breaking news
Family
-
పాలిటిక్స్ కన్నా.. పిజ్జాయే మిన్న
పాలిటిక్స్ కంటే పిజ్జా గురించే మన వాళ్లు ఎక్కువగా ఆలోచిస్తున్నారని ‘ఇండియా ఓవర్ థింకింగ్ రిపోర్ట్’ పేరిట సెంటర్ ఫ్రెష్ యూ గోవ్ సంయుక్తంగా నిర్వహించిన తాజా జాతీయ స్థాయిఅధ్యయనం వెల్లడైంది. ఈ రిపోర్ట్ ప్రకారం.. ఓవర్ థింకింగ్లో ముందున్న మన దేశవాసులు రాజకీయాల కంటే పిజ్జా గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు తేలింది. దేశవాసుల ఆలోచనల్లోనూ, రోజువారీ జీవనశైలిలోనూ అతి ప్రభావితం చేస్తోందని, సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, అత్యంత సాధారణమైన విషయాలకు సంబంధించిన నిర్ణయాల్లోనూ, ఆలోచనల్లోనూ అతి కనిపిస్తోందని ఈ నివేదిక చెబుతోంది. 81 శాతం మందిలో.. దేశంలో 81 శాతం మందికి రోజుకి మూడు గంటలకు పైగా ఓవర్థింకింగ్ అలవాటైంది. వాట్సాప్ మెసేజ్కి ఎలా స్పందించాలో, భోజనానికి ఏం తినాలో, లేదా ఇన్స్ట్రాగామ్లో ఏ ఫొటో పోస్ట్ చేయాలో అనేటటువంటి ప్రతి చిన్న విషయంలోనూ ప్రజలు ఆలోచనల ఊబిలో మునిగిపోతున్నారని నివేదిక స్పష్టం చేస్తోంది. రెస్టారెంట్లో డిష్ ఎంపిక చేయడం అనేది రాజకీయ నాయకుడిని ఎంచుకోవడంకన్నా ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తోందని 63% మంది చెప్పడం విశేషం. (చదవండి: అరచేతిలో అనర్థం..! మొబైల్ ఫోబియాపై నిపుణులు ఆందోళన..) -
అరచేతిలో అనర్థం..!
అరచేతిలో అద్భుతాన్ని చూపించే స్మార్ట్ఫోన్లు.. అనర్థాలకు దారితీస్తోంది.. ప్రపంచాన్ని మన గుప్పిట్లోకి తెచి్చన టెక్నాలజీ.. చివరికి మనల్నే తన గుప్పిట్లో బం«దీగా చేస్తోంది. రోజువారీ అవసరాలు తీర్చడంతోపాటు.. రోజువారీ సమస్యలనూ తెచి్చపెడుతోంది.. సరదాగా కాలక్షేపం కోసం మొదట్లో వినియోగంలోకొచ్చి.. ఇప్పుడు అదే కాలక్షేపంగా మారిపోయింది.. అనేక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చి సమయాన్ని ఆదా చేస్తుందనుకున్న మొబైల్ నేడు మన సమయాన్ని వృథా చేస్తోంది.. నెమ్మదిగా దానికి బానిసలుగా మార్చేసుకుంటోంది.. మొబైల్ వినియోగించకుండా ఉండలేకపోవడాన్ని సైంటిఫిక్గా నోమోఫోబియా అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోబియాకు గురవుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఫలితాలు చెబుతున్నాయి. ఒకప్పుడు కేవలం సమాచారానికి, అవసరమైన కమ్యూనికేషన్కు మాత్రమే ఉపయోగించుకున్న మొబైల్ ఫోన్లు.. ఇప్పుడు మన జీవితాల్లో ప్రధాన భాగమైపోయాయి. సోషల్ మీడియా, గేమ్స్, షార్ట్ వీడియోలు, అరచేతిలో టిక్ టిక్ మంటూ వచ్చే నోటిఫికేషన్లతో.. అసలు మొబైల్ను మనమే పట్టించుకోవడం లేదు.. అది మనల్ని పట్టేసింది! ఒక ప్రైవేట్ సర్వే ప్రకారం.. హైదరాబాద్లోని విద్యార్థుల్లో 62% మందికి పైగా రోజుకు సగటున 6–8 గంటలు మొబైల్లో గడుపుతున్నారని తేలింది. అయితే వ్యసనంలా మారిన ఈ మొబైల్ అడిక్షన్ నుంచి బయటపడటానికి కొందరు మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. నగర యువతపై ప్రభావం.. హైదరాబాద్ వంటి మహానగరాల్లో మొబైల్ యూజర్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. టెక్ జాబ్స్, మెట్రో జీవితం, ఒంటరి అపార్ట్మెంట్ కల్చర్ తదితర కారణాలతో మొబైల్ను ఓ సాధనంగా కాకుండా ఒక సహజీవిగా మార్చేశాయి. ప్రత్యేకించి 15–30 ఏళ్ల వయసులో ఉన్న యువతలో ఇది తీవ్రమైన డిజిటల్ డిపెండెన్సీగా మారింది. ముఖ్యంగా రాత్రిపూట స్క్రోల్ చేస్తూ నిద్రపోయే వరకూ ఫోన్ చూస్తుండటం వల్ల నిద్రలేమి, తలనొప్పి, ఏకాగ్రత లోపం, డిప్రెషన్ వంటి మానసిక, శారీరక రుగ్మతలకు లోనవుతున్నారు. సర్వేలు ఏమంటున్నాయంటే.. నిమాన్స్ (ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్) చేసిన అధ్యయనంలో దాదాపు 40% మందికి ‘నో మొబైల్ ఫోబియా’ (నోమోఫోబియా) ఉందని వెల్లడైంది. తెలంగాణ సైకలాజికల్ అసోసియేషన్ అధ్యయనం ప్రకారం, 18–25 ఏళ్ల మధ్య వయస్కుల్లో ప్రతి 10 మందిలో ఏడుగురు మొబైల్ లేని జీవితాన్ని ఊహించలేకపోతున్నారని తేలింది. హైదరాబాద్లోని విద్యాసంస్థలు తాము నిర్వహించిన అంతర్గత సర్వేల్లో విద్యార్థులు చదువుపై ఫోకస్ కోల్పోతున్నారని స్పష్టంగా పేర్కొన్నాయి. చిన్నారుల్లో దీని ప్రభావం.. పిల్లలు ఆహ్లాదంగా ఆడుకోవాల్సిన వయసులో మొబైల్ స్క్రీన్కి అలవాటుపడుతున్నారు. తల్లిదండ్రులు తాత్కాలికంగా వారి తలనొప్పి తగ్గించుకోవాలనే ఉద్దేశంతో మొబైల్ అందిస్తుంటే.. అది శాశ్వతంగా పిల్లల అభివృద్ధికి అడ్డుగోడవుతోంది. స్పీచ్ డిలే, అటెన్షన్ డెఫిసిట్, హైపర్ యాక్టివిటీ వంటి సమస్యలు పిల్లల్లో గణనీయంగా పెరిగిపోతున్నాయి. విముక్తి మార్గాలు.. డిజిటల్ డీటాక్స్ ఛాలెంజ్ : ప్రతి వారం ఒక రోజు లేదా ప్రతి రోజు ఒక నిరీ్ణత సమయం మొబైల్కి బ్రేక్ ఇవ్వడం. ఆఫ్లైన్ హాబీస్ : పుస్తక పఠనం, ఆర్ట్, గార్డెనింగ్, యోగా వంటి కార్యకలాపాలు మొబైల్ డిపెండెన్సీని తగ్గించడంలో సహాయపడతాయి. సోషల్ మీడియా మేనేజ్మెంట్ : సోషల్ మీడియా అకౌంట్స్ డిలీట్ చేయడం కాదు, వాటిని ‘లిమిటెడ్ యూజ్’ మోడ్లో పెట్టడం, నోటిఫికేషన్లు ఆఫ్ చేయడం. డిజిటల్ వెల్ బీయింగ్ యాప్స్ : స్క్రీన్ టైమ్ ట్రాకింగ్, రిమైండర్లు ఇవ్వగల యాప్స్ ఉపయోగించడం. ఫ్యామిలీ టైమ్..: ప్రతి రోజు 1–2 గంటలు కుటుంబ సభ్యులతో గడిపేందుకు ప్రయతి్నంచాలి. హైదరాబాద్ స్పెషల్ ఇన్షియేటివ్స్.. కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగులకు నెల్లో ఒక్కరోజు ‘నో మొబైల్ డే’ పాటిస్తున్నారు. బంజారాహిల్స్లోని ఓ స్కూల్ ‘టెక్ ఫ్రీ అవర్’ అంటూ రోజుకు ఒక పిరియడ్ను స్క్రీన్ లేని యాక్టివిటీలకు కేటాయిస్తోంది. సైకలాజికల్ వెల్ బీయింగ్ సెంటర్స్ ఆధ్వర్యంలో మొబైల్ డిపెండెన్సీకి కౌన్సెలింగ్ ప్రోగ్రామ్లు నిర్వహిస్తున్నారు. స్మార్ట్ యూజ్.. ప్రస్తుత అధునాతన జీవన శైలిలో టెక్నాలజీని వదిలేయమనడం సాధ్యం కాదు.. కానీ మనమే నియంత్రించలేకపోతే అది మనల్ని నియంత్రించడం ఖాయం. మొబైల్ అనేది ఓ సాధనం మాత్రమే, జీవితం కాదు. ప్రత్యేకించి యువత.. కెరీర్, మానసిక ఆరోగ్యం, రిలేషన్షిప్స్ అన్నింటినీ తారుమారు చేసే ఈ డిజిటల్ బానిసత్వం నుంచి బయటపడితేనే నిజమైన ‘స్మార్ట్ యూజ్’ అవుతుంది. (చదవండి: తుమ్ములు కుమ్మేస్తున్నాయా..? వాచ్ ది హాచ్) -
తుమ్ములు కుమ్మేస్తున్నాయా..? వాచ్ ది హాచ్
తరచుగా తుమ్ములు రావడం, ఛాతీ అంతా నొక్కేసినట్టుగా అనిపించడం చాలామంది ఎదుర్కొనే సమస్య. సాధారణంగా అలెర్జీలు, జలుబు వంటివి వచ్చినప్పుడు తుమ్ములు ఓ లక్షణంగా కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు తుమ్ములు చాలా మామూలు విషయమే గానీ... మరికొన్నిసార్లు అవి మరింత తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు ఓ సూచన కావచ్చు. ఈ నేపథ్యంలో తరచూ కనిపించే తుమ్ములు ఎందువల్ల వస్తాయో, ఏయే సమయాల్లో అవి తీవ్రమైన సమస్యలకు సూచికగా ఉంటాయో అలాంటప్పుడు అవసరమైన సాధారణ ఇంటి చిట్కాలు మొదలుకొని... పెద్ద సమస్యలకు అవసరమైన చికిత్సలేమిటన్న అనేక అంశాలపై అవగాహన కలిగించే కథనమిది...ఆవలింతకు అన్న ఉన్నాడుగానీ... తుమ్ముకు తమ్ముడు లేడని ఓ వాడకమాట. అంటే ఒకరు ఆవలించగానే మరొకరికి ఆవలింత వస్తుంది... కానీ తుమ్ము అలాకాదు... సోలోగా వస్తుందని అర్థం. తుమ్ము ఎలాంటి ఆరోగ్య సమస్యలను సూచిస్తుందో చూద్దాం...అలెర్జీలు, పుప్పొడి, ధూళిలో ఉండే అతి చిన్న డస్ట్మైట్స్, పెంపుడు జంతువుల వెంట్రుకలు (పెట్ డ్యాండర్), బూజు వంటివి ఊపిరితిత్తులను ప్రేరేపించి తుమ్ములొచ్చేలా చేస్తాయి.జలుబు అలాగే ఫ్లూ (కామన్ కోల్డ్ అండ్ ఫ్లూజ్వరం)లో : వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంతో ముక్కు కారుతుండే సమయంలో; దగ్గు, గొంతునొప్పి, జ్వరంతో పాటు తుమ్ములూ వస్తుంటాయి. నాన్–అలెర్జిక్ రైనైటిస్: ఈ సమస్య ఉన్నప్పుడు అలెర్జీని ట్రిగర్ చేసే కారకాలు లేకుండానే వచ్చే తుమ్ములూ, ముక్కు కారడం వంటి లక్షణాలతో ఉంటాయి. వాతావరణంలో మార్పులు, కొన్ని రకాల వాసనలు, మసాలాలు ఇందుకు కారణమవుతుంటాయి. దుమ్ము, ధూళి, వాతావరణ కాలుష్యాలు (డస్ట్ అండ్ పొల్యూషన్) : వాతావరణంలోని దుమ్ము, పొగ, వాయుకాలుష్యం వంటి అంశాలు ముక్కులోని అతి సున్నితమైన పొరలను ఇరిటేట్ చేయడం ద్వారా తుమ్ములొచ్చేలా చేస్తాయి. బాగా ఘాటుగా ఉండే వాసనలు (స్ట్రాంగ్ సెంట్స్) : కొన్ని రకాల సెంట్లూ, పెర్ఫ్యూమ్లూ, శుభ్రం చేయడానికి వాడే సువాసనగల క్లీనింగ్ ఉత్పత్తులు లేదా కొన్ని రకాల రసాయనాల తాలూకు ఘాటు వాసనలు తుమ్ములను తెప్పిస్తాయి.ఛాతీ బిగుసుకుపోయినట్టు అనిపించేలా చేసే ఈ కారణాలన్నీ తుమ్ములతో సంబంధం ఉన్నవే. చాలాసార్లు తుమ్ములు వస్తున్నప్పుడు ఊపిరితిత్తులపై ఒత్తిడి పడుతున్నట్లుగానూ, ఛాతీ బాగా బిగదీసుకుపోయిన ఫీలింగ్ కలుగుతుంటుంది. ఇలా ఏయే సమయాల్లో జరుగుతుందో తెలుసుకుందాం. తరచుగా వచ్చే దగ్గుతో (ఫ్రీక్వెంట్ కాఫ్ వల్ల) : తుమ్ములతోపాటు తరచూ వచ్చే దగ్గు వల్ల ఛాతీ కండరాలపై ఒత్తిడి పడుతుంది. దాంతో ఛాతీ బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది. అలెర్జిక్ ఆస్తమా : అలెర్జీ సమస్య ఉన్న కొందరిలో అదేపనిగా తుమ్ములు వస్తుండటంతోపాటు వాళ్ల శ్వాసనాళాలూ, ఊపిరితిత్తుల్లోని గాలిగొట్టాలూ సంకోచించి సన్నబారిపోతుంటాయి. దాంతో గాలి సాఫీగా ప్రవహించడానికీ / ప్రసరించడానికీ తగినంత స్థలం లేకపోవడంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం (ఆస్తమా) జరగవచ్చు. ఆ శ్వాసనాళాలన్నీ సన్నబారి ఊపిరితీసుకోవడం కష్టంగా మారడంతో ఛాతీలోనూ బిగుతుగా అనిపిస్తుంది. పిల్లికూతలతోపాటు ఇలా శ్వాస తీసుకోవడం కష్టం కావడాన్నే ఆస్తమాగా పేర్కొంటారు. సైనస్తో పెరిగే ఒత్తిడి (సైనస్ ప్రెషర్): ముఖం ఎముకల మధ్య ఉండే ఖాళీ ప్రదేశాలను సైనస్ అంటారు. తుమ్ములు, జలుబు లేదా అలెర్జీల వల్ల సైనస్లలో ఇన్ఫెక్షన్ (అంటే వాపు వచ్చి) ఆ కారణంగా ఛాతీపై పరోక్షంగా ఒత్తిడి పెరగవచ్చు. ఇలా సైనస్లలో పేరుకు΄ోయిన శ్లేష్మం... ఛాతీపై ఒత్తిడిని పెంచుతుంది.కండరాల నొప్పి (మజిల్ స్ట్రెయిన్): తరచుగా తుమ్మడం వల్ల ఛాతీ కండరాలపై ఒత్తిడి పడుతుండటం వల్ల ఆ కారణంగా నొప్పిగానూ, ఛాతీ బిగుతుగా అనిపించవచ్చు.తుమ్ములతో ఊపిరితిత్తులపై పడే ప్రభావమిలా...సాధారణంగా తుమ్మడమనే ప్రక్రియ... ముక్కు లేదా శ్వాసనాళాల్లో అడ్డుగా ఉండి చికాకు కలిగించే కొన్ని వ్యర్థాలనూ, కణాలను బలంగా బయటకు పంపడానికి శరీరం అసంకల్పితంగా చేసే ఓ రక్షణాత్మకమైన ప్రక్రియ. అయితే, తరచుగా, అలాగే తీవ్రంగా, అదేపనిగా తుమ్ములు వస్తున్న కొన్ని సందర్భాల్లో అవి ఊపిరితిత్తులపై కొంత ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ఊపిరితిత్తుల కండరాలపై ఒత్తిడి (స్ట్రెయిన్ ఆన్ లంగ్ మజిల్స్)తుమ్మిన ప్రతిసారీ కడుపును రెండు భాగాలుగా విభజించి, ఊపిరితిత్తులనూ, కడుపు తాలూకు జీర్ణవ్యవస్థలోని భాగాల్ని వేరు చేసే డయాఫ్రమ్ అనే పొర, ఛాతీ కండరాలూ సంకోచిస్తాయి. ఇలా మరీ ఎక్కువగానూ, శక్తిమంతంగానూ తుమ్ములు వస్తున్నప్పుడు అక్కడి కండరాలపై తీవ్రమైన ఒత్తిడి కలిగిస్తాయి. దాంతో ఛాతీలో నొప్పి, అక్కడి కండరాలకు తీవ్రమైన అసౌకర్యం కలుగుతుంది. దీనివల్ల ఊపిరితిత్తులపైన నేరుగా ప్రభావం పడదుగానీ... శ్వాసప్రక్రియకు సహాయపడే కండరాలపై తీవ్రంగా ఒత్తిడి పడుతుంది. దాంతో శ్వాస సరిగా ఆడకపోవడం, ఆయాసం రావడం జరుగుతాయి. దీన్నే వాడుక భాషలో ఉబ్బసంగా చెబుతుంటారు. శ్వాసనాళాల్లో ఇబ్బంది (ఇరిటేషన్), వాపు (ఎయిర్ వే ఇరిటేషన్ అండ్ ఇన్ఫ్లమేషన్)తుమ్మినప్పుడు గాలి అకస్మాత్తుగా చిమ్మినట్టుగా చాలా వేగంగా బయటకు వస్తుంది. ఇది శ్వాసనాళాల లోపలి పొరల్లో ఇబ్బంది (ఇరిటేషన్) కలిగిస్తుంది. అలాగే అలెర్జీలూ, మాటిమాటికీ వచ్చే ఇన్ఫెక్షన్ల వల్ల వల్ల తరచుగా తుమ్ములు వస్తున్నట్లయితే, ఈ ఇబ్బంది (ఇరిటేషన్) కాస్తా దీర్ఘకాలిక వాపునకు (క్రానిక్ ఇన్ఫ్లమేషన్) దారితీసే అవకాశముంది. ఈ ఇన్ఫ్లమేషన్ కాస్తా శ్వాసనాళాలను మరింతగా కుంచించుకు΄ోయేలా చేసి, గాలి సాఫీగా ప్రసరించడాన్ని ఆటంకపరుస్తుంది. ఫలితంగా హాయిగా ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుంది.ఆస్తమాను ప్రేరేపించడం లేదా తీవ్రతరంచేయడం(ట్రిగరింగ్ / వర్సెనింగ్ ఆస్తమా) : ఆస్తమా సమస్య ఉన్నవారిలో తుమ్ములు ఆస్తమా అటాక్ను ప్రేరేపించగలవు... అంటే ట్రిగర్ చేయగలవు. అలెర్జీని కలిగించే అంశాలను (అలర్జెన్స్ను) దేహం ఎదుర్కొన్నప్పుడు యధేచ్ఛగా తుమ్ములు వస్తూ అవి శ్వాసనాళాలను కుంచించుకుపోయేలా / బిగుసుక΄ోయేలా చేస్తాయి. దాంతో ఛాతీ బిగదీసుకుపోవడం ఆస్తమా లక్షణాలు తీవ్రతరం కావడం జరగవచ్చు. అప్పుడు శ్వాసనాళాలు సన్నబారడంతో దగ్గు, ఆయాసం, ఎగశ్వాస, ఛాతీ బిగదీసుకుపోవడం వంటి ఆస్తమా లక్షణాలు కనిపిస్తాయి లేదా వాటిని తీవ్రతరం చేస్తాయి కూడా. తుమ్ములు మరింత ఎక్కువగా వస్తూ, దగ్గు కూడా తోడైనప్పుడు ఊపిరితిత్తులపై ఒత్తిడి బాగా పెరిగి, ఆస్తమా ఉన్నవారికి అది మరింత కష్టంగా పరిణమించవచ్చు.ఇన్ఫెక్షన్ వ్యాప్తి (స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్):జలుబు లేదా ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల వల్ల తుమ్ములు వస్తున్నప్పుడు, అలా తుమ్మినప్పుడు వెలువడే అతి సన్నటి తుంపర్లలతో వైరస్లు ఉంటాయి. ఆ తుంపర్ల కారణంగా వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందడంతో పాటు, కొన్నిసార్లు శ్వాసనాళాల లోపల మరింత లోతుకు విస్తరించి బ్రాంకైటిస్ లేదా నిమోనియా వంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. మరీ ముఖ్యంగా వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఇలా జరగడం చాలా సాధరణం.గాలి గదులు ధ్వంసం కావడం లేదా న్యూమోథొరాక్స్ : ఇది చాలా అరుదుగా మాత్రమే చోటు చేసుకునే ప్రమాదం. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో, అంటే మరీ ముఖ్యంగా ముఖ్యంగా ఊపిరితిత్తులలోని అంతర్గత సమస్యలు (ఉదాహరణకు ఎంఫసిమా వంటి సమస్యలు) ఉన్నవారిలో, తుమ్ములు చాలా బలంగా లేదా తీవ్రంగా వస్తున్నప్పుడు ఊపిరితిత్తులలోని అతి చిన్న గాలి గదులు (బ్లెబ్స్ అండ్ బ్యుల్లే) ఫటేల్మంటూ పగిలినట్టుగా అయ్యే ముప్పు ఉంటుంది. అయితే ఇది చాలా అరుదు. అయితే ఇది జరిగితే దీనివల్ల ఊపిరితిత్తీ అలాగే ఛాతీ గోడకు మధ్యన గాలి లీక్ అయి, న్యుమోథొరాక్స్ (కొలాప్స్డ్ లంగ్) అనే తీవ్రమైన కండిషన్కు దారి తీస్తుంది. ఇది చాలా అత్యవసరంగా వైద్యచికిత్స అందించాల్సిన పరిస్థితి.... అంటే మెడికల్ ఎమర్జెన్సీ.వైద్యచికిత్స ఎప్పుడంటే... ఈ కింద పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అవి... గాలి పీల్చడంలో తీవ్రమైన ఇబ్బంది; శ్వాస సరిగా తీసుకోలేక΄ోవడం, ఊపిరి అందక΄ోవడం / ఊపిరాడకపోవడం ఛాతీ బిగుసుకు΄ోవడం / ఛాతీలో తీవ్రమైన నొప్పి ఒక పట్టాన తగ్గని తీవ్రమైన జ్వరం శ్లేష్మం / కఫం పసుపురంగులో లేదా ఆకుపచ్చరంగులో ఉండటం ఇక్కడ పేర్కొన్న ఈ లక్షణాలు కొన్ని రోజుల తర్వాత కూడా తగ్గకుండా ఉండటం లేదా మరింత తీవ్రతరమైతే తక్షణం డాక్టర్ను సంప్రదించడం అవసరం.కొన్ని ఇతర వైద్యపరమైన సమస్యలతో కనిపించే లక్షణాలు : గుండె సంబంధిత సమస్యల కుటుంబ చరిత్ర / వైద్య చరిత్ర (హెల్త్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారు బాగా ఛాతీలో ఇబ్బంది లేదా ఛాతీ బిగుసుకు΄ోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు. తరచుగా తుమ్ములు, ఛాతీలో బాగా బిగదీసుకుపోయి ఛాతీలో ఒత్తిడి ఉన్నట్లుగా అనిపిస్తుండటం (ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఎంతమాత్రమూ నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సందర్భాల్లో సమస్య చాలా సాధారణంగా కనిపిస్తున్నా లేదా అంత తీవ్రమైన సమస్య కానప్పటికీ ఆ లక్షణాలను నిర్లక్ష్యం చేయడం సరికాదు. ఈ లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్కు చూపించి వెంటనే తగిన చికిత్స తీసుకోవడం అవసరం.చివరగా... తరచుగా తుమ్ములు రావడమన్నది దాదాపుగా అందరిలోనూ తమ జీవితకాలంలోని ఏదో ఒక సమయంలో అనుభవంలోకి వచ్చే సమస్య. అయితే ఇలా తుమ్ములు పదేపదే కనిపిస్తుంటే మాత్రం ఒకసారి డాక్టర్ను సంప్రదించడం మంచిది.తుమ్ముల నివారణా... అందుకు ఉపకరించే ఇంటి చిట్కాలు నివారణకు అనుసరించాల్సిన సూచనలు : అలెర్జీకి కారణమయ్యే కారకాల (అలర్జెన్స్)ను గుర్తించడం, వాటికి దూరంగా ఉండటం. (అంటే మనకు ఏ కారణంగా అలెర్జీ వస్తుందో తెలుసుకుని, వాటి నుంచి దూరంగా ఉండటం, అవి ఎదురుకాకుండా చూసుకోవడం; ఇంట్లో అలెర్జెన్స్ లేకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం; దుమ్మూ ధూళి లేకుండా జాగ్రత్తపడటం; పెంపుడు జంతువులూ, వాటి వెంట్రుకల నుంచి దూరంగా ఉండటం. డాక్టర్లు సూచించిన మేరకు అలర్జీలను నివారించే నేసల్ స్ప్రేలు వాడటం లేదా యోగా ప్రక్రియలో కొమ్ముతో ఉండే చిన్న భరిణె లాంటి ఉద్ధరిణి సహాయంతో ‘నేతి’ అనే యోగప్రక్రియతో ముక్కు రంధ్రాల్ని శుభ్రం చేసుకోవడం (ఈ నేతి ప్రక్రియ కారణంగా ముక్కులోని అలెర్జీ కారకాలు (అలర్జెన్స్). శ్లేష్మం కొట్టుకుపోయి ముక్కు శుభ్రంగా ఉండటంతో అలెర్జీ, ఆస్తమా నివారితమవుతాయి). ఆవిరి పీల్చడం (స్టీమ్ ఇన్హెలేషన్) : వేడినీటి ఆవిరి పీల్చడం వల్ల ముక్కుదిబ్బడ తగ్గడంతోపాటు శ్వాస తేలిగ్గా అందుతుంది. నీరూ, ద్రవపదార్థాలూ ఎక్కువగా తీసుకోవడం (హైడ్రేటెడ్గా ఉండటం) : నీళ్లు ఎక్కువగా తాగుతుండటం వల్ల శ్లేష్మం (స్ఫుటమ్) పల్చబడి అది తేలిగ్గా బయటకు వస్తుంది. (ఈ శ్లేష్మం ఊపిరితిత్తుల్లోనూ, గొంతులోనూ ఇరుక్కుని ఉన్నప్పుడు శ్వాస సరిగా అందకపోవడం, ఊపిరితీసుకోడానికి అది అడ్డుపడటం వల్ల చికాకుగా ఉండటం వంటివి చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే). ఇంటి చిట్కాలుతేనె అల్లం కలిపిన పానియాలు : తేనె (హనీ), జింజర్ (అల్లం) కలిపి చేసుకున్న పానియాల వల్ల గొంతు నొప్పి తగ్గడం, దగ్గు నుండి ఉపశమనం కలగడం వంటి ఫలితాలుంటాయి. తుమ్ములూ తగ్గుతాయి.తగినంత విశ్రాంతితో : శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం వల్ల వ్యాధి నిరోధక శక్తి మెరుగవ్వడంతోపాటు త్వరగా కోలుకోవచ్చు. పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండటం : పొగతాగడం, పొగకు ఎక్స్పోజ్ అవుతుండటం వల్ల శ్వాసకోశ సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ఇక పోగ ఎక్కువగా వస్తున్నచోట ఉంటే ఊపిరిసలపనట్టుగా అనిపిస్తుండటం అందరికీ అనుభవంలోకి వచ్చే విషయమే. అందుకే పొగ అలవాటుకూ, పొగకూ దూరంగా ఉండటం మేలు. (చదవండి: Beauty Tip: మేకప్ లేకున్నా...అందంగా కనిపించాలంటే..!) -
మేకప్ లేకున్నా...!
ముఖం కేవలం మేకప్ వేసినప్పుడే మిలమిలా అదిరిపోయేలా ఉండకూడదు. లేనిప్పుడూ కూడా సహజ సౌందర్యంతో అందంగా కనిపించాలి. అందుకోసం ఏం చేయాలంటే..ముఖం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. శుభ్రంగా ఉన్నప్పుడు అందంగా కనిపిస్తుంది. ముఖాన్ని శుభ్రం చేసుకునేందుకు సహజసిద్ధమైన లేదా తేలికపాటి క్లెన్సర్స్, ఫేస్ వాష్లను వాడాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడే గాక, బయట నుంచి ఇంటికి వచ్చాక కూడా ముఖాన్ని శుభ్రంగా కడిగితే మొటిమలు లేకుండా ముఖం తేటగా కనిపిస్తుంది.వారానికి రెండుసార్లు సున్నిపిండి, స్క్రబ్బర్లను వాడడం ద్వారా ముఖం మీద పేరుకు΄ోయిన మృత కణాలు వదిలి΄ోయి ముఖం కాంతిమంతంగా కనిపిస్తుంది.ముఖం అందంగా కనిపించాలంటే జుట్టు కూడా ఆరోగ్యంగా ఉండాలి. చుండ్రు రాకుండా జుట్టుని కాపాడుకోవాలి. జుట్టు మృదువుగా, మెరిసిపోవడానికి తగిన జాగ్రత్తలు పాటిస్తే ముఖం మరింత అందంగా కనిపిస్తుంది. (చదవండి: Mona Singhs weight loss journey: యోగా, డైట్తో ఆరు నెలల్లో 15కిలోలు..! స్లిమ్గా మోనాసింగ్) -
జూన్లోనే కోతకొచ్చే సీతాఫలం ‘అర్క సహన్’!
వర్షాకాలపు అద్భుత ఫలాల్లో సీతాఫలం ముఖ్యమైనది. వర్షాధారపు సేద్య భూములు, బంజరు భూముల్లో సీతాఫలం విరివిగా పండుతుంది. సాధారణంగా ఆగస్టు–సెప్టెంబర్ నెలల్లో శీతాఫలాలు మార్కెట్లోకి వస్తుంటాయి. అయితే, ప్రూనింగ్ చేయటం ద్వారా జూన్ నెలలోనే సీతాఫలాల కాపు చేతికి తెచ్చుకోవచ్చంటున్నారు బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్ – ఐఐహెచ్ఆర్) శాస్త్రవేత్తలు. ఆరేడేళ్ల క్రితమే ఐఐహెచ్ఆర్ రూపొందించిన ఈ ఇంప్రూవ్డ్ హైబ్రిడ్ రకాన్ని ఉద్యాన రైతు మరిబసవయ్య గత ఆరేళ్లుగా సాగు చేస్తూ చక్కని ఫలితాలు సాధిస్తున్నారు. సౌత్ బెంగళూరు తాలూకాలోని సులివర గ్రామంలో ఆయన అర్క సహన్ రకం సీతాఫలం తోటను సాగు చేస్తున్నారు. ఐఐహెచ్ఆర్ ఈ తోట సందర్శన కార్యక్రమాన్ని జూలై 31న నిర్వహించింది. రైతులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు పెద్దసంఖ్యలో పాల్గొని అర్క సహన్ సీతాఫల క్షేత్ర విశేషాలను తెలుసుకున్నారు. అర్క సహన్ సాగు చేసే అభ్యుదయ రైతులు బెల్గావికి చెందిన మహంతేశ్, మహేంద్ర మాట్లాడుతూ స్థానిక మార్కెట్లతో పాటు దూర ప్రాంత మార్కెట్లలో కూడా అర్క సహన్ రకం పండ్లకు మంచి ధర వచ్చిందని చెప్పారు. కరువు పీడిత ప్రాంతాల రైతులు కూడా ఈ వంగడం పనితీరుపై సంతోషాన్ని వ్యక్తం చేశారని ఐఐహెచ్ఆర్ ఫల విభాగం అధిపతి డాక్టర్ ఎం. శంకరన్ తెలిపారు. అక్టోబర్లో ప్రూనింగ్.. జూన్లో దిగుబడి..ఇసుక, రాళ్ల, గ్రావెల్ కలిసిన తేలిక నేలలతో పాటు బరువైన నేలలు కూడా ఈ రకానికి అనుకూలమే. అయితే, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. 6–7.5 మధ్య ఉదజని సూచిక ఉన్న నేలలు అనుకూలమని ఐఐహెచ్ఆర్ చెబుతోంది. సాధారణ సీతాఫలం రకాల చెట్లు వర్షాలు కురిసే ఆగస్టు–సెప్టెంబర్ నెలల్లో సీతాఫలాలు కోతకు వస్తాయి. వర్షాల కారణంగా ఆంత్రాక్నోజ్, పండీగ తదితర చీడపీడల బెడద ఎక్కువగా ఉంటున్నది. అయితే, అర్క సహన్ చెట్లకు అక్టోబర్ నెలలో కొమ్మ కత్తిరింపులు (ప్రూనింగ్) చెయ్యాలి. గత ఏడాది చెట్టు పెరిగిన దాంట్లో 75% మేరకు ప్రూనింగ్ చెయ్యాలి. దీని కారణంగా, పూత, కాత 8–9 వారాల ముందే వస్తుంది. జూన్లో పండ్లు కోతకు వస్తాయని, పండు నాణ్యతతో పాటు ముందుగానే మార్కెట్లోకి రావటం వల్ల రైతుకు మంచి ఆదాయం వస్తున్నదని ఐఐహెచ్ఆర్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఏపీ, తెలంగాణకూ అనువైనదే!అర్క సహన్ సీతాఫలం హైబ్రిడ్ రకం కర్ణాటకతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలోని వర్షాధార ప్రాంతాల్లో సాగుకు కూడా అనువైనదే. ఈ రకం సీతాఫలాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. పండ్ల సైజు పెద్దగా, గింజలు తక్కువ, గుజ్జు ఎక్కువగా, తియ్యగానూ ఉంటుంది. సాధారణ రకాలతో పోల్చితే అర్క సహన్ హైబ్రిడ్ సాగు మెరుగైన ఫలితాలనిస్తున్నదనటానికి దీనిపై పెరుగుతున్న ఆసక్తే నిదర్శనం.ఎకరానికి 160 మొక్కలు వేసుకోవాలి. మొక్క ధర రూ. 70. బెంగళూరులోని ఐఐహెచ్ఆర్ నర్సరీలో మొక్కలు దొరుకుతాయి.మొబైల్: 70192 30983. – డాక్టర్ టి. శక్తివేల్, ప్రధాన శాస్త్రవేత్త, ఐఐహెచ్ఆర్, బెంగళూరుఅర్క సహన్ రైతులకు వరం!అర్క సహన్ సీతాఫలం మెరుగైన హైబ్రిడ్ రకం చిన్న సన్నకారు రైతులకు, ముఖ్యంగా వర్షాధార వ్యవసాయం చేసే రైతులకు వరంలాంటిది. వాతావరణ ఒడిదుడుకుల్ని దీటుగా తట్టుకుంటూ గ్రామీణుల జీవనోపాధులను పెంపొందించే క్లైమెట్ స్మార్ట్ పండ్ల రకాల్లో ఇది కూడా ఒకటి. చిన్న సన్నకారు రైతుల తలరాతను మార్చే శక్తి అర్క సహన్కు ఉంది. ఏ వాతావరణానికైనా ఇట్టే నప్పుతుంది. పండు నాణ్యత అద్భుతంగా ఉంది. వినియోగదారుల మన్ననలు కూడా చూరగొనటం వల్ల అర్క సహన్ సీతాఫలం తోటల ద్వారా రైతులకు దీర్ఘకాలంలో స్థిరమైన ఆదాయం చేకూరుతుందని చెప్పగలను.– డా. తుసార్ కాంతి బెహెర, సంచాలకులు, భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్), బెంగళూరు -
చిటికెలో చెట్టు చుట్టూ పాదు!
మామిడి, జామ, బత్తాయి, సన్న నిమ్మ, పెద్ద నిమ్మ.. తదితర తోటల్లో మొక్కలు నాటిన తర్వాత 5–10 ఏళ్ల వరకు పసిబిడ్డల్లా పెంచుకోవాలి. మొదళ్లలో కలుపు తీయటం, పాదులు చేయటం, ఎరువులు వేసి మట్టిని కలియబెట్టటం.. వంటి పనులన్నీ అధిక శారీరక శ్రమతో కూడుకున్నవే. వ్యవసాయ కార్మికులు నడుము వంచి, చెమట చిందిస్తే తప్ప ఈ పనులు సజావుగా సాగవు. ఈ తోటల్లో చెట్ల దగ్గర కలుపు తీయటం, పాదులు చేయటం, ఎరువులు వేయటం రైతులకు నిత్యకృత్యం. అయితే, ఈ పనులను సులువుగా చేసే యంత్రపరికరాలు రైతులకు అందుబాటులో లేవు. వ్యయ ప్రయాసలకోర్చి స్వయంగా చేసుకోవటమో, ఎక్కువ ఖర్చు పెట్టి కూలీలతోనో చేయించుకుంటున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సుండుపల్లి మండలం పింఛ గ్రామానికి చెందిన రైతు కుటుంబంలో పుట్టిన డా. మూడె వినాయక్ ఈ కష్టాలన్నీ చూస్తూ పెరిగారు. మడకశిర అగ్రి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేశారు. బాపట్ల అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంటెక్, పీహెచ్డీ చదివారు. డా.హరిబాబు మార్గనిర్దేశకత్వంలో తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం ప్రధాన శాస్త్రవేత్త డా.సి.రమణ పర్యవేక్షణలో వినాయక్ పీహెచ్డీ పూర్తి చేశారు. పరిశోధనల్లో భాగంగానే పండ్ల చెట్ల చుట్టూ ట్రాక్టర్ సహాయంతో సులువుగా పాదులు చేసే యంత్ర పరికరాన్ని గత ఏడాది రూపొందించారు. ప్రస్తుతం ఆదిత్య యూనివర్సిటీ(కాకినాడ)లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు.ఉద్యాన తోటల రైతులకు ఉపయోగపడే యంత్ర పరికరాన్ని రూపొందించిన డా. వినాయక్ను ‘సాక్షి’ పలుకరించింది. ‘మా ప్రాంతంలో దాదాపుగా అన్ని పొలాల్లోనూ పండ్ల తోటలే కనిపిస్తాయి. ఓపిక ఉన్నంత వరకూ నాన్నే ఈ పనులు చేసేవారు. భారమనుకున్నప్పుడు కూలీలను పెట్టి చేయించేవారు. చిన్న నాటి నుంచి మా నాన్నతో పాటు ఇతర రైతులు చెట్ల చుట్టూ పాదులు చేయటంలో సహాయ పడే యంత్ర పరికరాలు లేక పడే కష్టాలను కళ్లారా చూస్తూ పెరిగా. పరిశోధక విద్యార్థిగా ఈ సమస్యపై దృష్టి పెట్టా. ఆ కృషి ఫలితంగానే పండ్ల తోటల్లో పాదులు చేసే యంత్రం రూపొందించాన’ని అన్నారు. పాదులు తవ్వే యంత్రం ఎలా పనిచేస్తుంది?చెట్ల చుట్టూ పాదులు తవ్వే యంత్రపరికరాన్ని ట్రాక్టర్కు అనుసంధానం చేస్తే.. హైడ్రాలిక్ సిస్టం ద్వారా పాదులు చేస్తుంది. ఇందులో ప్రధానమైనది బెవెల్ గేర్ (గుండ్రంగా ఉండే పళ్ల చక్రం). ఇది అర్ధ చంద్రాకారంలో రెండు భాగాలుగా ఉంటుంది. వీటికి ఊతంగా ఇనుప చట్రం అమర్చి ఉంటుంది. ట్రాక్టర్ చెట్టు దగ్గరకు వెళ్లి ఈ బెవెల్ గేర్ రెండు భాగాలను చెట్టు చెట్టూ పెట్టి, చట్రాన్ని బిగిస్తే పాదు పని జరుగుతుంది. చట్రం కింద వైపు రెండు నాగళ్లు, వాటికి రెండు కర్రులు ఉంటాయి. 40 హెచ్పీ, అంతకన్నా ఎక్కువ అశ్వశక్తి కలిగిన ట్రాక్టర్ ఇంజన్కు ఈ యంత్ర పరికరాన్ని అనుసంధానం చేస్తే హైడ్రాలిక్ మోటార్ ద్వారా పనిచేస్తుంది. ట్రాక్టర్ నుంచి 6 హైడ్రాలిక్ పైపులు అమర్చి ఉంటాయి. రెండు పైపులు హైడ్రాలిక్ మోటార్కు ఆయిల్ వెళ్లడానికి, తిరిగి ఆయిల్ వెనక్కు రావడానికి ఉపయోగపడతాయి. వీటిని పవర్లైన్, రిటర్న్లైన్ అంటారు. మిగతా 4 పైపులను రెండు సిలిండర్లకు అమరుస్తారు. బెవెల్ గేర్ తెరచుకోవ టానికి, మూసుకోవటానికి ఇవి ఉపయోగపడ తాయి. వీటితోపాటు 3 కంట్రోల్ లివర్స్ ఉంటాయి. హైడ్రాలిక్ వ్యవస్థ ద్వారా దీన్ని ఆపరేట్ చేసినప్పుడు.. బెవెల్గేర్ ఫ్రేమ్ రెండుగా విడిపోయి చెట్టు కాండం చుట్టూ అల్లుకుంటుంది. ఫ్రేమ్ కింద అనుసంధానమై వున్న రెండు నాగళ్లు, వాటికున్న కర్రులతో చెట్టు చుట్టూతా తవ్వి పాదును ఏర్పాటు చేస్తాయి. కాండం చుట్టుకొలత మీటరు కన్నా తక్కువ గల చెట్టు చుట్టూ పాదు చేసుకోవచ్చు. గంటకు 32–35 పాదులుపాదులు తీసే యంత్రం ద్వారా చెట్టు చుట్టూ 1.75 మీటర్ల వ్యాసార్ధం, 15 సెంటీ మీటర్ల లోతులో పాదును చేసుకోవచ్చు. ఒక చెట్టు చుట్టూ పాదు చేయటానికి ఒకటిన్నర నిమిషాల సమయం పడుతుంది. ట్రాక్టర్కు ఒక గంటకు 5 లీటర్ల డీజిల్తో 32 నుంచి 35 పాదులు చేసుకోవచ్చు. గంటకు రూ. 690 చొప్పున హెక్టారు తోటలో పాదులు పూర్తి చేయటానికి రూ. 4,615 ఖర్చవుతాయని, రైతులకు 30 శాతం సమయం, 45 శాతం ఖర్చు ఆదా అవుతాయని అంచనా. ఎక్కడ దొరుకుతుంది?డాక్టర్ వినాయక్ తాను రూపొందించుకున్న డిజైన్ మేరకు పాదులు చేసే యంత్ర పరికరాన్ని ప్రై వేటు వర్క్షాపులో తయారు చేయించి, ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఏవైనా కంపెనీలు ముందుకు వచ్చి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అనుమతితో ఈ పరికరాన్ని పెద్ద సంఖ్యలో తయారుచేసి రైతులకు అందించాల్సి వుంది. ఈ పాదుల యంత్ర పరికరం త్వరలో రైతులకు ఉపయోగంలోకి వస్తుందని ఆశిద్దాం. ప్రస్తుత ధర రూ. 80 వేలు. కావాల్సిన వారు బాపట్లలోని డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలో వ్యవసాయ పనిముట్లు, యాంత్రీకరణ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్. రాజ్కిరణ్ (91773 45631)ను సంప్రదించాలని కళాశాల అసోసియేట్ డీన్ డీడీ స్మిత్ తెలిపారు.రైతుల శ్రమ, ఖర్చు తగ్గుతాయిఏవైనా పెద్ద కంపెనీలు ముందుకు వచ్చి, ఈ యంత్ర పరికరాన్ని పెద్ద సంఖ్యలో తయారు చేసి విక్రయిస్తే విస్తృతంగా రైతులకు అందుతుంది. ఈ యంత్ర పరికరం రూపకల్పనతో మా అమ్మా నాన్నలతో పాటు పండ్ల తోటలు పెంచే ప్రతి రైతు శ్రమ, ఖర్చు చాలామటుకు తగ్గుతాయి. నా కృషి త్వరగా ఫలిస్తే అంతకు మించిన సంతోషం ఏముంటుంది?– డా. మూడె వినాయక్ (91330 86832), పాదులు చేసే యంత్ర పరికరం రూపశిల్పి.(బిజివేముల రమణారెడ్డి, సాక్షి ప్రతినిధి, బాపట్ల) -
టాలెంట్ వదిలేసి బొట్టుపై ట్రోల్స్
ముఖం చూసి బొట్టు పెట్టడమనేది స్థాయీభేదాలను సూచించే సామెత! ఇప్పుడు ఆ బొట్టు అమెరికాలోనూ ఆక్షేపణీయమైంది.. సొలిసిటర్ జనరల్ పదవికి! దాంతో ఆధునిక నాగరికతకు ఆనవాలంగా భ్రమపడే అమెరికా మరొక్కసారి తన జాత్యహంకారాన్ని చాటుకుంది. భారతీయ మూలాలున్న మథుర శ్రీధరన్ అమెరికాలోని ఒహైయో రాష్ట్ర 12వ సొలిసిటర్ జనరల్గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని అటార్నీ జనరల్ ఆఫీస్ ఎక్స్ (ట్విటర్) వేదికగా ప్రకటించింది. అంతే నిరసనలు, ట్రోల్స్తో నిండిపోయింది ఎక్స్. మథుర ప్రజ్ఞాపాటవాల మీద సందేహంతో కాదు, ఆమె భారతీయ మూలాల మీద ఆక్షేపణ.. ఆమె పేరు, ఒంటి రంగు, పెట్టుకున్న బొట్టు మీద వ్యతిరేకతతో! ‘సొలిసిటర్ జనరల్గా ఒక ఇండియన్ ఏంటీ? ఒహైయోలో అమెరికన్స్ కరువయ్యారా?’ అంటూ ఒకరు, ‘నుదుటన పర్మినెంట్ చుక్క పెట్టుకుని మరీ వచ్చిందండీ కొలువుకి’ అంటూ మరొకరు, ‘జాబ్స్ లేకుండా స్థానికులు అల్లాడుతుంటే ఈ విదేశీయులకు ఉద్యోగం ఏంటీ?’ అంటూ ఇంకొకరు, ‘బొట్టు పెట్టుకోవడం స్థానికులకు చేతకాదు కాబట్టి వాళ్లకు కొలువుల్లేమో’ అంటూ వేరొకరు ఎక్స్లో కామెంట్లు గుప్పించారు. ఆమెకున్న క్వాలిఫికేషన్స్, శక్తిసామర్థ్యాల గురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడలేదు. అయితే.. ఆ ట్రోల్స్, కామెంట్స్కి జవాబుగా ఒహైయో అటార్నీ జనరల్ డేవ్ యోస్ట్ స్పందిస్తూ ‘చాలామంది మథుర శ్రీధరన్ అమెరికన్ కాదనే అపోహలో ఉన్నారు. కానీ ఆమె అమెరికా పౌరులకు పుట్టిన అమ్మాయి. అమెరికా పౌరురాలే! అంతేకాదు అమెరికా పౌరుడినే పెళ్లాడారు. అన్నిటికీ మించి ఆమె చాలా బ్రిలియంట్, సొలిసిటర్ జనరల్ హోదాకు అన్ని అర్హతలున్న పర్ఫెక్ట్ అభ్యర్థి. ఆ బాధ్యతలను చక్కగా నిర్వర్తించగలరు కూడా! ఇవికాక మిమ్మల్ని ఆమె పేరు, రంగు ఇబ్బంది పెడుతున్నట్లయితే ప్రాబ్లం ఆమెలో లేదు.. మీ మెదళ్లలో ఉంది’ అని పోస్ట్ చేశారు. మథుర శ్రీధరన్.. ఎమ్ఐటీ (మాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ పోస్ట్గ్రాడ్యూయేట్. తర్వాత న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో చేరి జ్యూరిస్ డాక్టర్ (జేడీ) పట్టా పొందారు. చక్కటి వాగ్ధాటి, అద్భుతమైన వాదనా పటిమ ఆమె సొంతం. ఆ ప్రతిభే ఆమెను సొలిసిటర్ జనరల్ పదవి వరించేలా చేసింది. -
అమృత ఘడియలవి!
వ్యాధులు దరిచేరకుండా శిశువులకు వ్యాక్సిన్లు వేయించడం తెలిసిందే. ప్రసవం అయిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం అంటే శిశువుకు మొదటి వ్యాక్సిన్ వేయించినట్టే అని చెబుతుంది భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రసవం తర్వాత మొదటి గంట ఎంత కీలకమైనదో తల్లికి– బిడ్డకి ఎన్ని విధాల మేలు చేస్తుందో తెలుసుకోవడం, అవగాహన పెంచుకోవడమనేది కాబోయే తల్లులు తప్పక తెలుసుకోవాల్సినదే.అమ్మపాలే తన బిడ్డకు ఇచ్చే అమృతం. ఔషధం కూడా. నవజాత శిశువులకు మొదటి గంటలోనే రొమ్ము పాలు పట్టించడాన్ని ఓ మంచి ప్రారంభంగా చెప్పవచ్చు. తల్లిపాలు పిల్లలకు సహజ పోషకాహారం, సురక్షితమైనవి, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిసినా.. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలు మొదటి ఆరు నెలల్లో తల్లిపాలు తాగడం లేదు అని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీని వల్ల పిల్లల ఆరోగ్యకరమైన భావి జీవితం సమస్యాత్మకంగా ఉంటుందనేది ఆ నివేదికల సారాంశం. తల్లిపాలు తాగని పిల్లల్లో అనారోగ్యం, ఆకస్మిక మరణం, నేర్చుకునే సామర్థ్యం తగ్గడం, యుక్తవయస్సులో ఆరోగ్య సమస్యల ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆ నివేదికలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. బిడ్డకు తల్లి ఇచ్చే మొదటి బహుమతిముర్రుపాలుగా పిలిచే మొదటి పాలను కొలెస్ట్రామ్ అంటారు. ‘ప్రీ మిల్క్’ అనే ఈ పాలలోని పోషకాలు యాంటీబాడీలుగా శిశువుకు మొదటి సహజ టీకాగా పనిచేస్తాయి. ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి. రోగనిరోధక శక్తిని, వ్యాధుల నుంచి రక్షణను ఏకకాలంలో అందజేస్తాయి. అంతేకాదు, ప్రసవం అయిన మొదటి గంటలో తల్లి హృదయానికి హత్తుకున్న బిడ్డ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వల్ల పిల్లల చర్మంలో మంచి బాక్టీరియా వృద్ధి చెంది, తల్లీ–బిడ్డల బంధాన్ని మెరుగుపరుస్తుంది. అందువల్ల అప్పుడే పుట్టిన శిశువుకు తల్లిపాలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇవ్వాలని, మొదటి గంట మరీ కీలకం అని యునిసెఫ్, డబ్ల్యూహెచ్వో తో పాటు ఎన్నో పరిశోధనలు తెలియజేస్తున్నాయి. బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల తల్లికి కూడా ఆరోగ్యపరంగా ఎంతో మేలు జరుగుతుంది. ప్రసూతి అనారోగ్య భారం తగ్గుతుంది. ఆరోగ్యకరమైన కుటుంబాల సృష్టికి మూలం అవుతుంది. బిడ్డకు అందమైన భవిష్యత్తును కానుకగా ఇవ్వాలని తపించే ప్రతి తల్లి మొదటగా అందివ్వాల్సింది తల్లిపాలే.మరెన్నో ప్రయోజనాలు→ ప్రసవం అయిన కొన్ని రోజుల వరకే కొలొస్ట్రామ్ ఉత్పత్తి అవుతుంది. అందుకే ఈ రోజుల్లో తప్పక పాలు ఇవ్వాలి. మరీ ముఖ్యంగా పుట్టిన మొదటి గంటలోపు తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డ మనుగడ అవకాశాలు 14 రెట్లు పెరుగుతాయని నివేదికలు చెబుతున్నాయి.→ తల్లిపాలలో ఆరోగ్యకరమైన మెదడు అభివృద్ధికి, చురుకైన పనితీరుకు తోడ్పడే పోషకాలు ఉంటాయి. ప్రొటీన్, ఐరన్, కాల్షియం, విటమిన్లు సమృద్ధిగా, చక్కెరపాళ్లు తక్కువగా ఉండే తల్లి పాలు శిశువుకు మొదటి ఆరు నెలలు పూర్తి ఆహారం. → తల్లిపాలు కాకుండా ఇతర ఆహారాన్ని అంటే.. చాలా వరకు ప్రసవం అయ్యాక శిశువుకు తేనె నాకించడం, డబ్బా పాలు పడుతుంటారు. ఈ విధానం చాలా ప్రమాదకరమైనది. దీని వల్ల తల్లిలోనూ పాల ఉత్పత్తి ఆలస్యం కావచ్చు. బిడ్డకు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. చెవి ఇన్ఫెక్షన్లు, విరేచనాలు, న్యుమోనియా వంటి అనారోగ్యాల బారిన పడే అవకాశాలూ ఉన్నాయి. తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి శరీర వేడి ద్వారా బిడ్డను రక్షించడమే కాకుండా తల్లీ బిడ్డ మధ్య బంధం బలపడుతుంది.ఆరు నెలలు... ఆ తర్వాత...ఆరు నెలల తర్వాత ఇంట్లో వండిన పోషకాలు ఉండే మెత్తని ఆహారాన్ని ఇవ్వాలి. అలాగే, వయస్సుకు తగిన విధంగా, పోషకాలు ఉండే ఆహారాన్ని ఇస్తూ ఉండాలి. అదే సమయంలో రెండేళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు వరకు కూడ తల్లిపాలు ఇవ్వచ్చు. బిడ్డ క్రమంగా ఘన, ద్రవ, వైవిధ్యమైన ఆహారాన్ని తగు మోతాదులో తీసుకోగలుగుతుందా లేదా అని దృష్టి పెట్టాలి. బిడ్డ తొలినాళ్ల నుంచే తీసుకున్న శ్రద్ధ ఆ బిడ్డ పెరుగుదల, అభివృద్ధికి పునాది వేస్తుంది. తొలి బాల్య దశలోనే బిడ్డ ఏం నేర్చుకుంటుంది, ఎలా ప్రవర్తిస్తుంది.. అనే వాటిని నిర్ణయిస్తుంది. జీవితంలో విజయాలు సాధించేలా వారి సామర్థ్యాన్ని ఆ తొలిదశే నిర్ణయిస్తుంది. పిల్లల మనుగడ, ఆరోగ్యకరమైన అభివృద్ధికి తల్లిపాలు కీలకపాత్ర పోషిస్తాయి. మొదటి గంటలో తల్లి తన బిడ్డకు ఇచ్చే ప్రతి పాల చుక్క అనారోగ్యకారకమైన బాక్టీరియాతో పోరాడే శ్రక్తి ప్రదాయిని. సాధారణ, సిజేరియన్ ఏ ప్రసవం అయినా మొదటి తల్లిపాలు శిశువుకు తప్పక ఇవ్వాలి. ఈ విషయాన్ని తల్లికాబోయే ప్రతి ఒక్కరికీ చెబుతుంటాం. పాలు ఎలా పట్టాలి, శుభ్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పాలు వృద్ధి చెందడానికి ఎలాంటి పోషకాలు గల ఆహారాన్ని తీసుకోవాలో వివరిస్తాం. ప్రతీ తల్లి తన బిడ్డ ఆరోగ్య భవిష్యత్తుకు తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త ఇదే. కుటుంబ సభ్యులు కూడా ఈ విషయం లో తప్పనిసరి అవగాహన పెంచుకోవాలి. తల్లికి తగినంత మద్దతునివ్వాలి. – డాక్టర్ శిరీష, గైనకాలజిస్ట్∙ -
యోగా, డైట్తో ఆరు నెలల్లో 15కిలోలు..! స్లిమ్గా మోనాసింగ్
బరువు తగ్గడంలో ఎందరో ప్రముఖుల, సెలబ్రిటీలు స్ఫూర్తిగా నిలిచారు. అయినప్పటికీ అత్యంత కష్టసాధ్యమైన ఈ టాస్క్ని వ్యసనంలా చేస్తే ఈజీగా బరువు తగ్గిపోవచ్చట. అలా పూర్తి ఫోకస్ పెట్టి చేస్తేనే..కచ్చితంగా త్వరిత గతిన బరువు తగ్గిపోతారట. అదీగాక చూస్తుండగానే వేగవంతంగా మనలో వస్తున్న మార్పులను చూసి ఆత్మవిశ్వాసంగా ఫీలవుతామని అంటోంది ప్రముఖ బాలీవుడ్ నటి మోనాసింగ్. అదెలాగో సవివరంగా చూద్దామా..!.బాలీవుడ్ టెలివిజన్ సీరియల్తో జస్సీ జైస్సీ కోయి నటి మోనాసింగ్ పలు సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది. లాల్ సింగ్ చద్దా, అమావాస్, 3 ఇడియట్స్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. చివరగా ముంజియా అనే మూవీలో కనిపించారు. గత కొంత కాలం మూవీలకు దూరంగా ఉన్నా ఆమె పాన్ పర్దా సర్దా అనే గ్యాంగ్ స్టర్ సిరీస్ కోసం బరువు తగ్గాలని నిర్మాతలు కోరడంతో వెయిట్ లాస్ అయ్యేందుకు సద్ధమైనట్లు తెలిపింది. వాస్తవానికి ఆమె కూడా గత కొన్నాళ్లుగా బరువు తగ్గాలని అనకుందని గానీ కుదరలేదు. కొత్త ఏడాది సందర్భంగా కూడా బరువు తగ్గే ప్రయత్నం చేయాలనకున్నా సాధ్యం కాలేదు. కానీ ఆ సిరిస్లో తన పాత్ర కోసం బరువు తగ్గక తప్పదని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి వెంటనే కసరత్తులు ప్రారంభించింది. నిజానికి బరువు తగ్గడం అనగానే నచ్చిన ఆహారం త్యాగం చేయడం అని ఫీలవుతుంటారు. కానీ ఫలితాలు మంచిగా వస్తున్నప్పుడల్లా అదేమంతా భారమైన పని కాదని అదిమలనో భాగమయ్యేలా వ్యసనంలా మారిపోతుందని అంటోంది మోనాసింగ్. బరువు తగ్గడం అంటే..మంచి ఆకృతిలోకి మారి అందంగా కనిపించడం అనుకుంటే ఏమంత కష్టం కాదట. తాను వెయిట్ లాస్కి ఉపక్రమిస్తున్నా అనగానే..తినే ఆహరంపై స్పష్టత కలిగి ఉండటం, వ్యాయామాలు చేయడమని ఫిక్స్ అయ్యానంటోంది. తన యోగా గురువు చెప్పిన అద్భత ట్రిక్ ఫాలో అవ్వడంతోనే కేవలం ఆరునెలల్లో ఏకంగా 15 కిలోలు తగ్గానని అంటోంది. "రోజుకి ఒకపూట తింటే ఆరోగ్యం, అదే రెండు పూటలా తింటే అనారోగ్యం, అలా కూడా కాకుండా మూడు పూటలా తింటే రోగి" అని ఆదే ఆరోగ్య సూత్రమని చెప్పుకొచ్చింది. తాను ఆరోగ్యకరమైన జీవనశైలితోనే ఇంతలా బరువు తగ్గినట్లు వివరించింది. రాత్రి 9.30 కల్లా నిద్రపోతే సగం అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయంటోంది. మనకోసం మనం సమయం కేటాయించు కోవాలని సూచించింది. ఇన్నాళ్లు సోమరితనం కారణంగానే దీన్ని సాధించలేకపోయాని చెప్పింది. ఆరోగ్యకరమైన బరువుని నిర్వహించడమే కష్టం తప్ప బరువు తగ్గడం కష్టం కాదంటోదామె. ఆరోగ్య నిపుణుల సంరక్షణలో మంచి జీవనశైలిని పాటిస్తే త్వరితగతిన మంచి ఫలితాలు అందుకుంటారని చెబుతోంది మోనాసింగ్.(చదవండి: ఆ మట్టి'..మెళియాపుట్టి..! ఔరా అనిపిస్తున్న కళాకారులు..) -
'ఆ మట్టి'..మెళియాపుట్టి..!
ఆ మట్టికి సాష్టాంగ నమస్కారాలు పెడతారు. అదే మట్టిని మండపంలో పెట్టి పూజలు చేస్తారు. ఫల పుష్పాదులు సమర్పించి పండగ చేస్తారు. ఆ మట్టి.. మెళియాపుట్టి. ఇక్కడ ఇరవై ఏళ్లుగా మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నారు. వినాయక చవితి, దసరా సీజన్ వచ్చిందంటే ప్రతిమల కోసం అంతా ఈ ఊరికి క్యూ కడతారు. విగ్రహాలతో పాటు దీపాలు ఇతర మట్టి సామగ్రిని కూడా తయారు చేయడం వీరి ప్రత్యేకత. మెళియాపుట్టి: వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కా వడానికి ఇంకా కొద్దిరోజులే ఉంది. మెళియాపుట్టిలో అప్పుడే సందడి మొదలైపోయింది. ఇక్కడ మట్టితో విగ్రహాలు, పూజా సామగ్రి తయారుచేస్తూ కళాకారులు బిజీగా బిజీగా గడుపుతున్నారు. మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ ప్రాంతంలో నివాసముంటు న్న కొన్ని కుటుంబాలు మట్టి వినాయక విగ్రహాలు తయారు చేస్తాయి. ఏటా చిన్న విగ్రహాలతో పాటు పెద్ద పెద్ద విగ్రహాల తయారీలో వారికి మంచి పట్టుంది. వీరు తయారు చేసిన ప్రతిమలను చూస్తే ప్రతిభను కొనియాడకుండా ఉండలేం. చుట్టుపక్కల మండలాల నుంచి సైతం విగ్రహాలకు అడ్వాన్సులు ఇస్తూ విగ్రహాలు కొనుగోలు చేస్తుంటారు. ధరలు తక్కువగా ఉండడంతో పాటు విగ్రహాలు కూడా అందంగా..రంగురంగుల్లో ఆకర్షణీ యంగా తయారు చేయడంతో ఎక్కువగా మెళియాపుట్టిలోనే విగ్రహాలు కొనుగోలు చేస్తామని కొనుగోలు దారులు చెబుతున్నారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా మట్టి విగ్రహాలు తయా రు చేయడంతోనే వీరికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఎక్కువమంది కొనుగోలు చేస్తుంటారు. కొంత మంది యువత వారికి కావాల్సిన విధంగా గణపతి విగ్రహాలు తయారు చేయించుకుంటారని విక్రయదారులు చెబుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ను వినియోగించి తయారు చేసే విగ్రహాల వల్ల పర్యావరణ పరిరక్షణకు భంగం కలుగుతుందని, అందుకే మట్టితోనే చేస్తున్నామని వారు చెబుతున్నారు. విగ్రహ తయారీలో కర్రలు, మట్టి, వరిగడ్డి, కొన్ని తాళ్లను మాత్రమే వారు వాడుతారు. 20 ఏళ్లుగా వీరు వివిధ రూపాల్లో వినాయక విగ్రహాలను తయారు చేసి భక్తులకు అందిస్తున్నారు. ఏటా కొత్తదనాన్ని తీసుకొస్తున్నారు. ప్రభుత్వ సహకారం కావాలి మట్టితోనే విగ్రహాలు తయారు చేయడంతో సంతృప్తి చెందుతు న్నాం. మట్టితో విగ్రహాలు తయా రు చేయడం చాలా కష్టం. తయారు చేసిన తర్వాత చాలారోజులు ఉంచి అప్పుడు రంగులు వేయాలి. వాటిని భద్రపరచడారనికి స్థలం లేక ఇబ్బందులు పడుతున్నాం. రేకుల షెడ్లు వేసుకోవడానికి ప్రభుత్వం లోన్లు మంజూరు చేయాలి. – బూరగాన సవరయ్య, విగ్రహ తయారీ దారుడు, మెళియాపుట్టి గ్రామం మట్టి ప్రమిదలకు గిరాకీ ఎక్కువ మట్టి ప్రమిదలు నిత్యం తయా రుచేస్తూనే ఉంటాం. వినాయక ఉత్సవాలకు అత్యధిక మండపాల్లో దీపారాధన చేస్తారు. వేల సంఖ్యలో ప్రమిదలు కొనుగోలు చేస్తారు. వినాయక చవితి వస్తే ఇంటిల్లిపాదీ నిమగ్నమై పనులు చేస్తాం. – రేఖాన ఉమ, మెళియాపుట్టి గ్రామం (చదవండి: 'నాన్న' అని పిలవలేం ..! పాపం అంజలి, అవినాష్..) -
'నాన్న' అని పిలవలేం ..! పాపం అంజలి, అవినాష్..
నాన్న అంటే త్యాగం, బాధ్యత. వాటిని పక్కనపెట్టి తన సౌఖ్యం చూసుకుంటే కుటుంబం ఏవిధంగా చిన్నాభిన్నమవుతుందో అనేందుకు ఉదాహారణే ఈ ఘటన. తండ్రి కుటుంబానికి ప్రధాన ఆధారం అదే గాడి తప్పితే..దాన్ని బేసి చేసికుని ఉన్నవన్ని తునాతునకలేపోతాయి. తండ్రి స్థానం ఎంత బాధ్యతయుతమైనదో..అది దారితప్పితే ఫలితం తట్టుకోవడం అనితరసాధ్యమైనది. ఎంత ప్రయత్నించిన సరిద్దుకోలేని విధంగా ఉంటుంది. 'నాన్న' అని పిలుపుకి దూరమయ్యేలా వ్యధ మిగులుతుంది.ఈ విషాదకర ఘటన ఘజియాబాద్లోని గోవింద్పురంలో చోటుచేసుకుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అవినాష్ అతడి సోదరి అంజలి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. దీనిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు 22 పేజీల సూసైడ్ నోట్ దొరికింది. ఆ నోట్ కుటుంబ బాధ్యతలు సరిగా నిర్వర్తించలేని తండ్రి కారణంగా ఆ పిల్లల పడ్డ బాధ కళ్లకు కట్టినట్లు కనిపించింది. అంతేగాదు తమ మరణానికి కన్న తండ్రి, సవతి తల్లి రీతులే కారణమని పేర్కొంది సూసైడ్ నోట్లో. ఈ ఇద్దరు అన్నా చెల్లెళ్లు గత గురువారం చనిపోగా, వారి గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులకు చెప్పారు కుటుంబసభ్యులు. అయితే అనుమానస్పద కేసుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు బాధితుల ఇంటిని క్షుణ్ణంగా దర్యాప్తు చేయగా, డైరీలో రాసిన 26 పేజిల అంజలి సూసైడ్నటి బయటపడింది. అందులో అంజలి తన వ్యథను వివరించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. తన సవతి తల్లి రీతు, తండ్రి సుఖ్వీర్ సింగ్ తమను ఎంతగానో మానసింగా వేధిస్తున్నట్లు తెలిపింది. తన తండ్రి రెండో వివాహం కోసం కన్న పిల్లల గొంతు నొక్కేశాడని, వారిని తన అవసరాలకు వాడుకున్నాడని ఆరోపించింది. అలాగే సవతి తెలివితేలు ముందు సుఖ్వీర్ సింగ్ వివరణ పూర్తిగా నిజాయితీ లేనిదని ఆరోగపించింది. ఆయన తన సవతితల్లినే నమ్ముతాడని కూడా ఫిర్యాదు చేసింది. తన సవతి తల్లి రీతూ తన గురించి తప్పుగా మాట్లాడి అవమానించినట్లు పేర్కొంది. ఆ మాటలను తన తండ్రి ఖండించను లేదు, పైగా తననే తప్పు పట్టడం తట్టుకోలేకపోయానని వాపోయింది. తన సవతి తల్లి నీడలో 16 ఏళ్లు తాను తన సోదరుడు ఎంత నరకయాతన అనుభవించామో చెప్పుకొచ్చింది. తన డైరీలో రాసిన సూసైడ్ నోట్ని చింపివేయొద్దని తను ఒంటరిగా చనిపోతే పలు ప్రశ్నలు లెవనెత్తాతారని వేడుకుంది. తన సవతి తల్లి తెలివితేటలు గురించి తెలుసునని అందుకే ముందు జాగ్రత్తగా దీన్ని ఫోటో తీసి వాట్సాప్లో చాలామందికి పంపినట్లు తెలిపింది. ఇక తమ మృతదేహాలను తన తండ్రి తాకడానికి వీలు లేదని తన స్నేహితుడు మహీనే తమ అంత్యక్రియలు చేయాలని కూడా చెప్పింది. పైగా తన ఖాతాలో డబ్బు కూడా తీసుకోమని, మిగిలిన డబ్బుని తన కుటుంబసభ్యులకు ఇవ్వమని పేర్కొంది. తన స్నేహితుడు మహీనే తనను అర్థం చేసుకున్నాడని, అందకుగాను తాను ఇస్తున్న చిన్న మొత్తం ఇది అని లేఖలో తెలిపింది. అలాగే ఆ లేఖలో తన మేనమామలు, దేవేంద్ర, అనిల్లను ఉద్దేశిస్తూ.. ఇప్పటి వరకు మా బాగోగులు గురించి కనీసం వాకబు కూడా చేయలేదు, మీరు బంధువులేనా అని ప్రశ్నించింది. తన అన్నయ్య, తాను చాలా మానసిక ఒత్తడిలో ఉన్నాం..ఇక భరించలేక ఈ పనికి ఒడిగట్టాం అని లేఖలో పేర్కొంది. ఇదిలా ఉండగా, ఆ మృతుల తల్లి కమలేష్ కూడా ఇలానే ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని, ఆమె చనిపోయిన ఆరు నెలలకే తన స్నేహితురాలిని పెళ్లిచేసుకున్నాడంటూ బావమరిది సుఖ్వీర్సింగ్పై ఫిర్యాదు చేశారు అంజలి మేనమామలు. ఇక బాధితురాలి తండ్రి సుఖ్వీర్ సింగ్, తన భార్య తాను ప్రభుత్వోద్యోగాలు చేస్తున్నామని, అదంతా ఎవరికోసం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన పిల్లల మరణంతో చచ్చిన శవంగా అయిపోయానంటూ విలపించాడు. తన కూతురు అంజలి ఇలా తన పరువు తీసేలా ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసిందో తనకు తెలియదని చెబుతున్నాడు బాధితురాలి తండ్రి సుఖ్వీర్ సింగ్. ఇక మృతులు అవినాష్ ఇన్విస్టిగేషన్ బ్యూరో అధికారి కాగా, అంజలి నోయిడాలోని ఎగుమతి సంస్థలో టీమ్ లీడర్గా పనిచేస్తున్నట్లు మేనమామ దేవేంద్ర వెల్లడించారు. కాగా, పోలీసులు ఈ ఘటనపై మరింత కూలంకషంగా దర్యాప్తు చేయడమేగాక దోషులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. (చదవండి: భారత్ వ్యక్తినే పెళ్లి చేసుకోవడానికి రీజన్..! రష్యన్ మహిళ పోస్ట్ వైరల్) -
భారత్ వ్యక్తినే పెళ్లి చేసుకోవడానికి రీజన్..!
మన భారతీయ ఆచార వ్యవహారాలు, సంస్కృతికి ఇంప్రెస్ అయిన ఎందరో విదేశీయలు అనుభవాలను విన్నాం. అంతేగాదు మన భారత్ అబ్బాయిలనే వివాహమాడుతున్న విదేశీయువతులను కూడా చూశాం. కానీ మన భారతీయ అబ్బాయినే చేసుకోవడానికి గల కారణాలు వివరిస్తూ ఓ విదేశీ యువతి సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట సంచలనంగా మారింది. ఆ పోస్ట్లో ఏముందంటే..తాను భారతీయ వ్యక్తిని వివాహం చేసుకోవడానికి గల మూడు కారణాలను షేర్ చేసుకుంది రష్యన్ మహిళ క్సేనియా చావ్రా. వాళ్లతో అందమైన పిల్లలను కనొచ్చని, ఎల్లప్పుడూ రుచికరమైన ఆహారాన్ని వండటమేగాక, ప్రేమగా చూసుకుంటాడని చెప్పుకొచ్చింది. తన పట్ల చాలా కేరింగ్ తోపాటు సదా ప్రేమిస్తాడని చెప్పుకొచ్చింది. ఆ పోస్ట్కి ఆమె నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రపంచంలోనే ఉత్తమ భర్త అనే క్యాప్షన్ని కూడా జత చేసి మరీ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ హృదయాన్ని కదిలించేలా అంతర్ సాంస్కృతిక సంబంధాన్ని ప్రతిబింబించింది. ఈ పోస్ట్ చూసి నెటిజన్లు..భారతీయ పురుషులు విదేశీ మహిళ మనసు గెలుచుకుంటున్నారు అని కొందరూ, ఆమె మాటల్లో నిజమైన సంతృప్తి కనిపిస్తుందని, మీరిద్దరూ ఇలానే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని దీవిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Kseniia Chawra (@ksyu.chawra) (చదవండి: అప్పుడు శత్రువు..ఇవాళ జీవత భాగస్వామి..! ఇంట్రస్టింగ్ లవ్స్టోరీ..) -
అప్పుడు శత్రువు..ఇవాళ జీవిత భాగస్వామి..! ఇంట్రస్టింగ్ లవ్స్టోరీ..
కొన్ని ప్రేమకథలు ఫన్నీగా వెరైటీగా ఉంటాయి. అసలు వీళ్లద్దరికి ఎలా కుదిరిందిరా బాబు అనేలా ఉంటాయి వారి లవ్స్టోరీలు. టామ్ అండ్ జర్నీలా కొట్టుకునేవాళ్లే భార్యభర్తలైతే వామ్మో అని నోరెళ్లబెడతారు అంతా. అచ్చం అలాంటి లవ్స్టోరీనే నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఒకప్పుడు ఆమెకు అతడు పరమ శత్రువు..ఇవాళ ఇద్దరు పెళ్లితో ఒక్కటయ్యారు.ఫ్రెండ్షిప్డే రోజున నెట్టింట వైరల్ అవుతున్న ఈ లవ్స్టోరీ నెటిజన్ల హృదయాలను కొల్లగొట్టింది. ఆంచల్ రావత్ ఒకప్పుటి శత్రవు తన జీవిత భాగస్వామిగా ఎలా అయ్యాడో వివరిస్తూ సోషల్ మీడియాలో తన ప్రేమకథను షేర్ చేసుకున్నారు. ఆ పోస్ట్ తన భర్తతో తన కథ ఎలా ప్రారంభమైందో చెప్పుకొచ్చారు. పాఠశాల చదువుకునే రోజుల్లో తన భర్త క్లాస్మేట్ అని తెలిపింది. అయితే తాను స్కూల్డేస్లో అబ్బాయిలంటే ఇష్టపడని అమ్మాయిని అని చెప్పుకొచ్చింది. వారితో స్నేహానికి కూడా నో ఛాన్స్ అన్నట్లుగా ఉండేదాన్ని అని నాటి తన బాల్యాన్ని గుర్తుచేసుకుందామె. అయితే తన క్లాస్లో అత్యంత సిగ్గుపడు ఒక క్లాస్మేట్ తనతో భోజనం షేర్ చేసుకోవడానికి ప్రయత్నించాడట. దాంతో తనకు చిర్రెత్తికొచ్చి తన లంచ్ బాక్స్ని విరగొట్టేసిందట. ఆ రోజు దాదాపు అతడిని ఏడిపించేంత పనిచేశానంటూ నాటి ఘటనను గుర్తుచేసుకుంది. ఆ సంఘటనతో అతడు తనతో ఎప్పుడు మాట్లాడే ప్రయత్నం చేయలేదట. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఒక మ్యారేజ్ వెబ్సైట్ ఆ క్లాస్మేట్ని చూసిందట. అలా ఇద్దరు కలుసుకున్నారట. అప్పుడు అతడు తన ఫస్ట్ మెసేజ్లో ఆమెకు నా టిఫిన్ బాక్స్ కొనిస్తావా అని టెక్స్ట్ పంపించాడట. అలా మళ్లీ ఇరువురు కలుసుకుని పెళ్లితో ఒక్కటయ్యారట. అలా నాటి శత్రువు తన భర్తగా మారాడంటూ తన ప్రేమకథను పోస్ట్లో రాసుకొచ్చింది. అంతేగాదు హ్యపీ ఫ్రెండ్షిప్ డే పతి దేవ్ అంటూ క్యాప్షన్ కూడా జోడించిందామె. నెటిజన్లు కూడా నాటి వైరం ప్రేమగా చిగురించిందని మాట అంటూ ఆ జంటను ప్రశంసించగా, మరికొందరూ ఊహించని విధంగా ఎవరు ఎప్పుడు ప్రేమలో పడతారో చెప్పలేం అని కొందరూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: ఆడేద్దామా..'అష్టాచెమ్మ'..! అలనాటి ఆటల మజా..) -
ఆడేద్దామా..'అష్టాచెమ్మ'..!
వైకుంటపాళి.. అష్టాచెమ్మా.. వామనగుంట.. పులి–మేక.. ఈ పేర్లన్నీ ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడిన నేటితరానికి అప్పటి ఆటల్లో ఉన్న మజా.. అసలే తెలియకపోవచ్చు. అలాంటి ఆటల పట్ల బాలలకు ముచ్చటగొలిపేలా కృషి చేస్తోంది.. ‘క్రీడ’ సంస్థ. వీరితోపాటు పెద్దలకు సైతం గత స్మృతులను గుర్తుచేసే ప్రయత్నం చేస్తోంది.. ఈ ఆటలు ఆడిన నగరానికి చెందిన కొందరు పెద్దలు చాలా కాలం తర్వాత ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపామని చెబుతున్నారు. నగరీకరణలో భాగంగా మనలో చాలా మంది ఆర్టిఫీషియల్ లైఫ్కి అలవాటుపడిపోయారు. ఎంత వరకూ ఉద్యోగాలు, వ్యాపారాలు, సమాజిక మాధ్యమాలు ఇవే తప్ప సహజసిద్ధమైన ఆటలను మర్చిపోతున్నారు. ఒత్తిడిని తగ్గించి మానసిక ఆనందానికి దోహదపడే అచ్చతెలుగు ఆటలైన వైకుంఠపాళి.. అష్టాచెమ్మా.. వామనగుంట.. వంటి పేర్లన్నీ వింటుంటే 1970–80 కాలం నాటి రోజులు తప్పకుండా గుర్తుకొస్తాయి.. మైక్రో ఫ్యామిలీలుగా మారిపోతున్న కల్చర్లో నానమ్మలు, తాతయ్యల వద్ద పెరిగే వారే లేరంటే అశ్చర్యపోవాల్సిన పని. ఒకవేళ ఉన్నా.. టెక్నాలజీ మోజులో పడి పులిని చూసి నక్క వాతబెట్టుకున్న చందాన ఆన్లైన్ గేమ్స్ అలవాటు చేసి.. ఇప్పుడు అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి కుటుంబాలకు దూరమైన కొందరు ఒంటరితనాన్ని తగ్గించుకునేందుకు సామాజిక మాధ్యమాల చట్రంలో ఇరుక్కుపోయి వాటికి పూర్తిగా బానిసలవుతున్నారు. నగరంలోని ‘క్రీడ’ సంస్థ ఈ ఆటలపట్ల అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోంది. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–12 లోని క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఆవరణలో నాటితరం ఆటలను నేటి తరానికి పరిచయం చేస్తోంది. అందుకు తగిన ఏర్పాటను సైతం చేసింది. పిల్లలు పెద్దలు చక్కగా ఆటలోని మజాను ఆస్వాదిస్తున్నారు. క్రీడ సంస్థ ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు. 80 ఏళ్లు పైబడిన వారు కూడా.. అలనాటి ఆటలు ఈ తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయగా.. అప్పటి తరంలోని కొందరు.. 80 ఏళ్లకు పైబడిన వారు కూడా ఇందులో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పులి–మేక, దాడీ, అచ్చంగిల్ల వంటి ఆటలను ఆడించడమే కాదు.. నాటి, నేటి తరానికి చెందిన కొందరికి ఈ ఆటలను ఎలా ఆడాలో నిర్వాహకులే నేర్పిస్తున్నారు.. పిల్లలు, పెద్దలు కూడా ఈ ఆటలను ఎంతో ఆసక్తిగా నేర్చుకుంటున్నారు. మెదడుకు పదును.. ఈ ఆటలు ఎంతో ఆసక్తికరంగా సాగుతాయని, వీటిని ఆడటం వల్ల మెదడుకు పదును పెరుగుతుందని, పైగా దీనివల్ల దు్రష్పభావాలు కూడా ఏమీ ఉండవని, ఒత్తిడిని సైతం జయించవచ్చని పలువురు నిపుణులు, సైకాలజిస్టులు చెబుతున్నారు. ఇటువంటి ఆటల వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుందని, పైగా క్రీడాస్ఫూర్తి కూడా పెరుగుతుందని, ఓటమిని సైతం తట్టుకునే శక్తి వస్తుందని, పైగా పరిచయాలు బలపడతాయని చెబుతున్నారు. మెల్లమెల్లగా కనుమరుగవుతున్న ఇటువంటి ఆటలను క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వెలుగులోకి తీసుకురావడం మంచి పరిణామమని చెబుతున్నారు. నేటి తరం కోసం.. నాకు మా అమ్మమ్మ అష్టాచెమ్మాతో పాటు వామనగుంట, వైకుంఠపాళి, సోలాసీబీ వంటి ఆటలను నేరి్పంచింది. మా అమ్మకు ఈ ఆటలన్నీ రావు. నాకు నేర్చుకోవాలని ఉన్నా చెప్పేవారు లేరు. పిల్లలకు వీటి గురించి చెప్పేవారే కరువయ్యారు. అందుకే క్రీడ అనే సంస్థ ద్వారా నెలలో 25 రోజుల పాటు వివిధ నగరాల్లో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నాను. ఇది పూర్తిగా ఉచితం. చిన్నా పెద్దా అందరూ వచ్చి ఆడుకోవచ్చు. వీటి గురించి నేరి్పంచడమే కాకుండా ఆడిస్తాం. ఇక్కడ రోజుకు 200 మంది వరకూ వస్తున్నారు. – వినీత సిద్ధార్థ, క్రీడ సంస్థ నిర్వాహకులుఇదో మంచి ప్రయత్నం.. మా దగ్గర అలనాటి ఆటల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారని తెలియగానే ఎంతో సంతోషమేసింది. ఈ ఆటల గురించి తెలియని వారికి ఈ ప్రదర్శన ఎంతగానో ఉపయోగపడుతుంది. నేను కూడా సరదాగా ఆడుకున్నా. ఈ ప్రయత్నం అభినందించదగ్గ విషయం. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ఏర్పాటు చేయిస్తాం. పిల్లలు, పెద్దలు ఇందులో పాల్గొనడం ఆనందంగా ఉంది. కొద్దిసేపు నేను కూడా ఆడుకుని నాటి రోజులను గుర్తుచేసుకున్నా. – విజయలక్ష్మి, సీసీటీ సభ్యురాలు (చదవండి: Masaba Gupta Weight Loss Tips: డెలివరీ తర్వాత బరువు తగ్గాలంటే..! మసాబా గుప్తా హెల్త్ టిప్స్) -
వర్చువల్ ఫ్రెండ్.. సోషల్ ట్రెండ్..
రంగురంగుల ఫ్రెండ్షిప్ బ్యాండ్స్.. వెరైటీ గ్రీటింగ్ కార్డ్స్.. గ్రూప్ గ్యాథరింగ్స్.. ఇది ఒకప్పటి మాట.. ఫ్రెండ్షిప్ డే అంటే వారం ముందు నుంచే హడావుడి మొదలయ్యేది.. ఎవరికి బ్యాండ్ కట్టాలి.. ఏం మెసేజ్ ఉన్న గ్రీటింగ్ ఇవ్వాలి.. ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలి.. అనే మీమాంస కొనసాగేది.. అయితే నేటి ఆధునిక కాలంలో టెక్నాలజీ స్నేహితుల దినోత్సవాన్ని కూడా కొత్తరాగం తీయిస్తోంది.. వర్చువల్ ఫ్రెండ్.. సోషల్ ట్రెండ్ అన్నట్లు గతకాలపు జ్ఞాపకాలతో కూడి రీల్స్, లైక్స్, షేర్స్, వాట్సాప్ స్టేటస్ల హోరుతో సెలబ్రేషన్స్ నడిచాయి.. మారిన మానవుని లైఫ్స్టైల్ స్నేహితుల దినోత్సవాన్నీ ప్రభావితం చేస్తోంది.. భౌతిక మిలాకత్లకు దూరంగా.. వర్చువల్ పరామర్శలకే పరిమితమైంది. స్నేహితులతో సరదాగా తాము తిరిగిన ఫేవరెట్ ప్రదేశాల్లో గడపాల్సిన సమయాన్ని స్క్రీన్ టైం మింగేసిందా? అన్నట్లు నడిచింది. మునుపటి మధుర స్మృతులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సినిమా పాటలకు మిక్స్ చేస్తూ.. మరోసారి ఆ అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఖండాలను దాటి.. డిజిటల్ కాలంలో స్నేహం.. కొత్తగా చిగురులను తొడుగుతోంది. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా వీడియో కాల్స్తో కనెక్ట్ అవుతున్నారు. అర్రే నా మిత్రులను కలవలేకపోతున్నానే అనే భావనను, బాధను చెరిపేస్తూ..ఫేస్బుక్, ఇన్స్టా వంటి వేదికలు వేల మంది స్నేహితులతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం కలి్పస్తోంది. కొత్తవారిని సైతం పరిచయం చేస్తోంది. నేరుగా కలవకున్నామనే బాధను తొక్కిపెట్టి.. అంతకుమించిన ఆనందాన్ని పంచుతోంది. (చదవండి: అరకు విహారం..ఘుమ ఘుమల కాపీ సేవనం..!) -
అరకు విహారం.. ఘుమ ఘుమల కాపీ సేవనం..!
అరకు టూర్ అంటే అరకొరగా ఉండదు. జీఐ ట్యాగ్ సొంతమైన కాఫీ రుచిలా ఉంటుంది. చక్కటి పచ్చదనం మధ్య కాఫీ తోటల్లో విహారం. చిక్కటి కాఫీ ఘుమఘుమల మధ్య ప్రకృతి వీక్షణం. గాలికొండ నుంచి నేలమ్మకు వందనం చేయడం. బొర్రా గుహల రాతి శిలల శిల్పచాతుర్యం. ఆదివాసీ మ్యూజియం చెప్తున్న నాటి జీవనశైలి...అందుకే దీనిని తూర్పు కనుమల రత్నం అన్నారు. వీటన్నింటినీ చూపిస్తుంది అరకులోయ పర్యటన.విశాఖపట్నం నుంచి అరకుకు సాగే ప్రయాణమే ఓ అద్భుతం. కేరళలోని వయనాడు ప్రయాణం పశ్చిమ కనుమల సౌందర్యానికి అద్దం పడుతుంది. తూర్పు కనుమల లాలిత్యానికి అరకు ప్రయాణం దర్పణమవుతుంది. ఈ కాఫీ రుచి కొలమానం ప్రపంచస్థాయి అవార్డే. జీఐ ట్యాగ్ అందుకున్న కాఫీ ఇది. కాఫీ గింజలు ఓ రకమైన కమ్మదనాన్ని గాల్లో మోసుకొస్తుంటాయి. తోటల్లో విహరిస్తున్నప్పుడు చెట్ల ఆకులు ఒంటిని తాకుతూ కలిగించే గిలిగింతను మాటల్లో వర్ణించలేం. కాఫీ చెట్ల లేత ఆకులు ముదరు కాఫీ గింజ రంగులో ఉంటాయి. లేత కాఫీ గింజలు పచ్చగా ఉంటుంది. ముదిరే కొద్దీ చిక్కటి ఎరుపుదనం సంతరించుకుంటాయి. ఎండిన తర్వాత నల్లగా మారుతాయి. కాఫీ తోటల విహారం తర్వాత ముందుకు సాగే కొద్దీ ఒక్కొక్క ప్రదేశమూ మినిమమ్ గ్యారంటీ ఆహ్లాదాన్నిస్తాయి.ట్రైబల్ మ్యూజియంఅరకు బస్ స్టేషన్ నుంచి కేవలం పావుకిలోమీటరు లోపే ఉంటుంది మ్యూజియం. తూర్పు కనుమల ప్రకృతి సౌందర్యం ఈ విజిట్లో ప్రత్యేక ఆకర్షణ. అరకు, విశాఖపట్నం పరిసరాల్లో 19 రకాల ఆదివాసీ జాతుల వాళ్లు నివసించేవారు. ట్రైబల్ కల్చర్, అందులోని వైవిధ్యతను పరిరక్షించే ఉద్దేశంతో దీనిని 1996లో ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో ఆదివాసీలు ప్రాచీన కాలం నుంచి ఉపయోగించిన వస్తువులు, ధరించిన ఆభరణాలు, దుస్తులు, వేటాడే సాధనాలు, వంట సామగ్రి, వారి పెళ్లి వేడుక ఫొటోలు ఉన్నాయి. ఆదివాసీలు రూపొందించిన చిత్రలేఖనాలు, కళారూపాలను కూడా చూడవచ్చు. వారి మయూర నృత్యం, ధింసా నృత్యం (dhimsa dance) శిల్పాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఎర్రమట్టితో నిర్మించి తెల్లటి అంచులతో ఈ భవనం ఆర్కిటెక్చర్ బాగుంటుంది. ఈ మ్యూజియం ఉదయం పది గంల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న మ్యూజియం కావడంతో టికెట్ నామమాత్రమే. పెద్దవాళ్లకు పది రూపాయలు, పిల్లలకు ఐదు రూపాయలు.పద్మపురం గార్డెన్స్ఇది అరకు బస్ స్టేషన్ (Araku Bus Station) నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరాన ఉంది. చాలా ప్రసిద్ధి చెందిన గార్డెన్ ఇది. పాతిక ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ గార్డెన్ని స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ పాలన కాలంలో 1942లో ఏర్పాటు చేశారు. ఇక్కడ పండిన కూరగాయలు రెండవ ప్రపంచ యుద్ధంలో పోరాడిన సైనికుల కోసం వెళ్లేవని చెబుతారు. యుద్ధం ముగిసిన తర్వాత ఈ గార్డెన్ని హార్టికల్చర్ నర్పరీ, మొక్కల పెంపకంలో శిక్షణ కేంద్రంగా మార్చారు. ఇక్కడి వృక్ష శిల్పాలు కనువిందు చేస్తాయి. చెట్టుని శిల్పం ఆకారంలో మలిచి పెంచడానికి కొన్నింటికి దశాబ్దాలు పడుతుంది. ఈ గార్డెన్ మొత్తం తిరిగి చూడడానికి టాయ్ ట్రైన్ ఎక్కాలి. ఈ గార్డెన్లో ట్రీ టాప్ హట్స్ ఉన్నాయి. అంటే చెట్టు మీద గుడిసెలన్నమాట. టూరిస్టులు రాత్రి బస కోసం బుక్ చేసుకోవచ్చు. వీటిని హ్యాంగింగ్ కాటేజ్ అంటారు. ఈ గార్డెన్స్లో రోజ్ గార్డెన్ ఉంది. పద్మపురం గార్డెన్స్కి ఎంట్రీ టికెట్ పది రూపాయలు, ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అనుమతి.కుర్సురా మ్యూజియంఇది దేశ భద్రత కోసం 31 సంవత్సరాల΄ాటు నిర్విరామంగా సేవలందించి విశ్రాంతి తీసుకుంటున్న సబ్ మెరైన్. ఇండో– పాక్ యుద్ధంలో ఈ సబ్మెరైన్ అరేబియా సముద్రంలో గస్తీ కాసింది. ఆ తర్వాత అండమాన్ దీవులలో సేవలందించి తన సర్వీస్ కాలంలో 73,500 నాటికల్ మైళ్లు ప్రయాణించిన ఈ సబ్మెరైన్ 2001 నుంచి విశ్రాంతిలో ఉంది. ఇంతటి సమగ్రమైన సబ్మెరైన్ను ప్రభుత్వం 2002 లో ప్రదర్శనశాలగా మార్చింది. ఇది పిల్లలకు, పెద్దవాళ్లకు కూడా వినోదభరితంగా జ్ఞానాన్ని పంచే అధ్యయన కేంద్రం. దీని నిర్వహణకు ప్రభుత్వానికి సుమారుగా ఎనభై లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయి. అయితే ఈ సబ్మెరైన్ వీక్షణానికి వచ్చే పర్యాటకుల ఎంట్రీ టికెట్ల మీద ఏడాదికి కోటి రూపాయలను సంపాదిస్తోందీ సబ్మెరైన్. రోజుకు ఐదారు వందల మంది పర్యాటకులు వస్తుంటారు. సెలవు రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపవుతుంటుంది. విశాఖపట్నానికి వచ్చిన వాళ్ల రామకృష్ణ బీచ్ని, అందులో ఉన్న సబ్మెరైన్ మ్యూజియాన్ని చూడకుండా రారంటే అతిశయోక్తి కాదు.కైలాసగిరిఇది విశాఖపట్నం నగరానికి సమీపంలో ఆరువందల అడుగుల ఎత్తున్న కొండ. సుమారు నాలుగు వందల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఎకోపార్కు ఇది. రోప్వేలో కొండమీదకు వెళ్లడం పిల్లలకే కాదు పెద్దవాళ్లకు కూడా జాయ్ఫుల్గా ఉంటుంది. బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అవార్డు అందుకున్న పర్యాటక ప్రదేశం ఇది. స్థానికులు, బయటి వాళ్లు అంతా కలిసి కైలాసగిరిని రోజుకు మూడు వేల మందికి పైగా సందర్శిస్తారు.గాలికొండ వ్యూపాయింట్ఈ టూర్లో తూర్పు కనుమల ప్రకృతి సౌందర్యాన్ని అనంతంగా ఆస్వాదించవచ్చు. విశాఖపట్నం– అరకు రీజియన్లో ఎత్తైన ప్రదేశం గాలికొండ. 4,320 అడుగుల ఎత్తు ఉంటుంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చదనంలో షేడ్స్ను లెక్కపెట్టాలంటే ఈ రోడ్డు వెంట ప్రయాణిస్తున్నంత సేపూ కనురెప్ప వేయకుండా చూడాలి. ఇక బొర్రా గుహలు (Borra Caves) ఓ ప్రకృతి అద్భుతం. గుహల పై కప్పు నుంచి స్టాలగ్మైట్ ధారలు ధారలుగా కారుతూ వాతావరణంలో మార్పులతో గడ్డకట్టి΄ోయి ఉంటుంది. అమరనాథ్ లో మంచు శివలింగం రూపం సంతరించుకున్నట్లు ఇక్కడ స్టాలగ్మైట్తో ఏర్పడిన శివలింగం రూపానికి పూజలు చేస్తారు. అమర్నాథ్ మంచులింగం ఏటా కరిగిపోతూ కొత్తగా రూపుదిద్దుకుంటుంది. బొర్రా గుహల్లోని స్టాలగ్మైట్ శివలింగం స్థిరంగా ఉంటూ ఉంటుంది.చందనోత్సవ సింహాచలంశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఏడాదంతా చందనలేపనంతో ఉంటాడు. ఏడాదికోసారి చందనోత్సవం జరుగుతుంది. ఈసందర్భంగా పాత చందన లేపనాన్ని తొలగించి కొత్తగా చందనలేపనం చేస్తారు. స్వామి దేహం నుంచి తీసిన చందనాన్ని భక్తులకు ప్రసాదంగా పంచుతారు. ఈ ఆలయంలో కప్పస్తంభం అని ఉంటుంది. అది కప్పం అనే పదం నుంచి వచ్చింది. రాజుకు కప్పం కట్టని ఉద్యోగులను ఆ స్తంభానికి కట్టేసి శిక్షించేవారని స్థానిక కథనం. ఇప్పుడు భక్తులను ఆ స్తంభానికి కట్టేసి, తాడుతో సున్నితంగా రెండు దెబ్బలు వేస్తారు. ఆ స్తంభాన్ని కౌగలించుకుని కోరికలు కోరుకుంటే అవి తీరుతాయని ఒక విశ్వాసం. సంతానాన్ని కోరుకునే వారు. పుట్టిన సంతానాన్ని దేవుని దర్శనానికి తీసుకువచ్చి మొక్కు తీర్చుకునే వారు. దాంతో కప్పస్తంభాన్ని కౌగలించుకుని కోరుకుంటే సంతానం కలుగుతుందనే అభిప్రాయం వాడుకలోకి వచ్చింది. సింహాచలంలో సంపెంగ పూలు ప్రసిద్ధి. చందనం రంగులో పొడవుగా ఉండే ఈ పూలను అటవీ ప్రదేశం నుంచి ఆదివాసీలు సేకరించి తెస్తారు. వాటిని మాలలుగా కట్టి అమ్ముతారు. ఈ టూర్ గుర్తుగా ఓ దండ కొనుక్కుని తలకు అలంకరించుకోవచ్చు లేదా మెడలో మాలగా వేసుకుని పరిమళాన్ని ఆస్వాదించవచ్చు.అన్నవరంశ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం ఎంతటి ప్రసిద్ధి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంతటి ప్రాశస్త్యం కలిగిన ఆలయం. పురాణాల్లో ఉదహరించిన రత్నాచలం అనే ప్రదేశం ఇదేనని చెబుతారు. ఈ ఆలయం ఉన్న కొండ పేరు రత్నగిరి. ఈ ఆలయంలో సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి భక్తులు ఆసక్తి చూపుతుంటారు. అరకు టూర్లో రైలు, రోడ్డు రవాణా సంస్థలు నిర్వహిస్తున్న ఈ రెండు ప్యాకేజ్లలో ఉన్న ప్రధానమైన తేడా అన్నవరం, సింహాచలం ఆలయాల విషయంలోనే. తెలంగాణ టూరిజమ్ బస్సు టూర్లో అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఐఆర్సీటీసీ టూర్లో వెళ్తే సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి స్వామి దర్శనం చేసుకోవచ్చు. మిగిలిన పర్యాటక ప్రదేశాలు రెండు టూర్లలోనూ ఒకే విధంగా ఉంటాయి. బస్ టూర్లో థింసా నృత్యం అదనం.జ్యూవెల్ ఆఫ్ ఈస్ట్కోస్ట్ ఐదు రోజుల టూర్లో విశాఖపట్నం, అరకు కవర్ అవుతాయి. అరకులో పర్యటించడానికి సెప్టెంబర్ నుంచి అనువైన సమయం. దసరా సెలవులకు ప్లాన్ చేసుకుంటే కాఫీ తోటల సౌందర్యాన్ని ఆస్వాదించడంతోపాటు పిల్లలకు సబ్ మెరైన్ నేవీ యుద్ధ నౌకను చూపించవచ్చు.ఐఆర్సీటీసీ టూర్ ఇలా ఉంది!మొదటి రోజు: గురువారం సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాలకు 12728 నంబర్ గోదావరి ఎక్స్ప్రెస్ హైదరాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరుతుంది.రెండవ రోజు: శుక్రవారం ఉదయం 5.55 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. ఐఆర్సీటీసీ టూర్ నిర్వహకులు పర్యాటకులను రిసీవ్ చేసుకుని హోటల్కు తీసుకెళ్తారు. చెక్ ఇన్, రిఫ్రెష్మెంట్, బ్రేక్ఫాస్ట్ తర్వాత సిటీ టూర్. కాళీమాత ఆలయం, సబ్మెరైన్ మ్యూజియం వీక్షణం తర్వాత హోటల్కు వచ్చి లంచ్ చేయడం. మధ్యాహ్నం తర్వాత కైలాసగిరి సందర్శనం, రిషికొండ బీచ్ విహారం. రాత్రి బస విశాఖపట్నం హోటల్లో.మూడవ రోజు: బ్రేక్ఫాస్ట్ తర్వాత రోడ్డు మార్గాన అరకుకు ప్రయాణం. టైడా జంగిల్ బెల్స్ ఎకో టూరిజమ్ రిసార్ట్లో సేదదీరడం, పద్మపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం విజిట్ తర్వాత లంచ్ విరామం. మధ్యాహ్నం తర్వాత గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహల విహారం తర్వాత సాయంత్రానికి తిరిగి విశాఖపట్నంలోని హోటల్కు చేరడం, రాత్రి బస.నాలుగవ రోజు: బ్రేక్ఫాస్ట్ తరవాత హోటల్ గది చెక్ అవుట్ చేసి బయలుదేరాలి. దారిలో సింహాచలం దేవస్థానం, రామకృష్ణ బీచ్లో విహారం తర్వాత నాలుగు గంటలకు విశాఖపట్నంలో స్టేషన్లో డ్రాప్ చేస్తారు. సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు ట్రైన్ నంబర్ 12727 గోదావరి ఎక్స్ప్రెస్ బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం.ఐదవ రోజు: ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు హైదరాబాద్కు చేరడంతో టూర్ పూర్తవుతుంది.ఐఆర్సీటీసీ ప్యాకేజ్ ధరలివి: కంపర్ట్ కేటగిరీ (థర్డ్ ఏసీ), సింగిల్ షేరింగ్లో ఒక్కొక్కరికి దాదాపుగా 28 వేల రూపాయలవుతాయి. ట్విన్ షేరింగ్లో ఒక్కొక్కరికి 17 వేలవుతాయి. ట్రిపుల్ షేరింగ్లో 13 వేలకు పైగా ఉంటుంది.స్టాండర్డ్ కేటగిరీ (స్లీపర్) సింగిల్ షేరింగ్లో 26 వేలకు పైగా అవుతుంది. ట్విన్ షేరింగ్లో 15 వేలకు పైగా, ట్రిపుల్ షేరింగ్లో 11 వేలకు పైగా అవుతుంది.ప్యాకేజ్లో మూడు బ్రేక్ఫాస్ట్లు, ఒక లంచ్, రెండు డిన్నర్లుంటాయి.ఇది వీక్లీ టూర్. గురువారం మాత్రమే ఉంటుంది. ఇవి వర్తించవు: ప్యాకేజ్లో సూచించిన భోజనాలు తప్ప ఇతర భోజనాలు పర్యాటకులు సొంతంగా భరించాలి. రైల్లో కొనుక్కున్న తినుబండారాలు, పర్యాటక ప్రదేశాల ఎంట్రీ టికెట్లు, బోటింగ్, హార్స్రైడింగ్ వంటి ఇతర టికెట్లు వగైరాలు ప్యాకేజ్లో వర్తించవు.టూర్ కోడ్: https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR027తెలంగాణ టూరిజమ్ నిర్వహిస్తున్నరోడ్ ప్యాకేజ్ ఇలా ఉంది!మొదటి రోజు: సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్లోని పర్యాటక భవన్ (బేగంపేట, గ్రీన్ల్యాండ్స్) నుంచి తెలంగాణ టూరిజమ్ బస్ బయలుదేరుతుంది. అదే బస్సు ఆరున్నరకు బషీర్బాగ్ సీఆర్వో ఆఫీసు చేరుతుంది. ఆ స్టాప్కు సమీపంలో ఉన్న వాళ్లు అక్కడే ఎక్కవచ్చు. రాత్రంతా ప్రయాణం కొనసాగుతుంది.రెండవ రోజు: ఉదయం ఆరు గంటలకు బస్సు విశాఖపట్నం చేరుతుంది. హోటల్ గదిలో చెక్ ఇన్, రిఫ్రెష్మెంట్, బ్రేక్ఫాస్ట్ తర్వాత సిటీటూర్. కైలాసగిరి, సింహాచలం, రుషికొండ, సబ్మెరైన్ మ్యూజియం విజిట్, బీచ్ విహారం తర్వాత హోటల్కు చేరడం, రాత్రి బస.మూడవ రోజు: ఉదయం ఆరు గంటలకు అరకుకు ప్రయాణం. ట్రైబల్ మ్యూజియం విజట్, అనంతగిరి కాఫీ ప్లాంటేషన్లో విహారం, బొర్రా గుహల వీక్షణం, ధింసా నాట్యాన్ని ఆస్వాదించడం ఆ రాత్రికి అరకులో బస.నాలుగవ రోజు: అరకు నుంచి అన్నవరానికి ప్రయాణం. అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న తర్వాత బస్సు ప్రయాణం హైదరాబాద్కు సాగుతుంది.ఐదవ రోజు: ఉదయం ఏడు గంటలకు బస్సు హైదరాబాద్కు చేరడంతో టూర్ పూర్తవుతుంది.బస్ ప్యాకేజ్ ఇలా...తెలంగాణ టూరిజమ్ నిర్వహిస్తున్న అరకు టూర్ ప్యాకేజ్లో పెద్దవాళ్లకు ఒక్కొక్కరికి 6,999 రూపాయలు, పిల్లలకు 5,599 రూపాయలు.ప్యాకేజ్లో నాన్ ఏసీ బస్సు ప్రయాణం, వైజాగ్లో ఏసీ బస, అరకులో నాన్ ఏసీ బస ఉంటాయి.ఆహారం, పర్యాటక ప్రదేశాల్లో ఎంట్రీ టికెట్లు, దర్శనం టికెట్లు, బోటింగ్ వంటివేవీ వర్తించవు.– వాకా మంజులారెడ్డి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి చదవండి: వైష్ణోదేవి దర్శనం.. హిమాలయాల వీక్షణం..! -
మత్తు వదిలితేనే మహత్తు
విశాల విశ్వంలోని జనులెందరినో పట్టి పీడించే రుగ్మత, ప్రగతిపథంలో వారు ముందుకు సాగకుండా ఆపివేసే దుర్లక్షణం మత్తు. మత్తు అంటే నిద్ర అన్న నిఘంటువు అర్ధంలోనే మనం తీసుకోరాదు. ఇది ఒక్కో వ్యక్తిని అల్లుకునే ఒక విధమైన జడత్వం. మనిషి పురోగమించాలంటే ముందుగా వదలవలసింది జడత్వంతో కూడిన యోచనలను మాత్రమే. కార్యాచరణకు సంసిద్ధుడై సాగే సమయాన ప్రతి విషయాన్ని సందేహించడం, అనుభవజ్ఞులు చెప్పిన మాటలను విభేదిస్తూ అక్కడే చతికిలబడడం వంటి వాటినీ ప్రగతి నిరోధకాలుగా మనం చెప్పుకోవచ్చు.చదువుకునే సమయంలో, ఉద్యోగ నిర్వహణలో కొందరు తమతో పనిచేసే మిగిలినవారి కంటే ఉత్తమ ఫలితాలను సాధిస్తూ మహత్తరంగా ముందుకు సాగిపోతూ ఉంటారు. వారి విజయాలకు కారణం వారి జీవనశైలి. కొంతమంది మాత్రం ఎక్కడ మొదలు పెట్టారో అక్కడే ఉన్నామన్నట్లుగా చతికిలబడిపోతారు.ప్రగతికి అడ్డుకట్టు వేసే ప్రధానమైన విషయాలు సోమరితనం, మనిషిలో ఆత్మ విశ్వాసం లోపించడం, అనుక్షణం సందిగ్ధావస్థలోనే కొట్టు మిట్టాడడం వంటివి. అయితే, వీటిలో సోమరితనం అనేది ప్రధానమైన సమస్య. ఒక సినీకవి చెప్పినట్లుగా ‘‘ మత్తు వదలరా.. ఆ మత్తులోన బడితే గమ్మత్తుగా చిత్తవుదువురా..’’ అంటూనే‘‘జీవితమున సగభాగమ్ము నిద్దురకే సరిపోవును..మిగిలిన ఆ సగభాగమ్ము చిత్తశుద్ధి లేకపోవును..’’ అని కూడా లిఖించాడు. ఆ కవి చెప్పిన మాటలు అక్షర సత్యం. మత్తుగా ఉండడం అంటే మొద్దు నిద్రే కాదు, మనిషి జాగ్రదావస్థలోనే ఉన్నా ఒకింత బద్ధకంగా ఉండడం, చైతన్యరహితంగా ఉండడం, చేయవలసిన కార్యవిధి గురించి అస్సలు ఆలోచించకపోవడం వంటివి కూడా మత్తులో ఉన్నట్లుగానే మనం భావించాలి.మనిషి కార్యసాధనకు ఉపక్రమించే సందర్భంలో కలిగే సందిగ్ధావస్థ పురోగతికి గొప్ప ప్రతిబంధకం. ఈ అవస్థ ఏదో ఒకటి రెండుసార్లయితే సరి పెట్టుకోవచ్చు. ఆరంభంలో ఎవరికైనా ఇటువంటివి తప్పవు. కానీ, ఇదే సమస్య, ప్రతిసారీ ఎదురైతే, ఆ మనిషి మానసిక స్థితి మీద సందేహ పడవలసిందే.. ప్రతి కదలికకూ భయపడుతూ, ముందుకు సాగితే తనకు ఏమవుతుందో, చేపట్టిన పనిలో ఉత్తమ ఫలితాలు వస్తాయో రావో అని మీమాంసకు గురి కావడమే ఈ రకమైన మానసిక స్థితికి కారణం. ఇటువంటి వారు తప్పకుండా, తమ ఆలోచనా ధోరణిలో మార్పు తెచ్చుకోవాలి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగడం అత్యంత ఆవశ్యకమని గుర్తెరగాలి. ఏదన్నా సాధించాలి అని అనుకున్నప్పుడు, అన్నివేళలా, విజయం మన సొంతం కాదు, ఒక్కొక్కసారి పరాజయమూ చవి చూడవలసి వస్తుంది. తప్పనిసరిగా విజయం సాధిస్తామని తలచినప్పుడు కూడా ఒక్కోసారి మనకు అనూహ్యంగా అపజయం కలుగుతుంది. అటువంటి క్షణాల్లోనే క్రుంగిపోకుండా, నీరస పడకుండా, ఎటువంటి మానసిక ఒత్తిడికీ తలొగ్గక ముందుకు సాగాలి.ఇటువంటి సందర్భాల్లో ఓడిపోయామని తలచకూడదు. మగరాజైన సింహం తనకు కావలసిన ఆహారం లభించకపోతే ఏ మాత్రం నిరాశ చెందదు. అలసిపోయినా, డస్సిపోయినా, కీళ్ళు సడలిపోయినా, కష్ట స్థితిని పొందినా, ఏనుగు కుంభస్థలాన్నే కొట్టడానికి సంసిద్ధురాలవుతుంది. అందుకే మానవుడు జడత్వంతో కూడిన మత్తులో ఏమాత్రం కూరుకుపోకూడదు. మత్తులో పడితేఎంతటి యోధుడైనా అవుతాడు చిత్తు..!! మత్తును వదిలి చైతన్యమూర్తిగా మెలిగేవ్యక్తిని తప్పక వరిస్తుంది విజయమనే మహత్తు..!!ప్రతిరోజూ ఉదయం మనం రోజును ఎలా ప్రారంభిస్తామనే విషయం ఆ రోజంతా మన శక్తి స్థాయిని, మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. అందుకే, జీవితంలో ఏదైనా సాధిద్దామని అనుకునేవారు, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలనుకునేవారు ఉదయంపూట కొన్ని అలవాట్లను తప్పక పాటించాలి.ఉదయం 20–30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. ఒత్తిడిని పెంచే హార్మోన్ల స్థాయిలు తగ్గుతాయి. శరీరంలో కావలసినంతగా వత్తిడిని తగ్గించే రసాయనాలు విడుదలవుతాయి. ఇవి మనిషిలోని శక్తి స్థాయులను పెంచడమే కాకుండా, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. – అన్నమయ్య తత్వ ప్రవచన సుధాకర వెంకట్ గరికపాటి -
డెలివరీ తర్వాత బరువు తగ్గాలంటే..! మసాబా గుప్తా హెల్త్ టిప్స్
బాలీవుడ్ నటి, ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా, నటుడు సత్యదీప్ మిశ్రా దంపతులు గతేడాది అక్టోబర్లో పండంటి బిడ్డకు స్వాగతం పలికారు. ఓ తల్లిగా బిడ్డతో బిజీ బిజీగా లైఫ్ సాగిపోతున్నా.. ఆమె తన ఫిట్నెస్పై ఫోకస్ని పెట్టడమే కాదు అదనపు బరువుని కూడా తగ్గించుకున్నారు. సాధారణంగా ప్రతి మహిళ ప్రెగ్నెన్నీలో బరువు పెరగడం సహజం. అయితే ప్రసవానంతరం ఆ బరువుని తగ్గించుకోవడం అనేది అంత ఈజీ కాదు. అయితే మసాబా మాత్రం దాన్ని ఈజీగానే సాధించారు. పైగా డెలివరీ తర్వాత బరువు ఎలా తగ్గించుకోవచ్చో వివరిస్తూ..టిప్స్ కూడా షేర్ చేసుకున్నారు. అవేంటంటే..ప్రసవానంతరంలో ఆహారంలో కొద్దిమార్పులు చేసుకుంటే బరువు తగ్గడం సులభం అని అంటోంది. తాను ప్రసవానంతరం ఆరు నెలలు బాదం పాలు, వేయించిన కూరగాయలు, కాల్చిన చేప, ఎల్లప్పుడూ తేనె బాల్సమిక్ వెనిగ్రెట్(క్రంచింగ్ కోసం విత్తనాలు) తీసుకున్నట్లు తెలిపారు. వాటి తోపాటు గుడ్లు, వేరుశెనగ, వెన్నటోస్ట్, బీట్రూట్, చికెన్, ఓట్స్ అంజూర పండ్లు, తదితరాలు తీసుకునేదాన్ని. తల్లిగా బిడ్డకు పాలిచ్చేలా, తన బరువు బ్యాలెన్స్ చేసుకునేలా ఆరోగ్యకరమైన ఫుడ్స్నే తీసుకునేదాన్ని అని ఆమె వివరించారు. అలాగే కుదిరినంతలో తేలికపాటి వ్యాయామాలు, కెటిల్బెల్ సెషన్ వ్యాయామాలు తదితరాలు చేశానని చెప్పుకొచ్చారు. ఇవి కండరాల కదలికలకు, ఫ్యాట్ని కరిగించడంలో సమర్థవంతంగా ఉంటాయని అన్నారు. అలా తాను పదికిలోలు బరువు తగ్గినట్లు వివరించారామె. స్ట్రాంగ్ ఫోకస్ ఉంటేనే బరువు తగ్గడం సాధ్యమవుతుందని అంటోంది మసాబా గుప్తా.(చదవండి: అరుదైన స్ట్రోక్తో..మెడుల్లాపై దాడి!) -
స్నేహం..ఆరోగ్యం..మహాభాగ్యం..
