breaking news
Family
-
7 సీక్రెట్స్ : ప్రేమించే భార్య, కొంచెం లక్తో సెంచరీ కొట్టేశా!
వందేళ్లు ఆరోగ్యంగా బతికిన ఓ పెద్దాయన నా దీర్ఘాయువుకు కారణాలివే అంటూ ఏడు చిట్కాలను పంచుకున్నాడు. అమెరికాకు చెందిన శతాధిక వృద్ధుడు సి లిబర్మాన్, జీవిత అనుభవాలు, ఆచరణ, ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.అక్టోబర్ 13న ది వాషింగ్టన్ పోస్ట్ వ్యాసంలో 101 ఏళ్లు ఆరోగ్యంగా జీవించిన సి లిబర్మాన్ తన దీర్ఘాయుష్షు రహస్యాలు సోషల్ మీడియాలో విశేషంగా నిలిచాయి. ఈయన రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. ఈ సందర్బంలో ముఖ్యంగా నాజీ జర్మనీపై శత్రువుల కాల్పుల నుండి బయటపడటం, తీవ్రమైన మాంద్యం పరిస్థితులు తదితర విషయాలను షేర్ చేశాడు. అంతేకాదు ఆరోగ్యపరంగా కూడా కష్టాలు తప్పలేదు. గుండెపోటు, కోమాలోకి వెళ్లి బయటపడటం లాంటి అద్భుతమైన జీవిత అనుభవాలు ఉన్నాయి.. ఆయన దీర్ఘాయువుకు కారణమైన ఏడు చిట్కాలుసంబంధాలపై దృష్టి (Focus on relationships): బంధాలు అనుబంధాలపై దృష్టిపెట్టడం ఈ విషయంలో తాను చాలా అదృష్టవంతుడినని తెలిపారు. 76 వైవాహిక జీవితంలో ఎంతో సన్నిహితంగా ఉండే భార్య డోరతీ(97), అద్భుతమైన ఇద్దరు పిల్లలు, మరెంతో ప్రేమగా ఉండే మనవరాళ్లు తన జీవితాన్ని ప్రభావితం చేశారన్నారు. View this post on Instagram A post shared by The Washington Post (@washingtonpost)సిగరెట్ తాగవద్దు (Don't Smoke) : ధూమపానం చేయకపోవడమే ప్రదానమైంది. తన చిన్నతనంలో తన స్నేహితులు దాదాపు అందరూ ధూమపానం చేసినా తాను మాత్రం దాని జోలికి పోలేదని తెలిపారు. పెళ్లికాకముందు తన భార్య అప్పుడప్పుడు ధూమపానం చేసేదనీ , మెల్లిగా దాన్ని తాను మానిపించగలిగానని చెప్పారు.వ్యాయామం, ఆహారం (Exercise and eat healthy): ఎల్లప్పుడూ ఆరోగ్యంగా తినడానికి ప్రయత్నించాలని సూచించారు. అల్పాహారంగా పండ్లు, ఆహారంలో ఎక్కువగా చేపలు ఉంటాయి. దీంతో పాటు 14 సంవత్సరాల క్రితం ఫ్లోరిడాకు వెళ్లినప్పటినుంచి బీచ్లో నడవడం, స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టడం లాంటివి ఉన్నాయని చెప్పారు.సానుకూల దృక్పథం (positive attitude): ఎన్ని కష్టాలొచ్చినా, ఎప్పుడూ నిరాశ చెందలేదు. కష్టాల్లో జీవిస్తూనే పరిస్థితులు మెరుగు పడతాయనే సానుకూల వైఖరి మంచి ఫలితాలనిస్తుందని చెప్పుకొచ్చారు.తగిన వైద్య సంరక్షణ (appropriate medical care) : ఆరోగ్య పరిస్థితులకనుగుణంగా చికిత్స తీసుకోవాలి. ఈ విషయంలో శాస్త్రీయ పురోగతి, ఆధునిక వైద్యం అద్భుతాలు నాకు చాలా లాభించాయి. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, వైద్య సలహాలు తీసుకోవాలన్నారు. నచ్చిన పని, మీనింగ్పుల్గా చేయడం (Do work you find meaningful): ప్రైవేట్ యాజమాన్యంలోని పత్రిక ఆస్బరీ పార్క్ సండే ప్రెస్కు ఎడిటర్గా పనిచేశా. 40 ఏళ్లకు పైగా జర్నలిస్ట్గా చాలెంజింగ్ అండ్ రివార్డింగ్ జాబ్ అది చాలా ఇష్టం చేశా. ఇప్పటికీ బిజీగా ఉండటానికి రాస్తాను.కొంచెం అదృష్టం (Be a little lucky): నిజంగా భార్యతో చాలా అందమైన జీవితాన్ని గడిపాను. ఆమె కొన్ని జ్ఞాపకశక్తి సమస్య ఉన్నా, రాత్రి నిద్రపోయే ముందు నన్ను ముద్దు పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. మనల్ని ప్రేమించే, మన గురించి కేర్ తీసుకునే మనిషితో జీవించడం దీర్ఘాయువుకు చాలా తోడ్పడతుంది అంటారాయన. -
ఈ దీపావళి స్వీట్స్ కిలో ఏకంగా రూ. 1.1 లక్షలు? ఎందుకింత ఖరీదంటే..
దీపావళి పండుగంటే టపాసులు ఖర్చు కాదు.. ఈ వెరైటీ స్వీట్స్ కూడా అంతే ఖరీదు. నిజానికి లక్ష్మీ దేవి పండుగ అయినా ఈ దీపావళి రోజున బంగారం, వెండి కొంటుంటారు కొందరు. కానీ ఆ బంగారాన్నే ఆస్వాదించేలా తయరు చేస్తోంది ఈ ప్రసిద్ధ స్వీట్స్ స్టాల్. వీటిని బంగారం, వెండిపూతతో ఆస్వాదించేలా తయారు చేస్తున్నారు. ఈ తియ్యటి మిఠాయిల ఖరీదు ఎంతో తెలిస్తే గుండెల్లో టపాసులు పేలినంతం పనవ్వుతుంది. వామ్మో..! ఇంత ఖరీదా అనిపిస్తుంది. మరి ఆ కథాకమీషు ఏంటో చూసేద్దామా..!.త్యోహార్ జైపూర్ స్వీట్స్ స్టాల్ ఈ ఖరీదైన స్వీట్లను అందిస్తుంది. ముఖ్యంగా ఈ దీపావళి పండుగ సీజన్లో ఈ స్వీట్స్ మహా ఫేమస్. బంగారు ఆభరణాలను ధరించడమే కాదు నోటిలో కరిగిపోయేలా కూడా ఆస్వాదించొచ్చు అనేలా అందిస్తోంది ఈ ప్రసిద్ధ స్వీట్ షాప్. అంజలి జైన్ అనే మహిళ ఈ వెరైటీ స్వీట్లకు శ్రీకారం చుట్టింది. ఈ గోల్డ్ స్వీట్స్ సిరీస్లో అత్యంత ఖరీదైన స్వీట్ స్వర్ణ ప్రసాదంగా పిలిచే మిఠాయి. దీని ధర కిలోగ్రాముకు రూ. 1,11,000 పలుకుతుంది. చదరపు ఆకారంలో ఉండే ఈ స్వీట్ తినాలంటే అంత ఖర్చు చేయక తప్పదు. ఇవి ఆరోగ్యానికి ఆరోగ్యం, రాయల్టీని అందించే స్వీట్స్ ఇవి. ఆయుర్వేదంలో స్వర్ణ భస్మం అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలది అని చెబుతుంటారు. ఆ నేపథ్యంలోనే ఇలా స్వీట్స్ తయారీలో లోహాలను వినియోగిస్తున్నట్లు చెబుతోంది ఈ స్వీట్స్ సృష్టికర్త అంజలి. వీటిని ప్యాక్ చేసే బాక్స్లు సైతం అత్యంత విలక్షణంగా బంగారుపెట్టెలను తలపించేలా ఉండటం విశేషం. ఎవరీమె అంటే..చార్టర్డ్ అకౌంటెంట్(CA)గా తన కెరీర్ను ప్రారంభించి.. అనుకోకుండా పాకశాస్త్రంలోకి అడుగుప్పెట్టి తన క్రియేటివిటీకి పదును పెట్టింది. అలా తన రుచికరమైన వంటకాలతో ప్రంపంచాన్ని జయించాలని మహమ్మారి సమయంలో ఈ రంగంలోకి అడుగు పెట్టింది. తన సీఏ నేపథ్యం ఈ స్వీట్స్ వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి తోడ్పడిందని అంటోంది. ఇక తన ఉత్పత్తులన్నింటికి ప్రామాణికత ఉందని, సాధారణ వంటకాలకు తన సృజనాత్మకతను జోడించి విలక్షణంగా పరిచయం చేయడమే తన విజయ రహస్యమని చెబుతోంది. సంప్రదాయ వంటకాలకు ఆధునికతను జోడించి సక్సెస్ని అందుకున్నాని చెబుతోంది. ఈ స్వీట్స్లోని కొన్నింటి ఖరీదు..చాంది భస్మ్ భారత్ - ఒక్కో ముక్కకు రూ. 1,150స్వర్ణ్ భస్మ్ భారత్ - ఒక్కో ముక్కకు రూ. 1,950/ కిలోకు రూ. 85,00024 క్యారెట్ కాజు కట్లి - కిలోకు రూ. 3,50024 క్యారెట్ పిస్తా లోంజే - కిలోకు రూ. 7,00024 క్యారెట్ లడ్డూ - కిలోకు రూ. 2,500(చదవండి: ఆహా ఏమి రుచి..! నోరూరించే వివిధ రకాల వంటకాలు..) -
ఆయుష్మాన్ భవ.. ! కాలుష్యాన్ని జయిస్తున్న జీవన విధానం..
ఓ వైపు పెరుగుతున్న కాలుష్యం.. కల్తీ ఆహారం.. అనారోగ్య కారకాలు వంటివి మనిషి సగటు జీవన ప్రమాణాలను ఆయుర్దాయాన్ని దెబ్బతీస్తున్నాయి.. మరోవైపు ఆశ్చర్యకరమైన ఫలితాలను అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి. అయితే దీనికీ ఓ లెక్కుందండోయ్..? అదే ఆరోగ్యకరమైన జీవన విధానం.. అందుకు కావాల్సిన సౌకర్యాలు.. ప్రామాణికాలు.. గతంతో పోలిస్తే మెట్రో నగరాల్లో పలు వనరులు కాలుష్యానికి గురైనా.. మరోవైపు ప్రజల్లో పెరిగిన అవగాహన, విజ్ఞానం, వైద్య సౌకర్యాలు వాటిని అధిగమిస్తూ కొత్త అడుగులు వేయిస్తున్నాయి. ఫలితంగా మానవుని ఆయుఃప్రమాణాలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.. హైదరాబాద్తోపాటు దేశంలోని పదికి పైగా ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, కల్తీ ఆహారం వంటివి పెరుగుతూనే ఉన్నాయి. ఇది 3 నుంచి 4 శాతం సగటును నమోదు చేసుకుంటున్నాయి. అయితే అదే సమయంలో ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన సగటున ఆయుర్దాయాన్ని(Life Expectancy)పెంచడానికి దోహదం చేస్తున్నాయని, దీని వల్ల నగరాల్లో జీవన కాలాన్ని సగటున 70 నుంచి 75 సంవత్సరాలకు పెంచిందని లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ వంటి అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది వాస్తవానికి పూర్తి భిన్నంగా ఉన్నప్పటికీ అధ్యయన ఫలితాలు మాత్రం ఇది వాస్తవమని చెబుతున్నాయి. పూర్తి భిన్నంగా.. మహానగరాలు గాలి, నీరు, ఆహారం, శబ్ద కాలుష్యంతో నిండిపోయాయి. అయినప్పటికీ, గ్రామీణ ప్రాంత ప్రజలతో పోలిస్తే నగర ప్రజల ఆయుః ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయని పరిశోధనలే చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తాజా అధ్యయనాలు పరిశోధకులను, ఆరోగ్య నిపుణులను విస్తుపోయేలా చేస్తున్నాయి. పట్టణాల కంటే మెరుగైన వాతావరణ పరిస్థితులు పల్లెల్లో ఉంటాయనేది అందరికీ తెలిసిన వాస్తవం.. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అలాంటి ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ.. ఈ ఫలితాలు ఉండడం నిజంగా ఆశ్చర్యకరమే.. అయితే ఫలితాలు చెప్పే వాస్తవాలను ఓ సారి పరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు. దీనికి జీవన ప్రమాణాల్లో పెరుగుతున్న నాణ్యత అవగాహనే కారణమని తెలుస్తోంది. సర్వే చెబుతోన్నదేంటి!? గతేడాది ప్రచురితమైన బీఎమ్సీ పబ్లిక్ హెల్త్ నివేదిక ప్రకారం.. దేశంలో అధిక ఆదాయం ఉన్న నగర ప్రాంతాల ప్రజలు గ్రామీణ ప్రజలకంటే సగటున 7.5 సంవత్సరాలు ఎక్కువ జీవిస్తున్నారని తేలి్చంది. మెరుగైన ఆర్థిక స్థిరత్వం, ఆరోగ్యపై పెరుగుతున్న చైతన్యం, ఆరోగ్య బీమా, మెరుతైన ఆహారం, వ్యాయామం వంటి అంశాలే కారణాలు ఇందుకు కారణాలుగా పరిశోధనలు చెబుతున్నాయి. హైదరాబాద్లో ఐటీ, ఫార్మా, వంటి ఇతర సరీ్వస్ రంగాల ఉద్యోగాలు మధ్యతరగతి ప్రజల జీవన విధానం, ఆలోచనా ధోరణిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటితోపాటు నగరంలో ప్రభుత్వాలు చేపట్టే ‘క్లీన్ ఎయిర్ ప్లాన్’, ‘హరిత హైదరాబాద్’ వంటి ప్రాజెక్టులు కూడా ఓ ముఖ్య భూమికను పోషిస్తున్నాయని, దీంతో పాటు ప్రజల్లోనూ ఆరోగ్యంపై వ్యక్తిగత శ్రద్ధ పెరిగిందని, వ్యాయామం, నిద్ర, ఆహార నియమాలు మెరుగైన ఫలితాలకు దోహదం చేస్తున్నాయని తెలుస్తోంది. అవగాహన లేమి.. నగరాలతో పోలిస్తే గామీణ ప్రాంతాలు వెనుకబడడానికి అసలు కారణం అవగాహనా లేమి.. మెరుగైన సౌకర్యాలు లేకపోవడం, ఆదాయ వనరులు, వ్యక్తి శుభ్రత ప్రభావం చూపుతున్నాయని తెలిసింది. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే.. సరైన అవగాహన లేక, సదుపాయాలు లేక, ఆయా సమస్యలను, ఆరోగ్య పరిస్థితులను సరైన సమయంలో గుర్తించక ప్రాణాపాయ స్థితికి చేరుతున్నారని, పల్లెతో పోలిస్తే వైద్యు సేవలు, డిజిటల్ కన్సల్టేషన్, టెక్నాలజీ, టెలీమెడిసిన్, ఫిట్నెస్ సెంటర్లు, యోగా వంటివి ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రజలకు తెలిసిన వాస్తవ కోణం.. పర్యావరణ, కాలుష్య నియంత్రణ బోర్డు తాజా గణాంకాల ప్రకారం హైదరాబద్ నగర గాలిలో నాణ్యత ‘మోస్తరు నుంచి హానికర స్థాయికి’ మధ్యలో ఊగిసలాడిందని తెలిపింది. జలాశయాలైన హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్, ముసీ నది కాలుష్యానికి గురవుతున్నాయని ఎమ్ఏఎన్యూయూ పరిశోధకులు వెల్లడించారు. పారిశ్రామిక వ్యర్థాలు, డ్రైనేజ్ నీరు, రసాయన అవశేషాల వల్ల భూగర్భజలాలు కూడా కలుషితమౌతున్న విషయం తెలిసిందే. ఆహార విషయంలోనూ హానికర రసాయనాలు నగర మార్కెట్లో మితిమీరిన స్థాయిలో ఉన్నాయని ఫుడ్ సేఫ్టీ విభాగం తెలిపింది. వ్యక్తిగత భద్రత ముఖ్యం.. విజ్ఞానం, సాంకేతికత ద్వారా అందే ఫలాలను అందరూ అందుకోగలగాలి. అప్పుడే జీవిత కాలం పెరగడంతో పాటు, ఒక మెరుగైన జీవితాన్ని అనుభవించగలరు. ఇందుకు విద్య, ఆరోగ్యం పట్ల అవగాహన, పరిసరాల–వ్యక్తిగత పరిశుభ్రత వంటివి చాలా ముఖ్యం.! అందుకే కాలుష్యం అధికంగా ఉన్న పట్టణాల కంటే గ్రామాల్లో ఆయుఃప్రమాణాలు తక్కువ.! పట్టణాల్లో కాలుష్యం తగ్గించే ప్రయత్నాలతో పాటు, గ్రామాల్లో కూడా మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటే, గ్రామ ప్రజల ఆయుర్దాయం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. – డా.ప్రతిభా లక్ష్మి, జనరల్ మెడిసిన్ – ప్రొఫెసర్ -
అకేషన్ ఏదైనా సరే.. బొమ్మలతో కళ
బొమ్మలు మాట్లాడవు.తమ గురించి మాట్లాడేలా చేస్తాయి.అలా మాట్లాడాలంటే ఆర్టిస్ట్లో అద్భుత సృజన ఉండాలి. అలాంటి ఒక ఆర్టిస్ట్ ఆమదాలవలసకు చెందిన ప్రియాంక.శుభకార్యాలకు తగ్గట్టు రకరకాల థీమ్స్తో బొమ్మల సిరీస్ రూపొందిస్తూ పాతకళకు కొత్త కళ తీసుకువస్తోంది ప్రియాంక...‘చిన్నప్పుడు ఆడుకున్న ఆటల్లో బొమ్మలే నా బతుకు బండిని నడిపిస్తాయని నేను అసలు ఊహించనే లేదు’ అంటుంది ప్రియాంక. బొమ్మల ద్వారా నేటి తరానికి సంప్రదాయ విలువలను వివరించడంలో ఆనందం ఉందంటారు ఆమె. తన మనసులో మెదిలిన ఊహకు సృజనాత్మకంగా ప్రాణం పోస్తూ, బొమ్మలను థీమ్కు తగ్గట్టు రూపొందిస్తూ వినియోగదారుల మనసు గెలుచుకుంటుంది ప్రియాంక. ఆ బొమ్మలు సనాతన సంప్రదాయాలకు ప్రతీకలుగా కనిపిస్తాయి. కనుమరుగ వుతున్న కళలు కళ్లముందు కనబడతాయి.అనుబంధాల రైలుబండికాంక్రీట్ జంగిల్లో న్యూక్లియిర్ ఫ్యామిలీల నడుమ దూరమవుతున్న అనుబంధాలు ప్రియాంక తయారుచేసే బొమ్మలతో గుర్తుకు వస్తాయి. ఆమదాలవలసకు చెందిన ఒక పెద్దాయన 60వ పుట్టిన రోజు వేడుకను భిన్నంగా చేయాలని కుటుంబ సభ్యులు ఆలోచించారు. ప్రియాంకకు విషయాన్ని వివరించారు. అరవై ఏళ్లలో జరిగిన ఘట్టాలను అద్భుతమైన రీతిలో బొమ్మల రూపంలో కళ్లకు కట్టేలా తీర్చిదిద్దింది ప్రియాంక. అన్నప్రాసన వేడుక నుంచి పదవీ విరమణ వేడుక వరకు... ఆ పెద్దాయన జీవితంలోని వివిద దశలను చిన్న రైలుబండి మాదిరిగా బొమ్మల్లో తయారు చేసి శభాష్ అనిపించుకుందిజచదవండి: మొరింగా సాగుతో.. రూ. 40 లక్షల టర్నోవర్తాళికట్టు శుభవేళపలాసకు చెందిన ఒక వ్యాపారి నూతన గృహ ప్రవేశ వేడుకను భిన్నంగా చేయాలనుకున్నాడు. కాన్సెప్ట్ను వివరించాడు. బిల్డింగ్ నమూనా నుంచి సత్యనారాయణ వ్రతం, గో మాత ప్రవేశంతో సహా అన్నింటిని చక్కని బొమ్మలతో కళ్లకు కట్టింది ప్రియాంక. శుభకార్యానికి వచ్చిన అతిథులంతా ఈ థీమ్ను చూసి భలే ముచ్చట పడ్డారు. శ్రీకాకుళం నగరంలోని ఒక కార్పొరేట్ బ్యాంక్లో నవరాత్రి పూజలు నిర్వహించాలని బ్యాంక్ సిబ్బంది భావించారు. రెండు రోజులు కష్టపడి నవరాత్రి వేడుకల థీమ్ను తయారు చేసి బ్యాంక్ను లక్ష్మీనిలయంగా మార్చింది ప్రియాంక. వివాహ వేడుకకు ప్రారంభ ఘట్టమైన గోధుమరాయి కార్యక్రమం నుంచి తాళికట్టు శుభవేళ వరకు తయారు చేసిన వెడ్డింగ్ సెట్ ప్రియాంక స్పెషల్. ఆ సెట్ చూస్తే మన కళ్లముందే పెళ్లి జరిగినంత సంబరం మన సొంతం అవుతుంది.చదవండి: అంబానీ వంటింట్లో పెత్తనం పెద్ద కోడలిదా? చిన్నకోడలిదా?ఇదే నా ప్రపంచంచిన్నప్పుడే కాదు పెద్దయ్యాక కూడా బొమ్మలను వదల్లేదు. అమ్మ సాయంతో వాటిని చక్కగా అలంకరించడం చిన్నప్పటి నుంచి నా అలవాటు. డిగ్రీ పూర్తయింది. ఉపాధి కోసం ఏదో ఒకటి చేయాలి అనుకున్నాను. బొమ్మలతోనే కొత్తగా ఏదైనా చేయాలనుకున్నాను. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. నా ఆలోచనలను నాన్నతో పంచుకున్నాను. ఆయన ప్రోత్సహించారు. వర్క్షాపులో కొంత భాగం నన్ను వినియోగించుకోమన్నారు. ఆర్టిస్టిక్గా షోరూమ్ను సిద్ధం చేశారు. విభిన్న రకాల థీమ్లను సిద్ధం చేశాను. సోషల్ మీడియా వేదికగా నేను తయారుచేసిన బొమ్మలను, ఫొటోలను షేర్ చేయడం మొదలుపెట్టాను. ఆర్డర్లు పెరిగాయి. బొమ్మల ద్వారా సంప్రదాయాల్ని వివరిస్తున్నందుకు ఆనందంగా ఉంది. – ప్రియాంక– దువ్వూరి గోపాలరావు,సాక్షి, శ్రీకాకుళంఫొటోలు: జయశంకర్ కుప్పిల -
ఆహా ఏమి రుచి..! నోరూరించే వివిధ రకాల వంటకాలు..
నోరూరించే వివిధ రకాల వంటకాలకు నగరం వేదికైంది.. పాకశాస్త్రంలో ప్రావీణ్యం పొందిన పలువురు చెఫ్లు వివిధ ప్రాంతాల వంటకాలతో ఆకట్టుకున్నారు. అంతర్జాతీయ చెఫ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని భాగ్యనగరంలోని సనత్నగర్లో అగ్రోమెచ్ స్టూడియో తెలంగాణ, ఆంధ్ర చెఫ్ల వంటకాలకు గురువారం వేదికైంది. అత్యంత ఘనంగా నిర్వహించిన కార్యక్రమం చెఫ్ల ఐక్యత, వారసత్వ కళ, పాకశాస్త్రానికి వేదికగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన చెఫ్లు కేవలం వేడుక జరుపుకోవడానికి మాత్రమే కాకుండా, ఒకరికొకరు కనెక్ట్ అవ్వడానికి, మెరుగైన భవిష్యత్తుకు తమ అనుభవాలను పంచుకున్నారు. పాకశాస్త్రంలో పేరెన్నికగన్న చెఫ్స్ కాశీ విశ్వనాథన్, శేఖర్, సంజయ్ తుమ్మ, సుధాకర్ ఎన్.రావు, మిస్టర్ పాల్గుణి నాయుడు, సుధా కుమార్, మిస్టర్ అన్మోల్ ప్రభు, మిస్టర్ కళ్యాణ్ చక్రవర్తి, రవీందర్ రెడ్డి వంటి ప్రఖ్యాత చెఫ్లు, ముఖ్య అతిథులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరంతా పాక శాస్త్రం, ఆరోగ్యం, ఆవిష్కరణల పరిణామంపై ప్రభావవంతమైన సూచనలను అందించారు. ఆహారం అంటే పోషకాహారం మాత్రమే కాదు, సంరక్షణ, సృజనాత్మకత, స్థానిక భాష.. అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, ప్రొఫెషనల్ చెఫ్లతో పోటీ పడుతూ తమ పాక శాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. అనుభవజ్ఞులైన చెఫ్ల నేతృత్వంలోని ఇంటరాక్టివ్ షేరింగ్ సెషన్స్, మనదైన వారసత్వ వంటకాలను పంచుకున్నారు. బెస్ట్ వంటకాల ప్రదర్శన చేసిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించారు. చెఫ్ల మధ్య సోదరభావాన్ని ఏర్పరిచింది. ఈ సందర్భంగా సీఏటీఏ వ్యవస్థాపకుడు, ప్రధాన కార్యదర్శి చెఫ్ యాదగిరి మాట్లాడుతూ ‘అంతర్జాతీయ చెఫ్ దినోత్సవం కేవలం ఒక వేడుక కాదు.. ఇది ఓ కుటుంబం, ఆహారానికీ జీవం పోసే ప్రతి కళాకారుడినీ వృద్ధిలోకి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశం’ అన్నారు. చెఫ్స్ ఐక్యత, సేవా సందేశంతో తెలంగాణ, ఆంధ్ర అంతర్జాతీయ చెఫ్ దినోత్సవం– 2025 వేడుకను ముగింపుగా కాకుండా ఒక ప్రారంభ సూచికగా నిలిచింది.. (చదవండి: ప్రపంచ ఆరోగ్య వేదికపై ప్రసంగించిన తొలినటి...! ఏం మాట్లాడారంటే..) -
ప్రపంచ ఆరోగ్య వేదికపై ప్రసంగించిన తొలినటి...! ఏం మాట్లాడారంటే..
చలం, అంబేద్కర్ల నుంచి నటి, ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) జెండర్ ఈక్వాలిటీకి ఈ దేశపు రాయబారి కృతిసనన్ దాకా అందరి మాటా ఒకటే స్త్రీ ఆరోగ్యమే దేశ భవిష్యత్ భాగ్యం అని!నిజానికి మహిళా ఆరోగ్యం, లింగ సమానత్వం గురించి మాట్లాడుకోవడానికి ప్రత్యేక సందర్భం అక్కర్లేదు.. అయినా ఈ ప్రస్తావనకు ప్రత్యేక సందర్భమూ ఉంది. అదే బెర్లిన్ (జర్మనీ)లో జరిగిన వరల్డ్ హెల్త్ సమ్మిట్ 2025. ఇందులో ఆమె మహిళల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం గురించి మాట్లాడారు. ఇలా వరల్డ్ హెల్త్ సమ్మిట్లో ప్రసంగించిన తొలి భారతీయ నటిగా కీర్తి గడించారు. ఆ ప్రసంగంలో కీర్తి సనన్ ఏం మాట్లాడారంటే.. ‘మహిళల ఆరోగ్యం నిర్లక్ష్యం చేయాల్సిన లేదా పక్కన పెట్టాల్సిన విషయం కాదు. తక్షణమే దృష్టిపెట్టాల్సిన అత్యంత అవసరమైన అంశం. ఆమె ఆరోగ్యం.. మానవాళి ప్రగతికి, భవిష్యత్కు మూలస్తంభం. అందుకే మహిళా ఆరోగ్యానికి సంబంధించి సుస్థిరమైన పెట్టుబడులు కావాలి. ఆవిష్కరణలు జరగాలి. ఇందుకోసం చేసే ప్రతి ప్రయత్నం అద్భుతమైన ఆర్థిక, సామాజిక మార్పులుగా ప్రతిఫలిస్తుంది. ఏటా ముప్పై కోట్లు ఇన్వెస్ట్ చేస్తే పదమూడు వందల కోట్ల రాబడి కనిపిస్తోంది. అంటే దాదాపు తొమ్మిది రెట్ల లాభం. ఈ ఇన్వెస్ట్మెంట్ నైతికావసరమే కాదు మన మూకుమ్మడి భవిష్యత్కు భరోసా కూడా! ఎందుకంటే మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాలు, సమాజం.. ఆరోగ్యంగా ఉంటాయి. ఆరోగ్యవంతమైన సమాజం ఆర్థికసుస్థిరతకు చిహ్నం. కానీ ప్రపంచ జనాభాలో సగంగా ఉన్న మహిళల ఆరోగ్యం ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతూనే ఉంది. యూఎన్ఎఫ్పీఏ జెండర్ ఈక్వాలిటీ అంబాసిడర్గా చాలా ప్రాంతాలు తిరిగాను. అవన్నీ కూడా బాల్యవివాహాలకు సాక్ష్యంగా కనపడ్డాయి. అమ్మాయిలకు మానసిక ఆరోగ్యం సంగతి అటుంచి కనీసం శారీరక ఆరోగ్య కేంద్రాలు కూడా అందుబాటులో లేని దుస్థితిలో ఉన్నాయి. వీళ్ల జీవితాలు మారాలంటే మహిళల ఆరోగ్యానికి సంబంధించి దృష్టి పెరగాలి. తక్షణమే ఆ దిశగా కార్యాచరణ నిర్ణయాలు జరగాలి’ అన్నారు కృతిసనన్. (చదవండి: 'జోంబీ' డ్రగ్ జిలాజైన్: అచ్చం 'జాంబీ రెడ్డి' మూవీ సీన్ని తలపించేలా..) -
ఇంటిపని నుంచి తోటపని వరకు...'ఫిగర్ వో 3'
‘ఫిగర్ ఏఐ’ అనేది హ్యూమన్ రోబోలకు సంబంధించిన స్టార్టప్. తాజాగా ‘ఫిగర్ వో 3’ అనే హ్యూమన్ రోబో గురించి ప్రకటించింది కంపెనీ. ‘రోజువారీ అవసరాలకు ఉపయోగపడే సాధారణ హ్యూమనాయిడ్ రోబో ఇది. గదిని శుభ్రం చేయడం, మొక్కలకు నీళ్లు పెట్టడం, ఆహారాన్ని వడ్డించడం, గిన్నెలు కడగడం, బట్టలు మడత పెట్టడం...మొదలైన ఎన్నో పనులు చేస్తుంది’ అని ‘ఫిగర్ వో 3’ వివరాలు వెల్లడి చేసింది కంపెనీ.కాలిఫోర్నియాకు చెందిన ‘ఫిగర్ ఏఐ’ స్టార్టప్ మునుపటి తరం హ్యూమనాయిడ్లతో పోల్చితే సరికొత్త, సాంకేతికంగా ఒక అడుగు ముందుండే హ్యూమనాయిడ్స్ దృష్టి పెట్టింది. పూర్తిగా రీడిజైన్ చేసిన సెన్సరీ సూట్, హ్యాండ్ సిస్టమ్, నెక్ట్స్ జనరేషన్ విజన్ సిస్టమ్తో ఈ సరికొత్త హ్యూమనాయిడ్ రోబో మార్కెట్లోకి అడుగు పెట్టనుంది. (చదవండి: పండుగంతా నిండుగా..ఈ చీరకట్టులో మెరుద్దాం ఇలా..!) -
పండుగంతా నిండుగా..ఈ చీరకట్టులో మెరుద్దాం ఇలా..!
పండగలకు, సంప్రదాయ వేడుకలకూ నిండైన హుందాతనాన్ని తీసుకువచ్చేలా కట్టూ బొట్టు విషయంలో అతివలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ దీపావళి వేళ మరింత స్పెషల్గా కనిపించాలనుకునే వారికోసం బెంగాలీ చీరకట్టు ఆధునికతనూ అద్దుకొని కొంగొత్తగా మెరిసి΄ోతుంది. సెలబ్రిటీ లూ ముచ్చటపడే ఈ కట్టుకు వారు జోడించే హంగులు ఇవి... పండగలు, ఇతర సంప్రదాయ వేడుకలలో బెంగాలీ స్టైల్ చీర కట్టును దేశవ్యాప్తంగా మహిళలు ధరించడానికి ఇష్టపడుతున్నారు. ఉత్తేజాన్ని కలిగించే ఎరుపు–తెలుపు కాంబినేషన్లో ఉండే ఈ చీర కట్టు, నుదుటన పెద్ద బిందీ, శంఖం ఆకృతిలో నెక్ డిజైన్, చీర పల్లూకున్న అందమైన డిజైన్.. ఇవన్నీ పండుగను మరింత ప్రత్యేకంగా చేస్తాయి. దుర్గాపూజల సమయాల్లో ఈ రంగు చీరలను బెంగాలీలు ప్రత్యేకంగా ధరిస్తారు. ఆ స్టైల్ కట్టును ఇప్పుడు లక్ష్మీ పూజలు, వివాహ వేడుకల సమయాల్లో ధరించడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఈ కట్టును మనం అనుసరించాలంటే మాత్రం ఈ సూచనలు తప్పక అవసరం.ఎంపికలో సరైన చీరపూజలు, నోములు, వ్రతాల సమయంలో ఎరుపు అంచుతో ఉన్న తెలుపు లేదా ఆఫ్–వైట్ బేస్ చీరను ఎంచుకోవాలి. అంచు ఉన్న కాటన్, పట్టు లేదా టస్సర్ చీరలు ఈ బెంగాలీ లుక్కు సరైనవి. వీటిలో మనవైన చేనేతలు కూడా ఉండవచ్చు. ఈ చీరకట్టు సౌకర్యంగా ఉండటమే కాకుండా పూజ, పండగల సమయాల్లో రోజంతా ధరించడం సులభం కూడా.కట్టుతో కట్టడిబెంగాలీ స్టైల్లో నిజమైన ఆకర్షణ దాని డ్రేపింగ్ శైలిలోనే ఉంటుంది. చీర కుచ్చిళ్ల నుంచి ఎడమ వైపుగా, పొడవాటి పల్లూను ఛాతీ మీదుగా భుజం వరకు తీసుకుంటూ వెళ్లాలి. పొడవాటి పల్లూ భాగాన్ని కుడి చేతి భుజం కిందుగా తీసి, పైకి అంచు భాగం కనిపించేలా బ్లౌజ్కు జత చేయాలి. పొడవుగా తీసుకున్న కొంగు భాగాన్ని కుడి చేత్తో ముందుకు తీసుకువచ్చి పట్టుకోవడం కూడా ఈ కట్టులో అందంగా కనిపిస్తుంది. భుజం మీదుగా తీసిన పల్లూని కొప్పుకు అటాచ్ చేసి, ఎడమ భుజం కిందుగా తీసుకురావచ్చు. ఈ కట్టు లలనల రూపాన్ని మరింత సంప్రదాయంగా మారుస్తుంది. డ్రేపింగ్ చేసేటప్పుడు, కుచ్చుల భాగం మడతలు లేకుండా సెట్ చేసి, పల్లూ చాలా తేలికగా ఉన్నట్టు చూసుకోవాలి.నగలపై ప్రత్యేక శ్రద్ధపెద్ద పెద్ద చెవి΄ోగులు, గాజులు, నెక్లెస్లు ఈ స్టైల్ చీరకట్టుకు రాయల్ టచ్ను జోడిస్తాయి. హెవీగా ఆభరణాలు అక్కర్లేదు అనుకుంటే పెద్ద చెవి΄ోగులు, గాజులు ఈ అలంకరణకు సరి΄ోతాయి.గుండ్రని వెడల్పాటి బిందీబెంగాలీ స్టైల్ డ్రేపింగ్ సంపూర్ణం కావాలంటే నుదుటన పెద్ద, గుండ్రని ఎరుపు బిందీ తప్పక ఉండాలి. ఇది పండుగల రోజుల్లో మొత్తం మేకప్ను పూర్తి చేస్తుంది. నుదుటిపై బిందీతో పాటు సిందూర్ చుక్కలను కూడా అదనంగా పెట్టడం వల్ల లుక్ మరింత మెరుగవుతుంది. ఈ లుక్కి ఎరుపు లేదా ముదురు గులాబీ రంగు బిందీ ఆకర్షణీయంగా కనిపిస్తుంది.హెయిర్ స్టైల్– మేకప్హెయిర్ స్టైల్ కోసం ఒక బన్ తయారు చేసి, దానిని మల్లె పువ్వులు లేదా ఎరుపు, తెలుపు పువ్వులతో అలంకరించవచ్చు. పువ్వులతో కాకున్నా హెయిర్ బన్కు హెయిర్ పిన్ జ్యువెలరీని జోడించడం ద్వారా అందాన్ని పెంచుకోవచ్చు. మేకప్ కోసం ఎరుపు లిప్స్టిక్, తేలికపాటి ఐ మేకప్ సరిపోతాయి. ధరించిన చీరకు మేకప్ సెట్ అవుతుందా అనేది సరి చూసుకుంటే చాలు. మెడలోనూ, చేతులకు ఎక్కువ నగల లేకుండా చూసుకుంటే చాలు. మీ రూపం ఆధునికతను అద్దుకున్న సంప్రదాయంతో కొంగొత్తగా మెరిసిపోతుంది. (చదవండి: బహుశా ఇదే చివరి దీపావళి పండుగ..! సమయం మించిపోతోంది.) -
పండగ రోజులు కదా...ఎర వేస్తారు!
పండగ కదా.... ఆన్లైన్ షాపింగ్ ప్రయత్నాలలో ఉన్నప్పుడు ‘ఫ్రీ దీ పావళి గిఫ్ట్’ అంటూ పాపప్ కనిపించవచ్చు. ‘ఈ ప్రశ్నలకు జవాబు చెప్పి దీపావళి బహుమతులు గెలుచుకోవచ్చు’ అనే ప్రకటన మెరుపులా మెరియవచ్చు.దీపావళిని పురస్కరించుకొని దుస్తుల నుంచి వస్తువుల వరకు ఆన్లైన్ షాపింగ్ ఊపందుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ మోసగాళ్లకు చేతినిండా పనే!పండగ రోజుల్లో ఆన్లైన్ స్కామ్లు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. నకిలీ ఈ–మెయిల్స్, టెక్ట్స్, కాల్స్ ద్వారా స్కామ్లు జరుగుతుంటాయి. ఈ పండగ సీజన్లో మోస్ట్ కామన్ స్కామ్... నకిలీ ఆర్డర్ లేదా అకౌంట్. మీ అకౌంట్ తాత్కాలికంగా నిలిపివేయబడిందని, ఆర్డర్కు పేమెంట్ వెరిఫికేషన్ అవసరమని పేర్కొంటూ హానికరమైన లింక్లను క్లిక్ చేసేలా, వ్యక్తిగత వివరాలు షేర్ చేసే విధంగా కస్టమర్లను ప్రేరేపిస్తారు.‘గత సంవత్సరం 55,000 ఫిషింగ్ వెబ్సైట్లను, 12,000 స్కామ్ ఫోన్ నంబర్లను బ్లాక్ చేశాం. పండగ సీజన్ ముందు ఆన్లైన్ స్కామ్లపై వినియోగదారులకు అవగాహన కలిగించడానికి ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్తో కలి పనిచేశాం’ అన్నారు అమెజాన్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ (లీగల్) రాకేష్ బక్షీ.‘స్కామర్లు నకిలీ షాపింగ్ వెబ్సైట్లను లేదా అమెజాన్, ఫ్లిప్కార్ట్లాంటి ప్రసిద్ధ బ్రాండ్లను అనుసరించి ఆన్లైన్ ప్రకటనలను సృష్టిస్తారు. నమ్మశక్యం కాని డిస్కౌంట్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. పరిమిత కాల ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తారు. ఒక కస్టమర్ ఆర్డర్ చేసి చెల్లింపు చేసిన తర్వాత నకీలి ప్రాడక్ట్స్ అందుతాయి. అసలు ఏమీ అందకపోవచ్చు కూడా. నకిలీ వెబ్సైట్లు తరచుగా అధికారిక బ్రాండ్ లోగోలు, ప్రాడక్ట్ ఇమేజ్లను, చట్టబద్దమైన సైట్లను తలపించేలా పాలిష్ చేసిన డిజైన్లను ఉపయోగిస్తాయి. కొందరు నిజమైన వెబ్సైట్ల లే అవుట్, డొమైన్ పేరును కూడా క్లోన్ చేస్తారు. తేడాను గుర్తించడం కష్టంగా ఉంటుంది’ అంటున్నారు సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ శుభంసింగ్.చాలామంది స్కామర్లు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఫేక్ ‘గివ్ అవే’ పోటీలు లేదా లక్కీ డ్రాల గురించి పోస్ట్ చేస్తారు. మీ బ్యాంక్ వివరాలను షేర్ చేయమని లేదా క్లెయిమ్ యువర్ ప్రైజ్ లింక్పై క్లిక్ చేయమని అడగవచ్చు. వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని ఎప్పుడూ షేర్ చేయవద్దు.అనుమానాస్పద ఎకౌంట్ల గురించి వెంటనే రిపోర్ట్ చేయండి. బ్లాక్ చేయండి. బ్యాంక్ స్టేట్మెంట్లను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోండి. -
అమ్మ... నాన్న... నాలుగో సింహం
అణువంత ప్రోత్సాహంతో అంతులేనన్ని విజయాలు సాధిస్తామని నిరూపించారు. అపజయాలెన్ని ఎదురైనా వెరవకుండా లక్ష్యాన్ని సాధించి చూ పారు. అమ్మానాన్నలు ఇచ్చిన ప్రోత్సాహం.. భరోసాతో దేశంలోనే అత్యున్నత సర్వీస్లలో ఒకటైన ఇండియన్ పోలీస్ సర్వీసెస్కు ఎంపికై శభాష్ అనిపించుకున్నారు. ఓ కూతురు కండక్టర్ అయిన తన తండ్రి కల నెరవేర్చితే... మరో కూతురు తన తండ్రి నుంచి పొందిన స్ఫూర్తితో సమాజ సేవకు సిద్ధమైంది.అమ్మ అండతో సాటి మహిళలకు భరోసాగా నిలిచే పోలీస్ అధికారి అవుతానని మరొకరు నిరూపించారు. నేషనల్ పోలీస్ అకాడమీలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న 174 మందిలో 77 ఆర్ఆర్ (రెగ్యులర్ రిక్రూటీస్) బ్యాచ్ ఐపీఎస్ అధికారులు నేడు నిర్వహించనున్న పాసింగ్ ఔట్పరేడ్తో (passing out parade) బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా బ్యాచ్లోని ముగ్గురు మహిళా ఐపీఎస్ల మనోగతం.. వారి మాటల్లోనే...అమ్మ ఇచ్చిన భరోసాతోనే ముందుకు వెళ్లా!నేను ఐపీఎస్ అధికారి అయ్యానంటే అందుకు వందశాతం మా అమ్మే కారణం. నేను ఓటమి పాలైన ప్రతిసారి నాలో ధైర్యాన్ని నింపింది అమ్మ. ఒత్తిడిలో కూరుకుపోయిన ప్రతిసారీ నాకు భరోసా ఇచ్చి నన్ను ఇక్కడివరకు నడిపింది మా అమ్మ నీతూశర్మే. నా పేరు జయశర్మ. నా స్వస్థలం హర్యానాలోని హిస్సార్. మా నాన్న ప్రమోద్ కుమార్ శర్మ. నాన్న డిస్ట్రిక్ట్ ఫుడ్ సప్లై కంట్రోలర్గా పనిచేస్తున్నారు. అమ్మ గృహిణి. నేను ఢిల్లీ యూనివర్సిటీలో బీఎస్సీ మ్యాథ్స్ ఆనర్స్, ఐఐటీ ఢిల్లీ నుంచి ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్ పూర్తి చేశాను. నాకు ఐపీఎస్ కావాలని చిన్ననాటి నుంచే కల. అమ్మ ప్రోత్సాహం, నాన్న అండతో నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత సివిల్ సర్వీసెస్పై దృష్టి పెట్టా. ఇది ఎంతో కష్టమైన పని. కొన్నిసార్లు మనపై మనం నమ్మకాన్ని కోల్పోతాం. ఇది మన వల్ల కాదనిపిస్తుంది. అలాంటప్పుడు మనల్ని ప్రోత్సహించేవాళ్లు, భరోసా ఇచ్చేవాళ్లు ఎంతో అవసరం. నేను కూడా మూడుసార్లు సివిల్స్కి ఎంపిక కాకపోయినా నిరుత్సాహ పడలేదు. తప్పులు సరిచేసుకుంటూ ముందు వెళ్లా. ఐపీఎస్ ఎలాగైనా సాధించాలన్న నా పట్టుదలకు తోడు నా కుటుంబం, స్నేహితులు అండగా నిలిచారు. నాల్గో ప్రయత్నంలో నేను అనుకున్నట్టుగానే ఐపీఎస్కి ఎంపికయ్యాను. నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్పీఏ)లో శిక్షణ పూర్తిగా భిన్నమైంది. నేను ఎన్ పీఏలోకి రాకముందు కనీసం వంద మీటర్లు కూడా పరిగెత్తినట్టు గుర్తు లేదు. కానీ ఇక్కడ శిక్షణతో ఇప్పుడు ఒంటిపై బరువు, చేతిలో రైపిల్తో 40 కిలోమీటర్లు కూడా రన్నింగ్ చేసేంత స్థై్థర్యం వచ్చింది. మహిళా ఐపీఎస్ అధికారిగా మహిళా భద్రత, సైబర్ భద్రతపై ప్రత్యేక దృష్టి పెడతాను. – జయశర్మనాలుగుసార్లు ఓడినా.. నాన్న ప్రోత్సాహం తగ్గలేదుమా స్వస్థలం తమిళనాడులోని కన్యాకుమారి. నాన్న బస్ కండక్టర్గా పనిచేసి ఈ ఏడాది రిటైర్ అయ్యారు. అమ్మ గృహిణి. మా అక్క ప్రైవేటు ఉద్యోగిని. మేం ఇద్దరమూ అమ్మాయిలమే అయినా.. నాన్న మమ్మల్ని అన్నింటిలో ప్రోత్సహించేవారు. నేను అన్నా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో ఇంజినీరింగ్ (Engineering) పూర్తి చేశాను. ప్రభుత్వ అధికారిగా ఉంటేనే సమాజానికి దగ్గరగా పనిచేయవచ్చని నాకు మొదటి నుంచి ఉండేది. అందుకే ఇంజినీరింగ్ తర్వాత ప్రైవేటు ఉద్యోగాలవైపు వెళ్లలేదు. తమిళనాడులో స్టేట్ జీఎస్టీ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేశాను. కానీ.. నన్ను ఐపీఎస్ ఆఫీసర్ను చేయాలన్నది నాన్న కల. అయితే సివిల్స్ కు ఎంపిక కావడం అంత సులువేం కాదు. ఐదో ప్రయత్నంలో ఐపీఎస్ సాధించానంటే నాన్న ఇచ్చిన ప్రోత్సాహమే కారణం. ఎప్పటికప్పుడు గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ, వ్యక్తిగతంగా నోట్స్ తయారు చేసుకుంటూ నా ప్రయత్నాన్ని కొనసాగించాను. చివరికి విజయం దక్కింది. ఎన్నో కొత్త విషయాలను నేర్చుకునే అవకాశంతో పాటు మనలో ఉన్న సామర్థ్యాన్ని మనకు తెలియజేస్తుంది నేషనల్ పోలీస్ అకాడమీ ట్రైనింగ్. ఈ శిక్షణ తర్వాత నేను ఎంతో భరోసాగా చెప్పగలను – పోలీస్ ఉద్యోగం మహిళలు కూడా ఎంతో బాగా చేయగలరని! మా బ్యాచ్లో కూడా 65 మంది మహిళా ఐపీఎస్లు ఉండడమే అందుకు ఉదాహరణ. సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్లకి నా సలహా ఒక్కటే..సివిల్స్ సాధించడం అనేది మీ లక్ష్యం అయితే, ఎన్ని అడ్డంకులు వచ్చినా మధ్యలో వదలొద్దని ముందే నిర్ణయించుకోవాలి. ఒత్తిడి లేకుండా ప్రణాళిక ప్రకారం పరీక్షలకు సిద్ధం కావాలి. అప్పుడు విజయం మనదే.– అశ్విని.ఎస్నాకు స్ఫూర్తి మా నాన్నేనాన్న ఎయిర్మెన్ గా ఇండియన్ ఎయిర్ఫోర్స్లో పని చేసి రిటైర్ అయ్యారు. ఇంట్లో ఎంతో క్రమశిక్షణ ఉండేది. నా చిన్నప్పటి నుంచి నాన్నను అలా యూనిఫాంలో చూస్తూ పెరగడంతో నాకు కూడా యూనిఫాం సర్వీసెస్ అంటే ఎంతో గౌరవం ఏర్పడింది. ఆయనే నాకు ఎప్పటికీ స్ఫూర్తి. స్కూలింగ్ పూర్తయి, కాలేజీకి వచ్చాక నాకు స్పష్టత వచ్చింది ఐపీఎస్ అధికారి అయితే ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం ఉంటుందని. అందుకే ఎప్పటికైనా ఐపీఎస్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్లా. గ్జేవియర్స్ కాలేజ్ కోల్కతా నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తయి తర్వాత నేను మొదటి ప్రయత్నంలో సీఐఎస్ఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్గా ఎంపికయ్యాను. 2020 లో ట్రైనింగ్ చేస్తూనే సివిల్స్ ప్రిపరేషన్ కొనసాగించాను. చదవండి: అంబానీ వంటింట్లో పెత్తనం పెద్ద కోడలిదా? చిన్నకోడలిదా?ఆ తర్వాత ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్కు ఎంపికయ్యాను. అయినా, ఐపీఎస్ కలను వదల్లేదు. నాల్గో ప్రయత్నంలో నాకు ఐపీఎస్ (IPS) వచ్చింది. నాన్న ఎయిర్ఫోర్స్లో పనిచేయడం.. మొదటి నుంచి ఎంతో క్రమశిక్షణతో పెరగడంతో ఇక్కడి ట్రైనింగ్ కష్టంగా అనిపించలేదు. సులువుగానే శిక్షణ పూర్తి చేశా. ఇక్కడ నేర్చుకున్న విషయాలు వృత్తిగతంగానే కాకుండా వ్యక్తిగతంగా నన్ను ఎంతో మార్చాయి. నాకు తెలంగాణ పోలీసులో మహేశ్ భగవత్ ఇన్స్పిరేషన్. ఐపీఎస్ అధికారిగా నేను మహిళా భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. నేను హర్యానాలో పుట్టిపెరిగాను. అక్కడి పరిస్థితులు చూశాక.. మహిళా భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా.– కీర్తియాదవ్ -
ఇదే ఆఖరి దీపావళి పండుగ..! మళ్లీ ఏడాది..
దీపావళి పండుగ అంటే చిన్నా పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు. అలాంటి పండుగను ఈ యువకుడు ఇదే తనకు ఆఖరి దీపావళి ఏమో అంటూ భావేద్వేగంగా పోస్టు పెట్టాడు. హృదయాన్ని మెలిపెట్టే అతడి కథ నెట్టింట వైరల్గా మారడమే కాదు ప్రతి ఒక్కరిని కదిలించింది. పైగా బ్రో నీకేంకాదు అంటూ..ధైర్యం చెబుతూ పోస్టులు వెల్లువెత్తాయి. అసలేం జరిగిందంటే..21 ఏళ్ల వ్యక్తి హృదయ విదారక పోస్ట్ నెట్టింట ప్రతి ఒక్కరిని కంటతడిపెట్టేలా చేసింది. ఆ పోస్ట్లో అంతలా ఏముందంటే..అతడు 2023 నుంచి స్టేజ్4 కొలొరెక్టల్ కేన్సర్(colorectal cancer)తో పోరాడుతున్నట్లు వెల్లడించాడు. నెలలతరబడి కీమోథెరపీలు, ఆస్పత్రుల్లో గడిపిన తదనంతరం వైద్యులు ఈ ఏడాదికి మించి బతకలేడని నిర్థారించారని షేర్ చేసుకున్నాడు. "దీపావళి పండుగ సమీపిస్తుండటంతో బహుశా ఇదే నా చివరి దీపావళి పండుగ అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. త్వరలో దీపావళి రాబోతోంది అంతా దీపాలు వెలిగించి..సందడిగా ఉంటే..తన హృదయ దీపం ఆరిపోయి..జీవితం ముగిసిపోనుంది అని భావోద్వేగంగా పోస్ట్లో రాసుకొచ్చాడు. నా జీవితం ముగిసిపోతుంది అని తెలిసి కూడా ఎలా సాగుతుందో చూడటం వింతగా ఉంది. వచ్చే ఏడాది నా స్థానంలో మరొకరు దీపాలు వెలిగిస్తారు. సొంత వ్యాపారాన్ని ప్రారంభించి, ఓ కుక్కను పెంచుకోవాలనుకున్నా నా కల, ఆకాంక్షలు అన్ని జారిపోతున్నట్లుగా ఉంది. ఆలోచనలన్నీ మసకబారుతున్నాయి. నా తల్లిదండ్రుల ముఖాలో తీవ్ర దుఃఖం కనిపిస్తుంది. అయినా ఇదంతా నేనెందుకు పోస్ట్ చేస్తున్నానో కూడా నాకు నిజంగా తెలియదు. బహుశా నిశబ్దంగా వెళ్లిపోవడం ఇష్టం లేక ఇలా పోస్ట్లో బిగ్గరగా చెప్పలనేమో." అంటూ తన పోస్ట్ని ముగించాడు. ఈ పోస్ట్ నెట్టింట వేలాదిమంది నెటిజన్ల హృదయాలను తాకింది. చాలామంది ఉన్న సమయం ఉపయోగించుకోండి, ధైర్యంగా ఉండండి అని భరోసా ఇవ్వగా మరికొందరూ మాత్రం ఏదైనా మిరాకిల్ జరగొచ్చు కేన్సర్ మీ నుంచి దూరంగా వెళ్లిపోవచ్చు అని ఆశను రెకెత్తించేలా పోస్టుల పెట్టారు. (చదవండి: జోంబీ' డ్రగ్ జిలాజైన్: అచ్చం 'జాంబీ రెడ్డి' మూవీ సీన్ని తలపించేలా..) -
బొట్టు కూడా ఒక డిజైనర్ ఆభరణం : ఆదాయం 20 లక్షలు
భారతీయ మహిళామణులకు బొట్టు అంటే ప్రాణం.అందం, సంప్రదాయాల మేళవింపు అది. పండగ అయినా, పెళ్లిఅయినా, ఏ వేడుక అయినా అదొక ఫ్యాషన్. అందుకే కాలక్రమేణా బొట్టు లేదా బిందీ రూపాలు మారుతూ వచ్చాయి.ఈ మార్పునే ఆకళింపు చేసుకున్నారు బెంగళూరుకు చెందిన వ్యవస్థాపకురాలు మేఘనా ఖన్నా. రోజువారీ జీవితంలో భాగమైన బొట్టు బిళ్లలను ఫ్యాషన్ ఆభరణాలుగా మార్చి, తన క్రియేటివిటీతో పలువురి సెలబ్రిటీల ఫ్యావరెట్గా మారిపోయింది. మిలిటరీ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన మేఘన ఉద్యోగాన్ని వదిలి మరీ ఈ వ్యాపారాన్ని ఎంచుకుంది. మేఘనా సక్సెస్ జర్నీ ఎలా సాగిందో తెలుసుకుందాం ఈ కథనంలో.బెంగళూరుకు చెందిన వ్యవస్థాపకురాలు మేఘనా ఖన్నా బిందీ సంప్రదాయం నుండి ప్రేరణ పొంది, ది బిండి ప్రాజెక్ట్ను స్థాపించారు. అయితే ఈ జర్నీ వెనుక పెద్ద పోరాటమే ఉంది. మేఘనా ఖన్నా పూణేలో మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్లో ఎంబీఏ చేశారు. ఒక ఏడాది పాటు ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరారు. కానీ సొంతంగా వ్యాపారాన్ని చేయాలనే ఆలోచనకు మరింత పదును పెరిగింది. ఈ క్రమంలో ఆమె దృష్టి ముక్కు పోగులపై పడింది. జోధ్పూర్ కళాకారులతో కలసి "లెవిటేట్" అనే హ్యాండ్క్రాఫ్ట్ జ్యువెలరీ బ్రాండ్ను ప్రారంభించింది. 2002 - 2020 వరకు అంటే పద్దెనిమిదేళ్లు లెవిటేట్ విజయవంతంగా నడిచింది. ఇందులో రకరకాల చోట్ల నుంచి వచ్చిన అందమైన నగలు, యాక్సెసరీలు, గృహాలంకరణ వస్తువులు ఉండేవి. కోవిడ్ మహమ్మారి మేఘనా వ్యాపారాన్ని దెబ్బతీసింది. చివరకు వ్యాపారం మూసివేయాల్సి వచ్చింది. కానీ బిజినెస్ చేయాలనే కోరిక మాత్రం నశించ లేదు. View this post on Instagram A post shared by Startup Pedia (@startup.pedia)2022లో అనుకోకుండా బొట్టు బిళ్లల్లో బంగారు, వెండివి ఉంటాయని తెలుసుకుంది మేఘనా. తన స్నేహితురాలు అమ్మమ్మ ఇచ్చిన బంగారు బొట్టు చూశాక తానెందుకు ఇలాంటి తయారు చేయకూడదనే ఆలోచన వచ్చింది. అన్ని ఆభరణాల మాదిరిగానే బొట్టు బిళ్లలు కూడా ఒకఫ్యాషన్గా ఉండాలనే ఆలోచనతో "ది బిందీ ప్రాజెక్ట్" ప్రారంభించింది. దీనికి తోడు ‘లెవిటేట్’ అనుభవం ఉండనే ఉంది. రూ.5 లక్షలతో బిందీ ప్రాజెక్ట్ షురూ అయింది. కేవలం ఇద్దరు మహిళలకు శిక్షణ ఇచ్చి, అందంగా స్పెషల్ డిజైన్లతో బిందీ డిజైన్లు రూపొందాయి. దీనికి తగ్గట్టు మార్కెటింగ్ చేసుకున్నారు. తొలుత వీటిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పర్యావరణహితమైన, రీసైకిల్ చేయబడిన వ్యర్థాలతో అందమైన బొట్టు బిళ్లలను తయారు కావడంతో సెలబ్రిటీలను సైతం విపరీతంగా ఆకర్షించాయి. ఇవి కేవలం ఒక సాధనంగా కాకుండా, ఫ్యాషన్ స్టేట్మెంట్గా మారిపోయాయి. రెండున్నరేళ్లలో 1500 కస్టమర్లు వచ్చారు. సోషల్ మీడియాలో వాట్సాప్, ఇన్స్టా ద్వారా ఆర్డర్లు తీసుకుంటారు. ఇలా 2024 ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల ఆదాయం వచ్చింది. ఇది 2025లో రూ. 20 లక్షలకు చేరిందంటే దీని ఆదరణను అర్థం చేసుకోవచ్చు. ఫెస్టివ్, లెదర్, వస్త్రంతో పూర్తిగా చేత్తో తయారవుతాయి. రంగు రాళ్లు, ఇత్తడి ముక్కలు, పూసలు ఇలా రక రకాలుగా తయారయ్యే ఒక్కో బొట్టు బిళ్లా ఒక్కో డిజైనర్ ఆభరణంలా ఉంటుంది. సామాన్యులతో పాటు,ప్రముఖ పాప్ గాయని ఉషా ఉతుప్, కరీనా కపూర్, కరిష్మా, తమన్నా, సోనం కపూర్ తదితర బాలీవుడ్ హీరోయిన్లను కూడా ఆకర్షిస్తున్నాయి. -
'జోంబీ' డ్రగ్ జిలాజైన్: అచ్చం 'జాంబీ రెడ్డి' మూవీ సీన్ని తలపించేలా..
తేజ సజ్జా, ఆనంది కీలక పాత్రల్లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబిరెడ్డి’ మూవీలో ఎలాగైతే మనుషులు ప్రవర్తిస్తారో అలా బిహేవ్ చేస్తారట ఈ జిలాజిన్ డ్రగ్ తీసుకుంటే. దీన్ని కొందరు మత్తు పదార్థలతో కలపి తీసుకుంటారట. దాంతో మనుషులు అచ్చం జంతువుల మాదిరిగా ప్రవర్తిస్తారట. ఒక్కోసారి మోతాదు ఎక్కువైతే శరీరం కుళ్లిపోయి..ప్రాణాలు కూడా కోల్పోతారట. ఇంతకీ అసలేంటి డ్రగ్..?. అసలు దేని కోసం దీన్ని తయారు చేశారు?, ఏవిధంగా మత్తుపదార్థంగా వినియోగిస్తున్నారు అంటే..ప్రస్తుతం యూఎస్లో ఈ డ్రగ్ సంబంధిత మరణాలు అధికంగా ఉన్నాయి. అక్కడ ఫెంటానిల్ అనే మత్తు మందుని యువకులు సేవిస్తుంటారట. దానిలో 'జోంబీ' అనే జిలాజిన్ డ్రగ్ కలిపి ఇస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇది శరీరంపై పలు దుష్ప్రభావాలు చూపిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే ప్రాణాంతకమైనది కూడా. నిజానికి ఇది జంతువులను సులభంగా అదుపులోకి తెచ్చే మత్తుమందు. దీన్ని పశువైద్య మందుగా ఉపయోగిస్తారు. అలాంటి డ్రగ్ని అక్రమ మాదకద్రవ్యాల్లో కలిపేస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ముఖ్యంగా ఫెంటానిల్ అనే మత్తు మందులో కలపడం వల్ల దాని దుష్ఫ్రభావం మరింత తీవ్రతరం అవుతుందట. ఇటీవల కాలంలో అందుకు సంబంధించిన మరణాలు అధికమవ్వడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాదు ప్రస్తుతం దీనికి సంబంధించిన బాధితులను యూఎస్ ఫిలడెల్ఫియాలోని చుట్టుపక్కల ఉన్న ఆస్పత్రుల్లో వారానికి ఒకసారి చూడాల్సి వస్తోందని చెబుతున్నారు వైద్యులు.జిలాజిన్ అంటే ఏమిటి?జిలాజిన్ అనేది శక్తివంతమైన α-2 అడ్రినెర్జిక్ అగోనిస్ట్. దీనిని మొదట 1962లో బేయర్ అనే శాస్త్రవేత్త రక్తపోటు ఔషధంగా సంశ్లేషణ చేశారు. అయితే దీని తీవ్రమైన దుష్ప్రభావాల కారణంగా పశువైద్య కోసం ఉపయోగించడం మొదలుపెట్టారు. తరువాత ఇది 2000ల ప్రారంభంలో ప్యూర్టో రికోలో వీధి ఔషధంగా దుర్వినియోగం అవడం ప్రారంభించి..రాను రాను వ్యసనంగా మారింది. ఈ మందుని ఇంజెక్ట్ చేయగానే..కండరాలు సడలించి, నొప్పిని తగ్గించి వ్యక్తులను ఒక విధమైన మత్తులో జోగేలా చేస్తుందట. సింపుల్గా చెప్పాలంటే నోర్పైన్ ఫ్రైన్ విడుదలను తగ్గించి..ట్రాన్స్ లాంటి స్థితిని ప్రేరేపిస్తుంది. దీని ఫలితంగా జోంబీ లాంటి ప్రభావం ఏర్పడుతుంది. అదేనండి జాంబీ రెడ్డి మూవీలో విధంగా మనుషులు మారిపోతారని మాట. Welcome to Michigan 🥴🥴🥴🥴😂 pic.twitter.com/CfE1vE2fiM— 0HOUR (@0HOUR1__) September 6, 2025 ప్రమాదకరమైన ప్రభావాలు..ఈ డ్రగ్ నెమ్మదిగా హృదయ స్పందన రేటు పడిపోయేలా చేస్తుందట. తర్వాత తక్కువ రక్తపోటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి వాటిగి కలిగిస్తుంది. రక్తనాళాలను సంకోచించేలా చేసి తీవ్రమైన చర్మగాయాలకు దారితీస్తుందట. దీన్ని ఎక్కడ ఇంజెక్ట్ చేశామో ఆ ప్రాంతంలో రక్తసరఫరా, ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుందట. తద్వారా కణజాలం చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. ఇది అచ్చం మాంసం తినే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను పోలి ఉంటుందట. కొన్ని సందర్భాలలో కణజాల నెక్రోసిస్ కారణంగా అవయవాలు స్వయంచాలకంగా విచ్ఛిన్నమవడం, ఎముకలు బహిర్గతం అవ్వడం జరుగుతుందట. ఈ డ్రగ్ సంబంధిత గాయాలనేవి.. మోతాదు వినియోగం, వ్యక్తి స్థితిని బట్టి మారుతుంటుందట దాని ప్రభావం. ఆ డ్రగ్ ఇంజెక్ట్ అయిన ప్రాంతంలో నరాలకు కోలుకోలేనంత నష్టం ఏర్పుడతుంది కాబట్టి యథాస్థితి రావడం అసాధ్యమని చెబుతున్నారు నిపుణులు. కానీ ఈ వ్యసనం బారినుంచి బయటపడేలా చేసి, సాధారణ జీవితాన్ని అనుభవించేలా మాత్రం చికిత్స అందించగలమని నిపుణులు చెబుతున్నారు. అలా బయటపడి పూర్తి స్థాయిలో కోలుకున్నవాళ్లుకూడా ఉన్నారని చెబుతున్నారు.📍For informational purposes:These chilling scenes are coming out of Philadelphia, USA, linked to the widespread use of a drug called Xylazine.It’s so potent that it’s been described as a drug that “zombifies” humans 😳Could this be the beginning of an apocalypse? pic.twitter.com/r8Uiq2rYCz— ADTed✨ (@Eduo_Prince) September 6, 2025 (చదవండి: తెర వెనుక డాక్టర్ అనస్థీషియా..! వైద్య రంగంలో వారి సేవలు అద్భుతం..) -
అంబానీ వంటింట్లో పెత్తనం పెద్ద కోడలిదా? చిన్నకోడలిదా?
పండుగలు, పబ్బాలు అనగానే ఇంటిని శుభ్రం చేసుకోవడం, అలంకరించుకోవడం మొదలు పూజలు, పిండివంటలు అబ్బో ప్రతీ ఇంట్లోనూ ఈ హడావిడి మామూలుగా ఉండదు. సామాన్యుల నుంచి కుబేరుల దాకా ఈ సందడి ఉంటుంది. ఇక వెలుగుల పండుగ దీపావళి అంటే ఇక చెప్పాల్సిన పనే లేదు. దీపావళి వేడుకలు, భారతదేశంలో అత్యంత ధనిక కుటుంబం అనగానే మొదటగా రిలయన్స్ అంబానీ ఫ్యామిలీ గుర్తొస్తుంది. మరి అంబానీ కుటుంబంలో వంటలు ఎవరు చేస్తారు? అసలు అక్కడ ఫుడ్ మెనూ ఎవరు ప్రిపేర్ చేస్తారు. వంటింట్లో ఎవరి ప్రాముఖ్యత ఎంత?ముంబైలోని అతి విలాసవంతమైన భవనం, ముఖేష్ అంబానీ ఉండే భవనం ‘యాంటిలియా’లో వందలాది మంది సిబ్బంది పిలిస్తే పలకడానికి సిద్ధంగా ఉంటారు. మరి అలాంటి ఇంట్లో వంటింటి పెత్తనం ఎవరిది అనేది ఇపుడు చర్చ. రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, ముఖేష్, నీతా దంపతులకు ముగ్గురు సంతానం, ఆకాష్,అనంత్, ఇషా. కూతురు పెళ్లి అయ్యి అత్తవారింటికి వెళ్లింది. ఇక ఇద్దరు కొడుకులు, కోడళ్లతో నివసించే ఉమ్మడి కుటుంబం. అలాగే రిలయన్స్ ఫౌండర్ దివంగత ధీరూభాయ్ అంబానీ సతీమణి, ముఖేష్ తల్లి కూడా వీరితోపాటే ఉంటారు. చదవండి: Diwali 2025 : ఈవస్తువులను ఇంటికి తెచ్చుకుంటే కనక వర్షం!Radhika Merchant Vs Sloka Mehta ఈ ఉమ్మడి కుటుంబంలో కిచెన్ బాధ్యత ఎవరిదన్న కుతూహలం అందరిలో ఉంటుంది. పెద్ద కోడలు శ్లోక మెహతా, చిన్నకోడలు రాధికా మర్చంట్ మధ్య చాలా సఖ్యత ఉంటుందట. అంబానీ కుటుంబం శాఖాహారులు. తాజా వార్తల ప్రకారం పెద్ద కోడలు శ్లోక మెహతా రోజువారీ మెనూను నిర్ణయిస్తారు. శ్లోకకు కుటుంబ సంప్రదాయాలు ఆహార ప్రాధాన్యతలు బాగా తెలుసు. ఆమె వంట గదిని పర్యవేక్షిస్తుంది. కుటుంబం, అతిథులు, పండుగలు, విందు భోజనాలను ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది. రాధిక మర్చంట్ ఇటీవల అంబానీ కుటుంబంలో చేరిన నేపథ్యంలో ఇంటి పద్ధతులను ఆచారాలను ఇపుడిపుడే అవగాహన చేసుకుంటోంది. సంప్రదాయాలను నేర్చుకుంటోంది. కుటుంబ కార్యక్రమాలతో పాటు వివిధ ప్రజా కార్యక్రమాల్లో కనిపిస్తూ ముద్దుల కోడలు అనిపించుకుంటోంది.(బొట్టు కూడా ఒక డిజైనర్ ఆభరణం : ఆదాయం 20 లక్షలు )కాగా అంబానీలు ఆరోగ్యకరమైన, సాంప్రదాయ ఆహారానికి ప్రాధాన్యత ఇస్తారు. ముఖేష్ అంబానీ ఇంట్లో వండిన భోజనాన్ని ఇష్టపడే స్వచ్ఛమైన శాఖాహారి. క్షణాల్లో వంటకాలను తయారు చేసి, వేడిగా వడ్డించేందుకు చెఫ్లు రెడీగా అందుబాటులో ఉంటారు. దీనికితోడు అప్పుడప్పుడు హోటళ్ల నుంచి కూడా ఫుడ్ ఆర్డర్ చేస్తారు. ముఖ్యంగా ఆదివారాల్లో ముంబైలోని 'మైసూర్ కేఫ్' నుంచి కూడా ఆర్డర్ చేసుకుంటారనే విషయం తెలిసిందే. ఇదీ చదవండి: మొరింగా సాగుతో.. రూ. 40 లక్షల టర్నోవర్ -
ఏకంగా 200 రకాల వెరైటీ సమోసాలు..! ఎక్కడంటే..
సమోసా అంటే ఎవరికి ఇష్టం ఉండదు. వేడివేడి చాయ్తో ఆరగించే స్నాక్ ఐటెం అది. ఈ చిరు తిండిని బంగాళ దుంప మసాల, లేదా బఠానీలతో క్రిస్పీగా అందించడం విన్నాం. బంగారు త్రిభుజాకారంలో నోరూరించే ఈ వంటకం భారతీయుల వంటకాలలో అంతర్భాగం. మహా అయితే ఆ సమోసాలో మూడు, నాలుగు రకాల వెరైటీలు చూసుంటాం. కానీ ఏకంగా వందల రకాల వెరైటీ సమోసాలు అందించే ఫుడ్స్టాల్ గురించి విన్నారా?. ఔను మీరు వింటుంది నిజమే. నో ఛాన్స్ అనుకోకండి..అన్ని రకాలు అమ్ముతూ నెట్టింట వైరల్ అయ్యాడు ఈవ్యక్తి. ఎక్కడుందంటే ఆ ఫుడ్ స్టాల్.. పంజాబ్లో జలంధర్(Jalandhar)లోని వీధిలో ఈ దుకాణం దర్శనమిస్తుంది. అక్కడ ఇన్ని రకాల సమోసా వెరైటీలను(Samosa Varieties) చూడొచ్చు. పది రకాల సమోసాలు విక్రయిస్తేనే..వామ్మో..! అనేస్తాం. కానీ ఇక్కడ ఏకంగా 200 రకాల సమోసాలను అందిస్తున్నారు ఆహారప్రియులకు. అవేంటో చూద్దామా..ముందుగా లేడిఫింగర్ సమోసాతో మొదలై..బీన్స్ సమోసా, పచ్చి అరటి సమోసా, పనీర్ సమోసా, గోబీ సమోసా, సోయా సమోసా, నూడిల్స్ సమోసా, మాకరోని, పుట్టగొడుగులు ఇలా పలు రకాల సమోసాలు దర్శనమిస్తున్నాయి. వాటిని చూడగానే..ఆ రకరకాల సమోసాలు టేస్ట్ చేయగలమా అనే సందేహం తప్పక కలుగుతుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు సైతం బ్రో నేను ఆలుతో చేసిన సమోసా తప్ప మరేది ట్రై చేయను అని ఒకరు, బాబోయ్ సమోసాపై ఉన్న ఇష్టాన్ని చంపేశావు కదా అని మరొకరు ఇలా కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Foodpandits! (@foodpandits) (చదవండి: చలి పులి వచ్చేస్తోంది..ఆరోగ్యం జాగ్రత్త! హెచ్చరిస్తున్న నిపుణులు) -
దీపావళి వేళ, ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే కనక వర్షం!
దివ్యమైన దీపావళి పండగ సంబరాలను సమయం మరెంతో దూరంలో లేదు. ప్రతీ ఏడాది అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో దీపావళి కూడా ఒకటి. ధంతేరస్, నరక చతుర్ధశి (ఛోటీ దీపావళి), దీపావళి, యమ విదియతో దీపావళి పండుగ ముగుస్తుంది.దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని, గణపతి, కుబేరడిని విశేషంగా పూజించడం ఆనవాయితీ. దీనికి అనేక పురాణగాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సత్యభామ సాయంతో శ్రీకృష్ణుడు నరకాసురుడిని వధించడం, 14 సంవత్సరాల వనవాసం నుండి రాముడు తిరిగి వచ్చిన వేళ దీపావళి పండుగను సంబరంగా జరుపుకుంటారని కూడా చెబుతారు.కొత్త బట్టలు, లక్ష్మీ, గణపతి: అయితే దీపావళి రోజు లక్ష్మీదేవితోపాటు,గణపతి ప్రతిమలను తెచ్చుకొని కొలిస్తే సిరిసంపదలకు లోటు ఉండదని నమ్మకం. అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు. కొత్త బట్టలు, దీప కాంతులతో పాటు దీపావళి పండుగ రోజు కొన్ని వస్తువులను తీసుకొని రావడం శుభప్రదంగా పరిగణిస్తారు. తద్వారా సంపద కలిగి శ్రేయస్సు లభిస్తుందని భావిస్తారు.ముఖ్యంగా ఎరుపు రంగు దుస్తులను కొనుగోలు చేయడం శుభప్రదమని, అంతా మంచే జరుగుతుందట.చదవండి: Diwali 2025 : ఈ ఏడాది అద్భుతం విశిష్టత ఏంటి? శుభ ముహూర్తం!తాబేలు: విష్ణుమూర్తికి ప్రతిరూపమైన తాబేలు ఇంట్లోకి తెచ్చుకుంటారు. ఆర్థికాభివృద్ధితోపాటు ఇంటిల్లిపాదికీ పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందని నమ్ముతారు.శ్రేయస్సుకు, సంపదకు సంకేతమైన కొబ్బరికాయను తెచ్చుకుంటారు. దీంతో స్వయంగా లక్ష్మీదేవి కొలువుదీరినట్టే అంటారు. ముందు రోజు తెచ్చుకున్న కొబ్బరికాయను, దీపావళి రోజున ఆ కొబ్బరికాయను లక్ష్మీదేవికి నివేదిస్తారు. (Diwali 2025: పూజ ఇలా చేస్తే, అమ్మవారి కటాక్షం పూర్తిగా మీకే!)తులసి : ఇక తులసి మొక్క గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. గాలిని శుభ్రం చేసే తులసి ఇంట్లో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పెంచుతుంది. దీపావళి రోజున తులకి మొక్కను ఇంటి ముందు ప్రతిష్టించు భక్తితో పూజిస్తేఅంతా శుభం కలుగుతుంది అంటారు. దాన ధర్మాలు దీపావళి రోజు మనకు మనమే సంబరాలు చేసుకోవడం కాకుండా, పేదవారికి లేనివారికి దానాలు చేస్తే ఆరోగ్య వృద్ధి, ఆయు వృద్ధి కలుగుతుందని పెద్దలు చెబుతారు. నమ్ముతారు. కొత్తబట్టలు, ఆహార ధాన్యాలు, తెల్లని వస్త్రాలు, చీపురు, పంచదార, బెల్లం, బియ్యం దానం చేస్తే అంతాశుభాలు జరుగుతాయంటారు. నోట్ : ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజలు వారి వారి వ్యక్తిగత ఇష్టా ఇష్టాలమీద ఆధారపడి ఉంటాయి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం అందించినది మాత్రమే. -
Anesthesiologist: తెర వెనుక డాక్టర్..! వైద్య రంగంలో వారి సేవలు అద్భుతం..
పేషెంట్కు నొప్పి తెలియకుండా ఆపరేషన్ చేయడం వైద్యశాస్త్రంలో ఓ అద్భుతం. శరీరంలోని ప్రతీ అవయవానికి చేసే సర్జరీకి ముందుగా మత్తుమందు(అనస్థీషియా)ఇస్తారు. దీంతో నొప్పి బావన ఉండదు. క్లిష్టమైన, అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడేందుకు అనస్థీషియా నిపుణులు చేస్తున్న సేవలు అత్యంత ముఖ్యమైనవి. తెరవెనుక డాక్టర్ అనస్థీషియా. వీరికోసం ఏటా అక్టోబర్ 16న ప్రపంచ అనస్థీషియా దినోత్సవం నిర్వహిస్తున్నారు. 1846 అక్టోబర్ 16న తొలిసారి విలియం టీజీ మోర్టన్ అనే వైద్యుడు ఈథర్ అనస్థీషియాను విజయవంతంగా ప్రదర్శించారు. మత్తుమందు లేని రోజుల్లో.. అనెస్తీషియా అమలులోకి రానిరోజుల్లో పేషెంట్కు శస్త్రచికిత్స చేయాలంటే, మత్తు రావడానికి తలపై గట్టిగా కొట్టడం, పాములతో కరిపించడం, వివిధ రకాల మత్తు పదార్థాలు తినిపించడం, గట్టిగా చేతులతో పట్టుకుని ఆపరేషన్లు చేసేవారని చెబుతున్నారు. అనస్థీషియాను కనిపెట్టాక చిన్న సూదితో శరీరంలో మత్తు ఎక్కించేసి పేషెంట్కు నొప్పి తెలియకుండా ఆపరేషన్ చేస్తున్నారు. జీజీహెచ్లో 13 మంది అనస్థీషియాలు.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అనస్థీషియాల సహకారంతో ప్రతీనెల వేలాది ఆపరేషన్లు జరుగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ సిమ్స్ అనుబంధ జీజీహెచ్లో అనెస్తీషియా విభాగం ప్రత్యేకంగా ఉంది. ఇందులోని ఇద్దరు ప్రొఫెసర్లు, 10 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఒక ఎస్ఆర్ సేవలు అందిస్తున్నారు. పేషెంట్ కోలుకునే వరకు.. పేషెంట్కు మత్తుమందు ఇచ్చేది అనస్థీషియాలే అయినా.. శస్త్రచికిత్స పూర్తయి, కోలుకునే వరకూ దగ్గరుండి పర్యవేక్షిస్తారు. పేషెంట్ త్వరగా కోలుకున్నాడంటే అందులో అనస్థీషియా పాత్రకీలకంగా ఉంటుంది.వైద్యరంగంలో కీలకం వైద్యరంగంలో అనస్థీషియా చాలా కీలకమైనది. ప్రస్తుత వైద్య విధానంలో మత్తుమందు లేకపోతే అనే ఊహనే కష్టంగా ఉంటుంది. మత్తుమందు అందుబాటులోకి రావడంతో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి.– దండె రాజు, ఆర్ఎంవో, జీజీహెచ్ తెరవెనుక వైద్యుడు తెరవెనుక వైద్యుడు అనస్థీషియా. ఆపరేషన్ చేయడానికి సర్జన్తోపాటు అనస్థీషియా కూడా కీలకమే. పేషెంట్ కోలుకునే వరకు పర్యవేక్షిస్తుంటాడు. జీజీహెచ్లో చాలా హైరిస్క్ కేసులు కూడా అనెస్తీషియాల సహకారంతో విజయవంతంగా చేస్తున్నాం. – అరుణ, గైనిక్ హెచ్వోడీ, జీజీహెచ్(చదవండి: -
చలి పులి వచ్చేస్తోంది..ఆరోగ్యం జాగ్రత్త!
దసరా అయిపోయింది..దీపావళి పండుగ సన్నాహాలు మొదలైపోయాయి. దీపాల పండుగ వచ్చేస్తుందటంట..వణికించే చలి మొదలైపోతుంది. సరదాగా అనిపించినా.. ఈ కాలంలో ఆహారం, ఆరోగ్యం రెండూ జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. అంతేగాదు రైతులు కూడా ఈ అధిక చలికారణంగా నష్టాలను చవిచూస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల నుంచి సేఫ్గా ఉండాలంటే..మరీ ఏడాది చలి ప్రభావం ఏ రేంజ్లో ఉందో ముందుగానే తెలుసుకుందామా..!.వాతావరణ శాస్త్రవేత్తలు ఈ ఏడాది భారత్ అత్యంత శీతల శీతకాలన్ని చవిచూడనుందని పేర్కొన్నారు. భారత వాతావరణ శాఖ సైతం ఈ ఏడాదిలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు, తరుచుగా చలి గాలులు, భారీ హిమపాతం వంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఈవిధమైన వాతావరణ మార్పు ప్రపంచ వాతావరణ వ్యవస్థలను దెబ్బతీస్తుందని చెబుతున్నారు వాతావరణ నిపుణులు. ఇప్పటికే జమ్ము కాశ్మీర్లోని సింథాన్ వంటి ప్రాంతాలన్నీ మంచుతో కప్పబడి ఉన్నాయి. ఇక ఇండో గంగా మైదానాల్లోకి చొచ్చుకుపోతున్న చల్లని గాలి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలను ప్రభావితం చేస్తుందని నిపుణులు అంచనా వేశారు. అలాగే వాతావరణ ఉష్ణోగ్రతలు తరుచుగా మార్పులు చోటుచేసుకుంటాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీలో సీనియర్ క్లైమాటాలజిస్ట్ డాక్టర్ రీతు శర్మ అన్నారు. ఈ ముందస్తు శీతాకాలపు సూచన ముఖ్యంగా వ్యవసాయం, ప్రజారోగ్యం వాటికి సంబంధించి మెరుగైన సంసిద్ధతకు మేల్కొలుపుగా పేర్కొన్నారు. ఈ ఏడాది రైతులకు అధిక శీతగాలుల కారణంగా గోధుమ, ఆవాలు వంటి రబీ పంటలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. అలాగే ఆరోగ్యపరంగా.. శ్వాసకోస వ్యాధులు, ఫ్లూ వ్యాధులు ప్రబలంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నందున ఈ వాతావరణ మార్పు, ఆహార భద్రత ఒకదానిపై ఒకటి ఎలా ఆధారపుడుతున్నాయో హైలెట్ చేశారు. అలాగే ఈ ముదస్తు వాతావరణ హెచ్చరికతో ఎలాంటి వ్యవసాయానికి పెట్టుబడి పెడితే మంచిదనేది నిర్ణయించొచ్చని ఎఫ్ఏఓ ప్రతినిధి ప్రియామీనన్ అన్నారు. అలాగే చలికాలం సమీపిస్తున్నందున ప్రజలంతా తమ నిత్యావసరాలను అనువైన విధంగా నిల్వ చేసుకోవడం తోపాటు అనారోగ్యం బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు నిపుణులు.(చదవండి: Success Story: ఆఫీస్ బాయ్ నుంచి సీఈవో రేంజ్కి..! ఏకంగా డిజైన్ దిగ్గజం కాన్వాతో..) -
టీనేజర్ల మానసిక ఆరోగ్యం : స్పెషల్ టూల్స్ ప్రారంభించిన యూట్యూబ్
గూగుల్కు చెందిన వీడియో షేరింగ్ ప్లాట్ ఫాం యూ ట్యూబ్ (YouTube) దేశంలో టీనేజర్లకోసం ప్రత్యేకంగా విభాగాన్ని అక్టోబర్ 15న ప్రారంభించింది.మానసిక ఆరోగ్యం, శ్రేయస్సుపై దృష్టి సారించి ప్రత్యేకంగా రూపొందించిన ఆధారాల ఆధారిత కంటెంట్ను ప్రారంభించింది. టీనేజర్ల మానసిక ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే లక్ష్యంతో YouTube ఈ ప్రత్యేక వీడియో షెల్ఫ్ను లాంచ్ చేసింది. యువ వినియోగదారుల కోసం సురక్షితమైన సమాచారం అందిచేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఇది ఒక ప్రధాన అడుగు అని యూట్యూబ్ ప్రకటించింది.ఇందులో డిప్రెషన్, ఆందోళన, ADHD, ఈటింగ్ డిజార్డరలు, తదితర అంశాలపై సమాచారంతో వీడియోలు ఉంటాయి. ఈ కంటెంట్ను సంబంధిత రంగ నిపుణుల సూచనలతో రూపొందించారు. అమెరికా, యూకే, కెనడా, మెక్సికో, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో త్వరలో అందుబాటులోకి రానుంది. ఎదుగుతున్న దశలో వారికి విశ్వసనీయ సమాచారాన్ని సులభంగా అందించడమే లక్ష్యమని గూగుల్ పేర్కొంది. దీనికి సంబంధించిన సమాచారం ‘షెల్ఫ్ ఆఫ్ ఫిలింస్’ (shelf of films) అందుబాటులో ఉంటుంది. యువతకు మానసిక ఆరోగ్యం, ఆరోగ్యం గురించి సినిమాలు తీయడంలో నేర్పించడంలో ప్రత్యేకత కలిగిన అంతర్జాతీయ సంస్థలతో YouTube పనిచేస్తోంది. అలాగే ఒక వీడియోను ‘షెల్ఫ్ ఆఫ్ ఫిలింస్’లో పొందుపరచాలంటే కంటెంట్ టీనేజర్లను లక్ష్యంగా చేసుకుని, ఆకర్షణీయంగా ఉండాలి.భారతదేశంలో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన అగ్ర మానసిక ఆరోగ్య కేంద్రం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (NIMHANS), నమ్మకమైన మానసిక ఆరోగ్య సలహాల నిమిత్తం"మనోసందేశ్" వీడియో సిరీస్ను రూపొందించింది. ప్రముఖ పరిశోధకులు, పేషెంట్ న్యాయవాదులు మరియు మానసిక ఆరోగ్య నిపుణులు ఈ సిరీస్లో తరచుగా అడిగే సమస్యలకు ప్రతిస్పందిస్తారు. ఉదాహరణకు “నా టీనేజర్తో ఒత్తిడి, ఆందోళన గురించి నేను ఎలా మాట్లాడగలను?” లాంటివి ఉంటాయని తెలిపింది.కౌమారదశలో భావోద్వేగాలు, వాటి ముందస్తు గుర్తింపు , మానసిక ఆరోగ్య సమస్యలకు సకాలంలో మద్దతు ఇస్తే, ఇది వారి ఆరోగ్యంపై శాశ్వతంగా మెరుగైన ప్రభావం చూపుతుందని NIMHANSలో సైకియాట్రీ డైరెక్టర్, సీనియర్ ప్రొఫెసర్ డా. ప్రతిమ మూర్తి తెలిపారు. ఇది యువతకు జ్ఞానం, పోరాట నైపుణ్యాలు, అందుబాటులో ఉన్న సంరక్షణ విధానాల ద్వారా సవాళ్లను అధిగమించేలా,, స్థితిస్థాపకతను పెంపొందించడంలోవారి సామర్థ్యాన్ని బలపరుస్తుందన్నారు. వీటిని వారిలో అవగాహనపెంచిడమే, మానసిక ధైర్యాన్ని పెంచడం తోపాటు, పాఠశాలలు, కుటుంబాలు, సొసైటీలో సురక్షితమైన, సహాయవాతావరణాలను కూడా పెంపొందిస్తాయి. ఈ ప్రయత్నాల ద్వారా తదుపరి తరానికి మానసిక ఆరోగ్య ఫలితాలను మార్చడానికి కేంద్రంగా ఉండాలని భావిస్తున్నామని యూట్యూబ్ ప్రకటించింది. టీనేజర్లు అవసరమైనప్పుడు విశ్వసనీయ సమాచారాన్ని యాక్సెస్ చేస్తూ డిజిటల్ స్పేస్ను సురక్షితంగా, యువవినియోగదారులకు మరింత సహాయంగా మార్చాలనే నిబద్ధతలో ఇది భాగమని యూట్యూబ్ హెల్త్ డైరెక్టర్ మరియు గ్లోబల్ హెడ్ డాక్టర్ గార్త్ గ్రాహం తెలిపారు. -
ఆఫీస్ బాయ్ నుంచి సీఈవో రేంజ్కి..! ఏకంగా డిజైన్ దిగ్గజం కాన్వాతో..
