గీతాంజలి, వారి కలలు ఎంత కష్టంగా అనిపించినా, వాటిని సాధించేలా ప్రోత్సహిస్తూ వారి కెరీర్ వృద్ధికి మార్గనిర్దేశం చేస్తున్నారు. వారి నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడుతున్నారు.హైపర్ పర్సనలైజ్డ్అమెజాన్లో సెంట్రల్ షాపింగ్ ఎక్స్పీరియెన్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డైరెక్టర్గా పాయల్ గుప్తా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కీలకమైన షాపింగ్ అనుభవాలను అందించే, సాంకేతిక పరిష్కారాలను నిర్మించే ఇంజినీరింగ్ బృందాలకు ఆమె నాయకత్వం వహిస్తున్నారు. జనరేటివ్ ఏఐని ఉపయోగించి షాపింగ్ను వ్యక్తిగతీకరించిన (హైపర్ పర్సనలైజ్డ్), ఆహ్లాదకరమైన అనుభవంగా మార్చడంపై దృష్టి పెట్టారు పాయల్ గుప్తా.ఏఐ ఆధారిత ఆవిష్కరణలుసాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డైరెక్టర్ అయిన శ్వేతాశంకర్, వినియోగదారులకు సంబంధించిన టెక్నాలజీ ప్లాట్ఫామ్లను నిర్మించే ‘అమెజాన్ ఇండియా రిటైల్ టెక్నాలజీ’ బృందాలకు నాయకత్వం వహిస్తున్నారు. అమెజాన్ ఇండియాలో జెన్ ఏఐ కార్యక్రమాలకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ఏఐ–ఆధారిత ఆవిష్కరణలకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు. రియల్–టైమ్ డేటా ప్రాసెసింగ్, అనాలిటిక్స్కు సంబంధించి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. మెరుగైన నిర్ణయాలను తీసుకోవడానికి ఇది వినియోగదారులకు ఉపయోగపడుతుంది. ‘సిస్టమ్లను నిర్మించడానికి టెక్నాలజీకి మించి ఆలోచించడం అవసరం’ అంటారు శ్వేతా శంకర్. అమెజాన్ సహేలి‘అమెజాన్ సహేలి’ అనేది అమెజాన్ ఇండియా చేపట్టిన మహిళా సాధికారత కార్యక్రమం. మహిళా వ్యాపారవేత్తలు, స్వయం సహాయక బృందాలు, మహిళల నేతృత్వంలోని బ్రాండ్లు తమ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించడంలో ‘అమెజాన్ సహేలి’ సహాయపడుతుంది. అమెజాన్లో తమ వ్యాపారాలను విస్తరించుకోవడానికి మహిళలకు శిక్షణ, ఆన్బోర్డింగ్ సహాయం, కేటలాగింగ్ అసిస్టెంట్స్, రాయితీ రుసుము, మార్కెటింగ్ అవకాశాలను అందిస్తుంది. గీతాంజలి భుతాని, శ్వేతా శంకర్, పాయల్ గుప్తాలాంటి లీడర్స్ మహిళా సాధికారత కార్యక్రమం ‘అమెజాన్ సహేలి’కి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. -
పర్వతాల మధ్య ప్రకృతి గీతం..
పచ్చగా పరుచుకున్న పచ్చిక, మంచుతో కప్పబడిన భారీ పర్వతాలు, వాటి మధ్యలో బొమ్మల్లా కనిపించే చిన్న చిన్న గ్రామాలు ... అన్నీ కలిసి ఒక ప్రశాంతమైన అనుభూతిని అందిస్తాయి ఫ్రెంచ్ ఆల్ఫ్స్ పర్వతాలు. ఎండాకాలం రాగానే చల్లదనంతో రారమ్మని ఆహ్వానిస్తాయి. ఫ్రెంచ్ ఆల్ఫ్స్ అనే ఈ విశాలమైన పర్వత ప్రాంతం ఫ్రాన్స్లోని ప్రకృతి రమణీయతను అత్యంత అందంగా చూపుతుంది. ఫ్రెంచ్ ఆల్ఫ్స్లో ప్రతి దృశ్యం ఒక పెయింటింగ్లా ఉంటుంది. సూర్యోదయం వేల బాల భానుని కిరణాలు మంచుపర్వతాల మీదుగా, పచ్చని గడ్డిపై పడి ఒక వింతైన బంగారు కాంతిని మనకు చూపుతుంది. చల్లని, స్వచ్ఛమైన గాలి మదిని తాకి వెళ్తుంటే, స్వర్గంలో ఉన్నామా ... అనే అనుభూతి కలుగుతోంది.సరస్సుల అందాలుఇక్కడి సరస్సులు ఆకాశాన్ని ప్రతిబింబిస్తూ సంధ్యాకాలం కొత్త రంగుల్లో మెరిసి΄ోతాయి. ఈ సమయంలో కెమెరా కన్నా మనసుతో క్లిక్మనిపించే దృశ్యాలు ఎన్నో కనువిందుచేస్తాయి. మేఘాలు పర్వతాల మధ్య నెమ్మదిగా తిరుగుతూ, ఒక నిధానమైన ప్రయాణ అనుభూతిని ఇస్తాయి.సందర్శనీయ స్థలాలుఇక్కడి చామోనిక్స్లో పర్వత జీవితం సహజంగా కనిపిస్తుంది. మోంట్ బ్లాంక్ పర్వత శిఖరాలు ఎండాకాలంలో కూడా మంచుతో మెరుస్తుంటాయి. ఆన్నెస్సీలో సరస్సు పక్కన నడక ఒక ప్రశాంత అనుభవాన్ని ఇస్తుంది. లేక్ ఆన్నెస్సీ నీరు క్రిస్టల్ క్లియర్గా ఉండటం ప్రత్యేక ఆకర్షణ. గ్రెనోబెల్లో నగర జీవితం, పర్వత జీవితం రెండింటి మేళవింపు కనిపిస్తుంది.నిశ్శబ్ధ సంగీతం..ఫ్రెంచ్ ఆల్ఫ్స్లో జీవితం నెమ్మదిగా సాగుతుంది. చిన్న కేఫ్లలో కాఫీ తాగుతూ, గ్రామాల్లో నడుస్తూ సమయం గడపవచ్చు. ఇక్కడ ప్రజలు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ జీవిస్తారు.పర్వతాల మీదుగా ప్రయాణంహైదరాబాద్ నుంచి ముందుగా ప్యారిస్ లేదా జెనీవా వరకు విమానంలో చేరుకోవాలి. జెనీవా నుంచి ట్రైన్ లేదా రోడ్డు మార్గంలో ఫ్రెంచ్ ఆల్ఫ్స్ కు చేరుకోవచ్చు. రైలు ప్రయాణంలో పర్వతాల అందమైన దృశ్యాలు ఒక మధురమైన జ్ఞాపకంగా మిగులుతాయి.వుడెన్ హౌజ్లో బసచిన్న చాలెట్స్, వుడెన్ హౌసెస్ లేదా సరస్సు పక్కన ఉన్న స్టేల్లో ఉండటం ద్వారా ప్రకృతికి దగ్గరగా ఉండే అనుభూతి పొందవచ్చు. కిటికీ నుంచి పర్వతాలు, మేఘాలు కనిపించే దృశ్యం ఎంతో ఆహ్లాదకరం.ఏం చూడాలి?మంచు పర్వతాలుపచ్చని పచ్చిక మైదానాలస్వచ్ఛమైన నీటితో తొణికసలాడే సరస్సులు.ఆహ్లాదభరితమైన గ్రామ జీవితం ఇవి అన్నీ కలిసి సహజ సౌందర్యాన్ని కళ్లకు కడతాయి. మరికొన్ని ఆసక్తికరమైనవి: మాంట్ బ్లాంక్ అనే పర్వత శిఖరం ఇక్కడ అత్యంత ఎత్తైనది.ఇక్కడి చాలా సరస్సులు క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి.వేసవిలోనూ మంచు శిఖరాలు కనిపిస్తాయి. ఆల్పైన్ గ్రామాలు ఎన్నో శతాబ్దాలుగా తమ స్వరూపాన్ని అలాగే కాపాడుకున్నాయి.వాకింగ్, సైక్లింగ్కు ఈ ప్రదేశం చాలా ప్రసిద్ధిఛీజ్తో తయారైన వేడి వేడి వంటకాలుఫ్రెంచ్ కంట్రీసైడ్లో బ్రెడ్, చీజ్తో తయారైన వేడి వేడి వంటకాలు ఇక్కడి ప్రత్యేకత. ఫాండ్యూ అనేది ఇక్కడి గ్రామీణుల సంప్రదాయ వంటకం. వైట్వైన్, వెల్లుల్లి, ఇతర పదార్థాలను కలిపి తయారుచేసిన ఛీజ్లో గట్టిగా కాల్చిన రొట్టెముక్కలను ముంచుకొని, తింటారు. బంగాళదుంప, ఉల్లిపాయలు, వైట్వైన్.. మొదలైన వాటితో తయారుచేసిన టార్టిఫ్లెట్ అనేది అక్కడి బలవర్ధకమైన ఒక వంటకం. ఇక్కడి వంటకాలలో సాస్లు ముఖ్యమైనవి. బ్లూబెర్రీ టార్టె అనేది ఇక్కడి పర్వత ప్రాతాలలోనివారికి ఇష్టమైన డిజెర్ట్. సంప్రదాయ మూలికలతో చేసే స్థానిక పానీయాలను తప్పక సేవించాల్సిందే. ఎండకాలమే సరైనది...ఎండాకాలంలో ఫ్రెంచ్ ఆల్ఫ్స్ ప్రయాణం చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం చల్లగా ఉండి, ప్రకృతి ఫ్రెష్ ఫీలింగ్ను అందిస్తుంది. ప్రతి దృశ్యం కొత్తగా అనిపిస్తుంది.ఫ్రెంచ్ ఆల్ఫ్స్ అంటే ఒక ప్రయాణం మాత్రమే కాదు ఒక ప్రశాంతమైన జీవన విధానం. ఇక్కడ ప్రతి క్షణం మనసుకు విశ్రాంతి ఇస్తుంది. ఎండాకాలంలో కూడా ఒక చల్లని జ్ఞాపకంగా ఈ ప్రదేశం మనసులో నిలిచిపోతుంది.– ఎం.జి.కిశోర్,ప్రయాణికుడు.కామ్(చదవండి: నేచర్ లవర్స్కు డ్రీమ్ డెస్టినేషన్) -
హీరో వరుణ్ ధావన్ కుమార్తెకు డీడీహెచ్..? ఎందువల్ల వస్తుందంటే..
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన విలక్షణమైన నటనతో వేలాదిమంది అభిమానులను సంపాదించుకున్న క్రేజీ హీరో. ధావన్ ఇటీవల అనురాగ్ సింగ్ దర్శకత్వంలో వచ్చిన ‘బోర్డర్ 2’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇటీవల ఆయన తన కుమార్తె లారాకు సంబంధించిన వ్యాధి గురించి ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. అంతేగాదు ఆయన దీనిపై ఓ పుస్తకం కూడా రాయాలనకుంటున్నా అంటూ చాలా భావోద్వేగంగా ఆ వ్యాధి గురించి వివరించారిలా.హీరో వరుణ్ ధావన్ తన కుమార్తె లారాకు డెవలప్మెంటల్ డిస్ప్లాసియా ఆఫ్ ది హిప్(DDH) అనే చలన సంబంధిత సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయిందని వెల్లడించారు. ఈ వ్యాధిని ముందుగానే గుర్తించడంతో లారా కోలుకోవడానికి సహాయపడిందని ధావన్ తెలిపారు. ఆమెకు ఒకటిన్నర సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, DHH (డెవలప్మెంటల్ హిప్ డిస్ప్లాసియా) ఉన్నట్లు నిర్ధారణ అయిందని చెప్పారు. అంటే, తుంటి ఎముక సాకెట్ నుంచి జారిపోవడం. ఒక కాలు మరొక కాలు కంటే పొడవుగా పెరుగుతుంది, దీనివల్ల నడవడం చాలా కష్టమవుతుందని అన్నారు. అంటే వాళ్లు సరిగ్గా పరిగెత్తలేరు, నడవలేరు అని చెప్పుకొచ్చారు. దీన్ని పాశ్చాత్య దేశాలలో పుట్టినప్పుడే దీనిని సరిగ్గా నిర్ధారిస్తారు, కానీ భారతదేశంలో అలా కాదని అన్నారు. అయితే తన కూతురికి శస్త్ర చికిత్స చేయావలసిన అవసరం రాలేదన్నారు. ఒకే ప్రక్రియతో ఎముకను తిరిగి యథాస్థానంలోకి పెట్టగలిగారు. ఆమెకు స్పైకా కాస్ట్ వేయాల్సి వచ్చింది. దీనివల్ల ఆ చిన్నారి రెండున్నర నెలల పాటు ప్లాస్టర్ కట్టులో ఉండాలి. ఇది చాలా కష్టం. బిడ్డకు మత్తుమందు ఇచ్చి, ఆ తర్వాత ఆమె ప్లాస్టర్ కట్టుతోనే మేల్కొంటుందని చెప్పారు. అయితే ప్రస్తుతం ప్లాస్టర్ తీసేశారని అన్నారు. తాను దీనిపై పుస్తకం కూడా రాయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. హిప్ డెవలప్మెంటల్ డిస్ప్లాసియా(DDH)అంటే..DDH అనేది శిశువులు,చిన్నపిల్లలలో తుంటిలోని 'బాల్ అండ్ సాకెట్' కీలు సరిగ్గా అమరని ఒక పరిస్థితి. సాధారణ పిల్లలలో, తుంటి కీలు తొడ ఎముకను కటి ఎముకకు కలుపుతుంది. తొడ ఎముక పైభాగం బంతిలా గుండ్రంగా ఉండి, గిన్నె ఆకారంలో ఉండే తుంటి సాకెట్ లోపల అమరి ఉంటుంది.అయితే, DDH ఉన్న పిల్లలలో, తుంటి సాకెట్ చాలా లోతు తక్కువగా ఉంటుంది మరియు తొడ ఎముక తల గట్టిగా పట్టుకోబడదు. అందువల్ల, తుంటి కీలు వదులుగా ఉంటుంది. కొన్ని పరిస్థితులలో తొడ ఎముక సాకెట్ నుంచి బయటకు కూడా రావచ్చు, దీనివల్ల కీలు తప్పిపోతుంది (డిస్లోకేషన్). శారీరక పరీక్ష సమయంలో ఎముకను సాకెట్లో కదిలించవచ్చు, కానీ అది స్థానభ్రంశం చెందదు.కారణాలుఈ పరిస్థితి ఒకటి లేదా రెండు తుంటి కీళ్లలో సంభవించవచ్చు.అయితే, ఇది సాధారణంగా ఎడమ తుంటి కీలులో ఎక్కువగా కనిపిస్తుంది. DDH వచ్చే ప్రమాదాన్ని పెంచే కొన్ని కారకాలు ఉన్నాయి.అమ్మాయిలుమొదటి సంతానంకుటుంబాలలో చిన్నతనంలో తుంటి సమస్యలు ఉన్నవారు (తల్లిదండ్రులు, సోదరులు లేదా సోదరీమణులు)గర్భధారణ 28 వారాల తర్వాత బ్రీచ్ పొజిషన్లో (పాదాలు లేదా పిరుదులు క్రిందికి) జన్మించిన శిశువులులక్షణాలుతుంటి కీలు తప్పిన కొంతమంది శిశువులలో బయటకు ఎటువంటి లక్షణాలు కనిపించవు. అయితే, శిశువుకు ఈ క్రింది లక్షణాలు ఉంటే తక్షణమే వైద్యుడిని సంప్రదించండి.కాళ్ళు వేర్వేరు పొడవులలో ఉండటంతొడపై అసమాన చర్మపు మడతలుఒక వైపు కదలిక లేదా వశ్యత తక్కువగా ఉండటంకుంటుతూ నడవడం, కాలి వేళ్ళపై నడవడం, లేదా తూలుతూ నడవడంనిర్ధారణNHS ప్రకారం, శిశువు పుట్టిన 72 గంటలలోపు లేదా 6 నుంచి 8 వారాల వయస్సులో గుర్తిస్తారు. సాధారణంగా నవజాత శిశువుల శారీరక పరీక్షలో భాగంగా వారి తుంటిని తనిఖీ చేస్తారు. ఈ పరీక్షలో, ఏవైనా సమస్యలు ఉన్నాయేమో చూడటానికి శిశువు తుంటి కీళ్ళను సున్నితంగా కదిలించడం కూడా ఉంటుంది.ఒకవేళ డాక్టర్, బిడ్డ తుంటి అస్థిరంగా ఉందని భావిస్తే, 4 నుంచి 6 వారాల వయస్సు మధ్యలో వారి తుంటికి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించాలి.కుటుంబ చరిత్రలో లేదా చిన్నతనంలో తుంటికి సంబంధించిన సమస్యలు ఉండి ఉంటేగర్భధారణ 28 వారాల తర్వాత బిడ్డ బ్రీచ్ పొజిషన్లో (కాళ్ళు లేదా పిరుదులు కిందికి ఉండేలా) జన్మించి ఉంటేకవలలు లేదా అంతకంటే ఎక్కువ మంది శిశువులు పుట్టి, వారిలో ఒక శిశువు బ్రీచ్ పొజిషన్లో ఉంటే, ప్రతి శిశువుకు 4 నుంచి6 వారాల వయస్సు వచ్చేసరికి వారి తుంటికి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించాలి.ఎదురయ్యే సమస్యలు..నడవడంలో ఇబ్బందులు, ఉదాహరణకు కుంటి నడకనొప్పితుంటి, వెన్నుపూసల ఆస్టియో ఆర్థరైటిస్సకాలంలో వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తే, పిల్లలకు శస్త్రచికిత్స అవసరం తక్కువగా ఉంటుందని, వారు సాధారణంగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణుల చెబుతున్నారు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: ఆ వ్యాయామ మెషీన్తో 113 కిలోల నుంచి 90కిలోలు..! ఆ సర్జరీ సైతం..) -
అక్షరాల... సినిమా బయోపిక్
ప్రముఖుల జీవితకథలు పుస్తకాలుగా నిరంతర ఆదరణకు నోచుకుంటాయి. అందులోనూ వారు సినీ తారలైతే ఇక చెప్పేది ఏముంది! సినీ తారల పట్ల అందరికీ ఉండే ఆసక్తి అలాంటిది. సదరు సినిమా తార అనేక విధాలుగా ప్రథమశ్రేణిలో నిలిచిన వ్యక్తి అయితే, చారిత్రకంగానూ ఆ రచనకు ప్రాధాన్యం ఉంటుంది. తొలి భారతీయ బాలల చిత్రం ‘సతీ అనసూయ – ధ్రువ విజయం’ (1936)లో టైటిల్ రోల్ ధరించడంతో మొదలుపెట్టి, హీరోయిన్గా ఎదిగి, దర్శక – నిర్మాత మీర్జాపురం రాజా వారితో వివాహంతో మహారాణిగా మారి, స్వయంగా నిర్మాత అయి, శోభనాచలా సినీ స్టూడియో అధినేత్రిగా నిరూపించుకొని, నూరేళ్ళ నిండు జీవితం గడిపి, ఇటీవలే మరణించిన చిత్తజల్లు కృష్ణవేణి (1924 – 2025) జీవిత కథ అందుకనే ఆసక్తిగా అనిపిస్తుంది.జీవితచరిత్రను సైతం కేవలం వివరాలు, విశేషాలను ఏకరవు పెట్టే రూపంలో కాకుండా, కాల్పనిక సాహిత్య మార్గంలో ఒక మంచి నవలను చదువుతున్న పద్ధతిలో అందించడం ఎప్పుడైనా ఆకర్షించే పద్ధతే. సమకాలీన రచయితలు కొందరు ఆ కోవలో అక్షరబద్ధం చేసిన జీవిత కథలు సాహితీ లోకానికి ఇప్పటికే సుపరిచితం. పైగా, రచయిత్రి పల్లవి రాసిన మహానటి సావిత్రి జీవితకథ ‘సావిత్రి’ లాంటివి గతంలో బెస్ట్ సెల్లర్స్ కావడమూ అందుకు నిదర్శనం. ఆ రకమైన రచనా సంవిధానంలో మెప్పించే మెరుపులు చాలానే ఉంటాయి కానీ, కొన్నిసార్లు... అసలు జరిగిన వాస్తవమేదో, కొసరు కవికల్పన ఏదో తెలియనంతగా పాలు, నీళ్ళు కలసినట్టు సాగిపోతాయి. వీలైనంత వరకు చరిత్రను వక్రీకరించకుండా వాస్తవాలను పేర్కొంటూనే, సంఘటనను నాటకీయంగా చెప్పడంలో రచయిత నిజాయతీ, నైపుణ్యం రాణకెక్కుతాయి. ఉత్తమ పత్రికా రచయితగా నంది అవార్డులు అందుకున్న సీనియర్ జర్నలిస్ట్ భగీరథ తన తాజా ‘మీర్జాపురం రాణి... కృష్ణవేణి’ రచనలో అక్షరాలా చేసినది అదే!ఒక మంచి ఇతివృత్తం చేయి తిరిగిన వ్యక్తి చేతిలో పడినప్పుడు అది కొత్త సొబగులు సంతరించుకోవడం సహజం. రచయితగా, పత్రికా రచయితగా ఎన్నో దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న భగీరథ ఈ రచనలో దాన్ని సమర్థంగా వినియోగించారు. ఇటీవల ఎన్టీఆర్పై ‘తారకరామం’, ‘శకపురుషుడు’ లాంటి పుస్తకాలు, అలాగే కృష్ణదేవరాయల కాలంపై రాసిన చారిత్రక నవల ‘నాగలాదేవి’ ద్వారా నవతరం పాఠకులకు సైతం ఆయన సుపరిచితులే. సినీ సుప్రసిద్ధుల జీవిత కథలు రాయడం కూడా ఆయనకేమీ కొత్త కాదు. గతంలో నటి జమున అంతరంగావిష్కరణ ‘జమునా తీరం’, భాగ్యనగర్ స్టూడియోస్ వ్యవస్థాపక అధినేత బాదం రామస్వామిపై ‘మహర్జాతకుడు’, హీరో జగపతి బాబు తండ్రి – ప్రముఖ నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్పై ‘దసరా బుల్లోడు’ లాంటి సినీ జీవిత కథలు ఆయన కలం నుంచి వచ్చి, అశేష ఆదరణకు నోచుకున్నాయి. ఇప్పుడు అలనాటి హీరోయిన్ కృష్ణవేణి కుమార్తె, ప్రముఖ నిర్మాత ఎన్.ఆర్. అనూరాధాదేవి పనుపున భగీరథ ఈ ‘మీర్జాపురం రాణి... కృష్ణవేణి’ రచన చేశారు. కృష్ణవేణి జీవితంతో పాటు ఆ సమకాలీన పరిస్థితుల్ని రచనలో ప్రతిబింబించేందుకు రచయిత కసరత్తు చేశారు. నిజానికి, నటుడు ఎన్టీఆర్ – సంగీత దర్శకుడు ఘంటసాల – సుస్వరాల రమేశ్ నాయుడు... ఇలా ఎందరో మహామహుల్ని సినీ రంగానికి పరిచయం చేసిన ఘనత కృష్ణవేణిది.చిన్న వయసులోనే తల్లి లేని బిడ్డగా సవతి తల్లితో ఇబ్బందులు పడడం, పిన్ని – బాబాయ్ వద్ద పెరగడం, రంగస్థలంపై ఆసక్తి పెరగడం, అప్పట్లో భానుమతి, రేలంగి, అంజలీదేవి సహా ఎందరినో స్టార్లుగా తీర్చిదిద్ది ‘తారాబ్రహ్మ’గా పేరొందిన సినీ దర్శక – నిర్మాత చిత్తజల్లు పుల్లయ్య గారి ప్రోత్సాహం లభించడం, ఎనిమిది – తొమ్మిదేళ్ళ వయసులోనే తొలి బాలల చిత్రం ‘సతీ అనసూయ’లో టైటిల్ రోల్ పోషించడం, పితృసమానుడైన పుల్లయ్య గారి మీద అపార గౌరవంతో యర్రంశెట్టి కృష్ణవేణి కాస్తా చిత్తజల్లు కృష్ణవేణిగా మారడం, ఆ పైన హీరోయిన్గా రాణించడం, మీర్జాపురం రాజా వారు (మేకా వెంకట్రామయ్య అప్పారావు)తో వివాహం, భర్త జస్టిస్ పార్టీ అయితే తాను కాంగ్రెస్ సానుభూతిపరురాలిగా ‘మన దేశం’ (1949) లాంటి చిత్ర నిర్మాణం సాగించడం, ‘కీలుగుర్రం’ – ‘గొల్లభామ’, 'లక్ష్మమ్మ' లాంటి బాక్సాఫీస్ హిట్ చిత్రాల రూపకల్పన లాంటి తొలినాళ్ళ సినీ చరిత్రలోని ఆసక్తికరమైన ఘట్టాలెన్నో ఈ రచనలో చదవవచ్చు. నిండు నూరేళ్ళు జీవించిన ఆమె ప్రస్థానంలోని అనేక ఘట్టాలను చదువుతుంటే... అచ్చంగా ఓ సినిమా చూస్తున్న అనుభూతి కలిగించేలా ఈ రచనా శైలి సాగుతుంది. ప్రతి సంఘటననూ దృశ్యమానమయ్యే రీతిలో రాయడంతో... ఒక రకంగా ఇది కాగితంపై అక్షరాలలో కనిపించే ఓ బయోపిక్ అనవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ మొదలు ‘సాక్షి – ఎక్సలెన్స్ అవార్డ్’ (లైఫ్ టైమ్ ఎఛివ్మెంట్) సహా ఎన్నో గుర్తింపులు పొందిన సి. కృష్ణవేణి జీవితకథ చదువుతుంటే... కేవలం ఓ వ్యక్తి జీవితంగా అనిపించదు. దాదాపు నూరేళ్ళ కాలగతిలో సమాజంలోనూ, సినిమాలోనూ వచ్చిన మార్పులు సైతం కళ్ళ ముందు రీళ్ళు తిరుగుతాయి. మహిళలను ద్వితీయశ్రేణి వ్యక్తులుగా చూస్తూ, సమాజం ఇంతగా పురోగమించని రోజుల్లోనే... కృష్ణవేణి సాగించిన జీవితం, సాధించిన విజయం అబ్బురపరుస్తాయి. ఇవాళ్టికీ ఎందరికో స్ఫూర్తిమంత్రంగా నిలుస్తాయి. అరుదైన ఫోటోలతో పాటు, అవి అందుబాటులో లేని కీలక ఘట్టాలకు రేఖాచిత్రాలను సుప్రసిద్ధ చిత్రకారుడు దాకోజు శివప్రసాద్తో ప్రత్యేకంగా గీయించడం ఈ 516 పేజీల రచనకు వన్నె తెచ్చింది. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి అనేక అడ్డంకులున్న ఆ రోజుల్లోనే ఎంత సమున్నత స్థాయికి చేరి, నూరేళ్ళ జీవితాన్ని పండించుకుందో తెలిపే ఈ రచన నేటి తరానికీ ప్రేరణనిచ్చే పాఠం. ఆపకుండా చదివించడంతో పాటు... అన్నీ కళ్ళ ముందే జరుగుతున్న అనుభూతిని కలిగించడంతో... ఈ జీవితకథ సినీచరిత్రపై ఆసక్తి గలవారికి అందమైన బహుమానం.మీర్జాపురం రాణి... కృష్ణవేణి (నటి కృష్ణవేణి జీవితకథ), రచన – భగీరథ, ప్రతులకు – నవోదయ బుక్హౌస్, హైదరాబాద్. మొబైల్ – 92474 71361).– రెంటాల జయదేవ -
ఆ బాబా ఇంగ్లీష్ ఫ్లుయెన్స్కి మతిపోవాల్సిందే..!