‘నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అంటే.. నీతూ, రీతూ, కాదు కాదు శ్వేత.. అంటూ ఇప్పుడు కొందరు అమ్మాయిలు/అబ్బాయిలు తల బద్ధలు కొట్టుకోవడం లేదు.. మై మమ్/ డాక్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని ఠక్కున సమాధానం చెబుతున్నారు. అవును మరి జిమ్లో వెయిట్స్ లేపాలన్నా, పబ్లో ఛీర్స్ చెప్పాలన్నా కఠినమైన ట్రెక్కింగ్కి వెళ్లాలన్నా, కాలక్షేపంగా కార్డ్స్ ఆడాలన్నా.. ఇప్పుడు బయటకు వెళ్లి ఫ్రెండ్స్ని వెదుక్కోవాల్సిన పనిలేదు. నిన్న కనీ పెంచిన తల్లిదండ్రులే నేడు కంటి ముందున్న స్నేహితులుగా మారిపోతున్నారు. పిల్లలు కూడా భయంతో వణికిపోకుండా.. ప్రతిదీ తల్లిదండ్రులకు షేర్ చేసుకుంటూ.. దునియా మెచ్చే దోస్తీ అనిపించుకుంటున్నారు. నేడు స్నేహితుల దినోత్సవం నేపథ్యంలో పలువురి నగరవాసుల మనోగతం.. ‘అంతకు ముందేమో గానీ మా నాన్న వయసు 70 అంటే ఇప్పుడు అస్సలు నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే ఆయన నాకన్నా యంగ్ అండ్ యాక్టివ్..’ అంటూ చెప్పారు సింధు. రిటైర్ అయిన తర్వాత తండ్రికి కాలక్షేపం కోసం ట్రెక్కింగ్ పరిచయం చేశా అనుకున్న ఈ యువతి.. ఆ తర్వాత ఆయన తనతోనే పోటీపడే ట్రెక్కింగ్ ఫ్రెండ్గా మారతారు.. అని అప్పట్లో అనుకోలేదు మరి. ‘ఇప్పుడు ఏ అడ్వెంచర్ చేయాలన్నా నా దృష్టిలో ఫస్ట్ గుర్తుకొచ్చే ఫ్రెండ్ మా నాన్నే’ అంటున్నారీమె. గత కొంత కాలంగా అడ్వెంచర్ యాక్టివిటీస్లో తరచూ పాల్గొంటున్న మణికొండ నివాసి సింధు. తండ్రితో కలిసి జాగింగ్ నుంచి జిమ్ వరకూ, సైక్లింగ్ నుంచి ట్రెక్కింగ్ వరకూ కలిసి పంచుకుంటారు. ‘షి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్’ అంటున్నారు ఆమె తండ్రి.. పిల్లలతో కలిసి ఫ్రెండ్స్గా ఉంటేనే నేటి ట్రెండ్స్ తెలుస్తాయనేది నగరంలోని పలువురు తల్లిదండ్రుల అభిప్రాయం. ప్రస్తుతం పిల్లల ఆలోచనాధోరణులు, వాళ్లను ఆకర్షిస్తున్న కొత్త కొత్త విషయాల గురించి తెలుసుకోవాలంటే తమ పిల్లలకి స్నేహితులుగా మారడాన్ని మించిన మార్గం లేదని తల్లిదండ్రులు స్పష్టం చేస్తున్నారు. ‘మా అబ్బాయి శశాంక్కి షాపింగ్ సహా ప్రతి విషయంలోనూ నేను తోడుండాల్సిందే’ అని గర్వంగా చెబుతున్నారు నగర వాసి సుమన్ కృష్ణ. తనకి యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచే ఒక తల్లిలాగా కాకుండా ఓ ఫ్రెండ్లా ట్రీట్ చేస్తూ వచ్చానని ఇటీవలే తన కొడుకుతో కలిసి ఓ ఫారెస్ట్ ట్రెక్ పూర్తి చేసిన సుమన్ అంటున్నారు. నగరవాసి ముంతాజ్ పటేల్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన కుమార్తె తారిణ్ పటేల్తో కలిసి డియోరియేటల్ చంద్రశిల అనే ప్రాంతంలో ట్రెక్కింగ్ చేసి తిరిగొచ్చిన అనుభవాలు మరచిపోలేనివి అంటున్నారామె. నేను యంగ్గా మారిపోయా.. సోషల్ మీడియా సాక్షిగా వన్ ఆఫ్ ది స్టైలిస్ట్ ఫాదర్ అంటూ ప్రశంసలు అందుకునే అలీ సాగర్..నేను యంగ్గా మారిపోయా అంటూ చెబుతున్నారు. ఫ్యాషన్ విషయంలో తన కుమారుడు అమ్మార్కి కూడా టిప్స్ అందిస్తుంటారు. గాగుల్స్ ధరించడం దగ్గర నుంచి థ్రిల్స్లో పాల్గొనడం వరకూ ఈ ఫాదర్ అండ్ సన్ ఇద్దరూ పోటా పోటీగా రెడీ అవుతుంటారు. తరచూ బైక్ రైడ్స్ వేసే తామిద్దరి మధ్య మాట్లాడుకోకూడనివేవీ లేవని, అసలు సీక్రెట్స్ అనేవే లేవని సగర్వంగా చెబుతారు అలీ సాగర్. ‘మా పిల్లలు మా మాట వినడం లేదండీ’, ‘అసలు వాళ్ల లోకంలో వాళ్లుంటున్నారు. ఇలాగైతే ఏమైపోతారో’. ‘ఎంత చెప్పినా వినడం లేదు. అసలు మమ్మల్ని లెక్కే చేయడం లేదు’ ఇలాంటి కంప్లెయింట్స్తో తమను రోజూ పదుల సంఖ్యలో కలుస్తున్న తల్లిదండ్రులకు తాము చెప్పే ఏకైక సలహా.. పిల్లలతో స్నేహం చేయడమే.. అంటున్నారు నగరానికి చెందిన సైకాలజిస్ట్స్. టెక్ యుగంలో చాలా త్వరగా పిల్లలు పేరెంట్స్ మధ్య గ్యాప్ పెరిగిపోవడం సహజమని, ఇప్పుడిప్పుడే కొందరు తల్లిదండ్రుల్లో కనిపిస్తున్న ఈ ట్రెండ్ స్వాగతించదగ్గ పరిణామమని, ఈ తరహా పరిస్థితి మరింతగా బలోపేతం కావాల్సి ఉందని అంటున్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ కావాలంటే..పిల్లలతో గడిపే సమయంలో వ్యక్తిగత వ్యవహారాలను పూర్తిగా పక్కన పెట్టేయాలి. పిల్లలతో మాట్టాడేటప్పుడు తరచూ నేను నీ నాన్నని/అమ్మని అనే మాట పదే పదే గుర్తు చేయకూడదు. పిల్లల ప్రతి మూడ్నీ షేర్ చేసుకోవాలి. అది మనకు ఎంత నచ్చకున్నా వారికి ఇష్టమైన దేనినీ పదే పదే విమర్శించవద్దు. వాకింగ్, జిమ్ వర్కవుట్స్, డ్యాన్స్.. లాంటి పనుల్లో తరచూ వారితో మమేకం అవ్వాలి. వారికి నచ్చిన ఫ్రెండ్స్ని, వారి అభిమాన క్రీడాకారుల్ని వీలైనంత వరకూ మనమూ ప్రశంసిస్తుండాలి. వండిపెట్టాలి, ఇంటిని సర్ధాలి.. ఇలా తల్లిదండ్రుల పనులు అని విభజించకుండా అన్ని పనులూ అందరివీ అనే భావన వారిలో కలిగేలా చేయాలి. వారి ఫెయిల్యూర్స్ సమయంలో తప్పనిసరిగా పక్కనే అండగా ఉండాలి. వీలైనంత ఎక్కువగా వారితో కమ్యూనికేట్ అవ్వాలి. అయితే అదేదో వారిపై నిఘా ఉంచిన భావన రానీయకుండా చేయాలి అని నగరానికి చెందిన పలువురు సైకాలజిస్టులు పేరెంట్స్కి సూచిస్తున్నారు. (చదవండి: ఉద్యమ స్నేహం..!) -
ఉద్యమ స్నేహం
ఉద్యమ నేపథ్యమే వారి స్నేహానికి విత్తనమయింది. వృక్షం అయింది. స్వీడిష్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్బర్గ్కు తోటి ఉద్యమకారులు మలాలా యూసఫ్జాయ్, వెనెస్సా నకేట్లతో మంచి స్నేహం ఉంది. ఉద్యమకారులైనంత మాత్రాన గంభీరంగా ఉండాలని ఏమీ లేదు. ఈ ముగ్గురు మరికొందరు యాక్టివిస్ట్లు చాలా సరదాగా ఉంటారు. బాల్యజ్ఞాపకాల నుంచి సోషల్ మీడియా సరదాల వరకు ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటారు. ‘చైతన్యం మూర్తీభవించిన స్నేహితురాలు’ అని ఉగాండ పర్యావరణ ఉద్యమకారిణి వెనెస్సా నకేట్ గురించి గొప్పగా చెబుతుంది గ్రేటా థన్బర్గ్. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలోని లేడీ మార్గరెట్ హాల్లో ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్లిన గ్రేటా థన్బర్గ్కు తన నేస్తం మలాలాతో కలిసి బోలెడు ముచ్చట్లు చెప్పుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ‘షీ ఈజ్ ది ఓన్లీ ఫ్రెండ్...’ అనే కాప్షన్తో గ్రేటాతో దిగిన ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది మలాలా. (చదవండి: Friendship Day: 'హార్ట్' ఆఫ్ 'లివింగ్') -
అరుదైన స్ట్రోక్తో..మెడుల్లాపై దాడి!
స్ట్రోక్ అంటే మనకు తెలిసింది మెదడుకు వచ్చే బ్రెయిన్ స్ట్రోక్. అయితే చిన్నప్పట్నుంచీ మనం చదువుకున్న మెదడులోని భాగాలైన పెద్ద మెదడు, చిన్న మెదడు, మెడుల్లా అబ్లాంగేటాలలో... మెడుల్లా అనే భాగానికి కూడా స్ట్రోక్ వచ్చే అవకాశముంది. ఆ భాగానికి స్ట్రోక్ వచ్చినప్పుడు కలిగే కొన్ని నరాల మార్పుల (న్యూరలాజికల్ కండిషన్స్) వల్ల దేహంలోని ఓ పక్క భాగం (అంటే లాటరల్ భాగం) అచేతనమైపోయే అవకాశం ఉంది. ఇలా మెదడులోని మెడుల్లా అనే భాగానికి వచ్చే స్ట్రోక్ వల్ల కలిగే మార్పుల కారణంగా కళ్లు తిరుగుతున్నట్లు ఉండటం (డిజ్జీనెస్), సరిగా నిలబడలేక΄ోవడం, గుటక వేయలేకపోవడం వంటి లక్షణాలతో కనిపించే ఈ అనారోగ్యాన్ని ‘ల్యాటరల్ మెడుల్లరీ సిండ్రోమ్’ అంటారు. ఈ సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం.ల్యాటెరల్ మెడుల్లరీ సిండ్రోమ్ అనే ఈ సమస్య... సాధారణంగా మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే పోస్టీరియర్ ఇన్ఫీరియర్ సెరెబెల్లార్ ఆర్టరీ (పీఐసీఏ)లో రక్తప్రవాహం ఆగడం వల్ల వస్తుంది. దాంతో మెడుల్లా (బ్రెయిన్ స్టెమ్)లోని ఒక పక్క భాగం (పార్శ్వం) ప్రభావితమవుతుంది. ఇవీ లక్షణాలు... బాధితులకు నొప్పి, వేడిమి, ఉష్ణబాధలు తెలియకపోవడం బాలెన్స్ కోల్పోవడం, నడుస్తున్నప్పుడు సరైన రీతిలో నడవలేకపోవడం (గెయిట్ సరిగా లేకపోవడం) ∙తల, కళ్లు తిరుగుతుండటం ∙గుటకవేయలేక΄ోవడం, గొంతు బొంగురుపోవడం, మాట ముద్దముద్దగా రావడం. (మెదడులోని మింగే వ్యవస్థనూ, మాట్లాడే కేంద్రాన్ని నియంత్రించే ‘న్యూక్లియస్ యాంబిగస్’ అనే భాగం ఆయా వ్యవస్థలపై అదుపు కోల్పోవడంతో ఈ పరిణామం సంభవిస్తుంది) కనురెప్ప దానంతట అదే వాలిపోవడం, కనుపాప దగ్గరగా ముడుచుకోవడం (ప్యూపిల్ కన్స్ట్రిక్షన్), కొన్నిసార్లు కళ్లు (నల్లగుడ్డు) వాటంతటవే కదుతుండటం కొందరిలో వికారం, వాంతులు, ఎక్కిళ్లు.కారణాలు... మెదడులోని కొన్ని భాగాలకు రక్తం అందించే ధమనులు గట్టిబారి΄ోయి సన్నబడటం లేదా ఆ గోడల్లో పగుళ్లు రావడం వల్ల మెడను సరిగా ఉపయోగించకుండా రఫ్గా వాడినప్పుడు అక్కడి వర్టెబ్రల్ ఆర్టరీస్లో పగుళ్లు రావడం వల్ల లేదా మార్ఫన్స్ సిండ్రోమ్, ఎహ్లెర్–డ్యాన్లస్ సిండ్రోమ్, ఫైబ్రోమస్క్యులార్ డిస్ప్లేసియా (రక్తనాళాల లోపలివైపున కణాలు పెరగడం వల అవి సన్నబారిపోవడం) వంటి కారణాలతో ఈ సమస్య వస్తుంది. అయితే మిగతా కారణాలతో పోలిస్తే ఈ అంశాలు చాలా అరుదు.నిర్ధారణ... మెదడు ఎమ్మారై ద్వారా అలాగే లక్షణాలను బట్టి దీన్ని నిర్ధారణ చేస్తారు. అయితే చాలా సందర్భాల్లో నిర్ధారణ సరిగా జరగక... ఈ సమస్యను ఇతర సమస్యగా పొరబడటం జరుగుతుంటుంది. ప్రధానంగా వికారం, వాంతులు, తలతిరగడం, కళ్లుతిరగడం వంటి లక్షణాలను బట్టి దీన్ని ఈఎన్టీ సమస్యగా పొరబడుతుంటారు. చికిత్స... స్ట్రోక్ అనేది ఈ తరహాదైనప్పటికీ దానికి అత్యంత త్వరగా చికిత్స అందడం అవసరం. అప్పుడే వీలైనంత తక్కువ నష్టం జరుగుతుంటుంది. ఈ తరహా స్ట్రోక్ మొదలుకొని అది ఎలాంటిదైనప్పటికీ వీలైనంత త్వరగా హాస్పిటల్కు తీసుకురావాలి. బాధితుల్ని కనీసం మూడు నుంచి నాలుగు గంటల లోపు తీసుకొస్తే డాక్టర్లు థ్రాంబోలిటిక్ థెరపీ (అంటే ధమనుల్లో రక్తసరఫరాను పునరుద్ధరించేందుకు ఇంజెక్షన్ ద్వారా మందును ఇచ్చే చికిత్స)ని బాధితులకు అందించడానికి ప్రయత్నిస్తారు. ఇదే కాకుండా కొన్ని సందర్భాల్లో కొందరికి ‘మెకానికల్ థ్రాంబెక్టమీ’ అనే (రక్తనాళాల్లో పేరుకుపోయిన క్లాట్ను తొలగించడానికి చేసే) శస్త్రచికిత్సతో పరిస్థితిని చక్కబరుస్తారు. ఇటీవల ఈ సమస్యపట్ల కొంత అవగాహన పెరగడంతో మునపటిలా కాకుండా సంబంధిత చికిత్సలు సత్వరమే జరుగుతున్నాయి. అయితే ముందుగా చెప్పినట్లుగా థ్రాంబోలిటిక్ థెరపీ చేయడానికి అవకాశం లేకుండా కాస్తంత ఆలస్యంగా వచ్చినవారికి క్లాట్స్ ఏర్పడకుండా ఉంచేందుకు రక్తం గడ్డకట్టి ఉండలుగా మారకుండా యాంటీ ప్లేట్లెట్ ఏజెంట్స్ను ఇవ్వడం, రక్త΄ోటు (బీపీ) అదుపులో ఉంచడం, కొలెస్ట్రాల్ వంటి కొవ్వులను తగ్గించడం, రక్తాన్ని పలచబర్చేలా యాంటీ కోయాగ్యులెంట్స్ ఇవ్వడం వంటి మేనేజ్మెంట్ చికిత్సలూ అవసరమవుతాయి.రీ–హ్యాబిలిటేషన్... ఇక్కడ పేర్కొన్నవే కాకుండా బాధితులు కోలుకునేందుకు వీలుగా ఫిజియో వంటి ‘రీ–హ్యాబిలిటేషన్’ వంటి కాస్త సుదీర్ఘ చికిత్సలతో పాటు బ్యాలెన్స్డ్గా నడక ప్రాక్టీస్ చేయించడం, మాట ముద్దగా వస్తున్నవారికి స్పీచ్ థెరపీ వంటివి కూడా అవసరమవుతాయి. భవిష్యత్తు ఆశారేఖలివి... ఇప్పుడున్న మందులు కాకుండా న్యూరో ప్రొటెక్టివ్ మెడిసిన్, స్టెమ్సెల్ చికిత్సల వంటి వాటిపైనా విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ లక్షణాలతో స్ట్రోక్ను గుర్తించి వీలైనంత త్వరగా బాధితులను హాస్పిటల్కు తరలించడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వల్ల జరిగే నష్టాన్ని వీలైనంతగా తగ్గించవచ్చు.(చదవండి: సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చా?) -
'హార్ట్' ఆఫ్ 'లివింగ్'
అదేదో సినిమాలో ‘‘హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా చారీ’’ అంటూ బ్రహ్మానందం విష్ చేయగానే ‘‘నేను మీకు ఫ్రెండేమిటి గురువుగారూ’’ అంటాడు జూ. ఎన్టీఆర్ కాస్తంత గురుగౌరవ భావంతో. దానికి బ్రహ్మానందం మళ్లీ ‘‘ఫ్రెండ్షిప్కు ఏజ్ లిమిటేదీ ఉండదురా’’ బదులిస్తాడు. అవును. ఫ్రెండ్షిప్కు వయసుపరంగా చిన్నా పెద్దా అనే ఏజ్ లిమిటు లేనట్టే... సైజు పరంగా కూడా చిన్నా పెద్దా తేడా ఉండదు. అందుకే శ్రీరాముడంతటి వాడికి భక్తితో ఉడత హెల్ప్ చేస్తే... ‘‘నాకే హెల్ప్ చేశావంటే నీ ఫ్రెండ్షిప్ మామూలుది కాదూ... నీ ఫ్రెండ్షిప్పూ, నా ఫ్రెండ్షిప్పూ లోకానికి ఎప్పటికీ తెలియాలం’’టూ దానికి వీపు మీద పర్మనెంట్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ను వదిలాడు. అదేంటోగానీ శ్రీరామచంద్రుడికి టాప్ టు బాటమ్... సుగ్రీవుడు మొదలుకొని ఉడత వరకు ఎందరో ఫ్రెండ్సు. పాపం... అంత ఫ్రెండ్షిప్ చేస్తే అర్జునుడికి భగవద్గీత... ఒక్కటే ‘గీత’! కానీ చిన్న హెల్ప్తో పెద్ద క్రెడిట్ కొట్టేసిన ఉడుతగారికి మాత్రం మర్యాదాపురుషోత్తముడి నుంచి మాంచి మార్కింగ్లైన్స్ ‘మూడు గీతలు’!! స్నేహం గొప్పదనాల ఉదంతాలకూ... స్నేహం ఔన్నత్త్యాల గురించి ‘నేస్తమ... నేస్తమా’ లాంటి పాటలకూ... కర్ణ సుయోధన, కృష్ణకుచేల, పార్థుడూ ఆయన సారథీలాంటి స్నేహ తార్కాణాలకు కొదవేవీ లేదు. స్నేహభావన గొప్పది కాబట్టే మొదట... తెలివితేటల కంటే ముందుగా ‘చెలిమి’చేతలనూ... నెనరు–నెయ్యాలనూ... కూరిమి–పేరిమిలనూ, మమతా–మైత్రీ భావాలను జీవుల పరిణామానికి ముందునుంచే సృష్టించి పెట్టిందేమో ప్రకృతిమాత! అదెలాగంటారా... ఆక్సిజనూ... కార్బన్ డై యాక్సైడ్ ఇచ్చిపుచ్చుకుంటూ మొక్కలూ, జంతువులూ... పండ్లూ ఫలాలూ ఇచ్చుకుంటూ చెట్టుచేమలూ... ఫారెస్టు యానిమల్సూ... పూల తేనెతేటల ఊటలు పంచుకుంటూ హనీబీలూ–బటర్ఫ్లైసూ.. ఇలా ప్రకృతి నిండా బడ్సీస్ అండ్ ‘బ్రో’లే! పురాణాలూ... ప్రకృతీ వదిలేసి పిక్చర్లూ మూవీలకు వద్దాం. ఎందుకంటే... పురాణాలూ ప్రకృతీ లాంటి సీరియస్ వ్యవహారాలు కాస్త భారంగా ఉంటాయి కాబట్టి... జనాల ట్రెండును నిర్దేశించేవీ, సమాజానికి అద్దం పట్టేవైన సినిమాలతోనే మొదలుపెట్టాం కాబట్టి... వాటితోనే ముగిద్దాం. అప్పట్లో... మిస్సమ్మ మొగుడు ఎన్టీ రామారావు పక్కనే రేలంగీ... అడవిరాముడి పక్కనే ఉండి నవ్విస్తుండే రాజబాబూ... సినీ మధ్యయుగాన... అనేక మంది హీరోల స్క్రీన్మేటు బ్రహ్మానందం... ఇప్పటి ట్రెండుకు తగ్గట్టు మహేశ్బాబు ‘మహర్షి’ అయితే పాల్ అల్లరి నరేషూ అదే మహేషు ‘శ్రీమంతుడై’΄ోతే పక్కనుండే ఫ్రెండే వెన్నెల కిషోరూ... అంతెందుకు... ఎర్ర గంధపు చెక్క పుష్పరాజ్ గాడి వెంట ఎప్పుడూ వెన్నంటి ఉండే మంచి ఫ్రెండ్షిప్పు తురుపు ముక్క కేశవ... సినిమాలో ఫ్రెండనే ఫార్మూలా సూపర్ డూపర్ బంపర్ హిట్ అయితే... జీవితంలో ఫ్రెండ్సంటే కామన్మేన్ కరేజ్కు తోడుండే పెద్ద జట్టు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే... (చదవండి: జస్ట్ 30 నిమిషాల పనికి రూ. 18 వేలు..! కార్పొరేట్ ఉద్యోగి రేంజ్లో..) -
ఈ సండే టేస్టీ..టేస్టీ..అమెరికా హలపేన్యో పాపర్స్ చేయండిలా..!
చాక్లెట్ రైస్ కేక్కావలసినవి: అన్నం– 2 కప్పులు (మరీ మెత్తగా ఉడికించకూడదు)కొబ్బరికోరు– 2 టేబుల్ స్పూన్లుఅరటిపండు గుజ్జు– 4 టేబుల్ స్పూన్లుకొబ్బరి పాలు– పావు లీటరుపంచదార– ఒక కప్పునెయ్యి– 1 లేదా 2 టీ స్పూన్లుదాల్చినచెక్క పొడి, చాక్లెట్ క్రీమ్, పీనట్ బటర్– గార్నిష్ కోసంతయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, కళాయిలో కొబ్బరిపాలు, పంచదార వేసి, పంచదార కరిగేవరకు తిప్పుతూ మరిగించాలి. ఆ మిశ్రమంలో అరటిపండు గుజ్జు, కొబ్బరికోరు వేసి మరోసారి కలుపుకోవాలి. చివరిగా అన్నం వేసి బాగా తిప్పి, కాస్త దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అనంతరం నచ్చిన షేప్లో ఉండే చిన్నచిన్న బౌల్స్ తీసుకుని, వాటికి అడుగున నెయ్యి రాసి, ఈ రైస్ మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేసుకుని, సమాంతరంగా చేత్తో ఒత్తుకుని, గట్టిపడేలా చేసుకోవాలి. తర్వాత ఒక్కో రైస్ కేక్ మీద పీనట్ బటర్ పూసి, పైన దాల్చిన చెక్క పొడి వేసుకోవాలి. ఆపైన చాక్లెట్ క్రీమ్ వేసుకుని స్ప్రెడ్ చేసుకుని, క్రీమ్ ఆరిన తర్వాత, నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుని, సర్వ్ చేసుకోవచ్చు.అమెరికా హలపేన్యో పాపర్స్కావలసినవి: హలపేన్యో (పెద్ద పచ్చిమిర్చీలు)– 10 (సగానికి నిలువుగా కట్ చేసి, విత్తనాలు తీసేసి పెట్టుకోవాలి)చీజ్ క్రీమ్– 200 గ్రాములుమాంసం ముక్కలు– పావు కప్పు (మసాలా, ఉప్పు, కారం జోడించి, నూనెలో దోరగా వేయించాలి), వెల్లుల్లి– 3 (తురుములా చేసుకోవాలి), ఉప్పు, మిరియాలు, ఆలివ్ నూనె, ఉల్లికాడ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పర్మేసన్ చీజ్ తురుము– కొద్దికొద్దిగాబ్రెడ్ పౌడర్– 2 టేబుల్ స్పూన్లు (నూనెలో దోరగా వేయించుకోవాలి)తయారీ: ముందుగా ఒక పాత్రలో చీజ్ క్రీమ్, వెల్లుల్లి తురుము, తగినంత ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, ఆలివ్ నూనె, ఉల్లికాడ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మాంసం ముక్కలు, వెల్లుల్లి మిశ్రమాన్ని హలపేన్యో ముక్కల్లో నింపుకోవాలి. ఇప్పుడు ప్రతి హలపేన్యో ముక్కపైన కొద్దికొద్దిగా పర్మేసన్ చీజ్ తురుము వేసుకోవాలి. ఆపైన వేయించిన బ్రెడ్ పౌడర్ పరచుకుని, ఆ హలపేన్యో ముక్కలను బేకింగ్ ట్రేలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ట్రేను ఓవెన్లో పెట్టుకుని, వాటిని బేక్ చేసుకుని తింటే భలే రుచిగా ఉంటాయి.ఫరాలీ సూరన్ ఖిచిడీకావలసినవి: కంద తురుము– 2 కప్పులుసగ్గుబియ్యం లేదా మరమరాలు లేదా అటుకులు– ఒక కప్పు (కడిగి, నీళ్లు పోయేలా వడకట్టులో వేసి పెట్టుకోవాలి)నెయ్యి– సరిపడావేరుశెనగలు– ఒక కప్పు (దోరగా వేయించి పొడి చేసుకోవాలి)పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము– కొద్దికొద్దిగాకరివేపాకు, జీలకర్ర– తాలింపు కోసంనిమ్మరసం– సరిపడాఉప్పు– తగినంతతయారీ: ముందుగా ఒక పాన్లో నెయ్యి వేసి వేడి చేసుకుని, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దానిలో కంద తురుము వేసి, మూతపెట్టి చిన్నమంట మీద బాగా మగ్గనివ్వాలి. దానిలో కొద్దిగా నీళ్లు, వేరుశెనగ పొడి, సగ్గుబియ్యం లేదా మరమరాలు లేదా అటుకులు కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి, మధ్యమధ్యలో గరిటెతో తప్పితూ మూతపెట్టుకుని కాసేపు ఉడికించుకోవాలి. చివరగా, ఒక ప్లేట్లోకి తీసుకుని, పైన తగినంత నిమ్మరసం, కొత్తిమీర తురుము, కొబ్బరికోరు వంటివి వేసుకుని తింటే భలే రుచిగా ఉంటుంది ఈ ఖిచిడీ. (చదవండి: బ్రెయిన్ ఆరోగ్యం కోసం ఇవి తప్పనిసరి..!) -
చర్మం లోతుల్లోంచి క్లీన్ చేసే..క్లెన్సింగ్ బ్రష్..!
చర్మాన్ని లోతుగా, సున్నితంగా శుభ్రపరచడానికి, ఎల్లవేళలా తాజాగా ఉంచడానికి సహకరిస్తుంది ఈ సూపర్ ఫేషియల్ వైబ్రేటింగ్ క్లెన్సింగ్ బ్రష్. దీనితో కేవలం క్లీనింగ్ మాత్రమే కాకుండా, మరెన్నో ప్రయోజనాలున్నాయి. ఈ అధునాతన బ్రష్ సున్నితమైన మైక్రో–వైబ్రేషన్లను అందిస్తుంది. ఇది చర్మంపై ఉండే మలినాలను పూర్తిగా తొలగిస్తుంది. అంతేకాకుండా, రక్తప్రసరణను ఉత్తేజపరుస్తుంది.యాంటీ బ్యాక్టీరియల్ సిలికన్తో తయారైన ఈ బ్రష్ రీచార్జబుల్ కావడంతో వినియోగించుకోవడం చాలా తేలిక. దీనికి మూడు వైబ్రేషన్ మోడ్లు (డీప్ క్లెన్సింగ్, మసాజింగ్, స్కిన్ స్టిమ్యులేటింగ్) ఉండటంతో దీనిని చర్మ సంరక్షణ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవచ్చు. ఎర్గనామిక్ డిజైన్ ఉన్న ఈ మినీ డివైస్ ఆటో–కాంటారింగ్ హెడ్తో ప్రత్యేకంగా రూపొందింది.మేకప్ తొలగించిన తర్వాత, ఈ బ్రష్ను తడిపి, నచ్చిన క్లీనింగ్ లోషన్ లేదా క్రీమ్ని కొద్దిగా బ్రష్కు పూసి అప్లై చేసుకోవాలి. రెండు సెకన్ల పాటు బటన్ను నొక్కి ఉంచితే క్లెన్సింగ్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. ఆ ఆప్షన్తో పరికరం ఆటోమేటిక్గా ఆగిపోయే వరకు చర్మాన్ని శుభ్రం చేసుకోవచ్చు. మసాజ్ కోసం, బ్రష్ను తిప్పి, బటన్ను 2 సెకన్ల పాటు నొక్కి పట్టుకుంటే సరిపోతుంది. అప్పుడే కొన్ని చుక్కల ఫేషియల్ ఆయిల్ అప్లై చేసుకుంటే, ఈజీగా మసాజ్ చేసేస్తుంది. చేతిలో ఇమిడిపోయే ఈ మినీ టూల్ సౌందర్య ప్రియులకు చక్కగా ఉపయోగపడుతుంది.నిండైన పెదవులకు మెండైన చికిత్సఈ రోజుల్లో దొండపండులాంటి నిండైన పెదవుల కోసం అట్టే శ్రమించనక్కర్లేదు. కావాలనుకుంటే, ఇట్టే పొందవచ్చు. ‘ఇంజెక్టబుల్ లిప్ ఫిల్లర్స్’ అనే కాస్మెటిక్ చికిత్సతో కోరిన పెదవులను సొంతం చేసుకోవచ్చు. జన్యుపరంగా పెదవులు సన్నగా ఉన్నవారికి ఈ చికిత్స మంచి అవకాశమనే చెప్పుకోవాలి. ఈ ఫిల్లర్లలో సాధారణంగా హైయలురోనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మానికి సహజంగా తేమను అందించి, పెదవులు నిండుగా కనిపించేలా చేస్తుంది. ఈ చికిత్సలో, ముందుగా పెదవులకు మత్తు ఇస్తారు. ఆపై సన్నని సూదితో ఫిల్లర్ను పెదవి లోపలికి జాగ్రత్తగా ఇంజెక్ట్ చేస్తారు. ఇది పెదవుల పరిమాణాన్ని పెంచడమే కాకుండా, వాటి ఆకృతిని మెరుగుపరచడానికి, చిన్న చిన్న ముడతలను తగ్గించడానికి సహాయపడుతుంది. చికిత్స తర్వాత కొద్దిపాటి వాపు కనిపిస్తుంది. కానీ అదంతా కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది. ఈ లిప్ ఫిల్లర్ల ప్రభావం సుమారు 6 నుంచి 12 నెలల వరకు ఉంటుంది. అర్హత కలిగిన వైద్య నిపుణులతో మాత్రమే ఈ చికిత్స చేయించుకోవడం క్షేమం. (చదవండి: చిరునవ్వే సిగ్నేచర్ లుక్!) -
చిరునవ్వే సిగ్నేచర్ లుక్!
ఒక్క చిరునవ్వుతో వెండితెరపై వెలుగులు కురిపించే నటి జెనీలియా దేశ్ముఖ్. ఎప్పుడూ క్లాసిక్ అందాన్ని కంఫర్ట్తో కలిపి, ఫ్రెష్ ఫ్యాషన్తో మెరిసిపోతుంది. ఆ యూనిక్ చార్మ్ను సినిమాల్లోనే కాదు, జీవితంలోనూ చూపిస్తోంది. జ్యూలరీ బ్రాండ్: షాచీ ఫైన్ జ్యూలరీ, ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.చీర బ్రాండ్: యాష్డెన్, ధర: రూ. 98,000నాకు స్టయిల్ అంటే సింప్లిసిటీ. ట్రెండ్ కంటే కంఫర్ట్ ముఖ్యం. చిన్న చోకర్, లైట్ ఇయర్ రింగ్స్, సాఫ్ట్ లిప్గ్లోస్, ఇదే నా సిగ్నేచర్ లుక్. ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటే మేకప్ లేకపోయినా, ముఖం ఆటోమేటిక్గా మెరిసిపోతుందని చెబుతోంది జెనీలియా.రిబ్బన్స్ రీ ఎంట్రీ!ఒకప్పుడు జడకే పరిమితమైన ఈ నాజూకైన పట్టీ, రిబ్బన్స్. ఇప్పుడు మెడ మీద మెరిసేలా ఓ కొత్త స్టయిల్ స్టేట్మెంట్ను సృష్టిస్తోంది. జడల చివర అలముకునే ఈ చిన్నదానికి ఇప్పుడు ఫ్యాషన్లో పెద్ద స్థానం దక్కుతోంది. ఇది వచ్చినప్పటి నుంచీ పొడవైన హారాల జమానా కాస్త వెనక్కి వెళ్లిందనే చెప్పాలి. మధ్యలో ఓ చిన్న పెండెంట్, చుట్టూ సన్నని రిబ్బతో వచ్చే ఈ చోకర్ వేసుకొని, అద్దం ముందు నిలబడగానే ‘ఇంత అందంగా నేనేనా?’ అన్న ఆశ్చర్యంతో మురిసిపోతారు! చీరా, లెహంగా, కుర్తా ఏదైనా సరే, ఈ రిబ్బన్స్ చోకర్ మెడమీద పడితే లుక్కి కొత్త శోభ చేకూరుతుంది. హెయిర్ స్టయిల్ బ్రేడ్ అయినా, బన్ అయినా, ఏదైనా మెడ భాగం స్పష్టంగా కనిపించేలా చూసుకోవాలి. మేకప్ విషయంలో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. తక్కువ టచ్ ఇచ్చినా సరే, చోకర్ ముఖాన్ని హైలైట్ చేయగలదు. ఇది వేసుకున్నాక, ఇంకొక హారం అవసరం లేదు. ఎందుకంటే, ఈ ఒక్కదానికే పొడవైన హారాల గర్వాన్ని తగ్గించేంత స్టయిల్, పవర్ ఉంది. చిన్నదిగా కనిపించినా, గొప్పగా మెరిసిపోతుంది. (చదవండి: సెల్ఫ్ బ్రాండ్..అదే ట్రెండ్..! పేరులో ఐడెంటిటీ..అదే ఇవాళ స్టైల్లో మేటి..) -
‘టెస్ట్ ట్యూబ్’లో.. మీ ‘బేబీ’యేనా?
పిల్లలు పుట్టలేదని సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లిన మహిళకు భర్త శుక్రకణాలతో కాకుండా వేరే వ్యక్తి శుక్రకణాలతో సంతానం కలిగించిన ఘటన సికింద్రాబాద్లో వెలుగులోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం ‘సృష్టి’ంచింది. ఇటీవలి కాలంలో జంటల్లో సంతాన సాఫల్యత తగ్గడమే.. ఇలాంటి కేంద్రాలు పెరగడానికి కారణం. ఈ సమస్య తీవ్రత ఎంత ఎక్కువంటే... ప్రతి ఆరు వివాహిత జంటల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారని అంచనా. దీంతో పలువురు దంపతులు కృత్రిమ గర్భధారణకు మొగ్గుచూపుతున్నారు. ఈ డిమాండ్ను ఆసరా చేసుకున్న కొన్ని ఫెర్టిలిటీ సెంటర్లు దంపతుల పట్ల అనైతికంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృత్రిమ గర్భధారణలో ఐవీఎఫ్ (టెస్ట్ట్యూబ్ బేబీ) ప్రాధాన్యమేమిటి? అది ఎప్పుడు, ఎందుకు చేస్తారు? దంపతులు ఎక్కడ మోసపోయే అవకాశం ఉంటుంది? ప్రభుత్వం నియమ నిబంధనలూ, మార్గదర్శకాలు ఏమిటి?సాక్షి, ఫీచర్స్ – హెల్త్ డెస్క్ .ఇటీవల మనదేశంలో సంతానలేమితో బాధపడుతున్నవారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీనికి ప్రధానంగా రెండు రకాల కారణాలున్నాయి. మొదటిది.. సామాజిక కారణాలు. యువత పై చదువుల కోసం, మంచి ఉద్యోగాలంటూ తమ కెరీర్ కోసం ఎక్కువ సమయం కేటాయించడం; ఉద్యోగాల్లో తీవ్రమైన ఒత్తిడి, వేళాపాళా లేని పనివేళలు, మారుతున్న ఆహారపు అలవాట్లు, వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం; అధిక బరువు (స్థూలకాయం), మద్యపానం, పొగతాగడం, డ్రగ్స్ వంటి అనారోగ్యకర అలవాట్లు. ఇక రెండోది ఆరోగ్యపరమైనవి.. మహిళల్లోని హార్మోన్లలో అసమతౌల్యత, ఇన్ఫెక్షన్లు, స్త్రీలలో పుట్టుకతోనే అండాల సంఖ్య తక్కువగా ఉండటం; మగవారిలో వీర్యకణాల సంఖ్య, కదలిక తక్కువగా ఉండటం, నాణ్యతలేమి.ఐవీఎఫ్ : ‘ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్’కు సంక్షిప్త రూపమే ఐవీఎఫ్. జనసామాన్యంలో దీనికి ‘టెస్ట్ట్యూబ్ బేబీ’ అని పేరు. స్త్రీ, పురుషులిద్దరిలోనూ ఫలదీకరణ విషయంలో సమస్యలు ఉన్నప్పుడు ఈ మార్గాన్ని సూచిస్తారు. ఇందులో ముందుగా మహిళలో అండాలు పెద్దమొత్తంలో పెరిగేందుకు మందులిస్తారు. అలా పెరిగిన అండాల్లోంచి ఆరోగ్యంగా ఉన్న కొన్నింటిని సేకరించి, పురుషుడి నుంచి సేకరించిన వీర్యకణాలతో ల్యాబ్లోని ‘టెస్ట్ట్యూబ్’లో ఫలదీకరణం చేస్తారు. ఇందులో కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ పిండాలు పెరగవచ్చు (అందుకే ఈ పద్ధతిలో చాలామందిలో కవలలు పుడుతుంటారు). ఇలా రూపొందించిన వాటిల్లో ఆరోగ్యకరమైన పిండాలను మళ్లీ మహిళ గర్భంలోకి ప్రవేశపెడతారు. రెండువారాలకు నిర్ధారణ పరీక్షలు చేస్తారు. నాలుగు వారాల తర్వాత అల్ట్రాసౌండ్ పరీక్ష చేసి, గర్భం నిలిచిందా లేదా అన్నది నిర్ధారణ చేసుకుంటారు. గర్భం నిలవకపోతే కారణాలను విశ్లేషించి, మళ్లీ కొన్ని నెలలు ఆగి ప్లాన్ చేస్తారు. ఇలా రెండుమూడు సార్లు ప్రయత్నిస్తారు.ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ఐసీఎస్ఐ): పురుషుల్లో సమస్య ఉంటే అనుసరించే మార్గమిది. మగవారి నుంచి ఎంపిక చేసుకున్న ఆరోగ్యంగా ఉన్న శుక్రకణాన్ని నేరుగా అండంలోకి ప్రవేశపెడతారు.పిండాలను భద్రపరిచి..: ఐవీఎఫ్ ప్రక్రియలో రూపొందిన పిండాల సంఖ్యను బట్టి, ఒకసారి ఒకటి లేదా రెండు పిండాలను గర్భాశయంలోకి పంపి, మిగతా వాటిని ‘విట్రిఫికేషన్’ అనే పద్ధతి ద్వారా ఫ్రీజ్ చేసి భద్రపరుస్తారు. ఐవీఎఫ్ ప్రక్రియ మొదటిసారి సఫలం కానప్పుడు, అలా భద్రపరచిన పిండాలను తీసుకొని మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. లేదా ఇంకొకసారి గర్భం దాల్చాలనుకున్నప్పుడు కూడా వాడుకోవచ్చు. పరిశోధనలకు ఇవ్వవచ్చు. లేదా వాటిని నిర్జీవపరచమని కోరవచ్చు. క్లినిక్లు వీటిలో ఏది చేయాలన్నా దంపతుల అనుమతితోనే చేయాలి. ఈ విషయంపై కూడా దంపతులకు పూర్తి అవగాహన లేకపోవడం వల్ల మోసాలు జరిగే అవకాశం ఉంది.ఐవీఎఫ్ ఎవరి కోసమంటే..సాధారణ చికిత్సలతో గర్భం రాక.. ఇంకా వేచిచూసేంత ఓపిక లేనివాళ్లకి. వయసు 38 – 40 ఏళ్లు దాటిన వారికి అండాల సంఖ్య, నాణ్యత బాగా తగ్గిపోతున్నవారికివీర్యకణాల సంఖ్య, కదలిక, నాణ్యత బాగా తక్కువగా ఉన్నప్పుడు. భార్య లేదా భర్తలో ఏవైనా జన్యుపరమైన సమస్య ఉండి, అది పిల్లలకూ వచ్చే అవకాశం ఉన్నప్పుడు, ఐవీఎఫ్ ద్వారా తయారైన పిండాలనుంచి ఒక దాన్ని తీసి, ప్రీ–ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నసిస్ (పీజీడీ) ద్వారా పరీక్ష చేసి, జన్యు సమస్య లేని పిండాలను వేరుపరచి, తల్లి గర్భాశయంలోకి పంపిస్తారు.కొందరు కెరీర్ కోసమో లేదా వ్యక్తిగత కారణాల వల్లో గర్భధారణను వాయిదా వేస్తారు. వాళ్లలో కొందరు ముందుగానే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా తయారైన పిండాలను భద్రపరచుకొని, ఆ తర్వాత వీలైనప్పుడు ఫ్రోజెన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ద్వారా గర్భాశయంలోకి ప్రవేశింపచేయడం ద్వారా గర్భం ధరిస్తారు. ఈ సందర్భంలో కూడా దంపతులు అప్రమత్తంగా ఉండాలి. పిండాలు మారిపోయే అవకాశం ఇక్కడ కూడా ఉంటుంది.ఇవీ నియమ నిబంధనలుకృత్రిమ గర్భధారణ విషయంలో ఇన్ఫెర్టిలిటీ కేంద్రాలకూ, అలాగే ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ‘ద ఏఆర్టీ (అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్) యాక్ట్ ఆఫ్ 2021’, అలాగే ‘సరోగసీ యాక్ట్ ఆఫ్ 2021’ వంటి చట్టాలు చేసింది. ఇన్ఫెర్టిలిటీ క్లినిక్లు ఈ నియమ నిబంధనలను పాటించాలి. దంపతులు కూడా ఈ చట్టాలపై కొంత అవగాహన కలిగి ఉంటే మంచిది.దేశంలోని ప్రతి ఐవీఎఫ్ సెంటర్.. కేంద్ర, రాష్ట్ర ఏఆర్టీ బోర్డు కింద నమోదు చేసుకుని ఉండాలి. ఐవీఎఫ్ చికిత్సకు తాము అంగీకరిస్తున్నట్టుగా దంపతులు ఆమోదపత్రం ఇవ్వాలి. ఈ ప్రక్రియ నిర్వహిస్తున్న నిపుణులు.. ఐవీఎఫ్ ప్రక్రియ గురించి పూర్తి వివరాలు దంపతులకు తెలియజేయాలి. తమ దగ్గర చికిత్స తీసుకుంటున్న దంపతుల వివరాలను, వారి మెడికల్ రికార్డులను క్లినిక్లు గోప్యంగా ఉంచాలి. తమకు జరుగుతున్న చికిత్స, వైద్యపరీక్షల వంటి పూర్తి వివరాలు పేషెంట్లు తెలుసుకోవచ్చు. క్లినిక్ నిర్వాహకులు / డాక్టర్లు అన్ని వివరాలనూ పేషెంట్లకు వివరించాలి. చికిత్సకు సంబంధించిన అన్ని రికార్డులూ పేషెంట్లకు ఇవ్వాలి. తమకు కలిగే అసౌకర్యాల విషయంలో ఫిర్యాదు చేసేందుకు ప్రతి క్లినిక్ తమ దగ్గర ఓ ఫిర్యాదుల కేంద్రాన్ని (గ్రీవెన్స్ సెల్) ఏర్పాటు చేయాలి.దాతలకు నియమ నిబంధనలివి..కేంద్ర / రాష్ట్ర ఏఆర్టీ బోర్డు ఆధ్వర్యంలో నమోదు చేసుకున్న ఏఆర్టీ బ్యాంకుల నుంచే క్లినిక్లు అండాలను / శుక్రకణాలను స్వీకరించాలి.ఇటీవల ఎవరో బిచ్చగాళ్లు, ఆరోగ్యం సరిగా లేనివారిని దాతలుగా కొన్ని సంస్థలు శాంపిళ్లు సేకరించినట్లు వార్తలొచ్చాయి. ఇది కఠిన శిక్షార్హమైన నేరం. దాతల ఎంపికకూ, అండాలు ఇచ్చే మహిళా దాతలుగానీ లేదా శుక్రకణాలను ఇచ్చే పురుషుల అర్హతల గురించీ స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. దాతల నుంచి అండాలు లేదా శుక్రకణాలను స్వీకరించే సమయంలో స్వీకర్తలకు దాతల గురించి, ఈ విషయంపై ఉన్న నియమ నిబంధనలూ తెలుపుతూ కౌన్సెలింగ్ చేయాలి.– డాక్టర్ ప్రీతీ రెడ్డి, సంతాన సాఫల్య నిపుణురాలు, హైదరాబాద్ఐవీఎఫ్ పేరిట క్లినిక్ల నయా మోసాలుదాతల విషయంలో అప్రమత్తత అవసరంచట్టాలపై అవగాహనతో అక్రమాలకు అడ్డుకట్టవివరాలన్నీ క్లినిక్లు దంపతులకు చెప్పాల్సిందేపేషెంట్ల వివరాలు గోప్యంగా ఉంచాల్సిందేఐవీఎఫ్ విజయావకాశాలుఇవి ప్రధానంగా మహిళ వయసు మీద ఆధారపడి ఉంటాయి. 40 ఏళ్లు దాటాక.. వయసు పెరిగే కొద్దీ సక్సెస్ రేటు తగ్గుతుంది. అండాలు, పిండం నాణ్యత తక్కువగా ఉంటే ఆ మేరకు సక్సెస్ రేటూ తగ్గిపోతుంది. దంపతుల జీవనశైలి కూడా ప్రభావం చూపుతుంది. ధూమపానం, మద్యపానం అలవాటున్నవారు, ఊబకాయం ఉన్నవారిలో అండాల సంఖ్య, నాణ్యత సహజంగా తక్కువగా ఉండవచ్చు. దాంతో సక్సెస్రేటూ తగ్గుతుంది. -
అరవైలలోని మహిళలకూ ఆ ముప్పు!
హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ) కారణంగా సర్వైకల్ క్యాన్సర్ సోకే ముప్పు యువతులకు, నడివయసు మహిళలకు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే! అరవై ఏళ్లు నిండిన వయసులోని మహిళలకు కూడా ఈ ముప్పు ఎక్కువగానే ఉంటుందని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. అందువల్ల అరవైలలోని మహిళలు కూడా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం మంచిదని అంతర్జాతీయ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2022లో సర్వైకల్ క్యాన్సర్ సోకిన మహిళల్లో 65 ఏళ్లు పైబడిన మహిళలు 1,57,182 మంది ఉంటే, వారిలో 1,24,269 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ లెక్కన వార్ధక్యంలో సర్వైకల్ క్యాన్సర్ సోకిన మహిళలు ప్రాణాపాయం బారిన పడే అవకాశాలే ఎక్కువగా ఉంటున్నట్లు స్పష్టమవుతోంది. సాధారణంగా ఈ వయసులోని మహిళలు వ్యా«ధి రెండో దశలోను, ఇంకా ముదిరిన దశలోను ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ నివేదికలు చెబుతున్నాయి. అందువల్ల అరవైలలో ఉన్న మహిళలు కూడా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సూచనలపై ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని, దానివల్ల వ్యాధిని తొలిదశలోనే గుర్తించి ప్రాణాపాయాన్ని నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. సర్వైకల్ క్యాన్సర్ ముప్పును చాలావరకు తప్పించగల హెచ్పీవీ వ్యాక్సిన్ అందు బాటులోకి వచ్చినా, వ్యాక్సిన్ తీసుకుంటున్న మహిళల సంఖ్య ఇంకా తక్కువగానే ఉంటోంది. డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం 2017–2023 మధ్య కాలంలో 25–54 ఏళ్ల వయసు గల మహిళల్లో కేవలం రెండు శాతం మంది మాత్రమే ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు. (చదవండి: సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చా?) -
సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చా?
నేను ఇద్దరు పిల్లల తల్లిని. వయసు నలభై రెండు సంవత్సరాలు. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చా?– శాంత, విజయవాడ.మీరు తప్పకుండా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ హ్యూమన్ పాపిలోమా వైరస్ వలన వస్తుంది. ఇది లైంగిక చర్యల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపించే ఇన్ఫెఫెక్షన్. ఎక్కువసార్లు ఈ ఇన్ఫెక్షన్ కు ఎటువంటి లక్షణాలు ఉండవు. మన రోగనిరోధక వ్యవస్థ చాలాసార్లు దీన్ని తట్టుకోగలుగుతుంది. కాని, కొన్నిసార్లు హైరిస్క్ వైరస్లు పదహారు నుంచి పద్దెనిమిది రకాలు శరీరంలో ఉండిపోతే, గర్భాశయ కణాల్లో మార్పులు వస్తాయి. ఇవి కాలక్రమంలో క్యాన్సర్కి దారితీయవచ్చు. ఇలా క్యాన్సర్గా మారటానికి మూడు నుంచి పదిహేను సంవత్సరాల వరకు పడుతుంది. ఇది కేవలం సర్వైకల్ క్యాన్సర్కే కాకుండా జననాంగ క్యాన్సర్, మలద్వారం, నోటి, గొంతు క్యాన్సర్లు, పురుషుల్లో పురుషాంగ క్యాన్సర్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. ఈ టీకా ఎక్కువ ప్రయోజనం ఇచ్చేది పెళ్లికి ముందే తీసుకుంటే. ఎందుకంటే లైంగికంగా చురుకుగా ఉండే వారిలో ఈ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకు తెలిసిన పదమూడు రకాల వైరస్ల వలన క్యాన్సర్ రావచ్చు. అయితే, ఈ టీకా వాటిలో కొన్ని ముఖ్యమైన రకాల నుంచే రక్షణ ఇస్తుంది. అందుకే టీకాతో పాటు కండోమ్ వాడటం, అవసరమైనప్పుడు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇది నిర్ధారించాలంటే ప్యాప్ టెస్ట్, వైరస్ టెస్ట్ అనే రెండు పరీక్షలు చేయించాలి. ఇవి గర్భాశయ కణాల్లో అసాధారణ మార్పులను ముందే చూపిస్తాయి. అవసరమైతే వెంటనే చికిత్స తీసుకుని క్యాన్సర్ దశకు వెళ్లకుండా అడ్డుకోవచ్చు. వైరస్ టెస్ట్ ద్వారా హైరిస్క్ వైరస్లు ఉన్నాయా లేదా అనే విషయం స్పష్టమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ టీకా వలన సర్వైకల్ క్యాన్సర్, మొటిమలు వచ్చిన వారి సంఖ్య చాలా తగ్గిపోయింది. అందుకే టీకా తీసుకోవడం ఎంతో అవసరం. టీకా తీసుకున్నాక కూడా ప్రతి మూడేళ్లకోసారి లేదా ఐదేళ్లకోసారి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. తొమ్మిది నుంచి నలభై ఐదేళ్ల వయస్సు మధ్యలో ఉన్నవారికి ఈ టీకా ఇవ్వవచ్చు. తొమ్మిది నుంచి పద్నాలుగేళ్ల లోపు వయస్సు కలిగినవారికి రెండు డోసులు వేస్తారు. మొదటి డోసు తర్వాత ఆరు నుంచి పన్నెండు నెలల్లో రెండవ డోసు వేయాలి. పదిహేను నుంచి నలభై ఐదేళ్లవారికి మూడు డోసులు అవసరం. మొదటి డోసు తర్వాత రెండు నెలల్లో రెండవ డోసు, ఆరు నెలల్లో మూడవ డోసు తీసుకోవాలి. ఈ టీకాతో పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది సురక్షితమైంది. కాబట్టి డాక్టర్ను సంప్రదించి వారి పర్యవేక్షణలో తప్పకుండా తీసుకోండి. డాక్టర్ ప్రమత శిరీష, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: గుండె ఆరోగ్యం కోసం బ్రిస్క్ వాకింగ్..! ఎలా చేయాలంటే..) -
మీ జీన్స్లోనే లేదా!
అన్నీ వేదాలలోనే ఉన్నాయన్నట్లు, మొత్తం మన ఆరోగ్య చరిత్రంతా మన జీన్స్లోనే ఉంటుంది. అయితే జీన్స్లో లేకుండా, బయటెక్కడి నుంచో వచ్చి శరీరంలోకి చొర బడి, ఆరోగ్యాన్ని ‘డిస్టర్బ్’ చేసే శక్తుల మాటేమిటి? అది తెలుసుకోవటానికే గత ఇరవై ఏళ్లుగా వైద్య పరిశోధకులు చెట్టూ, పుట్టా గాలిస్తున్నారు. కొండా కోనా ఎక్కి దిగుతున్నారు. పంచభూతాలపై పరిశీలనలు జరుపుతున్నారు. ఏమైనా తేలిందా మరి? త్వరలోనే తేలబోతోందని డాక్టర్ కల్పన బాలకృష్ణన్ అంటున్నారు. చెన్నైలోని ‘శ్రీరామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్’ డీన్ కల్పన.. ఈ పరిశోధనల్లో భారతదేశం చురుగ్గా ఉందని కూడా చెబుతున్నారు!లోపల జన్యువులు.. బయట అన్యశక్తులు‘‘మా డీఎన్ఏలోనే లేదు..’’ అని ధీమాగా అంటుండే వాళ్లలో సైతం గుండె జబ్బులు కనిపిస్తుంటాయి! కారణమేంటి? ‘‘మా బ్లడ్లోనే లేదు...’’ అని కులాసాగా కబుర్లు చెబుతుండే వాళ్లలో హఠాత్తుగా షుగర్ బయట పడుతుంటుంది! కారణమేంటి? ఈ వైరుధ్యాలను తెలుసుకోవటానికే ‘ఎక్స్పోజోమిక్స్’ రంగంలో నేడు అవిశ్రాంత కృషి జరుగుతోంది. జన్యుశాస్త్రాన్ని ‘జెనోమిక్స్’ అన్నట్లే, బయటి నుండి ప్రభావం చూపే అంశాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘ఎక్స్పోజోమిక్స్’ అంటున్నారు! మానవ ఆరోగ్యం అన్నది కేవలం వారి లోపలి జన్యువులపైనే ఆధారపడి ఉండదని; బయట పీల్చే గాలి, తాగే నీరు, ఉండే పరిసరాలు, ఉష్ణోగ్రతలు... ఇవన్నీ చూపే ప్రభావాన్ని బట్టి కూడా ఉంటుందని ఎక్స్పోజోమిక్స్ నిపుణులు ఏనాడో నిర్ధారించుకున్నారు. దాంతో ఈ రంగంలో పరిశోధనలు ముమ్మరం అయి, నేటికీ కొనసాగుతూ ఉన్నాయి. తాజాగా జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వీటిపై అంతర్జాతీయ సమావేశం నిర్వహించింది.భారత్... సహజ ప్రయోగశాలజన్యు నిపుణులను ‘జెనిటిసిస్ట్’లు అన్నట్లు, ఎక్స్పోజోమిక్స్ నిపుణులకు ప్రత్యేకమైన పేరు లేదు. ఎన్విరాన్మెంటల్ సైంటిస్టులు, బయాలజిస్టులు, కెమిస్టులు, ఎపిడెమియాలజిస్టులు, టాక్సికాలజిస్టులు, డేటా సైంటిస్టులు, స్టాటిస్టీషియన్లు, కంప్యూటేషన్ బయాలజిస్టులు అంతా కలిసి ఒక చెయ్యేస్తేనే ‘ఎక్స్పోజోమిక్స్’ అధ్యయనం ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో భారత్ వడివడిగా అడుగులు వేస్తోందని, ఎక్స్పోజోమిక్స్పై త్వరలోనే ఒక స్పష్టతను సాధించనుందని చెబుతున్నారు ‘వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) కొలాబరేటింగ్ సెంటర్ ఫర్ ఆక్యుపేషనల్ ఎన్విరాన్మెంటల్ హెల్త్’ డైరెక్టర్ కూడా అయిన కల్పన బాలకృష్ణన్. ఇటీవలే ఆమె ఎక్స్పోజోమిక్స్పై వాషింగ్టన్ డీసీలోని జా¯Œ ్స హాప్కి¯Œ ్స విశ్వవిద్యాలయం నిర్వహించిన ఫోరమ్లో పాల్గొని వచ్చారు. ఎక్స్పోజోమిక్స్ సైన్స్ పరిశోధనలకు భారత్ ‘సహజ ప్రయోగశాల‘గా మారబోతోందని ఆమె అన్నారు. జినోమ్ సాఫ్ట్... ఎక్స్పోజోమ్ ఫాస్ట్‘ఎక్స్పోజోమిక్స్’ అనే మాట ‘ఎక్స్పోజోమ్’ అనే పదం నుండి పుట్టింది. 2005లో డాక్టర్ క్రిస్టోఫర్ వైల్డ్ ఈ పదాన్ని సృష్టించారు. గర్భస్థ శిశువు మొదలు, జీవిత చరమాంకం వరకు మనుషులపై ఉండే పర్యావరణ ప్రభావాలను అధ్యయనం చేసే శాస్త్రమే ఎక్స్పోజోమిక్స్. వారసత్వంగా, స్థిరంగా ఉండే జీనోమ్లా కాకుండా ఎక్స్పోజోమ్ క్రియాశీలకంగా ఉండి, నిరంతరం పరివర్తన చెందుతూ ఉంటుంది. మనిషి ఆరోగ్య అంశాలతో ఇది లోతుగా ముడిపడి ఉంటుంది. జన్యువులు, జన్యు గ్రహణశీలత మాత్రమే మనుషుల్లో దీర్ఘకాలిక వ్యాధులు ఎందుకు అభివృద్ధి చెందుతాయో చెప్పలేవు. కొందరిలో గుండె జబ్బులు లేదా మధుమేహానికి సంబంధించిన జన్యుపరమైన చిహ్నాలు లేకుండానే, వారు వాటి బారిన పడవచ్చు. దీని వెనుక ఉన్న కారణాలను ‘ఎక్స్పోజోమ్’ అధ్యయనం వివరిస్తుంది. మ్యాపింగ్ అత్యంత కీలకంమానవ జీనోమ్ ప్రాజెక్ట్ ఒక దశాబ్దం వ్యవధిలోనే జన్యు శాస్త్రాన్ని అభివృద్ధి పరచినప్పటికీ, హృదయనాళ వ్యవస్థను ప్రభావితం చేసే వ్యాధులు, అంతఃస్రావ గ్రంథులకు చెందిన ఎండోక్రైన్ రుగ్మతలు, మానసిక ఆరోగ్య సమస్యలను అర్థం చేసుకోటానికి ఒక్క జన్యుశాస్త్రం మాత్రమే సరిపోదు. రసాయన, భౌతిక, జీవ సంబంధ, సామాజిక మనోరుగ్మతలు; జీవనశైలి లేదా జీవన పరిస్థితులతో ఆ రుగ్మతల పరస్పర చర్యల ప్రభావాలను తెలుసుకోటానికి వినూత్నమైన ఉపకరణాలతో పాటుగా ఎక్స్పోజోమ్స్ మ్యాపింగ్ అత్యంత కీలకం. (ఉనికిని గుర్తించి దృశ్యమానం చేసే పటాలను సృష్టించే ప్రక్రియే మ్యాపింగ్). గాలి, నీరు, నేల, ఆహారాలలో వేలాది రసాయన సమ్మేళనాలను ఏకకాలంలో పరీక్షించగల హై రిజల్యూషన్ మాస్ స్పెక్ట్రోమెట్రీ (హెచ్.ఆర్.ఎం.ఎస్.)తో ఇది సాధ్యం అవుతుంది. అయితే, ‘‘మనం ఆశించే ఎ, బి, సి ల కోసం మాత్రమే చూడకుండా, ఉంటాయో ఉండవో తెలియని డి, ఇ, ఎఫ్ లను, ఆ తర్వాతి వాటిని కూడా కనుగొనడానికి ‘లక్ష్య రహిత’ విశ్లేషణ చేయాలి. లేకపోతే, మనకు తెలియని వాటి గురించి మనం ఎప్పటికీ తెలుసుకోలేం’’ అంటారు కల్పన. విశ్లేషణలన్నీ కలిస్తేనే సంపూర్ణం, సఫలంజీవసంబంధమైన ప్రతిస్పందనల విశ్లేషణకు నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్సింగ్ (ఎన్.జి.ఎస్.); జీవక్రియలు, ప్రొటీన్లు, జన్యుశాస్త్ర అధ్యయనాలు సహా, వాటన్నిటికీ ఉపకరించే సాఫ్ట్వేర్ సమాహారం ఎక్స్పోజోమిక్స్లో ముఖ్యమైనవి. ఇవి మన దేహంలోని అంతర్గత వ్యవస్థలు బాహ్య ప్రభావాలకు (ఎక్స్పోజర్లకు) ఎలా స్పందిస్తాయో అర్థం చేసుకోవడానికి తోడ్పడతాయి. రక్తం, మూత్రం, ఇతర కణజాలాల నుండి తీసుకున్న నమూనాలు వీటికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తాయి. అయితే, ఎక్స్పోజోమిక్స్ పరిశోధన ప్రయోగశాలకు మాత్రమే పరిమితమైనది కాదు. అదిప్పుడు వాయు కాలుష్యం, పట్టణ ఉష్ణ దీవులు, వృక్ష విస్తీర్ణం, భూ వినియోగ మార్పుల వంటి భౌతిక ప్రభావాల అధ్యయనం కోసం ఉపగ్రహం ద్వారా సేకరించిన డేటా వంటి వాటిని కూడా కలుపుకుని పోవాలి. అప్పుడే పరిశోధకుల ప్రయత్నాలు సంపూర్ణం, సఫలం అవుతాయి.లోతైన అభ్యాసం.. ఏఐ సహకారం పర్యావరణ సవాళ్లు ఉన్న భారతదేశం వంటి దేశాలలో ఎక్స్పోజోమిక్స్ అధ్యయనం ఎంతో కష్టమైనది. సామాజిక ఆర్థిక స్థితిగతులు కూడా ఆ పరిధిలోకి వస్తాయి. ముఖ్యంగా ఎక్స్పోజోమిక్స్ డేటాలోని సంక్లిష్టతను అర్థం చేసుకోటానికి దానిని మ్యాపింగ్ చేసే ప్రాథమిక గణాంక పద్ధతులకు మించి లోతైన అభ్యాసం, ఏఐ ఆధారిత జీవనశైలి నమూనాల గుర్తింపు అవసరం. ఈ గణన సాధనాలు చాలా కీలకమైనవి. పర్యావరణ నమూనాలు, జీవసంబంధమైన ప్రతిస్పందనలు, జనాభాకు సంబంధించిన భారీ, అంచెలవారీ డేటా కేటగిరీలను అవగాహన చేసుకోవడానికి ఆ నమూనాలు అవసరం. ఉత్తర అమెరికా, యూరోపియన్ దేశాల ఎక్స్పోజోమ్ సంస్థలు తీసుకున్న నమూనాలు అక్కడి కాలుష్యం, భౌగోళిక వైవిధ్యాల మధ్య... మధుమేహం, హృద్రోగాల వంటి వ్యాధుల ప్రమాదాలను విజయవంతంగా అంచనా వేస్తున్నాయి. సవాళ్లలోనే అధ్యయన అవకాశాలుభారతదేశంలో ఎక్స్పోజోమిక్స్ అధ్యయనాలకు అవకాశాలు ఇక్కడి ప్రజారోగ్య సవాళ్లలోనే ఉన్నాయి. పారిశుధ్యలోపం, పరిశుభ్రమైన నీరు లేకపోవడం ఆ సవాళ్లలో ప్రధానమైనవి. అల్ట్రా–ప్రాసెస్డ్ ఫుడ్, వాయు కాలుష్యం, సామాజిక మనోరుగ్మతల ఒత్తిడి వంటివి కూడా వీటిలో ఉన్నాయి. పైగా భారతదేశం ఒంటరి శాస్త్రీయ విధానాలపై ఆధారపడుతోంది. ‘‘నిజానికి ఎక్స్పోజోమిక్స్లో ప్రపంచంతో కలిసి పనిచేయటానికి భారతదేశం అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది..’’ అని దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పర్యావరణ ఆరోగ్యం, ప్రాదేశిక శాస్త్రాల అసోసియేట్ ప్రొఫెసర్ రిమా హాబ్రే అన్నట్లు కల్పన తెలిపారు. ఇటీవల అహ్మదాబాద్ జరిగిన ఐ.సి.ఎం.ఆర్–ఎన్.ఐ.ఓ.హెచ్ సమావేశంలో వీరిద్దరూ భారత్లో జరుగుతున్న ఎక్స్పోజోమిక్స్ అధ్యయనాలపై చర్చించారు. గ్రహణం ఆన్ డిమాండ్! సూర్యగ్రహణం కావాలా? ఆర్డర్ పెడితే వస్తుంది! నిజం, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) ‘ప్రోబా 3’ అనే డబుల్ స్పేస్క్రాఫ్ట్ మిష¯Œ ద్వారా ఒక కృత్రిమ సూర్యగ్రహణం సృష్టించింది. తాజాగా ఆ మొదటి కృత్రిమ గ్రహణం ఫోటోలు కూడా విడుదల చేసింది. ఇది ఆకాశంలో ఒక అద్భుత ప్రదర్శన. రెండు ఉపగ్రహాల్లో ఒకటి ‘ఆక్యుల్టర్ స్పేస్క్రాఫ్ట్’ సూర్యుడిని కప్పేసుంటే, మరొకటి ‘కరోనాగ్రాఫ్ స్పేస్క్రాఫ్ట్’ సూర్యుడిని పరిశీలిస్తుంది. వీటి మధ్యలో కచ్చితంగా 150 మీటర్ల దూరం. అంతే కాదు, ఇక ‘గ్రహణం కేవలం కొన్ని నిమిషాలే’ అన్నది పాత కథ! సెకన్లపాటు వచ్చే సహజ గ్రహణాల మధ్య ఇది ఏకంగా 6 గంటల పాటు కొనసాగింది. అంతేకాదు, ప్రతి 19.6 గంటలకోసారి ఒక కొత్త సూర్యగ్రహణాన్ని సృష్టించవచ్చు. పూర్తిగా మనుషుల చేతుల్లోనే అంతా ఉంటుంది. ఇక గ్రహణం కోసం ఆకాశం కేసి వేచి చూడాల్సిన రోజులు పోయాయి. మనకిష్టమైనప్పుడు గ్రహణాలను షెడ్యూల్ చేసుకోవచ్చు! శాస్త్రవేత్తలు దీనిని ‘ప్రపంచంలోనే ఇది, తొలి ప్రిసిషన్ ఫార్మేషన్ ఫ్లైయింగ్ మిషన్’గా ప్రకటించారు. అయితే, ఇది మొదటి అడుగు మాత్రమేనని, భవిష్యత్తులో సూర్యుని మరిన్ని రహస్యాలను తెలుసుకునే అవకాశం ఉందని తెలిపారు.· -
పోల్చుకోవద్దు.. కుంగిపోవద్దు!
‘‘ఇతరులతో పోల్చుకోవడం ప్రేరణను ఇవ్వకపోగా మనల్ని మనమే నాశనం చేసుకునేలా చేస్తుంది’’ అని ఒక స్కూల్ వర్క్షాప్లో చెప్పినప్పుడు ఒక పేరెంట్ లేచారు. ‘‘వాళ్లలా నేనెందుకు సక్సెస్ కాలేకపోతున్నాను నాన్నా? అని మా బాబు చాలాసార్లు అడుగుతాడు సర్! ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక నాలో నేనే బాధపడతాను’’ అని తన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రోజుకు ముగ్గురు, నలుగురు విద్యార్థులు కౌన్సెలింగ్ కోసం మా సెంటర్కు వస్తుంటారు. వాళ్లకు 90 శాతం మార్కులు వస్తున్నా, ఫెయిల్యూర్లా ఫీలవుతుంటారు. కారణం ఇతరులతో పోల్చుకోవడం. ఈ సమస్యతో పిల్లలు, విద్యార్థులే కాదు, లక్షల కుటుంబాలు బాధపడుతున్నాయి. కాస్తంత గమనిస్తే, ఇది అందరికీ తెలిసే విషయమే!అసలేంటీ కంపేరిజన్ సిండ్రోమ్? మనిషి తనను తాను అర్థం చేసుకునేందుకు ఇతరులతో పోల్చుకుంటాడు. అది సహజం. కానీ టెక్నాలజీ, సోషల్ మీడియా, టాప్ ర్యాంక్స్, పక్కింటి పిల్లలతో పోలికలు– ఇవన్నీ ఇప్పుడు పిల్లల మనసుల్లో భయాన్ని, ఆందోళనను, న్యూనత భావాన్ని నింపుతున్నాయి. ఇలా ఇతరులతో పోల్చుకుని తనను తాను తక్కువ చేసుకోవడమే కంపేరిజన్ సిండ్రోమ్.సోషల్ కంపేరిజన్ సిద్ధాంతాన్ని 1954లో లియోన్ ఫెస్టింజెర్ అనే సైకాలజిస్ట్ ప్రతిపాదించాడు. మన అసలైన విలువను పక్కన పెట్టి, ఇతరుల ప్రమాణాలతో మన జీవితం నడపడమే దీని లక్షణం. ఈ పోలికలు వాళ్లకంటే తక్కువగా ఉన్నవారితో లేదా మెరుగ్గా ఉన్నవారితో జరగొచ్చు. పోలికలు నెగటివ్ దిశలో ఎక్కువగా జరిగితే ఆత్మన్యూనత, అసంతృప్తి, ఆత్మనింద పెరుగుతాయి.పది పరిష్కార మార్గాలుకంపేరిజన్ అనేది ఒక ట్రాప్. ఏ రెండు వేలిముద్రలూ ఒకలా ఉండనట్లే, ఏ ఇద్దరు విద్యార్థులూ ఒకేలా ఉండరు, ఒకేలా చదవరు, చదవలేరు. కాబట్టి ఈ కంపేరిజన్ ట్రాప్ నుంచి బయటపడితేనే మీ అసలైన ప్రతిభ కనిపిస్తుంది. అందుకోసం ఈ పది మార్గాలు పాటించండి. 1. ఇతరులతో పోల్చుకోవడం ఆపండి. ‘‘నిన్న కంటే నేడు ఏం మెరుగయ్యాను?’ అని ప్రశ్నించుకుని మీ ప్రోగ్రెస్ను గమనించండి. 2, సోషల్ మీడియా ఒక ఫిల్టర్ చేసిన ప్రపంచం. ఇన్స్టాగ్రామ్లో ఎవరి విజయమూ ఫుల్ స్టోరీ కాదు. మీ ప్రయాణం నిజమైనదిగా, నిజాయితీగా ఉంటే చాలు.3. ప్రయత్నం మీద ఫోకస్ చేయండి. ఎంతసేపు కష్టపడ్డారు, ఎలా ఫోకస్ చేశారన్నదే అసలైన విజయానికి సూచిక.4. మీ బలాల జాబితా తయారు చేసుకోండి. ‘నాలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి?’ అని రాసుకోండి.5. మైండ్ఫుల్ బ్రేకులు తీసుకుంటూ ఒత్తిడిని తగ్గించుకోండి. పోలిక వల్ల వచ్చే నెగటివ్ భావాల నుంచి బయటపడేందుకు ప్రతిరోజూ పది నిమిషాల సేపు మైండ్ఫుల్నెస్ను ప్రాక్టీస్ చేయండి.6. పరీక్షలు ఓ పోటీ కాదు, నేర్చుకునే ప్రయాణం అని గుర్తుంచుకోండి. ఫలితాల కోసమే కాకుండా, అభివృద్ధి కోసం చదవండి.7. ఇతరులు చేసిన విమర్శలు మీ విలువకు ప్రమాణం కాదు. ఏదైనా కామెంట్, మెసేజ్ వల్ల తక్కువగా ఫీలవకండి. అది వాళ్ల అభిప్రాయం మాత్రమే అని గుర్తించండి. 8. మీ సొంత లక్ష్యాలపై స్పష్టత కలిగి ఉండండి. ఇతరులు ఎటు పోతున్నారన్న దానికన్నా, మీరు ఎందుకు చదువుతున్నారన్న దానిపై దృష్టి పెట్టండి.9. తప్పుల నుంచి నేర్చుకోండి. తప్పు చేయడమంటే ఫెయిలవ్వడం కాదు, నేర్చుకునే అవకాశ అనే దృష్టితో చూడండి. 10. మీరు వేరెవరిలానో మారాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు అంగీకరించుకోండి. మీ బాటలో మీరున్నారని నమ్మండి. మీ బిడ్డ కంపేరిజన్ ట్రాప్లో ఉన్నట్లు ఎలా తెలుసుకోవాలి?‘నాకు రాదు’ అనే మాట తరచూ వినిపిస్తేసోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపితే · ‘వాళ్లు మంచి మార్కులు తెచ్చుకున్నారు’ అని తరచూ చెప్తుంటే మిగిలినవాళ్ల విజయాలను చూసి తనదే తప్పులా భావిస్తేవిద్యార్థులకు ఎదురయ్యే ఇబ్బందులుఇతరుల విజయాలను చూస్తూ తానేం సాధించలేనన్న భావనలో బందీలవుతారు. తమ ప్రయత్నాల వల్ల ఉపయోగం లేదనుకోవడంతో చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. ఎప్పుడూ తప్పులపైనే దృష్టి పెడుతుండటం వల్ల తమను తామే నిందించుకుంటారు. దీనివల్ల జ్ఞాపకశక్తి, సృజనశీలత దెబ్బతింటాయి. ఇతరుల విజయాలు, తమ లోపాలపైనే దృష్టి పెట్టడం వల్ల ఎవరితో మాట్లాడకుండా, కలవకుండా ఒంటరవుతారు. పదే పదే పోల్చుకోవడం వల్ల ఒత్తిడి, నిరాశ, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్కు దారితీయవచ్చు. సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com(చదవండి: జస్ట్ 30 నిమిషాల పనికి రూ. 18 వేలు..! కార్పొరేట్ ఉద్యోగి రేంజ్లో..) -
రహస్య నగరాలు
ప్రపంచంలో ఎన్నో నగరాలు ఉన్నాయి. వీటిలో చారిత్రక ప్రాశస్త్యం గల నగరాలు కొన్ని; ఆధ్యాత్మిక ప్రాధాన్యం గల నగరాలు ఇంకొన్ని; పర్యాటక ఆకర్షణలు గల నగరాలు మరికొన్ని ఉన్నాయి. ఇలాంటి నగరాల గురించి చాలామందికి తెలుసు. వీటికి భిన్నంగా ప్రపంచంలో అక్కడక్కడా రహస్య నగరాలు కూడా ఉన్నాయి. వీటి గురించి బయటి ప్రపంచానికి ఏమీ తెలియదు. ప్రపంచ పటాల్లో కూడా ఈ నగరాలు కనిపించవు. అలాంటి కొన్ని రహస్య నగరాల గురించి, ఆ నగరాల్లో జరిగే కార్యకలాపాల గురించి తెలుసుకుందాం.సిటీ 40ఇది రష్యాలో ఉంది. సోవియట్ ప్రభుత్వం 1946లో అణ్వాయుధాల తయారీ కోసం ఏర్పాటు చేసిన రహస్య నగరాల్లో ఇదొకటి. ఈ నగరంలో దాదాపు లక్షమందికి పైగా జనాభా ఉండేవారు. ఇక్కడకు ఇతరుల రాకపోకలపై కట్టుదిట్టమైన ఆంక్షలు ఉండేవి. రష్యాలోని మిగిలిన నగరాలు, పట్టణాల్లోని పౌరుల కంటే ఈ రహస్య నగరంలోని పౌరులకు నిత్యావసరాల సరఫరా మొదలుకొని రకరకాల సౌకర్యాలు చాలా మెరుగ్గా ఉండేవి. చుట్టూ ఎత్తయిన ఇనుప కంచెల మధ్యనున్న ఈ నగరంలో ఇప్పటికీ ‘అణు’ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇదివరకు ఇక్కడ కొన్ని అణు ప్రమాదాలు జరిగినా, వాటి వివరాలు బయటి ప్రపంచానికి తెలియకుండా నాటి సోవియట్ ప్రభుత్వం కప్పిపుచ్చింది. చెర్నోబిల్ దుస్సంఘటన ప్రపంచాన్ని కుదిపేసిన తర్వాతే ‘సిటీ 40’లో కూడా అణు ప్రమాదాలు జరిగిన సంగతి తెలిసింది. వాతావరణంలో అణు ధర్మాకత నిండి ఉన్న ఈ నగరంలో ఇప్పటికీ జనాలు నివసిస్తున్నారు. కార్మికులు పనులు సాగిస్తూనే ఉన్నారు. ఈ నగరం మ్యాపుల్లో కనిపించదు. అంతేకాదు, ఇక్కడి పౌరుల వివరాలు కూడా ప్రభుత్వ రికార్డుల్లో కనిపించవు.ఇది రష్యాలో ఉంది. ఇప్పటి తరానికి చెందిన రష్యన్లలో చాలామందికి ఈ నగరం ఒకటి ఉందనే సంగతి కూడా తెలియదు. ఎందుకంటే, ఈ నగరాన్ని రష్యా మ్యాపుల నుంచి 1947లోనే తొలగించారు. ఇదివరకు దీనిని ‘అర్జామాస్–16’ అనే పేరుతో పిలిచేవారు. సోవియట్ హయాంలో ఇక్కడ అణ్వాయుధాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాక, దీనిని మ్యాపుల నుంచి తొలగించారు. అప్పట్లో ఏర్పాటు చేసిన అణ్వాయుధ తయారీ కేంద్రం ఇప్పటికీ పనిచేస్తోంది. ఈ నగరాన్ని మ్యాపుల నుంచి తొలగించిన విషయాన్ని రష్యా ప్రభుత్వం 1994లో తొలిసారిగా అంగీకరించింది. ఈ నగరంలో పద్దెనిమిదో శతాబ్ది నాటి చర్చి ఉంది. సెయింట్ సెరాఫియన్ ఈ చర్చిలో ప్రార్థనలు జరిపేవారు. ప్రేమ, కరుణ, మానవత్వం వంటి అంశాలపై తన బోధలు వినిపించేవారు. ఆయన బోధలకు భిన్నంగా ఇక్కడ భీకర హింసకు దారితీసే అణ్వాయుధాల తయారీ కొనసాగుతుండటమే విచిత్రం.బర్లింగ్టన్ బంకర్ఇది ఇంగ్లండ్లో ఉంది. నిజానికి ఇది నగరం కాదు. కేవలం ఒక సువిశాల భూగర్భ స్థావరం మాత్రమే! అయితే, ఇందులో అభివృద్ధి చెందిన నగరాల్లో ఉండే సమస్త సౌకర్యాలూ ఉన్నాయి. కర్మకాలి ఎప్పుడైనా అణు యుద్ధం తటస్థిస్తే, ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారికి భద్రత కల్పించడానికి యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం ఈ భూగర్భ నగరాన్ని 1950లలో నిర్మించింది. బ్రిటిష్ రాచకుటుంబ సభ్యులు సహా ప్రభుత్వంలోని కీలక పదవుల్లో ఉండే నాలుగువేల మంది ఇందులో సురక్షితంగా ఆశ్రయం పొందడానికి అన్ని ఏర్పాట్లూ ఉన్నాయి. ఈ స్థావరాన్ని ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి నిర్మించి, దశాబ్దాలు గడిచినా దీనిని వినియోగించుకునే అవసరం ఏర్పడలేదు. అవసరం లేని ఈ నిర్మాణానికి ఏటేటా నిర్వహణ వ్యయం పెరుగుతూ రావడంతో ప్రభుత్వం 2016లో దీనిని కారుచౌకగా కేవలం 1.5 మిలియన్ పౌండ్లకు (రూ.17.42 కోట్లు) అమ్మకానికి పెట్టింది. అయినా ఇప్పటి వరకు దీనిని కొనుక్కోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ప్రభుత్వం దీనిని అమ్మకానికి పెట్టేంత వరకు జనాలకు దీని గురించి తెలియదు.ఓక్రిడ్జ్ఇది అమెరికాలో ఉంది. రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్న కాలంలో అమెరికా, దాని మిత్ర దేశాలు యుద్ధాన్ని వీలైనంత త్వరగా పరిసమాప్తం చేయడానికి అణుబాంబు ప్రయోగించడం ఒక్కటే మార్గమని తలచాయి. అణుబాంబు తయారీ కోసం రహస్య స్థావరం, ఆ స్థావరానికి తగిన ఏర్పాట్లు కావలసి వచ్చాయి. అందువల్ల అమెరికా ప్రభుత్వం టెనసీ రాష్ట్రంలోని నాక్స్విల్కు పడమరన నలభై కిలోమీటర్ల దూరంలో అరవైవేల ఎకరాల ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసి, 1943లో ఈ రహస్య నగరాన్ని నిర్మించింది. ఇక్కడ పెద్దసంఖ్యలో సైనికులు, శాస్త్రవేత్తలు, కార్మికులు పనిచేసేవారు. ఈ రహస్య పట్టణాన్ని అమెరికా తన మ్యాపుల్లో చూపలేదు. ఇక్కడ పనిచేసే కార్మికులకు తాము చేసే పని తప్ప, ఇక్కడ జరిగే కార్యకలాపాలేవీ తెలిసేవి కావు. కొంతకాలం పనిచేశాక ఓక్రిడ్జ్లోని శాస్త్రవేత్తలు అణుబాంబు తయారీకి కీలకమైన శుద్ధి చేసిన యురేనియంను తయారు చేయగలిగారు. ఇక్కడ రెండు యురేనియం శుద్ధి కర్మాగారాలు, ఒక ప్లూటోనియం శుద్ధి కర్మాగారం పనిచేసేవి. దీని గురించి సాధారణ పౌరులకు వివరాలేవీ తెలియవు.క్యాంప్ సెంచరీఇది గ్రీన్లాండ్లో ఉంది. బయటి నుంచి చూస్తే, ఇది మంచుకొండల్లో ఏర్పడిన గుహలా కనిపిస్తుంది గాని, నిజానికి ఇది సువిశాల భూగర్భ నగరానికి ప్రవేశమార్గం. గ్రీన్లండ్ భూభాగంలో అమెరికా ఏర్పరచుకున్న రహస్య సైనిక స్థావరం ఇది. సోవియట్ కాలంలో రష్యా–అమెరికాల నడుమ ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న కాలంలో రష్యాను దీటుగా ఎదుర్కొనే లక్ష్యంతో అమెరికా దీనిని నిర్మించింది. భూగర్భంలో నాలుగువేల కిలోమీటర్ల పొడవున సొరంగ రహదారులతో సైనిక అవసరాలకు కావలసిన శాస్త్ర సాంకేతిక పరిశోధనల కోసం అమెరికా భారీ వ్యయంతో ఈ భూగర్భ నగరాన్ని నిర్మించుకుంది. ‘ప్రాజెక్ట్ ఐస్ వర్మ’ పేరుతో ఇక్కడ సైనిక పరిశోధనలు సాగించింది. ఈ నగరంలో శాస్త్రవేత్తలు, సైనికాధికారులు, ఇతర సిబ్బంది, వారి కుటుంబాలు నివసించడానికి కావలసిన సకల సౌకర్యాలూ ఉన్నాయి. వారి కోసం ఒక సినిమా థియేటర్, ఒక ప్రార్థన మందిరం కూడా ఉండటం విశేషం.వన్స్డార్ఫ్ఇది జర్మనీలో ఉంది. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ రహస్య నగరాన్ని జర్మన్ రాజ్యం 1871లో నిర్మించింది. అప్పట్లో ఇక్కడ ముస్లిం ఖైదీలను బంధించేవారు. వారి కోసం ఇక్కడ మసీదు కూడా నిర్మించారు. ఇదే జర్మనీలోని తొలి మసీదు. నాజీల ప్రాబల్యం పెరిగాక, 1935 నుంచి రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్న కాలంలో ఇది నాజీల ప్రధాన రహస్య స్థావరంగా ఉండేది. తర్వాత సోవియట్ రెడ్ ఆర్మీ వశమైంది. అప్పట్లో సోవియట్ సైనికులు వారి కుటుంబాలతో ఇక్కడ నివసించేవారు. దాదాపు 75 వేల జనాభా ఉండే ఈ నగరం ‘లిటిల్ మాస్కో’గా, ‘ఫర్బిడెన్ సిటీ’గా పేరుమోసింది. అమెరికాతో ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న కాలంలో రష్యన్ బలగాలు ఇక్కడి నుంచి రహస్య కార్యకలాపాలు సాగించేవి. ఇప్పుడు ఈ నగరం శిథిలావస్థకు చేరుకుంది. నగరం నడిబొడ్డున సోవియట్ బలగాలు నెలకొల్పిన లెనిన్ విగ్రహం మాత్రం ఆనాటి కార్యకలాపాలకు సాక్షీభూతంగా నిలిచి ఉంది. -
లీప్ ఇయర్ పత్రిక
ప్రపంచంలో రకరకాల పత్రికలు ఉన్నాయి. దినపత్రికలు, వారపత్రికలు, మాసపత్రికలు సర్వసాధారణంగా అందరికీ తెలిసివే! అక్కడక్కడా ద్వైమాసిక పత్రికలు, త్రైమాసిక పత్రికలు కూడా ఉన్నాయి. అరుదుగా ఏడాదికి రెండుసార్లు మాత్రమే ప్రచురితమయ్యే అర్ధవార్షిక పత్రికలు, ఏడాదికి ఒకే సంచికను వెలువరించే వార్షిక పత్రికలు కూడా ఉంటాయి. ఫ్రాన్స్ నుంచి వెలువడే ‘లా బూజీ డి సాపోర్’ అనే ఈ పత్రిక మాత్రం అలాంటిలాంటి పత్రిక కాదు. ప్రపంచంలోని పత్రికలన్నింటిదీ ఒకదారి అయితే, ఈ పత్రికది మరోదారి. జన్మానికో శివరాత్రి అన్నట్లుగా ఈ పత్రిక క్రమం తప్పకుండా ప్రతి నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే ప్రచురితమవుతుంది. అది కూడా ఠంచనుగా ప్రతి లీపు సంవత్సరంలో ఫిబ్రవరి 29వ తేదీన ఇది విడుదలవుతుంది. లీపు సంవత్సరం వచ్చిందంటే చాలు, దీనికోసం పెద్దసంఖ్యలో పాఠకులు ఎదురుచూస్తూ ఉంటారు.అలా మొదలైంది...హాస్య, వ్యంగ్య కథనాలను ప్రధానంగా ప్రచురించే ఈ పత్రిక 1980లో మొదలైంది. ఇప్పటి వరకు ఈ పత్రిక వెలువరించినవి పన్నెండు సంచికలు మాత్రమే! పెద్దగా వ్యాపార ప్రణాళికలు, ఘనమైన లక్ష్యాలు వంటివేవీ లేకుండానే ఈ పత్రిక ఇద్దరు మిత్రుల చిలిపి ఆలోచన ఫలితంగా పుట్టుకొచ్చింది. జాక్వెస్ డి బుయిసన్, క్రిస్టియన్ బెయిలీ అనే మిత్రులు కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటున్నపుడు ‘లీపు సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటాయి కదా, ప్రతిసారీ ఫిబ్రవరి 29న విడుదలయ్యేలా ప్రత్యేకంగా ఒక పత్రికను తీసుకొస్తే భలేగా ఉంటుంది కదా!’ అని అనుకున్నారు. జాక్వెస్ పాలిటెక్నీషియన్, క్రిస్టియన్ ఔత్సాహిక ప్రెస్ టెక్నీషియన్– అంతేకాకుండా, పాతపత్రికల సేకర్త కూడా! ఇద్దరూ కలసి ఎలాగైనా, ఫిబ్రవరి 29న విడుదలయ్యేలా పత్రిక ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చారు. పత్రికకు ఏ పేరు పెడదామని ఆలోచించారు. పంతొమ్మిదో శతాబ్ది చివరిరోజుల నాటి కార్టూన్ క్యారెక్టర్ ‘సాపర్ కామెంబర్’ గుర్తొచ్చింది. ఆ కార్టూన్ పాత్ర ఫిబ్రవరి 29న వస్తుంది. నాలుగేళ్లకు ఒకసారి పుట్టినరోజు జరుపుకొనే ఆ పాత్ర బోలెడంత హాస్యం సృష్టిస్తుంది. అందుకే, ఆ పాత్ర గుర్తొచ్చేలాంటి పేరు పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ‘లా బూజీ డి సాపోర్’ (సాపర్స్ క్యాండిల్) అనే పేరు పెట్టారు. తొలి సంచికను 1980 ఫిబ్రవరి 29న ఇరవై పేజీలతో టాబ్లాయిడ్ సైజులో విడుదల చేశారు. మార్కెట్లోకి విడుదలైన కాపీలు హాట్కేకుల్లా అమ్ముడైపోయాయి. అప్పటి నుంచి ఈ పత్రిక ప్రతి లీపు సంవత్సరంలోను ఫిబ్రవరి 29న ఠంచనుగా మార్కెట్లోకి తన సంచికను విడుదల చేస్తోంది. ప్రస్తుతం జీన్ డి లిండీ ఈ పత్రికకు ప్రధాన సంపాదకుడిగా కొనసాగుతున్నారు. హాస్యరస ప్రధానంప్రధానంగా ఇది హాస్యరస ప్రధానమైన పత్రిక. ఎక్కువగా హాస్య, వ్యంగ్య కథనాలను ప్రచురిస్తుంది. అయినా, దీనిపైన రాజకీయ విమర్శలు లేకపోలేదు. జాతీయ అతివాదానికి ఈ పత్రిక మద్దతుగా కథనాలను ప్రచురిస్తోందని కొన్ని ఫ్రెంచ్ పత్రికల్లో కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే, తమది పూర్తిగా రాజకీయాలకు అతీతమైన పత్రిక అని ప్రధాన సంపాదకుడు జీన్ డి లిండీ చెప్పుకుంటారు. ఈ పత్రిక ప్రతులు ఫ్రాన్స్లోనే కాకుండా బెల్జియం, స్విట్జర్లండ్, లగ్జెంబర్గ్, కెనడా దేశాల్లో కూడా అమ్ముడవుతాయి. చివరిగా 2024లో విడుదలైన ఈ పత్రిక ప్రతులు రెండు లక్షలకు పైగా అమ్ముడయ్యాయి. ‘మేం ప్రచురించే ప్రతి సంచికలోనూ గడచిన నాలుగేళ్లలో జరిగిన రాజకీయ పరిణామాలను సింహావలోకనం చేస్తాం. అలాగని మాది రాజకీయ పత్రిక కాదు. రాజకీయాలకు అతీతంగా మేం పత్రికను నడుపుతున్నాం. బ్రెగ్జిట్ మొదలుకొని పర్యావరణ మార్పుల వరకు రకరకాల సమస్యలను మా పత్రికలో చర్చిస్తుంటాం. కథనాలు హాస్యస్ఫోరకంగా, వ్యంగ్యంగా ఉంటే పాఠకులను త్వరగా ఆకట్టుకోగలవని మా ఉద్దేశం. నవ్వు ఆరోగ్య లక్షణం. పాఠకులను నవ్వించాలనేదే మా లక్ష్యం’ అంటారు ఈ పత్రిక ప్రధాన సంపాదకుడు జీన్ డి లిండీ. ఈ పత్రిక 2024 సంచిక ధర 4.90 యూరోలు. మిగిలిన పత్రికల్లాగానే ఈ పత్రికను కూడా మార్కెట్లోకి విడుదలైనప్పుడు కొనుక్కోవచ్చు. ఎప్పటి సంచికను అప్పుడు కాకుండా, ఒకేసారి చందా కట్టాలనుకుంటే, 100 యూరోలు చందా కట్టినట్లయితే, వందేళ్ల పాటు– అంటే, పాతిక సంచికలు అందుతాయి. ప్రపంచ పత్రికా రంగంలో ఈ ఫ్రెంచ్ పత్రికది ఒక విలక్షణమైన కథ. -
మంత్ర తంత్రశాస్త్రాల మహిమ
బృహస్పతి నుంచి లౌకిక శాస్త్రాల ఘనతను సోదాహరణంగా తెలుసుకున్నాడు ఇంద్రుడు. మోక్షసాధనకు బ్రహ్మవిద్య ఉండగా, మరి మంత్ర తంత్రశాస్త్రాలు ఎందుకు ఉన్నాయి? వాటి వల్ల ప్రయోజనం ఏముంది? అనే సందేహం కలిగింది అతడికి. అదే సందేహాన్ని దేవగురువు వద్ద బయటపెట్టాడు.‘ఆచార్యా! మోక్షసాధనకు బ్రహ్మవిద్య ఒక్కటి సరిపోతుంది కదా? మరి అలాంటప్పుడు మంత్ర తంత్రశాస్త్రాలు ఎందుకు పుట్టుకొచ్చాయి? వాటి వల్ల సాధించే ప్రయోజనం ఏముంటుంది? ఈ మంత్ర తంత్ర విద్యలు క్షుద్రప్రయోజనాల కోసం దుర్వినియోగానికి లోనయ్యే అవకాశాలు ఎక్కువ కదా? వీటి వెనుకనున్న మర్మమేమిటి?’ బృహస్పతిని అడిగాడు ఇంద్రుడు. ‘శచీపతీ! మంత్ర తంత్రశాస్త్రాల ప్రయోజనం ఏమిటనేగా నీ సందేహం? నీకు బాగా అర్థం కావడానికి ఒక కథ చెబుతాను, శ్రద్ధగా విను’ అంటూ బృహస్పతి ఆ కథను ఇలా చెప్పసాగాడు.‘పూర్వం విశాలనగరంలో వేదశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సకల శాస్త్రకోవిదుడు, తత్త్వజ్ఞుడు. అంతేకాదు, బహిరంతరేంద్రియ నిగ్రహం గలవాడు, ధర్మపరాయణుడు. వైదిక కర్మలను తు.చ. తప్పక పాటించేవాడు. గృహస్థాశ్రమ జీవనం సాగిస్తూ, అతిథి అభ్యాగతులను ఆదరించేవాడు. కొన్నాళ్లకు వేదశర్మకు ఒక కొడుకు కలిగాడు. అతడికి సుశీలుడు అని నామకరణం చేశాడు. సుశీలుడి పురాకృత పాపకర్మల ఫలితంగా పుట్టినప్పటి నుంచి ఆ బాలుడిని ఏడుగురు బ్రహ్మరాక్షసులు ఆవహించారు. ఆ ఏడుగురు బ్రహ్మరాక్షసులు పరస్పరం కలహించుకుంటూ, ఒకరినొకరు వధించుకునేందుకు నిరంతరం ప్రయత్నాలు చేసేవారు. వారి ప్రభావానికి సుశీలుడు విలవిలలాడుతూ రోదించేవాడు. ఒక్కోసారి రాక్షసుల ప్రభావంతో అతడికి ఉన్మాదం ప్రకోపించి, ఊరకే నవ్వుతూ నృత్యం చేసేవాడు. ఒక్కోసారి అకస్మాత్తుగా మూర్ఛపోయేవాడు. ఎదుగుతున్న కొద్ది సుశీలుడి చేష్టలు కొంత వింతగాను, మరింత విపరీతంగాను ఉండేవి. ఒక్కోసారి అతడు తినడం మొదలుపెడితే, ఇది తినదగినది, ఇది తినదగినది కాదు అనే విచక్షణ లేకుండా అమితంగా తినేవాడు. ఒక్కోసారి రోజుల తరబడి పస్తులుండేవాడు. కొడుకు తీరు చూస్తూ, వేదశర్మ దంపతులు ఆవేదన చెందేవారు. తన కొడుకును ఏ దయ్యాలో భూతాలో పట్టుకుని ఉంటాయని భావించిన వేదశర్మ, వాటిని వదిలించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. హోమాలు, నోములు, తీర్థయాత్రలు వంటివి ఎన్ని చేసినా, ప్రయోజనం లేకపోయింది. ఇంట్లో కొడుకు వల్ల తీరని ఇబ్బంది ఉన్నా, వేదశర్మ ఎన్నడూ తన గార్హస్థ్య ధర్మాన్ని మానుకోలేదు. ప్రతిరోజూ అతిథిపూజ చేసిన తర్వాతే తాను భుజించేవాడు.ఒకనాడు వేదశర్మ వైశ్వదేవం ముగించుకుని, అతిథి ఎవరైనా రాకపోతారా అని గుమ్మం వద్ద ఎదురుచూస్తూ ఉన్నాడు. ఇంతలోగా ఇంటి ముందుకు ఒక భిక్షువు వచ్చాడు. ఒళ్లంతా మట్టికొట్టుకుని ఉన్నాడు. చీలికలైన దుస్తులతో, దుర్గంధమయంగా ఉన్నాడు. అతడి శరీరం మీద ఈగలు ముసురుతూ ఉన్నాయి. ‘అభ్యాగతః స్వయం విష్ణుః’ అనే ఆర్యోక్తి ప్రకారం వేదశర్మ అతడిని సాదరంగా ఆహ్వానించాడు. అర్ఘ్యపాద్యాలు ఇచ్చి, ఇంటి లోపలికి తీసుకుపోయి, భోజనం పెట్టించాడు. అతిథి భోజనం తర్వాత వేదశర్మ తాను కూడా ప్రసాదం స్వీకరించి వచ్చి, భిక్షువుకు వింజామర వీచసాగాడు. ఈ అతిథి సాక్షాత్తు దత్తాత్రేయుడే కావచ్చు అనే ఆలోచన వేదశర్మ మనసులో మెదిలింది. దత్తాత్రేయుడు ఈ నగరంలోనే సంచరిస్తూ, ఇళ్లకు వెళ్లి భిక్ష స్వీకరిస్తున్నట్లు కొద్దిరోజుల కిందటే విన్నాడతను. ఈయనే గనుక దత్తాత్రేయుడు అయినట్లయితే తన జన్మ ధన్యమైనట్లేనని భావించాడు. అంతలోనే ఆ భిక్షువు లేచి, ‘ఇక బయలుదేరుతాను’ అంటూ బయటకు నడిచాడు. వేదశర్మ అతడి వెంటపడ్డాడు. భిక్షువు పొమ్మంటున్నా వినిపించుకోకుండా, అతడినే అనుసరించసాగాడు. వేదశర్మ ఎంత చెప్పినా వినకుండా తన వెంటే వస్తుండటంతో విసుగెత్తిన భిక్షువు అతడి మీదకు చేతికందిన రాయి, కట్టె వంటివి విసరసాగాడు. వాటి దెబ్బలకు నెత్తురోడుతున్నా లెక్కచేయకుండా, వేదశర్మ అతడి వెంటే ముందుకు నడవసాగాడు. కొంత దూరం వెళ్లాక దారిలో ఒక గాడిద కళేబరం కనిపించింది. భిక్షువు ఆ గాడిద శరీరం నుంచి ఇంత మాంసం ముద్దను పెకలించి, ‘ఇంద తిను’ అని వేదశర్మ చేతుల్లో పెట్టాడు. వేదశర్మ దానిని ప్రసాదంలా భక్తిగా దోసిట్లో పట్టుకుని, అతడి వెంట నడవసాగాడు. వేదశర్మను చేరువకు రానిచ్చి, భిక్షువు అతడిని కాలితో చాచిపెట్టి తన్నాడు. వేదశర్మ ఆ తాపును తట్టుకుని నిలబడ్డాడు. ఈలోగా భిక్షువు పరుగులాంటి నడకతో ముందుకు సాగి, ఒక కొండ గుహలోకి దూరాడు. వేదశర్మ కూడా ఆ కొండ గుహలోకి వెళ్లాడు.‘ఏమయ్యా నువ్వు! తిట్టినా కొట్టినా వదలకుండా నా వెంటపడ్డావు?’ అడిగాడు భిక్షువు.వేదశర్మ భోరున విలపిస్తూ అతడి పాదాలపై పడ్డాడు. తన కొడుకు దురవస్థను చెప్పి, అతడి దుఃఖాన్ని తొలగించమని అభ్యర్థించాడు. భిక్షువు ప్రసన్నుడయ్యాడు. ఏడు మంత్రాలను బీజాక్షర సహితంగా వేదశర్మకు ఉపదేశించాడు.‘నీ కొడుకును ఏడుగురు బ్రహ్మరాక్షసులు పట్టి పీడిస్తున్నారు. వారిని ఒక్కొక్కరినే వదలగొట్టాలి. రోజుకొక మంత్రాన్ని జపించు. మంత్రోదకాన్ని నీ బిడ్డ మీద చిలకరించు. అలాగని, ఒకేసారి ఏడుగురు రాక్షసులను వదలగొట్టడం ఏ మంత్రానికీ సాధ్యం కాదు. అందుకని ఆ బ్రహ్మరాక్షసులను ఒకరి తర్వాత ఒకరుగా మాత్రమే వదలగొట్టాలి. ఏడుగురు బ్రహ్మరాక్షసులూ వారం రోజుల్లోనే నీ బిడ్డను విడిచి వెళ్లిపోతారు. ఆ తర్వాత నీ బిడ్డ నీ అంతటి కర్మిష్ఠి అవుతాడు’ అని చెప్పాడు.వేదశర్మ భిక్షువుకు పదే పదే నమస్కారాలు చేస్తూ, అక్కడి నుంచి ఇంటిముఖం పట్టాడు.ఇందాక గాడిద కళేబరం పడి ఉన్న చోట ఒక రక్తచందన వృక్షం ఉంది. తన చేతిలో భిక్షువు పెట్టిన మాంసం ముద్ద రక్తచందన పుష్పమైంది.ఇంటికి వెళ్లిన బ్రాహ్మణుడు భిక్షువు చెప్పిన ప్రకారమే రోజుకొక మంత్రాన్ని జపించి, ఏడుగురు రాక్షసులను ఒక్కొక్కరినే తన బిడ్డ నుంచి వెళ్లగొట్టాడు. ఆ తర్వాత సుశీలుడు సాధారణ స్థితికి వచ్చాడు.విన్నావు కదా దేవేంద్రా! మంత్ర తంత్రశాస్త్రాలు కేవలం క్షుద్రప్రయోజనాలకే కాదు, పరంపరాగతంగా అవి ముక్తిసాధనాలు కూడా కాగలవు’ అని ముగించాడు బృహస్పతి.∙సాంఖ్యాయన -
చిలకపచ్చ పావురం..!