ఒకప్పుడూ ఒక ప్రముఖ సాఫ్టవేర్ దిగ్గజం ఇన్ఫోసిస్లో ఆఫీస్ బాయ్గా కంప్యూటర్లను క్లీన్ చేసేవాడు. ఆ తర్వాత వాటితో పనిచేసే స్థాయికి చేరుకుని..ప్రోఫెషన్ డిజైనర్గా మారాడు. ఇంతలో మహమ్మారి తన ఆశలపై చన్నీళ్లు జల్లి గ్రామంలో కూర్చొబెట్టింది. అయినా సరే ..అక్కడ నుంచి వ్యవస్థాపకుడిగా తన ప్రస్థానం ప్రారంభించి..అంచెలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయ డిజైన్ దిగ్గజంతో పోటీపడే స్థాయికి చేరుకుని శెభాష్ అనిపించుకున్నాడు. ఎవ్వరి ప్రస్థానం అయినా ఏమి తెలియని సున్నా స్థాయి నుంచి మొదలవ్వుతుంది..ఆ శూన్యం విలువని పెంచడం అనేది మన చేతిలోనే ఉంది అనేది తన చేతలతో చెప్పకనే చెప్పాడు ఈ వ్యక్తి. అతడెవరు? అతడి ప్రస్థానం ఎలా మొదలైందో సవివరంగా చూద్దామా..!.ఎక్కడో కరువు బాధిత గ్రామం నుంచి వచ్చి..జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆ వ్యక్తి దాదాసాహెబ్ భగత్(Dadasaheb Bhagat ). ప్రధాని నరేంద్ర మోదీ సైతం తన మన కీ బాత్లో అతడి గురించి ప్రస్తావించడమే కాదు మేక్ ఇన్ భారత్కు సరైన అర్థం ఇచ్చాడంటూ ప్రశంసలతో ముంచెత్తారు. భగత్ మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందినవాడు. అతడి కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారం. అందువల్ల అతడి కుటుంబం తన విద్యకు అంత ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి లేదు. అయినా భగత్ ఐటీఐ వరకు ఏదోలా చదువు పూర్తి చేశాడు. ఆ తర్వాత మెరుగైన భవిష్యత్తు కోసం పూణేకు వెళ్లి నెలకు 4 వేలు జీతం ఇచ్చే పనిక కుదిరాడు. ఆ తర్వాత ఇన్ఫోసిస్ ఆఫీస్ బాయ్(Infosys office boy) ఉద్యోగాలు గురించి తెలుసుకుని అక్కడ జాయిన్ అయ్యాడు. అక్కడ రోజువారి పనులు చేస్తూ..అందులో పనిచేసే ఉద్యోగులతో మాట్లాడుతుండేవాడు. ఇలాంటి కంపెనీలో ఉద్యోగం చేయాలంటే కనీసం డిగ్రీ చేసి ఉండాలని చెప్పారు అక్కడి ఉద్యోగులు. పోనీ కంప్యూర్ జాబ్ కావాలంటే గ్రాఫిక్ డిజైన్ వంటి యానిమేషన్ కోర్సులు ద్వారా ఆ డ్రీమ్ నెరవేర్చుకోవచ్చు అని సూచించారు భగత్కి. వాటికి క్రియేటివిటీ ముఖ్యం అని చెప్పడంతో ఆ దిశగా అడుగులు వేశాడు. అలా రాత్రిళ్లు ఆఫీస్ బాయ్గా డ్యూటీ చేస్తూ.పగలు యానిమేషన్ కోర్సునేర్చుకునేలా ప్లాన్ చేసుకున్నాడు. ఆ తర్వాత వేరే చోట ఉద్యోగం చేయడం కంటే తనకంటూ సొంత మార్గంలో వెళ్లాలనేది అతడి ఆలోచన. ఆ నేపథ్యంలోనే తొలుత డిజైనర్గా ఫ్రీలాన్సింగ్ ప్రారంభించాడు..ఆ తర్వాత సొంత డిజైన్ కంపెనీని ప్రారంభించాడు. అయితే అతడి కలలపై నీళ్లు జల్లినట్లుగా కోవిడ్మహమ్మారి విజృంభించి తిరిగి గ్రామంలోకి వెళ్లిపోయేలా చేసింది. అయినా ఏ మాత్రం తగ్గలేదు భగత్. గ్రామంలో బతకడం ఈజీ..కానీ తన గ్రాఫిక్ డిజైన్ కంపెనీ ప్రారంభించడం అంత సులభం కాదు. ఎందుకంటే తరుచుగా విద్యుత్ కోతలు..సరైన ఇంటర్నెట్ సదుపాయం ఉండదు. కాబట్టి దీన్ని పరిష్కరించేలా తన బృదం సాయంతో మార్గాన్ని అన్వేషించాడు. తమ ఊరిలో కొండపై ఉండే గోశాల వద్ద మొబైల్ సిగ్నల్ బేషుగ్గా ఉంది. కాబట్టి అక్కడ తన డిజైన్ టెంప్లేట్ ఆఫీస్ను పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా చిన్నగా మొదలైంది అతడి కార్యాలయం. స్థానిక యువకులకు గ్రాఫిక్ డిజైన్లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. వారికి డిజిటల్ నైపుణ్యాల అందివ్వడంలో సహాయం చేశాడు. అతడి వినూత్న స్ఫూర్తి మీడియా కంటపడి..మోదీ దృష్టిని ఆకర్షించింది. ఆయన మన్ననలను అందుకోవడమే కాదు షార్క్ ట్యాంక్ ఇండియాకు చేరుకుంది అతడి విజయగాథ. దాంతో చిన్నగా మొదలైన డిజైన్ టెంప్లేట్ కాస్తా అంచలంచెలుగా వృద్ధి చెందడం మొదలైంది. ఇక షార్క్ ట్యాంక్ షోలో బోట్ వ్యవస్థాపకుడు సీఎంఓ అమన్ గుప్పా ఏకంగా అతడి కంపెనీలో పదిశాతం ఈక్విటీని కోటి రూపాయలకు విక్రయించాడు. అయితే ఆ షోలో తన కంపెనీ గురించి ప్రెజెంటేషన్ ఇవ్వడంలో తడబడ్డానని, అప్పుడు రాధికా గుప్తా మంచినీళ్లు ఇచ్చి ఏదో ఆఫీస్ ప్రెజెంటేషన్లా కాదు..నీ ప్రస్థానాన్ని తోటి స్నేహితులకు వివరించినట్లుగా చెప్పుచాలు అని ధైర్యం ఇచ్చారని నాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు భగత్. అయితే ఈ డిజైన్ టెంప్లేట్ భారతీయ వినియోగదారుల కోసం భగత్ రూపొందించిన క్రియేటివిటీ సాధనం. ఇప్పుడు ఇది అంతర్జాతీయ డిజైన్ ఫ్లాట్ఫామ్ కాన్వాతో పోటీపడే రేంజ్కి చేరుకుంది. ఆఫీస్ బాయ్ కాస్తా ప్రోఫెషనల్ డిజైనర్ స్థాయికు చేరుకుని తానే ఉద్యోగాల ఇచ్చే రేంజ్కి చేరడం అంటే..అది అలాంటి ఇలాంటి సక్సెస్ జర్నీ కాదు కదూ..! కాగా, భగత్ స్థానిక క్రియేటర్లకు సాధికరత కల్పించి..డిజిటల్ డిజైన్లో భారతదేశాన్ని స్వావలంబన దిశగా నడిపించడమే తన ధ్యేయమని చెబుతున్నాడు భగత్. View this post on Instagram A post shared by Dadasaheb Bhagat (@dadasaheb_bhagat) (చదవండి: పేదరికాన్ని జయించేశా.. ఎట్టకేలకు అమ్మ కోసం ఇల్లు కట్టేశా..!) -
ఛిద్రమవుతున్న బాల్యం
18 ఏళ్ల లోపు బాలబాలికలను లైంగిక నేరాల నుండి రక్షించడానికి రూపొందించిన పోక్సో చట్టం 2012 (POCSO Act 2012)నవంబర్ 14 నుండి అమల్లోకి వచ్చింది. నేరస్థుడు పురుషుడు, మహిళ లేదా మూడవ జెండర్ కూడా కావచ్చు. కేంద్ర న్యాయ శాఖ వెబ్సైట్ ప్రకారం దేశంలో 725 కోర్టులు ఈ కేసులను విచారిస్తున్నాయి, 2 లక్షల పైగా కేసులు పెండింగులో ఉన్నాయి, ఇప్పటి వరకూ 3,34,213 కేసులు పరిష్కారమైనాయి. బంధు వులు, పొరుగింటివారు, యజమానులు, బాగా పరిచయమున్నవారు కూడా బాలలపై లైంగిక నేరాలకు పాల్పడుతున్నారని జరుగు తున్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని పోలీసుల దాకా వెళ్ళకుండా నిందితులతో రాజీ చేసుకునే కేసులు, నిందితు లకు భయపడి మౌనంగా ఉండే కేసులు ఎన్నో ఉంటాయి. ఈ నేరాన్ని ప్రేరేపించిన వారు కూడా నిందితులు అవుతారు. నేరం రుజువైతే జీవిత ఖైదు, మరణ శిక్షతో పాటు జరిమానాకు అర్హులు.ఈ చట్టం కింద నమోదైన కేసుల్లో ప్రత్యేక సెషన్స్ కోర్టుల ముందు ‘ఇన్ కెమెరా’ పద్ధతిలో విచారణ జరుగుతుంది. నేర అభియోగపత్రం రిజిస్టరైన తేదీ నుండి ఏడాది లోపులో తీర్పు వెలువరించాలని చట్టం చెప్తోంది. ఎగతాళి, సామాజిక బహిష్కరణ, వేధింపుల నుండి నివారణ కోసం లైంగిక వేధింపులకు గురైన బాలల పేరు, చిరునామా, ఫొటోలను బహిర్గతం చేయరాదు. బహిర్గతం చేసినట్లయితే ఏడాది పాటు శిక్షకు గురవుతారు. అంతెందుకు, విచారణ జరిపిన ప్రత్యేక న్యాయస్థానం, అప్పిలేటు న్యాయస్థానం కూడా తమ తీర్పుల్లో బాధిత బాలుడు లేదా బాధిత బాలికగానే పేర్కొనాలి తప్ప పేరును బహిర్గతం చేయకూడదు. సాక్ష్యాలను నమోదు చేసే సమయంలో బాధిత బాలలు నింది తుడికి కనిపించకుండా ప్రత్యేక కోర్టు చర్యలు తీసుకోవాలి. వీడియో కాన్ఫరె న్సింగ్, సింగిల్ విజిబిలిటీ మిర్రర్లు, పరదా లేదా ఏదైనా ఇతర పరికరాన్ని ఉపయోగించి, భయాందోళనలకు గురి కాకుండా స్నేహపూర్వక వాతావరణం కల్పించి పిల్లల వాఙ్మూలాన్ని రికార్డ్ చేయాలి. అదే సమయంలో నిందితుడు బాధిత బాలల వాఙ్మూలాన్ని వినగలిగే, అతని న్యాయవాదితో సంభాషించ గలిగే స్థితిలో ఉండాలి. ఈ చట్టం కింద నమోదైన కేసుల్లో నేరం చేయలేదని రుజువు చేసుకోవాల్సిన భారం నిందితుడి మీదే ఉండటం గమనార్హం. పిల్లలు, టీనేజర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్న వెబ్సైట్ల సంఖ్య పెరుగుతోంది. వీటి దుష్ప్రభావాల నుంచి రక్షించడంలో భాగంగా పదహారేళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టం తెచ్చింది. అలాంటిది తేవడానికి అవకాశం ఉందేమో మన ప్రభుత్వాలూ పరిశీలించాలి. చికిత్సకు ముందే వ్యాధి నివారణకై ఆలోచించటం ఉత్తమం.-తడకమళ్ల మురళీ ధర్ విశ్రాంత జిల్లా జడ్జి -
కామితార్థ ప్రదాయిని కామాక్షీదేవి
కంచి (Kanchi) అనగానే మనకు కామాక్షిదేవి పేరే గుర్తుకు వస్తుంది. ఆ నగరాన్ని స్మరిస్తేనే మోక్షం లభిస్తుంది. అందరూ దర్శించే కామాక్షీదేవి ఆలయానికి వెనుకవైపు ఒక ఆలయం ఉంది. అదే ఆదికామాక్షీదేవి ఆలయం. ఈ ఆలయాన్ని కాళీకొట్టమ్ (కాళీ కోష్టమ్) అనే పేరుతో కూడా పిలుస్తారు. ఒకానొక సమయంలో పార్వతీదేవి ఇక్కడ కాళీరూపంలో వెలసిందట. నాటినుండీ ఆమెకు ఆ పేరు ప్రసిద్ధమైంది.కంచి కామాక్షిదేవి ఆలయం కంటే ఇది ప్రాచీనమైనదని చెబుతారు. కామాక్షీదేవికి ముందు భాగంలో శక్తి లింగం ఒకటుంది. అమ్మవారి ముఖం లింగంపై ఉంటుంది. ఇది అర్ధనారీశ్వరలింగంగా పూజలందుకుంటోంది. కల్యాణం కాని వారు ఈ శక్తి లింగాన్ని పూజిస్తే తప్పక కల్యాణం జరుగుతుంది. ఈ ఆలయంలో ఆదిశంకరులు శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి అమ్మవారి ఉగ్రత్వాన్ని శాంతింపచేశారట.గర్భగుడిలో ఆదికామాక్షీదేవి పద్మాసనంలో కూర్చుని అభయముద్రను, పానపాత్రను, పాశాంకుశాలనూ నాలుగు చేతులతో ధరించి దర్శనమిస్తుంది. అమ్మవారి పీఠానికి కింది భాగంలో మూడు శిరస్సులు దర్శనమిస్తాయి. వాటి వెనుక ఒక పౌరాణిక గాథ ఉంది.శిల్పకుశలురైన ధర్మపాలుడు, ఇంద్రసేనుడు, భద్రసేనుడు అనే ముగ్గురు కాంచీపురంలో తమ శిల్పాలను ప్రదర్శించడానికి వస్తారు. వారి శిల్పకళకు అచ్చెరువొందిన కంచిరాజు వారికి ఒక మాట ఇచ్చి తప్పుతాడు. దాంతో రాజుకు శిల్ప సోదరులకు యుద్ధం జరుగుతుంది. భీకరమైన ఈ యుద్ధాన్ని నివారించేందుకు కామాక్షీదేవి ప్రత్యక్షమై రాజుకు, ఆ శిల్పులకు సంధి చేస్తుంది. శిల్పులకు తన పాదసన్నిధిలో స్థానం కల్పించి అనుగ్రహిస్తుంది. ఈ కథ ధర్మపాలవిజయం పేరిట ప్రసిద్ధి పొందింది. సకలశుభాలనూ, సకల సిద్ధులనూ అనుగ్రహించే ఆదికామాక్షీదేవిని దర్శించి అభీష్టసిద్ధిని పొందండి.చదవండి: పుణ్యభారతాన ఆదివైద్యుడి ఆలయాల గురించి తెలుసా?– డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
సహజమైన స్టైల్ దుస్తులే ఇష్టం: కునాల్ కపూర్
బాలీవుడ్ నటుడు ఓ స్టోర్ లాంచింగ్లో సందడి చేశారు. కొత్తగూడలోని శరత్సిటీ మాల్లో ఇండియన్ టెర్రైన్ ఎండీ నర్సింహన్తో కలిసి బుధవారం ఆయన సరికొత్త కాన్సెప్ట్ స్టోర్ను ప్రారంభించారు. ఫ్యాషన్ ప్రేమికులకు నాణ్యమైన వివిధ డిజైన్ల దుస్తులు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. సహజమైన స్టైల్గా ఉండే దుస్తులు ఇష్టమని ఓ తెలుగు సినిమాలో నటిస్తున్న కునాల్ కపూర్ పేర్కొన్నారు. చేనేత..ఓ ప్రామాణికత..ఫ్యాషన్ అంటే అనుసంధానం చేసేది, అనుభూతిని కలిగించేది.. మనం ధరించే వ్రస్తాలు అందమైన అనుభూతులనే కాకుండా సామాజికంగా మంచిని ప్రోత్సహించాలని నటి తేజస్వి మడివాడ తెలిపారు. కళాధర్ హ్యాండ్లూమ్స్ ఆధ్వర్యంలో రానున్న హైఫ్రీక్వెన్సీ దుస్తుల శ్రేణి కోసం నటి తేజస్వి సంస్థతో కలిసి పనిచేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సహజంగా లభించే ఫైబర్స్, స్వచ్ఛమైన పత్తి, నార, పట్టు నుంచి తయారైన దుస్తులను అమితంగా ఇష్టపడతాను, ఇలాంటి చేనేత ఫ్యాషన్ ఔత్సాహిక ఉన్న బ్రాండ్తో భాగస్వామిగా మారడం సంతృప్తిగా ఉందని అన్నారు. ప్రామాణికతపై నమ్మకం, చేతన ఫ్యాషన్ పట్ల నటి తేజస్వీకి ఉన్న ఉత్సుకత ఈ తరం ఫ్యాషన్ ప్రియులకు ఆదర్శమని కళాధర్ హ్యాండ్లూమ్స్ డైరెక్టర్ కళాధర్ రచబతుని పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యంలో భాగంగా మొదటి డ్రాప్లో క్లీన్ సిల్హౌట్లు, బ్రీతబుల్ టెక్చర్తో సమకాలీన హంగులతో భారతీయ హస్తకళను ప్రదర్శించే సీజన్లెస్ కలెక్షన్స్ ఉంటాయని పేర్కొన్నారు. (చదవండి: ఫ్యాషన్ టు డైరెక్షన్..! కాదేదీ సృజనకు అనర్హం) -
పుణ్యభారతాన ఆదివైద్యుడి ఆలయాల గురించి తెలుసా?
శ్రీ మహావిష్ణువు అవతారంగా, దేవతలకు వైద్యుడుగా, ఆయుర్వేద వైద్యానికి ఆది వైద్యుడిగా ప్రసిద్ధి చెందిన ధన్వంతరి క్షీర సాగర మథన సమయాన ఆశ్వయుజ శుద్ధ త్రయోదశి నాడు ఆవిర్భవించాడు. చతుర్భుజుడైన ధన్వంతరి నాలుగు చేతులలో శంఖం, చక్రం, జలౌకం (జలగ) అమృత తుల్యమైన పునరుజ్జీవన తేనె భాండం దర్శనమిస్తాయి.ధన్వంతరిని సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అవతారంగా పూజిస్తున్నప్పటికీ, ధన్వంతరికి అంకితం చేయబడిన దేవాలయాలు భారతదేశంలో చాలా తక్కువ. ఆ ఉన్న కొద్ది ఆలయాలు కూడా దక్షిణ భారతదేశంలోనే దర్శనమిస్తాయి ఉత్తర భారతాన న్యూఢిల్లీలోని కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థ ప్రాంగణంలో ఒక విగ్రహం, హరిద్వార్లోని ఒక ఆశ్రమంలో మరొక విగ్రహం తప్ప ఉత్తర భారతాన ధన్వంతరికి ఆలయాలంటూ అసలేం లేవనే చెప్పాల్సి ఉంటుంది.రంగనాథస్వామి ఆలయం వద్ద ధన్వంతరి ఆలయంతమిళనాడులో శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో ధన్వంతరి మందిరం ఉంది. శ్రీ రంగనాథస్వామి ఆలయ ప్రాంగణంలో 12వ శతాబ్దానికి చెందిన పురాతన మందిరం ఉంది. ఇక్కడ స్వామికి ప్రతిరోజూ పూజలు నిర్వహిస్తారు. ఆరోగ్యాభిలాషులైన భక్తులకు ‘ప్రసాదం’గా మూలికలను అందిస్తారు.కోయంబత్తూరు శ్రీ ధన్వంతరి ఆలయంకోయంబత్తూరులోని శ్రీ ధన్వంతరి ఆలయం తమిళనాడులోని మరొక ప్రసిద్ధ ధన్వంతరి ఆలయం. కోయంబత్తూరు నగర నడిబొడ్డున ఆర్య వైద్య చికిత్సాలయం, పరిశోధనా సంస్థలో ఉన్న శ్రీ ధన్వంతరి మందిరం, జీవానికి, వైద్యానికి దేవుడు, ధన్వంతరిని ప్రధాన దేవతగా ప్రతిష్టించింది.నెల్లువాయ భగవాన్ ధన్వంతరి ఆలయంగురువాయూర్, త్రిసూర్ నుండి 20 కి.మీ దూరంలో ఉన్న నెల్లువాయ వద్ద ఉన్న లార్డ్ ధన్వంతరి ఆలయం కేరళలోని ముఖ్యమైన ధన్వంతరి ఆలయాలలో ఒకటి. ఆయుర్వేద వైద్యులు వైద్యం ్ర΄ారంభించే ముందు ఈ ఆలయాన్ని సందర్శించడం శుభప్రదంగా భావిస్తారు.మలప్పురంలో రుద్ర ధన్వంతరి ఆలయంమలప్పురంలోని పులమంథోల్ మధ్యలో ఉన్న శ్రీ రుద్ర ధన్వంతరి ఆలయం కేరళలోని మరొక ప్రసిద్ధ ధన్వంతరి ఆలయం. ఈ ఆలయం ప్రసిద్ధ అష్టవైద్య పులమంథోల్ మూస్ కుటుంబానికి చెందినది, అయితే అన్ని వర్ణాలకు చెందిన హిందువులు ఆలయంలో పూజలు చేసుకోవడానికి అనుమతి ఉంది.శ్రీ ధన్వంతరి ఆలయం, పెరింగవుకేరళలోని త్రిస్సూర్ పట్టణ శివార్లలో ఉన్న మరొక పురాతన ధన్వంతరి ఆలయం పెరింగావులోని శ్రీ ధన్వంతరి ఆలయం. ఈ ఆలయ గర్భగుడి రెండు అంతస్తులతో గుండ్రని ఆకారంలో నిర్మించబడింది, ఇది ఇతర కేరళ శైలి నిర్మాణ శైలికి భిన్నంగా అరుదైన డిజైన్. గణపతి, లక్ష్మీదేవి, అయ్యప్పన్ ఈ ఆలయంలో ప్రతిష్టించబడిన ఇతర దేవతలు.వడక్కంచెరి ధన్వంతరి ఆలయంవడక్కంచెరి ఆయుర్వేద ప్రభువుకు అంకితం చేయబడిన మరొక ప్రసిద్ధ ఆలయం. ఈ ఆలయం కేరళలోని త్రిస్సూర్కు ఉత్తరాన 18 కి.మీ దూరంలో వడక్కంచెరి నుండి 8 కి.మీ దూరంలో కున్నంకుళం – వడక్కంచెరి రహదారిపై ఉంది. (అక్టోబర్ 18, శనివారం ధన్వంతరి జయంతి) -
ఫ్యాషన్ టు డైరెక్షన్..! కాదేదీ సృజనకు అనర్హం
దుస్తులు చెక్కిన చేతులు దృశ్యాలకు రూపమిస్తున్నాయి. మోడల్స్ని మెరిపించిన సృజన యాక్టర్స్ను కదిలిస్తోంది. ఫ్యాషన్ డిజైనర్లు సినిమా రంగం వైపు దృష్టి మళ్లిస్తున్నారు. కాదేదీ సృజనకు అనర్హం అనుకుంటూ తమ స్కిల్స్కు సాన పెడుతున్నారు. ఈ ట్రెండ్ దేశవ్యాప్తంగా ఇప్పటికే ప్రారంభం కాగా.. నగరంలో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. సినిమా రంగం వైపు డిజైనర్ల చూపు ‘అక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ రావాలి.. ఆ షేడ్ ఇంకొంచెం మార్చాలి’.. వగైరా సూచనలు చేసిన వారే ‘లైట్స్, కెమెరా, యాక్షన్..’ అంటూ నిర్ధేశిస్తున్నారు. నగరంలో కొన్ని సినిమా షూటింగ్స్లో డైరెక్టర్లుగా మారిన ఫ్యాషన్ డిజైనర్లు చేస్తున్న సందడి ఇది. బాలీవుడ్తో మొదలై.. ప్రముఖ భారతీయ ఫ్యాషన్ డిజైనర్లు అనగానే వెంటనే గుర్తుకు వచ్చే జాబితాలో ముందుంటాయి విక్రమ్ ఫడ్నిస్, మనీష్ మల్హోత్రా అనే పేర్లు. అయితే ఇప్పుడు వీరి పేర్లకు ముందు ఇప్పుడు డిజైనర్లతో పాటు డైరెక్టర్లు అనే కొత్త ప్రొఫెషన్ కూడా చేరింది. కొన్నేళ్ల క్రితమే సినిమా దర్శకత్వంలో అడుగుపెట్టి హృదయాంతర్(2017), స్మైల్ ప్లీజ్(2019) అనే రెండు మరాఠీ చిత్రాలకు విక్రమ్ ఫడ్నిస్ దర్శకత్వం వహించారు. అదేవిధంగా ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న హిందీ చిత్రం ద్వారా మనీష్ మల్హోత్రా దర్శకుడిగా అరంగేట్రం చేయబోతున్నారు. అయితే వీరు మాత్రమే కాకుండా గతంలో ఇతర డిజైనర్లు కూడా రంగుల లోకంలో భిన్న పాత్రలను పోషించారు. కాంతార ద్వారా దేశవ్యాప్తంగా అటు దర్శకత్వం, ఇటు హీరోగానూ పేరు సాధించిన రిషబ్ శెట్టి తొలి దశలో తాను తీసిన రిక్కి అనే సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్గా కూడా పనిచేశారు. అదే విధంగా డిజైనర్గా సినిమా రంగంలో అడుగుపెట్టిన కేరళకు చెందిన స్టెఫీ జేవియర్ సైతం కొన్నేళ్ల తర్వాత మధుర మనోహర మోహం అనే సినిమా ద్వారా దర్శకురాలిగా మారారు. నగరానికి వచ్చేసిన ట్రెండ్.. ఇప్పుడు అదే ట్రెండ్ నగరానికి కూడా విస్తరించినట్టు కనిపిస్తోంది. నగరానికి చెందిన ప్రముఖ డిజైనర్లు సినిమా రంగంపై తమ దృష్టి మళ్లించినట్టు స్పష్టమవుతోంది. డిజైనర్గా విజయవంతంగా కొనసాగుతున్న రామ్జ్.. పచ్చీస్ అనే సినిమా ద్వారా హీరోగా మారాడు. అలాగే ఫైటర్ రాజా పేరిట మరో సినిమాలో ఆయన నటిస్తున్నాడు. ఇక డైరెక్టర్లుగా మెగాఫోన్ పడుతున్నవారూ క్రమక్రమంగా పెరుగుతున్నారు. వీరిలో సినీ స్టైలిస్ట్, డిజైనర్గా పేరొందిన నీరజ కోన త్వరలో విడుదల కానున్న తెలుసు కదా సినిమాతో దర్శకురాలిగా ఆరంగేట్రం చేస్తున్నారు. గోదావరి వంటి సినిమాలకు పనిచేయడం ద్వారా శేఖర్ కమ్ములకు సన్నిహితుడైన మరో ప్రముఖ డిజైనర్ అరవింద్ జాషువా కూడా పేషన్ పేరుతో ఒక సినిమా తీస్తున్నారు.డిజైనర్గా ఉన్నా కాబట్టే డైరెక్టర్గా మారా.. దాదాపు 12ఏళ్ల పాటు కాస్ట్యూమ్స్ డిజైనర్, స్టైలిస్ట్గా ఉన్నాను. అందువల్లే నేను డైరెక్టర్గా మారగలిగాను. సినిమా రంగంతో సన్నిహితంగా ఉంటూ తొలుత స్క్రిప్ట్ రాయడం మీద పట్టు సాధించి అలా అలా ఒక స్టోరీని రెడీ చేసుకుని ఇప్పుడు సినిమా డైరెక్షన్ చేశాను. ఖచ్చితంగా ప్రేక్షకుల మన్ననలు పొందుతుందని ఆశిస్తున్నాను. – నీరజ కోన, ఫ్యాషన్ స్టైలిస్ట్, దర్శకురాలుఅదే ప్యాషన్తో.. సినిమా సినిమాల్లో కాస్ట్యూమ్ డిజైనర్గా ఉన్నప్పుడు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ తరహాలో కాస్త ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేవాడిని. స్క్రిప్ట్ చదవడం దగ్గర నుంచి ప్రతీ అంశంపై నా ఆసక్తిని గమనించి శేఖర్ కమ్ముల బాగా నన్ను ప్రోత్సహించారు. అణువణువునా సృజనాత్మకత నింపే ఫ్యాషన్ డిజైనింగ్ అనేది రెగ్యులర్ స్టడీస్ లాంటిది కాదు. నిఫ్ట్లో చదువుతున్నప్పుడు నాతో పాటు సహ విద్యార్థుల్లో కూడా గమనించిన ప్యాషన్ను బుక్గా రాశాను. అదే నా సినిమాకి ఇప్పుడు నేపథ్యం. – అరవింద్ జాషువా, ఫ్యాషన్ డిజైనర్, దర్శకుడు (చదవండి: హెయిర్కి బియ్యపిండి మాస్క్ మంచిదేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..) -
మానసిక వ్యాధులను మందుల్లేకుండానే నయం చేయొచ్చా?
మా అబ్బాయికి చాలా కాలంగా స్కిజోఫ్రీనియా వ్యాధి ఉంది. హైదరాబాదులో చికిత్స ఇప్పిస్తున్నాము. చాలాసార్లు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి కరెంటు ట్రీట్మెంట్ (ఇ.సి.టి.) కూడా ఇప్పించాము. చాలా కాలం నుండి డాక్టర్ ఇచ్చిన క్లోజపిన్ మందులు వాడుతున్నాము. అయితే తను మన అందరి లాగా పూర్తిగా నార్మల్గా ఉండడు. కొన్ని లక్షణాలు అలాగే మిగిలి ఉన్నాయి. పని కూడా ఏమీ చేయడు. ఇలా ఉండగా యూ ట్యూబ్లో ఒక కౌన్సెలర్ ఇంటర్వ్యూ చూసి ఆయనను వ్యక్తిగతంగా కలిసి ఆయన సలహా మేరకు మందులు – ఆపేశాం. మందులు మానేస్తే 3–4 నెలల్లోనే జబ్బును పూర్తిగా నయం చేస్తానన్నాడాయన. అలా చేసిన తర్వాత లక్షణాలు తగ్గకపోగా, మరింత పెరిగాయి. మా అబ్బాయికి చెవిలో మాటలు వినపడుతుండడంతో వాటిని తట్టుకోలేక ఆత్మహత్యకి కూడా ప్రయత్నించాడు. ఇప్పుడు నాకు స్పష్టత రావట్లేదు – మళ్ళీ డాక్టర్ని కలిసి మందులు తీసుకోవాలా? లేక ఆ కౌన్సెలర్ చెప్పినట్టే ఇంకొంత కాలం మందులు లేకుండా కౌన్సిలింగ్ మాత్రమే చేయించాలా? ఏది నమ్మాలి? ఏం చేయాలో కన్ఫ్యూజన్ లో ఉన్నాను. అసలు మందులు లేకుండా మానసిక వ్యాధులను నయం చేయలేరా! – శ్రీనివాసరావు, హైదరాబాద్‘స్కిజోఫ్రీనియా’ అనేది ఒక దీర్ఘకాలిక మానసిక వ్యాధి, కొంతమందిలో లక్షణాలు తగ్గినా, చాలాసార్లు దాన్ని పూర్తిగా నయం చేయడం కష్టం. చాలా సందర్భాల్లో దీర్ఘకాలికంగా మందులు అవసరమవుతాయి. కొన్ని సందర్భాల్లో తీవ్ర లక్షణాలు ఉన్నప్పుడు రోగిని ఆసుపత్రిలో ఉంచి ఇ.సి.టి. థెరపీ వంటి చికిత్సలు కూడా ఇవ్వాల్సి వస్తుంది. తరువాత జబ్బు మళ్లీ పెరగ కుండా మందులను చాలాకాలం కొనసాగించడం అవసరం పడవచ్చు. ఇక మీ అబ్బాయికి వాడినట్లుగా మీరు చెబుతున్న క్లోజపిన్ అనే మందు స్కిజోఫ్రీనియా లక్షణాలు మొండిగా ఉన్నప్పుడు, ఇతర మందులు పని చేయని సందర్భాల్లో వాడే ఔషధం. దీనిని డాక్టర్ పర్యవేక్షణలో సరైన డోసుల్లో వాడితే మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఆత్మహత్య ఆలోచనలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మానసిక సమస్యలకు ఇచ్చే చికిత్సలో రెండు ప్రధాన భాగాలు ఉంటాయి. మెదడులో రసాయన అసమతుల్యతను సరిచేయడానికి కొన్ని మందులు వాడడం అలాగే రోగికి, వారి కుటుంబానికి జబ్బుపై అవగాహన పెంచడం (సైకోఎడ్యుకేషన్), లక్షణాలు తగ్గడం కోసం ‘కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’ వంటి సైకలాజికల్ ట్రీట్మెంట్, ఈ రెండూ కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు సాధ్యమవుతాయి. వైద్యుల సూచన లేకుండా మందులను ఇలా ఆపడం చాలా ప్రమాదం! మందులు ఆపిన తరువాత లక్షణాలు పెరిగి, ఆత్మహత్యా ప్రయత్నం జరగడం చాలా తీవ్రమైన విషయం. అందుకే మళ్లీ మీ సైకియాట్రిస్ట్ను కలిసి పరిస్థితిని వివరించి మందులను ప్రారంభించండి. అలాగే మందులతోపాటు, అవసరమైతే అర్హత కలిగిన (ఆర్.సి.ఐ. లైసెన్స్ పొందిన) క్లినికల్ సైకాలజిస్ట్ వద్ద నుండే సైకోథెరపీ కౌన్సెలింగ్ తీస్కోండి. నేటి కాలంలో యూట్యూబ్, సోషల్ ’మీడియా వేదికల్లో చాలా మంది వైద్యపరమైన అర్హత లేని వ్యక్తులు పెద్ద పెద్ద హామీలు ఇస్తూ కనిపిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో ముఖ్యంగా స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిసార్డర్. లాంటి మానసిక వ్యాధుల విషయంలో అలాగే ఆటిజం, ఎ.డి. హెచ్.డి. వంటి న్యూరో డెవలప్మెంట్ సమస్యల – విషయంలో అటువంటి అసంబద్ధమైన మోసపూరిత ప్రకటనలను నమ్మరాదని, వైద్యుల సూచన లేకుండా మందులు నిలిపివేయవద్దని మనవి. జబ్బు లక్షణాలు తగ్గేకొద్దీ, డాక్టర్లే మందుల డోసును క్రమేపీ తగ్గిస్తారు, తప్ప అర్హతలేని వారి సలహామేరకు మందులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆపరాదు.. చిన్న చిన్న మానసిక వ్యాధుల విషయంలో ఒక్కోసారి మందులు లేకుండా కేవలం కౌన్సెలింగ్ తో సరిచేయవచ్చేమో కానీ, స్కిజోఫ్రీనియా లాంటి తీవ్రమైన మానసిక వ్యాధులకు మందులు తప్పనిసరి! చదవండి: మొరింగా సాగుతో.. రూ. 40 లక్షల టర్నోవర్డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
ఆ దివ్య తోటలోనికి ఆమె తరలి వెళ్లింది
‘ఆ తోటలోనొకటి ఆరాధనాలయము’ అని గానం చేసి తెలుగువారి అపురూప గాయనిగా నిలిచిన రావు బాలసరస్వతి దివిలోని దివ్య పాటల లోగిలికి తరలి వెళ్లారు.‘మల్లెపూలు మొల్లపూలు కల్వపూలు కావాలా’... అని సుమగీతాలనిచ్చిన రావు బాలసరస్వతి వాడని పూలుండే లోకానికి బయలుదేరారు. గాయనిగా సవాళ్లు ఎదుర్కొన్నా గొంతు ఖైదు చేయబడినా నిలిచిన నాలుగు నిక్కమైన నీలాలతోనే నేటికీ మిలమిలలాడిన ఆమె వజ్రాల నదులు పారే అంబరాల బాట పట్టారు. ఆమెకు తెలుగువారి నివాళి. లలిత సంగీత ప్రపంచపు సురాగమయ జోహారు.ఈ వేళ పొద్దున్నే ఫేస్బుక్లో, ఇతర గ్రూపుల్లో రావు బాలసరస్వతి గారి ఫొటో చూడగానే మనసు కీడు శంకించింది. చాలా రోజులు నుంచి ఆమె ఆరోగ్యం బాగా లేదని తెలుసు. అయినా వున్నారనే ఆలోచన తృప్తినిస్తుంది. ఇంక ఈ రోజు తో ఆ ఆశ లేదు. ఆమె తెలుగువారి తొలి నేపథ్యగాయని అవునో కాదో ఆ చర్చ వేరేగాని తొలి ప్రముఖ నేపథ్య గాయని అనడంలో ఎటువంటి సందేహం లేదు. సి.ఆర్.సుబ్బరామన్, ఎస్.రాజేశ్వరరావుల సంగీతంలో ఎన్ని గొప్ప పాటలు. ‘దేవదాసు’లో ఆమె పాడిన ‘తానే మారెనా... గుణమ్మే మారెనా’ పాట ఎంతమందికో ఇష్టం. ఆమె పాడిన ’ఆ తోటలో నొకటి ఆరాధనాలయము’ విని ‘అందులో ఆమె అందగాడెవరే అని గొంతెత్తి పాడుతూ వుంటే మనసు ఎటో వెళ్లిపోతుంది’ అన్నారు మహా రచయిత చలం. అంత మధురమైన స్వరం బాలసరస్వతిది. చాలా ఏళ్ల క్రితం గుంటూరులో ప్రోగ్రాం. కారణం ‘అజో విభో అవార్డు’ ఆమెను వరించింది. ఆ సభకు హాలులో జనం పోటెత్తారు. ఎన్ని రోజులు అయింది! ఆమెని చూడాలి. ఆమె పాట వినాలి. అప్పటికే భర్త ఆంక్షలతో ఆంధ్రదేశం ఆమె పాటకి దూరమై దాదాపు అర్ధ శతాబ్దం అయింది. అందుకే అదో అపురూప అవకాశం అని విజయవాడ నుంచి మేమూ వెళ్ళాం. ఎప్పటిలా నేను పాడనని నిర్వాహకులకి చె΄్పారుట. అవార్డు ఇచ్చాక ‘అమ్మా... ఒక ముక్క పాడండి’ అని ప్రేక్షకులు ఒక్క గొంతుతో అడిగితే సరేనని –చలి గాలి వీచింది – తెరవారబోతోందిఇకనైన ఇలు చేరవా – ఓ ప్రియా ఇకనైన ఇలు చేరవా...పాట వింటూ అందరూ చప్పట్లు కొట్టారు. ఆ ఉద్వేగాన్ని మర్చిపోలేను. అందరి కళ్లలో నీళ్ళు! లేచి నిల్చుని చప్పట్లు. మారుమోగిన హాలు. ఆ తర్వాత ఆమెతో చనువు ఏర్పడ్డాక అడిగాను ’ఎందుకలా పాడనంటారు’ అని . ‘చాలా రోజులుగా పాడలేదు గదా... అప్పటి పాటలా రాకపోతే నాకు బాగుండదు’ అన్నారు. ’ఎవరన్నారు మీ పాట అప్పటి పాటలా లేదని.? వయసుతో మరింత అందం వచ్చింది’ అన్నాను. నిజమే! ఆ గొంతులో మధురిమ ఏ మాత్రం తగ్గలేదు. ‘బెజవాడ వచ్చి నాలుగు రోజులు మీ ఇంట్లో వుంటా, నన్ను పాడమని అడగద్దు’ అన్నారొకసారి. అలాగేనని తీసుకుని వచ్చాను. మహీధర రామ్మోహనరావు గారు, నండూరి రామ్మోహనరావు గారు... ఇలా అందరూ వచ్చారు ఆమెను చూడటానికి. ఆమెకీ వారందరంటే అభిమానమే. అందరూ ఇంట్లో కూర్చుని కబుర్లు మొదలు పెట్టాక పాట ఎలా ఆగుతుంది? రామ్మోహనరావు గారి కోరిక పై ‘ఆ తోటలో నొకటి ఆరాధనాలయం’ పాడారు. ‘రెల్లు పూల పానుపు పైన ఎవరో వెన్నెల జల్లినారమ్మా!’ అని ఆమె పాడుతూ ఉంటే నిజంగానే వెన్నెల మా అందరి మనసుల్లో. ఆ స్వరం జల్లుజల్లుగా కురిపించింది. అంత మంది పండితులు, కవులు మధ్య కూర్చునే సరికి ఆ కోయిల అలా నాలుగు గంటలసేపు పాడింది! ఎంత భాగ్యం కదా!అదే మొదలు. ఎప్పుడు రావాలి అని అనిపిస్తే అపుడు విజయవాడ రావడం నాలుగు రోజులు వుండడం. మా ఇంట్లో కుదరని పరిస్థితి వచ్చినప్పుడు హేమ పరిమిగారిని అడిగాను. ఆమె ఎంతో సంతోషించి వారి పొదరింట్లో రెండు మూడుసార్లు ఆతిథ్యం యిచ్చారు. బాలసరస్వతి గారి పాట ఎంత మధురమో మనసు అంత సున్నితం. ఒకసారి స్నేహం చేస్తే మర్చిపోరు. ఆత్మీయతను పదిసార్లు గుర్తు తెచ్చుకుంటారు. మనకి ఆమె చిన్నప్పటి నుంచి తెలిసిన చుట్టం అవుతారు. రాగానే ముందు పాత పరిచయాలు గుర్తుకు తెచ్చుకుని వారిని ఒకసారి కలవాలి అని అనుకుంటారు. ‘అమ్మాయి’ అంటూ స్వంత కూతురులా చూసుకుంటారు. అలా వారి పెద్దబ్బాయి, చిన్నబ్బాయి మా వారిని అన్నయ్య అని, నన్ను వదినా అని కలిపేసుకున్నారు. మామయ్య గారి (బాలాంత్రపు రజనీకాంతరావు) పై అభిమానం. వి.ఏ.కే రంగారావు గారి దృష్టిలో ఆమె పాడిన అన్ని పాటలలోకి గొప్పది రజనీ గారు స్వరపరిచిన ‘తన పంతమే తా విడువడు’. ఆమెకు లలితమైన సంగీతం మాత్రమే యిష్టం. సుబ్బరామన్ సంగీతం ఆమెకు యిష్టం. హాయిగా పాడుకోవచ్చు అంటారు. తన గొంతుకు సరిపోయే పాట, సంగీతం అయితేనే పాడతారు. పాట పాడితే అది పదికాలాలు వుండాలి అంటారు. ‘పాట నాకు నచ్చకపోతే ఎంత పెద్దవాళ్ళైనా లేచి వెళ్లి పోతాను’ అంటారామె. అందుకే సంగీత దర్శకులు ‘బాలమ్మా సరేనా?’అని అడిగి ట్యూన్ చేసేవారట. మీరా భజనలు ఎంత గొప్పగా పాడేవారని. వసంతదేశాయి దగ్గర వాటిని నేర్చుకున్నారు. ‘మీరా భజన్ కర్ణాటక పద్ధతిలో పాడితే బాగుండదు’ అని ఆమె స్ధిర అభిప్రాయం. అందుకే హిందీ మాటలు పలికే పద్ధతిని నేర్చుకుని అదే విధంగా పాడేవారు. హిందీ చిత్ర పరిశ్రమలోకి వెళ్ళ లేకపోవడం ఆమెకు కొంచెం అసంతృప్తి. మనసులో కొంచెం ఆ బాధ మిగిలిపోయింది. హిందీ సినీ సంగీతం గురించి ఎన్నో కబుర్లు చెప్పేవారు. ఆమె ఇంట్లో ఉన్నప్పుడు ఈల వినపడితే ఎవరా అని ఇటు అటు చూస్తే ‘నేనే’ అని చిలిపిగా నవ్వేవారు. ‘అమ్మకి అల్లరి ఎక్కువ’ అని ఆమె పిల్లలు కూడా గారాబం చేసేవారు. చివరిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెకు ‘వైఎస్ఆర్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డ్’ యిస్తే వచ్చేందుకు ఆరోగ్యం సహకరించలేదు. ఆ పురస్కారంతో పొటో దిగి పంపారు. ఇక మళ్ళీ ఆమెను చూడలేము. కాని పాట వున్నంత వరకూ ఆమె చిరస్థాయిగా వుండి పోతారు.– ప్రసూన బాలాంత్రపు -
చౌకగా వెండి ఇలా కొంటే రూ. 14 వేలు ఆదా! వైరల్ ట్వీట్
వెండి, బంగారం మాట ఎత్తాలంటేనే బెంబేలెత్తేపరిస్థితి. ఊహించని రీతిలో పెరిగి ఆకాశా న్నంటాయి. సామాన్య మానవులే కాదు, ధనవంతులు కూడా గోరెడు బంగారం కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి. మరీ వెండి ధరలు కనీవినీ ఎరుగని రీతిలో పరుగులు తీస్తోంది. ఈ క్రమంలో ఎక్స్లో ఒక ట్వీట్వైరల్గా మారింది. దేశంలోని పలు నగరాల్లోని వెండి ధరల అంతరాలపై ఇది తీవ్ర చర్చకు దారి తీసింది. దీని కథా కమామిష్షు ఏమింటే..ఫుడ్ కంటెంట్ క్రియేటర్ నళిని ఉనగర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అయింది. ఆమె ఏమంటుంది అంటే.. అక్టోబరు 14 నాటికి వెండి ధరలు పోలుస్తూ ఈ రైలు ప్రయాణం ద్వారా మీకు రూ.14వేల ఆదా చేసుకోవచ్చు ట్వీట్ చర్చకు దారితీసింది. ఆమె లెక్క ఆన్లైన్లో అటు వ్యాపారులు , ఇటు సాధారణ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది.అక్టోబర్ 14న దేశంలోని రెండు భారతీయ నగరాల్లో 1 కిలో వెండి ధర ఇలా ఉన్నాయిఅహ్మదాబాద్: రూ. 1,89,000విశాఖపట్నం: రూ. 2,06,0001 kg Silver Price- Ahmedabad: ₹1,89,000- Visakhapatnam: ₹2,06,000Return Train (Ahmedabad → Visakhapatnam): ₹2,000Gross Profit: ₹17,000Tax: ₹510Net Profit: ₹14,490 (per trip, ~3 days)If repeated 3–4 times a month, total monthly profit ≈ ₹43,000 – ₹58,000— Nalini Unagar (@NalinisKitchen) October 14, 2025 రెండు నగరాల మధ్య రైలు టికెట్ ధర దాదాపు రూ. 2,000. అంటే తక్కువగా ఉన్న నగరంలో వెండిని కొనుగోలుచేస్తే ప్రయాణ ఖర్చులు , ప్రాథమిక పన్నులు తరువాత ట్రిప్కు సుమారు రూ. 14,490 నికర లాభం ఉంటుందని అంచనా వేసింది. అంటే నెలకు 3–4 సార్లు చేస్తే చాలు రూ. 43వేల నుంచి రూ. 58వేలకు సంపాదించవచ్చు అని ఆమె పేర్కొంది.చదవండి: మొరింగా సాగుతో.. రూ. 40 లక్షల టర్నోవర్దీనిపై భిన్న స్పందనలు వినిపించాయి. ఈ రేటులో భారీ వ్యత్యాసం ఉంది. కొనుగోలు ధర రూ. 2 లక్షలు అయితే, అమ్మకపు ధర రూ. 1.8 లక్షలు. కాబట్టి, మీరు అహ్మదాబాద్లో రూ. 1.89 లక్షలకు కొనుగోలు చేసినప్పటికీ, అదే ధరకు ఇక్కడ విక్రయించలేరు కదా ఒకరు ప్రశ్నించారు. సాధారణంగా వెండి ధరల్లో అంత తేడా ఉండదు. ( మరీ 17 వేలంత). ధరలు జాతీయంగా నియంత్రించబడతాయి. పైగా వెండిపై GST 3శాతం జీఎస్టీ. లాభాల్లో జీఎస్టీ భారం ఉంటుంది. పైగా మీరు రిజిస్టర్డ్ GST డీలర్ అయి ఉండాలి, చెల్లుబాటు అయ్యే ట్యాక్స్ ఇన్వాయిస్, ఇ-వే బిల్లును కలిగి ఉండాలి కాబట్టి మీ మరింత పన్నుభారం తప్పదు. పైగా వెండి ధరలు ప్రతిరోజూ హెచ్చుతగ్గులకు లోనవుతాయి. కాబట్టి విశాఖపట్నం చేరుకునే సమయానికి, ధర తగ్గితే, లాభం కాస్త నష్టంగా మారవచ్చు కదా అంటే కమెంట్ చేశారు. మీ "లాభం" నష్టంగా మారుతుంది. అయితే బులియన్ మార్కెట్లు, ధరలు స్థానిక డిమాండ్-సరఫరా, లాజిస్టిక్స్ ఖర్చులు, రాష్ట్ర పన్నులు ,డీలర్ మార్జిన్లు వంటి అంశాల కారణంగా ఈ తేడాలుంటాయనేది గమనించాలంటున్నారు బులియన్మార్కెట్ నిపుణులు.ఇదీ చదవండి: ఫ్యామిలీ కోసం కార్పొరేట్ జీతాన్ని వదులుకుని రిస్క్ చేస్తే..! -
హెయిర్కి బియ్యపిండి మాస్క్ మంచిదేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..
ప్రముఖ టెలివిజన్ నటి, దీపికా కాకర్(Dipika Kakar) షోయబ్ ఇబ్రహీంల జంట బాలీవుడ్లో ఎంతో ఫేమస్ తెలిసింది. ఎప్పటికప్పడూ సోషల్ మీడియాలో తమ విషయాలను షేర్ చేస్తూ..తమ అభిమానులను సంతోషపరుస్తూ ఉంటారు. అలానే ఈసారి తమ హెయిర్ సీక్రెట్కి సంబంధించిన వీడియోని పోస్ట్ చేస్తూ..తమ అందమైన కురులు రహస్యం బియ్యపిండి మాస్క్ అని వెల్లడించారు. దీన్ని తమ రెండేళ్ల కుమారుడి జుట్టుకి కూడా అప్లై చేస్తామని, ఇది శిరోజాలకు ఎంతో మంచిదంటూ చెప్పుకొచ్చారు అంతేగాదు ఇందులో ఎలాంటి పదార్థాలు ఉపయోగిస్తారో కూడా వివరించాడు ఆమె భర్త షోయబ్ ఇబ్రహీం. అసలేంటి ఈ ప్యాక్..?, ఇది నిజంగానే హెయిర్కి మంచిదా అనే వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం. బియ్యపిండి మాస్క్(Rice Flour mask)లో బియ్య పిండి, అవిసె గింజెలు, కొబ్బరి నూనెల మిశ్రమమే ఈ బియ్యపిండి మాస్క్. ఇది కురులను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందని చెబుతున్నారు దీపికా కకార్ దంపతులు. మరి ఇది హెయిర్కి మంచిదేనా..?, అంత చిన్నపిల్లలకు అప్లై చేయొచ్చా? అంటే..నిపుణులు ఏమంటున్నారంటే..ప్రముఖ నిపుణులు ఇందులో ఉపయోగించే బియ్యపిండి, అవిసె గింజలు, కొబ్బరి నూనె వంటి వన్నీ సహజ పదార్థాలని, వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయని అన్నారు. అయితే పెద్దలకు మంచివైనవి ఎప్పుడూ చిన్నారులకు మంచివి కావనే విషయం గుర్తెరగాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే వారి చర్మం చాలా సున్నితం..అందులోనూ వారి బుర్ర ఇంకా గట్టిపడదు..కాబట్టి అక్కడ చర్మం మరింత మృదువుగా ఉంటుందట. కాబట్టి ఇలాంటి వంటింటి చిట్కాలను అనుసరించే మందు కాస్త కేర్ఫుల్గా ఉండాలన్నారు. జుట్టుకి మంచిదేనా అంటే..బియ్యపిండి జుట్టుని సున్నితంగా ఎక్స్ఫోలియేట్ చేసి అదనపు నూనెలను తొలగిస్తుందట. అలాగే ఇక్కడ అవిసె గింజల్లో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కురుల ఆకృతిని మెరుగుపరుస్తాయిట. ఇక కొబ్బరి నూనె జుట్టుని తేమగా ఉండేలా చేస్తుందట. కానీ శిశువు చర్మానికి ఇవి అస్సలు పనికిరావనిచెబుతున్నారు. అంతేగాదు బియ్యపిండిలో ఉండే అమైనో ఆమ్లాలు, స్టార్చ్ జుట్టుని బలోపేతం చేసి మెరిసేలా చేస్తాయట. అవిసెగింజల్లోని యాంటీ ఆక్సిడెండ్లు జుట్టుని ఉండలు కట్టకుండా చేస్తుందట. తలపై మంటను తగ్గించి, పెరుగుదలను ప్రేరేపింస్తుందట. పర్యావరణ హానికరమైన ప్రభావాన్ని నుంచి రక్షిస్తుందట. నిజానికి ఈ పదార్థాలన్నీ జుట్టు వేగవంతంగా పెరిగేలా చేయకపోయినా..ఆరోగ్యంగా..మెరుగ్గా ఉండేలా చేస్తాయట. తత్ఫలితంగా జుట్టు పెరుగుదల సులభతరం అవుతుందని చెబుతున్నారు నిపుణులు. అలాగే సహజసిద్ధమైనవన్ని సురక్షితం కాదనే విషయం గమనించాలని అంటున్నారు నిపుణులు. అవన్ని ఇంట్లో పరిశుభ్రమైన పద్ధతిలో తయారైనవే అని నిర్థారించుకోవాలని చెబుతున్నారు. అలాగే శిశువులకు ఉపయోగించాలనుకుంటే మందుగా డెర్మటాలజిస్టులను సంప్రదించాలని సూచించారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: 44 కిలోల బరువు తగ్గిన ఫిట్నెస్ కోచ్..! సరికొత్తగా వెయిట్లాస్ పాఠాలు..) -
మొరింగా సాగుతో.. రూ. 40 లక్షల టర్నోవర్
వ్యవసాయం చేయడం అంటే మాటలుకాదు. చెమటలు చిందించాలి. ఆను పాను తెలియాలి. ఏ పంటకు ఎలాంటి చీడపీడలు వస్తాయి, వాటికి పరిష్కారం ఏమిటి అనేదానిపై పూర్తి అవగాహన ఉండాలి. కష్టాలు కన్నీళ్లు ఎన్ని వచ్చినా ఓపిగ్గా ఉంటూ కృషిని నమ్ముకోవాలి. వీటన్నింటికి తోడు మట్టిని ప్రేమించాలి. అపుడు మాత్రమే ఊహించని ఫలితాలు సాధ్యం. అలా కర్ణాటకకు చెందిన ఒక రైతు అద్భుతాలు సాదించాడు. ఏడాదికి 40 లక్షల రూపాయల ఆదాయాన్ని కళ్ళ చూస్తున్నాడు. పదండి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.కర్ణాటకకు చెందిన ఉమేశ్ రావు మునగ సాగుతో భారీ లాభాలు సాధించిన తనలాంటి ఔత్సాహిక రైతులకు ప్రేరణగా నిలిచాడు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన ఉమేశ్ కుటుంబ భారాన్ని మోయాల్సి వచ్చింది. దీంతో పూర్వీకుల భూమిలో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎనిమిది ఎకరాలకు పైగా చెరకు, మొక్కజొన్న, రాగులు, కూరగాయలు, ఇతర పంటలను పండించాడు. కానీఆశించిన ఫలితాలు పెద్దగా లభించ లేదు. ఇంతలో మొరింగ సాగు గురించి తెలుసుకున్నాడు.2010లో మొరింగ ఒలిఫెరా మొక్క విత్తనాలను నాటాడు ఉమేష్. దాదాపు 900 మొక్కలతో తన జర్నీని మొదలు పెట్టాడు. మొదట్లో మునక్కాయలను క్రమంగా మునగాకు పౌడర్ను విక్రయించడం మొదలు పెట్టాడు. పదేళ్ల పాటు ఆర్థికంగా కుదుట పడ్డాడు. 2020లో కోవిడ్ మహమ్మారి రావడంతో మునగ పొడి డిమాండ్ భారీగా పెరిగింది. ఈ డిమాండ్ కనుగుణంగా ఇతర పంటలను నిలిపివేసి సేంద్రీయ పద్ధతుల్లో మునగ సాగు చేశాడు.చదవండి: ఫ్యామిలీ కోసం కార్పొరేట్ జీతాన్ని వదులుకుని రిస్క్ చేస్తే..!ఇది ఇలా ఉండగా భూవిషయంలో కుటుంబ వివాదం నేపథ్యంలో తన సాగును వేరే చోటికి తరలించాల్సి వచ్చింది. అయినా నిరాశపడలేదు. కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలోని గౌరిబిదనూర్లో బంజరు భూమిని పదేళ్లకు లీజుకు మోరింగ వ్యవసాయాన్ని ప్రారంభించాడు. ఇట్లా చిన్నమొత్తంలో కేవలం రెండు ఎకరాల్లో ఒకవైపును సాగును కంటిన్యూ చేస్తూ భూమిని సారవంతం చేసుకున్నాడు. కోడి ఎరువు, మేక ఎరువు , ఆవు పేడ ఎరువును కలిపి నేలను సారవంతంగా తయారు చేసాడు. ఇది నేల సారాన్ని, నీటిని నిలుపుకోవడాన్ని పెంచుతుంది వాతావరణం నుండి కార్బన్ డయాక్సైడ్ను వేరు చేయడం ద్వారా వాతావరణ మార్పులను తగ్గించడంలో సహాయపడింది. ఆర్గానిక్ పద్ధతుల్లో వ్యవసాయం చేయడంతో మంచి ఫలితాలు లభించాయి. మార్కెట్ను స్టడీ చేసి మెరుగైన (ఓడీసీ-3 వెరైటీ) చెందిన మొక్కలను నాటాడు. ఇవి అనుకున్నట్టుగానే 3-4 నెలల్లోనే కాపుకు వచ్చి , ఆరు నెలల్లో మంచి దిగుబడి వచ్చింది.ప్రస్తుతం ఉమేష్ ఎకరానికి 10 టన్నుల తాజా మునగ ఆకులను సేకరిస్తాడు. ఆకులను షేడ్ నెట్ల కింద సహజంగా ఎండబెట్టి, దాదాపు 2.5 నుండి 3 టన్నుల దాకా, కిలోకు సగటున రూ.140 చొప్పున విక్రయిస్తాడు. ఎక్స్ట్రాక్టర్లు, ఫార్మా కంపెనీలు, న్యూట్రాస్యూటికల్ కంపెనీలు ,ఎరువుల కంపెనీలు వీటిని కొనుగోలు చేస్తాయి. దీని ఫలితంగా ఎకరానికి రూ.4 లక్షల టర్నోవర్ వస్తుందని ఉమేష్ చెప్పారు. ఇదీ చదవండి: 45 కిలోలకు పైగా వెయిట్లాస్..బెల్లీ ఫ్యాట్ దెబ్బకి కరిగింది!ఏడాదికి రూ. 40 లక్షలుఅలా ఎకరానికి 10 లక్షల టన్నుల వరకు మునగాకును, మునగకాయలను పండిస్తున్నాడు. వీటిని కేజీకి రూ. 140 చొప్పున విక్రయిస్తున్నాడు. డిమాండ్ను బట్టి కొన్ని సందర్భాల్లో కేజీ రూ. 500కు కూడా విక్రయిస్తున్నాడు. అలా మునగకాయలను, ఆకులను విక్రయిస్తూ.. ఎకరానికి రూ. 4 లక్షల ఆదాయం సంపాదిస్తూ.. ఏడాదికి 10 ఎకరాలకు రూ. 40 లక్షల టర్నోవర్కు ఎదిగాడు ఉమేశ్. ఇక ఎండబెట్టిన మునగాకును ఫార్మా కంపెనీలు, ఫర్టిలైజర్ కంపెనీలకు విక్రయిస్తున్నట్లు ఉమేశ్ తెలిపాడు. -
44 కిలోల బరువు తగ్గిన ఫిట్నెస్ కోచ్..! సరికొత్తగా వెయిట్లాస్ పాఠాలు..
ఆరోగ్యకరమైన జీవినశైలి బరువు తగ్గడానికి సంబంధించి..తప్పుదారి పట్టించే ఇన్ఫర్మేషన్ కారణంగానే చాలామంది వెయిట్లాస్ కాలేకపోతుంటారని చెబుతున్నాడు ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ యష్ వర్ధన్ స్వామి. కొందరు విఫల ప్రయత్నం చేసి విసిగిపోయినవాళ్లు కూడా ఉన్నారని అంటున్నాడు. తాను ఒకప్పుడు అధిక బరువు ఉండేవాడనని, ఇప్పుడు వెయిట్లాస్ అయ్యి ఆరోగ్యకరమైన బరువుకి చేరుకున్నాని కూడా చెప్పారు.ఆ మార్పు కొన్ని పాఠాలను నేర్పించిందని, అవి శ్రేయోభిలాషులకు తప్పక ఉపయోగపడతాయాంటూ..తన అనుభవాలను షేర్ చేసుకున్నారు. అంతేగాదు బరువు తగ్గడం అనేది క్రమ శిక్షణ, మనసును కంట్రోల్ చేయడం వంటి అంశాలను తప్పక నేర్పిస్తుందని అంటన్నారు. వాటి కారణంగా బరువు తగడ్డం అనేది ఆధారపడి ఉంటుందట. మరి అదెలా అనేది ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా.!.ఫిట్నెస్ ట్రైనర్(Fitness coach) యష్ వర్ధన్ స్వామి(Yash Vardhan Swami) 13ళ్ల క్రితం వరకు అధిక బరువుతో ఉండేవాడనని చెప్పారు. ఆ తర్వాత 44 కిలోలు మేర బరువు తగ్గి విజయవంతమయ్యాక..కొన్ని విషయాలు ప్రస్ఫుటంగా అర్థమయ్యాయన్నారు. తను క్రమంగా బరువు తగ్గుతున్నప్పుడూ సంతరించుకున్న మార్పుని గమనిస్తూ..నేర్చుకున్న వెయిట్లాస్ పాఠాలను గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. బరువు తగ్గడం అనే శారీరక సవాలు.. మానసిక భావోద్వేగాలను సంబంధించిన అంశమని నొక్కి చెప్పారు. ఇక్కడ ఊబకాయం(Obesity) అనేది కేవలం శరీర సమస్య కాదు, జీవిత సమస్య అని అన్నారు. దీని కారణంగా అన్ని సంబంధాలు కోల్పోతామట. ముఖ్యంగా ఆరోగ్యం, సంపద, సంబధాలపై ప్రభావం చూపి..పూర్తిగా సత్సంబంధాలు దెబ్బతింటాయని చెబుతున్నారు. అలాగే వెయిట్లాస్ జర్నీలో అతి ముఖ్యమైన సవాలు మనసుతో యుద్ధం చేయడమేనని అన్నారు. కొలస్ట్రాల్ తగ్గించుకుంటే బరువు తగ్గుతామని అందరికీ తెలుసు. అది కార్యరూపంలోకి రావాలంటే..మనసు కంట్రోల్లో ఉండాలన్నారు. అప్పుడే మనం వేసుకునే వెయిట్లాస్ ప్లాన్ సక్సెస్ అవ్వగలదు. అది నియమానుసారంగా సాగితే..క్రమశిక్షణ, నిబద్ధత అలవడుతుందట. ఎప్పుడైతే మనలో ఇలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో అప్పుడూ కుటుంబసభ్యులు, స్నేహితుల నుంచి ఆటోమేటిగ్గా మద్దతు లభించడమే కాదు..మనకో ప్రాముఖ్యత ఏర్పడేలా మన రూపురేఖల్లో మార్పులు సంతరించుకుంటాయని చెప్పుకొచ్చారు. అలాగే ఇంకొక విషయం తప్పక గుర్తించుకోండి అంటూ..ఊబకాయం ఏమి రాత్రికి రాత్రికి మన జీవితాన్ని నాశనం చేయదని చెప్పారు. మన ఆహారపు అలవాట్లతో రోజువారిగా నెమ్మదిగా మన సౌందర్యాన్ని దెబ్బతీసేలా బరువు పెరుగుతుంటామని అన్నారు. అందుకే ఎదుట వ్యక్తులకు శారీరక పరంగా మనపట్ల ఉన్న అభిప్రాయాన్ని లైట్ తీసుకోవద్దని అని సూచిస్తున్నారు. అప్పుడే లోపాన్ని సరిచేసుకునే యత్నం చేసి..బరువు తగ్గేందుకు ట్రై చేస్తామని అన్నారు. అందుకు మనసు తోపాటు డెడికేషన్ అనేది అత్యంత ప్రధానమని గ్రహించమని సూచించారు ఫిట్నెస్ కోచ్ యష్ వర్ధన్ స్వామి. View this post on Instagram A post shared by Yash Vardhan Swami (@trainedbyyvs) (చదవండి: పేదరికాన్ని జయించేశా.. ఎట్టకేలకు అమ్మ కోసం ఇల్లు కట్టేశా..!) -
అన్నా చెల్లెలు టీచర్లు..ఒకే పాఠశాలలో విధులు..
ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన అన్నా చెల్లెలు చివరకు ఒకే పాఠశాలలో పోస్టింగ్ పొందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాలలోని ఆత్మకూరుకు చెందిన బాలస్వామి (హెచ్ఎం), నాగమణి దంపతుల కుమారుడు, శ్యామూల్ రాజు, కుమార్తె సారాపింకి కొత్తగా ఉపాధ్యా య ఉద్యోగాలు పొందారు. ఒకేసారి ఉద్యోగా లు పొందడమే కాకుండా ఒకే పాఠశాలలో టీచర్లుగా చేరడం విశేషం. మండలంలోని హు సేనాపురం ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయులుగా మంగళవారం విధుల్లో చేరారు. వీరి సోదరి మౌనిక కూడా అమలాపురంలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నట్లు శ్యామ్యూల్ రాజు, సారాపింకి తెలిపారు. ఒకే పాఠశాలలో ఇద్దరం విధుల్లో చేరడం ఆనందంగా ఉందని, విద్యార్థులను తీర్చిదిద్దుతామన్నారు.(చదవండి: ఆ కారణంతోనే ఐశ్వర్యని వెనక్కినెట్టి.. సుస్మితా మిస్ ఇండియాగా గెలుపొందింది..!) -
ఆ కారణంతోనే సుస్మితా మిస్ ఇండియాగా గెలుపొందింది..!
అందాల పోటీకి సంబంధించి భారత్కి.. 1994 అతి ప్రాధాన్యత సంతరించుకున్న ఏడాది. ఎందుకంటే ఆ ఏడాదే ప్రతిష్టాత్మకమైన మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ కిరీటాలు రెండూ దక్కాయి. 28 ఏళ్ల తర్వాత రీటా ఫారియా తదనంతరం ఇద్దరు సుందరీమణులు ఈ ఘనతను దక్కించుకున్నారు. ఐశ్వర్య రాయ్, సుస్మితా సేన్ ఆ ఘన కీర్తిని భారత్కు అందించారు. దేశమే గర్వించేలా చేశారు. అయితే వీళ్లిద్దరూ మిస్ ఇండియా ఫైనల్లో తలపడ్డాడరు. కానీ కిరీటం సుస్మితా సేన్నే వరించింది. నిజానికి ఐశ్వర్యనే గెలుస్తుందనేది అందరి నమ్మకం. ఇలా ఎందుకు జరిగిందో నాడు పోటీల్లో పాల్గొన్న సహ పోటీదారురాలు రూబీ భాటియా ఆ విషయాన్ని వివరించింది. ఆఖరికి సుస్మితా సైతం గెలుపొందుతానని అనుకోలేదంటూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారామె. అంతేగాదు మిస్ యూనివర్స్గా సుస్మితాకు కిరీటం ఎందుకు దక్కిందో కూడా వివరించారామె.1994 మిస్ ఇండియాలో పోటీల్లో రూబీ భాటియా కూడా పాల్గొన్నారు. అయితే సుస్మితా సేన్(Sushmita Sen ) మిస్ ఇండియా(Miss India) కిరీటాన్ని(crown) గెలుచుకుందని, ఐశ్వర్య రన్నరప్గా నిలిచారంటూ నాటి సంఘటనను గుర్తుచేసుకుందామె. నిజానికి జ్యూరీ ప్యానెల్ ఆ సమయంలో మోడలింగ్లో మంచి పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న ఐశ్వర్య రాయ్(Aishwarya Rai)ను కాదని సుస్మితాను ఎందుకు ఎంచుకుందో వివిరించింది. నాడు పోటీల్లో ర్యాంప్పై నడుస్తుండగా ఐశ్వర్య జారిపడింది..అందువల్ల సుస్మితాను మిస్ ఇండియా కిరీటం వరించిందేమో అనుకున్నా కానీ..అది నిజం కాదని అందుకు ప్రత్యేక కారణం ఉందంటూ అసలు విషయం చెప్పారామె. నాటి మిస్ ఇండియా పోటీల్లో న్యాయనిర్ణేతల్లో ఒకరైనా ఫెమినా మ్యాగజైన్ మాజీ ఎడిటర్ వవిమ్లా పాటిల్ని దీని గురించి అడిగానని, ఐశ్వర్య ర్యాంప్పై స్లిప్ అవ్వడం వల్ల కిరీటం చేజారిపోలేదని తేల్చి చెప్పారంటూ నాటి సంగతి వివరించింది. మిస్ యూనివర్స్కి పోటీపడటానికి నిర్ధిష్ట లక్షణాలు గల పోటీదారుడి కోసం వెతుకుతున్నామని..ఆ నేపథ్యంలోనే సుస్మితాను విజేతగా ప్రకటించినట్లు ఆమె చెప్పారని రూబీ చెప్పుకొచ్చింది. అంతేగాదు మిస్ యూనివర్స్గా సుస్మితా, మిస్ వరల్డ్గా ఐశ్వర్య ఎందుకు సరిపోతారో కూడా ఆమె వివరించినట్లు తెలిపింది. మరి వారే ఎందుకంటే..మిస్ యూనివర్స్ తెలివైన, అందం కలిగిన మహిళ కోసం అని, అందుకు సుస్మితా సేన్ సరిపోతుందని ఆమె చెప్పినట్లు రూబీ పేర్కొంది. మిస్ వరల్డ్ అంటే మరింత కలలు కనే అందమైన దివా మహిళ అని అందుకు ఐశ్వర్య తగినదని అందుకే ఆ ఇద్దరు చెరొక అంతర్జాతీయ టైటిళ్లను కైవసం చేసుకున్నారని రూబీ చెప్పుకొచ్చింది. అలాగే సుస్మితా కూడా ఓ ఇంటర్వ్యూలో మిస్ ఇండియా పోటీలో ఐశ్వర్య కూడా పోటీపడనుందని తెలిసి..నాకు కిరీటం వచ్చే ఛాన్సే లేదనే అనుకున్ననని స్వయంగా వెల్లడించింది కూడా. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనేటప్పుడూ అన్ని అనుమానాలు, భయాలతో పాల్గొన్న సుస్మిత..చివరికి ఊహించని విధంగా కిరీటం గెలుకుని మిస్ యూనివర్స్ టైటిల్ని అందుకుంది, ఐశ్వర్య మిస్ వరల్డ్గా గెలుపొదింది. చివరికి ఇద్దరూ..చరిత్రలో తమ పేర్లను లిఖించుకున్నారు. (చదవండి: పేదరికాన్ని జయించేశా.. ఎట్టకేలకు అమ్మ కోసం ఇల్లు కట్టేశా..!) -
45 కిలోలకు పైగా వెయిట్లాస్..బెల్లీ ఫ్యాట్ దెబ్బకి కరిగింది!
బరువు తగ్గడం అనేది ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామాల కలయికతోనే సాధ్యం.అందులోనూ గుట్టలా పేరుకుపోయిన బెల్లీ ఫ్యాట్ వదిలించుకోవడం అంత సులువు. కొంత సమయం దాటిన తరువాత అంది మొండిగా మారిపోతుంది. ఒక పట్టాన కరగదు. అందుకు ప్రత్యేక వ్యాయామాలు చేయాల్సిందే. ఒక మహిళ అయిదు కోర్ వ్యాయామాల ద్వారా బెల్లీ ఫ్యాట్ను తగ్గించుకుంది. దాదాపు 45 కిలోలకు పైగా తగ్గింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రాంలో షేర్ చేసింది. వెయిట్ లాస్ జర్నీ గురించి తన ఫాలోయర్లతో నిరంతరం షేర్ చేసే ఫెర్నాండా ఇటీవల తన అదనపు కిలోలను తగ్గించుకోవడానికి సహాయపడిన కొన్ని ఉత్తమ వ్యాయామాల గురించి చెప్పు కొచ్చింది. అవేంటో చూద్దాండంబెల్ రష్యన్ ట్విస్ట్బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్న వారికి రష్యన్ ట్విస్ట్ బెస్ట్ ఆప్షన్ అని తెలిపింది.దీనికి కోర్ కండరాలు ( వెన్నెముక, కటి, దర కండరాలు,దిగువ వీపు,డయాఫ్రాగమ్) భుజం బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది. మంచి ఫలితాలకోసం 3 సెట్లు 25 సార్లు చేసిందిఫెర్నాండా .ఎలా చేయాలి? : నేలపై 'V' షేప్లో మోకాళ్లను వంచి, భుజాలు స్థిరంగా ఉండేలా కూర్చోండి. వీపును నిటారుగా ఉంచి రెండు చేతులతో మీ ఛాతీ వద్ద డంబెల్ను పట్టుకుని, నడుమును నెమ్మదిగా ఎడమ నుండి కుడికి తిప్పాలి. దీన్ని రెండు వైపులా రిపీట్ చేయాలి. లెగ్ రైజ్: పొత్తికడుపు, దిగువ ఉదర కండరాలను బలోపేతం చేయడానికి ఇది చాలా బాగ పనిచేస్తుంది లెగ్ రైజ్ ఎక్స్ర్సైజ్ 3 సెట్లు పది సార్లు చేసేదట. నేలపై సమాంతరంగా పడుకుని కాళ్లను పైకి లేపడం. ఇలా చేసేటపుడు, పొత్తికడుపుపై ఒత్తిడిపెంచుతు మోకాళ్లను వంచకుండా చేయాలి. దీని పొత్తికడుపు కొవ్వు కరుగుతుంది. దీన్ని చాలా రకాలుగా చేయవచ్చుఆల్టర్నేటింగ్ లెగ్ రైజెస్వెయిట్లాస్లో ఇది మరో మంచివ్యాయామం. ఇది పొట్ట కొవ్వును బాగా కరిగిస్తుంది. నేలపై పడుకుని, ఒక కాలు తరువాత మరో కాలు నిటారుగా పైకి లేపుతూ చేయాలి.బాడీని నిటారుగా నేలపై ఉంచి, ముంజేతులపై ప్లాంక్ పొజిషన్లో ఉండాలి.ఒక కాలును పైకి లేపి. ఒక సెకను పాటు పట్టుకుని, నెమ్మదిగా కిందకు దించాలి.మరొక కాలుతో దీన్ని రిపీట్ చేయాలి.లెగ్ రైజ్ హోల్డ్: వెల్లకిలా పడుకుని, కాళ్ళు నిటారుగా చాపి, చేతులు పక్కన ఉంచే వ్యాయామం.నేలపై పడుకుని కాళ్ళను నేల నుండి 45 డిగ్రీల కోణంలో పైకి లేపి, కొద్దిసేపు పట్టుకుని ఉండాలి, ఆపై నెమ్మదిగా కిందికి దించాలి.డంబెల్ హాఫ్ క్రంచ్ : నేల మీద పడుకొని, మోకాళ్లను వంచి, పాదాలను నేలపై ఉంచి రెండు చేతులతో సౌకర్యవంతంగా డంబెల్ పట్టుకోవాలి. డంబెల్తోపాటు బాడీని పైకి ఎత్తేటప్పుడు శ్వాస వదులుతూ, పైకి లేపి కొద్దిసేపు హోల్డ్ చేసి, నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఇది పొట్ట దగ్గర కొవ్వును కరిగించి, కండరాలను దృడం చేస్తుంది. ఈ వ్యాయామాలతో పాటు, లోఫ్యాట్ డైట్ను పాటిస్తూ 45 కిలోలకు పైగా బరువు తగ్గింది. View this post on Instagram A post shared by Fernanda (@fernandadidit)నోట్ : ఫెర్నాండా విషయంలో వ్యాయామాలు,ఆహారం అద్భుతాలు చేసినప్పటికీ. మన బాడీకి ఏది కరెక్ట్ అది నిర్ధారించుకోవాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి,ఎన్ని కేలరీలు అవసరం, ఎలాంటి వ్యాయామం చేయాలి అనే నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి. -
పేదరికాన్ని జయించేశా.. ఎట్టకేలకు అమ్మ కోసం ఇల్లు కట్టేశా..!
కడు దుర్భరమైన జీవితం గడిపి..కనీస అవసరాలనే సమకూర్చుకోలేని స్థితిలో గడిపాడు ఆ యువకుడు. ఎంతలా అంటే కనీసం బాత్రూం కూడా లేని ఇంట్లో జీవితం భారంగా నెట్టుకొచ్చాడు. ఈ స్థితిని చూసి చిన్నపాపల ఏడుస్తున్నా తల్లిని చూసి..ఏ చేయలో తోచని చిన్నతనంలోనే ఆ యువకుడి మదిలో నిలిచిన ధ్యేయం..అతడితోపాటు పెరుగుతూ వచ్చింది. అదే తన పేదరికాన్ని జయించే స్థితికి చేరేలా చేసింది. ఇవాళ తన అమ్మ సంబరపడేల కలల సౌధాన్ని నిర్మించాడు. కష్టబడితే మన కలలన్నీ ఎన్నటికి వృధాకావు అనే మాటకు అర్థాన్నిచ్చేలా స్ఫూర్తిగా నిలిచాడు. ఈ స్టోరీ రెడ్డిట్లో షేర్ అవ్వడంతో నెట్టింట వైరల్గా మారింది.రెడ్డిట్లో ఆ యువకుడు అంతకుముందు తాము ఉండే పాత ఇల్లు తాలుకా ఫోటోను షేర్ చేస్తూ..అప్పుడూ తన లైఫ్ ఎంత దయనీయం ఉంటుందో చెప్పుకొచ్చాడు. వర్షం వస్తే ఇంట్లోకి వచ్చేసే మురుగు నీరు మధ్య ఎలా బిక్కుబిక్కుమంటూ గడిపామా గుర్తు చేసుకున్నాడు. అది చూసి తన తల్లి పసిపాపలా ఏడ్చిన ఘటన ఇంకా మర్చిపోలేనని చెప్పుకొచ్చాడు. అయితే తాను ఏం చేయలేని చిన్నవాడిని కావడంతో..ఎలాగైనా దీన్ని మార్చాలని కలలు కనేవాడని అంటూ తన పరిస్థితిని వివరించాడు. కనీసం ఇంట్లో బాత్రూం కూడా లేకపోవడంతో తన తల్లి, అక్క తాత్కాలిక కచ్చా నిర్మాణాన్ని ఏర్పరుచుకున్నారని, తను తండ్రి ఆఫీస్లోని వాష్రూమ్ వాడుకునేవాడినంటూ నాటి పేదరిక జీవితంలోని గడ్డు పరిస్థితులను తెలిపాడు. ఇదంతా ఎలా మార్చాలనేది తెలియకపోయినా..తండ్రికి భారం కాకుండా చదువుకోవడంపై దృష్టిపెట్టి..చిన్న చిన్న ట్యూషన్లు చెప్పేవాడినని అన్నాడు. అయితే ఏదో ఒకరోజుకి ధనవంతుడిని అవుతాననే కలను మాత్రం వదిలేయలేదని..అది ఎప్పుడూ కళ్ల ముందు సాక్షాత్కారిస్తూనే ఉండేదని చెప్పుకొచ్చాడు. అదే చివరికి నాకు తన తల్లి మెచ్చుకునేలా కలల సౌధాన్ని నిర్మించేలా చేసిందని, కానీ కొంత అప్పుకూడా చేయాల్సి వచ్చిందని వివరించాడు. అప్పుడు తాన ఎలాంటి ఇంట్లో జీవించేవాడో..ఇప్పుడూ ఎలాంటి ఇంట్లో నివసించే రేంజ్కి వచ్చాడో తెలిపేలా అందుకు సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేశాడు. చివరికి తాను "పేదరికం అనే యుద్ధంపై గెలిచేశా, నా తల్లి కలలుగన్న ఇంటిని కట్టేశా" అనే క్యాప్షన్ జోడించి మరి తన కథను వివరించాడు. ఈ స్టోరీ నెటిజన్లను ఆకట్టుకోవడమే కాదు..తమను ఎంతాగనో ప్రేరేపించిందంటూ..సదరు వ్యక్తిని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: ఏంటి క్రెడిట్ కార్డుతో గిన్నిస్ రికార్డు? కేవలం ఖర్చే కాదు ఆదాయం కూడా..) -
భగవంతుడు నిష్పక్షపాతి, అవునా? కాదా?
ఒకడు కోటీశ్వరుల ఇంట్లో జన్మిస్తాడు. వానిని చూసి పేదవాడంటాడు – దేవునికి పక్షపాతముందని! లేకపోతే తనను పేదవానిగా, అతనిని ధనికునిగా ఎందుకు పుట్టిస్తాడని ప్రశ్నిస్తాడు. ఒకసారి పరమహంస యోగానంద ఒక కథ చెబుతారు. ఒక రాజుండేవాడు. ఆయన తన ప్రధానమంత్రి పట్ల చాలా ప్రేమను, గౌరవాన్ని కనబరచే వాడు. మిగిలిన వారికి అసూయ కలిగి, రాజు గారికి పక్షపాతముందని గుసగుసలాడేవారు. రాజు గారి చెవిన ఆ విషయం పడింది. మరుసటి రోజు అందరూ సమావేశమై ఉండగా దూరంలో సంగీతం వినబడింది. అక్కడ ఏమి జరుగుతున్నదో కనుక్కొని రమ్మని ఒకనిని పంపాడు రాజు. అతడు వెళ్ళి వచ్చి అక్కడొక వివాహం జరుగుతున్నదని చెప్పాడు ఆ వ్యక్తి. ఎవరు పెళ్ళి చేసుకొంటున్నారని రాజు ప్రశ్నించాడు. ఆ వ్యక్తి ‘తెలీదు’ అన్నాడు. కనుక్కొని రమ్మని మరొకనిని పంపించాడు రాజు. ఆ వ్యక్తి తిరిగి వచ్చి ఫలానా వారిదని చెప్పాడు. రాజు మరొక్క ప్రశ్న వేశాడు. ఆ వ్యక్తి జవాబు చెప్పలేక ఊరికే నిల్చున్నాడు. కనుక్కొని రమ్మని మరొక్క వ్యక్తిని రాజుగారు పంపారు. అతడు వచ్చిన తర్వాత ఇంకొక ప్రశ్న వేస్తే జవాబు లేదు. చివరకు రాజు గారు తన ప్రధానమంత్రిని పంపారు. ఆయన వెళ్ళి వచ్చాడు. రాజు గారు అడిగిన ప్రతి ప్రశ్నకూ వివరంగా జవాబులు చెప్పాడు.చదవండి: ఫ్యామిలీ కోసం కార్పొరేట్ జీతాన్ని వదులుకుని రిస్క్ చేస్తే..!అప్పుడు రాజు ‘ఇప్పుడు మీకు అర్థమైందా నేను ఆయన పట్ల ఎందుకు గౌరవాన్ని చూపుతానో?’ అని అందర్నీ చూస్తూ అడిగాడు. అందరూ తలలు దించుకున్నారు. (పుట 292: మానవుడి నిత్యాన్వేషణ–పరమహంస యోగానంద). ఒక సాధారణ రాజుగారి చర్యకే ఇంతటి బలమైన కారణముంటే సర్వజ్ఞుడైన భగవంతుడు నిష్కారణంగా ఎవరికైనా ఇస్తాడా, చేస్తాడా?– రాచమడుగు శ్రీనివాసులు -
ప్రాణాలు నిలిపే అదృష్టం ఊరికే రాదు!