సాధువులు చూడగానే..ఆధ్యాత్మికంగా చాలా జ్ఞానం ఉన్నవారనే భావనే ఉంటుంది. వారికి ఆధునికత, వివిధ భాషలు తెలిసి ఉండటం అత్యంత అరుదు అని అందరి భావన. గతేడాది కుంభమేళలో మేధావులైన బాబాలను చూసే వరకు అందరి భావన ఇలానే ఉండేది. అయితే మన చుట్టుపక్కల పరిసరాల్లో తరుచుగా కనిపించే బాబాలు విద్యావంతులేనా అనేది సంశయాత్మక ప్రశ్నే. అయితే ఈ బాబాను చూస్తే ఆ అభిప్రాయం కూడా మారిపోతుందేమో..అందుకు సంబంధించిన వీడియని వాసుదేవ్ కచ్ఛవా అనే యూజర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఆ వీడియో క్లిప్లో సాధుబాబా సమీపంలో పుస్తకాల షాపు వద్ద బల్లపై ఉంచిన పుస్తకాలను తిరగేస్తూ కనిపిస్తారు. వీడియో రికార్డు చేస్తున్న వ్యక్తి ఈ పుస్తకాలన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి. మీకు ఇంగ్లీస్ వచ్చా అని ప్రశ్నిస్తాడు. దానికి ఆ సాధు బాబా ఒక పుస్తకాన్ని తీసుకుని చదవి ఇది రెండొవ అధ్యాయం అని స్పష్టంగా చెబుతాడు. మీకు ఇంత ఇంగ్లీష్ ఎలా వచ్చు అని అడగగా..తాను ఇంగ్లీష్ చదువుకున్నట్లు చెబుతాడు. ఆ తర్వాత మరో పుస్తకాన్ని ఇస్తూ..చదవమని కోరతాడు. ఆ పుస్తకం వైపు చూస్తూ..'ది సైలెంట్ పేషెంట్'' అని బదులు ఇస్తాడు. మాకు కూడా ఇంత ఇంగ్లీష్ రాదు అనగా, అందుకు ఆ సాధువు వ్యగ్యంగా మీర అంత చదువు చదువుకుని ఉండరు అని కౌంటరిస్తాడు. అందుకు సదరు వ్యక్తి మీరు ఎంత వరకు చదువుకున్నారు అని అడుగుతాడు..దానికి బాబా..తాము సాధువులమని దాన్ని బహిర్గతం చేస్తే తమ సర్టిఫికేట్లు విలువని కోల్పోతాయని అంటూ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు సైతం బాబా క్లాస్టాపర్..అదరగొట్టేశారు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Vasudev Kachhawa (@vaas.you) (చదవండి: నేచర్ లవర్స్కు డ్రీమ్ డెస్టినేషన్) -
నేచర్ లవర్స్కు డ్రీమ్ డెస్టినేషన్
హిమాచల్ ప్రదేశ్లోని కల్ప అనే చిన్న గ్రామం ఒక నేచురల్ వండర్లా అనిపిస్తుంది. చుట్టూ కిన్నోర్ కైలాష్ పర్వతాలు గర్వంగా నిలబడిన తీరు, ఈ సీన్ చాలా అందంగా ఉంటుంది. మార్నింగ్ సమయంలో పీక్స్పై పడిన భానుడి కిరణాల వెలుగు చూస్తే ఒక నిర్మలమైన, దివ్యమైన దృశ్యంలా అనిపిస్తుంది.మబ్బులు కొంచెంగా పర్వతాల మధ్య తిరుగుతూ ఉంటే ఈ సీన్స్ ఒక పెయింటింగ్లా కనిపిస్తుంది. ప్రకృతితో కలిసిన ఈ ప్రదేశం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది.జీవితం చాలా సింపుల్ఇక్కడ జీవితం చాలా సింపుల్, నిధానంగా ఉంటుంది. చిన్న ఇళ్లు, ఆపిల్ తోటలు, తాజా గాలుల మధ్య ఒక కామ్ రిథమ్ ఉంటుంది. ప్రతీ రోజు ఒక రొటీన్ లైఫ్ స్టైల్లా కాకుండా ఒక భిన్నమైన అనుభూతిలా అనిపిస్తుంది. లోకల్ వీధుల్లో నడుస్తూ ఉంటే గ్రామ జీవితంలో ఉన్న సింప్లిసిటీ, మంచి మనసులు కనిపిస్తాయి.ఇక్కడ సమయం కొంచెం స్లోగా నడుస్తుందనే భావన కలుగుతుంది. సిటీ జీవితం నుండి దూరంగా ఉన్న ఒక పీస్ఫుల్ వరల్డ్లా ఉంటుంది. ∙సాయంత్రం సమయంలో పర్వతాల వెనక సూర్యాస్తమం చూస్తే ఆ ఆకాశం ఆరెంజ్, పింక్ షేడ్స్తో మారిపోతుంది. ఆ క్షణంలో కలిగే సైలెన్స్, ప్రశాంతత ట్రావెల్ ఎక్స్పీరియెన్స్ని మరింత ప్రత్యేకంగా మార్చేస్తాయి.ఎలా చేరుకోవాలంటే..హైదరాబాద్ నుండి ముందుగా ఢిల్లీ నుంచి ఫ్లైట్లో చేరుకొని, అక్కడి నుండి రోడ్డు మార్గంలో కల్పకు చేరుకోవచ్చు. ఈ ప్రయాణంలో హిమాలయన్ దృశ్యాలు, నదులు, లోయలు చూస్తూ సాగుతుంది. దీంతో ఈ జర్నీ ఓ మరపురాని అనుభూతిగా నిలిచిపోతుంది. కూనూరు: ఫాస్ట్ లైఫ్కుబ్రేక్కూనూర్లో ఉదయం అనగానే పచ్చని టీ తోటలపై నిదానంగా కదిలే తొలి మంచు కళ్లముందు నిలుస్తుంది. వాటి మీదుగా గాలులు చల్లగా, తాజాగా వీస్తాయి. ప్రతీ ఆకుపై ఉండే తడి ఒక కొత్త అనుభవాన్ని ఇస్తుంది. ఇక్కడి నేచర్ రీఫ్రెష్ బటన్లాంటి ఫీల్ ఇస్తుంది. మార్నింగ్ వాక్లో ఈ ఫ్రెష్నెస్ ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది.టీ తోటల మధ్య ఉదయంటీ గార్డెన్స్ మధ్య నడుస్తూ ఉంటే అన్ని వైపులా పచ్చని రంగుల లేయర్స్ కనిపిస్తాయి. వర్కర్స్ను నిదానంగా టీ లీవ్స్ సేకరిస్తూ ఉండడం చూస్తే ఆ దృశ్యం ఒక డాక్యుమెంటరీలా అనిపిస్తుంది. చిన్న దారుల్లో నడిచే ప్రతీ స్టెప్లో సైలెన్స్ , ప్రకృతి మధ్య ఒక కనెక్షన్, ఇక్కడ టైమ్ స్లోగా మూవ్ అవుతుందనే భావన కలుగుతుంది.నీలగిరి పర్వతాల రిథమ్నీలగిరి పర్వతాల మధ్య నడుస్తూ ఉంటే ప్రతీ టర్న్లో ఒక కొత్త దృశ్యం కనిపిస్తుంది. చిన్న రైలుమార్గాలు, వుడెన్ హౌసెస్, వీటితో పాటు ప్రకృతి.. ఇవన్నీ ఒక ప్రశాంతమైన జీవితం ఎలా ఉండాలో లైవ్లో చూపిస్తాయి. కొన్ని ప్రదేశాల నుండి వ్యాలీస్ చూస్తే మేఘాలు కింద తిరుగుతున్నట్టుగా కనిపిస్తాయి. ఆ అనుభవం మరింత మేజికల్గా ఉంటుంది.హైదరాబాద్ నుండి ప్రయాణంముందుగా కోయంబత్తూరు వరకు ఫ్లైట్ లేదా ట్రైన్ లో చేరుకుని, అక్కడి నుండి రోడ్ మార్గంలో కూనూర్కి చేరుకోవచ్చు. ఆ ఘాట్ రోడ్స్లో తిరుగుతూ వెళ్తే పర్వత దృశ్యాలు ప్రయాణాన్ని నిధానంగా, ఆనందంగా మార్చేస్తాయి. (చదవండి: పెయింటింగ్లా కనిపించే గ్రామం) -
కిరోసిన్ దీపం వెలుగులో చదువుకుని ఐఏఎస్ అయ్యాడు..!
మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా.. మన లక్ష్యం దృఢంగా ఉండాలి. ఎంతలా పరిస్థితులు కుంగదీస్తున్నా..మన ధ్యేయం గురితప్పకూడదు. కష్టమే కష్టపెట్టలేక విసిగిపోయేలా..గెలుపు తీరాలని అందుకుని స్ఫూర్తిగా నిలవాలి. అందుకు నిలువెత్తు నిదర్శనం ఈ అన్షుమాన్ రాజ్.బిహార్కి చెందిన అన్షుమాన్ రాజ్ బాల్యం మొత్తం బక్సర్జిల్లా నవానగర్ బ్లాక్లో సాగింది. తండ్రి రైస్మిల్లు వ్యాపారం నష్టాల్లోకి వెళ్లడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరుకుపోయింది. దాంతో కనీసం ఇంట్లో విద్యుత్ సౌకర్యం లేక ఇక్కట్లు పడుతుండేది. అయితే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలైన అతడి తల్లి ఒక్కరే కుటుంబానికి ఆధారంగా మారింది. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ ఎంతో పట్టుదలతో చదువుకునేవాడు. నవోదయ విద్యాలయంలో పాఠశాల విద్యను ప్రారంభించి అక్కడే తన ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. మెట్రిక్యులేషన్ తర్వాత, అతను జవహర్లాల్ నవోదయ విద్యాలయంలో తన చదువును కొనసాగించి, 12వ తరగతిని పూర్తి చేశాడు. ఆ తర్వాత అదే సంస్థ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. అప్పుడే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కు సన్నద్ధం కావాలని స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నాడు. అన్షుమాన్ తన అచంచలమైన పట్టుదలతో తొలి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్ క్లియర్ చేయగలిగాడు గానీ మెయిన్స్లో సక్సెస్ కాలేకపోయాడు. ఆ ఎదురుదెబ్బకు నిరుత్సాహపడకుండా మరోసారి పయత్నించేందుకు ఢిల్లీకి మకాం మార్చాడు. రెండో ప్రయత్నంలో కూడా రాత పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణుడయ్యాడు కానీ పర్సనాలిటీ టెస్ట్లో పాస్ కాలేకపోయాడు. దాంతో ముచ్చటగా మూడోసారి పరీక్ష రాశారు. ఆ ప్రయత్నంలో మొత్తం మూడు దశలనూ విజయవంతంగా పూర్తి చేసినప్పటికీ ఐఏఎస్కు కాకుండా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ పోస్ట్ పొందాడు. కానీ అన్షుమాన్ తన డ్రీమ్ని వదులుకోవడానికి ఇష్టపడక.. మరోసారి అకుంఠిత దీక్షతో సివిల్స్కు సన్నద్ధమై 2019 నాల్గో ప్రయంత్నంలో తన ఆకాంక్షను నెరవేర్చుకున్నాడు. 107 ఆల్ ఇండియా ర్యాంకుతో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్ అధికారి అయ్యాడు. అతడి కథ..అకస్మాత్తుగా వచ్చిపడే కష్టాలకు లక్ష్యాన్ని త్యాగం చేయాల్సిన పనిలేదని తెలుపుతోంది. ఎన్ని కష్టాలు వెంటాడినా..వెనక్కి తగ్గకుండా ప్రయత్నిస్తే..కచ్చితంగా ఏదో ఒకరోజు విజయం పాదాక్రాంతం అవుతుందని ఐఏఎస్ అన్షుమాన్ కథ చెప్పకనే చెబుతోంది కదూ..!. (చదవండి: నాడు కాలేజ్ డ్రాపౌట్..ఇవాళ ఏకంగా ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో చోటు..!) -
పెయింటింగ్లా కనిపించే గ్రామం
పోర్టోఫినో అనేది ఇటలీలోని ఒక కోస్టల్ గ్రామం. లిగూరియా తీరంపై ఉన్న ఈ గ్రామం ఒక రంగుల చిత్రంలా కనిపిస్తుంది. సముద్రం పక్కనే నిలిచిన పేస్టెల్ కలర్స్ ఇళ్లు ప్రతీ ఉదయం ఒక సరికొత్త వర్ణంతో మెరిసిపోతాయి. హార్బర్లో నిలిచిన బోట్లు, వీచే గాలులు ఇవన్నీ కలిసి ఒక ప్రశాంతమైన రిథమ్లా అనిపిస్తాయి. మనసుకు ప్రశాంతమైన భావాలను కలిగించే ఒక చక్కని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లా అనిపిస్తుంది. విలేజ్ స్ట్రీట్స్లో నడుస్తూ ఉంటే చిన్న కేఫ్ల నుండి వస్తున్న కాఫీ సువాసన, బాల్కనీ గార్డెన్లో విరబూసిన పూలు, ప్రతీ మలుపులో కనిపించే సముద్రం వ్యూ ... ఇవన్నీ కలిసి ఒక సినిమాటిక్ ఫీల్ ఇస్తాయి. ఇక్కడ జీవితం నిజంగా నిదానంగా సాగుతుంది. సముద్రం తీరాన కూర్చుని కాఫీ తాగుతూ, అలల శబ్దాన్ని వినడం ఒక మధురమై అనుభూతిని ఇస్తుంది. నేటి ఈ ఫాస్ట్ లైఫ్ నుండి బ్రేక్ కావాలనుకునే వాళ్లకి ఇది పర్ఫెక్ట్ ప్లేస్.ఇక్కడ ప్రతీ రోజు ఒక స్లో రిథమ్లో నడుస్తుంది రష్ లేకుండా, టెన్షన్ లేకుండా. లోకల్ షాప్స్లో హ్యాండ్మేడ్ సోవెనీర్స్, కోస్టల్ ఫ్లేవర్స్తో తయారైన ఫ్రెష్ సీ ఫుడ్ డిషెస్, గెలాటో రుచి చూస్తూ గడిపే క్షణాలు ట్రావెల్ను మరింత మెమొరబుల్గా మారుస్తాయి. ఫోటోగ్రఫీ లవర్స్కి ఇది ఒక డ్రీమ్ లొకేషన్.. ఇలా ప్రతీ కార్నర్ ఒక పోస్ట్కార్డ్లా ఉంటుంది.సాయంత్రం సమయంలో పోర్టోఫినో మరింత అందంగా మారుతుంది. సూర్యాస్తమ సమయంలో వెలుగు సముద్రంపై పడితే ఆ ప్రతిబింబం గ్రామం మొత్తాన్ని గోల్డెన్ షేడ్లో మార్చేస్తుంది. ఆ క్షణాల్లో ప్రతీ దృశ్యం ఒక పెయింటింగ్లా కనిపిస్తుంది క్యాప్చర్ చేయాలనిపించే మూమెంట్స్ ఎండ్లెస్గా ఉంటాయి. హైదరాబాద్ నుండి మిలాన్ లేదా గెనోవా వరకు ఫ్లైట్లో చేరుకుని, అక్కడి నుండి రోడ్ లేదా ట్రెయిన్ ద్వారా పోర్టోఫినోకి చేరుకోవచ్చు. ఈ ప్రయాణంలో మెడిటరేనియన్ తీరం దృశ్యాలు, టన్నెల్స్, కోస్టల్ కర్వ్స్ జర్నీని మరింత అందంగా మార్చేస్తాయి. -
ఆ వ్యాయామ మెషీన్తో 113 కిలోల నుంచి 90కిలోలు..!
కొందరికి బరువు తగ్గడం అంత సులభం కాదు. తగ్గినట్టు తగ్గి అమాంతం యథావిధిగా బరువు పెరిగిపోతుంటారు. సర్జరీలు వంటివి కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు. శరీరాన్ని కష్టపెట్టడానికి, చక్కటి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనురించడంలో విఫలమయ్యే వారి పరిస్థితి వెయిట్లాస్ విషయంలో దాదాపు ఇలానే ఉంటుంది. అందుకు ఉదాహరణ ఈ 68 ఏళ్ల అమెరికన్ వ్యక్తి. అతడి కథ వింటే..ఆరోగ్యం విషయంలో ఎలా ఉండకూడదో కనువిప్పు కలుగుతుంది.అమెరికాకు చెందిన అల్ ఎస్పోసిటో 46 ఏళ్ల వయసులో సుమారు 226 కిలోల బరువు ఉండేవాడు. తన రూపాన్ని చూసి ఆయనే ఇబ్బంది పడేవాడు. తగ్గాలని స్వల్పకాలిక ప్రయోజనాలిచ్చే డైట్లు ప్రయత్నిస్తుండేవాడు. అవేమి వర్కౌట్ అవ్వకపోయేసరికి గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీని ఎంచుకున్నారు. ఆ శస్త్రచికిత్సకు ముందే పలువురు కోల్పోయిన బరువులో 20% మళ్లీ పెరుగుతావని చెప్పారు కూడా. అలాగే అల్ ఎస్పోసిటో గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత సుమారు 91 కిలోలు తగ్గాడు. అయితే మళ్లీ ఇదివరకు చెడు ఆహారపు అలవాట్లతో మళ్లీ బరువు పెరిగిపోయాడు. కనీసం వ్యాయమం చేసేందుకు ప్రయత్నించకపోవడంతో సుమారు 154 కిలోలకు వచ్చేశాడు. అధిక బరువు కారణంగా కుడి మోకాలిలో తీవ్రమైన నొప్పి మొదలైంది. వైద్యులు మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స సిఫార్సు చేశారు.అయితే ఆపరేషన్కు అతడి శరీరం సహకరించలేదు. దాంతో అల్ బరువు తగ్గక తప్పలేదు. ఆ నేపథ్యంలో మెడిటేరియన్ డైట్ని అనుసరించి రోజుల తరబడి వ్యాయామం చేయడం వంటి జీవనశైలి మార్పులను జీవితంలో చేర్చుకున్నాడు. అలా అల్ సుమారు 129 కిలోలకు చేరుకున్నాడు. ఆ తర్వాత కుడి మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. చివరగా, ఫిబ్రవరి 2025లో ఫిజికల్ థెరపీ పూర్తి చేసుకున్న తర్వాత, అతను తన బరువు తగ్గే ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించాడు.అయితే బరువు తగ్గడంలో రోయింగ్ మెషీన్ బాగా హెల్ప్ అవుతుందని సన్నిహితులు సూచించడంతో ఆ మెషీన్ని కొని తెచ్చుకుని వర్కౌట్లు చేయడం ప్రారంభించాడు. రోయింగ్ మెషీన్పై వర్కౌట్లు చేసేటప్పటకీ అతడి బరువు 113 కిలోలు. ఇవాళ అనూహ్యంగా 90 కిలోల బరువు తగ్గడం విశేషం. మొదట్లో 20 నిమిషాల కంటే తక్కువ నిడివిగల చిన్న సెషన్లతో ప్రారంభించి క్రమంగా క్రమంగా ఎక్కువ సేపు చేసే వర్కౌట్లకు పెంచుకుంటూ, చివరికి రోజుకు 90 నిమిషాల వరకు రోయింగ్ చేశాడు. అంతేగాదు స్థిరమైన భోజన సమయాలను పాటిస్తూ..రాత్రి ఎనిమిది తర్వాత ఆహారానికి పూర్తిగా దూరంగా ఉంటున్నాడు. అలాగే చక్కెర పదార్థాలకు దూరంగా ఉంటూ ఫుడ్ విషయంలో మంచి కేర్ తీసుకుంటూ బరువుని అదుపులో ఉంచాడు అల్. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను అనుసరించడం ఉత్తమం. (చదవండి: సద్గురు పేరెంటింగ్ సలహా..! నటి అలియా భట్ రియాక్షన్..) -
జగదేక వీరా.. అసహాయ శూరా!
రెండుసార్లు హనుమజ్జయంతి ఏమిటి?హనుమంతుడు చైత్ర΄పౌర్ణమినాడు జన్మించినట్లు పలుచోట్ల కనిపిస్తుంది. అందుకే ఉత్తర భారతదేశం లోనూ, తెలంగాణ ప్రాంతంలోనూ చైత్రపూర్ణిమ నాడే హనుమజ్జయంతిని జరుపుకుంటారు. అయితే పరాశర సంహిత ప్రకారం హను మంతుడు వైశాఖ బహుళ దశమినాడు జన్మించినట్లు తెలుస్తోంది. పరాశర సంహిత హనుమ గురించి అధికంగా ప్రస్తావించడం వల్ల దానినే ప్రామాణికంగా తీసుకోవడం సముచితంగా ఆంధ్రా ప్రాంతంలో చాలామంది పండితులు భావిస్తూ అదే రోజున అక్కడి ఆలయాలలో జయంతి వేడుకలు నిర్వహిస్తారు.కలౌ కపి వినాయకౌ: ...అంటే కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతా రూపాలు ... వినాయకుడు, హనుమంతుడు. భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తేనే భయపడి పారిపోతాయి. మహా రోగాలు నయం అవుతాయి. శని గ్రహం అనుకూలంగా లేకపోతే వచ్చే బాధలూ తొలగిపోతాయి. మంచి బుద్ధి బలం పెరుగుతుంది. కీర్తి లభిస్తుంది. ధైర్యం వస్తుంది. యత్ర యత్ర రఘునాధ కీర్తనంతత్ర తత్ర కృత మస్తకాంజలింబాష్ప వారి పరిపూర్ణ లోచనంమారుతీం ్తనమత రాక్షసాంతకంఅంటే ఎక్కడ రామనామం వినిపిస్తూ వుంటుందో అక్కడ కళ్ళనిండా ఆనందబాష్పాలు నింపుకుని తలవంచి నమస్కరిస్తూ నిలబడి వుంటాడట రాక్షసులను దోమల లాగా నలిపి నశింపజేసే రామభక్తుడైన హనుమంతుడు. జయ హనుమానుడుహనుమంతుడు ఎక్కడ ఉంటే అక్కడ జయం సిద్ధిస్తుందని ప్రతీతి. శ్రీరామచంద్రుని పక్షాన చేరి ఆయన విజయానికి మూల కారణమయ్యాడు. మహాభారత యుద్ధంలో పాండవ మధ్యముడైన అర్జునుని పతాకంపై నిలిచి, పాండవుల విజయానికి కారణభూతుడయ్యాడు. అందుకే ఆంజనేయుని ప్రార్థించి చేసే ఏ పని అయినా తప్పక నెరవేరుతుందని నమ్మకం.ఆదర్శ మూర్తియువత హనుమను చూసి నేర్చుకోవలసింది చాలా ఉంది. వాక్చాతుర్యం, సమయస్ఫూర్తి, పట్టుదల, ఎంత కష్టమైనా సరే, చెప్పిన పనిని శ్రద్ధగా చేయడం. నిష్కార ణంగా అవతలివారికి హాని తలపెడితే తమకంతకన్నా ఎక్కువ కీడు జరుగుతుందన్న వాస్తవాన్ని నిరూపించేం దుకు తన తోకకు పెట్టిన నిప్పుతోనే లంకాదహనం చేశాడు. తాను ఆజన్మ బ్రహ్మచారి అయినప్పటికీ, ఆదర్శ దంపతులైన సీతారాములను కలిపి భావితరాలకు ఆదర్శంగా నిలిచాడు. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, చురుకు దనం, మాటకారితనం, ΄పౌరుషం, పరోపకారం, అచంచలమైన ఆత్మవిశ్వాసం, దీక్ష, కార్యదక్షత, అపారమైన ప్రభుభక్తి, వజ్రంలా ప్రకాశించే ఆరోగ్యకరమైన శరీరం కలవాడు ఆంజనేయుడు.ఈ రోజున ఏం చేయాలి?హనుమజ్జయంతి రోజున స్వామిని షోడశోపచారా లతో పూజించడం వల్ల గ్రహదోషాలు నశిస్తాయి. భూత, ప్రేత, పిశాచ పీడలు, మానసిక రుగ్మతలు తొలగిపోతాయి. చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది. ఆలయానికి వెళ్లలేని పరిస్థితులలో ఉన్నవారు హనుమజ్జయంతి రోజున ఆయనని షోడశోపచారాలతో పూజించి, హనుమ ప్రతిమకు సింధూరం, నవనీతం సమర్పించి, తమలపాకులతో అలంకరించి, అరటిపండ్లు లేదా పానకం, వడపప్పు, నారికేళ ఫలాన్ని నివేదించిన వారికి ఏ కష్టనష్టాలూ రావని, అపమృత్యుభయం ఉండదని, అన్నింటా జయం ప్రాప్తిస్తుందని శాస్త్రవచనం. – డి.వి.ఆర్. (ఏప్రిల్ 2, గురువారం హనుమజ్జయంతి) -
బిడ్డకు సరిపడా పాలు పడేలా ఇలా చేయండి..!
కొత్తగా తల్లి అయిన మహిళల్లో తమకు పాలు పడకపోవడం అన్నది వారిలోని అ΄ోహ మాత్రమే. దాదాపుగా 90% నుంచి 95% మహిళల్లో తమ చిన్నారులకు కావాల్సినన్ని పాలు సమకూరుతాయి. అయితే అప్పుడే పుట్టిన బిడ్డ తాలూకు ఆకలి తీరుతెన్నులు తెలియకపోవడం లేదా బిడ్డను తమ నిపుల్ వరకు తీసుకెళ్లి బిడ్డను రొమ్ము పట్టించడం వంటి అంశాలపై కొత్త తల్లులకు అవగాహన లేకపోవడం లేదా పాలు పట్టడంలో బేబీ పొజిషన్స్ సరిగా కుదరక΄ోవడంతో బిడ్డ పాలు తాగక ఏడుస్తుండటంతో తమ పాలు బిడ్డకు సరిపోవడం లేదేమోనంటూ చాలామంది కొత్తగా తల్లులైన మహిళలు అపోహ పడుతుంటారు. ఈలోపు బాటిల్ ఫీడింగ్తో పాలు పడుతుంటే తల్లి మాత్రమే కాకుండా ఎవరైనా తేలిగ్గా పట్టగలగడంతో పాటు తల్లిపాలతో పోలిస్తే కాస్త రుచిగానూ, బాటిల్తో తాగడానికి సులువుగానూ ఉండటంతో బిడ్డ పోత పాలకు తేలిగ్గా అలవాటు పడతారు. దాంతో చాలామంది తల్లులు తమ బేబీకి సరిపడినన్ని పాలు పడటం లేదేమోననే అపోహలో ఉండిపోతారు. నిజానికి ఈ అపోహలన్నీ తొలగించుకుని తల్లిపాలు పట్టడమే మేలు.ఎన్నో వ్యాక్సిన్ల పెట్టుఈ తల్లిపాలుతల్లులు ముందునుంచే తమ బిడ్డకు వీలైనంత మేర తల్లిపాలకు అలవాటు చేయడమే మంచిది. ప్రసవం అయిన తర్వాత పూర్తిస్థాయిలో పాలు ఊరడానికి ఒకటి రెండు రోజులు పట్టవచ్చు. అయితే కొత్తగా తల్లి అయిన వాళ్లలో కొంతమేరకు నీళ్లలా పలుచగా ఉండే పాలను ముర్రుపాలు అంటారు. నిజానికి ఈ ముర్రుపాలు ఎన్నెన్నో వ్యాక్సిన్ల కంటే ప్రభావవంతమైనవి. అయితే ఇవి రెండుమూడు చుక్కల పరిమాణంలోనే వస్తున్నాయంటూ కొందరు తల్లులు వీటిని బిడ్డకు అంతగా పట్టించరు. కానీ వీటిని తప్పక బిడ్డకు తాగించాలి. ఈ పాలలో బిడ్డకు సుదీర్ఘకాలం ΄పాటు మేలు చేసే చాలా అంశాలు ఉంటాయి.కొంతమేర మానసికమైన అంశాల ప్రభావం కూడా... పాలు ఊరడంలో కొంతమేర మానసిక అంశాలూ దోహదపడతాయని చెప్పవచ్చు. తల్లిలో సమృద్ధిగా పాలు పడటానికి ప్రోలాక్టిన్ అనే హార్మోన్ కారణమవుతుంది. ఇది మెదడు నుంచి వచ్చే సంకేతాల మేరకు విడుదల అవుతుంది. కొత్త తల్లి ఏ మాత్రం మానసిక ఒత్తిడి లేకుండా రిలాక్స్డ్గా ఉండి, ప్రశాంతంగా కూర్చుని... నా బిడ్డకు సరిపడినన్ని పాలు నా దగ్గర ఉన్నాయనే భావనతో పాలు పడితే... తల్లి దగ్గర బిడ్డకు అవసరమైనన్ని పాలు సమృద్ధిగా ఉంటాయి. కేవలం ఒక శాతం నుంచి 5% తల్లుల్లోనే పాలు ఊరడానికి సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. అందుకే ఇలాంటి సమస్య ఏదైనా ఉంటే ల్యాక్టేషన్ నిపుణులు లేదా తమ డాక్టర్ను సంప్రదించడం అవసరం. పై నుంచి పాలు పట్టడం తప్పనిసరి అయితే ఉగ్గుగిన్నెతోనే... బిడ్డకు సరిపడా పాలు ఇవ్వలేని సందర్భంలో కొంతమంది పాత తల్లుల సలహా మేరకు బిడ్డకు బాటిల్ ఫీడింగ్ ఇస్తుంటారు. పైపోత పాలు కొంత రుచికరంగా ఉండటంతో పాటు బాటిల్ ఫీడింగ్ తేలిగ్గా ఉండటంతో బిడ్డ ఆ పాలకు అవవాటు పడి తల్లిపాలను అంతగా ఇష్టపడకపోవచ్చు. అలా రెండుమూడు రోజుల పాటు బిడ్డకు పోతపాలో లేదా ఫార్మూలా పాలో తాగించాలంటే కేవలం ఉగ్గుగిన్నెతోనే పట్టించడం మంచిది. దాంతో భవిష్యత్తులో తల్లి నుంచి పాలు తాగే విషయంలో అయోమయపడకుండా మళ్లీ బిడ్డ సౌకర్యంగా పాలు తాగగలడు. బిడ్డ ఎంతగా పాలు తాగుతుంటే తల్లిలో అంతగా పాలు ఊరుతూ ఉంటాయి.బిడ్డకు సరిపడా పాలు ఊరాలంటే... ప్రసవం తర్వాత కొందరు మహిళల్లో బిడ్డకు సరిపోయినంతగా పాలు పడకపోతే వారిలో స్వభావికంగానే (నేచురల్గానే) పాలు సమృద్ధిగా పడేందుకు ఈ కింద పేర్కొన్న మార్గాలను అనుసరించవచ్చు. ఆ తల్లి తన ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలతో పాటు పాలు, పెరుగు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అంతేకాదు... ఆహారంలో నువ్వులు, వెల్లుల్లి, బెల్లం, పాలు, కోడిగుడ్లు, కొబ్బరి, కొబ్బరి నీళ్లతో పాటు మంచినీళ్లూ ఎక్కువగా తీసుకోవడం వల్ల తల్లికి స్వాభావికంగానే బాగా పాలు పడే అవకాశం ఉంటుంది.అవి అపోహలు మాత్రమే సిజేరియన్ ప్రక్రియ ద్వారా కాన్పు అయిన చాలామంది తల్లులు తమకు సర్జరీ అయినచోట కుట్లలో చీము వస్తుందేమో అన్న ఆందోళనతో పప్పులు తీసుకోరు. నిజానికి పప్పుల్లో ఉండేది ప్రోటీన్లు అయినందున పప్పుతో చీము పట్టదు. అలాగే ఒంటికి నీరు పడుతుందనే అపోహతో తగినన్ని ద్రవపదార్థాలూ, ద్రవాహారాలు తీసుకోరు. బిడ్డకు జలుబు చేస్తుందనే తప్పుడు అభిప్రాయంతో పండ్లను తీసుకోరు. నిజానికి పండ్లలో తల్లీబిడ్డలలో తగినన్ని విటమిన్లు, ఖనిజలవణాలను భర్తీ చేయడంతో పాటు వాళ్లలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే సామర్థ్యం ఉంటుంది. అందుకే ఈ తరహా అ΄ోహల జోలికి పోకుండా బాలింతకు మంచి పోషకాహారంతో పాటు, పండ్లరసాలతో చేసే ద్రవాహారాలు, నీళ్లు, పండ్లు ఇస్తూ ఉండటం అవసరం. ఇక మరికొంత మంది తల్లులు తమ బిడ్డకు పాలు సరిపోవడం లేదనే అ΄ోహతో పోతపాలు పడుతుంటారు. బిడ్డ పాలు తాగిన తర్వాత రెండు నుంచి మూడు గంటల సేపు హాయిగా నిద్రపోవడంతో పాటు... రోజు మొత్తంలో ఆరుసార్ల కంటే ఎక్కువ సార్లు పక్కతడుపుతూ, వయసుకు తగినట్లు బరువు పెరుగుతుంటే మాత్రం ఆ బిడ్డకు తల్లి పాలు సరిపోతున్నాయని అనుకోవచ్చు. ఇక్కడ పేర్కొన్న సూచనలు పాటించాక కూడా ఇంకా పాలు సరిపోకపోతే అప్పుడు డాక్టర్ సలహా మేరకు ట్యాబ్లెట్లు, పాలలో కలిపే పొడులు వాడాల్సి రావచ్చు. డాక్టర్ పృథ్వీ పేరం, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్టిట్రీషియన్ – గైనకాలజిస్ట్నిర్వహణ: యాసీన్ (చదవండి: నో స్ట్రెస్..! రోగాల బారినడకుండా..) -
నో స్ట్రెస్..! రోగాల బారినడకుండా..