పావురాలు ఎక్కువగా కాసింత నీలిఛాయ కలగలసిన బూడిద రంగులో ఉంటాయి. తెల్ల పావురాలు కూడా సర్వసాధారణంగా కనిపిస్తూనే ఉంటాయి. కొన్ని పావురాలు గోధుమరంగులో ఉంటాయి. ఇంకొన్ని ఇవన్నీ కలగలసిన రంగుల్లో ఉంటాయి. వీటికి భిన్నంగా చిలకపచ్చ రంగులో ఉన్న పావురం ఒకటి ఇటీవల ఇంగ్లండ్లోని నార్తాంప్టన్ పట్టణంలో కనిపించి, స్థానికులను అబ్బురపరచింది. ఈ అరుదైన పావురాన్ని చూడగానే కొందరు ఔత్సాహికులు దీనిని తమ స్మార్ట్ఫోన్ కెమెరాల్లో బంధించారు. కొద్ది వారాలుగా ఈ ఆకుపచ్చ పావురం నార్తాంప్టన్ వీథుల్లో మిగిలిన పావురాల గుంపుతో కలసి చక్కర్లు కొడుతోంది. ఇది ఎక్కువగా నార్తాంప్టన్ పట్టణం నడిబొడ్డున ఉన్న ఆల్ సెయింట్స్ చర్చ్ ప్రాంగణంలోను, ఆ పరిసరాల్లోని వీథుల్లో ఉన్న ఇళ్ల వద్ద కనిపిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కొందరు దీని వీడియోలను ‘టిక్టాక్’లో పోస్ట్ చేస్తే, అవి వైరల్గా మారాయి. మొదటిసారిగా ఈ పావురాన్ని తన ఇంటి ముందున్న తోటలో జూన్ 28న చూసినట్లు రాబిన్ హింక్మాట్ అనే స్థానికులు చెప్పారు. ఆయన దీని ఫొటోలు, వీడియోలు తీశారు. మరికొందరు స్థానికులు కూడా దీని ఫొటోలు, వీడియోలు తీసి ఆన్లైన్లో పెట్టారు. మొత్తానికి ఈ ఆకుపచ్చ పావురం నార్తాంప్టన్ పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. (చదవండి: ప్రాణం తీసిన ఫ్లాస్కు) -
ఫాస్ట్ట్యాగ్
సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేతావత్ చందు రాథోడ్ కళ్లల్లో కారం కొట్టి, కాల్చి చంపిన కేసులో నిందితులను సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. 2025 జూలై 15న హైదరాబాద్లో ఈ హత్య చేసి, వేర్వేరు ప్రాంతాలకు పారిపోయిన దుండగులు నాలుగు రోజుల్లోనే చిక్కడంలో ఓ కారుకు సంబంధించిన ఫాస్ట్ట్యాగ్ కీలకంగా మారింది. ఈ హంతక ముఠా అరెస్టుతో విశాఖపట్నంలోని గాజువాక షీలానగర్లో జరిగిన భారీ చోరీ కేసు కూడా కొలిక్కి వచ్చింది. ఈ ముఠాలోని ఇద్దరు అక్కడి వెంకటేశ్వర కాలనీలో నివసించే ఎల్ఐసీ ఉద్యోగి ఎస్.శ్రీనివాస్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో నిందితులని తేలింది. ఆ ఇంట్లో వీళ్లు 700 గ్రాముల బంగారం, మూడు కేజీల వెండి నగలు, వస్తువులతో పాటు రూ.20 లక్షల నగదు తస్కరించారు.సీపీఐ ఎంఎల్ తెలంగాణ సెక్రటరీ రాజన్న అలియాస్ రాజేష్ హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్లో ఉంటున్నాడు. ఇతడికి నాలుగేళ్ల కిందట చందు నాయక్తో పరిచయమైంది. ప్రభుత్వ, భూదాన్ భూముల్లో పేదలతో గుడిసెలు వేయించడంతో పాటు ఇతర కారణాల నేపథ్యంలో వీరి మధ్య స్పర్థలు వచ్చాయి. చందును హత్య చేయడానికి రాజన్న గతంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన కొందరికి సుపారీ ఇచ్చినా, ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో రాజన్న ఈసారి తన అనుచరులు ఏడుకొండలు, శ్రీను, కందుకూరి ప్రశాంత్లతో పాటు ఏడుకొండలుకు పరిచయం ఉన్న నెల్లూరుకు చెందిన అర్జున్, రాంబాబులతో కలిసి రంగంలోకి దిగాడు. ఉప్పల్ భగాయత్లోని హోటల్ సైలాలో గది బుక్ చేసి ఏడుకొండలు, శ్రీను, ప్రశాంత్లను అందులో ఉంచాడు. షీలానగర్లో 2025 జూలై 12న చోరీ చేసిన అర్జున్, రాంబాబు అక్కడ నుంచి తమ వాటాగా వచ్చిన సొత్తు, నగదుతో కాకినాడ వెళ్లారు. అక్కడ కారు బుక్ చేసుకుని, అందులోనే హైదరాబాద్ వచ్చి గచ్చిబౌలిలోని శ్రీనివాస గెస్ట్హౌస్లో బస చేశారు. అక్కడ నుంచి బయలుదేరి 13వ తేదీ రాత్రి క్యాబ్లో హోటల్ సైలాకు వచ్చి ఏడుకొండల్ని కలిశారు. మర్నాటి ఉదయం హత్య పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నాక తిరిగి వెళ్లిపోయారు. తర్వాతి రోజు తెల్లవారుజామున (2025 జూలై 15) వీళ్లు ఉప్పల్ భగాయత్కు రాగా; అక్కడే ఉన్న రాజన్న, ఏడుకొండలు, శ్రీను, ప్రశాంత్లతో కలిసి ఓ కారులో వెళ్లి మలక్పేటలోని శాలివాహన నగర్ పార్కు వద్ద చందును కాల్చి పంపారు. వాకింగ్ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన చందుపై తొలుత అర్జున్, శ్రీను కాల్పులు జరిపారు.అతడు చనిపోయాడో, లేదో అనే సందేహంతో రాజన్న కూడా అర్జున్ నుంచి తుపాకీ తీసుకుని మరోసారి కాల్చాడు. ఈ కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఘటనాస్థలిలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా దుండగులు స్విఫ్ట్ కారులో వచ్చినట్లు గుర్తించారు. ఇది పీర్జాదిగూడకు చెందిన ఓ మహిళ పేరుతో రిజిస్టరై ఉంది. ఆమె దీన్ని కొత్తపేట కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఓ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల ఏజెన్సీకి కాంట్రాక్టుకు ఇచ్చారు. ఈ కారును ఆన్లైన్లో బుక్ చేసుకున్న ఏడుకొండలు హత్యానంతరం తిరిగి అప్పగించి వెళ్లిపోయాడు. ఆ కారుకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి ఉండగా, దాని వివరాలన్నీ ఏజెన్సీ యజమాని ఫోన్లో నమోదవుతాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతడి ఫోన్లోని వివరాలను విశ్లేషించి, ఏడుకొండలు అద్దెకు తీసుకున్న నాటి నుంచి కారు ఎక్కడెక్కడ సంచరించిందో గుర్తించారు. ఇలా పోలీసులకు భగాయత్లోని హోటల్ సైలా వివరాలు తెలిశాయి. అక్కడకు వెళ్లిన దర్యాప్తు అధికారులు అర్జున్, రాంబాబు గచ్చిబౌలి నుంచి అక్కడకు వచ్చిన క్యాబ్ నంబరు గుర్తించారు.ఆ నంబర్ ఆధారంగా ముందుకు వెళ్లిన పోలీసులు గచ్చిబౌలిలోని శ్రీనివాస గెస్ట్హౌస్ను గుర్తించారు. అక్కడే టాస్క్ఫోర్స్ బృందానికి వాళ్లు వినియోగించిన కాకినాడ ట్యాక్సీ నెంబర్ దొరికింది. చందు హత్య తర్వాత ఆరుగురూ ఉప్పల్ నుంచి ఇదే వాహనంలో బీబీనగర్, వలిగొండ, ఖమ్మం మీదుగా కోదాడ చేరుకున్నారు. ఆ సమీపంలోని చిలుకూరు వద్ద కారు దిగిన రాజన్న, ఏడుకొండలు, శ్రీను, ప్రశాంత్ జనగాం పారిపోయారు. అర్జున్, రాంబాబు అదే కారులో విజయవాడ వెళ్లి, ట్యాక్సీని పంపేశారు. తమ వద్ద ఉన్న సొత్తు విక్రయించడం విజయవాడలో సాధ్యం కాకపోవడంతో అట్నుంచి మచిలీపట్నం వెళ్లి ప్రయత్నించారు. అక్కడా కుదరకపోవడంతో నెల్లూరు వెళ్లిపోవాలని భావించారు. దీంతో మరోసారి కాకినాడ నుంచి అదే ట్యాక్సీ పిలిపించి మచిలీపట్నం నుంచి బయలుదేరారు.రాజన్న, ఏడుకొండలు, ప్రశాంత్, శ్రీను ఫోన్లూ స్విచాఫ్లో ఉండటంతో సాంకేతిక నిఘా సాధ్యం కాలేదు. అర్జున్, రాంబాబు నంబర్లు పోలీసుల వద్ద లేవు. దీంతో కాకినాడ ట్యాక్సీ నంబర్ ఆధారంగా సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాని ఫాస్ట్ట్యాగ్ వివరాలను సంగ్రహిచడం మొదలెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ టోల్గేట్ను ఆ వాహనం దాటినా తెలిసేలా జాతీయ రహదారుల సంస్థతో పాటు టోల్గేట్స్ నిర్వాహకులతో అనుసంధానం ఏర్పాటు చేసుకున్నారు. అప్పటికే ఓ బృందం ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంత్లాలో గాలిస్తోంది. 2025 జూలై 19 తెల్లవారుజామున ఆ ట్యాక్సీ మచిలీపట్నం నుంచి నెల్లూరుకు బయలుదేరింది. ఆ మార్గంలోని టోల్గేట్లు దాటినప్పుడల్లా టాస్క్ఫోర్స్కు సమాచారం వచ్చింది. వీటి ఆధారంగా వాహనం విజయవాడ దాటి చెన్నై జాతీయ రహదారిలో ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. అప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్న బృందాన్ని అప్రమత్తం చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు కావలి పంపి అర్జున్, రాంబాబు ప్రయాణిస్తున్న వాహనం నంబర్ చెప్పారు. అక్కడి చెక్పోస్టు సిబ్బంది సహకారంతో ఈ వాహనాన్ని ఆపిన పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో జనగాంలో దాక్కున్న రాజన్న, ఏడుకొండలు తదితరులను పట్టుకున్నారు. -
ఈ వారం కథ: ముట్టుకోకు
‘‘చదవేస్తే ఉన్న మతి పోయిందట! పిచ్చి అనుమానాలతో పిల్లల బుర్రలు పాడు చేస్తే ఇలానే ఉంటుంది మరి! నా కొడుకు కష్టమంతా బూడిదలో పోసేశావ్, నీ అతితెలివి తగలెయ్యా! బ‘‘మా అత్తగారు ఆ రోజు నా మనసులో గుచ్చిన ఆ ముల్లు ఇంకా పచ్చిగానే ఉంది.‘‘అసలు మగ పిల్లాడిని పెంచే విధానం ఇదేనా! మగపిల్లాడంటే పులిబిడ్డలా ఉండాలి, పిరిగ్గొడ్డులా కాదు.’’ గుచ్చిన ముల్లునే ఇంకా లోనికి దించుతూ అటూ ఇటూ తిప్పితే ఎలా ఉంటుందో అలా ఉంది నాకప్పుడు.మారుతున్న కాలంతో పాటూ వంకర్లు పోతున్న మనుషుల మెదళ్ళ గురించి, ఆ వంకర్లలో నుంచి పుట్టే వికృత కృత్యాల గురించి ఆవిడకి వివరించి చెప్పే ధైర్యం నాకు లేదు, అర్థం చేసుకునే పెద్ద మనసు ఆవిడకి లేదు. నాలాంటి పిరికి కోడళ్ళం ఉన్నాం ఈ రోజుల్లో కూడా! భయభక్తులతో నేనూ, ఆధిపత్యంతో అత్తగారూ, కెరీర్లో పడుతూ లేస్తూ మా ఆయన. నిస్సారంగా సాగిస్తున్న మా జీవితాల్లోకి ఆ సంఘటన ఓతుఫానులా వచ్చి వెళ్ళినా, అది వదిలి వెళ్ళిన గుర్తులు ఎప్పటికీ చెరిగిపోవు. పదేళ్ళు కష్టపడ్డా దక్కని ఫలితం ఒక్క విందు దౌత్యం ద్వారా దక్కుతుందంటే వెనుకాడుతామా? ఉదయం నాలుగున్నరకే లేచి రెండు రకాల టిఫిన్లూ, వాటికి రెండు చట్నీలూ, సాంబారూ; మధ్యాహ్నం లంచ్ కోసం కొర్రమీను పులుసు, టైగర్ రొయ్యల వేపుడు, నాటు కోడి ఇగురు, మటన్ బిర్యానీ; వాటికి తోడు శాకపాకాలు కూడా ఉండాలిగా అన్నట్టు ఆలూ ఫ్రై, టమాటా పప్పు, రసం, అప్పడాలూ, పెరుగూ; ఇవన్నీ చాలవన్నట్టు చక్కెర పొంగలి, అరటిపండూ, ఐస్ క్రీమూ– బడా గెస్ట్ కోసం భారీ మెనూ సిద్ధం చేసుకొని,వంట పూర్తిచేసి, మొహాన కాసిన్ని నీళ్ళు జల్లుకొని, ముస్తాబై నవ్వు సింగారించుకొని కూర్చున్నా.మా ఆయన, తనకు దక్కబోతున్న పది కోట్ల కాంట్రాక్టు గురించి; దాన్ని ప్రసాదించబోయే మంత్రిగారి బామ్మర్ది గురించి వేచి చూస్తూ, ఇంటి గేటు దగ్గరే పచార్లు కొడుతూ ఉన్నారు. మంత్రిగారి బామ్మరిదే మా బడా గెస్టు. పదేళ్లుగా చిన్నచిన్న సబ్ కాంట్రాక్టులు చేసుకుంటూ బండి లాక్కొస్తున్న మా ఆయనగారికి దొరక్క దొరక్క ఎదురుపడ్డ పది కోట్ల రోడ్డు కాంట్రాక్టుని విందు దౌత్యం ద్వారా దక్కించుకోవాలని ఆయన ఉబలాటం. అన్నీ పోనూ ఓ పది శాతమైనా మిగిలితే చాలు, జీవితంలో ఓ మెట్టెక్కినట్టే! ఉదయం టిఫిన్ల నుంచి మధ్యాహ్నం భోజనాల సమయం వరకూ పెద్ద పెద్దోళ్లతో మంతనాలన్నీ మా ఇంట్లోనే! వారి కోసమే ఈ భారీ మెనూ. కాంట్రాక్టులంటే కమిషన్లూ, పర్సెంటేజీల అధికారిక పొట్లాల పంపిణీ ఉండనే ఉంటుంది కాని, మనీ పర్సుని తృప్తిపరిస్తే అది ఖాళీ అయ్యేవరకే గుర్తుంటుంది, మనిషి అహాన్ని తృప్తిపరిస్తే మనిషి ఉన్నంతవరకూ గుర్తుపెట్టుకుంటాడు. అతిథి మర్యాదలకున్న పవర్ అలాంటిది. పైగా ఆ వచ్చేవాడు పెళ్లీ పెటాకులు లేని బెమ్మచారిట! ఇంటికి పిలిచి భోజనాలు పెడితే తెగ పొంగిపోతాడట! ఆ వీక్నెస్ పట్టేశారు మావారు.గంట సేపు వెయిటింగ్ తర్వాత పెద్ద పడవ లాంటి కారులో దిగాడు మంత్రిగారి బామ్మర్ది. మాసిన తెలుపు నలుపుల గడ్డం, లోపలకెళ్లిన సీసాల కొద్దీ మద్యాన్ని మోయలేక ఊరిపోయి వేలాడుతున్నట్టున్న పొట్ట, మెడలో కట్లపాములాంటి బంగారపు గొలుసు, చేతికి బ్రేస్లెట్, బొటనవేళ్ళు తప్ప మిగతా ఎనిమిది వేళ్లకు ఎనిమిది ఉంగరాలు ధరించిన ఆ భారీ ఆకారం ఊగుతూ మా ఇంట్లో చొరబడింది, సాదర స్వాగతాలతో!మా సోఫా సెట్లో కుర్చీలు ఈయనకు సరిపోతాయా అన్న అనుమానం గుండెను గుంజేసింది కాసేపు. ఇంతాచేసి ఇలాంటి చోట అభాసు పాలైపోతే ఎలా! పర్లేదు, కుదురుకొని సర్దుకున్నాడు. ఈ మంత్రుల తమ్ముళ్ళు, బామ్మరుదులు ఏదో ఇలానే ఉండాలని రూల్ పెట్టుకుంటారో ఏంటో! అచ్చం సినిమాల్లో చూపించినట్టు ఉన్నాడు. టిఫిన్లకు కూర్చున్నారు. పక్కనే నిలబడి అతి వినయం ప్రదర్శిస్తూ వడ్డిస్తున్నాను. ఆ పక్కగా ఆడుకుంటున్న మా ఐదేళ్ల చింటూగాడు పరిగెత్తుకుంటూ వచ్చి బంతిని తీసుకున్నాడు. అతడు ముచ్చటగా చూసి నవ్వేడు. గంభీరమైన ఆ ముఖానికి నవ్వు కూడా వచ్చా! అనిపించింది. టిఫిన్లు పూర్తయి భారీ ఆకారాన్ని మళ్ళీ సోఫాకి తరలించి ప్రాజెక్టుకి సంబంధించిన ఫైలు ఏదో తెమ్మని ఆయన్ని లోపలికి పంపేడు.‘‘టిఫిన్ తర్వాత నాకు జ్యూస్ అలవాటు... తీసుకొస్తారా?’’ ఆర్డరు వేసి నన్ను వంటగదిలోకి పరిగెత్తించాడు. అతడు చింటూగాడిని ఎత్తుకొని బుగ్గలు నిమరడం నేను కిచెన్లోకి వెళ్తుండగా నా కంటబడ్డ ఆఖరి దృశ్యం. అంతే!ఓ రెండు నిమిషాల తర్వాత..‘‘బ్యాడ్ అంకుల్! బ్యాడ్ టచ్!! బ్యాడ్ అంకుల్! బ్యాడ్ టచ్!’’ చింటూగాడి అరుపులకు గుండె జలదరించినట్టైంది. పరిగెత్తుకొని హాల్లోకి వచ్చి చూశాను. చింటూని విదిలించి కింద పడేసి, కోపంగా చూస్తూ ఇంటి బయటకు తన భారీ కాయాన్ని జరజరా లాక్కుంటూ పోతున్నాడు.మా ఆయన బెడ్రూమ్లోంచి బయటకొచ్చి ఫైలు పట్టుకొని నిలబడి హతాశుడై చూస్తున్నాడు. బయటకు పోతున్న అతడి వెంట ‘‘సార్సార్! సారీ సార్...!’’ అంటూ పరిగెత్తాడు. అతడి కారు మా ఆయన్ని పట్టించుకోలేదు.చింటూని దగ్గరకు తీసుకొని హత్తుకొని కూర్చున్నాను. ‘‘అసలేమైంది చింటూ?’’ అనునయిస్తూ అడిగాను.‘‘ఏమైందేంటే?? వాడిని ఎత్తుకొని కాస్త ముద్దు చేశాడాయన, అంతే! నేనిక్కడే ఉన్నానుగా!’’ గయ్యిమంది మా అత్తగారు.‘ఊరికే వాడు బ్యాడ్ టచ్ అని ఎందుకు అరుస్తాడు? వాడికి బ్యాడ్ టచ్ అంటే ఏమిటో వివరించి చెప్పానుగా ఎప్పుడో! అంటే వచ్చిన వెధవ ఏమైనా అఘాయిత్యం!’ తల్చుకుంటేనే వెన్నులో వణుకొచ్చేసింది. వివరంగా చింటూని అడగాలనుకున్నా. ఆవిడ ముందు నా గొంతు పెగలలేదు.‘పక్కగదిలో కూర్చొని సాయికోటి రాసుకుంటున్న ఈవిడ హాల్లోకి ఎపుడు చూసిందని, వాడికి వత్తాసు పలుకుతోంది!?’ నా బుర్రకేమీ తోచలేదు.‘‘మొత్తం నాశనం అయిపోయింది. ఛా!!’’ ఇంట్లోకి వస్తూనే చేతిలో ఫైలుని విసిరికొట్టాడు మా ఆయన.కాయితాలన్నీ చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. పిచ్చెక్కినట్టు అరవటం మొదలుపెట్టాడు.పిల్లోడికి ఏమైందో అనే ఆదుర్దా కూడా లేకుండా కాంట్రాక్ట్ పోయిందనే బాధపడటం నాకు ఆశ్చర్యమే కాదు, అసహ్యం కూడా వేసింది. ముడిపడ్డ నా నొసటిని, మా వారివైపు చీదరింపుతో కూడిన నా చూపుని కూడా భరించలేకపోయింది మా అత్తగారు.‘‘చదవేస్తే ఉన్న మతి పోయిందట! పిచ్చి అనుమానాలతో పిల్లల బుర్రలు పాడుచేస్తే ఇలానే ఉంటుంది మరి! నా కొడుకు కష్టమంతా బూడిదలో పోసేశావ్, నీ అతితెలివి తగలెయ్యా! అసలు మగ పిల్లాడిని పెంచే విధానం ఇదేనా? అయినా చింటూ ఏమైనా ఆడపిల్లా? మగపిల్లాడంటే పులిబిడ్డలా ఉండాలి. పిరిగ్గొడ్డులా కాదు’’ అత్తగారు విరుచుకుపడింది. నా ఒళ్ళో ఉన్నవాడిని రెక్కపట్టుకు లాక్కుపోయి బెడ్రూం తలుపేసుకు కూర్చుంది.నా బుర్ర గిర్రున తిరిగింది. అసలక్కడ ఏం జరుగుతోందో నాకేం అంతుబట్టలేదు. ఇలాంటి పరిస్థితిలో ఓ తండ్రి, నానమ్మ ప్రవర్తించాల్సిన తీరు కచ్చితంగా ఇది కాదు. ఒక్కసారిగా అగాథంలోకి కూరుకుపోయిన భావనేదో కమ్మేసింది.మా ఆయనగారు బిక్కుబిక్కుమంటూ అతడికి ఫోన్ చేసి తిరిగి రప్పించే ప్రయత్నాల్లో చాలా బిజీగా ఉన్నాడు. అతడు ఫోన్ ఎత్తినట్టు లేడు. ఎవరెవరికో ఫోన్లు చేసి, కాంట్రాక్టు చేజారిపోకుండా చూసేందుకు దేబిరిస్తున్నాడు. అత్తగారు మూసిన తలుపింకా తెరవలేదు. లోపల చింటూ ఎలా ఉన్నాడో! తలుపు తట్టే ధైర్యం నాకు లేదు. నా బేలతనానికి నాకే సిగ్గేసింది.డబ్బు కోసం కన్న కూతుర్ల శీలాన్ని తాకట్టు పెట్టే తల్లిదండ్రులు ఉంటారని చాలా చోట్ల చదివి ఉన్నాను.ఇప్పుడు ఇంచుమించు అలాంటి వాళ్ళనే చూస్తున్నాను అనిపించేసింది. ఓహ్! మగపిల్లలకి శీలం లాంటిదేదీ ఉండదు కదూ! మరిప్పుడు తాకట్టు పెట్టినదాన్నేమంటారో!నా తడి కళ్ళు నిస్సహాయంగా తలుపుకేసి చూస్తుండిపోయాయి. అర్హతకు తగ్గ అవకాశాలు, విజయాలు దక్కకపోతే మనిషి మరీ ఇంత దిగజారిపోతాడా? కొడుకుని పట్టించుకోకుండా ఎవరెవరికో ఫోన్లు చేసి దేబిరిస్తున్న మా ఆయన మొహం చూడాలంటే కంపరం మొదలయింది. మూడు గంటలు గడిచాయి. ఆయన ప్రయత్నాలేవీ ఫలించినట్టు లేవు. అసలైనోడే అలిగి వెళిపోతే కొసరు పెద్దమనుషులు కూడా మొహం చాటేశారు. కాంట్రాక్టు గాలిలో కలిసినట్టే. సమయం గడుస్తున్న కొద్దీ రక్తపోటు పెరిగి ఆయన మొహం వికృతంగా కొంకర్లుపోతోంది. ఇంకాసేపైతే కిందపడి గిలగిలా కొట్టుకునేవాడే. గేటు బయట కారు శబ్దం విని దిగ్గున లేచాడు. పరిగెత్తుకు వెళ్ళి అతడి చేతులు పిసుకుతూ సారీలు చెప్పుకుంటూ లోపలికి తీసుకొచ్చాడు .వాడి మొహంలో ఇందాకటి గాంభీర్యం ఇప్పుడు లేదు, పాలిపోయింది. పీడోఫిల్ ... చిన్నపిల్లలపై కామవాంఛలను పెంచుకునే వెధవలను అలానే పిలుస్తారట! ఎక్కడో చదివిన గుర్తు. వీడు అందుకే పెళ్లి పెటాకులు లేకుండా ఆంబోతులా తిరుగుతున్నాడనమాట!వాడ్ని చూస్తూనే నా నరాలు పొంగాయి. చికెనూ మటనూ కోసిన కత్తితోనే వాడి పీక కోసేయాలన్నంత కసి.‘‘బాగా ఆలస్యం అయిపోయింది. సార్గారు వచ్చేశారు కదా, భోజనం వడ్డించు’’ ఆయనగారి ఆర్డరు!కారు శబ్దం వింటూనే బెడ్రూమ్ తలుపు తెరుచుకుంటూ బయటకొచ్చింది మా అత్తగారు. వస్తూనే వంగి వంగి దండాలెట్టేసింది. చింటూ లోపల పడుకున్నట్టున్నాడు. ఏ చప్పుడూ లేదు.‘‘ఏంటి చూస్తున్నావ్ వడ్డించూ!!’’ అత్తగారి హుకుం జారీ అయింది. నాలోని దద్దమ్మ కోడలు తలవంచేసింది. వచ్చినోడు ఎంత వెధవ అయినా, ఎంతటి ఘాతుకానికి ఒడిగట్టినా, వాణ్ని చూస్తేనే మన ఒంట్లో రక్తం సలసలా కాగుతున్నా, మర్యాదలకు మాత్రం లోటు రానివ్వకూడదు. దద్దమ్మ కోడళ్ళ రూల్బుక్లో మొదటి రూల్ ఇదే కావొచ్చు!మటను బొమికల్లో మజ్జను కూడా జుర్రుకుంటూ మెక్కుతున్న ఆ కుక్కను చూస్తే ఒళ్ళంతా కంపరమేసింది. పక్కనే జీ హుజూర్ ! అంటూ నిల్చున్న మా వాళ్ళను చూస్తే అంతకంటే జుగుప్సగా ఉంది.‘‘మీరు చదువుకున్నవారిలా ఉన్నారే!’’ నాకేసే చూస్తూ అడిగాడు ఆ కుక్క.వాడికి జవాబిచ్చే స్థితిలో నేను లేను. చాలాసేపటి నుంచి పంటి బిగువున అదిమిపట్టిన కోపం, కట్టలు తెంచుకోవడం నాకిష్టం లేదు. దద్దమ్మల రూల్ పుస్తకంలో ఇది మరో రూల్.‘ఆ! ఏదో చదివిందిలెండి. ఈకాలం ఆడపిల్లల చదువులు ఉద్యోగాలకి చాలవు ఇల్లు చక్కబెట్టడానికి పనికిరావూ..’’ వెకిలి కామెంటు విసిరింది అత్తగారు.అతడు పట్టించుకోలేదు. ‘‘ఏమ్మా! బ్యాడ్ టచ్ గురించి పిల్లలకి చెప్పడం తెలిసింది సరే, మరి ఆ తర్వాత పిల్లాడిని జరిగిన విషయం గురించి వాకబు చేశావా తల్లీ?’’ గతుక్కుమన్నాను. అతడు ఎగతాళి చేస్తున్నాడో, సవాలు చేస్తున్నాడో అర్థం కాలేదు. బెడ్రూమ్ వైపు అత్తగారి వైపు మార్చి మార్చి చూశాను. ‘‘పోవే! పోయి వాణ్ని తీసుకురా! ’’ అన్నట్టు కళ్ళతోనే సైగ చేసిందావిడ.పరిగెత్తుకు లోపలికి వెళ్ళాను. చింటూని గుండెలకి హత్తుకుని, బుజ్జగిస్తూ ఆరా తీశాను. నాలుగు గంటల మానసిక క్షోభ తర్వాత గుండెలపై నుండి టన్ను బరువు దించినట్టైంది. వాడి చేయి పట్టుకుని మెల్లగా డైనింగ్ టేబుల్ దగ్గరకు తెచ్చాను. చింటూ కళ్ళలో బెరుకు, భయం లాంటివేవీ నాకు కనపడలేదు. అతడిని చూసి, ‘‘నీ జట్టు పీస్! బ్యాడ్ అంకుల్.’’ అన్నాడు.మా ఆయన గొంతు తడారిపోవడం తెలుస్తూనే ఉంది. గుటకలు మింగుతూనే ఉన్నాడు.‘‘తప్పు! అలా అనకూడదు చింటూ!’’ చింటూ చెయ్యి పట్టుకులాగి చిన్నగా కుదుపుతూ గయ్యిమన్నాడు మా ఆయన.‘‘ఈ అంకుల్ నాతో ఫైటింగ్ చేస్తూ నా సీటుపైన గిచ్చేశాడు.‘‘ బుంగ మూతి పెట్టి చెప్పాడు బుజ్జాయి చింటూ.మా ఆయనగారూ, అత్తగారూ తెచ్చి పెట్టుకున్న నవ్వుతో బిగ్గరగా నవ్వేసి, ‘‘తప్పు నాన్నా! అంకుల్ సరదాగా చేశారు. బ్యాడ్ అంకుల్ అనకూడదు’’ అని, చింటూతో బలవంతంగా ‘సారీ’ కూడా చెప్పించేశారు.చింటూ చెప్పిన విషయం నమ్మాలనే అనిపించింది. ఊహించినట్లుగా ఏ ఘోరమూ జరగలేదని తెలిశాక, తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను.‘‘పూర్తిగా తెలుసుకోకుండా ఈ విషయం బయటకెళ్తే నా పరువేం కానూ?’’ నవ్వుతూనే చురక వేశాడు అతడు.‘‘ఈ మాత్రం దానికి ఇంత రాద్ధాంతం చేశావా?’’ అన్నట్టు కింద నుంచి పైవరకు కొరకొరా చూసింది అత్తగారు.అతడ్ని అనవసరంగా అనుమానించినందుకూ, అడ్డమైన పుస్తకాలూ చదివేసి, అనవసర భయాలతో బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అంటూ పిల్లల మనసులు పాడు చేసినందుకు నాలో నేనే కుచించుకుపోయేలా చేసిన చూపు అది.‘‘చక్కెర పొంగలి చాలా బాగుంది. మా అమ్మ గుర్తొచ్చింది’’ చేతి వేళ్ళను చప్పరిస్తూ చెప్పేడతడు.జరిగిన దాన్ని మనసులో పెట్టుకోకుండా ఎంత బాగా మాట్లాడుతున్నాడో అన్నట్టు మొహాలు పెట్టి మురిసిపోయారు మావాళ్లిద్దరూ. అతడి మంచితనపు ప్రదర్శన పెరిగే కొద్దీ నా వైపు కొరకొర చూపులు ఎక్కువయ్యాయి.‘‘మా అమ్మ మీ కంటే వంట బాగా చేసేది. కాని, మీకున్న తెలివితేటలు ఆవిడకు ఉండి ఉంటే నా జీవితం వేరేలా ఉండేది.’’ అతడి మాట అర్థంకాక మొహాలు చూసుకున్నాం. ‘‘బ్యాడ్ టచ్ అంటే ఏంటో నాకు చిన్నప్పుడే తెలుసు. మా అమ్మ చెప్పలేదు. మా మావయ్య తెలియజెప్పాడు, చేతలతో. నేను జరిగినది చెప్పినా అమ్మ నమ్మలేదు. ఆమెది సొంత తమ్ముడిపై ప్రేమో, లేక అసలు అలాంటి వెధవ బుద్ధుల గురించి తెలియనితనమో! అమ్మ కూడా నన్ను నమ్మటం లేదనే వేదన, ఆమె నమ్మకపోయేసరికి ఇంకా ఎక్కువైన మావయ్య వేధింపులు... ఆ రోజులు చాలా భయంకరంగా ఉండేవి. కలల్లో కూడా వెంటాడే భయం... బాల్యమంతా ఆ భయంతోనే గడిచిపోయింది. సరిగ్గా చదువు వంటబట్టలేదు. కొత్తవాళ్ళతో మాట్లాడాలంటే భయం. పెళ్లి చేసుకోవాలంటే భయం. కొన్నిసార్లు నా మనసు ఇంకా పిల్లాడి లాగానే ఉండిపోయిందని అనిపిస్తూ ఉంటుంది. అల్లకల్లోలంగా ఉండే మనసుని శాంతింపజేయడానికి తాగుడు అలవాటు చేసుకున్నా, ఫలితం లేదు. సైకాలజిస్టుల చుట్టూ తిరిగా... మొత్తానికి ఆ కూపంలోంచి బయట పడేసరికి నలభైఏడేళ్ళు దాటిపోయాయి. ఇప్పడూ ఓ కుటుంబం కావాలనిపిస్తుంది కాని, ఇలాగే అలవాటైపోయింది. అందుకే ఎవరైనా ఇంటికి పిలిచి భోజనం పెడితే కాదనకుండా వాలిపోతా! పిల్లలతో ఆడుకుంటూ ఉంటే ఏదో తెలియని ఆనందం. కాని, చింటూ అలా అరిచే సరికి నా గతం మొత్తం కెలికినట్టయింది. ఏమీ అనుకోకండి సారీ! చింటూ సారీ నాన్నా! ఈసారి బాగా ఫైట్ చేద్దాం నో చీటింగ్. అమ్మా! మా అమ్మ కూడా మీలాగా ఉండి ఉంటే నా జీవితం ఇలా ఉండేది కాదు’’ అంతటి భారీ మనిషి కంటి నుండి కన్నీరు మాత్రం అతి తేలికగా జారిపోయింది.అలాంటి వ్యక్తి నుంచి అలాంటి మాటలు వినేసరికి అంతా నిశ్చేష్టులయిపోయారు. చిరునవ్వుతో అతడికి వీడ్కోలు పలికేశాము. మా అత్తగారు చింటూ తల నిమిరి నా వైపే చూస్తూ నిలబడిపోయింది.అంతకు ముందున్న కరకు చూపు కాదది. మా ఆయన దగ్గరుండి కారు డోర్ మూసి మరీ ఆయన్ని సాగనంపి, లోపలికొచ్చి మురిపెంగా ప్రాజెక్టు ఫైలుని చూసుకొని నవ్వుకుంటున్నాడు. నేను కూడా హాయిగా ఊపిరి తీసుకున్నాను. కాని, గుండెలో ఏదో గుచ్చుతున్నట్టు, గుండె గోడకి ఏదో బీటలు పడ్డట్టు అనిపించింది. గట్టిగా ఊపిరి తీసుకున్నాను. బీటలు పడాల్సింది బద్దలవ్వాల్సింది నా గుండె కాదు, నా దద్దమ్మతనం. అర్థమైంది నాకు. -
లవ్ ట్రెండ్స్లో 'న్యూ విండ్స్'..!
ఒకప్పుడు ప్రేమ కళ్లతో మొదలై, కలలతో కడవరకు సాగేది. ఇప్పుడది ఒక స్వైప్తో మొదలై, ఒక మెసేజ్తోనే ముగుస్తోంది. ప్రేమలా అనిపిస్తుంది, కానీ ప్రతిసారి సందేహాల స్టేటస్లోనే ఆగిపోతుంది. ఇక బంధం బ్లూటూత్లా మారి, కనెక్ట్ అయితే పని చేస్తుంది, లేదంటే మాయమవుతోంది. ఇక్కడ ప్రేమ పుట్టినా, క్లారిటీ మాత్రం ఎప్పటికీ బ్లాక్లిస్ట్లోనే మిగిలిపోతుంది. ఇవన్నీ ఇప్పడు లవ్ ట్రెండ్స్లో బలంగా వీస్తున్న న్యూ విండ్స్... ఈ తరం ప్రేమికుల ప్రేమ ఓపెన్ రిలేషన్షిప్లా ఉంటుంది. కాని ఎవరూ ఓపెన్గా మాట్లాడరు! ‘హాయ్’ అంటే ఫ్రెండ్ అనాలా? ఫ్లర్ట్ అనాలా? అన్నదానిపై కన్ఫ్యూజన్. ‘మిస్ యూ’ అంటే నిజంగా ప్రేమా? లేక లస్ట్? అన్న సందేహం. ఇక ‘బిజీ బేబీ’ అంటే టైమ్ లేదు అంటున్నారా? లేక నన్ను బెంచ్లో పెట్టాలనుకుంటున్నారా? అనే అనుమానం వచ్చేస్తుంది. అలా ఇవన్నీ స్క్రోల్ చేయగలిగే అనుబంధాలుగా, టైప్ చేయగలిగే మమకారాలుగా, డిలీట్ చేయగలిగే గాథలుగా మారాయి. ఇక్కడ ప్రేమ ఫాస్ట్ ఫార్వర్డ్లో నడుస్తుంది, కాని కన్ఫర్మేషన్ మాత్రం ఎప్పుడూ బఫరింగ్లోనే ఉంటుంది. అందుకే ఈ ప్రేమలను అర్థం చేసుకోవాలంటే ఓ కొత్త డిక్షనరీ అవసరం. అదే ఈ జెన్ జీ ప్రేమభాష డిక్షనరీ. ఇది ప్రేమలో పడటానికి కాదు, పడిపోకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. అందుకే, మీ క్రష్ చేతిలో మీ హార్ట్ క్రాష్ కాకముందే, ఒక్కసారి ఈ ప్రేమ భాషను తెలుసుకోండి!నేటి ప్రేమ భాషకాకరకాయకు షుగర్ కోటింగ్ వేసినట్టు నేటి ప్రేమ ఉంటోంది. ప్రేమగా, స్నేహంలా కనిపిస్తుంది కాని, ఫీలింగ్ డిఫరెంట్. కుప్పలు తెప్పలుగా ప్రేమను చూపిస్తారు. కాని, కన్ఫర్మేషన్ ఇవ్వరు. అందుకే, ఎవరైనా సరే, ఈ జెన్ జీ ప్రేమ భాష తెలుసుకోకుండా, ప్రేమలో పడొద్దు. ఎందుకంటే, మీ ప్రేమను తెలిపే సమయానికే వాళ్లు వదిలిపోయే జెన్ జీ బంధాల పేర్లతో సిద్ధంగా ఉంటారు! అలా కొన్ని గమ్మత్తయిన జెన్ జీ బంధాలే ఇవీ! ఘోస్టింగ్ అజ్ఞాతంలోకి ఎగిరిపోవడంఇప్పటి వరకు ప్రతిరోజూ మాట్లాడినవారు, ఉన్నట్టుండి ఒక్కసారిగా మాయమవుతారు. సందేశాలకు సమాధానం ఉండదు. కాల్ చేస్తే స్విచ్డ్ ఆఫ్. వెతికితే కనిపించరు. కారణం? తెలీదు. ఎమోషన్స్కు ఎక్స్ప్లనేషన్ ఇవ్వకుండనే వెళ్లిపోవచ్చు. అదే ఘోస్టింగ్. బెంచింగ్ బ్యాకప్ లవ్ఇక్కడ, మీరు క్రికెట్లో ఎక్స్ట్రా ప్లేయర్ లాంటివారు. అవసరమైతే పిలుస్తారు, లేదంటే ‘బిజీ బేబీ’ అని మెసేజ్ పెడతారు. ఇది ఓ స్ట్రాటజీ లవ్. ముందు నుంచే వెనక పెడతారు. పూర్తిగా రిలేషన్షిప్లోకి తీసుకుకున్నా, వదిలేయకుండా, ‘ఓకే కాని, ఇప్పుడు కాదు’ అనే మూడ్లో ఉంచుతారు. ఒక రిజర్వ్ లవర్లా! నో స్ట్రింగ్స్ అటాచ్డ్శరీరం దగ్గర, మనసులు దూరంఈ ప్రేమలో ఎలాంటి బంధాలూ ఉండవు. కేవలం భౌతికంగా సమీపంలో ఉంటారు. ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ అసలు ఉండదు. ఒకరి కోసం ఒకరు ఎదురుచూసే అవకాశం కూడా రాదు. ఇది ప్రేమకన్నా ఒప్పందం లాంటిది. కనెక్ట్ కావచ్చు. కాని, కమిట్ అయ్యే పరిస్థితే ఉండదు.షుగర్ డేటింగ్ ప్రేమకు పేమెంట్ఇది డేటింగ్ మాత్రమే కాదు. డీలింగ్ కూడా. గిఫ్ట్లు, డబ్బు, సహాయం, హోదా... వీటన్నింటికీ బదులుగా సాన్నిహిత్యం లేదా భాగస్వామ్యం. ఇక్కడ ఒకరికి ఆర్థిక ఒప్పందం, మరొకరికి అవసరాల ఒప్పందం. సిచ్యుయేషన్షిప్ సమయానికి తగు ప్రేమఇది స్నేహం కాదు, ప్రేమ కాదు. అర్థం కాలేదు కదా! రోజూ మాట్లాడుతుంటారు. కలుస్తుంటారు. అచ్చం ప్రేమికుల మాదిరే ఉంటారు. కాని, చెప్పుకోరు. సందర్భాన్ని బట్టి స్నేహాన్ని, ప్రేమను స్విచ్ చేస్తూ ఉంటారు. కఫింగ్ అందమైన వసంతంచలికాలం వచ్చిందంటే ఒంటరితనానికి బదులుగా ఈ తాత్కాలిక ప్రేమను ఓపెన్ చేస్తారు. ఈ ప్రేమ వేసవి వస్తే మాయమైపోతుంది. వెచ్చని స్వెట్టర్లా, ఈ ప్రేమకు కూడా చలికాలం తర్వాత ప్యాకప్ చెప్పేస్తారు.ఎథికల్ నాన్ మొనోగమీ (ఈఎన్ఎమ్) నిజాయితీతో కూడిన బహుళ ప్రేమఇక్కడ ప్రేమ ఉన్నా, అది ఒకరితోనే పరిమితం కాదు. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నా, మరొకరిని కూడా ప్రేమిస్తున్నాను.’ అనేంత నిజాయితీగా ఉంటుంది. అంటే, ఇక్కడ ఒకరితో కాక, పలువురితో బంధం ఉండొచ్చు. కాని, ఎవరినీ మోసం చేయకూడదు. అందరికీ స్పష్టంగా చెప్పి ఉండాలి. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్స్నేహానికి అదనపు లేయర్ఇక్కడ మీరు స్నేహితులు. కాని, అప్పుడప్పుడూ బౌండరీలను దాటి శారీరక సాన్నిహిత్యం కూడా ఏర్పరచుకుంటారు. ప్రేమను స్పష్టంగా దూరంగా ఉంచి, ‘మన మధ్య ఏమీలేదు, కాని, ఏం జరిగినా ఫ్రెండ్స్ మనం!’ అన్న కంఫర్ట్ జోన్లో ఉంటారు. లవ్ బాంబింగ్ అతివేగమైన బంధంఒకేసారి వందలాది మెసేజ్లు, ‘నువ్వు లేకుంటే బతకలేను’, ‘నీ నవ్వు నా పూల వర్షం’ అనేసరికి, మీరు కూడా ‘వావ్! ఐ లవ్ యూ టూ’ అనేరు, జాగ్రత్త! ఇక్కడ, వారం తర్వాత అది అంతా మాయమైపోతుంది. ఒకేసారి ఇబ్బంది పెట్టేంత ప్రేమ చూపించడం, ఊహించని రీతిలో బ్రేకప్ చెప్పేయటం రెండూ చాలా వేగంగా జరిగిపోతాయి.జాంబీయింగ్ పాతవారితో కొత్తగా ఇక్కడ మరచిపోయిన వ్యక్తి ‘హాయ్ స్ట్రేంజర్’ అనే మెసేజ్తో మళ్లీ వస్తారు. ఇది తెలిసిన ‘ఎక్స్’తో కొత్తగా ప్రేమలో పడటం లాంటిది. ఇక్కడ ఫ్లాష్బ్యాక్ను రిపీట్ చేయకూడదనేది మొదటి హెచ్చరిక.క్యాట్ ఫిషింగ్ ఓపెన్గా చేసే ఫేక్ ప్రేమ! ఇక్కడ అన్నీ ఫేక్ ఫొటోస్, ఫేక్ ఫీలింగ్స్. చివరికి ప్రేమ కూడా ఫేక్. ఆ విషయం తెలిసి కూడా రిలేషన్లో ఉంటారు. అయితే, ఇక్కడ అసలు నిబంధన ఒకటి ఉంది. అదే ఆ అజ్ఞాత ప్రేమికుడి వివరాలు అసలు తెలుసుకోకూడదు. తెలిస్తే ఇక బ్రేకప్పే! స్లో డేటింగ్ ప్రేమకు వేగం అవసరం లేదుముందుగా పరిచయం, ఆ తర్వాత స్నేహం, ఆ తర్వాత భద్రత, అలా అలా ప్రేమ వైపు. ఇది కథకు మొదట వచ్చే ఇంట్రోలాంటిది. ఫిజికల్గా కాకుండా, ఫీలింగ్స్కు ప్రాధాన్యం ఇస్తారు. బ్రెడ్ క్రంబింగ్ లవ్ ఇన్ ఆన్లైన్ఒక మెసేజ్, ఒక లైక్, ఒక కామెంట్... ఇవన్నీ ఇక్కడ ప్రేమ! ఎందుకంటే, ఈ ప్రేమ కేవలం ఆన్లైన్లో మాత్రమే ఉంటుంది. నిజ జీవితంలో ఉండదు. రాకూడదు కూడా. కేవలం ఊహల్లో జీవించే ఉండే ప్రేమికుల్లా మిగిలిపోవాలి. రిజ్ పడేంత వరకే ప్రేమిస్తారు ఆటిట్యూడ్, ఆకర్షణ, ఆనందం ఇవన్నీ కలిపితే ‘రిజ్’!. ఇక్కడ ప్రేమలో పడేయడానికి మాత్రమే ప్రయత్నాలు చేస్తారు. కాని, ప్రేమించరు. అంటే ఇంప్రెస్, ఫ్లర్టింగ్, చాటింగ్, కేరింగ్ లాంటివన్నీ ఇక్కడ ఉంటాయి. ఒక్క ప్రేమ తప్ప. పాకెటింగ్-దాచుకునే ప్రేమ వాళ్లు మీతో ప్రేమలో ఉంటారు. కాని, బయట ఎవరికీ తెలియకూడదు. ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి పేరు చెప్పరు. వాళ్ల జీవితంలో మీరు ఎప్పటికీ ఒక రహస్య ఫోల్డర్లాంటి వారు మాత్రమే. మీకు కూడా అంతే అయ్యుండాలి. సాఫ్ట్ లాంచ్ అట్రాక్షన్ గ్రాస్పింగ్అట్రాక్షన్ గ్రాస్పింగ్వాళ్లు ప్రేమలో ఉన్నారు. కాని, ఎవరనేది మాత్రం డైరెక్ట్గా చెప్పరు. సోషల్ మీడియా స్టోరీల్లో మాత్రం రెండు చేతులు, ఓ కాఫీ కప్పు, ఓ షాడో కనిపిస్తుంటాయి. ‘ఇది ఎవరితో?’ అనేది ప్రపంచాన్ని గెస్ చేసేలా ఊరిస్తూ ప్రేమించుకుంటుంటారు.ఇలా ఈ జెన్ జీ ప్రేమ లోకంలో మరెన్నో బంధాలు అర్థం కాకుండా ఉన్నాయి. వాటిలో ఒకటి థ్రస్ట్ ట్రాప్. ఇది మాట్లాడే ప్రేమ కాదు, చూస్తే చాలు అనిపించే ప్రేమ. ఇక్కడ మాటలకు చోటు లేదు, కాని, హద్దులు దాటిపోయే ఫోటోలు మాత్రం బంధాన్ని నెట్టుకుంటూ పోతాయి. అదే తరహాలో డ్రై టెక్సి›్టంగ్ కూడా. ఇది వన్సైడ్ ప్రేమలకి మరో రూపం. మీరు పది లైన్లు టైప్ చేస్తే, సమాధానంగా ‘ఒకే’, ‘సరే’, ‘హుమ్’లాంటి ముక్తసరి రిప్లయ్స్ వస్తాయి. ఇక సింపింగ్ అంటే అవతలి వారు ప్రేమించకపోయినా, మీరు వారికోసం ఏదైనా చేస్తూ ఉంటారు. మీ అభిమానాన్ని వాళ్లు తీసుకుంటారు, కాని, ప్రేమను మాత్రం కాదు. ఫ్లీ బ్యాగింగ్ బంధాల్లో, వారు చెడ్డవాళ్లని తెలిసినా, వారినే ప్రేమిస్తూ మళ్లీ మళ్లీ అదే బాధను అనుభవించడానికి సిద్ధంగా ఉంటారు. ఇక పింక్ ఫ్లాగ్స్ అనేవి గ్రీన్, రెడ్ ఫ్లాగ్స్ రిలేషన్స్ మధ్యలో ఉంటాయి. అంటే చిన్న చిన్న అబద్ధాలు, నిర్లక్ష్యం, డబుల్ డేటింగ్ వంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నా, ‘మారతారు కదా...’ అనే ఆశతో బంధాన్ని వదలకుండా కొనసాగించడం. ఇలా, స్పష్టత లేని అనుబంధాలతో నిండిన ఈ జెన్ –జీ ప్రేమ లోకంలో ప్రతి బంధం, అడిగితే వచ్చే బంధాలుగా మిగిలిపోతున్నాయి. చట్టం చుట్టమైందా?సినిమా స్క్రిప్టుల్లా ఎక్కువ ట్విస్టులు, తక్కువ క్లారిటీతోనే ఈ ప్రేమకథలన్నీ ఉంటున్నాయి. అందుకే, క్రేజీగా ఉండే ఈ కథలు హృదయాల్లో చోటు దక్కించుకుంటున్నా, చట్టాల్లో మాత్రం ఇంకా గందరగోళంగానే ఉన్నాయి. కొన్ని బంధాలపై న్యాయవ్యవస్థ నేరుగా స్పందిస్తోంది. స్పష్టత లేక, మరికొన్ని బంధాలను అసలు పట్టించుకోవడమే లేదు. ఫలితంగా చట్టం కొందరికి హక్కుల రక్షణగా మారుతుంటే, మరికొందరికి మోసంగా మారిపోతోంది. గౌరవిస్తున్న బంధాలుగా...భారతీయ చట్టం ఈ ఆధునిక ప్రేమలకు పూర్తిగా సపోర్ట్ ఇవ్వలేకపోయినా, కొన్ని విషయాల్లో మాత్రం ముందడుగు వేసింది. ముఖ్యంగా లివ్–ఇన్ బంధాలపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. ఇద్దరు మేజర్లు పరస్పర సమ్మతితో కలిసి జీవించడం అక్రమం కాదని, దీర్ఘకాల బంధాన్ని ‘వివాహంతో సమానంగా’ పరిగణిస్తూ మహిళలకు హక్కులు కల్పించింది. వ్యక్తిగత స్వాతంత్య్ర హక్కు, ఆర్టికల్ 21 ప్రకారం, ఎవరితో జీవించాలన్నది వ్యక్తిగత నిర్ణయం.ఈ కోణంలో చూస్తే, జె¯Œ జీ ప్రేమలను నేరంగా పరిగణించే పరిస్థితి లేదు. అలాగే, పెళ్లి కాని బంధాల్లో ఉన్న మహిళలకూ గృహ హింస నిరోధక చట్టం 2005 కింద రక్షణ కల్పిస్తోంది. అంటే, స్నేహితుడితో కలిసి ఉండే మహిళపై హింస జరిగితే, ఆమెకు చట్ట పరిరక్షణ లభిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో లివ్ ఇన్ జంటలపై ఉన్న సామాజిక ఒత్తిడులను కోర్టులు ఖండించాయి. ప్రేమను సంస్కృతి పేరుతో జడ్జ్ చేయవద్దు అంటూ న్యాయవ్యవస్థ పేర్కొంది. చిక్కుముళ్లుగా.. వేగంగా మారుతున్న ఈ సంబంధాల పట్ల మన న్యాయ వ్యవస్థ చాలా నెమ్మదిగా స్పందిస్తోంది. ముఖ్యంగా, ‘సిచ్యుయేషన్షిప్’, ‘ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్’, ‘నో స్ట్రింగ్స్ అటాచ్డ్’లాంటి సంబంధాలకు చట్టపరంగా స్పష్టమైన నిర్వచనమేమీ లేదు. ఈ సంబంధాల్లో స్పష్టమైన నిబంధనలు లేకపోవడం వలన, యువత భావోద్వేగ మోసాలకు, ఆర్థిక దుర్వినియోగానికి గురవుతున్నారు. అలాగే, వీటిపై హక్కుల వివరణ, రక్షణ కష్టంగా మారింది. వివాహేతర బంధాల్లో పిల్లలకు వారసత్వ హక్కులు చట్టంలో అస్పష్టంగా ఉన్నాయి. ఇక, సాంప్రదాయ ఒత్తిడులు, ఫ్యామిలీ ఒడిదుడుకులు కూడా చట్టానికి అందని సత్యాలుగా మారాయి. ఇలా కొత్త తరానికి చట్టం కొన్ని సమస్యలును తెస్తోంది. అయితే, ఈ ప్రేమల మధ్య నిజాయితీ ఉంటే చట్టం అడ్డుపడటం లేదు. భవిష్యత్ ప్రమాదకరం..జెన్ జీ రిలేషన్షిప్లో పేర్లు ఏవైనా సరే ఎటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్ లేకపోవడం కామన్ పాయింట్. సైకలాజికల్ సేఫ్టీ మనిషికి ప్రాథమిక అవసరం. అది పటిçష్ఠమైన బంధాల్లో మాత్రమే దొరుకుతుంది. నేడు కనిపిస్తున్న బంధాలు బయటకు అందంగా కనిపిస్తున్నా, లోపల బోలుగా ఉంటున్నాయి. మనిషి బేసిక్ హంగర్స్లో ఎగ్జిస్టెస్ హంగర్ ఒకటి. భార్యాభర్తల మధ్య; కుటుంబంతోనూ; బంధువులు, స్నేహితులతోనూ బలమైన బంధాలు ఉన్నప్పుడు మనిషి అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్న రాదు. ఇవి ఎప్పుడైతే బలహీన పడిపోతాయో లోలోపల సంఘర్షణ ప్రారంభమవుతుంది. ఇది పలు మానసిక సమస్యలకు దారి తీస్తుంది. నేటి తరం ‘మనం’ అనే భావన నుంచి ‘నేను’ అనే భావన వైపుగా వెళుతోంది. ఈ ధోరణి వ్యక్తిగతంగానూ సామాజికపరంగానూ అంత మంచిది కాదు. దీని పర్యవసానం ఏమిటో మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. యువతకు రిలేషన్షిప్ని రీడిఫైన్, రీబిల్డ్ చేసుకోవడంపై కోర్సులను రూపొందించాల్సిన ఆవశ్యకత ఉంది. యూనివర్సిటీలు, కాలేజీలు ఆ దిశగా అడుగులు వేయాలి. ట్రెండ్లో వ్యాపారాలు!జెన్ జీ ప్రేమలు స్పీడ్ బస్సులా వెళ్లిపోతుంటే... వాటి చక్రాలుగా తిరుగుతున్నాయి అనేక వ్యాపారాలు! కొన్ని బంధాలు మధ్యలోనే పంక్చర్ అవుతుంటే, మరికొన్ని స్టెపినీలా కొత్త కొత్త ఆలోచనలతో లాభాలు చూస్తున్నాయి. ఈ తరం కండిషన్స్ అప్లయ్! బంధాలను బాగా అర్థం చేసుకొని, సక్సెస్ అయిన వాటిల్లో ముఖ్యంగా డేటింగ్ యాప్స్ నిలిచాయి. జెనరేషన్ మొత్తం ‘స్వైప్ లెఫ్ట్, స్వైప్ రైట్’ మీదే ఆధారపడి ప్రేమించేస్తోంది. దీంతో ‘పెళ్ళిళ్ల పేరయ్యలు’ ఇంట్లోనే కూర్చుంటున్నారు. ప్రేమకు బహుమతిగా, ‘డేట్ కిట్ బాక్స్’, ‘బ్రేకప్ హ్యాండీ ప్యాక్’, ‘లోన్లీ గిఫ్ట్ హ్యాంపర్’ వంటి ప్రేమ వస్తువులను బాక్సుల్లో ప్యాక్ చేసి పంపిస్తూ, కంపెనీలు పర్సులను నింపుకుంటున్నాయి. ఒకవేళ ప్రేమ దూరమైతే, ‘థెరపీ ఫర్ ఎక్స్’, ‘బెంచింగ్ పెయిన్ రిలీఫ్’ అనే ఆన్లైన్ సేవలు కూడా రెడీగా ఉన్నాయి. కానీ ఈ ప్రేమ మార్పులు మరికొన్నింటికి తలనొప్పిగా మారాయి! పెళ్లి మండపాలు డైవోర్స్ పార్టీలకు హ్యాంగౌట్ స్పాట్లుగా మారిపోతున్నాయి. చాలా మంగళసూత్రాలు షాపుల్లోనే ఉండిపోతున్నాయి. పెళ్లికి కట్టుబాట్లు తగ్గిపోవడంతో, మ్యాట్రిమోనియల్ సైట్లకు నోటిఫికేషన్లు రావడం అరుదైపోయాయి. ఇక ‘పెళ్లి ఫొటోగ్రఫీ’ కన్నా ‘బ్రేకప్ సెల్ఫీ’కే డిమాండ్ పెరిగిపోయింది. ఇలా జె¯న్ జీ ప్రేమలు ఎంత వెరైటీగా మారుతున్నాయో, వాటి చుట్టూ జరుగుతున్న వ్యాపారాలూ కూడా అంతే క్రియేటివ్గా రూపాంతరం చెందుతున్నాయి.ఒకప్పుడు ప్రేమ కోసం ఎదురు చూసేవాళ్లు, ఇప్పుడు ప్రేమ కోసం అప్గ్రేడ్ వెతుకుతున్నారు. 2024లో నిర్వహించిన ‘ఈ హర్మోనీ అండ్ రియల్ రీసర్చ్’ సర్వే ప్రకారం, 18 నుంచి 40 ఏళ్ల అమెరికన్లలో 40 శాతం మంది యువత ఏఐ భాగస్వాములను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కొందరికి ఇది సురక్షితమైన ఎమోషనల్ ఔట్లెట్, మరికొందరికి ఇది రియల్ రిలేషన్షిప్కి ట్రైనింగ్ ఇచ్చే సలహాదారు. ఇదే విధంగా 16.7 శాతం పురుషులు ఏఐ ప్రేమ వల్ల తాము నిజమైన సంబంధాల్లో మెరుగవుతామని చెప్పారు. అలాగే, 11.5 శాతం మంది యువత ఏఐతో బంధం వల్ల భావోద్వేగ మోసాలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. కాని అదే సమయంలో, 15.4 శాతం మంది యువత ‘నా ప్రేయసి, నా కంటే ఏఐనే ఎక్కువ ఇష్టపడుతుందేమో?’ అనే భయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రేమ ఆన్లైన్లో అప్లయ్ చేసుకునే ఒక అప్లికేషన్లాగా కూడా మారుతోంది. అదే విధంగా ప్రస్తుతం యువత ప్రేమను చూసే విధానాన్ని కూడా అంచనా వేసి చెప్పారు. అందులో ఒక డేటింగ్ ప్లాన్ గురించి వివరించారు. ప్రస్తుతం డేటింగ్ అంటే గులాబీ పువ్వతో కాకుండా, గూగుల్ షీట్తో మొదలవుతుంది. ‘మైక్రోమాన్స్’ అంటే చిన్నచిన్న జాగ్రత్తలు, ‘ఫ్యూచర్ ప్రూఫింగ్’ దీర్ఘకాలిక ఆర్థిక ఆలోచనలు ప్రధానమైన డేటింగ్ ప్లాన్లో భాగమయ్యాయని ఈ సర్వే తెలిపింది. ప్రస్తుతం ఇవే ఇప్పటి కొత్త లవ్ లాంగ్వేజ్గా కూడా మారాయి. బిల్లు స్లిప్ట్ చేయడం, స్ట్రెస్లో నీళ్లు తాగమని రిమైండ్ చేయడం. నైట్ రైడ్కి క్యాబ్ బుక్ చేయడం.. ఇవన్నీ ఇప్పుడు రొమాన్స్కి న్యూ వర్షన్ మోడల్స్. ఈ విధంగా యువత ప్రేమలో మునిగిపోవడం మరచిపోయి, ఎమోషనల్, ఫైనాన్షియల్ హెల్మెట్స్తో దూసుకెళ్లడం నేర్చుకుంటోందని తెలిపింది.∙∙ ప్రేమ నీటి బుడగలా కాకుండా, ప్రవహించే నదిలా ఉండాలి. అది నెమ్మదిగా మనసులోకి చేరి, కాలంతో కలుస్తూ, ఆత్మకు జీవం పోయాలి. కాని, ఇప్పటి ప్రేమ కథలు వాట్సాప్ స్టేటస్లా, ఇరవై నాలుగు గంటలు కూడా నిలవని అనుబంధాలుగా మారిపోయాయి. అయితే, ప్రేమ ఏ దశలో ఉన్నా సరే, గౌరవం, స్పష్టత, నిజాయితీ ఉంటేనే అది బంధంగా నిలుస్తుంది. లేదంటే, అది మరో ఘోస్టింగ్ ఎపిసోడ్గానే మిగిలిపోతుంది. బ్రిటన్కు చెందిన ‘ఆఫ్కమ్’ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారు ప్రపంచాన్ని టెక్నాలజీతో కలిపే తరమే అయినా, ‘ఎక్కువగా ఒంటరితనంలో ఉన్న తరం’ అని పేర్కొంది. అందుకే, డేటింగ్ యాప్లు, రిలేషన్షిప్ మోడల్స్, పెళ్లిపై అభిప్రాయాలన్నీ భిన్నంగా ఉన్నాయి. ఈ విషయాన్ని వారి తాజా అధ్యయనాలతో తెలిపింది. (చదవండి: బ్రెయిన్ ఆరోగ్యం కోసం ఇవి తప్పనిసరి..!) -
ప్రాణం తీసిన ఫ్లాస్కు
అతి అనర్థానికి దారితీస్తుంది అన్నట్లు... ఒక తైవాన్ వ్యక్తికి, తన పాత థర్మోస్ ఫ్లాస్కుపై ఉన్న మమకారం, చివరకు ప్రాణాలు కోల్పోయేలా చేసింది. ఏదైనా తాగాలంటే అదే థర్మోస్ ఫ్లాస్కును ఎక్కడికెళ్లినా చేతిలో పెట్టుకొని తిరిగేవాడు. అది తుప్పు పట్టింది, రంగు మారింది. కాని, మనోడు మాత్రం ‘ఇంకా బాగానే ఉంది!’ అంటూ పుల్లటి పానీయాలు, కాఫీ, జ్యూస్ అన్నీ అదే బాటిల్లో పోసుకుని తాగుతూనే ఉండేవాడు. అలా పదేళ్లు వాడేశాడు. అయితే, తుప్పు, పానీయాల్లోని పులుపు కలసి లోహాలను పానీయాల్లోకి విడుదల చేశాయి. అవి శరీరంలోకి చేరి నెమ్మదిగా విషపూరితం చేశాయి. మొదట జలుబు, ఆ తర్వాత ఊపిరితిత్తుల ఇన్ఫెఫెక్షన్. రక్త పరీక్షల్లో చూసిన డాక్టర్లు ‘ఇది రక్తమా! లేక ఖనిజాల ద్రావణమా!’ అంటూ షాక్ అయ్యారు. బ్లడ్లో సీసం, క్రోమియం, నికెల్ వంటి భార లోహాలు ఉన్నాయి.అసలు కారణం? అదే పాత థర్మోస్ ఫ్లాస్కు కడిగినంత మాత్రాన శుభ్రమవుతుందని అనుకున్నాడు. కాని, అది అతని రోగనిరోధక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసింది. చివరకు అతని ప్రాణాలే పోయాయి. ఇప్పుడు ఈ తైవాన్ స్టోరీ ప్రజలకు ఒక తీవ్ర హెచ్చరికగా మారింది.(చదవండి: విమానాలకు సోడియం ఇంధనం!) -
విమానాలకు సోడియం ఇంధనం!
విమానాలు సహా విద్యుత్తుతో నడిచే వాహనాలన్నింటికీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా లిథియం అయాన్ బ్యాటరీలను వినియోగిస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు ఇటీవల సోడియం ఫ్యూయల్ బ్యాటరీలను రూపొందించారు. లిథియం చాలా అరుదుగా దొరికే మూలకం. అందువల్ల దీని ఖరీదు ఎక్కువ. దీనికి ప్రత్యామ్నాయం కోసం రకరకాల ప్రయోగాలు సాగించిన శాస్త్రవేత్తలు, చివరకు విరివిగా దొరికే సోడియంతో బ్యాటరీని విజయవంతంగా రూపొందించారు. దీని తయారీ కోసం సోడియంను ద్రవరూపంలో ఉపయోగించారు. ఇప్పుడు వాడుతున్న లిథియం బ్యాటరీల కంటే సోడియం బ్యాటరీల ఇంధనసాంద్రత మూడురెట్లు ఎక్కువగా ఉంటుందని, అందువల్ల వాటి మన్నిక ఎక్కువగా ఉంటుందని; పైగా ఈ బ్యాటరీలు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటాయని ఎంఐటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే, విద్యుత్ వాహనాల బ్యాటరీలు మరింత చౌక కావడమే కాకుండా, వాతావరణ కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సోడియం బ్యాటరీలను చిన్న మోటారు వాహనాలతో పాటు భారీ విమానాలు, నౌకలలో కూడా సురక్షితంగా ఉపయోగించవచ్చని చెబుతున్నారు.(చదవండి: గుండె ఆరోగ్యం కోసం బ్రిస్క్ వాకింగ్..! ఎలా చేయాలంటే..) -
మాట కటువైతే... మురి పాలు విరుగుతాయ్!
‘‘తొమ్మిది నెలల బొడ్డుతాడు అకస్మాత్తుగా అలా కోసేస్తే ఎలా...?’’ అనుకున్నాడో ఏమో దేముడు! ‘‘పేగుబంధమిలా తెంచినందుకేనేమో... ఆహారంగా పాలబంధం పెట్టి స్తన్యబంధమేర్పాటు చేశాడనిపిస్తోంది!!ప్రసవవేదనతో ప్రాణాల్ని తోడేసిన ఆ కొత్తబిడ్డలోకి తన ప్రాణాలు నింపి... తనలోంచి బయటకు తోడిన ప్రాణాలను మళ్లీ నెమ్మది నెమ్మదిగా పునఃప్రతిష్టించుకుంటూ ఉంటుంది అమ్మ. అలా అప్పుడప్పుడే కోలుకుంటున్న కీలక తరుణంలో ఆ అమ్మ పట్ల జడ్జిమెంటల్గా కొన్ని కామెంట్స్ చేయవద్దని కోరుతున్నారు మానసికవేత్తలు.ఆ పోస్ట్ పార్టమ్ ‘బ్ల్యూ’స్ తాలూకు ‘నీలి’నీడల్ని క్రమంగా బిడ్డపై ప్రేమ పెంచుకుంటూ ఇంద్రధనుస్సులాంటి ఫ్లయింగ్ కలర్స్గా మార్చుకునే తరుణంలో ఆ కామెంట్లు ఆమెలో అపరాధభావం నింపుతాయంటూ హెచ్చరిస్తున్నారు. సూచన అనే మారువేషం వేసుకుని కర్కశాన్ని కనిపించకుండా కప్పేస్తూ ఉండే... పలకకూడని ఆ పరుష పదాలేమిటో చూద్దాం.ఈనెల మొదటి తేదీతో మొదలై ఈ వారమంతా తల్లి పాల వారోత్సవాలు కొనసాగుతుంటాయి. ఈ సందర్భంగా బుజ్జాయికి తల్లి పాలే పట్టమంటూ సిఫార్సు చేస్తుంటారు డాక్లర్లు. ‘బాటిల్ పాలు బొజ్జ నింపుతాయేమోగానీ... అమ్మ పాలు కడుపునింపడంతో పాటూ ఆత్మనూ నింపుతాయంటున్నారు’ వైద్య నిపుణులు. ఈ సమయంలో కొన్ని మాటలు కొత్త తల్లితో చెప్పకూడదంటూ వారు సూచిస్తున్నారు. ‘‘అమ్మా! నువ్వు పీరియడ్స్లో ఉండి మైలతో ఉంటే బిడ్డకు పాలుపట్టకు’’– కొందరు పెద్దాళ్ల పెడసరం మాటఇది ఎంతమాత్రమూ తల్లితో చెప్పకూడని మాట. బిడ్డకు తల్లి పాలను మించిన ఆహారం లేదు. డాక్టర్లు నిర్దిష్టంగా వద్దని చెబితే మినహా బిడ్డకు పాలుపట్టకుండా ఉండనే కూడదు. పైగా మురి పాలతో పట్టే ముర్రు పాలు ఇంకా ఇంకా మేలూ మంచీ చేసేవే. ఆ ముర్రు పాలనే కొలెస్ట్రమ్ అంటారు. తల్లిని దేవత అన్నాక అమ్మ అమృతం పట్టక పోతే ఎలా! అందుకే అనేక అనారోగ్యాలూ... ఎప్పుడో వృద్ధాప్యంలో బిడ్డకు వచ్చే ఎన్నో జబ్బుల్నించి రక్షించే ఆ పాలు అమృతాలు కాకుండా ఎలా పోతాయి. అమృతానికి అంటు ఏమిటి? పాలకు మైలేమిటి? అందుకే తల్లి ఏ పరిస్థితుల్లో ఉన్నా బిడ్డకు అమ్మ పాలు పట్టాల్సిందే. ‘‘ పాప ఏడుస్తోంది... పాలు సరిగా పట్టావా? ఏమో.... పట్టావో లేదో?’’ – అనుభవజ్ఞురాలంటూ ఆరా తీసే మహిళ పాలు తాగుతుండే పా పాయి చక్కగా బరువు పెరుగుతుంటే చాలు. పాలు తన ఒంటికి పడుతున్నట్టే లెక్క. తల్లి ఇచ్చే ఆ పాలబువ్వనంతా బిడ్డ ఒంటికంతా పట్టేలా ఏర్పాటు చేస్తుంది ప్రకృతి. అందుకే నెలల పా పాయిలకు మలవిసర్జన అంతగా కాక పోవచ్చు. కొన్నిసార్లు మల విసర్జనకు రెండు మూడురోజులూ పట్టవచ్చు లేదా రోజులో రెండుసార్లు కూడా కావచ్చు. కానీ మూత్రంతో రోజుకు ఆరుసార్లైనా డయపర్ తడిపేస్తుంది బేబీ! అలా రోజూ పాలు తాగే పసి పాప... రోజులో ఐదారుసార్లు పక్కతడిపేస్తుంటే చాలు. ఇక పా పాయి ఏడుస్తుందంటే అర్థం పాలు సరి పోలేదని కాదు... అది కోలిక్ అని పిలిచే కడుపునొప్పి వల్ల కావచ్చు. చెప్పుకోలేని చెవినొప్పి ఉండచ్చు. అందుకే... పాప అదేపనిగా ఏడుస్తుంటే ఒకసారి చిన్నపిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. అంతేతప్ప జడ్జిమెంటల్గా కామెంట్స్ పాస్ చేయకూడదు. ‘‘ఏమిటీ...? పాలు పట్టడం అప్పుడే మానేశావా? మా కాలంలో బిడ్డకు మూడేళ్లు వచ్చే వరకూ పట్టేవాళ్లమమ్మా...’’– తమ కాలమైన గతమంతా గొప్పేనంటూ చెప్పే ఓ పెద్దావిడ మాటబిడ్డకు ఆర్నెల్లు వచ్చేవరకూ పాలు పట్టడం తప్పనిసరి. చిన్నారి పా పాయికి పాలే సరైన ఆహారం. ఆర్నెల్ల తర్వాత నెయ్యీ పప్పూతో గుజ్జుగుజ్జుగా కలిపిన అన్నం గోరుముద్దలతోనూ, గుజ్జుగా నలిపే పండ్ల బువ్వతో క్రమంగా ఘనాహారమంటూ అలవాటు చేయడాన్ని ఇంగ్లిష్లో ‘వీనింగ్’ అంటారు. ఇలా చేస్తూ కూడా ఏడాది ఏడాదిన్నర వరకూ పాలు పడుతూనే ఉండవచ్చు. డాక్టర్ చెప్పిన ఏ కారణాల వల్లనో లేదా బిడ్డకు సరిపడా పాలు తల్లికి పడకనో ఆపేయాల్సి వస్తే... అందుకు అనేక కారణాలుండవచ్చు. అందుకే అదేదో నిష్ఠూరంగా ఎలా పడితే అలా మాట్లాడాల్సిన మాట కాదు. ‘‘బిడ్డ బరువు సరిగా పెరుగుతున్నట్టుగా లేదు... పాలు సరిగా పట్టడం లేదా?’’– పెత్తనం చేస్తున్నట్టుగా పెదవి దాటించే ఓ పెద్దావిడ ఆరా!బిడ్డకు పాలు సరి పోయాయంటే... కడుపు నిండిన వెంటనే పా పాయి కనీసం గంటా గంటన్నర పాటు నిద్ర పోతుంది. పాలు తాగాక కనీసం గంటసేపైనా పా పాయి పడుకుందంటే చిన్నారికి కడుపు నిండినట్టే లెక్క. కొందరు బిడ్డలు కాస్త పీలగా ఉండొచ్చు. అందరూ బొద్దుగానే ఉండరు కదా. అలా చూసి... ఇలా నిష్టూరాలు ఆడకూడదు. మొదట్లో ఒకవైపు పాలు తాగడానికి బిడ్డకు 20 నిమిషాల నుంచి 25 నిమిషాలూ పట్టవచ్చు. పాలు తాగే నైపుణ్యం పెరుగుతున్నకొద్దీ పా పాయి 5 – 10 నిమిషాల్లోనే పాలు తాగేస్తుంటుంది. అయితే... పాలు పట్టేటప్పుడు మొదట వచ్చే పాలను ఫోర్ మిల్క్ అంటారు. అందులో నీటి మోతాదు ఎక్కువగా ఉంటుంది. అది తాగేశాకే హైండ్ మిల్క్ అనే పాలొస్తాయి. ఇందులో బిడ్డ పెరుగుదలకు కావాల్సిన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. అవన్నీ కొవ్వులే అయినా పాప ఒంటికి హాయిగా పట్టేలా చేస్తుంది ప్రకృతి.కొత్త తల్లితో కినుక మాటలు ఎందుకు మాట్లాడకూడదంటే... కొత్త తల్లికి అంతా కొత్తే. కొంగులో బంగారు బిడ్డతో కొత్త తల్లికి అసలే కంగారు. పాప పుట్టే సమయంలో అనుభవించే వేదనతో కొన్నిసార్లు పాపపై కోపం వచ్చేలాంటి ‘ పోస్ట్ పార్టమ్ బ్లూస్’ వర్కవుట్ అవుతూ ఉంటాయి. అవి క్రమంగా తగ్గుతుండే సమయంలో ఇలాంటి నిష్ఠూరాలతో అమ్మమనసుకు కష్టం కలిగిస్తాయి. అలాంటి వ్యాఖ్యలు ఆమెను మానసికంగా దెబ్బతీసి గిల్ట్ను నింపవచ్చు. మొదటే తెలియని తనం... అసలే అనుభవలేమి... పైగా ఇలాంటి మాటలు!! వీటితో ఆమెలో ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం దెబ్బతింటే ఇంకా ఇంకా సమస్యలు రావచ్చు. అందుకే అలాంటిలాంటి అనుచిత వ్యాఖ్యలు వద్దంటూ సూచిస్తున్నారు సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు. -
పెంపుడు జంతువులకూ పోషకాహార లోపం..!
పోషకాహార లోపం మనుషులనే కాదు.. జంతువులనూ వేధిస్తోంది.. ఈ విషయాలు తాజాగా జాతీయ స్థాయిలో ఓ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయ్యాయి. నగర జీవనశైలికి అనుగుణంగా ఆహారం అవసరం ఉంటుందని, హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లోని పెంపుడు జంతువుల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తోందని ఆ అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. ప్రతి పది జంతువుల్లో తొమ్మిదిట్లో ఈ తరహా లోపం కనిపిస్తోందని, తగిన జాగ్రత్తలు పాటిస్తే సమస్యను అధిగమించొచ్చని పెట్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై ఇప్పటికే పలు స్వచ్ఛంద సంస్థలు జంతుప్రేమికులకు అవగాహన కల్పించేందుకు ప్రచారం చేపట్టాయి. నగరంలోని పెట్ లవర్స్ని ఆకట్టుకునే విధంగా కార్యక్రమాలను రూపొందించారు. ప్రస్తుత నగర జీవనశైలిలో పెంపుడు జంతువులు ఓ భాగంగా మారాయి. కొందరు జంతువులపట్ల ప్రేమతో పెంచుకుంటుంటే.. మరికొందరు స్టేటస్ సింబల్ కోసం.. ఇంకొందరు బిజీలైఫ్లో కాసేపు ఒత్తిడిని తగ్గించుకునేందుకు మంచి తోడు కోసం.. తమ భావాలను వాటితో పంచుకునేందుకు పెంచుకుంటుంటారు.. ఇందులో ముఖ్యంగా పిల్లులు, కుక్కలు, కొన్ని రకాల పక్షులు కీలకంగా మారాయి. అయితే చాలా మంది ఇంటి సభ్యులు మాదిరిగానే వాటినీ చూసుకుంటుంటారు.. వారు తినే భోజనాన్నే వాటికీ ఆహారంగా పెడుతుంటారు. ఎంతో ప్రేమతో మచి్చక చేసుకుని, వాటిని హత్తుకుంటూ వాటిని పెంచుకుంటుంటారు చాలా మంది యజమానులు. అయితే మరీ ముఖ్యమైన విషయాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుబాటులో ఉన్న ఆహారం పెట్టడం వల్ల వాటి పోషకాహార అవసరాలు తీరడంలేదనేది నిపుణులు చెబుతున్న మాట. సర్వే ఏం చెబుతోంది?నగరాల్లో పెంపుడు జంతువుల్లో ఇటీవల దేశంలోని పశువైద్యులను సంప్రదించి నిర్వహించిన సర్వేలో ప్రతి పది పెంపుడు జంతువుల్లో తొమ్మిదిట్లో సరైన పోషకాహారం అందడంలేదనే ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో న్యూట్రిషన్ విషయంలో విశేష సేవలందిస్తున్న మార్స్ సంస్థ ‘పెట్స్ని కుటుంబంలా ప్రేమించండి.. కానీ వాటికి కావాల్సినదే ఆహారంగా పెట్టండి’ అనే సందేశంతో సరికొత్త ప్రచారానికి తెరతీశారు. ఈ ప్రచారానికి సంబంధించిన వీడియోలు హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లోని పెట్స్ యజమానుల భావోద్వేగాలకు అనుగుణంగా రూపొందించారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లోనూ ఈ వీడియోలు ఆయా గ్రూపుల్లోనూ, అఫీషియల్ ఫాలోవర్స్ పేజీల్లోనూ చెక్కర్లు కొడుతున్నాయి. సాధారణంగా ఇళ్లల్లో పెంచుకునే పెట్స్ జీవనశైలి, వాటి దైనందిన జీవితం, వాటి మనుగడకు కాస్త ప్రత్యేకమైనది. వాటికి అనువైన ఆహారం అందించకపోవడం వల్ల మనుషుల్లానే అవి కూడా పోషకాహార లోపంతో బాధపడుతున్నాయని ఇటీవలి సర్వేలో వెల్ల్లడయ్యింది. దేశంలోని పశువైద్యుల సర్వే ప్రకారం.. 91% పశువైద్యులు వాటి జీవన, జీర్ణ క్రియ ఆధారంగా రూపొందించిన ప్యాకేజ్డ్ పెట్ ఫుడ్ వాడాలనే సూచన చేస్తున్నారు. 88% మంది ఇంట్లో వండిన ఆహారం పోషకపరంగా తక్కువగా ఉందని, 86% మంది తగిన పోషకాలు లేకపోవడం వల్ల జంతువులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చర్మసమస్యలు, అరుగుదల లోపం, శక్తిలేమి లాంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు పెరుగుతున్నాయట. సమతుల ఆహారం.. పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పెడిగ్రీ, విస్కాస్ వంటి పలు బ్రాండ్ల ఆహారం, వాటి శరీర ధర్మానుసారం సమతుల పోషకాలను అందిస్తున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. వీటిని వాల్థామ్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్ నిపుణులు రూపొందించగా, అవి జంతువుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నట్లు పలువురు యజమానులూ, వైద్యులూ చెబుతున్నారు. ఈ కారణంగా, లైఫ్స్టైల్ కోణంలో పెంపుడు జంతువుల పోషకాహారంపై స్పష్టమైన అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. పిల్లి, కుక్కకు మనం తినేది కాకుండా, వాటికి అవసరమైనదే పెట్టాలి.., ఇది ప్రేమతో కూడిన శాస్త్రీయ సంరక్షణకు మొదటి అడుగు అని సూచిస్తున్నారు. అయితే ప్యాకేజింగ్ ఫుడ్ మాత్రమే పెట్టాల్సిన అవసరం ఉందా? అంటే.. వాటి సహజ జీవనశైలికి అనుగుణంగా ఉండే ఆహారాన్ని పెట్టినా సరిపోతుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. (చదవండి: గుండె ఆరోగ్యం కోసం బ్రిస్క్ వాకింగ్..! ఎలా చేయాలంటే..) -
గుండె ఆరోగ్యం కోసం బ్రిస్క్ వాకింగ్..! ఎలా చేయాలంటే..
బ్రిస్క్ వాకింగ్ గుండె ఆరోగ్యానికి మంచిది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. బ్రిస్క్ వాకింగ్ అంటే మీ సాధారణ నడక కంటే వేగంగా నడవడం. అంటే హృదయ స్పందన రేటును పెంచే వేగంతో నడవాలి. ఇది మితమైన తీవ్రత కలిగిన వ్యాయామం, అంటే నడుస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది పడతారు, కానీ మాట్లాడగలరు. బ్రిస్క్ వాకింగ్ ప్రయోజనాలుబ్రిస్క్ వాకింగ్ గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది ∙బ్రిస్క్ వాకింగ్ కేలరీలను కరిగించడానికి ఉపకరిస్తుంది. దీనిద్వారా ఇది బరువు తగ్గడానికి లేదా బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. ∙మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది బ్రిస్క్ వాకింగ్ ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గించడానికి సహాయపడుతుంది. ∙ఎముకలు, కండరాలను బలోపేతం చేస్తుంది. బ్రిస్క్ వాకింగ్ ఎముకలు, కండరాలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది, ఇది ఎముకల సాంద్రతను పెంచడం ద్వారా బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.∙శక్తి స్థాయులను పెంచడానికి, అలసటను తగ్గించడానికి సహాయపడుతుంది. జ్ఞాపకశక్తిని, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. బ్రిస్క్వాకింగ్ ఎలా చేయాలి?మీ సాధారణ నడక వేగాన్ని పెంచండి.మీ చేతులను మీ వైపులా వదిలివేయండి, లేదా వాటిని కొద్దిగా వంచి, ముందుకు వెనుకకు ఊపండి. మీ నడకలో వేగం, దూరాన్ని పెంచండి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల బ్రిస్క్ వాకింగ్ చేయడానికి లక్ష్యంగా పెట్టుకోండి. బ్రిస్క్వాకింగ్ ప్రారంభించడానికి చిట్కాలు. ∙మీకు నడవడం అలవాటు లేక΄ోతే, నెమ్మదిగా ప్రారంభించండి.క్రమంగా వేగాన్ని, దూరాన్ని పెంచండి. ∙మీకు నచ్చిన ప్రదేశంలో నడవండి ఉదాహరణకు తోటల్లో లేదా బీచ్ వంటి ప్రదేశాలలో అన్నమాట.. దీనిని ఒక సామాజిక కార్యకలాపంగా మార్చడానికి స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో కలిసి నడవండి. -
బ్రెయిన్ ఆరోగ్యం కోసం ఇవి తప్పనిసరి..!
రాగి అనేది శరీరంలోని ప్రతి కణజాలంలో కనిపించే ఒక ముఖ్యమైన ట్రేస్ మినరల్. ఇతర ఖనిజాల మాదిరిగా, శరీరం దానిని స్వంతంగా తయారు చేసుకోదు; మనం తీసుకునే ఆహారం ద్వారానే లభిస్తుంది. అనేక ఇతర ముఖ్యమైన ఖనిజాలతో పోలిస్తే, ఎక్కువ రాగి అవసరం లేదు. అలాగని రాగి లోపిస్తే మాత్రం మెదడు పనితీరు మందగిస్తుంది. అందువల్ల రోజూ ఆహారంలో తగినంత కాపర్ ఉండేలా చూసుకుంటే మెదడు కణజాలం చురుగ్గా పని చేస్తుంది. దానిద్వారా జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. రాగి వివిధ న్యూరోహార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది, జన్యు వ్యక్తీకరణను నియంత్రిస్తుంది. మెదడు అభివృద్ధికి మద్దతు ఇస్తుంది, పిగ్మెంటేషన్ను ప్రభావితం చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థ పనితీరును నిర్వహిస్తుంది. మెదడు ఆరోగ్యంలో...మెదడు అభివృద్ధికి, దాని పనితీరుకు సరైన మొత్తంలో రాగి కూడా అవసరం. మానసిక స్థితి, ప్రేరణ, శ్రద్ధ, ఒత్తిడి ప్రతిస్పందనను నియంత్రించడం వంటి వివిధ మెదడు విధుల్లో రాగి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అధిక రాగి స్థాయులు అల్జీమర్స్ వ్యాధికి కూడా దారితీస్తాయి. హిప్పోకాంపస్, సెరిబ్రల్ కార్టెక్స్ వంటి మెదడులోని ముఖ్యమైన ప్రాంతాలలో న్యూరాన్ల పనితీరును అధిక స్థాయిలో రాగి ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది జ్ఞాపకశక్తి, విమర్శనాత్మక ఆలోచన వంటి వాటికి ఉపకరిస్తుంది. రాగి అత్యధికంగా ఉండే ఆహారాలు ఆర్గాన్ మీట్స్, గుల్లలు, ఇతర సముద్ర ఆహారాలు, పౌల్ట్రీ, రెడ్ మీట్ వంటి జంతువుల నుండి తీసుకోబడిన ఉత్పత్తులు. మీరు డైటరీ కాపర్ కోసం జంతు ఉత్పత్తులను తినవలసిన అవసరం లేదు. అనేక మొక్కల ఆధారిత ఆహారాలు రాగికి సురక్షితమైన వనరులు.మెదడు, ఎముకలు, కీళ్ళు, గుండె, ధమనులు, చర్మం, రోగనిరోధక వ్యవస్థ అంటే అనేక శారీరక ప్రక్రియలకు రాగి చాలా అవసరం కానీ అది లోపిస్తే ఎంత ఇబ్బందో, ఎక్కువ అయితే కూడా అంతటి హానికరం. అందువల్ల తగిన రాగి స్థాయులను నిర్వహించడం శరీర ఆరోగ్యానికి అత్యవసరం. మొక్కల ఆధారిత డైటరీ కాపర్బంగాళదుంపలు, పుట్టగొడుగులు, జీడిపప్పు, పొద్దుతిరుగుడు విత్తనాలు, డార్క్ చాక్లెట్, టోఫు చిక్పీస్, చిరుధాన్యాలు, కాయధాన్యాలు, అవకాడో, టర్నిప్ గ్రీన్స్, పాలకూర. (చదవండి: జస్ట్ 30 నిమిషాల పనికి రూ. 18 వేలు..! కార్పొరేట్ ఉద్యోగి రేంజ్లో..) -
ఆయుష్షా.. ఆరోగ్యమా..!
ఆయుష్షు.. ఆరోగ్యం.. ఈ రెండింటిలో మీ ఓటు దేనికి అంటే చెప్పలేం. ఎందుకంటే ఎంత ఆరోగ్యంగా ఉన్నా... ఆయుష్షు లేకపోతే ఏం లాభం? అదేవిధంగా ఎంత కాలం జీవించి ఉన్నా, ఆరోగ్యం లేకుండా ఎప్పుడూ మంచంలో పడి ఉంటే ప్రయోజనం ఏముంది? అయితే జీవిత కాలానికి, ఆరోగ్య కాలానికీ తేడా ఏమిటని అడిగితే మాత్రం కచ్చితంగా చెప్పచ్చు... జీవిత కాలం అంటే మనం లేదా ఇతర జీవులు ఎంతకాలం పాటు గరిష్టంగా జీవించి ఉన్నారన్నది చెప్పడమే. అదే ఆరోగ్య కాలం అంటే మనం లేదా ఆయా జీవులు బతికిన కాలంలో ఎంత కాలం పాటు ఆరోగ్యంగా ఉన్నారో చెప్పడం. ఆయుష్షులోనూ, ఆరోగ్యంలోనూ జన్యువుల పాత్ర కీలకమైనప్పటికీ ఎవరికి వారు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండటం, అలా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా అధిక కాలం జీవించడం అనేది వారి చేతుల్లోనే ఉంటుంది. ఆయుఃప్రమాణం దేశాన్ని బట్టి మారుతుంటుంది. ఉదాహరణకు అమెరికాలో పురుషుల సగటు ఆయుఃప్రమాణం 75 ఏళ్లయితే స్త్రీలకు 80 సంవత్సరాలు. ప్రతివారూ దీర్ఘకాలం టు ఆరోగ్యంగా గడపాలంటే కొవ్వు స్థాయులు తక్కువగా.. పోషకాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, తేలికపాటి వ్యాయామాలు చేయడం, ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించడం వంటి అలవాట్ల వల్ల జీవిత కాలం, ఆరోగ్య కాలం.. రెండూ సమతుల్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. (చదవండి: జస్ట్ 30 నిమిషాల పనికి రూ. 18 వేలు..! కార్పొరేట్ ఉద్యోగి రేంజ్లో..) -
జస్ట్ 30 నిమిషాల పనికి రూ. 18 వేలు..
వంటవాళ్ల జీతం మహా అయితే ఎంతో ఉంటుంది అనుకుంటాం. పైగా అది చాలా శారీరక శ్రమ ఓర్చి చేయాల్సిన పని కూడా. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే వంటవాడి జీతం గురించి తెలిస్తే..ఇంకెప్పుడూ అంత తక్కువ అంచనా వేయరు. చిన్న చితకా పనులు చేసేవాళ్లు కూడా తెలివిగా స్మార్ట్గా చేయగలరు అనే ప్రూవ్ చేస్తున్నారు. ఒకరకంగా వారి పనే బెటర్గా ఉంది అనిపిస్తుంది కూడా. అచ్చం అలాంటి వ్యక్తి ఈ ముంబై వంటవాడు. కేవలం అరగంట పనికి నెలకు రూ. 18 వేలు వరకు ఛార్జ్ చేస్తాడట. అంతలా.. ఎవరూ ఇస్తారు అనుకోకండి. ఎందుకంటే ముంబైకి చెందిన న్యాయవాది ఆయుషి దోషి నెట్టింట ఈ విషయాన్ని షేర్ చేయడంతో పెనుదూమారం రేపి చర్చలకు దారితీసింది. తన వంట వాడిని మహారాజ్గా సంభోదిస్తూ అతడి పనితీరు సంపాదన తీరుగురించి పోస్ట్లో వెల్లడించారు. దాంతో నెటిజన్లంతా అదంతా అబద్ధం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వంటవాడు కార్పొరేట్ ఉద్యోగిలా సంపాదిస్తాడని. జస్ట్ అరగంట పనికి నెలకు రూ. 18 వేలు జీతం తీసుకుంటాడని, అలా రోజుకు పది నుంచి 12 ఇళ్లల్లో పనిచేస్తాడని చెప్పుకొచ్చారు. దాంతో నెటిజన్లు ఆమె చెప్పినదాంట్లో పూర్తి నిజం లేదని మండిపడడారు. నిజంగా అతడు అరగంటలో వంట చేసేయగలడా..? ఏమైనా ఏఐ ఉపయోగిస్తున్నాడా ఏంటీ.. అని విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. ఆ కామెంట్లకు బదులిస్తూ న్యాయవాది ఈ విధంగా పోస్ట్లో పేర్కొన్నారు. ముంబై ప్రజలరా నేను చెప్పింది వాస్తవమే. ఖరీదైన మెట్రో నగరాల్లో మహమహారాజులు వసూలు చేసేది ఈ రేంజ్లోనే ఉంటుంది. "అదే వంటవాడు 12 మంది ఉన్న కుటుంబానికి రూ. 2.5 వేలు దాకా వసూలు చేస్తాడు. అయితే మీప్రాంతాల్లో ఇంకా అంత తక్కువ జీతానికే వంటవాళ్లు పనిచేసినంతా మాత్రాన అన్నిచోట్ల అలానే ఉంటుందని అనుకోవద్దు. ఖరీదైన నగరాలో జీవితానుభవం ఇలానే ఉంటుంది. ముఖ్యంగా జీవన వ్యయాల్లో వ్యత్యాసాలు ఉంటాయనే విషయం మరిచపోవద్దు అనినొక్కి మరి పోస్ట్లో వెల్లడించింది". న్యాయవాది ఆయుషిMy Maharaj (Cook)•Charges ₹18k per house•Max 30 mins per house•10–12 houses daily•Free food & free chai everywhere•Gets paid on time or leaves without a goodbye 😭Meanwhile I’m out here saying “gentle reminder” with trembling hands with minimum salary.🙂— Adv. Ayushi Doshi (@AyushiiDoshiii) July 29, 2025 (చదవండి: లైట్హౌసింగ్ పేరెంటింగ్ అంటే..? పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దగలదా..?) -
విద్యార్ధుల వేసవి సెలవులు రద్దు?
వేసవి సమయంలో తీవ్రమైన ఎండల వేడి తరచుగా రోజువారీ కార్యకలాపాలకు అసౌకర్యంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే చిన్నారులను ఇబ్బందుల పాటు చేస్తుంది. ఎండలు మండే వేళ, వడదెబ్బల వంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి ముఖ్యంగా భావితరాన్ని రక్షించడానికి పుట్టుకొచ్చాయి సమ్మర్ హాలిడేస్. దశబ్ధాల తరబడి కొనసాగుతున్న ఈ సంప్రదాయం ఇప్పుడు మొదటి సారి చర్చనీయాంశంగా మారింది. గత కొన్నేళ్లుగా వర్షాకాలం సైతం తన తఢాఖా చూపిస్తోంది. అకస్మాత్తుగా కురుస్తున్న భారీ వర్షాలు ఒక్క రోజులోనే దేశంలోని అనేక పెద్ద పెద్ద నగరాలను అతలాకుతలం చేస్తున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఇలాంటి సమయంలో తరచుగా పాఠశాలలకు కూడా సెలవులు (Holidays) ప్రకటించడం జరుగుతోంది.నిజానికి కొందరు విద్యార్ధులైనా ఎండల నుంచి ఎసి బస్సులు, పాఠశాలల్లో ఎసిల ద్వారా అన్నా తప్పించుకోవచ్చునేమో కానీ నగరాల్లో ట్రాఫిక్, పొంగిపొర్లే నాలాలు, డ్రైనేజీలు తదితర పరిస్థతుల దృష్ట్యా చూస్తే తీవ్రమైన వర్షాల నుంచి తప్పించుకోవడానికి స్కూల్కి డుమ్మా తప్ప వేరే మార్గమే లేదు. ఈ నేపధ్యంలో అసలు వేసవి సెలవుల్ని వర్షాకాలం సెలవులుగా మారిస్తే ఎలా ఉంటుంది? అంటూ ఒక కొత్త చర్చ దేశంలో మొదలైంది. ఈ చర్చకు శ్రీకారం చుట్టింది రుతుపవనాలను ఎదురేగి ఆహ్వానించే తొలి రాష్టమైన కేరళ (Kerala). తమ రాష్ట్రంలోని వేసవి సెలవులను ఏప్రిల్ మే నెల నుంచి జూన్, జూలై వర్షాకాల నెలలకు మార్చాలా? అనే చర్చ ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది.నైరుతి రుతుపవనాల ప్రారంభంతో పాటే జూన్ లో పాఠశాలలు తిరిగి తెరవడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది, అయితే భారీ వర్షపాతం వాతావరణ సంబంధిత హెచ్చరికల కారణంగా తరచుగా పాఠశాల తరగతులకు అంతరాయం కలుగుతోంది. తరచుగా తలెత్తుతున్న ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, కేరళ ప్రభుత్వం గరిష్ట రుతుపవన కాలంలో సెలవులను తిరిగి షెడ్యూల్ చేసే అవకాశాన్ని అన్వేషిస్తోంది. ఈ విషయంపై చర్చోపచర్చల్లో భాగంగా కొందరు ప్రత్యామ్నాయంగా మే–జూన్ నెలను కూడా సూచించారట. అయితే ‘‘ఈ మార్పు వల్ల లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి? ఇది విద్యార్థుల అభ్యాసం భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుంది? ఇది ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ఆచరణాత్మకంగా ఉంటుందా? మనం ఇతర భారతీయ రాష్ట్రాలు లేదా దేశాల నుంచి ఈ విషయంలో పాఠాలు నేర్చుకోగలమా?’ అంటూ కేరళ మంత్రి శివన్ కుట్టి (Sivankutty) అడిగారు, దీనిపై ఆయన ప్రజల నుంచి సూచనలను కూడా ఆహ్వానిస్తున్నారు.ఈ విషయంపై నిర్మాణాత్మక సంభాషణకు ఈ చొరవ మార్గం సుగమం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ,కేరళ విద్యాశాఖా మంత్రి తన పోస్ట్లోని కామెంట్స్ విభాగంలో ప్రజలు తమ అభిప్రాయాలను సిఫార్సులను పంచుకోవాలని కోరుతున్నారు. ఈ నేపధ్యంలో కేరళలో దీనిపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. వర్షాల కారణంగా విలువైన విద్యా సంవత్సరంలో అనేక రోజులు స్కూల్స్ మూతబడుతున్న పరిస్థితిలో ఇది చర్చనీయాంశమేనని అనేకమంది అభిప్రాయపడ్డారు. దీనిపై ఆన్ మనోరమ అనే స్థానిక మీడియా సంస్థ నిర్వహించిన పోల్లో 42 శాతం మంది జూన్–జులై మధ్య సెలవుల మార్పుకు అనుకూలంగా స్పందించగా 30.6 మంది మాత్రం ఏప్రిల్–మే అనే పాత విధానాన్ని యథాతధంగా కొనసాగించాలని కోరారు. అలాగే 27.52 శాతం మంది మే నుంచి జూన్ వరకూ సెలవుల్ని సవరించాలని సూచించారు.చదవండి: బుడ్డోడి ఫైరింగ్ స్టంట్కి షాకవ్వాల్సిందే! -
Lighthouse Parenting: ఒడ్డుకు చేర్చేలా మాత్రమే..!
లైట్హౌస్ అనేది సముద్రంలోని ఓడలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు లైట్హౌస్ పేరెంటింగ్ పిల్లలకు ఒక దిశను చూపుతుంది. అదే సమయంలో పిల్లలు వారి సొంత మార్గాల్లో పయనించేలా చేస్తుంది. ఈ పేరెంటింగ్ విధానంతో పిల్లలు బాధ్యతాయుతంగా ఎదగ గలిగే అవకాశాలెన్నో ఉన్నట్లు నిపుణుల పరిశీలన. ఈ తరహా పేరెంటింగ్ పిల్లలు భవిష్యత్తులో బాధ్యతయుతంగా పెరగడానికి ఎలా దోహదపడుతుందో తెలుసుకుందాం.లైట్హౌస్ పేరెంటింగ్ అంటే పిల్లలను సక్రమ మార్గంలో పెట్టడం. పిల్లలకు పూర్తిగా స్వేచ్ఛ ఇస్తూనే వారిని బాలెన్స్ చేయడం. ఈ వ్యూహాన్ని అమలు చేసే వారు తమ పిల్లలకు నిజాయితీగా మాట్లాడడానికి తగిన స్వేచ్ఛను ఇస్తారు. ఈ విధానంలో పిల్లలు తమకు ఏదైనా సాయం అవసరమైతే సంకోచించకుండా తల్లిదండ్రులను అడిగేలా పిల్లలను ప్రోత్సహిస్తుంది. తద్వారా పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.ప్రయోజనాలు ఏమిటి? లైట్హౌస్ పేరెంటింగ్ ప్రాథమిక ప్రయోజనాల్లో ఒకటి.. పిల్లల ఆత్మగౌరవంపై సానుకూల ప్రభావం చూపడం.ఆరోగ్యకరమైన హద్దులు లైట్హౌస్ పేరెంట్స్ తమ పిల్లలకు సొంతంగా ఎంచుకునే స్వేచ్ఛను ఇస్తారు. కానీ, వారికి కొన్ని హద్దులను నిర్దేశిస్తారు. పిల్లలు తమ ఆత్మవిశ్వాసం, స్వాతంత్య్రం వంటి ముఖ్యమైన జీవిత నైపుణ్యాలను నేర్చుకుంటారు. తల్లిదండ్రులు తమపై పూర్తి నమ్మకం ఉంచుతున్నారని తెలుసుకోవడం ద్వారా పిల్లల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కోవటానికి వారికి శక్తి వస్తుంది.బలమైన బంధాన్ని ఏర్పరచుకోవడంఈ పేరెంటింగ్ విధానానికి కమ్యూనికేట్ చేయడం చాలా ముఖ్యం. పిల్లలు తమ తల్లిదండ్రులను విమర్శిస్తారనే భయం లేకుండా నిశ్చింతతో ఉన్నప్పుడు సంబంధాలు బలపడతాయి. వారు తమ తల్లిదండ్రులను సలహాదారులుగా భావిస్తే.. ఆత్మస్థైర్య భావం పెరుగుతుంది.కోపింగ్ నైపుణ్యాలను పెంపొందించడంఈ పేరెంటింగ్ విధానం ప్రాథమికంగా పిల్లలు ఎదురుదెబ్బలను అనుభవించేలా చేస్తుంది. అవసరమైనప్పుడు సాయం కోసం అడగడంలో వారికి మద్దతునిస్తుంది. పిల్లలు తమ భావాలను, ఇబ్బందులను సొంతంగా అధిగమించగల సామర్థ్యాన్ని పొందుతారు. జీవితంలో ఎదురయ్యే పెద్ద సమస్యలను అధిగమించేందుకు ఈ పేరెంటింగ్ ఎంతో తోడ్పడుతుంది.సవాళ్లు లైట్ హౌస్ పేరెంటింగ్ విధానంతో అనేక ప్రయోజనాలను ఉన్నప్పటికీ, ఇది ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. తల్లిదండ్రులు తమ పిల్లల కష్టాలు ఎదుర్కొనే విషయంలో వెనుకడుగు వేయడం కష్టం. ఫెయిల్యూర్ అనేది నేర్చుకోవడంలో ఒక భాగమని తెలుసుకోవాలి. ఇందుకు చాలా సహనం అవసరం. పిల్లల ప్రత్యేక అవసరాలు, వారి పరిస్థితులపై ఆధారపడి కొంతమందికి మరింత ప్రత్యక్ష పర్యవేక్షణ అవసరం కావచ్చు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడు జోక్యం చేసుకోవాలి అనేదానిపై లైట్హౌస్ పేరెంటింగ్ ప్రాథమిక సూత్రాలను తప్పనిసరిగా పాటించాలి. (చదవండి: 77 ఏళ్ల 'ఫిట్నెస్ క్వీన్'..! ఓ బామ్మ సరిలేరు మీకెవ్వరూ..) -
33 ఏళ్ల తర్వాత బాద్షాకు ఆదాబ్..!
ముప్పై మూడు ఏళ్ల సుదీర్ఘ నటనానుభవం తర్వాత షారుక్ ఖాన్ను భారత ప్రభుత్వం ఉత్తమ నటుడిగా గుర్తించింది. ‘దీవానా’ (1992) నుంచి షారుక్ ఖాన్ బాలీవుడ్లో ప్రవేశించి ‘కింగ్ ఖాన్’గా ప్రేక్షకుల అభిమానం పొందుతూ, దేశ విదేశాల్లో ఎన్నో అవార్డులు పొందుతున్నా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు మాత్రం రాలేదు. ఇన్నాళ్ల తర్వాత అదీ మన సౌత్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో నటించిన ‘జవాన్’ సినిమాకు వరించింది. అయితే అది కూడా పూర్తి అవార్డు కాదు. సగమే. మరో సగాన్ని యువ నటుడు విక్రాంత్ మాసేతో (ట్వల్త్ ఫెయిల్ సినిమాకు) పంచుకోవాలి. అంటే ఈసారి ఉత్తమ నటుడు పురస్కారాన్ని ఇద్దరు నటులకు ప్రకటించారు. సినిమా రంగంలో ఎటువంటి ఘరానా వంశాల మద్దతు లేకపోయినా ఢిల్లీ నుంచి మధ్యతరగతి యువకుడిగా వచ్చి జెండా ఎగుర వేసిన వాడు షారుక్. తనతరం హీరోలు ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్లతో పోటీ పడి తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. వేగమైన శరీర కదలికలు, వినూత్నమైన డైలాగ్ డెలివరీ, అల్లరి చిల్లరిగా కనిపిస్తూనే లోతైన భావాలు పలికించడం ప్రత్యేకతగా షారుక్ ప్రేక్షకులకు నచ్చాడు. ‘బాజీగర్’, ‘డర్’ సినిమాల్లో నెగెటివ్ కేరెక్టర్లు వేసినా యువత అతణ్ణి హీరోగానే చూసింది. ఆ తర్వాత ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ (1995)తో పూర్తి సూపర్స్టార్గా అవతరించాడు. ‘పర్దేశ్’, ‘దిల్తో పాగల్ హై’, ‘దిల్ సే’, ‘కభీ ఖుషీ కభీ గమ్’.. అన్నీ హిట్గా నిలిచాయ్. దర్శకుడు కరణ్ జొహర్, జూహీ చావ్లాలతో చాలా హిట్స్ సాధించాడు షారుక్. దిలీప్ నటించిన ‘దేవదాసు’ పాత్రను మళ్లీ పోషించి మెప్పించాడు. ‘కల్ హోనా హో’, ‘వీర్జారా’, ‘చక్దే ఇండియా’ వంటి సినిమాలు అతడి ప్రతిభను పదేపదే నిరూపించాయి. స్టార్గా ఉండి కూడా ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ లో బుద్ధిమాంద్యం ఉన్న హీరోగా నటించాడు. ‘ఓమ్ శాంతి ఓమ్’, ‘చెన్నై ఎక్స్ప్రెస్’ సినిమాలు ఆబాలగోపాలాన్ని అలరించాయి. షారుక్కు ఉత్తమ నటుడు అవార్డు తెచ్చిన ‘జవాన్’ను 300 కోట్లతో నిర్మిస్తే 1100 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికీ షారుక్ బాలీవుడ్ కా బాద్షాగానే కొనసాగుతున్నాడు. (చదవండి: స్త్రీ వాణి రాణించింది..!) -
'ఊరు' పాటకు కిరీటం
జాతీయ అవార్డుల్లో తెలంగాణ పల్లె పద సౌందర్యం మెరుపై మెరిసింది. తళుక్కున వెలిగింది. ‘బలగం’ సినిమాలో కాసర్ల శ్యామ్ రాసిన పాట ‘ఊరు పల్లెటూరు’ ఆ సినిమా విడుదలైనప్పుడే తెలుగు వారందరి మనసును తాకింది. పల్లె జీవనం అందరికీ ఇష్టమే కాబట్టి, ఆ పల్లెను మిస్సయ్యి పట్నవాసం, ప్రవాసం ఉండక తప్పదు కాబట్టి పాటలోని పల్లెతనాన్ని వినగానే అందరి ప్రాణం లేచివచ్చింది. కాసర్ల రచనకు భీమ్స్ అందించిన సంగీతం, మంగ్లి–రామ్ మిరియాల అందించిన గళం, దర్శకుడు వేణు ఎల్దండి దృశ్యరూపం అన్నీ కలిసి పాటను నిలబెట్టాయి. ఇప్పుడు జాతీయస్థాయిలో ఆ పాట గెలిచి తెలంగాణ గ్రామీణ సౌందర్యానికి అందిన వందనం స్వీకరించింది. ప్రయివేట్ గీతాల నుంచి జాతీయ పురస్కార గ్రహీతగా..‘ఊరు పల్లెటూరు’ పాటతో ఉత్తమ గేయ రచయితగా జాతీయ పురస్కారం అందుకోనున్న కాసర్ల శ్యామ్ది తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా హన్మకొండలోని బ్రాహ్మణవాడ. తండ్రి మధుసూదన్ రావు రంగస్థల, టీవీ, సినీనటుడు కావడంతో నటుడు కావాలనే ఆకాంక్ష శ్యామ్ చిన్నతనం నుంచే ఉండేది. అయితే సాహిత్యం పట్ల తనకున్న అభిలాషతో జానపద పాటలు రాయడం, పాడడంలో అనుభవాన్ని సంపాదించారు. వరంగల్ శంకర్, సారంగపాణి బృందంతో కలసి పలు ప్రదర్శనలు ఇవ్వడంతో గాయకుడిగా, రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘కాలేజీ పిల్ల చూడరో.. యమ ఖతర్నాక్గుందిరో..’ శ్యామ్ రాసిన తొలి జానపద సాంగ్. ఆ తర్వాత సుమారు 50పైగా ఆల్బమ్స్కు పాటలు రాశారు. ఆ సమయంలోనే మిత్రుల సాయంతో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించగా.. ‘చంటిగాడు’(2003) సినిమాలో తొలి అవకాశం వచ్చింది. బాలాదిత్య, సుహాసిని జోడీగా బి. జయ దర్శకత్వంలో బీఏ రాజు నిర్మించిన ఈ చిత్రంలో ‘కోకోకో .. కొక్కొరోకో, సిగ్గులొలికే సీతాలు’ పాటలతో సినీ గేయ రచయితగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘ప్రేమికులు’, ‘మహాత్మ’, ‘పటాస్’, ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’, ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, ‘డీజే టిల్లు ‘అల వైకుంఠపురములో’... వంటి పలు సినిమాల్లో సుమారు 800కుపైగా పాటలు రాశారు శ్యామ్. తెలంగాణ మాండలికం, యాస, మాస్తోపాటు మెలోడీ గీతాలు రాయడంలో ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు. తన అభిమాన రచయిత చంద్రబోస్ అని చెబుతుంటారాయన. ఆయన భార్య రాధిక ఆర్కిటెక్ట్. ‘బలగం’ సినిమాలోని అన్ని పాటల్నీ కాసర్ల శ్యామ్ రాయగా ‘ఊరు.. పల్లెటూరు...’ పాటకిగానూ రచయితగా తొలి జాతీయ అవార్డు అందుకోనున్నారు. (చదవండి: స్త్రీ వాణి రాణించింది..!) -
స్త్రీ వాణి రాణించింది..!
స్త్రీల జీవితాల్లోని అంతఃప్రవాహాలువారిని లైంగికంగా పీడించి ఓడిపోయిన పిశాచాలు...స్త్రీలకు స్త్రీలే తోడుగా నిలిచిన కథనాలు...శుక్రవారం ప్రకటించిన జాతీయ సినీ పురస్కారాలు2023లో వెండితెర చూపించిన మహిళా సంఘర్షణలను మరోసారి జ్ఞప్తికి తెచ్చాయి. అలాగే ఎన్నో ఏళ్లుగా సినీ రంగంలో ఉన్నాఈసారి గుర్తింపు పొందిన నటీమణులు, గాయనులువారి అభిమానులను ఆనందపరిచారు. మొత్తంగా ఈ అవార్డులు స్త్రీల దృష్టికోణంలో ప్రత్యేకమైనవి. రాణి ముఖర్జీకి ఉత్తమనటి పురస్కారం దక్కింది. ఆమె నటించిన ‘మిసెస్ చటర్జీ వెర్సస్ నార్వే’ చిత్రానికి గానూ ఆమెకు ఈ పురస్కారం అందింది. ‘గులామ్’ (1998) నుంచి రాణి ముఖర్జీ నటిస్తూ ఉన్నా జాతీయనటిగా గుర్తింపు దక్కడం ఇన్నాళ్లకు గాని సాధ్య పడలేదు. ఆమెకు ఈ పురస్కారం రావడం పట్ల అభిమానులే కాదు... విమర్శకులు కూడా సంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే స్త్రీల దృష్టికోణంలో ‘మిసెస్ చటర్జీ వెర్సస్ నార్వే’ చాలా శక్తివంతమైన సమస్యను చర్చించింది. నిజ జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమాలో రాణి ముఖర్జీ గొప్పగా నటించిందన్న ప్రశంసలు పొందింది. జాతీయ పురస్కారం వచ్చిందన్న వార్త వెలువడగానే ‘నా ముప్పై ఏళ్ల నటనా జీవితానికి ఇది వేలిడేషన్గా భావిస్తున్నా’ అని ఆమె స్పందించింది.ఎన్నో కలికితురాయిలుబెంగాల్ నుంచి బాలీవుడ్కు వచ్చిన రాణి ముఖర్జీ ‘ఆతీ క్యా ఖండాలా’ పాట ఉన్న ఆమిర్ ఖాన్ ‘గులామ్’తో ప్రేక్షకుల దృష్టిలో పడింది. ఆ తర్వాత షారుక్తో నటించిన ‘కుచ్ కుచ్ హోతాహై’తో స్టార్డమ్కు చేరుకుంది. ‘చోరీ చోరీ చుప్కే చుప్కే’, ‘కభి ఖుషీ కభి గమ్’, ‘సాథియా’, ‘వీర్ జారా’... తదితర సినిమాలు ఆమె ప్రతిభను చాటాయి. అయితే అమితాబ్తో కలిసి నటించిన ‘బ్లాక్’ సినిమాలో తను కేవలం గ్లామర్ హీరోయిన్ కాదని, ప్రతిభ ఉన్న నటి అని నిరూపించింది. 2014లో దర్శకుడు ఆదిత్యా చోప్రాను వివాహం చేసుకున్నాక సినిమాలకు కొంత దూరమైనా ఇటీవల ‘మర్దానీ’, ‘మర్దానీ2’, ‘హిచ్కీ’, ‘మిసెస్ చటర్జీ వెర్సస్ నార్వే’ చిత్రాలతో తెరతో తన అనుబంధాన్ని కొనసాగిస్తోంది.మిసెస్ చటర్జీ వెర్సస్ నార్వేభారతీయ తల్లులకు పిల్లలను ఎలా పెంచాలో తెలుసు. పాలు ఇచ్చే పద్ధతి, పాలబువ్వ తినిపించే పద్ధతి, నీళ్లు ΄ోయడం, జోలపాడటం... ప్రతిదీ తెలుసు. కాని ఈ పద్ధతి తప్పు అంది నార్వే ప్రభుత్వం. అక్కడి బాలల సంరక్షణ అధికారులు అక్కడ నివసిస్తున్న భారతీయ జంట అనురూప్ భట్టాచార్య, సాగరికల నుంచి వారి ఇద్దరు పిల్లలను 2011లో అధీనంలోకి తీసుకున్నారు. ఇందుకు కారణం నార్వే బాలల సంరక్షణ చట్టాలు. అక్కడ నివసిస్తున్న పౌరుల ఇళ్లలో పిల్లలు ఉంటే వారిని క్రమ విరామాలలో పరిశీలిస్తారు అధికారులు. అలా పరిశీలనకు వచ్చిన ప్రతిసారీ భారతీయ పద్ధతులకు పెడర్థాలు తీసి అనురూప్, సాగరికల పిల్లలు ప్రమాదంలో ఉన్నారని మూడేళ్ల కొడుకును, సంవత్సరం వయసు కుమార్తెను తమ అధీనంలోకి తీసుకెళ్లారు. ఆ పిల్లల కోసం సాగరిక చేసిన పోరాటాన్ని రాణి ముఖర్జీ ‘మిసెస్ చటర్జీ వెర్సస్ నార్వే’ సినిమాలో పునఃప్రతిష్ట చేసింది.నటి ఊర్వశికి ఉత్తమ సహాయ నటి పురస్కారంతెలుగువారికి చిరపరిచితమైన నటి ఊర్వశికి 2023 జాతీయ పురస్కారాల్లో ‘ఉల్లుజుక్కు’ (అంతఃప్రవాహం) సినిమాకు ఉత్తమ సహాయనటి పురస్కారం లభించింది. ఇదే సినిమాకు మలయాళం నుంచి ఉత్తమ జాతీయ చిత్రం పురస్కారం కూడా లభించింది. ‘ఉల్లుజుక్కు’లో ఊర్వశి అత్తగారి పాత్రలో నటించింది. ఆమె కుమారుడు పెళ్లయిన కొన్నాళ్లకే జబ్బు వల్ల మరణిస్తాడు. కోడలు ఆ పెళ్లికి ముందే ఒక వ్యక్తితో ప్రేమలో ఉంటుంది. కాని అనివార్యమై ఈ పెళ్లి చేసుకుంటుంది. భర్త మరణించే సమయానికి ఆ ప్రాంతంలో విపరీతమైన వానలు కురిసి వరద సంభవిస్తుంది. పైకి కనిపించే ఆ వరదలో లోపలి ప్రవాహపు వేగం ఎంతో ఎవరికీ తెలియదు. అలాగే అత్తగారు, కోడలు తమ జీవితాల్లో ఏయే లోపలి గాథలతో సతమతమవుతున్నారో ప్రేక్షకులకు మెల్లగా తెలుస్తూ వస్తుంది. సినిమా ముగింపు సమయానికి కోడలు అత్తను వీడి వెళ్లే పరిస్థితి ఉన్నా చివరకు ఆమె తన ప్రియుణ్ణి కాదని అత్త వద్దకు చేరుకోవడంతో సినిమా ముగుస్తుంది. ఈ సినిమాలో అత్తగా ఊర్వశి, కోడలిగా పార్వతి తిరువోతు నటించగా ఊర్వశికి పురస్కారం దక్కింది.సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హైజాతీయ పురస్కారాలలో మనోజ్ బాజ్పాయ్ నటించిన ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ సినిమాకు ఉత్తమ డైలాగ్ రైటర్ పురస్కారం దక్కింది. ఈ సినిమా జాతీయ పురస్కారాల పట్టికలో కనిపించడం చాలా ముఖ్యమైన విషయం. దీనికి కారణం బాబాల చెరలో చిక్కి బలైపోతున్న చిన్నారి ఆడపిల్లల కోసం న్యాయం వైపు నిలబడితే న్యాయం దక్కి తీరుతుందని ఇందులోని కథానాయకుడు తన న్యాయవాద వృత్తి ద్వారా నిరూపిస్తాడు. ఆడపిల్లలకు ఎన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయో, వారి మీద లైంగిక దాడి జరిగితే ఎన్ని విధాల వొత్తిళ్లు వస్తాయో ఈ సినిమా చూపుతుంది. టీనేజ్ పిల్లలకూ, వారి తల్లిదండ్రులకూ, వారి కోసం పథకాలు రచించే కపట స్వాములకు ఈ సినిమా హెచ్చరిక. (చదవండి: 77 ఏళ్ల 'ఫిట్నెస్ క్వీన్'..! ఓ బామ్మ సరిలేరు మీకెవ్వరూ..) -
జట్టుగా కృషిచేస్తే సమష్టి విజయం
చినుకు చినుకు కలిస్తే ప్రవాహం అయినట్టు చేయీ చేయీ కలిపితే విజయం చేరువ అవుతుందని అంటున్నారు కొందరు మహిళా గ్రూప్ సభ్యులు. ఇంటి వద్ద చిన్న చిన్న వ్యాపారాలు చేసే యాభై మంది మహిళలు వాట్సప్ ద్వారా ఒక జట్టుగా కలిశారు. ఒకరి కష్టనష్టాలను మరొకరితో పంచుకున్నారు... వ్యాపార మెళకువలను కలబోసుకున్నారు. నాలుగేళ్లుగా తమ నైపుణ్యాలను, సృజనాత్మకతను పంచుకుంటూనే వ్యాపారాలలో విజయాలు సాధిస్తున్నారు. రేపు ఆదివారం వీరంతా కలిసి సికింద్రాబాద్లోని ఎక్స్ పోచాణక్యలో తమ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు పంచుకున్న విషయాలు..హస్తకళలు, క్లీనింగ్ అండ్ హైజీన్ ప్రొడక్ట్స్, ఫొటోగ్రఫీ, హెల్త్కేర్ సర్వీసెస్, ఈవెంట్ ΄్లానర్స్, స్నాక్స్ మేకర్స్, గిఫ్ట్ డీలర్స్, ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్లు.. ఇలా వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న యాభైమంది మహిళలు ఒకచోట చేరి జట్టుగా విజయాలు సాధిస్తున్నారు. తమతోటి వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసి, రెండేళ్ల క్రితం ఈ గ్రూప్లో జాయిన్ అయ్యాను. రోజూ ఉదయం మేమంతా రెండు గంటలసేపు ఆన్లైన్ నెట్వర్క్ ద్వారా కలుసుకుంటాం. ఎవరికైనా ఏదైనా సమాచారం అవసరం ఉంటే.. ఆ విషయాలను పంచుకుంటాం. వెబ్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ చేసే స్టార్టప్ని రన్ చేస్తున్నాను. మా గ్రూప్లో ఎవరికైనా నా వర్క్ అవసరం ఉంటే వాళ్లు షేర్ చేస్తారు. నా వర్క్కి సంబంధించి ఏదైనా అవసరం ఉంటే, మా గ్రూప్ ఫ్రెండ్స్ నుంచి తీసుకుంటాను. ఏడాదికి ఒకసారి పెట్టే స్టాల్ ద్వారా నాకు ఏదైతే అవసరం ఉంటుందో దాని గురించి నా డెస్క్ వద్ద రాస్తాను. ఎవరికైనా ఆ స్కిల్ ఉంటే, వర్క్లో జాయిన్ కావచ్చు. వారి వద్ద ఏదైనా ఎక్విప్మెంట్ ఉంటే మాకు అందజేయవచ్చు. ఇంట్లో ఉండి చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే గృహిణులు, బయటకు రావాలంటే ఇబ్బందిగా ఫీలయ్యేవారు.. ఈ వేదిక ద్వారా ప్రయోజనాలు ΄÷ందాలనుకున్నాం. శిక్షణాతరగతులు కూడా నిర్వహిస్తుంటాం. మహిళల వ్యాపార వృద్ధికి జట్టుగా చేసే కృషి ఎంతగానో ఉపయోగపడుతుంది. – లక్ష్మీ మోపిదేవి, ముగ్దా క్రియేటివ్స్, హైదరాబాద్వ్యాపార విస్తరణకు సరైన మార్గంవైష్ణో ఎంటర్ప్రైజెస్ పేరుతో హెల్తీ స్నాక్స్ తయారు చేస్తుంటాను. మిల్లెట్స్తో చేసే ఈ స్నాక్స్ని ఆర్డర్ మీద సప్లయ్ చేస్తుంటాను. నా వర్క్స్ గురించి ఈ గ్రూప్లోని స్నేహితులు స్టేటస్ పెడుతుంటారు. నేనూ వారి వర్క్స్ని స్టేటస్గా పెడుతుంటాను. దీని ద్వారా మా బంధుమిత్రులకు కూడా వారి వర్క్స్ చేరువవుతుంటాయి. మూడేళ్ల క్రితం ఈ విమెన్ గ్రూప్లో చేరాను. గ్రూప్ సభ్యులుగా వర్క్షాప్స్లో కలుస్తుంటాం. ఒకరికి ఒకరం సాయంగా ఉంటాం. మహిళలు ఒకరిగా కన్నా ఇలా సమష్టి్టగా కలిస్తే విజయాలు సులువుగా సాధించగలరు. – శైలబాల, వైష్ణో ఎంటర్ప్రైజెస్, హైదరాబాద్సృజనాత్మక పనికి చేయూతనేను బడ్జెట్ ఫ్రెండ్లీ కస్టమైజ్డ్ గిఫ్ట్స్ తయారు చేస్తాను. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి చేసే నా గిఫ్ట్ ఐడియాస్లో ఫొటో ఫ్రేమ్స్, స్క్రాప్ బుక్స్, ఫొటో ఆల్బమ్స్, వెడ్డింగ్ ఈవెంట్కి కావల్సిన గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి. రెండేళ్ల క్రితం ఈ మహిళా గ్రూప్లో స్నేహితుల ద్వారా జాయిన్ అయ్యాను. నా వర్క్ని నా గ్రూప్లో ఉన్నవారే ప్రమోట్ చేస్తుంటారు. నేనూ ఈ గ్రూప్లోని కొంతమంది సభ్యులతో కొలాబరేట్ అయ్యి నా బిజినెస్ను పెంచుకుంటున్నాను. ప్రతి యేటా జరిగే ఈ ఎక్స్΄ోలో నా స్టాల్ ఉంటుంది. దీని ద్వారా నా వర్క్ మరింతమందికి రీచ్ అవుతున్నందుకు ఆనందంగా ఉంది. – నాగవాణి, హైదరాబాద్కాంటాక్ట్స్ పెరిగాయిఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, వేణీ, రిటర్న్ గిఫ్ట్స్.. వంటివి తయారు చేస్తుంటాను. తెలిసిన వారి ద్వారా ఈ మహిళా గ్రూప్లో చేరాను. దీంతో నాకు కాంటాక్ట్స్ పెరిగాయి. మిగతావారితో కలిసి నా బిజినెస్ను ఎలా డెవలప్ చేసుకోవచ్చో తెలిసింది. లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకున్నాను. వర్క్షాప్స్ కూడా నిర్వహించుకుంటాం. లోన్ మేళా, హెల్త్క్యాంప్స్ ఏర్పాటు చేస్తుంటాం. – దుర్గ గరిమెళ్ళ,విపంచిక ట్రెండ్స్, హైదరాబాద్ – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
77 ఏళ్ల 'ఫిట్నెస్ క్వీన్'..! ఓ బామ్మ సరిలేరు మీకెవ్వరూ..
సెలబ్రిటీలు, ప్రముఖులు ఫిట్నెస్ ట్రైనర్లు, పోషకాహారుల నిపుణులు పర్యవేక్షణ వంటివి ఉంటేనే మంచి ఫిట్నెస్ని సాధించగలరు. అవన్నీ కూడా పెద్దపెద్ద వాళ్లకే మనలాంటి వాళ్లకు అలాంటి సౌకర్యాలు ఉండవు కాబట్టి మనవల్ల కాదు అనుకుంటారు చాలామంది. కానీ ఈ బామ్మని చూస్తే ఆ విధమైన ఆలోచనతీరునే మార్చుకుంటారు. సాదాసీదాగా ఉన్నవాళ్లు కూడా తమ ఆరోగ్యంపై ఫోకస్ పెట్టొచ్చు అని తెలుస్తుంది ఈ బామ్మని చూస్తే. వృద్ధాప్యాన్ని అత్యంత ఆనందంగా ఎలా ఆస్వాదించాలో నేర్పుతోందామె. ఆమెనే హర్యానాకు చెందిన సాబో దేవి అనే 77 ఏళ్ల బామ్మ. గ్రామీణ హర్యానాకు చెందిన సాబోదేవి..అసాధారణమైన ఫిట్నెస్కి కేరాప్ అడ్రస్ ఆమె. చక్కటి జీవనశైలి, మంచి వర్కౌట్లతో అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ వయసులో అంతలా వ్యాయమాలా అని ఆశ్చర్యపోయేలా చేస్తోందామె. అంతేగాదు ఆమె ఫిట్నెస్ పట్ల ఫోకస్ని చూసి చుట్టుపక్కల వాళ్లంతా 'హర్యానా ఫిట్నెస్ క్వీన్' అని ఆమెకు కితాబు కూడా ఇచ్చారు. అంతలా ఆకర్షించేలా ఆమె ఏం చేస్తుంది అనే కదా సందేహం. ఆమె బాల్యంలో సరదాగా నేర్చుకున్న ఈత తన దినచర్యలో భాగం చేసుకుంది. ఆమె తన ప్రతి ఉదయాన్ని ఈతతో ప్రారంభిస్తారామె. ఈ ఈత నైపుణ్యంతోనే గంగానదిలో పడిపోయిన ముగ్గురు వ్యక్తులను కాపాడి సూపర్ బామ్మ అని కూడా అనిపించుకుంది. ఈ తరాన్ని ప్రేరేపించేలా స్క్వాట్లు చేస్తుంది. తన వయసు శారీరక పరిమితులకు సంబంధం లేకుండా యువత మాదిరిగా చురుకుగా ఉంటుందామె. అందులోనూ ఆమెది గ్రామీణ నేపథ్యమే అయినా..ప్రతి ఉదయం వ్యాయమాలు, తీసుకునే ఆహారానికి ప్రాధాన్యత ఇస్తుంది. అథ్లెట్లకు కూడా కష్టసాధ్యమైన గంగానది ఈతను అలవోకగా చుట్టొచ్చేసింది. అంతేగాదు 2024లో తన మనవడితో కలసి సాబోదేవి 'ఐస్ ఛాలెంజ్'ను స్వీకరించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె తన మనవడి పక్కన మంచుతో నిండిన తొట్టిలో గంటల తరబడి ఉండి మరి అతడిని ఓడించింది.ప్రమాదవశాత్తు సోషల్ మీడియా ఐకాన్..హర్యానాలో సోనిపట్లోని సీతావాలి గ్రామంలో జన్మిచింది సాబో దేవి. హుల్లెడి గ్రామానికి చెందిన ట్రాక్టర్ మెకానిక్ కృష్ణను వివాహం చేసుకుంది. చిన్న వయసులోనే ఆమె భర్త మరణించడంతో ఆమె ఒక్కత్తే ఆ ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలను ఒంటరిగా పెంచింది. పిల్లలందరికి వివాహలైపోగా, తన రెండో కుమారుడితో ఉంటుందామె. అతడి కొడుకు చిరాగ్ అకా ఖగత్ కారణంగా సోషల్ మీడియా ఐకాన్గా మారింది. చిరాగ్ తన బామ్మ వ్యాయామాలు, ఈత కొడుతున్న చేస్తున్న వీడియోలు నెట్టింట షేర్ చేయడంతో ఒక్కసారి ఓవర్నైట్ స్టార్గా మారిపోయింది. సాంప్రదాయ భారతీయ జీవన విధానం ప్రాముఖ్యతను తెలియజేసేలా ఆమె ఆహార్యం అందరిని ఆకట్టుకుంటుంది. ఆవనూనె, నెయ్యి, తాజా ఆకుకూరలు, తేలికపాటి పదార్థాలనే తీసుకుంటానని చెబుతోంది. అంతేగాదు దేశీ నెయ్యి, ఆవాల నూనె, పచ్చి కూరగాయలు, గోధుమలు తదితరాలే మంచి ఆరోగ్యానికి ప్రధానమైనవని నిపుణులు సైతం సూచించడం విశేషం. అందువల్ల ఆమెను అంతా ఫిట్నెస్ క్వీన్ కీర్తిస్తున్నారు. ఆమె జీవిత విలువలకే కాదు ఫిటనెస్కు, సాంస్కృతిక పరిజ్ఞానానికి, ధైర్యానికి ఐకాన్గా నిలిచి అందరికి స్ఫూర్తిని కలిగిస్తోంది. (చదవండి: పిల్లికి హైలెవల్ సెక్యూరిటీ..! ఇంకా ఇలానా..!) -
పిల్లికి హైలెవల్ సెక్యూరిటీ..! ఇంకా ఇలానా..!
