breaking news
Family
-
National Doctors day ముప్పు డప్పు కొట్టినా తప్పులు ఆగవా!
జీవితం ఒక సినిమా అయితే... దేవుడు రాసిన స్క్రిప్ట్ను కూడా మార్చి రాయగల రైటర్లు డాక్టర్లు. జీవితం ఒక మూవీ అయితే... పేషెంట్కు లైఫ్కో కొత్త డైరెక్షనిచ్చి హిట్ చేయగల టాప్ డైరెక్టర్లు డాక్టర్లు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... జీవితం... సినిమా కంటే విచిత్రమైనది. దాంట్లో లవ్, మదర్ సెంటిమెంట్, స్టడీస్లో సక్సెస్తో కెమెరా టిల్ట్ చేసి తలెత్తి పైకి చూడాల్సినంత అడ్మిరేషన్, ఎదురుగా మృత్యువు నిలబడ్డా చిరునవ్వుతో ఎదుర్కొనేంత హీరోయిక్ కరేజ్, హెల్మెట్లు లేకపోవడంతో జరిగే అనర్థాల స్టంట్స్... ఇలా ఎన్నో... ఎన్నెన్నో!! ఇన్ని ఎమోషన్స్ను మనతో పంచుకున్నారు నిష్ణాతులూ, లబ్ధప్రతిష్ఠులైన కొందరు డాక్టర్లు... నేడు డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ అనిరుథ్ కె. పురోహిత్ మాటల్లోనే...అదో అందమైన చలికాలపు ఉదయపు వేళ. కానీ ఆ ఆహ్లాదకరమైన ప్రాంతఃకాలం... శేఖర్ పాలిట రాబోయే రాత్రికి కాబోయే కాళరాత్రికి నాందీ సమయం. కారణం... ఆరోజు శేఖర్ చేసిన రెండు తప్పులు. మొదటి తప్పు హెల్మెట్ ధరించకపోవడమైతే... రెండోది స్పీడ్ బ్రేకర్ దగ్గర కూడా ఏమాత్రం స్లో చేయకపోవడం. దాంతో బండి మీది నుంచి పడి తలకు గాయంతో ఐసీయూలో బెడ్పై అచేతనంగా పడి ఉన్నాడు. శేఖర్ గురించి అతడి అన్న శ్రీధర్ చాలా బాధపడుతూ ఉండేవాడు. బహుశా శ్రీధర్కు 35 ఏళ్లూ, అతడి తమ్ముడు శేఖర్కు 30 ఏళ్లు ఉంటాయేమో. ప్రతిరోజూ కళ్ల నిండా నీళ్లతో, జోడించిన చేతులతో నా దగ్గరికి వచ్చి తమ్ముడి పరిస్థితి వాకబు చేస్తూ ఉండేవాడు. ‘‘ఎంత ఖర్చైనా పర్లేదు డాక్టర్. నా తమ్ముడు బాగైతే చాలు’’ అనేవాడు. అంతటి దయ, గుండెనిండా ఆర్ద్రత ఉన్న ఆ అన్నను చూస్తే ఓ పక్క ఆనందం... మరో పక్క అతడి పరిస్థితికి బాధా ఉండేవి. ‘‘మీవాడుగానీ ఆ రోజు హెల్మెట్ పెట్టుకుని ఉంటే... ఇవ్వాళ ఈ పరిస్థితి వచ్చేదే కాదు’’ అంటూ ఉండేవాణ్ణి. ఒకరోజు పొద్దున్నే నేను నా కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నా. పక్క సందులోంచి ఒక వ్యక్తి తన బైక్ను చాలా రాష్గా డ్రైవ్ చేస్తూ ప్రధాన రోడ్డు మీదికి వస్తున్నాడు. ఎక్కడా స్లో చేయడమన్న మాటే లేదు. మెయిన్ రోడ్డులో వస్తున్న నేను వెంటనే నా కార్ను స్లో చేస్తూ... అతడు నన్ను గుద్దుకోకుండా నా కార్ను చాలా పక్కకు తీశా. ఒకవేళ నేనలా చేయకపోతే నన్నతడు తప్పక ఢీకొని ఉండేవాడు. తీరా చూస్తే అతడి బైక్ హ్యాండిల్ మీద హెల్మెట్ కూడా ఉంది. పరిశీలనగా చూస్తే అతడు మరెవరో కాదు... మా హాస్పిటల్ బెడ్ మీద యాక్సిడెంట్ అయి పడుకుని ఉన్న పేషెంట్ వాళ్ల అన్నే. కాస్తయితే ‘‘అదే బెడ్ పక్కన ఇతడూ తమ్ముడికి కంపెనీ ఇస్తూ పడుకునేవాడు కదా’’ అనిపించింది. మరో మాట అనిపించింది. తన సొంత తమ్ముడు చేసిన రెండు తప్పుల నుంచి ఏమీ గ్రహించకుండా శేఖర్ వాళ్ల అన్న శ్రీధర్ చేసింది మూడో తప్పు. అలాంటి యాక్సిడెంట్లో చనిపోయిన ఓ వ్యక్తి తాలూకు అంతిమ సంస్కారాల్లో పాల్గొన్న మర్నాడే ఈ ఘటన జరగడంతో నాకీ విషయం స్ఫురణకు వచ్చింది. నన్ను మనసులో తొలిచేస్తున్న విషయమేమిటో తెలుసా... ‘‘ఇన్ని సంఘటనలు జరిగాక... జరుగుతున్న సంఘటనలను చూశాక... తమ ఇంట్లో కూడా ఇలాంటి విషాదాలు చోటు చేసుకున్న తర్వాత కూడా వీళ్లు మారరా’’ అంటూ బాధేసింది. నా అనుభవంలో చూసిన ఘటనలూ, ఆ టైమ్లో వచ్చే ఆలోచనలే నన్ను ఈ నాలుగు మాటలు రాసేలా పురిగొల్పాయి. డాక్టర్ అనిరుథ్ కె. పురోహిత్ సీనియర్ కన్సల్టెంట్న్యూరో – స్పైన్ సర్జన్,ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్-యాసిన్ -
కూతురి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని తండ్రి సాహసం, వైరల్ వీడియో
బిడ్డ ప్రాణాలు ప్రమాదంలో పడితే..ఏ తండ్రి అయినా చూస్తూ ఉరుకుంటాడా..? తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ముందుకు దూకేస్తాడు. సరిగ్గా అదే చేశాడో తండ్రి. తన కళ్లముందే బిడ్డ సముద్రంలో పడిపోవడాన్ని చూసి క్షణం ఆలోచించకుండా దూకేసాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట విశేషంగా నిలుస్తోంది. డిస్నీ క్రూయిజ్ షిప్ లోని 4వ డెక్ నుంచి ఒక పాప పొరపాటున జారి పడబోయింది. ఇది చూసిన తండ్రి క్షణం ఆలోచించుండా ఆమెను కాపాడటానికి సముద్రంలోకి దూకాడు. జూన్ 29న బహామాస్ - ఫోర్ట్ లాడర్డేల్ మధ్య ఓడ ప్రయాణంలో ఈ సంఘటన జరిగింది. బహామాస్ చుట్టూ నాలుగు రాత్రుల షిప్లో గడిపిన తరువాత ఓడ ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్డేల్కు తిరిగి వస్తోంది. చదవండి: కొడుకు స్నేహితుడితో పెళ్లి, త్వరలో బిడ్డ : వ్యాపారవేత్త లవ్ స్టోరీ వైరల్"ఓడ వేగంగా కదులుతోంది. సముద్రపు హోరును, నీటి మెరుపులను చూస్తూ ప్రయాణికులుఎంజాయ్ చేస్తున్నారు. తన అయిదేళ్ల కమార్తెకు తండ్రి రైలింగ్ దగ్గర ఫోటో తీస్తున్నాడు. ఇంతలోనే ఆ పాప పడిపోయింది. వెంటనే తండ్రి కూడా దూకేశాడు. దీంతో ఓడ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. కెప్టెన్ వెంటనే ఓడను స్లో చేశాడు. ఇంతలో క్రూ సభ్యులు లైఫ్సేవర్లను నీటిలోకి విసిరారు. క్రూయిజ్ షిప్ నుంచి రెస్క్యూ బోట్ ద్వారా తండ్రీ కూతుళ్లను రక్షించారు. ఇది కళ్లప్పగించి చూస్తున్న ప్రయాణికులు బిగ్గరగా హర్షధ్వానాలు చేశారు. అటు ప్రయాణీకులు, ఇటు డిస్నీ సిబ్బంది తండ్రి ధైర్యాన్ని ప్రశంసించారు.హీరో అంటూ నెటిజనులు కూడా తండ్రిని అభినందనల్లో ముంచెత్తారు. ఈ సంఘటనను రికార్డ్ చేసిన ట్రేసీ రాబిన్సన్-హ్యూస్, "బిడ్డను కాపాడటానికి దూకిన ఒక హీరో’’ అంటూ ప్రశంసించారు. దీనికి సంబంధించిన వీడియో ఎక్స్లో వైరల్గా మారింది. NEW: Father jumps overboard to save his 5-year-old daughter, who fell off a Disney cruise ship from the 4th deck into the ocean.The ship was heading back to South Florida when the intense rescue was made."The ship was moving quickly, so quickly, it's crazy how quickly the… pic.twitter.com/PTGmAzZJ7O— Collin Rugg (@CollinRugg) June 30, 2025మరోవైపు డిస్నీ క్రూయిజ్ లైన్ తమ సిబ్బంది స్పందించిన తీరు, ప్రయాణీకులను రక్షించిన తీరును ప్రశంసిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. సోమవారం తెల్లవారుజామున ఆ ఓడ సురక్షితంగా పోర్ట్ ఎవర్గ్లేడ్స్కు తిరిగి వచ్చింది.ఇదీ చదవండి: 5 వేల కిలోమీటర్ల దూరంనుంచి రెండుగంటల్లో సర్జరీ : విప్లవాత్మక అడుగు -
అందం ముఖ్యమే.. కానీ, ఆ బలహీనతకు లొంగిపోకూడదు!
కాంటా లగా గర్ల్ షెఫాలీ జరీవాలా (Shefali Jariwala) ఆకస్మిక మరణం రకరకాల చర్చలకు తెరలేపింది. యాంటీ-ఏజింగ్ ఇంజెక్షన్ల కారణంగా గుండెపోటు వచ్చి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో గ్లామర్ ప్రపంచంలో విపరీత పోకడలపై విమర్శలు వెల్లువెత్తాయి. సెలబ్రిటీలు, యువత అందం, నాజుకుతనంపై ఫోకస్ పెట్టి ప్రాణాలు పణంగా పెడుతున్నారనే వాదన తెరపైకి వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో ఈ అంశం హాట్టాపిక్ మారిపోయింది. ప్రస్తుతం ఈ విషయంపై నటి ఖుష్బూ సుందర్ కూడా స్పందించారు. యువత, యువ నటీనటులు ఎదుర్కొంటున్న ఆందోళనల గురించి నటి ఖష్బూ ప్రధానంగా ప్రస్తావించారు. ప్రస్తుతం అందరూ గ్లామర్కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇది మంచి విషయమై అయినప్పటికీ కొన్ని విషయాలను గుర్తించుకోవాలంటూ అందానికి సంబంధించిన అమూల్యమైన సలహాలు సూచనలు అందించారామె. అవేంటంటే.. ఇది గ్లామర్ ఫీల్డ్కు పరిమితమైన సమస్య మాత్రమే కాదని.. సాధారణ యువతీయుకులు కూడా బాహ్య అందం అనే ఉచ్చులో పడిపోతున్నారని అన్నారామె. ‘‘ఏం చేస్తున్నారో..ఎలాంటి చికిత్సలు తీసుకుంటున్నాం అనే దానిపై పెద్దగా ఫోకస్ లేదు, ఆరోగ్యంపై జాగ్రత్త కూడా లేదని మండిపడ్డారు. ముఖ్యంగా తమ అందం తరిగిపోతే ఐడెంటిటీ ఎక్కడ కనుమరుగైపోతుందో అనే ఫోమో( FOMO) భయంతో చేసే తప్పులే ఇవి’’.. ముఖ్యంగా సోషల్ మీడియా కూడా మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలో డిసైడ్ చేసేస్తోందన్నారు. దాన్ని ఎప్పుడైతే వాటిని మనం సీరియస్ తీసుకుంటామో అప్పుడే సమస్యల వలయంలో చిక్కుకుంటామని అంటున్నారు ఖుష్బూ. ముందుగా బయటి ప్రపంచం నుంచి వచ్చే ఒత్తిళ్లను సమర్థవంతంగా నిర్వహించడం నేర్చుకోవాలి. సోషల్మీడియాలో యాక్టివ్గా ఉండటం ముఖ్యమే..ఎంత వరకు తీసుకోవాలి అనేది మనపైనే ఆధారపడి ఉంది. అంతేగాదు మనం ఎలా ఉండాలన్నది మనం నిర్ణయించుకోవలే గానీ ఎదుటి వారి మాటలకు, కామెంట్లకు తలొగ్గే బలహీనతకు లొంగిపోకూడదని చెబుతున్నారు. "ఇది మన జీవితం మనకు నచ్చినట్లుగా ఉండాలే గానీ..ఎవ్వరో నిర్ణయించినట్లు కాదనేది గుర్తరెగాలి. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే ఏజ్తోపాటు వచ్చే వృద్ధాప్యాని ఆనందంగా ఆహ్వానించగలుగుతారు. దాన్ని కూడా అందంగా ఆరోగ్యవంతంగా నిర్వహించగలుగుతారు " అని చెబతున్నారామె. బాలనటిగా సినీ ప్రపంచంలోకి వచ్చిన తకు ఇలాంటి ఒత్తిళ్లు లేవని, ఇండస్ట్రీలో సహృద్భావంతో కూడిన వాతావరణం ఉండేదని అన్నారు. తాము ఆరోజుల్లో బయటకు ఏ డ్రెస్స్లో అయినా ధైర్యంగా వెళ్లేవాళ్లం. ఎందుకంటే అప్పుడు ఇలాంటి ఇన్స్టా, ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాల ట్రోలింగ్ భయం లేదు. సినిమాలో దర్శకుడి చెప్పినట్లుగా నడుచుకున్నా..బయట మాకు నచ్చిన శైలిలో బతకగలిగే స్వేచ్ఛ మాకుంది. నేటి యువ హీరో హీరోయిన్లకు, యుతకు ఆ అవకాశం లేకుండా పోవడం దురదృష్టకరం అన్నారు. అంతెందుకు నా పిల్లలు ఫేస్బుక్లో, ఇన్స్టాలో ఎలాంటి ట్రోలింగ్ బారినపడ్డారో తెలుసు. ఎందుకంటే వాళ్లు బాగా పొడుగ్గా ఉండటంతో.. ఖుష్బూ కూతుళ్లు ఇలా ఉండటం ఏంటని అనే మాటలు చాలా బాధించాయంటూ ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని కూడా షేర్ చేసుకున్నారు. తల్లిగా వాళ్ల బాగా పొడుగ్గా ఉండటం నన్ను ఇబ్బందిపెట్టలేదు కానీ, బయటి నుంచి వాళ్ల ఎదుర్కొన్న ఒత్తిడిని తాఉ చాలా దగ్గరగా చూశానన్నారు. అయితే తన పిల్లలకు దాన్ని ఎలా అధిగమించాలో కూడా నేర్పానని అన్నారు. ముందు మనం స్ట్రాంగ్ ఉంటే పిల్లలు కూడా అలాంటి వాటిని ధైర్యంగా ఫేస్ చేస్తాని అన్నారు. అలాగే తనకు ప్రత్యేక మేకప్ ఆర్టిస్ట్ గానీ, డిజైనర్ గానీ లేరని, అవన్నీ తానే స్వయంగా చేసుకుంటానని అన్నారామె. యాంటీ-ఏజింగ్ చికిత్సలు మంచివేనా..వృద్ధాప్య వ్యతిరేక చికిత్సలు మంచివనే అంటోంది ఖుష్బూ. ఎందుకంటే ఎప్పటికీ 20 ఏళ్లలా కనిపించేలా ఎలాంటి మ్యాజిక్ ఉండదని గుర్తించుకోండని అంటున్నారామె. మన శరీరంలో వయసు రీత్యా వచ్చే మార్పులను అంగీకరించండి, అందంగా ఉండేలా ప్రయత్నించండి అని పిలుపునిస్తున్నారు. అయితే అది ఎంత వరకు అనేదానిపై నియంత్రణ ఉండాలంటున్నారు. ఏదైనా ప్రారంభించండి..కానీ దాన్ని ఎక్కడ ఆపాలో కూడా కచ్చితంగా తెలియాలి అని చెబుతున్నారామె. తాను కూడా వృద్ధాప్య వయసులోకి వచ్చానని, కానీ దాన్ని తాను అందంగా నిర్వహిస్తున్నా అని అన్నారు. "తన ముఖంపై ముడతలు ఉన్నాయి, కళ్లకు కళ్లజోడు పెట్టుకోవాల్సి వచ్చింది..అయితే వాటన్నింటిని స్టైలిష్గా నిర్వహిస్తున్నా. అందుకోసం రెగ్యులర్ షేషియల్స్ చేయించుకుంటా..స్కిన్ బాగుండేలా చూస్తా..అలా అని మితీమీరిన బ్యూటీ చికిత్సల జోలికి వెళ్లిపోను. ఎందుకంటే ఎక్కడ ఆపాలి అన్నదానిపై క్లారిటీ ఉంది" అని నొక్కి చెబుతున్నారు ఖష్బూ. అలాగే బాహ్య అందం తోపాటు..లోపాల అంతర్గతంగా కూడా బాగుండాలని చెప్పారామె. బయటన ఎంత అందంగా ఉన్నా..లోపాల అంతర్గత శరీరం అనారోగ్యం పాలుకాకుండా రెగ్యులర్ హెల్త్ చెకప్లు చేయించుకోవాలని సూచించారామె. అమ్మాయిలంతా మిస్ అయ్యేది ఇక్కడేనని, బాహ్య రూపం కంటే.. అంతర్గత ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి అని పిలుపు ఇచ్చారామె. (చదవండి: గుండె తరుక్కుపోయే ఘటన..! మూడేళ్లుగా అపార్ట్మెంట్లో ఒంటరిగా..) -
5 వేల కిలోమీటర్ల దూరం నుంచి రెండుగంటల్లో సర్జరీ : విప్లవాత్మక అడుగు
చైనా వైద్యులు వైద్యచరిత్రలో విప్లవాత్మకమైన పురోగతి సాధించారు. ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 5,000 కిలోమీటర్ల దూరం నుండి రిమోట్ రోబోటిక్ ఆపరేషన్ నిర్వహించి రికార్డు సృష్టించారు. శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా ఇలా శస్త్రచికిత్స చేయడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. టిబెట్లోని లాసాలో ఉన్న వైద్య బృందం బీజింగ్లోని 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇద్దరు రోగులకు రోబోటిక్ సాయంతో కాలేయ శస్త్రచికిత్స నిర్వహించింది. PLA జనరల్ హాస్పిటల్కు చెందిన ప్రొఫెసర్ రోంగ్ లియు నేతృత్వంలో కాలేయ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఉపగ్రహ కమ్యూనికేషన్ను ఉపయోగించి ఇప్పటివరకు నిర్వహించిన అతి పొడవైన దూర శస్త్రచికిత్సగా నిలిచింది.Apstar-6D ఉపగ్రహం ద్వారా 68 ఏళ్ల కాలేయ కేన్సర్ రోగి, 56 ఏళ్ల హెపాటిక్ హెమాంగియోమాకు ఈ రెండు శస్త్రచికిత్సలు నిర్వహించారు. కేవలం 125 నిమిషాల్లో బ్లడ్ లాస్ లేకుండా చేయడమే కాదు, 24 గంటల్లో రోగులు పూర్తిగా కోలుకోవడం విశేషం. ఉపగ్రహ శస్త్రచికిత్స, సిద్ధాంతపరంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ, సిగ్నల్ ఆలస్యం కారణంగా సవాళ్లను ఎదుర్కొంది. వీటిని అధిగమించడానికి, ప్రొఫెసర్ లియు బృందం మూడు ప్రధాన ఆవిష్కరణలను ప్రవేశపెట్టింది: 632 ms జాప్యంలో కూడా రోబోటిక్ హ్యాండ్ లోపాన్ని 0.32 mmకి పరిమితం చేసేలా న్యూరాల్ నెట్వర్క్ను వినియోగించింది. అలాగే ఉపగ్రహం విఫలమైతే తక్షణమే 5G బ్యాకప్కు మారే ద్వంద్వ-లింక్ వ్యవస్థను, HD ఇమేజింగ్ను కొనసాగిస్తూనే, డేటా లోడ్ను 62శాతం తగ్గించేందుకు డైనమిక్ బ్యాండ్విడ్త్ కేటాయింపును వాడింది.ఇదీ చదవండి: కొడుకు స్నేహితుడితో పెళ్లి, త్వరలో బిడ్డ : వ్యాపారవేత్త లవ్ స్టోరీ వైరల్రిమోట్,విపత్తు ప్రభావిత ప్రాంతాలకు అధునాతన శస్త్రచికిత్స సేవలు అందించడంలో ఇది కీలక మలుపు అని ప్రొఫెసర్ లియూ చెప్పారు. ముఖ్యంగా వైద్యులు సకాలంలో చేరుకోలేని వార్ జోన్స్, ప్రకృతి వైపరీత్యాలలో క్లిష్టమైన రెస్క్యూ మిషన్లకు ఇది చక్కటి పరిష్కారం అన్నారు. చైనా ఇప్పుడు ఉపగ్రహ సాంకేతికతో చేసే ఆపరేషన్ల మోడల్ను విస్తృత జాతీయ ఆరోగ్య సంరక్షణ వ్యూహాలలో చేర్చాలని యోచిస్తోంది. ఇది అంతరిక్ష ఆధారిత వైద్యం విషయంలో కొత్త యుగానికి నాంది పలికిందని నిపుణులు పేర్కొంటున్నారు.చదవండి: 900 గంటలు, 180 బటన్స్ : ఆమె స్పెషల్ వెడ్డింగ్ గౌను విశేషాలు -
నావనెక్కి.. 'నేవీకి చేరి'..!
చిన్ననాటి విషాదాలను, పేదరికాన్ని జయించి సెయిలింగ్లో అద్భుత ప్రతిభను కనబరిచిన ముగ్గురు తెలుగు యువకులు భారత నౌకాదళంలోని స్పోర్ట్స్ కంపెనీలో చేరనున్నారు. ఈ ముగ్గురు నవీన్, సాత్విక్ ధోకి, రిజ్వాన్ మహమ్మద్.. వారి జీవితం ఎలా ఉన్నా అద్భుతమైన సెయిలింగ్ ప్రతిభతో భవిష్యత్ ప్రయాణాన్ని సుగమం చేసుకున్నారు. ఈ యువ హైదరాబాదీ సెయిలర్లు గోవాలోని నేవీ యూత్ స్పోర్ట్స్ కంపెనీ (ఎంవైఎస్సీ)కి ఎంపికయ్యారు. తార హోమ్ నుంచి యువ తారగా.. ప్రకాశం జిల్లాలోని లక్ష్మప్ప గ్రామానికి చెందినవాడు 13 సంవత్సరాల నవీన్. ఆరేళ్ల వయసులో తల్లిదండ్రులను కోల్పోయి, తప్పిపోయి నగరంలోని సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు దొరికాడు. అక్కడి నుంచి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా తార హోమ్ అనే అనాథ శరణాలయానికి చేరుకున్నాడు. ఇలాంటి దయనీయమైన గతం నుంచి ఈ తరం యువతకు స్ఫూర్తి నింపేలా తను భవిష్యత్తును రూపుదిద్దుకున్నాడు. జాతీయ స్థాయి మేటి సెయిలర్గా.. 15 ఏళ్ల రిజ్వాన్ మహమ్మద్ ప్రస్తుతం దేశంలోనే నెం.1 సెయిలర్గా ఉన్నాడు. హైదరాబాద్లోని పాట్టిగడ్డ ప్రాంతంలో ఒక చిన్న గుడిసెలో నివసించే రిజ్వాన్ ఏడేళ్ల వయసులో తండ్రిని కోల్పోయాడు. అతని తల్లి యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్లో వంట మనిషిగా పనిచేస్తుంది. కాసింత ప్రోత్సాహం అందితే చాలు అనుకునే పరిస్థితి నుంచి జాతీయ స్థాయిలో అత్యుత్తమ సెయిలర్గా మారడంలో తన కృషి, నిబద్ధత, అంకితభావం ఎలాంటిదో ఊహించవచ్చు. కూలీ కుటుంబం.. వరంగల్ జిల్లాలోని ఎర్రవల్లి గ్రామం నుంచి వలస వచ్చిన కుటుంబానికి చెందినవాడు 14 సంవత్సరాల సాత్విక్. అతని తండ్రి హైదరాబాద్ మోండా మార్కెట్లో కూలీగా, తల్లి ఓ ఇంటి పనిమనిషిగా కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇలాంటి కుటుంబం నుంచి వచ్చిన సాత్విక్ భారత నౌకాదళంలో చేరనుండటం తనకే కాదు తన కుటుంబానికి సైతం గర్వకారణం. నేనున్నాననీ..ఈ ముగ్గురు యువకుల ప్రస్థానంలో యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ (వైసీహెచ్) కీలక పాత్ర పోషించింది. ఆరేళ్ల నవీన్ తప్పిపోయి అనాథ శరణాలయం ‘తార హోమ్’కు చేరుకున్న సమయంలో.. వైసీహెచ్ అతన్ని గుర్తించి సెయిలింగ్ శిక్షణ కోసం ఎంపిక చేసింది. నవీన్ లాగే, పేద కుటుంబాల నుంచి వచ్చిన సాత్విక్, రిజ్వాన్ కూడా వైసీహెచ్ మార్గ దర్శకత్వంలోనే శిక్షణ పొందారు. కోచ్ సుహీమ్ షేక్ పర్యవేక్షణలో ఈ యువకులు సెయిలింగ్లో కఠోర శిక్షణ తీసుకున్నారు. అంకితభావం, పట్టుదల జాతీయ స్థాయి పోటీల్లో ఉన్నత స్థానాలకు చేర్చాయి. రిజ్వాన్ మహమ్మద్ అయితే స్థిరంగా పతకాలను సాధిస్తూ, అంతర్జాతీయ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఈ యువకుల అసాధారణ ప్రతిభ, క్రీడా స్ఫూర్తిని గుర్తించిన నేవీ యూత్ స్పోర్ట్స్ కంపెనీ, వారిని తమ జట్టులోకి తీసుకుంది. (చదవండి: గుండె తరుక్కుపోయే ఘటన..! మూడేళ్లుగా అపార్ట్మెంట్లో ఒంటరిగా..) -
ఒత్తిడి లేని జీవితం కావాలంటే.. ఇదే సీక్రెట్!
ఈ భూమి మీదకు వచ్చేటప్పుడు ఏ జీవిౖయెనా ఏమీ తీసుకురాదు. మృతి చెందినప్పుడూ తనతో ఏదీ తీసుకుపోదు. ఈ ఎరుక ఒక్కటే మనిషికి ఒత్తిడిలేని జీవితాన్ని అందిస్తుంది. ఈ చిన్న కథ ద్వారా ఈ వాస్తవం బోధపడుతుంది. ఒకానొక రోజు, ఓ ధనవంతుడు తన ఇంటి బాల్కనీలో పడక్కుర్చీలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. కాస్సేపటికి అతను ఒక చిన్న చీమ తన ఆకారం కన్నా కొన్ని రెట్లు ఎక్కువ పెద్దదైన ఓ ఆకును తీసుకుపోవటం చూశాడు.ఇంతలో ఓ చోట ఒక పగులు కనిపించింది. అక్కడ ఆ చీమ ఎలా పోతుందా అని ఆసక్తిగా చూశాడు. పగులు దగ్గరకు రావడంతోనే చీమ అక్కడ ఆకును అడ్డంగా ఉంచి దానిపైకి ఎక్కి అవతలకు దాటింది. అనంతరం ఆ ఆకును ముందుకు లాగింది. మొత్తం మీద చీమ ఇలా మరిన్ని అడ్డంకులను దాటుకుంటూ విజయవంతంగా ముందుకు సాగింది. చీమ చివరకు దాని గమ్యస్థానమైన పుట్ట వద్దకు చేరుకుంది. తన పుట్ట ముందర ప్రవేశ ద్వారంగా ఓ రంధ్రం ఉంది. ఆ రంధ్రంలోకి తాను వెళ్ళడానికి వీలుంది తప్ప తానింత దూరమూ తీసుకొచ్చిన ఆకుని పుట్టలోకి తీసుకుపోయే వీలు లేదు. అది తెలీని చీమ ఎంత ప్రయత్నించినా ఆకుతో సహా రంధ్రంలోకి వెళ్లడానికి నానా తిప్పలూ పడింది. చివరకు చేయగలిగిందేమీ లేక ఆకును ప్రవేశద్వారం దగ్గరే విడిచిపెట్టి లోపలికి వెళ్లింది.ఇదీ చదవండి: యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లతో ముప్పు ; షెఫాలీ ప్రాణం తీసింది అవేనా?ఒక వ్యక్తి చాలా కష్టపడి తన జీవితంలో ఎన్నెన్నో సమకూర్చుకుంటాడు. ఇబ్బందులు అధిగమించి సౌకర్యాలను పొందుతాడు. బోల్డన్ని ఆస్తిపాస్తులను పోగేసుకుంటాడు. తాను జీవించడానికి అవసరమైనవాటికన్నా ఎక్కువే పోగుచేసి సంతోషపడిపోతూ ఉంటాడు. చివరికి, అతను మరణించేటప్పుడు తనదంటూ ఏదీ తీసుకుపోలేడు. ఈ సంపదలేవీ తనతో రావని తెలిసీ మనిషి చివరి వరకూ అవసరం లేకపోయినా సంపాదించడానికే ప్రయత్నిస్తాడు. కానీ, రిక్త హస్తాలతో చీమ పుట్టలోకి వెళ్లినట్లే... మనిషీ మరణం ఒడిలోకి జారుకుంటాడు. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవడమే జ్ఞానం! ఈ జ్ఞానమే ఇహలోకంలో మనిషికి ప్రశాంతతను ప్రసాదిస్తుంది. – యామిజాల జగదీశ్ -
గుండె తరుక్కుపోయే ఘటన..! మూడేళ్లుగా అపార్ట్మెంట్లో ఒంటరిగా..
కొన్ని ఘటనలు మానవత్వం ఇంకా ఉందా అనే సందేహానికి తావిస్తే, మరికొన్ని.. ఇంకా మంచితనం బతికే ఉంది అనిపించేలా ఉంటాయి. అలాంటి హృదయవిదారక ఘటనే నవీ ముంబైలో చోటుచేసుకుంది. ఆ సంఘటన అందరిని మానవత్వంపై ఆలోచింప చేయడమే గాక, తోటివారికి చేతనైనా సాయం చేయాలి అనే స్పుహని కలిగించేలా చేసింది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..55 ఏళ్ల టెకీ అనూప్ కుమార్ జీవితం గత మూడేళ్లుగా ఓ ఫ్లాట్ గదిలోనే ఒంటరిగా సాగింది. తల్లిదండ్రులు, సోదరుడిని కోల్పోయిన అనంతరం తీవ్ర మానసిక ఆందోళనకు గురైయ్యారు. దాంతో బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెంచుకుని తన అపార్ట్మెంట్లో ఒంటరిగా జీవించడం ప్రారంభించారు. అంతేగాదు తన రోజువారీ అవసరాల కోసం పూర్తిగా ఆన్లైన్ డెలివరీ యాప్స్పై ఆధారపడ్డారు. ఆహారం, ఇతర వస్తువులను ఆర్డర్ చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చాడు. ఇంట్లో చెత్త బయటన పారయేకపోవడం, పరిశుభ్రత లేకపోవడం తదితరాల వల్ల కాలికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకింది. అంతటి పరిస్థితి ఎదురైనా అనూప్ దాన్ని పట్టించుకోకుండా అదే దుర్భరమైన పరిస్థితుల్లో జీవించసాగాడు. అంటే ఆయన మానసిక ఆరోగ్యం ఎంత దారుణంగా క్షీణించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్పందించిన అప్పార్ట్మెంట్ వాసులు..అనూప్ విషాదకర పరిస్థితిని గుర్తించిన అపార్ట్మెంట్ సొసైటీ వాసులు వెంటనే స్పందించారు. మానవతా దృక్పథంతో ఆలోచించి, ముంబైలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ ఎస్.ఈఏఎల్ (Social & Evangelical Association for Love) కు సమాచారం అందించారు. వారి చొరవతో అనూప్ను అపార్ట్మెంట్ నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.ప్రస్తుతం అనూప్కు మానసిక, శారీరక ఆరోగ్యం పట్ల అవసరమైన చికిత్స అందిస్తున్నారు. SEAL సంస్థ ఆధ్వర్యంలోని ఆశ్రమంలో ఆయనకు పునరావాసం కల్పించి, మానవీయ విలువలతో కూడిన జీవితాన్ని తిరిగి అందించే ప్రయత్నం చేస్తున్నారు.ఈ సంఘటన మనందరికీ ఒక గొప్ప గుణపాఠాన్ని నేర్పించింది. మన చుట్టూ ఉన్నవారి పరిస్థితులపై అవగాహన కలిగి ఉండటం, కష్టాల్లో ఉన్నవారికి మానవతా మనసుతో స్పందించడం ఎంత ముఖ్యమో ఇది గుర్తుచేస్తోంది. ఒకరి బాధను గమనించి, చేయగలిగినంతలో చేయూత ఇవ్వగలిగితేనే నిజమైన మానవత్వం ప్రకాశిస్తుంది.మనం మన పరిసరాలను నిశితంగా పరిశీలిస్తే, అనూప్ వంటి వారు మన మధ్యనే ఉండవచ్చు. వారికి అండగా నిలబడి, సహాయం అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందనే విషయాన్ని చాటి చెప్పింది. సాటి మనిషి పట్ల కరుణ, ప్రేమను చూపడం ద్వారానే మనం బలమైన సమాజాన్ని నిర్మించగలం అనే విషయాన్ని నొక్కిచెబుతోంది ఈ ఘటన.(చదవండి: కళాకారుడిగా మారిన పోలీసు..! సొంతంగా ఫోటో స్టూడియో పెట్టి..) -
మన మనో బలం ఎంత?
కొందరు ఎప్పుడూ ఆడుతూపాడుతూ, నవ్వుతూ, తుళ్లుతూ ఉంటారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ అలాగే కనిపిస్తుంటారు. పైగా ఆ పరిస్థితిని ఎదుర్కొనేంత ధైర్యాన్ని కనబరుస్తుంటారు. తమ మానసిక బలంతో సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. తాము విజయం సాధిస్తే మరీ మంచిది. ఒకవేళ సాధించలేకపాయినా తమ ప్రయత్నం మాత్రం మానరు. ఇక మరికొందరు చిన్న చిన్న సమస్యకే డీలాపడిపాతుంటారు. కిందా మీదా పడుతూ ఎంతో ప్రయాస పడుతున్నట్టుగా కనిపిస్తారు. వాళ్ల మాటల్లో ఆందోళన, నిరుత్సాహం, చిరాకు, చికాకూ అన్నీ కనిపిస్తుంటాయి. అందరూ మనుషులే.. అయితే వాళ్ల మధ్య ఈ వ్యత్యాసాలెలా కనిపిస్తున్నాయి? ఈ తేడాలెందుకున్నాయి? ఎందుకంటే ఒక్కొక్కరికి ఐక్యూలలో తేడాలున్నట్టే... వాళ్ల ఎమోషన్ కోషియెంట్ (ఈక్యూ)లలో ఉన్న తేడాల వల్ల. ఎమోషనల్ కోషియెంట్ అంటే ఏమిటి, అది ఎందుకు అవసరం, దాన్ని ఎలా అభివృద్ధి పరచుకోవాలి... వంటి అనేక అంశాలను తెలిపేదే ఈ కథనం. ఐన్స్టైన్ చాలా మేధావి అనీ, అతడి ఐక్యూ సాధారణ జనాల ఐక్యూ కంటే చాలా ఎక్కువనే మాట వినే ఉంటారు. ఐక్యూ వల్ల తెలివితేటలు బాగానే ఉండవచ్చు. కానీ జీవితంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైనది ఎమోషనల్ కోషియెంట్. అలాంటి ‘ఈక్యూ’ గురించి తెలుసుకుందాం.ఎమోషనల్ ఎపిడమిక్... ఏదైనా వైరస్ లేదా బ్యాక్టీరియా వంటి వాటి వల్ల అనేక చోట్ల ఒక్కసారిగా వ్యాధులు పెచ్చరిల్లి వ్యాప్తిచెందుతూ ఉంటే దాన్ని ఎపిడమిక్ అంటారు కదా. మరి ఇప్పుడున్న వాతావరణంలో ఎమోషన్ ఎపిడమిక్ అనే పరిస్థితి నెలకొని ఉందని అనుకోవచ్చు. అసలు ఎమోషనల్ ఎపిడమిక్ అంటే ఏమిటో చూద్దాం. ఈ మధ్యకాలంలో మన సమాజంలో అనేక రకాల మానవ సంబంధాలకు (రిలేషన్షిప్ప్రాబ్లమ్స్కు) సంబంధించిన సమస్యలు పెరుగుతున్నాయి. సంక్లిష్టమైన ఈ మానవ సంబంధాలతో వచ్చే మానసిక వేదనలూ, దౌర్బల్యాలూ, కుంగుబాట్ల వల్ల అనేక అనర్థాలూ చోటు చేసుకుంటున్నాయి. ఈ తరహా కుటుంబ కలహాలు... భార్యాభర్తలు, తల్లిదండ్రులు–పిల్లలూ, అన్నాచెల్లెళ్లూ, అక్కా తమ్ముళ్లూ... స్నేహితులూ, ఇతరుల మధ్య... దాదాపుగా ఇలాంటి సమస్యలు లేనివారంటూ ఉండరనే చెప్పవచ్చు. కాకపోతే వాటి తీవ్రతలోనే తేడా ఉంటే ఉండవచ్చుగానీ... సమస్యలంటూ లేనివారు ఉండరు. ఇలా అన్నిచోట్లా ఇలాంటి మానసిక సమస్యలు పెచ్చరిల్లి మానవ సంబంధాలు ప్రభావితం కావడాన్ని ‘ఎమోషనల్ ఎపిడెమిక్’గా చెప్పవచ్చు. ఈ ఎమోషనల్ ఎపిడమిక్కు కారణం... మనం, చదువుకూ, డబ్బుకూ ఇచ్చిన ప్రాధాన్యాన్ని ఉద్వేగాలకు అతీతంగా స్థిరంగా ఉండటానికి... అంటే ‘ఎమోషనల్ డెవలప్మెంట్’కు ఇవ్వకపోవడమే. దాంతో క్షణికోద్రేకాలు... వాటి కారణంగా ఘర్షణలూ, కొన్నిసార్లు ఆత్మహత్యలు, హత్యల వంటివీ చోటు చేసుకుంటున్నాయి. దీనికి కారణం మనుషుల్లో ఐక్యూలాగా... ఈక్యూను అంటే ఎమోషనల్ కోషియెంట్ను కూడా పెంపోందించుకోవాలన్న దృష్టి కొరవడటం. అందుకే ఇప్పుడు స్కూలు పిల్లల చదువులలో ఐక్యూతో పాటు ఈక్యూనూ పెంచడంతోపాటు చిన్నప్పట్నుంచే పిల్లలకు ఈక్యూ కూడా పెంపోందేలా చూడటం అవసరం.భావోద్వేగ మేధాశక్తి అంటే ఏమిటి? ఏదైనా ఓ మానసిక స్థితి తాత్కాలికంగా కొనసాగడాన్ని ఉద్వేగం లేదా ఎమోషన్ అంటారు. అదే మానసిక స్థితి చాలా ఎక్కుసేపు కొనసాగితే దాన్ని ‘మూడ్’ అని వ్యవహరిస్తారు. ఉదాహరణకు బాధ పడటం ఒక మానసిక స్థితి. దాన్ని ఒక డిప్రెసివ్ ఎమోషన్గా చెప్పవచ్చు. అయితే అదే బాధ అలా దీర్ఘకాలం పాటు కొనసాగుతూ ఉంటే దాన్ని ‘డిప్రెస్డ్ మూడ్’ అంటారు. రోజుల తరబడి అదే బాధ నిత్యం ఉంటే అది మూడ్ డిజార్డర్ అవుతుంది. బాధ, సంతోషం, దిగులు, ఆందోళన, భయం, కోపం, ప్రేమ, ఉత్సాహం... ఇవన్నీ మనందరిలోనూ రకరకాల సమయాల్లో కలిగే మానసిక స్థితులు. వాటినే భావోద్వేగ స్థితులుగా చెప్పవచ్చు. సరైన సమయంలో సరైన భావోద్వేగాలను సరైన రీతిలో ప్రదర్శించడాన్ని ‘భావోద్వేగ మేధాశక్తి’గా చెప్పవచ్చు. ఉదాహరణకు చాలా పెద్ద పోరబాటు జరిగినప్పుడు ఆ సమయంలో (అంటే తగిన సమయంలో) తగిన రీతిలో కోపం ప్రదర్శించినప్పుడు అది తనకూ, ఇతరులకు కూడా సక్రమంగా ఉపయోగపడుతుంది. అయితే అదే కోపాన్ని ఎప్పుడూ ప్రదర్శిస్తూ ఉంటే అది వారికి తీరని నష్టం కలగజేయవచ్చు. అతడితో పనిచేయడానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చు. అంటే... తన భావోగ్వేగ మేధాశక్తిని సమర్థంగా తగిన రీతిలో సరైన రీతిలో ఉపయోగపడేలా చేసుకోవడమే ఇక్కడ ప్రయోజన్ని ఇస్తుందని గుర్తించాలి. ఇలా ఎప్పుడు ఏ రకమైన ఉద్వేగాన్ని, ఎంత మేరకు, ఏ పరిమితుల్లో ఉపయోగించాలన్నదే ‘ఈక్యూ’గా చెప్పవచ్చు.భావోద్వేగ మేధాశక్తి (ఈక్యూ) ఉన్నవారి లక్షణాలివి... ఎప్పుడూ సంతోషంగా కనిపించడం... తమ భావోద్వేగాలను ఎప్పుడూ తమ అదుపులో ఉంచుకోవడం, ఇతరుల భావోద్వేగాలనూ గుర్తించగలగడం. వాటిని గుర్తెరిగి వాటికి అనుగుణంగా ప్రవర్తించడం.అవసరమైనప్పుడు ఇతరుల భావోద్వేగాలను సైతం తాను నియంత్రిస్తూ, వారిని సంతోషపరచడం లేదా పరిస్థితులు వారికి అనుగుణంగా ఉండేలా మార్చగలగడం. అవసరాన్ని బట్టి తన లక్ష్యం కోసం కొన్ని తన సుఖాలను తాత్కాలికంగా వాయిదా వేయడం. అలా తన తక్షణ సుఖాలను వాయిదా వేయడం వల్ల కూడా తాను సంతోషం పోందగలగడం. సమర్థమైన నాయకత్వ లక్షణాలూ అలాగే మంచి సంభాణాచాతుర్యం. ఓటమికి భయపడకపోవడం, కుంగిపోకుండా వాటిని ఎలా ఎదుర్కోవాలన్నది తక్షణం ఆలోచించగలగడం. ఈక్యూ తాలూకు లక్షణాల వల్ల కలిగే ఫలితాలు... ఇలాంటివారు గతంలో తమకు ఎదురైన అనుభవాలను ఒక పాఠంగా తీసుకుని ప్రస్తుతంలో జీవిస్తారు. జీవితాన్ని ప్రణాళికాబద్ధంగా నడుపుతారు. దాంతో గెలుపూ, సంతోషం ఎప్పుడూ వాళ్లతోనే ఉంటాయి. అతడితో సమయం గడపడానికి అందరూ ఇష్టపడుతుంటారు. తనతో ఉన్నవారినీ సంతోషపెడుతూ ఈ ఈక్యూ ఎక్కువగా ఉన్నవారు ఇతరులకు మార్గదర్శకుడుగా ఉంటాడు. ∙సమర్థమైన నాయకుడిగా ఎదుగుతాడు. తొలుత కుటుంబానికీ, ఆ తర్వాత సమాజానికీ నేతృత్వం వహిస్తుంటాడు. ఈక్యూను (భావోద్వేగ మేధాశక్తిని) పెంచుకోవడం ఎలా...? ఈక్యూ (భావోద్వేగ మేధాశక్తి)ని అభివృద్ధి చేసుకోడానికి ముందర... ముఖ్యంగా అదెలా ఏర్పడుతుందో తెలుసుకోవాలి. భావోద్వేగ మేధాశక్తికి మొదటి పునాదులు అర్లీ ఛైల్డ్హుడ్ టైమ్లో పడి అప్పట్నుంచి 18 ఏళ్ల వయసు వరకు వేగంగా అభివృద్ధి చెందుతుంటుంది. ఆ తర్వాత కూడా ఈక్యూ పెరుగుతుంటుంది కానీ... అర్లీ ఛైల్డ్హుడ్ నుంచి 18 ఏళ్ల వరకు జరిగినంత వేగంగా ఆ అభివృద్ధి జరగదు. చిన్నప్పుడు తమ తల్లిదండ్రుల, సమాజంలోని ఇతరుల ప్రవర్తన, తాము ఎదిగిన పరిస్థితులు... ఇవన్నీ పిల్లల భావోద్వేగ మేధాశక్తిపై ప్రభావం చూపుతాయి. ∙మెదడులో చిన్నప్పుడు ΄్లాస్టిసిటీ అనే స్వభావం ఎక్కువగా ఉంటుంది. అంటే... దాన్ని ఏరకంగా మలిస్తే మెదడులో స్వభావాలను ఏర్పరచుకునే తత్వం / పరిస్థితి ఆ రకంగా మారుతుందని చెప్పవచ్చు. ఈ స్వభావం లేదా గుణం మనం ఎదిగే కొద్దీ తగ్గుతూ పోతుంది. అందుకే ‘మొక్కై వంగనిది, మానై వంగునా’ అనే సామెత భావోద్వేగ మేధాశక్తి విషయంలో అక్షర సత్యమని చెప్పవచ్చు.ఎమోషనల్ ఇంటెలిజెన్స్... తల్లిదండ్రుల పాత్ర... తల్లిదండ్రులు కేవలం పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టినంత మాత్రాన సరిపోదని గుర్తించాలి. నిజానికి వారు ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశమేమిటంటే... తమ పిల్లలు ఎదుటివారిలో మెలిగేప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ల ప్రవర్తనలో తేడాలుంటే ఎలా చక్కదిద్దాలి... అలాగే విపత్కర పరిస్థితుల్లో వాటిని ఎదుర్కొనేందుకు వాళ్లు అనుసరిస్తున్న పద్ధతులు లేదా వ్యూహమేమిటి, వాటిని పరిష్కరించడానికి వాళ్లు ఎదుర్కొంటున్న మార్గాలేమిటి అని చూడాలి. అవి చాలా చిన్న చిన్న అంశాలే కావచ్చు. ఉదాహరణకు ఏదైనా ఓ కారణంతో ఓ చిన్నారి తన హోమ్వర్క్ పూర్తిగా కంప్లీట్ చేయలేదు. ఆ వయసుకు అతడికి అదే విపత్కరమైన పరిస్థితి. దాన్ని అతడు ఎలా ఎదుర్కొంటున్నాడు అన్నది తల్లిదండ్రులు గమనించాలి. కడుపునొప్పి లేదా ఇతరత్రా వంక పెట్టి ఆ రోజుకు స్కూల్ మానేయాలని చూస్తున్నాడా లేదా తగిన (కన్విన్సింగ్) జవాబును సిద్ధం చేసుకుని పరిస్థితిని ఎదుర్కొనేందుకు సంసిద్ధమవుతున్నాడా అన్నది తల్లిదండ్రులు చూడాల్సిన అంశం. ఒకవేళ అతడు స్కూల్ మానాలని అనుకుంటే... అది సరికాదనీ... టీచర్ అడిగినప్పుడు ఈ సమాధానం చెప్పమనీ, ‘‘ముందు నువ్వు ఈ విషయం ఇలా చెప్పు. ఒకవేళ ఆయన వినకపోతే మేమూ స్కూల్కు వచ్చి కన్విన్స్ చేస్తా’’మంటూ పిల్లలను పరిస్థితి ఎదుర్కొనేందుకు సంసిద్ధం చేయాలి. ఇది చిన్నపిల్లల విషయంలో జరగాల్సిన పనికి ఓ ఉదాహరణ. పరిస్థితులను బట్టి ఇలాంటివే పిల్లలు ఎదుర్కొనేలా తలిదండ్రులు ధైర్య, స్థైర్యాలను తమ పిల్లల్లో పాదుకునేలా చూడాలి. నిజానికి చదువు కంటే... భవిష్యత్తులో ఎదురయ్యే అనేక రకాల సమస్యలను ఎదుర్కోడానికి ఇలాంటి పాఠాలే చాలా అవసరమని గుర్తించాలి. లోకంలోని అనేక పరిస్థితులను ఎదుర్కోడానికి ఐక్యూ కంటే కూడా ఈక్యూనే ప్రధానం. ఇక అవసరమైన చోట ఓపిగ్గా ఉండటాన్ని అభ్యాసం చేయించాలి. ఓరిమితో ఉండటం క్షమాగుణాన్నీ పెంపోందిస్తుంది. క్షమాగుణం వల్ల గొడవలు తగ్గి చాలా ప్రశాంతంగా హాయిగా జీవించడం సాధ్యమవుతుంది. ఎదుటివారిలో మంచి కనిపించినప్పుడు దాన్ని గుర్తించి అభినందించే మనస్తత్వాన్ని అభ్యాసం చేయిస్తే... ఈర్ష్య తగ్గి చాలా ప్రశాంతతతో జీవించే గుణం అలవడుతుంది. ప్రతికూల ప్రవర్తనలతో ఈక్యూ తగ్గిన సందర్భాల్లో... తల్లిదండ్రులు తమ పిల్లలను తరచూ తిడుతూ, ఇతరులతో పోల్చి వారిని నిందిస్తూ ఉంటే పిల్లలు కూడా తమ తప్పులకు ఇతరులను బాధ్యులు అనుకోవడం, అందుకు వారిని దూషించడం, నిందించడం నేర్చుకుంటారు. ఇది అదేపనిగా కొనసాగడం వల్ల ద్వేషించడాన్ని కొనసాగిస్తుంటారు. ఇక మరికొందరు పెద్దవాళ్ల చేత అదేపనిగా ఎగతాళికి గురవుతుంటే ఆ పిల్లలు బిడియస్తులుగా, పిరికివారుగా తయారవుతారు. మరికొందరు అవమానం కారణంగా నేరస్వభావాన్ని పెంచుకుంటారు. అందుకే పిల్లలకు ఈక్యూ నేర్పడంలో తల్లిదండ్రుల ప్రవర్తన చాలా కీలకం.భావోద్వేగ మేధాశక్తితో కలిగే ప్రయోజనాల్లో కొన్ని... భావోద్వేగ మేధాశక్తి ఉన్నవారికి మానసిక సమస్యలు చాలా తక్కువ. వారిలో శారీరక సమస్యలు వచ్చే అవకాశాలు కూడా తక్కువ అని అధ్యయనాలు తెలుపుతున్నాయి. గుండె జబ్బులు ఉన్న వ్యక్తికి ఎమోషనల్ సపోర్ట్ లేకపోతే గుండె పోటు వచ్చే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువ. అదే ఒకసారి గుండెపోటు వచ్చిన వ్యక్తికి డిప్రెషన్ ఉంటే గుండెపోటు వచ్చే అవకాశాలు 3.5 రెట్లు అధికం. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మనం మనలోని ఉద్వేగ మేధాశక్తిని (ఈక్యూను) నిరంతర సాధనతో పెంచుకుంటూ ఉండటంతో పాటు... ఆ ప్రభావం ఎదుటివారికీ ప్రయోజనం కలిగేలా వ్యవహరించడం (దీన్నే మానసిక విశ్లేషకులు ‘విన్ – విన్ సిచ్యువేషన్’ అంటుంటారు) వల్ల మానవ సంబంధాలు మెరుగుపడటంతో పాటు మరింత మంచి సమాజం ఏర్పడుతుందన్నది చాలామంది మానసిక వైద్యులూ, శాస్త్రవేత్తల మాట. ఈక్యూ ఎందుకంటే... మేధాశక్తి (ఇంటెలిజెన్స్)ని రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకటి విషయ సంబంధమైన పరిజ్ఞానం, తెలివితేటలు మొదలైన వాటికి సంబంధించినది. విషయసంబంధమైన మేధాశక్తిని ఇంటెలిజెన్స్ కోషియెన్స్ (ఐక్యూ) ద్వారా చెబుతారు. రెండోది భావోద్వేగ మేధాశక్తి. దీనినే ‘ఎమోషనల్ ఇంటెలిజెన్స్’ అంటారు. భావోద్వేగ మేధాశక్తి ద్వారా ఈక్యూను అంచనా వేస్తారు. ఒక వ్యక్తి సంతోషంగా జీవించడానికి, ఇతరులతో చక్కటి సంబంధాలను ఏర్పరచుకోడానికి భావోద్వేగ మేధాశక్తి ఎంతో కీలకం. మరెంతో అవసరం. తెలివితేటలు, చదువు, విషయపరిజ్ఞానం వంటి ఎన్నో అంశాలు ఉండి కూడా కొందరు సమస్యలను ఎదుర్కునేలా అంతగా మానసిక దృఢత్వం లేకపోవడానికీ, ఢక్కాముక్కీలు తిన్నవారిలా కాకుండా సమస్యకు తేలిగ్గా లొంగిపొయి, బెదిరిపోవడానికి కారణం ఈక్యూ తక్కువగా ఉండటమే. -
International Joke Day: : నవ్వు.. నవ్వులాట కాదు
ఇవాళ మనిషి దగ్గర అన్నీ ఉంటున్నాయి... నవ్వు తప్ప. వేయి తుఫాన్లు చుట్టుముట్టినా హాయిగా నవ్వగలిగే, నవ్వించగలిగేవాళ్లు వాటిని దాటుతారు. స్నేహాలు, కుటుంబ అనుబంధాలు పలుచబడి ఒత్తిడి నిండిన ఈ రోజుల్లో నవ్వు సిరిధాన్యాల బలం ఇవ్వగలదు.జూలై 1‘ఇంటర్నేషనల్ జోక్ డే’. స్త్రీలకు నవ్వు ఇష్టం. ఇంట్లో, పని చోటా నవ్వుకోగలిగే వాతావరణం ఇష్టం. కాని వారిని టార్గెట్ చేస్తూ ఇంకా కొనసాగుతున్న కుళ్లు జోకులను మాత్రం ‘ఇక ఆపండి’ అంటున్నారు. ఆరోగ్యకరమైన హాస్యమే ఆనందోబ్రహ్మ.జోకులు ఎవరు పుట్టిస్తారో ఎవరికీ తెలియదు. ప్రసిద్ధ రచయిత కుష్వంత్ సింగ్ పుస్తకాలు రాయడమే కాదు బాగా చదువుతాడు. హాస్యప్రియుడు. ఆయనకు ఒక సందేహం వచ్చింది. ఇంగ్లిష్లో ప్రచారంలో ఉన్న చాలా జోకులు కొద్ది΄ాటి తేడాలతో చాలా దేశాల్లో జనం చెప్పుకోవడం ఆయన గమనించాడు. ఈ జోకులు అన్ని దేశాల్లో చెప్పుకుంటున్నారు... చిన్న మార్పులతో... ఒరిజినల్గా ఎవరు సృష్టించి ఉంటారు అని చిన్న పరిశోధన చేస్తే చివరకు ఏం తెలిసిందో తెలుసా? అవన్నీ యూదులు తయారు చేసిన జోకులు. రెండవ ప్రపంచయుద్ధ సమయంలో భయం, ఒత్తిడిలో, తమపై ఊచకోత సాగుతున్న సమయంలో వారు ఆ దుఃఖాన్ని మర్చి΄ోవడానికి జోకులు సృష్టించుకుని నవ్వుకునేవారట. అవే ఆ తర్వాత అన్ని దేశాలకు రూపు మార్చుకుని చేరాయి.ఒక్క నవ్వు చాలు వేయి వరహాలు అంటారు మనవారు. నవ్వు రూపానికో అలంకారం మాత్రమే కాదు సంస్కారానికి ఆనవాలు కూడా. చిర్నవ్వు ధరించిన ప్రతి మనిషి సౌందర్యంతో ఉన్నట్టే. ఫ్రీ మేకప్. అంతా కలిపి చేయాల్సింది నవ్వుతూ పెదాలను సాగదీయడమే.నవ్వులో విశేషం ఏమిటంటే బలవంతంగా నవ్వినా, ఏడ్చినట్టు నవ్వినా ఆ నవ్వు ఆరోగ్యానికి మేలు చేస్తుందట. ఇక నిజంగా నవ్వితేనో? అందుకే సినీ దర్శకుడు నవ్వడం భోగం... నవ్వించడం యోగం అన్నాడు. జోకులకు ఉండే శాపం ఏమిటంటే అవి విన్నప్పుడు నవ్వొస్తాయి... తర్వాత గుర్తుండవు. ఒక జోకు చెప్పు అని ఎవర్ని అడిగినా వెంటనే బుర్ర తడుముకుంటారు. జోకులు ఎందుకు గుర్తుండవనేది పెద్ద పజిల్.ఇవాళ రేపు స్టాండప్ కమెడియన్లు చాలా సక్సెస్ అవుతున్నారు. రాజకీయ నాయకుల మీద జోకులు వేస్తున్నారు. అలా జోకులేసే కమెడియన్లపై రాజకీయ నాయకులు కూడా సెటైరికల్గా పగబడుతున్నారు. ‘ఇతరులు మన మీద జోకేస్తే నవ్వేవాడు భోగి... తన మీద తనే జోకేసుకునేవాడు యోగి’ అన్నాడో జోకుల రీసెర్చర్ వెనుకటికి. జోకు వింటే వచ్చే నవ్వుకు జెండర్ ఉండదు. స్త్రీలు, పురుషులు సమానంగా నవ్వుతారు. కాని జోకులో సబ్జెక్ట్కు జెండర్ ఉంటుంది. ఆడవాళ్ల మీద వేసే జోకు అన్నింటి కంటే అథమమైనది. అయినా సరే అప్పడాల కర్రల మీద, వారి అలంకరణల మీద, అలవాట్ల మీద జోకులు వేసి ఇకఇకలు ΄ోతుంటారు చాలామంది. భార్య తోడు లేకపోతే గంట కూడా బతకలేని భర్త నలుగురు ఫ్రెండ్స్ రాగానే భార్య మీద జోకులేస్తాడు. భార్యను నవ్వించొచ్చు. నవ్వులాటగా మార్చకూడదు. అయినా సరే స్త్రీల మీద చీప్ జోకులు వినపడుతూనే ఉన్నాయి. ఒక మనిషిని కించపరిచేది జోక్ కాదు. మంచి జోక్ పేల్చడం ఉదాత్తమైన కళ. ఇంటర్నేషనల్ జోక్ డే సందర్భంగా నవ్వుల శుభాకాంక్షలు. నవ్వుతూ బతుకుదాం. -
డాక్టర్ హార్ట్ బీట్స్
జీవితం ఒక సినిమా అయితే... దేవుడు రాసిన స్క్రిప్ట్ను కూడా మార్చి రాయగల రైటర్లు డాక్టర్లు. జీవితం ఒక మూవీ అయితే... పేషెంట్కు లైఫ్కో కొత్త డైరెక్షనిచ్చి హిట్ చేయగల టాప్ డైరెక్టర్లు డాక్టర్లు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... జీవితం... సినిమా కంటే విచిత్రమైనది. దాంట్లో లవ్, మదర్ సెంటిమెంట్, స్టడీస్లో సక్సెస్తో కెమెరా టిల్ట్ చేసి తలెత్తి పైకి చూడాల్సినంత అడ్మిరేషన్, ఎదురుగా మృత్యువు నిలబడ్డా చిరునవ్వుతో ఎదుర్కొనేంత హీరోయిక్ కరేజ్, హెల్మెట్లు లేకపోవడంతో జరిగే అనర్థాల స్టంట్స్... ఇలా ఎన్నో... ఎన్నెన్నో!! ఇన్ని ఎమోషన్స్ను మనతో పంచుకున్నారు నిష్ణాతులూ, లబ్ధప్రతిష్ఠులైన కొందరు డాక్టర్లు... నేడు డాక్టర్స్ డే సందర్భంగా కొన్ని భావోద్వేగాలు వాళ్ల మాటల్లోనే...బరువైన బతుకులో చిరునవ్వు అతడు!అడ్మిరేషన్కొన్ని కేసులు ఎలా ఉంటాయంటే... ఇలా నిజజీవితంలో కూడా సాధ్యమవుతుందా అన్నట్టుగా ఉంటాయి. అవి 1990 ల నాటి తొలి రోజులు. ఓ చిన్నారి బాబును వాళ్ల అమ్మగారు నా దగ్గరికి తీసుకొచ్చారు. మహా అయితే ఆ బాబుకు అప్పటికి ఓ ఏడెనిమిదేళ్లు ఉంటాయేమో... అంతే! ఆ బాబుకు వాళ్ల నాన్నకు ఉండే మూత్రపిండాల (కిడ్నీ) జబ్బే వచ్చింది. అదేమిటంటే... కిడ్నీలో చాలా గడ్డలు రావడం. మూత్రపిండాల్లో మల్టిపుల్ ట్యూమర్స్ వస్తూ జన్యుపరమైన కారణాలతో వంశపారంపర్యంగా వచ్చే జబ్బు అది. తండ్రికీ ఉండటంతో కొడుకుకూ వచ్చింది. ఆ బాబు తల్లిదండ్రులిద్దరూ చాలా సంస్కారవంతులూ, ఉన్నత విద్యావంతులూ, కాస్త ధనవంతులు కూడా. తండ్రికి ఆ జబ్బు ఉండటంతో అతడి తల్లి తన భర్తకు కిడ్నీ ఇచ్చి కాపాడేందుకు ప్రయత్నించింది. ఆ ట్రాన్స్ప్లాంట్ శస్త్రచికిత్స జరుగుతున్నప్పుడు నేనూ అక్కడ ఉన్నా. ఆ తర్వాత ఐదేళ్లలో ఆయన చనిపోయారు. ఆ తర్వాత రెండుమూడేళ్లకు అనుకుంటా... అతడి అమ్మగారు హార్ట్ అటాక్తో లోకం విడిచి వెళ్లారు. ఈ ప్రపంచంలో ఇప్పుడా బాబు పూర్తిగా అనాథ. అయితే అతడు చాలా చిన్నవయసు నుంచే సమర్థంగా బిజినెస్ చేస్తుండేవాడు. బిజినెస్లో ఎక్స్పర్ట్ కావడంతో తానో పెద్ద కంపెనీ పెట్టి విజయాన్ని చవిచూసిన ఓ సక్సెస్ఫుల్ బిజినెస్మేన్ అతడు. తన వ్యాపారంలో అతడెంత ఉన్నతిని సాధించాడంటే... తన కంపెనీ ద్వారా వందల సంఖ్యలో వ్యక్తులకు ఉపాధిని కల్పించాడు. కొన్నేళ్ల తర్వాత దాదాపు 2000 సంవత్సరం ప్రాంంతాల్లో అతడు మళ్లీ కిడ్నీ సమస్యతో మరోసారి నా దగ్గరికి వచ్చాడు. గుర్రపునాడా ఆకృతిలో (హార్స్ షూ షేప్లో) ఉన్న అతడి కిడ్నీలోంచి ఈసారి సగభాగాన్ని తొలగించాల్సి వచ్చింది. ఆ సర్జరీ నేనే చేశా. కాలక్రమంలో ఈసారి పూర్తిస్థాయి కిడ్నీ ఫెయిల్యూర్తో అతడు మళ్లీ నా దగ్గరికి వచ్చాడు. ట్రాన్స్ప్లాంట్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. కిడ్నీ ఇవ్వడానికి అతడికి ఈలోకంలో రక్తసంబంధీకులెవ్వరూ లేరు. వాస్తవానికి వాళ్ల నాన్నగారు చాలా చిన్నప్పుడే ఓ చిన్నారి బాబును ఇంట్లో పెట్టుకున్నారు. ఒకరి ఆత్మబంధువుగా మరొకరు గత రెండు దశాబ్దాలుగా వాళ్లిద్దరూ ఆ ఇంట్లో నివసిస్తున్నారు. ఆ ఇంట్లో అతడి వ్యక్తిగత సహాయకుడూ, సెక్రటరీ అన్నీ అతడే. అతడు కిడ్నీ ఇస్తానన్నాడుగానీ... నిబంధనల ప్రకారం రక్తసంబంధీకులో... లేదా రక్తసంబంధం లేనివాళ్లైతే భార్యభర్తల్లో ఎవరో ఒకరు ఇవ్వాలి. తనకు ఈ లోకంలో అతడు తప్ప మరెవ్వరూ లేరనే కారణంతో వాళ్లు కోర్టుకు వెళ్లారు. అతడి ఇంట్లో గత 20 ఏళ్లుగా ఉంటున్న వ్యక్తి కిడ్నీ ఇవ్వవచ్చంటూ అతడి కేసులో మాత్రం కోర్టు ప్రత్యేక అనుమతి ఇవ్వడంతో అతడి ట్రాన్స్ప్లాంట్ చికిత్స కూడా నేనే చేశా. ఈ ట్రాన్స్ప్లాంట్ చేసి ఇప్పటికి దాదాపు ఎనిమిదేళ్లు అయ్యింది. అంటే... దాదాపు గత 30కి పైగా ఏళ్ల నుంచి అతడు నా పేషెంట్. వాళ్ల అమ్మగారు చనిపోయాక ప్రతి చికిత్సకూ అతడొక్కడే వచ్చేవాడు. ఇన్పేషెంట్గా చేరేప్పుడూ... డిశ్చార్జ్ అయి వెళ్లేటప్పడూ ఇలా ప్రతి ప్రతికూల పరిస్థితిలోనూ అతడొక్కడే. ఏ పరిస్థితుల్లోనూ అతడు తన చిరునవ్వును వీడలేదు. ఇక్కడ ఓ డాక్టర్గా నా గొప్పదనం ఏమీ లేదు. గొప్ప చికిత్స జరిగినప్పుడు పేషెంట్ అదృష్టాలూ, డాక్టర్ ప్రయత్నాలూ, పరిస్థితులు కలిసిరావడాలూ... ఇలా ఇవన్నీ అనుకూలించడంతో డాక్టర్ గొప్పగా, సమర్థంగా చికిత్స చేశాడనే పేరొస్తుంది. కానీ ఈ కేసులో పరిస్థితి వేరు. ఆ పేషెంట్ తాలూకు సంకల్పబలం, గొప్పదనంతో డాక్టర్కూ గొప్పదనాన్ని ఆపాదించినట్లయ్యింది. ఇప్పుడతడి వయసు దాదాపు 40 ఉండవచ్చు. ఈ వయసుకే అతడో సక్కెస్ఫుల్ వాణిజ్యవేత్త. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ అదరక, బెదరక ఎంతోమందికి అన్నం పెడుతున్న బెస్ట్ బిజినెస్మేన్. సాధారణంగా డాక్టర్లంటే పేషెంట్లకు అడ్మిరేషన్ ఉండటం సహజం. కానీ... చిన్నప్పట్నుంచీ... ఓ చిన్నారిగా ఉన్నప్పట్నుంచీ అతడిని చూస్తూ ఉన్నప్పటికీ, గత 30 ఏళ్ల నుంచి అతడికి చికిత్స అందిస్తున్నప్పటికీ... అతడంటే నాకెంతో అడ్మిరేషన్. డాక్టర్ సి. మల్లికార్జున,చీఫ్ యూరాలజిస్ట్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ – యూరాలజీ (అఐN్ఖ), హైదరాబాద్ముప్పు డప్పు కొట్టినా తప్పులు ఆగవా!‘హెల్త్’మేట్స్అదో అందమైన చలికాలపు ఉదయపు వేళ. కానీ ఆ ఆహ్లాదకరమైన ప్రాంతఃకాలం... శేఖర్ పాలిట రాబోయే రాత్రికి కాబోయే కాళరాత్రికి నాందీ సమయం. కారణం... ఆరోజు శేఖర్ చేసిన రెండు తప్పులు. మొదటి తప్పు హెల్మెట్ ధరించకపోవడమైతే... రెండోది స్పీడ్ బ్రేకర్ దగ్గర కూడా ఏమాత్రం స్లో చేయకపోవడం. దాంతో బండి మీది నుంచి పడి తలకు గాయంతో ఐసీయూలో బెడ్పై అచేతనంగా పడి ఉన్నాడు. శేఖర్ గురించి అతడి అన్న శ్రీధర్ చాలా బాధపడుతూ ఉండేవాడు. బహుశా శ్రీధర్కు 35 ఏళ్లూ, అతడి తమ్ముడు శేఖర్కు 30 ఏళ్లు ఉంటాయేమో. ప్రతిరోజూ కళ్ల నిండా నీళ్లతో, జోడించిన చేతులతో నా దగ్గరికి వచ్చి తమ్ముడి పరిస్థితి వాకబు చేస్తూ ఉండేవాడు. ‘‘ఎంత ఖర్చైనా పర్లేదు డాక్టర్. నా తమ్ముడు బాగైతే చాలు’’ అనేవాడు. అంతటి దయ, గుండెనిండా ఆర్ద్రత ఉన్న ఆ అన్నను చూస్తే ఓ పక్క ఆనందం... మరో పక్క అతడి పరిస్థితికి బాధా ఉండేవి. ‘‘మీవాడుగానీ ఆ రోజు హెల్మెట్ పెట్టుకుని ఉంటే... ఇవ్వాళ ఈ పరిస్థితి వచ్చేదే కాదు’’ అంటూ ఉండేవాణ్ణి. ఒకరోజు పొద్దున్నే నేను నా కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నా. పక్క సందులోంచి ఒక వ్యక్తి తన బైక్ను చాలా రాష్గా డ్రైవ్ చేస్తూ ప్రధాన రోడ్డు మీదికి వస్తున్నాడు. ఎక్కడా స్లో చేయడమన్న మాటే లేదు. మెయిన్ రోడ్డులో వస్తున్న నేను వెంటనే నా కార్ను స్లో చేస్తూ... అతడు నన్ను గుద్దుకోకుండా నా కార్ను చాలా పక్కకు తీశా. ఒకవేళ నేనలా చేయకపోతే నన్నతడు తప్పక ఢీకొని ఉండేవాడు. తీరా చూస్తే అతడి బైక్ హ్యాండిల్ మీద హెల్మెట్ కూడా ఉంది. పరిశీలనగా చూస్తే అతడు మరెవరో కాదు... మా హాస్పిటల్ బెడ్ మీద యాక్సిడెంట్ అయి పడుకుని ఉన్న పేషెంట్ వాళ్ల అన్నే. కాస్తయితే ‘‘అదే బెడ్ పక్కన ఇతడూ తమ్ముడికి కంపెనీ ఇస్తూ పడుకునేవాడు కదా’’ అనిపించింది. మరో మాట అనిపించింది. తన సొంత తమ్ముడు చేసిన రెండు తప్పుల నుంచి ఏమీ గ్రహించకుండా శేఖర్ వాళ్ల అన్న శ్రీధర్ చేసింది మూడో తప్పు. అలాంటి యాక్సిడెంట్లో చనిపోయిన ఓ వ్యక్తి తాలూకు అంతిమ సంస్కారాల్లో పాల్గొన్న మర్నాడే ఈ ఘటన జరగడంతో నాకీ విషయం స్ఫురణకు వచ్చింది. నన్ను మనసులో తొలిచేస్తున్న విషయమేమిటో తెలుసా... ‘‘ఇన్ని సంఘటనలు జరిగాక... జరుగుతున్న సంఘటనలను చూశాక... తమ ఇంట్లో కూడా ఇలాంటి విషాదాలు చోటు చేసుకున్న తర్వాత కూడా వీళ్లు మారరా’’ అంటూ బాధేసింది. నా అనుభవంలో చూసిన ఘటనలూ, ఆ టైమ్లో వచ్చే ఆలోచనలే నన్ను ఈ నాలుగు మాటలు రాసేలా పురిగొల్పాయి. డాక్టర్ అనిరుథ్ కె. పురోహిత్ సీనియర్ కన్సల్టెంట్న్యూరో – స్పైన్ సర్జన్,ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్అమ్మతనం ఇచ్చిన‘బ్రహ్మా’నందంమదర్ హుడ్అమ్మతనపు కమ్మదనం కోసం అర్రులు సాచే అమ్మాయిలెందరో! అలాంటి అమ్మాయిల్లో ఆమె కూడా ఒకరు. అప్పటికే ఆ అమ్మాయికి నాలుగు అబార్షన్లు అయ్యాయి. ఆ గర్భస్రావాల్లో ఒకట్రెండు దాదాపు పూర్తికాలం గర్భం మోసిన దాఖలాలూ ఉన్నాయి. కానీ ఏ ప్రసవంలోనూ బిడ్డ జీవించి పుట్టలేదు. ఈసారి ఐదో ప్రసవం సమయంలో ఆ దంపతులు నా దగ్గరికి వచ్చారు. వాళ్లకు ఇది ఐదోసారి గర్భధారణ. అల్ట్రా సౌండ్ స్కానింగ్లో ఏదో తేడా ఉంది. వాళ్లలో ఉండే వేదన ఎంతో ఎవ్వరైనా అంచనా వేయవచ్చు. మా దగ్గర రెండు రకాలుగా పరీక్షలు నిర్వహిస్తాం. మొదటిది క్రోమోజోముల్లో ఏదైనా తేడా ఉందేమో తెలుసుకునే క్యారియోటైపింగ్ టెస్ట్. రెండోది ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టడానికి గల అవకాశాలను తెలిపే ప్రాంబబిలిటీ పరీక్ష. వాళ్లు రెండోది కోరుకున్నప్పటికీ... అప్పటికే ఉన్న ప్రతికూలతల కారణంగా అది సాధ్యం కాలేదు. ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే... ఒకవేళ పుట్టబోయే బిడ్డకు శారీరక అవయవాల్లో లోపాలో లేదా మానసికంగా బిడ్డ ఎదుగుదల బాగుండదనో తెలిస్తే జెనెటిక్ కౌన్సెలింగ్ ఇచ్చి... ‘ఇదీ పరిస్థితి. ఇక మీరు నిర్ణయం తీసుకోండి’ అని చెబుతాం. ఇక ఆ తర్వాత నిర్వహించిన క్యారియోటైపింగ్ పరీక్షల్లో బిడ్డలో ‘క్రోమోజోమల్ ట్రాన్స్ లొకేషన్’ జరిగినట్లు తేలింది. అంటే... క్రోమోజోముల్లోని ఒకచోట ఉండాల్సినవి అక్కడినుంచి మారి మరోచోట చేరాయి. కానీ చూడ్డానికి అంతా బాగానే ఉంది. ఇలాంటప్పుడు బిడ్డ ఆరోగ్య కరంగానే పుడుతుందా అంటే చెప్పలేం. ఇలాంటి సందర్భాల్లో ప్రకృతి ఓ పని చేస్తుంది. అనారోగ్యకరమైన బిడ్డను ఈ లోకంలోకి రాకుండా చేసేందుకు మూడు నెలలలోపు స్వాభావికంగా దానంతట అదే బిడ్డ పడిపోయేలా చేస్తుంది. అంటే నేచురల్ అబార్షన్ జరిగిపోతుందన్నమాట. అదే ఒకవేళ మూడు నెలలు గడిచిపోయాయంటే ఇక బిడ్డ పూర్తిగా ఎదగడానికి అవకాశం ఉందన్నమాట. మొదటి సస్పెన్సు కాలమైన ఆ మూడు నెలలూ గడిచిపోయాయి. ఇప్పుడు రెండో సస్పెన్సు మొదలైంది. ఇప్పటికే నిండు చందమామలాంటి బిడ్డలు నలుగురు ఆ అమ్మ ఒడినుంచి జారిపోయారు. కడుపున మరో బంగారం పెరుగుతోందిగానీ... ఆ కొంగుబంగారమూ కొంగుజారిపోతే? అమ్మో!! అందుకే మేమంతా కాబోయే ఆ అమ్మను జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉన్నాం. క్రోమోజోమల్ ట్రాన్స్లొకేషన్ జరిగిందంటే ఏదో జరిగిందనే అర్థం. కాకపోతే అదెక్కడో, ఎలాగో, దాని పర్యవసానాలేమిటో తెలియదు. జాగ్రత్తగా వేచిచూస్తున్నాం. ఎట్టకేలకు అల్లరిపిడుగు పుట్టనే పుట్టింది. ఆ బంగారుతల్లి ఒడిలోకి బంగారుకొండ చేరింది. అంతా సుఖాంతం. బిడ్డకు పూర్తి ఆరోగ్యం. మా అందరిలోనూ కొండంత ఆనందం. నేను చెప్పేదేమిటంటే... ప్రతి ఒక్కరికీ జెనెటిక్ పరీక్షలు అవసరం కాకపోవచ్చు. కానీ ఎలాంటి బిడ్డ పుడుతుందో... పుట్టి జీవితాంతం తల్లిదండ్రులను క్షోభపెడుతుందో తెలియని పరిస్థితుల్లో జన్యుపరీక్షలు అవసరం. ఓ సీనియర్ జన్యువైద్య పరిశోధకురాలిగా, జెనెటిక్స్ వైద్యురాలిగా ఇదీ నా సూచన.డాక్టర్ యానీ క్యూ హసన్, సీనియర్ జెనెటిక్ – మాలెక్యులార్ స్పెషలిస్ట్, కామినేని హాస్పిటల్స్, హైదరాబాద్మృత్యువు పెట్టిన ‘పరీక్ష’ పాసయ్యాడు!స్టడీస్ఎలాగైనా యూపీఎస్సీ పరీక్ష రాసి ఐఏఎస్ సాధించాలనే తపనతో చదువుతున్నాడు మిస్టర్ రంజిత్ (పేరు మార్చాం). అతడు నరాలు తెగే ఏకాగ్రతతో చదువుతుంటే గులియన్ బ్యారీ సిండ్రోమ్ (జీబీఎస్) అనే సమస్య అతడి నరాలను దెబ్బతీసింది. జీబీఎస్ అనేది నరాలకు సంబంధించిన వ్యాధి. ఏదైనా ఇన్ఫెక్షన్కు గురైన తర్వాత వస్తుందిది. ఇందులో నుంచి దేహంలోని ప్రతి భాగానికీ ఆదేశాలందించే నరాలపైన ఉండే ‘మైలీన్’ అనే పొర దెబ్బతింటుంది. సొంత వ్యాధి నిరోధక వ్యవస్థలోని యాంటీబాడీస్ వెలువడి... అవి తమ సొంత మైలీన్ పొరను దెబ్బతీసినప్పుడు మెదడు నుంచి వచ్చే సిగ్నల్స్ అందక సొంత అవయవాలు అచేతనమవుతాయి. అందునా ఈసారి రంజిత్కు వచ్చిన వ్యాధి మామూలు జీబీఎస్ కాదు. జీబీఎస్ వచ్చేవాళ్లలోనూ ప్రతి 1000 మందిలో ఒకరికి మాత్రమే వచ్చే అరుదైన, అత్యంత తీవ్రమైన గులియన్ బ్యారీ సిండ్రోమ్ రకమిది. నరాల కూడలి (నోడల్) ప్రదేశాల్లో వస్తుంది కాబట్టి దీన్ని ‘నోడోపతి’ అంటారు. అది ఎంతటి తీవ్రమైనదంటే... సాధారణంగా కాళ్ల నుంచి పైకి చచ్చుబడిపోయేలా చేసే ఆ వ్యాధి... ఇతడిలో మాత్రం దేహమంతా అచేతనమయ్యేలా చేసింది. ఊపిరి తీసుకునేందుకు సహాయపడే కండరాలు అచేతనమైపోతే కొద్ది క్షణాల్లోనే ప్రాంణం పోతుంది కదా. అలాంటిది అతడి కంటికి సంబంధించిన కండరాల్లో కొంత మినహాయించి మిగతా దేహమంతా కదలిక లేకుండా పోయింది. సొంత వ్యాధి నిరోధక వ్యవస్థ అతడిని దెబ్బతీసిందేమో కానీ పరిస్థితులు అతడి సంకల్ప బలాన్ని ఏమాత్రమూ దెబ్బతీయలేకపోయాయి. సొంత కుటుంబ సభ్యులు అండగా నిలబడ్డ తీరు అసామాన్యం, అనితరసాధ్యం, నిరుపమానం, నిరంతర స్ఫూర్తి. సొంత సోదరి కూడా ఐఏఎస్కు ప్రిపేర్ అవుతుండటంతో ఆమె అతడిలో మోటివేషన్ నింపుతూ ఉంది. అతడి పరిస్థితికి అతడిలోని వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఐవీఐజీ అనే తరహా ఇమ్యునోథెరపీ ఇవ్వాల్సి ఉంది. ఇది బాగా ఖరీదైన చికిత్స. అతడిది కేవలం ఓ దిగువ మధ్యతరగతి కుటుంబం. దాంతో అతడి మనోబలాన్ని పెంచేందుకూ, అతడిలో స్ఫూర్తి రగిలించేందుకూ మేం డాక్టర్లం కూడా అతడికి ఆర్థికంగా కొంత సహాయం (క్రౌడ్ ఫండింగ్) చేశాం. ఆసుపత్రి కూడా తనవంతు అండదండలందించింది. అన్నివైపుల నుంచి అందుతున్న సహకారాలతో అతడు రెండునెలల పాటు ఐసీయూలో వ్యాధితో పోరాడాడు. ఈలోపు మరో రెండుసార్లు ఇన్ఫెక్షన్ వచ్చి అతడిని మృత్యువు అంచులవరకూ తీసుకెళ్లింది. దాంతో అతడి పరిసరాలు అత్యంత శుభ్రంగా ఉండేలా చేశాం. అతడికి అందే ఆహారాలు బలవర్థకంగా ఉండేలా చూశాం. రిటుక్సిమాబ్ అనే ఇమ్యూన్ సపోర్ట్ మందులిచ్చాం. ఇలా అనేక ప్రయత్నాలు చేసి అతడిని కాపాడాం. రెండు నెలల పాటు అతడి నరాలకు ఏ ఆహారమూ అందకపోవడంతో, అవి రెండునెలల పాటూ ఏ పనీ చేయకపోవడంతో... ఆ తర్వాత ఎంతో బలహీనపడి శక్తిపుంజుకునేందుకు ఎంతో కష్టమైంది. అయినప్పటికీ ఫిజియోథెరపీ సహాయంతో అతడెంతో కష్టపడి బయటకొచ్చాడు. ఇప్పుడు హాయిగా హ్యాపీగా ఉన్నాడు. ఈ ఏడాది కాకుండా ఆ వచ్చే ఏడాది పరీక్ష రాద్దువుగానీ అంటే... ‘‘లేదు సర్... మీరిచ్చిన ప్రోత్సాహంతో ఈ ఏడాది కూడా పరీక్ష రాయాల్సిందే. అది కుదరకపోతే నేను చెబుతుంటే ఎవరైనా స్క్రైబ్ను పెట్టుకునైనా సరే’’ అన్నాడా అబ్బాయి. మేం ఒక టీమ్గా పనిచేసే డాక్టర్లమంతా కలిసి, మా శక్తియుక్తులన్నీ వెచ్చించి, సంయుక్తంగా అతడిని మృత్యుదేవత ఒడిలోంచి బలవంతంగా వెనక్కుతీసుకొచ్చామంటే అది అతిశయోక్తి కాదు. క్రిటికల్ కేర్లో పనిచేసే మేము రోజులోని 24 గంటలూ క్రిటికల్ కేసుల్నే చూస్తాం. ఇటీవలే మేం ఒక డబుల్ ట్విన్స్ కడుపులో ఉన్న మహిళను రక్షించాం. అత్యంత సంక్లిష్టమైన టీబీ ఇన్ఫెక్షన్లూ, చాలా అరుదుగా కనిపించే మెనింజైటిస్ విత్ టీటీపీ అనే కేసులూ చూశాం. కానీ ఇలా చదువుకోసం తాపత్రయపడే ఓ చురుకైన కుర్రాణ్ణి మేమంతా ఓ టీమ్గా రక్షించిన ఉదంతం మాకు ఎంతో సంతృప్తినిచ్చింది. డాక్టర్ హర్ష్ ఖండేలియా సీనియర్ కన్సల్టెంట్ క్రిటికల్ కేర్ ఫిజీషియన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్వాళ్ల ప్రేమకు పునర్జన్మ!లవ్ సురేశ్, సమీర (పేర్లు మార్చాం) ప్రేమించుకున్నారు. అయితే అన్ని ప్రేమకథల్లోలాగే అమ్మాయి వాళ్ల పెద్దలు ఈ ప్రేమను ఒప్పుకోలేదు. కలిసే బతుకుదామని నిర్ణయించుకున్నారు. పారిపోయి పెళ్లి చేసుకుందామనుకున్నారు. అమ్మాయి నిర్ణీత స్థలానికి రాగానే అప్పటికే అక్కడ టూ వీలర్ మీద వెయిట్ చేస్తున్న సురేశ్... సమీరను పికప్ చేసుకున్నాడు. అసలే యాంగై్జటీ. తమను వెతికేవారికి దొరక్కూడదనే టెన్షన్. ఆ యాంగై్జటీ, టెన్షన్లతో బండి వేగంగా నడిపాడు. ఫలితం... బండి బోల్తా కొట్టి యాక్సిడెంట్ అయ్యింది. వెంబడిస్తున్న సమీర తరఫు బంధువులకు అమ్మాయి చిన్న చిన్న దెబ్బలతో సేఫ్గానే దక్కింది. కానీ... సురేశ్ తల బద్దలైంది. అచ్చం అతడి ప్రేమలా! సురేశ్ మెదడు బయటకు వచ్చింది. ఛాతీ ఎముకలూ విరిగాయి. పొట్టలోకి నీరు వచ్చింది. ఇలా మెడికల్కు సంబంధించిన మల్టీ డిసిప్లినరీ సమస్యలెన్నో వచ్చాయి. ఆ స్థితిలో తీసుకువచ్చిన సురేశ్కు చికిత్సలు చాలా జాగ్రత్తగాఅందించాల్సి వచ్చింది. తల తాలూకు చిన్న చిన్న ముక్కలు కొన్ని (మరీ లోతుగా కాకపోయినా) మెదడులోనూ ఇరుక్కున్నాయి. మెదడులోకి లోతైన గాయాలు కాకుండా వాటిని చాలా జాగ్రత్తగా బయటకు తీయాల్సి వచ్చింది. వెంటిలేటర్పై పెట్టి చికిత్స ఇవ్వాల్సిన పరిస్థితి.అత్యంత సునిశితమైన చికిత్సలూ, గాజుబొమ్మలా చూసుకున్న జాగ్రత్తల తర్వాత ఎట్టకేలకు సురేశ్ కోలుకున్నాడు. ఈలోపు... వాళ్ల ప్రేమకథలో ఓ ట్విస్ట్. అతడి యాక్సిడెంట్ వృత్తాంతం వాళ్ల క్లోజ్ క్లోజ్ సర్కిల్స్లో వ్యాపించడంతో అతడికి సంబంధాలేమీ రాలేదు. అటువైపు ఆ అమ్మాయి పరిస్థితీ అంతే. బద్దలైన తల తాలూకు చిన్న చిన్న ముక్కల్నీ పేర్చి అతికిస్తే అవే మెల్లగా అమరాయి కదా... అచ్చం అలాగే పెద్దలు బద్దలు చేయాలనుకున్న వాళ్ల ప్రేమ కూడా చక్కగా కుదిరింది. వెరసి పెళ్లీ జరిగింది. తన కాళ్ల మీద నిలబడ్డ సురేశ్ ఇప్పుడు ఓ మంచి రెస్టా్టరెంట్ నడుపుతున్నాడు. వాళ్లిద్దర్నీ చూసినప్పుడు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. డాక్టర్ ఎస్. రమేశ్ సీనియర్ న్యూరో సర్జన్, మినిమల్ యాక్సెస్ బ్రెయిన్ – స్పైన్ సర్జన్, కామినేని హాస్పిటల్స్, హైదరాబాద్ -
కళాకారుడిగా మారిన పోలీసు..! సొంతంగా ఫోటో స్టూడియో పెట్టి..
కళ కోసం తపించే మహానుభావులెందరినో చూశాం. తమ సర్వస్వం దానికే అర్పించి..భావితరాలకు వాటి గొప్పతనం తెలియజేసిన మహానుభావులెందరో ఉన్నారు. అయితే ఇక్కడొక పోలీసు అంతలా కాకపోయినా..చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకునేందుకు కళకారుడిగా మారిన కథ ఇది. కుటుంబ భాద్యతల నడుమ మరుగున పడ్డ తన కలకు ప్రాణం పోసి శెభాష్ అనిపించుకుంటున్నాడు.అతడే కర్ణాటకకు చెందని పోలీసు బి ఎస్ శివరాజు. ఆయన తన తల్లి గౌరమ్మతో కలిసి ఒక్కఫోటో కూడా దిగలేదు. తన స్నేహితులు, బంధువులు ఇంటికి వెళ్లినప్పుడూ..గోడలపై కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలు చూసి కలత చెందేవాడు. తన చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన గుర్తుచేసుకుంటూ శివ..తన తాత తనను, తన తల్లిని తీసుకుని ఫోటోస్టూడియోకి తీసుకువెళ్లి..ఫోటో తీయించుకోకుండానే బాధగా ఎలా వెనుతిరిగి వచ్చిందో చెప్పుకొచ్చాడు. ఎందుకంటే అప్పటి తమ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటం, పైగా స్టూడియో అతను తక్కువ డబ్బులకు తీయడం కుదరదనడంతో నాటి ఫోటో ముచ్చట నీరుగారిపోయిందని బాధగా చెప్పుకొచ్చాడు శివ. ఆ విధంగా ఫోటో తీసుకోలేకపోయిన వెలితి శివ మనసులో అలానే బలంగా ఉండిపోవడంతో..2017లో పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతంగా ఫోటో స్టూడియో పెట్టుకుని..ఆల్బమ్లు డాక్యుమెంటేషన్ చేస్తున్నాడు. ఈ పనిని ఆయన తన తల్లి రగౌరమ్మతో కలిస చేస్తుండటం విశేషం. బాల్యంలో అమ్మతో కలిసి ఫోటో దిగలేకపోయిన లోటుని ఇలా భర్తీ చేసుకుంటున్నాడు శివ. ప్రస్తుతం బెంగళూరులో జాషువా ముయివా నిర్వహిస్తున్న నో లాంగర్ ఎ మెమరీ, పాతకాలపు స్టూడియో-షాట్ ఫోటో ఆల్బమ్ల నోస్టాల్జియా గ్యాలరీ సుముఖ ప్రదర్శనలో అతడి ఫోటో డాక్యుమెంట్లు సందడి చేస్తున్నాయి. ఆ ఫోటోల ఆల్బమ్లన్నింటిల్లోనూ తన తల్లితో కలసి రకరకాల వేషాల్లో కనిపిస్తాడు.ప్రతి ఒక్క ఫోటో అలనాటి జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఉంటుంది. సెల్ఫోన్లు, కెమెరాలు లేని ఫోటో స్టూడియా ముచ్చట్లు కదలాడేలా ఆ గ్యాలరీ ప్రదర్శన ఉంటుంది. ఆ ఆల్బమ్ని శివ ప్రాణం పెట్టి తీర్చిదిద్దాడు. 21 ఏళ్లకు పోలీసు ఉద్యోగం సంపాదించాడు శివ. సహజంగా ఆ వృత్తిపరంగా టెన్షన్తో కూడిన కాఠిన్యం ఎక్కడ శివ ముఖంలో మచ్చుకైన కానిరాని విధంగా ఆ ఫోటోల్లో కనిపిచడం విశేషం. ఇలా ఈ కళను ఎంచుకోవడానికి కారణాన్ని కూడా వివరించాడు శివ. "నాటక సంప్రదాయం అంతరించిపోతోంది. ప్రస్తుత వాతావరణం చాలా భిన్నంగా ఉంది. ఫోటో స్టూడియోలు గతంలో ఉన్నట్లుగా లేవు. అందువల్ల నేను నా జ్ఞాపకాలతో, నా ప్రజలతో, నా సంస్కృతితో పనిచేయాలనుకుంటున్నాను. ఇది ఒకరకంగా నా జీవితంలోకి తిరిగి వచ్చిన ఫీల్ని అందిస్తోంది. ఇంకా ఇలాంటివి మరిన్ని డాక్యుమెంట్లు చేయాలి అదే తన ఆకాంక్ష అని నవ్వుతూ చెబుతున్నాడు". ఈ మాజీ పోలీస్ శివ.(చదవండి: 'బంగారంలాంటి ఇల్లు' అంటే ఇదే..! స్విచ్ బోర్డుల నుంచి...) -
Indias 10 richest temples: రూ. 3 లక్షల కోట్లతో టాప్లో ఏది?
ఎంతో పవిత్రమైన, సాంస్కృతిక వారసత్వాన్ని చాటు దేవాలయాలకు నిలయం భారతదేశం. కోట్లాదిమంది భక్తులు సర్వశక్తిమంతుడైన ఆ భగవంతుడు తమను సర్వ పాపాలనుంచి, ఆపదలనుంచి కాపాడతాడని విశ్వసిస్తారు. అనేకమంది భక్తులు తమ ఆరాధ్య దైవం పేరుతో లక్షలాది కానుకలను విరాళాలుగా ఇస్తుంటారు. అలా అత్యంత ఘనమైన సంపదతో అలరారే దేశంలోని టాప్ పది దేవాలయాలను పరిశీలిద్దాం.ప్రపంచం నలుమూలల నుండి ప్రతీ ఏడాది లక్షలాది భక్తులు, పర్యాటకులను అద్భుతమైన దేవాలయాలను సందర్శిస్తారు. మొక్కులు చెల్లించుకుంటారు. ఇందులో నగదు విరాళాలు, బంగారం, వెండి లాంటి విలువైన ఆస్తులు ఇందులో ఉంటాయి. వీటిని అనేక సామాజిక కార్యక్రమాలను, సేవా కార్యక్రమాలను వినియోగిస్తాయి సంబంధిత ఆలయట్రస్టులు. ఈ దేవాలయాల సంపద అమూలమ్యైన భక్తుల విశ్వాసాన్ని ప్రతిబింబించడమే కాకుండా, భారతదేశ సాంస్కృతిక, సామాజిక , ఆర్థిక నిర్మాణంలో వాటి పాత్రకు నిదర్శనం కూడా.భారతదేశంలోని 10 అత్యంత ధనిక దేవాలయాలుఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఆలయంసుందరమైన తిరుమల కొండలలో ఉన్న ఈ ఆలయం ప్రపంచంలోని అత్యంత ధనిక మతపరమైన ప్రదేశాలలో ఒకటి. దీని విలువ రూ. 3 లక్షల కోట్లు అని అంచనా. ప్రతిరోజూ దాదాపు 50వేల మంది భక్తులు సందర్శిస్తారు . ఈ ఆలయం విరాళాలు, బంగారం , ఇతర కానుకల ద్వారా ప్రతి సంవత్సరం దాదాపు రూ. 1,400 కోట్లు ఆర్జిస్తుంది.కేరళలోని తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయంప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయంగా ప్రసిద్ధి చెందిన పద్మనాభస్వామి ఆలయంలో రూ.1.2 లక్షల కోట్ల విలువైన సంపద దీని సొంతం.బంగారు ఆభరణాలు, వజ్రాలు, పురాతన వెండి , పచ్చలు ఉన్నాయి. 2015లో, గొప్ప ఖజానాను గుర్తించడం ఇప్పటికే ఉన్న భారీ నిధికి మరింత తోడైంది.గురువాయూర్ దేవస్వం, కేరళలోని గురువాయూర్విష్ణువు కొలువై ఉండే ఈ పురాతన ఆలయం సంపదకూడా చాలా ఎక్కువ.. దీనికి రూ.1,737.04 కోట్ల విలువైన బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. అలాగే 271.05 ఎకరాల భూమిని కలిగి ఉందని తెలుస్తోంది. ఈ ఆలయంలో బంగారం, వెండి ,విలువైన స్టోన్స్కు సంబంధించి పెద్ద నిధి కూడా ఉంది. జమ్మూలోని వైష్ణో దేవి ఆలయంసముద్ర మట్టానికి 5,200 అడుగుల ఎత్తులో ఉన్న పవిత్ర దుర్గాదేవి ఆలయం భారతదేశంలోని అత్యంత సంపన్నమైన వాటిలో ఒకటి. 2000-2020 వరకు, దీనికి 1,800 కిలోల బంగారం, 4,700 కిలోల వెండి. రూ. 2,000 కోట్లకు పైగా నగదు విరాళాలుగా వచ్చాయి.మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయందేశంలో అత్యధికంగా సందర్శించే ఆలయాలలో ఒకటి షిర్డీ సాయినాథునికి ఆలయం. రోజుకు దాదాపు 25,000 మంది భక్తులను ఆకర్షిస్తుంది. ముంబై నుండి దాదాపు 296 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని 1922లో నెలకొల్పారు. 2022లో రూ. 400 కోట్లకు పైగా విరాళాలు అందుకుంది. ఇది రెండు ఆసుపత్రులను కూడా నిర్వహిస్తుంది. ప్రతిరోజూ వేలాది మంది యాత్రికులకు ఉచిత భోజనాన్ని అందిస్తుంది.అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం ( గోల్డెన్ టెంపుల్)బంగారం తాపడం చేసిన అద్భుతమైన దేవాలయం స్వర్ణ దేవాలయం. గొప్ప వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందిన సిక్కు మతం ఆధ్యాత్మిక హృదయంగా భావిస్తారు. 1581లో నిర్మించబడిన ఇది ప్రతి సంవత్సరం దాదాపు రూ. 500 కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం.మధుర మీనాక్షి ఆలయంతమిళనాడులో మధురైలో ఉన్న ఈ ఆలయం దాని అద్భుతమైన డిజైన్ , పండుగ వాతావరణానికి ప్రశంసలు అందుకుంది. ఇక్కడకొలువుదీరిన మీనాక్షి అమ్మవారిని దర్శించుకునేందుకు ఇది రోజుకు 20వేల మందికి పైగా భక్తులువస్తారు. ప్రతి సంవత్సరం రూ. 60 మిలియన్లు సంపాదిస్తుందని అంచనా.సిద్ధివినాయక ఆలయం, ముంబైముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో ఉన్న ఈ ప్రసిద్ధ గణేష్ ఆలయం భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకటి, దీని విలువ రూ. 125 కోట్ల అంచనా. దీనికి ప్రతిరోజూ రూ. 30 లక్షల విలువైన కానుకలు అందుతాయి.ఇక్కడ విగ్రహం 4 కిలోల బంగారంతో అలంకరించి ఉంటుంది.గుజరాత్లోని సోమనాథ్ ఆలయంభారతదేశంలోని అత్యంత గౌరవనీయమైన శివాలయాలలో ఒకటైన సోమనాథ్ 12 జ్యోతిర్లింగాలలో ఇది మొదటిదిగా భావిస్తారు. ఈ ఆలయం గర్భగుడిలో 130 కిలోల బంగారం, దాని శిఖరంపై అదనంగా 150 కిలోలు ఉన్నాయట.ఒడిశాలోని పూరిలోని శ్రీ జగన్నాథ ఆలయంఒడిశా ఆధ్యాత్మిక వారసత్వానికి మూలస్తంభమైన 11వ శతాబ్దపు ఆలయం జగన్నాథ ఆలయం. చార్ ధామ్ యాత్రలో కీలకమైంది కూడా. . దీని విలువ దాదాపు రూ. 150 కోట్లు . దీంతోపాటు దాదాపు 30వేల ఎకరాల భూమి ఉంది. దీంతోపాటు ఇటీవల నిర్మితమైన, బాగా ప్రాచుర్యం పొందిన, అత్యంత ఖరీదైన ప్రాజెక్టులలో ఒకటి అయోధ్యలోని రామమందిరం. -
కొడుకు స్నేహితుడితో పెళ్లి, త్వరలో బిడ్డ : వ్యాపారవేత్త లవ్ స్టోరీ వైరల్
50 ఏళ్ళ వయసులో ఒక చైనా మహిళ తన కొడుకు స్నేహితుడిని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. అంతేకాదు ఇపుడు ఒక బిడ్డకు తల్లి కాబోతోంది. ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఈ కథేంటో తెలుసుకుందాం పదండిఆగ్నేయ చైనాకు చెందిన ఈ-కామర్స్ వ్యవస్థాపకురాలు "సిస్టర్ జిన్". తన కొడుకు రష్యన్ క్లాస్మేట్ను పెళ్లాడింది. 30 ఏళ్ళ వయసులో మొదటి భర్తనుంచి విడాకులు తీసుకున్న ఆమె కొడుకు, కుమార్తెను స్వతంత్రంగా పెంచి పెద్ద చేసింది. సబర్బన్ విల్లా, చెఫ్, డ్రైవర్ ఇలా సకల హంగులతో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపే ఆమె చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ డౌయిన్లో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. 13,000 మందికి పైగా ఫాలోయర్లు ఉన్నారు.ఆరేళ్ల ప్రేమ తరువాత పిల్లల ఆమోదంతో కొడుకు కైకై రష్యన్ ఫ్రెండ్ డైఫును పెళ్లి చేసుకుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా కొడుకు తన ఫ్రెండ్స్ను ఇంటికి ఆహ్వానించినపుడు డైఫుతో పరిచయం ఏర్పడింది. సిస్టర్ జిన్ వంటలకు ఆతిథ్యానికి ఫిదా అయిన డైఫు తన సెలవులను పొడిగించుకున్నాడు. చైనాలో చాలా సంవత్సరాలు గడిపిన తర్వాత చైనీస్ భాషను కూడా మాట్లాడే డైఫు, జిన్తో టచ్లో ఉంటూ, అనేక గిఫ్ట్లు ఇచ్చి పుచ్చుకున్నాడు. అచ్చమైన ప్రేమికుల్లాగానే వీరిద్దరి మధ్య అనేక సర్ప్రైజ్లు కూడా ఉన్నాయి. 20 ఏళ్ల వయసు తేడా, ఎత్తులో తేడా, గతంలో విఫలమైన వివాహం తదితర కారణాల రీత్యా జిన్ తొలుత వ్యతిరేకించినా, ఆ తరువాత ఇవేవీ వీరి ప్రేమకు అడ్డంకి కాలేదు. కొడుకు ప్రోత్సాహంతో అతడి ప్రేమను స్వీకరించింది. ఈ జంట ఈ ఏడాది ప్రారంభంలో అధికారికంగా తమ వివాహాన్ని నమోదు చేసుకున్నారు. చైనా అంతటా విస్తృతంగా పర్యటించారు. (యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లతో ముప్పు ; షెఫాలీ ప్రాణం తీసింది అవేనా?)చివరికి జూన్8న తన ప్రెగ్రెన్నీని ప్రకటించింది. లేట్ ఏజ్ ప్రెగ్నెన్సీ ప్రమాదమే కానీ, డైఫుతో జీవితం చాలా బావుంది అంటూ సిస్టర్ జిన్ సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా తన గర్భధారణను ప్రకటించింది ఆన్లైన్ వినియోగదారులు వీరి వివాహ చట్టబద్ధతను ప్రకశ్నించారు. అయితే కాలమే తమ ప్రేమను రుజువు చేస్తుందని సమాధానమిచ్చింది. పుట్టబోయే బిడ్డను స్వాగతించేందుకు ఉత్సాహంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదీ చదవండి: Today Tip బరువు తగ్గాలంటే.. జామ ఆకూ ఔషధమే -
'బంగారంలాంటి ఇల్లు' అంటే ఇదే..! స్విచ్ బోర్డుల నుంచి...
ఎన్నో విలాసవంతమైన భవనాలను చూసి ఉంటారు. ానీకానీ ఇలాంటి విలాసవంతమైన ఇంటిని మాత్రం చూసుండరు. మహా అయితే ఇన్ని అంతస్థుల భవనం, కట్టిపడేసే లగ్జరీయస్ ఫర్నీచర్లు తదితర విశేషాలతో ఉన్న బంగ్లాలనే ూచూశాం. కానీ ఈ ఇల్లు వాటన్నింటిని తలదన్నేలా అత్యంత విలాసవంతంగా అంతకు మించి అన్నట్లుగా ఉంది. ఆ ఇంటిని తిలకిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. కంటెంట్ క్రియేటర్ ఇటీవల మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక విలాసవంతమైన బంగారంతో అలకరించి ఉన్న లగ్జరీయస్ ఇంటిని సందర్శించారు. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేయడంతో వైరల్గా మారింది. ఆ ఇంటి లోపల ఫర్నిచర్ నుంచి ఎలక్ట్రిక్ స్విచ్బోర్డుల వరకు ప్రతీది స్వచ్ఛమైన బంగారంలా ధగ ధగ మెరుస్తూ ఉంటుంది. ఇవన్నీ 24 క్యారెట్ల బంగారంతో తయారు చేసినవే అట. కంటెంట్ క్రియేటర్ సరస్వత్ అంతటి ఐశ్వర్యాన్ని చూసి ఆశ్చర్యంగా తిలకిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ భవనంలో మొత్తం పది బెడ్రూమ్లు ఉన్నాయి. ఇంటి ప్రాంగణంలో గోశాల నుంచి మొదలై.. ఎంట్రన్స్లో 1936 వింటేజ్ మెర్సిడెస్ కారు నుంచి పలు విలాసవంతమైన కార్ల సేకరణ కనిపిస్తుంది. అంతేగాదు ఆ ధనవంతుడి సక్సెస్ జర్నీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. తమ కుటుంబంలో మొత్తం 20 మంది సభ్యులం ఉండేవాళ్లమని, అందరికీ ఒకే ఒక పెట్రోల్ బంక్ ఆధామని చెప్పుకొచ్చారు. అప్పుడే ఆ ధనవంతుడికి అర్థమైపోయిందట ఏదోరకంగా కష్టపడకపోతే తన మనుగడ ప్రశ్నార్థకమై పోతుందని. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వ కాంట్రాక్టర్షిప్లోకి ప్రవేశించారట. అలా ప్రభుత్వ రోడ్లు, వంతెనలు, భవనాలు నిర్మించే తన వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం సుమారు 300 గదుల హోటల్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. కాగా, అందుకు సంబంధించిన వీడియోకి "భారతదేశంలోని ఇండోర్లో బంగారంతో అలంకరించబడిన ఇల్లు" అనే క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు కంటెంట్ క్రియేటర్ సరస్వత్. నెటిజన్లు అంతటి విలాసవంతమైన ఇంటిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేయగా, మరికొందరూ లక్ష్మీపుత్రుడు, అద్భుతమైన వ్యక్తి అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Priyam Saraswat (@priyamsaraswat) (చదవండి: 'చార్లీ 777 మూవీ'ని తలపించే స్టోరీ..! ఏకంగా 12 వేల కిలోమీటర్లు..) -
యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లతో ముప్పు ; షెఫాలీ ప్రాణం తీసింది అవేనా?