ప్రతి ఒక్కరి జీవితకాలంలో ఎంతో కొంత ఒత్తిడి (స్ట్రెస్)ఉంటుంది. అయితే కొందరిలో ఇది చాలా సుదీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడి అన్నది మెదడు, మానసిక ఆరోగ్యంపై మాత్రమే కాదు... దేహం తాలూకు భౌతిక సమస్యల రూపంలోనూ వ్యక్తమవుతుంటాయి. ఒత్తిడికి కారణాలు, దీని దుష్ప్రభావాలు, వీటిని అధిగమించడం ఎలా అనే పలు అంశాలను వివరించేందుకే ఈ కథనం.ఒత్తిడి పెరగడానికి పలు అంశాలు కారణమవుతాయి. ఉదాహరణకు పేదరికం, ప్రేమించేవారికి దూరం కావడం సామాజికంగా ఒంటరికావడం, ఉద్యోగం లేదా ఉపాధి కోల్పోవడం, కుటుంబంలో ఎవరినైనా కోల్పోవడం... ఇలా ఎన్నో కారణాలు ఒత్తిడి పెరగడానికి కారణమవుతాయి.ఒత్తిడి (స్ట్రెస్)లో రకాలు : ఈ స్ట్రెస్ను ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి...మేలు చేసే ఒత్తిడి : దీన్ని ఇంగ్లిష్లో ‘గుడ్ స్ట్రెస్’ అని చెప్పవచ్చు. అయితే ఒత్తిడిలోనూ మంచి ఒత్తిడి ఉంటుందా అనే సందేహం రావచ్చు. కొన్ని సందర్భాల్లో కొంత ఒత్తిడి ఉన్నప్పుడు ఆ పని త్వరగా లేదా అనుకున్న విధంగా విజయవంతంగా ముగుస్తుంది. ఉదాహరణకు ఏదైనా ఒక పనిని నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాల్సి వచ్చినప్పుడు అది ఆ టైమ్లోపు ముగుస్తుందా లేదా అన్న ఒత్తిడిలో పని చేయడం వల్ల నిర్ణీత గడువులో పని బాగా పూర్తయ్యే అవకాశముంటుంది. ఇలాంటి మేలు చేసే ఒత్తిడిని ‘మంచి ఒత్తిడి’ లేదా ఇంగ్లిష్లో ‘యూస్ట్రెస్’ అంటారు. భరించగలిగేంత ఒత్తిడి : దీనితో సమస్య అవుతుంది గానీ... కొంత ప్రయత్నంతో దీన్ని భరించవచ్చు. ఫ్రెండ్స్, కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలతో దీన్ని అధిగమించవచ్చు. అందుకే దీన్ని భరించగలిగే ఒత్తిడి (టాలరబుల్ స్ట్రెస్)గా పేర్కొంటారు. హానికరంగా పరిణమించే ఒత్తిడి : ఇది తీవ్రమైన ఒత్తిడి చాలాకాలం పాటు కొనసాగుతుంది. దీనివల్ల మానసిక ఆరోగ్యంపైనా, దేహంపైనా దుష్ప్రభావాలు కనిపిస్తాయి. అందుకే దీన్ని హానికరమైన ఒత్తిడి లేదా ‘టాక్సిక్ స్ట్రెస్’గా చెబుతారు. ఏదైనా ఒత్తిడి కలిగినప్పుడు అది కొద్ది సేపటికోసమే అయితే దేహం దాన్ని ఎలాగోలా తట్టుకుని తన జీవక్రియల వ్యవస్థలను (బయలాజికల్ సిస్టమ్స్ను) మళ్లీ మామూలు స్థితికి తెచ్చుకోగలుగుతుంది. ఉదాహరణకు మనం ఒక పామును చూశామనుకోండి. ఒళ్లు ఝల్లుమంటుంది. తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. స్నేక్ రెస్క్వువర్స్ వచ్చి దాన్ని పట్టుకుని వెళ్లిన తర్వాత ఝల్లుమన్న ఒళ్లు, ఒత్తిడి మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తాయి. కానీ ఏదైనా ఒత్తిడి అదే పనిగా చాలా సుదీర్ఘకాలం΄ాటు అదే స్థితిలో కొనసాగుతూ ఉంటే ఆ ఒత్తిడి తాలూకు దుష్ప్రభావాలు అనేక రకాలుగా బయటపడతాయి. ఉదాహరణకు కుంగుబాటు (డిప్రెషన్), ఉద్విగ్నత (యాంగై్జటీ), గుండెజబ్బులు (కార్డియోవాస్కులార్ డిసీజెస్), డయాబెటిస్, హైబీపీ లాంటి దేహ జీవక్రియలకు సంబంధించిన (మెటబాలిక్ డిజార్డర్స్) వంటి రూపంలో బయటపడవచ్చు.మెదడుపై ఒత్తిడి ప్రభావం మెదడుపై పలురకాలుగా ఒత్తిడి ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు... హిప్పోక్యాంపస్పై : ఇది మెదడులో మూడ్స్ను, జ్ఞాపకశక్తిని ప్రభావితం చేసే భాగాలు. స్ట్రెస్ తాలూకు ప్రతికూల ప్రభావాలు హి΄్పోక్యాంపస్పై పడితే అది మూడ్స్నూ, మన జ్ఞాపకశక్తిని ప్రభావితం చేయవచ్చు. అమిగ్దలా : ఇది మెదడులో ఉద్విగ్నతను (యాంగై్జటీని) కలగజేసే ప్రాంతం. కాబట్టి అదేపనిగా యాంగై్జటీ కొనసాగే ప్రమాదం ఉంటుంది. ప్రీ–ఫ్రంటల్ కార్టెక్స్ : మెదడులోని ఈ భాగం మనం నిర్ణయాలు తీసుకునే ప్రాంతం. అంతేకాదు... ఇది భావోద్వేగాలను నియంత్రించే భాగం కూడా కావడంతో ఆ మేరకు దుష్ప్రభావాలు కనిపిస్తాయి. ఇవే కాకుండా ఒత్తిడి దీర్ఘకాలం కొనసాగితే మెదడులో ఆలోచనలూ, అన్ని రకాల కార్యకలాపాలకు కేంద్రాలైన మెదడు కణాల (న్యూరాన్ల) ఆకృతి మారడం, వాటి పనితీరుపై దుష్ప్రభావలు పడటంతోపాటు రకరకాల మానసిక సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి.ఒత్తిడి... న్యూరో కెమికల్స్ భూమిక(రోల్ ఆఫ్ న్యూరోకెమికల్స్)ఒత్తిడి సమయంలో కొన్ని రకాల న్యూరోకెమికల్స్ విడుదల అవుతాయి. వీటినే స్ట్రెస్ కెమికల్స్ అంటారు. ఉదాహరణకు కార్టిసాల్ లాంటి గ్లూకోకార్టికాయిడ్స్, గ్లుటామేట్ వంటి న్యూరోట్రాన్స్మిటర్లు వంటివి. దీర్ఘకాలం ఒత్తిడి కొనసాగితే ఇవి మెదడులో అనేక మార్పులు తెస్తాయి. అంతేకాదు దీర్ఘకాలంపాటు ఒత్తిడి కొనసాగితే అది దేహం తాలూకు జీవక్రియల మీదా ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి.ఒత్తిడి నివారణ పద్ధతులు /చికిత్సకొన్ని జీవనశైలిని మెరుగుచేసుకునే ప్రక్రియల ద్వారా ఒత్తిడిని చాలావరకు అధిగమించవచ్చు. ఉదాహరణకు... మంచి పోషకాహారం, కంటి నిండా నిద్ర కుటుంబం, స్నేహితులను సన్నిహిత సంబంధాలు (మంచి సోషల్ స΄ోర్ట్ సిస్టమ్) ఆహ్లాదకరమైన సంగీతం వినడం లేద ఇష్టమైన హాబీలను పెంపొందించుకోవడం ∙రోజూ తేలికపాటి వ్యాయామం, ధ్యానం వంటి ప్రక్రియలతో చాలావరకు ఒత్తిడిని అధిగమించవచ్చు. అయితే దీర్ఘకాలిక ఒత్తిడిని అధిగమించడానికి సైకియాట్రిస్ట్లను సంప్రదించి కొన్ని మందులు, ఒత్తిడికి కారణమైన అంశాలను బట్టి కౌన్సెలింగ్ అవసరమవుతాయి. డాక్టర్ ప్రవీణ్ ఎస్ గోపన్, సీనియర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ నిర్వహణ: యాసీన్ (చదవండి: కాలులో ఆకస్మికంగా భరించలేని నొప్పి..క్షణాల్లో ప్రాణాంతకంగా మారి..) -
సద్గురు పేరెంటింగ్ సలహా..! నటి అలియా భట్ రియాక్షన్..
బాలీవుడ్లోని అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీ కపుల్ అలియా భట్, రణబీర్ కపూర్లు. 'బ్రహ్మాస్త్ర' సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన వీరు, ఐదేళ్ల డేటింగ్ అనంతరం ఏప్రిల్ 14, 2022న వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు రాహా అనే కుమార్తె ఉంది. అయితే అలియా ఇటీవల చెన్నైలో JITO చెన్నై ప్లస్ (జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్) నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ 'ఇన్ కన్వర్సేషన్ విత్ ది మిస్టిక్' పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో అలియా భట్, సద్గురు ఆధ్యాత్మిక సంభాషణలలో పాల్గొన్నారు. అక్కడ ఆమె సద్గురుని పిల్లల పెంపకంపై సలహా కోరుతూ ఆయనను ఇలా అడిగారు. "తాము మంచి తల్లిదండ్రులుగా ఉంటున్నామో లేదో అని ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు మీరు ఇచ్చే ఒకే ఒక్క సలహా ఏమిటి?" అని సూటిగా ప్రశ్నించారు. ఆయన నవ్వుతూ, "ఆందోళన చెందే తల్లిదండ్రులు మంచి తల్లిదండ్రులు కారు" అని అన్నారు. ఆ మాటకు అలియా వెంటనే నవ్వులు చిందించారు. ఆ తర్వాత ఆధ్యాత్మిక గురువు అలియా భట్ను తన బిడ్డ గురించి ఎక్కువగా ఆందోళన చెందవద్దని హెచ్చరించారు. అలాగే ఆందోళన చెందడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని సూచించారు కూడా. ఆయన సలహాకు అక్కడ ఉన్న ప్రేక్షకులు కూడా పగలబడి నవ్వారు. కాసేపటి తర్వాత అలియా పిల్లల పెంపకం విషయంలో ఆందోళనను పక్కన పెట్టగలమని అస్సలు అనుకోలేనన్నారు. సద్గురు మీరు కూడా దీన్ని అంగీకరిస్తారనే అనుకుంటున్నా అని నవ్వుతూ అన్నారామె. రాహా పుట్టినప్పుడు, అలియా భట్, రణబీర్ కపూర్ దంపతులు ఆమె ఫోటోలు తీయవద్దని పాపరాజీలను కోరారు. నిజానికి, వారు చాలా కాలం పాటు ఆమె ముఖాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. కాగా, ఆలియా కెరీర్ పరంగా 'ఆల్ఫా', 'లవ్ అండ్ వార్' చిత్రాలలో కనిపించనున్నారు. ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాదే విడుదల కానున్నాయి.Truly excited to see Sadhguru ji and alia Bhat’s full conversation pic.twitter.com/mCJF3pm0r9— SgInclusive (@SgInclusivess) March 27, 2026 (చదవండి: కాలులో ఆకస్మికంగా భరించలేని నొప్పి..క్షణాల్లో ప్రాణాంతకంగా మారి..) -
మాటలతో మెప్పించడం ఎలా?
చాలామందికి పబ్లిక్ స్పీకింగ్ అంటే స్టేజ్ ఎక్కి గంటలు గంటలు ఉపన్యాసం ఇవ్వడం అనుకుంటారు. కానీ నిజానికి, పదిమంది ఉన్న మీటింగ్ లో మీరు మీ ఐడియాను చెప్పినా, నలుగురు స్నేహితుల మధ్య ఒక విషయాన్ని వివరించినా అది పబ్లిక్ స్పీకింగే.ప్రపంచాన్ని మార్చిన ప్రతి గొప్ప నాయకుడికి ఉన్న ఏకైక ఆయుధం—మాట. ఒక మంచి ప్రసంగం మనుషుల్లో ఆలోచనను రేకెత్తిస్తుంది, ఒక గొప్ప ప్రసంగం మనుషులను కార్యోన్ముఖులను చేస్తుంది. మీ మాట కేవలం సమాచారం కాకూడదు, అది ఒక అనుభూతి (Emotion) అవ్వాలి.స్టేజ్ ఫియర్: భయాన్ని బలంలా మార్చుకోండిప్రపంచంలో మరణం కంటే ఎక్కువగా భయపడేది 'స్టేజ్ ఎక్కడం'. కానీ సైకాలజీ ప్రకారం, ఆ భయం (Nervousness), ఉత్సాహం (Excitement) రెండూ శరీరంలో ఒకే రకమైన రసాయన చర్యలను కలిగిస్తాయి.Reframing: మీరు వణుకుతున్నప్పుడు "నేను భయపడుతున్నాను" అని కాకుండా, "నేను ఈ విషయాన్ని చెప్పడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను" అని మీ మెదడుకు చెప్పుకోండి. ఆ ఆందోళనను 'ఎనర్జీ'గా మార్చడమే ఒక స్పీకర్ కి ఉండాల్సిన మొదటి లక్షణం.Aristotle’s Rhetoric…అరిస్టాటిల్ ప్రకారం, ఒక మాట ప్రభావాన్ని చూపాలి అంటే అందులో మూడు ఉండాలి.1. Ethos (విశ్వసనీయత): మీరు ఎవరు? మీ మాటను జనం ఎందుకు వినాలి? మీ వ్యక్తిత్వమే మీ మాటలకు పునాది.2. Logos (తర్కం): మీరు చెప్పే విషయంలో లాజిక్ ఉండాలి. డేటా, ఫ్యాక్ట్స్ ఉండాలి.3. Pathos (భావోద్వేగం): ఇది అన్నింటికంటే ముఖ్యం. మనుషులు లాజిక్ తో కనెక్ట్ అవ్వరు, ఎమోషన్ తో కనెక్ట్ అవుతారు. ఒక కథను (Storytelling) చెప్పడం ద్వారా వారి మనసులను తాకండి.మోటివేషన్ మాయ vs రియల్ స్పీకింగ్"బిగ్గరగా అరవండి, చేతులు తిప్పండి, స్టేజ్ మీద పరిగెత్తండి" అని మోటివేషన్ చెప్తుంది. ఇది ఒక్కోసారి నాటకీయంగా ఉంటుంది. "మీరు మీలాగే మాట్లాడండి. మీ గొంతులో సహజత్వం (Naturalness) ఉన్నప్పుడే అది ఎదుటివారికి చేరుతుంది" అని సైకాలజీ చెప్తుంది. మోటివేషన్ కంటే 'కన్విక్షన్' (నమ్మకం) ముఖ్యం.మీ ప్రసంగాన్ని ఒక ప్రభంజనం చేయండిGenius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, మీ స్పీకింగ్ స్టైల్ ని ఎలా బిల్డ్ చేయాలి?Step 1: మొహమాటాన్ని బ్రేక్ చేయండి"నేను సరిగ్గా చెప్పగలనా?" అనే మొహమాటాన్ని 'Break' చేయండి. అలాగే, రోబో లాగా ఒకే శృతిలో (Monotone) మాట్లాడటం ఆపండి. గొంతులో ఎత్తుపల్లాలు (Vocal Variety), మధ్యలో ఇచ్చే నిశ్శబ్దం (Power of Pause) మీ మాటలకు ప్రాణం పోస్తాయి.Step 2: Build Storytellingవిషయాన్ని కేవలం పాయింట్ల రూపంలో కాకుండా, ఒక కథలా చెప్పడం అలవాటు చేసుకోండి. మనుషులు నెంబర్లను మర్చిపోతారు కానీ కథలను ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. మీ వ్యక్తిగత అనుభవాలను జోడించండి. అది మీ మాటలకు 'అథెంటిసిటీ'ని ఇస్తుంది.Step 3: Transformationమీ ప్రసంగం ముగిసిన తర్వాత వినేవారిలో ఒక మార్పు రావాలి. వారు ఒక కొత్త నిర్ణయం తీసుకోవాలి లేదా ఒక కొత్త ఆలోచనతో వెళ్లాలి. కేవలం చప్పట్లు కొట్టించుకోవడం కాదు, ఒక 'ప్రభావం' (Impact) చూపడమే 'Beyond' స్టేజ్.మీ మాట ఎంత పవర్ఫుల్?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.1. మీరు మాట్లాడేటప్పుడు ఎదుటివారి కళ్ళలోకి చూస్తున్నారా? 2. మీరు చెప్పే విషయంలో మీకు నిజంగా నమ్మకం ఉందా?3. మీ మాటలు విన్న తర్వాత కనీసం ఒక్కరైనా "బాగా చెప్పారు" అని కాకుండా "నేను మారతాను" అని అన్నారా?మీ మాట మీ సంతకం!బ్రో, మీ గొంతు ప్రపంచానికి మీరు ఇచ్చే అతిపెద్ద బహుమతి. దాన్ని దాచుకోకండి. అద్భుతమైన పదాలతో కాదు, స్వచ్ఛమైన భావాలతో మాట్లాడండి. మీరు మాట్లాడితే ఒక చరిత్ర సృష్టించబడాలి, ఒక మనసు మారాలి. అదే మీ పర్సనాలిటీకి అసలైన సక్సెస్."Speech is power: speech is to persuade, to convert, to compel." -రాల్ఫ్ వాల్డో ఎమర్సన్సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com (చదవండి: Conflict Resolution: గొడవలను పరిష్కరించే నేర్పు) -
మౌనం మీ వ్యక్తిత్వాన్ని ఎలా పెంచుతుంది?
ఒక పవర్ఫుల్ పర్సనాలిటీకి ఉండాల్సిన అతిపెద్ద ఆయుధం 'మాట' మాత్రమే కాదు.. ‘మౌనం’ కూడా అవసరం. చాలామంది మౌనాన్ని బలహీనత అనుకుంటారు, కానీ సైకాలజీ ప్రకారం మౌనం అనేది ఒక 'స్ట్రాటజిక్ పవర్'. మీరు ఎప్పుడు మాట్లాడాలో తెలియడం కంటే, ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండాలో తెలియడం మీ మెచ్యూరిటీకి నిదర్శనం.నిజమైన అధికారం ఉన్న వ్యక్తి ఎప్పుడూ ఎక్కువగా అరవడు. నిశ్శబ్దం అనేది ఒక రకమైన 'గ్రేవిటాస్' (Gravitas) ని ఇస్తుంది. మీరు తక్కువగా మాట్లాడినప్పుడు, మీరు మాట్లాడే ప్రతి మాటకి విలువ పెరుగుతుంది. మౌనం మీ ప్రొఫెషనల్, సోషల్ ఇమేజ్ని ఎలా మారుస్తుందో చూద్దాం.నిశ్శబ్దంలోని రకాలు మౌనం అంటే కేవలం మాట్లాడకపోవడం కాదు. అది ఒక కమ్యూనికేషన్ టూల్.The Listening Silence: ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు మౌనంగా వినడం. ఇది వారిని గౌరవిస్తున్నట్లు అనిపిస్తుంది. మీరు వారి గురించి ఎక్కువ సమాచారం తెలుసుకోవడానికి సహాయపడుతుంది.The Thinking Silence: ఒక ప్రశ్న అడిగినప్పుడు వెంటనే సమాధానం చెప్పకుండా, ఒక రెండు సెకన్లు ఆగి చెప్పడం. ఇది మీరు 'ఆలోచించి' మాట్లాడుతున్నారనే నమ్మకాన్ని కలిగిస్తుంది.The Power Pause: ప్రసంగం మధ్యలో ఇచ్చే చిన్న విరామం. ఇది వినేవారిలో కుతూహలాన్ని పెంచుతుంది.తక్కువ మాట్లాడటం వల్ల వచ్చే లాభాలు Control of Emotions: మీరు మౌనంగా ఉన్నప్పుడు మీ ఎమోషన్స్ మీ కంట్రోల్ లో ఉంటాయి. ఆవేశంలో తప్పుడు మాటలు అనే ప్రమాదం తప్పుతుంది.Increased Observation: నోరు తెరిస్తే మనం కేవలం మనకు తెలిసింది మాత్రమే చెప్తాం, కానీ చెవి తెరిస్తే కొత్త విషయాలు నేర్చుకుంటాం.Mystery & Respect: ఎక్కువగా మాట్లాడేవారిని ప్రజలు తేలికగా తీసుకుంటారు. తక్కువగా, అర్థవంతంగా మాట్లాడేవారి పట్ల ఒక రకమైన గౌరవం, మిస్టరీ ఏర్పడతాయి.నిశ్శబ్ద శక్తి...మోటివేషన్ స్పీకర్లు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్లు "నీ వాయిస్ వినిపించు, అందరినీ డామినేట్ చేయి" అని చెప్తుంది. ఇది ఒక్కోసారి మిమ్మల్ని 'నాయిసీ' (Noisy) పర్సనాలిటీగా మారుస్తుంది. కానీ సైకాలజీ ఇందుకు భిన్నమైన మార్గం చూపిస్తుంది. "నీ మాటలు విలువైనవి, వాటిని అవసరమైనప్పుడే వాడు" అని చెప్తుంది. నిశ్శబ్దం అనేది అజ్ఞానానికి చిహ్నం కాదు, అది ఆత్మవిశ్వాసానికి చిహ్నం.మౌనాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి?Genius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, మీ పర్సనాలిటీలో నిశ్శబ్దాన్ని ఎలా భాగం చేసుకోవాలి?Step 1: అనవసరమైన వివరణలు తగ్గించండిమిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి ఇచ్చే అనవసరమైన వివరణలను 'Break' చేయండి. ఎవరైనా మిమ్మల్ని విమర్శించినా లేదా ప్రశ్నించినా, వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఒక నిమిషం మౌనంగా ఉండండి. ఆ నిశ్శబ్దమే అవతలి వ్యక్తిని ఆలోచింపజేస్తుంది.Step 2: Build Deep Listeningమనుషులతో మాట్లాడేటప్పుడు "నేను ఎప్పుడు మాట్లాడాలి?" అని కాకుండా "వారు ఏం చెప్తున్నారు?" అని వినడం నేర్చుకోండి. మీరు ఎంత ఎక్కువ వింటే, మీ నిర్ణయాలు అంత ఖచ్చితంగా ఉంటాయి. మౌనం మిమ్మల్ని మంచి అబ్జర్వర్ గా మారుస్తుంది.Step 3: Presenceమీరు ఏమీ మాట్లాడకుండా ఒక గదిలో కూర్చున్నా, మీ 'ప్రెజెన్స్' అందరికీ తెలియాలి. మీ కళ్ళలో ఉండే ప్రశాంతత, మీ బాడీ లాంగ్వేజ్ లో ఉండే స్థిరత్వం మీ మౌనాన్ని పవర్ఫుల్ గా మారుస్తాయి. ఇదే 'Beyond' స్టేజ్.మీ మాటల విలువ ఎంత?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.1. ఈ రోజు మీరు మాట్లాడిన మాటలలో ఎన్ని అనవసరమైనవి?2. ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు మీరు వారిని మధ్యలో ఆపారా?3. మీరు మౌనంగా ఉన్నప్పుడు మీకు అసౌకర్యంగా అనిపిస్తోందా?నిశ్శబ్దం మీ సంతకం!బ్రో, ఖాళీగా ఉన్న పాత్రలే ఎక్కువ శబ్దం చేస్తాయి. నిండుగా ఉన్న వ్యక్తిత్వం నిశ్శబ్దంగా ఉంటుంది. మీరు ఎంత తక్కువ మాట్లాడితే మీ వ్యక్తిత్వానికి అంతటి గాంభీర్యం (Depth) వస్తుంది. మౌనాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి, అది మిమ్మల్ని ప్రపంచం వైపు నుంచి మీ వైపుకు మళ్ళిస్తుంది."Silence is a source of great strength." - Lao Tszu సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: The Professional Mask: ఆఫీసులో మీ వ్యక్తిత్వం ఎలా ఉండాలి?) -
కాలులో ఆకస్మికంగా భరించలేని నొప్పి..క్షణాల్లో ప్రాణాంతకంగా మారి..
శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ ఎంత కీలకమైనది అని చెప్పేందుకు ఈ కేసు ఓ ఉదాహరణ. తీవ్రమైన అవయవ రక్తప్రసరణ అనేది అచ్చం గుండెపోటుని పోలి ఉంటుంది. దీని కారణంగా ఒక్కోసారి ఆయా అవయవం లేదా ప్రాణమే పోయే పరిస్థితి ఏర్పడుతుందట. ఇక్కడ కూడా ఓ మహిళ ఈ పరిస్థితితోనే దాదాపు అవయవాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. సకాలంలో వైద్యులు చికిత్స అందించడంతో త్రుటిలో ఆ ప్రమాదం తప్పింది.అసలేం జరిగిందంటే..మహారాష్ట్రలో హింగోలికి చెందిన 57 ఏళ్ల ప్రయాగ్బాయి శంకరరావు షిండేకు ఎండమకాలులో ఆకస్మికంగా భరించలేని నొప్పి వచ్చింది. అది కాస్తా చూస్తుండగానే ప్రాణాతక అత్యవసర పరిస్థితిగా మారింది. గంటల వ్యవధిలో ఆమె పాదం నీలిరంగులోకి మారి, వాచి చల్లగా అయిపోయింది. పూర్తిగా రక్తసరఫరా నిలిచిపోయింది. ఆమె కాలు శాశ్వతంగా కోల్పోయే సంకేతాలు మొదలయ్యాయి. అయితే సకాలంలో సమీపంలోని ఆస్పత్రికి తరలించడంతో అక్కడ వైద్యులు ఆమె తీవ్రమైన అవయవ రక్తప్రసరణ లోపం(అక్యూట్ లింబ్ ఇస్కీమియా)తో బాధపడుతున్నట్లు నిర్థారించారు. ఇదొక తీవ్రమైన రక్తనాళాల అత్యవసర పరిస్థితి. దీనిలో గనుక చికిత్స ఆలస్యం అయితే ఆ కాలుని తీసివేయడం లేదా ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చు. అధునాతన ఇమేజింగ్లో ఆమె కాలులోని ప్రధాన ధమనులలో పూర్తి అడ్డంకి ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. అయితే అప్పటికే పాదంలో ప్రీ-గాంగ్రేనస్ మార్పులు కనిపించడం మొదలయ్యాయని వైద్యులు తెలిపారు. దాంతో తాము షిండేకు ఎడమ తొడ ధమని ఎంబోలెక్టమీ (left femoral embolectomy) కోసం హుటాహుటిన శస్త్రచికిత్స చేశారు. ఇది ప్లంబింగ్ లాంటిది. ధమని ఎక్కడ మూసుకుపోయినా, దానిని తెరిచి రక్తం గడ్డను తొలగిస్తారు వైద్యులు. ఫలితంగా రక్తప్రసరణ పునరుద్ధరింపబడి కాలును పూర్తిగా కోల్పోకుండా కాపడతారు. అయితే షిండే కాస్త ఆలస్యంగా రావడం వల్ల కొన్ని కాలివేళ్లు అప్పటికే గ్యాంగ్రీన్గా (gangreanes) మారిపోయాయి, అందువల్ల వాటిని తొలగించాల్సి ఉందని అన్నారు. అదీగాక సదరు రోగి షిండేకి అదుపులో లేని మధుమేహం, వయస్సు సంబంధిత అథెరోస్క్లెరోసిస్ ఉండటం ఈ కేసును ప్రత్యేకంగా సవాలుగా మార్చాయి. ఈ సహ-వ్యాధులు తీవ్రమైన అవయవ ఇస్కీమియా (acute limb ischemia) ప్రమాదాన్ని పెంచడమే కాకుండా కోలుకోవడాన్ని క్లిష్టతరం చేస్తాయని అన్నారు వైద్యులు.ఇదేలా గుండెపోటు లాంటిది అంటే..తీవ్రమైన అవయవ రక్తప్రసరణ లోపాన్ని గుండెపోటుతో పోలుస్తున్నారు వైద్యులు. గుండెపోటులో గుండె కండరాలకు రక్త సరఫరా ఎలా నిలిచిపోతుందో, అలాగే తీవ్రమైన అవయవ రక్తప్రసరణ లోపంలో కూడా రక్తప్రసరణ అకస్మాత్తుగా ఆగిపోతుంది. ఇది తీవ్రమైన నొప్పికి, కణజాల నష్టానికి దారితీస్తుంది. సాధారణంగా దీనిని తీవ్రమైన అవయవ దాడిగా కూడా పిలుస్తుంటారు. ప్రతి అవయవానికి పోషణ కోసం రక్త ప్రసరణ అవసరం. ధమని మూసుకుపోతే, నీరు లేని మొక్కలాగే అవయవం చనిపోతుంది. తీవ్రమైన అవయవ ఇస్కీమియా అంటే అవయవానికి రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోవడం. తక్షణ చికిత్స లేకుండా, ఆ అవయవం జీవించలేనిదిగా మారుతుంది. ఫలితంగా అవయవంలో తీవ్రమైన నొప్పి, తిమ్మిరి, చల్లదనం వంటి ప్రారంభ లక్షణాలను లైట్ తీసుకోవడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారిపోతుందని చెబుతున్నారు వైద్యులు. కొందరు నరాల ఒత్తిడిగా భ్రమపడి న్యూరాలజిస్టులని సంప్రదించి విలువైన సమయాన్ని వృధా చేసుకుని ప్రాణాంతకంగా మార్చుకుంటారని తెలిపారు. ప్రమాదం ఎవరికి ఎక్కువ అంటే..వృద్ధ రోగులు, అదుపులో లేని మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బులు, ధూమపానం చేసేవారికి ఈ ప్రమాదం మరింత ఎక్కువ. చికిత్స:సాధారణ చికిత్స ఎంబోలెక్టమీ, కానీ పెర్క్యుటేనియస్ మెకానికల్ థ్రాంబెక్టమీ వంటి అధునాతన పద్ధతులు . ఈ ప్రక్రియలో స్థానిక అనస్థీషియా ఇచ్చి, కాథెటర్ ఉపయోగించి రక్తం గడ్డను బయటకు తీస్తారు. శస్త్రచికిత్స విజయవంతమై, నష్టం తక్కువగా ఉంటే, రోగులు కేవలం రెండు లేదా మూడు రోజుల్లో నడవడం ప్రారంభించొచ్చు. సంక్లిష్టమైన కేసులలో, కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది.అంతేగాదు అవయవంలో తీవ్రమైన నొప్పి, చల్లదనం వంటివి కనిపిస్తే, తక్షణమే సమీపంలోని ఆసుపత్రికి వెళ్ళమని సూచిస్తున్నారు వైద్యులు. సాధ్యమైనంత వరకు సమయం వృథా చేయకుండా సకాలంలో రోగ నిర్ధారణ చేయించుకుని తగిన చికిత్స పొందితే అవయవాన్ని కాపాడుకోగలమని చెబుతున్నారు వైద్యులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: పానీపూరీతో ఇంత ఆదాయం వస్తుందా..?! నెలకు ఏకంగా..) -
పానీపూరీతో ఇంత ఆదాయం వస్తుందా..?! నెలకు ఏకంగా..