అధికారులు తమ కింద పనిచేసే ఉద్యోగులను మాములుగా సతాయించారు. ఉద్యోగ ధర్మానికి సంబంధించిన పనులు తప్పించి..ఇబ్బందిపెట్టేలా అర్థం పర్థం లేని పనులు అప్పగించి బాధపెడుతుంటారు. పై అధికారి అనో లేక ఉద్యోగపోతుందనే భయంతోనో నోరు మెదపకుండా తలాడిస్తూ చేస్తుంటారు పాపం. కింది స్థాయి సిబ్బంది కూడా మనలాంటి సాటి మనుషులే కదా అని కూడా భావించరు కొందరు అధికారులు. అలాంటి వింత ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. నెటిజన్లు సైతం ఇంకా ఇలానా అంటూ మండిపడుతున్నారు. ఆగ్రాలో జూలై 30న సాయంత్రం హోంగార్డులు రోజులానే విధుల్లోకి రాగా..పోలీస్ లైన్ కాంపౌండ్లో పార్క్ చేసిన కార్లపై నిఘా ఉంచాలేమో అనుకున్నారు. కానీ అనూహ్యంగా పై అధికారి విచిత్రమైన డ్యూటీని అప్పగించడంతో కంగుతిన్నారు వారంతా. తమ డ్యూటీ ఆ రోజు ఒక పిల్లికి కాపల కాయడం. అది ఓ ట్రాఫిక్ ఎస్పీకి చెందిన పిల్లి. ఆయన దాన్ని జాగ్రత్తగా చూసుకోమని వాళ్లను ఆదేశించారు.ఏ జంతువు దానిపై దాడి చేయకుండా చూడటమే కాకుండా దానికి రాత్రిపూట పాలు, రొట్టే వంటివి ఇవ్వాల్సిందిగా చెప్పారట. ఒకవేళ ఆ పిల్లికి హాని కలిగేలా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారట ఆ అధికారి. దీంతో నిర్ఘాంతపోయారు హోంగార్డులు. ఈ విషయాన్ని ఒక హోంగార్డు తన డ్యూటీ ముగిసిన తదనంతరం సోష్లో మీడియాలో తన గోడును వెల్లబోసుకున్నారు. పైగా ఆ పోస్ట్కి ఈ రోజు మా డ్యూటీ పిల్లికి కాపల. దానికేదైనా జరిగితే మాపై కఠిని చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని క్యాప్షన్ని కూడా జోడించి మరి తన బాధను వెల్లడించాడు ఆ హోంగార్డు. ఈ విషయం క్షణాల్లో వైరల్ అవ్వడంతో.స్వాతంత్ర భారతవనిలో ఇంకా ఇలాంటివి ఉన్నాయా అంటూ మానవ హక్కుల కార్యకర్లు ఒక్కసారిగా మడిపడ్డారు. అటు నెటిజన్లు కూడా పోలీసుల విధుల గురించి సైటర్లు వేస్తూ పోస్టులు పెట్టారు. నెట్టింట ఈ విషయం తారస్థాయిలో ఆగ్రహోజ్వాలాలు రెకెత్తించగా..వెంటనే మరోపోస్ట్లో అతి వీధిపిల్లి అని ఎవ్వరిది కాదని అధికారిక పోస్ట్లో వివరణ ఇవ్వడం గమనార్హం. (చదవండి: బుడ్డోడి డేరింగ్ ఫైర్ స్టంట్కి షాకవ్వాల్సిందే..! వీడియో వైరల్) -
బుడ్డోడి డేరింగ్ ఫైర్ స్టంట్కి షాకవ్వాల్సిందే..!
చిన్నారులు కూడా చిరుప్రాయంలోనే చిచ్చిర పిడుగుల్లా తమ ప్రతిభను చాటుకుని శెభాష్ అనిపించుకున్న సందర్భాలు ఎన్నో చూశాం. కానీ ఇలా అగ్గితో అవలీలగా ఆడుకునే చిన్నారిని చూసుండరు. ఏ మాత్రం బెరుకులేకుండా చేస్తున్న ఆ ఫైర్ విన్యాసం కళ్లు ఆర్పడమే మర్చిపోయేంతలా మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఆ డేరింగ్కి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.తమిళనాడుకు చెందిన ఆరవ్ అనే ఎనిమిదేళ్ల బాలుడు.. నిప్పుతో ఆడే ఒక రకమైన యుద్ధకళతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. ఆరవ్ రాష్ట్రస్థాయి మార్షల్ ఆర్ట్స్ చాంపియన్ కూడా. ఆ బాలుడు తమిళనాడుకి చెందిన పురాతన ఆయుధ ఆధారిత యుద్ధ కళ అయిన 'సిలంబం'ని అలవోకగా చేసి అలరించాడు. ఇది ఇరువైపులో అగ్నితో జ్వలిస్తున్న కర్రతో ఒక విధమైన విన్యాసంలా ప్రదర్శిస్తారు. ఎంతో శిక్షణ ఉంటేనే గానీ ఇంతలా డేర్గా చేయడం కష్టం. చాలా కేర్ఫుల్గా చేయాల్సిన ప్రాచీన యుద్ధ కళ ఇది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం తప్పదు. కానీ ఈ బుడతడు ఏ మాత్రం బెరుకు లేకుండా.. ఆ కళకే వన్నెతెచ్చేలా అత్యంత అద్భుతంగా ప్రదర్శించాడు. దీన్నిచూసిన నెటిజన్లు సిలంబం కళకే గర్వ కారణం అంటూ ప్రశంసించారు. ఆ వీడియోలో ఆరవ్ ప్రదర్శన సమయంలో కాలిపోతున్నట్లుగా కనిపించినా.. ఎక్కడ ఆగకుండా చేస్తున్న తీరు చూపరులను కట్టిపడేస్తుంది. చిన్న వయసులోనే ఇంత డేరింగా అని ఆశ్చర్యంకలుతుంది. ఇక ఆ వీడియోలో కూడా ఎవరూ దీన్ని ట్రై చేయొద్దు. తాము నిపుణుల ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ఇచ్చాం అంటూ ఒక హచ్చరిక సందేశాన్ని కూడా ఇవ్వడం విశేషం. కనుమరుగవుతున్న మన ప్రాచీన కళలు ఈ విధంగానైనా ప్రస్తుత జనరేషన్ తెలుకునే అవకావశం దొరికింది అని పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Aarav AJ (@aarav_aj_official) (చదవండి: జొన్న రొట్టె రుచికి అమెరికన్ సీఈవో ఫిదా..! ఇది చాలా హెల్దీ..) -
బీపీ మందులు పనిచేయకపోవడానికి రీజన్ ఇదే..!
హైపర్టెన్షన్ లేదా అధిక రక్తపోటు అనేది ఒక నిశ్శబ్ద కిల్లర్. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్న వ్యాధి. మందులు తీసుకున్నప్పటికీ, చాలా మంది వ్యక్తులు ఇప్పటికీ వారి రక్తపోటును సమర్థవంతంగా నియంత్రించలేక పోతున్నారు.నేషనల్ హెల్త్ మిషన్ ప్రకారం, ఏడాదికి 1.6 మిలియన్ల మరణాలకు కారణం రక్తపోటే. ఒక్కమాటలో చెప్పాలంటే భారతీయ జనాభాలో దాదాపు 29.8% మందిని ప్రభావితం చేస్తోంది. సమర్థవంతమైన చికిత్సా విధానాలు ఉన్నప్పటికీ లక్షలాది మంది ఇంకా ఈ సమస్యను ఎదుర్కొంటూనే ఉండటం బాధకరం. కొందరికి మందులతో రక్తపోటు అదుపులో ఉండగా, మరికొందరిలో ఇది అసాధ్యంగా ఉండటానికి గల కారణాలు, ఈ వ్యాధిని ఎలా అర్థం చేసుకోవాలి తదితరాల గురించి అపోలో ఆస్పత్రి ఇంటర్వెన్షన్ కార్డియాలజీస్ట్ డాక్టర్ మనోజ్ కుమార్ అగర్వాలా మాటల్లో తెలుసుకుందాం. మందులు వాడుతున్నప్పటికీ రక్తపోటు అదుపులో లేదని ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్నారు డాక్టర్ మనోజ్. దీన్ని నిరోధక రక్తపోటుగా పిలుస్తారని తెలిపారు. సాధారణ చికిత్సల వల్ల అంతగా మార్పు లేదంటే..అంతర్గత అవయవ నష్టానికి సంకేతంగా పరిగణించాలని అన్నారు. అలాంటప్పుడు మూత్రపిండాల డెనెర్వేషన్' వంటి ఆధునిక చికిత్సలు ఈ సమస్య నుంచి బయటపడేయగలవని చెబుతున్నారు. ఈ విధానంలో మూత్రపిండాల్లోని హైపర్యాక్టివ్ నరాలకు చికిత్స చేయడం ద్వారా రక్తపోటుని నియంత్రించగలగడమే కాకుండా దీర్ఘకాలిక హృదయనాళ ప్రమాదాన్ని కూడా తగ్గించగలమని చెప్పారు. ఈ చికిత్సా విధానం మెరుగైన జీవన నాణ్యతను అందించి, జీవితంపై కొత్త ఆశను అందిస్తుందన్నారు. అయితే రక్తపోటు మందులు రోగికి పనిచయడానికి ప్రధానంగా మూడు కారణాలని వాటి గురించి వివరించారు. మందులు పనిచేయకపోవడానికి రీజన్..నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నివేదిక ప్రకారం, దాదాపు 50% మంది రోగులు తమ ఔషధ మోతాదులను సమర్థవంతంగా పాటించరు. అలాగే తాము ఆరోగ్యంగా ఉన్నామని భావించినప్పుడు లేదా దుష్ప్రభావాలు ఎదుర్కొన్నప్పుడూ మందులను నిలిపేస్తారు. అందువల్లే రక్తపోటు నియంత్రణ లోపం తలెత్తుందట. ఫలితంగా దీర్ఘకాలిక అనారోగ్యాల బారినపడే ప్రమాదం పెరుగుతుందని చెబుతున్నారు డాక్టర్ మనోజ్. ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం, భారతదేశంలో 28.1% మంది పెద్దలకు అధిక రక్తపోటు ఉన్నప్పటికీ, వారిలో కేవలం 36.9% మందికి మాత్రమే కచ్చితమైన రోగనిర్ధారణ జరిగింది. వారిలో మందులు వాడేవాళ్లు 44.7% కాగా, కేవలం 8.5% మందికి బీపీ నియంత్రణలో ఉందట. సకాలంలో మందులు తీసుకోలేకపోవడాన్ని వైద్యులకు తెలిపి తగు ప్రత్యామ్నాయా వైద్య చికిత్సలు తీసుకోవాలని చెబుతున్నారు డాక్టర్ మనోజ్.సాధారణ చికిత్సలకు స్పందించకపోవడానికి కారణం..కొన్ని సందర్భాల్లో రక్తపోటు అనేది ఒక హెచ్చరిక. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD), అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, లేదా హార్మోనల్ అసమతుల్యతలు వంటి మూల రుగ్మతలకు ప్రధాన కారణమవుతుంది. సాధారణ చికిత్సల ద్వారా రక్తపోటు నియంత్రణ సాధ్యం కాకపోతే, వైద్య నిపుణులు అంతర్లీన ఆరోగ్య సమస్యలను వెలికితీసేందుకు ప్రత్నించడమే కాకుండా సమర్థవంతంగా నిర్వహించి రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తారు. పలితంగా రోగి మొత్తం ఆరోగ్య స్థితి కూడా గణనీయంగా మెరుగవుతుంది.రెసిస్టెంట్ హైపర్టెన్షన్ కావొచ్చు..మందులకు లొంగకపోతే అది'రెసిస్టెంట్ హైపర్ టెన్షన్' గా పరగణిస్తారు. అంటే ఆయా రోగుల్లో రక్తపోటు 140/90 mmHg కన్నా ఎక్కువ ఉంటుందట. ఈ పరిస్థితి గుండెపోటు, స్ట్రోక్ లేదా మూత్రపిండాల వైఫల్యం వంటి తీవ్రమైన ఆరోగ్యప్రమాదాలను గణనీయంగా పెంచుతుంది. అలాంటప్పుడే మూత్రపిండాల డెనెర్వేషన్ లేదా RDN వంటి అత్యాధునిక చికిత్సలు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు డాక్టర్ మనోజ్. ఈ విధానంలో రేడియోఫ్రీక్వెన్సీ టెక్నాలజీ సాయంతో రక్తపోటును ప్రభావితం చేసే మూత్రపిండాల ధమనుల్లో ఉన్న అధిక ఉత్కంఠ కలిగించే నరాలను లక్ష్యంగా చికిత్స అందిస్తారు. ఫలితంగా రక్తపోటు గణనీయంగా నింయత్రణలోకి వస్తుంది. సాదారణ మందుకుల స్పందించిన రోగులకు ఈ చికిత్సా విధానం ఒక వరం లాంటిది.తక్షణమే అవగాహన అవసరం.."రక్తపోటు మందుకు పనిచేయకపోతే సంప్రదాయ ఔషధ చికిత్సలకు మించి అత్యాధుని చికిత్స అవసరం అనేది గుర్తించాలి. ఈ విషయాన్ని వైద్యునితో చర్చించాలి. ఆర్డీఎన వంటి అత్యాధునిక చికిత్స విధానం అవసరం అవ్వక మునుపే మేల్కొని ..ఈ వ్యాధిని నియంత్రణలోకి తెచ్చుకోవాలి. ఇక్కడ రక్తపోటు నియంత్రణలో ఉండటం అనేది మెరుగైన ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది లాంటిది అని గ్రహించాలి". చెబుతున్నారు డాక్టర్ మనోజ్డాక్టర్ మనోజ్ కుమార్ అగర్వాలా, డైరెక్టర్ ఇంటర్వెన్షన్ కార్డియాలజీ, అపోలో ఆస్పత్రి, హైదరాబాద్గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: ఆ గుండె17 నిమిషాల పాటు ఆగింది!) -
బరువు తగ్గాలంటే.. టేస్టీ అండ్ హెల్దీ స్నాక్స్
బరువు తగ్గించుకునే క్రమంలో చప్పచప్పగా తింటూ విసిగిపోయారా? వెయిట్ లాస్జర్నీకి భంగం కలగకుండా ఉండేలా, బోరింగ్ స్నాక్స్ కాకుండా హెల్దీగా, సంతృప్తి కరంగా ఉండేలా కొన్ని రకాల ఆహారాలను తయారు చేసుకోవచ్చు. ఇవాల్టీ టిప్ ఆఫ్ది డేలో భాగంగా రుచితోపాటు, సంతృప్తిగా, బరువుతగ్గడంలోనూ కూడా సాయపడే వంటకాల గురించి తెలుసుకుందాం.చనా లేదా చిక్పీస్, లేదా కాబూలీ శనగలు ఎలా పిలిచినా ఇవి పోషకాల గని. వీటినే తెల్ల శనగలు అని కూడా అంటారు. వీటిల్లో ప్రోటీన్, ఫైబర్, ఎన్నో విటమిన్స్, మినరల్స్ లాంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. బోర్ కొట్టకుండా, వెరైటీగా, రుచికరంగా ప్రోటీన్-ప్యాక్డ్గా స్నాక్స్, కూర ,సలాడ్ ఇలా ఎన్నో.. సులభంగా తయారు చేసుకోవచ్చు .కాబూలీ శనగలకూర (Kabuli Chana Curry)కావలసినవి: బాగా నానబెట్టి ఉడించిన కాబూలి శనగలు, ఉల్లిపాయలు, టొమాటోలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, నూనె, ఉప్పు.ఒక ప్యాన్లో నూనెగానీ నెయ్యిగానీ వేసి వేడెక్కిన తరువాత సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ,పచ్చిమిర్చి, టొమాటోవేసి వేగనివ్వాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, గరంమసాలా వేయించుకోవాలి. వేగాక ఉడికించి పెట్ఘుకున్నశనగలు వేసి ఉడికించాలి. అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. బాగా దగ్గరికి వచ్చిన తరువాత టేస్ట్ చూసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రుచికరమైన కర్రీ రెడీ.. అన్నంలోగానీ, చపాతీలు, రోటీలోకి గానీ భలే టేస్ట్గా ఉంటుంది.Kabuli Chana Pulao కాబూలీ శనగలతో పులావ్ కావలసినవి: కాబూలి శనగలు, బాస్మతి బియ్యం, ఉల్లిపాయలు, టొమాటోలు, అల్లం-వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, నెయ్యి, గరం మసాల దినుసులు (లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, పులావ్ఆకులు), ఉప్పు.తయారీ: ఒకప్యాన్లో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి మసాలాలు వేసి వేయించుకోవాలి. తరువాతతరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు వేసి వేగాక అల్లం-వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. బాగా వేగిన తరువాత నీళ్లు, బియ్యం, శనగలు వేసి సాల్ట్ టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఉడికిన తరువాత కొత్తిమీర, పుదీనాతో గార్నీష్ చేసుకుంటే పులావ్ రెడీ. ఇలా ఉత్తినే తీనేయవచ్చు. లేదా పుదీనా, అల్లం చట్నీతో తినవచ్చు.సలాడ్కావలసినవి: కాబూలి శనగలు, ఉల్లిపాయలు, టొమాటోలు, కీరా నిమ్మరసం, కొత్తిమీర, చాట్ మసాలా, ఉప్పు.తయారీ: రాత్రంతా నానబెట్టిన ఉడికించిన శనగలు, సన్నగా తరిగిన ముక్కలు, నిమ్మరసం, చాట్ మసాలా, ఆలివ్ ఆయిల్( ఆప్షనల్) వేసి బాగా కలుపుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలు.చనా మసాలాకావాల్సినవి : ఉడికించి పెట్టుకున్నశనగలు కాశ్మీరీ ఎండుమిర్చి, టొమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు మసాలాలు (దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు , బిర్యానీ ఆకులు, ధనియాలు, జీలకర్ర , సోంపు)ఒక పాన్లో కొద్దిగా నెయ్యివేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి వేస్ట్, మసాలాలు బాగా వేయించాలి. పాన్ అడుగున అంటు కోకుండా తిప్పుతూ బాగా వేయించాలి. ఆ తరువాత తరిగి ఉంచుకున్న టమాటాలు ముక్కలు వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి, ఉడికాక శనగలు వేసి ఉప్పు, నూనెపైకి వచ్చేదాకా బాగా ఉడికించాలి. రుచి చూసుకొని తినేముందు నిమ్మరసం కలిపి, పైన కొత్తిమీర చల్లుకున్న ఘుమఘుమలాడే చనా మసాలా రెడీ..కాబూలీ శనగల స్నాక్స్రాత్రంతా నానబెట్టి ఉడికించిన కాబూలి శనగలు. నూనె, ఉప్పు, కారం, చాట్ మసాలా, ధనియాల పొడి. శనగలను నూనెలో బాగా వేయించి, మసాలాలు కూడా యాడ్ చేసి మరికొద్దిసేపు వేగించి ఆరగించడమే.ఇవి కాకుండా ఉడికించిన శనగలను మెత్తగా చేసి, మసాలాలు జోడించి కట్లెట్స్ లాగా చేసుకోవచ్చు. శెనగ పిండితో కలిపి బజ్జీలు చేసుకోవచ్చు.శనగలతో లాభాలురోగనిరోధక శక్తికి కూడా శనగలు చాలా మంచివని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిలో విటమిన్ బి9, మెగ్నీషియం, జింక్ తదితర పోషకాలుంటాయి. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అంతేకాదు ఇదొక యాంటి ఆక్సిడెంట్ కూడా. గ్లూటెన్ రహితం కాబట్టి షుగర్, అదుపులో ఉంచుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. బెల్లీ ఫ్యాట్ను కరిగిస్తుంది. చర్మ సంరక్షణకు కూడా మంచిదేనోట్: శనగలు ఆరోగ్యానికి మంచిది. కానీ ఏదైనా అతిగా తినడం మంచిది కాదు కొంతమందికి గ్యాస్ సమస్యలు రావచ్చు. ఏవైనా సందేహాలు, సలహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.) -
ఇదొక ఫుడ్ లవ్ స్టోరీ..! వంటకానికో కథ..
నగర జీవన వైవిధ్యంలో విభిన్న సంస్కృతులకు చెందిన ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీనికి అనుగుణంగానే దేశంతో పాటు విభిన్న ప్రాంతాలకు చెందిన కాంటినెంటల్ డిషెస్ సైతం నగరంలో ఆదరణ పొందుతున్నాయి. ఇందులో భాగంగానే నగరంలోని లీలా–రీన్ ది చెఫ్స్ స్టూడియో బెంగాల్ ప్రెసిడెన్సీ కాలం నాటి వంటకాలకు ఆధునికతను జోడించి ‘ప్రితిర్ కోతా’ రుచులను నగరవాసులకు చేరువ చేస్తున్నారు. ఈ చెఫ్స్ స్టూడియోలో ఆగస్టు 3వ తేదీ వరకు కొనసాగనున్న ఫుడ్ ఫెస్ట్లో ప్రముఖ చెఫ్ గౌరవ్ సిర్కార్.. ప్రితిర్ కోతా ఫుడ్ పాప్–అప్తో అలరించనున్నారు. బెంగాల్ ఫుడ్కు నగరంలో ఇస్తున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇందులో భాగంగానే ఇక్కడి బెంగాల్ ఫుడ్ లవర్స్కు సరికొత్త రుచులను పరిచయం చేయనున్నట్లు ప్రముఖ చెఫ్ గౌరవ్ సిర్కార్ తెలిపారు. బెంగాల్ గ్రామీణ ప్రాంతాల్లోని జాక్ఫ్రూట్ కుడుములు మొదలు స్ట్రీట్ క్లాసిక్ ఫుడ్ భెట్కి, ప్రాన్ కబీరాజీ.. రాజ్–యుగ వంటకాలు స్టీమర్ డక్ కర్రీ, ఆల్టైమ్ ఫేవరెట్ ధోకర్దల్నా–రాధా బల్లవితో పాటు ఠాకూర్బరిర్ శుక్టో వంటి విభిన్న రుచులను నగరంలో వండి వారుస్తున్నామని తెలిపారు. ది ఒబెరాయ్ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ పూర్వ విద్యార్థి అయిన చెఫ్ గౌరవ్ సిర్కార్.. న్యూఢిల్లీలోని ది ఒబెరాయ్ ‘ఓమ్య’, ది బాంబే క్యాంటీన్ వంటి ప్రముఖ సంస్థలతో తన కలినరీ అనుభవాన్ని విస్తరింపజేశారు. ప్రతి వంటకంతో ఒక కథ చెప్పడం అతని పాక శాస్త్ర వైవిధ్యం. ఈ పాప్–అప్ చారిత్రాత్మక కలయికలతో పాటు ప్రాంతీయ రుచులను సమకాలీన భోజన వినూత్నత్వాన్ని మిళితం చేస్తుంది.(చదవండి: జొన్న రొట్టె రుచికి అమెరికన్ సీఈవో ఫిదా..! ఇది చాలా హెల్దీ..) -
నీ స్నేహం..ఓ సంబరం..
కొంత కాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట.. రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం.. రూపురేఖలు వేరట.. ఊపిరొకటే చాలట.. ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం.. కంటిపాపను కాపు కాసే జంట రెప్పల కాపలాగా.. నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి.. స్నేహమంటే రూపులేని ఊహ కాదని.. లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి.. అని సిరివెన్నెల రచించిన పాట అందరికీ సుపరిచితమే.. అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచి్చందంటే!.. అదే ‘ఫ్రెండ్షిప్ డే’.. ఫ్రెండ్షిప్ డే అంటే కేవలం బహుమతులు ఇచి్చపుచ్చుకోవడం లేదా ఇన్స్టాలో కథలు చెప్పడం మాత్రమే కాదు. నిజానికి, ఈ వేడుక రేపటి జ్ఞాపకాలుగా మారే అనుభవాలకు వేదిక. ట్రెడిషన్, ట్రెండ్ను మిళితం చేసే హ్యాపెనింగ్ సిటీ అయిన మన భాగ్య నగరంలో ఆ జ్ఞాపకాల సృష్టికి అనువైన ప్రదేశాలెన్నో.. అలాంటి కొన్ని ప్రదేశాలు, ఈవెంట్ల వివరాలు, అనువైన ప్రదేశాలను కోరుకునే ఫ్రెండ్షిప్ కోసం.. ప్రతి యేడాదిలానే ఈ యేడాది కూడా ఆగస్టు నెల్లో తొలి ఆదివారం ఫ్రెండ్షిప్ డే జరుపుకోనున్నారు స్నేహితులు. ఇందుకు నగరంలో పలు వేదికలు సిద్ధమవుతున్నాయి. ఇది స్నేహితులతో రోజూ మాదిరి సరదాగా కాకుండా మరింత ప్రత్యేకంగా గడపడానికి సరైన సందర్భం.. అందుకు అనువైన ప్రదేశాలెన్నో నగరంలో వేదిక కానున్నాయి. ఫ్రెండ్స్.. జంతు ప్రేమికులైతే బంజారాహిల్స్లోని పెట్ కేఫ్ లాంటివి సరైన ఎంపిక. ఇక్కడ పిల్లులను కౌగిలించుకోవచ్చు, అందమైన శునకాలను పలకరించవచ్చు. ఇది స్నేహితుల రోజువారీ ఒత్తిడిని తగ్గించడానికి అనువైన ప్రదేశం. నగరంలో మొట్టమొదటి ఆర్ట్ థెరపీ స్పాట్ జూబ్లీహిల్స్లోని లైజుర్–ఆర్ట్ కేఫ్, లైజుర్ పెయింటింగ్, టఫ్టింగ్, కుండలు, టీ–షర్ట్ పెయింటింగ్, కొవ్వొత్తుల తయారీ లాంటివెన్నో అందిస్తుంది. కళాభిమానులైన స్నేహితులు ఆర్ట్ జామింగ్ లేదా సృజనాత్మక సెషన్లను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. బ్రష్స్ట్రోక్స్ లేదా టఫ్టింగ్ సెషన్ మధ్య కాఫీని ఆస్వాదించవచ్చు. జూబ్లీహిల్స్లోని బోర్డ్ కేఫ్లో స్క్రాబుల్ వంటి క్లాసిక్ల నుంచి తంబోలా వంటి పార్టీ గేమ్ల వరకూ 700 కంటే ఎక్కువ గేమ్స్ ఉన్నాయి. ఆటలకు కొత్తవారైతే హోస్ట్ల ద్వారా సహాయం అందుకోవచ్చు. ఇక్కడ గంటల తరబడి నవ్వుతూ, స్నేహితులతో సరదా పోటీలతో గడపవచ్చు. జూబ్లీహిల్స్లోని బేస్ కాఫీ, పికిల్ బాల్ కేఫ్.. నగరంలో కొత్త జీవనశైలిలో ఒకటైన పికిల్ బాల్ కాఫీలని విలీనం చేస్తుంది. స్నేహితులు బాల్ గేమ్స్ ఆడవచ్చు, ఆ తరువాత కోల్డ్ బ్రూలు స్నాక్స్తో రీఛార్జ్ కావచ్చు. ప్రకృతిని, ప్రశాంతతను ఇష్టపడే ఫ్రెండ్స్ ప్రప్రథమ గార్డెన్ థీమ్డ్ అర్బన్ నెమో కేఫ్ని ఎంచుకోవచ్చు. ఇది పచ్చని మొక్కలతో రిలాక్స్డ్ ఓపెన్–ఎయిర్ సీటింగ్ బొటానికల్ డెకార్ను అందిస్తుంది. ఈ కేఫ్ ఫ్రెండ్షిప్ డే కార్యకలాపాలను ప్రత్యేకంగా నిర్వహించనప్పటికీ.. పచ్చదనంతో పాటు అల్లుకున్న ప్రశాంతత నిశ్శబ్దంగా ఫ్రెండ్షిప్ డేని ఆస్వాదించడానికి సరిపోతుంది. సృజనాత్మక కో–వర్కింగ్, వర్క్షాప్లు లేదా ఈవెంట్లతో కూడిన హైబ్రిడ్ స్పేస్ మిక్సింగ్ కేఫ్ ఛార్జీ. ఇక్కడ ఓపెన్ మైక్ నైట్స్, ఇండీ బ్రాండ్ పాప్–అప్లు, రైటింగ్ సర్కిల్స్, ఆర్ట్ వర్క్షాప్లు లేదా స్టాండ్–అప్ కామెడీని స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. ప్రత్యేక కార్యక్రమాలు.. కోకాపేట్లోని ది రాబిట్ లాంజ్లో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా డీజే కిమ్, డీజే సినాయ్లు సందడి చేయనున్నారు. లిక్విడ్ డ్రమ్స్, సాక్సాఫోన్, దర్బూకా.. వంటి వెరైటీ సంగీత పరికరాలు ఆకట్టుకోనున్నాయి. నగర శివార్లలో ఉన్న ఎమ్యూజ్మెంట్ పార్క్స్లో ఫ్రెండ్షిప్ డే వినోదభరితంగా జరగనుంది. శని, ఆదివారాలు రెండు రోజులపాటు వేడుకలు ప్లాన్ చేశారు. వేవ్ పూల్ డీజే సెట్లు, ఫోమ్ పారీ్టలు, ఇంటరాక్టివ్ గేమ్లు సూర్యాస్తమయం నుంచి రాత్రి వరకూ కొనసాగే నృత్యోత్సవాలను నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలిలోని థర్డ్ వేవ్ కాఫీలో ‘సొంత ఫ్రెండ్షిప్ డే బ్యాండ్స్ తయారు చేసుకోండి’ పేరిట శనివారం వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి ఈ కార్యక్రమం ఉంటుంది. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా హిప్–హాప్ పార్టీ విత్ జినీ లైవ్ ప్రోగ్రామ్ను సోమాజిగూడలోని ఆక్వా ది పార్క్లో ఆదివారం నిర్వహిస్తున్నారు. దీని కోసం మిజోరాంకు చెందిన ఆరి్టస్ట్ నగరానికి వస్తున్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. (చదవండి: సంచార జాతుల ప్రాచీన హస్త కళ..ట్రెండీ స్టైల్గా..!) -
అతిగా చేస్తే.. ప్యాకైపోతారు..!
శరీరాకృతిపై నేటి తరం యువతలో ఆసక్తి పెరుగుతోంది. అయితే ఇది ఓ క్రమ పద్ధతిలో చేస్తే లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకోవచ్చు. ఇందుకు ఆహార అలవాట్లలోనూ అనేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కానీ ఇవేవీ పాటించకుండా ఓవర్నైట్లో కండలు, సిక్స్ ప్యాక్స్ సొంతం చేసుకోవాలనే అపోహతో అతిగా సాధన చేస్తున్నారు. గంటల తరబడి బరువులు ఎత్తుతూ సొంతంగా అనర్థాలకు కారకులవుతున్నారని పలువురు జిమ్ ట్రైనర్స్, వైద్యులు చెబుతున్న మాట. ఇటీవల తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో పలువురు అనారోగ్యానికి గురైన సంఘటనలే దీనికి నిదర్శనం. ఈ తరహా ప్రమాదాలు రెగ్యులర్గా జరుగుతున్నాయని, పరిస్థితి దెబ్బతిన్న తర్వాత తమను సంప్రదిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. నగరంలో సుమారు 1.4 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఒత్తిడులతో నిత్యం బిజీగా గడిపేస్తున్నారు. వీరిలోనూ ముఖ్యంగా సాఫ్ట్వేర్, ప్రభుత్వ, కొన్ని ప్రయివేటు రంగ సంస్థల్లో పనిచేవారిలో ఎక్కువ మంది రోజుకు 8 నుంచి 9 గంటల పాటు కుర్చీలకే పరిమితమవుతున్నారు. ఈ కారణంగా శరీరాకృతిలో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువ శారీరక శ్రమ లేకపోవడం ఒకెత్తయితే.. పని ఒత్తిడి, స్ట్రెస్ మరో ఎత్తు.. దీంతో తమ శరీరంలో పేరుకుపోయిన కేలరీలు తగ్గించుకునేందుకు వీలు చిక్కినప్పుడల్లా తమకు అందుబాటులో ఉన్న జిమ్ములు, పార్కులు, ఆట స్థలాల్లో తమకు తోచిన రీతిలో వ్యాయామాలు చేస్తున్నారు. కొందరైతే వీటికి ప్రత్యామ్నాయంగా ఆటలు, డ్యాన్స్ వంటి వాటిని సాధన చేస్తున్నారు. పొంచి ఉన్న ముప్పు.. క్రమ పద్ధతి పాటించకుండా అతిగా వ్యాయామం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం, కండరాల్లో దీర్ఘకాలిక అలసట, నొప్పులు, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, నీరసం, ఆందోళన, నిరుత్సాహం, శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ పనులు చేసుకోడానికి కూడా బద్ధకం అనిపిస్తుంది. కార్టిసాల్, టెస్టోస్టిరాన్ వంటి హార్మోన్ల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. శరీరానికి ఎక్కువ శ్రమ కలిగించడం వల్ల గుండె పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా కార్డియాక్ అరెస్ట్కు దారితీయవచ్చు.. ఇటీవల తరచూ కనిపిస్తున్న కేసుల్లో 90 శాతం ఈ తరహా సమస్యలే ఎక్కువని, క్రీడలు, వ్యాయామం చేస్తుండగానే కుప్పకూలిపోతున్నారన్న విషయం తెలిసిందే.. లైఫ్స్టైల్ మేనేజ్మెంట్ అవసరం.. లైఫ్స్టైల్ మేనేజ్మెంట్లో శరీరానికి విశ్రాంతి ఎంత అవసరమో.. వ్యాయామం, ఆహారపు అలవాట్లు అంతే అవసరం.. ఒక్కసారిగా సన్నబడిపోవాలని ఎక్కువగా జిమ్ చేయడం, అలసిపోయే వరకూ క్రీడల్లో పాల్గొనడం కార్డియాక్ అరెస్ట్కు కారణం కావచ్చు. ఆహారం తగ్గించి ప్రొటీన్ పౌడర్ తీసుకోవడం మంచిది కాదు. జిమ్, క్రీడా మైదానాల్లో ఇంప్లాంటబుల్ కార్డియో వర్టర్ డీఫిబ్రిలేటర్ (ఐసీడీ) అనే పరికరం వినియోగిస్తే గుండె లయను క్రమబద్ధీకరిస్తుంది. ఎయిర్ పోర్టు, మాల్స్లో ఏఈడీ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. గుండె ఆగిపోయినప్పుడు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటివి కమ్యూనిటీల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలి. విద్యార్థి దశ నుంచే పీసీఆర్పై శిక్షణ ఇస్తే అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. – డాక్టర్ భార్గవి, కార్డియాలజిస్ట్, రెయిన్బో హార్ట్ ఇన్స్స్టిట్యూట్ -
సంచార జాతుల ప్రాచీన హస్త కళ..ట్రెండీ స్టైల్గా..!
మెటాలిక్ కలర్, మిర్రర్ వర్క్ డ్రెస్లో నటి ఖుషీ కపూర్ హ్యూందయ్ ఇండియన్ కొచర్ వీక్లో మెరిసిపోయారు. డిజైనర్ రిమ్జిమ్ దాదు చేసిన ఈ మోడర్న్ డిజైన్స్కి గుజరాతీ సంచార జాతుల హస్తకళ ప్రేరణగా నిలిచింది. ఎవర్గ్రీన్గా నిలిచే కలర్స్కి తోడైన ప్రాచీన హస్తకళ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఆక్సిడైజ్డ్ సిల్వర్, మిర్రర్ వర్క్, హెరిటేజ్, మోడర్న్ ... అంశాలతో లగ్జరియస్ బ్రాండ్గా పేరొందిన రిమ్జిమ్ దాదు ఈ డిజైన్స్ రూపొందించారు. ‘ఆక్సిన్‘ పేరుతో మన మూలాల కాంతి అని అర్ధం వచ్చేలా చేసిన ఈ డిజైన్స్లో పటోలా వంటి సంప్రదాయ ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్ను ఆమె తన డిజైన్స్కి జత చేశారు.ఖుషీ కపూర్ ధరించిన కస్టమ్ టెక్ట్స్టైల్ బ్రాకెట్–స్టైల్ బ్లౌజ్, హై–వెయిస్టెడ్ లెహంగా ఎంగేజ్మెంట్, రిసెప్షన్ వంటి వేడుకలలో హైలైట్గా నిలిచే లక్ష్యంతో ఈ డ్రెస్ను రూపొందించారు. మెటాలిక్ కలర్లోనే స్కర్ట్ అంతా మిర్రర్ వర్క్ చేశారు. బంజారా సంచార స్ఫూర్తితో ప్రేరణ పొందిన ఈ సేకరణలో మెటాలిక్ తీగలను ఉపయోగించారు. దీంతో బంజారా తెగ సాంస్కృతిక వారసత్వం హైలైట్ అయ్యింది. ‘బంజారాతో దుస్తులకు ఉన్న సంబంధాన్ని, అది తనకు తెచ్చిన అందం, సౌకర్యాన్ని ఇష్టపడుతున్నాన’ని ఖుషీకపూర్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఆక్సిడైజ్డ్ సిల్వర్, మిర్రర్ వర్క్, హెరిటేజ్, మోడర్న్ ... అంశాలతో లగ్జరియస్ బ్రాండ్గా పేరొందిన రిమ్జిమ్ దాదు ఈ డిజైన్స్ రూపొందించారు. ‘ఆక్సిన్‘ పేరుతో మన మూలాల కాంతి అని అర్ధం వచ్చేలా చేసిన ఈ డిజైన్స్లో పటోలా వంటి సంప్రదాయ ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్ను ఆమె తన డిజైన్స్కి జత చేశారు. ఇతర మోడల్స్ ధరించిన డ్రెస్సులను డిజైనర్ దాదు తన బ్రాండ్ సిగ్నేచర్ మెటల్ వైర్ల నుండి రూపొందించిన టైలర్డ్ ఫారమ్స్, స్కల్ప్చర్ డ్రేప్లతో ఆకట్టుకుటోంది. ఈ డిజైన్స్లో పైస్లీ మోటిఫ్లు మెరుస్తూ ఆకట్టుకున్నాయి. మన దేశీయ వారసత్వ హస్తకళా సంపద ఎన్నటికీ వన్నెతగ్గదని నిరూపిస్తూ డిజైనర్లు స్ఫూర్తిమంతమైన డిజైన్స్ మన ముందుకు తీసుకువస్తూనే ఉంటారు. మన మూలాల గొప్పతనాన్ని ఎప్పటికీ నిలిచి ఉండేలా ప్రపంచానికి పరిచయం చేస్తూనే ఉంటారు. (చదవండి: సెల్ఫ్ బ్రాండ్..అదే ట్రెండ్..! పేరులో ఐడెంటిటీ..అదే ఇవాళ స్టైల్లో మేటి..) -
భగవంతుడి సృష్టి
ఈ విశ్వంలో భూమి ఉంది, కాబట్టి మనం ఇక్కడ పుట్టాం. భూమి ఉండటానికి మానవులు ఏమైనా చేశారా? లేదు, ఏదో ఒక శక్తి భూమిని సృష్టించింది. మనం పుట్టిన తర్వాత జీవించటానికి ప్రాణవాయువు అవసరం. ఆ ప్రాణవాయువు ఏర్పడటానికి మానవులేమైనా చేశారా? లేదే! ఏదో ఒక శక్తి దాన్ని పుష్కలంగా లభింపచేసింది. ఈ భూమిపైన ఎప్పుడూ గాఢాంధ కారం ఉండి ఉంటే జీవించటం సాధ్యమా? వెలుతురు ఉండాలి. ఆ వెలుతురు ఉండాలంటే సూర్యుడుండాలి. ఆ సూర్యుడు అక్కడ ఉండటానికి మనుషులు ఏం చేశారు? ఏదో ఒక శక్తి ఆ సూర్యుణ్ణి సృష్టించింది. మనం జీవించటానికి నీరు అత్యంత ముఖ్యం. మరి నీటిని మనుషులెవరైనా చేశారా? ఏదో ఒక శక్తి సముద్రాలను ఏర్పరచి వాటిని నీటితో నిల్వచేసి నిరంతరం మనకు అందుబాటులోనికి తెచ్చి పెడుతున్నది. ఆహారం తీసుకొంటేనే మనం జీవించగలం. మరి ఆ ఆహారాన్ని మనుషులెవరైనా ఏ లోకం నుంచైనా భూమిపైకి తెచ్చిపెట్టి మనకు సరఫరా చేస్తున్నారా?మనం వివేకాన్ని వినియోగించి యోచిస్తే ఇదంతా స్వచ్ఛమైన సత్యమని తెలుస్తుంది. ఈ సత్యాన్ని తెలిపే గ్రంథం మానవ సమాజానికి శ్రేయస్సును కలిగించేదవుతుంది. ‘అన్నాద్భవన్తి భూతాని, పర్జన్యాదన్న సంభవః.’ అంటే ప్రాణులు అన్నము వలన కలుగుచున్నవి, అన్నము మేఘము వలన కలుగుచున్నది, ఆ మేఘము యజ్ఞం వలన కలుగు చున్నది. అంత ముఖ్యమైన యజ్ఞాన్ని జరిపే బాధ్యత అల్పజ్ఞులైన మానవులపై ఉంచక ఆ దైవం ముఖ్యమైన కార్యాలన్నీ తానే జరిపించినట్లే ఆ యజ్ఞాన్ని కూడా ఆయనే జరివిస్తున్నాడని భగవద్గీత చెబుతోంది. ‘తపామ్యహమహం వర్షం నిగృహ్ణా మ్యుత్సృజామి చ’ అంటాడు భగవానుడు. ‘నేను (సూర్య కిరణములను) తపింప చేయుచున్నాను, వర్షమును కురుపించుచున్నాను, వర్షమును నిలుపుదల చేయుచున్నాను. (గీతామకరందము–శ్రీ విద్యాప్రకాశానంద గిరి స్వామి). మనిషి జీవించ టానికి అవసరమైన భూమి, గాలి, ఎండ, నీరు, ఆహారం అన్నీ ఆ కరుణా మయుడే సమకూర్చాడు. వాటిని కలుషితం చేయకుంటే ఆయురారోగ్యాలు కల్గుతాయి.– రాచమడుగు శ్రీనివాసులు -
కిరణ్ దేశాయి : మన సాహితీ కిరణం!
కన్నడంలో బాను ముష్తాక్ (Banu Mushtaq) రాసిన కథా సంకలనానికి దీపా భాస్తిఇంగ్లిష్ అనువాదమైన ‘హార్ట్ల్యాంప్’ ఇటీవలే 2025 అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ (అనువాదాలకు ఇచ్చేది) గెలుచుకుంది. ఇప్పుడు మరో భారతీయ రచయిత్రి కిరణ్ దేశాయి రాసిన ‘ద లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ’ నవల 2025 బుకర్ ప్రైజ్కు (ఇంగ్లిష్ రచనలకు ఇచ్చేది) మరోమారు లాంగ్లిస్ట్ అయ్యింది. కిరణ్ దేశాయి (Kiran Desai) గతంలో రాసిన ‘ది ఇన్ హెరిటెన్స్ ఆఫ్ లాస్’ నవల ఆమెకు 2006లోనే అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ప్రతిష్ఠా త్మక ‘మాన్ బుకర్’ బహుమతినీ, నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ ఫిక్షన్ అవార్డునూ గెలుచుకుంది. ప్రముఖ రచయిత్రి అనితా దేశాయి కుమార్తే కిరణ్. తన 14 ఏళ్ల వయసులో తల్లితో కలిసి ఇంగ్లండ్ వెళ్లారు. ఆ తర్వాత అమెరికాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. కొలంబియా యూనివర్సిటీలో సృజనాత్మక రచనలపై కోర్సు చేశారు. కిరణ్ మొదటి నవల ‘హల్లా బలూ ఇన్ ది గ్వావా ఆర్చర్డ్’ 1998లో వెలువ డింది. అది ఒక వ్యంగ్యాత్మక రచన. ఈ నవల సంపత్ చావ్లా అనే యువకుడి చుట్టూ తిరుగు తుంది. సమాజపు ఆశలు, ఆధ్యాత్మికత, మానవ స్వభావం లాంటి అంశాలను ఇతివృత్తంగా తీసుకుని రాసిన ఈ నవల సల్మాన్ రష్దీ వంటి సాహితీ వేత్తల నుండి ప్రశంసలు అందుకోవడమే కాకుండా బెట్టీ ట్రాస్క్ అవా ర్డునూ గెలుచుకుంది. కిరణ్ రెండవ నవల ‘ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్’. 1980లలో న్యూయా ర్క్లోని వలస జీవితాలు, వారి సాంస్కృతిక గుర్తింపు, ప్రపంచీకరణ, ఫలితంగా కోల్పోయే వ్యక్తిగత స్వేచ్ఛ తదితర అంశాల్ని ఇతివృత్తంగా తీసుకుని రాశారు. వివిధ సంస్కృతుల మధ్య చిక్కుకున్న పాత్రలను చిత్రించారు. కిరణ్ రచనల్లో ధ్వనించే కథన శైలి, సజీవ చిత్రణ, సంక్లిష్ట ఇతివృత్తాల అన్వేషణ అంత ర్జాతీయ గుర్తింపును పొందాయి. ముఖ్యంగా 35 ఏళ్ల వయసులోనే బుకర్ బహుమతిని గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపును అందుకున్నారు. 2025 బుకర్ ఫైనల్ విజేతగా కిరణ్ నిలవాలని కోరుకుందాం!– వారాల ఆనంద్ ‘ కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార గ్రహీత -
ఆ ఆర్మీ ఆఫీసర్ నిర్మించిన ‘బేలీ' ఆ మహిళలకు అండగా మారింది..!
గత సంవత్సరం కేరళలోని వయనాడ్లో వచ్చిన భారీ వర్షాలు, విరిగి పడిన కొండచరియలు ఎంతోమంది జీవితాలను అస్తవ్యస్తం చేశాయి. ఈ నేపథ్యంలో వరదబాధితులకు వేగంగా సహాయం అందించడానికి ఆర్మీ ఆఫీసర్ సీతా షెల్కే 144 మంది ఆర్మీ జవానుల బృందంతో కలిసి ‘బేలీ వంతెన’ నిర్మించింది. ఆనాటి వరదల్లో సర్వస్వం కోల్పోయిన మహిళలకు ఇప్పుడు ‘బేలీ’ అండగా నిలబడింది. అయితే ఇది వంతెన కాదు. వరద బాధిత మహిళలు తమ జీవితాలను పునర్మించుకోవడానికి వచ్చిన ప్రాజెక్ట్. ‘బేలీ అంబరిల్లా అండ్ బ్యాగ్స్ ప్రాజెక్ట్’ ద్వారా ఎంతోమంది మహిళల జీవితాల్లో కొత్త వెలుగు వచ్చింది.జిల్లా అధికార యంత్రాంగం స్వయం సహాయక బృందం ‘కుటుంబశ్రీ’ భాగస్వామ్యంతో ‘బేలీ అంబరిల్లా అండ్ బ్యాగ్స్ ప్రాజెక్ట్’ను ప్రారంభించింది. ఆనాటి వరదల్లో ‘బేలీ వంతెన’ ఎంతోమంది బాధితులను కాపాడింది. ఆ కృతజ్ఞతతోనే ఈ జీవనోపాధి ప్రాజెక్ట్కు ‘బేలీ’ అని నామకరణం చేశారు. ‘బేలీ ప్రాజెక్ట్’లోని మహిళలు తయారు చేస్తున్న రంగురంగుల గొడుగులు, బ్యాగులను కుటుంబశ్రీ స్టాల్స్, ట్రైబల్ డిపార్ట్మెంట్ ఔట్లెట్స్లో ప్రదర్శిస్తున్నారు.‘బేలీ బ్రాండ్’ బ్యాగులు, గొడుగులకు తక్కువ కాలంలోనే మంచి పేరు వచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి వీటికి ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ‘బేలీ ప్రాజెక్ట్’కు సంబంధించిన పని ప్రదేశం... కేవలం బ్యాగులు, గొడుగుల తయారీ కేంద్రం మాత్రమే కాదు. ‘విపత్కర పరిస్థితులను తట్టుకొని నిలబడవచ్చు. మోడువారిన పరిస్థితులలోనూ కొత్తగా పునర్జీవించవచ్చు’ అని బలంగా చెప్పే ప్రదేశం. (చదవండి: ఆ గుండె17 నిమిషాల పాటు ఆగింది!) -
బామ్మగారి లయన్... పిజ్జాలు తినడంలో నెంబర్వన్!
బామ్మగారి లయన్... పిజ్జాలు తినడంలో నెంబర్వన్! ‘ఏరా బుజ్జికొండా, పిజ్జాలు తింటావా!’ అని తన పక్కన కూర్చున్న సింహాన్ని అడిగింది బామ్మ. ‘నువ్వు తినిపిస్తే ఎందుకు తినను’ అన్నట్లుగా చూసింది సింహం. ‘అయితే తినూ’ అంటూ సింహానికి ఆప్యాయంగా పిజ్జా తినిపిస్తూ తాను కూడా ఒక ముక్క తిన్నది బామ్మ. మటన్ ముక్కలు తినే సింహం పిజ్జా ముక్కలు తినడం ఏమిటి! అడవిలో ఉండాల్సిన సింహం బామ్మ పక్కన పిల్లిలా కూర్చోవడం ఏమిటి!!ఇది కలియుగ వింత కాదు... ఏఐ (ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్) సృష్టించిన సాంకేతిక వింత. ఈ ఏఐ వీడియోలో ఎక్కడా కృత్రిమత్వం కనబడదు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ సింహం– బామ్మ వీడియో వేలాది వ్యూస్తో దూసుకుపోతోంది. View this post on Instagram A post shared by Viral taii vlog (@taii_vloger) (చదవండి: Dog Therapy In Hyderabad: డాగ్ థెరపీ.. ! 'ఒత్తిడికి బైబై'.) -
ఆ గుండె17 నిమిషాల పాటు ఆగింది!
విక్టోరియా అనే ఓ మహిళ గుండె స్పందనలు ఆగాయి. కార్డియాక్ అరెస్ట్తో ఆ గుండె ఆగగానే ఆమె దాదాపుగా చని΄ోయిందనే అనుకున్నారందరూ! ఏకంగా 17 నిమిషాల పాటు ఆగిందామె గుండె. అయితే... అత్యంత అప్రమత్తతతో అత్యవసరంగా స్పందించిన కొందరు పారామెడిక్స్ కృషితో గుండె స్పందనలు మళ్లీ మొదలయ్యాయి. తీరా చూస్తే ఆమె గుండె అలా ఆగడానికి కారణం... ఆమెకున్నో అరుదైన జన్యుపరమైన వ్యాధి. మల్టిపుల్ హార్ట్ ఫెయిల్యూర్గా పిలిచే విక్టోరియా వ్యాధి వివరాలివి. యూకేలోని గ్లౌసెస్టర్ నగరానికి చెందిన విక్టోరియా థామస్ అనే మహిళ ఓ ఫిట్నెస్ ఫ్రీక్. ముప్పై ఐదేళ్ల ఆమె తన ఆరోగ్యం కోసం నిత్యం వ్యాయామాలు చేస్తూ ఉండేది. ఎప్పటిలాగే ఆరోజునా ఆమె జిమ్లో వ్యాయామాలు చేస్తోంది. తన ఇంటెన్సివ్ వర్కవుట్ సెషన్లో భాగంగా అప్పుడే ఆమె తన వెయిట్ లిఫ్టింగ్ సెట్స్ పూర్తి చేసుకుంది. ఇంతలో ఆమెలోని శక్తినంతా తలలోంచి బయటకు తోడిపోసిన అనుభూతి! విక్టోరియా తన చేతిలోని వెయిట్స్ రాడ్ను ఇలా పక్కకు పెట్టిందో లేదో... ఒక పక్కకు అలా ఒరిగిపోయింది. పక్కనున్నవాళ్లు హుటాహుటిన పారామెడిక్స్ను తీసుకొచ్చారు. వాళ్లు ఆమె ఛాతీని నొక్కుతూ సీపీఆర్ (కార్డియో పల్మునరీ రీససియేషన్) మొదలుపెట్టారు. కానీ గుండె స్పందనలు ఎంతకీ మొదలు కాలేదు.మరణానుభవానుభూతితో ఓ నిశ్శబ్ద శూన్యత... సెకన్లు నిమిషాల్లోకి గడిచి΄ోతున్నాయి. నిమిషాలు పదీ, పదిహేను నిమిషాల వ్యవధి దాటి పావుగంటల్లోకి దొర్లిపోతున్నాయి. కానీ సీపీఆర్తో ఎంతగా ప్రయత్నిస్తున్నా విక్టోరియా కోలుకోవడం లేదు. అలా 17 నిమిషాల ప్రయత్నం తర్వాత ఆమె గుండె అకస్మాత్తుగా స్పందనలనందుకుంది. ఈలోపు ఆమెకు అంతటా శూన్యం. భయంకరమైన నిశ్శబ్దం. ఎటు చూసినా... చూడకున్నా అంతా చిమ్మచికటి. ఆమెలోని తన స్మృతి హేతు జ్ఞానాలన్నీ విస్మృతిలోకి వెళ్లాయి. ఇలా ఆమె ఆ 17 నిమిషాల పాటూ ‘నియర్ డెత్’ భయంకరానుభవాన్ని చవిచూసింది. ప్రాణాలు దక్కవనే అనుకున్నారు. కానీ 17 నిమిషాల తర్వాత ఆమె గుండె స్పందనలు మొదలయ్యాయి.మూడు రోజుల పాటు కోమాలోనే...ఎట్టకేలకు గుండె స్పందనలు మొదలైనా ఇంకా ఆమె కోమాలోనే ఉంది. దాంతో విక్టోరియాను ‘బ్రిస్టల్ రాయల్ ఇన్ఫర్మరీ’ అనే ఓ పెద్ద వైద్యశాలకు తరలించారు. అక్కడామె మూడు రోజుల పాటు కోమాలోనే ఉండిపోయింది. తర్వాత మెల్లగా కోలుకుని కోమాలోంచి బయటకొచ్చింది.గర్భం దాల్చడంతో మొదలైన సవాళ్లు... ఇదిలా ఉండగా 2021లో విక్టోరియా గర్భం దాల్చింది. అప్పుడు చేసిన పరీక్షల క్రమంలో తెలిసిందేమిటంటే... ఆమెకు మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అనే వ్యాధి ఉందని! ‘డేనన్ డిసీజ్’ అని పిలిచే ఆ అరుదైన జన్యుపరమైన ఆ వ్యాధి కారణంగా ఇతర కండరాలతో పాటు గుండె కండరాలూ తీవ్రంగా ప్రభావితమవుతాయి. అవి క్రమంగా బలహీనపడిపోవడంతో (కార్డియోమయోపతి కారణంగా) గుండె మాటిమాటికీ ఆగిపోతుంటుంది. ఆ గుండె ఆగకుండా స్పందించేందుకూ... ఒకవేళ ఆగినా మళ్లీ స్పందనలు మొదలయ్యేందుకు డీ–ఫిబ్రిలేటర్ అనే పరికరాన్ని అమర్చారు. అది చేసే పనేమిటంటే గుండె ఆగినప్పుడుల్లా ఓ ఎలక్ట్రిక్ షాక్ పంపి, గుండెను మళ్లీ కొట్టుకునేలా చేస్తుంది. చిత్రమేమిటంటే... జన్యుపరమైన వ్యాధి అయినప్పటికీ... వాళ్ల కుటుంబంలో అందుకుముందెవరికీ ఆ వ్యాధి లేదు. అది కనిపించిన మొట్టమొదటి బాధితురాలు విక్టోరియానే!!అసలే గుండె వీక్... ఆ పైన ప్రెగ్నెన్సీ!!మొదటే గుండె చాలా బలహీనం. కానీ ఆలోపు ప్రెగ్నెన్సీ రావడంతో గుండె పంపింగ్ సరిగా జరగక మాటిమాటికీ విక్టోరియా గుండె ఆగి΄ోవడాలు జరిగేవి. ఇలా తరచూ జరిగే కార్డియాక్ అరెస్టుల నేపథ్యంలోనే నెలల నిండకముందే సిజేరియన్తో బిడ్డను బయటకు తీయాల్సి వచ్చింది. బిడ్డ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ పండంటి మగబిడ్డ! అదృష్టం... పరీక్షలు చేసి చూస్తే తల్లికి ఉన్న ఆ జన్యుపరమైన జబ్బు బిడ్డకు లేదు!! డాక్టర్లు 2022లో విక్టోరియాకు గుండె పరీక్షలు చేయించినప్పుడు తెలిసిందేమిటంటే... ఆమె గుండె పనితీరు కేవలం 11 శాతమేనని!! అంటే హార్ట్ ఫెయిల్యూర్ తాలూకు చివరి దశ అది. ఇకపై ఆమె బతకబోయేది కొద్ది నెలల మాత్రమేనని తేలింది. అదృష్టాలు ఒక్కోసారి ‘ఫలించి’నప్పుడు గుండెకాయ కూడా చెట్టుకాయలా దొరుకుతుంది. అలా ఆమెకు గుండె మార్పిడి చికిత్స కోసం తగిన గుండె దొరకడంతో... ఏప్రిల్ 2023 లో ట్రాన్స్ప్లాంట్ చికిత్స చేశారు. దాంతో విక్టోరియా మృత్యుముఖం నుంచి మరోసారి బయటపడింది. ‘కొత్త హార్ట్’తో తల్లి... తన ‘స్వీట్ హార్ట్’ అయిన ఆ బిడ్డ... ఇలా ఇప్పుడా తల్లీ బిడ్డా ఇద్దరూ క్షేమం.– యాసీన్ (చదవండి: ఏం ప్రేమ రా నీది'..! ఏకంగా 43 సార్లు..) -
నవ్వుకు 16.5 కోట్ల ఇన్సూరెన్స్!
‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’ అనేది మన సామెత. ‘నోరు ఆరోగ్యంగా ఉంటేనే నా కెరీర్ బాగుంటుంది. భవిష్యత్ బాగుంటుంది’ అనేది బ్రిటిష్ నటి, గాయని సింథియా ఎరివో మాట. ‘నవ్వే నా ఆస్తి.. నా గొంతే నా ఐశ్వర్యం’ అంటున్న సింథియా సుమారు 16.5 కోట్లకు తన గొంతును బీమా చేయించింది. మౌత్వాష్ బ్రాండ్ ‘లిస్టెరిన్’ ‘వాష్ యువర్ మౌత్’ క్యాంపెయిన్కు ఆమె ప్రచారకర్తగా ఉంది.‘వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నా అందమైన నవ్వు, శక్తిమంతమైన స్వరం నా గుర్తింపు’ అని చెప్పే సింథియా దంత శుభ్రత, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. వేదిక ఎక్కినప్పుడల్లా బ్రష్ చేసుకుంటుంది. నోటికి సంబంధించిన ఆరోగ్య జాగ్రత్తలు తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచినట్లు చెబుతుంది.శరీర భాగాలకు బీమా చేయించడం కొత్తేమీ, వింతేమీ కాదు. కాళ్లు, వీపు, స్వరపేటిక, నాలుక...ఇలా రకరకాల శరీర భాగాలకు బీమా చేసుకున్నవారు హాలీవుడ్లో చాలామందే ఉన్నారు. అక్కడ ఇదొక ట్రెండ్గా కొనసాగుతోంది. (చదవండి: నో ఫ్యాషన్ డైట్.. జస్ట్ ఆరు నెలల్లో 17 కిలోలు! స్లిమ్గా నటి దీప్తి సాధ్వానీ) -
తల్లీకూతుళ్లు.. ఒకేసారి మెడిసిన్
చదువుకు వయసేమిటి? కష్టమైన మెడిసిన్ సీటు సాధించడంలోమనకు తక్కువేమిటి అనుకున్నారు 49 ఏళ్ల అముదవల్లి. తమిళనాడుకు చెందిన ఈ ఫిజియోథెరపిస్ట్ తన కుమార్తె సంయుక్తతో కలిసి నీట్ 2025 రాశారు. ఇద్దరికీ ర్యాంకు వచ్చింది. బుధవారం కౌన్సిలింగ్లో ఆమెకు సీటు ఖరారైంది. కూతురుతోపాటు మెడిసిన్ చదవబోతున్నందుకు చాలా ఉద్వేగంగా ఉందామె. పెళ్లి వల్ల చదువు ఆగిపోయిన తల్లులు అముదవల్లిని చూసి స్ఫూర్తి పొందాలి.‘వివాహం విద్యానాశాయ’... పెళ్లికాగానే చదువు అటకెక్కుతుందని, బాధ్యతలు తలకెక్కుతాయని పెద్దలంటారు. అదంతా అప్పటి మాట. ఇప్పుడు పెళ్లి తర్వాత కూడా విద్యను వృద్ధి చేయవచ్చు అని నిరూపించారు 49 ఏళ్ల అముదవల్లి. కూతురితో కలిసి, నీట్ పరీక్ష రాసిన ఆమె ఉత్తీర్ణత సాధించి చాలామంది అమ్మలకు స్ఫూర్తిగా నిలిచారు. ఒకేసారి తల్లీకూతుళ్లు నీట్ పరీక్ష రాయడం, ఇద్దరూ పాసవడం దేశంలో ఇదే తొలిసారి కావొచ్చు.ఎప్పటి నుంచో కలతమిళనాడు తె¯Œ కాశికి చెందిన అముదవల్లి వృత్తిరీత్యా ఫిజియోథెరపిస్ట్. భర్త లాయర్. మరో ఏడాదిలో ఆమె 50 ఏళ్ల వయసుకు చేరుకుంటారు. ఇన్నేళ్లు గడిచినా ఆమె మనసులో ఒక కోరిక మాత్రం తీరలేదు. అదే డాక్టర్ అవ్వడం. తెల్లకోటు వేసుకొని, చేతిలో స్టెతస్కోప్ పట్టుకొని, రోగుల్ని నవ్వుతూ పలకరించి, చల్లటి చికిత్స అందించే వైద్యురాలు కావాలన్నది ఆమె కల. కానీ ఆమె ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించ లేదు. దీంతో ఫిజియోథెరపీ కోర్సు చేసి, అందులోనే కొనసాగారు. ఆశ్చర్యంగా కూతురు సంయుక్త తనకు డాక్టర్ కావాలని ఉందని చెప్పినప్పుడు అముదవల్లి ఎంతో సంతోషపడ్డాను. తను నెరవేర్చుకోలేకపోయిన కోరిక కూతురు సాధించబోతోందని ఆనందపడ్డారు. అంతేనా? తన కూతురితోపాటు తను మాత్రం ఎందుకు సాధించకూడదు? ఆ వయసులో తనకు అడ్డుపడ్డ ఇబ్బందులు ఇవాళ లేవుగా? అందుకే కూతురుతోపాటు తనూ నీట్ పరీక్ష రాయాలని అనుకున్నారు.కష్టమైన లక్ష్యందేశవ్యాప్తంగా నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఆపై మెడికల్ సీటు పొందడం అంత సులభమైన విషయాలు కావు. చాలా శ్రమించాలి. గంటల తరబడి చదవాలి. రోజుల తరబడి చదువుకు అంకితమవ్వాలి. ఇంత చేసినా పాసవుతామన్న నమ్మకం లేదు. అయితే అముదవల్లికి కూతురు సంయుక్త తోడుగా నిలిచింది. స్ఫూర్తి నింపింది. తనతోపాటు తల్లి కూడా నీట్ పరీక్ష రాయడాన్ని ప్రోత్సహించింది. ఇద్దరూ కలిసి పరీక్షకు సిద్ధమయ్యారు. అయితే అప్పటికి అముదవల్లి చదువు మానేసి చాలా ఏళ్లయ్యింది. కొత్త సిలబస్, సరికొత్త అంశాలు. అవన్నీ మళ్లీ చదవడం, వాటిని అర్థం చేసుకోవడం, గుర్తుపెట్టుకోవడం కష్టమైన పనులు. అయినా ఆమె విసుగు లేకుండా రోజూ సాధన చేసేవారు. తనకొచ్చే సందేహాలను కూతురిని అడిగి సమాధానాలు తెలుసుకునేవారు. ‘నేను చదివినప్పటికీ, ఇప్పటికీ సిలబస్లో చాలా మార్పులొచ్చాయి. కొన్ని విషయాలు నాకు పూర్తిగా కొత్త. అయినా నా కూతురి సాయంతో వాటిని చదివి, అర్థం చేసుకున్నాను. ఇద్దరం కలిసి వాటిని చర్చించి, చదువుకునేవాళ్లం. ఈ విషయంలో మా అమ్మాయే నాకు స్ఫూర్తి’ అని సంతోషంగా వివరిస్తున్నారు అముదవల్లి. సంయుక్త కోచింగ్ సెంటర్కి వెళ్లి, అక్కడ శిక్షణ పొంది ఇంటికొచ్చి, ఆ పాఠాలు తల్లికి చెప్పేది. దీనివల్ల ఆ విషయాలు తనకూ బాగా తెలియడంతోపాటు తల్లికీ ఉపయోగకరంగా మారింది. ‘మనం చదువుకున్నది మరొకరికి నేర్పితే, అది మనకు బాగా గుర్తుంటుంది. నేను నేర్చుకున్న టాపిక్స్ మా అమ్మకు నేర్పడం చాలా మంచిదైంది’ అంటోంది సంయుక్త.సాధించిన ద్వయంఅముదవల్లి, సంయుక్త నీట్– 2025 పరీక్ష రాశారు. అముదవల్లి 147 మార్కులు సాధించగా, సంయుక్త 450 మార్కులు సాధించింది. జూలై 30న చెన్నైలో నీట్ కౌన్సిలింగ్కి ఇద్దరూ హాజరయ్యారు. దివ్యాంగుల కోటాలో అముదవల్లికి విరుదనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్ రాగా, సంయుక్తకు ఇంకా కళాశాలను అలాట్ చేయలేదు. ‘మా అమ్మతో కలిసి ఒకే కాలేజీ చదవాలని నాకు లేదు. ఆమె ప్రిపేర్ అవుతున్నప్పుడు అదొక్కటే నేను పెట్టిన షరతు’ అని నవ్వింది సంయుక్త. ఇన్నేళ్ల తర్వాత తన తల్లి తన ఆశయాన్ని సాధించి, అనేకమందికి స్ఫూర్తిగా నిలవడం ఆనందంగా ఉందని అంటోంది.నేను చదివినప్పటికీ, ఇప్పటికీ సిలబస్లో చాలా మార్పులొచ్చాయి. అయినా నా కూతురి సాయంతో వాటిని చదివి, అర్థం చేసుకున్నాను. ఇద్దరం కలిసి వాటిని చర్చించి, చదువుకునేవాళ్లం. ఈ విషయంలో మా అమ్మాయే నాకు స్ఫూర్తి.– అముదవల్లి -
బుస్ బుస్..స్నేక్ వెరైటీల్లో టాప్ 10 దేశాలివే...
ఇది వానాకాలం...సిటీలో ఉన్నవారికి ఈ సీజన్లో ఏవేవో గుర్తు రావచ్చు గానీ గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారికి మాత్రం వెంటనే గుర్తొచ్చేవి, వారిని అప్రమత్తం చేసేవి పాములు అని చెప్పాలి. ఈ సమయంలో పాములు పొలాల్లో నుంచి ఇళ్లలోకి కూడా ప్రవేశించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి గ్రామీణులు, నగర శివార్లలో ఉన్నవారు తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ సందర్భంగా అసలు ప్రపంచంలో పాముల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాలు ఏవేవి? ఎన్నెన్ని జాతులు పాములు ఉన్నాయి? మన దేశం ఏ స్థానంలో ఉంది? ఒక్కసారి పరిశీలిస్తే...పాముల సంఖ్యలో తొలిస్థానం మెక్సికో దేశం దక్కించుకుంటోంది. ఈ దేశంలో దాదాపుగా 400కిపైగా సర్ప జాతులు ఉన్నట్టు అంచనా. వీటిలో రాటిల్ స్నేక్స్, కోరల్ స్నేక్స్, బోవా పాములు వంటివి ఉన్నాయి.పాముల సంఖ్యలో 2వ స్థానాన్ని దక్కించుకుంది బ్రెజిల్. అయితే జాతుల రీత్యా చూస్తే ఈ దేశంలో 420కిపైగా పాములు ఉన్నట్టు లెక్కించారు. వీటిలో చెట్లలో నివసించే వాటి నుంచి అనకొండ వంటి భారీ సర్పాల వరకూ ఉన్నాయి.ఈ జాబితాలో ఇండోనేసియా 3వ స్థానంలో నిలిచింది. ఈ దేశంలో సముద్ర సర్పాలు, పైథాన్స్ వంటి రకాలతో కూడిన 376 సర్ప జాతులకు ఈ దేశం నిలయంగా ఉంది.పామును దైవంగా కొలిచే కోట్లాది మంది ప్రజలున్న మన భారత దేశం ఈ లిస్ట్లో 4వ ప్లేస్ దక్కించుకుంది. కోబ్రాలు, పచ్చని పల్లి పాములు, క్రైట్స్ సహా 305 సర్ప జాతులు మన దేశంలో ఉన్నాయట.దట్టమైన అడవులు, కొండ ప్రాంతాలకు చిరునామా అయిన కొలంబియా మన తర్వాత 5వ స్థానంలో నిలిచింది. ఈ దేశంలో మొత్తం 305 రకాల స్నేక్ వెరైటీలు ఉన్నాయి. బుష్ మాస్టర్స్, కోరల్ స్నేక్స్ వంటి పాముల జాతులకు ఈ దేశం పేరొందింది.జనాభాలో నెం2గా ఉన్న చైనా పాముల జనాభాలో 6వ స్థానం చేజిక్కించుకుంది. పిట్ వైపర్స్ వంటి అరుదైన జాతులతో సహా 246 వెరైటీలు చైనాలో ఉన్నాయి.సైజులో చిన్న అయినా పాముల పాప్యులేషన్లో పెద్ద దేశాల సరసన చోటు సంపాదించింది ఈక్వడార్. ఈ దేశంలో అమెజానియన్ రెయిన్ ఫారెస్ట్, క్లౌడ్ ఫారెస్ట్స్ వంటివి పాముల నిలయాలుగా మారి 241 సర్పజాతులకు ఈ దేశాన్ని అడ్రెస్గా మార్చాయి.మొత్తం 226 సర్ప జాతులతో వియత్నాం 8వ స్థానం అందుకుంది. కోబ్రాలు, కీల్ బ్యాక్స్ వంటి వెరైటీలతో ఈ దేశంలోని అడవులు సర్ప నిలయాలుగా పేరొందాయి.ప్రకృతి సౌందర్యంతో, పర్యాటకుల ఆకర్షణలో ముందున్న మలేషియా 9వ స్థానంలో నిలిచింది. ఈ దేశంలో రంగురంగుల పాములు ప్రత్యేక ఆకర్షణ. మొత్తంగా 216 స్నేక్ వెరైటీలు ఉన్నాయట.టాప్ 10లో చివరి దేశంగా నిలిచిన ఆస్ట్రేలియాలో 215 సర్పజాతులు ఉన్నాయని లెక్కించారు. అత్యంత ప్రమాదకరమైన టైపాన్స్, బ్రౌన్ స్నేక్స్, టైగర్ స్నేక్స్కు ఈ దేశం కేరాఫ్గా ఉంది. -
నో ఫ్యాషన్ డైట్.. జస్ట్ ఆరు నెలల్లో 17 కిలోలు! స్లిమ్గా నటి దీప్తి సాధ్వానీ
బరువు తగ్గేందుకు సామాన్యులు నుంచి సెలబ్రిటీల వరకు అందరు నానాప్రయాసలు పడి మరీ స్లిమ్గా మారుతున్నారు. ఆహార్యం పరంగానే కాదు ఆరోగ్యపరంగా ఫిట్గా ఉండాలన్నదే అందరి అటెన్షన్. అయితే ఆ బరువు తగ్గే ప్రయాణం అంత ఈజీగా విజయవంతం కాదు. ఎందుకంటే..ఎక్కడ రాజీపడని దృఢ సంకల్పంతో ముందుకు సాగినవారే మంచి ఫలితాలను అందుకుని చక్కటి ఆకృతితో మన ముందుకు వస్తున్నారు. అలాంటి కోవలోకి బాలీవుడ్ బుల్లితెర నటి తారక్ మెహతా కా ఊల్తా చాష్మా ఫేమ్ దీప్తి సాధ్వానీ కూడా చేరిపోయారు. ఎలాంటి షార్ట్కట్లు డైట్లు పాటించకుండానే ఆరోగ్యవంతంగా బరువు తగ్గి అందరిచేత ప్రశంసలందుకుంటోంది దీప్తి. మరి ఆమెకు అదెలా సాధ్యమైందో సవివరంగా చూద్దామా..!.34 ఏళ్ల దీప్తి సాధ్వానీ తారక్ మెహతా కా ఊల్తా చాష్మాలో ఆరాధన శర్మ పాత్రతో ప్రేక్షకులను మెప్పించి వేలాది అభిమానులను సంపాదించుకున్న నటి. గతేడాది తన బ్యూటిఫుల్ లుక్తో ఫ్యాన్స్ని ఆశ్చర్యపరిచింది. ఇండ సడెన్గా అంతలా మెరుపు తీగలా ఎలా అని విస్తుపోయారంతా. అంతలా తన ఆహార్యాన్ని మార్చుకుంది దీప్తి. అంతేగాదు తాను ఎలా స్లిమ్గా మారిందో కూడా ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారామె. తాను ఎలాంటి క్రాష్ డైట్లు ఫాలో కాలేదని, కనీసం బరువు తగ్గే మాత్రలను కూడా ఉపయోగించలేదని చెప్పుకొచ్చింది. కేవలం ఆరోగ్యకరమైన ఆహారం, తగిన వ్యాయామాలతోనే బరువు తగ్గించుకున్నానని తెలిపింది. అయితే ఏ నెల స్కిప్ చేయకుండా వెయిట్లాస్ జర్నీని విజయవంతంగా పూర్తిచేసినట్లు వెల్లడించింది. అలాగే బరువు తగ్గడం ఏమంత సులువు కాదని చెబుతోంది. ఇక్కడ అంకితభావంతో డుమ్మా కొట్టకుండా పాటిస్తేనే మంచి ఫలితాలు త్వరితగతిన పొందగలమని చెబుతోంది. ముఖ్యంగా చక్కెరకు సంబంధించినవి, ప్రాసెస్ చేసిన ఆహారాలను దరిచేరనివ్వకుండా చేస్తే చాలు బాడీలోని మార్పులు త్వరితగతిన సంతరించుకుంటాయంటోంది. దీంతోపాటు రోజుకి 16 గంటలు అడపాదడపా ఉపవాసం ఉంటుందట. అలాగే మైండ్ఫుల్ కేలరీ ట్రాకింగ్ వీటన్నింటితో సమతుల్య ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చేలా చూసుకున్నానని చెబుతోంది. ఇవి మంచివేనా అంటే..కెనడాలోని కాలేజ్ ఆఫ్ ఫ్యామిలీ ఫిజిషియన్స్ జర్నల్ సైతం అడపాదడపా ఉపవాసం అనుసరించే వ్యక్తులు తక్కువ వ్యవధిలో 0.8% నుండి 13% బరువు తగ్గుతారని పేర్కొంది. అలాగే కేలరీలరట్రాకింగ్అనేది కూడా అత్యంత ఆరోగ్యకరమైన రీతిలో ఉంటే బరువు తగ్గడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందట. ఇక దీప్తి వ్యాయమాలు దగ్గరకు వచ్చేటప్పటికీ బాక్సింగ్, ఈత, వైమానిక యోగా వంటివి చేసినట్లు వెల్లడించింది. ఒకటే రొటీన్ వ్యాయమాలు కాకుండా మారుస్తూ చేస్తూ.. ఉంటే..బాడీకి స్వాంతన తోపాటు..చేయాలనే ఉత్సాహం వస్తుందని చెబుతోంది. ఇక్కడ బరువు తగ్గడం అనేది శారీరకంగానే కాదు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతుందనని అంటోంది దీప్తి సాధ్వానీ. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: Dog Therapy In Hyderabad: డాగ్ థెరపీ.. ! 'ఒత్తిడికి బైబై'..) -
కళ్లకు గంత..! 'ఆ కళ ఓ వింత'
కాదేదీ కవితకు, కళకు కూడా అనర్హం. కళ్లు తెరచి చూసేవారికి కనువిందు చేసే చిత్రకళ.. కళ్లకు గంతలు కట్టుకొని చిత్రకారులు సృష్టించింది అని తెలిస్తే వీక్షకులకు అదో వినూత్న అనుభూతి. అలాంటి చిత్రాలకే కాదు.. ఆ చిత్రకళకూ ఇప్పుడు నగరంలో కళాభిమానులు జై కొడుతున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని చిత్రకారులు గీసిన చిత్రాలను చూడటానికి మాత్రమే కాదు తాము సైతం అదే కళను సాధన చేస్తూ ఓ వైపు సృజనాత్మకత పెంచుకుంటూ మరోవైపు మానసిక ప్రశాంతత పొందుతున్నారు. బ్లైండ్.. ట్రెండ్.. కొన్నేళ్లుగా బాగా ఆదరణకు నోచుకుంటున్న బ్లైండ్ ఫోల్డ్ ఆర్ట్ అనేది కళాకారులు కళ్లకు కట్టు కట్టి, తమ భావోద్వేగాలను, ఊహాశక్తిని ఆధారంగా చేసుకుని పెయింటింగ్స్ రూపొందించే ఒక అరుదైన కళా ప్రక్రియ. మన దేశంలో ఈ ఆర్ట్కు సంబంధించి ప్రత్యేక గుర్తింపు పొందిన కొందరు ప్రముఖ కళాకారుల్లో రాజస్థాన్కు చెందిన మహేష్ చంద్ర శర్మ దాదాపు 6 వేల చిత్రాలను కేవలం స్పర్శ ఆధారంగా చిత్రీకరించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్కు నామినేట్ అయ్యారు. ఎన్నో సోషల్ వర్క్ కార్యక్రమాలలో పాల్గొంటూ సమాజ సేవ కోసం తన కళను వినియోగిస్తున్నారు. మైసూరుకు చెందిన శ్రీనివాస్ బి.బ్లైండ్ ఫోల్డ్ మల్టీటాలెంటెడ్ ఆరి్టస్టుగా పేరు పొందారు. కేవలం చిత్రకళే కాదు, సంగీతం, డాన్స్ వంటి ఇతర కళారూపాల్లో కూడా కళ్లకు కట్టు వేసుకుని ప్రదర్శనలిచ్చారు. దేశవ్యాప్తంగా పలు స్కూల్స్, కళాకేంద్రాల్లో వర్క్షాప్లు నిర్వహిస్తున్నాడు. బెంగుళూర్ నివాసి నివేదిత గౌడ టీవీ ప్రోగ్రామ్స్లో బ్లైండ్ఫోల్డ్ డ్రాయింగ్, స్కెచ్ డెమోస్ ద్వారా గుర్తింపు పొందారు. యువతలో సృజన పెంపొందించేందుకు బ్లైండ్ఫోల్డ్ ఆర్ట్ వర్క్షాప్లు నిర్వహిస్తున్నారు. నగరంలో బ్లైండ్ఫోల్డ్ ఆర్ట్ నిపుణులుగా జె.వేణుగోపాల్ పేరొందారు. ఆయన కళ్లకు గంతలతో ‘గణేశ’ ‘ప్రపంచ ఉష్ణోగ్రత’ వంటి చిత్రాలు గీశారు. కొత్త కొత్త కళలను సాధన చేయడం పట్ల నగరవాసుల్లో ముఖ్యంగా యువతలో క్రేజ్ పెరుగుతోంది. పలు ఇన్నోవేషన్స్కు సిటీ కేంద్రంగా మారుతున్న వేళ, ఈ తరహా వినూత్న ఆర్ట్ ఫార్మాట్లు యువతలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దాంతో బ్లైండ్ఫోల్డ్ ఆర్ట్ ఈవెంట్స్ ట్రెండ్గా మారుతున్నాయి. కళను అనుభవించడంలో కొత్త కోణాలను అన్వేíÙంచే వారికి వీటి వర్క్షాప్లు ఆసక్తికరంగా మారడంతో పలు ఆర్ట్ స్టూడియోలు, కమ్యూనిటీ సెంటర్లు బ్లైండ్ ఫోల్డ్ ఆర్ట్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నాయి. వయసులకు అతీతంగా నగరవాసులు వీటిలో పాల్గొంటున్నారు. ఈ బ్లైండ్ ఫోల్డ్ ఆర్ట్ ఈవెంట్స్, వర్క్షాప్స్ కేవలం వినూత్న కళను నేర్చుకోవడానికి మాత్రమే కాదు కాదు, చూస్తూ అనుభవిస్తూ కళను సృష్టించే ఈ కళారీతి మైండ్ఫుల్నెస్, స్ట్రెస్ రిలీఫ్, ఇన్నర్ కాని్ఫడెన్స్ పెంపొందించుకోవడంలో సహాయపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇటీవల నగరంలో ‘బ్లైండ్ఫోల్డ్ ఆర్ట్ ఛాలెంజ్’ కార్యక్రమం జరిగింది. దీనిలో పాల్గొనేవారు కళ్లకు గంతలు కట్టుకుని బొమ్మల్ని గీయాలి అంతేకాక అది ఏ బొమ్మో కూడా ఊహించాలి. ఎస్సిఎమ్ హైదరాబాద్ ఆర్ట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఛాలెంజ్లో బహుళ రౌండ్ల తర్వాత విజేతలను ఎంపిక చేశారు. సాధారణ వ్యక్తుల కన్నా దృష్టి లోపం ఉన్నవారికి. ఇతర ఇంద్రియాల పట్ల అవగాహన వాటి శక్తుల పట్ల ఆలోచన పెంచడం లక్ష్యంగా దీనిని నిర్వహించారు. స్ఫూర్తిని అందిస్తున్న బ్లైండ్ ఫోల్డ్ విజయాలు.. చిత్రకళ మాత్రమే కాకుండా బ్లైండ్ ఫోల్డ్ అనేది చాలా కళలకు, సాహసాలకు విస్తరిస్తోంది. నగరంలో ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ.. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన వారు సాధిస్తున్న విజయాలు నగరవాసులకు స్ఫూర్తిని అందిస్తున్నాయి. అలాంటి వాటిలో.. మంగుళూర్కి చెందిన మెజిషియిన్ సమర్థ్ షెనాయ్: లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లక్ష్యంగా 300 కి.మీ. స్కూటర్ రైడ్ను కళ్లకు గంతలు కట్టుకుని పూర్తి చేశారు. బీహార్లోని దర్భాంగా ప్రాంతవాసి అయిన మోనికా గుప్తా అయోధ్యలో రామమందిర ప్రారంభత్సవంలో కళ్లకు గంతలు కట్టుకుని రంగోలిని గీసి అందర్నీ ఆకట్టుకున్నారు. ముంబైకి చెందిన అఫాన్ కుట్టి కళ్లకు గంతలు కట్టుకుని రూబిక్స్ క్యూబ్లను ఉపయోగించి క్రికెటర్ మొహమ్మద్ షమీ చిత్రపటాన్ని సృష్టించాడు. చెన్నైకి చెందిన శిల్పి చంద్రు స్పర్శ, విజువలైజేషన్ కళ మధ్య సంబంధాన్ని వివరిస్తూ కళ్లకు గంతలు కట్టుకుని శిల్పాలను సృష్టించే శిల్పకారుడిగా పేరొందారు. వాయిద్య కారులు, గాయకులు సహా అందరూ కళ్లకు గంతలు కట్టుకుని ప్రదర్శన ఇచ్చే ముంబైకి చెందిన బ్లైండ్ ఆర్కెస్ట్రా కళాకారులు కూడా ప్రత్యేక గుర్తింపు పొందారు. (చదవండి: ఏం ప్రేమ రా నీది'..! ఏకంగా 43 సార్లు..) -
'ఏం ప్రేమ రా నీది'..! ఏకంగా 43 సార్లు..
ఎన్నో ప్రేమకథలు గురించి విని ఉండి ఉంటారు. ఇలాంటి వెరైటీ లవ్స్టోరీ మాత్రం విని ఉండరు. ఎవ్వరైన నచ్చిన అమ్మాయి/అబ్బాయికి ఓకే చెప్పేందుకు ట్రై చేయడం, నిరీక్షించడం కామన్. కానీ మరి ఇన్నిసార్లు మాత్రం ప్రపోజ్ చెయ్యరు. ఒక్కసారి రిజెక్ట్ చేస్తేనే.. గుండెపగిలిపోయినంతగా బాధపడతారు ప్రేమికులు. ఆ తర్వాత రాను.. రాను.. లైట్ అనుకుంటారు. కానీ ఈ వ్యక్తి అలాంటి ఇలాంటి ప్రేమికుడు కాదు. తన ప్రియురాలు చేత ఓకే చెప్పించేంత వరకు ఎన్ని సార్లు ప్రపోజ్ చేశాడో వింటే నోరెళ్లబెడతారు. ఇంతలానా బాస్ అంటారు.ఏడేళ్ల ప్రణయ ప్రేమకథ ఇది. ఏదో కాంపిటీటివ్ ఎగ్జామ్ ఫెయిలైతే ట్రై చేసినట్లుగా లవ్ ఎగ్జామ్ రాశాడు మనోడు. యూఎస్కు చెందిన 36 ఏళ్ల ల్యూక్ వింట్రిప్ తన స్నేహితురాలు సారాను 2018లోనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే ఆమె అస్సలు అతడి లవ్ని అంగీకరించలేదట. అలా అని అక్కడితో వదిలేయలేదు ల్యూక్. ఆమె ఓకే అనేంత వరకు తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఏదో రెండు, మూడు, ఐదు సార్లు కాదు ఏకంగా 42 సార్లు ల్యూక్ ప్రపోజల్ని స్నేహితురాలు రిజెక్ట్ చేస్తూనే వచ్చింది. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలో ఈసారి కాకపోయినా..మరోసారి అయినా తన దేవత అంగీకరించపోతుందా అని ఆశగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు ల్యూక్. ఏమైతేనేం..43సారి తన స్నేహితురాలు సారా చేత 'యస్' అనిపించుకున్నాడు. ఈ ఏడాది(2025)కి తన అమర ప్రేమను పెళ్లిపీటల వరకు తీసుకొచ్చాడు. చెప్పాలంటే అతడిలా ఏ లవర్ అన్నిసార్లు ప్రపోజ్ చేసి ఉండడు. నిజంగా అతడు గిన్నిస్ వరల్డ్ రికార్డులకి ఎక్కాల్సిందే ఈ విషయంలో. అతడి భాగస్వామి సారా కూడా అలానే అంటూ అతడిని ఆటపట్టిస్తోందామె. అయితే సారా కూడా ల్యూక్ని తొలిచూపులోనే ప్రేమించింది కానీ ఆమెకు అప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉండటంతో వెంటనే అంగీకరించలేకపోయింది. అదీగాక విడాకులు తీసుకుని ఉండటంతో మరొసారి వైవాహిక బంధం అనగానే ఆమెకు ఒక విధమైన భయం, ఆందోళన వెంటాడంతో ల్యూక్ ప్రేమను అంగీకరించలేకపోయిందట. ఏదిఏమైతేనేం తన ప్రియురాలి మనసు కరిగేలా చేసి తన ప్రేమను గెలుపించుకున్నాడు ల్యూక్. ఇక్కడ సారా తన పిల్లలు, బంధువులు అంగీకరించాక..ఎలాంటి సమస్యలు ఉండవని నిర్థారించుకున్నాక..అతడికి ఓకే చెప్పిందట. అంతేకాదండోయ్ ల్యూక్ తన ప్రేమను గెలిపించుకునే ప్రయత్నంలో ఆమెకు రకరకాలుగా ప్రపోజ్ చేసేవాడట. దాని కోసం అతడు పడిన పాట్లు అన్ని ఇన్నీ కావట కూడా. ఇక 43వ సారి టైం కీపింగ్ నావిగేషన్ గ్రీన్విచ్కు తీసుకెళ్లి మరీ ప్రపోజ్ చేశాడట ప్రియురాలు సారాకు. "ఈ ప్రదేశం టైంకి సంబంధించిన ప్రపంచ కేంద్రం అయితే ..నువ్వు నా ప్రపంచానికి కేంద్రానివి, అందుకే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా" అంటూ భావోద్వేగంగా ప్రియురాలికి ప్రపోజ్ చేశాడట. అతడి మాటలకు ఉప్పొంగిన కన్నీళ్లతో అంగీకరించా అంటూ తన ప్రేమకథను గుర్తుచేసుకుంది సారా. అతడి ఓపికకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే, నిజంగా అతడు గొప్ప ప్రేమికుడు అంటూ ప్రియుడు ల్యూక్పై ప్రశంసల వర్షం కురిపించేసింది సారా.(చదవండి: డాగ్ థెరపీ.. ! 'ఒత్తిడికి బైబై'..) -
డాగ్ థెరపీ.. ! 'ఒత్తిడికి బైబై'..
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందమైన టాయ్ పూడుల్స్ ప్రయాణికులను సాదరంగా ఆహా్వనిస్తున్నాయి. చిరకాల నేస్తాల్లా పలకరిస్తాయి. తాకితే చాలు వచ్చి ఒడిలో వాలిపోతాయి. ప్రయాణికులకు ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తాయి. పిల్లలు ఆడుకొనే సున్నితమైన టాయ్స్ను తలపించే ఈ శునకరాజాలు ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్టులో ప్రత్యేక ఆకర్షణగా మారాయి. జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రయాణికుల్లో ఒత్తిడి, ఆందోళన తగ్గించేందుకు రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం డాగ్ థెరపీలో భాగంగా వినూత్నంగా ఈ శునకాలను ప్రవేశపెట్టింది. ప్రయాణికులు బయలుదేరే ప్రవేశ ద్వారాల వద్ద ఈ శునకాలు కనువిందు చేస్తూ కనిపిస్తాయి. టాయ్ పూడుల్స్ శునకాలకు తర్ఫీదు సాధారణంగా ప్రయాణం అనగానే ఏదో ఒక స్థాయిలో ఒత్తిడి ఉంటుంది. పద్మవ్యూహంలాంటి ట్రాఫిక్ రద్దీని ఛేదించుకొని సకాలంలో ఎయిర్పోర్టుకు చేరుకోవడమే ఒక సవాల్, ఏదో ఒక విధంగా ఆ సవాల్ను అధిగమించి ఎయిర్పోర్టుకు చేరుకున్న తర్వాత మరోవిధమైన ఆందోళన మొదలవుతుంది. భద్రతా తనిఖీలు దాటుకొని లగేజీ బరువు సరిచూసుకొని, బోర్డింగ్ పాస్ తీసుకొనే వరకు టెన్షన్గానే ఉంటుంది. వరుసగా తనిఖీలు, ఇమ్మిగ్రేషన్ వంటి ప్రహసనాలన్నీ ముగించుకొని టెరి్మనల్కు చేరుకొనే వరకు ఒత్తిడి ఉంటుంది. ఈ క్రమంలో ప్రయాణికులకు ఆ ఒత్తిడి నుంచి ఊరటనిచ్చేందుకు మానసిక ప్రశాంతత కలిగించేందుకు డాగ్థెరపీ దోహదం చేయనుంది. ప్రస్తుతం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్రయాణికులకు ఈ డాగ్ థెరపీ సదుపాయం అందుబాటులో ఉంది. అదే తరహాలో హైదరాబాద్లో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం నాలుగు టాయ్ పూడుల్స్ శునకాలకు ప్రత్యేక తర్ఫీదునిచ్చారు. అలాగే వాటి నిర్వహణ కోసం నిపుణులను కూడా అందుబాటులో ఉంచారు. ‘ఈ టాయ్ పూడుల్స్ ఎంతో మృదుస్వభావాన్ని కలిగి ఉంటాయి. పెద్దలు, పిల్లలతో స్నేహపూర్వకంగా ఉంటాయి. అందరితో కలిసిపోయేవిధంగా శిక్షణనిచ్చారు.’ అని ఎయిర్పోర్టు అధికారి ఒకరు తెలిపారు. ఒంటరిగా ప్రయాణం చేసేవారికి కొన్ని గంటల పాటు ఇవి తోడుగా ఉంటాయని చెప్పారు.సెల్ఫీ ప్లీజ్.. ఈ శునకాలను ప్రయాణికులకు తమ బాల్యాన్ని గుర్తుకు తెస్తాయి. వాటితో ఆటలాడుకోవచ్చు. ఒడిలోకి తీసుకొని నిమురుతూ కాలక్షేపం చేయొచ్చు. సెలీ్ఫలు కూడా తీసుకోవచ్చు. టాయ్ పూడుల్స్ ద్వారా పొందే అనుభూతులు ప్రయాణికులకు ఆత్మవిశ్వాసాన్ని, ఆనందాన్ని కలగజేస్తాయని, డాగ్ థెరపీలో ఇది ఒక భాగమని నిర్వాహకులు తెలిపారు. వీటితో కాలక్షేపం చేసేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ‘డాగ్ థెరపీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడికి గురయ్యే కారి్టసాల్ హార్మోన్లను తగ్గిస్తుందని చెప్పారు. అలాగే ఆనందాన్ని కలిగించే ఆక్సిటోసిన్ను పెంచుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ ఎయిర్పోర్టులో ఉన్న 4 శునకాలు వారానికి 5 రోజులు అంటే ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు 6 గంటల పాటు అందుబాటులో ఉంటాయి. ఈజీగా జర్నీ.. సాధారణంగా విమానప్రయాణంలో రకరకాల ఒత్తిళ్లు ఉంటాయి. విమాన ప్రయాణం పట్ల ఉండే భయం, ఆందోళనలను డాగ్థెరపీ ద్వారా అధిగమించవచ్చు. అంతర్జాతీయ ప్రయాణాల్లో ఆలస్యంగా నడిచే విమానాల వల్ల కనెక్టింగ్ ఫ్లైట్ లభిస్తుందో లేదోననే భయం పట్టుకుంటుంది. ఆ సమయంలో ఈ శునకాలు ఒక డైవర్షన్ టెక్నిక్లా పని చేస్తాయి. (చదవండి: జొన్న రొట్టె రుచికి అమెరికన్ సీఈవో ఫిదా..! ఇది చాలా హెల్దీ..) -
నమస్కారం.. వందేమాతరం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎన్నో ప్రయోగాల్లో మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యం ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తోంది. బుధవారం సాయంత్రం 5.40 గంటలకు జీఎస్ఎల్వీ–ఎఫ్16 రాకెట్ ద్వారా ప్రయోగించిన నాసా–ఇస్రో సింథటిక్ ఆపార్చర్ రాడార్ (నైసార్) ఉప గ్రహానికి చైత్ర రావు (Chaitra Rao) అనే మహిళా శాస్త్రవేత్త శాటిలైట్ డైరెక్టర్గా వ్యవహరించారు.ప్రయోగం విజయవంతమయ్యాక మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి నమస్కారం.. అంటూ ప్రసంగం ప్రారంభించిన ఆమె.. చివరలో వందేమాతరం.. అని చెప్పడంతో ఆందరూ ఆమెను తెలుగు మహిళా శాస్త్రవేత్త అనుకున్నారు. అయితే ఆమె మూలాలు ఉమ్మడి తెలుగు రాష్ట్రమే (Telugu State) అయినప్పటికీ ప్రస్తుతం కర్ణాటకలో ఉంటున్నారు. చిన్నపాటి ఇంజినీర్గా చేరిన ఆమె అంచెలంచెలుగా ఎదిగి బెంగళూరులో ప్రొఫెసర్ యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో ఉపగ్రహాలను రూపొందించడం, సమగ్ర పరచడం, పరీక్షించడం వంటి విభాగాల్లో ఆమె సైంటిస్టుగా పని చేస్తున్నారు. గతంలో మార్స్ ఆర్బిట్ మిషన్కు స్పేస్ క్రాఫ్ట్ ఆపరేషన్ మేనేజర్గా వ్యవహరించారు. ఆ తర్వాత ఖగోళ పరిశోధనకు తయారు చేసిన ఆస్ట్రోశాట్లో పేలోడ్స్ను అందజేయడంలో కీలక భూమిక పోషించారు.చదవండి: చిన్నోడి డాన్స్కు ఫిదాకు అవుతున్నారు!ప్రస్తుతం నైసార్ ఉపగ్రహానికి శాటిలైట్ డైరెక్టర్గా వ్యవహరించారు. అమెరికాలోని కాలిఫోర్నియా ఆఫ్ డిపార్ట్మెంట్కు సంబంధించి జెట్ ప్రొపల్షన్ లేబోరేటరీ (జేపీఎల్)కి చెందిన ప్రతినిధులతో కలిసి ఆమె ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. ఇందులో ఎల్– బ్యాండ్ సింథటిక్ ఆపార్చర్ రాడార్ను జేపీఎల్ ప్రతినిధులు, ఎస్–బ్యాండ్ సింథటిక్ ఆపార్చర్ రాడార్ను ఇస్రో రూపొందించింది. చైత్రరావు శాటిలైట్ డైరెక్టర్గా కీలకమైన పాత్ర పోషించారు. పురుషులకంటే మహిళలు ఎందులోనూ తక్కువ కారని నిరూపించారు. -
జొన్న రొట్టె రుచికి అమెరికన్ సీఈవో ఫిదా..! ఇది చాలా హెల్దీ..
మన భారతీయ వంటకాలు ఎంతటి మహామహులనైన ఫిదా చేస్తాయి. వండే విధానం, వాటి రుచికి దాసోహం అని అనను వాళ్లు లేరు అంటే అతిశయోక్తి కాదేమో. అంతలా మైమరిపించే మన వంటకాల రుచికి ఓ ప్రముఖ ప్రసిద్ధ ఫాస్ట్ ఫుడ్ చైన్ సీఈవోనే ఇంప్రెస్ అయ్యి..ఆరోగ్యకరమైన రెసిపీలంటూ ప్రశంసించాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ప్రసిద్ధ ఫాస్ట్ ఫుడ్ చైన్ కాలిఫోర్నియా బురిటో వ్యవస్థాపకుడు అమెరికన్ బ్రెట్ ముల్లర్..మన బెంగళూరు వంటకాల రుచికి ఫిదా అయ్యాడు. ఆయన బసవగుడిలో కామత్ శాకాహార రెస్టారెంట్లో జోలాడ రోటీ భోజనాన్ని ఆస్వాదస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ శాకాహార రెస్టారెంట్లో ఉత్తర కర్ణాటక శైలి థాలిని ఆయన ఆనందంగా ఆస్వాదించారు. తాను ఈ రెస్టారెంట్కి తన చార్టర్ అకౌంటెంట్ సిఫార్సుపై 2014లో ఇక్కడి వచ్చానని ఆ వీడియోలో తెలిపారు. అప్పట్లో ఈ నగరానికి కొత్త..అంటూ నాటి అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ రెస్టారెంట్లో భోజనం గురించి వివరిస్తూ..ప్లేట్లోని తాజా కూరగాయల వంటకాలు, క్రిస్పీ సలాడ్లు, ఉత్సాహభరితమైన రుచులతో ఇంప్రెస్ చేస్తుంది. జొన్న రొట్టె మీద వెన్న కరుగుతూ ఉండగా వేడివేడిగా ఉన్న గుత్తు వంకాయ కూరలో నొంచుకుని తింటే ఉంటుంది.. నా సామిరంగా ప్రాణం లేచివచ్చినట్లుగా ఉంటుంది అని చెబుతున్నాడు ముల్లర్. తాను ఈ జోలాడ రొట్టెని ఆస్వాదించాలని మూడు సార్లు ఈ బసవనగుడికి వచ్చానని అన్నారు సీఈవో. బెంగళూరు అంతటా ఇలాంటి ఆహారాలు ఉన్నా..ఇక్కడి జోలాడ రొట్టె మాత్రం అత్యంత విభిన్నంగా ఉంటుందని అన్నారు. అక్కడెక్కడ ఇలాంటి రుచి లభించదని అన్నారు. ఇది రుచికి రుచి, ఆరోగ్యం కూడా అని ప్రశంసించారు. అయితే ఇలాంటి భోజనం తిన్నాక తప్పకుండా జిమ్కి వెళ్లక తప్పదు అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ఆయన ఇక్కడ బెంగళూరు వంటకాలను మెచ్చుకున్నప్పటికీ..ఇక్కడి ట్రాఫిక్ పట్ల అత్యంత అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇక్కడకు వచ్చినప్పుడల్లా త్వరత్వరగా వెళ్లేందుకు ఆటోలకే ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. కాగా, ముల్లెర్ 2012లో 22 ఏళ్ల వయసులో బెంగళూరు నగరం వచ్చి తన తొలి కాలిఫోర్నియా బురిటో అవుట్లెట్ను ప్రారంభించాడు. ఈ మెక్సికన్ ఫాస్ట్-క్యాజువల్ బ్రాండ్ క్రమంగా అభివృద్ధి చెంది.. భారతదేశం అంతటా సుమారు 100కు పైగా అవుట్లెట్లతో విస్తరించింది. ఇది సుమారు 20 కోట్లపైనే లాభాలను ఆర్జిస్తోంది. ఇక ఈ వ్యాపారం కూడా ఇతర బిజినెస్ల మాదిరిగానే మహమ్మారి సమయంలో ఆటుపోట్లకు గురైంది. దాని 37 దుకాణాల్లో సుమారు 19 దుకాలు మూతపడ్డాయి కూడా. కానీ ఈ బ్రాండ్కి ఉన్న ఆదరణతో మళ్లీ శక్తిమంతంగా పునరాగమనం చేసి..అచ్చం అదే తరహాలో లాభాలబాట పట్టింది. పైగా అశేష జనాదరణ పొందేలా ఇటీవలే తన వందవ స్టోర్ ప్రారంభోత్సవాన్ని కూడా జరుపుకోవడం విశేషం.California Burrito CEO x Jolad Rotti Meals pic.twitter.com/eFlhLCsjqX— Season Flake 🏗️ (@seasonflaketopg) July 29, 2025 (చదవండి: టీ ఆరోగ్యకరమే గుండెకు మంచిదే! ఇలా తాగితే..) -
టీ ఆరోగ్యకరమే గుండెకు మంచిదే ! ఇలా తాగితే..
చాలా మందికి కప్పు చాయ్ తాగితే గాని రోజు ప్రారంభం కాదు, లక్షలాది మంది భారతీయులకు, టీ అనేది కేవలం ఒక పానీయం కంటే ఎక్కువ. కొన్ని చోట్ల ఇది ఒక ఆచారం కూడా. అయితే ఇది ఒక కప్పులో మనకు అందిస్తున్న వైద్య చికిత్స కూడా అంటున్నాయి అధ్యయనాలు. రోజుకు రెండు కప్పుల వరకు టీ తాగడం గుండెను కాపాడుతుంది. అంతేగాదు స్ట్రోక్, గుండె వైఫల్య ప్రమాదాన్ని తగ్గించవచ్చు అని ఒక కొత్త అధ్యయనం చెబుతోంది. నాంటాంగ్ విశ్వవిద్యాలయం చేపట్టిన 2 అధ్యయనాలు టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలపై దృష్టి సారించాయి. అవి నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ‘‘హృదయ నాళ ప్రమాద కారకాలను నిర్వహించడంలో టీ పాత్ర: అందే ప్రయోజనాలు, విధానాలు ఇంటర్వెన్షనల్ వ్యూహాలు’’ అనే అంశంపై అదే విధంగా కార్డియోవాస్కులర్ రిస్క్ అండ్ ప్రివెన్షన్ అనే అంశంపైనా నిర్వహించిన పరిశోధన ఫలితాలు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ప్రచురితమయ్యాయి. అవి చెబుతున్న ప్రకారం...టీ దాని రసాయన కూర్పు కారణంగా కేవలం పానీయం కాదు; ఇది యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ ప్రత్యేకమైన మొక్కల సమ్మేళనాలతో నిండిన సహజ శక్తి కేంద్రం. దీనిలో గుండె ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే, వాపును తగ్గించే ఫ్రీ రాడికల్స్తో పోరాడే కాటెచిన్లు థియాఫ్లావిన్లు ఉన్నాయి. అంతేకాకుండా, టీ లోని పాలీశాకరైడ్లు రక్తంలో చక్కెరను సరైన విధంగా నిర్వహించడానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీ: కార్డియోవాస్కులర్ రిస్క్ అండ్ ప్రివెన్షన్ లో ప్రచురించిన ఈ నాంటాంగ్ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనం దాదాపు 13 సంవత్సరాలుగా 177,000 మందిని భాగం చేసింది.టీ దాని ఆరోగ్య ప్రయోజనాలకు చాలా కాలంగా పేరొంది. శరీరంలో ఆరోగ్యకరమైన లిపిడ్ (కొవ్వు మరియు కొలెస్ట్రాల్) స్థాయిలకు మద్దతు ఇచ్చే దాని సామర్థ్యం వాటిలో ముఖ్యమైనది.ప్రతిరోజూ రెండు కప్పుల వరకు టీ తాగితే.. గుండె పోటు ప్రమాదం 21% తగ్గుతుంది. స్ట్రోక్ వచ్చే ప్రమాదం 14%, కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం 7% తగ్గుతాయి.కొవ్వు జీవక్రియను మెరుగుపరుస్తుంది: టీ శరీరపు సహజ కొవ్వును నిర్మూలించే ప్రక్రియలను బలోపేతం చేస్తుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించే యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్లను సక్రియం చేస్తుంది అల్లం వంటి సప్లిమెంట్లతో కలిపితే ట్రైగ్లిజరైడ్లు, కొలెస్ట్రాల్ను నియంత్రించడానికి సహాయపడుతుంది.మహిళలకు ఎక్కువ ప్రయోజనాలు: శరీరంలో కొవ్వు సంబంధిత నష్టాన్ని తగ్గించే విషయంలో 20 నుండి 48 సంవత్సరాల వయస్సు గల మహిళలు విటమిన్ల నుంచి వచ్చే వాటి కంటే టీ తాలూకు యాంటీఆక్సిడెంట్ల నుంచి మరింత ప్రయోజనం పొందవచ్చు.రక్తపోటు (అధిక రక్తపోటు) గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకం. ముఖ్యంగా మితమైన పరిమాణంలో దీర్ఘకాలిక టీ వినియోగం వృద్ధులలో సిస్టోలిక్ డయాస్టొలిక్ రక్తపోటు రెండింటినీ 2–3 ఎంఎంహెచ్జి వరకూ తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.తైవాన్ లో జరిగిన ఒక అధ్యయనంలో సంవత్సరానికి పైగా రోజుకు 120 మి.లీ. మించకుండా టీ తాగేవారికి అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం బాగా తక్కువని తేలింది. రక్త నాళాల పనితీరును మెరుగుపరుస్తుంది: టీలో చాలా యాంటీఆక్సిడెంట్లు పాలీఫెనాల్స్ ఉన్నాయి, ఇవి రక్త నాళాలు సరళంగా ఉండటానికి (వాసోడైలేషన్), వాపును తగ్గించడానికి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. ఇవన్నీ కాలక్రమేణా రక్తపోటు స్థాయిలను మెరుగుపరుస్తాయి.ప్రయోజనాలు అందాలంటే...ఇలా తాగాలంతే...కానీ ట్విస్ట్ ఏమిటంటే... టీకి చక్కెర లేదా కృత్రిమ స్వీటెనర్లను జోడించిన వెంటనే అనేక ఆరోగ్య ప్రయోజనాలు అదృశ్యమవుతాయి, అంటే చాలా మంది ఇష్టపడే తీపి, పాల మసాలా చాయ్ వల్ల లాభాలు శూన్యం. ఆకుపచ్చ లేదా నలుపు రంగులో (గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ) ఉన్న ప్రతి కప్పు సైన్స్ ఆధారిత ఆరోగ్య లాభాలను అందిస్తుంది. అంతేగాదు చక్కెర లేదా కృత్రిమ స్వీటెనర్లు లేకుండా ఆస్వాదించినప్పుడు దాని నిజమైన రుచి అలవాటవుతుంది. దానిని ఆరోగ్యం కోసం అనుసరించే ప్రిస్క్రిప్షన్ గా భావించాలి. కొన్ని రోజులు దీన్ని కొద్ది కొద్దిగా ప్రయత్నిస్తే త్వరగానే అలవాటు పడతారు దాని స్వచ్ఛమైన రూపంలో టీ ఎంత రిఫ్రెషింగ్గా సహజంగా సంతృప్తికరంగా ఉంటుందో కూడా తెలిసివస్తుంది. -
ఏ శుక్రవారం వరలక్ష్మీవ్రతం చేసుకోవాలి..?
సాధారణంగా వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణ పున్నమి ముందు శుక్రవారం చేసుకోవాలన్నది సంప్రదాయం కనుక ఆగస్టు 1 శుక్రవారం చేసుకోవాలా? లేక ఆగస్టు 8న వచ్చే శుక్రవారం చేసుకోవాలా... అన్న సందేహం సహజం. చాలామంది పంచాంగ కారులు 8వ తేదీని పున్నమి అయినా ఆ వేళే చేసుకోవాలని నిర్ణయించారు. అయినా మనకు గ్రంథ ప్రమాణం, సంప్రదాయ వేత్తల ఉపదేశ ప్రమాణమూ కావాలి కనుక వ్రతనిర్ణయ కల్పవల్లి అనే గ్రంథం శ్రావణస్య సితేపక్షే పూర్ణిమోపాంత భార్గవేవరలక్ష్మీ వ్రతం కార్యం మోక్షసంపత్ ఫలప్రదమ్అని భవిష్యోత్తర పురాణోక్తిని ఉట్టంకిస్తూ చెప్పింది కాబట్టి మంచి సంçపద, మోక్షమూ కలిగించే వరలక్ష్మీవ్రతం శ్రావణ మాస శుక్లపక్షంలోని పున్నమికి దగ్గరగా ఉన్న శుక్రవారం నాడు చేసుకోవాలన్నదే నిర్ణయంగా చెప్పబడింది. ఒకవేళ పున్నమిరోజునే శుక్రవారం వస్తే.. ఆ రోజే వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలి. ఈ మేరకు ఈ ఆగస్టు 8నే వరవలక్ష్మీవ్రతం చేసుకోవాలనే సంకేతం కదా! ఒకవేళ ఏ కారణం చేతనైనా 8 వతేదీ ఆటంకం కలుగుతుందేమో అని అనుకొనే వారు ఆగస్టు 1న వచ్చే రెండవ శుక్రవారం కూడా వరలక్ష్మీ వ్రతం చేసుకోవచ్చు. (చదవండి: శ్రావణం శుభప్రదం..! వరలక్ష్మీ వ్రతం ఎప్పుడంటే..?) -
బ్రహ్మాండనాయకుడి పవిత్రోత్సవాలు! ఎందుకు చేస్తారంటే..?
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుణ్ణి శాస్త్రోక్తంగా అర్చించటం బ్రహ్మాదులకు కూడా సాధ్యం కానిపని. అలాంటిది సామాన్య మానవులు జరిపే శాస్త్రోక్త విధానమైన భగవత్పూజా విధానం అతిదుస్సాధ్యమని చెప్పచ్చు. ఎందుకంటే స్వామివారికి జరిగే నిత్యపూజల్లో, ఉత్సవాలలోనూ ద్రవ్య మంత్రతంత్రాది లోపాలు అనేకం చోటు చేసుచేసుకోవడం పరిపాటి. ఇలా తెలిసీ తెలియక జరిగిన దోషనివృత్తికి ప్రత్యేకంగా ఉత్సవ రూపాల్లో ఉన్న ఒక ప్రాయశ్చిత్తం చెప్పబడి ఉన్నది. దానికే పవిత్రారోపణం లేక పవిత్రోత్సవం అని పేరు. ఆగస్టు 3 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరగనున్న సందర్భంగా....పవిత్రోత్సవం అంటే పరమపవిత్రమైన ప్రాయశ్చిత్త మహోత్సవం. సంవత్సరానికొకసారి ఆలయ పవిత్ర వాతావరణం పునఃస్థాపితం కావడానికి జరిపే ఉత్సవమిది. ఆలయాల్లో సంవత్సర పర్యంత చేసే ఆరాధనలలో జరిగే దోషాలను నిత్య, నైమిత్తిక, కామ్య ఉత్సవాలైన నిత్యారాధనాహోమ (బలి) నివేదన, బలి సమర్పణలు, మాసోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, జ్యేష్టాభిషేక, సహస్రకలశ స్నపన, ఆరాధనాదులు, దేశ ప్రజాజనహితార్థం ఆచరించే యజ్ఞ యాగాది క్రియలలో జరిగే మంత్ర, తంత్ర, క్రియారూప, శౌచ, అశౌచ దోషనివారణకై స్వామికి జరిపించే ఉత్సవం. ఈ పవిత్రోత్సవంలో పూసలుగా అమర్చబడిన మాలలను ప్రతిష్టించి శ్రీస్వామివారికి, ఆలయపరివార దేవతలకు సమర్పించటం ప్రధానఘట్టం. పవిత్ర సూత్రాలను పవిత్రమండపంలోని పీఠంలో ఉంచి వాటిని దర్భకొసలతో కూడిన పంచగవ్యాలతో ప్రోక్షణ చేసి ఆగమోక్త విధానంగా వాటిని ప్రతిష్టించి ఉక్తహోమం జరిపి ఉత్సవమూర్తులకు అష్టకలశ స్నపనం జరిపి ధ్వజ ఛత్ర చామర పింఛ నృత్య గేయ సమాయుక్తంగా ఆచార్యుడు ఆలయ ప్రదక్షిణం చేసి దేవదేవుణ్ణి విశేషంగా అర్చించి అష్టోత్తరశత పవిత్ర సూత్రాలను జాను పర్యంతం సమర్పించడం ఉత్తమం. చతుః పంచాశత్ (54) సూత్రములను ఊరువుల వరకు సమర్పిస్తే మధ్యమం. సప్తవింశతి (27) సూత్రాలను నాభ్యన్తం సమర్పిస్తే అధమం అని ఆగమోక్తం. వీటిలో యథాశక్తి సమర్పించాలి. పవిత్రములను ఈవిధంగా దేవ దేవునికి ఆరోపణ చేయటమే పవిత్రారోపణం. ఇదే విధంగా పరివారదేవతలకు కూడా ఒక్కొక్కరికీ సమర్పించాలి. ముందుగా అంకురార్పణ చేయాలి. ఇది దాదాపు అన్ని ప్రధాన ఆలయాలలోనూ సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా జరిపించవలసిన ఉత్సవం.తిరుమలలో వేంచేసి ఉన్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆశ్రితజన వత్సలుడు అయిన శ్రీమన్నారాయణునికి వైఖానసాగమోక్తంగా జరిగే ఈ పవిత్రోత్సవం భక్తితో చేయించినా, కళ్లారా దర్శించినా భక్తులు సర్వ పాపల నుంచి విముక్తి పొంది యశస్సు, సంపద, సంవత్సరార్చన ఫలం, విష్ణుసాయుజ్యం, అశ్వమేధయాగ ఫలం, సర్వోపద్రవనివారణయేగాక సర్వాభీష్టఫలాలు పొంది నిర్భీతులై, ధర్మ తత్పర నిష్టాగరిష్టులై సుఖిస్తారని భృగు సంహిత చెబుతోంది. పవిత్రోత్సవం అనే మాటకు పవిత్రీకరణ కార్యక్రమమని పేరు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేముందు వ్రేలికి దర్భతో చేయబడిన పవిత్రం ధరించి కార్యక్రమం జరపడం అలవాటు. దీనివల్ల కార్యక్రమానికి మానసికంగా యజమానికి నిర్మలతత్త్వం చేకూరుతుందనేది సంప్రదాయం.ఆలయాల్లో పవిత్రోత్సవం ఏడాదికొక పర్యాయం ఆలయపవిత్ర వాతావరణం పునఃస్థాపితమయ్యేందుకు జరుగుతుందని చెప్పుకున్నాం కదా... ఐతే ఇది బ్రహ్మోత్సవాది సందర్భాల్లో, అంతకు ముందు బలిపీఠాల వద్ద, మూలబేరం వద్ద జనసమ్మర్దం వల్ల ఏర్పడిన కాలుష్యాన్ని పోగొట్టేందుకు జరిపే సంప్రోక్షణం కన్నా భిన్నమైంది. దానికి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అని పేరు. పవిత్రోత్సవంలో మంత్ర, వేద, పురాణపారాయణాది కార్యక్రమాల ద్వారా భగవానుడే లేదా మూలమూర్తే విద్యుదుత్పాదక యంత్రంగా పనిచేయడం జరుగుతుంది.ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో తిరుమల వేంకటేశ్వర స్వామివారి వార్షిక పవిత్రోత్సవం వైభవోపేతంగా జరుగుతుంది. ఈ రోజుల్లో శ్రీవేంకటేశ్వర స్వామి, ఆయన దేవేరులతో పాటు ఉత్సవ విగ్రహాలు ఆలయ కల్యాణ మండపంలోని యాగశాలలో ఉంచబడి ఉత్సవానంతరం పూర్ణాహుతి అయిన తర్వాత మరల ఆలయప్రవేశం గావించబడతాయి. ఈ దినాల్లో శాస్త్రోక్తంగా హోమాది కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. మొదటిరోజున పట్టుపోగులతో తులసిపూసలు లేదా తామరతూడు సరంలా కనిపించే పవిత్రాలను యాగశాలలో ఉంచుతారు. రెండవరోజున శాస్త్రోక్త మర్యాదలతో ఈ పవిత్రములను శ్రీవారి ఆలయానికి, బేడీ ఆంజనేయస్వామి ఆలయానికి నడుమగల ప్రధాన ఇతర పరివారదేవతలకు సమర్పించటం జరుగుతుంది. మూడవరోజున పవిత్ర విసర్జనం జరుపబడి పూర్ణాహుతితో ఉత్సవం సమాప్తమవుతుంది.చారిత్రకంగా ఈ పవిత్రోత్సవం 15వ శతాబ్దంలో అమల్లో ఉన్నట్లు తెలుస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆలయ పవిత్రతను కాపాడటానికి, ఏడాది పొడవునా జరిగే అర్చనలు, ఉత్సవాలలో యాత్రికుల లేదా సిబ్బంది వల్ల తెలియకుండా జరిగే దోషాలను నివారించడానికి వార్షిక ఉత్సవాలు నిర్వహిస్తారు. శ్రావణ శుద్ధ ఏకాదశినాడు ఉత్సవమూర్తిని తిరుమామణిమండపంలో వేంచేపు చేస్తారు. ద్వాదశినాడు తలకు, మెడకు, మణికట్టుకు తిరుపవిత్రంతో అలంకరించి దేవేరులతో కూడా ఊరేగింపు జరుపుతారు. శ్రావణ శుక్లద్వాదశి విష్ణు పవిత్రారోపణ దినంగా తులసి పెంచటానికి ఉపయోగించే భూమిలో పెరిగిన ప్రత్తి చెట్లనుండి తీసిన దారంతో ఈ పవిత్రం చేస్తారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అన్నప్రసాద నివేదన తప్పకుండా జరుగుతుంది. ఈ పవిత్రోత్సవాలను ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజమాసాల్లో శుక్లపక్షంలోని పాడ్యమి, విదియ, పంచమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, పౌర్ణమిల్లో భరణి, రోహిణి, పునర్వసు, పుష్యమి, హస్త, స్వాతి, రేవతి, శ్రవణం మొదలైన నక్షత్రాల్లో ఆచరించాలని పంచరాత్రాగమం చేస్తోంది. ఈ పవిత్రోత్సవాల్లో ఉపయోగించే పవిత్రాలు బంగారు, వెండి, రాగి, మృణ్మయం, పత్తి, ముంజ గడ్డి, దర్భ, పట్టు మొదలైనవాటితో చేస్తారు. అలా చేసిన పవిత్రాలను ఆచార్యుడు స్వీకరించి, పంచగవ్యాదులతో ప్రోక్షించి, ఆ ఆలయాగమాన్ననుసరించి పవిత్రాలకు యజ్ఞ ఆరాధనాదులను పూర్తి చేస్తారు. వీటిని స్వామికి సమర్పించడంవల్ల సర్వులకూ ఆయుః క్షేమాభివృద్ధి కలుగుతుంది. శ్రీమన్నారాయణారాధనను అత్యంత భక్తిశ్రద్ధలతో సంవత్సర కాలం చేస్తే కలిగే ఫలితమంతా పవిత్రారోపణమాచరిస్తే కలుగుతుందని ప్రతీతి. చదవండి: శ్రావణం శుభప్రదం..! వరలక్ష్మీ వ్రతం ఎప్పుడంటే..?ఈ పవిత్రోత్సవం (Pavithrotsavam) మహా ప్రాయశ్చిత్తం కాబట్టి ప్రతీ సంవత్సరం చేయాలి. ఈ ఉత్సవం అలా ఆచరించకున్నా పరమాత్మకు ఆ సంవత్సరకాలం చేసిన ఆరాధనమంతా నిష్పలమవుతుంది. అందువల్ల ఈ ఉత్సవాన్ని ప్రతిసంవత్సరం ఆచరించాలని ఆగమశాస్త్రాలు చెప్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఉత్సవ విగ్రహాల్ని యాగశాలలో ఉంచడం, ఆ తర్వాత రోజు పవిత్రాలు యాగశాలలో ఉంచడం, తర్వాత పవిత్రసమర్పణం, పూర్ణాహుతి జరిపి ఉత్సవాలకు స్వస్తి వాచకం పలుకుతారు. ఎప్పుడు ప్రారంభం...ఈ పవిత్రోత్సవాలు హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలోని ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ముఖ్యమైన రోజులలో మూడు రోజుల పాటు జరుగుతాయి. ఉత్సవాలకు ముందు రోజు ‘అంకురార్పణం’తో ప్రారంభమవుతాయి, ఇందులో నవధాన్యాలను మట్టి పాత్రలలో విత్తుతారు.ముఖ్య ఉద్దేశ్యం...ఏడాది పొడవునా జరిగిన దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రాకుండా ఆగమశాస్త్రం ప్రకారం ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. - డి.వి.ఆర్. భాస్కర్ -
ఎంత గ్రాండ్మాస్టర్ అయినా తల్లి చాటు బిడ్డే..!