కాంటా లగా గర్ల్ షెఫాలీ జరీవాలా (Shefali Jariwala) అకాల మరణం అనేక ఊహాగానాలు, ఆందోళనలను తెరపైకి తీసుకొచ్చింది. ముఖ్యంగా యాంటీ-ఏజింగ్ ట్రీట్మెంట్స్ అండ్ ఫాస్టింగ్ టాక్సిక్ కాక్టెయిల్ ఆమె ప్రాణాలకు ముప్పు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.షెఫాలిఖాళీ కడుపుతో కాస్మెటిక్ యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ తీసుకొని ఉండవచ్చని, ఇదే గుండెపోటుకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న షెఫాలి ఖాళీ కడుపుతో గ్లూటాతియోన్ , విటమిన్ సి కలిగిన కాస్మెటిక్ యాంటీ-ఏజింగ్ ఇంజెక్షన్ తీసుకున్నారనీ, ఆ వెంటనే ఆమె తీవ్ర అస్వస్తతతకు గురైందట. ఒళ్లు వణకడం, తర్వాత స్పృహ కోల్పోవడంతో తక్షణమే ఆమె భర్త పరాగ్ త్యాగి ముంబైలోని బెల్లెవ్యూ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్కు తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. అంతేకాదు షెఫాలీ ఇంట్లో యాంటీ ఏజింగ్ ఇంజక్షన్ వైల్స్, విటమిన్ సప్లిమెంట్లు, గ్యాస్ట్రిక్ మాత్రలు దొరకడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది. అంతే కాదు ఎనిమిదేళ్ల క్రితం వైద్యుడిని సంప్రదించిన షెఫాలీ, ఆ తర్వాత కూడా స్వయంగా మందులు తీసుకోవడం ప్రారంభించి, ప్రస్తుత వైద్యుల పర్యవేక్షణ లేకుండానే దీనిని కొనసాగించిందనే అనుమానాలు కూడా బలంగా ఉన్నాయి. ఖాళీ కడుపుతో ఇంట్రావీనస్గా తీసుకోవడం లేదా ఇతర మందులతో పాటు తీసుకోవడం వంటివి - హైపోటెన్షన్ , కార్డియాక్ అరెస్ట్లాంటి ముప్పు ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. షెఫాలీ విషయంలో కూడా ఖాళీ కడుపుతో ఇంజక్షన్ తీసుకోవడం వల్ల రక్తపోటు ఒక్కసారిగా పడిపోయి గుండెపోటు వచ్చి ఉంటుందని వైద్య నిపుణులు అనుమానిస్తున్నారు. అయితే ఆమె మరణానికి ఖచ్చితమైన కారణపై ఇంకా స్పష్టతలేదు. పోస్ట్మార్టం నివేదిక తరువాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.గ్లుటాతియోన్, విటమిన్ సి చర్మ చికిత్సలలో విస్తృతంగా వాడుకలో ఉన్నప్పటికీ ఖాళీకడుపుతో లేదా ఉపవాసం ఉన్న స్థితిలో, ఇలాంటి మందుల కలయిక హృదయనాళ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుందని, ఒక్కోసారి రక్తపోటు పడిపోయి గుండె ఆగిపోవడానికి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే వీటిని వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా అంతటా యాంటీ-ఏజింగ్ థెరపీల వాడకంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా, ఇంజెక్ట్ చేయగల గ్లూటాతియోన్కు FDA-ఆమోదం లేదనీ, వాస్తవానికి, చర్మాన్ని తెల్లగా చేస్తుందని భావిస్తున్న గ్లూటాతియోన్ ఇంజెక్షన్ ఫలితాలపై క్లినికల్ ట్రయల్స్గానీ, లేదా అధికారిక మార్గదర్శకాలు లేవు. పైగా దీని వలన కాలేయం, మూత్రపిండాలు , నాడీ వ్యవస్థపై విషపూరిత ప్రభావంతో పాటు, స్టీవెన్స్-జాన్సన్ సిండ్రోమ్ వంటి తీవ్రమైన ప్రమాదాలను కూడా FDA లేవనెత్తింది. అలాగే చర్మకాంతికోసం ఇంజెక్టబుల్ విటమిన్ సి ఉత్పత్తులకు కూడా FDA-ఆమోదం లేదు. 2019లో, FDA అన్ని కంపెనీలను ఆస్కార్బిక్ ఆమ్లం (విటమిన్ సి) ఇంజెక్షన్ అనుమతి లేని వెర్షన్ల పంపిణీని నిలిపివేయాలని కోరింది. మరోవైపు భారతదేశంలో, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) గ్లూటాతియోన్ , విటమిన్ సి ఇంజెక్షన్ల వినియోగానికి ఆమోదం తెలిపింది. కానీ సౌందర్య లేదా చర్మాన్ని తెల్లగా చేసే ఉద్దేశానికి ఎంతమాత్రం కాదు నిర్దిష్ట వైద్య సూచనల కోసం మాత్రమే.కోవిడ్ తరువాత ఇటు దేశంలో, ఆటు ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో మరణానికి హృదయనాళ వ్యాధి (CVD) ప్రధాన కారణంగా నిలుస్తోందని రొమ్ము కేన్సర్ తరువాత ఇదే అత్యంత ప్రమాదకారిగా ఉందంటున్నారు వైద్య నిపుణులు. -
అల్యూమినియం పాత్ర.. ‘అతి’ వాడకంతో ముప్పు!
ఒకప్పుడు వంట చేయాలంటే మట్టి పాత్రలే వినియోగించేవాళ్లు. ఆ తర్వాత కాలక్రమేణా వంటింట్లోకి రాగి, ఇత్తడి, స్టీల్, అల్యూమినియం, నాన్స్టిక్ పాత్రలు చొచ్చుకొచ్చేశాయి. ప్రస్తుతం వీటిలో అత్యధిక మంది ఉపయోగించేవి అల్యూమినియం పాత్రలే. అన్నం, కూర, పిండివంటలు.. వంటకం ఏదైనా అల్యూమినియం గిన్నెలు ఉండాల్సిందే. ఈ పాత్రలు ఉపయోగించడం వరకు బాగానే ఉన్నా.. వాటిని సుదీర్ఘ కాలం వాడటం ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వంట పాత్రలకూ ఎక్స్పెయిరీ ఉంటుందని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) వెల్లడించింది. రెండేళ్లకు మించి వాడొద్దు..1938లో ఇండియన్ అల్యూమినియం కంపెనీ మన దేశంలో ఉత్పాదకత ప్రారంభించింది. అనంతరం అల్యూమినియం వంట పాత్రల తయారీ కుటీర పరిశ్రమగా మారింది. దేశంలో ఈ పాత్రలు లేని వంట గది ఉండదు. అందుబాటు ధరల్లో లభిస్తుండడంతో ప్రజలు వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే వీటిని సుదీర్ఘకాలం ఉపయోగించకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటి తయారీ నాణ్యతను బట్టి 12 నుంచి 24 నెలలకు ఒకసారి పాత్రలను మారుస్తుండాలని బీఐఎస్ సూచించింది. తేలికైన వంట పాత్రలను ఏడాదికి మించి వాడకూడదని తెలిపింది. సూపర్ గ్రేడ్ వంట సామగ్రి సైతం అధిక ఉష్ణోగ్రతల్లో వేడికి గురై నెలల వ్యవధిలోనే పాడై పోతుంటాయని పేర్కొంది. ఈ క్రమంలో వీటిని రెండేళ్లకు మించి వినియోగించకపోవడం ఉత్తమమని సూచించింది.ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం..ఈ పాత్రల్లో టమాటా, చింతపండు, నిమ్మకాయ వంటి పుల్లటి పదార్థాలతో వంటలు చేయడం వల్ల అల్యూమినియం కరిగి ఆహారంలోకి చేరుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ ఆహారం శరీరంలోకి ప్రవేశించి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుందని తెలిపారు. ఎముకలు, మెదడు సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాల కిడ్నీజబ్బుతో బాధపడేవారికి మరింత ఎక్కువ హాని చేసే అవకాశం ఉందని వివరించారు.త్వరలో కొత్త నిబంధనలు అమల్లోకి..అల్యూమినియం వంట పాత్రల తయారీ ప్రమాణాలను బీఐఎస్ సవరించింది. వంట పాత్రల తయారీలో సీసం, కాడ్మియం, పాదరసం, హెక్సావాలెంట్ క్రోమియం వంటివి 0.05 శాతం కంటే తక్కువ ఉండాలని స్పష్టం చేసింది. వచ్చే నెల నుంచి దేశంలోని చిన్న పరిశ్రమలు, అక్టోబర్ నుంచి సూక్ష్మ పరిశ్రమల్లో ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అలాగే వంట పాత్రలపై అల్యూమినియం గ్రేడ్ను లేబులింగ్ చేయడం తప్పనిసరి చేసింది.(చదవండి: డయాబెటిస్ని జయించిన జర్నలిస్ట్ స్టోరీ..! ఐసీయూలో ఉండాల్సిన స్టేజ్ నుంచి..) -
బెజోస్తో పెళ్లి, ఆ పోస్ట్లన్నీమాయం, పేరు మార్చేసిన లారెన్ సాంచెజ్
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, జర్నలిస్ట్ లారెన్ సాంచెజ్ వివాహం ఇటలీలోని వెనిస్లో అంగరంగ వైభవంగా జరిగింది. అత్యంతవిలాసవంతమైన ఈ వివాహానికి పలువురు గ్లోబల్ సెలబ్రిటీలు విచ్చేశారు.. వివాహానికి సంబంధించిన చిత్రాలు, వివాహ ఖర్చు, ముఖ్యంగా లారెన్ సాంచెజ్, జెఫ్ బెజోస్ దుస్తులు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం మరో విషయం ట్రెండింగ్లో నిలిచింది.జెఫ్ బెజోస్తో పెళ్లి తరువాత లారెన్ సాంచెజ్ కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లి అయిన కొన్ని గంటల తర్వాత, సాంచెజ్ తన పాత ఇన్స్టాగ్రామ్ ఫోటోలన్నింటినీ డిలీట్ చేసింది. కేవలం తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను మాత్రమే ఉంచింది. అంతేకాదు తన ఇంటి పేరును కూడా మార్చేసింది. తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ను "లారెన్ సాంచెజ్ బెజోస్" గా మార్చుకుంది. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్గా నిలిచింది.ఇదీ చదవండి: 900 గంటలు, 180 బటన్స్ : ఆమె స్పెషల్ వెడ్డింగ్ గౌను విశేషాలు View this post on Instagram A post shared by Lauren Sánchez Bezos (@laurensanchezbezos) జెఫ్ బెజోస్ ఏకంగారూ.548 కోట్లు ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది. జెఫ్ బెజోస్ బ్లాక్ కోట్ ధరించగా, సాంచెజ్ తెల్లటి వెడ్డింగ్ గౌనులో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్, ప్రముఖ జర్నలిస్ట్ ఓప్రా విన్ఫ్రే, కిమ్ కర్దేషియాన్, కోలే కర్దేషియాన్, జోర్డాన్ రాణి రనియా, భారత్కు ఫ్యాషన్ ఐకాన్, వ్యాపారవేత్త భార్య నటాషా పూనా వాలా తదితరులు హాజరయ్యారు. -
ప్రాణాంతక 'డయాబెటిక్ కోమా స్టేజ్'..! కానీ ఆమె జస్ట్ రెండు నెలల్లో..
ప్రతి ఏడాది వేలాది మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. దీన్ని మందులతోనే నిర్వహించగలం తప్ప నివారిణి ఉండదు. అయితే కొందరూ ఈ సమస్యను చక్కటి జీవనశైలితో అధిగమించి స్ఫూర్తిగా నిలుస్తారు. ఇక్కడ కావల్సింది తాను ఈవ్యాధి నుంచి బయటపడి మెరుగైన ఆరోగ్యంతో ఉండాలనే 'గట్టి పట్టుదల'. అది ఉంటే డయాబెటిస్ ఎంతటి ప్రమాదకర స్టేజ్లో ఉన్న అవలీల అధిగమించగలరు అనేందుకు ఉదాహారణ ఈ 57 ఏళ్ల మాజీ జర్నలిస్ట్ ఉషా రాచెల్ థామస్. ఆమెకు శరీరంలో చక్కెర స్థాయిలు ఏ రేంజ్లో ఉన్నాయో..? ఆమె పరిస్థితి ఎంత క్రిటికల్గా ఉందో తెలిస్తే విస్తుపోతారు. మరీ అంతటి ప్రమాదకరస్థితిలో ఉన్న డయాబెటిస్ని జయించి ఎలా ఆరోగ్యవంతురాలిగా మారిందో సవివరంగా చూద్దామా..!.సీనియర్ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ అండ్ కమ్యూనికేషన్స్ లీడర్ ఉషా రాచెల్ థామస్ అధిక ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి అలవాట్లతో ఉండేది. చెప్పాలంటే.. తన ఆరోగ్యంపై ధ్యాస పెట్టేది కాదు. తాను డయాబెటిస్ పేషెంట్నని తెలిసి కూడా లైట్ తీసుకుంది. ఉత్తిపుణ్యానికే అలసట, విపరీతమైన దాహం, భోజనం చేసిన వెంటనే అలిసిపోవటం వంటి శరీర సంకేతాలను కూడా నిర్లక్ష్యం చేసింది. ఫలితంగా ఆమె శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరిగిపోయాయి. ఒకరోజు అనుకోకుండా ముంబైలోని ఒక ప్రముఖ డాక్టర్ని సందర్శించింది. ఆయన శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలు చూసి అవాక్కయ్యారు. ఎందుకంటే గ్లూకోమీటర్ ఏకంగా 500 నుంచి 538 పైనే రీడింగ్ చూపిస్తోంది. అంటే..ఇది ఒక షుగర్ పేషెంట్కి ఉండాల్సిన దానికంటే ఐదు రెట్లు ప్రమాదకర స్థాయిలో ఉందని అర్థం. ఆ వైద్యుడు ఉషతో మీరు ఐసీయూలో ఉండాలని చెప్పారు. ఆ మాటలు విని ఉషకు గుండె ఆగినంత పని అయ్యింది. ఆయన ఉషను డయాబెటిక్ కోమా స్టేజ్లో ఉన్నట్లు తేల్చి చెప్పారు. పరిస్థితి ఇలానే ఉంటే..ఏ క్షణం ఎలా ఉంటుందో చెప్పడం కష్టం అన్నారు. అందువల్ల ఉషా అనునిత్యం డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉండటం మంచిది అని సూచించారాయన. ఆ డాక్టర్ మాటలు చెంప చెళ్లుమనిపించినట్లయ్యింది ఉషకు. ఒక్కసారి తన అనారోగ్యకరమైన అవాట్లు అన్ని కళ్లముందు కదలాడాయి. చేజేతులారా తానే ఈ పరిస్థితి కొని తెచ్చుకున్నానని కుమిలిపోయింది. మూడెళ్ల నుంచి తన శరీరం ఇస్తున్న సంకేతాలను తాను ఎలా నిర్లక్ష్యం చేసిందో గుర్తు తెచ్చుకుంది. కాళ్లలో వచ్చిన బెణుకులు, శరీరంలోని అసాధారణ మార్పులను గమనించడం ప్రారంభించింది. తన అధిక బరువుపై కూడా ఫోకస్ పెట్టింది.మార్పుని బలంగా స్వాగతించడం..వెంటనే అధిక బరువుని నియంత్రణలోకి తెచ్చుకుంటే గనుక తాను ఎదుర్కొనే చిన్న చిన్న అనారోగ్య సమస్యలను అధిగమించొచ్చు అని భావించింది ఉష. ఆ దిశగా వర్కౌట్లు, తీసుకునే ఆహారంపై ధ్యాస పెట్టడమే గాక మంచి జీవనశైలిని అనుసరించింది. ఎలాగైన డయాబెటిస్ని తన శరీరం నుంచి తరిమి కొట్టాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యింది. జస్ట్ 60 రోజుల్లో మాయం...క్రహశిక్షణాయుతమైన జీవనశైలి మార్పులతో కేవలం రెండు నెలల్లోనే తన రక్తంలో చక్కెరస్థాయిలను నార్మల్కి తీసుకొచ్చింది. అంతేగాదు పదినెలలు ఎలాంటి మందులు లేకుండా డయాబెటిస్ని సమర్థవంతంగా నిర్వహించింది. ప్రస్తుతం అత్యంత తక్కువ మోతాదులో డయాబెటిక్ మందులు తీసుకుంటూ..నాన్ డయాబెటిక్గా ఉన్నారామె.వర్కింగ్ విమెన్స్ మేల్కోండి..ఇద్దరు పిల్లలు తల్లి అయిన ఉషా తన శరీరంతో చక్కటి సంబంధాన్ని ఏర్పరుచుకోకపోవడంతో ఇలాంటి ప్రాణాంతక పరిస్థితిని ఎదుర్కొన్నట్లు పేర్కొంది. తనలా ప్రతి వర్కింగ్ ఉమెన్ ఆలోచనా తీరు ఉంటుందన్నారు. ఒక ఏడాది క్రితం నాన్న చనిపోవడంతో అమ్మ ఒంటిరితనం పోగొట్టేలా ధైర్యం చెప్పడం. అలాగే పిల్లలు విదేశాల్లో స్థిరపడటంతో ఏర్పడి ఒంటరితనం అనే సిండ్రోమ్. దీనికి తోడు తాను పనిచేసే 24*7 మీడియాలో లేట్నైట్ డిన్నర్లు వంటి చెడు ఆహారపు అలవాట్లు తన ఆరోగ్యాన్ని పూర్తిగా ప్రమాదంలోకి నెట్టేసిందని చెప్పుకొచ్చారామె. అలాగే మోనోపాజ్ దశలోకి వచ్చిన ప్రతి మహిళ సులభంగా అనారోగ్య సమస్యల బారినపడుతుందని గ్రహించకపోవడం వంటి తప్పిదాలే కారణాలని చెప్పుకొచ్చారు ఉషా. వర్కింగ్ విమెన్స్ ఎవ్వరూ తనలా అంతటి పరిస్థితి తెచ్చుకోవద్దని..ఉద్యోగ కెరీర్ తోపాటు ఆరోగ్యం కూడా ముఖ్యమేనని సూచించారామె.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రేమ ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: హార్ట్ ఫెయిల్యూర్ అంటే..? ఈ పరిస్థితి ఎందువల్ల వస్తుందంటే..) -
‘పెద్దొరిసి’ కేరాఫ్ వెంకటాపురం, రేటెంతో తెలిస్తే షాకవుతారు
కొత్తూరు: పెద్దొరిసి.. ఇదో రకం జాతికోడి. పందేలకు వినియోగించే అరుదైన రకాల్లో ఇదీ ఒకటి. కొత్తూరు మండలం వెంకటాపురం ఇప్పుడు ఈ తరహా కోళ్లకు కేరాఫ్గా మారింది. గ్రామానికి చెందిన గండికోట త్రినాథరావు సుమారు 100 జాతికోళ్లను పెంచుతున్నారు. వీటిని పెంచడం ఆషామాషీ కాదు. పశువైద్యుల పర్యవేక్షణలో ఈ కోళ్లను త్రినాథరావు పెంచుతున్నారు.పగలంతా తోటల్లో ఉంచుతూ సాయంత్రానికి షెడ్ వద్ద కు చేరుస్తారు. నాటుకోళ్లలో అరుదైన ఈ రకానికి మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. రుచి అమోఘం కావడంతో గోదావరి జిల్లాలకు చెందిన వారు అడ్రస్ కనుక్కుని మరీ ఇక్కడకు వచ్చి కోళ్లను కొంటుంటారు. చదవండి: Today Tip బరువు తగ్గాలంటే.. జామ ఆకూ ఔషధమేకోడి బరువు, సైజ్ను బట్టి రెండు వేలు నుంచి రూ. 20 వేలు వరకు కొనుగోలు చేస్తున్నారు. సంక్రాంతి సందర్భాల్లో గోదావరి జిల్లాలతో పాటు పొలకొండ మండలంతో పాటు ఒడిశా నుంచి వస్తుంటారు. గుడ్లను ఇక్కడే పొదిగిస్తుంటామని, ఇతర ప్రాంతాలను నుంచి పిల్లలకు తీసుకురావడం లేదని పెంపకందారు చెబుతున్నారు. ఈ కోళ్ల పెంపకం లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. ఇదీ చదవండి: 900 గంటలు, 180 బటన్స్ : ఆమె స్పెషల్ వెడ్డింగ్ గౌను విశేషాలు -
ఐకానిక్ అవార్డ్ : సినిమాటోగ్రాఫర్కు విజన్ చాలా ముఖ్యం
డైరెక్టర్ విజన్ ఒకటైతే.. సినిమాటోగ్రాఫర్ విజన్ మరోలా ఉంటుంది. సినిమాకు కళను తెచ్చే సినిమాటోగ్రఫీ చేయడం కష్టతరమైన పని.. కానీ నచ్చిన మెచ్చిన పనిలో తన కష్టాన్ని చూపిన కిషోర్ బొయిదాపు(Kishore Boyidapu) ఇంటర్నేషనల్ ఐకానిక్ సినిమాటోగ్రాఫర్ అవార్డు అందుకున్నాడు. ఇటీవలే నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో ‘105 మినిట్స్’ చిత్రానికి అవార్డు లభించింది. తన కుంటుంబ సినిమా నేపథ్యాన్ని, సినిమాటోగ్రఫీ విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నాడు. – బంజారాహిల్స్ బోరబండలోని గాయత్రినగర్కు చెందిన కిషోర్ స్వస్థలం విజయవాడ. ఆయన కుటుంబానిది సినిమా నేపథ్యం. తన ఇద్దరు బాబాయిర్లు ఒకరు ప్రముఖ పీఆర్ఓ దివంగత బీఏ రాజు, మరో బాబాయి కెమెరామెన్ రామ్కుమార్, తన అన్నల్లో ఒకరు కెమెరామెన్ రవి, మరో అన్న అనిల్ దర్శకుడిగా పనిచేస్తున్నారు. కుటుంబం మొత్తం సినిమా నేపథ్యం అవడంతో సినిమాలపై మక్కువతో 2002లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. రవిప్రసాద్ యూనిట్లో మొదట కెమెరా అసిస్టెంట్గా కెరీర్ ప్రారంభించాడు. మెచ్చిన, నచ్చిన పనిలో కష్టాన్ని నమ్మిన కిషోర్ త్వరగానే స్లమ్డాగ్ మిలీనియర్, మిషన్ ఇంపాజిబుల్–4, లెటర్స్, సూటబుల్ బాయ్స్ వంటి హాలీవుడ్ ప్రాజెక్టులకు సెకండ్ యూనిట్ కెమెరామెన్గా ప్రతిభను కనబరిచాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అనిల్ మోహతా ప్రియ శిష్యుడిగా సీక్రెట్ సూపర్స్టార్, ఏ దిల్హై ముష్కిల్, బియాండ్ ది క్లౌడ్స్, హిందీ జెర్సీ వంటి అగ్రచిత్రాలతో పాటు అగ్రహీరోల యాడ్ ఫిల్మ్స్కి సినిమాటో గ్రాఫర్గా సత్తాచాటాడు. కెమెరామెన్గా.. బోయ్ మీట్స్ గరల్స్ చిత్రంతో కెమెరామెన్గా మారిన్ కిషోర్ ‘కిరాక్, వశం, కర్త–కర్మ–క్రియ, 105 మినిట్స్, మైనేమ్ ఈజ్ శృతి’తో పాటు పలు నూతన చిత్రాలకు సినిమాటోగ్రాఫర్గా పనిచేశాడు. 105 మినిట్స్ చిత్రానికి ఐకానిక్ అవార్డు అందుకున్నాడు. ముంబై నుండి నగరానికి షిఫ్ట్ అయిన కిషోర్ తన ఫోకస్ అంతా తెలుగు చిత్రాలపైనే అని పేర్కొన్నాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సినిమాటోగ్రాఫర్గా రాణించడమే లక్ష్యమని తెలిపాడు. -
900 గంటలు, 180 బటన్స్ : ఆమె స్పెషల్ వెడ్డింగ్ గౌను విశేషాలు
లేటు వయసులో లేటెస్ట్గా అంటూ లవ్ బర్డ్స్ అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్,లారెన్ సాంచెజ్ (Lauren Sanchez and Jeff Bezos) వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఇటలీలోని వెనిస్లో శనివారం రాత్రి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, రాజకీయ , వినోద రంగాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరైనారు. ఈ సందర్భంగా 55 ఏళ్ల వధువు వెడ్డింగ్ గౌన్ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది.మాజీ టీవీ యాంకర్ , పైలట్ లారెన్ సాంచెజ్, డోల్స్ & గబ్బానా ఆల్టా మోడా రూపొందించిన గౌనులో మెరిసింది. ఈ పెళ్లి గౌను తయారీకి 900 గంటలు పట్టిందట. అలాగే చేతితో తయారు చేసిన ఇటాలియన్ లేస్,180 సిల్క్ చిఫ్ఫోన్-కవర్డ్ బటన్లుకూడా ఉన్నాయట. హౌస్బోట్ చిత్రంలో నటి సోఫియా లోరెన్ ధరించిన 1950ల నాటి లుక్ ప్రేరణగా దీని డిజైన్ రూపొందించారు. దీని ధర దాదాపు 12 కోట్లు అని అంతర్జాతీయ మీడియా నివేదించింది. అన్నట్టు ఈ గౌను తయారీ వెనుక పెద్ద కథే ఉందట. View this post on Instagram A post shared by Lauren Sánchez Bezos (@laurensanchezbezos)వోగ్ కథనం ప్రకారం ఏప్రిల్లో, సాంచెజ్ బెజోస్ స్థాపించిన బ్లూ ఆరిజిన్స్ స్పేస్ ఫ్లైట్ కంపెనీలో అంతరిక్ష అంచుకు వెళ్లింది. ఈ అనుభవం తనను అనేక విధాలుగా మార్చిందని, అదే తన జీవితంలో మధురమైన క్షణాల సమయంలో ఎలా కనిపించాలో నిర్ణయం తీసుకునేలా చేసిందని తెలిపింది. అంతకుముందు తాను స్ట్రాప్లెస్ డ్రెస్ ధరించాలని ఊహించుకున్నానని సాంచెజ్ చెప్పింది. కాలాతీతంగా, అర్థవంతంగా తన డ్రెస్ ఉండాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. అలాగే తన పెళ్లి రోజున తన గ్లామ్ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది, ఇది గౌను కాదు, కవితా భాగం, మీ మ్యాజిక్కు ధన్యవాదాలు అంటూ మేకర్స్కు ధన్యవాదాలు తెలిపింది.తానేంటో, తన స్టోరీ ఏంటో తెలియజేయాలనే కోరికతోపాటు, 11 నిమిషాలు తన అంతరిక్ష యాత్రకు ప్రత్యేక జ్ఞాపకంగా కొంచెం నీలిరంగులో,ముఖ్యంగా పెళ్లి కూతుళ్లు అదృష్టంగా భావించే వివాహ సంప్రదాయాన్ని జోడించేలా ఈ స్పెషల్ వెడ్డింగ్ గౌన్ను ఎంచుకున్నట్టు వెల్లడించింది. అంతేకాదు ఈ డ్రెస్ను ముందే చూడాలిన జెఫ్ బెజోస్ చాలా వేడుకున్నాడట. కానీ బిగ్ సర్ప్రైజ్గా ఉండాలని లారెన్ సాంచెజ్ దీనికి సున్నితంగా తిరస్కరించిందిట. కాగా 2019నుంచి డేటింగ్లో ఉన్న లారెన్ శాంచెజ్ జెఫ్ బెజోస్, గత ఏడాది నిశ్చితార్థం చేసుకున్నారు. జూన్ 27న పెళ్లి చేసుకున్నారు. View this post on Instagram A post shared by Vogue (@voguemagazine) -
'చార్లీ 777 మూవీ'ని తలపించే స్టోరీ..! ఏకంగా 12 వేల కిలోమీటర్లు..
చార్లీ 777 అనే కన్నడ మూవీ తెలుగు ప్రేక్షకులను ఎంతగా అలరించిందో తెలిసిందే. దర్శకుడు కిరణ్రాజ్ కె తీసిన ఈ మూవీ టైటిల్ లీడ్ రోల్లో చార్లీగా లాబ్రాడర్ కుక్క, హీరోగా రక్షిత్ శెట్టి, నటి సంగీత శృంగేరి తదితరులు నటించారు. ఈ సినిమాలో కొన్ని రోజుల్లో దూరమైపోతున్న ఆ కుక్క డ్రీమ్ని నెరవేర్చి, దాని జ్ఞాపకాలను పదిల పర్చుకోవాలని కోరికతో హీరో రక్షిత్ శెట్టి బైక్పై దాన్ని కూర్చోబెట్టుకుని టూర్లు చుట్టివస్తుంటాడు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య పెనవేసుకున్న ప్రేమానురాగాలు సైలెంట్గా సాగే ఈ మూవీలో హైలెట్గా ఉంటాయి. అచ్చం అలాంటి కథే ఈ బిహార్ వ్యక్తిది. కాకపోతే ఇక్కడ ఈ వ్యక్తి సైకిల్పై తన పెంపుడు కుక్కతో టూర్లు చుట్టొచ్చాడు. అలా ఎంత దూరం వెళ్లాడో తెలిస్తే విస్తుపోతారు. బిహార్కి చెందిన సోను అనే వ్యక్తి, తాను కాపాడిన చార్లీ అనే కుక్కతో భారతదేశం అంతటా సుమారు 12,000 కి.మీ.ల దూరం పైనే పర్యటించాడు. ఒక ప్రమాదంలో గాయపడిన ఆ కుక్కతో అనుకోకుండా అటాచ్మెంట్ పెరిగిపోయింద ఇద్దరికి. అది అతడు ఎక్కడికి వెళ్తే అక్కడకు అనుసరించడంతో ఇలా ఆ కుక్కతో కలిసి ట్రావెల్ చేసినట్లుగా తెలిపాడు. అంతేగాదు అతడు తన ఇంటిని వదిలి ఇప్పటికీ దాదాపు 11 నెలలు పైనే అయ్యిందట. ఇప్పటి వరకు ఇద్దరూ కలిసి రామేశ్వరం, కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించారు. ప్రస్తుతం ప్రయాగ్రాజ్ మార్గంలో ఉన్నట్లు ఇన్స్టాగ్రాంలో షేర్ చేసిన వీడియోలో చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన వీడియోని అంతకుమునుపే పోస్ట్ చేసినప్పటికీ అందులో ఆడియో సరిగా లేకపోవడంతో మరోసారి రీపోస్ట్ చేశాడు సోను. దాంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు కూడా..ఆ కుక్క నిజంగా చాలా అదృష్టవంతురాలు..ఏ కుక్కకి దక్కని అద్భుత అవకాశం లభించింది. బ్రో మీ ఇద్దరి మధ్య పెనవేసుకున్న ప్రేమకి ఫిదా అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Sonu and Charlie 🐶( Bihar 🚴) (@safarmeinrahi) (చదవండి: అమెరికా ఆఫీసులో భారతీయ మహిళ ఆకలి తిప్పలు..! పాపం ఆ రీజన్తో..) -
International Asteroid Day: గ్రహశకలం నేలను ఢీ కొంటే..!
ఆస్టరాయిడ్స్ (Asteroids)అంటే గ్రహ శకలాలు. ఇవి సూర్యుని చుట్టూ దీర్ఘవలయాకార కక్ష్యలో తిరుగుతుంటాయి. గురు గ్రహానికీ, అంగారక గ్రహానికీ మధ్యగల మండ లంలో ఇవి ఎక్కువగా ఉన్నాయి. 2016 డిసెంబర్లో ప్రతి ఏడాదీ జూన్ 30వ తేదీని అంతర్జాతీయ గ్రహ శకల దినోత్సవం (International Asteroid Day ) గా జరపాలని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఇది 1908 జూన్ 30న రష్యాలోని సైబీ రియా ప్రాంతంలో ఉన్న తుంగస్కా నదిపై జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకునే వార్షికోత్సవంగా చెప్ప వచ్చు. ఈ నదిపై ఓ గ్రహశకలం పేలిపోయింది. పెద్ద ్రVýæహశకలం ఒకటి గంటకు 53,913 కిలోమీటర్ల వేగంతో వాతావరణాన్ని ఢీకొట్టింది. ఈ గ్రహశకలం వాతావరణంలో ప్రవేశించడం వలన ఏర్పడిన ‘రాతి విస్ఫోటనం’ ధర్మో న్యూక్లియర్’ పేలుడు అని గమనించారు. ఈ పేలుడు వలన విస్తారమైన అటవీ ప్రాంతంలోని చెట్లన్నీ కూలి పోయాయి. ఈ పేలుడులో విడుదలైన శక్తి 1,000 హిరోషిమా అణుబాంబు లకు సమానం. అయినా అక్కడ ఎటు వంటి బిలం ఏర్పడలేదు. అంటే గ్రహ శకలం భూమిని ఢీకొట్టకుండా వాతావరణంలో పేలి పోయిందన్నమాట. ఈ సమయంలో ప్రకాశవంత మైన కాంతి, పెద ్దశబ్దాలు, భూప్రకంపనలు పశ్చిమ ఐరోపా వరకు నమోదు అయ్యాయి. ‘గ్రహశకలాలు – అవి భూమి చరిత్రలో, భవి ష్యత్తులో పోషించే పాత్ర, దానిపై అవగాహన కల్పించడంపై దృష్టి పెట్టడం’ ఈ ఏడాది దినోత్సవ ఇతివృత్తం. అంటే ఈ రోజున గ్రహ శకలాల ద్వారా సంభ వించే ప్రమాదాల గురించి అవగాహన పెరిగేందుకు ప్రపంచవ్యాప్తంగా సదస్సులు, ప్రదర్శనలు జరుపు తారు. గ్రహ శకలాల వల్ల కలిగే ప్రమాదాల నుండి భూమిని రక్షించుకోవడానికి చేపట్టాల్సిన చర్యల గురించి చర్చిస్తారు. ఏటా దాదాపు 17,000 గ్రహశకలాలు భూమి వైపు పడతాయని ఒక అంచనా. ఇవి వాతావరణంలో ప్రవేశించిన తరువాత చిన్న కణాలు లేదా దుమ్ముగా మారి పోతాయి. అందువల్ల అవి మనకు కన్పించవు. అను దినం 44,000 కిలోల గ్రహశకలాల పదార్థం భూమిపై పడుతుందని ఒక అంచనా. గ్రహశకలం నేల వైపు పడేటప్పుడు ముందుగా అది వాతావరణంలోకి వస్తుంది. వాతావరణంతో కలిగే ఘర్షణ వల్లఈ రాతి ముక్క బాగా వేడెక్కుతుంది. చివరకు అది కాలిపోయి ఆవిరిగా మారుతుంది.ఈ క్రమంలో ఆకాశంలో ప్రకాశవంతమైన గీత కన్పిస్తుంది. మన వాతా వరణం చాలా గ్రహశకలాలను ఇలా నాశనం చేస్తుంది కాబట్టి దాదాపు 95 శాతం ఈ రాతి ముక్కలు భూమిని చేరవు. ఈ విధంగా వాతావరణం గ్రహశకలాల బారి నుండి భూమిని కాపాడుతోంది. గ్రహశకలం భూమిని తాకితే వాతావరణంలో దుమ్ము, పొగ పెరుగుతాయి. వీటివల్ల ఆ ప్రాంతంలో సూర్యరశ్మి చేరక ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. ఫలితంగా అనేక జీవులు మరణిస్తాయి. ఒక అపార్టుమెంటు పరిమా ణంలో ఉన్న గ్రహశకలం భూమిని తాకితే ఒక చిన్న నగరం నాశనం అయిపోతుంది. – డా. సి.వి. సర్వేశ్వర శర్మ ,పాపులర్ సైన్స్ రచయిత -
Secret of Happiness: ఆనంద రహస్యం
తొండమనాడు రాజు ఓ పర్వదినాన శేషాచలం కొండలలోని అద్భుత సహజ శిల్పకళా చమత్కారమైన తుంబురు తీర్థం దర్శించడానికి వెళ్ళాడు. సనక సనంద తీర్థం, నల్లగుండాల మీదుగా దట్టమైన అటవీలోయలో నడుచుకుంటూ తుంబురు తీర్థం చేరాడు. భూ పరిణామ క్రమంలో భాగంగా ఓ కొండ కొబ్బరిచిప్పలా రెండుగా విచ్చుకుని చివర్లో జలజల ΄ారుతున్న తుంబురు తీర్థం జలపాతాన్ని చూస్తూ గంటలకొద్దీ గడిపినాడు. పక్కనే వున్న తరిగొండ వెంగమాంబ గుహ వద్ద వున్న నిశ్చలానంద స్వామిని దర్శించుకున్నాడు.తనకు అష్టైశ్వర్యాలున్నా ఎందులోనూ ఆనందం కనిపించడం లేదని బాధను వ్యక్తం చేశాడు. నిశ్చలానంద స్వామి చిరునవ్వు నవ్వాడు. అప్పుడే కాలినడకన కొందరు భక్తులు గోవిందలు చెప్పుకుంటూ తిరుమల కొండకి నడిచి వెళుతున్నారు. వారు నడిచి నడిచి అలసిపోయి ఉన్నారు. వారికి కడుపు నిండా అన్నం పెట్టి, వారు భోజనం చేసి వెళ్లేటప్పుడు రాజును వారి కళ్ళలోకి చూడమన్నాడు.వెంటనే రాజు తనతో వచ్చిన వంటవాళ్లను, భటులను పురమాయించి చకాచకా వంటలు చేయించాడు. వేడివేడిగా అరటి ఆకులో వడ్డించిన వంటలను కాలి నడక భక్తులు ఆవురావురుమని తినసాగారు. అలా తింటున్న వారిని చూస్తున్న రాజుకు తాను తినకుండానే కడుపు నిండిపోయినట్లనిపించింది.భోజనమయ్యాక భక్తులు ఒక్కొక్కరూ వచ్చి ‘అన్నదాతా సుఖీభవా’ అని చెప్పి వెళ్తుంటే రాజు తృప్తిగా తియ్యటి గుటకలు మింగాడు. రాజు ముఖంలోకి మెరుపు వచ్చింది. తనకి తెలియకుండానే కళ్ల నుంచి ఆనంద భాష్పాలు రాలాయి. అదే అదునుగా భావించిన నిశ్చలానంద స్వామి ‘‘మనం ఒకరికి ఏదైనా ఇస్తున్నామంటే మనం శక్తి మంతులమవుతున్నామని గుర్తుంచుకోవాలి. అందుకే మనం ఎవరికైనా ఏదైనా ఇవ్వడంలో సహజమైన ఆనందం వుంటుంది. తీసుకోవడం కన్నా ఇవ్వడంలో వున్న ఆనందం పదింతల గొప్పది’’ అని ఇవ్వడంలో వున్న గొప్పదనాన్ని రాజుకు విశదీకరించి చెప్పినాడు. ఆనంద రహస్యం ఇవ్వడంలోనూ.... దాన గుణంలోనూ వుందని గుర్తించిన రాజు మరిన్ని దానాలు చేయాలని నిర్ణయించుకుని స్వామి పాదాలకు నమస్కరించి తన రాజ్యానికి బయలుదేరాడు. -
ఆద్యంతం.. ఆసక్తికరం ఈ ఆరు రోజుల టూర్..!
మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ దర్శనం. ప్రాచీన కోటల సందర్శనం. సాంచి బౌద్ధ స్థూపం వీక్షణం. ఇండోర్ లాల్బాగ్ ప్యాలెస్. ఉజ్జయిని మహాకాలేశ్వరుడు. భోపాల్ ఆదివాసీ ఆద్యకళల నిలయం. నర్మద తీరాన అహిల్యాబాయి కోట. ఇంకా... ఇంకా ఈ టూర్లో.1వ రోజుసంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ (12707) సాయంత్రం నాలుగన్నరకు కాచిగూడ స్టేషన్లో బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం.2వ రోజురైలు ఉదయం 08:15 గంటలకు భోపాల్ రైల్వే స్టేషన్కు చేరుతుంది. రైలు దిగి హోటల్ గదిలో చెక్ ఇన్, ఫ్రెష్ అప్ అయిన తర్వాత రోడ్డు మార్గాన సాంచి స్థూపానికి ప్రయాణం. ఆ తర్వాత భోజేశ్వర్ మహాదేవ్ ఆలయ దర్శనం చేసుకుని తిరిగి భోపాల్కు రావాలి. భోపాల్లోని ట్రైబల్ మ్యూజియం వీక్షణం. రాత్రికి హోటల్లో బస.అశోకుడి పెళ్లి మండపం!సాంచి స్థూపం బౌద్ధ క్షేత్రాల్లో ప్రధానమైనది. మన ప్రాచీన నిర్మాణ శాస్త్ర విజ్ఞానానికి ప్రతీక. యునెస్కో గుర్తించిన వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరానికి 45 కిలోమీటర్ల దూరాన ఉంది. ఇది క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నాటి నిర్మాణం. ఈ చారిత్రక నిర్మాణం మౌర్య, బౌద్ధ వాస్తుశైలిల సమ్మేళనం. బుద్ధుని అవశిష్టాన్ని ప్రతిష్ఠించి నిర్మించారు. స్థూపానికి దక్షిణ ముఖ ద్వారానికి దగ్గరగా సాంచి ఆర్కియలాజికల్ మ్యూజియం ఉంది. ఇందులో నాలుగు సింహాల అశోకుని రాజముద్ర, ధర్మచక్రం ఉన్నాయి. అశోక చక్రవర్తి బౌద్ధాన్ని స్వీకరించిన తర్వాత చేసిన గొప్ప నిర్మాణాల్లో ఇది ముఖ్యమైనది. ఇది అశోకుని భార్య దేవి పుట్టిన ప్రదేశం, వారి వివాహం జరిగిన ప్రదేశం కూడా ఇక్కడికి పది కిలోమీటర్ల దూరానున్న విదిశ.. రెండు వందల రూపాయల కరెన్సీ నోట్ను వెనక్కి తిప్పి చూడండి. సాంచిలోని బౌద్ధస్థూపం కనిపిస్తుంది.భోపాల్ మ్యూజియం – ఆదివాసీల ఆద్యకళ (ఆద్యకళా నిలయం)మధ్యప్రదేశ్లో నివసించే ఆదివాసీలు, వారి జీవనశైలికి ఒక మీనియేచర్ రూపమే ఈ ట్రైబల్ మ్యూజియం. ఇందులో స్థానికంగా నివసించే గోంద్, భిల్, భారియా, సహారియా, కోర్కు, కోల్, భైగా ఆదివాసీ జాతుల రోజువారీ వస్తువులు, కళాకృతులు ఉన్నాయి. ఆదిలాబాద్లోని ఆదివాసీలు తయారు చేసే ఢోక్రా శైలి ఇత్తడి బొమ్మలు కూడా ఉన్నాయి. ఆదివాసీలు ధాన్యం నిల్వచేసుకోవడానికి అడవిలోని చెట్ల తీగలతో అల్లిన పెద్ద పెద్ద బుట్టలు ఉంటాయి.భోజ్పూర్ ఈశ్వరుడుభోజేశ్వర మందిరం... ఉన్న ప్రదేశం పేరు భోజ్పుర్. ఇది చిన్న గ్రామం. పారమార రాజు భోజుడు నిర్మించిన ఆలయం ఇది. అయితే ఇక్కడ ఆలయ నిర్మాణం పూర్తయినట్లు కనిపించదు. అర్ధంతరంగా ఆగి΄ోయిందా లేక నిర్మాణం విధ్వంసానికి గురైందా అనే సందేహం వస్తుంది. ఆలయ ప్రాంగణంలో అక్కడక్కడా శిల్పాల విడిభాగాలు కనిపిస్తాయి. ఆ విడిభాగాలు క్షతగాత్రాలు కాదు. ఒక పెద్ద శిల్పం ఆకారం ఉంటుంది, కానీ మెరుగులు లేక అసంపూర్తిగా కనిపిస్తుంది. బహుశా ఈ ఆలయ నిర్మాణాన్ని తలపెట్టిన తర్వాత అనుకోని కారణాలతో నిర్మాణం ఆగి΄ోయి ఉండవచ్చని చరిత్రకారుల అంచనా. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీనిని నిశితంగా పరిశోధించి మాన్యుమెంట్ ఆఫ్ నేషనల్ ఇం΄ార్టెన్స్గా గుర్తించింది. ఏటా ఇక్కడ శివరాత్రి వేడుక అంబరాన్ని తాకుతుంది.3వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్, ఉజ్జయినికి ప్రయాణం. ఉజ్జయినిలో హోటల్ చెక్ ఇన్. మహాకాలేశ్వర్ ఆలయం, హర్సిద్ధి ఆలయం, మంగళ్నాథ్ ఆలయం, నవ్గ్రహ శని మందిర్, శ్రీచింతామన్ గణేశ్ టెంపుల్, రామ్ఘాట్, శ్రీగద్కాలిక టెంపుల్ దర్శనం, రాత్రికి ఉజ్జయినిలోనే బస.క్షతగాత్ర ఉజ్జయినిప్రాచీనకాలం నుంచి ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం ఇది. పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఉజ్జయిని ఒకటి. ద్వాదశ జ్యోతిర్లింగం కూడా. సతీదేవి దేహంలో పై పెదవి పడిన ప్రదేశం ఉజ్జయిని అని చెబుతారు. మహాకాలేశ్వరుడి ఆలయం కూడా ఇక్కడ ప్రసిద్ధి. గుజరాత్ లోని సోమనాథ్ ఆలయం లాగానే ఇది కూడా విధ్వంసాల బారిన పడిన ఆలయం. ఢిల్లీ పాలకుడు ఇల్టుట్మిష్ తన రాజ్యవిస్తరణలో భాగంగా ఉజ్జయిని మీద దండెత్తి విజయం సాధించిన సందర్భంగా ఇక్కడి ప్రాచీన ఆలయాన్ని ధ్వంసం చేశాడు. జ్యోతిర్లింగాన్ని ముక్కలు చేసి సమీపంలోని కోటితీర్థ కుండ్లో విసిరివేశాడని చెబుతారు. మరాఠా రాజోద్యోగి రామచంద్ర బాబా సుఖ్తాంకర్ పునర్నిర్మాణం చేశాడు. కానీ అది కూడా జలాలుద్దీన్, అలాఉద్దీన్ ఖిల్జీల దాడికి గురైంది.ఈ శని క్షేత్రం త్రివేణీ సంగమంనవగ్రహ శని మందిర్ ఉజ్జయినికి ఎనిమిది కిలోమీటర్ల దూరాన ఉంది. ఇక్కడ క్షిప్ర, గండకి, సరస్వతి నదులు కలుస్తాయి. ఈ ప్రదేశాన్ని త్రివేణీ ఉజ్జయిని అంటారు. సాధారణంగా శివాలయం లేదా ఇతర ఆలయాల్లో నవగ్రహాల వేదిక ఉంటుంది. ఇక్కడ నవగ్రహాల కోసమే ఓ ఆలయం ఉంది.సీతమ్మ కొలిచిన గణేశుడుఈ ఆలయం ఉజ్జయినికి ఏడు కిలోమీటర్ల దూరాన ఫతేహాబాద్లో ఉంది. స్వయంభువుగా వెలిసిన ఈ గణేశుడిని కొలిస్తే మనసులోని చింతలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. రామాయణ కాలంలో సీతాదేవి ఈ ప్రదేశంలో కొంతకాలం నివసించిందని, ఆ సమయంలో ఈ గణేశుడిని ప్రార్థించినదని చెబుతారు. ఇక్కడి క్షిప్రానది తీరాన రామ్ఘాట్ కూడా ఉంది. 4వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్, మహేశ్వర్కు ప్రయాణం. అహిల్యాదేవి కోట, నర్మద ఘాట్ దర్శనం తర్వాత ఓంకారేశ్వర్కు ప్రయాణం. ఓంకారేశ్వర్లో హోటల్ లో చెక్ ఇన్ అయిన తర్వాత నడకదూరంలో ఉన్న ఆలయాలను దర్శించుకోవచ్చు. నదిలో పడవ ప్రయాణం చేయవచ్చు. రాత్రి బస ఓంకారేశ్వర్లో.రాతికి పూచిన పూలురాణి అహిల్యాబాయి కోట మహేశ్వర్ పట్టణంలో ఉంది. దాంతో మహేశ్వర్ కోటగా వ్యవహారంలోకి వచ్చింది. ఇది మొత్తం గ్రానైట్ స్టోన్తో చేసిన మరాఠా శైలి నిర్మాణం. నర్మద నది తీరాన శత్రుదుర్భేద్యంగా నిర్మించడమే కాక అత్యంత సునిశితమైన నైపుణ్యంతో నగిషీలు చెక్కారు. కోటలోని ప్యాలెస్ల గోడలకు చెక్కిన పూలు అప్పుడే విచ్చుకున్నట్లున్న తాజా పూల తోరణాల్లా ఉంటాయి. రాతికి పూచిన ఈ పూలు నాటి శిల్పకారుల నైపుణ్యాన్ని నేటి తరానికి తెలియచేస్తున్న ప్రతిబింబాలు. ఈ కోట స్త్రీసాధికారతకు ప్రతీక. రాణి అహిల్యాబాయ్ హోల్కర్ క్రీ.శ 1765 నుంచి 1796 వరకు మాల్వా రాజ్యాన్ని పాలించారు. ఈ కోటలో ఉన్న రాణి ప్యాలెస్ను మ్యూజియంగా మార్చారు. అందులో ఆమె ఆహార్యం, జీవనశైలితోపాటు పాలన రీతి కూడా కళ్లకు కడుతుంది. ఆమె వారసుడు ప్రిన్స్ రిచర్డ్ హోల్కర్ ఈ కోటలోని అహిల్యాబాయి వాడాను హెరిటేజ్ హోటల్గా మార్చారు. మహేశ్వరలో నర్మదాతీరాన విహరిస్తూ అనేక ఆలయాలు, చారిత్రక నిర్మాణాలను దగ్గరగా వీక్షించవచ్చు. 5వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్, ప్రయాణం ఇందోర్ వైపు సాగుతుంది. ఇందోర్లో లాల్బాగ్ ప్యాలెస్, ఖజ్రన గణేశ్ మందిర్ దర్శనం తర్వాత రాత్రి ఎనిమిది గంటలకు ఇందోర్ రైల్వేస్టేషన్కు వచ్చి ట్రైన్ నంబర్ 19301 అంబేద్కర్ నగర్– యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ ఎక్కాలి. ఎనిమిది గంటలకు రైలు బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం.లాల్బాగ్ గులాబీల తోటఇందోర్లోని లాల్బాగ్ ప్యాలెస్ కూడా హోల్కర్ రాజవంశ నిర్మాణమే. యాభై ఏళ్ల కిందటి వరకు ఆ రాజవంశమే ఇందులో నివసించింది. ప్రభుత్వ నిర్వహణలో ఉంది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీనిని మ్యూజియంగా మార్చింది. ఈ ప్యాలెస్లోకి వెళ్లే ముందు మెయిన్ గేట్ నిశితంగా పరిశీలించాలి. యూరోపియన్ శైలిలో బకింగ్హామ్ ప్యాలెస్ను తలపిస్తుంది. ఇక భవనంలోపలి గదులు కూడా ప్రాచ్య ప్రాచాత్య కలబోతగా ఉంటాయి. 76 ఎకరాల్లో విస్తరించిన ప్యాలెస్ ప్రాంగణమంతటినీ చూడడం కష్టమే. కానీ ఇరవై ఎకరాల రోజ్ గార్డెన్ను మిస్ కాకూడదు. అహిల్యాబాయి వాడాను ఆమె వారసుడు హోటల్గా మార్చాడని చెప్పుకున్నప్పుడు అతడి పేరు ప్రిన్స్ రిచర్డ్ హోల్కర్ అని చెప్పుకున్నాం. అప్పుడు కలిగిన సందేహానికి సమాధానం ఈ ప్యాలెస్లో లభిస్తుంది. హోల్కర్ రాజవంశానికి చెందిన తుకోజీరావ్ హోల్కర్ మూడవ భార్య అమెరికన్. పేరు నాన్సీ అన్నే మిల్లర్. తుకోజీ మరణం తర్వాత ఆమె అమెరికాకి వెళ్లిపోయారు. మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ్ దర్శన్ (ఎస్హెచ్ఆర్ 097). ఇది ఆరు రోజుల యాత్ర. భోపాల్, ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ఇందోర్ ప్రదేశాలను సందర్శించవచ్చు. హైదరాబాద్, కాచిగూడ స్టేషన్ నుంచి ట్రైన్ నంబరు 12707, సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ బుధవారం సాయంత్రం నాలుగన్నరకు బయలుదేరుతుంది. ఇది వీక్లీ టూర్. కంఫర్ట్ (థర్డ్ ఏసీ)లో సింగిల్ షేరింగ్కి 36 వేలకు పైగా అవుతుంది. ట్విన్ షేరింగ్లో ఒక్కొక్కరికి 20వేలు దాటుతుంది. ట్రిపుల్ షేరింగ్లో ఒక్కొక్కరికి దాదాపుగా 16 వేలవుతుంది. నలుగురు నుంచి ఆరుగురు వరకు బృందంగా ప్రయాణం చేస్తే మరికొంత తగ్గుతుంది.స్టాండర్డ్ (స్లీపర్) కేటగిరీలో సింగిల్ షేరింగ్ సుమారు 34 వేలు, ట్విన్ షేరింగ్లో ఒక్కొక్కరికి సుమారు 18 వేలవుతుంది. ట్రిపుల్ షేరింగ్లో ఒక్కొక్కరికి సుమారు 14 వేలవుతుంది.టూర్ కోడ్:https://www.irctctourism.com/pacakage_descriptionpackageCode=SHR097(చదవండి: పర్యాటకుల తాకిడితో ఉక్కిరిబిక్కిరి అయ్యే టాప్ 10 ప్రదేశాలివే..!) -
పచ్చదనానికి 'మియావాకీ'..
నగరంలోని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు తమ ప్రాంగణాలను పచ్చగా మార్చేందుకు శ్రద్ధ చూపిస్తున్నాయి. ఈ క్రమంలో జపనీస్ టెక్నిక్ అయిన మియావాకీ అత్యుత్తమ అనుసరణీయ విధానంగా మారింది. గత ఐదేళ్లుగా ఈ విధానం ఊపందుకోవడంతో నగరం నలుదిశలా ఇప్పుడు పచ్చగా ప్రతిఫలిస్తున్నాయి. ఓ వైపు పెరుగుతున్న కాలుష్యం.. మరోవైపు వాతావరణంలో ఏర్పడుతున్న సమతుల్యత వెరసి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో పచ్చదనం ఆవశ్యకతపై అవగాహన పెరుగుతోంది.. దీంతో విస్తారంగా మియావాకీ అడవుల పెరుగుదలకు దోహదపడుతోంది. తనను తాను పోషించుకునే, పెంపొందించుకునే సత్తా ఉన్న మియావాకీకి స్వల్పకాలం మాత్రమే పోషణ అవసరం. దీంతో పచ్చని ప్రదేశాలను విస్తరణ కోసం మియావాకీ అటవీకరణ విధానం ప్రస్తుతం విస్తృతంగా ఆదరణ పొందుతోంది. జపనీస్ వృక్ష శాస్త్రజ్ఞుడు అకిరా మియావాకీ అభివృద్ధి చేసిన డెన్స్ నేటివ్ మినీ ఫారెస్ట్ కాన్సెప్ట్ ఈ విధానంలో భాగంగా ఒక చిన్న ప్రాంతంలో వివిధ రకాల స్థానిక చెట్ల జాతులను దగ్గరగా నాటడం జరుగుతోంది. ఫలితంగా దట్టమైన, వేగంగా పెరిగే అడవులు ఏర్పడనున్నాయి. దీనిని విజయవంతంగా అనుసరిస్తూ నగరంతో పాటు చుట్టుపక్కల అనేక మియావాకీ అడవులు పచ్చగా వరి్థల్లుతున్నాయి. జయహో గ్రీనరీ.. ప్రభుత్వ హరితహారం కార్యక్రమంతో పాటు, పెద్ద ఎత్తున అటవీకరణ ప్రాజెక్టుల కోసం అనేక ప్రయివేటు సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు మియావాకీ పద్ధతిని అవలంభిస్తున్నాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా గచ్చిబౌలి స్టేడియం సమీపంలో ఉన్నటువంటి పలు కంపెనీలు మియావాకీ తోటల పెంపకంలో తాము కూడా పాల్గొంటున్నాయి. ప్రముఖ బయోఫిలిక్ డెవలపర్ ఎకో–రియాల్టీ ఫర్మ్గా పేర్కొంటున్న స్టార్టప్ స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్, ప్రపంచంలోనే అతిపెద్ద మియావాకీ అటవీప్రాంతాన్ని శంషాబాద్లో అభివృద్ధి చేసింది. ప్రస్తుతం దీనిని అదనంగా 100 ఎకరాల్లో విస్తరించనున్నారు. రాచకొండ పోలీసులు 40,000 మొక్కలతో మియావాకీ తోటను ఏర్పాటు చేశారు. ఇది ఇప్పుడు దట్టమైన అడవిగా పెరిగింది. కొత్తపేటలో 10 ఎకరాల మియావాకీ పార్కును కూడా అభివృద్ధి చేస్తున్నారు. రైల్వే శాఖ ఆధ్వర్యంలో నార్త్ లాలాగూడలోని శాంతినగర్ రైల్వే కాలనీలోనూ ఈ పద్ధతిలో మొక్కలు నాటారు.. దీనిలో సే ట్రీస్ ఎరాన్మెంటల్ ట్రస్ట్ అనే ఎన్జీఓ కూడా భాగం పంచుకుంది. హైదరాబాద్ యూనివర్సిటీలో 4వేల మొక్కలతో మినీ ఫారెస్ట్ను సృష్టించారు. రెండేళ్లలో స్వయం పోషకంగా.. వ్యక్తిగత ఆసక్తితో బెంగళూరులో దీని కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 15 ప్రాజెక్టుల అభివృద్ధిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలు పంచుకున్నాను. మియావాకీ పద్ధతిలో మొక్కల పెంపకం వల్ల ప్రధాన ప్రయోజనం ఏమిటంటే కేవలం రెండేళ్ల స్వల్ప కాలంలోనే ఇవి స్వయం పోషకాలుగా మారతాయి. ఆ తర్వాత వాటి పరిరక్షణకు ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ విధానానికి తగినట్టుగా మొక్కలు పెంచే స్థలంలో పలు రకాల మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఒక శాస్త్రీయ పద్ధతి ప్రకారం జరుగుతుంది. అలాగే ఈ విధానంలో తొలి దశలో వ్యయప్రయాసలు కూడా ఎక్కువే ఉంటాయి. – మహేష్ తలారి, ఎన్జీఓ ఎవర్గ్రీన్ ఎగెయిన్, మియావాకీ నిపుణులు మియావాకీ విశేషాలు.. మియావాకీ పద్ధతి తక్కువ సమయంలో దట్టమైన అడవులను సృష్టించగలదు. ఈ విధానంలో చెట్లు 10 రెట్లు వేగంగా పెరుగుతాయి అంతేకాక ఈ అడవి సంప్రదాయకంగా నాటిన అడవుల కంటే 30 రెట్లు దట్టంగా ఉంటాయి. ఈ చిన్న అడవులు వివిధ జాతుల పక్షులు, సీతాకోక చిలుకలు, ఇతర వన్యప్రాణులను ఆకర్షించడానికి జీవవైవిధ్యానికి దోహదం చేస్తాయి. ప్రధాన మియావాకీ సూత్రాలను అనుసరిస్తూ స్థానిక నేల వృక్షజాతులకు అనుగుణంగా మార్పు చేర్పులు చేస్తున్నారు. -
అనుభవసారం
పెద్దల సూచనలు, సలహాలు స్వీకరించడం అంటే, యువతకు ఏమీ తెలియదని కాదు. మారుతున్న కాలగతిలో, సాంకేతిక పురోగతిలో తమకున్న పరిజ్ఞానానికి గురువులు అందించే సూచనలు ఆచరిస్తే, కలిగే ప్రయోజనమే వేరు. ఈ విధమైన సమన్వయం తో జీవితాన్ని నడిపే యువత అత్యంత ప్రతిభాశాలురుగా నిలవడం మనకు తెలిసిన విషయమే.పాండవ మధ్యముడైన అర్జునుడు మిగిలినపాండవుల మాదిరిగా, కౌరవుల మాదిరిగా అందరిలాంటి యోధుడే. కానీ,పార్థునిలో ఉన్న విశేషగుణం విలువిద్యలో అతనికొక ప్రత్యేకతను సంతరించింది. చీకటిలో కూడా బాణాలు వేయగలగడం, శబ్దాన్ని అనుసరించి అస్త్రాలను సంధించడం, ఎడం చేతితోనూ బాణాన్ని అవలీలగా ఉపయోగించగలగడం వంటివి గురువు చెప్పిన సూచనలనుపాటించడం ద్వారా గొప్ప విలుకాడయ్యాడు.ద్రోణుడు తాను అస్త్రవిద్యను నేర్చుకునే సందర్భంలో ఎదుర్కొన్న సమస్యలను అర్జునునికి తెలపడం, అర్జునుడు ఆ సమస్యలను ఎలా అధిగమించాలి అన్న విషయాన్ని గురువు చెప్పిన విధంగాపాటించడం చేశాడు. నిత్యమూ జరిగే, సాధారణమైన అస్త్ర బోధన పూర్తి చేశాక గురువు చెప్పిన విషయాలను తేలికగా తీసుకోక,అత్యంత నిజాయితీగా ఆచరణలో పెట్టి సవ్యసాచిగా నిలిచి, యువతకు నేటికీ చక్కటి ఉదాహరణగా నిలిచాడు.పెద్దలు లేక గురువులు మనకు ఏదైనా విషయాన్ని బోధిస్తే, అది మన మంచికే అన్న సంగతిని యువత ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అనుభవంతో వారు చెప్పే మాటల్లో వెలకట్టలేని విలువైన సమాచారం దాగి ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు వాటినిపాటిస్తే జీవితంలో వచ్చే ఎన్నో సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. గురువు అంటే వయసులోనే పెద్దవాళ్ళు కాదు, ఎంతో అనుభవం తమ సొంతం చేసుకున్నవారు. ఎన్నో సంక్లిష్ట పరిస్థితులను దాటి ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు. పరిణామ క్రమంలో కాలంలో వచ్చే మార్పులో, అలవాట్ల విషయంలో గురువులకూ, శిష్యులకూ కొంత భేదం తప్పకుండా ఉంటుంది.అంత మాత్రాన మన జీవితానికి సంబంధించి వాళ్ళు చెప్పే విషయాలనుపాత చింతకాయ పచ్చడి అన్న చందాన పరిగణించకూడదు. ఎందుకంటే, వాళ్ళు మనకు మంచిని బోధించే సమయంలో గానీ, ఏదైనా సూచనలు, సలహాలు ఇచ్చినప్పుడు గానీ, గతంలో తమకు ఎదురైన అనుభవాలను ఉదాహరణలుగా బోధించడం మనకు తెలిసిన విషయమే. యువత గమనించవలసినది ఏమిటంటే, ఒక ప్రత్యేకమైన సమస్య చదువులో కానీ, తమ జీవితానికి సంబంధించి గానీ ఎదురైనప్పుడు పెద్దవాళ్ళతో లేక గురువులతో చర్చిస్తే, దానివల్ల ఒనగూడే లాభమే వేరు. దాదాపుగా ఇటువంటి సమస్యనో, ఉత్పాతాన్నో గతంలో వాళ్ళు ఎదుర్కొనే ఉంటారు కాబట్టి, వెంటనే ఆ గడ్డు సమస్యను ఏ విధంగా అధిగమించాలో మనకు చక్కగా సూచిస్తారు.నిత్య జీవితంలో ఎన్నో సమస్యలతో, సందేహాలతో సతమతమయ్యే నరేంద్రుడు, గురువైన రామకృష్ణులు అనుభవంతో చెప్పిన ప్రతిపాఠాన్ని అత్యంత శ్రద్ధతో విని, వారు చెప్పిన సూచనలను చక్కగా ఆచరణలో పెట్టాడు. మహితమైన తన లక్షణాలతో జాతి మొత్తం గర్వించే స్వామి వివేకానందగా అందరి మన్ననలూ నిత్యమూ అందుకుంటున్నాడు. నరేంద్రుడు తెలివైనవాడే అయినా, పెద్దరికంతో గురువుగా రామకృష్ణులు చెప్పిన మాటలను అత్యంత వినయవిధేయతలతో అనుసరించాడు కాబట్టే, భరతజాతి మొత్తానికే ఆదర్శ్రపాయుడయ్యాడు.నేటి తరంలో ఈ పంథాలో చక్కగా చెప్పుకోగలిగే ఒక ఉదాహరణ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. సచిన్ చిన్నతనంలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టినా, క్రికెట్ ఆటలో తనకున్న ప్రతిభకు గురువు చెప్పే సూచనలకు ఎంతో విలువిచ్చి, తన బ్యాటింగ్ టెక్నిక్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాడు. ఫలితంగా ప్రత్యర్థి ఎవరైనా, బౌలర్ ఎవరైనా సచిన్ నిర్భీతితో బ్యాటింగ్ చేసిన విధం విశ్వమంతా ఎరిగిన విషయమే. చివరికి తన ఆట తీరుకు, అద్భుత బాటింగ్ శైలికి సచిన్ ‘క్రికెట్ దేవుడు’ గా పేరు పొందాడు. ఈ విధంగా చెప్పుకుంటూపోతే, ఎన్నో చక్కటి ఉదాహరణలు మనకు తారసపడతాయి.అందుకే గురువులు తమ అనుభవసారంతో చెప్పే సలహాలు, వాటిని నిజాయితీగాపాటించే యువతకు విజయహారంగా మారతాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. – వ్యాఖ్యాన విశారద వెంకట్ గరికపాటి -
అమ్మ కోసం కుమార్తె ఆవిష్కరణ..కట్చేస్తే ఆమె..
తల్లి కోసం ఆ కూతురు రూపొందించిన ఆవిష్కరణ తనకు ఇంతలా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతుందని కలలో కూడా ఊహించిలేదు ఆ కూతురు. అమ్మపై ఉన్న ప్రేమ తనలోని మేథస్సుని మేల్కొలిపి ఆవిష్కరణకు నాంది పలికేలా చేసింది చివరికి అదే తనను జపాన్ దేశానికి వెళ్లేలా చేసి..వార్తల్లో నిలిచేలా చేసింది. ఆ అమ్మాయే కృపాలి సునీల్. కేంద్రీయ విద్యాలయ విద్యార్థినిగా కృపాలి సాధించిన అద్భుత విజయం ఇది. పదోతరగతి చదువుతున్న ఆమె వెన్నునొప్పితో బాధపడుతున్న తన తల్లికి సాయం చేయాలని రూపొందించిన ఆవిష్కరణే ఇది. తల్లి వెన్నునొప్పి కారణంగా బరువైన వస్తువులు ఎత్తలేదు కాబట్టి వాటిని సులభంగా లిఫ్ట్ చేసేలా ఒక యంత్రాన్ని తయారు చేయాలని భావించింది. అనుకుందో లేదా వెంటనే బరువైనా వస్తువులను సులభంగా ఎత్తడంలో సహాయపడే పోర్టబుల్ ఎలివేటింగ్ పరికరాన్ని రూపొందించింది. ఆ ఆవిష్కరణ జపాన్ దేశాన్ని అమితంగా ఆవిష్కరించింది. అంతే ఈ నెల జూన్ 21 నుంచి 25 వరకు జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ నిర్వహించిన సాకురా సైన్స్ హై స్కూల్ ప్రోగ్రామ్లో పాల్గొనేందుకు కృపాలికి ఆహ్వానం వచ్చింది. ఆమె INSPIRE MANAK ఎగ్జిబిషన్లో పాల్గొని తన ఆవిష్కరణను ప్రదర్శించడంతోనే ..కృపాలికి ఈ అపురూపమైన అవకాశం లభించింది. అంతేగాదు జపాన్కు వెళ్లిన 54 మంది ప్రతినిధుల బృందంలో మన కృపాలి సునీల్ దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయ పాఠశాల తరుఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక విద్యార్థినిగా నిలవడం విశేషం. ఇక ఆ గర్వించదగ్గ క్షణంలో ఆమె తండ్రి ఇండాస్ కంపెనీ జనరల్ మేనేజర్ సునీల్ కుమార్ కృపాలి, వెల్లూరు ప్రభుత్వ హయ్యర్ స్కూల్ టీచర్ ధన్య నారాయణలు కూడా ఈ పాలుపంచుకున్నారు.(చదవండి: అమెరికా ఆఫీసులో భారతీయ మహిళ ఆకలి తిప్పలు..! పాపం ఆ రీజన్తో..) -
అమెరికా ఆఫీసులో భారతీయ మహిళ ఆకలి తిప్పలు..! పాపం ఆ రీజన్తో..
మన భారతీయులు అమెరికాలో పనిచేసేటప్పుడు విచిత్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. రానురాను అక్కడి పద్ధతులకు అలవాటు పడిపోతుంటారు. అది కామన్. అయితే కొన్ని విషయాల్లో ఎవ్వరైనా రాజీపడలేం. ఇక్కడ అలానే ఓ భారతీయ మహిళ తన వ్యక్తిగత అలవాటు రీత్యా ఆఫీసులో ఊహించిన విధంగా ఇబ్బంది పడింది. అయితే పాపం ఆమె అలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదంటూ ఇన్స్టాగ్రాం పోస్ట్లో తన అనుభవాన్ని పేర్కొనడంతో నెట్టింట ఈ విషయం వైరల్గా మారింది.శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన రుంజున్ అనే భారతీయ మహిళ తన ఆహారపు అవాట్ల రీత్యా ఆఫీస్ ఈవెంట్లో పాల్గొనలేకపోతుంది. మిగతా ఉద్యోగుల్లా ఆమె తన కార్యలయం ఇచ్చిన విందు కార్యక్రమానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అస్సలు ఇలాంటి పరిస్థితి ఎదురవ్వుతుందని ఆమె భావించలేదు. నెట్టింట ‘ది వికెడ్ వెజిటేరియన్’ మహిళగా పేరుగాంచిన ఆమె ఆఫీస్లో ఊహించని విధంగా ఇబ్బందిని ఎదుర్కొంటుంది. తన వర్క్ప్లేస్లో యజమాన్యం తన సిబ్బందినందరిని మరుసటి రోజుకి భోజనాలు తెచ్చుకోవద్దని బహిరంగ ప్రకటన ఇచ్చింది. దాంతో అంతా మరుసటి రోజు ఇచ్చే విందు కోసం ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. వారిలానే ఈమహిళ కూడా కుతుహలంగా ఉంది. అయితే అక్కడ ఉద్యోగులంతా తమ కంపెనీ ఇచ్చే విందులో పాల్గొని ఖుషి చేస్తుంటే.. ఈ భారతీయ మహిళా ఉద్యోగి మాత్రం అక్కడ నుచి నిశబ్దంగా నిష్క్రమించాల్సి వస్తుంది. ఎందుకుంటే ఆ విందులో అక్కడ రకరకాల ప్లేవర్ల శాండ్విచ్లు సుమారు 60 రకాలు పైనే ఉన్నాయి. వాటిలో అత్యంత ఆరోగ్యకరమైనవి కూడా ఉన్నాయి. అయితే అన్నీ నాన్వెజ్ శాండ్విచ్లే గానీ ఒక్క వెజ్ శాండ్విచ్ కూడా లేకపోవడంతో కంగుతింటుంది ఆమె. అక్కడకి వెజ్ శాండ్విచ్ కావాలని సదరు ఫుడ్ కేటరింగ్కి చెప్పినా..తినాలనుకుంటే..వాటి మధ్యలో ఉండే మాంసాన్ని తీసేసి తినవచ్చేనే ఉచిత సలహ ఇవ్వడంతో మరింత షాక్ అవుతుంది. అస్సలు అలా ఎలా తినగలను చాలా బాధపడింది. తనలాంటి ప్యూర్ వెజిటేరియన్లకు అది మరింత ఇబ్బందని, తింటే వాంతులు వస్తాయని వాపోయింది. తనకోసం వెజ్ శాండ్విచ్ ప్రిపేరవ్వదని భావించి ఆ ఈవెంట్ నుంచి నెమ్మదిగా నిష్క్రమించింది. అయితే అక్కడున్న వారంతా గిల్టీగా ఫీల్ అయ్యి..సదరు భారతీయ మహిళ రింజూన్కు మరేదైనా తెప్పిస్తామని రిక్వెస్ట్ చేశారు. కానీ ఆమెకు అప్పటికే ఆకలిగా ఉండటంతో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నట్లు ఇన్స్టా పోస్ట్లో పేర్కొంది. ఆ పోస్ట్ని చూసిన నెటిజన్లు తాము కూడా అలాంటి సమస్యనే ఫేస్ చేశామంటూ ఆమె పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ.. పోస్టులు పెట్టారు.(చదవండి: ఆ ఊళ్లో నెమళ్ల బెడద..) -
వెరైటీగా రస్క్ గులాబ్ జామ్, క్యాబేజీ ఖీర్ ట్రై చేద్దాం ఇలా..!
రస్క్ గులాబ్జామ్కావలసినవి: రస్క్ పౌడర్– ఒక కప్పుమైదాపిండి– ఒక టేబుల్ స్పూన్కొబ్బరి పాలు– తగినన్నిపంచదార– అర కప్పు (పాకానికి సరిపడా నీళ్లు తీసుకోవాలి)ఏలకుల పొడి– కొద్దిగా, నూనె– సరిపడాతయారీ: ముందుగా ఒక పాత్రలో రస్క్ పౌడర్, మైదాపిండి వేసుకుని ఒకసారి బాగా కలపాలి. తర్వాత దానిలో కొద్దికొద్దిగా కొబ్బరి పాలు కలిపి ముద్దలా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండల్లా చేసుకుని, నూనెలో దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. మరో పాన్లో పంచదార పాకం పెట్టుకుని, అందులో ఏలకుల పొడి వేసుకుని, దోరగా వేగిన ఉండలను అందులో వేసుకోవాలి. రెండు గంటలు కదలకుండా ఉంచి, చల్లారాక సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.ముంబై క్యాబేజీ ఖీర్కావలసినవి: క్యాబేజీ తురుము– ఒక కప్పుచిక్కటి పాలు– 4 కప్పులుపంచదార– అర కప్పు పైనేసేమియా పుల్లలు– 5 టేబుల్ స్పూన్లు (అభిరుచిని బట్టి వీటిని వేసుకోవచ్చు, అయితే ముందుగా నేతిలో వేయించాలి)నెయ్యి– 4 టేబుల్ స్పూన్లు పైనేఏలకుల పొడి – అర టీస్పూన్డ్రై ఫ్రూట్స్ తురుము– కొద్దిగా (గార్నిష్ కోసం)తయారీ: ముందుగా తురిమిన క్యాబేజీని కొద్దిగా నేతిలో వేసి, పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఈలోపు మరో స్టవ్ మీద, మందపాటి గిన్నెలో పాలు పోసి, సగం అయ్యే వరకు మరిగించాలి. ఇప్పుడు మరిగిన పాలల్లో వేయించిన క్యాబేజీ తురుము, పంచదార, ఏలకుల పొడి వేసి గరిటెతో తిప్పుతూ ఉండాలి. మధ్యలో సేమియా పుల్లలు, నెయ్యి వేసి తిప్పుతూ సుమారు 7 నిమిషాల పాటు ఉడికించాలి. మిశ్రమం బాగా దగ్గరపడిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని, నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది.మలేషియన్ కుయ్ కారా బెర్లౌక్కావలసినవి: చికెన్ కీమా– అర కప్పు (కారం, అల్లం తురుము, వెల్లుల్లి తురుము, ఉప్పు, మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు తరుగు అన్నీ కొద్దికొద్దిగా కలిపి, 8 గంటల పాటు ఫ్రిజ్లో పెట్టి, అనంతరం నూనెలో దోరగా వేయించి పెట్టుకోవాలి)మైదా పిండి– ఒక కప్పు, గుడ్లు– 4, పసుపు– ఒక టీ స్పూన్కొబ్బరి పాలు– పావు కప్పు, నీళ్లు– సరిపడాబేకింగ్ సోడా– ఒక టీ స్పూన్, ఉప్పు,నూనె– తగినంతమసాలా, ఉప్పు, కారం కలిపి ఉడికించిన లేదా వేయించిన రొయ్యలు, కూరగాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు – గార్నిష్కితయారీ: ముందుగా మైదాపిండిలో పసుపు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత మరో గిన్నెలో కొబ్బరి పాలు, కొద్దిగా ఉప్పు, గుడ్లు, 2 టీ స్పూన్ల నూనె వేసుకుని బాగా కలిపి, ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పోసుకుంటూ మైదా మిశ్రమాన్ని క్రీమీగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక గంట పక్కన పెట్టుకుని, పొంగనాల ట్రేకు అడుగున నెయ్యి లేదా నూనె రాసి, మైదా మిశ్రమంతో గుంతలన్నీ సగం వరకూ నింపుకోవాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా కీమా మిశ్రమాన్ని అందులో వేసుకుని, పైన మళ్లీ మైదా మిశ్రమంతో ఫిల్ చేసుకుని, బేక్ చేసుకోవాలి. అవి బాగా ఉడికిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని, ఒక్కో మైదా–కీమా బైట్ మీద ఒక్కో రొయ్యను, కొన్ని కూరగాయ ముక్కలను వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. (చదవండి: ది బెస్ట్ ఐస్ క్రీమ్లుగా ఆ ఐదు భారతీయ బ్రాండ్లకు చోటు..! నటి దీపికా పదుకొణె) -
Beauty Tips: చేయంత యంత్రం..ముఖమంతా మెరుపు..!
అందమైన, కాంతిమంతమైన చర్మం కోసం ఇప్పుడు బ్యూటీ సెలూన్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆధునిక టెక్నాలజీతో రూపొందిన ఈ బ్రూనో ఈఎమ్ఎస్ ఫేషియల్ లిఫ్ట్ పరికరం, ఇంట్లోనే సౌకర్యవంతంగా, పూర్తి స్థాయి చర్మ సంరక్షణను అందిస్తుంది. అందం కోసం ఉపయోగిస్తున్న ఎలక్ట్రిక్ మజిల్ స్టిమ్యులేషన్ పద్ధతికి ఆధునిక హంగులు దిద్ది, ఈ పరికరం వినియోగదారులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది.ఈ డివైస్ నాలుగు ప్రత్యేకమైన ఆప్షన్స్ని కలిగి ఉంది. ఇందులోని ఎలక్ట్రిక్ మజిల్ స్టిమ్యులేషన్ ఆప్షన్ ముఖ కండరాలను ఉత్తేజపరచి, చర్మాన్ని బిగుతుగా చేసి, ముడతలను తగ్గిస్తుంది. అలాగే దీనిలోని హాట్ అండ్ కోల్డ్ ఫంక్షన్ చల్లని రోజుల్లో చర్మాన్ని వెచ్చగా ఉంచడానికి, వేడి రోజుల్లో చర్మాన్ని చల్లబరచడానికి సహాయపడుతుంది. అలాగే దీనిలోని బూస్టర్ ఫంక్షన్ సౌందర్య ఉత్పత్తులు చర్మంలోకి లోతుగా ఇంకేలా చేసి, వాటి ప్రభావాన్ని పెంచుతుంది. మరోవైపు దీనిలోని అల్ట్రాసోనిక్ వైబ్రేషన్ చర్మాన్ని మరింత బిగుతుగా, దృఢంగా మారుస్తుంది. ఇది వాటర్ప్రూఫ్ కావడంతో తడి చర్మంపై కూడా సురక్షితంగా ఉపయోగించవచ్చు. కేవలం ముఖానికే కాకుండా, మెడ, చేతులు, కాళ్ళపై కూడా దీనిని ఉపయోగించి మంచి ఫలితాలను పొందవచ్చు. సుమారు 183 గ్రాముల బరువుతో, స్టాండ్, స్టోరేజ్ బ్యాగ్తో లభిస్తుంది. ఇది ఎక్కడికైనా తీసుకెళ్లడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. దీనిలోని ‘త్రీ మినిట్స్ ఆటో పవర్–ఆఫ్’ ఫీచర్ వల్ల సురక్షితంగా దీనిని వాడుకోవచ్చు.సెల్యులైట్కు శాశ్వత పరిష్కారం!ఎందరో మహిళలను వేధించే సాధారణ సమస్య సెల్యులైట్. తొడలు, పిరుదులపై చర్మం గుంతలు పడినట్లు, నారింజ తొక్కలా వడిలిపోయినట్లుగా కనిపించడమే సెల్యులైట్ లక్షణాలు. సెల్యులైట్కు అసలు కారణం చర్మంలోని కొవ్వు కణజాలం కింద ఉండే ఫైబ్రస్ బ్యాండ్లు. ఇవి చర్మాన్ని లోపలికి లాగడం వల్ల గుంతలు ఏర్పడతాయి. ఆహారపు అలవాట్లతో, వ్యాయామాలతో తగ్గని ఈ సమస్యకు ఆధునిక పరిష్కారం సెల్ఫినా చికిత్స. నిపుణులు సన్నటి సూదిలాంటి పరికరాన్ని ఉపయోగించి ఫైబ్రస్ బ్యాండ్లను కత్తిరించి, వాటి ఒత్తిడిని తొలగిస్తారు. బ్యాండ్లు విడుదలైన వెంటనే, చర్మం మళ్లీ నునుపుగా మారుతుంది. కొన్నిసార్లు స్వల్పంగా నొప్పి, వాపు, గాయాలు ఉండవచ్చు, కాని, అవన్నీ కొద్ది రోజుల్లోనే తగ్గిపోతాయి. (చదవండి: వాల్నట్స్ షెల్స్తో వైట్ హెయిర్కి చెక్పెడదాం ఇలా..!) -
ట్రెండ్ సెట్టర్ నిధి అగర్వాల్ స్టైలింగ్ టిప్స్ ..!
ఫ్యాషన్ ట్రెండ్స్కి ట్రెండ్సెట్టర్ తను. ప్రతి లుక్లోనూ ఒక డిఫరెంట్ శైలి చూపిస్తూ, మెరుపులా మెరిసే లుక్తో మాయ చేస్తుంది నటి నిధి అగర్వాల్. కాని, తన స్రీకెట్ ‘చాలా సింపుల్’. ఆమె స్టయిలింగ్ టిప్స్,తను ఫాలో అయ్యే ఫ్యాషన్ విశేషాలు మీకోసం.హెవీ మేకప్ నాకు అసలు నచ్చదు. నేచురల్ లుక్నే ఎక్కువగా ఇష్టపడతాను. ఎప్పుడూ ముఖం క్లీన్ గా, చాలా సింపుల్గా ఉండేలా చూసుకుంటాను ఇదే నా సీక్రెట్. ఇక, డ్రెస్ విషయానికి వస్తే, బ్లాక్ నా ఫేవరెట్. ఏ ఫంక్షన్కైనా బ్లాక్ డ్రెస్నే ఫ్రిఫర్ చేస్తా అని చెబుతున్నారు నిధి అగర్వాల్రింగ రింగారే..‘రోజూ లేట్ అవుతుందని ఆఫీస్కు పరుగులు తీస్తూ, చక్కగా రెడీ కాలేకపోతున్నాం?’ అని బాధపడే ఫ్యాషన్ ప్రియులను కాపాడటానికి వచ్చిన అందమైన సాధనాలే ఈ ‘చెవి రింగులు’. ఇవి చిన్నవే కావచ్చు, కానీ వీటి ప్రభావం మాత్రం పెద్దగా ఉంటుంది. పెద్దవిగా ఉండే హూప్లతోపాటు, చిన్న గోల్డ్, వెండి రింగులు లేదా సన్నని ముత్యాలతో ఉండే స్టడ్స్ ఇవన్నీ ఆఫీస్ ఔట్ఫిట్కి బాగా మ్యాచ్ అవుతాయి. అయితే, ఇవి వేసుకునే ముందు మీ జుట్టు స్టయిల్ కూడా రింగుల రకానికి తగ్గట్లుండాలి. హెయిర్ బన్ అయితే గోల్డ్ హూప్ రింగులు అదిరిపోతాయి. జుట్టు అల్లుకుంటే చిన్న స్టడ్స్ సాఫ్ట్ లుక్ ఇస్తాయి. చీర, కుర్తీకి లైట్ వెండి చెవి రింగులు చాలా అందంగా కనిపిస్తాయి. ఇక ప్యాంట్ షర్ట్ వేసుకున్నప్పుడు చిన్న గోల్డ్ రింగ్స్ సరిపోతాయి. డైలీ వేర్కి చక్కగా ఉపయోగపడే వీటి ఖరీదు తక్కువ, స్టయిల్కి మాత్రం హై క్లాస్. రోజూ కొత్తదనంతో కనిపించాలనుకునే వారికి ఇవి గొప్ప ఫ్యాషన్ ఫ్రెండ్స్ అవుతాయి! డ్రెస్ బ్రాండ్: జారాధర: రూ. 12,950జ్యూలరీ బ్రాండ్: కార్టియర్వాచ్ ధర:రూ. 21,70,000 -
ఉజ్జయినీ అమ్మవారి ఘటం..!
లష్కర్ బోనాల పండుగ అనగానే కొత్త కుండలో ప్రత్యేకంగా వండిన ప్రసాద నైవేద్యం.. డప్పుల దరువులు.. పోతురాజుల వీరంగాలు.. ఫలహారపు బండ్ల ఊరేగింపులు.. రంగం ద్వారా భవిష్యవాణి వినిపించడం.. ఎక్కువగా ఇవే గుర్తుకొస్తాయి. కానీ.. జాతరలో ప్రతి ఇంటికీ వెళ్లి భక్తులకు దర్శనభాగ్యం కల్పించే ఘటం అత్యంత కీలకమైనది. ఈ నెల 29న ఆదివారం అమ్మవారి ఘటం ఎదుర్కోలుతో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జూన్ 29 నుంచి జులై 12 వరకూ అమ్మవారి ఘటం భక్తులకు దర్శనం కోసం సికింద్రాబాద్ పురవీధుల్లో ఉరేగిస్తారు. అమ్మవారి ఘటాన్ని పొడవైన వెదురు బద్దలతో నిలువెత్తు ఆకారంతో.. పూలతో అందంగా తీర్చిదిద్దుతారు. నడుమ అమ్మవారి విగ్రహాన్ని అమర్చి ఆకర్షణీయంగా రూపొందించేదే ఘటం. ఒంటినిండా పసుపు పూసుకున్న వ్యక్తులు ఘటాన్ని అధిరోహించి.. తలపై ఉన్న ఘటం కిందపడకుండా డప్పుల వాద్యాలకు, దరువులకు అనుగుణంగా విన్యాసాలతో నాట్యమాడతారు. సాధారణంగా కనికట్టు విద్యలు చేసే వారు ఇటువంటి వాటిని ప్రదర్శించినా.. సుమారు 60 కిలోల బరువుతో కూడిన ఘటాన్ని కేవలం పసుపు ముద్ద.. తలచుట్టకు మధ్యన పెట్టి పడకుండా చూడాల్సి ఉంటుంది. సికింద్రాబాద్లో 15కు పైగా ఆలయాలకు సంబంధించిన అమ్మవారి ఘటాలు ఈ రకంగా 13 రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో భక్తులకు దర్శనమిస్తుంటాయి.సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి బోనాల వేడుకలు జులై 13 ఆదివారం బోనాలు, 14న రంగం కార్యక్రమం ఉంటుంది. ఇందు కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. అమ్మవారి బోనాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని సదుపాయాలు, సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. లష్కర్ బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై ఇప్పటికే ఆయా విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.ఎదుర్కోలు నుంచి జాతర ముగిసే వరకూ..ఆషాఢమాసం తొలి ఆదివారం ఈ నెల 29వ తేదీ ఆదివారం సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి ఘటం ఎదుర్కోలు ఉత్సవాల్లో పాల్గొంటుంది. అదే విధంగా సోమసుందరం వీధిలోని శ్రీ దేవి పోచమ్మ, కళాసిగూడలోని మాతా ముత్యాలమ్మ, శివాజినగర్లోని డొక్కలమ్మ, రెజిమెంటల్ బజార్లోని గండిమైసమ్మ, ఓరుగంటి ఎల్లమ్మ, సెకెండ్ బజార్లోని ముత్యాలమ్మ, పీనుగుల మల్లన్న, కుమ్మరిగూడలోని నల్లపోచమ్మ, ఆర్పీ రోడ్డులోని మావురాల పెద్దమ్మ వంటి అమ్మవారి ఘటాలు కూడా ఎదుర్కోలు ఉత్సవాల్లో వేర్వేరుగా పాల్గొంటాయి. ప్రధానంగా సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఘటం బోట్స్క్లబ్ సమీపంలోని బుద్ధభవన్ ఎదురు వీధిలో ఉన్న మహంకాళమ్మ దేవాలయంలో రూపుదిద్దుకుంటుంది. ఆ తరువాత జులై 12 శనివారం రాత్రి వరకూ ఆయా బస్తీలు.. కాలనీల్లో ఊరేగుతూ భక్త జనుల పూజలు అందుకుంటాయి. 13 ఆదివారం బోనాల పండుగ రోజున ఉజ్జయిని మహాకాళి మినహా ఇతర ఘటాలు ఆనకట్ట ఉత్సవాల్లో పాల్గొంటాయి. 14వ తేదీ సోమవారం రంగం కార్యక్రమం ముగిసిన తరువాత అమ్మవారి ఘటం వీడ్కోల ఉత్సవంలో పాల్గొంటుంది. దీంతో జాతర ముగుస్తుంది.ఘటం మొదలైంది ఇలా.. తొలినాళ్లలో ఘటం అనేది ఉండేది కాదు. ప్రధానంగా 1813లో సురిటి అప్పయ్య అనే మిలటరీ ఉద్యోగి మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ప్రాంతంలో విధులు నిర్వహించేవారు. ఆ సమయంలో నగరంలో కలరా వ్యాధి సోకి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కలారా వ్యాధి తగ్గితే.. సికింద్రాబాద్లో ఆలయాన్ని కడతానని మొక్కుకున్నారు. అనంతరం సికింద్రాబాద్లో ఆషాఢంలో ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఆషాఢమాసంలో ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్దే అమ్మవారి దర్శనభాగ్యం కల్పించేందుకు అమ్మవారి ఘటాన్ని మొదలుపెట్టారు.ఘటం అధిరోహకుల వేషధారణ.. ఘటం అధిరోహకులు కూడా ఘటం మాధిరిగా ప్రత్యేకంగా తయారవుతారు. ముఖ్యంగా పసుపులో తడిపిన పంచె ధరించి.. ఒంటి నిండా పసుపు పులుముకుని కళ్లకు కాటు.. కాళ్లకు గజ్జెలు ధరించి అమ్మవారి ఘటాన్ని అధిరోహిస్తుంటారు. వేపాకులతో కూడిన చన్నీళ్ల సాకతో ఘటం అధిరోహకుల కాళ్లను భక్తులు కడిగి మొక్కుతారు. (చదవండి: Telangana Bonalu : తెలంగాణ బోనం.. సాంస్కృతిక ప్రయాణం..) -
భార్య..భర్త..ఓ మిడ్ వైఫ్..!
నగరంలో ఇటీవల సహజ (నేచురల్) డెలివరీకి ప్రాధాన్యతతో పాటు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, ‘మిడ్ వైఫ్’ పేరిట ఓ ప్రాచీనమైన విధానమే తనదైన ఆధునిక రూపంలో విస్తృతంగా అందుబాటులోకి వస్తోంది. గర్భిణులకు మరింత సురక్షితమైన, మందుల రహితమైన, హాస్పిటల్ ఆధారిత, సిజేరియన్ డెలివరీలకు ప్రత్యామ్నాయంగా ఈ మిడ్ వైఫ్ సేవలు నగరంలో వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఒకప్పుడు అంటే మన అమ్మమ్మల కాలంలో మంత్రసాని పేరిట కాన్పులు చేసే మహిళలు ఉండేవారు. ఏ శిక్షణా లేకపోయినా వంశపారంపర్య వృత్తిగా వీరు అత్యంత చాకచక్యంగా ఇంటికి వచ్చి మరీ తమ సేవలు అందించేవారు. ఇప్పుడు దాదాపు అదే కాన్సెప్్టతో మిడ్ వైఫ్ గా తిరిగి ఆధునికులకు చేరువైంది. మిడ్ వైఫ్ అంటే ప్రత్యేక శిక్షణ పొందిన ప్రసూతి నిపుణురాలు అని పేర్కొనవచ్చు. వీరు గర్భిణులు, మహిళలకు గర్భధారణ నిర్ధారితమైన దగ్గర నుంచి సహజ ప్రసవం వరకూ వెన్నంటి ఉంటారు. అంతేకాదు వీరు ప్రసవానంతర కాలంలో సహాయం చేస్తారు. నేచురల్ బర్త్కు వీరు అత్యంత ప్రోత్సాహం ఇస్తారు. ప్రసవ సమయంలో ప్రత్యక్ష పర్యవేక్షణ, భావోద్వేగ సహాయం అవసరమైన మద్దతునూ అందిస్తారు. ప్రత్యేక ఆస్పత్రులు సైతం.. నగరంలో పలు కార్పొరేట్ ఆస్పత్రులతో పాటు మిడ్ వైఫ్ సేవలు అందించే ప్రత్యేక ప్రసవ కేంద్రాలు సైతం ఏర్పాటవ్వడం విశేషం. గచి్చ»ౌలి, బంజారాహిల్స్, మాదాపూర్ వంటి సంపన్న నివాస ప్రాంతాల్లోనే ఇవి ఎక్కువగా నెలకొన్నాయి. కొన్ని ప్రసూతి కేంద్రాలు, డౌలా క్లినిక్స్, బర్తింగ్ సెంటర్లు ఇప్పుడు మిడ్ వైఫ్ సేవలను అందుబాటులోకి తెచ్చాయి. వీటిలో బర్త్ విలేజ్, ఫెర్నాండెజ్ ఫౌండేషన్, హెల్తీ మదర్ బర్త్ సెంటర్, ది సాంక్టమ్ నేచురల్ బర్త్ సెంటర్. వంటివి కొన్ని కేంద్రాల్లో మిడ్ వైఫ్ లు గర్భిణులకు సరైన ఆహార మార్గదర్శనం, ప్రీ–నాటల్ కౌన్సిలింగ్, ప్రసవ వ్యాయామాలు, మెడిటేషన్ తరగతులు, ఎమోషనల్ సపోర్ట్ కూడా అందిస్తున్నారు. మిడ్ వైఫ్ విధానానికి కారణాలివే.. డాక్టర్ ఆధారిత హాస్పిటల్ ప్రసవాల్లో అధిక జోక్యం, అధిక మందుల వాడకం పట్ల విముఖత కలిగిన వారు, ఎట్టి పరిస్థితుల్లోనూ సిజేరియన్కు దూరంగా ఉండాలనుకుంటున్నవారు, సహజమైన, వ్యాధుల రహిత ప్రసవాన్ని ప్రసవానంతర సేవలు కోరుకునే వారు వీరిని ఎంచుకుంటున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లోనూ.. నగరానికి చెందిన ఫెర్నాండెజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో 2011లో దేశంలో మొట్టమొదటి మిడ్ వైఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మిడ్ వైఫ్ విధానాన్ని ప్రభుత్వాస్పత్రుల వరకూ విస్తరించే దిశగా పరిశీలన చేస్తోంది. ఇటీవల నేషనల్ మిడ్ వైఫ్ కోర్సులు సైతం ప్రారంభమయ్యాయి. దీని వల్ల కొత్తగా ట్రైనింగ్ పొందిన మిడ్ వైఫ్స్ ఈ రంగంలోకి వస్తున్నారు. ఏదేమైనా నేచురల్ డెలివరీల పట్ల పెరుగుతున్న అవగాహన, ఆసక్తి వల్ల మిడ్ వైఫ్ విధానం నగరవాసులకు ఒక ఆరోగ్యకరమైన, భావోద్వేగపూరితమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. సేవల ధరలు ఇలా.. ఈ మిడ్ వైఫ్ సేవలు అందుకోవాలనుకునే వారి కోసం ప్రాథమిక ప్యాకేజీ రూ.40,000 నుంచి రూ.70,000 వరకూ ఉన్నాయి. ఇందులో గర్భధారణ సమయంలో రెగ్యులర్ కన్సల్టేషన్, 8–10 విజిట్లు, ప్రీ నాటల్ కౌన్సిలింగ్, బర్త్ ప్లాన్ తయారీ, ప్రసవ సమయంలో మిడ్ వైఫ్ సపోర్ట్ (ఇన్–సెంటర్), పోస్ట్నాటల్ ఫాలో–అప్ (1 లేదా 2 విజిట్లు) వంటివి ఉంటాయి. అలాగే అడ్వాన్స్డ్ బర్తింగ్ సెంటర్ ప్యాకేజీ : రూ.80,000 నుంచి రూ.1,50,000 వరకూ ఛార్జ్ చేస్తారు. దీనిలో ఉమెన్ ఎడ్యుకేషన్ సెషన్స్ లామాజ్ / బెర్తింగ్ క్లాసెస్ వాటర్ బర్త్ ఎంప్షన్, ఇంటిగ్రేటెడ్ డౌలా (పోషక సహాయం) సపోర్ట్, బర్తింగ్ టబ్, సౌండ్ థెరపీ, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటాయి. అదే విధంగా హోం బర్త్ ప్యాకేజీ ఎంచుకుంటే రూ.1,20,000 – రూ.2,00,000 వరకూ ఖర్చు అవుతుంది. దీనిలో భాగంగా మిడ్ వైఫ్ + అసిస్టెంట్ బృందం ఇంటికి వస్తారు. మానిటరింగ్ ఎక్విప్మెంట్ అమరుస్తారు. అత్యవసర జాగ్రత్తల కోసం హాస్పిటల్ సపోర్ట్.. వంటివి ఉంటాయి. కొందరు మిడ్ వైఫ్స్ వ్యక్తిగతంగానూ సేవలు అందిస్తూ తమ ప్రతి విజిట్కూ రూ.2,000 నుంచి రూ.4,000 మధ్య ఛార్జ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆరోగ్య బీమా సంస్థలు మిడ్ వైఫ్ సేవలను కవరేజ్ ఇవ్వడంలేదు. దీంతో కొన్ని బర్తింగ్ సెంటర్లు తమదైన పాలసీలను కూడా అందిస్తున్నాయి. ( చదవండి: హార్ట్ ఫెయిల్యూర్ అంటే..? ఈ పరిస్థితి ఎందువల్ల వస్తుంది..) -
32 వేల ఏళ్ల నాటి మొక్క పుష్పించింది..!
మంచుయుగం నాటి పురాతన పుష్పం ముప్పయిరెండు వేల ఏళ్ల తర్వాత పునరుత్థానం పొందింది. ఏనాడో అంతరించిపోయిన ఈ పురాపుష్పానికి రష్యన్ శాస్త్రవేత్తలు పునర్జీవం కల్పించారు. ‘సైలిని స్టెనోఫిలా’ అనే ఈ పువ్వు దాదాపు ముప్పయిరెండు వేల ఏళ్ల కిందట పూసేదట! సైబీరియా మంచు ఎడారుల్లో పరిశోధనలు జరుపుతున్న రష్యన్ శాస్త్రవేత్తలకు ఈ పూల మొక్కకు చెందిన విత్తనాలు ఒక ఉడుత బొరియలో దొరికాయి. వీటిని ల్యాబొరేటరీలో మొలకెత్తించడానికి వారు చేసిన ప్రయత్నం విజయవంతమైంది. మొత్తం విత్తనాలన్నీ మొలకెత్తాయి. మొలకలు మొక్కలుగా ఎదిగి, చక్కగా పూలు పూశాయి. వేల ఏళ్ల కిందట కాలగర్భంలో కలిసిపోయిన విత్తనాలు బయటపడటం, వాటి నుంచి మొక్కలను మొలకెత్తించడం చరిత్రలో ఇదే మొదటిసారి. రష్యన్ శాస్త్రవేత్తలు 2012లో చేసిన ప్రయోగం సఫలం కావడంతో ‘సైలిని స్టెనోఫిలా’ పూల మొక్కలు ఇప్పుడు చాలా ఇళ్లల్లోని కుండీల్లోకి చేరాయి. (చదవండి: ఆ ఊళ్లో నెమళ్ల బెడద..) -
ఆ ఊళ్లో నెమళ్ల బెడద..
నెమళ్లు చూడముచ్చటైన పక్షులు. ఆకాశంలో మబ్బులు ముసురుకున్నప్పుడు నెమళ్లు పురివిప్పి చేసే నాట్యం కనువిందైన దృశ్యం. సాధారణంగా పెద్దపెద్ద ఉద్యాన వనాలలోను, అడవుల్లోను కనిపించే నెమళ్లు ఊళ్లలోకి వచ్చేస్తేనో! ఆ బెడద మామూలుగా ఉండదంటున్నారు ఇంగ్లండ్లోని గల్వాల్ గ్రామస్థులు. ఇంగ్లండ్ నైరుతి ప్రాంతంలోని కార్న్వాల్ కౌంటీలో ఉన్న గల్వాల్ గ్రామానికి ఇటీవల కొంతకాలంగా నెమళ్లు పెద్ద బెడదగానే మారాయి. ‘ఎక్కడి నుంచి వచ్చిపడ్డాయో ఈ నెమళ్లు– పెద్దసంఖ్యలో ఊళ్లోకి చేరుకున్నాయి. ఇవి యథేచ్ఛగా ఇళ్లలోకి చేరి, ఎక్కడ పడితే అక్కడ రెట్టలు వేసేస్తూ ఇళ్లన్నీ కంపు చేసేస్తున్నాయి. రోడ్ల మీద తాపీగా నడకలు సాగిస్తూ ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నాయి’ అని గల్వాల్ గ్రామస్థులు గగ్గోలు పెడుతున్నారు. ‘నెమళ్లు చూడటానికి అందంగానే ఉంటాయి గాని, అవి ఎక్కడ పడితే అక్కడ వేసే రెట్టలను భరించడం మాత్రం చాలా కష్టం’ అని గల్వాల్ గ్రామస్థుడు డిలాన్ జాస్పర్ వాపోయారు. (చదవండి: హార్ట్ ఫెయిల్యూర్ అంటే..? ఈ పరిస్థితి ఎందువల్ల వస్తుంది..) -
హార్ట్ ఫెయిల్యూర్ అంటే..? ఈ పరిస్థితి ఎందువల్ల వస్తుందంటే..