World Anaesthesia Day 2025 అదృష్టం ఊరికే రాదు. ఎవరైనా దాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉంటేనే అంది వస్తుంది. ఒక ప్రాణం కాపాడటం అలాంటి అదృష్టమే. దానికి వైద్యుడే కానక్కర లేదు. కొద్దిపాటి అవగాహన, కొంచెం శిక్షణ దొరికితే ప్రతీ పౌరుడూ ప్రాణం నిలపగలడు. మొదట నా సొంత అనుభవానికి వద్దాం. వైద్యునిగా, ప్రత్యేకించి అనస్థీషియా (మత్తువైద్యం) నిపుణుడిగా ఎవరికైనా అరు దుగా దక్కే అదృష్టం నాకు దక్కింది. అదేమిటంటే నా చేతిలో నా తండ్రి ప్రాణం తిరిగి రావడం! నేను 2001లో ఎంపీగా ఉన్న రోజుల్లో ఒక అధికారిక పర్యటనలో ఉండగా మా పల్లెటూరు పాలికవలసనుండి ఫోన్ వచ్చింది... నాన్నకు బాగులేదని. పార్వతీపురం నుండి ఆ ఊరు నలభై కిలోమీటర్లు. అప్పటికే నాన్న బీపీ పేషెంట్ కనుక ఎందుకైనా మంచిదని అత్యవసర మందులు పట్టుకుని బయలుదేరాను. ఇంటికి చేరి మూడు నిమిషాలు అయిందో లేదో నాన్నకు గుండె, ఊపిరి ఆగి పోయాయి (కార్డియాక్ అరెస్ట్). వెంటనే ఆయన్ని సరైన పొజిషన్లో ఉంచి నోటితో శ్వాస అందిస్తూ, గుండెపై బలంగా నొక్కుతూ అత్యవసర ప్రక్రియ చేపట్టాను. కాసేపటికి ఆయన గుండె కొట్టుకోవడం, ఊపిరి తీసుకోవడం మళ్లీ మొదలైంది. గండం గట్టెక్కింది. మిగతా వైద్యం కోసం హాస్పిటల్కు తక్షణం పంపే ఏర్పాట్లు చేశాను. ఇదంతా ప్రత్యక్షంగా చూస్తున్న గ్రామీణులకే కాదు, బాగా చదువుకున్న అనుచరులకు, సెక్యూరిటీ సిబ్బందికి కూడా వింత. నాకు పట్టరాని ఆనందం. తలుచుకుంటే ఇప్పటికీ అంతే ఆనందం.చదవండి: ఫ్యామిలీ కోసం కార్పొరేట్ జీతాన్ని వదులుకుని రిస్క్ చేస్తే..!గుండె, ఊపిరి ఆగిపోయిన క్షణాల్లో అందించే ప్రాథమిక అత్యవసర ప్రక్రియ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) క్లిష్టమైన ప్రక్రియ కాదు. ఎవరైనా నేర్చుకోగలరు. గతంలో అది వైద్యులకే పరిమితమైన విద్య. ఇప్పుడుఅందరూ నేర్చుకోవాల్సిన ప్రాథమిక నైపుణ్యం. ఎందుకంటే ఆ మొదటి క్షణాల్లో అందించే వైద్య సహాయం ద్వారా ఎన్నో ప్రాణాలు కాపాడగలం. రోగిని గట్టి బల్లపై లేదా రోడ్డుపై పడుకోబెట్టడం, ఛాతీపై తగు బలంతో నిమి షానికి 100 సార్లు చేతులతో ఒత్తిడి ఇవ్వడం, అభ్యంతరం లేకపోతే నోటికి నోటి ద్వారా శ్వాస అందించడం లాంటి వాటితో ఒక ప్రాణాన్ని తిరిగి తీసుకు రావచ్చు. ఈ నైపుణ్యాలపై విద్యార్థుల్లో, పౌరులందరిలో అవగాహన కల్పించాలి. ప్రస్తుతం ఈ దిశగా జరుగుతున్న కృషి ప్రాథమిక స్థాయిలో ఉంది. ప్రభుత్వం, పౌర సమాజం దృష్టి పెడితే ప్రజారోగ్య కోణంలో సమాజానికి చాలా మేలు జరుగుతుంది.– డా.డి.వి.జి. శంకరరావు మాజీ ఎంపీ(అక్టోబర్ 15.. ప్రపంచ అనస్థీషియా దినోత్సవం) -
Diwali 2025: దీపావళికి అలరించనున్న గిఫ్ట్ ఫ్యాక్స్
దీపావళి పండుగకు నగరం ముస్తాబవుతోంది.. ముఖ్యంగా ఈ పండుగలో స్వీట్స్దే అగ్రభాగం.. ఈ సందర్భంగా ఇచ్చిపుచ్చుకునే గిఫ్ట్స్ ప్యాకింగ్ కూడా ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా పలుకరించుకుని స్వీట్స్, లేదా డ్రైఫ్రూట్స్ వంటి గిఫ్ట్ బాక్సులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ సారి దీపావళికి అందమైన ర్యాపింగ్తో ఆకట్టుకునే గిఫ్ట్ ప్యాక్స్ హడావుడి మొదలైంది.. మార్కెట్లో వివిధ రకాల స్వీట్స్, డ్రైఫ్రూట్స్ వంటి వాటితో ఈ గిఫ్ట్ ప్యాకింగ్స్ అందుబాటులో ఉన్నాయని పలువురు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. రంగు రంగుల ర్యాపింగ్, రకరకాల మోడళ్లలో గిఫ్ట్ ప్యాకింగ్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే పలువురు ఔత్సాహికులతో నగరంలోని బేగంబజార్ సందడిగా కనిపిస్తోంది. సంప్రదాయ వెరైటీ డిజైన్లలో తయారు చేసిన డ్రైఫ్రూట్స్, స్వీట్ బాక్సులు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. ఇవి వివిధ రకాల ఆకారాల్లో, వివిధ రకాల సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. ఇమిడిపోయిన సంప్రదాయం.. దీపావళికి గిఫ్ట్ బాక్సులు ఇచ్చే సంస్కృతిని మార్వాడీలు, గుజరాతీలు ఎక్కువగా పాటిస్తారు. ఇదే పద్ధతి ప్రస్తుతం నగరంలోని ప్రజల్లోనూ క్రమంగా ఇమిడిపోయింది. దీంతో పండుగ పూట ఇంటికి వచ్చే అతిథులకు, లేదా ఇరుగు పొరుగు వారికి, మరీ ముఖ్యంగా సన్నిహితులకు ఈ గిఫ్ట్ బాక్సులు అందజేస్తుంటారు. కొనుగోళ్లు షురూ.. ఇప్పటికే బేగంబజార్లో కొనుగోళ్లు షురూ అయ్యాయి. డ్రై ఫ్రూట్ మార్కెట్ కిటకిటలాడుతోంది. స్వీట్షాపుల నిర్వాహకులు, సాధారణ ప్రజలు కొనుగోళ్లకు వస్తున్నారు. ఆకర్షణీయమైన ప్యాకింగ్స్ అందుబాటులో ఉన్నాయి. నగరంలో ఉద్యోగులు, వ్యాపారుల్లో ఈ గిఫ్ట్స్ ఇచ్చే సంస్కృతి పెరిగిపోయింది. దీంతో గిఫ్ట్ బాక్సుల అమ్మకాలకు డిమాండ్ ఏర్పడింది. – రాజ్కుమార్ టండన్, కశ్మీర్ హౌస్ యజమాని బాక్స్ల ధరలు ఇలా.. సాధారణంగా ఈ గిఫ్ట్ బాక్స్ల ధరలు రూ.250 నుంచి రూ.2 వేల వరకూ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఆకర్షణీయమైన బాక్స్ల్లో బాదం, కాజు, కిస్మిస్, పిస్తా, ఆప్రికాట్తో పాటు అంజీర వంటి డ్రై ఫ్రూట్స్ పెడుతుంటారు. వీటితో పాటు కొందరు వివిధ రకాల స్వీట్లు కూడా ప్యాక్ చేస్తుంటారు. ఈ బాక్స్ల్లో డ్రైఫ్రూట్స్ 750 గ్రాములు, 500 గ్రాములు, 250 గ్రాములు ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు. -
పెయింట్ విత్ పప్పీస్..!
ప్రాణుల పట్ల భాధ్యతాయుతమైన సమాజ నిర్మాణంలో ప్రతి అడుగూ విలువైనదే. ప్రపంచవ్యాప్తంగా పెంపుడు జంతు సంరక్షణ, దత్తత, మానవతా విలువలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో హైదరాబాద్ నగర వేదికగా నిర్వహించిన ‘పెయింట్ విత్ పప్పీస్’ అనే వినూత్న కార్యక్రమం ఆకట్టుకుంది. ప్రముఖ గ్లోబల్ కంపెనీ ‘మార్స్’ ఆధ్వర్యంలోని మార్స్ గ్లోబల్ అడాప్షన్ వీక్–2025లో భాగంగా ఈ వర్క్షాప్ నిర్వహించింది. ఆర్ట్, ఆనందం, ఆదరణ కలగలిపిన ఈ మార్స్ వెల్నెస్ డ్రైవ్ మూగజీవాల పట్ల కళాత్మక ఆత్మీయతను ప్రదర్శించింది. పాజిటివ్ వైబ్స్తో ఆర్ట్ థెరపీ..ఈ ప్రత్యేక కార్యక్రమం ‘పావాసన’ అనే జంతు సంక్షేమ సంస్థతో కలిసి మార్స్ కార్యాలయంలో నిర్వహించింది. 100 మందికి పైగా అసోసియేట్లు ఇందులో పాల్గొని, చిన్న చిన్న పప్పీలతో కలిసి చిత్రలేఖనం చేస్తూ మానసిక విశ్రాంతి, ఆనందం, కరుణను ఒకే వేదికపై ప్రదర్శించారు. ఈ అడాప్షన్ వీకెండ్ హైదరాబాద్తో పాటుగా దేశవ్యాప్తంగా 11 నగరాల్లో జరిగింది. 14 ఎన్జీఓలు, వందలాది వాలంటీర్లు, వేల మంది సందర్శకులు దీనిలో భాగమయ్యారు. హైదరాబాద్లో బ్లూ క్రాస్, ఎన్ఎస్ఏఏఎస్ మేడ్చల్ సహకారంతో అడాప్షన్, వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. నిరాశ్రయ జంతువులు ‘ఫరెవర్ హోమ్స్’ సహాకారాన్ని పొందాయి. అంతేకాకుండా మార్స్ సంస్థ తన ‘టూ లీవ్స్ చేంజ్డ్’ అనే అంతర్జాతీయ సంస్థ చొరవతో భారత్తో పాటు అమెరికా, యుకే, థాయ్లాండ్, మెక్సికో వంటి 25 దేశాల్లో ఈ మానవతా కార్యక్రమాన్ని విస్తరించింది. ఒక పెంపుడు జంతువును దత్తత తీసుకోవడం అంటే ఆ ప్రాణికి మాత్రమే కాకుండా మన జీవితంలో మార్పుకు ఆహా్వనం పలకడమేనని మార్స్ మేనేజింగ్ డైరెక్టర్ సలీల్ మూర్తి తెలిపారు. కేవలం అవగాహన కలి్పంచడమే కాకుండా మూగజీవాల పట్ల దయ, సంరక్షణకు మార్గం చూపే ప్రయత్నమని పేర్కొన్నారు. కామ్ సంస్థ భాగస్వామ్యంతో చేసిన అధ్యయనంలో జంతువుల వల్ల యజమానుల్లో 88 శాతం మంది ఆందోళన, ఒత్తిడి తగ్గుతుందని వెల్లడైందని, 76 శాతం మంది మానసిక సాంత్వనను పొందుతున్నట్లు తేలిందన్నారు. ఇది సృజనాత్మకత, సేవల కలయిక అని పావాసన సహ వ్యవస్థాపకురాలు అన్నన్య అభివరి్ణంచారు. -
చరిత్రకు కేరాఫ్..మనసుకు టేకాఫ్..
తెలంగాణ రాష్ట్రం భాగ్యనగరంలో చారిత్రక పర్యాటకం అనగానే చాలా మందికి చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, గోల్కొండ కోట.. ఇవే గుర్తుకొస్తాయి. కానీ అందరికీ తెలిసిన ఈ చారిత్రక విశేషాలు మాత్రమే కాకుండా.. కాలగమనంలో మరుగునపడిపోయిన అనేక కట్టడాలు నిశ్శబ్దంగా దర్శనమిస్తున్నాయి. కొత్త మెరుపుల మధ్య వాటి వెలుగులు మసకబారుతున్నాయి. అద్భుతమైన కట్టడాలు.. ఆకట్టుకునే విశేషాలను తడిమి చూస్తే ఎన్నో మధురానుభూతులను కలి్పంచే అనేక పర్యాటక విశేషాలు ప్రాచుర్యానికి నోచుకోవడంలేదు.. ఇవి తప్పక చూసి తీరాల్సిన పర్యాటక ప్రాంతాల జాబితాలో కనబడకపోవచ్చు. కానీ వాటిని సందర్శిస్తే మనకు తెలియని హైదరాబాద్ నగర చారిత్రక వైభవాన్ని మన కళ్ల ముందు ఉంచుతాయి. పర్యాటకులు, సందర్శకుల గుర్తింపుకు నోచుకోకుండా.. గోల్కొండ కోట వెనుక భాగంలో, ఆక్రమణల మధ్య మరుగున పడిన నయా కిలాకు 500 ఏళ్ల చరిత్ర ఉంది. దీనిని 1656లో షాజహాన్ పరిపాలన సమయంలో జరిగిన మొఘల్ దాడికి ప్రతిస్పందనగా నిర్మించారు. ఒకప్పుడు గోల్కొండ రక్షణ వ్యవస్థలో భాగంగా ఉండేది.. ఇప్పుడు ప్రధాన కోట కాంప్లెక్స్ నుంచి వేరుగా ఉంది. ఇందులోనే మజూ్న, లైలా బురుజులు, హైదరాబాద్ స్థాపనకు ముందు 1561లో నిర్మితమైన ముస్తఫా ఖాన్ మసీదు, డెక్కన్ కవి పేరిట నెలకొన్న ముల్లా ఖయాలి మసీదు, ఆఫ్రికన్ సన్యాసులు నాటినదిగా చెప్పే 400 ఏళ్ల నాటి పాత బోబాబ్ చెట్టు వంటి విశేషాలెన్నో ఉన్నాయి. స్మృతుల నిధి.. రేమండ్ సమాధి.. ఇది చాదర్ఘాట్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలోని హిల్స్పైన అస్మాన్ ఘడ్ ప్యాలెస్లో ఉంది. (మిచెల్ జోచిమ్ మేరీ రేమండ్) అనే ఫ్రెంచ్ జనరల్ సమాధి. ఆయన నిజాం అలీ ఖాన్ (ఆసఫ్ జాహ్–2) దగ్గర సేనాధిపతిగా సేవలందించారు. ఆయన్ని హిందువులు ‘మూసా రామ్, ముస్లింలు’, ‘మూసా రహీం’గా పిలిచేవారని చెబుతారు. నిజాంలు కూడా 1940ల వరకూ ఇతని వర్థంతి సందర్భంగా నివాళులర్పించేవారట. దీనిని 2003లో పునరుద్ధరించినా, భారత–ఫ్రెంచ్ స్నేహానికి ప్రతీకగా నిలిచే ఈ స్థలం ఇప్పటికీ పర్యాటక ఆకర్షణగా మారలేదు. బహుత్ పురానా.. ఈ ఠాణా..పర్యాటక అర్హతలున్న పోలీస్ స్టేషన్ సైతం ఉన్న నగరం మనదే అని చెప్పొచ్చు. ఎప్పుడో 1867లో నిర్మించిన జేమ్స్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్, నగరంలోని పురాతన బ్రిటిష్ కాలపు కట్టడాలలో ఒకటి. సికింద్రాబాద్ క్లాక్ టవర్ పక్కనే ఉన్న ఇది.. బ్రిటిష్ శాసన కాలంలో కంటోన్మెంట్ ప్రాంతంలో కీలక పరిపాలనా కేంద్రంగా ఉపయోగించబడింది. ఆర్చ్లా మార్చిన వరండాలు, స్టోన్వాల్స్, కలోనియల్ శైలిని ప్రతిబింబించే నిర్మాణ పద్ధతులతో పాటు.. ప్రత్యేకమైన బ్రిటిష్ శైలి ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకోవాలంటే దీన్ని సందర్శించాలని ఆర్కిటెక్ట్స్ అంటున్నారు. అందమైన కథ.. బ్రిటిష్ రెసిడెన్సీ.. వైట్ మొఘల్ అనే పుస్తకంలో రాసిన ఓ అందమైన ప్రేమ కథకు మౌన సాక్షి గా ఈ భవనాన్ని పేర్కొంటారు. ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యాలయం కోసం సుమారు 1805లో ఆర్కిటెక్ట్ సామువెల్ రస్సెల్ ఆధ్వర్యంలో నిజాంల దగ్గర బ్రిటిస్ రెసిడెంట్ అయిన జేమ్స్ అకిలిస్ కిర్క్పాట్రిక్ (వైట్ మఘల్ గా ప్రసిద్ధుడు) కోసం నిర్మితమైంది. దీనిని పల్లాడియన్ శైలిలో డిజైన్ చేశారు. ఈ విశాలమైన విల్లాలో ఆరు కొరింథియన్ స్తంభాలు, ద్వితీయ అంతస్తుకు తీసుకెళ్లే ద్విపాద మెట్లదారి, పెయింటింగ్స్తో నిండిన పైకప్పులు.. పార్కే ఫ్లోర్స్ బ్రిటిష్ సింహాల విగ్రహాలు ఆకట్టుకుంటాయి. అమెరికాలోని వైట్ హౌస్ని తలపించే ఈ భవనంలో చరిత్రను తెలియజేసే చిన్న మ్యూజియం కూడా ఉంది. ఈ భవనం 1949 తర్వాత కోఠి మహిళా కళాశాలలో భాగమైంది. కాలక్రమంలో ఇది శిథిలావస్థకు చేరగా దీన్ని 2022లో పునరుద్ధరించారు. -
భారీ ఎత్తున భరణం గుంజి, అతడితో పెళ్లి.. నా మాజీ భార్య భర్తపై కేసు వేయొచ్చా?
నా భార్య మరొకరితో సంబంధం పెట్టుకొని నా నుంచి విడాకులు తీసుకుంది. విడాకుల కేసులో నేను తనకు ఫలానా వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది అని పేరుతో సహా చెప్పినప్పటికీ, తనకు అలాంటివేమీ లేవని కోర్టును నమ్మించింది. దాంతో నేను పదిలక్షల రూపాయలు భరణంగా చెల్లించవలసి వచ్చింది. మా విడాకులు అయిన 7 నెలలకే తను అదే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తను నా భార్యగా ఉన్నప్పుడు వారు కలిసి తీసుకున్న ఫోటోలు కొన్ని పెళ్లి వీడియోలో పెట్టి ఇంటర్నెట్లో కూడా పెట్టుకున్నారు. నన్ను మానసిక క్షోభకి గురి చేసినందుకు నేను నా మాజీ భార్య ప్రస్తుత భర్తపై కేసు వేయవచ్చా? ఎందుకంటే, ఇటీవలే పేపర్లో తైవాన్లో భార్య ప్రియుడిపై భర్త కోర్టులో దావా వేయగా కోర్టు అతనికి పరిహారం కూడా చెల్లించమని చెప్పిందని ఒక వార్త చదివాను. మనదేశంలో కూడా అలా చేసే వీలుందా? – సంపత్, హైదరాబాద్ రెండు వారాల క్రితం ఇలాంటి ఒక కేసు గురించి మన పత్రికలో కూడా సమాధాన రూపంగా చె΄్పాను. వివాహేతర సంబంధాలు చట్టరీత్యా నేరాలుగా పరిగణించక పోయినప్పటికీ, సివిల్ దావాలు/పరిహారాలు కోరడానికి భారతీయ చట్టాలలో ఎటువంటి అడ్డంకీ లేదు. మారుతున్న సామాజిక పరిణామాల దృష్ట్యా, వివాహేతర సంబంధాలు ఇకపై సివిల్ కోర్టుకు చేరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు మీ మాజీ భార్య ప్రియుడి మీద (ప్రస్తుతం ఆమె భర్త) ఖచ్చితంగా కేసు వేయవచ్చు. పరిహారం కూడా కోరవచ్చు. ఇటీవలే ఢిల్లీ హైకోర్టు తన తీర్పులో ఒక భార్య తన భర్త ప్రియురాలిపై వేసిన దావా చెల్లుతుంది అని పేర్కొంది. అయితే మీరు కేసు వేసిన తర్వాత, మీ మాజీ భార్యకి, తన భర్తకి సంబంధం ఉండేదనే విషయాన్ని ఖచ్చితమైన సాక్ష్యాధారాలతో రుజువు చేయవలసి ఉంటుంది. కోర్టును ఎవరు ఆశ్రయిస్తే వారే తమ పక్షం వాదనని వాస్తవాలేనని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది! కేవలం గతంలో వారిద్దరూ కలిసి తీసుకున్న కొన్ని ఫొటోల ఆధారంగా మాత్రమే మీరు కేసు గెలవడం కొంత కష్టమే! అయితే, అసలు మీ మాజీ భార్యకు అతనితో పెళ్లికి ముందు పరిచయమే లేదు అతను ఎవరో నాకు తెలియదు’’ వంటి సమాధానాలు చెప్పి ఉన్నట్లయితే, మీ డైవర్స్ కేసులో జరిగిన వాదోపవాదాలను ఆధారంగా తీసుకొని మీ తరఫు సాక్ష్యాలుగా కూడా కోర్టు ముందు ఉంచవచ్చు. చదవండి: ఆ టైంలో హెల్ప్ అడగడం తప్పుకాదు, మీకోసం మీరు ఏడ్వండి : సారాఇవన్నీ ఒకవేళ రుజువు అయినట్లయితే మీకు మానసిక క్షోభ కలిగించినందుకు గాను, ఆర్థికంగా కూడా మీరు నష్టపోయినందుకు గాను, మీరు తగిన పరిహారం పొందే అవకాశం లేకపోలేదు. మీరు కేసు వేయాలి, తగిన సాక్ష్యాధారాలతో రుజువు చేయగలను అనుకుంటే, మీ మాజీ భార్యని కూడా కేసులో పార్టీ చేయండి. ఇంతవరకు ఇలాంటి కేసులు లేకపోయినప్పటికీ, ఇటీవలే మన భారతీయ కోర్టులు ఇచ్చిన తీర్పుల ఆధారంగా మీ కేసు విచారణకు మాత్రం అర్హత సాధించింది. కేసు గెలవడం ఓడిపోవడం తర్వాత సంగతి. అన్ని సాక్ష్యాధారాలు, ముఖ్యంగా మీ డైవర్స్ కేసులో మీ మాజీ భార్య ఇచ్చిన వాంగ్మూలాలు/ క్రాస్ ఎగ్జామినేషన్లో తను చెప్పిన సమాధానాలు వంటివి నిక్షిప్తపరిచి ఒక లాయర్ను సంప్రదిస్తే మీకు ఉపశమనం లభించవచ్చు. ఇదీ చదవండి: ఫ్యామిలీ కోసం కార్పొరేట్ జీతాన్ని వదులుకుని రిస్క్ చేస్తే..! – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com మెయిల్ చేయవచ్చు. -
ఊపిరి ఉగ్గబట్టి 20 మీటర్లు.. 2 నిమిషాలు... సీఫుడ్ హీరోలు జుజు మహిళలు
శ్వాస పరికరాలు లేకుండా సాగర గర్భంలోకి డైవ్ చేస్తూ షెల్ ఫిష్, సీవీడ్స్ వంటి సముద్ర ఆహారాన్ని సేకరించి కుటుంబాలను పోషించుకునే మహిళా రైతుల తెగువ ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయంలో చెమటను చిందించే రైతమ్మలందరికీ స్ఫూర్తినిస్తుంది. దక్షిణ కొరియాలోని జెజు ద్వీపానికి చెందిన హెన్యో అనే మహిళా డైవర్లను ‘సీ ఉమన్’ అంటారు. వెయ్యేళ్ల నాటి వారసత్వ సంస్కృతి, డైవింగ్ నైపుణ్యం, సుస్థిరతలకు ప్రసిద్ధి చెందిన ఒక ప్రత్యేకమైన పాక్షిక మాతృస్వామిక సంప్రదాయం వారిది. ఇప్పటికీ 103 గ్రామాలకు చెందిన మహిళలు ఈ విధంగా ఎటువంటి యంత్రాల సహాయం లేకుండా సముద్ర గర్భంలోకి దూసుకెళ్తూ ఆహార సేకరణ చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ‘ఫుడ్ హీరోలు’గా కీర్తిస్తోంది. అంతేకాదు, అత్యంత అరుదైన ప్రపంచ వ్యవసాయ వారసత్వ సంపదగా కూడా హెన్యో సామ్రాజ్యాన్ని ఎఫ్ఏవో, యునెస్కో విశిష్ట గుర్తింపునిచ్చాయి. జెజు ద్వీపంలో పుట్టిన ఈ తరం యువతులు సైతం ఈ సంప్రదాయ వారసత్వ వ్యవసాయాన్ని కొనసాగిస్తూ ఆధునిక సాగర కన్యలుగా జీవనం సాగిస్తుండటం విశేషం. స్వేచ్ఛా డైవింగ్ ద్వారా వారు ‘సముద్ర పొలాలను’ పండిస్తున్న అరుదైన మహిళా ఫుడ్ హీరోలపై అక్టోబర్ 16న అంతర్జాతీయ ఆహార దినోత్సవం (World Food Day )సందర్భంగా ప్రత్యేక కథనం...‘సముద్రం నా రెండో తల్లి’!ర్యుజిన్ కో తన తల్లి లేదా అమ్మమ్మ అడుగుజాడల్లో నడవాలని ఎప్పుడూ అనుకోలేదు. జెజు ద్వీపం తూర్పు తీరంలో డైవ్ చేయడానికి తన తల్లి లేదా అమ్మమ్మ ఇంటి నుంచి పొద్దున్నే బయలుదేరి వెళ్లే సంగతి ఆమెకు బాల్యంలోనే తెలుసు. సీజన్ సరిగ్గా ఉన్నప్పుడు, వారు తమ కుటుంబాలను పోషించుకోవడానికి సముద్రపు అర్చిలు, అబలోన్, సముద్రపు నాచును సముద్రం లోపలి జలాలను గాలించి సేకరించేవారు. ర్యుజిన్ తన తరంలోని చాలా మంది అమ్మాయిల్లాగే కష్టపడి చదువుకుని నగరపు జీవితాన్ని గడపాలని కలలు కంది. అథ్లెటిక్స్లో డిగ్రీ పొందినతర్వాత ఆమె నగరానికి వెళ్లిపోయింది. కానీ, అక్కడి జీవితంలో నిలవలేకపోయింది. ఎదురైన నిరాశ, ఆవహించిన నిస్సత్తువ ఆమెను తిరిగి ఇంటి బాట పట్టించాయి. ఇల్లు ఆమెను సముద్రం వైపు నడిపించింది. ఆ విధంగా యువ ర్యుజిన్ తన తల్లి, అమ్మమ్మలాగే ఆమె ‘సముద్ర మహిళ’ కావాలని నిర్ణయించుకుంది.ప్రకృతి చిత్రమైనది. ఒక వనరు లేకపోతే మరో వనరును చూపిస్తుంది మనుషులు బతకడానికి! రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోని జెజు ద్వీపం ఇందుకు ఒక ఉదాహరణ. ఒక అసాధారణ, విలక్షణ ‘సముద్ర వ్యవసాయ’ వారసత్వానికి కేంద్ర బిందువైంది. జెజు ద్వీపంలో ఎక్కువ భూమి నిస్సారవంతమైనది కావటంతో వ్యవసాయానికి అంతగా పనికొచ్చే స్థితిలో లేదు. ఈ భౌగోళిక బలహీనత కారణం వల్ల జెజు ప్రజలు సాంప్రదాయకంగా వరికి బదులుగా తమ మెట్ట పొలాల్లో బాగా పెరిగే చిరుధాన్యాలు, బార్లీ వంటి ధాన్యపు పంటలను పండించేవారు. ఎందుకంటే ఈ పంటలు తక్కువ వనరులతోనే ఎక్కువ మందికి ఆహార భద్రతనిచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఆ కారణంగా అక్కడి మహిళా రైతులు సముద్రంపై ఆధారపడి తమ కుటుంబాలకు ఆహారాన్ని సమకూర్చుకోవటంపై దృష్టి సారించారు. సముద్రం అడుగున ఉండే జీవులు, ఆకులు అలములను వెదికి తెచ్చుకోవటమే వారు వృత్తిగా పెట్టుకున్నారు. సుమారు వెయ్యి ఏళ్ల క్రితం నుంచి జుజు ద్వీపంలోని మహిళలు సముద్రపు నీటి లోతుల్లోకి దూకి తినదగిన ఆహారాన్ని సేకరించటం ప్రారంభించారు. ఆ క్రమంలో వారు అసాధారణమైన డైవింగ్ నైపుణ్యాలను తరతరాలుగా సంతరించుకున్నారు. ఎటువంటి శ్వాస పరికరాలు పెట్టుకోకుండా సాగర గర్భంలోకి డైవ్ చేస్తూ అట్టడుగున ఉండే షెల్ ఫిష్, సీవీడ్స్ వంటి సముద్ర ఆహారాన్ని సేకరించి కుటుంబాలను పోషించుకుంటున్నారు. జెజు హెన్యో ఫిషింగ్ ప్రాక్టీస్ అనేది ప్రధానంగా మహిళలు నిర్వహించే సాంప్రదాయ జీవనాధార ఫిషింగ్ వ్యవస్థ. హెన్యో అంటే కొరియన్ భాషలో ‘సముద్ర మహిళ’ అని అర్థం. జెజు హెన్యోలు సాధారణ పద్ధతుల్లో చేపలు పట్టరు. అలాగని మట్టిలో పంటలు పండించరు. ఈ రెండిటికి మధ్యలో పర్యావరణ హితమైన సముద్రాహార సేకరణ ద్వారా తమ సమాజానికి ఆహార, జీవనోపాధి భద్రతను సాధించగలిగారు. ఈ మహిళా డైవర్లు సగం వ్యవసాయం – సగం మత్స్యకార జీవనశైలితో కూడిన జీవనోపాధి పనిలో నిమగ్నమవుతున్నారు. వట్టిపోతున్న సముద్రంకనుమరుగవుతున్న వాణిజ్య అవకాశాలతో పాటు సముద్రం నుంచి జుజు మహిళా డైవర్లు పొందే ప్రతిఫలం కూడా తగ్గుతోంది. వాతావరణ మార్పుల కారణంగా జెజు సముద్ర జలాలు వేడెక్కుతున్నాయి. ఫలితంగా, ఈ ప్రాంత సముద్ర జలాల్లోకి చొచ్చుకొస్తున్న ఉపఉష్ణమండల చేపలు స్థానిక జాతులను మింగేస్తున్నాయి. అముర్ స్టార్ ఫిష్, బ్లూ–రింగ్డ్ ఆక్టోపస్ వంటి మాంసాహార జాతులు ఈ జలాలను దురాక్రమణ చేస్తున్నాయి. సముద్ర మహిళలు ఇప్పుడు అలల కింద కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారు.ర్యుజిన్ సముద్రంలోకి దిగిన ప్రారంభ సంవత్సరాల్లో సమృద్ధిగా చేపలు పట్టుకోగలిగేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారి΄ోయింది. ఒకప్పుడు దొరికిన దానిలో ΄ావు వంతు కంటే తక్కువ మత్స్య సంపదే ఇప్పుడు దొరుకుతోంది. ‘నా నైపుణ్యాలు మెరుగుపడినప్పటికీ, సముద్రం నుంచి తక్కువగానే పట్టుకోగలుగుతున్నాను. మూడు సంవత్సరాల క్రితం నేను ఏటా 30 బస్తాల అగర్ సీవీడ్ను సేకరించి ఎండబెట్టగలిగాను. ఈ సంవత్సరం కేవలం ఏడు బస్తాలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది..’ అన్నారు ర్యుజిన్. ర్యుజిన్, ఆమెతో పాటు ఉండే మహిళా డైవర్లు మత్స్య సంపద అంతరించి΄ోకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. స్వీయ–నియంత్రణ ΄ాటిస్తూ సముద్ర పర్యావరణ వ్యవస్థను సంరక్షించే చర్యలు చేపడుతున్నారు. హానికరమైన మత్స్య జాతుల నుంచి ఒబుంజాక్ (ఒక రకమైన అబలోన్) వంటి స్థానిక జాతులను కాపాడుతున్నారు. మహిళా డైవర్లు తాము ఆహారం కోసం వేటాడే వారిలా మాత్రమే కాకుండా సముద్ర జీవుల సంరక్షకులుగా తమను తాము భావిస్తారు. స్థానిక సముద్ర జలాలను దురాక్రమణ చేసే స్టార్ ఫిష్లను స్థానిక ప్రభుత్వ మద్దతుతో చంపే పని కూడా చేస్తున్నారు.కొత్త యుగంసవాళ్లు ఎదురవుతున్నప్పటికీ జెజు హెన్యో సంస్కృతిపై ప్రజలకు ఆసక్తి పెరుగుతోంది. 2016లో యునెస్కో జెజు హెన్యో సంస్కృతిని యావత్ మానవాళి అవ్యక్త సాంస్కృతిక వారసత్వ సంపదగా గుర్తించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) జెజు హెన్యో మత్స్యకార వ్యవస్థను ‘ప్రపంచవ్యాప్తంగా అతిముఖ్యమైన వ్యవసాయ వారసత్వ వ్యవస్థ’గా 2023లో ప్రకటించింది. సముద్ర జీవవైవిధ్యం, హానికరం కాని రీతిలో వేట పద్ధతులు అనుసరించటం, అసాధారణమైన సామాజిక నీతి సంరక్షకులుగా హెన్యో మహిళా డైవర్లకు గల ప్రాముఖ్యతను ఎఫ్ఏఓ గుర్తించి ప్రోత్సహిస్తోంది. జెజు ప్రత్యేక స్వయం పాలిత రాష్ట్రంలో ఏర్పాటైన హెన్యో సాంస్కృతిక వారసత్వ విభాగం డైరెక్టర్ క్యుంగ్–హో కో మాట్లాడుతూ ఈ గుర్తింపు ప్రాముఖ్యతను ఇలా వివరించారు.. ‘ఇది జెజు హెన్యో వ్యవస్థను ఉన్నతీకరిస్తుంది. ఈ విలువైన వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించడానికి సహాయపడుతుంది. స్థానిక సమాజం అభివృద్ధికి దోహదపడుతుంద’ని ఆయన అన్నారు. ‘కఠినమైన పని పరిస్థితులు, పర్యావరణ మార్పులు, తగ్గుతున్న సముద్ర వనరులు, వృద్ధాప్యం, కొత్తగా ఈ పనిలోకి వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉండటం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, తమ జీవనోపాధిని కొనసాగించే మహిళల బలమైన ఆకాంక్షను ఎఫ్ఏవో గుర్తింపు బలోపేతం చేస్తోంది’ అన్నారాయన. హెన్యో జీవన విధానాన్ని కాపాడుకోవడానికి జెజు ప్రభుత్వం కృషి చేస్తోంది. సముద్ర మహిళల సంక్షేమం కోసం, వారి ఆదాయాన్ని పెంపొందించడానికి, వారి పని వాతావరణాన్ని మెరుగుపరచటం ద్వారా హెన్యో సంస్కృతిని సంరక్షించడానికి ఈ సంవత్సరం 2 కోట్ల అమెరికన్ డాలర్ల మేరకు ప్రభుత్వం పెట్టుబడి పెట్టిందని డైరెక్టర్ క్యుంగ్–హో కో వివరించారు. డైవింగ్ సంబంధిత గాయాలకు వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తోంది. అరవై, డెబ్బయి ఏళ్లు దాటిన హెన్యోలకు ఆర్థిక భత్యాలు ఇస్తున్నారు. 75 ఏళ్లు పైబడిన వారికి పదవీ విరమణ ప్రయోజనాలను అందిస్తున్నారు. హెన్యో పండుగలు, ఆచారాల ప్రోత్సహించటం, కొత్త తరం మహిళలకు హెన్యో నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడానికి పాఠశాలలను కూడా నిర్మించటం విశేషం.ఉద్యోగం కంటే ఎక్కువ..ఒక జీవన వారసత్వం! వేగవంతమైన ప్రపంచంలో జెజులోని హెన్యో సమాజం పర్యావరణ స్పృహతో కొనసాగుతోంది. ప్రకృతిని మనుషులు ఉపయోగించుకునే క్రమంలో పర్యావరణ పరిమితులను గౌరవిస్తుంది. పరస్పరం ఆధారపడటాన్ని విలువైనదిగా భావించే జీవన విధానాన్ని కొత్త తరాలకు చాటిచెప్పే ఉదాహరణగా నిలుస్తుంది. ‘ప్రజలు ఈ పనిని ‘3డి ఉద్యోగం’ అని పిలుస్తారు. మూడు డీలు అంటే.. డర్టీ, డేంజర్, డిమాండింగ్తో కూడిన పని అని చెబుతుంటారు. కానీ నా మటుకు నాకు, ఇది అత్యున్నతమైన సంతృప్తినిచ్చే పని అనిపిస్తుంటుంది’ అన్నారు 42 ఏళ్ల ర్యుజిన్. ‘నేను నీటి అడుగున ఉన్నప్పుడు, నేను జీవించడం గురించి మాత్రమే ఆలోచిస్తాను. అంతకుమించి అతిగా ఆలోచించడం మానేశాను’ అంటారు ర్యుజిన్. ‘సముద్రం నా రెండో తల్లి. నేను సముద్రపు తల్లి ఒడిలో ఈదులాడుతూ చాలా స్వస్థత పొందాను. ఈ తల్లి నాకు చాలా ఇచ్చింది..’ అంటారామె ఉద్వేగంగా! ‘నాకు నలుగురు పిల్లలు. ప్రతి ఉదయమూ జీవన పోరాటమే. కానీ సముద్రం వైపు వెళుతున్నప్పుడు మాత్రం నాకు ఉత్సాహంగా ఉంటుంది. ఈ రోజు సముద్రం నాకు ఏమి ఇస్తుందో అన్న ఉత్సుకత కలుగుతుంది. స్వస్థత చేకూర్చే నిరంతర ప్రవాహంలా జీవితం గడచిపోతోంది’ అన్నారామె. ‘జెజులో మహిళలది ఎల్లప్పుడూ కీలక పాత్రే. నాకు, హెన్యో అంటే మహిళలు, మహిళలు అంటే హెæన్యో. ఇది గొప్ప గర్వకారణం...’ అన్నారు.కనుమరుగవుతున్న వారసత్వంహెన్యో వ్యవసాయ వారసత్వ సంప్రదాయానికి వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. క్రీస్తు శకం 1,105వ సంవత్సరం నుంచి ఈ వ్యాపారాన్ని ప్రస్తావించిన రికార్డులున్నాయి. జెజు మహిళలు ఎల్లప్పుడూ ఆ ద్వీపం జీవితానికి వెన్నెముకగా ఉన్నారు. మత్స్యకారులుగా, రైతులుగా, తల్లులుగా, ఎక్కువగా వీళ్లదే ఇళ్లలో ముఖ్యమైన సంపాదనగా ఉంటుంది.1970లలో 14,000 మంది హెన్యోలు ఉన్నారు. కానీ, 1980 తర్వాత కాలంలో చాలా మంది మహిళలు ఈ పనిని విడిచిపెట్టి పర్యాటక, టాన్జేరిన్ పరిశ్రమల్లో ఉద్యోగాల కోసం వెళ్లారు. ప్రస్తుతం 2,700 హెన్యోలు ఉన్నారు. అయితే, వారిలో చాలా మంది డెబ్బై, ఎనభై– ఏళ్ల వయస్కులే! 42 సంవత్సరాల వయస్కురాలైన ర్యుజిన్ సముద్రంలోకి వెళ్లే అతి పిన్న వయస్కుల్లో ఒకరు. ర్యుజిన్ గ్రామంలో 83 మంది చురుకైన హెన్యోలు ఉన్నారు. ఈ సంవత్సరం పది మంది పదవీ విరమణ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ర్యుజిన్ తరంలో డైవర్లు పని నేర్చుకున్న వారి సంఖ్య చాలా తక్కువ. ‘భవిష్యత్తులో నేను ఒంటరిగా డైవింగ్ చేయవలసి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నాను. అందుకే నేర్చుకోవాలనుకునే వారెవరినైనా స్వాగతిస్తున్నాను. నాకు తెలిసిన ప్రతి నైపుణ్యాన్నీ వారికి నేర్పుతాను’ అని ర్యుజిన్ చెప్పారు. 20 మీటర్లు.. 2 నిమిషాలు...స్వేచ్ఛా డైవింగ్ చేసే జెజు మత్స్యకార మహిళలు తమ శ్వాసను ఉగ్గబట్టుకునే సామర్థ్యం, సముద్ర జలాల్లోకి దూసుకెళ్లే నైపుణ్యం, సముద్రపు నీటి అడుగున ఏయే తావుల్లో తమకు అవసరమైన ఆహారం ఎక్కడెక్కడ ఉంటుందో గ్రహించే సంప్రదాయ విజ్ఞానం, జ్ఞాపక శక్తిని మాత్రమే ఆయుధాలుగా ఉపయోగించి సముద్రపు లోతుల్లోకి సాహసంతో దూకేస్తారు. ఆక్సిజన్ ట్యాంకులు లేకుండా వారు డైవ్ చేయగలరు. ఒకటి–రెండు నిమిషాలు తమ శ్వాసను స్తంభింపజేసుకోగలరు. ఆ కొద్ది సమయంలోనే ఐదు నుండి 20 మీటర్ల లోతుకు డైవ్ చేయగలరు. రోజుకు ఏడు గంటల పాటు సముద్రంలో గడపటం వారికి వెన్నతో పెట్టిన విద్య. ప్రతి అక్టోబర్ 16 నాడు ప్రపంచ ఆహార దినోత్సవం జరుపుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ర్యుజిన్ వంటి ‘ఫుడ్ హీరో’ల గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఇటువంటి సంప్రదాయ విజ్ఞానంతో కూడిన గొప్ప జీవన నైపుణ్య సాంప్రదాయ వారసత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరాన్ని ఈ తరం గుర్తించేలా చెయ్యటం మన కర్తవ్యం.– నిర్వహణ: పంతంగి రాంబాబు సాక్షి సాగుబడి డెస్క్ -
వద్దిక... ఓవర్ ఒద్దిక బెటర్!
ఇది వైరల్ కాలం! సర్వైలెన్స్ కెమెరాల మధ్య బిగ్ బాస్ హౌస్ ఉన్నట్టే జెన్ ఆల్ఫా కూడా తమను సోషల్ మీడియా ఫ్రేమ్లో ఫిక్స్ చేసుకుంది! అందుకే వాళ్లు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్సర్స్ను, వాళ్లు చూస్తున్న రీల్స్, షాట్స్, షోస్లోని క్యారెక్టర్స్ను అనుకరిస్తుంటారు. ఈ తీరు కొందరికి అతిగా... అసహజంగా అమర్యాదగా తోచవచ్చు. ఇంకొందరికి ముచ్చటగా అనిపించవచ్చు. ఈ రెండిటికీ ఉదాహరణగా ఇటీవల వైరల్ అయిన కౌన్ బనేగా కరోడ్పతి 17 వ సీజన్ ‘కేబీసీ జూనియర్స్’ లో ఓ చిన్నారి పార్టిసిపెంట్ వీడియోను చూపిస్తున్నారు. దీనిపై కామెంట్లు, కాంప్లిమెంట్లను పక్కన పెడితే ఈ వీడియో.. జెన్ ఆల్ఫా పేరెంటింగ్ కి సంబంధించి ఓ చర్చను లేవనెత్తింది...కేబీసీలో ఇదీ జరిగింది.. కౌన్ బనేగా కరోడ్పతి17వ సీజన్లోని ‘కేబీసీ జూనియర్స్’ హాట్ సీట్లో ఓ బుడతడు కూచున్నాడు. చుట్టూ కెమెరాలు.. ఆడియెన్స్.. ఎదురుగా 83 ఏళ్ల పాపులర్ పర్సనాలిటీ.. ఎవర్గ్రీన్ సెలబ్రిటీ అమితాబ్ బచ్చన్.. అయినా ఎలాంటి బెరుకు లేకుండా చాలా రిలాక్స్డ్గా.. ఇంకా చె ప్పాలంటే ఆ కూర్చోవడంలోనే అందరి అటెన్షన్ను గ్రాబ్ చేశాడా పిల్లాడు. వాడి ఆత్మవిశ్వాసానికి ముచ్చటపడుతూ అమితాబ్ ‘హాట్ సీట్లో కూర్చోవడం ఎలా ఉంది?’ అనడిగారు. ‘ఎక్సయిటెడ్గా ఉన్నాను కానీ.. మీరు రూల్స్ చెబుతూ కూర్చోకండి.. నాకు ఈ షో రూల్స్ అన్నీ తెలుసు.. నేరుగా పాయింట్కి వచ్చేద్దాం’ అన్నాడు.ఆ జవాబు హోస్ట్ అయిన అమితాబ్ను ఖంగుతినేలా చేసింది. అయినా తమాయించుకుని షోని ప్రోసీడ్ చేశాడు. మొదటి ప్రశ్న అడిగి ఆప్షన్స్ ఇచ్చేలోపే జవాబు చెప్పి ఆప్షన్స్ లేకుండానే నా ఆన్సర్ని లాక్ చేసేయ్ డాన్స్.. ఆప్షన్ ఏదైనా ఈ ఆన్సర్ లాక్ చేసెయ్’ అన్నాడు అమర్యాదగా. ఆ తర్వాత ప్రశ్న అడిగేముందు ఏదో చెప్పబోతున్న అమితాబ్ను‘మీరు ప్రశ్నయితే అడగండి ముందు’ అన్నాడు అదే ధోరణిని కొనసాగిస్తూ. అదే ప్రవర్తనతో ఆ పిల్లాడు అలా అయిదవ ప్రశ్న దాకా వచ్చాడు.25 వేలు వచ్చే అయిదవ ప్రశ్న ‘వాల్మీకి రామాయణంలోని మొదటి కాండ ఏది?’ కి ఆప్షన్స్ అడిగాడు ఆ కుర్రాడు.‘బాల కాండ.. అయోధ్య కాండ.. కిష్కింధ కాండ.. యుద్ధ కాండ’ అంటూ నాలుగు ఆప్షన్స్ను చదివారు అమితాబ్. వెంటనే ‘బి.. అయోధ్యకాండ’ అని చెబుతూ ‘ఒక్కసారి కాదు ఈ ఆన్సర్ను నాలుగుసార్లు లాక్ చేయండి’ అన్నాడు పిల్లాడు. ‘సారీ.. తప్పు చె ప్పావ్.. కరెక్ట్ ఆన్సర్ బాలకాండ’ అన్నారు అమితాబ్. ఈసారి ఆ పిల్లాడు ఖంగు తిన్నాడు. ఆ బాబు వయసు పదేళ్లు. అయిదవ తరగతి చదువుతున్నాడు. గుజరాత్లోని గాంధీనగర్లో ఉంటాడు. ఆ పిల్లాడు జవాబులు చెబుతూంటే ఆడియెన్స్ గ్యాలరీలో ఉన్న అతని తల్లిదండ్రులు కొడుకువైపు మురిపెంగా.. గర్వంగా చూడసాగారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన వాళ్లు సోషల్ మీడియాలో రెండురకాలుగా స్పందించారు. కొందరు ‘జ్ఞానం ఒక్కటే ఉంటే సరి పోదు.. కాసింత వినయం, సంస్కారం కూడా ఉండాలి’,‘అది కాన్ఫిడెన్స్ కాదు ఓవర్ కాన్ఫిడెన్స్.. ’, ‘చదువు కన్నా ముందు పిల్లలకు మర్యాద, మన్నన నేర్పాలి’, ‘అమ్మో... పిల్లాడు కాదు... మహా ముదురు’ అంటూ, ఇంకొందరు ‘అయిదు నిమిషాల ఫుటేజ్ చూసి పిల్లాడి బిహేవియర్ని జడ్జ్ చేయడమేంటీ?’, ‘పేరెంట్స్ పిల్లాడికి కాస్త మర్యాదగా నడుచుకోమని చెప్పి ఉంటే బాగుండేది’ అంటూ కామెంట్ చేశారు.బ్రేక్ పడాల్సిన ప్లేస్ ఇల్లు...‘ఇలాంటి ప్రవర్తన ఉన్న ట్రెండ్ను 6 –13 ఏళ్ల పిల్లల్లో ఎక్కువగా చూస్తాం. ఇది బుద్ధిమాంద్యం లేదా ఏడీహెచ్డీ ఏమాత్రం కాదు. డిఫరెంట్గా కనిపించాలనే తాపత్రయం, పదిమంది దృష్టిని ఆకర్షించాలన్న లక్ష్యం. ఒక్కమాటలో చె ప్పాలంటే డిఫరెంట్ బిహేవియర్తో సోషల్ మీడియా అటెన్షన్ను గ్రాబ్ చేయడమన్న మాట. దీనికి ఇండివిడ్యువలిస్ట్గా పెరగడం, ఓవర్ కాన్ఫిడెన్స్.. ఓవర్ ఆటిట్యూడ్ బిహేవియర్ కారణం. వాళ్లు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, రీల్స్, షాట్స్ లోని క్యారెక్టర్లను అనుకరిస్తూ తమ సహజత్వాన్ని మరచి పోతారు. ఆ ప్రభావంతో అందరూ గౌరవిస్తున్న వాళ్ల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాలనుకుంటారు.అందులో భాగమే పెద్దవాళ్లను ఏకవచనంతో సంబోధించడం, అన్నీ తమకే తెలుసన్నట్లుండటం, వయసుకు మించి మాట్లాడటం లాంటివి. ఇలాంటి పిల్లల ప్రవర్తనను చక్కదిద్దక పోగా దాన్ని వాకి తెలివితేటలుగా అభివర్ణిస్తూ ప్రోత్సహిస్తుంటే ఇదిగో ఇలాగే ఓవర్ కాన్ఫిడెంట్గా తయారవుతారు. ఈ తీరును మొక్కగా ఉన్నప్పుడే తుంచేయాలి. దీనికి బ్రేక్ పడాల్సిన ప్లేస్ ఇల్లు.. బ్రేక్ వేసి ఆ ప్రవర్తనను సరిచేయాల్సిన వాళ్లు తల్లిదండ్రులే. – డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి కన్సల్టెంట్ చైల్డ్ అండ్ అడల్ట్ సైకియాట్రిస్ట్, హైదరాబాద్ఆ ట్రైనింగ్ పేరెంట్సే ఇవ్వాలి...‘ఆ బుడతడి వీడియో చాలా వైరల్ అయింది. వైరల్ అయిన వీడియో కూడా జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ క్లిప్పింగ్ అంతే! దాన్నిబట్టే ఆ పిల్లాడి ప్రవర్తనను, పేరెంటింగ్ను జడ్జ్ చేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ట్రోల్ చేయడం కూడా తప్పే. అది పిల్లాడి మీద, అతని తల్లిదండ్రుల మీదా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే.. ఆ పిల్లాడిలో ఇంపల్సివిటీ కనిపిస్తోంది. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఆ ట్రైనింగ్ పేరెంట్సే ఇవ్వాలి. – వర్ష వేముల, సైకోథెరపిస్ట్ -
రైలుతో... ఆమె చెట్టపట్టాలు
మోనిషా రాజేష్(Monisha Rajesh)... 42 ఏళ్ల ఈ ట్రావెల్ రైటర్కు గత 15 సంవత్సరాలుగా రైలే ఇల్లు. 2010లో ఆమె 80 రైళ్లలో దేశమంతా తిరిగి ‘అరౌండ్ ఇండియా ఇన్ 80 ట్రైన్స్’ పుస్తకం రాశారు. ఆ తర్వాత లోకమంతా 80 రైళ్లలో చుట్టేసి ‘అరౌండ్ ద వరల్డ్ ఇన్ 80 ట్రైన్స్’ రాసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు స్త్రీలు రాత్రిపూట చేసే రైలు ప్రయాణాలు ఎలా ఉంటాయో ప్రపంచమంతా తిరిగి ‘మూన్లైట్ ఎక్స్ప్రెస్’ వెలువరించారు. ఈ రైలు ప్రయాణాల ప్రేమికురాలి పరిచయం...‘భారతదేశాన్ని చూడాలంటే రైలులోనే చూడాలి’ అంటారు మోనిషా రాజేష్. యు.కె.లో స్థిరపడ్డ ఈ మాజీ జర్నలిస్టు ఇప్పుడు పూర్తిగా ‘ట్రావెల్ రైటర్’గా మారారు. ఆశ్చర్యకరంగా ఆమె తన కెరీర్కు ‘రైలు’ను ఒక ఆధారంగా మలుచుకున్నారు. అంటే పుస్తకాలు అమ్ముడవగా వచ్చే డబ్బు ఆమెకు రైలు ద్వారా వస్తున్నట్టే. ‘హఠాత్తుగా నాకు ఏమర్థమైందంటే నా పుస్తకాలకు రైలు కంటే మించిన కథానాయకుడు లేడని’ అంటారామె నవ్వుతూ.ఆమె తాజా పుస్తకం ‘మూన్లైట్ ఎక్స్ప్రెస్ – అరౌండ్ ద వరల్డ్ బై నైట్ ట్రైన్’ మార్కెట్లోకి వచ్చింది. ప్రపంచంలోని అనేక దేశాలలో రాత్రి జర్నీల ద్వారా ట్రైన్లలో సంచారం చేస్తూ తాను చూసిన ప్రపంచాన్ని పరిచయం చేశారు మోనిషా. ఇప్పటివరకూ ‘రైలు’ ప్రయాణాల ఆధారంగా ఆమెవి నాలుగు పుస్తకాలు వచ్చాయి.మొదటిసారి రైలుతో ప్రేమమోనిషా తల్లిదండ్రులది చెన్నై. ఇద్దరూ డాక్టర్లు. అయితే యు.కెలోని నార్ఫోక్లో స్థిరపడ్డారు. మోనిషా అక్కడే పుట్టి పెరిగింది. ఆమెకు 9 ఏళ్లు ఉన్నప్పుడు తల్లిదండ్రులు రెండేళ్లపాటు వెనక్కు వచ్చి చెన్నైలో ఉన్నారు కాని ఆ సమయంలో మోనిషాకు దేశం గురించి తెలుసుకునే అవకాశం రాలేదు. తర్వాత ఆమె చదువు సాగి, జర్నలిస్టుగా మారాక, 2010 లో మరోసారి ఇండియాకు వచ్చారు. ‘నా దేశాన్ని చూడాలి అని నేను అనుకున్నప్పుడు విమాన ప్రయాణం బడాయి వద్దనుకున్నాను. రోడ్డు సేఫ్ కాదు. అందుకే రైలు ప్రయాణం ఎంచుకున్నాను.90 రోజుల పాస్ తీసుకుని రైళ్లలో తిరగడం మొదలైన రెండు నెలల్లోనే నాకు అర్థమై పోయింది భారతదేశంలో రైలు ప్రయాణం అద్భుతమని. అందుకే ఈసారి ఒక ప్లాన్తో వచ్చి 80 ట్రైన్లలో తిరిగి ‘అరౌండ్ ఇండియా ఇన్ 80 ట్రైన్స్’ పుస్తకం రాశాను. దానికి బోల్డంత పాఠకాదరణ, అవార్డులు లభించాయి. ఆ ఉత్సాహం నన్ను రైలులో ప్రపంచ యాత్ర చేసేలా చేసింది’ అని తెలిపారు మోనిషా. ఆమె ఇండియాలో తిరుగుతూ కోణార్క్ ఎక్స్ప్రెస్లో భువనేశ్వర్ నుంచి హైదరాబాద్కు వచ్చారు.. మోనిషా రైలు మార్గం ఉన్న ప్రతి దేశంలో తిరుగుతూ ‘అరౌండ్ ద వరల్డ్ ఇన్ 80 ట్రైన్స్’ పుస్తకం రాశారు. ఇప్పుడు రాత్రి ప్రయాణాలు ఉన్న రైళ్లలో ప్రయాణించి ‘మూన్లైట్ ఎక్స్ప్రెస్’ పుస్తకం రాశారు.ధన్యమయ్యే ప్రయాణం‘నేను భారతదేశమంతా సెకండ్ క్లాస్ ట్రైన్లో తిరిగాను. భారతదేశం అర్థం కావాలంటే ట్రైను ప్రయాణం చేయాలి. అదీగాక మనుషులు విమాన ప్రయాణాలతో విసుగెత్తారు. కోవిడ్ వల్ల లాక్డౌన్ వచ్చి ముగిశాక ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు భ్రమణకాంక్ష పెరిగింది. లోకం చూద్దాం అనుకుంటున్నారు. దానికి గొప్ప మార్గం రైలే. యూరప్లో 2015 నాటికి రాత్రి ప్రయాణాలు ఉండే స్లీపర్ ట్రైన్లు బంద్ చేశారు. ఇప్పుడిప్పుడే అవి తిరిగి మొదలయ్యాయి. స్త్రీలు ఒంటరిగా రాత్రిళ్లు రైలు ప్రయాణాలు చేయడం, జీవితాన్ని ఆస్వాదించడంలో భాగమే’ అంటారు మోనిషా.ప్రకృతి కన్నులు‘టర్కీ నుంచి ఆర్మేనియా వరకూ 26 గంటల పాటు సాగే రైలు ప్రయాణం అద్భుతం. టర్కీ సౌందర్యం మొత్తం అక్కడ చూడొచ్చు. ఇక అత్యుత్తమ రైలు ప్రయాణమంటే నార్వే దేశానికి వెళ్లాలి. అక్కడ రైలు కంపార్ట్మెంట్లు ఇల్లంత సౌకర్యంగా ఉంటాయి. భోజనం ఏది కావాలంటే అది దొరుకుతుంది. అదొక్కటే కాదు రాత్రి మూడు గంటలకు రైలు అద్దాల్లో నుంచి సూర్యోదయం చూడొచ్చు. ఇలా మరెక్కడ సాధ్యం?’ అంటారు మోనిషా. -
మనల్ని ప్రేమించే జంతువులు
సాధారణంగా మనుషులు అడవులకూ, అడవి ప్రాణులకూ చెడ్డ వార్త. అంతే కాక మనము ఒక దుంగ నుంచి పడిపోయేంత సులువుగా ఉత్పత్తి చెందడానికి తప్ప ఇంకెందుకూ పనికిరానట్టుగా కనిపిస్తాము. కానీ ఈ స్టోరీలో, కొన్ని బతక నేర్చిన ప్రాణులకు మనుషులు వచ్చేదాకా ఇంత మంచి గతి పట్టలేదని రచయిత సంబరం చేసుకుంటున్నారు. వాటి సంఖ్య పెరుగుతూనే ఉన్నందున మనకి కృతజ్ఞత తెలపవలసింది కేవలం కాకులు, ఎలుకలు, బొద్దింకలు మాత్రమే కాదు.చిరుతలు చూడండి. ఎంతో కాలంగా మనం ఈ జంతువులు అడవిలోనే నివసించాలని అనుకున్నాము. “సహజంగా అవి అక్కడ ఉండాల్సినవే ” అంటారు మేధావులు. ఆ చిరుతలు ఏవైనా దురదృష్ట వశాత్తు అడవి బయట కనిపిస్తే “అయ్యోపాపం. తప్పిపోయిందేమో” అనో లేదా “దీనికి అడవిలో ఆహరం దొరకటంలేదేమో” అని మనం అనుకుంటాం. అందుచేత మంచి పౌరుల్లా మనం ఆ ప్రాణుల్ని బంధించి, మనం వాటి మనుగడకి తగినదైనది అనుకున్న అడవిలో దానిని వదిలిపెడతాం.కానీ ఆ జంతువులు తప్పిపోలేదని, మరి అవి పొరపాటున దారితప్పలేదని., ఆ పొలాలే వాటి ఇల్లులని పరిశోధన తెలుపుతోంది. అడవులు లేని చోట అవి చెరుకు పొలాల్లో దాక్కుంటాయి. కోతులూ, జింకలూ వేటడటానికి లేని చోట అవి స్వేచ్ఛగా తిరిగే పశువులనూ, ఊర కుక్కలనూ, అచ్చోసిన పందుల మీద బతుకుతాయి. చిరుతలకు, అడవి జింకను కూడా చూడని, అసల అడవి అంటె ఏమిటో తెలియని ప్రదేశాలు దేశం నలుమూలలా ఉన్నాయి.ఇలాంటి పరిస్థితే భారత దేశంలోని అతి సాధారణంగా కనిపించే మూడు విషసర్పాలది : నాగు పాము, కట్ల పాము ఇంకా రక్తపింజరి. వ్యవసాయ భూముల్లో సమృద్దిగా ధాన్యమే కాక లావుపాటి ఎలుకలు, చుంచులు కూడా ఉంటాయి. చుట్టుపక్కల పొలాలు నీట మునిగినప్పుడు, ఈ ఎలుకలను తినే పాములను తినేలా ఆహారం, ఉండటానికి బోరియలు పుష్కళంగా దొరుకుతాయి. ఈ సమృద్దిగా ఉండే ఎలకలు, చుంచుల మందల పుణ్యమా అని, అడవులలో కంటే వ్యవసాయ భూములలోనే ఈ విషసర్పాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇంకా, ప్రపంచంలోకెల్లా ఎగిరే పక్షులలో పొడుగైన సారస్ క్రేన్ పక్షులు ఉత్తర్ ప్రదేశ్లోని ధాన్యపు పొలాల్లోని, చిత్తడి భూములలోని వాటి గుడ్లు పెట్టి, పిల్లలను పొదుగుతాయి.గత రెండు దశాబ్దాలుగా పశువుల వైద్యం కోసం వాడే నొప్పి నివారిణి అయిన డైక్లోఫెనాక్ రాబందులకు విషపూరితంగా మారి, వాటి సంఖ్య అకస్మాత్తుగా తగ్గిపోయింది. కానీ ఈ విషమస్థితికి ముందు, జంతు కళేబరాలను మనము బహిరంగ స్థలాలలో వదిలేసే అలవాటు ఉండటంవల్ల ఇవి పక్షులు వందలలో కనిపించేవి. రాబందులు జంతు కళేబరాల నుంచి మాంసం నిముషాలలో తీసెయ్యగల అత్యున్నత పరిశుభ్ర మిషన్లు. నగరాలలో మనం చెత్తకుప్పల్లో ఊరకుక్కల్ని చూస్తాం కానీ, వాటి హయామ్ నడిచే రోజుల్లో ఈ ఎగిరే స్కావెంజర్లు ఈ వాసనకొట్టే చెత్త కుప్పల్ని ఏలేవి. నీరు ఉన్న చోట బ్రాహ్మణి గ్రద్దలు, బెంగళూరు మైసూరు వంటి నగరాలలో నల్ల గెద్దలు ఈ పనిని స్వాధీన పరుచుకున్నాయి.ఎంతో వింతగా, ఈ రాబందులు పాల్క్ స్ట్రైట్ దాటి శ్రీలంకలో నివాసం ఏర్పర్చుకోవడానికి మాత్రం ఎప్పుడూ వెళ్ళలేదు. ఒకసారి ఆ దీవి దేశాన్ని సందర్శించినప్పుడు, అక్కడ స్థానికులు సాధారణంగా పరిగణించే ప్రాణులను నేనూ, రోమ్ చూసి ఆశ్చర్యపోయాం. ఊబకాయంతో ఉన్న నీటి మానిటర్ బల్లులు, రాబందుల స్థానాలలో చెత్తకుప్పలపై రాజ్యం ఏలుతున్నాయి. వ్యవసాయ భూముల్లో వృద్ధి చెందుతూ.. రసం నిండిన టమాటాలను నవులూతూ తిరిగే నక్షత్ర తాబేళ్ళు, ప్రపంచంలోకేల్లా కీటకంగా పరిగణించబడే ఏకైక తాబేలు అయివుంటుంది.శ్రీలంకలోని కొద్ది ప్రదేశాలలో మనుషుల కార్యకలాపాలు ఏనుగులకు కూడా లాభించాయి. వర్షాధారితమైన ఒకే పంట వ్యవసాయం, భూమి బీడయినప్పుడు మరల పెరిగే కలుపు మొక్కలు తిని వృద్ధి చెందదానికి ఆ గజాలకు సహాయపడుతుంది. మనిషి సృష్టించిన ఏ దానా భూములే లేకపోతే శ్రీలంక అంత ఎక్కువ ఏనుగుల సంఖ్యను భరించలేకపోయి ఉండేదని పరిశోదకులు చెబుతారు.శ్రీలంకలోని బాగా దక్షిణంగా ఉన్న యాల నేషనల్ పార్క్ చుట్టుపక్కల ఉన్న ఎన్నో నీటి పారుదల చెరువులలో వండలాది మగ్గర్ మొసళ్లు నివసిస్తాయి. ఒకానొక రోజుల్లో ఇక్కడ ధాన్యం పండించిన వారి పూర్వికుల పుణ్యమా అని శ్రీలంకలోని ఈ చిన్ని ప్రదేశం విశాల భారతదేశం మొత్తంలో ఎక్కడా కనిపించనన్ని మొసళ్లకు నిలవు.పై అన్ని ఉదాహరణలలోనూ, జంతు సమూహంతో నిండిన ప్రకృతిని సృష్టించడానికి రైతులు సహనం అనుకోకుండా వారి వ్యవసాయ పద్ధతులతో కలవడం వల్ల జరిగినవే. వానలకీ, శాంక్చ్యువరీలకీ బయట, మరి కాస్త ధ్యాస పెడితే, ఈ జంతువుల మనుగడ కోసం మనిషి మరింత చేయవచ్చు.Author : Janaki Lenin -- జానకి లెనిన్(చదవండి: Frogs: నన్నుఇంటికి తీసుకువెళ్ళు) -
ఆ టైంలో హెల్ప్ అడగడం తప్పుకాదు, మీకోసం మీరు ఏడ్వండి : సారా
వృత్తి జీవితంలో ఆందోళన, ఒత్తిడి మానసిక ఆరోగ్యాన్ని (Mental Health) ప్రభావితం చేస్తుంది. ఇది మొత్తం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి గతంలో అనేకసార్లు చెప్పిన బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ ( Sara Ali Khan) మరోసారి మానసిక ఆరోగ్య సమస్యల గురించి, ఒత్తిడి, చికిత్స లాంటి విషయాలను గురించి మాట్లాడింది. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా సులభం. అని చెప్పిన సారా మానసికంగా ఒత్తిడిలో ఉన్నపుడు సాయం అడగడంలో తప్పు లేదనీ, అది బలహీనతగా భావించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు ఆ సమయంలో మీరు చేయాల్సిందల్లా ఒక క్షణం ఊపిరి పీల్చుకుని, మీకు మీరే భారం తీరే దాకా ఏడ్చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.ట్రోలింగ్, మానసిక ఆరోగ్యంపై దాని ప్రభావంపై గతంలో తన అభిప్రాయాన్ని వెల్లడించిన సారా అలీ ఖాన్ వృత్తి జీవితంలో ఒత్తిళ్లపై తాజాగా మరో ఇంటర్వ్యూలోతన అభిప్రాయాలను అనుభవాన్ని షేర్ చేసింది. మానసిక ఒత్తిడికి లేదా చికిత్స తీసుకోవడం అంటే బలహీనత కాదు, అది వికాసానికి, స్వీయ అవగాహనకు దోహదపడుతుందని చెప్పింది. బలం అంటే భావోద్వేగాలను అణిచివేయడం కాదు, వాటిని అంగీకరించే ధైర్యం కలిగి ఉండటం అని తాను నమ్ముతానని తెలిపింది. తన కరియర్లో ఒత్తిళ్లు తీవ్రంగా ఉంటాయి బలంగా ఉండటానికి ప్రతీదాన్ని మేనేజ్ చేసుకోవాలని తెలిపింది. అంతేకాదు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతపై మాట్లాడుతూ మనస్సును జాగ్రత్తగా చూసుకోవడం ఎంత ముఖ్యమో శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అంతే ముఖ్యమని తనకు అర్థమైందని తెలిపింది.కొన్నిసార్లు ఊపిరి పీల్చుకోవడానికి, మీ శరీరాన్ని కదిలించడానికి, అవసరమైతే ఏడవడానికి లేదా అపరాధ భావన లేకుండా విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించడం అవసరమని సారా పేర్కొంది. నిజంగా ఆ క్షణాలు తన ఫీలింగ్ ఏంటో గ్రహించడంలో సాయపడ్డాయనీ, అనుకున్న దానికంటే బలంగా ఉన్నానని గుర్తు చేశాయని తెలిపింది. వేగాన్ని తగ్గించి, కాస్త నిదానించడం, సహాయం అడగడం అవసరం.. అన్నిసార్లు అన్నీ చేసేయ్యాలని ఏమీ లేదు.. మీరు మీరుగా ఉంటే సరిపోతుందని చెప్పుకొచ్చింది సారా.అలాగే నేటి తరం మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, దాని చుట్టూ ఇప్పటికీ కొన్ని అపోహలున్నాయనీ. మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడటం, చికిత్స తీసుకోవడం చాలా సాధారణంగా జరగాలని ఆమె అభిలషించారు. మరోవైపు సారా ఒత్తిడికి గురైనప్పుడు తక్షణమే తన ఉత్సాహాన్ని పెంచే మార్గం వైపు మొగ్గు చూపుతుంది. తన మూడ్-లిఫ్టర్లలో డ్యాన్సింగ్ ఒకటని చెప్పింది. అలాగే యోగా పైలేట్స్ కు ప్రాధాన్యత ఇస్తుంది. మరో విధంగా చెప్పాలంటే ఆమెకు నృత్యం కేవలం ఫిట్నెస్ కాదు, అదొక చికిత్స.2018లో కేదార్నాథ్తో తన కెరీర్ను ప్రారంభించిన సారాఅలీ ఖాన్, నట జీవితంలో తానేంటే నిరూపించు కుంటూ ముందుకు సాగుతోంది. బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్ , అమృతా సింగ్ల కుమార్తె సారా. -
ఏంటి క్రెడిట్ కార్డుతో గిన్నిస్ రికార్డు? కేవలం ఖర్చే కాదు ఆదాయం కూడా..
సాహసకృత్యాలతోనే కాదు స్మార్ట్గా కూడా గిన్నిస్ రికార్డులు సృష్టించొచ్చని నిరూపించాడు ఈ వ్యక్తి. అందరూ స్మార్ట్ కార్డులు(credit cards) ఖర్చుపెట్టడానికి ఉపయోగిస్తే..ఆయన దాన్ని ఆదాయ వనరుగా మార్చేసుకున్నాడు. అది ఎంతలా అంటే..రోజు మొత్తం క్రెడిట్ కార్డు లేకుండా పని కాదన్నంత రేంజ్లో. అలా ఏకంగా ఎన్ని క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నాడో తెలిస్తే కంగుతింటారు. అంతేకాదండోయ్ అన్నేసి కార్డులు ఉపయోగించడంతో గిన్నిస్ రికార్డుల్లకెక్కాడు కూడా.అతడే మనీష్ ధమేజ్. ఇతడి కథ అత్యంత విచిత్రంగా అనిపించినా..తెలివిగా, స్మార్ట్గా బతకడంలో అందరికి స్ఫూర్తిగా నిలుస్తాడు. ఆయన క్రెడిట్ కార్డులతో ఏప్రిల్ 30, 2021న గినిస్ రికార్డు నెలకొల్పాడు. వాట్ క్రెడిట్ కార్డుతో గిన్నిస్ రికార్డా..? అని విస్తుపోకండి. ఎందుకంటే ఆయన క్రెడిట్ కార్డుని ఖర్చు చేసి.. అప్పలు పాలవ్వలేదు. దాన్ని ఆయన ఎలాంటి అప్పు లేకుండా..మంచి ఆదాయ వనరుగా మార్చేసుకున్నాడు. అలా ఆయన వద్ద మొత్తం 1,638 చెల్లుబాటు అయ్యే క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఆయన రోజు క్రెడిట్ లేకుండా మొదలవ్వదట. అంతలా క్రెడిట్ కార్డులంటే ఇష్టమట. కాంప్లిమెంటరీ, ట్రావెలింగ్ రైల్వే లాంజ్, ఎయిర్పోర్ట్ లాంజ్, ఫుడ్, స్పా, హోటల్ వోచర్లు, కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఫ్లైట్ టిక్కెట్లు, కాంప్లిమెంటరీ షాపింగ్ వోచర్లు, కాంప్లిమెంటరీ సినిమా టిక్కెట్లు, కాంప్లిమెంటరీ గోల్ఫ్ సెషన్లు, కాంప్లిమెంటరీ ఇంధనం ఇలా ఎన్నో క్రెడిట్ కార్డులన్నీ వాడేస్తారట.ప్రతి రివార్డు పాయింట్లను వేస్ట్ చేయకుండా ఉపయోగించేయడంతో.. అవన్నీ అప్పులుగా కాకుండా ఆదాయ వనరుగా మారింది మనీష్కి. ఆ నేపథ్యంలోనే ఆయన వద్ద అంతలా క్రెడిట్ కార్డుల కలెక్షన్ ఉందని గిన్నిస్ వరల్డ్ రికార్డు పేర్కొనడం గమనార్హం. అంతేగాదు 2016లో నోట్ల రద్దు సమయంలో అందరూ డబ్బులు కోసం బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలో నిలబడితే.. ఇతడు మాత్రం క్రెడిట్ కార్డుతో పనికానిచ్చేశాడట. ఆయన బ్యాంకు నగదు కోసం త్వరపడడట. క్రెడిట్ కార్డుల సాయంతో డిజటల్గా డబ్బుని ఖర్చు చేయగలను అని చెబుతున్నారు. ఇక ఆయన విద్యా నేపథ్యం ఏంటంటే..కాన్పూర్ సీఎస్జీఎం విశ్వవిద్యాలయం నుంచి బీసీఏ, లక్నో ఇంటిగ్రల్ విశ్వవిద్యాలయం నుంచి ఎంసీఏ, ఇగ్నో నుంచి సోషల్ వర్క్లో మాస్టర్ డిగ్రీ తదితరాలు పూర్తి చేశారు. ఈయన్ను చూస్తే..సాంకేతికతను వినియోగించుకుంటూ..తెలివిగా ఆర్థిక విషయాలను ప్లాన్ చేస్తే..సాధారణ విషయాలు కూడా అసాధారణంగా మారిపోతాయనేందుకు మనీష్ స్టోరీనే ఉదాహరణ కదూ..!.During India’s 2016 demonetisation, when the country faced a cash shortage, Manish relied on his credit cards and managed his expenses through digital payments with ease. For him, credit cards are more than financial tools. They are a way of life. pic.twitter.com/g7V8Sztl1Z— Fact Point (@FactPoint) October 10, 2025 (చదవండి: ఇదేందీ ఇది.. చనిపోయిన వాళ్లతో జీవించడమా..?! పర్యాటకులు సైతం..) -
ఇండోనేషియా భామతో తమిళ యువకుడి పెళ్లి
అన్నానగర్: తమిళనాడలోని తిరువారూర్ జిల్లాలోని ముత్తు పెట్టి సమీపంలోని కరయంగడు గ్రామానికి చెందిన సోమసుందరం. ఇతని భార్య వాసుకి, వీరి కుమారుడు యోగాదాస్ (30), ఇతను గత పదేళ్లుగా సింగపూర్లోని ఒక ప్రైవేట్ కంపె నీలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఇండోనేషియాలోని అమానుషన్ బరాతకు చెందిన డేని యల్ టీపు-మాతా నియోసన్ థామ్పటి కుమార్తె డయానా టీపు(26) ఒకే కంపెనీలో పనిచేస్తోంది. ఈమె యోగాదాను గత 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకోవాలని ఈ జంట. నిర్ణయించుకున్నారు. తమిళనాడు ఆలయంలో వివాహ వేడుకను నిర్వహించాలని యోగాదాస్ నిర్ణయించుకుని, వివాహ ఆహ్వాన పత్రికను ముద్రించి, బంధువులు, స్నేహితులు, గ్రామ స్తులందరికీ పంచిపెట్టారు. అనుకున్న ప్రకారం ఆదివారం అక్కడి కరై ముత్తు మారియమ్మన్ ఆలయంలో చాలా సరళంగా వివాహం జరిగింది. పట్టు చీర ధరించిన తమిళ మహిళలా కనిపించే డయానా టీషునకు యోగాదాస్ తాళి కట్టాడు. ఈ వేడుకలో బంధువులు, గ్రామ స్తులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.చదవండి: ఫ్యామిలీ కోసం కార్పొరేట్ జీతాన్ని వదులుకుని రిస్క్ చేస్తే..! -
శ్రీకృష్ణుడూ దేవుడే! శ్రీకృష్ణుని శివదీక్ష
శ్రీకృష్ణుడూదేవుడే! పరమశివుడూ దేవుడే! ఇద్దరూ ఘటనాఘటన సమర్థులే! హరిహరులకు భేదం లేదు. ఎవరి ఇష్ట దైవాన్ని వారు పూజించుకుంటూ ఉంటారు. అయితే భక్తులకు వరాలివ్వ గల కృష్ణ పరమాత్మ తానే వరం కోరి శివుని గురించి ఉగ్ర తపస్సు చేయటం విశేషం.కృష్ణుని అష్ట మహిషులలో రుక్మిణి మొదలైన వారికి ప్రద్యుమ్నాదులు జన్మించారు. కానీ, జాంబవతికిసంతానం కలగలేదు. ఆమె దీనంగా కృష్ణుని ప్రార్థిస్తే, కృష్ణుడు పుత్రుని కోసం ఆరునెలలు పాశుపత దీక్షను స్వీకరించి, తీవ్ర తపస్సు చేశాడు. మొదటి నెల రోజులు పళ్ళు భుజించి కృష్ణుడు శివ మంత్రాన్ని పఠించాడు. రెండవ నెలలో జలమే ఆహారంగా ఒంటి కాలి మీద నిలిచి తపస్సు చేశాడు. మూడవ నెలలో వాయుభక్షణ మాత్రమే చేస్తూ, కాలి బొటన వేలు మీద నిలబడి తపస్సు చేశాడు. అలా ఆరునెలలు నిష్ఠగా చేశాక శివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మన్నాడు.అప్పుడు కృష్ణుడు, ‘సంసారంలో బందీనైపోయాను. మాయా పాశాలలో చిక్కుకుపోయాను. నా ఈ తపస్సుకు కూడా ఈ సంసారమే కారణం. పుత్రార్థినై జాంబవతి కోసం సకామంగా తపస్సు చేశాను. మోక్ష ప్రదుడవైన నిన్ను ప్రసన్నుని చేసుకుని ముక్తి నిమ్మని కోరాలి కానీ లౌకికము, అశాశ్వతము అయిన కోరిక కోరుతున్నాను’ అంటాడు. శివుడు ‘నీకు చాలా మంది పుత్రులు కలుగుతారు. గృహస్థాశ్రమంలో చిరకాలం ఉంటావు. గాంధారి శాపం వల్ల, బ్రాహ్మణ శాపం వల్ల నీ వంశం అంతరిస్తుంది. ఇది ఇలాగే జరగవలసి ఉంది’ అని అంటాడు.చదవండి: ఫ్యామిలీ కోసం కార్పొరేట్ జీతాన్ని వదులుకుని రిస్క్ చేస్తే..!ఆకలి, నిద్ర, భయం, శోకం, హర్షం, మరణం ఇవన్నీ మానవ దేహం ధరించిన వారికి తప్పవు. మానుష జన్మలో మానుష లక్షణాలే ఉంటాయి. మాయాశక్తి సర్వులనూ ప్రేరేపిస్తుంది. స్వతంత్రురాలు ఆ జగదీశ్వరి మాత్రమే అని వ్యాసుడు దేవీ మహాత్మ్యాన్ని దేవీ భాగవతంలో చెపుతాడు. ఆ దేవిని నిరంతరం ధ్యానించటం ద్వారా లౌకిక సుఖాల పట్ల కొంతైనా విరక్తి సాధించవచ్చునంటారు పెద్దలు. ఇదీ చదవండి: Diwali 2025: పూజ ఇలా చేస్తే, అమ్మవారి కటాక్షం పూర్తిగా మీకే! – డా. చెంగల్వ రామలక్ష్మి -
గ్రామాల్లో ‘బిగ్’బజార్!
సామాన్య, పేద, మద్యతరగతి ప్రజలకు వారసంతలు బిగ్ మార్ట్లయ్యాయి. మరోవిధంగా చెప్పాలంటే.. ఉన్న ఊరులోకే నడిచే వచ్చే మొబైల్ మార్ట్లుగా మారాయి. ఇక్కడ నిత్యావసరాలు, కూరగాయలు, అల్లం, వెల్లుల్లి, ఉల్లి, మసాలా, కూరగాయల విత్తనాలు, టమాట, వంకాయ, ఉల్లినారు, నువ్వులు, పెసలు, బబ్బెర్లు, అలసందలు, పసుపు, కొన్నిరకాల డిష్వాష్, డిటర్జెంట్ పౌడర్లు, సబ్బులు, చింతపండు, కారప్పొడి, ఎండు మిరపకాయలు, టీ పైడర్ ఇలా ఒక్కటేమిటీ.. అన్నిరకాల దుస్తులూ చవకగా లభిస్తున్నాయి. గతంలో మండల కేంద్రాల్లోనే జరిగే వారసంతలు ఇప్పుడు పల్లెలకూ విస్తరిస్తున్నాయి. ఒక్కో గ్రామ పంచాయతీకి సుమారు నాలుగు వరకు అనుబంధ గ్రామాలు ఉంటున్నాయి. మండల కేంద్రాల్లో నిర్వహించే వారసంతలో తెలంగాణ రాష్ట్రంలోని గోదావరిఖని, వరంగల్, జమ్మికుంట, పరకాల, పెద్దపల్లి, కరీంనగర్ తదితర దూర ప్రాంతాల నుంచి పలువురు వ్యాపారులు వచ్చి దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. ఊరూరా మొబైల్ మార్ట్లు.. సామాన్య పేద, మధ్య తరగతి ప్రజలకు మొబైల్ మార్ట్లుగా రూపాంతరం చెందిన వారసంతలు.. ఇప్పుడు ఒక్కోగ్రామంలో ఒక్కోవారం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. అటు వినియోగదారులకు, ఇటు చిరువ్యాపారులకు ఇవిఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వ్యాపారులకు ఉపాధి, వినియోగదారులకు బడ్జెట్ ధరల్లోనే అవసరమైన సరుకులు లభ్య మవుతున్నాయి. పంచాయతీలకూ ఆదాయం ఆయా గ్రామాల్లో నిర్వహించే వారసంత(మొబైల్ మార్ట్)ల ద్వారా గ్రామ పంచాయతీలకు ఆదాయం కూడా సమకూరుతోంది. ఒక్కో దుకాణ నిర్వాహకుడి(చిరు వ్యాపారి) నుంచి కనీసం రూ.20 నుంచి రూ.100 వరకు రుసుం వసూలు చేస్తున్నారు గ్రామపంచాయతీ సిబ్బంది. చాలామందికి ఉసాధి వారసంతలో వ్యాపారుల నుంచి నిర్వహణ రుసుం(చిట్టి) వసూలు చేసుకునేందుకు గ్రామానికి చెందిన పలువురు వ్యాపారులు.. ఏడాదిపాటు అనుమతి కోసం రూ.30 వేల నుంచి రూ.50వేల వరకు బహిరంగ వేలం ద్వారా అనుమతి పొందుతున్నారు. ఇలా జిల్లావ్యాప్తంగా సుమారు 600 మందికిపైగా ఉపాధి పొందుతున్నారు.(చదవండి: దీపావళి కానుకగా రూ. 2 లక్షల నగదు..!) -
దీపావళి కానుకగా రూ. 2 లక్షల నగదు..!
పండుగ సమీపిస్తున్న వేళ ఎప్పుడో దాచిన డబ్బు అనుకోకుండా బయటపడితే..ఆ సంతోషమే వేరేలెవల్. అందులోనూ దీపావళి అంటే మహాలక్ష్మీదేవి పండుగ..అమ్మ ముందుగానే ఇలా కనక వర్షం కురిపిస్తే..ఆ సంతోషం మాటలకందనిది. అలాంటి ఆనందంలోనే తడిసిముద్దవుతోంది ఈ కుటుంబం.దీపావళి పండుగ సమయం అని ఇల్లంతా క్లీన్ చేస్తుండగా..ఎప్పుడో దాచిన డబ్బులు బయటపడ్డాయి. ఆ సంగతే మర్చిపోయింది ఆ ఫ్యామిలీ. అనుకోకుండా పండుగ నేపథ్యంలో ఇల్లు శుభ్రం చేస్తుండగా పాత డీటీహెచ్ బాక్స్లో దాచిన సొత్తు బయటపడింది. దగ్గర దగ్గర రెండు లక్షలు ఉండటంతో ఆ కుంటుంబం సంతోషానికి అవధులే లేకుండా పోయింది. "మహాలక్ష్మీ ముందుగానే మమ్మల్ని కటాక్షించింది. ఇది దీపావళి పండుగ ఆశీర్వాదమే అంటూ పట్టరాని ఆనందంతో ఉబ్బితబ్బిబవ్వుతోంది ఆ కుటుంబం". అయితే అందులో ఉన్నవన్నీ రూ. 2 వేలు నోట్లు కావడం గమనార్హం. బహుశా ఈ డబ్బుని మా నాన్నగారు నోట్లు రద్దు చేయకమునుపు దాచి ఉంచి ఉండొచ్చుని..ఆయనకి ఈ సంగతి ఇంకా తెలియదంటూ రెడ్డిట్లో ఈ సంగతిని షేర్ చేయడంతో నెట్టింట ఈ విషయం వైరల్గా మారింది. అయితే నెటిజన్లు తక్షణమే ఆ నోట్లను మార్చుకోండి. ఆర్బీఐని సంప్రదించే మందు ఆ డబ్బు ఎక్కడిది ఇప్పుడే ఎందుకు మార్చాల్సి వచ్చిందో తెలియజేయాలన్న విషయం మర్చిపోకండి బీకేర్ఫుల్ అని సూచిస్తూ పోస్టులు పెట్టారు. కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మే 19, 2023న చలామణి నుంచి రూ.2000 డినామినేషన్ నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ నెల ప్రారంభంలో విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం, రూ.5,884 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు ఇప్పటికీ చెలామణిలో ఉన్నాట్లు సమాచారం.(చదవండి: ఇదేందీ ఇది.. చనిపోయిన వాళ్లతో జీవించడమా..?! పర్యాటకులు సైతం..) -
ఫ్యామిలీ కోసం కార్పొరేట్ జీతాన్ని వదులుకుని రిస్క్ చేస్తే..!