చెస్ గురించి పెద్దగా ఆసక్తి లేని వారికి కూడా ఇప్పుడు సుపరిచిత పేరు... దివ్యా దేశ్ముఖ్. ప్రపంచం మెచ్చిన అపూర్వ విజయం తరువాత తన తల్లిని కౌగిలించుకొని భావోద్వేగానికి గురువుతున్న దివ్య వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘తల్లి అంటే ఎంతోమంది స్టార్ల వెనుక ఉన్న అన్సంగ్ హీరో’ అని దివ్య తల్లి గురించి ప్రశంసిస్తూ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర. ‘ఎంత గ్రాండ్మాస్టర్ అయినా తల్లి చాటు బిడ్డే’ అన్నారు నెటిజనులు. తల్లులు పిల్లల గురించి ఎన్నో కలలు కంటారు. వారి కలలను తమ కలలుగా భావిస్తారు. వారి కష్టాలను తమ కష్టాలుగా భావిస్తారు. పిల్లల కంటే ఎక్కువగా వారి విజయాలకు సంతోషంతో ఉప్పొంగిపోతారు. అందుకే...అమ్మలు అన్సంగ్ హీరోలు. ఉమెన్స్ చెస్ వరల్డ్ కప్ గెలుచుకున్న తరువాత ‘ఎవరీ దివ్య దేశ్ముఖ్?’ అనే ఆసక్తి చాలామందిలో మొదలైంది. చాలా చిన్న వయసు నుంచే చెస్ ఆడడం మొదలుపెట్టిన దివ్య చెస్లోనే కాదు చదువులోనూ ‘శభాష్’ అనిపించుకునేది. ‘అయిదేళ్ల వయసు నుంచే చెస్లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తూ వస్తోంది దివ్య. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు గెలుచుకున్న దివ్యకు కామ్గర్ల్గా పేరు. జయాపజయాలలో ఒకేరకంగా ఉండడం కొందరికి మాత్రమే సాధ్యపడుతుంది. అలాంటి వారిలో దివ్య ఒకరు. ఓడిపోయిన సందర్భంలోనూ ఆమె కళ్లలో బాధ కనిపించేది కాదు. టోర్నమెంట్ గెలచినప్పుడు ట్రోఫీతో నా దగ్గరకు వచ్చేది. తాను సాధించిన విజయం గురించి ఎంతోమాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ చాలా తక్కువగా మాట్లాడేది. తనకు ఇష్టమైన ఆట, చదువును రెండిటినీ విజయవంతంగా సమన్వయం చేసుకునేది. నాగ్పూర్ కాకుండా వేరే చోట చెస్ పోటీలు జరిగినప్పుడు పాఠ్యపుస్తకాలను తీసుకువెళ్లేది. చదువును ఎప్పుడూ అశ్రద్ధ చేయలేదు’ అంటూ గత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంది నాగ్పూర్లోని భారతీయ విద్యాభవన్ స్కూల్ మాజీ ప్రిన్సిపాల్ అంజు భూటాని.Divya’s hug to her mom says everything ❤️#FIDEWorldCup @DivyaDeshmukh05 pic.twitter.com/jeOa6CjNc1— International Chess Federation (@FIDE_chess) July 28, 2025 (చదవండి: రికార్డు బ్రేకింగ్ నాట్య ప్రదర్శన..! ఏకంగా 170 గంటల పాటు..) -
మళ్లీ భయపెడుతున్న ఒంటికన్ను శివరాసన్..!
నిజంగా కాదు లేండి. ఓటీటీ తెర మీద. రాజీవ్గాంధీ దారుణ హత్య తర్వాత దేశంలో మార్మోగిపోయిన పేరు ఒంటికన్ను శివరాసన్. పిల్లల్ని భయపెట్టాలంటే శివరాసన్ పేరు చెప్పేవారు తల్లులు. రాజీవ్ గాంధీని మానవ బాంబుతో హత్య చేసే ప్లాను రచించిన ఈ వ్యక్తి 35 ఏళ్ల తర్వాత తిరిగి ఇంటింటా భయపెడుతున్నాడు. నగేష్ కుకునూర్ తీసిన ‘ది హంట్’ వెబ్ సిరీస్లో రాజీవ్ హంతకునిగా గతాన్ని గుర్తు చేస్తున్నాడు.తెల్లలాల్చీ, పైజామాలో ఉన్న శివరాసన్, పక్కనే చందన దండ పట్టుకు నిల్చున్న మానవ బాంబు థాను... వీరి ఫొటోను 1990ల కాలం నాటి భారతీయ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. మే 21, 1991 రాత్రి తమిళనాడు శ్రీపెరంబుదూర్లో రాజీవ్గాంధీ హత్య జరిగాక మానవబాంబు అనే మాట, ఎల్టీటీఈ అనే పేరు జనసామాన్యానికి తెలిసింది. ఈ ప్లాన్ వేసిన వాడు శివరాసన్ అనే ఒంటికన్ను వ్యక్తి అని, అతను ఇంకా దేశంలోనే ఉన్నాడనే ప్రచారంతో భయపడని వారు లేరు. ఏ ఊరిలో ఏ టీ బంకు దగ్గరైనా శివరాసన్ కబుర్లే. ఆడవారు అతని పేరు తలుచుకుని ఒణికేవారు. అలాంటి శివరాసన్ ఆ ప్లానంతా ఎలా వేశాడో, ప్లాన్ ఎగ్జిక్యూట్ అయ్యాక ఎలా తప్పించుకున్నాడో, ఆ తర్వాత ఎలా పోలీసుల చేతికి చిక్కబోయి మరణించాడో సవివరంగా, ఉత్కంఠగా చూపిస్తూ ‘సోనీ లైవ్’లో ‘ది హంట్– రాజీవ్గాంధీ అసాసినేషన్ కేస్’ వెబ్ సిరీస్లో చూస్తాం. తెలుగువాడైన ప్రసిద్ధ దర్శకుడు నాగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఆనాటి రోజులతోపాటు, శివరాసన్ను కూడా తిరిగి ఇంటింటిలో చూపి భయపెడుతోంది.జాఫ్నాకు చెందిన శివరాసన్ ఎల్టీటీఈలో చేరి, దాని చీఫ్ ప్రభాకరన్కు నమ్మకస్తుడుగా మారి రాజీవ్గాంధీ హత్యను అమలుపరిచే టీమ్కు నాయకుడిగా చెన్నై చేరుకున్నాడు. అతనితో పాటు నళని, థాను, మురుగన్ తదితరులు మరో ఎనిమిది మంది వచ్చారు. వీరంతా కలిసి ప్లాన్ చేసి మానవబాంబుగా థానును తయారు చేసి రాజీవ్గాంధీ హత్యకు పాల్పడ్డారు. హత్య జరిగాక దేశం మొత్తం ఒక అంధకారంలో ఉండిపోయింది... హంతకులు ఎవరై ఉంటారనే విషయం తెలియక. ఆ సమయంలో సిట్ చీఫ్గా బాధ్యతలు తీసుకున్న సీబీఐ ఆఫీసర్ కార్తికేయన్ తన టీమ్తో సాగించిన నేర పరిశోధనే ‘ది హంట్’ వెబ్ సిరీస్. దాదాపుగా అంతగా తెలియని నటులతో ఈ సిరీస్ రూపుదిద్దుకున్నా వీరందరిలో శివరాసన్గా చేసిన వ్యక్తి అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అచ్చు శివరాసన్లా కనిపిస్తూ నాటి రూపానికి అతడు జీవంపోశాడు. ఆ నటుడి పేరు షఫీక్ ముస్తఫా. మలయాళం ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే గుర్తింపుపొందిన పాత్రలు వేస్తున్న షఫీక్ శివరాసన్ పాత్ర అవకాశం రావడంతోటే వెంటనే అంగీకరించాడు. ‘ఇలాంటి పాత్రను పోషించడానికి చాలా పరిశోధన చేశాను. శివరాసన్ చాలా తెలివైన వ్యక్తి. అలాంటివారు ఎక్కువగా మాట్లాడరు. నేను సిరీస్లో ఆ నియమాన్ని పాటించాను’ అంటాడు షఫీక్. నాటక రంగం నుంచి వచ్చిన షఫీక్ ఇప్పుడు ఆ పాత్రకు వచ్చిన గుర్తింపుతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ‘శివరాసన్లా గాజుకన్ను పెట్టుకుని నటించడం కష్టమైంది’ అని చెప్పాడు. ఎప్పుడూ పెన్ను, పేపర్ పట్టుకుని కనిపించే శివరాసన్ ఈ వెబ్ సిరీస్లో మరణించే ముందు కవిత రాసి మరణిస్తాడు. ఈ సన్నివేశాల్లో షఫీక్ నటన ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. ‘కత్తి పట్టినవాడు కత్తితోనేపోతాడు’ అన్నాడు జీసస్. అహింసతో ఎంత గొప్ప విజయం సాధించవచ్చో నిరూపించారు గాంధీజీ. అసహనం, ఆగ్రహం... కారణాలు ఏవైనా హింసాత్మక వైఖరి పనికి రాదని, ఆయుధం వినాశనానికే కారణమవుతుందని నేటి యువత తెలుసుకోవడానికి ఇలాంటి పాత్రలు, వెంటాడే గతాలు తప్పక ఉపయోగపడతాయి.(చదవండి: 'నేరమే'.. అయినా! సుప్రీంకోర్టు సైతం..) -
'నేరమే'.. అయినా! సుప్రీంకోర్టు సైతం..
న్యాయ విచారణలో తీర్పులెప్పుడూ బలహీనుల పక్షమే ఉండాలి... నేరానికి బలైనా, నేరం చేసినా! ఆ బలహీనుల వర్గంలో పిల్లలు, మహిళలు ముందుంటారు! అందుకే... హనీమూన్ మర్డర్ మొదలు ఆడవాళ్లు చేసినట్టుగా నమోదవుతున్న ఆ తరహా నేరాల విషయంలో వాటి వెనుకున్న సామాజిక ఒత్తిళ్ల మీద చర్చ జరగాలి.. ఆ వాతావరణాన్నివిశ్లేషించాలని సోషల్ ఇంజినీర్స్, సైకాలజిస్ట్లు అంటున్నారు. వాటిని సుప్రీంకోర్ట్ కూడా పరిగణనలోకి తీసుకుంది. తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకున్న అమ్మాయిలు దాన్నుంచితప్పించుకోవడానికి చేసిన నేరాలను ప్రస్తావిస్తూ ఇటీవలే ఓ అభిప్రాయాన్ని వెల్లడించింది.సమాజంలోని లింగవివక్ష, సామాజిక నిబంధనలు చాలావరకు స్త్రీని పరాయిగా చూస్తూ.. స్వేచ్ఛాస్వాతంత్య్రాలను దూరం చేస్తూ ఆమెను నిస్సహాయ స్థితిలోకి నెట్టేస్తున్నాయి. ఈ అణచివేత, నిస్సహాయతే నేరాలకు కారణమవుతున్నాయి. ఇలాంటి సామాజిక నేపథ్యంతో నేరం చేసిన స్త్రీల విషయంలో కఠినమైన శిక్షలకన్నా సంస్కరణ దృక్పథాన్ని అనుసరించాలని ఉద్ఘాటించింది సుప్రీం కోర్ట్.ఈ నిర్ణయానికి ప్రధాన నేపథ్యం.. కర్ణాటకకు చెందిన శుభ అనే కాలేజ్ స్టూడెంట్.. తన స్నేహితుడు అరుణ్ వర్మతోపాటు వెంకటేశ్, దినేశ్ అనే ఇంకో ఇద్దరు వ్యక్తులతో కలిసి తన కాబోయే భర్తను హత్య చేసింది. నిజానికి శుభకు ఆ పెళ్లి ఇష్టంలేదు. అయినా తల్లిదండ్రులు బలవంతపెట్టడంతో ఆ విషయాన్నే తన స్నేహితుడు అరుణ్కి చెప్పి, పెద్దలు నిశ్చయించిన ఆ వరుడి హత్యకు కుట్ర పన్నింది. ఈ కేస్ పూర్వపరాలను పరిశీలించిన సుప్రీంకోర్ట్.. ‘లింగవివక్ష, ఏళ్ల నుంచి పాతుకుపోయిన జెండర్ రోల్స్ వంటివన్నీ మహిళల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు సంకెళ్లుగా మారుతూ వారిని అణచివేస్తున్నాయి. అది వాళ్లలో ధిక్కార ప్రవర్తనకు కారణమవుతోంది. ఫలితంగా నేరాలకు పాల్పడుతున్నారు. ఆధునిక మహిళలు చాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ హక్కును ఆస్వాదించాలనుకుంటున్నారు. ఉదాహరణకు.. చదువుకున్న అమ్మాయి ‘ఆశలు’ అనే రెక్కలు తొడుక్కోవాలనుకుంటుంది. ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటుంది. ఈ క్రమంలో బలవంతపు పెళ్లి తన జీవిత లక్ష్యానికి విడాకులు ఇప్పిస్తుంది. పై చదువులకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటుంది. ఇది కచ్చితంగా ప్రతి చర్యకు దారితీస్తుంది. అయితే ఈ రియాక్షన్స్ మహిళ మహిళకు మారుతుంటాయి.. వాళ్ల నేపథ్యం, స్నేహాలను బట్టి. ఉదాహరణకు మధ్యతరగతికి చెందిన అమ్మాయి.. పేదింటి లేదా ధనిక కుటుంబపు అమ్మాయిల కంటే భిన్నంగా రియాక్ట్ కావచ్చు. తీసుకునే నిర్ణయాన్ని అది ప్రభావితం చేయొచ్చు’ అని విశ్లేషించింది. నేరస్తులు అందరిపట్లా...స్త్రీలకు సంబంధించి.. నేరానికి ఉసిగొల్పిన సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నేరస్థుల సంస్కరణ దిశగా తీర్పులు ఉండాలన్న సుప్రీంకోర్ట్ అభిప్రాయం హర్షించదగ్గది. అయితే దాదాపుగా నేరాలన్నిటికీ సామాజిక పరిస్థితులే కారణాలుగా ఉంటాయి. నేరస్థుల అందరిపట్లా ఇలాంటి అప్రోచే ఉండాలి. శిక్ష తర్వాత సమాజంలోకి వచ్చిన వాళ్లను సానుకూల దృక్పథంతో చూడాలి. సహానుభూతి ఉండాలి. – ప్రొఫెసర్ బీనా చింతలపురిసంస్కరించడమే పరిష్కారంమన దేశంలో చాలామంది మహిళలు పిల్లల కోసమో, విడాకులకు సొసైటీలో యాక్సెప్టెన్స్ లేకపోవడం వల్లో, అవమానాలు, అపవాదులకు జడిసో, ఆర్థిక స్వాతంత్య్రం లేకనో వైవాహిక జీవితంలోని హింసను మౌనంగా భరిస్తూన్నారు. భరించలేని కొందరు మాత్రం విపరీత చర్యలకు ఒడిగడుతున్నారు. ఇది కలవరపరచే అంశమే! వారి ఆ చర్యలకు సామాజిక నిర్లక్ష్యం, అన్యాయం, వాళ్లను అర్థం చేసుకోకపోవడమే కారణాలుగా తోస్తున్నాయి. వెఫల్యం చెందిన వ్యవస్థలను సంస్కరించడమే దీనికి పరిష్కారం. కుటుంబం ముఖ్యంగా మగవాళ్లు అమ్మాయిల పట్ల సహానుభూతితో వ్యవహరించాలి. కెరీర్, పెళ్లి, పిల్లలు లాంటి విషయాల్లో వాళ్ల నిర్ణయాలను గౌరవించి ఆమోదించాలి. మద్దతుగా నిలవాలి.– రాజ్ రాచకొండ, సినీ దర్శకుడుకారణాలను పరిగణించాలి... సామాజిక, కుటుంబ ఒత్తిళ్లు మహిళలు/అమ్మాయిల స్వేచ్ఛను అడ్డుకోవడమేకాక వాళ్లను నిస్సహాయ స్థితిలోకి నెట్టేస్తున్నాయి. ఇవి కొన్నిసార్లు నేరాలకు దారితీయొచ్చు. కాబట్టి వారిలో పరివర్తన తీసుకురావడం ఎంత అవసరమో.. ఆ సామాజిక పరిణామాలను పరిగణనలోకి తీసుకుని వారికి క్షమాభిక్ష పెట్టడమూ అంతే అవసరమంటూ సుప్రీంకోర్టు చేసిన సిఫార్సు ఆహ్వానించదగినది. అలాగని సుప్రీంకోర్టు నేరాన్ని సమర్థించట్లేదు. నేరస్థులను చంపితే నేరం చావదని, నేరస్థుల పరివర్తన మీద దృష్టిపెట్టి.. నేర స్వభావానికి కారణమైన సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని చెబుతోంది. ఉద్దేశపూర్వకంగా చేసిన నేరానికీ, నిస్సహాయ స్థితిలో ఒక అమ్మాయి చేసిన నేరానికి చాలా తేడా ఉంటుంది. రెండింటిలో శిక్ష ఒకే మాదిరిగా ఉన్నప్పటికీ, వారిలో తేవాల్సిన పరివర్తన ధోరణి, అలాగే క్షమాభిక్ష పెట్టేప్పుడు పరిగణించాల్సిన అంశాలు వేరేగా ఉండాలి.– మామిడి సుధేష్ణ, హైకోర్ట్ అడ్వకేట్సంస్కరించడమే పరిష్కారంమన దేశంలో చాలామంది మహిళలు పిల్లల కోసమో, విడాకులకు సొసైటీలో యాక్సెప్టెన్స్ లేక΄ోవడం వల్లో, అవమానాలు, అపవాదులకు జడిసో, ఆర్థిక స్వాతంత్య్రం లేకనో వైవాహిక జీవితంలోని హింసను మౌనంగా భరిస్తూన్నారు. భరించలేని కొందరు మాత్రం విపరీత చర్యలకు ఒడిగడుతున్నారు. ఇది కలవరపరచే అంశమే! వారి ఆ చర్యలకు సామాజిక నిర్లక్ష్యం, అన్యాయం, వాళ్లను అర్థం చేసుకోకపోవడమే కారణాలుగా తోస్తున్నాయి. వెఫల్యం చెందిన వ్యవస్థలను సంస్కరించడమే దీనికి పరిష్కారం. కుటుంబం ముఖ్యంగా మగవాళ్లు అమ్మాయిల పట్ల సహానుభూతితో వ్యవహరించాలి. కెరీర్, పెళ్లి, పిల్లలు లాంటి విషయాల్లో వాళ్ల నిర్ణయాలను గౌరవించి ఆమోదించాలి. మద్దతుగా నిలవాలి.– రాజ్ రాచకొండ, సినీ దర్శకుడు (చదవండి: కండలు తిరిగిన వైద్యురాలు..! ఏకంగా 600కి పైగా..) -
మా అమ్మాయిని చాటింగ్ నుంచి బయట పడేయగలరా
మా అమ్మాయి వయసు 16 సంవత్సరాలు, జూనియర్ ఇంటర్ చదువుతోంది. ఈ మధ్య ఎంతసేపు ఫోన్లోనే ఉంటోంది. చికాకుగా ఉండటం, అందరితో సరిగ్గా మాట్లాడక΄ోవడంతోపాటు తిండి కూడా బాగా తగ్గించేసింది. చదువు మీద బొత్తిగా ధ్యాస లేదు. ఈ మధ్య నేను అనుకోకుండా తన ఫోన్ చూస్తే ఒక సోషల్ మీడియా యాప్ ద్వారా వేరే దేశంలోని వ్యక్తితో చాటింగ్, ఫోన్స్, వీడియో కాల్స్ మాట్లాడుతున్నట్లు గమనించాను. ఇంకా తన పర్సనల్ ఫొటోలు కూడా ఆ వ్యక్తికి పంపినట్లు చూసి నేను చాలా అప్సెట్ అయ్యాను. తన నుంచి ఫోన్ తీసుకుంటే చనిపోతానని చెదిరిస్తుంది. చాకుతో చేతిమీద కోసుకునే ప్రయత్నం కూడా చేసింది. ఎవ్వరితోను చెప్పుకోలేని పరిస్థితి నాది! మా వారితో కూడా చెప్పే ధైర్యం లేదు. దిక్కు తోచని పరిస్థితిలో ఈ ఉత్తరం రాస్తున్నాను! దయచేసి సలహా చెప్పగలరు. – ఒక సోదరి, హైదరాబాద్ఇది మీరొక్కరే కాదు, ప్రస్తుతం సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. ఈ మధ్య కాలంలో టీనేజీ పిల్లలో ఫో, ఇంటర్నెట్ వాడటం చాలా ఎక్కువ అయింది. సోషల్ మీడియా ప్రభావం వారి మీద చాలా ఎక్కువగా ఉంది. మీ అమ్మాయి విషయానికి వస్తే ఫోన్ వాడకంతో పాటు, క్షణికావేశం, తప్పుడు నిర్ణయాలు, తొందరపాటుతనం, అంతర్గత భావోద్వేగాలను నియంత్రించలేకపోవడం కనిపిస్తోంది. కౌన్సెలింగ్ ‘బిహేవియరల్ థెరపీ’ బాగా ఉపయోగ పడుతుంది. అయితే మీరు మీ భర్తతో కూడా దీని గురించి చర్చించడం మంచిది. పేరెంట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్’ ద్వారా మీరు కూడా ఎలా ఉండాలో తెలుసుకోవచ్చు. ఆమెతో ఎక్కువ సాన్నిహిత్యం పెంచుకోండి. తెలియని వ్యక్తులతో చాటింగ్ వలన వచ్చే నష్టాలను వివరించండి. అదే విధంగా ఫోన్ సమయాన్ని ఎలా నిర్దేశించాలో చెప్పండి. తల్లిదండ్రులుగా మీరిద్దరూ కలిసి తనతో ప్రశాంతంగా మాట్లాడటం, వినడం మొదలు పెడితే, ఆమె కోర్కెలు, బాధలు బయటపడతాయి. మీరు ధైర్యంగా, ప్రశాంతంగా ఉండి మానసిక వైద్య నిపుణల సహాయంతో ఈ సమస్య నుంచి మీ అమ్మాయిని తప్పకుండా పూర్తిగా బయటికి తీసుకు రావచ్చు.డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. (మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com) -
Pratiksha Tondwalkar: స్వీపర్ టు ఏజీఎం!
నేను స్వీపర్గా పనిచేయడం ఏమిటి?’ అని ఆమె అహానికి పోలేదు. ‘ఇంత చిన్నజీతానికి పనిచేయడం ఏమిటి?’ అని తాను చేస్తున్న పనిని చిన్నచూపు చూడలేదు.చిన్నదో, పెద్దదో ‘పని’ చేయాలి అని గట్టిగా అనుకుంది ముంబైకి చెందిన ప్రతీక్ష తోండ్వాల్కర్. పనే ఆమెకు ‘పవర్’ అయింది. ఎస్బీఐలో స్వీపర్ స్థాయి నుంచి ఏజీఎం స్థాయికి చేరింది...పేదకుటుంబంలో పుట్టిన ప్రతీక్షకు పదిహేడు సంవత్సరాల వయసులోనే వివాహం జరిగింది. ఇరవైలలో ఉన్నప్పుడు భర్త రోడ్డుప్రమాదంలో చనిపోయాడు. ఆ షాక్ నుంచి కోలుకోవడం ఆమెకు చాలా కష్టమైపోయింది. అప్పటికే తనకు రెండు సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు. ‘ఇలా ఏడుస్తూ కూర్చుంటే పిల్లవాడి గురించి ఎవరు ఆలోచిస్తారు?’ అనుకొని ఆ దుఃఖం నుంచి బయటపడి ధైర్యం తెచ్చుకుంది.‘ఇంట్లో ఖాళీగా కూర్చుంటే కడుపు నిండదు. ఏడుపు ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఏదో ఒక పని చేయాలి’ అనుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ముంబై బ్రాంచ్కు వెళ్లి ‘ఏదో ఒక పని ఇప్పించండి’ అని అడిగింది. ఆమె భర్త ఈ బ్రాంచ్లో బుక్బైండర్గా పనిచేసేవాడు. ఆ మంచితనం, సానుభూతితో బ్యాంక్ వాళ్లు ఆమెకు తమ బ్రాంచీలో స్వీపర్గా పనిచేసే అవకాశం ఇచ్చారు. నెలకు అరవై అయిదు రూపాయల జీతం వచ్చేది.ఆ జీతంతోనే సర్దుకుపోయి ఉంటే ప్రతీక్ష తన భవిష్యత్ గురించి ఆలోచించేది కాదు. ఆ సమయంలోనే తాను మరచిపోయిన చదువు గురించి ఆలోచన మొదలైంది. ఆ ఆలోచనతో పాటు అనుమానాలు కూడా మొదలయ్యాయి. ‘ఈ వయసులో చదువు ఏమిటి!’ ‘ఇంట్లో బిడ్డను పెట్టుకొని కాలేజీకి వెళతావా!’... ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందేమో అని మొదట భయపడింది. ఆ తరువాత తనకు తానే ధైర్యం తెచ్చుకుంది.‘నేనేమీ తప్పు చేయడం లేదు. చదువుకోబోతున్నాను. అంతే’ అని గట్టిగా నిశ్చయించుకుంది. ఒకవైపు స్వీపర్ పనిచేస్తూనే మరోవైపు నైట్ కాలేజీలో చదువుకునేది. ఇంటర్మీడియెట్ తరువాత మరో నైట్కాలేజీలో డిగ్రీ చేసింది. స్వీపర్ నుంచి బ్యాంక్ క్లర్క్గా ప్రమోట్ అయింది. కొంతకాలానికి తిరిగి వివాహం చేసుకుంది ప్రతీక్ష. భర్త ప్రమోద్ ‘నిన్ను ఇంకా పెద్దస్థాయిలో చూడాలనుకుంటున్నాను’ అనేవాడు. బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలని ప్రోత్సహించేవాడు. అలా బ్యాంకు పరీక్షలు రాసి ఒక్కోమెట్టు ఎక్కుతూ ఏజీఎం (అసిస్టెంట్ జనరల్ మేనేజర్) స్థాయికి చేరింది ప్రతీక్ష. ‘కష్టాల్లో ఉన్నప్పుడు చదువు తప్ప నాకు మరో దారి కనిపించలేదు. చదువును నమ్ముకునేవారికి, కష్టపడేవారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది’ తన అనుభవ జ్ఞానంతో అంటుంది ప్రతీక్ష తోండ్వాల్కర్. ప్రతీక్ష తన విజయం దగ్గరే ఆగిపోలేదు. తన విజయంతో ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తోంది. ఆ రెండు అడుగులుఆ కష్టకాలాన్ని గుర్తు తెచ్చుకుంటే నాకు ఊపిరి ఆడనట్లుగా ఉంటుంది. అయితే గతంలోనే ఉండిపోతే భవిష్యత్ను చూడలేము. నాకు మొదటి నుంచి చదువు అంటే ఇష్టం. ఆ చదువే నాకు ధైర్యాన్ని ఇచ్చి దారి చూపింది. పరిస్థితులే మనకు ధైర్యాన్ని ఇస్తాయి అని చెప్పడానికి నేనే ఉదాహరణ. తెలియని వ్యక్తుల ముందుకు వెళ్లి ‘నాకు ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించండి’ అని అడగడం నేను ధైర్యంగా వేసిన మొదటి అడుగు అనుకుంటాను. ఎవరు ఏమనుకున్నా సరే నేను చదవాల్సిందే అనుకోవడం నేను ధైర్యంగా వేసిన రెండో అడుగు. ఆ రెండు అడుగులు నా జీవితాన్ని మార్చేశాయి– ప్రతీక్ష తోండ్వాల్కర్ -
చిన్నోడి డ్యాన్స్కు ఫిదా అవుతున్నారు!
పడవ స్పీడుగా దూసుకెళుతోంది.ఆ స్పీడ్కు తగినట్లుగా దిఖా చేసిన మ్యాజిక్ డ్యాన్స్ సంచలనం సృష్టించింది. ఈ ఆన్లైన్ సంచలనం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.పదకొండు సంవత్సరాల ఇండోనేషియా అబ్బాయి రెయాన్ అక్రన్ దిఖా చేసిన ఐకానిక్ బోట్ డ్యాన్స్ ‘ఆరా ఫార్మింగ్’ అంతర్జాతీయ స్థాయిలో వైరల్ అయింది. తాజాగా ఈ ట్రెండ్లో సింగపూర్ నేవీ సిబ్బందితో పాటు మన ముంబై పోలీసులు (Mumbai Police) కూడా భాగం అయ్యారు.ముంబై పోలీసుల ఐకానిక్ బోట్ డ్యాన్స్ హిట్ కావడంతో, ఒరిజినల్ డ్యాన్స్ చూడని వాళ్లు ఇది చూసి ‘ఆహా’ ‘ఓహో’ అంటున్నారు.ఉన్నతాధికారులతో పాటు వివిధ రంగాల సెలబ్రిటీలు ఈ ఐకానిక్ బోట్ డ్యాన్స్ ట్రెండ్లో భాగం కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రెండ్లో భాగం అవుతున్నవారు స్థానిక మ్యూజిక్ను వీడియోకు జత చేస్తున్నారు.‘ఆరా ఫార్మింగ్’ అనేది ఇప్పుడు ఆన్లైన్లో పాపులర్ అయింది. కదులుతున్న కారుపై.. జనమంతా చూస్తుండగా కదులుతున్న కారుపై ముంబై మహిళ ఒకరు చేసిన ఆరా ఫార్మింగ్ డ్యాన్స్ వీడియో తెగ వైరల్ అయింది. నవీ ముంబైలోని ఖార్ఘర్లో కదులుతున్న మెర్సిడెస్ బెంజ్ కారు బానెట్పై నజ్మీన్ సుల్దే అనే 24 ఏళ్ల మహిళ చెప్పులు లేకుండా డాన్స్ చేసిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. చదవండి: రికార్డ్ బ్రేకింగ్ ప్రదర్శన.. ఏకంగా 170 గంటల పాటు.. నజ్మీన్తో పాటు కారు నడిపిన ఆమె ప్రియుడు అల్-ఫెష్ షేక్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిద్దరితో పాటు ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించేలా వ్యవహరించినందుకు భారతీయ న్యాయ సంహిత, మోటారు వాహన చట్టం కింద వారిని అరెస్ట్ కూడా చేశారు. అల్-ఫెష్ షేక్కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని వార్తలు కూడా వచ్చాయి.🔥🚨BREAKING: This young man named Dika has taken over the Internet on all platforms for ‘legendary aura farming’ he can be seen dancing on the front of boat races in Indonesia to boost moral. The viral kid stealing hearts at Pacu Jalur, His dance isn't just moves, it's pure… pic.twitter.com/awify23gFh— Dom Lucre | Breaker of Narratives (@dom_lucre) July 7, 2025 View this post on Instagram A post shared by Nazmeen Sulde (@nazmeen.sulde) -
రికార్డు బ్రేకింగ్ నాట్య ప్రదర్శన..! ఏకంగా 170 గంటల పాటు..
అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తేనే కదా ప్రపంచం మొత్తం మనవైపు తిరిగి చూసేది. మంచి గుర్తింపు వచ్చేది కూడా అలాంటప్పుడే. అలాంటి అనితర సాధ్యమైన ఘనతనే సాధించి శెభాష్ అనిపించుకుంది ఈ మంగళూరు అమ్మాయి. రోజు చేసే పనిని చేయడమే ఒక్కోసారి విసుగ్గా ఉంటుంది. అలాంటిది ఒక పనిని నిరంతరాయంగా చేయడం అంటే మాటలా..వామ్మో అనేస్తాం. కానీ ఈ అమ్మాయి మాత్రం అలుపు సలుపు లేకుండా సునాయాసంగా చేసేస్తోంది. ఆ అమ్మాయే మంగళూరుకి చెందిన సెయింట్ అలోసియస్(డీమ్డ్ యూనివర్సిటీ)విద్యార్థిని రెమోనా ఎవెట్ పెరీరా(Remona Evette Pereira). బీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నా ఆమె జులై 21న రికార్డు బద్దలు కొట్టే నాట్య ప్రదర్శన ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. జులై 21 నుంచి జులై 28 వరకు అంటే మొత్తం ఏడు రోజులపాటు 170 గంటలు నిర్విరామంగా భరతనాట్యం చేసి అందరిచేత శెభాష్ అనిపించుకుంది. ఆమె ప్రదర్శనకు ఉరుములతో కూడిన చప్పట్లతో దద్దరిల్లింది స్టేడియం. ఇలా ఎక్కువ గంటలపాటు నిరంతరాయంగా నాట్యం చేసి ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లోకి కెక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఇలా నిరంతరాయంగా నాట్యాన్ని ప్రదర్శించిన తొలి వ్యక్తిగా కూడా ఘనత సాధించింది పెరీరా. ఆమె ప్రతి మూడు గంటలకు స్వల్ప విరామం తీసుకుంటూ..ఆగకుండా భరతనాట్యం చేసినట్లు ఆమె కళాశాల డైరెక్టర్ క్రిస్టోఫర్ డిసౌజా అన్నారు. ఇక పెరీరా మూడేళ్ల ప్రాయం నుంచే ప్రఖ్యాత గురువు విద్య మురళీధర్ ఆధ్వర్యంలో భరతనాట్యం శిక్షణ తీసుకుంది. అంతేగాదు 2019లో సోలో అరంగేట్రం ప్రదర్శనతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ ఘనత ఎలా సాధించిందంటే.. ఈ ప్రపంచ రికార్డు కోసం గత కొన్ని నెలలుగా భరతనాట్యంలో కఠోర సాధన చేస్తున్నట్లు పేర్కొంది పెరీరా. రోజుకు ఐదారు గంటలు నృత్య సాధనకే కేటాయించినట్లు తెలిపింది. ఏడు రోజుల పాటు నిరంతరాయంగా నృత్యం చేయడమంటే మాటలు కాదు. అయినా సాధించాలన్న పట్టుదలే తనను ముందుకు నడిపించిందని చెబుతోంది. ఇక ఈ సుదీర్ఘ ప్రదర్శనలో భాగంగా ప్రతి మూడు గంటలకోసారి పావుగంట విరామం తీసుకొనేదాన్ని, అలాగే ఆ సమయంలోనే కునుకు కూడా తీసేదాన్ని అంటోంది. ఇక అరటిపండ్లు, పెరుగు, కొబ్బరి నీళ్లు, కొద్దిగా అన్నం.. ఇలా తేలికపాటి ఆహారంతో ఎనర్జీని పెంచుకునేదాన్ని అని చెబుతోంది. అయితే ఈ ప్రపంచ రికార్డుని తన తల్లిదండ్రులు, టీచర్లు, ఫ్రెండ్స్ ప్రోత్సాహంతోనే సాధించగలిగానంటూ క్రెడిట్ అంతా వారికే ఇచ్చేసింది ఈ డ్యాన్స్ లవర్ ఎవెట్ పెరీరా. ప్రస్తుతం ఆమె విజయం నెట్టింట తెగ వైరల్గా మారింది. View this post on Instagram A post shared by LEO DISTRICT 317D (@leodistrict317d) (చదవండి: కండలు తిరిగిన వైద్యురాలు..! ఏకంగా 600కి పైగా..) -
కండలు తిరిగిన వైద్యురాలు..! ఏకంగా 600కి పైగా..
వైద్యులు అనగానే ఎలా ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఒక కళ్లజోడు..చూడగానే స్మార్ట్గానో లేదా ఓ మోస్తారు లావుగానో ఉంటుంది వారి ఆహార్యం. చాలామటుకు వైద్యులంతా ఇలానే ఉంటారనే చెప్పొచ్చు. కానీ అలాంటి మూసపద్ధతులన్నీ బద్దలు కొట్టి ఇక్కడొక వైద్యురాలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. అంతేగాదు నెట్టింట ఆ వైద్యురాలు ఎవరా..? అంటూ చర్చలు మొదలయ్యాయి. చైనాలోని చాంగ్కింగ్లో 26 ఏళ్ల యాన్యన్ ఫోరెన్సిక్ డాక్టర్ బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ మాదిరిగా కండలు తిరిగిన వైద్యుడు. సాధారణంగా డాక్టర్లు కనిపించేలా స్మార్ట్గా కాకుండా..వెయిట్లిఫ్టర్ మాదిరిగా..ఉంటుందామె. ఆమె శరీరాకృతి వైద్యరంగంలో ఉండే మూసపద్ధతులకు అత్యంత విభిన్నంగా ఉంటుంది ఆమె ఆహార్యం. ఆ కారణంగానే ఆమె నెట్టింట హాట్టాపిక్గా మారింది. ఆమె అద్భుతమైన బలానికి, ఫిట్నెస్కి పేరుగాంచిన వైద్యురాలు. ఆమె చైనాలోని చాంగ్కింగ్ మునిసిపాలిటీలోని ఫోరెన్సిక్ ప్రయోగశాలలో పనిచేస్తున్న తొలి మహిళా ఫోరెన్సిక్ ఫాథాలజిస్ట్. ఆమె ఫోరెన్సిక్ మెడిసిన్లో పట్టా పొందిన వెంటనే విధుల్లో చేరారు. అప్పటి నుంచి దాదాపు 600కు పైగా మృతదేహాల అనుమానాస్పద మరణ కేసులను నిర్వహించింది. అంతేగాదు యూన్యన్ సుమారు 120 కిలోలు బరువులను ఎత్తగలదు. ఒంటి చేత్తో చైన్సా (Chainsaw) అనే శక్తివంతమైన పోర్టబుల్ కట్టింగ్ సాధనాన్ని ఆపరేట్ చేయగలదు. కేవలం మూడు నిమిషాల్లో బ్రెయిన్కి సంబంధించిన క్రానియోటమీ సర్జరీని పూర్తి చేస్తుందామె. ఈ విశిష్ట సామర్థ్యమే ప్రత్యేక మహిళా వైద్యురాలిగా గుర్తింపుతెచ్చి పెట్టాయి. ఆమె ఫిట్నెస్ శిక్షణ తన ఉద్యోగ విధులను సులభంగా నిర్వర్తించేందుకు ఎంతగానో ఉపకరిస్తుందట. ఎందుకుంటే తరుచుగా దాదాపు 150 కిలోలు వరకు బరువు ఉండే మృతదేహాలను కదలించడంలో ఈ దేహధారుడ్యం తనకు ఎంతగానో హెల్ప్ అవుతోందని చెబుతోంది యాన్యన్. అంతేగాదు తన సోషల్ మీడియా ఖాతాలో ఫిట్నెస్కి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటుంటుంది. యాన్యన్ మహిళలు ఇలాంటి ఉద్యోగాలకు పనికిరారు అనే భావనను సవాలు చేయడమే లక్ష్యంగా తనను స్ట్రాంగ్గా చేసుకుంటూ సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నానని చెబుతోంది. ఈ ఫోరెన్సిక్ రంగంలో ఇప్పటికీ వివక్ష ఉందని, కొన్ని సంస్థలు పురుషులకే ప్రాధాన్యత ఇస్తాయని వాపోయింది. అలాగే చాలామంది ప్రజలు తన వృత్తి పట్ల ప్రతికూలంగా మాట్లాడుతుంటారని, కనీసం షేక్హ్యాండ్ ఇవ్వడానికి కూడా నిరాకరిస్తారంటూ బాధగా చెప్పుకొచ్చింది. అయితే తాను అవేమి పట్టించుకోనని, తన వృత్తి ధర్మం ప్రకారం..చనిపోయిన మృతులకు న్యాయం చేకూరేలా తన వంతు సాయం చేస్తుంటానని పేర్కొంది యాన్యన్. ఆమెకు బాడీబిల్డర్గా ఫిట్నెస్పై దృష్టిపెట్టడం, వృత్తి రెండు కళ్లులాంటివి అని, అందుకే ఆ రెండింటికి సమన్యాయం చేస్తుంటానని చెబుతోంది. తన ఉద్యోగానుభవం..జీవితంలోని దర్భలమైన పరిస్థితులను గుర్తుచేస్తూ..ప్రతి క్షణాం మంచిగా ప్రవర్తించమనే పాఠాన్ని నేర్పిస్తుందని అంటోంది యాన్యన్.(చదవండి: జస్ట్ 15 వారాల్లో 50 కిలోలు ..! కానీ ఆ వ్యాధి కారణంగా..) -
వర్షకాలంలో ఫుడ్ విషయంలో జర జాగ్రత్త..!
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో సమోసా, జిలేబీ వంటి స్ట్రీట్ ఫుడ్స్ హాట్ టాపిక్గా మారాయి. వీటిపై కూడా ప్రమాద హెచ్చరికలు జారీచేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆ తర్వాత అలాంటిదేమీ లేదని, కేవలం స్ట్రీట్ ఫుడ్ విషయంలో అపరిశుభ్రత విధానాలపై హెచ్చరించడమే తమ ఆలోచనని ప్రభుత్వం స్పష్టం చేసి ఆ వార్తలకు ఫుల్స్టాప్ పెట్టేసింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం దీనిపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. వర్షాల సీజన్ కావడంతో వేడి వేడి స్ట్రీట్ ఫుడ్కు ఆకర్షితులవ్వడం సహజమే. ఈ క్రమంలో ఇలాంటి ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నగరానికి చెందిన ప్రముఖ కన్సల్టెంట్, ఎండోక్రైనాలజిస్ట్, డయాబెటాలజిస్ట్ డాక్టర్ పృథ్వీరాజ్ సనమంద్ర సూచిస్తున్నారు.. జిలేబీలు, సమోసాలు, బజ్జీలు, పునుగులు వగైరా స్ట్రీట్ ఫుడ్ నోటికి రుచిగా ఉంటాయి. కానీ ఇవి ఆరోగ్యానికి చేటు చేస్తాయి. మరీ ముఖ్యంగా చిరుతిళ్లలో మైదా శాతం అధికంగా ఉంటుందని, పైగా ఇవన్నీ పలుమార్లు వాడిన నూనెతో చేసిన వంటకాలు కావడంతో మరింత ప్రమాదకరం. తరచూ ఈ తరహా ఆహారం తినడం వల్ల జీవక్రియతో పాటు జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. అనారోగ్య కారకం.. ఈ తరహా చిరుతిండి ఎక్కువగా తినేవాళ్లలో ఒవెసిటీ, తర్వాత రక్తపోటు, ఫ్యాటీ లివర్, చెడు కొలె్రస్టాల్, గుండె సంబంధిత అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. క్రమంగా ఈ అలవాట్లతో పాటు పెద్ద పెద్ద వ్యాధులుగా రూపాంతరం చెంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి తప్పదు. ప్యాంక్రియాస్పై ప్రభావం.. మన శరీరంలో రెండు రకాల కొవ్వులు ఉంటాయి. వీటిలో చర్మం కింద ఉండే సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంత ప్రమాదకరం కాదు. కానీ లివర్, ప్యాంక్రియాస్, కిడ్నీలు వంటి అంతర్గత అవయవాల చుట్టూ ఉండే విసెరల్ ఫ్యాట్ పెంచుతాయి. దీంతో ఆరోగ్యానికి ప్రమాదం అధికం. ఇది శరీరంలోని వాపును పెంచి ఇన్సులిన్ పనితీరును దెబ్బతీస్తుంది. తద్వారా ప్యాంక్రియాస్ అధిక శాతంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. దీనినే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇది క్రమంగా డయాబెటిస్, ఇతర మెటబాలిక్ వ్యాధులకు దారితీస్తుంది.చిన్నపిల్లల్లో సమస్యలు.. చిన్నారులు స్కూలు వయసులో తీపి, ఉప్పు ఎక్కువగా ఉన్న ఫుడ్ తింటే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యల వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. అలాగే 5–10 ఏళ్ల పిల్లల్లో కనిపించే సమస్యలు – మెడ దగ్గర నలుపు మచ్చలు (అకాంథోసిస్ నైగ్రికన్స్), అమ్మాయిల్లో హార్మోన్ డిజార్డర్, అబ్బాయిల్లో టెస్టోస్టిరాన్ తగ్గడం (హైపోగోనాడిజం), ప్రీడయాబెటిస్, హైబీపీ, ఫ్యాటి లివర్ వంటి సమస్యలు తప్పవు. రోడ్డు మీది ఫుడ్తో పాటు చిప్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్, జంక్ ఫుడ్ ఏదీ మంచిది కాదు. దీనికి బదులుగా ఇంటి దగ్గర వండినవి మాత్రమే పిల్లలకు ఇవ్వడం ఉత్తమం. -
ముసురులో ముచ్చటైన ఆహారం..! పోషకాలు ఫుల్..
ముసురులో వేడివేడిగా.. ముచ్చటైన ఆహారం తినాలని ఎవరికి ఉండదు.. అలాంటి ఆహారాల్లో చెప్పుకోదగినది.. అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న వస్తువులతో సిద్ధం చేసుకోగలిగినది ఏదైనా ఉందంటే.. అది కిచిడీ ఒక్కటే.. అంతేకాదు.. నగరంలో అనేక మందికి ఇది అభిమాన బేక్ర్ఫాస్ట్ డిష్ కూడా. రుచికి రుచీ.. ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ దేశీ వంటకం ప్రపంచ గ్యాస్ట్రోనామిక్ మెనూలోనూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. విభిన్న రకాల కూరగాయలు, దినుసుల మేళవింపుతో అనేక పోషక విలువలు దీని సొంతమని ఆహార నిపుణులు చెబుతోన్న మాట.. శుభ్రత, ఆరోగ్యం, రుచిని కలగలిపే భారతీయ వంటకం కిచిడీ. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ నప్పే, నచ్చే వంటకంగా చాలా మందికి తెలుసు. అయితే ఇప్పుడు అంతర్జాతీయంగా మన దేశపు ‘సూపర్ ఫుడ్’గా కూడా ఇది గుర్తింపు పొందుతోంది. భారత్ నుంచి ప్రపంచ గ్యాస్ట్రోనామిక్ మెనూలో బిర్యానీ, పంజాబీ కడీ, దోస, రాజ్మా చావల్ తరహాలో కిచిడీ కూడా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తన రోజువారీ ఆహారంలో కిచిడీని భాగం చేశారంటే అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు సినీ సెలబ్రిటీలు కరణ్ జోహార్, తమన్నా భాటియా, మంధిరా బేడీ, క్రికెటర్ హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్ వంటి ప్రముఖులు కూడా కిచిడీ లవర్స్గా తమను తాము చెప్పుకుంటున్నారు. ఆరోగ్యానికీ మేలు.. మనలో చాలా మందికి చిన్నప్పటి జ్ఞాపకాలలో కిచిడీ రుచులు తప్పకుండా ఉంటాయి. అరుగుదల సులభం అనే ఆలోచనతోనే కిచిడీకి అంత క్రేజ్ వచ్చిందనేది నిస్సందేహం. రుచిగా ఉండటమే కాదు, దీనిని ప్రత్యేకంగా వండే శైలి కారణంగా తేలికగా జీర్ణం కాగలదు. ఇది కొన్ని వెరైటీల్లో ఎక్కువగా ముద్దలాగా తయారవుతుంది. కొన్ని రకాల్లో ఘన పదార్థంలా ఉంటుంది. అయినా ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడానికి దోహదపడుతుంది. వర్షం, ముసురు పట్టిన రోజుల్లో లేదా అనారోగ్య సమయంలో తినడానికి శ్రేష్ఠమైన ఆహారం. కిచిడీ సులభంగా జీర్ణమవుతుంది. అనేక విధాలుగా తయారు చేయొచ్చు. ప్రతి ఒక్కరికీ సరిపోయే ఆహారం ఇది అంటున్నారు సెలబ్రిటీ చెఫ్ సంజీవ్ కపూర్. ప్రొటీన్లు, విటమిన్లు అధికం..దీనిలో ఉండే మసాలాలు, మినపప్పు, బియ్యం వంటి పదార్థాల వల్ల ఇది శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు అందిస్తుంది. తేలికగా జీర్ణం కావడం మాత్రమే కాదు.. ఇది జీర్ణశక్తిని మెరుగుపరిచే ఆహారం కూడా. బియ్యంలో కలిపే ‘ హింగు (ఇంగువ), మిరియాలు, అల్లం, జీలకర్ర, వెల్లుల్లి వంటి మసాలాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. ఇటీవలే ఓ ప్రదర్శనలో చెఫ్ శివజిత్ సూరి మూంగ్ దాల్, మష్రూమ్స్, ట్రఫుల్ నూనె, గ్రీన్ బీన్స్ వంటి పదార్థాలతో కిచిడీ అంతర్జాతీయ ఫ్లేవర్ తీసుకొచ్చి ఆహార ప్రియుల్ని ఆకట్టుకున్నారు. వీటితోపాటు సాబూదాన్, వెజిటబుల్స్, చిరుధాన్యాలతో చేసే కిచిడీ వెరైటీల రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. నగరంలో ఎక్కడెక్కడ? ఈ కిచిడీ ప్రియుల కోసం నగరంలో పలు రెస్టారెంట్స్ వెరైటీ డిష్లను అందిస్తున్నాయి. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్లలోని ఈట్ ఫిట్ రెస్టారెంట్లోని గ్రేట్ ఇండియన్ కిచిడీ, జూబ్లీహిల్స్, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్లలో ఉన్న అంతేరా కిచెన్, ఎమ్ఓఏఐ, కృష్ణపట్నం, మోడ్రన్/కాంటినెంటల్ వంటలతో కూడిన రెస్టారెంట్లలోని కిచిడీలు మంచి రేటింగ్స్ పొందాయి. అలాగే అమీర్పేట్లోని హబీబో అందించే దాల్ కిచిడీ, జూబ్లీహిల్స్, హైటెక్సిటీలలో ఉన్న డైలీ రిచ్యువల్స్, టెర్రాయ్ అండ్ నియో తెలంగాణ కిచెన్, రెడ్ రినో, హోటల్ నయాబ్, టోలిచౌకిలోని హోటల్ రుమాన్, షాగౌస్లు అందించే కిచిడీ ఖీమా అండ్ కట్టా వంటివి కిచిడీ వంటకాలకు పేరొందాయి. (చదవండి: శ్రావణ శోభను తెచ్చేలా..పట్టుతో స్టైలిష్గా మెరుద్దాం ఇలా..!) -
శ్రావణ మాసంలో మహిళలు ఆకుపచ్చని గాజులే ఎందుకు ధరిస్తారంటే..?
శ్రావణ మాసం అంటేనే పండుగలు, కళ్యాణ వైభోగాలతో సందడిగా ఉంటుంది. ఈ మాసంలో ఉండే వాతావరణానికి అనుగుణంగా ఉండే మన ఆచార వ్యవహారాలు సైన్సుకే అందని విషయాలను వివరిస్తాయి. ప్రతిదాంట్లో సంప్రదాయం, ఆరోగ్యం రెండూ ఉంటాయి. ముఖ్యంగా ఈ పవిత్ర మాసంల వరాలిచ్చే వరలక్ష్మీ దేవిని కొలిచే మహిళల కట్టు, బొట్టు, తినే ఆహారం ఇలా ప్రతిదాంట్లోనూ ప్రత్యేకత ఉంటుంది. అలా ఎందుకో సవివరంగా తెలుసుకుందామా.!.శ్రావణ మాసంలో భారతీయ వివాహితలు ఆకుపచ్చ గాజులు ధరిస్తుంటారు. ఇది వారి సంతోషకరమైన, సుసంపన్నమైన వైవాహిక స్థితిని సూచిస్తుంది. ఆకుపచ్చ రంగు శుభప్రదమని, సంతానోత్పత్తికి సంబంధించినదని వారి నమ్మకం. అంతేకాదు, తమ శ్రేయస్సుకు, అదృష్టానికి, ప్రకృతి పునరుద్ధరణకు ప్రతీకగా ఆకుపచ్చ గాజులు ధరిస్తుంటారు. వర్షాకాలంలో వాతావరణం ప్రశాంత శక్తితో ముడిపడి ఉంటుంది. ఆకుపచ్చ రంగు కళ్లకు ఉపశమనం కలిగిస్తుంది. శరీర ఉష్ణోగ్రత, భావోద్వేగ సమతౌల్యతను కలిగిస్తుంది. అన్యోన్యతకు సూచికగా, సంప్రదాయం, ఆరోగ్యం, భక్తిని ఒకే వరసక్రమంలో పరిచయం చేసే శక్తి ఆకుపచ్చ రంగుకు ఉంటుంది. గాజుల శబ్దం ప్రతికూలతను దూరం చేస్తుందని నమ్మకం. శివ–శక్తి దైవిక ఐక్యతను ప్రతిబింబించే సామరస్యాన్ని కూడా సూచిస్తుందనే భావన దీనిలో ఇమిడి ఉంది.ఫలవంతమైన ఎంపికశ్రావణ మాసం వర్షాకాలం కనుక అలెర్జీలను తట్టుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకు సి–విటమిన్ సమృద్ధిగా లభించే పండ్లు తీసుకోవాలి. అలాగే, జీర్ణక్రియకు మేలు చేసేవీ జాబితాలో ఉండేలా చూసుకోవాలి. నారింజలో అధికంగా ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే, రసాయనాల గాఢత లేని వాటిని ఎంచుకోవడం మేలు. అరటిపండు శక్తినిస్తుంది. జీర్ణక్రియ పనితీరుకు సహాయపడుతుంది. ఈ మాసంలో అరటిపండు వాడకం విరివిగా కనిపిస్తుంది. జీర్ణక్రియకు సహాయపడే బొప్పాయి మలబద్ధక నివారిణిగా కూడా పనిచేస్తుంది. (చదవండి: బడి పాఠాలే కాదు ‘బతుకు బడి’ పాఠాలు కూడా..) -
బడి పాఠాలే కాదు ‘బతుకు బడి’ పాఠాలు కూడా..
పేరెంటింగ్కు సంబంధించి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ‘జోహో’ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు ‘ఎక్స్’లో చేసిన అర్థవంతమైన, అద్భుతమైన పోస్ట్ నెట్లోకంలో చర్చనీయాంశంగా మారింది. పిల్లలు తమకు ఆసక్తి ఉన్న రంగంలో రాణించడానికి అవసరమైన పలు నైపుణ్యాలను గురించి ఈ పోస్ట్లో ప్రస్తావించారు వెంబు. పిల్లలు మానవత్వం మూర్తీభవించిన వ్యక్తులుగా ఎదగడానికి సృజనాత్మకత, సాంస్కృతిక అంశాలు ఎలా సహాయపడతాయో వివరించారు.‘గణితం, శాస్త్రీయ సంగీతం, వంటలు, ఆటలు... ఇష్టమైన ఏ విద్య అయినా కావచ్చు, పతకాల కోసం నేర్చుకోవద్దు. పోటీలకు సంబంధించిన ఒత్తిడికి దూరంగా ఉండాలి. గణితంపై నా ఆసక్తి సాఫ్ట్వేర్డెవలప్మెంట్ను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది.పిల్లల భవిష్యత్ను నిజంగా మార్చేది ఏమిటనే విషయంపై తల్లిదండ్రులు, విద్యావేత్తలు దృష్టి పెట్టాలి’ అని రాశారు శ్రీధర్.‘బడి పాఠాలే కాదు బతుకు బడి పాఠాలు కూడా నేర్చుకోవాలి’ అనేది శ్రీధర్ పోస్ట్ సారాంశం. ‘కుకింగ్కు పెద్దగా ఎవరూ ప్రాధాన్యత ఇవ్వరుగానీ నిజానికి అది అత్యంత నైపుణ్యం ఉన్న పని, లైఫ్ స్కిల్. కుకింగ్ రావడం అనేది జీరో డిపెండెన్సీని సూచిస్తుంది. అందుకే వంటచేయడాన్ని పిల్లలు తప్పనిసరిగా నేర్చుకోవాలి. అది ఒక కళగా గుర్తించుకోవాలి’ అని స్పందించారు ఒక యూజర్. Pure mathematics, carnatic music, bharatanatyam, classical art, sculpture, chess or go, mridangam, classical poetry, fine cooking - what is common to all of them? (apart from the fact that I am not good in any of them 😁, at least I get to appreciate some of them)We need…— Sridhar Vembu (@svembu) July 22, 2025 (చదవండి: మనింట్లో ఇలాంటి అభిమానులున్నారా?) -
మనింట్లో ఇలాంటి అభిమానులున్నారా?
సినీ అభిమానం వెర్రితలలు వేసి భవిష్యత్తు నాశనం చేసుకునే విధంగాటీనేజ్ పిల్లలు తయారవుతున్నారా? కర్నాటకలో ఇలాగే జరుగుతోంది.అక్కడ హీరో దర్శన్ అభిమానులు తనపై అత్యాచారం చేస్తామని, చంపుతామని బెదిరిస్తున్నారని నటి రమ్య కేసు పెట్టారు. గతంలో దర్శన్ అభిమాని రేణుకా స్వామి ఇలాంటి మెసేజ్లే పెట్టి హత్యకు గురయ్యాడు. ఆ కేసులో దర్శన్ నిందితుడు. ఈ నేపథ్యంలో అతడికి బెయిలు మంజూరు అవడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. రమ్య సుప్రీంకోర్టును మెచ్చుకుంటూ ట్వీట్ చేసింది.దాంతో ఆమెను చంపుతామని అభిమానులు బయలుదేరారు. చదువు, ఉద్యోగాల్లో ఉండాల్సిన యువత ఇలాంటి పనుల్లో ఉంటే సరిదిద్దుతున్నామా?ఇంట్లో ఉన్న పిల్లలు బయట ఏ అస్తిత్వంతో ఉన్నారో తల్లిదండ్రులు చెక్ చేసుకుంటున్నారా? వారు ఫలానా తల్లిదండ్రుల పిల్లలు అనో, కాలేజీ పిల్లలు అనో, ఏరియా పిల్లలు అనో గుర్తింపు పొందుతున్నారా? లేదా ఫలానా హీరో ఫ్యాన్స్ అనో, రాజకీయ పార్టీ అభిమానులనో, వాట్సాప్ గ్రూప్కు సంబంధించిన యాక్టివ్ మెంబర్లనో అందరికీ తెలుస్తున్నారా?హైస్కూల్, కాలేజీ వయసు దాటాక ఇటీవల ఉద్యోగాల్లో చేరాక కూడా మెచ్యూరిటీ లేని విధంగా కేవలం ‘ఫ్యాన్స్’గా ఉంటూ సొంత/దొంగ ఐడీలతో దాడి చేసే కుసంస్కారంతో ఉంటే గనక వీరి భవిష్యత్తు ఏమవుతుందో... అనే బాధ తల్లిదండ్రులకు ఉండటం చాలా సహజం. పత్రికల్లో కనిపిస్తున్న రోజువారీ ఘటనలు ‘వెర్రి అభిమానం’ వల్ల ప్రమాదం తెచ్చుకుంటున్న యువతను చూపెడుతున్నాయి. ఇంకానా ఇకపైనైనా మారండి అని హెచ్చరిస్తున్నాయి.దర్శన్ అభిమానులు ఏం చేశారు?గత రెండు రోజులుగా కన్నడ హీరో దర్శన్ అభిమానులు అక్కడి నటి, మాజీ ఎం.పి. అయిన రమ్యను సోషల్ మీడియాలో తీవ్ర పదజాలంతో హింసిస్తున్నారు. ఆమెను చంపుతామని, రేప్ చేస్తామని ఇంకా రాయడానికి వీలుకాని భాషలో ఆమెకు క్షోభ కలిగిస్తున్నారు. దానికి కారణం ఇటీవల ఆమె సోషల్ మీడియాలో చేసిన కామెంట్. దర్శన్కు గతంలో కర్నాటక హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. దానిని కర్నాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేస్తే సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేస్తూనే కర్నాటక హైకోర్టు బెయిల్ ఎలా మంజూరు చేసిందనే విషయమై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇది చాలా అసమంజసం అని చెప్పింది. ఈ విషయాన్నే ఉటంకిస్తూ రమ్య సోషల్ మీడియాలో ‘సుప్రీంకోర్టు ఒక ఆశాకిరణంలా కనిపిస్తోంది’ అని రాసింది. అంటే దర్శన్ బెయిల్ మీద బయట తిరగడం సరి కాదు అని ఆమె ఉద్దేశం. దీంతో ఫ్యాన్స్ రెచ్చిపోయారు.దర్శన్ కేసుదర్శన్ 2024 జూన్లో అరెస్ట్ అయ్యాడు. దీనికి కారణం చిత్రదుర్గకు చెందిన తన అభిమాని రేణుకా స్వామి హత్యలో అతని ప్రమేయం ఉందనే అభియోగం. రేణుకా స్వామి కూడా ‘వెర్రి అభిమాని’గా ఉండి ప్రాణం మీద తెచ్చుకున్నాడు. జరిగింది ఏమంటే దర్శన్కు, అతని భార్య విజయలక్ష్మికి కొంత కాలంగా సయోధ్య లేదు. అందుకు కారణం దర్శన్ గర్ల్ఫ్రెండ్ పవిత్ర గౌడ అని కొందరు అభిమానులు భావించారు. దర్శన్ అభిమాని అయిన రేణుకా స్వామి దర్శన్ జీవితంలో కలత రేపిన పవిత్ర గౌడను సోషల్ మీడియాలో అబ్యూజ్ చేయసాగాడు. అతని కామెంట్లు భరించలేని పవిత్ర ఈ సంగతిని దర్శన్ దృష్టికి తీసుకు రాగా అతను తన అభిమానులతో కలిసి రేణుకా స్వామిని హత్య చేయించాడని అభియోగం. ఈ కేసు విచారణలో ఉండగానే డిసెంబర్, 2024లో కర్నాటక హైకోర్టు దర్శన్కు బెయిల్ ఇచ్చింది. దానిని తాజాగా సుప్రీంకోర్టు తప్పు పట్టింది. అలా తప్పు పట్టడం సరైన విషయంగా రమ్య భావిస్తూ కామెంట్ చేసింది.కేసుల్లో అభిమానులురమ్యను అశ్లీల మాటలు అంటూ నానా హంగామా చేసిన దర్శన్ అభిమానులపై రమ్య పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. 47 ఇన్స్టా హ్యాండిల్స్ను పోలీసుల దృష్టికి తెచ్చింది. ఇప్పుడా ఇన్స్టా హ్యాండిల్స్ ఏ అభిమానులైతే నడుపుతున్నారో వారంతా ప్రమాదంలో పడినట్టు. నేరం రుజువైతే 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. అభిమానం సినిమా చూసేంత వరకూ ఉండాలి కాని ఇలా నటుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి వారికి వత్తాసు పలుకుతూ తీవ్ర చర్యలు చేపట్టేంతగా మాత్రం ఉండకూడదు. ఈ బూతులు తిట్టిన అభిమాని ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉండొచ్చు. తల్లిదండ్రులకు ఈ సంగతే తెలియకవచ్చు. రేపు అరెస్ట్ అయితే వారి పరిస్థితి ఏమిటి? రమ్యకు మద్దతుగా కన్నడ ఇండస్ట్రీ నిలబడింది. అంతే కాదు కర్నాటక మహిళా కమిషన్ సూమోటోగా కేసును తీసుకుని నిందితులను పట్టుకోమని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.ఒక నటుడి వ్యక్తిగత జీవితంలో అనవసరంగా తల దూర్చడం వల్ల ఇప్పటికే ఒక అభిమాని హత్యకు గురయ్యాడు. ఇప్పుడీ కేసు వల్ల ఎందరు అభిమానులు నష్టపోతారో?! తల్లిదండ్రులూ బహుపరాక్. తెలుగు నాట కూడా ఇలాగే అభిమానాలు వెర్రితలలు వేస్తున్నాయి. ఫోన్ చేతిలో ఉంది కదా అని హద్దు మీరిన వ్యాఖ్యలు చేస్తే అవి నేరాభియోగానికి ఆధారాలవుతాయి. శిక్షకు సాక్ష్యాలవుతాయి. పిల్లల్ని హెచ్చరించండి. వారు ఏ వయసు వారైనా సరే. (చదవండి: ఆలోచనలతో కంప్యూటర్ని కంట్రోల్ చేస్తున్న తొలి మహిళ! ఏకంగా 20 ఏళ్లకు పైగా పక్షవాతం..) -
పాస్పోర్ట్ సమస్య జటిలమే కానీ..పరిష్కారం ఉంది
మా కూతురు అమెరికాలో వుంటుంది. అక్కడ గ్రీన్ కార్దు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటోంది. సమస్య ఏమిటంటే, తన బర్త్ సర్టిఫికెట్లో పుట్టిన తేదీ 22–10–1999 అని ఉంది. కానీ పాస్పోర్టు – విద్య సర్టిఫికెట్లు అన్నిట్లో 22–10–1998 అని ఉంది. ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే బర్త్ సర్టిఫికెట్లో ఉన్న పుట్టిన తేదీ – పాస్పోర్ట్లో ఉన్న తేదీ ఒకటే అయి ఉండాలి, లేకపోతే కుదరదు అంటున్నారు. మా అమ్మాయి ఇవి మార్పించమని అడుగుతోంది. పాస్పోర్టులో పుట్టిన తేదీ మార్చుకోవటం కుదురుతుందా? – పూర్ణిమ, చిత్తూరుమీరు అడిగిన ప్రశ్న చిన్నదిగా అనిపించినప్పటికీ పరిష్కారం అంత సులభమైనదేమీ కాదు. ఐతే కొంచెం కష్టం అయినప్పటికీ పరిష్కారం ఉంది. పాస్పోర్టులో పుట్టిన తేదీ మార్చుకోవడం సాధారణ పరిస్థితులలో వీలుపడదు. పుట్టిన తేదీని మార్చడానికి గల కారణాలు చాలా బలమైనవిగా, నిర్దిష్టంగా ఉండాలి. అలా మార్చుకోవడానికి గల కారణాలను వివరిస్తూ తగిన రుసుము చెల్లించి పాస్పోర్ట్ అధికారులకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. మేజర్ అయిన తర్వాత పాస్పోర్ట్ తీసుకుని ఉన్నట్లయితే, పాస్పోర్ట్ పొందిన ఐదు సంవత్సరాల లోపు ఈ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మైనర్ గా ఉన్నప్పుడు తీసుకున్న పాస్పోర్ట్ అయితే, తిరిగి రెన్యువల్ చేసుకునేటప్పుడు కూడా మార్చుకోవచ్చు. ఈ రెండు సందర్భాలలోని గడువు దాటి΄ోతే, ఇక పాస్పోర్ట్లోని పుట్టిన తేదీ మార్చడం కోర్టు జోక్యం చేసుకుంటే తప్ప కుదరదు. కానీ కేవలం పాస్పోర్ట్ మార్చుకున్నంత మాత్రాన మీ అమ్మాయి సమస్య తీరదు. ఎందుకంటే, పాస్పోర్ట్ లోని వివరాలను అమెరికా వెళ్లేటప్పుడు వీసా కోసం, పై చదువుల కోసం, లేదా ఉద్యోగం కోసం కూడా ఇచ్చి ఉంటారు కాబట్టి, ఆ రికార్డులు అన్నీ కూడా మార్చవలసి వస్తుంది. అలా కాకుండా కేవలం పాస్పోర్ట్, బర్త్ సర్టిఫికెట్ మాత్రమే చూస్తార్లే అని తేలిగ్గా తీసుకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది జాగ్రత్త!మీ అమ్మాయి రికార్డులలో వ్యత్యాసం ఉంటే ప్రస్తుతం ఉన్న వీసా సమస్య ఇంకా జటిలం అవ్వచ్చు. గ్రీన్ కార్డు కోసం చేసుకునే ఐ–495 దరఖాస్తు సమయంలో దరఖాస్తుదారుల ద్వారా వారి పూర్వవీసాలు, డాక్యుమెంట్లు, ధ్రువీకరణలు అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. అన్నిట్లో ఒకే సమాచారం లేకపోతే లేదా ముందస్తు సంజాయిషీ ఇచ్చి ఉండకపోతే కొత్త సమస్య మొదలై, ఉన్న వీసా కూడా పోవచ్చు. అంతేగాక, అన్ని సర్టిఫికెట్లలో 1998 ఉంది అని చెప్పారు కాబట్టి, అవన్నీ కూడా మార్చాల్సి వస్తుంది కదా... అందుకే, పాస్పోర్ట్లో మార్పు చేసుకున్న తర్వాత CI (అమెరికా పౌరసత్వ – ఇమ్మిగ్రేషన్ సేవ) – USDHS (అమెరికా అంతర్గత భద్రతా విభాగం) వంటి సంస్థలకు స్వతహాగా, స్వచ్ఛందంగా అన్ని అంశాలను తెలియజేయటం మంచిది. అవసరమయితే మీ జిల్లాలో సివిల్ కోర్టును ఆశ్రయించి కూడా డిక్లరేషన్ కోరే అవకాశం లేకపోలేదు. అలా డిక్లరేషన్ పొందిన తర్వాత రికార్డులలో సవరణలు చేసే వీలుంటుంది. ముందుగా అమెరికాలోని ఒక మంచి ఇమ్మిగ్రేషన్ లాయర్ను కలిసి ఏ రికార్డు మారిస్తే మంచిది, లేక బర్త్ సర్టిఫికెట్ లేకుండా మరేదైనా ఉసాయం ఉందేమో తెలుసుకోండి.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. )(చదవండి: 12వ తరగతి డ్రాపౌట్..సొంతంగా జిమ్..ఇంతలో ఊహకందని మలుపు..!) -
సూపర్ ఫాస్ట్ కంపోస్టర్!
సేంద్రియ వ్యర్థాలను కేవలం 8 గంటల్లో కంపోస్టు ఎరువుగా మార్చే ఆధునిక టెక్నాలజీని బెంగళూరుకు చెందిన వేస్ట్ ఈజ్ గోల్డ్ అనే స్టార్టప్ రూపొందించింది. ఇంత సూపర్ ఫాస్ట్గా పోషకవంతమైన కంపోస్టు తయారు చేయగల మరో సంస్థ లేదు. 20 కేజీల నుంచి 10 టన్నుల చెత్తనైనా కేవలం ఎనిమిది గంటల్లో ఎటువంటి హానికరమైన వాయువులను వెలువరించకుండా కంపోస్టుగా మార్చేస్తోంది ఈ సంస్థ రూపొందించి గోల్డ్ కంపోస్టర్. ‘సేంద్రియ చెత్తను అత్యంత వేగంగా కంపోస్టుగా మార్చే సూక్ష్మజీవుల మిశ్రమాన్ని, బయోరియాక్టర్ టెక్నాలజీని ఉపయోగించుకునే నాచురల్ బయో మెకానికల్ ప్రాసెస్ను అనుసరిస్తున్నాం. టన్నుల కొద్దీ చెత్తనైనా ఒక్క రోజులోనే ఎరువుగా మార్చేస్తాం’ అంటున్నారు ఈ స్టార్టప్ అధినేత తివారి. ‘అధికంగా వేడిని ఉత్పత్తి చెయ్యకుండా సేంద్రియ వ్యర్థాలను అతివేగంగా విచ్ఛిన్నం చేస్తున్నందు వల్ల మిథేన్ వంటి హానికారక వాయువులు వెలువడకుండా చూస్తున్నాం. దీని వల్ల వ్యర్థాలను కంపోస్టుగా మార్చే పనిలో కాలుష్యం లేకుండా పోయింది. ఆక్సిజన్ను ఉపయోగించే సూక్ష్మజీవరాశిని, బయో రియాక్టర్ను ఏరోబిక్ డీకంపోజిషన్ పద్ధతిలో వాడటం వల్ల ఇది సాధ్యపడుతోంద’న్నారాయన. మేం తయారు చేసే కంపోస్టును తిరిగి మళ్లీ ఏ ప్రాసెసింగ్ చెయ్యాల్సిన అవసరం లేదని, నిల్వ చేసుకోవచ్చు. లాండ్స్కేపింగ్ కోసమైతే అదే రోజు వాడుకోవచ్చు. వ్యవసాయం కోసమైతే 3 నుంచి 7 రోజులు మాగిన తర్వాత ΄÷లాల్లో వేసుకుంటే పోషకాలు పుష్కలంగా భూమికి అందుతాయ’న్నారు తివారి. వండిన ఆహార వ్యర్థాలు, సేంద్రియ తడి చెత్త, ఎముకలు, మాంసం వ్యర్థాలు, ఈకలు, గుడ్ల పెంకులు, కూరగాయ వ్యర్థాలు, లేత కొబ్బరి బొండాల డొప్పలు, పండ్ల తోటల వ్యర్థాలు, గడ్డి కత్తిరింపులు, టిష్యూ పేపర్, ఎస్టీపీ వ్యర్థాలు.. వంటి వేటినైనా సరే తమ గోల్డ్ కంపోస్టర్ ద్వారా సమర్థవంతంగా 8 గంటల్లో కంపోస్టుగా మార్చవచ్చని తివారి చెబుతున్నారు. ఇది నిజంగా గోల్డ్ కంపోస్టరే. ఎందుకంటే, పట్టణ వ్యర్థాలను సేకరించిన తర్వాత అందులోని కుళ్లే సేంద్రియ వ్యర్థాలను, కుళ్లని ΄్లాస్టిక్ తదితర వ్యర్థాలను వేరు చేయటం పెద్ద పని. ఈ పనిని కూడా గోల్డ్ కంపోస్టరే చేసేస్తుందని తివారి చెబుతున్నారు. ఇది చాలా ముఖ్యమైన ఆవిష్కరణగా చెప్పవచ్చు. ఇప్పటికే ఈ కంపోస్టర్లను దేశంలో 150 చోట్ల నెలకొల్పారు. 2,500 టన్నుల చెత్తను 1,200 టన్నుల కంపోస్టుగా మార్చేయటం కూడా జరిగిందట. అయితే ఇదంతా ఒక్క రోజులో జరగలేదు. పదేళ్ల ప్రయాణం, ప్రయాస దీని వెనుక ఉంది అన్నారు తివారి. ఈ గోల్డ్ కంపోస్టర్లను నగరాలు, పట్టణాల్లో కాలనీలు, వార్డులు, గేటెడ్ కమ్యూనిటీలు, అ పార్ట్మెంట్ల దగ్గర నెలకొల్పి ఎక్కడికక్కడే సేంద్రియ వ్యర్థాలను కంపోస్టుగా మార్చేస్తే.. నగరాలు, పట్టణాల మూలంగా చెత్త కొండలుగా పోగుపడే సమస్య ఇట్టే పరిష్కారమైపోతుంది. పార్కులకు, ఇంటిపంటలకు, పంట ΄÷లాలకు కూడా సిటీ కంపోస్టు పెద్ద పరిమాణంలో అందుబాటులోకి వస్తుంది. ఆల్ ద బెస్ట్ టు గోల్డ్ కంపోస్టర్! -
ట్రీ ఆఫ్ లైఫ్
కొబ్బరిలో అద్భుతమైన ఆరోగ్యదాయక లక్షణాలున్నాయి. కొబ్బరి ఒక చక్కని ఆహారం. ఆరోగ్యదాయకమైన కొబ్బరి నీరును, అద్భుతమైన నూనెను అందించే గొప్ప పంట. ప్రపంచవ్యాప్తంగా ఎందరికో జీవనో పాధిని అందిస్తుండటం వలన దీన్ని ‘జీవన వృక్షం (ట్రీ ఆఫ్ లైఫ్)’గా పరిగణిస్తారు. కొబ్బరి శాస్త్రీయ నామం కోకోస్ న్యూసిఫెరా ఎల్ (అరేకేసి). కొబ్బరిని ఆహారంగా, ఆథ్యాత్మిక సాధనంగా, పానీయంగా, ఔషధ విలువలున్న నూనెగా ఉపయోగపడుతోంది. పీచుగా అనేక ఉత్పత్తులను తయారుచేసే పరిశ్రమలకు ముడిసరుకుగా ఉపయోగపడుతోంది. 80 కంటే ఎక్కువ దేశాల్లో సుమారు కోటి కుటుంబాలు కొబ్బరిని తమ ప్రాథమిక ఆహారంగా, ఆదాయ వనరుగా ఉపయోగించుకుంటున్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత విస్తృతంగా సాగు చేస్తున్న, ఉపయోగించబడే చెట్టుగా మారింది. కొబ్బరి గానుగ నూనెను వంటకు వాడటం ఇటీవల కాలంలో బాగా పెరిగిన నేపథ్యంలో వండర్ ట్రీ ఆఫ్ లైఫ్పై స్పెషల్ ఫోకస్...కొబ్బరి ఆధారిత వ్యవసాయ విధానం తరతరాలుగా అభివృద్ధి చెందిన ప్రకృతి ఆధారిత వ్యవసాయ పద్ధతులకు ప్రసిద్ధ ఉదాహరణ. కొబ్బరి చెట్లు ఇంటి పంటల్లో/తోటల్లో ముఖ్యమైన భాగాలు. ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లు నాటుకోవటం అనేక దేశాల్లో సుదీర్ఘ కాలపు సంప్రదాయంగా కనిపిస్తుంది. ఇంటి తోటలలోని కొబ్బరి చెట్లు ఆ కుటుంబానికి జీవనాధార వ్యవస్థగా మారాయి. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ఇలా చెబుతోంది: కొబ్బరి తదితర పంటల వైవిధ్యంతో కూడిన ఇంటి/పెరటి పంటలు రైతు కుటుంబం ప్రాథమిక అవసరాలను తీర్చటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆహార భద్రత, ఆదాయ భద్రత, ఉ పాధి భద్రత కల్పిస్తుంది. ప్రతికూల వాతావరణ విపత్తులను తట్టుకునే శక్తిని ఇంటి/పెరటి పంటలు మెరుగుపరుస్తాయి. ఇందుకోసం పెరటి తోటల్లో అనేక పంటలు, పశువులు, కోళ్లు, చేపల పెంపకం కూడా కలిసి ఉంటుంది. 15వ శతాబ్దపు మళయాళ కావ్యం ‘కృషి గీత’లో కేరళలో మధ్యయుగపు పర్యావరణ అనుకూల సాగు వ్యవస్థల ప్రస్తావన ఉంది. కొబ్బరి ఆధారిత వ్యవసాయ వ్యవస్థలను ఇందులో ప్రముఖంగా పేర్కొనటం విశేషం. కొబ్బరి సేద్యంలో ఉత్తమ వ్యవసాయ పద్ధతులు...నాణ్యమైన, స్వచ్ఛమైన లేక జన్యు స్వచ్ఛత కలిగిన కొబ్బరి నారు మొక్కల పూర్తి వివరాలు తెలుసుకొని నమ్మ దగ్గ నారు మొక్కలను ఎంచుకోవాలి. ప్రభుత్వ ఉద్యానశాఖ విభాగం వారి గుర్తింపు పొందిన నర్సరీల నుంచి సేకరించుకొని జాగ్రత్త పడాలి. సంవత్సరం అంతా పండే పంట కాబట్టి నాణ్యత విషయంలో రాజీ పడకుండా నారు మొక్కలను శ్రద్ధగా ముందు జాగ్రత్తతో సేకరించుకొని నాటుకోవాలి. పచ్చి కొబ్బరి బోండం (చౌగాట్ ఆరెంజ్ డ్వార్ఫ్ అంటే నారింజ రంగు గల ΄÷ట్టి రకం) తెగులును తట్టుకునే/తెగులును ఎదుర్కొనే (కల్ప రక్ష, కల్ప శ్రీ కల్ప శంకర) రకాలను, కురిడి కొబ్బరి రకం (లక్షద్వీప్ మైకో) మొదలైనవి మేలు.నాటేందుకు అనుకూల నేలలు...కొబ్బరి సాగులో అతి ముఖ్యమైన సూత్రం ఏమిటంటే, వెలుతురు బాగా ప్రసరించాలి. కొబ్బరికి అనుకూలమైన నేలలను ఎంచుకుంటే గాలి, వెలుతురు ప్రసరణ బాగా జరిగి నత్రజనిని, కర్బనాన్ని, ఆక్సిజన్ను బాగా గ్రహించి పంటలు బాగా ఎదగడానికి సహకరిస్తుంది. చెట్టు ఆకుల్లో కిరణ జన్య సంయోగ క్రియ సామర్థ్యం పెరగాలంటే ఖాళీ భూముల్లో సాధ్యమైనంత వరకు మొక్క నాటడం ఉత్తమం. కేరళలో ఎక్కువగా కొబ్బరి నారు మొక్కలను వెలుతురు కోసం పెద్ద చెట్ల కింద నాటుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల గాలి, వెలుతురు ప్రసరణ సక్రమంగా అందక లేత మొక్కలు చీడ పీడల తాకిడికి తీవ్రంగా గురి అవుతూవుంటాయి. అంతేగాక ఈ చెట్లు పూత పూయడానికి ఎక్కువ కాలాన్ని వెచ్చిస్తాయి కూడా! కొబ్బరి నారు మొక్కల్ని నీరు సరిగ్గా పారని భూముల్లో నాట కూడదు. ఇలా చేయడం వల్ల ప్రారంభ దశలో పోషకాలు సరిపడక వేర్ల శ్వాసక్రియ సక్రమంగా ఉండదు. ఒక వేళ ఈ పరిస్థితులలో పెరిగినా ఎదుగుదలలో ఆటంకం ఏర్పడి కాయల దిగుబడిలో ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి. లేత మొక్కలకు ఎదిగెందుకు తగిన తేమ అవసరం. అదే తరుణంలో పాదులో నీరు నిలచే పరిస్థితిని తట్టుకోలేవు. కొబ్బరి చెట్లు ఎదగడానికి ముందుగానే మంచి వెలుతురు, గాలిలోని మూలకాలు బాగా గ్రహించేందుకు సహకరించే భూసారం అవసరం. అప్పుడే మొక్కలు బాగా ఎదుగుతాయి.పంటకు కావలసిన భూభౌతిక వనరులు...నిర్థిష్టమైన నియమం ప్రకారం ఒక సెంటు భూమి(40 చదరపు మీటర్ల)లో ఒకే ఒక్క కొబ్బరి నారు మొక్కను నాటే ఏర్పాటు చేసుకోవాలి. రైతులందరు కొబ్బరి సాగును ఏక పంటగా పెంచేటపుడు అన్ని మొక్కలకు 7.5మీ. “ 7.5 మీ.లు, ΄÷ట్టి రకాల మొక్కలను 7.0మీ గీ 7.0మీ. ల ఖాళీ స్థలం ఉండే విధంగా నాటాలి. పెరటి తోటలలాగా ఎక్కువ పంటలను కలిపి పండించే సమయంలో చెట్లకు గాలి బాగా సోకే విధంగా తక్కువ మొక్కలు నాటాలి. రాజీ పడకూడదు. నాటే సమయంలో తక్కువ స్థలం కేటాయిస్తే గాలి ఆడక చెడు వాసన ప్రబలి చీడపీడలకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అంతర పంటలను అనుబంధంగా పండించడం వల్ల చీడపీడల నియంత్రణ బాగా జరుగుతుంది. తోటలో పక్షులు వాలడానికి పంగ కర్రలు, సన్నని కాడ కలిగినటువంటి పూల మొక్కలను గుంపులుగా పెంచితే చీడపీడల నెదుర్కొనేలా పర్యావరణ రక్షణ సేవలు పొందవచ్చు. కొబ్బరి తోటల్లో కొమ్ము పురుగును నివారించేందుకు కొబ్బరి ఆధారిత వివిధ పంటల సాగు ఏక పంటగా కొబ్బరి చెట్ల సాగుకంటే బాగా అనుకూలంగా ఉన్నట్లు రూఢి అయ్యింది.పంట రక్షణ...నారు మొక్కల జీవక్రియ పెంచడానికి, నారు మొక్కలను నాటిన తర్వాత స్యూడోమొనాస్ను నాలుగు ఏడు, పది నెలల్లో 50 గ్రా. చొప్పున వేస్తూండాలి. మొక్కల్ని నాటేటప్పుడు 100 గ్రాముల స్యూడోమోనాస్ ΄÷డితో ద్రావణం చేసి వేరు మొక్కలను అందులో ముంచి నాటాలి. నాటిన మొక్కల హద్దుల వెంబడి గ్లైరిసీడియా మొక్కలను పెంచుతూ, వాటి ఆకులను కత్తిరించి మొక్కల పాదులలో మల్చింగ్ వేయడం వల్ల భూసారంలో మేలు చేసే సూక్ష్మజీవులే గాక సేంద్రియ పదార్థం వల్ల భూభౌతికంగా రసాయనికంగా, జీవనసంబంధమైన ఎరువులు వృద్ధి అవుతాయి. సేంద్రియ సూక్ష్మ పోషకాలు కూడా అభివృద్ధి అయి అందుబాటులో ఉంటాయి. సేంద్రియ ఎరువు తయారవుతూండడం వల్ల పంటలకు పోషకాలు (బయో ఎంజైములు) చెట్ల ఎదుగుదలకు బాగా అనుకూలిస్తాయి. బాగా మగ్గిన వర్మికంపోస్టు (10గ్రా. ఒక చెట్టుకు) లేక పశువుల ఎరువు (ఒక కిలో / చెట్టుకు) వేప చెక్క (2కిలోలు / చెట్టుకు) (ట్రైకోడెర్మా కలిపి (250 గ్రా/ చెట్టుకు) లేత కొబ్బరి మొక్కకు నాటిన తొలి దశలో ఎరువుగా ఉపయోగించుకోవాలి.జీవవ్యర్థాల పునరుత్పత్తి వినియోగం...ఏప్రిల్ – మే, సెప్టెంబర్ – అక్టోబర్ నెలల్లో జనుము, జీలుగ పంటల ఆకులను పచ్చి రొట్ట ఎరువుగా చెట్టుకు 100 గ్రాములు పాదులలో వేసినట్లయితే వాతావరణ సంబంధ నత్రజని మాత్రమే గాక కాల్షియం: నత్రజని నిష్పత్తి కూడా బాగా వృద్ధి అవుతుంది. పచ్చి రొట్ట ఎరువును వేయడం వల్ల భూమి లోపలి ΄÷రలలోకి గాలి పుష్కలంగా ప్రవహించేందుకు దోహదం చేస్తుంది. వేరు వ్యవస్థ బాగా వృద్ధి అవడం, తేమ కొరత ఉన్నా కూడా మొక్కలు నిలదొక్కుకుని పెరగడం గమనించవచ్చు.చెట్లకు నీటి పారుదల చాలా క్లిష్టమైన అంశం వేసవి కాలంలో తేమ కొరతను నివారించేందుకు చెట్టుకు 200 లీటర్ల నీటిని వారానికి ఒక్కసారి అందివ్వడం అతి ముఖ్యమైన విషయం. అత్యధిక ఉత్పత్తిని సాధించేందుకు బిందు సేద్యం అందిస్తూ వినియోగించ వలసిన నీటిని పూర్తిగా ఉపయోగించడం అన్నది మరొక విధానం. వర్షాకాలంలో కూడా తగిన విధంగా నీరు ఇవ్వాలి. కోస్తా తీరంలో సముద్రజలాల పారుదలకు వీలున్నప్పుడు 500ల గ్రాముల ట్రైకోడెర్మా విరిడితో నాణ్యమైన వేప చెక్కను, పచ్చి రొట్ట ఎరువుగా పచ్చని ఆకులను చేర్చి వేసుకోవాలి. కొబ్బరి తోటల అభివృద్ధికో పథకంకొబ్బరి ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదల కోసం రైతులకు కొబ్బరి అభివృద్ధి బోర్డు సహాయం దరఖాస్తుకు చివరి తేదీ జూలై 31ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే సాగులో ఉన్న కొబ్బరి తోటల్లో అంతర పంటల సాగు ద్వారా ఉత్పాదకతను పెంపొందించటం కోసం కొబ్బరి బోర్డు 2025–26 సంవత్సరానికి గాను రైతులు, రైతు బృందాలు, ఉత్పత్తిదారుల సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కొబ్బరి ఆధారిత పంటల వ్యవస్థ ద్వారా ఉత్పాదకత మెరుగుదలకు క్లస్టర్ ప్రాతిపదికన, బోర్డు నియమ నిబంధనలకు లోబడి రైతు భాగస్వామ్య విధానం ద్వారా ప్రస్తుత తోటల్లో ఉత్పత్తి, ఉత్పాదకతలను మెరుగుపరచడానికి కొబ్బరి బోర్డు ఆర్థిక సహాయం అందిస్తుంది. సూచించిన ఫార్మాట్లో దరఖాస్తులు / ప్రతి పాదన లు ఈ నెల 31 లోగా పం పాలి. కీలకమైన ఉత్పాదకాలు, అంతర పంటలు నాటడం, సామగ్రి, పచ్చి ఎరువు విత్తనాలు, మొక్కల రక్షణ రసాయనాలు మొదలైన వాటి ఖర్చులకు బోర్డు సహాయం వరుసగా రెండు సంవత్సరాలు అందించనుంది. కూలీల ఖర్చులు, ఇతర అద్దె సేవలు, మౌలిక సదు పాయాల అభివృద్ధి మొదలైన వాటికి ఈ పథకం వర్తించదు. ఆసక్తిగల రైతు బృందాలు 2025–07–31 ఉదయం 10.30 గంటల్లోగా అవసరమైన పత్రాలతో పాటు సూచించిన ఫార్మాట్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతులు దరఖాస్తులను స్వయంగా లేదా పోస్టు ద్వారా ఇవ్వాల్సిన చిరునామా: డిప్యూటీ డైరెక్టర్, కొబ్బరి అభివృద్ధి బోర్డు, రాష్ట్ర కార్యాలయం, డోర్ నంబర్ 54–14/5–18ఎ, రోడ్ నెం.11, భారతి నగర్, నోవోటెల్ దగ్గర, రింగ్ రోడ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా – 520008.పోషకాలమయం కొబ్బరి నూనె!కొబ్బరి నూనెను తల నూనెగానే చాలా మంది ఉపయోగిస్తుంటారు. కానీ, పోషకాల నిలయమైన కొబ్బరి నూనెను వంటకు ఉపయోగించవచ్చు. మనుషుల ఆయుప్రమాణం ఎక్కువగా ఉండే కేరళ రాష్ట్రంలో వంటకు కొబ్బరి నూనెనే విరివిగా ఉపయోగిస్తారు. కొబ్బరి అభివృద్ధి బోర్డు సమాచారం ప్రకారం.. ఈ నూనెలోని పోషకాలు, వంటకు ఉపయోగించే విధానాల గురించి తెలు సుకుందాం.ఆరోగ్యపరమైన ప్రయోజనాలుకొబ్బరి నూనె జీర్ణశక్తిని పెంచి వ్యాధులు, ఇన్ఫెక్ష న్లకు గురికాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఇందులోని శాచురేటెడ్ ఫ్యాట్స్ గుండెకు హాని కలిగిస్తాయనుకుంటారు. కానీ అది నిజం కాదు. శాచురేటెడ్ ఫ్యాట్స్ గుండెకు మేలు చేస్తాయి. దీన్లోని లారిక్ యాసిడ్ కొలెస్ట్రాల్.. రక్తపోటు వల్ల గుండెకు హాని కలగకుండా రక్షణనిస్తుంది కొబ్బరి నూనెలోని షార్ట్ అండ్ మీడియం చైన్ ఫ్యాటీ ఆమ్లాలు శరీర అధిక బరువును తగ్గిస్తాయి. అలాగే కొబ్బరినూనె వాడటం వల్ల ΄÷ట్ట చుట్టూ కొవ్వు పేరుకోకుండా ఉంటుంది కొబ్బరినూనె వాడకం వల్ల థైరాయిడ్ ఇతర ఎండోక్రైన్ గ్రంథులు సక్రమంగా పనిచేస్తాయి శరీర మెటబాలిక్ రేటును పెంచుతుంది. ఫలితంగా శరీర బరువు అదుపులో ఉంటుంది ఈ నూనెలో ఉండే యాంటీమైక్రోబియల్ లిపిడ్స్, లారిక్ యాసిడ్, కాప్రిలిక్ యాసిడ్లు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాల్ని కలిగి ఉంటాయి. కాబట్టి కొబ్బరి నూనె వాడకం వల్ల సంబంధిత వ్యాధులు దరి చేరవు కిడ్నీలో ఏర్పడే రాళ్లను కరిగించే శక్తి కూడా కొబ్బరి నూనెకు ఉంది.కొబ్బరి నూనెను వంటల్లో ఇలా వాడాలికొబ్బరి నూనె స్మోకింగ్ పాయింట్ 350 ఫారిన్హీట్ కాబట్టి ఈ నూనెను అన్ని రకాల వంటలకూ వాడొచ్చుకేకు వంటి వంటకాల్లో వెన్నకు బదులుగా కొబ్బరి నూనెను ఉపయోగించొచ్చు అలాంటప్పుడు వెన్న పరిమాణంలో 25% తక్కువ కొబ్బరి నూనె వాడాలి పాప్కార్న్ తయారీకి కొబ్బరినూనెను వాడొచ్చు వర్జిన్ కోకోనట్ ఆయిల్ వెన్నలా ఉంటుంది. దీన్ని బటర్ మాదిరిగా బ్రెడ్ మీద పూసుకొని తినొచ్చు స్మూదీస్, సూప్స్, సాసుల్లో కలుపుకోవచ్చు ఈ నూనెతో అన్ని రకాల కూరగాయల వేపుళ్లు వండుకోవచ్చుపప్పు తాలింపులో వాడొచ్చు. ఆధారం: భారత ప్రభుత్వ సంస్థ ‘కొబ్బరి అభివృద్ధి బోర్డు’. -
మిసెస్ ఇండియాగా విజయలక్ష్మి
సాక్షి, సిటీబ్యూరో/సంబేపల్లె: మిసెస్ ఇండియా సీజన్ –5 విజేతగా కవ్వం విజయలక్ష్మి నిలిచారు. ఢిల్లీలో జరిగిన గ్రాండ్ఫినాలే ఫలితాలను నిర్వాహకులు బుధవారం ప్రకటించారు. హైదరాబాద్ ప్రతినిధిగా పోటీల్లో పాల్గొన్న విజయలక్ష్మి అన్ని రౌండ్లలోనూ విజేతగా నిలిచారు. వీఆర్పీ ప్రొడక్షన్ డైరెక్టర్ డా. రీతు ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ గ్రామీణ వాతావరణంలో పుట్టి, వ్యవసాయ రంగం నుంచి పలు సంస్థలను నిర్వహించి, జాతీయ స్థాయిలో విజేతగా నిలవడం సంతోషాన్నిచి్చందన్నారు. దీని వెనుక కుటుంబ సభ్యుల సంపూర్ణ మద్దతు ఉందని పేర్కొన్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి.. అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండలం మినుమరెడ్డిగారిపల్లెలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన రామాంజులు రెడ్డి, సరస్వతమ్మల రెండో కుమార్తె కవ్వ విజయలక్ష్మి. సంబేపల్లె ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఆమె ఇంటర్ సండుపల్లె మండలం జీకే రాచపల్లెలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అభ్యసించింది. తర్వాత ఆమె వివాహం చేసుకొని హైదరాబాద్లో స్థిరపడింది. తాను సాధించిన విజయాన్ని రాష్ట్రంలో మహిళలకు అంకితం ఇస్తున్నట్టు విజయలక్ష్మి తెలిపింది. -
బ్రహ్మపుత్ర మెచ్చిన సాహస పుత్రిక
సాహసం సైలెంట్గా ఉండదు. కంచుకంఠంతో మనలోని ఆత్మవిశ్వాసాన్ని తట్టి లేపుతుంది. ఆ పిలుపును కాలేజీ రోజుల్లోనే అందుకుంది శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతానికి చెందిన వాసుపల్లి కవిత. సాహసంతో చెలిమి చేసిన కవిత బ్రహ్మపుత్రలో రివర్ రాఫ్టింగ్ విజయవంతంగా పూర్తి చేసిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఆర్మీ వైద్యాధికారి అయిన కవిత అరుణాచల్ప్రదేశ్లో అత్యంత ఎత్తయిన గోరీచెన్ పర్వతాన్ని ఐదుసార్లు అధిరోహించింది. మరెన్నో సాహసయాత్రలకు సిద్ధం అవుతోంది.ఉద్దానం ప్రాంతమైన వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామంలోని సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వాసుపల్లి కవితకు చిన్నప్పటి నుంచి క్రీడలు, స్విమ్మింగ్ అంటే ఇష్టం. చదువులోనూ ముందుండేది. కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీటు సాధించింది. శ్రీకాకుళంలోని రిమ్స్ వైద్య కళాశాలలో సమయంలో ట్రెక్కింగ్ చేసేది.సైన్యంలోకి....సైన్యంలో పనిచేయాలనే ఆసక్తి కవితలో ఉండేది. 2021లో ఆర్మీ వైద్యాధికారిగా కెప్టెన్ హోదాలో ΄ోస్టింగ్ పొందిన కవిత మేజర్ స్థాయికి చేరింది. అరుణాచల్ ప్రదేశ్లో పనిచేస్తున్నప్పుడు సాహస క్రీడలపై ఇష్టంతో ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్’లో చేరి పర్వతారోహణకు సంబంధించి రెండు కోర్సులు, రివర్ రాఫ్టింగ్లో ఒక ప్రత్యేక కోర్సు చేసింది.ప్రాణదాతపర్వతారోహణలో శిక్షణ తీసుకున్న కవిత అరుణాచల్ప్రదేశ్లో అత్యంత ఎత్తయిన గోరీచెన్ పర్వతాన్ని ఐదుసార్లు అధిరోహించింది. కల్నల్ రణవీర్సింగ్ జమ్నాల ఆధ్వర్యంలో గోరీచెన్ అధిరోహించి కిందికి వస్తున్న సమయంలో బృందంలోని ఒక యువ సభ్యురాలు ఊపిరి అందక ప్రమాదంలో పడింది. కవిత ఆమెకు తక్షణ వైద్యం అందించి ప్రాణపాయం నుంచి తప్పించింది.బ్రహ్మపుత్రలో సాహస యాత్రఅత్యంత క్లిష్టమైన బ్రహ్మపుత్ర నదిలో 1040 కిలోమీటర్ల మేరకు విజయవంతంగా రివర్ రాఫ్టింగ్ పూర్తి చేసింది కవిత. కల్నల్ రణవీర్సింగ్ నేతృత్వంలోని పన్నెండు మంది సభ్యుల బృందంలో ఆమె ఏకైక మహిళ. బ్రహ్మపుత్రలో రివర్ రాఫ్టింగ్ విజయవంతంగా పూర్తి చేసిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. భారత–టిబెట్ సరిహద్దులోని గెల్లింగ్ గ్రామం నుంచి బ్రహ్మపుత్రలో ప్రయాణం ప్రారంభించి, ఏకధాటిగా 28 రోజులపాటు రివర్ రాఫ్టింగ్ చేశారు. ఇండో–బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న హాట్సింగిమారి దగ్గర తమ సాహసయాత్ర ముగించారు.ప్రాణం మీదికి వచ్చినా సరే...బ్రహ్మపుత్రలో రాఫ్టింగ్ సజావుగా ఏమీ సాగలేదు. ప్రాణం మీదికి తెచ్చిన ప్రమాదాలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. నది ΄÷డవునా ప్రవాహ తీవ్రత, 11 అడుగుల ఎత్తులో ఎగిసిపడే అలల ఉధృతి కారణంగా ఏర్పడిన సుడిగుండంలో చిక్కుకుని బృందం ప్రమాదంలో పడింది. కాస్త ఓపిక పడితే ప్రమాదం నుంచి బయటపడొచ్చు అనుకున్నారు. ధైర్యం కోల్పోలేదు. పెద్ద అల నుంచి తప్పించుకుని, ఈదుకుంటూ రాఫ్ట్ను చేరుకున్నారు. ఇలా నాలుగుసార్లు రాఫ్ట్ నుంచి పడి΄ోయినా ముందుకే సాగారు. యాత్రలో రోజుకు 12 గంటలపాటు 70 కిలోమీటర్ల మేరకు ప్రయాణించి రాత్రివేళల్లో విశ్రాంతి తీసుకునేవారు.వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో... సైన్యంలో చేసిన సేవలకు గుర్తింపుగా ‘చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్’ అవార్డు అందుకుంది కవిత. గోరీచెన్ పర్వతారోహణ సందర్భంగా తోటి పర్వతారోహకురాలికి చికిత్స చేసినందుకు రాష్ట్రపతి విశిష్ట సేవా మెడల్కు ఎంపికైంది. బ్రహ్మపుత్రలో రివర్ రాఫ్టింగ్ను విజయవంతంగా పూర్తి చేసినందుకు ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సాధించింది.– కందుల శివశంకర్, సాక్షి, శ్రీకాకుళం -
డీజే బీట్స్.. రోడియో నైట్స్..
యువతను ఆకర్షించే రీతిలో హైదరాబాద్ నగరంలో మరోసారి సరికొత్త సంస్కృతికి బీజం పడింది. ప్రతిష్టాత్మక ‘రాయల్ ఛాలెంజ్ అమెరికన్ ప్రైడ్ రోడియో నైట్స్’కు నగరం వేదికైంది. అమెరికా తరహా కల్చర్లో భాగమైన కాక్టెయిల్స్, దేశీ డీజే బీట్స్ మేళవింపుతో ఈ నైట్ను బోల్డ్ లైఫ్స్టైల్ ఎక్స్ప్రెషన్గా సోమాజిగూడలోని ఆక్వా పార్కులో సోమవారం వినూత్నంగా నిర్వహించారు. నగరంలో మొదలైన ఈ ఉత్సవం.. త్వరలోనే ఇతర నగరాలకూ విస్తరించనుంది. లైఫ్స్టైల్ వేదికగా అమెరికన్ స్పిరిట్, ఫ్రీడమ్, అడ్వెంచర్ థీమ్లతో బ్రాండ్ అనుభవాన్ని మరింత బలంగా ట్యాప్ చేయనుంది. ఈ ఈవెంట్ ప్రధానంగా అమెరికానా వైల్డ్ వెస్ట్ థీమ్ ఆధారంగా డిజైన్ చేశారు. డెనిమ్ స్టైల్తో అలంకరించిన డిజైన్, ఇంటరాక్టివ్ గేమ్స్, ఏ ఆర్ ఫొటో మూమెంట్స్ వంటి అనేక అనుభూతులను కలిపి లైఫ్స్టైల్ స్టేట్మెంట్గా రూపొందించారు. ఇందులో భాగంగా లాసో ఛాలెంజ్లు, హ్యామర్ స్లామ్లు, హ్యాండ్ పెయింటెడ్ డీఐవై జోన్ వంటి క్రియేటివ్ స్పేస్తో యువతను కొత్తరకంగా భాగస్వాములను చేసింది. ఈ వేదికపై ప్రత్యేకంగా క్యూరేటెడ్ అమెరికన్ బైట్స్, సిగ్నేచర్ కాక్టెయిల్స్, ఎనర్జీ ఫుల్ డీజే బీట్ అహూతులను ఉత్సాహపరిచాయి. ఆధునిక జీవనశైలి.. ‘ఇది సంగీతం, స్వేచ్ఛ, సంస్కృతిని కలిపిన ఆధునిక జీవన శైలికి ప్రతిబింబం’ అని డియాజియో ఇండియా వైస్ ప్రెసిడెంట్ వరుణ్ కూరిచ్ అన్నారు. యువత ఆత్మవిశ్వాసం, ఐడెంటిటీని ప్రతిబింబించే ఈవెంట్లను కోరుతోంది. ఈ రోడియో నైట్స్ అలాంటి అవకాశాన్ని అందించిన తొలి వేదికని తెలిపారు. -
జస్ట్ 15 వారాల్లో 50 కిలోలు ..! కానీ ఆ వ్యాధి కారణంగా..
బోనీ కపూర్, మోనా శౌరీ కపూర్ల తనయుడు అర్జున్ కపూర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందు ఎలా ఉండేవాడు తెలిస్తే విస్తుపోతారు. చక్కటి ఫిజిక్తో హీరో లుక్లో కనిపించే అర్జున్ బాల్యంలో చాలా బొద్దుగా ఉండేవాడట. జంక్ ఫుడ్ అంటే మహా ఇష్టంగా లాగేంచేవాడట. దాంతో టీనేజ్ వయసులో 140 కిలోల అధిక బరువుతో ఉండేవాడు. బాలీవుడ్లోకి అడుగుపెట్టేమందే తన రూపు రేఖలను అందరు ఇష్టపడేలా మార్చుకున్నాడు అర్జున్. అతడి న్యూ లుక్ చూసి ఇంట్లో వాళ్లే ఆశ్చర్యపోయారట కూడా. మరి అంత అధిక బరువుని అర్జున్ ఎలా తగ్గించుకున్నాడో ఆయన మాటల్లోనే సవివరంగా చూద్దామా..!.ఇషాక్జాదే మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన అర్జున్ కపూర్(Arjun Kapoor) ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడంతోనే తన లుక్ని పూర్తిగా మార్చుకున్నాడట. పూర్తి ఫిట్నెస్తో స్మార్ట్గా మారాకే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారట అర్జున్. తన వెయిట్ లాస్ జర్నీలో మంచి మార్పు తీసుకువచ్చింది మాత్రం వాకింగ్ అని చెబుతారు అర్జున్. ఇది తనను శారీరకంగా చురుకుగా ఉండేలా చేస్తుందని అన్నారు. బరువు తగ్గాలనుకుంటే ముందు వాకింగ్కే ప్రాధాన్యత ఇస్తానని అన్నారు కపూర్. తను మంచి ఆహారప్రియుడునని, జంక్ ఫుడ్ అంటే మహా ఇష్టమని చెప్పుకొచ్చారు. అయితే తాను ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో చక్కెర కలిగిన ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. తాజా పండ్లు, కూరగాయలు, అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాలనే తీసుకుంటానని చెప్పారు. తన రోజు వారి డైట్ ఎలా ఉంటుందో కూడా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన బ్రేక్ఫాస్ట్లో గుడ్లు వంటి అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాలు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్లు అధికంగా ఉంటాయిని చెప్పారు. భోజనంలో టర్కిష్ కబాబ్లు, పుదీనా చట్నీ, కూరగాయల సలాడ్లు వంటివి తప్పనిసరి అని అన్నారు. అలాగే జిమ్లో సర్క్యూట్ ట్రైనింగ్, క్రాస్ ఫిట్ ట్రైనింగ్, కార్డియో వంటి వ్యాయామాలు చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఆ వ్యాధి కారణంగా మళ్లీ అధిక బరువు బారిన పడ్డానంటూ నాటి చేదు జ్ఞాపకాన్ని షేర్ చేసుకున్నారు అర్జున్. 2024లో అర్జున్ హషిమోటోస్ థైరాయిడిటిస్ వ్యాధి నిర్థారణ అయ్యిందని చెప్పుకొచ్చారు. ఇది జీవక్రియను నెమ్మదించి, బరువు పెరిగేలా చేసే ఆటో ఇమ్యూన్ పరిస్థితి అని తెలిపారు. దీని వల్ల అధిక బరువుని ఎదుర్కొనక తప్పదని తెలుసుకుని చాలా నిరాశకు లోనయ్యానంటూ నాటి బాధను గుర్తుతెచ్చుకున్నారు. అయితే తాను ఆ వ్యాధితో పోరాడలి లేదా అధిక బరువుతో ఉండాలి అనే రెండు ఆప్షన్లే తన ముందు కనిపించాయంటూ భావోద్వేగంగా మాట్లాడారు. దాంతో తాను ఎలాగైన ఆ వ్యాధిని జయించేలా ఫిట్గా ఉండాలని నిర్ణయించుకుని..తన వెయిట్లాస్ జర్నీని కొనసాగించానని చెప్పుకొచ్చారు. తాను ఎదుర్కొంటున్న వ్యాది తన అమ్మ మోనా శౌరీ కపూర్, సోదరి అన్షులా కపూర్కి కూడా ఉందని అన్నారు. అయితే ఆ వ్యాధి పెడుతున్న ఇబ్బందిని అధిగమిస్తూ..ఆరోగ్యంగా ఉండేలా కేర్ తీసుకోవడంతో బరువుని అదుపులో ఉంచుకున్నానని చెప్పుకొచ్చారు. తన వెయిట్ లాస్ జర్నీకి బ్రేక్ ఉండదని..అది అలా సాగుతుందని నవ్వుతూ చెప్పారు అర్జున్. అంతేగాదు అందరిని ఆరోగ్యంగా ఉండండి, ఏదైనా అనారోగ్యం బారిన పడితే కుంగిపోవద్దు..ఎలా బయటపడాలో ఆలోచించండి అని సూచిస్తున్నాడు అర్జున్ కపూర్. (చదవండి: పరాఠా విత్ నెయ్యితో 'జీరో సైజ్ ఫిగర్'..! నటి కరీనా కపూర్ కూడా..) -
సెల్ఫ్ బ్రాండ్..అదే ట్రెండ్..!
ప్రస్తుత కాలంలో ప్రతిదీ ఓ ట్రెండే.. అది ఫ్యాషన్ అయినా.. లైఫ్ స్టైల్ అయినా.. పేర్లు, ఇష్టాలు, అభిప్రాయాలు, ఆసక్తులు ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో.. వాడే వస్తువులు, ధరించే దుస్తుల ద్వారా తమ భావాన్ని వ్యక్తికరించాలనే తపనలో ప్రస్తుత తరం యువత ఆలోచిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మధ్య కాలంలో విడుదలైన పుష్ప సినిమాలోని డైలాగ్ గుర్తుందా..! ‘పుష్ప అంటే పేరుకాదు పుష్ప అంటే బ్రాండ్’ అన్నట్లు బ్రాండ్ ఇమేజ్ కోసం తాపత్రయ పడుతోంది నేటి యువత. అయితే ఇందులోనూ ఎవరి ట్రెండ్ వారిదే.. ఎవరి బ్రాండ్ వారిదే.. ప్రస్తుతం ఫ్యాషన్ అంటే కేవలం అందాన్ని పెంచేదో, ఆధునికతను చూపించేదో మాత్రమే కాదు. తమ తమ వ్యక్తిత్వాన్ని వ్యక్తపరిచే సాధనంగా కూడా మారిపోయింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘తమ గురించి తాము చెప్పుకునే’ ఫ్యాషన్ ట్రెండ్. ఇప్పుడు నగరంలో ఈ తరహా ట్రెండ్ ఊపందుకొంది. వ్యక్తిగత అభిరుచిని బట్టి అలాంటి సెల్ఫ్–ఎక్స్ప్రెషన్ స్టైల్స్ విభిన్న రకాలుగా ఉంటున్నాయి. ఆధునిక ఫ్యాషన్ ప్రపంచంలో వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే స్టైల్స్ ప్రాధాన్యత పెరుగుతోంది. ఇందుకు నిదర్శనంగా పలు బ్రాండ్లు సైతం వినూత్న ఫ్యాషన్లను ఆవిష్కరిస్తున్నాయి. కఫ్ లింక్స్ పై పేర్లు.. ఇటీవల తమ పేరు లేదా వ్యక్తిగత గుర్తింపుతో కూడిన కఫ్ లింక్స్ ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. విభిన్న అలంకరణలతో, చేతి చివర్లలో ధరించే ఈ కఫ్ లింక్స్లో పేరు, ఇంకేమైనా ప్రత్యేకమైన డిజైన్లు చెక్కించుకుంటున్నారు. ఒకప్పుడు కార్పొరేట్ ఫార్మల్ వేర్లో భాగంగా మాత్రమే వినియోగించే హ్యాండ్మేడ్ – కస్టమ్ – డిజైన్ బంగారం, వెండి లాంటి మెటల్స్తో తయారవుతున్నాయి. పేర్లు, లక్షణాల ప్రాతిపదికన డిజైన్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. అలాగే వీటిని బహుమతులుగానూ వినియోగిస్తున్నారు. ఈ ట్రెండ్ ముఖ్యంగా యువతలో, పెళ్లిళ్లు లేదా ఫ్యామిలీ ఫంక్షన్లలో తమ పేరు లేదా ఇనీíÙయల్స్తో ప్రత్యేకత చూపించాలనుకునే వారి వల్ల బాగా పాపులర్ అవుతోంది. ఫ్యాషన్ రంగ నిపుణులు కూడా ఈ ట్రెండ్ను ‘పర్సనలైజ్డ్ ఎలిగెన్స్’గా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి కొత్త ప్రయోగాలు, సంప్రదాయ ఆధునికతల కలయికగా మన నగరంలో మారుతున్నాయని చెబుతున్నారు. కేవలం కఫ్లింక్స్ మాత్రమే కాదు, వ్యక్తిగత గుర్తింపును ఫ్యాషన్లో కలిపే ట్రెండ్స్ ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్నాయి. సొంత/ఇంటి పేరుతో లేదా మొదటి అక్షరంతో డిజైన్ చేసిన గొలుసులు. నేమ్ నెక్లెస్ / ఇసీíÙయల్ పెండెంట్స్, రింగ్స్ వంటివి సిల్వర్, గోల్డ్, రోజ్ గోల్డ్ లాంటి మెటల్స్లో లభ్యం అవుతున్నాయి. ఇది ముఖ్యంగా యువతలో, ప్రేమ జంటల్లో ట్రెండింగ్ అవుతున్నాయి. జాకెట్లు/శాలువాలు : షర్ట్, జాకెట్స్(బ్లేజర్స్)పై పేరు లేదా చిన్న మెసేజ్ను ఎంబ్రాయిడరీతో బ్రాండెడ్ లోగో తరహాలో తీర్చిదిద్దుతున్నారు. ఇది డ్రెస్కి ఓ వ్యక్తిగత టచ్ ఇచ్చేలా చేస్తుంది. కస్టమ్ మేడ్ టి–షర్ట్స్, ప్రింట్ చేసిన పేరు, ఫేవరెట్ కోట్, బర్త్డేట్ లేదా క్యారెక్టర్ డ్రాయింగ్తో కూడిన డిజైన్లు, గ్రూప్ ఈవెంట్స్, బర్త్డేలు, ట్రావెల్ వంటి సందర్భాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సొంత పేర్లను కాకపోయినా, తమ భావోద్వేగాలు ప్రతిబింబించే పదాలు, సంకేతాలు టాటూలుగా వేయించుకోవడం కూడా సెల్ఫ్–ఎక్స్ప్రెషన్లో భాగమే. పేర్లు, ఇనీషియల్స్తో కూడిన స్నీకర్స్, లేదా ఫేవరెట్ డిజైన్తో ఉండే పాదరక్షలు, షూ డిజైన్లుగా మారుతున్నాయి. ఈ ట్రెండ్ దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ‘నైక్’ వంటి బ్రాండ్లు కూడా కస్టమైజేషన్కు అవకాశం ఇస్తున్నాయి. ఇండియన్ వెడ్డింగ్ డ్రెస్లపై పేర్లు కాడలుగా అల్లడం పెళ్లి కూతురు లేదా వరుడు దుస్తుల్లో తన పేరు లేదా జంట పేరు అల్లించుకోవడం ట్రెండ్గా మారుతోంది. అలాగే బ్యాగ్స్, వాలెట్స్, ట్రావెల్ పౌచ్లు తదితర పర్సనల్ ఐటమ్స్పై మోనోగ్రామ్లు, నేమ్ ఇనీషియల్స్తో ఉన్న హ్యాండ్బ్యాగ్స్ కూడా విరివిగా వాడుతున్నారు. ఇవి లగ్జరీ బ్రాండ్స్ (లూయిస్ విటన్, గూచి) నుంచి చిన్న ఆర్టిసన్ స్టోర్ల వరకూ అందుబాటులో ఉన్నాయి. (చదవండి: జల్లుల సీజన్..ఒళ్లు జాగ్రత్త..! లేదంటే వర్షపు వ్యాధుల ముప్పు..) -
ఆలోచనలతో కంప్యూటర్ని కంట్రోల్ చేస్తున్న తొలి మహిళ!