చాలామంది హార్ట్ ఫెయిల్యూర్నూ, హార్ట్ ఎటాక్నూ ఒకటే అనుకుంటారు. కానీ ఈ రెండూ వేర్వేరు. హార్ట్ అటాక్ అంటే తన ధమనుల ద్వారా గుండెకు రక్తం అందక గుండె కండరం చచ్చుబడిపోవడం మొదలవుతుంది. ఇదొక తక్షణ మెడికల్ ఎమర్జెన్సీ. తక్షణం ఆసుపత్రికి తీసుకెళ్లి ఆ అడ్డంకిని స్టెంట్ వేయడం లేదా బైపాస్ వంటి సర్జరీ ద్వారా గుండె కండరానికి రక్త సరఫరాను పునరుద్ధరిస్తే ముప్పు తప్పుతుంది. అయితే హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె తన కార్యకలాపాలు సమర్థంగా నిర్వహించడంలో వైఫల్యం చెందడం. ఇదొక దీర్ఘకాలిక సమస్య. హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, దానికి కారణమయ్యే అంశాలు, హార్ట్ ఫెయిల్యూర్లో కనిపించే లక్షణాల వంటి అనేక సమస్యలను తెలిపే కథనమిది. హార్ట్ ఫెయిల్యూర్లో కండిషన్లో గుండె కండరం చాలా బలహీనంగా కావడంగానీ లేదా అదే కండరం చాలా బిగుతుగా (స్టిఫ్గా) మారిపోవడం గాని జరగవచ్చు. ఈ రెండింటిలో ఏది జరిగినప్పటికీ గుండె తన స్పందనలను కొనసాగించలేకపోవడం, దాంతో ఎప్పటిలాగా అన్ని అవయవాలకూ రక్తాన్ని సమర్థంగా పంప్ చేయలేకపోవడం జరగవచ్చు. పంపింగ్ పూర్తిగా జరగని ఫలితంగా రక్తం ఊపిరితిత్తులూ లేదా ఇతరత్రా అవయవాల్లోనే వెనకే ఉండిపోవచ్చు. దాంతో గుండె ఫెయిల్యూర్ బాధితుల్లో అనేక లక్షణాలు కనిపిస్తాయి.హార్ట్ ఫెయిల్యూర్ బాధితుల్లో కనిపించే లక్షణాలు ...ఊపిరి సరిగా అందకపోవడం, ఆయాసం రావడం (ఉదాహరణకు నడుస్తున్నా లేదా మెట్లు ఎక్కుతున్నా విపరీతంగా ఆయాసం రావడం) తీవ్రమైన అలసట / విపరీతమైన నిస్సత్తువ కాళ్లలో, చీలమండ (యాంకిల్స్), పాదాల్లో వాపురావడం బాధితులు అదేపనిగా దగ్గుతూ ఉండటం లేదా ఊపిరి తీసుకుంటున్నప్పుడు పిల్లికూతలు రావడందేహంలోని ద్రవాలు బయటకు పోలేకపోవడంతో బరువు పెరగడం దేనిపైనా దృష్టినిలపలేకపోవడం / ఏకాగ్రత కొరవడటం / చురుగ్గా ఉండలేకపోవడం గుండె స్పందనల్లో / గుండె లయలో మార్పులు రావడం. మన దేహంలోని ప్రతి కణానికి అనుక్షణం పోషకాలు అలాగే ఆక్సిజన్ సప్లై తప్పనిసరిగా అందుతూ ఉండాలి. రక్తం ద్వారా గుండె అలా పోషకాలనూ, ఆక్సిజన్నూ అందించలేకపోతే ఆ ప్రతికూల ప్రభావాన్ని ప్రతి కణమూ అనుభవిస్తుంది. సునాయాసంగా పూర్తయే పని కూడా చాలా కష్టమ్మీద చేయాల్సి వస్తుంది. కొందరిలో గుండె ఫెయిల్యూర్ దుష్ప్రభావాలు తక్షణం కనిపించవచ్చు. మరికొందరిలో క్రమక్రమంగా జరుగుతుండవచ్చు. లక్షణాలు కనిపించడానికి వారాలూ, నెలలూ పట్టవచ్చు.హార్ట్ ఫెయిల్యూర్కు కారణాలు ఈ సమస్యకు చాలా కారణాలు ఉండవచ్చు. అనేక కారణాల వల్ల గుండె కండరం బలహీనం (వీక్గా) కావడం లేదా స్టిఫ్గా మారడం జరగవచ్చు. వాటిలో కొన్ని...కరొనరీ ఆర్టరీ డిసీజ్ (సీఏడీ – అంటే గుండెకు రక్తాన్ని అందించే ధమనుల్లో కొన్ని మూసుకు΄ోవడం లేదా సన్నబారడం) అధిక రక్తపోటు (హై–బీపీ) ∙మధుమేహం (డయాబెటిస్) గుండె కవాటాల్లో సమస్యలు గతంలో గుండెపోటు రావడం విపరీతమైన మద్యం అలవాటు (క్రానిక్ ఆల్కహాలిజమ్)ఏవైనా ఇన్ఫెక్షన్లకు లోనుకావడం పోషకాలూ / విటమిన్ల లోపం పైన పేర్కొన్న లోపాల్లో ఏ కారణం చేతనైనా ఏదైనా లోపం ఏర్పడినప్పుడు గుండె చాలా వేగంగా స్పందిస్తూ ఆ లోపాన్ని తన వేగంతో భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంటుంది. అయితే అది కేవలం తాత్కాలికంగా మాత్రమే జరిగే ప్రక్రియ. దీర్ఘకాలంలో ఆ లోటు భర్తీ కాకపోవడం వల్ల అది క్రమంగా వైఫల్యానికి దారితీస్తుంది. అలా మొదట్లో కొద్దిపాటిగా ఉన్న లక్షణాలు కాస్తా దీర్ఘకాలంలో ప్రస్ఫుటంగా కనిపించడం మొదలవుతుంది. ఆ తర్వాత పరిస్థితి చాలా సీరియస్గా మారుతుంది.గుండె వైఫల్యంతో సాధారణ జీవనం సాగించడమెలా...గుండె వైఫల్యమన్నది ఒక తీవ్రమైన జబ్బు. పైగా ఇది జీవితాంతం కొనసాగే సమస్య. దీనికి నిత్యం డాక్టర్ల పర్యవేక్షణ, వారు సూచించిన మందులతోపాటు వ్యక్తిగత క్రమశిక్షణతో కూడిన జీవనశైలి మార్పులను తప్పక పాటించడం వంటి జాగ్రత్తలు అవసరం. ఈ కింద పేర్కొన్న సూచనలు పాటించడం ద్వారా హార్ట్ ఫెయిల్యూర్ బాధితులు చాలావరకు సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చు. అవి... గుండె తన సాధారణ కార్యకలాపాలు నిర్వహించడంతోపాటు లక్షణాలను సాధ్యమైనంతగా తగ్గించడానికి డాక్టర్లు సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడటం ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకోవడం వీలైనంతగా ద్రవాహారాలను తగ్గించడం ఒత్తిడిని (స్ట్రెస్ను) తగ్గించుకోవడం బరువు పెరగకుండా చూసుకోవడం. ఎప్పటికప్పుడు బరువును పరీక్షించుకుంటూ ఉండటం పరిస్థితి తీవ్రమైన కండిషన్లలో వారికి అవసరమైన ఉపకరణాలను (ఇంప్లాంటబుల్ డివైసెస్) అమర్చుకోవడం. ఈ తరహా బాధితుల్లో ఇక గుండె మార్పిడి చికిత్స (హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్) చివరి ప్రత్యామ్నాయం. అది చాలా సంక్లిష్టమైన, ఖరీదైన వ్యవహారం. పైగా మార్పిడికి అవసరమైన గుండె అందుబాటులోకి రావడం చాలా అరుదు. అందుకే వీలైనంతగా మంచి జీవనశైలిని అనుసరిస్తూ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అందరూ విధిగా చేయాల్సిన పని. గత పదేళ్లలో హార్ట్ ఫెయిల్యూర్ సమస్యకు చాలా ప్రభావవంతమైన మంచి మందులు అందుబాటులోకి వచ్చాయి. గుండె డాక్టర్ పర్యవేక్షణలో వాటిని వాడటం వల్ల మంచి ఫలితాల తోపాటు సాధారణ జీవితం గడిపేలాంటి అవకాశాలున్నాయి. ఇక కొందరు బాధితుల్లో గుండె స్పందనలు సరిగా జరిగేలా చేసేందుకు పేస్ మేకర్ వంటివి అమర్చాల్సిన ‘సీఆర్టీ’ వంటి మరికొన్ని చికిత్సలూ అవసరం పడవచ్చు.డాక్టర్ అమర్ నారాయణ్ పట్నాయక్, సీనియర్ కార్డియాలజిస్ట్ (చదవండి: Anemia: రక్తం పంచే అమ్మకు బ్లడ్ తక్కువ..! ఎలా అధిగమించాలంటే..) -
రక్తం పంచే అమ్మకు బ్లడ్ తక్కువ..!
మహిళలను రక్తహీనత (అనీమియా) సమస్య ఒక పట్టాన వదలదు. అసలు నెలనెలా వచ్చే రుతుస్రావం సమస్యతో రక్తంపోతూ ఉండటం, బిడ్డలకు జన్మనిచ్చే సమయంలో రక్తంపోవడం, వాళ్లకు వచ్చే యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ వంటి సమస్యలతో మహిళల్లో రక్తంపోవడం చాలా సాధారణం. మన కేంద్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా నిర్వహించే 5వ కుటుంబ ఆరోగ్య సర్వే (ఫిఫ్త్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే)లోనూ గర్భవతుల్లోని 52 శాతం కంటే ఎక్కువమందిలో తీవ్రమైన రక్తహీనత ఉన్నట్లు అధికారికంగానే తేలింది. అంటే గర్భవతులందరిలో సగంమంది కంటే ఎక్కువే రక్తహీనతతో బాధపడుతున్నారన్నమాట. ఈ నేపథ్యంలో మహిళల్లో రక్తహీనత (అనీమియా) సమస్య, దాన్ని అధిగమించడమెలా అనే అంశాలను తెలుసుకుందాం. సాధారణంగా రక్తహీనత అన్నది స్త్రీ, పురుషులిద్దరిలో కనిపించేదే అయినా మహిళల్లో మాత్రం చాలా ఎక్కువ. అందునా గర్భవతుల్లో 52 శాతానికి పైగా మహిళల్లో అనీమియా ఉండటం ఎలా ఉన్నా సాధారణ మహిళల్లోని దాదాపు 70 శాతం మందికి పైగా రక్తహీనత ఉంటుందనేది అనేక మంది డాక్టర్ల పరిశీలనల్లో తేలిన అంశం.రక్తహీనత (అనీమియా) అంటే... రక్తంలో తగినన్ని ఎర్రరక్తకణాలు లేక΄ోవడాన్ని రక్తహీనత (అనీమియా)గా పరిణిస్తారు. మన శరీరంలోని అన్ని అవయవాలకూ రక్తంలోని ఎర్ర రక్తకణాల (ఆర్బీసీ) ద్వారానే పోషకాలూ, ఆక్సిజన్ అందుతాయి. వాటి సంఖ్య తగ్గడంతో అన్ని అవయవాలకూ పోషకాలూ, ఆక్సిజన్ అందక΄ోవడంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మన రక్తం ఎర్రగా ఉండటానికి కారణం అందులోని హీమోగ్లోబిన్ అనే పదార్థం. ఈ హీమోగ్లోబినే అన్ని కణాలకూ ఆక్సిజన్ అందజేస్తుంటుంది. మన శరీరంలో 100 గ్రాముల రక్తంలో... హీమోగ్లోబిన్ పరిమాణమన్నది మగవారిలో 13 గ్రాములు, మహిళల్లోనైతే 12 గ్రాములు, ఆరు నుంచి పన్నెండేళ్ల పిల్లల్లో 12 గ్రాములు ఉండాలి. ఒకవేళ ఈ హీమోగ్లోబిన్ పరిమాణం ఇంతకంటే తక్కువగా ఉంటే వారు రక్తహీనతతో బాధపడుతున్నారని అర్థం.మహిళల్లో రక్తహీనతకు కారణాణాలివి... మహిళల్లో ప్రతినెలా వచ్చే రుతుస్రావం కారణంగా ప్రతి నెలా రక్తం పోతుంటుంది. ఇక మరికొందరిలో ఎర్రరక్తకణాల తయారీ ప్రక్రియ దెబ్బతింటుంది. కొత్త ఎర్రరక్తకణాలు తయారయ్యే లోపే కొందరిలో పాతవి వేగంగా చనిపోవడం వల్ల కూడా రక్తహీనత వస్తుంది. ఇక మహిళల్లో బిడ్డకు జన్మనిచ్చే సమయంలో అతిగా రక్తంపోవడం, యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ వంటి అంశాలు కూడా రక్తహీనతకు కారణమవుతాయి. అనీమియా లక్షణాలు కొందరిలో తక్కువగానూ, మరికొందరిలో తీవ్రంగా ఉంటాయి.రక్తహీనత లక్షణాలు : రక్తహీనత (అనీమియా) ఉన్నవారిలో ఎర్రరక్తకణాల (రెడ్ బ్లడ్ సెల్స్ / ఎరిథ్రోసైట్స్) సంఖ్య తగ్గి΄ోవడం వల్ల వాళ్లు పాలిపోయిన చర్మం, గోళ్ల కింద రక్తం లేని కారణంగా గోళ్లు తెల్లగా కనిపించడం, ఎర్రగా కనిపించాల్సిన కింది కనుపాప కింద తెల్లగా పాలిపోయినట్లుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అనిమియా లక్షణాలను తెలుసుకోడానికి భౌతికంగా తొలి పరీక్షగా డాక్టర్లు వీటినే చూస్తారు. ఇవిగాక... ముఖం పాలిపోయినట్లుగా ఉండటం కొద్దిపాటి నడకకే ఆయాసం శ్వాస కష్టంగా తీసుకోవడం ∙తీవ్రమైన నిస్సత్తువ, నీరసం, అలసట మగతగా ఉండటం చికాకు / చిరాకు / కోపం తలనొప్పి నిద్రపట్టకపోవడం పాదాలలో నీరు చేరడం ఆకలి తగ్గడం కాళ్లుచేతుల్లో తిమ్మిర్లతో అవి చల్లగా మారడం కొందరిలో ఛాతీనొప్పి త్వరగా భావోద్వేగాలకు గురికావడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. జాగ్రత్తలు / చికిత్స : మాంసాహారులైతే ఐరన్ పుష్కలంగా లభించే కాలేయం వంటివి తీసుకోవాలి. ఇక శాకాహారులతోటు అందరూ ముదురాకుపచ్చ రంగులో ఉండే అన్ని రకాల ఆకుకూరలు, నువ్వులు, ఖర్జూరం. అటుకులు, బెల్లం వంటివి ఎక్కువగా తీసుకోవాలి. రక్తహీనత సమస్య తీవ్రంగా ఉన్నవారు డాక్టర్ సలహా మీద ఐరన్ ట్యాబ్లెట్లు వాడాలి. సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు కొందరికి రక్తం ఇవ్వాల్సి రావచ్చు. ఇక టాబ్లెట్లు వాడే సమయంలో కొందరికి మలబద్దకం సమస్య వచ్చే అవకాశం ఉన్నందున వాటిని డాక్టర్ల సూచన మేరకు, వారి పర్యవేక్షణలోనే వాడాలి. ఇతరత్రా సమస్యలు కనిపిస్తుంటే డాక్టర్లు వారికి సరిపడే మందుల్ని సూచిస్తారు. డాక్టర్ విమీ బింద్రా, సీనియర్ గైనకాలజిస్ట్ (చదవండి: పరాఠా విత్ నెయ్యితో 'జీరో సైజ్ ఫిగర్'..! నటి కరీనా కపూర్ కూడా..) -
ప్లాన్ చేస్తున్నాం కానీ...
నాకు ముప్పై ఐదు సంవత్సరాలు. నా రెండు రొమ్ముల్లో గడ్డల్లాగా ఉన్నాయి. కాని, ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లా¯Œ చేస్తున్నాం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?– అనిత, విజయవాడ.మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుండగా రొమ్ముల్లో గడ్డలు కనిపిస్తే, అది చిన్న సమస్య అయి ఉండొచ్చు, కాని నిర్లక్ష్యం చేయరానిది. చాలా సందర్భాల్లో ఇది ఫైబ్రో ఎడినోమా అనే సాదారణ సమస్యగా ఉంటుంది. ఇది నొప్పి లేకుండా కనిపిస్తుంది. మీ వయస్సు, కుటుంబంలో బ్రెస్ట్ కేన్సర్ చరిత్ర, బాడీ మాస్ ఇండెక్స్ 35 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, థైరాయిడ్, బీపీ వంటి సమస్యలుంటే, తప్పకుండా బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ చెక్ చేయించాలి. గడ్డల పరిమాణం, ప్రదేశం, స్వభావం ఆధారంగా దానికి బైరాడ్స్ గ్రేడింగ్ చేస్తారు. చాలా సందర్భాల్లో ఇది తక్కువ గ్రేడింగ్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి సమయంలో ఇది ప్రమాదకరం కాదు. అలాగే ఇది భవిష్యత్తులో బ్రెస్ట్ ఫీడింగ్కు కూడా అంత అడ్డు రాదు. కానీ బ్రెస్ట్లో ఆకస్మికంగా వాపు, రంగు మారటం, నొప్పి రావడం లాంటివి కనిపిస్తే వెంటనే వైద్యుని కలవాలి. సంవత్సరానికి ఒకసారి చెక్ చేయించుకోవడం మంచిది. అలాగే స్వయంగా పరిశీలించి చూసుకోవడం వలన ఏదైనా మార్పు ఉంటే వెంటనే గుర్తించవచ్చు. అవసరమైతే డాక్టర్ ఎఫ్ఎ¯Œ ఏసీ లేదా బయాప్సీ చెయ్యమని సూచిస్తారు. ఎక్కువ మార్పులు కనిపిస్తే శస్త్రచికిత్స కూడా చేస్తారు. ఇది ప్రెగ్నెన్సీకి ఏ ప్రమాదం చేయదు. అయితే ప్రతి మార్పును గమనిస్తూ రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తూ, డాక్టర్ సూచించిన పరీక్షలు, స్కానింగ్లను తప్పకుండా చేయించుకోవాలి.నేను ఇప్పుడు మూడు నెలల గర్భవతిని. మా ఫ్యామిలీలో చాలామందికి థైరాయిడ్ ఉంది. అందుకే, ప్రెగ్నెన్సీలో నాకు కూడా వస్తుందేమో అనిపిస్తోంది. ఇందుకు ఏవైనా పరీక్షలు చేయించుకోవాలా?– సుమలత, నూజివీడు.మీ కుటుంబంలో థైరాయిడ్ సమస్యలు ఉన్నట్లయితే, ప్రెగ్నెన్సీ సమయంలో మీరు తప్పనిసరిగా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమస్యలు ఉంటే అవి శిశువు ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా మెదడు అభివృద్ధి, నరాల వ్యవస్థపై దీని ప్రభావం ఉంటుంది. ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల్లో టీఎస్హెచ్ అనే థైరాయిడ్ పరీక్ష చేయించాలి. ఈ సమయంలో టీఎస్హెచ్ స్థాయి 2.5 కంటే తక్కువగా ఉండాలి. అలాగే కుటుంబంలో ఇప్పటికే థైరాయిడ్ ఉన్నవారు ఉంటే, థైరాయిడ్ యాంటీబాడీ పరీక్ష కూడా చేయించాలి. ఈ పరీక్షలో యాంటీబాడీలు పాజిటివ్గా ఉంటే, గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. అందుకే, అలాంటి సందర్భాల్లో వైద్యుని సూచనల మేరకు తక్కువ మోతాదులో థైరాక్సి¯Œ అనే మందును వాడాలి. ప్రెగ్నెన్సీ మొత్తం వ్యవధిలో టీఎస్హెచ్ స్థాయిని ప్రతి నెలా పరీక్ష చేయాలి. మూడో నెల దాటిన తర్వాత టీఎస్హెచ్ స్థాయి 3 వరకు ఉండవచ్చు. అంతకంటే ఎక్కువైతే, వైద్యులు మందుల మోతాదును సరిచేస్తారు. గర్భవతిగా ఉన్నప్పుడు టీఎస్హెచ్ స్థాయి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. అందువలన ప్రతిసారీ పరీక్షల ద్వారా స్థాయిని గమనించి, మందుల మోతాదును మార్చుకుంటూ ఉండాలి. చాలామంది గర్భవతులకు డెలివరీ తర్వాత కూడా థైరాయిడ్ యాంటీబాడీలు కొనసాగుతాయి. అందుకే డెలివరీ అనంతరం కూడా మందులను కొనసాగించే అవసరం ఉంటుంది. థైరాయిడ్ సమస్య ఉన్నా కూడా శిశువు ఆరోగ్యంగా పుట్టే అవకాశం ఉంది. ఇందుకోసం ముఖ్యంగా శిశువు మెదడు, చురుకుదనం, శరీరాభివృద్ధి బాగా జరగాలంటే మొదటి మూడు నెలల్లో టీఎస్హెచ్ స్థాయిని 2.5 కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అందుకే, ఎప్పటికప్పుడు డాక్టర్ను సంప్రదిస్తూ, వారు చెప్పే సూచనలు, సలహాలు పాటించడం చాలా అవసరం. ∙ -
తొలి అడుగుకు భరోసా ఇవ్వాలి!
ఒక చిన్నారి పుట్టినప్పటి నుంచి తల్లి, తండ్రి, ఇల్లు, బొమ్మలు, తన పడకే ప్రపంచంగా ఉంటుంది. వాటితోనే, వారితోనే బంధం, అనుబంధం అన్నీ. ఈ పరిసరాలకు దూరంగా కొత్త వ్యక్తుల మధ్యకు, కొత్త ప్రదేశంలోని వెళ్లాలంటే అగ్నిపరీక్షే! నర్సరీ ప్రవేశం అలాంటిదే! నర్సరీ అనేది చిన్న అడుగు కాదు. జీవితంలో పెద్దమార్పు. నర్సరీకి పంపడం అన్ని రోజుల్లా ఒక మామూలు రోజు కాదు, బిడ్డ జీవితం కోసం వేసే ముందడుగు. పిల్లల మనసులో ప్రేమతో కూడిన తొలి పాఠశాల అనుభవాన్ని నాటగలిగితే, వారు భవిష్యత్తులోనూ ప్రపంచాన్ని భయపడకుండా ఎదుర్కొంటారు. ఆ మేరకు పిల్లలను నర్సరీకి పంపే ముందే వారి మనసును సిద్ధం చేయాల్సిన బాద్యత తల్లిదండ్రులదే! ఈ వయసులో పిల్లలకు అమ్మ కనిపించకపోతే, నన్ను వదిలిపెట్టిందేమో అనే భయంతో బాధపడతారు. ఇది సెపరేషన్ యాంగ్జయిటీకి దారితీస్తుంది. ఈ దశలో తల్లిదండ్రుల ప్రేమ, మానసిక మద్దతు అత్యంత అవసరం. నర్సరీలోని మొక్కలను జాగ్రత్తగా కాపాడుకున్నట్లే చిన్నారులను కూడా ప్రేమగా కాపాడుకోవాలి. వారికి దూరంగా ఉన్నా, తమకే ఆపద రాదని; ప్రమాదం జరగదని నమ్మకం కలిగించాలి. కథలతో సిద్ధం చేయండినర్సరీ లేదా ప్రీస్కూల్ అనేది పిల్లలకు తెలియని ప్రదేశం. ఆ ప్రదేశం గురించి తల్లిదండ్రులు పిల్లలకు అర్థమయ్యే భాషలో వివరించాలి. ‘‘నీకు తెలుసా... బంటి అనే బాబు స్కూల్కు వెళ్లి అక్కడ కొత్త అక్కలతో ఆడుకుని ఆనందించాడు తెలుసా’’ అంటూ కథల రూపంలో చెప్పి పిల్లలకు స్కూల్ పట్ల ఆసక్తి కలిగించాలి. ఇలా చెప్పడం వల్ల పిల్లల మనసులో స్కూల్ అంటే భయం కాకుండా, ఆటలాడుకునే ప్రాంతమనే ఆలోచన ఏర్పడుతుంది. ముందుగానే పరిచయం చేయాలిఒక చిన్న పిట్ట కొత్త గూటిని ఎలాగైతే ముందుగా చుట్టూ తిరిగి గమనించి వెళ్తుందో, అలాగే పిల్లలు కూడా కొత్త ప్రదేశాన్ని ముందే చూశారంటే భయం తగ్గుతుంది. అందుకే వారిని ముందుగానే స్కూల్ ప్రాంగణానికి తీసుకెళ్లి, ‘ఇదిగో, నీ ఆటబొమ్మలు ఇక్కడ ఉంటాయి. టీచర్ అక్కలతో మాట్లాడవచ్చు’ అని చెప్పండి. ఈ పరిచయం వారిలో భరోసాను నింపుతుంది. ముందే ఆశ నింపాలిబెలూన్ చేతి నుంచి విడిచే ముందు, దాన్లో గాలి నింపుతాం. అలాగే, పిల్లలను స్కూల్లో వదిలే ముందు భరోసా అనే గాలిని నింపాలి. ‘‘కాస్సేపు ఇక్కడ ఆడుకో, ఆ తర్వాత నన్ను పిలుస్తారు. నేను వస్తాను, అమ్మ వస్తుంది’’ అని భరోసా నింపండి. మీ భయాన్ని పసిగట్టేస్తారు జాగ్రత్త‘‘పిల్లాడు ఏడుస్తాడేమో!’’ అని మీరు మనసులో అనుకుంటే, అది మీ బిడ్డకు స్పష్టంగా తెలుస్తుంది. అతడి మనస్సు మీ ముఖాన్ని అద్దంగా చూస్తుంది. కాబట్టి, మీ హావభావాల్లో ఆనందం, నమ్మకం కనిపించాలి. మీ భయం బిడ్డ మనసులోని భద్రతను దెబ్బతీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక లవ్ టోకెన్ ఉండాలి పిల్లలను స్కూల్లో వదిలే సమయంలో వారి చేతిలో ఒక చిన్న బొమ్మ, అమ్మ హ్యాంకీ, లేదా ఫోటో ఉండాలి. ఈ చిన్న చిన్న వస్తువులు అనురక్తికు సంకేతాలు. వారు తల్లికి దూరంగా ఉన్నా, ప్రేమ దగ్గరగా ఉంది అని అనిపించేలా చేస్తాయి.చిన్న విడిపోవడం – పెద్ద శాంతికి ప్రారంభంపక్షి పిల్ల తమ గూటిని వదిలి ఎగిరే ముందు చిన్న చలనం అవసరం. అలాగే, పిల్లలను స్కూల్కు తీసుకెళ్ళే ముందు ఇంట్లోనే చిన్న విడిపోవడాల్ని ప్రాక్టీస్ చేయండి. మామయ్య, చిన్నమ్మ దగ్గర అరగంట వదిలి అబ్జర్వ్ చేయండి. ఇలా వదలడం ‘అమ్మ వదిలిపోదు, నాకోసం వచ్చేస్తుంది’ అనే నమ్మకాన్ని కల్పిస్తుంది. సెపరేషన్ యాంగ్జయిటీకి ఇది దివ్యౌషధం.ప్రీస్కూల్లో చిన్నారి ఆలోచనలు... పిల్లల మెదడు ఇంకా పూర్తిగా వికసించక పోవడం వల్ల ఎందుకు స్కూల్ వెళ్తున్నాం? ఎందుకు వెళ్లాలి? అనే లాజిక్ వారికి ఉండదు. అమ్మ లేదు– భయం మొదలవుతుంది.పదజాలం పరిమితం– భావాలను చెప్పలేక తంటా పడుతుంటారు.ఎక్కువ మంది పిల్లలు– నా బొమ్మ నా వద్ద లేదు అనే అసూయ మొదలవుతుంది.క్లాస్ టైమ్, ఆట టైమ్, భోజన టైమ్– అన్నీ షెడ్యూల్, కష్టంగా ఉంటుంది. -
ప్రపంచంలో అభయారణ్యాలు
ప్రపంచంలో అభయారణ్యాలు ఉండటం సహజం. అడవులలోని కొండ కోనలను, వాగు వంకలను, చెట్టు చేమలను, పక్షులు, జంతువులను పరిరక్షించడానికి అభయారణ్యాలను ఏర్పాటు చేస్తుంటారు. కొన్ని చోట్ల అభయారణ్యాలే కాదు, భయారణ్యాలు కూడా ఉంటాయి. ఆ అరణ్యాలలోకి అడుగు పెట్టాలంటేనే వెన్నులో వణుకు మొదలవుతుంది. సాహసించి ఎవరైనా ఆ అరణ్యాలలోకి వెళ్లినా, వారికి చిత్రవిచిత్రమైన రీతిలో అంతుచిక్కని అనుభవాలు ఎదురవుతుంటాయి. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న అలాంటి కొన్ని భయారణ్యాల గురించి, వాటి విశేషాల గురించి తెలుసుకుందాం.ఎల్ఫిన్ ఫారెస్ట్అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న కీకారణ్యం ఇది. ఈ అడవిలోకి అడుగు పెట్టడానికి పట్టపగలు కూడా జనాలు భయపెడతారు. ఈ అడవి చుట్టూ అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ అడవిలో అమెరికన్ మూలవాసుల ఆత్మలు సంచరిస్తుంటాయని, ఒక మంత్రగత్తె ఆత్మ కూడా సంచరిస్తూ ఉంటుందని స్థానికులు కథలు కథలుగా చెప్పుకుంటారు. ఎల్ఫిన్ అడవి నడిబొడ్డున ఒక సన్నని రాతి దారి ఉంది. మెలికలుగా ఉన్న ఈ దారిలోనే ఇక్కడ మూలవాసులు అతీంద్రియ శక్తుల కోసం ఆత్మలను ఆవాహన చేసేవారని చెబుతారు. ఈ అడవిలోని లోయకు ఎగువనున్న కొండల మీద మూలవాసుల సమాధులు ఉన్నాయంటారు. ఈ ప్రాంతంలో అక్కడక్కడా కనిపించే చిన్నారుల పాదముద్రలు మూలవాసుల పిల్లలవి కావచ్చని భావిస్తారు. ఈ అడవిలో కొన్ని అంతుచిక్కని హత్యలు సహా పలు అంతుచిక్కని సంఘటనలు జరిగాయి. కొందరు సాహసించి ఈ అడవిలోకి వెళితే, వాళ్లకు అంతుచిక్కని అనుభవాలు ఎదురయ్యాయని చెబుతారు. రకరకాల ప్రచారాలు, భయాల కారణంగా స్థానికులెవరూ ఈ అడవిలోకి వెళ్లడానికి సాహసించరు. అందుకే, ఈ అడవి నిత్యం నిర్మానుష్యంగా ఉంటుంది.బ్లాక్ ఫారెస్ట్పగలు, రాత్రి దాదాపు ఒకేలా ఉండే ఈ అడవి జర్మనీ నైరుతి ప్రాంతంలో ఉంది. ఈ అడవి అసలు పేరు ‘ష్వార్జ్వాల్డ్’. అడవి నిండా ఎత్తయిన చెట్లు దట్టంగా పెరిగి ఉండటంతో పట్టపగటి వేళలో కూడా ఇక్కడి నేల మీద సూర్యకిరణాలు దాదాపు పడవు. అందువల్ల పగటి వేళలో కూడా ఈ అడవి చీకటిగానే ఉంటుంది. నిత్యం చీకటిగా ఉండటం వల్లనే దీనికి ‘బ్లాక్ ఫారెస్ట్’ అనే పేరు వచ్చింది. ఈ అడవిలో కొన్ని అంతుచిక్కని సంఘటనలు జరిగాయి. ఇక్కడ కొందరు అంతుచిక్కకుండా గల్లంతైపోయారు. ఈ అడవిని అల్లుకుని ప్రచారంలో ఉన్న కథల ఆధారంగా జర్మన్ రచయితలు బ్రదర్స్ గ్రిమ్ (జాకోబ్, విల్హెల్మ్) ‘హాన్సెల్ అండ్ గ్రెటెల్’ అనే పుస్తకం రాశారు. ఇందులో ఈ అడవిలో అంతుచిక్కకుండా తప్పిపోయిన ఇద్దరు పిల్లల ఉదంతాన్ని రాశారు. ఈ అడవిలో ఇప్పటికీ కనిపించే పిల్లల పాదముద్రలు అప్పట్లో తప్పిపోయిన వారివేనని స్థానికులు నమ్ముతారు. ప్రపంచంలోనే అత్యంత నిర్మానుష్యంగా కనిపించే అడవుల్లో బ్లాక్ ఫారెస్ట్ కూడా ఒకటి.డెవిల్స్ ట్రాంపింగ్ గ్రౌండ్అమెరికాలోని ఉత్తర కరోలినాలో అడవి నడిమధ్యన ఉన్న విచిత్ర ప్రదేశం ఇది. ‘బెయిర్ క్రీక్ ’ వాగు సమీపంలో ఉన్న దేవదారు వృక్షాల అడవి నడిమధ్యన ఈ వృత్తాకర ప్రదేశం ఖాళీగా కనిపిస్తుంది. దట్టమైన అడవిలో కనీసం గడ్డిపరకలైనా మొలవని ఈ ప్రదేశం ఇప్పటికీ ఒక అంతుచిక్కని మర్మమే! దాదాపు 40 అడుగుల పరిధిలో ఉన్న ఈ ప్రదేశంలో అడవిలో సంచరించే జంతువులేవీ అడుగు పెట్టవు. దీని సమీపానికి వచ్చినా, చుట్టూ తిరిగి వెళతాయే గాని, దీని లోపల అడుగు పెట్టి, ఇటు నుంచి అటు దాటే ప్రయత్నం చేయవు. దీని సంగతేమిటో తేల్చుకోవాలని కొందరు ఔత్సాహికులు ఇక్కడకు పెంపుడు జాగిలాలను తీసుకు వచ్చినా, ఆ జాగిలాలు దీని చుట్టూ తిరిగి, విచిత్రంగా మొరిగాయే తప్ప దీని లోపలకు అడుగు పెట్టలేదు. ఒక్కోసారి ఇక్కడ ఎవరో పారవేసినట్లుగా అంతుచిక్కని వస్తువులు కనిపిస్తుంటాయి. అలాగే, అంతుచిక్కని పాదముద్రలు కూడా కనిపిస్తుంటాయి. అందుకే, స్థానికులు దీనిని ‘దయ్యాల మైదానం’గా అభివర్ణిస్తుంటారు. రాత్రివేళ ఇక్కడ దయ్యాలు వచ్చి ఆటలాడుకుంటూ, నృత్యం చేస్తూ కాలక్షేపం చేస్తాయని కథలు కథలుగా చెప్పుకుంటారు.ఎపింగ్ ఫారెస్ట్ఇంగ్లండ్లోని అత్యంత పురాతనమైన అడవి ఇది. దాదాపు ఆరువేల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ దట్టమైన అడవి అతీంద్రియ శక్తులకు ఆలవాలమని స్థానికులు చెబుతుంటారు. నాలుగు శతాబ్దాల కిందట నాటి రాజులు ఈ అడవిలో వేట సాగించేవారట! నేరాలు చేసి పారిపోయేవారికి, దోపిడీ ముఠాలకు, యుద్ధం నుంచి పారిపోయిన సైనికులకు ఈ అడవి ఒకప్పుడు సురక్షిత స్థావరంగా ఉండేదని చెబుతారు. పద్దెనిమిదో శతాబ్దిలో డిక్ టర్పిన్ అనే దోపిడీ ముఠా నాయకుడు ఈ అడవిని అడ్డాగా చేసుకుని, అటవీ మార్గం గుండా వచ్చే బాటసారులను దోచుకునేవాడు. తనను ఎదిరించేవారిని నిర్దాక్షిణ్యంగా చంపేవాడు. ఇరవయ్యో శతాబ్దిలో ఈ అడవిలో కనీసం పదకొండు హత్యలు జరిగాయని చెబుతారు. అరవయ్యేళ్ల కిందటి వరకు హంతక ముఠాలు తమ చేతిలో హత్యకు గురైనవారి మృతదేహాలను ఈ అడవిలో పారవేసేవారు. అంతుచిక్కని చాలా హత్యలకు కేంద్రంగా ఉన్న ఈ అడవిలో హత్యలకు గురైనవారి ఆత్మలు సంచరిస్తూ ఉంటాయని స్థానికులు చెబుతుంటారు. ఈ అడవిలోకి అడుగుపెట్టిన కొందరు తమకు అంతుచిక్కని రీతిలో విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయని చెబుతుంటారు. సాహసికులు, అతీంద్రియ శక్తులపై ఆసక్తి ఉన్న ఔత్సాహికులు తప్ప మామూలు మనుషులెవరూ ఈ అడవి జోలికి వెళ్లరు.డౌహిల్ ఫారెస్ట్ఇది పశ్చిమ బెంగాల్లోని కుర్సియాంగ్ పట్టణానికి చేరువలో ఉంది. ఈ అడవికి సమీపంలోనే వందేళ్ల నాటి విక్టోరియా బాయ్స్ హైస్కూల్ ఉంది. దట్టంగా దేవదారు చెట్లు పెరిగిన ఈ అడవిలోనే కాకుండా, అడవికి దగ్గరగా ఉన్న స్కూల్లో కూడా అతీంద్రియ శక్తులు సంచరిస్తుంటాయని స్థానికులు చెబుతుంటారు. చీకటి పడిన తర్వాత ఈ పరిసరాల్లో మానవమాత్రులు కనిపించడం చాలా అరుదు. డౌహిల్ అడవి నుంచి విక్టోరియా బాయ్స్ హైస్కూల్ వైపు వెళ్లే దారిని ‘డెత్ రోడ్’గా పిలుచుకుంటారు. ఈ దారిలో అనేక అసహజమైన సంఘటనలు జరగడమే దీనికి కారణం. చీకటి పడ్డాక ఈ దారిలో వస్తుండగా దయ్యాలను చూశామని కొందరు చెబుతుంటారు. ఈ దారిలో ప్రయాణిస్తున్నప్పుడు వికృతమైన నవ్వులు, భయపెట్టే ధ్వనులు వినిపించినట్లు ఇంకొందరు చెబుతుంటారు. స్థానికులు చెప్పే మరో విచిత్రమైన ఉదంతమేమిటంటే, ఈ ప్రాంతంలో రాత్రివేళ తలలేని బాలుడు ఒకడు కాపలాగా తిరుగుతుంటాడని, ఎవరైనా గమనిస్తే, పరుగుతీస్తూ అడవిలోకి పారిపోయి, అదృశ్యమైపోతాడని చెబుతారు. ఆ బాలుడికి తల ఉండదని, మెడ ఉండాల్సిన చోట ఒక నిలువైన కట్టె ఉంటుందని చెబుతుంటారు. రాత్రివేళ ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టడానికి స్థానికులు ఇప్పటికీ భయపడతారు.హోయా బాచూప్రపంచంలో అతీంద్రియ శక్తులకు ఆలవాలంగా పేరుమోసిన అడవుల్లో ‘హోయా బాచూ’ ఒకటి. ఇది రుమేనియాలో ఉంది. అడ్డదిడ్డంగా మెలికలు తిరిగి దట్టంగా పెరిగిన ఇక్కడి చెట్లను పగటి వేళలో చూస్తేనే జనాలు భయపడతారు. ఇక రాత్రివేళ అయితే, ఈ అడవి పరిసరాల్లోకి అడుగు పెట్టడానికి కూడా సాహసం చేయరు. సాధారణంగా ఈ అడవి నిర్మానుష్యంగా ఉంటుంది. అప్పుడప్పుడు కొందరు ఔత్సాహికులు ఇక్కడి అంతుచిక్కని రహస్యాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో వెళుతుంటారు. అలా వెళ్లినవారు కూడా చాలామంది ఈ అడవిలో కొంతదూరం ప్రయాణించాక కడుపులో వికారం మొదలై వాంతులయ్యాయని, గుండెదడ మొదలైందని చెబుతుంటారు. ఈ అడవి పరిసరాల్లో కనిపించిన ‘యూఎఫ్ఓ’ను ఒక సైనికుడు 1968లో ఫొటో తీయడంతో ఇక్కడ అతీంద్రియ శక్తులపై ప్రచారం మరింత ఎక్కువైంది. ఆ ఫొటో ప్రచారంలోకి వచ్చిన తర్వాత శాస్త్రవేత్తల బృందాలు ఈ అడవిలో పరిశోధనలు జరిపాయి. అడవి పైనుంచి యూఎఫ్ఓ సంచరించిన ప్రాంతంలో చెట్లు చచ్చిపోయాయి. ఆ ప్రదేశంలో ఇప్పటి వరకు ఒక్క మొక్క కూడా మొలవలేదు. దీనికి శాస్త్రవేత్తలు కచ్చితమైన కారణాలను చెప్పలేకపోతున్నారు. బహుశా, యూఎఫ్ఓ రేడియేషన్ ప్రభావం కారణంగానే ఈ ప్రదేశంలో తిరిగి మొక్కలు మొలవడం లేదని చాలామంది భావిస్తున్నారు. -
గాంధీ కొండ... చూద్దామా!
∙చెన్నాప్రగడ శర్మ, విజయవాడ విజయవాడ పేరు చెప్పగానే గుర్తొచ్చేవి ముచ్చటగా మూడు కొండలు. ఒకటి దుర్గ కొండ, రెండోది గాంధీ కొండ, మూడోది గుణదల కొండ. మహాత్మాగాంధీ మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం గాంధీ కొండ పేరిట స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్ పశ్చిమ ద్వారానికి కూతవేటు దూరంలో ఉంటుంది. ఒకప్పుడు పర్యాటకులతో కిటకిటలాడిన కొండ కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురైంది. మళ్లీ ఇప్పుడిప్పుడే పూర్వవైభవాన్ని సంతరించుకుంటోంది.నాటి ఓర్ కొండే నేటి గాంధీ కొండవిజయవాడ తారాపేటలో 500 అడుగుల ఎత్తున గాంధీ కొండ ఉంది. కెప్టెన్ చార్లెస్ ఓర్ అనే ఇంజినీరు 1852లో కృష్ణా నదిపై తొలి ఆనకట్ట నిర్మించినప్పుడు ఈ కొండపై నుంచే నిర్మాణ పనులను పర్యవేక్షించేవారు. అప్పట్లో దీన్ని ఓర్ కొండ అనేవారు. దీనిపై 1948లో బాపూజీ స్మారక స్థూపం ఏర్పాటు చేశారు. విజయవాడ వాసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఎంతో ఆసక్తిగా తిలకించేవారు. ఆ తర్వాత పలు జిల్లాలు, క్రమేణా ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకుల రాక ఊపందుకుంది. 1921లో స్వాతంత్య్ర పోరాట సమయంలో మహాత్మాగాంధీ బెజవాడ వచ్చి కొండ దిగువన నిర్వహించిన సభలో ప్రసంగించారు. అప్పటి నుంచి ఓర్ కొండ గాంధీ కొండగా పేరు పొందింది. గాంధీ స్మారక నిధి ఇక్కడ రూపొందించిన గాంధీ స్మారక చిహ్నానికి 1964 నవంబర్ 9న నాటి ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి పునాదిరాయి వేశారు. దేశంలో ఒక కొండపై ఉన్న మొట్టమొదటి గాంధీ స్మారక చిహ్నమిది. 1967లో అప్పటి ఉప ప్రధాని మొరార్జీదేశాయ్ గాంధీ హిల్ సొసైటీని స్థాపించారు. దశాబ్దం తర్వాత ఈ సొసైటీని గాంధీహిల్ ఫౌండేషన్ పేరిట ట్రస్టుగా మార్చారు. గాంధీజీ శత జయంతి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా 1968 అక్టోబర్ 6న అప్పటి రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ 52 అడుగుల పొడవుగల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. చికుబుకు చికుబుకు రైలే...కొండపై ప్రధానంగా ఆకట్టుకునేది పిల్లల టాయ్ రైలు. 1969లో ఇండియన్ రైల్వేస్ రైలుమార్గాన్ని వేసింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రైలును బహూకరించింది. ఇది కొండను చుట్టివస్తుంది. లోపల కూర్చొని విజయవాడ నగరాన్ని చూడవచ్చు. ఒకప్పుడు ఈ రైలు ఎక్కేందుకు జనాలు పోటీపడేవారు. ఇప్పుడు రైల్వే ట్రాక్ పాడయింది. రైలు కూడా జీర్ణావస్థకు చేరడంతో ఏడాదిన్నరగా తిప్పడం లేదు. ప్రస్తుతం ఒకవైపు కొత్త ట్రాక్ పనులు, మరోవైపు విద్యుద్దీకరణ జరుగుతోంది.నేల మీదికి నింగి...అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి సౌండ్ అండ్ లైట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా.. 1969లో సరిహద్దు గాంధీగా పేరొందిన ఖాన్ అబ్దుల్ గఫార్ఖాన్ ప్రదర్శన ప్రారంభించారు. ఇందులో గాంధీజీ జీవితం, స్వాతంత్య్రోద్యమ ఘట్టాలను ప్రదర్శిస్తారు. 1971లో ప్లానెటోరియంను ప్రారంభించారు. న్యూయార్క్కు చెందిన ఫోర్డు ఫౌండేషన్ దీనికి టెలిస్కోప్ బహూకరించింది. పిల్లలు, పెద్దలు ఎవరికైనా ప్రవేశ రుసుం 40 రూపాయలు. కనీసం పదిమందికి పైగా వస్తేనే ప్రదర్శన వేస్తారు. కొండపై గ్రంథాలయం ఒకటుంది. ఇందులో మహాత్మాగాంధీ జీవితానికి సంబంధించినవి, ఆయన స్వయంగా రాసిన పుస్తకాలు దాదాపు వెయ్యి ఉంటాయి. ఇంకా పలు ఛాయాచిత్రాలు చూడవచ్చు. పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేకంగా పార్కులున్నాయి. దశలవారీగా అభివృద్ధి...రాష్ట్ర విభజన అనంతరం 2017లో కొత్తగా ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక నిధి పేరుతో రిజిస్టర్ అయింది. కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. ప్రస్తుతం గాంధీ హిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను దశలవారీగా చేపట్టనున్నారు. ముందుగా కొండను సుందరీకరించనున్నారు. ఘాట్ రోడ్డు ప్రారంభంలో ఆర్చ్ని అందంగా తీర్చిదిద్దుతారు. అక్కడి నుంచి స్థూపం వరకు అప్రోచ్ రోడ్డును అభివృద్ధి చేస్తారు. పచ్చదనాన్ని మరింత పెంచుతారు. పిల్లలు ఆడుకునే ఆట ప్రదేశాల్లో కొత్త పరికరాలను అమర్చుతారు. ఇవన్నీ అక్టోబరు రెండు నాటికి పూర్తయితే గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నారు. గాంధీ కొండను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రణాళికతో ముందుకెళుతున్నామని గాంధీ స్మారక నిధి చైర్మన్ గాంధీ పి.సి. కాజా చెప్పారు.ఫొటోలు: కిశోర్ నడిపూడి సాక్షి–విజయవాడపర్యాటకానికి అండ గాంధీ కొండవిజయవాడ నగరంలో పర్యాటకంగా ప్రసిద్ధిగాంచిన ప్రదేశాల్లో గాంధీ కొండ ఒకటి. టాయ్ ట్రైన్ తిరిగినప్పుడు పిల్లలు పెద్ద సంఖ్యలో వచ్చేవారు. ఇప్పుడది మరమ్మతులకు గురైంది. మరో ఏడాదిన్నరకుగాని పట్టాలెక్కదు. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 8–30 గంటల వరకు కొండను సందర్శించవచ్చు. ఎంట్రన్్స టికెట్ 10 రూపాయలు. ప్రతి మంగళవారం సెలవు. రైల్వే స్టేషన్ పశ్చిమ ద్వారానికి అతి సమీపంలో ముఖ ద్వారం ఉంటుంది. కాలినడకన వెళ్లవచ్చు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి 1.9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ∙ఉప్పలూరి రవితేజ, మేనేజర్–గాంధీ హిల్ -
కొట్టలేకపోయిన వారిని కొట్టించాడు!
∙పార్ట్–2 - కేరళలో ఇటీవల ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక స్కూల్ పూర్వ విద్యార్థులు కొందరు గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ బాలకృష్ణన్, అతడి స్నేహితుడు మాథ్యూ కలిసి బాబుపై (62) దాడి చేశారు. అదేమంటే, 50 ఏళ్ల క్రితం నాలుగో తరగతిలో ఉండగా బాబు తనను కొట్టాడని, బలహీనంగా ఉన్న తాను అప్పుడు కొట్టలేకపోయానని, ఆ కక్ష ఇప్పుడు తీర్చుకున్నానని చెప్పాడు. ఉస్మాన్ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనీస్ను భరూచ్లో పట్టుకున్న పోలీసులకు ఇదే అనుభవం ఎదురైంది. డిగ్రీ వరకు చదువుకున్న అనీస్ తెలివైనవాడే అయినా, అతడికి శరీర దారుఢ్యం లేదు. దీంతో స్కూలు, కాలేజీ రోజుల్లో కొందరు స్నేహితులు, క్లాస్మేట్స్ చేతిలో దెబ్బలు తిన్నాడు. మిగతా వారిని మర్చిపోయిన అనీస్, తనను విచక్షణారహితంగా కొట్టిన ఇద్దరు క్లాస్మేట్స్ను మాత్రం గుర్తుంచుకున్నాడు. తన ఇంటి పక్కన ఉండే ఓ వ్యక్తితో మంచినీళ్ల విషయమై అనీస్కు గొడవ జరిగింది. దీంతో అతడు దాడి చేసినా, ఇతడు ప్రతిదాడి చేయలేకపోయాడు. ఈ విషయంతో అతడిపైనా కక్ష పెంచుకున్న అనీస్ సరైన సమయం కోసం ఎదురు చూశాడు. అనీస్ను భరూచ్ నుంచి హైదరాబాద్ తీసుకువచ్చిన టాస్క్ఫోర్స్ పోలీసులు సహ నిందితులు, బాలుడి ఆచూకీ కోసం ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇద్దరు క్లాస్మేట్స్తో పాటు పక్కింటి యజమానిపై కక్ష తీర్చుకోవాలని భావించిన అనీస్– వారి పేర్లు, వివరాలు చెప్పి, వాళ్లతో కలిసే నేరం చేశానని, బాలుడు వారి వద్దే ఉన్నాడని చెప్పాడు.అనీస్ పథకం విషయం తెలియని పోలీసులు బాలుడిని కాపాడాలనే ఉద్దేశంతో వారిని తీసుకువచ్చి ప్రశ్నించడం, వాళ్లు తమకు ఏమీ తెలియదని చెప్పడంతో ‘ఇంటరాగేషన్’ మొదలుపెట్టారు. వీరిలో ఓ ఏఎస్సై కుమారుడు సైతం ఉండటంతో ఆ అధికారి కూడా వచ్చి ‘ఇంటరాగేషన్’లో పాల్గొన్నారు. ఇలా నలుగురిని తీసుకువచ్చి, ‘ఇంటరాగేషన్’ చేసి, వారి పూర్వాపరాలు పరిశీలించాక టాస్క్ఫోర్స్ పోలీసులకు అనుమానం వచ్చింది. అనీస్ తప్పుదోవ పట్టిస్తున్నాడని భావించారు. అప్పటి వరకు అతడిని ‘ఇంటరాగేషన్’ చేయని అధికారులు ఆపై తమ పంథాలో ముందుకు వెళ్లారు. దీంతో అసలు విషయం చెప్పిన అనీస్, ‘వాళ్లు అందరూ ఒకప్పుడు నన్ను కొట్టారు. అప్పుడు నేను తిరిగి కొట్టలేకపోయాను. ఇప్పుడు అవకాశం రావడంతో మీతో కొట్టించాను’ అని చెప్పడంతో అధికారులు అవాక్కయ్యారు. ఈ పరిణామంతో పోలీసుల ట్రీట్మెంట్ కూడా మారిపోవడంతో నోరు విప్పిన అనీస్... కిడ్నాప్ చేసిన గంటలోపే అనుకోని పరిస్థితుల్లో ఉస్మాన్ తమ చేతిలో హత్యకు గురయ్యాడని బయటపెట్టాడు. కిడ్నాప్ చేసిన 2009 ఏప్రిల్ 20నే బాలుడిని తీసుకుని నిందితులు మారుతీ వ్యాన్లో శంషాబాద్ వైపు వెళ్తుండగా, మార్గమధ్యంలో పోలీసుల నాకాబందీ నిర్వహిస్తున్నారు. దీంతో తాము వారి కంట పడకూడదని అనీస్ తదితరులు భావించారు. అప్పటికే ఉస్మాన్ గొడవ చేస్తుండటంతో చెకింగ్ పాయింట్ దాటే వరకు నోరు మూసి, వాహనం కిటికీల్లోంచి కనపడనంత కిందకు ఉంచాలని భావించారు. ఆ ప్రయత్నాలో భాగంగా వీళ్లు పొరపాటున ఉస్మాన్ ముక్కు కూడా మూసేయడంతో చనిపోయాడు. చెకింగ్ పాయింట్ దాటిన తర్వాత బాలుడిని గమనించిన నిందితులు అతడు చనిపోయినట్లు గుర్తించారు. మృతదేహాన్ని షాద్నగర్ సమీపం వరకు తీసుకువెళ్లి, రోడ్డు పక్కన గుంతలో పడేసి, పైన చెత్తకప్పి ఎవరికి వారుగా పారిపోయారు. బాలుడు చనిపోయిన విషయం అతడి కుటుంబానికి తెలియదు కాబట్టి తమ వద్దే ఉన్నాడని చెబుతూ డబ్బు గుంజాలనే ఉద్దేశంతో ఫోన్లు చేశాడు. ఉస్మాన్ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు 2009 ఏప్రిల్ 20 తర్వాత రాష్ట్రంలోను, చుట్టుపక్కల రాష్ట్రాల్లోనూ దొరికిన గుర్తుతెలియని శవాల వివరాలను ఆరా తీశారు. వాటిలో 10–15 ఏళ్ల మధ్య వయస్సు వారివి లేకపోవడంతో ఆ దిశలో దర్యాప్తు సాగలేదు. ఉబ్బిపోయిన స్థితిలో ఉన్న ఉస్మాన్ మృతదేహాన్ని 2009 ఏప్రిల్ 23న గుర్తించిన పశువుల కాపరులు షాద్నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇదేదో సాధారణ కేసుగా భావించిన ఆ ఠాణా అధికారులు ఓ హెడ్–కానిస్టేబుల్ను ఘటనాస్థలికి పంపారు. అక్కడకు వెళ్లిన ఆ అధికారి మృతదేహం ఉబ్బి ఉండటంతో అది 25–30 ఏళ్ల మధ్య వయస్కుడిగా భావించి అలానే రికార్డుల్లో నమోదు చేయడంతో ఆ విషయం టాస్క్ఫోర్స్ దృష్టికి రాలేదు. ఉస్మాన్కు సంబంధించి తొలుత శాలిబండ పోలీసుస్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. అనీస్ నుంచి ఫోన్లు వచ్చిన తర్వాత ఇది కిడ్నాప్గా మారింది. షాద్నగర్లో మృతదేహం దొరికిన వెంటనే అక్కడ పోలీసులు గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. ఈ మృతదేహానికి షాద్నగర్ పోలీసులు పోస్టుమార్టం నిర్వహించగా, ఎందరో చంపినట్లు బయటపడంతో గుర్తుతెలియని హత్యగా కేసును మార్చారు. ఇలా రెండు పోలీసుస్టేషన్లలో వేర్వేరుగా నమోదైన ఉస్మాన్ కేసు నాలుగు రకాలుగా మారింది. షాద్నగర్ పోలీసులు ఉస్మాన్ మృతదేహంపై లభించిన చొక్కాను భద్రపరచారు. దీని ఆధారంగానే కుటుంబీకులు అది తమ కుమారుడి మృతదేహమే అని గుర్తించగలిగారు. ఈ కేసు దర్యాప్తు మొత్తం పూర్తి చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు 2009 జూన్ 9న అనీస్తో పాటు అతడి సోదరులు షంషుద్దీన్ అలియాస్ అక్రం, ఖాజీ హఫీజుద్దీన్ అలియాస్ అస్లంలను అరెస్టు చేశారు. ఈ నేరం చేసిన తర్వాత అత్యంత తెలివిగా వ్యవహరించిన అనీస్ బాలుడి కుటుంబంతో కలిసే ఉన్నాడు. ఓ దశలో పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు తనకు అనేక రుగ్మతలు ఉన్నాయని, ఇంటరాగేషన్ చేయకూడదంటూ నకిలీ పత్రాలు చూపించి బయటపడ్డాడు. వెంటనే తన తండ్రి సహాయంతో కిడ్నాప్ డ్రామా ఆడి కామాటిపురాలో కేసు నమోదు చేయించి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ∙ -
ఈ వారం కథ: బదిలీ
‘వద్దు నాకు ఇష్టం లేదు.’‘వెరీ స్ట్రేంజ్ అందరూ ప్రమోషన్ కోసం ఆరాటపడతారు. మీరూ?!... ఆశ్చర్యంగా ఉందే!’‘ప్రమోషన్ వరకూ ఓకే! ప్రమోషన్ వచ్చిందంటేనే పక్కన ట్రాన్స్ఫర్ ఉంటుంది. అలా వెళ్ళటం, నాకు?! అయినా ప్రైవేట్ జాబ్లో ఓ బ్రాంచ్ నుండి ఓ బ్రాంచ్కేగా ప్రమోషన్.’ ‘మీరు ఎంచుకున్న చోటుకి వేయించుకోండి. అనుకూలమైన చోటుకి వెళ్ళండి. అంతేగాని, ప్రమోషన్ ఎందుకు వద్దూ!? ఏ ఉద్యోగంలోనైనా ఈ బదిలీలు మామూలేగా! మళ్ళీ మధ్యలో బదిలీ కావాలంటే ఉండదు ఆలోచించుకోండి’శ్రేయోభిలాషులు, ఆఫీసు మేనేజర్ ఎంత నచ్చచెప్పాలని చూసినా వినలేదు సుమబాల.ప్రమోషనూ, ట్రాన్స్ఫర్ ఆగిపోయాయి.తండ్రి లేని పిల్ల, ఏ బాధా కలగకుండా చూసుకోవటమే తల్లిగా తన బాధ్యత.విదూష ఇప్పుడు ఆరో క్లాస్ చదువుతోంది.బాల ఆఫీస్ నుండి ఇంటికి వచ్చింది.తన కంటే ముందే వచ్చి, పక్కింట్లో ఆడుకుంటున్న విదూషను తీసుకువచ్చి,స్నానం చేయించి, హోమ్ వర్క్ చేయించాలి. విదూషను తీసుకురావటానికి వెళ్ళింది. అక్కడ సింధూరతో ఆడుతోంది విదూష. ఎంతగానో చక్కగా కిలకిలలాడుతూ, నవ్వుతూ, గంతులేస్తూ ఆడుతున్న విదూషను, తీసుకుని రాలేక అలాగే సింధూర వాళ్ళమ్మతో తనూ, ఆఫీస్ విషయాలూ, లోకాభిరామాయణం మాట్లాడుతూ కూర్చుంది.‘విదూ! చీకటి పడుతోంది.హోమ్ వర్క్ చేసుకోవాలి పద నాన్నా!’లేచి సింధూరకు ‘బై’ చెప్పి తల్లి వెనుకే వచ్చేసింది. ఇంటికి వచ్చాక, సుమబాల ఇంటిపనిలోనూ, విదూష హోమ్ వర్క్లోనూ బిజీ అయిపోయారు. దాదాపు గంటన్నర తర్వాత ఇద్దరూ భోజనానికి కూర్చుని, విదూషను ‘విదూ! ఏంటి విశేషాలూ!’ అడిగింది.స్కూల్ విశేషాలు చెప్పినవి తక్కువే కాని, సింధూర గురించి చెప్పిన విషయాలే ఎక్కువున్నాయ్. విదూష ఏం చెప్పినా, విని ఆమెను అంచనా వేయటం సుమబాలకు అలవాటు. సింధూరతో తను ఎలా ఆడుకుందీ, సింధూర ఎలా తినేదీ, ఎలా మాట్లాడేదీ! ఎంతో సంతోషంగా ఏకరువు పెడుతోంది. ఆ సంతోషం చూస్తూనే...సుమబాల మనసు గతంలోకి తొంగి చూస్తోంది. సవ్యసాచిదీ, తనదీ పెద్దలు అంగీకరించిన ప్రేమవివాహం. రెండేళ్ళు ఆనందంగా గడిచినాయి. తమ కలల పంట కడుపులో ఉండగానే, సవ్యసాచి తనను వదిలేసి పైలోకాలకు పోయాడు. ఆ దుఃఖంలోంచి బయటికి రావటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. సవ్యసాచికి ఓ పెద్ద ప్రైవేట్ లిమిటెడ్లో జాబ్. అన్ని రాష్ట్రాలలోనూ బ్రాంచ్లు ఉండటం వల్ల, తరచూ కంపెనీలో ఉద్యోగులు మారుతూనే ఉంటారు.సవ్యసాచి పోయాక ఆ ఉద్యోగం తనకు ఇచ్చారు. పాప కోసమైనా కన్నీళ్లు తుడుచుకుని, జాయిన్ అయింది. తల్లిదండ్రులకు వాళ్ళు ఉన్న ఊళ్ళోనే కాలక్షేపం కనుక వారిని తీసుకొని రాలేదు.పైగా తీసుకువస్తే, తన గురించి దిగులుపడుతూ, తనను రెండోపెళ్లి కోసం ఇబ్బంది పెడతారు. అందుకే! వాళ్ళని శెలవులలో కలవడమే!కాని, తోడులేని ఒంటరి ప్రయాణం, సింగిల్ పేరెంట్గా తన అవస్థలు, పాపను పెంచటంలో తను పడే పాట్లు, ఓ గ్రంథాన్ని వ్రాయవచ్చు.ఇంటా బయటా ఎన్నో సమస్యలు తట్టుకుంటూ, మధ్యలో దూరిపోయి భయపెట్టేసే అపరిచితులను దాటుకుంటూ, తప్పించుకుంటూ, బాధపెట్టే ఎన్నో అనుభవాలు.. విదూష నుండి కూడా...పాప విదూష యూకేజీలో ఉండగా, ఓ స్కూల్లో జాయిన్ చేసింది. అక్కడ విశాలాక్షి అనే పాపతో స్నేహం కుదిరింది విదూషకు. ఎంతో చనువుగా, చక్కగా ఉండేవారు. విశాలాక్షి ఇల్లూ తమ ఇంటికి రెండు ఇళ్ళ అవతలే కాబట్టి, ఎప్పుడూ విశాలాక్షితోనే ఉండేది విదూష. వాళ్ళ నాన్న ఉంటే విదూషను బండి మీద ఎక్కించుకుని తిప్పేవారు. తను ఎక్కడ తిప్పగలదు. ఆఫీసు, ఇంటిపనీ! అప్పటికే అలసట.పాపం ఏదో కాలక్షేపం చేస్తోందిలే అనుకుంది. విశాలాక్షి తింటేనే తినేది. తను పడుకుంటేనే పడుకునేది. స్కూల్ లేని సమయంలో తప్ప దాదాపు వాళ్ళింట్లోనే ఉండేది.రెండేళ్ళలో విడదీయరాని బంధం. విశాలాక్షి తండ్రికి గవర్నమెంట్ జాబ్. ట్రాన్స్ఫర్ అయింది.విశాలాక్షితో పాటు వాళ్ళు వెళ్ళిపోయారు.ఆరోజు విదూష ఏడ్చిన ఏడుపు, తను ఇప్పటికీ మరచిపోలేదు.‘అమ్మా! విశా కావాలమ్మా!’ అంటూ కిందపడి ఏడుస్తూ ఉంటే, ఏం చేయాలి? అనుబంధాలు పెంచుకోకూడదని చెప్పటానికీ, ఆమె వినటానికి, ఎంత వయసనీ? రెండురోజులు ఆఫీసుకు సెలవు పెట్టి, అమ్మమ్మ దగ్గరకూ, షాపింగ్లకూ తిప్పాక, వారంరోజులకు కాస్త తెప్పరిల్లింది. స్కూల్కి వెడుతోంది.రెండో తరగతిలో శశికళతో విదూషకు చక్కని స్నేహం కుదిరింది. ఒకరితో ఒకరు కలిసి హోమ్ వర్క్ చేసుకోవటం; కలిసి ఐస్ క్రీమ్లకు డబ్బులు తీసుకుపోవటం; ఇద్దరూ కలిసి ఏవో గుసగుసలు, నవ్వులూ, మరే! మరే! అంటూ ఎన్నో ముచ్చట్లు, కేరింతలూ, ఆటవస్తువులూ, బిల్డింగ్ కట్టే క్లిప్స్, బొమ్మను తయారు చేయండి అనే చార్టులూ, ఆటా, పాటా, డాన్సూ, రెండేళ్లలో శశికళ నాన్నకి ట్రాన్స్ఫర్ అయింది.ఇక విదూష ఏడ్చిన ఏడుపు సుమబాల మనసును పిండేసింది. గుండెను కుదిపేసింది. ఏం చెప్పి, ఎలా చెప్పి ఓదార్చాలీ? తనకైనా బుద్ధి ఉండక్కర్లా?ఒకసారి జరిగాక జాగ్రత్త పడాలిగా!ఇంత స్వచ్ఛమైన మనసు ఇన్నిసార్లు గాయపడితే? ఈ పిల్ల ఏమైపోతుంది? ఏం చేయాలి? ఎలా జాగ్రత్త పడాలి? అసలు స్నేహాలు చేయకుండా ఎలా ఉంటాం. ప్రతిసారి ఇలా భంగపడి ఏడిస్తే ఎలా?పిల్లలంతా ఇలాగే ఉంటారా? సున్నిత మనస్కులైన ఇలాంటి పిల్లలకు ప్రత్యేక శిక్షణ, చికిత్స అవసరమా? మరి అవన్నీ ఎవరు ఇస్తారు? ఎక్కడికి వెళ్ళి ఎవరినడగాలి? సుమబాలకు ఆలోచనలతో మనసు కలచివేస్తోంది. విదూషను కాపాడుకోటం ఎలా? ఎవరైనా వ్యసనాల బారిన పడకుండా తమ పిల్లలను ఎలా కాపాడుకోవాలి? అని ఆలోచిస్తారు. తనూ!? స్నేహం చేయకుండా ఎలా కాపాడుకోవాలి? అని ఆలోచిస్తోంది.స్కూల్లో విదూష ఎవరితోనూ స్నేహం చేయకుండా, సరైన జాగ్రత్త కోసం తనే దగ్గరుండి దింపటం, స్కూల్ వదలిన వెంటనే ఎవరితోనూ మాట్లాడకుండా తీసుకొచ్చేయటం అలవాటు చేసుకుంది.నాలుగు రోజుల నుండి విదూష దిగులుగా ఉండటం గమనించింది. గుండె గుభేలుమంది.‘విదూ! ఏమయిందిరా? అలా ఉన్నావ్?’‘అమ్మా! ట్రాన్స్ఫర్ అంటే ఏంటమ్మా?’‘ట్రాన్స్ఫర్ అంటే బదిలీ! ఉద్యోగంలో ఉన్నవారిని ఓ ఊరు నుండి మరో ఊరికి, ఉద్యోగ సేవలు ఆ ఊరిలో వారికి అందించాలని పంపిస్తారు. అలాగే, చాలా బదిలీలు... డబ్బు బదిలీ, అంటే మనీ ట్రాన్స్ఫర్... అలాగే పేపర్స్... ఇంకా...’మాట పూర్తికాక ముందే ‘అసలు ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు ఉండకూడదమ్మా! నేను పెద్దయ్యాక పెద్ద ఆఫీసర్నై, ఈ బదిలీలు లేకుండా చేస్తానమ్మా!’ అంటూ ఏడ్చింది.సమబాలకూ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.‘ట్రాన్స్ఫర్ అంటే! ఇష్టమైన వాళ్ళని వదిలేసి వెళ్ళటం అని, అంతే నాకు తెలిసిందమ్మా! అసలీ బదిలీలు ఉండకూడదమ్మా! మా స్కూల్లో శాంతారాంగాడు నాలాగానే ఫస్ట్ ర్యాంకర్. ఇద్దరం కలిసి పోటీపడి చదువుతున్నాం ఫస్ట్ యూనిట్లో తను ఫస్ట్, సెకండ్ యూనిట్లో నేను.తర్వాత నేను, ఇలా చక్కగా పక్కపక్కనే కూర్చుని, కంబై¯Œ ్డ స్టడీ చేసేవాళ్ళం. కాని, వాళ్ళమ్మకి ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ అయింది. అమ్మ ఉన్నచోటే శాంతారాం ఉండాలిగా! వెళ్ళిపోతున్నాడు. నేను ఎవరితోనూ స్నేహం చేయకూడదమ్మా!చేస్తే వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోతారమ్మా! ఇక అంతే, ఎవరూ వద్దు నాకు’ అంటూ గదిలోకి వెళ్ళి పడుకుంది అన్నం తినకుండా...భగవంతుడా! ఇప్పుడేమి చేయటం? ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచిపోయి, తెల్లవారి స్కూల్కి వెళ్ళలేకపోతే, తనూ సెలవు పెట్టాల్సి వచ్చింది. మనసులో ఇంత సున్నితత్వం ఉండటం మంచిదే కాని, మన ఉనికే ప్రశ్నార్థకం అయ్యేలా కాదేమో!మరోసారి ఇలా జరిగితే? ఈ సంఘటనల పర్యవసానం భవిష్యత్తులో విదూష ఆలోచనలలో జరిగే మార్పుల ఫలితం ఎలా ఉంటుంది? మంచా? చెడా?సింధూరతో విదూష స్నేహమూ బలపడుతోంది.కేవలం సింధూరతో విదూష స్నేహం కోసమే ప్రమోషన్ వద్దనుకుంది. ట్రాన్స్ఫర్ వల్ల విదూషకు కొత్త వాతావరణంలో సంతోషంగానే ఉంటుందా? సింధూర, మరో విదూషలాగా ఏడ్చి మారాం చేస్తే, ఆ తల్లికి ఎంతకష్టం! ఆ చిన్న మనసుకు ఎంత గాయం! తన పిల్ల విషయంలో జరిగింది, సింధూర విషయంలో జరగకూడదు. సింధూర విదూషను చాలా ఇష్టపడుతోంది. అందుకే ప్రమోషన్, ట్రాన్స్ఫర్ వదులుకుంది. కాని, ఇద్దరినీ సున్నితంగా నొప్పి తెలీకుండా వేరు చేయాలి. ఏదో చేయాలి. ఏం చేయాలి ఆలోచిస్తోంది సుమబాల.‘విదూ! ఈరోజు సెలవు పెట్టాం కదా! మనం ఓ చోటికి వెడదామా?’‘కరుణామయీ! వికలాంగుల సంక్షేమ ఆశ్రమం’ దగ్గర బండి ఆపి, లోపలికి తీసుకువెళ్ళింది విదూషను.అక్కడ అన్ని రూములలోనూ పిల్లలు. అందరూ వికలాంగులే! మానసిక వికలాంగులు, శారీరక వికలాంగులు.భయం భయంగా చూసింది విదూష.అందరికీ తను తెచ్చిన, స్వీట్స్ పళ్ళూ ఇప్పించింది సుమబాల. అక్కడ కన్వీనర్తో మాట్లాడుతూ కూర్చుని, విదూషను పరిశీలిస్తోంది. విదూష ఏదో కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్లు, చూస్తూ మనసులో దేన్నో నింపుకోటానికి ప్రయత్నిస్తోంది. వాళ్ళ దగ్గరకు వెళ్ళటానికి భయపడుతోంది.వాళ్ళల్లో కొంతమంది బయటి ప్రపంచంతో సంబంధం లేనట్లుగా, వీళ్ళు ఇచ్చిన, పళ్ళు తింటూ, కూర్చున్న చోటునే, విరిగిపోయిన బొమ్మలను ఏదో తోచినట్లు ఆడిస్తూ, ఆడుకుంటున్నారు.కానీ! కొంతమంది శారీరక వైకల్యం కలిగిన పిల్లలు మాత్రం విదూషతో మాట్లాడటానికి చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. వాళ్ళతో బిడియంగా, కొత్తగా ఫీలవుతూ చేయి కలిపింది విదూష.సాయంత్రం వరకూ అక్కడే ఉండి, విదూషను ఇంటికి తీసుకువచ్చింది.‘విదూ! వీరికి వేరే ప్రపంచం తెలీదు.కొంతమందికి స్నేహం చేయటమూ తెలీదు. పసితనం ఓ శాపంలా బతుకుతారు. కేవలం ఎవరు అన్నం పెడతారా? బిస్కట్ ఇస్తారా! తిందామా! ఎంత దైన్యం, కదా!’‘అమ్మానాన్నలు ఉండరా అమ్మా!’‘అమ్మ గాని, నాన్న గాని ఉంటే వాళ్ళు ఇక్కడుంటారా? చెప్పు! వాళ్ళని చూశాక నువ్వు ఎంత అదృష్టవంతురాలివీ అనుకోవాలి. అయినదానికీ కానిదానికీ ఏడ్చి అమ్మను బాధ పెట్టకూడదు. స్నేహం చేయదలచుకుంటే రోజూ అక్కడికి వెడదాం. నీ స్నేహం వాళ్ళకి పంచు. ఆనందపడతారు. అంతేగాని, ఫ్రెండ్స్ వెళ్ళిపోయినప్పుడల్లా ఏడుస్తావెందుకు?దీని ద్వారా ప్రకృతి నీకేం చెప్పదలచుకుందో అది విను. అందరితోనూ స్నేహం చేయమని, కేవలం ఏం ఒక్కరితోనో కాదని సందేశం ఇస్తోందేమో! ఏడుపు మానేస్తే అది వినబడుతుంది. మామూలు మాటలతో చెబితే ఏమీ అర్థం కాదని ఇక్కడికి తీసుకువచ్చా!’‘మరి వీళ్ళంతా నాతో స్నేహం చేసి, ఎప్పటికీ ఉంటారా?’విదూష మనసులో ఎన్నో ఆలోచనలు.‘తెలుసుకో! పదిసార్లు ఇక్కడికి వచ్చావనుకో వాళ్ళే నీ ప్రియ నేస్తాలవుతారు. ఇంకొంచెం పెద్దయ్యాక వాళ్ళ కోసం నువ్వేమైనా చేయగలనేమో అనే ఆలోచన నీకే వస్తుంది.’విదూష ఆలోచనలలో శాంతారాం వెనుక పడ్డాడు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది సుమబాల.‘కానీ రోజూ అక్కడికి వెళ్ళటం కుదరదుగా!’అంది. సాయంత్రం రిలాక్స్ అవుతున్న సమయంలో సింధూర వాళ్ళ అమ్మగారు రావటం సుమబాలకు ఆశ్చర్యం కలిగించింది.‘ఏమిటీ! విశేషాలు?’‘మీ విదూష, మా సింధూర కలిసి మా యింట్లో ఆడుకుంటున్నారు.మీతో ఓ విషయం మాట్లాడాలని వాళ్ళకి తెలీకుండా వచ్చాను’ అంది.సుమబాల గుండె మళ్ళీ గుభేలుమంది.‘మాది హోటల్ వ్యాపారమని మీకు తెలిసిన విషయమే కదా!’‘అవును... తెలుసండీ’‘ఇక్కడ బిజినెస్ సరిగా సాగట్లేదు. అందుకని హైదరాబాద్ వెళ్లి అక్కడ బిజినెస్ చేద్దామని మావారు అంటున్నారు.అయితే. ఫ్రెండ్స్ దూరమైనప్పుడల్లా విదూష, ఆమెతో పాటు మీరు తల్లడిల్లిపోవటం విన్నాను. ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ అయితే విదూష గురించి బాధగా ఉంది. సింధూర కొత్త ప్లేస్ కాబట్టి ఎంజాయ్ చేస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదనుకుంటున్నాను. మరీ!...’సుమబాల దేనికైతే భయపడి ఆరునెలల క్రితం ట్రాన్స్ఫర్ వద్దనుకుందో, అదే తన కళ్ళముందు ప్రత్యక్షమవటం భయం కలిగించింది. కాని, మెల్లగా– ‘మీరు ఉద్యోగస్తులు కాదు! కాబట్టి, ఈ సమస్యే రాదు. నావల్ల వస్తే, సింధూర బాధపడుతుందనుకుని, ఆ బాధ మీరు పడకూడదు అనే అనుకున్నాను ఇన్నాళ్ళూ!’‘తెలుసు! మీకు చెప్పకుండా మేం వెళ్ళిపోవచ్చు. కాని, మీరు ప్రమోషన్ కూడా వదులుకున్నారు మన పిల్లల కోసం... అందుకే చెప్పటానికి వచ్చాను. ఈవిషయం సింధూరకు చెప్పలేదు చెబితే విదూషకు ఎక్కడ తెలుస్తుందో అనీ!...’‘నిజమే ఇది తెలిస్తే?’... విదూషను తలచుకుంటే ఒళ్ళు జలదరించింది.ఇప్పుడు ఆర్థిక సంవత్సరం మధ్యలో, ట్రాన్స్ఫర్ కావాలన్నా ఇవ్వరు. ఎలా?పిల్లలను పసితనంలో ఏ ప్రభావమూ పడకుండా పెంచటం ఇంత కష్టమా? అందరి పిల్లలూ విదూషలా లేరు.ఇలా ఉన్న పిల్లలను కాపాడే తీరాలి. అప్పుడే సమాజం పట్ల సున్నితమైన అవగాహనతో మెలుగుతారు. లేదంటే ఒక కసితో... ఇక ఆలోచించలేక‘నేను చూసుకుంటాలెండి’ అని మాత్రం అనగలిగింది. ఆమె వెళ్ళిపోయింది.∙∙ ‘విదూ! నాకు బదిలీ అయింది. నీ పుట్టినరోజు సందర్భంగా నీకో సర్ర్పైజ్ గిఫ్ట్.’ ‘ఎక్కడమ్మా! ఏంటమ్మా అదీ! ప్లీజ్ చెప్పవా?’ విదూష సంతోషం చూసి, తేలికగా ఊపిరి పీల్చుకుంది.‘చూపిస్తా పద!’ఇద్దరూ కలిసి వెళ్ళారు.‘ఇదిగో! కొత్త ఇల్లు. మన కోసమే!’‘ఇక్కడ ... మన కోసం’‘వావ్! కరుణామయి వికలాంగుల సంక్షేమ ఆశ్రమం.. మొన్న ఈ ఆశ్రమానికి వచ్చాముగా! మరి ట్రాన్స్ఫర్ అన్నావ్?’‘అవును! బదిలీ! అక్కడి నుండి ఇక్కడికి ఇంటి బదిలీ! ఆలోచనల బదిలీ.ఆశయాల బదిలీ. పరిస్థితుల బదిలీ.’‘అంటే? ఏంటమ్మా? సింధూరనూ తెద్దామా?‘అలాగే! ఏ పిల్లలలోనూ లేని ఓ ప్రత్యేకత నీలో ఉంది. అది తోటివారికి ప్రేమను పంచటం. ప్రేమ పంచిన వారి పట్ల తపన పడటం. అందుకే నువ్వు ఉండాల్సిన చోటు ఇదే. నీ ప్రేమ, తపన, వీరితో స్నేహం చేసి వీరికి పంచు. ఏదో ఓరోజు నువ్వూ మదర్ థెరిస్సా అంతటి దానివవుతావో, లేదంటే... మార్గం మారుతుందో కాలం చెబుతుంది. అందుకే ఆశ్రమానికి పక్కనే ఇల్లు తీసుకున్నాను. మరి ఇది బదిలీనేగా!’ ‘అమ్మా! అదిగో! నాకిష్టమయిన బ్లూమింగ్ మైండ్స్ స్కూల్’‘అవును అందులో చేరు. నీ సాయంత్రాలూ, ఖాళీ సమయాలూ, ఆశ్రమంలో.. ఓకేనా?’‘మరి సింధూర?’‘ముందు నీకు నచ్చితే... సింధూరను తీసుకువద్దాం. సరేనా?’విదూష తలూపటం చూసి, తేలికైన మనసుతో... ఆశ్రమం వంక చూస్తూ నిట్టూర్చింది సుమబాల.కాని, రోజూ అక్కడి పిల్లలతో కలిసిపోయి ఆడుతూ పాడుతూ ఉన్న విదూషతో పాటు తనూ పాలు పంచుకుంటూ, తనలో తనను చూసుకుంటే విదూషకు కాదు, తనకే ఒంటరితనపు దుఃఖం నుండి కొత్త జీవితానికి బదిలీనేమో! -
ఆనందో బ్రహ్మ
వరుణ మహర్షి కొడుకు భృగు మహర్షి. తండ్రి వద్ద భృగువు సకల శాస్త్రాలూ నేర్చుకున్నాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత భృగువుకు బ్రహ్మజ్ఞానం సాధించాలనే కోరిక కలిగింది. ఒకనాడు తండ్రి వద్దకు వెళ్లి తనకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించమని అడిగాడు.‘కుమారా! అన్న ప్రాణ నేత్ర శ్రోత్ర మనో వాక్కులన్నీ పరబ్రహ్మ సాధనకు మార్గాలే! వీటన్నింటిలోనూ బ్రహ్మతత్త్వం ఇమిడి ఉంది. అది దేని నుంచి ఉత్పన్నమైనదో, దేనితో పోషణ పొందుతున్నదో, చివరకు దేనిలో లయమవుతున్నదో, దానికి మూలమేమిటో తెలుసుకోవాలి. దానిని తపస్సు ద్వారా మాత్రమే సాధించాలి. అందువల్ల వెళ్లి తపస్సు చెయ్యి’ అన్నాడు.తండ్రి ఆదేశంతో భృగు మహర్షి దీక్ష తీసుకుని, ఒక నిర్జనారణ్యానికి చేరుకుని, అక్కడ నియమ నిష్ఠలతో తపస్సు ప్రారంభించాడు. కొంతకాలం గడిచాక ‘అన్నమే పరబ్రహ్మ స్వరూపం’ అని అతడికి స్ఫురించింది. అన్నం ద్వారానే అన్ని ప్రాణులూ ఉత్పన్నమవుతున్నాయి. అన్నం వల్లనే పోషణ పొందుతున్నాయి. అన్నం భూమి నుంచి పుడుతోంది. మరణించిన తర్వాత అన్ని ప్రాణులూ ఈ భూమిలోనే కలసిపోతున్నాయి. కాబట్టి ‘అన్నమే పరబ్రహ్మ స్వరూపం’ అని నిర్ధారణకు వచ్చాడు. వెంటనే తండ్రి వద్దకు వెళ్లి ఇదే విషయాన్ని తెలియజేశాడు. భృగువు మాటలు విన్న వరుణ మహర్షి, ‘కుమారా! నువ్వు ఇంకా మొదటి మెట్టు మీదనే ఉన్నావు. ఇంకా సాధన చేయాలి’ అన్నాడు.భృగు మహర్షి మళ్లీ అడవులకు వెళ్లి, తపస్సు చేయడం ప్రారంభించాడు. ఇంకొంత కాలం గడిచింది. ‘ప్రాణమే బ్రహ్మ’ అని ఆయన గ్రహించాడు. లోకంలోని సమస్త జీవులు ప్రాణం వల్లనే జీవిస్తున్నాయి. ప్రాణం ఉన్నప్పుడే మనుగడ సాగిస్తున్నాయి. ప్రాణం పోయినప్పుడు మృత్యువులో లయమైపోతున్నాయి అందుకే ప్రాణమే సర్వసృష్టికి మూలాధారమని భావించి, ఇదే సంగతిని తండ్రికి చెప్పాడు.కొడుకు మాటలకు వరుణుడు నవ్వి, ‘కుమారా! ఇదివరకటి కంటే కాస్త ముందుకు వెళ్లావు. ప్రాణం వల్లనే జీవులు మనుగడ సాగిస్తున్నా, ప్రాణమే బ్రహ్మ కాదు. బ్రహ్మజ్ఞానం నీకు పూర్తిగా అవగతం కావాలంటే, మరింత సాధన అవసరం. ఇంకా తపస్సు కొనసాగించు’ అన్నాడు.తండ్రి మాటలకు భృగుమహర్షి నిరాశ చెందకుండా, యథప్రకారం మళ్లీ అడవులకు వెళ్లి, మరింత కఠిన నియమ నిష్ఠలతో తపస్సు ప్రారంభించాడు. కొంత కాలం గడిచింది. సృష్టికి మూలం మనస్సు అని తలచాడు భృగువు.మనస్సు వల్లనే స్త్రీ పురుషులు పరస్పరం ఆకర్షితులవుతున్నారు. మనస్సు వల్లనే లోకంలోని సమస్త ప్రాణులు ఉద్భవిస్తున్నాయి. జన్మించిన తర్వాత కూడా మనోధర్మం ప్రకారం ఇంద్రియాల ద్వారానే జీవనం సాగుతోంది. మరణం తర్వాత ఇంద్రియాలకు జ్ఞానం ప్రసాదించే శక్తి పోతుంది. అవన్నీ మనస్సులోనే లీనమైపోతాయి. అందువల్ల మనస్సే బ్రహ్మ అనుకున్నాడు.తండ్రి వద్దకు వెళ్లి, తపస్సులో తాను గ్రహించినది చెప్పాడు. ‘తండ్రీ! మనస్సే బ్రహ్మ’ అని నాకు తపస్సులో స్ఫురించింది.అందువల్ల మనస్సే బ్రహ్మ అనుకుంటున్నాను’ అన్నాడు.‘కాదు. నీకు బ్రహ్మతత్త్వం పూర్తిగా అవగతం కాలేదు. మళ్లీ తపస్సు కొనసాగించు’ అన్నాడు వరుణుడు.భృగువు మళ్లీ మొక్కవోని దీక్షతో తపస్సు కొనసాగించాడు. తపస్సులో కొన్నేళ్లు గడిచిపోయాయి. ‘ఆనందమే పరబ్రహ్మ స్వరూపం’ అని స్ఫురించింది. సర్వమూ ఆనందం నుంచే జనిస్తుంది, ఆనందంలోనే లయమవుతుంది. ఆనందానికి అతీతమైనది మరేదీ లేదు.అందువల్ల ‘ఆనందో బ్రహ్మ’ అనుకున్నాడు. తండ్రి వద్దకు వెళ్లి ఇదే సంగతిని తెలియజేశాడు.భృగువు ‘ఆనందో బ్రహ్మ’ అని పలకడంతోనే వరుణ మహర్షి పరమానందభరితుడయ్యాడు.‘కుమారా! లెస్సగా గ్రహించావు. ఉత్తమోత్తమ పరమాత్మ తత్త్వం ఆనందం. అన్నం, ప్రాణం, మనస్సు, విజ్ఞానం కూడా పరబ్రహ్మ స్వరూపాలే! కాని, ఇవి ఒకదాని కన్నా మరొకటి సూక్ష్మమైనవి. వీటన్నింటినీ మించినది ఆనందం. ఈ ఆనందం క్షణికమైనది కాదు, శాశ్వతమైనది. పరబ్రహ్మోపాసన క్రమంగా జరగాలి. అంటే, ఒక్కొక్క మెట్టు పైకి వెళ్లాలి. అన్నాన్ని ఎన్నడూ నిందించరాదు. ప్రాణం, మనస్సు అన్నంపైనే ఆధారపడి ఉన్నాయి. అయితే, మానవులు తినడం కోసం జీవించరాదు, జీవించడానికి తినాలి. అన్నాన్ని నియమ ప్రకారమే స్వీకరించాలి. అన్నాన్ని పూజిస్తే, తర్వాతివన్నీ లభిస్తాయి. అందువల్ల ఆహారాన్ని వదలకుండా, ప్రాణాన్ని నిలుపుకుంటూ, మనస్సును వికసింపజేసుకుని, విజ్ఞానానుభవం ద్వారా బ్రహ్మానందం పొందాలి’ అంటూ కొడుకుకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు వరుణుడు.తండ్రి ఆదేశం ప్రకారం విడువకుండా మళ్లీ మళ్లీ కొనసాగించిన తన తపస్సు ఫలవంతమైనందుకు భృగుమహర్షి పరమానందం చెందాడు.∙సాంఖ్యాయన -
ప్రపంచ దేశాల ప్రోగ్రెస్ కార్డు
ఒక చిన్న పాఠశాల గది నుంచే ఒక దేశం మారవచ్చు ఒక నోట్బుక్ పేజీ నుంచే ఒక తరం చరిత్రను తిరగరాయవచ్చు అందుకే, ప్రపంచం మొత్తం విద్యావిధానమే అభివృద్ధికి ఆలంబన కాగలదని విశ్వసిస్తోంది.ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఒక అద్భుతమైన రేసులో ఉన్నాయి. అయితే, ఇది రన్నింగ్ రేసు కాదు, రీడింగ్ రేసు! ఈ రేసులో పరుగులు తీసేది విద్యార్థులే అయినా, ఫలితాలు మాత్రం దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. ఇక్కడ కుల, మత, వర్ణ భేదాలకు చోటు లేదు – ఒక్కటే అవసరం: విద్యపై నిబద్ధత! దేశాలన్నీ పాఠశాల వేదికపై ఎగబడి, చదువు అనే శక్తిమంతమైన ఆయుధంతో భవిష్యత్తులో తమ స్థానాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఇందుకోసం, ఆ పక్కన క్యాలిక్యులేటర్ పెట్టుకుని, స్మార్ట్ బోర్డు ముందు నిలబడి, ల్యాబ్ కోట్స్ వేసుకుని ప్రభుత్వాలు తమ విద్యా వ్యవస్థలపై ఉన్న విజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాయి.కాని, ఈ రేసులో ఎవరు ముందున్నారో, ఎవరు ఇంకా నిద్రలోనే జోగుతున్నారో తెలుసుకోవడానికి ‘వరల్డ్ పాపులేషన్ రివ్యూ’ సంస్థ 2025 సంవత్సరానికి విద్యా నాణ్యత ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. ఈ జాబితాలో కొన్ని దేశాలు దుమ్మురేపేలా టాప్ గేర్లో దూసుకెళ్తుంటే, మరికొన్ని మాత్రం ఖాళీ బ్యాగు వేసుకుని, ఫస్ట్ పీరియడ్ మిస్ చేసుకున్నట్లుగా దిగాలుగా ఉంటున్నాయి. ఇంకా, ఇందులో ఏ దేశానికి పరీక్షల్లో ఎన్ని మార్కులొచ్చాయి? ఎవరు టాప్ స్కోర్ కొట్టారు? ఎవరు ‘పాస్’ అయ్యారు? మరెవరు ఇంకా ప్రోగ్రెస్ కార్డులో రెడ్ లై¯Œ దాటి నిలబడినవాళ్లు? వంటి విషయాలన్నీ ఉన్నాయి. ఇది ప్రపంచ విద్యా పోటీకి ఒక స్పష్టమైన ఫలితాల బోర్డు ఇది!ప్రపంచ దేశాల విద్యా ప్రమాణాలను విశ్లేషించేటప్పుడు మూడు ప్రధాన అంశాలను ఆధారంగా తీసుకున్నారు. అవేంటంటే: 1. ప్రభుత్వ విద్యా వ్యవస్థ స్థిరత్వం, ప్రభావం2. విశ్వవిద్యాలయాల గ్లోబల్ ఆకర్షణ 3. విద్యలో ప్రపంచ స్థాయి నాణ్యతఈ మూడు విభాగాల్లో మెరుగైన ఫలితాలను సాధించిన దేశాలు ప్రపంచ విద్యా నాణ్యత ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. అభివృద్ధి చెందిన దేశాలు ఈ అంశాల్లో ముందంజలో ఉన్నాయి. అదే సమయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు మార్పు దిశగా నెమ్మదిగా అడుగులు వేస్తున్నాయి. అయితే, ఇంకా కొన్ని దేశాల్లో ప్రాథమిక విద్య కూడా అందని పరిస్థితి ఉంది. ఉదాహరణకు చాద్, దక్షిణ సూడాన్ వంటి దేశాల్లో అక్షరాస్యత రేటు అత్యల్పంగా ఉండటంతో, అవి అభివృద్ధికి ఇంకా చాలా దూరంగా ఉన్నాయి. 2025 సంవత్సరానికి ప్రపంచ విద్యా నాణ్యత ర్యాంకింగ్స్ జాబితాను ‘వరల్డ్ పాపులేషన్ రివ్యూ’ విడుదల చేసింది. అందులో టాప్ 10 దేశాలు విద్యారంగంలో ముందు వరుసలో నిలిచాయి – అవేంటో చూద్దాం!దక్షిణ కొరియామేధాశక్తిదక్షిణ కొరియా అంటే కేవలం కే– పాప్, టెక్నాలజీ మాత్రమే కాదు, దాని అసలైన శక్తి అక్కడి విద్యా వ్యవస్థలో ఉంది. చిన్న దేశం అయినా, గణితశాస్త్రం, సాంకేతిక విద్యా ప్రమాణాల్లో ప్రపంచానికే మార్గదర్శిగా నిలుస్తోంది. ఒక అధ్యయనంలో 15 ఏళ్ల విద్యార్థులలో చైనా తర్వాత అత్యధిక ఐక్యూ స్కోర్లు సాధించిన దేశం ఇదే! ఇది క్రమశిక్షణ, కుటుంబాల సహకారం, ప్రభుత్వ ప్రాధాన్యాల వలనే సాధ్యమైంది. ఇక్కడ చదువు కేవలం పుస్తకాలకే పరిమితం కాదు, టెక్నాలజీతో మిళితమై, పిల్లల భవిష్యత్తుకు మార్గం వేస్తోంది.డెన్మార్క్ఒత్తిడిలేని బోధనవైకింగ్ల చరిత్రతో ప్రసిద్ధి చెందిన డెన్మార్క్ నేడు ప్రపంచంలో అత్యుత్తమ విద్యా వ్యవస్థలలో రెండో దేశంగా నిలుస్తోంది. జనాభా అరవై లక్షలే అయినా, చదువులో దీని స్థానం గొప్పది. విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచన పెంపొందించడం, ఒత్తిడిలేని బోధన ఈ దేశం ప్రత్యేకతలు. ఇక్కడ చదువు అనేది పరీక్షల కోసమే కాదు, జీవిత పాఠాలను నేర్చుకునే మార్గం. ప్రభుత్వం విద్యపై సమగ్రంగా ఖర్చు చేస్తూ, సమానావకాశాలు కల్పిస్తుంది. పాఠశాలలోనే పిల్లలు చర్చా వేదికల్లో పాల్గొంటూ సమాజాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. ఈ విధానాల వలనే డెన్మార్క్ ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉండే దేశాల జాబితాలోనూ చేరింది.నెదర్లండ్స్స్వేచ్ఛగా ఆలోచించే విద్యార్థులే నెదర్లాండ్స్ లోని విద్యా విధానం కేవలం విద్యార్థుల ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించేలా రూపొందించారు. తక్కువ ఒత్తిడి, ఎక్కువ చర్చలతో పిల్లలు చదవటం ఈ దేశ ప్రత్యేకత. ఇక్కడ చదువు కేవలం పాఠశాలలోనే కాదు, సమాజంలో కూడా నేర్చుకోవాల్సిన ప్రక్రియగా ఉంటుంది. విద్యార్థుల స్వతంత్ర ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తుంది. ప్రభుత్వ పెట్టుబడులతో నాణ్యమైన బోధన అందించడం, టెక్నాలజీని తరగతి గదికి తీసుకురావడం ఈ దేశాన్ని ముందు వరుసలో నిలిపాయి. జనాభాలో మెజారిటీ డచ్ వారే అయినా, వలసదారులకు కూడా సమానమైన విద్యా అవకాశాలు లభిస్తున్నాయి. ఇది విద్యలో సమానత్వానికి నిజమైన ఉదాహరణ.బెల్జియంఅందరికీ విద్యభిన్నత్వంలో ఏకత్వం సాధించాలంటే, చదువే అసలైన మార్గం అని బెల్జియం చెబుతుంది. అత్యుత్తమ విద్యా విధానాల్లో విశేషంగా ఎదుగుతూ, అగ్రస్థానాల్లో నిలుస్తోంది ఈ దేశం. రాజధాని బ్రసెల్స్ యూరోపియన్ యూనియ¯Œ కు కేంద్రంగా ఉండటం, దీని విద్యా ప్రాధాన్యాన్ని మరింత పెంచింది. ఇక్కడి విద్యా వ్యవస్థ బహుభాషా విధానం, సమానత్వం ఆధారంగా ఉంటుంది. డచ్, ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో విద్య అందుతుండటంతో పిల్లలలో బహుభాషా సామర్థ్యం పెరుగుతుంది. అలాగే, ఫ్లెమిష్, వాలున్, జర్మన్ వలసదారులు అందరూ చదువులో భాగస్వాములవడం ఇక్కడ సాధారణం. ప్రతి ఒక్కరికీ విద్య అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.స్లోవేనియావలసదారులకూ సమాన విద్యకేవలం 20 లక్షల జనాభా ఉన్నా ఈ చిన్న దేశం వంద శాతం అక్షరాస్యతతో ఐదవ స్థానంలో ఉంది. నాణ్యమైన బోధన, ప్రభుత్వం మద్దతు, వలస వచ్చిన జనాభాకు కూడా సమానంగా విద్యను అందించడంతో ఇది సాధ్యమైంది. చదువు సమాజాన్ని ఏకీకృతం చేసే మార్గంగా ఎలా పనిచేస్తుందో చెప్పే ఒక ఉదాహరణగా ఈ దేశం నిలిచింది. జపాన్క్రమశిక్షణ శక్తి పురాతన దేవాలయాలు, మౌంట్ ఫుజీ వంటి ప్రకృతి అందాలతో పాటు, జపా¯Œ విద్యా రంగంలోనూ విశేషమైన గుర్తింపు పొందింది. ఇక్కడ విద్యా వ్యవస్థ క్రమశిక్షణ, కఠిన శ్రమ, నాణ్యతపైనే ఆధారపడి ఉంటుంది. చిన్న వయస్సులోనే పిల్లలు గణితం, శాస్త్రం, సాంకేతికతలో చురుకుగా మారతారు. ప్రభుత్వ పెట్టుబడులు, బలమైన బోధన పద్ధతులు ఈ విజయం వెనుక ఉన్న ప్రధాన కారణాలు. జపా¯Œ లో 98 శాతం జనాభా జాపనీస్ ప్రజలే. జాతి పరంగా ఏకత్వం ఉన్నా, విద్యకు విస్తృత దృక్కోణంలో ఉంది.జర్మనీఉచితంగా ఉన్నత విద్యకోటలు, ఆధునిక నగరాలతో ప్రసిద్ధి గాంచిన జర్మనీ, విద్యా రంగంలోను అగ్రగామిగా నిలుస్తోంది. టెక్నాలజీ, ఇంజినీరింగ్, పరిశోధన రంగాల్లో ఇది ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది. ఇక్కడ విద్యా వ్యవస్థ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఉచిత ఉన్నత విద్యతోపాటు ప్రభుత్వ మద్దతుతో విద్య అందరికీ అందుబాటులో ఉంటుంది. విద్యార్థుల ప్రాక్టికల్ స్కిల్స్కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. మతాలు, భాషలు భిన్నమైనా, చదువు విషయంలో సమానత్వం కొనసాగుతుంది.ఫిన్లండ్చదువు చల్లగా, బతుకు హాయిగా స్వచ్ఛమైన సరస్సులు గుర్తొచ్చే దేశం ఫిన్లండ్. ఇక్కడ విద్య అనేది పోటీకి సిద్ధం చేసే మార్గం కాదు, బలమైన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే సాధనం. ఒత్తిడిలేని తరగతులు, ప్రాజెక్టు ఆధారిత బోధన, విద్యార్థులే కేంద్రంగా రూపొందించిన పద్ధతులు ఫిన్లండ్ విద్యకు ప్రత్యేకత తీసుకొచ్చాయి. పరీక్షలు తక్కువ, ఆలోచన ఎక్కువ ఇక్కడి విద్యార్థుల విజయ రహస్యం. ఈ దేశం ప్రపంచ హ్యాపీనెస్ ర్యాంకింగ్స్లో తొలిస్థానంలో ఉండటానికి కారణం కూడా ఇదే!నార్వే ఆలోచనా శక్తి పెంచే బోధననార్దన్ లైట్స్ వంటి ప్రకృతి అద్భుతాలకు నిలయమైన నార్వే, విద్యా ప్రమాణాల్లో ముందంజలోనే ఉంది. ఇక్కడ విద్యా వ్యవస్థ స్వేచ్ఛ, సమానత్వం, నాణ్యతతో కూడినది. విద్యార్థులలో ఆలోచనాశక్తిని పెంచేలా బోధన సాగుతుంది. ప్రభుత్వ మద్దతుతో విద్య ఉచితంగా అందుతూ, ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది. అలాగే, నార్వే జీవన ప్రమాణాలు చాలా ఉన్నతమైనవి. చదువుతో పాటు అక్కడ లభించే ఉన్నతమైన ఆరోగ్యసేవలు కూడా విద్యార్థుల అభివృద్ధికి అనుకూలంగా ఉన్నాయి.ఐర్లండ్విద్యలో వైవిధ్యంటెక్నాలజీ ఆధారిత విద్యా రంగంలో వేగంగా ఎదుగుతున్న దేశం ఐర్లండ్. రాజధాని డబ్లి¯Œ వంటి నగరాల్లో వలసదారుల పెరుగుదలతో విద్యలో వైవిధ్యం పెరిగింది. ఇక్కడ విద్యా విధానం ఆచరణాత్మక జ్ఞానానికి ప్రాధాన్యమిస్తూ, విద్యార్థుల ఆలోచనా స్వాతంత్య్రాన్ని ప్రోత్సహిస్తోంది. ఆర్థికంగా అభివృద్ధి చెందిన ఈ దేశం, సాంకేతిక, జైవ శాస్త్ర రంగాల్లో విద్యను శక్తిగా వినియోగిస్తోంది. ఉద్యోగావకాశాలకు అనుగుణంగా ఉంటూ అనేక అంతర్జాతీయ విద్యార్థులకు ఆశ్రయంగా మారింది.ఈ జాబితా నుంచి మనం గమనించగలిగేది ఏమిటంటే అత్యుత్తమ స్థాయిలో విద్యను అందిస్తున్న దేశాలు అన్నీ ఏకకాలంలో ఆర్థికంగా, సాంకేతికంగా, సమాజపరంగా కూడా ముందున్నాయి. వీటిల్లో వంద శాతం అక్షరాస్యతతో స్లోవేనియా అత్యుత్తమ విద్యా నాణ్యతకు ఒక అద్భుత నిదర్శనం. మిగతా దేశాలలో అక్షరాస్యత శాతం గణాంకాలు అందుబాటులో లేవు గాని, విద్యా నాణ్యత అత్యుత్తమంగా ఉండడం వల్ల వాటి స్థానం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ దేశాలు తమ విద్యా విధానాలను సామాజిక అవసరాలకు అనుగుణంగా రూపొందించు కొని, విద్యార్థులకు ఒత్తిడి లేని, పరిశోధన ప్రాతిపదికన ఉన్న, ఆచరణాత్మకమైన విద్యను అందిస్తున్నాయి. ఫలితంగా ఈ దేశాల్లో ఉన్నత జీవన ప్రమాణాలు, ఉచిత లేదా తక్కువ ధరల్లో ఉన్నత విద్య అవకాశాలు, స్వేచ్ఛాయుత విద్యా వాతావరణం కనిపిస్తున్నాయి.ఇండియాఇంకా ‘వికాస దశ’లోనే! ఇండియా అంటేనే విశాలమైన సంస్కృతి, శాస్త్రవేత్తలు, ఐటీ మేధావులు గుర్తొస్తారు. కాని, ప్రపంచ విద్యా రంగపు ర్యాంకింగ్స్లో చూస్తే, మన దేశం ఇంకా ‘వికాస దశ’లోనే ఉంది. 2025 విద్యా ర్యాంకింగ్స్లో భారత్ 101వ స్థానంలో నిలవడం కొంచెం చేదుగా అనిపించినా, ఇది మన విద్యా వ్యవస్థకు ఎదురవుతున్న సవాళ్లను స్పష్టంగా చూపిస్తుంది. మన పక్కనున్న దేశాల పరిస్థితి చూస్తే చిన్న దేశాలైన నేపాల్ 56, భూటాన్ 88వ స్థానాల్లో మనకంటే చాలా మెరుగ్గా ఉన్నాయి. పాకిస్థాన్ 136, అఫ్గానిస్తాన్ 146, బంగ్లాదేశ్ 122వ స్థానాల్లో మన తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు ఈ జాబితాలో అసలైన షాక్ ఏంటంటే, మన పొరుగునే ఉన్న చైనా మాత్రం 13వ స్థానంలో మెరిసిపోతూ ప్రపంచానికి చదువుల దారులు తెరుస్తోంది.మన వెనుకబాటుకు కారణాలుఇందుకు ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వసతుల లోపం అని చొప్పొచ్చు. అందుకే మన అక్షరాస్యత రేటు 74 శాతం దగ్గరే నిలిచిపోయింది. కాని, మార్పు మొదలైంది. నూతన విద్యా విధానం, డిజిటల్ లెర్నింగ్, గ్రామీణ విద్యపై దృష్టి, బాలికల విద్యకు ప్రాధాన్యం వంటి చర్యలు మన ప్రయాణాన్ని వేగవంతం చేస్తున్నాయి. అయితే, టాప్ 10లోకి వెళ్లాలంటే ప్రాథమిక విద్యా నాణ్యత, ఉపాధ్యాయుల శిక్షణ, సమానత్వం కీలకం. ఇప్పుడు ఉన్నదంతా ప్రారంభం మాత్రమే! సరైన దిశగా నడిస్తే, భారతదేశం కూడా భవిష్యత్తులో ప్రపంచ విద్యా శిఖరాలను అధిరోహించగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పుడు మన దేశం కూడా అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది.పేజీ కూడా తెరవలేదుప్రపంచంలోని దాదాపు అన్నీ దేశాలు చదువును ఓ శస్త్రాయుధంలా వాడేస్తుంటే, ఇంకా కొన్ని దేశాల్లో మాత్రం ‘ఏ ఫర్ ఆపిల్’ అనే పదం రాయటమే గొప్ప విజయంగా పరిగణిస్తున్నాయి. చాద్ (27 శాతం), బుర్కినా ఫాసో (34శాతం), సౌత్ సూడాన్ (35 శాతం) వంటి దేశాలు ప్రపంచ అక్షరాస్యత రేటులో అసలైన రెడ్ జోన్ లో ఉన్నాయి. స్కూల్కి దూరం, పుస్తకాలు అరుదు, టీచర్లు లేని తరగతులు. ఇక్కడ ‘ఎలా చదవాలి?’ అనే ప్రశ్న కంటే ముందు, ‘ఎక్కడ చదవాలి?’ అనే ప్రశ్న వస్తుంది. ఎందుకంటే, ఇక్కడ స్కూల్స్ ఉండటమే అరుదు. బాల్యవివాహాలు, పేదరికం, యుద్ధాలు ఇవన్నీ కలసి చదువును పక్కకు నెట్టి, చీకట్లోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడి బాలికలకు చదువు అందని మానిపండే!చిన్న దేశాల గొప్ప విజయాలుఒకప్పుడు ‘చిన్న దేశాలు’ అనే పేరు వింటే, మనకు గుర్తొచ్చేది వాటి పరిమిత వనరులు, అభివృద్ధి లోపం, పెద్ద దేశాల మీద ఆధారపడే పరిస్థితులు. కాని, ఇప్పుడు? అవే చిన్న దేశాలు పుస్తకాలతో పరుగు తీస్తూ, ప్రపంచ విద్యా వేదికపై సగర్వంగా నిలుస్తున్నాయి. కజక్స్తాన్, ఉజ్బెకిస్తాన్, లాట్వియా, ఇస్టోనియా, లిథువేనియా... వీటి పేర్లు చాలామందికి టూరిజం బ్రోషర్ల ద్వారా మాత్రమే తెలిసి ఉండొచ్చు కాని, ఇప్పుడు ఇవే దేశాలు విద్యలో వందశాతం అక్షరాస్యతతో టాప్ లైన్ లో నిలబడ్డాయి! చదువు విషయంలో ఇవి చిన్న దేశాలు కాదు, చదువుల మహారాజులు! నేపాల్ (71 శాతం) భూటాన్ (72 శాతం) వంటి హిమాలయాల మధ్యన ఉన్న దేశాలు కూడా అక్షరాస్యతలో అగ్రస్థానానికి చేరుతున్నాయి. 2025 నాటికి ప్రపంచం మొత్తం అక్షరాస్యత సగటు 72.91 శాతం అంటే, ఈ చిన్న దేశాల ప్రభావం ఎంత ఉంటుందో ఊహించండి! వనరులు తక్కువైనా, విజన్ పెద్దది. డబ్బు లేకపోయినా, గొప్ప సంకల్పం ఉంది. ప్రభుత్వాల నిబద్ధత, విద్యా విధానాలలో స్పష్టత, ప్రతి పాఠశాలలో బలమైన ఫౌండేషన్... ఇవే ఈ దేశాలను అగ్రస్థానాలకు చేర్చాయి.టాపర్లాంటిది! విద్యా వ్యవస్థలో టాప్ ర్యాంక్ వచ్చినంత మాత్రాన, చదువులో టాప్ స్కోర్ వస్తుందన్న గ్యారంటీ లేదు! పేరుకు ప్రపంచంలో ఉత్తమ విద్యా సంస్థలు కలిగిన దేశాల జాబితాలో అమెరికా నంబర్ వన్. కానీ సబ్జెక్ట్ వైజ్లో చూస్తే? గణితంలో 38వ స్థానం, సై¯Œ ్సలో 24వ స్థానం – అచ్చం ‘టాపర్’ ముసుగులో ‘బోర్డర్ పాస్’ అన్నట్టు! ‘బిజినెస్ ఇన్సైడర్’ అనే సంస్థ ఇచ్చిన గణాంకాలు, బెస్ట్ కంట్రీస్ రిపోర్ట్ లెక్కలు– ఇలా ఒక్కో సంస్థ ఒక్కో విధంగా మార్కులు వేస్తుండడంతో, ర్యాంకింగ్ ఒక పజిల్లా మారిపోయింది. ఎక్కడైనా పుస్తకాలతో కప్పేసి ‘ఉత్తమ విద్యా సంస్థ’ అన్న ట్యాగ్ పెడితే సరిపోదు. అసలైన విషయాలు చూడాలి. పిల్లలు చదువుతున్నారా? టీచర్లు బాగా బోధిస్తున్నారా? ప్రభుత్వ పెట్టుబడులు నిజంగా ఉపయోగపడుతున్నాయా? అనే విషయాలు కూడా కీలకమే! ఇక ‘గ్లోబల్ సిటిజన్ ఫర్ హ్యూమన్ రైట్స్’ వంటి సంస్థలు బాగానే మ్యాటర్ను పసిగట్టాయి. విద్యా వ్యవస్థ అంటే చిన్నారి స్కూల్ అడ్మిషన్ నుంచీ పెద్దల అక్షరాస్యత వరకూ మొత్తం జీవన ప్రయాణాన్ని గమనించాలి అని అంటున్నాయి. సింపుల్గా చెప్పాలంటే టాప్ ర్యాంక్ అనేది పేపర్లో ఉండే డిజైన్ మాత్రమే! అసలైన చదువు ఏమిటో, అది జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో చూసే చూపు అవసరం. లేదంటే టాపర్ గుండెల్లోని ర్యాంక్ కాస్త, రిజల్ట్ వచ్చాక ‘ఒక్క మార్క్ మిస్ అయ్యింది!, లేకుంటే నేనే టాప్’ అని అంటాయి. విద్య అనేది కేవలం ఒక పాఠశాల గది వరకు మాత్రమే పరిమితమైంది కాదు. అది వ్యక్తిని మారుస్తుంది. వ్యక్తి మారితే కుటుంబం మారుతుంది; కుటుంబం మారితే సమాజం మారుతుంది; సమాజం మారితే దేశం మారుతుంది. అందుకు విద్యే మార్గం, విజ్ఞానమే శక్తి.పేజీ కూడా తెరవలేదుప్రపంచంలోని దాదాపు అన్నీ దేశాలు చదువును ఓ శస్త్రాయుధంలా వాడేస్తుంటే, ఇంకా కొన్ని దేశాల్లో మాత్రం ‘ఏ ఫర్ ఆపిల్’ అనే పదం రాయటమే గొప్ప విజయంగా పరిగణిస్తున్నాయి. చాద్ (27 శాతం), బుర్కినా ఫాసో (34శాతం), సౌత్ సూడాన్ (35 శాతం) వంటి దేశాలు ప్రపంచ అక్షరాస్యత రేటులో అసలైన రెడ్ జో¯Œ లో ఉన్నాయి. స్కూల్కి దూరం, పుస్తకాలు అరుదు, టీచర్లు లేని తరగతులు. ఇక్కడ ‘ఎలా చదవాలి?’ అనే ప్రశ్న కంటే ముందు, ‘ఎక్కడ చదవాలి?’ అనే ప్రశ్న వస్తుంది. ఎందుకంటే, ఇక్కడ స్కూల్స్ ఉండటమే అరుదు. బాల్యవివాహాలు, పేదరికం, యుద్ధాలు ఇవన్నీ కలసి చదువును పక్కకు నెట్టి, చీకట్లోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడి బాలికలకు చదువు అందని మానిపండే! -
తీవ్ర వ్యసనం
మొన్నటి మేలో కర్నాటకలోని ఉడిపిలో ఒక సంఘటన జరిగింది. రోడ్డు మీద తిరుగుతున్న ఒక పిచ్చివాణ్ణి ఒక స్వచ్ఛంద సంస్థ కార్యకర్త సంరక్షించి, వైద్యం చేయించి, తిరిగి మామూలు మనిషిని చేశాడు. మెల్లగా ఆ కోలుకున్న వ్యక్తి తమిళుడని, సొంత ఊరు కుంభకోణం అని తెలిసింది. అతని మనుషులు వెతుక్కుంటూ వచ్చారు. ‘ఇతను ఆరునెలలుగా కనిపించకుండా పోయాడు. దానికి ముందు ఫోన్లో రీల్స్ చూస్తూ కుటుంబంతో మాట్లాడక, స్నానం చేయక, తిండి తినక అదే లోకంగా ఉండేవాడు. ఆ తర్వాత ఈ స్థితిలో దొరికాడు’ అని చెప్పి తీసుకెళ్లారు. రీల్స్ను వరుసపెట్టి చూడటానికి ‘డూమ్ స్క్రోలింగ్’ అంటున్నారు నిపుణులు. రీల్స్ మనిషి మెదడును ఏ విధంగా ఆక్రమించగలదో ఇదొక ఉదాహరణ.ఇటీవలే గుజరాత్లోని వడోదరలో మరో ఘటన జరిగింది. అక్కడి ఒక కొడుకు తన భార్యతో కలిసి పోలీసుల సహాయం కోరుతూ ఫోన్ చేశాడు. దానికి కారణం ఆ ఇంట్లోని తల్లి రీల్స్లో పడి తిండి తినడం మానేసింది. కొడుకు, కోడలు డ్యూటీకి వెళుతుంటే ఆమెకు బోర్ కొట్టి రీల్స్ చూడటానికి అలవాటు పడిందట. ఆ రీల్స్లో కూడా ఒక ఇన్ఫ్లూయెన్సర్ పెట్టే రీల్స్ చూస్తుందట. వాటికింద కామెంట్స్ పెడుతుందట. ఆ కామెంట్స్కు ఆ ఇన్ఫ్లూయెన్సర్ రియాక్ట్ అయితే ఆమెకు సంతోషం. లేదంటే అప్సెట్ అయ్యి అన్నం తినదు. కొడుకు కోడలు ఆమె ఫోన్ నుంచి ఇన్స్టా యాప్ను తొలగించారు. దాంతో ఇంకా పెద్ద గొడవ జరిగి, ఆమె అన్నం తినడం మానేసింది. దాంతో ఇప్పుడా కొడుకు, కోడలు తల పట్టుకుని కూచుని ఉన్నారు.అసలు రీల్స్ అంటే ఏమిటి? కొన్ని సెకన్ల విన్యాసం. 2020లో మన దేశంలో టిక్టాక్ను నిషేధించాక, ఇన్స్టాగ్రామ్ రీల్స్ పేరుతో 90 సెకన్ల నుంచి 3 నిమిషాల వీడియోస్ను ప్రవేశ పెట్టింది. వీటిద్వారా గుర్తింపు, పేరు, ఫాలోయెర్సు తద్వారా డబ్బు... ఇవన్నీ వచ్చేసరికి కేవలం రీల్స్ మీద ఆధారపడినవారు కోకొల్లలుగా పెరిగారు. వీరు రకరకాల విన్యాసాలతో నిత్యం వేలకొద్దీ రీల్స్ వదులుతుంటారు. అవి చూడటానికి ఎవరికైనా, ఎన్ని సంవత్సరాలైనా సరిపోవు. ఆ సంగతి గ్రహించి ఎప్పుడైనా సరదాగా చూసి ఫోన్ కట్టేయాలి తప్పితే వాటిలోనే కూరుకుపోతే మెదడు ఆ రీల్స్కు బానిసవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.చేయి విరగ్గొట్టుకున్న అమ్మాయిఅహ్మదాబాద్లో నర్సింగ్ కోర్సులో చేరిన ఒక అమ్మాయి హాస్టల్లో బోరు కొడుతున్నదని రీల్స్ చూడటానికి అలవాటు పడింది. పరీక్షలు వచ్చాయి. రీల్స్ చూడాలంటే పరీక్షలు రాయకూడదని ఆ అమ్మాయి తన కుడి చేతిని బల్ల మీద పదేపదే బాది విరగ్గొట్టుకుంది. ఇలా ఉంటాయి రీల్స్ ఉత్పాతాలు.బి.పి. పెరుగుతుందిచైనాలోని హైబె మెడికల్ యూనివర్సిటీ చేసిన అధ్యయనం ప్రకారం రీల్స్ వల్ల 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్నవారిలో బి.పి. పెరుగుతుందని నిరూపణ అయ్యింది. రీల్స్లోని కంటెంట్ ఒక్కోసారి ఎక్కువగా, మరోసారి తక్కువగా కొనసాగుతూ మూడ్స్ను హెచ్చుతగ్గులు తెచ్చిపెడుతుండటం వల్ల ఇలా జరుగుతుంది. రాత్రివేళ గంటలు గంటలు రీల్స్ చూస్తూ నిద్ర పాడుచేసుకుని ఉద్యోగాల్లో కునికిపాట్లు పడుతున్నవారు వేలమంది ఉన్నారు. ఇక దేహం కదల్చకుండా ఉండటం వల్ల వస్తున్న శారీరక సమస్యలు ఎన్నో.టీవీ నయంరీల్స్ చూడటం కన్నా టీవీ చూడటం నయం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే టీవీ చూస్తూ కనీసం ట్రెడ్మిల్ మీద వాకింగ్ చేయొచ్చు. లేదా పుస్తకాల ర్యాక్ సర్దుకోవచ్చు. లేదా బట్టలు మడతపెట్టడమో, కూరగాయలు తరగడమో... ఏదో ఒక పని టీవీ చూస్తూ చేయొచ్చు. రీల్స్ చూడాలంటే ఇలా చేయడానికి చేతులు ఖాళీ ఉండవు. ఒక చేతిలో ఫోన్ పట్టుకుని మరో చేత్తో స్క్రోలింగ్ చేస్తూ వెళ్లాలి. కాబట్టి శరీరం వేరే పని చేయలేదు.కాపురాలలో చిచ్చురీల్స్ చూడటం భార్యాభర్తల మధ్య చిచ్చు తెస్తోంది. నాలుగురోజుల క్రితం కర్నాటకలోని మంగళూరు సమీపంలో రీల్స్ చూస్తున్న భార్యను కట్టడి చేయలేక భర్త ఆమెను చంపేశాడు. ఉత్తర ప్రదేశ్లో ఒక భార్య రీల్స్ చూడనివ్వడం లేదని, గిన్నెలు తోమమంటున్నాడని భర్త మీద కేసుపెట్టింది. వీటన్నింటికి విరుగుడు ఆరోగ్యకరమైన వ్యాపకాల్లో ఉండటమే అంటున్నారు నిపుణులు. హస్తకళలు, పుస్తకాలు చదవడం, క్రీడలు వీటిలో సమయాన్ని వెచ్చించడం మేలంటున్నారు. ముఖ్యంగా పిల్లల్ని రీల్స్ బారిన పడకుండా చూడమంటున్నారు. -
వారు విడిపోయి వీరికి... 'ఒడి'పోయి
విడాకులు కేవలం ఇద్దరు పెద్దల మధ్యే కాదు, ఆ కుటుంబంలో ముఖ్యంగా ఐదారేళ్ల వయసు పిల్లలపైనా తీవ్ర భావోద్వేగాల గందరగోళాన్ని, ఆరోగ్య నష్టాన్ని కలిగిస్తాయని, ఆయుష్షునూ తగ్గిస్తాయని నివేదికలు తెలుపుతున్నాయి. తల్లిదండ్రులు పిల్లల ఐదారేళ్ల వయస్సులో విడిపోతే, ఆ పిల్లలకు ఆయుష్షు తగ్గే అవకాశాలు పెరుగుతాయంటోంది ఒక అధ్యయనం. ఈ పరిశోధనను మిడ్ అట్లాంటిక్లోని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం నిర్వహించింది. ప్రొఫెసర్ నోలన్ పోప్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం మెర్సెడ్ నుండి ఆండ్రూ సి. జాన్స్ స్టన్, అమెరికా జనగణన బ్యూరోకి చెందిన మ్యాగీ ఆర్. జోన్స్ సంయుక్తంగా ఈ ఫలితాలను వివరించారు.జీవనశైలిలో తీవ్ర మార్పులుచిన్నవయస్సులో తల్లిదండ్రులు విడిపోయిన పిల్లలు జీవితాంతం అనేక ప్రతికూలతలను ఎదుర్కొంటున్నారని పరిశోధకులు పేర్కొంటున్నారు. తల్లిదండ్రులు దూరమైన పిల్లల్లో తక్కువ ఆదాయం, చిన్న వయస్సులోనే గర్భం ధరించడం, జైలు శిక్షలు, త్వరగా మరణించే ప్రమాదాలు .. వంటివి ఉన్నాయి. ఇవన్నీ కుటుంబంలో విడాకుల కారణంగా ఏర్పడ్డ అగాథాల మూలంగా జరుగుతున్నాయని పరిశోధకులు వివరించారు. విడాకుల తర్వాత తల్లిదం డ్రులు వేరు వేరు చోట్ల నివసించాల్సి వస్తుంది. ఆదాయం తగ్గిపోతుంది. ఒంటరిగా పిల్లల్ని పెంచాల్సిన తల్లిదండ్రులు ఎక్కువ సమయం పని చేయాల్సి వస్తుంది. తరచూ నివాసం మారుతుంది. తక్కువ ఆర్థిక అవకాశాలు ఉన్న పేద ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి ఉంటుంది. ఇవన్నీ పిల్లల జీవితంలో సామాజిక, ఆర్థిక సవాళ్లకు దారితీస్తాయి. 1988 నుండి 1993 మధ్యకాలంలో జన్మించిన 50 లక్షల మందికి పైగా పిల్లలపై వారు గణాంకాలను విశ్లేషించారు. ఫెడరల్ ట్యాక్స్ రికార్డులు, సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్, జనగణనా బ్యూరో డేటా ఆధారంగా వారు ఈ విశ్లేషణ చేశారు.వ్యాధుల పాలయ్యే ప్రమాదంకొందరు పిల్లలు తమ వల్లే తల్లిదండ్రులు విడిపోయారేమో అనే ఆలోచనను పెంచుకుంటారు. ఇది వారిలో నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తగ్గించవచ్చు. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవ్వచ్చు. తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న పిల్లలలో 16 శాతం అధిక స్థాయి సి–రియాక్టివ్ ప్రోటీన్ ఉందని అధ్యయనం. ఈ ప్రొటీన్ వల్ల కరోనరీ హార్ట్ డిసీజ్, టైప్– 2 డయాబెటిస్ వంటి వ్యాధులకు లోన య్యే రిస్క్ ఎక్కువ ఉందని గుర్తించారు.మానసిక అనారోగ్యంపిల్లలు తల్లిదండ్రుల మధ్య ప్రేమ, సహకారం చూసి పెరుగుతారు. ఆ మద్దతు వారికి ధైర్యాన్నిస్తుంది. కానీ విడాకుల సమయంలో వారిలో భయాలు, అనిశ్చితి, ఒంటరితనం మొదలై మనోవేదన ఎక్కువవుతుంది. ఒక అధ్యయనంలో విడాకులు తీసుకున్న, విడిపోయిన లేదా మరణించిన తల్లిదండ్రులలో ఇద్దరు పిల్లలు కౌమారదశలో ఉంటే వారిలో ఒకరికి మానసిక రుగ్మత ఉందని తేలింది. విపరీతమైన భావోద్వేగాలుతిండి తినడంలో మార్పులు, నిద్రలో ఆటుపోట్లు, శరీర బలహీనత .. వంటి లక్షణాలు పిల్లల్లో బయటపడతాయి. ఇది వారి చదువు పై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. ఏకాగ్రత లోపించటం, స్కూల్లో పర్ఫార్మెన్స్ తగ్గిపోవటం, ఇంటి నుంచి వెళ్లిపోవడం.. వంటివీ కనిపించవచ్చు.సమాజంలో ప్రవర్తనకొన్ని సందర్భాల్లో పిల్లలు అతి శాంతంగా మారిపోతారు. లేదంటే మొండిగా ప్రవర్తించవచ్చు. స్నేహితులు, బంధువులతో సంబంధాలు దెబ్బతింటాయి. తల్లిదండ్రుల మధ్య విభేదాలు చూసిన పిల్లలు తమ భవిష్యత్తు సంబంధాలపై నమ్మకాన్ని కోల్పోతారు. విడాకులు అనివార్యమైతే, పిల్లలపై ఆ ప్రభావం పడకుండా తల్లిదండ్రులు పరస్పర సహకారంతో ముందడుగు వేయాలి. భార్యాభర్తలుగా విడిపోయినా తల్లిదండ్రులుగా ప్రేమ, మద్దతు, మార్గదర్శకం పిల్లలకు ఇవ్వాలి. ఇద్దరిదీ సమాన బాధ్యతఐదారేళ్ల వయసు పిల్లలకు తల్లిదండ్రుల సమస్య ఏంటో అర్థం కాదు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి, దంపతులు తమ జీవితంలో సర్దుబాట్ల చేసుకోవాలి. పిల్లల భావోద్వేగాలను అర్థం చేసుకొని, ధైర్యమివ్వాలి. విడాకుల అనంతరం పిల్లలు ఇద్దరిలో ఎవరి దగ్గర ఉన్నా మరొకరి గురించి చెడుగా మాట్లాడకూడదు. ఇవి పిల్లల భవిష్యత్తుకు పెద్ద అవరోధమని గ్రహించాలి. మారుతున్న కాలానికి తగినట్టు బంధాలను అర్థం చేసుకుంటూ సామాజికంగానూ బంధుమిత్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు అండగా ఉండాలి. విడాకులకు ముందు తల్లిదండ్రులుగా ఎలా ఉన్నారో, ఆ తర్వాత కూడా ఇద్దరూ పిల్లల పట్ల సమాన బాధ్యత తీసుకో వాలి. విడాకులకు ముందు మానసిక నిపుణుల సూచనలు అవసరం. – డా. సునీత, సైకాలజిస్ట్– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
Ramya Joseph ప్రపంచంలోనే తొలి ఏఐ ఫైనాన్షియల్ అడ్వైజరీ కంపెనీ
ఇరవై ఏడు సంవత్సరాల వయసులోనే గోల్డ్మాన్ శాక్స్కు వైస్ ప్రెసిడెంట్గా తనదైన ప్రత్యేకతను నిలుపు కుంది రమ్య జోసెఫ్ (Ramya Joseph). ‘పెఫిన్’ (Pefin) పేరుతో ప్రపంచంలోనే తొలి ఏఐ ఫైనాన్షియల్ అడ్వైజరీ కంపెనీ స్టార్ట్ చేసి విజయపథంలో దూసుకుపోతుంది.కొలంబియా యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ, ఫైనాన్షియల్ ఇంజినీరింగ్ చేసింది రమ్య.చదువు పూర్తయిన తరువాత మల్టీనేషనల్ ఫైనాల్సియల్ సర్వీసెస్ కంపెనీ మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్మన్ శాక్స్లో పనిచేసింది. స్వచ్ఛంద సంస్థ ‘ది బ్రిడ్జ్ ; ప్రాజెక్ట్’ ప్రాజెక్ట్ హెడ్గా పనిచేసింది. ‘ది బ్రిడ్జ్’లో ఆటోమేషన్, ఫ్రాడ్ ప్రివెన్షన్ కోసం పూర్తిస్థాయి టెక్నాలజీ ప్లాట్ఫామ్ ప్రారంభించింది.రిటైర్మెంట్ తరువాత తన తల్లిదండ్రుల ఆర్థిక భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నప్పుడు రమ్యకు ‘పెఫిన్’ ఆలోచన వచ్చింది. ‘పర్సనల్ ఫెనాన్స్ ఇంటెలిజెన్స్’ను ‘పెఫిన్’గా సంక్షిప్తీకరించింది.‘ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి మా ΄్లాట్ఫామ్ ఏఐ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. కస్టమర్లకు ఉపకరించే పర్సనలైజ్డ్, యాక్షనబుల్ ΄్లానింగ్, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలను అందిస్తాం’ అంటుంది రమ్య.ఏఐ–ఆధారిత పర్సనల్ ఫైనాన్స్ సెగ్మెంట్కు యువతలో మంచి ఆదరణ ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సర్వే ప్రకారం జెన్–జెడ్, మిలీనియల్స్లో 41 శాతం మంది ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఏఐ సలహాలు తీసుకుంటున్నారు.‘ఎంతైనా రోబో సలహాలే కదా!’ అని ఏఐ బేస్డ్ టెక్నాలజీ గురించి తక్కువ చేసి మాట్లాడేవారు కూడా లేకపోలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని...‘మా సర్వీస్ సింపుల్గా, సులభంగా ఉంటుంది. ఎలాంటి గందరగోళమూ ఉండదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తుంది. మీ ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తుంది’ అంటుంది రమ్య.వెల్త్ మేనేజ్మెంట్ రంగంలో రోబో అడ్వైజర్లు మేజర్ ట్రెండ్గా మారారు. అయితే ‘పెఫిన్’ వాటి కంటే భిన్నమైంది అంటుంది రమ్య. ‘కస్టమర్లకు సంబంధించిన మూడు నెలల స్పెండింగ్ డేటా తీసుకుంటుంది పెఫిన్. కస్టమర్ల అభిరుచుల గురించి తెలుసుకొని ఏది సరిౖయెనదో, ఏది కాదో సూచిస్తుంది. మా నెట్వర్క్ కస్టమర్ల సందేహాలను తీర్చి ఎన్నో సలహాలు ఇస్తుంది. సరిౖయెన దారి చూపుతుంది’ అంటుంది రమ్య.ఆర్థిక విషయాల గురించి మరింత అవగాహన కలిగించడానికి కస్టమర్లకు కంటెంట్ కూడా పంపుతుంది పెఫిన్. నా తల్లిదండ్రులు రిటైర్మైంట్కు దగ్గరలో ఉన్నప్పుడు, వారి ఆర్థికభద్రతకు సంబంధించి రకరకాల మార్గాలు ఆలోచిస్తున్నప్పుడు ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ ఆలోచన వచ్చింది. నేను రిటైర్ కావాలను కుంటున్నాను... అని ఎవరైనా అన్నప్పుడు వారికి సరిౖయెన దారి కనిపించదు. ఒకవేళ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవాలనుకుంటే అది ఖర్చుతో కూడిన పని. ఈ నేపథ్యంలో పెఫిన్ అన్నిరకాలుగా ఉపయోగపడుతుంది. – రమ్య జోసెఫ్ ఇదీ చదవండి: Today Tip బరువు తగ్గాలంటే.. జామ ఆకూ ఔషధమే -
Today Tip బరువు తగ్గాలంటే.. జామ ఆకూ ఔషధమే
జామ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి ఇది అందరికీ తెలిసిన విషయమే. పోషకాలు మెండుగా ఉండే జామ పండుతో ప్రయోజనాలు పొందవచ్చ. కానీ జామ ఆకులు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మరి ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా జామ ఆకులు ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.జామ ఆకుల్లో అధిక మొత్తంలో ట్యానిన్స్, ఆక్సలేట్స్ ఉంటాయి. అందువల్ల నోటిపూత, నోటిలో పుండ్లు, చిగుళ్ల వాపు, గొంతు నొప్పి వంటి నోటి సమస్యలతో బాధపడేవారు లేత జామ ఆకుల్ని నమిలినా లేదా లేత ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిట పట్టినా మంచి ఫలితాలను పొందవచ్చు. జామ ఆకులు జుట్టుకి దివ్యౌషధంలా పని చేస్తాయి.జుట్టు రాలడాన్ని నివారించడంతో పాటు జుట్టు పెరగడానికి దోహదపడతాయి. సరిపడా జామ ఆకుల్ని శుభ్రం చేసుకుని తగినన్ని నీరు పోసి 15 నిముషాలసేపు మరిగించాలి. చల్లారాక ఆ నీటిని తలపై నెమ్మదిగా అప్లై చేస్తూ బాగా మర్దనా చేయాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. తరచుగా ఇలా చేయడం వల్ల వెంట్రుకల కుదుళ్లు గట్టిపడి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.జామ ఆకులు ఆరోగ్యానికి ముఖ్యంగా, ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, బరువు తగ్గడానికి సహాయపడతాయి జామ ఆకు టీ తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. తద్వారా అధిక బరువునుంచి బయటపడవచ్చు.(Today tip : ఈజీగా బరువు తగ్గాలంటే ఇవిగో ఆసనాలు)వీటిల్లోని అధిక యాంటీఆక్సిడెంట్లు ,యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వ్యాధులను నయం చేయడంలో సహాయపడతాయి.జామ ఆకులలోని యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. యాంటీ బాక్టీరియల్ లక్షణాలు హానికరమైన సూక్ష్మజీవులతో పోరాడతాయి మరియు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి, మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలను తగ్గిస్తాయి,జామ ఆకు టీ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.జామ ఆకులలోని యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మొటిమలు, మచ్చలు వంటి సమస్యలను తగ్గిస్తాయి.నోట్ : ఇవి అవగాహన కోసం అందించిన సమాచారం మాత్రమే అని గమనించగలరు. వీటిని వాడేముందు,వాడిన తరువాత ఏదైనా సమస్యలొచ్చినా వైద్యుడిని సంప్రదించిన తర్వాతే జామ ఆకులను ఉపయోగించడం మంచిది. -
ఫీజు అడగని వైద్యుడు గురించి తెలుసా?