సాధారణంగా కనీస ఆదాయం కోసం, లేదా ఉన్న ఉద్యోగానికి తోడుగా, కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు డెలివరీ బాయ్గానో, క్యాబ్ డ్రైవర్లగానో పార్ట్ టైం పనిచేసే వాళ్లను చూసి ఉంటాం. కానీ కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి మరీ ఉబెర్ డ్రైవర్గా పని చేస్తూ సక్సెస్ సాధించిన వైనం నెట్టింట స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. అసలు కార్పొరేట్ ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశాడు, అతని ఆదాయం ప్రస్తుతం ఎంత? పదండి ఈ వివరాలన్నీ తెలుసుకుందాం.బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త వరుణ్ అగర్వాల్ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీని ప్రకారం దీపేష్ కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేశాడు. కార్పొరేట్ జీవితం, జీతం కంటే తన ఫ్యామిలీ లైఫే ముఖ్యమని భావించిన ఈ నిర్ణయం తీసుకున్నాడు. గతంలో రిలయన్స్ రిటైల్ లో పని చేసిన దీపేష్ అతను తన పని-జీవిత సమతుల్యతను మెరుగు పరుచు కోవడానికి ఉబెర్ డ్రైవర్ అయ్యాడు. రిలయన్స్ రిటైల్లో తన కెరీర్ను ప్రారంభించి ఎనిమిదేళ్లు పనిచేశాడు. నెలకు రూ. 40వేల జీతం. కానీ స్థిరమైన ఉద్యోగం , మంచి జీతం, కానీ ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్, వర్క్ లైఫ్ బాలెన్స్ లేకపోవడం ఇబ్బంది పెట్టింది. ముఖ్యంగా తన భార్యా పిల్లలతో సమయం గడపలేకపోతున్నానని గ్రహించాడు. అంతేకాదు ఉద్యోగాన్ని వదిలి వేసి ఫుల్ టైం డ్రైవర్గా మారాలన్ని సాహసం చేశాడు.కట్ చేస్తే అతని నెల ఆదాయం ఇపుడు రూ. 50 వేలు. పైగా నెలకు 21 రోజులు మాత్రమే పని. మొత్తానికి ధైర్యం చేసి తాను కోరుకున్న జీవితాన్ని సాధించాడు అంటూ వరుణ్ అగర్వాల్ ఈ స్టోరీని షేర్ చేశారు..అంతేకాకుండా, క్రమశిక్షణతో కూడిన పొదుపు ద్వారా, దీపేష్ మరో కారు కొన్నాడు. మరో డ్రైవర్ను నియమించుకున్నాడు. అంటే తన కాళ్ల మీద తానే నిలబడటమే కాదు మరొకరికి ఉపాధిని కల్పించడం విశేషం. జీవితంలో ముందుగా సాగాలంటే కొన్నిసార్లు రిస్క్ తీసుకోక తప్పదు అంటూ దీపేష్ సక్సెస్ సాధించిన తీరును ప్రశంసించారు వరుణ్. చదవండి: Diwali 2025: పూజ ఇలా చేస్తే, అమ్మవారి కటాక్షం పూర్తిగా మీకే!నెటిజన్ల రియాక్షన్స్దీపేష్ నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ప్రాధాన్యతలను గుర్తించడం,, రిస్క్ తీసుకోవడం చాలా అవసరం. ఒక్క మెట్టు దిగినా పరవాలేదు.. దిల్ ఉంటే..కష్టపడితే అదే పెద్ద ప్రమోషన్ అని వ్యాఖ్యానించారు. మరిన్ని విజయాలు సాధించాలి అంటూ దీపేష్కు శుభాకాంక్షలు తెలిపారు. ఇదీ చదవండి: Down's syndrome పుట్టకముందే నిర్ధారణఎలా...? -
ఇదేందీ ఇది.. చనిపోయిన వాళ్లతో జీవించడమా..?! పర్యాటకులు సైతం..
కొన్ని దేశాల్లో ఉండే ఆచారాలు ఎంతలా వింతగా ఉంటాయంటే..వినడానికి నమ్మశక్యం కానంతగా ఉంటాయి. ఇవేమి పద్ధతులు..ఎందుకిలా అని ఆరా తీసినా..వాటి వివరణ సైతం నోరెళ్లబెట్టేలా ఉంటుంది. అచ్చం అలాంటి విచిత్రమైన సంస్కృతే ఇండోనేషియాలోని ఓ తెగ ఆచరిస్తుంది. ఆ కారణంగానే వార్తల్లో నిలిచింది కూడా. అంతేకాదండోయ్ దాన్ని చూసేందుకు పర్యాటకులు సైతం ఎగబడుతున్నారు. పైగా అలాంటి థ్రిల్ కావలంటూ.. మరి వస్తున్నారట టూరిస్టులు. మరి ఇంతకీ అంతలా ఆశ్చర్యపరిచే ఆ ఆచారం కథాకమామీషు ఏంటో సవివరంగా తెలుసుకుందామా..!.కుటుంబంలో ఎవ్వరైన చనిపోతే అంత్యక్రియలు నిర్వహిస్తారు..ఆ తర్వాత జరిగే కార్యక్రమాలు వారి వర్గాల నేపథ్యం అనుసరించి పదకొండు అంతకు మించిన రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇది అత్యంత సర్వసాధారణం. కానీ ఇండోనేషియాలోని దక్షిణ సులవేసి ప్రావిన్స్లోనే తానా తోరాజా అనే గిరిజన తెగ మాత్రం అలాచేయరు. చనిపోయిన వారిని మమ్మీలుగా మార్చి వాటితో జీవిస్తారట. అంత్యక్రియలకు కావల్సినంత సొమ్ము సమకూరాక గానీ నిర్వహించరట. పైగా ఆ వారి పూర్వీకుల శవాలను ఎంతో భద్రంగా చూసుకుంటారట. కొత్తబట్టలు తొడిగి, ఆహారాలను కూడా నివేదిస్తారట. వారి కుటుంబంలోకి కొత్తగా వచ్చిన తరాలకు వీటని చూపించి..ప్రతి రెండేళ్లకు ఒకసారి ఆ మమ్మీలను బయటకు తీసి..కొత్త బట్టలు వేయడం, ఆహారం నివేదించడం వంటివి చేస్తారట. ఎందుకిలా అంటే..అక్కడ అంత్యక్రియల తంతు చాలా ఖర్చుతో కూడుకున్నదట. అందువల్ల వారికి వాటిని ఖననం చేయడాని సంత్సరాల తరబడి సమయం పడుతుందట. ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఒక ట్రావెలర్ దీని గురించి ఆరా తీయగా.. అందుకు ఏకంగా రూ.4 కోట్లు పైనే ఖర్చు అవుతుందని చెప్పారట ఆ తెగ ప్రజలు. వాళ్లకి అంత్యక్రియలనేవి వేడుకలాంటివట. ఈ తంతు ఐదురోజుల జరుగుతుందట. పైగా ఆ కుటుంట సభ్యుల సంఖ్యను అనుసరించి అంతే సంఖ్యలో గెదెలను, పందులను బలి ఇవ్వాలి. అలాగే వందలాది మంది అతిథులకు ఆతిథ్యం ఇవ్వాలి. దీంతోపాటు చనిపోయిన వారికి ఒక కొత్త స్థలంలో గుడిసెను నిర్మించి అందులో దహన సంస్కారాలు నిర్వహిస్తారట. అందువల్ల అంత డబ్బు సమకూరేంత వరకు వాటిని మమ్మీలుగా మార్చి జాగ్రత్తగా సంరక్షిస్తారట ఆ తెగ ప్రజలు. అప్పటి వరకు ఆ కుటుంబ సభ్యులంతా ఆ శవాలతోనే జీవిస్తారు. చెప్పాలంటే..వాళ్లు తమతో ఉన్నట్లుగానే వాళ్లు వ్యవహరిస్తారట. కాగా, ఇటీవల ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ శరణ్య అయ్యర్ ఇండోనేషియా గ్రామాన్ని సందర్శించి..అక్కడ సంస్కృతిని వీడియో రూపంలో నెట్టింట షేర్ చేయడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఆమె తానా తోరాజా ఏజెన్సీ సందర్శించి చనిపోయిన వారి మద్య జీవించడం, వారితో కలిసి ఉండటం వంటి థ్రిల్లింగ్ అనుభవాన్ని పొందానని పోస్ట్లో వివరించింది. అంతేగాదు ఈ ప్రత్యేకమైన సంస్కృతిని తిలకించేందుకే పర్యాటకులు ఇక్కడకు తండోపతండాలు తరలి వస్తుంటారని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Sharanya Iyer 🇮🇳 | Travel (@trulynomadly) (చదవండి: ఇటలీలో డీజే ఫెస్టివల్లో మారుమ్రోగిన శివ తాండవస్త్రోతం..!) -
'శివ తాండవ స్తోత్రం'తో మారుమ్రోగిన ఇటలీ ..!
మన దేశంలో ఏ పండుగ లేదా ఏదైనా వివాహ ఆచారంలో దేవుడి పాటలతో ఆధ్యాత్మికానుభూతి పొందడం అత్యంత సహజం. కానీ ఇలాంటి దైవిక పాటలు పాశ్చాత్య దేశాల్లో అందులోనూ యూరోపియన దేశమైన ఇటలీలో ప్లేచేస్తే..ఔను మీరు వింటుంది నిజమే..అక్కడ ఈ పాటతో అందరూ ఒక విధమైన తన్మయత్వంతో ఊగిపోయారు. అంతేగాదు ఈపాట వైబ్ అక్క ప్రజలను ఓ ఊపు ఊపేసింది. వెస్ట్రన్ కల్చర్తో విభన్నంగా ఉండే మ్యూజిక్ ఫెస్ట్వెల్ ఈ ఘటన చోటుచేసుకోవడం మరింత విశేషం. అసలేం జరిగిందంటే..ఇటలీలో జరిగిన ఒక మ్యూజిక్ వేడుకలో ఒక మహిళా డీజే శివతాండవ స్తోత్రాన్ని ఎలక్ట్రానిక్ డ్యాన్ మ్యూజిక్(ఈడీఎం) ట్రాక్గా ప్లే చేసి అందరిన్ని ఆశ్చర్యపరిచింది. అయితే ఆ సాంగ్ పవర్కో మరేమో గానీ అక్కడి ప్రజలు ఒక విధమైన ఎనర్జీతో ఊగిపోయారు. ఆ పాటకు లయబద్ధంగా డ్యాన్స్చేస్తూ ఆసక్తి కనబర్చడం విశేషం. కూడా ఈ పాట జోష్కి మమైకమైపోతూ చిందులేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారి చర్చనీయాంశంగా మారింది. ఇదేంటి విదేశాల్లో మన శివుడి భక్తిపాట అని విస్తుపోయారు. అయితే నెటిజన్లు కొందరూ భక్తిపాటలు ఇలా ప్లే చేయొచ్చా అని ఆగ్రహం వ్యక్తం చేయగా..శివుడిని అర్థం చేసుకున్నవారు, శివుడు తత్వం తెలుసకున్నావారికి ఇది కచ్చితంగా నచ్చుతుంది అని కౌంటరిస్తూ పోస్టులు పెట్టారు. రావణుడి బ్రహ్మ పాడిన ఈ పాట విదేశీ శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేయడమే గాక, భారతదేశంలోని భక్తి పారవశ్యంతో కూడిన సంగీతం పవర్ ఏంటో నొక్కి చెప్పింది కదూ..!. View this post on Instagram A post shared by Times Now (@timesnow) (చదవండి: Man Name Makes Record: 'పేరు'తో ప్రపంచ రికార్డు..! ఏకంగా చట్టంలోనే మార్పులు చేసి..) -
డౌన్స్ సిండ్రోమ్లో ఇన్ని రకాలున్నాయా? చికిత్స ఎలా?
మనిషిలో ఉండాల్సిన 46 (అంటే ఇరవైమూడు జతల) క్రోమోజోములకు బదులుగా... ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఈ సంఖ్య కాస్తా 47కు చేరితే... అప్పుడు ఆ బిడ్డలో కనిపించే రుగ్మత పేరే ‘డౌన్స్ సిండ్రోమ్’. అంటే... ఇందులో 21వ క్రోమోజోము తాలూకు ‘కాపీ’ ఒకటి అదనంగా ఏర్పడుతుంది. ఫలితంగా 46 క్రోమోజోములు కాస్తా 47గా మారి΄ోతాయి. ఇలా జరిగినప్పుడు అలా పుట్టిన పిల్లలకు కొన్ని మానసికమైన లోపాలు కనిపిస్తుంటాయి. ఇంగ్లాండుకు చెందిన ఫిజీషియన్ జాన్ లాంగ్డన్ డౌన్ ఈ కండిషన్ను కనుగొన్నారు. దాంతో ఈ మెడికల్ కండిషన్కు ఆయన పేరిట ‘డౌన్స్’ సిండ్రోమ్గా పేరు పెట్టారు.ఇందులోనూ కొన్ని రకాలు ఉన్నాయి. ఉదాహరణకు డౌన్స్ సిండ్రోమ్లో రకాలు...ట్రైజోమీ: రెండు జతలుగా ఉండాల్సిన 21వ క్రోమోజోమ్కు మరొకటి అదనంగా చేరడం వల్ల కలిగే కండిషన్. డౌన్స్ సిండ్రోమ్తో బాధపడేవారిలో 94 శాతం మందిలో సాధారణంగా ఈ కండిషనే ఉంటుంది. దీన్ని ‘ట్రైజోమీ’ అంటారు. ట్రాన్స్లొకేషన్ : 21వ క్రోమోజోమ్ నుంచి ఒక ముక్క విడివడి అది వేరే క్రోమోజోమ్కు అంటుకోవడాన్ని ట్రాన్స్ లొకేషన్ అంటారు. ఈ తరహా కారణంతో డౌన్స్ సిండ్రోమ్ రావడం మరో 4 శాతం మందిలో కనిపిస్తుంది. మోసోయిజమ్ : ఇది కేవలం 2 శాతం మందిలోనే ఉండే అరుదైన పరిస్థితి. ఇది పై రెండు విధాల కంటే భిన్నంగా ఉంటుంది. డౌన్స్ సిండ్రోమ్ పిల్లల్లో కనిపించే లోపాలు...సాధారణంగా డౌన్స్ సిండ్రోమ్తో పుట్టిన పిల్లల్లో కొన్ని శారీరక, మానసిక లో΄ాలు కనిపిస్తాయి. వాటిలో ముఖ్యమైనవి ఇవి.. కండరాల పటుత్వం తగ్గి పుట్టడం. మెడ వెనక భాగంలో దళసరి చర్మం ఉండటంముక్కు చప్పిడిగా ఉండటం (ఫ్లాటెన్డ్ నోస్), పుర్రెలోని ఎముకల మధ్య ఖాళీలు కాస్త ఎక్కువగా ఉండటంసాధారణంగా మన అరచేతిలో పైన రెండు గీతలు ఉంటాయి. కానీ డౌన్స్ సిండ్రోమ్ ఉన్నవారి అరచేతిలో ఒకటే గీత ఉంటుంది (సిమియన్ క్రీస్)చెవి డొప్పలు (ఇయర్ పిన్నా) చిన్నవిగా ఉండటం నోరు చిన్నదిగా ఉండటం ∙కళ్లు పైవైపునకు తిరిగినట్టుగా ఉండటం చేయి వెడల్పుగా, చేతి వేళ్లు పొట్టిగా ఉండటం కంట్లోని నల్లగుడ్డులో తెల్లమచ్చలు (బ్రష్ఫీల్డ్ స్పాట్స్) ఉండటం. మిగతావారితో పోలిస్తే తల కాస్త తక్కువ సైజులో ఉండటం. చూడగానే తల ఆకృతిలో ఏదో మార్పు (అబ్నార్మాలిటీ) ఉన్నట్లు కనిపించడం. పిల్లలు పెద్దగా ఎత్తు పెరగకపోవడం మానసిక వికాసం కాస్త ఆలస్యంగా జరుగుతుండటం. వీటితో పాటు మరికొన్ని అదనపుఆరోగ్య సమస్యలూఉండవచ్చు. అవి...గుండెకు సంబంధించిన లోపాలు కనిపించవచ్చు. అంటే గుండె గదుల్లో పై గదుల మధ్య గోడలో లోపం (ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్) గాని, కింది గదుల మధ్య గోడలో లోపం (వెంట్రిక్యులార్ సెప్టల్ డిఫెక్ట్)గాని ఉండేందుకు అవకాశాలెక్కువ. ఈ పిల్లల్లో మతిమరపు ఎక్కువగా కనిపించవచ్చు. కాటరాక్ట్ కంటి సమస్యలు రావడం. జీర్ణకోశ వ్యవస్థలో అడ్డంకులు/సమస్యలు (డియొడినల్ అట్రీసియా) తుంటి ఎముక తన స్థానం నుంచి తొలగిపోవడం (హిప్ డిస్లొకేషన్), మలబద్దకం హైపోథైరాయిడిజమ్ వంటి శారీరక సమస్యలు రావచ్చు. డౌన్స్ సిండ్రోమ్ ఉంటే క్రమం తప్పకుండా చేయించాల్సిన పరీక్షలు...డౌన్స్ సిండ్రోమ్ ఉన్న పిల్లలకు క్రమం తప్పకుండా కొన్ని వైద్య పరీక్షలు చేయిస్తూ ఉండాలి. అవి... చిన్నతనంలో ప్రతి ఏడాదిలో కనీసం ఒకసారి కంటి పరీక్షలు చేయించాలి ప్రతి 6 నుంచి 12 నెలలకు ఒకసారి చెవి పరీక్షలు చేయించాలి. (పిల్లవాడి వయసును బట్టి ఆరు నెలలకొకసారి చేయించాలా లేదా 12 నెలలకు ఒకసారా అన్న వ్యవధిని డాక్టర్లు నిర్ణయిస్తారు) ప్రతి ఆర్నెల్లకోసారి దంతాల పరీక్షలు ∙ప్రతి 3 నుంచి 5 ఏళ్లకు ఒకసారి ఛాతీ, మెడ భాగాన్ని ఎక్స్–రే పరీక్ష తీసి పరీక్షిస్తూ ఉండాలి అమ్మాయిల్లో యుక్త వయసు రాగానే లేదా 21 ఏళ్ల వయసులోగాని పాప్ స్మియర్ పరీక్ష చేయించాలి ప్రతి 12 నెలలకోసారి థైరాయిడ్ పరీక్ష చేయిస్తూ ఉండాలి. ఇదీ చదవండి: Down's syndrome పుట్టకముందే నిర్ధారణఎలా...?ఈ పరీక్షలన్నీ సంయుక్తంగా... డౌన్స్ సిండ్రోమ్ నిర్ధారణ కోసం పైన పేర్కొన్న రక్తపరీక్షలు, అల్ట్రా సౌండ్ పరీక్షలను ఒక పద్దతి ప్రకారం అన్నీ సంయుక్తంగా చేస్తుంటారు. రక్త పరీక్షల్లో రక్తనమూనాలను సేకరించి వాటిలో కొన్ని నిర్దిష్టమైన ప్రొటీన్లను, హార్మోన్లను పరిశీలిస్తారు. ఇలా కొన్ని రకాల ప్రోటీన్లు, హార్మోన్ల మోతాదులు సాధారణ విలువల కంటే ఎక్కువగా ఉంటే.. ఆ మార్కర్స్ను బట్టి అది డౌన్స్ సిండ్రోమ్స్కు సూచికలు కావచ్చంటూ అనుమానిస్తారు. ముందుగా చెప్పినట్లుగా ఇవన్నీ ముందస్తుగా అంచనా తెలిసిందేకు చేసే పరీక్షలు. ఈ పరీక్షలు చాలావరకు కరెక్ట్గానే విషయాన్ని ముందే తెలుపుతాయి. అయితే అతడికి డౌన్స్ సిండ్రోమ్ ఉందన్న విషయం బిడ్డ పుట్టాక మాత్రమే నూరు శాతం తెలుస్తుందని గుర్తుంచుకోవాలి. చికిత్సఇది క్రోమోజోముల తేడా వల్ల వచ్చిన కండిషన్ కావడంతో దీనికి చికిత్స లేదు. అయితే ఇలా పుట్టిన పిల్లలను మామూలు పిల్లల్ల పెంచడానికి ఫిజియోథెరపిస్ట్, భాషను చక్కదిద్దడం, చక్కగా వచ్చేల చేయడానికి సహాయపడే లాంగ్వేజ్/స్పీచ్ థెరపిస్ట్, పెద్దయ్యాక వారు స్వతంత్రంగా బతికేలా తోడ్పడేందుకు ఆక్యుపేషనల్ థెరపిస్ట్లూ, మంచి ఆహారాన్ని అందించేందుకు డైటీషియన్, వినికిడి సమస్యల పరిష్కారానికి ఆడియాలజిస్ట్, కంటి సమస్యలను చక్కదిద్దడానికి ఆఫ్తాల్మాలజిస్ట్, పిల్లల వైద్య నిపుణుడు, గుండె వైద్య నిపుణుల సహాయం... ఇలా ఇంతమంది నిపుణుల సహాయం అవసరమవుతూ ఉంటుంది. డా. శివనారాయణ రెడ్డి వెన్నపూససీనియర్ నియోనేటాలజిస్ట్ – పీడియాట్రీషియన్ నిర్వహణ : యాసీన్ -
లేట్ ప్రెగ్నెన్సీ.. డౌన్స్ సిండ్రోమ్, పుట్టకముందే నిర్ధారణఎలా...?
మహిళల్లో గర్భధారణ ఆలస్యమవుతున్న కొద్దీ పుట్టబోయే బిడ్డలో కొన్ని మానసిక, శారీరక సమస్యలు వచ్చే అవకాశాలూ పెరుగుతూ పోతాయి. ఆరోగ్యకరమైన బిడ్డ కావాలనుకునేవాళ్లు త్వరగా బిడ్డను కనేలా ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ ఉద్యోగరీత్యా లేదా లైఫ్లో సెటిల్ అవ్వడంలో ఆలస్యమైనవాళ్లు... లేట్గా బిడ్డను ప్లాన్ చేసుకోవాలనుకునేవారు... లేదా కారణాలు ఏవైనా లేటు వయసులో గర్భధారణ కోరుకునే పరిస్థితి వచ్చినవాళ్లు కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవడం మేలు. లేట్ వయసులో గర్భధారణ జరిగితే ఆ బిడ్డ ‘డౌన్స్ సిండ్రోమ్’ (Down's syndrome)తో పుట్టేందుకు అవకాశాలు ఎక్కువ. అందుకే లేట్ వయసులో గర్భధారణను ప్లాన్ చేసుకున్నవారు... డౌన్స్ సిండ్రోమ్ ముప్పును నివారించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే కథనం.ఈ భూమ్మీద పుట్టిన ప్రతి ప్రజాతి (స్పీసీస్)కి చెందిన ప్రతి జీవికీ నిర్దిష్టమైన క్రోమోజోముల సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్యను బట్టే ఆ జీవి ఏమిటన్నది నిర్ణయమవుతుంది. మనిషిలోని క్రోమోజోముల సంఖ్య 46. అందుకే ప్రత్యుత్పత్తి జరగడానికి వీలుగా... పురుషుడి వీర్యకణంలో 23, మహిళలోని అండంలో 23 క్రోమోజోములుంటాయి. వీర్యకణం... అండంతో కలిసినప్పుడు ఈ 23 జతలు కలుసుకుని 46 క్రోమోజోములతో కొత్త బిడ్డ పుట్టేలా ప్రకృతి ఏర్పాటు చేస్తుంది. మనిషి విషయంలోలాగే... ప్రతి జీవిలోనూ ఇదే జరుగుతుంది. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల ఈ క్రోమోజోముల సంఖ్యలో మార్పు వస్తే...? అది సహజమూ, స్వాభావికమూ కాదు. అలా ఉండవలసిన క్రోమోజోముల కంటే ఎక్కువగానో లేదా తక్కువగానో ఉంటే పుట్టిన బిడ్డలో కొన్ని అసాధారణమైన రుగ్మతలు కనిపిస్తాయి. గర్భధారణ లేట్ అయిన కొద్దీపెరుగుతుండే డౌన్స్ సిండ్రోమ్ రిస్క్! వివాహాన్ని ఆలస్యం చేస్తూ, దానివల్ల గర్భధారణ కూడా ఆలస్యంగా జరగడం వల్ల కలిగే దుష్పరిమాణం ఇది. మహిళ వయసు పెరుగుతూ ఎంత ఆలస్యంగా గర్భధారణ జరుగుతుంటే... డౌన్స్ సిండ్రోమ్ వచ్చే ముప్పు అంతగా పెరుగుతుంది. అందుకే మహిళలు తమ గర్భధారణను 35 ఏళ్లకు ముందుగానే జరిగేలా చూసుకోవడం మేలు. వివాహాన్ని ఆలస్యం చేస్తూ, దానివల్ల గర్భధారణ కూడా ఆలస్యంగా జరగడం వల్ల కలిగే దుష్పరిమాణం ఇది. మహిళ వయసు పెరుగుతూ ఎంత ఆలస్యంగా గర్భధారణ జరుగుతుంటే... డౌన్స్ సిండ్రోమ్ వచ్చే ముప్పు అంతగా పెరుగుతుంది. అందుకే మహిళలు తమ గర్భధారణను 35 ఏళ్లకు ముందుగానే జరిగేలా చూసుకోవడం మేలు. పుట్టకముందే నిర్ధారణఎలా...? వివాహం ఆలస్యంగా చేసుకోవడమో లేదా ఏదైనా కారణాల వల్ల ఆలస్యంగా పిల్లల్ని కనేలా ప్తిన్ చేసుకోవడమో జరిగితే ఆ దంపతులు... పుట్టబోయే చిన్నారిలో డౌన్స్ సిండ్రోమ్ కండిషన్ వచ్చేందుకు అవకాశాలెలా ఉన్నాయనే విషయాన్ని తెలుసుకునేందుకు కొన్ని రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఆ పరీక్షల సహాయంతో ముప్పును చాలావరకు ముందుగానే తెలుసుకోవచ్చు. ఇందుకు కొన్ని రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. (అయితే ఈ పరీక్షలు చాలావరకు ఖచ్చితమైన సమాచారాన్నే అందిస్తాయి. కానీ పూర్తి నిర్ధారణ బిడ్డ పుట్టిన తర్వాతే అవుతుందని కాబోయే తల్లిదండ్రులు గుర్తించాలి. స్క్రీనింగ్ పరీక్షలు ఆ పరీక్షలేమిటో చూద్దాం...∙ఈ పరీక్షల్లో చాలా ప్రాచుర్యం ఉన్నది ‘ట్రిపుల్ స్క్రీన్’ అనే పరీక్ష. ఇందులో మూడు రకాలైన పరీక్షలను కలగలిపి ట్రిపుల్ స్క్రీన్ అంటారు. ఈ పరీక్షల్లో రక్తంలోని కొన్ని అంశాల విలువలను మూడుసార్లు పరీక్షించి సరిపోల్చి డౌన్స్ సిండ్రోమ్ వచ్చే అవకాశాన్ని నిర్ధారణ చేస్తారు. ఈ పరీక్షను గర్భవతికి గర్భధారణ జరిగిన 15వ వారం నుంచి 20వ వారం మధ్యలో నిర్వహిస్తారు.∙అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు : మిగతా పరీక్షలతో పాటు అల్ట్రా సౌండ్ స్కాన్ చేస్తూ... బిడ్డ ఎదుగుదలలో మార్పులను పరిశీలిస్తుంటారు. ఈ పరీక్ష వల్ల బిడ్డ తాలూకు భౌతికమైన అంశాలు (ఫిజికల్ ఫీచర్స్) ఎలా ఉన్నాయో తెలుస్తాయి. తరచూ స్కాన్ చేయిస్తూ... ఆ స్కాన్ ఫలితాలను డౌన్స్ సిండ్రోమ్ లక్షణాలతో సరి΄ోలుస్తూ తరచూ పరిశీలిస్తూ ఉంటారు. డయాగ్నస్టిక్ పరీక్షలు (నిర్ధారణకోసం) గర్భధారణ జరిగాక 12 నుంచి 20వ వారాల మధ్య సమయంలో గర్భసంచి నుంచి ఉమ్మనీరు తీసి ‘అమ్నియోసెంటైసిస్’ అనే పరీక్షనిర్వహిస్తారు ∙ గర్భధారణ సమయంలోని 8వ వారం నుంచి 12వ వారం వరకు ‘కోరియానిక్ విల్లస్ శాంప్లింగ్’ అనే పరీక్ష చేస్తారు గర్భధారణ సమయంలోని 20వ వారంలో ‘పర్క్యుటేనియస్ అంబిలికల్ బ్లడ్ శాంప్లింగ్’ అనే పరీక్ష చేస్తారు. అలాగే అల్ట్రాసౌండ్ స్కానింగ్లోనూ ఒక ప్రత్యేకమైన స్కానింగ్ పరీక్షను చేస్తారు. ఈ పరీక్షకే ‘న్యూకల్ ట్రాన్స్లుయెన్సీ’ (ఎన్టీ) పరీక్షగా అని పేరు. ఇందులో బిడ్డ మెడ వెనకభాగంలోని చర్మం వెనక ఉన్న ఉమ్మనీటిని పరీక్షిస్తారు. సాధారణంగా డౌన్స్ సిండ్రోమ్ ఉన్న బిడ్డలకు ఈ నీటి మందం ఎక్కువగా ఉంటుంది. దీన్ని బట్టి పుట్టబోయే బిడ్డకు డౌన్స్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలను అంచనా వేస్తారు. ఇక కోరియానిక్ విల్లస్ శాంప్లింగ్ (సీవీఎస్) పరీక్ష లేదా ఉమ్మనీటిని తీసి చేసే పరీక్షల ద్వారా గర్భస్త శిశువు దశలోనే పుట్టబోయే బిడ్డకు ఏవైనా ఆరోగ్య సమస్యలున్నాయా అన్న విషయమూ తెలుస్తుంది. డౌన్స్ సిండ్రోమ్ నిర్ధారణ పరీక్షలివి... కోరియానిక్ విల్లస్ శాంప్లింగ్ (సీవీఎస్) : గర్భధారణ జరిగాక 10వ వారంలో బిడ్డ తాలూకు బొడ్డు తాడు నుంచి చిన్న ముక్కను సేకరించి చేసే అల్ట్రా సౌండ్ పరీక్ష ఇది.ఆమ్నియోసెంటైసిస్ : సాధారణంగా గర్భధారణ తర్వాత 15వ వారం నుంచి 22వ వారం వరకు ఈ పరీక్ష చేయవచ్చు. ఇందులో తల్లి గర్భంలోంచి ఇంజెక్షన్ నీడిల్ ద్వారా కొంత ఉమ్మనీటిని సేకరిస్తారు. ఇలా సేకరించడానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ సహాయం తీసుకుంటారు. స్కానించిన్నారిలో డౌన్స్ సిండ్రోమ్ నిర్ధారణ ఇలా... కారణాలు ఏవైనప్పటికీ ఒకవేళ డౌన్స్ సిండ్రోమ్తో పిల్లలు పుడితే ముందుగా వాళ్లలో డౌన్స్ సిండ్రోమ్ నిర్ధారణ కోసం కొన్ని పరీక్షలూ, అలాగే ఆ చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడటం కోసం కొన్ని వైద్య పరీక్షలను క్రమం తప్పకుండా చేయిస్తూ ఉండటం అవసరం. ఒకవేళ అప్పటికే చిన్నారి డౌన్స్ సిండ్రోమ్తో పుడితే : ఒక చిన్నారిలో డౌన్స్ సిండ్రోమ్ ఉందని నిర్ధారణ చేయడానికి క్రోమోజోముల పరీక్షను నిర్వహించాలి. దీనికోసం చిన్నారి నుంచి సేకరించిన రక్తంతో ‘కారియోటైపిక్ క్రోమోజోమల్ స్టడీ’ అనే రక్త పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఈ ప్రధాన పరీక్షతో పాటు గుండెలో ఏవైనా లోపాలున్నాయేమొనని తెలుసుకోడానికి ఎకోకార్డియోగ్రామ్ చేయాలి. ఇక ఈసీజీ, ఛాతీ, జీర్ణకోశవ్యవస్థ తాలూకు పరిస్థితిని తెలుసుకోడానికి ఎక్స్–రే పరీక్షలూ చేయించాలి. మహిళల్లో వయసు పెరుగుతున్న కొద్దీ డౌన్స్ సిండ్రోమ్ ముప్పు కూడాఅదే క్రమంలో పెరుగు తుందని పక్కన ఉన్నపట్టిక వల్ల తెలుస్తుంది. డౌన్స్ సిండ్రోమ్ నిర్ధారణ కోసం పైన పేర్కొన్న రక్తపరీక్షలు, అల్ట్రా సౌండ్ పరీక్షలను ఒక పద్దతి ప్రకారం అన్నీ సంయుక్తంగా చేస్తుంటారు. రక్త పరీక్షల్లో రక్తనమూనాలను సేకరించి వాటిలో కొన్ని నిర్దిష్టమైన ప్రొటీన్లను, హార్మోన్లను పరిశీలిస్తారు. ఇలా కొన్ని రకాల ప్రొటీన్లు, హార్మోన్ల మోతాదులు సాధారణ విలువల కంటే ఎక్కువగా ఉంటే.. ఆ మార్కర్స్ను బట్టి అది డౌన్స్ సిండ్రోమ్స్కు సూచికలు కావచ్చంటూ అనుమానిస్తారు. ముందుగా చెప్పినట్లుగా ఇవన్నీ ముందస్తుగా అంచనా తెలిసిందేకు చేసే పరీక్షలు. ఈ పరీక్షలు చాలావరకు కరెక్ట్గానే విషయాన్ని ముందే తెలుపుతాయి. అయితే అతడికి డౌన్స్ సిండ్రోమ్ ఉందన్న విషయం బిడ్డ పుట్టాక మాత్రమే నూరు శాతం తెలుస్తుందని గుర్తుంచుకోవాలి. ఇది క్రోమోజోముల తేడా వల్ల వచ్చిన కండిషన్ కావడంతో దీనికి చికిత్స లేదు. అయితే ఇలా పుట్టిన పిల్లలను మామూలు పిల్లల్ల పెంచడానికి ఫిజియోథెరపిస్ట్, భాషను చక్కదిద్దడం, చక్కగా వచ్చేల చేయడానికి సహాయపడే లాంగ్వేజ్/స్పీచ్ థెరపిస్ట్, పెద్దయ్యాక వారు స్వతంత్రంగా బతికేలా తోడ్పడేందుకు ఆక్యుపేషనల్ థెరపిస్ట్లూ, మంచి ఆహారాన్ని అందించేందుకు డైటీషియన్, వినికిడి సమస్యల పరిష్కారానికి ఆడియాలజిస్ట్, కంటి సమస్యలను చక్కదిద్దడానికి ఆఫ్తాల్మాలజిస్ట్, పిల్లల వైద్య నిపుణుడు, గుండె వైద్య నిపుణుల సహాయం... ఇలా ఇంతమంది నిపుణుల సహాయం అవసరమవుతూ ఉంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత బాధపడటం కంటే దంపతులు కొద్దిపాటి జాగ్రత్తలతో, కొన్ని వైద్య పరీక్షల సహాయంతో బిడ్డలో ఇది రాకుండా లేదా వచ్చేందుకు అవకాశమున్న విషయాన్ని తెలుసుకోవాలి. ఒకవేళ అలా డౌన్స్ సిండ్రోమ్తో బిడ్డ పుట్టే అవకాశముందని తెలుసుకున్నప్పుడు డాక్టర్లు, క్రోమోజోమల్ స్పెషలిస్టుల ఆధ్వర్యంలో తప్పక కౌన్సెలింగ్ తీసుకోవాలి. ఇలాంటి సమస్య రాకుండానే ఉండేందుకు వీలైనంతవరకు మహిళలో గర్భధారణ 35 ఏళ్ల కంటే ముందుగానే జరిగేలా ΄్లాన్ చేసుకోవడం, కుటుంబంలో ఎవరికైనా డౌన్స్ సిండ్రోమ్ ఉంటే ఆ విషయాన్ని గర్భధారణకు ముందుగానే డాక్టర్లకు చెప్పి తగిన కౌన్సెలింగ్ తీసుకోవడమన్నది దంపతులు తప్పనిసరిగా చేయాల్సిన పనులు. డా. శివనారాయణ రెడ్డి వెన్నపూససీనియర్ నియోనేటాలజిస్ట్ – పీడియాట్రీషియన్ నిర్వహణ : యాసీన్ -
పాప్ కల్చర్ కామికాన్..! దేశంలోనే అతిపెద్ద ఫెస్టివల్
హైదరాబాద్ నగరంలో మరోసారి పాప్ కల్చర్ సందడి మొదలైంది. ప్రముఖ కాస్ప్లేయర్లు, గేమింగ్ సెలబ్రిటీలు, యానిమే, ఫిల్మ్ స్టార్స్ నగరానికి చేరుకోనున్నారు. నగర వేదికగా దేశంలోనే అతిపెద్ద పాప్ కల్చర్ ఫెస్టివల్ ‘కామికాన్ ఇండియా 2025–26’ సీజన్ అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకూ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగనుంది. కామిక్స్, గేమింగ్, కాస్ప్లే, యానిమే, ఫిల్మ్స్, టీవీ, మెర్చండైజ్ వంటి విభిన్న, వినూత్న కార్యక్రమాలు, ప్రదర్శనలు ఒకే వేదికపై నిర్వహించే అతిపెద్ద యూత్ లైఫ్స్టైల్ ఫెస్టివల్ కామికాన్ ఇండియా. ప్రస్తుతం హైదరాబాద్ కేవలం ఐటీ సిటీ కాదు, ఇదొక కల్చరల్ క్రియేటివ్ సెంటర్గా అవతరించింది. ముఖ్యంగా ఈ తరం యువత గ్లోబల్ పాప్ కల్చర్ని తమదైన రీతిలో అర్థం చేసుకుంటూ ‘లైఫ్స్టైల్ సెలబ్రేషన్’గా అలవర్చుకుంటోంది. ప్రస్తుతం కామికాన్ కేవలం కామిక్స్ ప్రదర్శన మాత్రమే కాదు.. ఇది కొత్త తరం జీవనశైలికి ప్రతిబింబం. పాప్ కల్చర్ నుండి లైఫ్స్టైల్ వరకూ.. ఫ్యాషన్, ఆర్ట్, డిజైన్, ఎంటర్టైన్మెంట్, టెక్నాలజీ తదితర అంశాలతో కలిసిన ఫ్యూజన్కి ఇది కేంద్రబిందువు. యానిమే టీ–షర్టులు, కామిక్ క్యారెక్టర్ కలెక్టబుల్స్, ఆర్ట్ పోస్టర్లు, గేమింగ్ జోన్లు.. ఇవన్నీ ఆధునిక యువతకు ‘లైఫ్స్టైల్ ఎక్స్ప్రెషన్’గా మారిపోయాయి. ఈ ఫెస్టివల్లో అంతర్జాతీయ గెస్ట్లు, సెలబ్రిటీలతో ప్రశ్నోత్తర సెషన్లు, లైవ్ మ్యూజిక్, స్టాండప్ కామెడీ, యానిమే షోకేస్లు, ఈ–స్పోర్ట్స్ గేమింగ్ అరీనాలు, ఎక్స్క్లూజివ్ మెర్చండైజ్ లాంచ్లు, కంటెంట్ క్రియేటర్ల మీట్–అండ్–గ్రీట్స్ అన్నీ కలిపి ‘బెస్ట్ వీకెండ్ ఆఫ్ ది ఇయర్’గా నిలిచేలా ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా కామికాన్ ఇండియా సీఈఓ షెఫాలీ జాన్సన్ మాట్లాడుతూ.. హైదరాబాద్ యువతలో సృజనాత్మకత, ఎనర్జీ, గ్లోబల్ కల్చర్పై ఆసక్తి విపరీతంగా ఉంది. అందుకే ఈ నగరమే తమ కొత్త సీజన్ ప్రారంభానికి సరైన వేదికని అభిప్రాయపడ్డారు. సృజనాత్మక హరివిల్లు.. కాస్ప్లే.. కాస్ప్లే ఇప్పుడు కేవలం ఆట కాదు.. ఇది ఒక ఆర్ట్ ఫార్మ్. అభిమానులు తమకు ఇష్టమైన సూపర్ హీరోలు, విలన్స్, యానిమే క్యారెక్టర్ల వేషధారణను రంగరించి, వ్యక్తిత్వాన్ని కొత్త రీతిలో చూపిస్తారు. ఈ కల్చర్ ద్వారా యువతలో ఫ్యాషన్ సెన్స్, క్రియేటివిటీ, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. గత కొంత కాలంగా హైదరాబాద్లో కాస్ప్లేయర్లకు ప్రత్యేక గుర్తింపు దక్కుతోంది. గతంలో నగరంలో నిర్వహించిన కామికాన్ హైదరాబాద్ ఫెస్ట్కు 40 వేల మందికి పైగా హాజరై ఈ తరం ఔత్సాహికత్వాన్ని ఘనంగా ప్రదర్శించారు. ఈ ఏడాది ఆ సంఖ్యను మించి ఉండనుందని నిర్వాహకులు చెబుతున్నారు. డిస్ట్రిక్ట్, మై జొమాటో ఈ సీజన్కు ప్రత్యేక టికెటింగ్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. హైదరాబాద్ కామిక్ కాన్ 2025–26 ఈవెంట్కి సంబంధించిన టికెట్లు డి్రస్టిక్ట్ యాప్లో అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. క్రియేటివ్..కేరాఫ్ హైదరాబాద్..ఈ ఫెస్టివల్ సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా నగరంలోని ఆరొమాలే కెఫే, క్రియేటివ్ కమ్యూనిటీ వేదికగా కామికాన్ ఇండియా ఆధ్వర్యంలో కాస్ప్లే వర్క్షాప్ సైతం నిర్వహించారు. పాప్ కల్చర్ అభిమానులకు, క్రియేటివిటీకి, ఫ్యాండమ్కి ఇదొక అద్భుత వేదికగా నిలుస్తోంది. ఈ వర్క్షాప్లో వివిధ ప్రాంతాల నుంచి వచి్చన 150 మందికి పైగా కాస్ప్లే అభిమానులు పాల్గొని తమ కళాత్మకతను, సృజనాత్మకతను ప్రదర్శించి సందడి చేయనున్నారు. ఈ వర్క్షాప్లో పాల్గొన్నవారికి కాస్ట్యూమ్ డిజైనింగ్, ప్రాప్ క్రియేషన్, ఫోమ్ కటింగ్, ప్యాటర్న్ మేకింగ్ వంటి బేసిక్ టెక్నిక్స్ను ప్రాక్టికల్గా నేరి్పంచారు. ముఖ్యంగా ‘రియలిస్టిక్ ఎఫెక్ట్స్’.. బాటిల్ డ్యామేజ్ లుక్ వంటి ఫినిషింగ్ టచ్లు ఎలా ఇవ్వాలో శిక్షణ ఇచ్చారు. ఫోమ్ను వేడి చేసి ఆకట్టుకునే ఆకారాలు మార్చే పద్ధతిని చూపించారు. ఈ సెషన్ ఇండియన్ చాంపియన్షిప్ ఆఫ్ కాస్ప్లే (ఐసీసీ) రెండు సార్లు గెలిచిన అక్షయ్ చూరీ నడిపించడం విశేషం. ఆయన కాస్ట్యూమ్ తయారీ, ప్రెజెంటేషన్, డీటైలింగ్కి సంబంధించిన చిట్కాలను పంచుకున్నారు. అదనంగా.. వీఎఫ్ ఎక్స్ మేకప్, విగ్ స్టైలింగ్, కాంటాక్ట్ లెన్స్ వినియోగం.. వంటి అంశాలపై ప్రత్యేక సెగ్మెంట్ నిర్వహించే.. దీనిలో సేఫ్టీ, హెల్త్, కంఫర్ట్పై దృష్టి పెట్టారు. నచ్చిన క్యారెక్టర్తో మొదలుపెట్టండి.. హైదరాబాద్ యానిమే క్లబ్, కాస్ప్లే క్లబ్ హెడ్ రాహుల్ రెడ్డి మాట్లాడుతూ.. కాస్ప్లే మొదలుపెట్టేందుకు ముందే అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇష్టపడే క్యారెక్టర్తో మొదలుపెడితే చాలు. అదే మీకు ఆసక్తిని, స్ఫూర్తిని అందిస్తుందని తెలిపారు. ఈ వర్క్షాప్లో ఐసీసీ 2024–25 హైదరాబాద్ క్వాలిఫయ్యర్ శుక్రాన్ ఖాన్ పాల్గొన్నారు. ఆయన రూపొందించిన వరల్డ్ ఆఫ్ వార్క్రాఫ్ట్ క్యారెక్టర్ ‘అండుయిన్ వ్రిన్’ ఆర్మర్ కాస్ట్యూమ్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది కేవలం క్లాస్ కాదు, ఒక ఫన్ ఇంటరాక్టివ్ సెషన్. పారి్టసిపెంట్లు స్వయంగా ప్యాటర్న్లు కట్ చేయడం, ఫోమ్ గ్లూ చేయడం నేర్చుకోవడం వావ్ అనిపించిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ వర్క్షాప్ ఒక బిగినర్ ఫ్రెండ్లీ సెషన్గా.. నగరంలోని కాస్ప్లే ఔత్సాహికులకు ఆత్మవిశ్వాసం పెంచి కొత్త ఊపునిచ్చింది. (చదవండి: బన్ మస్కా..! వేడి వేడి ఇరాన్ చాయ్ కాంబినేషన్ అదుర్స్..!) -
దీపావళి పూజ ఇలా చేస్తే, అమ్మవారి కటాక్షం పూర్తిగా మీకే!
దీపావళి అంటే దివ్యమైన పండుగ. వెలుగుల పండుగ. చీకట్లను పారద్రోలి జ్ఞానాన్ని ప్రసాదించే జ్యోతికి మొక్కే పండగ. దీపావళి రోజు లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం ప్రధానంగా ఆచారంగా పాటిస్తారు. ఇలా చేయడం వల్ల తమ కష్టాలన్నీ తొలగిపోయి, నిత్యం తమ ఇంట లక్ష్మీదేవి కళకళలాడుతూ ఉంటుందని విశ్వసిస్తారు.మరి అంత విశిష్టమైన లక్ష్మీపూజ ఎలా చేయాలో తెలుసుకుందాం.విష్ణువు శక్తికి, మాయకు కారణం లక్ష్మీ పక్కనుండటమే అంటారు. భూదేవి కూడా ఆమె మరో అంశమని చెబుతారు. దేవీ మహాత్మ్యంలో మహాశక్తియే మహాలక్ష్మీగా చెప్పబడింది. ఆమెను అష్ట భుజ మహాలక్ష్మిగా వర్ణించారు. త్రిమూర్తులలో ఒకరైన శ్రీమహావిష్ణువు దేవేరి, భృగుమహర్షి కుమార్తె అయిన లక్ష్మీ దుర్వాసుని శాపంతో క్షీరసాగర మథనంలో ఉద్భవించింది. జైన మతంలో కూడా మహాలక్ష్మి తన భక్తులను కష్టాల నుంచి కాపాడి వారికి సిరిసంపదలను కలుగజేస్తుందని నమ్ముతారు.ఋగ్వేదకాలంలో అదితి,రాకా, పురంధ్రి మొదలగు దేవతలను మాతృమూర్తులుగా ఆరాధించారు. అధర్వణ వేదం ‘సినీవాలి’ అనే దేవతను ‘విష్ణుపత్ని’గా నుతించింది. వీరిలో ఏ దేవత లక్ష్మీదేవికి మాతృరూపమో తెలియడంలేదు. లక్ష్మీ దేవి గురించి వివిధ గాధలు పురాణాలలోను, ఇతిహాసాలలోను ఉన్నాయి. శ్రీ మహా విష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మి తోడుగానే ఉన్నదనిm, ఆమె నిత్యానపాయిని ఎన్నడూ విడివడనిది అని అర్థం. లక్ష్మీనారాయణులు వేరు వేరు కారని అని శ్రీవైష్ణవ సంప్రదాయంలో చెబుతారు. పురాణాలు, ఇతిహాసాలలో లక్ష్మీదేవి గురించి వివిధ రకాలుగా పేర్కొన్నారు. సృష్టి ఆరంభం నుంచే శ్రీమహావిష్ణువునకు లక్ష్మీదేవి తోడుగానే ఉందని, 'నిత్యానపాయిని' లక్ష్మీనారాయణులు వేరు వేరు కాదని కొందరు అంటారు. సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని జగన్మాత ప్రసాదించిందని దేవీ భాగవతంలో పేర్కొన్నారు.లక్ష్మీదేవి ఓసారి విష్ణువు నుంచి వేరు కావడంతో ఆయన శక్తి హీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆదేశాలతో భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి ఆయనకు కుమార్తెగా జన్మించింది. అనంతరం విష్ణువుతో వివాహం చేశాడు. కాబట్టి లక్ష్మీదేవిని 'భార్గవి' అని కూడా అంటారు. దీపం జ్యోతి పరబ్రహ్మమ్, దీపం సర్వతమోహరమ్, దీపేన సాధ్యతే సర్వమ్, సంధ్యా దీపం నమామ్యహమ్. ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి. వరాహస్వామికి , భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. లోకకంటకుడైన నరకుడు విష్ణువు చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా భూదేవి వరం పొందుతుంది. ఇక ఈ దీపావళి పర్వదినాన లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకునేలా ఆచరించాల్సిన పూజా విధానం ఏంటంటే..లక్ష్మీ దేవిని వినాయకుడిని..దీపావళి రోజు లక్ష్మీదేవిని విధిగా పూజించాలి. సంపద, శ్రేయస్సుకు దేవతగా చెప్పుకునే లక్ష్మీని పూజించేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. సాయంత్రం వేళలో పూజ ప్రారంభించాలి. దీపావళి ప్రతి పూజలోనూ వినాయకుడిని ఆరాధించడం సంప్రదాయం. లక్ష్మీదేవిని వినాయకుడిని కలిపి పూజిస్తారు. లక్ష్మీదేవి పూజలో భాగంగా ముందుగా పసుపుతో వినాయకుడిని పూజిస్తారు. దీపం వెలిగించి ఈ కింది మంత్రంతో పూజ ప్రారంభించాలి. ప్రాణ ప్రతిష్ఠ ‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే బెల్లం ముక్కను నివేదన చేస్తూ ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.అసునీతే పునరస్మా సుచక్షుః పునః ప్రాణ మిహనోధేహి భోగం జ్యోక్పశ్యేమ సూర్య ముచ్చరంత మనమతే మృడయానస్వస్తి అమృతమాపః ప్రాణానేన యధాస్థాన ముపహ్యయతే రక్తాం భోధిస్థపోతోల్లసదరుణ సరోజాధిరూఢాకరాబ్జైః పాశంకోదండ మిక్షూద్భవ మళిగుణమప్యం కుశం పంచబాణాన్ బిబ్రాణా సృక్కపాలం త్రిణయనవిలసత్ పీన వక్షోరుహాఢ్యా దేవీబాలార్కవర్ణాభవతు సుఖకరీ ప్రాణశక్తిః పరానః పై మంత్రాన్ని చదువుతూ ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి. కలశ స్థాపన వేదిక మధ్యలో ఎర్రటి వస్త్రాన్ని వేసి దాని మీద ధాన్యాన్ని పోసి కలశాన్ని ఉంచాలి. బంగారం, వెండి, రాగి పాత్రను కలశంగా పెట్టి అందులో మూడు భాగాలు నీటిని పోయాలి. కలశంలో మామిడి ఆకులను వేయాలి. వేదిక మీద పోసిన ధాన్యంలో తామర పువ్వును గీసి లక్ష్మీ విగ్రహాన్ని ఉంచాలి. అలాగే ఒక పళ్లెంలో కొన్ని నాణేలను ఉంచాలి. తరువాత కలశాన్ని కుంకుమతో అలకరించి ఈ కింది మంత్రాన్ని చదువుకోవాలి.‘గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతినర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురుఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాఃకలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య’ లక్ష్మీదేవిఅధాంగ పూజచంచలాయై నమః పాదౌ పూజయామిచపలాయై నమః జానునీ పూజయామిపీతాంబర ధరాయై నమః ఊరూ పూజయామికమలవాసిన్యై నమః కటిం పూజయామిపద్మాలయాయై నమః నాభిం పూజయామిమదనమాత్రే నమః స్తనౌ పుజయామిలలితాయై నమః -భుజద్వయం పూజయామికంబ్కంఠ్యై నమః- కంఠం పూజయామిసుముఖాయై నమః- ముఖం పూజయామిశ్రియై నమః ఓష్ఠౌ పుఅజయామిసునాసికాయై నమః నాసికం పూజయామిసునేత్రాయై నమః ణెత్రే పూజయామిరమాయై నమః కర్ణౌ పూజయామికమలాలయాయై నమః శిరః పూజయామిఓం శ్రీలక్ష్మీదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామిఈ కింది మంత్రాన్ని పఠిస్తూ దీపం వెలిగించాలిఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీంసూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహఘృతాక్తవర్తి సంయుక్తం అంధరాశి వినాశకందీపం దాస్యామి తే దేవి గృహణ ముదితాభవశ్రీలక్ష్మీదేవ్యై నమః దీపం దర్శయామి. లక్ష్మీ దేవికి తిలకాధారణ చేసి విగ్రహం ముందు పూలు, కుంకుమ, పసుపు, గంధం, నైవేద్యం, పండ్లు, కొబ్బరి, మొదలైనవి సమర్పణలు ఉంచాలి. అలాగే బంగారు, వెండి ఆభరణాలు, ముత్యాలు, నాణేలను కూడా సమర్పించవచ్చు. లక్ష్మీదేవికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత శుద్దోదక స్నానం చేయాలి. ఆభరణం, ముత్యాన్ని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేయాలి. విగ్రహాన్ని వస్త్రంతో తుడిచి కలశంలో పెట్టాలి. ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ సూక్తం మీ శక్తి కొద్ది స్తోత్రాలను చదివి, దీపం , దూపంలను సమర్పించిన అనంతరమే నైవైద్యం సమర్పించాలి. ఈ క్రింది మంత్రం చదువుతూ ప్రదక్షిణలు చేయాలి.యానకాని చ పాపాని జన్మాంతర కృతాని చతాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదేపాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవత్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సలఅన్యథా శరనం నాస్తి త్వమేవ శరణం మమతస్మాత్ కారుణ్య భావేన రక్ష మహేశ్వరిశ్రీలక్ష్మీదేవ్యై నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.చివరిగా సాష్టాంగ నమస్కారంనమస్తే లోకజనని నమస్తే విష్ణు వల్లభే పాహిమాం భక్తవరదే శ్రీలక్ష్మ్యైతే నమో నమః శ్రీలక్ష్మీదేవ్యై నమః సాష్టాంగనమస్కారన్ సమర్పయామి సంధ్యాసమయంలో ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనె/కొబ్బరి నూనెతో దీపాలను ఇంటిముందర ఓ వరస క్రమంలో వెలిగించాలి. (Diwali 2025 : ఈ ఏడాది అద్భుతం విశిష్టత ఏంటి? శుభ ముహూర్తం!) -
బన్ మస్కా..! వేడి వేడి ఇరాన్ చాయ్ కాంబినేషన్ అదుర్స్..!
వర్షాల సీజన్లో వేడెక్కే క్రేజ్ బన్మస్కా. వేడి వేడి ఇరానీ చాయ్తో పాటు ఈ సీజనల్ ఫుడ్కి కూడా మూడొస్తుంది. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సిటీలో ఫుడ్ లవర్స్, ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్ ప్రేమికుల నుంచి బన్ మస్కా లేదా మలై బన్ లకు ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. తాజా క్రీమ్తో మేళవించి పొరలుగా ఉండే ఈ మృదువైన బ్రెడ్ను ఇరానీ కేఫ్లు, సంప్రదాయ బేకరీలు అందిస్తాయి. నగరంలో చినుకులు పడే ఉదయం, సాయంత్రం వేళల్లో చాలా మంది తినే చిరుతిండి ఇది. గత కొన్నేళ్లుగా ఫుడ్ బ్లాగర్ల కారణంగా ఆధునికుల్లోనూ మరింత ప్రజాదరణ పొందింది. నగరం అంతటా అనేక కేఫ్లు నగరానికే ప్రత్యేకించిన ఈ సంప్రదాయ ట్రీట్ను అందిస్తూన్నాయి. వీటిలో దేనికదే ప్రత్యేకమైన రుచికి పేరొందాయి. ఈ వర్షాకాలంలో మంచి మలై బన్ను పొందగల కొన్ని చిరునామాలివి.. పిస్తా హౌస్ వారి మలై బన్లో కుంకుమపువ్వు (జాఫ్రాన్) పరిమళాన్ని కూడా కలిపి అందిస్తోంది. ఇది వీరి జఫ్రానీ చాయ్ కాంబినేషన్తో ఆస్వాదించడం సిటిజనుల అలవాటు. లక్డికాపుల్లోని కేఫ్ నీలోఫర్లో బన్ మస్కా ఉదయం 4 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. బేగం బజార్లో ఉన్న ఈ చట్టు రామ్ యాదవ్ మిల్క్ షాప్ 1944లో స్థాపించారు. ఇప్పుడు ఆ వంశీకుల్లో ఆరో తరం దీనిని నిర్వహిస్తోంది. హైదరాబాదీలకు మలై బన్ను పరిచయం చేసింది వీరే. ఇటీవలి సంవత్సర కాలంలో హసన్ డైరీ అనే కొత్త సంస్థ సిటీ ట్రెడిషనల్ బన్ను ప్రత్యేకంగా తీర్చిదిద్దింది. ఇది మలై గులాబ్ జామూన్ బన్, హనీ బన్, నుటెల్లా బన్, కోవా బన్ వంటి వెరైటీలను అందిస్తోంది. అబిడ్స్, మాధాపూర్లో శాఖలు నిర్వహిస్తున్న ‘నయన్తారా’ మలై బన్ ప్రియుల్లో బాగా ఫేమస్. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు దీనిని బాగా షేర్ చేస్తున్నారు. (చదవండి: పెద్దమ్మ గుడిలో ఈ–హుండీ..) -
పెద్దమ్మ గుడిలో ఈ–హుండీ..
ప్రస్తుతం అంతా డిజిటల్ యుగం నడుస్తోంది.. బస్ టికెట్ కొనాలన్నా.. వాటర్ బాటిల్ కొనాలన్నా.. అన్నింటికీ యుపిఐ పేమెంట్సే.. ఈ క్రమంలో బహిరంగ మార్కెట్లో చిల్లర కొరత ఏర్పడుతోంది.. ప్రతి కొనుగోలుకీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం అలవాటైపోయింది. నూటికి 60 శాతం పైగా పేమెంట్స్ ఈ తరహాలోనే నడుస్తున్నాయి. దీంతో అత్యవసరమైన చోట ఖర్చు చేసేందుకు కూడా జేబులో రూ.10 ఉండని పరిస్థితి. ఈ ప్రభావం దేవాలయాలపై భారీగా కనిపిస్తోంది. దీంతో ఈ సమస్యకు ప్రత్యామ్నాంగా దేవాలయాల్లోనూ ఇటీవల కాలంలో హుండీ ఆదాయం గణనీయంగా పడిపోతోందని దేవాదాయ శాఖ రికార్డులు వెల్లడిస్తున్నాయి. దీనిని అధిగమించేందుకు నగరంలోని జూబ్లీహిల్స్లోని శ్రీ పెద్దమ్మ దేవాలయంతో పాటు బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, సికింద్రాబాద్ గణేష్ టెంపుల్, మహంకాళి దేవాలయం, చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంతో పాటు పలు ప్రధాన ఆలయాల్లో ఈ–హుండీలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. తాజాగా నగరంలోనే భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసే జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ ఆలయంలో ఈ–హుండీ ఏర్పాటైంది. సోమవారం నుంచి భక్తులకు ఈ–హుండీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. భక్తులు ఇక్కడ స్కాన్ చేసి కానుకలను నేరుగా ఆలయ అకౌంట్లోకి పంపించవచ్చు. మొదటి రోజు ఈ విధానానికి భారీ స్పందన లభించింది. మిగతా ఆలయాల్లోనూ ఈ–హుండీలను ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ అధికారుల నుంచి ఆదేశాలు వెలువడిన నేపథ్యంలో ఆయా ఆలయాలు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. (చదవండి: ఆ దంపతుల అభి‘రుచే’ సపరేటు.. అమెరికాలో వడాపావ్ పిక్నిక్కి అదే రూటు) -
పగ బట్టిన పండు ఈగ!
పండు ఈగ (ఫ్రూట్ ఫ్లై) అనేక పండ్లు, కూరగాయ తోటలకు పెను నష్టాన్ని కలిగిస్తూ రైతులను అల్లాడిస్తోంది. కొద్ది సంవత్సరాల క్రితం మామిడికే పరిమితమై ఉండే పండు ఈగ ఇప్పుడు అనేక పంటలకు విస్తరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పండు ఈగ ముప్పు ఏటేటా పెరుగుతోంది. దాదాపు 20కి పైగా పండ్లు, కూరగాయ తోటలకు పండు ఈగ ఆశిస్తూ రైతులకు పెను నష్టం కలిగిస్తోంది. మామిడిలో 30% నుంచి 70% దిగుబడి నష్టం జరుగుతోంది. జామ, బొప్పాయి, సపోటా, రేగు వంటి పంటల్లో 20% నుంచి 50% దిగుబడి నష్టాలకు కారణమవుతున్న పండు ఈగపై కేంద్ర వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థ ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్’ (ఎన్ఐపీహెచ్ఎం) శాస్త్రవేత్తలు డాక్టర్ మరియదాస్, డాక్టర్ పైలా జ్యోతి, డాక్టర్ ఆలిస్ ఆర్పీ సుజీత సూచనలతో ప్రత్యేక కథనం. పండు ఈగ సోకకుండా జీవనియంత్రణ పద్ధతులను అనుసరించటమే మేలని వారు రైతులకు సూచిస్తున్నారు.పండ్ల ఈగలు (ప్రధానంగా బాక్ట్రోసెరా జాతులు బి. డోర్సాలిస్, బి. జోనాటా, బి. కుకుర్బిటే వంటివి) ఎన్నో రకాల పండ్లు, కూరగాయలను ఆశించి నాశనం చేసే పురుగులు. అందుకే వీటిని ‘పాలీఫాగస్ పెస్ట్స్’ అంటారు. ఒకప్పుడు కొన్ని పండ్లు, కూరగాయ రకాలకు నష్టం చేకూర్చేవి. క్రమంగా అనేక ఇతర పంటలకు కూడా వ్యాపించి నష్టం చేస్తున్నాయి. అకాల వర్షాలు, అస్థిర వాతావరణ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఉద్యాన తోటల్లో పండు ఈగల త్వరితగతిన వ్యాప్తికి దోహదం చేస్తున్నాయి. దీనివల్ల గత సీజన్లో కూడా మామిడి కాయలకు తీవ్ర నష్టం కలిగింది. పండు ఈగ వల్ల మామిడి ఎగుమతులు కూడా తగ్గిపోతాయి. అనేక ఇతర పంటలను కూడా పండు ఈగ చుట్టుముడుతోంది.పండు ఈగ నియంత్రణకు మేలైన యాజమాన్య పద్ధతులు→ తోటలో చెట్ల నుంచి రాలిపోయిన లేదా పండు ఈగ సోకిన పండ్లను సేకరించి మట్టిలో రెండు అడుగుల (60 సెం.మీ.ల) లోతు గుంత తీసి పాతిపెట్టాలి. → పండ్ల చెట్ల కొమ్మలను తగుమాత్రంగా కత్తిరించి, కత్తిరింపులను తో టలో నుంచి తొలగిస్తే పండు ఈగలు పెరగకుండా చూసుకోవచ్చు. → పండిన పండ్లను పండినట్లు ఎప్పటికప్పుడు వెంటనే కోయండి. పండిన పండ్లను చెట్లపై వదిలివేయవద్దు.→ జొన్న, ఆముదం, తులసి, కర్రపెండలం వంటి పురుగులను ఆకర్షించే జాతుల మొక్కలను తోటల గట్లు/ సరిహద్దుల్లో పెంచటం ద్వారా ప్రధాన పంటను పండు ఈగల నుంచి రక్షించుకోవచ్చు. → మగ ఈగలను ఆకర్షించటం కోసం సామూహిక ఉచ్చులు ఏర్పాటు చేయటం ద్వారా పండు ఈగ సంతతిని నియంత్రించి తోటలను కాపాడుకోవచ్చు. పండ్ల తోటల్లో మిథైల్ యూజినాల్ ఉచ్చులు పెట్టాలి. తీగజాతి కూరగాయ పంటల్లో క్యూ–లూర్ ఉచ్చులను ఉపయోగించాలి. ఎకరానికి 6–10 ఉచ్చులు పెట్టాలి. ఒకసారి పెడితే చాల్లే అనుకోకండి. ప్రతి 30–40 రోజులకు ఒకసారి ఎరలను మార్చుతూ ఉండాలి. తక్కువ ఖర్చుతో కూడిన ‘ఫ్రూట్ ఫ్లై బాటిల్ ట్రాప్ టెక్నాలజీ’ని ఎన్ఐపీ హెచ్ఎం వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. దాన్ని ఉపయోగించుకోవచ్చు. → అధిక విలువైన పండ్లను పండు ఈగ నుంచి కాపాడుకోవటం కోసం పండ్లకు రక్షక సంచులు తొడగాలి. పండ్లకు కాగితం లేదా ప్లాస్టిక్ సంచులు తొడగండి. ఇది పండుపై ఈగ గుడ్లు పెట్టకుండా అడ్డుకుంటుంది. పురుగుమందుల అవశేషాలను తగ్గిస్తుంది. ఎగుమతి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పండ్లు ఉండేలా చేస్తుంది. శ్రమతో కూడుకున్న పని అయినప్పటికీ చిన్న తోటలన్నిటిలో, దేశీయ /ఎగుమతి మార్కెట్ల కోసం ఉద్దేశించిన తోటల్లో చెట్లపై కాయలకు సంచి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. → తోటలో చెట్లు / మొక్కల కింద ఉన్న మట్టిని కుళ్లగించి, ఆ మట్టిలో ఉండే పండు ఈగ ప్యూపాలను చంపడానికి క్లోర్పైరిఫోస్ 20% ద్రావణాన్ని లీటరు నీటికి 2.5 ఎం.ఎల్. చొప్పున కలిపి చల్లండి. → బ్యూవేరియా బాసియానా, మెటారైజియం అనిసోప్లియా వంటి ఎంటోమో పాథోజెనిక్ శిలీంధ్రాలను ఆకులపై పిచికారీ చేయండి. → మగ, ఆడ కీటకాలను చంపడానికి ఎర స్ప్రేలను పిచికారీ చేయవచ్చు. ఏదైనా ఒక పురుగుమందును (మలాథియాన్ 50% ద్రావణం లీటరు నీటికి 2 ఎం.ఎల్./∙లేదా డెల్టామెథ్రిన్ 2.8% ద్రావణం లీటరు నీటికి 2 ఎం.ఎల్. చొప్పున) ప్రోటీన్ హైడ్రోలైజేట్ లేదా మొలాసిస్ లేదా బెల్లంలకు లీటరు నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయండి. పండు ఈగలు ఎక్కువగా ఉన్నప్పుడల్లా 2 వారాల వ్యవధిలో పిచికారీ చేయండి.ఈ తోటలకు ముప్పుపండ్ల జాతులు: మామిడి, జామ, సీతాఫలం, రేగు, బొప్పాయి, సపోటా, అరటి, దానిమ్మ, బత్తాయి, పుచ్చతో పాటు కివి వంటి అన్యదేశ పండ్లను కూడా పండు ఈగలు ఆశిస్తున్నాయి. కూరగాయలు, దోసకాయలు: టమాటా, వివిధ రకాల తీగ జాతి కూరగాయ పంటలకు పండు ఈగ సమస్యగా మారింది. బీర, సొర, కాకర, నేతి బీర, పొట్ల, గుమ్మడి, దొండ, దోస, కీర దోస తదితర ఉద్యాన పంటలకు పండు ఈగ ముప్పు పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. బాక్ట్రోసెరా జాతి పండ్ల ఈగలు విజృంభిస్తున్నాయి. వందలాది పంటలను ఆశిస్తున్నాయి. అకాల వర్షాలు, తేమతో పాటు వెచ్చని రాత్రులతో మారుతున్న వాతావరణం చీడపీడలు వేగంగా విస్తరించటానికి సహాయపడుతున్నది. ఇది తెలంగాణ, ఆంధ్రలో ఇటీవలి మామిడి నష్టాలకు ప్రధాన కారణం బాక్ట్రోసెరా జాతి పండ్ల ఈగలే. పక్వానికి వచ్చిన కాయల కోత ఆలస్యమై పండ్లు చెట్లపై ఎక్కువ కాలం ఉన్నప్పుడు పండు ఈగలు వాటిని ఆశించి, ఆ పండ్ల లోపలికి గుడ్లు చొప్పించడానికి ఎక్కువ అవకాశం దొరుకుతున్నది. (పాపాయితోనే మాస్టర్స్..కానీ గ్రాడ్యుయేషన్ ఈవెంట్కి డబ్బుల్లేక అలా చేశా!)నష్టాలు.. ఎగుమతి చిక్కులుచెట్లకు వేలాడుతున్న పండ్ల తొక్కకు ఆడ పండు ఈగలు బెజ్జం చేసి, వాటి లోపల గుడ్లు పెడతాయి. గుడ్ల నుంచి తయారయ్యే పురుగులు ఆ పండు లోపలే ఉండి గుజ్జు ను తింటూ ఉంటాయి. దీనివల్ల పండు పైకి చూపులకు అంతా బాగానే కనిపిస్తున్నా లోపల్లోపల కుళ్ళి మెత్తబ డుతుంది. అకాలంగా పండ్లు రాలిపోతుంటాయి. ఇది పంట కోత తర్వాత కాలంలో అధిక నష్టాలకు దారితీస్తుంది. పండు ఈగలు ఎక్కువగా ఆశిస్తే పంట దిగుబడితో పాటు మార్కెట్లో ధరలు, ఎగుమతులు కూడా తగ్గిపోతాయి. పండు ఈగల దాడిని సరిగ్గా నియంత్రించకపోతే పండ్లు, కూరగాయల దిగుబడి గణనీయంగా తగ్గిపోయి, రైతులకు భారీ స్థాయిలో ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి. మామిడిలో 30% నుంచి 70% వరకు పంట నష్టం జరుగుతుంది. జామ, బొప్పాయి, సపోటా, రేగు తదితర పంటల్లో సీజన్ను, పండు ఈగల తీవ్రతను బట్టి 20% నుంచి 50% వరకు పంట నష్టం జరుగుతుంది. (Diwali 2025 : ఈ ఏడాది అద్భుతం విశిష్టత ఏంటి? శుభ ముహూర్తం!)పండు ఈగలు పెద్ద సంఖ్యలో ఆశిస్తే విదేశాలకు ఎగుమతైన పండ్లు అక్కడికి వెళ్లిన తర్వాత తిరస్కరణకు గురయ్యే రిస్క్ పెరుగుతుంది. ఎగుమతికి సిద్ధం చేసే ప్రక్రియలో ఖర్చులు కూడా పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో సరుకు ఎగుమతి ఆర్డర్ల రద్దుకు సైతం దారితీస్తుంది. ఇది భారతీయ ఉత్పత్తులకు విదేశీ మార్కెట్లలో వాణిజ్య భాగస్వామ్యాన్ని తగ్గిస్తుంది. ఈ పరిస్థితిని నివారించడానికి పండ్లు ఈగలతో ప్రభావితమైన పండ్లను ఎగుమతి కాకుండా చూడాలి. అందుకు అనుగుణంగా కఠినమైన ఫైటో శానిటరీ శుద్ధి ప్రక్రియలు చేపట్టటం అవసరం. వేడి నీటి చికిత్స, వేడి ఆవిరి చికిత్స, చల్ల నీటి చికిత్స, వికిరణ చికిత్స, రసాయన ద్రావణాల్లో పండ్లను ముంచటంతో పాటు ఎగుమతి ప్రమాణాలకు అనుగుణంగా పండు ఈగ రహిత ధ్రువీకరణను ప్రవేశపెట్టటం వంటి పటిష్ట చర్యలు తీసుకుంటే పండు ఈగ వల్ల ఎగుమతులు దెబ్బతినకుండా చూసుకోవచ్చు. -
జెండర్ ‘బౌండరీ’ దాటిన ఫస్ట్ కామెంటేటర్
దారులు ఏర్పరచేవారెప్పుడూ ఒంటరిగానే బయలుదేరుతారు! చెప్పకనే ఆ బాటను పదిమందికీ గమ్యంగా మారుస్తారు. అలా పురుషుల రంగమైన క్రికెట్లో మహిళలను కామెంటరీ బాక్స్ వరకు నడిపించిన వ్యక్తి చంద్ర నాయుడు. ఆమెను పరిచయం చేస్తోంది ఈ వారం పాత్ మేకర్..ఇప్పుడిప్పుడే క్రికెట్లో మహిళల ఉనికి, ఉన్నతి కనిపిస్తోంది. కామెంటరీ రంగంలోనూ మహిళా గళాలు వినిపిస్తున్నాయి. క్రికెట్ నేపథ్యం కాకపోయినా మందిరా బేడీ క్రికెట్ యాంకర్గా, కామెంటేటర్గా కనిపించి, వినిపించి కలకలం రేపింది. అంజుమ్ చో్రపా, ఇసా గుహా, లీసా స్థాలేకర్, స్నేహల్ ప్రధాన్ లాంటి క్రికెటర్స్ కూడా ఆట నుంచి రిటైరైపోయి కామెంటేటర్స్గా మారినవారే! వీళ్లందరికీ ఆ ధైర్యం, స్ఫూర్తిని పంచింది మాత్రం 1970ల్లోని క్రికెట్ ప్లేయర్.. చంద్ర నాయుడు. మగాళ్లే వినిపించే క్రికెట్ వ్యాఖ్యానంలోకి మైక్ పట్టుకుని వచ్చిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. ఆ రంగంలో మహిళలు రావడానికి దారిని ఏర్పరచారు.ఘనకీర్తి వారసత్వంచంద్రనాయుడు.. దేశపు తొలి టెస్ట్మ్యాచ్ కెప్టెన్ కల్నల్ సీకే నాయుడు కూతురు. 1932లో లార్డ్స్ స్టేడియంలో మన దేశం ఇంగ్లండ్తో ఆడిన తొలి టెస్ట్మ్యాచ్లో మన జట్టుకు ఆయనే సారథ్యం వహించారు. అతని సోదరులైన సీఎల్ నాయుడు, సీఆర్ నాయుడు, సీఎస్ నాయుడు కూడా క్రికెటర్లే. అలా క్రికెట్ కుటుంబంలో పుట్టిన చంద్ర నాయుడు రక్తంలో కూడా క్రికేట్ ఉండటంతో ఊహ తెలియని వయసు నుంచే క్రికెట్ బ్యాట్ పట్టుకున్నారావిడ. ఊహ తెలిసేప్పటికి ఆమె ఆసక్తి, ఇష్టం అన్నీ క్రికెటే అయ్యాయి. ప్రాక్టీస్తో ఆటలో ప్రావీణ్యం సంప్రాదించి దేశపు తొలితరం మహిళా క్రికెటర్లలో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు.సల్వార్, కమీజ్తో రోల్ మోడల్గా.. ఇటు చదువు.. అటు ఆటలు.. రెండిట్లోనూ చంద్ర చురుకే! 1950ల్లో తన కాలేజీ రోజుల్లో ఉత్తరప్రదేశ్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. సల్వార్, కమీజ్తోనే క్రికెట్ ఆడేవారు ఆమె. ఈ ఆట కోసం ΄్యాంట్, షర్ట్ ధరించాల్సిన అవసరం ఉండదని, సంప్రదాయ దుస్తుల్లోనే చక్కగా ఆడొచ్చని తోటి అమ్మాయిలు గ్రహిస్తారని! క్రీడారంగంలో ముఖ్యంగా క్రికెట్లోకి వీలైనంత ఎక్కువ మంది అమ్మాయిలు రావాలని చంద్ర ఆశించారు. అందుకే స్పోర్ట్స్వేర్తో వాళ్లు వెనుకడుగు వేయకుండా తనను ఓ రోల్మోడల్గా చూపేందుకు ప్రయత్నించారు ఆమె.ట్రయల్ బ్లేజర్ఎన్నో విజయాల తర్వాత క్రికెట్ ఆట నుంచి ఆమె దృష్టి క్రికెట్ మ్యాచ్ వ్యాఖ్యానం మీదకు మళ్లింది. రంజీ ట్రోఫీ మ్యాచ్ల కోసం రేడియోలో వ్యాఖ్యానం చెప్పడం మొదలుపెట్టారు. ఆల్ ఇండియా రేడియో కోసం కాకుండా స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకుల కోసం నేరుగా వ్యాఖ్యానం చేయాలని ఉత్సాహపడ్డారు. ఆ అవకాశం 1977లో వచ్చింది బాంబే (అప్పటి) – మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్తో! ఆ ఆటను వ్యాఖ్యానించడానికి స్టేడియంలో తొలిసారిగా మైక్ పట్టుకున్నారు చంద్ర నాయుడు. ఆ సందర్భమే ఆమెను తొలి మహిళా కామెంటేటర్ అనే ఖ్యాతిని తెచ్చి పెట్టింది. చరిత్రలో నిలిపింది. భారతీయ క్రికెట్ బ్రాడ్కాస్టింగ్లోనే ఓ సంచలనంగా మారింది. ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్కి ఆల్ ఇండియా రేడియోలో ఆమె చెప్పిన వ్యాఖ్యానానికి బీబీసీ మేల్ కామెంటేటర్స్ అబ్బురపడ్డారట.టీచర్గా ...క్రికెట్ కామెంటరీ నుంచి రిటైరయ్యాక చంద్ర నాయుడు ఇండోర్ వెళ్లిపోయి.. అక్కడి ప్రభుత్వ మహిళా పీజీ కాలేజ్లో లెక్చరర్గా చేరారు. చివరి వరకు అక్కడే పనిచేసి ప్రిన్సిపల్గా రిటైరయ్యారు. ఆమె తండ్రి తొలి టెస్ట్ మ్యాచ్కి ఎక్కడైతే కెప్టెన్గా వ్యవహరించారో అక్కడే ఆ లార్డ్స్ స్టేడియంలోనే 1982లో ఇండియా, ఇంగ్లండ్కు మధ్య జరిగిన గోల్డెన్ జుబ్లీ టెస్ట్ మ్యాచ్కు చంద్ర నాయుడు ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు. ఆమె ఇండోర్లో.. 2021, ఏప్రిల్లో తన 88వ ఏట తుదిశ్వాస విడిచారు. -
AI వినియోగంపై హెచ్చరిక.. యూకేలో గరికపాటి ప్రవచనాలు
లండన్: ప్రఖ్యాత సహస్రావధాని, పద్మశ్రీ పురస్కార గ్రహీత గరికపాటి నరసింహారావు తన తొలి యూకే పర్యటనలో భాగంగా బ్రిటిష్ ఇండియన్ తెలుగు సంస్కృతి సంఘం ఆహ్వానంపై పలు నగరాల్లో ప్రవచనాలు నిర్వహించారు. ఈ పర్యటనలో ఆయన జీవిత శిక్షకుడిగా, సాహిత్య పండితుడిగా తన మేధస్సుతో వేలాది మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.బర్మింగ్హామ్ నగరంలో జరిగిన కార్యక్రమంలో గరికపాటి నైతిక, ధార్మిక విలువలపై ప్రసంగించారు. లండన్లో జరిగిన ప్రవచనం ప్రధానంగా ధర్మబద్ధమైన జీవనం, జాతి నిర్మాణంలో NRIల పాత్ర అనే అంశాల చుట్టూ సాగింది. ఆయన ప్రసంగంలో హాస్యం, భక్తి, తత్వశాస్త్రం మేళవించి, శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. ప్రసంగంలో గరికపాటి గారు AI వాడకంపై చమత్కారమైన హెచ్చరికలు చేస్తూ, తగిన నియంత్రణ లేకపోతే దాని ప్రమాదాలు గురించి పునరుద్ఘాటించారు. అంతేకాక, ప్రతి NRI తన స్వగ్రామాన్ని దత్తత తీసుకుని దేశానికి సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బిట్సెస్ బృందాన్ని సురేష్ మంగళగిరి పరిచయం చేశారు. కాటెపల్లి సచిందర్ రెడ్డి, వాసా బరత్, యశ్వంత్, రాగసుధ, షణ్ముఖ్, సుభాష్, అశ్విన్, సుదర్శన్, రాజ్ దేవరపు, శరత్ తమా, వివేక్, శ్రీనివాస్, బాలు తదితరులు కోర్ కమిటీ సభ్యులుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. వాలంటీర్లు, స్పాన్సర్లు అందించిన మద్దతుతో ఈ పర్యటన తెలుగు సంస్కృతికి, ధర్మబద్ధమైన జీవన దృక్పథానికి అద్భుత వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమాల్లో భజనలు, శాస్త్రీయ నృత్యాలు కూడా ప్రదర్శించబడ్డాయి. ఇది ఎన్ఆర్ఐలు తమ కళా, సాంస్కృతిక విలువలను ఎలా నిలబెట్టుకుంటున్నారనే దానికి నిదర్శనంగా నిలిచింది. -
మనిషి లక్షణాలు
ఆచారః కుల మాఖ్యాతిదేశ మాఖ్యాతి భాషణంసంభ్రమః స్నేహ మాఖ్యాతివపురాఖ్యాతి భోజనం’’ నడవడిక కులాన్ని (శీలాన్ని), మాటతీరు ప్రాంతాన్ని, సంభ్రమం (మర్యాదచూపే తీరు) ప్రేమను, శరీరం ఆహారపు అలవాట్లను తెలుపుతాయి. సంభ్రమం అంటే మర్యాద చేయటానికి పడే హడావుడి, కంగారు. ఈ సంభ్రమం ఎంతప్రేమ ఉన్నదో తెలియచేస్తుంది. ఇష్టమైనవాళ్ళు వస్తున్నారంటే కాళ్ళుచేతులు ఆడవు. వాళ్ళకి నచ్చినట్టు చేయాలనే తాపత్రయంలో ఒకదానికి ఒకటి చెయ్యటం కూడా కద్దు. ఆ విధంగా ΄÷రబడటం అవకతవకగా చెయ్యటం ప్రేమకి చిహ్నమే కాని, చేతకానితనం కాదు. కృష్ణుడు తన ఇంటికి వచ్చాడన్న ఆనందంలో విదురుడు అరటిపండ్లు ఒలిచి ప్రేమగా పెడదామనుకుని, తొక్కలు కృష్ణుడి చేతిలో పెట్టి, పండు బయట పడేశాడుట! కృష్ణుడు ఆప్యాయంగా ఆ తొక్కలని తిన్నాడు ఆ సంభ్రమం వెనక ఉన్న ప్రేమని గుర్తించాడు కనుక. అదే ఇష్టంలేని వాళ్ళు వస్తే ఉన్నచోటు నుండి కదలబుద్ధి అవదు. తప్పనిసరి అయి, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వవలసి వస్తే చేయవలసిన మర్యాదలన్నీ ఎక్కువగానే చేసినా మనసుపెట్టి చేసినట్టుగా ఉండదు. యాంత్రికంగా అనిపిస్తుంది.ఒక వ్యక్తి గురించి తెలియటానికి వారి గురించిన పరిచయ పత్రమో, నివేదికో చదివిన దానికన్న, వారిని ప్రత్యక్షంగా చూస్తే బాగా తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది అన్నదాన్ని చాణక్యుడు చక్కగా తెలియ చేశాడు. ఆచారం కులాన్ని తెలియచేస్తుంది అన్నాడు. ‘‘కుల’’మంటే ఈనాడు మనమనుకునేది కాదు. ఒక వృత్తిని అవలంబించే వారి సముదాయం లేక సంఘం. ఆచారమంటే తరతరాలుగా వస్తున్న అలవాట్లు, పద్ధతులు, సంప్రదాయాలు మొదలైనవి. ఇవి ఒక కుటుంబానికి మరొక కుటుంబానికే మారి΄ోతూ ఉంటాయి. అటువంటిది వృత్తులని బట్టి మారటం సహజమే కదా! ఉదాహరణకి ఉ΄ాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి సమయ΄ాలన, క్రమశిక్షణ తప్పులు లేకుండా ఎదుటివారికి అర్థమయ్యే విధంగా మాట్లాడటం మొదలైనవి అలవాటవుతాయి.అందుకే ఎవరైనా తాను నిక్కచ్చిగా ఉండి, ఎదుటివారిని కూడా అట్లా ఉండమంటే ‘‘మరీ క్లాసు టీచర్ లాగా వెంట పడుతున్నాడు’’ అనటం వింటూ ఉంటాం. పనిచేసే తీరుని బట్టి కూడా ఉపాధ్యాయవృత్తిలో ఉన్నవాళ్లని చెప్పవచ్చు. అన్ని వృత్తులు కూడా అంతే! కుల శబ్దానికి శీలమనే అర్థం కూడా చెప్పారు. శీలమైనా వ్యక్తమయ్యేది అలవాట్లలోను, పని చేసే తీరులోనే కదా! మాట తీరు ఆవ్యక్తి ఏ్ర ప్రాంతానికి చెందినవాడో తెలియచేస్తుంది. తెలుగు మాట్లాడేవాళ్ళే అయినా వాళ్ళు మాట్లాడే తెలుగు స్వస్థలం ఏదో చెప్పకనే చెపుతుంది. ‘‘ఈ సోరగాడు’’ అనగానే ఎక్కడివారో చెప్పనక్కర లేదు. ‘‘ఈ పిలగాడు’’ అని ఎవరంటారో అందరికి తెలుసు. ‘‘ఈ గుంటడు’’ అంటే ఉత్తరాంధ్ర నుండి వచ్చిన వారని చెప్పనవసరం లేదు. మాటలే కాదు మాటాడే తీరు, అంటే యాస వాళ్లెక్కడి వాళ్ళో పట్టిస్తుంది. ఇదీ చదవండి: పాపాయితోనే మాస్టర్స్..కానీ గ్రాడ్యుయేషన్ ఈవెంట్కి డబ్బుల్లేక అలా చేశా!అందుకే పండితులైన వాళ్ళు శిష్టవ్యవహారికం రాయటమే కాదు, మాట లో కూడా ప్రాంతీయత తొంగిచూడకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. అంటే యాసలో మాట్లాడటం తప్పో తక్కువో అని కాదు. సమతని పాటించటం కోసం అంతే! అదే పరాయిభాష అయితే మరీ తేలికగా తెలిసి ΄ోతుంది. ఉత్తరదేశీయుల ఇంగ్లీషుకి, తెలుగువారి ఇంగ్లీషుకి, తమిళుల ఇంగ్లీషుకి, బెంగాలీల ఇంగ్లీషుకి తేడా స్పష్టంగానే కనిపిస్తుంది. విదేశీయులది సరే సరి. మాట వినగానే ఎక్కడివాళ్ళో వెంటనే తెలిసి΄ోతుంది. ఇక శరీరం తిన్న ఆహారాన్ని ప్రకటిస్తుంది. ఎటువంటి ఆహారం ఎంత తింటారు అన్నది ఆకారాన్ని చూసి చెప్పవచ్చు. మితాహారుల శరీరం చూడ ముచ్చటగా ఉంటుంది. అన్నీ నోటితో చెప్పనక్కర లేదు. చూడగానే తెలిసి΄ోతాయి. మన గురించి మంచి అభి్ర΄ాయం ఎదుటి వారికి కలగాలంటే ప్రవర్తనని, భాషని, ఆహారపుటలవాట్లని సరిచేసుకుంటే సరి. చదవండి: Diwali 2025 : ఈ ఏడాది అద్భుతం విశిష్టత ఏంటి? శుభ ముహూర్తం!– డాక్టర్ ఎన్. అనంతలక్ష్మి -
భర్త క్షేమం కోరి కర్వా చౌత్ ఉపవాసం ఉంటే..పాపం విధి మరోలా..
"ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు" అన్న పాటలానే జీవితం ఉంటుంది. అప్పటి వరకు మనతో ఆడుతూ పాడుతూ సందడి చేసినవాళ్లు హఠాత్తుగా మనల్ని వదిలేసి వెళ్లిపోతే కచ్చితంగా ఠక్కున మన ఘంటసాలగారు పాడిన పాటల మదిలోకి వచ్చేస్తుంది. మనం ఒకటి అనుకుని సరదాగా గడిపితే విధి మరోలా మన కథ రాసేస్తుంటుంది. అలాంటి విషాద ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. ఈ దురదృష్టకర సంఘటన పంజాబ్లో జరిగింది. పంజాబ్లోని బర్నాలాలో కర్వాచౌత్ వేడుకల సందర్భంగా తన భర్త దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉంది 59 ఏళ్ల ఆశా రాణి. దక్షిణ భారతదేశంలో జరుపుకునే అట్లతద్ది మాదిరిగా జరుపుకునే పండుగే ఈ కర్వా చౌత్. అయితే ఈ కర్వాచౌత్ పండుగలో ఉపవాస విరమణ భర్తచేతుల మీదుగా జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే ఈ ఆశారాణి అనే మహిళ కూడా భర్త క్షేమం కోరి ఉపవాసం ఉంది. అయితే ఈ వేడుకను ఆ రోజు(శుక్రవారం) సాయంత్రం స్నేహితుల ఇంటిలో జరుపుకోవాలని భావించి మనవరాలు, భర్తతో కలిసి వాళ్ల ఇంటికి వెళ్లారు. అక్కడ చంద్రుడి రాకకై నిరీక్షిస్తూ..అంతా సందడి సందడిగా గడిపారు. ఈలోపు నీరసం రాకుండా ఉత్సాహంగా ఉండేలా కాస్త ఆటపాటలు, నృత్యాలతో నిరీక్షిస్తున్నారు. ఈ ఆశారాణి కూడా అందులో భాగంగానే ఓ పాటకు వారందరితో కలిసి నృత్యం చేస్తూ..ఒక్కసారిగా కుప్పకూలిపోయింద. సకాలంలో వైద్యుడి వద్దకు తీసుకువెళ్లినా.. ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆమె మరణించినట్లు దృవీకరించారు వైద్యులు. అప్పటిదాక ఆనంద సంతోషాలతో తేలియాడిన ఆ రెండు కుటుంబాలు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయాయి. భర్త దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉండి..ఆమెనే సుమంగళిగా మృత్యుఒడికి వెళ్లిపోయిందంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలిపించారు. ఇలాంటి ఘటనలు చూడగానే.. ఏ క్షణంలో ఏం జరగుతుందో ఎవ్వరికీ తెలియదు..విధి చాలా బలీయమైనది అన్న మాటలు స్పురణకు వస్తాయి కదూ..!. ..ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ..అప్పటి దాక ఆడిపాడి..మనముందే తనువు చాలిస్తే..ఆ బాధ అంత తేలిగ్గా మర్చిపోలేరెవ్వరూ..!. సో బీకేర్ఫుల్ ఇలాంటి విషయాల్లో..సదా అప్రమత్తంగా ఉండండి.Karwa Chauth celebration in Barnala turn tr@gic after woman coll@pses while dancing#KarwaChauth #KarwaChauthcelebration pic.twitter.com/dz3G5APp7r— True Scoop (@TrueScoopNews) October 13, 2025 (చదవండి: ఆ దంపతుల అభి‘రుచే’ సపరేటు.. అమెరికాలో వడాపావ్ పిక్నిక్కి అదే రూటు) -
ఆ దంపతుల అభి‘రుచే’ సపరేటు.. అమెరికాలో వడాపావ్ పిక్నిక్కి అదే రూటు
న్యూయార్క్ నగరంలోని మాన్ హట్టన్ లోని సెంట్రల్ పార్క్, ప్రశాంతమైన సరస్సులు, పచ్చని పచ్చిక బయళ్లు, వనాలకు పేరొందింది. ఇక్కడే ఉన్న సెంట్రల్ పార్క్ జూ బెథెస్డా టెర్రస్ వంటి ప్రత్యేక ఆకర్షణలకు కూడా ఇది చిరునామా. అయితే ఇప్పుడు అది మరికొన్ని వైవిధ్యభరిత రుచులకు కూడా చిరునామాగా మారింది. ముఖ్యంగా భారతీయ రుచుల కోసం వెతుకుతున్న ఆహార ప్రియులకు అది తప్పనిసరి సందర్శనీయ స్థలంగా కూడా అవతరించింది. ఈ పార్క్ మధ్యలో తాజాగా తయారుచేసిన వడ పావ్ల సువాసన నాసికకు సోకుతుంటే ఆ ఉద్యానవనం మీదుగా వెళ్లే ఇండియన్ రుచుల అభిమానులు ఆగగలరా? ఇంతకీ ఈ పార్క్లో మన వంటల మార్క్ ఎలా సాధ్యపడింది?ఈ ప్రశ్నకు సమాధానం న్యూయార్క్లో నివసిస్తున్న భారతీయ జంట షౌనక్ శివానీలు మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే వారి ప్రత్యేకమైన ’వడ పావ్ ప్రాజెక్ట్’ ఆలోచన దీని వెనుక ఉంది కాబట్టి. మహారాష్ట్రలోనే పుట్టి పెరిగిన వారికి వడా పావ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ఆ వంటకం దొరకని ప్రదేశంలో సదరు మహారాష్ట్రీయుల్ని ఉంచడం అంటే వారి జిహ్వకు ఎంత లోటో కూడా చెప్పనక్కర్లేదు. అదే విధంగా ఈ జంట కూడా న్యూయార్క్కు వెళ్లాక తమకు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ ఐటమ్, భారతీయ సంప్రదాయ వంటకాల్లో పేరొందిన వడ పావ్ను మిస్ అయ్యారు. మసాలాతో వేయించిన బంగాళాదుంప ముద్దని మృదువైన బన్ లోపల ఉంచి, టాంగీ, స్పైసీ చట్నీలతో చవులూరింపచేసే ఈ వంటకం మిస్ అవడం కన్నా బాధ ఏముంటుంది? అంటూ వాపోయారా దంపతులు.‘ఈ నగరంలో దోసెలు, పానీపురి, కతి రోల్స్( విభిన్న రకాల వెరైటీలను రొట్టెల్లో చుట్టి అందించేవి) అందించే స్టాల్స్ చాలా ఉన్నప్పటికీ, ఇప్పటికీ వడ పావ్ మాత్రం ఇక్కడకి రాలేదు‘ అని శివాని తన అభిమాన వంటకం లేకపోవడం గురించి పంచుకున్నారు. దాంతో ‘మేం పటేల్ బ్రదర్స్(అమెరికాలో భారతీయ ఉత్పత్తులకు పేరొందిన స్టోర్)కు ట్రిప్లు వేశాం, మా రెసిపీతో ప్రయోగాలు చేశాం, చట్నీలను తయారు చేసాం ఓ ఫైన్ మార్నింగ్ నుంచి సెంట్రల్ పార్క్లో వడ పావ్ పిక్నిక్లను నెలవారిగా నిర్వహించడం ప్రారంభించాం‘ అంటూ వీరు చెబుతున్నారు.వీరి ప్రాజెక్టుకు అక్కడి భారతీయుల నుంచే కాక స్థానికుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. ‘మేం ఇప్పటికే వందలాది మందికి పైగా వడ్డించాం అందరి ప్రేమ అభిప్రాయాలకు చాలా కృతజ్ఞతలు. ఇకపై మా నెలవారీ కార్యక్రమాలను మరింత ఉత్సాహఃగా కొనసాగించాలని ఆశిస్తున్నాం‘ అని వారు అంటున్నారు. వీరి రుచుల పిక్నిక్ ఆన్ లైన్ లో కూడా అనేకమందిని ఆకర్షించింది, నెటిజన్లు ఎందరో ఈ ప్రయత్నాన్ని ప్రశంసించారు. ‘అద్భుతం అని ఒకరంటే..‘‘ మాకు కూడా చికాగోలో ఒకటి అవసరం’’ అని మరొకరు, ‘ఓరి దేవుడా, ఇది ఎప్పటి నుంచో నా మనసులో ఉంది. ఇప్పటికి నిజమవడం చూసి చాలా సంతోషంగా ఉంది’’ అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ‘‘ ఈ నగరానికి ఖచ్చితంగా వడ పావ్ అవసరం. ఇక్కడ మిలియన్ బేకరీలు ఉన్నప్పటికీ, ప్రపంచంలోని ఏ బ్రెడ్ ముంబై పావ్తో సరిపోలదు‘ అంటూ ఒక వడ పావ్ ప్రేమికుడు సగర్వంగా ఆన్లైన్లో తన అభిప్రాయం పంచుకున్నారు. ఒక భోజన ప్రియుడు మరింత ముందుకెళ్లి ‘అమెరికాలో ప్రతి మూలలో తాజా వడా పావ్, దబేలి, భేల్పురి చాట్ అవసరం’’ అంటూ తేల్చేశాడు. View this post on Instagram A post shared by The Vada Pav Project (@thevadapavproject) (చదవండి: Success Story: అతను ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్ కాదు..కానీ సంపదలో అదానీ రేంజ్..!) -
పాపాయితోనే మాస్టర్స్..కానీ గ్రాడ్యుయేషన్ ఈవెంట్కి డబ్బుల్లేక అలా చేశా!
కష్టపడి చదువుకోవడం ఒక ఎత్తైతే, ఆ సర్టిఫికెట్ను అందుకోవడం మరో ఎత్తు. గ్రాడ్యుయేషన్ విద్యార్థుల జీవితాల్లో, కరియర్లో అదొక అద్భుతమైన అనుభూతి. గ్రాడ్యుయేషన్ డ్రెస్లో తోటివారితో పాటు వేదికపై నిలబడటం, హితులు, సన్నిహితుల సమక్షంలో గర్వంగా పట్టా పుచ్చుకోవడం అనేది చాలా అరుదుగా సాధించగల అనుభూతి. కానీ అలాంటి ఆనందాన్ని మిస్ అవడం నిజంగా చెప్పలేనంత దురదృష్టమే. అలాంటి అనుభవాన్ని డిజిటల్ క్రియేటర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది నెట్టింట పలువురి హృదయాలను దోచుకుంది.డిజిటల్ క్రియేటర్, రషికా ఫజాలి తన గ్రాడ్యుయేషన్ అనుభవాన్ని పంచుకున్నారు. గ్రాడ్యుయేషన్ ఈవెంట్లో పాల్తొనాలనే ఆమె డ్రీమ్ సాకారం కాలేదు.కేవలం ఆర్థిక సమస్యల కారణంగా దాన్ని మిస్ అయ్యానని చెప్పుకొచ్చింది. ఆరోజు కేవలం జనంలో అతిథిగా కూర్చోవాల్సి వచ్చిందంటూ హృదయాన్ని కదిలించే స్టోరీ షేర్ చేశారు."నేను నా స్వంత గ్రాడ్యుయేషన్కు అతిథిగా ఉన్నాను" అనే శీర్షికతో ఇన్స్టాగ్రామ్లోచేసిన పోస్ట్ వైరల్గా మారింది. అప్పట్లో ఆ వేడుకకు డబ్బు చెల్లించడం కంటే నెల గడవడమే తనకు ముఖ్యమని ఫజాలి పేర్కొన్నారు. నిజంగా ఆ క్లోక్ ధరించాలని చాలా కోరిక ఉండేదని, కానీ మిస్ అవ్వడం తీపి చేదు కలయిక క్షణాలని, వేడుకకు అతిథిగా హాజరు కావాలనే తన నిర్ణయం అత్యంత దారుణమైందని గుర్తు చేసుకున్నారు. అయితే తనను ప్రోత్సహించిన తన తోటివారిని అభినందించే అవకాశం వచ్చినందుకు సంతోషించాననీ, కనీసం ఆ ఆనంద జ్ఞాపకాలు తనలో మిగిలాయని చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Rashika Fazali (@rashikariri)బిడ్డకు తల్లిగాఒక బిడ్డకు తల్లిగా క్లిష్టమైన బాధ్యతలను నిర్వర్తిస్తూనే రషికా మెరిట్తో పట్టభ్రదురాలైంది. రిసెర్చ్లో డిస్టింక్షన్ తెచ్చుకుంది. అదీ చిన్ని పాపాయిని ఎత్తుకుని ఎవరి సాయం లేకుండానే, మాస్టర్స్ సాధించానంటూ గర్వంగా చెప్పుకుంది. దీంతో నెటిజన్లు ఆమెను ప్రశంసల్లో ముంచెత్తారు. అయ్యో... అప్పుడు తమకీ విషయం తెలిసి ఉంటే, సాయం చేసేవారమని చాలామంది కమెంట్ చేశారు. "ఎంత గొప్ప విజయం! భవిష్యత్తులో ఇంకా సాధిస్తారు! అలా కూర్చోవడానికి చాలా ధైర్యం అవసరం! అని ఒకరు, ‘‘గ్రాడ్యుయేషన్కు అభినందనలు మీరు నిజంగా క్వీన్," మరొకరు కామెంట్ చేశారు. నాకు తెలిసి ఉంటే కచ్చితంగా సాయం చేసే దాన్ని.. సాయంగానో, ఉపకారంగానో కాదు ఒకబిడ్డకు తల్లిగా ఇది సాధించడంఎంత కష్టమో తెలుసు అన్నారు మరొకరు. -
అతను ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్ కాదు..కానీ సంపదలో అదానీ రేంజ్..!
కొన్ని సక్సెస్ స్టోరీలు ఎంతలా ప్రేరేపిస్తాయంటే.. జీరో నుంచి మిలియనీర్గా అవతరించడం ఎలా అనేది నేర్పిస్తాయి. తాతల తండ్రులు కాస్త సంపాదించే పెడితే కదా జీవితం బాగుండేది..మంచి చదువులు చదవగలిగేది అనుకుంటారు చాలామంది. అవన్నీ సాధించడం చేతకాని వాడు చెప్పే చెత్తకబుర్లే అవి పలువురు విజేతలు ప్రూవ్ చేశారు. అలాంటి కోవకు చెందిన వాడే ఈ వ్యక్తి. అతడికి ఎలాంటి వ్యాపార సామ్రాజ్య వారసత్వం లేకపోయినా.. కేవలం తనపై ఉన్న అచంచలమైన నమ్మకం, పట్టుదలతో కుభేరులు అవ్వొచ్చని చూపించి..ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు.అతడే గుజరాత్కి చెందిన పంకజ్ రామన్భాయ్ పటేల్(Pankaj Ramanbhai Patel). కోటీశ్వరుడి కావాలంటే వారసత్వం, వ్యాపార సామ్రాజ్యం ఉండాల్సిన పనిలేదంటాడు పటేల్. ఆయన సంపదలో గౌతమ్ అదానీ తర్వాత రెండో అత్యంత ధనవంతుడిగా రికార్డులకెక్కాడు. ఆయన సంపద విలువ అక్షరాల రూ. 84,510 కోట్లు. ఆయన ఓ సాదాసీదా కంపెనీలో జాయిన్ అయ్యి..దాన్ని లాభాల బాట పట్టించి.. నెంబర్ వన్ స్థాయిలో నిలబెట్టడమే కాదు దానికే నాయకత్వం వహించే రేంజ్కి వచ్చాడు. ఫార్మసి, లైఫ్సైన్సు అండ్ లాలో డిగ్రీలు చేసిన ఆయన..తరుచు ఏం చేయాలి,..ఏంటి లక్ష్యం అని ఆలోచిస్తుండేవాడు. అలా కాడిలా హెల్త్కేర్ అనే ఒక చిన్న కంపెనీలో చేరాడు. ఆయన ఉద్యోగిగా మొదలైనప్పుడూ ఆ కంపెనీ చాలా సాదాసీదా కంపెనీ. అయితే పంకజ్ పర్యవేక్షణలో శరవేగంగా అభివృద్ధి బాటలో పయనించి..కాడిలా జైడస్ లైఫ్సైన్సెస్గా పరిణామం చెందింది. ఇప్పుడు ఏకంగా భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ ఫార్మాస్యూటికల్ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. ఆ సమయంలోనే ఆయన పేరు బయటకొచ్చింది..ఆయన ఎదుగుదలను కూడా అత్యంత నిరాడంబరంగానే ఉంటుంది. ఎక్కడ ఎలాంటి పబ్లిసిటీలకు చోటివ్వరాయన. కోవిడ్ సమయంలోనే ఆయన పేరు బయటకొచ్చింది. అప్పటి దాక ఏ సరికొత్త టీకాలు లేదా ఔషధాల ఆవిష్కరణకు విదేశాల ధ్రువీకరణ తప్పనిసరిగా ఉండేది. కానీ ఆ కష్ట సమయంలో జైడస్ భారతదేశంలో మొట్టమొదటి DNA-ఆధారిత COVID-19 వ్యాక్సిన్ అయిన జైడస్ జైకోవి-డిని అభివృద్ధి చేసి..అతిపెద్ద శాస్త్రీయ విజయం అందుకుంది. పైగా దీనికి విదేశీ ధ్రువీకరణతో పనిలేదంటూ ఓ సరికొత్త మైలురాయిని సాధించింది. ఇక పంకజ్ వ్యక్తిగతం జీవితం దగ్గరకి వచ్చేటప్పటికీ..ఆయన ప్రీతి పటేల్ని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. ఆయన కుమారుడు డాక్టర్ షార్విల్ పటేల్ ఆ కంపెనీలోనే మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఇక కూతురు శివాని కూడా అన్న బాటలో పయనిస్తున్నారు. ఇక 2003లో పంకజ్ పటేల్కు ఉత్తమ ఫార్మా మ్యాన్ ఆఫ్ ది ఇయర్గా అవార్డు లభించింది. ఈ గుర్తింపుని సైతం ఆయన నిశబ్దంగానే సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక పంకజ్ వృద్ధి అనేది మంచితన లేకుండా సాధ్యం కాదని గట్టిగా నమ్ముతారు. ఆ నేపథ్యంలోనే విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి వాటికి తనవంతుగా సహాయ సహకారాలు అందించారు. అహ్మదాబాద్లో ఉండే ఇల్లు ఆయన ఆలోచనలకు అనుగుణంగా అత్యంత సాదాసీదా ఉంటుంది . ఆయన ఎప్పుడు చెప్పేది ఒక్కటే..నిలకడగా ఉండటం అలవర్చుకుంటే..ఏదైనా సాధించొచ్చు అని. ఒకటి అనుకుని ఇంకొకటి చేస్తూ..అస్థిర మనసుతో ఉంటే.. ఏం సాధించలేం అని సదా చెబుతుంటారాయన. ఏపనైనా ఎంచుకునేటప్పుడూ..వందశాతం కచ్చితత్వం, స్తిరత్వంతో(నిలకతో) చేయాలి. అప్పుడు ఎలాంటి రంగంలోనైనా మంచి విజయాన్ని అందుకుంటామని నొక్కి చెబుతున్నారు పంకజ్ రామన్భాయ్ పటేల్. (చదవండి: Sherry Singh: భారత్కు తొలిసారి మిసెస్ యూనివర్స్ కిరీటం.. భార్యగా, తల్లిగా ఆమె చరిత్ర..) -
ఈ ఏడాది దీపావళి అద్భుతమే : విశిష్టత ఏంటి? శుభ ముహూర్తం!
వినాయకచవితి, దసరా వేడుకల తరువాత చిన్నా పెద్దా అంతా ఏంతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగ దీపావళి (Diwali 2025). ఆశ్వీయుజ అమావాస్య నాడు వచ్చే, వెలుగు దివ్వెల పండుగ. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 20వ తేదీన వచ్చింది. ఈసారి గ్రహాల అద్భుతమైన కలయిక అని, చాలా ఏళ్ల తరువాత వచ్చే ఈ కలయికే ఈ దీపావళి ప్రత్యేకత అని జ్యోతిష్య పండితులు చెపుతున్నారు.ఈ ప్రత్యేక సంయోగ సమయంలో లక్ష్మీదేవిని పూజించడం చాలా ఫలవంతమైనదనీ, ఇంటిల్లి పాదికీ సుఖ సంతోషాలను తెచ్చిపెడుతుందని చెబుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ దీపావళి పూజకు శుభముహూర్తం, పూజ గురించి తెలుసుకుందాం.శుభముహూర్తం: అమావాస్య సోమవారం మధ్యాహ్నం 2:32 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 21వ తేదీ మంగళవారం సాయంత్రం 4:26 గంటల వరకు ఉంటుంది. కాబట్టి, ఈ సంవత్సరం, దీపావళిని 20వ తేదీ సోమవారం జరుపుకుంటారు.లక్ష్మీదేవి, గణేశుని పూజించడానికి పవిత్రమైన సమయం మధ్యాహ్నం 2:39 నుండి అర్ధరాత్రి వరకు.పూజకు శుభ సమయంకుంభ లగ్నము మధ్యాహ్నం 2:09 నుండి మధ్యాహ్నం 3:40 వరకువృషభ లగ్నం సాయంత్రం 06:51 నుండి 08:48 వరకుసింహ లగ్నం ఉదయం 1:19 నుండి ఉదయం 3:33 వరకుగ్రహాల ప్రత్యేక కలయికదీపావళి రోజున, మూడు గ్రహాలు కలుస్తాయి. కుజుడు, సూర్యుడు , బుధుడు అందరూ కలుస్తారు. వారి మిశ్రమ ప్రభావం అన్ని రాశిచక్ర గుర్తుల ప్రజలకు శుభ ఫలితాలను తెస్తుందని నమ్ముతారు. కార్తీక అమావాస్య నాడు దీపావళి పూజను స్థిరమైన లగ్నంలో చేయడం ఆచారం. చాలా మంది స్థిరమైన లగ్నంలో మహాలక్ష్మిని పూజిస్తారు. స్థిరమైన లగ్నము (వృషభ, సింహ, వృశ్చిక, కుంభ) నందు అమావాస్య రాత్రి మహాలక్ష్మిని పూజించే వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని విశ్వాసం.మహాలక్ష్మి పూజ : మొదటి రోజు ధనత్రయోదశి, రెండో నరక చతుర్ధశి, మూడో రోజు దీపావళి , నాలుగో రోజు గోవర్ధన పూజ, , అయిదో రోజు భాయ్ దూజ్ ఇలా అయిదు రోజుల పాటు దీపావళి జరుపుకుంటారు. దీపావళి రోజు గణేశుడు, లక్ష్మి, ఇంద్రుడు, కుబేరుడు, సరస్వతి , కాళి మాతను పూజిస్తారు. దీపావళి రోజు సంపద, శ్రేయస్సుకు దేవతగా చెప్పుకునే లక్ష్మీదేవిని విధిగా పూజిస్తారు.ఇల్లంతా దీపాలతో అలంకరించి బాణా సంచాల పేల్చుకుని ఉత్సాహంగా గడుపుతారు. దీపావళి రోజున శ్రీయంత్ర పూజ ,ప్రతిష్ట ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుందని పండితులు చెబుతున్నమాట శ్రీ యంత్రాన్ని ప్రతిరోజూ పూజించే ఇంట్లో లేదా సంస్థలో ఎప్పుడూ డబ్బు కొరత ఉండదని నమ్మం.ధన త్రయోదశి: అక్టోబర్ 18న ధన త్రయోదశి. ఈ రోజున బంగారం, వెండి, లేది ఇతర ఏదైనా కొత్త వస్తువు ఇంట్లోకి తెచ్చుకోవాలని భావిస్తున్నారు. గోరెడు బంగారమైనా ఇంటికి తెచ్చుకుంటే తమ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని భావిస్తారు.నరక చతుర్దశి : రాక్షసుడైన నరకాసురుడిని వధించిప్రజలకు సుఖ సంతోసాలను పంచిన రోజు నరక చతుర్దశిగా జరుపు కుంటారు. పొద్దున్నే తలస్నానాలు చేసి కొత్త బట్టలు ధరిస్తారు.దీపావళిఅసురుడు నరకుడి పీడ వదిలిన సంతోషంలో జరుపుకునే పండుగ. విద్యుద్దీప కాంతులతో గృహాలన్నీ కళకళ లాడుతాయి. లక్ష్మీపూజ చేసుకొని, బాణసంచాపేల్చి నోరు తీపి చేసుకోవడం ఆనవాయితీ. అలాగే శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినందుకు చిహ్నంగా గోవర్ధన పూజను, అన్నాచెళ్లెళ్లఅనుబంధానికి ప్రతీకగా భాయి దూజ్ను జరుపుకుంటారు.అలాగే కొన్ని గోగు కర్రలతో దీపాలు వెలిగించి చిన్న పిల్లల చేత దివిటీలు కొట్టించడం ఆనవాయితీ. -
సరదా అకేషన్...మెట్రో స్టేషన్
హైదరాబాద్ నగరంలోని మెట్రో స్టేషన్లు ఎంటర్టైన్మెంట్ కేంద్రాలుగా నిలుస్తున్నాయి. కేవలం ప్రయాణానికే కాదు.. షాపింగ్ నుంచి సాంస్కృతిక కార్యక్రమాల వరకూ అన్నింటా ముందుంటోంది. ఆహార కేంద్రాలు, ఫొటో బూత్లు వంటివి ప్రయాణికులకు ఆలంబనగా నిలుస్తున్నాయి. నచ్చిన రుచులను ఆస్వాదిస్తూ.. ఇష్టమైన బ్రాండ్స్ను కొనుగోలు చేస్తూ.. సరదాగా కాసేపు కాలక్షేపం చేయాలనుకునే వారికి వేదికలుగా నిలుస్తున్నాయి. ఫొటోలు దిగుతూ.. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తూ.. బ్రాండెడ్ ఉత్పత్తులు దొరికే స్టోర్స్, సంగీత ప్రదర్శనలు.. ఇవన్నీ ఒకే చోట దొరకాలంటే చాలా మందికి బహుశా నగరంలో పేరొందిన మాల్సే గుర్తుకొస్తాయేమో.. కానీ ఆ జాబితాలోకి మేం కూడా వస్తున్నాం అంటున్నాయి మెట్రో స్టేషన్స్. – సాక్షి, సిటీబ్యూరోఅమీర్పేట మెట్రో స్టేషన్ ప్రస్తుతం నగరంలోని రోజువారీ మెట్రో ప్రయాణికులకు పరిచయమైన ఒక ఏరియా స్టాప్ కంటే చాలా ఎక్కువ. దీని సందడికి మెట్రో ఇంటర్చేంజ్ దోహదం చేస్తుండగా మరోవైపు ఈ స్టేషన్ ఒక చిన్న తరహా అధునాతన జీవనశైలి కేంద్రంగా రూపాంతరం చెందుతోంది. ఇక్కడ జూడియో వంటి పేరొందిన ఫ్యాషన్ అవుట్లెట్స్, కేఎఫ్సీ, థిక్షేక్ ఫ్యాక్టరీ, సబ్వే వంటి ఆహార పదార్థాలు దొరికే ఫుడ్ కోర్ట్ స్పాట్ను తలపిస్తుంది. దీంతో పాటు గిఫ్ట్ స్టోర్స్, గ్రోసరీ షాప్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లేవారు మాత్రమే కాదు పలువురు తమ కుటుంబాలతో కూడా ఇక్కడ తరచూ ఆగుతుంటాయి. ఇది ప్రయాణం కోసం మాత్రమే కాకపోవచ్చు ఓ సరదా సాయంత్రపు కాలక్షేపం కోసం, త్వరిత షాపింగ్ కోసం కూడా కావచ్చు. ఫొటో బూత్ అదనపు అట్రాక్షన్.. ఈ స్టేషన్లో పెరుగుతున్న ఆకర్షణల జాబితాకు సరికొత్త హంగులు తోడవుతున్నాయి. ఈ ట్రాన్సిట్ జోన్ను ఆకస్మిక జ్ఞాపకాల ప్రదేశంగా మారుస్తోంది రెట్రో–శైలి ఫొటో బూత్. అమీర్పేట మెట్రో స్టేషన్లోని మొదటి అంతస్తులో ఉన్న ఇన్స్టా స్నాప్ ద్వారా కొత్తగా ఏర్పాటు చేసిన ఫొటోబూత్ ప్రయాణికులను జ్ఞాపకాలను కాపాడుకోడానికి ఆహ్వానిస్తోంది. స్కూల్స్, కాలేజీలకు వెళుతున్నా, పనికి వెళ్తున్నా లేదా తదుపరి రైలు కోసం వేచి ఉన్నా, రోజువారీ రద్దీ నుంచి రిఫ్రెష్ చేసే మరో దారి ఈ బూత్. సిబ్బంది అవసరం లేని ఈ ఫొటో బూత్ పూర్తిగా ఆటోమేటెడ్ పోలరాయిడ్–శైలి ఫొటో స్ట్రిప్లను కేవలం రెండు నిమిషాల్లో అందిస్తుంది. ఇంటర్ఫేస్ స్క్రీన్–గైడెడ్ చాలా సులభం. బటన్ ప్రెస్ చేయడం, ఫొటో స్టైల్ ఎంచుకోవడం, స్కాన్ చేసి చెల్లించడం.. ఆపై నాలుగు సరదా భంగిమలను ఎంజాయ్ చేయడం.. సోలో షాట్ల నుంచి జంట క్లిక్లు లేదా గ్రూప్ స్నాప్ల వరకూ ఈ బూత్ అమీర్పేట మెట్రో స్టేషన్లో సెల్ఫీ ప్రియులకు సందర్శనీయ ప్రదేశంగా మారుతోంది. చదవండి: ముద్దుల కోడలితో నీతా అంబానీ : బుల్లి బ్యాగ్ ధర ఎన్ని కోట్లో తెలుసా?సోషల్ ఇన్స్టా జోన్లుగా.. ఫుడ్ కోర్టులు, షాపింగ్ కియోస్క్లు, గిఫ్ట్ స్టాల్స్, ఫ్యాషన్ అవుట్లెట్స్కు నిలయంగా ఉన్న అమీర్పేట్ మెట్రో స్టేషన్ ప్రస్తుతం సోషల్ మీడియా ఎంటర్టైన్మెంట్ వేదికగా నిలుస్తోంది. ఇన్స్టా, ఫేస్బుక్, స్నాప్చాట్ వంటి ఇంటరాక్టివ్ స్పాట్స్కు కేంద్రంగా నిలుస్తోంది. ముఖ్యంగా నగరంలోని యువత నిత్యం ఈ ప్రాంతం మీదుగా వెళ్లాల్సి రావడం, ఇది ఇంటర్ చేంజింగ్ స్పాట్ కావడం.. ప్రయాణీకుల టైంపాస్ కోసం ఏర్పాటు చేసిన వివిధ ఎంటర్టైన్మెంట్ వేదికలు కూడా దీనికి కారణాలుగా నిలుస్తున్నాయి. దీంతో ప్రజల కోసం మెట్రో స్టేషన్లో కలి్పంచే మౌలిక సదుపాయాలలోనూ వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈవెంట్స్ సైతం.. సిటీ మెట్రో స్టేషన్స్లో తరచూ సంగీతం, నృత్య ప్రదర్శనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. పరిమిత సంఖ్యలో కళాకారులను ఆహ్వా నిస్తూ సంగీత దినోత్సవాలు వంటివి ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా మెట్రో రైలు స్టాపులు ఇప్పుడు విందు, వినోద కేంద్రాలుగా అవతరిస్తున్నాయి.(వేయించుకు తినండి..అదిరిపోయే రుచి!) -
చూసే దృష్టిని బట్టే మంచైనా..చెడైనా..!
తమిళనాడు రాష్టం తిరుచ్చిలోని ఒక ఆడిటర్కి ఇద్దరు మగపిల్లలు. కవలలైన వారిద్దరూ ఫిజియో థెరపీ కోర్సు చేశారు. స్వంతంగా క్లినిక్ ప్రారంభించాలని అనుకున్నారు. లక్షలు ఖర్చుపెట్టి భవనాన్ని నిర్మించారు.క్లీనిక్ ప్రారంభించేముందు తిరుమలకెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందామని తిరుమల బయలుదేరారు. కొండమీద ఇసుక రాలనంత జనం ఉంది. వరాహస్వామి దర్శనం చేసుకుని ఓపికగా క్యూలో నిలబడ్డారు. వైకుంఠం కాంప్లెక్స్లో దేవస్థానం వారు అందించిన వేడివేడి పాలు తాగారు. చిన్న చిన్నగా క్యూ కదిలింది.‘కష్టపడి చదివాము, భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఆందోళనగా ఉంది’ అని కొడుకులిద్దరూ తండ్రితో చె΄్పారు. ‘‘ఏదైనా మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. ధైర్యంగా ఉండండి’’ అని బదులిచ్చాడు తండ్రి.ఇంతలో జనం తోసుకోవడం ప్రారంభమయ్యింది. మహాద్వారం వరకు ఒక్కటిగా వచ్చిన ముగ్గురూ వేరయ్యారు. విడివిడిగా దర్శనానికి వెళ్ళారు.ఆరోజు గురువారం కావడంతో మూలవిరాట్టు పైన నగలేమీ లేవు. స్వామివారి నొసటిపై పెద్దగా ఉన్న పచ్చకర్పూరపు నామాన్ని అర్చకులు బాగా తగ్గించి ఉన్నారు. అందువల్ల భక్తులకు శ్రీవారి నేత్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేత్ర దర్శనం చేసుకుని హుండీలో కానుకలు సమర్పించి ఉచిత ప్రసాదం ఇచ్చే చోట ముగ్గురూ కలిశారు. చిన్న లడ్డులు అందుకున్నారు.‘‘ఎలా జరిగింది దర్శనం?’’ అని తండ్రి ఇద్దరినీ అడిగాడు. పెద్దబ్బాయి ముఖం నల్లగా పెట్టి ‘‘దర్శనమైతే అయ్యింది కానీ, జనం నన్ను తొక్కేశారు. ఒళ్లంతా హూనమయ్యింది’’ అని బదులిచ్చాడు. చిన్నబ్బాయి మెరుపు ముఖంతో ‘‘స్వామి దర్శనంతోపాటు ఒళ్ళంతా ఫిజియో థెరపీ చేసుకున్నట్లయ్యింది. ఇప్పుడు నా శరీరం తేలికగా ఉంది’’ అన్నాడు. వెంటనే తండ్రి ‘‘గులాబీ తోటలోకి వెళ్ళిన కొందరు అందమైన గులాబీ పూలను చూస్తారు. మరికొందరు గులాబీ ముళ్ళను చూస్తారు. అలాగే మన జీవితాన్నీ, వృత్తినీ మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. మంచిగా ఆలోచిస్తే అంతా మంచే, చెడ్డగా ఆలోచిస్తే అంతా చెడ్డే’’ అన్నాడు. నాన్న చెప్పిన మాటల్లోని అంతరార్థం తెలుసుకున్న కొడుకులిద్దరూ లడ్డు తింటూ మనసులోనే గోవింద నామస్మరణలు చేస్తూ చిన్నగా గుడి బయటికి వచ్చారు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు (చదవండి: దీపావళి 2025: ఆ పండుగ పేరుతోనే రెండు గ్రామాలు..కానీ అక్కడ..) -
భారత్కు తొలిసారి మిసెస్ యూనివర్స్ కిరీటం.. భార్యగా, తల్లిగా ఆమె చరిత్ర..
అంతర్జాతీయ అందాల పోటీల్లో భారత్ విజయ కేతనం ఎగురవేసింది. భారత్కు చెందిన షెర్రీ సింగ్ మిసెస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని దక్కించుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా, మొట్టమొదటి తల్లిగా చరిత్ర సృష్టించారు. ఫిలిప్పీన్స్లోని మనీలాలో జరిగిన 48వ ఎడిషన్ పోటీలో ప్రపంచ వ్యాప్తంగా ఆమె సుమారు 120 మందితో పోటీ పడి కిరీటాన్ని దక్కించుకున్నారు.తొమ్మిదేళ్ల క్రితం సికందర్ సింగ్ అనే వ్యక్తితో పెళ్లి, ఒక కుమారుడు ఉన్న షెర్రీ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. "ఈ విజయం హద్దులు దాటి కలలు కనే ప్రతి మహిళదీ. బలం, దయ, పట్టుదల మహిళ నిజమైన అందానికి నిదర్శనం అని అదే తాను ప్రపంచానికి చూపాలనుకున్నా." అంటూ భావోద్వేగంగా చెప్పారామె. అంతేగాదు ప్రతి గృహిణి తన కుటుంబాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ.. తను కన్న ప్రతి కలను నిజం చేసుకోగల సత్తా ఆమెకు ఉందని సగర్వంగా చెప్పింది. పైగా తన విజయం ప్రతి మహిళను ప్రేరేపించి అడ్డంకులను చేధించి తన లక్ష్యాన్ని చేరుకునేలా చేస్తుందని పేర్కొంది. కాగా, చరిత్రాత్మకమైన ఈ విజయం భారత్ను గర్వపడేలా చేసిందని మిస్ యూనివర్స్ పోటీ నిర్వాహకులు ప్రశంసించారు. ఆమెకు ఇన్స్టాలో 2.5 లక్షల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. View this post on Instagram A post shared by UMB PAGEANTS: MISS AND MRS INDIA (@umbpageants) (చదవండి: Karwa Chauth: భార్య కోసం బ్రిటిష్ వ్యక్తి కర్వా చౌత్ ఉపవాసం..! పాపం చంద్రుడి దర్శనం కోసం..) -
వెలుగుల పండుగ : రంగు రంగుల ప్రమిదలు రెడీ!
దీపావళి పర్వదినాన్న పురస్కరించుకుని ప్రమిదలతో పాటు బొమ్మల కొలువులు, వ్రతాలకు ఉపయోగించు కునే కుందుల తయారీలో మహిళలు నిమగ్నమయ్యారు. కుమ్మరి కళాకారులు సంప్రదాయబద్ధంగా చేతులతోనే ప్రమిదలతో పాటు కుందులు తయారుచేసి చక్కని డిజైన్లకు ఆకర్షణీయమైన రంగులు వేస్తూ మార్కెట్లోకి పంపిణీ చేస్తున్నారు. అమీర్పేటలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెనుక ఈ వృత్తి కళాకారులు, మహిళలు వీటి తయారీలో నిమగ్నమయ్యారు. కుందులకు, ప్రమిదలకు తగిన రంగులు అద్దుతూ ఆకట్టుకునేవిధంగా తీర్చిదిద్దుతున్నారు. వీటిని మార్కెట్లో విక్రయించేందుకు పలువురు వ్యాపారులు ఆర్డర్లు ఇవ్వడంతో తమకు చేతినిండా పని దొరికిందని మహిళలు చెబుతున్నారు. వీటి తయారీ కోసం ఈ కుటుంబాలన్నీ ముఖ్యంగా మహిళలు నిమగ్నమయ్యారు. ప్రతియేటా దీపావళికి రెండు నెలల ముందు నుంచే వీటి తయారీపై దృష్టి పెడతామని కుమ్మరి శ్రీను తెలిపారు. ఇదీ చదవండి: ముద్దుల కోడలితో నీతా అంబానీ : బుల్లి బ్యాగ్ ధర ఎన్ని కోట్లో తెలుసా? -
‘మిత్ర మండలి’ నిహారిక.. సందడి
దేశంలో అగ్రగామి ఇన్ఫ్లుయెన్సర్ అయిన వర్థమాన నటి నిహారిక ఎన్ఎం (Niharika NM) హైదరాబాద్ నగరంలోని శరత్ సిటీ మాల్లో ఆదివారం సందడి చేశారు. ప్రస్తుతం ‘మిత్ర మండలి’ సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా అరంగేట్రం చేస్తూ తెలుగు ప్రేక్షకుల ముందుకు మరికొద్ది రోజుల్లో రానున్నారు.ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రాండెడ్ ఫుట్ వేర్ బాటా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సంస్థ తన కొత్త కలెక్షన్లో భాగంగా ‘బ్రైటర్ మూమెంట్స్’ పేరుతో కొత్త ప్రొడక్ట్ను శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో (Sarath City Capital Mall ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నిర్వహించిన ఇంటరాక్టివ్ గేమ్స్, పండుగ పోటీలు నిహారిక ఉత్సాహంగా పాల్గొన్నారు. అభిమానులతో సెల్పీలు దిగుతూ మీట్–అండ్–గ్రీట్ (Meet and Greet) కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: ముద్దుల కోడలితో నీతా అంబానీ.. బుల్లి బ్యాగ్ ధర ఎన్ని కోట్లో తెలుసా? -
Diwali 2025: ఆ పండుగ పేరుతోనే రెండు గ్రామాలు..కానీ అక్కడ..
దీపావళి అనగానే టపాసులు, బాణ సంచాలతో సరదాగా సాగే పండుగ. పెద్దలు సైతం చిన్నపిల్లల్లా మారిపోయి ఎంజాయ్ చేసేలా చేసే వేడుక ఇది. ఈ పండుగ ఇంటే అందరికీ మహా ప్రీతి. అలాంటి పండుగ పేరుతోనే రెండు గ్రామాలు ఉన్నాయి. అది కూడా ఒకే జిల్లాలో రెండు గ్రామాల పేర్లు దీపావళి. అయితే ఒక చోట ఈ పండుగ ఐదు రోజులు పాటు ఘనంగా నిర్వహిస్తే..మరోచోట మాత్రం ఏ ఇంట్లో దీపమే వెలిగించరు. మరి ఆ పండుగ పేరుతో ఏర్పడిన ఆ రెండు గ్రామల వెనుక ఉన్న ఆసక్తికర కథేంటో తెలుసుకుందామా..!.. దీపాల కాంతితో కళకళలాడే ఈ దీపావళి పండుగ పేరుతో ఉన్న రెండు గ్రామాలు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. ఒకటి శ్రీకాకుళం జిల్లాకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న గారమండలంలో ఉండగా, మరొకటి టెక్కలి మండలం అయోధ్యాపురం పంచాయతీ పరిధిలో మరో గ్రామం ఉంది. ఈ రెండు గ్రామాల పేర్లు 'దీపావళి'. వాటికి ఈ పండుగ పేరు ఎలా వచ్చిందంటే..గారమండలంలోని ఊరుకి ఆ పేరు ఎలా వచ్చిందంటే..శ్రీకాకుళం ప్రాంతాన్ని పరిపాలించిన కళింగరాజు కూర్మనాథాలయానికి వచ్చే వారట. స్వామి దర్శనం చేసుకుని తిరిగి వెళుతుండగా.. స్ప్రుహ తప్పి పడిపోయారు. అప్పుడు అక్కడ ఉండే స్థానికులు ఆ రాజుకి సపర్యలు చేశారు. కొద్దిపేపటికి మెలుకువ వచ్చిన తర్వాత రాజు తనకు సపర్యలు చేసిన వారిని ఈ గ్రామం పేరెంటని అడగగా..తమ ఊరికి పేరు లేదని చెప్పారట గ్రామస్తులు. దాంతో రాజుగారు తనకు దీపావళి నాడు ఇక్కడి ప్రజలు ప్రాణదానం చేసి సాయం చేశారు కాబట్టి ఈ ఊరు పేరు 'దీపావళి' అని నామకరణం చేశారని అక్కడ స్థానికులు చెబుతున్నారు. అధికారిక రికార్డుల్లో సైతం ఈ గ్రామానికి అదే పేరు స్థిరపడి ఉండటం విశేషం. ఆ పండుగ రాజుగారి రాజరికదర్పానికి తగ్గట్టుగా ..ఆ రేంజ్లోనే అక్కడి ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారట. మొత్తం ఐదు రోజుల పాటు ఘనంగా ఈ పండుగను నిర్వహిస్తారట. అంతేగాదు గ్రామం మొత్తం వేల దీపాలను వెలిగించి..నాటి చారిత్రక ఘటనకు గుర్తుగా తమ గ్రామం ప్రమిదల కాంతితో దేదీప్యమానంగా వెలిగిపోయాల వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ ఊరికి మాత్రం గమ్మత్తుగా వచ్చిందా పేరు..శ్రీకాకుళం జిల్లాలోనే టెక్కలి మండలం అయోధ్యాపురం పంచాయతిలో ఉన్న ఈ గ్రామం పేరు కూడా 'దీపావళినే'. అయితే దీన్ని మొదట్లో చుట్టుపక్కల గ్రామల ప్రజలు దీపాల పేటగా పిలిచేవారట. రానురాను వాడుకభాషలో దీపావళి ఊరుగా స్థిరపడిందట . అయితే ఇక్కడ ప్రజలెవ్వరూ దీపావళి పండుగను జరుపుకోరు. అక్కడ ఏ ఒక్క ఒక్క ఇంట్లో కూడా ప్రమిదలు వెలిగించరు. ఎందుకంటే..ఎలుక కారణంగా దూరమైన పండుగ..పూర్వం ఈ గ్రామంలో ప్రతి ఇల్లు తాటాకు గుడిసెలే. పైగా కరెంటు సదుపాయం కూడా ఉండేది కాదట. దీంతో ఇళ్లల్లో నూనె దీపాలు వెలిగించి ఉంచేవారట. దీపావళి పండుగ రోజు ఓ ఎలుక దీపాన్ని దొర్లించడంతో ఓ గుడిసెకు అంటుకున్న మంటలు ఊరంతో వ్యాపించి..మొత్తం గ్రామంలో విషాదం నెలకొందట. దాంతో అప్పటి నుంచి ఈ గ్రామంలో దీపావళి పండుగనే జరుపుకోవడం లేదట. అంతేగాదు ఇక్కడ నాగుల చవితిని కూడా జరుపుకోరట. ఒకవేళ ఎవ్వరైన చేస్తే..ఆ ఇంట్లో ఎవ్వరో ఒకరు చనిపోవడం జరుగుతుందట. దాంతో అక్కడి స్థానిక ప్రజలు ఈ రెండు పండుగలను ఎట్టిపరిస్థితుల్లోనూ జరుపుకోరని చెబుతున్నారు. ఈ మూఢనమ్మకాలకు తిలోదాకాలు ఇచ్చి..ఎలాగైనా ఈ పండుగను మిగతా గ్రామాల మాదిరిగానే చేసుకోవాలని అక్కడి యువత గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు పలువురు పెద్దలు చెబుతుండటం విశేషం.(చదవండి: చంద్రభాగ బీచ్..! సైకత శిల్ప వేదిక..) -
ముద్దుల కోడలితో నీతా అంబానీ : బుల్లి బ్యాగ్ ధర ఎన్ని కోట్లో తెలుసా?
MMDiwali ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా దివాలీ బాష్లో స్టన్నింగ్ లుక్తో అలరించారు. 61ఏళ్ల వయసులో కూడా ఆరోగ్యంగా, అందంగా తనదైన ఫ్యాషన్ స్టైల్తో ఆకట్టుకుంటారు. అటు వ్యాపారవేత్తగా రాణిస్తూ, ఫిట్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు.అంతేకాదు మహిళలు 40 ఏళ్లు దాటిన తరువాత కనీసం వ్యాయామం యోగా లాంటివి చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటూమహిళలకు సందేశమిస్తారు. తాజాగా అరుదైన హెర్మేస్ జ్యువెలరీ బ్యాగ్ , కొలంబియన్ ఎమరాల్డ్స్తో సీక్విన్డ్ మనీష్ మల్హోత్రా చీరలో నీతా అంబానీ మరోసారి ఫ్యాషన్ ఐకాన్ అనిపించుకున్నారు.దీపావళి సమీపిస్తున్న తరుణంలో మనీష్ మల్హోత్రా ఎప్పటిలాగే తన ఇంట్లో బి-టౌన్ సెలబ్రిటీలతో గ్రాండ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ వేడుకకు మొత్తం బాలీవుడ్ పరిశ్రమ తరలివచ్చింది. అంబానీ ఫ్యామిలీకి చెందిన అత్తాకోడళ్ల ద్వయం చీరలలో అందరి దృష్టిని ఆకర్షించింది. (మూడు నెలలు ముహూర్తాలు లేవు..నగరానికి పెళ్లి కళ వచ్చేసింది!)బిలియనీర్ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ చైర్మన్,ముఖేష్ అంబానీ భార్య డిజైనర్ నీతా అంబానీ, చిన్నకోడలు రాధికా మర్చంట్తో చీరల్లో ఫెస్టివ్ల్ లుక్లో అదరగొట్టేశారు. ముఖ్యంగా నీతా బ్రైట్ సిల్వర్ వెండి సీక్విన్ సారీ, స్లీవ్లెస్ బ్లౌజ్తో క్లాసిక్ అండ్ ఫెస్టివ్ లుక్లో ఆకట్టుకున్నారు. దీనికి తగ్గట్టు స్పెషల్ హై జ్యువెలరీ కలెక్షన్ అద్భుతమైన ఎమరాల్డ్స్ చెవిపోగులు, వజ్రాల బ్రాస్లెట్తో హైలైట్గా నిలిచారు. ఇంకా తనదైన శైలిలో ధరించిన ప్రత్యేక ఎడిషన్ మినియేచర్ లగ్జరీ బిర్కిన్ మరో హైలైట్. వజ్రాలతో పొదిగి రోజ్ గోల్డ్తో తయారు చేసిన ఈ బ్యాగ్ ధర రూ.17.74 కోట్లు ఉంటుందని అంచనా. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) నీతా వెండి సీక్విన్ చీరను ధరించగా, కోడలు రాధిక ముత్యాలతో రూపొందించిన మనీష్ మల్హోత్రా చీరలో క్లాసీ వైబ్ను పంచారు. డీప్ నెక్లైన్ స్లీవ్లెస్ బ్లౌజ్, ఓపెన్ పల్లుతో స్టైల్ చేసింది. అలాగే అత్తగారిలాగానే తన లుక్కి మ్యాచింగ్ బ్యాగ్ ధరించింది. అత్తగారి చేయి పట్టుకుని నడిచి వచ్చిన తీరు అక్కడున్నవారినందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. -
చంద్రభాగ బీచ్..! సైకత శిల్ప వేదిక..
గండ శిలతో చెక్కిన శిల్పాలను చూస్తాం.పూరీ చెక్కుకున్న దారు శిల్పాలను చూస్తాం.చంద్రభాగలో సైకత శిల్పాలను కూడా చూస్తాం. అశోకుడి తొలి బౌద్ధచిహ్నం ధవళగిరి స్థూపం...దేశంలో పెద్ద ఉప్పునీటి సరస్సు చిలకాలేక్.శిల్పరాజాలు కందగిరి... ఉదయగిరి గుహలు. వీటన్నింటినీ ఒకే ప్యాకేజ్ టూర్లో చూస్తాం. అది కోణార్క్ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్ టూర్. ఫెస్టివల్ ఎప్పుడు జరుగుతుంది?డిసెంబర్ 1 నుంచి 5 వరకు...టూర్కి టికెట్ బుక్ చేసుకుందాం.ఇంటర్నేషనల్ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్ 2025. ఇది 15వ ఇంటర్నేషనల్ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్. ఈవేడుకలకు వేదిక ఒడిశా రాష్ట్రం, కోణార్క్లోని చంద్రభాగ బీచ్. 1వ రోజు..హైదరాబాద్ నుంచి బయలుదేరి భువనేశ్వర్కు చేరాలి. భువనేశ్వర్లోని బిజూ పట్నాయక్ ఎయిర్పోర్ట్లో టూర్ ఆపరేటర్లు రిసీవ్ చేసుకుంటారు. అక్కడి నుంచి పూరీకి ప్రయాణం. దారిలో ధౌలి స్థూప వీక్షణం. పూరికి చేరిన తర్వాత హోటల్ గదిలో చెక్ అవడం, రాత్రి బస.ధవళ గిరి స్థూపంకొండ మీద తెల్లటి స్థూపం. భువనేశ్వర్ నుంచి ఏడు కిలోమీటర్ల దూరాన పూరీకి వెళ్లే దారిలో ఉంటుంది. అశోక చక్రవర్తి బౌద్ధాన్ని స్వీకరించిన తర్వాత నిర్మించిన తొలి స్థూపం ఇది. కళింగ యుద్ధంలో జరిగిన రక్తపాతంతో మనసు కకావికలమైన అశోకుడు బౌద్ధం వైపు మరిలిన సంగతి తెలిసిందే. అశోకుడు శాంతి మార్గంలో జీవించడానికి నిర్ణయించుకున్న తర్వాత ఏర్పాటు చేసిన స్థూపం కావడంతో దీనికి శాంతి స్థూపం అని పేరు. బౌద్ధ సన్యాసులు ఈ స్థూపాన్ని సభక్తిగా దర్శించుకుంటారు.2వ రోజుతెల్లవారు జామున బయలుదేరి జగన్నాథుని దర్శనానికి వెళ్లాలి. ఇది ప్యాకేజ్లో వర్తించదు. పర్యాటకులు తమకు తాముగా వెళ్లి రావాలి. దర్శనం తర్వాత హోటల్కు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టూర్ సత్పద వైపు సాగిపోతుంది. చిలకా సరస్సు వీక్షణం తర్వాత తిరిగి పూరీకి చేరాలి. రాత్రి బస పూరీలోనే.జగన్నాథపురిపూరీ అని పిలిచే పట్టణానికి ఆ పేరు రావడానికి జగన్నాథుని ఆలయమే ప్రధానం. జగన్నాథపురి అనే పేరు నుంచి పురి అనే పేరు వ్యవహారంలో పూరీగా మారిపోయింది. ఈ ఆలయంలో బలభద్ర, సుభద్ర, జగన్నాథులు పూజలందుకునే దైవాలు. బలరాముడు, శ్రీకృష్ణుడు, వారి చెల్లెలు సుభద్ర విగ్రహాలు దారుశిల్పాలు. విగ్రహాల రూపం అసంపూర్తి రూపాలతో విచిత్రంగా ఉంటుంది. ఏటా జరిగే జగన్నాథుని రథయాత్ర ప్రసిద్ధి. ఇక్కడ భగవంతుడికి నివేదన చేసే వంటకాలు తయారు చేసే గది ‘రోసాఘర’ను కూడా చూడాలి. 56 రకాల పదార్థాలను వండుతారు. వంటకాల్లో ఉల్లి, వెల్లుల్లి వాడరు.సముద్రమంత సరస్సుచిలకా సరస్సు 11 వందల చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. మనదేశంలో తీర్ర΄ాంతంలో విస్తరించిన పెద్ద తీర సరస్సు ఇది. దయా నది, భార్గవి నది, మకర, మాలగుని, లునా నదుల నీరు బంగాళాఖాతం సముద్రంలో కలిసే చోట ఆటు΄ోట్లకు సముద్రపు నీరు వెనక్కు తోసుకు రావడంతో ఏర్పడిన ఉప్పు నీటి సరస్సు ఇది. మన తెలుగు రాష్ట్రంలో పులికాట్ సరస్సు కూడా అలాంటిదే. పులికాట్ సరస్సుకు వచ్చినట్లే ఖండాంతరాల నుంచి పక్షులు ఇక్కడికి కూడా ఏటా వలస వస్తాయి. గుడ్లు పెట్టి, పిల్లల్ని పొదిగి వాటికి రెక్కలు వచ్చిన తర్వాత తమతో తీసుకెళ్లిపోతాయి. చిలకా సరస్సు మరో ప్రత్యేకత ఏమిటంటే క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దం నుంచి విదేశీ వర్తక వాణిజ్యాలు జరిగిన ప్రదేశం ఇది. యునెస్కో సంస్థ చిలకా సరస్సును వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. సత్పద అనే ప్రదేశంలో సరస్సు మీద కొంత దూరం వెళ్ల్లడానికి ఒక ఫ్లాట్ఫామ్ ఉంటుంది. నీటి మీద విహారాన్ని ఆస్వాదించవచ్చు. 3వ రోజుబ్రేక్ఫాస్ట్, హోటల్ గది చెక్ అవుట్ చేసిన తర్వాత కోణార్క్కు ప్రయాణం. కోణార్క్ సూర్యదేవాలయ వీక్షణం, సాండ్ ఆర్ట్ ఫెస్టివల్ను ఆస్వాదించడం. సాయంత్రం భువనేశ్వర్కు ప్రయాణం. హోటల్ చెక్ ఇన్. రాత్రి బస భువనేశ్వర్లో.రథచక్రాలయంకోణార్క్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది యునెస్కో. సూర్యదేవాలయాన్ని చూడడం అంటే ఖగోళశాస్త్రాన్ని శిల్పాల రూపంలో తెలుసుకోవడం. ఆలయం ప్రాంగణంలోని సన్టెంపుల్ మ్యూజియాన్ని చూడడం మర్చి΄ోవద్దు. కోణార్క్ డాన్స్ ఫెస్టివల్ ఏటా అలరించేది. ఇప్పుడు సైకత శిల్ప కళల వేడుక కూడా తోడవడంతో కోణార్క్ పర్యాటకధామంగా మారింది.ఇసుక బొమ్మల కొలువుకోణార్క్లోని చంద్రభాగ బీచ్లో సాండ్ ఆర్ట్ కొలువు దీరి ఉంటుంది. ఈ ఏడాది డిసెంబర్ ఒకటి నుంచి ఐదవ తేదీ వరకు జరిగే ఈ ఫెస్టివల్కు దేశ విదేశాల సాండ్ ఆర్టిస్టులు పాల్గొంటారు. ప్రపంచ శాంతి, ప్రకృతి పరిరక్షణ వంటి థీమ్లతో ఒక్కొక్క ఆర్ట్ ఒక్కో సందేశాన్నిస్తుంది. సుదర్శన్ పట్నాయక్ సరదాగా మొదలు పెట్టిన సైకత శిల్పకళకు చక్కటి ఆదరణ లభించింది. ఎంతగా అంటే... ముఖ్యమైన సందర్భాలు, సామాజిక సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఆ అంశాన్ని పట్నాయక్ ఎలా రూపొందించాడో చూడడానికి టెలివిజన్ వార్తలను ఫాలో అయ్యేంతగా. ఇప్పుడు సుదర్శన పట్నాయక్ సాండ్ ఆర్ట్కి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. అతడి బాటలో ఈ తరం యువతీయువకులు సాండ్ ఆర్ట్లో శిక్షణ పొంది, ఒకరిని మించి మరొకరు చక్కటి సైకత శిల్పాలకు రూపమిస్తున్నారు.4వరోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత జాజ్పూర్కు ప్రయాణం. బిరజాదేవి శక్తిపీఠాన్ని దర్శించుకున్న తర్వాత రత్నగిరి బౌద్ధక్షేత్ర వీక్షణం. తిరిగి భువనేశ్వర్కు చేరాలి. రాత్రి బస భువనేశ్వర్లోనే.బిరజాదేవి ఆలయంఒడిశాలో బిరజ అనే పదానికి అసలు ఉచ్చారణ విరజ. గిరిజాదేవినే ఒడియా వాళ్లు బిరజాదేవి అంటారు. ఇది దుర్గాదేవి శక్తిపీఠం. విరజ క్షేత్రం అని కూడా అంటారు. ఇప్పుడు మనం చూసే ఆలయం 13వ శతాబ్దం నాటిది. రత్నగిరి బౌద్ధక్షేత్రం ఒక పురాతత్వగని. తవ్వేకొద్దీ విషయాలను వెల్లడిస్తోంది. రత్నగిరి బౌద్ధ క్షేత్రమే కాని ఇక్కడ హిందూ పౌరాణిక పాత్రల శిల్పాలు అనేకం ఉంటాయి. ఈ బౌద్ధక్షేత్రంలోని నిర్మాణాలు ఐదవ శతాబ్దం నుంచి మొదలై పదవ శతాబ్దం వరకు కొనసాగినట్లు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తవ్వకాల్లో నిర్ధారణ అయింది. 16వ శతాబ్దంలో వరదల్లో కప్పబడి పోవడంతో ఇక్కడ ఇంత గొప్ప నిర్మాణాలున్నాయనే విషయాన్ని కూడా మర్చిపోయారు. తవ్వకాల్లో దొరికిన శిల్పాలతో ఈ ప్రాంగణంలో మ్యూజియం ఉంది. రత్నగిరి, లలిత్గిరి, ఉదయగిరి గుహలను కలిపి డైమండ్ ట్రయాంగిల్గా పిలుస్తారు. 5వరోజుబ్రేక్ఫాస్ట్, గది చెక్ అవుట్ చేసిన తర్వాత లింగరాజ ఆలయానికి ప్రయాణం. ఆ తర్వాత ముక్తేశ్వర్ టెంపుల్, రాజారాణి టెంపుల్ వీక్షణం. మధ్యాహ్నం తర్వాత కందగిరి గుహలు, ఉదయగిరి గుహల్లో విహారం తర్వాత రాత్రి ఎనిమిది గంటలకు టూర్ నిర్వహకులు పర్యాటకులను భువనేశ్వర్లో ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తారు.ఆలయాల భువనంభువనేశ్వర్లో ఏమి చూడాలని అడిగితే లింగరాజ ఆలయం, ముక్తేశ్వర్, రాజారాణి ఆలయాలు అని ఒక్కమాటలో చెప్పవచ్చు. భువనేశ్వర్ గొప్పశిల్ప నిలయం. లింగరాజ ఆలయాన్ని దర్శించిన వాళ్లు, ఆలయం గురించి వివరించేటప్పుడు మొదటి మాటగా నిర్వహణ లోపాన్ని ప్రస్తావిస్తారు. చాలా మురికిగా ఉంటుందని ఆవేదన చెందుతారు. భారీ నిర్మాణం. ఆలయ నిర్మాణకౌశలం ప్రత్యేకంగా ఉంటుంది. మన దక్షిణాది నిర్మాణాలు, ఉత్తరాది నిర్మాణాలకు భిన్నమైన కళింగ నిర్మాణశైలి ఇది. ముక్తేశ్వర్ ఆలయంలో ఏకరాతి శిలాతోరణ ద్వారం గొప్ప శిల్పచాతుర్యమనే చె΄్పాలి. భువనేశ్వర్లోని రాజారాణి ఆలయం కూడా పుణ్యక్షేత్రమే. ఈ ఆలయ నిర్మాణం అంతా పసుపు, ఎరుపు సాండ్స్టోన్ల కలయిక. ఈ రెండు రంగుల రాళ్లను రాజారాణి రాళ్లుగా పిలుస్తారు. అందుకే ఇది శివాలయమే అయినా రాజారాణి ఆలయంగా వ్యవహారంలోకి వచ్చింది.కందగిరి ఉదయగిరి గుహలుకొండలను గుహలుగా తొలచడమే ఒక అద్భుతం అనుకుంటే గుహల్లోపల గోడల నిండుగా రకరకాల థీమ్లతో శిల్పాలుంటాయి. స్థూలంగా చూసినప్పుడు శిల్పాలన్నీ ఒకేరీతిలో ఉన్నట్లు అనిపిస్తాయి. కానీ నిశితంగా పరిశీలిస్తే పౌరాణిక కథల సన్నివేశాలు కళ్లకు కడుతాయి. చేతికందే ఎత్తులో ఉన్న శిల్పాలు యుద్ధానంతర దాడుల్లో ధ్వంసమైన వైనం కూడా అవగతమవుతుంది. ఉదయగిరి గుహల్లో గణేశ గుహను గమనించడం మర్చిపోవద్దు. పదడుగుల ఎత్తున్న కొండను తొలిచి వరండాలాగ మలిచారు. ఎదురుగా చెరుకు తింటున్న ఏనుగులు, ద్వార΄ాలకుల్లాగ సైనికులు, వరండా పైకప్పుకి స్తంభాల్లాగ చెక్కిన రాతిని కలుపుతూ నమస్కార ముద్రలో ఉన్న సాలభంజికలు... చూడ చక్కగా ఉంటాయి.టూర్ వివరాలివిఐఆర్సీటీసీ నిర్వహిస్తున్న ఈ టూర్ పేరు ‘కోణార్క్ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్’. ప్యాకేజ్ కోడ్ : ఎస్హెచ్ఏ42. ఇది ఐదు రోజుల టూర్. హైదరాబాద్ నుంచి మొదలై హైదరాబాద్కు చేరడంతో పూర్తవుతుంది. ఈ టూర్లో చిలకా లేక్, కోణార్క్ టెంపుల్, బిరజాదేవి ఆలయం, భువనేశ్వర్ ప్రదేశాలకు కవర్ అవుతాయి.నవంబర్ 30వ తేదీ 12.35 గంటలకు ‘6ఈ 6911’ ఫ్లైట్ హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 14.10 గంటలకు భువనేశ్వర్కు చేరుతుంది. డిసెంబర్ 4వ తేదీ రాత్రి ‘6ఈ 631’ ఫ్లైట్ 22.10 గంటలకు భువనేశ్వర్ నుంచి బయలుదేరి రాత్రి 23.55 గంటలకు హైదరాబాద్కు చేరుతుంది.టికెట్ ధరలిలాగ:సింగిల్ ఆక్యుపెన్సీలో 43,950 రూపాయలు. డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 34,800 రూపాయలు, ట్రిపుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 32,650 రూపాయలు. బుకింగ్ ఎలా:సంప్రదించాల్సిన చిరునామా: ఐఆర్సీటీసీ, సౌత్సెంట్రల్ జోన్, ఐఆర్సీటీసీ 9–1–129/1/302, థర్డ్ ఫ్లోర్, ఆక్స్ఫర్డ్ ప్లాజా, ఎస్డీ రోడ్, సికింద్రాబాద్, తెలంగాణ.ఫోన్ నంబరు: 040– 27702407– వాకా మంజులారెడ్డి,సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: Man Name Makes Record: 'పేరు'తో ప్రపంచ రికార్డు..! ఏకంగా చట్టంలోనే మార్పులు చేసి..) -
మూడు నెలలు ముహూర్తాలు లేవు..నగరానికి పెళ్లి కళ వచ్చేసింది!
అక్టోబర్, నవంబర్లో భారీగా ముహూర్తాలు ఉండడంతో పెళ్లి సందడి షురూ అయ్యింది. షాపింగ్ మాల్స్, వస్త్ర దుకాణాలు, బంగారం షాపులు కొనుగోలు దారులతో సందడి మారుతున్నాయి. రెండు నెలల పాటు పెద్ద సంఖ్యలో ముహూర్తాలు ఉండడం, ఆ తరువాత మూడు నెలల పాటు ఎలాంటి ముహూర్తాలు లేకపోవడంతో చాలా మంది ఈ రెండు నెలల్లోనే వివాహాలు జరిపించేందుకు ఆసక్తి చూపుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరో నగరంలో పెళ్లి సందడి మొదలైంది.. దీంతో నగరంలోని ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు, హోటళ్లు, కల్యాణ మండపాలకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. ఈ నెలలో ఇప్పటికే మొదటి వారంలో పెద్ద సంఖ్యలో వివాహ వేడుకలు జరిగాయి. అలాగే ఈ నెల 12వ తేదీ నుంచి నవంబర్ 27 వరకూ వరుస ముహూర్తాలు ఉన్నట్లు పురోహితులు చెబుతున్నారు. అక్టోబర్ 12 నుంచే హడావుడి మొదలైంది. దీంతో పాటు అక్టోబర్ 24, 26, 29, 30, 31 తేదీలు, నవంబర్ 7, 8, 15, 22, 26, 27 తేదీల్లో బలమైన ముహూర్తాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ తరువాత నవంబర్ 28 నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకూ మూఢాలు ఉన్నట్లు చెప్పారు. అంటే నవంబర్ చివరి నుంచి డిసెంబర్, జనవరి నెలల్లో ఎలాంటి ముహూర్తాలు లేవు. ఇంచుమించు మూడు నెలల పాటు వివాహాలు జరిపేందుకు అవకాశం లేకపోవడంతో చాలామంది ఈ రెండు నెలల్లోనే తమ ఇళ్లల్లో భాజా భజంత్రీలు మోగించాలని భావిస్తున్నారు. ఇదీ చదవండి: 5 నిమిషాల్లో జాబ్ కొట్టేసింది.. దెబ్బకి కంపెనీ సీఈవో ఫిదా! -
చాక్లెట్ ప్రేమికుల కోసం ‘ఉత్సవ టేబుల్’
అదేదో వ్యాపార ప్రకటనలో చెప్పినట్లు.. ‘తియ్యని వేడుక చేసుకుందామా’ అనే పదం ఎంత తియ్యగా అనిపిస్తుందో.. అదేరీతిలో.. సమయం సందర్భం ఏదైనా.. అది మొదలయ్యేది మాత్రం ‘తియ్యని వేడుక’తోనే.. ఇప్పుడీ సోదంతా ఎందుకంటే.. ప్రస్తుతం దీపావళి పండగ సమీపిస్తున్న నేపథ్యంలో స్వీట్స్కు ఉన్న ప్రాముఖ్యత వేరు. ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ తియ్యటి గిఫ్ట్ ప్యాకింగ్స్ ఎంచుకుంటారు.. ప్రతీ ఇంటా వెలుగులు చిమ్మే ఈ దీపావళి సీజన్లో మనం చేసుకునేది కేవలం ఉత్సవం కాదు.. ఓ ఆత్మీయ కలయిక. స్నేహాన్ని బలపరుచుకోవడం, ఆనందాన్ని పంచుకోవడం అనే భావనల సమ్మేళనం. దీపావళి నేపథ్యంలో నగరంలో స్వీట్లు, చాక్లెట్ల సందడి గురించి తెలిసిందే. అయితే ఈసారి పండుగకు పశ్చిమ గోదావరి జిల్లా కోకో తోటల నుంచి హైదరాబాద్ బంజారాహిల్స్ వరకూ సాగిన పంచదార రుచి కథలతో.. శ్రమ, కళ, ఫ్యాషన్ సమ్మిళిత చాక్లెట్ ఉత్సవాన్ని నగరవాసులకు పరిచయం చేస్తోంది మనం చాక్లెట్. ఈ సారి దీపావళి ఎడిషన్–2025లో భాగంగా మనం ‘ఉత్సవ టేబుల్’ అనే వినూత్న ఆలోచన చుట్టూ తన సృజనాత్మకతను విస్తరించింది. పంచుకోడానికి, రుచి చూడడానికి, ఆ అనుభూతిని పొందడానికి ఎన్నో మధుర క్షణాలను చాక్లెట్ రూపంలో అందించింది. పాశ్చాత్య శైలితో కాకుండా, భారతీయ భావనతో రూపొందిన ఈ కలెక్షన్లో ప్రతి డబ్బాలో గోదావరి కథలతో ఒక కొత్త అనుభవాన్ని పంచుతోంది. మనం చాక్లెట్ ఖార్ఖానా భారతదేశంలోని మొదటి చాక్లెట్ బ్రాండ్. ఈ ఖార్ఖానాలో ఆంధ్రప్రదేశ్లోని పశి్చమ గోదావరి జిల్లాలో పండించిన చక్కటి రుచి గల కోకో బీన్స్తో తయారు చేసిన చాక్లెట్తో తయారు చేయబడిన 300 కంటే ఎక్కువ ఉత్పత్తులు నగరంలోని విభిన్న రుచులను ఆస్వాదించే చాక్లెట్ ప్రియులను అలరిస్తున్నాయి. డిజిటల్ ఆర్టిస్ట్ నమ్రతా కుమార్ సృష్టించిన ప్రత్యేక డిజైన్లు ఈ ప్యాకేజింగ్కి కొత్త ఉత్సవ రూపాన్ని ఇస్తున్నాయి. ఆమె చిత్రాలలో కేవలం వేడుక కాదు, సమాజం, భాగస్వామ్యం, ఆనందం అనే విలువలు ప్రతిబింబిస్తున్నాయి. దీపావళి అనేది కేవలం వెలుగుల పండుగ కాదు, మనసులు దగ్గరయ్యే సందర్భం. ఆ భావనను మానం చాక్లెట్ తన ప్రత్యేక రుచులతో మరింత బలపరుస్తోంది. ఇండో–అమెరికన్ రుచులతో తయారు చేస్తున్న ఈ చాక్లెట్స్ ప్రత్యేకమైన వేగన్ స్టైల్లో తయారు చేశారు. ఈ చాక్లెట్స్ ఆరోగ్యకరమైన సమ్మేళనాలతో ఏ వయసు వారైనా ఇష్టంగా తీనగలిగే విధంగా రూపోందించారు. ఈ ఎడిషన్లో డార్క్చాక్లెట్–ఆరెంజ్ క్లస్టర్స్, గుంటూరు మిర్చి–డ్రింకింగ్ చాక్లెట్ మిక్స్, సీ సాల్ట్ స్ప్రింకిల్ థిన్స్, గోదావరి కోకో నిబ్స్ థిన్స్, నట్టీ ప్రాలిన్ బార్క్స్, పిస్తా ఫడ్జ్ ఇన్క్లూజన్ టాబ్లెట్, ఇండియన్ ఆరిజిన్ టాబ్లెట్ నెం.6 వంటి ప్రత్యేక ఉత్పత్తులు ఉన్నాయి. వేగన్ స్టైల్లో..(చదవండి: Man Name Makes Record: 'పేరు'తో ప్రపంచ రికార్డు..! ఏకంగా చట్టంలోనే మార్పులు చేసి..) -
మనిషి లక్షణాలు
ఒక వ్యక్తి గురించి తెలియటానికి వారి గురించిన పరిచయ పత్రమో, నివేదికో చదివిన దానికన్న, వారిని ప్రత్యక్షంగా చూస్తే బాగా తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది అన్నదాన్ని చాణక్యుడు చక్కగా తెలియ చేశాడు. ఆచారం కులాన్ని తెలియచేస్తుంది అన్నాడు. ‘‘కుల’’మంటే ఈనాడు మనమనుకునేది కాదు. ఒక వృత్తిని అవలంబించే వారి సముదాయం లేక సంఘం. ఆచారమంటే తరతరాలుగా వస్తున్న అలవాట్లు, పద్ధతులు, సంప్రదాయాలు మొదలైనవి. ఇవి ఒక కుటుంబానికి మరొక కుటుంబానికే మారిపోతూ ఉంటాయి. అటువంటిది వృత్తులని బట్టి మారటం సహజమే కదా! ఉదాహరణకి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి సమయపాలన, క్రమశిక్షణ తప్పులు లేకుండా ఎదుటివారికి అర్థమయ్యే విధంగా మాట్లాడటం మొదలైనవి అలవాటవుతాయి.అందుకే ఎవరైనా తాను నిక్కచ్చిగా ఉండి, ఎదుటివారిని కూడా అట్లా ఉండమంటే ‘‘మరీ క్లాసు టీచర్ లాగా వెంట పడుతున్నాడు’’ అనటం వింటూ ఉంటాం. పనిచేసే తీరుని బట్టి కూడా ఉపాధ్యాయవృత్తిలో ఉన్నవాళ్లని చెప్పవచ్చు. అన్ని వృత్తులు కూడా అంతే! కుల శబ్దానికి శీలమనే అర్థం కూడా చెప్పారు. శీలమైనా వ్యక్తమయ్యేది అలవాట్లలోను, పని చేసే తీరులోనే కదా! మాట తీరు ఆవ్యక్తి ఏ్రపాంతానికి చెందినవాడో తెలియచేస్తుంది. తెలుగు మాట్లాడేవాళ్ళే అయినా వాళ్ళు మాట్లాడే తెలుగు స్వస్థలం ఏదో చెప్పకనే చెపుతుంది. ‘‘ఈ పోరగాడు’’ అనగానే ఎక్కడివారో చెప్పనక్కర లేదు. ‘‘ఈ పిలగాడు’’ అని ఎవరంటారో అందరికి తెలుసు. ‘‘ఈ గుంటడు’’ అంటే ఉత్తరాంధ్ర నుండి వచ్చిన వారని చెప్పనవసరం లేదు. మాటలే కాదు మాటాడే తీరు, అంటే యాస వాళ్లెక్కడి వాళ్ళో పట్టిస్తుంది. అందుకే పండితులైన వాళ్ళు శిష్టవ్యవహారికం రాయటమే కాదు, మాట లో కూడా ప్రాంతీయత తొంగిచూడకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. అంటే యాసలో మాట్లాడటం తప్పో, తక్కువో అని కాదు. సమతని పాటించటం కోసం అంతే! అదే పరాయిభాష అయితే మరీ తేలికగా తెలిసి పోతుంది. ఉత్తరదేశీయుల ఇంగ్లీషుకి, తెలుగువారి ఇంగ్లీషుకి, తమిళుల ఇంగ్లీషుకి, బెంగాలీల ఇంగ్లీషుకి తేడా స్పష్టంగానే కనిపిస్తుంది. విదేశీయులది సరే సరి. మాట వినగానే ఎక్కడివాళ్ళో వెంటనే తెలిసిపోతుంది. ఇక శరీరం తిన్న ఆహారాన్ని ప్రకటిస్తుంది. ఎటువంటి ఆహారం ఎంత తింటారు అన్నది ఆకారాన్ని చూసి చెప్పవచ్చు. మితాహారుల శరీరం చూడ ముచ్చటగా ఉంటుంది. అన్నీ నోటితో చెప్పనక్కర లేదు. చూడగానే తెలిసిపోతాయి. మన గురించి మంచి అభిప్రాయం ఎదుటి వారికి కలగాలంటే ప్రవర్తనని, భాషని, ఆహారపుటలవాట్లని సరిచేసుకుంటే సరి. ఆచారః కుల మాఖ్యాతిదేశ మాఖ్యాతి భాషణంసంభ్రమః స్నేహ మాఖ్యాతివపురాఖ్యాతి భోజనం’’ నడవడిక కులాన్ని (శీలాన్ని), మాటతీరు ప్రాంతాన్ని, సంభ్రమం (మర్యాదచూపే తీరు) ప్రేమను, శరీరం ఆహారపు అలవాట్లను తెలుపుతాయి.సంభ్రమం అంటే మర్యాద చేయటానికి పడే హడావుడి, కంగారు. ఈ సంభ్రమం ఎంతప్రేమ ఉన్నదో తెలియచేస్తుంది. ఇష్టమైనవాళ్ళు వస్తున్నారంటే కాళ్ళుచేతులు ఆడవు. వాళ్ళకి నచ్చినట్టు చేయాలనే తాపత్రయంలో ఒకదానికి ఒకటి చెయ్యటం కూడా కద్దు. ఆ విధంగా పొరబడటం అవకతవకగా చెయ్యటం ప్రేమకి చిహ్నమే కాని, చేతకానితనం కాదు. కృష్ణుడు తన ఇంటికి వచ్చాడన్న ఆనందంలో విదురుడు అరటిపండ్లు ఒలిచి ప్రేమగా పెడదామనుకుని, తొక్కలు కృష్ణుడి చేతిలో పెట్టి, పండు బయట పడేశాడుట! కృష్ణుడు ఆప్యాయంగా ఆ తొక్కలని తిన్నాడు ఆ సంభ్రమం వెనక ఉన్న ప్రేమని గుర్తించాడు కనుక. అదే ఇష్టంలేని వాళ్ళు వస్తే ఉన్నచోటు నుండి కదలబుద్ధి అవదు. తప్పనిసరి అయి, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వవలసి వస్తే చేయవలసిన మర్యాదలన్నీ ఎక్కువగానే చేసినా మనసుపెట్టి చేసినట్టుగా ఉండదు. యాంత్రికంగా అనిపిస్తుంది.– డాక్టర్ ఎన్. అనంతలక్ష్మి -
'పేరు'తో ప్రపంచ రికార్డు..! ఏకంగా చట్టంలోనే మార్పులు చేసి..
ఎవ్వరికైనా పేరు మహా అయితే ఓ నాలుగైదు పేర్లతో పెట్టుకుంటారేమో. అది కూడా అప్లికేషన్స్లో రాయడం అంత ఈజీ కాదు కూడా. అలాంటిది ఈ వ్యక్తి ఎంత పెద్ద పేరు పెట్టుకున్నాడో వింటే విస్తుపోతారు. అందులో ఎన్ని పదాలు ఉన్నాయో చూస్తే మతిపోతుంది. ఇలా కూడా పేరు పెట్టుకుంటారా అన్నంత వెరైటీగా పేరు పెట్టుకుని రికార్డు క్రియేట్ చేశాడు. అందరూ రకరకాల ఫీట్లతో కష్టపడి రికార్డు బద్దులు కొడితే..ఈ వ్యక్తి మాత్రం తన పేరుతోనే రికార్డులు ఎక్కాడు. వాటే క్రియేటివిటీ అనాలా..లేక అతని ఆలోచనకు సలాం కొట్టాలో తెలియదు గానీ..ప్రస్తుతం ఇతడి పేరు మాత్రం అత్యంత హాట్టాపిక్గా మారి వార్తల్లో నిలిచింది. అతడే న్యూజిలాండ్కు చెందిన లారెన్స్. మాములుగా కొందరికి వంశపారంపర్య పేర్లే, ప్లస్ సెంటిమెంట్లు, ఆచారాలో కొందిరి పేర్లు ఎంత పొడవుగా ఉంటాయో తెలిసిందే. కానీ లారెన్స్ వాళ్లందర్నీ వెనక్కి నెట్టేలా ఎంత పెద్ద పేరు పెట్టుకున్నాడంటే..అధికారులే అభ్యంతరం చెప్పే రేంజ్లో పెట్టుకున్నాడు. చట్టబద్ధంగా ఆ పేరు మార్పుని పొంది వార్తల్లో నిలవడమే కాదు గిన్నిస్ వరల్డ్ రికార్డు( Guinness World Records)లకెక్కాడు. ఇంతకీ ఈ వ్యక్తి పేరులో ఎన్న పదాలు ఉంటాయో తెలుసా..ఏకంగా 2,253 ప్రత్యేక పదాలు ఉన్నాయి. నిజానికి ఇంత పెద్ద పేర్లు ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో ఉపయోగించడం చాలా కష్టం. ఎందుకంటే..రాతపూర్వకంగా కాకుండా ఆన్లైన్లోనే దేనికైనా దరఖాస్తూ చేయాల్సిన పరిస్థితి. అందులోనూ ఇంత పెద్ద పేరుని టైప్ చేయడం ఇంకా కష్టం. పైగా అక్కడ అంత స్పేస్ కూడా ఉండదు. అలాగే పలకాలన్నా కూడా 20 నిమిషాలు పడుతుందట.అయితే లారెన్స్ ఎక్కడ తగ్గలేదు అంత పెద్ద పేరు టైప్ చేసేలా వందల డాలర్ల ఖర్చు చేశాడు. అంతేగాదు జిల్లా కోర్టు ఇంత పెద్ద పేరుని పెట్టుకోవడాన్ని తిరస్కరిస్తే..హైకోర్టుకి అప్పీల్ చేసుకుని మరి న్యాయం పోరాటం చేశాడు. చివరికి కోర్టు అతడికి అనూకూలంగా తీర్పు ఇవ్వడమే కాదు..ఏకంగా చట్టంలోనే సంస్కరణలు చేసి.. రెండు చట్టాలను మార్చింది కూడా. పేరు మార్పు చేసుకోవడమే కాదు చట్ట బద్ధం చేసుకునేలా పోరాడటం అంటే మాటలు కాదు కదా..!.(చదవండి: Karwa Chauth: భార్య కోసం బ్రిటిష్ వ్యక్తి కర్వా చౌత్ ఉపవాసం..! పాపం చంద్రుడి దర్శనం కోసం..) -
ఈ ఆదివారం వెరైటీగా టేస్టీ.. టేస్టీ..ఉప్మా సమోసా ట్రై చేయండిలా..!