పానీపూరీ అమ్ముతూ ఎంత సంపాదించొచ్చు అనగానే మహా అయితే రూ. 20 వేలు లేదా రూ. 30 వేలు ఉండొచ్చని అనుకుంటాం. రోజంతా నిలబడి.. అర కొర సంపాదనతో కష్టపడే వేతన జీవులుగా భ్రమపడతాం అని అంటున్నాడు కంటెంట్ విక్రేత. అంతేకాదండోయ్ వాళ్లు నిజంగా పానీపూరీ అమ్ముతూ ఎంత సంపాదించగలరో స్వయంగా తెలుసుకునేందుకు ఆ స్టాల్లో పనిచేసి మరి రోజువారీ వేతనం లెక్కించాడు. మరి ఇంతకీ ఎంత సంపాదించొచ్చంటే..బెంగళూరుకు చెందిన పెరీరా అనే కంటెంట్ క్రియేటర్ రోడ్డు పక్కనే ఉన్న ఒక పానీపూరీ స్టాల్లో ఒక రోజంతా పనిచేసి అతడి రోజువారీ సంపాదనను లెక్కించాడు. అందుకోసం ఉల్లిపాయలు, బంగాళ దుంపల తొక్కు తీయడం, మసాల పూరీని తయారు చేయడం వంటి ప్రాథమిక తయారీ పనులను కుణ్ణంగా నేర్చుకుని మరి ప్రారంభించాడు పెరారీ. ఆ పనులు అలవాటయ్యాక వినియోగదారులకు అందించడం ప్రారంభించడు. మొదట్లో కాస్త తడబడ్డాడు. ఆ తర్వాత రద్దీ పెరిగాక త్వరగా అలవాటుపడిపోయాడు. కేవలం ఒక గంటలోనే సుమారు 120 పూరీలు దాక అమ్మాడు. ఈ స్టాల్ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తుందని, సాయంత్రం అయ్యే కొద్దీ జనం క్రమంగా పెరుగుతారని ఆయన పేర్కొన్నారు. అంతేగాదు ఆయన పనిచేస్తున్న సమయంలో పలువురు సన్నిహితులు ఆయన గుర్తుపట్టారు కూడా. ఎంత ఆదాయం వస్తుందంటే..ఒక ప్లేట్ ధర రూ. 30లు. అంటే రోజుకి సుమారు 80 నుంచి 100 ప్లేట్లు అమ్ముడవుతాయని పెరీరా తెలిపారు. అంటే రోజువారీ మొత్తం ఆదాయం సుమారు రూ. 3000 దాక ఉంటుంది. దానిప్రకారం నెలకు రూ. 90,000 వరకు గడిస్తాడని, దాదాపు ఏడాదికి రూ. 10.8 లక్షలకు సమానమని పెరారీ అంచనా వేశారు. అందుకు సంబంధించిన వీడియోతో సహా నెట్టింట షేర్ చేయడంతో సర్వత్రా పానీపూరీ వంటి సంప్రదాయ వ్యాపారాలతో ఇంతలా ఆర్జిస్తారా అని చర్చల మొదలయ్యాయి. View this post on Instagram A post shared by Cassy Pereira (@cassiusclydepereira) (చదవండి: నాడు కాలేజ్ డ్రాపౌట్..ఇవాళ ఏకంగా ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో చోటు..!) -
నాడు కాలేజ్ డ్రాపౌట్..ఇవాళ ఏకంగా ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో చోటు..!
కొందరికి ఈ చదువులు తనకేం ఉపయోగపడవని, ఇంకేదో రంగంలో ఎదగగలం అని ముందుగానే గుర్తిస్తారు, బలంగా నమ్ముతారు కూడా. అంతేగాదు చాలా ధైర్యంగా చదువుకి మధ్యలోనే స్వస్తి పలికి అందరూ ఆశ్చర్యపోయేలా ఆ రంగంలో దూసుకుపోవడమే కాదు మంచి గుర్తింపు, పేరు తెచ్చుకుంటారు కూడా. అలాంటి కోవకు చెందినవాడే ఈ పిజిక్స్ వాలా. ఆయన ఒకప్పడూ కాలేజీ డ్రాపౌట్..ఇవాళ ఎవ్వరూ ఊహించనంత స్థాయి చేరుకోవడమే కాదు..ఏకంగా ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా చోటు దక్కించుకున్నాడు. అతడే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చెందిన అలఖ్ పాండే. ఆయన ఇంజనీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరంలోనే చదువు మానేశారు. ఆ తర్వాత చాలాకాలం ప్రైవేట్ ట్యూటరింగ్గా తక్కువ జీతానికి పనిచేసేవారు. అలా సాగుతున్న టైంలో 2016లో పిజిక్స్ వాలాగా ఉచితంగా సులభంగా పాఠాలు బోధిస్తూ వేలాది మంది విద్యారులను సంపాదించుకోవడంతో అతడి జీవితం కీలక మలుపు తిరిగింది. ఆ తర్వాత అలఖ్ పాండే, ప్రతీక్ బూబ్ అనే వ్యక్తితో కలిసి 2020లో 'ఫిజిక్స్వాలా' అనే ఎడ్టెక్ సంస్థను స్థాపించారు. కొద్దికాలంలోనే ఆ కంపెనీ ఓ ప్రభంజనంలా దూసుకుపోయింది. నిజానికి అధిక ఫీజలు చెల్లించకుండా అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షల్లో నెగ్గుకురావడం అంత ఈజీ కాదు. దాంతో అలాంటి విద్యార్థులను ఉద్దేశించి సులభంగా అర్థం చేసుకునే బోధనా శైలిని రూపొందించారు. ఎడ్టెక్ అనే స్థార్టప్ సాయంతో దూసుకుపోయారు. మొదట్లో ఆ కంపెనీ ఉద్యోగ కోతలు, నష్టాలు, పెట్టుబడుదారుల సందేహాలతో సతమతమవుతున్న తరుణంలో పాండే తన కంపెనీని వృద్ధికి అందుబాటు ధరలో విద్యును అందించడమే కేంద్రబిందువుగా చేసుకున్నారు. అలా 2024లో ఫిజిక్స్వాలా సిరీస్ బి రౌండ్లో దాదాపు రూ. 1750 కోట్లు సమీకరించింది. ఆ తర్వాత మార్చి 2026 నాటికి అలఖ్ పాండే నికర ఆస్తి విలువ సుమారు రూ. 9 వేల కోట్లుకు చేరుకుందని అంచనా. దాంతో ఆయన ఫోర్బ్స్ 2026 బిలియనీర్ల జాబితాలో 3332వ స్థానంలో ప్రవేశించారు. ఒకప్పుడు పాఠం పాఠంగా చెబుతూ అభిమానులను సపాదించుకున్న ఆ ఉపాధ్యాయుడు కొద్దిమంది వ్యవస్థాపకులు మాత్రం చోటు దక్కించుకునే సంపాదన స్థాయికి చేరుకోవడం విశేషం. ఈ స్థాయికి ఎలా చేరుకున్నారంటే..పాండే తన స్టార్టప్ విధానానికి విరుద్ధంగా విస్తరణపైనే దృష్టిసారించి లాభాలను ఆర్జించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన తక్కువ ఖర్చుతో బోధించడంతో విశేష ఆదరణ సంపాదించకున్నారు. పాండే కథ డిజిటల్ విప్లవం విద్యా అవకాశాల స్వరూపాన్ని ఎలా మార్చేసిందే చెబుతోంది. ఒక చిన్న పట్టణంలోని విద్యార్థి విద్య నేర్చుకోవడాని అతని కోసం మెట్రో నగరానికి వెళ్లాల్సిన పనిలేదు. పైగా అధికమొత్తంలో డబ్బు చెల్లించాల్సిన పనిలేదు. ఒక్క ఫోన్ స్క్రీన్ చాలు. అందువల్ల అతడు బిలియనీర్ల జాబితాలో సులభంగా చోటు దక్కించుకోగలిగాడు. అందుబాటు ధరలో మార్కెట్ను సొంతం చేసుకునే వ్యాపార సూత్రం కూడా. (చదవండి: డెవర్లే... రైతులుగా...) -
లక్ష జీతం, కారు, ఫ్లాట్.. వరుడికి కొత్త రూల్స్!
మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. రెండు మనసులు కలిసి ఒకటిగా మారేది పెళ్లి. ఇది కొత్త జీవితానికి అంకురార్పణ. అగి్నసాక్షిగా ఏడు అడుగులతో మొదలయ్యే ఈ కొత్త పయనం జీవితాంతం తోడుంటాననే మధుర వాగ్దానంతో ముందుకు సాగుతుంది. ఈ అపురూపమైన పెళ్లి బంధాన్ని ప్రస్తుతం యువతీ యువకులు ఒక వ్యాపారంగా మార్చేశారు. గతంలో పెళ్లిని పెద్దలు కుదిర్చేవారు. ఇప్పుడు యువతీయువకుల చేతుల్లోకి వెళ్లిపోయింది. మూడు పదులు దాటినా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతున్నారు. చివరకు ఒంటరితనమనే శిక్షను చేతులారా తమకు తామే వేసుకుంటున్నారు. వయసు ముదురుతున్న కొద్దీ కనిపించిన వారంతా ఏంబా ఇంకా పెళ్లి చేసుకోలేదా అనే సూటిపోటి మాటలను తట్టుకోలేకపోతున్నారు. దీంతో మళ్లీ పెద్దలకు చెప్పి ఏ సంబంధమైనా సరే నేను రెడీ అంటున్నారు. ఈ వయసు వారికి పెళ్లి కావడం కష్టంగా పరిణమించింది. చిత్తూరు: నేటితరం అబ్బాయిలు పెళ్లితో ఆర్థికంగా ఎదగాలని భావిస్తున్నారు. తాను ఎలాగున్నా అమ్మాయి మాత్రం అందంగా ఉండాలి. కచ్చితంగా తాను చేసే ఉద్యోగమే అయి ఉండాలి. భారీగా కట్నకానుకలు ఇవ్వాలని భావిస్తున్నారు. జీవితాంతం కలిలి ఉండే భార్యని డబ్బులు తెచ్చే అందమైన యంత్రంగా.. అదో ఫ్యాకేజీగా మార్చేశారు. దీంతో అలాంటి అమ్మాయిల కోసం వేటాడుతూ ఉన్న జీవితాన్ని కోల్పోతున్నారు. 30 ఏళ్లు దాటాక కనువిప్పు కలిగి ఏదో ఒక సంబంధమైనా సరే అని సాగిలపడుతున్నారు. ఎలాంటి సంబంధమైనా ఓకే అన్నా కష్టమే వయసు ముదిరాకగాని అనేక మంచి సంబంధాలను వదులుకున్నామనే బాధ తెలిసి వస్తోంది. అప్పటికీ పెళ్లి చేసుకునేందుకు పెద్దగా ఎవరూ ముందుకురాని పరిస్థితి కలుగుతోంది. ఇదే సమయంలో బంధువులు, స్నేహితుల నుంచి ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అన్న మాటలు వినిపిస్తాయి. ఆపై తల్లిదండ్రుల మాట వింటూ ఏ సంబంధమైనా చూడడండనే మాటలు వస్తున్నాయి. మొత్తానికి అప్పటికి పెళ్లి కష్టంగా మారిపోతుంది. మొత్తం మీద పెళ్లి అనేది జీవితం కాదని, అదో జీతాల లెక్కని అనుకునే వారికి చివరికి తనకంటూ ఎవరూ లేకుండా పోతున్నారు. జిల్లాలో 30 ఏళ్లు దాటి పెళ్లికాని యువతీ యువకుల సంఖ్య 16 వేల వరకు ఉన్నట్టు అంచనా. ఇప్పటికైనా యువత మేలుకుని తన పంథాను మార్చుకుని సరైన వయసులో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గుర్తించుకోవాలి.లేని ఆశలు నింపుతున్న మ్యారేజీ బ్రోకర్లు ఇప్పుడు ఎక్కడ చూసినా మ్యారేజీ బ్రోకర్లు, మ్యారేజి బ్యూరోలే పెళ్లి సంబంధాలను చూస్తున్నాయి. వారిని ఆశ్రయించిన వారికి పలు ఆశలు పెట్టి కళ్ల ముందు స్వర్గాన్ని చూపుతున్నారు. తాను సెట్ చేసిన వారంతా కోట్లకు పడగలెత్తారని, కట్నకానులు భారీగా ఇప్పిస్తామంటూ ఢాంబికాలు పలికి యువతీ యువకుల్లో లేనిపోనీ ఆశలు కలి్పస్తున్నారు. తద్వారా వారి నుంచి పెద్ద మొత్తంలో కమీషన్ తీసుకుంటున్నారు. వారి మాటలను నమ్మిన యువతీ యువకులు పెళ్లి తర్వాత తాను పెద్ద పొజిషన్లోకి చేరుకుంటానంటూ కలల ప్రపంచంలో ఊగిసలాడుతూ చివరికి మూడు పదలు దాటాక గాని వాస్తవంలోకి రాలేకపోతున్నారు. ఇదంతా ఒట్టి మాటలనే నిజం చెవికెక్కించుకుంటున్నారు. అప్పటికే పుణ్యకాలం దాటిపోయి పెళ్లి కావడం కష్టంగా మారుతోందిఅమ్మాయిలేం తక్కువ కాదు గతంలో అమ్మాయిలు తల్లిదండ్రులు చెప్పిన సంబంధాన్ని చేసుకునేవారు. ఇప్పుడు ఎక్కువమంది భాగస్వామి ఎంపికను వారే చూసుకుంటున్నారు. అబ్బాయి అందంగా ఉండాలి. నెలకు లక్షకు పైగా జీతం రావాలి. అపార్ట్మెంట్ ఉండాలి. కారు ఉండాలి. అత్తమామలు, ఆడపడుచులు గోల ఉండకూడదు. పెళ్లయిన వెంటనే వేరు కాపురం పెట్టాలి అని పలు కండీషన్లు పెట్టుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే వీరికి భర్త కంటే వారు సెటిల్ అయ్యే ఓ ప్యాకేజీలా మార్చుకున్నారు. ఇలా మంచి మ్యాచ్ వస్తుందేమోనని చూసి చూసి ఆఖరుకు మూడు పదులు దాటాక ఒంటరితనమే మేలని భావిస్తున్నారు. -
కథాకళి: ఉపదేశం
భవిష్యత్తులో ఓ రోజు. ఓ తప్పనిసరి రోజు. ఆ రోజు టోక్యోలోని యునైటెడ్ నేషన్స్ బిల్డింగ్లో సభ్య దేశాల రాయబారులు సమావేశమయ్యారు. బీద దేశాల్లోని ఖనిజాలు, ఇతర ప్రకృతి సంపదని తమదిగా చేసుకోడానికి కొన్ని దేశాలు, తమ మతాన్ని రక్షించుకోవడానికి కొన్ని దేశాలు, తమ మతవ్యాప్తికి మరికొన్ని దేశాలు, సామ్రాజ్య విస్తరణ కాంక్షతో ఆయుధ సంపత్తి గల కొన్ని దేశాలు చాలాకాలంగా యుద్ధాలు చేస్తున్నాయి. సైనికులతోపాటు కోట్లాదిమంది పౌరులు మరణిస్తున్నారు. ఆ యుద్ధాల నివారణకి, ప్రపంచశాంతికి సంప్రదింపులు జరుగుతున్నాయి.సెక్రటరీ జనరల్ ఆ సమావేశాన్ని ఆరంభిస్తూ చెప్పాడు.‘‘మిత్రులారా! మన చర్చలు ప్రతిష్టంభనతో ముగిశాయి. దాంతో ఐదవ ప్రపంచ యుద్ధం కూడా జరిగి మానవాళి పూర్తిగా నాశనం అవచ్చు. ఇప్పటికే అణ్వస్త్రాలకి తోడు లేజర్ ఆయుధాల వల్ల భూమిలో సారం తగ్గి, అంతరిక్షంలోని ఉపగ్రహం మీద పండించుకుని తింటున్నాం. మానవాళి ప్రమాదం అంచున ఉంది. కాబట్టి కృత్రిమ మేధస్సుని ఉపయోగించాలని నిర్ణయించాను. నూటముప్ఫై ఏడు దేశాల సాంకేతిక నిపుణుల సహాయం తీసుకుని, ఎలాంటి సమస్యకైనా పరిష్కారాన్ని సూచించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సూపర్ బ్రెయి¯Œ ని తయారు చేయించాను.’’ఆ గది మధ్యలో మనిషి మెదడు ఆకారంలో, దానికన్నా పాతిక రెట్లు పెద్దదిగా ఉన్న ఆ యంత్రాన్ని అంతా చూశారు. ప్రపంచాన్ని ముప్ఫైసార్లు నాశనం చేయగల ఆయుధ సంపత్తి గల, నియంత అధికారంలోని, అంతా భయపడే నార్త్ కొరియా రాయబారి చెప్పాడు.‘‘మన సమస్యకి ఓ యంత్రం పరిష్కారం చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.’’‘‘కావచ్చు. కాని ‘సరైన పరిష్కారం మూర్ఖుడి నించి వచ్చినా స్వీకరించదగ్గదే’ అని మా దేశ సామెత.’’ ఉత్తరప్రదేశ్ రాయబారి చెప్పాడు.‘‘విందాం. ఈ యంత్రం ఏం చెప్తుందో, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం సూచించగలదేమో విందాం. మనం ఇప్పటికే చాలా పరిష్కారాలని విన్నాం. తిరస్కరించాము. కాబట్టి దీన్ని వినడంలో అవమానం లేదు.’’ సెక్రటరీ జనరల్ చెప్పాడు.‘‘అవును. అందులో విజ్ఞత ఉంది.’’ టెక్సస్ రాయబారి చెప్పాడు.అన్ని దేశాల్లా అమెరికా కూడా చాలా చిన్న దేశాలుగా విడిపోయింది. పదవుల కోసం చాలా రాష్ట్రాలని, దేశాలని రాజకీయ నాయకులు విడగొట్టారు. అవి రక్షణకి వివిధ మిలటరీ కూటములను ఏర్పాటు చేసుకుని అందులో సభ్యులయ్యాయి.‘‘మనకన్నా దీనికున్న క్వాలిఫికేషన్ ఏమిటి?’’ రాజస్థాన్ రాయబారి ప్రశ్నించాడు.‘‘భౌగోళిక, రాజకీయ, చరిత్ర, మతపరమైన, ఇంకా ఎన్నో అంశాలకి చెందిన అంశాలని శాస్త్రజ్ఞులు ఈ మెదడులో నమోదు చేశారు. వాటన్నిటిని క్రోడీకరించి, ఆలోచించి పక్షపాతం లేకుండా పరిష్కారాన్ని సూచించగలదు. మనిషి మెదడుకి ఈ శక్తి లేదు. కాబట్టి ఈ సూపర్ మైండ్ని సృష్టించాము.’’దాన్ని ఉపయోగించటం అవమానంగా భావించిన కొన్ని దేశాలు ఓటింగ్ కోరాయి. ప్రపంచంలోని 1862 దేశాల్లోని 73% మంది దాన్ని ఉపయోగించాలనే ఓటు వేశారు.‘‘లేడీస్ అండ్ జెంటిల్మెన్. థేంక్యూ. మన ముందున్న ఈ అద్వితీయ మెదడు వంద శాతం తృప్తికరంగా పనిచేస్తోంది. ప్రపంచ దేశాల చరిత్ర, వివాదాలు దీనికి తెలుసు. ఈ మీటని నొక్కగానే శాంతికి పరిష్కారాన్ని ఇది చెప్తుంది. మీ అంగీకారంతో దీన్ని నొక్కుతున్నాను. ఒన్... టు... త్రీ...’’ఆయన మీట నొక్కగానే అందులోని కోట్లాది న్యూరా¯Œ ్స ఒకదానితో మరొకటి కలిసి సమాచారాన్ని మార్పిడి చేసుకోవడాన్ని, మెరుపు తీగల్లా ప్రయాణించిన ఆలోచనా తరంగాలని అంతా విస్మయంగా చూశారు. క్షణం కన్నా తక్కువ కాలంలో అలా సాగాక, అది మానవ గొంతుతో గంభీరంగా పలికింది. ‘‘నన్ను పరిష్కారాన్ని కోరినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. మీరు నాకు మూడు సమస్యలని ఇచ్చారు. కొరియన్ భాషని ప్రపంచ భాషగా చేయాలనే సమస్య; ప్రజల మధ్య, దేశాల మధ్య శాంతి నెలకొల్పడం మిగిలిన రెండు. వీటి పరిష్కారం మీకు అనాదిగా తెలిసి ఉండి కూడా ఎందుకు ఆచరించడం లేదని నాకు ఆశ్చర్యంగా ఉంది.’’అంతా ఆ పరిష్కారం ఏమిటా అని ఆసక్తిగా వినసాగారు.‘‘సమస్యని చూస్తున్న మీరు, పరిష్కారాన్ని ఎందుకు చూడటం లేదు? దీన్ని ఏనాడో మీ పూర్వీకులు, అంటే ముత్తాతల ముత్తాతల ముత్తాతలు మీ క్షేమం కోసం ఉపదేశించారు. ఆ ఉపదేశాన్ని విస్మరించడమే మీరు నష్టపోవడానికి ప్రధాన కారణం. ఒక్క ఆ ఉపదేశంలోనే అన్ని మతాల వందలకొద్దీ బోధనలు నిబిడీకృతమై ఉన్నాయి. ఈ ఒక్క ఉపదేశాన్ని పాటిస్తే మనిషికి, మనిషికి మధ్య ఎలాంటి సంఘర్షణా ఉండక ప్రపంచ శాంతి నెలకొంటుంది.’’‘ఆ ఒక్క ఉపదేశం ఏమిటి?’ అని కొందరు గుసగుసలాడుకున్నారు. ఆ కంఠం గంభీరంగా పలికింది.‘‘ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్ ఏషధర్మః సనాతనః... అంటే, ‘నీకు ఏది చేస్తే బాధ కలుగుతుందో దాన్ని ఇతరులకి చేయకు. ఇది శాశ్వత ధర్మం’ కురుక్షేత్ర యుద్ధం తర్వాత, అనుశాసనపర్వంలో భీష్మ పితామహుడు అంపశయ్య మీద నుంచి ధర్మరాజుకి బోధించిన ఈ సూత్రం మానవాళి శాంతికి కిరీటం లాంటిది. తల మీద కిరీటాన్ని విస్మరించి పాదాలవైపు చూడటం ఆపండి.’’కొన్ని దేశాలవారు కరతాళ ధ్వనులు చేస్తే, మరికొందరు మొహాన్ని మొటమొటలాడించారు. -మల్లాది వెంకట కృష్ణమూర్తి -
డెవర్లే... రైతులుగా...
కేరళ కోజికోడ్లోని ఆటోడ్రైవర్లకు ఇంట్లో భోజనం చేసే అవకాశం లేకపోవడంతో రెస్టారెంట్లలో తినేవారు. ఖర్చు కళ్లు తిరిగేలా ఉండేది. ఇలా అయితే కుదరదనుకొని డ్రైవర్లందరూ కలిసి ఒక చోట సొంతంగా వంటలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ ప్రయోగం సూపర్ హిట్ అయింది.డబ్బు ఆదాతోపాటు ఆరోగ్యం కూడా!ఇప్పుడు ఈ డ్రైవర్లు సేంద్రియ వ్యవసాయం ద్వారా రైతులుగా మారి మరోసారి సంతోషాన్ని సొంతం చేసుకున్నారు. భూస్వామి కోలకట్టిల్ బీజు దగ్గర భూమి లీజు తీసుకొని రైతుగా తొలి అడుగు వేశారు. ‘డ్రైవింగ్ చేసినంత సులభం కాదు... వ్యవసాయం అంటే’.... ఇలాంటి వెక్కిరింపులు ఎన్నో వినిపించినా వారు వెనక్కి తగ్గలేదు.తమ జీవనోపాధిని పణంగా పెట్టి బీడు నేలలోకి పాదం మోపారు.తెల్లవారుజామున తొలి వెలుగుతోనే పొలం పనులకు శ్రీకారం చుట్టేవారు. ఆ తరువాత డ్రైవర్గా రోడ్డు మీదికి వెళతారు. మళ్లీ సాయంత్రం ఇష్టంగా పొలంలోకి వస్తారు. రోజంతా ట్రాఫిక్ పొగల మధ్య ఉండే వారికి పచ్చటి పొలాల మధ్య ఉండడం ఇష్టం. ఒక్క ముక్కలో చెప్పాలంటే...డ్రైవర్గా ఉన్నప్పుడు తప్ప మిగిలిన సమయమంతా పొలంలోనే ఉంటారు. తమ రెక్కల కష్టంతో పాలకూర, పప్పుధాన్యాలు, బెండకాయ, గుమ్మడికాయ, దోసకాయ వంటి పలు రకాల పంటలతో పచ్చని కూరగాయల తోటను సృష్టించారు. పంట సాగు చేయడానికి అవసరమైన డబ్బులను తామే సమకూర్చుకున్నారు. అత్యున్నత శ్రేణి విత్తనాలు, సహజ ఎరువులతో పంట పండించారు. అకాల వర్షాలు కురిసినప్పటికీ వారి కష్టానికి ప్రతిఫలం దక్కింది. చేనులో కోసిన కూరగాయలను ఇంటి అవసరాలకు ఉపయోగించడంతోపాటు, మార్కెట్ ధరకు వాటిని అమ్ముకున్నారు. ‘డ్రైవర్గా మాకు లైసెన్స్ ఉంది. ఇక రైతుగా మా లైసెన్స్... మేము పడే కష్టం’ అంటున్నాడు చంద్రశేఖరన్. ‘రోజంతా హారన్లు మోగించే మేము మొక్కలకు నీరు పోయడం పని కాదు. ప్రశాంతత’ అంటున్నాడు అబ్దుల్ రహీం. ‘జాతీయ రహదారిపై దొరకని విలువైన నిశ్శబ్దం ఇక్కడ దొరుకుతుంది’ అంటున్నాడు మహేష్ అనే రైతు. తాజా విషయానికి వస్తే... ఈ డ్రైవర్ రైతులు పెద్ద పంటలపై దృష్టి పెట్టారు. భవిష్యత్ కాలంలో వారు పూర్తిస్థాయి రైతులుగా మారినా ఆశ్చర్యం లేదు! ‘డ్రైవింగ్ చేసినంత సులభం కాదు... వ్యవసాయం అంటే’.... ఇలాంటి వెక్కిరింపులు ఎన్నో వినిపించినా వారు వెనక్కి తగ్గలేదు. -
గౌరముఖుడి వృత్తాంతం
పూర్వం కృతయుగంలో సుప్రతీకుడు అనే రాజు ఉండేవాడు. అతడికి ఇద్దరు భార్యలు. ఎన్నేళ్లు గడిచినా వారికి సంతానం కలగలేదు. ఆ కాలంలో మహాతపస్వి అయిన ఆత్రేయ మహర్షి చిత్రకూట పర్వతం మీద ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉండేవాడు. సంతానాపేక్షతో సుప్రతీకుడు ఒకనాడు తన భార్యలిద్దరితో కలసి వెళ్లి ఆత్రేయ మహర్షిని దర్శించుకున్నాడు. ఆత్రేయుడి అనుగ్రహంతో కొన్నాళ్లకు సుప్రతీకుడికి దుర్జయుడనే కొడుకు పుట్టాడు.దుర్జయుడు అమిత శక్తిమంతుడిగా ఎదిగాడు. సుప్రతీకుడు కొడుకుకు రాజ్య పాలనను అప్పగించి, తపస్సు చేసుకోవడానికి వానప్రస్థానానికి వెళ్లిపోయాడు. దుర్జయుడు అపార సైన్యసంపత్తిని సమకూర్చుకుని, దండయాత్రకు బయలు దేరాడు. ఎక్కడా అపజయం ఎరుగకుండా, సమస్త భూమండలాన్ని అవలీలగా జయించాడు. ఆ తర్వాత అష్టదిక్పాలకులనూ ఓడించి, తన దారికి తెచ్చుకున్నాడు. విజయగర్వంతో తన రాజ్యానికి తిరుగు ప్రయాణం అవుతుండగా, తోవలో గౌరముఖుడు అనే మహర్షి ఆశ్రమం కనిపించింది. దుర్జయుడు తన సైనిక పటాలాన్ని బయటనే నిలిపి ఉంచి, తానొక్కడే మహర్షి ఆశ్రమంలోకి వెళ్లి, ఆశీస్సులు కోరాడు. గౌరముఖుడు మహారాజైన దుర్జయుడిని సాదరంగా ఆహ్వానించి, గౌరవించాడు. ‘మహారాజా! ఘనవిజయాలు సాధించి నా ఆశ్రమానికి వచ్చావు. నీకు, నీ పరివారానికి ఆతిథ్యమిస్తాను’ అన్నాడు.ఒంటరిగా ఆశ్రమంలో ఉంటున్న మహర్షి తనకు, తన వెంట వచ్చిన లక్షలాదిమంది సైనికులకు ఆతిథ్యం ఎలా ఇస్తాడా అని దుర్జయుడు ఆశ్చర్యపోయాడు.అంతలోనే గౌరముఖుడు స్నాన సంధ్యలు ఆచరించి వస్తానని చెప్పి, సమీపంలోనే ఉన్న గంగానదికి వెళ్లాడు. గంగలో నిలిచి, భక్తిగా నారాయణుడిని స్తుతించాడు.గౌరముఖుడి స్తుతికి ప్రసన్నుడైన నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు.‘స్వామీ! దుర్జయ మహారాజు సైన్యసమేతంగా నా ఆశ్రమానికి వచ్చాడు. అతడికి, అతడి పరివారానికి ఆతిథ్యం ఇస్తానని చెప్పాను. వారందరికీ ఆతిథ్యమిచ్చే శక్తినివ్వు’ అని ప్రార్థించాడు. నారాయణుడు ఒక దివ్యమణిని గౌరముఖుడికి ఇచ్చి, ‘ఈ మణి నువ్వు కోరినవన్నీ తక్షణమే ఇవ్వగలదు’ అని చెప్పి అదృశ్యమయ్యాడు.గౌరముఖుడు ఆ మణి మహిమతో దుర్జయుడు, అతడి పరివారం విడిది కోసం అప్పటికప్పుడే చలువరాతి సౌధాలు, దాస దాసీ జనాలు, ఉద్యాన వనాలతో కూడిన ఒక సువిశాల సుందర నగరాన్ని సృష్టించాడు. దుర్జయుడికి, అతడి పరివారానికి కోరిన పదార్థాలన్నింటినీ సుష్టుగా వడ్డించాడు. భోజనానంతరం వారంతా అక్కడే హాయిగా విశ్రమించారు. మరునాటి ఉదయం దుర్జయుడు, అతడి పరివారం కాలకృత్యాలు, స్నాన సంధ్యల కోసం నదికి వెళ్లారు. వారు తిరిగి వచ్చే సరికి ముందురోజు తాము బస చేసిన నగరం కనిపించలేదు. గౌరముఖుడి శక్తికి దుర్జయుడు, అతడి పరివారం చకితులయ్యారు. గౌరముఖుడి వద్ద సెలవు తీసుకుని రాజధాని వైపు ప్రయాణం మొదలుపెట్టారు.మార్గమధ్యంలో ఉండగా, దుర్జయుడికి ఒక దురాలోచన వచ్చింది. గౌరముఖుడు తమందరికీ ఎలా ఆతిథ్యం ఇచ్చాడో, ఆ రహస్యమేమిటో కనుక్కుని రమ్మని చారులను పంపాడు. నారాయణుడి వరం వల్ల పొందిన మణి మహిమతో అతడు తమకు ఆతిథ్యం ఇవ్వగలిగాడని చారులు చెప్పారు. ఆ మణిని అడిగి తెమ్మని దుర్జయుడు భటులను పంపాడు.గౌరముఖుడి వద్దకు వెళ్లిన భటులు మణిని ఇవ్వమని తమ రాజు ఆదేశించినట్లుగా చెప్పారు. నారాయణ వరప్రసాదమైన మణిని తాను ఇచ్చేది లేదని గౌరముఖుడు నిర్మొహమాటంగా చెప్పాడు. వారు దుర్జయుడి వద్దకు వెళ్లి మణిని ఇవ్వడానికి గౌరముఖుడు తిరస్కరించిన సంగతి చెప్పారు.దుర్జయుడు సైన్యసమేతంగా గౌరముఖుడిపైకి దండెత్తి వచ్చాడు. గౌరముఖుడు మణి మహిమతో సైన్యాన్ని సృష్టించాడు. ఆ సైన్యం చేతిలో దుర్జయుడి సైన్యం తుడిచిపెట్టుకుపోయింది. దుర్జయుడు కరవాలం దూసి గౌరముఖుడిపైకి దూసుకు వస్తుండగా, గౌరముఖుడు నారాయణుడిని ప్రార్థించాడు. నారాయణుడు చక్రం సంధించి, దుర్జయుడి కంఠాన్ని ఉత్తరించాడు.∙సాంఖ్యాయన -
క్లూషియల్: క్రైమ్ సీన్..