తెలుగునేలపై జన్మించి స్వాతంత్య్ర సంగ్రామంలో పాలుపంచుకున్నవారు ఎందరో ఉన్నారు. వారిలో ఒకరు చెలికాని వెంకట రామారావు (Chelikani Venkata Rama Rao)మానవత, నిజాయతీ, వినమ్రత, నిబద్ధత వంటి విశిష్ట లక్షణాలతో ఆయన అన్ని తరాలకూ స్ఫూర్తిగా నిలిచారు. రామారావు జులై 15, 1901లో తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం సమీపంలోని కొందెవరంలో జన్మించారు. తూర్పుగోదావరి జిల్లా మొదటి నుంచీ సంఘసంస్కరణోద్యమాలు, విప్లవోద్యమాలకు నెలవు. దీంతో చిన్ననాటి నుంచే ఆ వాతావరణంలో పెరిగారు రామారావు పాఠశాల జీవితంలోనే స్వదేశీ ఉద్యమం వైపు మొగ్గు చూపారు. దేశం పరాయిపాలనలో మగ్గిపోతుంటే తాను చదువుకోవడం ద్రోహమని భావించి చదువుకు స్వస్తి పలికారు. జాతీయ ఉద్యమంలో చేరి 1922లో మొదటిసారి జైలు శిక్ష అనుభవించారు. ఉప్పు సత్యాగ్రహంలోపాల్గొన్నారు. కందుకూరి వీరేశలింగం పంతులు ఆయనను ఎంతగానో ప్రభావితం చేశారు. కందుకూరి దగ్గర పెరిగిన డాక్టర్ కమలమ్మను 1934లో కులాంతర వివాహం చేసుకున్నారు. అనంతరం వైద్యుడిగా ప్రాక్టీసలు ప్రారంభించి పేదలకు సేవలందించారు. వారి నుంచి డబ్బులు తీసుకోకుండా, ఖర్చుల కోసం వారికే కొంత డబ్బు ఇచ్చి పంపేవారు. 1952లో కమ్యూనిస్టు పార్టీ సభ్యునిగా కాకినాడ పార్లమెంటు సభ్యునిగా పోటీ చేశారు. అనారోగ్యం కారణంగా ప్రచారంలో పాల్గొనకపోయినా జనం ఆయన్నే గెలిపించి తొలి లోక్సభకు పంపించారు. 84 సంవత్సరాలు జీవించిన రామారావు సెప్టెంబరు 25, 1985న మరణించారు. ఇదీ చదవండి: Today Tip : షుగర్ పేషెంట్లు ఎగ్స్ తినవచ్చా? ఎన్ని తినవచ్చు? -
సింగపూర్లో కూడా ఉంది యూనివర్సల్ స్టూడియోస్...
అమెరికాలో యూనివర్సల్ స్టూడియోస్ (Universal Studios) అందరూ చూస్తారు. అయితే సింగపూర్లో ఉన్న యూనివర్సల్ స్టూడియో ఇంకా ఇంటెరెస్టింగ్గా ఉంటుంది. ఇది సింగపూర్లోని సెంటోసా వద్ద ఉన్న థీమ్ పార్క్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐదు యూనివర్సల్ స్టూడియోస్ థీమ్ పార్కులలో ఇదీ ఒకటి. ఏటా లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడి వచ్చి వెళ్తుంటారు. 2007 ఏప్రిల్ 19న ఈ థీమ్ పార్క్ నిర్మాణం ప్రారంభించి 2011లో పూర్తి చేశారు. మొత్తం 62 ఎకరాల్లో విస్తరించి ఉన్న ‘యూనివర్సల్ స్టూడియోస్’ ఆసియా ఖండంలో విశిష్టమైనది. మొదటి సంవత్సరంలోనే ఈ పార్క్కు సమారు 30 లక్షలమంది సందర్శించారు. అప్పటి నుండి ఏటా సుమారు 40 లక్షల మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ పార్క్లో సందర్శకుల్ని ఆకర్షించేందుకు 17 రకాల జోన్స్ ఏర్పాటు చేశారు. అందులో ‘హాలీవుడ్’, ‘న్యూయార్క్’, ‘స్కైఫై సిటీ’, ‘పురాతన ఈజిప్టు’, ‘జురాసిక్ పార్క్’.. ఇలా రకరకాల జోన్స్ ఉన్నాయి. వాటిలోకి వెళ్తే నిజంగానే అక్కడే ఉన్న అనుభూతి కలుగుతుంది. ఆయా జోన్స్లోకి వెళ్లిన వారికోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అందులో కొన్ని సీజనల్ కాగా, మరికొన్ని రోజూ ఉంటాయి. ఈ కారణంగా ప్రపంచంలో అనేక దేశాల నుంచి పర్యాటకులు అధికసంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా జరుగుతుంటాయి. వాటిని కూడా చాలా ఆసక్తిగా గమనిస్తుంటారు.ఇదీ చదవండి: Today Tip : షుగర్ పేషెంట్లు ఎగ్స్ తినవచ్చా? ఎన్ని తినవచ్చు? -
Kaleswaram అసలు బాధితులు... సామాన్య ప్రజలే!
కాళేశ్వరం మూడు బ్యారేజీ లలో జరిగిన అవినీతిపై విచా రిస్తున్న సుప్రీంకోర్టు న్యాయ మూర్తి పినాకినీ చంద్రఘోష్, మాజీ ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖర రావును విచారించారు. ఈ విచా రణలో కేసీఆర్ యూటర్న్ ఎందుకు తీసుకున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. నాడు తుమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత లేదని... ప్రాజెక్టును ‘రీ డిజైనింగ్, రీ ఇంజినీరింగ్’ పేరుతో అక్కడి నుంచి కాళేశ్వరానికి మార్చి... అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అంతా తానై వ్యవహరించింది కేసీఆర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. అటువంటి ఆయన తుమ్మిడిహెట్టి దగ్గర కాళేశ్వరం బ్యారేజీల్లో నీటిని నిలువ చేయాలన్న నిర్ణయం అంతా అధికారులదే అనీ, తనకేం సంబంధం లేదనీ చంద్రఘోష్ కమిషన్ ముందు సాక్ష్యం ఇచ్చారు. పంపు హౌస్ హెడ్కు తాకేంతవరకు నీటిని నిలువ చేయమని తాను ఆదేశాలు ఇవ్వలేదని తప్పించుకున్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం తమ ప్రభుత్వహయాంలో రూ. 280 కోట్ల నిధులు విడుదల జరి గిందనీ, వినియోగించే అధికారాలు వారికే ఇచ్చా మనీ చెప్పారు. ప్రభుత్వ ఆమోదంతోనే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామన్నారు. బ్యారేజీల కోసం స్థలాల ఎంపిక పూర్తిగా సాంకేతికంగానే జరిగిందని తెలి పారు. కాళేశ్వరం నిర్మాణం కోసం నిధులు సమీకరించేందుకే ఇరిగేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేశా మనీ, ప్రాజెక్టు వినియోగం ద్వారా సమకూరే నిధులతో ఆ రుణాలను తిరిగి చెల్లించాల నుకున్నామనీ వివరించారు. కానీ, వివిధ కారణాల వల్ల అది సాధ్యం కాలేదన్నారు. ‘తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదు’ అనే సీడబ్ల్యూసీ పత్రం బీఆర్ఎస్–బీజేపీ పవిత్ర మైత్రిలో భాగంగా సృష్టించబడింది. ప్రతిఫలంగా బీఆర్ఎస్ రాష్ట్రపతి ఎన్నిక, వ్యవసాయ చట్టాలు, నోట్ల రద్దు తదితర బిల్లులకు మద్దతునిచ్చింది. వీరి బంధం 2022 వరకు సాగింది. ఈ బంధం తెగిన (2022) తర్వాత ‘కాళేశ్వరం కేసీఆర్ కుటుంబపు ఏటీఎం’ అని మోదీ, అమిత్ షాలు, రాష్ట్ర నాయకులు అన్న మాటల తూటాలు మర్చిపోలేము.తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదనేది ఎంత కల్పితమో కాళేశ్వరం బ్యారేజీల అవినీతి అక్ర మాలపై చీల్చి చెండాడిన ఎన్డీఎస్ఏ నివేదిక నిగ్గు తేల్చింది. 2022–23లో మేడిగడ్డ నుండి విడుదలైన నీరు 4,628 టీఎంసీలు. 2019–20లో 2,046 టీఎంసీలు. 2021–22లో 2,671 టీఎంసీలు. 2023–24 మేడిగడ్డ ఐదు అడుగులు కుంగి, మూడు అడుగుల వెడల్పుతో నిట్టనిలువునా, అడుగు నుండి పైవరకు చీలిన సంవత్సరం 1,942 టీఎంసీల నీరు విడు దలైంది. పై ఐదేళ్లలో మొత్తం 13,151 టీఎంసీల నీటిని మేడిగడ్డ విడుదల చేసింది. ఇందులో 85–90 శాతం నీరు తుమ్మిడిహెట్టి–ప్రాణహిత నుండి వచ్చిందే! ప్రాణహిత నది లేకపోతే మేడిగడ్డ వద్ద బ్యారేజీ అనే ఆలోచన కేసీఆర్కు వచ్చేది కాదు. వ్యాప్ కోస్ లైడార్ సర్వే మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఉందని నిర్ణయించగా, ఆ నివేదిక ఆధారంగా బ్యారేజీల నిర్మాణంపై నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ కమిషన్ ముందు సాక్ష్యం ఇచ్చారు. వ్యాప్ కోస్ సీఎండీ రాజిందర్ గుప్తా ఇంట్లో 38 కోట్ల రూపాయలను, నోయిడా, తదితర ప్రాంతాలలో విలువైన రియల్ ఎస్టేట్ భూములు, విల్లాల రిజి స్ట్రేషన్ పత్రాలు, భారీ బంగారం నగలను, సీబీఐ 2023 మే 3న దాడులు చేసి జప్తు చేసి ఆయన్ని జైల్లో పెట్టింది నిజం కాదా? ఈ డబ్బంతా ఎక్కడిది? తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదనే సాకుతో బ్యారేజీ స్థలాన్ని మేడిగడ్డకు మార్చేందుకు పొందినదే అనేది విమర్శకుల అనుమానం.ప్రతి ఇంజనీర్కూ బ్యారేజ్కు, డ్యామ్కు ఉన్న తేడా తెలుసు. వాటిని ఎలా నిర్వహించాలో తెలుసు. బ్యారేజీలో 2.5 టీఎమ్సీల కంటే ఎక్కువ నీళ్లు నిలపకూడదు. ఎక్కువైన నీళ్లన్నీ నదికైనా లేదా కాలువకైనా వెళ్లాలి. మరి, మేడిగడ్డలో 16, అన్నారంలో 12, సుందిళ్లలో 8 టీఎంసీలు నిల్వ చేయాలని ఆదేశించింది ఎవరు? కాళేశ్వరం కార్పొరేషన్ తీసుకున్న రుణాలు, ఆ ప్రాజెక్టు వినియోగం ద్వారా సమకూరే లాభాలతో, ఆ రుణాలను చెల్లించడం అసాధ్యం. అప్పులిచ్చిన బ్యాంకులు, కేంద్ర సంస్థలు... అసలు, వడ్డీలు పొందుతుండగా; ప్రజల సేవలకు, భారీగా కోత పడింది. చివరకు అసలు, వడ్డీలు నెల నెలా చెల్లించేది కోట్లాది సామాన్య ప్రజలే అనేది వాస్తవం. నైనాల గోవర్ధన్వ్యాసకర్త సామాజిక కార్యకర్త, నీటిపారుదల ప్రాజెక్టుల విశ్లేషకులు -
Basaveshwarudu: బసవ బోధ
సమాజంలో నెలకొన్న దురాచారాలను, మూఢ విశ్వాసాలను సమూలంగా నిర్మూలించి జనులను సన్మార్గంలో నడి పించి ఉద్ధరించాలని తపించి ఆ ప్రయత్నంలోనే తనువులను బాసిన మహనీయులెందరో! వారిలో బసవేశ్వరుడు ఒకరు. బసవేశ్వరుడు క్రీ.శ. 1131లో కర్ణాటకలో జన్మించాడు. ఆయనకు ఎనిమిదేళ్ళ వయసులో ఉపనయనం చేయదలచిన తల్లితండ్రులతో, ‘అక్కకు లేని ఉపనయనం నాకెందుకు?’ అని ప్రశ్నించాడు. సదాచారం, సత్ప్రవర్తన లేని జీవితం వ్యర్థమనీ, చిత్త శుద్ధి దైవ సాక్షాత్కారాన్ని కల్గి స్తుందనీ చాటి చెప్పాడు. బస వేశ్వరుని అపారమైన మేధను గమనించి కల్యాణ కటకాన్ని పాలించే ఆనాటి రాజు బిజ్జ లుడు ఆయనను తన రాజ్యంలో మహామంత్రిగా నియ మించాడు. కేవలం శాసించటానికే పరిమితమైన రాజ సభను ప్రజాసమస్యలను పరిష్కరించే వేదికగా ‘అనుభవ మంటపం’గా ఆయన తీర్చిదిద్దాడు. ‘కాయకమే కైలాసం’ అనే సిద్ధాంతాన్ని బోధించి ప్రజలను కార్యకర్తలుగా, కార్య దక్షులుగా మలిచాడు. తాము చేసే పనిని శ్రద్ధతో చేయ టమే అసలైన పూజ అని తెలియజెప్పాడు.మానవులంతా సమానమే, శివుడే సత్యం, ఆయన నిరాకారుడు, ఖరీదైన ఆలయాలు, అలంకారాలు వద్దు, వాస్తు – జ్యోతిషాలు అసత్యాలు, భక్తి కన్నా సత్ప్రవర్తన మిన్న అని పదేపదే గొంతెత్తి చెప్పాడు. వేటగాడైన కన్నప్ప, పారిశుద్ధ్యపు పని చేసిన మేదర చెన్నయ్య, అంటరాని వాడైన సిరియాళుడు ఎలా ముక్తి పొందగలిగారో వివరించాడు. కులాంతర వివాహాలను, సహపంక్తి భోజనాలను బసవేశ్వరుడు ఆనాడే ప్రోత్సహించి సంఘ సంస్కరణకు పూనుకొన్నాడు. ఇలాంటివి నచ్చని సంప్రదాయవాదులు కుట్ర పన్నారు. అయినా వాటిని ఎదుర్కొంటూ ఆయన తన కార్యక్రమాలను కొనసాగిస్తూనే శివైక్యం చెందాడు.– రాచమడుగు శ్రీనివాసులు -
‘సొంతిల్లా.. నో వే..!’ బోట్లో బతికేస్తా.. సోషల్ మీడియాలో తీవ్ర చర్చ
‘కూడు, గూడు గుడ్డ’ ఇవి సామాన్య జీవితానికి కావల్సిన కనీస అవసరాలు. కానీ ప్రస్తుత సమాజంలో మధ్యతరగతి జీవికి సొంత ఇల్లు అనేది అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. అందులోనూ భారతదేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో సొంతిల్లు కాదు గదా కనీసం అద్దె భారాన్ని భరించడం కూడా కష్టమే. ఈ నేపథ్యంలో ఒక నెటిజన్ పోస్ట్ వైరల్గా మారింది. మరో విధంగా చెప్పాలంటే తీవ్ర చర్చకు దారి తీసింది.మెట్రో నగరాల్లో ఒక చిన్న అపార్ట్ మెంట్ కొన్నాలన్నా లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి. ఇది చాలా మంది మధ్యతరగతి కొనుగోలుదారుల ఆందళన. దీనిపైనే స్పందిస్తా.. సొంతిల్లు,లోన్లు, ఈఎంఐలు ఇవన్నీ నా వల్ల కాదుగానీమన దేశంలో హౌస్బోట్లో జీవితాన్ని లాగించేయడం చట్టబద్ధమేనా? దయ చేసి ఎవరైనా చెప్పండి బ్రో అంటూ సోషల్మీడియాలో పెద్ద చర్చకే తెర లేపాడు. బెంగళూరు, చెన్నై లేదా హైదరాబాద్లో ఫ్లాట్ కొనలేని,గృహ రుణం కోసం వయస్సు, ఆదాయ పరిమితులు సహకరించని వ్యక్తి ఒక చిన్న పడవను కొనుగోలు చేయాలా లేదా అద్దెకు తీసుకోవాలా అంటూ ఆవేదనగా ప్రశ్నించాడు. అందులో వంటగది, బాత్రూమ్ రెండు గదులు వంటి మినిమం సౌకర్యాలతో నివసించదగిన స్థలంగా మార్చాలా? ఏం చేయాలి? అంటూ పోస్ట్ చేశాడు.ఇండియాలో భారతదేశంలోని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ఏ నగరంలోనూ ఫ్లాట్ కొన లేను నాకు ఇప్పటికే వయస్సు మీద పడింది, కాబట్టి నేను EMIల కట్టేంత కాలమూ పని చేయలేను ఒక బోట్ కొనుక్కొని, నదులు, సముద్ర తీరంలో పార్క్ చేసుకుంటా.. వానొచ్చినా, వరదొచ్చినా పరవాలేదు మహా అయితే హౌస్ బోట్ ధర 15 నుండి 30 లక్షల వరకు ఉంటుంది. ’’ అంటూ రాసుకొచ్చాడు. సోషల్ మీడియా స్పందనదీనిపై నెటిజనలు విభిన్న రీతుల్లో స్పందించారు. ఇళ్లు చవకగా కొనే కొన్ని ఏరియాలు, సూచనలతో పాటు పడవలో ఉండకూడదని కొందరు అతని ఆలోచనకు బ్రేక్లు వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కొనమని కొందరు సూచించారు. అంతేకాదు బోట్ జీవితం ఒకే కానీ... అడ్రస్ ప్రూఫ్, పర్మినెంట్ అడ్రస్, డెలివరీ అడ్రస్ ఇలాంటి వన్నీ ఉంటాయిగా అన్నారు. -
Pooja Dhingra వంటల రాణి, గేమ్ చేంజర్
పేస్ట్రీ గేమ్ చేంజర్ అవార్డు అందుకున్న మొట్టమొదటి ఇండియన్ చెఫ్గా పూజా ధింగ్రా (Pooja Dhingra) పేరు రికార్డులకెక్కింది. సాధారణంగా వంట అనగానే ఆడవాళ్లు చేసేదే కదా అని అనుకుంటాం కానీ రోడ్డు పక్కన ఉండే చిన్నా చితక కాకా, పాకహోటళ్ల నుంచి బిల్లు కట్టాలంటే చుక్కలు చూపించే స్టార్ హోటళ్ల వరకు మగవాళ్లే చెఫ్లుగా ఉంటారు. అయితే ముంబైకి చెందిన పూజా ధింగ్రా ఆ సంప్రదాయాన్ని తిరగరాసింది. తనకెంతో ఇష్టమైన వ్యాపకమైన వంటలనే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని స్టార్ చెఫ్గా పేరు తెచ్చుకున్న పూజ భారతదేశపు మొట్టమొదటి మాకరోన్ దుకాణాన్ని ప్రారంభించి... బేకరీ చెయిన్ లీ 15 పాటిస్సేరీకి యజమానిగా... మహిళా వ్యాపారవేత్తగా ఆంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇవేమీ కొత్త విషయాలు కావనుకోండి... ముంబాయ్ మాకరోనీ క్వీన్గా ఇప్పటికే మకుటం ఉన్న పూజాధింగ్రాకు పేస్ట్రీ గేమ్ చేంజర్ అవార్డు అందులో మరో విలువైన రాయిగా ఒదిగి΄ోయింది. దాంతో ఆమె ఈ అవార్డు అందుకున్న మొదటి ఫీమేల్ చెఫ్గా కూడా రికార్డు సృష్టించింది. ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయమేంటంటే... ఎప్పుడూ చేసే వంటలే కదా అనో. రోజూ తినే రుచులే కదా అనో చప్పరించేయడం కాదు... ఆ వంటలకు ఒక ప్రత్యేకతను తీసుకురావాలి. ఆ రుచులు చూడటంలో... అంటే రుచులను పసిగట్టడంలో కూడా నేర్పును సంపాదించాలి. టీ, కాఫీ, ఇతర పానీయాలను టేస్ట్ చూస్తూ... హాయిగా కంటì నిండా నిద్రపోతూ కూడా లక్షలు కాదు.. కోట్లు సంపాదించే వారున్నారన్నది జ్ఞాపకం చేసుకోవాలి. చదవండి: Today tip : ఈజీగా బరువు తగ్గాలంటే ఇవిగో ఆసనాలు -
Anju టెర్రస్ గార్డెన్లో తోపు : 600కు పైగా గులాబీలు
మడిసన్నాక కాపింత కళాపోషనుండాల అన్నట్టు గట్టిగా అనుకోవాలే కానీ చారెడు మట్టినేల లేకున్నా కోరుకున్న పంట పండించవచ్చని నిరూపించింది కేరళకు చెందిన అంజు కార్తీక (Anju Karthika). తన ఇంటి మిద్దె తోటలో ఆమె 600 రకాల గులాబీలను విరబూయించి రోజాపూల ప్రేమికుల గుండెలను గులాబీ సౌరభాలతో నింపేసింది. కేరళలోని కయాంకుళానికి చెందిన యాభై రెండు సంవవత్సరాల అంజు కార్తీకకు చిన్నప్పటినుంచి పువ్వులంటే ఎనలేని ప్రేమ. అందులోనూ గులాబీలంటే ప్రాణం. స్కూల్లో చదివేటప్పుడే ఆమెలో గులాబీలపైన ప్రేమ బీజం నాటుకుని మొలకెత్తింది. అది ఆమెతోపాటే పెరిగి పెద్దదై కొమ్మలు రెమ్మలుగా విస్తరించింది. ఆమెకు పూలంటే ఉన్న మక్కువ మట్టిగా... ఆమె కృషి, పట్టుదలలే నీరు, ఎరువులుగా మారి ఆమె కోరుకున్నన్ని రకాల గులాబీ బాలలయ్యాయి. కార్తీకకు పదవ తరగతి విద్యార్థినిగా ఉన్నప్పటినుంచే స్నేహితుల తోటల నుంచి గులాబీల అంట్లు తీసుకొచ్చి తన ఇంటిలో వాటిని పెంచే ప్రయత్నాలు చేసేది. తోటి వారందరూ ఆటపాటలలో బిజీగా ఉన్నప్పుడు ఆమె నిశ్శబ్దంగా తన మొక్కల ప్రపంచంలో పడి వాటిని పెంచడంలో విసుగూ విరామం లేకుండా గంటలు గంటలు గడిపేది. తాను అంటుకట్టిన గులాబీ అందమైన మొగ్గ తొడిగినప్పుడు ఆమె గుండెల్లో ఆనందం ఉప్పొంగేది. గులాబీల పెంపకం పట్ల గల ఆమె అభిరుచి ఆమె టీనేజ్ దాటిన తరువాత వయసుతో పాటే పెరుగుతూ వచ్చింది. 2013లో ఆమె బ్రెజిల్, థాయిలాండ్లలో పెరిగే టేబుల్ గులాబీ రకాల గురించి తెలుసుకున్నటినుంచి మరింతగా వికసించింది. 15 రకాల గులాబీ మొక్కలను సేకరించి తన టెర్రస్పై రకరకాల కంటైనర్లలో పెంచడం ప్రారంభించింది. వాటి పోషణలో... సంరక్షణలో ఆమె కృషి ఫలించింది. ఈ వాతావరణంలో కూడా అక్కడి గులాబీ రకాలు అభివృద్ధి చెంది రోజుకో రకం మొక్క, పూటకో రకం పువ్వు అన్నట్టు విచ్చుకోనారంభించాయి. ఆమె సేకరించి పెంచుతున్న గులాబీల సౌరభాలు క్రమేణా కేరళ దాటి పొరుగు రాష్ట్రాలకు, అక్కడినుంచి విదేశాలకు కూడా చేరాయి. అలా ఒక ప్రయోగం ఫలించగానే మరో ప్రయోగం చేస్తూ వచ్చింది. చెన్నై, పూణెలలోని రకరకాల నర్సరీల నుంచి కొత్తరకాల గులాబీ అంట్లను తెప్పించేది. పరాగ సంపర్కాన్ని ఉపయోగించి ఆమె అంటుకట్టిన గులాబీ రకాలు మావిచిగురు, నారింజ, వంకాయ రంగు, ఊదా రంగు.. ఇంకా రకరకాల రంగులలో రూపాలలో ఊపిరి పోసుకుని వివిధ రకాల ఆకృతులలో విచ్చుకోసాగాయి. ఆమె తన ఇంటి మిద్దెనే ప్రయోగశాలగా మార్చుకుని చేసిన వినూత్న ప్రయోగాలు ఆమెకు ఆదాయ మార్గాలుగా కూడా మారాయి. చదవండి: Today Tip : షుగర్ పేషెంట్లు ఎగ్స్ తినవచ్చా? ఎన్ని తినవచ్చు? ఫేస్బుక్లో ఆమె తాను పెంచుతున్న గులాబీ రకాలను అందమైన ఫొటోలు తీసి పోస్ట్ చేసేది. వాటిని చూసి మైమరచి పోయిన ఆమె స్నేహితులు, బంధువులు తమకు కావాలంటే తమకు కావాలంటూ ఆమెకు ఆర్డర్లు పంపసాగారు. అలా అందుకున్న ఆర్డర్ల ద్వారా ఆమె రోజుకు కొన్ని వేల రూపాయల ఆదాయాన్ని కళ్ల జూసేది. ప్రస్తుతం ఆమె మిద్దెతోటలో లేని గులాబీ రకం లేదంటే అతిశయోక్తి కాదు. ఏవిధమైన ఏజెంట్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ లేకుండానే ఆమె తన నోటిమాటలు, ఫేస్బుక్ సమూహాల ద్వారా అడిగిన వారికి లేదనకుండా గులాబీ అంట్లను పంపుతూ వేల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. చేయాలనే సంకల్పం, దానిని నెరవేర్చుకునేందుకు కావలసిన శ్రద్ధ, అంకిత భావం, పట్టుదల ఉంటే చాలు.. దేనినైనా సాధించి చూపవచ్చుననేందుకు నిదర్శనం అంజు కార్తీక గులాబీ తోట. ఇదీ చదవండి: రూ. 400 చెప్పుల్ని లక్షకు అమ్ముకుంటారా? ప్రాడాపై హర్ష్ గోయెంకా విమర్శలు -
Jagannath Rath Yatra సర్వం జగన్నాథం
పర్లాకిమిడి: గజపతి జిల్లా పర్లాకిమిడిలో రథయాత్ర సందర్భంగా ఘోష యాత్ర మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రారంభమైంది. ఉదయం జిల్లా కలెక్టర్ బిజయ కుమార్దాస్, ఎస్పీ జ్యోతింద్ర నాథ్ పండా, సబ్ కలెక్టర్ అనుప్ పండాలు విచ్చేసి జగన్నాథ, బలభద్ర, సుభద్ర రథయాత్రకు పహాండిని ప్రారంభించారు. మధ్యాహ్నం 2 గంటలకు పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి విచ్చేసి జగన్నాథ, బలభద్ర, సుభద్రలను రథాలపైకి తీసుకెళ్లారు. అనంతరం గజపతి వంశీయురాలు కల్యాణీ దేవి గజపతి మేళతాళాలతో రాజ మందిరం నుంచి విచ్చేసి జగన్నాథుని రథంపై శా్రస్తోత్తరంగా పూజలు చేసి బంగారు చీపురుతో ఊడ్చి శుభ్రం చేశారు. దీనిని చెరాపహారా అంటారు. స్థానిక కళాకారులు రథాల ముందు ఒడిస్సీ నృత్యాలతో ప్రజలను అలరించారు. మూడు రథాలను గుండిచా మందిరం వైపు సాయంత్రం 5.00 గంటలకు తీసుకెళ్లడం మొదలుపెట్టారు. పోలీసులు కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేయడం వలన ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. మల్కన్గిరిలో... జిల్లా కేంద్రంలో జగన్నాథ స్వామివారి రథయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ముందుగా కలెక్టర్ ఆశిష్ ఈశ్వర్ పటేల్తో ఆలయ అర్చకులు పూజ నిర్వహించి రథం లాగడం ప్రారంభించారు. యాత్రలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రథం కదిలే సమయంలో కళాకారులు నృత్య ప్రదర్శనలు చేశారు. స్వామివారి దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. రాయగడలో... రాయగడలో రథయాత్ర వైభవంగా జరిగింది. జగన్నాథ మందిరం నుంచి దేవతామూర్తులకు సాంప్రదాయబద్ధంగా పొహండి నిర్వహించి ప్రత్యేకంగా రూపొందించిన రథంలో నిలిపారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు రథంలాగే కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టర్ ఫరూల్ పటా్వరీ, తహసీల్దార్ ప్రియదర్శిని స్వయి, కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక, రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక తదితరులు రథంలాగే కార్యక్రమంలో పాల్గొన్నారు. అడుగడుగునా భక్తుల సౌకర్యార్థం స్వచ్ఛంద సేవా సంస్థలు మజ్జిగ, చల్లని పానీయాలు వితరణ చేశారు. ఇదిలా ఉండగా స్థానిక రైతుల కాలనీలోని జిమ్స్ పాఠశాల విద్యార్థులు రూపొందించిన రథం అందరినీ ఆకట్టుకుంది. రథయాత్రను తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు స్థానిక మజ్జిగౌరి మందిరం ట్రస్టు తరుపున మందిరం ప్రాంగణంలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జయపురంలో... పట్టణంలో అంగరంగ వైభవంగా రథయాత్ర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని మిగిలిన ప్రాంతాల్లో శుక్రవారం యాత్ర జరగగా, ఒక్కరోజు తర్వాత అనగా శనివారం నుంచి జయపురంలో రథయాత్ర జరుగుతుంది. దీనిలో భాగంగా శుక్రవారం జగన్నాథ స్వామి ఆలయం నుంచి దేవతామూర్తులను మంగళ వాయిద్యాలతో తోడ్కొని వచ్చి రథాలపై ఆశీనులు చేశారు. అనంతరం శనివారం మధ్యాహ్నం వరకు దేవతామూర్తులకు భక్తులు పూజలు చేస్తారు. శనివారం మధ్యాహ్నం 4 గంటలకు రథాన్ని గుండిచా మందిరానికి తీసుకొని వెళ్తారు. కొరాపుట్లో... కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాల్లో రథయత్ర తొలి ఘట్టంలో భాగంగా రథాలు గుండిచా మందిరాలకు చేరుకున్నాయి. కొరాపుట్ జిల్లా కేంద్రంలో జయపూర్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి దంపతులు, కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చోలు పాల్గొన్నారు. నబరంగ్పూర్లో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి రథం లాగారు. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలో సీఆర్పీఎఫ్ 12వ బెటాలియన్లో నేతృత్వంలో కమాండెంట్ ఎన్కేకే ప్రసాద్ నేతృత్వంలో రథయాత్ర జరిగింది. మరోవైపు విశ్వవ్యాప్త రథయాత్రకు విభిన్నంగా జయపూర్, ఆంధ్రా–ఒడిశా వివాదస్పద ప్రాంతం కొఠియాలో ఒక రోజు ఆలస్యంగా శనివారం రథయాత్ర జరగనుంది. శుక్రవారం మాత్రం పొహండి నిర్వహించి విగ్రహాలను రథం మీదకి చేర్చారు. ఆకట్టుకునే పుష్ప మకుటంస్వామివారి అలంకరణలో ఆకట్టుకునే అపురూప పుష్ప మకుటం. దీనిని యాత్ర వ్యవహారిక భాషలో ఠయ్యా అంటారు. సుగంధిత పుష్పాలతో దేవతా త్రయం బలభద్రుడు, దేవీ సుభద్ర, శ్రీజగన్నాథుని కోసం వేర్వేరుగా 3 ఠయ్యాలు తయారు చేస్తారు. స్థానిక రాఘవ దాసు మఠం క్రమం తప్పకుండా వీటిని పంపిణీ చేస్తుంది. వీటి తయారీలో వెదురు బద్దలు, జీలుగు, జరీ కాగితాలు వంటి ఆకర్షణీయమైన వస్తువులతో పాటు సుగంధిత పుష్పాలను వినియోగిస్తారు. కదంబ పుష్పాలు ప్రముఖ స్థానం ఆక్రమించి ఆబాలగోపాల భక్త జనాన్ని ఆకట్టుకుంటాయి. -
Yoga సంకల్ప శక్తి, స్వీయ–క్రమశిక్షణ కావాలంటే..
ముఖం కడుక్కోవడం, బ్రష్ చేసుకోవడం, స్నానం చేయడం మొదలైనవన్నీ పై శరీరాన్ని శుభ్రపరిచే క్రియలైతే యోగక్రియలు అంతర్గత అవయవాలనీ శుభ్రపరుస్తాయి. వాటిలో అతి ముఖ్యమైనది త్రాటక. యోగాసనాలు వేయడం పూర్తయ్యాక త్రాటక క్రియ సాధన చేస్తే శరీరం ప్రశాంతంగా మారుతుంది. మనసుకు శరీరానికి మధ్య శక్తివంతమైన వంతెనను సృష్టిస్తుంది. బరువు నియంత్రణలో ఉండటానికి కూడా ఈ సాధన ఉపయోగపడుతుంది. సాధన చేయడమూ సులువే... సౌకర్యవంతమైన ప్లేస్లో కూర్చోవాలి. ఎదురుగా టీ పాయ్లాంటి చిన్న టేబుల్పైన వెలుగుతున్న కొవ్వొత్తిని ఉంచాలి. విశ్రాంతిగా కూర్చొని, ప్రశాంతంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తూ దీపకాంతిని చూస్తూ ఉండాలి. రోజూ కొంత సమయం ఈ క్రియను సాధన చేస్తూ ఉండాలి. ఇదీ చదవండి: వెయిట్లాస్ జర్నీలో ఆహారానిదే కీలక పాత్రఈ అభ్యాసం వల్ల...కంటి కండరాలను బలపరచడంతో పాటు చూపును మెరుగుపరుస్తుంది. భావోద్వేగ స్థిరత్వాన్ని కలిగిస్తుంది. ఒత్తిడి నిర్వహణకు ఒక విలువైన సాధనంగా పనిచేస్తుంది. కన్నీటి గ్రంథులను శుభ్రపరుస్తుంది. కళ్ళు ప్రకాశవంతం అవుతాయి. కంటిచూపు సామర్థ్యాన్ని బలపరుస్తుంది. నాడీ వ్యవస్థను సమతుల్యం చేస్తుంది. ఆందోళనను తగ్గిస్తుంది. నిద్రలేమి, నిరాశపూరితమైన ఆలోచనలు తగ్గి΄ోతాయి. ఓర్పు, సహన సామర్థ్యాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. మెరుగైన శక్తిదృష్టిని మెరుగుపరచడం ద్వారా జ్ఞాపకశక్తికి కూడా దోహదపడుతుంది. నిలకడగా చూడటం అనే అభ్యాసం మనసుపై ప్రశాంత ప్రభావాన్ని చూపుతుంది. మనసును శాంతపరచడం వల్ల భావోద్వేగ స్థిరత్వం లభిస్తుంది. నిద్ర పట్టని వారికి ఇది మేలైన ఔషధం అని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఎక్కువసేపు స్క్రీన్ లను చూస్తూ గడిపే వారికి, ఈ అభ్యాసం కంటి ఒత్తిడి, అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ అభ్యాసం సంకల్ప శక్తి, స్వీయ–క్రమశిక్షణను పెంపొందించడంలో సహాయ పడుతుంది. – ఎన్.ఆర్. -
వెయిట్లాస్ జర్నీలో ఆహారానిదే కీలక పాత్ర
బరువు తగ్గడానికి అయినా పెరగడానికి అయినా వ్యాయామాలపాత్ర 20 శాతం ఉంటే, ఆహారంపాత్ర 80 శాతం ఉంటుంది. సాధారణ మనిషికి రోజుకు 2,200 క్యాలరిస్ అవసరం. బరువు తగ్గాలి అనుకునే వారు క్యాలరీ లోటులో ఉండాలి. మన శరీరం 2,200 కావాలి అంటే, ఒక 5 – 10 శాతం ఆహార క్యాలరీ లోటు తో మొదలుపెట్టాలి. అంటే రోజుకు 2000 క్యాలోరీలు ఇచ్చే ఆహారం తీసుకోవాలి. అది కూడా ఆరోగ్యకరమైన ఆహారం. కూరగాయలు, పళ్ళు, మాంసకృత్తులు, ఓట్స్ లాంటివి.ఉదాహరణకు కేజీ బరువు తగ్గాలి అంటే దాదాపు 7500 క్యాలరీలు కరిగించాలి. అంటే ఈ విధంగా చేస్తూ ఉంటే, 3 వారాలకు ఒక కేజీ తగ్గుతారు అన్నమాట. నెమ్మదిగా తగ్గినా ఆరోగ్యంగా తగ్గుతారు ఈ విధంగా. కానీ ఒక మనిషిలో ఎదుటి వాళ్ళు గుర్తించగలిగే మార్పు రావాలి అంటే ఒక 3 కేజీలు అయినా తగ్గాలి. అలా తగ్గడానికి కనీసం 2 నెలలు పడుతుంది.ఇదీ చదవండి: Today tip : ఈజీగా బరువు తగ్గాలంటే ఇవిగో ఆసనాలు -
ఏడడుగులు తడబడి... విడివడి
మన దగ్గర ‘పెళ్లి పుస్తకం’ అమ్మాయి సహనం, సైలెన్స్.. అబ్బాయి ఆజ్ఞ, అధికారంతో రాసి ఉంది! కుటుంబ పరువు, ప్రతిష్ఠల మధ్య బైండ్ అయిపోయింది! అందుకే కలహాలు, కలతలున్నా ఆ కాపురం సాగిపోతూనే ఉండింది! కానీ దాన్నిప్పుడు అమ్మాయిలు ప్రేమ, కంపాటబిలిటీతో తిరగరాసేందుకు ప్రయత్నిస్తున్నారు. గౌరవం, భావోద్వేగాలతో బంధించాలనుకుంటున్నారు. అయితే ఆ ప్రయాణంలో విడాకుల అడ్డంకులు ఎదురవుతున్నాయి. దాన్ని గమనిస్తున్న పెద్దలకు మన వివాహ వ్యవస్థ కూలిపోతున్నట్టనిపించవచ్చు! కానీ.. ఒక వ్యవస్థను పునర్నిర్మించడంలో అలాంటివి సాధారణమే అంటున్నారు సామాజిక విశ్లేషకులు. ఆ తడబాట్లు సర్దుకుని పెళ్లిపుస్తకంలో కొత్త పేజీలుగా మారుతాయని చెబుతున్నారు! సుచరిత బిజినెస్ ఎనలిస్ట్. పెళ్లయి రెండేళ్లవుతోంది. భర్త సాఫ్ట్వేర్. పెళ్లయిన వెంటనే యూకేలో మంచి జాబ్ ఆఫర్ వస్తే.. పెళ్లిని నిలబెట్టుకోవడం కోసం ఆ జాబ్ ఆఫర్ని వద్దనుకుంది. ఓ స్టార్టప్ ప్లాన్ చేసుకుని ఈ రెండేళ్లలో దాన్ని బాగా డెవలప్ చేసుకుని ఆంట్రప్రెన్యూర్గా స్థిరపడే దశకు చేరుకుంది. ఆ క్రమంలో పిల్లలనూ అప్పుడే వద్దనుకుంది. భర్త మాత్రం పిల్లలు కావాలనుకుంటున్నాడు. ఈ మధ్యే అతనికి అమెరికాలో మంచి జాబ్ ఆఫర్ వచ్చింది. సుచరితనూ తీసుకుని అమెరికా వెళ్లిపోతే పిల్లల కోసం కన్విన్స్ అవుతుందనుకుని ఆ జాబ్కు ఓకే చేసి ఇక్కడున్న ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి, సుచరిత ముందు తన ప్రపోజల్ పెట్టాడు. తను స్టార్టప్ను వదిలేసి వచ్చే సమస్యే లేదని స్పష్టం చేసింది. చర్చలు, వాదనలు జరిగాయి. ‘పెళ్లయిన కొత్తలోనే ఇప్పుడు నీకొచ్చిన జాబ్ ఆఫర్ కన్నా రెట్టింపు శాలరీతో మంచి ఆఫర్ నాకు వచ్చింది. కానీ మన పెళ్లిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ జాబ్ను వద్దనుకున్నాను. ఇప్పుడు నా స్టార్టప్ క్లిక్ అయ్యింది. ఇంత ఎఫర్ట్నీ తుంగలో తొక్కి నీతో రమ్మంటే రాలేను. కావాలంటే నువ్వు నా కంపెనీలో చేరు. ఇద్దరం కలిసి పనిచేద్దాం!’ అంది. ససేమిరా అన్నాడు. మన బంధానికన్నా నీకు ఆ స్టార్టప్పే ఎక్కువ? నీ కెరీర్ కోసం మదర్హుడ్ని కూడా పణంగా పెడతావా?’ అంటూ నిలదీశాడు. ఆ మాటలకు, ఆ ఆలోచనా ధోరణికి విస్తుపోయింది సుచరిత.‘నేనేం పిల్లలను వద్దనుకోవట్లేదు. నీ అమెరికా జాబ్ కోసం నా కెరీర్ను వదలను అంటున్నాను. నువ్వు ఇక్కడే ఉండు.. పిల్లల కోసమూ ప్లాన్ చేసుకుందాం’ అంది. రాజీకి రాలేదు అతను. అయితే విడాకులు కావాలంది సుచరిత. ఆమె నిర్ణయానికి అటు పెద్దలు, ఇటు పెద్దలు హతాశులయ్యారు. మూర్ఖత్వంతో కాపురాన్ని కూల్చుకుంటున్నావంటూ తిట్టారు. అయినా చలించలేదు సుచరిత. కూతురి తీరుకు ఏడుస్తున్న తల్లిని ‘నన్నెవరు అర్థం చేసుకోకపోయినా పర్లేదు నువ్వు అపార్థం చేసుకోవడమే పెయిన్గా ఉందమ్మా! బాగా చదువుకోవాలి, నీ కాళ్లమీద నువ్వు నిలబడాలి, కోట్ల ఆస్తి ఉన్న భర్త దొరికినా సరే.. నీకంటూ రూపాయి సంపాదించుకున్నప్పుడే నీకు ధైర్యం, గౌరవమని నువ్వు చెప్పిన మాటల్ని నువ్వే మరచిపోయావా? ఆ గోల్ కోసం నేను పడ్డ కష్టాన్ని నువ్వూ ఇగ్నోర్ చేయడమేంటమ్మా..’ అంటూ బాధపడింది. అమ్మకు అర్థమైంది, అలాగని కూతురిని పూర్తిగా సమర్థించలేకపోయింది.ఎందుకంటే.. ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలని చిన్నప్పటి నుంచీ నూరిపోసిన ఆ తల్లి ఆడపిల్లకు కాపురం కూడా అంతే ముఖ్యం, అవసరమైతే అంతకన్నా ముఖ్యమనే సంప్రదాయ విలువలకు కండిషనింగ్ అయి ఉంది. ఆ భావజాలం కూతురి నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించడానికి అడ్డం పడుతోంది. తన పెంపకం పట్ల అపరాధ భావాన్నీ కలిగిస్తోంది. ఆమే కాదు ఆడపిల్లల చదువును, ఉన్నతిని కాంక్షించి ఆ దిశగా వాళ్లను తీర్చిదిద్దిన చాలామంది తల్లిదండ్రులదీ అదే భావన. పెళ్లిని నిలుపుకోవడం కోసం చదువును, కెరీర్ను ఆడపిల్లలే పణంగా పెట్టాలనుకుంటారు. ఎందుకంటే ఎంతకాదన్నా మన దగ్గర పెళ్లి సఫరింగ్నే గ్లోరిఫై చేస్తోంది కాబట్టి అంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్లు. బాధ పడుతున్నా.. హింసను ఎదుర్కొంటున్నా, మానసిక దూరం పెరుగుతున్నా, భావోద్వేగాలు నిర్లక్ష్యం అవుతున్నా ఆలుమగలు కలిసి ఉండాలనే నేర్పుతోంది కుటుంబం. కానీ..చదువు, లోకజ్ఞానం, సాధికారత ఇచ్చిన ధైర్యంతో అలాంటి కాపురంలో కొనసాగడం కన్నా విడాకులతో మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారు సుచరితలాంటి అమ్మాయిలు. ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ లేని పెళ్లిని పెళ్లిగానే చూడట్లేదు. విడాకులను పెద్దవాళ్లు పరువుప్రతిష్ఠలకు ముడిపెడతారు. ఆ భావన నుంచి బయటపడాలి. భరిస్తూ కలిసి బతకడంలో అర్థం లేదు. విడిపోయినా ఆత్మగౌరవంతో బతకడంలోనే ఆనందముందని గ్రహించాలని కోరుకుంటున్నారు. అందుకే ఏమైనా సరే సహనంతో సర్దుకుపోవాలంటూ పిల్లలను బలవంత పెట్టకూడదని మానసిక, న్యాయ నిపుణులూ చెబుతున్నారు. ఇది సంప్రదాయాన్ని మంటగలుపుతున్న మార్పు కాదు. పరిణామ క్రమమని అంటున్నారు సామాజిక విశ్లేషకులు. విడాకులకు కారణాలు.. మునుపటిలా ఆడవాళ్ల పని, మగవాళ్ల పనంటూ బాధ్యతలను జెండర్ కోణంలో చూడట్లేదు. ఇంటా, బయటా స్త్రీ, పురుషుల విధుల్లో మార్పులొచ్చాయి. మారిన ఈ విలువలను జీర్ణించుకోలేని కాపురాలు విడాకుల బాట పడుతున్నాయి. భార్యాభర్తల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం, ఆర్థిక సమస్యలు, బంధంలో భావోద్వేగాల సమన్వయం లోపించడం, నమ్మకం లేకపోవడం, అభద్రత, అస్తవ్యస్త పనివేళలు, మద్యం, ధూమపానం మొదలైనవీ విడాకులకు ప్రధాన కారణాలే అంటున్నాయి అధ్యయనాలు. ఈ మధ్య కాలంలో ఢిల్లీ, బెంగళూరు, ముంబై, కోల్కతా, లక్నో వంటి నగరాల్లో విడాకుల దరఖాస్తులు మూడింతలయ్యాయి. పురుషాధిపత్య సమాజాలుగా పేరొందిన ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో విడాకుల సంఖ్య, వేరు పడిన సంసారాల సంఖ్యా తక్కువగా ఉన్నాయి.పెళ్లి, పిల్లలు,పేరెంటింగ్, విడాకులు, ఆందోళన వంటివన్నీ మనదాకా వస్తేగానీ తెలియవు. కాలం కలిసి వచ్చినప్పుడు అంతా బ్రహ్మాండంగా సాగుతూ మనంత తెలివిగల వాళ్లు లేరనిపిస్తుంది. కాలం ఎదురు తిరిగినప్పుడే అసలు సినిమా కనిపిస్తుంది.– కరీనా కపూర్భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మంచి, చెడు రెండిటికీ కమ్యూనికేషన్ ఉంటేనే ఆ బంధం నిలబడుతుంది. అనుబంధం బలపడుతుంది. అలాగే ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి ఆ బంధంలోకి భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మంచి, చెడు రెండిటికీ కమ్యూనికేషన్ ఉంటేనే ఆ బంధం నిలబడుతుంది. అనుబంధం బలపడుతుంది. అలాగే ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి ఆ బంధంలోకి మూడోవ్యక్తి దూరకూడదు. ఆ జంటే పరిష్కరించుకోవాలి.మూడోవ్యక్తి దూరకూడదు. ఆ జంటే పరిష్కరించుకోవాలి.– విద్యా బాలన్ – సరస్వతి రమ -
నీటి కుంటలతో కరువుపై పోరాటం
కరువుకు ప్రత్యామ్నాయపదంగా మారిన రాజస్థాన్లో పొలాల్లో నీటి కుంటలు జలసిరులను అందిస్తున్నాయి. జైపూర్ జిల్లా కుకాస్ గ్రామంలోని వాతావరణ ప్రతికూలతలను తట్టుకొని సాగు నీటి భద్రతను కల్పించే పరివర్తనాత్మక గ్రామీణ నీటి సంరక్షణ నమూనా అమల్లో ఉంది. ఈ గ్రామపరిసరాల్లోనే 50 వ్యవసాయ నీటి కుంటలు (ఫామ్ పాండ్స్)ను తవ్వారు. ఈ వర్షాకాలంలో వీటితో పది కోట్ల లీటర్ల వాన నీటిని ఒడిసిపట్టాలని గ్రామస్తులు ఆశిస్తున్నారు. ఈ నీటి కుంటలను శాస్త్రీయ పద్ధతిలో నిర్మించారు. వానాకాలంలో వాన నీటిని ఒడిసిపట్టి, ఏడాది పొడవునా పంటలకు సాగునీటి కొరత లేకుండా చూడటం ద్వారా గ్రామీణుల జీవనోపాధులను మెరుగుపరచటమే లక్ష్యంగా ఈ ఫామ్ పాండ్లను నిర్మించారు. ఈ ఫామ్ పాండ్లను ‘కుకాస్ నమూనా’ అని పిలుస్తున్నారు.ఖరగ్పూర్ ఐఐటీ పూర్వ విద్యార్థి విప్ర గోయల్ ఈ నీటి కుంటల ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. గ్రామంలో ఇప్పటికి 50 నీటి కుంటలు నిర్మించామని, మరో 25 నిర్మించబోతున్నామని ఆయన చెబుతున్నారు. వీటిలో వాన నీటిని సంరక్షిస్తే ఈ ప్రాంతంలో 50 వేల మంది ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. వాన నీటిని రెండు పంటలకూ అందించే ఏర్పాటు చేసినందున తక్కువ నీటితో పండించగల పంటలు, అధికాదాయాన్నిచ్చే పంటలను శ్రద్ధగా సాగు చేసుకుంటూ స్వావలంబనతో జీవించే అవకాశం రైతులకు దక్కిందని కుకాస్ సర్పంచ్ రాధేశ్యాం మీనా సంతోషపడుతున్నారు. జైపూర్ ప్రాంతంలో హెక్టారుకు 14 నుంచి 21 లక్షల లీటర్ల వాన నీరు వృథాగా పోతోందని గోయల్ లెక్కగట్టారు. నదులు, కాలువలు లేని ఈ ప్రాంతంలో నీటి కుంటలు ఆధారపడదగినవిగా ఉన్నాయన్నారు. నిరంతరం ఫామ్ పాండ్ ద్వారా నీటి సదుపాయం ఉంటుంది కాబట్టి భూగర్భ జలాలు ఆదా అవుతాయన్నారు. గతంలో నీతి ఆయోగ్తో పనిచేసిన అనుభవం గల గోయల్ ఒక టూవీలర్ తయారీ కంపెనీ ఆర్ధిక సహకారంతో కుకాస్ గ్రామంలో వాననీటి సంరక్షణకు పామ్ పాండ్స్ నిర్మాణం చేయిస్తుండటం ప్రశంసనీయం. తన వంతు కృషి చేస్తూ కేంద్ర ప్రభుత్వ తోడ్పాటు కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు.కుకాస్ నమూనా ప్రత్యేకతలువానాకాలంలో వాన నీటి సంరక్షణ సామర్థ్యం: 10 కోట్ల లీటర్ల వానాకాలపు వరద నీటిని ఒడిసిపట్టుకోవాలి.ఇదీ ఫామ్ పాండ్ డిజైన్: ప్లాస్టిక్ లైనింగ్, ప్రతి రైతు పొలంలో 5% స్థలంలో 10 అడుగుల లోతు తవ్వి ఫామ్ పాండ్ నిర్మాణం, చుట్టూ పకడ్బందీగా ఇనుప కంచె నిర్మాణం.ప్రాజెక్టు పరిధి: దాస జిల్లాలో 250 నీటి కుంటల తవ్వకం ద్వారా వాననీటి సంరక్షణ ద్వారా సాగు నీటి భద్రతకు విజయవంతంగా కృషి చేసిన స్ఫూర్తితో కుకాస్ జిల్లాలో ఈ నమూనాను అమలు చేస్తున్నారు.నీటి భద్రత, వ్యవసాయానికి జరిగిన మేళ్లు...జైపూర్ జిల్లా వ్యవసాయం 99.4% మేరకు భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉంది. భూమిలోకి వాన నీరు ఇంకేదానికన్నా 2.22 రెట్లు బోర్ల ద్వారా తోడేస్తున్నారు. ఈ సమస్యను అధిగమించానికి ఫామ్ పాండ్స్ను నిర్మిస్తున్నారు. ఖరీఫ్, రబీ పంటలకు నీటి అవసరాలు తీర్చటం కోసం వీటిని నిర్మిస్తున్నారు. ఏడాది పొడవునా సాగయ్యే పంటలు, తోటల సాగు, పశువుల పెంపకం, ఉద్యాన తోటల పెంపకానికి దోహదం. పంట మార్పిడిని ప్రోత్సహించటం.. ఉదా.. వేరుశనగ, బొబ్బర్లు.చదవండి: ఔషధ మొక్క.. ఆరోగ్యానికి రక్షసుస్థిరత, అభివృద్ధిపై ప్రభావంప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని పంట దిగుబడులు తీసుకునే శక్తిని నీటి కుంటల వ్యవస్థ పెంపొందిస్తుంది. వైవిధ్యపూరితమైన జీవనోపాధులకు దోహదం చేస్తుంది. ఆహార భద్రతను కల్పిస్తుంది. పాడి పరిశ్రమ, ఆహార శుద్ధి పరిశ్రమలు, మార్కెటింగ్ సదుపాయాలను కల్పించడానికి అవకాశాలు మెరుగుపడ్డాయి. -
వాల్నట్స్ షెల్స్తో వైట్ హెయిర్కి చెక్పెడదాం ఇలా..!
జుట్టు నెరవడం దగ్గర నుంచి, కాలిన గాయాలకు మన వంటింట్లో ఉపయోగించే వాటితోనే సులభంగా పరిష్కారం చూపొచ్చట. సహజసిద్ధమైన వాటితో మెరుగైన ఫలితమే గాక ఎలాంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సమస్యలకు కిచెన్ టిప్స్ ఏంటో చూసేద్దామా..!. వాల్నట్స్ లోపల ఉన్న పప్పుని తీసుకుని షెల్స్ని పడేస్తుంటారు. కానీ వాల్నట్స్ షెల్స్ తెల్లజుట్టుని నల్లగా మార్చడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. వాల్నట్స్ షెల్స్ను మెత్తగా పొడిచేసుకోవాలి. ఆరు టేబుల్ స్పూన్ల పొడిని లీటరు నీటిలో వేసి అరగంటపాటు మరిగించాలి. మరిగిన నీటిని చల్లారాక వడగట్టాలి. ఈ నీటిని కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టి మర్దన చేయాలి. రెండు గంటల తరువాత కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేయడం వల్ల మూడు నెలల్లో తెల్లజుట్టు నల్లగా... ఒత్తుగా మారుతుంది.నాలుక కాలినప్పుడు చల్లని పదార్థాలు తినడం తెలిసిందే. అయితే ఐస్క్రీమ్ను కొద్దికొద్దిగా చప్పరించడం వల్ల కూడా త్వరగా ఉపశమనం లభిస్తుంది. దీనికోసం వెనిలా, మ్యాంగో, పిస్తా, గుల్ఖండ్ ఫ్లేవర్స్ ఉన్న ఐస్క్రీమ్లు బాగా పనిచేస్తాయి.పుదీనా ఆకుల్లో కొద్దిగా తేనె వేసి కచ్చపచ్చాగా దంచాలి. ఈ మిశ్రమాన్ని నెమ్మదిగా చప్పరిస్తుంటే కాలిన నాలుకకు ఉపశమనం లభిస్తుంది. (చదవండి: Today Tip : షుగర్ పేషెంట్లు ఎగ్స్ తినవచ్చా? ఎన్ని తినవచ్చు?) -
బాడీ బిల్డర్గా 'అడవి బిడ్డ'..!
నో స్పాట్లైట్... నో స్పాన్సర్... నో బిగ్–సిటీ జిమ్...ఎన్నో ‘నో’ల మధ్య ఆమె దగ్గర ఉన్న ఏకైక ‘యస్’ ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసమే ఛత్తీస్గఢ్లోని మారుమూల గ్రామానికి చెందిన ఖుష్బు నాగ్ను ‘బాడీబిల్డర్’ కావాలనే తన కల నెరవేర్చుకునేలా చేసింది.తాజాగా... ఢిల్లీలో జరిగిన ఎన్పీసి వరల్డ్వైడ్ బాడీబిల్డింగ్ చాంపియన్షిప్లో కాంస్య పతకం గెలుచుకుంది. ‘బస్తర్ కా షేర్నీ’ ‘వైరల్ బాడీ బిల్డర్’ ‘ఫిట్నెస్ క్వీన్’ అనిపించుకుంది. పేదింట్లో పుట్టిన ఖుష్బు నాగ్ కష్టపడి బీఎస్సీ చదువుకుంది. ఒకవైపు చదువుకుంటూనే పొలం పనుల నుంచి పశువులను మేపడం వరకు ఎన్నో పనులు చేసేది. ‘బాడీబిల్డర్’ కావాలనేది ఆమె కల.‘నేను బాడీబిల్డర్ కావాలనుకుంటున్నాను’ అనే మాట ఖుష్బు నోటి నుంచి వినిపించినప్పుడల్లా చుట్టుపక్కల వారికి చెప్పలేనంత వినోదంగా మారేది. ‘బాడీబిల్డర్’ అనే నిక్నేమ్తో పిలిచేవారు.అయితే ఎగతాళి మాటలకు, వెక్కిరింపులకు ఎప్పుడూ వెనకడుగు వేయలేదు ఖుష్బు. ఆమె ఏకైక లక్ష్యం... బాడీబిల్డర్. వడ్రంగి అయిన తండ్రి ‘నువ్వు సాధించగలవు’ అని ఖుష్బుకు ధైర్యాన్ని ఇచ్చాడు.అడవిలో పెరిగిన అమ్మాయికి, జిమ్లు అందుబాటులో లేని అమ్మాయికి, బాడీబిల్డింగ్ ఛాంపియన్షిప్ నియమనిబంధనలు చెప్పే వ్యక్తి ఒక్కరూ లేని ప్రాంతానికి చెందిన అమ్మాయికి తన కలను నెరవేర్చుకోవడం సాధ్యపడుతుందా?‘కచ్చితంగా సాధ్యమే’ అని పట్టుదలతో నిరూపించింది ఖుష్బు నాగ్. తన ఇంటిని జిమ్గా చేసుకుంది. అందుబాటులో ఉన్న వస్తువులతోనే సాధన చేసేది.కేన్సర్తో ఖుష్బు తల్లి చనిపోయింది. ఆ దుఃఖం ఒకవైపు. ‘ఏదో ఉద్యోగం చూసుకోకుండా ఏమిటీ పనులు!’ లాంటి సూటిపోటి మాటలు మరోవైపు. అయినా సరే సాధన పక్కన పెట్టలేదు. పరిమిత వనరులతోనే పోరాటానికి రెడీ అయింది. ప్రతి సవాలును నిచ్చెనగా చేసుకొని లక్ష్యం వైపు దూసుకువెళ్లింది. జాతీయస్థాయిలో జరిగిన బాడీబిల్డింగ్ పోటీలలో ఎన్నో పతకాలు గెలుచుకుంది. ప్రతి పతకం ఖుష్బు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచేది.ఖుష్బు విజయం గురించి మాట్లాడం అంటే ఆమె ప్రతిభ గురించి మాత్రమే మాట్లాడడం కాదు. ‘అడవిలో పుట్టిన వారు అడవికే పరిమితం అవుతారు’లాంటి తరతరాల భావజాలాన్ని పక్కన పెట్టిన విజేత గురించి మాట్లాడడం. ‘నీకు తోడుగా ఎవరూ లేరా? గాడ్ఫాదర్ లేడా? అయినా ఫరవాలేదు... అపురూప విజయాలు సాధించవచ్చు’ అని నిరూపించిన అడవిబిడ్డ ఆత్మవిశ్వాసం కథ.పవర్ ఆఫ్ పట్టుదలబాడీబిల్డర్ కావాలంటే ఎన్నో వనరులు ఉండాలి అంటారు. అయితే ఇలాంటి మాటలేవీ నన్ను వెనక్కి నెట్టలేదు. ప్రతి సవాలును స్వీకరించి లక్ష్యం వైపు అడుగులు వేశాను. సాధించాలనే పట్టుదల ఉంటే ఏదీ అసాధ్యం కాదు అని చెబుతోంది ఖుష్బు నాగ్. View this post on Instagram A post shared by The CSR Journal (@thecsrjournal)(చదవండి: అర ఎకరం భూమి లేకుండానే డ్రాగన్ పంట..! రిటైర్డ్ ఉపాధ్యాయురాలి సక్సెస్ స్టోరీ) -
Arya Rajendran: మమ్దానీ మెచ్చిన మన మేయర్
జోహ్రాన్ మమ్దానీ.. ప్రపంచం మొత్తం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన భారత సంతతి వ్యక్తి. న్యూయార్క్ నగర మేయర్ పదవి రేసులో అభ్యర్థిగా నిలబడిన ఈ 33 ఏళ్ల యువ నాయకుడి ప్రచార శైలి, ఎన్నికల హామీల గురించే అక్కడి జనం చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో భారత్కు చెందిన ఓ యువ నేత గురించి ఆయన చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆర్య రాజేంద్రన్.. ఈ పేరు గుర్తుందా?. కేవలం 21 ఏళ్ల వయసులో తిరువనంతపురం మేయర్ పదవి చేపట్టారు. తద్వారా దేశంలోనే అత్యంత చిన్నవయసులో మేయర్గా ఎన్నికైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఆ టైంలో తన సోషల్ మీడియా ఖాతాలో మమ్దానీ ఈ విషయాన్ని ప్రస్తావించడం ఇప్పుడు హైలైట్ అవుతోంది. న్యూయార్క్కు ఎలాంటి మేయర్ అవసరం?.. రాజేంద్రన్ లాంటి నేత అవసరం అంటూ పోస్ట్ చేశారాయన. డెమొక్రటిక్ పార్టీ తరఫున మేయర్ అభ్యర్థిగా మమ్దానీ ఎన్నికైన తరుణంలో ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. them: so what kind of mayor does nyc need right now?me: https://t.co/XEuvK6VvOc— Zohran Kwame Mamdani (@ZohranKMamdani) December 27, 2020👉1999 జనవరి 12వ తేదీన జన్మించిన ఆర్య రాజేంద్రన్.. తిరువంతపురం కార్పొరేషన్ మేయర్. నెమోం అసెంబ్లీ నియోజకవర్గం ముడవన్ముగల్ వార్డు నుంచి ఆమె ఎన్నికయ్యారు. ఆమె కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) – CPI(M)లో ఉన్నారు. కిందటి ఏడాది తిరువనంతపురం జిల్లా కమిటీకి కూడా ఎన్నికయ్యారు. ఈమె భర్త కేరళ అసెంబ్లీకి చిన్న వయసులో ఎన్నికైన శాసన సభ్యుడు కేఎం సచిన్ దేవ్. 2023లో ఆమె నెల వయసున్న చంటి బిడ్డతో కార్యాలయంలో పని చేసిన వీడియో బాగా వైరల్ కావడంతో.. ఆమెపై ప్రశంసలు కురిశాయి. అదే సమయంలో.. కిందటి ఏడాది ఓ బస్సు డ్రైవర్తో ఆమెకు జరిగిన వాగ్వాదం తీవ్ర విమర్శలకు దారి తీసింది కూడా. ఇక.. న్యూయార్క్ మేయర్ పదవికి పోటీ చేస్తున్న భారతీయ మూలాల జోహ్రాన్ మమ్దానీ 2020లో ఆమెను ప్రశంసిస్తూ ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైది. “న్యూయార్క్కు అవసరమైన మేయర్ ఎవరు?”అంటూ ఆమెను ఉదాహరణగా చూపించారు. ఆర్య మేయర్గా వేస్టేజ్ మెనేజ్మెంట్తోపాటు ఆరోగ్య సేవల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. 24/7 ఆరోగ్య కేంద్రాలు, శాస్త్రీయ వ్యర్థాల పారవేయడం వంటి కార్యక్రమాలు చేపట్టారు.👉33 ఏళ్ల వయసున్న జోహ్రాన్ మమ్దానీ.. న్యూయార్క్ మేయర్ పదవి రేసులో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఉగాండాలో భారతీయ మూలాలున్న కుటుంబంలో ఈయన జన్మించాడు. తండ్రి ప్రొఫెసర్ మహ్మూద్ మమ్దానీ, తల్లి ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్. భార్య సిరియా మోడల్ రమా దువాజీ(rama duwaji). న్యూయార్క్ మేయర్ ఎన్నికల ప్రచారంలో.. ఉచిత బస్సు ప్రయాణం, ప్రభుత్వ ఆధ్వర్యంలోని గ్రాసరి స్టోర్లు లాంటి హామీలతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడీయన. అలాగే పిల్లల సంరక్షణ, సంపన్నులపై అధిక పన్నులు లాంటి హామీలు కూడా ఉన్నాయి. బెర్నీ సాండర్స్, అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్ వంటి ప్రముఖులు ఇతనికి మద్దతుగా నిలిచారు. అయితే.. పాలస్తీనా మద్దతుతో పాటు పరిపాలనా అనుభవం లేమి వంటి అంశాలపై విమర్శలూ ఎదుర్కొన్నాడు. అంతేకాదు.. కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న నేత అంటూ ట్రంప్ సహా రిపబ్లికన్లు మమ్దానీపై దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే జోహ్రాన్ మమ్దానీకి జనాల్లో మాత్రం విపరీతమైన ఆదరణ ఉంది. మరీ ముఖ్యంగా యువతలో. సోషల్ మీడియాను ఏడాది కాలంగా బాగా ఉపయోగించుకుంటూ ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటున్నారు. మద్దతుదారులతో డ్యాన్స్ చేస్తూ, మజ్జిగ పంచుతూ సంబరాలు చేస్తూ వీడియోలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎన్నారై కమ్యూనిటీని ఆకట్టుకునేందుకు బాలీవుడ్ సాంగ్స్, డైలాగులతో షార్ట్ వీడియోలతో సైతం ప్రచారం నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు. తాను డెమోక్రాటిక్ సోషలిస్ట్ అని గర్వంగా చెప్పుకుంటున్నాడాయన. నవంబర్లో న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ ఆ ఎన్నికల్లో గెలిస్తే.. న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన మొదటి ముస్లిం, భారతీయ-అమెరికన్గా చరిత్ర సృష్టిస్తారు. -
Today Tip : షుగర్ పేషెంట్లు ఎగ్స్ తినవచ్చా? ఎన్ని తినవచ్చు?
షుగర్ (diabetes) అనేది దీర్ఘకాలిక వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే.. ఇక అంతే సంగతులు జీవితాంతం మనల్ని వీడిపోదు అనేది ఒకప్పటి మాట. లైఫ్ స్టైల్ డిజార్డర్ కాబట్టి ఆహార నియమాలు, వ్యాయామంతో పూర్తిగా నియంత్రణలోకి వస్తుందని అనేది ఇప్పటి మాట. అయితే డయాబెటిస్ రాకుండానే జాగ్రత్తపడాలి. వయసు పెరుగుతున్న కొద్దీ మరింత జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఆహారం విషయంలోనూ, వ్యాయామం విషయంలోనే అలసత్వం ప్రదర్శించకూడదు. అయితే ఎలాంటి ఆహారాలు తినాలి? ఎలాంటి ఆహారాలు తీనకూడదు అనే సందేహం చాలామందిని పట్టి పీడిస్తుంటుంది. మరి ఇవాల్టి టిప్ ఆఫ్ ది డే లో భాగంగా షుగర్ ఉన్న వారు ఎగ్స్ (Eggs) తినొచ్చా, ఒకవేళ తింటే ఎలా తినాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.కోటడిగుడ్లలో బయోటిన్, పొటాషియం, యాంటి యాక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. అలాగే చాలా గ్లైసెమిక్ ఇండెక్స్ , కార్బొహైడ్రేట్స్ తక్కువగానూ ప్రోటీన్ ఎక్కువగానూ ఉంటుంది. ఈ రెండూ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో తోడ్పడతాయి. కాబట్టి గుడ్లును నిరభ్యంతరంగా తినవచ్చు. మధుమేహం ఉన్నవారికి ప్రోటీన్ అధిక మూలాన్ని అందిస్తుంది. కనుక చక్కగా తినవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలపై పెద్దగా ప్రభావం ఉండదు.గుడ్లలోని కొలెస్ట్రాల్ కంటెంట్ గురించి ఆందోళన అవసరం లేదని, అయితే మితంగా తినడం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అంటే వారానికి మూడు రోజుల పాటు రోజుకొకటి చొప్పున తినొచ్చు. అయితే కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉన్నవారు రెండు ఎగ్ వైట్స్ తింటే సరిపోతుంది.అలాగే, గుండె సమస్యలు, కిడ్నీ ,ఇతర సమస్యలున్న వారు ఎగ్స్ తినే విషయంలో వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది.నోట్ : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. షుగర్లో ఉండే రకాలను బట్టి, వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి డయాబెటిస్తో బాధపడేవారు ఏం తినాలి అనేది ఆధారపడుంది. ఇలాంటి నిర్ణయాలు వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి. అయితే ఒత్తిడిలేని జీవితం, నీళ్లు తాగడం, నిద్ర, తాజా కాయగూరలు, పళ్లు, సిరిధాన్యాలతో చేసిన వంటలు, కొవ్వు తక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. క్రమం తప్పని వ్యాయామం, రెగ్యులర్గా వైద్య పరీక్షలు చేయించుకోవడం మధుమేహం రోగులకు చాలా అవసరం. -
'కన్నీళ్లు ఉప్పొంగే క్షణం': శుభాంశు తల్లిదండ్రుల భావోద్వేగం
శుభాంశు శుక్లా బృందం యాక్సియం-4 మెషిన్ ద్వారా అంతర్జాతీయ పరిశోదనా కేంద్రంలోకి విజయవంతంగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన రెండో భారతీయుడిగా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా పేరు దేశమంతటా మారుమ్రోగిపోతుంది. ఎక్కడ చూసినా.. ఈ అంశమే చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఆ బృందం 14 రోజుల పాటు చేయనున్న పరిశోధనల గురించే అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎవరి నోట చూసినా..శుభాంశు శుక్లా పేరే హాట్టాపిక్గా మారింది. 140 కోట్ల పై చిలుకు బారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ రోదసిలోకి దూసుకెళ్లిను శుభాంశు బృందం మిషన్ సక్సెస్ అవ్వాలన్నేదే దేశమంతటి ఆ కాంక్ష కూడా. ఈ క్రమంలో యావత్తు దేశం గర్వపడేలా చేసే కుమారుడిని కన్న తల్లిదండ్రుల భావోద్వేగం మాటలకందనిది. అంతరిక్షంలోకి అడుగుపెట్టి తమ కొడుకుని చూసి ఆ తల్లిదండ్రులిద్దరూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఏ పేరెంట్స్కి అయినా ఇది గర్వంతో ఉప్పొంగే క్షణం. లక్నోలోని తమ ఇంటి నుంచి తమ కుమారుడు శుభాంశు ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఆక్సియమ్ మిషన్ 4 ఆకాశంలోకి ఎగిసిన విధానాన్ని వీక్షించారు. ముఖ్యంగా శుభాంశు తల్లి ఆశా శుక్లాకి అదంతా చూసి కన్నీళ్లు ఆగలేదు. అయితే అవి ఆనందంతో ఉప్పొంగిన ఆనందభాష్పాలని చెప్పారామె. తమ బంధువులు, సన్నిహితులు స్క్రీన్లకి అతుక్కుపోయి చూస్తున్న విధానం..పట్టరాని ఆనందాన్నిచ్చిందని అన్నారామె. మాటలే రానంతగా గొతు వణుకుతోందామెకు. అలాగే అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి చేరిన వెంటనే గ్రూప్ కెప్టెన్ శుభాంశు దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ..‘‘అంతరిక్షం నుంచి మీ అందరికి నమస్కారం. ఈ యాత్ర చాలా అద్భుతంగా ఉంది. సుమారు 41 ఏళ్ల తర్వాత మనం అంతరిక్షంలోకి తిరిగి వచ్చాం. ఈ అద్భుత యాత్రలో ప్రతి భారతీయుడూ నాకు తోడుగా ఐఎస్ఎస్లో ఉన్న భావనే కలుగుతోంది మీ అందరి ప్రేమ, ఆశీస్సులతోనే ఐఎస్ఎస్ చేరగలిగా. మనమంతా కలిసి ఈ యాత్రను మరింత ఉత్సాహభరితంగా మారుద్దాం. మీ అందరితో పాటు త్రివర్ణ పతాకం వెంట రాగా నాతోపాటు ఐఎస్ఎస్ చేరా. ఇది నా ఒక్కని ఘనత కాదు. భారతీయులందరి విజయం." అని అన్నారు. దానికి అతడి తల్లిదండ్రులు స్పందిస్తూ.. అది కేవలం తమ కుమారుడి దేశభక్తి మాత్రమే కాదు. అది చాలా వ్యక్తిగతమైనది. మా బిడ్డ ఇప్పుడు దేశ జెండా తోపాటు ఆ నక్షత్రాల మధ్య యావత్తు దేశ సామూహిక ఆకాంక్షలను తన భుజాలపై మోస్తున్నాడు. అని భావోద్వేగంగా అన్నారు.కాగా, తమ కుమారుడితో అంతరిక్షంలోనికి వెళ్లడానికి కొన్ని గంటల ముందు ఫోన్లో సంభాషించినట్లు తెలిపారు. నాన్న నా గురించి బాధపడుతూ ఉండిపోవద్దు. దేనికోసం ఇక్కడికి వచ్చానో..ఆ మిషన్ని విజయవంతంగా పూర్తి చేస్తాను అని చెప్పినట్లు శుభాంశు తండ్రి అన్నారు. అలాగే ఆయన అక్క సుచి కూడా 30 సెకన్లపాటు శుభాంశుతో మాట్లాడినట్లు సమాచారం. ఇక శుభాంశు కూడా బాగానే ఉన్నాడని, అతడికి శుభాకాంక్షలు కూడా తెలిపామని చెప్పుకొచ్చారు కుటుంబసభ్యులు. #WATCH | Lucknow, Uttar Pradesh: Parents, relatives of IAF Group Captain & astronaut Shubhanshu Shukla, celebrate as #Axiom4Mission lifts off from NASA's Kennedy Space Centre in Florida, US. The mission is being piloted by India's IAF Group Captain Shubhanshu Shukla. pic.twitter.com/bNTrlAq72r— ANI (@ANI) June 25, 2025 (చదవండి: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా క్యూట్ లవ్ స్టోరీ..! ప్రియతమ ఈ జర్నీలో..) -
రూ. 400 చెప్పుల్ని లక్షకు అమ్ముకుంటారా? ప్రాడాపై హర్ష్ గోయెంకా విమర్శలు
ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ ప్రాడా ఇటీవల ప్రదర్శించిన చెప్పులు, వాటి ధరపై భారతీయ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా స్పందించారు. అసలు కళాకారులకు క్రెడిట్ ఇవ్వకుండా భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని అంతర్జాతీయ బ్రాండ్లు లాభపడుతున్నాయంటూ ఆయన విమర్శించారు. ఇది చాలా విచారకరం అంటూ ట్వీట్ చేశారు.Prada is selling products looking like Kolhapuri chappals for over ₹1 lakh. Our artisans make the same by hand for ₹400. They lose, while global brands cash in on our culture. Sad! pic.twitter.com/Cct4vOimKs— Harsh Goenka (@hvgoenka) June 26, 2025 ప్రాడా పురుషుల పాదరక్షల స్ప్రింగ్ సమ్మర్ 2026 ఇటీవల ప్రదర్శించింది. వీటి డిజైన్ అచ్చం మన షోలాపూర్ చెప్పుల మాదిరిగానే రాజసాన్ని ఒలకబోస్తుట్టున్నాయి. కానీ వాటి ధరే 1.2 లక్షలు ఉండటం హాట్ టాపిక్గా మారింది. నెటిజన్లు దీనిపై తీవ్రంగా చర్చించారు.అటు బిలియనీర్ గోయెంకా కూడా దీనిపై స్పందించారు.ఈ చెప్పుల ఫోటోలు ట్వీట్ చేస్తూ, ఇవి భారతదేశపు ఐకానిక్ కొల్హాపురి చెప్పులను పోలి ఉన్నాయి, కానీ ధర లక్షకు పై మాటే!అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించారు. మన చేతివృత్తులు వారు వీటినే రూ.400 కు తయారు చేస్తారు. అంటే వారు ఎంత నష్టపోతున్నారు? ప్రపంచ బ్రాండ్లు మన సంస్కృతిని సొమ్ము చేసుకుంటున్నాయి. విచారకరం! అంటూ గోయెంకా రాసుకొచ్చారు.ఈ హై-ఎండ్ ఫ్యాషన్ చప్పల్స్ని ప్రీమియం మెటీరియల్స్, ఇండియన్ డిజైన్తో రూపొందించినట్టు ప్రాడా ప్రకటించింది. అయితే ఇండియాలో షోలాపూర్ చెప్పులను పోలి ఉన్న ఈ చెప్పుల ధర భారీ లగ్జరీగా ఉండటంతో నెటిజన్లు విస్తుపోయిన సంగతి తెలిసిందే. -
పేరుకు తగ్గట్టే.. రిటైర్డ్ ఉద్యోగి ధర్మారావు దాతృత్వం
ప్రతి ఒక్కరికీ సేవ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ సమయం లేక కొంతమంది.. ఆర్థిక స్తోమత లేక మరి కొంతమంది చేయలేని పరిస్థితి.. అలాంటివారు ఏమాత్రం అవకాశం దొరికినా తమ వంతుగా సమాజానికి సేవ చేయాలనే తలంపుతో ఉంటారు. అలాంటి వారిలో ఒకరే ధర్మారావు.. సేల్స్ టాక్స్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్గా విధులు నిర్వహించిన ఆయన ఉద్యోగ విరమణ అనంతరం తన వంతు సాయంగా సేవ చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు.. – మోతీనగర్ ఆంధ్రప్రదేశ్లోని ఏలూరుకు చెందిన బి.ధర్మారావు ప్రస్తుతం మూసాపేట డివిజన్ మోతీనగర్లో నివాసం ఉంటున్నారు. ఉద్యోగ విధుల నిమిత్తం 1996లో కృష్ణాజిల్లా నుంచి నగరానికి బదిలీ అయ్యారు. డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూ జులైలో 2004లో ఉద్యోగ విరమణ పొందారు. అనంతరం ఆయన సతీమణి దివంగత బి.హైమావతి కోరిక మేరకు 2004 నుంచి నేటి వరకూ నిరంతరాయంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నోటు పుస్తకాలు, యూనిఫామ్, పాఠశాల ఫీజులు చెల్లిస్తున్నారు. ఆమె ఆలోచన నుంచే.. మేము చదువుకున్న సమయంలో పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేక అవస్థలు పడ్డాం. ఈ నేపథ్యంలో నా భార్య హైమావతి ఆలోచన నుంచే ఉద్యోగ విరమణ అనంతరం మా వంతు సాయం చేయాలని నిర్ణయించు కున్నాం. ఆమె మరణానంతరం ఆమె జ్ఞాపకార్థం విద్యార్థులకు తోచిన విధంగా పరితోషికాన్ని సాయం చేస్తున్నా. అపార్టుమెంట్లో విధులు నిర్వహిస్తున్న వాచ్మెన్ పిల్లలకు నోటు పుస్తకాలు అందజేస్తున్నా. రానున్న రోజుల్లో హైమావతి జ్ఞాపకార్థం మరిన్ని కార్యక్రమాలు చేపడతా. – ధర్మారావు, రిటైర్డ్ డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ భార్య జ్ఞాపకార్థం.. ప్రస్తుతం చిన్నకుమారుని వద్ద నివాసం ఉంటున్న ధర్మారావుకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. 2020లో ఆయన భార్య మరణానంతరం హైమావతి జ్ఞాపకార్థం.. 2021 నుంచి పుస్తకాలు, యూనీఫామ్ పంపిణీతో పాటు మూసాపేట డివిజన్లోని బబ్బుగూడ, యూసఫ్గూడ, వెంగళరావునగర్, ఇస్నాపూర్, శ్రీరామ్నగర్, రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాలలు, శ్రీరామ్ నగర్లోని ఉర్దూ మదరసాల్లో చదువుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన పదో తరగతి విద్యార్థులకు రూ.12వేల చప్పున ఫీజులను చెల్లిస్తున్నారు. గత ఐదేళ్లుగా పదో తరగతి మొదటి స్థానంలో ఉత్తీర్ణత సాధించిన, 500కు పైబడి మార్కులు సాధించిన 120 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు. -
Kareena Kapoor: పరాఠా విత్ నెయ్యితో 'జీరో సైజ్ ఫిగర్'..!