ఉప్మా సమోసాకావలసినవి: బొంబాయి రవ్వ– ముప్పావు కప్పు, పెరుగు– అర కప్పుమైదాపిండి– ఒక కప్పుఉల్లిపాయ– ఒకటి (చిన్నగా తరగాలి)అల్లం తురుము– కొద్దిగాపచ్చిమిర్చి– 2 (చిన్నగా కట్ చేసుకోవాలి)పచ్చి బఠానీలు– 50 గ్రాములు (నానబెట్టి ఉడబెట్టి పెట్టుకోవాలి), క్యారెట్– ఒకటి (తురుముకోవాలి)క్యాప్సికం– ఒకటి (సన్నగా తరగాలి)ఉప్పు, నూనె– సరిపడాతయారీ: ముందుగా ఒక పాన్లో నూనె వేడి చేసి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అనంతరం అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు వేసి గరిటెతో తిప్పుతూ వేయించాలి. అనంతరం బఠానీలు, క్యారెట్ తురుము, క్యాప్సికం ముక్కలు ఇలా అన్నీ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు బొంబాయి రవ్వ వేసి దోరగా వేయించాలి. ఉప్పు కూడా వేసి కలపాలి. ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుని ఉప్మా బాగా మగ్గించి, స్టవ్ ఆఫ్ చేసుకుని, చల్లారనివ్వాలి. ఈలోపు ఒక గిన్నెలో మైదాపిండి, తగినంత ఉప్పు, కాస్త నూనె, నీళ్లు పోసి బాగా కలుపుతూ చపాతీ ముద్దలా చేసుకుని, అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న పూరీల్లా చేసుకుని సమోసాలా చుట్టుకుని దానిలో కొద్దికొద్దిగా ఉప్మా మిశ్రమాన్ని నింపుకుని ఫోల్డ్ చేసుకోవాలి. వాటిని నూనెలో దోరగా వేయించి టమోటో సాస్తో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి.ఫ్రాన్స్ లాబ్స్టర్ థెర్మిడార్ కావలసినవి: లాబ్ట్సర్ (పీత జాతి) – ఒకటి (రెండు లేదా మూడు రొయ్యలతో కూడా ఇలా చేసుకోవచ్చు, లాబ్స్టర్ను శుభ్రం చేసుకుని, సగం ముక్కలుగా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇరువైపులా ఉండే కాళ్ల భాగాలను మరో వంటకానికి వినియోగించుకోవచ్చు)ఆలివ్ నూనె– 2 టేబుల్ స్పూన్లుబటర్– 3 టేబుల్ స్పూన్లుఉల్లిపాయ ముక్కలు– అర కప్పువెల్లుల్లి తరుగు– ఒక టీ స్పూన్మైదా– 2 టేబుల్ స్పూన్లుపాలు– ఒక కప్పు, ఫ్రెష్ క్రీమ్– పావు కప్పుఆవాల పేస్ట్– అర టీ స్పూన్ , చికెన్ స్టాక్– పావు కప్పు, పార్మెసాన్ చీజ్– అర కప్పు, ఉప్పు– సరిపడామిరియాల పొడి– కొద్దిగాకొత్తిమీర తురుము– కొద్దిగాతయారీ: ముందుగా ఒక పాన్ లో బటర్ వేసి కరిగించాలి. బటర్ కరిగిన తర్వాత, తరిగిన ఉల్లిపాయ వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. తరువాత వెల్లుల్లి వేసి ఒక నిమిషం పాటు గరిటెతో తిప్పుతూ వేయించాలి. ఇప్పుడు మైదా వేసి 2 లేదా 3 నిమిషాలు వేయించాలి. నెమ్మదిగా పాలు, చికెన్ స్టాక్ వేసి, ఉండలు లేకుండా బాగా కలపాలి. ఈ మిశ్రమం చిక్కబడిన తర్వాత, ఆవాల పేస్ట్, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. చివరగా, కట్ చేసి పెట్టుకున్న లాబ్ట్సర్ ముక్కలు లేదా రొయ్యలు, ఫ్రెష్ క్రీమ్ వేసి, కొన్ని నిమిషాలు ఉడికించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పున్ లో బేక్ చేసుకోవాలి. చీజ్ బంగారు రంగులోకి మారి కరిగేవరకు 10–15 నిమిషాలు బేక్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.త్రిపుర మాయిదుల్కావలసినవి: అన్నం– 2 కప్పులు, ఉప్పు– సరిపడావెల్లుల్లి రెబ్బలు– 4 (తురుములా చేసుకోవాలి)పచ్చిమిర్చి పేస్ట్– ఒక టీ స్పూన్, బియ్యప్పిండి– ఒక టేబుల్ స్పూన్బేకింగ్ సోడా, అల్లం పేస్ట్– కొద్దికొద్దిగాతయారీ: ముందుగా అన్నాన్ని చేత్తో పిసికి బాగా మెత్తగా చేసుకోవాలి. దానిలో సరిపడా ఉప్పు, వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చి పేస్ట్, బియ్యప్పిండి, బేకింగ్ సోడా, అల్లం పేస్ట్ ఇలా అన్నీ బాగా కలిపి.. కొద్దికొద్ది మిశ్రమంతో గుండ్రటి బంతుల్లా చుట్టుకోవాలి. వాటిని బొగ్గులపై దోరగా కాల్చి, వేడి వేడిగా ఉన్నప్పుడు టొమాటో సాస్ లేదా నచ్చిన చట్నీలతో తినొచ్చు. (చదవండి: మెరిసే చర్మం కోసం యాంటీ–రింకిల్ బ్యూటీ డివైజ్..) -
రీసైకిల్ కమ్ డెకరేషన్గా.. బాటిల్ ఆర్ట్..!
మన ఇళ్లలో ఖాళీగా ఉన్న గాజు లేదా ప్లాస్టిక్ బాటిళ్లు చెత్త బుట్టలోకి చేరుతుంటాయి. కాని కొంచెం సృజనాత్మక ఆలోచన, కొంచెం కలర్, పెయింట్ లేదా క్రాఫ్ట్ ఐడియాలతో ఆ బాటిళ్లను అందమైన హోమ్ డెకరేషన్లో షో పీసులుగా మార్చుకోవచ్చు. ఇది రీసైక్లింగ్కి తోడ్పడటమే కాకుండా ఇంటికి ఒక ప్రత్యేకమైన లుక్ను ఇస్తుంది.డెకరేషన్ కోసం ఉపయోగించే మెటీరియల్స్ఆక్రిలిక్ పెయింట్స్, స్ప్రే పెయింట్స్గ్లిట్టర్, బీడ్స్, మిర్రర్ పీసెస్జూట్ రోప్స్టిక్కర్స్, టేప్ఫాబ్రిక్ పీసెస్, లేస్ డిజైన్స్బాటిల్స్ .. క్రియేటివిటీపెయింటెడ్ బాటిల్స్బాటిల్పై స్ప్రే పెయింట్ వాడి ఒకే రంగులో కలర్ చేయాలి.ఆక్రిలిక్ పెయింట్స్తో పూలు, ఆకులు లేదా జామెట్రిక్ డిజైన్స్ వేయాలి.జూట్ రోప్ ర్యాప్జూట్ తాడుతో బాటిల్ మొత్తం చుట్టి, పై భాగంలో షెల్స్ లేదా పూలు అతికిస్తే రస్టిక్ లుక్ వస్తుంది.జనపనార తాడును ఉపయోగించి, అందమైన సన్నని అమ్మాయి, అబ్బాయి బొమ్మలను తయారు చేయవచ్చు.లైట్ బాటిల్ ల్యాంప్స్ఖాళీ బాటిల్లో ఫెయిరీ లైట్స్ పెట్టి నైట్ ల్యాంప్లా వాడుకోవచ్చు.బొమ్మలుగా ఉండే సంగీత పరికరాలను అతికించి, షో పీసులుగా అమర్చవచ్చు. గ్లాస్ పేస్టింగ్ ఆర్ట్బాటిల్కు కలర్ పేపర్, గ్లిటర్, స్టోరీస ... అతికిస్తే రిచ్ లుక్ వస్తుంది. అలంకరణలో ప్రత్యేకంగా ఉంటుంది.పెయింట్తో పాటు పూసలు, అద్దాలు అతికించి మరింత అందంగా మార్చవచ్చు. ఫ్లవర్ వేజ్పెద్ద పెద్ద గాజు బాటిళ్లను పెయింట్ చేసి, అందులో తాజా పువ్వులు లేదా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో అలంకరించి లివింగ్ రూమ్, సెంటర్ టేబుల్పై పెడితే ఆకర్షణీయంగా కనిపిస్తుంది. బాటిల్ డెకరేష మనలోని సృజనాత్మకతను చూపించే ఒక అద్భుతమైన మార్గం. చిన్న బాటిల్ నుంచి పెద్ద బాటిల్ వరకు, ప్రతి ఒక్కదాన్ని కళాఖండంగా మార్చుకోవచ్చు.ఎన్నార్ -
భార్య కోసం బ్రిటిష్ వ్యక్తి కర్వా చౌత్ ఉపవాసం..! పాపం చంద్రుడి దర్శనం కోసం..
ఆశ్వయుజ మాసం పౌర్ణమి తర్వాత వచ్చే మూడో రోజుని దక్షిణ భారతదేశంలో అట్లతద్దిగా జరుపుకుంటే ఉత్తర భారతదేశంలో పౌర్ణమి తర్వాత నాల్గవ రోజు.. చవితి తిధి నాడు కర్వాచౌత్ పండుగ జరుపుకుంటారు. ఈ రెండు పర్వదినాలు, వివాహితులకు, కన్నెపిల్లలకు ప్రత్యేకం అనే చెప్పాలి. ఆ రోజు కన్నెపిల్లలు మంచి వరడు కోసం, పెళ్లైన స్త్రీలు తమ భర్త క్షేమం కోసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఉపవాసం ఉంంటారు. సాయంత్రం చంద్ర దర్శన అనంతరం విరమిస్తారు. కానీ ఉత్తర భారతదేశంలో మాత్రంలో చంద్ర దర్శనాన్ని భర్త సమక్షంలో సందర్శించి ఉపవాసాన్ని విరమించడం విశేషం. అయితే ఈ పండుగ భారతీయ విశిష్ట సంస్కృతికి ప్రతీకగా ప్రజలు విభిన్న రకాలుగా జరుపుకుంటారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకంటే..ఈ ఆచారాన్ని ఓ విదేశీయుడి ఆచారించిన ఘటన నెట్టింట వైరల్గా మారింది. బ్రిటిష్ కంటెంట్ క్రియేటర్ నిక్ బుకర్ తన భార్య కోసం ఉపవాసం ఉండటం సోషల్ మీడియాలో వైరల్గా మారడమే కాదు హాట్టాపిక్గా మారింది. భారతచరిత్రకు సంబంధించిన ఆసక్తికర విషయాలను సదా షేర్ చేసుకునే నిక్ బుకర్ "మై డెస్పరేట్ కర్వా చౌత్ సెర్చ్ ఫర్ ది మూన్" అనే వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో నిక్ తన భార్యతో కలిసి ఈ పండుగను జరుపుకున్నానని, ఉపవాసం కూడా ఉన్నట్లు వెల్లడించాడు. ఆయన ముంబైలోని జుహూ బీచ్ సమీపంలో తన నివాసంలో ఈ పండుగను నిర్వహించి ఉపవాసం ఉన్నారు. అయితే త్వరితిగతిన చంద్రుడిని సందర్శించేందుకు ముంబై నుంచి ఢిల్లీ వచ్చి..అక్కడ లోధి హోటల్ నుంచి చంద్రుడిని చాలా త్వరితగతిన సందర్శించి తన భార్యతో కలిసి ఉపవాసం విరమించినట్లు తెలిపాడు. అంతేగాదు కర్వా చౌత్ను ఎందుకు జరుపుకుంటారు చాలా చక్కగా వివరించి భారతీయులందరి మనసులను గెలుచుకున్నాడు. చివరగా ఆ వీడియోలో ఈ రోజు ఉపవాసం ఉన్నవారందరికీ శుభాకాంక్షలు అని చెప్పాడు. అయితే నెటిజన్లంతా మా భారతీయ సంస్కృతిని హృదయపూర్వకంగా స్వీకరించినందుకు ధన్యవాదాలు, అలాగే మీరు మీ కుటుంబం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని నిక్ని ఆశీర్వదిస్తూ..పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by IndoGenius | Nick Booker (@indogenius) (చదవండి: 'ఖతర్నాక్ మొక్కలు'..! వీటి టక్కు టమారాలకు విస్తుపోవాల్సిందే..!) -
'ఖతర్నాక్ మొక్కలు'..! వీటి టక్కు టమారాలకు విస్తుపోవాల్సిందే..!
నక్కజిత్తులు, టక్కు టమారాలు, వలపు వలలు – మనుషుల్లోనే కాదు ప్రకృతిలోని అన్నీ జీవుల్లోనూ ఉంటాయి. అయితే కొన్ని రకాల మొక్కల్లో కూడా ఈ విధమైన ‘జీవన నైపుణ్యాలు’ ఉంటాయని వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడున్న మొక్కలన్నీ ఏదో ఒక విశేషాన్ని కలిగి ఉన్నవే. కొద్దో గొప్పో తమ ప్రత్యేకతతో విస్తుగొలిపేవే. వీటిల్లో కొన్ని, కొనేందుకు దొరకొచ్చు. కొన్నింటి కోసమైతే ఏ ఆఫ్రికాకో, అమెజాన్ వర్షారణ్య ప్రాంతాలకో వెళ్లాల్సిందే! 1. హైడ్నోరా పైకి కనిపించని పరాన్నజీవి· ‘హైడ్నోరా ఆఫ్రికానా’ అనే ఈ ఆఫ్రికా మొక్క తన జీవితంలో ఎక్కువ భాగం భూగర్భంలో అజ్ఞాతంగా గడుపుతుంది, పుష్పించడానికి మాత్రమే తన గుట్టును రట్టు చేసుకుంటుంది. అంటే భూ ఉపరితలంపైన విప్పారిన పువ్వులా సాక్షాత్కరిస్తుంది. ఈ మొక్కకు ఆకులు ఉండవు. ఆకులు ఉండవు కనుక కిరణజన్య సంయోగక్రియను నిర్వహించదు. ‘కిరణజన్య సంయోగ క్రియ’ అంటే తెలిసిందే కదా. ఆకుపచ్చని ఆకులుండే మొక్కలు సూర్యరశ్మిని ఉపయోగించుకుని నీటిని, కార్బన్ డై ఆక్సైడ్ని... గ్లూకోజ్గా, ఆక్సిజన్గా మార్చి శక్తిని పొందటం.మరి హైడ్నోరా ఆఫ్రికానాకు శక్తి ఎలా? కిరణ జన్య సంయోగ క్రియకు బదులుగా ఇది పోషకాలను దొంగిలించడానికి భూమి లోపల ఇతర మొక్కల వేళ్లకు అంటుకుని ఉంటుంది! దీని వింత జీవనశైలి ఎలా ఉన్నప్పటికీ స్థానికులు ఇందులోని యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను విలువైనవిగా భావిస్తారు. ఫంగస్కీ, బాక్టీరియాకు ఔషధంగా వాడతారు.2. ఫ్లైపేపర్ ప్లాంట్ జిగట ఉచ్చుల జిత్తులమారి‘పింగిక్యులా జైగాంటియా’ అనే ఈ మొక్క, పోషకాలు తక్కువగా ఉండే నేలల్లో పెరుగుతుంది. దీని జిగట ఆకులు కీటకాలను బంధిస్తాయి. ఆ కీటకాలను తిని ఈ మొక్క పెరుగుతుంది. కీటకాలను తన జిగటతో ఒకసారి పట్టుకున్న తర్వాత, ఆ కీటాకాహారం నెమ్మదిగా మొక్కకు జీర్ణం అవుతుంది. మొక్కకు ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. వేసవి నెలల్లో లేత ఊదా నుండి ముదురు ఊదా వరకు వివిధ వర్ణ ఛాయలలో ఈ మొక్కకు సన్నని పూలు పూస్తాయి. ఈ మాంసాహార మొక్క కేవలం తను బతకడానికి మాత్రమే కీటకాలను తినటం కాకుండా, పరిసరాలలో కీటకాల జనాభానూ నియంత్రిస్తుంది. కీటకాలను పట్టుకునే ఉద్దేశంలో (ట్రాప్ మోడ్) లేనప్పుడు పుప్పొడి పరాగ సంపర్కాల కోసం ఆకర్షణీయమైన పువ్వులను కూడా ఉత్పత్తి చేస్తుంది! ఈ మొక్కను హన్స్ లుహర్స్ అనే వృక్ష శాస్తజ్ఞుడు మెక్సికోలో కనిపెట్టారు. ఎత్తయిన పర్వత వాతావరణంలో, నిలువు సున్నపు రాతి గోడల మధ్య ఉండే తేమతో కూడిన పగుళ్లలో ఇవి వృద్ధి చెందుతాయి. 3. హ్యామర్ ఆర్కిడ్ ‘మాస్టర్స్’ డిగ్రీ మాయలాడి!డ్రాకేయా గ్లిప్టోడాన్ అనే ఈ మొక్క మాయల పకీరు వంటిది. ఇది ఆడ కందిరీగను పోలి ఉంటుంది. పోలిక మాత్రమే కాదు, ఆడ కందిరీగ ఒంటి నుంచి వచ్చే వాసన లాంటి వాసననే ఇది విడుదల చేస్తుంటుంది. ఆ వాసనకు మగ కందిరీగలు మైమరచి, దీనితో జత కట్టటానికి వచ్చి వీటిపైన వాలతాయి. ఈ వాలటంలో, పుప్పొడి ఒక పువ్వు నుండి మరొక పువ్వుకు అంటుకుంటుంది. ఈ అద్భుతమైన మాయలాడి వ్యూహం వృక్షశాస్త్రవేత్తల అధునాతన పరిశోధనలకు చక్కగా ఉపయోగ పడుతోందని అంటారు! ఇవి పశ్చిమ ఆస్ట్రేలియాలోని నైరుతి ప్రాంతంలో కనిపిస్తాయి. వీటి పూలు మెరూన్ రంగులో ఉంటాయి. పైభాగంలో మూడింట రెండు వంతులు ‘నూగు’ ఉంటుంది. కింది భాగం జారుడుగా మెరుస్తూ ఉంటుంది. ఆగస్టు చివరి వారం నుండి అక్టోబర్ ఆఖరి వారం వరకు వీటి పూలు కనిపిస్తాయి.4. డెత్ ఆపిల్ ట్రీ వల విసిరే వగలాడి‘హిప్పోమేన్ మాన్సినెల్లా అనే ఈ మొక్క పండ్లను చూడగానే తినేయబుద్ధి అవుతుంది. కానీ అవి అత్యంత విషపూరితమైన పండ్లు. తింటే శరీరం విషమయం అవుతుంది. తక్షణ మరణం కూడా సంభవించవచ్చు. ఇవి ఉష్ణమండల ప్రాంతాలైన దక్షిణ ఉత్తర అమెరికా నుండి ఉత్తర దక్షిణ అమెరికా వరకు విస్తరించి ఉన్నాయి. ఈ మొక్కను ‘లిటిల్ ఆపిల్ ఆఫ్ డెత్’ అని కూడా అంటారు. అందంగా, పచ్చగా కనిపిస్తున్నప్పటికీ ఈ మొక్కల మోసపూరితమైన అందం జానపద కథలలో అపఖ్యాతిని సంపాదించుకుంది. ఈ చెట్టు చుట్టూ అనేక కథలు ఉన్నాయి. ప్రకృతిలో దాగి ఉన్న ప్రమాదాలకు ఒక హెచ్చరికగా ఈ మొక్క కొన్ని కథల్లో గౌరవాన్ని కూడా పొందింది. మొదట వీటికి చిన్న ఆకుపచ్చని పువ్వుల వంటి ముళ్లు వస్తాయి. వాటి నుండి పండ్లు వృద్ధి చెందుతాయి. అవి చిన్న ఆపిల్ పండ్లలా కనిపిస్తాయి.5. మూషిక భక్షకి మాంసాహార రాక్షసి‘నెపెంథెస్ అటెన్ బరోగి’ అనే ఈ ఆగ్నేయాసియాకు చెందిన మొక్క.. వాలీబాల్ నెట్లా పెద్ద మూతితో, కాడ ఆకారపు ఆకులను తోకగా కలిగి ఉంటుంది. ఇది కీటకాలను మాత్రమే కాకుండా ఎలుకలను కూడా బంధించి తింటుంది. వీటిని పిచర్ మొక్కలు అంటారు. ప్రముఖ ప్రకృతి శాస్త్రవేత్త సర్ డేవిడ్ అటెన్బరో పేరును ఈ మొక్కకు పెట్టారు. నెపెంథెస్ అటెన్ బరోగి భూమిపై నిటారుగా, లేదా ఊగులాడుతూ పెరిగే పొద. కీటకాలు గానీ, ఎలుకలు గాని ఒకసారి ‘నెట్’లో పడ్డాక ఇక బయటికి రావటం ఉండదు. మొక్క లోపలి ఆమ్ల ద్రవంలో జీర్ణమై పోతాయి. ఫిలిప్పీన్స్ ద్వీప సమూహం అంతటా కనిపించే వివిధ జాతుల పిచర్ మొక్కలను ఒక జాబితాగా తయారు చేయటానికి 2007లో వృక్షశాస్త్రవేత్తలు రెండు నెలల పాటు పరిశోధన జరిపినప్పుడు ఈ నెపెంథెస్ అటెన్బరోగి అమ్మగారు దర్శనమిచ్చారు.6. పోర్క్యుపైన్ టొమాటాముళ్లు కప్పుకున్న వయ్యారి‘సోలనమ్ పైరాకాంతోస్’ అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ పోర్క్యుపైన్ మొక్క టొమాటా మొక్క లాగా కనిపిస్తుంది. అయితే పదునైన ముళ్లను కప్పుకుని ఉంటుంది. ఈ ముళ్లు... వేటాడే జంతువులు, కొన్ని రకాల తెగుళ్ల నుంచి ఈ ‘టొమాటా’లకు సహజ రక్షణ కవచంగా పనిచేస్తాయి. ఆఫ్రికాలోని కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో జీవించడానికి వీలు కల్పిస్తాయి.పోర్క్యుపైన్ అద్భుతమైన రూప లావణ్యాలతో వయ్యారంగా ఉంటుంది. పూలు లావెండర్ రంగులో, ముళ్లు నారింజ రంగులో ఉంటాయి. ఇది ఉష్ణమండల మడగాస్కర్ ద్వీపానికి చెందిన మొక్క. నిత్యం పచ్చగా ఉంటూ, పొదలు పొదలుగా పెరుగుతుంది.7. డాల్స్ ఐ ప్లాంట్భయానక ‘భ్రమ’రాక్షసి ‘ఆక్టేయా పాకిపొడా’ అనే ఈ మొక్క, బెర్రీ పండ్లు అని భ్రమింపజేసే మానవ కనుగుడ్లను పోలిన పండ్లను కలిగి ఉంటుంది. పండు చుట్టూ తెల్లగా ఉంటుంది. మధ్యలో కారునలుపు ఉంటుంది. ఉత్తర అమెరికా అడవులకు చెందిన ఈ ‘బెర్రీ’లు క్షీరదాలకు అత్యంత విషపూరితమైనవి. ఆహారం కోసం వెతికే జంతువులు తమ సహజజ్ఞానం వల్ల కావచ్చు, వీటి దరిదాపులకే వెళ్లవు. అసలు వీటి రూపమే భయం గొల్పేలా ఉంటుంది. ఇవి మనుషులకు, అడవి జంతువులకు నిషిద్ధమైనవి. వీటి పండ్లు తింటే గుండె కండరాల కణజాలంపై తక్షణ ప్రభావం చూపి గుండెను ఆగిపోయేలా చేస్తాయి.8. జెల్లీ ఫిష్ ట్రీ వెల్లకిలా పడిన గొడుగు!తూర్పు ఆఫ్రికా వైపుగా హిందూ మహాసముద్రంలో ఉండే సీషెల్స్ ద్వీప సముద్రంలో మాత్రమే కనిపించే ఈ ‘మెడుసజైన్ ఆపోజిటిఫోలియా’ అనే మొక్క నేడో రేపో అంతరించి పోతుందన్నంతగా ప్రమాదంలో ఉంది. జెల్లీ ఫిష్ టెంటకిల్స్ను పోలి ఉండే దీని పండ్ల క్యాప్సూ్యల్స్ దీనిని అరుదైన మొక్కలలో ఒకటిగా నిలిపాయి. చరిత్రకు పూర్వం నుండే ఈ మొక్క జీవించి ఉందని అంటారు. దీనికి వచ్చే తక్కువ విత్తనాలు దీని అంకురోత్పత్తికి సరిపడినంతగా మాత్రమే ఉంటాయట! అలాగే తగ్గిపోతున్న ఆవాసాలు కూడా ఈ మొక్క మనుగడకు ముప్పుగా పరిణమించాయి. వీటి పండ్లు ఎండి చిట్లినప్పుడు వెల్లికిలా పడిన గొడుగుల్లా కనిపిస్తాయి.విక్టోరియా వాటర్ లిల్లీ తేలియాడే ‘శివగామి’అమెజాన్ వర్షారణ్య ప్రాంతాల్లో కనిపించే ‘విక్టోరియా అమెజోనికా’ అనే ఈ మొక్క 9 అడుగుల వెడల్పు వరకు భారీ ఆకులను ఉత్పత్తి చేస్తుంది, ఆ ఆకు చిన్న పిల్లవాడు లేదా ఒక సన్నటి మనిషి బరువును మోసేంత బలంగా ఉంటుంది. వీటిని నీటి ఆకులు అంటారు. తేలికపాటి మోడల్స్ (అమ్మాయిలు) వీటిపై కూర్చొని ఫొటో షూట్ తీసుకోవటం ఇప్పుడు విస్తృతంగా కనిపిస్తోంది. విక్టోరియా మొక్క, జలచరాలకు ఆశ్రయం కల్పిస్తుంది. స్థానికులు దీనిని అనేక విధాలుగా ఉపయోగిస్తుంటారు. ఈ భారీ ‘నీటి కలువ’ ఒక సహజమైన అద్భుతం. అమెజాన్ ప్రాంతీయులకు ప్రకృతి ప్రసాదించిన సంపద. ఈ మొక్క చేసే టక్కు టమారాలు ఏమీ లేకపోయినా, వృక్షశాస్త్రజ్ఞులు దీనిని ‘అరుదైన జాతి’లో చేర్చారు.10. డెడ్ హార్స్ అరమ్ కుళ్లిన వాసన కొట్టే లిల్లీ‘హెలికోడిసెరోస్ మస్కివోరస్’ అనే ఈ మొక్క కుళ్లిన మాంసం వాసనను వెదజల్లటం ద్వారా పరాగ సంపర్కాలను ఆకర్షిస్తుంది. ఈ వాసన, కళేబరాలను తినే కీటకాలను రారమ్మని పిలుస్తుంటుంది. ఆ కీటకాలు ఈ మొక్కల పునరుత్పత్తికి, విస్తరణకు సహాయపడతాయి.మధ్యధరా సముద్రంలో ఈ మొక్కను కనుగొన్నారు. మనుగడ కోసం పోరాటంలో మొక్కల వ్యూహాలు ఎంత తీవ్రంగా, అసాధారణంగా ఉంటాయో తెలుసుకోటానికి ఈ మొక్క ఒక ఉదాహరణ. వీటి పూలను ఆరల్ లిల్లీస్ అంటారు. ఆ లిల్లీపూల పుష్ఫగుచ్చం, చనిపోయిన జంతువు ఆసన ప్రాంతాన్ని పోలి ఉంటుంది. సాక్షి, స్పెషల్ డెస్క్ -
మెరిసే చర్మం కోసం యాంటీ–రింకిల్ బ్యూటీ డివైజ్..
చాలామంది తమలో వృద్ధాప్యఛాయలు రాకుండా చూసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అందంగా, యవ్వనంగా కనిపించే చర్మం కోసం ఇప్పుడు కొత్త ‘పోర్టబుల్ హ్యాండ్హెల్డ్ యాంటీ–రింకిల్ బ్యూటీ డివైజ్’ అందుబాటులోకి వచ్చింది. ఇది ఇంట్లోనే సులభంగా చర్మ సంరక్షణ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ పరికరం చర్మ ఆరోగ్యానికి వివిధ రకాలుగా సహాయపడుతుంది. ఇది చర్మాన్ని బిగుతుగా, దృఢంగా మారుస్తుంది. ఈ డివైజ్ సాయంతో చర్మాన్ని లిఫ్ట్ చేసి, బిగుతుగా ఉంచుకోవచ్చు. చర్మంపై ఉండే సన్నటి ముడతలను ఈ పరికరం సమర్థవంతంగా తగ్గిస్తుంది. చర్మంపై కనిపించే రంధ్రాలు పెద్దవిగా ఉంటే, ఈ పరికరం వాటిని చిన్నవిగా చేయడానికి సహాయపడుతుంది.ఈ డివైజ్ చర్మంలో కొలాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. కొలాజెన్ చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. అలాగే చర్మాన్ని లోపలి నుంచి ఆరోగ్యంగా మార్చి, దానిని పునరుజ్జీవింపజేస్తుంది. ఈ డివైజ్ అయానిక్ మోడ్ ఆప్షన్లతో పనిచేస్తుంది. దీనిలో హై, లో, మీడియం వంటి మైక్రో కరెంట్ పవర్ ఆప్షన్లు ఉంటాయి. దీనితో చర్మ అవసరాలకు తగినట్టుగా కరెంటు స్థాయిని ఎంచుకోవచ్చు. అంతేకాకుండా చికిత్స సమయాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ బ్యూటీ డివైస్కి ట్రీట్మెంట్ హెడ్స్ వేరువేరుగా ఉంటాయి. ముక్కు, కళ్లు భాగాలను మసాజ్ చేసుకోవడానికి ఒక హెడ్, ముఖానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మరో హెడ్, మొత్తం బాడీని మసాజ్ చేయడానికి ఇంకో హెడ్ ఇలా మూడు వేరువేరు హెడ్స్ లభిస్తాయి. ఈ రకమైన ఫీచర్లు ఉన్న డివైస్తో చర్మ సంరక్షణను సులభతరం చేసుకోవచ్చు. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడంతో చర్మం ఆరోగ్యంగా మారుతుంది. అందంగా మెరుస్తూ కనిపిస్తుంది. (చదవండి: Back pain during pregnancy: ప్రెగ్నెన్సీ టైంలో నడుము నొప్పి సాధారణమా? తగ్గాలంటే..) -
ప్రెగ్నెన్సీ టైంలో నడుము నొప్పి సాధారణమా? తగ్గాలంటే..
నేను ఆరునెలల గర్భవతిని. కొన్నిరోజులుగా నడుమునొప్పి ఎక్కువగా వస్తోంది. ఎక్కువసేపు నడిచినా, కూర్చున్నా నొప్పి పెరుగుతోంది. ఇది గర్భధారణలో సాధారణమా? లేక ఏమైనా సమస్య ఉందా? దీన్ని తగ్గించడానికి ఏం చేయవచ్చు?– మాలిని, గుంటూరు. గర్భధారణలో నడుమునొప్పి చాలా సాధారణం. ఎక్కువమంది గర్భిణులు ఏదో ఒక దశలో దీనిని అనుభవిస్తారు. బరువు పెరగడం, గర్భాశయం పరిమాణం పెరగడం, హార్మోన్ల ప్రభావం, శరీర ధారణలో మార్పులు, లిగమెంట్లు సడలడం వంటివి దీనికి ప్రధాన కారణాలు. చాలాసేపు ఒకే స్థితిలో కూర్చోవడం లేదా నిలబడడం, వెన్నుకు సరైన ఊతం లేని కుర్చీలో కూర్చోవడం వల్ల నొప్పి మరింత పెరుగుతుంది. గర్భధారణ మొదటి నెలల నుంచే ఈ సమస్య రావచ్చు, అయితే గర్భధారణ కొనసాగుతున్న కొద్దీ ఇది మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. నడుమునొప్పి తగ్గించుకోవడానికి కొన్ని సాధారణ జాగ్రత్తలు పాటించడం మంచిది. ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిలబడడం తగ్గించుకోవాలి. వెన్నుకు ఊతం ఇచ్చే కుర్చీని ఉపయోగించడం, పక్కకు తిరిగి పడుకోవడం, మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని నిద్రించడం ఉపశమనాన్ని ఇస్తాయి. హీల్స్ వాడకూడదు, సౌకర్యవంతమైన షూలు ధరించాలి. ఎక్కువ నీరు తాగడం, శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవడం, పాల ఉత్పత్తులు తీసుకోవడం, వైద్యులు సూచించిన కాల్షియం, విటమిన్ సప్లిమెంట్స్ వాడటం అవసరం. ఆకస్మిక నొప్పి ఉన్నప్పుడు వేడి నీటి బ్యాగ్తో మసాజ్ చేయడం, వేడినీటితో స్నానం చేయడం లేదా మృదువుగా తైలమర్దన చేయించుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. పెయిన్ కిల్లర్ వైద్యుల సూచన లేకుండా వాడకూడదు. తగినంత విశ్రాంతితో పాటు నడక, వ్యాయామం, స్ట్రెచింగ్, ప్రెగ్నెన్సీ యోగా వంటి పద్ధతులు కూడా నడుమునొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. కొన్ని సందర్భాల్లో ఫిజియోథెరపిస్ట్ సలహా తీసుకోవడం కూడా మంచిది. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నడుమునొప్పి తగ్గడమే కాకుండా, ప్రసవానికి శరీరం సిద్ధమవుతుంది, ప్రసవానంతర రికవరీ సులభతరం అవుతుంది, అలాగే గర్భిణికి మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.నేను ఆరు నెలల గర్భిణిని. గర్భధారణ ప్రారంభంలో నా హీమోగ్లోబిన్ 12 గ్రాములు ఉండగా, ఇప్పుడు అది 8 గ్రాములకు పడిపోయింది. నేను ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నప్పటికీ హీమోగ్లోబిన్ తగ్గిపోయింది. డాక్టర్ మరిన్ని పరీక్షలు చేయమని సూచించారు, అలాగే హీమోగ్లోబిన్ సరిచేయడానికి ఇంజెక్షన్లు అవసరం కావచ్చని చెప్పారు. నా బంధువులు చెబుతున్నది ఏమిటంటే, హీమోగ్లోబిన్ తక్కువగా ఉండటంవల్ల బిడ్డ పెరుగుదలపై ప్రభావం చూపవచ్చని, అలాగే డెలివరీ తర్వాత కోలుకోవడం కష్టమవుతుందని. ఇది నిజమేనా? – సుగుణ, మిరియాలగూడ. గర్భిణులు, ముఖ్యంగా భారతీయ మహిళల్లో రక్తహీనత లేదా హీమోగ్లోబిన్ తక్కువగా ఉండటం చాలా సాధారణమైన సమస్య. గర్భధారణ సమయంలో రక్తపరిమాణం పెరగడం వలన శరీరానికి ఐరన్ అవసరం ఎక్కువ అవుతుంది, కాని, ఆహారంతో మాత్రమే ఆ అవసరం తీరడం కష్టం. అందువల్ల హీమోగ్లోబిన్ స్థాయులు తగ్గిపోతాయి. కొందరిలో గర్భధారణకు ముందే రక్తహీనత ఉండి, అది గర్భధారణలో మరింత ఎక్కువ అవుతుంది. ఇది సాధారణంగా ఐరన్ లోపం వల్ల జరుగుతుంది, కానీ కొన్నిసార్లు విటమిన్ బీ12 లేదా ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల కూడా రావచ్చు. అరుదుగా జన్యు సంబంధిత వ్యాధులు, ఉదాహరణకు థలసీమియా, సికిల్ సెల్ వ్యాధులు వంటి కారణాలు కూడా ఉండవచ్చు. హీమోగ్లోబిన్ తక్కువగా ఉండటం తల్లి, బిడ్డ ఇద్దరికీ సమస్యలు కలిగించే అవకాశం ఉంది. తల్లిలో అలసట, తలతిరగటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వలన ఇన్ఫెక్షన్లు రావడం, ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం జరగడం, రక్త మార్పిడి అవసరం కావడం, అలాగే ప్రసవానంతరం రికవరీ ఆలస్యమవడం వంటి సమస్యలు కనిపించవచ్చు. బిడ్డలో పెరుగుదలలో ఆలస్యం, తక్కువ బరువుతో పుట్టడం, కొన్ని సందర్భాల్లో ఐసీయూ అవసరం కావడం వంటి సమస్యలు రావచ్చు. అందువల్ల రక్తహీనతను త్వరగా గుర్తించి చికిత్స చేయడం అత్యంత ముఖ్యం. సాధారణంగా గర్భిణులకు ఐరన్ సప్లిమెంట్లు రెండవ త్రైమాసికం నుంచే ఇవ్వడం ప్రారంభిస్తారు, ఎందుకంటే మొదటి నెలల్లో వాంతులు, మలబద్ధకం వంటి సమస్యలు మరింత పెరగకుండా ఉండటానికి. మాత్రలను విటమిన్ సీ ఎక్కువగా ఉన్న ఆహారాలతో ఉదాహరణకు నిమ్మరసం, నారింజ లాంటివి ఖాళీ కడుపుతో తీసుకుంటే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. మాత్రలు సరిగా పనిచేయకపోతే లేదా తట్టుకోలేకపోతే, ఐరన్ ఇంజెక్షన్లు అవసరం కావచ్చు. ఆహారంలో ఆకుకూరలు, శనగలు, బీన్స్, పప్పులు, కిస్మిస్, ఆప్రికాట్ వంటి డ్రై ఫ్రూట్స్, అలాగే గుడ్లు, చేపలు, కాలేయం, మాంసం వంటి నాన్వెజిటేరియన్ ఆహార పదార్థాలు ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా గర్భధారణలో ఐరన్ లోపాన్ని చక్కదిద్దుకోవచ్చు. సమయానికి పరీక్షలు చేయించుకోవడం, వైద్యులు సూచించిన జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. డెలివరీకి ముందే హీమోగ్లోబిన్ స్థాయులు మెరుగుపడితే, మీకూ, మీ బిడ్డకూ ఆరోగ్యకరమైన ఫలితాలు వస్తాయి. (చదవండి: సరైన ప్రశంసలతోనే... జీనియస్ మైండ్ సెట్!) -
సరైన ప్రశంసలతోనే... జీనియస్ మైండ్ సెట్!
‘‘అమ్మా.. నేను క్లాస్ ఫస్ట్ వచ్చా!’’ ‘‘వావ్... కంగ్రాచ్యులేషన్స్ నాన్నా. నువ్వు తెలివైనవాడివి! ’’ అని మెచ్చుకుంది తల్లి. తల్లి ప్రశంసలతో ఆ బిడ్డ కాసేపు సంతోషపడుతుంది. గర్వపడుతుంది. కానీ వారం తర్వాత కాస్త కష్టమైన టాపిక్ రాగానే, ‘‘నేను తెలివైనవాడినైతే ఇది ఎందుకు రాలేదు?’’ అని ఆలోచనలో పడిపోతుంది. అక్కడినుంచి మెల్లగా మోటివేషన్ పోతుంది. ప్రశంస అంటే కేవలం మాటలు కాదు. అది మెదడులోని న్యూరాన్లకు ఇచ్చే సూచన. ప్రతి మాట మీ బిడ్డ మెదడులో కొత్త కనెక్షన్లు నెలకొల్పుతుంది. అందుకే మెచ్చుకోవడంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మెచ్చుకున్నా తప్పేనా? పిల్లలు ఏదైనా సాధించగానే ‘‘శభాష్, నువ్వు బెస్ట్, నువ్వు ఇంటెలిజెంట్’’ అని టీచర్లు, పేరెంట్స్ మెచ్చుకుంటారు. ఇలాంటి తప్పు రకమైన ప్రశంసలు పిల్లలను ట్రాప్లో పడేస్తాయి. ఇతరులతో పోల్చే ప్రశంస తాత్కాలికంగా ఉత్సాహాన్నిస్తుంది. కాని, ‘ఇతరులకంటే ముందుండడమే నాకు విలువ’ అనే తప్పు నమ్మకాన్ని ఏర్పరుస్తాయి.చిన్న విషయాలకే పెద్ద ప్రశంసలు ఇస్తే వాటి విలువ తగ్గిపోతుంది.నువ్వు సక్సెస్ అయితేనే ప్రశంసిస్తామనే తీరు చాలా ప్రమాదకరం. దీంతో ఆప్యాయతను పర్ఫార్మెన్స్తో లింక్ చేసుకుంటారు. తరచుగా ప్రశంసలపై ఆధారపడితే పిల్లలు అంతర్గత కుతూహలం కోల్పోతారు. స్వతంత్రంగా ప్రయత్నించడం తగ్గిపోతుంది. ప్రశంసలో నిజాయితీ లేకపోతే పిల్లల నమ్మకం దెబ్బతింటుంది. సైన్స్ ఏమంటుంది?పిల్లలకు ప్రోత్సాహం ఇవ్వడంపై మానసిక శాస్త్రవేత్తలు, న్యూరో సైంటిస్టులు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. మీరిచ్చే ప్రశంసలు వారి మెదడును, మైండ్ సెట్ను షేప్ చేస్తాయని వాటిలో వెల్లడైంది. న్యూరోప్లాస్టిసిటీ: మన మెదడు అనుభవాల ఆధారంగా రీవైర్ చేసుకుంటుంది. ప్రయత్నం, పద్ధతి, పట్టుదలపై ఇచ్చే ప్రశంస డోపమైన్ అనే ‘మోటివేషన్ కెమికల్’ను విడుదల చేస్తుంది.ఎపిజెనెటిక్స్: జీన్స్ మన జీవితాన్ని నిర్ణయించవు. ఏ జీన్స్ ‘ఆన్’ అవ్వాలి, ఏవి ‘ఆఫ్’ అవ్వాలనేది వాతావరణం నిర్ణయిస్తుందని ఎపిజెనెటిక్స్ పరిశోధనలు చెప్తున్నాయి. సెల్ఫ్–డిటర్మినేషన్ థియరీ: పిల్లలు సక్సెస్ అవ్వాలంటే అటానమీ, కాంపిటెన్స్, రిలేటెడ్నెస్ అనే మూడు అవసరాలు తీరాలి. సరైన ప్రశంస ఈ మూడింటినీ అందిస్తుంది. ఫ్లో సైకాలజీ: ఫ్లో స్టేట్ అంటే నైపుణ్యాలు, సవాళ్లు సమపాళ్లలో ఉండే స్థితి. సరైన ప్రశంస పిల్లలను ఫ్లో స్టేట్ వైపు నెడుతుంది. అప్పుడే పిల్లల అసలు జీనియస్ వెలుగులోకి వస్తుంది.సరైన ప్రశంసలకు 10 టిప్స్...‘‘నువ్వు స్టెప్ బై స్టెప్గా చేసిన తీరు చాలా నచ్చింది’’ అని ప్రాసెస్ని గుర్తించండి.‘‘నీ ప్రశ్నలు ఆసక్తికరంగా ఉన్నాయి. సైంటిస్ట్లా ఆలోచిస్తున్నావు’’ అని క్యూరియాసిటీకి విలువనివ్వండి. ‘‘ఎన్నిసార్లు ఫెయిల్ అయినా వదల్లేదు, అదే నిజమైన శక్తి’’ అని ప్రయత్నాన్ని హైలైట్ చేయండి.‘‘నీ ఆలోచన ప్రత్యేకంగా ఉంది’’ అని ఒరిజినాలిటీని సెలబ్రేట్ చేయండి. ‘‘గతంలో కష్టమనిపించింది ఇప్పుడు బాగా చేశావు. ఇదే నిజమైన అభివృద్ధి’’ అని ఇంప్రూవ్మెంట్పై ఫోకస్ చేయండి.‘‘నీ వ్యాస పరిచయం చాలా స్పష్టంగా ఉంది’’ అని స్పెసిఫిక్గా చెప్పండి.‘‘ఒకే సమస్యకు పలు మార్గాల్లో ప్రయత్నించడం చాలా స్మార్ట్ స్ట్రాటజీ’’ అని ప్రాబ్లమ్ సాల్వింగ్ని ప్రోత్సహించండి.‘‘ఈ ప్రాజెక్ట్లో ఏ భాగం నీకు ఎక్కువ సంతోషాన్నిచ్చింది?’’ అని రిఫ్లెక్షన్కి దారి చూపండి.‘‘ఈ పనిని ప్రేమగా చేసినప్పుడు ఎంత అందంగా వచ్చిందో గమనించావా?’’ అని ఎఫర్ట్తో పాటు ఎమోషన్ని గుర్తించండి.‘‘ఇది బాగా చేశావు, ఇప్పుడు నెక్ట్స్ లెవెల్ ప్రయత్నిస్తావా?’’ అని ప్రశంసని చాలెంజ్తో కలిపి ఇవ్వండి. సైకాలజిస్ట్ విశేష్ ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్ (చదవండి: వయసు 84 ఏళ్లు..కానీ ఇతడి టాలెంట్ మాములుగా లేదుగా..!) -
నటి అనుకుట్టి ఇష్టపడే స్టైలిష్వేర్లు ఇవే..!
శారీలో కొత్త డ్రేపింగ్ స్టయిల్స్ ట్రై చేస్తుంటాను. ఇది శారీకి కొత్త జీవాన్ని ఇస్తుంది. సామాన్యమైన సల్వార్ను కూడా కొత్త శైలిలో ధరించడం ద్వారా ప్రత్యేకతను పొందవచ్చు. నేను ఎల్లప్పుడూ సహజ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగిస్తాను. అందుకే, నా చర్మం, జుట్టు సహజంగానే మెరుగ్గా ఉంటాయి. నిజానికి, నా అందం మొత్తం నా సహజత్వంలోనే ఉంది అని చెబుతోంది అనుమోల్అందానికి వయసుతో నిమిత్తం ఉండదనేందుకు నిదర్శనం ఆమె. అందమైన వర్చస్సుతో పాటు నిండైన ఆత్మవిశ్వాసం తొణికిసలాడే నటి అనుమోల్ ఫాలో అయ్యే స్టయిలింగ్ టిప్స్ నేటి యువతను కూడా ఆకర్షించి, ఫాలో అయ్యేలా చేస్తున్నాయి. ఇక్కడ అనుమోల్ ధరించిన చీరబ్రాండ్: చినాయా బెనారస్, ధర: రూ. 16,658, జ్యూలరీ బ్రాండ్: దీపాలీ డిజైన్స్, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.స్టిచ్డ్ జ్యూలరీఆభరణాలు లేకుండా రాయల్టీ లుక్ సాధ్యమేనా? అసాధ్యం అనుకుంటున్నారా? కాని, మీ దగ్గర ఒకే ఒక్క స్టిచ్డ్ జ్యూలరీ బ్లౌజ్ ఉంటే, అసాధ్యాన్ని చాలా సులభంగా సుసాధ్యం చేయగలరు. మెడ చుట్టూ నెక్లెస్లా మెరుస్తూ, చేతులపై వంకీల్లా మెరిసిపోతూ, వెనుకవైపు పెండెంట్లా గ్లామర్ జోడించే ఈ మగ్గం వర్క్ డిజైన్లు, ‘ఎక్కడ హారం? ఎక్కడ గొలుసు?’ అని వెతికే పని, ఇతర అదనపు జ్యూలరీ అవసరం లేకుండా చేస్తాయి. ఎందుకంటే ఆభరణాలే బ్లౌజ్లో దాక్కుని ఉంటాయి. ఒక్క బ్లౌజ్తోనే మీ స్టయిల్ నేరుగా స్టార్డమ్ లెవెల్కి చేరుతుంది. సింపుల్ కలర్ చీరతో కలిపితే మగ్గం వర్క్ మరింత హైలైట్ అవుతుంది, హెయిర్ స్టయిల్ బన్ లేదా సైడ్ ప్లేట్స్ సరిగ్గా సరిపోతుంది. వీటితోపాటు, మినిమల్ మేకప్ అదనంగా అందాన్ని జోడిస్తుంది. అయితే, బ్లౌజ్ ఫిటింగ్ సరిగ్గా ఉంటే, మగ్గం వర్క్ డిజైన్ మరింత ప్రభావవంతంగా కనిపిస్తుంది. దీపిక కొండి(చదవండి: అందాల ఆషికా రంగనాథ్ స్టైలిష్ వేర్లు ఇవే..!) -
ఎడారిలోన పంట పండెనెంత సందడి!
ఎండలతో ఎర్రగా మారిన ఎడారి నేల ఇప్పుడు పచ్చని పంటలతో మెరిసిపోతోంది. కేవలం చిన్న చిన్న రాళ్ల గుట్టలు, మట్టీ మాయల సహాయంతోనే పరిశోధకులు ఎడారిని పచ్చని పరుపులా మార్చడం పెద్ద పనేం కాదని అంటున్నారు. ఆనకట్టలు కావు.. ఆదుకునే మంత్రాలు!ఎర్రబడిన ఎడారుల్లో కొత్త ఆశ మొలకెత్తింది. ఆ ఆశ పేరే లారా నార్మన్. అమెరికాకు చెందిన ఈ శాస్త్రవేత్త, ఇరవై ఏళ్లుగా ఎడారిలో నీటి జాడల కోసం వెతికేస్తూ చివరకు ఒక రహస్యాన్ని కనుగొన్నారు. ఆ రహస్యం పెద్ద యంత్రం కాదు, క్లిష్టమైన శాస్త్రం కాదు. ప్రకృతి ఇచ్చిన సులభ మంత్రం. పెద్ద పెద్ద రాళ్లు, చెట్లు, కట్టెలు వంటివన్నీ కలిసి నిడ్స్ అనే సహజ అడ్డాలుగా మారతాయి. ఈ అడ్డాలు నీటి ప్రవాహాన్ని పూర్తిగా ఆపకుండా, నెమ్మదిగా మార్చి, నేలను తడిగా ఉంచుతాయని లారా గుర్తించింది. ఈ పద్ధతిని అనుసరించి ఆమె అరిజోనా, న్యూ మెక్సికో ప్రాంతాల్లో చిన్న చెక్ డ్యామ్లు, రాళ్ల గుట్టలు ఏర్పాటు చేసింది. మొదట ఇది కేవలం మట్టిని ఆపినట్టే అనిపించింది. కాని, కొద్ది రోజుల్లోనే ఎండిన నేల తడిగా మారింది. తడిబీడులు పుట్టాయి. పచ్చని చెట్లు మొలిచాయి. పక్షులు తిరిగి వచ్చి కూశాయి. ఇలా ఎడారి గుండెకు మళ్లీ జీవం చేరింది. మాయా మట్టీ!ఎడారి ఇసుకల్లో ఒక్కసారిగా పచ్చని పంటలు పండాయి. ఆశ్చర్యంగా అనిపిస్తుందా? కాని, ఇది నిజమే! యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నలభై రోజుల్లోనే ఇసుకమయమైన భూమి కాస్త పచ్చటి తోటగా మారిపోయింది. అంతేగాక, అక్కడి ఎండల్లో తియ్యటి పుచ్చకాయల పంట కూడా పండింది. ఈ అద్భుతానికి కారణం ‘నానోక్లే’. మట్టి, నీరు, స్థానిక ఇసుకల మిశ్రమంతో తయారైన ఈ ద్రవం ఎడారికి ప్రాణం పోసే రహస్య మంత్రంలా పనిచేస్తుంది. ఇసుకపై దీన్ని పిచికారీ చేస్తే, ప్రతి ఇసుక రేణువుకు మట్టి కవచం ఏర్పడుతుంది. ఆ కవచం నీటిని పట్టి ఉంచుతుంది. ఫలితంగా ఎండిన నేల తడిగా మారి, వేర్ల దగ్గర పచ్చని జీవం మొలుస్తుంది. ఇలా కొద్ది గంటల్లోనే ఎడారి పచ్చదనంతో మెరిసిపోతుంది. అంతేకాదు, నీటి వినియోగం సగానికి తగ్గిపోవడం, పంటలు వేగంగా పెరగడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఈ మధ్యనే అబూధాబీలో చేసిన ప్రయోగాల్లో పుచ్చకాయలతో పాటు జుక్కినీ, మిల్లెట్ కూడా పండించగలిగారు. కరోనా సమయంలో వచ్చిన ఆ పంటలు స్థానిక కుటుంబాల కడుపులు నింపాయి. ఇప్పటికీ ఈ ప్రక్రియకు ఖర్చు కొంత ఎక్కువే కాని, భవిష్యత్తులో ఈ సాంకేతికత చౌకగా మారితే ఎడారులన్నీ పచ్చటి పొలాలుగా మారిపోతాయి! (చదవండి: పిట్ట మైల్డ్.. వేట వైల్డ్) -
పిట్ట మైల్డ్.. వేట వైల్డ్
కాస్త వేట తెలిసిన పెద్దపెద్ద పక్షులైతే మాంసం ముక్కకోసం వెతుకుతాయి చిన్నా చితకా పక్షులు గింజలు తింటాయి. దొరికితే పురుగుపుట్రను నోట్లో వేసుకుంటాయి. అయితే ష్రైక్ అనే పక్షి క్రూరత్వాన్ని చూస్తే మాంసాహారులకు కూడా మనసు చలిస్తుంది. దీని వేటలో అంత వ్యూహం ఉంటుంది మరి! ‘లానిడే’ కుటుంబానికి చెందిన అనేక రకాల పక్షులను ష్రైక్ పక్షులు అంటారు. ఈ పక్షులు చూడటానికి చాలా మైల్డ్గా కనిపిస్తాయి గాని, వీటిని వైల్డ్ బర్డ్స్ అని కూడా అంటారు. వీటికి వేటాడే జంతువులకు ఉన్నట్లుగా బలమైన కాళ్లు, గోళ్లు ఉండవు. అందుకే ఇవి తన ఆహారాన్ని విలక్షణంగా సమకూర్చుకుంటాయి. చిన్న కీటకాలు, బల్లులు, కప్పలు, చిట్టెలుకలు, కాస్త బలహీనంగా ఉండే రామచిలుకలను వేటాడి, వాటిని నిర్దాక్షిణ్యంగా బతికి ఉండగానే ముళ్ళ పొదలపైన లేదా పదునైన కొమ్మలపైన, మొనలుదేరిన తీగలపైన గుచ్చి చంపుతాయి. మాంసం దుకాణంలో మాంసాన్ని కొక్కేలకు వేలాడదీసినట్లుగా ఈ పక్షులు తమ ఆహారాన్ని ముళ్లకంపలకు వేలాడదీస్తాయి. ఈ పద్ధతి వాటి మనుగడకు అత్యంత కీలకం. ష్రైక్ పక్షులు తమ ఆహారాన్ని నిల్వ చేసుకోవడానికి, తర్వాత అవసరమైనప్పుడు ముక్కలుగా చేసి తినడానికి ఈ విధానాన్నే ఎంచుకుంటాయి. మనకు ఈ పద్ధతి క్రూరంగా అనిపించినా, ప్రకృతిలో ఈ జీవులు తమ మనుగడ కోసం అనుసరించే వ్యూహం ఇదంతా. ఇక తినే ఆహారం విషతుల్యమైందనే అనుమానం వస్తే, ఈ పక్షులు తాము వేటాడిన ఆహారాన్ని అక్కడే వదిలిపెట్టి మరునాడు వచ్చి, అప్పటికి సురక్షితంగా ఉన్నట్లయితే తింటాయట! -
చిన్నారులకు ఆస్తమా..! ఇన్హేలర్స్..నో వర్రీస్..
పిల్లల్లో ఆస్తమా వచ్చి వాళ్లు బాధపడుతుంటే చూసేవాళ్లకు ఆ దృశ్యం చాలా హృదయవిదారకంగా ఉంటుంది. అలా ఆయాసపడుతూ ఊపిరి అందని చిన్నారులను చూస్తే చాలా బాధగా ఉంటుంది. అయితే చిన్నవయసులో ఆస్తమా వచ్చిన చిన్నారుల విషయంలో అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదంటూ డాక్టర్లు భరోసా ఇస్తున్నారు. నిజానికి పిల్లల్లో వచ్చే ఈ ఆరోగ్య సమస్యను ‘రియాక్టివ్ ఎయిర్ వే డిసీజ్’ అంటారు. కానీ సామాన్య జనవాడుకలో దీన్ని ఆస్తమాగా చెబుతుంటారు. చిన్నారుల ఆస్తమా చికిత్సలో అవసరాన్ని బట్టి కొన్ని మందులు నెబ్యులైజేషన్ తర్వాత వారిలో మున్ముందు ఆస్తమా రాకుండా చూసేందుకు డాక్టర్లు రెండు రకాల ఇన్హేలర్స్ సూచిస్తుంటారు. ఇందులో మొదటి రకం ఇన్హేలర్స్ను ‘రిలీవర్స్’ అంటారు. ఇవి తక్షణం ఊపిరి అందేందుకు మొట్టమొదటి చికిత్స (ఫస్ట్ లైన్ ట్రీటెమెంట్) కోసం వాడేవి. ఇవి అటాక్నుంచి రిలీవ్ చేస్తాయి కాబట్టి వీటిని ‘రిలీవర్స్’ అంటారు. ఇవి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే గాలిగొట్టాలను వెడల్పుగా విప్పారేలా చేసి పిల్లలు హాయిగా గాలితీసుకునేందుకు ఉపయోగపడతాయి. ఇక ఆస్తమా అటాక్ వచ్చినప్పుడు ఊపిరితిత్తుల్లో కొన్ని ఇన్ఫ్లమేటరీ సెల్స్ పుడతాయి. వీటిని తొలగించడం రిలీవర్స్కు సాధ్యం కాదు. అలాంటి వాటిని తొలగిస్తూ మున్ముందుకు అటాక్ రాకుండా నివారించే ఇన్హేలర్స్ను ‘ప్రివెంటర్స్’ అంటారు. అవి నివారణకు ఉపయోగపడతాయి కాబట్టి వాటిని ప్రివెంటార్స్గా అభివర్ణిస్తారు. ఇలా ఈ రెండు రకాల ఇన్హేలర్స్తో చిన్నారుల ఊపిరితిత్తుల కార్యకలాపాలు వీలైనంత నార్మల్గా పనిచేసేలా డాక్టర్లు చూస్తారు. ఇవి వాడుతూపోతుంటే క్రమంగా ‘రిలీవర్స్’ వాడాల్సిన అవసరం దాదాపుగా పూర్తిగా తగ్గిపోతుంది. పిల్లల్లో వ్యాధి తీవ్రత ఎంతగా ఉందో, దాన్ని అదుపులో ఉంచేందుకు మందుల డోస్లు ఎంతెంత మార్చాలో తెలుసుకోవడం కోసం అవసరమైనప్పుడు డాక్టర్లు ‘పల్మునరీ ఫంక్షన్ టెస్ట్ – పీఎఫ్టీ’ అనే పరీక్ష చేస్తారు. పిల్లలు పెరుగుతున్నకొద్దీ చాలామందిలో అటాక్స్ దాదాపు పూర్తిగా తగ్గిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువ. చాలామంది పిల్లల్లో ఆర్నెల్లలోనే ఆస్తమా పూర్తిగా అదుపులోకి వచ్చేసే అవకాశాలుంటాయి. ఒకసారి ఆస్తమా అదుపులోకి వచ్చాక ఇన్హేలర్స్ దాదాపు నిలిపివేయవచ్చు కూడా. అయితే ఈ ఇన్హేలర్స్కు పిల్లలు అలవాటు పడిపోతారేమోనని కొంతమంది తల్లిదండ్రులు ఆందోళన పడుతుంటారు. ఇది కేవలం అ΄ోహ మాత్రమే. పైగా ఇన్హేలర్స్ ఎంత సురక్షితమంటే నోటి నుంచి తీసుకునే మందులతో పోలిస్తే వాటిలోంచి దేహంలోకి వెళ్లే మందు కేవలం సమస్య ఉన్న చోటికే పరిమితమవుతుంది. దేహమంతటా తన దుష్ప్రభావాలు చూపదు. అందుకే అవి పూర్తిగా సురక్షితమని పేరెంట్స్ నమ్మవచ్చు. (చదవండి: Dental Health: ఓపెన్ యువర్ మౌత్..! నోటి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఇలా..) -
సేఫ్ హ్యాండిల్స్!
డోర్ హ్యాండిల్ అంటే మనం పెద్దగా పట్టించుకోని చిన్న వస్తువు. కాని, అక్కడే నిత్యం బ్యాక్టీరియా కణాలు పార్టీ చేసుకుంటుంటాయి. తెలియకుండానే వ్యాధులను లోపలికి ఆహ్వానించే ఈ హ్యాండిల్స్ని చూసి, ‘ఇక చాలు’ అనుకున్నాడు జమైకా యువ ఆవిష్కర్త రేవాన్స్ స్టూవర్ట్ట్. వెంటనే సెల్ఫ్ క్లీనింగ్ డోర్ హ్యాండిల్కు ప్రాణం పోశాడు. జమైకా తీరం దగ్గర పుట్టిన అతడి ఆలోచన ఇప్పుడు ఆసుపత్రుల తలుపులకు చేరి వేలాది మంది ప్రాణాలను రక్షిస్తోంది. రేవాన్స్ స్టూవర్ట్.. జమైకా పర్వతాల మధ్యలోని మౌంట్ ప్రాస్పెక్ట్ అనే చిన్న ఊరిలో పెరిగిన అబ్బాయి. జమైకా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో చదువుకుంటున్న విద్యార్థి. అయితే, కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితమయ్యే విద్యార్థి కాదు, వాస్తవ సమస్యలను గమనించి, వాటికి పరిష్కారాలను వెతికే క్రియేటర్. చిన్నప్పటి నుంచి వస్తువులు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. ఆటబొమ్మలు, రేడియోలు విప్పదీసి మళ్లీ కలపడం అతని ఫేవరెట్ గేమ్. అందుకే అతని తల్లి ఎప్పుడూ అతనికి ‘రేవాన్స్ , వస్తువులను పగలగొట్టడం మానెయ్యి!’ అని చెబుతుండేది. కుటుంబంలో ఎవరికీ అక్షరాలు రాకున్నా, రేవాన్స్ యూనివర్సిటీలోకి అడుగుపెట్టాడు. అక్కడ ఇన్నోవేషన్లపై ప్రేమ పెంచుకున్నాడు. వర్చువల్గా దుస్తులు ట్రై చేసుకునే సాఫ్ట్వేర్ను కూడా తయారు చేశాడు. కాని, అసలైన మలుపు ఒక ఆసుపత్రిలో వాలంటీర్గా పనిచేసేటప్పుడు వచ్చింది. అక్కడే గ్రహించాడు ‘డోర్ హ్యాండిల్స్ అంటే అనారోగ్యానికి నేరుగా ఫ్రీ ఎంట్రీ పాస్ల లాంటివి’. అప్పుడే ‘జెర్మోసోల్’ అనే మ్యాజిక్ డోర్ హ్యాండిల్ను తయారు చేశాడు. ఎలా పనిచే స్తుందంటే? సూర్యరశ్మిని సూక్ష్మజీవులు తట్టుకోలేవు కదా! అదే సూత్రాన్ని ఇక్కడ వాడాడు. హ్యాండిల్లో ఒక చిన్న అల్ట్రావయొలెట్ లైట్ అమర్చాడు. మనం తాకగానే అది వెలుగుతుంది. అందులోంచి వెలువడే అల్ట్రావయొలెట్ కాంతి ముప్పయి సెకన్లలో హ్యాండిల్పై ఉన్న బ్యాక్టీరియాను అంతం చేస్తుంది. దాదాపు 99.9 శాతం శుభ్రత సాధ్యం! ఇది కేవలం ఒక ఆవిష్కరణ మాత్రమే కాదు, కరీబియన్స్ వాతావరణానికి సరిపోయే ప్రాణరక్షక కవచం. ఆసుపత్రులు, స్కూళ్లు, ఆఫీసులు సహా ఎక్కడ తలుపులు ఉంటాయో, అక్కడ దీని రక్షణ అవసరం. ఈ అద్భుత ఆవిష్కరణ రేవాన్స్ కి జమైకా ప్రధాని చేతుల మీదుగా జాతీయ యువ శాస్త్రవేత్త అవార్డు, అలాగే కామన్వెల్త్ హెల్త్ ఇన్నోవేషన్స్ అవార్డు తెచ్చిపెట్టింది. ఇప్పుడు తలుపు తీయడం అంటే కేవలం లోపలికి వెళ్లడం కాదు, సూక్ష్మజీవులను బయటే వదిలేయడం కూడా! ఈ విషయమై రేవాన్స్ మాట్లాడుతూ, ‘ఎన్ని కష్టాలు వచ్చినా మా కుటుంబం ఎప్పుడూ ఒకటిగానే నిలిచింది. వాళ్లే నా బలం, వాళ్లే నా ప్రేరణ’. అని చెప్పాడు. ∙ -
అసలైన అంధుడు
సూరారంలో సుబ్బయ్య అనే ఆస్తి పరుడు ఉండేవాడు. అతను పరమ లోభి. అనేక అక్రమ వ్యాపారాలు చేసి డబ్బు కూడబెట్టాడు. దానం చేసే బుద్ధి, పరోపకార గుణం సుబ్బయ్యలో మచ్చుకైనా లేకుండేవి. ఏ పనైనా వెంటనే కావాలనుకునేవాడు.అయితే, అతనికి దేవునిపై నమ్మకం ఎక్కువ. వీలు దొరికినప్పుడల్లా ఏదో ఒక దేవాలయానికి వెళ్లి తన కోరికలు చెప్పుకునేవాడు.పండరిపుర పాండురంగడు కోరిన కోరికలు వెంటనే తీరుస్తాడని సుబ్బయ్య చెవిన పడింది. వెంటనే పండరిపురం వెళ్లాడు. చంద్రవంక నదిలో స్నానం చేసి పుండరీకుని దర్శనం చేసుకున్నాడు. తన కోరికలు పాండురంగనికి చెప్పమని కోరుకున్నాడు. ఆ తర్వాత పాండురంగని ఆలయానికి చేరుకున్నాడు.పాండురంగని ఆలయం ఎంతో సుందరంగా ఉంది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కళకళలాడుతున్నాయి. దైవ దర్శనానికి ఉన్న వరుస ఎంతో పొడవుగా భక్తులతో కిటకిటలాడుతోంది.సుబ్బయ్య అక్రమ బుద్ధి అక్కడ కూడా చూపించాడు. వరుసలో భక్తులు ఒకరి వెంట ఒకరు నెమ్మదిగా పాండురంగని భజన చేసుకుంటూ వెళుతున్నారు. సుబ్బయ్య మాత్రం వెంటనే భగవంతుని దర్శనం చేసుకోవాలని వరుసలోంచి పక్కకు వచ్చి అందర్నీ తోసుకుంటూ ముందుకు పోయాడు. పాండురంగని దర్శించుకుని బయటకు వెళ్లాడు. ‘అయ్యా! దానం చేయండి!’ అంటూ బిచ్చగాళ్లు చుట్టుముట్టారు. అందర్నీ విదిలించుకుని వెళ్ళి దూరంగా ఉన్న అరుగు మీద కూర్చున్నాడు.అక్కడ కంటికి నల్ల అద్దాలు పెట్టుకుని పాండురంగని కీర్తిస్తున్న అంధురాలు ‘అయ్యా! గర్భగుడిలో ఇటుక మీద పాండురంగ స్వామి రెండుచేతులు నడుం మీద పెట్టుకుని ఠీవిగా నిల్చున్న అందాన్ని చూడటానికి మన రెండు కళ్ళు చాలవట కదా!’ అడిగింది.సుబ్బయ్య మాట్లాడలేదు. ‘పాండురంగని పాదాలు మన చేతులతో, శిరస్సుతో స్పృశించవచ్చట కదా! మందిరంలో ఎటు చూసినా తులసి మాలలేనట కదా!?’ తిరిగి అడిగింది. ఆమెకు కళ్లు కనిపించవు. అందుకే చూడలేక అడిగింది. సుబ్బయ్యకు రెండు కళ్లున్నా వెంటనే దర్శనం చేసుకుని బయట పడాలని, ఇతర భక్తులను తోసుకు వెళ్లాడు. అందుకే ఆ అందాన్ని ఆస్వాదించలేకపోయాడు.తన కళ్ళకూ, కళాత్మకంగా చూసే కళ్లకు చాలా భేదం ఉంది. కళాత్మక హృదయం లేని తనకు గొప్ప శిల్పం కూడా బండరాయి లాగే కనిపించింది’ అనుకున్నాడు సుబ్బయ్య. పరోపకారం, దానగుణం లేని తాను కళ్లున్న అసలైన అంధుణ్ణనుకున్నాడు. అక్రమ మార్గం విడిచి సక్రమంగా జీవించాలనుకున్నాడు. అలా అనుకున్నాక పేదలకు దానధర్మాలు చేస్తూ, భగవంతుని సుందరరూపాన్ని చూడగలిగాడు సుబ్బయ్య. పువ్వులు∙ గుండాల నరేంద్రబాబుపూలమ్మా పువ్వులు రంగు రంగుల పువ్వులురంగేళీ రవ్వలురాసగుమ్మ గువ్వలురక రకాల పువ్వులురమ్యమైన పువ్వులురా రమ్మను పువ్వులురామచిలుక చిన్నెలుముద్ద ముద్ద బంతులుముద్దుల చేమంతులుమల్లెలు మందారాలుఎర్రనైన గులాబీలుఅరవిరిసిన సింగారాలు -
జిలుగుల జింజు వెలుగుల రంజు
దక్షిణ కొరియాలోని జియోంగ్సాంగ్ ప్రావిన్స్లో ఉన్న జింజు నగరంలో ఏటా జరిగే ఈ జింజు లాంతర్ ఫెస్టివల్ చాలా ప్రత్యేకంగా నడుస్తుంది. రంగురంగుల లాంతర్లతో జింజులోని నామ్గాంగ్ నది ప్రాంగణం మొత్తం దేదీప్యమానంగా వెలిగిపోతుంది.ప్రతి సంవత్సరం అక్టోబర్లో వచ్చే ఈ దీపాల పండుగ.. సుమారు రెండువారాలకు పైగానే కొనసాగుతుంది. ఈ ఏడాది అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 19 వరకు జింజు నగరాన్ని మెరిపిస్తుంది. ఈ పండుగ మూలాలు సుమారు 400 సంవత్సరాల నాటి పురాతన చరిత్రను చెప్పుకొస్తాయి. జింజు నగరం 1592లో సైనిక కేంద్రంగా ఉండేది. ఆనాడు జపాన్ దండయాత్ర జరిగినప్పుడు జింజు కోటను రక్షించుకోవడానికి వేలాది మంది దక్షిణ కొరియా సైనికులు ప్రాణాలను కోల్పోయారు. వారి ప్రాణత్యాగాలకు గుర్తుగా నేటికీ ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. జపాన్ సైన్యం నామ్గాంగ్ నదిని దాటకుండా నిరోధించడానికి, వారిని తికమకపెట్టడానికి– కొరియన్ సైనికులు నీటిపై లాంతర్లను వదిలేవారని, అలాగే యుద్ధసమయంలో తమ కుటుంబ సభ్యులకు తమ క్షేమ సమాచారం తెలియజేయడానికి కూడా తేలియాడే లాంతర్లను ఉపయోగించేవారని చరిత్ర చెబుతుంది.ఈ వేడుకలో సాంస్కృతిక, వినోదాత్మక కార్యక్రమాలు చక్కగా సాగుతాయి. వేలకొద్దీ రంగురంగుల దీపాలు నామ్గాంగ్ నదిపై తేలుతూ, కళ్ళకు ఇంపుగా మెరుస్తాయి. ఈ వేడుకలో పాల్గొనేవారు తమ కోరికలు రాసిన లాంతర్లను నదిలో వదలిపెట్టవచ్చు లేదా ఆ ఆర్టిఫిషియల్ బ్రిడ్జీలకు వేలాడదీయవచ్చు. ప్రపంచంలోని వివిధ దేశాల మైలురాళ్లను పోలిన భారీ లాంతరు శిల్పాల ప్రదర్శన కనువిందు చేస్తుంది. పండుగ సందర్భంగా పర్యటకులకు, నదిపై తాత్కాలికంగా నిర్మించిన వంతెనలపై నడుస్తూ, లాంతర్లను దగ్గరగా చూసే అవకాశం కల్పిస్తారు. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో రాత్రిపూట– కళ్లు చెదిరే బాణాసంచాలు, డ్రోన్ లైట్ షోలతో ఆకాశం కాంతిమయమవుతుంది.అరుదైన లైట్హౌస్బోనవిస్టా ద్వీపకల్పంలో తీరం వెంబడి తరతరాలుగా ప్రయాణించే నావికులకు– కేప్ బోనవిస్టా లైట్హౌస్తో గొప్ప అనుబంధం ఉంది. పంతొమ్మిదో శతాబ్ది తొలినాళ్లలో ఉపయోగించిన సీల్ (ఒక సముద్రజీవి) ఆయిల్తో మండే అరుదైన కాటోప్ట్రిక్ లైట్ ఉపకరణాన్ని ఇక్కడ చూడొచ్చు. న్యూఫౌండ్లాండ్, లాబ్రడార్లలో అత్యధికంగా ఫొటోలు తీసిన ప్రదేశాలలో ఇది ఒకటి! తిమింగలాలు, మంచు పర్వతాలు, పఫిన్ పక్షులను చూడటానికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. అందుకే ఇక్కడికి పర్యాటకులు ఎగబడుతుంటారు. -
రావణుడి లంకాక్రమణ
రావణుడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి వరాలు పొంది, త్రికూట పర్వతానికి వచ్చాడు.ఈ సంగతి తెలిసి, రావణుడి మాతామహుడు సుమాలి తన మంత్రులైన మారీచుడు, సుబాహుడు, ప్రహస్తుడు, మహోదరుడు, విరూపాక్షుడు సహా తన అనుచరులతో కలసి రావణుడిని కలుసుకోవడానికి వచ్చాడు.‘నాయనా! నువ్వు బ్రహ్మదేవుడి నుంచి ఉత్తమ వరాలు పొందావు. విష్ణువు వలన భయం కారణంగా మేమంతా లంకను విడిచి వెళ్లి, రసాతలంలో తలదాచుకుంటూ వస్తున్నాం. లంకానగరం మనది. ఒకప్పుడు రాక్షసులు నివసించిన నగరం అది. ఇప్పుడు నీ సోదరుడు, బుద్ధిమంతుడు అయిన కుబేరుడు లంకను తన నివాసంగా చేసుకున్నాడు. నువ్వు బుద్ధిబలంతో గాని, సామ దాన భేద దండోపాయాలతో గాని తిరిగి లంకను స్వాధీనం చేసుకున్నట్లయితే, మంచి పని చేసినట్లవుతుంది. నువ్వు లంకకు అధిపతివి కాగలవు. నువ్వు మన రాక్షసులందరికీ ప్రభువువు కాగలవు’ అని అన్నాడు.‘తాతా! కుబేరుడు మాకు అగ్రజుడు, పూజ్యుడు. నువ్విలా మాట్లాడటం తగదు’ అన్నాడు రావణుడు.ప్రహస్తుడు కలగజేసుకుని, ‘రావణా! నీ మాటలు వీరోచితంగా లేవు. శూరులకు భ్రాతృప్రేమ ఉండరాదు. తోబుట్టువులైన అదితి, దితి సౌందర్యవతులు. వారిద్దరూ కశ్యప ప్రజాపతి భార్యలు. అదితి ముల్లోకాలకు ప్రభువులైన దేవతలను, దితి దైత్యులను కన్నారు. సాగర పర్వత వన సమన్వితమైన ఈ భూలోకంపై దైత్యులు అధికారం కలిగినవారై ఉండేవారు. విష్ణువు యుద్ధాలలో దైత్యులెందరినో చంపి, ముల్లోకాలను దేవతల వశం చేశాడు. సోదరులతో విరోధం పెట్టుకోవడం అనే విపరీతాన్ని నువ్వొక్కడివే చేయడం లేదు. పూర్వం సురాసురులు ఇదే పని చేశారు. కాబట్టి నేను చెప్పినట్లు చేశావంటే, లంకాధిపత్యమే కాదు, నీకు త్రిలోకాధిపత్యం కూడా లభించగలదు’ అన్నాడు.ప్రహస్తుడి మాటలతో రావణుడు ఆలోచనలో పడ్డాడు.కాసేపు ఆలోచించాక, ‘సరే! అలాగే చేస్తాను’ అని పలికాడు. రావణుడి మాటలతో సుమాలి, అతడి మంత్రులు, అనుచరులు ఆనందంతో తబ్బిబ్బయ్యారు.మాతామహుడితోను, అతడి మంత్రులతోను చర్చలు జరిపిన తర్వాత కుబేరుడి వద్దకు మాటకారి అయిన ప్రహస్తుడిని రాయబారిగా పంపాలని రావణుడు నిర్ణయించాడు.‘‘ప్రహస్తా! నువ్వు లంకకు వెళ్లు. ధనాధిపతి అయిన కుబేరుడితో సామ మార్గంలో ఇలా చెప్పు’ అని తన సందేశాన్ని ఇలా చెప్పాడు: ‘సౌమ్యుడైన కుబేరా! మహాత్ములైన రాక్షసులకు చెందిన లంకా నగరంలో నువ్వు నివాసం ఏర్పరచుకున్నావు. ఇది నీకు తగదు. అందువల్ల ఇప్పుడు లంకను తిరిగి మాకు ఇచ్చేసినట్లయితే, నాకు సంతోషాన్ని కలిగినవాడివి, ధర్మాన్ని పాలించిన వాడివి కాగలవు’ అని ఆదేశించాడు.రావణుడి ఆదేశంతో ప్రహస్తుడు లంకకు బయలుదేరాడు. కుబేరుడి మందిరానికి చేరుకుని, అతడితో ‘బుద్ధిశాలివైన కుబేరా! నీ సోదరుడైన దశకంఠుడు రావణుడు నన్ను నీ వద్దకు పంపాడు. రావణుడి ఆజ్ఞపై నేను చెబుతున్న మాటలు విను– పూర్వం ఈ లంకానగరాన్ని సుమాలి మొదలైన రాక్షసులు ఏలుకున్నారు. అందువల్ల సౌమ్యంగా అర్థిస్తున్న నీ సోదరుడైన రావణుడికి ఈ లంకను అప్పగించు’ అని చెప్పాడు.‘ప్రహస్తా! రాక్షసులెవరూ లేని ఈ లంకను నా తండ్రి నాకు అప్పగించాడు. ప్రజలకు తగిన దాన గౌరవాలు కల్పించడం ద్వారా దీనిని నేను నివాసయోగ్యం చేశాను. నువ్వు వెళ్లి రావణుడితో ఇలా చెప్పు’ అని– ‘రావణా! ఈ లంకానగరం, ఈ రాజ్యం నీకు చెందినదే! ఏ బాధలు లేకుండా రాజ్యాన్ని అనుభవించు. నా రాజ్యాన్ని, నా ధనాన్ని నీతో ప్రత్యేకంగా పంచుకోవలసిన పనిలేదు. ఇవి మనిద్దరమూ కలసి అనుభవించవలసినవి’ అని చెప్పి ప్రహస్తుడిని సాగనంపాడు.తర్వాత కుబేరుడు తన తండ్రి విశ్రవసుడి వద్దకు వెళ్లాడు. లంకను అప్పగించాలంటూ రావణుడు తన వద్దకు దూతను పంపిన విషయం చెప్పి, ఇప్పుడు తానేం చేయాలో చెప్పమన్నాడు.‘కుమారా! రావణుడు ఈ సంగతి నాకు కూడా చెప్పాడు. నేను మందలించాను. అయినా వాడు నా మాట పట్టించుకోవడం లేదు. దుష్టబుద్ధితో లంకను ఆక్రమించుకుంటే నశిస్తావని కూడా వాడికి చాలాసార్లు చెప్పాను. వాడికి మంచిచెడులు తెలియడం లేదు. హితవు వినే పరిస్థితిలో లేడు. కుమారా! ఈ పరిస్థితుల్లో ధర్మసమ్మతం, శ్రేయోదాయకం అయిన మార్గం చెబుతాను విను. నువ్వు నీ అనుచరులతో కలసి లంకను విడిచిపెట్టు. ఉత్తర దిశలో కైలాసపర్వత ప్రాంతంలో ఉత్తమమైన మందాకినీ నది ఉంది. ప్రశాంతమైన ఆ ప్రదేశంలో దేవ గంధర్వ కిన్నెర కింపురుషాలదులు ఆనంద విహారాలు చేస్తుంటారు. అలాంటి మందాకినీ తీరంలో నివాసయోగ్యమైన నగరాన్ని నిర్మించుకో’ అని సలహా ఇచ్చాడు.తండ్రి సలహాతో కుబేరుడు తన భార్యా పుత్రులతో, అమాత్యులతో, పరిజనంతో రథాది వాహనాలను సిద్ధం చేసుకుని, కైలాసం వైపు ప్రయాణం ప్రారంభించాడు. కుబేరుడు లంకను ఖాళీ చేసేయడంతో ప్రహస్తుడు సంతోషించాడు. వెంటనే రావణుడి వద్దకు వెళ్లి, లంకానగరం ఇప్పుడు శూన్యంగా ఉంది. నువ్వు నీ సోదరులు, అమాత్యులు, పరివారంతో చేరుకుని, లంకను యథేచ్ఛగా అనుభవించవచ్చు’ అని చెప్పాడు.రావణుడు లంకను ఆక్రమించుకుని, రాక్షసుల చేత రాజ్యాభిషిక్తుడయ్యాడు. లంకను విడిచి వెళ్లిన కుబేరుడు కైలాస పర్వతం వద్ద మందాకినీ తీరానికి చేరువలో అలకాపురి నగరాన్ని నిర్మించుకున్నాడు.∙సాంఖ్యాయన -
కాలేజీ క్రీమినల్!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా ఉన్న నేరగాడు బత్తుల ప్రభాకర్. కాలేజీలను టార్గెట్గా చేసుకుని, స్టూడెంట్ ముసుగులో రెక్కీ చేసి, నల్లధనాన్ని దోచుకుపోయే ఈ గజదొంగ ఈ ఏడాది సెప్టెంబర్ 22న ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా దుద్దుకూరు వద్ద పోలీసు ఎస్కార్ట్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో నేరాలకు పాల్పడ్డ ఈ అంతర్రాష్ట్ర నేరగాడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రూ.333 కోట్లు సంపాదించాక నేరాలు మానేయాలని, అప్పటికే తన జీవితంలో వందమంది యువతులతో సన్నిహితంగా ఉండాలనీ లక్ష్యంగా పెట్టుకున్న ఘరానా దొంగ ఇతడు.పెద్ద పెద్ద కాలేజీలను టార్గెట్గా చేసుకుని, చోరీలు చేసే బత్తుల ప్రభాకర్ చదివింది మాత్రం ఎనిమిదో తరగతే. చిత్తూరు జిల్లా ఇరికిపెంటకు చెందిన ఇతగాడు 7, 8 తరగతులు విజయవాడలో చదివాడు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ 17 ఏళ్ల వయస్సు నుంచే చోరీల బాటపట్టాడు. దాదాపు 15 ఏళ్లుగా ఇంజినీరింగ్ కాలేజీలు, కార్పొరేట్ స్కూళ్లలో చోరీలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా మారాడు. ఇతడికి బిట్టూ, రాహుల్ రెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి, రాజు తదితర మారు పేర్లు ఉన్నాయి. స్నేహితులు, సన్నిహితంగా ఉండే యువతుల వద్ద, షాపింగ్కు వెళ్లినప్పడు మృదు స్వభావిగా ఉంటాడు. ఎక్కడా ఎవరితోనూ గొడవలు పడిన దాఖలాలు లేవని పోలీసులు చెబుతున్నారు. కొన్నేళ్ల కిందట రూ.3 వేలు చోరీ చేయడంతో తన నేరచరిత్ర మొదలైంది. అప్పట్లో ఒకే రోజు రూ.3 లక్షలు, మొత్తమ్మీద రూ.33 లక్షలు చోరీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు. అందుకే బత్తుల ప్రభాకర్ తన ఛాతీ కుడివైపు 3 సంఖ్యను పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ లక్ష్యాన్ని రూ.333 కోట్లకు పెంచుకున్నాడు. అలాగే 100 మంది యువతులతో సన్నిహితంగా ఉండాలన్నది మరో లక్ష్యమని, విలాసవంతమైన జీవితం గడుపుతున్న తాను ఇప్పటికే 40 మందితో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనికి గుర్తుగానే ఛాతీ ఎడమ వైపు 100 సంఖ్యను టాటూ వేయించుకున్నాడు. విలాస జీవితం గడిపే ఇతగాడు సాఫ్ట్వేర్ ఇంజినీర్ ముసుగుతో ఉంటాడు. గేటెడ్ కమ్యూనిటీల్లో స్నేహితుల పేరిట ఫ్లాట్ తీసుకొని ఉంటూ ఇతర రాష్ట్రాల యువతులతో సహజీవనం చేస్తుంటాడు. ప్రతిరోజూ ఉదయం జిమ్కు వెళ్లడం, వీకెండ్స్లో పబ్స్లో జల్సాలు చేయడం ఇతడి నైజం. కేవలం హైఎండ్ కార్లు మాత్రమే వాడే ప్రభాకర్ సెకండ్ హ్యాండ్ వాహనాలను స్నేహితుల పేరిట కొంటాడు. కొన్నాళ్లు వాడిన తర్వాత ఆ వాహనాన్ని ఆ స్నేహితుడికే వదిలేసి తన మకాం మార్చేస్తాడు. పోలీసులకు చిక్కకుండా ఉండటానికే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు. ఓ ఫ్లాట్ ఖాళీ చేసిన తర్వాత మరో దాంట్లోకి చేరే వరకు ఖరీదైన ప్రాంతాల్లో ఉన్న పేయింగ్ గెస్ట్ అకామడేషన్స్లో ఉంటాడు. ఓ కాలేజీని టార్గెట్గా చేసుకున్న తర్వాత ప్రభాకర్ ముందుగా రెక్కీ చేస్తాడు. దీనికోసం ఆ కాలేజీ విద్యార్థి మాదిరిగా కొన్ని పుస్తకాలు పట్టుకుని, అందుకు తగ్గ దుస్తులు ధరించి లోపలకు ఎంటర్ అవుతాడు. క్లాసుల్లోకి వెళ్లకపోయినా.. 15 రోజుల నుంచి 20 రోజుల వరకు ఆ కాలేజీకి వెళ్తాడు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఆఫీస్ రూమ్, లాకర్ తదితరాలు ఎక్కడ ఉన్నాయి? ఎలా ఉన్నాయి? పరిశీలిస్తాడు. ఈ రెక్కీ పూర్తయ్యాక తన రూమ్లో ఓ పేపర్ మీద డ్రాయింగ్ వేస్తాడు. అందులో లాకర్ రూమ్తో పాటు అక్కడకు ప్రవేశించడానికి ఎంచుకోవాల్సిన మార్గాలను గీస్తాడు. లాకర్ను కట్ చేయడానికి ఎలక్ట్రిక్ కట్టర్ వాడే ప్రభాకర్... దానికి ప్లగ్ పెట్టడానికి పాయింట్ ఎక్కడ ఉందో కూడా చూసుకుంటాడు. నేరం చేశాక చేతికి చిక్కిన సొమ్ముతో జల్సాలు చేసే ప్రభాకర్, సాధారణంగా ఆ డబ్బు మొత్తం ఖర్చయ్యే వరకు మరో నేరం చేయడు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం వరుసపెట్టి నేరాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఫ్లాట్లో కలిసి ఉండే క్రమంతో తనకు స్నేహితులుగా మారిన వారికి తన గతం తెలియకుండా జాగ్రత్తపడతాడు. అనుకోకుండా ఎవరికైనా తెలిస్తే వారికి భారీ మొత్తం ఇచ్చి నోరు మూయిస్తాడు. చోరీ నగదును స్నేహితుల అకౌంట్లలో వేసి, వారి యూపీఐలు తన ఫోన్లో యాక్టివేట్ చేసుకుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తాడు. జిమ్, పబ్స్తో పాటు గోల్ఫ్, బౌలింగ్ ఆటలు, సినిమాలు ఇతడి హాబీ. వీటిలో ఎక్కడికి వెళ్లినా తన ముఖం సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా కచ్చితంగా మాస్క్ ధరిస్తాడు. ఇతడు చోరీ చేసే డబ్బు డొనేషన్లకు సంబంధించిన నల్లధనమైతే వాళ్లు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసే వారు కాదు. విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఉన్న ఇతగాడిని అనకాపల్లిలో నమోదైన కేసు విచారణ నిమిత్తం 2022 మార్చి 23న అక్కడి కోర్టుకు తీసుకువెళ్లారు. విచారణ అనంతరం వైజాగ్ తీసుకువచ్చిన ఎస్కార్ట్ పోలీసులు సంకెళ్లు తీసి జైలు అధికారులకు అప్పగిస్తుండగా తప్పించు కున్నాడు. అప్పటినుంచి సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ, సంగారెడ్డి, సూర్యాపేట్ పరిధిలో కాలేజీలలో చోరీలు చేశాడు. విశాఖపట్నం జైల్లో ఉండగా పరిచయమైన, వివాదం జరిగిన ఓ వ్యక్తిని చంపడానికి తుపాకీ తూటాలు ఖరీదు చేశాడు. వీటితో సంచరిస్తుండగా ఈ ఏడాది ఫిబ్రవరి 1న గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఆ సమయంలో పోలీసులపై కాల్పులు జరిపాడు. ∙ -
ఓపెన్ యువర్ మౌత్..! నోటి ఆరోగ్యం కోసం..