రాత్రి పది గంటలు . క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అభిమన్యు అప్పుడే అక్కడకు చేరుకున్నాడు.వెంటనే క్లూస్ టీమ్ అతని దగ్గరికి వచ్చి చెప్పింది. ‘ఫుడ్ పాయిజనింగ్.., ఒక విధంగా విషప్రయోగం... పూర్తి రిపోర్ట్స్ వెంటనే అందేలా ఏర్పాటు చేస్తాం’,,, ఆ మాట వింటూనే మరణించిన తన పదహారేళ్ళ కూతురు లీల శవం దగ్గర నుంచి లేచి వచ్చి, ‘నాకు తెలుసు ఇన్స్పెక్టర్ ఇదంతా నా రెండో భార్యే చేసింది. సవతి తల్లి కదా’... తన కూతురి దగ్గర ఏడుస్తూ కూర్చున్న రెండో భార్య నీలవేణి వైపు కోపంగా చూస్తూ అన్నాడు దివాకర్. రెండు గంటల్లో పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ వచ్చింది. ఆర్సెనిక్ మూలకాన్ని ఎక్కువ మోతాదులో కలిసిన నూడుల్స్ తినడం వల్ల లీల చనిపోయినట్టు తేలింది. రోజూ నూడుల్స్ తినిపించే నీలవేణి ని చూస్తూ, ‘నా కూతురికి ఇష్టమని నూడుల్స్ తెస్తే, అందులోనే విషం కలిపి నా కూతురిని చంపిన ఈ రాక్షసిని ఉరి తీయాలి’ దివాకర్ అరుస్తున్నాడు.ప్రతిఘటన లేకుండా, ఎలాంటి సమాధానం చెప్పకుండా పోలీసులకు సరెండర్ అయ్యింది నీలవేణి. ‘కేసును ఇంత త్వరగా క్లోజ్ చేస్తారనుకోలేదు. కూతురులాంటి బిడ్డను సవతితల్లి చంపుకుంది?’ కటకటాల్లో ఉన్న నీలవేణి వైపు చూస్తూ అన్నాడు డీసీపీ.ఇన్స్పెక్టర్ అభిమన్యు కస్టడీలో వున్న నీలవేణి దగ్గరికి వెళ్లి, ‘ఎందుకు చేశావీ పని?’ అడిగాడు. తలెత్తింది నీలవేణి.‘సవతితల్లిని కదా... నాకు పిల్లలు వద్దనుకున్నానుగా... వున్న బిడ్డను చంపుకుని హాయిగా బ్రతకాలని’ ఏడుస్తూ తల దించుకుంది... కన్నీళ్లు కనిపించకుండా...కారులో వెళ్తున్న ఇన్స్పెక్టర్ అభిమన్యు నీలవేణి మాటలను రీకలెక్ట్ చేసుకుంటున్నాడు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారు ఆగింది. యథాలాపంగా ఎడమ వైపు చూస్తుంటే హాస్పిటల్ కనిపించింది. కారును లెఫ్ట్ వైపు పోనించాడు. న్యాయాన్ని బతికించడానికి.బార్ ముందు ఇన్స్పెక్టర్ కారు ఆగింది. లోపలకి వెళ్లేసరికి ఒక టేబుల్ దగ్గర మందు కొడుతూ కనిపించాడు దివాకర్.అక్కడికి వెళ్లి అతను ముందు కూర్చుని, ‘నాకూ ఆర్డర్ చేయండి?’ అన్నాడు. దివాకర్ ఇన్స్పెక్టర్ను చూసి కంగారుపడ్డాడు. అంతలోనే సర్దుకుని, ‘నా కూతురి మరణాన్ని తట్టుకోలేక’... ‘మందు కొడుతున్నావా? ఆ మందులో ఆర్సెనిక్ విషాన్ని కలిపితే బాగుంటుంది. జైల్లో కూర్చుని’... ‘మీరేమంటున్నారు?’‘నీ కూతురు ఇష్టంగా తినే నూడుల్స్లో ఆర్సెనిక్ విషాన్ని కలిపావు. నీ రెండో భార్య నీ కూతురికి నూడుల్స్ తినిపిస్తుందని తెలిసి... నీ రెండో భార్య పెళ్లి కాగానే తనకు ఇక బిడ్డలు వద్దని, లీలే తన కూతురు అని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది... ఆ విషయాన్ని మీ ఫ్యామిలీ డాక్టర్ ద్వారా తెలుసుకున్నాను. ఆర్సెనిక్ విషం గురించి నువ్వు గూగుల్లో సెర్చ్ చేసి మరీ క్రైమ్ చేసినట్టు నీ మెయిల్ ద్వారా తెలిసింది. నువ్వు పనిచేస్తున్న కంపెనీలో పనిచేసే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం నువ్వు చేసిన వరస్ట్ క్రైమ్’ చెప్పాడు. అప్పటికే పోలీసులు అక్కడికి వచ్చి, దివాకర్ను అరెస్టు చేశారు. దివాకర్ కటకటాల్లోకి వెళ్ళాడు.కటకటాల నుంచి బయటకు వచ్చింది నీలవేణి.‘థాంక్యూ ఇన్స్పెక్టర్. నన్ను శిక్ష నుంచి బయట పడేసినందుకు కాదు, నా కూతురి ఆత్మ శాంతించేలా చేసినందుకు’... కన్నీళ్లతో చెప్పింది, అభిమన్యు ముందు నిలబడి చేతులు జోడించి.‘చట్టాన్ని మాత్రమే కాదు. అమ్మ మనసునూ కాపాడటం నా బాధ్యత.’ చెప్పి ముందుకు కదిలాడు ఇన్సె్పక్టర్ అభిమన్యు .∙శ్రీసుధామయి -
ఈ వారం కథ: కావిడి పెట్టె
ప్రముఖ రచయిత, ఉత్తమ అవార్డు గ్రహీత భయ్యా కన్నుమూత.. హుష్ టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తోంది.అదేమిటి మొన్న సాయంత్రం వరకు బాగానే ఉన్నారు కదా... విజయవాడ పుస్తక మహోత్సవంలో వేదికపై నేను రాసిన ‘బతుకు బస్టాండు’ పుస్తకం ఆవిష్కరించి నాతో చాలాసేపు మాట్లాడారు. ఇంతలోనే ఏమైంది?.. నాలో ఆదుర్దా మొదలైంది.రిమోట్ అందుకుని వేరే చానల్ మార్చా. అందులోనూ ఇదే వార్త స్క్రోలవుతోంది. మనసాగక మరో చానల్కు వెళ్లా.. ఇదే సమాచారం ఫ్లాష్ న్యూస్గా వేస్తూ ఆయన ఫొటోలు చూపుతున్నారు. లైవ్ దృశ్యాలు ఇంకా ఏ చానల్లోనూ ప్రసారం కావడం లేదు. వెంటనే ఆయన అభిమాన సంఘం ప్రధాన కార్యదర్శికి ఫోన్ చేసి వార్తను నిర్ధారించుకున్నాను.భయ్యాగారు నాకంటే ఇరవై రెండేళ్లు పెద్ద. రచనాపరంగా ఆయన శైలి, భాష, ముక్కుసూటిగా చెప్పే తత్వం బాగా నచ్చి ఆయనకు వీరాభిమానినయ్యా. ఇంటర్లో ఉన్నప్పుడు ఆయన మా కళాశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చారు. కళాశాల సావనీరులో నేను రాసిన కథ చదివి అభినందించారు. ఆయనకు వీలు కుదిరినప్పుడల్లా ఇంటికి పిలిపించి కథలు రాయడంలో మెలకువలు నేర్పారు. అందుకే ఆయన్ను రచనా వ్యాసంగానికి తొలి గురువుగా స్వీకరించాను. అత్యంత నిరాడంబరంగా ఉండే రచయితల్లో భయ్యా ఒకరు. నేను పుస్తకాలు చదవడం ప్రారంభించిన రోజుల్లో ఏ దినపత్రిక, వారపత్రిక, మాసపత్రిక చూసినా ఆయన రచనలే కనిపించేవి. ప్రతి కథనూ, వ్యాసాన్ని మొదటి నుంచి చివరి వరకూ పొల్లు పోకుండా చదివేవాడిని. ఆయనంటే నాకెంతటి అభిమానమో.. ఆయనకూ నేనంటే అంతే ఇష్టం. ఆయనతో సన్నిహితంగా మెలిగిన క్షణాలు, ఆయన చెప్పిన మాటలు నా కళ్ల ముందు సినిమా రీల్లా తిరుగుతుంటే ఫోన్ రింగయింది. మా ఇద్దరితో పరిచయం ఉన్న మిత్రుడు సారథి చేశాడు.. ‘భయ్యాగారు ఎలా పోయారు?’ అని.ఆ...ఆ.. ఇప్పుడే తెలిసింది. రాత్రి టిఫిన్ తిని ‘ఖ్యాతిముత్యం’ సీరియల్ రాస్తున్నారట. అలా రాస్తుండగా గుండెపోటు వచ్చింది. ఒంటరిగా ఉంటారేమో ఉదయం పేపర్ బోయ్ వచ్చేవరకు ఎవరూ చూడలేదు. ఆ కుర్రోడు అంబులెన్స్కు కాల్ చేస్తే వాళ్లొచ్చి చూసి రాత్రే చనిపోయారని నిర్ధారించారు..మిత్రుడితో మాట్లాడుతూనే ఆషామాషీ టీవీ చానల్ మార్చాను.భయ్యా ఆకస్మిక మృతిని మేజర్ వార్తగా కవరేజి ఇస్తున్నారు.భయ్యా అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారుండరు. అసలు పేరు భగవంతం బలరామయ్య. మొదటి అక్షరం ‘భ’, చివరి అక్షరం ‘య్య’ను కలిపి ‘భయ్యా’గా కలం పేరు పెట్టుకుని అమూల్యమైన, స్ఫూర్తిదాయకమైన రచనలు చేశారు. యువత వికాసానికి చాలా పుస్తకాలు వెలువరించారు.. నాటకాలు, సినిమాలకు కథలు సమకూర్చారు. వందలకొద్దీ అవార్డులు, రివార్డులు అందుకున్న ఘనత భయ్యా సొంతం. ఆయన వయసు 77 ఏళ్లు. రచనా వ్యాసంగానికి అడ్డుకాకూడదనుకుని పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా మిగిలిపోయారు.. అంటూ న్యూస్ రీడర్ గుక్కతిప్పుకోకుండా చెబుతోంది. ఆయన పాత ఫొటోలు, పుస్తకాల కవర్ పేజీ క్లిప్పింగులు, సాహితీ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటి వీడియోలు చూపిస్తూ అక్షర నివాళి అర్పిస్తున్నారు. పార్థివ దేహాన్ని విజయవాడలోని స్వగృహానికి తరలించినట్లు చెబుతూ.. అంత్యక్రియలు ఎప్పుడు జరిగేదీ ఇంకా స్పష్టత రాలేదన్నారు.నాకేమో ఎప్పుడెప్పుడు వెళ్లి ఆయన పార్థివదేహాన్ని చూద్దామా అని మనసు పీకుతోంది. అనుకోకుండా ఆరోజు విజయవాడలో ఆటోవాలాలు సమ్మె చేస్తున్నారు. నాకైతే యాక్టివా ఉంది.. భుజం నొప్పితో బాధపడుతూ డాక్టర్ సలహా మేరకు నెల రోజులుగా బండి నడపడం లేదు.వెంటనే మిత్రుడు సారథికి ఫోన్ చేస్తే మంగళగిరి నుంచి హడావుడిగా వచ్చాడు. ఇద్దరం కలిసి వాడి కారులో లబ్బీపేటలోని భయ్యాగారింటికి బయలుదేరాం. దగ్గరలో పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో ఇందిరాగాంధీ స్టేడియం వద్ద కారు నిలిపి నడుచుకుంటూ వెళ్లాం. ఆ ఇల్లు వారి తాతల నుంచి వచ్చిన వారసత్వపు ఆస్తి. నాలుగు గదుల డబుల్ పోర్షన్ డాబా ఇల్లు. దాదాపు శిథిలావస్థకు చేరింది. ప్రస్తుత మార్కెట్ ధరను బట్టి మూడు కోట్లకు పైనే పలుకుతుంది.అప్పటికే నగరంలోని సాహితీ మిత్రులందరూ భయ్యా పార్ధివదేహం వద్ద పూలు జల్లి నివాళులర్పిస్తున్నారు. నేను తీసుకెళ్లిన ఆయన ఫొటోను, రాసిన కొన్ని ప్రముఖ పుస్తకాలనూ అక్కడున్న చెక్క కుర్చీమీద పెట్టి నమస్కరించాను. టీవీ చానల్స్వారు లైవ్ కవరేజి కోసం హడావుడి చేస్తున్నారు. బందరు రోడ్డుపై ఓబీ వ్యాన్లన్నీ కవాతు చేస్తున్న సైనికుల్లా వరుసగా నిలిపి ఉన్నాయి. ఒక యాంకరమ్మ వచ్చీరాని తెలుగులో మాట్లాడుతూ ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తోంది. నన్ను చూడగానే ఇంకో చానల్ యాంకర్ నా వద్దకు వచ్చి ఆయన గురించి నాలుగు ముక్కలు చెప్పాలని గొట్టం నా ముఖం మీద పెట్టింది.రెండు మూడు గంటల్లో సందర్శకుల సంఖ్య భారీగా పెరిగింది. ఆ వీధిలోని వారంతా వలంటీర్లుగా మారిపోయారు. వచ్చినవారికి మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. మరికొంతసేపటికి పోలీసులు రంగ ప్రవేశం చేసి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చేశారు.నిజానికి భయ్యాగారు ఒంటరి. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు లేరు. పెద్దమ్మ పిల్లలు, బాబాయి పిల్లలు ఉన్నప్పటికీ వారంతా అమెరికాలో సెటిలయ్యారు. పాతికేళ్లుగా ఎవరితోనూ సంబంధ బాంధవ్యాలు లేవు. కనీసం ఫోను సంభాషణలు కూడా శూన్యం. భయ్యా తదనంతరం ఆస్తిపాస్తుల్ని, సంపాదించిన డబ్బును కొట్టేయాలన్న కాంక్షతో బందరు, నూజివీడు, గుంటూరు, ఒంగోలు ప్రాంతాల్లో ఉన్న బీరకాయ పీచు చుట్టాలు టీవీలో వార్తలు చూసి మధ్యాహ్నానికల్లా కార్లలో వాలిపోయారు. ఎవరికి వారే ఖరీదైన పూలదండలు మోసుకొచ్చారు. తమకు భయ్యాతో ఉన్న అనుబంధాన్ని, చిన్ననాటి జ్ఞాపకాలను తలచుకుంటూ ఆరున్నొక్క రాగం ఆలపించారు. ‘ఆస్తి మూరెడు..ఆశ బారెడు’ నవల్లో రాసినట్లు వాళ్లంతా తమలోని నటులను వెలికితీశారు. ఒక పెద్దాయనైతే ‘దూకుడు’ సినిమాలో బ్రహ్మానందాన్ని మరిపించాడు.మధ్యాహ్నం 2 గంటలు. ఆగస్టు నెలలోనూ ఎండ ప్రచండంగా మండిపోతోంది. సందర్శకులు ఆకలి దప్పులను సయితం మరిచి ఉదయం నుంచి షామియానాల కింద ఉసూరుమంటూ కూర్చుని సెల్ఫోన్లో వీడియోలు చూసుకుంటున్నారు. ఇంకొందరేమో ఆయన పార్థివదేహం వద్ద నిలబడి సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాను పిచ్చపిచ్చగా వాడేసుకుంటున్నారు.యూట్యూబర్లయితే ఎవరిని పడితే వారిని, ఏది పడితే అది మాట్లాడించి రికార్డు చేస్తున్నారు. తమ చానల్ను సబ్స్క్రైబ్ చేయించాలని బతిమలాడుతున్నారు.భయ్యా అభిమానులు అందరికీ పెరుగన్నం పొట్లాలు, మంచినీటి ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు.ఓ బీరకాయ పీచు చుట్టం వాలంటీర్ను పిలిచి ‘వీటన్నింటికీ డబ్బులెక్కడివి? మీరే పెట్టుకుంటున్నారా? లేక మా బాబాయి ఖాతాకు కన్నం పెడుతున్నారా?’ చెవిలో గొణిగాడు.ఆ కుర్రాడు ఆయన్ను ఎగాదిగా చూసి ‘మీ బాబాయెవరు?’ అంటూ అయోమయంగా ప్రశ్నించాడు.‘అదేనయ్యా! మెడనిండా పూలదండలేసుకుని శాశ్వత నిద్ర పోతున్న ఆ పెద్దాయన’ అంటూ భయ్యా గారి శవపేటిక వైపు వేలు చూపెట్టాడు.వాలంటీర్ ఆయన్ను కూరలో కరివేపాకులా తీసిపారేసి ముందుకు సాగాడు.బీరకాయ పీచులు మెల్లగా జారుకుని బందరు రోడ్డెక్కారు. పీకల్దాకా బిర్యానీలు మెక్కి తిరిగొచ్చారు.ఒక తెలివైన ప్రచురణకర్త భయ్యాగారు రాసిన పుస్తకాలను ఆటోలో తీసుకొచ్చి విక్రయాలు ప్రారంభించాడు. తెచ్చిన గంటసేపట్లోనే సరుకంతా అయిపోగా, మళ్లీ తేవడానికి నిష్క్రమించాడు.భయ్యాగారి అభిమానులను, వాడకట్టు నివాసితులను చూసి ఆనందపడాలో.. ధనార్జనే ధ్యేయంగా శవం ముందు డబ్బులేరుకుంటున్న ప్రచురణకర్తను చూసి బాధపడాలో అర్థం కాక మిన్నకుండిపోయాను.∙∙ మధ్యాహ్నం 3 గంటలు. కర్మకాండలు నిర్వహించేందుకు ఇద్దరు పురోహితులు, సహాయకుడు ఇల్లు వెతుక్కుంటూ చేరుకున్నారు. అందుకు కావాల్సిన సరంజామా వెనకాలే ఆటోలో వచ్చింది.అంత్యక్రియలు ఎన్ని గంటలకు చేస్తారండి అని ఒకరు, ఎవరు చేస్తారండి అని మరొకరు నా వద్దకొచ్చి అడిగారు.ఇంకా ఏమీ అనుకోలేదండి.. ఆయనకు కావాల్సినవాళ్లమంతా కూర్చుని మాట్లాడాక నిర్ణయిస్తాం.. చెప్పాను.‘మేం కావాల్సినవాళ్లం కాదా?’ అని ఓ బీరకాయ పీచు మైండ్ వాయిస్ బయటికి వినిపించింది.భయ్యాగారికి అంత్యక్రియలు ఎవరు చేయాలనే విషయమై అంతా తర్జనభర్జన పడుతున్నారు. ఆయన అభిమాన సంఘం అధ్యక్షుడు ముందుకొచ్చి ‘మా సంస్థ తరఫున నేనే తలకొరివి పెడతా’నని చెప్పాడు.నగరంలోని రచయితల సంఘాలన్నీ కలిసి ఈ తంతు పూర్తిచేస్తే బాగుంటుందని నా అభిప్రాయం కుండబద్దలు కొట్టాను.‘బంధువుని నేనుంటే.. మీరెలా పెడతారు?’ ఆవేశంగా అడిగాడు గుంటూరు గురునాథం.‘భయ్యా బాబాయికి తలకొరివి నన్నే పెట్టమని పైలోకంలో ఉన్న అమ్మ నాకు పదేళ్ల కిందటే చెప్పింది’ బందరు బాబు లైన్లోకి వచ్చాడు. ‘గతంలో అమ్మ బెజవాడ వచ్చినప్పుడల్లా బందరు లడ్డూలు, నల్ల హల్వా తెచ్చిస్తే బాబాయి ఇష్టంగా తినేవాడురా.. నేను పోయాక ఆయనకు ఏ కష్టం రాకుండా చూసుకోరా.. అని చాలాసార్లు నాతో అంది’.. అంటూ ఫ్లాష్బ్యాక్లోకి వెళ్లిపోయాడు.‘మీకు మీరే నిర్ణయాలు తీసేసుకునే లెక్కయితే ఇక మేమొచ్చిందెందుకు? నలుగురం కూర్చొని మన శంకర వరప్రసాదుగారిలా టీమ్ మీటింగు పెట్టుకుని ఒక అంగీకారానికి వద్దాం’ నూజివీడు, ఒంగోలు నుంచి వచ్చిన నీలాంబరం, రామ్మూర్తి ముక్తకంఠంతో పలికారు. అప్పటివరకు నాకు వాళ్లేమిటో, వారి వైఖరేమిటో పూర్తిగా అర్థం కాలేదు. వాళ్లొచ్చింది ఆయనపై ప్రేమతో కాదు, ఆస్తిమీద ఆశతోనని నిర్ధారించుకోవడానికి అట్టే సమయం పట్టలేదు.పట్టరాని కోపంతో నీలాంబరం, రామ్మూర్తి జుత్తు పట్టుకుని పక్కకు ఈడ్చేద్దామనుకున్నాను. ఇద్దరిదీ బట్టతలే కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నేనా ప్రయత్నం విరమించుకోవాల్సి వచ్చింది.చర్చోపచర్చలు, వాదోపవాదాలు సీరియస్గా సీరియల్గా నడుస్తూనే ఉన్నాయి శిఖరాగ్ర సమావేశాలకు దీటుగా.‘ఏదో ఒకటి త్వరగా తేల్చండి.. ఆవతల సూర్యాస్తమయం కావస్తోంది’ పొరుగింట్లో ఉండే వృద్ధమనిషి తొందరపెట్టారు.ఇంతలో అక్కడికి నల్లకోటు వేసుకున్న వ్యక్తి జనాలను తోసుకుంటూ లోపలికి అడుగుపెట్టాడు. వస్తూనే అందరికీ నమస్కరించాడు. ఆయన వాలకం చూస్తే లాయర్ అని గ్రహించడానికి నాకెంతో సమయం పట్టలేదు.నా పేరు విశ్వనాథ్. పాతికేళ్లుగా భయ్యాగారితో పరిచయం ఉంది. కోవిడ్ సోకి దాదాపు చావు అంచుల వరకు వెళ్లొచ్చిన ఆయన కోలుకున్న తర్వాత వీలునామా రాశారు. దాన్ని ఇంతకాలం నావద్ద భద్రంగా ఉంచారు. తాను మరణించాక దాన్ని బహిర్గతం చేయాలని నాతో చెప్పి మాట తీసుకున్నారు. ఆ ప్రకారం ఇప్పుడు నేనొచ్చా అంటూ బ్యాగ్లోంచి వీలునామా బయటికి తీశాడు.అందరి కళ్లూ ఆ వీలునామాపైనే కేంద్రీకృతమయ్యాయి. మరీ ముఖ్యంగా బీరకాయ పీచులు గోతికాడ నక్కల్లా అందులో ఏం రాశారోనని ఆబగా ఎదురుచూస్తున్నారు.ఎవరికీ నోట మాట రావడం లేదు. నిశ్చేష్టులై చూస్తుండిపోయారు. ముఖంపై చెమటను కర్చీఫ్తో ఒకటికి పదిసార్లు అద్దుకుంటున్నారు. టాంటాం టీవీ చానల్ కెమెరామేన్ రాంబాబు కెమెరా జూమ్ చేశాడు. రిపోర్టర్ గంగ జింకపిల్లలా చెంగు చెంగున గెంతుతూ జనాలను తోసుకుని ముందుకొచ్చింది.ఏదో అయిపోతుందని హడావుడిగా మరో రెండు మూడు చానల్స్ కెమెరామెన్, కొంతమంది యూట్యూబర్లు అనుసరించారు.ఈ హడావుడి చూసి ప్రతి ఒక్కరూ జేబులోంచి ఫోన్ తీసి ఫొటోలు తీయసాగారు.ఈ తంతు నిశితంగా గమనిస్తున్న బీరకాయ పీచు చుట్టాలు... ముసలోడు గట్టిగానే సంపాదించి ఉంటాడనుకున్నారు. ఆమధ్య చెన్నయ్లో లావుపాటి గండపెండేరం తొడిగినప్పుడు టీవీలో చూసిన సన్నివేశం వారి మదిలో మెదిలింది. దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని ఎవరికి వారు ఆశ పడుతున్నారు.ఈ ఆలోచనల నుంచి వారు పూర్తిగా తేరుకోకముందే లాయర్ అందులో ఏముందో చదివి వినిపించారు. భయ్యాగారు రాసినట్లు డాబా ఇంటిని జిల్లా గ్రంథాలయ సంస్థకు అప్పజెప్పాలి. తనకు ఎవరైతే అంత్యక్రియలు నిర్వహిస్తారో వారికి తన కావిడిపెట్టె కానుకగా అందజేయాలని పేర్కొన్నారు. అది కూడా దశ దిన కర్మ రోజు వారికి స్వాధీనపరచాలని స్పష్టంగా రాశారు.నేనూ ఆయన అభిమానులూ అందరం పెద్దగా చప్పట్లు చరిచాం.‘భయ్యాజీ అమర్ రహే’ అని కొందరు, ‘కలం సలాం’ అని ఇంకొందరు జేబుల్లోంచి పెన్నులు తీసి పైకెత్తి పట్టుకుని నినదించారు.అంతా పెద్దాయన దొడ్డ మనసుకు జోహార్లర్పించి అభినందిస్తుంటే ఆ నలుగురు బంధువుల ముఖాలు ఫిల్మంటు తెగిన బల్బుల్లా మాడిపోయాయి. ‘ఇంతకీ విల్లు రిజిస్ట్రీ గట్రా చేశారా?’ ఒకాయన అడిగాడు..‘రిజిస్టర్ చేశారండి.. ఇవిగో చూడండి’.. అంటూ స్టాంపు పేపర్లు అందరికీ చూపించాడు విశ్వనాథ్. పనిలో పనిగా జిరాక్సు కాపీ సెట్టొకటి ఇచ్చాడు. ఆలస్యం చేయకుండా వారంతా టీమ్ మీటింగు పెట్టుకున్నారు. రహస్య మంతనాలు జరిపి తామంతా ఉమ్మడిగా అంత్యక్రియలు నిర్వహిస్తాం.. ఆ కావిడిపెట్టెను తమకివ్వాలని లాయర్ను అభ్యర్థించారు... డబ్బూదస్కం, గండపెండేరాల్లాంటి బంగారు వస్తువులు అందులో ఉంటాయని భావించి!ముందుచూపంటే అదే మరి... వెనకాల ఎవరో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.‘ఏం ముందుచూపో ఏమో... ముసలాడు ఘటికుడే. గట్టిగానే మెలికపెట్టాడు. ఎంతైనా రచయిత కదా! ఇంకొక డైలాగు గుంపులోంచి వినిపించింది.లాయర్ ఏం చెబుతారా అని అంతా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. సరే.. ఏం చేద్దాం.. చెప్పండి సార్.. నలుగురు బంధువులు లాయర్ వంక తేరిపార చూశారు.‘భయ్యాగారికి దూరపు బంధువులాయె.. మీరు దహనక్రియలు నిర్వహిస్తే ఆయన ఆత్మ శాంతిస్తుంది’ అని చెప్పగానే ఆనందంతో ఎగిరి గంతేయాలనుకున్నారు. మరీ అతి చేసినట్లవుతుందని భావించి ఆ ప్రయత్నాన్ని మానుకున్నారు. అభిమానులంతా కార్యకర్తల్లా ముందుకొచ్చి ఏర్పాట్లు చకచకా చేసేశారు. అంతిమయాత్ర శకటాన్ని పచ్చిపూలతో అందంగా అలంకరించారు. ఆయన పుస్తకాల తాలూకు కవర్ పేజీ ఫొటోలతో ఫ్లెక్సీలు ముద్రించి వ్యాన్ చుట్టూ తోరణాల్లా కట్టారు. నగరంలోని ప్రముఖులతోపాటు పాటు పొరుగూళ్ల నుంచి వచ్చిన కవులు, రచయితలు కొంత దూరం భయ్యా పాడె మోశారు. ఆ తర్వాత భౌతికకాయాన్ని వ్యానెక్కించారు. పెళ్లికొడుకును ఊరేగించినట్లు ఊరేగించగా... సాహితీ లోకమంతా ఆయన వెంట కృష్ణలంకలోని మరుభూమి వరకు నడిచింది.ఆ విధంగా భయ్యాగారి అంతిమ సంస్కారం అంగరంగ వైభవంగా ముగిసింది. మరుసటి రోజు అన్ని పత్రికల్లోనూ ఈ వార్త ప్రముఖంగా వచ్చింది. ఆరోజు భయ్యాగారి పెద్దకర్మ. ఇంటి వద్దే ఏర్పాటుచేశారు. బీరకాయ పీచు చుట్టాలు కర్మకాండలకు కావాల్సినవన్నీ సమకూర్చారు. అన్ని రకాల దానాలు ఘనంగా జరిపించారు. వచ్చిన వారందరికీ పెన్నులూ, పుస్తకాలు పంచిపెట్టారు. నభూతో నభవిష్యతి అన్నట్లు పసందైన విందు భోజనం పెట్టారు.జనం తిరునాళ్లలా వచ్చి పోతున్నారు. సాయంత్రం నాలుగింటి వరకు తింటూనే ఉన్నారు. సాయంత్రం 5 గంటలకు లాయర్ విశ్వనాథ్ ప్రెస్మీట్ పెడుతున్నట్లు అన్ని చానళ్లలో స్క్రోలింగ్ వస్తోంది. ఆ వీలునామాలో ఏముందోనని అందరూ టీవీలకు అతుక్కుపోయారు. భయ్యా ఇంటి వద్దా అదే పరిస్థితి. అంతా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఆ నలుగురిలో ఇద్దరు చేతి గడియారం వంక పదేపదే చూసుకుంటున్నారు. మరో ఇద్దరికి వాచీ లేదేమో సెల్ఫోన్లో టైం చూసుకుంటూ గోళ్లు కొరుక్కుంటున్నారు. సాయంత్రం ఐదు గంటలు... లాయర్ విశ్వనాథ్ మీడియా సమావేశం ప్రారంభించారు. గుండుసూది కిందపడినా వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది వాతావరణం. భయ్యా గురించి నాలుగు మంచి మాటలు చెప్పి.. ఆయనతో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకుని నివాళులర్పించారు. అనంతరం పెద్దాయన కోరిక మేరకు కావిడి పెట్టె తాళం చెవిని మీడియా సమక్షంలో ఆ నలుగురు బంధువులకూ అప్పచెప్పడంతో అప్పగింతల తంతు ముగిసింది.లోపల ఏముందో చూడాలని తెగ ఆరాటపడిపోతున్నారంతా. చానల్స్ కెమెరాలన్నీ కావిడిపెట్టె వైపే చూస్తున్నాయి. గురునాథం తాళం తెరిచాడు. కెమెరాలు ముందుకొచ్చాయి .. మూత పైకి లేవనెత్తాడు. కెమెరాలు జూమ్ చేసేశారు. అందరూ ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. లోపల భయ్యాగారు ప్రచురించిన పుస్తకాలు, శాలువాల దొంతర, మరికొన్ని జ్ఞాపికలు, సర్టిఫికెట్లు బూజుపట్టి దర్శనమిచ్చాయి. అతి కష్టం మీద అన్నింటినీ వెలికితీసి దుమ్ము దులిపారు. అందరూ ఊహించిన డబ్బుగాని, నిధిగాని అందులో లేదు. నలుగురూ కంగుతిన్నారు. ఒక్క క్షణం ఏం చేయాలో పాలుపోక స్థాణువుల్లా నిలబడిపోయారు. ఒకటికి రెండుసార్లు కార్లేసుకుని బెజవాడ వచ్చినందుకు అయిన పెట్రోలు ఖర్చు, హోటల్ ఖర్చు, పెద్దకర్మ ఖర్చులు.. అన్నీ ఒక్కొక్కటిగా మదిలో మెలిగాయి. అబ్బో చేతిచమురు గట్టిగానే వదిలింది.. అని తెగ బాధపడిపోయారు.ఏదో లప్ప వస్తుందని ఆశపడి ఇంత దూరం వచ్చి ఇన్ని పాట్లు పడితే .. ఇత్తడి తాళం కప్ప దక్కిందని బావురుమన్నారు. సమయమూ డబ్బూ రెండు వృథా చేసుకుని ప్రయాస పడ్డామని ఎవరికి వారే ఘొల్లుమన్నారు.టీవీ యాంకర్లు నలుగురి ముఖాల ముందు గొట్టాలు పెట్టి స్పందన తెలియజేయాలని అడుగుతుంటే.. ఎవరి ముఖంలోనూ నెత్తుటి చుక్క లేదు. ఏడుపొక్కటే తక్కువ! ∙చెన్నాప్రగడ శర్మ -