బాలీవుడ్ నటి కరీనా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఎవర్గ్రీన్ నటనతో అశేష అభిమానుల్ని సంపాదించుకున్న నటి ఆమె. ఇప్పటికి కుర్ర హీరోయిన్లకు తీసిపోని విధంగా గ్లామర్గా ఉంటారామె. ముఖ్యంగా ఆమె ఫిట్నెస్ విషయంలో చాలా క్రమశిక్షణగా ఉంటారు. మంచి జీవనశైలిని పాటిస్తారామె. తరుచుగా ఆమె ఈ విషయాలను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో షేర్ చేస్తుంటారు. తన వర్కౌట్ల నుంచి ఆరోగ్యకరమైన డైట్ వరకు ప్రతిదీ పంచుకుంటారామె. అయితే హీరో హీరోయిన్లు ఎంతలా స్ట్రిక్ట్గా ఫిట్నెస్కి ప్రాముఖ్యత ఇచ్చినా..కెరీర్ పరంగా కొన్ని త్యాగాలు చేయక తప్పని పరిస్థితి. ఎందుకంటే పాత్ర డిమాండ్కి అనుగుణంగా వాళ్ల ఆకృతిని మార్చుకోక తప్పదు. ఆ క్రమంలో ఆరోగ్యానికి విరుద్ధమైన డైట్లను అనుసరించాల్సి ఉంటుంది. అలానే కరీనా కూడా ఓ మూవీ కోసం జీరో సైజ్ ఫిగర్ మెయింటైన్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకోసం ఎలాంటి ఫుడ్ తీసుకునేదో తెలిస్తే నోరెళ్లబెడతారు. ఏంటి పరాఠాలతో తగ్గడం అని షాక్కి గురవ్వుతారు. కానీ కరీనానే ఓ ఇంటర్వ్యూలో పరాఠా విత్ నెయ్యితోనే జీరో సైజ్ బరువుకి వచ్చానని చెప్పడం విశేషం. మరి అదెలాగో చూద్దామా..!.వెయిట్ లాస్ జర్నీలో సక్సెస్ కానీ వాళ్లకు కరీనా అనుసరించిన విధానం ఓ వరమనే చెప్పాలి. ఎందుకంటే పాపం నోరు కట్టేసుకుని ఫైబర్ కోసం రుచి పచి లేని ఫుడ్ తింటుంటారు. అయితే ఇలా కమ్మటి పరాఠాలు, నెయ్యి కలిపి హాయిగా తింటూనే బరువు తగ్గే విధానం తెలుసుకుంటే హమ్మయ్యా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. మరీ ఆమె వీటితో సైజ్ జీరోకి ఎలా రాగలిగందంటే..2008 యాక్షన్-కామెడీ 'తాషన్'లో కరీనా కపూర్ జీరో సైజ్ ఫిగర్తో అందరినీ ఆశ్యర్యపరిచింది. అయితే ఆమె ఎప్పుడూ ఆకలితో అలమటించే డైట్లు ఫాలో కానని అంటోంది. ఎప్పుడూ పరాఠాలు తింటూనే ఉంటానంటోంది. అలా తింటూ..కూడా రోజంతా తీసకునే ఆహార క్రమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే చాలని చెబుతోందామె. అయితే ఆమె ఆ మూవీ కోసం దాదాపు 68 కిలోల నుంచి 48 కిలోలు చేరుకునేందుకు అస్సలు ఆకలితో ఇబ్బందిపడే లేదట. (చదవండి: Dinner: సాయంత్రం 6.30కి తినేయడమే మంచిదా? నటి కరీనా కపూర్ కూడా..)తన ఫిట్నెస్ టీమ్ పోషకాహార నిపుణుడు రుజుత దివేకర్, ట్రైనర్ నమ్రత పురోహిత్ల సాయంతో అద్భుతంగా బరువు తగ్గానని చెప్పారామె. అందుకోసం తాను సరైన మార్గాన్ని అవలంభించే మంచి శరీరాకృతిని పొందినట్లు తెలిపారామె. తాను అస్సలు తినకుండా ఉండలేనని అంటోంది. అయితే తాను సరైన మొత్తంలో కార్బోహైడ్రేట్లు తీసుకునేలా రుజుత దివేకర్ నెయ్యితో పరాఠాలు, కుంకుమ పువ్వు నీళ్లు తీసుకునేలా చేసిందని చెప్పుకొచ్చారు. వాటి తోపాటు గుల్కండ్ అనే స్వీటు, గోరువెచ్చని పాలు తప్పనిసరిగా తీసుకునేదాన్ని అని అంటోంది. అయితే 2018లో మొదటి బిడ్డ ప్రసవానంతరం బరువు పెరిగానని, అయితే త్వరితగతిన బరువుని అదుపులోకి తెచ్చుకున్నానని చెప్పుకొచ్చారు. అలాగే తాను జిమ్లో 55 నిమిషాలకు మించి ఎక్కువసేపు ఉండలేనని అన్నారు. తాను ఎక్కువగా పవర్ యోగా, పైలట్స్ వర్కౌట్లతో బాడీని ఫిట్గా ఉండేలా చూసుకుంటానని చెప్పారు. ఇక్కడ కరీనా..తనకిష్టమైన ఆహారాన్ని వదులకోకుండానే బరువు తగ్గే ప్రయత్నం చేశారు. మైండ్ఫుల్నెస్గా ఇష్టమైన ఆహారాలు దూరం చేసుకోకుండా తగ్గడమే ఆరోగ్యదాయకమని చెప్పకనే చెప్పారామె. సో ఆమెలా ఒక క్రమ పద్ధతిలో నచ్చిన ఫుడ్ తీసుకుంటూనే తగ్గే ప్రయత్నం చేసి ఆరోగ్యంగా ఉందామా..!.(చదవండి: ది బెస్ట్ ఐస్ క్రీమ్లుగా ఆ ఐదు భారతీయ బ్రాండ్లకు చోటు..!) -
ది బెస్ట్ ఐస్ క్రీమ్లుగా ఆ ఐదు భారతీయ బ్రాండ్లకు చోటు..!
ఆన్లైన్ ఫుడ్ ర్యాంకింగ్ ప్లాట్ఫామ్ టేస్ట్ అట్లాస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ది బెస్ట్ రెసీపీలు, బ్రేక్ఫాస్ట్లు, రెస్టారెంట్లలు తదితర వాటిల జాబితా అందించనట్టుగానే ఈసారి అందరికి ఇష్టమైన చల్లటి హిమక్రీమ్ల జాబితాను కూడా విడుదల చేసింది. వాటిలో భారత్కి చెందిన ఐదు ప్రముఖ బ్రాండ్ల ఐస్క్రీమ్లు చోటు దక్కించుకోవడం విశేషం. మెత్తం వంద ది బెస్ట్ ఐస్క్రీమ్ల జాబితాను వెల్లడించగా అందులో ఐదు భారతీయ ఐస్క్రీమ్లకు స్థానం లభించింది. వాటిలో ముందుంజలో ఉన్నది ముంబైకి చెందిన కె. రుస్టమ్స్ & కో. బ్రాండ్కి చెందిన మ్యాంగో శాండ్విచ్ ఐస్క్రీమ్. దీన్ని సన్నని వేఫర్లలో ప్రత్యేకమైన ఐస్క్రీమ్ శాండ్విచ్లకు గమ్యస్థానంగా నిలిచింది. ఇది అత్యంత పురాతన ఐసీక్రీమ్ దుకాణం. దీన్ని దాదాపు 1950లలో స్థాపించారు. అప్పటి నుంచి విభిన్న రుచుల ఐస్క్రీమ్లతో వినియోగదారులను అలరిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ మామిడి శాండ్విచ్ టేస్ట్ అట్లాస్ గుర్తింపుతో మరింత ప్రజాదరణను పొందనున్నది. ఇక రెండో స్థానంలో పబ్బాస్, మంగళూరు గడ్బాద్ ఐస్క్రీమ్ ఉంది. ఇది సాంప్రదాయ ఐస్ క్రీం రుచులకు ప్రసిద్ధి చెందింది. దీనిలో జెల్లీలు, పండ్లు మిళితం చేసిన గడ్బాద్ ఐస్ క్రీమ్ ఇది. దీన్ని స్థానికులు, పర్యాటకులు అత్యంత ఇష్టంగా తింటారట. మూడవ స్థానంలో సహజసిద్ధమైన కొబ్బరితో చేసిన ఐస్ క్రీమ్. ఈ బ్రాండ్ 1984లో స్థాపించారు. ఇప్పటి దీని ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. ఇక నాల్గవ స్థానంలో అప్సరస్ జామ ఐస్ క్రీమ్ దక్కించుకుంది. ఇది కూడా ముంబైలో స్థాపించబడిన బ్రాండ్. టేస్టీ అట్లాస్ కూడా ఈ జామా ఐస్క్రీం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇది జామ ముక్కల తోపాటు మసాల దినుసులతో తయారు చేసిన వెరైటీ ఐస్క్రీమ్. చివరి స్థానంలో కార్నర్ హౌస్, బెంగళూరు డెత్ బై చాక్లెట్ అని పిలిచే సిగ్నేచర్ ఐస్ క్రీమ్ ఉంది. బాలీవుడ్ నటి దీపికా పదుకొణె అత్యంత ఇష్టంగా తినే ఐస్క్రీమ్ అట. ఇది పొరలు పొరలుగా ఉండి, పైన చెర్రీ కూడా ఉంటుందట. దీన్ని గుడ్డు సొన, చక్కెర కలయికతో తయారు చేస్తారు. అయితే ఆహారప్రియులు దీన్ని ఎక్కువగా చెస్ట్నట్ తేనెతో సేవిస్తారట. (చదవండి: విదేశీ వంటకాలకు కేరాఫ్గా భాగ్యనగరం..!) -
కుబేరుడి పెళ్లి సందడి షురూ : అంగరంగవైభవంగా మూడు రోజుల ముచ్చట
ప్రపంచ కుబేరుడు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) పెళ్లి సందడి మొదలైంది. 61 ఏళ్ల టెక్ బిలియనీర్, 55 ఏళ్ల ప్రేయసి లారెన్ సాంచెజ్తో వెడ్ లాక్ సంబరాలు అంగరంగ వైభవంగా ప్రాంభమైనాయి. గురువారం తమ మూడు రోజుల వివాహ వేడుకలు షురూ అయ్యాయి. ఈ వేడుకలకు కిమ్ చ ఖ్లో కర్దాషియాన్, ఓప్రా విన్ఫ్రే , ఓర్లాండో బ్లూమ్ వంటి టాప్ మోస్ట్ గెస్ట్లతో వేదిక కళకళలాడింది. This is Jeff Bezos’s $500 million yacht. Republicans are cutting Americans’ healthcare to give him a tax cut so he can buy a bigger yacht. pic.twitter.com/SxTRaIxqpn— Piyush Mittal 🇺🇸🇺🇦🇬🇪🇨🇦🟧🌊🌈 (@piyushmittal) June 26, 2025 బెజోస్, సాంచెజ్ 16వ శతాబ్దపు గ్రాండ్ కెనాల్ పై ఉన్న విలాసవంతమైన అమన్ హోటల్ లో బస చేయగా, ప్రపంచంలోని పురాతన చలనచిత్రోత్సవానికి నిలయంగా ప్రసిద్ధి చెందిన శుక్రవారం వెనిస్ సరస్సులోని ఒక ద్వీపంలో ప్రముఖ అతిథులు హాజరయ్యే విలాసవంతమైన మరియు ప్రైవేట్ వేడుకలో వెనిస్,బెజోస్, సాంచెజ్తో వివాహం చేసుకోనున్నారు.శాన్ గియోవన్నీ ఎవాంజెలిస్టా అనే చిన్న ద్వీపంలో ఉన్న విల్లా బాస్లిని తోటలలో గురువారం అతిథులు విందారగించారు. వివాహ వేడుక శనివారం తుది పార్టీతో ముగుస్తుంది.మరోవైపు ఇటాలియన్ మీడియా ప్రకారం, ద్వీపంలోని ఒక పెద్ద బహిరంగ యాంఫిథియేటర్ లో వివాహం జరుగుతుంది. వేడుక తర్వాత, ఈ జంటకు ప్రముఖ ఒపెరా గాయని ఆండ్రియా బోసెల్లి కుమారుడు మాటియో బోసెల్లి సెరినేడ్ చేస్తారని సమాచారం. ఈ వివాహ వేడుకల కోసం సాంచెజ్ 27 విభిన్న దుస్తులను సిద్ధం చేసినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. సగం మంది ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్లు వీటిని రూపొందించారట. అంతేకాదుతమ వేడుకల్లో భాగంగా, బెజోస్ ,సాంచెజ్ నగరానికి 3.5 మిలియన్లు డాలర్లు (దాదాపు 30కోట్లు) విరాళంగా ఇస్తున్నారని వెనెటో ప్రాంతీయ అధ్యక్షుడు లూకా జైయా తెలిపారు. నటాషా పూనవాలా, ఇవాంకా ట్రంప్ సందడి లవ్ బర్డ్స్ పెళ్లి సందడికోసం వెనిస్ చేరుకున్నామంటూ ఇవాంకా ట్రంప్ కొన్ని ఫోటోలను ఇన్స్టాలోపోస్ట్ చేసింది. భారతీయ దాతృత్వవేత్త , ఫ్యాషన్ ఐకాన్ నటాషా పూనవాలా ఈ వెడ్డింగ్ బాష్లో అద్భుతంగా కనిపించారు. ఆమె రూపానికి ఫ్యాన్స్మాత్రమే కాదు స్వయంగా వధువు సాంచెజ్ కూడాఫిదా అయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను నటాషా ఇన్స్టాలో పోస్ట్ చేసింది. విశిష్ట అతిథులుప్రపంచ వ్యాప్తంగా అనేకమంది సెలబ్రిటీలు, ప్రముఖ అతిథులతోపాటు, జోర్డాన్ క్వీన్ రానియా, NFL స్టార్ టామ్ బ్రాడీ, అమెరికన్ డిజైనర్ స్పెన్సర్ ఆంట్లే, గాయని అష, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ఉన్నారు. వీరిని చేరవేసేందుకు మెగా యాచ్లు ,వెనిస్లోని మార్కో పోలో విమానాశ్రయంలో కనీసం 95 ప్రైవేట్ విమానాలు ల్యాండింగ్ అనుమతిని అభ్యర్థించాయి.'నో స్పేస్ ఫర్ బెజోస్' ఆందోళనలుఅయితే, ఈ వేడుకపై పర్యావరణవేత్తలు స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'నో స్పేస్ ఫర్ బెజోస్' (బెజోస్కు చోటు లేదు) అనే నినాదాలతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని ప్రధాన కాలువలు, సెంట్రల్ వెనిస్లోని పలు పర్యాటక ప్రాంతాలను దిగ్బంధించాలని నిరసనకారులు పిలుపునిచ్చారు.కాగా గతంలో జర్నలిస్టు, యాంకర్గా పనిచేసిన లారెన్ శాంచెజ్ జెఫ్ బెజోస్లు 2018 నుంచి డేటింగ్లో ఉన్నారు. 2019లో భార్య మెకంజీ స్కాట్తో బెజోస్ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత గతేడాది లారెన్ శాంచెజ్తో బెజోస్ నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. -
ఎయిరిండియా విషాదం : రూ. 500కోట్లతో టాటా సన్స్ కీలక నిర్ణయం!
అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్ది నిమిషాలకే లండన్ కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూన్ 12న లండన్కు బయలుదేరిన విమానం (AI-171) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో కూలిపోయిన విషాద సంఘటన 270 మందికి పైగా ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాద బాధితుల కుటుంబీకుల కోసం టాటా సన్స్ కీలక నిర్ణయం తీసుకుంది.అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధితుల బంధువుల కోసం రూ. 500 కోట్ల ట్రస్ట్ ఏర్పాటు చేయాలని అటా సన్స్ యోచిస్తోందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. విమాన ప్రమాద బాధితుల బంధువులకు ఆర్థిక సహాయం అందించడానికి ఒక ట్రస్ట్ ఏర్పాటుకు టాటా సన్స్ బోర్డు అనుమతులు కోరుతోంది. ఈ ఘోరవిషాదం తర్వాత జరిగిన మొదటి బోర్డు సమావేశంలో టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ దీని గురించి చర్చించారు.ప్రమాదంలో ప్రభావితమైన వారి కుటుంబాల కోసం టాటా గ్రూప్ తీసుకున్న చర్యల గురించి డైరెక్టర్ల బోర్డుకు వివరిస్తూ, సహాయక చర్యలు త్వరగా అమలు అయ్యేలా చూసుకోవడానికి తాను ఎయిర్ ఇండియాతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తున్నానని చంద్రశేఖరన్ వివరించారు. అలాగే వీరి సహాయార్థం ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేయడానికి టాటా సన్స్ రూ. 500 కోట్ల అంచనా కేటాయింపుతో ఆమోదం కోరుతున్నట్లు ది ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ గతంలో రెండు ప్రత్యేక ట్రస్టులను ఏర్పాటు చేయాలని భావించింది. ఒకటి భారతీయ పౌరుల కుటుంబాలకు, మరొకటి విదేశీ పౌరులకు. ఈ మొత్తాన్ని 271 మంది బాధితుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులు, వైద్య సంరక్షణ అలాగే ప్రభావితమైన బీజే మెడికల్ కాలేజ్ , సివిల్ హాస్పిటల్ పునరుద్ధరణ కోసం ఉపయోగిస్తారు."టాటా గ్రూప్ చరిత్రలో చీకటి రోజులలో ఒకటి" గా పేర్కొన్న చంద్రశేఖరన్, కంపెనీ తన బాధ్యతల నుండి వెనక్కి తగ్గదని గాయపడిన వారి వైద్య ఖర్చులు, బీజే మెడికల్ హాస్టల్ నిర్మాణంలో సహాకారం తోపాటు సంబంధిత అన్ని చర్యలూ తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ఈప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ప్రయాణీకుడి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
రూ. 40 లకే భోజనం, ఎక్కడ? నమ్మలేకపోతున్న ఫ్యాన్స్
ప్రముఖ గాయకుడు అరిజిత్ సింగ్ కేవలం తన పాటల ద్వారా మాత్రమే కాదు, తన గొప్పమనసుతో అందరి మనసులను దోచుకున్నాడు. సెలబ్రిటీలు అనేక వ్యాపారాలకు, ఎండార్స్మెంట్లతో కోట్లకు పడగలెత్తుతున్న తరుణంలో తన రెస్టారెంట్ ద్వారా ప్రజలకు పోషకాహారం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కేవలం 40 రూపాయలకే కమ్మటి భోజనం అందిస్తున్నాడు. ఎక్కడ? ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? తెలుసుకుందామాపశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లోని తన స్వస్థలం జియాగంజ్లో హెషెల్ అనే రెస్టారెంట్ను ప్రారంభించాడు అరిజిత్ సింగ్. కుటుంబ వ్యాపారంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేశాడు. ఈ రెస్టారెంట్ చాలా తక్కువ ధరకు, కేవలం రూ. 40కి ఆరోగ్యకరమైన, నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నాడు. తద్వారా మధురమైన గానంతోపాటు సామాజిక సేవతో మరోసారి ఎందరో హృదయాలను గెలుచుకున్నాడు.మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం ఈ హోటల్ కొత్తదేమీ కాదు. కుటుంబ వ్యాపారంలో భాగంగా గాయకుడు అరిజిత్ సింగ్ తండ్రి గురుదయాళ్ సింగ్ చాలా కాలంగా నిర్వహిస్తున్నారు. అయితే సగటు మనిషికి, మరీ ముఖ్యంగా విద్యార్థులకు చాలా సరసమైన ధరలో, ఆరోగ్యకరమైన, రుచికరమైన భోజనాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు అరిజిత్. అంతేకాదు గౌరవప్రదంగా వడ్డించడ కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చేలా ఈ కొత్త ధరలను ప్రకటించినట్టు తెలుస్తోంది.మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం ఈ హోటల్ను గాయకుడు అరిజిత్ సింగ్ తండ్రి గురుదయాళ్ సింగ్ నిర్వహిస్తున్నారు.ఇది చాలా కాలంగా కొనసాగుతున్న కుటుంబ వ్యాపారంలో భాగం. అయితే సగటు మనిషికి, మరీ ముఖ్యంగా విద్యార్థులకు చాలా సరసమైన ధరలో, ఆరోగ్యకరమైన, రుచికరమైన భోజనాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు అరిజిత్. అంతేకాదు గౌరవప్రదంగా వడ్డించం కూడా అధిక ప్రాధాన్యత ఉంటుందట.భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే గాయకుడు అరిజిత్ సింగ్ ఒకడు. అతని కచేరీకోసం ప్రేక్షకులు డిమాండ్ బాగా ఉంటుంది. ఒక్కో షోకు దాదాపు 14 కోట్లు వసూలు చేస్తాడట. ముంబైలో రూ. 8 కోట్ల ఇల్లు, లగ్జరీ కార్లు అతని సొంతం. మొత్తంగా అరిజిత్ సింగ్ నెట్వర్త్ సుమారు 414 కోట్లు ఉంటుందని అంచనా.అయితే కోట్ల రూపాయలు ఆర్జించే గాయకుడు అరిజిత్ సింగ్ లాంటి వారికి ఛారిటబుల్ ఫుడ్ ఆర్గనైజేషన్ను నడపడం పెద్ద విషయం కానప్పటికీ, అభిమానులు ఇప్పటికీ ఈ వార్త నిజమేనా అని ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు ఈ పూర్తి భోజనం విద్యార్థులకు మాత్రమేనని అందరికీ కాదని పేర్కొంటున్నారు. 'ఫర్ ఎ చేంజ్' అనే సంస్థ మరో పోస్ట్లో, ఈ రెస్టారెంట్ సరసమైన ధరలకు ఆరోగ్యకరమైన భోజనాన్ని అందిస్తుందని తెలిపింది. ఈ రెస్టారెంట్ ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు పనిచేస్తుందని, విద్యార్థులకు డిస్కౌంట్లను కూడా అందిస్తుందని, ఇది అరిజిత్ సమాజ సేవపై ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొపడం గమనార్హం.భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే పాపులర్ గాయకుల్లో ఒకరు అరిజిత్ సింగ్. అతని కచేరీలకున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఒక్కో షోకు దాదాపు 14 కోట్లు వసూలు చేస్తాడట. ముంబైలో రూ. 8 కోట్ల ఇల్లు, లగ్జరీ కార్లు అతని సొంతం. మొత్తంగా అరిజిత్ సింగ్ నెట్వర్త్ సుమారు 414 కోట్లు ఉంటుందని అంచనా. -
విదేశీ వంటకాలకు కేరాఫ్గా భాగ్యనగరం..!
భాగ్యనగరం రుచికరమైన కాంటినెంటల్ వంటకాలకు నెలవన్న విషయం విదితమే. అయితే ప్రస్తుతం నగరంలో సియోల్, బ్యాంకాక్, టోక్యో వంటి ఆసియన్ దేశాలకు చెందిన వినూత్న రుచులకు కేంద్రంగా మారుతోంది. ఇందులో భాగంగా గన్రాక్తో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో తమాషా పేరుతో ఆసియన్ వెజ్ కెఫేలు నగరంలోని ఫుడ్ లవర్స్కు సరికొత్త రుచులను అందిస్తున్నాయి. ఆసియా వంటకాలకు కొత్త దిశ చూపేలా ప్రారంభమైన తమాషా 100 శాతం శాకాహారి వంటకాలతో, ఓల్డ్ స్కూల్ రెట్రో లుక్తో, లైవ్ మ్యూజిక్తో, ఓపెన్ ఎయిర్లో, యాంటీ ఫొటోలు తీసుకునే స్పాట్లతో ఆకర్షిస్తున్నాయి.నగరవాసులకు ప్రతిదీ వింతే.. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆహారం విషయంలో కొత్త వెరైటీలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. పైగా నగరంలోని ఆహార ప్రియులు కొందరు, ఆహ్లాదం కోసం కొందరు రెగ్యులర్గా రెస్టారెంట్లు, కెఫేలు, హోటళ్లను సందర్శిస్తుంటారు. వీరిలో కొందరు ఆకట్టుకునే వాతావరణం కోసం.. అద్భుతమైన యాంబియన్స్ కోసం వెతుకుతుంటారు. అలాంటి వారిని ఆకట్టుకునేందుకు నిర్వాహకులు కూడా కొత్త తరహా యాంబియన్స్ కోసం అన్వేషిస్తుంటారు. ఇందులో భాగంగానే నగరంలో తమాషా డిషెస్ పేరుతో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ సందర్శకులను, ఆహార ప్రియులను ఆకట్టుకుంటోంది. అంతేకాదు వివిధ దేశాలకు చెందిన వెరైటీ వంటకాలను కూడా అందుబాటులో ఉంచుతోంది.. ముఖ్యంగా శాకాహార వంటకాలకు ప్రాముఖ్యతను ఇస్తూ.. సియోల్, బ్యాంకాక్, టోక్యో దేశాల ఆహారాలను వండి వడ్డిస్తున్నారు. నోస్టాల్జిక్ అనుభూతి.. అయితే ఈ కెఫే విశిష్టత కేవలం ఆహారంలోనే కాదు –యాంబియన్స్లోనూ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. వింటేజ్ టీవీలు, బుక్షెల్ఫ్లు, గిటార్లు, బ్యాంబూ లైట్స్, ఆర్టిస్టిక్ కార్నర్లు.. ప్రతి మూల కూడా ఇన్స్టా మెంట్!, స్టేజిపై లైవ్ మ్యూజిక్ వింటూ, వెనక నోస్టాలజిక్ వీడియోలు చూసే అనుభవాన్ని విభిన్నమైన తరహాలో అందించేలా ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో ఈ మధ్య కాలంలో ఆదరణ పొందుతున్న పికిల్ బాల్ కోర్ట్ కూడా ఉండటం విశేషం! ఇదొక భావోద్వేగం.. ఇది కేవలం కెఫే కాదు– ఒక భావోద్వేగం. మేము మళ్లీ భౌతికంగా అనుసంధానం కావడానికి అనువైన వాతావరణాన్ని ఆహారంతో ముడిపెట్టే ప్రదేశాన్ని సృష్టించాలనుకున్నాం. – ఏకె.సోలంకీ, తమాషా కో–ఫౌండర్ గ్రీన్ థాయ్ మొదలు జైన్ వరకు.. కోరియన్ చిల్లీ టోఫూ నుంచి జపనీస్ కాటేజ్ చీజ్ కాట్సు వరకు, గ్రీన్ థాయ్ కర్రీ నుంచి కిమ్చీ పిజ్జా వరకు – ప్రతి ఐటమ్లోనూ కొత్తదనం, ఆరోగ్యం, ఆసియన్ స్పైసీ టచ్ ఉండేలా చూస్తున్నారు. వెజ్జీ థిన్ క్రస్ట్ పిజ్జా, రోస్ కూలర్, క్యూకంబర్ ఫిజ్ వంటి పానీయాలు, థాయ్ మాంగో స్టికీ రైస్ వంటి డెజర్ట్స్తో వావ్ అనిపిస్తున్నాయి. జైన్ భోజనాన్ని కోరేవారికీ ప్రత్యేక ఐటమ్స్ సిద్ధంగా ఉన్నాయి. -
‘మిసెస్ ఆసియా వరల్డ్–2025’ విజేత రేవతి
యుఎస్తో పాటు భారత్లో 16 ఏళ్లకు పైగా సామాజిక సేవ, మహిళా సాధికారత, ప్రపంచ మానవతా విలువల కోసం కృషి చేస్తున్నందుకు గానూ ‘మిసెస్ ఆసియా వరల్డ్ విన్నర్–2025’ కిరీటాన్ని నగరానికి చెందిన డాక్టర్ రేవతి దక్కించుకున్నారు. ఈ విషయాన్ని మనస్వ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలైన డాక్టర్ సూర్య రేవతి మెట్టుకూరు గురువారం తెలిపారు. జూన్ 22న దుబాయ్లో జరిగిన అంతర్జాతీయ కార్యక్రమంలో భారత మహిళగా ఈ అరుదైన గౌరవం దక్కిందని అన్నారు. ఐటీ, ఫైనాన్స్, మైనింగ్, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో సీఈఓగా పనిచేశాసిన, తెలంగాణ రాష్ట్రంలోని ఐదు గ్రామాలను దత్తత తీసుకుని విద్య, ఆరోగ్య సంరక్షణ, మహిళా సంక్షేమం, యువత ఉపాధిపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. 100 శాతం అక్షరాస్యత సాధించినందుకు రాష్ట్రపతి అవార్డు పొందినట్లు తెలిపారు. (చదవండి: నేషనల్ కాదు ఇంటర్నేషనల్..! లగ్జరీ బ్రాండ్లతో జత కట్టిన అందాల భామలు వీరే) -
'అమేయ డబ్లి' పాన్ ఇండియా టూర్.
ప్రముఖ పాన్ ఇండియా సింగర్ అమేయ డబ్లి తన స్వర మాధుర్యంతో నగరంలో సందడి చేయనున్నారు. గత 14 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా 4 వేలకు పైగా సంగీత కచేరీలు, ప్రదర్శనలు చేసిన అమేయ డబ్లి ఈ నెల 28న నగరంలోని శిల్పకళావేదికగా లైవ్ కాన్సర్ట్తో సంగీత ప్రియులను అలరించనున్నారు. ఏకమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘పాన్ ఇండియా కృష్ణా టూర్’లో భాగంగా హైదరాబాద్తో పాటు భారత్లోని 11 నగరాల్లో ఈ కాన్సర్ట్ నిర్వహించనున్నారు. ఈ మ్యూజికల్ టూర్ కృష్ణునిపై మాత్రమే సంగీత విభావరి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఇటీవల సన్నాహక కార్యక్రమానికి హాజరైన నేపథ్యంలో ‘సాక్షి’తో ముచ్చటించారు.. ఆ విశేషాలు.. టాలీవుడ్ స్టార్ రాణా దగ్గుబాటి, మిహీకా బజాజ్ పెళ్లి మొదలు కపూర్ ఖండన్, రాణీ ముఖర్జీ, ఆదిత్య చోప్రా, జిందాల్ కుటుంబం, ఇమామి గ్రూప్లోని అగర్వాల్ కుటుంబం, ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ వంటి లగ్జరీ వేడుకల్లో పాడిన డబ్లి మొదటి సారి నగరంలో సంగీత ప్రదర్శన చేపట్టడం విశేషం. ఏకమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. సంగీతం ఒక సాంత్వన, పాటలు ఒక సంతృప్తి..!! నా ప్రయాణంలో ప్రపంచవ్యాప్తంగా 4 వేలకు పైగా ప్రదర్శనలిచ్చాను. ఈ సారి వినూత్నంగా కృష్ణుని ఇతివృత్తంతో ఈ పాన్ ఇండియా టూర్ చేయడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా నా సామాజిక బాధ్యతగా నా సంపాదనలో 25 నుంచి 50 శాతం వరకూ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంటాను. ఇందులో భాగంగానే ఏకమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మ్యూజికల్ టూర్ను జైపూర్, జోద్పూర్, సూరత్, ముంబై, పుణె, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్కతా నగరాల్లో ప్రదర్శిస్తున్నాను. ప్రదర్శనలో 25 శాతం వారికే.. దేశం కోసం నిరంతరం పోరాడుతున్న ఆర్మీ కోసం ప్రత్యేకంగా సంగీత ప్రదర్శనలిచ్చాను. అంతేకాకుండా నా ప్రతి ప్రదర్శనలో 25 శాతం సీట్లు ఆర్మీ వారి కోసం ఉచితంగా కేటాయిస్తాను.. ఈ ఆనవాయితి నగరంలోని ప్రదర్శనలో కూడా కొనసాగుతోంది. ఈ ప్రదర్శన కోసం మొదటిసారి తెలుగు పాటను కూడా పాడబోతున్నా. అనాది నుంచి హైదరాబాద్కు సంగీతానికీ విడదీయరాని అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడి సంగీత ప్రియుల గురించి దేశవ్యాప్తంగా తెలుసు. 16 మంది ప్రముఖ సంగీత విద్వాంసులు, ఐదుగురు ప్రముఖ సింగర్లు.. మొత్తం నాతో పాటు 25 మంది భారీ బృందంతో ఈ ప్రతిష్టాత్మక కచేరీ హైదరాబాద్ నగరాన్ని సంగీత సాగరంలో ముంచెత్తనుంది. – సింగర్ అమేయ డబ్లి -
ట్యూషన్ ఎవరికి అవసరం? ట్యూషన్ టీచర్ ఎలా ఉండాలి?
మూడేళ్లు రావడంతోటే పిల్లల్ని స్కూల్లో వేయడం,ఉద్యోగాల నుంచి వచ్చే వరకూ ట్యూషన్లో ఉండేలా ప్లాన్ చేయడంమన దగ్గర సర్వసాధారణం.ఏ వయసు పిల్లలకైనా ఏ తరగతుల్లో అయినాట్యూషన్ చెప్పించడం ప్రిస్టేజ్ ఇష్యూగా మారింది.నిజంగా పిల్లలకు ట్యూషన్ అవసరమా? ఏ వయసులో అవసరం? దాని వల్ల జరిగే మంచి ఏమిటి, ప్రతికూలత ఏమిటి... తెలుసుకుందాం.మన దగ్గర ట్యూషన్ చెప్పించడం రెండు ఆలోచనల్లో భాగంగా ఉంటుంది. ఒకటి: పిల్లలు బాగా చదువుకోవాలి రెండు: టైమ్ వేస్ట్ జరగకుండా ట్యూషన్కు పంపడం మంచిది.ఈ రెండో విధానానికి తెలివైన పిల్లలు, తెలివితక్కువ పిల్లలు అనే తేడా లేదు. ట్యూషన్కు పంపడం వల్ల వారిని క్రమశిక్షణలో పెడుతున్నామనే సంతృప్తి తప్ప. దీనివల్ల తెలివైన పిల్లల వికాసానికి కొంతమేర నష్టం జరగొచ్చు. ఎందుకంటే ఈ పిల్లలు స్వయంగా చదువుకోగలరు. స్వయంగా చదువుకోవడం వల్ల వారికి ఇంకా తెలివితేటలు పెరుగుతాయి. ఇలాంటి పిల్లలను ట్యూషన్కు పంపితే భారం టీచరు మీద వేసి తమ తెలివికి విరామం ప్రకటించవచ్చు. అందువల్ల తల్లిదండ్రులు పిల్లలు సాయంత్రాలు ఇంట్లో ఉండకుండా ఏదో ఒక ట్యూషన్కు వెళ్లడం మంచిది అనే ఆలోచన చేస్తూ ఉంటే ఆ ఆలోచన మీ పిల్లలకు ఏ మేరకు వర్తిస్తుందో గమనించుకోవాలి.అసలు ట్యూషన్ చెప్పించడం ఎవరికి అవసరం?చాలా మంది తల్లిదండ్రులు తమ మూడేళ్ల చిన్నారులను కూడా ట్యూషన్లో చేర్పిస్తున్నారు. ఇది వారికి మేలు చేయక΄ోగా మొత్తం పెరుగుదల, ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా పిల్లలకు ఆరేళ్లు వచ్చాక ట్యూషన్ గురించి ఆలోచించవచ్చు. హైస్కూల్ స్థాయి వరకు వీరికి ట్యూషన్ అవసరం కావచ్చు. అయితే అందరికీ ఇది అక్కర్లేదు. మరి ఎవరికి కావాలి?చదువులో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు... మేథ్స్, సైన్స్ వంటి సబ్జెక్ట్లు స్కూల్లో చెప్పినవి మరింత అర్థం కావాలంటే ట్యూషన్ పెట్టాలి. కొందరు పిల్లలకు చదువు చాలా ఆసక్తిగా ఉంటుంది. వీరు స్కూల్లో చదివిందే కాక ఇంకా నేర్చుకోవాలనే ఉత్సాహంతో ఉంటారు. ట్యూషన్ పెడితే టీచర్ను సందేహాలు అడిగి ఆ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ కావాలనుకుంటే లేదా పరీక్షల్లో మార్కులు బాగా రావాలనుకుంటే అలాంటి పిల్లలకు ట్యూషన్ కావాలి. కొందరు పిల్లలకు స్వతహాగా తెలివితేటలు ఉన్నా టీచరు సహాయం ఉంటేనే ఆత్మవిశ్వాసంతో చదువుకుంటారు. లేదంటే ఒత్తిడి ఫీలవుతారు. ఇలాంటి వారికి ట్యూషన్ అవసరం.కొందరు పిల్లలు చదువుతున్న స్కూళ్లలో టీచర్లు సరిగా ఉండరు. లేదా ఫలానా సబ్జెక్ట్ను సరిగ్గా చెప్పరు. పిల్లలు ఇది గమనించి ఇంట్లో చెబుతారు. అప్పుడు ఆ సబ్జెక్టుల్లో తప్పనిసరిగా ట్యూషన్ పెట్టించాలి. కొందరు పిల్లలకు తల్లిదండ్రులే ట్యూషన్ చెప్పగలరు. కాని వారికి వివిధ కారణాల వల్ల వీలు ఉండదు. ట్యూషన్ పెట్టించి తాము పైనుండి అజమాయిషీ చేద్దామనుకుంటే అలాంటి సమయంలో ట్యూషన్ పెట్టించాలి. స్కూల్లో ఎన్ని పిరియడ్స్ ఉన్నాయి, వారానికి ఐదు రోజుల బడినా లేదా ఆరు రోజుల బడినా అనేదాన్ని బట్టి కూడా ట్యూషన్ అవసరమా కాదా అనేది నిర్ణయించాలి. స్కూల్లో పిరియడ్లు రోజుకు 8 ఉండి, వారానికి ఆరు రోజులు బడి నడుస్తుంటే అలాంటి పిల్లలకు రోజూ ట్యూషన్ చాలా భారమవుతుంది. వీరికి వారానికి ఒకరోజు ట్యూషన్ చాలు. అదే ఐదు రోజుల బడి ఉంటే వారానికి రెండు రోజులు ట్యూషన్ చాలు. అంతిమంగా పిల్లలు చదువుకోవాలి... బెంబేలు పడకూడదు.ఆన్లైన్ ట్యూషన్లు పెట్టించవచ్చని కొందరు తల్లిదండ్రులు భావిస్తారు. ఇవాళ ఆన్లైన్లో ఇబ్బడి ముబ్బడిగా ట్యూషన్లు ఉన్నాయి. కాని ముఖాముఖి ట్యూషన్లే ఎక్కువ ప్రభావవంతమైనవని అధ్యయనాలు చెబుతున్నాయి. కనుక ఆన్లైన్ ట్యూషన్లను వీలైనంతగా పరిహరించాలి. (Hyderabad: సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్కు నగరం చిరునామా)ట్యూషన్ టీచర్ ఎలా ఉండాలి?చాలా మధ్యతరగతి ఇళ్లలో ఇరుగు పొరుగున ఎవరైనా ట్యూషన్ చెబుతుంటే వారి దగ్గరకు ట్యూషన్కు పంపి చేతులు దులుపుకోవడం అలవాటు. కాని ట్యూషన్కు పంపాలంటే ఆ ట్యూషన్ చెప్పేవారి యోగ్యతలు కూడా కచ్చితంగా చూడాలి.వారి విద్యార్హత ఏమిటి? : తాను బోధించే సబ్జెక్టులో మంచి నైపుణ్యం కలిగి ఉందా? విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలుగుతోందా? క్లిష్టమైన భావనలను సులభంగా అర్థమయ్యేలా వివరించగలగాలి.బోధనా నైపుణ్యాలు : సహనం ఏ మేరకు ఉంది. చిరాకు పడుతున్నదా? విద్యార్థులు తప్పులు చేసినప్పుడు లేదా ప్రశ్నలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడినప్పుడు, ఓపికగా మరియు అర్థమయ్యేలా వారికి వివరించగలుగుతోందా?గుంపును కూచోబెట్టి ‘చదువుకోండ్రా’ అనే టీచర్లు కూడా ఉంటారు. ఈ గుంపులో రకరకాల తరగతుల విద్యార్థులు ఉంటారు. ఇలాంటి ట్యూషన్ వల్ల ఉపయోగం లేదు. మన పిల్లలనే కేంద్రంగా చేసుకుని ట్యూషన్ చెప్పే టీచర్ వద్దకే పంపాలి. -
ఈ అందాల భామలు నేషనల్ కాదు ఇంటర్నేషనల్..!
బాలీవుడ్ని సినిమాల గురించి మాత్రమే కాదు, నవతరం బ్యూటీలు చేస్తున్న బోల్డ్ ఫ్యాషన్ ప్రోగ్రెస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ యువ నటీమణులు తమ సినిమా పాత్రలతోనే కాదు ఫ్యాషన్లో ఇంటర్నేషల్ స్టైల్ను కూడా నిర్దేశిస్తున్నారు .ప్రపంచంలోని కొన్ని అగ్రశ్రేణి లగ్జరీ బ్రాండ్లతో జత కట్టి, ప్రపంచ ఫ్యాషన్ రంగంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటున్నారు. ఖుషీ కపూర్ఖుషీ కపూర్ బాలీవుడ్ ఫ్యాషన్లో మరో వర్ధమాన తార. ఆమె ఫ్యాషన్లో చేసే ప్రయోగాలు విరివిగా మనకు కనిపిస్తుంటాయి. ఆమె తాజా ఎంపిక డియోర్ బార్బీకోర్ పింక్ కలర్ స్కర్ట్ సూట్. డ్రెస్సింగ్ సాధారణంగా ఉన్నప్పటికీ ఆమె దానిని సిగ్నేచర్ డియోర్ వైట్ పెర్ల్ నెక్లెస్, బ్లాక్ పెండెంట్, మినీ హ్యాండ్బ్యాగ్తో హైలైట్ చేసింది.అనన్య పాండేమిడి స్టైలింగ్పై అనన్య పాండే ఆలోచన ప్రపంచ ఫ్యాషన్ సెన్సిబిలిటీలపై ఆమెకున్న పట్టును ప్రదర్శిస్తుంది. లగ్జరీ బ్రాండ్ చానెల్ మ్యూజ్ స్కర్ట్, జాకెట్ రెండూ ఆమెను హై–ఫ్యాషన్తో ఆకట్టుకునేలా మార్చాయి. మెరిసే, స్ట్రాపీ హీల్స్తో లుక్ను పూర్తి చేసింది. మానుషి చిల్లర్మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ సోషల్ మీడియాలో యంగ్ వరల్డ్కి ఫ్యాషన్ ఐకాన్గా చెప్పవచ్చు. ఆమె ఇంటర్నేషనల్ బ్యూటీ కాంటెస్ట్ అనుభవం తన డ్రెస్సింగ్ స్టైల్లోనూ ప్రతిబింబిస్తుంది. మిడి స్టైలింగ్తో అద్భుతమైన లుక్లో ఆకట్టుకుంటుంది. స్లీవ్లెస్ బ్లాక్ పెప్లం టాప్కి తెల్లటి మినీ స్కర్ట్తో జత చేసింది. ΄ాయింటెడ్ హీల్స్, స్టేట్మెంట్ బ్యాగ్తో లుక్ను పూర్తి చేస్తూ, లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్ను తల నుండి కాలి వరకు స్టైల్ చేసింది.జాన్వీ కపూర్జాన్వీ డ్రెస్సింగ్ స్టైల్ నిరంతరం చర్చనీయాంశంగా ఉంటోంది. ఆమె ఇటీవలి మియు మియు లుక్ చూస్తే మన స్కూల్ రోజులు గుర్తుకు వస్తాయి. జాన్వీ ఇటీవల కాన్స్లో పాల్గొనడానికి సోదరి రియా కపూర్ స్లీవ్లెస్ మ్యాచింగ్ వైట్ నిట్ టాప్తో జత చేసిన తెల్లని నిట్ మినీ స్కర్ట్తో స్టైలింగ్ చేసింది. బ్లూ కలర్ చెక్స్ షర్ట్తో లుక్ను లేయర్గా అలంకరించి, దానిపైన లాంగ్ స్లీవ్స్తో ఉన్న బ్రౌన్ కలర్ చెక్స్ జాకెట్తో మ్యాచ్ చేసింది. ఇది రిలాక్స్ వైబ్ను సృష్టిస్తుంది. తమ డ్రెస్సింగ్ స్టైల్తోనే కాన్ఫిడెన్స్ను చూపుతున్న ఈ తారలు నవతరానికి ఇంటర్నేషనల్ ఐకాన్స్గా మారుతున్నారు. -
ఏఐ మాయ: తల్లి ప్రేమ ఎప్పటికీ చిరస్మరణీయం..!
తనను తల్లి హగ్ చేసుకున్న చిన్నప్పటి ఫోటోను ఏఐ వీడియో క్లిప్గా మార్చి షేర్ చేశాడు సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ ‘రెడిట్’ కో–ఫౌండర్ ఎలెక్సిస్ ఒహానియన్. సోషల్ మీడియాలో ఈ ఎమోషనల్ పోస్ట్ వైరల్ కావడం మాట ఎలా ఉన్నా విమర్శలు కూడా వచ్చాయి. ‘ఫాల్స్ మెమోరీ’ అని కొద్దిమంది విమర్శించారు. దీనికి సంబంధించి ఒహానియన్ వివరణ ఇచ్చాడు. ‘ఇరవై సంవత్సరాల క్రితం అమ్మ నాకు దూరమైంది. నా దగ్గర అమ్మకు సంబంధించిన వీడియోలు లేవు. అందుకే ఈ ఏఐ వీడియో క్రియేట్ చేయాల్సి వచ్చింది. Damn, I wasn't ready for how this would feel. We didn't have a camcorder, so there's no video of me with my mom. I dropped one of my favorite photos of us in midjourney as 'starting frame for an AI video' and wow... This is how she hugged me. I've rewatched it 50 times. pic.twitter.com/n2jNwdCkxF— Alexis Ohanian 🗽 (@alexisohanian) June 22, 2025 (చదవండి: బిడ్డ కోసం తల్లడిల్లిన తల్లి..! సాక్షాత్తు ఆ దేవుడే..)ఈ వీడియో క్లిప్ను 50 సార్లు చూసి ఉంటాను’ అన్నాడు ఒహానియన్. ఈ వీడియో క్లిప్కు 27 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ‘ఫాల్స్ మెమోరీ’లాంటి విమర్శలను పక్కన పెడితే, ఒక ఫోటోగ్రాఫ్ను జీవం ఉట్టిపడే వీడియోగా మార్చిన సాంకేతిక నైపుణ్యానికి నెటిజనులు ‘భేష్’ అంటున్నారు. (చదవండి: మూత్రంతో మరీ ఇలానా..! వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్) -
మ్యారేజీ ఎంట్రీకి ఏజ్ ఏంటి?
పెళ్లికి అర్హతను నిర్ణయించేది అబ్బాయికైతే కొలువు .. అమ్మాయికైతే వయసు! ఉద్యోగం వస్తే అబ్బాయి స్థిరపడినట్టు.. ఇరవై ఏళ్లు నిండితే అమ్మాయి పెళ్లితో స్థిరపడాలన్నట్టు! ఇవి పెళ్లికి సంబంధించిన సామాజిక ప్రమాణాలు.. సాంస్కృతిక కట్టుబాట్లూనూ! పెళ్లి వ్యక్తిగత నిర్ణయం. మానసిక పరిణతి, సంసిద్ధత, ఆర్థిక స్వాతంత్య్రమే దానికి అర్హతలు ఎవరికైనా అంటున్నారు నేటి తరం వనితలు! ఆ చర్చే నేటి కథనం..అనూష (పేరు మార్చాం)కు 30 ఏళ్లు. ఇంజినీరింగ్లో మాస్టర్స్ చేసింది. మంచి కంపెనీలోనే ఉద్యోగం. నచ్చిన కారు కొనుక్కుంది. దేశ, విదేశాలు తిరుగుతూ ప్రపంచాన్ని ఎక్స్΄్లోర్ చేస్తోంది. త్వరలోనే ఫ్లాట్ కొనుక్కోవాలనే ప్లాన్లోనూ ఉంది. తోటివాళ్లంతా అబ్బాయిలు సహా.. ఆమెను ఓ అచీవర్గా చూస్తుంటారు.. ఇన్స్పైర్ అవుతుంటారు. కానీ అనూష తల్లిదండ్రులే దిగులుపడుతూ ఉంటారు. 30 ఏళ్లు వచ్చినా పెళ్లిపేరు ఎత్తట్లేదని, అసలు పెళ్లి ఊసు ప్రస్తావించినా మండిపడుతోందని. బంధువుల పెళ్లిళ్లకు వెళితే ఆ తల్లిదండ్రులను ప్రశ్నలతో ముంచేస్తున్నారు అమ్మాయికి ఇంకా పెళ్లి చేయరా? వయసు మీద పడుతుంటే అమ్మాయిలు లావైపోతారు, ముందుముందు సంతానం కష్టమవుతుంది, అసలు కలగకపోనూ వచ్చు– అంటూ లేని భయాలను సృష్టిస్తున్నారు. అదంతా అమ్మాయి మీద ఒత్తిడిగా మారుతోంది.. ‘నీ తోటి వాళ్లంతా పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అయిపోతున్నారు.. నువ్వేమో ఇల్లు కొనాలి, దేశాలు తిరగాలని ఊరేగుతున్నావ్’ అంటూ! ఇది నసలా అనిపించడంతో అనూష.. అమ్మానాన్నల దగ్గరకు రావడమే మానేసింది. ఇక్కడ అనూష ఒక ఉదాహరణ మాత్రమే! అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న అమ్మాయిలు ప్రతి ఇంట్లో ఉంటున్నారు. జీవితంలో సెటిల్ అవడం అంటే అబ్బాయిలకు ఎలాంటి నిర్వచనం ఉందో అమ్మాయిలకూ అలాంటి నిర్వచనమే ఉండాలని కోరుకుంటున్నారు. ఉద్యోగం వచ్చాక కూడా అబ్బాయిలు ఆర్థికంగా స్థిరపడటానికి టైమ్ ఎలా ఇస్తున్నారో అమ్మాయిలకూ ఆ సడలింపు కావాలని డిమాండ్ చేస్తున్నారు.నిజమే కదా.. చదువు విషయంలో అమ్మాయిలకు అవకాశాలిస్తూ.. బాగా చదివేలా ఇటు కుటుంబాలు, అటు ప్రభుత్వాలూ వాళ్లను ప్రోత్సహిస్తూ మంచి ప్రయత్నానికి నాంది పలికారు. ఇప్పుడా ప్రయత్నం ఫలితాలనిస్తోంది అన్ని రంగాల్లో ఆడవాళ్ల ఉనికి చూపుతూ! మొదలుపెట్టాక గమ్యం చేరాలి కదా! ఆ ప్రయాణంలోనే ఉన్నారు నేటి అమ్మాయిలు. వాళ్లనుకున్న గమ్యం లేదా అచీవ్మెంట్ను సాధించే వరకు వేచి చూడమంటున్నారు. ఆ టైమ్ ఇవ్వమంటున్నారు. పెళ్లిని తమ జీవితాలకు పరమావధిగా చూ పొద్దంటున్నారు.. దానికిమించిన ఆలోచనలు, కార్యాచరణతో ముందుకుసాగుతున్న వాళ్లను మూడుముళ్లతో ఆ పొద్దంటున్నారు. అలాగని వాళ్లు పెళ్లిని వ్యతిరేకించడం లేదు. పెళ్లికి వయసుతో ముడిపెట్టిన సాంస్కృతిక కట్టుబాటును సవాల్ చేస్తున్నారు. వాళ్లు పెళ్లికన్నా తమ ఉద్యోగోన్నతి, మానసిక, భావోద్వేగాల పరిణతి, ఆర్థిక స్వాతంత్య్రాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పెళ్లికి వయసు కన్నా మానసిక, ఆర్థిక సంసిద్ధతనే ప్రామాణికంగా చూస్తున్నారు.‘ఫలానా వయసు రాగానే పెళ్లి చేసేసుకోవాలనేది ఒక మిత్. దాన్నొక కల్చరల్ ఎక్స్పెక్టేషన్లాగే భావిస్తున్నాం మ్యారేజ్ అనేది పర్సనల్ చాయిస్. ఎప్పుడు చేసుకోవాలనేది వ్యక్తిగత నిర్ణయం. ఇంకా చె΄్పాలంటే పెళ్లి అనేది జీవితంలో ఒక భాగం కానీ అదే జీవితం కాదు. అరే.. జీవితంలో సాధించాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ప్రపంచం చూడండి ఎంత వేగంగా ముందుకు వెళ్తోందో.. దాంతో పోటీ పడాలి కదా!’ అంటోంది హైదరాబాద్కు చెందిన ఒక బిజినెస్ ఎనలిస్ట్.మరి బయోలాజికల్ క్లాక్ మాటేమిటి? ‘పిల్లలకేం అలాగే అంటారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని పెద్దలు ఊరికే అన్నారా? పెళ్లి సరైన వయసులో అయితేనే సంతానం కలుగుతుంది. లేకపోతే కనపడ్డ చెట్టు, పుట్టలకు మొక్కినా పిల్లలు పుట్టరు’ అంటున్నారు కొంతమంది తల్లిదండ్రులు. ‘అన్యాయం.. ఇలాంటి ఒత్తిళ్లతో అమ్మాయిలను అగౌరవ పరచకూడదు. అమ్మాయి విలువను పెంచేది ఆమె అమ్మ అవడం ఒక్కటే కాదుకదా!’ అని నొచ్చుకుంటున్నారు స్త్రీ వాదులు, సామాజిక విశ్లేషకులు. ‘బయోలాజికల్ క్లాక్ అనేది ఇదివరకటి మాట. ఇది కూడా ఒకరకమైన కల్చరల్ ఎక్స్పెక్టేషనే. సైన్స్ చాలా డెవలప్ అయింది. ఎగ్ ఫ్రీజింగ్ బ్యాంక్లు, ఆంబ్రియో ప్రిజర్వింగ్ సెంటర్సే దానికి ప్రత్యక్ష ఉదాహరణలు. అవీ వీలుకాకపోతే దత్తత చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇన్ని ప్రత్నామ్యాయాల మధ్య కూడా బయోలాజికల్ క్లాక్ గురించిన భయం, సుదీర్ఘ చర్చ అవసరమా?’ అంటున్నారు ఇంకొంతమంది అమ్మాయిలు. వీటన్నిటినీ అర్థం చేసుకోవాల్సింది కుటుంబాలే! అమ్మాయిలకూ చదువు, ఆర్థిక స్వేచ్ఛ ఉండాలని వాళ్ల ఆశలకు రెక్కలు తొడిగినప్పుడు ఎగిరే స్పేస్నూ ఇవ్వాలి. పెళ్లి విషయంలో వాళ్ల నిర్ణయాలను గౌరవించాలి. వాళ్ల ఆలోచనలను అంగీకరించి తదనుగుణంగా ఇంటి ‘లా’ను మార్చాలి అని చెబుతున్నారు సామాజిక విశ్లేషకులు. ఊహకందనంతగా సైన్స్ తద్వారా వైద్యరంగంలో మార్పులొస్తున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి ఎగ్ ఫ్రీజింగ్. అమ్మాయిలు పొటెన్షియల్ ఏజ్లో అండాలను ప్రిజర్వ్ చేసుకోవడమన్నమాట. ఇది.. జీవితంలో ఏదైనా సాధించాలనే తపన ఉన్న విమెన్కి వరం లాంటిది. ఒకరకంగా చె΄్పాలంటే రి్ర పొడక్టివ్ చాయిస్ని మహిళలు తమ నియంత్రణలో ఉంచుకోవడమన్నమాట. పెళ్లి, పిల్లలతో కెరీర్కి బ్రేక్ పడకుండా నేటి అమ్మాయిలకు యూజ్ఫుల్గా ఉంటోందీ ప్రక్రియ. దీనివల్ల వయసు అయిపోతోంది పెళ్లి చేసుకోవాలి, లేకపోతే పిల్లలు పుట్టకపోయే ప్రమాదం ఉండొచ్చు వంటి భయాలకు చోటు లేదు. అంటే బయోలాజికల్ క్లాక్ ప్రెజర్ లేకుండా జీవితంలో వాళ్లనుకున్న లక్ష్యాల మీద మనసు పెట్టే వీలును కల్పిస్తుందిది. అంతేకాదు కెరీర్లో, పర్సనల్ చాయిసెస్లో జెండర్ ఈక్వాలిటీనీ సపోర్ట్ చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రతికూల ప్రభావాలూ లేకపోలేదు. – డాక్టర్ ఆకుల దివ్య, ఎమ్డి, హైదరాబాద్ – సరస్వతి రమ -
సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్.. కొత్త పుంతలు
ఒకప్పటి ఉద్యానాల భాగ్యనగరం.. ఇప్పుడు ‘సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్’గా ప్రసిద్ధి చెందుతోంది. ఇంటిపంట కొత్త పుంతలు తొక్కుతోంది. నగరం కేంద్రంగా ఇంటి పంటల సంస్కృతి దేశ, విదేశాలకు విస్తరించింది. హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోనే సుమారు 70 వేల మందికి పైగా టెర్రస్ గార్డెనర్స్ భారీ ఎత్తున సాగు చేస్తున్నారు. డాబాలు, బాల్కనీలు తదితర ప్రాంతాల్లో సుమారు 15వేల చదరపు గజాలకు పైగా విస్తీర్ణంలో ఇంటి పంటలను పండిస్తున్నట్లు అంచనా. రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్లు ఇళ్లపై సాగు చేస్తున్నారు. నగర టెర్రస్లపై ఆరోగ్య సిరులు కురిపిస్తున్న ఇంటి పంటలు సామాజిక మాధ్యమ వేదికలుగా ప్రపంచమంతటా విస్తరిస్తున్నాయి.బ్రిటన్, అమెరికా, సింగపూర్, జర్మనీ, ఆ్రస్టేలియా తదితర దేశాల్లోని తెలుగువాళ్లు అన్ని రకాల కూరగాయలను తమ ఇళ్లపై పండించుకొని ఇంటిపంట రుచిని ఆస్వాదిస్తున్నారు. 2019లో కేవలం 30 మంది సభ్యులతో ఏర్పడిన ‘సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్’ సమూహం ఇప్పుడు 70,000 సంఖ్య దాటింది. వందల కొద్దీ వాట్సాప్ గ్రూపులు ఇంటిపంటల ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయి. కొత్త తరహా పంటలను పరిచయం చేస్తున్నాయి. ఇంటిపంట సంస్కృతి దైనందిన జీవితంలో ఒక భాగమైంది. స్వచ్ఛమైన ఆకుకూరలు, కూరగాయలతో ఆరోగ్యకర జీవితాన్ని కొనసాగిస్తున్నారు. స్ట్రాబెర్రీ గ్రూపుతో ఆరంభం.. ‘మనం ఏం తింటామో అది మనమే పండించుకుందాం’ అనే నినాదంతో 6 సంవత్సరాల క్రితం నగరంలో 30 మంది సభ్యులతో ‘స్ట్రాబెర్రీ’ గ్రూప్ ప్రారంభమైంది. అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న చోట మాత్రమే పండే స్ట్రాబెర్రీలను టెర్రస్లపై పెంచే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీనివాస్ హార్కర కన్వీకర్గా, ఈదల సరోజ కో– కన్వీనర్గా ఈ గ్రూపు సేవలు మొదలయ్యాయి. కేవలం 500 స్ట్రాబెర్రీ మొక్కలను తెప్పించి అందజేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. కానీ కొద్ది రోజుల్లోనే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి అనూహ్యంగా 5,600 మొక్కల కోసం ఆర్డర్లు వచ్చాయి. స్ట్రాబెర్రీ గ్రూపు వేగంగా విస్తరించింది. ఈ సమూహమే సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ (సీటీజీ)గా అవతరించింది.తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, అండమాన్ తదితర నగరాలతో పాటు విదేశాలకు విస్తరించింది. ఇంటి పంటలపై అనుభవాలను పంచుకొనేందుకు అవగాహనను పెంచుకొనేందుకు వేలాది మంది ఆసక్తి కనబర్చారు. సాధారణ కూరగాయలు, ఆకుకూరలతో పాటు కూరగాయల్లోనే ఎంతో విలువైన ఆగాకర, కాసర దుంపలు, పెన్సిల్ దొండ పాదులు వంటి వెరైటీ మొక్కలను సీటీజీ హైదరాబాద్ గార్డెనర్స్కు పరిచయం చేసింది. వంగ, మిర్చి, టమాటా, కాప్సికం, బీర, సొర, కాకరలలో అధిక దిగుబడినిచ్చే రకాలను నగరంలో అభివృద్ధి చేశారు.ఎన్నెన్నో వెరైటీలు.. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ (city of terrace gardens) ఈ రంగంలో కొత్త పుంతలు తొక్కింది. గ్రీన్ చామంతి, తెల్ల బంతి వంటి వెరైటీలు నగరంలో విరబూస్తున్నాయి. ఇక్కడి వాతావరణానికి అనుకూలమైన రెండు రకాల యాపిల్ మొక్కలను పెంచారు. మేఘాలయ ప్రభుత్వం ధ్రువీకరించిన లక్డంగ్ పసుపు హైదరాబాద్లో మిద్దెతోటలపై పండుతోంది. మొక్కలకు అవసరమైన జీవన ఎరువులు, ఘన, ద్రవ రూప ఎరువులు సిటీ ఆఫ్ గార్డెనర్స్ అందజేస్తోంది. నగర వాసులు తమ కూరగాయలు తామే పండించుకొని అందరూ కలిసి ఆరోగ్యాన్ని పంచుకొనేలా సీటీజీ అనేక కార్యక్రమాలను చేపట్టింది. మొక్కల పెంపకం పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు గార్డెన్ విజిట్స్, ఫార్మ్ విజిట్ ట్రిప్స్, ఫీల్డ్ ట్రిప్స్, సీడ్ బాల్స్ వంటి వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. పది పాదులు ఉంటే చాలు.. ‘కేవలం పది పాదులకు సరిపడా కుండీలను ఏర్పాటు చేసుకోగలిగితే ఏడాది పాటు ఇంటి అవసరాలకు కావాల్సినన్ని పండించుకోవచ్చు. ఆయా కాలాలకు అనుగుణమైన కూరగాయలను, ఆకుకూరలను 365 రోజులు పండించుకొనేలా ప్రత్యేమైన అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నాం’ అని చెప్పారు సీటీజీ కో– కన్వీర్ సరోజ. కొత్తగా ఇంటిపంట ప్రారంభించేవారికి శిక్షణనిస్తున్నారు. అవసరమైన కుండీలు, టబ్బులు, మొక్కలు, ఎరువుల వినియోగం, మొక్కలకు వచ్చే తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా ఈ శిక్షణ దోహదంచేస్తోందని ఆమె చెప్పారు. కేబీఆర్ పార్కు, పబ్లిక్ గార్డెన్స్, అగ్రి–హార్టీకల్చరల్ సొసైటీ, తెలంగాణ ఉద్యానశాఖ, జీహెచ్ఎంసీ తదితర సంస్థలు, ప్రభుత్వ విభాగాలు ఇంటి పంట ఉద్యమంలో భాగస్వాములుగా నిలిచాయి. సీటీజీ సమావేశాల్లో రిటర్న్ గిఫ్ట్ల రూపంలో వివిధ రకాల మొక్కలు, సేంద్రియ విత్తనాలను ఉచితంగా అందజేస్తున్నారు.చదవండి: తక్కువ పిండి పదార్థం, ఎక్కువ కొవ్వున్న గింజలుఇంటింటా ఓ మిద్దెతోట.. నగరంలో మిద్దెతోట (Midde Thota) చాలాకాలంగా విస్తరిస్తోంది. కేవలం కూరగాయలు, ఆకు కూరలు, పండ్ల మొక్కలే కాకుండా కొంతమంది ప్రత్యేక అభిరుచితో చిన్న చిన్న ట్యాంకులను ఏర్పాటు చేసి ఇంటిపై చేపల పెంపకాన్ని ఒక అభిరుచిగా కొనసాగిస్తున్నారు. ధాన్యం పండిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో ఇంటిపంటల పట్ల అభిరుచి ఉన్నవాళ్లందరిని ఒక గొడుగు కిందకు తెచ్చి ఇంటిపంట సంస్కృతికి సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ నూతన ఒరవడిని తెచ్చింది.చాలా వెరైటీలు పెంచుతున్నారు హైదరాబాద్లో అన్నా వెరైటీ, హెచ్ఆర్ఎం యాపిల్ మొక్కలు పెంచారు. స్ట్రాబెర్రీతో పాటు బ్లాక్ బెర్రీ, ఇంగువ, కర్పూరం, ఇలాచీ దాల్చిన చెక్క ఆల్ స్పైసెస్ ప్లాంట్ వంటివి మన టెర్రస్లపై గుబాళిస్తున్నాయి. 2021 వరకు కూడా 5000 మంది సభ్యులు ఉండేవారు. ఆ తర్వాత నాలుగేళ్లలోనే 70 వేల మందికి పైగా చేరారు. – ఈదల సరోజ, కో– కన్వీనర్, సీటీజీ -
Today tip : ఈజీగా బరువు తగ్గాలంటే ఇవిగో ఆసనాలు
యోగా మానసిక, శారీరక ఆరోగ్యానికి చాలా మంచిది. క్రమం తప్పకుండా యోగాను సాధన చేయడం వలన సుదీర్ఘ అనారోగ్యాలనుంచి బయటపడటం సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా ఆధునిక కాలంలో పెద్ద సమస్యగామారిన అధిక బరువును కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల ద్వారా సులువుగా తగ్గించుకోవచ్చు. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా వాటిలో కొన్నింటిని చూద్దాం. సూర్య నమస్కారాలు, విన్యాస యోగ, ఉత్కటాసన, ఉష్ట్రసన, సేతు బంధాసన, తడసన , నవాసన వంటివి బరువు తగ్గడానికి, కొన్ని యోగాసనాలు సహాయపడతాయి.సూర్య నమస్కారాలు: బరువు తగ్గడానికి హృదయ సంబంధ ఆరోగ్యానికి సహాయపడతాయి. విన్యాస యోగ: కేలరీలను బర్న్ చేయడానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది,. ఉత్కటాసన: ఈ ఆసనం కాళ్ళు , తుంటిని బలోపేతం చేస్తుంది, పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. ఉష్ట్రాసన: ఒంటె భంగిమ, ఇది బరువు తగ్గడానికి సహాయపడే ఒక సమగ్ర వ్యాయామం,. సేతు బంధాసన: ఈ ఆసనం బరువు నిర్వహణకు సహాయపడుతుంది. తడాసన: ఇది పర్వత భంగిమ అంటారు. బాలెన్స్ను, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నవాసన: ఇది పొత్తికడుపు బొడ్డు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ధనూరాసన: వెన్ను, ఛాతి, నడుము, చేతులు, పొత్తి కడుపు, కాళ్లకు మేలు జరుగుతుంది. ఫిట్నెస్ మెరుగవుతుంది. ధనస్సులా శరీరానికి వంచే ఫ్లెక్సిబులిటీ పెరిగి జీవక్రియ వేగవంతమై వెయిట్ లాస్కు ఈ యోగాసనం తోడ్పడుతుంది.వీటితో పాటు ఆహార నియమాలు, నడక లాంటి చిన్నపాటి వ్యాయామాలు చేస్తే మరింత త్వరగా ఫలితం లభిస్తుంది. యోగా ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అంతిమంగాఇవన్నీ బరువు తగ్గడానికి సహాయపడతాయి.యోగాసనాలు ఎలా వేయాలి అనేది యోగా నిపుణుల ద్వారాగానీ, నమ్మకమైన యాప్ ద్వారా గానీ నేర్చుకోవాలి. -
కొత్త శకానికి నాంది పలికిన ఇషా అంబానీ
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల కుమార్తె, వ్యాపారవేత్త ఇషా అంబానీ (Isha Ambani ) మరో ఘనతను సాధించారు సెర్పెంటైన్ సమ్మర్ పార్టీ 2025 ((Serpentine Summer Party 2025)కి తొలి భారతీయ చైర్పర్సన్గా ఎంపికై కళా ప్రపంచంలో కొత్త శకానికి నాంది పలికారు.సెర్పెంటైన్ సమ్మర్ పార్టీ 25వ వార్షికోత్సవం సందరబంగా తొలి బారతీయ చైర్గా ఇషా ఎంపికయ్యారు. కళలు, సంస్కృతి రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీడర్లు, ప్రభావవంతమైన వ్యక్తులనుచేర్చుకోవడంలో మరింత మార్పువచ్చిందని నిరూపించిం దని, ప్రపంచ దేశాలకు, భారత్కు మధ్య ఇషా సాంస్కృతిక వారధి అంటూ ప్రశంసిస్తున్నారు ఫ్యాషన్ నిపుణులు. సెర్పెంటైన్ సమ్మర్ పార్టీ 2025లో ఇషా అంబానీ లక్ మెరీనా టబస్సమ్ రూపొందించిన 2019 నాటి వాలెంటినో, షాంపైన్ కలర్ పూసల దుస్తులను ధరించింది. ఉంగరాల జుట్టు, సహజమైన మేకప్ వేసుకుని, హీల్స్తో ఇషా ప్రతి ఫ్రేమ్లో అందమమైన లుక్లో అలరించింది. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా అంబానీ కుటుంబ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఇషా తనదైన వ్యాపార నైపుణ్యాలతో వ్యాపారంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ డియోర్కు ప్రపంచ రాయబారి , సోనమ్ కపూర్, సమ్మర్ పార్టీలో సందడి చేసింది. డియోర్ ఫాల్ 2025 కలెక్షన్ నుండి కిమోనో జాకెట్ ధరించింది అందర్నీ ఆకట్టుకుంది. జూన్ 24, 2025న లండన్లోని సెర్పెంటైన్ పెవిలియన్లో జరిగిన ఈ పార్టీలో ఈజా గొంజాలెజ్, అలిసియా వికాండర్, రెబెల్ విల్సన్, జార్జియా మే జాగర్, లేడీ అమేలియా స్పెన్సర్, లేడీ ఎలిజా స్పెన్సర్, లిల్లీ అలెన్ తదితర సెలబ్రిటీలు పాల్గొన్నారు. -
62 కిలోలు తగ్గాడు : నీళ్లు, టీ, ఫన్నీ అండ్ హెవీ కార్డియో ఇవే సీక్రెట్స్
ఒకపుడు బాన పొట్టతో, భారీ బరువుతో ఉన్న యువకుడు పట్టుదలతో తన శరీర బరువును తగ్గించుకున్నాడు. కండలు తిరిగే శరీరంతో చూడముచ్చటగా తయారయ్యాడు. 140 కిలోల నుండి 78 కిలోల బరువుకు చేరాడు. అయితే ఇది అంత ఈజీగా ఏమీ సాగలేదు. ఠినమైన ఆహారం , క్రమం తప్పని వ్యాయామంతో ఫిట్తా మారానంటూ ఇన్స్టా పోస్ట్లో వెల్లడించాడు.ఇన్స్టాగ్రామ్ యూజర్ పువి 2023 నవంబరులో తన వెయిట్లాస్ జర్నీని షేర్ చేశాడు. ప్రధానంగా 'హై-కార్బ్ డైట్' పూర్తిగా పక్కన బెట్టి, ప్రొటీన్డ్ ఆహారం, ధారాళంగా నీరు తాగడం ద్వారా 62 కిలోలు తగ్గిన తరువాత, తన దేహం కండలతో కనిపించిందని చెప్పాడు. 'కార్బోనేటేడ్ డ్రింక్స్ చెత్త'ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు ,చక్కెరలను పూర్తిగా తగ్గించేశాడు. కూల్ డ్రింక్లు, చక్కెర కార్బోనేటేడ్ డ్రింక్లకు బై బై చెప్పేశాడు. అవి చెత్త తప్ప వాటిల్లో ఏమీలేదంటాడు పువి. పుష్కలంగా నీళ్లు, అప్పుడప్పుడు టీకి మాత్రమే పరిమితమయ్యాడు. చాలా రోజులు కూరగాయలు, చాలా సింపుల్గా మసాలా దినుసులతో ఉడికించిన చికెన్ తినేవాడు. View this post on Instagram A post shared by 🅿️uvi (npuvi96) (@transformwithpuvi) 'ట్రెడ్మిల్ కాదు కానీ ఫన్ కార్డియో'బరువును తగ్గించుకోవాలనే లక్ష్యంతో ప్రొటీన్ ఫుడ్పై దృష్టిపెట్టాడు. వారానికి 4 సార్లు రెసిస్టెన్స్ ట్రైనింగ్తోపాటు, చేయ గలిగినంత కార్డియో(ట్రెడ్మిల్ కాదు) ఫన్ కార్డియో చేసేవాడు. హెవీ బ్యాగ్ కొట్టడం, స్కిప్పింగ్, HIIT (హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్) ఇలా ప్రతీదీ ఆస్వాదిస్తూ వెయిట్లాస్ జర్నీని కొనసాగించాడు. లావుగా ఉన్నానని నా బాడీని, జీవితాన్ని ద్వేషించ లేదు, కానీ ఫిట్గా మారాలని ప్లాన్ చేసుకున్నారు. ఏమి తిన్నా, ఎంజాయ్ చేస్తూ, ఉపయోగపడేలా తినాలి అంతే అంటాడు పువి. నోట్: బరువు తగ్గాలనే కోరికతో పాటు,దానికి తగిన ప్లాన్, ఆహార అలవాట్లు ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తీవ్రంగా జిమ్ చేయాలంటే నిపుణుడైన శిక్షకుడి ఆధ్వర్యంలోనే చేయాలి. దీనికంటే ముందు అసలు బరువు ఎందుకు పెరుగుతున్నామో విశ్లేషించుకోవాలి. అవసరమైతే వైద్య సలహా తీసుకోవాలి. -
అమ్మా,నాన్నా ప్రేమ కావాలి లేదంటే మానసిక ఒత్తిడితో అనర్థాలు
జిల్లాలో జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభమయ్యాయి. చాలా మంది తమ పిల్లలను విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప వంటి నగరాల్లోని కార్పొరేట్, రెసిడెన్షియల్ కాలేజీల్లో చేర్పిస్తున్నారు. అక్కడ హాస్టళ్లలో ఉండలేక చాలా మంది ఇంటి బాటపడుతున్నారు. మరి కొందరు తల్లిదండ్రులు బలవంతంగా అక్కడే ఉండమని నచ్చచెబుతున్నారు. దీంతో విద్యార్థులు ఒంటరితనంతో నిత్యం మానసిక సంఘర్షణ పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులకు ఎదురవుతున్నాయి. ‘అమ్మా, నాన్న నేను ఇంటిలో ఉండి చదువుకుంటాను. ఇంట్లో వాళ్లను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను. చదువు పేరుతో నన్ను ఇంటి నుంచి దూరం చేయాలని చూడవద్దు. నాకు మీ ప్రేమానురాగాలు కావాలి. బాగా చదువుకుని టీచరై పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పుతాను’ ఓ కుమార్తె అభ్యర్థన. నువ్వు హాస్టల్లో ఉండి చదవాల్సిందే. మంచి మార్కులు, ర్యాంకులు సాధించి డాక్టర్ కావాలి. తల్లిదండ్రుల సమాధానం. ఇదీ నేడు కొందరు తల్లిదండ్రులు పిల్లల పట్ల వ్యవహరిస్తున్న తీరు. పిల్లల ఆలోచన, వారి అభిరుచులకు భిన్నంగా స్పందిస్తున్న విధానం. దీంతో పిల్లలు ఒంటరిగా హాస్టళ్లలో ఉండలేకపోతున్నారు. కొందరు ఆత్మన్యూనతా భావంతో పెరిగి పెద్దవారై ఒంటరితనానికి అలవాటు పడుతున్నారు.మదనపల్లె సిటీ: బాల్యం పిల్లలకు దేవుడిచ్చిన వరం. తల్లిదండ్రుల ప్రేమానురాగాల మధ్య ఆడుతూ పాడుతూ, చిరునవ్వులు చిందిస్తూ బాల్యాన్ని ఆస్వాదించాలి. అప్పుడే బాల్యానికి సాకారం. ప్రపంచాన్ని అర్థం చేసుకునే విధానం కుటుంబం నుంచి రావాలి. నేటి పోటీ ప్రపంచం, ప్రపంచీకరణ నేపథ్యంలో కొందరు తల్లిదండ్రులు పిల్లల బాల్యాన్ని హరిస్తూ యాంత్రిక జీవనానికి అలవాటు చేస్తున్నారు. బాల్యంలోని మధురానుభూతులకు దూరం చేస్తున్నారు. పిల్లలను మార్కులు, ర్యాంకులను తయారు చేసే యంత్రాలుగా చేస్తున్నారు. దీని కోసం వారి ఇంటి నుంచి దూరంగా కార్పొరేట్ పాఠశాలల్లో బలవంతంగా చేర్పిస్తున్నారు. పాఠశాల స్నేహితుల సాన్నిహిత్యం ఉన్నా అమ్మ పంచే ప్రేమకు ఏదీ సాటిరాదు. నాన్న చూపే ఆదరణ ఏవీ సరితూగవు. దీంతో పిల్లలు తమలో తాము సంఘర్షణ పడుతూ జీవితాన్ని గడపాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎప్పుడూ మార్కులు, ర్యాంకులే కాకుండా వారి కోసం కాస్త సమయాన్ని కూడా కేటాయించి ప్రేమను పంచాలని పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఆశిస్తున్నారు. ఇదే విషయాన్ని మనోవ్యక్తిత్వ వికాస నిపుణులు కూడా అంటున్నారు. లేనిపక్షంలో పిల్లల్లో భావవ్యక్తీకరణ నైపుణ్యం తగ్గడంతో పాటు అభద్రతా భావం పెరుగుతుందని చెబుతున్నారు. కౌమార దశలోని పిల్లలకు తల్లిదండ్రుల నుంచి సరైన ప్రేమానురాగాలు లభించకపోతే వారిలో మానసిక రుగ్మతలు చోటు చేసుకుంటాయని వెల్లడిస్తున్నారు. ఆయా వయస్సులో వచ్చే శారీరక, మానసిక మార్పులను సరిచేయక, సరైన మార్గదర్శనం చేయకపోతే పిల్లల భవిష్యత్తు అంధకారమవుతుందని సూచిస్తున్నారు. కొందరు పిల్లలు తప్పటడుగులు వేసే ప్రమాదం కూడా లేకపోలేనది హెచ్చరిస్తున్నారు. మరికొందరైతే ఏ చిన్న సమస్య ఎదురైనా అఘాయిత్యాలకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.కనుమరుగవుతున్నఉమ్మడి కుటుంబ వ్యవస్థగతంలో అవ్వా,తాతలు, అమ్మానాన్నలు, చిన్నాన్న, పెద్దనాన్న, వారి పిల్లలతో కూడిన ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కాలానుగుణంగా చోటు చేసుకుంటున్న మార్పులతో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగైంది. నేటి కొందరు తల్లిదండ్రుల ఆలోచనా విధానంతో కనీసం కన్న బిడ్డలతో కూడిన సమిష్టి కుటుంబ వ్యవస్థ కూడా మాయమైపోతోంది. పిల్లలను వసతిగృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పించి ఒంటరి జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటున్నారు. సమాజంలో అనుబంధం, ప్రేమ, వాత్సల్యం అనే పదాలకు అర్థాలు కూడా మరచిపోతున్నారు.ఇదీ చదవండి: డిజిటల్ యాప్స్ బంద్, జీపే కూడా తీసేసా: సానియా మీర్జా సోదరి సంచలన పోస్ట్తల్లిదండ్రుల ధోరణి మారాలిఆధునిక జీవన విధానంలో అమ్మానాన్నల ఆలోచనా ధోరణి మారాలి. శారీరక, మానసిక పెరుగుదల వేగంగా జరిగే కౌ మార దశలో పిల్లలకు కుటుంబంలోని ప్రత్యక్షానుభవాలు ఎంతో అవసరం. ఈ దశలో పిల్లలు ఎదుర్కొనే సంఘర్షణలను అమ్మానాన్నలు మాత్రమే అర్థం చేసుకోగలరు. పిల్లల కోసం సమయాన్ని కేటాయించి.. ప్రేమానురాగాలు పంచాలి. –ఎస్.రెడ్డప్పరెడ్డి, అధ్యాపకులు, బాలికల జూనియర్ కాలేజీ, మదనపల్లెచదవండి: మూడు నెలల ముందే పదేళ్ల జీవితానికి ప్లాన్ : కానీ అంతలోనే! తల్లిదండ్రుల అనురాగం అవసరంబాల్యంలో చిన్నపిల్లలకు తల్లిదండ్రుల ప్రేమానురాగాలు చాలా అవసరం. తల్లిదండ్రు లు ఎంత ఉద్యోగులైనా పిల్లల కోసం రోజూ కొంత సమయాన్ని కేటాయించాలి. ఒక వయస్సు వచ్చే వరకు పిల్లలు తల్లిదండ్రులతో కలిసి ఉండేలా చూడాలి. చదువంటే మార్కులు, ర్యాంకులు మాత్రమే కాదనే విషయాన్ని గ్రహించాలి. పిల్లల అభిరుచి మేరకు వారిని ఎదగనివ్వాలి. వారికి ఇష్టమైన రంగాల్లో ప్రోత్సహించాలి. - టీఎఎస్ఏ క్రిష్ణమూర్తి, ప్రముఖ నవలా రచయిత, మదనపల్లెమానసిక ఒత్తిడితో అనర్థాలు..చిన్నప్పటి నుంచే పిల్లలు తల్లిదండ్రుల ప్రేమకు దూరమైతే మానసిక ఒత్తిడి పెరిగి అనేక అనర్థాలకు దారి తీస్తాయి. ఆస్పత్రులకు వైద్య పరీక్షల కోసం వచ్చే విద్యార్థుల్లో అనేక మంది మానసిక ఒత్తిడితో పాటు మనోవేదనకు గురైన వారే ఉంటున్నారు. ఇంటికి, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నందున ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, పోషక విలువలు కలిగిన ఆహారం అందకపోవడంతో వ్యాధులకు గురవుతున్నారు.– చాముండేశ్వరి, సైకాలజిస్టు, మదనపల్లె -
Shubhanshu Shukla ‘నిన్నటినుంచి తెగ నిద్రపోతున్నానట’
భారత వ్యోమగామి 39 ఏళ్ల భారత వైమానిక దళ పైలట్, గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా, ఆక్సియం-4 మిషన్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోకి ఎగిసిన కొన్ని గంటల తర్వాత , కక్ష్య నుండి తన తొలి వ్యక్తిగత సందేశాన్ని పంపించారు. గాల్లోకి పంపినప్పుడు గొప్పగా అనిపించలేదు అంటూనే అంతరిక్షంలో తన ఫీలింగ్ను పంచుకున్నారు. "అంతరిక్షం నుంచి అందరికీ నమస్కారం. తోటి వ్యోమగాములతో ఇక్కడ ఉండటం చాలా ఆనందంగా ఉంది. వావ్, ఎంత ఆనందం.. అద్భుతమైన ప్రయాణం. లాంచ్ప్యాడ్లోని క్యాప్సూల్లో ఇప్పుడిప్పుడే నడక నేర్చిన చిన్నారిలా ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నా..ఎలా కదలాలో, ఎలా తినాలో.. ఎలా నియంత్రించుకోవాలో తెలుసుకుంటున్నా’ అంటూ శుభాన్షు తన అనుభవాలను సందేశంలో పంచుకున్నారు. అలాగే స్పేస్క్రాఫ్ట్లో తన మొదటి గంటల్లో, జీరో గ్రావిటీకి అలవాటు పడుతూ, తన అనుభవం గురించి మాట్లాడారు. నిన్నటి నుండి చాలా నిద్రపోతూనే ఉన్నానట అంటూ చెప్పుకొచ్చారు.చదవండి: డిజిటల్ యాప్స్ బంద్, జీపే కూడా తీసేసా: సానియా మీర్జా సోదరి సంచలన పోస్ట్కాగా భారత వ్యోమగామి రాకేశ్శర్మ తరువాత తాజా ప్రయోగంతో 41 ఏండ్ల తర్వాత రోదసిలోకి వెళ్తున్న రెండో భారతీయుడిగా శుభాన్షు రికార్డు సృష్టిస్తున్నారు. ఐఎస్ఎస్లోకి వెళ్తున్న తొలి భారతీయుడు కూడా శుభాన్షు కావడం విశేషం.మాజీ నాసా వ్యోమగామి , గత మూడు మిషన్లలో అనుభవజ్ఞుడైన కమాండర్ పెగ్గీ విట్సన్ , మిషన్ నిపుణులు హంగేరీకి చెందిన టిబోర్ కాపు, పోలాండ్కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నివ్స్కీలతో పాటు యాక్స్-4 మిషన్లో ఉన్న నలుగురు వ్యోమగాములలో శుక్లా ఒకరు.చదవండి: మూడు నెలల ముందే పదేళ్ల జీవితానికి ప్లాన్ : కానీ అంతలోనే! -
Urine Eye Wash: ప్లీజ్ అలా చెయ్యొద్దు..! వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్
ఇటీవల ఇన్స్టా రీల్స్ పిచ్చి మాములుగా లేదు కొందరికి. అందుకోసం వాళ్లు చేసే పిచ్చి చేష్టలకు అంతుపొంతు లేకుండాపోతోంది. అది సరైనదా? కాదా..? అన్నది అనవసరం. సోషల్ మీడియా క్రేజ్, ఆ కంటెంట్కి ఎన్ని వ్యూస్ వచ్చాయ్ అన్నదే ధ్యేయం. కానీ వీటిని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి ఇబ్బందులు పడుతున్న అభాగ్యులెందరో ఉన్నారు. ప్రస్తుతం తాజాగా అలాంటి వీడియో సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఆ వీడియోని చూసి వైద్యులే కంగుతిన్నారు. ప్లీజ్ అలా చెయ్యకండి అని హెచ్చరిస్తునన్నారు. అసలేం జరిగిందంటే.. పూణెకు చెందిన నుపుర్ పిట్టీ అనే మహిళ వైరల్ వీడియోలో తనను "మెడిసిన్-ఫ్రీ లైఫ్ కోచ్"గా పరిచయం చేసుకుంటూ "యూరిన్ ఐ వాష్ " గురించి వివరించింది. ఇది మనకు ప్రకృతి ప్రసాదించిన ఔషధం అంటూ..మూత్రం కళ్లను శుభ్రం చేసుకుంటూ కనిపించింది వీడియోలో. మన మూత్రంతో ఇలా కళ్లను వాష్ చేసుకుంటే..డ్రైగా మారడం, ఎరుపెక్కడం వంటి కంటి సమస్యలు రావని ఆరోగ్య సలహాలు కూడా ఇచ్చేసింది. అయితే ఈ వీడియోపై వైద్య నిపుణులు తీవ్రంగా స్పందించడమే గాక మండిపట్టారు. ప్రజల ఆరోగ్యంతో ఇలా చెలగాటం ఆడటం మంచిద కాదని ఫైర్ అయ్యారు. ఇలాంటి ప్రక్రియలు ప్రమాదకరమైనవని, దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. మూత్రంతో ఇలా అస్సలు చేయొద్దని గట్టిగా హెచ్చరించారు కూడా.ఎందుకు మంచిది కాదంటే..నిపుణులు అభిప్రాయం ప్రకారం మూత్రాన్ని తాగడం లేదా ఉపయోగించటం అనేది ఆరోగ్యానికి మంచిదని శాస్త్రీయంగా ఎక్కడ నిరూపితం కాలేదు. “యూరిన్ థెరపీ“కి సంబంధించి వైద్యపరమైన ఆధారాలు కూడా లేవు. మూత్రంలో చాలా తక్కువ మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు ఉన్నప్పటికీ ఏవిధమైన ఆరోగ్య ప్రయోజనాలను అందివ్వదు. అందులో శరీరానికి అవసరం లేని ద్రవం, శరీరంలోని వ్యర్థాలనను తొలగించిన ద్రవమే మూత్రం. మూత్రపిండాలు రక్తప్రవాహం నుంచి అదనపు నీటిని సెల్యులార్ వ్యర్థాలను బయటకు పంపించే ఉత్పత్తి ఇది. దీనిలో 90 శాతం నీరు ఉండగా, మిగిలిన భాగం అమ్మోనియా వంటి ఇతర లవణాలు ఉంటాయి. అంతేగాదు మూత్రపిండాల అనే రెండు కండరాల గొట్టలు ద్వారా మూత్రాశయానికి మూత్రాన్ని పంపుతాయి. మూత్రాశయం నిండినప్పుడు, నరాల చివరలు మెదడుకు బాత్రూమ్కి వెళ్లమని సంకేతమిస్తాయి. దాంతో మూత్రనాళం అనే చిన్నగొట్టం సాయంతో విసర్జిస్తాం. అదీగాక ఈ మూత్రనాళం కొన్ని రకాల బ్యాక్టీరియాలకు నిలయం.అందువల్ల మూత్రం శుభ్రమైనద కాదు. శరీరం వదిలించుకున్న ఈ వ్యర్థ ద్రవం తిరిగి శరీరంలోకి పంపిస్తే..హనికరమైన బ్యాక్టీరియాకు గురై లేనిపోని వ్యాధులు బారినపడే ప్రమాదం తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. Please don't put your urine inside your eyes. Urine is not sterile. Boomer aunties trying to be cool on Instagram is depressing...and terrifying.Source: https://t.co/SQ5cmpSOfY pic.twitter.com/qgryL9YHfI— TheLiverDoc (@theliverdr) June 25, 2025 (చదవండి: ఆ తప్పిదాలతో 116 కిలోల బరువు..కానీ 13 నెలల్లో ఏకంగా..) -
ధర్మ సందేహాలు: అయిదో తనమంటే..?
కొన్ని ఆచార వ్యవహారాలు నేటి యువతకు పెద్దగా తెలియదనే చెప్పాలి. ఒకవేళ ఇలా చేయకూడదని హిత భోద చేసినా..ఏంటిది అని చాదస్తం అన్నట్లుగా విసుక్కుంటారు. అయితే వాళ్లు చెప్పే వాటికి నిగూఢ అర్థాలతోపాటు సమాజ హితం కూడా ఉంది. మరి ఆ విశేషాలేంటో చూద్దామా..!. అయిదో తనమంటే ?ముత్తయిదువ అని అర్థం. పసుపు, కుంకుమ, గాజులు, మెట్టెలు, మాంగల్యం. స్త్రీ ఈ అయిదు అలంకరణలతో కల కల లాడుతుండాలి. స్త్రీకి వివాహం అయిన తర్వాతే మెట్టెలు, మాంగల్యం వస్తాయి.స్త్రీలు జుట్టు విరబోసుకొని ఎందుకుండరాదు?ఈ చర్య పిశాచాలకు ఆహ్వానం వంటిది. అనేక దుష్ట గ్రహాలూ ఆ సమయంలో ఆవహించి కల్లోలపరిచే శక్తి జుట్టు విరబోసుకున్నప్పుడే వాటికి వస్తుంది. దానికి తోడు విరబోసుకున్న స్త్రీని చూసిన పురుశిడికి ఆ స్త్రీమీద కామం కలుగుతుంది. తద్వారా కుటుంబ సమస్యలు వస్తాయి. అలాగే జుట్టు విరబోసుకు తిరుగుతుంటే లక్ష్మిదేవి అక్కకు కూడా ఆహ్వానమే. (చదవండి: సంబురాలు మొదలాయె..! తొలి బోనం ఎప్పుడంటే..) -
డిజిటల్ యాప్స్ బంద్, జీపే కూడా తీసేసా: సానియా మీర్జా సోదరి సంచలన పోస్ట్
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి అనమ్ మీర్జా (Anam Mirza) ఇక ఇంట్రస్టింగ్ పోస్ట్ చేసింది. అందరూ డిజిటల్ చెల్లింపుల సౌలభ్యంపై తెగ మురిసిపోతోంటే...అదిమానేసి డబ్బు ఎలా ఆదా చేశానో తెలుపుతూ ఇన్స్టాలో ఒకపోస్ట్ పెట్టింది. అదెలాగో తెలిస్తే మీరు కూడా ఔరా అంటారు. పదండి మరి అదేంటో చూద్దాం.అనమ్ మీర్జా సోషల్ మీడియాలో ఇపుడు ట్రెండింగ్లో ఉంది. ఎందుకంటే డబ్బులు ఏలా ఆదా చేయాలో యూత్కి ఒక సీక్రెట్ మంత్రాను షేర్ చేసింది. యూపీఐ (UPI) యాప్స్ వాడటం పూర్తిగా ఆపివేసానని, రోజువారీ ఖర్చులను తగ్గించుకోవడానికి తన ఫోన్ నుండి Google Payని కూడా డిలీట్ చేశానని వీడియోలో వివరించింది. QR కోడ్లను స్కాన్ చేయకుండా లేదా తక్షణ చెల్లింపులు చేయకుండా తనను తాను కట్టడి చేసుకున్నానని, తద్వారా బోలోడంత ఆదా చేశానని చెప్పుకొచ్చింది. ఫలితంగా తన డబ్బు ఎక్కడికి వెళుతుందో తనకు బాగా తెలిసిందని అనమ్ చెప్పింది. తన సిరీస్ లిటిల్ చేంజెస్, బిగ్ ఇంపాక్ట్ ఎపిసోడ్ 4లో ఈ వీడియోను షేర్ చేసింది. View this post on Instagram A post shared by Anam Mirza (@anammirzaaa) మొదట్లో ఈ నిర్ణయానికి సర్దుబాటు చేసుకోవడం కష్టమనిపించింది. స్నేహితులను కాఫీ కొనమని కూడా అడగాల్సి వచ్చింది కానీ కాలక్రమేణా, ఆ మార్పుకు అలవాటు పడ్డానని, ఇప్పుడు చాలా ఉపయోగకరంగా ఉందని వెల్లడించింది. ఇదీ చదవండి: నాడు పేదరికంతో గాజులమ్మాడు, వైకల్యం వెక్కిరించినా.. నేడు ఐఏఎస్గాఇది చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. అనమ్పై ప్రశంసలు కురిపించారు. "ఇది ఖచ్చితంగా చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది" అని ఒకరు, "ఈ కాలంలో నిజంగా గొప్ప మార్పు" అని మరొకరు, తాము కూడా ప్రయత్నించి, డబ్బు పొదుపు చేస్తామని వ్యాఖ్యానించారు.అయితే "మీరు ఇప్పటికే ధనవంతులు కాబట్టి ఇది మీకు సరిపోతుంది. మా లాంటి మధ్యతరగతి ప్రజలకు UPI ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో అర్థం చేసుకోగలరు. అనవసరమైన ఖర్చులు చేసే ముందు ప్రజలు ఖచ్చితంగా ఆలోచించాల్సిందే కానీ దానికోసం UPI ఖాతాను తొలగించడం సరైంది కాదంటూ మరో యూజర్ పెదవి విరవడం గమనార్హం. (మూడు నెలల ముందే పదేళ్ల జీవితానికి ప్లాన్ : కానీ అంతలోనే!) -
పవిత్ర తులసి మాలలతో బుల్లి రథం
భువనేశ్వర్/పూరీ: పవిత్రమైన తులసి మాలలతో బుల్లి రథం రూపుదిద్దుకుంది. స్వామివారి భక్తులకు ఈ కళాఖండం అంకితం చేసినట్లు సృజనాత్మక కళాకారుడు బిశ్వజిత్ నాయక్ తెలిపారు. ఆరు రోజుల పాటు నిర్విరామంగా శ్రమించి 8 అంగుళాల ఎత్తు, 7 అంగుళాల వెడల్పుతో తయారు చేసిన ఈ రథంలో 551 తులసి మాలలు, 175 ఐస్క్రీం పుడకల్ని వినియోగించారు. రథయాత్రకు పోలీసు యంత్రాంగం సన్నద్ధంరథయాత్రకు పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. రథాలు లాగడం మొదలుకొని యాత్ర పూర్తయ్యే వరకు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా రథాలు లాగడంపై బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. పూరీ రిజర్వు పోలీసు గ్రౌండులో చేపట్టిన ఈ కార్యక్రమం రథయాత్రను తలపింపజేసింది. బలభద్రుని తాళ ధ్వజం, జగన్నాథుని నందిఘోష్, సుభద్ర దర్ప దళనంకు ప్రతీకగా మూడు జీపుల్ని మూడు రథాల మాదిరిగా వినియోగించారు. క్లియరెన్స్, కార్డన్ ఏర్పాటు దశల్లో అనుబంధ బలగాలకు మెలకువలను నేర్పించారు. అదనపు పోలీసు డైరెక్టరు జనరల్, జిల్లా న్యాయాధికారులు, సీనియర్ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో మాక్ డ్రిల్ నిర్వహించారు. -
ఆ తప్పిదాలతో 116 కిలోల బరువు..కానీ 13 నెలల్లో ఏకంగా..!
వెయిట్ లాస్ జర్నీలలో చాలామంది తమ కిష్టమైన హాబీలతోనూ..ఇతరులను స్ఫూర్తిగా చేసుకుని తగ్గారు. కొందరూ ప్రోటీన్ డైట్ ఫాలో అయితే..మరికొందరు అనారోగ్య భయంతో బరువు తగ్గారు. కానీ ఈ న్యూట్రిషన్ కోచ్ తాను ఎందువల్ల బరువు పెరిగానో కారణాలను విశ్లేషించి ఆ తప్పిదాలను పునరావృతం కాకుండా చూసుకుంటూ బరువు తగ్గింది. పైగా తనలా ఎవ్వరూ ఆ తప్పులు చెయ్యొద్దని, దాని వల్ల కలిగే అనర్థాలేంటో వివరిస్తూ..ప్రేరణగా నిలిచింది. ఆమె కొన్ని నెల్లల్లోనే స్లిమ్గా మారి బరువు తగ్గడం పెద్ద కష్టమేమి కాదని నిరూపించింది. ISS సర్టిఫైడ్ న్యూట్రిషన్ అండ్ వెయిట్ లాస్ కోచ్ రక్షా భలవి ఒకప్పుడామె దాదాపు వంద కిలోలు పైనే బరువు ఉండేది. ఊబకాయం సమస్యతో చర్మం, జుట్టు, ఆరోగ్యం సరిగా లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంది. అందుకు ప్రధాన కారణం ఆమెకున్న జంక్ఫుడ్ వ్యనసం. దాదాపు ప్రతిరోజు చిప్స్, చాక్లెట్లు లేకుండా ఆమె రోజు ఉండేది కాదు. అలా ఆమె 116 కిలోలు బరువుతో ఇబ్బందులు పడింది. తన ఆకృతి కారణంగా ఎదుర్కొన్న బాడీ షేమింగ్లు, మరోవైపు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలతో బరువు తగ్గాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యింది. ఎలాంటి క్రాష్డైట్లు జోలికిపోకుండా పోషకాహారం గురించి క్షుణ్ణంగా తెలుసుకుంది. ముందుగా ప్రతిరోజు వ్యాయామాలు చేస్తూ.. తన బరువులో వస్తున్న మార్పులను గమనించింది. అలాగే తాను స్కూల్ డేస్లో మధ్యాహ్న భోజనానికి పరాఠాలు తినడంతో ఎలా తాను బరువు పెరిగింది అర్థం చేసుకుంది. దానిలో ఉండే అధిక కార్బ్, అధిక కొవ్వు గలిగిన ఆహారం బొడ్డు కొవ్వుకు కారణమవుతుందని తెలుసుకుంది. అందుకనే తన ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకుంది. సమతుల్య ఆహారాలకే పెద్దపీటవేసి..ఫైబర్ కోసం పండ్లు, ప్రోటీన్ కోసం గుడ్లు లేదా పనీర్, కార్బ్ల కోసం గోధుమ రోటీ లేదా బ్రెడ్ వంటివి తీసుకునేది. అలాగే తాను చదువుతున్నప్పుడూ బాగా ఒత్తిడికి గురయ్యేది. అందువల్ల తాను తెలియకుండా ఎలా ఎక్కువగా ఫుడ్ తీసుకుందో కూడా చెప్పుకొచ్చింది రక్ష. అలాగే అధిక ఉప్పు, చక్కెరతో ఉండే స్నాక్స్కి దూరంగా ఉండేది. వాటి బదులు మఖానా, తాజా పండ్లతో స్నాక్స్ని భర్తీ చేసింది. అలాగే రోజంతా శారీరక శ్రమ లేకుండా ఉండటాన్ని నివారించింది. స్క్రీన్ సమయాన్ని తగ్గించుకుని.. ఆటలు లేదా వ్యాయామాలకు సమయం కేటాయిస్తూ..మానసికంగా ఉల్లాసంగా ఉండేలా చూసుకునేది. చివరగా తాను చెడ్డ ఆహారపు అలవాట్ల వల్లే బరువు పెరుగుతున్నానని చాలా ఆలస్యంగా గ్రహించానని, తనలా మరెవ్వరూ చెయ్యొద్దని సూచిస్తోంది. ప్రస్తుతం ఆమె పూర్తి శాకాహారి. అలాగే తన డైట్ప్లాన్ని కూడా షేర్ చేసుకున్నారామె.(చదవండి: Nozempic Diet: 130 కిలోల అధిక బరువు..ఎన్నాళ్లో బతకదన్నారు..! కట్చేస్తే..)ఆ కోచ్ ఏమి తీసుకునేదంటే..ఉదయం: చియా సీడ్ నీరువ్యాయామం చేయడానికి ముందు: 7 నానబెట్టిన బాదం, 10 గ్రా వేరుశెనగ వ్యాయామం తర్వాత: ప్రోటీన్ పౌడర్ పానీయం (1 స్కూప్), 1 గిన్నె మస్క్మెలోన్ భోజనం: స్టైర్-ఫ్రైడ్ క్యాప్సికమ్తో గిన్నె క్వినోవా టోఫురాత్రి భోజనం: 2 బేసన్ చీలాస్, 1 కప్పు పప్పు, 100 గ్రా క్యాబేజీ సబ్జీ, 1 ప్లేట్ దోసకాయ-క్యారెట్ సలాడ్, 30 గ్రా కాల్చిన సోయా ముక్కలు View this post on Instagram A post shared by Raksha Bhalavi | Nutrition & Weight Loss Coach (@fitwithraksha_)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: ఆ చెప్పులు మన వారసత్వ కళ..ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ ఏకంగా..!) -
Jagannath Rath Yatra నేడే జగన్నాథుని నేత్రోత్సవం
భువనేశ్వర్: అశేష భక్త జనం అభీష్టం నెరవేరే మధుర క్షణం చేరువైంది. నవనవలాడే యవ్వన రూపుతో ఆరాధ్య దైవం జగన్నాథుడు భక్తుల మధ్య ప్రత్యక్షం కానున్నాడు. మర్నాడు శ్రీ గుండిచా యాత్రకు బయల్దేరుతాడు. స్వామి రాక కోసం శ్రీ మందిరం గడపలో మూడు రథాలు దేవతల ఆగమనం కోసం ఆహ్వానం పలుకుతున్నాయి. ఇటు శ్రీ మందిరం, అటు శ్రీ గుండిచా మందిరం వాకిళ్ళు మొదలుకొని ఆలయ ప్రాంగణాలు సైతం శోభాయమానంగా రూపుదిద్దుకున్నాయి. గుండిచా మందిరంలో అడపా మండపం చతుర్థాదారు మూర్తుల ఆసీనం కోసం సిద్ధమై ఉంది. భారీ రంగవళ్లులతో రెండు మందిరాల వాకిళ్లు మిరమిట్లు గొలిపిస్తున్నాయి. గత 14 రోజులుగా తెరచాటున స్వామి భక్తులకు కానరాకుండా రహస్య ఉపచారాలతో సరికొత్త ఉత్సాహం పునరుద్ధరించుకోవడంతో శ్రీ క్షేత్రం హడావిడిగా ఉంది. చదవండి: Jagannath Yatra 2025 : మూడు రథాలు, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకతజ్యేష్ట పూర్ణిమ నాడు అష్టోత్తర కలశ జలాభిõÙకాన్ని స్నాన యాత్రగా జరుపుకున్న స్వామి తడిసి ముద్దయ్యాడు. దీంతో మూల విరాటుల సహజ రూపు చెదిరి పోయింది. జ్వర పీడతో వైద్య నియమాల ప్రకారం అనవసర మండపానికి తరలిపోయాడు. అది మొదలుకొని భక్తులకు నిత్య దర్శనం కొరవడింది. దైతపతుల ప్రత్యక్ష పర్యవేక్షణలో రాజవైద్య వర్గం తైలాది వైద్య ఉపచారాలతో దేవుళ్ల ఆరోగ్యం కోలుకుంది. యథాతథంగా భక్తులకు నిత్య దర్శనం ప్రసాదించేందుకు భగవంతునికి మార్గం సుగమం అయింది. హింగుళ (ఎరుపు), హరితల (పసుపు), కస్తూరి, కేశర (కుంకుమ), కొయిత (మారేడు గుజ్జు) వంటి సహజ మూలికా వర్ణ ద్రవ్యాల మేళవింపుతో మూల విరాటుల ముఖాలకు క్రమ పద్ధతిలో రంగులు హద్ది యవ్వన రూపం తీర్చి దిద్దుతారు. జగన్నాథుని సంస్కృతిలో ఇదో గోప్య సేవ. కాగా, గురువారం భక్తులు ప్రవేశించేందుకు శ్రీ మందిరం తలుపులు తెరుచుకుంటాయి. గుడిలో బలభద్ర స్వామి, దేవీ సుభద్ర, జగన్నాథుడు భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు.రథాలపై నీలచక్రాల అమరిక పర్లాకిమిడి: స్థానిక రాజవీధిలోని శ్రీమందిరంలో నీలచక్రాలకు పండాలు శాస్త్రోక్తంగా బుధవారం పూజలు నిర్వహించారు. అనంతరం వాయిద్యాలతో వీటిని శ్రీజగన్నాథ రథం నందిఘోష, బలభద్రస్వామి రథం తాలధ్వజ, సుభద్ర రథం దర్పదళన రథాలపై అమర్చారు. దీంతో నేటి నుంచి జగన్నాథ రథంపై హనుమాన్ జెండాను ఎగురవేస్తారు. అనేక దేవతామూర్తులు రథాయాత్రకు ఆటంకం కలుగకుండా ఈ పది రోజులు కాపాడతారనేది భక్తుల విశ్వాసం. కార్యక్రమంలో రథాయాత్ర కమిటీ చైర్మన్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, తహసీల్దార్ బెహారా, రథాయాత్ర కమిటీ సభ్యులు కుమార్, బసంత పండా, భరత్ భూషన్ మహంతి, రాజేంద్ర కుమార్ బెహరా, అశోక్ మహారాణా పాల్గొన్నారు. -
ఆ చెప్పులు మన వారసత్వ కళ..ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ ఏకంగా..!