నోరు బాగుంటే ఊరు బాగుంటుందని సామెత. ఊరూ... ఊరి వ్యక్తులతో సంబంధాలే కాదు... నోటి పలువరస బాగుంటే, దంతాలకు సంబంధించిన వ్యాధులేమీ లేకపోతే వ్యక్తి చిరునవ్వు, ఇనుమడించిన ముఖపు అందం, మంచి పలువరస కారణంగా చక్కటి ఉచ్చారణ... ఇలా చాలా అంశాలు బాగుంటాయి. నోరూ లేదా దంతాలకు సంబంధించి ఏదైనా సమస్య వస్తే... అప్పటికప్పుడు ఆ సమస్యకు చికిత్స అందించడమన్నది కాకుండా... ఓ పూర్తి స్థాయి చికిత్సను ‘సమగ్రం’గా అందించడం ద్వారా నోటి ఆరోగ్యాన్ని అన్ని విధాలా కాపాడే చికిత్స ప్రక్రియే‘ఫుల్ మౌత్ రీ–హ్యాబిలిటేషన్’. సంక్షిప్తంగా ‘ఎఫ్ఎమ్ఆర్’ అని పిలిచే ఈ చికిత్స ప్రక్రియ గురించి తెలిపేదే ఈ కథనం. నోటిలోని పళ్లకూ, పలువరసకూ అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ పళ్లు అరిగి΄ోవడం, కొన్ని విరిగి΄ోవడం, కొన్ని చోట్ల సందులు రావడం వంటివి జరుగుతుండటం మామూలే. దీనికి తోడు కొందరిలో చిగుర్ల సమస్యలూ రావచ్చు. మరికొందరిలో ఒకటో రెండూ పళ్లు ఊడి΄ోవచ్చు. అయితే ఇవన్నీ జరుగుతున్నప్పటికీ తమకు సంబంధించినంతవరకూ ఏ సమస్యా లేక΄ోతే కొందరు దంతవైద్యుడి వద్దకు వెళ్లరు. చికిత్స తీసుకోరు. కారణం... పని నడుస్తోంది కాబట్టి అలా రోజులు వెళ్లదీయడమే పనిగా పెట్టుకుంటారు. కొన్ని సమస్యలు...అలా నోటిలో పళ్లు అరగడం, విరగడం, దంతాలూ ఊడిపోవడం వల్ల సందులు రావడాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల మరికొన్ని సమస్యలు రావచ్చు. ఉదాహరణకు... పలువరసలోని కొన్ని పళ్లు ఊడటం వల్ల దంతాల మధ్య సందులు (గ్యాప్) వచ్చి అక్కడ ఆహారం చిక్కుకుపోయి, అది కుళ్లుతుండటం వల్ల దంతక్షయం మరింత వేగంగా జరగడం. అలా పళ్లు ఊడిన చోట ఆహారం చిక్కుకు΄ోయి కుళ్లుతుండటంతో నోటి దుర్వాసన వస్తుండటం. పళ్లు ఊడిన కారణంగా ముఖం ఆకృతి చెడిపోయి మునపటి కంటే అందవిహీనంగా కనిపించడం. పళ్లు ఊడటం లేదా పలువరసలో సందుల కారణంగా మాట్లాడుతున్నప్పుడు పళ్లసందుల నుంచి గాలిపోతూ ఉచ్చారణ సరిగా లేకపోవడం, దాంతో సరైన కమ్యూనికేషన్ జరగక... ఎదుటివారికి మాట సరిగా అర్థం కాకపోవడం. ఊడినపళ్ల కారణంగా చిరునవ్వు నవ్వేందుకు ఇబ్బంది పడుతూ నలుగురిలో మనస్పూర్తిగా నవ్వలేకపోవడం.ఆరోగ్యపరంగానూ మరికొన్ని నష్టాలు... ఊడిన పళ్ల కారణంగా ఆహారాన్ని సరిగా / పూర్తిగా నమలలేకపోవడం. పలువరసలో వచ్చిన గ్యాప్ కారణంగా పళ్లు ఉన్నచోటి నుంచి పక్కకు కదిలిపోతూ ఉండటం. ఊడిన పళ్ల వల్ల వచ్చిన సందుల కారణంగా పలువరస చెడిపోయి కొరికినప్పుడు పైవరస, కింది వరస పళ్లు సరిగా అమరకపోఒవడం (అలైన్మెంట్ సరిగా జరగకపోవడం). (రెండు దవడలూ కలిసినప్పుడు అవి సరిగా అమరకపోవడం).నములుతున్నప్పుడు కింది దవడ కదిలినప్పుడల్లా క్లిక్ క్లిక్ మంటూ శబ్దం (క్లికింగ్ సౌండ్) రావడం.మానసిక సమస్యలకూ దారితీసే ప్రమాదం... ఇలా పలువరసకు వచ్చే సమస్యలతో కేవలం భౌతికంగా కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు రావడం లుక్స్పరంగా ఇబ్బంది కలగడం మాత్రమే కారణంగా... ఆత్మవిశ్వాసం లోపించడం, చిరునవ్వు నవ్వలేకపోవడంతో కొన్ని సందర్భాల్లో కొందరిలో ఈ సమస్య మానసికమైన రుగ్మతలకూ కారణమయ్యేందుకూ అవకాశాలు లేకపోలేదు. పై ప్రక్రియలన్నింటి సాయంతో కొన్ని కొన్ని సిట్టింగులలో నోటికి అవసరమైన పూర్తిస్థాయి సమగ్రమైన సంయుక్త చికిత్సను ఈ ‘ఫుల్ మౌత్ రీ–హ్యాబిలిటేషన్’లో అందిస్తారు. దాంతో పేషెంట్లకు దంతపరంగా లేదా నోటి ఆరోగ్యపరంగా అవసరమైన అనేక అవసరాలు ఒకే సమగ్రచికిత్సలో తీరి΄ోవడం సాధ్యమవుతుంది.అన్ని రకాల సమస్యలకూ కలిపి ఒక సమగ్ర చికిత్సే ‘ఎఫ్ఎమ్ఆర్’... దంతాల సమస్యలకు చికిత్సలు విడివిడిగా ఉంటాయి. ఉదాహరణకు పళ్లు అరిగినప్పుడు ఫిల్లింగ్ చేయడం లేదా క్యాప్ వేయడం, అలాగే చిగుర్లకు వచ్చే జింజివైటిస్, పెరియోడాంటైస్ వంటి సమస్యలకూ ఇవ్వాల్సిన చికిత్సలూ ఇలా రకరకాల సమస్యలకు నిర్దిష్టంగా చికిత్సలు ఇస్తుంటారు. అయితే అనేక రకాల సమస్యలు ఒకేసారి కనిపించినప్పుడు అనేక చికిత్సలను కలగలిపి ఒకే సమగ్ర చికిత్సగా ఇవ్వడమూ సాధ్యమవుతుంది. ఇందులో అరిగిన / విరిగిన పళ్లకు పైన దంతాన్ని పునర్నిర్మించడం (క్రౌన్స్), పన్నుకూ పన్నుకూ మధ్య మరో పన్ను పోయినప్పుడు బ్రిడ్జ్ చికిత్సలు, ఆర్థోడాంటిక్స్ (దవడ పళ్లు లేదా దవడల అమరిక సరిగా లేనప్పుడు ఇవ్వాల్సిన చికిత్సలూ), చిగుర్లకు చికిత్సలూ... వీటన్నింటినీ కలిపి సంయుక్తంగా చికిత్సలను అందించడాన్ని ‘ఫుల్ మౌత్ రీ–హ్యాబిలిటేషన్’ (ఎఫ్ఎమ్ఆర్)గా చెబుతారు.ఎఫ్ఎమ్ఆర్లో ఏం జరుగుతుంది... ఈ సమగ్ర చికిత్స ప్రక్రియలో కంప్యూటర్ సహాయంతో నోటి తాలూకు పూర్తి చిత్రీకరణ... ఉదాహరణకు... కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్ (క్యాడ్) అలాగే కంప్యూటర్ ఎయిడెడ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ (క్యామ్) లతో నోటి నిర్మాణాన్ని తొలుత రూపొందించుకుంటారు. అటు తర్వాత నోటిలో ఉన్న సమస్యలన్నింటినీ తెలుసుకుని, ఏయే రకాల సమస్యలకూ ఏయే చికిత్సలనే ఓ సమగ్ర ప్రణాళికను రచించుకుంటారు. అవసరాన్ని బట్టి ఎలాంటి కృత్రిమమైన ఇంప్లాంట్స్ అమర్చాలో నిర్ణయించుకుంటారు. ఇక అందానికీ, లుక్స్కు సంబంధించిన సమస్య అయితే దానికి తగ్గట్టుగా కాస్మటిక్ చికిత్స కోసం అవసరమైన వినీర్స్ (బాధితుల వ్యక్తిగత అవసరాల కోసం తగిన విధంగా రూపొందించిన పంటిపై అమర్చేందుకు ఆ పంటి రంగే కలిగిన పలుచటి పొరల్లాంటివి) సమకూర్చుకుంటారు. చిగుర్ల సమస్యలు ఉంటే దానికి ఇవ్వాల్సిన మందులను సూచిస్తారు. డాక్టర్ సుధీర్ చౌదరి కరణంఆర్థోడాంటిస్ట్ – ఇంప్లాంట్ స్పెషలిస్ట్ (చదవండి: Parenting Tips: పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే..? ఐఏఎస్ అధికారిణి పేరెంటింగ్ టిప్స్లు..!) -
కథాకళి: దాగుడుమూతలు
వరియార్ నా కొలీగ్. మలయాళీ అయిన అతనికి అలెప్పీ నుంచి హైద్రాబాద్కి బదిలీ అయి రెండున్నర ఏళ్లైంది. మా అందరికన్నా సీనియర్. మెయింటెనెన్స్ పనిలో అనుభవజ్ఞుడు. తన భార్య ఆరోగ్యంగా లేదని ఓసారి చెప్పాడు. మూడు నెలల క్రితం ఆమె మరణించింది. మృతదేహాన్ని ఆవిడ సొంత ఊరు ఎర్నాకులానికి తీసుకెళ్ళాడు. తిరిగి వచ్చాక వరియార్ మా ఆఫీస్లో పనిచేసే ఓ బ్రహ్మచారిని తన అపార్ట్మెంట్కి వచ్చి ఉండమని కోరాడని నాకు తెలిసింది. నేనున్న పేయింగ్ గెస్ట్ అకామడేషన్స్ చాలా ఖరీదుగా ఉంది. హాస్టల్స్లో సౌకర్యాలు బాగుండవు. అందుకని వరియార్ పనిచేసే మెషి¯Œ షాప్కి వెళ్ళి అడిగాను.‘‘మీ అపార్ట్మెంట్లో నేను ఉండచ్చా?’’వరియార్ మొహం వికసించింది.‘‘తప్పకుండా. ఇద్దరిని అడిగితే రామన్నారు.’’ చెప్పాడు.‘‘నెలకి ఎంత ఇవ్వాలి?’’ అడిగాను.‘‘మీ ఇష్టం. ఇవ్వకపోయినా ఫర్వాలేదు.’’‘‘ఉచితంగా తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను భోజనంతో కలిపి ఇప్పుడు నేను నెలకి పదిహేనువేల ఐదొందలు చెల్లిస్తున్నాను. మీకు ఏడువేల ఐదొందలు ఇస్తాను.’’ చెప్పాను.‘‘అలాగే. మీ ఇష్టం అన్నాగా. కాని సాధ్యమైనంత త్వరగా రాగలరా? వీలుంటే ఇవాళే...’’భార్య పోవడంతో కలిగిన ఒంటరితనం అతన్ని బాధిస్తోందని నాకు అర్థమైంది.ఇంటికి వెళ్ళగానే నేనున్న ఇంటి యజమానికి ఆదివారం ఖాళీ చేస్తానని చెప్పాను.∙∙ నేను వరియార్ అపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత రెండు రోజులు వరుసగా అరుణిక వచ్చింది.‘‘ఈమె అరుణిక. మన పక్క అపార్ట్మెంట్లో ఉంటుంది.’’ పరిచయం చేశాడు.ఆ తర్వాత ఆమె రెండు మూడుసార్లు వచ్చింది. ఆమె కేరళ వాళ్ళు చేసుకోని కందిపొడో, పచ్చి పులుసో, ములక్కాడ, టొమాటోల కూరో ఇలా ఏదో ఒకటి తెచ్చిచ్చేది. ఆమెకీ, వరియార్ భార్యకి మంచి దోస్తీ ఉండి ఉంటుందని అనుకున్నాను.ఆఫీస్ అయ్యాక నేను ఏదైనా సినిమాకి వెళ్ళి అపార్ట్మెంట్కి వెళ్తే దానికి తాళం ఉండేది. లోపల వరియార్ ఉండేవాడు కాదు. సెలవు దినాల్లో నేను బయటికి వెళ్తూంటే అతనూ నాతోపాటే బయటికి వచ్చేవాడు. రెండు వారాల తర్వాత అతను అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం లేదని గ్రహించాను.ఓ రాత్రి చెప్పాను.‘‘మిత్రమా. మీరు మీ ఆవిడని బాగా మిస్ అవుతున్నారు. మీ భార్యని మీరు ప్రేమించినంతగా ఎప్పుడు ఎవరూ తమ భార్యని ప్రేమించలేరు.’’అతను బదులుగా పకపక నవ్వాడు. మర్నాడు ఆదివారం అరుణిక తెచ్చిన గుమ్మడి పులుసుని అన్నంలో కలుపుకుని తింటూండగా చెప్పాడు.‘‘మీకో విషయం నిజాయితీగా చెప్పాలి. నేను అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉండకపోవడానికి కారణం మా ఆవిడ మీద ప్రేమ కాదు.’’‘‘మరి?’’‘‘ఇది రహస్యం. అయినా చెప్తున్నాను. ఎవరికీ చెప్పకండి. కారణం అరుణిక.’’‘‘అరుణికా?’’ ఆశ్చర్యంగా అడిగాను.‘‘అవును. ఆమె భర్త నించి విడాకులు తీసుకుంది. కూతురు, కొడుకుతో మన పక్క అపార్ట్మెంట్లో ఉంటోందని మీకు తెలుసుగా?’’‘‘తెలుసు?’’కొద్దిగా సందేహించాక చెప్పాడు.‘‘ఆమెతో దాగుడుమూతలాట ఆడుతున్నాను. కొన్ని నెలల క్రితం మా మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. మా ఆవిడ ఓ రెండు గంటలు బయటకి వెళ్తే మాకు ప్రైవసీ దొరకగానే రమ్మనేవాడిని. వచ్చేది. మా ఆవిడ హాస్పిటల్లో చేరినప్పుడు కూడా. ఆమె మరణించాక నాకు ప్రైవసీకి లోపం లేకపోవడంతో రోజూ వచ్చి శారీరక సంపర్కం కోరుతోంది. ఆమెకి మన అపార్ట్మెంట్ బయట తాళంకప్ప కనపడితే సరే. లేదా వచ్చేస్తుంది. ఆమె మీద నాకు ఎన్నడో మొహం మొత్తింది. రావద్దని చెప్పి ఆమెని హర్ట్ చేయలేను. ఇది మన కంపెనీ నాకు కేటాయించిన అపార్ట్మెంట్ కాబట్టి ఖాళీ చేయలేను. ఇంట్లో ఇంకొకరు ఉంటే అరుణికని దూరంగా ఉంచొచ్చని నిన్ను రమ్మన్నాను.’’ వివరించాడు.ప్రైవసీ కోసం లోకంలోని ప్రేమికులు వెతుకుతూంటే, వరియార్ దాన్ని దూరంగా ఉంచి దాగుడుమూతలాట ఆడటం నాకు నవ్వు తెప్పించింది. FEED ME A STORY : మల్లాది వెంకట కృష్ణమూర్తి ‘ఫన్డే’లో ప్రచురితమయ్యే ఈ శీర్షికలో మల్లాది కథలు రాయడమే కాదు, మిమ్మల్ని కూడాభాగస్వాములను చేయనున్నారు. మీరైతే ఈ కథకు క్లైమాక్స్ ఏమి రాస్తారో ఈ కింది మెయిల్కు పంపండి. kathakalisakshi@gmail.com -
ఈ వారం కథ: జీవన మాధుర్యం
‘‘అరేయ్ రాజూ! మాధురికి పెళ్లి కుదిరింది. అబ్బాయి పేరు జీవన్. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్’’ సంతోషంగా చెప్పాడు ప్రకాష్. ‘‘ఓహ్ కంగ్రాట్స్రా ప్రకాష్! అబ్బాయి సొంత ఊరేది? అతడి అమ్మానాన్నలు ఎక్కడుంటారు?’’ అడిగాడు రాజీవ్.‘‘అబ్బాయి తండ్రి హైదరాబాద్లోని బీఎస్ఎన్ఎల్ ఆఫీసులో మంచి ఉద్యోగమే చేస్తున్నాడు. తల్లి గృహిణి, వాళ్లకు మొదట అమ్మాయి, తరువాత అబ్బాయి. అమ్మాయికి పెళ్లయిపోయింది. తను కూడా అమెరికాలోనే కాపురముంటోందట!’’ అన్నాడు ప్రకాష్.‘‘చూడబోతే గొప్పింటి సంబంధంలాగా అనిపిస్తోంది. మనలాంటి మధ్యతరగతి వాళ్లకు ఎలా తూగారు?’’ అనుమానంగా అన్నాడు రాజీవ్.‘‘వాళ్ళు డబ్బుతో పాటు మంచి మనసున్న మారాజులురా! కానీ కట్నం వద్దని కచ్చితంగా చెప్పారు’’ అన్నాడు ప్రకాష్.‘‘అయితే మాధురి అదృష్టవంతురాలు. ఎప్పుడూ ఎలాంటి సంబంధం వస్తుందో, ఎంత కట్నం అడుగుతారోనని భయపడేవాడివి. కుదిరిపోయింది కదా, ఇప్పుడు ప్రశాంతంగా ఊపిరి తీసుకో’’ అన్నాడు రాజీవ్.‘‘రాజూ! వాళ్ళు కట్నం వద్దన్నారని మనమేమీ ఇవ్వకుండా ఊరుకుంటే మర్యాదగా ఉంటుందా? మనకూ, వెళ్లిన చోట పిల్లకూ కూడా అవమానమే’’ అన్నాడు ప్రకాష్.‘‘అడిగింది ఇవ్వకపోతే అవమానం కానీ అడగకపోతే ఇవ్వడమెందుకు?’’‘‘అరేయ్ రాజూ! అడిగిన కట్నం ఇచ్చేస్తే ఎటువంటి గొడవుండదు. అడగకపోతే కట్నం లేదని మిగిలిన అన్ని లాంఛనాలు ఘనంగా పెట్టాలి’’‘‘అదీ నిజమే అనుకో! ఇంతకీ తాంబూలాలు పుచ్చుకునేది ఎప్పుడు?’’ అన్నాడు రాజీవ్.‘‘ప్రత్యేకంగా తాంబూలాలు మార్చుకోవడమేమీ లేదు. అమ్మాయిని చూడటానికి వచ్చిన రోజునే అమ్మాయి మెడలో అత్తగారు హారం వేశారు. అబ్బాయి తన చేతికున్న ఉంగరం తీసి అమ్మాయి వేలికి తొడిగాడు. ఇదే నిశ్చితార్థం అనుకుందాం అని మా వియ్యంకులుగారు అన్నారు.’’‘‘అదేంట్రా? ఈ రోజుల్లో ఇంత సింపుల్గా నిశ్చితార్థం జరుపుకున్నవారిని మిమ్మల్నే చూశాను. ఎంగేజ్మెంట్ పేరుతో ఇరువైపులా బట్టలు పెట్టుకోవటం; తరువాత పెద్ద హోటల్లోనో, ఫంక్షన్ హల్లోనో భారీ ఎత్తున భోజనాలు, డ్రోన్లతో రక రకాల ఫొటోలు తీయడం దాదాపు పెళ్ళి చేసినంత ఆర్భాటంగా చేస్తున్నారు. వీళ్లేంటీ అలికిడి లేకుండా మన కాలంలో చేసుకున్నట్లు ఇంట్లో క్లుప్తంగా ముగించారు? అబ్బాయి ఎవరి తాలూకా? కుటుంబం గురించి సరైన విచారణ చేశావా?’’ ఆరా తీశాడు రాజీవ్.‘‘హహ...’’ అంటూ నవ్వేశాడు ప్రకాష్.‘‘నవ్వుతావేంట్రా? అసలే అమెరికా సంబంధం అంటున్నావు. ఈ మధ్యన అమెరికా పెళ్లిళ్ల గురించి టీవీలో చాలా వింటున్నాము. ఎవరికీ తెలియనివ్వకుండా తాంబూలాలు కానిచ్చారంటే చాలా ఆలోచనలు వస్తున్నాయి’’ అన్నాడు రాజీవ్.‘‘అలాంటి అనుమానాలు నాకూ వచ్చాయి. వాళ్ళు మా అత్తగారికి కాస్త దగ్గరి బంధువులవుతారు. ఎవరిని అడిగినా మంచి కుటుంబమనే చెప్తున్నారు. వాళ్ళు రాజమండ్రిలో స్థిరపడ్డారు, అబ్బాయి చదువుకోవడానికి అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అసలు ముందుగా పెళ్లిళ్ల పేరయ్య ద్వారా ఈ సంబంధం మనకు వచ్చింది. వాళ్లకు ఫొటోల్లో మన అమ్మాయి నచ్చిందని చెప్పడంతో విషయం మనదాకా వచ్చింది. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు చుట్టరికం బయటకు వచ్చింది. అబ్బాయి వీడియో కాల్లో అమ్మాయిని చూసి, మాట్లాడి తన అంగీకారం తెలిపాడు. తరువాత ఇరుపక్షాల మాటలు జరిగాయి. అంతా సరే అనుకున్నాక పెళ్ళికి సిద్ధపడ్డాం’’ అన్నాడు ప్రకాష్.‘‘తెలిసినవాళ్లేనా? అయితే ఇంకా కంగారు పడటానికేముంది? ఇంతకీ పెళ్లెప్పుడు?’’ అన్నాడు రాజీవ్.‘‘అబ్బాయి పెళ్లయ్యాక అమ్మాయిని కూడా తీసుకెళ్లాలంటే వీసా ప్రక్రియ కోసం పెళ్లి తొందరగా చేయాలని వియ్యంకుడు జగదీష్ చెప్పాడు. పెళ్లి మరో పదిహేను రోజుల్లో’’...‘‘అయితే పెళ్లి పనుల కోసం నువ్వు రేసు గుర్రంలాగా పరుగులు తీయాలి’’ నవ్వుతూ అన్నాడు రాజీవ్.‘‘అవునురా డబ్బున్నవాళ్లతో వ్యవహారం కదా ఎలా చేస్తానో అని కంగారుగా అనిపిస్తుంది. నువ్వు మాత్రం అమ్మాయి అత్తారింటికి వెళ్ళేదాకా తోడుండాలి’’...‘‘అది ప్రత్యేకంగా నువ్వు చెప్పాలా?’’ అన్నాడు రాజీవ్.∙∙ ప్రకాష్ చిన్న వ్యాపారస్తుడు రమ అతడి భార్య, వారికిద్దరు పిల్లలు మాధురి పెద్దది, బీటెక్ పూర్తిచేసి ఊర్లో ఉన్న చిన్న ప్రైవేట్ స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేస్తోంది. తరువాత మహేష్ బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ప్రకాష్ సంపాదనతో ఉండటానికి సొంత ఇల్లు కట్టుకున్నాడు. అంతకు మించి అతడికి ఎటువంటి స్థిరాస్తులూ లేవు. కూతురికి తన స్తోమతకి తగిన సంబంధాలు చూడామని పెళ్ళిళ్ళ పేరయ్యకు చెప్పాడు. ఆయన వీళ్ళు కట్నం వద్దంటున్నారు, అమ్మాయి గుణగణాలు బాగుంటే చాలంటున్నారని ఈ సంబంధం తీసుకువచ్చాడు. తీరాచూస్తే అది దగ్గరి సంబంధం కావడంతో ప్రకాష్ చాలా సంతోషించాడు. దానికితోడు బంధువులందరూ కూతురికి గొప్ప సంబంధం వచ్చిందని అతడి అదృష్టాన్ని పొగుడుతుంటే మరింత ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ‘‘రమా! మన ఇల్లు తాకట్టు పెట్టాలనుకుంటున్నాను’’ అన్నాడు ప్రకాష్. రమ తుళ్ళిపడింది.‘‘అదేంటండీ? ఎందుకలా? మనం అమ్మాయి పెళ్లికోసం కొంత డబ్బు పక్కన పెట్టాం కదా? ఇప్పుడు ఇల్లు తాకట్టు పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది?’’ ఆశ్చర్యంగా ప్రశ్నించింది రమ.‘‘పిచ్చిదానా! అప్పుడు మనం దాచిన డబ్బు మనబోటి సంబంధం కోసం. ఇప్పుడు మన తాహతుకి మించిన గొప్పవారి సంబంధం కుదిరింది. మరి వారికి నచ్చేలా అన్ని ఏర్పాట్లు చేయాలంటే ఎక్కువ డబ్బు కావాలిగా?’’ ప్రశ్నించాడు ప్రకాష్ . ప్రకాష్ చేతిలో డబ్బు లేక తగ్గి ఉంటాడు కాని, సహజంగా దుబారా మనిషే! రమ ఎంత నచ్చచెప్పాలని చూసినా అతడు వినలేదు. ఇంటి దస్తావేజులు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చాడు. ముందూ వెనుకా చూడకుండా ధారాళంగా ఖర్చు పెడుతున్నాడు. తండ్రి అలా డబ్బులు గుమ్మరిస్తుంటే పిల్లలకు చిత్రంగా అనిపిస్తోంది. మహేష్ అదంతా చూసి సంబరపడినా, మాధురి మాత్రం తల్లి దగ్గర నుండి విషయం రాబట్టింది. తండ్రి చేస్తున్న అప్పు చూసి ఆమె మనసు తల్లడిల్లింది. పెళ్ళిబట్టలకు, నగలకు తాహతుకు మించి కొంటుంటే భవిష్యత్తు తలచుకుని ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.ఒకరోజు ప్రకాష్ పిల్లలను, భార్యను దగ్గరకు పిలిచాడు.‘‘మధూ! మహేష్! మీకు తెలిసిన కొత్తరకం వంటకాల పేర్లు చెప్పండి. మీకు తెలియకపోతే మీ స్నేహితులనైనా అడిగి తెలుసుకోండి. పెళ్ళిలో మనం పెట్టే భోజనాలు చూసి మగపెళ్లివారు అబ్బో భలే ఉన్నాయే అంటూ నోరు తెరవాలి’’ అన్నాడు ప్రకాష్.‘‘డాడీ! నేను చెప్తాను– మొన్న మా ఫ్రెండు అక్క పెళ్ళిలో కోవా వెరైటీస్ కొత్త రకానివి పెట్టారు. పనీర్ జిలేబీ, కోవా కజ్జికాయలు వేడి వేడిగా వేసిస్తుంటే మేమంతా బోలెడన్ని తినేశాం’’ అన్నాడు మహేష్.‘‘డాడీ! తమ్ముడు అలాగే చెప్తాడు కాని, వంటవాళ్ళని అడిగితే కొత్తగా చేస్తున్న వంటకాలు చెప్తారు. ఎక్కువ రకాలు అవసరం లేదు. రుచికరమైనవి కొన్ని చేయిస్తే సరిపోతుంది’’ అంది మాధురి.‘‘మధు సరిగ్గా చెప్పింది. మీరు అనవసరమైన ఆర్భాటాలకు పోకండి’’ అంది రమ.‘‘మనం కట్నం ఇవ్వడం లేదు, భోజనాలైనా మంచిగా పెట్టకపోతే ఎలా?’’ అన్నాడు ప్రకాష్.‘‘ముందు మనం మధూ పెళ్ళికి అనుకున్నదాని కన్నా ఎక్కువే ఖర్చు పెడుతున్నారు. పెళ్లి అవగానే సరికాదు, తరువాతే ఎక్కువ అవసరాలుంటాయి. ఇలా అయితే తరువాత ఇబ్బంది పడతాం’’ అంది రమ.ప్రకాష్కి ఆ మాటలు రుచించలేదు. స్నేహితుడిని సంప్రదించాడు. ‘‘మధ్య తరగతి వాళ్ళం చూసుకుని ఖర్చు పెట్టకపోతే పెద్ద దెబ్బ తగులుతుంది. వాళ్ళు అడగకపోయినా బంగారం, బట్టలు అంటూ చాలా డబ్బులు గుమ్మరిస్తున్నావు. చెల్లెమ్మ చెప్పినట్లు విను’’ అన్నాడు రాజీవ్.ప్రకాష్ అతడి మాటలు కూడా పెడచెవిన పెట్టాడు. వంటవాళ్లతో తనే స్వయంగా మాట్లాడి భారీ ఎత్తులో మెనూ తయారుచేశాడు. పెళ్లిరోజు దగ్గరకు వచ్చింది. పెద్ద కళ్యాణమండపం, దానికి అలంకరణ బ్రహ్మాండంగా చేయించాడు.భోజనాలకు ముందు అల్పాహారంలో పానీపూరీ. బజ్జీమసాలా, సమోసా చాట్, చిన్న పునుగు, వెజ్ కట్లెట్, పనీర్ టిక్కా, పావ్ భాజీ, చిన్న పిజ్జా, బఠాణీ చాట్, పెసర దోశ ఏర్పాటు చేశాడు. వచ్చిన జనం అక్కడ కిక్కిరిసిపోయి ఉన్నారు. ఎన్నో రకాల పదార్థాలు నోరూరిస్తూ కనిపిస్తుంటే, అందులోనూ ఉచితంగా ఆకర్షిస్తుంటే ఆపడం ఎవరి తరం?... ఒకో స్టాల్ దగ్గర ఆగడం అక్కడ ఉన్న వంటకం పెట్టించుకోవడం... కొంచెం రుచి చూడటం, అది పారేసి మళ్ళీ మరోదాని కోసం వెళ్లడం, అక్కడ మరో ప్లేట్ తీసుకుని అది వేయించుకోవడం, అది కొంచెం తినగానే మరో కొత్త వంటకం కనిపించగానే చేతిలో ఉన్నది పూర్తిగా తినకుండానే చెత్త డబ్బాలో పడేసి, అక్కడకు వెళ్లి మరో ప్లేట్ అందుకోవడంలో జనం బిజీ అయ్యారు. అల్పాహారాలు తినడంతో సగానికి పైగా పొట్టలు నిండిపోయాయి. తరువాత అందరూ కాసేపు లోపలకు వెళ్లి పెళ్లి చూస్తూ కూర్చున్నారు. కాసేపటి తరువాత మళ్ళీ భోజనాల దగ్గరకు వచ్చారు. అక్కడ సుమారు పది రకాల స్వీట్లు, ఇరవై రకాల వంటకాలు, పది రకాల ఫ్రూట్స్, పది రకాల డిజర్ట్స్ ఉన్నాయి. అన్ని వంటకాలూ వేడిగా ఉండేందుకు అన్నింటి కిందా చిన్న స్టవ్లు కూడా ఉన్నాయి. నోరూరించే ఎన్నో రకాల పదార్థాలను చూసి, అన్నీ రుచి చూడాలనే అతృతతో అన్నీ వేయించుకుని, పొట్టలో పట్టకపోవడంతో తినకుండానే వృథాగా చెత్తడబ్బాలో పారేస్తున్నారు. మనిషి తన నోటితో తను ఇక చాలని చెప్పగలిగేది ఆహారం విషయంలో మాత్రమే! ప్రకాష్ దంపతులు పెళ్ళికి వచ్చిన అతిథులను పలకరించి వేదిక మీద కూర్చున్నారు. వేదమంత్రాల సాక్షిగా మంగళవాయిద్యాల నడుమ బంధుమిత్రుల సమక్షంలో మాధురి, జీవన్ల పెళ్లి జరిగింది. తరువాత నూతన వధూవరులు, అమ్మాయి తల్లితండ్రులు, అబ్బాయి తల్లితండ్రులు భోజనాలు చేయడానికి భోజనశాల వైపుకి వస్తున్నారు. వారి వెనుక రాజీవ్ కూడా నడుస్తున్నాడు. భోజనశాలలో రెండు విభాగాలున్నాయి. ఒకటి బంతి భోజనాలు, మరొకటి బఫే భోజనాలు. వీళ్ళు బఫే భోజనాలు దాటి బంతి భోజనాల వైపుకి వెళ్తుండగా నడుస్తున్న జగదీష్ ఆగిపోయాడు. ‘‘బావగారు! బఫే భోజనం చేద్దామంటారా?’’ వెనక్కు తిరిగి వచ్చి అడిగాడు ప్రకాష్.‘‘ఆ డస్ట్ బిన్ వైపు చూశారా? అందులో ప్లేట్స్లో తినకుండా పారేసిన స్వీట్లు, హాట్లు, ఇతర ఆహార పదార్థాలు చూడండి. ఎంత ఆహారం వృథాగా నేలపాలయిందో చూశారా?’’ అన్నాడు జగదీష్.‘‘బావగారు! ఎక్కువ రకాల వంటకాలు చేయించాం కదండీ! ఒక్కసారే అన్నీ తినలేక పారేసుంటారు అంతే కాని, రుచిగా ఉండకపోవడం వల్ల కాదండీ’’ అన్నాడు ప్రకాష్.‘నా ప్రశ్న మీకలా అర్థమైందా?’ మనసులో అనుకున్న జగదీష్ ఒకసారి ఆయన వైపు అదోలా చూసి మౌనంగా వాళ్లతో నడిచాడు. ప్రకాష్ భోజనాల దగ్గర తనే స్వయంగా ‘‘బావగారు! ఈ స్వీటు తినండి బాగుంటుంది, చెల్లెమ్మా! ఈ పెసర పునుగు ఆవడ తినండి బాగుంటుంది, బాబూ! పుదీనా రైస్ రుచి చూడండి’’ అని పెట్టించబోయాడు. అతను ఎంత బలవంతం చేసినా జగదీష్, అతని భార్య, జీవన్ కొన్ని రకాల పదార్థాలు మాత్రమే తిన్నారు. అదిచూసి ప్రకాష్ ముఖం మాడిపోయింది. అప్పగింతలయ్యాక మగ పెళ్లివాళ్ళు వెళ్లిపోతున్న సమయంలో అందరూ కళ్యాణమండపం బయటకు వచ్చారు. అక్కడ ఒక పక్కన చెత్తబండి పెట్టుంది. ఫంక్షన్ హాల్ లోపల నిండిపోయిన టబ్లు తెచ్చి అందులో వేస్తున్నారు. కొంతమంది బిచ్చగాళ్ళు అందులో నుంచి ఆహార పదార్థాలు ఏరుకుని, వాళ్ళ దగ్గరున్న సత్తుగిన్నెల్లో వేసుకుంటున్నారు. కొన్ని తడిసిపోయిన వాటిని తీసి, వారి చినిగిన దుస్తులకు తుడుస్తూ గిన్నెలో వేస్తున్నారు. రెప్పవాల్చకుండా అటువైపే చూస్తున్న జగదీష్ కనుకొలకులలో నీటి బిందువులు నిలిచాయి. జేబులోంచి కర్చీఫ్ తీసుకుని తుడుచుకున్నాడు.‘‘బావగారు! మా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? ఎందుకు బాధపడుతున్నారు’’ కంగారుగా అడిగాడు ప్రకాష్.‘‘అదేం లేదు’’ అంటూ కారెక్కి కూర్చున్నాడు జగదీశ్.పెళ్ళికూతురుని తీసుకుని మగపెళ్లివాళ్ళు హైదరాబాద్ వెళ్లిపోయారు. వెళ్ళేముందు రెండవరోజు జరుగబోయే సత్యనారాయణస్వామి వ్రతానికి, అదేరోజు సాయంత్రం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రిసెప్షన్కి అందరినీ తప్పకుండా రమ్మని మరీ మరీ ఆహ్వానించారు. ‘‘రమా! ఎందుకో జగదీష్గారు సంతృప్తిగా ఉన్నట్లనిపించడం లేదు’’ వాళ్ళు వెళ్ళాక అన్నాడు ప్రకాష్.‘‘అదేం లేదు లెండి!’’ అంది రమ.‘‘ఎందుకో ఆయన కళ్ళు కూడా తుడుచుకున్నాడు’’ అన్నాడు ప్రకాష్. ‘‘ఇప్పుడవన్నీ ఆలోచించే వ్యవధి లేదు. రేపు మనం హైదరాబాద్ వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. వ్రతానికి పీటలమీద కూర్చున్నప్పుడు అమ్మాయి అల్లుడుగారికి అలాగే వాళ్ళ అత్తమామగార్లకు కూడా మనం బట్టలు పెట్టాలి. పళ్ళు, స్వీట్స్ కూడా పట్టుకెళ్ళాలి’’ అంది రమ. ‘‘రమా! మళ్ళీ చాలా డబ్బులు కావాలి... నా దగ్గరున్న డబ్బంతా అయిపోయిపోతుంది. కట్నం లేదన్న మాటే కానీ పై ఖర్చులు చాలా అయ్యాయి’’ అన్నాడు ప్రకాష్.‘‘ఆర్భాటాలకు పోతే అలాగే అవుతుందని నేనెంత చెప్పినా మీకు అర్థం కాలేదు. ఇప్పుడనుకుని ఏం లాభం? స్వీట్స్ అన్నాను కదా అని ఖరీదు ఎక్కువ వాటి జోలికి పోకండి. లడ్డు, కాజాలు చాలు’’ అంది రమ . ప్రకాష్ కుటుంబం మరి కొందరు దగ్గరి బంధువులతో కలిసి రెండవరోజు ఉదయం మగ పెళ్లివారింటిలో దిగారు. వారు మర్యాదగా ఆహ్వానం పలికారు. అల్పాహారంగా ఇడ్లీ, వడ, కొబ్బరి చట్నీ, కారప్పొడి వేసి పెట్టారు. సత్యనారాయణ స్వామి పూజకు ఇంట్లో బంధువులు మాత్రమే ఉన్నారు. వియ్యాలవారు భోజనాలు ఎంత గొప్పగా పెడతారోనని ఊహించుకున్న ప్రకాష్కి నిరాశే ఎదురైంది. పులిహోర, పూర్ణం, మిరపకాయ బజ్జీ, వంకాయ చట్నీ, ముద్దపప్పు, రసం, బెండకాయ వేపుడు, అప్పడం, గడ్డపెరుగు పెట్టారు. అందరూ శుభ్రంగా పదార్థాలన్నీ వదలకుండా తినేశారు. ‘‘అరేయ్ రాజూ! భోజనాలు మరీ ఇంత సింపుల్గా పెట్టారేంట్రా?’’ అన్నాడు గుసగుసగా ప్రకాష్.‘‘ఇప్పుడు ఇంట్లో వాళ్లకు మాత్రమే కదా! అందుకే ఇలా పెట్టుంటారు సాయంత్రం రిసెప్షన్లో బాగా పెడతారనుకుంటా. అయినా కొన్ని వంటకాలు పెట్టినా మంచి భోజనం పెట్టారు’’ మెచ్చుకుంటూ అన్నాడు రాజీవ్. సాయంత్రం అందరూ రిసెప్షన్కి వెళ్లారు. అది పెద్ద ఫంక్షన్ హాల్. సహజమైన పూలతో చాలా తేలికపాటి అలంకరణ చేశారు. చూడటానికి చాలా అందంగా అనిపిస్తోంది. బయట ఎక్కడా అల్పాహారాల స్టాల్స్ లేవు. లోపలకు వెళ్ళగానే ముందుగా అందరికీ వెల్కమ్ డ్రింక్గా బాదంపాలు ఇచ్చారు. మరే ఇతర స్నాక్స్ పెట్టలేదు. రిసెప్షన్కి వచ్చిన వాళ్లంతా వధూవరులకు అక్షింతలు వేశాక, కుటుంబ సభ్యులు డైనింగ్ హాల్ వైపు నడిచారు. అక్కడ ఎంన్లోస్ ఒక రైతు వరి కంకులు పట్టుకుని నిలబడిన చిత్రం పెట్టారు. దాని కింద ‘ఒక వరి కంకి తయారు కావాలంటే రైతు నూట ఎనిమిది రోజులు కష్టపడతాడు’ అని రాసుంది. అది దాటుకుని లోపలకు వెళ్ళగానే, అక్కడక్కడా కొన్ని పేపర్ కటింగ్స్ పుల్ల ఆధారంగా నిలబెట్టబడి ఉన్నాయి. ‘అన్నదాతా సుఖీభవ!’...‘ఆహారం వృథా చేయకండి’...‘మీరు ఏది తినగలరో అదే తీసుకోండి’‘తినలేనిది పెట్టుకుని నేలపాలు చేయకండి’...‘పారేసేముందు పంటలు పండించే రైతు కష్టాన్ని గుర్తుచేసుకోండి’...‘పిల్లల పెళ్ళిచేయడానికి ఆ తండ్రి పడే కష్టాన్ని తలచుకుంటే ఒక్క పదార్థం కూడా పారేయకుండా తింటారు’...అనే క్యాప్షన్స్ ఉన్నాయి. అందరూ వాటిని చదువుతూ మాట్లాడుకుంటున్నారు. ‘భలే రాశారు కదా?’...‘ఇలాంటివి చదివాక ఎవరైనా ఆహారం వృథా చేస్తారా?’... ‘అన్ని చోట్లా ఇలాంటి బోర్డులు పెడితే ఎవరూ తినే పదార్థాలు పొరపాటున కూడా పారేయరు’అక్కడున్న అందరూ పైకే మాట్లాడుకుంటున్నారు. ప్రకాష్, రమ, మాధురి, రాజీవ్ ఆశ్చర్యంగా చూస్తున్నారు.‘జీవన్ గారు! ఈ విధమైన ఏర్పాట్లు ఎవరి సూచనలతో చేశారు? నాకు చాలా నచ్చింది’ అంది మాధురి.ప్రకాష్ అల్లుడి జవాబు కోసం అటే చూస్తున్నాడు.‘డాడీ చిన్నప్పటి నుండి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. డబ్బు, ఆహారమే కాదు ఏదీ వృథా చేయడం ఆయనకు ఇష్టముండదు. ఆర్భాటాలకు పోయి అప్పు చేయడం కూడా నచ్చదు. నిన్న అక్కడ పెళ్ళిలో భోజనాలు పారేయడం చూసి చాలా బాధపడ్డారు. అన్నపూర్ణను గౌరవించిన వారి దగ్గర ఆమె కొలువుంటుందని ఎప్పుడూ చెప్తుంటారు. ఆయన మన పెళ్లి సందర్భంగా ఈరోజు చాలామంది హోమ్లెస్ పీపుల్కి ఆహారం సరఫరా చేశారు’’ అన్నాడు జీవన్.ఆ మాటలు వినగానే ప్రకాష్ ముఖంలో రంగులు మారాయి. రమ ముఖంలో ఆనందం కనిపించింది. ‘‘మామయ్య గారి అభిప్రాయాలు చాలా ఆదర్శవంతంగా అనిపిస్తున్నాయి’’ అంది మాధురి చిన్నగా. ‘‘థాంక్స్ అమ్మా!’’ అన్నాడు జగదీష్. ‘‘బావగారు ! నేను మీ విషయంలో చాలా అపోహపడ్డాను. నన్ను మన్నించండి, ఇంత మంచి కుటుంబానికి నా కూతురిని ఇచ్చినందుకు గర్వపడుతున్నాను’’ ఆనందంగా అన్నాడు ప్రకాష్. ‘‘బావగారు! ఆడపిల్ల పెళ్ళి చేసి బరువు దించుకోవాలనే తాపత్రయంతో మీరు బరువు పెంచుకున్నారని నాకు తెలిసింది. మా అబ్బాయి మీ ఇంటి అల్లుడయ్యాడు. మీ కష్టసుఖాలలో భాగం పంచుకోవడానికి అనుమతిస్తే మన్నిస్తాను’’ నవ్వుతూ అన్నాడు జగదీష్.‘‘ఏమిటది? కొంపదీసి ఇల్లు తనఖా పెట్టిన విషయం తెలిసిందా?’’ ఆలోచిస్తున్నాడు ప్రకాష్. ‘‘బావగారూ! మీరు అంతగా ఆలోచించకండి. ఏ ఆడపిల్లయినా పుట్టింట్లో ఇబ్బందులు లేకుండా ఉంటేనే తను అత్తింట్లో సంతోషంగా ఉండగలుగుతుంది. మా కోడలి సంతోషం మాకు కావాలి. ఇకనుండి మన రెండు కుటుంబాలు ఒకటే’’ అన్నాడు జగదీష్.‘‘అరేయ్ ప్రకాష్! జీవన్, మాధురి పెళ్ళిలో నాకు జీవనమాధుర్యం అంటే ఏమిటో తెలిసిందిరా!’’ అన్నాడు రాజీవ్.ఆ మాటలకు పెళ్లివారింట్లో అందరి నవ్వులు చిచ్చుబుడ్డీలలా వెలుగులపూలు జిమ్మాయి. ‘డాడీ చిన్నప్పటి నుండి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. డబ్బు, ఆహారమే కాదు ఏదీ వృథా చేయడం ఆయనకు ఇష్టముండదు. ఆర్భాటాలకు పోయి అప్పు చేయడం కూడా నచ్చదు. నిన్న అక్కడ పెళ్ళిలో భోజనాలు పారేయడం చూసి చాలా బాధపడ్డారు. ∙కె.వి.సుమలత -
అమెరికా కాదన్నా.. ఆప్షన్స్ అన్లిమిటెట్
‘టాలెంట్ ఉన్న ప్రతిచూపు అమెరికా వైపే’ అన్నట్లుగా సాగింది ఇంతకాలం. అమెరికాలో సెటిల్ అయినవారి పేరెంట్స్ దగ్గర నుంచి అమెరికన్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు వరకు ప్రతి ఒక్కరూ అమెరికా కాలమానానికి అనుగుణంగా నడుచుకోవడం పరిపాటి అయిపోయింది! కాని, అమెరికా తీరు మార్చింది. పొమ్మనకుండానే ఇండియన్స్కు పొగబెడుతోంది.చదువు, ఉద్యోగం, స్థిరనివాసం కోసం అమెరికా చేరుకోవడమనేది చాలామంది భారతీయుల కల! అందుకోసం ఎంత కష్టమైనా పడడానికి సిద్ధంగా ఉంటారు. కాని, అపారమైన ఆశలతో అమెరికా వైపు చూస్తున్న లక్షలాది మంది భారతీయుల కలలు ఇప్పుడు కరిగిపోతున్నాయి. దీనికి, అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కఠిన నిబంధనలే కారణం! ఎన్నో ఏళ్లుగా ఇండియా–అమెరికాల మధ్య కొనసాగుతున్న బలమైన అనుబంధం ఇప్పుడు మెల్లమెల్లగా బీటలువారుతోంది. ఈ బంధానికి ప్రధాన వారధి అయిన విద్యారంగంపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపెడుతోంది. ఈ పరిస్థితుల్లో, విదేశీ విద్య కోసం అమెరికా తప్పితే మరో మార్గమే లేదా? మరో దేశమే లేదా?! అంటే ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు పలు అభివృద్ధి చెందిన దేశాల నుంచి సాదర ఆహ్వానాలు అందుతున్నాయి.క్రమంగా అమెరికాకే కాదు జర్మనీ, కెనడా యూకే వంటి దేశాలకు ఇండియా నుంచి వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. అమెరికాకు బ్రేక్స్ పడుతున్న తరుణంలో భారత యువత తమ విదేశీ ప్రయాణాల గమ్యాలను మార్చుకుంటూదూసుకుని పోతున్నారు. ఏటా విదేశాలకు వెళ్లే మన విద్యార్థులు హెచ్–1బీ వీసా అనేది అమెరికా– తమ దేశంలో ప్రత్యేక నైపుణ్యంతో నిర్వహించే ఉద్యోగాల కోసం– విదేశీ నిపుణులకు ఇచ్చే ఒక వలస వీసా! ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ (స్టెమ్) రంగాల్లో అమెరికాకు చెందిన నిపుణుల కొరతను తీర్చుకోవడానికి ఈ వీసాను 1990లో నాటి అమెరికా ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ యాక్ట్ ద్వారా ప్రవేశపెట్టింది. దీనివల్ల అమెరికన్ కంపెనీలు తమ వ్యాపారాలను విస్తరించుకోడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను నియమించుకోగలిగాయి. ఇది అమెరికా ఆర్థిక వృద్ధికి, సాంకేతిక ఆవిష్కరణలకు ఎంతో తోడ్పడింది! ఇప్పటి వరకూ హెచ్–1బీ వీసాలు పొందినవారిలో భారతీయులే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అయితే ట్రంప్ నిర్ణయంతో ఎందరో భారతీయుల కలలు చెదిరిపోయాయి. ఈ క్రమంలోనే ‘అమెరికా వద్దంటే ఆగిపోనక్కర్లేదు మా దేశం రండి’ అంటున్నాయి ఎన్నో దేశాలు. ఆ లిస్ట్లో జర్మనీ, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లండ్, ఫ్రాన్స్, యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్), పోలండ్ ఇలా చాలా దేశాలు చక్కటి భవిష్యత్ కోసం ఎర్రతివాచీలు పరుస్తున్నాయి. ఏయే దేశాల్లో ఎలాంటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో చూద్దాం విదేశీయులకు సైతం ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యను, అది కూడా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో దాదాపు ఉచితంగా అందించే అరుదైన దేశం జర్మనీ. ఇది కేవలం ఉన్నత ప్రమాణాలకు, ఆధునిక పరిశోధనలకు ప్రసిద్ధి చెందడమే కాక, ప్రపంచంలోని అగ్రశ్రేణి సాంకేతిక, ఇంజనీరింగ్ కోర్సులకు కేంద్రంగా ఉంది. జర్మనీలోని ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదివే అంతర్జాతీయ విద్యార్థులకు సాధారణంగా ట్యూషన్ ఫీజులుండవు. కొన్ని విశ్వవిద్యాలయాల్లో కేవలం సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ లేదా అడ్మినిస్ట్రేటివ్ ఫీజు మాత్రమే ఉంటుంది. విద్యార్థులు తమ చదువుపై ప్రభావం పడకుండా ఉండేందుకు ఏడాదికి గరిష్ఠంగా 140 పూర్తి రోజులు లేదా 280 సగం రోజులు పనిచేయడానికి అనుమతి ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా, సెమిస్టర్ కాలంలో వారానికి 20 గంటల వరకు పనిచేయవచ్చు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత, అంతర్జాతీయ విద్యార్థులు తమ అర్హతకు సరిపోయే ఉద్యోగం వెతుక్కోవడానికి 18 నెలల వరకు జర్మనీలో ఉండొచ్చు. అందుకు జాబ్–సీకింగ్ రెసిడె¯ పర్మిట్ పొందాల్సి ఉంటుంది. ఈ 18 నెలల కాలంలో వారు పూర్తి సమయం ఉద్యోగం వెతుక్కుంటూనే తమ ఖర్చుల కోసం తాత్కాలిక ఉద్యోగం కూడా చేసుకోవచ్చు. గడువులోపు ఉద్యోగం సంపాదించి, దానిని వర్క్ పర్మిట్గా మార్చుకున్నట్లయితే, జర్మనీలో స్థిరపడటానికి మార్గం సులభమవుతుంది.కెనడానిజానికి కెనడియన్ విద్యార్హతలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అలాగే కెనడాలో ప్రపంచ శ్రేణి విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి, ఇవి విద్యార్థులకు అద్భుతమైన ఉద్యోగ అవకాశాలనందిస్తాయి. కెనడాలో ప్రభుత్వ నిధులు పొందే విశ్వవిద్యాలయాలలో కూడా విదేశీ విద్యార్థులకు ఫీజులుంటాయి. అయితే కోర్సులను బట్టి, యూనివర్సిటీ స్థాయిని బట్టి ఫీజులు మారుతుంటాయి. స్టడీ పర్మిట్ ఉన్న విద్యార్థులు తమ చదువుల సమయంలో వారానికి గరిష్ఠంగా 20 గంటలు క్యాంపస్లో లేదా క్యాంపస్ వెలుపల పనిచేయడానికి అనుమతి ఉంటుంది. సెమిస్టర్ బ్రేక్స్ సమయంలో పూర్తి సమయం పనిచేయవచ్చు. కెనడియన్ డిజిగ్నేటెడ్ లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్ నుంచి అర్హత కలిగిన ప్రోగ్రామ్ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులు తమ కోర్సు వ్యవధిని బట్టి గరిష్ఠంగా 3 సంవత్సరాల వరకు కెనడాలో ఉండొచ్చు. ఉద్యోగం వెతుక్కోవడానికి పనిచేయడానికి అనుమతించే పోస్ట్–గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ పొందవచ్చు. ఈ పర్మిట్ పొందిన తరువాత, ఒక సంవత్సరం కెనడియన్ గ్రాడ్యుయేట్స్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ వంటి ఇమ్మిగ్రేషన్ మార్గాలతో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. కెనడా ప్రభుత్వం వలసదారులను స్వాగతిస్తుంది కాబట్టి, విద్యార్థులకు ఇది ఒక చక్కటి మార్గమవుతుంది.యూకే విద్యార్థులకు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గమ్యస్థానం యునైటెడ్ కింగ్డమ్ (యూకే). బెస్ట్ కోర్సులు, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన యూనివర్సిటీలు, గ్రాడ్యుయేషన్ తర్వాత సులభంగా ఉద్యోగం వెతుక్కోవడానికి వీలు కల్పించే విధానాలతో యూకే అంతర్జాతీయ విద్యార్థులకు స్వర్గధామం. అక్కడి విశ్వవిద్యాలయాలు క్వాలిటీ ఎడ్యుకేషన్కు ప్రసిద్ధి. ఇక్కడి బ్యాచిలర్ కోర్సులు సాధారణంగా 3 సంవత్సరాలు, మాస్టర్స్ కోర్సులు ఒక సంవత్సరంలోనే పూర్తి అవుతాయి. యూకేలో విదేశీ విద్యార్థులకు ఫీజులు సాధారణంగా దేశీయ విద్యార్థుల కంటే ఎక్కువగా ఉంటాయి. యూనివర్సిటీ ర్యాంకింగ్, నగరంతో పాటు కోర్సును బట్టి ఫీజు మారుతుంది. స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు, విద్యార్థి తమ ట్యూషన్ ఫీజుతో పాటు తమ జీవనానికి సరిపడా కనీస రాబడిని చూపించాల్సి ఉంటుంది. అలాగే ఎంపికైన యూనివర్సిటీ/కాలేజ్ (లైసె¯Œ ్స పొందిన స్పాన్సర్) నుంచి అధికారిక ధ్రువీకరణ పత్రం సిద్ధంగా ఉంచుకోవాలి. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఇంపీరియల్ వంటి అనేక యూనివర్సిటీలు అంతర్జాతీయ విద్యార్థులకు ట్యూషన్ ఫీజులో రాయితీ లేదా పూర్తి స్థాయి స్కాలర్షిప్లను అందిస్తాయి. కామ¯Œ వెల్త్ దేశాలకు చెందిన ప్రతిభావంతులకు కామ¯Œ వెల్త్ స్కాలర్షిప్ కూడా లభిస్తుంది. విద్యార్థులు ఎటువంటి తక్కువ జీతం పొందే ఉద్యోగాన్ని చేస్తున్నా స్కిల్డ్ వర్కర్ వీసాకు మారే అవకాశం కూడా ఉంటుంది.ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్యార్థులకు చక్కటి విద్యను, అధిక జీవన ప్రమాణాలను, పట్టభద్రులైన తర్వాత గొప్ప ఉద్యోగ అవకాశాలను పుష్కలంగా అందించే దేశాలలో ఆస్ట్రేలియా కూడా ఒకటి. అంతర్జాతీయ విద్యార్థి వీసా (సబ్క్లాస్ 500) ఉన్నవారు చదువుకునేటప్పుడు ప్రతి రెండు వారాలకు 48 గంటల వరకు పని చేసుకోవచ్చు, ఇంకా చదువు విరామ సమయాల్లో అపరిమిత గంటలు పనిచేసే వెసులుబాటు కూడా ఉంది. ఇది విద్యార్థులకు తమ ఖర్చులను తాము భరించడానికి, నెట్వర్క్ను పెంచుకోవడానికి, చక్కటి అనుభవాన్ని పొందడానికి సహాయపడుతుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తర్వాత, విద్యార్థులు తమ అర్హతలను బట్టి, 18 నెలల నుంచి 4 సంవత్సరాల వరకు (కోర్సుతో పాటు ప్రాంతాన్ని బట్టి) ఆ దేశంలోనే ఉండి, తగిన ఉద్యోగం కోసం వెతుక్కోవచ్చు.న్యూజీలండ్అంతర్జాతీయ విద్యార్థులకు అత్యంత సురక్షితమైన, నాణ్యమైన విద్యను అందించే దేశాల్లో న్యూజీలండ్ కూడా ప్రత్యేకమే! ఇక్కడ పర్యావరణం చాలా అందంగా, ప్రశాంతంగా ఉంటుంది. న్యూజిలాండ్లో పలు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు వరల్డ్ క్యూఎస్ (కోక్వారెల్లి సైమండ్స్) ర్యాంకింగ్స్లో స్థానాన్ని పొందాయి. కాబట్టి అక్కడ విద్యాప్రమాణాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించొచ్చు. అంతర్జాతీయ విద్యార్థులు పీహెచ్డీ (డాక్టోరల్) కోర్సులు చదివితే, వారికి దేశీయ విద్యార్థులతో సమానమైన, చాలా తక్కువ ఫీజు వర్తిస్తుంది. ఇక విదేశీ విద్యార్థి వీసా కోసం జీవన వ్యయాలు, తిరుగు ప్రయాణ ఖర్చులు చూపించాల్సి ఉంటుంది. విరామ సమయాల్లో పూర్తి సమయం పనిచేయడానికి అనుమతి ఉంది. న్యూజీలండ్లో చదువుకున్న తర్వాత అక్కడ స్థిరపడటం కూడా సులభమే.మొత్తానికీ అమెరికా చాన్స్ పోయిందని నిరాశపడే భారతీయులకు ప్రపంచవ్యాప్తంగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చాలా దేశాలు వెల్కమ్ బోర్డ్తో ఎదురుచూస్తున్నాయి. ఆ నిరాశను వదిలేసి చుట్టూ ప్రపంచం వైపు చూస్తే మారేదేం లేదు.. విమానాశ్రయంలో ఫ్లైట్ పేరు తప్ప అంటున్నారు అనుభవజ్ఞులు.ఉత్తమమైన దేశాన్ని ఎలా ఎంచుకోవాలి?విదేశాల్లో కెరీర్ని ప్లాన్ చేసుకునే యువతకు ఆయా దేశాల్లో చదువుకోవడానికి, ఆపై అక్కడే పని చేయడానికి, అక్కడే స్థిరపడటానికి ఏ దేశాన్ని ఎంచుకోవాలి అనేది ప్రధాన సమస్య. కొన్ని దేశాలు సులభమైన పోస్ట్–స్టడీ వర్క్ వీసా, అలాగే పర్మనెంట్ రెసిడెన్స్ (స్థిరనివాసం) పొందే మార్గాలను అందిస్తాయి. అయితే ఏ దేశాలను ఎంచుకుంటే మేలు జరుగుతుంది?సులభమైన పోస్ట్–స్టడీ వర్క్ వీసా, స్థిరనివాస మార్గాలు ఎక్కువగా ఉన్న దేశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలండ్ వంటి దేశాలు అంతర్జాతీయ విద్యార్థులకు చాలా అనుకూలమైన వీసా విధానాలను పాటిస్తున్నాయి. దాంతో ఈ దేశాలలో పర్మనెంట్ రెసిడెన్సీ (స్థిరనివాసం)పొందే మార్గాలు కూడా సులభంగా ఉంటాయి.కెరీర్ వృద్ధి కోసం ఇంగ్లీష్ మాట్లాడే లేదా ఇంగ్లీష్ బోధించే దేశాలను ఎంచుకోవాలి. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలండ్, యూకే వంటి ఇంగ్లిష్ మాట్లాడే దేశాలు మన భారతీయులకు భాషాపరంగా సౌకర్యంగా ఉంటాయి. అయితే జర్మనీ, నెదర్లండ్స్ వంటి కొన్ని నాన్–ఇంగ్లిష్ దేశాలు ఇంగ్లిష్ భాషలో కోర్సులను అందిస్తాయి. కాని, ఉద్యోగం పొందాలంటే మాత్రం స్థానిక భాషను నేర్చుకోవాల్సి ఉంటుంది. అక్కడే సెటిల్ అవ్వాలి అనుకునేవారు ఎడ్యుకేష సమయంలో స్థానిక భాష నేర్చుకోవడంపై కాస్త దృష్టిపెట్టాలి.ఏ రంగంలో చదువుకోవాలనుకుంటున్నారో దాని ఆధారంగా మనం ఎన్నుకునే యూనివర్సిటీల విషయంలో కోక్వారెల్లి సైమండ్స్ (క్యూఎస్), టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్(టీహెచ్ఈ) వంటి సంస్థల ప్రపంచ ర్యాంకింగ్లను పరిశోధించుకోవాలి. ఆయా విశ్వవిద్యాలయాల గ్రాడ్యుయేట్లకు ఎంత సులభంగా ఉద్యోగాలు లభిస్తున్నాయో, వారి సగటు జీతాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. యూనివర్సిటీల అధికారిక వెబ్సైట్లు లేదా లింక్డ్ఇన్ వంటి ప్లాట్ఫారమ్లలో ఈ వివరాలు లభిస్తాయి.ఒక దేశాన్ని ఎంచుకునే ముందు, అక్కడ అంతర్జాతీయ విద్యార్థులకు ఎంత భద్రత ఉందో తెలుసుకోవాలి. విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ విద్యార్థులకు ఎలాంటి సహాయక సేవలు (అకాడెమిక్ సపోర్ట్, కౌన్సెలింగ్, కెరీర్ గైడె¯Œ ్స) అందిస్తున్నాయో పరిశీలించుకోవాలి. ఆ దేశంలో జీవన వ్యయం (అద్దె, ఆహారం, రవాణా) సహా విద్యార్థి సంఘాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోవాలి.చదువుకునే సమయంలో ఆయా దేశాల్లో తమ వ్యక్తిగత ఖర్చులను తగ్గించుకోవడానికి స్కాలర్షిప్లు, ట్యూషన్ ఫీజు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయో లేదో ముందే చూసుకోవాలి. చదువుతున్నప్పుడే ఇంటర్న్షిప్లు లేదా పార్ట్–టైమ్ ఉద్యోగాలు లభించే అవకాశాలున్న దేశాలను ఎంచుకోవడంతో వృత్తి అనుభవాన్ని పొందవచ్చు. అంతేకాకుండా, స్థానిక భాష కూడా నేర్చుకోవచ్చు. -
ఇన్ బ్రెయిన్
మెదడు పనితీరుపై విశ్లేషణ, కార్యాచరణ సమాచారాన్ని అందించే సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసి, మానసిక వైద్యులకు ఆధునాతన బ్రెయిన్ ఇమేజింగ్–బేస్డ్ ఇన్సైట్స్ను అందించే న్యూరో–ఇన్ఫార్మటిక్స్ ప్లాట్ఫామ్ ‘బ్రెయిన్ సైట్ ఏఐ’ నిర్మించారు రింఝిమ్ అగర్వాల్, ఇమ్మాన్యుయేల్...గత సంవత్సరం ఇండియా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్ట్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడిఎస్సీవో) నుంచి ‘సాఫ్ట్వేర్–యాజ్–ఎ మెడికల్ డివైజ్’ సర్టిఫికెట్ పొందడం ద్వారా ‘బ్రెయిన్సైట్ ఏఐ’ వాణిజ్యపరంగా కీలకమైన మైలురాయిని చేరింది. ఈ సంస్థకు ఇమ్మాన్యుయేల్ సీయివో, రింఝిమ్ అగర్వాల్ సీటీవో.నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ నుంచి రింజిమ్ అగర్వాల్ పీహెచ్డీ చేసింది. ఇమ్మాన్యుయల్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ చేసింది. హెల్త్ కేర్ మేనేజ్మెంట్, టెక్నాలజీ అండ్ పాలసీలలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 సంవత్సరాల అనుభవాన్ని సంపాదించింది. ఆపరేటింగ్ సిస్టమ్ డిజైన్, పబ్లిక్ హెల్త్ అండ్ హెల్త్ కేర్ బిజినెస్లో ఆమెకు అపార అనుభవం ఉంది.‘సీడిఎస్సీవో లైసెన్స్ మాకు వాణిజ్యపరంగా ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం మా ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాం. మా ప్రాడక్స్›్ట వంద ఆస్పత్రులకు చేరువ కావాలనేది మా లక్ష్యం’ అంటుంది ఇమ్మాన్యుయేల్.‘ఆసుపత్రులలో అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వైద్యులలో న్యూరోసర్జన్లు ఒకరు. మా సాంకేతికత మెదడుకు సంబంధించిన నిర్మాణాత్మక అంశాలకు మాత్రమే కాకుండా లాంగ్వేజ్, కాగ్నిషన్లాంటి వివిధ విధులపై కూడా ఇన్సైట్స్ను అందించగలదు. మా బ్రెయిన్సైట్ ఏఐ సామర్థ్యం సర్జన్లలో ఆసక్తి రేకెత్తించింది’ అంటుంది అగర్వాల్.‘బ్రెయిన్సైట్ ఏఐ’ అందించే సమాచారం సర్జరీల సమయంలో వైద్యులకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఒక కణితి... దేహంలో ఏదైనా కీలక విధులు నిర్వహించే ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటే, వైద్యులు దానిని చేరుకోవడానికి వేరే ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లడానికి వీలవుతుంది.బ్రెయిన్ ఏఐ ప్రాడక్ట్ ‘వోక్సెల్బాక్స్’ వేగంగా అభివృద్ధి చెందనుంది. మెదడుకు సంబంధించిన నాడీ కణాల కనెక్షన్లను మ్యాప్ చేయడానికి ‘ఫంక్షనల్ మాగ్నెటిక్ రెసోసెన్స్ ఇమేజింగ్’ (ఎఫ్ఎంఆర్ఐ) ఉపయోగ పడుతుంది. ఆ డేటాను ప్రాసెస్ చేసేందుకు ఉపయోగపడేదే ఏఐ–పవర్డ్ ప్రాడక్ట్ వోక్సెల్బాక్స్. రోగ నిర్ధారణ, శస్త్ర చికిత్సలను ప్లాన్ చేయడంలోనూ, చికిత్సను పర్యవేక్షించడంలో సహాయపడేందుకు వీలైన బ్రెయిన్ మ్యాప్స్ను తయారు చేయడంలో ‘వోక్సెల్ బాక్స్’ ఉపయోగపడుతుంది.హెల్త్–టెక్ ఎంటర్ప్రెన్యూర్గా విజయం సాధించిన రింఝిమ్ అగర్వాల్, ఇమ్మాన్యుయేల్ ‘స్నోడ్రాప్’ అనే పేషెంట్ కేర్ యాప్ను కూడా అభివృద్ధి చేశారు. పేషెంట్ల ప్రొఫైల్స్ రూపొందించడంలో, వైద్యప్రకియను మెరుగుపరచడంలో ఇది ఉపయోగపడుతుంది. -
శాంతి సమరం ఇంటి పాఠమే!
‘ఇంటి నుంచే మొదలు కావాలి’ అని నైతిక విలువలకు సంబంధించి చెప్పే మాట. నైతిక విలువల నుంచి సామాజిక నిబద్ధత, సాహస ప్రవృత్తి వరకు ఇంట్లో నుంచే నేర్చుకుంది నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మరియా కొరినా. కుటుంబ వారసత్వం, కుటుంబ బంధాలు, ఉద్యమ బంధాల గురించి ఐరన్ లేడి మరియా మాటల్లోనే..నాన్న అడుగు జాడల్లో నడవాలనుకున్నాను కానీ...రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. నాన్న గొప్ప ఇంజినీర్, వ్యాపారవేత్త. దార్శనికుడు. ఎన్నో కంపెనీలు ప్రారంభించాడు. ఎంతోమందికి ఉపాధి కల్పించాడు.నాన్న ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవారు...‘దేశభవిష్యత్, దాని శ్రేయస్సు ఒక సంస్థ అభివృద్ధి, లాభాల కంటే ఎక్కువ. కంపెనీని ఎవరైనా స్థాపించవచ్చు. డబ్బులు సంపాదించడం కూడా సులభం. అయితే నైతిక ప్రమాణాలు ముఖ్యం’ కుటుంబ వారసత్వం అనేది నా బలం. నా పూర్వీకులు, అనేక తరాల వాళ్లు తమ మాతృదేశం కోసం ప్రతీది చేశారు. జైలు జీవితం అనుభవించారు. తరతరాల సందేశం ఒక్కటే... దేశాన్ని ప్రేమించు, బాధ్యతతో ప్రవర్తించు.దేశ చరిత్రను మా ఇల్లు చెప్పేది!నా చిన్నప్పుడు మా ఇల్లు వెనెజువెలా చరిత్రను చెప్పే ఉపాధ్యాయురాలిగా అనిపించేది. ఆ ఇల్లు దేశచరిత్రలో ఎన్నో కీలక ఘట్టాలకు సాక్షిగా నిలిచింది. ఒక విధంగా చె΄్పాలంటే వెనెజువెలా చరిత్రతో కలిసి పెరిగాను! మా అమ్మమ్మ ప్రఖ్యాత పుస్తకం ‘వెనెజువెలా హీరోయిక’ రచయిత ఎడ్వర్డో బ్లాంకో మనవరాలు, వెనెజువెలా మొదటి అధ్యక్షుడు జోస్ ఆంటోనియో పేజ్ సహాయకురాలు. చిన్నప్పుడు నేను విద్యార్థి నాయకుడు అరామండో జులోగా బ్లాంకో వీరాభిమానిని. విసెంటే గోమేజ్ నియంతృత్వంలో 24 సంవత్సరాల వయసులో బ్లాంకో హత్యకు గురయ్యాడు.నన్ను టెర్రరిస్ట్ అన్నారు!నేను గెలుస్తానని మొదట్లో చాలామంది నమ్మలేదు. ‘మీరు మహిళ కదా!’ ‘మీరు ఇంజినీర్ కదా! ‘మీది బాగా డబ్బున్న కుటుంబం కదా!’....ఇలాంటి మాటలే వినిపించేవి. లాటిన్ అమెరికాలోని పితృస్వామ్య భావజాల ప్రభావం వారి మాటల్లో కనిపించేది. ఒకానొక సమయంలో నన్ను టెర్రరిస్ట్గా ముద్ర వేస్తూ బెదిరింపు మెసేజ్లు అదేపనిగా రావడం మొదలయింది. నన్ను నేను రక్షించుకోవడానికి జాగ్రత్త పడడం తప్పనిసరి అనిపించింది. ఏ వ్యక్తీ అజ్ఞాతవాసంలో ఉండాలని నేను కోరుకోను. అయితే మరో కోణంలో చూస్తే మనల్ని మనం మరింతగా తెలుసుకోవడానికి, సవాళ్లను అధిగమించే శక్తిని సమకూర్చుకోవడానికి అజ్ఞాతవాసం అనేది ఒక అవకాశం.మాటలు మాత్రమే చాలవురాజకీయాలు, రాజకీయ నాయకులను అదేపనిగా విమర్శించడం ఒక్కటే సరిపోదు. మనవంతు కార్యాచరణ తప్పనిసరిగా ఉండాలి. ప్రజాస్వామ్యం, న్యాయం, స్వాతంత్య్రం కోసం పోరాడే సాహసికులు ఒక ప్రాంతం, దేశం అని కాదు ప్రపంచం నలుమూలలా ఉన్న ప్రజలకు తరగని స్ఫూర్తిని ఇస్తారు. భయం చుట్టుముట్టిన సమయంఒక సభలో ప్రభుత్వ అవినీతి గురించి మాట్లాడుతున్నాను. హఠాత్తుగా నా కుమార్తె గుర్తుకు వచ్చింది. మాటలు ఆగిపోయాయి. కొన్ని నిమిషాలు మౌనం దాల్చాను. నా కుమార్తె ఎక్కడ ఉంది? క్షేమంగా ఉందా? నేను సభల్లో ప్రభుత్వ అవినీతిపై గొంతెత్తడం వల్ల నా బిడ్డకు హాని జరుగుతుందా?... ఇలా ఎన్నో ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. ఇంటికి వెళ్లి నా కుమార్తెను చూసుకునే వరకు నా మనసు మనసులో లేదు. ‘కుటుంబ బాధ్యతలు, ఉద్యమం అనే రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నాను. ఇలా చేస్తే రెండిటికీ న్యాయం చేయలేను’ అనిపించింది.అమ్మ మాట‘నాకు దేవుడు ఎన్నో అద్భుత అవకాశాలు ఇచ్చాడు. నాకు ఎలాంటి లోటూ లేదు. నాకు ఎంతో మంది మద్దతు ఉంది... అనుకునేవాళ్లు తమ వంతుగా ఈ సమాజానికి తిరిగి ఇవ్వాలి’ అని చిన్నప్పుడు అమ్మ చెబుతుండేది. అమ్మానాన్నల మాటల సారాంశం ఒక్కటే... మనం వ్యక్తిగతంగా ఏ స్థాయిలో ఉన్నా సమాజ హితాన్ని మరవకూడదు. -
ఆ ఊరి జనం కేవలం 130 మందే, స్త్రీలు ఎంతమందో తెలుసా?
హిమాచల్ ప్రదేశ్ స్పిటి వ్యాలీలోని కోమిక్ గ్రామం గురించి విన్నారా? సంవత్సరంలో కొన్ని రోజులు తప్ప ఇక్కడ ఎప్పుడూ మంచే ఉంటుంది. ఇక్కడ ఎంత మంది నివశిస్తారో తెలుసా? కేవలం 130 మంది. వారిలో 90 మంది పురుషులు, 40 మంది స్త్రీలు. మన దేశంలో అత్యంత తక్కువ జనాభా ఉన్న కొండ పల్లె ఇదే.సముద్ర మట్టానికి 15,000 అడుగుల ఎత్తులో ఉండే కోమిక్ ఆకాశాన్ని తాకే ఎత్తులో, చుట్టూ తెల్లటి హిమకొండలతో, పచ్చిక బయలను తనలో నింపుకుని ప్రకృతి ప్రేమికులను ఎంతగానో మైమరిపిస్తుంటుంది. ఇది బౌద్ధ సంప్రదాయాలకు నెలకొలుపు. ఇక్కడి తంగ్యుద్ మఠం ఒక ఆధ్యాత్మిక కేంద్రం. 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మఠం సాక్య సెక్ట్కు చెందినది. మాత్రే బుద్ధ (ఫ్యూచర్ బుద్ధ) విగ్రహన్ని కలిగిన ఏకైక ్ర΄ాంతం ఈ కోమిక్. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి తెరిచే రహస్య భాండాగారాలైన డ్రాగన్ గుడ్డు, యూనికార్న్ శృంగం వంటి అద్భుతాలు సందర్శకులను ఆశ్చర్యపరుస్తాయి. ఈ మఠం భారతదేశంలోని అత్యంత ఎత్తైన మఠాల్లో ఒకటి. (5 నిమిషాల్లో జాబ్ కొట్టేసింది.. దెబ్బకి కంపెనీ సీఈవో ఫిదా!)కోమిక్ కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు. ప్రకృతి ప్రేమికులకి ఇదొక స్వర్గం. హిమాలయాల మధ్య హైకింగ్ చేస్తూ, ఫాసిల్స్ శోధిస్తూ, స్థానిక యాక్ మిల్క్ టీ సిప్ చేస్తూ, గ్రామస్తుల ఆతిథ్యాన్ని ఆస్వాదించవచ్చు. స్పిటియన్ వంటకాలు, బటర్ టీ రుచి చూడటం ఒక అద్భుత అనుభవం. ఢిల్లీ నుండి మనాలీ లేదా షిమ్లా మీదుగా 700–800 కి.మీ. ప్రయాణించి కాజా నుండి ఒక గంటలో కోమిక్ చేరుకోవచ్చు. మే నుండి సెప్టెంబర్ వరకు సందర్శనకు ఉత్తమ సమయం. ఎందుకంటే శీతాకాలంలో మంచు రోడ్లను కప్పివేసి ప్రయాణాన్ని జటిలం చేస్తుంది. కోమిక్ ఒక అద్భుత ప్రపంచం. ఇక్కడ గడిపే ప్రతి క్షణం జీవితానికి ఒక మధురా నుభూతిని ఇస్తుంది.ఇదీ చదవండి : స్కామ్ కాల్ అనుకుని...కట్ చేస్తే రూ.9 కోట్ల జాక్పాట్ -
కథ: రాతి రథం
విదర్భ రాజ్యాన్ని చంద్రసేన మహారాజు పరిపాలిస్తున్నాడు. దైవభక్తి కలిగిన ఆయన రాజ్యం మధ్యలో పెద్ద వైష్ణవాలయాన్ని కట్టించాడు. స్వామికి రాతి రథం చేయించాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా అందుకు తగ్గ శిల్పి దొరకడం లేదు. చివరకు నారాయణాచారి అనే శిల్పి గురించి చంద్రసేనుడికి తెలిసింది. ఆయన రాతిరథం అద్భుతంగా తయారు చేయగలడని చంద్రసేనుడు భావించాడు. వెంటనే నారాయణాచారిని ఆస్థానానికి పిలిపించి ఆలయానికి రాతి రథం చేయమని కోరాడు. ‘రాజా! శిల్ప కళ నాదే అయినా, నాకు ఆ కళను ప్రసాదించింది ఆ భగవంతుడు. నేను ఇంటికి వెళ్లి భగవంతుణ్ని ధ్యానిస్తాను. ఆయన అనుమతి ఇస్తే తప్పక రథం చేస్తాను. లేదంటే నేను ఆ పని చేయలేను’ అని చె΄్పాడు నారాయణాచారి. చంద్రసేనుడు సరేనన్నాడు. ఇంటికి వెళ్లిన నారాయణాచారి భగవత్ ధ్యానంలో మునిగి΄ోయాడు. మూడు రోజులు గడిచినా ఆయన ధ్యానం నుంచి బయటకు రాలేదు. ఆయన చెప్పే సమాధానం కోసం చంద్రసేనుడు ఎదురుచూస్తున్నాడు. నాలుగో రోజు నారాయణాచారి ధ్యానంలోనుంచి బయటకు వచ్చాడు. నేరుగా చంద్రసేనుడి దగ్గరకు వెళ్లి రాతి రథం చేసేందుకు ఒప్పుకున్నాడు. దీంతో రాజు సంతోషించి అందుకు తగిన ఏర్పాట్లు చేశాడు. మూడు నెలలు శ్రమించి నారాయణాచారి రాతి రథం తయారు చేశాడు. నాలుగు అంతస్తుల ఎత్తులో భారీగా ఉన్న ఆ రథాన్ని రాచవీధిలో ఉంచారు. ప్రజలంతా ఆ రథాన్ని చూస్తూ నారాయణాచారి ప్రతిభను గొప్పగా పొగిడారు. చంద్రసేనుడు సంతోషంతో తబ్బిబ్బయ్యాడు. నారాయణాచారి దగ్గరికి వెళ్లి ‘రథం తయారు చేసినందుకు ఏం కావాలో కోరుకోండి సమర్పిస్తాను’ అని వినమ్రంగా అడిగాడు. ‘ఏదడిగినా కాదనకూడదు’ అని శిల్పి షరతు పెట్టాడు. ‘నా రాజ్యం మొత్తం ఇమ్మన్నా ఇచ్చేస్తాను. మాట తప్పను’ అని చంద్రసేనుడు వాగ్దానం చేశాడు. ‘అయితే రథాన్ని ప్రారంభించే రోజు అడుగుతాను’ అన్నాడు నారాయణాచారి.రథాన్ని ప్రారంభించేందుకు పండితులు ముహూర్తం పెట్టారు. రథాన్నిప్రారంభించే ముందు చంద్రసేనుడు నారాయణాచారిని ఏం కావాలో కోరుకొమ్మని అడిగాడు. ‘ఈ ఒక్క రోజు ఈ రాజ్యానికి నేను రాజుగా ఉండాలి’ అని అడిగాడు శిల్పి. ఆ మాటతో అక్కడున్నవారందరూ ఆశ్చర్యపోయారు. చంద్రసేనుడు మాత్రం తాను ఇచ్చిన మాట తప్పను అంటూ నారాయణాచారిని ఆ ఒక్క రోజు తన రాజ్యానికి రాజుగా ప్రకటించారు. రథం ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ రాజ్యానికి రాజుగా ఉన్న వ్యక్తి రథాన్ని ముందుగా లాగాలి. ఆ తర్వాత ప్రజలంతా లాగి పురవీధుల్లో తిప్పుతారు. దీంతో ఆ ఒక్క రోజు రాజుగా ఉన్న నారాయణాచారి రథానికున్న తాడును పట్టుకుని ముందుకు లాగాడు. ఆయన వెంట ప్రజలంతా ఆ తాడు పట్టుకొని ముందుకు కదిలారు. భారీ రథం ముందుకు కదిలింది. కొద్దిదూరం వెళ్లగానే చక్రాలు అదుపు తప్పి రథం ప్రజల మీదకు దూసుకెళ్లింది. రథానికి ముందుగా ఉన్న నారాయణాచారి కింద పడగా ఆయన మీద నుంచి రథం వెళ్లి ఆగిపోయింది. హుటాహుటిన ఆయన్ను పక్కకి తీసుకెళ్లి సపర్యలు చేశారు. ఆయన చంద్రసేనుణ్ని పిలిచి ‘రాజా! నాకు శిల్పకళతోపాటు జోతిష్యం కూడా తెలుసు. ఈ రథాన్ని ్ర΄ారంభించిన రోజే ఈ రాజ్యప్రభువు మరణిస్తాడని కనుగొన్నాను. అందుకే ఈ ఒక్క రోజు నేను రాజుగా ఉంటానని కోరాను. నా కోరికను మీరు మన్నించారు. మీవంటి రాజు దేశానికి, ప్రజలకు ఎంతో అవసరం. మిమ్మల్ని కాపాడుకున్నానన్న తృప్తితో కన్ను మూస్తున్నాను’ అంటూ నారాయణాచారి మరణించారు. ఆయన త్యాగనిరతికి కన్నీరు పెట్టిన చంద్రసేనుడు ఆ రాతి రథంపై నారాయణాచారి పేరు చెక్కించి ఆయనను కలకాలం గుర్తుంచుకునేలా చేశారు. -
గ్లోబల్ వేదికగా హైదరాబాదీ ఫ్యాషన్
సాక్షి, సిటీబ్యూరో: గ్లోబల్ ఇండియా కోచర్ వీక్లో భాగంగా నగరానికి చెందిన ప్రముఖ డిజైనర్ హరీష్ అక్కిసెట్టి ప్రదర్శించిన సరికొత్త కలెక్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇండియన్ బ్రైడల్, కోచర్ ఫ్యాషన్లో ప్రసిద్ధి చెందిన హైదరాబాదీ హరీష్ కలెక్షన్ జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో విస్తరించింది. ఈ సందర్భంగా డిజైనర్ హరీష్ అక్కిసెట్టి మాట్లాడుతూ.. టైమ్స్ ఫ్యాషన్ వీక్, ఇండియా ఫ్యాషన్ వీక్ లండన్ వరుసలో ప్రస్తుత గ్లోబల్ ఇండియా కోచర్ వీక్ కూడా హైదరాబాద్ డిజైనింగ్ వైభవాన్ని గ్లోబల్ వేదికగా ప్రదర్శించే అవకాశం కలిగిందని అన్నారు. వెడ్డింగ్ ట్రౌస్సో లైన్తో ఈ కలెక్షన్ను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఫ్యాషన్ షోలో వాకింగ్ చేస్తూ, బ్యాక్స్టేజ్ మేనేజ్మెంట్లో పనిచేస్తున్న డిజైనర్లతో ప్రయాణం చేసి నగరంలో వినూత్న డిజైనింగ్ స్టైలింగ్ అందించడం కోసం లేబుల్ ప్రారంభించానని హరీష్ వివరించారు. మ్యూజియం జ్యువెలరీ కలెక్షన్ఈ నెల 18 వరకూ అందుబాటులో ప్రదర్శన సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ భారతదేశపు తొలి లగ్జరీ జ్యువెలరీ మ్యూజియం కలెక్షన్ ప్రదర్శన జూబ్లీహిల్స్లో ఏర్పాటైంది. నగరానికి చెందిన వేగ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభించిన ఈ ప్రదర్శన అక్టోబర్ 18 వరకూ అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రత్యేక ప్రదర్శన ప్రారంభ కార్యక్రమంలో మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠం డీమ్డ్ టు బీ యూనివర్సిటీకి చెందిన డా.సీహెచ్.ప్రీతిరెడ్డి, ఫిక్కీ ఎఫ్ ఎల్ ఓ చైర్పర్సన్ ప్రతిభా కుందా, ప్రముఖ నటి తేజస్వి మదివాడ, మాల్వి మల్హోత్రా, ప్రాంతికా దాస్ తదితర నగర ప్రముఖులు పాల్గొన్నారు. -
స్కామ్ కాల్ అనుకుని...కట్ చేస్తే రూ.9 కోట్ల జాక్పాట్
ఒక ఫోన్ కాల్ ఆమె జీవితాన్ని మార్చేసింది. తనకు వచ్చిన ఫోన్ కాల్, ఏ స్పామ్ కాలో, స్కామ్ కాలో అనుకుంది. ఒక విధంగా చెప్పాలంటే ఒక్క క్షణంలో మెటా లాటరీ మిస్ అయ్యిపోయేదే. ఆ తరువాత అసలు విషయం తెలిసి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. విషయం ఏమీ అర్థం కాలేదు. అసలు సంగతి తెలియాలంటే.. ఈ కథనాన్ని చదవాల్సిందే.మిచిగాన్లోని వెస్ట్ల్యాండ్కు చెందిన 65 ఏళ్ల మహిళ వాలెరీ విలియమ్స్ తనకు లాటీరలో అదృష్టం వరిస్తుందేమో ఆశ ఉన్నా.. కచ్చితంగా తనకు కోట్ల రూపాయల అదృష్టం వరించబోతోందని మాత్రం అస్సలు ఊహించలేదు. అందుకే ఫోన్ కాల్ రూపంలో వెతుక్కుంటూ వచ్చిన లక్ను స్కామ్ అనుకుంది. నిజానికి ఆ ఫోన్ కాల్ వాస్తవానికి జీవితాన్ని మార్చే వార్త అని తెలుసుకుని షాక్ అయ్యింది. మిలియన్ డాలర్ల ఎలక్ట్రిక్ గివ్అవేలో తనను పోటీదారుగా ఎంపిక చేశారని తెలుసుకుని షాక్ అయింది విలియమ్స్. కట్ చేస్తే విలియమ్స్ మిలియన్ డాలర్ల (రూ.8.8 కోట్లు బహుమతిని గెలుచుకుంది. ఇన్నేళ్లుగా రాని అదృష్టం ఇంకేమి వస్తుంది అనుకుంది. కానీ అనూహ్య విజయం అవాస్తవంగా అనిపిస్తోందంటూ సంతోషం వ్యక్తం చేసింది. చదవండి: 5 నిమిషాల్లో జాబ్ కొట్టేసింది.. దెబ్బకి కంపెనీ సీఈవో ఫిదా!సెప్టెంబర్ 19న డెట్రాయిట్లోని కొమెరికా పార్క్లో బహుమతి చక్రం తిప్పడానికి ఆహ్వానించారని ఈ స్పిన్ ఆమెకు ఈ బహుమతిని సంపాదించిపెట్టింది.కొమెరికా పార్క్లో భారీ జనసమూహం మధ్య ఎలక్ట్రిక్ ఫ్యామిలీ గివ్అవే విజేత వాలెరీ విలియమ్స్కు అభినందనలు అని లాటరీ కమిషనర్ సుజన్నా ష్క్రెలి అనౌన్స్ చేసేదాకా నమ్మలేదని..ఇప్పటికీ షాక్లో ఉన్నాను అని తెలిపింది విలియమ్స్. గెల్చుకున్న డబ్బును ఏం చేయాలనే పెద్ద ప్లాన్లు ఏవీ ప్రస్తుతానికి లేక పోయినా, భర్తతో కలిసి హాలిడే ట్రిప్కు వెళతానని, మిగతాది పొదుపు చేసుకుంటానని తెలిపింది. మిచిగాన్ లాటరీ యాప్ ద్వారా తాను గెలవని టిక్కెట్లను స్కాన్ చేయడం ద్వారా తాను రెండవ అవకాశం బహుమతిగా పొందుతున్నానని ఆమె గ్రహించలేదని మిచిగాన్ లాటరీ అధికారులు చెప్పారు. చాలా మంది విజేతలు రెండో అవకాశాన్ని పట్టించుకోరనీ, కానీ తమ ఖాతాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, అధికారిక నోటిఫికేషన్ల కోసం అప్రమత్తంగా ఉండాలని గుర్తు చేశారు. -
రాక్స్టార్ పుట్టిన రోజు : ఫ్యాన్స్ ‘జల్సా’, మమత స్పెషల్ విషెస్
బాలీవుడ్ సీనియర్ నటుడు, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ శనివారం (అక్టోబర్ 11) 83వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అద్భుతమైన నటనతో ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు. కేవలం సినిమాలు మాత్రమే కాదు, టీవీ షోలు ముఖ్యంగా కౌన్ బనేగా కరోడ్పతి షో ద్వారా మరింత ప్రజాదరణ సంపాదించుకున్న సెలబ్రిటీ అమితాబ్ బచ్చన్. ఎన్నో విలక్షణమైన పాత్రలు గంభీరమైన స్వరం, అనన్య సామాన్యమైన నటన, అంతకుమించిన వ్యక్తిత్వం ఆయనను లెజెండ్రీగా నిలబెట్టాయి. అందుకే ఆయన పుట్టిన రోజు సందర్భంగా ముంబైలోని ఆయన నివాసం ముందు ఫ్యాన్స్చేసిన సందడి అంతా ఇంతా కాదు.అమితాబ్ బచ్చన్ అభిమానులు ఆయన పుట్టినరోజు సందర్భంగా తమ అభిమాన నటుడిని చూసేందుకు అభిమానులు తరలి వచ్చారు. మ ముంబై లోని బిగ్ బీ బంగ్లా 'జల్సా' వెలుపల గుమిగూడారు. అంతేకాదు ఆయన పోషించిన ప్రముఖ పాత్రల వేషధారణలో, పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ ఉత్సాహంగా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. మరోవైపు బిగ్ బీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువ కురిసింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్డే విషెస్ అందించారు.#WATCH | Mumbai, Maharashtra | Fans of the Veteran Actor Amitabh Bachchan gather outside his bungalow, 'Jalsa', to catch a glimpse of their favourite movie star on the occassion of his birthday. His fans dressed up as famous characters played by the actor, and sang songs and… pic.twitter.com/MfE34Y5RWl— ANI (@ANI) October 10, 2025 బిగ్ బీతో కలిసి నటించిన హీరో ప్రభాస్, కాజోల్, అజయ్ దేవ్గన్, శత్రుఘ్న సిన్హా,సునీల్ శెట్టి అ లాంటి సినీప్రముఖులతో పాటు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా అమితాబ్కు విషెస్ చెప్పడం విశేషం. "లెజెండరీ అమితాబ్ బచ్చన్ జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు! మీరు ఎపుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ మా అందరికీ స్ఫూర్తిని ప్రసాదించాలన్నారు. అలాగే 1984లో తామిద్దరం ఎంపీలు అనే విషయానఇన గుర్తు చేసుకున్నారు. -
వేయించుకు తినండి..అదిరిపోయే రుచి!
స్నాక్స్గానూ, భోజనంలోనూ రెండు విధాలుగా ఉపయోగపడే వంటకాలు కొన్ని ఉంటాయి. వాటిలో ఇంటిల్లిదినీ మెప్పించే క్రిస్సీ వెజ్, చికెన్ మెజిస్టిక్, చిల్లీ గార్లిక్.. ఇవాల్టీ టిప్ ఆఫ్ ది డేలో భాగంగా చెఫ్ గోవర్ధన్ ఇచ్చిన వంటకాలను చూద్దాం. క్రిస్పీ వెజ్కావలసినవి: క్యారెట్ – 100 గ్రా.; బీ¯Œ ్స – 50 గ్రా; రెడ్ క్యాప్సికం – 50 గ్రా; యెల్లో క్యాప్సికం – 50 గ్రా; గ్రీన్ క్యాప్సికం – 50 గ్రా.; క్యాబేజీ – 100 గ్రా.;పిండి మిశ్రమానికి... కార్న్ ఫ్లోర్ – 3 టేబుల్ స్పూన్లు; మైదా – 3 టేబుల్ స్పూన్లు; బియ్యప్పిండి – 3 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; కచ్చాపచ్చాగా దంచిన మిరియాల పొడి – టీ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి – రెండు స్పూన్లు; సన్నగా తరిగిన అల్లం – టేబుల్ స్పూన్; నీళ్లు – అవసరమైనంత.తయారి: ∙పిండి మిశ్రమం కోసం తీసుకున్న పదార్థాలన్నీ ఒక వెడల్పాటి గిన్నెలో వేసి నీరు కలిపి మృదువైన మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి ∙కూరగాయలన్నీ పొడవాటి సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి కూరగాయ ముక్కలను పిండి మిశ్రమంలో ముంచి, అన్ని వైపులా పిండి పట్టేలా ఉంచాలి ∙స్టౌ పై కడాయి పెట్టి, నూనె పోసి, వేడయ్యాక, అందులో సిద్ధం చేసుకున్న కూరగాయల ముక్కలను వేసి, బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి ∙చట్నీ లేదా సాస్తో వేడిగా సర్వ్ చేయాలి.చిల్లీ పనీర్ కావలసినవి: పిండి మిశ్రమానికి... పనీర్ – 500 గ్రా. (డైమండ్ షేప్లో కట్ చేయాలి); కార్న్ ఫ్లోర్ – 40 గ్రా.; మైదా – 40 గ్రా.; ఉప్పు – టీ స్పూన్; మిరియాల పొడి – టీ స్పూన్; సన్నగా తరిగిన వెల్లుల్లి – టేబుల్ స్పూన్; నీరు – అవసరమైనంత.సాస్ కోసం... నూనె – 2 టేబుల్ స్పూన్లు; సన్నగా తరిగిన వెల్లుల్లి – 2 టేబుల్ స్పూన్లు; సన్నగా తరిగిన అల్లం – టీ స్పూన్ పచ్చిమిర్చి (డైమండ్ కట్) – 8; గ్రీన్ క్యాప్సికం – ఒకటి (సన్నగా తరగాలి); ఉల్లిపాయ – ఒకటి (సన్నగా తరగాలి); ఉప్పు – తగినంత; చక్కెర – టీ స్పూన్ టొమాటో సాస్ – టేబుల్ స్పూన్ వెనిగర్ – టీ స్పూన్; సోయా సాస్ – టేబుల్ స్పూన్ ; గ్రీన్ చిల్లీ సాస్ – 2 టేబుల్ స్పూన్లు; రెడ్ చిల్లీ పొడి – టీ స్పూన్; నీళ్లు – 150 మి.లీ.తయారి: ∙పై పదార్థాలన్నీ ఒక గిన్నెలో వేసి, కలిపి, మిశ్రమం తయారు చేయాలి. పనీర్ ముక్కలను మిశ్రమంలో ముంచి, కాగుతున్న నూనెలో వేసి, బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ∙సాస్ తయారీకి.. పాన్ లో నూనె పోసి, వేడయ్యాక వెల్లుల్లి–అల్లం వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, క్యాప్సికం, ఉల్లిపాయ వేసి, వేపాలి ∙ఉప్పు, చక్కెర, టొమాటో సాస్, వెనిగర్, సోయా సాస్, చిల్లీ సాస్, కారం పొడి వేసి, నీళ్లు కలిపి చిక్కగా అయ్యేవరకు ఉడికించాలి ∙వేయించిన పనీర్ ముక్కలను ఈ సాస్లో వేసి బాగా కలపాలి ∙కొత్తిమీర లేదా గుండ్రంగా తరిగిన ఉల్లిపాయ స్లైసులతో అలంకరించి వేడిగా సర్వ్ చేయాలి. ( కిలోల కొద్దీ వెండి, బంగారం, నగదు, లగ్జరీ కార్లు, 17 టన్నుల తేనె)చికెన్ మెజెస్టిక్కావలసినవి: చికెన్ మ్యారినేట్ చేయడానికి... బోన్లెస్ చికెన్ – 500 గ్రా.; చిక్కటి మజ్జిగ– గ్లాసుడు; అల్లం వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్పసుపు – టీ స్పూన్; కారం – టేబుల్ స్పూన్ఉప్పు – టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ – టేబుల్ స్పూన్ ; మైదా – టేబుల్ స్పూన్సాస్ కోసం... నూనె – 2 టేబుల్ స్పూన్లు; సన్నగా తరిగిన వెల్లుల్లి – రెండు స్పూన్లు; పచ్చిమిర్చి – నాలుగైదు; కరివేపాకు – ఒక రెమ్మ; పుదీనా ఆకులు – అర కప్పు; సోయా సాస్ – 2 టేబుల్ స్పూన్లు; ఎండు మిరపకాయలు – 6; గరం మసాలా – టీ స్పూన్; పెరుగు – 6 టేబుల్ స్పూన్లు; నీరు – 50 మి.లీ.తయారి: ∙చికెన్ ను అన్ని పదార్థాలతో కలిపి, కనీసం 30 నిమిషాలు మ్యారినేట్ చేయాలి ∙బాణలిలో నూనెపోసి, మ్యారినేట్ చేసిన చికెన్ పీసులను బంగారు రంగు వచ్చేవరకు వేయించి, తీయాలి.ఇదీ చదవండి :హ్యాపీగా ఏసీ కోచ్లో తిష్ట, చూశారా ఈవిడ డబల్ యాక్షన్!సాస్ తయారీ: పాలో నూనె వేసి వెల్లుల్లి, మిర్చి, కరివే΄ాకు, పుదీనా ఆకులు వేసి వేయించాలి. తర్వాత సోయా సాస్, ఎండు మిరపకాయలు, గరం మసాలా, పెరుగు, నీరు వేసి చిక్కగా అయ్యేవరకు ఉడికించాలి. వేయించిన చికెన్ను ఈ సాస్లో వేసి బాగా కలపాలి. ∙పుదీనా లేదా కొత్తిమీరతో అలంకరించి వేడిగా సర్వ్ చేయాలి. -
గొంగడి గురించి తెలుసా? ఇంతకుముందెప్పుడూ వినని విశేషాలు!
పిల్లలూ! ‘గొంగడి’ గురించి మీకు తెలుసా? మీ ఇంట్లో గొంగడి ఉందా? ఒకప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్లల్లో గొంగడి ఉండేది. వ్యవసాయ, పాడి ఆధారిత కుటుంబాల్లో తప్పకుండా కనిపించే వస్తువు ఇది. ప్రస్తుతం పట్టణాల్లో దీని వాడకం తగ్గినా పల్లెల్లో ఇంకా వాడుతున్నారు.ముఖ్యంగా పశువుల కాపర్లు జీవాలను మేతకు తీసుకువెళ్లే సమయంలో గొంగడిని తమ వెంట తీసుకువెళ్తుంటారు. భారతదేశానికి వస్త్ర పరిశ్రమ రంగంలో గొంగడికి కీలకమైన స్థానం ఉంది. గొంగడి అనేది ఉన్నితో తయారు చేసిన దుప్పటి. మరాఠీలో దీన్ని ‘ఘొంగడి’ అంటారు. దీన్ని చేత్తో తయారు చేస్తారు. దీనికి అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు, సాంస్కృతిక విలువలు ఉన్నాయి. గతంలో వ్యవసాయ ఆధారిత కుటుంబాల్లో వివాహ ప్రతిపాదనలు ఏర్పాటు చేసేటప్పుడు గొంగడిని వినియోగించేవారు.ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూర్చోడానికి, విశ్రమించడానికి దీన్ని వాడేవారు. ఎండ, వాన, చలి నుంచి రక్షణగా నిలిచేందుకు ఇదెంతో సౌకర్యవంతంగా ఉంటుంది. వర్షంలో ఈ గొంగడి కప్పుకుంటే గొంగడి తడిసిపోయినా లోపలున్నవారికి ఆ తడి తగలదు. అది గొంగడి విశిష్టత.చదవండి: కిలోల కొద్దీ వెండి, బంగారం, నగదు, లగ్జరీ కార్లు, 17 టన్నుల తేనెమహారాష్ట్రలోని పలు గ్రామాల్లో అతిథులను స్వాగతించడానికి నేటికీ ఈ గొంగడిని ఉపయోగిస్తారు. అతిథుల్ని గొంగడిపై కూర్చోబెట్టడం గౌరవప్రదంగా భావిస్తారు. జూన్–ఆగస్టు నెలల మధ్య గొంగడి తయారీ ప్రారంభమవుతుంది. ఈ నెలల్లో గొర్రెల నుండి ఉన్నిని తీస్తారు. దాన్ని రంగుల ఆధారంగా వేరు చేస్తారు. సాధారణంగా ఉన్ని నలుపు, తెలుపు, గోధుమ రంగులలో ఉంటుంది. ఇందులో తెల్ల రంగు గొంగడి చాలా అరుదుగా కనిపిస్తుంది. 8 అడుగుల గొంగడిని తయారు చేయడానికి 350 గజాల ఉన్ని అవసరం. 10, 12 అడుగుల గొంగడికి 400, 450 గజాల ఉన్ని అవసరం అవుతుంది. చేతి మగ్గంపై ఒక గొంగడిని నేయడానికి ఎనిమిది నుండి పది గంటల సమయం పడుతుంది. నేయడం పూర్తయ్యాక దుప్పటికి చింతపండు గింజల రసం పూసి, రెండు నుండి మూడు రోజులు ఎండలో ఉంచుతారు. ఆ తర్వాత గొంగడి వినియోగానికి సిద్ధమైనట్లే.చదవండి: 5 నిమిషాల్లో జాబ్ కొట్టేసింది.. దెబ్బకి కంపెనీ సీఈవో ఫిదా! -
పాలిటిక్స్లో పాట కచేరి
ప్రతిభ, పాపులారిటీ.. పాలిటిక్స్కి మోస్ట్వాంటెడ్ థింగ్స్! ఈ రెండూ ఉన్న వ్యక్తులను ఎన్నికల్లో పార్టీ టికెట్స్ వలచి వరిస్తాయి! ఆ కోవలో గ్లామర్ స్టార్స్, కళాకారులకైతే స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది! అందులో అమ్మాౖయెతే.. మహిళా ప్రాతినిధ్యానికి ఒక ఓటు పెరిగినట్టే.. ఓ ఆశ చిగురించినట్టే! ఇప్పుడీ ప్రస్తావనకు ప్రాసంగికత బిహార్ ఎన్నికలు..అలా టాలెంట్ అండ్ ఫాలోయింగ్ గల అభ్యర్థి.. గాయని మైథిలీ ఠాకుర్. ఆమె పరిచయం..గాయనిగా మైథిలీ ఠాకుర్ (Maithili Thakur) దేశమంతటా సుపరిచితం. ఆమె మైథిలీ, భోజ్పురి, హిందీ భాషల్లో జానపద సంగీతంతోపాటు శాస్త్రీయ సంగీతంలోనూ ఘనాపాటి. సంగీత కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మైథిలీ జన్మస్థలం బిహార్, మధుబని జిల్లాలోని బేనీపట్టీ. తండ్రి రమేశ్ ఠాకుర్ సంగీతం మాస్టారు. మైథిలీ తన ఇద్దరు సోదరులతోపాటు తండ్రి, తాత దగ్గరే శాస్త్రీయ, జానపద సంగీతం నేర్చుకున్నారు. దేశంలోనే కాదు, విదేశాల్లోనూ భక్తి, జానపద సంగీత కచేరీలు ఇస్తున్నారు. జానపద సంగీతంలో ఆమె చేస్తున్న కృషిని గుర్తించిన సంగీత నాటక అకాడమీ ఆమెను ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారంతో సత్కరించింది. మైథిలీకి సంగీత కళ మీద ఆరాధనే కాదు. సామాజిక స్పృహ కూడా బాగా ఉంది. ఓటర్ ఎడ్యుకేషన్ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని ఓటర్లకు అవగాహన పెంచడంలో తన వంతు పాత్ర పోషించారు. అందుకే ఎలక్షన్ కమిషన్ ఆమెను బిహార్ స్టేట్ ఐకాన్ను (Bihar State Icon) చేసింది. ఇవన్నీ కూడా ఆమెను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టిలో పడేట్టు చేశాయి. ఆయోధ్య రామాలయ (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవంలో శబరి మీద ఆమె పాట పాడారు. ఆ గాన మాధుర్యాన్ని ప్రధాని అభినందించారు. ఇవన్నీ ఆమె రాజకీయ ప్రవేశాన్ని సునాయాసం చేయనున్నాయి. బిహార్ ఎన్నికల్లో మధుబని లేదా అలీనగర్ ఈ రెండిట్లో ఏదో ఒక నియోజక వర్గానికి ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేట్టు కనిపిస్తున్నాయి. మధుబని, దర్భంగా (అలీనగర్ ఈ జిల్లాలోనిదే).. ఈ రెండూ కూడా మిథిలా ప్రాంతం కిందకు వస్తాయి. మైథిలీ ఆ సంస్కృతీ సంప్రదాయంలోనే పుట్టి పెరిగిన వనిత. పైగా కళాకారిణి. ఈ రెండూ ఆమెను ఇటు సంప్రదాయవాదులకు, అటు సంప్రదాయవాదులు కాని వాళ్లకూ కూడా కావల్సిన వ్యక్తిగా ఆమెను ప్రజలకు దగ్గర చేస్తున్నాయి. సరిగ్గా బీజేపీ ఈ అంశాన్నే పరిగణనలోకి తీసుకుని ఆ రెండు నియోజకవర్గాల్లో ఒక స్థానం నుంచి ఆమెను బరిలోకి దింపే ప్రయత్నం చేస్తోందని రాజకీయ విశ్లేషకుల మాట. అంతేకాదు ఆమె యంగ్ లేడీ కావడంతో ఇటు యూత్నూ ఆకట్టుకోవచ్చని బీజేపీ ఆలోచిస్తోందని చెబుతున్నారు. అయితే గెలుపు మాత్రం అంత అనాయాసంగా ఉండక పోవచ్చని మైథిలికి మద్దతిస్తున్న వారి అభిప్రాయం. ఆమె ముందు చాలా సవాళ్లే ఉన్నాయి. ఓటరు అవగాహనా కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రమే సరిపోదు రాజకీయ ప్రవేశానికి. ఎంతో కొంత క్షేత్రస్థాయి అనుభవం, వ్యూహాలు, సంస్థాగత తోడ్పాటు, పార్టీ అంచనాలకనుగుణంగా పని చేయడం వంటివి మైథిలి ముందున్న సవాళ్లని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏదేమైనా యువత.. అందులో అమ్మాయిలు రాజకీయాల్లోకి రావడం మాత్రం శుభపరిణామమే! -
‘మురుగున’ పడ్డ జీవితాల్లో వెలుగు
మారుతున్న ఈ దేశంలో మారాల్సినవి ఇంకా ఉన్నాయి. మానవ వ్యర్థాలను ఎత్తి పోసే పాకీ పనిని నిషిద్ధం చేయగలిగినా మ్యాన్హోల్స్ శుభ్రతకు మురుగు నీటి వ్యవస్థ మరమ్మత్తులకు మనుషులనే ఉపయోగించడం వల్ల వారు అనారోగ్యం పాలై మృత్యువాత పడుతున్నారు. వారిలో చైతన్యం, పొందాల్సిన హక్కుల కోసం పని చేస్తోంది హేమలత కన్సోటియా. ఢిల్లీలో మొదలైన ఈమె ఉద్యమం ఇప్పుడు రాజస్థాన్కు చేరి మంచి ఫలితాలను ఇస్తోంది. హేమలత పరిచయం..‘జూన్లో బికనీర్లో ముగ్గురు స్కావెంజర్లు మరణించారు... సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ. విష వాయువుల వల్ల ఇలా జరిగింది. కేసు ఏం పెట్టలేదు. కొద్ది డబ్బుతో వదిలించుకున్నారు. ఇలా ఎన్నిచోట్ల జరుగుతున్నదో చెప్పలేము. ఈ పరిస్థితి మారాలి’ అంటుంది హేమలత.ఢిల్లీకి చెందిన హేమలత ప్రస్తుతం రాజస్థాన్లోని జైపూర్లో ఉంటూ మాన్యువల్ స్కావెంజర్ల కోసం పని చేస్తోంది. గతంలో ‘మాన్యువల్ స్కావెంజర్స్’ అంటే మానవ వ్యర్థాలను శుభ్రం చేసే వారిని అనేవారు. ఇప్పుడు మ్యాన్హోల్స్ను, సెప్టిక్ ట్యాంకులను, మురుగు కాల్వలను శుభ్రం చేసే వారికి కూడా వాడుతున్నారు. మొత్తంగా పారిశుధ్య కార్మికుల పనిలో యంత్ర ప్రమేయం అవసరం గురించి హేమలత పోరాటం సాగిస్తున్నారు. ఆమె వాదన వింటే ఎవరికైనా సరే పారిశుద్ధ్య కార్మికుల గురించి ఆలోచన మొదలవుతుంది.చిన్న వయసు నుంచేఢిల్లీకి చెందిన హేమలతకు పద్నాలుగేళ్ల వయసులో చెవి వైద్యం చేయిస్తే అది వికటించి ముఖానికి పాక్షిక పక్షవాతం వచ్చింది. దాంతో ఆమెను తల్లిదండ్రులు పెళ్లి పేరుతో వదిలించుకున్నారు. ఆ పెళ్లి నిలువలేదు. హేమలత భవన నిర్మాత కూలీలతో పని చేస్తూ ఎం.ఏ చదివి కార్మికుల హక్కుల కోసం పని మొదలెట్టింది. 1998 నుంచి ఆమె ఈ పనిలో ఉన్నా 2007లో ఓ కేసు ఆమె దృష్టిని మార్చింది. ఓ నిర్మాణంలో జరిగిన ప్రమాదం కారణంగా ముగ్గురు మరణించారని ఆమెకు చెప్పారు. ఆమె అక్కడికి వెళ్లి చూశాక అసలు విషయం అర్థమైంది. అక్కడ మ్యాన్ హోల్ శుభ్రం చేసేందుకు వెళ్లి విషవాయువులు పీల్చి ఆ ముగ్గురూ మరణించారు. ఆ ఘటన ఆమె మనసును కదిలించింది. దేశంలో ఇంకా ఇలాంటి ఘటనలు జరుగుతుండటమేమిమటే ప్రశ్న మొదలైంది. పొట్టకూటి కోసం కార్మికులు ఈ ప్రమాదకరమైన పని చేస్తూ మృత్యువు పాలవుతున్నారని ఆమె గుర్తించింది. వారి కుటుంబాలకు నష్టపరిహారం సైతం అందడం లేదనే విషయం ఆమెకి తెలిసింది. ఈ పనులకు ముగింపు పలకాలని భావించి అదే సంవత్సరం దిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసింది. సమాజం మారాలి‘ప్రభుత్వ విధానాలు పేపర్ల మీద ఉంటాయి. కాని అవి వాస్తవరూపం దాల్చితేనే ఫలితం’ అంటుంది హేమలత. మ్యాన్హోల్స్ శుభ్రం చేస్తూ మరణించిన వారి కుటుంబాలకు ఆమె అండగా నిలబడ్డారు. వారి కాళ్ల మీద వారు నిలబడేలా సాయం అందించాలని భావించారు. అందుకు తగ్గ పనులు మొదలుపెట్టారు. అందుకూ ఆమెకు సమాచార హక్కు చట్టమే తోడ్పాటుగా నిలిచింది. ఆమె కృషి ఫలితంగా ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. మ్యాన్ హోల్స్ శుభ్రం చేస్తూ మరణించిన వారి కుటుంబాలకు సాయం అందించేందుకు సిద్ధమైంది. దీంతోపాటు ఏళ్లుగా ఈ పనిలోనే ఉన్నవారిని ఆ పని మాన్పించి, కొత్త పనులు చేపట్టేలా ప్రభుత్వ పథకాలను వారికి చేరువ చేశారు హేమలత. ఇది మాత్రమే కాదు, నిరుపేద కుటుంబాలకు విద్య, వైద్యం, మౌలిక వసతులు అందే విషయంలోనూ ఆమె క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. సుమారు రెండు వేల మంది చిన్నారులకు సక్రమంగా పోషకాహారం అందేందుకు ఆమె పాటుపడ్డారు. ‘మ్యాన్ హోల్లో ఎవరో ఒకరు దిగి శుభ్రం చేయక పోతే ఊళ్లు శుభ్రంగా ఎలా ఉంటాయి?’ అని చాలామంది హేమలతతో వాదిస్తుంటారు. ‘మనిషి జన్మ ఎత్తినవారెవరూ ఇటువంటి పనులు చేయకూడదు. అలా చేయకుండా చూడాల్సిన బాధ్యత సమాజానిది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఇంత అభివృద్ధి సాధించాం. మురుగు కాల్వ శుభ్రం చేయడానికి ఆ అభివృద్ధిని ఉపయోగించలేమా?’ అని ఆమె ప్రశ్నిస్తారు. యంత్రాలను తీసుకొచ్చి, ఆ కార్మికులకు శిక్షణ ఇచ్చి, వారికి ఉపాధి కల్పించాలని ఆమె అంటున్నారు. తద్వారా దేశం నిజమైన అభివృద్ధి సాధిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మనిషి దిగొద్దుసామాజిక కార్యకర్త బెజవాడ విల్సన్ తదితరుల కారణంగా అప్పటిదాకా పాకీ పని చేసేవారి గురించి దేశవ్యాప్తంగా చర్చ సాగింది. అయితే మ్యాన్ హోల్స్లో దిగి శుభ్రం చేసేవారి గురించి, వారి భద్రత గురించి హేమలత వల్ల తొలిసారి చర్చ మొదలైంది. ఈ క్రమంలో అనేక ప్రాంతాలు తిరిగి అక్కడి కార్మికులతో మాట్లాడారు హేమలత. మురుగుకాల్వలు, మ్యాన్ హోల్స్ వంటి చోట్ల పనిచేసేవారి పట్ల సమాజం ఎంత వివక్షపూరితంగా ఉందనేది తెలిసింది. వారి ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయన్న విషయం వెలుగులోకి వచ్చింది. కోర్టులో సుదీర్ఘ వాదనల అనంతరం 2010లో దిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. మ్యాన్ హోల్స్లోకి దిగి మురుగును శుభ్రం చేయడం చట్టవ్యతిరేక చర్య అని ప్రకటించింది. -
వయసు 84 ఏళ్లు..కానీ ఇతడి టాలెంట్ మాములుగా లేదుగా..!
ఒకే మనిషిలో ఒకటికి మించి టాలెంట్లు ఉంటే అబ్బా అనేస్తాం. కానీ విభిన్న రంగాల్లో మనోడు సత్తా మాములుగా లేదు. ప్రతిదాంట్లోనూ తానే ముందున్నాడు. అతడి ఆహార్యం నుంచి కెరీర్ పరంగా టాలెంట్ వరకు..ఎవర్రా అది అని నోరెళ్లబెట్టేలా సత్తా చాటుతున్నాడు ఈ 84 ఏళ్ల హోండా కంపెనీ ఇంజనీర్.వయసుపరంగా వృద్ధుడే అయినా..ఆహార్యం పరంగా యువకులకు ఏ మాత్రం తీసిపోని దేహదారుఢ్యం అతనిది. అతడి విలక్షణమైన టాలెంట్లు గురించి వింటే..మాటల్లేవ్ అంతే అని చెప్పొచ్చు. అతడే జపాన్కి చెందని షోటారో ఓడేట్ అనే 84 ఏళ్ల ఇంజనీర్. ఆధునాత భద్రతా సాంకేతికతకు సంబంధించిన డెవలపర్. అతడి హెయిర్ స్టైల్ కారణంగా వార్తల్లో నిలవడమే కాదు నెట్టింట వైరల్గా మారాడు. విలక్షణమైన హెయిర్ స్టైల్..జపనీస్ సినిమాల్లోని పాత్రల్లోని అనిమే-ప్రేరేపిత హెయిర్ స్టైల్లో అతడి జుట్టు ఉంటుంది. నిజానికి ఆ పాత్రల్లోని హెయిర్స్టైల్ని నిజజీవితంలో అనుకరించడం అతం ఈజీ కాదు. మెయింటైన్ చేయడం కూడా కష్టమే. కానీ ఇతడి హెయిర్మాత్రం అందుకు విరుద్ధం. అత్యంత సహజమైన అనిమే-ప్రేరేపిత హెయిర్ స్టైల్ మాదిరిగా ఉండటం విశేషం. అయితే ఈ జపనీస్ ఆటోమోటివ్ ఇంజనీర్ మాత్రం తాను ఐదేళ్లుగా ఈ హెయిర్ స్టైల్ని నిర్వహిస్తున్నట్లు చెబుతున్నాడు. తన చిన్నతనం వరకు సాంప్రదాయ పద్ధతి హెయిర్ స్టైల్లోనే ఉన్నాడట. గత కొన్ని ఏళ్లుగా తన ఎడమ కన్నుపై పడుతున్న జుట్టుని స్లైలిష్గా మార్చేప్రయత్నంలో ఈ స్టైల్ని అనుసరించాడట. ఇక తన జుట్టు ఈ స్టైల్లో సులభంగా మారిపోవడానికి ప్రధాన కారణం సరైన నిద్ర అలవాట్లు లేకపోవడమేనట. ఇక అతను 2003లో హోండాలో సీటు బెల్ట్లలో ప్రత్యేకత కలిగిన ఇంజనీర్గా బాధ్యతలు చేపట్టి..అందుకు సంబంధించిన సురక్షితమైన డ్రైవింగ్ టెక్నాలజీలో దాదాపు 253 పేటెంట్లను పొందారు. అలాగే ఇదే కంపెనీలో ఆయన హోండా సెన్సింగ్ 360+ ADAS వ్యవస్థ వెనుక ఉన్న లీడ్ ఇంజనీర్ విభాగానికి, డ్రైవర్ల కంటి కదలికలను పర్యవేక్షించే స్మార్ట్ కెమెరా టెక్నాలజీనిను అభివృద్ధి చేసే బృందానికి ఈయనే సారథ్యం వహించారు. సేఫ్టీ టెక్నాలజీలు..సింపుల్గాచెప్పాలంటే ఆయన పని ఎల్లప్పుడూ.. "జీవితాన్ని సురక్షితంగా ఉంచడమే" లక్ష్యంగా సాంకేతికతలను అభివృద్ధి చేయడమే. ఆయన కేవలం టెక్నీలజీ డెవలప్పర్గానే కాకుండా హోండాలో ప్రముఖ సభ్యుడిగా కొత్త కార్లను కూడా ప్రమోట్ చేస్తారు కూడా. ఆఖరికి ఫిట్నెస్లో కూడా..చివరిగా ఫిట్నెస్ పరంగా అతనికి వేలకొద్ది అభిమానులు ఉన్నారట. అంతేగాదు 170 కేజీల బెంచ్ప్రెస్ బల శిక్షణా వ్యాయామాన్ని వరుసగా ఐదుసార్లు ప్రదర్శించిన రికార్డు కూడా అతని పేరు మీద ఉందట. ఇలా కెరీర్, ఫ్యాషన్, హెల్త్ పరంగా ఇంతలా ప్రతిభను చాటుకోవడం అంత ఈజీ కాదు కదూ..!.This is 84-year-old Shotaro Odate, Chief Engineer at @Honda recognized for his significant contributions to automotive safety technology, including the development of the Honda SENSING 360+ system. Odate holds over 250 patents and has published nine scientific papers on topics… pic.twitter.com/r3tXDCTJB8— Evan Kirstel #B2B #TechFluencer (@EvanKirstel) September 22, 2025 (చదవండి: Success Story: ఒకప్పుడు సెక్యూరిటీ గార్డు..ఇవాళ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్గా..) -
కిలోల కొద్దీ వెండి, బంగారం, నగదు, లగ్జరీ కార్లు, 17 టన్నుల తేనె
కోట్ల రూపాయల విలువ చేసే బంగారం, కిలోల కొద్దీ వెండి, లెక్కపెట్టలేనంత డబ్బు, లగ్జరీ కార్లు, టన్నుల కొద్దీ తేనె.. ఏంటి లెక్కలు అనుకుంటున్నారా? ఒక అవినీతి తిమింగలం ఇంట్లో దొరికిన అక్రమ సంపద ఇది. మధ్యప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (PWD)కి చెందిన రిటైర్డ్ ఇంజనీర్-ఇన్-చీఫ్ భోపాల్ జీపీ మెహ్రా అవినీతి బాగోతం దర్యాప్తు అధికారులనే నివ్వర పోయేలా చేసింది.క్రైమ్ థ్రిల్లర్ను తలపించే ఈ స్టోరీ గురువారం నాటి దాడుల్లో వెలుగులోకి వచ్చింది. అవినీతి నిరోధక అంబుడ్స్మన్ లోకాయుక్త రిటైర్డ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (PWD) చీఫ్ ఇంజనీర్ GP మెహ్రాకు భోపాల్లోని మణిపురం కాలనీలోని అతని నివాసం, ఇతర ఆస్తులపై అధికారులు దాడి చేశారు. ఈ సందర్బంగా కళ్లుచెదిరే సంపదను గుర్తించారు. డబ్బులను లెక్కపెట్టేందుకు యంత్రాలను తెప్పించాల్సివ చ్చిందంటే పరిస్థితి ఊహించుకోవచ్చు. ఇటీవలి కాలంలో మధ్యప్రదేశ్లో అత్యంత సంచలనాత్మక అవినీతి కథలలో ఒకటిగా నిలిచింది.లోకాయుక్తలోని నలుగురు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) స్థాయి అధికారులు భోపాల్ ,నర్మదాపురంలోని నాలుగు ప్రదేశాలలో దాడుల బృందాలు దాడులు నిర్వహంచాయి. జి పి మెహ్రా తన పదవీకాలంలో అవినీతితి భారీ సంపదను కూడబెట్టారనే ఫిర్యాదుల ఆధారంగా లోకాయుక్త డైరెక్టర్ జనరల్ యోగేష్ దేశ్ముఖ పర్యవేక్షణలో ఈ సోదాలు నిర్వహించినట్లు భోపాల్ లోకాయుక్త ఎస్పీ డి రాథోడ్ పిటిఐకి తెలిపారు.చదవండి: 5 నిమిషాల్లో జాబ్ కొట్టేసింది.. దెబ్బకి కంపెనీ సీఈవో ఫిదా!మణిపురం కాలనీ , దానా పానీ సమీపంలోని ఓపాల్ రీజెన్సీ, భోపాల్లోని గోవింద్పుర పారిశ్రామిక ప్రాంతంలోని అతని ఫ్యాక్టరీ కె టి ఇండస్ట్రీస్, నర్మదాపురం జిల్లాలోని సోహాగ్పూర్ తహసీల్ పరిధిలోని సైని గ్రామంలోని ఆస్తులపై ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్లు లోకాయుక్త తెలిపింది. ఈ సోదాల్లో కోట్లకు పైగా విలువైన బంగారం , కిలోల కొద్దీ వెండి దొరికింది. అంతేకాదు ఫామ్హౌస్లో చక్కగా పేర్చబడిన 17 టన్నుల తేనె దొరకడ మరింత ఆశ్చర్యకరంగా నిలిచింది.పామ్ హౌస్లో 17 టన్నుల తేనె, లగ్జరీ కార్లురూ.8.79 లక్షల నగదు, రూ.56 లక్షల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు కనుగొన్నారు. మరో ఇంట్లో అక్కడ దర్యాప్తు అధికారులు రూ.26 లక్షల నగదు, రూ.3.05 కోట్ల విలువైన 2.6 కిలోగ్రాముల బంగారం, 5.5 కిలోగ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు.అలాగే తహసీల్ సోహగ్పూర్ (నర్మదపురం)లోని సైని గ్రామంలోని మెహ్రా ఫామ్హౌస్లో మరో సామ్రాజ్యాన్ని కనుగొన్నారు. 17 టన్నుల తేనె, ఆరు ట్రాక్టర్లు, నిర్మాణంలో ఉన్న 32 భవనాలు, ఏడు పూర్తయినవి, చేపల చెరువు కూడా. దానికి తోడు, ఒక గోశాల, ఒక ఆలయం, ఫోర్డ్ ఎండీవర్, స్కోడా స్లావియా, కియా సోనెట్,మారుతి సియాజ్ వంటి లగ్జరీ కార్లు అన్నీ మెహ్రా కుటుంబం పేరు మీద నమోదై ఉన్నాయి.(భర్త మానసిక క్షోభకు రూ. 37 లక్షలు : ప్రియుడికి భారీ షాకిచ్చిన కోర్టు)ఈ ఆపరేషన్ గోవింద్పురా ఇండస్ట్రియల్ ఏరియాలోని కెటి ఇండస్ట్రీస్లో కూడా కొనసాగింది. ఇది మెహ్రా వ్యాపార సంస్థగా భావిస్తారు.ఇక్కడ, అధికారులు పరికరాలు, ముడి పదార్థాలు, రూ.1.25 లక్షల నగదు, మెహ్రా బంధువులు సంస్థలో భాగస్వాములుగా ఉన్నారని చూపించే పత్రాలను కనుగొన్నారు. ఈ యూనిట్ మెహ్రా కుమారుడు రోహిత్ , కైలాష్ నాయక్ సంయుక్తంగా యాజమాన్యంలో ఉన్నట్లు తెలిపింది. బీమా పాలసీలు, వాటా పత్రాలు, బహుళ ఆస్తులు, అనేక కోట్ల ఆస్తులను లోకాయుక్త అధికారులు ధృవీకరించారు. స్వాధీనం చేసుకున్న పత్రాలు, డిజిటల్ ఫైళ్లు, బ్యాంకింగ్ రికార్డులను పరిశీలించడానికి ఫోరెన్సిక్ బృందాలను నియమించారు. -
గుజరాత్ నుంచి 40 రోజులు : అయోధ్యకు నడిచొచ్చిన వృద్ధుడు
అయోధ్య: శ్రీరాముడిపై అచంచల భక్తి విశ్వాసాలు కలిగిన ఓ 73 ఏళ్ల వృద్ధుడు గుజరాత్లోని మెహసనా నుంచి కాలినడకన బయలుదేరి 1,338 కిలోమీటర్ల దూరంలోని యూపీలోని అయోధ్య క్షేత్రానికి 40 రోజుల్లో గురువారం చేరుకున్నారు. అయోధ్యకు (Ayodhya) నడిచి వెళ్లాలనే మూడు దశాబ్దాలనాటి సంకల్పాన్ని సాకారం చేసుకున్నారు. మెహసనా జిల్లా మోదీపూర్ గ్రామానికి చెందిన జయంతీలాల్ హర్జీవన్దాస్ పటేల్ (Jayantilal Harjivandas Patel) 1990లో బీజేపీ అగ్ర నేత ఎల్కే అడ్వాణీ చేపట్టిన సోమ్నాథ్–అయోధ్య రథయాత్రను స్ఫూర్తిగా తీసుకున్నారు. అప్పట్లో గుజరాత్లోని జరిగిన ఆ యాత్రలో జయంతీలాల్ పటేల్ పాల్గొన్నారు కూడా. అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కూడా జరగడంతో తన కల నెరవేర్చుకునే సమయం వచ్చిందని భావించారాయన. ఆ మేరకు తన యాత్రను ఆగస్ట్ 30వ తేదీన స్వగ్రామం నుంచి ప్రారంభించారు. రోజుకు 33–35 మేర నడుస్తూ, రాత్రి వేళల్లో విశ్రాంతి తీసుకున్నారు. మార్గమధ్యంలోని ఆలయాలు, పబ్లిక్ పార్కులు, అతిథి గృహాల్లో విరామమిచ్చేవారు. కుటుంబసభ్యులు ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు ఆయన క్షేమ సమాచారం తెలుసుకోవడంతోపాటు, ఆ మార్గంలో తర్వాతి స్టాప్ ఏమిటో తెలియజేస్తుండే వారు. అయోధ్యకు చేరుకున్న జయంతీలాల్ కరసేవక్పురంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ను కలుసుకున్నారని ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: 5 నిమిషాల్లో జాబ్ కొట్టేసింది.. దెబ్బకి కంపెనీ సీఈవో ఫిదా! View this post on Instagram A post shared by Ahmedabad Mirror (@ahmedabadmirrorofficial) -
అద్భుతం.. మనిషికి పంది కాలేయం!
ఆధునిక వైద్య చరిత్రలో మరో అద్భుతం. కాలేయం సమస్యలతో బాధే పడే వారికి ఊరట నిచ్చే వార్త. విజయవంతంగా మనిషికి పంది కాలేయం (Pig Liver) అమర్చారు చైనా వైద్యులు. అంతేకాదు దాని పనితీరు కూడా బేషుగ్గా ఉందని ప్రకటించారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినతను 170 రోజులు పైగా బతికివున్నాడని, పంది కాలేయం అమర్చిన వారిలో ఎక్కువ రోజులు బతికిన వ్యక్తిగా గుర్తింపు పొందాడని సీఎన్ఎన్ వార్తా సంస్థ వెల్లడించింది.చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్కు చెందిన 71 ఏళ్ల వ్యక్తి సిరోసిస్, హెపటైటిస్ బితో బాధపడుతున్నాడు. కాలేయం పూర్తిగా పాడైపోవడంతో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ (Liver transplantation) చేయాలని నిర్ణయించారు. జన్యుమార్పిడి చేసిన పంది కాలేయాన్ని అతడికి అమర్చారు. తర్వాత అతడిని అబ్జర్వేషన్లో ఉంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. అన్హుయ్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ బీచెంగ్ సన్ నాయకత్వంలో ఈ ప్రయోగం జరిగింది.ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కాలేయం పనితీరు బాగానే ఉందని, జీవక్రియలు సాఫీగా సాగాయని వైద్యులు తెలిపారు. అయితే 38వ రోజున చిన్న సమస్య తలెత్తినా పరిష్కరించామన్నారు. జెనోట్రాన్స్ప్లాంటేషన్- సంబంధిత థ్రోంబోటిక్ మైక్రోయాంజియోపతి కారణంగా ఏర్పడిన గ్రాఫ్ట్ తొలగించామన్నారు. కాలేయ మార్పిడిన జరిగిన వ్యక్తి 171 రోజులు జీవించిన తర్వాత అంతర్గత రక్తస్రావం కారణంగా మరణించాడని చెప్పారు. ఈ ప్రయోగం ద్వారా కాలేయ మార్పిడిలో ఎదురయ్యే సవాళ్లను చాలా వరకు అధిగమించామని అన్నారు.భవిష్యత్ ఆశాకిరణం"గుండె లేదా మూత్రపిండాలతో పోలిస్తే కాలేయ మార్పిడి చాలా క్లిష్టమైందని అందరూ భావిస్తుంటారు. కానీ మా ప్రయోగం తర్వాత ప్రజలు భిన్నంగా ఆలోచిస్తారని నేను భావిస్తున్నాను" అని డాక్టర్ బీచెంగ్ సన్ CNNతో అన్నారు. ఈ ప్రయోగాన్ని భవిష్యత్ ఆశాకిరణంగా వర్ణించారు జర్మనీలోని హన్నోవర్ మెడికల్ స్కూల్లో గ్యాస్ట్రోఎంటరాలజీ, హెపటాలజీ ప్రొఫెసర్ డాక్టర్ హీనర్ వెడెమెయర్. కాలేయ మార్పిడి ప్రయోగాల్లో ఇంకా ఎంత దూరం ప్రయాణించాలనే విషయాన్ని కూడా ఈ ప్రయోగం వెల్లడి చేసిందన్నారు. అతడే ఫస్ట్!రీడింగ్ క్రానికల్ ప్రకారం.. పరిమాణంలో మనిషి అవయవాలకు వరాహ అవయవాలు పోలి ఉండటం, పంది జన్యు- సవరణ సాంకేతికత లభ్యత కారణంగా వీటి నుంచే మనుషులకు అవయవ మార్పిడి చేస్తున్నారు. తొలిసారిగా అమెరికాకు చెందిన 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తికి 2022లో జన్యుమార్పిడి చేసిన పంది గుండెను (Pig Heart) అమర్చారు. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ సెంటర్లో ఈ ప్రయోగం జరిగింది. అవయవ మార్పిడి జరిగిన రెండు నెలల తర్వాత బెన్నెట్ మరణించాడు.పంది కిడ్నీ కూడా..అమెరికాకు చెందిన 62 ఏళ్ల రిచర్డ్ స్లేమాన్ గత సంవత్సరం మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి చేయించుకున్నాడు. జన్యుమార్పిడి చేసిన పంది మూత్రపిండ్రాలను (Pig Kidney) ఆయనకు అమర్చారు. ఆ ప్రక్రియ తర్వాత రెండు నెలల్లో రిచర్డ్ మరణించాడు.చదవండి: అప్పుడు దివాళా.. ఇప్పుడు రోజు 25 లక్షల సంపాదన! -
ఒకప్పుడు సెక్యూరిటీ గార్డు..ఇవాళ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్గా..
కనీసం డిగ్రీ కూడా లేకుండా ఉద్యోగం సంపాదించడం కష్టం. అందులోనూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే..అస్సలు సాధ్యం కాదు. కానీ ఈ వ్యక్తి ఏ కంపెనీకి సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడో అదే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. డిగ్రీ కూడా పూర్తి చేయని ఈ వ్యక్తి ఎలా ఇంత పెద్ద ఉద్యోగాన్ని సంపాదించగలిగాడో వింటే..నేర్చుకోవడం విలువ కచ్చితంగా తెలుస్తుంది. లింక్డ్ఇన్లో వైరల్గా మారిన ఇతని స్టోరీ నేటి తరాని స్ఫూర్తి. ఎన్ని డిగ్రీలు చేశామన్నాది కాదు స్కిల్ ఎంత ఉంది అన్నది ముఖ్యం అని చెబుతోంది ఇతడి కథ.అతడే అబ్దుల్ అలీమ్. లింక్డ్ ఇన్ పోస్ట్లో తన సెక్యూరిటీ గార్డు నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మారిన తన సక్సెస్ జర్నీని షేర్ చేసుకున్నారు. 2013లో ఇంటి నుంచి వెయ్యి రూపాయలతో బయటకొచ్చేశానని, రైలు టికెట్ కోసం రూ. 800లు ఖర్చు చేశానంటూ నాటి పరిస్థితిని గుర్తుచేసుకున్నాడు అబ్దుల్. చిన్నపాటి ఉద్యోగం కూడా లేకపోవడంతో ఎక్కడకి వెళ్లలేని తన దీనస్థితిని గురించి వివరించాడు. అలా రెండు నెలలు వీధుల్లో గడిపిన అనంతరం..జోహో సాఫ్ట్వేర్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనికి కుదిరాడు. అదే అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. పదోతరగతి వరకే చదివిన అతడికి హెచ్టీఎంఎల్(HTML)పై కొంచెం పట్టు ఉంది. అయితే మరింతగా నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నా..అదెలా అనేది తెలియలేదు అబ్ధుల్కి. సరిగ్గా ఆ సమయంలో జోహోలో సీనియర్ ఉద్యోగి శిబు అలెక్సిస్తో పరిచయం..ఒక్కసారిగా అబ్దుల్ జీవితమే మారిపోయింది. అతడు అబ్దుల్ మాటల్లో ఏదో చేయాలనే తపనను గుర్తించి..మార్గనిర్దేశం చేసేందుకు ముందుకొచ్చాడు. అలా ఎనిమినెలల పాటు పగటిపూట భద్రతా విధులను పూర్తి చేసి, సాయంత్రం ప్రోగ్రామింగ్ నేర్చుకునేవాడు అబ్దుల్. చివరికి ఒకరోజు వినియోగదారు ఇన్పుట్ను దృశ్యమానం చేసే ఒక సాధారణ యాప్ను రూపొందించాడు. దానిని అలెక్సిస్ జోహూ మేనేజర్కు చూపించాడు. దీంతో మేనేజర్ అబ్దుల్ని ఇంటర్వ్యూకి పిలిచారు. అయితే తనకు డిగ్రీ లేకపోవడంతో కాస్త తడబడుతున్న అబ్దుల్ని చూసి ఆ కంపెనీ మేనేజర్..కాలేజ్ డిగ్రీ అవసరం లేదు, నైపుణ్యం ఉంటే చాలు అంటూ అతడిని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్గా నియమించారు. అలా సెక్యరిటీ గార్డుగా పనిచేసిన ఎనిమిదేళ్ల తర్వాత అదే కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్గా నియమాకం అందుకున్నాడు. ఇలా తన కథను వివరిస్తూ..తనకు గురువులా మార్గనిర్దేశం చేసిన శిబు అలెక్సిస్కు, అలాగే తనని తాను నిరూపించుకునేలా అవకాశం ఇచ్చిన జోహో కంపెనీ మేనేజర్కి ధన్యావాదాలు తెలిపాడు పోస్ట్లో. చివరగా ఆయన "నేర్చుకోవడం అనేది ఎప్పుడైనా ప్రారంభించొచ్చు..ఆలస్యం అనే పదానికి ఆస్కారం లేదు" అని పోస్ట్ని ముగించారు. కాగా, జోహో అనేది చెన్నైకి చెందిన గ్లోబల్ సాఫ్ట్వేర్ కంపెనీ. 1996లో శ్రీధర్ వెంబు స్థాపించిన ఈ కంపెనీ సరసమైన సాంకేతికత, డేటా గోప్యత, భారతదేశంలో ఉత్పత్తులను నిర్మించడంలో ప్రసిద్ధి చెందింది. యూఎస్ సుంకాల ఉద్రిక్తతల నేపథ్యంలో అనేకమంది మంత్రులు ఈ దేశీ టెక్కంపెనీని ప్రమోట్చేయడంతో జోహూ కంపెనీ వార్తల్లో నిలిచింది. (చదవండి: Parenting Tips: పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే..? ఐఏఎస్ అధికారిణి పేరెంటింగ్ టిప్స్లు..!) -
భర్త మానసిక క్షోభకు రూ. 37 లక్షలు : ప్రియుడికి భారీ షాకిచ్చిన కోర్టు
ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు, విడాకులు, భరణానికి సంబంధించిన వార్తలు చాలానే వింటున్నాం. సాధారణంగా భార్యకు భర్త భరణం ఇవ్వడం కామన్. కానీ ఒక కేసులో భర్తకు రూ. 37 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కోర్టు భార్య ప్రియుడిని ఆదేశించింది. వివరాలు ఇలా ఉన్నాయి.తైవాన్కు చెందిన వీ (పేరు మార్చబడింది) అనే వ్యక్తి తన భార్య జీ (మారుపేరు) ప్రేమికుడి (యోంగ్)తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న వైనాన్ని గుర్తించాడు. దీంతో తీవ్ర వేదనకు గురయ్యాడు. అక్కడితో ఆగిపోకుండా, వారిపై చట్టపరమైన చర్య తీసుకున్నాడు. తాను అనుభవించిన మానసిక క్షోభ వైవాహిక హక్కుల ఉల్లంఘనకు పరిహారంగా దాదాపు కోటి రూపాయలను డిమాండ్ చేస్తూ కోర్టును ఆశ్రయించాడు.విచారణ సమయంలో వీ మానసిక క్షోభకు గురైనట్లు కనిపించాడని కోర్టు గుర్తించింది. అలాగే వీ కంటే ప్రియుడు యోంగ్ సంపాదన ఎక్కువ అని కూడా గమనించింది. అందుకే మోసపోయిన భర్తకు పరిహారంగా భర్తకు 300,000 యువాన్లు (సుమారు రూ. 37 లక్షలు) చెల్లించాలని తీర్పు చెప్పింది.2000లొ వీ- జీకి పెళ్లైంది. దాదాపు 15 సంవత్సరా సంసారిక జీవితం తరువాత 2022 నుంచి జీ తన కొలిగ్ యోంగ్తో సంబంధం పెట్టుకుంది. జీ,యోంగ్ ఒకేచోట పనిచేస్తారు. యోంగ్ అకౌంటింగ్ డైరెక్టర్గా ఉండగా, జీ ఒక ఉపాధ్యాయురాలిగా ఉంది. అయితే ఏడాది తరువాత 2023 నవంబరులో తన భార్య జీ యోంగ్తో రిలేషన్లో వున్నట్టు ఫోన్ ద్వారా గుర్తించాడు. వారిద్దరి మధ్య మెసేజ్లు కంటపడ్డాయి. ఇద్దరూ తరచుగా హోటళ్లలో కలుసుకోవడం, అక్రమంగా శారీరక సంబంధంలో ఉన్నారని తెలుసుకున్నాడు. అంతేకాదు "భార్యభర్త" లుగానే వ్యవహరిస్తున్నారని కూడా గమనించి షాక్ అయ్యాడు. దీనితో తన ఎమోషన్స్ని హర్ట్ చేశారంటూ యోంగ్ పై దావా వేశాడు. అయితే జీకి పెళ్లి అయిందన్న విషయం తనకు తెలియదంటే బుకాయించాడు యోంగ్. కానీ వీ వాదనలను విశ్వసించిన కోర్టు ప్రియుడికి భారీ షాకే ఇచ్చింది. అయితే అతను డిమాండ్ చేసినట్టుగా కోటి రూపాయలు కాకుండా, రూ. 37 లక్షలు చెల్లించాలని తీర్పు చెప్పింది. మరోవైపు ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునే అవకాశం యోంగ్కి ఇచ్చింది కోర్టు -
వేప చెట్లకు మళ్లీ ఆపద
గుర్రంపోడు: తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలో వేప చెట్లకు మళ్లీ ఆపద ముంచుకొస్తోంది. వేప చెట్లకు నెల రోజులుగా డైబ్యాక్ వ్యాధి వ్యాపిస్తోంది. కొమ్మ లు ఎండుతున్న వేప చెట్లు నల్లగొండ – దేవరకొండ ప్రధాన రహదారి వెంట కనిపిస్తున్నాయి. వేపకు మూడేళ్ల కిత్రం డైబ్యాక్ ఒక్కసారిగా విజృంభించడంతో.. కొమ్మలు ఎండటంతోపాటు చెట్లు కూడా కొన్ని నిలువునా ఎండిపో యాయి. అప్పట్లో శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి ఒక కీటకం కారణమని గుర్తించారు. టీ మస్కిట్ బగ్ శిలీంధ్రంతోపాటు , క్లాడోస్పోరియం అనే శిలీంధ్రాల ద్వితీయ సంక్రమణం ద్వారా వేపకు ఎండుతెగులు సోకుతున్నట్లు అప్పట్లో నిర్ధారించారు. సూర్యాస్తమయం తర్వాత టీ మస్కిట్ బగ్ పురుగులు.. వేపకణజాలంలోని రసాన్ని పీల్చడం ద్వారా ఆకులు, కొమ్మలు ఎండిపోతాయి. వ్యాధి తీవ్రత అధికమై చెట్లు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది. డై బ్యాక్ నివారణకు శాస్త్రవేత్తలు మందులు సూచించినా.. ఎత్తయిన చెట్లకు మందుల పిచికారీ చేసే పరిస్థితి లేదు. చదవండి: 5 నమిషాల్లో జాబ్ కొట్టేసింది.. దెబ్బకి కంపెనీ సీఈవో ఫిదా! -
5 నిమిషాల్లో జాబ్ కొట్టేసింది..దెబ్బకి కంపెనీ సీఈవో ఫిదా!
చదువు అయిన తరువాత ఉద్యోగం రావడం అంత సులువుకాదు. అదీ మన మనసుకు నచ్చిన జాబ్ రావడమంటే జాక్ పాట్ కొట్టినంత ఆనందమే. దీనికి టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు , తెగువ, స్మార్ట్నెస్ కూడా ఉండాలని నిరూపించిందో యువతి. కేవలం అయిదే అయిదు నిమిషాల్లో ఉద్యోగాన్ని సాధించిన యువతి స్టోరీని టెక్ కంపెనీ సీఈవో సోషల్మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈస్టోరీ నెట్టింట హల్చల్ చేస్తోంది.కోడ్ ఆఫ్ అజ్ CEO సాండి స్లోంజ్సాక్ అందించిన వివరాల ప్రకారం కేవలం ఐదు నిమిషాలు మాట్లాడిన తరువాత ఒక కళాశాల విద్యార్థినిని తాను నియమించు కున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మనోధైర్యం, తెలివి, నిజాయితీపై ప్రశంసలు కురిపించారు. "తమ కంపెనీలో ఎలాంటి ఉద్యోగ ఖాళీలు లేకపోయినా ... ఓపెన్ లెటర్ దరఖాస్తు పంపే ధైర్యం ఉంది, తనకు ఏమీ తెలియదని ఒప్పుకోవడమేకాదు, కష్టపడి పని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది" అని చెప్పుకొచ్చారు. ఆమె సూపర్ కమ్యూనికేటివ్, స్ట్రెయిట్ షూటర్. చాలా స్మార్ట్, చాలా వినయంతో ఉంది. జీతం గురించి పట్టించుకోనని తెలిపిందంటూ ట్వీట్ చేశారు. ఖాళీ సమయంలో తన సొంత ప్రాజెక్టులలో పనిచేసిందని చెప్తూ, కృషి అంకితభావాన్ని గురించి చెప్పుకొచ్చారు. ఆమె నిజాయితీ, అభిరుచి, పట్టుదల తనను చాలా ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. మూడు నెలల కనీస వేతనంతో జాబ్ ఆఫర్ చేసి, రేపటినుంచే ఉద్యోగంలో చేరిపోవచ్చని ఆమెకు గుడ్ న్యూస్ చెప్పారు. (హ్యాపీగా ఏసీ కోచ్లో తిష్ట, చూశారా ఈవిడ డబల్ యాక్షన్!)today i hired a college student after just 5 minutes of talking to her1. had the guts to send an open letter application although we had no job openings 2. straight up admitted she knows nothing3. told she’s willing to work as an animal to learn as much as she can4. open…— Sandi Slonjšak (@sandislonjsak) October 8, 2025సోషల్ మీడియా రియాక్షన్సోషల్ మీడియాలో సీఈవో, విద్యార్థిని ఇద్దరిపైనా ప్రశంసలు వెల్లువెత్తాయి.‘నిజమైన రత్నాన్ని గుర్తించారు.. మీ కంపెనీలో నేర్చుకోవాలనే ఆమె ఆసక్తిని ఎలా ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? మీకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉందా? అనే అసక్తిని ప్రదర్శించారు. రిక్రూటర్లు అందరూ మీలా వుండరు సార్ , ఆమెకు ఎంచుకున్నందుకు సంతోషం, ఆమెను మీ ఆధ్వర్యంలో బాగ నైపుణ్యాన్ని సాధిస్తుందని మరొకరు కమెంట్ చేశారు.చదవండి: జస్ట్ 10 లక్షల లోన్తో రూ. 60 లక్షల ఇల్లుకొన్న పనిమనిషి, షాకవ్వకండి! -
పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే..? ఐఏఎస్ అధికారిణి పేరెంటింగ్ టిప్స్
ఈ ఇంటర్నెట్ యుగంలో పిల్లల పెంపకం అనేది ప్రతి తల్లిదండ్రులకు అతిపెద్ద సవాలు. మొబైల్, సోషల్మీడియా వంటి వ్యసనాలకు లోనుకాకుండా జాగ్రత్త పడుతూ..ప్రయోజకులుగా తీర్చిదిద్దడం అంత ఈజీ కానప్పటికీ..అసాధ్యం మాత్రం కాదు. ప్రతి పేరెంట్ తమ పిల్లలు మంచి ఉన్నత స్థాయిలో ఉండాలనే కోరుకుంటారు. దాంతోపాటు మంచి వ్యక్తిత్వం ఉండాలని ఆశిస్తారు. అందుకోసం ప్రతి తల్లిదండ్రులు ఈ ఐఏఎస్ అధికారిణి చెప్పే అద్భుతమైన పాఠాలను తెలుసుకోవాల్సిందే. ప్రతిదీ అందుబాటులో ఉండే ఈ కాలంలో పిల్లలను మంచిగా పెంచడం అనేది ఓ టాస్క్ మాత్రమే కాదు, ఏ మార్గాన్ని అనుసరించాలనేది కూడా గందరగోళమే అంటున్నారామె. తన తల్లి నుంచి నేర్చుకున్న ఆ అమూల్యమైన పాఠాలే తన ఇద్దరి కూతుళ్లను పెంచడానికి ఉపయోగ పడుతున్నాయంటూ 12 పేరెంటింగ్ పాఠాలను చెప్పుకొచ్చారామె. అవేంటంటే..ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్లల్ తన తల్లి ముగ్గురు పిల్లలను పెంచిందని, వారంతా జీవితంలో మంచిగా సెటిల్ అయ్యారని సోషలమీడియా ఎక్స్ పోస్ట్లో చెప్పుకొచ్చారు. ఆ పేరెంటింగ్ పాఠాలనే తాను నేర్చుకున్నానని, అనుసరిస్తున్నాని రాసుకొచ్చారామె పోస్ట్లో. అంతేగాదు సోషల్మీడియా వేదికగా ఇద్దరు కుమార్తెల తల్లిగా తన స్వంత అనుభవాల ఆధారంగా కొన్ని పేరెంటిగ్ సూచనలు కూడా అందించారామె. అవేంటంటే..పిల్లలతో తరచుగా..ఏదైనా సాధించగలవు అని చెప్పండి: తరుచుగా ఇలా అనడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందడమే గాక, క్లిష పరిస్థితుల్లో తట్టుకుని నిలబడేలా చేస్తుంది.పడిపోనివ్వండి లేదా ఓటమిని ఎదుర్కొననివ్వండి: దీనివల్ల తప్పిదాలు తెలుసకోవడమే కాదు, తన కాళ్లపై ఎలా నిలబడాలో తెలుస్తుంది. పొంచి ఉండే ఆపదల నుంచి బయటపడటం ఎలా అనేది కూడా అలవడుతుంది.పోటీ: పోటీ పడటానికి ప్రోత్సహించండి. అది ఆరోగ్యకరమైన విధంగా ఉండాలని చెప్పండి. దాంతో వైఫల్యాలనేవి జీవితంలో భాగం అనేది తెలుస్తుంది. తద్వారా సానుకూలంగా వ్యవహరించడం అలవాటు చేసుకోగలుగుతారురిస్క్ తీసుకోనివ్వండి: సాహసక్రీడల్లో పాల్గొనివ్వండి. గాయపడినప్పుడూ బాధ్యతాయుతంగా ఎలా వ్యవహరించాలో తెలుసుకోగలుగుతారు. మీ ఆలోచనలు రుద్దకండి: మీకున్న ఉన్నని అవకాశాలు పొందలేకపోయామన్న నిరాశను వ్యక్తం చెయ్యొద్దు. అలాగే మీ ఆకాంక్షలను రుద్దొద్దు. ఆదర్శంగా ఉండండి: మొదట మీరు ఆచారించే పిల్లలకు చెప్పాలి. అప్పుడే పేరెంట్స్ మాటపై వారికి విలువ, గురి ఉంటాయి. మీ బిడ్డపై నమ్మకం ఉంచండి: ఆశ అనేది అందిరికి ముఖ్యం. ముందు మనం వారిని నమ్మకపోతే ఇంకెవ్వరు వారి సామర్థ్యాలను నమ్ముతారు. పిల్లలు ఎన్ని ఓటములు ఎదుర్కొంటున్న తల్లిదండ్రులుగా ఏదో ఒకనాడు గెలుపు అందుకుంటాడనే స్ట్రాంగ్ నమ్మకంతో ఉండాలిపోల్చవద్దు: అతి పెద్ద తప్పు పోలిక. మీ పిల్లలను ఎవ్వరితోనూ పోల్చవద్దు. వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి: స్వతహాగా ఎదగడం ముఖ్యం. కాబట్టి వారికి వారికి కొన్ని అనుభవాలను పొందే అవకాశం ఇవ్వాలి. వినండి: పిల్లలు చెప్పే ప్రతీది ఓపికతో వినండి, తద్వారా వారు వినడం అనే అలవాటును అవర్చుకోగలుగుతారు. సురక్షితంగా ఉన్నామనే భరోసా: పిల్లలు ధైర్యంగా ఉండేలా భరోసా ఇవ్వాలి. తమ భావాలను మనసు విప్పి చెప్పుకోగలిగే స్వేచ్ఛ ఇవ్వాలి. ప్రేమపూరిత వాతావరణం కల్పించాలి.పైన చెప్పిన అన్నింటిని మనం పిల్లలకు అందిస్తే..తప్పకుండా ప్రయోజకులు అవ్వుతారని చెప్పుకొచ్చారు ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్. కాగా దివ్య మిట్టల్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ జీవిత పాఠాలపై యువతకు అమూల్యమైన సలహాలు సూచనలు అందిస్తున్నారు. My mother raised 3 kids- all 3 went to IIT, then IIM & doing well in their lives. Based on my own childhood and journey of raising 2 little daughters, some insights on parenting. Please retweet for wider reach. 🧵— Divya Mittal (@divyamittal_IAS) August 23, 2022 (చదవండి: ప్లాస్టిక్ను సరికొత్త రూపంలో చెక్పెడుతున్న అతివలు..!) -
మోసగాళ్లున్నారు..లివ్ఇన్పై జాగ్రత్త..లేదంటే : గవర్నర్ ఆనందీబెన్ హెచ్చరిక
ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఈ తరం అమ్మాయిలకు కీలకమైన సందేశాన్నిచ్చారు. మహిళలపై పెరుగుతున్న హింస కేసులపై ఆందోళన వ్యక్తం చేస్తూ, సామాజిక , వ్యక్తిగత జీవితాల్లో విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమ్మాయిలు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలనీ,ముఖ్యంగా లివ్-ఇన్ రిలేషన్షిప్లు ( (సహజీవనం) , మహిళల అణచివేతకే దారితీస్తాయని, అందుకే అలాంటి పరిస్థితులకు దూరంగా ఉండాలని ఆనందీబెన్ హితవు పలికారు.వారణాసిలోని మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠం 47వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ అయిన గవర్నర్ పటేల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడి విద్యార్థులకు డిగ్రీ పట్టాలు, బంగారు పతకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.చదవండి : జస్ట్ 10 లక్షల లోన్తో రూ. 60 లక్షల ఇల్లుకొన్న పనిమనిషి, షాకవ్వకండి!లివ్-ఇన్ (సహజీవనం) సంబంధాలపై తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలని, మోసగాళ్లను కనిపెట్టి, జాగ్రత్తగా మసలుకోవాలని ఆమె వారికి పిలుపునిచ్చారు. లివ్-ఇన్ రిలేషన్షిప్లు ఈ రోజుల్లో ఒక ట్రెండ్గా మారాయి వాటికి దూరంగా ఉండాలన్న గవర్నర్ , లివ్-ఇన్ రిలేషన్షిప్ల పరిణామాల గురించి తెలుసుకోవానలుకుంటే 15-20 ఏళ్ల బాలికలు ఏడాది వయసున్న పిల్లలతో నిలబడి ఉన్న అనాథాశ్రమాలను చూడాలని తెలిపారు. సహజీవనంలో ఉన్న మహిళలుదారుణంగా ముక్కలు ముక్కలుగా హత్యలకు గురౌతున్న వైనాన్ని ప్రస్తావించారు. వనితలు ఎడ్యుకేషన్పై దృష్టి కేంద్రీకరించాలన్నారు. What is this live-in relationship? Visit an orphanage and see what is live-in relationship: UP Governor Anandiben Patel "I have only one advice for daughters. Someone will approach you for friendship. There is this trend of live-in relationships. What is this live-in… pic.twitter.com/c1SUZ03ejT— Piyush Rai (@Benarasiyaa) October 8, 2025 "విద్య అనేది కేవలం డిగ్రీ కోసం కాదు, జీవితంలో మార్పు కోసం" అన్నారు డిగ్రీలతో పాటు సామాజికజాతీయ బాధ్యతను పెంపొందించు కోవాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు. యువతలో పెరుగుతున్నమాదకద్రవ్యాల దుర్వినియోగంపై ఆనందీబెన్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు పర్యావరణ సమస్యలపై, విద్యార్థులు సేంద్రీయ వ్యవసాయాన్ని అవలంబించాలని, పరిశుభ్రతను మెరుగుపరచాలని మరియు ప్రకృతి వైపరీత్యాల నుండి నష్టాలను తగ్గించడానికి పరిశోధనలు నిర్వహించాలని గవర్నర్ కోరారు.MGKVP వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆనంద్ త్యాగి యూనివర్శిటీ సాధించిన విజయాలను వివరించారు ఈ వేడుకలలో, 25,363 మంది పురుషులు, 45,877 మంది మహిళలు, ట్రాన్స్జెండర్లు సహా 71,243 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. 101 మంది విద్యార్థులకు మొత్తం 103 బంగారు పతకాలను ప్రదానం చేశారు. చందౌలి జిల్లా నుండి ఐదుగురు అంగన్వాడీ కార్యకర్తలను కూడా సత్కరించారు . ఈ సందర్భంగా జరిగిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. -
సంప్రదాయాన్ని పునరుజ్జీవింప చేసేలా ప్లాస్టిక్కి చెక్..!
ప్లాస్టిక్ భూతం అంటూ గగ్గోలు పెడుతున్నారు పర్యావరణ వేత్తలు. అన్నింటిలో ప్లాస్టిక్ ఆవరించేసిందంటూ పెద్ద పెద్ద లెక్చర్లు ఇవ్వడమే తప్ప, నిర్మూలించే దిశగా అడుగులు పడవు. కానీ ఈ మహిళలు..ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుతో ప్లాస్టిక్ని నాటి సంప్రదాయం తిరిగి పురుడుపోసుకునేలా చెక్పెట్టేందుకు నాంది పలికారు. సాదికారతకు బీజం వేసేలా సంప్రదాయం, పర్యావరణ హిత సమ్మిళితంగా సాగిపోతున్న వారి దృఢ సంకల్పానికి హ్యాట్సాఫ్ అని చెప్పాల్సిందే. ఇదంతా చెన్నైలో చోటుచేసుకున్న అద్భుత చైతన్యంగా పేర్కొనవచ్చు. చెన్నై అనగానే మెరీనా బీచ్, ఆవిరి ఫిల్టర్ కాఫీ, పురాతన దేవాలయాలే కాదు..వినూత్న పద్ధతిలో ప్లాస్టిక్కి చెక్పెడుతున్న ఈ మహిళలు కూడా ఇప్పుడు ఠక్కున గుర్తొస్తారు. ఎందుకంటే వీళ్లు చేస్తున్న సాధికారతతో కూడిన పర్యావణ హిత ఉద్యమం యావత్తు దేశాన్ని ఆకర్షించేలా హైలెట్గా నిలిచింది. చేస్తున్న ప్రయత్నం చిన్నదైనా..ప్రభావం మాములుగా లేదు అనిపించుకున్నారు ఈ వనితలు. తమిళనాడు ప్రభుత్వం పర్యావరణ అనుకూల ప్రాజెక్టులో భాగంగా మహిళా సంఘాలకు ఆకుపచ్చని ఎలక్ట్రిక్ ఆటోలు అందించి సాధికారత, సంప్రదాయాన్ని మిళితం చేసేలా పర్యావరణ హితంగా నడిపిస్తోంది. వీరంతా ఆకుపచ్చ మొబైల్ ఆటోల్లో కూరగాయలు అమ్ముకుంటూ జీవనోపాధినే కాదు, పర్యావరణ సంరక్షణ కోసం తమ వంతు తోడ్పాటును అందిస్తూ..ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వాళ్లు ఈ మొబైల్ ఆటోల సాయంతో తాజా కూరగాయలను కస్టమర్లకు చేరవేయడమే కాదు, వాటిని పసుపు పచ్చ బ్యాగుల్లోనే కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. పాతకాలం నాటి పసుపురంగు కాటన్ సంచులకు ప్రాణం పోసి నాటి సంప్రదాయన్ని గుర్తుచేయడమే కాదు..పర్యావరణ సంరక్షణకు బాటలు వేస్తున్నారు. అంతేగాదు కేవలం కూరగాయలు అమ్మడమే కాదు, ఈ ప్లాస్టిక్ భూతం మన జీవితాన్ని ఎలా కబిళిస్తుంది, ఎలా మన జీవితాల్లో స్థిరపడిపోయిందో వివరిస్తూ..ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఈ చెన్నై మహిళలు. ఆకుపచ్చని ఆటోలతో పచ్చదన సంరక్షణ నినాదం తోపాటు తిరిగి ఉపయోగించే ఈ పర్యావరణ హిత పసుపు సంచులనే వాడుదాం అని విషయాన్ని ప్రజల్లోకి బలంగా వెళ్లేలా చేస్తున్నారు. అందుకే ఈ సంచులను తమిళంలో మంజపైస్(మళ్లీ వినియోగించే పసుపు సంచులు) అని పిలుస్తారు. ఇక ఈ ఆటోలు కూడా కాలుష్య రహిత ఎలక్ట్రానిక్ వాహనాలే కావడం విశేషం. మొత్తం ఈ ప్రాజెక్టు కార్యచరణ మొత్త పర్యావరణ సంరక్షణకే పెద్దపీట వేసేలా జాగ్రత్త తీసుకుని స్త్రీ సాధికారతను ప్రోత్సహించి..అందిరిచే ప్రశంలందుకుంది అక్కడి ప్రభుత్వం. ఇది ఒకపక్క జీవనోపాధి, మరోవైపు సాధికారణ, సంప్రదాయ మిళిత పర్యావరణ హితానికి అంకురార్పణ చేయడమే గాక పెనుమార్పుకి నాంది పలికింది కదూ..!. View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) (చదవండి: భారత్ పిలిచింది..! కష్టం అంటే కామ్ అయిపోమని కాదు..) -
జస్ట్ 10 లక్షల లోన్తో రూ. 60 లక్షల ఇల్లుకొన్న పనిమనిషి, షాకవ్వకండి!
సొంతింటి కల అనేది చాలామందికి కలగానే మిగిలిపోతుంది. కానీ కొంతమంది మాత్రం పట్టుదలతో ఆ కలను సాకారం చేసుకుంటారు. దానికోసం ఎంత కష్టమైనా పడతారు. అంతేకాదు తమలాంటి ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తారు. అలాంటి స్ఫూర్దిదాయకమైన స్టోరీ ఒకటి ఇపుడు నెట్టింట విశేషంగా నిలుస్తోంది.పదండి ఆ వివరాలు తెలసుకుందాం.భారతదేశంలో ఇల్లు కొనడం దశాబ్దాల కష్టం దాగి ఉంటుంది. అదీ ఒక మామూలు శ్రామికమహిళకు ఇంకా కష్టం. సూరత్కు చెందిన ఒక ఇంటి పని మనిషి కొత్త చరితను లిఖించింది ఎన్నో అవమానాల్ని, అవహేళల్ని తోసి రాజని సొంతింటి కలను నెరవేర్చుకుంది.సూరత్లో కేవలం రూ. 10 లక్షల రుణంతో రూ. 60 లక్షల 3BHK ఫ్లాట్ను కొనుగోలు చేసింది.ఈ విషయాన్ని ఆమె యజమాని నళిని ఉనగర్ ఈ స్టోరీని ఎక్స్లో పోస్ట్ చేశారు. దీంతో ఇది అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇది తనను చాలా ఆశ్చర్యానికి గురి చేసిందని, చాలా సాధారణంగా తనతో మాట్లాడుతూ సూరత్లో తాను రూ.60 లక్షల అపార్ట్మెంట్ కొన్నానని చెప్పిందని తెలిపింది. అంతే కాదు, ఆమె ఇప్పటికే రూ.4 లక్షలు ఫర్నిచర్ కోసం ఖర్చు చేసిందట ఇందుకోసం ఆమె తీసుకున్న కేవలం రూ.10 లక్షల రుణంతో ఇవన్నీ చేసుకుంది.. దీనికి నిజంగా షాకయ్యాను అంటూ నళిని ట్వీట్ చేసింది. ఇదీ చదవండి: హ్యాపీగా ఏసీ కోచ్లో తిష్ట, చూశారా ఈవిడ డబల్ యాక్షన్!దీనికి ఒక యూజర్ స్పందిస్తూ'మీరు ఎందుకు షాక్ అవుతున్నారు? ఆమె విజయానికి సంతోషించండి!' అన్నదానికి రిప్లై ఇస్తూ 'సంతోషంగా ఉన్నాను. కానీ సమాజంలొ తరచుగా ఇంటి పనిలో ఉన్నవారు పేదోళ్లనే చులకన భావం ఉంటుందనీ, కానీ చాలామంది డబ్బును తెలివిగా మేనేజ్ చేసుకుంటారని పేర్కొన్నారు. అంతేకాదు మరికొందరు కేఫ్లు, గాడ్జెట్లు , ట్రిప్లపై డబ్బు ఖర్చు చేస్తారని ఆమె కామెంట్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది మ్యేజికో,మంత్రమో కాదు, ఆమె ఆర్థిక నిర్వహణకు, తెలివిగా పొదుపు చేసిన వైనానికి నిదర్శనమంటూ ప్రశంసించారు. -
చౌమహల్లా ప్యాలెస్ చూసొద్దాం రండి..!
చార్మినార్: ఆసఫ్ జాహీల రాచరిక పాలనకు అద్దంపట్టే విధంగా ఉన్న పాతనగరంలోని చౌమహల్లా ప్యాలెస్లో 8వ ఆసఫ్ ఝా, మాజీ హైదరాబాద్ నిజాం ముకర్రం ఝా బహదూర్ జయంతిని పురస్కరించుకుని అరుదైన ఛాయా చిత్రాల ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఈ మేరకు ఈ నెల 6న ఈ ఫొటో ఎగ్జిబిషన్ను ఆయన కుమారుడైన 9వ నిజాం అజ్మత్ ఝా బహదూర్ ప్రారంభించగా..7న నుంచి సందర్శకులకు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫొటో ఎగ్జిబిషన్తో పాటు చౌమహల్లా ప్యాలెస్ భవనం, అందులోని నిజాం కాలం నాటి వస్తువులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. View this post on Instagram A post shared by Mustafa Ameen (@asafjahidynasty)యూరోఫియన్ శైలిలో నిర్మించిన శ్వేతసౌధం.. చార్మినార్ కట్టడం నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ఈ చౌమహల్లా ప్యాలెస్ యూరోఫియన్ శైలిలో నిర్మించిన శ్వేతసౌదం. ఇది నాలుగు ప్యాలెస్ల సముదాయం. ఏకాంతం (ఖిల్వత్)గా నిర్మించిన ఈ ప్యాలెస్లో పలు నిర్మాణాలు జరిగాయి. 5వ నిజాం అప్జల్–ఉద్–దౌలా–బహదూర్ పాలనా (1857–69) కాలంలో ఖిల్వత్ ప్యాలెస్లో నాలుగు ప్యాలెస్ల నిర్మాణం జరిగింది. టెహ్రాన్లోని షా ప్యాలెస్ను పోలిన ఆర్కిటెక్చర్లో ఐదో నిజాం అఫ్తాబ్ మహల్, మఫ్తాబ్ మహల్, తహనియత్ మహల్, అప్జల్ మహల్ల నిర్మాణం జరిగింది. 1912లో ఏడో నిజాం ప్యాలెస్కు చేయించిన మరమ్మతులతో ప్యాలెస్ మరింత శోభాయమానంగా మారింది. నిజాం ప్రభువుల నివాస గృహంగా.. ఇది నిజాం ప్రభువుల నివాస గృహంగా ఉండేది. దాదాపు 2.90 లక్షల గజాల విస్తీర్ణంలో విశాలమైన ప్రాంగణంలో నిర్మించబడింది. ఆనాటి కాలంలో విద్యుత్ లైట్లు లేని కారణంగా ప్యాలెస్లో వెలుగుల కోసం షాండిలియర్లను ఏర్పాటుచేశారు. వీటిలో పొగరాని కొవ్వత్తులు, మైనపు ఒత్తులు ఏర్పాటుచేసేవారు. ప్రస్తుతం విద్యుత్ దీపాలు ఉండడంతో షాండిలియర్లు దేదీప్యమానంగా వెలుగుతూ చౌమహల్లా ప్యాలెస్కు మరింత శోభను తీసుకువస్తున్నాయి. 1915లో చౌమహల్లా ప్యాలెస్ ప్రధాన గేట్ వద్ద అతిపెద్ద గడియారాన్ని ఏర్పాటుచేశారు. మ్యూజియంలో చూడదగ్గవి.. ఈ ఛాయా చిత్ర ప్రదర్శనతో పాటు నిజాం కాలంలో వినియోగించిన ఫర్నిచర్, మంచాలు, దుస్తులు, తల్వార్లు, ఫొటోలు తదితర విలువైన పురాతన వస్తువులన్నింటిని చౌమహల్లా ప్యాలెస్లోని నాలుగు ప్యాలెస్లలో భద్రపరిచారు. ప్రస్తుతం నిజాం ట్రస్ట్ పర్యవేక్షణలో చౌమహల్లా ప్యాలెస్ కొనసాగుతోంది. ఎక్కడ: యూరోపియన్ శైలిలో అత్యంత ఆకర్షణీయంగా పాలరాతి వలే నిర్మితమైన చౌమహల్లా ప్యాలెస్ చార్మినార్ కట్టడానికి దగ్గరలోని ఖిల్వత్లో ఉంది. ఎలా వెళ్లాలి: చార్మినార్ కట్టడం నుంచి లాడ్బజార్, ఖిల్వత్ చౌరస్తా ద్వారా ముందుకెళితే చౌమహల్లా ప్యాలెస్ భవనం కనిపిస్తుంది. ఇదీ చదవండి: హ్యాపీగా ఏసీ కోచ్లో తిష్ట, చూశారా ఈవిడ డబల్ యాక్షన్! -
లైవ్ కిచెన్..! నేరుగా వీక్షిస్తూ..ఆస్వాదించేలా..
భాగ్యనగర వాసులకు నాలుగు రకాల ప్రత్యేక వంటకాలను రుచి చూసే అవకాశం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని ‘4–నోట్’ రెస్టారెంట్ను ప్రారంభించారు. ఇది లైవ్ కిచెన్స్ థియేటర్గా రూపొందించిన సరికొత్త రెస్టారెంట్. అతిథులు రెస్టారెంట్ లోపల లేదా బయట కూర్చొని ప్రతి షో కిచెన్ నుంచి వంటకాలను ఆర్డర్ చేసుకొని, వైవిధ్య భరిత రుచుల అనుభవాన్ని పొందే సౌకర్యాన్ని ఈ రెస్టారెంట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ 4–నోట్లో ఒకే స్థలంలో నాలుగు ప్రత్యేక కిచెన్స్కు అతిథ్యమిచ్చేలా రూపొందించారు. ముఖ్యంగా నార్త్ ఇండియన్, ఓరియంటల్, తెలుగు రుచులు, యూరోపియన్ వంటకాలను, అతిథులు లైవ్ కిచెన్ ప్రదర్శనలను ఆస్వాదించే అవకాశం కల్పిస్తున్నారు. ప్రతి వంటకం వారి ముందు తయారయ్యేలా ఏర్పాట్లు చేశారు. దీనివల్ల ఆహార ప్రియులు ఉత్సాహంగా, ఆనందంగా, ఓ అద్భుతమైన థియేటర్ అనుభవంగా మారనుంది. ఈ కార్యక్రమంలో హయత్ హైదరాబాద్ మేనేజర్ క్రిసెల్లె ఫెర్నాండేజ్, ఎగ్జిక్యూటివ్ చెఫ్ అలోక్, అసోసియేట్స్ డైరెక్టర్ మిచెల్ ఎవాన్స్, డైరెక్టర్ ఆఫ్ సేల్స్ శ్రావణ్బతినా పాల్గొన్నారు. మరచిపోలేని అనుభవం కోసం.. 4–నోట్ కేవలం రెస్టారెంట్ మాత్రమే కాదు. ఇది లైవ్ కిచెన్. క్యూరేటెడ్ ఫుడ్తో ఆతీ్మయ అనుభూతి కలిగిస్తుంది. ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్లో 4–నోట్ తన ప్రత్యేకతను చాటుకోనుంది. ప్రపంచ స్థాయి, హైదరాబాద్ అతిథులను అలరించేలా, మెప్పించేలా వైవిధ్యమైన రుచులను ఈ లైవ్ కిచెన్ థియేటర్ అందిస్తుంది. – పియుష్శర్మ, హయత్ హైదరాబాద్ ఫుడ్ అండ్ బివరేజ్ డైరెక్టర్ (చదవండి: స్వచ్ఛందంగా ఇలా ప్రయత్నిస్తే..స్వచ్ఛ భారత్ సక్సెస్ అయినట్లే..)