26 కేసులు గెలిచిన 'నకిలీ' లాయర్
ఎవరైనా కాస్త గడుసుగా మాట్లాడినా.. తర్కంతో ప్రశ్నించినా..‘పట్టా’ లేని ప్లీడరు అంటారు. బయట ప్రశ్నించడానికి, అవతలి వాళ్లను నిలదీయడానికి ‘పట్టా’ అక్కర్లేదు. కానీ కోర్టులో అలా కాదు, కోటుంటే సరిపోదు.. న్యాయవిద్య చదివుండాలి.. సెక్షన్లూ తెలిసుండాలి. ఓ వ్యక్తి పట్టా లేకపోయినా కోర్టులో వాదించాడు. కేసులూ గెలిచాడు. చివరికి అతని బండారం బయటపడింది. గుట్టు రట్టయ్యింది. జీవితం జైలు పాలైంది. అయినా ‘తగ్గేదేలే ’ అంటూ కోర్టును అభ్యర్థించాడు. తన కేసును తనే వాదించు కున్నాడు. షరతులతో కూడిన బెయిల్ పొందాడు. అలాగని ఇది విజయ గాథ కాదు, తీసేయదగ్గదీ కాదు. ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. తెలుసుకోదగ్గ అంశంగా మారింది. కెన్యాలో ఈ ఉదంతం జరిగింది.న్యాయవాదిగా కోర్టులో వాదించాలంటే ఏ దేశంలో అయినా న్యాయ విద్యను అభ్యసించాలి. సంబంధిత కౌన్సిల్లో పేరు నమోదు చేయించుకోవాలి..అప్పుడే అర్హత వస్తోంది. కెన్యాలో కూడా అంతే. న్యాయవాదుల నమోదును ‘లా సొసైటీ ఆఫ్ కెన్యా’ పర్యవేక్షిస్తోంది. ఇందులో పేర్లు నమోదు అయిన వారు మాత్రమే ప్లీడరుగా ప్రాక్టీసు చేయాలి. బ్రియాన్ మ్వెండా న్త్విగా అనే వ్యక్తి ‘లా సొసైటీ ఆఫ్ కెన్యా’లో అడ్వకేట్గా రిజిస్టర్ అయ్యాడు.మోసానికి బీజం పడిందిక్కడేబ్రియాన్ న్త్విగా వివరాలను బ్రియాన్ మ్వెండా న్జాగీ అనే వ్యక్తి టాంపర్ చేసి అక్కడ తన ఈమెయిల్ నమోదు చేశాడు, ఫొటో మార్చాడు. ఇలా పట్టా లేకుండానే ప్లీడర్ అయ్యాడు. లోయర్ కోర్టు నుంచి హయ్యర్ కోర్టుల వరకు కేసులు వాదించాడు. సుమారుగా 26 కేసుల్లో విజయం కూడా సాధించాడు. ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. ప్రాక్టీసు కొనసాగించాడు.ఎలా బయటపడిందిబ్రియాన్ మ్వెండా న్త్విగా ‘లా సొసైటీ ఆఫ్ కెన్యా’లో లాగిన్ అవ్వడానికి ప్రయత్నించగా ఓపెన్ కాలేదు. తన వివరాలు మారిపోయినట్టు గుర్తించి, లా సొసైటీ ఆఫ్ కెన్యాకు ఫిర్యాదు చేశాడు. అధికారులు దర్యాప్తు చేశారు. ఓ వ్యక్తి అక్రమంగా తన పేరును బ్రియాన్ న్త్విగా వివరాల్లో నమోదు చేసినట్టు గుర్తించారు. కేసు నమోదుఅధికారుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. న కిలీ లాయరు జైలు కెళ్లాడు. కేసు విచారణ మొదలైంది. కోర్టును అభ్యర్థించి తన కేసు తనే వాదించుకోవడం సంచలనంగా మారింది. తన ‘నకిలీ’ అనుభవం అక్కరకు వచ్చింది. షరతులతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భిన్నాభిప్రాయాలునకిలీ లాయర్కు కొందరు బాసటగా నిలిచారు. అతని తెలివితేటల్ని మెచ్చుకున్నారు. న్యాయ విద్య చదివితే మరింతగా రాణిస్తావని సలహా ఇచ్చారు. మరికొందరు.. ఇది ప్రమాదరకరమైందన్నారు. లాయర్ల రిజిస్ట్రేషన్లోని డొల్లతనాన్ని బయటపెట్టిందని విమర్శించారు. ఈ ఘటన కెన్యాలో న్యాయవ్యవస్థపై చర్చకు దారి తీసింది.. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపింది. గతంలో అతడు విజయం సాధించిన 26 కేసుల్లోనూ సాక్ష్యాలు బలంగా ఉండడంతో కోర్టులు వాటి పునఃసమీక్షకు అంగీకరించకపోవడం కొసమెరుపు.-దిలీప్ మాదిరెడ్డి -
కుటుంబమే కీలకం
ప్రముఖ మనస్తత్వవేత్త ఎరిక్ ఎరిక్సన్ తన ఎనిమిది దశల వికాస సిద్ధాంతంలో మొదటి దశను ‘ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్’ అని పిలిచారు. శిశువు జన్మించిన మొదటి ఏడాదిలో తల్లిదండ్రులు ఇచ్చే ఆదరణ, రక్షణ ఆ బిడ్డలో ‘ఈ ప్రపంచం సురక్షితమైనది’ అనే నమ్మకాన్ని కలిగిస్తాయి. ఒకవేళ ఆ దశలో నిర్లక్ష్యానికి గురైతే, ఆ బిడ్డ పెద్దయ్యాక ఎవరినీ నమ్మలేని వ్యక్తిత్వాన్ని అలవరచుకుంటాడు. మానవ పరిణామ క్రమంలో మనిషిని ఒక సామాజిక జీవిగా తీర్చిదిద్దే మొదటి పాఠశాల ‘కుటుంబం’. ఒక వ్యక్తి సమాజంలో ఎలా ప్రవర్తిస్తాడు, ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటాడు, ఇతరులతో బంధాలను ఎలా కొనసాగిస్తాడు అనే అంశాలన్నీ ఆ వ్యక్తి పెరిగిన కుటుంబ వాతావరణంపైనే ఆధారపడి ఉంటాయి. సైకాలజీ పరిభాషలో చెప్పాలంటే, వ్యక్తిత్వం అనేది కేవలం జన్యువుల కలయిక మాత్రమే కాదు, అది అనుభవాల సమాహారం. ఆ అనుభవాలకు కేంద్ర బిందువు కుటుంబం.ఒక కుమ్మరి మట్టిని ఎలాగైతే తన చేతులతో నొక్కుతూ, సరిచేస్తూ ఒక అందమైన పాత్రగా మలుస్తాడో, తల్లిదండ్రులు కూడా తమ ప్రవర్తనతో పిల్లల మనసులను అలాగే మలుస్తారు. బాల్యంలో కుటుంబం ఇచ్చే సంస్కారం, క్రమశిక్షణ వ్యక్తిత్వానికి శాశ్వత ముద్ర వేస్తాయి.మాటల కంటే చేతలు మిన్నకుటుంబం అనేది ఒక అద్దం లాంటిది. తల్లిదండ్రులు ఒకరినొకరు గౌరవించుకుంటే, పిల్లలు ‘గౌరవం’ అనే విలువను సహజంగానే నేర్చుకుంటారు. వారు విన్న దానికంటే, కళ్లారా చూసిన దాన్నే ఎక్కువగా నమ్ముతారు. పెద్దలను గమనించడం ద్వారా పిల్లలు నేర్చుకుంటారని అల్బర్ట్ బండూరా తన ‘సోషల్ లెర్నింగ్ థియరీ’లో నిరూపించారు. ఇంట్లో తండ్రి కోపాన్ని ఎలా ప్రదర్శిస్తున్నాడు? తల్లి సమస్యలను ఎలా ఎదుర్కొంటోంది? తాతయ్య ఇతరులతో ఎలా మాట్లాడుతున్నాడు? ఇవన్నీ బిడ్డ మెదడులో నిక్షిప్తమైపోతాయి.ఉదాహరణకు, ఒక ఉన్నత విద్యావంతుడైన వ్యక్తి, బయట చాలా సౌమ్యంగా ఉంటూ ఇంట్లో మాత్రం భార్యపై అరుస్తూ ఉంటాడు. అతని కుమారుడు అది చూస్తూ పెరిగాడు. ఆ అబ్బాయి పెద్దయ్యాక తన భాగస్వామితో కూడా అదే ‘అగ్రెసివ్’ ప్రవర్తనను ప్రదర్శిస్తాడు. ఎందుకంటే, అతని దృష్టిలో మగతనం అంటే అధికారం చలాయించడం అనే తప్పుడు భావన నాటుకుపోయింది. దీనినే ‘ఇంటర్జెనరేషనల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ బిహేవియర్’ అంటారు.ఫ్యామిలీ డైనమిక్స్ – ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వ్యక్తిత్వ వికాసంలో ఐక్యూ (తెలివితేటలు) కంటే ఈక్యూ (భావోద్వేగ పరిణతి) ముఖ్యం. కుటుంబంలో భావోద్వేగాలను పంచుకునే స్వేచ్ఛ ఉంటేనే బిడ్డలో ఈక్యూ పెరుగుతుంది. ‘మగపిల్లలు ఏడవకూడదు‘ అని అణచివేయడం వల్ల, వారు పెద్దయ్యాక తమ భావాలను వ్యక్తపరచలేని ‘ఎమోషనల్లీ స్టంటెడ్’ వ్యక్తులుగా మారుతారు. కుటుంబం అనేది ఒక సురక్షిత ్రపదేశంగా ఉండాలి, అక్కడ తప్పులు చేసినా క్షమించబడతామనే ధైర్యం ఉండాలి.మనం ఇంటికి వేసే రంగులు (బయట ప్రపంచానికి కనిపించే మన నడవడిక) అందంగా ఉండవచ్చు. కాని, వర్షం వచ్చినా, భూకంపం వచ్చినా ఇల్లు నిలబడాలంటే పునాది (కుటుంబం ఇచ్చిన మానసిక స్థైర్యం) బలంగా ఉండాలి. పునాదిలో పగుళ్లు ఉంటే, పైన ఎన్ని రంగులు వేసినా ప్రయోజనం లేదు. అలాగే, వ్యక్తిత్వంలో లోపాలు ఉంటే, అవి కుటుంబ వాతావరణం నుండి వచ్చినవే అయి ఉంటాయి.మార్పు మన నుండే...కుటుంబం వ్యక్తిత్వానికి పునాది అనగానే, మనలోని లోపాలకు తల్లిదండ్రులను నిందించడం పరిష్కారం కాదు. కార్ల్ జంగ్ అన్నట్లు, ‘నేను నా గతాన్ని మార్చలేను కాని, నా భవిష్యత్తును నేను నిర్మించుకోగలను.’ మన కుటుంబం నుంచి మనకు వచ్చిన నెగటివ్ పాటర్న్స్ను గుర్తించడం మొదటి అడుగు. ఆ తర్వాత వాటిని మార్చుకుంటూ, మన తర్వాతి తరానికి ఒక ఆరోగ్యకరమైన కుటుంబ వాతావరణాన్ని అందించడం మన బాధ్యత.నేటి కాలంలో కుటుంబ సభ్యులంతా ఒకే గదిలో ఉన్నా, ఎవరి మొబైల్స్లో వారు నిమగ్నమై ఉంటున్నారు. దీనిని ‘ఫబ్బింగ్’ అంటారు. ఇది పిల్లల్లో ‘నిర్లక్ష్యానికి లోనవుతున్నాం’ అనే భావనను కలిగిస్తుంది. నాణ్యమైన సమయం గడపకపోవడం వల్ల పిల్లలు తమ వ్యక్తిత్వానికి కావాల్సిన సామాజిక నైపుణ్యాలను కోల్పోతున్నారు. ముఖాముఖి సంభాషణలు లేకపోవడం వల్ల సహానుభూతి తగ్గుతోంది.-సైకాలజిస్ట్ విశేష్ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్www.psyvisesh.com -
ఇదేమైనా సీరియస్ సమస్యా?
నాకు ఇరవై ఐదు సంవత్సరాలు. తరచు బ్రెస్ట్లో నొప్పి అనిపిస్తోంది. ఇది ఎందుకు వస్తుంది? ఇది ఏమైనా సీరియస్ సమస్యా? – లత, గుంటూరుబ్రెస్ట్ నొప్పి అనేది చాలా కామన్ గా కనిపించే సమస్య. ఎక్కువగా ఇది ఎలాంటి ప్రమాదకర వ్యాధి లక్షణం కాదు. ముఖ్యంగా హార్మోన్ల మార్పుల వల్లే ఎక్కువగా వస్తుంది. ఈస్ట్రోజెన్ , ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్లు నెలసరి చక్రంలో మార్పులు చూపుతాయి. ఈ మార్పుల కారణంగా కొంతమందికి నెలసరి ముందు లేదా తర్వాత బ్రెస్ట్ నొప్పి అనిపిస్తుంది. కొందరికి ఇది ప్రతి నెలా కూడా రావచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఇతర కారణాల వల్ల కూడా బ్రెస్ట్ నొప్పి ఉండొచ్చు. ఉదాహరణకు బ్రెస్ట్ ఇన్ ఫెక్షన్ (మాస్టిటిస్), ఫైబ్రోసిస్టిక్ మార్పులు, చిన్న సిస్టులు వంటి సమస్యలు. చాలా అరుదుగా మాత్రమే బ్రెస్ట్ క్యాన్సర్తో కూడా నొప్పి ఉంటుంది. బ్రెస్ట్ నొప్పితో పాటు జ్వరం, చర్మం ఎర్రబడటం, గట్టిపడటం, నిపుల్ నుంచి స్రావం రావడం, గడ్డలు ఉన్నట్లు అనిపించడం వంటి లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించాలి. డాక్టర్ పరీక్ష చేసి అవసరమైతే బ్రెస్ట్ అల్ట్రాసౌండ్, మామోగ్రఫీ వంటి పరీక్షలు సూచిస్తారు. కొన్నిసార్లు బయాప్సీ కూడా అవసరం కావచ్చు. సాధారణంగా నొప్పి తేలికగా ఉంటే పారాసిటమాల్, ఐబుప్రొఫెన్ వంటి మందులు ఉపశమనం ఇస్తాయి. వేడి లేదా చల్లని కంప్రెస్ కూడా ఉపయోగపడుతుంది. విటమిన్–ఈ సప్లిమెంట్స్ కొందరికి బాగా పనిచేస్తాయి. జీవనశైలిలో కొన్ని మార్పులు కూడా సహాయపడతాయి. సరైన సైజ్ బ్రా ధరించడం, కెఫీన్ తగ్గించడం, ఒత్తిడి తగ్గించుకోవడం, వ్యాయామం చేయడం, తగినంత నీరు తాగడం మంచిది. కుటుంబంలో బ్రెస్ట్ లేదా ఒవేరియన్ క్యాన్సర్ చరిత్ర ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు, ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా బ్రెస్ట్ నొప్పి పెద్ద సమస్య కాకపోయినా, సందేహం ఉంటే వెంటనే గైనకాలజిస్ట్ను సంప్రదించడం ఉత్తమం. నాకు యాభై ఐదు సంవత్సరాలు. దాదాపు పదిహేనేళ్ల క్రితం గర్భసంచి తీసే ఆపరేషన్ (హిస్టరెక్టమీ) చేయించుకున్నాను. ఇప్పుడు యోని భాగంలో ఏదో బయటికి వచ్చినట్లుగా అనిపిస్తోంది. దగ్గినా, తుమ్మినా అది బయటికి ఉబ్బినట్లుగా కనిపిస్తోంది. మూత్రం నియంత్రణలో కూడా కొంత ఇబ్బంది ఉంది. ఇది ఏ సమస్య? ఏమి చేయాలి? – రమణమ్మ, అనంతపురం. మీరు చెప్పిన లక్షణాలు పోస్ట్ హిస్టరెక్టమీ ప్రోలాప్స్ అనే సమస్యకు సూచనలు. అంటే గర్భసంచి తీసిన తర్వాత, యోని పైభాగం (వాల్ట్), మూత్రాశయం (బ్లాడర్), లేదా రెక్టమ్ కిందికి జారిపోవడం. హిస్టరెక్టమీ చేసిన తర్వాత పెల్విక్ ఫ్లోర్ కండరాలు, లిగమెంట్లు బలహీనపడితే ఈ సమస్య వస్తుంది. వయసు పెరగడం, ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గడం వల్ల టిష్యూలు సడలిపోవడం కూడా దీనికి ఒక కారణం. అలాగే అధిక బరువు, దీర్ఘకాలిక దగ్గు, మలబద్ధకం, బరువైన వస్తువులు ఎత్తడం వంటి కారణాలు సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే క్రమంగా తీవ్రత పెరిగి మూత్రం అదుపు లేకపోవడం, మల విసర్జనలో ఇబ్బందులు వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి వెంటనే గైనకాలజిస్ట్ను సంప్రదించడం అవసరం. డాక్టర్ పూర్తి శరీర పరీక్ష చేసి, సమస్య స్థాయిని అంచనా వేస్తారు. అవసరమైతే అల్ట్రాసౌండ్, యూరోడైనమిక్ స్టడీస్ వంటి పరీక్షలు కూడా సూచించవచ్చు. సమస్య తీవ్రతను బట్టి చికిత్స ఇలా ఉంటుంది. ప్రారంభ దశలో అయితే, పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు (కెగెల్ ఎక్సర్సైజ్లు), సపోర్టివ్ డివైజ్లు (పెస్సరీ) వినియోగం సరిపోతుంది. అదే తీవ్రంగా ఉన్నప్పుడు శస్త్రచికిత్స అవసరం. ప్రస్తుతం ల్యాపరోస్కోపిక్, రోబోటిక్ సర్జరీలు కూడా అందుబాటులో ఉన్నాయి, ఇవి త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయి. అదనంగా, బరువు నియంత్రణ, మలబద్ధకం నివారణ, బరువైన వస్తువులు ఎత్తకుండా ఉండటం, నియమిత వ్యాయామాలు చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే సమస్యను నియంత్రించుకోవచ్చు. ముఖ్యంగా, తొందరగా గుర్తించి చికిత్స ప్రారంభిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. -డా‘‘ భావన కాసుగైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ ,హైదరాబాద్ -
పిల్లలకి ఇవ్వాల్సింది ధైర్యమే!
‘నా విజయంలో అమ్మదే ప్రధాన పాత్ర’ అంటారు అరుంధతీరెడ్డి. భారత మహిళా క్రికెట్ టీమ్లో ఆమె సాధించిన విజయాలు తెలిసినవే! ‘పిల్లల ఇష్టాలను గమనించి, గైడ్ చేయడమే మనం చేయగలిగేది’ అంటారు అరుంధతీరెడ్డి తల్లి భాగ్య. ఆమెకు కొడుకు, కూతురు. ఇద్దరు పిల్లల తల్లిగా ఆమె తన అనుభవాలను పంచుకున్నారు.‘‘ఈ రోజుల్లో తల్లిదండ్రుల పెంపకం ఎలా ఉంటోందంటే... ‘డబ్బులు ఎన్నయినా పెడతాం, ఏదైనా చేయండి’ అనేట్టుగా ఉంటున్నారు. పిల్లలేమో ‘మీరే అన్నీ చూసుకోవాలి. మాకేం సంబంధం లేదు’ అనేలా ఉన్నారు. కష్టపడితేనే డబ్బు వస్తుందనే విషయాన్ని పిల్లలకు నేర్పించడం లేదు. ఏది అడిగినా పెద్దలు ఇచ్చేస్తారు అనే ధోరణి బాగా పెరిగింది. మా పిల్లలు స్కూల్ టైమ్లో నన్ను డబ్బులు అడిగినప్పుడు నిజంగా ఏది అవసరమో తెలుసుకొని, దానికే ఇచ్చేదాన్ని. మిగతావి ఎందుకు అనవసరమో కూడా చెప్పేదాన్ని.పాకెట్ మనీ కావాలంటే కొన్ని పనులు తప్పనిసరిగా కేటాయించేదాన్ని. అవి పూర్తి చేస్తేనే డబ్బులు ఇచ్చేదాన్ని. దీని వల్ల డబ్బు విలువ తెలియజెప్పేదాన్ని. మేముండేది సికింద్రాబాద్లోని సైనిక్పురిలో. ప్రవైట్ స్కూల్ టీచర్ని. ఇద్దరు పిల్లల పెంపకం, పెద్ద టాస్క్. విజయవంతంగా పూర్తి చేయాలంటే అన్నింటిలో క్రమశిక్షణ అవసరం.ఎమోషన్స్ ముఖ్యంభావోద్వేగాలు బ్యాలెన్స్ చేసుకోవడం ఈ రోజుల్లో తగ్గిపోయిందనే చెప్పాలి. పిల్లలు స్నేహితులకు ఇచ్చే విలువ తల్లిదండ్రులకు ఇవ్వడం లేదు. ముందు అమ్మనాన్న, తర్వాతనే మిగతావి అనేది క్లియర్గా చెప్పాలి. ఇప్పటికీ మా పిల్లలకు ‘మీరు పెద్దయ్యారు. అన్నీ తెలుసుకుంటున్నారు. కాని, ఏ విషయంలోనైనా స్టెప్ తీసుకునేముందు సెల్ఫ్గానూ, కుటుంబానికి ఎంత వరకు మంచిదో నిర్ణయించుకోండి’ అని చెబుతుంటాను. ఈ రోజుల్లో మగపిల్లలకన్నా ఆడపిల్లలు చాలా బెస్ట్గా ఉన్నారు. కాని, సమాజం ఎంత ఆధునికంగా మారినా అబ్బాయి–అమ్మాయి అనే వివక్ష మాత్రం ఉంది. ఈ వ్యత్యాసం ఇంట్లో పిల్లల మీద చూపకూడదు. చదువుతో పాటు సంస్కారంవిలువలు చాలా ముఖ్యం. సంస్కారం, క్రమశిక్షణ లేకుండా చదువు ఎంత ఉన్నా అది వృథానే. ఇప్పుడు పిల్లల్లో చదువు స్ట్రెస్ బాగా పెరిగిపోయింది. తల్లిదండ్రుల్లోనూ ‘ఫీజులు లక్షల్లో కడుతున్నాం, చదువు రావడం లేదు’ అనే ఒత్తిడి పెరిగింది. పిల్లల గురించి టీచర్స్ ఏదైనా రిమార్క్ చెబితే స్కూల్లో అందరి ముందే వారిని తిట్టేస్తుంటారు. లేదంటే, ‘ఇక వీళ్లింతే...’ అని వదిలేస్తున్నారు. ఇలాంటి భావన ఈ రోజుల్లో చాలా ప్రమాదంగా మారుతోంది. మా షమ్మూ (ముద్దు పేరు) చదువులోనూ ముందుండేది.చిన్నప్పుడు తన అన్న రోహిత్, ఇతర కజిన్ పిల్లలతో కలిసి గల్లీలో క్రికెట్ ఆడేది. టీవీలో క్రికెట్ తెగ చూసేది. స్పోర్ట్స్లో చాలా చురుకుగా ఉండేది. ‘నేను వాలీబాల్ స్టేట్ ప్లేయర్ని. స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉన్నా, కుటుంబ పరిస్థితుల కారణంగా నా కలలను నెరవేర్చుకోలేకపోయాను. నా కూతురి ఇష్టాన్ని కాదనకూడదు అనుకున్నాను. పన్నెండేళ్ల వయసు నుంచి తన ఇష్టం వైపుగా సపోర్ట్ చేశాను. ఈ రోజు ఫలితాన్ని చూస్తున్నాం. అందుకని, చదువు ఒక్కటే కాదు, పిల్లల ఇష్టాలు ఎటుగా సాగుతున్నాయో, వారి అభిరుచులు ఏంటో కూడా తెలుసుకోవడం, సూచనలు ఇవ్వడం ముఖ్యం.త్యాగాలు ఎన్నో!పెంపకంలో ఎన్నో త్యాగాలు ఉంటాయి, కష్టం ఉంటుంది. పిల్లలు ఏ మార్గం ఎంచుకున్నారు, వారు ఎందుకు దానిని వదలుకుంటున్నారు.. ఆ సమయంలో వారి ఆలోచన ఏ విధంగా ఉంటోంది అని కూడా కనిపెట్టాలి. 2017లో మా అమ్మాయి రైల్వేలో ఉద్యోగంలో చేరింది. అక్కడ ఉంటూనే చాలా విషయాల పట్ల అవగాహన ఎర్పరచుకుంది. అండర్ 23 జోనల్ టోర్నమెంట్లో రాణించింది. మళ్లీ ఒక దశలో క్రికెట్– జాబ్ .. దేనిని ఎంచుకోవాలనే నిర్ణయం వచ్చింది. ఓ రోజు తన నిర్ణయం క్రికెట్ మాత్రమే అని చెప్పింది. నేనూ ‘సరే’ అన్నాను. నిజానికి.. జాబ్ చేసుకుంటూ సాధారణ జీవితం గడపవచ్చు. కాని, కష్టపడటానికే సిద్ధపడింది. మేమూ తన ఇష్టానికే ప్రాధాన్యం ఇచ్చాం. ఆసక్తులను ప్రోత్సహించాలి... అరుంధతికి క్రికెట్తో పాటు పాటలు పాడటం చాలా ఇష్టం. కాస్త సమయం దొరికితే మెలోడీస్ను చాలా ఇష్టంగా పాడుతుంది. అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా వారి జీవితాన్ని వారు ఎంచుకునే స్వేచ్ఛ వారికే ఇవ్వాలి. పెద్దలుగా మనం కనిపెడుతూ ఉండాలి. పిల్లల ఆసక్తితో ఎంచుకున్న మార్గంవైపు మనకు తెలిస్తే ఏవైనా సూచనలు ఇవ్వాలి. లేదంటే, ధైర్యంగా వెళ్లు అని చెప్పాలి. ‘ఈ ఏడాది పిల్లలను స్పోర్ట్స్ అకాడమీలో చేర్చాం. వచ్చే ఏడాదికి పెద్ద ప్లేయర్ అయిపోవాల’ని వారిపై ఒత్తిడి తీసుకురావద్దు. అది సాధ్యం కాదు కూడా. ఎంచుకున్న దానిపైన అంకితభావం, క్రమశిక్షణ, సాధన ఉండాలి. మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా కెనడాలో స్ధిరపడ్డాడు. కూతురు దేశం గర్వించే స్థాయిలో ఉంది. నా కలలను పిల్లల ద్వారా తీర్చుకోవాలి అనుకోలేదు. నా జీవితంలో ఎదురైన స్ట్రగుల్స్ ఎప్పుడూ పిల్లల ముందు చెప్పలేదు. నా ప్రయాణంలో మా అమ్మ నాకు సపోర్ట్గా నిలిచింది. మా పిల్లల ఎదుగుదలలో నేనూ అంతే. ఎంచుకున్న మార్గం వైపు రిస్క్ ఎంత ఉన్నా ధైర్యంగా వెళ్లమనే చెబుతుంటాను’’ అని వివరించారు భాగ్య.పిల్లల పెంపకం గురించి ప్రముఖుల అభిప్రాయాలు, అనుభవాలు, సూచనలు ఇదే శీర్షికలో ప్రతివారం...∙ నిర్మలారెడ్డి -
మానస మనసులో మాటలు
హైదరాబాద్ మట్టిలో మొదలైన నటి మానస వారణాసి అడుగు ప్రపంచ వేదికపై నడిచే వరకు చేరుకుంది. అలా కోడింగ్ నుంచి మిస్ ఇండియా కిరీటం వరకూ సాగిన ప్రయాణంలోని మెరుపు వెనుక ఉన్న విశేషాలు ఆమె మాటల్లోనే...నా ప్రపంచం రెండు దేశాల మధ్యనేను హైదరాబాద్ అమ్మాయినే. అయితే నా బాల్యం అంతా మలేషియాలో గడిచింది. కౌలాలంపూర్లో గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివాను. నేనొక యావరేజ్ స్టూడెంట్నే కాని, ఫ్రెంచ్లో మాత్రం ఎప్పుడూ టాప్.కోడింగ్ నుంచి కిరీటంఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత నేను ఫైనాన్షియల్ అనలిస్ట్గా పని చేశాను. ఒకవైపు సాఫ్ట్వేర్ కోడింగ్, మరోవైపు మోడలింగ్ అలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూనే అందాల పోటీలో విజయం సాధించాను.కళ్లతో వింటానుసైన్ లాంగ్వేజ్ అంటే నాకు ఆసక్తి. అలా నేనే ఇండియన్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. ‘వినడం’ అంటే కేవలం చెవులతోనే కాదు, కళ్లతో కూడా వినొచ్చని అప్పుడు అర్థమైంది. అలాగే, లాక్డౌన్ లో నేర్చుకున్న ఎంబ్రాయిడరీ నాకు ఓపికను నేర్పింది.నా బలం నా కుటుంబంమా అమ్మ, నాయనమ్మ, నా చెల్లి మేఘనా ఈ ముగ్గురు మహిళలే నా బలం. వాళ్లే నాకు నిజమైన ప్రేరణ. సినిమాల్లో అయితే హాలీవుడ్లో ఎమ్మా స్టోన్, ప్రియాంక చోప్రా నాకు ఇన్ స్పిరేషన్ .అభిరుచులు! రోజులో ఒక్క పూటైనా అన్నం లేకపోతే నాకు కడుపు నిండదు. స్వీట్స్లో తిరామిసు, ఫ్రూట్ పుడ్డింగ్ అంటే ఇష్టం. దుస్తుల్లో ఫైరీ రెడ్ రంగు నాకు బాగా నప్పుతుంది. సెంట్స్లో చెర్రీ బ్లోసమ్, పెస్టో వాసనలు నన్ను రిఫ్రెష్ చేస్తాయి.సెల్ఫ్ బిలీఫ్మిస్ ఇండియా 2020 సమయంలో పాండమిక్ కారణంగా చాలా భాగం ఆన్లైన్ లో జరిగింది. అప్పుడు నాకు నేనే మేకప్ ఆర్టిస్ట్, కెమెరాపర్సన్ , కోచ్. నాపై నాకు ఉన్న నమ్మకంతో ఆ సమయంలో నా సేవింగ్స్ అంతా ఖర్చు చేశాను. అదే నన్ను సినిమాల్లోకి తీసుకువచ్చింది.సంగీతం నా మరో స్వరంఫ్రీ టైమ్ దొరికితే నేను సంగీతంలో మునిగిపోతాను. కాలేజీలో ‘నైన్ డేస్’ అనే మ్యూజిక్ బ్యాండ్లో మెంబర్ని. స్టేజ్పై పాడడం నాకు మరో ఎనర్జీ ఇస్తుంది. అలాగే, యోగా, మ్యూజిక్, పేజెంట్స్ ఇలా ఒక్కో అడుగు వేసుకుంటూ నా భయాలను నేనే ఓడించాను.‘మీన్ గర్ల్’ మోడ్లోకి మారుతున్నాఇప్పుడిప్పుడే కొంచెం ‘మీన్ గర్ల్’లా ఉండడం ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎందుకంటే ‘నో’ అనడం కూడా జీవితంలో చాలా అవసరం. -
ఈ స్టవ్కు గ్యాస్ అక్కర్లేదు!
ఈ గ్యాస్ కష్టాల ఎండకాలంలో... ‘శతకోటి ప్రాబ్లమ్స్కు అనంతకోటి ఐడియాస్’ అనుకోవడం ధైర్యాన్ని ఇస్తుంది. ఎల్పీజీ గ్యాస్ అక్కర్లేని ‘విశ్వగురు స్టవ్’లాంటి స్టవ్లు మరింత ధైర్నాన్ని ఇస్తాయి. రాజస్థాన్లోని ఉదయ్పూర్కు చెందిన షేర్ఖాన్ అనే సామాన్యుడు ఒకేసారి మూడు రకాల వంటలు చేసుకునే స్టవ్ను రూపొందించాడు. ఈ స్టవ్కు చాలా తక్కువ కట్టెలు మాత్రమే అవసరం అవుతాయి. పొగ సమస్య పెద్దగా ఉండదు...షేర్ఖాన్ ఎనిమిదవ తరగతి మాత్రమే చదువుకున్నాడు. వంటలు వండడానికి మహిళలు గంటల తరబడి సమయం వెచ్చిస్తూ కష్టపడే దృశ్యాలు చూసిన తరువాత... వారి పని సులువు చేయడానికి ఏదైనా చేయాలని అదేపనిగా ఆలోచించాడు.అతడి ఆలోచనల్లో నుంచి పుట్టిందే... విశ్వగురు స్టవ్.వంట చేసే సమయాన్ని తగ్గించడం, కట్టెల వినియోగాన్ని తగ్గించడం, పొగను కనిష్ఠ స్థాయికి తీసుకురావడం లక్ష్యంగా ఖాన్ తయారుచేసిన స్టవ్ సూపర్ హిట్ అయింది. ఈ పొయ్యి లేదా స్టవ్ను మూడు పొరల(లేయర్స్)తో ప్రత్యేకంగా రూపొందించాడు. దీనిలో ఒకేసారి రకరకాల వంటకాలు చేసుకోవచ్చు.పై పొరలో రొట్టెలు, బ్రెడ్, పిజ్జాలాంటివి కాల్చవచ్చు.మధ్య పొరలో కూరగాయలు, మాంసాన్ని ఫ్రై చేసుకోవచ్చు లేదా గ్రిల్ చేసుకోచ్చు. కింది పొరలో పప్పు, సూప్ లేదా కూరలు ఉండకబెట్టవచ్చు. ఈ స్టవ్ వంటకాలు త్వరగా పూర్తి అయ్యేలా చేస్తుంది. తద్వారా సమయం ఆదా అవుతుంది. అట్టే కష్టపడనక్కర్లేదు.ఇక ఇంధనం విషయానికి వస్తే....సంప్రదాయ పొయ్యిలో పదికిలోల కట్టెలు వాడితే, ఈ పొయ్యిలో మాత్రం రెండు కిలోల కట్టెలు వాడితే సరిపోతుంది. పొగ సమస్య పెద్దగా ఉండదు. సంప్రదాయ రాజస్థానీ వంటకాల నుంచి అంతర్జాతీయ బ్రెడ్లు, పిజ్జాల వరకు ఈ పొయ్యిపై ఏ వంటకాన్ని అయినా వండవచ్చు అంటున్నాడు ఖాన్. స్టవ్ రూపొందించిన తరువాత ఇండ్లలో, రోడ్డు పక్కన హోటల్స్లో పరీక్షించాడు. ఆ తరువాత దీనిపై పేటెంట్ తీసుకున్నాడు. దేశవ్యాప్తంగా ఈ స్టవ్లు వేల సంఖ్యలో అమ్ముడయ్యాయి. ఇండ్లతో పాటు ధాబాలు, చిన్న చిన్న హోటల్స్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.30 నిమిషాల వ్యవధిలో 25–30 మందికి సరిపడా భోజనాన్ని తయారుచేసే ఈ స్టవ్ గేమ్ చేంజర్గా మారింది. వృత్తిరీత్యా కమ్మరి అయిన షేర్ఖాన్ తన 3–ఇన్–1 స్టవ్తో దేశవ్యాప్తంగా ఎంతోమంది దృష్టిని ఆకర్షించాడు. సోషల్ మీడియాలో ఖాన్ షేర్ చేసిన డెమో వీడియోకు అనూహ్యమైన స్పందన వచ్చింది. -
నేటికీ పీడిస్తున్న పోషకాహార లోపం
ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక శక్తులలో మన దేశం నాలుగో స్థానంలో ఉంది. అయినా, పోషకాహార లోపం మన దేశాన్ని ఇంకా పట్టి పీడిస్తూనే ఉంది. ఎక్కువగా పిల్లలు, మహిళలు పోషకాహార లోపంతో రకరకాల సమస్యలకు లోనవుతున్నారు. ఈ విషయాన్ని పలు జాతీయ సంస్థల సర్వేలతో పాటు ‘పోషణ్ ట్రాకర్’–2024–25 గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి.పోషకాహార లోపం వల్ల ఆరేళ్ల లోపు వయసు గల పిల్లల్లో పలువురు ఎదుగుదల లోపాలతో, వయసుకు తగిన బరువు పెరగక బాధపడుతున్నారు. చాలా రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజన పథకాలు అమలు చేస్తున్నా, దేశంలో దాదాపు 2.10 కోట్ల మందికి పైగా పిల్లలు పోషకాహార లోపంతో బక్కచిక్కిపోతున్నారు. -
సదా మీ సేవలో... ఆతిథ్య రంగంలో రోబోలు
‘రండి రండి రండి... దయచేయండి... తమరి రాక మాకెంతో సంతోషం సుమండి’ అంటూ అతిథులకు స్వాగతం పలుకుతుంది ఒక రోబో ‘డిన్నర్కి ఏం కావాలో ఆర్డర్ చెప్పండి బాస్’... అంటూ వినయంగా అడుగుతుంది ఇంకో రోబో మరో రోబో ముందుకొచ్చి మీ లగేజీని అందుకుంటుంది మీకు కేటాయించిన గదిలో చక్కగా సర్దిపెట్టేస్తుంది... పర్యటనలో భాగంగా మీరు హోటల్లో అడుగుపెట్టినది మొదలుకొని, తిరుగు ప్రయాణానికి బయలుదేరే వరకు సదా మీ సేవల్లో రోబోలు అడుగడుగునా ముందుంటాయి. ఆతిథ్యరంగం ఏఐ సాంకేతికతతో నానాటికీ స్మార్ట్గా మారుతోంది. రోబోలను సేవల్లోకి దించి అతిథి సేవలకు హైటెక్ హంగులద్దుతోంది.మన దేశంలో రోబోల వాడకం అంతగా పెరగలేదు గాని, అగ్రరాజ్యాల్లో రోబోలు ఆతిథ్యరంగ సేవలను కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. హోటళ్లు, రెస్టరెంట్లు, బార్లలో రిసెప్షన్ నుంచి రూమ్ సర్వీస్ వరకు; కిచెన్ నుంచి ఫుడ్ డెలివరీ వరకు రోబోలు సేవలందిస్తున్నాయి. అమెరికా, జపాన్ వంటి దేశాలలో గత పదేళ్లుగా రోబోల సేవలు విస్తృతం కావడం మొదలైంది. ‘కోవిడ్–19’ తర్వాత ఆతిథ్య రంగంలో రోబోల సేవలు మరింతగా వేగం పుంజుకున్నాయి. తొలితరం రోబోలు వెయిటర్లుగా సేవలందించడం ప్రారంభిస్తే, ఏఐ సాంకేతికతతో పనిచేస్తున్న ఇప్పటి రోబోలు ఆతిథ్య రంగానికి చెందిన దాదాపు అన్నిరకాల సేవలనూ నిరంతరాయంగా అందించగలుగుతున్నాయి.మనుషులు అందించే సేవల్లో తేడాలు ఉండవచ్చేమో గాని, రోబోలు అందించే సేవల్లో ఎలాంటి తేడాలూ ఉండవని వీటి సేవలు అందుకుంటున్న అతిథులు కితాబునిస్తున్నారు. మనుషులు చేసే పనులను రోబోలు సునాయాసంగా చేసేస్తుండటంతో హోటళ్ల యాజమాన్యాలకు కూడా లాభసాటిగా ఉంటోంది. రోబోలను రంగంలోకి దించిన హోటళ్లకు కాసులపంట పండుతోంది. ఇటీవలి కాలంలో రోబోలు హోటళ్లలో ఎలాంటి సేవలను అందిస్తున్నాయో తెలుసుకుందాం...రోబో రిసెప్షనిస్ట్పలు దేశాల్లోని స్టార్ హోటళ్లు ఇప్పుడు రిసెప్షనిస్టులుగా రోబోలను వినియోగించు కుంటున్నాయి. మొదటగా జపాన్లోని నాగసాకి నగరానికి చెందిన ‘హెన్ నా హోటల్’ దాదాపు పదేళ్ల కిందట రిసెప్షనిస్టు స్థానంలో హ్యూమనాయిడ్ రోబోను రంగంలోకి దించింది. తొలినాళ్లలో జనాలు దీనిని విచిత్రంగా చూసేవారు. క్రమంగా అలవాటైపోయారు. కాలం గడిచే కొద్ది సాంకేతికతలో అనేక మార్పులు వచ్చాయి. అచ్చంగా మనుషులను పోలి ఉండే హ్యూమనాయిడ్ రోబోలు అందుబాటులోకి వచ్చాయి. వీటికి ఏఐ సాంకేతికత తోడైంది.ఇటీవలి కాలంలోని హ్యూమనాయిడ్ రోబోలు మనుషుల కంటే మిన్నగా పనిచేస్తుండటంతో అగ్రదేశాల్లోని పలు హోటళ్లు అమ్మాయిల రూపంలో ఉండే హ్యూమనాయిడ్ రోబోలను రిసెప్షనిస్టులుగా ఉపయోగిస్తున్నాయి. ఇవి కస్టమర్లను సాదరంగా స్వాగతించి, పలకరించడం, వారి అవసరాలను కనుక్కుని, వారికి కావలసిన సమాచారాన్ని అందించడంలోను, ఎల్లవేళలా అతిథులకు అందుబాటులో ఉండటంలోను విజయవంతంగా పనిచేస్తున్నాయి.రోబో రిసెప్షనిస్టులు ప్రత్యేక ఆకర్షణగా ఉండటంతో, వీటిని ఏర్పాటు చేసుకున్న హోటళ్లకు అతిథుల రాక కూడా మిగిలిన వాటి కంటే ఎక్కువగా ఉంటోంది. రోబో రిసెప్షనిస్టులు లాభసాటిగా ఉండటంతో పలు అంతర్జాతీయ హోటల్ బ్రాండ్లు వీటిని తమ ప్రధాన శాఖలన్నింటికీ విస్తరించుకుంటూ వస్తున్నాయి.కేర్ టేకర్ రోబోలుహోటల్లో అడుగుపెట్టే అతిథులకు అవసరమైన సమాచారం అందించడం మొదలుకొని అన్ని రకాలుగా సహాయపడే రోబోలు ఇవి. ఈ కేర్ టేకర్ రోబోలను ‘కోనీ’రోబోలు అని కూడా అంటున్నారు. ప్రముఖ టెక్ కంపెనీ ఐబీఎం పదేళ్ల కిందట తొలి కోనీ రోబోను రూపొందించింది. తర్వాత మరిన్ని టెక్ సంస్థలు వీటి రూపకల్పనకు రంగంలోకి దిగాయి. ఇటీవలి కాలంలో ఏఐ సాంకేతికతతో కోనీ రోబోలను మరింతగా అభివృద్ధి చేశాయి.ఇవి హోటల్కు వచ్చే అతిథులు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెబుతాయి. స్థానిక సందర్శనీయ స్థలాలు, తదితర అంశాలపై సమాచారం అందిస్తాయి. లోకల్ టూర్ బుకింగ్స్కు, తిరుగు ప్రయాణాల టికెట్ బుకింగ్స్కు సులువైన మార్గాలు చెబుతాయి. ప్రస్తుతం హోటళ్లు వినియోగించే పలు కేర్ టేకర్ రోబోలు బహు భాషా సామర్థ్యాలతో పనిచేస్తున్నాయి.రిలే డెలివరీ రోబోలుఅంతర్జాతీయ హోటళ్లు కొన్ని రోబోలను రిసెప్షన్ సేవలకు మాత్రమే పరిమితం చేసుకోవడం లేదు. పలు ఇతర సేవలకూ వినియోగించుకుంటున్నాయి. బహుళ అంతస్తుల స్టార్ హోటళ్లలో కొన్ని రిలే డెలివరీ రోబోలను ఉపయోగించుకుంటున్నాయి. ఇవి రూమ్ నుంచి ఆర్డర్ ఇచ్చే అతిథులకు కావలసిన ఆహార పానీయాలను అందించడం; రూమ్ సర్వీస్ వస్తువులను అవసరమైన గదుల వద్దకు మోసుకెళ్లడం; హోటల్కు వచ్చే అతిథులను వారి గది వరకు తోడ్కొని వెళ్లడం; వారి లగేజీని మోసుకెళ్లడం వంటి పనులు సమర్థంగా చేయగలుగుతున్నాయి. వీటిని ‘బట్లర్బో’ అని కూడా అంటున్నారు.ఆతిథ్య రంగంలో రోబోల తొలి అడుగుఆతిథ్యరంగంలో రోబోల వాడకం ఇటీవలి కాలంలో పెరిగింది కాని, నిజానికి వీటి ప్రస్థానం 1983 నుంచే మొదలైంది. తొలిసారిగా అమెరికాలో ఒక రెస్టరెంట్ జపాన్లో తయారైన ‘టాన్బో ఆర్–1’, ‘టాన్బో ఆర్–2’ అనే రెండు రోబోలను అప్పట్లోనే 20 వేల డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. వీటిని బేరర్ల స్థానంలో అతిథులకు పదార్థాలతో నిండిన ప్లేట్లు, పానీయాలతో నిండిన గ్లాసులు వంటివి అందించడానికి ఉపయోగించింది. ఇటీవలి కాలంలో డైనర్ రోబోలుగా పిలిచే రోబో బేరర్లు చాలా దేశాలకు విస్తరించాయి. మన దేశంలో కూడా ‘ది యెల్లో హౌస్’ హోటల్ చెయిన్ ఉత్తరాదిలోని కొన్ని నగరాల్లో ఉన్న తన రెస్టరెంట్లలో రోబో బేరర్లను ఉపయోగించుకుంటోంది. అంతర్జాతీయ నిపుణుల అంచనాల ప్రకారం 2030 నాటికి ఆతిథ్యరంగంలో 25 శాతం ఉద్యోగుల స్థానాలను రోబోలే పూర్తిగా భర్తీ చేస్తాయి.లగేజ్ హ్యాండ్లింగ్ రోబోలుహోటల్లో దిగేటప్పుడు కొందరు అతిథులు భారీ లగేజీలతో వస్తుంటారు. వారు తీసుకొచ్చే భారీ లగేజీని వాహనం నుంచి దించి, హోటల్లో వారికి కేటాయించిన గది వరకు మోసుకొచ్చే పని ఇదివరకు రూమ్ సర్వీస్ సిబ్బంది చేసేవారు. లగేజీ మరీ ఎక్కువగా ఉంటే, ఒకరికిద్దరు మనుషులు అవసరమయ్యేది. అంత లగేజీని రూమ్ వరకు మోసుకొచ్చినందుకు వారికి టిప్పు ముట్టజెప్పాల్సి వచ్చేది. కొన్ని అంతర్జాతీయ హోటళ్లు ఇప్పుడు ఈ పనికోసం లగేజ్ హ్యాండ్లింగ్ రోబోలను ఉపయోగిస్తున్నాయి. ఎంత లగేజీనైనా ఇవి అవలీలగా మోసుకొచ్చి, జాగ్రత్తగా సర్దిపెట్టేస్తాయి. మనుషులు శక్తికి మించిన లగేజీ మోసేటప్పుడు ఏదో ఒకటి జారిపోవడం, లోపలి వస్తువులు దెబ్బతినడం వంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. లగేజ్ హ్యాండ్లింగ్ రోబోలతో అలాంటి సమస్యలేవీ ఉండవు. వాటికి టిప్పులివ్వాల్సిన అవసరం కూడా లేదు. తొలిసారిగా న్యూయార్క్లోని ఒక హోటల్ పదిహేనేళ్ల కిందటే ‘యోబో’ పేరుతో లగేజ్ హ్యాండ్లింగ్ రోబోను ప్రవేశపెట్టింది. ఇటీవలి కాలంలో లగేజ్ హ్యాండ్లింగ్ రోబోలు మరింతగా అభివృద్ధి చెందాయి. హోటళ్లతో పాటు పలుచోట్ల విమానాశ్రయాలు, కర్మాగారాలలో కూడా వీటి వినియోగం నెమ్మదిగా పెరుగుతోంది.రూమ్ సర్వీస్ రోబోలుహోటళ్లలో గదులు, బాత్రూమ్లు శుభ్రం చేయడం వంటి రూమ్ సర్వీస్ పనులను సాధారణంగా హౌస్కీపింగ్ సిబ్బంది చేస్తుంటారు. ఇటీవలి కాలంలో కొన్ని అంతర్జాతీయ స్టార్ హోటళ్లు ఈ పనుల కోసం రూమ్ సర్వీస్ రోబోలను ఉపయోగించుకుంటు న్నాయి. ఒక అమెరికన్ హోటల్ తన శాఖలు కొన్నింటిలో రూమ్ సర్వీస్ రోబోలను తొలిసారిగా పన్నెండేళ్ల కిందటే ప్రవేశపెట్టింది. ఇటీవలి కాలంలో మరిన్ని హోటళ్లు ఇదే దారిని అనుసరిస్తున్నాయి. వీటిలో అమర్చిన కెమెరాలు, సెన్సర్ల ఆధారంగా ఇవి గదుల మూలల్లో ఉన్న దుమ్ము ధూళిని కూడా చిటికెలో తొలగించేస్తాయి.హోటళ్ల కారిడార్లు, లాబీలు వంటి ప్రదేశాలలోని చెత్తను, దుమ్ము ధూళిని వాక్యూమ్తో తొలగిస్తాయి. హోటళ్లతో పాటు వీటిని పలుచోట్ల కార్యాలయాలు, ఆస్పత్రులు వంటి చోట్ల కూడా ఉపయోగిస్తున్నారు. రూమ్ సర్వీస్, క్లీనింగ్ రోబోలలో పలు రకాల వాటిని అంతర్జాతీయ హోటళ్లు ఉపయోగిస్తున్నాయి. వీటిలో కొన్ని వాక్యూమ్ క్లీనింగ్, ఎయిర్ ప్యూరిఫికేషన్ వంటి పనులు మాత్రమే చేస్తుంటే, మరింత అధునాతనమైనవి సర్ఫేస్ స్క్రబ్బింగ్, మాపింగ్, వాటర్ ట్యాంక్ క్లీనింగ్ వంటి పనులు కూడా చేయగలుగుతున్నాయి. సెక్యూరిటీ రోబోలుహోటళ్లు, రెస్టరెంట్లు, ఆస్పత్రులు, కార్యాలయాలు– ఇలా ఎక్కడ చూసినా సెక్యూరిటీ గార్డులు కనిపిస్తారు. సెక్యూరిటీ గార్డులు షిఫ్టుల వారీగా విధులు నిర్వర్తిస్తారు. ఇటీవలి కాలంలో కొన్ని అంతర్జాతీయ హోటళ్లు, కార్యాలయాలు సెక్యూరిటీ గార్డులకు బదులుగా సెక్యూరిటీ రోబోలను ఉపయోగించు కుంటున్నాయి. ఇవి నిరంతరాయంగా పనిచేస్తాయి. జపాన్లో సెక్యూరిటీ రోబోలను పదిహేనేళ్ల కిందట ప్రయోగాత్మకంగా రంగంలోకి దించారు.తర్వాతి కాలంలో వీటిని మరింతగా అభివృద్ధి చేశారు. ‘కోవిడ్–19’కాలంలో పలు అభివృద్ధి చెందిన దేశాలలో సెక్యూరిటీ రోబోల వినియోగం పెరిగింది. వీటిలో అమర్చే థర్మల్ కెమెరాల సాయంతో ఇవి నిరంతరం పరిసరాలను గమనిస్తూ ఉంటాయి. హోటల్ పరిసరాల్లోను, పార్కింగ్ ప్రదేశాల్లోను, లాబీల్లోను కలియదిరుగుతూ అనుమానాస్పద వ్యక్తులను, వస్తువులను గుర్తించి నిర్వాహకులను అప్రమత్తం చేస్తాయి. ఫుడ్ డెలివరీ రోబోలు‘కోవిడ్–19’ దరిమిలా ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. చాలా చోట్ల ఇప్పటికీ మనుషులే ఫుడ్ డెలివరీ సేవలను అందిస్తున్నారు. హోటళ్లు, రెస్టరెంట్లకు అనుసంధానమై పనిచేసే యాప్స్ ద్వారా వినియోగదారులు తమకు కావలసిన ఆహార పదార్థాలను ఇళ్ల వద్దకు తెప్పించుకుంటున్నారు. యాప్స్కు చెందిన సంస్థల్లో పనిచేసే ఫుడ్ డెలివరీ బాయ్స్ వీటిని ఇళ్లకు తెచ్చి అందిస్తున్నారు. కొన్ని సంపన్న దేశాల్లోని హోటళ్లు, రెస్టరెంట్లు ఈ సేవల కోసం ఫుడ్ డెలివరీ రోబోలను ఉపయోగించుకుం టున్నాయి.చిన్నసైజు వాహనాల్లా కనిపించే ఈ రోబోలు కోరుకున్న చోటుకు ఆహార పదార్థాలను అందిస్తున్నాయి. మనుషులు నడిపే వాహనాల కంటే ఇవి చిన్నగా ఉండటంతో కిక్కిరిసిన ట్రాఫిక్లో కూడా ఇవి వేగంగా ముందుకు పోగలుగుతున్నాయి. అధునాతనమైన కెమెరాలు, సెన్సర్లు అమర్చి తయారు చేసిన ఫుడ్ డెలివరీ రోబోలు డ్రైవర్తో పనిలేకుండానే ఎలాంటి దారుల్లోనైనా సులువుగా ప్రయాణించగలవు. అగ్రరాజ్యాల్లో ఫుడ్ డెలివరీ రోబోలకు ఆదరణ బాగా పెరుగుతోంది. త్వరలోనే ఇవి భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా అందుబాటులోకి రాగలవని అంచనాలు ఉన్నాయి.డైనర్ రోబోలుటిఫిన్ చేయడానికో, భోజనం చేయడానికో హోటల్ లేదా రెస్టరెంట్లోకి అడుగుపెడితే, మనం కూర్చున్న టేబుల్ వద్దకు సర్వర్లు వచ్చి ఆర్డర్లు తీసుకుంటారు. కొద్దిసేపు నిరీక్షణ తర్వాత మనం ఆర్డర్ చేసిన పదార్థాలను తీసుకొచ్చి టేబుల్ మీద పెడతారు. మనం వెళ్లే చోట రద్దీ ఎక్కువగా ఉంటే, మనం ఆర్డర్ చేసిన పదార్థాల రాక కోసం ఎదురుచూడాల్సిన సమయం సహజంగానే పెరుగుతుంది. సర్వర్లు రెండు చేతులతోనూ వీలైనన్ని ప్లేట్లను బ్యాలెన్స్ చేస్తూ వచ్చినా, ఒక్కోసారి సర్వీస్లో ఆలస్యం జరుగుతూ ఉంటుంది. ఈ పరిస్థితికి పరిష్కారంగానే డైనర్ రోబోలు అందుబాటులోకి వచ్చాయి.దాదాపు నాలుగు అడుగుల ఎత్తుండే ఈ రోబోలు చక్రాల మీద వేగంగా తిరుగుతూ సేవలు అందించగలవు. అంతేకాదు, వీటికి రెండువైపులా అరడజను చొప్పున ట్రేలు అమర్చడం వల్ల ఏకకాలంలో దాదాపు నలభై కిలోల బరువు ఉండే ఆహార పదార్థాలను టేబుళ్ల వద్ద ఆగుతూ కస్టమర్లకు అందించగలవు. కీనన్ రోబోటిక్ సంస్థ పదేళ్ల కిందట తొలిసారిగా డైనర్ రోబోను రూపొందించింది. ఇది విజయవంతం కావడంతో మరికొన్ని కంపెనీలు కూడా ఇలాంటివి రూపొందిస్తున్నాయి. పలు దేశాల్లోని హోటళ్లు, రెస్టరెంట్ల నుంచి వీటికి ఆదరణ కూడా నానాటికీ పెరుగుతూ వస్తోంది. రోబో బార్టెండర్లుపలు స్టార్ హోటళ్లలోను, బార్లలోను బార్టెండర్లు పనిచేస్తుంటారు. రకరకాల మద్యాలను అతిథుల అభిరుచులకు అనుగుణంగా అందించడం బార్టెండర్ల పని. రకరకాల ద్రవాల సమ్మేళనంతో, వాటికి తగిన అలంకరణతో అతిథులకు అందించే పనికి చాలా నైపుణ్యం కావాలి. బార్టెండర్లు ఒక పానీయాన్ని సిద్ధం చేయడానికి దాని సంక్లిష్టతను బట్టి కొద్ది నిమిషాల సమయం తీసుకుంటారు. ఇటీవలి కాలంలో వచ్చిన రోబో బార్టెండర్లు నిమిషంలోనే ఎలాంటి పానీయాన్నైనా ఇట్టే సిద్ధం చేయగలుగుతున్నాయి.ఏఐ సాంకేతికతతో రూపొందించిన రోబో బార్టెండర్లు అతి సంక్లిష్ట పానీయ సమ్మేళనాలను సైతం ఏమాత్రం రుచి తగ్గకుండా శరవేగంగా చేయగలుగుతున్నాయి. తొలితరం రోబో బార్టెండర్లు రంగప్రవేశం చేసి, పుష్కరం పైనే గడిచింది. తొలినాళ్లలో వచ్చిన ‘టోనీ’ వంటి రోబో బార్టెండర్లు పానీయాలు తయారు చేసేటప్పుడు ఒక్కోసారి ఐస్ ముక్కలు, పానీయాలు కొంత నేల మీద చిందేవి. వీటిని మరింతగా అభివృద్ధి చేశాక ఇప్పుడు ఈ సమస్యలేవీ లేకుండా సమర్థంగా పనిచేయగలుగుతున్నాయి.రోబో కిచెన్ అసిస్టెంట్లురోబోలు ఇటీవలి కాలంలో వంటింటి పనులనూ చక్కబెడుతున్నాయి. చేయితిరిగిన షెఫ్లలా వంటకాలు వండేస్తున్నాయి. అంతేకాకుండా, వంటింటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసి, ఎక్కడి వస్తువులను అక్కడ క్రమపద్ధతిలో సర్దిపెట్టేస్తున్నాయి. కూరలు, సూప్లు కలపడం, కూరగాయలు తరగడం, వంటకానికి తగిన ఉష్ణోగ్రతను నియంత్రించడం, రొట్టెలు కాల్చడం వంటి పనులు చేయగలుగుతున్నాయి. వీటిలో కొన్ని ‘రోబో ఆర్మ్స్’గా దొరుకుతున్నాయి. ఇవి మనిషి చేతి ఆకారంలో ఉండి, మనిషి చేతితో చేయగలిగే వంటింటి పనులన్నీ సునాయాసంగా చేయగలుగుతాయి.ఇంకొన్ని పూర్తిస్థాయిలో మనిషిని పోలి ఉండే హ్యూమనాయిడ్ రోబోలు. ఇవి షెఫ్లతోనే పోటీపడే స్థాయిలో వంటకాలను సిద్ధం చేయగలవు. వీటిలోని మరో సౌలభ్యం ఏమిటంటే, వీటిలో చాలా రోబోలు ‘సెల్ఫ్ క్లీనింగ్’. పని ముగిశాక ఇవి తమను తాము శుభ్రం చేసేసుకుంటాయి. అధునాతనమైన కెమెరాలు, సెన్సర్లతో తయారైన ఈ రోబో కిచెన్ అసిస్టెంట్లు ఏఐ సాయంతో నలభీముల్లాంటి షెఫ్లకు దీటుగా హోటళ్లు, రెస్టరెంట్ల వంట పనిని సులభతరం చేస్తున్నాయి.∙ పన్యాల జగన్నాథదాసు -
మానవాళి కోసం సిలువనెక్కిన క్రీస్తు
మన అతిక్రమ క్రియలనుబట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది... ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడు ఆయెను.అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసేను – యెషయా 53:4,5,12.పైన ఉటంకించిన ప్రవచనాలన్నీ క్రీస్తు మరణం ద్వారా నెరవేరాయి. యేసు మాంసయుక్త దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్ములను సమాధానపరుస్తున్నాడు అనునది పౌలు యొక్క క్రీస్తు మరణ సువార్త సందేశం. ‘క్రీస్తు యేసు– మరణమును నిరర్థకం చేశాడు’ అన్న పౌలు బోధలు ఉజ్జీవం కలిగించుటలో ప్రసిద్ధికెక్కాయి.ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించునట్లు యేసు మరణం పొందాడు.దీని భావం ఏమంటే, పాపము వలన వచ్చు జీతము మరణం. ఆత్మకు మరణం లేకున్నా పాపం వలన క్షమాపణ పొందని పాప జీవితం వలన నిత్య మరణం అనే స్థితి సంభవిస్తుంది. అది అడ్డుకొని తన మీద వారి మరణం వేసుకొని ఇలా పాపం వలన ప్రతి ఒక్కరికి ప్రాప్తించే పాప శిక్షను తాను భరించాడు.సర్వమానవాళి అనబడే దేవుని పిల్లలు రక్తమాంసములు గలవారు. దేవుడు వీరిని రక్షించమని వీరిని క్రీస్తు వశం చేశాడు. మరణం యొక్క బలం గలవాడు సాతాను. విధేయ మార్గం మినహా మరో మార్గం లేదు. ఆ అపవాదిని మరణం ద్వారానే నశింపచేయాలి. జీవిత కాలమంతా మరణ భయం చేత దాస్యానికి లోబడిన మానవాళిని విడిపించుటకు యేసు కూడా రక్త మాంసాలలో పాలి భాగస్థుడు కావలసివచ్చింది. యేసు చేసిన ఒక గొప్ప అసాధారణ బోధ ఏమంటే, ‘నేను మీతో చెప్పునది ఏమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము’ ఇలాంటి స్వభావం గల వ్యక్తి, అతడి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చూస్తే ఆశ్చర్యం కలుగకమానదు.‘నేను దేవుని కుమారుడను’ అన్న విషయం మరచి తన్ను తాను రిక్తునిగా చేసికొని శ్రమలను ఆహ్వానిస్తూ శ్రమలకు ఎదురువెళ్ళాడు. తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనుటకు ఎల్లవేళలా సంసిద్ధుడయ్యాడు. అలాంటి ఆయన ఆకారంలో మనుష్యుడుగా కనబడి మరణం పొందునంతగా సిలువ మరణం పొందునంతగా విధేయత చూపినవాడు. దేవుని సంకల్పానికి విధేయంగా లోబడిన క్రీస్తు వంటి విధేయుడు ఈ భూమ్మీద మరొకడు లేడు.‘ఎందుకనగా మనము ఆయనయందు దేవుని నీతి ఆగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను’ ( 2కొరిం«థీ 5:21 ). ‘క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మ శాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది’ (గలతీ 3:13,14, 1కొరింథీ 12:3 ).పరిశుద్ధుడైన ఆ మహాదేవునితో పాపముగా చేయబడి సిలువ మ్రానున వ్రేలాడే శాపగ్రస్తుడిగా ఉన్న యేసుకు ఆ దేవ దేవుని ఎడబాటును ఇలా చూస్తాము. ‘ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు –‘ఏలీ, ఏలీ, లామా సబక్తానీ’ అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం... యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను’ (మత్తయి 27 : 45–50).‘దేవుడు తన సొంతకుమారుని పాప శరీరాకరముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను’ (రోమా 8:3,4 ). లోక పాపములను మోసికొనిపోయే దేవుని గొర్రెపిల్లయైన క్రీస్తు విధేయతా బలియాగం నిత్యం గుర్తుంచుకొంటూ ఆయన వచ్చువరకు ఆ ప్రభువు మరణమును ప్రచురించవలసిన విధేయులమై ఉంటున్నాము.‘అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును’ (హెబ్రీ 9:28 )ఈ వచన భావం దేవుని యెడల తిరుగుబాటు చేసే అవిధేయుల పాపములను తన మీద వేసుకొని క్రీస్తు మరణించాడు అనునదే. పాపము లేకుండా రెండోసారి రావడం అంటే మొదటిసారి పాపముతో వచ్చాడు అని కాదుగాని, మానవాళి పాపమును తనమీద వేసుకున్నాడు. ఇందువలననే క్రీస్తు మరణం అనేకుల జీవితాలను కదిలిస్తూ వారిని విధేయులుగా మారుస్తూ ఉంది.‘నేను దేవుని కుమారుడను’ అన్న విషయం మరచి తన్ను తాను రిక్తునిగా చేసికొని శ్రమలను ఆహ్వానిస్తూ శ్రమలకు ఎదురువెళ్ళాడు.∙ జేతమ్ -
నా ఒరిజినాలిటీ..!
సింప్లిసిటీకి స్టయిలిష్ టచ్ ఇస్తూ ప్రత్యేకంగా నిలిచే పేరు ప్రీతి ముకుందన్ . మినిమల్ స్టయిలింగ్తో, ప్రతి లుక్ను కంఫర్ట్తో కలిపి క్లాసీగా మలచడం ఆమె ప్రత్యేకత. ఆ సైలెంట్ స్టయిల్ సీక్రెట్స్ ఇప్పుడు మీకోసం!చీర.. బ్రాండ్: సమీనాస్జ్యూలరీ బ్రాండ్: అరణ్య జ్యూలరీధర: డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.‘‘నా ఫ్యాషన్ సీక్రెట్? కంఫర్ట్. అలాగే ‘లెస్ ఈజ్ మోర్’ అనే మేకప్ రూల్ను పాటిస్తాను. సంప్రదాయ దుస్తులు, ఆభరణాలంటే నాకు చాలా ఇష్టం. అందుకే జడగంటలు, ముక్కుపుడకలు లాంటి ట్రెడిషనల్ టచ్ను మోడ్రన్ గా క్యారీ చేయడం నా స్పెషాలిటీ. ట్రెండ్స్ కోసం కాదు, నా ఒరిజినాలిటీ కోసం డ్రెస్ అవుతాను.’’ – ప్రీతి ముకుందన్ .చేతికి చిన్న మెరుపు వేసుకుంటే లుక్ పెద్దగా మారిపోతుందా? అంటే అవుననే చెప్తోంది ఈ బాజుబంద్. భుజం కింద భాగంలో కూర్చుని సున్నితంగా మెరిసే ఈ హ్యాండ్ జువెలరీ, మీ మొత్తం ఔట్ఫిట్కే రాయల్ అప్గ్రేడ్ లుక్ ఇస్తుంది. ఒకప్పుడు రాజకుటుంబాల స్టయిల్ సీక్రెట్గా ఉన్న ఇది, ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో కమ్బ్యాక్ కొట్టి ట్రెండింగ్లో టాప్ ర్యాంక్ సాధించింది. చిన్న రాళ్లు, ముత్యాలు, గోల్డ్ ఫినిష్ డిజైన్లతో రూపొందిన బాజుబంద్లు చేతి ఆకృతిని, జిమ్ అవసరం లేకుండానే! చిన్నగా చూపించడంలో సాయం చేస్తాయి.లెహెంగా, చీర, ఫ్యూజన్ వేర్ ఏది వేసుకున్నా ఇది సరిపోతుంది. హెవీ జ్యూలరీ పెట్టుకోకపోయినా, ఒక్క బాజుబంద్ చాలు మిగతావన్నీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్లిపోతాయి. స్లీవ్లెస్ లేదా హాఫ్ స్లీవ్ డ్రెస్సులతో అయితే ఇది ఫుల్గా షో ఆఫ్ అయ్యి, చూపుల్ని కట్టిపడేస్తుంది. మార్కెట్లో సింపుల్ నుంచి గ్రాండ్ వరకు అనేక డిజైన్లలో లభిస్తున్నాయి. -
Parenting Tips : పిల్లల్ని పొగడాలా? తిట్టాలా?
Parenting పిల్లలు చిన్నప్పటినుంచి ధైర్యంగా ఉంటేనే పెద్దయ్యాక వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కొనగలిగే సత్తా వస్తుంది. సరైన మార్గదర్శకత్వం ద్వారానే ఇది సాధ్యం అవుతుంది. అందుకు తల్లిదండ్రులు ఏం చేయాలో తెలుసుకుందాం.ముందుగా చేయాల్సింది... పిల్లలకు చిన్నప్పటినుంచి అన్నం తినకపోతే బూచాడొచ్చి పట్టుకుపోతాడని బోదిరించడం మానెయ్యాలి. వారు సాధించిన చిన్న చిన్న విజయాలను సైతం మనం గుర్తించి అభినందించాలి. అలాగే వారు చేసిన తప్పులను విమర్శించకుండా వాటి నుండి నేర్చుకోవడానికి ఒక అవకాశం ఉందని వారికి అర్థమయ్యేలా విడమరచి చెప్పాలి.అలాగని పిల్లలు ఏం చేసినా ΄÷గడాలని లేదా వారు ఏం చెప్పినా అంగీకరించాలని కాదు. నిపుణులు సూచించిన కొన్ని మార్గాల ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొదించవచ్చు.పిల్లలు చుట్టూ ఉన్న పరిస్థితులను నిశితంగా గమనిస్తారు. అందుకే ఇంట్లో సానుకూలమైన వాతావరణం కల్పించాలి. ప్రేమతో... అభిమానంతో పెంచితే వారి ఆత్మవిశ్వాసం మెల్లగా పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో పెరిగిన పిల్లలకి భయాలు తక్కువగా ఉంటాయి.పిల్లవాడు ఏదైనా సాధించినప్పుడు అది చిన్న విజయమే అయినా గమనించాలి. నిజాయితీతో పొగడాలి. అలాంటి ప్రశంసలు పిల్లలకు కృషి పట్ల గౌరవాన్ని నేర్పుతాయి. వారికిచ్చే ప్రశంసలే వారికి టానిక్లా పని చేసి మంచి దిశగా నడిపిస్తాయి.తప్పులు చేయడం సహజమని, ప్రతి ఒక్కరూ జీవితంలో తప్పులు చేస్తారని పిల్లలకు అర్థం అయ్యేలా చెప్పాలి. ఈ మాటలు పిల్లలకు ధైర్యాన్ని ఇస్తాయి.స్వయంగా చిన్న నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించాలి. ఉదాహరణకి ఏ వస్త్రాలు వేసుకోవాలి..? ఏ ఆట ఆడాలి వంటి చిన్న విషయాల్లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు పిల్లలు తమపై నమ్మకం పెంచుకుంటారు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది.పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. రోజూ లాగా లేకుండా ప్రవర్తనలో మార్పు వస్తే... ఏదో జరిగినట్లే. అది మీకు చెప్పాలంటే వారితో మీరు సుతిమెత్తగా మాట్లాడుతూ... దగ్గరకు తీసుకొని... అడగాల్సి ఉంటుంది. వాళ్లు ఏదైనా తప్పు చేస్తే... మీరు దాన్ని సున్నితంగా మందలిస్తూ సరిదిద్దాలే తప్ప... కోపం తెచ్చుకొని కొట్టినా, తిట్టినా వాళ్లలో భయం మరింత పెరిగి... అది మానసికంగా విపరీత పరిణామాలకు దారితీస్తుంది. పిల్లలు ఏడుస్తున్నప్పుడో, బాధ పడుతున్నప్పుడో మీరు పక్కనే ఉండి వారు చెప్పేది సహనంతో వినండి.. వారు తమ ఇబ్బందిని ధైర్యంగా చెప్పుకునేలా చెయ్యండి. దాంతో వారిలో భారం దిగి΄ోయి మీరు వారికి రక్షణగా ఉన్నారనే భావనతో ధైర్యం వస్తుంది. పిల్లలు ప్రతీదీ తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు. కాబట్టి క్లిష్ట పరిస్థితులలో కూడా పేరెంట్స్ ధైర్యంగా ఉంటేనే పిల్లలు కూడా ధైర్యంగా ఉంటారు. అలాగే పిల్లల ముందు ఇతరులను గట్టి గట్టిగా అరవడం, తిట్టడం మంచిది కాదు. అది అది చూసి పిల్లలు భయపడతారు. భయం వారిలో చురుకుదనాన్ని పోగొట్టి... మానసికంగా చాలా ఇబ్బందులు తెస్తుంది. ఇదీ చదవండి: రైతుకు రూ.15 కోట్ల పరిహారం: హెలికాప్టర్, థాయ్లాండ్ ట్రిప్చాలా మానసిక సమస్యల్లో తల్లిదండ్రులు వారికి సరిగా అండగా నిలవక΄ోవడం వల్లే వస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. పిల్లలకు అవసరమైన సమయంలో మీ సాయం అందాలి. మీరు ఎంత చెప్పినా వారిలో ధైర్యం పెరగకపోతే... కౌన్సెలింగ్ ఇప్పించాలి. వారి ప్రతి కదలికలో మీ అండదండలు ఉంటే... ఓ మంచి సిటిజన్ను మీరు ఈ ప్రపంచానికి ఇచ్చినట్లు అవుతుంది. పిల్లల దృష్టిలో కూడా మీరు మంచి పేరెంట్స్గా నిలుస్తారు. ఇదీ చదవండి: యువతి కారుణ్య మరణం, చివరి కోరిక తెలిస్తే కన్నీళ్లాగవు -
ఆరోగ్యానికి ప్రొటీన్ ఎంత లాభం?
శరీర నిర్మాణానికి, కండరాల బలానికి ప్రోటీన్ ఎంతగానో అవసరం. శాకాహారం, మాంసాహారం ఏదైనా సరే, శరీరానికి సరిపడా ప్రోటీన్ అందకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మన శరీరంలోని అవయవాల నిర్మాణానికి ప్రోటీన్ ప్రాథమిక పునాది. ఇది దెబ్బతిన్న కణజాలాలను త్వరగా రిపేర్ చేయడంలో సహాయపడుతుంది. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇది అనవసరమైన ఆకలిని తగ్గించి, క్యాలరీల వినియోగాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.ఆహారం అరగడానికి శరీరం ఎక్కువ శక్తిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ప్రోటీన్ ఈ ప్రక్రియలో మెటబాలిజం రేటును పెంచి, శక్తిని సమర్థవంతంగా వినియోగించుకునేలా చేస్తుంది. వ్యాయామం లేకపోవడం వల్ల, వయస్సు పెరగడం వల్ల కండరాల క్షీణత జరుగుతుంది. ప్రోటీన్ కండరాల ద్రవ్యరాశిని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది.వ్యాయామం తర్వాత కండరాలు త్వరగా కోలుకోవడానికి అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్లు ఎంతో తోడ్పడతాయి. చేపలు, గుడ్లు, పప్పు ధాన్యాలు, చికెన్, పనీర్, గింజలు, చియా సీడ్స్లో ప్రోటీన్ సమృద్ధిగా లభిస్తుంది. నిత్యం తీసుకునే ఆహారంలో వీటిని చేర్చుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇదీ చదవండి: క్లిష్ట సమయాల్లో నీతా అంబానీ హస్త ముద్ర, స్పెషల్ ఏంటో ?రైతుకు రూ.15 కోట్ల పరిహారం: హెలికాప్టర్, థాయ్లాండ్ ట్రిప్ -
Yoga ప్రశాంతత కావాలంటే.. ఈ ఆసనం!
Shashankasana (Pose of the Moon) యోగాలో చాలా ప్రశాంతతను కలిగించే ఆసనం.‘‘శశాంక’’ అనే సంస్కృత పదానికి చంద్రుడు అని అర్థం. చంద్రుడు శాంతి, చల్లదనం, సమతుల్యతకు ప్రతీక. ఈ ఆసనం కూడా మన శరీరం, మనసుకు అలాంటి శాంతిని ఇస్తుంది. ఈ ఆసనం ప్రత్యేకంగా మెదడు, నాడీవ్యవస్థ, వెన్నెముకకు చాలా ఉపయోగకరం. ఒత్తిడి, టెన్షన్, అలసట తగ్గించడంలో ఇది మంచి యోగాసనం.శశాంకాసనం చేసే విధానం.. స్టెప్ 1... ముందుగా నేలపై యోగా మ్యాట్పై వజ్రాసనంలో కూర్చోవాలి. (మోకాళ్లు మడిచి, ΄ాదాలపై కూర్చోవాలి.) స్టెప్ 2... వెన్నెముకను సూటిగా ఉంచి, చేతులను మోకాళ్ళపై ఉంచాలి. స్టెప్ 3... నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులను తలపైకి ఎత్తాలి. ఇప్పుడు శ్వాసను నెమ్మదిగా వదులుతూ శరీరాన్ని ముందుకు వంచాలి. స్టెప్ 4... చేతులను ముందుకు చాపి, నుదుటిని నేలకు తాకేలా వంచాలి. ఈ స్థితిలో శ్వాసను తీసుకుంటూ 20 నుంచి 30 సెకన్లు ఉండాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ మళ్లీ నెమ్మదిగా పైకి లేచి వజ్రాసన స్థితికి రావాలి. ఇదే విధంగా 3 నుంచి 5 సార్లు సాధన చేయాలి.ఇదీ చదవండి: యువతి కారుణ్య మరణం, చివరి కోరిక తెలిస్తే కన్నీళ్లాగవుజాగ్రత్తలు..మోకాళ్ల నొప్పి ఉన్నవారు జాగ్రత్తగా చేయాలి. వెన్నెముకకు తీవ్రమైన సమస్యలు ఉన్నవారు యోగా గురువు సలహాతో చేయాలి. హై బీపీ లేదా తలనొప్పి ఎక్కువగా ఉన్నవారు ఎక్కువసేపు వంగి ఉండకూడదు. ఆసనం వేస్తూ శ్వాసను బలవంతంగా ఆపకూడదు. ఖాళీ కడుపుతో చేయడం మంచిది. శశాంకాసనాన్ని ప్రాణాయామం లేదా ధ్యానం ముందు చేస్తే మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది.-పాతర్ల అనిత, యోగా ట్రైనర్ఇదీ చదవడి: గ్రేట్ ప్లాన్ : తక్కువ అద్దె, బోలెడన్ని లాభాలు -
మండే ఎండలు : నీళ్లు నమలండి!
Hot Summer రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు తరచూ చెబుతుంటారు. అయితే, కేవలం నీటి రూపంలోనే కాకుండా, మనం తినే ఆహారం ద్వారా కూడా శరీరానికి అవసరమైన తేమను అందించవచ్చు. దీన్నే నీటిని తినండి (ఈట్ యువర్ వాటర్) అని అంటుంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండొచ్చు.దోసకాయలో 97శాతం నీరు ఉంటుంది. చర్మ ఆరోగ్యానికి, శరీరంలోని వేడిని తగ్గించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. సలాడ్లలో ఎక్కువగా వాడే లెట్యూస్ శరీరానికి చలువ చేస్తుంది. ఇందులో 95% నీరుంటుందిటమాటాల్లో 94% నీటితో పాటు లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. పుచ్చకాయలో 92% నీరుంటుంది. ఇందులో విటమిన్ ఏ, విటమిన్– ఇ లు సమృద్ధిగా ఉంటాయి. స్ట్రాబెర్రీలు రుచికరంగా ఉండటమే కాకుండా, 90% నీటిని కలిగి, రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్– ఇ ని కలిగి ఉంటాయి. పియర్స్లో 83% నీరు ఉంటుంది. వీటిల్లో ఫైబర్, నీరు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండటమే కాకుండా, తగినంత నీటి శాతం (73%) కూడా ఉంటుంది. ఇదీ చదవండి: యువతి కారుణ్య మరణం, చివరి కోరిక తెలిస్తే కన్నీళ్లాగవుకేవలం దాహం వేసినప్పుడే నీరు తాగడం కాకుండా, ఈ పండ్లు, కూరగాయలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరం రోజంతా హైడ్రేటెడ్గా, ఉత్సాహంగా ఉంటుంది.ఇదీ చదవండి: గ్రేట్ ప్లాన్ : తక్కువ అద్దె, బోలెడన్ని లాభాలు -
స్ట్రాబెర్రీ టైగర్ను చూసారా?
ఈ అందమైన పులిని చూసారా? దీని పేరు ‘అవా’. ఇప్పుడు ఇది సోషల్ మీడియా స్టార్. థాయిలాండ్లోని ‘చియాంగ్ మై నైట్ సఫారి’లో ఉన్న ఒక అరుదైన పులి ఇప్పుడు ఇంటర్నెట్లో సంచలనం అవుతోంది. దాని అందమైన రూపాన్ని చూసి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ‘అవా’ అనే మూడేళ్ళ ఈ బంగారు వర్ణం పులిని అందరూ ‘స్ట్రాబెర్రీ టైగర్’ అని ముద్దుగా పిలుస్తున్నారు. పులులు సాధారణంగా నారింజ, నలుపు గీతల్లో ఉంటాయి. ఇది అలా లేదు. తన క్యూట్ లుక్ తో సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయింది. చాలా మంది అవాను తమ జీవితంలో చూసిన అత్యంత అందమైన జంతువుల్లో ఒకటిగా అభివర్ణిస్తున్నారు.అవా ఫిబ్రవరి 16, 2021న తన సోదరి లూనాతో కలిసి జన్మించింది. అవా తల్లిదండ్రులను కొన్ని సంవత్సరాల క్రితం వేర్వేరు దేశాల నుండి ఈ సఫారి పార్క్కు తీసుకువచ్చారు. వాటి జన్యు నిర్మాణం (జెనెటిక్ మేకప్) అవాకు వచ్చిన ప్రత్యేకమైన గోల్డెన్ రంగుకు కారణంగా భావిస్తున్నారు. నిపుణుల ప్రకారం, గోల్డెన్ పులులు వైట్ టైగర్ల కంటే కూడా అరుదైనవి.చియాంగ్ మై నైట్ సఫారి సందర్శించిన వారు సోషల్ మీడియాలో అవాను చాలా ఆటపాటలతో ఉండే, స్నేహపూర్వక పులిగా వర్ణించారు. దాని మృదువైన రూపం వల్ల పర్యాటకులకు దాన్ని అమితంగా ఇష్టపడుతున్నారు. కొందరు ఈ పులిని చూసి ‘‘ఇది పులి కంటే ఒక పెంపుడు పిల్లిలా కనిపిస్తోంది’’ అని సరదాగా అన్నారు. మరికొందరు ఇంత అందమైన పులి నిజంగా ఉందనే విషయాన్ని నమ్మలేకపోతున్నారు. -
అలా అనుకున్నాడు... సుందరం ఇలా అయ్యాడు... పాపం!
హైదరాబాద్లోని బోరబండ చౌరస్తా దాటి వెళుతున్న సుందరం దృష్టి ఒక మూలన ఉన్న చెత్తకుప్పపై పడింది. ఆ చెత్తకుప్పపై మెరుస్తున్న దీపం ఒకటి కనిపించింది.‘కొంపదీసి... ఇది అల్లావుద్దీన్ అద్భుతదీపం అయితే కాదు కదా!’ అనుకున్నాడు మనసులో.‘యస్’ అనే మాట నలుమూలలా రీసౌండ్ ఇచ్చింది.పరుగులాంటి నడకతో అక్కడికి వెళ్లి ఆ దీపాన్ని చేతిలోకి తీసుకున్నాడు సుందరం.‘కమాన్... టెల్మీ... ఏం కావాలో కోరుకో’ అని అడిగింది దీపంలోని జిన్నీ భూతం.‘ఎన్ని కోరికలైనా కోరుకోవచ్చా?’ ఆత్రంగా అడిగాడు సుందరం,‘యస్’ అని చెప్పింది జిన్నీ....సుందరం తన కోరికల చిట్టా విప్పాడు.‘నాకు ప్రపంచంలో ఏ భాష అయినా తెలిసి ఉండాలి’ అడిగాడు సుందరం.జిన్నీ: ఓకే.‘నాకు బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం. కానీ వేయడం రాదు. నేను ఏ బొమ్మ అయినా స్పీడ్గా గీసేలా వరం ఇవ్వు’జిన్నీ: ఓకేపోరపాట్లు చేయడం తప్ప నాకు సలహాలు ఇవ్వడం రాదు. ఎవరు ఏ సలహా అడిగినా సలహా ఇచ్చే శక్తి ఇవ్వు’జిన్నీ: ఓకేసుందరం:‘ఎవరి గొంతునైనా ఈజీగా ఇమిటేట్ చేయాలి’‘పాటలు అలవోకగా రాసే టాలెంట్ ఇవ్వు’‘సినిమాలకు స్క్రీన్ప్లే రాసే టాలెంట్ ఇవ్వు’‘సినిమా కథలు రాసే టాలెంట్ ఇవ్వు’‘పుస్తకాలు రాసే టాలెంట్ ఇవ్వు’‘అద్భుతమైన గ్రాఫిక్స్ సృష్టించే టాలెంట్ ఇవ్వు’‘అద్భుతమైన ప్రేమ లేఖలు రాసే అదృష్టం ఇవ్వు’‘ఏఐ గురించి నాకు బొత్తిగా తెలియదు. అలాంటి నాకు ఏఐ క్లాసులు చెప్పే శక్తి ఇవ్వు’‘నేను అందంగా లేకపోయినా చాలా అందంగా కనిపించే వరం ఇవ్వు’జిన్నీ: ఓ... ఓ... ఓ...కట్ చేస్తే....బోరబండ వాసి అయిన సుందరం అక్కడెక్కడో అమెరికాలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘ఓపెన్ ఏఐ’లో చాట్బాట్గా మారిపోయాడు!!!!!‘ఇది అన్యాయం, అక్రమం, దారుణం, దుర్మార్గం, రాజ్యాంగ విరుద్ధం, శోచనీయం, గర్హనీయం, అమానవీయం, ఆక్రోశనీయమ్’..... అంటూ ఏడుపు అందుకున్నాడు సుందరం.అప్పుడు జిన్నీ భూతం ప్రత్యక్షమై... ‘నువ్వు ఏం కోరుకున్నావో... అవన్నీ చాట్జీపీటీ చేస్తుంది. అందుకే ఆల్ ఇన్ వన్గా చాట్జీపీటిగా మార్చాను’ అని చావు న్యూస్ చల్లగా చెప్పి మాయమైంది.– యాకుబ్ పాషా