మనవాళ్లు ఎప్పుడో కళాత్మకంగా రూపొందించినవి కొన్ని రకా ఫ్యాషన్ బ్రాండ్లు కాపీ కొట్టేసి మార్కెట్లోకి రిలీజ్ చేసి ధర నిర్ణయిస్తుంటే కళ్లప్పగించి చూస్తుంటాం. ఇది మన పూర్వీకుల నుంచి వచ్చిన వారసత్వ కళ అని గుర్తుకు రాదు. లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ అనగానే..డబ్బులు వెచ్చించేయడమే గానీ..అదేంటని నిశితంగా ఆలోచించేవారే కరువు. అందువల్లే కాబోలు ప్రముఖ లగ్జరీ బ్రాండ్లు మన ఆర్ట్ని సులభంగా కాపీ కొట్టేస్తున్నాయి. అచ్చం అలానే ఓ దిగ్గజ ఇటలీ ఫ్యాషన్ బ్రాండ్ ఎంత పనిచేసిందో వింటే విస్తుపోతారు.కొల్హాపూర్ లెదర్ చెప్పులు చాలా ప్రసిద్ధిగాంచినవి. ముఖ్యంగా పెద్దవాళ్ల హుందాతనం ఉట్టిపడేలా చేసేలా ఉంటాయి ఆ చెప్పులు. కొల్హాపురి ఫ్లాట్ చెప్పులుగా బాగా ఫేమస్. అయితే వాటిని ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ ప్రాడా సమ్మర్ 2026 56 రన్వే లుక్లలో అచ్చం మనలాంటి పాదరక్షలనే ప్రదర్శించింది. అచ్చం మన కొల్హాపురి చెప్పులు మాదిరిగా ఉన్నాయి. అయితే ఆ లగ్జరీబ్రాండ్ వాటి ధర ఏకంగా అక్షరాల రూ. 1.2 లక్షలుగా నిర్ణయించడం విశేషం. ఈ లగ్జరీ బ్రాండ్ మన వారసత్వానికి ఎలాంటి క్రెడిట్ ఇవ్వకుండా తానే డిజైన్ చేసినట్లుగా ఫోజులు కొడుతూ..అంత ఖరీదు నిర్ణయించడంతో సర్వత్రా ఆగ్రహాం వ్యక్తమైంది. నెట్టింట అందుకు సంబధించిన ఫోటోలను ఆ బ్రాండ్ వైరల్ చేయడంతో నెటిజన్లు ఇది "చప్పల్ చోరి" అంటూ తింటూపోస్తున్నారు. PRADA is selling Kolhapuri chappals for ₹1.2 lakh — a design stolen from the Chamar community of India, who’ve handcrafted them for generations. No credit. No acknowledgment. Just pure cultural theft dressed in luxury branding. Shameful. #CulturalTheft #Kolhapuri pic.twitter.com/l3ITZlGSEG— The Dalit Voice (@ambedkariteIND) June 25, 2025ఫ్యాషన్ సంస్కృతికి తప్పుడు అర్థాన్నిచ్చేలా చేసిందంటూ మండిపడుతున్నారు. కనీసం భారతీయ వారసత్వ కళను ప్రశంసిస్తూ..వాటిని ప్రదర్శించినా..మా కళ మళ్లీ పునరుజ్జీవనం చేసుకుంటుందని సంతోషించేవాళ్లం అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. కొల్హాపురి చెప్పుల చరిత్ర...12వ శతాబ్దానికి చెందిన వారసత్వ కళ. ఇది సాంప్రదాయకంగా మహారాష్ట్ర, కర్ణాటకలోని చెప్పులు కుట్టేవారి చేతిల్లో రూపుదిద్దుకున్న కళ ఇది. ఈ కొల్హాపురి చెప్పులకు జీఐ ట్యాగ్ కూడా ఉంది. ఇది మన భారతీయ వారసత్వంలో భాగం. ఆ కాలంలోనే మన పూర్వీకులు ధరించిన చెప్పులివి. వీటిని తయారు చేయడానికి ఆరువారాలపైనే పడుతుందట. వీటి ధర రూ. 500 నుంచి రూ. 700ల మధ్య ఉంటుందట. కాగా, దీనిపై ప్రముఖ కాలమిస్ట్ శోభా దే కూడా మండిపడ్డారు. ఈ బ్రాండ్లు మన భారతదేశాన్ని ఒక మార్కెట్గా చూస్తున్నాయని విమర్శించారు. ఒకరంగా ఇది చేతిపనుల నైపుణ్యాలన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన ప్రాముఖ్యతను హైలెట్ చేసింది. అలాగే మన మూలాలను మర్చిపోకుండా గుర్తు చేసింది. ఫ్యాషన్ ట్రెండ్గా పరిచయం చేసిన ఈ చెప్పులు మన కళా వారసత్వానికి ప్రతీకలని గొంతెత్తి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. View this post on Instagram A post shared by Mahrukh Dar (@fashionjournalbym) (చదవండి: 22వేల కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, అతిపెద్ద ప్యాలెస్.. ఐనా ఆమె స్టిల్ బ్యాచిలర్..!) -
మూడు నెలల ముందే పదేళ్ల జీవితానికి ప్లాన్ : కానీ అంతలోనే!
జీవితం బుద్భుత ప్రాయం. ఎవరి ప్రాణాలు ఏ క్షణంలో గాల్లో కలిసిపోతాయో ఎవరికీ తెలియదు. కానీ అందమైన జీవితం కోసం ఎన్నో కలలు కంటాం. కీర్తి, ఆస్తి, పిల్లలు, వారి భవిష్యత్తు అంటూ.. రాత్రింబవళ్లు తిండి తిప్పలు కూడా మర్చిపోయి కష్ట పడతాం. కానీ కొన్ని విషాదాల గురించి తెలుసుకున్నపుడు మాత్రం ఒకలాంటి నిర్వేదం మన మనసుల్ని ముసురుకుంటుంది.ముఖ్యంగా ఇటీవలి కాలంలో విహార యాత్రలు విషాదంగా మారిపోయిన పహల్గాం ఉదంతం, బెంగళూరు తొక్కిసలాట, ఘోర విషాదాన్ని మిగిల్చిన విమాన ప్రమాదం లాంటి ఘటనలు చూసినపుడు మనసు మరింత భారమవుతుంది. దాదాపు ఇలాంటి గాథే వ్యాపార వేత్త సంజయ్ కపూర్ ఆకస్మిక మరణం.జూన్ 13న ఇంగ్లాండ్లో పోలో ఆటలో ప్రమాదవశాత్తు తేనెటీగను మింగి గుండెపోటుకు గురై 53 ఏళ్ల పారిశ్రామికవేత్త ప్రాణాలు కోల్పోతాడని అసలెవరైనా ఊహిస్తారా? 40వేల కోట్ల ఆస్తిపరుడు సంజయ్ కపూర్, చిన్న ప్రాణి తేనేటీగ మూలంగా కన్నుమూశాడు. ఆయన అకాల మరణం స్నేహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల హృదయాల్లో తీవ్ర శూన్యతను మిగిల్చింది. అంతేకాదు రాబోయే పదేళ్ల కాలంలో ఎంతో సంతోషంగా, కుటుంబ సభ్యులతో కలిసి జీవించాలని కలలు కన్న ఆయన కలలు కల్లలుగానే మిగిలిపోవడం మరింత విషాదం. మూడు నెలల క్రితం, తన జీవితంలో ముఖ్యమైన విషయాలపై మరింత దృష్టి పెట్టాలనే ఆశతో పదేళ్ల తన జీవిత ప్రణాళికను ఒక సందర్భంలో పంచుకున్నాడు."నేను గొప్ప ప్రణాళికదారుడిని. అక్టోబర్లో, నేను నా కోసం పదేళ్ల ప్రణాళికను రాసుకున్నాను. ఏమి చేయాలి, ఏం చేయకూడదు అనేది చాలా స్పష్టంగా ప్లాన్ చేసుకున్నా. నా గేమ్ నాకు చాలా ముఖ్యం, ఆరోగ్యం , ఫిట్నెస్ నాకు చాలా ముఖ్యం. నేను యాక్టివ్గా , వీలైనంత ఎక్కువగా పోలో ఆడతాను. అంతకంటే ముఖ్యమైనది ఏమిటంటే నేను నా కుటుంబానికి సమయాన్ని ఇవ్వాలనుకుంటున్నా..నేను ఉమ్మడికుటుంబం నుంచి వచ్చాను. ఉమ్మడి కుటుంబాల్లో జీవితం అంత ఈజీకాదు. కానీ అదృష్టవశాత్తూ ఒకర్నొకరు ప్రేమించుకుంటూ ఆనందంగా గడిపాం. ఇపుడు కూడా భార్యతో జీవితాంతం అలాగే కొనసాగాలను కుంటున్నానని తెలిపారు. కానీ అంతలోనూ అనూహ్యంగా ఈ లోకాన్నించి శాశ్వతంగా సెలవు తీసుకోవడం విషాదం.కాగా సంజయ్ నలుగురు పిల్లల తండ్రి. సమైరా, సఫీరా, కియాన్, అజారియాస్. మాజీ భార్య బాలీవుడ్ నటి కరిష్మాతో కుమార్తె సమైరా, కుమారుడు కియాన్ ఉన్నారు. విడాకుల తరువాత కూడా కరిష్మా పిల్లలతో తన స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించారు. మూడో భార్య, ప్రియా సచ్దేవ్ కుమారిడితో పాటు, మొదటిభర్త ద్వారా పుట్టిన కుమార్తె సఫీరాను కూడా తండ్రిలాగానే చూసుకునేవాడు. సంజయ్ కపూర్ అంత్యక్రియలకు కరిష్మా కపూర్, సైఫ్ అలీ ఖాన్,కరీనా కపూర్ హాజరైన సంగతి తెలిసిందే. నోట్ : జీవితాల్ని చిన్నాభిన్నం చేసే ఇలాంటి విషాదాల గురించి రోజూ వింటూనే ఉంటాం. నిట్టూరుస్తూనే ఉంటాం. ‘చివరికి మిగిలేది’ ఇదే కదా అని కూడా అనుకుంటాం. అలాగని జీవితం ఆగిపోదు. ‘జరిగేవన్నీ మంచికనీ అనుకోవడమే మనిషి పని’ అనుకుంటూ ముందుకు సాగాల్సిందే. -
చెయ్యెత్తి మొక్కేలా షిరిడీ సాయిబాబా! అంతేనా..!
అతడు మలిచిన శిల్పాలు జీవం పోసుకున్నాయా అన్నట్లు కనిపిస్తాయి.. కాస్త దూరం నుంచి చూస్తే అరె అక్కడ ఎవరో ఉన్నారు అనే భావన కలుగుతుంది. చేతితో తాకి చూస్తే తప్ప శిల్పం అని తెలుసుకోలేం.. మనతో లేని వారు మనమధ్యే ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. శిల్పం తయారు చేస్తున్నంత సేపు అతడు తపస్సులో ఉన్నాడా అనిపిస్తుంటుంది. అతడి పేరే రాజేష్ – విజయనగర్కాలనీ నగరంలో పుట్టిపెరిగిన అతడు 1993లో మాసబ్ట్యాంక్ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో చదివాడు. ఆ సమయం నుంచే విగ్రహాలు తయారు చేయడం ప్రారంభించాడు. 2021లో అతడు రూపొందించిన సాయిబాబా విగ్రహాన్ని మహారాష్ట్రలోని షిరిడీ సంస్థాన్కు అందజేయగా అక్కడ ధ్యాన మందిరంలో ఆ శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ఈ సజీవ శిల్పాన్ని చూసి అబ్బురపడ్డ పలువురు మరో ఐదు విగ్రహాలు తయారు చేయాలని ఆర్డర్ ఇవ్వగా ఆయన మొదటి వారంలోనే విగ్రహాలను తయారు చేసి షిరిడీ సంస్థాన్కు అందజేశారు. అతడి చేతులమీదుగా దివంగత జి.పుల్లారెడ్డి దంపతులు, ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి పద్మశ్రీ శోభానాయుడు, మైకెల్ జాక్సన్, రాఘవేంద్రస్వామి, చంద్రశేఖర సరస్వతిజీ, సంత్సేవాలాల్ విగ్రహాలతో పాటు ట్యాంక్బండ్పై ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్బాపూజీ విగ్రహాలు రూపుదిద్దుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర టూరిజం, హెచ్ఎండీఏ, జీహెచ్ఎం తదితర సంస్థలకు రాజేష్ ప్రస్తుతం పెయింటింగ్, శిల్పాలు వారి ఆర్డర్ మేరకు తయారు చేసి ఇస్తున్నారు. -
చినుకుల్లో హాయి..! జాగ్రత్తలు అవసరమోయి..
చిరుజల్లులలో ఏదైనా వేడి వేడి ఫుడ్ ఉంటే.. దానికి తోడు కమ్మటి వాసనతో హాట్ కాఫీ సిప్ చేస్తుంటే.. ఆ హాయి మరోలా ఉంటుంది. ఇలాంటి అనుభూతులు నగరవాసులకు ఎన్నెన్నో.. సిటీలో చినుకులు పడుతుంటే చాలు జనం ట్యాంక్బండ్, నెక్లెస్ రోడ్లపై సందడి చేస్తుంటారు. చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. అయితే ఈ మాన్సూన్ సీజన్లో ఆరోగ్యం, హైజీన్, డిజిటల్ టూల్స్ వంటి అంశాలను సైతం సమానంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు నగరవాసులు. ఎందుకంటే ఈ కాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు, నీటి కాలుష్యం, వాతావరణ మార్పులతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే వర్షాకాలాన్ని సురక్షితంగా, అందంగా అనుభవించడానికి కొన్ని లైఫ్స్టైల్ హ్యాక్స్, గాడ్జెట్స్, యాప్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. వర్షాకాలం అనేది సహజంగా ఆనందాన్ని కలిగించేది. కానీ అదే సమయంలో కొంత జాగ్రత్త అవసరం. ఆరోగ్యాన్ని, గాడ్జెట్లను, ఇంటిని, ఫ్యాషన్ను సమానంగా వాడుకుంటే ఈ సీజన్ను ఎంతో ప్రయోజనకరంగా మార్చుకోవచ్చు. మోడ్రన్ లైఫ్స్టైల్లో టెక్నాలజీ సహకారంతో వర్షాకాలాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ తరం. ఈ వానల్లో మీరు తీసుకునే జాగ్రత్తలు మీరు పొందే ఆనందానికి బలం అవుతాయి.వర్షాకాలం హెల్త్కేర్ టిప్స్.. వానల సమయంలో నీటి కాలుష్యం, ఆహారంలోని బ్యాక్టీరియా వల్ల జ్వరాలు, డైజెస్టివ్ సమస్యలు, స్కిన్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ సీజన్లో ఇంట్లోనే వంట చేసుకోవడం, వేడి నీళ్లు తాగడం, తులసి టీ, అల్లం–పెప్పర్ సూప్ వంటి బూస్టింగ్ ఫుడ్స్ తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఫ్యాషన్తో పాటు ఫంక్షనాలిటీ.. వర్షాకాలం అంటే మడమ తొక్కినట్లుగా బురద, తడిగా మారే దుస్తులు.. కానీ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న వాటర్ రిపెలెంట్ ఫ్యాబ్రిక్స్, సిలికాన్ షూ కవర్స్, ఫోల్డబుల్ రైనిక్స్ లాంటి ఉత్పత్తులతో స్టైలిష్గా ఉండటమే కాకుండా తడిసిపోకుండా ఉండొచ్చు. ట్రెండీ అంబ్రెల్లాస్: యాక్టివ్ కలర్స్, ఓపెన్–క్లోజ్ మెకానిజంతో అందంగా ఉండే మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటర్ప్రూఫ్ బ్యాక్ప్యాక్స్: టెక్ లవర్స్ కోసం వర్షంలో కూడా ల్యాప్టాప్, గ్యాడ్జెట్లు భద్రంగా తీసుకెళ్లేందుకు ఉపయోగకరం. వాటర్ప్రూఫ్ ఫోన్ కవర్లు: ముఖ్యంగా రోడ్ల మీద లేదా బైక్ ప్రయాణాల్లో తప్పనిసరి. హెల్త్ మానిటరింగ్ యాప్లు, గాడ్జెట్స్.. ఫిట్ బిట్, ఎమ్ఐ బ్యాండ్ వంటి వేరబుల్స్ ద్వారా వాకింగ్ ట్రాక్ చేయవచ్చు. హెల్తీ ఫై మీ వంటి డైట్ యాప్లు మంచి ఆహార నియమాలు పాటించేందుకు దోహదపడుతున్నాయి. ప్రాక్టో, టాటా 1 ఎంజీ వంటి యాప్ల ద్వారా ఇంట్లో నుంచే డాక్టర్ కన్సల్టేషన్ పొందవచ్చు.టెక్నాలజీతో వర్షాన్ని అనుభవించండి.. వర్షాలు ఎప్పుడు వస్తాయో, ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఉంటుందో ముందే తెలిసిపోతే బాగుంటుందనే మాట వాస్తవమే. ఈ విషయంలో కొన్ని యాప్స్తో పాటు ప్రయాణించవచ్చు. ఆక్యూ వెదర్, స్కైమెట్ వెదర్, లైవ్ రడార్తో వర్ష సూచన. గూగుల్ మ్యాప్స్, మై గేట్ల టెక్నాలజీతో ట్రాఫిక్ అప్డేట్స్, లోకేషన్ ఆధారిత అలర్ట్స్. స్పాటీ ఫై, పాకెట్ ఎఫ్ఎఫ్: వానలో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు, లేదా ఇంట్లో కూర్చుని విండో వెనుకగా జల్లులు చూస్తున్నప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్. వర్షంలో ఇంటిని కాపాడండి డోర్ మ్యాట్స్, షూ స్టాండ్స్: వర్షపు నీళ్లు ఇంట్లోకి రాకుండా అడ్డుకునేందుకు.. డీహ్యూమిడిఫైయర్స్: గదుల్లో తడిగా మారే వాతావరణం, మబ్బును నివారించేందుకు ఉపయోగపడతాయి. ఆరోమా డిఫ్యూజర్లు: తడి వాసనను తొలగించి ఫ్రెష్నెస్ కలిగించేందుకు ఉపయోగకరంగా ఉంటుంది.విందుగా మార్చే చిట్కాలు వీకెండ్ విత్ రైన్ థీమ్: ఇంట్లో ఫ్రెండ్స్తో టీవీకి దగ్గరగా బీన్స్ బ్యాగ్స్, మసాలా టీ, బజ్జీలు.. ఇదే అసలైన హ్యాపీనెస్. రెయిన్ ఫ్రేమ్స్ ఫొటోగ్రఫీ: వర్షపు నీటి బిందువులు, బల్కనీ పూల మధ్య సెల్ఫీలు.. సోషల్ మీడియాకు మరిచిపోలేని అనుభూతులు. రెయిన్ ఫ్రెండ్లీ రైడ్స్: వర్షంలో బైక్ రైడ్స్, సైక్లింగ్ ట్రిప్స్ వంటి గ్రూప్ యాక్టివిటీస్ ద్వారా వర్షాన్ని మరింత ఆస్వాదించవచ్చు. (చదవండి: 22వేల కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, అతిపెద్ద ప్యాలెస్.. ఐనా ఆమె స్టిల్ బ్యాచిలర్..!) -
విద్యార్థులు మెచ్చిన ఆహారం
సాక్షి, సిటీబ్యూరో: వేసవి సెలవులను పురస్కరించుకుని విద్యార్థులకు రైలులోకి ఆహారం అందించే వినూత్న తరహా ఫుడ్ ఆన్ ట్రైన్ని అందుబాటులోకి తెచ్చిన ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్.. స్విగ్గీ వేసవి సెలవులు ముగిసిన నేపథ్యంలో ఈ ఆఫర్ను విద్యార్థులు ఉపయోగించుకున్న తీరుపై, తమ అధ్యయన ఫలితాలను విడుదల చేసింది. స్విగ్గీ లిమిటెడ్ వెల్లడించిన ప్రకారం.. వెరైటీ వంటకాలకు ఓటువిద్యార్థులు ఆర్డర్ చేసిన ఆహార పదార్థాల్లో బిర్యానీ, బర్గర్స్, పనీర్ టిక్కా క్యూసాడిల్లా, స్పాగెట్టి, అగ్లియో ఒలియో వంటి ఇటాలియన్, అరబిక్, మెడిటేరియన్ ఫుడ్, కింగ్ ఫిష్ తవా ఫ్రై, చికెన్ కాషాభునా వంటి సీఫుడ్ టాప్ ప్లేస్లో ఉన్నాయి. ఆరోగ్య స్పృహ కలిగిన పలువురు విద్యార్థులు, ఆరోగ్యకరమైన పాత్రలు, హోమ్స్టైల్ భోజనాల కోసం ది గుడ్ బౌల్ లంచ్బాక్స్లతో పాటు వీగన్ స్టైల్ వంటకాలను కోరుకున్నారు. బ్రాండెడ్ ఫుడ్ కోసం మెక్డొనాల్డ్స్, కేఎఫ్సీ, సబ్వే, పిజ్జాహట్ నుంచి ఎంచుకున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులే ఎక్కువ.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా వంటి నగరాలకు రాకపోకలు సాగించే విద్యార్థులు అత్యధికంగా నాగ్పూర్ స్టేషన్లో ఫుడ్ డెలివరీ చేయించుకున్నారు. రైళ్లలో ఆహారం కోసం దాదాపు 70శాతం ఆర్డర్లతో ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ ఫుడ్ ఆన్ ట్రైన్ వినియోగించుకుని జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ఐఐటీ ఖరగ్పూర్, ఐఐటీ బీహెచ్యూ వారణాసి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలకు చెందిన విద్యార్థులు ముందున్నారు. రైళ్లలో ఆర్డర్ చేసేటప్పుడు విద్యార్థులు సమయపాలన పాటించలేదు. ఉదయం 7 గంటలకు అల్పాహారం నుంచి రాత్రి 11 గంటలకు లేట్నైట్ స్నాక్స్, డెజర్ట్ దాకా విద్యార్థులు రొటీన్కు భిన్నంగా ఆర్డర్లు చేశారు. -
మత్తు వదిలితేనే భవిత!
ప్రపంచ దేశాలను తీవ్రంగా కలవరపెడుతున్న అంశాలలో ‘మాదక ద్రవ్యాల తయారీ–అక్రమ రవాణా– క్రయవిక్రయాలు–వినియోగం’ అతి ముఖ్యమైనవి. వీటిని అరికట్టడానికి వివిధ దేశాలు వివిధ రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అయినా, మాదక ద్రవ్యాల నిర్మూలనలో ఆశించిన ఫలితాలు రావడం లేదు. మనకు మిక్కిలి హాని కలిగించే కొన్ని మత్తు పదా ర్థాలను మాదకద్రవ్యాలు (డ్రగ్స్) అని వ్యవహరిస్తారు. ఈనాటి యువతరాన్ని దారి మళ్ళించి చెడు మార్గాల్లో నడిపిస్తున్న దురలవాట్లలో మాదక ద్రవ్యాల వినియోగం తీవ్రమైనది. నల్లమందు, మార్ఫిన్, హెరాయిన్, చరస్, గంజాయి, కొకైన్, ఎల్ఎస్డీ వంటి మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించి రహస్యంగా వినియోగదారులకు అందిస్తూ డబ్బు సంపాదించడం కొందరికి లాభసాటి వ్యాపారం అయ్యింది. కానీ వాటికి అలవాటుపడిన వారు మాత్రం ఆరోగ్యం కోల్పోయి బికారులవుతున్నారు. తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు పిల్లల ముందే మత్తు పదార్థాలను వినియోగించడం వల్ల పిల్లలూ వాటికి ఆకర్షితులవుతున్నారు. ఒత్తిడిని తట్టుకోలేని సున్నిత మనస్కులు వీటిని ఆశ్రయిస్తున్నారు. కనుచూపు మేరలో మత్తు పదార్థాలు అందుబాటులోకి రావడం, పాశ్చాత్య పోకడలు, టీవీ, సోషల్ మీడియాల ప్రభావం వల్ల యువత వీటిబారిన పడుతున్నారు. పలు జాతీయ సర్వేల ప్రకారం... మత్తు పదార్థాలు సేవించేవారిలో ఆత్మహత్య ఆలోచనలు వస్తాయి. శారీరక సమస్యలకు తీవ్రంగా గురవుతారు. ఒత్తిడికి, మానసిక సమస్యలకు గురవుతారు. భార్యల నుండి విడాకులు కోరుతున్నారు. నేరపూరిత ఆలోచనలతో గడుపుతున్నారు. చాలామంది లైంగిక సామర్థ్యం కుంటుపడుతోంది. స్థూలకాయం లాంటి సమస్యలతోనూ బాధ పడుతున్నారు.– డా.బి. హర్షిణిఎమ్డీ (సైకియాట్రీ), మంగళూర్, కర్ణాటక (నేడు అంతర్జాతీయ మత్తుపదార్థాల వ్యతిరేక దినం) -
22 వేల కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, అతిపెద్ద ప్యాలెస్.. ఐనా ఆ అందాల రాణి..!
రాజులు, రాజ్యాలు అంతరించినా వారి వారసులు , వారి కధలు మాత్రం ఎప్పటికీ ఆసక్తికరంగానే ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో సంచలనం సృష్టించిన ది రాయల్స్ వంటి వెబ్ సిరీస్ల పుణ్యమా అని రాజవంశీకుల జీవితాలు మరింతగా వెలుగులోకి వస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. అదే విధంగా తాజాగా ఓ అందాల రాణి గురించిన కొన్ని విశేషాలు కూడా వెలుగు చూశాయి. కుప్పలు తెప్పలుగా ఆస్తి పాస్తులున్నా ఇంకా పెళ్లికాని రాజవంశీకురాలు గురించి వచ్చిన పలు కధనాలు వైరల్గా మారాయి. ఆమె పేరు శివరంజని రాజ్యే(Shivranjani Rajy). రాజస్థాన్కు చెందిన శివరంజని రాజ్యే జోధ్పూర్ రాజవంశీకురాలు. ఆమె కుటుంబానికి బ్రిటిష్ కాలంలోనే దేశ వ్యాప్తంగా అత్యంత గౌరవం లభించింది.ఖాతా నిండా డబ్బే డబ్బు...ఈరోజుల్లో సామాన్యులకు లక్ష రూపాయలే గగనంలా అనిపిస్తే, శివరంజని రాజ్యే ఖాతాలో మాత్రం ఓ అంచనా ప్రకారం రూ. 22,000 కోట్లు ఉన్నట్లు వార్తలు చెబుతున్నాయి. ఆమె తండ్రి గజ్సింగ్ జీ రాజ్మాతా కుమార్తె అయిన శివరంజని, ఉమైద్ భవన్ ప్యాలెస్ అనే మహా విలాసవంతమైన కోట కు సహ–యజమానిగా కొనసాగుతున్నారు. ఈ ప్యాలెస్ నుంచి శివరంజని రాజ్యేకు భారీగా ఆదాయం వస్తోంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద వ్యక్తిగత నివాసాల్లో ఇది ఒకటి. ఈ ప్యాలెస్ అద్భుతమైన ఆర్కిటెక్చర్, అంతఃపురాలు, ఉద్యానవనాలు, కళాఖండాలతో ప్రసిద్ధి చెందింది. ఈ రాజభవనంలో మొత్తం 347 గదులు ఉన్నాయి. దేశంలోని అతి ఖరీదైన హోటల్స్ లో ఒకటిగా నిలిచే ఉమైద్ భవన్ ప్యాలెస్లో ఓ భాగాన్ని తాజ్ గ్రూప్ నిర్వహిస్తోంటే మిగిలిన భాగంలో రాజవంశీకులు నివసిస్తున్నారు.ఇంకా బ్రహ్మచారిణిగానే...ఆమె ఆధీనంలోని ఉమైద్ భవన్ ప్యాలెస్ ఖరీదైన పెళ్లిళ్లకు అత్యంత నప్పే వేదికగా ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. విచిత్రంగా ఆమె మాత్రం 50ఏళ్లు వస్తున్నా ఇంకా పెళ్లి మాట ఎత్తడం లేదు. ఆస్తి పాస్తులు, అందచందాలు ఉన్న అందాల రాణి పట్ల మనసు పడ్డవారు చాలామందే ఉన్నప్పటికీ కారణం తెలీదు గానీ ఎందుకో ఆమె వివాహం చేసుకోలేదు. అంతేకాదు దేశంలోని కొందరు రాజవంశీకుల్లా శివరంజని రాజకీయాల్లో గాని సినీ రంగంలో గాని ప్రవేశించకుండా, తన కుటుంబ పరంపరను, వారసత్వాన్ని కాపాడడం పైనే దృష్టి పెట్టారు. తన జీవితాన్ని సామాజిక సేవ, వంశ పారంపర్య సంపద పరిరక్షణలో నిమగ్నం చేశారు. జోధ్పూర్ లో అనేక కళా, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ, యువతలో చైతన్యం తీసుకొస్తున్నారు. ఆమె జీవిత ప్రయాణం ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. సంపద ఉన్నా సంస్కృతీ సంప్రదాయాలకు, నైతిక విలువలకు ఆమె ఇచ్చే ప్రాధాన్యత నేటి యువతకు స్ఫూర్తిగా చెప్పొచ్చు.(చదవండి: Anti-Drug Day 2025: మత్తుపై 'దండెత్తారు'..!) -
Bonalu Festival 2025: సంబురాలు మొదలాయె..!
ఇంటి ఆడబిడ్డ బోనం ఎత్తగానే మోగిన డప్పు వాయిద్యాలు.. పోతరాజు విన్యాసాలు.. అమ్మా, కాపాడమ్మా.. అంటూ సాగే అడుగులన్నీ అమ్మవారి ఆలయం వైపుగా కదులుతుంటే.. దారులన్నీ ఆధ్యాత్మిక శోభతో కళ కళలాడతాయి. ఆ కళ గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు అనిపించేంత సంబురంగా జరుగుతుంది తెలంగాణ బోనాల పండగ. తెలంగాణ ప్రజల సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఐక్యతకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ ఆషాఢ మాసం మొదలవుతూనే ఆరంభం అవుతుంది. పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ, బాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ .. ఈ ఏడుగురు అమ్మ తల్లులు ప్రాంతాలను బట్టి వివిధ పేర్లతో పూజలు అందుకుంటున్నారు. ఈ అమ్మతల్లుల ఆలయాలన్నీ సుందరంగా ముస్తాబు అవుతాయి. నేటి నుంచి మొదలయ్యే ఈ వేడుకలో తెలంగాణ ఆడబిడ్డలు ఉత్సాహంగా పాల్గొంటారు. బెల్లం కలిపి వండిన అన్నాన్ని పసుపు, కుంకుమ బొట్లు, వేపాకులతో అలంకరించిన మట్టి లేదా ఇత్తడి పాత్రలలో ఉంచుతారు. పైన పెట్టిన మూతలో దీపాన్ని ఉంచి, ఆ పాత్రను జాగ్రత్తగా తలపైన పెట్టుకుని, అమ్మవారి దేవాలయాలకు వెళతారు. ఈ పండుగలో భక్తి, కుటుంబ శ్రేయస్సు ప్రధానంగా కనిపిస్తాయి. బోనాలతోపాటు, పొట్టేళ్ళ, ఘటం ఊరేగింపు వంటి సాంస్కృతిక కార్యక్రమాలూ నిర్వహిస్తారు. (చదవండి: బోనాల పండుగకు వేళాయె)హైదరాబాద్లో గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఈ పండగ మొదలవుతుంది. ఈ రోజు(గురువారం జూన్ 26) నుంచి బోనాలు ప్రారంభకానున్నాయి. వెయ్యేళ్లకు పైగా ఈ ఆచారం ఉన్నట్టు, కాకతీయ రాజులలో ఒకరైన ప్రతాప రుద్రుడు గోల్కొండలోని జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు జరిపినట్లు చారిత్రక కథనాలు. రెండో బోనం బల్కంపేట రేణుక ఎల్లమ్మ గుడిలో, తరువాతి వారంలో సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అమ్మవారికి బోనం సమర్పిస్తారు. లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంతోపాటు వివిధ ప్రాంతాలలో ఉన్న అమ్మవార్లకు వరసగా బోనం సమర్పించే ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి. చివరి వారం రంగం, భవిష్యవాణిలతో ముగింపు కార్యక్రమం ఉంటుంది. జులై 21తో ముగిసే ఈ జాతర ఉత్సవాలు పిల్లలూ పెద్దలలో ఆనందోత్సహాలను నింపుతుంది. (చదవండి: Anti-Drug Day 2025: మత్తుపై 'దండెత్తారు'..!) -
Beauty Tip: మచ్చలేని నిగారింపు కోసం..!
ముఖంపై ఉండే మృతకణాలను ఇంట్లో దొరికే పదార్థాలతో సులభంగా తొలగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో చూద్దాం...అలోవెరా స్క్రబ్: మూడు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్లో రెండు టీస్పూన్లు బియ్యప్పిండి, టీస్పూను తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకుని చేసి పదినిమిషాలపాటు మర్దన చేసి ఆరాక కడిగేయాలి.వాల్నట్ స్క్రబ్: రెండు వాల్నట్స్ను తీసుకుని పొడిచేసుకోవాలి. ఈ పొడిలో మూడు టీస్పూన్లు తేనె వేసి పేస్టులా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాలు ఆరాక నీటితో కడిగేయాలి. వాల్నట్స్లోని ఔషధ గుణాలు చర్మానికి పోషణ అందించడంతోపాటు, చర్మంపై ఉన్న జిడ్డుని తొలగించి ముఖాన్ని తాజాగా ఉంచుతాయి.కాఫీ స్క్రబ్: నాలుగు టీస్పూన్ల కాఫీ పొడిలో రెండు టీస్పూన్ల బ్రౌన్ సుగర్, టీస్పూను తేనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు మర్ధన చేయాలి. ఆరాక నీటితో కడిగేయాలి. కాఫీ పొడిలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని లోతుగా శుభ్ర పరిచి ఫ్రెష్గా ఉంచుతాయి. (చదవండి: Anti-Drug Day 2025: మత్తుపై 'దండెత్తారు'..!) -
మత్తుని చిత్తు చేసిన మహిళా యోధులు..!
మత్తును చిత్తు చేసిన మహిళా యోధులు ‘భూమాత అంత ఓపిక మహిళల సొంతం’ అంటారు. సహనానికి పర్యాయ పదంలా చెప్పే ‘మహిళ’ అవసరమైతే అపర కాళీ అవుతుంది.కేరళ నుంచి పంజాబ్ వరకు ఎన్నో ప్రాంతాలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడడానికి మహిళలు నడుం బిగించారు. సంఘాలుగా ఏర్పడిఎన్నో గ్రామాలను డ్రగ్స్ భూతం నుంచి విముక్తి చేశారు...ఛత్తీస్గఢ్లోని జూహ్లీ గ్రామంలో ఒకప్పుడు పరిస్థితి భయానకంగా ఉండేది. ఈ గ్రామంలో ఎంతోమంది మాదకద్రవ్యాలకు బానిస అయ్యారు. ఫలితంగా గ్రామంలో శాంతిభద్రతలు లోపించాయి. ఎప్పుడు ఏ గొడవ జరుగుతుందో తెలియదు. మత్తులో పడి పని కూడా మానేసేవారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి గ్రామ మహిళలు నడుం బిగించారు.‘ఉమెన్ కమాండోస్’ పేరుతో ఒక గ్రూప్గా ఏర్పడ్డారు. గ్రామాన్ని మాదక ద్రవ్యాల బారి నుంచి విముక్తి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. రాత్రీ, పగలు తేడా లేకుండా ఈ గ్రూప్ సభ్యులు వీధి వీధిలో పెట్రోలింగ్ చేసేవారు. ‘మా అలవాటు మా ఇష్టం. మీకెందుకు?’ అని అడ్డంగా వాదించే మొండిఘటాలను కూడా దారిలోకి తెచ్చారు. ఇప్పుడు గ్రామంలో పూర్తిగా మార్పు వచ్చింది. మద్యం, మాదకద్రవ్యాల విష కోరల నుంచి బయటపడి ఆదర్శ గ్రామంగా మారింది జూహ్లీ. ఈ మార్పుకు కారణం...ఉమెన్ కమాండోస్. ‘ఒకప్పుడు వయసు మళ్లిన వాళ్లలో కొందరు డ్రగ్స్ తీసుకునేవారు. ఆ దురలవాటు చివరికి యువత, పిల్లల్లోకి కూడా వచ్చింది. ఇలా చూస్తూ పోతే గ్రామం సర్వనాశనం అయి΄ోతుందని భయపడ్డాం. ఉమెన్ కమాండోస్ గ్రూప్గా ఏర్పడ్డాం. మార్పు సాధ్యం కాదు అనుకున్నచోట మార్పు తెచ్చాం’ అంటుంది ‘ఉమెన్ కమాండోస్’ గ్రూప్ సభ్యురాలు విష్ణుదేవి.‘మాదకద్రవ్యాల వాడకం వల్ల గృహహింస ఎక్కువ అయింది. కుటుంబ జీవితం అస్తవ్యస్తంగా మారింది. మేము ఉమెన్ కమాండోస్ పేరుతో ఒక గ్రూప్గా ఏర్పడినప్పుడు మార్పు తేవడం మీ వల్ల కాదు అన్నారు కొందరు. కచ్చితంగా అవుతుంది అని నిరూపించాలనుకున్నాం. నిరూపించాం’ అంటుంది రాజేశ్వరి మారవీ. శైలి(పేరు మార్చాం)కి సరదాగా డ్రగ్స్ అలవాటు మొదలైంది. చివరికి ఈ దురలవాటు తనను మృత్యువు అంచుల వరకు తీసుకువెళ్లింది. పంజాబ్లో శైలిలాంటి ఎంతోమంది మహిళలను డ్రగ్స్ మృత్యునీడ నుంచి బయటకు తీసుకువచ్చి కొత్త జీవితాన్ని ఇచ్చింది హెర్మిటేజ్ రిహాబ్ సెంటర్.మాదక ద్రవ్యాల బారిన పడిన మహిళలను కుటుంబ సభ్యులు ఈసడించడం, దూరం పెట్టడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యేది. పురుషుల కోసం మాత్రమే అన్నట్లుగా ఉండే రిహాబిలిటేషన్ సెంటర్లు మహిళలను చేర్చుకోవడానికి నిరాకరించేవి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని హెర్మిటేజ్ రిహాబ్ కేంద్రం మొదలైంది. పంజాబ్లోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు ఈ ఆల్–ఉమెన్ డ్రగ్ రిహాబ్ సెంటర్లో చేరుతుంటారు. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే.మహిళలే కీలకంమరోవైపు చూస్తే...మాదకద్రవ్యాల వ్యతిరేకపోరాటంలో, మాదకద్రవ్యాల బారిన పడిన వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో మహిళలను కీలక భాగస్వాములను చేస్తోంది పంజాబ్ ప్రభుత్వం. డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో భాగంగా వర్క్షాప్లు నిర్వహించింది. ‘మాదకద్రవ్యాల బారిన పడిన వాళ్లను అందులో నుంచి బయటికి తీసుకువచ్చే శక్తి మహిళలకు ఉంది’ అంటున్నారు పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి డా.బల్బీర్సింగ్.బెదిరింపులు వచ్చినా...డ్రగ్స్పై పోరాడుతున్న మహిళలకు డ్రగ్ మాఫియా నుంచి బెదిరింపులు వచ్చాయి. దాడులు జరిగాయి. అయినా వారు వెనక్కి తగ్గలేదు. మహిళా యోధుల పట్టుదల ముందు డ్రగ్ మాఫియా తోకముడిచింది.బాధ పడకూడదు... పోరాడాలిపంజాబ్లోని బఠిండా జిల్లాలోని దులేవాలా గ్రామంలో పదకొండు మంది మహిళలతో ఏర్పాటైన ‘ఆల్–ఉమెన్ యాంటీ–డ్రగ్ అవేర్నెస్ కమిటీ’ గ్రామంలోని డ్రగ్స్ భూతాన్ని తరిమేసింది. సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ షిందర్ పాల్ కౌర్ ఈ కమిటీకి నాయకత్వం వహించింది. ‘డ్రగ్స్ వల్ల ఎన్నో కాపురాలు కూలిపోయాయి. ఎంతోమంది దారి తప్పి వినాశనాన్ని కొని తెచ్చుకున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి మేము చేసిన ప్రయత్నం ఫలించింది’ అంటుంది షిందర్ పాల్ కౌర్. (చదవండి: అమ్మానాన్నల హక్కు కాదు..! అది కేవలం పిల్లల హక్కు..) -
నా మొండి భర్తను మార్చగలరా!
నా భర్తకు 48 ఏళ్లు, రైల్వే ఉద్యోగి. చిన్నవయసు నుండే కుటుంబ బాధ్యతలు ఆయన మీద పడ్డాయి. అప్పటి నుండే మందుకు, స్మోకింగ్కి బానిస అయ్యారు. ఈ మధ్య గుండెకి ఆపరేషన్ కూడా అయింది. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాతి రోజే మళ్లీ మందు, సిగరెట్ మెదలుపెట్టారు. ఆఫీస్కి సరిగా వెళ్ళరు. మందులు వేసుకోరు. ఈయన పరిస్థితికి భయం వేసి హైదరాబాద్లో రిహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేశాము. కొన్నిరోజులు అవగానే అక్కడ తిండి తినకుండా గొడవ చేసి మారుతానని బతిమిలాడితే ఇంటికి తీస్కొచ్చేశాం. బయటకు రాగానే అన్నీ – మళ్ళీ మొదలు పెట్టారు. ఇలా కనీసం ఇప్పటికి మూడుసార్లు జరిగింది. అసలు ఆయన మారతాడంటారా? సలహా ఇవ్వండి.– పద్మలత, కాజీపేట మీ భర్త ఆరోగ్యం గురించి మీరు పడే ఆందోళన, తపన అర్థం అవుతున్నాయి. ఇది ఆల్కహాల్కి బానిస అయిన చాలామంది పేషెంట్ల కుటుంబ సభ్యుల సమస్య కూడా. ఆల్కహాల్ అడిక్షన్కి వంశపారంపర్యం, వ్యక్తిత్వం, చుట్టూ ఉండే పరిస్థితులు, ఇతర మానసిక సమస్యలు... ఇలా అనేకమైన కారణాలు ఉంటాయి. మద్యం లేదా ఇతర, మత్తుపదార్థాలకు బానిస అయిన వారి మెదడు అనేకమైన మార్పులకి గురయి ఉంటుంది. వారిని ఆ అలవాటు నుండి బయట తీసుకు రావడానికి చాలా సమయం పడుతుంది. ఇక రిహాబిలిటేషన్ అనేది చాలా నిదానంగా చేసే చికిత్స. అందుకని ఆ వ్యక్తికి మారాలి అనే ఆలోచన లేనపుడు, ఆ ఆలోచన తీసుకురావడానికి కూడా చాలా సమయం పడుతుంది. చికిత్సకి అసలు సహకరించరు. ఇలాంటి సందర్భాల్లో కుటుంబ సభ్యుల సహకారం అవసరం. వీరిలో మారాలనే ఆలోచన వచ్చేలా సి.బి.టి, మోటివేషన్ ఇంటర్వ్యూయింగ్ పద్ధతులు వాడతాము. ఒకసారి మోటివేషన్ వస్తే అపుడు మళ్ళీ మద్యం జోలికి పోకుండా ఉండడానికి ‘ప్రివెన్షన్ రిలాప్స్’ పద్ధతులు చెబుతారు. దీనితోపాటు వారి జీవన శైలిలో, స్నేహితుల విషయాలలో చాలా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. స్ట్రెస్ తట్టుకోడానికి, కోపం తొందరపాటు తగ్గించుకునేలా కూడా థెరపీ ఇస్తారు. 30 సంవత్సరాల అలవాటుని 30 రోజుల్లో మార్చడం అసంభవం అని గుర్తుపెట్టుకోండి! ఈ సందర్భంలోనే మీరు ఓర్పుగా, నేర్పుగా సంయమనంతో ఉండాలి. అలాగే మీరు చేర్పించే రీహాబిలిటేషన్ సెంటర్లో సరైన శిక్షణ, అనుభవం కలిగిన మానసిక వైద్యులు, కౌన్సిలర్లు, సోషల్ వర్కర్లు, యోగ థెరపిస్ట్ లాంటి సౌకర్యాలు ఉన్నాయో లేదో చూడండి. పేషెంట్తో పాటు కుటుంబ సభ్యులు కూడా రెగ్యులర్ కౌన్సెలింగ్ తీసుకోవాలి. వైద్యుల సలహా మేరకు చికిత్స పూర్తి స్థాయిలో అందించండి. అతనిలో తప్పకుండా పరివర్తన వస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్ !డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్ విజయవాడ(మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ sakshifamily3@gmail.com)(చదవండి: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా క్యూట్ లవ్ స్టోరీ..! ప్రియతమ ఈ జర్నీలో..) -
మూడు ముళ్లెందుకు గుచ్చుకుంటున్నాయి?
‘మగాళ్లు, ఆడాళ్లు ఇద్దరూ సమానమే.. కానీ మగాళ్లు ఇంకొంచెం ఎక్కువ సమానం!’ ‘రాధాగోపాలం’ సినిమాలో డైలాగ్! ‘భార్యభర్తలిద్దరూ సమానమే అయితే భర్త ఇంకొంచెం ఎక్కువ సమానం’ అని సంసారంలో ఉన్న మాటను ఇప్పటి తరం అంటే అమ్మాయిలు అంగీకరించే పరిస్థితిలో లేరు! ఈ మాట వినపడగానే పెద్దలు, సంప్రదాయవాదులు అందుకే మనమూ పాశ్చాత్యుల్లా విడాకులకు తెగబడుతున్నాం అనేస్తారు ఘాటుగా!ఇంతకీ ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దగ్గర విడాకుల సంఖ్య ఎంతో తెలుసా.. కేవలం ఒక్క శాతమే! అంతదానికే ఇంత ఘాటా? అంటే కుటుంబ వ్యవస్థకు పునాది వివాహ వ్యవస్థగా మన్ననలు అందుకుంటున్న దేశం కదా! అలాంటి సమాజంలో ప్రపంచంతో పోలిస్తే తక్కువే అయినా విడాకుల సంఖ్య పెరుగుతుండటం, అందుకు అనుమతులు వస్తుండటం ఆందోళన కలిగించే అంశమే కదా! ఈ నేపథ్యంలో మన పెళ్లి వ్యవస్థ బీటలు వారుతోందా? నివారోణాపాయం ఏంటి... వంటి అంశాల మీద నేటి నుంచి వరుస కథనాలు. ఈ రోజు.. పెళ్లి, అది ప్రమోట్ చేస్తున్న, డిమాండ్ చేస్తున్న అంశాలేంటో చూద్దాం! ఇదివరకు.. ఆడపిల్లకు ఉత్తరం చదివే అక్షరజ్ఞానం ఉంటే సరిపోతుందని అంతవరకే అనుమతించారు. తర్వాత ఆ ఆలోచన కాస్త మారి అమ్మాయి తన పిల్లలకు చదువు చెప్పుకునేంత జ్ఞానం సంపాదించాలని ఆ అనుమతిని కాస్త సడలించారు. ఇప్పుడు అమ్మాయిలు ప్రొఫెషనల్ డిగ్రీలు, పీహెచ్డీలూ చేసి, అబ్బాయిలు ఏయే రంగాల్లో ఉన్నారో ఆయా రంగాల్లో తమ ఉనికినీ చాటుకుంటున్నారు. అబ్బాయిలతో సమానంగా శ్రమించి సమాన వేతనాల కోసం డిమాండ్ చేస్తున్నారు. సమానత్వ సాధనలో ఇది శుభపరిణామం. కానీ ఇదే పెళ్లిని బ్రేక్ చేస్తోందని సంప్రదాయ వాదుల భావన. ఎందుకంటే...అక్షరజ్ఞానం నుంచి ఆఫీస్లకు చేరుకునేదాకా ఆడవాళ్ల ప్రగతిని ఆంక్షలు, హద్దులతో అయినా అంగీకరించిన సమాజం కనీసం స్థాయిలో డొమెస్టిక్ లేబర్లో పురుషుల భాగస్వామ్యాన్ని అంగీకరించలేకపోతోంది. ఆ ప్రగతికి సమాన నిష్పత్తిలో డొమెస్టిక్ లేబర్లో పురుషుల పాత్ర పెరగలేదు. అంటే పెళ్లి ఆ బాధ్యతను పూర్తిగా ఇంకా స్త్రీల భుజాన్నే మోపుతోంది. భార్యాభర్తలు పేరెంట్స్గా మారినా భర్త మీద పెద్దగా భారం పడట్లేదు. తల్లయిన భార్యకు మాత్రం క్రమంగా విశ్రాంతి తగ్గిపోతోందని, పిల్లలు పుట్టగానే నిద్ర నుంచి కెరీర్ వరకు తల్లే త్యాగం చేయాల్సి వస్తోందని అధ్యయనాల సారం. పేరెంటింగ్ సమస్య కాదు. మ్యారేజ్లో పేరెంటింగ్ని కేవలం తల్లి బాధ్యతలా పరిగణించడమే సమస్య, ఆ మాటకొస్తే పెళ్లిలోని ప్రేమ, విధేయత, కమిట్మెంట్తో కూడా ప్రాబ్లం లేదు. పెళ్లి నిర్మాణమే అసలుప్రాబ్లం’ అంటున్నారు ఈతరం అమ్మాయిలు. అందుకే సాధికారత సాధించిన యువతలు ఆర్థిక, సామాజిక భద్రతకో, ఓ ఇంటి వారవడం కోసమో పెళ్లి చేసుకునే స్థితిలో లేరు. పురుషులతోపాటు స్త్రీలకూ అంతేప్రాధాన్యం, గౌరవం ఇస్తూ భాగస్వామ్యానికి అసలైన నిర్వచనంగా ఉండే బంధాన్ని కోరుకుంటున్నారు. ఆ ఫ్రేమ్లో లేని పెళ్లిని త్యజించడానికి సిద్ధపడుతున్నారు. ఆనందం పంచలేని బంధానికి విడాకులనివ్వడానికీ వెనుకాడటం లేదు. సంప్రదాయం కన్నా మానసిక ఆరోగ్యం, భద్రతకేప్రాధాన్యం ఇస్తున్నారు. దీన్ని కుటుంబం గ్రహించాలి. పిల్లల పెంపకం నుంచే జాగ్రత్త వహించాలి. చదువు విషయంలో అమ్మాయి, అబ్బాయి పట్ల చాలావరకు సమానత్వం చూపిస్తున్న తల్లిదండ్రులు ఇంటి పనుల విషయంలోనూ ఆ సమానత్వాన్ని ప్రదర్శించాలి. ఎందుకంటే అక్కడ అమ్మాయిలకు వెసులుబాటు దొరికితేనే వారి సాధికారతకు సార్థకత చేకూరుతుంది. ఇప్పటికిప్పుడు తల్లిదండ్రులు డొమెస్టిక్ లేబర్లోనూ అబ్బాయిలకు వాటా ఇస్తే భవిష్యత్ తరానికి అది నార్మలైజ్ అవుతుంది. సమాజంలో జరుగుతున్నదాన్ని అందరికీ ఆపాదించలేం. ఎవరి జీవితం వాళ్లది.. ఎవరి ఎక్స్పీరియెన్స్ వాళ్లది. పెళ్లి విషయంలోనూ అంతే! పెళ్లి కావాలనుకున్నా వద్దనుకున్నా అది వాళ్ల వ్యక్తిగత చాయిస్. అలాగే విడాకుల విషయంలోనూ అంతే! కలిసి ఉందామనుకున్నా, వద్దనుకున్నా ఆ జంట నిర్ణయం. అయితే ఆ చాయిస్కి కానీ, నిర్ణయాలకు కానీ సమాజంలో స్పేస్ ఉండాలి. – ఐశ్వర్య రాయ్ బచ్చన్‘నాకిప్పుడు 59 ఏళ్లు. శారీరకంగా, మానసికంగా నానా అవస్థలు పడుతూ సినిమాల్లో పనిచేస్తున్నాను. పెళ్లి పేరుతో నా జీవితంలోకి వచ్చిన భాగస్వామి ఏ కారణంతో విడిపోయినా భరణం కింద నా కష్టార్జితంలో సగానికి ఎసరుపెడుతుంది. యంగ్ ఏజ్లో పెళ్లయితే పర్లేదు.. అవతలి వాళ్లు మనోవర్తి కింద ఎంత డబ్బు తీసుకున్నా మళ్లీ సంపాదించుకోగలమనే నమ్మకం ఉంటుంది. కానీ ఈ వయసులో? అదంతా ఎక్కడ పెట్టుకోను? అందుకే ఇలా గడచిపోతోంది గడచిపోనివ్వండి’ – సల్మాన్ ఖాన్, బాలీవుడ్ నటుడు– సరస్వతి రమ -
మకడమియ గింజలు.. సుసంపన్న పోషక విలువలు
మకడమియ.. క్వీన్ ఆఫ్ నట్స్. మకడమియ కాయ లోపల ఉండే గింజలు డైటరీ ఫ్యాట్కు పెట్టింది పేరు. మకడమియ కాయలు పెద్ద గోళీకాయంత సైజులో ఉంటాయి. పచ్చి కాయ ఆకుపచ్చగా, ఎండుకాయ ముదురు గోధుమ రంగులో ఉంటుంది. దాని పైపొర గట్టిగా ఉంటుంది. దాన్ని పగులగొడితే లోపల వెన్న రంగు లేదా లేత గోధుమ రంగులో గింజ ఉంటుంది. అంచేత.. దీన్ని తెలుగులో ‘వెన్న గింజ’ అందాం!అవకాడోను ‘వెన్న పండు’ అంటారు. 100 గ్రాముల పండులో వెన్న రంగులో ఉండే గుజ్జు 15 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. దీని కన్నా చాలా ఎక్కువ మోతాదులో మకడమియ గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. తక్కువ పిండి పదార్థం, ఎక్కువ కొవ్వు, ప్రొటీన్ను కలిగి ఉండటం దీని విశిష్టత. 100 గ్రాములు మకడమియ గింజల్లో కొవ్వు 76 గ్రాములు, మాంసకృత్తులు 8 గ్రా., పిండి పదార్థాలు 14 (పీచు 8.6 తీసేస్తే నికర పిండి పదార్థం 5.4) గ్రాములు ఉంటాయి. లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ డైట్ తీసుకునే శాకాహారులకు, వీగన్ ఆహారాన్ని తీసుకునే వారికి ఆరోగ్యకరమైన కొవ్వు, మాంసకృత్తులకు మకడమియ గింజలు అద్భుతమైన వనరు. ట్రీ నట్ జాతుల్లో పేరెన్నిక గన్న మకడమియ పుట్టిల్లు ఆస్ట్రేలియా అయినప్పటికీ ఉత్పత్తిలో దక్షిణాఫ్రికా ముందుంది. కెన్యా, మలావితో పాటు అమెరికాలోని హవాయి దీవుల్లోనూ విస్తారంగా సాగవుతోంది. మన దేశంలో కర్ణాటక, తమిళనాడు ముందున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే సాగు ప్రారంభమైంది. అధిక విలువైన గింజలనిచ్చే దీర్ఘకాలిక చెట్టు మకడమియ. వాణిజ్యపరంగా కూడా మంచి భవిష్యత్తు ఉందని చెప్పొచ్చు.మకడమియ గింజల (macadamia nuts) ఉత్పత్తి ప్రపంచవ్యాప్తంగా క్రమంగా పెరుగుతోంది. వరల్డ్ మకడమియ ఆర్గనైజేషన్ (డబ్ల్యూ.ఎం.ఓ.) సమాచారం ప్రకారం.. 2022లో 2,98,914 టన్నుల మకడమియ కాయల నుంచి తీసిన గింజల ఉత్పత్తి జరిగింది. 2027 నాటికి ఇది రెట్టింపవుతుందని అంచనా. 2030 నాటికి 6,60,000 మెట్రిక్ టన్నులకు పెరుగుతుందని డబ్ల్యూ.ఎం.ఓ. ఊహిస్తోంది. ఆరోగ్యదాయకమైన నట్స్ను ఆహారంలో భాగం చేసుకుంటున్న వారి సంఖ్య ఆసియా దేశాల్లో, ముఖ్యంగా చైనా, భారత్లలో, అంతకంతకూ పెరుగుతుండటం.. ఈ దేశాల్లో ప్రజల ఆదాయాలు వేగంగా పెరుగుతుండటం, పాశ్చాత్య ఆహారపు అలవాట్లు విస్తరిస్తుండటం వంటి కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా వంటశాలల్లోనూ, ఆహారోత్పత్తుల పరిశ్రమల్లోనూ మకడమియ గింజల వినియోగం పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.చెట్ల ఎత్తు 7 నుంచి 40 అడుగులుమకడమియ చెట్లు ఏ కాలంలో అయినా పచ్చగా ఉంటాయి. ఈ చెట్టు 2–12 మీటర్ల (7–40 అడుగులు) ఎత్తు పెరుగుతుంది. ఈ చెట్టుకు పొడవాటి పూల జడ మాదిరిగా పూలు పూచి, కాయలుగా మారతాయి. కాయలో ఒకటి లేదా రెండు గింజలు ఉంటాయి. పెద్ద సైజు కాబూలి శనగల గింజల్లాగా ఉంటాయి. కాయ పైన పెంకు చాలా గట్టిగా ఉంటుంది. ఏదైనా పదార్థం గట్టితనాన్ని కచ్చితంగా చెప్పాలంటే.. ‘విక్కర్స్ హార్డ్నెస్’ స్కోర్లో కొలుస్తారు. దీని స్కోరు 35.దీన్ని తొలిగా వాణిజ్య స్థాయిలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటైన హవాయిలో సాగు చేశారు. ఆస్ట్రేలియా నుంచి 1880వ దశకంలో మకడమియ విత్తనాలు తీసుకెళ్లి హవాయిలో సాగు ప్రారంభించారు. తర్వాత వందేళ్ల వరకు హవాయినే అత్యధిక సాగుదారు. 2010వ దశకం నుంచి సాగు చేస్తున్న దక్షిణాఫ్రికా ఇప్పుడు అత్యధిక ఉత్పత్తిదారుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా సాగువుతున్న ఆస్ట్రేలియాకు చెందిన ఆహార పంట ఇదే!రెండు వంగడాలుమకడమియ చెట్టు జాతులు నాలుగు. ఇందులో రెండు రకాలను వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు. మొదటిది మకడమియ ఇంటెగ్రిఫోలియ. దీని కాయ పెంకు నున్నగా ఉంటుంది. రెండోది మకడమియ టెట్రాఫిల్లా. దీని కాయ పైపెంకు గరుకుగా ఉంటుంది. దీనికి మరింత సువాసన ఉంటుంది. కొత్త చిగుళ్లు ఎర్రగా, ఆకులు ముదురు ఆకుపచ్చగా ఉంటాయి. నాటిని నాలుగేళ్లలో కాపుకొస్తుంది. పొడవాటి కంకికి పూత పూస్తుంది. గెలలుగా కాయలు కాస్తాయి. 8 ఏళ్ల చెట్టు ఏటా 18 కేజీల కాయలు కాస్తుంది. కాయల బరువుకు కొమ్మలు విరిగే పరిస్తితి కూడా ఉంటుందట. అయితే, కాయల బరువులో పైన పెంకు బరువు 72.4% పోగా 27.6% తినదగిన గింజలు వస్తాయి.దక్షిణాఫ్రియా సూటబుల్ప్రస్తుతం మకడమియ నట్స్ సాగులో దక్షిణాఫ్రికాదే ఆధిపత్యం. ఆ దేశపు వాతావరణం, సారవంతమైన నేలలు, ఆధునిక పద్ధతుల్లో సాగుకు అధిక పెట్టుబడులు పెట్టడంతో దక్షిణాఫ్రికాలోని లింపొపొ, క్వాజులు–నటల్, పుమలంగ రాష్ట్రాల్లో సాగు మకడమియ సాగు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ నట్స్కు డిమాండ్ కారణంగా పెద్ద కమతాల రైతులు ఆసక్తి చూపటంతో విస్తీర్ణం త్వరితగతిన పెరిగింది. ప్రాసెసింగ్ సదుపాయాలు, ఎగుమతి వసతులకు సంబంధించి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టటం, చీడపీడలను తట్టుకునే నాణ్యమైన అధికోత్పత్తి వంగడాలను వాడటం దక్షిణాఫ్రికాకు కలిసి వచ్చింది. ప్రస్తుతం 60 వేల మెట్రిక్ టన్నుల మకడమియ కాయలను ఏటా ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచ మార్కెట్ సరఫరాలో ఇది 30%. ఆస్ట్రేలియాఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ ఈశాన్య ప్రాంతం, క్వీన్స్లాండ్ మధ్య, ఆగ్నేయ ప్రాంతాల్లో ఆది నుంచి విస్తారంగా సాగువుతోంది. అందుకే దీనికి క్వీన్స్లాండ్ నట్, బుష్ నట్, మరూచి నట్, బాపిల్ నట్ అని కూడా పిలుస్తారు. అక్కడి ఆదివాసులకు ఇదొక ముఖ్య ఆహారం. యూరోపియన్లు ఆస్ట్రేలియాకు రాక మునుపు నుంచే వారు వీటిని తింటున్నారనటానికి ఆధారాలున్నాయని చెబుతారు. పొదలా పెరిగే చెట్టుకు కాచేది కాబట్టి బుష్ నట్ అన్నారు. ఆస్ట్రేలియా 45 వేల నుంచి 50 వేల మెట్రిక్ టన్నుల కాయలను ప్రతి ఏటా ఉత్పత్తి చేస్తోంది. పండించిన దాంట్లో నుంచి 70% వరకు జపాన్, అమెరికా, చైనాలకు ఎగుమతి చేస్తోంది.మలావిఆఫ్రికా ఖండంలో వ్యవసాయ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మలావి. గత పదేళ్లలో మకడమియ సాగు ఈ దేశంలో బాగా విస్తరించింది. ఈ దేశపు వాతావరణం, సారవంతమైన భూములు అనుకూలిస్తున్నాయి. ప్రస్తుతం ఏటా 8 వేల నుంచి 10 వేల టన్నుల వరకు ఉత్పత్తి చేస్తోంది.కెన్యామలావి మాదిరిగానే కెన్యా కూడా కాఫీ, తేయాకు పంటలకు బదులుగా మకడమియ సాగును ప్రోత్సహిస్తోంది. 6 వేల నుంచి 8 వేల మకడమియ నట్స్ను కెన్యా ఏటా పండిస్తోంది. అందుకు అనుగుణంగా ప్రాసెసింగ్ సదుపాయాలను కూడా సమకూర్చుకుంది.హవాయిఅమెరికా సంయుక్త రాష్ట్రాల్లో భాగమైన హవాయి దేశంలోని మిగతా రాష్ట్రాలకు వందల మైళ్ల దూరంలో ఉండే ద్వీప రాష్ట్రం. ఈ ఒక్క రాష్ట్రంలోనే మకడమియ సాగవుతోంది. 20వ దశాబ్దంలో ఇదే అత్యధికంగా పండించింది. తర్వాత కాలంలో దక్షిణాఫ్రియా మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం హవాయి ఏటా 5–6 వేల మెట్రిక్ టన్నులు పండిస్తోంది. 250 కోట్ల డాలర్ల మార్కెట్ప్రపంచవ్యాప్తంగా మకడమియ గింజలకున్న ప్రస్తుత మార్కెట్ విలువ 250 కోట్ల డాలర్లు. వచ్చే పదేళ్లలో చాలా పెరుగుతుందని చెబుతున్నారు. మకడమియ పోషక విలువల గురించి ఆరోగ్య స్పృహ గల వారిలో అవగాహన పెరుగుతుండటం.. మొక్కల నుంచి వచ్చే కొలెస్ట్రాల్ లేని ఆయిల్స్కు ఆదరణ పెరుగుతుండటం.. ఆసియా, యూరప్ దేశాల్లో స్పెషాలిటీ, గౌర్మెట్ స్నాక్ మార్కెట్లు విస్తరిస్తుండటం.. పోలాంట్ బేస్డ్ డెయిరీ ప్రత్యామ్నాయాలకు ఆదరణ పెరటంతో మకడమియ గింజలతో తయారుచేసే పాలకు ప్రజాదరణ రావటం.. వంటి కారణాల వల్ల మకడమియ వాణిజ్యపరంగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. చదవండి: ఔషధ మొక్క.. ఆరోగ్యానికి రక్షకరువు ప్రాంతాల్లో సాగు చేసేటప్పుడు నీటి యాజమాన్యంలో జాగ్రత్తలు తీసుకోవటం, పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాల్లో మకడమియ సాగును విస్తరింపజేసే దశలో జీవవైవిధ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవటం, చిన్న–సన్నకారు రైతులకు సంబంధించి న్యాయబద్ధమైన వాణిజ్య ప్రయోజనాలు అందేలా చేయటం ద్వారా మకడమియ సాగును పెంపొందించుకోవడానికి అవకాశం ఉంది.కమ్మటి రుచిమకడమియ గింజలకు ఇంత ప్రాచుర్యం రావటానికి కారణం అందులోని సుసంపన్నమైన పోషక విలువలతో పాటు వెన్న వంటి రూపం, రుచి, సువాసనతో గింజ రుచిగా ఉండటమే. ఈ గింజను కాయలో నుంచి వెలికితీసిన తర్వాత అలాగే తినొచ్చు లేదా వేపుకొని తినొచ్చు. చాక్లెట్లు, అనేక చిరుతిళ్లలో వాడుతున్నారు. 78% వరకు నూనె ఉంటుంది. వంటకు, సౌందర్య సాధనాల తయారీలో వాడుతున్నారు. డెయిరీ ఫ్రీ బటర్స్, స్ప్రెడ్స్ తయారీలో ఈ నూనె వాడుతున్నారు. మకడమియ ఆయిల్ను ప్రీమియం హెయిర్కేర్, స్కిన్కేర్, మసాజ్ ఉత్పత్తుల్లో వాడుతున్నారు. ఒమెగా 7 ఫ్యాటీ ఆసిడ్స్, మోయిశ్చరైజింగ్ ప్రోపర్టీస్ కారణంగా దీనికి ప్రాధాన్యం ఉంది. -
కేన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?
సాక్షి ప్రతినిధి, వరంగల్: విస్తృతంగా విస్తరిస్తున్న కేన్సర్ మహమ్మారి ప్రజలు, ప్రభుత్వాలకు సవాల్ విసురుతోంది. వేగంగా ప్రబలుతున్న ఈ వ్యాధి దేశాన్నే కలవరపెడుతోంది. చాపకింద నీరులా అయిదేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఎగబాకింది. అధికారిక గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 5 ఏళ్లలో కేన్సర్ కేసుల సగటు పెరుగుదల 11.55 శాతంగా ఉంది. ఏపీలో 9 శాతం, తెలంగాణలో 10 శాతం చొప్పున కేసులు పెరిగాయి. మృతుల సంఖ్య కూడా దేశవ్యాప్తంగా లక్షల్లోనే ఉంది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 41 శాతం రొమ్ము, గర్భాశయ ముఖద్వార, రక్త, నోటి కేన్సర్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు / యూటీలలో కేన్సర్ పరిస్థితిపై ఇటీవలి భారతీయ ప్రజారోగ్య సంస్థ (ఐఐపీహెచ్) నివేదికపై ఏప్రిల్ 1న పార్లమెంట్కు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపిన ఈ వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కాగా కేన్సర్ ఇదే విధంగా కొనసాగితే.. జనాభాలో మార్పుల కారణంగా 2040 నాటికి కేసులు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని నిపుణులు, నివేదికలు హెచ్చరిస్తున్నాయి.మొదటి స్థానాల్లో యూపీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ ఏడాది ఏప్రిల్ 1న పార్లమెంట్లో.. మూడేళ్లలో విస్తరించిన కేన్సర్ కేసులపై రాష్ట్రాల వారీగా నివేదిక సమర్పించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 2022లో 14,61,427 కేసులు నమోదైతే, 2023 నాటికి 14,96,972కు పెరిగాయి. 2024 వచ్చేసరికి కేసుల సంఖ్య 15,33,055 గా నమోదైంది. కాగా రాష్ట్రాల వారీగా చూస్తే 2022, 2023, 2024లలో మూడేళ్లపాటు వరుసగా 2,10,958, 2,15,931, 2,21,000 కేసులతో.. దేశంలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో 1,21,717, 1,24,584, 1,27,512లతో మహారాష్ట్ర, ఆ తర్వాత స్థానంలో పశ్చిమ బెంగాల్లో 1,13,581, 1,16,230, 1,18,910 కేన్సర్ కేసులు పెరిగాయి. 4, 5, 6, 7 స్థానాల్లో బిహార్, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ ఉన్నాయి.కేన్సర్ వ్యాప్తికి ఇవే కారణాలు90–95 శాతం కేన్సర్లు జీవనశైలి, పర్యావరణ కారకాల వల్ల వస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ధూమపానం, మద్యపానం, పాన్, గుట్కా వంటివి నమలడం, ఊబకాయం, మానసిక ఒత్తిడి, మర్మావయవాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు కేన్సర్కు కారకాలుగా చెబుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పౌష్టికాహారం లోపించడం, 18 ఏళ్లలోపే పెళ్లి కావడం, పిల్లలు పుట్టడం, ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, 35 ఏళ్లు దాటాక గర్భధారణ, బిడ్డకు తల్లిపాలు పట్టకపోవడం, తక్కువ పండ్లు, కూరగాయల వినియోగం కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని అంటున్నారు. వ్యవసాయంలో రసాయనాల వాడకం కూడా కేన్సర్ వ్యాప్తికి ఒక కారణం కావచ్చని నివేదికలు చెబుతున్నాయి.తెలుగు రాష్ట్రాల్లోనూ అధికమే..కేన్సర్ కేసుల ఉధృతి తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కువగానే ఉంది. దేశవ్యాప్తంగా చూస్తే.. ఆంధ్రప్రదేశ్ 8, తెలంగాణ 11 స్థానాల్లో ఉన్నాయి. ఏపీలో 2022లో 73,536 కేసులు ఉండగా, 2023లో 75,086, 2024లో 76,708గా, తెలంగాణలో మూడేళ్లలో 49,983, 51,145, 52,334ల కేసులు నమోదయ్యాయి. కాగా తెలంగాణలోని హైదరాబాద్లో రొమ్ము కేన్సర్ (Breast Cancer) కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, పొగాకు, మద్యపానం, ఆహారపుటలవాట్లు, వ్యవసాయంలో రసాయనాల వాడకం వంటివి వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి.చదవండి: ఔషధ మొక్క.. ఆరోగ్యానికి రక్ష ఉమ్మడి వరంగల్కు వస్తే పురుషుల్లో ఊపిరితిత్తులు, శ్వాసనాళం, తల, గొంతు, బోన్, రక్త (లుకేమియా), ప్రోస్టేట్ కేన్సర్లు ఎక్కువగా ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. అత్యల్పంగా 28, 31, 32 కేసుల చొప్పున వరుసగా మూడేళ్లలో లక్షద్వీప్లో, డామన్లో 150 నుంచి 173, దాద్రా నగర్ హవేలీలో 238ల నుంచి 268లు, లద్దాఖ్లో 302 నుంచి 318కు కేన్సర్ కేసులను గుర్తించారు.స్క్రీనింగ్ టెస్టులకు ముందుకు రావాలి..కేన్సర్ను గుర్తించేందుకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించింది. జిల్లాల్లో 18 ఏళ్లు నిండిన వారికి ఉచితంగా స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలో ఏడాదిలో 600కు పైగా కేన్సర్ కేసులున్నాయి. వీరిలో 102కు పైగా నోటి కేన్సర్తో బాధపడుతున్న వారే.. గుట్కా, పొగాకు వల్ల నోటి కేన్సర్, ధూమపానం వల్ల ఊపిరితిత్తుల కేన్సర్ వస్తున్నాయి. నలభయ్యేళ్లు దాటిన స్త్రీలు రొమ్ము కేన్సర్ రాకుండా ఆరు నెలలకోసారి కేన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. – ఎ.అప్పయ్య, డీఎంహెచ్వో, హనుమకొండ జిల్లా -
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా క్యూట్ లవ్ స్టోరీ..! ప్రియతమ ఈ జర్నీలో..
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (International Space Station) (ఐఎస్ఎస్) వైపుకు ఈ రోజే(బుధవారం జూన్ 25)చేరుకోనున్నారు. ఈ యాక్సియం స్పేస్ సంస్థ చేపడుతున్న యాక్సియం-4 (AX-4) మిషన్లో శుభాంశు కీలక పాత్ర పోషించనున్నారు. నాసా ప్రకటన ప్రకారం, ఈ ప్రయోగం ఈ రోజు మధ్యాహ్నం 12:01 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రారంభమైంది. ఈ ప్రయోగం విజయవంతమైతే, గురువారం సాయంత్రం 4:30కి వ్యోమనౌక ఐఎస్ఎస్తో డాకింగ్ కానుంది. మన భారతీయ వ్వోమగామి ఈ ప్రతిష్టాత్మక మిషన్లో భాగం కావడంతో యావత్తు దేశం సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వుతూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. ఈనేపథ్యంలో ఆయన కుటుంబ నేపథ్యం, లవ్స్టోరీ గురించి తెలుసుకుందామా..!.ఆయన బుధావారం మధ్యాహ్నం ఫాల్కన్ 9 రాకెట్ రాకెట్ లాంచ్ అవ్వడానికి కొన్ని గంటల ముందు తన భార్య కోసం ఒక భావోద్వేగమైన లేఖ రాశారు. అదులో తన కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ..తన ప్రయాణంలో నువ్వులేని లేటుని భర్తీ చేయలేనిది అని భావోద్వేగంగా రాశారు. దానికి శుభాంశు భార్య కామ్నా గర్వంతో కూడిన ప్రేమతో స్పందించారు. ఈ క్రమంలోనే వారి ప్రేమ కథ తెరపైకి వచ్చింది. కామ్నా దంత వైద్యురాలు. ఆమెతో శుభాంశుకి దశాబ్దాల ప్రేమ బంధం ఉంది. వారిద్దరు మొదట లక్నోలోని ప్రాథమిక పాఠశాలలో కలుసుకున్నారు. అప్పటి నుంచి వారు మంచి స్నేహితులుగా ఉండేవారు. ఆయన తరగతి గదిలో అత్యంత సైలెంట్గా ఉండేవాడిని. ఒక్కమాటలో చెప్పాలంటే సిగ్గరి. అలాంటి వ్యక్తి జాతీయ స్థాయిలో ప్రేరణగా నిలవడం ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుందన్నారు. తమ విద్యా రంగాల దృష్ట్యా వేరైనా క్షణాలు ఎన్నో ఉన్నాయి. అయినా మా మధ్య ప్రేమ అలానే స్వచ్ఛంగా ఉంది. బహుశా అదే మమల్ని పెళ్లి పీటల వరకు వచ్చేలా చేసి ఉండొచ్చు. శుభాంశు కెరీర్ పరంగా ఎన్నో ఎడబాటులను తట్టుకుని నిలిచిన అపూర్వ ప్రేమ మాది అని కామ్నా సగర్వంగా చెప్పారు. అయితే తమ కొడుకు తన తండ్రితో గడిపే క్షణాలను కోల్పోడం మాత్రం ఇప్పటికీ బాధగానే ఉంటుంది. ఎన్ని బాధ్యతలున్నా..అతడి ఫోకస్ అచంచలంగా ఉంటుదని కీర్తించారు. అంతేగాదు శుభాంశు దృఢ సంకల్పాన్ని మహాభారతంలోని అర్జునుడితో పోల్చారామె. ఆయన మంచి ఏకాగ్రతతో స్పష్టమైన వైఖరి ఉన్న వ్యక్తిత్వం గలవాడని చెబుతున్నారు కామ్నా. ఫైటర్ జెట్ల నుంచి అంతరిక్షం వరకు చేరుకున్న అతడి కెరీర్ నిజంగా చాలా గొప్పదన్నారు. నక్షత్రాలలో తన స్థానాన్ని సుస్థిరపరుచుకోవాలనే ఆ కాంక్షతోనే ఈ స్థాయికి ఆయన చేరుకున్నారని చెప్పుకొచ్చారామె. ఆయన ఎల్లప్పుడూ "పరిస్థితి ఎంత సవాలుగా ఉన్నా, ఈత కొడుతూనే ఉండండి" అనే నినాదాన్ని గట్టిగా విశ్వసిస్తారని చెప్పుకొచ్చారు కామ్నా. కార్గిల్ యుద్ధంతో కెరీర్ యూటర్న్..శుభాంశు శుక్లా లక్నోలోని అలీగంజ్ క్యాంపస్లోని సిటీ మాంటిస్సోరి స్కూల్ (CMS) ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. కానీ 1998లో కార్గిల్ యుద్ధం సమయంలో కెరీర్ సడెన్గా మలుపు తిరిగింది. ఈ యుద్ధం అతనిలో దేశానికి సేవ చేయాలనే ప్రగాఢమైన కోరికను రేకెత్తించింది. దృఢ సంకల్పంతో తన కుటుంబానికి చెప్పకుండా UPSC నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) పరీక్షకు దరఖాస్తు చేసుకుని ఉత్తీర్ణులయ్యారు. అలా శుభాంశు 2005లో కంప్యూటర్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీతో పట్టభద్రుడయ్యారు. తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో విమాన శిక్షణ పొందాడు. చివరికి 2006లో అధికారికంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ స్ట్రీమ్లోకి నియమితులయ్యారు. ఆయన బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీని కూడా పొందారు. చాలా ఏళ్లుగా శుక్లా భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్, టెస్ట్ పైలట్గా సేవలందించారు. అదీగాక దాదాపు 2 వేల గంటల విమానయాన అనుభవంతో సాధించిన రికార్డు వివిధ రకాల విమానాలను అధిరోహించేలా చేసింది. ఆ కెరీర్ నేపథ్యమే 2019లో భారతదేశం ప్రతిష్టాత్మకమైన గగన్యాన్ మిషన్ కోసం నాలుగు వ్యోమగాములలో ఒకరిగా అతని ఎంపికకు దారితీసింది. అప్పటి నుంచి ఆయన రష్యాలోని యూరి గగారిన్ కాస్మోనాట్ శిక్షణా కేంద్రంలో, అలాగే బెంగళూరులోని భారతదేశ వ్యోమగామి శిక్షణా కేంద్రంలో కఠినమైన వ్యోమగామిగా శిక్షణ పొందారు.(చదవండి: ఇజ్రాయెల్ ప్రధానికి భారత్ అంటే ఇంత ఇష్టమా..! ఇక్కడ ఫుడ్ తోపాటు అమితాబ్తో..) -
స్టీలు సామాన్లు కొత్తవాటిలా మెరవాలంటే..!
వంటింట్లో పనిచేసే ఇంతులకు తరుచుగా కొన్ని సమస్యలు ఎదురవ్వుతుంటాయి. వంటి సామాన్ల దగ్గర నుంచి డ్రెస్సింగ్ టేబుల్స్ వరకు అన్నింటిని పరిశుభ్రంగా ఉంచడం తలొనొప్పిగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి అవి అందంగా మెరిపించడం ఓ పట్టాన సాధ్యం కాదు. ఏం చేయాలో పాలుపోక తెగ ఇబ్బంది పడుతుంటాం. అలాంటి వారికి ఈ సింపుల్ ఈ కిచెన్ టిప్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. అవేంటో చూద్దామా..!.స్టీల్ పాత్రలు వెలిసిపోయి మూతపడినట్లుగా అనిపిస్తే... అయిపోయిన టూత్పేస్టు ట్యూబ్ని ముక్కలుగా కత్తిరించి, లోపల ఉన్న కొద్దిపాటి పేస్టుని స్టీలు పాత్రకు రాసి టూత్ బ్రష్తో రుద్దాలి. రెండు చుక్కలు నీళ్లు వేసి రుద్ది, వస్త్రంతో తుడిస్తే కొత్తవాటిలా తళతళా మెరుస్తాయి. వెండిసామాన్లు కూడా టూత్బ్రష్తో రుద్దితే మురికి అంతాపోయి కొత్తవాటిలా కనిపిస్తాయి. మిరియాలు, ఉల్లిపాయ, వెల్లుల్లి పాయలను సమపాళ్లల్లో తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తరువాత మిశ్రమాన్ని వడగట్టి స్ప్రే బాటిల్లో వేయాలి. ఈ మిశ్రమాన్ని బల్లులున్న ప్రాంతంలో స్ప్రే చేస్తే ఘాటు వాసనకు బల్లులు పారిపోతాయి. డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్, చిన్న అద్దాలు మురికి పట్టి సరిగా కనిపించకపోతే కొద్దిగా టూత్పేస్టు వేసి రుద్ది, వస్త్రంతో తుడిస్తే దుమ్మూధూళి, మరకలు పోయి అద్దం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక కప్పు బేకింగ్ సోడాని సింక్లో చల్లండి. వెంటనే అర కప్పు వెనిగర్ వేయండి. కొన్ని నిమిషాల పాటు అలానే ఉండనివ్వండి. ఈ కాంబినేషన్ మురికిని తొలగించడమే కాకుండా బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తుంది. ఆ తరువాత వేడి నీళ్లతో క్లీన్ చేయండి. సింక్ దుర్వాసన పూర్తిగా పోతుంది. (చదవండి: యవ్వనంగా ఉండాలంటే.. చర్మంపై ఫోకస్ తప్పనిసరి..!) -
నలుగురితో కలిసే వ్యక్తా కాదా? ఇట్టే చెప్పేయొచ్చు ఇలా..!
ఒకే చిత్రాన్ని ఒక్కో వ్యక్తి ఒక్కో దృష్టితో చూస్తాడట. అందరికి ఆ చిత్రం ఒకేలా అనిపించదు. చెప్పాలంటే అందరికీ ఒకటే ఎలా నచ్చదో అలానే మన దృష్టి కోణాల్లో కూడా చాలా భేదాలు ఉంటాయట. అవే మన భావోద్వేగ స్థితిని, ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తాయని చెబుతున్నారు మానసిక నిపుణులు. శాస్త్రీయంగా ఇవి కచ్చితమైనవి అనేందుకు ఆధారాలు లేకపోయినా..కొన్ని అధ్యయనాల్లో ఆ ఫలితాలు చాలా ఆలోచింపచేసేలా ఉన్నాయి. పైగా ఇలాంటి ఫజిల్ చిత్రాలు సోషల్ మీడియాలో ప్రజాదరణ పొందడమే కాకుండా ఆకర్షణీయంగానూ, ఉత్సుకతను రేకెత్తించేలా ఉంటాయి. అలాంటి ఒక చిత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది మీరు ఎలాంటి స్వభావం గలవారో ఇట్టే చెప్పేస్తుందట. మరీ ఆ చిత్రం చెప్పే చిత్తరువు స్వభావం ఏంటో చూద్దామా..!.ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో మొట్టమొదటిసారిగా ఏం చూశారో చెప్పండి దాన్ని బట్టి అవతలి వారి స్వభావం ఈజీగా తెలుసుకోవచ్చు. View this post on Instagram A post shared by Recovery Trauma Ltd ♥️♥️♥️ (@recoverytraumaltd) మొదట జీబ్రాలు చూసినట్లయితే..మొదటగా జీబ్రాలనే చూస్తే..మీరు బహిర్ముఖుడని అర్థం. దీని అర్థం అందరితో స్నేహపూర్వకంగా ఉంటారని. ప్రజలతో మమేకం కావడానికే ఇష్టపడతారు. అంతేగాదు మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో ఉత్సాహంగా గడిపేందుకు ఎక్కువగా ఇష్టపడతారని అర్థం. అలాగే నచ్చిన హబీలో ముందుకు సాగడం, పార్టీలు చేసుకోవడం, కొత్త వ్యక్తులను కలవడం, స్నేహితులను చేసుకోవడం, వారితో గడిపే స్వభావం కలవారని చెబుతుందట. మొదట సింహాన్ని చూసినట్లయితేఅలాంటి వారు అంతర్ముఖులని అర్థం. ప్రజలతో అంత తేలిగ్గా కలవరు. వాళ్లు ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్న వ్యక్తులతోనే కలిసి మెలుగుతారు. ఇంట్లోనే బంధువులు లేదా సన్నిహితులతో కలిసి సినిమాలు చూడటం, చదవడం, యోగా వంటి కార్యకలాపాల్లో పాల్గొనడం వంటివి చేస్తారు. ఈ వ్యక్తులు ఇతర వ్యక్తుల సహవాసాన్ని అంతగా కోరుకోరట.సరదాగా ఉండే ఈ దృశ్య పజిల్ మనకు అవతలి వ్యక్తుల స్వభావాన్ని ఇట్టే పసిగట్టేలా చేయడమే గాక అలాంటి వాళ్లతో ఎలా నడుచుకోవాలో తెలియజేస్తుంది కదూ..!. ఇంకెందుకు ఆలస్యం మీక్కూడా ఏం కనిపిస్తుందో చెక్చేసుకోండి మరి..!.(చదవండి: ఇజ్రాయెల్ ప్రధానికి భారత్ అంటే ఇంత ఇష్టమా..! ఇక్కడ ఫుడ్ తోపాటు అమితాబ్తో..) -
ఆపన్నులకు కానుక..అసలైన వేడుక..
అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో వేడుకలు నిర్వహించేందుకు అనేక మంది వ్యక్తులు, సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. తొలి దశలో తమ పుట్టినరోజులను జరుపుకోడానికి వీటిని నగరవాసులు ఎక్కువగా ఎంచుకున్నప్పటికీ, అనంతర కాలంలో క్రమంగా పెళ్లిరోజు, ప్రమోషన్, రిటైర్మెంట్ ఇలా ప్రతి సందర్భాన్నీ వారితో పంచుకునేందుకు ఆసక్తికనబరుస్తున్నారు. ప్రత్యేక తేదీల నుంచి పండుగలు, నూతన సంవత్సరం వేడుకలు మొదలు.. అనేక రకాల వేడుకలు వీటికి జతకలిశాయి. బోలెడంత ఖర్చు పెట్టి పబ్స్, క్లబ్స్లో ఫ్రెండ్స్తో గడిపేకన్నా.. నిరుపేదల కడుపు నింపడమే మిన్న అని కొందరు అనుకుంటుంటే మరికొందరేమో.. అటు అన్నార్తులతోనూ, ఇటు బంధుమిత్రులతోనూ వేర్వేరుగా వేడుకలు నిర్వహించుకుంటున్నారు. మరికొందరైతే ఏకంగా వృద్ధాశ్రమాలు, అనాథశరణాయాలతోనే సరిపెట్టుకుంటున్నారు. తమకు తోచిన సాయాన్ని అందించడంతోపాటు వారికి అండగా నిలుస్తున్నారు. ఆద్యంతం.. ఆనందం.. ఈ తరహా వేడుకలు ట్రెండ్ నగరంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పలు స్వచ్ఛంద సంస్థలకు ప్రోత్సాహకరంగా మారింది. ఈ వేడుకల్లో భాగంగా ఆశ్రమాలు, హోమ్స్లో ఉన్నవారితో కలిసి కేక్ కటింగ్, ఆటపాటలతో అలరించడం, విందు వినోదాలు, బహుమతులను పంచడంతో పాటు కొందరు ఆర్థిక సహకారం కూడా అందిస్తున్నారు. తద్వారా నిర్వహణ భారాన్ని కూడా పంచుకుంటున్నారు. కొందరు మరింత ముందుకెళ్లి ఆయా హోమ్స్లో ఉంటున్నవారిని సినిమాలకు, జూ పార్క్, సిటీ టూర్స్.. తదితరాలకు తీసుకెళుతూ వారికి మరచిపోలేని అనుభవాలను, వారు వ్యక్తిగతంగా పొందలేని ఆనందాన్ని, అనుభవాలను వారికి అందిస్తున్నారు. ఒంటరితనాన్ని దూరంచేస్తూ.. ఇలాంటి కార్యక్రమాలు తమకు ఎవరూ లేరనే ఆవేదనను ఆపన్నుల నుంచి తాత్కాలికంగానైనా దూరం చేస్తున్నాయి. ‘ఎంత డబ్బులు ఖర్చు చేశాం అనేదాని కన్నా ఎంత మందికి నిజమైన సంతోషాన్ని అందించగలిగాం? అనేదే ముఖ్యం. వారిలోని ఒంటరితనాన్ని దూరం చేసేందుకు.. నా పుట్టిన రోజును ప్రతిసారీ ఏదో ఒక వృద్ధాశ్రమంలో, ఆర్ఫన్ హోమ్స్లో జరుపుకోవడం ఒక అలవాటుగా మార్చుకున్నాను’ అని చెప్పారు హైదరాబాద్ నగరానికి చెందిన మహిళా వ్యాపారవేత్త విభాజైన్. తనను చూసి తన స్నేహితులు మరికొంత మంది కూడా ఇదే బాట అనుసరిస్తున్నారంటూ ఆమె ఆనందం వ్యక్తం చేశారు. మేము సైతం అంటున్న ఈవెంట్ ఆర్గనైజర్లు.. హైదరాబాద్ నగరవాసుల్లో ఈ తరహా వేడుకల నిర్వహణ పట్ల పెరుగుతున్న ఆసక్తి దీని కోసం ప్రత్యేకంగా ఈవెంట్ మేనేజర్లు సైతం పుట్టుకురావడానికి దోహదం చేసింది. సంపన్న వ్యాపారుల పుట్టిన రోజులు, పెళ్లి రోజులు వంటివి అనాథలు, నిరుపేదల నడుమ జరుపుకునేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లూ చేయడం ద్వారా పలువురు ఈవెంట్ నిర్వాహకులు సిటీలో ఈ తరహా కార్యక్రమాలు ఊపందుకోడానికి కారణమవుతున్నారు. అంతేకాకుండా ఇలాంటి వేడుకలకు సోషల్ మీడియా ద్వారా అద్భుతమైన స్పందనను రాబట్టే పని సైతం వీరే నిర్వహిస్తుండడం విశేషం. ఏది ఏమైనా నగరంలో నిరుపేదలకు, అనాథలకు ఈ తరహా వేడుకలు ఎంతో ఉపయుక్తంగా మారాయనేది నిస్సందేహం.పండుగలు సైతం.. తొలుత ఆర్ఫన్ హోమ్స్, ఆశ్రమాల్లో సిటిజనులు పుట్టినరోజులే ఎక్కువగా జరుపుకునే వారు. అయితే ఆ ధోరణి మరింతగా పుంజుకుంటుండగా.. ప్రస్తుతం కాదేదీ సాయానికి అనర్హం అన్నట్టుగా మరికొన్ని ముఖ్యమైన సందర్భాలనూ వాటికి జతచేస్తున్నారు. ముఖ్యంగా వినాయకచవితి రోజునఅనాథ చిన్నారులతో కలిసి వినాయక ప్రతిమలు తయారు చేయడం వంటివి, అలాగే దీపావళి రోజున వృద్ధులు, చిన్నారులతో కలిసి టపాసులు కాల్చడం.. వంటివి చేస్తున్నారు. ఇలా సంప్రదాయ పండుగలు జరుపుకోవడం మొదలుకుని.. ఫ్రెండ్ షిప్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, న్యూ ఇయర్ వంటి ఆధునిక పార్టీల వరకూ ఈ ట్రెండ్కు జతచేస్తున్నారు. ‘నా కన్నతల్లి నాకు దూరమైనప్పటి నుంచీ మాతృదినోత్సవం రోజున ఓ వృద్ధాశ్రమంలో ఎందరో కన్నతల్లులతో కలిసి గడపడం ఒక అలవాటుగా మార్చుకున్నాను. అది నాకెంతో సంతృప్తిని అందిస్తోంది’ అని చెబుతున్నారు నగరానికి చెందిన డిజైనర్ రజితారాజ్. (చదవండి: అమ్మానాన్నల హక్కు కాదు..! అది కేవలం పిల్లల హక్కు..) -
ఇజ్రాయెల్ ప్రధానికి భారత్ అంటే ఇంత ఇష్టమా..! ఇక్కడ ఫుడ్ తోపాటు అమితాబ్తో..
గత కొద్దిరోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు యుద్ధజ్వాలలతో భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడి జోక్యంతో ప్రస్తుతం ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. యుద్ధం ఆగిపోయినట్లేనా కాదా..? అనేది స్పష్టం కాకపోయినా..ఇరు దేశాలు ఈ యుద్ధం కారణంగా వార్తల్లో హైలెట్గా నిలిచాయి. అదీగాక శత్రుదేశాన్ని పలు రకాలుగా దెబ్బ కొట్టి..ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ భారీ స్థాయిలో పాపులారిటీని, ప్రజాదరణను పెంచుకున్నారు. ముఖ్యంగా ఈ యుద్ధంలో తనకు తోడుగా అగ్రరాజ్యం కలిసివచ్చేలా ట్రంప్ను ఒప్పించడంలోనూ నెతన్యాహూ పూర్తి స్థాయిలో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో నెతాన్యాహూకి భారత్తో ఉన సత్సంబంధాలు..ఆయన మన దేశం అంటే ఎందుకంత ఇష్టం తదితరాల గురించి తెలుసుకుందామా..!.ఇజ్రాయెల్లో అత్యంత సుదీర్ఘకాలం ప్రధానిగా ఉన్న బెంజమిన్ నెతన్యాహూ తన దేశాన్ని, విదేశాంగ విధానాలను ఎలా ప్రభావితం చేయగలరనే దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిజానికి రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగతంగా ఆయన ఎలా ఉంటారనేది కూడా ఎవ్వరికీ పెద్దగా తెలియదు. ఆయనకు భారతదేశం, అక్కడి ప్రజలు, వంటకాలంటే మహా ఇష్టం. మన ప్రధాని మోదీ ఇజ్రాయెల్ సందర్శనకు వచ్చినప్పుడూ..ఈ రోజు కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నానంటూ ఆలింగనం చేసుకున్నారు. పైగా భారత్ పట్ల తనకున్న అభిమానాన్నికూడా చాటుకున్నారు. ఇక ఇరు దేశాల మధ్య చారిత్రక సైద్ధాంతిక వ్యత్యాసం ఉన్నప్పటికీ..భారత్ ఇజ్రాయెల మధ్య మంచి స్నేహబాంధవ్యాలు ఉన్నాయనే చెప్పొచ్చని చెబుతున్నారు విశ్లేషకులు.'బీబీ'గా పిలిచే బెంజమిన్ నెతన్యాహు ఎవరంటే..బెంజమిన్ నెతన్యాహు 1949లో టెల్ అవీవ్లో ఒక జియోనిస్ట్ కుటుంబంలో జన్మించారు. యూదు రాజ్యాధికారాన్నిఎంతో విలువైనదిగా భావిస్తారు. ఆయన తాత నాథన్ ఒక రబ్బీ(యూదు మత నాయకుడు). ఆయన అమెరికా, యూరప్లలో పర్యటించి జియోనిజానికి మద్దతు ఇచ్చేలా ప్రసంగాలు చేశారు. 1920లలో తన కుటుంబాన్ని పాలస్తీనాకు తరలించాడు. అక్కడ తన కుటుంబం పేరుని నెతన్యాహుగా మార్చాడు. అంటే దీని అర్థం "దేవుడు ఇచ్చినది". ఇక ఆయన కుమారుడు, ప్రధాని నెతన్యాహు తండ్రి బెంజియన్ నెతన్యాహూ 1971 నుంచి 1975 వరకు కార్నెల్లో బోధించిన జుడాయిక్ అధ్యయనాల ప్రొఫెసర్. ఆయన 102 ఏళ్ల వయసులో మరణించాడు. దీన్ని బట్టి ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యాహూకి యూదు జాతి పట్ల ఎంత లోతేన సంబంధ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వీటన్నింట్లకి అతీతంగా మన భారతీయ సంస్కృతికి నెతన్యాహు అమితంగా ఆకర్షింపబడటం మరింత విశేషం. ఇష్టపడే భారతీయ వంటకాలు..నెతన్యాహూకి ఇక్కడి ఆహారం, సంస్కృతి అంటే మహా ఇష్టం. నివేదికల ప్రకారం..టెల్ అవీవ్లోని ఒక భారతీయ రెస్టారెంట్ అయిన తందూరి టెల్ అవీవ్లో నెతన్యాహు ఆయన కాబోయే భార్య సారాను మొదటి డేట్లో కలిశారట. ఆ రెస్టారెంట్ యజమాని రీనా పుష్కర్ణ దాన్ని ధృవకరిస్తూ..వారి మొదటి డేట్ టేబుల్ నెంబర్ 8లో సమావేశమయ్యారని అని చెప్పారు. అంతేగాదు ఆయనకు భారతీయ ఆహారం అంటే మహా ఇష్టమని, వారంలో కనీసం రెండుసార్లు మన భారతీయ వంటకాలను ఆర్డర్ చేస్తారని చెప్పుకొచ్చారు. నెతన్యాహూకి బటర్ చికెన్ , కరాహి చికెన్ అంటే చాలా ఇష్టమట. ఈ రెండు దేశాలను ఏకం చేయడంలో ఈ ఆహారం కూడా ఒక రకంగా ముఖ్యపాత్ర పోషించిందని అంటోంది రెస్టారెంట్ యజమాని రీనా.నెట్టింట తెగ వైరల్గా ఆ ఫోటో..2018లో, నెతన్యాహూ, అతని భార్య భారతదేశాన్ని సందర్శించి ఐకానిక్ తాజ్మహల్ని సందర్శించారు. భారతదేశం అంటే ఎంతో ఇష్టం అందుకు గుర్తుగానే ఇక్కడి ప్రేమాలయంలో ఉన్నాం అని ఆ దంపతులు చెప్పడం విశేషం. అలాగే నెతన్యాహూ భారత పర్యటన సందర్భంగా 'షాలోమ్ బాలీవుడ్' అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అక్కడ హిందీ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ వ్యక్తులను కలిశారు. "ఇన్నాళ్లు తానే గొప్ప వ్యక్తిని అని అనుకునేవాడిని కానీ నటుడు అమితాబ్ బచ్చన్ నాకంటే గొప్పవాడినని తర్వాతే తెలిసింది. ఎందుకంటే ఆయనకు 30 మిలియన్ల మంది ట్విట్టర్ ఫాలోవర్లు ఉన్నారంటూ నవ్వేశారు" నెతన్యాహు. అలాగే ఆయన మితాబ్ బచ్చన్తో సెల్ఫీ కూడా దిగారు. పైగా ఇది ఆస్కార్ అవార్డుల సమయంలో తెగ వైరల్ అయిన ఫోటోగా వార్తల్లో నిలిచింది. చివరగా నెతన్యాహూ కూడా పహల్ఘామ్ దాడిని ఖండించారు. ఆ సంఘటనను "అనాగరికం" అని అభివర్ణించారు. పైగా ఇజ్రాయెల్ భారతదేశానికి పూర్తిగా మద్దతిస్తుందని, దాని సంస్కృతి తోపాటు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో కూడా తోడుగా ఉంటుందని స్పష్టం చేసి ప్రపంచ దేశాలనే విస్తుపోయేలా చేశారు.(చదవండి: కుగ్రామం నుంచి 'కుబేర' వరకూ..! సత్తా చాటుతున్న తెలంగాణ కుర్రాడు) -
కుగ్రామం నుంచి 'కుబేర' వరకూ..!
ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న కుబేర సినిమా అనేక మంది విమర్శకుల ప్రశంసలను అందుకుంటూ దూసుకెళ్తోంది. ఎప్పుడూ కొత్త తరహా కథలను తెరకెక్కించే శేఖర్ కమ్ముల ఈ సారి సామాజిక కథాంశంతో పాన్ ఇండియా స్థాయిలో సినిమా తీశారు. ఇది ఎంతగానో ప్రజాదరణ పొందుతోంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ టీంలో ఛీప్ అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు అరవింద్ ఏవీ. తాను తెలుగు యూనివర్సిటీ, ఉస్మానియా విద్యార్థి. ట్రావెలర్, ఫొటోగ్రాఫర్గా అందరికీ సుపరిచితమే. నల్లగొండ జిల్లా దేవరకొండ తాలుక మారుమూల కుగ్రామమైన మేడారంలో పుట్టి పెరిగారు. బాల్యదశలో బతుకు కోసం కుటుంబం సాగించిన వలసలో నడుస్తూ.. హుజూర్ నగర్, నిడమానూరు, మిర్యాలగూడ, హలియ అనేక ప్రాంతాల్లో జీవించాల్సి వచ్చింది. సంక్షేమ హస్టల్స్లో చదువుకుంటూ క్యాటరింగ్, రైస్ మిల్లుల్లో నైట్ షిఫ్ట్స్ చేయడం.. సొంత ఖర్చులను సమకూర్చుకుంటూ చదువుకున్నారు. మరోవైపు దేశభక్తి, ఇతర సామాజిక అంశాల్లో క్రియాశీలకంగా పనిచేయడం బాధ్యతగా భావించారు. యూనివర్సిటీలో అడుగులు.. యూనివర్సిటీ విద్యార్థిగా తమ గ్రామం నుంచి వచ్చిన మొదటి తరం విద్యార్థి. మాస్ కమ్యూనికేషన్ చదవుతూనే వార, మాస పత్రికలు నడిపారు. చిన్నతనంలో పేపర్ బాయ్గా పనిచేయటం వల్ల సాహిత్య పఠనం అలవడింది. అనేక సామాజిక, సాహిత్య అంశాలను స్పృశిస్తూ.. కవితలు, వ్యాసాలు రాశారు. సాహిత్య ప్రచారం.. కథ, కవిత్వం, నవలలు విరివిగా చదవటం. చదివిన పుస్తకాలను నలుగురికీ పంచడం అవసరమని.. ‘ఆలోచన’ అనే సంస్థ ద్వారా గ్రామీణ, పట్టణ విద్యార్థులకు చిట్టి–పొట్టి జానపద కథల నుండి దేశభక్తుల జీవిత చరిత్రల వరకూ పరిచయం చేయడం, చదివించడం చేశారు. నగరంలోని యూనివర్సిటీల్లో స్టడీ సర్కిల్స్ నిర్వహణ, పుస్తకాలు, సినిమాలు, ఆర్ట్పై సదస్సులు, సభలు నిర్వహించేవారు. యాత్రలు.. ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్.. దక్షిణ భారతదేశం మొత్తం యాత్రలు చేయడం. ఇందులో భాగంగా ఫొటోగ్రఫీపై అభిరుచి ఏర్పడింది. ఆయ ప్రాంతాల సంస్కృతిని, వైవిధ్యాన్ని, ప్రకృతిని, ఆర్కిటెక్చర్ను కెమెరా లెన్స్లోంచి చిత్రించారు. వాటిని యూనివర్సిటీల్లో, పట్టణాల్లో ప్రదర్శించారు. సినిమా రంగంలోకి.. దర్శకులు అనుదీప్ కేవీ సాహిత్య పాఠకుడిగా ఉన్న రోజుల్లో నుంచి స్నేహం వల్ల సినిమాల్లోకి ప్రవేశం దొరికింది. ఆయన కథలను చర్చిస్తుడడం.. రాస్తుండడం.. ఆ క్రమంలోనే ప్రిన్స్ సినిమాకు రచన విభాగంలో పని చేయడం.. రచన నైపుణ్యాన్ని నేర్చుకోవడం జరిగింది. అత్యంత మరపురాని క్షణాలు.. కుబేర షూటింగ్ మొదలవుతుంది అనుకున్న రెండు నెలల ముందు పిలిచారు. మొదట ఇంటర్న్షిప్ జాయిన్ అయ్యాను. యాత్ర అనుభవాల వల్ల ఈ సినిమా కథకు ముంబయి దగ్గర ఉండే లొకేషన్స్ వెతికిపెట్టే పని అప్పగించారు. చాల మేరకు హైదరాబాద్ లొకేషన్స్లో ఓకే చేయించుకోవడం.. క్రమంగా ఆర్ట్ డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జిగా ఉండడం.. లెజెండరీ మనుషులైన తోట తరణి, శేఖర్ కమ్ముల నేతృత్వంలో పనిచేయడం.. జీవితంలో ఓ మైలురాయి. డైరెక్టర్ విజన్, ప్రొడక్షన్ డిజైనర్ విజువల్ని సెట్లో ప్రతిబింబిచడానికి నిద్రాహారాలు పక్కనపెట్టి పనిచేశా.. అయినా కష్టం అనిపించలేదు.. సెట్లో తరణి, శేఖర్ అనుభవాలు వినడం జీవితంలో అత్యంత మరపురాని క్షణాలుగా ఉండిపోయాయి. ఆర్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంద్రాణితో సమన్వయంలో ఉండడం.. టీం చరణ్, రాజు, భార్గవ్లతో రాత్రి, పగలు ఆడుతూ.. పాడుతూ షూటింగ్ కంప్లీట్ చేశాము. నేను, మా టీం ఇప్పుడు వీస్తున్న విజయపు గాలిని ప్రశాంతంగా ఆస్వాదిస్తున్నాం. – అరవింద్ ఏవీ, అసోసియేట్ డైరెక్టర్ (చదవండి: అర ఎకరం భూమి లేకుండానే డ్రాగన్ పంట..! రిటైర్డ్ ఉపాధ్యాయురాలి సక్సెస్ స్టోరీ) -
అమ్మానాన్నల హక్కు కాదు..!
ఉద్యోగం పురుష లక్షణం.. నాన్న సంపాదిస్తాడు. అమ్మ ఇంటిల్లిపాది అవసరాలను చూసుకుంటుంది. అమ్మ, నాన్న అనగానే ఇంచుమించు ఈ భావనలే కలుగుతాయి అందరిలో! ఒకవేళ స్త్రీ ఉద్యోగి అయినా.. ఇంటిపని, వంట పని బాధ్యత కూడా ఆమెదే! ఇందులో పురుషుడి భాగస్వామ్యం ఏమీ ఉండదు. కుటుంబ సభ్యుడిగా అది అతని బాధ్యత కూడా కదా.. అనే భావన సమాజానికి రాదు. అది అతని పని కాదనే జడ్జిమెంట్తోనే ఉంటాం. బహుశా దీని ఆధారంగానే కావచ్చు సుప్రీంకోర్టు ఇటీవల ఒక తీర్పునిచ్చింది. ఆ కథేంటంటే..కేరళకు చెందిన ఒక వ్యక్తి సింగపూర్లో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఎనిమిదేళ్ల కూతురు, మూడేళ్ల కొడుకు ఉన్నారు. భార్యతో విడాకులు అయ్యాయి. నెలలో పదిహేను రోజులు కూతురి కస్టడీని తండ్రికి ఇచ్చింది కేరళ హైకోర్టు. కూతురి కోసం ఆ తండ్రి తిరువనంతపురంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని, నెలలో పదిహేనురోజులు కూతురి దగ్గర ఉండేవాడు. అయితే తల్లి దాన్ని సవాలు చేస్తూ పూర్తి కస్టడీ తనకే ఇవ్వాలని సుప్రీంకోర్టుకు వెళ్లింది. తండ్రిని విచారించిన సుప్రీంకోర్టు.. అతను తన బిడ్డకు ఇంట్లో వండిన రుచి, శుచికరమైన భోజనాన్ని అందించలేక΄ోతున్నాడని, ఆ అమ్మాయి తన మూడేళ్ల తమ్ముడికి దూరమవుతోందని, ఆ ఇంట్లో ఆమెకు తండ్రి తప్ప వేరే కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలు, తోడు, అండ లాంటివేమీ లేవని.. ఇవన్నీ ఆ అమ్మాయి శారీరక, మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపించి ఆమె పెరుగుదల కుంటుపడే ప్రమాదం ఉందని తండ్రికి ఇంటెరిమ్ కస్టడీని ఆదేశించింది. కూతురిని ఆ తండ్రి అల్టర్నేటివ్ వీకెండ్స్లో కలుసుకోవచ్చు. వారానికి రెండుసార్లు పిల్లలిద్దరితో వీడియోకాల్ మాట్లాడుకోవచ్చని చెప్పింది. ఎనిమిదేళ్ల వయసులో పిల్లలకు ఇంట్లో వండిన శుభ్రమైన ఆహారం, కుటుంబ వాతావరణం, తన ఈడు పిల్లల సహవాసం, ఇతర కుటుంబ సభ్యుల సాంగత్యం చాలా అవసరమని.. ఇవన్నీ పిల్లల శారీరక, మానసిక వికాసానికి దోహదపడేవనీ ఆ తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొన్నది.నిజమే కానీ..ఏ కుటుంబంలో అయినా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికే పిల్లలు అత్యంత మాలిమిగా ఉంటారు. విడాకులు పొందిన అమ్మానాన్నల విషయంలోనూ ఇది వర్తిస్తుంది. తండ్రికి వంట రాకపోయినా.. అమ్మ అద్భుతంగా వంట చేసిపెట్టినా నాన్నంటేనే పిల్లలకు వల్లమాలిన ఇష్టం ఉండొచ్చు. ఏది కావాలని అడిగినా క్షణాల్లో కొనిపెట్టే తండ్రి కన్నా ఏమీ కొనివ్వలేని అమ్మ ఆదరణ పిల్లలకు కొండంత అండగా అనిపించొచ్చు. తీర్పు సమయంలో కోర్టు వీటినీ పరిగణనలోకి తీసుకోవాలి కదా అని కొంతమంది న్యాయవాదుల వాదన. దీనికి ఇటీవల ‘వంట మనిషిని/పనిమనిషిని పెట్టుకుని పిల్లలను చూసుకోవడం తప్పేమీ కాదు’ అంటూ తల్లి దగ్గర్నుంచి పిల్లల కస్టడీ తండ్రికి ఇవ్వడం కుదరదని ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉదాహరణగా చూపిస్తున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు.. కేరళ హైకోర్టు తీర్పును తిరస్కరిస్తూ ఇచ్చిన జడ్జిమెంట్లో తండ్రికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, ఇంట్లో ఎవరైనా పనివారిని పెట్టుకుని చూసుకోగలుగుతాడా లేదా అని చాన్స్ ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు అంటున్నారు.హైదరాబాద్ హైకోర్టులో.. ఈమధ్యే హైదరాబాద్ ఫ్యామిలీ కోర్టు ఇద్దరు చిన్నారుల కస్టడీని ఎన్నారై తండ్రికి ఇచ్చింది. తల్లికి కోపం ఎక్కువ, ఆర్థిక వనరులు లేవు కాబట్టి పిల్లలు తల్లి దగ్గర ఉండటం శ్రేయస్కరం కాదని, ఈ నిర్ణయం తీసుకుంది కోర్టు. తండ్రి దగ్గర నానమ్మ, తాతయ్య కూడా ఉండటం, వారితో చిన్నారులకు అనుబంధం ఉండటం ఈ కేసులో తండ్రి పక్షాన తీర్పు రావడానికి మరో కారణమైంది. కేరళ కేసులో పిల్లల కస్టడీ తల్లికే ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పులోనూ సుప్రీం కోర్టు తల్లికి సంబంధించి ఇలాగే ఆలోచించింది. ఆమె కూడా తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది కాబట్టి వాళ్ల సంరక్షణ, ఆప్యాయతానురాగాలు ఆ పిల్లలకు అందుతాయని, పైగా తల్లి వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉండటం వల్ల రోజంతా పిల్లల్ని చూసుకోగలదని, పిల్లలకు ఇంటి భోజనం అందుతుందనే కారణాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుంది. ఇంకో కేసులో.. తల్లి దగ్గరే పిల్లలున్నారు. తండ్రి ఆర్థికంగా ఉన్నవాడు. పిల్లల కస్టడీ తమకు కావాలంటే తమకు కావాలంటూ తల్లిదండ్రులిద్దరూ కేసులు వేశారు. ఇరువురి నేపథ్యాలూ పరిశీలించిన ఫ్యామిలీ కోర్టు పిల్లలు తల్లి దగ్గరే ఉండాలని తీర్పు ఇచ్చింది. పిల్లల అంగీకారంతో తండ్రి వీడియో కాల్లో మాట్లాడొచ్చని పేర్కొంది. ఆ పిల్లలకు పదేళ్లు నిండాయి. కనుక వాళ్లు చెప్పిన విషయాలను పరిగణించిన కోర్టు.. తండ్రి బాధ్యతారాహిత్యాన్ని ఎత్తిచూపుతూ పిల్లలు తండ్రి ఆధ్వర్యంలో ఉంటే చెడిపోయే ఆస్కారం ఉందని పేర్కొంది. పైన చెప్పిన రెండు అంశాలను పరిశీలీస్తే.. పిల్లలు ఎక్కడ సురక్షితంగా ఉంటారన్న దాన్నే కోర్టులు పరిగణిస్తాయి తప్ప పిల్లలపై హక్కు ఎవరికి ఉందన్నదాన్ని కాదని అర్థమవుతోంది. ఎనిమిదేళ్లు నిండిన పిల్లలు తామెవరి దగ్గర ఉండాలనుకుంటున్నారో జడ్జికి ప్రైవేటుగా వినిపించవచ్చు. వారి మానసిక పరిస్థితిని అంచనా వేసి నిర్ణయం తీసుకుంటారు న్యాయమూర్తి.అస్త్రంగా మారే ప్రమాదంతండ్రి దగ్గర పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు కావల్సిన ఆహారం మొదలు సరైన కుటుంబ పరిస్థితులూ లేవంటూ పిల్లల కస్టడీని తిరస్కరించిన సుప్రీంకోర్టు తీర్పు ఆ కేస్ వరకు సమంజసమే. అయితే ఇది కొందరి చేతిలో అస్త్రంగా మారే ప్రమాదం ఉంది. గతంలో సుప్రీంకోర్టు తల్లిదండ్రులిద్దరి ప్రేమకు పిల్లలు అర్హులు, భార్యాభర్తలు విడిపోయినా పిల్లలకు మాత్రం ఇద్దరితోనూ సాన్నిహిత్యం కొనసాగేలా చర్యలు తీసుకోవాలంటూ ఇచ్చిన అనేక తీర్పులకిది భిన్నంగా ఉంది. అంతేకాదు స్త్రీ పురుషుల మధ్య భేదాలు, వారి అలవాట్లు, ఏయే పనులు ఎవరు చేయాలనే జెండర్ కోణంలో పితృస్వామ్య వ్యవస్థ స్థిరపరచిన పని విభజననూ బలపరుస్తున్నట్టుంది. అయితే పిల్లలు మానసికంగా, శారీరకంగా ఎవరి దగ్గర సురక్షితంగా ఉంటారు, పిల్లలకు అవసరమైన వనరులు ఎవరి దగ్గర ఎక్కువగా ఉన్నాయి, వాళ్లు తమ తల్లిదండ్రులలో ఎవరితో ఎక్కువ అటాచ్మెంట్తో ఉన్నారనే అంశాలు చైల్డ్ కస్టడీ ఎవరికివ్వాలనే తీర్పును నిర్దేశిస్తాయి. ఒక్కమాటలో ఇది పిల్లల హక్కు – తల్లిదండ్రుల హక్కు కాదు! – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది (చదవండి: నటి సమంత ఆరోగ్య చిట్కాలు.. డయాబెటిస్ పేషెంట్లు ఇలా చేశారంటే..) -
అర ఎకరం భూమి లేకుండానే డ్రాగన్ పంట..!
ఉపాధ్యాయురాలిగా పనిచేసే రెమబాయి రిటైర్ అయ్యారు. అదే సమయంలో తల్లి చనిపోయారు. ఏదో శూన్యం ఆవరించినట్లు అనిపించింది. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపట్టారు కేరళలోని కొల్లమ్కు చెందిన రెమబాయి. ఆమెకు అర ఎకరం కూడా వ్యవసాయ భూమి లేదు. ఇంటి టెర్రస్నే సాగుభూమిగా మార్చుకున్నారు. ‘వ్యవసాయ భూముల్లో కాకుండా టెర్రస్పై డ్రాగన్ ఫ్రూట్స్ పండించడం చాలా కష్టం’ అనే మాటను సవాలుగా తీసుకున్నాకే సాయిల్లెస్ ప్లాంటింగ్ మెథడ్తో ముందుకు వెళ్లారు. కూరగాయల వ్యర్థాలు, ఎండుటాకులు... మొదలైన వాటితో సేంద్రియ ఎరువులు స్వయంగా తయారు చేసుకున్నారు.డ్రాగన్ ఫ్రూట్ల ఆరోగ్య ప్రయోజనాల గురించి అప్పుడెప్పుడో విన్న రెమబాయి వాటిని పండించాలనుకున్నారు. రిటైర్మెంట్ తరువాత తన కలను నిజం చేసుకున్నారు. డ్రాగన్ ఫ్రూట్ల ద్వారా నెలకు లక్ష రూపాయల వరకు అర్జించడం విశేషం! డ్రాగన్ ఫ్రూట్ సాగులో తన అనుభవాలను పంచుకోవడానికి ‘జెసీ వరల్డ్’ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించారు రెమబాయి.ఆమె విజయ రహస్యం ఏమిటి?‘నా వయసు 58 సంవత్సరాలు. అయితే ఎప్పుడూ 20 ఏళ్ల వయసులాగే ఫీలవుతాను’ అంటూ తన విజయ రహస్యాన్ని చెప్పకనే చెప్పారు రెమబాయి. (చదవండి: సిఈఓలు యవ్వనంగా ఉండాలంటే..! సుందర్ పిచాయ్కి కలిగిన సందేహం) -
దాంపత్య సుధలివి
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి బిలియనీర్ మాత్రమే కాదు, చక్కటి కుటుంబ నిర్మాత కూడా. చదవడం, రాయడం పట్ల ఆమెకున్న మక్కువతో పాటు, ఇంటి అవసరాలు తీర్చడం, పిల్లలను పెంచడం, భర్త నారాయణ మూర్తికి సహకారం ఇవ్వడం వంటి వాటితో వృత్తిని, కుటుంబ జీవితాన్ని బాగా బ్యాలెన్స్ చేసుకున్నారు. వృత్తి జీవితంలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, కంప్లైంట్స్ లేకుండా కుటుంబం చక్కగా స్థిరపడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దాంపత్య జీవితం విజయవంతమవ్వాలంటే భాగస్వాములు ఎలా ఉండాలో నాలుగు పదుల వైవాహిక జీవితం నుంచి ఆమె చెప్పిన ముఖ్యమైన విషయాలతో దాంపత్య సుధలివి!వివాహం బ్యాలెన్స్ షీట్ కాదుసమానత్వం ఆరోగ్యకరమైన సంబంధంలో కీలకమైన అంశం. అయితే, కొంతమంది జంటలు వివాహాన్ని ఒక ఒప్పందంగా భావిస్తారు. ప్రతి చర్యను ఫిఫ్టీ–ఫిఫ్టీ ప్రాతిపదికన జాగ్రత్తగా లెక్కిస్తారు. కఠినంగా ఉండే ఇలాంటి మనస్తత్వ సంబంధం సహజత్వాన్ని దెబ్బతీస్తుంది. అది ఒకరి బాధ్యతలను ఒకరు అర్థం చేసుకోవడం, ప్రేమగా నెరవేర్చడంలో చూపించాలి కానీ, కఠినమైన సమానత్వాన్ని కొనసాగించడంలో కాదు.వివాహంలో పోటీ వద్దువివాహం అనేది ఇరు వ్యక్తుల ఏకత్వం కోసం. అంతేకానీ, యుద్ధభూమిగా ఉండకూడదు. భాగస్వాముల మధ్య పోటీ, సంఘర్షణ, ఆగ్రహానికి దారితీస్తుంది. జీవితం అభివృద్ధి చెందుతున్న కొద్దీ, జంట కూడా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారాలి. ఒకరి ప్రాధాన్యతలను మరొకరు గౌరవించుకోవాలి. ఇద్దరూ కలిసి సాధించాల్సిన విజయం కాబట్టి ఎవరు గొ΄్పో తేల్చుకోనక్కరలేదు. భాగస్వామ్య లక్ష్యాలు సంబంధాలను బలోపేతం చేస్తాయిప్రతి జంట తమ కుటుంబ లక్ష్యాల కోసం కలిసి పనిచేయాలి. వారు ఏం సాధించాలనుకుంటున్నారు, తమ భవిష్యత్తును ఎలా ఊహించుకుంటున్నారు... అనేవి ఇద్దరి మధ్య స్వేచ్ఛగా, నిజాయితీగా అబీప్రాయాలను వ్యక్తపరచగల వాతావరణం ఉండాలి. అప్పుడే ఆ సంబంధంలో పరస్పర గౌరవం ఏర్పడి, బంధం మధ్య స్పష్టతను పెంచుతుంది.సమస్యలను విస్మరించవద్దువివాహ బంధంలో సమస్యలు వస్తున్నప్పుడు వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవాలి. అదే సమయంలో సమస్య మరింత కఠినంగా మారకుండా చూసుకోవడమూ ముఖ్యమే. సరిచేయడానికి భాగస్వాములిద్దరూ చొరవ తీసుకోవాలి. కౌన్సెలింగ్ తీసుకోవడాన్ని ఎప్పుడూ చిన్నచూపుగానో, బలహీనతగానో చూడకూడదు. తమ బంధాన్ని నిలుపుకునేందుకు, నిబద్ధతకు సంకేతం కూడా. కొన్నిసార్లు బయటకు చెప్పని భావోద్వేగాలను నిపుణుల సహాయంతో వెలిబుచ్చడం వల్ల దంపతుల మధ్య స్పష్టతకు వీలు కల్పిస్తుంది.కమ్యూనికేషన్ చాలా అవసరంప్రతి వ్యక్తి భాగస్వామి తనను అర్థం చేసుకోవాలని, శ్రద్ధ వహించాలని కోరుకుంటాడు. ఇది సహజమే అయినప్పటికీ, జీవితపు ఒత్తిళ్లు కుదురుగా ఉండనివ్వవు. మీ భాగస్వామి మనస్సును చదవడం అంత సులభం ఏ కాదు. ఏదీ బయటకు వ్యక్తపరచనప్పుడు మరింత కష్టంగా కూడా ఉండవచ్చు. అందుకే స్పష్టమైన, నిజాయితీగల కమ్యూనికేషన్ చాలా అవసరం.వైవాహిక సమస్యలకు సంతానం పరిష్కారం కాదుపిల్లల పుట్టుకతో సమస్యాత్మకమైన వివాహం సరిదిద్దబడుతుందని చాలామంది నమ్ముతారు. ‘ఒక బిడ్డ పుడితే వాళ్లే సరిదిద్దుకుంటారు’ అనుకుంటారు. కానీ ఇది ఒక పెద్ద అ పోహ. బలమైన సంబంధంలోనే బిడ్డ ప్రేమను పెంచుకోగలడు. కానీ పుట్టిన బిడ్డ విచ్ఛిన్నమైన వైవాహిక సంబంధాన్ని సరిదిద్దలేదు. తల్లిదండ్రులుగా ఉండటం ఆనందాన్ని కలిగించాలంటే, భాగస్వాములిద్దరూ సమన్వయం చేసుకోవాలి. నిబద్ధతతో ఉండాలి. భాగస్వామికి అవసరమైన సమయాన్ని ఇవ్వడానికి, అభివృద్ధికి కృషి చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి.ఒకరి ఆసక్తులను ఒకరు గౌరవించుకోవాలిసుమారు 60 శాతం మంది ప్రజలు ఉమ్మడి ఆసక్తులు ఆరోగ్యకరమైన సంబంధానికి దోహదం చేస్తాయని నమ్ముతారు. ఒకే తరహా అభిరుచులు ఉంటే కొంత వరకు సహాయపడగలవు. నిజానికి ఒకరి అభిరుచులను మరొకరు గౌరవించాలి. ఆసక్తులు భిన్నంగా ఉన్నప్పటికీ, వాటిని ఎగతాళి చేయడం లేదా తోసిపుచ్చడం సంబంధానికి హాని కలిగిస్తాయి. మీ భాగస్వామి తనకు ఇష్టమైన విషయాలను మీతో పంచుకున్నప్పుడు ఆసక్తిగా వినాలి. దీని వల్ల మీ భాగస్వామికి తమ పట్ల శ్రద్ధ చూపుతున్నారనే విషయం అర్ధం అవుతుంది. మద్దతు ఇవ్వడం అంటే ఒప్పందం మాత్రమే కాదు, ఇది వాగ్దానం కూడా.సహానుభూతి శక్తిమంతమైన సాధనంచర్చలు, వాదోపవాదాలు సమస్యలను చాలా వరకు పరిష్కరిస్తాయి. అయితే, దీనికి బదులుగా మీ భాగస్వామి చెప్పుల్లో మీ కాళ్లు పెట్టి వారి దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సానుభూతి అనేది దీర్ఘకాలిక, అర్థవంతమైన బంధాన్ని పెంపొందించగల శక్తిమంతమైన సాధనం. ప్రతి సంబంధంలో విభేదాలు ఉంటాయి. కానీ, సహనం, సానుభూతి వల్లే సంబంధం నిలబడుతుంది. -
జెమ్ జెన్సీ
కొన్ని విజయాలు వ్యక్తిగత విజయాలు మాత్రమే కాదు. ఎంతోమందికి ధైర్యాన్ని, స్ఫూర్తిని ఇచ్చే విజయాలు. ‘జీవితం అంటే నిత్య నరకం’ అనుకున్న నిరాశామయ, నిస్సహాయ స్థితిలోనూ ‘విద్య’ అనే ఆయుధాన్ని నమ్ముకుంది ఎన్.జెన్సీ. ఆ ఆయుధం తనకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది. దేశంలో ఆంగ్లభాషా విభాగంలో డాక్టరేట్ అందుకున్న, అసిస్టెంట్ ప్రోఫెసర్గా నియామకం అయిన తొలి ట్రాన్స్జెండర్గా అరుదైన గుర్తింపు తెచ్చుకునేలా చేసింది...బాల్యం ఎవరికైనా వరం. స్వర్గం. ఒక దశ వరకు ఆ అబ్బాయి స్వర్గంలోనే ఉన్నాడు. క్రమంగా ఆ అబ్బాయి మాటతీరు, నడక తీరులో మార్పులు కనిపించాయి. అవి కొని తెచ్చుకున్న మార్పులు కాదు. అయినప్పటికీ ఆ బాలుడి తల్లిదండ్రులకు బొత్తిగా నచ్చలేదు. ‘అలా మాట్లాడుతున్నవేమిటి?’ ‘అలా నడుస్తున్నావేమిటి!’... ఇలా రకరకాలుగా తిట్టేవాళ్లు. ఇక స్కూల్లో నిత్యనరకం.తోటి పిల్లల నుంచి ఉ పాధ్యాయుల వరకు ఎవరో ఒకరు ఏదో ఒక కామెంట్ చేసి ఏడిపిస్తూనే ఉండేవారు. ఒకానొక సమయంలో బడికి వెళ్లాంటే భయపడే పరిస్థితి వచ్చింది. ‘బడికి వెళ్లేది పాఠాలు వినడానికా! అవమానాల పాలు కావడానికా!’ అని మనసు ప్రశ్నించింది. అంతా చీకట్లోనూ ఒక ఆశాకిరణం కనిపించింది. ఆ వెలుగు పేరు... చదువు. ఆ వెలుగు దారిలో ఆ బాలుడి నడక ప్రారంభమైంది. అప్పటి ఆ బాలుడే... నేటి జెన్సీ.తమిళనాడులోని తిరుత్తణికి చెందిన జెన్సీ చెన్నైలోని అంబేద్కర్ ఆర్ట్స్ కాలేజీలో ఎం.ఏ., ఎం.ఫిల్.లో గోల్డ్మెడల్ సాధించింది. ఆ బంగారు పతకాలు తన ఆత్మవిశ్వాసాన్ని మరోస్థాయికి తీసుకువెళ్లాయి. ఇంకా ఏదో సాధించాలి అనే తపనను పెంచాయి. చెన్నై లయోలా కాలేజీలో ఆంగ్ల భాషా విభాగంలో డాక్టరేట్ అందుకొని, అదే కాలేజిలో అసిస్టెంట్ ప్రోఫెసర్గా నియామకం అయ్యింది. ‘ఇది నా విజయం కాదు. మా ట్రాన్స్ కమ్యూనిటీ విజయం. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో బాధలు పడ్డాను. ఎన్నో కష్టాలూ అనుభవించాను. అయితే... చదువు మనుషుల వ్యక్తిత్వాన్ని తీర్చుదిద్దుతుంది. ధైర్యాన్ని ఇచ్చి విజయాలు సాధించేలా చేస్తుంది’ అంటుంది జెన్సీ.ఎందుకు ఆమోదించడం లేదు?ట్రాన్స్జెండర్లను చిన్నచూపు చూడకూడదు. అవమానాలు తట్టుకోలేక ఇంటినుంచి పారి పోయేలా చేయకూడదు. వారిని చదువుకు దగ్గర చేస్తే తమను తాము నిరూపించుకోగలరు. అందుకు నేనే సాక్ష్యం. యూజీ, ఎం.ఏ.లో నేను గోల్డ్మెడలిస్ట్. మొదట్లో ఎలా ఉన్నా నేను ఈ స్థితికి రావడానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంది. ప్రకృతిని అందరూ ఆమోదిస్తున్నప్పుడు ఆ ప్రకృతిలో భాగమైన మమ్మల్ని మాత్రం ఎందుకు ఆమోదించడం లేదు? – జెన్సీ -
ఔషధ మొక్క.. ఆరోగ్యానికి రక్ష
మనతోపాటు, మనకన్నా ముందే పుట్టిన అనేక రకాల ఔషధ మొక్కలు మానవ మనుగడలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రకృతి మనకు అందించిన మొక్కలను నిత్యం చూస్తున్నా.. వాటి ప్రయోజనాలు, విలువలను తెలుసుకోలేకపోతున్నాం. ఇంట్లో, పెరట్లో, మిద్దెలపై పెంచుతున్న పూలమొక్కలతోపాటు పలు రకాల ఔషధ మొక్కలను సైతం పెంచితే ఇంటికి అందంతోపాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుందని సూచిస్తున్నారు ఔషధ మొక్కల ప్రేమికులు.అందాన్ని పెంచే అలోవేరా (కలబంద), తిప్పతీగ, నిమ్మగడ్డి, అశ్వగంధ, తులసి, పుదీనా, ఉసిరి, వేప, పసుపు, బ్రహ్మి, మెంతులు.. ఇలా మానవాళికి దోహదపడే ఔషధ మొక్కలు అనేకం ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా సెంటనరీ కాలనీలో సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఆధ్వర్యంలో ఔషధ మొక్కల కేంద్రం ఏర్పాటు చేశారు. ఇందులో అనేక రకాల ఔషధ మొక్కలను సంరక్షిస్తున్నారు. అంతేకాదు.. వాటి ఉపయోగాలను తెలియజేసేలా ప్రచారం కూడా చేస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లిఆకులు మందంగా, తెల్లగా ఉన్న ఈ మొక్క పేరు క్లినియా గ్రాండిఫ్లోరా (కుందేలు చెవిఆకు). ఆస్టరేసి కుటుంబానికి చెందిన ఈ మొక్కను ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. దీని ఆకులు, వేర్లు ఆరోగ్య సమస్యలకు చికిత్సగా వాడతారు. ఆకురసాన్ని దద్దుర్లు, దురదలను తగ్గించేందుకు వాడతారు. మూత్ర సంబంధ వ్యాధులను సైతం నివారిస్తుంది.ఆయిల్ నట్ట్రీ (నూనెగింజల చెట్టు). దీని విత్తనాల నుంచి నూనె తీస్తారు. ఔషధాల తయారీతోపాటు వంటల తయారీకి కూడా ఉపయోగిస్తారు. చర్మ సంబంధ వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలకు ఈ నూనె వాడతారు. ఇంధనం, సబ్బులు, వార్నిష్ల తయారీకి సైతం దీని నూనెను ఉపయోగిస్తారు.నిమ్మగడ్డి. జీర్ణక్రియను మెరుగుపరిచి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఒత్తిడిని తగ్గించి శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది. వంటకాల్లో సైతం నిమ్మగడ్డి ఒక ప్రత్యేకమైన రుచితోపాటు సువాసనను అందిస్తుంది. వేడినీటిలో మరిగించి టీలా తాగుతారు కొందరు.నోని మొక్క. రుబియాసియే కుటుంబానికి చెందిన ఈ మొక్కతో ఔషధ ప్రయోజనాలు అనేకం. బ్లడ్ప్రెషర్ (బీపీ)ని కంట్రోల్ చేస్తుంది. కేన్సర్ నివారణకు ఈ మొక్క పండ్లు దోహదపడతాయి. నోనిలో యాంటీ యాక్సిడెంట్స్, ఖనిజాలు విటమిన్లు పుష్కలం. నోని పండ్లను నేరుగా లేదా జ్యూస్గా తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరిగి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. షుగర్ నియంత్రణకు దోహదపడుతుందంటున్నారు.ఈ చిత్రంలో కనిపిస్తున్న మొక్క వైల్డ్గ్రేప్ (నల్లేరు). విటాసియే కుటుంబానికి చెందింది. అనేక ఔషధ గుణాలు కలిగిన ఈ మొక్క ఎముకల పెరుగుదల, పగుళ్లను నయం చేయడం, దగ్గు, జలుబు, జీర్ణ సమస్యలకు ఔషధంగా, కాల్షియం బూస్టర్గా పరిగణిస్తారు.అలోవేరా (కలబంద) ఈ మొక్క అందరికీ సుపరిచితం. గాయాలను నయం చేయడంలో ముఖ్యపాత్రను పోషిస్తుంది. చర్మం, జుట్టు పెరుగుదల, సంరక్షణ, చుండ్రు నివారణకు దోహదపడుతుంది.రణపాల (బ్రయోఫిలమ్). కిడ్నీలో రాళ్లు, చర్మవ్యాధులు, దగ్గు, జ్వరం, జీర్ణ, ఎముకల సమస్యల నివారణకు ప్రత్యేకంగా ఈ మొక్క ఆకులను ఉపయోగిస్తారు. ఈ ఆకులు ఎముకలకు బలాన్ని చేకూరుస్తాయని వైద్యులు చెబుతారు.గణపత్రి. ఇది విస్తృతంగా కనిపించే సుగంధపు మొక్క. ఆకులు, పూలు, విత్తనాలు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. నొప్పి నివారణకు, యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలంగా లభించే ఈ గణపత్రి మొక్క జీర్ణక్రియ మెరుగుదలకు, రోగనిరోధక శక్తి పెంపునకు ఉపయోగపడుతుంది. దగ్గు, జలుబు నివారణకు, చర్మ సంబంధ వ్యాధుల చికిత్సలో సైతం ఉపయోగిస్తారు.మల్టీ విటమిన్ ప్లాంట్. సైంటిఫిక్ నేమ్ సౌరోపస్ ఆండ్రోజినస్. ఏ, బీ, సీ, కే విటమిన్లను సమృద్ధిగా అందించే మొక్క. కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలను కలిగి హిమోగ్లోబిన్ ఉత్పత్తికి, రక్తపోటు నియంత్రణకు దోహదపడుతుంది. కొలెస్ట్రాల్, మధుమేహం, చెవినొప్పి నివారణలకు ఔషధంగా వినియోగిస్తారు.చదవండి: ఐదేళ్ల శ్రమ ఫలించింది.. ఇంగువ పండింది -
వెయిట్లాస్ కోసం బ్లాక్బస్టర్ ఇంజెక్షన్ వచ్చేసింది, ధర ఎంత అంటే!
Wegovy Injection: అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఊరటి నిచ్చే వార్త ఇది. డెన్మార్క్కు చెందిన ఔషధ సంస్థ నోవో నార్డిస్క్.. 'వెగోవీ' అనే ఇంజెక్షన్ను తీసుకొచ్చింది. దీనికి సంబంధించి నోవో నార్డిస్క్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియా మంగళవారం (జూన్ 24) ఈ మెడిసిన్ను లాంచ్ చేశారు. ఊబకాయం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి ఈ ఔషధం ఉపయోగపడుతుందని చెబుతోంది. ఈ నెలాఖరులోగా అన్ని ఫార్మా దుకాణాల్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. వీగోవీ అనే ఇంజెక్షన్ నాలుగు వారాల మోతాదు సైకిల్లోఉంటుంది. నాలుగు వారాల పాటు వారానికి 0.25 mg అతి తక్కువ మోతాదుతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఒక నెల పాటు వారానికి 0.5 mg మోతాదు క్రమంగా పెరుగుతుంది. నెల పాటు వారానికి 1 mg మోతాదు పెరుగుతుంది. ఆ తర్వాత వైద్యుడి సిఫారసు మేరకు మోతాదును మరింత పెంచాలా, లేదా తగ్గించాలా అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. ఇది 0.25 mg, 0.5 mg, 1 mg, 1.75 mg ,2.4 mg ఐదు మోతాదు రూపాల్లో మార్కెట్లోకి లభిస్తుంది. ఇది ఉపయోగించడానికి సులభమైన పెన్ లాంటి పరికరంగా లభిస్తుంది.CNBC-TV18 Exclusive | We are confident of leading the weight loss #market as we are first to launch and have strong credibility, says Vikrant Shrotriya, MD & Corporate VP, Novo Nordisk India, as the company launches #Wegovy, a weight loss drug, in #India. Tells @ekta_batra that 1… pic.twitter.com/moiu37dB8c— CNBC-TV18 (@CNBCTV18News) June 24, 2025 ధరలు వివరాలునోవో నార్డిస్క్ వీగోవీ 0.25 mg, 0.5 mg , 1 mg మోతాదు నెలకు రూ. 17,345 ఖర్చవుతుంది. 1.75 mg అధిక మోతాదు ఇంజెక్షన్ నెలకు రూ. 24,280 ఖర్చవుతుంది. 2.4 mg మోతాదు రూ. 26,050 ఖర్చవుతుంది. దీర్ఘకాలిక బరువు నిర్వహణ ,హృదయ సంబంధ వ్యాధులకు వెగోవీ తొలిఏకైక బరువు నిర్వహణ ఔషధం. ఈ ఔషధం 30 కంటే ఎక్కువ బాడీ మాస్ ఇండెక్స్ (BMI), ఇతర అనారోగ్యాలు లేనివారికి , 27 కంటే తక్కువ BMI ఉన్న, ఇతర అనారోగ్యాలున్నా ఇస్తారు.భారతదేశంలో వెగోవీ కోసం స్థానికంగా తయారీకి ఎటువంటి ప్రణాళికలు లేవని కంపెనీ స్పష్టం చేసింది. నోవో నార్డిస్క్ ఇప్పటికే 2022లో భారతదేశంలో నోటి ద్వారా తీసుకునే సెమాగ్లుటైడ్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
Sundar Pichai: సిఈఓలు యవ్వనంగా ఉండాలంటే..!
ప్రముఖుల సంభాషణల్లో గొప్ప గొప్ప సందేశాలు అలవోకగా దొర్లుతాయి. బహుశా అందుకే కాబోలు యువతను గొప్ప గొప్ప వ్యక్తుల ఉపన్యాసాలను వినమని సూచిస్తుంటారు. ఇదంతా ఎందుకంటే..ఇండియా గ్లోబల్ ఫోరం 2025లో ఇస్కాన్ సన్యాసి గౌరంగ దాస్ స్పీచ్ ఒక గొప్ప సందేశాన్ని అందించడమే గాక యువతకు కనువిప్పు కలిగించింది. అంతేగాదు ఈ ఆధునిక సాంకేతికత, డిజిటల్ యుగం మనల్ని ఏవిధంగా ఏమార్చాతున్నాయో కళ్లకు కంటినట్లు చూపించాయి ఆ సన్యాసి మాటలు.అసలేం జరిగిందంటే..లండన్లో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరం 2025లో ఇస్కాన్ సన్యాసి గౌరంగ దాస్ మాట్లాడుతూ..తన బ్యాచ్మేట్ గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్తో జరిగిన సంభాషణను షేర్ చేసుకున్నారు. ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడానికి ఇంజనీరింగ్ వృత్తిని విడిచిపెట్టిన ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్ గౌరంగ దాస్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇద్దరు క్లాస్మేట్లు. అదే ఐఐటీ బ్యాచ్లోవారి బ్రాంచ్లు వేరే అయినా..ఇద్దరూ స్నేహితులు. అయితే కళాశాలలో తామిద్దరం ఒకరికొకరు తారసపడటం అత్యంత అరుదుగా ఉండేదన్నారు. కానీ ఇటీవలే చాలా ఏళ్ల తర్వాత తామిద్దరం కలుసుకుని చాలాసేపు ముచ్చటించుకున్నట్లు తెలిపారు. అయితే తన స్నేహితుడు పిచాయ్ నువ్వు నాకంటే చిన్నవాడిలా యంగ్గా కనిపిస్తున్నావని ప్రశంసించినట్లు గుర్తుచేసుకున్నారు. దీనికి గౌరంగ దాస్ స్పందిస్తూ..సుందర్ పిచాయ్ "ఒత్తిడిని సృష్టించే" గూగుల్తో వ్యవహరిస్తాడని, తాను ఒత్తిడిన మాయం చేసే ఆధ్యాత్మికతతో మమేకం అవుతున్నానని సమాధానమిచ్చారు. ఆ సదస్సులో గౌరంగ దాస్ పంచుకున్న కథ ఒక్కసారిగా డిజిటల్ వ్యసనం మనుషులను ఎలా బానిసలుగా మారుస్తుందో తెరపైకి వచ్చింది. దాని ప్రభావం వల్ల మానసిక ఆరోగ్యం ఎలా క్షీణిస్తుందో అనే దానిపై అవగాహన కలిగించేలా చేసింది. ఇక సన్యాసి గౌరంగ దాస్ కూడా అధిక స్క్రీన్ సమయం,సోషల్ మీడియా వాడకంతో పెరుగుతున్న మానసిక సమస్యల గురించి కూడా వివరించారు. పంచవ్యాప్తంగా 230 మిలియన్ల మంది ప్రజలు సోషల్ మీడియాకు బానిసలయ్యారని నివేదికలు చెబుతున్నాయన్నారు. భారతదేశంలోనే, 70% మంది టీనేజర్లు ప్రతిరోజూ ఏడు గంటలు ఆన్లైన్లో గడుపుతున్నారని, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడుగురిలో ఒకరు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని చెప్పుకొచ్చారు. ఒత్తిడిని తగ్గించుకునేలా చక్కటి మార్గాల తోపాటు కాసేపు మనతో మనం గడిపేలా చక్కటి ధ్యానం వంటివి చేస్తే..మానసికంగానే కాకుండా శారీరకంగానూ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు గౌరంగ దాస్. View this post on Instagram A post shared by India Global Forum (@indiaglobalforum) (చదవండి: నటి సమంత ఆరోగ్య చిట్కాలు.. డయాబెటిస్ పేషెంట్లు ఇలా చేశారంటే..) -
నాడు పేదరికంతో గాజులమ్మాడు, వైకల్యం వెక్కిరించినా.. నేడు ఐఏఎస్గా
పుట్టింది నిరుపేద కుటుంబం. కుటుంబాన్ని పోషించడానికి అతను తన తల్లితో కలిసి వీధుల్లో గాజులు అమ్మాడు. మరోవైపు పోలియోతో వైకల్యం. అయితేనేం కఠిన శ్రమ , దృఢ సంకల్పంతో అనుకున్నది సాధించాడు. సాధించాలన్న పట్టుదల ఉంటే ఎన్ని అడ్డంకులను ఎదుర్కొని విజయం సాధించవచ్చు అని నిరూపించాడు రమేష్ ఘోలాప్. ఇంతకీ ఆయన ఏం సాధించారు. పదండి రమేష్ సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం.'కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి' అనే దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటల్ని అక్షరాలా నిరూపించారు వికలాంగుడైన రమేష్ ఘోలప్. ఒకప్పుడు పొట్ట కూటి కోసం గాజులు అమ్మిన ఆ కుర్రాడే.. ప్రస్తుతం ఐఏఎస్గా సేవలందిస్తున్నాడు. కన్న తల్లికీ, పుట్టిన గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలోని ఒక గ్రామంలో సైకిల్ మరమ్మతు దుకాణం నడిపే నిరుపేద గోరఖ్ ఘోలాప్కు జన్మించాడు రమేష్. చిన్నతనంలోనే ఎడమకాలికి పోలియో సోకింది. అయినా ఏ మాత్రం నిరాశ చెందలేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు. మద్యం కారణంగా అతని తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో, చిన్న వయసులోనే నలుగురు సభ్యుల కుటుంబ బాధ్యతను తీసుకోవలసి వచ్చింది. కుటుంబ పోషణ కోసం తన తల్లితో కలిసి వీధుల్లో గాజులు అమ్మడం మొదలుపెట్టాడు. కానీ చదువులో రమేష్ ఎప్పుడూ క్లాస్ ఫస్టే. 12వ తరగతిలో ఉన్నప్పుడు తండ్రి చనిపోవడంతో మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. తండ్రి అంత్యక్రియలకు బస్సు ఛార్జీలు చెల్లించడానికి కూడా డబ్బులులేని పరిస్థితి. ఈ తన దయనీయ స్థితి బైట పడాలంటే చదువే మార్గం అని గ్రహించాడు. అతను కష్టపడి పనిచేస్తూనే పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, అతను D.Ed (డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్) అత్యంత చౌకైన కోర్సు కాబట్టి దానిని అభ్యసించాడు. తరువాత దూరవిద్య ద్వారా ఆర్ట్స్లో డిగ్రీ చదివాడు. తరువాత 2009లో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు.తన కల నిజం చేసుకోవాలని ఆలోచన తొలిచేస్తూ ఉండేది.. స్వయం సహాయక బృందం నుంచి తల్లి తీసుకున్న రుణంతో పుణే వెళ్లి యూపీఎస్సీ పరీక్షకు సిద్ధం కావడం మొదలుపెట్టాడు. 2010లో తొలి ప్రయత్నంలో విఫలమయ్యాడు. అయితే, మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ పరీక్షలు రాసి తహసీల్దార్ ఉద్యోగం సంపాదించాడు. చివరికి తన ఉద్యోగం నుండి 6 నెలల విరామం తీసుకుని IAS కావాలనే కల సాకారం కోసం నడుం బిగించాడు. చివరికి తన కృషికి ఫలితం దక్కింది, 2012లో అతను 287 ర్యాంకుతో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాడు. అదే సంవత్సరం, అతను మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) పరీక్షలో కూడా ఉత్తీర్ణుడై 1వ ర్యాంకు సాధించాడు. 2012, మే 4న ఐఏఎస్ అధికారిగా తన స్వగ్రామంలో అడుగు పెట్టడంతో గ్రామస్తులంతా సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయి సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం జార్ఖండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ స్పెషల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. -
Samantha: డయాబెటిస్ పేషెంట్లు ఇలా చేశారంటే..!
నటి సమంత రూత్ ప్రభు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అద్భుతమైన నటనతో వేలాదిగా అభిమానులను సంపాదించుకున్న నటి. ఆమె అరుదైన మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆరోగ్యంపై పూర్తి ఫోకస్ పెట్టి..ఫిట్నెస్కి సంబంధించిన చిట్కాలను అభిమానులతో ఎప్పటికప్పుడూ షేర్ చేసుకుంటుంటుంది. వర్కౌట్ల దగ్గర నుంచి మానసిక ఆరోగ్యం వరకు ప్రతిదానిపై తన అభిమానులకు ఆరోగ్య స్ప్రుహను కలిగిస్తోంది. అలానే ఈసారి డయాబెటిస్ పేషెంట్లు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు, చిట్కాలను షేర్ చేసుకుంది. తన అనుభవ పూర్వకంగా తెలుసుకున్న టిప్ గురించి చాలా చక్కగా వివరించింది. అదేంటో ఆమె మాటల్లోనే సవివరంగా తెలుసుకుందాం.డయాబెటిస్ పేషెంట్లు రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగ ఉంచుకోవడం అనేది అతిముఖ్యమైనది. ఆరోగ్యకరమైన భోజనంతోనే దాన్ని నివారించొచ్చట. సముతుల్య ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చేవారికి ఆ సమస్య ఉండదని అంటున్నారు. కొన్నిసార్లు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా కూడా రక్తంలో చక్కెర పెరుగుతుందని తాను కూడా గుర్తించానని అంటోంది సమంత. భోజనం ఆరోగ్యకరమైనదే అయినా ఈ సమస్య ఉత్ఫన్నం కావడం ఆశ్చర్యకరంగా అనిపించినా..ఒక అద్భుతమైన చిట్కాతో ఆ సమస్యను నివారించానని అన్నారామె. మనం తీసుకునే ఆహారా క్రమాన్ని మార్చితే చాలు..రక్తంలో చక్కెర పెరుగుదల తగ్గడం గమినించొచ్చని చెబుతోంది. తాను దీన్ని నిరంతర గ్లూకోజ్ మానిటర్తో గురించానని వివరించింది. అందువల్లే తాను ముందుగా కూరగాయలు, తర్వాత ప్రోటీన్, చివరిలో కార్బోహైడ్రేట్లు తీసుకోవడం వంటివి ప్రారంభించినట్లు వివరించింది. ఈ విధానం తనకు చాలా అద్భుతంగా ఉపయోగపడిందని అంటోంది. దీన్ని ఫుడ్ సక్వెన్సింగ్ అంటారు. డయాబెటిస్ ఉన్నవారికి బాగా హెల్ప్ అయ్యే చిట్కాగా చాలా ప్రజాదరణ పొందుతోంది.ఫుడ్ సీక్వెన్సింగ్ అంటే..ఇక్కడ వివిధ రకాల ఆహారాలను ఒక నిర్ధిష్ట క్రమంలో తినాలి. ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలతో భోజనాన్ని ప్రారంభించాలి. తర్వాత ప్రోటీన్ లేదా ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవాలి. చివరగా బియ్యం లేదా బ్రెడ్ వంటి కార్బోహైడ్రేట్లతో ముగించాలని నిపుణులు సూచిస్తున్నారు. పీచు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలతో జీర్ణక్రియం నెమ్మదించడంతో శరీరం చక్కెరను గ్రహించడం ఆటోమేటిగ్గా తగ్గుతుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయని చెబుతున్నారు పరిశోధకులు.ఈ విధానం ఎందుకు మంచిదంటే..తిన్న తర్వాత, మన రక్తంలో చక్కెర సహజంగా పెరుగుతుంది. అయితే అది చాలా స్పీడ్గా పెరిగితే టైప్ 2 డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుంది.అదే మొదటగా కూరగాయలు, ప్రోటీన్లు తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు సమంగా ఉంటాయిని పరిశోధనలో వెల్లడైంది. ప్రయోజనాలు..కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.కార్బోహైడ్రేట్లు తీసుకునే ముందు ప్రోటీన్ తినడం వల్ల హార్మోన్ GLP-1 పెరుగుతుంది. తద్వారా అతిగా తినకుండా నిరోధిస్తుంది. దీనివల్ల ఆటోమేటిగ్గా చిరుతిండిన తగ్గించగలుగుతాం. పైగా బరువు నిర్వహణకు మద్దతిస్తుంది. మధుమేహం ఉన్నవారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. పైగా ఇది మెరుగైన జీర్ణక్రియ, శక్తిని అందిస్తుందిఎలా తినాలంటే..పాలకూర, క్యారెట్లు లేదా ఓక్రా వంటి కూరగాయలతో భోజనం ప్రారంభించండి.గుడ్లు, పప్పు, చికెన్, టోఫు లేదా పనీర్ వంటి ప్రోటీన్తో అనుసరించండి.ముగించడం..కార్బోహైడ్రేట్లు - బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్ వంటి తృణధాన్యాలు ప్రాధాన్యంగా తీసుకోవాలి.భోజనంతో పాటు చక్కెర పానీయాలను నివారించాలి.శరీరంలో వాపులను తగ్గించడానికి ఎర్ర మాంసం కంటే లీన్ ప్రోటీన్లు లేదా మొక్కల ఆధారిత ఎంపికలను ఎంచుకోవాలి.గమనిక: ఇదికేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: జస్ట్ ఆరు రోజుల్లో ఇంగ్లీష్, అలవోకగా 46 భాషలు..ఏకంగా 400..) -
ఏఐ వింతలు: చనిపోయినవారితో జూమ్ కాల్, మాటామంతీ
అబ్బు: ఏరా సుబ్బూ... ఎలా ఉన్నావు?సుబ్బు: నువ్వు లేకుంటే నేను ఎలా ఉంటానురా? ఎప్పుడూ నీ జ్ఞాపకాలే...అబ్బు: అది సరే. భూలోక విశేషాలు ఏంటీ? కొత్త బైక్ కొన్నావా? ఇంకా ఆ డొక్కు బైకే వాడుతున్నావా(నవ్వు)గమనిక: అబ్బు రెండు సంవత్సరాల క్రితం చనిపోయాడు. సుబ్బు తన గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నాడు.మరి వాళ్లు ఎలా మాట్లాడుకుంటున్నారు?అదంతా ‘గ్రీఫ్బాట్స్’ మహిమ!‘గ్రీఫ్బాట్స్’ (Griefbots) లేదా ‘డెట్బాట్స్’ (deadbots) అనే ఏఐ(AI) స్టార్టప్లు చనిపోయిన వ్యక్తి ప్రతిరూపాన్ని సృష్టించడమే కాదు వారితో మాట్లాడిస్తాయి. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్(ఎల్ఎల్ఎం)లు చనిపోయిన వారి మాటతీరు, హావభావాలను అచ్చంగా అనుకరిస్తాయి. ప్రాజెక్ట్ డిసెంబర్, స్టోరీ ఫైల్, అండ్ యూ, వోన్లీ వర్చువల్... మొదలైన స్టార్టప్లు చనిపోయిన జీవిత భాగస్వామి, ఫ్రెండ్, బం«ధువు... ఇలా ఎంతోమంది ఏఐ అవతార్లతో మాట్లాడించే టూల్స్పై దృష్టి పెట్టాయి. దీనికోసం ప్రైవేట్ డాటాను కూడా విస్తృతంగా వాడుకుంటున్నాయి. (Today tip ఇలాంటి దివ్యౌషధం ఈ భూమ్మీద మరొకటి లేదు!)జస్టిన్ హారిసన్ స్టార్టప్ ‘అండ్ యూ’ యూజర్లకు సరికొత్త అవకాశాన్ని అందిస్తోంది. ఈ స్టార్టప్ సృష్టించిన ఏఐ–పవర్డ్ ఆడియో వెర్షన్స్ ద్వారా చని΄ోయిన వారికి ఫోన్ చేసి మాట్లాడవచ్చు (అంటే... అవతలి వ్యక్తి గొంతు అచ్చం చనిపోయిన వ్యక్తి గొంతును ΄ోలి ఉంటుంది. బతికి ఉన్నప్పుడు ఎలా మాట్లాడేవారో అలాగే మాట్లాడతారు!)‘అమ్మా, నాన్న లేకపోవడం పెద్ద లోటుగా ఉంది. వారిచ్చే సలహాలు నాకు ఎంతో ఉపయోగపడేవి... ఇలా చనిపోయిన తల్లిదండ్రులను తలుచుకొని బాధ పడేవారు బోలెడు మంది ఉంటారు. అలాంటి వారికి మేము సృష్టించిన సాంకేతికత ఎంతో ఊరట ఇస్తుంది’ అంటున్నాడు జస్టిన్ హరిసన్.చనిపోయిన వారితో ‘జూమ్ కాల్’లాంటి సంభాషణలు చేయడానికి వీలు కల్పించే సాంకేతికతను యూజర్లకు అందిస్తోంది ‘స్టోరీ ఫైల్’ స్టార్టప్. కీర్తిశేషుల ఏఐ అవతార్లు కొందరికి సంతోషం కలిగిస్తున్నప్పటికీ, ఆత్మీయులకు ఊరట ఇస్తున్నప్పటికీ ‘గ్రీఫ్బాట్స్’ స్టార్టప్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
Puri Rath Yatra 2025 ప్రత్యేక రైళ్లు
పర్లాకిమిడి: పూరీ రథయాత్ర సందర్భంగా ఈస్టు కోస్టు రైల్వే గుణుపురం–పూరీ–గుణుపురానికి ఈనెల 26, జూలై 4, జూలై 5న ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఈనెల 26న ట్రైన్ నంబర్ 08443 సాయంత్రం 6.30కు గుణుపురం నుంచి బయల్దేరి మరుసటి రోజు వేకువన 2.15కు పూరీ చేరుకుంటుంది. అన్ని స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతుంది. అలాగే తిరుగు ప్రయాణం ట్రైన్ నంబరు 08428 పూరీ నుంచి 2.45లకు వేకువజామున బయలుదేరి గుణుపురానికి మధ్యాహ్నం 12.30లకు చేరుకుంటుందని ఈస్టుకోస్టు రైల్వే సీనియర్ డివిజనల్ మేనేజరు కె.సందీప్ తెలియజేశారు. రిటర్న్ ట్రైను పూరీ నుంచి జూన్ 27 నుంచి జూలై 6, జూలై 7 వరకూ నడుస్తుంది. అలాగే పలాస, పూరీ, పలాసకు అన్రిజర్వుడ్ స్పెషల్ ట్రైన్సు కూడా జూన్ 26 నుంచి జూలై 7 వరకూ రాత్రి 9.30కు పలాసలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30కు పూరీ చేరుకుంటుంది. రిటర్న్ ట్రైన్లు కూడా పూరీ నుంచి పలాసకు జూన్ 27 నుంచి జూలై 8 వరకూ నడుస్తాయి. మధ్యాహ్నం 2.30కు బయల్దేరి అదే రోజు రాత్రి 9.15కు పలాస చేరుకుంటుంది. అన్ని స్టేషన్లలో ఈ ప్యాసింజరు ట్రైను నిలుపుదల చేస్తారని ఒక ప్రకటనలో తెలియజేశారు. చదవండి: శ్రీ జగన్నాథునికి ఖొల్లి లగ్గి సేవ .. ఎలా చేస్తారు? -
Jagannath Rath Yatra శ్రీ జగన్నాథునికి ఖొల్లి లగ్గి సేవ
భువనేశ్వర్: జగన్నాథుడిని యాత్రకు సిద్ధం చేసేందుకు గోప్య సేవకుల వర్గం తలమునకలై ఉంది. గత 13 రోజులుగా స్వామి సోదరీ సోదరులతో కలిసి తెర చాటున గోప్య సేవలు పొందుతున్నాడు. ఆషాఢ కృష్ణ పక్ష త్రయోదశి తిథి పురస్కరించుకుని స్వామి వారికి ఖొల్లి లగ్గి సేవ నిర్వహించారు. రాత్రి పూట ఈ సేవని చేపట్టారు. జ్వరం నుంచి ఉపశమనం పొందడంతో శారీరక దారుఢ్యం కోసం పలు లేపన సామగ్రి గోప్య మండపానికి తరలించడం ఖొల్లి లగ్గి సేవలో భాగం. శుద్ధ సువార్ సేవకుల ఇంటి నుంచి ఈ సామగ్రిని తీసుకుని వెళ్లడం ఆచారం. ముందు రోజు ద్వాదశి నాడు చీకటి పడిన తర్వాత శ్రీ మందిర సముదాయం విమలా దేవి పీఠం ఆవరణలో ఉన్న బావి నుంచి నీరు తోడుకుని పోయి స్వామి చికిత్స కోసం అవసరమైన లేపనాలు తయారు చేశారు. బాజా, తురాయి, ఘంటానాదంతో శుద్ధ సువార్ ఇంటి నుంచి శ్రీ మందిరానికి ఊరేగింపుగా ఔషధ సామగ్రిని సోమవారం తరలించారు. ఈ లేపన సామగ్రిని బలభద్రుడు, దేవీ సుభద్ర, శ్రీ జగన్నాథుని శ్రీ అంగాలకు పూర్తిగా అద్దుతారు. దీనితో శరీరం వజ్ర దారుఢ్యంతో మెరుస్తుంది. రూపుదిద్దుకుంటున్న జగన్నాథుని రథం ఈ నెల 27 నుంచి తొమ్మిది రోజుల పాటు జరగనున్న రథాయాత్ర కోసం రథం నిర్మాణం పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. రథం తయారీలో భాగంగా రంగులు అద్దే పనుల్లొ కళాకారులు నిమగ్నమయ్యారు. ఈ ఏడాది సుమారు 15 లక్షల రుపాయలను వెచ్చించి రథాయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నహాలు చేస్తుంది. స్థానిక పాతబస్టాండు సమీపంలోని గుండిచా మందిరంలో పరిశుభ్రత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటుగా జగన్నాథ, బలభద్ర, శుభద్ర దేవతా మూర్తులు గుండిచా మందిరంలో ఉండి భక్తులకు దర్శంన ఇస్తారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దార్ ప్రియదర్శిని స్వయి తెలిపారు. ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. తొమ్మిది రోజుల యాత్రలో భాగంగా గుండిచా మందిరానికి ఆనుకుని ఏర్పాటైన స్టాల్స్ వద్ద భక్తుల రద్దీ పెరగనున్న నేపథ్యంలో పోలీసులు బందోబస్తు పూర్తిగా ఉంటుందని వివరించారు. -
జస్ట్ ఆరు రోజుల్లో ఇంగ్లీష్, అలవోకగా 46 భాషలు..ఏకంగా 400..
బహు భాషల్లో అలవోకగా మాట్లాడే వారిని చాలామందిని చూశాం. మహా అయితే ఓ 20 లేదా 30 భాషలు వచ్చిన వాళ్లను చూసి.. నోరెళ్లబెట్టేస్తాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే అబ్బాయికి ఎన్ని భాషలు వచ్చో తెలిస్తే విస్తుపోతారు. మాట్లాడటమే కాదు ఆ భాషల్లో రాయడం, టైప్ చేయడం కూడా సునాయాసంగా చేసేస్తాడట. అంత టాలెంటెడ్ యువకుడు ఎవరంటే..ఆ యువకుడు మన భారతదేశంలోని చెన్నైకి చెందినవాడే. ఆ యంగ్ టాలెంట్ పేరు మహమూద్ అక్రమ్. బహుభాషావేత్త తండ్రి పెంపకంలో పెరిగిన అక్రమ్ బాల్యం అంతా అక్షరాలు, లిపిలు, మాండలికాలను అలవోకగా పలికించడం మధ్య పెరిగాడు. అతని తండ్రి షిల్బీ మోజిప్రియాన్ 16 భాషలు మాట్లాడగా..అందులో అతడినే మించిపోయాడు అక్రమ్. నాలుగేళ్లకే తమిళం, ఆంగ్లం నేర్చకున్న అక్రమ్ కేవలం ఆరు రోజుల్లో ఆంగ్లంపై పట్టు సాధించి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆరేళ్ల ప్రాయానికే వట్టేలుట్టు, గ్రంథ ప్రారంభించాడు, అలాగే పురాత తమిళ లింపిలో తండ్రినే అధిగమించాడు.ఇ క ఎనిమిదేళ్లకు ఆన్లైన్ ఫ్లాట్ఫామ్లలో సుమారు 50 భాషలను నేర్చుకున్నాడు. ఏ భాషనైనా సులభంగా నేర్చుకోగల అక్రమ్ మేథస్సుని అంతా సూపర్ కంప్యూటర్తో పోల్చడం విశేషం. అంతేగాదు అతి పిన్న వయస్కుడైన ద్విభాషా టైపిస్ట్గా ప్రపంచ రికార్డుని సైతం గెలుచుకున్నాడు. అలాగే మన జాతీయ గీతాన్ని జస్ట్ ఒక్క గంటలో సుమారు 20 భాషల్లో టైప్ చేసి రికార్డు సృష్టించడమే గాక ప్రతిష్టాత్మక జర్మన్ యంగ్ టాలెంట్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. అలా అతడి ప్రతిభ అంతర్జాతీయ వేదికలకు చేరుకుంది. అంతేగాదు ఓ టాలెంట్ షోలో గెలిచి..ఆస్ట్రియాలోని వియన్నాలోని డానుబే ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకునేలా స్కాలర్షిప్ని కూడా పొందాడు. అలా అక్రమ్ 19 ఏళ్లకే దాదాపు 46 భాషల్లో అనర్గళంగా మాట్లాడటం తోపాటు సుమారు 400 భాషల్లో రాయడం, టైప్ చేయగల సామర్థ్యం సంపాదించాడు.అయితే ఇంతలా డజన్ల కొద్దీ భాషల్లో ప్రావీణ్యం ఉన్నా..అతడుకు అత్యంత ఇష్టమైన భాష మాత్రం మాతృభాష తమిళం అంటేనే మహాప్రీతి అని చెబుతున్నాడు. అదే తన హృదయానికి దగ్గరగా ఉంటుందని, పైగా తన తమిళ వారసత్వం, సంస్కృతిని చాటిచెప్పేలా ఈ బహు బాషా ప్రావిణ్యం ఉపకరిస్తోందని చెబుతున్నాడు అక్రమ్.(చదవండి: 52 ఏళ్లుగా కడుపులోనే టూత్ బ్రెష్..!ఐతే సడెన్గా..) -
Today tip ఇలాంటి దివ్యౌషధం ఈ భూమ్మీద మరొకటి లేదు!
నిద్రను మించిన సుఖం లేదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆవేదనలనుంచి అలసటనుంచి ఎంతో ఉపశమనాన్నిస్తుంది. అందుకే కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది అంటాడో సినిమా కవి.మరో విధంగా చెప్పాలంటే ఈ భూమి మీద అత్యంత బలమైన ఔషధం నిద్ర. కానీ ఆధునిక కాలంలో నిద్ర అనేది చాలామంది అందని ద్రాక్షలా మిగిలిపోతోంది.మారుతున్న జీవన శైలి, నిద్రలేమి ప్రభావం యువతమీద , ఉద్యోగుల మీద తీవ్రంగా ఉంటోంది. జీవగడియారం సరిగా నడవడానికి నిద్ర ఎంత ముఖ్యమో తెలుసా? పదండి ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా నిద్రప్రయోజనాలు, పరిష్కారాలు తెలుసుకుందాం.నిద్ర అంటే ఏమిటి?నిద్ర అంటే శరీరం , మెదడు విశ్రాంతి తీసుకోవడానికి అనుమతించే ఒక సాధారణ శరీర ప్రక్రియ. రాత్రిపూట నిద్ర వల్ల అనేక ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతారు. అఇయతే కళ్లు మూసుకోగానే నిద్రలోకి జారిపోయే అదృష్టవంతులకు ఇది చాలా సులభం అనిపించినా, నిద్రాదేవత అనుగ్రహించని వారి బాధలు అన్నీ ఇన్నీ కావు. వ్యాయామం ,సమతుల్య ఆహారం లాగానే నిద్ర కూడా మన ఆరోగ్యానికి చాలా అవసరం నిద్రలేమితో మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బు, గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ఆరోగ్యంగా ఉండాలంటే ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి. అలాగే అప్పుడే పుట్టిన పిల్లలకు 18 గంటలు , చిన్న పిల్లలు 11 గంటలు నిద్రపోవాలని, టీనేజర్లకు 10 గంటలు నిద్రపోవాలని అంటారు నిపుణులు. మంచి నిద్ర మెదడును ఉత్తేజ పరుస్తుంది. మరుసటి రోజు పనికి ఉత్సాహాన్ని ఇస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. విసెరల్ కొవ్వును కరిగిస్తుంది.DNA నష్టాన్ని సరిచేస్తుంది . కొత్త మెదడు కణాలను ఉత్పత్తి చేస్తుంది.మంచి నిద్రకోసం చిట్కాలుమంచినిద్ర కావాలంటే జీవన శైలి సక్రమంగా ఉండాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి.క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది.నిద్రవేళకు 3 గంటలలోపు వ్యాయామం చేయాలనేది గుర్తించుకోండిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం కూడా చాలా ముఖ్యం. మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లు , కంప్యూటర్ల నుండి వెలువడే నీలిరంగు కాంతి నిద్రను ప్రభావితం చేస్తుంది. కనుక పడుకునే ముందు కనీసం ఒక గంట ముందు ఎలక్ట్రానిక్ పరికరాలను దూరం పెట్టేయాలి.వేడి నీటి స్నానం, పుస్తకం పఠనం, ప్రశాంతమైన సంగీతం వినడంతోపాటు నిద్రకు ముందు కెఫిన్, ఆల్కహాల్కు దూరంగా ఉండాలి.పడకగదిని నిద్రకు అనుకూలంగా అంటేగదిని చీకటిగా, ప్రశాంతంగా, వాతావరణానికి అనుగుణంగా మార్చుకోవాలి.ధ్యానం , యోగా, శ్వాస వ్యాయామాలు నిద్రకు సహాయపడతాయి.మంచినిద్ర కావాలంటే డి విటమిన్ చాలా అవసరం పగటి నిద్ర రాత్రి నిద్రకు చేటు. రాత్రి పూట హెవీ మీల్ తినవద్దుసాయం చేసే ఆహారంపైన చెప్పిన జాగ్రత్తలతోపాటు పడుకునే ముందు 1 ఔన్స్ టార్ట్ చెర్రీ రసం లేదా రోజుకు రెండుసార్లు టార్ట్ చెర్రీస్ తినవవచ్చు.పుట్టగొడుగులు,సాల్మన్, ట్యూనా చేపలు సహజంగా మెలటోనిన్ ఉత్పత్తిని పెంచుతాయి.ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మెదడు కెమిస్ట్రీని ఆప్టిమైజ్ చేస్తాయి.పాలీఫెనాల్ అధికంగా ఉండే బెర్రీలు (బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్, బ్లాక్బెర్రీస్) తీసుకోవచ్చు. ఆరోగ్యవంతమైన సెక్స్ తరువాత కూడా మంచి నిద్ర పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతారు.నోట్ : ఎంత ప్రయత్నించినా నిద్రలేమి లేదా ఇతర నిద్ర సంబంధిత సమస్యలు ఉంటే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. కారణాలను విశ్లేషించుకుని తగిన చికిత్స తీసుకుంటే నిద్రా దేవి ఒడిలో ఒరిగిపోవడం ఖాయం. -
52 ఏళ్లుగా కడుపులోనే టూత్ బ్రెష్..!ఐతే సడెన్గా..
అనుకోకుండా ఏదైనా వస్తువుని పొరపాటున మింగితే అప్పటికీ ఎలాంటి సమస్య తలెత్తదు కొందరికి. కానీ ఒక్కోసారి అనారోగ్యం పాలైనప్పుడూ లేదా శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడూ..ఆ వస్తువు ప్రాణాంతకంగా మారిపోతుంది అందుకు నిదర్శనమే ఈ ఘటన. అసలేం జరిగిందంటే..ఈ విచిత్రమైన ఘటన చైనాలో చోటుచేసుకుంది. యంగ్ అనే 64 ఏళ్ల వ్యక్తి కొన్ని రోజుల క్రితం విపరీతమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చాడు. అయితే ఇది గ్యాస్ నొప్పా లేక మరేదైనా అని క్షుణ్ణంగా పరిశోధించినా.. సమస్య ఏంటన్నది తేలలేదు. దీంతో అతడి జీర్ణవ్యవస్థలో ఏదైనా సమస్య ఉందా.. ? అని వైద్య పరీక్షలు చేస్తుండగా చిన్న పేగుల్లో ఒక వస్తువుని చూసి అవాక్కయ్యారు వైద్యులు. దాన్ని క్లియర్గా స్కాన్ చేయగా టూత్ బ్రష్ అని తేలింది. ఆ విషయమై సదరు పేషెంట్ యంగ్ని వైద్యులు ప్రశ్నించారు. అతడు తానెప్పుడో చిన్నతనంలో టూత్ బ్రెష్ మింగేసిన విషయం గుర్తు తెచ్చకున్నాడు. సుమారు 12 ఏళ్ల వయసులో టూత్ బ్రష్ని మింగేశానని, అయితే తల్లిదండ్రులు తిడతారని ఆ విషయం వారికి చెప్పలేదని నాటి ఘటనను గుర్తుతెచ్చుకున్నాడు యంగ్. అది విని వైద్యులే కంగుతిన్నారు. ఏంటీ 52 ఏళ్లుగా కడుపులోనే ఈ టూత్ బ్రష్ ఉండిపోయిందా.. ? అని ఆశ్చర్యపోయారు వైద్యులు. నిజానికి టూత్ బ్రష్ పేగుల్లోకి చేరి తిరుగుతూ కణజాలాన్ని పంక్చర్ చేసే ప్రమాదం లేకపోలేదన్నారు. అలా జరిగితే పేగుల్లో చిల్లులు ఏర్పడి ప్రాణాంతకంగా మారుతుందన్నారు. కానీ ఇక్కడ యంగ్ విషయంలో అదృష్టవశాత్తు టూత్ బ్రష్ పేగు వంపులో చిక్కుకుపోయి..దశాబ్దాలుగా అక్కడే ఉండిపోయిందన్నారు వైద్యులు. అయితే ఇది ఇప్పుడు పేగుల్లో కదలడం మొదలవ్వడంతోనే.. యంగ్ విపరీతమైన కడుపునొప్పిని అనుభవించినట్లు తెలిపారు. అయితే వైద్యులు చాలా గంటలు శ్రమించి ఆ టూత్ బ్రష్ని విజయవంతంగా కడుపులోంచి వేరు చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఐదు దశాబ్దాలుగా టూత్బ్రష్తోనే జీవించాడా వ్యక్తి.. ? అని ఆశ్చర్యపోతున్నారు. ఇన్నాళ్లు అతడికి ఎటువంటి హాని కలిగించకపోవడం అనేది నిజంగా అదృష్టం అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: యవ్వనంగా ఉండాలంటే.. చర్మంపై ఫోకస్ తప్పనిసరి..!) -
అది బైకా.. లేక ఇంకేమన్నానా! మారండిరా బాబూ!!
ప్రమాదమని తెలిసినా కొంతమంది కుర్రకారు రెచ్చిపోతూనే ఉన్నారు. పిచ్చి పిచ్చి చేష్టల కారణంగా కళ్ల ముందే నిండుప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా వీరి ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఒక వీడియో నెట్టింట్ హల్ చల్ చేస్తోంది. ఇది చూసిన నెటిజనులు తిట్టిపోస్తున్నారు. మరోవైపు అనేక సామాజిక అంశాలపై సోషల్మీడియాలో స్పందించే టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Vishwanath Channappa Sajjanar) కూడా ఈవీడియోపై అగ్రహం వ్యక్తం చేశారు. జరగరానికి జరిగితే, ఆ తల్లిదండ్రులకు, కుటుంబాలకు ఎంతటి క్షోభ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సజ్జనార్ ట్వీట్లో ఎమన్నారంటే..అది బైకా.. లేక ఇంకేమన్నానా!!ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఎనిమిది మంది.. ప్రమాదమని తెలిసి కూడా ఇలా చేస్తున్నారంటే వీళ్లని ఏం అనాలి. జరగరానిది జరిగి ప్రాణాలు పోతే మీ కుటుంబాలు ఎంతటి క్షోభను అనుభవిస్తాయనే కనీస సోయి కూడా వీళ్లకు లేదు.సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు టీనేజర్లు, యూత్ ఇలాంటి వెర్రి వేషాలు వేస్తున్నారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రమాదకర ప్రయాణాలు చేస్తున్నారు. ఇదేం పిచ్చో వాళ్లకే తెలియాలి!!అది బైకా.. లేక ఇంకేమన్నానా!!ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఎనిమిది మంది.. ప్రమాదమని తెలిసి కూడా ఇలా చేస్తున్నారంటే వీళ్లని ఏం అనాలి.జరగరానిది జరిగి ప్రాణాలు పోతే మీ కుటుంబాలు ఎంతటి క్షోభను అనుభవిస్తాయనే కనీస సోయి కూడా వీళ్లకు లేదు.సోషల్ మీడియాలో ఫేమస్… pic.twitter.com/dmXUQ8BWz4— V.C. Sajjanar, IPS (@SajjanarVC) June 24, 2025అటు ఇకనైనా మారండిరా బాబూ, సోషల్మీడియా పిచ్చి ఇలాంటి వెర్రిమొర్రి వేషాలు వేయకండి.. మీరు బాగానే పోతారు.. మీ వెనక అమ్మనాన్న పరిస్థితి ఏంటి? మీలో ఎవరైనా శాశ్వత వికలాంగులుగా మారిపోతే ఎలా? ఎపుడైనా ఆలోచించారా అంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని తగినవిధంగా శక్షించాలి అని కొందరు, తల్లిదండ్రులు కూడా ఇలాంటి వాటిని ఒక కంట గమనిస్తూ తమ బిడ్డలను మందలించాలని మరికొందరు సూచిస్తున్నారు. చదవండి: అంత విషాదంలో డీజే పార్టీ?ఎయిరిండియాపై తీవ్ర ఆగ్రహం, వీడియో వైరల్ -
సేంద్రియ బియ్యంతో జగన్నాథునికి అమృతాన్న భోగం
భువనేశ్వర్: పూరీ జగన్నాథుని దైనందిన భోగాల నివేదనలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది రథ యాత్ర మొదలుకొని స్వామి వారికి అమృత అన్న భోగం నివేదన ప్రారంభించనున్నారు. ఈ కార్యాచరణలో భాగంగా రథ యాత్ర నుంచి గుండిచా మందిరం అడపా మండపంలో కొఠొ భోగ సమయంలో మహా ప్రభువుకు అమృత అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. సోమవారం మందిరం ప్రధాన నిర్వాహకుడు (సీఏఓ) డాక్టర్ అరవింద కుమార్ పాడీ అధ్యక్షతన జరిగిన అధికారిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బొడు సువార్, సువార్ మహాసువార్ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. సువార్ మహాసువార్ భోగ మండపంలో అమృత అన్నం ఉపయోగించాలని ప్రతిపాదించారు. మహా ప్రభువు భోగం తయారీలో అమత అన్నాన్ని ఉపయోగించడం గురించి గతంలో చర్చించి ప్రయోగాత్మకంగా ఈ చర్యని అమలు చేశారు. కొరాపుట్ ప్రగతి ఇనిస్టిట్యూట్ అమృత అన్నం బియ్యం సరఫరాకు మద్దతు ప్రకటించిందని సీఏఓ తెలిపారు. ఈ సంస్థ ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. సేంద్రియ బియ్యంతో ప్రసాదం తయారీ.. మందిరంలో జగన్నాథుని అన్న ప్రసాదాలు మహా ప్రసాదంగా ప్రతీతి. ఈ ప్రసాదం సేంద్రియ బియ్యాన్ని ఉపయోగించి తయారు చేయాలని పాలక వర్గం నిర్ణయించడం ప్రత్యేకత సంతరించుకుంది. స్వామి నిత్య అన్న ప్రసాదాల తయారీలో సేంద్రియ బియ్యం వినియోగిస్తారు. ఈ బియ్యంతో వండిన ప్రసాదాల్ని అమృత్ అన్నం అనే ప్రత్యేక పేరుతో వ్యవహరిస్తారు. ఎటువంటి రసాయన ఎరువులు ఉపయోగించకుండా సహజమైన ఎరువులను ఉపయోగించి సాగు చేసిన బియ్యం మాత్రమే వినియోగిస్తారు. తొలి దశలో స్వామికి నివేదించే కొఠొ భోగ సేవలో మాత్రమే వినియోగిస్తారు. తదుపరి దశలో ఇతర అన్ని వంటకాల్లో ఈ బియ్యం వినియోగం బలపరుస్తారు. రాష్ట్రంలో రైతులు పండిస్తున్న కొళాజీర, పింపుడిబాసొ, యువరాజ్ మొదలైన సేంద్రియ బియ్యాన్ని అమృత అన్న మహా ప్రసాదంలో ఉపయోగిస్తారు. మందిరంలో రోజుకు 50 నుండి 55 క్వింటాళ్ల బియ్యంతో స్వామి మహా ప్రసాదం వంటకం అవుతుంది. ప్రత్యేక ఉత్సవాలు, పండగపబ్బాల సందర్భంగా రోజుకు 100 నుండి 200 క్వింటాళ్ల బియ్యాన్ని ఉపయోగిస్తారు. అదనంగా కొఠొ భోగం కోసం ప్రతి రోజూ 100 కిలోల బియ్యాన్ని ఉపయోగిస్తారు. అన్న మహా ప్రసాదానికి అధిక నాణ్యత గల బియ్యం వినియోగానికి ప్రాధాన్యం కల్పిస్తున్నారు. పిండి వంటల ప్రసాదాల తయారీలో మసూరి బియ్యం కొనసాగుతుంది. క్రమంగా వీటి స్థానంలో అమృత్ అన్నం బియ్యం వినియోగించే యోచన ఉన్నట్లు పేర్కొన్నారు. పథకం ప్రకారం మందిరం అన్న ప్రసాదాల తయారీలో కొరత లేకుండా అమృత అన్నం బియ్యం సరఫరా చేసేందుకు కనీసం నాలుగు వందల నుంచి ఐదు వందల ఎకరాల భూమిలో సేంద్రియ వరి సాగు అవసరం అని అనుభవజ్ఞుల వర్గం పేర్కొంది. మందిరం పాలక వర్గం ఈ మేరకు సన్నాహాలు చురుగ్గా కొనసాగిస్తుంది.ఇదీ చదవండి: Jagannath Yatra 2025 : మూడు రథాలు, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత -
స్కిన్ కేర్ 'ఏజ్ నో బార్'..!
కాలం ఎవరికోసమూ ఆగదు. కాలం గడుస్తున్న కొద్దీ అది ప్రతి అంశం మీదా ఏదో ఒక ప్రభావం చూపుతుంది.అలాగే మన చర్మం మీద కూడా. వయసు పెరుగుతున్న కొద్దీ వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుండటంతో చర్మానికి వచ్చే సమస్యలు, వ్యాధులొచ్చే అవకాశాలూ పెరుగుతాయి. అందుకే వయసు పెరుగుతున్న ప్రతి ఒక్కరూ...వారు ఏ వయసు వారైనప్పటికీ...తమ చర్మానికి వచ్చే కొన్ని సమస్యలను తెలుసుకుని తగిన శ్రద్ధ తీసుకోవడం అవసరం. కాలాన్నైతే ఆపలేం గానీ... దాని ప్రభావం వల్ల చర్మంపై వచ్చే మార్పులను ఆలస్యంగా వచ్చేలా చేసుకుని చాలాకాలం పాటు యౌవనంగా కనిపించవచ్చు. అదెలాగో తెలుసుకుందాం...వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చేమార్పులు...సమయం గడుస్తున్న కొద్దీ చర్మానికి వచ్చే అనేక ఆరోగ్య సమస్యలు చాలానే ఉంటాయి. ఉదాహరణకు చర్మాన్ని పొడిబార్చే జీరోసిస్ వంటి సాధారణ సమస్యలు మొదలుకొని చర్మం కింద రక్తం పేరుకున్నట్లు కనిపించే పర్ప్యూరా, హిమటోమా వరకు... ఎండకు పగుళ్లుబారినట్లు కనిపించే సోలార్ ఎలాస్టోసిస్ మొదలుకొని... కొన్ని రకాల క్యాన్సర్స్ వరకు చాలా సమస్యలు రావచ్చు. అలాంటి సమస్యలేమిటన్నది చూద్దాం. చర్మంలో ప్రధానంగా మూడు పొరలు ఉంటాయి. బయటి పొరను ఎపిడర్మిస్, మధ్యపొరను డర్మిస్ అంటారు. దానికింద సబ్క్యుటేనియస్ టిష్యూ ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ మూడు పొరల్లో చాలా మార్పులు వస్తాయి. ఎపిడర్మిస్ పొర: ఈ పొర పలుచబారడం మొదలవుతుంది. ఈ పొరలో చర్మానికి రంగునిచ్చే మెలనోసైట్స్ అనే కణాలు తగ్గడం మొదలవుతుంది. అందుకే వృద్ధుల్లోని చర్మం చాలావరకు పారదర్శకంగా మారి... లోపలు ఉండే రక్తనాళాలు కొంతవరకు బాగా కనిపిస్తూ ఉంటాయి. వయసు పెరుగుతున్నకొద్దీ చర్మం పాలిపోయినట్లుగా అవుతుంది. డర్మిస్ పొర : ఇందులో చర్మ కణాలను గట్టిగా పట్టి ఉంచే కొలాజెన్, ఎలస్టిన్ అనే కనెక్టివ్ కణజాలాలు ఉంటాయి. వీటి వల్ల చర్మానికి సాగే గుణం, బలం సమకూరుతాయి. ఈ కణాలు బలంగా ఉన్నప్పుడు చర్మం బిగుతుగా ఉంటుంది. యౌవనంలో కొలాజెన్, ఎలాస్టిన్ కణజాలం బలంగా ఉంటుంది కాబట్టి చర్మం బిగుతుగా ఉంటుంది. వయసు పైబడుతున్నకొద్దీ ఈ బలం తగ్గుతుండటంతో చర్మం సాగినట్లుగా, వదులవుతున్నట్లుగా కనిపిస్తుంది. దాంతోపాటు డర్మిస్లో ఉండే రక్తనాళాలు సైతం బలహీనంగా అవుతాయి. దాంతో వయసు పెరిగిన వారిలో చిన్న దెబ్బకైనా వెంటనే రక్తస్రావం అవుతుంది. సబ్క్యుటేనియస్ పొర : ఇందులో కొవ్వు ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ కొవ్వు తగ్గిపోతూ ఉండటం కారణంగా చర్మం మునుపటిలా మందంగా ఉండదు. పలచబారి΄ోతుంది. ఈ పొరలోనే చెమట గ్రంథులూ, అలాగే చర్మంపై నూనెలాంటి పదార్థాన్ని స్రవించే సెబేషియస్ గ్రంథులూ ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ గ్రంథుల పనితీరు కూడా తగ్గుతూ ఉంటుంది. దాంతో చెమట పట్టే సామర్థ్యం కూడా తగ్గిపోయి చర్మం పొడిబారినట్లుగా అవుతుంది. తన స్వాభావికమైన నునుపుదనాన్నీ కోల్పోతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ పైన చెప్పిన అన్ని సమస్యల కారణంగా చర్మం తన పటుత్వాన్ని కోల్పోయి వేలాడుతున్నట్లుగా అవుతుంది. చర్మంపై ముడుతలు (రింకిల్స్) కూడా వస్తాయి. కాలంతో వచ్చే ఈ మార్పులు రాకుండా చేయడానికిగానీ లేదా ఆపడం గానీ పూర్తిగా సాధ్యం కాదు. అయితే కొన్ని సందర్భాల్లో కొందరిలో ఈ మార్పులు చాలా వేగంగా జరగవచ్చు. అందుకు కారణమయ్యే అంశాలివి...తొలి ప్రభావం ఇలా... చర్మం పొడిబారిపోవడం, పాలిపోవడం, సాగేగుణం (ఎలాస్టిసిటీ) కోల్పోవడం, ముడుతలు, వేలాడినట్లుగా కావడం... ఈ గుణాలన్నీ తొలుత ముఖం, చేతుల చర్మంపై ఎక్కువగా కనిపిస్తాయి. ముఖంలోనూ ముక్కుకు ఇరువైపులా, నోటి చుట్టూ, దవడపైన ఉండే చర్మం, గవదల దగ్గరా ఎక్కువగా కనిపిస్తాయి. చేతుల విషయానికి వస్తే ముంజేతులు, కాళ్ల వద్ద ఉన్న చర్మంలో తొలుత మార్పులు వస్తాయి. ఆ తర్వాత శరీరంలోని మిగతా చర్మంపై అంతటా ఈ మార్పులు చోటు చేసుకుంటాయి. ముడతలు పడటం ఇలా : చర్మంపై వచ్చే ముడతల్లోనూ రెండు రకాలుగా చెప్పవచ్చు. తొలుత కాస్త స్పష్టంగా కనిపించే ముడతలను ‘ఫైన్ రింకిల్స్’ అంటారు. ఇవే ముడతలు మరింత లోతుగా, ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటే వాటిని ‘డీప్ రింకిల్స్’ అంటారు. ఇవి నలభై ఏళ్లు దాటాక మొదట్లో ముడతలు కాస్త కనిపించీ కనిపించనట్లుగా ఉంటూ, ఆ తర్వాత క్రమంగా మరింత లోతుగా మారుతుంటాయి. తొలుత కనిపించీ కనిపించని సమయంలోనే చర్మంపై శ్రద్ధ తీసుకోకపోతే త్వరగానే డీప్ రింకిల్స్గా మారతాయి. జీరోసిస్ లేదా ఏస్టిటోటిక్ డర్మటైటిస్ : ఈ సమస్యనే మామూలు వాడుక భాషలో పొడి చర్మంగా చెప్పవచ్చు. ఈ సమస్య ముందుగా కాళ్లలోని మోకాలి కింద భాగంలో ఉన్న చర్మంలో ఎక్కువగా కనిపిస్తుంది. దుస్తులు కప్పని భాగాల్లో ఈ సమస్య కొంత స్పష్టంగా కనిపిస్తుంది. ఏజ్ స్పాట్స్ లేదా లివర్ స్పాట్స్ : చర్మానికి రంగును ఇచ్చే కణాలు మెలనోసైట్స్ తగ్గడం వల్ల ఒంటి రంగు పాలిపోయినట్లుగా కనిపిస్తుంది. ఆ తర్వాత పెద్ద పెద్ద నల్లటి మచ్చలు వస్తాయి. వాటిని ఏజ్ స్పాట్స్ లేదా లివర్స్పాట్స్ లేదా సోలార్ లెంటిజీన్స్ అంటారు. చర్మం సూర్యరశ్మికి ఎక్స్΄ోజ్ అయ్యేచోట ఇవి ఎక్కువగా వస్తుంటాయి. సోలార్ ఎలాస్టోసిస్ : సూర్యరశ్మి నేరుగా తగిలే భాగాల్లో చర్మం కాస్త మందంగా మారినట్లుగా (లెదరీగా) ఉండటం, పగుళ్లువారినట్లుగా కనిపించడం జరుగుతుంది. ఈ సమస్య ఎండలో పనిచేసే వారిలో అంటే రైతులు, ఎండలో పనిచేసే కార్మికులు, నావికుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. సెబోరిక్ కెరటోసిస్ : చర్మంపై కందిగింజ పరిమాణంలో (ముఖ్యంగా చేతుల మీద, ముఖంపైన) గోధుమరంగు (బ్రౌన్)లో మచ్చలు వస్తాయి. వాటినే సెబోరిక్ కెరటోసిస్ అంటారు. హైపోథెర్మియా : హైపోథెర్మియా అనే కండిషన్లో సబ్ క్యుటేనియస్ పొరలో ఓ మార్పు వస్తుంది. స్వేదగ్రంథుల సామర్థ్యం తగ్గిపోతుంది. చర్మం మందం కోల్పోయి పలచబారుతుంది. దాంతో ‘హై΄ోథెర్మియా’ కండిషన్ ఉన్నవారు – వాతావరణంలో చలి ఎక్కువగా ఉంటే సాధారణ వ్యక్తుల కంటే చలిని చాలా ఎక్కువగా ఫీలవుతారు. అలాగే ఉష్ణోగ్రత కొద్దిపాటి పెరిగినా వెంటనే ఎండదెబ్బకు గురవుతారు. స్కిన్ ట్యాగ్స్ లేదా యాక్రోకార్డాన్స్ : చర్మం వదులుగా మారి – మెడలు, బాహుమూలాల వద్ద పులిపిర్లలా కాయల్లా కనిపిస్తాయి. తొడల వద్ద కూడా కనిపిస్తాయి. అదనపు చర్మంలా ΄÷డుచుకు వచ్చినట్లుగా పులిపిర్ల (ఔట్గ్రోత్స్) లాగా కనిపిస్తాయి. ఎయిర్బార్న్ కాంటాక్ట్ డర్మటైటిస్ : వయసు పైబడుతున్న కొద్దీ చర్మానికి అలర్జీలు వచ్చే అవకాశాలు పెరుగుతుంటాయి. అంతేకాదు అలర్జీలు చాలా తేలిగ్గా కూడా వస్తుంటాయి. పరిసరాల్లో ఉండే మొక్కల కారణంగా (పార్థీనియం వంటివి) చర్మంపై అలర్జీలు వస్తే దాన్ని ఎయిర్బార్న్ కాంటాక్ట్ డర్మటైటిస్ అని అంటారు. పర్ప్యూరా అండ్ హిమటోమాస్ : చర్మం కింద ఉన్న రక్తనాళాలు పెళుసుబారడం వల్ల (ఫ్రాజైల్గా మారడం వల్ల) అవి తేలిగ్గా చిట్లవచ్చు. దాంతో అక్కడ రక్తం చేరినట్లుగా చర్మం లోంచి బయటకు కనిపిస్తుంది. దాన్ని ‘సెనైల్ పర్ప్యూరా’ అంటారు. రక్తం పేరుకు΄ోవడంతో అక్కడ చర్మం కాస్త ఉబ్బుగా కనిపిస్తుంటే దాన్ని హిమటోమా అని అంటారు. కెరటో ఆకాంథోమా : వయసు పైబడుతున్న వారిలో, ఎండలో ఎక్కువగా తిరిగే వారిలో క్యాన్సర్కాని కొన్ని కాయలు (నాన్ క్యాన్సరస్ స్కిన్ గ్రోత్స్) కనిపిస్తాయి. అవి చాలా పెద్దగా ఉండి, చుట్టూ ఎత్తుగా ఉన్నా మధ్యలో గుంటలా ఉంటాయి. న్యూరోడర్మటైటిస్ : ప్రధానంగా పాదాల మీద నల్లటి మచ్చలా వచ్చి, చాలా దురదగా ఉండే లక్షణాలతో వ్యక్తమయ్యే సమస్య ఇది.చర్మానికి వచ్చే ఇన్ఫెక్షన్లువయసు పైబడుతున్నకొద్దీ చర్మం ఇన్ఫెక్షన్స్కు తేలిగ్గా గురవుతుంది. ఆ ఇన్ఫెక్షన్లు ఇవి...బ్యార్టీరియా వల్ల –ఫాలికులైటిస్, సెల్యులైటిస్ ఫంగస్ వల్ల–క్యాండిడియాసిస్, డెర్మటోఫైట్ ఇన్ఫెక్షన్స్ వైరస్ వల్ల–జోస్టర్ఇన్ఫెస్టేషన్స్ వల్ల–గజ్జి (స్కేబిస్) వంటివి. ఆటో ఇమ్యూన్ వ్యాధులు తమలోని వ్యాధి నిరోధక వ్యవస్థ తమ సొంత కణాలనే శత్రుకణాలుగా భావించడం వల్ల వచ్చే వ్యాధులనే ఆటో ఇమ్యూన్ వ్యాధులుగా చెబుతారు. ఆటో ఇమ్యూన్ వ్యాధులకు ఒక ఉదాహరణగా సోరియాసిస్ను చెప్పవచ్చు. సోరియాసిస్ : వయసు పెరుగుతున్న కొద్దీ సోరియాసిస్ అనే చర్మ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇవి మొదట పొడిగా ఆ తర్వాత వెండిరంగు ΄÷ట్టు రాలుతున్నట్లుగా లక్షణాలు కనిపిస్తాయి. చర్మ కేన్సర్లు : చర్మ క్యాన్సర్లు కాస్త అరుదుగా వచ్చేవే అయినప్పటికీ... పెరుగుతున్న వయసు వాటికి ఒక రిస్క్ ఫ్యాక్టర్. అందుకే వయసు పెరుగుతున్న కొద్దీ చర్మానికి క్యాన్సర్ వచ్చే అవకాశాలూ పెరుగుతాయి. వయసు పెరుగుతున్న వారిలో బేసల్ సెల్ ఎపిథిలియోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా, మెలనోమా వంటి క్యాన్సర్స్లు కనిపించవచ్చు. జాగ్రత్తలువయసును ఆపలేకపోయినా... కొన్ని జాగ్రత్తలతోనూ, సూచనలతో పాటు మంచి పోషకాహారం, వ్యాయామాలతో... వయసుతో పాటు వచ్చే దుష్ప్రభావాలను చాలావరకు ఆపవచ్చు. వయసు పైబడుతున్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చాలాకాలం పాటు చర్మాన్ని ఏజింగ్ తాలూకు లక్షణాల నుంచి సంరక్షించుకోవచ్చు. అవి... బాగా సుగంధభరితమైన సబ్బులు వాడకపోవడం. మైల్డ్ సోప్స్ మాత్రమే వాడటం బాత్ ఆయిల్స్ను వాడకపోవడం. బాత్ ఆయిల్స్తో, సుగంధభరితమైన సబ్బులతో అలర్జీలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఎండలోకి వెళ్లేప్పుడు తగినంత ఎస్పీఎఫ్ ఉన్న సస్స్క్రీన్ లోషన్స్ వాడటం. (చలికాలంలోనూ వీటిని వాడటం మానుకోకూడదు) మాయిశ్చరైజేషన్ లోషన్స్తో చర్మాన్ని పొడిబారకుండా చూసుకోవడం శరీరాన్ని దాదాపుగా కప్పి ఉంచే మంచి సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం అవసరాన్ని బట్టి క్యాప్ లేదా బ్రిమ్డ్ హ్యాట్ వంటివి వాడటం అన్ని రకాల పోషకాలూ ఉండే సమతుల ఆహారాన్ని తీసుకోవడం. పెరుగుతున్న వయసుతో చర్మంపై ప్రభావం కనపడనివ్వకుండా చేసుకోడానికి మంచి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల చర్మం చాలాకాలం ఆరోగ్యంగా, ఏజింగ్కు గురికాకుండా ఉంటుంది. ఆకుకూరలు, పండ్లు, బాదం వంటి డ్రై ఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ ఎక్కువగా ఉంటాయి ఆహారంతోపాటు తగినంత ద్రవాహారం తీసుకుంటూ శరీరంలోని లవణాలను కోల్పోకుండా (డీ హైడ్రేషన్కు గురికాకుండా) చూసుకోవడం పొగతాగే అలవాటును తక్షణం మానేయడం. (ఈ అలవాటు వల్ల కాలం గడిచేకొద్దీ ఏజింగ్ వల్ల చర్మంపై వచ్చే దుష్ప్రభావాలు చాలా వేగంగా వస్తాయి) గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం. (స్నానం చేసే విషయంలో గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... మనం స్నానానికి వాడే నీటి ఉష్ణోగ్రత... మన శరీర ఉష్ణోగ్రత కన్నా తక్కువగా ఉండటం మంచిది) ∙చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్స్కు వెంటనే చికిత్స తీసుకోవడం. (నిర్లక్ష్యం చేస్తే అవి మరిన్ని ఇతర సమస్యలకు దారితీయవచ్చు) డయాబెటిస్, థైరాయిడ్, పోషకాహారలోపాలు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో చర్మం పొడిబారిపోయి మరికొన్ని సమస్యలు రావచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం ద్వారా పెరిగే వయసుకు అతీతంగా చాలాకాలం పాటు యంగ్గా కనిపించవచ్చు.డాక్టర్ కొప్పిశెట్టి సత్య నాగ రవితేజ, సీనియర్ డర్మటాలజిస్ట్ (చదవండి: ఏఐ, మెషిన్ లెర్నింగ్ కోర్సులవైపు యువత అడుగులు..) -
అంత విషాదంలో డీజే పార్టీ?ఎయిరిండియాపై తీవ్ర ఆగ్రహం, వీడియో వైరల్
భారతదేశం తన చరిత్రలోనే అత్యంత దారుణమైన విమానయాన ప్రమాదాల్లో ఒకటి అహ్మదాబాద్లో జరిగిన AI171 విమాన ప్రమాదం. అయితే ఘోర విపత్తులో దాదాపు 270 మంది ప్రాణాలు కోల్పోయిన కొద్ది రోజులకే ఎయిర్ ఇండియా SATS (AISATS) ఉన్నతాధికారులు గురుగ్రామ్ కార్యాలయంలో డీజే పార్టీలో నృత్యం చేస్తూ ఎంజాయ్ చేయడం విమర్శలకు తావిచ్చింది.AISATS అనేది విమానాశ్రయ గ్రౌండ్ సేవలను అందించే సంస్థ. టాటా గ్రూప్కు చెందిన ఎయిర్ ఇండియా విమానాశ్రయ సేవలు , ఫుడ్ అందించే SATS అనే రెండు కంపెనీల (50-50) సమ భాగస్వామ్యంలో ఉన్న జాయింట్ వెంచర్ ఇది.ఎయిర్ ఇండియా SATS (AISATS) సీనియర్ అధికారులు గురుగ్రామ్ లో ఒక DJ పార్టీలో డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూన్ 20న జరిగిన ఈ పార్టీకి AISATS చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అబ్రహం జకారియా, ఎయిర్ ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, GM, సంప్రీత్ కోటియన్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ GM హాజరయ్యారు. విమాన ప్రమాదంలో 270 మందికి పైగా మరణించిన కొద్ది రోజులకే ఇలాంటి పార్టీ చేసుకోవడం దుమారాన్ని రాజేసింది. వందలాది మంది బాధితులు హృదయవిదారకమైన శోకం ఉంటే, ఆప్తులను కోల్పోయి కంటిమింటికి ధారగా రోదిస్తోంటే... కనీస మానవత్వం లేకుండా ఇలా కుప్పిగంతులు వేస్తున్నారంటూ దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రగిలింది. ఈ విషాదంలో కేవలం బాధితులు మాత్రమే కాదు, యావద్దేశం దుఃఖిస్తోంది.కానీ కనీస ఇంగితలం లేకుండా అధికారులు ఇలాంటి వేడుకలు జరుపుకోవడం సరికాదని మండిపడ్డారు. దీనిపై సంబంధింత అధికారులు క్షమాపణలు చెప్పినప్పటికీ, ఇది క్షమించరానిది అంటూ ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతూనే ఉండటం గమనార్హం. It has only been a few days since the tragic Ahmedabad plane crash. Many families have not yet been able to see their loved ones for the last time; several bodies have still not been handed over. Grief hangs heavy in households, funeral pyres are yet to cool. And at such a… pic.twitter.com/rrlekBNAeD— Squint Neon (@TheSquind) June 22, 2025 "మానవత్వం చచ్చిపోయింది.. నమ్మబుద్ధి కావడం లేదు’’ అని ఒకరు, "సంతోషంగా ఉండండి,కానీ ముందుగా మృతులకు గౌరవ సంతాపం తెలియజేయడం మర్చిపోతే ఎలా? ఇంత మంది చనిపోయిన నెలరోజులలోపే, మీరు ఇలా డాన్స్ చేసి ఎయిరిండియా ఇమేజ్ను నాశనం చేస్తున్నారు. సిగ్గుచేటు ఇప్పటికే సంస్థ సేవల విషయంలో దిగజారిపోయింది, ఇప్పుడు భద్రతలో కూడా’’ మరొకరు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
ఏఐ, మెషిన్ లెర్నింగ్ కోర్సులవైపు యువత అడుగులు..
కాబోయే ఇంజినీర్లు ఏ విధమైన ఉద్యోగావకాశాలను ఎంపిక చేసుకుంటున్నారు? దీనికి సంబంధించి ఇంజినీరింగ్లో ఎలాంటి కోర్సులను కావాలనుకుంటున్నారు? అంశాలపై ఇటీవల కాలంలో బైటెక్సల్ అనే ఓ సంస్థ నిర్వహించిన సర్వే స్పష్టం చేస్తోంది. ఇందులో మొత్తం లక్ష మంది విద్యార్థులు పాల్గొనగా 62వేల మంది అబ్బాయిలు, 38 వేల మంది అమ్మాయిలు, విద్యార్థినులు ఉన్నారు. ఈ సర్వేలో ఆసక్తికర అంశాలు కనిపిస్తున్నాయి. అబ్బాయిల కంటే అమ్మాయిలు తమ భవిష్యత్తుపై చాలా స్పష్టతతో ఉన్నారని తెలుస్తోంది. ఇంజినీరింగ్లో చదివే కోర్సులు, తదుపరి భవిష్యత్తులో చేయాలనుకునే ఉద్యోగావకాశాలపై 40 శాతం మంది విద్యార్థినులు ముందునుంచే సిద్ధమవుతున్నారు. అయితే అబ్బాయిల్లో మాత్రం 36శాతం మందికి మాత్రమే భవిష్యత్తుపై స్పష్టతతో ఉన్నారు. కెరీర్పై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఒత్తిడి కనిపిస్తోందని అబ్బాయిలు అభిప్రాయపడుతున్నారు. ఆ రెండు కోర్సులంటే.. టైర్–1 నగరాలైన హైదరాబాద్, పుణె నగరాల్లోని ఇంజినీరింగ్ విద్యార్థినిలు ఆరి్టఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెరి్నంగ్ కోర్సులవైపు మొగ్గుచూపుతున్నారు. నిత్యనూతనంగా మారుతున్న సాంకేతిక కోర్సులపై ఆసక్తి చూపిస్తున్నారు. కెరీర్ ప్రారంభ దశలోనే తమకు ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకుంటున్నారు. ఉద్యోగావకాశాల్లోనూ తమ ప్రాధాన్యతలపై స్పష్టతతో ఉంటున్నారు. కోడ్ ప్రాక్టీస్, ప్రాజెక్ట్ వర్క్స్పేస్, లైవ్ ప్లాట్ఫాం డేటా ఆధారంగా భవిష్యత్తు ఇంజినీర్లు ఏరంగాలపై ఆసక్తి చూపిస్తున్నారనే అంశాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్ విద్యార్థినిలు 66 శాతం మంది అధునాత ప్రోగ్రామింగ్ (అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్)కోర్సులపై ఆసక్తి చూపిస్తున్నారు. 40 శాతం మంది డిఫైన్డ్ కెరీర్ కోరుకుంటున్నారని తేలింది. అత్యధికంగా 40.58 శాతం మంది విద్యారి్థనులు ఏఐ, మెషిన్ లెర్నింగ్ కోర్సులను ఎంపిక చేసుకుంటున్నారు. భవిష్యత్తు ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటాయని అంచనా వేస్తున్నారు. పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నూతన ఆవిష్కరణలకు ఎప్పటికీ ఆదరణ ఉంటుందని పలువురు విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. విజయవాడ, నాగ్పూర్, చండీగఢ్, డెహ్రాడూన్ వంటి చిన్న పట్టణాలతో పోల్చితే హైదరాబాద్, పుణెల్లో ఏఐ, మెషిన్ లెరి్నంగ్ కోర్సులపై ఆసక్తి చూపే వారు భారీ సంఖ్యలో కనిపిస్తున్నారు. (చదవండి: రెస్టారెంట్ బిజినెస్లోకి దిగిన దిగ్గజ క్రికెటర్లు వీరే..!) -
దేశీ టొమాటోల సిరి! మైసూరులో విత్తనోత్సవం
కొన్ని పంటల్లో దేశీ వంగడాల వైవిధ్యం ఆశ్చర్యం కలిగిస్తుంది. కర్ణాటకకు చెందిన వి. కాంతరాజు 27 రకాల దేశీ టొమాటో వంగడాలను సాగు చేస్తూ పరిరక్షిస్తున్నారు. అత్యంత విలక్షణమైన ఆఫ్రికా టోగో, బ్లాక్ ప్లమ్, బ్లాక్ టొమాటో వంటి విశిష్ట రకాలు కూడా ఇందులో ఉన్నాయి. టొమాటోలే కాదు అనేక పంటల దేశీ వంగడాలను సేకరించటం, వాటిని రైతులకు ఇచ్చి ఏటేటా పండిస్తూ సంరక్షించటమే పనిగా పెట్టుకుంది మైసూరుకు చెందిన సేంద్రియ రైతుల సంఘం ‘సహజ సమృద్ధ’. కాంతరాజు కూడా ఈ సంఘం సభ్యుడే. ఈ 27 రకాల టొమాటోలతో పాటు చాలా రకాల ధాన్యాలు, పప్పుధాన్యాలను సైతం ఆయన సాగు చేస్తున్నారు. దేశీ విత్తనాలతో కూడిన సమీకృత సేంద్రియ వ్యవసాయమే ఆహార, పౌష్టికాహార, ఆదాయ భద్రతను కల్పిస్తుందని కాంతరాజు అంటున్నారు. కర్ణాటక దేశీ పంటల వైవిధ్యాన్ని కళ్లారా చూడాలంటే జూలై 5,6 తేదీల్లో మైసూరులో జరిగే దేశీ విత్తనోత్సవాన్ని సందర్శించాల్సిందే! అందరూ ఆహ్వానితులే. వివరాలకు 70900 09944.బీఆర్సీలపై 4 రోజుల శిక్షణప్రకృతి వ్యవసాయంలో ఘన, ద్రవరూప ఎరువులు, ద్రావణాలు, కషాయాలు, జీవన ఎరువులు, జీవన పురుగు మందులను ఉత్పత్తి చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చే కేంద్రాలను బయో రిసోర్స్ సెంటర్లు(బిఆర్సిలు) అంటారు. వీటిని గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి కోసం ఏర్పాటు చేసుకునే వ్యక్తులు, సహకార సంస్థలు, రైతు ఉత్పత్తి దారుల సంఘాల నిర్వాహకులకు నూజివీడు సమీపంలో కొండపర్వలో ఏర్పాటైన కృష్ణసుధ అకాడమీ ఫర్ ఆగ్రోఎకాలజీలో జులై 1 నుంచి 4 వరకు 4 రోజుల పాటు ఆంగ్లంలో శిక్షణా శిబిరం నిర్వహించనున్నారు. బిఆర్సిలకు సంబంధించిన 10 అంశాలపై శిక్షణ ఇస్తారు. ఫీజు, రిజిస్ట్రేషన్ వివరాలకు.. 850 028 3300. -
రెస్టారెంట్ బిజినెస్లోకి దిగిన దిగ్గజ క్రికెటర్లు వీరే..!