సాంకేతికత కూడిన వైద్యం ఎందరో రోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అందుకు ఎన్నో ఉదంతాలు నిదర్శనం. అయితే బ్రెయిన్ సంబంధిత విషయంలో మాత్రం సాంకేతికతను వాడటం కాస్త సవాలు. అయితే దాన్నికూడా అధిగమించి..స్ట్రోక్కి గురై పక్షవాతంతో బాధపడుతున్న పేషెంట్లలో కొత్త ఆశను అందించేలా టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది ఎలోన్ మస్క్ స్థాపించిన న్యూరాలింక్ (Neuralink) కంపెనీ. ఇది మానవ మెదడు, కంప్యూటర్ మధ్య నేరుగా కమ్యూనికేషన్ ఏర్పరిచే బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ (BCI) టెక్నాలజీపై పని చేస్తోందనే విషయం తెలిసిందే. ఈ టెక్నాలజీ ద్వారా, మెదడులో చిన్న చిప్ను అమర్చి, ఆలోచనల ద్వారా డిజిటల్ పరికరాలను నియంత్రిస్తారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ క్లినకల్ ట్రయల్ దశలో ఉంది. అందులో భాగంగానే ఈ న్యూరాలింక్ చిప్ను పొందింది ఆడ్రీక్రూస్ అనే మహిళ. ఎవరామె.? ఆమె ఈ సాంకేతికత సాయంతో ఏం చేసిందంటే..రెండు దశాబ్దాలకు పైగానే ఆడ్రీ కూస్ పక్షవాతానికి గురై మంచానికే పరిమితమైంది. క్లినికల్ ట్రయల్లో భాగంగా ఎలోన్ మస్క్ న్యూరాలింక్ చిప్ను ఆమె మెదడులో అమర్చారు. దీంతో న్యూరాలింక్ బ్రెయిన్ ఇంప్లాట్ ద్వారా తన ఆలోచనలతో కంప్యూటర్ని నియంత్రిస్తున్న తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఆమె తన మానసిక ఆదేశాలతో తన పేరుని డిజిటల్ రూపంలో రాసింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ఎక్స్లో షేర్ చేసుకున్నారామె. ఆ పోస్ట్లో ఆండ్రీ డిజిటల్ సిరాతో తన పేరును( ఆడ్రీ) సూచించే ల్యాప్టాప్ స్క్రీన్ ఫోటోని షేర్ చేశారు. అంతేగాదు దాంతోపాటు ఎర్రటి హార్ట్ సింబల్, ఒక పక్షి, పిజ్జా ముక్క ఉండే డూడుల్ని కూడా పంచుకుంది. దీన్ని ఆమె టెలిపతి ద్వారా గీసినట్లుగా ఆ పోస్ట్కి క్యాప్షన్ ఇచ్చింది ఆడ్రీ. ఆమె 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా తన పేరును రాసిన క్షణం నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఎందుకంటే ఆమె గత 20 ఏళ్లకు పైగా పక్షవాతానికి గురై కదలలేని, మాట్లాడలేని స్థితిలో ఉండిపోయారామె. ఆమె తన చూపుడు వేలుని క్లిక్గా, కర్సర్గా మణికట్టుని ఊహించుకుంటూ.. తన మానసిక ఆలోచనలతో కంప్యూటర్ని నియంత్రిస్తుందామె. ఇదంతా ఆమె తన బ్రెయిన్తో చేస్తుంది. ఇక్కడ ఆడ్రికి ఈ న్యూరాలింక్ క్లినికల్ ట్రయల్లో తొమ్మిదొ పేషెంట్గా ఈ చిప్ను ఆమెకు అమర్చారు. పుర్రెలో రంధ్రం చేసి మోటారు కార్టెక్స్లో సుమారు 128 కనెక్షన్లతో ఈ చిప్ని అమర్చారు. ఈ బీసీఐ(బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీ) ఆమె మెదడు కదలికలు, సంకేతాలను చదివి వాటిని కర్సర్ కదలికలుగా అనువదిస్తుంది. ఈ బ్రెయిన్ చిప్ ఆమెను మళ్లీ నడిచేలా సాయం చేయలేకపోయినా..డిజిటల్ పరికరాలతో తన మనసులోని మాటలను వ్యక్తం చేయడానికి వీలు కల్పిస్తోంది. ఇది పూర్తి మానసిక ఆలోచనలతో పనిచేస్తుంది. న్యూరాలింక్ అంటే.. 2016లో ఎలోన్ మస్క్ స్థాపించిన న్యూరాలింక్, మానవ మెదడును నేరుగా కంప్యూటర్లకు అనుసంధానించడం లక్ష్యంగా పెట్టుకుంది. పక్షవాతం వంటి నాడీ సంబంధిత పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులు డిజిటల్ స్వాతంత్య్రాన్ని పొందేలా.. సంభాషించడంలో సహాయపడటమే ఈ సాంకేకతికత లక్ష్యం.కాగా, ఇక్కడ ఆడ్రీ ఇలాంటి మరిన్ని పోస్ట్లను వీడియోలను పంచుకోవాలని ఆత్రుతగా ఎదురుచూస్తోంది. అంతేగాదు ఆమె తన పోస్ట్లో తాను త్వరలో ఇంటికి వస్తానని, ఈ ప్రక్రియ గురించి మరింత వివరంగా తెలిపేలా వీడియోలను కూడా పోస్ట్ చేస్తానని పేర్కొనడం విశేషం. ఈ న్యూరాలింక్ సాంకేతికతను వినియోగించిన తొలి మహిళగా ఆమె ప్రస్థానం పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని ఆశిద్దాం.(చదవండి: 12వ తరగతి డ్రాపౌట్..సొంతంగా జిమ్..ఇంతలో ఊహకందని మలుపు..!) -
జల్లుల సీజన్..ఒళ్లు జాగ్రత్త..!
ఈ వానాకాలంలో గత కొన్నాళ్లుగా... ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఈ వానాకాలపు సీజన్లోఎంత వర్షం పడిందో తెలిపే సెంటీమీటర్లూ... అలాగే జ్వరం తీవ్రత తెలిపే థర్మామీటర్ల రీడింగులూ పోటాపోటీగా పెరుగుతూపోతుంటాయి. ఎందుకంటే... వర్షం రాబోయే పంట సీజన్కు మంచి పంటలనే కాదు వర్తమానంలో జ్వరాలు, ఇన్ఫెక్షన్ల తంటాలనూ ప్రామిస్ చేస్తుంది. అందుకే ఓ పక్క మోద ప్రమోదాలతోపాటు మరో పక్క ఖేద ప్రమాదాలను తెచ్చిపెట్టే రెయినీ సీజన్ పెచ్చరిల్లజేసే వానల వ్యాధుల గురించి తెలుసుకుందాం. వర్షపు వ్యాధుల ముప్పులనుంచి కాపాడుకోవడమెలాగో అవగాహన పెంచుకుందాం...వానల్లో హాయిగా పకోడీలు తింటూ, కిటికీలోంచి చినుకులను చూసే అదృష్టం కొద్దిమందికే ఉంటుంది. చాలామంది రెయిన్కోట్ తొడుక్కునో లేదా గొడుగు పట్టుకునో... అవేవీ లేనివాళ్లు తడుస్తూనైనా వర్షాల్లో తమ పనులకూ / ఆఫీసులకూ వెళ్లి తీరాల్సిందే. ఈ నేపథ్యంలో తడవడంతో వచ్చే అనారోగ్యాలతో పాటు... ఈ సీజన్లోనే పెరిగే వ్యాధుల గురించి తెలుసుకుని జాగ్రత్త పడాల్సిన అవసరముంది. చిన్నారులు తమ ఆటలో భాగంగా వానలో తడిసేందుకు ఆసక్తి చూపుతారు. అలా వాళ్లు జలుబూ, జ్వరాలు తెచ్చిపెట్టుకుంటారు. ఇక వృద్ధులకు ఈ సీజన్ ఓ ప్రమాదకారిలా అనేక ముప్పులు తెచ్చిపెడుతుంది. వాన వ్యాధుల గురించి అవగాహన పెంచుకోవడంతో వాటిని చాలావరకు నివారించుకోవచ్చు. అదెలాగో చూద్దాం. వర్షాలు అనేక రకాలుగా అనారోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. మొదటిది నేరుగా తడవడం వల్ల వచ్చే జలుబూ, జ్వరాలు ఒక తరహావి. ఇక ఈ సీజన్లో నీటిగుంటల్లో చేరే నీరు కారణంగా దోమల ప్రత్యుత్పత్తి (బ్రీడింగ్)తో వాటి సంఖ్య విపరీతంగా పెరగడం, దాంతో అవి వ్యాప్తి చేసే వ్యాధులు మరో తరహావి అయితే... ఇదే సీజన్లో ముసురుకునే ఈగలు వ్యాప్తి చేసే జబ్బులూ... వెరసి ఇవన్నీ అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. ఇక ఇంకో తరహా ముప్పు ఏమిటంటే... వాన నీరు భూమి ఉపరితలాన్ని తడిపేయడంతో ఎలకలు తమ బొరియల్లోంచి పైకి వచ్చి, ఇళ్లలోని కిచెన్ ఫ్లాట్ఫారమ్ మీద ఉన్న ఆహారాలను కలుషితం చేయడంతో వచ్చే లెప్టోస్పైరోసిస్ లాంటి జ్వరాలను తెచ్చిపెట్టడం మరో ముప్పు. వృద్ధుల్లాంటి వారు బురదలో కాలుజారి ఎముకలకు ప్రమాదాలు తెచ్చిపెట్టుకోవడం వంటి ట్రామా కేసులకూ ఈ సీజన్ కారణమవుతుంటుంది. ఇలా ఒక్కో తరహా ముప్పుల తీరుతెన్నులను పరిశీలిద్దాం...నీరు కలుషితం కావడం కారణంగా... వర్షాల సీజన్లో నీరు కలుషితం కావడం (వాటర్ కంటామినేషన్) వల్ల టైఫాయిడ్, కలరా, షిజెల్లోసిస్, ఈ–కొలై వంటి వ్యాధులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలా నీరు కలుషితం కావడం వల్ల కనిపించే ప్రధాన వ్యాధులు...టైఫాయిడ్ : సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. బ్లడ్ కల్చర్, స్టూల్ కల్చర్, వైడాల్ టెస్ట్ వంటి పరీక్షలతో ఈ వ్యాధిని నిర్ధారణ చేయవచ్చు. సకాలంలో వైద్య చికిత్స అందించడం వల్ల దీనికి చికిత్స చేయవచ్చు. అయితే సరైన చికిత్స తీసుకోకపోతే ఈ సమస్య వల్ల పేగుల్లో పుండ్లు పడటం, సెప్టిసీమియా (ఒంటిలోని రక్తానికి ఇన్ఫెక్షన్ రావడం) వంటి కాంప్లికేషన్లకు దారితీయవచ్చు. తగిన మందులతోనూ, సెప్టిసీమియాలో ప్రత్యేకంగా చేయాల్సిన చికిత్సలతోనూ వైద్యులు ఈ సమస్యకు చికిత్స అందిస్తారు.కలరా : విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. తీవ్రమైన నీళ్ల విరేచనాలు, వాంతులు వల్ల డీహైడ్రేషన్ వస్తుంది. దాంతో బీపీ పడి΄ోవడం జరుగుతుంది. బియ్యం కడిగిన నీళ్లలా విరేచనం కావడం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. అందుకే ప్రత్యేకంగా ఈ లక్షణాన్ని ‘రైస్ వాటర్ స్టూల్స్’ అని కూడా చెబుతారు. ఈ వ్యాధికి సకాలంలో వైద్యం అందకపోతే మూత్రపిండాలు పాడైపోవడం వంటి దుష్పరిణామాలు చోటు చేసుకుని, ఒక్కోసారి ఆ పరిస్థితి ప్రాణాంతకంగా కూడా మారే అవకాశముంటుంది. స్టూల్ కల్చర్, డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోపీ వంటి పరీక్షలతో ఈ రోగనిర్ధారణ చేస్తారు. కొన్ని రకాల యాంటీబయాటిక్స్తో వైద్యులు దీన్ని అదుపు చేస్తారు.షిజెల్లోసిస్ : జ్వరం, రక్త విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి మొదలైనవి ఈ వ్యాధి తాలూకు లక్షణాలు. షిజెల్లోసిస్లో పేగులో ఇన్ఫెక్షన్తో వచ్చే ‘టాక్సిక్ మెగా కోలన్’ అనే కాంప్లికేషన్తోపాటు... రక్తంలో యూరియా మోతాదులు ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువగా పెరిగిపోవడవం; రక్తం కలుషితమయ్యే ‘కీటోలైటిక్ యురేమియా’ వంటి దుష్ప్రభావాలూ కనిపించవచ్చు. ఇలా జరిగినప్పుడు ఆ పరిస్థితి ప్రాణాంతకం అయ్యేందుకు అవకాశం ఉంది.ఈ-కొలై : నీళ్ల విరేచనాల ఎక్కువగా అయ్యే ఈ కండిషన్కు ‘ఈ–కొలై’ అనే బ్యాక్టీరియా కారణం. ఇది పేగులతో పాటు కిడ్నీలు, ఊపిరితిత్తులు, మెదడు, చర్మం లాంటి భాగాల్లోనూ ఇన్ఫెక్షన్ కలిగించవచ్చు. రక్తం, మూత్రం కల్చర్ పరీక్షల ద్వారా ఈ వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. దోమలతో వ్యాప్తిచెందే వ్యాధులు...డెంగీ : వానాకాలంలో మునపటి కంటే ఎక్కువగా వ్యాప్తి చెందే ఈ వ్యాధికి ఏడిస్ ఈజిప్టై అనే రకం దోమలు కారణమవుతాయి. జ్వరం, తీవ్రమైన తలనొప్పితోపాటు ఎముకలు విరిచేసినంత తీవ్రమైన నొప్పి రావడంతో దీన్ని ‘బ్రేక్ బోన్ ఫీవర్’ అని కూడా అంటారు. వ్యాధి ముదిరినప్పుడు అంతర్గత అవయావాల్లో రక్తస్రావం కూడా జరగవచ్చు. మామూలుగా వచ్చే డెంగీ వ్యాధిని ‘క్లాసికల్ డెంగీ’ అంటారు. అయితే తీవ్రమైన అంతర్గత రక్తస్రావం వల్ల వచ్చే పరిస్థితిని ‘డెంగీ హేమరేజిక్ ఫీవర్’ అంటారు. ఒక్కోసారి రోగి తీవ్రమైన షాక్కు గురికావచ్చు. ఈ తరహా డెంగీని దీన్ని ‘డెంగీ షాక్ సిండ్రోమ్’ అంటారు. దోమలు వ్యాప్తి చేసినప్పటికీ డెంగీ వైరస్తో వచ్చే వ్యాధి ఇది. దీనికి ప్రత్యేకంగా చికిత్స ఉండదు. కనిపించే లక్షణాలను బట్టి చికిత్స అందించే సింప్టమేటిక్ ట్రీట్మెంట్తో దీనికి చికిత్స చేస్తారు. డెంగీకి వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ... ఒకసారి డెంగీ బారిన పడ్డవారు మరోసారి దీని బారిన పడితే పరిస్థితి చాలా తీవ్రంగానూ, విషమంగానూ ఉంటుంది కాబట్టి ఒకసారి డెంగీ బారిన పడ్డవారికి వ్యాక్సిన్ ఇస్తుంటారు. చికన్ గున్యా : ఇది కూడా ఎడిస్ ఈజిపై్ట అనే దోమ వల్లనే వ్యాప్తి చెందుతుంది. దోమల వల్ల వ్యాప్తి చెందే ఒక రకం వైరస్ కారణంగా ఇది వస్తుంది. ఏడిస్ ఈజిపై్ట దోమ సాధారణంగా పగటి వేళ ఎక్కువగా కనిపిస్తుంటుంది. జ్వరంతో పాటు విపరీతమైన తలనొప్పి, తీవ్రస్థాయిలో కీళ్లనొప్పులు వస్తాయి. ఈ కీళ్లనొప్పులు భరించలేనంతగా ఉంటాయి. ఇది కూడా వైరల్ జ్వరం కావడంతో లక్షణాలను బట్టి ఇచ్చే సింప్టమేటిక్ ట్రీట్మెంట్ అందిస్తారు.మలేరియా : ఇది కొన్ని ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉండే తీవ్రమైన జ్వరం. అనాఫిలస్ అనే రకం దోమ కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఇది రాత్రివేళల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. దోమలో వృద్ధి చెందే ప్లాస్మోడియమ్ అనే ప్రోటోజోవా రకానికి చెందిన ఏకకణ సూక్షజీవి వల్ల మలేరియా జ్వరాలు వస్తాయి. ఇందులో ప్రధానంగా నాలుగు రకాలు ఉంటాయి. ఇందులో రకాన్ని బట్టి జ్వరాలు నిర్దిష్టంగా కొంత కొంత వ్యవధిలో మాటిమాటికీ వస్తుంటాయి. ఈ వ్యాధిలో ఒక రకం (స్పీషీస్) వల్ల సెరిబ్రల్ మలేరియా వస్తుంది. దీని వల్ల ఒక్కోసారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది (అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్–ఏఆర్డీఎస్), స్పృహ తప్పిపడిపోవడం, అపస్మారక స్థితిలోకి వెళ్లడం, మూత్రపిండాలు విఫలం కావడం (రీనల్ ఫెయిల్యూర్) వంటివి జరగవచ్చు.ఈగలతో వచ్చే వ్యాధులు...వానల సీజన్ మొదలవ్వగానే ఈగలు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తుంటాయి. ఈగలతో దాదాపు వంద రకాల వ్యాధులు వస్తుంటాయి. ఇవి పరిశుభ్రత లేని చోట్ల ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి కొన్ని మైళ్ల దూరాలూ వెళ్లగలవు. సాధారణంగా పగటివేళ ఎక్కువగా కనిపిస్తుంటాయి. రాత్రివేళ విశ్రాంతి తీసుకుంటుంటాయి. ఈగల లార్వాలతో వృద్ధి చెందే వ్యాధులను ‘మైయాసిస్’ అంటారు. ఈగల కారణంగా వ్యాప్తి చెందే వ్యాధులు సాధారణంగా ఒంటిపై ఉండే గాయాలు, పుండ్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంటాయి. ఈగ లార్వాలు కొన్ని కంటిలోకి కూడా ప్రవేశించి, రెటీనాకు సైతం హాని చేయవచ్చు.ఇవీ ఈగలతో వ్యాప్తి చెందే వ్యాధుల్లో కొన్ని... నీళ్ల విరేచనాలకు కారణం అయ్యే ఎంటమీబా హిస్టలిటికా, జియార్డియా లాంబ్లియా వంటి ్ర΄ోటోజోవన్ పరాన్న జీవులనూ, ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్, ఎంటరోబియస్ వర్మికులారిస్ వంటి నులిపురుగులనూ, ΄ోలియో, వైరల్ హెపటైటిస్ (హెపటైటిస్ ఏ అండ్ ఈ) వంటి వైరస్లనూ ఈగలు వ్యాప్తి చేస్తాయి. ఈ కింద పేర్కొన్నవి ఈగలు వ్యాప్తి చేసే ముఖ్యమైన వ్యాధుల్లో కొన్ని మాత్రమే.అమీబియాసిస్ : ఇవి ప్రొటోజోవాకు చెందిన సూక్ష్మక్రిములు. వీటి వల్ల ఆహారం కలుషితమైనప్పుడు తీవ్రమైన కడుపునొప్పి, మలంలో రక్తం పడటం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మలపరీక్ష, ఎలైసా వంటి వైద్యపరీక్షలతో ఈ వ్యాధిని సులభంగా గుర్తించవచ్చు. అమీబియాసిస్ వల్ల జీర్ణ వ్యవస్థలోని పేగులతో పాటు కాలేయం, ఊపిరితిత్తులు, మెదడు వంటి కీలకమైన అవయవాలు దెబ్బతినవచ్చు. ముఖ్యంగా కాలేయంలో చీముగడ్డలు (లివర్ యాబ్సెస్) కనిపించే అవకాశాలు ఉన్నాయి. కాలేయంలోని ఈ చీముగడ్డలను అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష ద్వారా తేలిగ్గా గుర్తించవచ్చు.జియార్డియాసిస్ : ఈ వ్యాధి జియార్డియా లాంబ్లియా అనే ప్రోటోజోవా రకానికి చెందిన సూక్ష్మక్రిముల వల్ల వస్తుంది. ఈ స్మూక్షక్రిములు చిన్నపేగుల్లో నివాసం ఏర్పరచుకొని ఈ వ్యాధిని కలగజేస్తాయి. ఈ వ్యాధి సోకినవారిలో వికారం, వాంతులు, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు రక్తంలోకి విస్తరించినప్పుడు ఒంటిపై దురద రావడం, అలా దురద వచ్చిన ప్రాంతమంతా నల్లబారడం వంటి చర్మసంబంధమైన లక్షణాలూ కనిపిస్తాయి. తిన్న ఆహారం ఒంటికి పట్టక΄ోవడం (మాల్ అబ్జార్ప్షన్) కూడా ఈ వ్యాధి వచ్చిన వారిలో కనిపిస్తుంటుంది. అమిబియాసిస్తో పాటు జియార్డియాసిస్ వంటి అనారోగ్యాలు కనిపించినప్పుడు గట్ ఎన్విరాన్మెంట్ను నార్మల్గా ఉంచుతూ హానికరమైన సూక్ష్మజీవులను బయటికి పంపే కొన్ని రకాల ΄పౌడర్లు, మెడిసిన్స్తోపాటు అవసరమైతే యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. ఎలుకల వల్ల...వర్షాలకు బొరియల్లో ఉండే ఎలుకలు బయట నుంచి ఇళ్లలోకి వస్తాయి. ఎలుకల్లో పెరిగే లె΄్టోస్పైరోసిస్ అనే బ్యాక్టీరియా కారణంగా లె΄్టో స్పైరోసిస్ అనే వ్యాధి వస్తుంది. ఎలుకల వల్ల ఆహారం కలుషితమైపోవడంతో లెప్టోస్పైరోసిస్ జ్వరాలు వస్తాయి. ఈ సీజన్లో ఎలుకలు ఎక్కువగా ఉండే బురద నీళ్లలో ఎక్కువగా తిరిగే వారికీ ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కొన్నిసార్లు వాంతులు కావడం వంటి లక్షణాలు ఈ వ్యాధిలో ప్రధానంగా కనిపిస్తాయి. కొన్నిసార్లు కడుపునొప్పి, కళ్లు ఎర్రబారడం, కళ్లు పచ్చగా మారడమూ జరుగుతుంది. కొన్ని రకాల యాంటీబయాటిక్స్తో డాక్టర్లు లె΄్టోస్పైరోసిస్కు చికిత్స అందిస్తారు.వర్షాకాలం వ్యాధుల నివారణ ఇలా... ఈ సీజన్లోని దాదాపు అన్ని వ్యాధులకు కారణం కలుషితమైన నీరే. కాబట్టి నీటిని కాచి చల్లార్చాక వడపోసి తాగడం అన్నిటికంటే ప్రధానం. కుండల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉన్న నీరు తాగవద్దు. వాటర్ను డిస్ ఇన్ఫెక్ట్ చేయడానికి క్లోరిన్ బిళ్ల వేసి క్లోరినేషన్ ద్వారా శుభ్రం చేసిన నీరు తాగడం వుంచిది. ఈ సీజన్లో బయటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండటమే మంచిది. తాజాగా వండుకున్న తర్వాత వేడిగా ఉండగానే తినేయాలి. ఈ సీజన్లో చల్లారిన ఆహారాన్ని వూటి వూటికీ వేడి చేసి తినడం అంత మంచిది కాదు. మాంసాహారం కంటే శాకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేమిటంటే... ఈ వ్యాధులు మాంసాహారం కారణంగా వ్యాప్తిచెందవు. కాకపోతే శాకాహారంతో పోలిస్తే మాంసాహారం ప్రాసెస్ చేసే క్రమంలో ఈగలు బాగా ముసరడానికి అవకాశం ఎక్కువ. సరిగ్గా ప్రాసెస్ చేయడం, పూర్తిగా ఉడికించడం వంటి జాగ్రత్తలు పాటిస్తే ఈ ముప్పును తప్పించుకోవచ్చు. ఈ సీజన్లో పరిసరాల పరిశుభ్రత తప్పక పాటించాలి. నీళ్లు నిల్వ ఉండటానికి అవకాశం ఇచ్చే, పాత టైర్లు, ఖాళీ కొబ్బరి చిప్పల వంటివి దోవుల పెరుగుదలకు కారణమవుతాయి. నీటి చేరడానికి అవకాశమిచ్చే చిన్న చిన్న నీటి గుంటలు, పైన పెచ్చులు ఊడిపోయిన సన్షేడ్కు పైన ఉండే ప్రదేశాల్లో దోమలు గుడ్లు పెట్టి తమ సంతతిని అభివృద్ధి (బ్రీడింగ్) చేస్తాయి. కాబట్టి మీ ఇళ్లలో, ఇంటి పరిసర్రప్రాంతాల్లో దోమలను వృద్ధి చేసే పరిస్థితులన్నింటినీ నివారించాలి. రాత్రిళ్లు పడుకునే సమయంలో మంచం చుట్టూ దోమ తెరలు వాడటం వల్ల దోమల కారణంగా వ్యాప్తి చెందే అనేక వ్యాధులు నివారితమవుతాయి.ఈ సీజన్లో దోవులతో వచ్చే వ్యాధుల నుంచి కాపాడుకోడానికి శరీరవుంతా కప్పే దుస్తులు వేసుకోవాలి. ఇంటి కిటికీలకు మెష్లు ఉపయోగించడం మేలు. కిటికీలకు మెష్లు ఉపయోగించడం కాస్త శ్రమతోనూ, ఖర్చుతోనూ కూడిన వ్యవహారమే అయినప్పటికీ ఇప్పుడు కిటికీలకు అంటించడానికి రెడీగా ఉండే మెల్క్రో వంటి ΄్లాస్టిక్ మెష్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటివల్ల దోమలతో వచ్చే అనేక వ్యాధులు నివారితమవుతాయి. వేప ఆకులతో పొగవేయడం, మస్కిటో రిపల్లెంట్ ఉపయోగించడం వల్ల దోమలు దూరమవుతాయి. అయితే కొంతమందికి పొగ, మస్కిటో రిపల్లెంట్స్లోని ఘాటైన వాసనల వల్ల అలర్జీ ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇలాంటి అలర్జీలు ఉంటే పొగవేసే ఇలాంటి చిట్కాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో చెత్త వేసుకునే కుండీలను ఎప్పటికప్పుడు దూరంగా ఉన్న కుండీలలో వేస్తుండాలి. వీధిలో ఉండే కుండీలను పారిశుద్ధ్య సిబ్బంది క్రమంతప్పకుండా శుభ్రం చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. త్వరగా కుళ్లేందుకు అవకాశం ఉన్న పదార్థాలను వెంటవెంటనే శుభ్రం చేసుకుంటూ ఉండాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. వుల, వుూత్ర విసర్జనకు వుుందు, తర్వాత చేతులు శుభ్రంగా సబ్బుతో లేదా బూడిదతో కడుక్కోవాలి.కొందరు నేల మీది మట్టితో పాత్రలు శుభ్రం చేస్తారు. అలా ఎప్పుడూ చేయవద్దు. పాత్రలు శుభ్రం చేసే సవుయంలో సబ్బు లేదా బూడిద వూత్రమే వాడాలి. వానలో అతిగా తడిసిన సందర్భాల్లో అప్పటికే ఏవైనా ఇన్ఫెక్షన్లతో బాధపడే వారిలో నిమోనియా వంటి సెకండరీ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వారు సాధ్యమైనంత వరకు తల తడవకుండా జాగ్రత్త వహించాలి.చివరగా... ఈ సీజన్లో చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. ఇలా చేతులు ఎక్కువగా కడుక్కోవడం వల్ల చాలా రకాల జబ్బులను... మరీ ముఖ్యంగా వర్షాల సీజన్లో వచ్చే అనేక వ్యాధులను సమర్థంగా నివారించవచ్చు. డాక్టర్ నవీన్ కుమార్ సీనియర్ ఫిజీషియన్ (చదవండి: World Hepatitis Day: ఐబ్రోస్ థ్రెడింగ్తో ఇంత ప్రమాదమా..! ఏకంగా కాలేయంపై..) -
కాలేయ సంబంధిత సమస్యలపై ఉచిత ఆరోగ్య శిబిరం
మెహదీపట్నంలోని ఆలివ్ ఆసుపత్రిలో జూలై 26 నుంచి 28వ తేదీ వరకూ నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరంలో సుమారు రెండు వందల మంది పాల్గొన్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. హెపటైటిస్ కన్సల్టేషన్ కోసం ఈ ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించినట్లు తెలిపింది. కాలేయ సంబంధిత ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్న ఈ తరుణంలో వీటిపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరముందని, ఈ దిశగా తామీ ప్రయత్నం చేశామని ఫెలోషిప్ ఇన్ అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, హెపటాలజీ కన్సల్టెంట్ డాక్టర్ పరాగ్ దశావతార్ (ఎండీ జనరల్ మెడిసిన్) తెలిపారు. జీర్ణకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు సుమారు 200 మంది కన్సల్టేషన్ సేవలు పొందారని ఆయన వివరించారు. ఆలివ్ హాస్పిటల్ సుమారు 210 పడకల అత్యాధునిక ఆసుపత్రి అని, తరచూ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూంటుందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.(చదవండి: 12వ తరగతి డ్రాపౌట్..సొంతంగా జిమ్..ఇంతలో ఊహకందని మలుపు..!) -
ఆ అమ్మ చర్మం బిడ్డ బుగ్గలపై చిగురించింది..
తల్లి తన బిడ్డల కోసం ఏ త్యాగం చేయడానికైనా సిద్ధపడుతుందనడానికి సిసలైన ఉదాహరణ ఇది. ఈ తల్లి ప్రమాదంలో చెంపలు కాలిపోయి అందవికారంగా తయారైన తన ఆరునెలల చిన్నారి కోసం తన చర్మాన్ని వొలిచి ఇచ్చింది. ఆ తల్లి త్యాగం ఫలించింది. ఇప్పుడా తల్లీ బిడ్డా ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో చక్కగా ఉన్నారు. తనకేం జరిగిందో తెలియకున్నా అమాయకంగా నవ్వుతూ బిడ్డ ధ్యాన్ష్... తన చర్మాన్నిచ్చి కాపాడుకున్నానన్న సంతోషంతో తల్లి మనీషా ఇద్దరూ ఫొటోకు పోజులిచ్చారు. గతనెల 12న అహమ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో విమానం కూలి మేఘనినగర్లోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్, నివాస గృహాలపై పడిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదం జరిగిన సమయంలో సివిల్ హాస్పిటల్లో యూరాలజీ నిపుణుడైన డాక్టర్ కపిల్ కచ్చాడియా భార్య మనీషా, వాళ్ల ఆరు నెలల కుమారుడు ధ్యాన్ష్ ఇంట్లో ఉన్నారు. విమాన శకలం నుంచి చెలరేగిన మంటల్లో మనీషా చేతులు ముఖంపై 25 శాతం కాలిన గాయాలు కాగా, ధ్యాన్ష్ ముఖం, రెండు చేతులు, ఉదరం, ఛాతీ కాలి, గాయాలు కావడంతో ఇద్దరినీ కేడీ ఆసుపత్రికి తరలించారు, అక్కడ ధ్యాన్ష్ ను పీడియాట్రిక్ ఐసియులో చేర్చి వెంటిలేటర్పై ఉంచారు. 36 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న ధ్యాన్స్కు అతని తల్లి ముప్ఫై ఏళ్ల మనీషా చర్మాన్ని తీసి స్కిన్ గ్రాఫ్టింగ్ ద్వారా అమర్చారు. ఫలితంగా ఎనిమిది నెలల పసివాడు ధ్యాన్ష్ ఇప్పుడు చక్కగా నవ్వుతున్నాడు, ప్రాణాంతక కాలిన గాయాల నుండి బయటపడిన అతని బుగ్గలు ఇప్పుడు నునుపుతేలి ఆరోగ్యంతో మెరుస్తున్నాయి. తన నుంచి తీసిన చర్మాన్ని పిల్లాడికి అమర్చి, అతడు కోలుకున్న తర్వాత ఆ బోసి నవ్వులు చూస్తూ మనీషా కూడా త్వరలోనే కోలుకుంది. తల్లి, బిడ్డ ఇద్దరూ జూన్ 12న జరిగిన ఏఐ 171 విమాన ప్రమాదం తర్వాత తీవ్రమైన కాలిన గాయాలకు ఐదు వారాల చికిత్స తర్వాత ఇటీవల డిశ్చార్జ్ అయినట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.‘ఒక్క క్షణం అంతా నల్లగా అయిపోయింది, ఆపై వేడి మా ఇంటిని చుట్టుముట్టింది. నేను ధ్యాన్ష్ను పట్టుకుని దట్టమైన పొగ, మంటల గుండా పరిగెత్తాను. మేము బయటకు వచ్చి ప్రాణాలతో బయటపడగలమని అనుకోలేదు కానీ దేవుడి దయవల్ల, కేడీ హాస్పిటల్ వైద్యులు సకాలంలో స్పందించి చేసిన చికిత్స వల్ల ఇద్దరం ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాం. ఇప్పుడు నేను నా బిడ్డ అందమైన నవ్వును తిరిగి చూడగలుగుతున్నాను’’ అంటూ సంతోషం వెలిబుచ్చింది మనీషా. కేడీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆదిత్ దేశాయ్ మాట్లాడుతూ, ‘ఆ తల్లి తన బిడ్డను కాపాడుకోవడానికి చూపిన ధైర్యాన్ని, వైద్యులకు అందించిన సహకారాన్ని మాటలలో వర్ణించలేం. మా హాస్పిటల్లో ప్రతి విభాగం సమన్వయంతో పనిచేసి సాధ్యమైనంత ఉత్తమమైన ఫలితాలనిచ్చింది’’ అని పత్రికలవారికి తెలిపారు. ఈ సంఘటనలో గాయపడిన ఆరుగురు ప్రమాద బాధితులకు తమ ఆస్పత్రి మానవతా దృక్పథంతో ఉచిత సేవలందించినట్లు తెలిపారు. (చదవండి: రుచిని ఆస్వాదిస్తూనే హాయిగా తినొచ్చు ఇలా..! గ్యాస్, అధిక బరువు..) -
సేంద్రియ పశుపోషణపై దృష్టి
‘ఆర్గానిక్ ఆహారోత్పత్తులు అనగానే మనకు చప్పున గుర్తొచ్చేది ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్లు. కానీ, పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లు కూడా ఆర్గానిక్ బుట్టలో ప్రధాన భాగాన్ని ఆక్రమిస్తుంది. ప్రకృతి/సేంద్రియ సేద్య పద్ధతుల్లో సాగు చేస్తున్న రైతులు ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత ఎక్కువ మంది మన దేశంలో ఉన్నారు. వారు పండిస్తున్న సేంద్రియ ఆహారాన్ని దేశీయంగా వినియోగిస్తుండడంతోపాటు చాలా రకాల సేంద్రియ ఉత్పత్తులను అనేక దేశాలకు మన దేశం ఎగుమతి చేస్తోంది. అయితే, సేంద్రియ పాలు/ పాల ఉత్పత్తులు, సేంద్రియ పశు / కోడి మాంసం తదితర ఉత్పత్తుల ఎగుమతి మాత్రం చెప్పుకోదగిన స్థాయిలో లేదు.సేంద్రియ పశుపోషణ, సేంద్రియ కోళ్ల పెంపకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి విధాన రూపుకల్పన కోసం కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఆర్గానిక్ లైవ్స్టాక్ ప్రొడక్షన్, సర్టిఫికేషన్ ప్రక్రియలకు సంబంధించి విధి విధానాలు, ప్రమాణాలను రూపొందించే కృషి ఊపందుకుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐసీఏఆర్ అనుబంధ సంస్థ జాతీయ మాంసం పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–ఎన్ ఎంఆర్ఐ) ఈ ప్రక్రియలో కీలకపాత్ర పోషిస్తోంది. ఔత్సాహిక రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులతో ఇటీవల ఒక సమాలోచన కార్య శాలను సైతం ఎన్ ఎంఆర్ఐ నిర్వహించింది. ఈ నేపథ్యంలో అసలు సేంద్రియ పద్ధతుల్లో పాడి పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకం అంటే ఏమిటి? రసాయనాలు వాడకుండా పశుపోషణ ఎలా? వ్యాధుల నివారణ, చికిత్సకు రసాయనా లకు ప్రత్యామ్నాయం ఏమిటి? సేంద్రియ ధ్రువీకరణ పద్ధతులేమిటి? మన బలాబలాలు, సవాళ్లేమిటి? ఇటువంటి అంశాలపై విషయ నిపుణులు ‘సాక్షి సాగుబడి’తో ఏమన్నారంటే.. పంటలు/తోటలు లేదా జంతువులు / కోళ్లను రసాయనిక పురుగు మందులు, రసాయనిక ఎరువులు, హార్మోన్లు, అల్లోపతి మందులు వంటి సింథటిక్ ఉత్పాదకాలను ఉపయోగించకుండా పెంచటాన్ని సేంద్రియ వ్యవసాయంగా అంతర్జాతీయ సమాజం గుర్తిస్తోంది. ఈ విధంగా రసాయ నాలు, జన్యుమార్పిడి ఉత్పాదకాలు వాడకుండా సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పెంచే ఆహారోత్పత్తులకు దేశ విదేశీ మార్కెట్లలో గిరాకీ అంతకంతకూ పెరుగుతోంది. ధ్రువీకరణ ప్రమాణాలకు అనుగుణంగా పెంచిన ఆరోగ్యదాయక మైన సేంద్రియ ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్లతో పాటు సేంద్రియ పాలు, మాంసం, కోడిగుడ్లు, విలువ ఆధారిత సేంద్రియ ఆహారోత్పత్తులకు అధిక సొమ్ము చెల్లించటానికి ధనిక, మధ్యతరగతి వినియోగ దారులు వెనుకాడటం లేదు. ఈ ట్రెండ్ ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలతో పాటు భారత్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ కనిపిస్తోంది. ప్రపంచ సేంద్రియ మార్కెట్ జోరుఆర్గానిక్ పాలు, గుడ్లు, మాంసం ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్ వేగంగా పెరుగుతోంది. సేంద్రియ పాల మార్కెట్ ఏటా 6% పెరుగుతోంది. 2020లో 2 వేల కోట్ల డాలర్లుగా ఉండగా, 2026 నాటికి 3,200 కోట్ల డాలర్లకు పెరుగుతుందని అంచనా. అదేవిధంగా సేంద్రియ మాంసం ఉత్పత్తుల మార్కెట్ 7% పెరుగుతోంది. 2020లో 1,500 కోట్ల డాలర్ల నుంచి 2025 ఆఖరు నాటికి 2 వేల కోట్లకు పెరుగుతుందని అంచనా. ఆర్గానిక్ ఎగ్ మార్కెట్ మరింత వేగంగా 12.5% పెరుగుతోంది. 2023లో 370 కోట్ల డాలర్ల వ్యాపారం జరగ్గా 2032 నాటికి ఇది 1,070 కోట్ల డాలర్లకు పెరుగుతుందని అంచనా. 20% పెరుగుతున్న దేశీయ మార్కెట్మన దేశంలో సేంద్రియ ఆహారోత్పత్తుల మార్కెట్ ఏటా 20% పెరుగుతోంది. కోవిడ్ తర్వాత సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. అనధికారిక పద్ధతుల్లో మార్కెటింగ్ ఊపందుకుంది. ఉత్పత్తిదారు నుంచి వినియోగదారులు నేరుగా కొంటున్నారు. ప్రభుత్వం ప్రకృతి/ సేంద్రియ పంటల సాగును చాలా ఏళ్లుగా విస్తృతంగా ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు సేంద్రియ పాడి పశువుల పెంపకం, సేంద్రియ గొర్రెలు/మేకల పెంపకం, సేంద్రియ కోడిగుడ్లు, కోడి మాంసం పెంపకంపై ఇప్పుడు దృష్టి సారించింది. ఎన్ పీఓపీ, పీజీఎస్ సర్టిఫికేషన్లు2023–24లో మన దేశంలో 44.75 లక్షల హెక్టార్లలో సేంద్రియ సాగు జరుగుతోంది. దీనితో పాటు 28.5 లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం నుంచి సేంద్రియ ఉత్పత్తులు సేకరిస్తున్నారు. విదేశాలకు ఎగుమతి చేయడానికి వీలున్న నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్ పీఓపీ) సర్టిఫికేషన్ కలిగిన రైతులు 36 లక్షల టన్నుల సేంద్రియ దిగుబడులు పండించారు. దేశీయంగా అమ్ముకోవడానికి ఉద్దేశించిన పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టం (పీజీఎస్) సర్టిఫికేషన్ ఉన్న రైతులు 6.20 లక్షల టన్నులు పండించారు. ఈ రెండు రకాల సర్టిఫికేషన్లు పంటలతో పాటు పాలు, మాంసం, గుడ్లు, తేనె, ఆక్వా ఉత్పత్తులకు కూడా ఇస్తారు. ఎగుమతులకు అవకాశాలు2023–24లో 2,61,029 టన్నుల (వీటి ఖరీదు రూ.4,008 కోట్లు) సేంద్రియ పత్తి, నూనెగింజలు, చెరకు, ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, ఔషధ మొక్కలను భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి చేశాం. అమెరికా, యూరోపియన్ యూనియన్, కెనడా, బ్రిటన్, శ్రీలంక, స్విట్జర్లాండ్, వియత్నాం, ఆస్ట్రేలియా తదితర దేశాలకు మనం సేంద్రియ ఉత్పత్తులు అమ్మాం. ఆయా దేశాల సేంద్రియ ప్రమాణాలకు తగిన రీతిలో సేంద్రియ పాలు, మాంసం, గుడ్లు మన రైతులు ఉత్పత్తి చేస్తే, వాటిని ఎగుమతి చేయటం కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, జర్మనీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, సింగపూర్, మలేసియా, కెనడా దేశాల్లో సేంద్రియ మాంసం, గుడ్లు, పాలు, తేనెకు డిమాండ్ ఉంది. ఆ మార్కెట్ల ప్రత్యేక నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా మన దేశంలో సేంద్రియ పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్కు మౌలిక సదుపాయాలు, ఏర్పాటు చేసే పటిష్టమైన సమగ్ర విధానంతో పాటు రైతుల కోసం ప్రత్యేక పథకాలను రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు. సేంద్రియ పశుపోషణలో ఎన్ ఎస్ఓపీ ప్రమాణాలు కీలకంసేంద్రియ పాలు, మాంసం, గుడ్లు ఉత్పత్తి చెయ్యాలనుకునే రైతులు, సంస్థలు నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్ ఎస్ఓపీ) ప్రమాణాలు పాటించాలి. అవి: సహజ బ్రీడింగ్ పద్ధతులను అనుసరించటం.. జంతువుల ఆరోగ్యం– సంక్షేమానికి రక్షణ చర్యలు తీసుకోవటం.. సేంద్రియంగా పండించిన దాణాను, పశుగ్రాసాలను మేపటం.. పశువులను ఒకేచోట కట్టేసి ఉంచకుండా సహజ ప్రవర్తనను వ్యక్తీకరించేలా స్వేచ్ఛనివ్వటంతో పాటు ఒత్తిడిని తగ్గించడం ముఖ్యం. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అల్లోపతి ఔషధాలు, యాంటీబయాటిక్స్, హార్మోన్లు, పెరుగుదలకు బూస్టర్లు, దాణా మిశ్రమాలు మొదలైన వాటి వాడకంపై నూటికి నూరు శాతం నిషేధం పాటించాలి. పెంచే పశువులు, జీవాల జాతుల ఎంపిక.. దాణా, ఆరోగ్య సంరక్షణ, పెంపకం, పేడ, మూత్రాల నిర్వహణ, సేంద్రియ పెంపక పద్ధతులకు మారే కాలం, షెడ్ల నిర్మాణంలో మెళకువలు, విశాలమైన స్థలం ఆవశ్యకత, ప్రతి పశువుకు గుర్తింపు చిహ్నం ఇవ్వటం, రవాణా పద్ధతులు, వధ–కోత అనంతర నిర్వహణలో నిర్దిష్ట పద్ధతులు పాటించాలి. అన్ని విషయాలపై రికార్డులు తయారు చేయటం ముఖ్యమైన విషయం. ఈ ప్రమాణాలు పాటిస్తూ సేంద్రియ పద్ధతులను అలవాటు చేసుకోవటంలో రైతులకు, విస్తరణ సిబ్బందికి అవగాహన కల్పించటం కోసం హయత్నగర్లోని ‘క్రీడా’ ప్రదర్శన క్షేత్రంలో సేంద్రియ గొర్రెల పెంపక యూనిట్ను ప్రారంభించాం. ఎన్పీఓపీ ధ్రువీకరణ ప్రమాణాలు పాటిస్తున్నాం. సేంద్రియ పశుపోషణ ద్వారా పాలు, మాంసం, సేంద్రియ కోళ్ల పెంపకంలో ఆసక్తి గల రైతులు, రైతు ఉత్పత్తి సంస్థలు(ఎఫ్పీఓలు), సహకార సంఘాలకు ప్రామాణిక శిక్షణ ఇస్తాం. – డాక్టర్ పి. బస్వారెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్– జాతీయ మాంసం పరిశోధనా సంస్థ (ఎన్ ఎంఆర్ఐ), చెంగిచర్ల, హైదరాబాద్ 040–29801672ఏ జాతులనైనా సేంద్రియంగా పెంచవచ్చువిదేశాల్లో పంటలు పండించే పొలాలు, పశువుల్ని పెంచే క్షేత్రాలు కలిసి ఉండవు. మన దేశంలో పంటలు సాగు చేసే రైతులకు పశువుల పెంపకం కూడా ఉంటుంది. ప్రకృతి/సేంద్రియ సేద్యంలో పంటలు పండించే రైతుల పొలాల్లోనే సేంద్రియంగా ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకానికి ప్రోత్సహిస్తే సత్ఫలితాలు వస్తాయి. వారి సొంత పంట వ్యర్థాలను, సొంత ధాన్యాలను పశువులకు మేపటం ద్వారా నాణ్యతా ప్రమాణాలను సులువుగా ఆచరించవచ్చు. నేల–పశువు–పంట.. ఈ మూడింటి మధ్య సేంద్రియ అనుసంధానం చెయ్యాలి. ఈ విషయంలో మన దేశంలో చిన్న, సన్నకారు రైతులకు ఉన్న నైపుణ్యాలు వరంగా ఉపయోగపడతాయి. విదేశాలతో పోల్చితే రసాయనాలకు పెద్ద పీట వెయ్యని దేశం మనది. వ్యవసాయ రసాయనాలు వాడకం తక్కువగా ఉన్న కొండ/గిరిజన ప్రాంతాలపై తొలుత దృష్టిని కేంద్రీకరించి, ప్రోత్సహించాలి. దేశీ, నాటు పశువులను మాత్రమే సేంద్రియ పెంపకానికి వాడాలనేం లేదు. సంకరజాతి పశువులను నిస్సందేహంగా పెంచవచ్చు. – డాక్టర్ మహేశ్ చందర్, ప్రధాన శాస్త్రవేత్త, జాతీయ పశుపోషణ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–ఐవీఆర్ఐ), ఇజ్జత్నగర్, ఉత్తరప్రదేశ్పశు వ్యాధులకు సంప్రదాయ ఈవీఎం చికిత్స మేలుపశు వ్యాధుల నివారణలో, చికిత్సలో యాంటీబయాటిక్ ఔషధాలను అతిగా వాడుతూ వాటికి నిరోధకత పెంచుకోవటం ఇప్పుడు మానవాళి ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. సుసంపన్న సంప్రదాయ సిద్ధ, ఆయుర్వేద విజ్ఞానంతో కూడిన మూలికా వైద్య చికిత్స (ఎత్నో వెటర్నరీ మెడిసిన్ –ఈవీఎం)ల ద్వారా పశువ్యాధులను జయించవచ్చు. 24 ఏళ్లుగా ఈవీఎంలపై కృషి చేస్తున్నా. వీటి పనితీరు ఎంత ప్రభావశీలంగా ఉందో 9 రాష్ట్రాల్లో 25 ఎన్ డీడీబీ అనుబంధ పాడి సహకార సంఘాల్లోని రైతుల అనుభవాలే తేటతెల్లం చేస్తున్నాయి. పొదుగువాపు, గాలికుంటు వ్యాధి వంటి అనేక తీవ్ర జబ్బులను సైతం కొద్ది రోజుల్లో ఈవీఎం మందులతో తగ్గించవచ్చని రుజువైంది. 11.2 లక్షల కేసుల్లో 80.4% జబ్బులు తగ్గిపోయాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈవీఎంల ప్రభావశీలతను గుర్తించింది. ఈవీఎంకు ఎవిడెన్ ్స బేస్డ్ మెడిసిన్ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తోంది. ఇవి తక్కువ ఖర్చుతో, కచ్చితంగా ఫలితాలనిచ్చే పర్యావరణ హితమైన, ఆరోగ్యదాయకమైన చికిత్సలని గుర్తించాలి.– ప్రొ. ఎన్ . పుణ్యమూర్తి, ఎన్ డీడీబీ కన్సల్టెంట్, టిఎఎన్ యువిఎఎస్ విశ్రాంత ఆచార్యులు, తంజావూరు, తమిళనాడుసమగ్ర విధానం ద్వారా రైతులకు మార్గదర్శనంప్రకృతి/సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆర్గానిక్ మాంసం, గుడ్లు, పాలు/పాల ఉత్పత్తుల పెంపకంపై కూడా దృష్టిని కేంద్రీకరించింది. సేంద్రియ మాంస ఉత్పత్తుల పెంపకం, మార్కెటింగ్ తదితర అంశాలపై రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులు, పారిశ్రామికవేత్తల ఆకాంక్షలతో పాటు మా అనుభవాలను జోడించి కేంద్రానికి నివేదిక పంపుతాం. సమగ్ర విధాన రూపకల్పనకు ఇది దోహదం చేస్తుంది. సేంద్రియ పశుపెంపకంపై పరిశోధనలకు, విస్తరణకు ప్రత్యేక నిధులు కేటాయించాలి. అపెడాలో సేంద్రియ పశు పెంపకం ప్రోత్సాహానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చెయ్యాలి. అమూల్ వంటి నమ్మదగిన బ్రాండ్ ద్వారా విక్రయిస్తే సేంద్రియ పాలు, గుడ్లు, మాంసం అధిక ధర ఇచ్చి కొనటానికి దేశంలో ప్రజలు ఆసక్తితో ఉన్నారు. యూరప్, మధ్యప్రాచ్య దేశాలకు సేంద్రియ పాలు, మాంసం ఎగుమతి చేయడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆసక్తి గల రైతులు మమ్మల్ని సంప్రదిస్తే మార్గదర్శనం చేస్తాం. – డా. ఎస్. బి. బర్బుదే, సంచాలకులు, ఐసీఏఆర్– జాతీయ మాంసం పరిశోధనా సంస్థ (ఎన్ ఎంఆర్ఐ), చెంగిచర్ల, హైదరాబాద్ – పంతంగి రాంబాబు -
టైగర్ ప్రిన్సెస్
‘అమ్మో పులి’ అనుకునే రోజులు కావు ఇవి. ‘అయ్యో పులి’ అనుకునే రోజులు. పులుల మనుగడ ప్రమాదంలో పడిన నేపథ్యంలో వాటి పరిరక్షణకు నడుం కట్టిన అగ్రగణ్యులలో దిల్లీకి చెందిన లతికానాథ్ ఒకరు. ‘టైగర్ ప్రిన్సెస్’గా పేరు తెచ్చుకున్న లతిక చూడని అడవి లేదు. తన కెమెరా కన్ను ప్రపంచంలోని ఎన్నో పులుల విషయాలను, విశేషాలను, విషాదాలను ఆవిష్కరించింది.చిన్నప్పుడు లతికను తల్లిదండ్రులు నేషనల్ పార్క్కు తీసుకువెళ్లడం వల్ల ఆమెలో జంతువులపై ఆసక్తి, ప్రేమ పెరుగుతూ వచ్చాయి. జంతు పరిరక్షణ ఉద్యమ విశేషాలు వినడం, ఆ ఉద్యమాల్లో పాల్గొనడం లతిక కన్జర్వేషన్ ఎకాలజిస్ట్, ఫోటోగ్రాఫర్గా రూపుదిద్దుకోవడానికి కారణం అయింది.‘పులుల పరిరక్షణకు సంబంధించి మీరు చేసిన కృషిని డాక్యుమెంట్ చేయండి’ అంటూ లతికను సంప్రదించిన నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజీన్ నిర్వాహకులు ఆమెకు ‘టైగర్ ప్రిన్సెస్’ అనే బిరుదును ప్రదానం చేశారు. ‘డిస్కవరీ’ చానెల్ కోసం లతిక చేసిన ‘వైల్డ్ థింగ్స్’ డాక్యుమెంటరీ పాపులర్ అయింది. మన దేశంలో పులుల పరిరక్షణ, మేనేజ్మెంట్పై పరిశోధన చేసిన తొలి భారతీయురాలిగా లతిక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.పులుల ఉనికి, సంరక్షణకు సంబంధించిన అరకొర సమాచారం ఒక పరిమితిగా ఉండేది. ఆ పరిమితిని లతిక పరిశోధనలు అధిగమించాయి. డా. జార్జ్ షాలర్ తరువాత ఆ స్థాయిలో పులులపై పరిశోధన చేసిన వ్యక్తిగా లతికకు గుర్తింపు తెచ్చాయి. ప్రస్తుతం పులుల పరిరక్షణ, మేనేజ్మెంట్కు సంబంధించి అధ్యయనాలు ఎక్కువగానే జరుగుతున్నాయి.‘గతంలో పోల్చితే పులుల పరిరక్షణపై ఎక్కువగా అధ్యయనాలు జరుగుతున్నప్పటికీ, పరిశోధన, అధ్యయనం అనేవి ఇప్పటికీ అంత సులభంగా ఏం లేవు. కావు. వైల్డ్లైఫ్ బయాలజిస్ట్, ఫొటోగ్రాఫర్గా చెప్పుకోదగ్గ స్థాయిలో జీవించడం కష్టంగా ఉంది. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. పులుల సంరక్షణకు సంబంధించి అధ్యయనాన్ని ప్రోత్సహించాలి’ అంటుంది లతిక.ప్రయాణాలు అంటే ఇష్టపడే లతిక యాభైకిపైగా దేశాలకు వెళ్లింది. ఎన్నో అడవులలో పులులతో సహా ఎన్నో జంతువుల ఫోటోలు తీసింది. ‘ప్రతి ఫోటోగ్రాఫ్కు ఒక కథ ఉంది. నేను చూసిన ప్రతి పులి నా మనసులో ముద్రించుకుపోయింది. ప్రతి పులి తనకు సంబంధించి ఒక కథ చెబుతున్నట్లుగానే ఉంటుంది. అవి క్షేమంగా ఉండాలని ఎప్పుడూ ప్రార్థించేదాన్ని’ అంటూ జ్ఞాపకాల్లోకి వెళుతుంది లతిక.లతిక తీసుకువచ్చిన ఫొటోగ్రాఫ్స్ కలెక్షన్ ‘హిడెన్ ఇండియా’ సమస్త జంతుజాలాన్ని మన ముందు ఆవిష్కరిస్తుంది. ఈ పుస్తకానికి వాడిన ముఖచిత్రం ఎంతో అర్థవంతంగా ఉంటుంది. అడవిలో ఒక శిథిల వృక్షం వెనకాల నుంచి భయంగా చూస్తూ ఉంటుంది పులి. ఆ పులి కళ్లు చెప్పకనే ఏవో బాధలు చెబుతున్నట్లుగానే ఉంటుంది. పిల్లల కోసం లతిక రాసిన ‘తక్దీర్ ది టైగర్ క్లబ్’ ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రపంచ వ్యాప్తంగా ఇరవై భాషలలోకి అనువాదం అయింది.‘మనుషుల మనుగడ జంతువుల మనుగడతో ముడిపడి ఉంది. స్వల్పకాల స్వార్థప్రయోజనాల కోసం వాటికి హాని చేయడం అంటే భవిష్యత్ కాలంలో మన జీవితాన్ని మనం నాశనం చేసుకోవడమే’ అంటున్న లతికానాథ్ అకాడమిక్ రిసెర్చ్ నుంచి కన్జర్వేషన్ ప్రాజెక్ట్లకు సంబంధించి కన్సల్టెన్సీ వరకు పులుల పరిరక్షణకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది.వాటిని చూడడం అదృష్టంనేను పులులకు సమీపంలో ఉన్నప్పుడు, వాతావరణం వేడిగా ఉందా, చల్లగా ఉందా? అసౌకర్యంగా ఉందా? ఆకలిగా ఉందా? అనే స్పృహ ఉండదు. పులులు మాత్రమే నాకు కనిపిస్తాయి. పిట్ట కావచ్చు, పులి కావచ్చు వాటిని చూడడం అదృష్టంగా భావిస్తాను. వాటిని చూసినప్పుడల్లా వాటి పరిరక్షణకు ఇంకా ఏదైనా చేయాలనే స్ఫూర్తి కలుగుతుంది.– లతికానాథ్ -
రుచిని ఆస్వాదిస్తూనే హాయిగా తినొచ్చు ఇలా..! గ్యాస్, అధిక బరువు..
ఇటీవల కాలంలో అందరిని వేదించే సమస్య అధిక బరువు, జీర్ణ సంబంధిత సమస్యలు. ఎందుకంటే నచ్చిన ఆహారం కాస్త ఎక్కువగా తినకుండా ఉండలేరు చాలామంది. చెప్పాలంటే.. ఫుడ్ విషయంలో నోరు కంట్రోల్లో ఉంటే చాలా వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. అది చాలా కష్టం. ఎందుకంటే నోరూరించే పదార్థాలు తినమని పిలుస్తుంటే ఆగకుండా ఉండటం ఎవరికి సాధ్యం. మరి అలాంటి సమస్యను అధిగమించి రుచిని ఆస్వాదిస్తూ..బి లిమిట్ని పాటించటం ఎలాగో తెలుసుకుందామా..!.బాలీవుడ్ నటి కరీనా కపూర్ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్ ..మనసారా నచ్చిన ఆహారం తింటూనే అధిక బరువు, గ్యాస్ సమస్యకు ఎలా చెక్ పెట్టొచ్చొ షేర్ చేసుకున్నారు. నిజానికి మనం ఏ ఆహారాన్ని తింటున్నా..ఒకటి రెండు, మూడు..అలా అన్ని సార్లు పెట్టుకుంటూ లాగించేస్తాం. మరి ఇష్టమైన ఫుడ్ అయితే ..ఎంతలా తింటారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. నియంత్రణ లేకుండా తినడాన్ని నియంత్రణలోకి తెచ్చుకోవాలంటే..ఈ మైండ్ఫుల్నెస్ టెక్నీక్ అయినా జోర్డాన్ ఫార్ములాను ఫాలోకండని చెబుతున్నారామె. ఇంతకీ అదేంటంటే..అందుకు ఆమె ఒక స్నాక్స్ ఐటెంని ఉదాహారణ తీసుకుంటూ చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఉదాహరణకు సగ్గుబియ్యం వడలు స్నాక్స్గా తినాలనుకున్నారు. అప్పుడు వెంటనే ప్లేట్ ఓ ఐదు వడలు తక్కువ కాకుండా లాగించేస్తారు. కానీ అలా కాకుండా ఇంత వరకు తినాలని ఫిక్స్అవ్వాలి. వంటకాలు నోరూరించేలా ఉండొచ్చు..కానీ ఆరోగ్యంపై ధ్యాస..ఎలా తింటే బెటర్గా ఉంటానన్నది ఆ పదార్థాలను చూడగానే ఠక్కున గుర్తుకు రావాలి. అలాంటి ఆలోచన రాగానే తినాలనే ఆలోచన ఆటోమెటిగ్గా నియంత్రణలోకి వచ్చేస్తుంది. వేసుకునేటప్పుడే రెండు లేదా మూడుతో ఆపేస్తారని చెబుతున్నారామె. పైగా దాన్ని ఎంజాయ్ చేసేలా చట్నీ లేదా ఇతరత్రా వాటిని సిద్ధం చేసుకుని ప్రతి ముక్కను ఆస్వాదిస్తూ..తింటుంటే కడుపు నిండిన అనుభూతి ప్లస్..తక్కువ తినడం రెండు సాధ్యమవుతాయట. దీన్ని మైండ్ఫుల్నెస్ తినడం అంటారని అన్నారు. రుజుతా ఈ చిట్కాకు జోర్డాన్ ఫార్ములాగా పేర్కొన్నారు. మంచి జోష్తో నచ్చిన ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ లిమిట్గా తినడమే ఈ జోర్డాన్ ఫార్ములానట. ఈ టెక్నిక్లో బేసి సంఖ్యలో పదార్థాలను తీసుకునేలా ఫిక్స్ అవ్వడం తోపాటు..క్రమశిక్షణతో తినడం అలవడుతుందట. అయితే ఇక్కడ తప్పనిసరిగా బుద్ధిపూర్వకంగా, నెమ్మదిగా ఆస్వాదిస్తూ తినడం అనేది అత్యంత కీలకం. అప్పుడే తీసుకునే ఆహారంపై కంట్రోల్ ఉంటుందట. ఇది స్వీయ నియంత్రణను మెరుగుపరుస్తూ..ఆహారంపై అవగాహన ఉండేలా తీసుకునేలా చేస్తుందట. ఇది చక్కటి సత్ఫలితాలనిస్తుందని ఆమె ధీమాగా చెబుతున్నారు. మంచి ఆరోగ్యానికి సమతుల్య ఆహారం, ఆకలే ప్రధానం. అందుకోసం ఆనందిస్తూ తినేలా..పరిమితంగా తినడం అనేదానిపై శ్రద్ధ పెట్టడం అనే జోర్డాన్ సూత్రం పాటిస్తే చాలు అని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్. మరి ఇంకెందు ఆలస్యం ప్రయత్నంచి చూడండి. View this post on Instagram A post shared by Rujuta Diwekar (@rujuta.diwekar) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: 12వ తరగతి డ్రాపౌట్..సొంతంగా జిమ్..ఇంతలో ఊహకందని మలుపు..!)) -
OTT సబ్స్క్రిప్షన్ కంటే తక్కువ ఖర్చుతో పెళ్లి!
పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు.. తప్పెట్లు.. అంటూ వర్ణించారు మనసు కవి ఆత్రేయ. ఈ కాలపు పెళ్లిళ్లలో సందడి కంటే షో ఎక్కువగా కనబడుతోంది. సంప్రదాయాల కంటే హంగామా ఎక్కువవుతోంది. ఫలితంగా పెళ్లి ఖర్చు తడిసిమోపెడవుతోంది. ఓ మాదిరి స్థాయిలో వివాహ వేడుక నిర్వహించాలంటే తక్కువులో తక్కువ 10 లక్షల రూపాయల వరకు ఖర్చవుతోంది. జీవితంలో ఒకేసారి జరిగే వేడుక అంటూ స్థాయిమించి లగ్గాలకు వెచ్చిస్తున్నారు. దీంతో పెళ్లి ఖర్చు అంటనే మిడిల్ క్లాస్ (Middle Class) పేరెంట్స్ పరేషాన్ అవుతున్నారు. అయితే ఇందుకు భిన్నంగా ఓ జంట సింపుల్గా పెళ్లిచేసుకుని వార్తల్లో నిలిచింది.ఏడాది OTT సబ్స్క్రిప్షన్ కంటే తక్కువ ఖర్చుతో పెళ్లి జరిగిందంటే నమ్ముతారా? అవును ఇది నిజంగా నిజం. ఓ జంట కేవలం రూ. 1,592తో పెళ్లి చేసుకుంది. జోకులేయకండి సార్.. ఈ డబ్బుతో ఒక జత బట్టలు కూడా కొనలేం, ఏకంగా పెళ్లా? అంటూ నోరెళ్లబెట్టకండి. అయితే రాజస్థాన్కు (Rajasthan) చెందిన కమల్ అగర్వాల్, అతని చిరకాల స్నేహితురాలు రుచి పెళ్లి గురించి మీరు తెలుసుకోవాల్సిందే. కళ్లు చెదిరే సంగీత్లు, ఆర్భాటపు గ్రాండ్ బఫేలు, ఊరంతా ఫంక్షన్ హాల్ లేకుండా వీరిద్దరూ సింపుల్ వెడ్డింగ్ చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేసేశారు.సింపుల్ వెడ్డింగ్ తన పెళ్లికథను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'రెడిట్' (Reddit) లో పంచుకున్నాడు కమల్. తన అన్నయ్య పెళ్లి ఆర్భాటంగా చేయడం వల్ల డబ్బు, సమయంతో పాటు తమ కుటుంబం అనుభవించిన యాతనను కళ్లారా చూసి.. నిరాడంబరంగా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కమల్. మే 28న రిజిస్ట్రార్ కార్యాలయంలో కమల్, రుచి వివాహం చేసుకున్నారు. తామిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు ఏప్రిల్ 17న రిజిస్ట్రార్ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. వధూవరుల ఆధార్కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు, కొన్ని స్టాంప్ పేపర్లతో పెళ్లి తంతు సింపుల్గా ముగిసింది. బారాత్ (Baraat) వంటి హంగామా లేకుండా పెళ్లికొడుకు, పెళ్లికూతురు.. మ్యారేజ్ సర్టిఫికెట్తో రిజిస్ట్రార్ ఆఫీసు నుంచి చిరునవ్వుతో బయటకు వచ్చారు.పెళ్లి ఖర్చులు ఇలా..తన పెళ్లికి వెచ్చించిన డబ్బు వివరాలు కూడా కమల్ వివరించాడు. స్టాంప్ పేపర్లకు రూ. 320, పబ్లిక్ నోటరీకి రూ. 400, అత్యవసర ఫోటోలకు రూ. 260, డిక్లరేషన్ ఫారమ్ ప్రింటింగ్ కోసం రూ. 290, స్టేషనరీ, ప్రింటింగ్, ప్రభుత్వ రుసుములకు రూ. 322 వరకు ఖర్చచేసినట్టు వెల్లడించాడు. మీ దగ్గర ఇప్పటికే ఫోటోలు ఉండి ఉంటే, ఇంట్లో ప్రింట్ తీసుకునే వీలుంటే, నోటరీ చేయడానికి తెలిసినవారు ఎవరైనా ఏంటే.. పెళ్లి ఖర్చు రూ.వెయ్యిలోపే ఉంటుందని వివరించాడు.నెటిజనులు ఏమన్నారంటే..కమల్, రుచి సింపుల్ వెడ్డింగ్ను నెటిజనులు (Netizens) ప్రశంసిస్తున్నారు. తాము ఇలాగే నిరాడంబరంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు కొంతమంది మనలో మాట బయటపెట్టారు. ఎటువంటి ఆడంబరం లేకుండా పెళ్లి చేసుకోవడంతో కమల్, రుచి నెట్ వర్త్ వెంటనే రూ. 10 లక్షలు పెరిగిందని ఓ నెటిజన్ చమత్కరించారు. మరికొందరు నూతన వధూవరులను అభినందిస్తూనే.. క్యాటరింగ్, ఆభరణాల వంటి పరిశ్రమలను నిలబెట్టడానికి లావిష్ వెడ్డింగ్స్ సహాయపడతాయని పేర్కొన్నారు. విలాసవంతమైన వేడుకలు ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తాయన్నారు. చదవండి: అంతిమ క్షణాల్లో 'విల్' పవర్!దీనికి కమల్ అగర్వాల్ స్పందిస్తూ.. తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నామని చెప్పారు. ఖర్చు విషయంలో రాజీ పడలేదని, తమది చైతన్యవంతమైన నిర్ణయమని అన్నాడు. హంగు, ఆర్భాటాలు లేకుండా సింపుల్ వెడ్డింగ్ (Simple Wedding) చేసుకుంటే మంచిదన్న అభిప్రాయాన్ని ఎక్కువ మంది నెటిజనులు వ్యక్తం చేయడం గమనార్హం. మరి మీరేమంటారు? -
వామ్మో.. బామ్మో: భారీ కోబ్రానే షేక్ చేసింది
సాధారణంగా పాము అన్న పదం వింటేనే ఆమడ దూరం పారిపోతారు చాలామంది. మరికొంత మంది దాన్ని చంపేదాకా నిద్రపోరు. కానీ 70 ఏళ్ల బామ్మ చేసిన సాహసం చూస్తే..వామ్మో..బామ్మో.. అంటారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.పూణేలోని ముల్షి తాలూకాలోని అంబోలి గ్రామానికి చెందిన 70 ఏళ్ల శకుంతల సుతార్ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. పామును మెడకు చుట్టుకుని నెటిజన్లను ఆశ్చర్యపర్చింది.ఏం జరిగిందంటేచుట్టు పక్కల వాతావరణం కారణంగా ఇంట్లోకి భారీ పాము (కోబ్రా) వచ్చింది. ఈ పామును చూడగానే ఇంట్లో వాళ్లంతా భయంతో పరుగులు పెట్టారు. కానీ బామ్మ ఏమాత్రం భయపడలేదు. దాన్ని భయపెట్టి, చంపేందుకు ప్రయత్నించలేదు. పైగా దాన్ని కాపాడింది. అదీ వట్టి చేతులతోనే, చాకచక్యంగా నక్కి ఉన్న పామును పట్టుకుంది. అయితే ఆ పాము అంత ఈజీగా ఏమీ లొంగలేదు. అయినా సరే నిర్భయంగా, అత్యంత సాహసంతో దాన్ని దొరకబుచ్చుకుని పామును పట్టుకుని మెడలో వేసుకోవడం విశేషంగా నిలిచింది. దీంతో అక్కడున్న వారు ఫోటోలు, వీడియోలు తీస్తుంటే వారికి ఫోజులిచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.చదవండి: 100 ఏళ్లకు పెళ్లి, 103వ బర్త్డేకి తీరనున్న డ్రీమ్ : లైఫ్ సీక్రెట్ అదేనట!ఈ పామును స్థానికంగా ధమన్ అని పిలుస్తారట. దీనివల్ల మనుషులకు ఎలాంటి హాని లేదు. పైగాఎలుకల నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాము. ఇది 18 అడుగుల (5.5 మీటర్లు) పొడవు వరకు పెరుగుతుంది. భారతదేశం సహా ఆగ్నేయాసియా అడవులలో కనిపించే కింగ్ కోబ్రా దట్టమైన వృక్షసంపద, సమృద్ధిగా ఆహారం ఉన్న ప్రాంతాలలో నివసిస్తాయి.అయితే అన్ని పాములూ విషపూరితమైనవి కావు. వాటిని చూసినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. తమకు హాని కలుగుతుందని భయపడనంతవరకూ అవి ఎలాంటి హానీ చేయవు. అలాగని పాము కనిపించగానే దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించకూడదు. దానికి ప్రత్యేక శిక్షణ ఉండాలి. ఎక్కడ ఎలా పట్టుకోవాలనే ఒడుపు, విజ్ఞానం తెలియాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. ఏదైనా పాము, ఇతర ప్రమాదకరమైనవి కనిపించినపుడు వన్యప్రాణ సంరక్షణ అధికారులకు సమాచారం అందివ్వాలి.ఇదీ చదవండి: HealthTip ఈ గింజలతో మెకాళ్ల నొప్పి, అధిక బరువుకు చెక్ ! -
12వ తరగతి డ్రాపౌట్..సొంతంగా జిమ్..ఇంతలో ఊహకందని మలుపు..!
నచ్చిన రంగంలో రాణించాలని ఎంతో ప్రయాసపడతారు. అన్ని ఏర్పాట్లు చేసుకుని డ్రీమ్ సాధించుకుందామనే తరుణంలో ఊహకందని మలుపు తీసుకుంటుంది జీవితం. అనుకోని ఆ యూటర్న్ని జీర్ణించుకోలేక సతమతమవుతారు చాలామంది. కానీ కొందరు జీవితంలో ఇలాంటివి భాగమే అని సానుకూల దృక్పథంతో ఆ అవాంతరం లేదా ఆపదను జయించి అనుకున్న కలను సాకారం చేసుకుని స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి గాథే ఈ యువకుడి కథ. అతడి స్టోరీ ఆద్యంతం ఆసక్తికరంగానూ..స్పూర్తిదాయకంగానూ ఉంటుంది. అతడే పరాస్ బజాజ్. 12వ తరగతికే చదవుకి స్వస్తి పలికాడు. చదవు కంటే ఫిటెనెస్ పట్ల పరాస్కి మక్కువ ఎక్కువ. ఆ ఇష్టంతోనే చదువుని మధ్యలోనే ఆపేసి ఢిల్లీలోని ఫిట్నెస్ అకాడమీలో జాయిన్ అయ్యాడు. అక్కడ ఫిట్నెస్ అంటే.. శారీరక పరివర్తన మాత్రమే కాదు, క్రమశిక్షణతో బాధ్యతగా మెలిగేలా చేసే ఒక ప్రక్రియ అని పరాస్ గుర్తిస్తాడు. తాను సరైన రంగాన్ని ఎంచుకున్నానని భావించి కొద్దికాలంలోనే దానిపై మంచి పట్టు సాధించి..ఇతరుల ఫిట్నెస్ లక్ష్యాలను సాధించడంలో సాయం అదించే స్థాయికి చేరుకున్నాడు. అలా అతడు ఆ ఫిట్నెస్ రంగంలో అచిరకాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ నమ్మకంతో ప్రభుత్వ స్టార్టప్ కింద రుణం తీసుకుని మరీ ఉత్తరాఖండ్లోని సితార్గంజ్లో సొంతంగా జిమ్ను ప్రారంభించాడు. అంతా హాయిగా సాగిపోతుంది అనుకున్న తరుణంలో జీవితం ఊహించని విధంగా సవాలు విసిరింది. ఇలా సొంతంగా జిమ్ ప్రారంభించాడో లేదో జస్ట్ రెండు నెలలకే కేన్సర్ బారినపడ్డాడు. ఆ తర్వాత కీమోథెరపీ వంటి చికిత్సల కారణంగా..అప్పటి దాక మంచి ఫిట్గా ఉండే అతడి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. జుట్టు ఊడిపోయింది, మజిల్స్ తగ్గిపోయాయి, ఆఖరికి ఒంట్లో శక్తి కూడా సన్నగిల్లినట్టుగా రోజువారి పనులు చేయలేనంత బలహీనమైన దయనీయ స్థితికి వచ్చేశాడు. ఏదిఏమైతేనేం కఠినమైన శస్త్రచికిత్సలతో ఏప్రిల్ 30,2024న కేన్సర్ని జయించాడు. అది అతడిలో ఏ మూలనో దాగి ఉన్న ఆశకు కొత్త ఊపిరిని పోసింది. కేవలం శస్త్ర చికిత్స చేయించుకున్న ఒకటిన్నర నెలకే జిమ్కి తిరిగి వచ్చి..తనను తాను మరింత స్ట్రాంగ్ మెన్గా మార్చుకోవాలనుకున్నాడు. ఆ ఉద్దేశ్యంతోనే బాడీ బిల్డింగ్పై ఫోకస్ పెట్టి వివిధ విభాగాలలో బరువులను ఎత్తడంపై కసరత్తులు చేశాడు. అలా 220 కిలోల బరువుని ఎత్తి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ కేన్సర్ తన శరీరంపై గాయంలా కాకుండా..మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకునే గుర్తుగా మలచాలన్నా.. ఆలోచన ఈ విజయానికి దారితీసింది. అంతేగాదు తనలా ఇలా చిన్నవయసులోనే కేన్సర్తో బారినపడుతున్న వాళ్లకు ఒక స్ఫూర్తిగా నిలబడేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు సగర్వంగా తెలిపాడు. అదీగాక తాను వెనుదిరిగి చూసుకున్నప్పడల్లా..తన ఒంటిపై మిగిలిని కేన్సర్ గుర్తులు తనను మరింత బలవంతుడిగా మార్చిందే తప్ప..తన కలను దూరం చేయలేకపోయిందని అంటాడు పరాస్. ఈ కష్ట సమయం తనకు ఓ గుణ పాఠాన్నినేర్పందని చెబుతున్నాడు. ప్రతిదీ మార్చగలమనే సంకల్పం బలంగా ఉంటే దేన్నైనా సులభంగా ఉన్నతికి మార్గంగా మార్చుకోవచ్చని అంటాడు పరాస్. నెటిజన్లు సైతం అతడి సంకల్పానికి ఫిదా అయ్యి, అతడిపై ప్రశంసల జల్లులు కురిపిస్తూ..పోస్టులు పెట్టారు. (చదవండి: World Hepatitis Day: ఐబ్రోస్ థ్రెడింగ్తో ఇంత ప్రమాదమా..! ఏకంగా కాలేయంపై..) -
ఈ గింజలతో మెకాళ్ల నొప్పి, అధిక బరువుకు చెక్ !
ఒక వయసు పెరిగిన తరువాత, ప్రస్తుతం ఆధునికకాలంలో మారిన జీవనశైలి కారణంగా కీళ్లు (Cartilage) అరిగి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు చాలామంది.కొందరికి నడవడం కూడా చాలా కష్టంగా మారుతుంది. అయితే ఈ నొప్పులకు పెయిన్కిల్లర్స్తో తాత్కాలిక ఉపశమనం లభించినా, అవి ఎక్కువ కాలం వాడలేం. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయామోనని భయం. అందుకే తేలికపాటి వ్యాయామం, కొన్ని ఆయుర్వేద చిట్కాలతో మోకాళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా మహాబీర గింజల ద్వారా మంచి ఫలితం ఉంటుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు.అసలు మోకాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి?సాధారణంగా మోకాళ్లలోని రెండు ఎముకల మధ్య గుజ్జు Cartilage కరుగిపోతుంది. ఇలా రెండు ఎముకల మధ్య ఉండే ఈ గుజ్జు పూర్తిగా కరిగిపోతే నడవడం, మెట్లు ఎక్కడం కష్టంగా ఉంటుంది. ఒక్కోసారి కింద కూర్చుని లేవడం కూడా కష్టం. అలాగే మోకాళ్లలో తీవ్రమైన నొప్పి, మంట వంటివి కలుగుతుంటాయి. దీన్నే ఆర్థరైటిస్ అని పిలుస్తారు.మోకాళ్లలో గుజ్జు పెరగడానికి స్విమ్మింగ్, సైక్లింగ్, యోగా వంటి రకరకాల వ్యాయామాలతో పాటు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నొప్పిగా ఉంది కదా అని భయపడకూడదు. మెల్లిగా నడక లాంటి వ్యాయామాలు చేస్తూ, కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలను చేయాలి. (Beauty Tips ముడతల్లేకుండా...అందంగా, యవ్వనంగా మెరిసిపోవాలంటే!)మహాబీర గింజలు- ప్రయోజనాలుమహాబీర గింజలువీటినే వనతులసి గింజలు అంటారు. తులసి జాతికి చెందిన మొక్కల ద్వారా వచ్చిన గింజలు. చూడటానికి సబ్జా గింజలలాగానే కనిపించే ఈ మహాబీర గింజలు ఆయుర్వేద దుకాణాల్లో లభిస్తాయి. వీటిని రాత్రంతా నీళ్లలో నానబెట్టి తినడం మోకాళ్లలో నొప్పి తగ్గుతుంది. మహాబీర విత్తనాల్లో క్యాల్షియం, విటమిన్ డి, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు జీర్ణక్రియ మెరుగువుతుంది. వెయిట్లాస్కు కూడా ఉపయోపడుతుంది. ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. ఇవి చర్మ సంబంధింత ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. ఒత్తిడి, శ్వాసకోశ రుగ్మతలు తగ్గడానికి కూడా మహాబీర గింజలు ఉపయోగపడతాయి.మహాబీర విత్తనాల్లో వున్న యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో ఫ్రీరాడికల్స్తో పోరాడి కేన్సర్ వంటి వాటిని నిరోధిస్తుంది.మహాబీర గింజలను ఎలా వాడాలి?ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ మహాబీర గింజలు వేసి ఎనిమిది గంటల పాటు నాన బెట్టాలి. ఉదయాన్నే పరగడుపున అలాగే తీసుకోవాలి. గింజలు బాగా నమిలాలని ఆయుర్వేదం చెబుతోంది.ఇంకా నిమ్మరసంలో, పెరుగులో లేదంటే సలాడ్లు, స్మూతీలు వంటి వాటిలో వీటిని కలుపుకుని తినచ్చు. ప్రతి రోజు క్రమం తప్పకుండా తిన్నారంటే మోకాళ్ల నొప్పుల సమస్యలు తగ్గుముఖం పడతాయి. వీటి పౌడర్ను నూనెలో కలిపి నొప్పి ఉన్న ప్రదేశాలలో రాస్తారు.మహాబీర చెట్టు ఆకుల రసాన్ని చర్మవ్యాధులైన గజ్జి, తామర నివారణలో కూడా వాడతారు. ఎవరు తినకూడదు: మహాబీర విత్తనాలు ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచుతాయి. థైరాయిడ్ సమస్యలను కలిగించవచ్చు, కాబట్టి, గర్భిణీ స్త్రీలు, థైరాయిడ్ ఉన్నవారు తీసుకోకుండా ఉండటం మంచిది. గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం కేవలం అవగాహనకోసమే అని గమనించాలి. మోకాళ్ల నొప్పి గల కారణాలను వైద్యుల ద్వారా నిర్ధారించుకోవాలి. ఏదైనా ఆరోగ్య సమస్యలకు వైద్యుడిని సంప్రదించి, వారి సలహా మేరకు మాత్రమే చికిత్స తీసుకోవడం మంచిది.ఇదీ చదవండి: Today tips : బొద్దింకలతో వేగలేకపోతున్నారా? -
ముద్దుల తనయకు గణపతి బప్పా ఆశీర్వాదం : న్యూ డాడ్ సిద్ధార్థ్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన ముద్దుల కుమార్తె కోసం ఆదివారం ఆలయంలో ప్రార్థనలు చేసి గణపతి బప్పా ఆశీర్వాదం తీసుకున్నారట. తన తల్లి రిమ్మా మల్హోత్రాతో సిద్ధి వినాయకుణ్ణి సందర్శించారు. దీనికి సంబంధించినొకవీడియో నెట్టింట ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది.ఆలయ సందర్శనకు సంబంధించిన అనేక వీడియోలు ఆన్లైన్లో కనిపించాయి. ఒక ఛాయాచిత్రకారుడు షేర్ చేసిన క్లిప్లో, సిద్ధార్థ్ నీలిరంగు కుర్తా ,బ్లాక్డెనిమ్ ధరించి సిద్దార్థ్, పింక్ సూట్లో తల్లి రిమ్మా గణపతిని దర్శించుకున్నారు. భక్తితో చేతులు జోడించి మొక్కుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి పూజారి దేవుని పాదాల దగ్గరి పూమాలను వారికి ఇచ్చారు. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal)s="text-align-justify"> కాగా స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara advani)ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కాఫీ విత్ కరణ్ సీజన్ 8లో కనిపించిన కియారా, ఇటలీలోని రోమ్లో సిద్ధార్థ్ మల్హోత్రా తనకు ప్రపోజ్ చేశాడని వెల్లడించింది. షేర్షా సినిమా షూటింగ్ సమయంలో డేటింగ్లో ఉన్న వీరిద్దరూ 2023, ఫిబ్రవరి 7న రాజస్థాన్లోని సూర్యగఢ్ ప్యాలెస్లో వివాహం జరిగింది. ఈ జంట జూలై 16న తమ తొలి సంతానానికి (ఆడబిడ్డ) జన్మనిచ్చారు. -
100 ఏళ్లకు పెళ్లి, 103వ బర్త్డేకి తీరనున్న డ్రీమ్ : లైఫ్ సీక్రెట్ అదేనట!
అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన రెండవ ప్రపంచ యుద్దంలోని పాల్గొన్న హెరాల్డ్ టెరెన్స్ (Harold Terens) ఈ ఏడాది ఆగస్టుకి 103 ఏట అడుగు పెట్టబోతున్నాడు. ఈ సందర్భంగా పెంటగాన్లో తన బార్ మిట్జ్వా (Bar Mitzvah)ను జరుపుకోవడానికి సిద్ధమవుతున్నాడు. తద్వారా 13 ఏళ్ల నాటి డ్రీమ్ను పూర్తి చేయాలని భావిస్తున్నాడు. అసలేంటీ బార్ మిట్జ్వా? అతని కోరిక ఏంటి? తెలుసుకుందాం ఈ కథనంలో.తన 102వ పుట్టిన రోజు సందర్భంగా తాతగారు ఈవిషయాన్ని ప్రకటించారు. యుక్త వయస్సులో స్వీకరించాలని కలలుగన్న బార్ మిట్జ్వా (యూదుల ఆచారం)ను తన తదుపరి పుట్టినరోజు సందర్భంగా స్వీకరించాలని భావిస్తున్నట్లు చెప్పారు. యూదు మతాన్ని అనుసరించే తల్లి పోలాండ్కు చెందిన వారు కాగా, రష్యాకు చెందిన చెండికి మతాలంటే ఇష్టం ఉండదు. ఈ దంపతులకు రెండో సంతానంగా పుట్టాడుహెరాల్డ్ టెరెన్స్. బార్ మిట్జ్వా అంటే ?బార్ మిట్జ్వా అనేది యూదు సంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆచారం. ఇది 13 ఏళ్ల వయసు వచ్చిన యూదు బాలుడు తన మతపరమైన నైతిక బాధ్యతలను స్వీకరించే సందర్భాన్ని బార్మిట్జ్వా అంటారు. ‘మిట్జ్వోట్’ అంటే ‘మత ఆజ్ఞలు’ అని, ‘బార్’ అనే హీబ్రూ అంటే ‘కుమారుడు’ అని అర్థం. సాధారణంగా బార్ మిట్జ్వా వేడుకలో బాలుడు సినగాగ్లో తోరా (యూదు మత గ్రంథం) నుండి ఒక భాగాన్ని చదువుతాడు లేదా హాఫ్తారా పఠిస్తారు. ఈ సందర్భం బాలుడు సమాజంలో పెద్దవాడిగా గుర్తింపు పొందే సందర్భంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలోనే తాను కూడా బార్మిట్జ్వా స్వీకరించాలని భావిస్తున్నానని తెలిపారు. ఇప్పటికే హెరాల్డ్ సోదరుడు తల్లి మతవిశ్వాసాలను అనుసరిస్తూ యుక్త వయస్సులోనే బార్ మిట్జ్వాను స్వీకరించారు. తల్లి తండ్రుల విశ్వాసాల కారణంగా అప్పుడు నెరవేర్చుకోలేకపోయిన కలను,ఇన్నాళ్ల తర్వాత తన 103 ఏట బార్ మిట్జ్వా పొందాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 6న వాషింగ్టన్ డీసీ (Washington DC)లోని పెంటగాన్ (Pentagon)లో అతడి బార్ మిట్జ్వా జరగనుంది.ఇంకో విశేషం ఏమిటంటేగత ఏడాది 100 ఏళ్ల వయసులో 97 ఏళ్ల జీన్ స్వెర్లిన్ను వివాహం చేసుకుని ఈయన వార్తల్లో నిలిచాడు. నార్మాండీలో జరిగిన వివాహం, తన జీవితంలో అత్యంత ముఖ్యమైన సంఘటన అని గుర్తు చేసుకున్నాడు. నీ లైఫ్లో అదే మధురమైందన్నాడు. లైఫ్ ఒక అందమైన కథ లాంటిది. తన జీవితాన్ని పూర్తిగా జీవించాలీ అంటే ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో నేర్చుకుంటే చాలు తిరుగు ఉండదు. కనీసం పదేళ్లు ఆయువు జోడించుకున్నట్టే అంటారాయన. ఒత్తిడి లేని జీవితం నంబర్ వన్ అయితే, రెండోది 90 శాతం అదృష్టం అంటూ తన లైఫ్ రహస్యాన్ని పంచుకున్నాడు.అంతేకాదు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత కూడా టెరెన్స్ చాలా సార్లు మృత్యువు నుంచి బయటపడ్డాడు. ఇరాన్లో ఒక రహస్య మిషన్లో ఒకసారి, లండన్ పబ్లో జర్మన్ రాకెట్ నుండి తప్పించుకున్నాడట. తన జీవితం "ఒక పెద్ద అద్భుత కథ" అని అతను పేర్కొన్నాడు మరియు తన జీవితాన్ని పూర్తిగా జీవించాలని అనుకున్నాడు. "ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో మీరు నేర్చుకోగలిగితే, మీరు చాలా దూరం వెళ్తారని నేను అనుకుంటున్నాను. మీరు మీ జీవితానికి కనీసం 10 సంవత్సరాలు జోడిస్తారు. కాబట్టి అది నంబర్ వన్. మరియు 90% అదృష్టం," అని అతను చెప్పాడు, సుదీర్ఘమైన, సంతోషకరమైన జీవితానికి తన రహస్యాన్ని పంచుకున్నాడు. కాగా హెరాల్డ్ టెరెన్స్ 1942లో US ఆర్మీ ఎయిర్ ఫోర్స్లో చేరాడు . P-47 థండర్బోల్ట్ ఫైటర్ స్క్వాడ్రన్కు రేడియో రిపేర్ టెక్నీషియన్గా పనిచేశాడు. 1944లో D-డే నాడు, అతను ఫ్రాన్స్ నుండి తిరిగి వచ్చే విమానాలను మరమ్మతు చేయడంలో సహాయం చేశాడు. ఆ తరువాత నార్మాండీ నుండి విముక్తి పొందిన యుద్ధ ఖైదీలను ఇంగ్లాండ్కు రవాణా చేయడంలో సహాయం చేశాడు. జూన్ 2024లో, నాజీ ఆక్రమణ నుండి దేశం విముక్తి పొందిన 80వ వార్షికోత్సవం సందర్భంగా ఫ్రెంచ్ ప్రభుత్వం అతన్ని సత్కరించింది. -
ఐబ్రోస్ చేయించుకుంటున్నారా?.. ఇది మీకోసమే.. కాలేయంపై ఎఫెక్ట్?
బ్యూటీ పార్లర్కి వెళ్లి ఐబ్రోస్ని అందంగా తీర్చిదిద్దుకోవడం అనేది చాలామంది మహిళలు చేయించుకునే సాధారణ సౌందర్య చికిత్స. దీన్ని రెండు నెలలకొకసారి చేయించుకుంటుంటారు. తక్కువ ఖర్చులో ముఖాన్ని అందంగా మార్చుకునే కొద్దిపాటి సౌందర్య ప్రక్రియ ఇది. దీంతో ఆరోగ్య సమస్యలు ఏం ఉంటాయని తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే ఇంది ప్రాణాంతక ఇన్ఫెక్షన్ల బారిన పడేలా చేస్తుందని చెబుతున్నారు వైద్యులు. అసలు ఐబ్రోస్ థ్రెడింగ్తో ఎలా అనారోగ్యానికి గురవ్వుతారు అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా ఈ వ్యాధి సంక్రమణం, కాస్మెటిక్ విధానాల వల్ల కూడా ఇది సోకుతుందా వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం.!.ఇటీవల ఓ 28 ఏళ్ల మహిళ ఇలాంటి సమస్యను ఎదుర్కొవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెన కనుబొమ్మలు థ్రెడింగ్ చేయించుకున్న తర్వాత కాలేయ ఇన్ఫెక్షన్కి సంబంధించిన హెపటైటిస్ బీ బారిన పడిందని వైద్య పరీక్షల్లో తేలింది. శతాబ్దాల నాటి బ్యూటీషియన్ విధానం ఇది. పైగా ప్రతి రెండు నెలలకోసారి చేయించుకుంటుంటారు. చాలా సరసమైన ధరలో ముఖాకృతి అందంగా మార్చుకుని ఈ సౌందర్య చికిత్స సదరు మహిళకు ప్రాణంతకంగా మారిందని వెల్లడించారు వైద్యులు. ఆ యువతికి థ్రెడింగ్ ద్వారా హెపటైటిస్ బి వ్యాపించిందని చెప్పుకొచ్చారు. ఆమె ఆ ఐబ్రోస్ షేప్ చేయించుకున్న తదనంతరం..అలసట, వికారం, పసుపు కళ్లు వంటి సమస్యలను ఎదుర్కొంది. ఈ థ్రెడ్డింగ్ కారణంగా ఆమె శరీరంలోకి హెపటైటిస్ బి లేదా సి వైరస్లు రక్తప్రవాహంలోకి ప్రవేశించినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అందుకు సంబంధించిన విషయం నెట్టింట తెగ వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Dr. Aditij Dhamija | Health Educator | MBBS (@drdhamija)అసలు హెపటైటిస్కు ఎలా దారితీస్తుంది...కొన్ని పార్లర్లలో కనుబొమ్మల ఆకృతి కోసం చేసే థ్రెడింగ్ దారం సాధారణంగా అందరికి ఉపయోగించే దాన్నే వినియోగిస్తుంటారు. అక్కడ వాళ్లు కాస్త పరిశుభ్రత పాటించకపోవడం వల్ల ఈ సమస్య వస్తోందని అన్నారు. ఒకరికి ఉపయోగించని దారం మరొకరికి వినియోగించడంతో ఆ థ్రెడ్డ్ కనుబొమ్మలను కట్ చేస్తున్నప్పుడే ఈ హెపటైటిస్ బి, సీ వైరస్లు సులభంగా సక్రమింస్తాయట. ఒక్కోసారి దీని వల్లే హెచ్ఐవీ బారీన కూడా పడే ప్రమాదం ఉందట.డబ్ల్యూహెచ్ఓ సైతం..ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం టాటూ వేయించుకోవడం, రేజర్లను షేర్ చేసుకోవడం, థ్రెడింగ్ చేయించుకోవడం వంటి కాస్మెటిక్ విధానాల వల్ల హెపటైటిస్ బి బారినపడ్డ పలు కేసులు ఉన్నాయని నివేదికలో వెల్లడైంది. ఈ హెపటైటిస్ బి వైరస్ చిన్న కలుషితమైన వాటి ఉపరితలాలపై రోజుల తరబడి జీవించి ఉంటుందట. ఇది కేవలం రక్తం వల్ల సంక్రమించదని, ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న ఒక్క దారం చాలు సులభంగా ఈ వ్యాధి సంక్రమిస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఎంత వ్యవధి పడుతుందంటే..వ్యాధి నిరోధక శక్తి బాగున్నంత వరకు ఈ వైరస్తో ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే అనారోగ్యానికి గురవ్వడం లేదా వీక్ అవుతామో అప్పుడు ఈ వైరస్ విజృంభణ మొదలవ్వుతుందట. తీవ్రమైన హెపటైటిస్ బి ఆరునెలల వరకు ఉంటుందట. ఈ టైంలో వైరస్ శరీరమంతా వ్యాపిస్తుందని చెబుతున్నారు. ఒక్కోసారి క్రియాశీల హెపటైటిస్ బారిన పడితే..సుదీర్ఘకాలం ఈ సమస్యతో బాధపడాల్సిందేనని చెబుతున్నారు నిపుణులు. ఇందులోనే సాధారణ హెపటైటిస్ బారిన పడితే..ప్రమాదం తక్కువగా ఉంటుంది. వైద్య పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే కొద్ది రోజుల్లోనే ఈ సమస్య నుంచి బయటపడగలరని చెబుతున్నారు నిపుణులు. లక్షణాలు..ఒక్కోసారి ఈ హెపటైటిస్ బి అనేది ఎలాంటి సంకేతాలు చూపకుండానే దాడి చేసే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు నిపుణులు. సాధారణంగా చాలామటుకు అందరిలోనూ ఒకేలా ఈ కింది సంకేతాలు కనిపిస్తాయి..కడుపు నొప్పిఅలసటజ్వరంకీళ్ల నొప్పులుఆకలి లేకపోవడంవికారం, వాంతులుముదురు రంగు మూత్రంలేత లేదా మట్టి రంగు మలంచేతులు, కాళ్లు వాచినట్లు లేదా ఉబ్బినట్లుగా నీరి చేరి ఉండటంచర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడం తదితర లక్షణాలుఅందువల్ల సాధ్యమైనంత వరకు కాస్మెటిక్కి సంబంధించిన వాటి విషయంలో బహు జాగ్రత్తగా ఉండండి. పార్లర్లో సరైన పరి శుభ్రత ఉందో లేదో నిర్థారించుకున్నాక..ఎలాంటి సౌందర్య చికిత్సా విధానానికైనా ముందుకెళ్లడం మంచిది అని సూచిస్తున్నారు నిపుణులుగమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: తొమ్మిది కాదు.. ఐదో నెలలోనే పుట్టేశాడు.. వండర్ బేబీ!) -
అంతర్గత సంపదే నిజమైనది
ఇంటా బయట ఆందోళనకరమైన జీవన విధానం. నిత్యం ఒత్తిడి, భావోద్వేగ సంఘర్షణలు. అయితే... ధ్యానం ద్వారా వాటిని సమతుల్యం చేసుకునే శక్తి మనకు ఉంది. ధ్యానం ఆత్మ సముద్ధరణకు ఉపయోగపడే అత్యున్నతమైన సాధనం. ఇంటిలో, సమాజంలో ప్రశాంతతను నెలకొల్పాలంటే ముందు మనలో ప్రశాంతత కలగాలి అని వివరించారు బ్రహ్మకుమారీస్ రాజయోగిని కులదీప్ దీది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ‘సంత్ సమాగమమ్’ కార్యక్రమంలో ఆమె ఈ విషయాలను పంచుకున్నారు.‘నేటి వేగవంతమైన ప్రపంచంలో ఒత్తిడి పోటీ, మితిమీరిన సాంకేతికత, భావోద్వేగ సంఘర్షణల కారణంగా మనశ్శాంతిని కోల్పోతున్నాం. ధ్యానం శక్తిమంతమైన, సమగ్రమైన పరిష్కారాన్ని అందిస్తుంది. సహనాన్నిప్రోత్సహించి సామరస్యాన్ని పెంపొదిస్తుంది. మానసికంగా ఇది మనసును ప్రశాంత పరుస్తుంది. ఆందోళనను తగ్గిస్తుంది. దృష్టిని మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం ఒత్తిడి హార్మోన్ల అసమతుల్యతను తగ్గిస్తుంది. మానసిక శ్రేయస్సును పెంచుతుంది. ఈ విషయాలు అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయి. యువతలో వేగవంతమైన భావోద్వేగాలు..నేటి యువత భావోద్వేగాలకు చాలా ఎక్కువగా గురవుతోంది. వేగవంతమైన భావోద్వేగాలు, విచ్ఛిన్నమైన సంబంధాలు, ప్రేమ గురించి విరుద్ధమైన ఆలోచనలతో వారి జీవితమే కాకుండా వారి ద్వారా ఇతరులకు కూడా ఇబ్బంది కలుగుతోంది. మనం వారికి ఏం చెప్పగలం అంటే.. నిజమైన ప్రేమ అంటే కేవలం ఆకర్షణ లేదా భావోద్వేగం కాదు. అది అర్థం చేసుకోవడం, గౌరవించడం, అవసరమైనప్పుడు కొంచెం స్పేస్ కూడా ఇవ్వడం. ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. లోలోపల ఖాళీగా అనిపిస్తే బయట ప్రేమ కోసం వెతకద్దు. ప్రేమ స్వీయ అవగాహనతో ్ర΄ారంభమవుతుంది. జీవితం కేవలం ఆనందం కోసం కాదు ప్రయోజనం కోసం అని గ్రహించాలి.గృహిణులు ఇంట్లో శాంతిని నిలబెట్టాలంటే... ‘నేను ప్రశాంతమైన ఆత్మను’ అనేది ముందుగా గుర్తుంచుకోవాలి. కొన్ని నిమిషాల నిశ్శబ్దం లేదా ధ్యానంతో రోజును ప్రారంభించాలి. కుటుంబ సభ్యులను కేవలం పాత్రలుగా కాకుండా ఆత్మలుగా చూడండి. ఇది సహనాన్ని, మంచి అవగాహనను తెస్తుంది. వంట చేసేటప్పుడు మీ ఆలోచనలను స్వచ్ఛంగా, ఉన్నతంగా ఉంచుకోండి. ఎటువంటి లక్షణాలు ఉన్న భోజనం తింటారో అటువంటి ఆలోచనలే వస్తాయి. జీవితం అలాగే తయారవుతుంది. గృహిణి ప్రశాంతంగా ఉన్నప్పుడు, మొత్తం కుటుంబం సురక్షితంగా, ప్రేమగా, సంతోషంగా ఉంటుంది. మనిషి జీవితం ధ్యేయం...‘నేను ఎవరు?’ నాది ఏది, సత్యత ఏంటీ.. అనేది గ్రహించాలి. రోజువారీ జీవితంలో శాంతి, ప్రేమ, స్వచ్ఛత వంటి అసలు లక్షణాలను వ్యక్తపరచాలి. మనం కేవలం శరీరాలు కాదు. మనం ఆత్మలం. ప్రతి ఆత్మ తన ప్రత్యేక΄ాత్రను ΄ోషించడానికి, ప్రపంచానికి ఏదైనా మంచిని అందించడానికి ఇక్కడ ఉంది. మనం విలువలు, ఆధ్యాత్మిక అవగాహనతో జీవించినప్పుడు మనం లోపల నండి సంతృప్తి చెందుతాం. ధ్యానం మనకు పరమాత్మతో కనెక్ట్ అవ్వడానికి, మన ఉన్నత ఉద్దేశ్యాన్ని అర్ధం చేసుకోవడానికి సహాయపడుతుంది. ‘నేను ప్రతిరోజూ మెరుగవుతున్నానా?’ అని తమని తాము ప్రశ్నించుకోగలిగితే, మీరు సరైన మార్గంలో ఉన్నారనేదానికి అదే సంకేతం. వెలితిగా ఉండటానికి పరిష్కారం..బాహ్య, భౌతిక విజయం వాస్తవానికి అంతర్గత శూన్యతను పూరించదు. నిజమైన సంతృప్తి అంతర్గత శాంతి, ప్రేమ నుండి వస్తుంది. మన ఆత్మ పరమ సంబంధం కోరుకుంటుంది. మనం స్వచ్ఛమైన ఉద్దేశ్యంతో ఇతరులకు సేవ చేసినప్పుడు మనం అర్థవంతంగా, సంతృప్తిగా భావించడం ప్రారంభిస్తాం. నిశ్శబ్దం, సరళత, ఆధ్యాత్మికత మన హృదయాన్ని నింపుతాయి. ఇవేవీ బాహ్య విజయాల ద్వారా అందవు. ఆధ్యాత్మికత తోడవ్వాలి. అంతర్గత సంపద ఉంటే వెలితి అనేదే ఉండదు’’ అని తెలిపారు ఈ రాజయోగిని.నేను ఆత్మను అనే భావనతో అవగాహన... ‘నేను ఒక ఆత్మను’ అనే అవగాహన మనకు ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులలోనూ ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది. భావోద్వేగపరంగా తక్షణమే స్పందించే బదులు, అవగాహనతో ప్రతిస్పందిస్తాం. ఇతరులను వారి రూ΄ాలతో, పనులతో కాకుండా ఆత్మలుగా చూడటం ప్రారంభించినప్పుడు మానవ సంబంధాలు మెరుగుపడతాయి. ఈ అవగాహన సరైన నిర్ణయం తీసుకోవడానికి దోహదపడుతుంది. పిల్లలపై తల్లిదండ్రుల దృష్టికోణం... తల్లిదండ్రులు పిల్లలను ఆస్తిగా కాకుండా వారి స్వంత ప్రయాణంతో కూడిన వ్యక్తిగత ఆత్మలుగా చూడాలి. ప్రతి బిడ్డ ప్రత్యేకమైనవాడే. ఇతరులనుండి ప్రేరణ కలిగించవచ్చు. కాని ఇతరులతో ΄ోల్చకూడదు. ప్రేమ అంటే ప్రతి కోరికనూ నెరవేర్చడం కాదు. అలా చేస్తే వారి కోరిక తీరక΄ోతే మారాం చేయడమో, మొండిగా అవ్వటమో చేస్తారు. సమయం చూసి వారితో ప్రేమతో మాట్లాడాలి. కఠినంగా కాకుండా ప్రశాంతంగా, స్పష్టతతో మాట్లాడండి. పిల్లలు సురక్షితంగా, ప్రేమతో ఉన్నప్పుడు బాగా వింటారు. అంతర్గత బలం వారికి ప్రేమ, సరైన మార్గదర్శకత్వం రెండింటినీ ఇవ్వడానికి సహాయ పడుతుంది– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఫ్యాషన్ ఫ్రమ్ నేచర్.. డిజైనింగ్తో స్టోరీ టెల్లింగ్..
15 ఏళ్ల వయసులోనే ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన.. రెండేళ్లలోనే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. వెరసి దేశంలోనే అతిపిన్న వయస్కుడైన ఫ్యాషన్ డిజైనర్గా రాణిస్తున్నాడు అమోగ్ రెడ్డి. భారతీయ సంప్రదాయ, వివాహ కోచర్లో తన నైపుణ్యాలతో ప్రసిద్ధి చెందిన అమోగ్.. వారసత్వ హంగులను ఆధునిక ఫ్యాషన్తో సమ్మిళితం చేస్తూ అంతర్జాతీయ స్థాయి ఫ్యాషన్ ఔత్సాహికులను ఆకర్షిస్తున్నారు. అంతేకాకుండా ‘యంగెస్ట్ డిజైనర్ ఆఫ్ ది ఇయర్’ బిరుదును సైతం పొందారు. ఈ ప్రయాణంలో భాగంగానే నగరంలోని హెచ్ఐసీసీ నోవోటెల్ వేదికగా వినూత్నంగా ఫారెస్ట్ థీమ్తో ఆదివారం నిర్వహించిన ఇండియా కిడ్స్ ఫ్యాషన్ వీక్లో వనమ్ కలెక్షన్స్ ఆవిష్కరించారు. డిజైనింగ్తో స్టోరీ టెల్లింగ్.. మన ఊహకందని నూతన ఫ్యాషన్ ఫార్ములాతో సమ్మిళితమై రూపొందించారు. ఆ సౌందర్యం ఒక్కొక్క లేయర్లా నిరంతరం ఆకర్షణీయంగా అభివృద్ధి చెందుతూ ఉంటుందని అమోగ్ రెడ్డి తన ఆలోచనలను పంచుకున్నారు. నోవోటెల్ వేదికగా చిన్నారులతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 12వ సీజన్ ఇండియా కిడ్స్ ఫ్యాషన్ వీక్లో అమోగ్ రూపొందించిన డిజైనింగ్ వేర్ ప్రకృతిని ప్రతిబింబించాయి. ప్రకృతిలోని వర్ణాలు, అరణ్యంలోని అందాల నుంచి ప్రేరణ పొందాయి. ఆకారాల కవిత్వమే ఈ వనమ్ కలెక్షన్ అని అమోగ్ పేర్కొన్నారు. ప్రకృతి అందాలే ఈ డిజైన్లను రూపొందించడానికి ప్రేరేపించాయన్నారు. క్రియేటివిటీని హైదరాబాద్లో ప్రారంభించి దేశంతో పాటు ప్రపంచ నలుమూలలా విస్తరింపజేయాలనే లక్ష్యంతో ఉన్నానన్నారు. ఈ కలెక్షన్లోని ప్రతి డిజైన్ ఒక కథను చెబుతుంది. వినూత్న పద్ధతుల్లో ఆధునిక ఫ్యాషన్ హంగులతో సంప్రదాయ హస్తకళలను సమన్వయం చేయడంతో ఫ్యాషన్ ప్రియులను అలరించాయి.(చదవండి: శ్రావణ శోభను తెచ్చేలా..పట్టుతో స్టైలిష్గా మెరుద్దాం ఇలా..!) -
ఫుడ్ అండ్ ఫ్యాషన్ టిప్స్ : వర్షంలో హాయి..హాయి
వెన్నెల్లో హాయి.. హాయి.. మల్లెల్లో హాయి హాయి.. వరాల జల్లే కురిసే.. తప్పేట్లు హాయి హాయి తృమ్పేట్లు హాయి హాయి.. ఇవ్వాళ మనసే మురిసే.. మే నెల్లో ఎండ హాయి ఆగష్టు లో వాన హాయి.. జనవరిలో మంచు హాయి.. హాయి రామ హాయి.. హాయిగుంటే చాలు నంది వెయ్యి మాటలెందుకండి.. ఈ పాట వింటుంటే ఎంత హాయిగా ఉంటుందో.. సరైన ప్రణాళికతో జాగ్రత్తలు పాటిస్తే వర్షాకాలంలోనూ అంతే హాయిగా ఉంటుందంటున్నారు నిపుణులు.. భాగ్యనగరంలో ప్రస్తుతం వర్షాలు ముసురుకున్నాయి. వాతావరణ శాఖ సూచనల ప్రకారం.. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సరైన జాగ్రత్తలు పాటించకుంటే ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి.. – సాక్షి, సిటీబ్యూరోగజిబిజి నగర జీవన శైలి.. వర్షాకాలంలో మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. ఓవైపు ముసురుకున్న వర్షాలతో తేమ బురద వాతావరణం. మరోవైపు ట్రాఫిక్ కష్టాలు.. వీటికి మించి ఆరోగ్య సమస్యలు.. ఈ నేపథ్యంలో చక్కని చిట్కాలు పటిస్తే వీటి నుంచి ఇట్టే పరిష్కారం లభిస్తుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. వీటిని ఓ సమస్యగా కాకుండా జీవనశైలిలో భాగంగా మార్చుకుంటే శ్రేయస్కరం.. ఇందులో భాగంగా నగరవాసులకు పలు చిట్కాలు.. ట్రావెల్ అండ్ వర్క్ లైఫ్.. నగరంలో వర్షాకాలం అనగానే ట్రాఫిక్ కష్టాలు తప్పవు.. ఎక్కడికక్కడ నిలిచిపోయే వర్షపు నీరు, వాహనాల బ్రేక్డౌన్లు సర్వసాధారణం. దీనిని దృష్టిలో ఉంచుకుని అవకాశం ఉన్న ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ తీసుకోవడం ఉత్తమం. దీనివల్ల ట్రాఫిక్ కష్టాలతో పాటు వర్షం తడవాల్సిన పరిస్థితి ఉండదు.. పైగా సమయం కూడా ఆదా అవుతుందిఇంటి పరిసరాలపై శ్రద్ధ : వర్షాకాలంలో ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఇంటి చుట్టూ నిరు నిలిచే ప్రదేశాలను శుభ్రం చేసుకోవాలి. పైప్లైన్లు బ్లాక్ అవ్వకుండా క్లీన్ చేసుకోవాలి. మేడపై కుండీల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ప్రధానంగా ఇంటి నుంచి బయటకు వెళ్లే డెయ్రిన్లలోని చెత్తను తొలగించుకోవడం ఉత్తమం. దీంతోపాటు విద్యుత్ వైర్లు, మీర్ల వద్ద తేమ లేకుండా చూసుకోవాలి. ఇన్వర్టర్లు, టార్చ్లైట్లు, బ్యాటరీ బ్యాకప్ప్ చెక్ చేసుకోవాలి. అత్యవసర పరిస్థితులకు పవర్ బ్యాంక్స్ సిద్ధంగా ఉంచుకోవాలి. చల్లని వాతావరణంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. సరైన ఆహారంతో ఆరోగ్య భద్రత సాధ్యమని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా బయటి ఆహారం, స్ట్రీట్ ఫుడ్ ఎంత మేరకు నివారిస్తే అంత మంచిది.సరైన ఆహారంతో ఆరోగ్య భద్రత..: వీధిపక్కన దొరికేకే ఆహారానికి దూరంగా ఉండాలి.. ఇంట్లో చల్లని వాతావరణానికి తగినట్లు వేడివేడిగా వెజ్ సూప్స్, ఉల్లిపాయ పకోడి, అల్లం టీ వంటి హీటింగ్ ఫుడ్స్ వల్లఆ హ్లాదంతో పాటు ఆరోగ్య సొంతం. నీరు తాగడంలో అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. వేడి నీరు, శుద్ధి చేసిన నీటిని తాగడం మంచిది. వర్షాకాలంలో తీసుకునే ఆహారం చిన్న పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై త్రీవ ప్రభావాన్ని చూపుతాయి. వీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. వర్షా కాలపు ఫ్యాషన్ టిప్స్.. : వర్షంలో మన ఫ్యాషన్ కూడా మారాలి. స్టైలిష్ ఉండే సమయంలో ప్రాక్టికల్గా కూడా ఆలోచించాలి.. వర్ష నిరోధక/వాటర్ ఫ్రూఫ్ షూస్, అనువుగా ఉండే రబ్బరు చెప్పులు సౌకర్యవంతంగా ఉంటాయి. సింథటిక్ లేదా డ్రై–ఫిట్ డ్రెస్సులు వేసుకుంటే తడవడం, ఆరిపోవడం తేలిక. లెదర్ బ్యాగ్స్కు బదులుగా వాటర్ప్రూఫ్ బ్యాగ్స్ ఎంచుకోవాలి. ల్యాప్టాప్ బ్యాక్స్కి కూడా వాటర్ప్రూఫ్ కవర్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగించాలి.ఎక్కువ దూరం నడవాల్సిన పనిలేని వారు ఎంఎంటీఎస్, మెట్రో వంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఆశ్రయించడం ఉత్తమం.ఒక వేళ అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తే ట్రాఫిక్ అప్డేట్స్ తెలుసుకోవాలి. ఇందుకోసం అనేక యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వర్షాలతో సంబంధం లేకుండా వాహనాల్లో రెయిన్ కోట్స్, గొడుగు, అదనపు మాస్క్, టవల్ క్యారీ చేయడం మంచిది. మైండ్ఫుల్ లివింగ్.. వర్షం మనసుకు ప్రశాంతతను, నూతనోత్సాహాన్ని తెస్తుంది. వర్షాన్ని కాఫీ కప్పుతో ఆస్వాదిస్తూ బుక్స్ చదవడం, ఇంట్లో గేమ్స్ ఆడడం, ఫ్యామిలీతో టైమ్ గడపడం లాంటి చిన్న విషయాలు జీవితాన్ని మరింత ఆహ్లాదంగా మార్చుతాయి. ఒక రకంగా వర్షాలు వరద బీభత్సాలే.. కాకుండా ఒక్కసారిగా పరిసరాలను శుభ్రం కూడా చేస్తాయి. ఫలితంగా ప్రకృతి ప్రదేశాలకు పచ్చదనాన్ని అందుతాయి. అయితే సరైన జాగ్రత్తలు లేకపోతే సమస్యలే ఎక్కువ ఇబ్బందిపెడతాయి. ముఖ్యంగా హైదరాబాదీయులు ఈ వర్ష కాలాన్ని ఒక లైఫ్స్టైల్ ఫెస్టివల్గా మార్చుకుంటే.. ఈ కాలమెంతో మధురంగా మారుతుంది. ఇదీ చదవండి: నో జిమ్, ఓన్లీ చాట్జీపీటీ, డంబెల్స్ 18 కిలోలు తగ్గిన మెరుపు తీగ -
నో జిమ్, ఓన్లీ చాట్జీపీటీ, డంబెల్స్ 18 కిలోలు తగ్గి మెరుపు తీగలా
అధిక బరువును తగ్గించుకుని ఫిట్గా ఉండాలని అందరూ అనుకుంటారు. కొందరు అనుకోవడంతోనే సరిపెట్టుకుంటారు. మరికొందరు దాన్ని సాధించి తీరతారు. అదీ ఖరీదైన జిమ్లు, క్రాష్ డైట్లు ఇలాంటివేమీ లేకుండానే శరీరం మీద అవగాహన పెంచుకుని, అధిక బరువును తగ్గించుకుంది. 20 ఏళ్ల వయసులో చాలా పట్టుదలగా అదీ సింపుల్ చిట్కాలతో ఫిట్నెస్ సాధించింది. పదండి ఆమె పాటించిన టిప్స్ ఏంటో తెలుసుకుందాం. ప్రముఖ కంటెంట్ సృష్టికర్త ఆర్య అరోరా జత డంబెల్స్ , కొంచెం స్వీయ-అవగాహన, చాట్జీపీటీ సాయంతో 18 కిలోల బరువు తగ్గింది. ఈ వెయిట్ లాస్జర్నీని ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు, వీడియోల ద్వారా అభిమానులను ఆకర్షిస్తోంది.తన విజయానికి కారణమైన చిట్కాల గురించి పంచుకుంటూ ఆర్య వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏడంటే ఏడు టిప్స్జిమ్ వర్కౌట్స్, ఫ్యాన్సీ డైట్ ఇవేమీ లేకుండా 18 కేజీల బరువు తగ్గింది. ఆర్య మొదట్లో అధిక బరువుతో బాధపడేది. కానీ , ఇపుడు స్లిమ్ అండ్ ట్రిమ్గా మారిపోయింది. ఇందుకు 7 చిట్కాలు ఫాలో అయినట్టు పేర్కొంది. View this post on Instagram A post shared by Aryaa Arora (@wutaryaadoin)BMR : ముందు తన శరీరానికి అవసరమైన కేలరీల గురించి అర్థం చేసుకోవడం మొదలు పెట్టింది. ఇందుకు చాట్ జీపీటీ సాయాన్ని తీసుకుంది. ChatGPT ప్రాంప్ట్ని ఉపయోగించి తన బేసల్ మెటబాలిక్ రేట్ (BMR)ను అంచనావేసింది. రోజువారీ కేలరీల అవసరాలను నిర్ణయించడంలో సహాయపడే మెట్రిక్. బరువు తగ్గడానికి కేలరీ ఇంటేక్ ఎంత? అని చాట్ జీపీటీని కోరింది. తన శరీరాకృతిని బట్టి ఏఐ ఇచ్చిన డేటాతో సరైన కేలరీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇదీ చదవండి: చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదన పోర్షన్-బ్యాలెన్సింగ్: ఆర్య పోర్షణ్ బ్యాలెన్సింగ్ ప్రధానంగా పాటించింది. 40% ప్రోటీన్, 30% ఫైబర్, 20% కార్బోహైడ్రేట్లు, 10% ఆరోగ్యకరమైన కొవ్వులు.పరిమితంగా తినడం పరిష్కారం కాదని,అవగాహన , నియంత్రణ ముఖ్యమని స్పష్టం చేసింది. "కటింగ్ లేదు, బ్యాలెన్స్ మాత్రమే" అంటుంది. View this post on Instagram A post shared by Aryaa Arora (@wutaryaadoin)బరువు తగ్గడమే కాదు ఎనర్జీ పెంచుకోవాలి : బరువు తగ్గడం, ఫ్యాట్ను కరిగించడంతోపాటు బాడీకి శక్తి కావాలి, దానికి తగ్గ వ్యాయామం కావాలి అంటుంది ఆర్య. ఈ విషయంలో తనకైతే డంబెల్స్చాలు అంటుంది.2.5 కిలోలతో ప్రారంచి, 5 కిలోల డంబెల్స్తో వర్కైట్స్ చేసింది. రోజూ నడక, రెండు రోజులు , 4 రోజులు స్ట్రెంగ్త్ ట్రైనింగ్తో కండరాలు దృఢంగా మారడంతో పాటు వేగంగా శరీరంలోని కొవ్వు కరిగిపోతుందని ఆర్య తెలిపింది. క్యాలరీల లెక్కలు: ఆర్య క్యాలరీల అవగాహన రావాలంటే వారం రోజులు చాలు అని, అలాగ ఒక వారంపాటు తన ఆహారాన్ని ట్రాక్ చేసుకుంటూ, ఆహార అలవాట్లను బాగా అర్థం చేసుసుకుని ఆచరించినట్టు తెలిపింది.జంక్ ఫడ్ : జంక్ ఫుడ్ విషయంలో 80:20 నియమాన్ని పాటించిదట. తినే ఫుడ్ లో జంక్ ఫుడ్ శాతాన్ని 20 శాతానికి పరిమితం చేసింది. ప్రాసెస్ చేసిన ఫుడ్, చక్కెర, పిండి, నూనె పదార్థాలు, ఫ్రై చేసిన ఫుడ్ ను తీసుకోవడం ఆమె తగ్గించింది. నీళ్లు, నిద్ర: బరువు తగ్గే క్రమంలో రోజుకు 2-3 లీటర్ల నీరు, 7-8 గంటల నాణ్యమైన నిద్ర చాలా అవసరమని తద్వారా శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెరిగి, జీర్ణ క్రియ సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపింది.హార్మోన్స్ : బరువు తగ్గడంలో మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైనదని ఆర్య తెలిపింది. ఇందుకోసం క్రమం తప్పకుండా చదవడం, ధ్యానం కృతజ్ఞతా భావంతో ఉండటం ఇవి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని పేర్కొంది. -
దక్ష నగార్కర్ గ్లామర్ రహస్యం ఏంటో తెలుసా?
సాక్షి, సిటీబ్యూరో: సౌందర్య రంగంలో బ్యూటీ కేర్ తప్పనిసరని, నగరంలోని ఈ తరం ఫ్యాషన్ ఔత్సాహికులు వ్యక్తిగత సౌందర్య సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ప్రముఖ సినీతార దక్ష నగార్కర్ తెలిపారు. మణికొండ అల్కా పూర్ వేదికగా నూతనంగా ఏర్పాటు చేసిన హెయిర్ అండ్ బ్యూటీ ప్రీమియం సెలూన్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన సినీ ప్రయాణంలో గ్లామర్ కీలకపాత్ర పోషించిందని, బ్యూటీ కేర్తోపాటు ఎల్లప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండటం కూడా తన గ్లామర్ రహస్యమని తెలిపారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్, పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల స్టైలిస్ట్ అమ్జద్ హబీబ్ తన సేవలను నగరంలో అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని బిజినెస్ హెడ్ ఆపరేషన్స్ మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సెలూన్ నిర్వాహకులు విజయలక్ష్మి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఇవీచదవండి: Ananya Reddy తొలిప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంక్, మార్క్ షీట్ వైరల్చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదన -
గయ నుంచి అయోధ్య దాకా... మనోరథ వీక్షణం
యూపీ... బిహార్... ఒడిశా... జార్ఖండ్... వెస్ట్బెంగాల్.ఈ టూర్లో... ఈ రాష్ట్రాలన్నింటినీ టచ్ చేయవచ్చు. రైలు ప్రయాణంలో మధ్యప్రదేశ్ కూడా పలకరిస్తుంది. గయలో విష్ణు పాదాన్ని దర్శించుకోవడంతో మొదలు. పూరీ జగన్నాథుడు...కోణార్క్ సూర్య భగవానుడు. గంగాసాగర కపిలమునీశ్వరుడు...కోల్కతాకాళిక. బైద్యనాథుడు... విశ్వనాథుడు... బాలరాముడు. వీరంతా పర్యటన ఆద్యంతం అలరించే దైవాలు. గంగలో పాద ప్రక్షాళనం సరయులో ముఖ ప్రక్షాళనం. పర్యాటకులను పునీతభావనలో ముంచే ధార్మికతలివి. మనోరథం ఆకాంక్షలను తీర్చే రైలు రథ యాత్ర ఇది. 1 వ రోజు : ఉదయం ఆగ్రా కంటోన్మెంట్ స్టేషన్ నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ బయలుదేరుతుంది. గ్వాలియర్, వీరాంగణ లక్ష్మీబాయ్, ఓరై, కాన్పూర్, లక్నో మీదుగా రాత్రికి అయోధ్య కంటోన్మెంట్ చేరుతుంది. 2వ రోజు : భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ తెల్లవారు జాముకు కాశీకి చేరుతుంది. రైలు దిగి హోటల్ గదిలో చెక్ ఇన్ అవడం, రిఫ్రెష్మెంట్ తర్వాత గయలోని విష్ణుపాదం ఆలయం, స్థానిక ఆలయాల దర్శనం. రాత్రికి రైలెక్కి పూరీకి సాగిపోవడం.ఫాల్గు తీరాన విష్ణుపాదంవిష్ణుపాద ఆలయం నిర్మాణపరంగా చాలా ప్రత్యేకం. ఇది బీహార్ రాష్ట్రంలో రాజధాని నగరం పట్నాకి వంద కిలోమీటర్ల దూరాన గయలో ఉంది. ఇక్కడ పిండప్రదానం చేస్తారు. రామాయణకాలంలో రాముడు, సీత ఈ ప్రదేశాన్ని సందర్శించారని చెబుతారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ నిర్మాణం దేవి అహల్యాబాయ్ హోల్కర్ నిర్మించిన ఆలయం. ఆమె ఇందోర్ రాణి. క్రీ.శ 1787లో ఫాల్గునది తీరాన ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు మంచి రాయి కోసం అన్వేషణ జరిగింది. గయ జిల్లాలోని బథని గ్రామంలోని పర్వతం నుంచి చక్కటి బ్లాక్ గ్రానైట్ని గుర్తించారు. రాజస్థాన్ నుంచి శిల్పకారులను రప్పించారు. ఆ శిల్పకారులు ఆలయ నిర్మాణం కోసం నివసించిన గ్రామం పేరు పత్తర్కట్టి. ఇప్పుడది కూడా ఒక టూరిస్ట్ ప్లేస్. గయాసురుడు అనే రాక్షసుడిని విష్ణుమూర్తి హతమార్చిన ప్రదేశం అని స్థలపురాణం. ఆ సందర్భంలో విష్ణువు తన పాదాన్ని గయాసురుడి ఛాతీ మీద పెట్టి అతడిని అదిమేశాడని, ఆ ప్రదేశంలో భూమి మీద విష్ణువు పాద ముద్ర నిలిచిపోయిందని చెబుతారు. అందుకు ఆనవాలుగా పెద్ద పాదాన్ని చూపిస్తారు. గయ అనగానే బుద్ధుడు గుర్తుకు వస్తాడు. అయితే ఆ గయ ఈ గయ ఒకటి కాదు. ఈ గయకు పదిహేను కిలోమీటర్ల దూరాన బో«ద్గయ ఉంది. అది బుద్ధుడికి జ్ఞానోదయమైన గయ అది. ఈ పర్యటనలో ఆ ప్రదేశాన్ని అక్కడి బోధివృక్షాన్ని, బుద్ధుని భారీ విగ్రహాన్ని, వివిధ దేశాల నమూనా బౌద్ధ చైత్యాలను చూడవచ్చు. 3వ రోజు: మధ్యాహ్నానికి రైలు పూరీకి చేరుతుంది. జగన్నాథ ఆలయ దర్శనం, రాత్రి బస రైల్లోనే. రైలు పూరీ స్టేషన్లోనే ఉంటుంది.సర్వం పూరీ జగన్నాథంజగన్నాథ ఆలయం ఒడిశా రాష్ట్రం, పూరీ పట్టణంలో ఉంది. పురాణ కాలం నుంచి ఇక్కడ ఆలయం ఉంది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడితోపాటు అతడి అన్న బలభద్ర (బలరాముడు), చెల్లి సుభద్రల విగ్రహాలు పూజలందుకుంటాయి. ఇక్కడి దేవతా విగ్రహాలు రాతివి కాదు, దారు శిల్పాలు. మాల్వ రాజు ఇంద్రద్యుమ్నుడు ఆలయ నిర్మాణం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినప్పుడు శ్రీకృష్ణుడు కలలో కనిపించి సముద్రంలో తేలుతూ వచ్చిన కర్రదుంగతో విగ్రహాలు చేయించమని చెప్పాడని, ఆ మేరకు రాజు బంగాళాఖాతం తీరంలో ఎదురు చూడగా ఒక వేప దుంగ కొట్టుకు వచ్చిందని, దానిని సేకరించి విగ్రహాలు తయారు చేయించాడని చెబుతారు. ఇప్పుడు మనం చూస్తున్న నిర్మాణాన్ని క్రీ.శ పదకొండవ శతాబ్దంలో తూర్పు గంగ వంశానికి చెందిన అనంతవర్మన్ చోడగంగ నిర్మించాడు. ఈ ఆలయంలో పూజాదికాలు నిర్వహించేది భిల్లు శబర జాతి ఆదివాసీలు. పూరీ జగన్నాథుని రథయాత్ర దేశమంతటా ప్రసిద్ధి. సర్వజన సమానత్వానికి ప్రతీక ఈ ఆలయం. కులాలు, జాతులు, పేదగొప్ప తేడా లేకుండా భక్తులంతా సమానమే. ఈ ఆలయం గొప్పదనం పాటించడం. అయితే ఈ ఆలయంలోకి హిందూయేతరులకు ప్రవేశం ఉండదు. విదేశీయులతోపాటు భారతీయ జైనులు, సిక్కులు, బౌద్ధులకు కూడా ప్రవేశం నిషిద్ధమే. ఈ విషయమై అనేక చర్చలు, వాదప్రతివాదాలు జరుగుతున్నాయి. కొన్ని నియమాలననుసరించి ప్రవేశం కల్పించవచ్చనే సడలింపు ప్రతిపాదన కూడా వచ్చింది. కానీ అవేవీ ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు. 4 వరోజు : కోణార్క్ ఆలయ దర్శనం తర్వాత రైలు కోల్కతాకు బయలుదేరుతుంది.కోణార్క రథాలయంరథం ఆకారంలో ఉన్న ఈ సూర్యదేవాలయం ఒక ఖగోళ విజ్ఞాన భండారం. క్రీ.శ 13వ శతాబ్దం నాటి ఈ ఆలయ నిర్మాణ కౌశలం దాడుల్లో ధ్వంసమైపోగా మిగిలిన ఉన్న ఆనవాళ్లలో నాటి శిల్పుల నైపుణ్యాన్ని వెతుక్కుంటూ ఆనందించడమే మిగిలింది. యునెస్కో ఈ ఆలయాన్ని హెరిటేజ్ సైట్గా గుర్తించింది. ప్రస్తుతం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహణలో మెరుగులు దిద్దుకుంటోంది. ఈ సూర్యదేవాలయం ఒడిశా, పూరీ జిల్లాలో ఉంది కోణార్క్ లో ఉంది. ఈ ప్రాంగణంలోని ఛాయాదేవి ఆలయం కూడా అద్భుతమైన నిర్మాణమే. ధ్వంసమై΄ోయిన వైష్ణవాలయం శిథిలాలను దగ్గరగా వెళ్లి చూస్తే నాటి ఇటుకల సైజు, వాస్తుశైలి అర్థమవుతాయి. ఇక్కడ ప్రదర్శించే లేజర్ షోలో ధ్వంసమైన ఆలయాల పూర్తి రూపాన్ని చూడవచ్చు. 5వ రోజు : ఉదయం రైలు కోల్కతాకు చేరుతుంది. రైలు దిగి గంగాసాగర్కు ప్రయాణం. కపిలముని ఆశ్రమం పర్యటన తర్వాత రాత్రి బస గంగాసాగర్లో.గంగ భూమ్మీదకొచ్చిందిపురాణాల్లో కపిలముని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే గంగ భూమ్మీదకు రావడానికి కారణభూతులు కపిలముని. స్థానిక కథనాల ప్రకారం ఆ కపిలముని ఆశ్రమమే ఇది. స్థానిక రాజు సాగరుడు అశ్వమేధ యాగాశ్వాన్ని వదిలాడు. ఆ గుర్రాన్ని ఇంద్రుడు అపహరించి దానిని కపిలముని ఆశ్రమ ప్రాంగణంలో కట్టి వేసి తాను దాక్కున్నాడు. అశ్వం కోసం రాజు తన అరవైవేల మంది కొడుకులను పంపించాడు. వారు అశ్వాన్ని వెదకుతూ వచ్చి కపిలముని ఆశ్రమంలో గుర్తించారు. కపిలముని అశ్వాన్ని దొంగలించాడని ఆరోపించారు. దాంతో ఆగ్రహించిన కపిలముని వారిని తన తపశ్శక్తితో భస్మం చేశాడు. వారి ఆత్మలు నరకంలో కొట్టుమిట్టాడుతున్నాయని, వారిని స్వర్గానికి పంపించాలంటే ఎలా అని మునిని అడిగినప్పుడు... గంగ దివి నుంచి భువికి దిగి వచ్చి చితాభస్మాలను తడుపుతూ ప్రవహించినప్పుడు వారికి శాపవిమోచనం జరుగుతుందని చెప్పాడు. సాగరుడి వంశంలో తరువాతి తరాలకు చెందిన భగీరథుడు ఆ పనికి పూనుకున్నాడు. భగీరథుడి ప్రయత్నంతో గంగ నేలకు దిగి వచ్చిన ప్రదేశమే ఈ గంగాసాగర్. గంగ భూమ్మీదకు వచ్చిన రోజు మకర సంక్రాంతి. అందుకే ఏటా మకర సంక్రాంతి రోజు ఇక్కడ గంగామాతకు విశేష పూజలు చేస్తారు. కపిల ముని ఆశ్రమం వెస్ట్బెంగాల్, సౌత్ 24 పరగణాస్ జిల్లా, గంగాసాగర్ గ్రామంలో ఉంది. 6వ రోజు : గంగాసాగర్ నుంచి కోల్కతాకు రావడం. కాలీమాత ఆలయ దర్శనం. రాత్రికి రైలెక్కిన తర్వాత రైలు జసిదిహ్ వైపు సాగిపోతుంది.కాళిక శక్తిపీఠంకాళీమాత ఆలయం కలకత్తా కాళిగా దేశమంతటికీ ప్రసిద్ధి. ఇది 51 శక్తిపీఠాల్లో ప్రత్యేకమైన శక్తిపీఠం. వెస్ట్బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతాలో ఉంది. ఈ ఆలయం ఆదిగంగానది తీరాన ఉంది. ఆది గంగా నది అంటే గంగోత్రిలో ఉద్భవించిన గంగానది కాదు. ఇది హుగ్లీ నది మూల స్థానం. ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయం రెండు వందల యేళ్ల కిందట నిర్మించినది. కాళీమాత మొదట గుడిసె వంటి చిన్న కప్పుతో కూడిన నిర్మాణం ఉండేది. కాళీ మాత విగ్రహం మనిషి ఆకారంలో ఉండదు. ఒక రాతికి మూడు విశాలమైన బంగారు కళ్లు, పొడవైన నాలుక, నాలుగు చేతులు ఉంటాయి. కాళీమాత ఆకారం ఇలా ఉండడానికి కారణంగా ఒక కథనం చెబుతారు. శివుడు తాండవం చేసి సతీదేవి దేహాన్ని భుజాన వేసుకుని పయనిస్తున్న సమయంలో ఆమె కుడికాలి బొటనవేలు దేహాన్ని వీడి కింద పడి΄ోయిందని, ఆ వేలు పడిన ప్రదేశం ఇదని చెబుతారు. అందుకే కాళికామాత విగ్రహం మనిషి రూపంలో ఉండదు, బొటనవేలి ఆకారంలోనే ఉంటుంది. ఈ ఆలయ వీక్షణానికి కేవలం దర్శనం చేసుకుని వచ్చే సమయాన్ని మాత్రమే కేటాయించుకుంటే సరి΄ోదు. కాళికా మాత ఆలయం లోపల నట్ మందిర్, జోర్ బంగ్లా, సోస్థి తాలా, హర్కాత్ తాలా, రాధాకృష్ణ ఆలయం, నకులేశ్వర్ మహాదేవ్ఆలయం, కాకు కుండ్లు ఉంటాయి. ప్రశాంతంగా దర్శనం చేసుకుని, ఆధ్యాత్మికతను ఆస్వాదించాలంటే మూడు గంటల సమయం పడుతుంది.7వ రోజు: తెల్లవారు జాముకు రైలు జసిదిహ్కు చేరుతుంది. రైలు దిగి హోటల్ గదిలో చెక్ ఇన్ అవడం. ఆ తర్వాత వైద్యనాథ్ ఆలయ దర్శనం. రాత్రికి రైలెక్కిన తర్వాత రైలు వారణాసికి సాగిపోతుంది.జార్ఖండ్ బైద్యనాథుడుదక్షిణాది వాళ్లకు బైద్యనాథ ఆలయం అనగానే మహారాష్ట్ర, పర్లిలో ఉన్న బైద్యనాథ ఆలయమే గుర్తుకు వస్తుంది. ఇది జార్ఖండ్, సంతాల్ పరగణా, దియోఘర్లో ఉన్న బైద్యనాథ ఆలయం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇదొకటి. పురాణాల ప్రకారం రావణాసురుడు హిమాలయాల్లో శివుని కోసం తపస్సు చేశాడు. శివుడు ఎంతకీ ప్రత్యక్షం కాక΄ోవడంతో తన ఒక్కో తలనూ ఖండిస్తూ తొమ్మిది తలలను ఖండించుకున్నాడు. చివరికి పదవ తలను ఖండించబోతున్న క్షణంలో శివుడు ప్రత్యక్షమై వరమిస్తాడు. కోరిన కోరికలు తీర్చే కామ్న లింగాన్ని ప్రసాదిస్తే దానిని శ్రీలంకకు తీసుకెళ్తానని అడుగుతాడు రావణుడు. అలాగే శివుడు కామ్నలింగాన్నిస్తాడు. శ్రీలంక వెళ్లే వరకు మధ్యలో ఎక్కడా నేల మీద పెట్టకూడదనే నియమాన్ని కూడా చెబుతాడు. కామ్నలింగంతో బయలుదేరిన రావణాసురుడు జార్ఖండ్, దియోఘర్లో ఈ ప్రదేశానికి వచ్చేటప్పటికి సంద్యాక్రతువుల సమయమవుతుంది. ఒక గొర్రెల కాపరికి ఆ లింగాన్ని ఇచ్చి తాను వచ్చే వరకు నేల మీద పెట్టవద్దని కోరుతాడు. అలాగేనని తీసుకున్న ఆ పశువుల కాపరి రావణాసురుడు రావడం ఆలస్యం కావడంతో ఆ శివలింగాన్ని నేల మీద పెట్టి వెళ్లి పోతాడు. భయంకరమైన వర్షం కారణంగా రావణాసురుడు తిరిగి రావడం ఆలస్యమైంది. ఆ అకాలవర్షానికి కారణం విష్ణువు మాయోపాయమేనని గ్రహిస్తాడు. ఆ లింగాన్ని పెకలించి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు, కానీ సాధ్యం కాదు. ఇక చేసేదేమీ లేక వెళ్లిపోతాడు. ఆ కామ్నలింగం ఉన్న ప్రదేశం కావడంతో దీనికి జ్యోతిర్లింగ క్షేత్రమైంది. 8వ రోజు ఉదయానికి వారణాసికి చేరుతుంది. విశ్వనాథుని దర్శనం తర్వాత రాత్రి బస వారణాసిలో. లయకారుని నిలయంకాశీ విశ్వనాథుని జ్యోతిర్లింగ దర్శనం, గంగాహారతి వీక్షణంతోపాటు విశాలాక్షి, అన్నపూర్ణ, వారాహి అమ్మవార్ల ఆలయాలు, కాలభైరవ మందిరాలను కూడా దర్శించుకోవాలి. వీటన్నింటికీ ప్రత్యేకమైన ప్రాశస్త్య్రం ఉంది. మనం ఇప్పుడు చూస్తున్న విశ్వనాథుడి మందిరం కొత్తది. యూపీలో ఉన్న ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ప్రాచీన కాలం నుంచి ప్రాచుర్యంలో ఉంది. అప్పట్లో ఈ ఆలయం అసలు పేరు ఆది విశ్వేశ్వరాలయం. భారత్ మీదకు దండెత్తి వచ్చిన మహమ్మద్ ఘోరీ ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఆ తర్వాత అక్బర్ ఆస్థానంలో ఉన్న మొదటి మాన్సింగ్, తోడరమల్లు దీనిని పునర్నిర్మించారు. 17వ శతాబ్దం అంటే ఔరంగజేబు పాలన కాలంలో మరోసారి ఆటు΄ోట్లను ఎదుర్కొన్నదీ ఆలయం. హిందూ ఆలయాన్నింటినీ కూల్చేయమన్న ఆదేశం మేరకు జరిగిన విధ్వంసంలో ఇది ్ ప్రాభవాన్ని కోల్పోయింది. ఈ ప్రాంగణంలో జ్ఞానవాపి మసీదు వెలిసింది. 18వ శతాబ్దంలో ఇందోర్ రాణి అహిల్యాబాయ్ హోల్కర్ పునర్నిర్మించారు. ఇప్పుడు చూస్తున్న నిర్మాణం విశాలంగా అధునాతనంగా ఉంది. దీనిని 2021లో విస్తరించారు. లయకారుని ఆలయం ఇన్ని దఫాలుగా లయమైపోతూ తిరిగి ఆలయంగా మారుతూ వచ్చింది. 9 వరోజు : ఉదయం రైలు అయోధ్యవైపు సాగుతుంది. అయోధ్యలో రామజన్మభూమి, హనుమాన్ గరితోపాలు ఇతర ఆలయాల దర్శనం. సరయు నదిలో హారతి. ఆ తర్వాత తిరుగు ప్రయాణం మొదలైనట్లే.రామ్లల్లా ఏడాదిన్నరగా దేశం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తున్న ఆలయం రామ్లల్లా ఆలయం. అదే అయోధ్య రామమందిరం. రోజుకు లక్ష మంది దర్శించుకుంటున్నారు. ఆ సంఖ్య పర్వదినాల్లో ఒకటిన్నర లక్షకు చేరుతోంది. బాబర్ కాలంలో మసీదు రూపం సంతరించుకుని, బ్రిటిష్ పాలనకాలం తర్వాత స్వతంత్ర భారతంలో ప్రతీకాత్మకంగా రాముడు, సీత విగ్రహాలను ప్రతిష్ఠించుకుని, ముప్పై మూడేళ్ల కిందట విధ్వంసానికి గురయ్యి న్యాయస్థానం తీర్పుతో తిరిగి రూపుదిద్దుకున్న ఆలయం ఇది. ఇందులో ప్రతిష్ఠించిన బాలరాముడి విగ్రహం ఆకట్టుకుంటుంది. దర్శించుకున్న ప్రతి ఒక్కరూ తమ ఇంటి బిడ్డగా భావించేటట్లు ఉంటుంది రాముడి రూపం. కళ్లు మూసుకుని మొక్కుకోవడమే కాకుండా కళ్లారా చూడాల్సిన రూపం. ఆలయ నిర్మాణం కూడా అంతే విశిష్టంగా ఉంటుంది. ఆ తర్వాత హనుమాన్ ఘరి దర్శనం, సరయు తీర విహారం ఆహ్లాదకరంగా సాగుతాయి.10వ రోజు : ఉదయానికి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ లక్నోకు చేరుతుంది. అదే రోజు అంటే 22వ తేదీన కాన్పూర్, ఓరై, వీరాంగణ లక్ష్మీబాయ్, గ్వాలియర్, ఆగ్రా కంటోన్మెంట్కు చేరడంతో పర్యటన పూర్తవుతుంది.ఐఆర్సీటీసీ నిర్వహించే భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్లో ‘పూరీ కోల్కతా గంగాసాగర్ యాత్ర (ఎన్జెడ్బీజీ62)’ చేయవచ్చు. ఆగ్రా కంటోన్మెంట్ నుంచి మొదలై తిరిగి అదే స్టేషన్కు చేరే ఈ పది రోజుల యాత్రలో గయ, గంగాసాగర్, కోల్కతా, పూరీ, కోణార్క్, బైద్యనాథ్, వారణాసి, అయోధ్యలను చూడవచ్చు. టికెట్ ధరలు కంఫర్ట్ కేటగిరీ (సెకండ్ ఏసీ)లో ఒక్కొక్కరికి 40 వేల మూడు వందలు, స్టాండర్డ్ కేటగిరీ (థర్డ్ ఏసీ)లో ఒక్కొక్కరికి 30 వేల ఐదు వందలు, ఎకానమీ క్లాస్ (స్లీపర్) లో ఒక్కొక్కరికి దాదాపు 19 వేల రూపాయలవుతాయి. గమనిక: లక్నో, కాన్పూర్, ఓరై, వీరాంగణ లక్ష్మీబాయి, గ్వాలియర్ స్టేషన్ల మీదుగా పర్యటన సాగుతుంది. ఇక్కడి పర్యాటక ప్రదేశాల సందర్శన ఈ ప్యాకేజ్లో లేదు. ఈ టూర్లో బుక్ చేసుకున్న పర్యాటకులు ఆగ్రా స్టేషన్కు వెళ్లాల్సిన తప్పనిసరేమీ ఉండదు. పై స్టేషన్లలో ఎక్కడైనా రైలెక్కవచ్చు, దిగవచ్చు. ఐఆర్సీటీసీ నిర్వహించే భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్లో ‘పూరీ కోల్కతా గంగాసాగర్ యాత్ర (ఎన్జెడ్బీజీ62)’ చేయవచ్చు. ఆగ్రా కంటోన్మెంట్ నుంచి మొదలై తిరిగి అదే స్టేషన్కు చేరే ఈ పది రోజుల యాత్రలో గయ, గంగాసాగర్, కోల్కతా, పూరీ, కోణార్క్, బైద్యనాథ్, వారణాసి, అయోధ్యలను చూడవచ్చు. టికెట్ ధరలు కంఫర్ట్ కేటగిరీ (సెకండ్ ఏసీ)లో ఒక్కొక్కరికి 40 వేల మూడు వందలు, స్టాండర్డ్ కేటగిరీ (థర్డ్ ఏసీ)లో ఒక్కొక్కరికి 30 వేల ఐదు వందలు, ఎకానమీ క్లాస్ (స్లీపర్) లో ఒక్కొక్కరికి దాదాపు 19 వేల రూపాయలవుతాయి. ఈ ట్రిప్ ఈ ఏడాది సెప్టెంబర్ 13వ తేదీ నుంచి మొదలవుతుంది. ప్యాకేజ్కోడ్ https://www.irctctourism.com/tourpackageBooking?packageCode=NZBG62& – వాకా మంజులారెడ్డి,సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి -
మనుషులను కలిపేదే సాహిత్యం
మనుషులను విడదీసేందుకు చాలా దారులు ఉన్నాయి. కానీ వారిని కలిపే పని సాహిత్యమే చేయగలదు. బుక్ బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్ను నిర్వహించడం వెనుక ఈ సంకల్పమే ఉంది’ అన్నారు సతీష్ చప్పరికె. గత సంవత్సరం మొదలై ఇకపై ప్రతి ఏటా నిర్వహించ తలపెట్టిన నాలుగు దక్షిణాది భాషల భారీ సాహిత్య సమ్మేళనం‘బుక్ బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్’ 2025 Book (Brahma Literature Festival-2025) సంవత్సరానికిగాను బెంగళూరులో ఆగస్టు 8, 9, 10 తేదీల్లో జరగనుంది. ఈ సందర్భంగా ఈ ఫెస్టివల్ ఫౌండర్, సీనియర్ పాత్రికేయుడు సతీష్ చప్పరికెతో సంభాషణ: గత సంవత్సరం బుక్ బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్కు వచ్చిన స్పందన ఎలా అనిపించింది? నాలుగు దక్షిణాది రాష్ట్రాల రచయితలను ఒకచోట చేర్చి, వారు ఒకరితో ఒకరు పరిచయమయ్యేలా, పాఠకులతో ఇంటరాక్ట్ అయ్యేలా చేసి, మనదైన సాహితీ వాతావరణం ఏర్పరచడమే ఈ లిటరేచర్ ఫెస్టివల్ ఉద్దేశం. దక్షిణాది రచయితలందరూ పాల్గొనే ఇలాంటి ఫెస్టివల్ ఇంతకు మునుపు లేదు. అందుకే గత సంవత్సరం మూడు రోజుల పాటు 36 వేల మంది హాజరైతే, వీడియో ప్రసారాలను 42 దేశాల్లో రెండున్నర లక్షల మంది తిలకించారు. ఇది చాలా పెద్ద స్పందన.ఈ సంవత్సరం విశేషాలు ఏమిటి?గత సంవ త్సరం నాలుగు రాష్ట్రాల నుంచి 300 మంది రచయితలు పాల్గొంటే, ఈ సంవ త్సరం 450 మంది పాల్గొంటున్నారు. ఐదు వేదికల మీద మూడు రోజుల పాటు నిరాటంకంగా సెషన్స్ జరుగు తాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు ఇంగ్లిష్లో సెషన్స్ ఉంటాయి. దక్షిణాదిలో పుట్టి ఇంగ్లిష్లో రాస్తున్న రచయితలను కూడా ఈసారి ఆహ్వానించాం. ఈసారి పాల్గొంటున్న వారిలో అదూర్ గోపాలకృష్ణన్, దామోదర్ మౌజో, శశి థరూర్, బాను ముష్తాక్, జయ మోహన్, సచ్చిదానందన్, మను పిళ్లై తదితరులెందరో ఉన్నారు. మరో విషయం... ఈ ఫెస్టివల్లో రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు ఉండరు. ఇది పూర్తిగా సాహిత్య ఉత్సవం.కన్నడ భాష నుంచి బాను ముష్తాక్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గెలిచారు. ఆమెకు ఏదైనా సత్కారం ఉంటుందా?ఆమెను ఈ ఫెస్టివల్కు ఆహ్వానించి పాఠకులు ఆమెతో ముచ్చటించేలా చేయడమే మేము చేసే సత్కారం. ఒక రచయిత పాఠకులను కలవడం కంటే ఏం కావాలి!మీరు ఆహ్వానించే రచయితలు ఏ ధోరణి సాహిత్యానికి ప్రతినిధులు?మీ ప్రశ్న నాకు అర్థమైంది. మేము లెఫ్ట్ వింగ్ కాదు, రైట్ వింగ్ కాదు. ప్రజల తరఫున మాట్లాడే, సాహితీ వికాసం కోరే ప్రతి రచయితా మాకు మిత్రుడే. ఈసారి తెలుగు నుంచి ఎవరెవరు ఆహ్వానం అందుకున్నారు?గత సంవత్సరం 30 మందిని ఆహ్వానించాం. ఈసారి రచయితలు, పబ్లిషర్లు, పెర్ఫార్మర్లు దాదాపు 100 మంది వరకూ ఉంటారు. భాష ఒకటే అయినా రెండు రాష్ట్రాల నుంచి సమాన సంఖ్యలో ఆహ్వానించాం. ఈసారి ఆహ్వానం అందుకున్న వారిలో సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, బండి నారాయణ స్వామి, మధురాంతకం నరేంద్ర, కొలకలూరి ఇనాక్, పెద్దింటి అశోక్ కుమార్, షాజహానా తదితరులు ఉన్నారు. తగుళ్ల గోపాల్, బాల సుధాకర మౌళి తదితర యువ కవులను ఆహ్వానించాం.గతంలో వచ్చినవారు రిపీట్ కాకుండా ఉండాలని ప్రయత్నిస్తున్నాం. ఈసారి ఆహ్వానం అందుకోనివారు వచ్చే సంవత్సరం అందు కుంటారు. అందరూ ఏదో ఒక సంవత్సరం పాల్గొనాలనేదే మా కోరిక. వీరిని ఆహ్వానించడంలో అనువాదకుడు అజయ్ వర్మ అల్లూరి మాకు సహకరిస్తున్నారు.లక్ష్యం ఏమిటి?మన దక్షిణాది భాషల్లో గొప్ప రచయితలు ఉన్నారు, రచనలు ఉన్నాయి. ప్రపంచ భాషలకు ఏమాత్రం తగ్గని పుస్తకాలు ఉన్నాయి. వాటిని ప్రపంచ భాషల్లోకి అనువాదం చేయించడం బుక్ బ్రహ్మ లక్ష్యంగా పెట్టుకుంది. దక్షిణాది భాషల సాహిత్య సౌరభాన్ని దేశం ఎదుట సగర్వంగా నిలిపేందుకు ఈ ఫెస్టివల్ జరుగుతూనే ఉంటుంది. దీనికి ఎవరైనా ఉచి తంగా రిజిస్టర్ చేసుకుని హాజరు కావచ్చు.ఇంటర్వ్యూ: ‘సాక్షి’ ప్రతినిధి‘ -
ఎవరు చెప్పారన్నది కాదు... స్థితప్రజ్ఞత ముఖ్యం!
ఒకరోజు ఒకతను ఒక ముని దగ్గరకు వెళ్లాడు. ఆయనకు నమస్కరించి ‘జ్ఞానం అంటే ఏమిటి? నేను కలిసిన కొందరు ఒక్కోలా చెప్పారు... మరి మీరేమంటారో తెలుసుకోవాలని ఉంది’ అన్నాడు. ‘జ్ఞానం అంటే సుఖాన్ని పొందినప్పుడు పట్టరాని ఆనందంతో ఉన్న చోటుని మరచిపోవడం కాదు... బాధలో అలసిసొలసి డీలా పడిపోవడం కాదు. కష్టమో సుఖమో దేనికైనా స్థిరంగా ఉండటం ముఖ్యం’ అన్నారు ముని. ‘మీరు దీనిని ఎక్కడి నుంచి నేర్చుకున్నారు?’ అని అడిగా డతను. అంతట ఆ ముని ‘నేను ఈ నిజాన్ని గాడిద నుండి నేర్చు కున్నాను’ అన్నారు. ‘ఏమిటి మీరు చెప్తున్నది? అది ఎలా సాధ్యం?’ అని అడిగాడు మునిని. ఒక గాడిద ఆ దారిన పోతోంది. ముని దాని వంక చూడమన్నారు. ‘ఈ గాడిద వీపు మీద ప్రతి ఉదయం మురికి బట్టల మూటలు పెట్టి తోలుకుంటూ పోతాడు దాని యజమాని. నదిలో మురికి బట్టలన్నింటినీ ఉతికి సాయంత్రం శుభ్రమైన బట్టల మూటలను గాడిద వీపు మీద ఉంచి ఇంటిబాట పడతాడు. మనం ఆ గాడిదలా ఉండాలి. ఉదయం పోతున్నప్పుడు మురికి బట్టల మూటలని అదేమీ బాధపడలేదు. సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు శుభ్రమైన బట్టల మూటలని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవదు. దేన్ని చూసీ అది చలించలేదు. ఆ స్థిరమైన జ్ఞానాన్ని దాని నుంచి నేర్చుకున్నాను’.అలాంటి స్థితి పరిపక్వతతోనే సాధ్యం. సుఖమైనా, కష్టమైనా స్థితప్రజ్ఞత ముఖ్యం. ఎవరు బోధిస్తారనేది ముఖ్యం కాదు. గురువు ఎవరైనా కావచ్చు, కానీ మనం ఏమి నేర్చుకుంటున్నామనేదే ముఖ్యం.– యామిజాల జగదీశ్ -
విశేష ఫల ప్రదం
నాగపంచమి/గరుడ పంచమి: నాగారాధనకు సంబంధించిన ముఖ్యరోజులలో కార్తీకశుద్ధ పంచమి ‘గరుడ పంచమి’ లేదా ‘నాగ పంచమి’ గా ప్రసిద్ది. కొన్నిప్రాంతాలలో నాగపంచమిని శ్రావణమాసంలో ఆచరిస్తారు. గరుత్మంతుడు సూర్యుడికి రథసారథి అయిన అనూరుడికి తమ్ముడు. మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు, సప్తసముద్రాల్లోని జలాన్నంతటినీ ఒక్కరెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు. అందుకే ఆయనకి సుపర్ణుడని పేరు. గరుడపంచమికి సంబంధించి భవిష్యత్పురాణంలో ప్రస్తావన ఉంది. దేవాలయాల్లో గరుడ వాహనాలను గమనిస్తే... ఒక మోకాలు వంచి, మరో మోకాలు మీద నిటారుగా కూర్చొని రెండు చేతులనూ చాచి మూలవిరాట్టును చూస్తూ ఉన్న మూర్తి కనిపిస్తుంది. అంటే విష్ణుమూర్తి తనను ఎక్కడికి తీసుకెళ్లమంటే అక్కడికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని తెలియజేయడం కోసమే. నాగులనుంచి రక్షణ పొంది, నాగదోషం తగులకుండా పిల్లలను కా పాడుకొనేందుకు చేసే పూజ నాగపంచమి, నిర్మలమైన మనస్సు, తెలివైన పిల్లలకోసం చేసే పూజ గరుడపంచమి.గరుడ పంచమి రోజున మహిళలు స్నానాంతరం ముగ్గులు పెట్టిన పీఠపై అరటి ఆకును పరచి, బియ్యం పోసి, వారి శక్తి మేర బంగారు, వెండి నాగపడిగను ప్రతిష్టించి, పూజచేసి, పాయస నైవేద్యం పెడ్తారు. మనికొన్నిప్రాంతాలలో పుట్టలో పాలు పోస్తారు. ఇలా మనపూజలందుకొనే గరుడిని వంటి మాతృ ప్రేమకల కుమారుడు కావాలని తెలిపే గరుడ/నాగ పంచమి వ్రతం అనంత సౌభాగ్యాలను కలుగచేస్తుందని నమ్ముతారు. ఇదే రోజున నాగపంచమి వ్రతం చేసుకునేవారు నాగుల ఆకారాన్ని ఇంటి గోడలమీద తీర్చిదిద్ది పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. నాగారాధన వల్ల సర్పదోషాలు తొలగి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. ఈరోజున చేసే నాగారాధన వల్ల చర్మవ్యాధులు, చెవి సంబంధిత రోగాలు తొలగుతాయని కూడా ప్రతీతి.మహనీయుల మాటలు→ ఏది మనకు అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించాలి. ఏది మనకు నీడనిస్తుందో దానిని కోవెలగా భావించాలి. ఏది మనకు మంచిని నేర్పిస్తుందో దానిని నిరంతరం స్మరణ చేసుకోవాలి.→ మంచి ఆలోచనలతో మనసు నింపుకో మంచి పనులతో ప్రతిష్ట పెంచుకో మంచి పలుకులతో మన్ననలు అందుకో వీటి అన్నిటితో అందరిని కలుపుకొని పో→ భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని ఎప్పుడూ భయపడేవారు ఏమీ సాధించలేరు. సత్యమని మంచిదని నీవు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు.→ బయటకు కనిపించే రంగు,రూ పాన్ని చూసి ఎవ్వరినీ అంచనా వేయకూడదు. ఎందుకంటే నోరు తెరిచేంతవరకూ కాకి, కోయిల రెండూ ఒకేలా ఉంటాయి.→ అవసరమైన దానికంటె ఎక్కువ విషయాలు సేకరించేవారు, తెలుసుకున్న దాని కంటె తక్కువ మాట్లాడేవారు విజ్ఞాన వంతులు.‘ -
మహిళల శబరిమల గురించి తెలుసా? పురుషులకు నో ఎంట్రీ
Sabarimala of Women" మహిళల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. వారి కోసం ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతారని తెలుసు. కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో మహిళల కోసం ఏకంగా ఒక ఆలయమే ఉంది. పురాతన కథలు, మత సంప్రదాయాలకు ప్రసిద్ధిగాంచిన అట్టుకల్ భగవతి ఆలయం అది. భద్రకాళి దేవికి అంకిత మిచ్చిన ఈ ఆలయంలోని దేవేరిని అట్టుక్కల్ అమ్మగా పిలుస్తారు. ఆమె ఎంతటి రక్షకురాలో అంతటి విధ్వంసకురాలిగా భక్తులు భావిస్తారు. అత్యంత మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో స్త్రీలకు మాత్రమే ప్రవేశం. అందుకే ఈ ఆలయాన్ని ‘మహిళల శబరిమల’గా పిలుస్తారు. ఏటా పది రోజులపాటు నిర్వహించే అట్టుకల్ పొంగళ (Attukal Pongala) ఉత్సవంలో ఆడవాళ్లు మాత్రమే పూజాదికాలు నిర్వహిస్తారు. ఆ రోజుల్లో పురుషులను ఆలయ దరిదాపులకు కూడా రానివ్వరు.ఆలయ చరిత్రఒకానొక సాయంత్రం ఓ వ్యక్తి కిల్లియర్ నదిలో స్నానం చేస్తుండగా, ఒక బాలిక వచ్చి నది దాటడానికి సహాయం చేయాలని అడిగినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆమె ప్రవర్తనకు ముగ్ధుడైన ఆ వ్యక్తి బాలికను ఇంటికి ఆహ్వానించాడు. కుటుంబసభ్యులంతా చూస్తుండగానే ఆమె అదృశ్యమైంది. అదే రాత్రి ఆ వ్యక్తికి కలలో ఆమె దేవత రూపంలో కనిపించింది. సమీపంలోని అడవిలో మూడు గీతలు గీసిన చోట తన కోసం గుడి కట్టించాలని ఆదేశించింది. మర్నాడు ఆ వ్యక్తి ఆ ప్రదేశానికి వెళ్లి మూడు గీతలను చూశాడు. వెంటనే ఆ స్థలంలో ఒక ఆలయాన్ని నిర్మించడం ప్రారంభించాడు. అది పూర్తయ్యాక నాలుగు చేతులున్న దేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అలా అట్టుక్కల్ భగవతి ఆలయం వెలుగు చూసింది.ఆలయ నిర్మాణంకేరళ, తమిళనాడు రాష్ట్రాల శిల్పులు గుడి గోపురాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆలయ గోడలు, ప్రధాన ద్వారంపై∙మహిషాసురమర్దిని, కాళి, రాజరాజేశ్వరి, శివపార్వతుల దేవతా రూపాలను చక్కగా చెక్కారు. ఇంకా విష్ణుమూర్తి దశావతారాల కథలు కూడా తోరణంపై కనిపిస్తాయి. దక్షిణ గోపురంపై దక్షయజ్ఞం కథను చిత్రీకరించారు. ఆలయ ప్రాంగణంలో వినాయకుడు, శివుడు, నాగ దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆలయం లోపల రెండు దేవతా విగ్రహాలు ఉంటాయి. ఒకటి ఆభరణాలతో అలంకరించిన అసలు విగ్రహం, దాని వెనుక మరో విగ్రహం ఉంటాయి. ఆలయంలోకి ప్రవేశించగానే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. కణ్ణగిని అమ్మవారి అవతారంగా భావించి మహిళలు అత్యంత భక్తితో పూజిస్తారు.అట్టుక్కల్ పొంగళఏటా మార్చి నెలలో పది రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇది ఆలయంలో జరిగే అతి పెద్ద పండుగ. దీన్ని అట్టుకల్ పొంగళ అని పిలుస్తారు. దేశవ్యాప్తంగా దీనికి గుర్తింపు ఉంది. వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది మహిళలు ఇక్కడికొస్తారు. స్త్రీ దైవత్వాన్ని గౌరవించడానికి మగువలకు మాత్రమే ఆలయ ప్రవేశం కల్పిస్తారు. అంతేతప్ప పురుషుల పట్ల ఎలాంటి వివక్ష ఉండదు. ఆచార వ్యవహారాల్లో కేవలం మహిళల భాగస్వామ్యం కోసం మాత్రమేనని చెబుతారు. పేద, ధనిక, వివాహితులు, వితంతువులు అనే తేడా లేకుండా మహిళలందరూ బియ్యం, బెల్లం, కొబ్బరి ఉపయోగించి తీపి పొంగలిని కట్టెలపొయ్యిపై కుండల్లో వండి భగవతిదేవికి నైవేద్యం సమర్పిస్తారు. మహిళా శక్తిని ప్రదర్శించడానికి వనితలు దీన్ని వేదికగా మలచుకుంటారు. ఒక మహిళ తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం చేసిన పోరాటానికి ప్రతీక ఈ వేడుక అని పురాణ గా«థ ఒకటుంది. 2009లో గిన్నిస్ రికార్డుల్లోకి సయితం ఎక్కింది. ఒకే రోజు 25 లక్షల మందికి పైగా మహిళలు పాల్గొన్న మతపరమైన సమావేశంగా గిన్నిస్ బుక్ గుర్తించడం విశేషం. ఈ వేడుకకు కేరళ రాష్ట్ర ఆర్టీసీ, భారతీయ రైల్వే ప్రత్యేక రవాణా సదుపాయాలు కల్పిస్తాయి.ఇదీ చదవండి: Ananya Reddy తొలిప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంక్, మార్క్ షీట్ వైరల్ఎలా చేరుకోవాలి?తిరువనంతపురం విమానాశ్రయం నుంచి ఆలయం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలు మార్గంలో వస్తే తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్లో దిగాలి. అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో గుడి ఉంటుంది. ఇంకా ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో గుడికి చేరుకోవచ్చు. స్థానికంగా ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. ఉదయం 4–30 నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 నుంచి 8–30 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. -చెన్నాప్రగడ శర్మ -
తొలి ప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంక్, అనన్య మార్క్స్ షీట్ వైరల్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పరీక్ష భారతదేశంలో అత్యంత కఠినమైన పోటీ పరీక్ష. UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని చాలామంది కలలు కంటారు. IAS, IFS, IRS లేదా IPS అధికారి కావాలనే కలతో ప్రతీ ఏడాది వేలాది మంది ఈ పరీక్ష రాయాలని కోరుకుంటారు. కానీ వారిలో కొద్దిమంది మాత్రమే విజయం సాధిస్తారు. అలాంటి వారిలో ఒకరు మహబూబ్నగర్కు చెందిన దోనూరు అనన్య రెడ్డి. తొలి ప్రయత్నంలోనే అసాధారణ ప్రతిభతో సత్తాచాటిన అనన్యరెడ్డి మార్కుల షీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్ తుది ఫలితాల్లో అనన్య మూడో ర్యాంకు సాధించారు. పదో తరగతి వరకు మహబూబ్నగర్ గీతం హైస్కూల్లోనూ, హైదరాబాద్లో ఇంటర్ విద్యను పూర్తి చేసిన అనన్య ఢిల్లీలో మిరాండా హౌస్ నుండి ఎకనామిక్స్లో మైనర్తో భౌగోళిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. డిగ్రి పూర్తవుతున్న క్రమంలో UPSCపై దృష్టిపెట్టింది. ప్రతిరోజూ 12 నుండి 14 గంటలు చదువుకుంటూ ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోకుండానే ఈ ఘనతను సాధించారు. తన సబ్జెక్టు ఆంత్రోపాలజీలో ప్రావీణ్యం సంపాదించడానికి కోచింగ్ తీసుకున్నారట. (చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదన)పట్టుదల దృఢనిశ్చయంతో చదవిUPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023లో అత్యుత్తమ ఆల్ ఇండియా ర్యాంక్ -3ని సాధించారు అనన్యరెడ్డి. రెండేళ్ల శ్రమతో తన తొలి ప్రయత్నంలోనే మంచి ర్యాంకుతో సివిల్స్ సాధించడం విశేషం. ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ తనకు ప్రేరణ అని వెల్లడించారు. అంతేకాదు నవలలు చదవడం, క్రికెట్ చూడటం ద్వారా అనన్య రెడ్డి తన టెన్షన్ను మేనేజ్ చేసుకునేదట. ఇదీ చదవండి: 10 నెలల పాపను ఛాతీపై పడుకోబెట్టుకునే తండ్రికి వింత అనుభవం -
వైతరణి ఉగ్రరూపం : వరద బెడద
ఒడిశా, భువనేశ్వర్: రాష్ట్రంలో వరదలతో నదులు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల ప్రమాద సంకేతం దాటి తీర ప్రాంతాల్లో కట్టలను బలహీనపరుస్తున్నాయి. నదీతీర ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ప్రాణహాని జరగకుండా సమగ్ర యంత్రాంగం చురుకుగా పని చేస్తోందని రాష్ట్ర జల వనరుల శాఖ పేర్కొంది. ప్రధానంగా సువర్ణ రేఖ, వైతరణి, జలకా నదుల్లో వరద ఉద్ధృతి విపరీతంగా కొనసాగుతోంది. ఈ నదుల్లో నీటిమట్టం పలు తీర ప్రాంతాల్లో గరిష్ట పరిమితికి మించి ఉంది. వైతరణి నది ఆనందపూర్, అఖుపొదా, జలకా నది మథాని తీరం, సువర్ణ రేఖ నది జంసోలా ఘాట్, రాజ్ఘాట్ తీర ప్రాంతాల్లో గరిష్ట పరిమితిని మించి ప్రవహిస్తున్నాయి. ఈ నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల అంచనా. #WATCH | Bhadrak, Odisha | The Baitarani River has crossed the danger mark at Akhuapada, and a flood warning has been issued for Jajpur and Bhadrak districts. (26.07) pic.twitter.com/hHNQAwZtqD— ANI (@ANI) July 26, 2025ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధం రాష్ట్రంలో వరద ముంపు పరిస్థితి తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. ఈ పరిస్థితి నివారణ కోసం ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమైంది. నదుల్లో వరద పరిస్థితిని నియంత్రించడానికి ప్రభుత్వం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి కార్యాచరణ ఖరారు చేసింది. అల్ప పీడనం కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో వివిధ నదుల నీటి మట్టం గణనీయంగా పెరుగుతోంది. నదుల్లో నీటిమట్టం పెరుగుతున్నందున వరద ముంపు పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్ పాఢి శనివారం విలేకరులకు తెలియజేశారు. అవసరమైతే లోతట్టు వరద తాకిడి ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేసి సురక్షిత ప్రదేశాలకు తరలిస్తామన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బాలాసోర్ జిల్లాలో 4 మండలాలు మళ్లీ ప్రభావితం అవుతాయని భావిస్తున్నారు. వాటిలో బలియాపాల్, భొగొరాయ్, బొస్తా, జలేశ్వర్ ఉన్నాయి. నిరంతర నిఘా ఉప్పొంగుతున్న నదీతీర ప్రాంతాల్లో పరిస్థితులపై అనుబంధ యంత్రాంగం నిరంతర నిఘా పెడుతోంది. రాష్ట్ర వరద విభాగం రాత్రింబవళ్లు చురుకుగా పని చేస్తుందని చంద్రశేఖర్ పాఢి తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్లకు అప్రమత్తం చేశారు. జాజ్పూర్, భద్రక్ – బాలసోర్ జిల్లా కలెక్టర్లు నదీతీర ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు, క్షేత్రస్థాయిలో అనుబంధ సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. సువర్ణరేఖ, బుఢా»ొలంగ్, మహానది, బ్రాహ్మణి, వైతరణి వ్యవస్థ నుంచి చీఫ్ ఇంజినీర్లు, బేసిన్ మేనేజర్లు జిల్లా యంత్రాంగంతో సమన్వయ కార్యాచరణను పర్యవేక్షిస్తున్నారు. భువనేశ్వర్ నుంచి ఇద్దరు ఇంజినీర్ ఇన్ చీఫ్లను ప్రభావిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఉన్నతాధికారులు సువర్ణరేఖ బేసిన్, వైతరణి బేసిన్ పరిధిలో వారు క్షేత్రస్థాయిలో వరద నిర్వహణను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. ఈ రెండు నదుల్లో నీటి మట్టాలు ప్రమాద స్థాయిని దాటిన తర్వాత ఈ అధికారులను తరలించారు. Flood Update: Flood Situation at 11 AM #Flood #Odisha@CMO_Odisha @DC_Odisha @_anugarg @IPR_Odisha@OLICLTD @OIIPCRA_OCTDMS @ltd_occ@GWDOdisha @CE_Megalift @dm_jajpur@DM_Bhadrak @DBalasore pic.twitter.com/VWOtvXcqBw— Deptt. of Water Resources (@OdishaWater) July 27, 2025 వైతరణి ఉగ్రరూపం భద్రక్ జిల్లా అఖుపొడా తీరంలో వైతరణి ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ మేరకు కలెక్టర్ వరద హెచ్చరికను జారీ చేశారు. చాంద్బాలి, ధామ్నగర్లు తీవ్రంగా, భొండారి, పొఖొరి ప్రాంతాలు పాక్షికంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. నదీతీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మయూర్భంజ్ జిల్లాలో రాసగోవింద్పూర్, మోర్దా, షులియాపడా, చిత్రాడ్ మొదలైన ప్రాంతాల్లో ఎగువ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా జలకా నది నీటిమట్టం పెరుగుతోంది. ఇటీవల ఈ ప్రాంతం వరదలకు గురై వందలాది హెక్టార్లలోని వరి పొలాలు నాశనమయ్యాయి. ఈ పరిస్థితి దిగజారకుంటే బొస్తా మండలంలో 8 పంచాయతీలు, సదర్ మండలంలో 2 పంచాయతీలు ప్రభావితం అవుతాయని భయపడుతున్నారు. వివిధ ప్రదేశాల్లో కరకట్టలు బలహీనంగా ఉండడంతో నదితీర ప్రాంత ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు. ఇదీ చదవండి: చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదన -
ఇదేనా ఆధునిక నాగరికత?
హిందూ పురాణాలు, భారతీయుల నమ్మకం ప్రకారం... జ్ఞాన దేవత అయిన సరస్వతీ దేవిని ( Goddess Saraswati) పుస్తక రూపంగా భావిస్తారు. పుస్తకం జీవన దీపికగా, నిత్యం మనకు సత్యా– అసత్యాల వాస్తవ మార్గాన్ని చూపిస్తూ, అజ్ఞానం నుండి జ్ఞానం వైపు తీసుకెళ్లే దారిగా నిలుస్తుంది. సంస్కృతంలో ప్రసిద్ధమైన మాట ‘పుస్తకం హస్త భూషణం’. అంటే పుస్తకం చేతికి అలంకారమని అర్థం. పుస్తకం ఉత్తమ మిత్రుడు, గురువు, తత్వవేత్త కూడా. ‘అపరిమితంగా చదివినవాడే గొప్ప వాగ్ధాటి గల వక్త కాగలడు’ అన్న మాట పుస్తక పఠనానికి ఉన్న ప్రాముఖ్యాన్ని సూచిస్తుంది. నిస్సందేహంగా, ఈ రోజు మనం జీవిస్తున్న ప్రపంచాన్ని తీర్చిదిద్దడంలో పుస్తకాల పాత్ర అమోఘం. రాతియుగం నుండి నేటి జనరేటివ్ ఏఐ యుగం వరకు మనల్ని నడిపించింది పుస్తకం. ఇది మన నాగరికత, శాస్త్రీయ పురోగతికి పునాది వేసినది.అయితే నేడు పుస్తకాలు అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. పుస్తకాలను నగరాల్లోని ప్రధాన రహదారుల ఫుట్పాత్లపై అమ్మడం తెలిసిందే. కానీ పాదరక్షలను ఎయిర్ కండిషన్డ్ షోరూమ్లలో ఉంచి అమ్ముతున్నారు. ఇది చేదు వాస్తవం అయినప్పటికీ, ఎవ్వరూ ఖండించలేని పచ్చి నిజం. విద్యాసంస్థలు దేవాలయాలు అయితే, గ్రంథాలయాలు సాక్షాత్తూ గర్భగుడులే. గర్భగుడిలో ఎవరు ఉంటారో మనందరికీ తెలుసు. అందువల్ల పుస్తకాలను గౌరవంగా ప్రార్థన గదిలో కాకపోయినా, పవిత్ర స్థలంలో ఉంచడం ద్వారా గౌరవించాలి. చదవండి: చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదనఈ మార్పు ఎలా జరిగింది అనే దానిపై మనం లోతుగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది నాగరికతా? సంస్కృతా?ఆధునికీకరణ పేరుతో, మనం స్నానపు గదిలో వంట చేయలేము; వంట గదిలో స్నానం చేయలేము అనే కఠినమైన వాస్తవికతను అర్థం చేసుకోవాలి. ఈ కార్యకలా పాలన్నీ ఇంట్లో వాటికి కేటాయించిన ప్రదేశాలలో జరగాలి. విలాసాలు, వినోదాల కోసం వేల రూపాయలు ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు కానీ వంద రూపాయలు ఖర్చుచేసి ఒక పుస్తకం కొనడానికి సంకోచిస్తున్నాడు మనిషి. పుస్తకాలకు (జ్ఞానానికి) మళ్ళీ తగిన స్థానం కల్పించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలి. లేదంటే భవిష్యత్తు తరాలు మనల్ని ‘విద్యావంతులైన మూర్ఖులు’గా చరిత్ర పుటల్లో గుర్తుంచుకుంటాయి.– రెడ్డి శేఖర్ రెడ్డి గుడిశ ఇంగ్లిష్ అసోసియేట్ ప్రొఫెసర్, క్రైస్ట్ యూనివర్సిటీ, బెంగళూరు -
చరిత్ర సృష్టించిన కుట్ర కేసు!
1969 డిసెంబర్ 19వ తేదీన మద్రాసులోని అన్నా నగర్లోని ఒక ఇంటిలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ విప్లవ కారుల రాష్ట్ర కమిటీ సమావేశం రహస్యంగా జరుగుతున్న మొదటి రోజున పోలీసులు దాడిచేసి కొందరు నాయకులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో దేవులపల్లి వెంకటేశ్వరరావు (డీవీ), తరిమెల నాగిరెడ్డి (టీఎన్) తదితరులు ఉన్నారు. చండ్ర పుల్లారెడ్డి అనుకున్న సమయానికి రాని కారణంగా అరెస్టు కాలేదు. సమావేశానికి హాజరైన నాయకులతో పాటు మరి కొంతమంది ముఖ్య నాయకులను కలిపి మొత్తం 68 మందిపై ఆనాడు కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం స్వతంత్ర భారత చరిత్రలో రాజకీయ ప్రేరేపితమైన తొలి కుట్ర కేసును బనాయించింది. దానికి ప్రభుత్వం పెట్టిన పేరు ‘హైదరాబాదు కుట్ర కేసు’. అయితే అది జనంలో ‘నాగిరెడ్డి కుట్ర కేసు’గా బహుళ ప్రచారం పొందింది. దీనికి ముఖ్య కారణం వీరిపై పెట్టిన కేసును డీవీ, టీఎన్లు స్వయంగా వాదించి సంచలనం సృష్టించడం. 1969 ఏప్రిల్ నెలలో కృష్ణా జిల్లా అట్లప్రగడలో రహస్యంగా జరిగిన రాష్ట్ర ప్లీనంలో ఆమోదించిన ‘తక్షణ కార్యక్రమం’ డాక్యుమెంట్ ఆధారంగా ప్రభుత్వం ఈ కేసును బనాయించింది. జనతా ప్రజాతంత్ర విప్లవ దశలో కమ్యూనిస్టు విప్లవ కారుల వ్యూహం – ఎత్తుగడల స్థూల రూపమే ఈ తక్షణ కార్యక్రమం. ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విప్లవ కమ్యూనిస్టు కమిటీ ప్రకటించిన ‘తక్షణ కార్యక్రమం’ ఆధారంగా ఈ ప్రభుత్వాన్ని కూల్చటానికి వీరు కుట్ర పన్నినట్లు పేర్కొంది. 1970 జూన్లో ఈ కేసు విచారణ హైదరాబాద్ అదనపు సెషన్స్ జడ్జి కోర్టులో జరిగిన సందర్భంలో– డీవీ, టీఎన్లు ఈ ‘తక్షణ కార్యక్రమా’న్ని పూర్తిగా సమర్థిస్తూ తమ వాదనలను దృఢంగా వినిపించారు. ఈ కేసులో తమకు తీవ్రమైన శిక్షలు పడతాయని తెలిసి కూడా పార్టీ విధానాలను సమర్థించాలనే నిర్ణయం తీసుకుని కమ్యూనిస్టుల విప్లవసంప్రదాయాలకు పట్టం కట్టారు. కోర్టులో 48 మంది ముద్దాయిలను విచారించి 18 మందికి నాలుగు సంవత్సరాల మూడు నెలల కఠిన కారాగార శిక్ష విధించారు. హైకోర్టు కూడా ఈ శిక్షలను నిర్ధారించింది. 1972 మే నెలలో కఠోరమైన బెయిల్ కండిష¯Œ ్సపై జైలులో ఉన్న నాయకులు బయటకు వచ్చారు. 1975 జూన్ 25వ తేదీన ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించడంతో డీవీ, టీఎన్లతో సహా కుట్రకేసులో ఉన్న ముఖ్య నాయకులంతా రహస్య జీవితానికి వెళ్లిపోయారు.డీవీ, టీఎన్ ఈ కుట్రకేసులో జైల్లో ఉన్న కాలంలో జైలును ఒక అధ్యయన కేంద్రంగా మార్చుకున్నారు. ‘కమ్యూనిస్టు విప్లవకారుల వ్యూహం – ఎత్తుగడలు’ అన్న స్టేట్మెంట్ను కేసులో ఉన్న అందరి తరఫున తయారుచేసి, విచారణ సందర్భంగా డీవీ వివరించారు. ఈ ప్రకటన ‘డీవీ స్టేట్మెంట్’గా ప్రచారం పొందింది. జైలు జీవితంలో ఉన్న టీఎన్ ‘తాకట్టులో భారతదేశం’ పేరుతో తగిన గణాంక వివరాలతో సమకాలీన ఆర్థిక రాజకీయ పరిణామాలను ‘తక్షణ కార్యక్రమా’నికి అన్వయించి రాసి... స్టేట్మెంట్ రూపంలో కోర్టులో రెండు గంట లపాటు ఎంతో శక్తిమంతంగా వివరించారు.డీవీ, టీఎన్ కోర్టును తమ రాజకీయాల ప్రచార వేదికగా చేసుకున్న ఫలితంగా ఈ స్టేట్మెంట్లు కొత్త ఒరవడిని సృష్టించాయి. వారు ఇచ్చిన స్టేట్మెంట్లలో ముఖ్యమైనవి: ‘సాయుధ పోరాటాలు జరగకుండా ప్రజాస్వామిక పద్ధతుల్లో భూసంస్కరణలు అమలు జరగటం అసంభవం’, ‘వర్గపోరాటం, ప్రజల సాయుధ విప్లవం ద్వారా పాలకవర్గాన్ని కూలదోయటం తప్పనిసరిగా జరుగుతాయి’, ‘కమ్యూనిస్టు విప్లవకారులమైన మేము ప్రజాయుద్ధ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాం’, ‘మా విప్లవ పంథా రివిజనిస్టుల పార్లమెంటరీ పంథాకు పూర్తిగా భిన్నమైనది, మా పం«థాను గురించి మా తక్షణ కార్యక్రమంలో ప్రకటించాం.’ ప్రభుత్వం కుట్ర కేసు ద్వారా విప్లవకారులపై ఏవైతే ఆరోపణలు చేసిందో... వాటిని అంగీకరిస్తూ కోర్టులో స్టేట్మెంట్లు ఇచ్చి విప్లవకారుల ప్రతిష్టను ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు పెంచారు వీరు. డీవీ 1984 జూలై 12న చనిపోగా, టీఎన్ ఎమర్జెన్సీకాలంలో రహస్యంగా ఉంటూ అనారోగ్యంతో హైదరాబాదు ఉస్మానియా ఆసుపత్రిలో 1976 జూలై 28న చనిపోయారు. అలా వీరు జూలై మాసంలోనే అమరులవ్వడం యాదృచ్ఛికమే అయినా ఆసక్తిదాయకం. వారికి విప్లవాభివందనాలు.– ముప్పాళ్ళ భార్గవ శ్రీ సీపీఐ ఎంఎల్ నాయకులు(రేపు కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి వర్ధంతి) -
కష్టాలున్నాయని కుమిలిపోలే..జీవిత పట్టా కుట్టుకుంది!
ఆమె తన కుల వృత్తి అయిన చెప్పులు కుడుతూనే... పుస్తకాలు పట్టుకుని జీవితంలోని చిరుగులను కుట్టుకుంది. అమ్మకు ఆసరాగా బీడీలు చుడుతూనే... తెలంగాణ యూనివర్సిటీ లో ఇంటిగ్రేటెడ్ కోర్సులతో డిగ్రీ, పీజీ చదివింది. విదార్థి నాయకురాలిగానూ అనేక ఉద్యమాల్లో పాల్గొంది. బీఈడీ అయ్యాక బీడీ కార్మికుల బతుకులపై పీహెచ్డీ చేసి ఇటీవల తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా పట్టా అందుకుని ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఆమే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన సిద్ధలక్ష్మి.కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన మోచి వెంకటయ్య, నాగమణి దంపతులకు ఇద్దరు పిల్లలు. పిల్లలిద్దరు చిన్న వయసులో ఉన్నపుడే తండ్రి మరణించాడు. తల్లి నాగమణి ఓ వైపు బీడీలు చుడుతూ మరోవైపు చెప్పులు కుడుతూ పిల్లల్ని చదివించింది. కూతురు సిద్ధలక్ష్మి ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు, అక్కడే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసింది. చదువుకునే సమయంలో సిద్దలక్ష్మి బీడీలు చుట్టడంతో పాటు కులవృత్తి కూడా చేసేది. పొద్దున, సాయంత్రం చెప్పుల దుకాణంలో తల్లితో పాటు కూర్చునేది. చెప్పులు కుట్టడం, అమ్మడంలో సాయపడేది. ఇంటర్ పూర్తయిన తరువాత తెలంగాణ యూనివర్సిటీలో ఐదేళ్ల డిగ్రీ, పీజీ (ఇంటిగ్రేటెడ్) కోర్సుకు సంబంధించిన ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణురాలై సీటు సాధించింది. దీంతో యూనివర్సిటీలో అడుగుపెట్టిన సిద్ధలక్ష్మి చదువుకుంటూనే విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొంది. పీడీఎస్యూ లో క్రియాశీలకంగా పనిచేసింది. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలోనూ చురుకుగా పాల్గొంది.ఉద్యమాల్లోపాల్గొంటూనే సిద్ధలక్ష్మి డిగ్రీ, పీజీ పూర్తి చేసింది. బీఈడీ చదువు కోసం మహబూబ్నగర్ వెళ్లింది. తరువాత ఉద్యమ సహచరుడు కన్నయ్యను వివాహమాడింది. ఆమెకు ముగ్గురు కుమారులు.బీడీ కార్మికుల బతుకులపై పరిశోధన...తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వ్యవసాయం తరువాత ఎక్కువ మంది ఆధారపడే బీడీ రంగంలో కార్మికుల ఆదాయం.. ఖర్చులు అన్న అంశంపై సిద్ధలక్ష్మి పరిశోధన పత్రం సమర్పించింది. ఇటీవల తెలంగాణ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా అందుకుంది. కాగా ఫెలోషిప్ ద్వారా తనకు నెలనెలా అందిన డబ్బులను పొదుపు చేసి ఎల్లారెడ్డిలో ఇల్లు నిర్మించుకుంది. బాన్సువాడలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీగా పని చేసింది. కష్టపడి పరిశోధన చేసి పీహెచ్డీ పట్టా అందుకుంది. అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఇదీ చదవండి: కుటుంబం తొలుత ఒప్పుకోకపోయినా..నిలిచి గెలిచిన ప్రేమికులు! కష్టాలను దిగమింగానుమాది పేద కుటుంబం. అమ్మ ఎంతో కష్టపడి చదివించింది. మా మేనత్త చదువుకోమని ప్రోత్సహించింది. అమ్మకు ఆసరాగా చెప్పులు కుట్టడం, బీడీలు చుట్టడం చేస్తూనే చదువుకు కూడా సమయం కేటాయించేదాన్ని. యూనివర్సిటీలో చాలామంది ప్రోత్సహించారు. చిన్నప్పుడు బీడీ కార్మికుల కష్టాలను స్వయంగా చూశాను కాబట్టి బీడీ కార్మికులనే సబ్జెక్టుగా తీసుకుని పీహెచ్డీ చేశాను. డాక్టర్ పాత నాగరాజు సార్ నా పీహెచ్డీకి గైడ్గా ఎంతో ప్రోత్సహించి నా పరిశోధనకు సహకరించారు. కష్టాలున్నాయని కుమిలిపోతే ఇక్కడిదాకా రాకపోయేదాన్ని. కష్టాలను ఎదుర్కొనడంలోనే సక్సెస్ ఉంటుందని స్వయంగా తెలుసు కున్నాను. – డాక్టర్ సిద్ధలక్ష్మి, ఎల్లారెడ్డిఇదీ చదవండి: చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదన– ఎస్.వేణుగోపాలాచారి, సాక్షి ప్రతినిధి, కామారెడ్డి -
శ్రీరాముని వైరాగ్యం
శ్రీరామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులు గురువు వశిష్ఠుని వద్ద విద్యాభ్యాసం పూర్తి చేశారు. గురుకులం నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాముడు తండ్రి అనుమతితో తమ్ముళ్లను వెంట బెట్టుకుని తీర్థయాత్రలకు వెళ్ళాడు. అనేక మున్యాశ్రమాలు, పుణ్య నదులు, దేవా లయాలు దర్శించి అయోధ్యకు చేరు కున్నాడు. ఆ తర్వాత శ్రీరామునిలో గొప్ప మార్పు వచ్చింది. తోటి బాలురతో ఆడటం మానేశాడు. ఎవరితోనూ మాట్లాడడు. ఎప్పుడూ పద్మాసనంలో కూర్చుని, ఏదో దీర్ఘాలోచనలో ఉండేవాడు.అలా ఉండటానికి కారణం ఏమిటని తండ్రి దశరథుడు అనునయంగా ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పడు. దశరథుడు, వశిష్ఠునితో చర్చించాడు. ఆయన రాముని ‘ఈ విచిత్ర ప్రవర్తనకు కారణం ఏదో ఉండే ఉంటుంది. నెమ్మదిగా తెలుసుకోవాలి’ అంటాడు. ఆ సమయంలోనే విశ్వామిత్రుడు తన యజ్ఞ రక్షణకు రాముని పంపమని దశరథుని అడగటానికి వచ్చాడు. అప్పుడు రాముడు విశ్వామిత్రునితో సంభాషిస్తూ... తీర్థయాత్రల నుంచి వచ్చిన దగ్గర నుంచి తనలో ఒక విచారణ ఉత్పన్నమైనదనీ, ప్రాపంచిక విషయాల పట్ల తనలో అనాసక్తి ఏర్పడిందనీ, ధనాదులు, సంపదలు శాశ్వతానందాన్ని ఇవ్వక పోగా ఇంకా అజ్ఞానారణ్యం లోకి తోసి వేస్తున్నాయనీ చెబు తాడు. తామరాకు మీద నీటి బొట్టులా నిర్లిప్తంగా ఉండే మార్గం ఏదీ? అని అడుగుతాడు. శ్రీరామునిలో ఈ వైరాగ్యాన్ని చూసి అతడికి ఆత్మ విచారణ తత్వాన్ని బోధించమని వశిష్ఠునితో చెబుతాడు విశ్వామిత్రుడు.అప్పుడు ఒక సభా వేదికను ఏర్పాటు చేసి, వశిష్ఠుడు జ్ఞానయుక్త వైరాగ్యంతో కర్మ వైముఖ్యం పొందిన శ్రీరామునికి జ్ఞాన, కర్మలు రెండూ వేరు కావనీ, ఒకే పక్షికున్న రెండు రెక్కల వంటివనీ బోధించి కర్తవ్యోణ్ముఖుని చేయటానికి ప్రేరణాత్మక కథలనూ, ఆత్మ విచారణ తత్వాన్నీ బోధించాడు. ఈ కథల సారమే యోగవాశిష్ఠంగా ప్రఖ్యాతమైంది. – డా. చెంగల్వ రామలక్ష్మి -
విచిత్రమైన షరతు!
ఇండస్ట్రీకి ‘నో డేటింగ్’ కండిషన్ తో ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్. ఇప్పుడు టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ, అభిమానులు గుడి కట్టేంత ఫేమ్ సంపాదించుకుంది. ప్రస్తుతం మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉంది.నిధి నిజానికి హైదరాబాద్లోనే 1992 ఆగస్టు 17న పుట్టింది. చిన్నతనం కూడా అక్కడే గడిచింది. తర్వాత బెంగళూరులో చదువుకుంది. అందుకే హిందీతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో సునాయాసంగా మాట్లాడగలుగుతుంది.తన తొలి సినిమా ‘మైఖేల్ మున్నా’ కోసం, ఏ హీరోయిన్ ఒప్పుకోని షరతును అంగీకరించింది. సినిమాలో నటిస్తున్నంతవరకూ ఎవరితోనూ డేటింగ్ చేయరాదని ఒప్పందంలో క్లాజ్ పెట్టారు. ‘‘అప్పట్లో కెరీర్ కావాలి, డబ్బులు అవసరం. కాబట్టి సరేనన్నాను’’ అని నవ్వుతూ చెబుతుంది నిధి.తెలుగులో ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్ అయింది. కాని తమిళంలో శింబు, ఉదయనిధి స్టాలిన్, జయం రవిలతో చేసిన సినిమాలు అంతగా ఆడలేదు. ప్రస్తుతం పవన్ కల్యాణ్తో ‘హరిహర వీరమల్లు’, ప్రభాస్తో ‘రాజాసాబ్’ సినిమాలపై చాలా ఆశలు పెట్టుకుంది.పూజా హెగ్డే తర్వాత, నాగ చైతన్య, అఖిల్– అన్నదమ్ములు ఇద్దరితోనూ నటించే అవకాశం దక్కించుకున్న హీరోయిన్ నిధి.ఫిబ్రవరి 14, వాలెంటైన్ ్స డే రోజున తమిళనాడులో అభిమానులు ఆమె విగ్రహానికి పాలతో అభిషేకం చేసి, గుడి కట్టినట్టు వార్తలు, ఫొటోలు వెలుగులోకి రావడం చూసి, షాక్ అయిందట!హైదరాబాద్లోని బషీర్బాగ్లో నిధి అమ్మమ్మ వాళ్ల ఇల్లు ఉంది. ‘హైదరాబాద్ మించిన ఫన్ ప్లేస్ ప్రపంచంలో లేదనిపిస్తుంది’ అని అంటుంది నిధి. అంతేకాదు, నగరంలో దాదాపు 15 వేల మంది బంధువులు ఉన్నారట!బెంగళూరులో చదువుకునేటప్పటి నుంచే హీరోయిన్ కావాలనే కోరిక. కాని, ఇండస్ట్రీలో పరిచయాలు లేకపోవడంతో ఫేస్బుక్లో అందమైన ఫోటోలు పెడుతూ, ఎవరైనా దర్శకుడు కాంటాక్ట్ చేస్తాడేమో అని ఎదురు చూసేది. ఆ ఆశే ఆమెను మోడలింగ్, అందాల పోటీల వైపు తీసుకెళ్లింది. తర్వాత హీరోయిన్ గా మారింది.కాలేజీలో ఓ అబ్బాయి ‘నీవు చాలా అందంగా ఉన్నావు’ అన్నాడు. వెంటనే చేతిలో ఉన్న యాపిల్ అతని మీదకు విసిరి, ‘నన్ను అంత మాట అంటావా!’ అంటూ అరిచిందట! ఇప్పుడు అభిమానులు పొగుడుతున్నప్పుడు ఆ సంఘటన గుర్తొచ్చి నవ్వుకుంటుందట! -
అడవుల కోసం అలుపెరుగని పోరాటం
‘ఈ భూమికి, అమెజాన్ వర్షారణ్యాలు ఊపిరితిత్తుల వంటివి. అవి నాశనం అవ్వడం మొదలైతే ప్రపంచమే ప్రమాదంలో పడుతుంది’ అని పర్యావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే ఎన్నోసార్లు హెచ్చరించారు. నిజానికి అమెజాన్ వర్షారణ్యాలు ప్రపంచ వాతావరణాన్ని నియంత్రించడంలో, జీవవైవిధ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, అడవుల నరికివేత, అక్రమ గనుల తవ్వకాలు, వ్యవసాయ విస్తరణ, పట్టణీకరణ వంటి ఎన్నో కారణాలతో ఈ అటవీ ప్రాంతాలు వేగంగా అంతరించిపోతూ వస్తున్నాయి. దీని ఫలితంగా వాతావరణ మార్పులు, జీవజాతులు అంతరించిపోవడం వంటి తీవ్ర పరిణామాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెజాన్ ఆదిమవాసీ బృందం– ఈ వర్షారణ్యాల సంరక్షణ కోసం బ్రిటన్ లో పర్యటించారు. ఈ బృందంలో ‘ఆషానింకా’ జాతి ప్రతినిధి ఒకోషో, అలెగ్జాండ్రినా పియాకోతో పాటు ‘గువారానీ’ అనే మరో ఆదిమజాతి ప్రతినిధి ‘జులియానా కెరెక్సు మిరిమ్’ ప్రత్యేకంగా నిలిచారు. ఈ పర్యటనలో అషానింకా, గువారానీ కమ్యూనిటీల ప్రతినిధులు– బ్రిటన్ కి చెందిన వుడ్లాండ్ ట్రస్ట్ సిబ్బందిని కలిశారు. యునైటెడ్ కింగ్డమ్లోని డెవాన్ లో డార్ట్ వ్యాలీలోని అరుదైన అటవీ ప్రాంత పునరుద్ధరణకు నిధులు సమకూర్చడానికి, వుడ్లాండ్ ట్రస్ట్కి మద్దతు పలికారు. ఆదిమ బృందంతో వుడ్లాండ్ సిబ్బంది కలిసి డార్ట్ వ్యాలీలోని బక్లండ్ వుడ్లోని 247 ఎకరాల పునరుద్ధరణకు 28 లక్షల పౌండ్లు (రూ.32.19 కోట్లు) అవసరమనే విజ్ఞప్తిని గట్టిగా వినిపించారు. ఈ క్రమంలోనే ఆదిమవాసులు– తమ అమెజాన్ వర్షారణ్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను, రాబోయే ప్రమాదాలను ప్రపంచానికి వినిపించే ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగా ఈ బృందం–బ్రిటన్ లోని పర్యావరణ సంస్థల ప్రతినిధులు ఎందరినో కలిశారు. వర్షారణ్యాల సంరక్షణకు అంతర్జాతీయ మద్దతును కూడగట్టుకోవడమే తమ లక్ష్యమని ప్రకటించారు. అందులో భాగంగా పలువురు పర్యావరణ అధికారులతో పాటు ఎందరో శాస్త్రవేత్తలను కూడా కలుసుకుని అమెజాన్ అడవుల పునరుద్ధరణ జరగకుంటే రాబోయే సమస్య తీవ్రతను చర్చించారు. అమెజాన్ ఆదిమ బృందం చేపట్టిన ఈ ఖండాంతర పర్యటన యావత్ ప్రపంచాన్ని కదిలిస్తోంది. వర్షారణ్యాలను రక్షించాలన్న ఆశే, తమ ప్రధాన ఉద్దేశమని వారు వెల్లడించారు. వర్షారణ్యాలు నాశనం కావడంతో ఏర్పడుతున్న పలు సమస్యల గురించి ఈ బృందం హెచ్చరించింది. అషానింకాకు చెందిన నాయకురాలు అలెగ్జాండ్రినా పియాకో మాట్లాడుతూ– ‘భూమిని, అడవులను పునరుద్ధరించడం అనేది ప్రకృతితో ప్రజల సంబంధాలను పునరుద్ధరించడంతో పాటు జరగాలి’ అని నొక్కి చెప్పారు. ఆ లోతైన సంబంధం లేకుంటే, ఏ పర్యావరణ ఉద్యమం కూడా విజయవంతం కాదని ఆమె హెచ్చరించారు.వుడ్లాండ్ ట్రస్ట్కి సంబంధించిన రెయిన్ ఫారెస్ట్ రికవరీ ప్రాజెక్ట్ ఆఫీసర్ సామ్ మానింగ్ ఈ ఆదిమవాసులు బ్రిటన్ను సందర్శించి తనను కలిసిన రోజు గురించి చెబుతూ, ‘ఒక అటవీ సంరక్షణాధికారిగా, ఈ రోజు నా జీవితంలో అత్యంత భావోద్వేగంతో కూడిన రోజులలో ఒకటి. గువారానీ, అషానింకాల జ్ఞానం నన్ను చాలా కదిలించింది. వారితో చర్చ చాలా స్ఫూర్తిదాయకమైనది’ అని తెలిపారు.‘అమెజాన్ అడవులు ప్రమాదంలో పడటం అంటే ప్రపంచం ప్రమాదంలో పడటమే! ప్రకృతిని పునరుద్ధరించడం అంత సులభం కాదు. ఇది తొలి అడుగు, అలాగే మేలి అడుగు. ఇది సమష్టి పోరాటం. అందుకే ప్రపంచదేశాల మద్దతుని కోరుతున్నాం’ అని ఈ ఆదిమ బృందం ప్రపంచానికి పిలుపునిచ్చింది.ఈ పర్యటన ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు, వర్షారణ్యాల పునరుద్ధరణకు ఎంత ప్రాధాన్యం ఉందో తెలియజేస్తుంది. ఇలాంటి అంతర్జాతీయ పర్యటనలు, చర్చలు, చర్యలు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఇప్పటికే ఈ అమెజాన్ స్థానికులు, నాయకులు వర్షారణ్యాల సంరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో, అంతర్జాతీయ వేదికల్లో తమ వాదనను వినిపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే! -
ఈ వారం కథ: పరదేశి
ఎప్పుడూ అతని గదిలో నుండి నాకు ‘ఆజారే...’ అంటూ లత మధురగానం వినిపిస్తూ ఉంటుంది. ‘మధుమతి’ చిత్రంలోని పాటలన్నీ అదేపనిగా వస్తూ ఉంటాయి. అతనికా పాటలు అంత ఇష్టమైతే కావచ్చు కాని, ఎప్పుడూ అవే పాటలు వింటూ ఉండటం నాకెంతో ఆశ్చర్యంగా ఉంటుంది. మరో పాట విని ఎరుగను. అతని దగ్గర వున్నది అదొక్కటే క్యాసెట్ కాబోలు!ఉదయం ఏడు గంటలకు వెళ్ళిపోతాడు హడావుడిగా.మళ్ళా రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో వస్తాడు. ‘మధుమతి’ పాటలు వినిపించాయంటే, అతను వచ్చినట్లే!సుమారు ఓ అరగంట వరకూ ఆ చిత్రంలోని పాటలు వినిపిస్తుంటాయి. అవి వినడం నాకూ అలవాటయిపోయింది.ఓ రోజు ఉదయం అతను వెళ్లే టైమ్కి నేను మా గుమ్మంలో నిలబడ్డాను. సైకిల్ మీద వెళుతున్నాడు. ఇరవై ఐదేళ్లు వుంటాయేమో?బక్కపలచగా, తెల్లగా వున్నాడు. ఊరు చివర ఏదో ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడట!మా ఇంటి పక్క పోర్షన్లో రిటైర్డ్ మాస్టారు వుంటారు. అందులో ఒక గది ఆ అబ్బాయికి అద్దెకు ఇచ్చారు. అది మా వంటింటికి, పెరటి ఖాళీ స్థలానికి దగ్గరగా ఉంటుంది. మధ్యలో ప్రహరీ గోడ ఉన్నప్పటికీ అతని గది కిటికీలు కనిపిస్తూ ఉంటాయి.ఇంటర్లో ఫెయిల్ అయిన సబ్జెక్ట్కి ప్రిపేర్ అవుతుండేదాన్ని. రోజంతా ఇంట్లో ఉండటం బోర్గా ఫీల్ అవుతున్న సమయంలో ఆ ఎదురింటి అబ్బాయిని గమనిస్తూ వుండటం నిజానికి మంచి కాలక్షేపం !మా ఇంట్లో నాన్నగారు రిటైర్ అయి మూడేళ్లు కావస్తోంది. అన్నయ్య పేపర్ మిల్స్లో పని చేస్తాడు. అక్క పెళ్లికి రెడీగా ఉంది.కాస్త నల్లగా, సన్నగా ఉండటం వల్లనేమో? అక్కని చూడటానికి వచ్చిన వాళ్ళు ఓకే అనడం లేదు. రెండో పిల్ల అయితే సరే అన్నారు ఒకరు. ‘పెద్ద అమ్మాయికి కాకుండా రెండో అమ్మాయికి చెయ్యం’ అని ఇంట్లోవాళ్లు గట్టిగా చెప్పడమే కాకుండా, అప్పటి నుంచి పెళ్లి చూపులకు ఎవరైనా వస్తే, నన్ను కనబడనీయకుండా దాచేసేవాళ్ళు.ఆ విధంగా ఒకరోజు సాయంకాలం నేను మా డాబా మెట్ల మీద కూర్చోవలసి వచ్చింది. చీకటి కూడా పడింది. పెళ్లి చూపుల కార్యక్రమం ఇంకా అయినట్లు లేదు. ఒక్కర్తినే ఏమీ తోచక అలా ఆలోచిస్తూ కూర్చున్నాను.ఇంతలో పక్కింటి రూమ్లో లైటు వెలిగింది.అతను తొందరగా వచ్చినట్లు వున్నాడు. కిటికీ తలుపు తెరిచాడు.టేప్ రికార్డర్ ఆన్ చేశాడు.‘ఆజారే పరదేశీ...’ లత తీయని గొంతు వినిపిస్తోంది.చీకటిలో డాబా మీద ఉన్న నేను అతనికి కనబడే అవకాశం లేదు. అతను మాత్రం కాస్తంత మాసిన బనీను, లుంగీతో స్పష్టంగా కనిపిస్తున్నాడు.గది మూల కిరోసిన్ స్టవ్ వెలిగించాడు. ఓ గిన్నెలో బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టాడు. ఇంకోపక్క ఓ పళ్ళెంలో ఉల్లిపాయలు, పచ్చిమిరప ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాడు. కోడిగుడ్డు కూడా ఆ పక్కనే కనిపిస్తోంది.ఆమ్లెట్ వేసుకుంటాడేమో?‘రమణీ... రమణీ’ అమ్మ కేక వినిపించింది.‘ఆ... వస్తున్నా’ అంటూ మెట్లు దిగుతుంటే, అతను కిటికీలోంచి నన్ను చూశాడు. చీకటిలో నా ఆకారం అతను గుర్తించినట్లే ఉంది. ఉదయం తొమ్మిది గంటలకు రూమ్ తాళం వేసి, సైకిల్ తీస్తూ గుమ్మంలో నిలుచున్న నన్ను తలెత్తి చూశాడు.అతను ఈ నాలుగు మాసాలలో నన్ను చూడటం అదే మొదటిసారి.అప్పటి నుంచి రోజూ ఉదయం అదే టైమ్కి ఒకరినొకరు చూసుకోవడం ఒక దినచర్యలా మారింది.నేను రోజూ ఉదయం గుమ్మంలో నిలబడటం ఇంట్లో ఎవైనా గమనిస్తారేమో అనే భయం లేకపోలేదు.ఒకసారి అమ్మ అంది ‘మన కులమే అయితే ఆ అబ్బాయిని రమణికి అడిగితే?’నాన్న అన్నారు ‘పెద్దమ్మాయికి పెళ్లి అయ్యాక కనుక్కుందాం’పుస్తకం చదువుకుంటూ ఆ మాటలు విన్న నాకు ఏదోలా అయ్యింది.కాని, మొన్న వచ్చిన సంబంధం వాళ్ళు ఏ కబురూ చేయలేదు.ఆరోజు సాయంకాలం నాలుగు గంటలకే ఆ అబ్బాయి రావడం నాకు ఆశ్చర్యం కలిగించింది.నేను కిటికీలోంచి చూస్తున్నాను.అరగంట తరువాత బ్యాగ్ పట్టుకుని రూమ్ తాళాలు వేసి, మాస్టారు గారింటికి వెళ్లి ‘మా ఊరు వెళుతున్నాను. చెల్లి పెళ్లి. వారం తరువాత వస్తాను’ అంటూ చెప్పడం వినిపించింది. అతను బయలుదేరి మా ఇల్లు దాటే సరికి, గబుక్కున గుమ్మంలోకి వచ్చి నిలబడ్డాను.నన్ను చూసి చిన్న నవ్వు నవ్వాడు.అదే మొదటిసారి అతను నన్ను చూసి నవ్వడం.నేనూ గబుక్కున నవ్వేసి చేయి ఊపాను.అతను ఊరు వెళ్ళాక, మూసివున్న గది తలుపులు చూస్తుంటే నాలో ఏదో అదోలాంటి దిగులులా అనిపిస్తోంది.ఈలోగా అన్నయ్యకు ఓ సంబంధం వచ్చింది.అమ్మాయి నచ్చింది. ఆ అమ్మాయి పినతండ్రి కొడుకు అక్కను చేసుకోవడానికి ఇష్టపడటంతో, కట్నకానుకల సమస్య పెద్దగా లేకపోవడంతో ఒకేసారి రెండు పెళ్లిళ్లు కుదిరిపోయాయి.వచ్ఛే నెలలో ముహూర్తాలు నిర్ణయించారు.నాలో ఏదో తెలియని ఉత్సాహం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూ అతని కోసం అదేపనిగా ఎదురు చూసేలా చేస్తోంది.పది రోజులు గడిచాయి.ఆరోజు ఉదయం అతని గది కిటికీ తలుపులు తెరిచి ఉండటంతో పాటు, లత తీయని గానం అతని రాకనుతెలియజేసింది.అతను మాస్టారు ఇంటికి వెళ్లి, తరువాత మా ఇంటికి వచ్చాడు. అతని చేతిలో స్వీట్ల కవరు ఉంది.నాన్నగారు ‘రా బాబూ ...కూర్చో’ అన్నారు.‘చెల్లి పెళ్లి...’ అంటూ స్వీట్లు అందించాడు.‘రమణీ...’కర్టెన్ వెనుక నిలబడిన నేను వెంటనే ‘నాన్నగారూ’ అంటూ వచ్చాను.‘మంచినీళ్లు తీసుకురామ్మా’ అన్నారు స్వీట్ల కవరు నా చేతికిస్తూ.నేను లోనికి వెళ్లి గ్లాసుతో నీళ్లు తెచ్చాను.అతను నా వైపు చూడకుండానే, చేతి వేళ్ళు తగలకుండా గ్లాసు అందుకున్నాడు.నాన్నగారు ‘మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? ప్రస్తుతం చేస్తున్న జాబ్ ఏమిటి? గోత్రం ఏమిటి? శాఖ ఏమిటి?’ వివరాలు అడుగుతున్నారు.అతడు మా కులం కాదని అప్పుడే తెలిసింది.నేను అక్కడి నుంచి వచ్చేశాను. మా ఇంట్లో పెళ్ళి హడావుడి మొదలయ్యింది. అంత హడావుడిలో కూడా ఉదయం చిరునవ్వుతో విష్ చేసుకోవడం, రాత్రి చేతి సైగతో గుడ్ నైట్ చెప్పుకోవడం ఎవరూ గమనించకుండా జరిగిపోతూనే వుంది. ఇద్దరికీ మొదటిసారి మాట్లాడుకునే అవకాశం అన్నయ్య, అక్క పెళ్లిలో వచ్చింది.చేతిలో గిఫ్ట్ ప్యాకెట్తో కల్యాణ మండపం దగ్గర నిలబడ్డాడు. నేను చిరునవ్వుతో పలకరించాను. నాన్నగారు అంత హడావుడిలో కూడా అతడిని గమనించి ‘రా...బాబూ’ అని పిలిచి, గిఫ్ట్ అందుకుని ‘భోజనం చేసి వెళ్ళు బాబూ’ అంటూ నా వైపు చూశారు.‘రండి’ అంటూ అతడిని భోజనాల దగ్గరికి తీసుకెళ్ళాను.మేము ఇద్దరం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అదే మొదటిసారి.‘మీకు మధుమతి పాటలంటే అంత ఇష్టమా?’‘అవును... మా అమ్మ ఎప్పుడూ వినే పాటలవి. ఇప్పుడు అమ్మ లేదు. నాకు ఆ పాటలు మాత్రం అమ్మ గుర్తుగా మిగిలిపోయాయి’నాకెంతో కుతూహలం కలిగింది. కాని, అక్కడ అంతకన్నా ఎక్కువ మాట్లాడే అవకాశం లేదు మరి .అతని కళ్ళల్లో లీలగా తడి...పెళ్లి హడావుడి అయిన వారం రోజులకు ఒక రోజు తెగించి చిన్న కాగితం మీద ‘సంగీతం కళాశాల దగ్గర ఈ ఆదివారం కలుద్దాం’ అని రాసి, ఖాళీ అగ్గిపెట్టెలో పెట్టి అతని గది కిటికీలో పడేశాను.నిజంగా నా దైర్యానికి నాకే ఆశ్చర్యం వేసింది.ఇంటి దగ్గర మాట్లాడుకునే అవకాశమే లేదు.నేను సాయంకాలం నాలుగు గంటలకు కళాశాల గేటు దగ్గర నిలబడ్డాను. ఆదివారం కావడం వలన అక్కడ ఎవరూ లేరు. లోపల ఎవరో ఒకరిద్దరు కనిపిస్తున్నారు.ఇంతలో సైకిల్ మీద వస్తూ అతను... నా గుండె వేగంగా కొట్టుకోసాగింది. అతను కూడా కొంచెం టెన్షన్గా కనిపిస్తున్నాడు.సైకిల్ స్టాండ్ వేసి నిలబడ్డాడు.ఎవరో ఒకాయన మమ్మల్ని కుతూహలంగా చూస్తూ ఆ దారంట వెళ్ళాడు.‘ఇంటి దగ్గర ాట్లాడటం కుదరదు’ అన్నాను.‘ఇక్కడ ఇలా రోడ్ పక్కన... నాకెందుకో బాగులేదు’ అన్నాడతను.‘అవును’ అన్నాను.జేబులోంచి ఒక కాగితం తీసి ఇచ్చాడు.నా మొహంలోకి చూశాడు. సాయంకాలపు నీరెండ.ఇద్దరి కళ్ళూ కలిసి మళ్లీ విడిపోయాయి. దస్తూరి బావుంది.ఒకే వాక్యం. ఈ శనివారం లక్మీ థియేటర్లో మార్నింగ్ షో.ఇంట్లో ఎవరూ చూడకుండా ఆ కాగితాన్ని ఎన్నిసార్లు చదివానో!శనివారం వచ్చింది. సినిమా హాలులో కలిశాం. మాకోసమే అన్నట్లు హాలు ఖాళీగా ఉంది. ‘శంకరాభరణం’ సినిమా విడుదల అయిన రెండోరోజో... మూడో రోజో!ఒకరి గురించి ఒకరు తెలుసుకునే అవకాశం కుదిరిన రోజది. నెమ్మదిగా మాట్లాడుకున్నాం. ఆ చిత్రంలోని పాటలు మమ్మల్ని మౌనంగా ఉండేలా చేశాయి. స్నేహపూర్వకంగా ఒకరి చేయి ఒకరు తాకిన రోజు. మేము మరిచిపోలేని రోజు కూడా!రోజూ ఎవరూ చూడకుండా పరస్పరం విష్ చేసుకోవడం, రాత్రి గుడ్ నైట్ చెప్పుకోవడం మామూలుగానే గడిచిపోతోంది.అతను బిజీ అయిపోయాడు. తొందరగా వెళ్లడం, లేటుగా రావడం, ఆదివారాలు కూడా హడావుడిగా వెళ్లిపోవడం...నేను మా వదినగారి బుల్లి టేప్ రికార్డర్లో ‘శంకరాభరణం’ పాటలు వినడం... అలా మూడు నెలలు గడిచిపోయాయి.ఓరోజు అతను కిటికీలో నుండి అగ్గిపెట్టె చూపించి, సందులో పడేశాడు.‘రేపు ఉదయం కలుద్దాం. మార్నింగ్ షో’ అని రాసి ఉంది.అదే హాలు. అదే సినిమా. నూరవరోజుకి దగ్గరగా ఉండటంతో జనాలు కాస్తంత పలచగానే వున్నారు.హాలులో మాకు మాట్లాడుకోవడానికి వీలుగా ఉన్న సీట్లలో కూర్చున్నాం.‘నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది’ చెప్పాడు.‘కంగ్రాట్స్’ అన్నాను.‘ఢిల్లీ వెళ్లిపోతున్నాను’నాకు అర్థమైపోయింది. ఇక మేము విడిపోయే రోజు వచ్చేసింది.అతను నా చేతికి చిన్న వాచ్ ఇచ్చాడు.‘గుర్తుగా’ అన్నాడు.చాలాసేపు ఏం మాట్లాడుకోవాలో తెలియలేదు. తరువాత చాలా మాట్లాడుకున్నాం కాని, అంత వివరించడానికి ఏమీ లేదు.సినిమా ఆఖరి సన్నివేశం పూర్తి కాకుండానే వెళ్లిపోవడానికి లేచాం. నా చేయి అందుకుని ముద్దుపెట్టుకున్నాడు. బయటికి నడిచాం.అతను రూమ్ ఖాళీ చేసే రోజు వచ్చింది.ఆ రాత్రి వెళ్లిపోతున్నాడు.గుడ్ బై చెప్పే సమయం...నేను ఓ ప్యాకెట్ అతనికి చూపించి కిటికీ లోంచి పడేశాను. అందులో ‘శంకరాభరణం’ కేసెట్ ఉంది. అతను ఇచ్చిన వాచీ నా చేతికి గుర్తుగా కనిపిస్తోంది.‘ఈ వాచీ ఎక్కడిది?’ అని ఇంట్లో అడిగితే నా స్నేహితురాలు ఇంటర్ పాస్ అయ్యానని గిఫ్ట్గా ఇచ్చిందని చెప్పడానికి ఒక అబద్ధం రెడీగా ఉంచుకున్నాను.‘మధుమతి’ పాటలు నాకిప్పుడు వినబడవు. -
లౌకిక శాస్త్రాలూ మోక్షదాయకాలే!
ఒకానొకప్పుడు దేవగురువు బృహస్పతి శిల్పశాస్త్రం, వాస్తుశాస్త్రం, దండనీతి శాస్త్రం, కామశాస్త్రం వంటి లౌకిక శాస్త్రాలను సమగ్రంగా రచించాడు. యోగ్యులు, బుద్ధిమంతులు అయిన శిష్యులకు ఆ శాస్త్రాలను నేర్పించడం ప్రారంభించాడు. దేవగురువును దర్శించుకుందామని ఒకనాడు ఇంద్రుడు ఆయన ఆశ్రమానికి వచ్చాడు. శిష్యులకు ఆయన లౌకిక శాస్త్రాలను నేర్పిస్తుండటం గమనించి ఆశ్చర్యపోయాడు. గురువుకు పాదాభివందనం చేసి, ఆయన చూపిన ఆసనంపై కూర్చున్నాడు. పాఠం పూర్తయి, శిష్యులంతా వెళ్లిపోయే వరకు ఓపికగా ఉండి, ‘గురువర్యా! మీరేమీ అనుకోనంటే, నాదొక సందేహం. తత్త్వబాహ్యాలైన ఈ శాస్త్రాలను మీరు ఎందుకు రచించారు? మానవులను మరింతగా విషయవాంఛలలో ముంచడానికి తప్ప ఇవెందుకు పనికొస్తాయి? గురువర్యా! తమరేమి ఆశించి ఈ శాస్త్రాలను శిష్యులకు బోధిస్తున్నారో గాని, నాకిది సముచితంగా తోచడం లేదు. ఇందులో ఇంకేమైనా పరమార్థం ఉంటే, అది నేను తెలుసుకోదగినదే అయితే దయచేసి వివరించండి’ అన్నాడు ఇంద్రుడు.ఇంద్రుడి ప్రశ్నలోని ఆందోళనను గుర్తించాడు బృహస్పతి.చిన్నగా నవ్వుతూ, ‘ఇంద్రా! ఇందులోని తత్త్వరహస్యం ఏమిటనేదే కదా నీ సందేహం? చెబుతాను, విను’ అంటూ బృహస్పతి ఇలా చెప్పసాగాడు.‘నేను రచించి, శిష్యులకు బోధిస్తున్న ఈ శాస్త్రాలన్నీ తత్త్వరహస్యాలే, తత్త్వబోధలే! పారంపర్యంగా ఇవి తత్త్వప్రాప్తికి కావలసిన చిత్తశుద్ధిని కలిగిస్తాయి. నీ సందేహం తొలగిపోవడానికి నీకు సోదాహరణంగా చెబుతాను, శ్రద్ధగా విను. అంతా నీకే అవగతమవుతుంది. కాంపిల్య నగరంలో విధిజ్ఞుడు అనే శిల్పశాస్త్ర పండితుడు ఉండేవాడు. అతడు శిల్పశాస్త్రంలోనే కాకుండా వాస్తు, జ్యోతిష శాస్త్రాలలో విశేష ప్రతిభాసంపన్నుడు. చాలా నీతిమంతుడు. ఆ నగరంలో ఎవరు ఇల్లు కట్టుకోవాలనుకున్నా, అతడినే పిలిచేవారు. ఆ విధంగా అతడు విశేషంగా ధనం సంపాదించాడు. అతడిని ఆశ్రయించుకుని చాలామంది ఉపాధి పొందేవారు. వారికి శాస్త్రపరిజ్ఞానం లేదు. వారు విధిజ్ఞుడితో ఉంటూ అతడు చెప్పిన పనులు చేస్తూ, అతడు ఇచ్చే వేతనాలతో బతుకుతూ ఉండేవాళ్లు. తన విద్యతో పుష్కలంగా ధనం సంపాదించిన విధిజ్ఞుడు విరివిగా దానధర్మాలు చేసేవాడు. నగరంలో దేవతాపూజలను ఘనంగా జరిపించేవాడు. అలా నగరంలోని ప్రముఖులు మొదలుకొని సామాన్యుల వరకు అందరికీ ఇష్టుడయ్యాడు. అతడి పేరు ప్రఖ్యాతులు క్రమంగా పొరుగు రాజ్యాలకు పాకాయి. ఇతర దేశాల రాజులు కూడా విధిజ్ఞుడిని పిలిపించుకుని, అతడి సలహా సూచనలతో భవనాలు, తటాకాలు, దేవాలయాలు నిర్మింపజేసుకుని, అతడికి ఘనంగా పారితోషికం, కానుకలు ఇచ్చి పంపుతుండేవారు. ఆ ధనంతో విధిజ్ఞుడు మరింతగా దాన ధర్మాలు చేసేవాడు. శిల్ప వాస్తు జ్యోతిష శాస్త్రాలలో విశేష ఖ్యాతి పొందిన విధిజ్ఞుడు కొంతకాలానికి ఆయువుతీరి మరణించాడు. చేసిన పుణ్యకర్మల ఫలితంగా అతడు స్వర్గానికి చేరుకుని, అక్కడ సుఖాలను అనుభవించి, కొన్నాళ్లకు మళ్లీ జన్మించాడు.ఈసారి అతడు కాంపిల్య రాజవంశంలో జన్మించి, యుక్తవయసు వచ్చాక పట్టాభిషిక్తుడై రాజయ్యాడు. రాజుగా అతడు ప్రజారంజకమైన పాలన సాగించేవాడు. సాధు సజ్జనులను ఆదరించేవాడు. రాజ్యంలో అనేక దేవాలయాలను, వాపీ కూప తటాకాదులను నిర్మించి, రాజ్యం నిత్యం సుభిక్షంగా ఉండేలా చూసుకునేవాడు. అసంఖ్యాకంగా యజ్ఞ యాగాదులను నిర్వహించి, విప్రులకు విశేషంగా గోదానాలు, భూదానాలు చేసేవాడు. సుదీర్ఘకాలం రాజుగా పాలించి, పేరు ప్రఖ్యాతులు పొందిన తర్వాత కొన్నాళ్లకు తనువు చాలించాడు. రాజ జన్మలో చేసిన పుణకర్మల ఫలితంగా మళ్లీ స్వర్గానికి చేరుకుని, చాలాకాలం సుఖభోగాలను అనుభవించాడు. పుణ్యఫలం అంతరించాక కొన్నాళ్లకు మళ్లీ భూలోకంలో జన్మించాడు.ఈసారి అతడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రుల ఆలనపాలనలో బాల్యం హాయిగా గడిపాడు. ఉపనయనం తర్వాత బ్రహ్మచర్యాశ్రమం స్వీకరించి, గురుకులంలో చేరాడు. గురువుకు శుశ్రూష చేస్తూ, వేద వేదాంగాలను, సకల శాస్త్రాలను క్షుణ్ణంగా అభ్యసించాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత గురుకులవాసం ముగించి, ఇంటికి చేరుకున్నాడు. యోగ్యురాలైన కన్యను పెళ్లాడి గృహస్థాశ్రమం స్వీకరించాడు. గృహస్థాశ్రమంలో నిత్య నైమిత్తిక కార్యాలను నియమం తప్పక నెరవేరుస్తూ, అతిథి అభ్యాగతులను ఆదరించేవాడు. గొప్పగొప్ప వ్రతాలు, పూజలు చేసి, యోగిగా మారి వానప్రస్థం స్వీకరించాడు. వానప్రస్థంలో ఫల కందమూలాదులనే ఆహారంగా స్వీకరిస్తూ, రోజులో అధిక కాలం తపోనిష్ఠలోనే గడిపేవాడు. క్రమంగా సాధనలో పరిపక్వత సాధించి, చివరకు భవబంధాలను విడిచిపెట్టి, సన్యాసాశ్రమం స్వీకరించాడు. సన్యాసాశ్రమంలో కఠోర సాధన సాగిస్తూ, ఆత్మసాక్షాత్కారం పొంది, జీవన్ముక్తుడై, చివరకు విదేహ కైవల్యం సాధించాడు.ఇంద్రా! విన్నావు కదా! శిల్ప, వాస్తు, జ్యోతిష శాస్త్రాలు విధిజ్ఞుడికి వేర్వేరు జన్మలలో క్రమంగా ఉన్నతి పొందడానికి, చివరకు ముక్తిని పొందడానికి దోహదపడ్డాయి. లౌకిక శాస్త్రాలు మానవులను మాయలో ముంచేస్తాయని భయపడటం నిర్హేతుకం. లౌకిక శాస్త్రాలు మానవుల ఐహిక సుఖాలకే కాదు, ఆముష్మిక ఔన్నత్యానికి కూడా ఉపయోగపడతాయి. శచీపతీ! ఈ లౌకిక శాస్త్రాలన్నీ కలకండ ముక్కల్లాంటివి. తత్త్వోపదేశమనే కషాయాన్ని సులువుగా గ్రోలడానికి అవి ఉపకరిస్తాయి. లౌకిక శాస్త్రాల సహాయం లేకుండా, సామాన్యులు తత్త్వాన్ని సులువుగా గ్రహించలేరు. అయినా, కైవల్యమే ఏ జీవికైనా అంతిమ లక్ష్యం, అదే అంతిమ గమ్యం’ అని చెప్పాడు బృహస్పతి.∙సాంఖ్యాయన -
అశోక చక్ర కమలేష్ కుమారి
2001 డిసెంబర్ 13న దేశం ఉలిక్కిపడింది. కారణం? పార్లమెంట్ మీద ఉగ్రదాడి జరిగింది. రక్షణగా ఉన్న సి.ఆర్.పి.ఎఫ్ దళాలు ఉగ్రవాదులతో పోరాడాయి. ఆ సి.ఆర్.పి.ఎఫ్లోనే కమలేష్ కుమారి అనే ఆడపులి కూడా ఉంది. ఆమె ఉగ్రవాదులను అడ్డుకుంటూ దేశం కోసం తన ప్రాణాలు బలి ఇచ్చింది. మరణానంతరం అశోకచక్రను పొందిన కమలేష్ను స్మరించుకుందాం.దేశంలో అంతర్గత భద్రతకు 85 ఏళ్ల క్రితం జూలై 27, 1939లో ‘క్రౌన్ రిప్రెజెంటేటివ్స్ పోలీస్’గా ఏర్పడి ఆ తర్వాత 1949 నుంచి ‘సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్’గా సేవలు అందిస్తున్న సి.ఆర్.పి.ఎఫ్లో ఇప్పటి వరకూ ఒకే ఒక మహిళ ‘అశోక చక్ర’ పొందింది. ఆమె కమలేష్ కుమారి. దేశం కోసం సి.ఆర్.పి.ఎఫ్ నుంచి ఎందరో ప్రాణత్యాగం ఇచ్చినా వారిలో కమలేష్ కుమారిది మాత్రం ఎప్పటికీ స్ఫూర్తినిచ్చే పేరే. అందుకంటే పార్లమెంట్ మీద అటాక్ అయిన సందర్భంలో ఆమె తన ప్రాణాలు అర్పించి మొత్తం హౌస్నే కా పాడటంలో కీలక పాత్ర పోషించింది.ఉత్తర ప్రదేశ్ మహిళకమలేష్ కుమారిది ఉత్తర ప్రదేశ్లోని కన్నౌజ్. సి.ఆర్.పి.ఎఫ్లో 1994లో చేరి కొంతకాలం ‘104 రాపిడ్ యాక్షన్ ఫోర్స్’లో అలహాబాద్లో పని చేసింది. ఆ తర్వాత ‘88 విమెన్స్ బెటాలియన్’లోకి మారింది. 2001 జూలై నుంచి ఆమె ఢిల్లీలో విధులు నిర్వహిస్తోంది. పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు విమెన్స్ బెటాలియన్ సభ్యులు సెక్యూరిటీ విధులు నిర్వర్తించడం ఆనవాయితీ. ఆ విధంగా డిసెంబర్ 13న ఆమెకు పార్లమెంట్ డ్యూటీ పడింది. ఆ రోజునే పార్లమెంట్ మీద ఉగ్రదాడి జరిగింది. అప్పటికి కమలేష్ కుమారికి వివాహమై ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి వయసు 9 ఏళ్లు, రెండో అమ్మాయి వయసు ఒకటిన్నర సంవత్సరాలు.ఆ రోజునడిసెంబర్ 13, 2001న ఉదయం 11.40 గంటలకు ఒక తెల్ల అంబాసిడర్ కారు పార్లమెంట్ భవనంలోకి దూసుకు వచ్చింది. ఆ సమయాన లోపల అద్వానీ, సుష్మా స్వరాజ్ తదితరులతో పాటు 200 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఆ సమయానికి కమలేష్ కుమారి గేట్ నంబర్ 11 వద్ద ఐరన్ గేట్ 1 దగ్గర విధులు నిర్వహిస్తోంది. ఆ రోజుల్లో మహిళా సి.ఆర్.పి.ఎఫ్ సభ్యులకు ఆయుధాలు ఇచ్చే ఆనవాయితీ లేదు. ఆమె వద్ద కేవలం వాకీటాకీ ఉంది. కారు దూసుకురావడంతో మొదట అందరూ అది కాన్వాయ్ కారు అనుకున్నారు. కాని కమలేష్ కుమారి అది అనుమతి లేని కారు అని గ్రహించి పక్కనే ఉన్న మరో గార్డ్ను అలెర్ట్ చేసి పెద్దగా అరిచి కారు వెనుక పరిగెత్తింది. అప్పటికే అందులో ఉన్న ఐదుగురు ఉగ్రవాదులు కారులో నుంచి జంప్ చేసి కారును పేల్చేయాలని పథకం పన్నారు. కాని కమలేష్ కుమారి పరిగెత్తుకుని రావడంతో కారు అదుపు తప్పి పక్కనే ఉన్న లాన్లోకి దూసుకు పోయింది. కారు పేల్చే ప్లాన్ కుదరక అందులో ఉన్న ఐదుగురు దిగి కాల్పులు మొదలెట్టారు. అప్పటికే వాకీటాకీ ద్వారా అందరినీ అప్రమత్తం చేసిన కమలేష్ కుమారి ఒక నిందితుడు పేలుడు పదార్థాలతో పార్లమెంట్ వైపు దూసుకు వెళ్లడాన్ని చూసి వాకీటాకీ ద్వారా దళాన్ని హెచ్చరించింది. ఇంకొన్ని సెకన్లలో అతడు లోపలికి వెళతాడనగా డోర్లు మూసేయగలిగారు. గేటు వైపు నుంచి ఒకరు, లాన్ వైపు నుంచి మరొకరు ఆ ఉగ్రవాదిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. లేకుంటే అతడు లోపలికి వెళ్లి మొత్తం సభ్యులను ఏం చేసేవాడో ఊహించడమే కష్టం. అయితే తమ రాకను అలెర్ట్ చేసి అంతా ఛిన్నాభిన్నం చేసిన కమలేష్ కుమారిని ఉగ్రవాదులు వదల్లేదు. బుల్లెట్లు కురిపించారు. మొత్తం 11 బుల్లెట్లు ఆమె శరీరంలో దూసుకు పోయాయి. ఆమె ప్రాణాలు పోయినా దేశ గౌరవాన్ని కా పాడగలిగింది.అశోక చక్ర పార్లమెంట్పై జరిగిన ఉగ్రదాడిలో మొత్తం 9 మంది అమరులయ్యారు. వీరిలో కమలేష్ కుమారి ఒక్కరే మహిళ. 2002లో ఆమెకు మరణానంతర ‘అశోక చక్ర’ ప్రకటించారు. నాటి ప్రధాని ఆమెకు అంజలి ఘటించారు. అశోకచక్ర అందుకున్న ఏకైక మహిళగా నిలిచింది కమలేష్ కుమారి. -
నూరేళ్ల నమ్మకం
నమ్మకం, నిజాయితీ సహజీవనం చేసే చోటు ఆ చాయ్ దుకాణం. అది నిన్న మొన్నటి దుకాణం కాదు, వందేళ్ల నాటిది. దీనికి పెట్టుబడి నమ్మకం, రాబడి నిజాయితీ. ప్రపంచంలోనే అరుదైన లక్షణాలు ఉన్న ఆ చాయ్ దుకాణం పశ్చిమ బెంగాల్లోని శ్రీరామ్పూర్ పట్టణంలో ఉంది. నరేశ్చంద్ర షోమ్ అనే స్వాతంత్య్ర సమరయోధుడు 1920లలో ఈ దుకాణాన్ని ప్రారంభించారు. ఈ చాయ్ దుకాణాన్ని ప్రారంభించడానికి కారణం లాభాపేక్ష కాదు, ఆనాటి స్వాతంత్య్ర సమరయోధుల చర్చలు, సమావేశాలకు ఒక కుదురైన వేదికగా ఉపయోగపడటానికి నరేశ్చంద్ర షోమ్ దీనిని ప్రారంభించారు. ఆయన ఏ ముహూర్తాన ఈ దుకాణాన్ని ప్రారంభించారో గాని, నేటి వరకు ఈ చాయ్ దుకాణం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. నేటికీ స్థానిక తేనీటిప్రియులకు అభిమాన ఆలవాలంగా నిలిచి ఉంది.స్వాతంత్య్ర పోరాట కాలంలో మిగిలిన సమరయోధుల మాదిరిగానే నరేశ్చంద్ర కూడా తరచు అరెస్టయి జైలుకు వెళుతుండేవారు. తాను అరెస్టయినప్పుడల్లా ఆయన ఈ దుకాణం బాధ్యతలను స్థానిక కస్టమర్లకే అప్పగించేవారు. వారు చాలా నమ్మకంగా టీ పెట్టుకుని తాగి, అందుకు తగిన డబ్బును అక్కడే ఉంచి వెళ్లేవారు. వారు తమ తర్వాత వచ్చే కస్టమర్లకు ఆ బాధ్యతను అప్పగించేవారు. ఇప్పటికీ ఈ దుకాణంలో ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది. నరేశ్చంద్ర తదనంతరం ఆ భవన యజమాని ‘లఖీరాణి దఖీ’ అల్లుడు అశోక్ చక్రవర్తి ఈ దుకాణం బాధ్యతలు తీసుకున్నాడు. క్లరికల్ ఉద్యోగం చేస్తున్న ఆయన ఉదయాన్నే దుకాణం తెరిచి; దుకాణానికి కావాల్సిన పాలు, టీ పొడి, పంచదార వంటివి ఏర్పాటు చేసి ఉద్యోగానికి వెళ్లిపోతారు. ఇక సాయంత్రం విధుల నుంచి రాగానే మళ్లీ దుకాణానికి వచ్చి, మూసేంత వరకు ఉంటారు. మరి మధ్య కాలంలో దుకాణంలో సిబ్బంది ఎవరూ ఉండరు. ఆ సమయంలో కొందరు స్వచ్ఛందంగా ఈ టీ దుకాణాన్ని నడిపిస్తున్నారు. పదవీ విరమణ పొందిన వారు, ఈ టీ దుకాణంపై అభిమానం కలిగినవారు ఇలా చాలామంది ఈ దుకాణాన్ని నడిపిస్తున్నారు! ఆశిష్ బంధోపాధ్యాయ్ అనే పదవీ విరమణ పొందిన ఒక పెద్దాయన.. అశోక్ చక్రవర్తి లేని సమయంలో దుకాణంలో ఉంటారు. పాలు లేకపోయినా, పంచదార లేకపోయినా క్యాష్ కౌంటర్లో డబ్బు తీసి, బజారు నుంచి కొని తెచ్చి పెడతారు. ఆయన కూడా లేనప్పుడు, టీ తాగడానికి వెళ్లిన వారే టీ పెట్టుకుని కప్పుల్లో పోసుకుని, తాగి, వాటిని శుభ్రపరచి, డబ్బులు క్యాష్ కౌంటర్ దగ్గర వేసి వెళ్లిపోవచ్చు. ఇక్కడ కావాల్సినంత సమయం గడపొచ్చు. టీ తాగినవారంతా డబ్బు ఇస్తున్నారా లేదా అనే విషయం తెలియడానికి నిఘా నేత్రాలేమీ ఉండవు. ఇక్కడ రోజుకు సుమారు రెండు వందలకు పైగా టీలు అమ్ముడుపోతుంటాయి. ఈ దుకాణానికి ఎదురుగా ఛత్ర కాళీబాబు శ్మశానవాటిక ఉండటంతో అక్కడికి వచ్చేవారు సైతం ఇక్కడికి టీ తాగడానికి వస్తారు.ఒకవేళ డబ్బు లేకపోయినా ఇక్కడ టీ తాగి వెళ్లొచ్చు. అలా వెళ్లిన వాళ్లు మరోరోజు తాము ఇవ్వాల్సిన డబ్బుల్ని గుర్తుపెట్టుకుని మరీ తెచ్చి క్యాష్ కౌంటర్లో వేస్తారు. పైగా ఈ దుకాణానికి బోర్డ్ కూడా ఉండదు. చాలామంది ఛత్ర ఘాట్ ఎదురుగా ఉన్న టీ షాప్ అని పిలుస్తుంటారు.ఆశిష్ బంధోపాధ్యాయ్తో పాటు సుమారు పదిమంది స్నేహితులు ఒక బృందంగా ఉండి, అశోక్ చక్రవర్తి లేని సమయంలో వీలును బట్టి దుకాణం బాధ్యతలను పంచుకుంటూ ఉంటారు. ఇక్కడ బ్లాక్ టీ, మసాలా టీ కూడా పెట్టుకోవచ్చు. అందుకు నిమ్మకాయలు, మసాలా పొడులు కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే చాయ్లోకి బిస్కట్స్ కూడా లభిస్తాయి. ఇక సాయంత్రం అశోక్ చక్రవర్తి వచ్చి ఆ రోజు కలెక్షన్ను క్యాష్ కౌంటర్లో లెక్క చూసుకుని, మరునాటికి కావాల్సిన ఏర్పాట్లు చూసుకుంటారు. ఇలా సాగుతున్న దుకాణం స్థానికులకు గొప్ప కాలక్షేప కేంద్రం. ఈ చోటు మానసిక సంతోషానికి గొప్ప ప్రదేశం అంటుంటారు ఆశిష్. ఇక్కడికి చాయ్ తాగడానికి వచ్చే ప్రతి ఒక్కరూ ఎన్నో ఏళ్లుగా వస్తున్నవాళ్లే! ఎవరిని కదిలించినా ఏదో ఒక అనుభూతిని పంచుకుంటారు. ‘నరేశ్చంద్రగారు ఉన్నప్పటి నుంచి వస్తుంటాను’ అని కొందరు; ‘మా నాన్నతో కలిసి ఇక్కడికి వచ్చేవాళ్లం’ అని ఇంకొందరు చెబుతుంటారు. కాని, ఈ రోజుల్లో కూడా ఒక వ్యాపార కేంద్రం ఎటువంటి నిఘా నేత్రాలు లేకుండా, ఏ ఒక్క సహాయకుడు లేకుండా కస్టమర్లతో కళకళలాడేలా నడిపించడం అబ్బురమే! -
ఆ దొంగ.. రూటే వేరు!
రకరకాల కారణాలతో దొంగలుగా మారినవారిని చూస్తూనే ఉంటాం కాని, శ్రీకాకుళం నుంచి వచ్చి హైదరాబాద్ పోలీసులను పరుగులు పెట్టించిన ఆ దొంగ కథే వేరు! ఆఫీసు బాయ్గా జీవితం ప్రారంభించి, కారు నడపడం నేర్చుకుని, డ్రైవర్గా మారాడు. తన యజమాని మతిమరపు కారణంగా దొంగగా మారాడు. పన్నెండేళ్ల వ్యవధిలో పదమూడుసార్లు జైలుకు వెళ్లిన ఈ చోరాగ్రేసరుడి కథలో అనేక మలుపులు ఉన్నాయి. అయితే, 2012 తర్వాత అతడి పేరు పోలీసు రికార్డుల్లోకి ఎక్కలేదు.ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా సేపన్నపేటకు చెందిన అప్పలనాయుడు తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. విధిలేని పరిస్థితుల్లో విజయవాడలో తాపీ మేస్త్రీగా పనిచేస్తున్న తన బావ పంచన చేరాడు. బావ తనకు పని నేర్పించి, బతుకుతెరువు చూపిస్తాడని భావించాడు. అయితే, ఆ బావ అప్పలనాయుడిని నిత్యం వే«ధించేవాడు. వేధింపులు తట్టుకోలేక అప్పలనాయుడు హైదరాబాద్ పారిపోయి వచ్చాడు. కృష్ణానగర్లోని ఓ చిన్నగదిలో మకాం ఏర్పాటు చేసుకున్నాడు. తొలినాళ్లల్లో కొన్ని ప్రైవేట్ ఆఫీసుల్లో బాయ్గా పని చేశాడు. ఆ జీవితం నచ్చకపోవడంతో కష్టపడి డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అనేక ప్రయత్నాల తర్వాత 1998లో ఒక సినీ నిర్మాత వద్ద డ్రైవర్గా చేరాడు. తన యజమాని దయ తలిస్తే తన జీవితమే మారిపోతుందని భావించాడు. ఆ నిర్మాత కారణంగా నిజంగానే అతడి జీవితం మరోలా మారిపోయింది. ఆ నిర్మాతకు ఉన్న మతిమరపే అప్పలనాయుడిని నేరగాడిగా మార్చింది. ఆ నిర్మాత తన ప్రాణ స్నేహితుడి ఇంట్లో పెళ్లి పనుల కోసం కొన్ని రోజుల పాటు తన కారుతో పాటు డ్రైవర్ను స్నేహితుడికి ఇచ్చి పంపారు. ఇంత వరకు బాగానే ఉన్నా, ఆ నిర్మాతకు ఉన్న మతిమరపు రోగం అప్పలనాయుడిని ఇబ్బందుల పాలు చేసింది. పెళ్లి పనుల కోసం కారుతో సహా అప్పలనాయుడు వెళ్లిన రెండు రోజులకు ఆ విషయాన్ని నిర్మాత మర్చిపోయారు. తన కారు తీసుకుని డ్రైవర్ పారిపోయాడని భావించారు. వెనుకా ముందూ ఆలోచించకుండా అప్పలనాయుడిపై పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పలనాయుడిపై పోలీసులు కారు చోరీ కేసు నమోదు చేసుకున్నారు. బాధితుడు సినీ నిర్మాత కావడంతో ముమ్మరంగా గాలించిన పోలీసులు– అప్పలనాయుడిని అదుపులోకి తీసుకుని, కారు స్వాధీనం చేసుకున్నారు. అతడు జరిగినది చెబుతున్నా పట్టించుకోకుండా, అరెస్టు చేసి జైలుకు పంపారు. కారును కోర్టు ద్వారా యజమానికి అప్పగించారు. అలా తొలిసారిగా చేయని నేరానికి జైలుకు వెళ్లిన అప్పలనాయుడు అక్కడి సహచరుల నుంచి నేర్చుకున్న మెలకువలతో నిజంగానే దొంగగా మారాడు. జైలు నుంచి 1999లో బయటకు వచ్చాక దొంగతనాలు మొదలుపెట్టాడు. హైదరాబాద్తో పాటు తిరుపతిలోనూ పంజా విసిరి అనేకసార్లు అరెస్టయ్యాడు. సాధారణంగా దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లల్లోకి చొరబడుతుంటారు. అయితే, అప్పలనాయుడు పంథా పూర్తి భిన్నంగా ఉండేది. మనుషులున్న ఇంట్లోనే తెల్లవారుజామన చోరీలు చేసేవాడు. అప్పట్లో కృష్ణానగర్లో నివాసముండే ఇతగాడు పొద్దున్నే భరత్నగర్ రైల్వేస్టేషన్లో రైలు ఎక్కి, ఫలక్నుమా వరకు ప్రయాణించేవాడు. ఈ మార్గంలో రైల్వే ట్రాక్లకు సమీపంలో కనిపించిన ఇళ్లల్లో అనువైన దాన్ని టార్గెట్గా ఎంచుకునే వాడు. అదే రోజు రాత్రి సెకండ్ షో సినిమాకు వెళ్లి, అది పూర్తయ్యాక కాసేపు కాలక్షేపం చేసేవాడు. తెల్లవారుజామున ఎంచుకున్న ఇళ్లపై విరుచుకు పడేవాడు. కిటికీలు సరిగ్గా మూసి ఉండని ఇళ్లల్లోకి కిటికీ ద్వారానే వెళ్లి, పని పూర్తి చేసుకునేవాడు. అలాగే, సినిమా హాలు నుంచి బయటకు వచ్చేటప్పుడు తనకు నచ్చిన ద్విచక్ర వాహనాన్ని ఫాలో చేసేవాడు. యజమాని ఇంటికి చేరుకునే వరకు వెంబడించి, అతడు ముందు పార్క్ చేసి వెళ్లిపోతే, ఆ వాహనాన్ని తస్కరించేవాడు. అప్పలనాయుడు ఒకసారి కూకట్పల్లిలో అనుమానాస్పదంగా సంచరిస్తూ స్థానికులకు చిక్కాడు. అతడిని వాళ్లు పోలీసుస్టేషన్కు తీసుకువెళ్లారు. అప్పటికి అతడికి నేరచరిత్ర లేకపోవడంతో అరెస్టు చేయని పోలీసులు అదుపులోనే ఉంచుకున్నారు. ఆ మరుసటి రోజు దీపావళి కావడంతో పండుగకు ఇంటికి వెళ్లివస్తానని కోరినా, పోలీసులు వదిలిపెట్టలేదు. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ తన సెల్ఫోన్లో చాటింగ్లో మునిగిపోవడం చూసి, అప్పలనాయుడు పోలీసుస్టేషన్ నుంచి పరారయ్యాడు. అక్కడ నుంచి అమీర్పేట వరకు వచ్చి అదే పోలీసుస్టేషన్ ల్యాండ్ ఫోన్కు కాల్ చేశాడు. పోలీసుస్టేషన్ నుంచి తప్పించుకున్నది తానే అని, దీపావళి పండుగ కోసం ఇంటికి వెళ్తున్నానని చెప్పాడు. తిరిగి వచ్చాక లొంగిపోతానని చెప్పాడు. ఇన్స్పెక్టర్ అతడి మాటలు నమ్మలేదు. అప్పలనాయుడు మాత్రం దీపావళి ముగిసిన రెండు రోజులకు మళ్లీ కూకట్పల్లి పోలీసుస్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఆవు–పులి కథ మాదిరిగా చెప్పినట్లే వచ్చి తన ముందు నిల్చున్న అప్పలనాయుడిని చూసిన ఆ ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోయారు. ఎంతో ఇంప్రెస్ అయి, ‘దొంగతనాలు చేయడం కాకుండా నీకు ఏ పని వచ్చు?’ అంటూ అడిగారు. డ్రైవింగ్ వచ్చని చెప్పడంతో పోలీసుస్టేషన్లోనే డ్రైవర్గా పెట్టుకున్నారు. కొన్నాళ్లు ఆయనే జీతం ఇచ్చి, పోలీసు వాహనం అప్పగించి పంపేవాళ్లు. కాలక్రమంలో ఆ అధికారి పదవీ విరమణ చేయడం, తర్వాత వచ్చిన వాళ్లు పట్టించుకోకపోవడంతో అప్పలనాయుడు మళ్లీ చోరీలు కొనసాగించాడు. పోలీసులను ముప్పతిప్పలు పెడుతూ 2012 వరకు 13 సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. అతడిపై నమోదైన కేసుల్లో దాదాపు అన్నీ కోర్టుల్లో వీగిపోయాయి. 2011 ఆగస్టు 8న పోలీసులు అప్పలనాయుడిని అరెస్టు చేసినప్పుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. అప్పట్లో ఇతగాడు విలేకరులను ఉద్దేశించి ‘కిలో బంగారం చోరీ చేసే వరకు పోలీసులకు దొరక్కుండా ఉండాలని అనుకున్నా. ఆ తర్వాత ప్రెస్మీట్ పెట్టి మరీ దొంగతనాలు మానేయాలని భావించా. కానీ కుదర్లేదు’ అంటూ నిట్టూర్చాడు. కొన్నాళ్లుగా అప్పలనాయుడి పేరు పోలీసు రికార్డుల్లో ఎక్కలేదు. -
మగవాళ్లలో మీరు ఏ టైపు?
వేమన చెప్పినట్లు, ‘పురుషులందు పుణ్య పురుషులు వేరు’ కావచ్చు. అయితే ఆ పుణ్య పురుషులు కూడా – ఈ భూమి మీద ఉండే మొత్తం 6 వర్గాల పురుషులలో ఏదో ఒక వర్గం కిందికి రావలసిందేనని స్విట్జర్లండ్లోని ఐడీఆర్ ల్యాబ్స్ శాస్త్రవేత్తలు తాజాగా చేసిన వర్గీకరణను బట్టి తెలుస్తోంది. యావత్ పురుషజాతిని వారు ఒక ‘షడ్భుజిలో’ సర్దేశారు. ఆల్ఫా, సిగ్మా, బ్రావో, ఒమేగా, డెల్టా, గామా అనే ఆరు రకాలుగా పురుషులను విభజించారు. మీరు ఏ కేటగిరీలోకి వస్తారో చూసుకోండి అని అంటూ చిన్న పరీక్షను కూడా రూపొందించారు.1 ఆల్ఫా మేల్ఇంటర్నెట్ సంస్కృతి వచ్చాక పురుషుల వ్యక్తిత్వాలను, వారి స్వరూపాలను ఒక ఆధిక్య శ్రేణి సోపానంగా అమర్చి; పురాణ పుంగవుల అన్వయింపుతో కేటగిరీలుగా విభజించి చూపడం సాధారణమైపోయింది. ఈ క్రమంలోనే ఐడీఆర్ ల్యాబ్స్ యావత్ పురుష లోకాన్ని ఆరు రకాలుగా విభజించింది. అందులో ఎవరు ఏ విభజన కిందికి వస్తారో తెలుసుకునేందుకు ‘పురుష సామాజిక సోపాన క్రమ పరీక్ష’ను రూపొందించింది. అందులో 31 ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానంగా ‘యెస్’ లేదా ‘నో’ అని ఐదు పాయింట్ల స్కేల్లో స్పందించమని ఆ పరీక్షా పత్రంలో ఉంటుంది. ఉదా: ఎన్ని అప్పులున్నా నేను ఆందోళ చెందను/ నా కింద ఉన్న పనివారి నుండి నేను పనిని పిండుకుంటాను/ నేను అంత తేలిగ్గా భయపడను/ ... ఇలాంటి స్టేట్మెంట్లు ఉంటాయి. చివర మీకు వచ్చిన స్కోర్ ఆధారంగా మీరు ఏ కేటగిరీ పురుషులో తెలుస్తుంది.ఆల్ఫా మగవారిని పురుష సామాజిక సోపానక్రమంలో పైభాగాన ఉండేవారిగా వర్ణించారు. ఆల్ఫా పురుషులు ఆకర్షణీయమైనవారు. త్వరగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సవాళ్లను స్వీకరించటానికి ఇష్టపడతారు. మహిళల మనసు దోచుకుంటారు. తక్కిన కేటగిరీలలోని పురుషులంతా ఆల్ఫా పురుషులను అనుసరించాలని కోరుకుంటారు. సినిమాలు, టీవీలలో ఆల్ఫా మగవారిని తరచుగా ఇతరులపై ఆధిపత్యం చలాయించే వారిగా, ఎవరికి ఏం చేయాలో చెప్పటంలో ఆనందం పొందేవారిగా చిత్రీకరించినప్పటికీ వాస్తవానికి అలా ఉండరని ఐడీఆర్ ల్యాబ్స్ నిపుణులు అంటున్నారు. నిజానికి ఆల్ఫా మగవాడిగా ఉండటం అంటే మాటలు కాదు, ఆటలూ కాదు. సోపానక్రమంలో తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి; ఇతరులు తమ మార్గదర్శకత్వం కోసం, దిశానిర్దేశం కోసం చూస్తున్నప్పుడు ఆల్ఫాలు అపారమైన బాధ్యతలు, భారాలతో పోరాడవలసి ఉంటుంది. మరోవైపు ఆల్ఫాలు నాయకుడిగా తమ స్థానానికి మద్దతు ఇచ్చే వారి పట్ల చాలా స్నేహపూర్వకంగా, ఉదారంగా ఉంటారు.2 సిగ్మా మేల్ పురుష సామాజిక సోపానక్రమంలో అసలు వీళ్లు ఉండనే ఉండరు. వీరు పిరికి వాళ్లు. సమాజ నియమాలకు జడుస్తారు. సొంత మార్గాన్ని అనుసరిస్తారు. ఆల్ఫాలు, బ్రావోలు వీళ్లను పట్టించుకోరు. అయితే, మహిళల విషయంలో సిగ్మాలు విజయవంతం అవుతారు. స్త్రీలు తరచుగా సిగ్మాల స్వీయ–నిర్ణయ తత్త్వాన్ని, నిర్లిప్తతను ఆకర్షణీయంగా భావిస్తారు. కాబట్టి సిగ్మాలు మహిళలకు దగ్గరవుతారు. ఆశ్చర్యకరంగా, సిగ్మాలను ఇంటర్నెట్ సంస్కృతి శృంగార పురుషులుగా పరిగణిస్తుంది. ఒక సిగ్మా విజయవంతం అయినప్పుడు, అతని జీవనశైలి ఆదర్శనీయం, ఆకర్షణీయం అవుతుంది.3 బ్రావో మేల్ బ్రావో మగవారు ‘లెఫ్టినెంట్లు’. అగ్రస్థానానికి దగ్గరగా ఉంటారు. ఇంచుమించు ఆల్ఫా మగవారిలా ఉంటారు. విశ్వసనీయ సలహాదారులుగా వ్యవహరిస్తారు. ఆల్ఫాకు నమ్మకమైన సిబ్బందిగా ఉంటారు. మహిళలు వారిని ఇష్టపడతారు. ఆల్ఫా భరించాల్సిన తీవ్రమైన బాధ్యతల భారాలను తప్పించుకుంటూ, ఆల్ఫా ర్యాంకు సదుపాయాలను అనుభవిస్తారు. ఆల్ఫాల మాదిరిగా తమ స్థానం కోసం నిరంతరం పోరాడాల్సిన అవసరం ఉండదు కనుక బ్రావోలు ప్రజలతో కొంచెం స్నేహపూర్వకంగా ఉండగలరు.4 ఒమేగా మేల్ పురుష సామాజిక సోపానక్రమంలో దిగువ నుంచి ఒక మెట్టు పైన ఒమేగా పురుషుడు ఉంటాడు. ఆల్ఫా పురుషుడికి ఒమేగా మేల్ పూర్తి వ్యతిరేకం. తరచు వీరు సామాజిక బహిష్కృతులుగా కనిపిస్తారు. సామాజిక నైపుణ్యాలు ఉండవు. అంతర్ముఖులుగా ఉంటారు, ఆత్మవిశ్వాసం ఉండదు. కొంతమంది వీరిని మేధావులు అనుకుంటారు. మరికొంతమంది పనికిమాలిన వాళ్లు అని భావిస్తారు. ఒంటరితనానికి భయపడి ఇతరులకు అతుక్కుపోతారు. వీళ్లనసలు స్త్రీలు చూడను కూడా చూడరు.5 డెల్టా మేల్ డెల్టా మగవారిని పురుష సామాజిక సోపానక్రమంలో ‘కార్మికులు’గా వర్గీకరించారు ఐడీఆర్ల్యాబ్స్ నిపుణులు. వీరు సాధారణ వ్యక్తులు. ఆధిపత్యం కోసం పోరాడరు. ‘పనిని పూర్తి చేశాం’ అని గర్వంగా చెప్పుకుంటారు. నిజాయితీగా, సూటిగా ఉంటారు. ఇతరులలో నిజాయితీని, మర్యాదను ఆశిస్తారు కాబట్టి డెల్టాలు కొన్నిసార్లు మోసానికి, దగాకు గురవుతారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా ప్రేయసి డెల్టాలను ఇష్టపడటం వల్ల కాకుండా సహాయాల కోసం సహవాసం చేస్తారు. వీరి ఔదార్యాన్ని వారు ఉపయోగించుకుంటారు.6 గామా మేల్ గామా మగవారు పురుష సామాజిక సోపానక్రమంలో ‘మేధావులు’. ఈ రకం పురుషులు పుస్తక జ్ఞానం కలిగి ఉంటారు, కాని ఆధిపత్యాన్ని నెలకొల్పటానికి అవసరమైన సామాజిక నైపుణ్యాలు, డబ్బు ఉండవు. వారి చూపులు ఆకర్షణీయంగా ఉండవు. వారిలో మానసిక దృఢత్వం కనిపించదు. తెలివి వారి బలం కాబట్టి, గామాలు తరచుగా జీవితంలోని మేధాపరమైన విషయాల గురించి మాట్లాడతారు. గామాలకు, మేధాపరంగా తక్కువ స్థాయి వారు పైకి ఎదగడం అన్యాయంగా కనిపిస్తుంది. చాలామంది గామా మగవారు తమను తాము రహస్య చక్రవర్తులుగా భావించుకుంటారు. కాని, దేనికీ బాధ్యత వహించరు. ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటారు. ఆ నిరాశే వారిని మహిళలకు దూరం చేస్తుంది. -
చినుకు చినుకుల జీవధార
ప్రకృతి సహజ పరిణామమైన రుతుచక్ర భ్రమణంలో ఏటా వర్షర్తువు వస్తుంది. వర్షాకాలం ఏటా రావడం తథ్యమే అయినా, వాన రాకడలో తరచుగా ముందు వెనుకలు జరుగుతుంటాయి. ‘వాన రాకడ ప్రాణం పోకడ ఎవరికీ తెలియదు’ అని మనకో సామెత ఉంది. ఎప్పుడు కురుస్తాయో తెలియని వాన రాక కోసం ఒక్కో ఏడాది రైతులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఒక్కో ఏడాది వానలు పుష్కలంగా కురుస్తుంటాయి. ఒక్కో చోట అనావృష్టి కరవు కాటకాలను సృష్టిస్తుంది. ఒక్కో చోట అతివృష్టి వరదలతో ముంచెత్తి పెనునష్టాన్ని కలిగిస్తుంది. వానలు తెచ్చిపెట్టే కష్టనష్టాలు ఎలా ఉన్నా, వానలు లేనిదే మనుగడ సాగించడం అసాధ్యం. ఈ భూమ్మీద మనుషులతో పాటు పశుపక్ష్యాదులు, చెట్లు చేమలు వంటి సమస్త జీవులు బతకాలంటే, వానలు కురవాల్సిందే!వానలే లేకుంటే మనం నివసించే ఈ భూమి కూడా మిగిలిన గ్రహాల మాదిరిగా జీవరహిత గోళంగానే మిగిలి ఉండేది. వానల వల్లనే భూమి మీద జీవజాలం ఏర్పడింది. వానల వల్లనే భూమి మీద నాగరికతలు ఏర్పడ్డాయి. తొలినాటి మానవులకు వాన ఒక ప్రకృతి అద్భుతం. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై, చిటపట చినుకులతో మొదలై, క్రమంగా పుంజుకుని జడివానగా మారే దృశ్యం ఇప్పటికీ ఒక అద్భుతమే! నాగరికతలు ఏర్పడిన కాలం నుంచి వివిధ సంస్కృతులలో వర్షారాధన ఉండేది. వానాకాలంలో ప్రత్యేకంగా జరుపుకొనే పండుగలు ఇప్పటికీ ఉన్నాయి. ప్రాచీన సాహిత్యం మొదలుకొని ఆధునిక సాహిత్యం వరకు వర్షవర్ణన కనిపిస్తుంది. వైదిక సాహిత్యంలోని ‘పర్జన్యసూక్తం’, ‘వరుణస్తుతి’ వంటివే కాకుండా, లౌకిక సాహిత్యంలోనూ కవులు మేఘవర్ణన, వర్షవర్ణన చేశారు.‘ఆనందదో వర్షతు మేఘ వృందఃఆనందదా జలధరా స్సంతతం భవంతుఆనందదోవుణ ఏష సదాస్తుమహ్యంఆనందినీ రోషధయో భవంతు’అని ‘వరుణస్తుతి’ వర్షానందాన్ని స్తుతించింది.‘విరిసెను మేఘ పరంపరమెరసెను శాంపేయలతలు మిన్నులు మొరసెన్పరచెను ఝంఝానిలములుకురిసెను వర్షము కుంభగుంభితరీతిన్’అంటూ మబ్బులతో మొదలై కుంభవృష్టిగా మారే వర్షదృశ్యాన్ని ఆవిష్కరించారు గుంటూరు శేషేంద్రశర్మ.నాగరికతలతో పాటు సంగీత సాహిత్యాది కళలను కూడా ప్రభావితం చేసిన ప్రకృతి పరిణామం వాన. వానలు లేనిచోట జీవం ఉండదు. జీవానికి తావులేని చోట మనుగడ ఉండదు. మనుగడ లేని చోట ఇక నాగరికతలెక్కడ? సంగీత సాహిత్యాది కళావైభవాలెక్కడ? భూమ్మీద వానలు కురిసే తావులతో పాటు అక్కడక్కడా చినుకు కురవని ఎడారులు కూడా ఉన్నాయి.ఇప్పటి ఎడారులు ఒకనాడు పచ్చని నేలలేనని, ప్రకృతి మార్పుల ఫలితంగానే అవి ఎడారులుగా మారాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే, ఆఫ్రికాలోని సహారా ఎడారి ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడేదని; ఒకప్పుడు అక్కడ జలకళతో అలరారే సరోవరాలు, నదులు ఉండేవని; వాటి ఒడ్డున పచ్చని సవన్నా గడ్డిభూములు ఉండేవని; ఆ గడ్డిభూముల్లో అనేక జంతువులు జీవించేవని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. వేలాది సంవత్సరాల పరిణామంలో భూకక్ష్యలో వచ్చిన మార్పుల వల్ల సహారా ప్రాంతంలో వానలు కురవడం ఆగిపోయి, పూర్తిగా ఎడారిగా మారిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, ఇటీవలి కాలంలో సహారా ఎడారిలో అక్కడక్కడా తాత్కాలికంగా పచ్చదనం కనిపిస్తోంది. ‘ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్’ ఉత్తర దిశవైపు కదిలినప్పుడు సహారా ఎడారిలో అక్కడక్కడా నాలుగు చినుకులు కురుస్తున్నాయి. ఆ చినుకుల వల్లనే ఈ ఎడారిలో తాత్కాలికంగా పచ్చదనం కనిపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.వర్షారాధన సంస్కృతిప్రాచీన నాగరికతలు విలసిల్లిన ప్రతిచోట వర్షారాధన సంస్కృతి ఉంది. అన్ని నాగరికతలలోనూ వర్షాలకు అధిదేవతలు ఉన్నారు. భారత ఉపఖండంలో వైదికార్యులు ఇంద్రుడిని, వరుణుడిని వర్షాధిదేవతలుగా కొలిచేవారు. మన పురాణాల్లో ఇంద్ర వరుణుల ప్రస్తావన కనిపిస్తుంది. ప్రాచీన గ్రీకు ప్రజలు వర్షాల కోసం జూస్ అనే వర్షాధిదేవుడిని, హైయడీస్ అనే అప్సరసలను ఆరాధించేవారు. వర్షాల కోసం ప్రాచీన రోమన్లు దేవతలకు రాజైన జూపిటర్ను, సముద్రాధిదేవత అయిన నెప్ట్యూన్ను పూజించేవారు. ప్రాచీన ఈజిప్షియన్ ప్రజలు టెఫ్నట్ అనే వర్షదేవతను ఆరాధించేవారు. సుమేరియన్ నాగరికతలోని ప్రజలు ఇష్కుర్ అనే వర్షాధిదేవుడిని ఆరాధించేవారు.ఇష్కుర్కు ‘అదాద్’ అనే మరోపేరు కూడా ఉన్నట్లు అకాడియన్ పురాణాల కథనం. మధ్య అమెరికాలోని మాయన్ నాగరికత ప్రజలు చాక్ అనే వర్షాధిదేవుడిని పూజించేవారు. ఉత్తర అమెరికాలో మూలవాసులైన నవాజో ప్రజలు టొనీనిలీ అనే వర్షాధిదేవుడిని ఆరాధించేవారు. దక్షిణ అమెరికాలో పురాతన మూయిస్కా మతస్థులు వర్షాల కోసం చిబ్చాకూమ్ అనే దేవుడిని పూజించేవారు. ప్రాచీన చైనీస్ ప్రజలు యుషి అనే వానదేవుడిని పూజించేవారు. జపాన్లోని షింటో మతస్థులు కురాఒకామి అనే వర్షాధిదేవుడిని ఆరాధించేవారు. ఆస్ట్రేలియాలోని మూలవాసులు వాంజినా అనే వర్షాధిదేవతను పూజించేవారు. వానల కోసం దేవుళ్లను, దేవతలను పూజించడం, వారి ప్రీతి కోసం రకరకాల నైవేద్యాలు సమర్పించడం, పండుగలు జరుపుకోవడం పురాతన కాలం నుంచే ఉంది. చాలాచోట్ల ఇప్పటికీ వానల కోసం ప్రత్యేకంగా పూజలు జరపడం, వేడుకలు జరపడం వంటి ఆచారాలు కొనసాగుతున్నాయి.మన వానాకాలం పండుగలుమన దేశంలో వానాకాలంలో వచ్చే పండుగలు ఎన్నో ఉన్నాయి. కొన్ని పండుగలను దేశవ్యాప్తంగా జరుపుకొంటే, మరికొన్నింటిని వేర్వేరు ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల ప్రజలు జరుపుకొంటారు. వానాకాలంలో వచ్చే జగన్నాథ రథయాత్ర, కృష్ణాష్టమి, వినాయకచవితి పండుగలను దాదాపు దేశవ్యాప్తంగా జరుపుకొంటారు. అలాగే, తెలంగాణలో బోనాల పండుగ, కేరళలో ఓనం పండుగ, తమిళనాడులో ఆదిపెరుక్కు తదితర పండుగలు జరుపుకొంటారు. ఉత్తరాది రాష్ట్రాలైన రాజస్థాన్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో తీజ్, లద్దాఖ్లో హెమిస్ సెచు, మేఘాలయలో భేడియేంఖ్లామ్, గోవాలో సావో జొవావో వంటి పండుగలను జరుపుకొంటారు. ఇవేకాకుండా, దేశవ్యాప్తంగా అమ్మవారి ఆలయాల్లో శాకాంబరి పూజలు జరుపుతారు.అత్యధిక వర్షపాతంప్రపంచంలో కొన్నిచోట్ల దాదాపు ప్రతి ఏడాది అధిక వర్షాలు కురుస్తుంటాయి. ఇంకొన్ని చోట్ల అరుదుగా అత్యధిక వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. మేఘాలయలోని మౌసిన్రామ్ గ్రామంలో 11,872 మిల్లీ మీటర్ల వార్షిక వర్షపాతం నమోదవడంతో ఇది గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ఒకే సంవత్సరంలో అత్యధిక వర్షపాతం రికార్డు కూడా మౌసిన్రామ్ గ్రామానికే దక్కడం విశేషం. ఈ గ్రామంలో 1985 సంవత్సరంలో ఏకంగా 26,471 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.ఫ్రెంచ్ ప్రభుత్వం అధీనంలోని రీయూనియన్ దీవిలోని ఫోక్ ఫోక్ ప్రాంతంలో ఇరవై నాలుగు గంటల వ్యవధిలో అత్య«ధిక వర్షపాతం నమోదైంది. హిందూ మహాసముద్రంలో మడగాస్కర్కు తూర్పున ఉన్న రీయూనియన్ దీవిలో సముద్రమట్టానికి 2,990 మీటర్ల ఎత్తులో ఉండే ఫోక్ ఫోక్ ప్రాంతంలో 1966 జనవరి 7–8 తేదీల నడుమ ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఏకంగా 1870 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై, గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది.వానాకాలం వెతలుసెగలు రేపే వేసవి తర్వాత వచ్చే వర్షాలు కొంత హర్షాన్ని తెచ్చినా, తెరిపిలేని వానలు వరుసగా వెతలను కూడా మోసుకొస్తాయి. మన దేశంలోని పరిస్థితులనే చూసుకుంటే, వానలు కురిస్తే చాలు నగరాలు, పట్టణాల్లోని రహదారులన్నీ జలమయంగా మారుతాయి. మురుగునీటి ప్రవాహంతో నిండిన రోడ్లపై వాహనాల రాకపోకలకు అడుగడుగునా అవరోధాలు ఏర్పడతాయి. ఒక్కోసారి రోజుల తరబడి ముసురు విడిచిపెట్టని పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు రోజువారీ కూలీలు ఉపాధి దొరకక ఇబ్బంది పడతారు. జలమయమైన రోడ్ల మీదుగా రాకపోకలు సాగించడానికి ఉద్యోగులు, విద్యార్థులు నానా ఇక్కట్లు పడతారు. అధిక వర్షాలు కురిసినప్పుడు నదుల్లో వరద పోటెత్తి, నదీ తీరాలలో ఉండేవారికి ప్రాణనష్టం, ఆస్తినష్టం వంటి తీవ్రనష్టాలు వాటిల్లుతాయి.వానాకాలంలో వీథులు, ఇళ్ల పరిసరాలన్నీ బురదమయంగా మారడంతో రకరకాల వ్యాధులు విజృంభిస్తాయి. పలుచోట్ల చిట్లిన మంచినీటి పైపులైన్లలోకి మురుగునీరు ప్రవేశించడంతో నీరు కలుషితమై, కలరా, టైఫాయిడ్, కామెర్లు వంటి వ్యాధులు పెరుగుతాయి. మురుగునీరు నిలిచిపోవడంతో ఈ కాలంలో దోమల బెడద పెరిగి, వాటి వల్ల వచ్చే డెంగీ, మలేరియా, చికున్ గున్యా వంటి వ్యాధులు సోకుతాయి. వాతావరణంలో తేమకు తోడు కాలుష్యం పెరగడం వల్ల జలుబు, దగ్గు, ఊపిరితిత్తుల వ్యాధులు, చర్మ వ్యాధులు ఎక్కువవుతాయి. వానాకాలంలో ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతుంటాయి.చాలా చోట్ల వీ«థుల్లోనే తినుబండారాలు అమ్మే దుకాణాలు, టీ షాపులు ఉంటాయి. వానాకాలంలో వీటి చుట్టూ మురుగునీరు, బురద చేరి ఉంటుంది. ఈగలు, దోమలు ముసురుతూ ఉంటాయి. పరిసరాలు అంత దారుణంగా ఉన్నా, ఉపాధి కోసం ఆ చిరువ్యాపారులు వ్యాపారాలు సాగిస్తుంటారు. అలాంటి చోట్ల తినుబండారాలు తినేవారికి వానాకాలంలో జీర్ణకోశ సమస్యలు, పరిసరాల శుభ్రత లోపించడం వల్ల రకరకాల అంటువ్యాధులు సోకే అవకాశాలు ఎక్కువవుతాయి.వర్షాలు అతిగా కురిస్తే రైతులకు పంటనష్టం తప్పదు. పొలాల్లో నీరు నిలిచిపోయి, నాట్లు వేసే సమయంలో అతిగా వర్షాలు కురిస్తే, సజావుగా పెరగాల్సిన మొక్కలు కుళ్లిపోతాయి. పంట చేతికి వచ్చే సమయంలో అతిగా వర్షాలు వస్తే, రైతులకు శ్రమ దండగై, పంటనష్టం జరుగుతుంది.వానాకాలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంటుంది. దీనివల్ల జనాల రోజువారీ పనులు దెబ్బతింటాయి. వ్యాపార లావాదేవీలకు కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. గాలి వానల ధాటికి ఒక్కోసారి స్తంభాల నుంచి విద్యుత్ తీగలు నేల మీదకు పడి ప్రమాదాలు కూడా సంభవిస్తుంటాయి.చినుకు కురవని నేలప్రపంచంలో అతిపెద్ద ఎడారి సహారా ఆఫ్రికాలో ఉంది. మన దేశంలో థార్ ఎడారి ఉంది. ఈ ఎడారులు ఇసుక మేటలతో పొడి పొడిగా ఉంటాయి. వీటిలో అరుదుగా కనిపించే ఒయాసిస్సుల్లో మాత్రమే కాస్త నీటిజాడ కనిపిస్తుంది. ఇలాంటి ఎడారుల్లో కూడా అతి అరుదుగా కొద్దిపాటి చినుకులు కురుస్తుంటాయి. అయితే, ఈ భూమ్మీద చినుకు కురవని నేల ఏదైనా ఉందా అంటే, అది చిలీలోని అటకామా ఎడారి మాత్రమే! అటకామా ఎడారిలోని పలు ప్రదేశాల్లో చరిత్రలో ఏనాడూ చినుకు కురిసిన దాఖలాల్లేవు. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడి ప్రదేశంగా రికార్డులకెక్కింది.వర్షాధార దేశాలుభూమధ్య రేఖకు ఉత్తర, దక్షిణ దిశలలోని కర్కాటక, మకర రేఖల నడుమనున్న చాలా దేశాలకు, వాటికి కాస్త అటు ఇటుగా ఉన్న దేశాలకు వర్షాలే ఆధారం. భారత్, చైనా సహా అత్యధిక జనాభా కలిగిన పలు దేశాలు ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఏటా వర్షాకాలం వస్తుంది. అలాగని, ప్రతి ఏడాది ఒకేలా వర్షాలు కురుస్తాయనే భరోసా ఉండదు. వర్షాలు సమృద్ధిగా కురిసినప్పుడు ఈ దేశాలు చక్కని పంట దిగుబడులతో కళకళలాడతాయి. తగినంత వానలు కురవనప్పుడు కరవు కాటకాలతో అల్లాడిపోతాయి. వానలు మితిమీరి కురిసినప్పుడు వరదలు ముంచెత్తి, పంటనష్టమే కాకుండా, ఆస్తినష్టం, ప్రాణనష్టాన్ని కూడా చవిచూస్తాయి. వరదలు ముంచెత్తకుండా పలుచోట్ల ఆనకట్టలు కడుతున్నా, అనావృష్టిని ఎదుర్కోవడానికి వీలుగా నీటిని నిల్వ చేసుకునేందుకు రిజర్వాయర్లు కడుతున్నా ఈ ప్రాంతాలకు తరచుగా అతివృష్టి, అనావృష్టి బాధలు తప్పడం లేదు.భూమధ్యరేఖకు ఉత్తర, దక్షిణాలలో ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో ఏటా రుతుపవనాలు వస్తాయి. రుతుపవనాల రాకతో ఈ ప్రాంతాల్లో వానాకాలం మొదలవుతుంది. పశ్చిమ, దక్షిణ ఆఫ్రికా దేశాల్లోను; ఉత్తర అమెరికా, ఆసియా దేశాలతో పాటు యూరోప్ దేశాలలో ఏటా జూన్ నెలాఖరులోగా వానాకాలం మొదలవుతుంది. దక్షిణార్ధగోళంలోని ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా దేశాలలో సెప్టెంబర్ నుంచి వానాకాలం మొదలవుతుంది. వానాకాలంలోనే సముద్రంలో అల్పపీడనాలు, తుఫానులు వంటివి ఏర్పడుతుంటాయి. తుఫానుల వంటి ప్రకృతి విపత్తుల వల్ల సముద్ర తీర ప్రాంతాల్లో ఒక్కోసారి అపారనష్టం వాటిల్లుతూ ఉంటుంది. వర్షాధార దేశాలకు తఫాను ముప్పు వెన్నంటే ఉన్నా, వర్షాలు లేకుండా ఈ దేశాలు మనుగడ సాగించలేవు. ఇటీవలి కాలంలో పెరిగిన వాతావరణ కాలుష్యం, అడవుల నరికివేత వంటి చర్యల వల్ల అకాల వర్షాలు, అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు తరచుగా తలెత్తుతున్నాయి. ప్రకృతి సమతుల్యతను కాపాడుకుంటేనే సకాల వర్షాలు సజావుగా కురుస్తాయి. మానవాళికి హర్షాతిరేకాన్ని తీసుకొస్తాయి.వానాకాలం జాగ్రత్తలువానాకాలంలో పుష్కలంగా వానలు కురవడం వల్ల నదులు, జలాశయాలు నీటితో నిండుతాయి. అయితే, వానాకాలంలో నీటితోనే జాగ్రత్తగా ఉండాలి. వానల ఉద్ధృతి వల్ల చెరువులు, బావుల్లో మురికి నీరు పైకి తేలుతుంది. చిట్లిన మంచినీటి పైపులైన్ల ద్వారా మురుగునీరు తాగునీటిలోకి చేరే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వానాకాలంలో నీటిని బాగా వడగట్టి, కాచి, చల్లార్చి తాగడం మంచిది. వానాకాలంలో నీటి పట్ల జాగ్రత్తలు తీసుకునేటట్లయితే చాలా వ్యాధుల నుంచి ముప్పు తప్పించుకోవచ్చు.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, వానాకాలంలో వాతావరణ కాలుష్యం వల్ల జలుబు, దగ్గు, జ్వరాలు వంటి ఇబ్బందులను తప్పించుకోవడం కష్టం. కాలంలో మార్పుల వల్ల వచ్చే ఇలాంటి సామాన్యమైన ఇబ్బందులకు దూరంగా ఉండాలంటే, రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్–సి వంటి పోషకాలు ఉండే పండ్లు, కూరగాయలు పుష్కలంగా తీసుకోవాలి.వానాకాలం వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఈ కాలంలో వీలైనంత వరకు తాజా ఆహారాన్ని తీసుకోవడమే మంచిది. పరిశుభ్రమైన ఆహారం, ఇంట్లో వండుకున్న పదార్థాలు మాత్రమే తినడం అలవాటు చేసుకుంటే, వానాకాలంలో వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు. ఈ కాలంలో ఆరుబయట విక్రయించే తినుబండారాలను తినడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు.వాన కురిసే సూచన ఉన్నప్పుడు బయటకు వెళ్లాల్సి వస్తే, తప్పకుండా గొడుగు లేదా రెయిన్కోటు వెంట తీసుకువెళ్లడం క్షేమం. నీరు నిండిన రోడ్లపై నడవడానికి అనువైన వాటర్ప్రూఫ్ చెప్పులు ధరించడం మంచిది. అనుకోకుండా తోవలో ఎక్కడైనా వానలో తడిస్తే, ఇంటికి రాగానే తడిబట్టలను విడిచి పొడి దుస్తులను ధరించడం మంచిది. తడిసిన దుస్తులతో ఎక్కువసేపు ఉన్నట్లయితే, చర్మంపై ఫంగస్ పెరిగి, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.తోవలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా వాన మొదలైతే, విద్యుత్ స్తంభాలు, వేలాడుతూ కనిపించే విద్యుత్ తీగలు లేని సురక్షితమైన ప్రదేశంలో తలదాచుకోవడం మంచిది. వాన కురిసేటప్పుడు విద్యుత్ పరికరాల వినియోగంలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ప్రమాదాలను నివారించుకోవచ్చు. వానలో చెట్ల కింద తలదాచుకోవడం కూడా మంచిది కాదు. గాలి తీవ్రత ఎక్కువైతే భారీ కొమ్మలు విరిగి మీదపడే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి పిడుగులు పడే ప్రమాదం కూడా ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, వానాకాలాన్ని చక్కగా ఆస్వాదించవచ్చు. -
ఔషధవనంలో అపురూప ఆలయం
వనపర్తి జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలోని చిట్టడవిలో.. ఎత్తయిన కొండ శిఖరంపై భూదేవి, శ్రీదేవి సమేతుడై కొలువుదీరిన తిరుమలనాథస్వామి భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్నాడు. వనపర్తి సంస్థానాధీశుల కాలంలో సుమారు 300 ఏళ్ల క్రితం ఈ కొండపై స్వామి, అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ ప్రాంత ప్రజలు ఏటా శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించేలా.. పశువుల కాపరులు, అడవి తల్లిని నమ్ముకున్న ముదిరాజ్లు దాసంగాలు సమర్పించి మొక్కులు తీర్చుకునే సంప్రదాయాన్ని ప్రారంభించారు. వనపర్తి పట్టణం నుంచి పెబ్బేరు వెళ్లే ప్రధాన రహదారిలో.. 5 కిలోమీటర్ల దూరంలో స్వామివారి ఆలయ ముఖద్వారం ఉంటుంది. అక్కడే ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించారు.ఆలయ చరిత్ర శతాబ్దాల క్రితం వనపర్తి సంస్థానాధీశులు వేటకు వెళ్లినప్పుడు ఎత్తయిన కొండ ప్రాంతం, ఆహ్లాదకరమైన వాతావరణం, వేల అడుగుల ఎత్తులో విశాలమైన రాతిచాప, అక్కడే సహజసిద్ధంగా ఏర్పడిన కోనేరు (నీటి కొలను) ఉండటం చూశారు. శిఖరాగ్రాన స్వామివారిని ప్రతిష్టించాలని నిర్ణయించుకుని.. ఏకశిలపై స్వామి, అమ్మవార్ల విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ట చేసినట్లు చరిత్ర కథనం. ఏటా శ్రావణ మాసంలోని శనివారాల్లో అక్కడికి వేలాది మంది భక్తులు వచ్చి పూజలు చేస్తారు. వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామానికి చెందిన కొందరిని ఆలయ ధర్మకర్తలుగా, పెద్దగూడెంలోని ఓ ముదిరాజు కుటుంబాన్ని పూజలు చేసేందుకు నియమించారు. నాటి నుంచి నేటివరకు ఆయా కుటుంబాల వారే స్వామివారిని సేవించుకుంటూ.. ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు.తాటిచెట్టు మెట్ల నుంచి.. మొదట్లో గుట్టపై నుంచి స్వామివారు కొలువుదీరిన శిఖరాగ్రానికి చేరుకునేందుకు సంస్థానాధీశులు తాటిచెట్ల కాండంతో మెట్లను ఏర్పాటు చేసినట్లు భక్తులు చెబుతారు. 1993 ప్రాంతంలో దాతల సహాయంతో ఇనుప మెట్లను, ఇటీవల కాంక్రీట్ మెట్లను ఏర్పాటు చేశారు. శ్రీరంగాపురం రంగనాయకస్వామి, పెద్దగూడెంలోని కోదండరామస్వామి ఆలయాలతోపాటు తిరుమలనాథస్వామి ఆలయాల్లో సంస్థానాధీశులు విగ్రహ ప్రతిష్ట చేయించి పూజలు చేసేవారని స్థానికులు పేర్కొంటారు. ప్రస్తుత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి హయాంలో తారురోడ్డును నిర్మించారు. ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో జిల్లా కేంద్రం నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది.ఔషధ మొక్కలకు పుట్టినిల్లు.. తిరుమలనాథస్వామి కొలువుదీరిన కొండపై ఎన్నో ఔషధ మొక్కలు (Medicinal Plants) ఉన్నట్లు గుర్తించారు. ఏటా శ్రావణ మాసంలో పచ్చని చెట్లు, ఎన్నో రకాల ఔషధ మొక్కలతో పాటు.. చేతికి అందేంత ఎత్తులో వెళ్తున్న మేఘాలు.. చల్లని జల్లులతో ఆహ్లాదకరమైన వాతావరణం మంతమ్రుగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకుని, జాతరను తిలకించి.. ప్రకృతిని ఆస్వాదిస్తారు.సుదూర ప్రాంతాల నుంచి.. వనపర్తికి 5 కిలోమీటర్ల దూరంలో వెలిసిన తిరుమలనాథస్వామిని దర్శించుకొని.. మొక్కులు తీర్చుకునేందుకు జిల్లాతోపాటు గద్వాల, మహబూబ్నగర్, కర్ణాటకలోని రాయచూరు, బళ్లారి, హుబ్లీ తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. కర్ణాటక ప్రాంతవాసులు.. ఇక్కడికి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంటారు. శ్రావణ మాసంలో ప్రతి శనివారం ఇక్కడ అన్నదానం చేస్తారు.తొలి శనివారం.. శ్రావణ మాసంలో వచ్చే తొలి శనివారం తిరుమలనాథస్వామి గుట్టపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు కల్యాణ మహోత్సవం జరిపిస్తారు. సామాన్యుల నుంచి కోటీశ్వరులు సైతం ఒకేచోట నేలపై కూర్చొని స్వామి, అమ్మవార్లకు కల్యాణం చేయిస్తారు. భక్తులతోనే కల్యాణ మహోత్సవం నిర్వహించడం ఇక్కడి విశేషం.చదవండి: ఈ జలపాతాలకు చూసేందుకు రెండు కళ్లు చాలవు -
హిరాకుద్ జలాశయానికి వరదపోటు
ఒడిశా, భువనేశ్వర్: హిరాకుద్ జలాశయంలో వరద నీటి ఉధృతి పెరుగుతుంది. ఈ జలాశయం గరిష్ట నీటి మట్టం పరిమితి 630 అడుగులు కాగా ప్రస్తుతం 609.39 అడుగుల నీటి మట్టం కొనసాగుతుంది. నీటి మట్టం నియంత్రణలో భాగంగా అంచెలంచెలుగా వరద నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం ఎడమ వైపు 13, కుడి వైపు ఏడు.. మొత్తం మీద 20 గేట్లు తెరిచి వరద నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం లోనికి ప్రతి సెకన్కు 2.51 లక్షల క్యూసెక్కులు ప్రవహిస్తుండగా సెకనుకు 2.75 లక్షల క్యూసెక్కులు వరద నీరు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి దృష్ట్యా మిగిలిన గేట్లు తెరిచే విషయం ఖరారు చేస్తారని జల వనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ తెలిపారు. గురువారం నుంచి పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. 15 జిల్లాల 43 మండలాల్లో 50 మిల్లీమీటర్లు పైబడి వర్షపాతం నమోదు అయినట్లు విభాగం సమాచారం. ఇదే పరిస్థితి కొనసాగితే నదుల్లో నీటి మట్టం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అన్ని నదుల నీటి మట్టం ప్రమాద సంకేతం దిగువన కొనసాగుతుందని సమాచారం. #ହୀରାକୁଦର_୨୦ଟି_ଗେଟ୍_ଖୋଲା👉ହୀରାକୁଦରୁ ୨୦ଟି ଗେଟ୍ ଦେଇ ବନ୍ୟାଜଳ ନିଷ୍କାସନ ଜାରି👉୬୦୯.୩୯ଫୁଟ୍ ରହିଛି ଜଳଭଣ୍ଡାରର ଜଳସ୍ତର#HirakudDam #Sambalpur #Odisha #GateOpen pic.twitter.com/vR9RNEZh7B— Mukesh Kumar Sahu (@Anchor_Mukesh) July 26, 2025 -
ప్రపంచంలోని సహజసిద్ధమైన అద్భుతాలేవో తెలుసా?
హలో పిల్లలూం. మనకు ప్రపంచ వింతలంటే ఠక్కున గుర్తొచ్చేవి – ది గ్రే వాల్ ఆఫ్ చైనా, పెట్రా, క్రైస్ట్ ది రిడీమర్, మచ్చు పిచ్చు, చిచెన్ ఇట్జా, రోమన్ కొలోసియం, మనందరికీ ఇష్టమైన తాజ్ మహల్. ఈ ఏడు వింతలు తప్ప మరొకటి జ్ఞప్తికి రావు. ఇవి ఎంతో అందమైన, ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలు, కట్టడాలు అయినప్పటికీ ఇవన్నీ కూడా మానవ నిర్మాతలు. మనకంటే ముందు జీవించిన మన పితరులు వివిధ కాలాలలో, విభిన్న సందర్భాలలో నిర్మించిన అద్భుతమైన కట్టడాలు ఇవి. కానీ ఈరోజు మనం, మానవ ప్రమేయం లేకుండా ప్రకతి ద్వారా సహజంగా ఏర్పడిన వింతల గురించి తెలుసుకుందాం. ప్రపంచంలోని ఏడు సహజసిద్ధమైన అద్భుతాలు (seven natural wonders of the World)1. గ్రాండ్ కాన్యన్ (Grand Canyon)అమెరికాలోని ఈ భారీ లోయ అరిజోనాలో ఉంది. కొలరాడో నది సష్టించిన ఈ కాన్యన్ దాదాపు 446 కిలోమీటర్ల ΄÷డవు, 29 కిలోమీటర్ల వెడల్పుతో 1.6 కిలోమీటర్ల లోతు కలిగి ఉంది. దీని అద్భుతమైన రంగులు, భౌగోళిక నిర్మాణం పర్యాటకులను కట్టిపడేస్తాయి.2. గ్రేట్ బారియర్ రీఫ్ (Great Barrier Reef ) ఆస్ట్రేలియా సమీపంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దిబ్బ. ఇది 2,300 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఈ అద్భుతం అనేక సముద్ర జీవులకు ఆవాసం.3. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ (Amazon Rainforest)దక్షిణ అమెరికాలోని ఈ ఉష్ణమండల వర్షారణ్యం ‘‘ప్రపంచ ఊపిరితిత్తులు’’ గా పిలువబడుతుంది. ఇది అమెజాన్ నది చుట్టూ విస్తరించి ఉండటంతోపాటు భూమ్మీద ఇంతవరకు కనిపించని ఎన్నో జాతుల జంతుజాలం, వక్షజాలానికి నిలయం.4. విక్టోరియా జలపాతం (Victoria Falls) ఆఫ్రికాలోని జాంబియా–జింబాబ్వే సరిహద్దులో ఉన్న ఈ జల΄ాతం జంబేజీ నదిపై ఉంది. దీని వెడల్పు 1.7 కిలోమీటర్లయితే, ఎత్తు 108 మీటర్లు.5. ఆరోరా బోరియాలిస్ (Aurora Borealis Northern Lights)ఉత్తర ధ్రువ ప్రాంతాలలో (నార్వే, స్వీడన్, ఫిన్లాండ్) కనిపించే ఈ అద్భుతమైన ఆకాశ దశ్యం సౌర కణాలు భూమి వాతావరణంతో సంకర్షణ చెందడం వల్ల ఏర్పడుతుంది. ఈ దశ్యాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా ప్రకతి డిజైన్ చేసిన గ్రాఫిక్స్ లా ఉంటాయి.6.పారిసెలో రాక్ (Paricutin Volcano)మెక్సికోలోని ఈ అగ్నిపర్వతం 1943లో ఒక రైతు భూమిలో ఏర్పడింది. ఇది ఏర్పడిన తొమ్మిది సంవత్సరాలలోనే 424 మీటర్ల ఎత్తుకు చేరుకుని ఆధునిక ప్రపంచ వింతగా పరిగణింపబడుతుంది.7. మౌంట్ ఎవరెస్ట్ (Mount Everest, Mount in Asia )ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం, హిమాలయాలలో 8,848 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ మంచు పర్వతాలు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఈ హిమ పర్వతాలను అధిరోహించడానికి కొన్ని వేల మంది ఆసక్తి చూపుతుంటారు. -
చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదన
కలలు కంటూ కూర్చుంటే సరిపోదు. అనుకున్నట్టు ఎదగాలంటే పట్టుదల ఉండాలి. దానికి తగ్గ కృషి ఉండాలి. అందుకే కృషి ఉంటే మనుషులు మహాపురుషులౌతారు అంటాడో సినీ కవి. కర్ణాటకకు చెందిన రైతు లోహిత్ శెట్టి సక్సెస్ స్టోరీ వింటే మీరు కూడా ఔను అంటారు.జీవితం అంటే ఐటీ కంపెనీల్లో లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేసే వ్యక్తులదేనా, నాది కూడా అని ఒక సామాన్య రైతుగా లోహిత్ శెట్టి నిరూపించిన వైనం ఇది. విలక్షణమైన సాగుతో, మార్కెట్ అవసరాలను అవగాహన చేసుకొని కోట్లు సంపాదిస్తున్నాడు కర్ణాటకకు చెందిన 42 ఏళ్ల లోహిత్ శెట్టి పుట్టింది వ్యవసాయ కుటుంబం. 21 ఎకరాల భూమిలో రబ్బరు, కొబ్బరి, తమలపాకులు, జీడిపంటలు పండిస్తున్న తండ్రి, మేనమామలను చూస్తూ పెరిగాడు. అందరిలాగానే లోహిత్కు చాలా ఆశలు, ఆశయాలుండేవి. కానీ ఆర్థిక సమస్యల కారణంగా చదువును 10వ తరగతితోనే ఆపేయాల్సి వచ్చింది. అయినా నిరాశపడలేదు. ఉన్నచోటనే సక్సెస్ను వెదుక్కున్నాడు.కుటుంబ కష్టాలు తీవ్రతరం కావటంతో తొలుత క్వారీలో చిన్న ఉద్యోగిగా పనిచేశాడు. దీని తర్వాత స్వగ్రామానికి దగ్గరలోనే ఉన్న ధర్మస్థలలోని ఒక పొలంలో 10 ఏళ్ల పాటు పని చేశాడు. అయితే లోహిత్కు వ్యవసాయంపట్ల ఉన్న మక్కువ అతణ్ని వ్యవసాయం వైపు మళ్లించింది. తొలుత తన కుటుంబ వారసత్వంగా వచ్చిన సాంప్రదాయ పంటలను సాగు చేసేవాడు. ఈ పంటల నిర్వహణ ఖర్చుతో కూడుకున్నది పైగా లాభదాయకంగా కూడా లేదని గమనించాడు. దీంతో కొంత పరిశోధన చేసి విదేశీ పండ్ల పెంపకంవైపు మళ్లి అద్భుతమైన విజయాన్ని సాధించాడు. 2006లో కేరళ నుండి రంబుటాన్ , మాంగోస్టీన్ మొక్కలను కొని దక్షిణ కన్నడ జిల్లాలోని తన పొలంలో నాటాడు. 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఈ చెట్లు ఇప్పుడు సీజన్కు 80-100 కిలోల పండ్లను ఇస్తాయి. టోకు వ్యాపారులు వాటిని పొలం నుండి కిలోకు రూ.350 లేదా అంతకంటే ఎక్కువ ధర పలుకుతుంది. రంబుటాన్, మాంగోస్టీన్ , డ్రాగన్ ఫ్రూట్ వంటి పండ్లను పండించడంలో ప్రత్యేకతను సాధించాడు. ప్రకృతిలో మమేకమై, మెళకువలను అర్థం చేసుకుంటూ భారీగా లాభాలను ఆర్జించాడు. వీటిని బెంగళూరు, చెన్నై , ముంబై వంటి ప్రధాన నగరాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఏడాదికి కోటి రూపాయట టర్నోవర్ సాధించాడు. తన లాంటి ఎందరో రైతులకు ప్రేరణగా నిలిచాడు.చదవండి: 10 నెలల పాపను ఛాతీపై పడుకోబెట్టుకునే తండ్రికి వింత అనుభవంఅదనంగా 20 ఎకరాల భూమిని లీజుకు తీసుకుని, పెద్ద ఎత్తున సాగుచేసి సక్సెస్ అయ్యాడు.. అంతేకాదు మొక్కలను ఉత్పత్తి చేయడానికి ఆయన ఒక నర్సరీని కూడా స్థాపించారు. దీని ద్వారా మరికొంత ఆదాయం లభించింది.లోహిత్ విజయం, విజ్ఞానం కేవలం తన సొంత పొలానికే పరిమితం కాలేదు. ఆయన తన జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని ఇతరులతో పంచుకుంటూ, తోటి రైతులకు వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడంలో సలహాలు సూచనలు అందిసతూ ముందుకు సాగుతున్నాడు. కృషి, వినూత్న విధానం, స్థిరమైన వ్యవసాయ పద్ధతుల పట్ల అంకితభావానికి లోహిత్ సక్సెస్ గొప్ప నిదర్శనం.చదవండి: వాళ్లకి బ్రెయిన్ అవసరం లేదట : హర్ష్ గోయెంకా ట్వీట్ వైరల్ప్రపంచంలోనే థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా దేశాలు అతిపెద్ద రంబుటాన్ ఉత్పత్తిదారులుగా ఉన్నాయి. 1980లలో మలేషియా, శ్రీలంక ద్వారా భారతదేశానికి చేరుకున్నట్లు చెబుతారు. -
తెలంగాణాలో ఫెర్టిలిటీ రేటు క్షీణతపై సంతానోత్పత్తి నిపుణుల ఆందోళన
వరంగల్ : తెలంగాణలో మొత్తం సంతానోత్పత్తి రేటు తగ్గుతున్న పరిస్థితిపై వరంగల్లోని నోవా IVF సంతానోత్పత్తి నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. సంతానోత్పత్తి జంటలలో వంధ్యత్వ కేసులలో స్థిరమైన పెరుగుదలను డాక్టర్ల దృష్టకి వస్తోంది.ఇలా వంధ్యత్వం పెరుగుతున్న సంఘటనలపై వరంగల్, పరిసరగ్రామీణ ప్రాంతాల్లో, 10 మంది పురుషులలో 8 మంది అసాధారణ వీర్య పారామితులను చూపిస్తున్నారని నోవా IVF వరంగల్వైద్యులు తెలిపారు. పురుషుల సంతానోత్పత్తిలో ఇదొక సవాల్ అని పేర్కొన్నారు.తెలంగాణ అంతటా విధాన నిర్ణేతలు మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR) తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ఇది ఇప్పుడు 1.5 - 1.7 మధ్య ఉంటుందని అంచనాఅన్ని వయసుల స్త్రీపురుషులను వంధ్యత్వం సమానంగా ప్రభావితం చేస్తుంద న్నారు. అయితే 25-45 సంవత్సరాల వయస్సు పురుషుల్లో తక్కువ స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ చురుగ్గా లేకపోవడం లాంటివి ఆందోళన కలిగిస్తోందన్నారు. వరంగల్ ప్రాంతంలో, 20 యేళ్ల వయసు యువకుల్లో కూడా పేలవమైన స్పెర్మ్,కౌంట్ తక్కువగా ఉంటోందని పదనిర్మాణం మరియు నిదానమైన స్పెర్మ్ చలనశీలతతో పేలవమైన స్పెర్మ్ వరంగల్లోని నోవా IVF ఫెర్టిలిటీలోని ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ అనిత అడబోయిన అన్నారు. " దీర్ఘకాలిక ఒత్తిడి, సూక్ష్మ కాలుష్య కారకాలకు గురికావడం, మైక్రోప్లాస్టిక్లు, ఎక్కువ పని గంటలు, ధూమపానం, మద్యపానం ,నిశ్చల జీవనశైలి, ఊబకాయం, ఇన్ఫెక్షన్లు, ఆధునిక జీవనశైలి మార్పులు, వైద్య రుగ్మతలు, అనారోగ్యకరమైన అలవాట్లు దీనికి కారణమన్నారు.నోవా IVFలో ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ ఫెర్టిలిటీ తరచుగా వృద్ధాప్య వయస్సు గల మహిళలు గర్భధారణ ప్రణాళికలో ఆలస్యం చేయడం, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS), తక్కువ అండాశయ నిల్వ, ఎండోమెట్రియోసిస్ మరియు వివరించలేని వంధ్యత్వం వంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది. వీటిలో వివరించలేని వంధ్యత్వం 25-30% కేసులలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్యలు 35 ఏళ్లు పైబడిన మహిళలను మాత్రమే కాకుండా 20 ఏళ్ల చివరిలో ఉన్నవారిని కూడా ప్రభావితం చేస్తాయి. జీవనశైలి మార్పులు మరియు పర్యావరణ కాలుష్య కారకాలకు గురికావడం, హార్మోన్ల అసమతుల్యత, మునుపటి శస్త్రచికిత్సలు, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, తెలియని కారణాలు వంటి కారణాలు దోహదపడే మహిళలు.అయితే జంటలు కలిసి సంతానోత్పత్తి పరీక్షలు, అంటే సాధారణ వీర్య విశ్లేషణ , మహిళలకు ప్రాథమిక కటి స్కాన్ ద్వారా కారణాలను విశ్లేషించుకుని చికిత్స తీసుకోవాలని ఆమె అన్నారు. వంధ్యత్వం కూడా మధుమేహం లేదా గుండె జబ్బుల లాంటిదే. సకాలంలో చికిత్స విజయవంతమైన గర్భధారణను సాధించే అవకాశాలను మెరుగుపర్చుకోవచ్చన్నారు. -
వాళ్లకి బ్రెయిన్ అవసరం లేదట : హర్ష్ గోయెంకా ట్వీట్ వైరల్
ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గొయెంకా (Harsh Goenka)ఎక్స్లో మరో ఇంట్రస్టింగ్ పోస్ట్ చేశారు. ఎప్పటికప్పుడు ఆసక్తికర అంశాలతో నెటిజన్లను ఆలోచింప చేసే ఆయన తాజా ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. యూకే గ్లోబల్ ఎగ్జిక్యూటివ్తో తన అనుభవాన్ని పంచుకున్నారు. ఒక గ్లోబల్ CEO భారతీయ నిపుణుల మేధో సామర్థ్యాలను ఎలా అవమానించారో తెలుపుతూ ట్వీట్ చేశారు. అందుకే నిపుణులంతా భారతీయ కంపెనీలవైపు మొగ్గు చూపుతున్నారంటూ చురకలంటించారు. హర్ష్ గోయెంకా ట్వీట్ ఆన్లైన్లో తీవ్ర చర్చకు దారి తీసింది. హర్ష్గోయెంకా ట్వీట్: "భారతీయ అనుబంధ సంస్థ, అత్యంత ప్రగతిశీల సంస్థకు చెందిన గ్లోబల్ CEO నాతో ఇలా అన్నాడు. ‘‘బ్రెయిన్, చేతులు, కాళ్లు అవసరం లేకుండా కేవలం ప్లాన్ను అమలు చేసే ఇంజీన్లా నా భారతీయ CEO ఉండాలని కోరుకుంటా.. అని అన్నట్టు అని గోయెంకా గుర్తు చేసుకున్నారు. "ఈ విధానం వల్లే ఇప్పుడు భారతీయ కంపెనీలలో పనిచేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు " అని ఆయన పేర్కొన్నారు.ఈపోస్ట్ నెట్టింట చర్చకు దారితీసింది. ముఖ్యంగా, భారతీయ సంతతికి చెందిన టెక్ నిపుణులు ప్రపంచంలోని కొన్ని అగ్రశ్రేణి కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారు, నూతన ఆవిష్కరణలతో టాప్లో కంపెనీలను నడిపిస్తున్న తరుణంలో హర్ష్ గోయెంకా ట్వీట్ విశేషంగా నిలిచింది."సో నయా వలసవాద వైఖరులు కొనసాగుతూనే ఉన్నాయి అన్నది నిజమన్నమాట అని ఒకరు వ్యాఖ్యానించారు. "ఈ మనస్తత్వం వల్లే భారతీయ నిపుణులు స్వదేశీ కంపెనీలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. మెషీన్లలా పనిచేయం కాదు...మెదళ్ళకు విలువ ఇవ్వాలనుకుంటున్నాము" అని మరొకరు రాశారు.చదవండి : కుటుంబం తొలుత ఒప్పుకోకపోయినా..నిలిచి గెలిచిన ప్రేమికులు!బెన్హాన్స్ ఫార్మా MD ఎలియా జయరాజ్, “భారత జట్టును చేతులు, కాళ్ళు లేకుండా చేయాలనే UK CEO ప్లానా ఇది? ఒక క్రికెట్ స్టార్ను బంతిని అలా ఫెచ్ చేయమని అడిగినంత కామెడీగా ఉంది. TCS వంటి భారతీయ సంస్థల వైపు ఐటీ నిపుణులు పరిగెత్తడంలో ఆశ్చర్యం లేదు , అక్కడ వారు తమ తెలివితేటలను ప్రదర్శించగలరు. 2024లో రిటెన్షన్ (ఉద్యోగుల కొనసాగింపు) 10 శాతం బెటర్గా ఉందని నాస్కామ్ చెబుతోంది. భారతీయ CEOలు అవకాశాన్ని వాడుకోండి.. లేదంటే మీకు నష్టం అని వ్యాఖ్యానించారు. “ఇది బహుశా ఫార్మా లేదా ఆర్థిక సేవల సంస్థ అయి ఉండాలి. మరే ఇతర రంగంలోనూ బ్రిటీషోళ్లకి అంత సీను లేదు” అని మరొకరు కమెంట్ చేశారు. ఇది చదవండి: కరిష్మా మాజీ భర్త సంజయ్ కపూర్ మరణంపై తల్లి సంచలన ఆరోపణలు -
తిరగవోయి భారతీయుడా...పాడవోయి విజయగీతికా!
నిన్న మొన్నటివరకు పర్యాటకం అంటే ఊటీ కొడైకెనాల్.. కాశ్మిర్.. కులూమనాలి వెళ్ళేవాళ్ళు.. మరికొందరు చారిత్రక ప్రాంతాలకు వెళ్లి రాచరిక నిర్మాణాలు అయిన కోటలు ... సరస్సులు చూసేందుకు రాజస్థాన్.. హంపి వంటి ప్రాంతాలకు వెళ్తారు.. మరికొందరు ఐతే నేచర్.. ప్రకృతిలో సేదదీరుతాం అంటూ వాగులు వంకలు జలపాతాలు చూసేందుకు వెళ్తుంటాయారు.. ఇంకొందరు మరింత కిక్కు కావాలబ్బా అంటూ సముద్రతీర ప్రాంతాలైన విశాఖ.. గోవా ..కేరళ వంటి చోట్లకు వెళ్తారు .. మరికొందరు సాహసకృత్యాలు చేసేందుకు పారా గ్లైడింగ్ .. స్పీడ్ బోట్ వంటివి చేస్తుంటారు.. ఇక టెంపుల్ టూరిజం ఎప్పట్నుంచో ఉన్నదే.. దేశంలోని ప్రఖ్యాత ఆలయాలు అన్నీ పర్యాటకులతో కిటకిటలాడుతుంటాయి. ఒక్కో రాష్ట్రం తన ప్రత్యేకతను నిలుపుకోవడానికి.. పర్యాటకులను ఆకట్టుకోవడానికి కొత్తకొత్త ఐడియాలతో ముందుకు వస్తున్నాయి. తమిళనాడు టెంపుల్ టూరిజం అంటూ జనాన్ని ఆకర్షిస్తుండగా కేరళ ప్రకృతిని చూద్దాం రండి అంటోంది,. కాశ్మిర్ అయితే మంచుకొండలు చూపిస్తాం అని రారమ్మంటోంది.గనుల్లో దిగుదాం... పర్యాటకం లోతులు చూద్దాంమరి అలాంటి అవకాశం ... ప్రకృతి అందాలు లేని జార్ఖండ్ (Jharkhand) ఏం చేస్తుంది.. జనాలను .. పర్యాటకులను ఎలా ఆకర్షిస్తుంది.. అనుకుంటున్నారా వాళ్లకూ ఒక ఐడియా వచ్చింది.. జార్ఖండ్ అంటేనే గనులు.. పరిశ్రమలకు ఆలవాలం. ఇనుము.. మాంగనీస్ వంటి గనులన్నీ అక్కడే ఉన్నాయి. నేలను తవ్వుకుంటూ పాతాళంలోకి వెళ్లిపోయే టెక్నాలజీ... నైపుణ్యం అక్కడి ప్రజల సొంతం. అందుకే సరిగ్గా ఆ పాయింట్ మీదనే పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనీ జార్ఖండ్ ప్లాన్ వేసింది. రాష్ట్రంలోని కేంద్రప్రభుత్వ రంగసంస్థ అయినా సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ సంస్థతో జార్ఖండ్ టూరిజం శాఖ ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా ఆసక్తి ఉన్న పర్యాటకులను బొగ్గు.. ఇనప గనుల్లోకి..(mining tourism) తీసుకెళ్తుంది. మైనింగ్ కార్యకలాపాలను దగ్గరుండి చూపిస్తుంది. ఆనందపు లోతులను మనకు అనుభవేకం చేస్తుంది. మామూలుగా అయితే గనుల్లోకి మనలను పంపరు కానీ టూరిజం శాఖ అన్ని భద్రతా చర్యలు తీసుకుని ఇనుము.. బొగ్గుగనుల్లోకి తీసుకెళ్లి మనకు ఆ మొత్తం ప్రక్రియ చూపిస్తుంది .. ఆసక్తి ఉన్న పర్యాటకులు జార్ఖండ్ వెళ్లి గనుల్లో అలా తిరిగిరావచ్చు.మరింత ఎత్తులో సిక్కిం టూరిజం ... యుద్ధభూమిపై రణనినాదంఅందరూ వెళ్ళేదారిలో వెళ్ళితే సక్సెస్ రాదన్న సూత్రాన్ని గుర్తెరిగిన సిక్కిం ఇప్పుడు ఏకంగా వార్ జోన్ లోకి తీసుకెళ్తోంది. గతంలో చైనా సైనికులతో మన భారత సైనికులు తలపడి వీరత్వాన్ని చూపిన డోక్లామ్ వద్దకు తీసుకెళ్తాం.. మన వీరుల సింహనాదాన్ని వినిపిస్తాం రండి అని సిక్కిం పిలుస్తోంది. హిమాలయాలను తాకే కొండ శిఖరాలవద్ద భారత చైనా సైనికులమధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. చైనీయులను మనవాళ్ళు తుక్కుతుక్కుకింద కొట్టి సరిహద్దుల ఆవలకు తరిమేసిన ప్రదేశమే ఈ డోక్లామ్ .. అక్కడికి తీసుకెళ్తాం అని సిక్కిం పిలుస్తోంది.'రణ భూమి దర్శన్' అంటూ దీనికి ప్రత్యేక ప్యాకేజి సైతం సిద్ధం చేసింది.. ఆ మధ్య కాశ్మిర్లోని పెహల్గామ్ వద్ద పాకిస్తాన్ దాడి చేసిన ప్రదేశము కూడా ఇప్పుడు పెద్ద పర్యాటక ప్రాంతం అయింది. మరింకెందుకు ఆలస్యం ఆనాడు మన వీర సైనికులు పరాక్రమం చూపిన ప్రాంతాలు చూసేయండి.. విజయగర్వంతో తిరిగిరండి..-సిమ్మాదిరప్పన్న -
తల తడిస్తే... వర్షపు నీరే కదా అని వదిలేస్తే... వెంట్రుకలకు మూడినట్టే?
వర్షాలు పడుతున్న వేళ రోజువారీ కార్యకలాపాల కోసం రోడ్ల మీద తిరిగే వారికి జుట్టు తడవడం సర్వసాధారణం. అయితే సరైన జాగ్రత్తలు, సంరక్షణ తీసుకోకపోతే మాత్రం దాని ప్రభావం అంత సాదా సీదాగా ఉండదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏమీ కాదులే అని తడిసిన జుట్టును వదిలేస్తే.. అపార నష్టం కలుగవచ్చునని స్పష్టం చేస్తున్నారు. వర్షాల సీజన్లో తల వెంట్రుకలను ఎలా కాపాడుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనిపై పలువురు స్కిన్–హెయిర్ కేర్ నిపుణులు అందిస్తున్న సూచనల సమాహారం ఇది..వర్షాకాలం ప్రభావం కేశాల మీద చాలా ఎక్కువగా ఉంటుంది, వర్షపు నీటిలోని కాలుష్య కారకాల వల్ల జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి, మీ జుట్టు సంరక్షణ పద్ధథులను మార్చుకోవాలి. తలని పరిశుభ్రంగా పొడిగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. తేలికపాటి షాంపూతో క్రమం తప్పకుండా కడగడం, కండిషనింగ్ చేయడం అవసరం. హెయిర్ మాస్క్లను ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం పొడిబారడం వంటివి నివారించవచ్చువర్షపు నీటికి ఉండే ఆమ్ల స్వభావం జుట్టును దెబ్బతీస్తుంది, కాబట్టి బయటకు వెళ్లే సమయంలో లేదా వర్షపు సమయంలో తలను గొడుగు, టోపీ లేదా స్కార్ఫ్తో కప్పడం చాలా అవసరం. (కుటుంబం తొలుత ఒప్పుకోకపోయినా..నిలిచి గెలిచిన ప్రేమికులు!)జుట్టు తడిసినట్టయితే కాలుష్య కారకాలను తొలగించడానికి వీలైనంత త్వరగా తేలికపాటి షాంపూ కండిషనర్తో జుట్టును కడగాలి.రుతుపవనాల తేమ తలని జిడ్డుగా మారుస్తూ రకరకాల ఇన్ఫెక్షన్లకు గురి చేస్తుంది. అదనపు నూనె ధూళిని తొలగించడానికి తేలికపాటి, సల్ఫేట్ లేని షాంపూతో జుట్టును క్రమం తప్పకుండా (వారానికి 2–3 సార్లు) కడగాలి.టీ ట్రీ ఆయిల్ లేదా వేప నూనెతో కూడిన షాంపూలను వాడటం మరింత ఉపయుక్తం ఎందుకంటే ఇవి యాంటీ ఫంగల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి. (కరిష్మా మాజీ భర్త సంజయ్ కపూర్ మరణంపై తల్లి సంచలన ఆరోపణలు)ప్రతి హెడ్ వాష్ తర్వాత జుట్టును కండిషన్ చేయాలి. తద్వారా జుట్టు బిరుసు తనాన్ని నియంత్రించవచ్చు తేమను జోడించవచ్చు.జుట్టును తేమగా మార్చడానికి బలోపేతం చేయడానికి వారానికి ఒకసారి డీప్ కండిషనింగ్ ట్రీట్మెంట్ లేదా హెయిర్ స్పా ఉపయోగించవచ్చుజుట్టు కడుక్కోవడానికి ముందు నూనె రాయడం ప్రయోజనకరంగా ఉంటుంది, కానీ ఎక్కువసేపు నూనె ఉంచడం సరికాదు.. ఎందుకంటే అది మురికిని ఆకర్షిస్తుంది.అధిక తేమ వల్ల జుట్టు విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి హెయిర్ డ్రైయర్లు స్ట్రెయిటెనర్లు వంటి హీట్ స్టైలింగ్ సాధనాల వాడకాన్ని తగ్గించండి. వేడిని ఉపయోగించాల్సి వస్తే, హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే బెటర్.పుష్కలంగా పండ్లు, కూరగాయలు నీటితో కూడిన సమతుల్య ఆహారం ఆరోగ్యకరమైన జుట్టుకు దోహదం చేస్తుంది.ఆహారంలో ఆమ్లా (ఇండియన్ గూస్బెర్రీ)భాగం చేయండి. ఎందుకంటే ఇందులో జుట్టుకు మేలు చేసే విటమిన్ సి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. -
లిఖిత అమ్మమనసు, హ్యాట్సాఫ్ అనాల్సిందే!
నవజాత శిశువులకు తల్లిపాలు అమృతం’ అనే మాటను చాలాసార్లు విని ఉంటాం. అయితే దురదృష్టవశాత్తూ కొన్ని పరిస్థితుల వల్ల అందరు శిశువులు ఆ అదృష్టానికి నోచుకోవడం లేదు. నెలలు నిండని పిల్లలు, తక్కువ బరువుతో పుట్టే నవజాత శిశువులకు తల్లిపాలు దొరకడం గగనమైంది. ఇలాంటి సమస్యనే ఎదుర్కొంది అనంతపురం నగరానికి చెందిన దర్శి లిఖిత. తాను పడిన ఇబ్బంది ఇతరులు పడకూడదని భావించిన లిఖిత పేదింటి శిశువులకు డబ్బా పాలు కాకుండా తల్లిపాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందడుగు వేసింది.ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బెంగూరులో ఎలక్ట్రికల్ మేనేజర్గా పని చేస్తోంది లిఖిత. ఈ ఏడాది ఏప్రిల్ 30న ఆమెకు బాబు పుట్టాడు. ‘మొదటి రెండు వారాల పాటు నాకుపాలు తక్కువగా వచ్చేవి. నాపాలతో పాటు డబ్బాపాలు బాబుకు పట్టేవాళ్లం. బాబు కడుపు నిండా తాగేవాడుపాలు తక్కువైన ప్పుడల్లా ఏడ్చేవాడు. ఆ సమయంలో అందుబాటులో ఉన్న డబ్బాపాలు పట్టేదాన్ని. అయితే డబ్బాపాలు తాగించేటప్పుడల్లా ఎంతో బాధపడేదాన్ని. ఆ తర్వాత పెద్దలు, అనుభవజ్ఞులు, కొందరు వైద్యులు చెప్పిన సూచనలను, సలహాలను పాటించిన తర్వాత అదృష్టవశాత్తూ నాకు పాలు బాగా పడ్డాయి. నా బిడ్డ బొజ నింపుకున్న తర్వాత కూడా ఇంకా మిగిలేవి. వాటిని తల్లిపాలు దొరకని చిన్నారుల కోసం ఉపయోగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. విదేశాల్లో, బెంగళూరులాంటి ప్రాంతాల్లో మిల్క్ బ్యాంకుల గురించి విన్నాను. అనంతపురంలోనూ మదర్ మిల్క్ బ్యాంకు ఉందని అక్క శ్రీలేఖ (గైనకాలజిస్టు) చెప్పారు. నేను పడ్డ ఇబ్బంది ఇతరుల పిల్లలు, తల్లులూ పడకూడదని, అలాంటి వారికి తల్లిపాలు అందజేయాలని నిర్ణయించు కున్నాను’ అంటుంది లిఖిత.చదవండి: కుటుంబం తొలుత ఒప్పుకోకపోయినా..నిలిచి గెలిచిన ప్రేమికులు!లిఖిత తీసుకున్న నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు స్వాగతించారు. ప్రోత్సహించారు. పాలను స్టోరేజ్ చేయడానికి ఆన్లైన్లో ΄్యాకెట్స్ కొనుగోలు చేస్తుంది లిఖిత. వాటిలో నుంచి తన బిడ్డకు సరిపడాపాలు ఇస్తూనే మిగిలిన పాలను రోజూ 200 మి.లీ. వరకు సేకరించి డీప్ ఫ్రీజర్లో నిల్వ చేస్తుంది. అలా నెల రోజుల పాటు సేకరించిన మొత్తం తొమ్మిది లీటర్ల పాలను ప్రభుత్వ ఆసుపత్రిలోని మదర్ మిల్క్ బ్యాంకుకు అందిస్తోంది.‘చనుబాల దానం కార్యక్రమాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తాను. తల్లిపాల ప్రాముఖ్యత, దానిలోని ΄ోషకాలు, రోగనిరోధక శక్తి గురించి ప్రచారం చేస్తాను’ అంటుంది లిఖిత– ఆర్డీవీ బాలకృష్ణారావు, సాక్షి, అనంతపురంఇదీ చదవండి: కరిష్మా మాజీ భర్త సంజయ్ కపూర్ మరణంపై తల్లి సంచలన ఆరోపణలు లిఖిత బాటలోఅనంతపురం జిల్లాలో ఎంతోమంది పేదతల్లులు గర్భం సమయంలో రకరకాల కారణాల వల్ల సౌష్టికాహారం తీసుకోకపోవడంతో నెలలు నిండక, బిడ్డ ఎదుగుదల సరిగా లేక ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రిలోని ఎస్ఎన్సీయూలో పసికందులు పాలు లేక ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వారి కోసం మదర్ మిల్క్ బ్యాంక్ను అందుబాటులోకి తీసుకువచ్చాం. లిఖిత ముందుచూపుతో తొమ్మిది లీటర్ల పాలు అందజేయడం సంతోషంగా అనిపించింది. వృత్తిరీత్యా బిజీగా ఉండే లిఖిత పేద పిల్లల గురించి ఆలోచించడం అభినందనీయం. ఇంకా ఎంతోమంది తల్లులు ముందుకువచ్చి పాలు ఇవ్వాలి. లిఖితను స్ఫూర్తిగా తీసుకోవాలి.– డాక్టర్ హేమలత, డిప్యూటీ ఆర్ఎంఓ -
ఈ 4 నెలలు లగ్గాలే..లగ్గాలు : రెండు నెలల ముందే ప్లాన్
మెదక్ జిల్లా, దుబ్బాక : సరిగ్గా 80 రోజుల విరామం తర్వాత మళ్లీ శుభకార్యాలకు మంచి ముహూర్తాలు వచ్చాయి. దీంతో జోరుగా పెళ్లి బాజాలు మోగనున్నాయి. శ్రావణమాసం శుభకార్యాలకు శ్రేష్టం కావడంతో నేటి నుంచి నవంబర్ 26 వరకు 35 మంచి ముహూర్తాలు ఉండటంతో జోరుగా లగ్గాలు జరగనున్నాయి. వివాహాలు, నూతన గృహ ప్రవేశాలు జరగనున్నాయి. మే 25 నుంచి జులై 26 వరకు ముహూర్తాలు లేకపోవడంతో శుభకార్యాలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం శుభ ముహూర్తాలు ఉండటంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కడ చూసినా పెళ్లి శోభ సంతరించుకొంది. నేటి నుంచి నవంబర్ 26 వరకు.. నేటి నుంచి నవంబర్ 26 వరకు 4 నెలల పాటు పెళ్లి బాజాలు మోగనున్నాయి. జులై 26, 27, 30, 31తోపాటు ఆగస్టులో 1, 3, 5, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 17, 20 తేదీల్లో, సెప్టెంబర్లో 24, 26, 27, 28వ తేదీల్లో, అక్టోబర్లో 1, 2, 3, 4, 8, 10, 11, 12, 22, 24, 29, 30, 31వ తేదీల్లో, నవంబర్లో 1, 2, 7, 8, 12, 13, 15, 22, 23, 26వ తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. మొత్తం నాలుగు నెలల్లో 35 ముహూర్తాలు ఉండటంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారుగా లక్షా 10 వేలకు పైగా వివాహాలు జరగనున్నాయి. సిద్దిపేటలో 40 వేలు, సంగారెడ్డిలో 45 వేలు, మెదక్ జిల్లాల్లో 25 వేలకు పైగా పెళ్లీలు జరగనున్నాయని వేదపండితులు తెలిపారు. చదవండి: కుటుంబం తొలుత ఒప్పుకోకపోయినా..నిలిచి గెలిచిన ప్రేమికులు!బ్యాండ్, డెకరేషన్, ఫొటోగ్రాఫర్లకు డిమాండ్వివాహాలు జరగుతుండటంతో పంతుళ్లు, బ్యాండ్ మేళాలు, టెంట్ హౌస్లు, డెకరేషన్, ఫొటో, వీడియో గ్రాఫర్లకు చాలా డిమాండ్ ఏర్పడింది. దీంతో ఇతర చోట్ల నుంచి తగిన సామగ్రిని, మనుషులను అద్దెకు తెచ్చుకుంటున్నారు. పెళ్లి చేసేవారు వీటికి ముందుగానే అడ్వాన్స్ ఇచ్చారు. ఇక పంతుళ్లు సైతం గ్రామాలు , పట్టణాల్లో ఎక్కువగా పెళ్లీ ముహూర్తాలు పెట్టడంతో ఇతర గ్రామాల్లోని వారి బంధువులను రప్పించుకుంటున్నారు.ముహూర్తాలను దృష్టిలో పెట్టుకుని..నాలుగు నెలల పాటు పెళ్లీలు జరగుతుండటంతో ఫంక్షన్హాల్స్కు డిమాండ్ నెలకొంది. ఇప్పటికే పెండ్లీ ముహూర్తాలు నిర్ణయించుకున్న పెళ్లి చేసే కుటుంబాలు 2 నెలల ముందరే ఫంక్షన్హాల్స్ బుక్ చేసుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రైవేట్ ఫంక్షన్హాల్స్ 3500కు పైగా ఉండగా ప్రభుత్వ(టీటీడీ), కమ్యూనిటీ హాల్స్ మరో 5000 కు పైగా ఉన్నాయి. దీంతో చాలా మందికి ఫంక్షన్హాల్స్ దొరక్కపోవడంతో ఇండ్ల వద్ద, ఖాళీ స్థలాల్లో వివాహాలు చేయనున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో.. శ్రావణమాసం ప్రారంభం కావడంతో నేటి నుంచి నవంబర్ 26 వరకు వివాహాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారుగా లక్షా 10 వేలకు పైగానే జంటలు ఒకటి కానున్నాయి. ఇప్పటికే 300 లకు పైగా పెళ్లీలకు ముహూర్తాలు పెట్టాను. 80 రోజుల విరామం తర్వాత 4 నెలలకు పైగా శుభ ముహూర్తాలు ఉండటంతో వేల కొత్త జంటలు వివాహంతో ఒక్కటవుతున్నాయి.- వేలేటి జయరామశర్మ, వేద పండితులు, బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులుఇదీ చదవండి: కరిష్మా మాజీ భర్త సంజయ్ కపూర్ మరణంపై తల్లి సంచలన ఆరోపణలురెండు నెలల ముందే బుక్ పెళ్లిళ్లకు ఫంక్షన్హాల్స్ రెండు నెలల ముందే బుక్ అయ్యాయి. జులై, ఆగష్టు,సెపె్టంబర్లో జరిగే వివాహాలకు ముందు జాగ్రత్తగా చాలా మంది బుక్ చేసుకున్నారు. ఇంకా ఫంక్షన్హాల్స్ కావాలని వస్తున్నారు. కానీ, ఇప్పటికే బుక్ అయ్యాయని చెబుతుండటంతో ఎలా అంటూ ఆందోళన చెందుతున్నారు. – కోమటిరెడ్డి రజనికాంత్రెడ్డి,ఫంక్షన్హాల్ యజమాని,దుబ్బాకటెంట్హౌస్లకు ఫుల్ గిరాకీ పెళ్లిళ్ల సీజన్ కావడంతో ముందుగానే టెంట్హౌస్ సామగ్రిని బుక్ చేసుకుండ్రు. ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి. సుమారు 80 రోజులు శుభకార్యాలు లేకపోవడంతో ఖాళీగా ఉన్నాం. ప్రస్తుతం పెళ్లీ ముహూర్తాలు ఉండటంతో టెంట్హౌస్లకు గిరాకీ ఉంది. – దయాకర్రెడ్డి, టెంటుహౌస్ యజమాని -
ఇంటర్ పిల్లల్ని లొకేషన్ షేర్ చేయమంటే ఎలా? అర్థం చేసుకోరు!
సార్థక్ ఫ్రెండ్స్తో డిన్నర్కు వెళ్లాలి. వాళ్లు ఏదో కేఫ్ పేరు చెప్పారు. సాయంత్రం 7కు కలవాలి. వచ్చేసరికి తొమ్మిదిన్నర కావచ్చు. ఆ మాటే ఇంట్లో చెప్పాడు. ఇంటర్ పూర్తిచేసి బి.టెక్. జాయిన్ కాబోతున్నాడు సార్థక్.‘అయితే లైవ్ లొకేషన్ పెట్టు’ అన్నాడు తండ్రి. వాట్సప్లో లైవ్ లొకేషన్ పెడితే సార్థక్ ఎక్కడ ఉన్నాడో తెలుస్తూ ఉంటుంది. అలా పెట్టడానికి సార్థక్కు అభ్యంతరం ఏమీ లేదు. కాని అది పెట్టినప్పటి నుంచి ప్రతి పది నిమిషాలకు దానివైపే చూస్తూ వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు ట్రాక్ చేస్తూ, చెప్పిన చోట నుంచి లొకేషన్ కాస్త కదిలినా ఆందోళన పడుతూ పదేపదే తండ్రి ఫోన్లు చేస్తాడు. అదే విసుగు సార్థక్కు.‘నాన్నా... నేను చిన్నపిల్లాణ్ణా?’ అంటాడు. తండ్రి భయం తండ్రిది. నగరాల్లో తిరిగేటప్పుడు సేఫ్టీ ముఖ్యం. వాళ్లను ఒక కంట కనిపెడుతూ ఉండాలనే తప్ప సార్థక్ తప్పు పనులు చేస్తాడని కాదు. తండ్రి మనసు కొడుక్కు అర్థం కాదు. కొడుకు కోరుకుంటున్నది తండ్రికి అర్థమైనా నిస్సహాయుడు. ఇలాంటి వ్యవహార శైలే ఆడపిల్లలతో తల్లులది ఉంటుంది. వారు బయటకు వెళుతుంటే లొకేషన్ పెట్టమనడమే కాదు క్యాబ్లు, ఆటోలు తమ ఫోన్ నుంచి బుక్ చేసి ట్రాక్ చేస్తూ ఉంటారు కూడా.ఇంటర్ వయసు పూర్తయ్యిందంటే పిల్లలు పూర్తిగా తమ జాగ్రత్తలు తాము తీసుకోదగ్గ వయసుకు వచ్చినట్టే. బాధ్యత లేకుండా అతి నిర్లక్ష్యంగా ఉండే పిల్లలు తప్ప మిగిలిన అందరు పిల్లలూ జాగ్రత్తగా బయటకు వెళ్లి వద్దామనే అనుకుంటారు. ఏదైనా అవసరం వస్తే తప్పక తల్లిదండ్రుల సాయం అడుగుతారు. కాని ప్రతిసారి ప్రతి ఔటింగ్కు తల్లిదండ్రులు వెంటపడటం వారికి ఇబ్బంది కలిగించవచ్చు. లేదా సొంతగా తామే సందర్భాలను ఎదుర్కొని ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవడంలో ఆలస్యం కావచ్చు. అందుకే టీనేజ్ పిల్లలను సంయమనంతో అర్థం చేసుకోవాలి.భద్రతా? లేదా స్వేచ్ఛ?భద్రత ముఖ్యం అని తల్లిదండ్రులు అనుకుంటారు. స్వేచ్ఛ ఉండాలని పిల్లలు అనుకుంటారు. రెండూ ఉంటే బాగుండని ఇరుపక్షాలు అనుకుని ఏం చేయాలో ఆలోచించడం అన్ని విధాలా మేలు. ఇవాళ రేపు నగరాల్లోనే కాదు టౌన్లలో పల్లెల్లో కూడా టీనేజ్ అబ్బాయిలతో, అమ్మాయిలతో అపరిచితులు గాని, అసాంఘిక శక్తులు గాని ఎలా వ్యవహరిస్తున్నారో మనకు తెలుసు. అందుకే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అని పిల్లలకు చె΄్పాలి. అదే సమయంలో భద్రత కోసమని తల్లిదండ్రులు చేసే హంగామా పిల్లలకు ఏమాత్రం మంచిది కాదని ఇటీవల యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ చేసిన ఒక అధ్యయనంలో తేలింది. తల్లిదండ్రుల ఆందోళన చూసి పిల్లలు కూడా ఆందోళన పడతారని, కోపం, డిప్రెషన్ వంటి సమస్యలు వారిలో తలెత్తుతాయని ఆ అధ్యయనం హెచ్చరించింది.రిస్క్ లేనిది ఎక్కడ?ఈ విషయమై భారతీయ సైకియాట్రిస్ట్ డాక్టర్ శుక్లా ఏమంటారంటే ‘పిల్లలు బయటకు వెళ్లి మంచి చెడు వారికై వారే తెలుసుకోనివ్వండి. రిస్క్ కొద్దిగా తీసుకుంటే మంచిదే. రిస్క్ లేనిది ఎక్కడ? ఎక్కడైనా రిస్క్ ఉంటుంది. రిస్క్ను ధైర్యంగా ఎదుర్కోవడం ఎలాగో వారికి నేర్పడం తల్లిదండ్రుల విధి’ అంటారాయన. అందుకే తల్లిదండ్రులు ఓవర్ ప్రొటెక్టివ్గా ఉండటం కంటే పిల్లల్లో చైతన్యం నింపడం, వారికి బయటి పరిస్థితులు విశదపరచడం, ధైర్యంగా వ్యవహరించడం నేర్పాలి.∙పిల్లలకు సామాజిక స్థితిగతులు అర్థం చేయించాలి. వారిచేత న్యూస్ పేపర్లు చదివించడం, వార్తలు చూపించడం చేయాలి. తద్వారా తమ చుట్టూ ఏం జరుగుతుందో, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వారికి అర్థం చేయించాలి.పిల్లలు ఎక్కడికైనా వెళ్తామన్నప్పుడు మొండిగా వద్దనకూడదు. ముందుగా వివరాలన్నీ కనుక్కొని, అక్కడికి వారు ఎందుకు వెళ్తున్నారో, పనేమిటి, ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవాలి. అన్నీ విని, వెళ్లడం మంచిదే అనిపిస్తే పంపించాలి. కాదనిపిస్తే అది వారికి అర్థమయ్యేలా చెప్పాలి.పిల్లలు ఏది చెప్పినా కొట్టిపారేయడం, వారి మీద అరవడం, చేయి చేసుకోవడం చేయ కూడదు. దానివల్ల భయం ఏర్పడి, తల్లిదండ్రులతో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తారు. వారు చెప్పేది పూర్తిగా విని, వారితో స్నేహంగా మెలుగుతూ మంచీచెడూ చెప్పాలి.చదవండి: కుటుంబం తొలుత ఒప్పుకోకపోయినా..నిలిచి గెలిచిన ప్రేమికులు!పిల్లలకు సామాజిక బాధ్యత నేర్పే చిత్రాలు చూపించాలి. విజేతల ఆత్మకథలు, సమాజాన్ని అర్థం చేయించే పుస్తకాలు చదివించాలి. అందులోని అంశాలను వారితో చర్చించాలి. పిల్లలు బయటకు వెళ్తే ఏదో ప్రమాదం జరిగి΄ోతుందన్న ఊహ చేయకుండా, వెళ్లేచోట ఎలా మెలగాలో వారికి శిక్షణ అందించాలి. ఆడ, మగ తేడా లేకుండా అందరికీ స్వీయరక్షణ పద్ధతులు నేర్పించాలి.పిల్లల అనుమతి లేకుండా వాళ్ల ఫోన్లు చెక్ చేయడం, వారి వస్తువులు సోదా చేయడం చేయకూడదు. ఏదైనా అనుమానం ఉంటే వారిని అడిగి, వారి ముందే అలాంటివి చేయాలి తప్ప వారిని బయటివారిగా భావించి నిలదీయడం మొదలుపెడితే, వారు మరింత జాగ్త్రత్త పడి చెడుదారులు తొక్కుతారు.పిల్లల స్నేహితులెవరో, వారి తల్లిదండ్రులెవరో తెలుసుకుంటూ ఉండాలి. వారు మీ పిల్లలకు ఎలాంటి విషయాలు నేర్పిస్తున్నారో అంచనా వేస్తూ ఉండాలి. బయటెక్కడో కాకుండా మీ ఇంట్లోనే వారు ఎక్కువగా కలిసే ఏర్పాటు చేయాలి. దీనివల్ల పిల్లలకు మీ మీద నమ్మకం ఏర్పడుతుంది. పిల్లల్ని అందరిముందూ అవమానించడం, అనుమానించడం, ఎందుకూ పనికి రావంటూ తిట్టడం చేయకూడదు. ఇతరులతో పోలిక తెచ్చి వారిని తక్కువ చేయకూడదు. వారికి ఏ రంగంలో ఆసక్తి ఉందో ఆ రంగంలో ఎదగనివ్వాలి. చదవండి: కరిష్మా మాజీ భర్త సంజయ్ కపూర్ మరణంపై తల్లి సంచలన ఆరోపణలువయసురీత్యా పిల్లల్లో వచ్చే మార్పులను గమనించి, వారితో ఆ విషయాలు నిర్భయంగా చర్చించాలి. తామూ ఆ దశ దాటి వచ్చామని చెప్తూ తమ అనుభవాలు వివరించాలి. దీనివల్ల వారిలో ఉండే అయోమయాలు దూరమవుతాయి. -
సంజన... ఐరన్ మ్యాన్
అత్యంత ఓర్పు నేర్పులతో మానసిక, శారీరక సామర్థ్యాలను ఉక్కు సంకల్పంతో పరిరక్షించుకుంటూ ఏదైనా సాధించగలం అని నిరూపిస్తోంది బొమ్మినేని సంజనారెడ్డి. ఐరన్ మ్యాన్ ప్రపంచ ఛాంపియన్ షిప్కు అర్హత సాధించిన ఈ హైదరాబాద్ వాసి ‘సంకల్పం గట్టిదైతే ఏదైనా సాధ్యమే!’ అంటున్నారు.ఈ ఏడాది అక్టోబర్లో హవాయిలోని కోనాలో జరగనున్న ప్రతిష్టాత్మక ఐరన్మ్యాన్ ప్రపంచ ఛాంపియన్ షిప్కు అర్హత సాధించారు బొమ్మినేని సంజనారెడ్డి. 18–24 ఏళ్ల విభాగంలో ఆమె ఈ స్థానాన్ని సాధించారు. గత జూన్లో ఆస్ట్రేలియాలో జరిగిన అల్ట్రా–ఎండ్యూరెన్స్ ట్రయాథ్లాన్ను 15 గంటల 22 నిమిషాల 13 సెకన్లలో పూర్తి చేశారు. లండన్లో అర్బన్ ఎకనామిక్ డెవలప్మెంట్లో ఎంఎసీ చేస్తున్న సంజన ప్రస్తుతం హైదరాబాద్లోనే శిక్షణ తీసుకుంటున్నారు. ఐరన్మ్యాన్లో తన అడుగు ఎలా మొదలయ్యిందో వివరించారు.కఠినమైన శిక్షణ‘‘స్కూల్ టైమ్లో నేనూ మా చెల్లెలు స్విమ్మింగ్ క్లాసులకు వెళ్లేవాళ్లం. స్విమ్మింగ్లో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. డిగ్రీ చేయడానికి యూకే వెళ్లాను. థర్డ్ ఇయర్లో ఐరన్మ్యాన్ గురించి తెలిసి, శిక్షణ తీసుకున్నాను. మాస్టర్స్ కూడా యుకెలోనే. శిక్షణ తీసుకుంటూ గత జూన్లో ఆస్ట్రేలియాలోని కైర్న్స్లో జరిగిన ఐరన్మ్యాన్లో పాల్గొన్నాను. సైక్లింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ ఈ మూడూ నిర్ణీత టైమ్లో పూర్తి చేయాలి. వరల్డ్ ఐరన్ మ్యాన్ 1978లో ఆరంభం అయింది. అయితే, ఇప్పటివరకు మన దేశం నుంచి నా ఏజ్ క్యాటగిరీలో ఎంపిక అయిన వారిలో నేనే మొదటి స్థానంలో ఉన్నాను. మొదట వారానికి 20 గంటలు, రోజూ 3–4 గంటలు ట్రైనింగ్ ఉంటుంది. రేస్ టైమ్ దగ్గర అవుతున్న కొద్దీ ట్రైనింగ్ సమయం పెరుగుతుంది. యూకేకి చెందిన కోచ్ ద్వారా ఆన్లైన్లో సూచనలు తీసుకుంటూ రోజుకు ఐదు నుండి ఆరు గంటలు శిక్షణ తీసుకుంటున్నాను.తప్పుకోవాలనుకున్న క్షణాలూ తప్పలేదు!మొదట్లో కఠిన సాధన వల్ల రేసు నుండి తప్పుకోవాలనిపించిన క్షణాలు చాలా ఉన్నాయి. కానీ లక్ష్యం ఐరన్ మ్యాన్ ను పూర్తి చేయడం మాత్రమే కాదు, ప్రారంభించిన దాన్ని ఎలాగైనా పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకే అడుగు వేశాను. ఈ అడుగు మరికొందరికి ప్రేరణగా మారాలి అనుకున్నాను. సౌకర్యమైన జీవనంలో ఉంటే మన సామర్థ్యాలు ఏవీ తెలియవు. ఈ రోజుల్లో దాదాపు అందరం చాలా సౌకర్యాలకు అలవాటుపడిపోతున్నాం. అది ఓవర్ అవుతుంది కూడా. దీనివల్ల మన మీద మనకే కాదు, ఎదుటివారి మీద కూడా గౌరవం రాదు. మనలో ఎంతటి శక్తి ఉందో గుర్తించాలి. ఆ శక్తిని వెలికి తీయడానికి నిరంతరం ప్రయత్నించాలి. అప్పుడే మనమేంటి.. అన్నది తెలుస్తుంది. ఒకసారి మనమా శక్తిని గ్రహించగలిగామంటే మనపై మనకే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. మహిళగా అది చాలా ముఖ్యం. నేనేం సాధించాలో తెలుసుకునే బ్రేకింగ్ పాయింట్కు చేరుకోవాలనుకున్నాను. చాలావరకు మన చుట్టూ ఉన్నవారే తొక్కేయడానికే చూస్తుంటారు. వాటిని అడ్డుకుంటూనే నాలో ఆత్మవిశ్వాసం, సాధికారతను గుర్తించాను.వ్యాపారంలోనూ రాణించాలని..మహిళగా ఈ రేస్లో పాల్గొనడానికి పీరియడ్స్ టైమ్ అసౌకర్యంగా ఉంటుంది. కొంతమందికి చాలా నొప్పి, క్రాంప్స్ వస్తాయని విన్నాను. నాకు అలా ఏమీ కాలేదు. ఆస్ట్రేలియాలో జరిగిన రేస్లో పీరియడ్స్ టైమ్లోనే పాల్గొన్నాను. ఏమీ ఇబ్బంది అనిపించలేదు. మానసిక, శారీరక ప్రయోజనాలు క్రీడల్లోనే సాధించగలమని తెలుసుకున్నాను. స్పోర్ట్స్లో మనం రొటీన్ ఫుడ్ తీసుకుంటే ఇబ్బంది పడతాం. ఎనర్జీ బేస్డ్ సప్లిమెంట్స్ తప్పనిసరి అవసరం. దీంతో ఇండియాలో స్పోర్ట్స్ సప్లిమెంట్ బిజినెస్ రంగంలో రాణించాలని ఆలోచన కలిగింది. అమ్మానాన్నలు వెంకట్రెడ్డి, స్వప్న ఇద్దరూ వ్యాపార రంగంలోనే ఉన్నారు. కూతుళ్లమైనా మా ఆలోచనలను పాజిటివ్గా తీసుకుంటారు. నా చిన్నప్పటి నుంచి స్కేటింగ్, టెన్నిస్, తైక్వాండ్, భరతనాట్యం... సాధన చేస్తూ ఉన్నాను. వీటితో పాటు చేసిన స్విమ్మింగ్ ఐరన్మ్యాన్ వరకు తీసుకెళ్లింది. ఈ విషయంలో అమ్మ నన్ను చాలా ఫుష్ చేశారు. ఈ రేసులో పాల్గొనే అమ్మాయిలు 20 శాతం వరకే ఉన్నారు. ఇండియాలో ఆరేడేళ్లుగా హాఫ్ ఐరన్మ్యాన్ జరుగుతోంది. గోవాలో జరిగే ఈ ఈవెంట్లో పాల్గొనేవారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. మన దేశంలో ఫుల్ ఐరన్మ్యాన్ వస్తే చాలా మంది అమ్మాయిలు ఈ రేసులో పాల్గొని తమని తాము నిరూపించుకునే అవకాశం ఉంది’’ అని తెలిపారు సంజన. – నిర్మలారెడ్డి -
కరిష్మా మాజీ భర్త సంజయ్ కపూర్ మరణంపై తల్లి సంచలన ఆరోపణలు
వ్యాపారవేత్త, నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, సంజయ్ కపూర్ ఆకస్మికమరణంపై ఆమె తల్లి సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మరణించిన నెల రోజుల తర్వాత తన కొడుకు మరణాన్ని అనుమానాస్పదం అని పేర్కొంటూ కొన్ని దిగ్భ్రాంతికర వాదనలు చేశారు. సంజయ్ మరణం తర్వాత ప్రజలు, కుటుంబ వారసత్వాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.సోనా కామ్స్టార్ మాజీ ఛైర్మన్ సంజయ్ కపూర్ (కెనడాలో జూన్ 12న) పోలో ఆడుతూ మరణించడం అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. తేనెటీగ కుట్టడం వలన గుండెపోటు వచ్చి చివరికి అతని మరణం సంభవించిందని వార్తలొచ్చాయి. తాజాగా ఆయనతల్లి రాణి కపూర్ తన కొడుకు ఆకస్మిక మరణంపై అనుమానాలు వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. కొడుకు మరణం అనుమానాస్పదం, అంతేకాదు సోనా కామ్స్టార్వార్షిక సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేయమని కోరుతూ లేఖ రాశారు. తన కొడుకు మరణంపై అనేక చిక్కు ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదని వాపోతోంది. తన ఏకైక కుమారుడు మరణంపై వచ్చిన వార్తలన్నీ ఊగాహానాలేనని, యూకేలో చెప్పుకోలేని పరిస్థితులలో చనిపోయాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని సార్లు అడిగినా తన కొడుకు మరణానికి సంబంధించిన వివరాలు అందండం లేదు. సంబంధిత సమాధానాలు, పత్రాలు నాకు అందలేదు. ఇంత దుఃఖంలో కొంతమంది కుటుంబ వారసత్వాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారుఅంతేకాదు సంజయ్ కపూర్కు ఖాతాలకు యాక్సెస్ను కూడా నిరాకరించారట. సంజయ్ మరణించిన ఒక నెలలోనే ఎంపిక చేసిన కొద్దిమందికే దీనికి అవకాశం కల్పించారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. తనకు అర్థం కాని పత్రాలపై సంతకం చేయమని బలవంతం చేశారని కూడా పేర్కొన్నారు. ఏమి రాసి సందో అర్థం చేసుకునేంత భావోద్వేగ స్థితిలో తాను లేనని, తీవ్ర మానసిక, మానసిక వేదన పడుతోంటే, నాలుగ్గోడల మధ్య పత్రాలపై సంతకం చేయమని బలవంతం చేశానంటూ షాకింగ్ వాదనలు చేశారు.ఏజీఎం ఆపాలని లేఖ, లేని పక్షంలో కేసు అవుతుందని హెచ్చరికతన దివంగత భర్త సురీందర్ కపూర్ ఎస్టేట్కు ఏకైక లబ్ధిదారురాల్ని తానేని, సోనా కామ్స్టార్తో సహా సోనా గ్రూప్లో మెజారిటీ వాటాదారుని రాణీ తన లేఖలో పేర్కొన్నారు. సంజయ్ కపూర్ తల్లిగా మాత్రమే కాకుండా, కపూర్ కుటుంబ అధిపతిగా, కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా తాను వ్రాస్తున్న ఈ లేఖను బోర్డు,వాటాదారులు నిర్లక్ష్యం చేస్తే కంపెనీ యొక్క దుర్వినియోగం నమ్మక ఉల్లంఘన కేసు అవుతుందని కూడా ఆమె స్పష్టం చేశారు.మరోవైపు AGM ఇప్పటికే ప్రారంభమైందని, సంజయ్ కపూర్ భార్య ప్రియా సచ్దేవ్ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉందని నివేదికలు తెలిపాయి.కాగా పలు నివేదిక ప్రకారం, రూ. 39 వేల కోట్ల ఆస్తిని సంజయ్ కపూర్, అతని ఇద్దరు సోదరీమణులు, సూపర్నా మోట్వానే , మందిరా కపూర్ మధ్య విభజించే అవకాశం ఉంది. దీనిపై ఎలాంటి ధృవీకరణ లేనప్పటికీ, సంజయ్ తన సోదరి మందిరాతో గత నాలుగేళ్లుగా వివాదం నడుస్తోంది. ఇది ఇలా ఉంటే సంజయ్మరణం తరువాత అతని మూడవ భార్య ప్రియా సచ్దేవ్ను కంపెనీకి నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా జెఫ్రీ మార్క్ ఛైర్మన్గా ఎంపికయ్యారు.