సిటీ వ్యాపార తెరపై బాలీవుడ్ నటీనటుల రంగ ప్రవేశం ఇప్పటికే ఊపందుకుంది. అదే బాటలో మరోవైపు క్రీడాకారులు, మరీ ముఖ్యంగా క్రికెట్ వీరులు భాగ్యనగర పిచ్పై అడుగుపెట్టడం మొదలైంది. జాతీయ స్థాయిలో వినోద, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఇతర రంగాలపై సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎక్కువగా రెస్టారెంట్ బిజినెస్పై ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో వారి వ్యాపార రంగానికి నగరం ఒక తిరుగులేని గమ్యంగా కనిపిస్తోంది.వరుసగా ఇక్కడ రెస్టారెంట్స్ ప్రారంభిస్తున్న వైనం వైవిధ్యభరిత కేఫ్ల నుంచి విలాసవంతమైన ఫైన్–డైన్ స్పాట్ల వరకూ కాదే వ్యాపారమూ కాలుపెట్టేందుకు అనర్హము అన్నట్టుగా సెలబ్రిటీలు నగరంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు ఇప్పటికే విభిన్న దేశాల, వైవిధ్యభరిత రుచులతో ఆహార ప్రియులకు వెల్కమ్ చెబుతున్న నగరం పలువురు సెలబ్రిటీల కొత్త రూట్కు బాటలు వేస్తోంది. మిగిలిన మెట్రోలతో పోలిస్తే వేగవంతమైన వృద్ధితో, విస్తృతమైన వ్యాపార అవకాశాలతో స్వాగతం పలుకుతోంది హైదరాబాద్. ఈ నేపథ్యంలో నగరంలో ఆహార విపణి రంగంలో కాలు మోపిన క్రికెటర్లు, వారు నెలకొల్పిన రెస్టారెంట్ల విశేషాలు ఇవీ.. పేసర్..ఫ్లేవర్..క్రికెట్ ప్రేమికులకు చిరపరిచితమైన భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ నగరం వైపు తన బౌలింగ్ను గురిపెట్టాడు. ఆయన హైదరాబాద్లో తన సొంత విలాసవంతమైన రెస్టారెంట్, జోహార్ఫాను ఏర్పాటు చేశాడు. ఈ వారంలో ఇది ప్రారంభం కాబోతున్న ఈ రెస్టారెంట్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 3లో ఆయన నెలకొల్పారు. జోహార్ఫా.. మొఘల్, పెర్షియన్, అరేబియన్, చైనీస్ వంటకాల మిశ్రమంతో నగరవాసులకు రాచరికపు కుకింగ్ అనుభవాన్ని అందిస్తుందని ఆయన హామీ ఇస్తున్నారు. గ్రాండ్’ ఎంట్రీ.. అంతర్జాతీయంగా పేరొందిన చదరంగం క్రీడాకారుడు గ్రాండ్మాస్టర్ అంకిత్ సైతం నగరంలో క్రీడాకారుల రాకకు తన వంతు ఊపు తెచ్చారు. యోగా, వెల్నెస్ నిపుణుడు కూడా అయిన అంకిత్.. గత మార్చి నెలలో జూబ్లీహిల్స్లో ఒక వినూత్నమైన ఆరోగ్య సాధనా కేంద్రాన్ని ‘అంకితం’ పేరిట ఏర్పాటు చేశారు. పైలేట్స్, యోగా, ధ్యానంతో పాటు జిమ్ వర్కవుట్స్ సైతం అందుబాటులోకి తెస్తూ పూర్తి స్థాయి వ్యాయామాలకు, వెల్నెస్ యాక్టివిటీలకు అంకితం అయిన వెల్నెస్ స్టూడియోను ఆయన ప్రారంభించారు. రుచుల.. బ్యారక్స్.. గత ఏడాది డిసెంబర్లో సైనిక్పురిలో బ్యారక్స్ – ఆంటెరూమ్ను ప్రారంభించడం ద్వారా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కూడా నగర ఆహార రంగంలోకి ప్రవేశించారు. మూడు అంతస్తుల్లో విస్తరించి ఉన్న ఈ విలాసవంతమైన ప్రదేశం కేవలం రెస్టారెంట్.. అంత కంటే ఎక్కువ. ఇది పూర్తి స్థాయి సోషల్ గేదరింగ్ అని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఈ జాబితాలో కొత్తగా సిరాజ్ జోహార్ఫా చేరడంతో.. మరింత మంది క్రికెటర్లు, క్రీడా ప్రముఖులు ఈ పంథాను అనుసరిస్తారని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు. క్రీడల్లో అద్భుతమైన విజయాలతో నగరవాసులకు దగ్గరైన క్రీడాకారులు తమ వంటకాల్లో వైవిధ్యం ద్వారా కూడా తమను అలరిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. రన్మెషిన్.. వన్ 8తో వచ్చెన్.. భారత క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ తన ప్రసిద్ధ వన్8 కమ్యూన్ రెస్టారెంట్ను గత ఏడాది మేలో నగరంలో ప్రారంభించారు. అనతి కాలంలోనే నగరంలో అత్యంత ట్రెండీగా, లగ్జోరియస్గా మారింది. నగరంలోని నాలెడ్జ్ సిటీలో ఉన్న ఈ రెస్టారెంట్ దాని ప్రీమియం వైబ్ ప్రత్యేకమైన వంటకాలకు ప్రసిద్ధి చెందింది. ఈ రెస్టారెంట్లో గత జనవరి నెలలో ఓ గెస్ట్కి స్వీట్ కార్న్ తీసుకున్నందుకు గాను రూ.525 బిల్ వేయడం అనే ఉదంతం వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో మీమ్ ఫెస్ట్గా మారింది.(చదవండి: ఆనంద్ మహీంద్రా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! తప్పనిసరిగా ఓ 20 నిమిషాలు..) -
బుక్షెల్ఫ్: పాజిటివ్... పవర్ఫుల్ పేరెంటింగ్
సైకోథెరఫిస్ట్ జి. త్రివేది, పేరెంటింగ్ ఎక్స్పర్ట్ అనఘ నాగ్పాల్ తాజా పుస్తకం... దిస్ బుక్ వోన్ట్ టీచ్ యూ పేరెంటింగ్: బట్ ఇట్ విల్ మేక్ యూ ఏ బెటర్ పేరెంట్. బెటర్ పేరెంటింగ్ స్టైల్స్, వ్యక్తిగత అనుభవాలు, ప్రాక్టికల్ చెక్ లిస్ట్లు ఈ పుస్తకంలో కనిపిస్తాయి. ఈ కాలంలో పేరెంటింగ్కు ఎదురవుతున్న సవాళ్ల గురించి చర్చించే పుస్తకం ఇది.‘పేరెంటింగ్ గురించి బోధించడానికి ఈ పుస్తకం రాయలేదు. ఏం చేస్తే మంచిది, ఏంచేయకూడదు...ఇలా ఎన్నో విషయాల గురించి చర్చిస్తూ రైట్ పేరెంటింగ్ గురించి చెప్పడమే ఈ పుస్తక లక్ష్యం’ అంటున్నారు రచయిత్రులు. సోషల్ మీడియా, డిజిటల్ టూల్స్... మొదలైన వాటి వల్ల గతంతో పోల్చితే ఇప్పటి తల్లిదండ్రులు పేరెంటింగ్కు సంబంధించి రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వాటికి ఈ పుస్తకం పరిష్కార మార్గాలు సూచిస్తుంది. దీనికోసం ఎంతో రీసెర్చ్ చేశారు. బాల్యం నుంచి టీనేజ్ వరకు పిల్లలకు సంబంధించిన వివిధ దశల్లో తల్లిదండ్రులు ఎలాంటి విధానాలను అనుసరించాలో ఈ పుస్తకం సూచిస్తుంది. నిజ జీవిత కథలను ప్రస్తావిస్తూ పాజిటివ్ పేరెంటింగ్కు సంబంధించిన ఫ్రేమ్వర్క్, పిల్లలకు ఉపకరించే సెల్ఫ్– రిఫ్లెక్షన్ ఎక్సర్సైజ్లు, సెల్ఫ్–రెగ్యులేషన్ టెక్నిక్ల గురించి తెలియజేస్తుంది.పెంగ్విన్ ర్యాండమ్ హౌజ్ ఇండియా ప్రచురించిన ఈ పుస్తకంలో ఎనిమిది చాప్టర్లు ఉన్నాయి. ‘పేరెంట్స్ తమ బాల్యంలోకి వెళ్లడానికి, ఆ జ్ఞాపకాల ఆధారంగా పిల్లల గురించి ఆలోచించడానికి, పాజిటివ్ పేరెంటింగ్ విషయంలో ప్రతి చాప్టర్ ఉపయోగపడుతుంది’ అంటున్నారు రచయిత్రులు. -
రసాయనిక ఎరువుల్లో 60–70% వృథా!
‘నత్రజని కాలుష్యం’ భూగోళంపై జీవనాన్ని కష్టాలపాలు చేస్తోంది. రసాయనిక ఎరువుల వాడకం, బొగ్గు/పెట్రోలియం ఉత్పత్తుల వంటి శిలాజ ఇంధనాల వాడకం అంతకంతకూ పెరిగిపోతుండటమే ఇందుకు కారణం. మనుషుల పనుల వల్ల అతిగా పర్యావరణంలోకి వెలువడుతున్న నత్రజని.. ప్రకృతిలోని సహజ ప్రక్రియలకు అంతరాయం కలిగిస్తోంది. ‘నత్రజని కాలుష్యం’ ముఖ్యంగా మూడు రకాలుగా భూగోళంపై మూడు సంక్షోభాలను కలిగిస్తోంది. దీన్నే ‘ప్లానెటరీ ట్రిపుల్ క్రైసిస్’ అంటారు. సుస్థిర పద్ధతుల్లో నత్రజని కాలుష్యాన్ని నిర్వహించే మార్గాలపై ప్రొఫెసర్ నందుల రఘురామ్ గత పాతికేళ్లుగా విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ నైట్రోజన్ ఇనీషియేటివ్ ఎమెరిటస్ చైర్మన్గా, గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ(ద్వారాక, ఢిల్లీ)లో ప్రొఫెసర్గా డా.రఘురామ్ సేవలందిస్తున్నారు. 2017లో ప్రపంచంలోనే మొదటిగా ‘ఇండియన్ నైట్రోజన్ అసెస్మెంట్’ నివేదిక రూపొందించటంలో ఆయనది కీలకపాత్ర. దీనిపై ఐక్యరాజ్యసమితిలో అప్పట్లోనే తీర్మానం జరిగింది కూడా. డా.రఘురామ్ని ‘సాక్షి సాగుబడి’ ఇటీవల ఇంటర్వ్యూ చేసింది. రసాయనిక ఎరువుల ‘నత్రజని కాలుష్య’ తీవ్రత ఎంతో? కారణాలేమిటో? పరిష్కారాలేమిటో? ఇప్పుడు తెలుసుకుందాం.ప్రజల ఆకలి తీర్చే క్రమంలో అధిక దిగుబడుల కోసం హరితవిప్లవంలో భాగంగా వాడటం ప్రారంభించిన రసాయనిక ఎరువులు నిజానికి పంటలకు ఉపయోగపడుతున్న దానికంటే వృథా అవుతున్నది చాలా ఎక్కువ. ముఖ్యంగా నత్రజని ఎరువుల వాడకం, వృథా ఎక్కువే. ప్రొఫెసర్ నందుల రఘురామ్ మాటల్లో చెప్పాలంటే.. ‘మన దేశంలో పొలాల్లో వేస్తున్న రసాయనిక ఎరువుల్లో 30–40% మాత్రమే పంటకు ఉపయోగపడుతున్నాయి. 60–70% వృథాగా పోతున్నాయి. నీటి కాలుష్యానికి, వాయు కాలుష్యానికి, భూతాపోన్నతికి కారణమవుతున్నాయి. జలవనరుల్లో జీవవైవిధ్యానికి తూట్లు పొడుస్తున్నాయి’ అన్నారాయన. ఇదీ చదవండి: పామూ లేదు, దోమా లేదు.. ఎక్కడో తెలుసా?6 కోట్ల టన్నుల ఎరువులుమన దేశంలో పంటల సాగు కోసం 2023–24లో 6 కోట్ల మెట్రిక్ టన్నులకు పైగా రసాయనిక ఎరువులు వాడారు. యూరియా 357.81 లక్షల టన్నులు, డిఎపి 109.73 లక్షల టన్నులు, ఎంఓపి 16.45 లక్షల టన్నులు, ఎన్పికె మిశ్రమ ఎరువులు 116.80 లక్షల మెట్రిక్ టన్నుల వినియోగం జరిగిందని కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఈ ఎరువులపై సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం ఏటా రూ. లక్షన్నర కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. మరోవైపు, ఎరువుల మోతాదు పెంచుతున్నా దిగుబడులు పెరగని స్థితి నెలకొంటున్నది. రైతులు ఏటేటా అధికంగా ఎరువులు వాడకతప్పని స్థితిని ఎదుర్కొంటున్నారు. ‘ట్రిపుల్ ప్లానెటరీ క్రైసిస్’నత్రజని కాలుష్య ప్రభావంతో ‘ట్రిపుల్ ప్లానెటరీ క్రైసిస్’ పెచ్చరిల్లుతోంది. వాతావరణ మార్పు, జీవవైవిధ్య నష్టం, కాలుష్యం అనే మూడు పరస్పర అనుసంధాన సంక్షోభాలకు ఇది నేరుగా దోహదం చేస్తోంది. 1 వ్యవసాయంలో ఎరువుల వాడకం నత్రజని కాలుష్యానికి ప్రధాన మూలం. పంటలు వాడుకోలేకపోయిన అధిక నత్రజని నీటి వనరుల్లోకి వెళ్లి భూగర్భ జలాల్లోకి చేరుతోంది. 2పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలను మండించడం వలన నైట్రోజన్ ఆక్సైడ్లు విడుదలవుతున్నాయి. ఇది వాయు కాలుష్యం, వాతావరణ మార్పులకు దోహదం చేస్తోంది.3 శుద్ధి చేయని లేదా సరిగా శుద్ధి చేయని మురుగునీటిలో అధిక స్థాయిలో నత్రజని, ఇతర పోషకాలు ఉంటాయి, ఇవి చెరువులు, రిజర్వాయర్లు, నదులు, సముద్రాలను కలుషితం చేస్తాయి. ఈ కాలుష్యం వల్ల ఆక్సిజన్ లోపించి చేపలు, ఇతర జలచరాలు చనిపోతాయి. ఆ నీటిలో విపరీతంగా నాచు పెరిగిపోతుంది. ఇది జలచరాలకు మరణశాసనంగా మారుతుంది. ఏమి చేయవచ్చు?→ నత్రజని తదితర ఎరువులను అవసరం మేరకు తగుమాత్రంగా, సముచిత పాళ్లలో ఉపయోగించాలి. → పశువుల పేడ మూత్రాన్ని సక్రమంగా సేకరించి, వినియోగించే పద్ధతులను అమలు చేస్తే నత్రజని కాలుష్యం తగ్గుతుంది. → వ్యర్థాలను తగిన రీతిలో పునర్వినియోగించటం, వనరుల వినియోగ సామర్థ్యాన్ని ప్రోత్సహించి అధిక ఎరువుల వాడకం అవసరాన్ని తగ్గించవచ్చు. → ప్రభుత్వాలు నత్రజని ఉద్గారాలను పరిమితం చేసే పద్ధతులను ప్రోత్సహించేలా విధానాల్లో మార్పులు తేవాలి. → నత్రజని కాలుష్యాన్ని అరికట్టే క్రమంలో సమాజంలో వ్యక్తుల పాత్ర కూడా కీలకం. మాంసం వినియోగాన్ని తగ్గించటం, రసాయనాల్లేని వ్యవసాయానికి మద్దతు ఇవ్వడం, నత్రజని కాలుష్యాన్ని పరిష్కరించే విధానాల కోసం కృషి చెయ్యాలి. ఈ పోషకాలను సమర్థంగా వాడుకోలేమా?దేశంలో రోజుకు 15,000 కోట్ల లీటర్లకు పైగా మురుగునీరు ఉత్పత్తి అవుతోంది. ఈ నీటిలో 65,250 మెట్రిక్ టన్నుల నత్రజని తదితర పోషకాలు ఉంటాయి. శుద్ధి చేసి ఆ పోషకాలను పునర్వినియోగించలేక ప్రతి రోజూ 55,000 మెట్రిక్ టన్నులకు పైగా పోషకాలను కోల్పోతున్నాం. మురుగు నీటిలోని పోషకాలను పూర్తిగా రీసైకిల్ చేస్తే రసాయనిక ఎరువులు 40% వరకు ఆదా అయ్యేవని ప్రొఫెసర్ రఘురామ్ అన్నారు. అదేవిధంగా, దేశంలో 20 కోట్ల పశువులున్నాయి. రోజుకు ఒక జంతువుకు 15 కిలోల పేడ వస్తుంది. అందులో 5% ఎన్పికె పోషకాలు ఉన్నాయి. వాటి పరిమాణం 1,50,000 మెట్రిక్ టన్నులు. ఇది మనం వాడే మొత్తం రసాయనిక ఎరువుల్లో 95 శాతం. దీనికి అదనంగా, రోజుకు ఒక పశువు 15–20 లీటర్ల మూత్రం పోస్తుంది. వీటిలో 3% పోషకాలు ఉంటాయి. ఆ మొత్తం 1,20,000 మెట్రిక్ టన్నులు. సక్రమంగా మూత్రాన్ని సేకరించి వాడుకోలేక చాలా కోల్పోతున్నాం. మరో మాటలో చెప్పాలంటే.. పంట పొలాలు, జనావాసాల నుంచి వెలువడే మురుగునీటిలో 3,35,000 టన్నులకు పైగా పునర్వినియోగించదగిన పోషకాలు ఉన్నాయి. ఇది మన దేశంలో రోజువారీగా వాడుతున్న ఎరువులకు రెట్టింపు ఉంటాయని డా.రఘురామ్ వివరించారు.ఎరువు 4 రోజుల్లో మాయం!పంటలకు స్థూల పోషకాలైన నత్రజని (యూరియా), ఫాస్ఫరస్, పొటాషియం/సల్ఫర్లను 4:2:1 నిష్పత్తిలో వాడాలి. ఉదా.. వరి పంటకు సీజన్కు హెక్టారుకు అన్నీ కలిపి 120 కిలోల ఎరువు వెయ్యాలని శాస్త్రవేత్తలు సిఫారసు చేస్తున్నారు. అయితే, రైతులు ఈ నిష్పత్తిపై సరైన అవగాహన లేక ఈ మోతాదులను పట్టించుకోవటం లేదు. పంట పచ్చబడితే చాలన్నట్లు యూరియానే పొలాల్లో కుమ్మరిస్తున్నారని, అది కూడా పంట సీజన్లో కేవలం రెండు సార్లు మాత్రమే ఎరువులు వేస్తున్నారని ప్రొఫెసర్ రఘురామ్ అన్నారు. రసాయనిక ఎరువులను పంట 2–4 రోజుల్లోనే తీసుకోగలుగుతుంది. పంట తీసుకునేది 30–40% మాత్రమే. మిగతా 60–70% ఎరువు నీటి ద్వారా, గాలి ద్వారా వృథాగా పోతున్నది. సమర్థవంతంగా ఎరువు వినియోగించకపోవటం వల్ల సుమారు రూ. లక్ష కోట్ల ఎరువుల సబ్సిడీ వృథా అవుతోందని ప్రొ. రఘురామ్ అన్నారు. ఏ ఎరువు ఎంత పాళ్లలో వేయాలో అంతే వెయ్యాలి. తక్కువ మోతాదులో, ఎక్కువ సార్లు వేస్తే ఎక్కువగా పంటకు ఉపయోగం. వృథా తగ్గుతుంది. అప్పుడే నత్రజని కాలుష్యమూ తగ్గుతుంది అన్నారాయన. అయితే, ఎక్కువ సార్లు వేయటానికి రైతులకు ఖర్చు ఎక్కువ అవుతుంది. మంచి గిట్టుబాటు ధర దక్కినప్పుడే రైతులు ఆపని చేయగలుగుతా రన్నారు. -
Badi Ganta స్కూల్ బ్యాగ్ బరువు ఎంత ఉండాలి?
స్కూల్ బ్యాగ్ ఎంత బరువుగా ఉంటే ఆ స్కూల్లో అంత గట్టిగా పాఠాలు చెప్తున్నట్టు అనుకోకూడదు. స్కూల్ బ్యాగ్ విద్యార్థికి నెత్తిన మోసే మూట కాకూడదు. పిల్లల ఆరోగ్యం కోసం శ్రద్ధ చూపే తల్లిదండ్రులు స్కూల్ బ్యాగ్ బరువు విషయంలో నిస్సహాయంగా ఉంటారు. పిల్లలు బయటకు చెప్పలేని ఆ భారాన్ని మోస్తూ ఆనారోగ్యాలు కొని తెచ్చుకుంటారు. పిల్లల్ని స్కూల్కు పంపడం అంటే అవసరమైన పుస్తకాలతో పంపడం. హమాలీలుగా పంపడం కాదు. మోసి చూశారా మీ పిల్లల స్కూల్ బ్యాగ్ బరువెంతో?స్కూల్ బ్యాగ్ ఎంత బరువుగా ఉంటే ఆ స్కూల్లో అంత గట్టిగా పాఠాలు చెప్తున్నారని సంబరపడి పోతుంటారు కొందరు తల్లిదండ్రులు. విద్యార్థి మోసే బ్యాగ్ బరువును బట్టి అతని చదువును అంచనా వేస్తారు మరికొందరు. ఇవి కేవలం అపోహలు మాత్రమే. పిల్లల వీపున బండ మోయించినట్లు వారి చేత స్కూల్ బ్యాగ్ మోయించడం సబబు కాదు. పిల్లల ఆరోగ్యం కోసం శ్రద్ధ చూపే తల్లిదండ్రులు స్కూల్ బ్యాగ్ బరువు విషయంలో నిస్సహాయంగా ఉంటారు. పిల్లలు బయటకు చెప్పలేని ఆ భారాన్ని మోస్తూ అనారోగ్యాలు కొని తెచ్చుకుంటారు. పిల్లల్ని స్కూల్కు పంపడం అంటే అవసరమైన పుస్తకాలతో పంపాలి. మీరెప్పుడైనా చూశారా మీ పిల్లల స్కూల్ బ్యాగ్ బరువెంతో? ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలకు చదువు పేరుతో చాలా పని పెడుతుంటారు. కొందరు ఇది పిల్లలకు అవసరం అనుకుంటే మరికొందరు ఈ మాత్రం హడావిడి స్కూల్కు అవసరం అనుకుంటారు. అందుకే చాలా స్కూళ్ల లో రెగ్యులర్ సిలబస్తోపాటు అసైన్ మెంట్, ప్రాజెక్టులు, స్లిప్ టెస్టులు, క్లాస్ వర్క్, హోం వర్కు, రఫ్ కాపీ, గైడ్, డైరీ, డ్రాయింగ్, క్రాఫ్ట్, ఆర్ట్, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ బుక్.. ఇలా విద్యార్థులకు ప్రతి సబ్జెక్ట్కు 6 నుంచి 7 నోటు బుక్స్లను కేటాయిస్తూ విద్యార్థుల వెన్ను వంచుతున్నారు. స్కూల్ బ్యాగ్ బరువు విద్యార్థి వయస్సు, ఎత్తుకు తగ్గట్టు ఉండాలని, విద్యార్థి బరువులో 10 శాతం మించకుండా ఉండాలని నిపుణులు చెప్పే మాటలు మాటలుగా ఉండిపోతున్నాయి. అధిక బరువున్న స్కూల్ బ్యాగులు పిల్లల శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా వెన్నునొప్పికి దారితీస్తోంది. (పామూ లేదు, దోమా లేదు.. ఎక్కడో తెలుసా?)పిల్లల బ్యాగ్ బరువు ఎంత ఉండాలి1–2 తరగతులు: 1.5 నుండి 2 కిలోలు3–5 తరగతులు: 2 నుండి 3 కిలోలు6–8 తరగతులు: 3 నుండి 4 కిలోలు9–10 తరగతులు: 4 నుండి 5 కిలోలుబ్యాగ్ బరువును ఇలా తగ్గిద్దాం..→ పిల్లలకు అవసరమైన పుస్తకాలు, నోట్బుక్లు మాత్రమే బ్యాగ్లో ఉంచుకునేలా చూడాలి. లంచ్బాక్స్, వాటర్ బాటిల్ వంటివి విడివిడిగా ఉంచుకోవడం మంచిది.→ పుస్తకాలను బైండింగ్ చేయించడం కంటే పేపర్తో అట్టలు వేయడం ద్వారా బరువు తగ్గుతుంది. → పేరెంట్స్–టీచర్ సమావేశం జరిగినప్పుడు బ్యాగ్ బరువు విషయం స్కూల్ వారితో చర్చించాలి. వారికి తగిన సూచనలు చేయాలి.→ మీ ఇంటికి స్కూల్ దగ్గరగా ఉంటే ఒక పని చేయొచ్చు. పిల్లల్ని ΄÷ద్దున్న తరగతుల పుస్తకాలు మాత్రమే తీసుకెళ్లేలా చూసి, లంచ్ బ్రేక్ సమయంలో మీరు వెళ్లి మధ్యాహ్నం తరగతుల పుస్తకాలు ఇవ్వొచ్చు. ఉదయం తరగతుల పుస్తకాలు మీరు తీసుకు రావొచ్చు. దీనివల్ల పిల్లలపై బ్యాగ్ భారం తగ్గుతుంది.→ రేపు ఏయే పాఠాలు జరుగుతున్నాయో, ఏయే టీచర్లు సెలవులో ఉన్నారో, ఏ పుస్తకాలు అవసరమో ముందే పిల్లలకు చెప్పేలా ప్రణాళిక రూ రూపొందించమని స్కూల్ యాజమాన్యాన్ని అడగండి. దీనివల్ల అవసరమైన పుస్తకాలు మాత్రమే తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. → చాలా పాఠశాలల్లో క్లాస్ వర్క్, హోం వర్క్ అని రెండు వేర్వేరు పుస్తకాలు వాడమని పిల్లలకు సూచిస్తుంటారు. దానికన్నా ఒకే పుస్తకంలో ముందువైపు క్లాస్వర్క్, వెనక వైపు హోం వర్క్ రాసేలా చూడమని టీచర్లకు సూచించొచ్చు. → కొన్ని పాఠశాలల్లో రోజువారీ పాఠ్యపుస్తకాలు అక్కడే పెట్టి, హోం వర్క్ పుస్తకాలు మాత్రం ఇంటికి తెచ్చుకునే వెసులుబాటు ఉంటుంది. అది అన్నిచోట్లా అమలుచేసేందుకు ప్రయత్నాలు చేయొచ్చు.నో బ్యాగ్ డే వారానికి ఒకసారి గానీ లేదా నెలలో రెండు రోజులు గానీ పిల్లలకు స్కూల్ బ్యాగ్ నుంచి స్వేచ్ఛ కల్పించడం ‘హ్యాపీనెస్ కర్రికులం’లో భాగంగా అమలు చేయాలనే ఆలోచనలు కొన్ని ప్రభుత్వాలు చేసినా అవి వాస్తవరూపం దాల్చడం లేదు. నిజానికి ఇది పిల్లలకు చాలా సంతోషాన్ని ఇచ్చే ఆలోచన. స్కూల్ బ్యాగ్ లేని రోజు పిల్లలు ఆటలు పాటలు కథలు బొమ్మలు... వీటితో గడిపితే మానసిక వికాసం కలుగుతుంది. బ్యాగ్ మోత తప్పి వెన్నుకు విశ్రాంతి లభిస్తుంది. అయితే టీచర్లు తల్లిదండ్రులు కూడా ఈ ఆలోచనను అంగీకరించరు. పిల్లలు అనునిత్యం పుస్తకాలు మోస్తూ పుస్తకాల్లో తలలు కూరి ఉంటేనే వాళ్ళు మంచిపిల్లలు అన్నది వారి భావన. -
ఉద్యమ సాహిత్యానికి అరుదైన గౌరవం
అరుణోదయ గాయని అరుదైన పరిశోధన అజ్ఞాత అక్షర యోధుడు.. అమర్ సాయుధ బాటలో సాహితీ సృజనఅభినందించిన ప్రొఫెసర్ కాశీంసినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన.. అది మల్లెల గంధం అవునో కాదో.. మట్టిపెళ్ల వాసన.. ఈ మట్టి పెళ్ల వాసన.. గడ్డిపూలు సిగనిండా తురిమి పంచుతున్న వాసనో.. ఆయేటిభూనంగా జీవరాసులు ఎదకొచ్చే వాసనో.. .. అంటూ ప్రకృతిని పర్యావరణాన్ని ఆవిష్కరించారు.బిడ్డా నీకు దీవెన.. కన్నబిడ్డా నీకు దీవెన బిడ్డా నీకు దీవెన.. కన్నబిడ్డా నీకు దీవెన తొమ్మిది మాసాలు మోసినా.. ఒడినే ఉయ్యాలజేసినా.. నా ఇంటి కడపళ్ల మెరిసినా.. ఏ అయ్య చేతుల్లో బోసినా.. నన్నెత్తుకాబోంగ ఏడుస్తవనుకంటే.. నన్నెత్తుకాబోంగ ఏడుస్తవనుకంటే.. దినదినగండము నీకమ్మా..కారడవి వార్తమి విందునమ్మా.. .. అంటూ అడవిబాట పట్టిన బిడ్డ యాదిలో అమ్మ తలపోతరాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడకు చెందిన కూర దేవేందర్ అలియాస్ అమర్ అలియాస్ మిత్ర.. మూడు దశాబ్దాల సాయుధ పోరాటంలో అజ్ఞాత వాసం చేస్తూ సాహితీ సృజన చేశారు. సీపీఐ (ఎంఎల్) జనశక్తి రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యుని హోదాలో 2004 అక్టోబర్లో నక్సలైట్లతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన శాంతిచర్చల్లో పాల్గొన్నారు. అమర్ తన సాహిత్యయాత్రను ‘మిత్ర’కలం పేరుతో కొనసాగించారు. ఆయన సోదరుడు కూర రాజన్న అలియాస్ రాజేందర్ ‘జనశక్తి’ ఉద్యమ నిర్మాత. అన్నబాటలో అడవుల్లోకి వెళ్లిన అమర్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. గన్ను పట్టి ప్రజా సమస్యలపై పోరాడుతూనే.. పెన్ను పట్టి ప్రజల పాటలు రాశారు. ఆయన సాహిత్యంపై ‘కైతల కవాతు’ పుస్తకం ప్రచురితమైంది. తాజాగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, గాయని అనిత ‘మిత్ర కవిత్వం–సమగ్ర పరిశీలన’ అనే అంశంపై ప్రొఫెసర్ చింతకింది కాశీం పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేసి డాక్టరేట్ పొందారు.ఆరు అధ్యాయాలుగా అధ్యయనం మిత్ర సాహిత్యాన్ని ఆరు అధ్యాయాలుగా విభజించుకుని సమగ్రంగా పరిశీలించారు. మొదటి అధ్యాయంలో రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో పుట్టి పెరిగిన మిత్ర బాల్యం, విద్యాభ్యాసం, ఉద్యమజీవితం, అజ్ఞాత జీవితం, శాంతిచర్చలు, జైలు జీవితం వంటి అంశాలపై చర్చించారు. రెండో అధ్యాయంలో మిత్ర కవిత్వంలోని విప్లవ దృక్పథాన్ని వివరిస్తూ.. పాటల్లో విప్లవ భావజాలం, వచన కవిత్వంలో ఉన్న విప్లవ దృక్పథాన్ని ఎత్తి చూపారు. మూడో అధ్యాయంలో మిత్ర కవిత్వంలోని అస్తిత్వ దృక్పథంలో భాగంగా తెలంగాణ అస్తిత్వాన్ని, దళితవాదం, స్త్రీవాదం, ఇతర అస్తిత్వాల్లోని బీసీలు, మైనారిటీలు, ఆదివాసీలు, దివ్యాంగులకు సంబంధించిన కవిత్వాన్ని అంతటిని పరిశీలనాత్మకంగా వివరించారు.నాలుగో అధ్యాయంలో ప్రపంచీకరణ అనే అంశాన్ని ఎంచుకొని.. బహుళజాతి సంస్థల విధ్వంసకర నమూనాలను ప్రశ్నిస్తూ సాగిన మిత్ర కవిత్వంలోని కులవృత్తుల విధ్వంసం, మానవ సంబంధాల విచ్ఛిన్నం అనే అంశాలను స్పష్టం చేశారు.ఐదో అధ్యాయంగా మిత్ర స్మృతి కవిత్వంలో కమ్యూనిస్టు, సామాజిక ఉద్యమాల్లో అసువులు బాసిన ఎందరో వీరుల స్మృతి పాటలను పరిశీలించి వాటిని విప్లవ వీరుల సంస్మరణ, మేధావుల స్మృతిగా విభజించి విశ్లేషించారు. ఆరో అధ్యాయంగా మిత్ర కవిత్వంలోని శిల్ప నైపుణ్యాలను.. అందులోని భాష, ప్రతీకలు, భావుకత, వర్ణనాత్మకత తదితర అంశాలన్నిటికీ కవిత్వ లక్షణాలకు అన్వయించి వివరించారు. విప్లవ నాయకునిగా కొనసాగుతూ.. ఒక చేతిలో పెన్ను మరో చేతిలో గన్ను పట్టి మూడు దశాబ్దాల పాటు అజ్ఞాత జీవితం గడిపిన ‘మిత్ర’ కవిత్వాన్ని సమూలంగా విభజించి విశ్లేషిస్తూ ఆయనను ‘విప్లవ కవిగా’తన పరిశోధనతో నిరూపించారు. సమగ్ర పరిశీలన ఉండడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University) అనితకు డాక్టరేట్ను ప్రకటించింది.పీహెచ్డీ చేసిన అనిత ప్రస్థానం వికారాబాద్ జిల్లా కొడంగల్ ప్రాంతంలోని బొమ్రాసిపేట మండలం రేగడిమైలారం గ్రామానికి చెందిన అనితకుమారి పేదింటి బిడ్డ. ప్రాథమిక విద్యనభ్యసిస్తున్న రోజుల్లోనే తండ్రిని కోల్పోయారు. తల్లి కూలీనాలీ చేసి బిడ్డను చదివించుకుంది. తోబుట్టువుల అండతో అనిత చదువులో రాణించారు. తెలంగాణ ఉద్యమంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో చేరి గాయనిగా పేరు సంపాదించారు. అనిత (Anitha) పాడిన అనేక పాటలు ఇప్పటికీ ప్రజాబాహుళ్యంలో మారుమోగుతున్నాయి. అరుణోదయ ప్రోత్సాహంతో పీజీ చేశారు. ఉద్యమ పాటలు, సాహిత్యంపై మక్కువ పెంచుకొని మిత్ర కవిత్వంపై పరిశోధనకు పూనుకున్నారు. తెలంగాణ ఉద్యమంతోపాటు మరెన్నో సామాజిక ఉద్యమాల్లో అనిత పాలుపంచుకుంటూనే పీహెచ్డీ (PhD) చేశారు. ఆమె పరిశోధనను ప్రొఫెసర్ చింతకింది కాశీం పర్యవేక్షించారు. ప్రగతిశీల భావాలున్న ఉస్మానియా న్యాయ కళాశాల విద్యార్థి, నల్లగొండ జిల్లా వాసి పురం వెంకటేశ్ను పెళ్లి చేసుకున్న అనిత.. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో పార్ట్ టైం అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు.చదవండి: చితికిన బతుకు జట్కాబండి ఉద్యమ సాహిత్యానికి అరుదైన గౌరవం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రజాసాహిత్యానికి, ఉద్యమ నేపథ్యానికి డాక్టరేట్ రావడం అరుదైన గౌరవంగా భావిస్తున్నారు. అంకితభావంతో మిత్ర సాహిత్యాన్ని సృజించి డాక్టరేట్ పట్టా పొందిన సందర్భంగా అనితను ప్రొఫెసర్ కాశీం (Professor Kasim) అభినందించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు, ప్రజాయుద్ధభేరి విమలక్క, కూర దేవేందర్ (మిత్ర), అరుణోదయ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఏపూరి మల్సూర్, ప్రధాన కార్యదర్శి రమేశ్ పోతుల, ఉపాధ్యక్షుడు సురేశ్, సహాయ కార్యదర్శి ప్రభాకర్, రాకేశ్, కోశాధికారి భాస్కర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూతన్, గంగ, లింగన్న, రామన్న, చిన్నన్న, స్వామి తదితరులు కూడా అభినందనలు తెలిపారు. వేములవాడకు చెందిన కూర దేవేందర్ దళిత, బహుజన, పీడిత ప్రజల సాహిత్యానికి డాక్టరేట్ రావడం విశేషం. -
యాదగిరిగుట్టలో టాంగా.. ఎప్పుడైనా ఎక్కారా?
సాక్షి, యాదాద్రి: అభివృద్ధి అందరి జీవితాల్లో వెలుగులు తీసుకొస్తే.. యాదగిరిగుట్ట టాంగా కార్మికుల జీవితాల్లో మాత్రం చీకటి మిగుల్చుతోంది. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు బస్సు సౌకర్యం లేని రోజుల నుంచి.. ప్రధాన రవాణా వ్యవస్థగా ఉన్న టాంగాలు.. ఆధునిక వాహన ప్రపంచంలో క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ వృత్తినే నమ్ముకున్న కార్మికులు ప్రస్తుతం పూట గడవని స్థితిలో ఉన్నారు. ఆహ్లాదం కోసం టాంగాలో ఎక్కి ఒక్కసారైనా ప్రయాణించాలని ఆశపడే కొందరు భక్తుల వల్లే.. కొద్దోగొప్ప ఉపాధిని పొందుతున్నారు.పెరిగిన భక్తులు .. తగ్గిన ఆదాయం ఆలయ పునర్మిర్మాణం తర్వాత యాదగిరిగుట్టకు రోజు రోజుకూ భక్తులు పెరుగుతున్నారు. రద్దీతో తమ రోజు వారి గిరాకీ పెరిగి.. ఆదాయం ఎక్కువ వస్తుందని భావించిన టాంగా కార్మికుల ఆశలు నీరుగారిపోయాయి. ఆటోలు, బస్సులు, సొంత వాహనాలు పెరిగాయి. ఫలితంగా తరతరాలుగా టాంగాల్నే నమ్ముకున్న వీరు మరో పనిచేయలేక.. కుటుంబాన్ని పోషించుకోవడానికి జవసత్వాలను తెచ్చుకుని బతుకు బండి లాగిస్తున్నారు. ఇంత స్పీడ్ యుగంలో కూడా గుర్రపు బండ్లను నమ్ముకుని యాదగిరిగుట్టలో టాంగాలపైనే ఆధారపడిన కుటుంబాల బతుకు చిత్రం దయనీయంగా ఉంది. తెలంగాణ (Telangana) తిరుపతిగా అభివృద్ధి చెందుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు సుమారు 70 ఏళ్లుగా టాంగాలే ప్రధాన రవాణా సౌకర్యం.యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో లేని రోజుల్లో హైదరాబాద్, వరంగల్ (Warangal) మధ్యన గల రాయగిరి రైల్వే స్టేషన్లో దిగే వందలాది మంది భక్తులు.. స్వామి వారిని చేరుకోవాలంటే టాంగాలే దిక్కు. యాదగిరిగుట్ట బస్ డిపో ఏర్పాటు తర్వాత కూడా ప్రయాణికులు టాంగాల్లోనే ప్రయాణించేవారు. రాయగిరి, యాదగిరిపల్లి, గుండ్లపల్లి, యాదగిరిగుట్ట, సైదాపురం, మల్లాపురం.. ఇలా చుట్టు పక్కల గ్రామాలకు చెందిన టాంగా కార్మికులు సుమారు 100 మంది టాంగాలను నడుపుతూ జీవించేవారు. రాయగిరి రైల్వే స్టేషన్, వడాయిగూడెం, యాదగిరిగుట్ట ఇలా మూడు స్టేజీల్లో భక్తులు, స్థానిక ప్రజలు టాంగాలపై ప్రయాణించేవారు. ఈ కుటుంబాలకున్న ప్రధాన ఆదాయ వనరు టాంగాలే కావడంతో.. రెండో తరం కూడా వాటిపై ఆధారపడి చాలీచాలని కూలితో జీవితాలను వెళ్లదీస్తున్నారు.తగ్గిన గిరాకీయాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో ఏర్పాటు కావడంతో ఎర్రబస్సులు వచ్చాయి. రోడ్లు వెడల్పు కావడంతో బస్సులకు తోడుగా ఆటోలు, ప్రయాణికులకు ద్విచక్ర, నాలుగు చక్రాల సొంత వాహనాలు వచ్చాయి. దీంతో టాంగాలకు గిరాకీ తగ్గింది. టాంగాల వృత్తిని వీడలేక.. ప్రత్యామ్నాయం కనుచూపు మేరలో కనిపించక.. చాలీచాలని కూలితో విధిలేని పరిస్థితిలో బతుకు బండి నడుపుతున్నారు. ఒక్క రూటే దిక్కయిందిటాంగాల ద్వారా యాదగిరిగుట్ట నుంచి పాత గుట్ట శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి వారి ఆలయం వరకు.. టాంగాల్లో తీసుకుపోయి తిరిగి యాదగిరిగుట్ట వరకు భక్తులను తీసుకుని వస్తున్నారు. ఒకప్పుడు గుట్ట నలుదిక్కులా గ్రామాలకు టాంగాలను నడిపిన కార్మికులు.. ప్రస్తుతం యాదగిరిగుట్ట నుంచి పాతగుట్ట వరకు మాత్రమే పరిమితమయ్యారు. రాయగిరి నుంచి బస్లు, ఆటోలు పెరగడంతో ఈ మార్గంలో టాంగాలు (Horse Cart) నడవడం లేదు. పాతగుట్ట రూట్లో నడిచే టాంగాలకు ఆటోల నుంచి పోటీ ఎదురు కావడంతో ఆందోళన నిర్వహించి.. ఆ ఒక్క రూట్లో ఆటోలు నడవకుండా కట్టడి చేసుకున్నారు.చదవండి: నిజాం నవాబు మెచ్చిన బీబీపేట పాన్!యాదగిరిగుట్ట, వడాయిగూడెం, రాయగిరి, గుండ్లపల్లి నుంచి ప్రస్తుతం 40 ఆటోలు నడుస్తున్నాయి. ఆదివారం, శనివారం, సెలవు రోజులు వస్తే అధికంగా వచ్చే భక్తుల వల్ల అన్ని టాంగాలకు పనిదొరికి రోజుకు రూ.300 నుంచి రూ.400 వరకు సంపాదిస్తారు. మిగతా రోజుల్లో రూ.100 సంపాదించడమే చాలా కష్టం. కొందరైతే టాంగాలను రోడ్డుపైకి తీసుకురారు. యాదాద్రి రోడ్డు విస్తరణ పేరుతో గ్రామపంచాయతీ ఎదురుగా ఉన్న టాంగాల స్టాండ్ తొలగించారు. దీంతో రోడ్డు పక్కన టాంగాలు ఆపితే ట్రాఫిక్ పోలీసులు పంపిస్తున్నారు.ప్రభుత్వం సహకరించాలి టాంగా తోలుకుని స్వశక్తితో బతుకుబండి లాగిస్తున్న మాకు ప్రభుత్వం సహకారం అందించాలి. టాంగాలు, గుర్రాల కొనుగోలుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి. రోడ్డు బాగాలేక గుర్రాలు అవస్థలు పడుతున్నాయి. టాంగాలు పెట్టుకోవడానికి స్టాండ్ కూడా లేదు. రోడ్డుపక్కన పెడుతుంటే ప్రతి ఒక్కరూ బెదిరిస్తున్నారు. టాంగా స్టాండ్ ఏర్పాటు చేయాలి. – అశోక్ గౌడ్, యాదగిరిగుట్టమా బతుకులు మారలేదు పాతగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం వరకు 40 ఏళ్లుగా 50 పైసల కిరాయికి తోలుతున్నా. రోడ్డు సౌకర్యం సరిగా లేని రోజుల నుంచి టాంగా నడుపుతున్నా. ప్రస్తుతం కూడా పాత గుట్ట రోడ్డు ఏమీ బాగాలేదు. రోడ్డు వేయాలి. టాంగా తోలడం ద్వారా వస్తున్న కొద్ది పాటి ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ప్రభుత్వాలు ఎన్ని మారినా మా జీవితాలు మాత్రం మారడం లేదు. – చిన్న బాబు, టాంగా కార్మికుడు, రాయగిరి రైల్వే స్టేషన్చదువుకు పిల్లలు దూరం మా తాత రాయగిరి నుంచి యాదగిరిగుట్టకు ఎడ్ల బండిని నడిపేవాడు. మా నాన్న టాంగాలు తోలేవాడు. నేను 11 ఏళ్లుగా టాంగా తోలుతున్నా. వచ్చే డబ్బులతో పిల్లలను సరిగా చదివించలేకపోతున్నా. కుటుంబపోషణ భారంగా మారింది. టాంగా కార్మికులకు రుణాలు ఇవ్వాలి. – శంకర్, రాయగిరి స్టేషన్ -
భారత్లో బిందాస్గా బతకొచ్చు..! అమెరికా మహిళ ప్రశంసల జల్లు
భారతదేశంపై చాలామంది విదేశీయులు తమ అభిమానాన్ని పలు రకాలుగా చాటుకుంటున్నారు. ఇక్కడకు సరదాగా పర్యాటనకు వచ్చి మన భారతావనిపై మనసు పారేసుకోవడం విశేషం. ఇక్కడి భిన్నత్వంలోని ఏకత్వమే మమ్మల్ని కట్టిపడేస్తోందంటూ..నచ్చిన విషయాలను చెబుతున్నారు. అలానే ఒక అమెరికా మహిళ భారత్పై మాములుగా పొగడ్తల జల్లు కురిపించడం లేదు. ఆమె ఇలా ప్రశంసించడం మొదటిసారి కాకపోయినా..ఈసారి మాత్రం భారత్ని ఆకాశానికి ఎత్తేసేలా ప్రశంసల వర్షం కురిపించింది. ఆమె మాటలు వింటే ప్రతి ఒక్క భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగక మానదు.అమెరికాలో లైఫ్ సౌకర్యవంతంగా ఉన్నా..భారతదేశంలోనే అంతకుమించిన జీవితాన్ని గడపగలమని అంటోంది క్రిస్టెన్ ఫిషర్ అనే అమెరికన్ మహిళ. ఆమె భారత్కి నాలుగేళ్ల క్రితం తన కుటుంబంతో సహా వచ్చి ఇక్కడే ఉంటోంది. తానెప్పుడూ ఈ నిర్ణయానికి చింతించలేదని, అమెరికాలో సగటు జీవితం కంటే భారత్లోనే జీవితం అద్భుతంగా ఉంటుందని చెబుతోంది. తన జీవితాన్ని ఏవిధంగా తీసుకువెళ్లాలనే దానిపై తనకు పూర్తి నియంత్రణ ఉందని అంటోంది. తాను యూఎస్నే ఎంచుకోవచ్చు గానీ, తాను అంతకుమించిన గొప్పగా ఉండే జీవితాన్ని కోరుకున్నా అందుకే భారత్ని ఎంచుకున్నానని పేర్కొంది. ఇక్కడ ఇప్పటివరకు చాలా అద్భుతమైన వ్యక్తులను కలుసుకున్నా..పైగా గొప్పగొప్ప ప్రదేశాలను, వెరైటీ వంటకాలను చూశానని అన్నారామె. భారతదేశం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని ఆనందంగా చెబుతోంది. ఎప్పటికీ తాను ఒకేలా ఉండకపోయినప్పటికీ..ఇక్కడి లైఫే నచ్చిందని పోస్ట్లో పేర్కొంటూ..మెహందీ పెట్టుకుని చీరకట్టులో ఢిల్లీలో ప్రయాణిస్తున్నవీడియోని కూడా జత చేసింది. అంతేగాదు ఆ వీడియోలో ఫిషర్ హోలీ పండుగను జరుపుకుంటూ..తన పిల్లలతో ఇతర ఉత్సవాల్లో కూడా పాల్గొంటున్నట్లు కనిపిస్తోంది. ఆమె పోస్ట్ని చూసిన నెటిజన్లు ఇలా స్పందించారు. భారతీయురాలిగా నా దేశాన్ని చాలా మిస్ అవుతున్నా..అని యూరప్లో నివశిస్తున్న ఒక భారతీయురాలు, మరొకరు..మేము త్వరలో భారత్కి వచ్చేస్తున్నాం అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Kristen Fischer (@kristenfischer3) (చదవండి: ఆనంద్ మహీంద్రా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! తప్పనిసరిగా ఓ 20 నిమిషాలు..) -
పామూ లేదు, దోమా లేదు.. ఎక్కడో తెలుసా?
కాకులు దూరని కారడవులు చీము దూరని చిట్టడవులు గురించి విన్నాం కానీ..భూమిపై దోమలు, పాములు కనిపించని ఏకైక దేశం గురించి ఎపుడైనా విన్నారా? అవును ఈ భూ ప్రపంచంలో పాములు, దోమలు లేని దేశం ఒకటి ఉంది. కనీసం జూలో చూద్దామన్ని కూడా కనిపించవు. అనేక సరస్సులు, చెరువులు, చిత్తడి నేలలు, దాదాపు 1,300 జంతు జాతులు ఉన్నప్పటికీ, దోమలు అక్కడ మనుగడ సాగించలేకపోయాయి. మరి భూమిపై దోమలు, పాములు కనిపించని ఏకైక దేశం గురించి తెలుసు కోవాలనుకుంటున్నారా? అమెరికా, చైనా, జపాన్, టర్కీ, రష్యానో అనుకుంటున్నారా? కానే కాదు. పదండి తెలుసుకుందాం.ప్రపంచంలో 3,900 కంటే ఎక్కువ రకాల పాములు ఉన్నాయి మరియు భారతదేశంలో 300 కంటే ఎక్కువ జాతుల పాములు కనిపిస్తాయి. వాటిలో ఎక్కువ భాగం విషపూరితం కానివే. దాదాపు 60 విషపూరిత మైనవి. కొన్ని పాములు కరిస్తే ప్రాణాపాయం కూడా. కొన్ని నివేదికల ప్రకారం, ఏ సమయంలోనైనా 110 ట్రిలియన్ దోమలు సజీవంగా ఉన్నాయని అంచనా.ప్రపంచంలో దోమలు, పాములు కనిపించని ఏకైక దేశంభారతదేశంలో, కేరళ తీరప్రాంతాలు మొదలు ఢిల్లీ, ముంబై వంటి సందడిగా ఉండే నగరాల వరకు, చల్లగా ఉండే హిమాచల్, కాశ్మీర్లో కూడా దోమలు సాధారణంగా కనిపిస్తాయి. కానీ ప్రపంచంలో దోమలు, పాములు కనిపించని ఏకైక దేశం ఐస్లాండ్. పాములు,ఇతర సరీసృపాలు లేకపోవడానికి కూడా ప్రసిద్ధి చెందింది. అందుకే దీనికి "పాములు లేని దేశం" అనే మరో పేరు కూడా వచ్చింది. అంతేకాదు అనేక సరస్సులు, చెరువులు, చిత్తడి నేలలు , దాదాపు 1,300 జంతు జాతులు ఉన్నప్పటికీ, దోమలు మాత్రం ఇక్కడ జీవించలేవు. ఐస్లాండ్లో వేగంగా మారుతున్న వాతావరణం, ఎక్కువశీతల వాతావరణం దీనికి కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ వాతావరణం దోమల గుడ్ల అభివృద్ధి ,పొదగడానికి ఆటంకం కలిగిస్తుందట. అందుకే దోమలు, పాములు లేని ప్రశాంతమైన, శుభ్రమైన, చల్లగా ఉండే దేశం ఐస్లాండ్.ఎందుకు లేవంటేదోమలు సాధారణంగా మురుగు నీరు, నిల్వ ఉన్న నీటిలో వృద్ధి చెందుతాయి. దోమల గుడ్లు దోమలగా మారడానికి స్థిరమైన ఉష్ణోగ్రతలు కూడా అవసరం. అయితే, ఐస్లాండ్లో పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. ఐస్లాండ్ సహజ పారుదల , వేగంగా కదిలే నీటి వ్యవస్థల కారణంగా, దోమల పెంపకానికి అవసరమైన నిలిచిపోయిన నీరు, దోమల పునరుత్పత్తికి అనుమతించేంత కాలం ఉండదు.ఇక్కడి జనసాంద్రత, తక్కువ ఉష్ణోగ్రతలు దోమల గుడ్లు లేదా లార్వాల కనుగుణంగా ఉండవు. దీని వలన దోమలు వృద్ధి చెందడం కష్టమవుతుంది. దోమలు తక్కువగా ఉండటానికి ఇతర కారణాలు:కొన్ని అధ్యయనాల ప్రకారం, ఐస్లాండ్లోని భూమిలో సల్ఫర్ అధికంగా ఉంటుంది, ఇది దోమల పెరుగుదలను నిరోధిస్తుంది. అలాగే, ఐస్లాండ్లో దోమల సహజ శత్రువులు కూడా ఉన్నాయి, ఇవి వాటి జనాభాను నియంత్రిస్తాయి ఇస్లాండ్లో దోమల్ని పోలిన కీటకాలుంటాయి. కానీ ఇవి కట్టవు, వ్యాధులను వ్యాప్తి చేయవు. అలాగే పాములు నివసించలేని చల్లని దేశం ఐస్లాండ్. ఐస్ లాండ్ పేరుకు తగ్గట్టే.. చల్లటి మంచు ప్రదేశంలో వాతావరణం పాముల మనుగడకు ఏమాత్రం అనువుగా ఉండదు.ఈ మంచు ప్రాంతంలో పాములు ఏమాత్రం జీవించలేవు. చుట్టూ నీటితో నిండి ఉండటం కూడా ఒక కారణం. పాములు మహా సముద్రాలను దాటవు. దోమలు అంత దూరం ఎగరవు. అందుకే ఐర్లాండ్లో కూడా దోమలు కనిపించ వని చెబుతారు. ఇదీ చదవండి: నేచురల్ బ్యూటీ లుక్ : సీక్రెట్ షేర్ చేసిన బాలీవుడ్ బ్యూటీ కాగా ప్రపంచంలో పాములు లేని ఐర్లాండ్, దేశం న్యూజిలాండ్ , గ్రీన్లాండ్, అలాస్కా లాంటి ప్రాంతాల్లో కూడా పాములు కనిపించవు. అక్కడి వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణమంటారు శాస్త్రవేత్తలు. -
నేచురల్ బ్యూటీ లుక్ : సీక్రెట్ షేర్ చేసిన బాలీవుడ్ బ్యూటీ
బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ మెరిసే చర్మం కోసం అద్భుతంగా పనిచేసే సాంప్రదాయ చిట్కాను షేర్ చేసింది. సెల్ఫ్ కేర్ సండే అంటూ తన రొటీన్ స్కిన్ కేర్ గురించి ఇన్స్టాలో పేర్కొంది. అలాగే తన మెరిసే చర్మం, అందం రహస్యాన్ని అభిమానులకు ఈ పోస్ట్ ద్వారా వివరించింది. దీనికి సంబంధించి కొన్ని అందమైన ఫోటోలను కూడా ఇన్స్టాలో పోస్ట్ చేసింది. హై-ఫ్యాషన్ అప్పీరియన్స్ కు పేరుగాంచిన భూమి పెడ్నేకర్ ప్రస్తుతం ‘ది రాయల్స్ సిరీస్’ విజయాన్నిఆస్వాదిస్తోంది. తాజాగా ముల్తానీ మిట్టి మాస్క్ తయారు చేసే వీడియెను, "సెల్ఫ్-కేర్ సండే" అనే క్యాప్షన్తో ఆమె చేతిలో గులాబీని పట్టుకున్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది. View this post on Instagram A post shared by Bhumi Pednekar (@bhumipednekar)ముల్తానీ మిట్టి - ప్రయోజనాలు సౌందర్య పోషణలో పురాతకాలంనుంచీ ముల్తానీ మట్టికి ఎంతో ప్రాధాన్యత ఉంది. జిడ్డు, లేదా మొటిమల బారిన పడే చర్మానికి ఇది మేలు చేస్తుంది.మృత కణాలను తొలగిస్తుంది. లోతుగా శుభ్రపర్చి, అదనపు నూనెను తొలగించి చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. చర్మాన్ని టైట్గా చేసి, వృద్ధాప్యల లక్షణాలను తొందరగా దరిచేరనీయదు. దీంట్లోని సున్నితమైన ఎక్స్ఫోలియేటింగ్ లక్షణాలు నల్ల మచ్చలను పోగొట్టడానికి, పిగ్మెంటేషన్ను తగ్గించి, ఆరోగ్యకరమైన, ప్రకాశ వంతమైన మెరుపును అందించడానికి సాయపడతాయి. అలాగే ముల్తాని మట్టిలోని సహజ శీతలీకరణ ప్రభావం ఎండ ప్రభావంతో వచ్చిన మచ్చలపై ప్రభావవంతంగా పనిచేస్తుంది.యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, ఆయిల్ను నియంతరించే లక్షణాలు కారణంగా ఇది మొటిమలు ఎక్కువగా వచ్చేవారికి ఇది బాగా పనిచేస్తుంది.ఇదీ చదవండి: భారతీయ సంతతి ర్యాపర్ ఓవర్ యాక్షన్ : నెటిజన్ల తీవ్ర అగ్రహంముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి:ముల్తానీ మిట్టి పొడిని రోజ్ వాటర్ లేదా సాదా నీటితో కలిపి మృదువైన పేస్ట్ లా చేయండి. దీన్ని మీ ముఖానికి అప్లై చేసి, 15-20 నిమిషాలు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. స్కిన్ తత్వాన్ని బట్టి పెరుగు, తేనె లేదా బాదం పాలను కూడా జోడించవచ్చు. (‘శ్వాస ముద్ర’ ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల న్యూ స్టడీ : ఆశ్చర్యకర ఫలితాలు)నోట్ : ఆధునిక కాలంలో బ్యూటీ ప్రొడక్ట్స్లో ముల్తాని మట్టిని విరివిగా వాడతారు. అయితే ముందుగా వేసుకునే వారు ప్యాచ్ టెస్ట్ వేసుకోవడం మర్చిపోవద్దు. ఒక వేళ ఏదైనా అలర్జీలాంటిది వస్తే వెంటనే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండి. -
ఆనంద్ మహీంద్రా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! తప్పనిసరిగా ఓ 20 నిమిషాలు..
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడూ..సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ స్ఫూర్తిదాయకమైన కథలను పంచుకుంటుంటారు. ఆయన కూడా ఫిట్నెస్కు అధిక ప్రాధాన్య ఇస్తారు. అందుకు నిదర్శనం ఆయన ఆహార్యం. 70 ఏళ్ల వయసులోనూ అంతే ఫిట్గా చురుగ్గా కనిపిస్తారు. ఈసారి సోషల్ మీడియాలో తన హెల్త్ సీక్రెట్ని పంచుకుంటూ తానేమి ఫిట్నెస్ గురువుని కాదని చెబుతున్నారు. మరి ఆనంద్ మహీంద్రా ఫిట్నెస్ రహస్యం ఏంటో సవివరంగా తెలుసుకుందామా..!.ఆయన తన వీక్లీ ఫిట్నెస్ దినచర్య మారుతూ ఉంటుందని స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు కూడా. అయితే మహీంద్రా ఎక్కువగా కార్డియో-వాస్కులర్ (ఈత/ఎలిప్టికల్స్), కండరాల టోన్ (బరువులు ఎత్తడం) వంటి వర్కౌట్లు చేస్తుంటారట. ఒక్కోసారి ఆ వ్యాయామాల బదులు యోగా చేస్తుంటారట. అయితే ప్రతిరోజూ తప్పనిసరిగా ఓ 20 నిమిషాలు ధ్యానం చేస్తుంటారట. అదే తనను పూర్తి ఆరోగ్యంతో ఉండేలా చేయడంలో కీలకపాత్ర పోషిస్తోందట. నిపుణులు సైతం 70 ఏళ్లు పైబడితే..తప్పనిసరిగా ధ్యానం చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. ఏవిధంగానో వారి మాటల్లోనే తెలుసుకుందాం. ధ్యానం ఆరోగ్యానికి మంచిదా..60 ఏళ్లు దాటాక..కండరాల ద్రవ్యరాశి, ఎముక సాంద్రత తగ్గడం అనేది స్పష్టంగా తెలుస్తుంది. క్రమంగా వయసు పెరిగేకొద్దీ..ఇమ్యూనిటీ పవర్ కూడా ఆటోమెటిగ్గా తగ్గుతుంది. అందువల్ల అలాంటి పెద్దవాళ్లు తప్పనిసరిగా బరువులు ఎత్తే వ్యాయామాలు, ఈత వంటివి చేస్తే..కండరాలకు సరైన కదలిక, బలం ఏర్పడుతుందట. దీనికి తోడు వ్యాయామం కూడా చేయడం వల్ల ..అవయవాలన్నీ రిలాక్స్ మోడ్లో ఉండి..మనసుపై ధ్యాస పెట్టగలుగుతారట. తమపై తాము దృష్టిసారించే ఈ అమూల్యమైన సమయం..భావోద్వేగాలను కట్టడి చేసేందుకు దోహదపడుతుంది. ఆ వయసులో మనసులో కలిగే లేనిపోనీ భయాలు మాయమవ్వడమే గాక..తెలియని ఆత్మవిశ్వాసం ఏర్పడి బాడీలో ఆటోమేటిగ్గా వ్యాధినిరోధిక శక్తి కూడా పెరుగుతుందట.ఎలా చేయాలంటే..కుషన్ లేదా కుర్చీపై కూర్చోండి. వెన్నెముక నిటారుగా లేదా విశ్రాంతి స్థితిలో ఉంచండికళ్ళు మూసుకుని మీ శ్వాసపై ధ్యాస పెట్టండి. ఈ అభ్యాసం అలా సాగితే..ఆటోమేటిగ్గా తెలియకుండానే అలవాటుగా మారడటమే గాక, మంచి మార్పులు మొదలవ్వుతాయట. ముఖ్యంగా శారీరకంగా, మానసికంగా మెరుగ్గా ఉండేలా చేసి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: అప్పుడు ఆర్మీ అధికారి.. కానీ ఇవాళ వీధుల్లో..) -
ఇంటర్లో గాడితప్పితే జీవితమే గందరగోళం
నిన్నటి వరకు పాఠశాల చదువు.. ఒక్కసారిగా కళాశాల వాతావరణం.. ఇంటర్ విద్యార్థులకు ఇదో కొత్త అనుభవం. కొత్త వారితో పరిచయాలు, సరికొత్తగా అనిపించే ఆలోచనలు.. ఇప్పుడిప్పుడే కళాశాలలో అడుగుపెట్టే విద్యార్థికి ఇలా అన్నీ కొత్తగా, వింతగా అనిపిస్తాయి. టీనేజ్లో ఇంటర్మీడియెట్ దశ అత్యంత కీలకం. జీవితాన్ని మలుపు తిప్పాలన్నా ఇదే ముఖ్యమైన కాలం. ఏ మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా.. జీవితం మళ్లీ మన చేతుల్లోకి రానంత వెనక్కి వెళ్తుంది. అందుకే ఇప్పుడిప్పుడే జూనియర్ కళాశాలల్లో చేరుతున్న వారు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగితే ఇంటర్ దశ కొత్త బంగారులోకమై భవిష్యత్ ఉజ్వలమయమవుతుంది. నంద్యాల(న్యూటౌన్): తొలిసారి ఎదుర్కొన్న పది పబ్లిక్ పరీక్షల్లో విజయం సాధించామన్న ఆత్మవిశ్వాసం, పాఠశాలను దాటి కళాశాలను చేరామన్న ఉత్సాహం.. కొత్త పరిచయాలు, కళాశాల వాతావరణం కల్గించే ఆనందం.. ఇలా అన్నీ వెరసి విద్యార్థులకు ఇంటరీ్మడియెట్ దశ ఓ కొత్త బంగారు లోకమే. అనువైన గ్రూపు, ఇష్టమైన సబ్జెక్టులు చదివే తొలి స్వేచ్ఛా దశ ఇదని చెప్పవచ్చు. జీవితంలో కీలక అడుగులన్నీ ఇంటర్లోనే పడతాయనడంలో అతిశయోక్తి లేదు. ఉన్నత ప్రమాణాలతో ఉత్తమ ఫలితాలు సాధించినా, గాడి తప్పి అధఃపాతాళానికి పడిపోయినా.. అంతా ఇంటర్లోనే బీజాలు పడతాయని చెప్పుకోవచ్చు. హైసూ్కల్ విద్యతో మొదలయ్యే కౌమార ప్రాయం ఇంటర్లో మరింత పురి విప్పుతుంది. అందుకే జాగ్రత్త పడాలి. సినిమాల ప్రభావంతో, స్నేహితుల ప్రోత్సాహంతో ప్రేమాయణమంటూ మనసు కలుషితం చేసుకోకూడదు. స్నేహితులే లోకంగా అనిపించే వయస్సులో వారికి అతి ప్రాధాన్యం ఇస్తూ తల్లిదండ్రుల, ఆధ్యాపకులను నిర్లక్ష్యం చేయకూడదు. తల్లిదండ్రులు ఇచ్చే స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే భవిష్యత్ అంధకారమే. చదవండి: ‘శ్వాస ముద్ర’ ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల న్యూ స్టడీ : ఆశ్చర్యకర ఫలితాలుచదువుకే ప్రాధాన్యం.. ఇంటర్లో అందరికీ తొలి ప్రాధాన్యం చదువే కావాలి. విధిగా తరగతులకు హాజరు కావడం, పాఠ్యాంశాలపై దృష్టి పెట్టడం, అధ్యాపకులిచ్చే నోట్స్ను ఎప్పటికప్పుడు చక్కగా రాసుకోవడం, పోటీ పరీక్షలకు అనుగుణమైన ప్రణాళిక రూపొందించుకోవడం ఎంతో ఉపయుక్తం.సమయం.. సద్వినియోగం ఇంటర్లో సెలవు రోజులు ఉంటే విద్యార్థులకు పండగే. అయితే వాటిని సద్వినియోగం చేసుకోగలిగితే విద్యార్థి ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించగలరు. మనసును, శరీరాన్ని ఉల్లాసపరిచే మంచి క్రీడలు, లైబ్రరీలో పుస్తక పఠనం, స్నేహితులతో సబ్జెక్టులపై చర్చ, శ్రుతిమించని వినోదం వంటివి ఆహ్లాదంతో పాటు జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. వ్యసనాలకు దూరంగా ఉండాలి.. జీతితాన్ని ప్రభావితం చేసే ప్రమాదకరమైన వ్యసనాలు ఈ దశలో అలవాటు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటి నుంచి తప్పించుకోవాలి. సిగరెట్, గుట్కాలు, మద్యం వంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మేలు. సెల్ఫోన్ వైరస్ విద్యార్థుల ప్రగతికి అవరోధంగా మారుతుంది. అశ్లీలత వైపు మనసు మళ్లితే అంతే సంగతులు. పారీ్టలు, వేడుకల పేరుతో స్నేహితులు చెడుదారుల వైపు ప్రేరేపించే అవకాశం ఉంటుంది. చదవండి: భారతీయ సంతతి ర్యాపర్ ఓవర్ యాక్షన్ : నెటిజన్ల తీవ్ర అగ్రహంస్నే‘హితులు’ ఇంటర్లో విద్యార్థులను ప్రభావితం చేసే తొలి అంశం స్నేహం. అదృష్టం కొద్దీ అది ఉన్నత భావాలున్న వారితో కుదిరితే జీవితానికి మంచి చుక్కాని లభించినట్లే. చదువుపై ఇష్టం, పెద్దలపై గౌరవం, సమాజం మీద అవగాహన, అధ్యాపకులపై సదాభిప్రాయం ఉన్న వారితో స్నేహం చేయాలి. లక్ష్యానికి తొలి అడుగులు.. భవిష్యత్లో లక్ష్యం సివిల్స్, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర ఏ కోర్సుకైనా తొలి అడుగు పడాల్సింది ఇంటర్లోనే. కొత్త కొత్త స్నేహదనంతో నిండి కళాశాల జీవితం సక్రమంగా సాగితే ఒక బంగారు లోకమవుతుంది. తప్పటడుగులు వేస్తే కోలుకోలేని దెబ్బ తగులుతుంది. లక్ష్యాన్ని నిర్ణయించుకుని ముందుకు సాగాలి. తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి పదవ తరగతి వరకు చదివిన వారు ఇంటర్కు రాగానే ఏదో తెలియని లోకంలో విహరిస్తారు. స్వేచ్ఛాజీవిగా భావిస్తారు. ముఖ్యంగా చెడు అలవాట్లకు తొందరగా దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు గమనించి మంచి, చెడులను వివరించాలి. ఎలా చదువుతున్నాడు. ఏయే పరిసరాల్లో ఫ్రెండ్స్ ఉంటున్నారో గమనిస్తుండాలి. చెడు వ్యసనాలకు గురికాకుండా తల్లిదండ్రులు, అధ్యాపకులు శ్రద్ధ వహించాలి. – హారిఫాబాను, మానసిక వైద్యనిపుణురాలు, నంద్యాల మితిమీరిన విశ్వాసం తగదుపదవ తరగతి తర్వాత కొత్త ప్రపంచంలోకి అడుగు పెడతారు. కొందరు చదువును పక్కన పెట్టి ప్రేమ, సినిమాలు, షికార్లు, స్నేహం వైపు దృష్టి మరలుతుంది. దీంతో భవిష్యత్తు నాశనం అయ్యే అవకాశాలున్నాయి. తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను కనిపెడుతూ ఉండాలి. పెడదారిలో వెళ్తున్నారని అనుమానమొస్తే వారికి మంచి నడవడకను అలవర్చాలి. –రోజమ్మ, సోషల్ వర్కర్, నంద్యాల కలలను సాకారం చేసుకోవాలి దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పినట్లు.. కలలు కనాలి. వాటిని సాకారం చేసుకోవాలి. ఇందుకు విద్యార్థులు పట్టుదలతో కృషి చేయాలి. అప్పుడే ఏదైనా సాధించుకోవచ్చు. మొదట చదవడం కష్టంగా ఉంటుంది. ఆ తర్వాత అలవాటు చేసుకుంటే పుస్తకాలతో కుస్తీ పట్టడం సులువే, తల్లి తండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే భవిష్యత్తు చేజారుతుంది. –శంకర్నాయక్, జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారి, నంద్యాల -
ఫ్యాషన్ ప్రపంచంలో అత్తాకోడళ్ల ప్రభంజనం..! చిన్న బొటిక్ వెంచర్ కాస్తా..
అత్తాకోడళ్లు అనగానే నూనె, ఉప్పులా ఉంటారనే భావనే కలుగుతుంది అందరిలో. అత్యంత అరుదుగా కొందరిలోనే సఖ్యత ఉంటుంది. చాలామటుకు..ఆ బంధం..కాస్త ఇబ్బందికరమైన వాతావరణంలానే కనిపిస్తుంది. కానీ ఈ అత్తాకోడళ్ల విషయంలో అందుకు విరుద్ధం. ఆ అత్తాకోడళ్లు తమ అభిరుచులతో ఒక వస్త వ్యాపారాన్ని ప్రారంభించి. ఫ్యాషన్కి సరికొత్త అర్థాన్ని ఇచ్చేలా మంచి సక్సెస్తో దూసుకుపోతున్నారు. చిన్న బొటిక్గా ప్రారంభించి.. నేడు ఫ్యాషన్లో ఒక బ్రాండ్గా అవతరించి మరీ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారిద్దరూ. ఆ అత్తకోడళ్ల విజయగాథ ఏంటో చూద్దామా..!.ఫ్యాషన్కి సరికొత్త అర్థాన్నిస్తున్న ఆ అత్తకోడళ్లే సర్లా గుప్తా, శిల్పా గుప్తాలు. రెండు దశాబ్దాల క్రితం ఢిల్లీ నడిబొడ్డున చిన్న బోటిక్ వెంచర్గా తమ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. ఈ ఇద్దరికి భారతీయ వస్త్రధారణ పట్ల ఉన్న ఇష్టమే..ఈ వెంచర్ పెట్టేందుకు దారితీసింది. ఆ ఇరువురు లెహంగాలు, చుడీదార్లు నుంచి డ్రేప్డ్ చీరలు వరకు అన్నింటిలో తమ మార్క్ ఉండేలా సరొకొత్త విధానంలో డిజైన్ చేస్తారిద్దరూ. అత్తగారు సర్లా గుప్తా సంప్రదాయ, వారసత్వానికి పెద్దపీట వేస్తే..కోడలు శిల్పా గుప్తా ఆధునికతకు, సృజనాత్మకతకు ప్రాముఖ్యత ఇచ్చేలా డిజైన్ చేస్తుంది. వారి విలక్షణమైన డిజైన్ శైలి ఒక్కసారిగా ఫ్యాషన్ ప్రపంచంలో ఇండో-వెస్ట్రన్ శైలి ముఖచిత్రానే మార్చేసింది. అంతేగాదు ఈ అత్తాకోడళ్లు డైనమిక్గా నిర్ణయాలు తీసుకుని రూపొందించిన డిజైనర్వేర్లు ఈ జనరేషన్కు సులభంగా చేరువవ్వడమే గాక ఒక కొత్త ట్రెండ్ని సృష్టించాయి. అలా వారి చిన్న బొటిక్ వెంచర్ 'ఘున్ఘాట్' అనే ఫ్యాషన్ బ్రాండ్గా స్థిరపడి అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. బనారసి టిష్యూ చీరల నుంచి సమకాలీన అనార్కలి వరకు, ఘున్ఘాట్ కలెక్షన్లు కళా సౌందర్యానిక ప్రతీకలుగా నిలిచాయి. ఈ బ్రాండ్ డిజైనర్వేర్లను గుజరాత్, రాజస్థాన్, వారణాసి అంతట ఉన్న హస్తకళాకారులు తయారు చేస్తారు. ఇవన్నీ చేతితో రూపొందించిన డిజైనర్వేర్లు. దాదాపు 200పైగా కళాకారులతో ఈ డిజైనర్వేర్లు రూపొందుతాయి. ప్రతి లెహంగా లేదా పైథానీ చీర వెనుక హస్తకళాకారుల వారాల తరబడి కష్టం ఉంటుంది. పేయింటింగ్ దగ్గర నుంచి, ఎంబ్రాయిడరీ వంటి తుది ఫిట్టింగ్ల వరకు ఎక్కడ కూడా షార్ట్కట్లతో పూర్తి చేయరు. ప్రతీది కళాకారుల చేతుల నుంచి జాలువారే డిజైనర్వేర్లే కావడం విశేషం. కుటుంబంగా కస్టమర్లు..ఘున్ఘాట్ బ్రాండ్ నుంచి దుస్తులు కొనుగోలు చేసే వ్యక్తుల ఆ బ్రాండ్ కుటుంబీకుల్లో ఒకరిగా మారిపోతారట. అంతలా ఆబ్రాండ్ వారిని ఆకట్టుకుంటుందట. తమ బ్రాండ్ కళకు ఫిదా అయ్యి కస్టమర్లే ప్రకటనదారులగా మారిపోతారట. ఇక ఈ ఏడాది ఘున్ఘాట్ "మోడరన్ మహారాణి" కలెక్షన్లను ప్రారంభించింది. పాతదనం, కొత్తదనాన్ని మిళితం చేసేలా డిజైన్ చేసింది. అంతేకాదండోయ్ ఆధునిక టైలరింగ్తో చేతితో నేసిన కళను వారధి చేసేలా రెడీ-టు-వేర్ ఫ్యూజన్ పటోలా దుస్తులను కూడా తీసుకురానుందట. చివరగా ఈ బ్రాండ్ అభివృద్ధి చెందతూ.. త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్యాషన్ ప్లాట్ఫామ్లపై ప్రదర్శనకు సిద్దం కానుంది. అంతేగాదు తమ బ్రాండ్ కళాకారుల సమూహంతో వర్క్షాప్లు కూడా ఏర్పాటు చేయనుంది. తద్వారా తర్వాత తరాలు ఈ సంప్రదాయ పద్ధతుల తెలుసుకునేలా రక్షిస్తోంది. అలా ఫ్యాషన్ వస్త్ర పరిశ్రమలో తమ బ్రాండ్తో ప్రభంజనం సృష్టించి.. మంచి గుర్తింపును, పేరుని తెచ్చకున్నారు ఈ అత్తాకోడళ్లు సర్లా గుప్తా, శిల్పా గుప్తాల ద్వయం. (చదవండి: అప్పుడు ఆర్మీ అధికారి.. కానీ ఇవాళ వీధుల్లో..) -
‘శ్వాస ముద్ర’ ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల న్యూ స్టడీ : ఆశ్చర్యకర ఫలితాలు
‘శ్వాస మీద ధ్యాస’.. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని, స్వస్థతను ప్రసాదించే ధ్యానానికి అద్భుత సాధనం అన్న విషయం మనకు తెలుసు. ఇది కేవలం నమ్మకం కాదని, అక్షరాలా సత్యమని చెప్పడానికి శాస్త్రీయ ఆధారం చూపే అధ్యయన ఫలితం వెలువడింది. ‘వేలి ముద్ర’ మాదిరిగానే ప్రతి మనిషికీ విలక్షణమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడిన ‘శ్వాస ముద్ర’ ఉంటుందట! ఆలోచనలపరంగా, ఆరోగ్యపరంగా మీరేమిటో చెప్పాలంటే మీ విలక్షణమైన ‘శ్వాస ముద్ర’ను చూస్తే చాలు అనే పరిస్థితి మున్ముందు రావచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు!!-సాక్షి సాగుబడిఇజ్రాయెల్లోని వీజ్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో న్యూరో బయాలజీ ప్రొఫెసర్ నోమ్ సోబెల్, ఆయన బృందం.. శ్వాస తీరుతెన్నులకు, వ్యక్తుల భావోద్వేగాలూ ఆరోగ్య స్థితిగతులకూ ఏమైనా సంబంధం ఉందా అనే అంశంపై అధ్యయనం చేశారు. ఆశ్చర్యకరమైన ఈ అధ్యయన ఫలితాలు ఇటీవల ‘కరెంట్ బయాలజీ’ జర్నల్లో ప్రచురితమయ్యాయి.96.8% ‘ప్రత్యేకం’ఈ అధ్యయనంలో భాగంగా 100 మందిని ఎంపిక చేసి, 24 గంటల పాటు వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నమోదు చేసి, విశ్లేషించారు. నాసికా రంధ్రాల బయట పట్టుకొని ఉండే సెన్సార్లతో కూడిన పరికరాన్ని వారికి అమర్చారు. వారు నిద్రలో ఉన్నా, మేల్కొని ఉన్నా అనుక్షణం వారి శ్వాస తీరుతెన్నులను 24 గంటల పాటు నమోదు చేశారు. దీనితో పాటు వారికి ప్రశ్నావళిని కూడా అందించి, వారి అభిప్రాయాలను సేకరించి, విశ్లేషించారు. ప్రతి వ్యక్తీ 96.8% మేర తనదైన విలక్షణ శైలిలో శ్వాసిస్తున్నారని ఈ అధ్యయనంలో వెల్లడైంది. కొందరు నిచ్ఛ్వాస తర్వాత తిరిగి శ్వాస తీసుకునే ముందు కొద్ది విరామం తీసుకున్నారు. మరికొందరు వెనువెంటనే లేదా ఇతరులకన్నా ముందే శ్వాస తీసుకున్నారు. ఎవరి తీరు వారిదే అన్నట్లు శ్వాస తీరుతెన్నులు ఉండటం విశేషం.అనారోగ్యాలు పసిగట్టేందుకూ..వ్యాకులత తదితర అంశాలపై వారు వ్యక్తపరచిన అభిప్రాయాలకు, వారి శ్వాస తీరుతెన్నులకు మధ్య సారూప్యత కనిపించింది. దీంతో, మనుషుల మానసిక స్థితిగతులను, అనారోగ్య సమస్యలను, రుగ్మతలను పసిగట్టేందుకు వారి శ్వాస తీరుతెన్నులు ఉపయోగపడతాయని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ‘ప్రతి ఒక్కరి మెదడు మాత్రమే కాదు, వారి శ్వాస తీరుతెన్నులు కూడా విలక్షణమైనవే’ అనిపిస్తోందన్నారు వీజ్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో న్యూరో బయాలజీ ప్రొఫెసర్ నోమ్ సోబెల్. ఈ అధ్యయనంలో పాల్గొన్న వంద మందిలో 42 మంది శ్వాస ప్రక్రియను మరో 24 గంటలు అదనంగా అధ్యయనం చేశారు. ‘ఒకరు రన్నింగ్ చేస్తారు. మరొకరు చదువుకుంటుంటారు. ఇంకొకరు విశ్రమిస్తుంటారు. వీరి శ్వాస తీరుతెన్నుల్లో వైవిధ్యాన్ని గుర్తించటం చాలా కష్టమేమో అని ముందు అనుకున్నాం. అయితే, ఒకరి శ్వాస తీరుతెన్నులతో మరొకరిది చాలా విభిన్నంగా ఉండటం గమనించాం’ అని ఈ అధ్యయనంలో పాల్గొన్న ఒక విద్యార్థి తిమ్న సరోక ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.వ్యాకులత.. తక్కువ గాలి!వారి శ్వాస తీసుకుంటున్న తీరు, నిద్రకు ఉపక్రమించటం–మేల్కొనటం, మనోవ్యథ, వ్యాకులతకు సంబంధించిన భావోద్వేగాలను బట్టి ఆయా వ్యక్తుల బాడీ మాస్ ఇండెక్స్ (బిఎంఐ)ను సైతం పరిశోధకులు అంచనా వేయగలగటం మరో విశేషం. అధ్యయనంలో భాగంగా ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాసినప్పుడు వ్యాకులతను కనబరిచిన వ్యక్తులు చాలా తక్కువగా గాలి పీల్చుకున్నారు. అంతేకాదు, నిద్రలో ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య వచ్చిన విరామంలో చాలా హెచ్చు తగ్గుల్ని పరిశోధకులు గుర్తించారు. మనోవ్యథతో బాధపడుతున్న వారు మేల్కొని ఉన్నప్పుడు చాలా బలవంతంగా శ్వాసను తీసుకోవటం, గాలి వదిలిన తర్వాత తిరిగి శ్వాస తీసుకోవటానికి ముందు సుదీర్ఘంగా విరామం (పాజ్) ఇస్తుండటాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇదీ చదవండి: Today Tips యోగాతో లాభాలెన్నో.. ఈ చిట్కాలు తెలుసా?ఆయురారోగ్యాలకోసం.. ‘ఒత్తిడి లేదా ఆందోళనతో బాధపడేవారి శ్వాస తీరుతెన్నులు మారి పోతున్నాయని మేం భావిస్తున్నాం. దీన్ని ఇంకోలా కూడా చెప్పుకోవచ్చు. మీరు శ్వాస తీసుకునే తీరును బట్టి మీకు ఒత్తిడి లేదా ఆందోళన వస్తున్నాయని కూడా అనుకోవచ్చు. అదేగనక నిజమైతే, ఆ రుగ్మతల నుంచి బయటపడేయటానికి శ్వాసించే తీరును మార్చితే సరిపోతుందని అనుకుంటున్నాం’ అన్నారు నోమ్ సోబెల్. శ్వాస మీద ధ్యాస పెడితే ఆయురారోగ్యాలు సమకూరుతాయంటే ఇదేనేమో! -
అప్పుడు ఆర్మీ అధికారి.. కానీ ఇవాళ వీధుల్లో..
ఒకప్పుడూ ఆర్మీలో ఉన్నతాధికారిగా సేవలందించింది. ఇప్పుడు వీధుల్లో ఫుడ్స్టాల్ నడుపుతూ లైఫ్ని లీడ్ చేస్తోంది. అయితే ఆమెలో అప్పుడలా..ఇప్పుడిలా అనే నైరాశ్యం అణువంతైనా తొణికిసలాడదు. నెట్టింట ఆమె కథ వైరల్లగా మారి ఎందరి మనసులనో కథిలించింది. ఎవరామె అంటే..79 ఏళ్ల ఈ వృద్ధురాలు ఒకప్పుడు ఆర్మీ మాజీ సైనికురాలు. అయితే ఆమె అస్సలు వివాహమే చేసుకోలేదట. ఆమె భారత సైన్యంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేసి పదవీవిరణమ చేసినట్లు తెలిపింది. అయితే ఆమెకు కుకింగ్ అంటే మహా ఇష్టమట. ఆ ఇష్టంతోనే ఇండోర్ వీధుల్లో ఒక ఫుడ్స్టాల్ని నడుపుతోంది. ఆమె ముంబైలో ఫైన్ ఆర్ట్స్లో డిగ్రీ పూర్తిచేసినట్లు వెల్లడించింది. కొన్నేళ్లు జీవితంలో తీవ్ర కష్టాలను ఎదుర్కొన్నానని కూడా చెప్పుకొచ్చింది. అయినప్పటికీ తన గత జీవితంలోనూ, ప్రస్తుతం ఎంతో ఆనందంగా సంతృప్తిగా జీవిస్తున్నానని ధీమాగా చెబుతోందామె. ఇక్కడ ఆ మహిళ ఈ వయసులో ఒంటరిగా ఈ వ్యాపారం ఎలా చేయగలను అనే సందేహానికి తావివ్వకుండా సాధికారత, సానుకూలతలను అస్త్రాలుగా చేసుకుని ముందుకు సాగడం ప్రశంసనీయం. అందుకు సంబంధించిన వీడియోని కాశీష్ సోని అనే సోషల్ మీడియా ఔత్సాహికురాలు నెట్టింట షేర్ చేయడంతో వైరల్గా మారింది. పైగా ఆ వీడియోకి లక్షకు పైగా లైక్లు వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు సైతం ఒంటరిగా కూడా మహిళలు లైఫ్ని లీడ్ చేయగలరు అనడానికి ఈ మాజీ భారత ఆర్మీ హీరోనే ఉదాహరణ, ఎందరికో ఆ వృద్ధురాలు స్ఫూర్తిదాయకం అని ప్రశంసిస్తూ పోస్ట్లు పెట్టారు. View this post on Instagram A post shared by Kashish Soni (@tasty_trekk) (చదవండి: World Motorcycle Day: రైడింగ్ స్కిల్తో అదరగొట్టిన ఉమెన్ రైడర్స్..!) -
అందానికి ఆధారం..నీరు, ఆహారం..!
ప్రతి వ్యక్తి అందానికీ దోహదం చేసేవాటిలో నీరు, ఆహారం ప్రధానమైనవని బ్యూటీ క్వీన్, నటి మనసా వారణాసి అన్నారు. కొత్తపేటలో నూతనంగా నెలకొల్పిన సికారా క్లినిక్స్లో సౌందర్య పోషణలో ఏఐ ఆధారిత ఉత్పత్తుల వినియోగం, తదితర అంశాలపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మన సంప్రదాయ ఆహారం, సౌందర్య సాధనాల విలువ అమూల్యమైనదని, అయితే ఆధునిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని ట్రీట్మెంట్లు తప్పవని అన్నారు. ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన హైడ్రో ఫేషియల్ వంటి చికిత్సలు తనకు ఇష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సౌదర్య చికిత్స నిపుణులు, సంస్థ నిర్వాహకులు రాఘవేందర్, శిరీష తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య నిపుణులు సైతం కనీసం ఆరు నుంచి ఎనిమిది గ్లాసులు తాగమని సూచిస్తుంటారు. చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచడమే గాక, శరీరంలోని మలినాలను బయటకు పంపించేస్తుంది. తద్వారా చర్మం తాజాగా, కాంతిమంతంగా ఉంటుందనేది సౌందర్య నిపుణుల వాదన. ఇది ఆరోగ్యానికి, అందానికి ఉపయోగపడే తేలికపాటి అందుబాటులో ఉన్న రెమిడీ. అంతేగాదు చల్లటి నీటిలో ముఖంపై పెట్టిన రక్తసరఫరా జరిగి మృతకణాలు పోతాయని కూడా అంటుంటారు నిపుణులు. అందువల్ల నీళ్లని తప్పనిసరిగా ఎక్కువగా తాగేలా ప్రయత్నిద్దాం. ఆరోగ్యంగానూ, అందంగానూ ఉందాం. (చదవండి: World Motorcycle Day: రైడింగ్ స్కిల్తో అదరగొట్టిన ఉమెన్ రైడర్స్..!) -
Ooty టీ తోటలు తప్ప ఏముంది బ్యూటీ అనుకుంటున్నారా?
ఊటీలో తేయాకు తోటలున్నాయి. వందలాది గులాబీల తోట ఉంది. బొటానికల్ గార్డెన్లో శిలాజవృక్షం ఉంది. ఏడు వేల అడుగుల ఎత్తులో సరస్సు.ఎనిమిది వేల అడుగుల్లో పర్వత శిఖరం. ఊటీ అంటే... యాభై ఏళ్ల కిందటబాలీవుడ్ హీరో హీరోయిన్లు... యుగళగీతాలు పాడిన నేల.. టాలీవుడ్... పాటల తోట. రకరకాల టీల రుచిని ఆస్వాదిస్తూఊ... టీ తోటల్లో విహరిద్దాం.1వ రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ నంబర్ 17230, శబరి ఎక్స్ప్రెస్ బయలుదేరుతుంది. ప్రయాణం రాత్రంతా సాగుతుంది. 2వ రోజు ఉదయం (07.57గంటలకు) రైలు కోయంబత్తూరుకి చేరుతుంది. రైలు దిగి రోడ్డు మార్గాన ఊటీకి బయలుదేరాలి. హోటల్లో చెక్ ఇన్ అయ్యి, రిఫ్రెష్ అయిన తర్వాత బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్లో విహరించి రాత్రికి హోటల్కి చేరడం. రాత్రి బస ఊటీలోనే. 3వ రోజు: బేక్ఫాస్ట్ తరవాత దొడబెట్ట శిఖరం, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ సందర్శనం తర్వాత హోటల్కు చేరడం. ఆ రాత్రి బస కూడా ఊటీలోనే.4వ వ రోజు : బ్రేక్ఫాస్ట్ తర్వాత కూనూరు సైట్ సీయింగ్కి వెళ్లాలి. తిరిగి ఊటీకి వచ్చి హోటల్కి చేరి విశ్రాంతి. షాపింగ్ చేసుకోవచ్చు.5వ రోజు : బ్రేక్ఫాస్ట్ తర్వాత కొంత సమయం ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ విశ్రాంతిగా ఫొటో షూట్ చేసుకుంటూ గడిపిన తర్వాత మధ్యాహ్నం గది చెక్ అవుట్ చేసి కోయంబత్తూరుకు బయలుదేరాలి. ట్రైన్ నంబర్ 17229 శబరి ఎక్స్ప్రెస్ 15.55 గంటలకు కోయంబత్తూరు స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఆ రైలు సికింద్రాబాద్కి ఆరవ రోజు మధ్యాహ్నం 12.45 గంటలకు చేరుతుంది. బ్రిటిష్ కాలం నాటి ఉద్యానవనం ఊటీకి ఎందుకెళ్లాలి? ఊటీలో టీ తోటలు తప్ప ఏమున్నాయ్ చూడడానికి? అనే పెదవి విరుపులు ఉంటాయి. కానీ ఊటీలో చూసి తెలుసుకోవాల్సినవి, ఆస్వాదించాల్సినవి చాలా ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన బొటానికల్ గార్డెన్స్ ఉన్నాయి. దీనిని కలయ తిరిగి చూడడం ఆహ్లాదంతోపాటు బోనస్గా విజ్ఞానం కలుగుతుంది. ఇది 54 ఎకరాల గార్డెన్స్ సముదాయం. బ్రిటిష్ పాలన కాలం నాటిది. తమిళనాడు ప్రభుత్వం చక్కగా నిర్వహిస్తోంది. చెట్లలో ఆరు వందల రకాలున్నాయి. గార్డెన్స్ మధ్యలో ఫాజిల్డ్ ట్రీ ట్రంక్ (శిలాజ వృక్షం) ఉంది. రెండు కోట్ల సంవత్సరాల కిందట జీవించిన వృక్షం అది. ఔషధ వృక్షాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ఇటాలియన్ గార్డెన్, న్యూ గార్డెన్, లోయర్ గార్డెన్, ఫౌంటెయిన్ టెర్రస్ గార్డెన్ ఇలా రకరకాలుగా విభజించి ఉంటుంది. ఫాజిల్ ట్రీ ట్రంక్ లోయర్ గార్డెన్లో ఉంది.తెలుగు పాటల తోటకూనూరు పట్టణం ఊటీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని ఒకప్పటి తెలుగు సినిమాపాటల చిత్రీకరణ కేంద్రం అనవచ్చు. సినిమా కథలో సన్నివేశాలు ఊటీలో చిత్రీకరించి, పాటలకు మాత్రం కూనూరుకు వచ్చేవాళ్లు తెలుగు దర్శకులు. అప్పట్లో ఊటీ, కూనూరు... ఈ రెండు ప్రదేశాలనూ ఊటీగానే పరిగణిస్తూ సినిమా పాటల చిత్రీకరణ కోసం ఊటీ వెళ్తున్నట్లు దర్శకులు చెప్పేవారు. ఈ ప్రదేశం బ్రిటిష్ కాలనీని తలపించేది. యూరోపియన్ శైలి ఫుడ్ రెస్టారెట్లు ఇప్పటికీ ఉన్నాయి. వెయ్యి రకాల మొక్కలతో సిమ్స్ పఆర్క్ ఉంది. ఊటీ ప్రకృతి సౌందర్యానికి చిరునామా అయితే కూనూరు పాశ్చాత్య విలాసంగా కనిపిస్తుంది. గులాబీల తోట!ఊటీ బొటానికల్ గార్డెన్స్ అనగానే ఎక్కువ మందికి రోజ్ గార్డెన్ గుర్తు వస్తుంది. ఇక్కడ వందల రకాల గులాబీ చెట్లు ఉంటాయి. ఇక్కడ ఏటా జరిగే నీలగిరి ఫ్లవర్ షోకి ప్రపంచ దేశాల నుంచి లక్షా యాభై వేల మంది సందర్శకులు వస్తారు. బొటానికల్ గార్డెన్స్లో మొక్కలతో ఏర్పాటు చేసిన భారత రాష్ట్రాల మ్యాప్ను నిశితంగా పరిశీలించి ఆస్వాదించాలి. అన్నట్లు బోన్సాయ్ వృక్షాలను చూడడం మరిచి΄ోవద్దు. ఈ గార్డెన్స్ పరిధిలో తోడా గిరిజన తెగ నివసించే చిన్న ప్రదేశం కూడా ఉంది. దానిని తోడా మండ్ అంటారు. వారి జీవనశైలి ప్రత్యేకం. తెలుపు, నలుపు, ఎరుపు రంగులతో ఎంబ్రాయిడరీ చేసిన వస్త్రాలు అందంగా ఉంటాయి.బాలీవుడ్ డ్యూయెట్లు ఇక్కడే!ఊటీలో మనం చూసే సరస్సు సహజసిద్ధమైనది కాదు. బ్రిటిష్ ΄ాలన కాలం నాటిది. చల్లటి నీలగిరుల్లో ఉన్న ఊటీ బ్రిటిష్ వారి వేసవి విడిది. విహారం కోసం సరస్సును తవ్వించారు. యాభై ఎకరాల బొటానికల్ గార్డెన్స్కు దీటుగా ఏడు వేల అడుగుల ఎత్తులో తవ్విన 65 ఎకరాల సరస్సు ఇది. బ్రిటిష్ అధికారులు సరదాగా వేటాడడం కోసం చేపలను పెంచేవారు. ప్రస్తుతం చేపల వేట లేదు. పర్యాటకుల వినోదం కోసం బోట్ షికారు ఉంది. సరస్సు చుట్టూ విస్తరించిన ఎత్తైన చెట్లను చూస్తూ పెడల్ బోట్లో నిదానంగా విహరించడం అనిర్వచనీయమైన అనుభూతి. వేగంగా ప్రయాణించే మోటర్ బోట్లు కూడా ఉంటాయి. సరస్సు చుట్టూ రౌండ్ కొట్టాలంటే సైకిళ్లు అద్దెకిస్తారు. ఈ సరస్సు దగ్గర అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది. అందులో పిల్లలను ఆకర్షించే టాయ్ ట్రైన్, హాంటెడ్ హౌజ్, హార్స్ రైడ్ ఉంటాయి. ఇక ఊటీ గొప్పదనాన్ని ఒక్కమాటలో చెప్పాలంటే ఇది సినిమా చిత్రీకరణ లొకేషన్. ఓ యాభై ఏళ్ల కిందట సినిమాల చిత్రీకరణ ఎక్కువ భాగం ఊటీ, కూనూరుల్లో జరిగేది. తెలుగు సినిమాలే కాదు, బాలీవుడ్ హీరోహీరోయిన్లు కూడా ఇక్కడే డ్యూయెట్లు పాడుకున్నారు. టెలిస్కోప్లో చూద్దాం!ఊటీ పేరు ఉదకమండలం. ఇది తూర్పు కనుమలలోని నీలగిరుల్లో విస్తరించిన ప్రదేశం. నీలగిరుల్లో ఎత్తైన కొండను దొడబెట్ట అంటారు. దొడబెట్ట అనేది కన్నడ పదం. పెద్ద కొండ అని అర్థం. ఈ ప్రదేశం ఊటీ పట్టణానికి తొమ్మిది కిలోమీటర్ల దూరాన ఉంది. శిఖరం ఎత్తు ఎనిమిది వేల ఆరు వందల అడుగులు. శిఖరాన్ని చేరడానికి ట్రెకింగ్ చేయాల్సిన అవసరం లేదు. రోడ్డు ఉంది, వాహనాలు వెళ్తాయి. ఈ శిఖరం మీద టెలిస్కోప్ హౌస్ ఉంది. సముద్ర తీరాల్లో లైట్ హౌస్లను చూస్తుంటాం. ఈ శిఖరం మీద ఉన్న టెలిస్కోప్ నుంచి నీలగిరుల సౌందర్యాన్ని వీక్షించవచ్చు. టీ కప్పు తెచ్చుకుందాం!టీ మ్యూజియం ఊటీకి నాలుగు కిలోమీటర్ల దూరంలో విస్తారమైన టీ తోటల మధ్య ఉంది. దొడబెట్ట రూట్లో∙వస్తుంది. నిజానికి ఇది పెద్ద టీ ఫ్యాక్టరీ. ఇక్కడ తేయాకును కట్ చేయడంతోపాటు ఆకును స్టీల్ కంటెయినర్లలో వేసి వేడితో ఎండబెట్టడం, క్రష్ చేసి ప్రాసెస్ చేయడం అన్నింటినీ చూడవచ్చు. రకరకాల టీలను రుచి చూడవచ్చు. అలాగే పొడులు కొనుక్కోవచ్చు. ఈ ప్రదేశాన్ని సందర్శించిన గుర్తుగా టీ మ్యూజియం లోగో ముద్రించిన టీ కప్పులు, ప్లేట్లు, టీ షర్ట్లు కొనుక్కోవచ్చు. ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. టూర్ ప్యాకేజ్ నిర్వహకుల ఐటెనరీ ఈ సమయానికి అనుగుణంగానే ఉంటుంది.బోట్హౌస్లో షికారు!ఊటీకి 20 కిమీల దూరాన ఉంది పైకారా. ఇది తోడా గిరిజనుల ఆరాధ్య ప్రదేశం. నది పేరు, జలపాతం పేరు, జలపాతం ఉన్న ప్రదేశం పేరు అన్నీ పైకారానే. ఇక్కడ గిరిజనులు కొలిచే ఆలయంలో దేవతను కూడా పైకారా అమ్మ అని పిలుస్తారు. ఈ నది మీద డ్యామ్ ఉంది. రిజర్వాయర్లో బోట్ షికార్ చేయవచ్చు. ఇక్కడ మామూలు పడవలు కాదు, పైకప్పుతో బోట్ హౌస్లుంటాయి. ప్రశాంత పర్యటనహైదరాబాద్లో మొదలై హైదరాబాద్ చేరడంతో పూర్తయ్యే ఈ టూర్ ప్యాకేజ్ పేరు... ‘అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్ (ఎస్హెచ్ఆర్094)’. ఇది ఆరు రోజుల పర్యటన. గడియారంతో పరుగులు పెడుతూ ఎక్కువ ప్రదేశాలను చుట్టేసే పర్యటన కాదు. ప్రశాంతంగా ప్రకృతి సౌందర్యాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ సాగే చక్కటి విహారం. మూడు రోజులు ఊటీలో బస చేయవచ్చు. టూర్ కోడ్: ULTIMATE OOTY EX HYDERABAD (SHR094)చదవండి: రాత్రికి రాత్రే మిలియనీర్గా..జాలరి దశ మార్చిన చేపలు ప్యాకేజీ ధరలివి! కంఫర్ట్ కేటగిరీ (థర్డ్ ఏసీ) సింగిల్ షేరింగ్లో ఒకరికి సుమారుగా 30 వేలవుతుంది. ట్విన్ షేరింగ్లో ఒక్కొక్కరికి సుమారు 17 వేలవుతుంది. ట్రిపుల్ షేరింగ్లో ఒక్కొక్కరికి 16 వేలు, పిల్లలకు ఒక్కరికి పదివేలు సుమారుగా. స్టాండర్డ్ కేటగిరీ (స్లీపర్ క్లాస్) సింగిల్ షేరింగ్లో ఒకరికి 27 వేలకు పైగా, ట్విన్ షేరింగ్లో ఒక్కొక్కరికి 15 వేలు, ట్రిపుల్ షేరింగ్లో 13 వేలకు పైగా అవుతుంది.రోడ్డు ప్రయాణానికి ఏసీ వాహనాలు, బసకు నాన్ ఏసీ హోటళ్లు. ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది.హోటల్లో ఇచ్చే బ్రేక్ఫాస్ట్ మాత్రమే ప్యాకేజ్లో ఉంటుంది. మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనాలు వర్తించవు.బోటింగ్, హార్డ్ రైడింగ్, పర్యాటక ప్రదేశాల ఎంట్రన్స్ టికెట్లు కూడా ప్యాకేజ్ ధరలో వర్తించవు. వాతావరణం: ఈ నెలలో ఉష్ణోగ్రతలు 25–17 డిగ్రీల మధ్య ఉంటాయి. ఉలెన్ దుస్తులు తీసుకెళ్లాలి. స్వల్ప వర్షపాతం ఉండవచ్చు. కాబట్టి పిల్లలతో వెళ్లేవాళ్లు గొడుగు దగ్గర ఉంచుకుంటే మంచిది. పెద్దవాళ్లకు చిరు తుంపరలో ఊటీ గార్డెన్స్లో విహరించడం బాగుంటుంది. ఇదీ రూట్: సికింద్రాబాద్లో బయలుదేరిన తర్వాత నల్గొండ, మిర్యాల గూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు జక్షన్, తెనాలి జంక్షన్, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, నెల్లూరు, గూడూరు జంక్షన్, రేణిగుంట జంక్షన్, తిరుపతి, చిత్తూరు మీదుగా ప్రయాణిస్తుంది. ఈ స్టేషన్లలో ఎవరికి సౌకర్యమైన స్టేషన్లో వాళ్లు రైలెక్కవచ్చు. అలాగే తిరుగు ప్రయాణంలో ఏ స్టేషన్లోనైనా దిగవచ్చు కూడా. తెలుగు రాష్ట్రాలు దాటిన తరవాత రైలు తమిళనాడులో ప్రవేశిస్తుంది. ఇది వీక్లీ ట్రిప్. వారానికి ఒక టూర్ మాత్రమే. ప్రతి మంగళవారం ఉంటుంది. ఇదీ చదవండి: Beauty Tips ఆలూతో అందం : అదిరిపోయే చిట్కాలు– వాకా మంజులారెడ్డి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి