breaking news
Family
-
కొత్త ఆలోచనలను మనసులో ఎలా నాటాలి?
మనం మట్టిలో ఒక విత్తనాన్ని వేయగానే అది చెట్టు అవ్వదు కదా! దానికి నీరు, ఎరువు, సరైన సమయం కావాలి. అలాగే, మన మనసులో కొత్త ఆలోచనలను నాటడం (Planting Ideas) కూడా ఒక కళ. దీన్నే మనం 'The Build Stage' అంటాం.మనసు ఒక సారవంతమైన భూమి లాంటిది. మీరు అందులో ఏది నాటితే అదే పెరుగుతుంది. మీరు ఇప్పటివరకు మీ మనసులో 'నేను ఓడిపోతాను', 'నేను ఎవరికీ పనికిరాను' అనే కలుపు మొక్కలను నాటారు. ఇప్పుడు ఆ స్థానంలో 'విజయం', 'అద్భుతమైన వ్యక్తిత్వం' అనే విత్తనాలను నాటే సమయం ఆసన్నమైంది.1. The Germination of an Ideaఒక ఆలోచన మనసులో స్థిరపడాలంటే దానికి ఒక క్రమపద్ధతి ఉంటుంది.Exposure: ముందుగా మీరు కొత్త ఆలోచనలకు మీ మనసును తెరవాలి, గొప్ప వ్యక్తులను కలవడం, కొత్త పుస్తకాలు చదవడం లాంటివి చేయాలి. Acceptance: ‘‘ఆ ఆలోచన నా జీవితానికి ఉపయోగపడుతుంది" అని మీరు నమ్మాలి.Repetition (పునరావృతం): ఆ ఆలోచనను రోజుకు వందసార్లు మీ మెదడుకు గుర్తు చేయాలి.2. మెదడును ఎలా రీ-వైర్ చేయాలి? (Neuroplasticity)మనం చేసే పనులను బట్టి మన మెదడులోని నాడీ మార్గాలు (Neural Pathways) మారిపోతాయి. దీన్ని సైకాలజీలో 'Neuroplasticity' అంటారు. మీరు ఒకే నెగటివ్ ఆలోచనను పదే పదే చేస్తే, మీ మెదడు దానికి అలవాటు పడిపోతుంది. అలాగే, మీరు కొత్త ఆలోచనను పదే పదే ప్రాక్టీస్ చేస్తే, మెదడు దాన్ని ఒక కొత్త 'హైవే' లాగా మార్చేస్తుంది.3. నిజమైన 'బిల్డ్' పద్ధతిమోటివేషన్ "ఒకే రోజులో నీ లైఫ్ మార్చేయ్, రేపటి నుండే కొత్తగా ఉండు" అని చెప్తుంది. ఇది ఒక అబద్ధం, ఎందుకంటే 20 ఏళ్ల అలవాటు ఒక్క రోజులో పోదు. సైకాలజీ కొత్త ఆలోచనను చిన్న చిన్న పనుల ద్వారా ప్రాక్టీస్ చేయమంటుంది (Incremental Building). ఉదాహరణకు, మీరు 'కాన్ఫిడెంట్' అవ్వాలనుకుంటే, ఒకే రోజులో స్టేజ్ ఎక్కక్కర్లేదు. ముందు అద్దం ముందు మాట్లాడండి, ఆ తర్వాత స్నేహితుల ముందు మాట్లాడండి. ఇది నిజమైన 'బిల్డ్' పద్ధతి.4. మీ మనసులో కొత్త పంట!Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, మీ కొత్త పర్సనాలిటీని ఎలా నిర్మించాలో చూద్దాం.Step 1: కలుపు మొక్కల తొలగింపు (Break)మీ పాత భయాలు, నమ్మకాలు ఒక 'కలుపు' లాంటివి. పాత పద్ధతిలో "నేను చేయలేను" అనే నెగటివ్ సెల్ఫ్-టాక్ ఎక్కడ మొదలవుతుందో అక్కడ 'బ్రేక్' చేయండి. అది రాగానే దాన్ని తుడిచేయండి.Step 2: నిర్మాణాత్మక ఆచరణ (Build)కొత్త ఆలోచనలకు మద్దతు ఇచ్చే వాతావరణాన్నిబిల్డ్ చేయండి. మీ లక్ష్యానికి సంబంధించిన వ్యక్తులతో తిరగండి, ఆ విషయాలపైనే వినండి. ఏ ఆలోచనను మీరు పదే పదే వింటారో, అదే మీ పర్సనాలిటీగా మారుతుంది. ఇది 'నిర్మాణం' (Build).Step 3: ఆటోమేషన్ (Beyond)ఒక్కసారి కొత్త ఆలోచన మీ సబ్-కాన్షియస్ మైండ్ లోకి వెళ్తే, ఇక మీరు కష్టపడక్కర్లేదు. అది మీ ప్రవర్తనలో, మీ మాటల్లో ఆటోమేటిక్గా కనిపిస్తుంది. మీరు మారుతారు, మీ జీవితం మారుతుంది. ఇదే 'Beyond' స్టేజ్.5. మీ మనసులో ఏముంది?ఈ రోజు ఒక చిన్న విశ్లేషణ చేయండి.ఈ వారం మీరు నాటాలనుకుంటున్న ఆ ఒక్క 'కొత్త ఆలోచన' ఏంటి?దాన్ని నాటడానికి మీరు వేస్తున్న మొదటి చిన్న అడుగు ఏంటి?మీరు నాటబోయే ఆ విత్తనం రేపు ఎలాంటి ఫలాలను (Results) ఇస్తుంది?మీరే మీ తోటమాలి!బ్రో, మనసు అనే తోటలో కలుపు మొక్కలు వాటంతట అవే వస్తాయి, కానీ మంచి మొక్కలు మనం నాటుకోవాలి. మీరు మీ మైండ్కి తోటమాలి లాంటివారు. ఏ ఆలోచనను పెరగనివ్వాలో, దేన్ని తీసేయాలో నిర్ణయం మీదే. మీ కొత్త వ్యక్తిత్వాన్ని ఒక అద్భుతమైన తోటలా నిర్మించుకోండి.గుర్తుంచుకోండి, "Your life is the harvest of your thoughts." -
"ఉగాది" రోజునే పంచాంగ శ్రవణం ఎందుకంటే..?
తెలుగు సంవత్సరాల ప్రకారం చైత్రమాసంలోని పాడ్యమితో కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ రోజునే ఉగాది పండుగ జరుపుకుంటారు. ఆ రోజు ప్రముఖంగా ఆచరించేది పంచాంగ శ్రవణం. ఈ రోజునే ఎందుకంటే..తెలుగు సంవత్సరాది ప్రారంభమయ్యేది ఆ పర్వదినంతోనే కాబట్టి. ఉగాది రోజున ఆలయంలోగానీ, ఓ ఆధ్యాత్మిక ప్రదేశంలో గానీ పండితుల సమక్షంలో పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. మరి అంత విశిష్టత గల పంచాంగ శ్రవణం వల్ల కలిగే ప్రయోజనాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండబోతున్నాయి? ఏరువాక ఎలా సాగాలి? లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి అదోక దిక్సూచిలా ఉండేది. శుభకార్యాలు, పూజా పునస్కారాలు, పితృదేవతారాధన, వంటి విషయాలకు వచ్చేటప్పటికి పంచాంగమును వాడుతుంటారు. ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి, మళ్లీ ఏడాది వచ్చే ఉగాది ముందురోజు వరకు అమలులో ఉంటుంది. అటువంటి పంచాంగమును ఉగాదినాడు వివిధ దేవతలతోపాటు పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు. అంటే నవనాయకులను తెలుసుకుని వారిద్వారా ఫలాలను అంచనా వేస్తారు.సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ సంవత్సర నవ నాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి.రాజు - చాంద్రమాన సంవత్సర ప్రారంభదిన వారాలకి అధిపతి ఆ సంవత్సరానికి రాజు.మంత్రి - సౌరమాన సంవత్సర ప్రారంభదిన వారానికి అధిపతి ఆ సంవత్సరానికి రాజు.సేనాధిపతి - సూర్యుడు సింహరాశికి ప్రవేశించేనాటి వారానికి అధిపతి.సస్యాధిపతి - సూర్యుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశించేనాటి వారానికి అధిపతి.పంచాంగకర్తలు తమ పంచాంగాల్లో ఈ క్రింద శ్లోకంతో పంచాంగ రచన కుపక్రమిస్తారు.తిధిః వారంచ నక్షత్రం యోగః కరణమేవ చపంచాంగమితి విఖ్యాతం కాల్కోయం కర్మసాధకతిధి వారము, నక్షత్రము, యోగము, కరణము అనునవి ఐదు అంగములు కలది కనుక ‘పంచాంగం’ అన్నారు. మానవుల జీవితాలు కాలంపైన, కాలం గ్రహాల సంచారంపైన ఆధారపడి ఉన్నాయి. గ్రహాల సంచారంపై జ్యోతిష శాస్త్రం ఆధారపడి ఉంది. మనిషి పుట్టినది మొదలు గిట్టేవరకు వాని భవిష్యత్తు గ్రహ సంచారంమీద ఆధారపడి ఉంటుంది. మనిషి జన్మించిన సమయం తిథి, వారం, నక్షత్రములను బట్టి జాతక రచన జరుగుతుంది. ఈ వివరణలన్నిటికీ పంచాంగమే ప్రమాణము. పంచాంగం మనిషి యొక్క జాతక ఫలాన్ని తెలుపుతుంది. పంచాంగం ఏఏ ఫలాలనిస్తుందో జ్యోతిష శాస్తజ్ఞ్రులు ఇలా చెప్పారు.తిధేశ్చ శ్రీయమాప్నోది వారాదాయుష్మవర్ధనీమ్నక్షత్రాద్హరతే పాపమ్ యోగాద్రోహ నివారణమ్కర్ణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగం దశమే ఫలమ్కాల విత్కర్మకృద్ధీమాన్ దేవతానుగ్రహం లభేత్సంపదల కోరేవారు తిథియందు, దీర్ఘాయువు కోరేవారు వారం యందు, పాప విముక్తిని పొందగోరేవారు నక్షత్రమునందు, ఆరోగ్యము అభిలషించేవారు యోగమునందు, కార్యసిద్ధిని కాంక్షించేవారు కరణముయందు శ్రద్ధ వహించాలని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. శాస్త్రం పంచాంగం గురించి ఇంకా ఏమి చెప్పుచున్నదంటే.‘‘ శ్రీ కల్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్నదో షారుహంగంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాంఆయుర్వర్థన ముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రాదంనానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ మాకర్ణ్యతాం’’.ఇది శుభాన్ని, మంగళాన్ని ఇచ్చేది, శత్రువులను హరించేది, దుస్స్వప్నాలను దోషాలను తొలగించేది; గంగాస్నాన ఫలం ఇచ్చేది, గోదాన ఫలం ఇచ్చేది, సత్సంతానాన్ని ప్రాప్తింపజేసేది అంటూ అందరూ పంచాంగం ప్రయోజనాన్ని పొందాలని ఆకాంక్షించింది.పంచాంగశ్రవణం చేసిన వారికి సూర్యభగవానుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని, గురుడు-సంపదను, కుజుడు- శుభాన్ని, బుధుడు-బుద్ధిని, కుజుడు- సుఖాన్ని, శని- ఐశ్వర్యాన్ని, రాహువు- బాహు బలాన్ని, కేతువు-కులాధిక్యాన్ని కలిగిస్తారు.ప్రతి ఒక్కరు సాయంత్రం దేవాలయాలలో లేదా సత్సంగాలలో పంచాంగ శ్రవణం చేయడం తప్పనిసరి అని స్పష్టపరిచింది శాస్త్రం. జ్యోతిషశాస్త్ర రీత్యా తెలియజేసే ఫలితాలను తెలుసుకుని, ఆసంవత్సరంలో తాము తీసుకోబోయే లేదా ఆచరించవలసిన కార్యక్రమాలకు తగు విధమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఆస్కారం కలుగుతుంది.(చదవండి: ఉగాది పండుగ నాడు తప్పక ఆచరించాల్సినవి...!) -
చైత్రమాసం విశిష్టత..! తెలుగు సంవత్సరాలు ఎలా ఏర్పడ్డాయంటే..
“ఋతూనాం కుసుమాకరాం” అని భగవానుడు స్వయంగా తానే "వసంత"ఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం.సంవత్సరానికి తొలి మాసం కూడా. చైత్రమాసం అనగానే మనకి "ఉగాది, "శ్రీరామనవమి" గుర్తుకొస్తాయి. అవే కాదు, దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం, యజ్ఞ వరాహమూర్తి జయంతి, సౌభాగ్యగౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి.అలా చైత్ర మాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక, అనేక ఆధ్యాత్మిక, పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమినాడు చిత్త నక్షత్రంతో కూడి ఉంటాడు. సూర్యుడు కూడా మొదటిరాశియైన మేషరాశిలో సంచరిస్తున్నాడు.ప్రభవ నామ సంవత్సరంతో ప్రారంభమైన తెలుగు సంవత్సరాలు అక్షయతో ముగుస్తాయి. అంటే మనిషి పుట్టిన సంవత్సరం నుంచి తిరిగి అరవై ఏళ్ల తర్వాత అదే సంవత్సరం మొదలువుతుంది.అప్పటి నుంచి మళ్లీ బాల్యావస్థ మొదలవుతుంది.అంటే చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. అకారణంగా అలగడం, అవీ.. ఇవీ తినాలని అడగటం, చిన్న చిన్న దొంగతనాలు చేయటం, ఎక్కువసేపు నిద్రపోవటం, చిన్న విషయాలకే ఆనంద పడటం, కోపం తెచ్చుకోవటం, కన్నీళ్లు పెట్టుకోవడం ఇలాంటి బాల్య చేష్టలన్నీ అరవైఏళ్ల నుంచి నెమ్మదిగా ప్రారంభమవుతాయి.ప్రతి కొడుకూ అరవై సంవత్సరాలు వచ్చిన నాటి నుంచి తన తండ్రిని తన బిడ్డలతో సమానంగా చూసుకోవాలని ధర్మశాస్త్రం చెబుతోంది. ఆరుపదుల జీవితాన్ని ఎవరైతే ఆనందంగా జీవిస్తారో వారి జీవితం ధన్యం. ఆ ధన్యజీవితపు జ్ఞాపకార్థమే బిడ్డలు, మనవళ్లు బంధువులు మిత్రులు కలిసి ‘షష్టిపూర్తి చేస్తారు’.ఇక ధర్మశాస్త్రం ప్రకారం చూస్తే..కృత, త్రేతా, ద్వాపర యుగాల్లో మానవ ఆయుర్దాయం 180 సంవత్సరాలు.కలియుగానికి వచ్చే సరికి కలి ప్రభావంతో 120 సంవత్సరాలకు పడిపోయింది.అందుకే 60ఏళ్లు పూర్తవగానే షష్టి పూర్తి చేస్తారు. అంటే దీనర్థం. మొదటి 60ఏళ్లు పూర్తవగానే లోక సంబంధ విషయాలు పూర్తయినట్లు భావించాలి.మిగిలిన 60ఏళ్లు ఆధ్యాత్మిక చింతనతో బతకాలని ధర్మశాస్త్రం చెబుతోంది.తెలుగు సంవత్సరాలు ఎలా ఏర్పడ్డాయంటే..ఒకానొక సమయంలో నారద మునీంద్రుడు తానంత గొప్ప భక్తుడు లేడని, ఆ గర్వంతో విర్ర వీగుతున్నాడట. అప్పుడు శ్రీమహా విష్ణుడు అతడికి జ్ఞాన బోధ చేయాలని తలంచాడు. దీంతో నారదుడిని మాయ ఆవరించేలా చేసి ఒక సరస్సు తీసుకెళ్లి అందులో దిగి స్నానం చేయమన్నాడు. నారదుడు అందులో దిగి స్నానం చేయగానే, ఒక్కసారి పూర్వ స్మృతిని మర్చిపోయి, స్త్రీ రూపం ఎత్తాడు.అదే సమయంలో దారితప్పి అక్కడకు వచ్చిన ఓ మహారాజును చూసి మోహించి, వివాహం చేసుకుని 60మంది పిల్లలను కన్నాడు. వారే.. ప్రభవ.. విభవ.. శుక్ల.. చివరిగా అక్షయ. వారంతా ఒకరి తర్వాత ఒకరు యుద్ధంలో మరణిస్తుండటంతో పుత్రశోకంతో ఉండిపోయాడు. సంసార సాగరంలో మునిగిపోయి అసలు తానెవరో మర్చిపోయాడు. అప్పుడు నారదుడిని ఆవరించిన మాయను శ్రీహరి తొలగించి, ఇదీ సంసారం అంటే.. నీవు ఏదో గొప్ప భక్తుడవని భావిస్తున్నావు. అని జ్ఞానబోధ చేశాడట. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని విష్ణుమూర్తి వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.(చదవండి: -
'ఉగాది' అంతరార్ధం? ఆ కారణంగానే ఈ పండుగను..
భాషాపరంగా యుగాది సరైన పదం. ఉగాది అనే పదం వికృతిపదం. అయితే రెండూ ఒకే అర్థాన్ని బోధించే పదాలే. నిజానికి “యుగాది” అనే పదమే కాలాంతరంలో 'ఉగాది'గా మారింది. సోమకాసురుని నుండి వేదాలను విష్ణువు రక్షించిన రోజు ఉగాది. నూతన కల్పంలో జగత్తు సృష్టిని బ్రహ్మ ప్రారంభించిన రోజు. ఆరు రుచుల కలయికతో అనారోగ్యాలను అంతం చేసేది ఉగాది. హిందువుల పండుగల సంప్రదాయానికి మొదలు ఉగాది. వరాహమిహిరుడు ఈ ఉగాది నాడే పంచాంగాన్ని పరిచయం చేశాడని అంటారు. శ్రీరా ముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు మొదలైన వారు ఉగాదినాడే పట్టాభిషిక్తులైనారని ఆర్యులు చెబుతారు. సంవత్సరాది నాడు ప్రజలు తెల్లవారక ముందే నిద్ర లేచి, కాలకృ త్యాలు తీర్చుకొని, తలకు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి, ఇష్టదైవానికి పూజలు చేసి, షడ్రుచుల పచ్చడిని ఆరగించాలి. నిర్ణీత సమయంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం చేయాలి.తిథిర్వారం చ నక్షత్రం యోగః కరణమేవ చ,పంచాగస్య ఫలం శృణ్వన్ గంగాస్నాన ఫలం లభేత్.తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే పంచాంగ శ్రవణం వల్ల గంగా స్నానంతో సమానంగా పుణ్యం, పురు షార్థం లభిస్తుందని పై శ్లోకం చెబుతున్న భావం. కొత్త సంవత్సరంలో గ్రహ, రాశిఫలాల్లో, నామ నక్షత్రాల్లో తేడా వస్తే దోషనివారణ కోసం శాంతి హోమాలు, వ్రతాలు, పూజలు చేసి సుఖశాంతులతో ప్రజలు జీవించడానికి పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుంది. నవగ్రహాల్లో సూర్యుడు తేజస్సును, చంద్రుడు భోగభాగ్యాలను, కుజుడు శుభాలను, బుధుడు బుద్ధి వికాసాన్ని, గురుడు జ్ఞాన విత్తాన్ని, శుక్రుడు కార్యసిద్ధిని, శనీశ్వరుడు దుఖ వినాశాన్ని, రాహువు సంతోషకరమైన రాణింపును, కేతువు చెప్పుకోదగి నంత గొప్పదనాన్ని కలిగిస్తారని విద్వాంసులు చెబుతారు.ఆరోగ్యమనే మహాభాగ్యాన్ని కలిగించేది ఉగాది పచ్చడి. శాస్త్రవచనాల్లో దానికి నింబకుసుమ భక్షణం, అశోకకళికా ప్రాశనం అనే పేర్లు కూడా ఉన్నాయి. తీపి, ఉప్పు, చేదు, వగరు, పులుపు, కారం సమపాళ్లలో కలిపి ఈ పచ్చడిని తయారు చేస్తారు. తీపికి బెల్లం, ఉప్పునకు ఉప్పు, చేదుకు వేపపూత, వగరుకు మామిడి ముక్కలు, పులుపునకు చింత పండు, కారమునకు మిరియాలు ఉగాది పచ్చడిలో వాడు తారు. వీటికి తోడు తమతమ ఇష్టాలను బట్టి జీలకర్ర, అరటిపండ్లు, ఎండుద్రాక్ష, జీడిపప్పు వంటివి కూడా కలిపి గొప్ప ఔషధంగా ఆరగిస్తారు. ఈ పచ్చడిని చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు ఒక పక్షం రోజులు సేవిస్తే వాత, పిత్త, కఫములకు చెందిన రోగాలన్నీ పటాపంచలవుతాయని వైద్యశాస్త్రం చెబుతుంది. భారతదేశంలో ఆంధ్ర రాష్టేతరులు సైతం సంవత్సరాది ఉత్సవాలను జరుపుకుంటారు. తమిళులు, మళయాళీలు, మరాఠీలు, సిక్కులు ఈ పండుగను జరుపుకోవడం విశేషం.(చదవండి: ఉగాది పండుగ నాడు తప్పక ఆచరించాల్సినవి...!) -
ప్రతి రుచీ ఆస్వాదిస్తూ...
ఈ కాలపు జనరేషన్కి ఉగాది గురించి ఏం తెలుసు? అనేవారున్నారు. ఈ డిజిటల్ యుగంలో బిజీగా ఉండే నవతరానికి తెలుగింటి సంప్రదాయం ఎంత పరిచయం? తెలుసుకోవడానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, స్టూడెంట్లు కొందరిని పలకరించింది సాక్షి ఫ్యామిలీ. వారి స్పందన ఇక్కడ ఉంది. చదివాక మీరంటారు మన పిల్లలు తెలుగుదనాన్ని కొనసాగిస్తున్నారనీ... తెలుగుదనానికి అద్దం పడుతున్నారనీ.... యుగం + ఆది, ఒక కొత్త యుగానికి ఆరంభం,బ్రహ్మదేవుని సృష్టికి ఆయువు పోసిన క్షణం,కాలం మొదటి అడుగు వేసిన సమయం.మామిడి తోరణాల అలికిడి,ప్రకృతితో మన అనుబంధానికి గుర్తు.పంచాంగ శ్రవణ జ్ఞాననాడి,భవిష్యత్తు అనే కాలాన్ని గౌరవించే గుర్తు.చిగురించిన కొమ్మలు, వికసించిన పువ్వుల సందడి,మళ్ళీ మొదలుపెట్టమని ఒక ఆశల పల్లకికి గుర్తు.కొత్త వస్తువుల హడావిడి,కొత్త ఆలోచనలను ఆహ్వానించడానికి గుర్తు.బ్రహ్మదేవుని సృష్టిని మొదలుపెట్టిన శుభముహూర్తం,మన తెలుగు సంస్కృతికి ఒక మొదటి అధ్యాయం,ప్రతి గుండెలో వెలుగు నింపే ఆనందం, ఉగాది ఉదయం,ఇంటిని శుభ్రం చేయడం మాత్రమే కాదు,మన మనసులోని బాధల్ని శుభ్రం చేయడం.ఉగాది పచ్చడిలో ఉన్న రుచులు,తీపి, కారం, పులుపు, చేదు, ఉప్పు, వగరు,మన జీవితంలోని భావాలు,ప్రతి రుచిని అంగీకరించండి మీరు.ఉగాది అంటే మారుతున్న కాలం కాదు,మారుతున్న మనసు, జీవితం,కొత్త ఆశ, కొత్త ప్రయాణం,అది అనుసరించడం ముఖ్యం.అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.– చిక్కాల షర్మిలనవ సంజీవనిఉగాది అంటే ప్రపంచానికి తొలి ఉషస్సు.మానవజాతి మనుగడకు ్రపాణం పోసిన నవసంజీవని ఉత్సాహాల ఉషస్సులతో మదిలోని ఇంద్రనస్సులా ఊయలలూగే ఊసులతో ఆకాశ వీధిలో అందాల జాబిలిలా సంవత్సరంలో వచ్చే తొలి చంద్రరేఖ నా ఉగాదిఉగాది మన ధర్మం, అదే మనకు ధర్మపథం.వసంత నవరాత్రుల రాక ప్రకృతిని పూజించే సుషుమ్న కాంతి రేఖ నా ఉగాది.షడ్రుచుల సమ్మేళనం నా ఉగాది, భవ్య పదం నా ఉగాది పరాభవాలను పారద్రోలి విజయానుభవాలను కలుగజేసే నా ఉగాది. – దేవి సరస్వతికాలం చెప్పే సూచిక...ఉగాది అనేది కేవలం కొత్త సంవత్సర ప్రారంభం మాత్రమే కాదు, జీవితంలోని అనేక భావోద్వేగాలు, అనుభవాల మిశ్రమమని గుర్తు చేసే ఒక అందమైన సందేశం. ఉగాదికి ప్రత్యేకత ‘ఉగాది పచ్చడి‘. ఆరు రకాల రుచులతో తయారు చేసే ఔషధం. ప్రతి రుచి జీవితంలోని ఒక్కో భావాన్ని సూచిస్తుంది. తీపి ఆనందానికి, చేదు బాధకు, పులుపు ఆశ్చర్యాలకు, కారం కోపానికి, ఉప్పు భయానికి, వగరు సవాళ్లకు సూచికగా ఉంటుంది. ఉగాది మనకు జీవితం ఎప్పుడూ తీపిగా ఉండదని, కానీ ప్రతి అనుభవం మనలను మరింత బలంగా, జ్ఞానవంతులుగా మార్చుతుందని నేర్పుతుంది. ఇది గత సంవత్సరపు తప్పులు, బాధలు, ఆందోళనలను వెనక్కి వదిలేయాలని కూడా మనకు గుర్తు చేస్తుంది. మనమందరం కలిసి సంతోషంగా ఉండాలని, ఉగాదిని ఆనందంగా జరుపుకోవాలని, మంచి పనులు చేయాలని కాలం చెప్పే సూచిక. ఈ రోజున ఇంటిని శుభ్రం చేసుకుని, మామిడి ఆకులతో అలంకరిస్తాం, కొత్త బట్టలు ధరించి, శాంతియుతమైన, విజయవంతమైన సంవత్సరానికి నాంది కావాలని ప్రార్థిస్తాం. ఈరోజు బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజు అని చాలా మందికి నమ్మకం. ఉగాది కేవలం క్యాలెండర్ మార్పు కాదు ఇది విశ్వం తన ప్రయాణాన్ని ప్రారంభించిన క్షణాన్ని సూచిస్తుంది. ఉగాదికి మరో ప్రత్యేక సంప్రదాయం ‘పంచాంగ శ్రవణం’. ఇందులో పండితులు సంవత్సర ఫలితాలను చదివి వినిపిస్తారు. ఇది కాలం చక్రంలా తిరుగుతుందని మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఉగాది కేవలం పండుగ మాత్రమే కాదు ఇది ఆత్మపరిశీలన, ఆశల పునర్జన్మకు సూచిక. – బొందుగుల వర్షిణి రెడ్డిప్రకృతికి దగ్గరగా! తెలుగు తనాన్ని మరింత అందంగా చూపే పండగ ఉగాది. పసుపు రాసిన గడపలు, మామిడితోరణాలు.. ప్రకృతే మన ఇంటికి వచ్చిందా అనిపించే పండగ ఉగాది. ఎంతటి మోడర్న్ వారైనా సంప్రదాయ దుస్తులతో అందంగా అలంకరించుకుంటారు. కొత్త కుండలో ఒక్కటిగా కలిపిన ఆరు రుచుల పచ్చడి కుటుంబంలో అందరినీ ఐక్యంగా ఉండమని చూపుతుంది. అంతేకాదు, ఆరు రుచులు కలిసిన ఏడవ రుచి కుటుంబ సభ్యుల మధ్య నిండిన ప్రేమను పరిచయం చేస్తుంది. వసంతకాలంలో కొత్త చిగుళ్లు తిని కూసే కోకిలల గొంతులు ప్రకృతికి దగ్గరగా ఉండమని చెబుతాయి. సంతోషంగా మన జీవితాలు సాగాలంటే ఆరోగ్యం ఎంతో ముఖ్యమని, అది ప్రకృతి ద్వారా మనకు లభిస్తుందని వేప, మామిడి, చెరకు,.. వివిధ రకాల చెట్ల గొప్పతనాన్ని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరాన్నీ మనకు తెలియజేస్తుంది. నిరుత్సాహంగా అనిపించే రోజుల్లోకి కొత్త ఆశల చిగుళ్లను మోసుకువచ్చేది ఉగాది. – లాస్య దేశ్ముఖ్గెలుపే కాదు చేదు కూడా! ఉగాది పచ్చడిలో ఆరు రకాల రుచులు ఉంటాయి. తీపి, చేదు, పులుపు, కారం, ఉప్పు, వగరు. ఈ ఆరు రుచులు మన జీవితంలోని ఆనందం, బాధ, ఆశ్చర్యం, కోపం, భయం, సవాళ్లను సూచిస్తాయి. ఈ పచ్చడి మనకు జీవితంలో అన్ని రకాల అనుభవాలు ఉంటాయని తెలియజేస్తుంది. ఉగాది రోజున ఇంటిని శుభ్రం చేసుకొని, నూనె, నలుగు పెట్టుకొని తలంటు స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, దేవుడిని పూజిస్తాం. ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని. ఈ ఉగాది కొత్త ఆశలకు, ఆనందానికి, జీవితంలో కొత్త ప్రారంభాలకు నాందిగా నిలవాలని, బాగా చదువుకోవాలని, ఉన్నతంగా జీవించాలనే ఆశతో ఉండాలి. ఎప్పుడైనా ఓటమి ఎదురైతే ఉగాది పచ్చడిని గుర్తుతెచ్చుకొని, తిరిగి ఆశను నింపుకోవచ్చు. ఎందుకంటే జీవితం ఎప్పుడూ అన్ని విధాల గెలుపునే కాదు చేదు అనుభవాలను కూడా ఇస్తుంటుంది. అన్నింటినీ సమానంగా తీసుకుంటూ, ఉత్సాహంగా జీవించడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. విద్యారంగంలో మనమంతా నూతనోత్సాహంతో, సరికొత్త ఆలోచనలతో మరింత సృజనాత్మకతతో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. – మద్ది తనిష్కారెడ్డిఅన్నీ సమానంగా...తెలుగు ఇంటికి ఉగాది అనేది కేవలం పండుగ మాత్రమే కాదు, అది ఒక పవిత్రమైన ఆరంభం. ఆశ, కృతజ్ఞత, విశ్వాసంతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే ప్రత్యేకమైన క్షణం. మా ఇంట్లో ఉగాది చాలా అర్థవంతంగా అనిపిస్తుంది. ఆచారాలు, సంప్రదాయాలు, కుటుంబ అనుబంధంతో నిండిన అనుభూతి. పండగ రోజున మేమంతా అత్యంత ఇష్టమైన సంప్రదాయ దుస్తులను ధరిస్తాం. ఆడవాళ్లు పట్టు చీరలు, సంప్రదాయ ఆభరణాలతో ముస్తాబవుతారు. ఇంటిని పూలతో, మామిడి ఆకులతో అందంగా అలంకరిస్తాం. పూజ గదిని శుభ్రం చేసుకుంటాం. ఉగాది పచ్చడి తయారుచేస్తాం. ఈ పచ్చడి తయారీలో ఇంటిల్లిపాది పాల్గొంటాం. వేప ఆకులు, బెల్లం, చింతపండు రసం, మామిడి ముక్కలు, డ్రై ఫ్రూట్స్తో తయారు చేస్తాం. ఇందులోని ప్రతి రుచి జీవితంలోని విభిన్న భావాలను సూచిస్తుంది. సంతోషం, బాధ, ఆశ్చర్యం, కోపం, సమతుల్యత, మనం వాటన్నింటినీ సమానంగా స్వీకరించాలనే అందమైన సందేశాన్ని ఈ పండగ ఇస్తుంది. తర్వాత పంతులుగారు చెప్పే పంచాంగం వింటాం, ఆయన మాటలు వచ్చే సంవత్సరానికి దారి చూపుతూ, శుభాశయాలను కలిగిస్తాయి. తర్వాత మా పండుగలో ముఖ్యమైన భాగంగా అందరం కలిసి వంట చేయడం. మామిడి పప్పు, మామిడికాయ పచ్చడి, పూరీ కుర్మా, రసం, మామిడికాయ పులిహోర, బొబ్బట్లు వంటి వంటకాలు తయారు చేస్తాం. మేం మా ఇంట్లో ప్రతి యేటా దాదాపు ముప్పై మంది కలిసి పండుగను జరుపుకుంటాం. – రచిత లింగానిర్వహణ: నిర్మలారెడ్డి -
ఆరు రుచుల పండుగ
ఆనందం తియ్యగా, భయం పుల్లగా, దిగులు ఉప్పగా, కోపం కారంగా, బాధ చేదుగా, ఆసక్తి వగరుగా ఉంటాయి. ఈ రుచులు లేకపోతే స్వాదిష్టత లేదు. ఈ అనుభూతులు లేనిది జీవితం కాదు. అందుకే ఉగాది మనల్ని అన్ని రుచులతో అన్ని అనుభూతులతో అనుదినాన్ని సెలబ్రేట్ చేసుకోమని అంటున్నారు సాహితీవేత్త జి.వి. పూర్ణచందు‘రుచి’లో సంస్కృతి ఉంది. సౌందర్యం ఉంది. అనుభూతి ఉంది. ఆనందం ఉంది. ‘రుచించటం’ అంటే కమ్మగా మనసుకు అంగీకార యోగ్యంగా, ఙ్ఞానదాయకంగా ఉండటం అని! ఉగాదిని ఆరు రుచుల పండుగగా భావించటం వలన రుచులు మన శరీరంపై, మనసుపై, మస్తిష్కంపై కలిగించే ప్రభావాన్ని అర్థం చేసుకోవటం సాధ్యం అవుతుంది. ఉగాది నాలుకకు, మనసుకు, మెదడుకు సంబంధించిన రుచుల సమ్మేళనంగా జరిగే పండుగ. తెలుగులో ‘ఉగము’ అంటే ఆయువు. ‘ఆద’ అంటే కష్టం. ‘ఆదట’ అంటే ప్రేమ, తృప్తి. కాబట్టి ‘ఉగాది’ సుఖదుఃఖాల్ని, నిర్మాణ విచ్ఛిన్నాల్ని, తీపి పులుపుల్ని సమన్వయం చేసుకుంటూ సాగిపోవాలని, జీవితాన్ని ప్రేమించి సంతృప్తి పొందాలని, ఉన్నతికి మెట్లు పరుచుకోవాలని మనకు సూచిస్తోంది. ఉగాది నుండి ఉగాది దాకా జరిగే పరిణామాల్ని, ఎదురయ్యే అవరోధాల్ని గోచార రీత్యా అంచనావేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటాడు తెలుగువాడు!మనసు రుచులు రుచులు ఆరు... తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు... ఒక్కో రుచికీ ఒక్కో ప్రభావం ఉంటుంది. ఈ ఆరు రుచులూ శరీరానికే కాదు మనసుకూ మెదడుకు కూడా పోషణ నిస్తాయి. ఆహారంలోని ఆరు రుచులే సత్త్వ రజస్తమో గుణాలను ప్రేరేపిస్తున్నాయని భగవద్గీత పేర్కొంది. ‘యథా అన్నం తథా మనః’ ఆహారం ద్వారానే ఆత్మాభివృద్ధి, మానసిక ఉన్నతి సిద్ధిస్తాయి. మన ఆహారమే మన ఆరోగ్యాన్ని, మన మనస్తత్వాన్ని, జీవన ధోరణిని నిర్ణయిస్తుంది. భోజనం అనేది కడుపు నింపి పోషించటానికే కాదు, అది మానసిక పరిపక్వతకు కూడా కారణం అవుతోంది. నోటికైనా, మనసుకైనా, మెదడుకైనా రుచులు ఆరే! జీవితానికి ఆనందాన్ని, సంప్రదాయాన్ని, సామూహిక అనుభూతిని అందించేది ఆరు రుచులతో కూడిన ఆహారం. ఉగాది పండుగ ఈ ఆరు రుచుల ప్రాధాన్యతని నొక్కి చె΄్తోంది.త్రిగుణాత్మక రుచులుమనిషి మెదడులోని ఆలోచనలను తమోగుణం నియమిస్తే, రజోగుణం ప్రవర్తింపచేస్తే, సత్త్వగుణం నియంత్రిస్తుందని మన సిద్ధాంతం. మెదడు రుచులకు కూడా ఇలాంటి గుణాలే ఉంటాయి. ఆనందం తియ్యగా, భయం పుల్లగా, దిగులు ఉప్పగా, కోపం కారంగా, బాధ చేదుగా, ఆసక్తి వగరుగా ఉంటాయి. వీటిలో ఏ రుచిని వదిలి జీవించగలం...? నోటి రుచుల్ని, మనసు రుచుల్ని సమ్మేళనం చేసుకోగలిగితే శరీరమూ మనసు, ఇంద్రియాలతో పాటు ఆత్మ కూడా సంతృప్తి చెందుతుంది. ఉగాది పండుగ ఆరు రుచులకూ అంతటి ప్రాధాన్యత నిచ్చింది.నోటి రుచులుతీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు.... ఈ 6 రుచులు ఒకదానితో ఒకటి వివిధ నిష్పత్తుల్లో కలవటం ద్వారా 63 రుచులు అవుతాయి. ఈ 63 రుచుల మర్మాన్ని తెలుసుకుని, ఆహార పదార్ధాల్ని వండుకోగలిగితే ఆహారం ఆరోగ్యదాయకంగా పోషకంగా ఉంటుంది. భారత దేశం మొత్తంలో తమ ప్రధానమైన ఆహారాన్ని అన్నం అని నోరారా పిలిచేది ఒక్క తెలుగువారే! మనకు అన్నం అంటే ఆరు రుచులతో కూడిన పదార్థాలను ఆస్వాదిస్తూ తినటం అని! అలా మనల్ని ఆరు రుచులకి అంకితం చేసింది ఉగాది! ఈనాటికీ ఉగాది ప్రబోధం ఆరు రుచుల్ని విడవొద్దనే! ఉగాది పచ్చట్లో వేపపూతని కూడా చేర్చటం ద్వారా ఆహార ఔషధ ప్రాధాన్యతని ఉగాది గుర్తు చేస్తోంది! -
కొత్త తరం ఉగాది స్వరం
ఉగాదంటే వాకిట్లో పూల రుతువుచిగుర్లేసే తీవెల నుండి... విప్పారే పూవుల నుండి... కోయిలమ్మల గొంతుల నుండీ... చుట్టూ లోకమంతా పరుచుకునే ఆనందాన్ని ఆగి చూడటానికి... కొండగుర్తు లాంటి రోజొకటి కావాలి. ఉగాది ఆ ఉత్సాహాన్ని ఉత్సవం చేసే రోజు. కోయిల గొంతులో సంబరం వంటి ఈ తెలుగువారి పండుగపై కవయిత్రి మానస చామర్తి ఏమంటున్నారో తెలుసుకుందాం...ఉగాది చాలా నెమ్మదైన పండుగనిపిస్తుంది నాకు. సంక్రాంతికి ఉన్నట్టు పెద్ద ఆర్భాటముండదు. దసరా దీపావళులకున్నట్టు సందడీ, సెలవులూ ఉండవు. పైపెచ్చు పిల్లల పరీక్షల కాలం. ఒక్కటంటే ఒక్కటే రోజుకు సెలవు. అయినా అది కాదు లెక్క. విరబూసే పూల ఋతువు వాకిట్లో కనపడుతున్నప్పుడు, గుప్పెడు గుప్పెడు ప్రాణాలు గొంతు విప్పి ఉదయాలను మేల్కొల్పుతున్నప్పుడు, క్యాలెండర్ కన్నా ముందు హృదయానికే తెలుస్తుంది, ఈ కాలమేదో ప్రత్యేకమని. ఏడాది మొత్తానికీ ఇది పండుగకాలమని. అందుకే గీతలో కృష్ణుడు కూడా, తాను ఋతువులలో వసంతాన్నని చెప్పుకున్నాడు (ఋతూనాం కుసుమాకరః). ఆ వసంత ఋతువు, చైత్ర మాసపు తొలిరోజునే మనం ఉగాదిగా పిలుస్తున్నాం. చిగుర్లేసే తీవెల నుండి, విప్పారే పూవుల నుండి, కోయిలమ్మల గొంతుల నుండీ చుట్టూ లోకమంతా పరుచుకునే ఆనందాన్ని ఆగి చూడటానికి, కొండగుర్తు లాంటి రోజొకటి కావాలి! ఉగాది ఆ ఉత్సాహాన్ని ఉత్సవం చేసుకునే సందర్భం. రేగిపళ్ళు, పసిడితోరాలు, పానకం వడపప్పులు, పుస్తకాల మీద పసుపు ఓంకారాలు, బొమ్మల కొలువులు, గోంగూరకాడలు...ఒక్కో పండక్కీ జతపడే ఆనవాయితీ ఒకటుంది మనకి. ఉగాది అంటే అట్లా గుర్తొచ్చేవి మరీ ముఖ్యంగా ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం.ఏడాది పొడుగునా అన్నీ దొరికే ఈ కాలంలో కూడా ఉగాది పచ్చడి మాత్రం ఉగాది రోజునే దొరుకుతుంది. నచ్చి, ఇంకోసారి చెయ్యమని మారాం చేస్తే, ఇది ఈ ఒక్కరోజే తినాలని ఆ పసి్రపాణాన్ని బుజ్జగించిన అమ్మ గొంతు చెవుల్లో ఇంకా అట్లానే వినపడుతోంది. వేపకొమ్మల నుండి వేప పూవులను సాధించుకుని, తెల్లటి పల్చటి రేకులను మాత్రం జాగ్రత్తగా వొలిచి ఆ పచ్చడి గిన్నెలో కలపడం నా పని. చిన్నప్పుడంతా ఉగాది రోజు ఉదయాన్నే ఎవరో పుణ్యాత్ములు ఇంటింటికీ తిరిగి గుమ్మాల దగ్గర వేపకొమ్మలు పెట్టి వెళ్ళేవాళ్ళు. ఇంటికొకరు చొప్పున చెట్లెక్కి వేపకొమ్మలు విరిచే శ్రమను తప్పించడమన్నమాట. కావాలా? అని అడగడం కూడా ఉండేది కాదు. వేప పూరేకులు వొలిచి, పొట్లాలు చుట్టి, రేటు కట్టి అమ్ముతున్న ఈ రోజుల్లో నిలబడి చూస్తే, నా చిన్నప్పటి ఊరికీ, ఆ వేపగాలికీ చాలా దూరం వచ్చేశాననిపిస్తోంది. రాజపూజ్యమూ– అవమానమూ, ఆదాయమూ వ్యయమూ, పుట్టి బుద్ధెరిగాక ఇన్నేళ్ళలో ఒక్కసారి కూడా ఇవి జంటగా నాకు బాగున్న దాఖల్లాల్లేవు. అయినా పంచాంగ శ్రవణమంటే చెవులప్పజెప్పి కూర్చోవడమే తెలుసు. మానవ సహజమైన ఆశ ఒకటి, ఎవరేమి చెప్పినా అంతా మంచే జరగనుందని నమ్మబలికేది. ఆ అద్భుతాల కోసం ఏడాది పొడుగునా ఎదురుచూడటమే జీవితమనిపించేది. కొత్త సంవత్సరం, కొత్త ఋతువు, కొత్త మాసం...మట్టి పలక మీద నీళ్ళు జల్లి, శ్రద్ధగా తుడిచి మళ్ళీ నచ్చినవేవో రాసుకోమన్నట్టు– కొత్త ఉగాది. జనవరి ఒకటికి రాసుకుని మర్చిపోయిన కలలకి మళ్ళీ కాస్త కదలిక వచ్చే రోజు. మళ్ళీ కొత్త ఆలోచనలు, కొత్త నియమాలతో కొత్త జాబితాలు తయారు. మళ్ళీ నిండు వాగ్దానమై చేతుల్లో పడ్డట్టుండే జీవితం. ఆరోగ్యంగా మేలుకునే ప్రతిరోజూ మనిషికి దొరికే కొత్త అవకాశమే కానీ, ఉగాది మాత్రం వాగ్దానమనిపిస్తుంది. ఉదయాన్నే లేస్తే చాలు. అడుగు బయటపెడితే చాలు పూలు, సీతాకోకల రంగుల తేజస్సు, విరిసే మల్లెల పరిమళం, కోయిల గొంతులోని సంబరం – అయాచితంగా మనిషికి బట్వాడా అయిపోతాయని నాకనిపిస్తుంది. ఆ కాస్త వ్యవధి, ఆ కాస్త ప్రయత్నం ఆశించగలమా ఈ హడావుడి జీవితాల నుండీ, అన్నది ప్రశ్న. ఉగాది రోజు ఏం చేస్తే, ఏడాదంతా అదే చేస్తామన్న అమాయకపు నమ్మిక ఒకటి ఉండేది. అందుకని మంచి మాటలే మాట్లాడటం, మంచిపనులే చెయ్యడం, ఇష్టమైన వాళ్ళని కలవడం, కలిసి, ఏడాదంతా మనదేనని చెప్పుకోవడం... ఎదిగే క్రమంలో ఎక్కడో పారేసుకున్నాను ఈ అందమైన విశ్వాసాన్ని. సాయంకాలపు నడకల్లో మామిడిచెట్లు కనపడితే ఇప్పుడు చూపు ఆగిపోతోంది. ఆ పూతవేసిన లేతమావి శోభ కాళ్ళను కట్టిపడేస్తోంది. పక్క వీధిలో ఉండే స్నేహితురాలొకరు, ఈ ఏడాదికి మొదటగా పూశాయంటూ దోసెడు మల్లెలు చూపించారు. ఎగబీల్చిన పరిమళం నా ఊపిర్లో కలిసిపోయింది. గుత్తులు గుత్తులుగా వాకిట్లో ఏవేవో పూవులు. ఆ పూల మధువు కోసం పూటా కొందరు కొత్త అతిథులు. ‘ఎవరు వారు వచ్చేరు? పూవుల తేరుపై; చైత్ర రథంలోన శ్యామపత్రపథంపైన, ఎవరా వచ్చేది?’ అని ప్రశ్నించి, అది ఉగాది అది ఉగాది అంటారు కృష్ణశాస్త్రి. ఉగాదితో పాటు వచ్చే ఈ అతిథులను చూస్తే నాకైతే ‘రొద సేయకే తుమ్మెదా...‘ అని పాడాలనిపిస్తుంది. నెలల తరబడి నీళ్ళు పోస్తూ ఆశగా చూసినన్నాళ్ళూ పూలు రాల్చని మొక్కల మీదకి, మొగ్గలు మొదలవుతూనే తుమ్మెదల తాకిడి. ఆ పూల మెత్తదనాన్ని తాకి చూసే వీలైనా లేకుండా మత్తుగా ఆ పూరెమ్మల మీదే తూగుతూ కనపడతాయ్. ‘ఈ పూల ఋతువంతా ఈ తేటిదో... ఈ తోటమాలిదో...’ అన్న సినీకవి సందేహం ఇప్పుడు నాది కూడా. -
ఉగాది పండుగ సందేశం ఇదే!
తెలుగు వారి పండుగల చిట్టాలో ఉగాది ముఖ్యమైనది. పూర్వ కాలంలో దీనినే ‘యుగాది’గా పిలిచేవారు. అంటే యుగానికి ఆదిగా దీనికి నిర్వచనం. ఆంగ్ల సంవత్సరాది జనవరి ఒకటిన ప్రారంభం అవుతుండగా, మన తెలుగు సంవత్సరాది చైత్ర మాసంలో ప్రారంభమవుతుంది. సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో వచ్చే ఈ పండుగతో కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో పాటు వరుసగా పర్వదినాలు వస్తాయి. రానున్న సంవత్సరాన్ని పరాభవ నామ సంవత్సరంగా వ్యవహరిస్తారు.శిశిరంలో మోడైపోయిన చెట్లన్నీ వసంతంలో చిగుళ్లు తొడిగి కొత్త సింగారాలొలుకుతుంటాయి. రుతువుల్లో మొదటిదైన వసంతం మనోహరమైనదీ, ఆహ్లాదకరమైనదీ. వసంత రుతువు తానే అన్నాడు శ్రీకృష్ణుడు. అలాంటి వసంతంలో వచ్చే తొలి మాసం చైత్రం. తిథుల్లో తొలి గౌరవం పాడ్యమిది. బ్రహ్మ సృష్టి ఆరంభించినది ఈ చైత్ర శుద్ధ పాడ్యమి నాడే అంటోంది బ్రహ్మపురాణం. రామ పట్టాభిషేకం జరిగిందీ, శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించిందీ, కలియుగం ప్రారంభమైందీ ఆ రోజేనని పండితులు చెబుతారు.ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త వరాహమిహిరుడి అంచనాల ప్రకారం చైత్రమే తొలి మాసం. ఆ రోజే తొలి పంచాంగాన్ని జనజీవన స్రవంతికి అంకితం చేశాడాయన. విక్రమార్కుడూ, ఆంధ్రరాజుల చక్రవర్తి శాలివాహనుడూ సింహాసనాన్ని అధిష్ఠించిందీ ఈ చైత్ర శుద్ధ పాడ్యమినాడే. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే చాంద్రమానాన్ని అనుసరించే తెలుగు, కన్నడ, మహారాష్ట్ర ప్రజలు చైత్ర శుద్ధ పాడ్యమినే నూతన సంవత్సర ఆరంభ దినంగా, కొత్తదనానికి ప్రారంభంగా భావించి పండగ జరుపుకొంటారు.ఉత్కంఠ గొలిపే సంవత్సర ఫలితాలను, కందాయ ఫలాలను పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకోవడం ఉగాది నాటి ముఖ్య వేడుక. కొత్త చిగుళ్లతో, రంగురంగుల పూలతో, పరిమళాల పన్నీరుతో కొమ్మకొమ్మకీ మామిడి తోరణాలు, కోయిల పాటలు వసంతానికి పచ్చని గురుతులై ప్రాణికోటికి శుభం పలుకుతున్నాయి. షడ్రుచుల ప్రసాదం కోసం మామిడి పిందెలు, వేపపూతలు సిద్ధంగా ఉన్నాయి.అన్ని రుచులు సమానంగా ఆస్వాదించాలనీ, అన్ని అనుభవాలు కలిస్తేనే సంపూర్ణ జీవితమనే సందేశాన్ని ఉగాది పచ్చడి మానవాళికి అందిస్తోంది. సంవత్సరమంతా జీవితంలో ఏర్పడే కష్టనష్టాలు, సుఖ సంతోషాలను సమానంగా స్వీకరించి ముందుకు సాగాలనే తాత్విక సందేశం ఉగాది పండుగలో ఉంది.– నందిరాజు రాధాకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్ -
ఏ నేరమూ చేయకున్నా... అకౌంట్ ఫ్రీజ్ అయింది..?
స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీ అంటూ ఫోన్ చేసిన వారిని నమ్మి ఒక వాట్సాప్ గ్రూపులో చేరాను. కొంత డబ్బులు పెట్టుబడి పెట్టాను. మొదట్లో ఆరు లక్షల దాకా లాభం వచ్చింది అని దాదాపు 10 లక్షలు పెట్టుబడి పెట్టాను. ఇంతలో ఉన్నట్టుండి ఓ రోజు ఒక్కసారిగా నా ఎకౌంట్లో నుంచి 8 లక్షల రూపాయలు కట్ అవడంతో బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా కోర్టు ఆర్డర్ ద్వారా డబ్బులు వేరే అకౌంట్ కి పంపించేశారని, నా అకౌంట్ను కూడా ఫ్రీజ్ చేశారనీ తెలిసింది. కోర్టు ఆర్డర్లు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చాయి. బ్యాంక్ వారిని అడిగితే పరిష్కారం కోసం తమిళనాడు కోర్టుకు, కర్ణాటక కోర్టుకు వెళ్ళమని చెప్తున్నారు. నా అకౌంట్లో ఇంకా 20 లక్షలు ఉన్నాయి కానీ కేసుల వల్ల అవి కూడా ఫ్రీజ్ అయి ఉన్నాయి. తీరా చూస్తే నేను పెట్టుబడి పెట్టిన దానికంటే పోయిందే ఎక్కువ. దయచేసి నాకు పరిష్కారం సూచించగలరు.– నళిని, హైదరాబాద్అనేక రకాల సైబర్ నేరాల్లో ఆన్లైన్ ట్రేడింగ్ కూడా ఒకటి. స్నేహం పేరుతో ప్రలోభ పెట్టి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు లాగేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. ట్రేడింగ్ చేయాలని అనుకుంటే నమ్మకమైన కంపెనీల ద్వారా మాత్రమే చేయాలి తప్ప, సోషల్ మీడియా ప్రకటనలు, వాట్సాప్ గ్రూపులలో ప్రకటనలు చూసి చేయడం అనేకమందిని బాధితులను చేస్తున్నాయి. మీ విషయంలో కూడా అదే జరిగింది. మీరు నేరం చేయనప్పటికీ, మీరు ఆన్లైన్ ట్రేడింగ్ చేసి సంపాదించాను అనుకునే నగదు బహుశా సైబర్ నేరగాళ్లు చేసిన లావాదేవీలలో భాగం అయి ఉండవచ్చు. మరొకరి దగ్గర అక్రమంగా తీసుకున్న డబ్బులను కొత్తగా ఇన్వెస్ట్మెంట్ మాయలో పడిన వారికి లాభంగా చూపిస్తూ వారి ఎకౌంట్లో వేసి వారి నమ్మకాన్ని సాధిస్తారు. తర్వాత మీరు ఎక్కువ లాభాల కోసం ఎక్కువ నగదు ఇవ్వాలి అనేదే వారి ఎత్తుగడ. కాబట్టి మీ అకౌంట్లోకి వచ్చిన మొత్తం లాభంగా మీరు భావిస్తున్నది అయినప్పటికీ, అది మరొక బాధితుడి డబ్బు అయి ఉండే ఆస్కారం ఉంది. అయితే నిజానిజాలు నిర్ణయించవలసినది కోర్టు!ఇకపోతే, మీ ఎకౌంటు ఫ్రీజ్ అయింది అని చె΄్పారు కాబట్టి, ఆర్డరు ఇచ్చిన కోర్టును లేదా ఏ పరిధిలోని పోలీసులు అకౌంట్ ఫ్రీజ్ చేశారో తెలుసుకొని వారిని సంప్రదించవలసి ఉంటుంది. వేరే రాష్ట్రాల కోర్టుకు వెళ్లడం లేదా అన్నిటినీ కలిపి సుప్రీంకోర్టును ఆశ్రయించి ప్రస్తుతానికి మీ ఎకౌంటులో ఉన్న నగదును కూడా కాడుకోవడం మాత్రమే మీకు ఉండే దారి. అదనంగా మీరు కూడా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వారికి ఒక ఫిర్యాదు చేస్తే మంచిది. మిమ్మల్ని ఏ విధంగా ట్రేడింగ్ కంపెనీ వారు సంప్రదించారు, ఏ విధంగా ఏ అకౌంట్లోకి మీరు డబ్బులు జమ చేశారు వంటి పూర్తి వివరాలను సైబర్ క్రైౖమ్ డిపార్ట్మెంట్ వారికి వెల్లడించి ఒక లిఖితపూర్వక ఫిర్యాదు చేయండి. మీకు వచ్చినది ఎంత...? పోయినది ఎంత అనే విషయాన్ని రుజువులతో సహా ఇవ్వండి. మీరు పోగొట్టుకున్న డబ్బులు తిరిగి రావాలి అంటే అది పోలీసు వారు మాత్రమే చేయగలరు. అదీ విచారణ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు మాత్రమే రికవరీ చేయగలరు. కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు మీ అకౌంట్లో లావాదేవీలు చేయడానికి మీ అనుమతి అవసరం లేదు! శ్రీకాంత్ చింతల(హైకోర్టు న్యాయవాది మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. ) -
మైకేల్ జాక్సన్ని తలపించేలా ఆ తండ్రి డ్యాన్స్..!
ఓ కూతురు తన తండ్రి ఆ రైంజ్లో డ్యాన్స్ చేస్తాడని ఊహించలేదు. ఒక్కసారిగి విస్తుపోయి..చివరికి అతడితో కలిసి పాదం కదిపింది. అందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే కాదు..మేడమ్ బహిరంగంగా ప్లే చేస్తే..ఆయన టాలెంట్ ఏంటో తెలిసేది కదూ అని కామెంట్ చేస్తూ పోస్టుల పెట్టారు కూడా. వివరాల్లోకి వెళ్తే..ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ వీడియలో ఓ యువతి 'బిల్లీ జీన్' పాటకు డ్యాన్స్ చేయడంతో ప్రారంభమవుతుంది. ఆమె తండ్రి మాములుగా ఆమె వద్దకు వస్తాడు. ఆ తర్వాత ఆతడు చాలా సులభంగా మూన్వాక్ చేయడంతో ఒక్కసారిగా ఆ దృశ్యం అనూహ్య మలుపు తీసుకుంటుంది. ఈ నాన్న సాధారణ దుస్తులతో ఉన్నప్పటికీ..చాలా సునాయాసంగా ఆత్మవిశ్వాసంగా చేస్తున్న ఆ డ్యాన్స్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అత్యంత నేచురల్గా కనిపించే ఆ క్షణం మధుర జ్ఞాపకంగా మారిపోయిందా కూతురికి. ఒక్క క్షణం ఆమె సైతం తన తండ్రి అద్భుతమైన డ్యాన్స్ చూసి నిశ్చేష్టురాలైపోతుంది. ఆ తర్వాత కొంచెంసేపటికీ అతనితో కలిసి అడుగులు కదపడానికి ప్రయత్నించడంతో వీడియో ముగుస్తుంది. కాగా 1982లో విడుదలైన 'బిల్లీ జీన్', మైఖేల్ జాక్సన్ అత్యంత ప్రసిద్ధ ఆల్బమ్లలో ఒకటైన 'థ్రిల్లర్'లోని ఒక భాగం. ఈ పాట పాప్ సంగీతం, నృత్య సంస్కృతిలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. అందులోనూ జాక్సన్ చేసిన మూన్వాక్ ప్రపంచవ్యాప్త గుర్తింపుని తెచ్చిపెట్టింది. View this post on Instagram A post shared by 🧚 (@magic._.shopp_)(చదవండి: నటి జ్యోతిక మోడర్న్ పేరెంటింగ్ టిప్స్..!) -
నటి జ్యోతిక మోడర్న్ పేరెంటింగ్ టిప్స్..!
రీల్ లైఫ్లోనే గాదు రియల్ లైఫ్లో కూడా బ్యూటీఫుల్ కపుల్ ఎవరంటే ఠక్కున చెప్పేస్తారు సూర్య-జ్యోతికలని. ఈ ఇద్దరు నటనపరంగానే కాదు, వ్యక్తితత్వ పరంగానూ నూటికి నూరు మార్కులు దక్కించుకున్న గొప్ప జంటగా పేరు తెచ్చుకున్నారు. ఈ దంపతులకు కుమార్తె దియా, కుమారుడు దేవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. హీరో సూర్యతో పెళ్లి తర్వాత నటనకు విరామం ఇచ్చిన జ్యోతిక కొంతకాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి..అశేష ఆదరాభిమానాలను అందుకుంది. అయితే ఆమె ఒక పక్క తన వృత్తిని, మాతృత్వాన్ని బ్యాలెన్స్ చేస్తూ..సూపర్ విమెన్గా పేరుతెచ్చుకుంది కూడా. మరి అలాంటి జ్యోతిక పిల్లల పెంపకం విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటుంది?, ఆమె చెప్పే అమూల్యమైన పేరెంటింగ్ టిప్స్ గురించి సవివరంగా తెలుసుకుందామా.!.ఒక ఇంటర్వూలో జ్యోతిక తాను తల్లిగా మారాక తనకు జీవితం పట్ల ఉన్న దృక్పథం పూర్తిగా మారిపోయిందన్నారు. ముఖ్యంగా తన పిల్లలను మీడియాకి, సెలబ్రిటీ హోదాకి చాలా దూరంగా ఉంచుతానని చెబుతున్నారు. వాళ్లకు సహనం, భావోద్వేగాల విలువ గురించి నేర్పిస్తుంటానని చెప్పారు. పేరెంట్స్గా పిల్లలను విలువలతో పెంచడం తోపాటు తాము కూడా కొన్ని విషయాలను వారి నుంచి నేర్చుకున్నామని అన్నారు. జీవితంలో కొన్ని సమయాల్లో వేగాన్ని తగ్గించి చిన్ని చిన్ని విషయాలను కూడా ఆస్వాదించడం, వాటి విలువ గురించి తెలుసుకోవడంలో పిల్లలు ఎంతగానో సహాయపడ్డారని అంటోంది. బాధ్యత, నిస్వార్థ ప్రేమ విలువలను తన పిల్లల ద్వారా తెలుసుకోగలిగానని చెబుతోంది. పిల్లలు ఎదుగుతుండటాన్ని చూడటం జీవితంలో అత్యంత సంతృప్తికరమైన క్షణాల్లో ఒకటని అన్నారు. అలాగే పిల్లల పెంపకంలో అత్యంత ముఖ్యమైనది వారి వ్యక్తిత్వాన్ని ప్రోత్సాహించడం అని ప్రగాఢంగా విశ్వసిస్తానని చెప్పారు. పిల్లలు నిజంగా దేనిపట్ల మక్కువ కలిగి ఉన్నారో తెలుసుకుంటూ..ఆ విషయాలను అన్వేషించి, ఆ దిశలో వెళ్లేలా స్వేచ్ఛను ఇవ్వడానికే ప్రయత్నిస్తానని అన్నారామె. దీనివల్ల పిల్లలు ఇతరుల ఆదేశాలకు లేదా నిర్ణయాలకు లోబడకుండా, తమను తాము వ్యక్తీకరించుకోగలిగేలా ధైర్యం ఆత్మవిశ్వాసంతో ముందుగకు సాగుతారని అంటోందామె. అంతేగాదు పిల్లలందరూ తమదైన రీతిలో ప్రత్యేకమైనవారని, విశిష్టమైన వాళ్లని నమ్ముతానని అన్నారు. అంతేగాదు సినీ ఆడంబరాలకు అతీతంగా వాస్తవాలను తెలసుకునేలా పెంచుతానని, ముఖ్యంగా ఒదిగి ఉండేలా పెంచుతానని అన్నారు. అలాగే ఆమె ప్రతి తల్లిదండ్రలు త పిల్లలతో కలిసి ఈ మూడు పనులు చేయాలని అన్నారు. అవేంటంటే..ప్రతిరోజూ పిల్లలతో కనీసం ఒక గంట నాణ్యమైన సమయం గడపడం ముఖ్యం. కలిసి భోజనం చేయండి, ఎటువంటి అంతరాయం లేకుండా మాట్లాడండి, బహుశా ఒక గేమ్ లేకా వాళ్లకు నచ్చిదాంతో మమేకమైతే.. పిల్లలు తమ మనసు విప్పి, వారు ఏమి ఆలోచిస్తున్నారో, వారిలో నిజంగా ఏమి జరుగుతుందో మనకు చెప్పడానికి సహాయపడుతుంది. వారి ప్రాణ స్నేహితుడు ఎవరు, వారికి ఎవరు ఇష్టం, ఒక పిల్లవాడిని ఎందుకు ఇష్టపడరు, ఏ ఉపాధ్యాయుడితో ఏమి జరుగుతోంది వంటి సాధారణ విషయాలు సైతం మనతో పంచుకుంటారు. రెండొవది ప్రయాణం చేయడం. కలిసి ప్రయాణం చేసినప్పుడు కుటుంబ బంధం చాలా బలపడుతుంది.మూడవది వారికి ఆదర్శంగా ఉండటం; వారికి సలహాలు ఇవ్వకండి.చివరగా ప్రతి తల్లి తన వృత్తి జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోగల సామర్థ్యం ఆమెకు ఉంటుందని చెబుతోంది జ్యోతిక. తన మటుకు ఎంత బిజీగా ఉన్నా..కుటుంబానికి ప్రాధ్యాన్యత ఇస్తానని, రెండిటిని సమతుల్యం చేసుకునే పనులను బ్యాలెన్స్ చేస్తానని అన్నారామె. (చదవండి: నీతా అంబానీకి మానవతా పురస్కారం..!) -
నీతా అంబానీకి మానవతా పురస్కారం..!
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీకి అరుదైన గౌరవం లభించింది. ఒడిశాలోని భువనేశ్వర్లో ఉన్న కేఐఐటీ (KIIT) విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మక కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (కిస్) హ్యుమానిటేరియన్ అవార్డు 2025తో నీతా అంబానీని సత్కరించారు. ఈ సందర్భానికి అనుగుణంగా ఆమె అద్భుతమైన లుక్లో ఈ కార్యక్రమానికి హాజరయ్యారామె.ఈ ప్రత్యేక సందర్భం కోసం, నీతా అంబానీ ప్రకృతిని స్ఫూర్తిగా తీసుకుని తనచీరను ఎంచుకోవడం విశేషం. సాధారణ ముదురు మెరూన్ చీరకు కాంట్రాస్ట్గా ఆకుపచ్చ రంగు అంచుతో కూడిన చీరను ఎంచుకున్నారు. ఇది ఆమెకు మరింత అందాన్ని ఇచ్చింది. ముందు భాగంలో కుచ్చులు పెట్టి, కొంగును తన భుజం నుండి నేల వరకు సింగిల్ పైటతో జారవిడిచారు. ఆ చీరకు మ్యాచింగ్ మెరూన్ కలర్ విత్ ఆకుపచ్చ అంచు ఉన్న బ్లౌజ్ని ఎంచుకున్నారు. అంతేగాదు అమూల్యమైన ఆభరణాలకు బదులుగా పూల డిజైన్లో ఉన్న ఒక జత రూబీ, డైమండ్ చెవిపోగులు, ఒక స్టేమెంట్ ఉంగరం, ఆకుపచ్చ గాజులు, బంగారు పూసల నెక్లెస్ ధరించారు. జుట్టుని కూడా పెద్ద తరహాలో హుందాగా పాపిడి తీసి పువ్వులతో అలకరించిన జడకొప్పులా వేసుకున్నారు. చక్కగా సాధారణ స్త్రీలా కళ్లకు కాటుక, గుండ్రటి బొట్టుతో సరికొత్తగా కనిపించారామె.కిస్ ఫౌండేషన్ ప్రకారం, 'మానవతా సేవ. సమాజ సాధికారత పట్ల ఆమెకున్న అసాధారణ నిబద్ధత'కు గాను నీతా అంబానీకి ఈ అవార్డును ప్రదానం చేశారు. ఆ విషయాన్ని సోషల్ మీడియా పోస్ట్లో వెల్లడిస్తూ.. ఆమె దూరదృష్టి గల నాయకత్వం, పరోపకార కార్యక్రమాల ద్వారా, విద్య, ఆరోగ్య సంరక్షణ, క్రీడలు, గ్రామీణాభివృద్ధిపై ప్రగాఢమైన ప్రభావాన్ని చూపారు. భారతదేశం అంతటా లెక్కలేనన్ని జీవితాలను ప్రభావితం చేశారు అని పేర్కొంది. View this post on Instagram A post shared by KISS Foundation (KISS) (@kissfoundation) (చదవండి: వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్కు రొమ్ము కేన్సర్..తొలిదశలో సురక్షితమేనా..?) -
ఉగాది పండుగ నాడు తప్పక ఆచరించాల్సినవి...!
ఉగాది.. తెలుగు ప్రజల కొత్త ఏడాదికి ప్రారంభం. చైత్ర మాస శుద్ధ పాడ్యమి రోజున జరుపుకునే ఈ పండుగను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున చేసే పనులు ఏడాది మొత్తం జీవితంపై ప్రభావం చూపిస్తుందని పెద్దలు, పండితులు చెప్తారు. అందుకే ఉగాది రోజు కొన్ని శుభకార్యాలు చేయడం ఆచారంగా ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.ఉగాది రోజున కొన్ని ప్రత్యేకమైన పూజలు, సాంప్రదాయాలు చేయడం వల్ల ఆ ఏడాది మొత్తం శుభంగా ఉంటుందనేది భక్తుల నమ్మకం.ప్రభాత వేళే మేల్కొనడం – బ్రహ్మ ముహూర్తంలో లేచి, తైలస్నానం (నువ్వుల నూనెతో స్నానం) చేయడం శ్రేయస్కరం.కొత్త బట్టలు ధరించడం – కొత్త ఆరంభానికి సంకేతంగా, ఈ రోజు అందరూ కొత్త బట్టలు ధరించి ఉగాదిని ఆహ్వానిస్తారు.వేప పచ్చడి సేవించడం – తీపి, చేదు, కారం, పులుపు, వగరు, ఉప్పు వంటి షడ్రుచులను కలిపి తయారుచేసిన ఉగాది పచ్చడి జీవితంలోని అనేక అనుభవాలను సూచిస్తుంది. ఇది ఆరోగ్యానికి మంచిది.పంచాంగ శ్రవణం – ప్రతి ఉగాది రోజున కొత్త సంవత్సర ఫలితాలను తెలుసుకునేందుకు పండితుల ద్వారా పంచాంగ శ్రవణం చేయడం ఉత్తమం. మినపప్పు , కందిపప్పు, శెనగపప్పుతో చేసిన పదార్ధాలు స్వీకరించాలి, స్వయంపాకంగా దానం ఇవ్వాలి.బ్రాహ్మణులకు దానము ఇవ్వాలి. కుదిరితే అన్నదానం చేయాలి. జలదానం చేయాలి. తల్లిదండ్రులకు భక్తితో నమస్కరించాలి, భార్యను ప్రేమతో చూచి కుదిరితే గాజులు కొనిచ్చి /కొనిపెట్టి , కుంకుమ బొట్టు పెట్టి ఆమెను దేవతగా భావించాలి. తద్వారా పార్వతీదేవి యొక్క ఆశీస్సులు పొందగలము. గురువునకు ఉగాదినాడు 3 ప్రదక్షిణలు చేసినవారు, 3 సార్లు భూప్రదక్షిణ చేసిన ఫలితం పొందుతారు. లక్ష్మీదేవిని పూజించి వ్యూహలక్ష్మీ మంత్రమును జపించుకోవటం, ఈశ్వరునికి అభిషేకం చేసుకోవటం శ్రేష్ఠం. పంచాంగ శ్రవణం చేయండి, కుదిరితే పంచాంగం లేక మంచి పుస్తకాలు దానం చేయడం మరింత ఉత్తమం. ఆలా చేస్తే పిల్లల యొక్క విద్య వృద్ధి చెoదుతుంది. పసుపు కుంకుమలు దానం ఇవ్వండి. బూరెలతో కూడిన భోజనము చేస్తే భూరి సంపదలు ఇస్తాడు పరమాత్మ. కోపం వదిలి, అన్నీ మంచి పలుకులు పలుకుదాము, ఈ నూతన సంవత్సరం సకల శుభాలను పొందుదాం... ఇవేగాక చాలామంది ఉగాది పండుగ నాడు ఇంటిపై కాషాయ ధ్వజం ఎగురవేయడం వంటివి చేస్తుంటారు. ఇలా ఎందకు చేస్తారు దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక రహస్యాలు ఏంటంటే.విజయ ప్రతీకగా..నూతన సంవత్సర ఆరంభం (విజయ ప్రతీక)... తెలుగు రాష్ట్రాలలో ఉగాదిని నూతన సంవత్సరంగా జరుపుకుంటాం. పురాణాల ప్రకారం, ఈ రోజే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని నమ్ముతారు. కాషాయ రంగు త్యాగానికి, పవిత్రతకు, ధర్మానికి చిహ్నం. కొత్త సంవత్సరం అంతా ధర్మబద్ధంగా, విజయవంతంగా సాగాలని కోరుకుంటూ ఇంటిపై ధ్వజాన్ని ఎగురవేస్తారు.చారిత్రక నేపథ్యం (విజయ సంకల్పం)... చారిత్రక కోణంలో చూస్తే, ఈ రోజును విజయ దినంగా కూడా భావిస్తారు. శాలివాహన చక్రవర్తి శకులను జయించి 'శాలివాహన శకం' ప్రారంభించిన శుభసందర్భం ఇది. ధ్వజం అనేది విజయానికి గుర్తు. ప్రతి ఇంటిపై ఈ జెండాను ఉంచడం ద్వారా ఆ కుటుంబం రక్షణ, ఐక్యతను చాటుతారు.ఆధ్యాత్మిక అర్థం... కాషాయం అంటే సూర్యోదయ కిరణాల రంగు. ఇది చీకటిని (అజ్ఞానాన్ని) తొలగించి వెలుగును (జ్ఞానాన్ని) ప్రసాదించే రంగు. హిందూ సంప్రదాయంలో జెండాను 'కేతువు' అని పిలుస్తారు. ఇంటి పైన జెండా ఎగురవేయడం వల్ల దుష్టశక్తులు దరిచేరవని, దైవ రక్షణ ఉంటుందని భక్తుల నమ్మకం.పండుగ అలంకరణలో భాగం...సాధారణంగా ఉగాదినాడు గుమ్మాలకు మామిడి తోరణాలు, వేప రెమ్మలతో పాటు ఇంటి కప్పు పైన లేదా బాల్కనీలో కాషాయ జెండాను కడతారు. ఇది ఇంటికి ఒక పవిత్రమైన రూపాన్ని ఇస్తుంది. ధ్వజం కట్టేటప్పుడు జెండా శుభ్రంగా, చిరగకుండా ఉండాలి.సాధారణంగా దీనిపై 'ఓం' కారము లేదా హనుమంతుడి చిహ్నం ఉంటుంది. జెండాను ఎత్తైన ప్రదేశంలో గాలికి రెపరెపలాడేలా కట్టడం శుభప్రదంగా భావిస్తారు.(చదవండి: పరాభవ నామ సంవత్సరం ఆధ్యాత్మిక అంతరార్థం..!) -
వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్కు రొమ్ము కేన్సర్..
వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్కు తొలిదశ రొమ్ము కేన్సర్తో బాధపడుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు. అంతేగాదు వేల్స్ని ఒక విశ్వసనీయ సలహాదారుగా ప్రశంసించారు కూడా. ఆమె సాధ్యమైనంత తొందరగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమె ఒక అద్భుతమైన చీఫ్ ఆఫ్ స్టాఫ్, అలాగే నాకు తెలిసిన అత్యంత బలమైన వ్యక్తులలో ఒకరామె. దురదృష్టవశాత్తు వేల్స్కి తొలిదశ రొమ్ము కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని అన్నారు. ఆమె సత్వరమే ఈ సవాలుని స్వీకరించి ధైర్యంగా పోరాడాలని స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నారు. ఆమెకు కోలుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. ఆమె వెంట అద్భుతమైన వైద్య బృందం ఉందని, చికిత్స సమయంలో, ఆమె దాదాపు పూర్తి సమయం వైట్ హౌస్లోనే గడుపుతారని పోస్ట్లో వెల్లడించారు ట్రంప్. ఈ నేపథ్యంలో తొలిదశ రొమ్ము కేన్సర్ అంటే..?, ఇతర భాగాలకు వ్యాపించకముందే ముందుగా ఎలా గుర్తిస్తారు, ఎలాంటి చికిత్స అందిస్తారు, తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.తొలిదశ రొమ్ము కేన్సర్ అంటే ఏమిటి?తొలిదశ రొమ్ము కేన్సర్లో సాధారణంగా స్టేజ్ 0, స్టేజ్ I, కొన్ని స్టేజ్ II కేన్సర్లు ఉంటాయి. ఈ దశలో, కణితి రొమ్ముకే పరిమితమై ఉంటుంది లేదా సమీపంలోని శోషరస కణుపులకు చాలా తక్కువగా వ్యాపించి ఉంటుంది. ఇక్కడ కేన్సర్ ఒకే చోట కేంద్రీకృతమై ఉన్నందున, తర్వాతి దశలతో పోలిస్తే సత్వరమే చికిత్స తీసుకుని సులభంగా కోలుకోగలుగుతారు సదరు రోగులుఅంతేగాదు 'ది బ్రెస్ట్' అనే జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, స్టేజ్ I రొమ్ము కేన్సర్కు ఐదేళ్ల మనుగడ రేటు దాదాపు 90% కాగా, స్టేజ్ IVకు ఇది సుమారు 26% మాత్రమేనని తెలుస్తోంది. ఇక్కడ వైల్స్ విషయంలో "తొలిదశ" అనేది ఆమె సాధ్యమైనంత తొందరగానే ఈ సమస్య నుంచి బయటపడతారనేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడ రొమ్ము కేన్సర్ను ముందుగానే గుర్తించడం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలను హైటెల్ చేసింది. ఈ దశలో మనుగడ రేట్లను గణనీయంగా మెరుగుపరుస్తుంది. చాలా సందర్భాలలో, తొలిదశ రొమ్ము కేన్సర్కు చికిత్స తీసుకుంటూనే రోజువారీ పనులను కొనసాగించొచ్చు కూడా. ఇక్కడ వైల్స్ కూడా ఆ నేపథ్యంలోనే చికిత్స పొందుతూనే పని కొనసాగించాలని నిర్ణయించుకున్నారామె. కానీ ఈ తొలి దశలలో, రొమ్ము కేన్సర్ని అంత సులభంగా గర్తించకపోవచ్చు. అయితే, అది ఇచ్చే హెచ్చరిక సంకేతాలను విస్మరించకూడదు:అవేంటంటే..రొమ్ములో లేదా చంకలో గడ్డరొమ్ము పరిమాణం లేదా ఆకారంలో మార్పులుచర్మంపై గుంటలు పడటం లేదా ముడతలు పడటంతల్లిపాలు కాకుండా చనుమొన నుంచి ఇతర స్రావాలు రావడంచనుమొన చుట్టూ చర్మం ఎర్రబడటం లేదా పొలుసులుగా మారడంనిరంతర రొమ్ము నొప్పిఅన్ని గడ్డలూ కేన్సర్ గడ్డలు కావని గమనించడం ముఖ్యం, కానీ ఏదైనా అసాధారణ మార్పును వెంటనే ఆరోగ్య నిపుణుడిచే పరీక్ష చేయించుకోవాలి.ఈ కేన్సర్ ఎవరిలో అధికం అంటే..వయస్సు: వయసు పెరిగే కొద్దీ ప్రమాదం పెరుగుతుందికుటుంబ చరిత్ర: దగ్గరి బంధువులకు రొమ్ము కేన్సర్ ఉండటం ప్రమాదాన్ని పెంచుతుందిజన్యు మార్పులు: BRCA1 మరియు BRCA2 వంటి వారసత్వంగా వచ్చే మార్పులుహార్మోన్ల కారకాలు: చిన్న వయసులోనే రుతుస్రావం ప్రారంభం కావడం లేదా ఆలస్యంగా మెనోపాజ్ రావడంజీవనశైలి కారకాలు: ఊబకాయం, మద్యపానం, శారీరక శ్రమ లేకపోవడంఅయితే, రొమ్ము కేన్సర్తో బాధపడుతున్న చాలా మందికి ముందుగా ఎలాంటి స్పష్టమైన ప్రమాద కారకాలు కనిపించకపోవచ్చు. అందుకే క్రమం తప్పని స్క్రీనింగ్ చాలా కీలకం.ఎలా నిర్ధారిస్తారంటే?ఒక అధ్యయనం ప్రకారం, స్క్రీనింగ్ పరీక్షల్లో మహిళల్లో మామోగ్రఫీ అనే సాధనం మరణాల రేటును 20% వరకు తగ్గించగలదు. వాస్తవానికి సాధారణ స్క్రీనింగ్ పరీక్షల ద్వారానే ప్రారంభ దశ రొమ్ము కేన్సర్ను చాలామటుకు సులభంగా గుర్తిస్తారు. అత్యంత సాధారణ పద్ధతులు:మామోగ్రఫీ: రొమ్ము ఎక్స్-రే, ఇది చిన్న కణితులను గుర్తించగలదుఅల్ట్రాసౌండ్: ఘన గడ్డలు, ద్రవంతో నిండిన తిత్తుల మధ్య తేడాను గుర్తించడంలో సహాయపడుతుందిబయాప్సీ: కేన్సర్ను నిర్ధారించడానికి కణజాల నమూనాను తీసుకుంటారు40 ఏళ్లు పైబడిన మహిళలకు లేదా అధిక ప్రమాదం ఉన్నవారికి క్రమమైన స్క్రీనింగ్ చాలా ముఖ్యం.చికిత్సా పద్ధతులుప్రారంభ దశ రొమ్ము కేన్సర్కు చికిత్స అనేది కణితి పరిమాణం, రకం, అది వ్యాపించిందా లేదా అనే దానితో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణ చికిత్సా విధానాలు:శస్త్రచికిత్స: కణితిని తొలగించడం (లంపెక్టమీ) లేదా మొత్తం రొమ్మును తొలగించడం (మాస్టెక్టమీ)రేడియోథెరపీ: శస్త్రచికిత్స తర్వాత మిగిలిపోయిన కేన్సర్ కణాలను నాశనం చేయడానికి తరచుగా ఉపయోగిస్తారుహార్మోన్ థెరపీ: హార్మోన్ రిసెప్టర్-పాజిటివ్గా ఉండే కేన్సర్ల కోసంకీమోథెరపీ: కొన్ని సందర్భాల్లో, కేన్సర్ మళ్లీ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికిటార్గెటెడ్ థెరపీ: నిర్దిష్ట కేన్సర్ కణ లక్షణాలపై దృష్టి పెడుతుందివైద్యులు సాధారణంగా ప్రతి వ్యక్తికి అనుగుణంగా చికిత్సా ప్రణాళికలను రూపొందిస్తారు. తద్వారా కొద్దిపాటి దుష్ప్రభావాలతో సులభంగా ఈ కేన్సర్ బారి నుంచి బయటపడేలా చేస్తారు. ఏదిఏమైనా ఈ రొమ్ము కేన్సర్ని ముందుగా గుర్తించడమనేది చాలా శక్తిమంతమైనది. ఎందుకంటే ఈ దశలో చికిత్స అందించడం సులభం అవుతుంది. కొద్దిపాటి చికిత్సతోనే తొందరగా బయటపడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: అంకుర్ వారికూ ఫిట్నెస్ సీక్రెట్..! నో స్టెరాయిడ్లు, నో షార్ట్కట్) -
ఇజ్రాయెల్ టు జపాన్.. అంతటా ఉగాది పచ్చడి క్రేజ్
ఉగాది అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ‘ఉగాది పచ్చడి’. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు.. ఇలా ఆరు రుచుల సమ్మేళనంతో జీవిత పాఠాన్ని నేర్పే ఈ పచ్చడి మన తెలుగు వారికే ప్రత్యేకం అనుకుంటాం. అయితే ఈ ఆచారం కేవలం మన దగ్గరే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ‘జీవిత సారాన్ని’ తినిపించే సంప్రదాయాలు ఉన్నాయనే సంగతి మీకు తెలుసా? అవేంటో ఒకసారి చూద్దాం!ఇజ్రాయెల్ ‘సెడర్ ప్లేట్’: చేదు జ్ఞాపకంయూదుల ‘పాసోవర్’ పండుగలో వడ్డించే ‘సెడర్ ప్లేట్’ మన ఉగాది పచ్చడికి గట్టి పోటీ ఇస్తుంది. ఇందులో ‘మారోర్’ అనే చేదు ఆకును తింటారు. ఇది వారి పూర్వీకులు పడ్డ కష్టాలను గుర్తుచేస్తుంది. అదే ప్లేట్లో ‘చరోసెట్’ అనే పండ్లు, గింజల తీపి మిశ్రమం ఉంటుంది. అంటే కష్టం (చేదు) తర్వాత సుఖం (తీపి) వస్తుందని చెప్పడమే దీని ఉద్దేశం. ఇది మన వేపపువ్వు, బెల్లం కాంబినేషన్ మాదిరిగానే ఉందనుకుంటున్నారా?జపాన్ 'ఓసేచి': బాక్సుల్లో భవిష్యత్తుజపనీయులు కొత్త సంవత్సరంలో ‘ఓసేచి ర్యోరి’ అనే ప్రత్యేక వంటకాల బాక్సును పంచుకుంటారు. ఇందులో ఒక్కో పదార్థానికి ఒక్కో అర్థం ఉంటుంది. నల్ల సోయా చిక్కుళ్లు తింటే ఆరోగ్యం, చేప గుడ్లు తింటే సంతాన ప్రాప్తి అని వారి నమ్మకం. మన ఉగాది పచ్చడిలో మామిడి వగరు లాగే, వారు కూడా ప్రకృతి ఇచ్చే ప్రతి పదార్థాన్ని ఒక ఆశీర్వాదంగా జపనీయులు భావిస్తారు.ఇరాన్ 'హఫ్త్-సీన్': ఏడు వస్తువులు.. ఏడు పాఠాలు!పర్షియన్ కొత్త సంవత్సరం ‘నౌరూజ్’ సమయంలో ఇరానీయులు ‘హఫ్త్-సీన్’ అనే టేబుల్ను ఏర్పాటు చేస్తారు. ఇందులో ‘ఎస్’ అక్షరంతో మొదలయ్యే ఏడు పదార్థాలు ఉంటాయి. వెల్లుల్లి ఆరోగ్యానికి, వినెగర్ సహనానికి ప్రతీక అని చెబుతారు. మన పచ్చడిలో చింతపండు పులుపు ఎలాగో, అక్కడ వినెగర్ అలా అన్నమాట. ఈ సంప్రదాయం వెనుక ఉన్న లోతైన అర్థం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.చైనా ‘లాబా గంజి’: ఎనిమిది రకాల అదృష్టంచైనీయులు ‘లాబా’ పండుగ నాడు ఎనిమిది రకాల ధాన్యాలు, పండ్లతో చేసిన గంజిని తాగుతారు. ఇది కేవలం ఆకలి తీర్చడానికే కాదు, రాబోయే ఏడాది అంతా అదృష్టం కలిసిరావాలని చేసే ఒక ప్రార్థన. మన ఉగాది పచ్చడిలో కొత్త బెల్లం ఎలాగైతే కొత్త ఆశలను చిగురింపజేస్తుందో, ఈ లాబా గంజి చైనీయులకు అంతటి పవిత్రమైనది.మహారాష్ట్ర 'పంఛరస': అదే సంప్రదాయంమన పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో గుడి పడ్వా రోజున ‘పంఛరస’ పేరుతో వేపపువ్వు, బెల్లం, ఉప్పు, జీలకర్ర కలిపిన లడ్డూలను తింటారు. పేరు వేరైనా పరమార్థం ఒక్కటే. జీవితం అంటే కేవలం తీపి మాత్రమే కాదు, అన్ని రుచులను సమానంగా స్వీకరించాలని ఈ వంటకం మనకు గుర్తు చేస్తుంది. ఈ పోలికలను చూస్తుంటే ‘వసుదైక కుటుంబం’ అనే భావన మనలో కలుగుతుంది.రుచులు వేరైనా భావం ఒక్కటేమనిషి ఏ దేశంలో ఉన్నా, ఏ భాష మాట్లాడుతున్నా జీవితంలోని ఒడిదుడుకులను ఆహారం ద్వారా అర్థం చేసుకోవడం ఒక అందమైన సంప్రదాయం. ఉగాది పచ్చడి అయినా, పాసోవర్ చేదు ఆకులైనా.. కష్టాన్ని భరిస్తూ సుఖాన్ని వెతుక్కోవడమే అసలైన విజయం. అందుకే ఈ ఏడాది ఉగాది పచ్చడి తీసుకునేటప్పడు దానిలోని ‘ప్రపంచవ్యాప్త తత్వాన్ని’ గుర్తుచేసుకోండి. ఇది కూడా చదవండి: విచ్చలవిడి ‘యూజర్ల’పై ప్రభుత్వం ఉక్కుపాదం -
ఫైనాన్షియల్ పర్సనాలిటీ అంటే..?
డబ్బు కేవలం కరెన్సీ మాత్రమే కాదు, అది మీ 'పర్సనాలిటీకి అద్దం'. మీరు డబ్బును ఎలా చూస్తున్నారు? భద్రత కోసం చూస్తున్నారా? లేక హోదా కోసం చూస్తున్నారా? మీ వ్యక్తిత్వం ఎంత గొప్పదైనా, మీ డబ్బు ఖర్చు చేసే విధానం మీలోని భయాలను, ఆశలను బయటపెడుతుంది. సైకాలజీ ప్రకారం, మన ఫైనాన్షియల్ నిర్ణయాలు మన బాల్యంలో ఏర్పడిన నమ్మకాలపై (Money Beliefs) ఆధారపడి ఉంటాయి.1. నాలుగు రకాల ఫైనాన్షియల్ పర్సనాలిటీలుసైకాలజీ ప్రకారం, మనుషులను డబ్బును ఖర్చు చేసే తీరు బట్టి నాలుగు రకాలుగా విభజించవచ్చు. The Spender (ఖర్చు చేసేవాడు): వీరు డబ్బును 'సంతోషం' కోసం ఖర్చు చేస్తారు. ఎవరైనా ఏమనుకుంటారో అని, లేదా ఇన్స్టంట్ హ్యాపీనెస్ కోసం ఖర్చు చేస్తారు. ఇది వారిలోని 'అభద్రతా భావం' (Insecurity) ను కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నం.The Saver (దాచుకునేవాడు): వీరు డబ్బును 'భద్రత'గా భావిస్తారు. ప్రతి రూపాయిని దాచుకోవడం వీరి పర్సనాలిటీ. ఇది వారిలోని 'భవిష్యత్తు భయం' (Fear of the future) ను ప్రతిబింబిస్తుంది. The Avoider (తప్పించుకునేవాడు): వీరు తమ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చూడ్డానికి కూడా భయపడతారు. డబ్బు విషయంలో ఒక రకమైన 'నిరాసక్తత'ను ప్రదర్శిస్తారు. ఇది వారి 'అసమర్థత' (Feeling of helplessness) ని సూచిస్తుంది. The Investor/Planner: వీరు డబ్బును ఒక 'సాధనం'లా వాడతారు. వీరిలో ప్లానింగ్, క్రమశిక్షణ ఉంటాయి. వీరు తమ వ్యక్తిత్వాన్ని 'రిస్క్ అండ్ రివార్డ్' తో బ్యాలెన్స్ చేసుకుంటారు.2. మనీ ట్రాప్స్: పర్సనాలిటీని ఎలా దెబ్బతీస్తాయి?Status Spending: మనకు నచ్చని వస్తువులను, మనకు ఇష్టం లేని వ్యక్తులను మెప్పించడానికి కొనడం. ఇది మీ 'ఆత్మవిశ్వాసం' లేకపోవడానికి సంకేతం.Impulse Buying: ఎమోషనల్ గా ఉన్నప్పుడు (కోపం లేదా బాధ) ఖర్చు చేయడం. ఇది మీ 'ఎమోషనల్ ఇంటెలిజెన్స్' లోపం.3. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, మీ డబ్బుని మీ పర్సనాలిటీని పెంచే ఆయుధంగా ఎలా మార్చుకోవాలి?Step 1: డబ్బుతో ఉన్న ఎమోషనల్ అటాచ్మెంట్ని బ్రేక్ చేయండిమీరు ఎందుకు ఖర్చు చేస్తున్నారో గమనించండి. అది మీ అవసరమా? లేక మీలోని ఏదో వెలితిని నింపుకోవడానికా? మీరు 'Spender' అయితే, మీలోని 'Insecurity' ని 'Break' చేయండి. 'Saver' అయితే, మీలోని 'భయాన్ని' బ్రేక్ చేయండి.Step 2: వాల్యూ బేస్డ్ స్పెండింగ్మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి మీ Values ని ప్రతిబింబించాలి. మీరు చదువుకోవడానికి, ఆరోగ్యం కోసం, మంచి సంబంధాల కోసం ఖర్చు చేస్తున్నారా? అయితే అది మీ పర్సనాలిటీని Build చేసుకోవడం. అనవసరమైన వాటిని కట్ చేయండి.Step 3: ఆర్థిక స్వేచ్ఛడబ్బు కోసమే బ్రతకడం కాదు, డబ్బు మీ కోసం పనిచేసేలా చేయాలి. మీ ఆర్థిక క్రమశిక్షణే మీ పర్సనాలిటీకి ఒక 'స్టేటస్'ను ఇస్తుంది. ఆర్థికంగా స్వేచ్ఛ ఉన్నప్పుడు, మీరు ప్రపంచాన్ని మరింత ధైర్యంగా ప్రభావితం చేయగలరు. ఇదే 'Beyond' స్టేజ్.4. మీ ఫైనాన్షియల్ అద్దంఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.మీ గత నెల ఖర్చులలో ఎన్ని 'అవసరం' కోసం, ఎన్ని 'హోదా' కోసం?మీరు ఎందుకు దాచుకుంటున్నారు? (భయం కోసమా? లక్ష్యం కోసమా?)మీరు కష్టపడి సంపాదించిన డబ్బుకి, మీ వ్యక్తిత్వానికి సంబంధం ఉందని మీరు నమ్ముతున్నారా?డబ్బు - మీ పర్సనాలిటీకి మందు!బ్రో, డబ్బు లేకపోవడం వల్ల వచ్చేది పేదరికం, కానీ డబ్బుని సరిగ్గా నిర్వహించలేకపోవడం వల్ల వచ్చేది 'పర్సనాలిటీ క్రైసిస్'. క్రమశిక్షణతో కూడిన ఖర్చు, మీ వ్యక్తిత్వానికి ఒక గొప్ప గౌరవాన్ని ఇస్తుంది."Wealth is not about having a lot of money; it's about having a lot of options." Naval Ravikanthసైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: ఒత్తిడిలో మీ నిజమైన పర్సనాలిటీ బయటపడుతుందా?) -
ఆస్కార్ ఘనత
ఆస్కార్లో భారతీయ మహిళలు తమ ఘనతను చాటుతూనే ఉన్నారు. తాజాగా ప్రకటించిన 2026 ఆస్కార్ ఆవార్డులలో గీతా గంద్భిర్ ‘ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరీ’లో ‘ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ విభాగం’లో రెండు నామినేషన్లు పొంది ఇలా రెండు నామినేషన్లు పొందిన తొలి భారతీయ సంతతి మహిళగా చరిత్ర సృష్టించారు. ఆమెకు ఆస్కార్ దక్కకపోయినా రెండు నామినేషన్లతో పేరు మార్మోగుతోంది.‘మనం మార్పు కోసం ప్రయత్నిస్తూనే ఉండాలి’ అంటారు గీతా గంద్భిర్. సినిమాలో కల్పన ఉంటుంది. డాక్యుమెంటరీలో వాస్తవం ఉంటుంది. వాస్తవం చూపించి వాస్తవికమార్పు తేవడమే గీతా గంద్భిర్ లక్ష్యం. అందుకే ఆమె తీసిన డాక్యుమెంటరీలు ఆస్కార్ చివరి మెట్టు వరకూ చేరాయి. అవార్డు గెలవకపోవచ్చు... కాని గెలిచినంత పని చేసి ప్రపంచం దృష్టిలో పడ్డాయి. అది చాలు గీతా గంద్భిర్కు. సమస్యను జనం దృష్టికి తెస్తే వాళ్లు ఆలోచిస్తారని ఆమెకు తెలుసు. ఆమెను చూసి స్ఫూర్తి పొందాల్సిన సంగతి అదే.రెండు నామినేషన్లులాస్ ఏంజెలెస్లో మార్చి15న జరిగిన 98వ ఆస్కార్ అవార్డు వేడుకలో భారతీయ సంతతికి చెందిన దర్శకురాలు గీతా గంద్భిర్ పేరు మారుమోగింది. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ విభాగంలో ఆమె దర్శకత్వం వహించినæ‘ది డెవిల్ ఈజ్ బిజీ’ షార్ట్లిస్ట్ అయితే ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరీలో గీత నిర్మించి, దర్శకత్వం వహించిన ‘ది పర్ఫెక్ట్ నైబర్’ నామినేషన్ కు చేరింది. ఇలా ఒక భారతీయ సంతతికి చెందిన మహిళ రెండు నామినేషన్లు సాధించడం రికార్డు.డాక్యుమెంటరీలు దేని గురించి?‘ది డెవిల్ ఈజ్ బిజీ’ డాక్యుమెంటరీకి గీత ఆ చిత్ర నిర్మాత క్రిస్టాలిన్ హాంప్టన్ తో కలిసి దర్శకత్వం వహించింది. ఇది అట్లాంటా లో ఉన్న మహిళా ఆరోగ్య కేంద్రంలో చీఫ్ ఆఫ్ సెక్యూరిటీగా పని చేస్తున్న ట్రేసీ జీవితంపై తీసిన డాక్యుమెంటరీ. ఉద్యోగులు, రోగులను కా పాడే క్రమంలో ఆమె దినచర్యలోని ఒక రోజును డాక్యుమెంటరీ నిశితంగా చూపిస్తుంది. ‘ది పర్ఫెక్ట్ నైబర్’ ఒకాల (ఫ్లోరిడా)లో జూన్ 2023లో జరిగిన విషాద సంఘటనను చూపిస్తుంది.రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో సుసాన్ లూయిస్ అనే తెల్లజాతి మహిళ తన ఇంటి పక్కన ఉన్న నల్లజాతి వ్యక్తి అజికే ఓవెన్ ్సను కాల్చి చంపింది. ఈ అంశాన్నే తన డాక్యుమెంటరీకి ఎంచుకున్నారామె. ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో విడుదలైంది. ‘అమెరికాలో అమానవీయ యాజమాన్యల ధోరణులపై పోరాడాలి. అలాగే అమెరికాలో ఉన్న గన్ కల్చర్ గురించి చాలా మాట్లాడాలి. ఆ చట్టాల్లో మార్పు రావాలి. ఇవి ఒకరోజులో జరిగేవి కావు. నా డాక్యుమెంటరీలు ఈ అంశాలనే చర్చిస్తూ ఆలోచనలు రేకెత్తిస్తాయి. మార్పుకు దోహదం చేస్తాయి’ అంటారు గీత.సహాయకురాలిగా ప్రారంభమైన కెరీర్స్పైక్ లీ, సామ్ పొలార్డ్ల చిత్రాలకు సహాయకురాలిగా గీత కెరీర్ను ప్రారంభించారు. ఆపై డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాణంలోకి అడుగుపెట్టారు. స్పైక్ లీ నిర్మించిన డాక్యుమెంటరీలు ‘ఇఫ్ గాడ్ ఈజ్ విల్లింగ్’, ‘డా క్రీక్ డోంట్ రైజ్’లకు గీత ఎడిటర్గా పని చేశారు. గ్రేస్ లీదర్శకత్వం వహించిన ‘అండ్ షీ కుడ్ బి నెక్స్ట్’ చిత్రానికి ఆమె ఫీల్డ్ డైరెక్టర్గా ఉన్నారు. గీత తీసిన షార్ట్ ఫిల్మ్ ‘త్రూ అవర్ ఐస్: అ పార్ట్’ సిరీస్ 2022లో అత్యుత్తమ షార్ట్ డాక్యుమెంటరీగా ఎమ్మీ అవార్డును గెలుచుకుంది.చేజారిన పురస్కారాలు..తాజాగా జరిగిన ఆస్కార్ ప్రదానోత్సవ వేడుకల్లో గీతకు రెండు విభాగాల్లోనూ పురస్కారాలు దక్కలేదు. ఉత్తమ షార్ట్ డాక్యుమెంటరీగా ‘ఆల్ ది ఎంప్టీ రూమ్స్’ ఎంపిక కాగా, ఉత్తమ డాక్యుమెంటరీగా ‘మిస్టర్ నోబడీ అగెనెస్ట్ పుతిన్’ ఎంపికైంది. అయినా సరే గీతలో ఏమాత్రం నిరాశ లేదు. తన పని తాను సరిగ్గా చేశానన్న ధీమా ఆమెలో వ్యక్తమవుతోంది. ఒకేసారి రెండు నామినేషన్లు పొందిన మహిళగా ఆమె గురించి ప్రపంచానికి తెలిసింది. మరిన్ని విజయాలు ఆమె కోసం ఎదురుచూస్తున్నాయి.వలస కుటుంబం నుంచిగీతా గంద్భిర్ తండ్రి శరద్ 1960లలో కెమికల్ ఇంజనీరింగ్ చదవడానికి భారతదేశం నుండి అమెరికాకు వెళ్లారు. ఫలితంగా గీత బోస్టన్లో పెరిగారు. ఆమె తల్లి పేరు లలిత. గీత సోదరుడు అశ్విన్ గంద్భిర్ కూడా చిత్రనిర్మాత, ఎడిటర్. డాక్యుమెంటరీ రంగంలో అమెరికాలో గీతది ప్రముఖమైన పేరు. ఇప్పటికే ఐదు ఎమ్మీ అవార్డులతో పాటు అనేక అంతర్జాతీయ పురస్కారాలు గెలుచుకున్నారు. -
గ్యాస్ కొన్ని జ్ఞాపకాలు
‘ఇంట్లో బోర్ కొడితేబయట తినొచ్చు’ అనేవారు. ఇప్పుడు బయట తినడానికి దొరికేలా లేదు. కొన్నాళ్ల తర్వాత ఇంటి పరిస్థితీ తెలియదు. ఏమంటే యుద్ధం వల్ల గ్యాస్ లేదు. కట్టెల పొయ్యి, కిరోసిన్ స్టవ్ దాటి గ్యాస్ వచ్చాక అది ఇంటి ఊపిరిగా మారింది. ఇప్పటి తరానికి తెలియదు గాని గ్యాస్ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి స్త్రీలకు.‘వాళ్లు గ్యాస్ కొనుక్కున్నారట’... 1980లలో ఇది చిన్న ఊళ్లలో పెద్ద వార్త. గ్యాస్ కొనుక్కోవడం అంటే ఆడవాళ్లకు అతి పెద్ద రిలీఫ్ ఏమిటంటే– అది ఎప్పుడు పడితే అప్పుడు వెలుగుతుంది. వాన వచ్చినా, చలి ఉన్నా, అర్ధరాత్రయినా, తెల్లవారుజామున కానీ... ఎప్పుడైనా సరే... టప్.. వెలుగుతుంది. ఆడవాళ్లు ఈ వింతను చూడటానికి ఆ గ్యాస్ కొనుక్కున్న వారి ఇంటికి వెళ్లేవారు. అప్పటివరకూ వాళ్లకు కట్టెల పొయ్యి తెలుసు. కట్టెలు తెచ్చుకుని, పొయ్యిలో పెట్టుకుని, వాటిని కిరోసిన్ వేసి ముట్టించి, బాగా మండే వరకు ఆగి... ఆ తర్వాత ఊదుడు గొట్టంతో ఊది ఊది... ఇన్ని చేస్తే గాని వంట పూర్తి కాదు.ఇక కిరోసిన్ స్టవ్ ఉంటుంది గానీ అందుకు కిరోసిన్ కావొద్దూ! వొత్తులు ఉండే స్టవ్ను వొత్తులు సరి చేసుకుని వెలిగించి మెల్లగా వంట మొదలెడితే ఎప్పటికో అవుతుంది. పంప్ స్టవ్ కొంచెం డేంజర్. ఇది మగవారికి సౌకర్యంగాని ఆడవాళ్లకు బెరుకే. బుజ్మని నీలిరంగు మంట వచ్చే ఈ స్టవ్లు ఆ రోజుల్లో పేలేవి. ఈ స్టవ్లు వాడాలంటే తరచు పిన్తో నొక్కి బర్నర్ను యాక్టివేట్ చేయాలి. అది మరో తలనొప్పి. అయినా సరే. పెద్ద టెన్షన్ ఉండేది కాదు. కట్టెలు దొరుకుతాయి. కిరోసిన్ కూడా బ్లాక్లో బాగానే దొరికేది. వంట చేయాలనుకోవాలేగాని చేయొచ్చు. ఆ సమయంలో ఇదిగో ఇలా గ్యాస్ ఊడిపడింది.ఎన్నో అనుమానాలుమొదట గ్యాస్ స్టవ్ను ఎవరూ నమ్మలేదు. సిలిండర్ పేలి చచ్చిపోతారని భయపడుతూ స్తోమత ఉన్నవారు కూడా కొనలేదు. గ్యాస్ మంట మీద వొండేది రుచిగా ఉండదని మరో అభి్ర పాయం. గ్యాస్ స్టవ్ను ఎలా తుడవాలి, ఎలా శుభ్రం చేయాలి తెలియదు. ఇక రెగ్యులేటర్ది పెద్ద అవస్థ. అది బిగించడం తీయడం తెలియదు. రెగ్యులేటర్ ఆన్ ఆఫ్ బటన్తో కూడా భయం ఉండేది. ఇక గ్యాస్ లీక్ కావడం గురించి గగ్గోలు ఉండేది. గ్యాస్ వాసన వస్తే భయపడిపోయేవారు. ఇవన్నీ ఇలా ఉండగా గ్యాస్ డీలర్లు గ్యాస్ కొనమని ప్రచారం చేసేవారు. ఆ ఎర్రరంగు సిలిండర్ ఇంటిలోకి అడుగుపెట్టింది.సిలిండర్ వొచ్చిందాసింగిల్ సిలిండర్లే చాలా ఇళ్లలో. డబుల్ సిలిండర్ ఏ కొద్దిమంది దగ్గరో ఉండేది. సిలిండర్ అవుతూ ఉండగా గ్యాస్ బుక్ చేస్తే అయిపోయిన ఎన్నో రోజులకు అది వచ్చేది. అంతవరకు మళ్లీ రకరకాల పద్ధతుల్లో వంట సాగేది. ‘గ్యాస్ దొరకడం లేదట’ అనే వార్త అప్పటినుంచి ఇప్పటి వరకూ స్త్రీలను హైరానా పెడుతూనే ఉంది. గ్యాస్ అయిపోవడం కూడా గమ్మత్తుగా జరుగుతుంది. అదెప్పుడూ తీరుబడిగా ఉన్నప్పుడు అయిపోదు. ఉదయాన్నే అందరూ హడావిడిగా బయలుదేరుతూ వంట చేసుకుని టిఫిన్లు కట్టుకుంటూ ఉండగా అయిపోతుంది. ఆ క్షణంలో ఇంట్లో రేగే కలకలం శత్రుదేశాల సరిహద్దుల వద్ద కూడా ఉండదు.కాస్త సిలిండర్ ఇస్తారాసిలిండర్ చేతుల్లోకి కుటుంబాలు వెళ్లాక ఇరుగు పొరుగు మధ్య గ్యాస్ స్నేహం ఏర్పడింది. వీరు ‘సిలిండర్ ఇచ్చేవారు’ ‘సిలిండర్ ఇవ్వనివారు’గా విభజితం అయ్యాయి. మనకు సిలిండర్ ఇచ్చేవారే క్లోజ్ఫ్రెండ్సు. గ్యాస్ ఎప్పుడైపోతుందో ఎవరికీ తెలియదు కాబట్టి ఇలాంటి స్నేహం ఒక్కటైనా లేకపోతే మనుగడ కష్టమైపోతుంది. గతంలో పోస్టుమ్యాన్ వస్తే జనానికి ఆనందం ఉండేది. ఇప్పుడు గ్యాసు బండి వీధిలోకి వస్తే సంతోషం కలుగుతోంది. బంగారం ధర, గ్యాస్ ధర... ఇవే సగటు మధ్యతరగతి మహిళకు మోదం ఖేదం కలిగించే విషయాలుగా మారాయి. 1980లలో 40 రూ పాయలున్న సిలిండర్ నేడు 930కి చేరింది. -
వంట... వనరులు
‘గ్యాస్ మామ రావే...జాబిల్లి రావే’ అని పిల్లలు పాడుకుంటున్నారట! ఈ సరదా సరదా పాటల సంగతి ఎలా ఉన్నా, ఎల్పీజీ గ్యాస్ అనే మాట బాంబులా భయపెడుతూనే ఉంది. గ్యాస్ సంక్షోభం వచ్చినప్పుడల్లా... ‘అయ్యో!’ అనుకోవడం కాకుండా...కాస్త ముందు చూపుతో ప్రత్యామ్నాయ ఇంధన వనరులు ఏర్పాటు చేసుకుంటే సమస్యే ఉండదు కదా! ‘స్మార్ట్ ప్లానింగ్ ఉంటే శాశ్వత పరిష్కారం మన సొంతం’ అని నిరూపించింది ప్రభాత్ స్కూల్...మహారాష్ట్ర అకోలాలోని ‘ప్రభాత్ డే అండ్ బోర్డింగ్ స్కూల్’లో వ్యవసాయ వ్యర్థాలతో పనిచేసే ‘ఫ్లేమ్ లెస్ సిస్టమ్’ను ఉపయోగించి రోజుకు పదిహేను వందల మంది విద్యార్థులకు వంటవార్పు చేస్తున్నారు. స్మార్ట్ ప్లానింగ్ శాశ్వత పరిష్కారాలకు ఎలా ఉపయోగపడుతుందో ‘ప్రభాత్ స్కూల్’ నిరూపించింది.మంట లేకుండా వంటప్రభాత్ స్కూల్ కిచెన్లో ‘మంట లేకుండా వంట’ అనేది నిన్నా మొన్నటి కాన్సెప్ట్ కాదు. దశాబ్ద కాలం క్రితమే వచ్చిన దీర్ఘకాలిక ఆలోచన. సంప్రదాయ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించడానికి చేసిన ప్రయత్నం. ఆ దూరదృష్టి ఊరకే పోలేదు. ఎంతోమంది కి స్ఫూర్తి ఇస్తోంది.స్కూల్ వంటగదిలో సంప్రదాయ వంటగ్యాస్కు బదులు థర్మిక్ ఫ్లూయిడ్ హీటింగ్ సిస్టమ్ను ఉపయోగిస్తారు. సరళంగా చె΄్పాలంటే ఆయిల్ పైపుల ద్వారా వేడి సర్క్యులేట్ అవుతుంది.. మంట లేకుండా స్థిరమైన వేడి వంట పాత్రలకు చేరుతుంది. వ్యవసాయ వ్యర్థాల నుండి తయారైన బయోమాస్– ఆధారిత ఇంధన గుళికలు(ఫ్యూయెల్ పిల్లెట్స్) ద్వారా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. పెద్ద వంట గదిలోకి అడుగు పెట్టేవారికి గ్యాస్ స్టవ్ల నుండి వచ్చే వేడి ఎంత ఉంటుందో తెలుసు. ముఖ్యంగా వేసవిలో ఆ వేడి మరింత తీవ్రంగా ఉంటుంది. అయితే ఈ మంట రహిత వంట గదిలో అధిక వేడితో ఇబ్బంది పడడం అనేది ఉండదు.బయోగ్యాస్ బాటలో...వంటగది వ్యర్థాలు... ఆవు పేడతో తయారయ్యే ఇంధన అద్భుతం... బయోగ్యాస్. తాజా ఎల్పీజీ సంక్షోభం నేపథ్యంలో బయోగ్యాస్ మళ్లీ తెర మీదికి వచ్చింది. బయోగ్యాస్ అనేది మీథేన్, కార్బన్ డయాక్సైడ్ల మిశ్రమం. ఆక్సిజన్ లేని వాతావరణంలో సేంద్రియ పదార్థాన్ని విచ్ఛిన్నం చేసినప్పుడు ఉత్పత్తి అవుతుంది. బయోగ్యాస్ను వంట కోసమే కాకుండా లైట్లు, జనరేటర్లకు కూడా ఉపయోగించవచ్చు. గృహ అవసరాలు, బడ్జెట్ను బట్టి తమకు అనుకూలమైన బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించుకోవచ్చు. వాటిలో కొన్ని... 1. ఫిక్స్డ్ డోమ్ డైజెస్టర్: ఫిక్స్డ్ గ్యాస్ స్పేస్తో నిర్మించే అండర్గ్రౌండ్ చాంబర్. ∙మెయింటెనెన్స్కు తక్కువ శ్రమతో మెయింటెనెన్స్ ∙లీక్–ప్రూఫ్ కోసం నిపుణుల సలహాలు తీసుకోవాలి.2. ఫ్లోటింగ్ డ్రమ్ డైజెస్టర్: గ్యాస్ వాల్యూమ్తో కదిలే ఫ్లోటింగ్ గ్యాస్ హోల్డర్ ∙పర్యవేక్షించడం సులభం, తక్కువ శ్రమ.3. ఫ్లెక్సీ–బ్యాగ్/ ప్లాస్టిక్ డైజెస్టర్: పీవీసీ టార్పాలిన్తో తయారు చేస్తారు కాబట్టి కొత్తగా ప్రారంభించే వారికి, అద్దె ఇంటిలో నివసించేవారికి అనుకూలమైనది.లైఫ్ స్పాన్: 1. íఫిక్స్డ్ డోమ్ డైజెస్టర్: 15–20 సంవత్సరాలు 2. ఫ్లోటింగ్ డ్రమ్ డైజెస్టర్: 8–10 సంవత్సరాలు...‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉ పాయాలు’ అన్నట్లు వంటగ్యాస్ ఎంత భయపెడితే మాత్రం ఏం? దాని నుంచి బయటపడడానికి, పర్యావరణ అనుకూల ఇంధన వనరులను అన్వేషించడానికి బోలెడు ఉ పాయాలు. మీదే ఆలస్యం!ఆదా–ఆదాయం⇒ గ్రామీణ ప్రాంతాలలోనే కాదు, సేంద్రియ వంటగది వ్యర్థాలు సులభంగా అందుబాటులో ఉండే పట్టణ ప్రాంతాలలో కూడా బయోగ్యాస్ ప్లాంట్ సమర్థంగా పనిచేస్తుంది⇒ బయోగ్యాస్ ద్వారా డబ్బు ఆదా చేసుకోవచ్చు, ఆదాయం పొందవచ్చు. బయోగ్యాస్ ప్లాంట్ నుండి వచ్చే ‘లిక్విడ్ స్లర్రీ’ సేంద్రియ ఎరువుగా పనికొస్తుంది.⇒ ప్రస్తుతం దేశీయ బయోగ్యాస్ మార్కెట్ 20 శాతానికి పైగా వార్షిక వృద్ధితో దూసుకుపోతోంది⇒ కేంద్రప్రభుత్వం జాతీయ జీవశక్తి కార్యక్రమం కింద గృహ బయోగ్యాస్ ప్లాంట్లకు ఆర్థిక సహాయం అందిస్తోంది. -
మళ్ళీ మన ముందుకు... అలనాటి ఆ మహామహులు!
నూరు వసంతాలు దాటిన తెలుగు నాటక ప్రస్థానంలో ఎన్నో మెరుపులున్నాయి. మరెన్నో నేర్చుకున్న పాఠాలున్నాయి. ఉత్తుంగ తరంగమై నిలిచి, ఉత్థాన పతనాలెన్నో చూసిన ఈ రంగస్థల స్రోతస్విని ప్రయాణంలో ఎందరో మహానుభావులు... తమ జీవితాన్నే కళకు దివ్య సమర్పణం చేసిన ఎందరెందరో మహామహులు.రంగస్థలం, ఆ వెనుక దాన్ని అనుసరించి వచ్చిన వెండితెర రంగుల ప్రపంచం... ఉభయత్రా తమ ప్రతిభా సంపత్తులతో ఆ రంగాలకు కొత్త కాంతులు జోడించిన ఆ దివ్యమూర్తులను నేటి తరానికి పరిచయం చేస్తే? వారిని స్మరిస్తూ, వారి గానం, అభినయాలను శ్రవ్య – దృశ్య రూపంలో కళ్ళ ముందు నిలిపితే? ఆ రూపంలో కొత్త తరానికి మన ‘అలనాటి నాటక ప్రస్థానం’పై స్థూలంగా అవగాహన కలిగిస్తే? అదిగో.... అలాంటి విశిష్ట ప్రయత్నమే ‘అలనాటి నాటక ప్రస్థానం’.పరిశోధన, పరిశ్రమల మేళవింపుగమనిస్తే... 1880ల నుంచి ఇప్పటి వరకు ఎందరో నటులు, నాటక కర్తలు, దర్శకులు, సాంకేతిక నిపుణుల ప్రతిభాపాటవాల వల్లే తెలుగు నాటక రంగం ఇప్పటి అత్యున్నత స్థితిని చేరుకుంది. అయితే, తెలుగునాట నాటక విమర్శ, పరిశోధన... రెండూ తక్కువే. మన తెలుగు నాటక చరిత్రను కూలంకషంగా గ్రంథస్థం చేసినదీ అతి స్వల్పమే. బళ్ళారి రాఘవ నుంచి నిన్న మొన్న దివంగతులైన వందలాది నటీనటుల అభినయ వైదుష్యం అరకొరగా అయినా అక్షరాల రూపంలో ఉందేమో కానీ, వారి గాన మాధుర్యం, నట వైదుష్యాలను ప్రత్యక్షంగా చూసినవారు నేడు అరుదు. అలాంటి పరిస్థితుల్లో... అంతకంతకూ చదవడం తగ్గిపోతున్న నవతరాన్ని సైతం దృష్టిలో పెట్టుకొని, మన నాటక రంగ శ్రవ్య, దృశ్య వైభవాన్ని రూపకంగా అందించేందుకు చేసిన ప్రయత్నం ఇది. ఈ తరానికి అలవాటైన, అందరికీ అందుబాటులో ఉన్న యూ ట్యూబ్ వేదికగా ‘అజో... విభో... కందాళం ఫౌండేషన్’ ఈ అరుదైన కానుకను సమర్పించింది.అలా... నాటి మేటి నటీనటుల శ్రవ్య – దృశ్య కళారూపకం ఈ ‘అలనాటి నాటక ప్రస్థానం’. మొత్తం 8 భాగాలుగా దీన్ని అందించారు. అన్ని భాగాలూ కలిపి దాదాపు 10 గంటల నిడివి గల సిరీస్ ఇది. ఒక్కమాటలో ఈ సిరీస్ ఎంతో శ్రమతో సాగించిన యజ్ఞం. ప్రముఖ నాటక రంగ పరిశోధకుడు – రచయిత డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు ఈ రూపకం కోసం అనేక నెలల పాటు పరిశోధించారు. సంబంధిత నటీనటుల దృశ్య, శ్రవ్య ఖండికల సేకరణ నిమిత్తం చాలానే పరిశ్రమించారు. ఆ పరిశోధన, పరిశ్రమ... ఈ రూపకాన్ని చూస్తున్నప్పుడు కళ్ళకే కాదు... మనసుకు కూడా తడతాయి.మూడేళ్ళ క్రితమే... మరో మహత్తర అక్షర కృషికొద్దిగా వెనక్కి వెళితే... ‘అజో-విభొ- కందాళం ఫౌండేషన్’ వారే మూడేళ్ళ క్రితం ‘తెలుగు నాటకరంగ మూలస్తంభాలు’ పేరిట అపూర్వమైన గ్రంథాన్ని ప్రచురించారు. తెలుగు నాటకరంగ అభివృద్ధికి కృషి చేసిన తొలి, మలి తరాల రచయితలు, నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల సంక్షిప్త పరిచయాలతో కూడిన వ్యాస సంకలనం అది. తెలుగు రంగస్థలంపై వారి ప్రాథమిక కృషితో పాటు అరుదైన వారి ఛాయాచిత్రాలను కూడా గుదిగుచ్చిన దాదాపు వెయ్యి పేజీల బృహత్ గ్రంథమది. ఆ రచన కూడా డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు చేసినదే! మరో రచయిత వాడ్రేవు సుందరరావు ఆ కృషిలో ఆయనకు భాగస్వామిగా వ్యవహరించారు. అందులో 120 మంది నాటక రచయితలు, 117 మంది నటులు – దర్శకులు, 24 మంది సాంకేతిక నిపుణులు... వెరసి 261 మంది దివంగత మహనీయమూర్తుల గురించిన సమాచారం, అపురూపమైన ఫోటోలతో అందించారు.ఒక రకంగా ఆ బృహత్ రచన సమయంలోనే కందిమళ్ళకు ఈ ‘అలనాటి నాటక ప్రస్థానం’ శ్రవ్య – దృశ్య రూపకం ఆలోచన వచ్చి ఉండాలి. ‘తెలుగు నాటకరంగ మూలస్తంభాలు’ బృహత్ ప్రయత్నాన్ని అక్షర రూపంలో అందించిన ఆయన ఈసారి ఈ ‘అలనాటి నాటక ప్రస్థానం’ అనే ఈ కొత్త ప్రయత్నానికి ఆడియో – విజువల్ పద్ధతిని ఎంచుకున్నారు. బుక్ కల్చర్ కన్నా లుక్ కల్చర్ లోకి ఎక్కువగా ఆకర్షితులవుతున్న నవతరాన్ని ఆకట్టుకొనేలా, అలనాటి నటీనటుల కృషి తెలిసేలా వారే పాడిన గ్రామఫోన్ రికార్డులు, నటించిన సినిమాలలోని దృశ్యాలు కష్టపడి సేకరించి, ఈ అరుదైన రూపకాన్ని రూపొందించారు. అందమైన మాలగా గుదిగుచ్చారు. ఈ ప్రయత్నం రంగస్థల అభిమానులందరికీ అమితమైన ఆనందం పంచుతుంది. పేర్లు చదవడమే తప్ప, ప్రత్యక్షంగా తాము చూడని అమరులైన దాదాపు 84 మంది అలనాటి సుప్రసిద్ధ నటీనటులను మళ్ళీ కళ్ళ ముందు ఉంచుతుంది. అప్పటి వారి మాట, పాట, అభినయాలను ఈ తరం మళ్ళీ మళ్ళీ చూసుకొనే అవకాశం కల్పిస్తుంది.కళ్ళ ముందు... నాటి అపూర్వ కళాప్రతిభబళ్ళారి రాఘవ, బలిజేపల్లి లక్ష్మీకాంతం, యడవల్లి సూర్యనారాయణ, వేమూరి గగ్గయ్య, స్థానం నరసింహారావు, మాధవపెద్ది వెంకట్రామయ్య, తుంగల చలపతిరావు, బందా కనకలింగేశ్వరరావు, అద్దంకి శ్రీరామమూర్తి, దాసరి కోటిరత్నం లాంటి 1920 – 30ల తరం ఈ రూపకంలో కనిపిస్తారు. అలాగే, ఆధునికులైన గరికపాటి రాజారావు, కె. వెంకటేశ్వరరావు, ఎ.ఆర్. కృష్ణ, చాట్ల శ్రీరాములు, బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి మొదలు జమునా రాయలు వరకు పలువురి పాటలు, పద్యాలు, నటన నిండిన వీడియోలు కూడా ఇందులో ఉన్నారు. ఎంతో శ్రమ, ఖర్చుతో కూడిన ఈ బృహత్తర యజ్ఞానికి ‘అజో- విభొ- కందాళం ఫౌండేషన్’ పక్షాన ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ ఆర్థికంగానూ, అన్ని విధాల గానూ అండగా నిలిచారు. ఈ పదిగంటల రూపకాన్ని పూర్తిగా ఉచితంగా, అందరికీ అందుబాటులో ఉంచారు.యూ ట్యూబ్ వేదిక కావడం ఈ శ్రవ్య – దృశ్య కళారూపకానికి ఉన్న ప్రధానమైన వెసులుబాటు. ఎందుకో తెలియని పరుగుపందేలతో, ఎప్పుడూ తీరిక దొరకని ఈ ఆధునిక కాలంలో... ఎవరి వీలును అనుసరించి వారు ఎక్కడైనా, ఎప్పుడైనా ఈ భాగాలను చూసే సౌకర్యం లభిస్తుంది. దేశ విదేశాలలోని నాటక రంగ ప్రియులకూ, పరిశోధకులకూ అలా ఇది ఓ అయాచిత వరం.తొలిసారిగా... జంట నగరాల్లో!ఇటీవలే గుంటూరులో లాంఛనంగా ఆవిష్కరణ జరుపుకొన్న ఈ రూపకాన్ని ఇప్పుడు హైదరాబాద్ – సికింద్రాబాద్ జంటనగరాల్లోని కళాభిమానులకు తొలిసారిగా పరిచయం చేయనున్నారు. ‘అజో-విభొ-కందాళం ఫౌండేషన్’, ప్రముఖ రంగస్థల వేదిక ‘రసరంజని’ సంయుక్తంగా ఆ పరిచయ సభను నిర్వహిస్తున్నాయి. తెలుగు నూతన సంవత్సర కానుకగా ఈ మార్చి 23, సోమవారం సాయంత్రం 6 గంటలకు ఈ పరిచయ సభ జరగనుంది. హైదరాబాద్ రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ థియేటర్లో జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమంలో నాటక రంగ ఆచార్యులు డాక్టర్ డి.ఎస్.ఎన్. మూర్తి, కళాపోషకులు – ప్రభుత్వ మాజీ సలహాదారు కె.వి. రమణాచారి, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు, కేంద్ర సంగీత – నాటక అకాడెమీ పురస్కార గ్రహీత దీర్ఘాసి విజయభాస్కర్, రూపకాన్ని రూపొందించడానికి శ్రమించిన కందిమళ్ళ సాంబశివరావు, ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ తదితరులు పాల్గొంటున్నారు. పది గంటల నిడివి గల ఈ ‘అలనాటి నాటక ప్రస్థానం’ రూపకాన్ని ఆనాటి సభలో ఒక గంట నిడివికి కుదించి, ముఖ్యాంశాలను సభికులందరికీ ప్రదర్శించనుండడం విశేషం. “ఉజ్జ్వలమైన మన గత చరిత్ర, కళారంగంలో మనవాళ్ళు చేసిన ఘనమైన కృషి... నేటికీ సరైన రీతిలో రికార్డు కాలేదు. మన తెలుగు నాటక రంగ పరిణామ క్రమాన్ని వివరిస్తూ, మన సాంస్కృతిక ఘన వారసత్వాన్ని తరువాతి తరాలకు పదిలంగా అందించడం కోసం చేయాల్సింది చాలా ఉంది. ఆ భగీరథ ప్రయత్నంలో నా వంతుగా కళాసరస్వతికి సభక్తికంగా సమర్పించిన చంద్రునికో నూలుపోగు... ఈ ‘అలనాటి నాటక ప్రస్థానం’ రూపకం” అని రంగస్థలంపై అనేక పరిశోధనాత్మక రచనలు చేసిన కందిమళ్ళ సాంబశివరావు వివరించారు.ఒక్కమాటలో... తెలుగు నాటకం, సినిమాలు రెంటితోనూ ముడిపడ్డ అలనాటి మహామహుల కృషిని ఇప్పుడు ప్రత్యక్షంగా చూసేందుకు, వినేందుకు ఈ రూపకం ఓ అద్భుత అవకాశం. నాటక రంగ అభిమానులకే కాదు... మన ఘన చరిత్రపై ఆసక్తి ఉన్నవారందరికీ ఈ కళారూపకం మృష్టాన్నభోజనం. దృశ్య – శ్రవ్య వేదికల్లో నాటి ప్రయోగాల నుంచి నేటి వరకు వచ్చిన మార్పులను తులనాత్మకంగా అధ్యయనం చేయదలుచుకున్నవారికైతే... ఇది సిద్ధాన్నం. తాజా పరిచయ సభ సాక్షిగా పెద్దల మాటలు వింటూ, మన రంగస్థల కళా చరిత్రను దృశ్యరూపంలో ఆస్వాదించే అపూర్వ అవకాశానికి అందరూ ఆహ్వానితులే.- రెంటాల జయదేవ -
అంకుర్ వారికూ ఫిట్నెస్ సీక్రెట్..! నో స్టెరాయిడ్లు, నో షార్ట్కట్
వ్యాపారవేత్త, కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికూ సోషల్ మీడియా వేదికగా 45 ఏళ్ల వయసులో 13% శరీర కొవ్వుని ఎలా తగ్గించుకున్నారో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. తాను ఎలాంటి స్టెరాయిడ్లు, షార్ట్కట్లు, ఏఐ సలహాలు తీసుకోలేదని చెప్పారు. నిజానికి వయసు పెరిగే కొద్దీ శరీర కొవ్వు సాధారణంగా పెరుగుతుంది. బరువు స్థిరంగా ఉన్నా కొలెస్టాల్ స్థాయిలు పెరుగుతాయట. పైగా వయసుతోపాటు కండర ద్రవ్యరాశిని కోల్పోతామట. దాంతో చర్మం కింద, పొత్తుకడుపు వంటి అంతర్గత అవయవాలలోకి కొవ్వు విసరల్ ఫ్యాట్గా స్టోర్ అవుతుందని చెబుతున్నారు. ఇది టైప్2, గుండెజబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందట. పైగా రానురాను బరువు తగ్గడం కష్టంగా మారిపోతుందట. పురుషులలో సుమారు 40 ఏళ్ల వయసు వచ్చేటప్పటికీ..టెస్టోస్టెరాన్ క్రమంగా తగ్గడం జరుగుతుంది. దాంతో కండరాలను నిర్మించడం, కొవ్వు పంపిణీ చేయడంలో సామర్థ్యం తగ్గుతుందని చెబుతున్నారు అంకుర్ వారికూ. అందుకే తాను 3టీ ఫార్ములాతో ఆరోగ్యకరమైన రీతీలో కొలెస్ట్రాల్ని తగ్గించుకున్నట్లు వెల్లడించారు. ఏంటా ఫార్ములా..? ఎలా అనుసరించాలంటే..T3 ఫార్ములా:T1 - ట్రాక్ వారానికి సుమారు 0.5 కిలోల బరువు తగ్గడానికి, రోజుకు 300 నుండి 500 కేలరీల స్వల్ప లోటు ఆరోగ్యకరమైనదట. డైట ప్లాన్..ఉదయం 9:30 - 1 స్కూప్ వే ప్రోటీన్, క్రియేటిన్, 1 వాల్నట్, 4 బాదం పప్పులు, 4 జీడిపప్పులు, 5-6 ఎండుద్రాక్షలుఉదయం 11 గంటలకు - 200 గ్రాముల పనీర్/టోఫు/టెంపే, లేదా దాల్ చిల్లా, అప్పుడప్పుడు గుడ్లు.మధ్యాహ్నం 1 గంటకు - పండ్లుసాయంత్రం 4 గంటలకు - 2 రోటీలు (ఎమ్మర్ గోధుమ/జొన్న/సోయా బీన్) + కూర + పప్పు + తక్కువ కొవ్వు గల పెరుగుసాయంత్రం 6:30 గంటలకు - పెరుగుతో 1 స్కూప్ వే ప్రోటీన్అయితే తనకు ఇష్టమైన చోలే భటూరేని మాత్రం వదిలేయలేదట. అలాగే మిఠాయిని కూడా తిన్నట్లు తెలిపారు. అయితే కేలరీలు బ్యాలెన్స్గా ఉండేలా కేర్ తీసుకున్నారట.T2 - శిక్షణగుండె ఆరోగ్యానికి కార్డియో మంచిదే అయినప్పటికీ, వృద్ధులలో దీర్ఘకాలిక కొవ్వు తగ్గడానికి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అత్యంత ప్రభావవంతమైన సాధనం.ఎందుకంటే ఇది జీవక్రియ రేటును పెంచుతుంది. ఒకేసారి ఎక్కువ కండర సమూహాలను ఉత్తేజపరచడానికి, సిట్-టు-స్టాండ్స్ లేదా మోడిఫైడ్ ప్లాంక్స్ వంటి బహుళ కీళ్లను ఉపయోగించే వ్యాయామాలపై దృష్టి పెట్టాలి.వ్యాయామ దినచర్య:టెన్నిస్ - వారానికి 6 రోజులు, 1 గంట (కార్డియో పూర్తయింది)వెయిట్స్ - వారానికి 6 రోజులు, 45 నిమిషాలుప్రతి రోజు: 2 వ్యాయామాలు x 3 శరీర భాగాలకు సంబంధించిన వర్కౌట్లు = 6 వ్యాయామాలు10-12 సార్లు పునరావృతం చేస్తూ మొత్త మూడు సెట్లు చేయాలి.T3 - రూపాంతరంమార్పులను నమోదు చేయడానికి రోజువారీ బరువును, వారపు కొలతలను ట్రాక్ చేసినట్లు తెలిపారు. అలాగే తన ఫోటోలను తన ట్రైనర్కు పంపిచినట్లు చెప్పారు.చాలామటుకు అదే డైట్ ప్లాన్ ఫాలో అయినట్లు తెలిపారు.సెలవులకు టూర్కి వెళ్లేముందు లేదా బ్రేక్ తీసుకోవాలనుకుంటే.. మరింతగా ఈ దినచర్యను వేగవంతం చేసినట్లు తెలిపారు. శరీరంలోని కొవ్వును తగ్గించడం అంటే మొత్తం బరువు తగ్గడానికి తోడ్పడటమే కాకుండా, దీర్ఘకాలిక వయస్సు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందట. ఇక్కడ కండర ద్రవ్యరాశిని పెంచుకుంటూ అదనపు శరీర కొవ్వుని తగ్గించుకుంటే..మొత్తం జీవన నాణ్యతనే మెరుగుపడుతుంది. ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని అనుభవించవచ్చు అని చెప్పుకొచ్చారు అంకుర్ వారికూ.మొత్తం బరువు తగ్గడానికి తోడ్పడటమే కాకుండా, దీర్ఘకాలిక, వయస్సు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు శారీరక స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. అందువల్ల, కండర ద్రవ్యరాశిని పెంచుకుంటూ అదనపు శరీర కొవ్వును కోల్పోవడం మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది మరియు వృద్ధాప్య జీవసంబంధమైన సూచికలను నెమ్మదింపజేస్తుంది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చిం. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను పంపించడం ఉత్తమం. (చదవండి: వెల్నెస్ కొత్త ట్రెండ్..ఒత్తిడిపై 'ఎత్తు') -
వెల్నెస్ కొత్త ట్రెండ్..ఒత్తిడిపై 'ఎత్తు'
ఒకప్పుడు ‘సక్సెస్’ అంటే మంచి జాబ్, భారీ ప్యాకేజ్, లగ్జరీ లైఫ్.. అని భావించిన నగర జీవనం క్రమంగా మారుతోంది. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ప్రజలు ‘క్వాలిటీ ఆఫ్ లైఫ్’ వైపు మళ్లుతున్నారు. ఒత్తిడి, జీవనశైలి వ్యాధుల మధ్య ఇరుక్కున్న అర్బన్ జనరేషన్ ఇప్పుడు ఆరోగ్యం లేకపోతే సంపాదనకు అర్థం లేదనే ధోరణికి వచ్చేసింది. ఈ మార్పే వెల్నెస్ ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోస్తోంది. వెల్నెస్ అనగానే కేవలం యోగా క్లాస్/ డైట్ మాత్రమే కాదు.., మానసిక ప్రశాంతత, శారీరక చురుకుదనం, భావోద్వేగ సమతుల్యత.. ఇవన్నీ కలిసిన సమగ్ర జీవన విధానమే నేటి వెల్నెస్ అని లైఫ్స్టైల్ కోచ్ డా.శ్రీ సోహం చెబుతున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ పంచుకున్న ఆలోచనలు ఆయన మాటల్లోనే.. కాలుష్యంతో నిండిన నగర జీవితానికి కొద్దిసేపైనా బ్రేక్ ఇవ్వాలనే తపన యువతలో పెరుగుతోంది. ఆరోగ్యం కోసం ప్రజలు తిరిగి మూలాల వైపు అడుగేస్తున్నారు. వారాంతాల్లో కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపాలన్న ఆలోచన కూడా వెల్నెస్ ట్రెండ్గా మారింది. ఇప్పటికే హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో చిన్న గెస్ట్హౌస్లు, నేచర్ గార్డెన్లు, వీకెండ్ రిట్రీట్స్ పెరుగుతున్నాయి. ఈ ప్రయాణంలో సరైన గైడెన్స్ ఉంటే శరీరం–మనసు రెంటిలోనూ అద్భుతమైన మార్పులు వస్తాయి. కార్పొరేట్ కల్చర్లోనూ వెల్నెస్ కీలకాంశంగా మారుతోంది. ఉద్యోగులకు ఒత్తిడి తగ్గించేందుకు, ఉత్పాదకత పెంచేందుకు అనేక కంపెనీలు యోగా, మెడిటేషన్, మైండ్ఫుల్నెస్ ప్రోగ్రామ్స్ సీఎస్ఆర్ కార్యక్రమాల్లో భాగం చేస్తున్నాయి. ‘సమతుల ఆహారం, సరైన నిద్ర, విశ్రాంతి, ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటే ఉద్యోగుల పనితీరు సహజంగానే పెరుగుతుంది. కొన్ని సంస్థల హెచ్ఆర్ విభాగం దీనిపై ఆలోచన చేయాల్సి ఉంది. కాన్షియస్.. మ్యాడ్ నెస్.. హైదరాబాద్ అంటే ఫుడ్ లవర్స్ సిటీ. రుచికరమైన ఆహారానికి తగ్గట్టుగా సరైన వ్యాయామం లేకపోవడం వల్ల ఇన్సోమ్నియా, పీసీఓడీ, థైరాయిడ్, షుగర్, బీపీ వంటి సమస్యలు సాధారణమయ్యాయి. ఇన్ఫెరి్టలిటీ సమస్యలు, ఐవీఎఫ్ క్లినిక్స్ పెరుగుతుండడమే దీనికి నిదర్శనం. తినడం తప్పు కాదు.. కానీ మనం ఏమి తింటున్నామో తెలుసుకుని తినాలి.. అప్పుడప్పుడు ఉపవాసం బాడీని డీటాక్స్ చేస్తుంది. యువతపై సోషల్ మీడియా ప్రభావం ఉన్నా.. ‘స్టాప్ లెర్నింగ్, స్టార్ట్ అన్లెర్నింగ్’ అనే భావన ఆకర్షణగా మారుతోంది. సమస్యల నుంచి పారిపోకుండా.. జీవితంలోని ప్రతి క్షణాన్ని అవగాహనతో అనుభవించాలనే ఆలోచన ‘కాన్సియస్ మ్యాడ్ నెస్’ కాన్సెప్ట్కు బలం ఇస్తోంది. ఈ ఆలోచనలతో ఈ నెల 21న గండిపేటలోని ఆయర్వన్ వాటర్ సైడ్లో యోగా, మెడిటేషన్, భజన్ జ్యూమింగ్ ఎక్స్పీరియన్స్ అందించనున్నాం. రానున్న ఐదేళ్లలో హైదరాబాద్ లైఫ్స్టైల్లో వెల్నెస్ కేవలం ట్రెండ్ కాదు.. అవసరంగా మారబోతోంది. సంపాదనతో పాటు ఆరోగ్యాన్ని కూడా సమానంగా చూసుకునే దిశగా యువత అడుగులు వేస్తోంది. స్ట్రెస్ నుంచి స్ట్రెంగ్త్కి ప్రయాణమే నేటి హైదరాబాద్ కొత్త లైఫ్స్టైల్. -
ఆ ప్లంబర్ వేతనం ఏడాదికి రూ. 18 లక్షలా..!
ఏఐ వచ్చేసింది ఇంకేముంది ఉద్యోగాలు ఉష్కాకి అంటూ మేధావులు, నిపుణులు పెద్ద ఎత్తున్న ఆందోళన వ్యక్తం చేశారు. కానీ నెట్టిట వైరల్ అవుతున్న ఈ విషయం గురించి తెలుసకున్నాక ఆ నిర్ణయం తప్పని ఒప్పుకుంటారు. ఎంత ఏఐ వచ్చినా..శ్రామిక జీవుల పనితనాన్ని ఎంతటి అత్యున్నత సాంకేతికత అయినా భర్తీ చేయలేదని తేటతెల్లమవుతుంది.నెట్టింట 'ముంబైలో ఒక ప్లంబర్ రూ. 18 లక్షలు సంపాదిస్తున్నాడు' అనే క్యాప్షన్తో చేసిన పోస్ట్ అందర్నీ ఆలోచించేలా చేసింది. ఆ పోస్ట్ల ముంబై ప్లంబర్తో జరిగిన సంభాషణను షేర్ చేసుకున్నాడు. అతను తన టౌన్షిప్లోని సోసైటీలో ఒక ప్లంబర్తో మాటమంతి కలిపినట్లు తెలిపాడు. తాము చాలా విషయాలు మాట్లాడుకుంటూ..అతడి సంపాదన గురించి ఆరా తీశాడు. కాంట్రాక్టుల ద్వారా మొత్తం వార్షిక ఆదాయం రూ. 18 లక్షల దాక ఉంటుందని ప్లంబర్ చెప్పాడు. అయితే తాను తమాషాగా అంటున్నాడేమో అనుకున్నా..కానీ తర్వాత అతను సంపాదిస్తున్న మొత్త లెక్కించడంతో అప్పుడు అర్థమైంది. పైగా ఆ వ్యక్తికి హ్యుండాయ్ క్రెటా (2023 మోడల్) కారు ఉంది, ఇల్లు కూడా కట్టుకున్నాడట, ఓ పొలం కూడా కొన్నానని చెబుతున్నాడు. అతను రిచ్ ప్లంబర్ అని అప్పుడే నాకు తెలిసంది. అంటే తానెంతలా సంపాదించాలి అని ఆలోచిస్తు ఉండిపోయా అంటూ పోస్ట్లో రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ని చూసి నెటిజన్లు సైతం ఏఐ బ్యూకాలర్ ఉద్యోగాలను అమాంత మిగిసింది అన్నది ఎవరూ అని ఒకరు, శారీరక శ్రమతో కూడిన ఉద్యోగాలకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది అని మరొకరు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: స్ట్రాంగెస్ట్కు బ్రాండ్ అంబాసిడర్ ఆమె..! ఏకంగా పదిమంది మగవాళ్లను..) -
ఈ సర్జరీలతో గుండెకు బైపాస్..!
గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాల్లో కొవ్వు ఉండల వల్ల గానీ లేదా రక్తం గడ్డకట్టడంతో ఏర్పడిన క్లాట్స్ వల్లగానీ వల్ల రక్తప్రసరణకు అడ్డంకులు ఏర్పడి... గుండెకు అవసరమైన రక్తం అందకుండా పోయే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్య తలెత్తాక... రక్తనాళాలు ఇంకా పూర్తిగా మూసుకుపోనప్పుడు స్టెంట్ వేయడమన్నది చాలామందికి తెలిసిన విషయమే. స్టెంట్ వేశాక రక్తాన్ని పలచబార్చే మందులు కూడా ఇస్తుంటారు. అయితే మరికొన్ని సందర్భాల్లో గుండెకు రకరకాల శస్త్రచికిత్సలు చేస్తుంటారు. ఈ క్రమంలో బైపాస్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, బీటింగ్ హార్ట్ సర్జరీ... అనే రకరకాల శస్త్రచికిత్సల పేర్లు వినిపిస్తుంటాయి. ఈ సర్జరీలు ఏమిటి, రకరకాల శస్త్రచికిత్సల తాలూకు ప్రయోజనాలేమిటి లాంటి అనేక విషయాలను తెలుసుకుందాం.గుండెకు రక్తం అందించే రక్తనాళాల్లో ఏదైనా అడ్డంకి వచ్చినప్పుడు... నిజానికి శస్త్రచికిత్స కంటే ముందుగా స్టెంట్ ద్వారా ఆ అడ్డంకిని తొలగించడానికి గుండె డాక్టర్లు ప్రయత్నిస్తారు. ముందుగా ఆ స్టెంట్ అంటే ఏమిటో చూద్దాం.స్టెంట్ అంటే ఏమిటి...? గుండె రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను తొలగించడానికి రక్తనాళాల్లోకి వెళ్లాక అక్కడ మూసుకు΄ోయిన రక్తనాళాన్ని వెడల్పు చేసే ఉపకరణాన్ని స్టెంట్ అంటారు. ఇందులోనూ రకరకాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక బెలూన్ వంటి ఉపకరనాన్ని పంపి, రక్తనాళం మూసుకుపోయిన చోట దాన్ని ఉబ్బేలా చేయడం ద్వారా అక్కడ ఏర్పడిన అడ్డంకిని తొలగించడాన్ని బెలూన్ యాంజియోప్లాస్టీ లేదా బెలూన్ స్టెంట్ అమర్చడంగా చెబుతారు.నిజానికి ఇలా స్టెంట్ వేయడమన్నది పూర్తి స్థాయి శస్త్రచికిత్స కాదు. మొదట్లో తొడ భాగం లోని రక్తనాళాల నుంచి గుండెలోని రక్తనాళాల వరకు వెళ్లి అక్కడ మూసుకు΄ోయిన చోట స్టెంట్ వేసేవారు. అయితే ఇటీవల మణికట్టు నుంచే స్టెంట్ను పంపడమూ జరుగుతోంది. గుండెకు ఏరకమైన చికిత్స అవసరమనే విషయాన్ని తెలుసుకోడానికి... తొలుత యాంజియోగ్రామ్ అనే పరీక్ష చేయించి, అటు తర్వాత గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాల్లో ఏదైనా సమస్య కనిపిస్తే... బైపాస్ చేయించాలా లేదా మందులతోనే సమస్యను పరిష్కరించవచ్చా లేదంటే స్టెంట్ వేయించాలా అని చాలా మంది అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది. నిజానికి ఈ ఏయే సందర్భాల్లో చేస్తారో, అవి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.గుండెకు చేసే రకరకాల శస్త్రచికిత్సలేమిటి... వాటితో ప్రయోజనాలేమిటంటే... గుండెకు చేసే శస్త్రచికిత్సలు ప్రధానంగా రెండు రకాలు. మొదటిది బైపాస్ సర్జరీ. రెండోవి వాల్వ్ సర్జరీలు. వీటిల్లో... బైపాస్ సర్జరీలోనే... ఓపెన్ హార్ట్ సర్జరీ... దాంతోపాటు పలు సందర్భాల్లో నిర్వహించే రకరకాల సర్జరీలైన బీటింగ్ హార్ట్ సర్జరీ, మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ, టోటల్ ఆర్టీరియల్ రీవాస్క్యులైజేషన్, ఎండోస్కోప్క్ సర్జరీ, హైబ్రిడ్ సర్జరీ, రొబోటిక్ బైపాస్ సర్జరీ వంటి వాటినీ అనుసరిస్తుంటారు. వాటి గురించి వరసగా...బైపాస్ శస్త్రచికిత్స అంటే : ముందుగా బైపాస్ శస్త్రచికిత్స అంటే ఏమిటో చూద్దాం. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళల్లో ఏవైనా అడ్డంకులు ఉంటే... వాటిని వెడల్పు చేయకుండా అలాగే వదిలేసి... వాటికి ప్రత్యామ్నాయంగా వేరే రక్తనాళాలను ఉపయోగించి, ఈ కొత్తమార్గం ద్వారా గుండెకు యథాతథంగా రక్తప్రసరణ జరిగేలా చేయడమే బైపాస్ శస్త్రచికిత్స. అంటే... ఇందులో అడ్డంకి ఉన్న రక్తనాళానికి పక్కగా... కరొనరీ ఆర్టరీ (బృహద్ధమని) నుంచి నేరుగా గుండెకండరానికి రక్తం అందేలా మరో రక్తనాళాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియలో కరొనరీ ఆర్టరీ నుంచి గుండె కండరానికి రక్తం అందేలా చేయడానికి అవసరమైన అదనపు రక్తనాళాన్ని కాలి నుంచి తీసుకున్న రక్తనాళాన్నిగాని లేదా రొమ్ము ఎముక పక్కనే ఉన్న మ్యామరీ ధమనిని గాని ఉపయోగిస్తారు. ఇలా చేసే క్రమంలో ఒకవేళ సిరను ఉపయోగిస్తే దాన్ని వీనస్ గ్రాఫ్ట్ అని, ధమనిని ఉపయోగిస్తే ఆర్టీరియల్ గ్రాఫ్ట్ అంటారు.బైపాస్ ఎవరికి అవసరం, దాంతో ఒనగూరే ప్రయోజనాలేమిటంటే... గుండెకు రక్తసరఫరా చేసే ప్రధాన రక్తనాళమైన లెఫ్ట్ మెయిన్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు గుండెలో ఎడమపక్క ఉండే ముఖ్య రక్తనాళంలోని మొదటిభాగంలోనే అడ్డంకి ఉన్నప్పుడు గుండె తాలూకు పంపింగ్ సామర్థ్యం తక్కువగా ఉన్నప్పుడు ∙గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళంలో అనేకచోట్ల అడ్డంకులు ఏర్పడినప్పుడు ∙డయాబెటిస్ (మధుమేహ వ్యాధి) ఉన్న వారికి. ఓపెన్హార్ట్ సర్జరీ అంటే...? బైపాస్ శస్త్రచికిత్స సమయంలో రొమ్ముఎముకను చీల్చి సర్జన్ గుండె వరకు వెళ్తాడు. అయితే గండె అనుక్షణం కొట్టుకుంటూ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇలా గుండె నిత్యం స్పందిస్తూ ఉండగా ఆపరేషన్ చేయడం ఒకింత కష్టంగా, సంక్లిష్టంగా ఉంటుంది. అందుకే తాత్కాలికంగా గుండెను ఆపేసి (అచేతన స్థితిలో ఉంచి) ఈ ఆపరేషన్ నిర్వహిస్తారు. అలా గుండె అచేతన స్థితిలో ఉన్నప్పుడు శరీరానికి అవసరమైన రక్తప్రసరణ యథాతథంగా కొనసాగేందుకు హార్ట్లంగ్ మెషిన్ అనే పరికరాన్ని వాడతారు. ఏ శస్త్రచికిత్సలోనైతే ఈ హార్ట్లంగ్ మెషిన్ను వాడతారో... దాన్ని ‘ఓపెన్హార్ట్ సర్జరీ’ పరిగణించవచ్చు.బీటింగ్ హార్ట్ సర్జరీ అంటే...? దీన్ని ‘ఆఫ్ పంప్ సర్జరీ’ అని కూడా అంటారు. ఇందులో కూడా రొమ్ము ఎముకను చీలుస్తారు. అయితే ఈ ప్రక్రియలో గుండె స్పందనలను ఆపడం, మళ్లీ ్ర΄ారంభించడం గానీ జరగదు. ఓ పక్క గుండె స్పందనలు యథావిధిగా కొనసాగుతుండగానే బై΄ాస్ సర్జరీ నిర్వహిస్తారు. ఆక్టోపస్ అనే ఒక ప్రత్యేక పరికరం ద్వారా గుండెలో ఆపరేషన్ జరుగుతున్న భాగం వరకు కదలకుండా చేసి, ఈ శస్త్రచికిత్స చేస్తారు. సాధారణ బై΄ాస్ శస్త్రచికిత్స తర్వాత కొంతమందిలో పక్షవాతం, మతిమరపు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే బీటింగ్ హార్ట్ సర్జరీ వల్ల అలాంటి ఆ దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలు బాగా తగ్గి΄ోతాయి.మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ అంటే..? గత కొద్దికాలంగా గుండె శస్త్రచికిత్సలో అత్యంత ఆధునికమైన, చాలా అధునాతమైన వినూత్న వైద్య పురోగతి జరుగుతోంది. కేవలం చాలా చిన్న గాటు సహాయంతోనే బై΄ాస్ సర్జరీ నిర్వహించడం కూడా వీటిల్లో ఒకటి. ఇందులో ఎదుర్రొమ్ము ఎముకను చీల్చాల్సిన అవసరమే ఉండదు. అయితే పెద్ద శస్త్రచికిత్సల్లోలాగే మత్తు మందు ఇవ్వాల్సి ఉంటుంది. చర్మంపైన చాలా చిన్నవైన గాట్లు పెడుతూ వెంటనే తగ్గి΄ోయి మూసుకు΄ోయే రంధ్రాలు చేయడం ద్వారా ఈ లాపరోస్కోపిక్ ఆపరేషన్ చేస్తారు. గాటు, గాయం చాలా చిన్నవిగా ఉండటం వల్ల రోగులు చాలా త్వరగా కోలుకుంటారు. రక్తస్రావం, నొప్పి కూడా చాలా తక్కువే. శస్త్రచికిత్స తర్వాత ఆయాసం వంటి సమస్యలూ ఉత్పన్నం కావు. కానీ సర్జన్కు కేవలం గుండెలోని కొద్దిభాగం మాత్రమే కనిపిస్తుంటుంది కాబట్టి ఈ తరహా శస్త్రచికిత్స నిర్వహించడానికి అతడికి చాలా నైపుణ్యం కావాలి. పైగా పేషెంట్లదరికీ ఈ చికిత్స చేయడం సాధ్యం కాకపోవచ్చు.టీసీఆర్ఏటీ : ఈ ‘టీసీఆర్ఏటీ’ అనేది ‘టోటల్ కొరనరీ రీవాస్క్యులరైజేషన్ బై యాంటీరియర్ కొరకాటమీ’ అనే సర్జరీ ప్రక్రియ తాలూకు సంక్షిప్త రూపం. దీన్ని ఎదుర్రొమ్ముకు ఏమాత్రం కోత లేకుండా చేస్తారు. ఈ శస్త్రచికిత్సలో చిన్న గాటుతోనే (మినిమల్లీ ఇన్వేజివ్గానే) గుండె తాలూకు కీలకమైన ధమని అయిన ‘కొరనరీ ఆర్టరీకి సంబంధించిన అనేక రక్తనాళాలకు బై΄ాస్ దారులు ఏర్పాటు చేయడం సాధ్యమవుతుంది. దాంతో గుండె కండరాలకు రక్తం ఎలాంటి అంతరాయం లేకుండా అందుతుంది. కేవలం 6 నుంచి 10 సెంటీమీటర్ల చిన్నపాటి గాటుతోనే గుండెకు బైపాస్ (కార్డియోపల్మునరీ బైపాస్ –సీపీబీ) శస్త్రచికిత్స నిర్వహిస్తారు. మిగతా బైపాస్ ప్రక్రియలతో పోలిస్తే ఇదెంతో సురక్షితమైనదీ, నొప్పి చాలా చాలా తక్కువ. ఇందులో పేషెంట్ కోలుకోవడం చాలా వేగంగా జరుగుతుంది.కంప్లీట్ ఆర్టీరియల్ రీవాస్క్యులరైజేషన్ అంటే..? బైపాస్ శస్త్రచికిత్స చేసేప్పుడు జబ్బుపడ్డ ప్రతి ముఖ్యమైన రక్తనాళానికీ బైపాస్ గ్రాఫ్ట్ చేస్తారు. అంటే ఎన్ని రక్తనాళాల్లో అడ్డంకులు ఉంటే అన్ని చోట్లా బైపాస్ చేయడం కోసం అన్ని ప్రత్యామ్నాయ రక్తనాళాలను అతికిస్తారు... అంటే గ్రాఫ్ట్ చేస్తారని అర్థం. చాలామందిలో ఒక్కోసారి మూడు లేక నాలుగు గ్రాఫ్ట్లు కూడా వేయాల్సి వస్తుంది. ప్రస్తుతం ప్రతి బై΄ాస్ సర్జరీలోనూ కనీసం ఒక ధమనిని ఉపయోగించడం పరి΄ాటి అయ్యింది. సాధారణంగా రొమ్ము ఎముకకు రక్తసరఫరా చేసే రొమ్ముఎముక ధమని (ఇంటర్నల్ మ్యామరీ ఆర్టరీ)ని ఉపయోగించి ఎల్ఏడీ కరొనరీ ధమని అనే దానికి అనుసంధానం (గ్రాఫ్ట్) చేస్తారు. కాలి నుంచి తీసిన సిరలతో పోలిస్తే ఇలా రొమ్ముఎముక నుంచి తీసిన ధమని చాలా కాలం పాటు మన్నికతో ఉంటుంది. అయితే టోటల్ ఆర్టీరియల్ రీవాస్క్యులరైజేషన్లో కాలినుంచి సిరలను తీయకుండా మణికట్టులోని ధమనులను, ఎడమ, కుడి రొమ్ము ఎముక ధమనులను ఉపయోగించి సర్జరీ చేస్తారు.ఎండోస్కోపిక్ సర్జరీ అంటే...? ప్రస్తుతం చేస్తున్న సరికొత్త శస్త్రచికిత్సల్లో మణికట్టు నుంచి తీసే ధమని గానీ... లేదా కాలి నుంచి తీసే సిరల విషయంలోగానీ... పూర్తిగా గాటు పెట్టి తీయకుండా, చిన్న రంధ్రం మాత్రమే చేసి వాటిని సేకరిస్తారు. ఇలా చేయడం వల్ల చేసే గాయం చాలా చిన్నది కావడం వల్ల పేషెంట్ చాలా త్వరితంగా కోలుకోవడం సాధ్యమవుతుంది.హైబ్రీడ్ సర్జరీ అంటే...? కొన్నిసార్లు బై΄ాస్ శస్త్రచికిత్సలో పేషెంట్ చాలా సీరియస్గానూ అతడి పరిస్థితి అత్యంత సంక్లిష్టపరిస్థితిలో ఉన్నప్పుడు కొన్ని రక్తనాళాలకు యాంజియో΄్లాస్టీ ద్వారా, మరికొన్నింటికి బై΄ాస్ ద్వారా శస్త్రచికిత్స నిర్వహించడం వల్ల చాలా రిస్క్లు తగ్గుతాయి. ఇలా చేయడం ద్వారా పేషెంట్ను చాలా త్వరగా కోలుకునేలా చేయవచ్చు. ఇలా ఒకే సర్జరీలో పలు రకాల శస్త్రచికిత్స ప్రక్రియలను చేయడాన్ని ‘హైబ్రీడ్ బై΄ాస్ సర్జరీ’ అంటారు.రొబోటిక్ బైపాస్ సర్జరీ అంటే...?ఈ ప్రక్రియలో డాక్టర్లు తమ బై΄ాస్ శస్త్రచికిత్సను రోబో సహాయంతో చేస్తుంటారు. ఈ ప్రక్రియలో మొదట మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ లేదా ఎండోస్కోపిక్ సర్జరీలో చాలా చిన్న రంధ్రం మాత్రమే చేసి, దాని ద్వారా మిగతా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అంత చిన్న రంధ్రం నుంచి డాక్టర్ వేళ్లు రోగి శరీరంలోకి ప్రవేశింపజేయడం కష్టం. అందుకే రోబో తాలూకు సన్నని వేళ్లని ఆ రంధ్రంలోకి ప్రవేశింపజేసి, డాక్టర్లు (శస్త్రచికిత్సకులు) లోపలి దృశ్యాన్ని తెరమీద చూస్తూ... రోబో వేళ్లను బయటి నుంచే యంత్రాల సహాయంతో నియంత్రిస్తూ శస్త్రచికిత్స పూర్తి చేస్తారు.బైపాస్ సర్జరీ తర్వాత... బైపాస్ శస్త్రచికిత్స తర్వాత పేషెంట్ కోలుకోడానికి 2–3 నెలలు పడుతుంది. మొదట్లో కొద్దిగా నీరసంగా ఉండటం చాలా సాధారణంగా జరిగే పరిణామమే. రొమ్ముఎముక చీల్చడం వల్ల ఛాతీకండరాల్లో, మెడ ఎముకల్లో, వెన్నుపూసల్లో, జబ్బల్లో నొప్పులు ఉండటాన్ని డాక్టర్లు సాధారణంగా చూస్తుంటారు. అదే సమయంలో కాలు లేదా చేతి నుంచి రక్తనాళం బయటకు తీస్తారు కాబట్టి అక్కడ కూడా కొంత నొప్పి, వాపు ఉండవచ్చు. కొందరు ఈ ఆపరేషన్ తర్వాత మనోనిబ్బరం కోల్పోతారు. మరికొందరికి జ్ఞాపకశక్తి, దృష్టికేంద్రీకరణ శక్తి కొద్దిగా తగ్గవచ్చు. కానీ ఆర్నెల్లో పేషెంట్ తన పూర్వస్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది.త్వరగా కోలుకోవడం కోసం... పేషెంట్లు తమ జీవనోపాధి కోసం చేసే పనులు అంతగా బరువైనవి కాక΄ోతే రెండు నెలల తర్వాతి నుంచే తమ వృత్తులకు హాజరుకావచ్చు. అయితే కాస్తంత బరువు పనులు చేసేవారు కనీసం మూడు నెలలు ఆగడం మంచిది. ఇక ఈ ఆపరేషన్ తర్వాత రెండునెలల పాటు వాహనం నడపడం అంత మంచిది కాదు. శస్త్రచికిత్స తర్వాత పేషెంట్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి...పొగతాగడం పూర్తిగా మానేయడం. ∙మంచి పుష్టికరమైన పోషకాహారం తీసుకుంటూ, దేహానికి శ్రమ కలగని విధంగా తగినంత వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం. ∙బరువును అదుపులో ఉంచుకోవడం. ∙మనోనిబ్బరంతో వ్యవహరించడం.చివరగా... పైన సూచించిన జాగ్రత్తలను పాటిస్తూ, వైద్యులు చేసే సూచనలను తప్పక అనుసరించడం ద్వారా గుండె శస్త్రచికిత్స తర్వాత కూడా సాధారణ జీవితాన్ని గడపడం ఇప్పుడు చాలావరకు సాధ్యమే.నిర్వహణ: యాసీన్డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్డాక్టర్ టి. వంశీధర్, సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ (చదవండి: పైల్స్ నుంచి ఫ్రీ అవ్వండి ఇలా..!) -
స్ట్రాంగెస్ట్కు బ్రాండ్ అంబాసిడర్ ఆమె..! ఏకంగా పదిమంది మగవాళ్లను..
ఓ మహిళ ఎంత శక్తి స్వరూపిణి అని చెప్పే ఘటన ఇది. అందరు నిర్ఘాంతపోయేలా మగవాళ్లను చిటికెలో ఎత్తిపడేసింది. నిజానికి ఆమె శారీరక బలం, ఓర్పుకి సలాం అనాల్సిందే. అంతలా సులభంగా మగవాళ్లను ఎత్తిపడేసి గిన్నిస్ రికార్డు సృష్టించిందామె. ఎవరా ఆ మహిళ అంటే..సినా రుప్పెంతాల్ అనే అథ్లెట్ ఈ ఘనతను సృష్టించింది. ఒక మహిళ ఎంత బలవంతురాలు అనేది చెప్పకనే చెప్పింది తన అసాధారణమైన సాహసంతో కేవలం 37.44 సెకన్లలో సుమారు 10 మంది పురుషులను ఎత్తి విసిరి గిన్నిస్ వరల్డ్ రికార్డుని నెలకొల్పింది. ఈ క్రీడాకారిణి తన అసాధారణమైన శక్తి, వేగం, సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఈ ఛాలెంజ్లో ఆ మహిళ ప్రతి ఒక్కర్ని ఎత్తి వారిని తన భుజంపై నుంచి వేగంగా ఒకరి తర్వాత ఒకరిని నిర్ధిష్ట సమయంలో విసిరి పూర్తి చేస్తింది. ఇక్కడ శారీరక బలం తోపాటు కచ్చితమైన సమన్వయం, ఓర్పు అవసరం. ఇక్కడ ఆమె ప్రతి ఒక్కరిని చాలా సురక్షితంగా ఎత్తి నియంత్రిత కదలికలతో విసిరింది. ఆమె అలా అలవోకగా అంతమంది మగవాళ్లను ఎత్తిపడేస్తున్న విధానం చూసి ప్రేక్షకులు సైతం విస్తుపోయారు. ఈ రికార్డు వాస్తవానికి ఆగష్టు 2025లో మ్యూనిచ్లో జరిగిన 'డై గ్రోస్సే షో డెర్ వెల్ట్రికోర్డే' అనే టీవీ కార్యక్రమంలో నెలకొల్పింది సినా రుప్పెంతాల్. ఈ ఛాలెంజ్ సాంప్రదాయ స్ట్రాంగ్మ్యాన్ ఈవెంట్లను పోలి ఉంటుంది. అయితే ఇక్కడ అథ్లెట్లు బరువైన రాళ్లను ఎత్తడం, వాహనాలను లాగడం, భారీ బరువులను మోయడం, వంటి విన్యాసాలతో తమ బలాన్ని ప్రదర్శిస్తారు. కానీ సినా రుప్పెంతాల్ రికార్డు మాత్రం అత్యంత విలక్షణమైన రికార్డుగా వార్తల్లో నిలిచింది. ఎవరీ సినా రుప్పెంతాల్సినా రుప్పెంతాల్ ఒక జర్మన్ స్ట్రాంగ్వుమన్. ఆమె ఉన్నత స్థాయి అథ్లెట్, స్పోర్ట్స్ సైంటిస్ట్. ఆమె ప్రపంచంలో నాల్గవ అత్యంత బలవంతురాలైన సహజ మహిళగా ర్యాంక్ పొందింది. అంతేగాదు స్ట్రెంత్ స్పోర్ట్స్లో అనేక జర్మన్ రికార్డులను కలిగి ఉంది. సింపుల్గా చెప్పాలంటే రుప్పెంతాల్ STRONGESTకు బ్రాండ్ అంబాసిడర్గా అభివర్ణించొచ్చు. అంతేకాదండోయ్..ఆమె మహిళా స్ట్రెంత్ అథ్లెట్లకు ఒక వేదికను అందించడానికి అంకితమైన లాభాపేక్షలేని సంస్థ స్ట్రాంగ్వుమెన్ జర్మనీ వ్యవస్థాపక సభ్యురాలు కూడా. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) (చదవండి: ఎల్పీజీ గ్యాస్ కొరత..ఆ స్టవ్లకు పెరుగుతున్న డిమాండ్) -
పరాభవ నామ సంవత్సరం ఆధ్యాత్మిక అంతరార్థం..!
తెలుగు వారి నూతన సంవత్సరం, పరాభవ నామ సంవత్సరం మార్చి 19, 2026న ప్రారంభం కాబోతుంది. అయితే చాలా మంది సంవత్సరం పేరు చూసి భయపడుతున్నారు. ఇదే సంవత్సరంరా బాబు..అసలు బాగుంటుందా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. పేరే పరాభవ నామ సంవత్సరం అంటే అన్ని పరాభవాలే, అవమానాలేనా అని ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ పరాభవ నామ సంవత్సరం అంతరార్థం ఏంటో సవివరంగా తెలుసుకుందామా..!.మనిషిలో ఉన్న 'అహంకారం', 'గర్వం', 'స్వార్థం' పరాభవం పాలు కావడాన్ని (ఓడిపోవడాన్ని) ఇది సూచిస్తుంది. మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్వర్గాలను జయించి, వినయంతో ఉండాలని ఈ సంవత్సరం మనకు బోధిస్తుంది. అహంకారంతో విర్రవీగే పాలకులకు, వ్యక్తులకు ఈ సంవత్సరం గట్టి గుణపాఠం నేర్పుతుంది. కానీ... వినయంతో, నిజాయితీగా, ధర్మబద్ధంగా కష్టపడే వారికి అద్భుతమైన విజయాలను అందిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో పరాభవ నామ సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. ఈ సంవత్సరం ఉగాది పచ్చడి కూడా విలక్షణమైనదిగానే పరిగణిస్తారట. ఎందుకంటే.. ఆరు రుచుల తోపాటు ప్రతికూలత అనుకూలత అనే రెండింటిని సమానంగా చూపుతుంది. ఎవరు అయితే సవాళ్లను అధిగమించి, సహనంతో ముదుకు సాగుతారో వారికి ఈ సంవత్సరం అదృష్టాన్ని ఇస్తుందంట. అలాగే సంవత్సరం ఫలితాలు అనేవి కేవం కొత్త ఏడాది పేర్లపైనే ఆధారపడి ఉండవు, ఇవన్నీ కూడా కర్మ, ప్రయత్నం, ధర్మం, భక్తి ఆధారంగా మారతాయి. కానీ ఈ పేర్లు కేవలం మీకు ఒక సూచను ఇస్తాయని వారు తెలుపుతున్నారు.(చదవండి: చైత్రమాసం విశిష్టత..! తెలుగు సంవత్సరాలు ఎలా ఏర్పడ్డాయంటే..) -
ఎల్పీజీ గ్యాస్ కొరత..ఆ స్టవ్లకు పెరుగుతున్న డిమాండ్..
యుద్ధం కారణంగా సిలిండర్ల దిగమతులకు అంతరాయం ఏర్పడటంతో దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ కొరత చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ఆ నేపథ్యంలో పలువురు తమ సృజనాత్మకతకు పదును పెట్టి మరి సరసమైన ధరలో కొంగొత్త స్టవ్లను అందిస్తున్నారు. ఎల్పీజీకి పత్యామ్నాయంగా అందిస్తున్న ఈ స్టవ్లకు ఒక్కసారిగా మార్కెట్లో అనుహ్యమైన డిమాండ్ పెరిగింది కూడా. అందుకు నిదర్శనమే బెంగళూరు వాసి ఆశోక్ ఉర్స్ రాకెట్ స్టవ్. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) మాజీ ఉద్యోగి అయిన 65 ఏళ్ల ఆశోక్ ఉర్స్ ఆరేళ్ల క్రితం గ్రామీణ ప్రజల కోసం ఇంధనాన్ని ఆదా చేసే స్టవ్ని రూపొందించారు. దానికి ఇప్పుడు అధిక మొత్తం ఆర్డర్లు..అలాంటి స్టవ్లు కావాలంటూ వాణిజ్య పరిశ్రమలో డిమాండ్ ఊపందుకుంది. కళ్లకు, ఊపరితిత్తులకు చికాకు కలిగించే వంటచెరుకుకి ప్రత్యామ్నాయంగా, అలాగే కలప తక్కువగా లభించే ప్రాంతాలకు వెసులుబాటుగా దీనిని రూపొందించారు. తక్కువ ఇంధనంతో వంటచేసుకునేలా రూపొందించిన స్టవ్ ఇది. సింపుల్గా చెప్పాలంటే కట్టెలపొయ్యి సంక్షిప్త నమునా, తక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తూనే అధిక ఉష్ణ సామర్థ్యం కోసం రూపొందించింది. ఇన్సులేషన్తో కప్పబడిన L-ఆకారపు దహన గది గాలి ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. కొబ్బరి చిప్పలు, పుల్లలు, కర్రలు, ఎండు ఆకులు లేదా వ్యవసాయ వ్యర్థాలు వంటి చిన్న జీవపదార్థపు ముక్కలు అధిక తీవ్రతతో కూడిన వేడితో మండుతాయి. సాంప్రదాయ కట్టెల పొయ్యిలతో పోలిస్తే..ఇది కట్టెల అవసరాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)లో జరిగే బహిరంగ కార్యక్రమాల్లో ఈ కట్టెల పొయ్యిల పై అవగాహన కల్పిస్తున్నారు ఉర్స్. ఈ పొయ్యి ధర వచ్చేసి కేవలం రూ. 3000/-.(చదవండి: గ్యాస్ కొరతకు..వంటగది వ్యర్థాలతో చెక్!) -
నిజమైన పంచాంగము
ఉగాది పండుగ అనగానే వెంటనే పంచాంగ పఠనం మనకు గుర్తుకొస్తుంది. ప్రతి ఊళ్లో పంచాంగ పఠనాన్ని వినటానికి జనం ఉత్సాహంగా గుమికూడతారు. 1961 మార్చి 17న పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సత్య సాయిబాబా వారి సమక్షంలో కస్తూరి పంచాంగం చదివాడు. బాబా ఇలా అన్నారు: ‘కస్తూరి ఇప్పుడు ‘ప్లవ’ నామ సంవత్సర పంచాంగం చదివాడు. విన్న మీలో విచారము, అశాంతి ఎక్కువవుతున్నాయి. ఈ పంచాంగము గురించి ఆందోళన చెందకండి, మీ లోపల ఉన్న పంచ అంగముల యెడల జాగ్రత్త వహించండి. అవి చాలా శక్తిమంతములైనవి. అవే ఐదు కర్మేంద్రియములు. వాటిని అదుపులో ఉంచటంలో మనస్సుకి శిక్షణ ఇవ్వండి. మీరు భగవంతుని అనుగ్రహం పొందినట్లయితే ఏ గ్రహమూ మిమ్మల్ని ఏమీ చేయదు.’ (పుట 15– శ్రీ సత్యసాయి వచనామృతం–1961–1962). ఈ సందర్భంలో మనం ఒక శ్లోకాన్ని గుర్తుకు తెచ్చుకొని పరిశీలిస్తే మంచిది:కురంగ, మాతంగ, పతంగ, భృంగమీనాః హతాః పంచభిరేవ పంచ.ఏకః ప్రమాదీ స కథం నహన్యతేయస్సేవతే పంచభి రేవ పంచ. లేడి, ఏనుగు, మిడత, చేప, తుమ్మెద ఈ అయిదును శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అను అయిదు విషయములలో క్రమముగా ఒక్కొక్క విషయముచే ఆకర్షింపబడి వానికి వశములై చనిపోవుచున్నవి. ఒక్కొక్క విషయమునకు, ఇంద్రియమునకు మాత్రమే వశములై పోయిన వాని దురవస్థ ఇట్లుండగా; అయిదు విషయములకు, అయిదు ఇంద్రియములకు వశమైపోయి, ఆ విషయములన్నిటిని ఎడతెగక ఎల్లప్పుడు అనుభవించుచున్న వారి దురవస్థను గురించి ఏమని వర్ణింపవలెను? (అద్వైతాక్షర మాలిక).పంచాంగములైన కర్మేంద్రియాలను, పంచాంగములైన జ్ఞానేంద్రియములను జాగ్రత్తగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, నియంత్రించటం వల్లే శుభం కల్గుతుంది. ఒక్క ఉగాది రోజే కాక సంవత్సరమంతా అలా చేస్తే ఏడాదంతా పండుగే. పంచాంగ పఠనం (పరిశీలన) రోజూ చేయాల్సిందే.– రాచమడుగు శ్రీనివాసులు -
ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి..
ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి.. ఈ పాట వినగానే నోరూరిపోతుంది..కదూ! సరిగ్గా ఇదే తరహాలో.. వంటల పోటీలు జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో.. ప్రపంచ చెఫ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ కలినరీ ఒలింపియాడ్ పోటీల్లో మేడ్చల్ సర్కిల్ గిర్మాపూర్కు చెందిన మహిళ ప్రతిభ కనబరిచింది. ఈ నెల 10 నుండి 14 వరకు జరిగిన పోటీల్లో ముక్కెర దివ్యసారిక దేశ, విదేశాలకు చెందిన పలు రకాల వంటలు వండి వార్చారు. ఆహార పదార్థాల రుచికి ఫిదా అయిన సెలెక్షన్ ప్యానెల్ ఆమెను ఐదు బంగారు పతకాలతో సత్కరించింది. ఇందులో భాగంగా బేకరి పాపీస్, ప్లెటైడ్ డెజర్ట్స్, వెడ్డింగ్ కేక్, రీజినల్ క్యూజిన్, డిన్నర్ మెనూ, తదితర విభాగాల్లో దివ్యసారిక ఉత్తమ ప్రతిభ ప్రదర్శించి పతకాలు పొందారు. వివిధ దేశాలకు చెందిన చెఫ్స్ ఆమెను అభినంధించారు. – మేడ్చల్ -
ఏ పనీ చేయకున్నా.. నీరసం వేధిస్తోందా?
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో అలసిపోవడం అనేది ఒక సాధారణ అంశంగా మారిపోయింది. ఆఫీసు పని, ఇంటి బాధ్యతలు, ప్రయాణాలు.. ఇలా ఏదో ఒక కారణంతో మనం అలసటకు గురవుతున్నామని సరిపెట్టుకుంటాం. అయితే ఎలాంటి పని చేయకపోయినా, తగినంత నిద్ర ఉన్నా కూడా నిత్యం నీరసంగా అనిపిస్తుంటే, దాని వెనుక ప్రమాదకర కారణం ఉండవచ్చని బ్రిటన్కు చెందిన ప్రముఖ జనరల్ ప్రాక్టీషనర్ డాక్టర్ సెర్మెడ్ మెజర్ హెచ్చరిస్తున్నారు.దడ పుట్టించే ‘థయామిన్’ లోపంమనకు కలిగే అలసటకు కేవలం పని ఒత్తిడి మాత్రమే కారణం కాకపోవచ్చని, శరీరంలో ఒక కీలకమైన పోషకం తగ్గిందని చెప్పడానికి అది ఒక హెచ్చరిక కావచ్చని డాక్టర్ సెర్మెడ్ మెజర్ అంటున్నారు. ‘థయామిన్’ లేదా ‘విటమిన్ బి1’ లోపం పలు అనారోగ్య సమస్యలకు దారితీసుందని ఆయన హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ‘థయామిన్’లోపంపై పలు కీలక విషయాలను పంచుకున్నారు. కారణం లేకుండా వేధించే అలసట వెనుక ఈ విటమిన్ లోపం ఎలా దాగి ఉంటుందో ఆయన వివరించారు.గుర్తించడం చాలా కష్టంచాలా మందిలో థయామిన్ లోపం ఉన్నప్పటికీ, సాధారణ రక్త పరీక్షల ద్వారా దీనిని త్వరగా గుర్తించలేమని డాక్టర్ మెజర్ పేర్కొన్నారు. దీనికి ప్రధాన కారణం ఈ లక్షణాలు ఇతర సాధారణ ఆరోగ్య సమస్యలను పోలి ఉండటమేనని ఆయన తెలిపారు. ‘ప్రారంభ దశలో థయామిన్ లోపం ఉంటే విపరీతమైన అలసట, చికాకు, మతిమరుపు లేదా నిద్రలేమి వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని బాధితులు మాత్రమే కాదు, వైద్యులు కూడా సాధారణ ఒత్తిడి లేదా వయసు పెరగడం వల్ల వచ్చే మార్పులుగా భావించి నిర్లక్ష్యం చేసే అవకాశం ఉందని ఆయన విశ్లేషించారు.థయామిన్ నిల్వలు తగ్గుతాయిలా..మన శరీరం విటమిన్ బి1ను ఎక్కువ కాలం నిల్వ చేసుకోలేదు. కేవలం 20 నుండి 30 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే మన శరీరంలో ఉంటాయి. కాబట్టి, మనం తీసుకునే ఆహారం సరిగ్గా లేకపోయినా లేదా అధిక చక్కెర పదార్థాలు తీసుకున్నా ఈ నిల్వలు చాలా వేగంగా తగ్గిపోతాయి. దీనిని డాక్టర్ మెజర్ ‘థయామిన్ డ్రైన్స్’గా పేర్కొన్నారు. శుద్ధి చేసిన పిండి పదార్థాలు మనం తీసుకునే మైదా, వైట్ రైస్ వంటి పదార్థాలను గ్లూకోజ్గా మార్చే ప్రక్రియలో థయామిన్ ఒక కీలకమైన కో-ఫ్యాక్టర్గా పనిచేస్తుంది. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న థయామిన్ వేగంగా ఖర్చవుతుంది.మద్యపానం ఆల్కహాల్ అలవాటు ఉన్నవారిలో థయామిన్ గ్రహించే శక్తి తగ్గిపోతుంది. దీనివల్ల ఈ లోపం ఏర్పడే ప్రమాదం ఎక్కువ.మందుల ప్రభావం రక్తపోటు (బీపీ) నియంత్రణ కోసం వాడే కొన్ని రకాల 'డైయూరిటిక్స్' మందులు, మూత్రపిండాల ద్వారా థయామిన్ శరీరం నుండి బయటకు వెళ్లిపోయేలా చేస్తాయి.శారీరక ఒత్తిడి విపరీతమైన శారీరక శ్రమ లేదా తీవ్రమైన అనారోగ్యం సమయంలో కూడా ఈ పోషక అవసరాలు పెరుగుతాయి.ఈ లక్షణాలను విస్మరించొద్దుథయామిన్ లోపం ప్రారంభంలో చాలా సాధారణంగా అనిపించినా, అది క్రమంగా తీవ్రరూపం దాలుస్తుంది. అందుకే శరీరంలో కలిగే కొన్ని ముఖ్య లక్షణాలను గుర్తించాలి.నిరంతర అలసట: రాత్రంతా నిద్రపోయినా ఉదయాన్నే లేవగానే నీరసంగా అనిపించడం.మెంటల్ ఫజ్జినెస్ : ఏదైనా విషయంపై దృష్టి పెట్టలేకపోవడం, ఆలోచనలు స్పష్టంగా లేకపోవడం.మూడ్ స్వింగ్స్: చిన్న చిన్న విషయాలకే విపరీతమైన చికాకు లేదా కోపం రావడం.మతిమరుపు: ఇటీవల జరిగిన విషయాలను కూడా గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడటం.నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయమా?థయామిన్ లోపం తీవ్రమైతే అది 'బెరిబెరి' (Beriberi) అనే ప్రమాదకరమైన వ్యాధికి దారితీస్తుంది. ఇది నాడీ వ్యవస్థను, గుండె పనితీరును దెబ్బతీస్తుంది. దీనివల్ల కండరాలు క్షీణించడం, కాళ్లు చేతులు మొద్దుబారిపోవడం, చివరికి గుండె వైఫల్యం (Heart Failure) సంభవించే అవకాశం ఉందని డాక్టర్ మెజర్ హెచ్చరించారు.పరిష్కారం ఏమిటి?థయామిన్ లోపాన్ని చాలా సులభంగా సరిదిద్దవచ్చు. డాక్టర్ మెజర్ సూచనల ప్రకారం..ఆహార మార్పులు: పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని భర్తీ చేయవచ్చు.సప్లిమెంట్లు: ముఖ్యంగా వృద్ధులు, సరైన పోషకాహారం తీసుకోలేని వారు లేదా ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు వైద్యుల సలహాతో 'లిపిడ్-సోలబుల్ థయామిన్' సప్లిమెంట్లను వాడవచ్చు.కొన్నివారాల్లోనే మాయం: శరీరంలో థయామిన్ స్థాయిలు మళ్ళీ సాధారణ స్థితికి చేరగానే, ఆహారం శక్తిగా మారే ప్రక్రియ మెరుగుపడుతుంది. దీనివల్ల ఏళ్ల తరబడి వేధిస్తున్న అంతుచిక్కని అలసట కేవలం కొన్ని వారాల్లోనే మాయమవుతుంది.గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీకు ఇలాంటి లక్షణాలు ఉంటే, సొంతంగా నిర్ణయాలు తీసుకోకుండా వెంటనే అర్హత కలిగిన వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.ఇది కూడా చదవండి: ఏఐ మేధావికి ఇలాంటి టెస్టా?.. ఇంత కన్నా ఘోరం ఉంటుందా? -
ఒత్తిడిలో మీ నిజమైన పర్సనాలిటీ బయటపడుతుందా?
సాధారణ స్థితిలో ప్రతి ఒక్కరూ మంచే మాట్లాడతారు, ప్రశాంతంగానే ఉంటారు. కానీ, "ఒత్తిడి (Stress) ఉన్నప్పుడు మీరు ఎవరు?" అనేదే మీ అసలైన వ్యక్తిత్వం."నేను ఆ టైమ్ లో కోపంగా మాట్లాడాను బ్రో, కానీ నేను చాలా మంచివాడిని" అని చాలామంది అంటారు. సైకాలజీలో దీనిని మనం అంగీకరించలేం. ఎందుకంటే, ఒత్తిడి అనేది మీలోని ముసుగును తీసేసే ఒక యాసిడ్ టెస్ట్ లాంటిది. ఒత్తిడిలో మీరు అరుస్తున్నారంటే, ఆ కోపం మీలో ఎప్పుడూ ఉన్నదే, అది ఆ సమయంలో బయటపడింది అంతే.1. ఒత్తిడిలో మెదడు ఏం చేస్తుంది? మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు మన మెదడులో భయాన్ని నియంత్రించే Amygdala యాక్టివేట్ అవుతుంది. దీన్నే 'Amygdala Hijack' అంటారు. ఆ సమయంలో మన లాజికల్ మెదడు (Prefrontal Cortex) పనిచేయడం ఆగిపోయి, కేవలం మన 'సర్వైవల్ ఇన్స్టింట్స్' (Fight or Flight) మాత్రమే పనిచేస్తాయి.Fight (పోరాటం): కోపంతో అరవడం, వాదించడం.Flight (పారిపోవడం): సమస్య నుండి తప్పించుకోవడం, బాధ్యత తీసుకోకపోవడం.Freeze (స్తంభించిపోవడం): ఏం చేయాలో తెలియక ఆగిపోవడం.మీరు ఈ మూడింటిలో దేనికి రియాక్ట్ అవుతున్నారో గమనిస్తే, మీ 'ఒత్తిడి వ్యక్తిత్వం' అర్థమవుతుంది.2. మీ పర్సనాలిటీని ఒత్తిడి ఎలా మార్చేస్తుంది?ఒత్తిడిలో మీరు మూడు రకాలుగా మారతారు.The Victim: "నాకే ఎందుకు ఇలా జరుగుతోంది?" అని నిరంతరం బాధపడటం.The Bully: ఒత్తిడిని భరించలేక ఇతరులను డామినేట్ చేసి, కంట్రోల్ చేయాలని చూడటం.The Hermit: పూర్తిగా ప్రపంచానికి దూరంగా వెళ్లిపోవడం.కానీ, Resilient Personality ఉన్న వ్యక్తి మాత్రం ఒత్తిడిలో కూడా నిశ్శబ్దంగా తన పని చేసుకుంటాడు. అతను సమస్యను చూసి భయపడడు, పరిష్కారం కోసం చూస్తాడు.3. నిజమైన స్ట్రెస్ మేనేజ్మెంట్"ఎప్పుడూ హ్యాపీగా ఉండు, స్ట్రెస్ కి చోటు ఇవ్వకు" అని సోకాల్డ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్లు చెప్తారు. ఇది అసాధ్యం, ఎందుకంటే జీవితం ఉన్నచోట స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ మధ్యలో ఉండి కూడా ఎలా ప్రశాంతంగా ఉండాలో సైకాలజీ (Mindfulness & Stoicism) నేర్పిస్తుంది. స్ట్రెస్ను పూర్తిగా తొలగించడం కాదు, స్ట్రెస్ను 'మేనేజ్' చేయడం నేర్చుకోవాలి.4. ఒత్తిడిలో కూడా 'మీరు'గా ఉండటం ఎలా?నా Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఒత్తిడిని మీ పర్సనాలిటీకి ఆయుధంగా మార్చుకోండి.Step 1: రియాక్షన్ బ్రేక్ఒత్తిడి మొదలవ్వగానే, ముందుగా శారీరక మార్పులను (గుండె వేగం పెరగడం) గుర్తించండి. వెంటనే ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఆ ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే, మీరు 'అమైగ్డాలా హైజాక్' నుండి బయటపడవచ్చు. ఆ 'రియాక్షన్'ని బ్రేక్ చేయడం మీ మొదటి విజయం.Step 2: స్ట్రెస్ వాల్యుయేషన్"ఈ ఒత్తిడికి కారణం ఏంటి? ఇది నా కంట్రోల్ లో ఉందా?" అని ప్రశ్నించుకోండి. మీ కంట్రోల్ లో ఉంటే పని చేయండి, లేకపోతే దాన్ని 'లెట్ గో' (Let go) చేయండి. మీ ఎనర్జీని కంట్రోల్ చేయలేని వాటి కోసం వృథా చేయకుండా, కంట్రోల్ చేయగలిగే వాటిపై 'Build' చేయండి.Step 3: స్టాయిక్ కామ్తుఫానులో కూడా చెట్టు కదలనట్లు, పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా మీరు మీ సెల్ఫ్-కంట్రోల్ ని కోల్పోకూడదు. ఎవరైతే ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉంటారో, వారే నిజమైన నాయకులు. ఇదే Beyond స్టేజ్.5. మీ స్ట్రెస్ రిపోర్ట్ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.ఈ వారంలో మీరు ఎక్కడ అతిగా రియాక్ట్ అయ్యారు?ఆ సమయంలో మీ మెదడు మిమ్మల్ని ఏమని భయపెట్టింది?ఇప్పుడు ఆ పరిస్థితిని తిరిగి చూస్తే, మీరు ఎలా స్పందించి ఉండాల్సింది?ఒత్తిడి మీ పర్సనాలిటీకి అద్దం!బ్రో, ఒత్తిడి మిమ్మల్ని చెడగొట్టదు, అది కేవలం మీ లోపల ఏముందో బయటకు తీస్తుంది. మీ లోపల శాంతి ఉంటే, ఒత్తిడిలో కూడా మీరు ప్రశాంతంగా ఉంటారు. లోపల గందరగోళం ఉంటే, ఒత్తిడిలో మీరు నలిగిపోతారు. కాబట్టి బయట పరిస్థితులను మార్చడం కంటే, లోపలి పర్సనాలిటీని నిర్మించడం ముఖ్యమని గుర్తుంచుకోండి."It is not the mountain we conquer, but ourselves." Edmund Hillaryసైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: అదే అసలైన కాన్ఫిడెన్స్..!) -
అనుబంధాలకే ఆస్కారం
ఎన్ని గ్రాఫిక్స్ వచ్చినా, ఎన్ని ఏఐ విప్లవాలు వచ్చినా, ‘ఈ జనరేషన్ కథ’ అనుకోవడానికి ఎన్ని ఫీట్లు చేసినా... గత, వర్తమాన, భవిష్యత్లలో తిరుగులేని కాలాతీత కథా వస్తువు... కుటుంబం, అనుబంధాలు, త్యాగాలు... మొదలైనవి. ‘నాది పాత స్కూలు’ అని చెబుతుంటారు డైరెక్టర్ పాల్ థామస్ ఆండర్సన్. సెంటిమెంట్, భావోద్వేగాలు అనే ఆ పాత స్కూల్ సబ్జెక్ట్తోనే ఆస్కార్ బరిలో సంచలనం సృష్టించారు. అతడి ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ ఆరు ఆస్కార్ అవార్డులు గెల్చుకుంది. ఈ ఏడాది ‘ఉత్తమ చిత్రం’గా ప్రపంచ దృష్టిని ఆకర్షించి ప్రశంసలు అందుకుంటోంది...‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అనే ప్రసిద్ధ మాట ఉన్నప్పటికీ... ఆర్థికం ఒక్కటే కాదు అనేకానేక సంబంధాలు అనుబంధాలను నిర్ణయిస్తాయి అని చెప్పుకోవడానికి ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ను ఉదాహరణగా చెపొ్చచ్చు. ‘సాగర సంగమం’ సినిమాలో పితృ సమానుడైన బాలు (కమల్ హాసన్)ను శైలు అకారణంగా ద్వేషిస్తుంటే ‘అయ్యో!’ అనిపిస్తుంది. ఆ అమ్మాయి కళ్లు తెరుచుకొని ‘మాతృదేవోభవ పితృదేవోభవ’ అని పాడుతుంటే ప్రేక్షకుల కళ్లు చెమర్చాయి. అలాంటి బలమైన భావోద్వేగాలు ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’లో చాలా ఉన్నాయి.ఇదీ కథ...విప్లవ సంస్థ ‘ఫ్రెంచ్ 75’లో సభ్యులైన ΄్యాట్ కల్వాన్ (లియోనార్డో డికాప్రియో), పెర్పిడియో బెవర్లీ హిల్స్ (టెయన్ టేలర్) ప్రేమికులు. ఒక డిటెన్షన్ సెంటర్లో నిర్బంధించబడిన వలసదారులను బయటకు తీసుకువచ్చే క్రమంలో కమాండింగ్ ఆఫీసర్ స్టీవెన్ను అవమానిస్తుంది పెర్పిడియో. దీంతో ఆమెపై కోపం పెంచుకుంటాడు స్టీవెన్. ఒక కేసులో పెర్పిడియోను అరెస్ట్ చేసిన స్టీవెన్, తన కోరిక తీర్చితే వదిలేస్తానని చెబుతాడు. అతడి డిమాండ్కు ఆమె అంగీకరించడంతో వదిలేస్తాడు.పెర్పిడియా ‘చార్లీన్’ అనే బిడ్డకు జన్మనిస్తుంది. ఆ తరువాత విప్లవ కార్యకలాపాలు కొనసాగించడానికి అజ్ఞాతంలోకి వెళుతుంది. బ్యాంకు దోపిడి సమయంలో సెక్యూరిటీ గార్డ్ను హత్య చేసినందుకు పెర్పిడియో అరెస్ట్ అవుతుంది. స్టీవెన్ ఆమెను జైలు నుంచి తప్పించుకునేలా చేస్తాడు. అయితే ఇది ఆమె మీద ప్రేమతో చేసింది కాదు. ‘ఫ్రెంచ్ 75’ సభ్యుల సమాచారాన్ని తెలుసుకోవాలనే కుట్రతో చేస్తాడు.పెర్పిడియో ఇచ్చిన సమాచారంతో ఆమె సహచరులను వెంటాడి, ఉరి తీస్తాడు. పదహారేళ్ల తరువాత.... చార్లీన్కు తానే తండ్రి అని తెలుసుకున్న స్టీవెన్ ఆమెను చంపేందుకు కుట్రలు చేస్తాడు. ఇన్నాళ్లు చార్లీన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకున్న ΄్యాట్ ఎలా స్పందించాడనేది కథ. తనను వదిలేసి వెళ్లిపోయిన తల్లిపై చార్లీన్కు కోపం, పెంపుడు తండ్రి (΄్యాట్)పై అనుమానం. ΄్యాట్ ఆమె నమ్మకాన్ని ఎలా గెలుచుకున్నాడనేది అసలు సిసలు కథ.వైన్ల్యాండ్ స్ఫూర్తితో...‘వైన్ల్యాండ్’ నవలను స్ఫూర్తిగా తీసుకొని డైరెక్టర్ పాల్ థామస్ ‘వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్’ తీశారు. థామస్ పిన్చాన్ 1990లో రాసిన పోస్ట్ మోడర్న్ నవల... వైన్ల్యాండ్. అమెరికా అధ్యక్షుడిగా రోనాల్డ్ రీగన్ తిరిగి ఎన్నికైన సంవత్సరం నేపథ్యంలో ఈ నవల సాగుతుంది. 1960 నుంచి 1980 వరకు అమెరికన్ సమాజంలో జరిగిన రకరకాల సంఘటనలను కళ్లకు కడుతుంది.తీయలేనేమో... లేదు తీయాల్సిందే!‘ఈ నవలను సినిమాగా తీయగలనా?’ అనే సందేహం మొదట్లో పాల్ థామస్కు వచ్చింది. నవలను ఉన్నది ఉన్నట్లుగా కాకుండా ఏదైనా కాన్సెప్ట్ అనుకొని తీయాలనుకున్నాడు. అప్పుడు అతడి మదిలోకి వచ్చిన ఆలోచనలు...యాక్షన్ కార్–చేజ్ మూవీ, మరొకటి... ఒక విప్లవకారిణి కథ. తండ్రి–కూతురు అనుబంధంతో పై రెండు కాన్సెప్ట్లను కలిపి సినిమా తీయాలనుకున్నారు.కారు ఛేజింగ్లు, షూటౌట్లతో యాక్షన్–హెవీ కథనం ఉండాలి. అదే సమయంలో బలమైన భావోద్వేగాలు ఉండాలనుకున్నారు. డ్రాఫ్ట్ల మీద డ్రాఫ్ట్లు రాశారు. ఎన్నోసార్లు తిరగరాసుకున్నాకగానీ తనకు స్క్రిప్ట్ సంతృప్తిగా అనిపించలేదు. అలా సినిమా తెర మీదికి వచ్చింది. ఆండర్సన్ గత చిత్రాలతో పోల్చితే ఈ చిత్రానికి అయిన బడ్జెట్ చా...లా ఎక్కువ!ఒక తల్లి కథవిప్లవకారిణి, ప్రేమికురాలు, అన్యాయానికి గురైన మహిళ, ఒక బిడ్డకు తల్లిగా... రకరకాల షేడ్స్తో తన నటనతో ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు టెయన్ జాక్వెలిన్ టేలర్. సింగర్, సాంగ్ రైటర్, మోడల్, డ్యాన్సర్, కొరియోగ్రాఫర్, మ్యూజిక్ వీడియో డైరెక్టర్గా బహుముఖ ప్రజ్ఞను సొంతం చేసుకుంది.డైనమిక్ డాటర్‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’లో కూతురిగా ప్రధాన పాత్ర పోషించింది అమెరికన్ నటి చేజ్ ఇన్ఫినిటి పేన్. పదేళ్ల వయసులో స్కూలులో జరిగిన సంగీత కార్యక్రమానికి ఎంపిక కావడం ద్వారా ఆమె మ్యూజిక్ జర్నీ మొదలైంది. హైస్కూల్ రోజుల్లోనే మ్యూజిక్, థియేటర్ ప్రోగ్రామ్స్తో బిజీబిజీగా గడిపేది. ‘కె–పాప్ కవర్ డ్యాన్స్ గ్రూప్’ కో–ఫౌండర్లలో ఇన్ఫినిటీ ఒకరు. ఫ్రెంచ్ బాగా వచ్చు.గతం విషయం ఎలా ఉన్నా... ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’తో ‘ఈ అమ్మాయి ఎవరు?’ అని ప్రపంచ ప్రేక్షకులు ఆరా తీసేలా నటించింది. ‘కెమెరా టెస్ట్ల తరువాత ఆండర్సన్ సినిమాకు ఎంపిక కావడం మాట ఎలా ఉన్నా, లియో డికాప్రియోతో కలిసి నటిస్తున్నాననే ఊహ భయపెట్టింది. అమ్మానాన్నలకు ఫోన్ చేసి చెబితే, నా కంటే ఎక్కువ భయభ్రాంతులకు గురయ్యారు! ఇదొక గొప్ప అవకాశం. భయపడకూడదు’ అనుకొని చేశాను’ అంటుంది ఇన్ఫినిటీ పేన్. -
ఆమెదే ఆస్కార్!
ఆస్కార్లో ఆమె నిలిచింది... చరిత్ర సృష్టించేలా గెలిచింది... కెమెరాలో ‘ఆమె’, క్యాస్టింగ్లో ‘ఆమె’, సాంగ్లో ‘ఆమె’, కాస్ట్యూమ్స్లో ‘ఆమె’, యానిమేషన్ నిర్మాణంలో ‘ఆమె’... ఇలా సాంకేతిక విభాగాల్లో పురుషులతో పోటీ పడి ‘ఆమె’ ఆస్కార్ దక్కించుకుంది. 98వ ఆస్కార్ అవార్డ్స్లో ‘ఆమె’ తన సత్తా చాటింది. ప్రతిభతో ‘ఆస్కార్ ఆమెదే’ అని నిరూపించింది. టోటల్గా ఈసారి ‘ఫిమేల్ డామినేషన్’ కనిపించింది. ఇంకా ఆస్కార్ అవార్డులు సాధించిన విజేతలు, ఇతర విశేషాల్లోకి...⇒ ‘‘ఈ రోజు నేను ఆస్కార్ వేదికపై ఉన్నానంటే ఇందుకు కారణం సిడ్నీ పోయిటియర్, డెంజెల్ వాషింగ్టన్, హాలీ బెర్రీ, జేమీ ఫాక్స్, ఫారెస్ట్ విటేకర్, విల్ స్మిత్ (జోర్డాన్ కంటే ముందు ఆస్కార్ అవార్డులు అందుకున్న నల్లజాతి నటులు). ఈ దిగ్గజాల బాటలో నిలబడటాన్ని గౌరవంగా భావిస్తున్నాను. నాకు అండగా నిలుస్తూ, నన్ను ప్రోత్సహిస్తున్న నా తల్లికి, నా కోసం ఘనా నుంచి ఇక్కడకు వచ్చిన నా తండ్రికి ధన్యవాదాలు. – ఉత్తమ నటుడు మైఖేల్ బి. జోర్డాన్⇒ ఈ సినిమా కథను నా పిల్లల (పెర్ల్, లూసిల్లే, జాక్, మిన్నీ) కోసమే రాశాను. మనం వాళ్లకు ఓ గందరగోళ ప్రపంచాన్ని అందిస్తున్నాం. ఇందుకు వారికి మనం ముందుగా క్షమాపణలు చె΄్పాలి. అదే సమయంలో మనల్ని మనం కూడా సరిదిద్దుకోవాలని, మానవత్వాన్ని తిరిగి ఇచ్చేయాలనే ఓ ఆశతో కూడా ఈ కథ రాశాను. నా ప్రయాణంలో భాగమైన నా భార్య మాయా రుడాల్ఫ్కు థ్యాంక్స్. ఈ అత్యున్నత పురస్కారాన్ని అందించిన అకాడమీకి థ్యాంక్స్. – ఉత్తమ దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్⇒ ఒక్క షాట్తో క్రికెటర్ సిక్సర్ కొట్టినట్లు ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ ఆస్కార్ వేదికపై సిక్సర్ కొట్టింది. ఆరు అవార్డులు సాధించి, హాట్ టాపిక్గా నిలిచింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో డాల్బీ థియేటర్ వేదికగా మార్చి 15న (భారతీయ కాలమానం ప్రకారం సోమవారం) హాలీవుడ్ హాస్య నటుడు కోనన్ ఓబ్రియన్ వ్యాఖ్యాతగా 98వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. మొత్తం 24 విభాగాల్లో అవార్డులను ప్రదానం చేశారు.పాల్ థామస్ అండర్సన్ దర్శకత్వం వహించిన అమెరికన్ బ్లాక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ సినిమా ఆరు విభాగాల్లో (ఉత్తమ చిత్రం, దర్శకుడు, సహాయ నటుడు, అడాప్టెడ్ స్క్రీన్ప్లే, ఎడిటింగ్, క్యాస్టింగ్) సిక్సర్ కొట్టింది. ఆస్కార్ చరిత్రలోనే అత్యధికంగా 16 నామినేషన్స్ను దక్కించుకుని, అందరి దృష్టినీ ఆకర్షించిన అమెరికన్ హారర్ ఫిల్మ్ ‘సిన్నర్స్’ నాలుగు విభాగాల్లో (ఉత్తమ నటుడు, ఒరిజినల్ స్క్రీన్ప్లే, సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ స్కోర్) మాత్రమే అవార్డులు సాధించింది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా ‘ఫ్రాంకైన్ స్టీన్’కు మూడు అవార్డులు లభించాయి. ‘కే పాప్ డిమాన్ హంటర్స్’ చిత్రాన్ని రెండు అవార్డులు వరించాయి.‘వెపన్స్, అవతార్: ఫైర్ అండ్ యాష్, ఎఫ్1, సెంటిమెంటల్ వేల్యూ’ చిత్రాలు ఒక్కో అవార్డును గెలుచుకున్నాయి. ఉత్తమ నటుడిగా మైఖేల్. బి. జోర్డాన్, నటిగా జెస్సీ బక్లీ, సహాయ నటి విభాగంలో ఎమీ మాడిసన్ తొలిసారి ఆస్కార్ అవార్డులు అందుకోగా, ఉత్తమ సహాయ నటుడు విభాగంలో సీన్ పెన్కు మూడో ఆస్కార్ అవార్డు వచ్చింది. ఉత్తమ దర్శకుడిగా పాల్ థామస్ ఆండర్సన్ అవార్డును అందుకున్నారు. 98 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో సినిమాటోగ్రఫీ విభాగంలో అవార్డు సాధించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు ఆటం డ్యూరాల్డ్ అర్కాపా. అలాగే ఈ ఏడాది తొలిసారి ప్రవేశపెట్టిన బెస్ట్ క్యాస్టింగ్ విభాగంలో కాసాండ్రా కులుకుండిస్ అవార్డు అందుకుని, ఈ విభాగంలో అవార్డు అందుకున్న తొలి వ్యక్తిగా, తొలి మహిళగా నిలిచారు.ఆరో నల్ల జాతీయుడు... తొలి ఐరిష్ మహిళ‘సిన్నర్స్’ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసి, అద్భుతమైన నటన కనబరిచిన మైఖేల్ బి. జోర్డాన్కు ఉత్తమ నటుడి అవార్డు లభించింది. ఆస్కార్ అవార్డు సాధించిన ఆరో నల్ల జాతీయుడిగా మైఖేల్ రికార్డు సృష్టించారు. అంతేకాదు... ఉత్తమ నటుడు విభాగంలో తొలిసారి లభించిన నామినేషన్తోనే మైఖేల్ ఆస్కార్ అవార్డును ముద్దాడటం విశేషం. ఇక ‘హామ్నెట్’లో ఆగ్నేస్ పాత్రలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన జెస్సీ బక్లీ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. జెస్సీకి ఇదే తొలి ఆస్కార్ అవార్డు. అలాగే ఉత్తమ నటి విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకున్న తొలి ఐరిష్ మహిళగా కూడా ఆమె రికార్డులకెక్కారు.⇒ ముచ్చటగా మూడు: దర్శకుడు పాల్ థామస్ అండర్సన్ ఆస్కార్ కల నెరవేరింది. 98వ ఆస్కార్ అవార్డులకు ముందు ఆయనకు పదకొండు ఆస్కార్ నామినేషన్స్ ఉన్నాయి. కానీ ఒక్క అవార్డు కూడా రాలేదు. కాగా 98వ ఆస్కార్ అవార్డ్స్లో ఆయన (ఉత్తమ చిత్రం, దర్శకుడు, అడాప్టెడ్ స్క్రీన్ ప్లే) విభాగాల్లో నామినేషన్స్ సాధించారు. ఈ మూడు విభాగాల్లోనూ అవార్డులు లభించాయి.సీన్... అన్సీన్!‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’కి ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు గెలుచుకున్న సీన్ పెన్ వేడుకకు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. సీన్... అన్సీన్ అని గుసగుసలు వినిపించాయి. అతను ఉక్రెయిన్లో ఉండటం వల్ల హాజరు కాలేదనే ప్రచారం జరుగుతోంది. ఇక యాక్టింగ్ విభాగంలో మూడు ఆస్కార్ అవార్డులు సాధించిన ఎనిమిదో వ్యక్తిగా సీన్ పెన్ నిలిచారు.‘‘ఇక్కడ ఉన్న అద్భుతమైన మహిళలందరికీ ధన్యవాదాలు. మీ ప్రతిభ నాకెంతో స్ఫూర్తినిచ్చింది. ఇక ఫ్రెడ్ (భర్తని ఉద్దేశించి)... నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నువ్వు అద్భుతమైన నాన్నవి... నా బెస్ట్ ఫ్రెండ్వి. ఇక మా చిన్న అమ్మాయి ఇస్లా వయసు ఎనిమిది నెలలు. ఏం జరుగుతుందో తనకు తెలియదు. బహుశా పాలు కావాలని కలలు కంటూ ఉంటుంది.నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఎప్పటికీ నీ తల్లిగా ఉండటానికి ఇష్టపడతాను. నా ఐరిష్ కుటుంబం ఇక్కడ ఉంది. కలలు కనడం, వాటిని సాకారం చేసుకునేలా అండగా నిలబడటం నుంచి అన్ని నేర్పించినందుకు ధన్యవాదాలు అమ్మానాన్న. ఈ రోజు యూకేలో మదర్స్ డే. ఈ వారం మా పాపకి ఒక పన్ను వచ్చింది. ఈ రోజు ఉదయం నా గుండెలను హత్తుకుని నిద్రపోయింది. ఈ తల్లి సాధించిన అవార్డుని నీ అందమైన హృదయానికి అంకితం చేయాలనుకుంటున్నాను’’. – నటి జెస్సీ బక్లీఆస్కార్ ఇన్ మెమోరియమ్లో కోటఆస్కార్ అవార్డు వేడుకలో భాగంగా ‘ఇన్ మెమోరియమ్’ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా సినీరంగం కోసం కృషి చేసిన గొప్ప కళాకారులను స్మరించుకుంటూ వీడియోను ప్రదర్శించారు. ఆస్కార్ కమిటీ నివాళులర్పించిన వారిలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన కోట శ్రీనివాసరావు, బాలీవుడ్కి చెందిన ధర్మేంద్ర, మనోజ్ కుమార్, దక్షిణాది తార బి. సరోజాదేవి వంటి దిగ్గజాలు ఉన్నారు.అయితే వీరి గురించి వేదికపై ప్రస్తావించినప్పుడు ధర్మేంద్రను చూపించకపోవడం భారతీయ ప్రేక్షకులను ఆగ్రహానికి గురి చేసింది. ధర్మేంద్ర అభిమానులు ఆస్కార్ ప్రతినిధులపై మండిపడుతూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టారు. సమయాభావం వల్ల వీడియోలో కొందరినే చూపారని... ఆ తర్వాత అందరి పేర్లను ఆస్కార్ అధికారిక వెబ్ సైట్లో పొందుపరిచారని టాక్.⇒ ‘‘నేత కార్మికులకు, కళాకారులకు, నా టీమ్కి, మా పనిని గుర్తించిన అకాడమీకి ధన్యవాదాలు’’ అంటూ కన్నీళ్లు ఆపుకోవడానికి కష్టపడుతూనే కాస్ట్యూమ్ విభాగంలో ‘ఫ్రాంకైన్స్టైన్’ సినిమాకి అవార్డు అందుకున్న ఆనందాన్ని పంచుకున్నారు కేట్ హాలే. అలాగే తాను చేసే సరదా పనులు, చిరాకు పెట్టే పనులను భరిస్తున్న తన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారామె.⇒ ‘‘అవార్డ్స్లో కొత్తగా క్యాస్టింగ్ కేటగిరీని చేర్చినందుకు అకాడమీకి థ్యాంక్స్. ఒక సినిమాకి నటీనటులను సెట్ చేయడానికి అవిశ్రాంతంగా పోరాడుతున్న క్యాస్టింగ్ డైరెక్టర్లకు థ్యాంక్స్. సినిమాలో తమ పేరు కూడా రాని క్యాస్టింగ్ డైరెక్టర్లకు ఈ అవార్డుని అంకితం చేస్తున్నా’’.– కాసాండ్రా కులుకుండిస్⇒ ‘వెపన్’ సినిమాలోని నటనకు గాను ఉత్తమ సహాయ నటి విభాగంలో ఎమీ మాడిగన్ తొలిసారి ఆస్కార్ అవార్డును సాధించారు. కాగా 1986లో జరిగిన 58వ ఆస్కార్ అవార్డుల్లో ఇదే విభాగంలో అవార్డు కోసం ‘ట్వైస్ ఇన్ ఏ లైఫ్టైమ్’ అనే చిత్రంలోని నటనకు గాను ఎమీ మాడిగన్కు నామినేషన్ దక్కినా, అవార్డు రాలేదు. ఇప్పుడు నాలుగు దశాబ్దాల తర్వాత ఆమెకు 98వ ఆస్కార్ అవార్డ్స్లో ఉత్తమ సహాయ నటి విభాగంలోనే నామినేషన్ లభించి, అవార్డు రావడం విశేషం. ఇలా ఒక ఆస్కార్ నామినేషన్కి, మరో ఆస్కార్ నామినేషన్కు మధ్య 40 ఏళ్ల గ్యాప్ ఉండి, అవార్డు సాధించిన ఘనత మాత్రం ఎమీ మాడిగన్కే దక్కుతుంది.కెమెరా... ఆమె మూడో కన్నుఉత్తమ సినిమాటోగ్రఫీకి అకాడమీ అవార్డు గెల్చుకున్న తొలి మహిళగా, శ్వేతజాతియేతర తొలి మహిళగా చరిత్ర సృష్టించారు అమెరికన్ సినిమాటోగ్రాఫర్ ఆటం డ్యూరాల్డ్ అర్కాపావ్. ‘సిన్నర్స్’ సినిమాకు ఆస్కార్ అందుకున్నారు. కాలేజీ చదువు పూర్తయిన తరువాత ఆటం కొంతకాలం ప్రకటనల రంగంలో పని చేశారు. ఆ తరువాత సినిమా రంగంలోకి అడుగు పెట్టి, కెమెరా అసిస్టెంట్గా పని చేశారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్లో సభ్యురాలిగా చేరారు.2025 చిత్రం ‘సిన్నర్స్’ సినిమాను ఐమాక్స్15–పెర్ఫ్ అండ్ అల్ట్రా పానా విజన్ 70 కెమెరాలను ఉపయోగించి 65 ఎంఎం ఫిల్మ్పై చిత్రీకరించారు.‘నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి. నా బాల్యం, కుటుంబంపై ప్రభావం చూపిన వ్యక్తి’ అని పోరాట యోధుడైన తన తాత పాగన్ బటిస్టా గురించి చెబుతుంటారు ఆటం. ‘నేను ఇక్కడ నిలబడడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఇంకా ఎంతోమంది మహిళలు ఇక్కడ నిలబడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు లేకుండా నేను ఇక్కడకి రాలేను అని నాకు తెలుసు’ అంటూ చిత్రపరిశ్రమలో పని చేస్తున్న మహిళలకు ఆస్కార్ వేడుకలో కృతజ్ఞతలు తెలియజేశారు ఆటం.ఆస్కార్ విజేతలు ⇒ ఉత్తమ చిత్రం: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ∙దర్శకుడు: పాల్ థామస్ ఆండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్) ⇒ నటుడు: మైఖేల్ బి. జోర్డాన్ (సిన్నర్స్) ∙నటి: జెస్సీ బక్లీ (హామ్నెట్) ∙సహాయ నటుడు: సీన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్) ∙సహాయ నటి : ఎమీ మాడిగన్ (వెపన్స్) ∙సినిమాటోగ్రఫీ: ఆటం డురాల్డ్ అర్కపా (సిన్నర్స్) ⇒ ఎడిటింగ్: యాండీ జుర్గెన్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్) ⇒ఒరిజినల్ స్కోర్: లుడ్విగో గోరాన్సన్ (సిన్నర్స్)⇒ ఒరిజినల్ సాంగ్: గోల్డెన్ సాంగ్ (కె–పాప్ డిమాన్ హంటర్స్) ⇒ అంతర్జాతీయ చిత్రం: సెంటిమెంటల్ వేల్యూ (నార్వే) ⇒ సౌండ్: గరేత్ జాన్, ఏఐ నెల్సన్, గ్వెన్డాలిన్ యేట్స్ విర్టల్, గేరీ ఎ. రిజో, జాన్ పెరల్ట (ఎఫ్ 1) ⇒ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం: మిస్టర్ నోబడీ ఎగైన్స్ట్ పుతిన్ ⇒ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం: ఆల్ ద ఎమ్టీ రూమ్స్ ⇒ విజువల్ ఎఫెక్ట్స్: జో లెటరి, రిచర్డ్ బనెహం, ఎరిక్ సైండన్, డేనియల్ బారెట్ (అవతార్: ఫైర్ అండ్ యాష్)⇒్రపొడక్షన్ డిజైన్: టమరా డేవెరల్, షేన్ వ్యూ (ఫ్రాంకైన్స్టీన్) ∙ఒరిజినల్ స్క్రీన్ప్లే: ర్యాన్ కూగ్లర్ (సిన్నర్స్)⇒ అడాప్టెడ్ స్క్రీన్ప్లే: పాల్ థామస్ ఆండర్సన్ (వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్) ⇒ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: మైక్ హిల్, జోర్డాన్ సామ్యూల్, క్లియోనా ఫ్యూరే (ఫ్రాంకెన్స్టీన్) ⇒ కాస్ట్యూమ్ డిజైన్: కేట్ హాలే (ఫ్రాంకెన్స్టీన్) ⇒ క్యాస్టింగ్: కాసాండ్రా కులుకుండిస్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్) ⇒ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం: ద గర్ల్ హు క్రైడ్ పాల్స్ ⇒ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం: కె–పాప్ డిమాన్ హంటర్స్⇒ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం: ద సింగర్స్, టూ పీపుల్ ఎక్సే ్చంజింగ్ సలైవా.⇒ ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త, రిలయన్ ్స అధినేత ముఖేశ్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ భర్త ఆనంద్ పిరమాల్తో కలిసి ఆస్కార్ వేడుకలో పాల్గొన్నారు. ప్రముఖ ఇటలీ డిజైనర్ వాలెంటినో ఫాల్/వింటర్ వింటేజ్ కలెక్షన్ గౌను, చోకర్ స్టైల్ డైమెండ్ నెక్లెస్లో ఈషా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారతీయ సంస్కృతిని అంతర్జాతీయ వేదికపై ప్రతిబింబించడంతో పాటు ఇండియన్ సినిమాకు మరింత గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ఈషా అంబానీ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆస్కార్ వేడుకలో పాల్గొనడం ఆమెకు ఇదే తొలిసారి⇒ 98వ ఆస్కార్ అవార్డ్స్లో భారతీయ నటి ప్రియాంకా చోప్రా సందడి చేశారు. స్పానిష్ నటుడు జేవియర్ బార్డెమ్తో కలిసి ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో అవార్డు సాధించిన నార్వేజియన్ డ్రామా ‘సెంటిమెంటల్ వేల్యూ’ సినిమా యూనిట్కు అవార్డు అందించారామె. ఈ విభాగంలో అవార్డు సాధించిన తొలి నైజీరియన్ ఫిల్మ్గా ‘సెంటిమెంటల్ వేల్యూ’ నిలిచింది. అవార్డును ప్రదానం చేసే సమయంలో ‘యుద్ధం వద్దు... పాలస్తీనాకు స్వేచ్ఛ కావాలి’ అన్నట్లుగా జేవియర్ నినాదం చేయగా, ప్రియాంకా చోప్రా మద్దతు ఇస్తున్నట్లుగా హావభావాలు పలికించారు. ఆస్కార్ వేదికపై ఇది చర్చనీయాంశమైంది.⇒ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో టై అవడం విశేషంగా నిలిచింది. ఈ విభాగంలోని అవార్డుకు ‘టూ పీపుల్ ఎక్సే ్చంజ్ సలైవా’, ‘ది సింగర్స్’ చిత్రాలు పోటీపడ్డాయి. ఈ రెండు సినిమాల్లో ఏ మూవీకి అవార్డు వస్తుందోననే ఆసక్తి నెలకొంది. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ‘టూ పీపుల్ ఎక్సే ్చంజ్ సలైవా’, ‘ది సింగర్స్’ విజేతలుగా నిలిచాయి. ఈ జాబితా టై అయింది’ అని ప్రజెంటర్ కుమాయిల్ నంజియాని తెలిపారు. ఈ విభాగంలోని రెండు చిత్రాల విజేతలకు నటుడు కుమాయిల్ నంజియాని అవార్డు అందించారు. కాగా 98 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో ఇలా టై అవడం ఇది ఏడోసారి అట.ఈ అవార్డు కొరియన్ల కోసమే... ‘కేపాప్ డిమాన్ హంటర్స్’ సినిమాకు యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్, ఒరిజినల్ సాంగ్ (‘గోల్డెన్’ పాటకు) విభాగాల్లో ఆస్కార్ అవార్డులు వచ్చాయి. యానిమేషన్ విభాగంలో డిస్నీ, పిక్సార్ సంస్థలు నిర్మించిన సినిమాలు కాకుండా వేరే యానిమేటెడ్ సినిమాకు రెండు ఆస్కార్ అవార్డులు రావడం ఇదే తొలిసారి. సౌత్ కొరియన్ సాంగ్ రైటర్లు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డులు సాధించారు. ‘కేపాప్ డిమాన్ హంటర్స్’ చిత్రాన్ని మాగీ కాంగ్, క్రిస్ అపెల్హాన్స్ ద్వయం దర్శకత్వంలో మిచెల్లీ వాంగ్ నిర్మించారు.యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును స్వీకరించే సమయంలో మాగీ కాంగ్ మాట్లాడుతూ – ‘ఈ అవార్డు కొరియా కోసం... ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొరియన్ల కోసం’ అంటూ కాస్త ఉద్వేగంగా మాట్లాడారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డును స్వీకరిస్తూ కిమ్ యున్–జే భావోద్వేగానికి లోనయ్యారు. ‘నన్ను తక్కువగా చూసేవారి మధ్య పెరిగాను. ఇప్పుడు వారందరూ మా పాటలు పాడుతున్నారు. అంతటా కొరియన్ లిరిక్స్ వినిపిస్తున్నాయి. ఇది సక్సెస్ మాత్రమే కాదు. ధైర్యానికి స్ఫూర్తి’ అన్నారు. -
మండుటెండల్లో మనసు చల్లగా
మండే ఎండలు, ఎడారి అంటే వెంటనే గుర్తొచ్చేది రాజస్థాన్. ఎండాకాలంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ వేడిలో కూడా మనసుకి శాంతి, ఆధ్యాత్మిక చల్లదనం కలిగించే ప్రదేశం ఉంది. అదే పుష్కర్లో ఉన్న పవిత్రమైన పుష్కర్ సరోవర్.ఆరావళి పర్వత శ్రేణుల మధ్య ఉన్న ఈ సరోవరం రాజస్థాన్లో అత్యంత పవిత్రమైన జల ప్రదేశాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. హిందూ పురాణాల ప్రకారం ఈ సరోవరం బ్రహ్మదేవుడి ఆశీర్వాదంతో ఏర్పడింది అని చెబుతారు. అందుకే ఈ సరోవరం చుట్టూ 50కి పైగా ఘాట్లు, అనేక ఆలయాలు కనిపిస్తాయి.ఎండాకాలంలో పుష్కర్ పట్టణంలో వేడి ఎక్కువగా ఉన్నా కూడా ఎర్లీ మార్నింగ్, సాయంత్రం సమయంలో సరోవరం వద్ద వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. సూర్యోదయం సమయంలో సరోవరం మీద పడిన సూర్య కిరణాల వల్ల నీరు బంగారు వర్ణంలో మెరుస్తుంది. అదే సమయంలో ఘాట్ల దగ్గర భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తూ, పూజలు చేస్తూ కనిపిస్తారు. తెల్లని ఘాట్లు, ఆలయాల గోపురాల ప్రతిబింబం నీటిపై పడుతూ ఒక అందమైన దృశ్యాన్ని సృష్టిస్తుంది. పుష్కర్కు మరో ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. ప్రపంచంలో చాలా అరుదుగా కనిపించే బ్రహ్మ ఆలయం పుష్కరం ఇక్కడే ఉంది. అందుకే భక్తులు మాత్రమే కాదు, ట్రావెల్ లవర్స్కు కూడా పుష్కర్ ఒక స్పిరిచ్యువల్ డెస్టినేషన్ గా నిలుస్తుంది. ఎండాకాలంలో రాజస్థాన్ పర్యటన అనేది సాధారణంగా కష్టమైనదే. ఒక వేళ ఏదైనా పనిలో భాగంగా వెళ్తే మాత్రం మౌంట్ అబూ, పుష్కర్ వంటి ప్రదేశాలకు పర్యటనకు వెళ్లచ్చు. మండే వేడిలోనూ ప్రశాంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందవచ్చు.ఎలా చేరుకోవాలి?తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారు హైదరాబాద్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్΄ోర్ట్ నుంచి జైపూర్ కు నేరుగా ఫ్లైట్లో చేరుకోవచ్చు. రైలు మార్గాన వెళ్లేవారు.. ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్ స్టేషన్ నుంచి జైపూర్కు రైలు మార్గాన చేరుకోవచ్చు. హైదరాబాద్లోని కాచిగూడ స్టేషన్ నుంచి రైలు మార్గం అందుబాటులో ఉంది. జైపూర్ నుంచి రోడ్డు మార్గాన అజ్మేర్, పుష్కర్ సులభంగా చేరుకోవచ్చు. వెళ్లడానికి ముందే టికెట్లు, రూమ్లు బుక్ చేసుకుంటే ప్రయాణం మరింత సౌకర్యంగా ఉంటుంది.యూరప్లోని అందమైన ద్వీపాల కథనార్త్ ఆట్లాంటిక్ సముద్రం మధ్య ఉన్న ఫరో ఐలాండ్స్ అనే ద్వీప సమూహం ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. యూరోప్లో ఇది చాలా పాప్యులర్ డెస్టినేషన్. పచ్చని పర్వతాలు, సముద్రం మధ్యలో కనిపించే చిన్న గ్రామాలు ఈ ప్రదేశాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. ఈ ద్వీ΄ాలకు ప్రత్యేకమైన, ప్రశాంతమైన గ్రామాలే ప్రధాన ఆకర్షణ. ఉదయం వేళలో సముద్ర అలలు, పచ్చని పర్వతాల మధ్య పడిన వెలుగు ప్రపంచం అంతా ప్రశాంతంగా అనిపించే దృశ్యాన్ని సృష్టిస్తుంది.గ్రామాల జీవనంఫరో గ్రామాల సందుల్లో చిన్న ఇళ్లు, గ్రాస్ రూఫ్స్, సముద్రంపై నడిచే పడవల దృశ్యం కనిపిస్తుంది. స్థానిక ప్రజలు ప్రకృతి రిథమ్తో కలిసి జీవించే జీవన విధానాన్ని ఇక్కడ చూడచ్చు. ఫిషింగ్, సముద్ర సంస్కృతి ఇక్కడి ప్రజల జీవితంలో కీలక భాగంలాంటిది. ఇక్కడ ఎక్కువగా వైకింగ్స్ వారసులే నివసిస్తుంటారు.హైదరాబాద్ నుంచి యాత్రహైదరాబాద్ నుంచి ఫరో ఐలాండ్కి ప్రయాణం సాధారణంగా వాయు మార్గంలోనే జరుగుతుంది. ముందుగా హైదరాబాద్ నుండి దుబాయ్ లేదా ఢిల్లీ నుండి యూరోప్లోని కోపెన్ హ్యాగెన్ చేరుకోవాలి. అక్కడి నుండి వగార్ విమనాశ్రయానికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి చిన్న రోడ్డు ప్రయాణం చేసి ద్వీపాల మధ్య ఉన్న అందమైన గ్రామాలకు వెళ్లి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. -
మనసుతో చేసే ఆధ్యాత్మిక యాత్ర
గిర్నార్ అనే పర్వత శ్రేణి గుజరాత్ రాష్ట్రంలో జూనాగఢ్ నగరం పక్కన ఆధ్యాత్మిక ప్రభతో నిలిచిన ఒక పవిత్ర ప్రదేశం. ఇక్కడ ఉదయం సమయంలో అడుగులు వేస్తూ కొండపైకి చేరుకుంటుంటే భక్తి, ప్రకృతి మధ్య జరిగే ఒక మౌన సంభాషణలా అనిపిస్తుంది.అడుగడుగునా మంత్రాల ధ్వనిగిర్నార్కి చేరిన తరువాత కొండపైకి ట్రెక్కింగ్ చేయడానికి మెట్లు ఉంటాయి. ప్రతి అడుగు ఒక రిథమ్లో ముందుకు సాగుతుంది. కొన్ని ప్రదేశాల్లో ప్రశాంతంగా వినిపించే మంత్రాల ధ్వని గాలిలో కలుస్తుంది. చుట్టూ పర్వత వనాలు, పర్వతం పైకి చేరుకుంటున్న కొద్దీ భక్తులు దైవానికి మౌనంగా చేసే నమస్కారాలు.. ఇవన్నీ కలిసి ఒక పవిత్రమైన మార్గంగా, అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రగా మారితుంది.గిర్నార్లోని అంబాజీ ఆలయం దగ్గర ఉదయం వేళలో దీపాల వెలుగు చాలా హృద్యంగా కనిపిస్తుంది. ఇంకా పైకి వెళ్లిన తరువాత దత్తాత్రేయ స్వామి ఆలయం ఉంటుంది. గిర్నార్ శిఖరం దగ్గర నిల్చొని చూస్తూ గుజరాత్ నేల అందం ఏంటో తెలుస్తుంది. అక్కడి నేల అందాల్ని చూస్తూ భక్తి, ప్రకృతి రెండూ కలిసిన అనుభూతిని సొంతం చేసుకోవచ్చు.పర్వతంపై సూర్యోదయంశిఖరం అంచున నిల్చొని సూర్యోదయాన్ని వీక్షిస్తుంటే ఆకాశం బంగారు రంగులో మారడాన్ని గమనించవచ్చు. పర్వత రేఖలు కోమలంగా కనిపిస్తాయి. ఆ క్షణంలో ఈ ప్రయాణం ఒక ఆధ్యాత్మిక అద్భుతంగా నిలుస్తుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుండి అహ్మదాబాద్ వరకు ఫ్లైట్ లేదా రైలు సేవలు అందుబాటులో ఉంటాయి. అహ్మదాబాద్ నుండి రైలు లేదా రోడ్ మార్గం ద్వారా జూనాగఢ్ చేరుకోవచ్చు. అక్కడి నుంచి గిర్నార్ వరకు రోడ్ ప్రయాణం ఉంటుంది. గిర్నార్ ఆధ్యాత్మిక ప్రయాణం ఒక శారీరక యాత్ర మాత్రమే కాదు. మనసుతో చేసే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. -
ఒకేసారి బిడ్డలకు జన్మనిచ్చిన తల్లీకూతుళ్లు
తల్లి కావడం అనేది ఎంత అపురూపమైన క్షణమో చెప్పాల్సిన పనిలేదు. ఆమె తల్లి అవ్వడంతోనే కుటుంబ సభ్యులకు అమ్మమ్మ, నానమ్మలుగా ప్రమోషన్లు వచ్చేస్తుంటాయి. అలాంటిది ఒకే ఇంట్లో తల్లి కూతుళ్లు ఇద్దరూ ఒకేసారి తల్లికావడం అంటే మాములు వింత కాదు కదా ఇది. అస్సలు ఇదెలా సాధ్యం అని అనుకోకండి. ఈ అద్భుతమైన ఘటన ఇటలీలోని నేపుల్స్లోని కారద్రాల్లి ఆస్పత్రిలో జరిగింది. అక్కడ ఆ తల్లి మారా బారోన్, కూతురు పాలోలకు ఈ అరుదైన సందర్భం ఎందురైంది. నిజానికి మారా బారోన్కి 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడే కూతురు పాలా జన్మించింది. అయితే ఆ సమయంలో ఆమె గర్భస్రావం చేయించుకోవడానికి బదులుగా గర్భాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది. విచిత్రం ఏంటంటే మారా మళ్లీ తల్లి అయ్యిన అదే రోజున ప్రస్తుతం 21 ఏళ్ల వయసున్న తన కూతురు కూడా తల్లి అయ్యింది. వారిద్దరు ఒకరోజున బిడ్డలకు జన్మనిచ్చారు. మారా 3.8 కిలోల బరువున్న 'Futura' అనే పాపకు జన్మనివ్వగా, కూతురు పోలాకి 3.4 కిలోల బరువున్న 'Giovanni' అనే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక తల్లి మారా జీవశాస్త్రవేత్త, ఆమెకు ఇది రెండో ప్రసవం. ఆస్పత్రి గైనకాలజీ విభాగం డైరెక్టర్ సైతం ఈ సంఘటనను ఒక అద్భుతం కంటే తక్కువ కాదని అభివర్ణించారు. తల్లీ కూతుళ్లిద్దరికీ సాధారణ ప్రసవాలే జరగాయని అన్నారు. ప్రస్తుతం ఇద్దరు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని చెప్పారు వైద్యులు. సాధారణంగా ఒక కొత్త బిడ్డ రాకతోనే కుటుంబం ఆనందంతో మునిగిపోతుంది. అలాంటిది ఇద్దరు నవజాత శిశువుల రాకతో ఆ కుటుంబానికి ఇది పండుగ వాతావరణంలా మారిపోయింది.(చదవండి: గ్యాస్ కొరతకు..వంటగది వ్యర్థాలతో చెక్!) -
గ్యాస్ కొరతకు..వంటగది వ్యర్థాలతో చెక్!
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన తాజా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇండియాలో ఎల్పీజీ (LPG) సరఫరా,నిల్వలపై ప్రభావం పడింది. విదేశాల నుంచి ఎల్పీజీ సరఫరా నిలిపివేతతో భారతదేశంలో సంక్షోభం తలెత్తింది. దాంతో గృహ అవసరాలకే కాక హోటళ్లు, అన్నదాన కార్యక్రమాలు వంటి పలు వాటిపై ఈ గ్యాస్ కొరత ప్రభావం మాములుగా లేదు. అంతేగాదు దీనికి ప్రత్యామ్నాయం ఏంటీ అని సర్వతా ఒకటే చర్చ. సాక్షాత్తు దేశ రాజధాని ఢిల్లీ సైతం బ్యాన్ చేసిన కట్టెల పొయ్యిలను తిరిగి వినియోగించుకోమని ఆదేశించడం చూస్తేనే తెలుస్తోంది సంక్షోభం ఏ స్థాయిలో ఉందనేది. ఈ క్రమంలో దీనికి ప్రత్యామ్నాయాన్ని చూపిస్తూ..సరికొత్త ఆశను రేకెత్తించారు పూణెకి చెందిన ఇంజనీర్ ప్రియదర్శన్ సహస్రబుద్ధే. అది కూడా వంటింటి వ్యర్థాలతోనే ఈ ఎల్పీజీ గ్యాజ్ సమస్యకు పరిష్కారం చూపించాడు.పూణేకు చెందిన ఇంజనీర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే పూర్వ విద్యార్థి ఈ ఎల్పీజీ గ్యాస్ కొరతకు తన ఇంటి కోసం కనిపెట్టిన ఆవిష్కరణతోనే మార్గం చూపాడు. ఆయన కొన్నాళ్ల క్రితం కుటుంబ వ్యాపారం చేస్తున్నప్పుడు భోజనం తర్వాత ఎంతలా ఆహారం వృధా అవుతుందో గమనించాడు. ఆ వ్యర్థాలను ఎలా తగ్గించాలి అని ఆలోచిస్తూ..పలు కంపోస్టింగ్ ప్రయోగాలు చేశాడు. కానీ పరిష్కారం దొరకలేదు. కానీ వాటిని తిరిగి మనకు శక్తిమంతంగా ఎలా ఉపయోగించుకోవచ్చు అనే దిశగా జీవ ఇంధనాల శాస్త్రంపై పరిశోధనలు చేయడం ప్రారంభించాడు. అప్పుడే తెలుసుకున్నాడు వంటశాలలో ఉత్పత్తి అయిన సేంద్రీయ వ్యర్థాలను బ్యాక్టీరియా ద్వారా విచ్ఛిన్నం చేసి మీథేన్ వాయువుని ఉత్పత్తి చేయొచ్చని. ఇది వంట కోసం ఉపయోగించే శుభ్రమైన ఇంధనం. పైగా వ్యర్థాలను పొంగిపొర్లుతున్న పల్లపు ప్రాంతాలకు పంపే బదులు గృహాలకు శక్తిగా మారిస్తే..ఆ ఆలోచనే 2017లో 'వాయు' అనే సాధారణ గృహాల కోసం రూపొందించిన కాంపాక్ట్ దేశీయ బయోగ్యాస్ ప్లాంట్గా రూపుదిద్దుకుంది. ఈ వ్యవస్థ వాయురహిత జీర్ణక్రియ అని పిలువబడే సహజ ప్రక్రియ ద్వారా సేంద్రీయ వంటగది వ్యర్థాలను మీథేన్గా మారుస్తుంది. ఇలా ఉత్పత్తి అయిన వాయువు నేరుగా స్టవ్కు పైపుల ద్వారా పంపొచ్చు. మిగిలిపోయిన వేస్ట్ని ఎరువుగా ఉపయోగించొచ్చు. ఈ ప్రయోగం ముందగా సహస్రబుద్దే తన ఇంట్లోనే ప్రారంభించాడు. ప్రతిరోజు సేకరించిన ఆహార వ్యర్థాలను ఉపయోగించి దాదాపు 800 లీటర్ల బయోగ్యాస్ను ఉత్పత్తి చేయడం ప్రారంభించాడు. ఇది అతని ఇంటి వంట అవసరాలకు సరిపోయింది. అంతేగాదు ఎల్పీజీ సిలిండర్లపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించింది కూడా. తన చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాసులకు కూడా దీనిపై అవగాహన కల్పించి..వాళ్లు కూడా ఈ మార్గంలో పయనించేలా చేశాడు. ఆ తర్వాత తన వినూత్న స్టార్టప్ సాయంతో నాసిక్, హైదరాబాద్, ఔరంగాబాద్తో సహా వివిధ నగరాల్లో వందకు పైగా యూనిట్లను స్థాపించారు. ఇవి ప్రతిరోజూ దాదాపు రెండు టన్నుల ఆహార వ్యర్థాలను ప్రాసెస్ చేయగలవు. ఇక్కడ ఈ ఇంజనీర్ వ్యర్థాలను పారేసివిగా కాకుండా వినియోగించుకునే విలువైన వనరుగా ఎలా వాడాలో తెలియజేశాడు. ఓ పక్క వ్యర్థాల సమస్యకు చెక్పెట్టాడు, అలాగే ఎల్పీజీ గ్యాస్పై ఆధారపడకుండా స్వచ్ఛమైన మీథేన్ వాయువుని పొందేలా చేశాడు. పర్యావరణానికి హితంగా, వంటిల్లు పరిశుభ్రంగా ఉంచే గొప్ప పరిష్కారం కదూ ఇది..!.(చదవండి: ఆస్కార్ రెడ్ కార్పెట్పై మెరిసిన భారత డిజైనర్ వేర్లు, ఆభరణాలు..!) -
ప్రపంచంలోనే అత్యంత చల్లని నగరం..
ప్రకృతి కొన్ని ప్రదేశాలను అత్యంత శాంతంగా సృష్టిస్తుంది. అక్కడ కాలం కొంచెం నెమ్మదిగా ప్రయాణిస్తున్నట్టు అనిపిస్తుంది. మైనస్ 40 డిగ్రీలలోనూ విస్తరించి, ప్రపంచంలోనే అత్యంత చల్లని నగరంగా పేరొందింది. రష్యాలో ఉన్న యాకుట్స్క్ అనే పేరుగల నగరం ఓ ప్రత్యేక ప్రపంచంలా కనువిందు చేస్తుంది.సైబీరియా ప్రాంతంలో లేనా నదీ తీరం దగ్గర ఉన్న యాకుట్స్క్ ది ప్రపంచ పటంలోనే ఒక ప్రత్యేక స్థానం. మంచు నేలపై భానుని కిరణాలు పడి, ఆకాశం నుంచి రాలిన వెలుగుల తారలా మార్చి ్ర΄ారంభంలో యాకుట్స్క్ కనువిందు చేస్తుంది. నట్టనడి వేసవిలో భూమి పచ్చని రంగులోకి మారి΄ోతుంది. ఈ రెండు కాలాల్లోనూ యాకుట్స్క్ ఒక ప్రత్యేక ప్రకృతి కథనాన్ని చూపిస్తుంది.సైబీరియా ప్రభాత దృశ్యంమార్చి, ఏప్రిల్ నెలలో ఉషోదయ సమయాన ఒక మనోహరమైన దృశ్యాన్ని వీక్షించవచ్చు. లేనా నది దగ్గర కనిపించే ప్రశాంతమైన పర్వతాలు, సుదూరంలో కనిపించే చెట్లు ఈ నగరానికి ఒక కొత్త రంగును అద్దుతాయి.కోల్డెస్ట్ సిటీ.. విశేషాలు ఇవీ..మైనస్ 40 డిగ్రీలు: యాకుట్స్క్ ప్రపంచంలోనే అత్యంత చల్లని నగరాల్లో ఒకటి. చలికాలంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు –40 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతాయి.శాశ్వత భవనాలు: నగరం మొత్తం పెర్మాఫ్రోస్ట్ (శాశ్వతంగా ఉండేలా) పై నిర్మించబడింది. అందుకే భవనాలను దృఢమైన పిల్లర్లపై నిర్మిస్తారు.డైమండ్స్కు ప్రసిద్ధి: యాకుట్స్క్ పరిసర ప్రాంతాలు డైమండ్స్కు ప్రసిద్ధి. ప్రపంచంలో ఎక్కువ డైమండ్స్ లభించే ప్రాంతాల్లో ఇది ఒకటి.కార్లు ఆఫ్ చేయరు: వింటర్లో కార్ల ఇంజిన్ ఆఫ్ చేస్తే ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే చాలాసార్లు ఇంజిన్ను ఆన్లోనే ఉంచుతారు.ఎక్స్ట్రీమ్ సీజన్స్ చలికాలంలో తీవ్ర చలిగా ఉండగా, సమ్మర్లో ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల వరకు పెరుగుతాయి.కష్టమైనా.. ఇష్టంగా!యాకుట్స్క్ ప్రజలు ప్రకృతితో కలిసి జీవించేలా తమ లైఫ్స్టైల్ను రూపొందించుకున్నారు. గ్రామాల వీధుల్లో చిన్న మార్కెట్లు, సంప్రదాయ ఇళ్లు, ఉదయం సమయంలో కనిపించే కదలికలు ఇక్కడి నగర సంస్కృతిని తెలియజేస్తాయి. స్థానిక సంస్కృతిలో యాకుట్స్క్ సంప్రదాయ పరంపర, నృత్యం, కళలు ఈ ప్రాంత చరిత్రను ప్రతిబింబిస్తాయి.సందర్శనీయ స్థలాలెన్నో! యాకుట్స్క్ ప్రయాణంలో మామ్మోత్ మ్యూజియం అనేది యాకుట్స్క్కు చెందిన ఒక ప్రత్యేక చరిత్ర కథను చూపిస్తుంది. సైబీరియా భూమిలో కనిపించే, అంతరించిన ్ర΄ాచీన జీవుల అవశేషాలు ఇక్కడ ప్రదర్శనలో ఉంటాయి.లేనా నదీ ఎంబార్క్మెంట్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తూ చాలా మంది ఈ నగర రిథమ్ను అర్థం చేసుకుంటారు.కొంచెం దూరంలో ఉన్న లేనా పిల్లర్స్ నేచర్ ΄ార్క్ అనేది ప్రకృతి సృష్టించిన విశాల శిలా స్తంభాలతో అద్భుతంగా కనిపిస్తుంది.అలాగే కింగ్డమ్ ఆఫ్ పెర్మాఫ్రోస్ట్ అనేది యాకుట్స్క్లో మంచు గుహల మధ్య కళాకృతులు కనిపిస్తాయి.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి ముందుగా ఢిల్లీ లేదా దుబాయ్కు చేరుకుని అక్కడి నుంచి మాస్కో వరకు విమానంలో వెళ్లాలి. మాస్కో నుంచి విమానంలో యాకుట్స్క్ చేరుకోవచ్చు.ఎక్కడ ఉండాలి?యాకుట్స్క్లో చిన్న హోటల్స్తో పాటు ట్రెడిషనల్ గెస్ట్ హౌసులు కూడా ఉంటాయి. లేనా నది దగ్గర ఉండే ప్రదేశాల్లో బస చేస్తే ఉదయం దృశ్యాలను ఆస్వాదించే అవకాశం ఉంటుంది.ఏమి తినాలి?ఇక్కడి లోకల్ ఫుడ్లో సైబీరియన్ రుచులు కనిపిస్తాయి. చేపలతో చేసే వంటలు, సూప్స్, సంప్రదాయ బ్రెడ్స్ స్థానిక భోజన సంస్కృతిని తెలియజేస్తాయి. లేనా నది తీరంలో మార్నింగ్ వాక్ చేయడం, మమ్మోత్ మ్యూజియం సందర్శించడం, లేనా పిల్లర్స్ దగ్గర ప్రకృతి శిల్పాలను చూడడం వంటి అనుభవాలు ఈ ప్రయాణాన్ని ప్రత్యేకంగా మారుస్తాయి. యాకుట్స్క్ ట్రిప్ అనేది ఒక సుదూరమైన ప్రదేశానికి వెళ్లడం మాత్రమే కాదు. ఇది ప్రకృతి, మనిషి జీవితానికి మధ్య జరిగే ఒక అందమైన అనుభవం. మార్చి హిమ వెలుగుల నుంచి వేసవి పచ్చని రంగుల వరకు ఈ నగరం కొంగొత్త దృశ్యాలను కనువిందు చేస్తుంది.– ఎం.జి.కిశోర్, పర్యాటకుడు (చదవండి: ఒకేసారి బిడ్డలకు జన్మనిచ్చిన తల్లీకూతుళ్లు) -
ఆస్కార్ రెడ్ కార్పెట్పై మెరిసిన భారత డిజైనర్ వేర్లు, ఆభరణాలు..!
సినిమా ప్రపంచంలో ప్రతిష్టాత్మక భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ప్రతిష్టాత్మకమైన వేడుకలో హాలీవుడ్ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు పాలుపంచుకుంటారు. అయితే ఈసారి జరిగిన ఆస్కార్ వేడుకలో రెడ్కార్పెట్పై మన భారతీయ ఢిజైనర్వేర్, ఆభరణాలు తళుక్కుమనడం విశేషం. హాలీవుడ్ ప్రముఖులు మన దిగ్గజ ఫ్యాషన్ డిజైనర్లు రూపొందిచిన దుస్తులు, ఆభరణాలను ధరించి ఈ వేడకలో కనిపించడం అత్యంత హైలెట్గా నిలిచింది. మన భారతీయ ష్యాషన్ శైలిని ధరించిన ఆ ప్రముఖులు ఎవరంటే..ప్రముఖ బ్రిటిష్-అమెరికన్ ఫ్యాషన్ జర్నలిస్ట్, స్టైలిస్ట్,జన్నా రాబర్ట్స్ రాస్సీ ఈ ఆస్కార్ వేడుకలో అబుజాని, సందీప్ ఖోస్లా రూపొందించిన కోచర్ని ధరించారు. భారతీయ వస్త్ర నైపుణ్యానికి ప్రతీకగా నిలిచే కోచర్లో కనిపించారామె. ఈ కోచర్ని వేలాది బగల్ పూసలు, రాళ్ళు, స్ఫటికాలతో ఎంబ్రాయిడరీ చేసిన విలాసవంతమైన క్రాప్ టాప్. సిల్క్ బ్రోకేడ్ కాన్వాస్పై ఈ డిజైన్ని రూపొందించారు. దీన్ని డిజైన్ చేయడానికి దారాలను కట్టి రంగులు వేసే సాంప్రదయా సాంకేతికతతో రూపొందిస్తారు. ఇది ఏకంగా రెండు వేల గంటలు శ్రమతో చేసిన చేతి ఎంబ్రాయిడరీ బ్లౌజ్.జాంబియన్ పచ్చ వజ్రంఅంతర్జాతీయ మోడల్, బ్యూటీ ఎంటర్ప్రెన్యూర్ ప్రీతికా స్వరూప్ ఈ వేడుకలో అద్భుతమైన భారతీయ నెక్లెస్తో మెరిశారు. ఆమె భారతీయ ఆభరణాల నైపుణ్యాన్ని వ్యక్తరిచేలా ఆస్కార్ రెడ్కార్పెట్పై తళుక్కుమన్నారు. జిప్ మాదిరి నెక్లైన్తో మధ్యలో జాంబియన్ పచ్చ వజ్రం ఆ నెక్లస్ని హైలెట్గా కనిపించేలా చేసింది. ఈ ఆభరణానికి రూపొందించడానికి దాదాపు 160 గంటల శ్రమతో చేతితో రూపొందిస్తారట.తెలంగాణ హస్తకళాకారులు రూపొందించిన..బ్రాందీ కార్లైల్ బంగారం, వజ్రాలతో చేతితో రూపొందించిన ప్రిజం బ్రూచ్ను ధరించారు. బ్రూచ్ ఓపెన్-సెట్టింగ్ టెక్నిక్ ద్వారా అమర్చబడిన పావ్-సెట్ వజ్రాలతో డిజైన్ చేశారు. ఇది రాళ్ల ద్వారా కాంతి స్వేచ్ఛగా కదలడానికి వీలు కల్పిస్తోంది. దీన్ని తెలంగాణలోని నిపుణులైన స్వర్ణ హస్తకళాకారులు సుమారు 100 గంటలు శ్రమింది డిజైన్ చేస్తారట. ఈ వజ్రాల నెక్లెస్ మన భారతదేశ హస్త కళా వారసత్వ నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం.(చదవండి: ఆస్కార్ ఫుడ్ మెనూ..! 600 పిజ్జాలు, 24-క్యారెట్ల 'ద్రవ బంగారం..) -
పంచాంగము (2026–2027)
స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయనం, వసంతఋతువు, చైత్రమాసంతేది/మాసం శుభసమయం 19/03 సా.05:00 ∙బ.అమావాస్య గురు ఘ.02:14, ఉ.గం.7:04, చైత్ర శుద్ధ పాడ్యమి ఘ.57:12, తె.గం.5:56. ఉత్తరాభాద్ర రా.తె.గం.5:11. శుక్లం రా.గం.2:20. నాగవం ఉ.గం.7:04. కింస్తుఘ్నం సా.గం.6:30. అహస్సు ఘ.29:52. వర్జ్యం ప.గం.3:09ల 4:43వ. అమృ రా.గం.12:30ల 2:04వ. భు.ఘ.0:32:55. మ.దు.2:56ల 3:44వ. ఉగాది.20/03 ఉ.10:35 శు.విదియ శుక్ర ఘ.55:29, తె.గం.4:21, రేవతి రా.గం.4:19. బ్రహ్మం రా.గం.12:00. బాల సా.గం.5:35. అహస్సు ఘ.29:54. వర్జ్యం ప.గం.4:43ల 6:16వ. అమృ రా.గం.2:00ల 3:30వ. భు.ఘ.00:40:54. ఉ.దు.8:42ల 9:30వ. మ.దు.12:32ల 1:20వ.21/03 ఉ.10:35 శు.తదియ శని ఘ.50:35, రా.గం.2:22, అశ్విని రా.తె.గం.3:03. ఐంద్రం రా.గం.9:15. తైతుల ప.గం.3:21. అహస్సు ఘ.29:56. వర్జ్యం రా.గం.11:15ల 12:45వ. అమృ రా.గం.8:13ల 9:44వ. భు.ఘ.00:48:54. ఉ.దు.6:08ల 7:44వ. సౌభాగ్య గౌరీవ్రతం, శివడోలోత్సవం22/03 ఉ.07:30 శు.చవితి ఆది ఘ.45:12, రా.గం.12:12, భరణి రా.గం.1:37. వైధృతి సా.గం.6:24. వనిక్ ప.గం.1:18. అహస్సు ఘ.29:59. వర్జ్యం ప.గం.12:04ల 1:34వ. అమృ రా.గం.9:07ల 10:37వ. భు.ఘ.00:48:53. సా.దు.4:31ల 5:19వ. గణేశచతుర్థీ (గణేశపూజ)23/03 ప.08:30 శు.పంచమి సోమ ఘ.39:23, రా.గం.9:52, కృత్తిక రా.గం.12:00. విష్కంభం ప.గం.3:23. బవ ప.గం.11:12. అహస్సు ఘ.30:02. వర్జ్యం ప.గం.12:49ల 2:18వ. అమృ రా.తె.గం.9:46ల 11:16వ. భు.ఘ.1:4:51. ప.దు.12:08ల 12:56వ. పునః ప.2:56ల 3:44వ. నాగపూజ, శ్వేతవరాహకల్పం, శ్రీపంచమీ(లక్ష్మీపూజ)24/03 సా.05:50 శు.షష్ఠి మంగళ ఘ.33:24, రా.గం.7:28 రోహిణి రా.గం.10:19. ప్రీతి ప.గం.12:17. కౌలవ ఉ.గం.8:39. అహస్సు ఘ.30:04. వర్జ్యం ప.గం.2:52ల 4:21వ. పునః రా.గం.3:31ల 5:00వ. అమృ రా.గం.7:20ల 8:50. భు.ఘ.1:12:50. ఉ.దు.8:28ల 9:16వ. రా.దు.10:53ల 11:42వ.25/03 ఉ.09:30 శు.సప్తమి బుధ ఘ.27:13, సా.గం.4:59, మృగశిర రా.గం.8:36. ఆయుష్మాన్ ఉ.గం.9:07. సౌభాగ్యం రా.తె.గం.6:00. వనిక్ సా.గం.4:59. అహస్సు ఘ.30:06. వర్జ్యం రా.తె.గం.4:28ల 5:58వ. అమృ ప.గం.12:26ల 1:56వ. భు.ఘ.1:20:49. మ.దు.11:48ల 12:37వ. 26/03 ప.12:10 శు.అష్టమి గురు ఘ.21:37, ప.గం.2:44, ఆర్ద్ర రా.గం.7:05. శోభ రా.గం.3:04. బవ ప.గం.2:44. అహస్సు ఘ.30:08. వర్జ్యం లేదు. అమ ఉ.గం.9:43ల 11:13వ. భు.ఘ.1:28:48. ఉ.దు.10:07ల 10:56వ. మ.దు.2:58ల 3:47వ. భవానీయాత్ర, అశోకరుద్రపూజ27/03 ప.02:30 శు.నవమి శుక్ర ఘ.16:13, ప.గం.12:33, పునర్వసు సా.గం.5:41. అతిగండ రా.గం.12:16. కౌలవ ప.గం.12:33. అహస్సు ఘ.30:10. వర్జ్యం ఉ.గం.6:22ల 7:52వ. పునః రా.1:18ల 2:49వ. అమృ ప.గం.3:26ల 4:56వ. భు.ఘ.1:36:47. ఉ.దు.8:30ల 9:19వ. మ.దు.12:32ల 1:21వ. శ్రీరామనవమి28/03 ప.01:15 శు.దశమి శని ఘ.11:26, ప.గం.10:37, పుష్యమి సా.గం.4:33. సుకర్మ రా.గం.9:41. గరజి ప.గం.10:37. అహస్సు ఘ.30:12. వర్జ్యం తె.గం.4:55ల 6:02వ. అమృ ప.గం.10:27ల 11:58వ. భు.ఘ.1:44:46. ఉ.దు.6:03ల 7:30వ.29/03 సా.06:20 శు.ఏకాదశి ఆది ఘ.7:21, ఉ.గం.8:58, ఆశ్లేష ప.గం.3:43. ధతి రా.గం.7:22. భద్ర ఉ.గం.8:58. అహస్సు ఘ.30:15. శేష వర్జ్యం ఉ.గం.6:02ల 6:28వ. పునః రా.గం.3:30ల 5:04వ. అమృ ప.గం.2:10ల 3:43వ. భు.ఘ.1:52:45. సా.దు.4:30ల 5:18వ. 30/03 సా.06:15 శు.ద్వాదశి సోమ ఘ.4:18, ఉ.గం.7:44, మఘ ప.గం.3:17. శూల రా.గం.5:43. బాలవ ఉ.గం.7:44. అహస్సు ఘ.30:18. వర్జ్యం రా.గం.11:17ల 12:53. అమృ ప.గం.12:55ల 2:29వ. భు.ఘ.2:00:44. ప.దు.12:29ల 1:18వ. పునః ప.2:55ల 3:44వ.31/03 ప.12:00 శు.త్రయోదశి మంగళ ఘ.2:12, ఉ.గం.6:53, పుబ్బ ప.గం.3:17. గండ ప.గం.3:46. తైతుల ఉ.గం.6:53. అహస్సు ఘ.30:20. వర్జ్యం రా.గం.10:38ల 12:16వ. అమృ ఉ.గం.8:52ల 10:28వ. భు.ఘ.2:8:43. ఉ.దు.8:25ల 9:14వ. రా.దు.10:53ల 11:32వ. 01/04 ఉ.07:10 శు.చతుర్దశి బుధ ఘ.1:23, ఉ.గం.6:33, ఉత్తర సా.గం.3:47. వృద్ధి ప.గం.2:55. వనిక్ ఉ.గం.6:33. అహస్సు ఘ.30:22. వర్జ్యం రా.గం.12:56ల 2:36వ. అమృ ఉ.గం.8:26ల 10:04వ. భు.ఘ.2:16:42. మ.దు.11:39ల 12:28. 02/04 ఉ.09:15 ఝ శు.పౌర్ణమి గురు ఘ.2:14, ఉ.గం.6:53, హస్త సా.గం.4:46. ధ్రువం ప.గం.1:41. బవ ఉ.గం.6:53. అహస్సు ఘ.30:24. వర్జ్యం రా.గం.1:15ల 2:57వ. అమృ ఉ.గం.10:31ల 12:11వ. భు.ఘ.2:24:41. ఉ.దు.10:01ల 10:50వ. మ.దు.2:54ల 3:43వ. 03/04 ప.03:00 బహుళ పాడ్యమి శుక్ర ఘ.3:32, ఉ.గం.7:24. చిత్త సా.గం.6:15. వ్యాఘాతం ప.గం.1:17. కౌలవ ఉ.గం.7:24. అహస్సు ఘ.30:27. వర్జ్యం రా.గం.12:18ల 2:02వ. అమృ ప.గం.11:27ల 1:09. భు.ఘ.2:32:40. ఉ.దు.8:23ల 9:12వ. మ.దు.12:27ల 1:16వ.04/04 ఉ.11:00 బ.విదియ శని ఘ.6:45, ఉ.గం.8:40. స్వాతి రా.గం.8:10. హర్షణం ప.గం.1:11. గరజి ఉ.గం.8:40. అహస్సు ఘ.30:30. వర్జ్యం రా.గం.2:18ల 4:03వ. అమృ ఉ.గం.10:40ల 12:24వ. భు.ఘ.2:40:39. ఉ.దు.5:58ల 7:36వ.05/04 ఉ.9:30 బ.తదియ ఆది ఘ.10:24, ప.గం.10:07. విశాఖ రా.గం.10:26. వజ్రం ప.గం.1:25. విష్టి ప.గం.10:07. అహస్సు ఘ.30:32. వర్జ్యం రా.గం.2:52ల 4:38వ. అమృ ప.గం.12:48ల 2:33వ. భు.ఘ.2:48:38. సా.దు.4:32ల 5:21వ. సంకటహర చతుర్థి06/04 సా.07:00 బ.చవితి సోమ ఘ.15:12, ప.గం.12:01. అనురాధ రా.గం.12:58. సిద్ధి ప.గం.1:51. బాలవ ప.గం.12:01. అహస్సు ఘ.30:34. వర్జ్యం లేదు. అమృ ప.గం.1:28ల 3:14వ. భు.ఘ.2:56:37. ప.దు.12:26ల 1:16వ. పునః 2:54ల 3:44వ.07/04 సా.05:15 బ.పంచమి మంగళ ఘ.20:24, ప.గం.2:05. జ్యేష్ఠ రా.గం.3:37. వ్యతీపాత ప.గం.2:27. తైతుల ప.గం.2:05. అహస్సు ఘ.30:37. వర్జ్యం ఉ.గం.7:11ల 8:57వ. అమృ సా.గం.5:50ల 7:36వ. భు.ఘ.3:4:36. ఉ.దు.8:21ల 9:11వ. రా.దు.10:51ల 11:41వ. మత్స్యజయంతీ08/04 ఉ.07:00 బ.షష్ఠి బుధ ఘ.25:37, ప.గం.4:09. మూల పూర్తి. వరీయాన్ ప.గం.3:03. వనిక్ ప.గం.4:09. అహస్సు ఘ.30:40. వర్జ్యం ప.గం.12:26ల 2:12వ. పునః తె.గం.5:20ల 5:53వ. అమృ రా.గం.11:03ల 12:49. భు.ఘ.3:12:35. మ.దు.11:37ల 12:27వ. 09/04 సా.05:00 బ.సప్తమి గురు ఘ.30:23, సా.గం.6:02. మూల ఉ.గం.6:06. పరిఘ ప.గం.3:30. బవ సా.గం.6:02. అహస్సు ఘ.30:42. వర్జ్యం శేషం ఉ.గం.5:53ల 6:06వ. పునః సా.3:38ల 5:23వ. అమృ రా.తె.గం.3:09ల 4:54వ. భు.ఘ.3:20:34. ఉ.దు.9:57ల 10:47వ. మ.దు.2:53ల 3:43వ.10/04 రా.08:30 బ.అష్టమి శుక్ర ఘ.34:28, రా.గం.7:39. పూర్వాషాఢ ఉ.గం.8:24. శివం ప.గం.3:44. బాలవ ఉ.గం.6:50. అహస్సు ఘ.30:45. వర్జ్యం సా.గం.5:03ల 6:47వ. అమృ రా.తె.గం.3:25ల 5:09వ. భు.ఘ.3:28:33. ఉ.దు.8:18ల 9:08వ. మ.దు.12:25ల 1:15వ.11/04 ప.11:15 బ.నవమి శని ఘ.37:22, రా.గం.8:48. ఉత్తరాషాఢ ఉ.గం.10:19. సిద్ధం సా.గం.3:43. తైతుల ఉ.గం.8:13. అహస్సు ఘ.30:48. వర్జ్యం ప.గం.2:34ల 3:16వ. అమృ రా.గం.12:46ల 2:28వ. భు.ఘ.3:36:32. ఉ.దు.5:50ల 7:30వ.12/04 ప.11:15 బ.దశమి ఆది ఘ.39:04, రా.గం.9:28. శ్రవణం ప.గం.11:48. సాధ్యం ప.గం.3:14. వనిక్ ఉ.గం.9:07. అహస్సు ఘ.30:51. వర్జ్యం ప.గం.3:58ల 5:38వ. అమృ రా.గం.1:59ల 3:39వ. భు.ఘ.3:44:31. సా.దు.4:31ల 5:21వ.13/04 సా.07:00 బ.ఏకాదశి సోమ ఘ.39:35, రా.గం.9:39. ధనిష్ఠ ప.గం.12:49. శుభం ప.గం.2:26. విష్టి ఉ.గం.9:33. అహస్సు ఘ.30:54. వర్జ్యం రా.గం.8:09ల 9:47వ. భు.ఘ.3:52:30. ప.దు.12:25ల 1:15వ. పునః 12:53ల 3:43వ. 14/04 సా.05:15 బ.ద్వాదశి మంగళ ఘ.38:49, రా.గం.9:21. శతభిషం ప.గం.1:19. శుక్లం ప.గం.1:13. కౌలవ ఉ.గం.9:30. అహస్సు ఘ.30:56. వర్జ్యం రా.గం.7:43ల 9:19వ. అమృ ఉ.గం.5:58ల 7:36వ. భు.ఘ.4:0:29. పు.భు.4:2. ఉ.దు.8:18ల 9:07వ. రా.దు.10:49ల 11:39వ. అశ్వి 1 రవిః ప.11:49 మేష సంక్రమణం15/04 సా.04:30 బ.త్రయోదశి బుధ ఘ.36:41, రా.గం.8:28. పూర్వాభాద్ర ప.గం.1:19. బ్రహ్మం ప.గం.11:35. గరజి ఉ.గం.8:54. అహస్సు ఘ.30:58. వర్జ్యం రా.గం.10:46ల 12:20వ. అమృ ఉ.గం.5:48ల 7:20వ. భు.ఘ.00:6:22. మ.దు.11:35ల 12:25వ. వరాహజయంతీ, మాసశివరాత్రి నిశీధి వారికి16/04 సా.05:10 బ.చతుర్దశి గురు ఘ.33:37, రా.గం.7:14. ఉత్తరాభాద్ర ప.గం.12:55. ఐంద్రం ప.గం.11:37. విష్టి ఉ.గం.7:51. అహస్సు ఘ.31:00. వర్జ్యం రా.గం.12:30ల 2:02వ. అమృ ఉ.గం. 8:11ల 9:45వ. భు.ఘ.0:14:52. ఉ.దు.9:55ల 10:45వ. మ.దు.2:53ల 3:43వ. మాస శివరాత్రి (ధర్మశాం) ప్రదోషం వారికి, శివసన్నిధిస్నానం17/04 రా.08:30 ∙బ.అమావాస్య శుక్ర ఘ.28:28, సా.గం.5:21. రేవతి ప.గం.12:05. వైధతి ఉ.7:19. విష్కంభం తె.గం.4:49. నాగవం సా.గం.5:21. అహస్సు ఘ.31:3. వర్జ్యం లేదు. ఉ.గం.9:46ల 11:19. పునః అమృ తె.గం.4:06ల 5:38వ. భు.ఘ.000:23:22. ఉ.దు.8:15ల 9:05వ. మ.దు.12:24ల 1:14వ. కూర్మకల్పం, తర్పణాలకు అమావాస్య స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయనం, వసంతఋతువు, వైశాఖమాసం18/04 ప.11:00 శుద్ధ పాడ్యమి శని ఘ.24:39, సా.గం.3:38. అశ్విని ప.గం.10:58. ప్రీతి రా.గం.2:01. బవ సా.గం.3:38. అహస్సు ఘ.31:06. వర్జ్యం ఉ.గం.7:09ల 8:40. పునః రా.7:56ల 9:26వ. అమృ తె.గం.4:55ల 5:46వ. భు.ఘ.00:31:52. ఉ.దు.5:46ల 7:26వ. చంద్రదర్శనం (నెలపొడుపు), ధర్మఘటాదిదానం19/04 ఉ.09:30 శు.విదియ ఆది ఘ.19:15, ప.గం.1:27. భరణి ఉ.గం.9:23. ఆయుష్మాన్ రా.గం.11:01. కౌలవ ప.గం.1:27. అహస్సు ఘ.31:8. వర్జ్యం రా.గం.8:43ల 10:13వ. అమృ శేషం ఉ.గం.5:45ల 6:25వ. భు.ఘ.00:40:22. సా.దు.4:35ల 5:25వ.20/04 సా.07:00 శు.తదియ సోమ ఘ.13:25, ప.గం.11:06. కృత్తిక ఉ.గం.8:00. సౌభాగ్యం రా.గం.7:57. గరజి ప.గం.11:06. అహస్సు ఘ.31:10. వర్జ్యం రా.గం.10:53ల 12:22. అమృ ఉ.గం.5:51ల 7:21వ. పునరమ రా.తె.3:21ల 4:50వ. భు.ఘ.00:48:52. ప.దు.12:24ల 1:14వ. పునః ప.2:53ల 3:43వ. అక్షయతృతీయ, గౌరీపూజ21/04 ఉ.10:30 శు.చవితి మంగళ ఘ.7:22, ఉ.గం.8:41. రోహిణి ఉ.గం.6:22. మృగశిర తె.గం.4:40. శోభ సా.గం.4:52. భద్ర ఉ.గం.8:41. అహస్సు ఘ.31:12. వర్జ్యం ప.గం.11:34ల 1:03వ. అమృ రా.గం.8:29ల 9:58వ. భు.ఘ.00:57:22. ఉ.దు.8:13ల 9:03వ. రా.దు.10:49ల 11:39వ. శంకర జయంతి, నాగచతుర్థీ22/04 ఉ.09:45 శు.పంచమి బుధ ఘ.01:17, ఉ.గం.6:14. షష్ఠి ఘ.54:00, తె.గం.3:50. ఆర్ద్ర రా.తె.గం.3:02. అతిగండ ప.గం.1:47. బాలవ ఉ.గం.6:14. కౌలవ సా.గం.5:02. అహస్సు ఘ.31:14. వర్జ్యం ప.గం.12:29ల 1:58వ. అమృ సా.గం.5:42ల 7:11వ. భు.ఘ.1:5:52. మ.దు.11:43ల 12:33వ.23/04 సా.05:00 శు.సప్తమి గురు ఘ.49:50, రా.గం.1:39. పునర్వసు రా.గం.1:37. సుకర్మ ప.గం.10:50. గరజి సా.గం.4:38. అహస్సు ఘ.31:16. వర్జ్యం ప.గం.2:20ల 3:50వ. అమృ రా.గం.11:22ల 12:52వ. భు.ఘ.1:14:22. ఉ.దు.9:52ల 10:42వ. మ.దు.2:53ల 3:43వ. విద్యారణ్య జయంతి, గంగోత్పత్తి 24/04 ప.02:15 శు.అష్టమి శుక్ర ఘ.44:56, రా.గం.11:41. పుష్యమి రా.గం.12:23. ధృతి ఉ.గం.7:59. శూల తె.గం.5:15. విష్టి ప.గం.12:39. అహస్సు ఘ.31:18. వర్జ్యం ప.గం.9:12ల 10:42వ. అమృ రా.గం.6:19ల 7:49వ. భు.ఘ.1:22:52. ఉ.దు.8:12ల 9:02వ. మ.దు.12:23ల 1:13వ. అపరాజితాదేవీపూజ25/04 ప.11:00 శు.నవమి శని ఘ.40:56, రా.గం.10:03. ఆశ్లేష రా.గం.11:30. గండ రా.గం.2:55. బాలవ ప.గం.10:51. అహస్సు ఘ.31:20. వర్జ్యం ప.గం.12:43ల 2:16వ. అమృ రా.గం.9:58ల 11:30వ. భు.ఘ.1:31:22. ఉ.దు.5:41ల 7:31వ. 26/04 ప.11:30 శు.దశమి ఆది ఘ.37:39, రా.గం.8:45. మఘ రా.గం.10:57. వృద్ధి రా.గం.1:14. తైతుల ఉ.గం.9:24. అహస్సు ఘ.31:22. వర్జ్యం ప.గం.11:14ల 12:48వ. అమృ రా.గం.8:36ల 10:10వ. భు.ఘ.1:39:52. సా.దు.4:34ల 5:24వ. 27/04 సా.07:00 శు.ఏకాదశి సోమ ఘ.35:37, రా.గం.7:55. పుబ్బ రా.గం.10:53. ధ్రువం రా.గం.11:23. వనిక్ ఉ.గం.8:19. అహస్సు ఘ.31:25. వర్జ్యం ఉ.గం.6:56ల 8:32వ. అమృ సా.గం.4:32ల 6:08వ. భు.ఘ.1:48:22. ప.దు.12:23ల 1:13వ. పునః ప.2:54ల 3:44వ. అన్నవరం సత్యదేవ కళ్యాణం, మతత్రయ (మోహినీ) ఏకాదశి28/04 సా.05:10 శు.ద్వాదశి మంగళ ఘ.34:37, రా.గం.7:31. ఉత్తర రా.గం.11:14. వ్యాఘాతం రా.గం.9:45. బవ ఉ.గం.7:43. అహస్సు ఘ.31:28. వర్జ్యం ఉ.గం.6:11ల 7:48వ. అమృ ప.గం.3:56ల 5:33వ. భు.ఘ.1:56:52. ఉ.దు.8:10ల 09:00వ. రా.దు.10:49ల 11:30వ. పరశురామద్వాదశీ29/04 సా.04:20 శు.త్రయోదశి బుధ ఘ.35:02, రా.గం.7:40. హస్త రా.గం.12:08. హర్షణం రా.గం.9:01. కౌలవ ఉ.గం.7:35. అహస్సు ఘ.31:30. వర్జ్యం ఉ.గం.7:56ల 9:36వ. అమృ సా.గం.5:54ల 7:34వ. భు.ఘ.2:5:22. మ.దు.11:31ల 12:21వ.30/04 సా.05:00 శు.చతుర్దశి గురు ఘ.36:35, రా.గం.8:16. చిత్త రా.గం.1:28. వజ్రం రా.గం.8:30. గరజి ఉ.గం.8:03. అహస్సు ఘ.31:32. వర్జ్యం ఉ.గం.8:34ల 10:15వ. అమృ సా.గం.6:42ల 8:23వ. భు.ఘ.2:13:52. ఉ.దు.9:51ల 10:41వ. మ.దు.2:54ల 3:44వ. 01/05 ప.02:15 ఝ శు.పౌర్ణమి శుక్ర ఘ.39:28, రా.గం.9:25. స్వాతి రా.గం.3:20. సిద్ధి రా.గం.8:25. విష్టి ఉ.గం.8:50. అహస్సు ఘ.31:34. వర్జ్యం ఉ.గం.7:30ల 9:14వ. అమృ సా.గం.5:51ల 7:35వ. భు.ఘ.2:22:22. ఉ.దు.8:10ల 9:00వ. మ.దు.12:23ల 1:13వ. 02/05 సా.06:30 బహుళ పాడ్యమి శని ఘ.43:18, రా.గం.10:56. విశాఖ రా.తె.గం.5:32. వ్యతీపాత రా.గం.8:47. బాలవ ఉ.గం.10:10. అహస్సు ఘ.31:36. వర్జ్యం ప.గం.9:26ల 11:11వ. అమృ రా.గం.7:55ల 9:40వ. భు.ఘ.2:30:52. ఉ.దు.5:37ల 7:18వ.03/05 రా.07:00 బ.విదియ ఆది ఘ.48:01, రా.గం.12:49. అనురాధ పూర్తి. వరీయాన్ రా.గం.9:04. తైతుల ప.గం.11:53. అహస్సు ఘ.31:38. వర్జ్యం ఉ.గం.9:57ల 11:43వ. అమృ రా.గం.8:34ల 10:20వ. భు.ఘ.2:39:22. సా.దు.4:35ల 5:25వ.04/05 రా.07:00 బ.తదియ సోమ ఘ.53:06, రా.గం.2:50. అనురాధ ఉ.గం.8:04. పరిఘ రా.గం.9:38. వనిక్ ప.గం.8:17. అహస్సు ఘ.31:40. వర్జ్యం ప.గం.2:16ల 4:02వ. అమృ రా.గం.12:55ల 2:41వ. భు.ఘ.2:47:52. ప.దు.12:22ల 1:12వ. పునః 2:54ల 3:44వ. 05/05 ఉ.10:30 బ.చవితి మంగళ ఘ.58:17, తె.గం.4:55. జ్యేష్ఠ ప.గం.10:41. శివం రా.గం.10:24. బవ ప.గం.3:52. అహస్సు ఘ.31:42. వర్జ్యం రా.గం.7:33ల 9:19వ. భు.ఘ.2:56:22. ఉ.దు.8:08ల 8:58వ. రా.దు.10:49ల 11:39వ. సంకటహర చతుర్థి06/05 ఉ.09:30 బ.పంచమి బుధ పూర్తి. మూల ప.గం.1:15. సిద్ధం రా.గం.10:51. కౌలవ రా.గం.6:31. అహస్సు ఘ.31:44. వర్జ్యం ప.గం.11:29ల 1:15వ. పునః రా.గం.11:48ల 1:34వ. అమృ ఉ.గం.6:10ల 7:56వ. భు.ఘ.3:4:52. మ.దు.11:32ల 12:22వ.07/05 సా.05:00 బ.పంచమి గురు ఘ.2:55, ఉ.గం.6:45. పూర్వాషాఢ ప.గం.3:37. సాధ్యం రా.గం.11:11. తైతుల ఉ.గం.6:45. అహస్సు ఘ.31:46. వర్జ్యం రా.గం.12:18ల 2:02వ. అమృ ఉ.గం.10:21ల 12:07వ. భు.ఘ.3:13:22. ఉ.దు.9:49ల 10:39వ. మ.దు.2:55ల 3:45వ.08/05 సా.05:40 బ.షష్ఠి శుక్ర ఘ.6:49, ఉ.గం.8:18. ఉత్తరాషాఢ సా.గం.5:39. శుభం రా.గం.11:15. వనిక్ ఉ.గం.8:18. అహస్సు ఘ.31:48. వర్జ్యం రా.గం.9:55ల 11:37వ. అమృ ప.గం.10:42ల 12:26వ. భు.ఘ.3:21:52. ఉ.దు.8:07ల 8:57వ. మ.దు.12:21ల 1:11వ.09/05 ప.11:30 బ.సప్తమి శని ఘ.9:43, ఉ.గం.9:27. శ్రవణం రా.గం.7:16. శుక్లం రా.గం.10:56. బవ ఉ.గం.9:27. అహస్సు ఘ.31:50. వర్జ్యం రా.గం.11:27ల 1:08వ. అమృ ఉ.గం.8:11ల 9:53వ. భు.ఘ.3:30:22. ఉ.దు.5:34ల 7:15వ.10/05 ప.03:00 బ.అష్టమి ఆది ఘ.11:22, ఉ.గం.10:07. ధనిష్ఠ రా.గం.8:24. బ్రహ్మం రా.గం.10:16. కౌలవ ఉ.గం.10:07. అహస్సు ఘ.31:52. వర్జ్యం రా.తె.గం.3:45ల 5:23వ. అమృ ఉ.గం.9:30ల 11:11వ. భు.ఘ.3:38:52. దు.4:36ల 5:26వ. 11/05 రా.07:00 బ.నవమి సోమ ఘ.11:48, ఉ.గం.10:14. శతభిషం రా.గం.9:00. ఐంద్రం రా.గం.9:08. గరజి ఉ.గం.10:14. అహస్సు ఘ.31:54. వర్జ్యం రా.గం.3:26ల 5:03వ. అమృ ప.గం.1:37ల 3:15వ. భు.ఘ.3:47:22. ప.దు.12:22ల 1:13వ. పునః 2:55ల 3:46. చణ్డికాదేవీపూజ, హనుమజ్జయంతీ మధ్యాహ్న వ్యాప్తి ప్రధానం12/05 ప.12:00 బ.దశమి మంగళ ఘ.11:16, ప.గం.10:03. పూర్వాభాద్ర రా.గం.9:09. వైధృతి రా.గం.7:39. విష్టి ఉ.గం.10:03. అహస్సు ఘ.31:56. వర్జ్యం లేదు. అమృ ప.గం.1:06ల 2:43వ. భు.ఘ.3:55:52. ఉ.దు.8:06ల 8:57వ. రా.దు.10:49ల 11:40వ.13/05 ప.04:15 బ.ఏకాదశి బుధ ఘ.8:52, ఉ.గం.9:05. ఉత్తరాభాద్ర రా.గం.8:48. విష్కంభం సా.గం.5:45. బాలవ ఉ.గం.9:05. అహస్సు ఘ.31:58. వర్జ్యం ఉ.గం.6:36ల 8:11వ. అమృ సా.గం.4:04ల 5:39వ. భు.ఘ.4:4:22. మ.దు.11:31ల 12:22వ. 14/05 సా.06:00 బ.ద్వాదశి గురు ఘ.5:40, ఉ.గం.7:48. రేవతి రా.గం.8:05. ప్రీతి సా.గ.3:34. తైతుల ఉ.గం.7:48. అహస్సు ఘ.32:00. వర్జ్యం ఉ.గం.8:26ల 9:59వ. అమృ సా.గం.5:48ల 7:18వ. భు.ఘ.4:12:52. ఉ.దు.09:48ల 10:39వ. మ.దు.2:55ల 3:46వ.15/05 రా.09:00 బ.త్రయోదశి శుక్ర ఘ.1:32, ఉ.గం.6:09, చతుర్దశి ఘ.55:28, తె.గం.4:21. అశ్విని రా.గం.7:03. ఆయుష్మాన్ ప.గం.1:06. వనిక్ ఉ.గం.6:09. విష్టి సా.గం.5:15. అహస్సు ఘ.32:00. వర్జ్యం ప.గం.2:51ల 4:23వ. పునః తె.గం.4:06ల 5:36వ. అమృ ప.గం.12:09ల 1:41వ. భు.ఘ.4:21:22. పు.భు.4:23. ఉ.దు..9:05ల 8:56వ. మ.దు.12:21ల 1:12వ. కత్తి 2 వషభే రవిః ఉ.9:59 మాసశివరాత్రి, వృషభ సంక్రమణం16/05 ప.02:15 ∙బ.అమావాస్య శని ఘ.51:53, రా.గం.2:17. భరణి సా.గం.5:41. సౌభాగ్యం ప.గం.10:24. చతుష్పాత్ సా.గం.3:19. అహస్సు ఘ.32:02. వర్జ్యం రా.తె.గం.4:56ల 5:32వ. అమృ ప.గం.1:09ల 2:39వ. భు.ఘ.00:07:50. ఉ.దు.5:32ల 7:14వ. తర్పణాలకు అమావాస్య స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయనం, గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం,17/05 సా.03:00 శుద్ధ పాడ్యమి ఆది ఘ.45:22, రా.గం.11:41. కృత్తిక సా.గం.4:10. శోభ ఉ.గం.7:30. అతిగండ తె.గం.4:31. కింస్తుఘ్నం ప.గం.12:59. అహస్సు ఘ.32:04. వర్జ్యం శేషం ఉ.గం.5:32ల 6:26వ. అమృ ప.గం.1:56ల 3:26వ. భు.ఘ.00:17:27. సా.దు.4:39ల 5:30వ. యాగకాలం18/05 రా.07:00 శు.విదియ సోమ ఘ.39:13, రా.గం.9:12. రోహిణి ప.గం.2:31. సుకర్మ రా.గం.1:25. బాలవ ప.గం.10:26. అహస్సు ఘ.32:6. వర్జ్యం ఉ.గం.7:04ల 8:34వ. పునః రా.7:45ల 9:14వ. అమృ ప.గం.11:33ల 1:02వ. పునరమ తె.గం.4:41ల 5:31వ. భు.ఘ.0:28:04. ప.దు.12:21ల 1:12వ. పునః ప.2:56ల 3:47వ. చంద్రదర్శనం 19/05 సా.05:15 శు.తదియ మంగళ ఘ.33:04, రా.గం.6:45. మృగశిర ప.12:51. ధృతి రా.గం.10:20. తైతుల ఉ.గం.7:58. అహస్సు ఘ.32:08. వర్జ్యం రా.గం.8:41ల 10:10వ. అమృ శేషం ఉ.గం.5:31ల 6:10వ. పునరమ రా.1:55ల 3:25వ. భు.ఘ.0:37:41. దు.8:04ల 8:55వ. రా.దు.10:49ల 11:44వ.20/05 సా.04:20 శు.చవితి బుధ ఘ.27:10, సా.గం.4:22. ఆర్ద్ర ప.గం.11:14. శూల రా.గం.7:21. భద్ర సా.గం.4:22. అహస్సు ఘ.32:10. వర్జ్యం రా.గం.10:30ల 12:00వ. భు.ఘ.0:47:18. మ.దు.11:31ల 12:22వ.21/05 రా.08:30 శు.పంచమి గురు ఘ.21:36, ప.గం.2:08. పునర్వసు ఉ.గం.9:45. గండ సా.గం.4:30. బాలవ ప.గం.2:08. అహస్సు ఘ.32:10. వర్జ్యం సా.గం.5:20ల 6:50వ. అమృ ఉ.గం.7:30ల 9:00వ. పునరమ రా.2:27ల 3:57వ. భు.ఘ.0:56:55. ఉ.దు.9:48ల 10:39వ. మ.దు.2:57ల 3:48వ.22/05 ఉ.07:15 శు.షష్ఠి శుక్ర ఘ.16:42, ప.గం.12:11. పుష్యమి ఉ.గం.8:31. వృద్ధి ప.గం.1:53. తైతుల ప.గం.12:11. అహస్సు ఘ.32:12. వర్జ్యం రా.గం.8:48ల 10:20వ. భు.ఘ.1:6:32. ఉ.దు.8:05ల 8:56వ. మ.దు.12:22ల 1:13వ.23/05 ప.11:15 శు.సప్తమి శని ఘ.12:28, ప.గం.10:29. ఆశ్లేష ఉ.గం.7:32. ధ్రువం ప.గం.11:18. వనిక్ ప.గం.10:29. అహస్సు ఘ.32:14. వర్జ్యం రా.గం.7:14ల 8:48వ. అమృ ఉ.గం.6:00ల 7:32వ. పునరమ తె.4:34ల 5:30వ. భు.ఘ.1:16:9. ఉ.దు.5:30ల 7:13వ.24/05 ప.11:15 శు.అష్టమి ఆది ఘ.9:09, ఉ.గం.9:10. మఘ ఉ.గం.6:55. వ్యాఘాతం ఉ.గం.9:42. బవ ప.గం.9:10. అహస్సు ఘ.32:14. వర్జ్యం ప.గం.2:51ల 4:26వ. అమృ శేషం ఉ.గం.5:30ల 6:08వ. పునరమ రా.గం.12:22ల 1:57వ. భు.ఘ.1:25:46. సా.దు.4:41ల 5:32వ. 25/05 ప.11:15 శు.నవమి సోమ ఘ.6:56, ఉ.గం.8:16. పుబ్బ ఉ.గం.6:44. హర్షణం ఉ.గం.7:38. కౌలవ ఉ.గం.8:16. అహస్సు ఘ.32:16. వర్జ్యం ప.గం.2:00ల 3:37వ. అమృ రా.గం.11:43ల 1:20వ. భు.ఘ.1:35:23. ప.దు.12:22ల 1:14వ. పునః 2:57ల 3:49వ.26/05 సా.06:00 శు.దశమి మంగళ ఘ.5:53, ఉ.గం.7:50. ఉత్తర ఉ.గం.6:59. వజ్రం ఉ.గం.5:36. సిద్ధం తె.గం.4:34. గరజి ఉ.గం.7:50. అహస్సు ఘ.32:18. వర్జ్యం ప.గం.10:37ల 12:16వ. అమృ రా.గం.1:31ల 3:10వ. భు.ఘ.1:45:00. ఉ.దు.8:04ల 8:56వ. రా.దు.10:50ల 11:42వ.27/05 ఉ.07:00 శు.ఏకాదశి బుధ ఘ.5:54, ఉ.గం.7:51. హస్త ఉ.గం.7:41. వ్యతీపాత తె.గం.4:31. భద్ర ఉ.గం.7:51. అహస్సు ఘ.32:18. వర్జ్యం సా.గం.4:08ల 5:49వ. అమృ రా.గం.2:13ల 3:54. భు.ఘ.1:54:37. మ.దు.11:31ల 12:43వ. 28/05 సా.06:00 శు.ద్వాదశి గురు ఘ.7:35, ఉ.గం.8:31. చిత్త ఉ.గం.9:02. వరీయాన్ తె.గం.4:29. బాలవ ఉ.గం.8:31. అహస్సు ఘ.32:20. వర్జ్యం ప.గం.3:02ల 4:45వ. అమృ రా.గం.1:20ల 3:03వ. భు.ఘ.2:4:14. ఉ.దు.9:48ల 10:40వ. మ.దు.2:59ల 3:51వ.29/05 ప.02:30 శు.త్రయోదశి శుక్ర ఘ.10:17, ఉ.గం.9:36. స్వాతి ఉ.గం.10:46. పరిఘ తె.గం.4:37. తైతుల ఉ.గం.9:36. అహస్సు ఘ.32:22. వర్జ్యం సా.గం.4:52ల 6:36. అమృ రా.గం.3:18ల 5:02. భు.ఘ.2:13:51. ఉ.దు.8:04ల 8:56వ. మ.దు.12:23ల 1:15వ.30/05 రా.08:00 శు.చతుర్దశి శని ఘ.14:02, ప.గం.11:06. విశాఖ ప.గం.12:55. శివం తె.గం.5:07. వనిక్ ప.గం.11:06. అహస్సు ఘ.32:22. వర్జ్యం సా.గం.5:19ల 7:05వ. అమృ తె.గం.3:53ల 5:28వ. భు.ఘ.2:23:28. ఉ.దు.5:29ల 7:13వ. 31/05 రా.06:15 ఝ శు.పౌర్ణమి ఆది ఘ.18:31, ప.గం.12:52. అనురాధ ప.గం.3:19. సిద్ధం పూర్తి. బవ ప.గం.12:52. అహస్సు ఘ.32:24. వర్జ్యం రా.గం.9:32ల 11:18వ. అమృ శేషం ఉ.గం.5:28ల 5:39వ. భు.ఘ.2:33:5. సా.దు.4:43ల 5:35వ.01/06 సా.07:00 బహుళ పాడ్యమి సోమ ఘ.23:31, ప.గం.2:52. జ్యేష్ఠ సా.గం.5:56. సిద్ధం ఉ.గం.5:45. కౌలవ ప.గం.2:52. అహస్సు ఘ.32:24. వర్జ్యం రా.గం.2:48ల 4:34. అమృ ఉ.గం.8:10ల 9:51. భు.ఘ.2:42:42. ప.దు.12:27ల 1:15వ. పునః 2:59ల 3:51వ. యాగకాలం02/06 సా.06:00 బ.విదియ మంగళ ఘ.28:39, సా.గం.4:56. మూల రా.గం.8:33. సాధ్యం ఉ.గం.6:24. గరజి సా.గం.4:56. అహస్సు ఘ.32:26. వర్జ్యం రా.గం.6:47ల 8:33వ. పునః రా.తె.3:08ల 4:54వ. అమృ ప.గం.1:27ల 3:13వ. భు.ఘ.2:52:19. ఉ.దు.8:04ల 8:56వ. రా.దు.10:51ల 11:43వ.03/06 సా.04:00 బ.తదియ బుధ ఘ.33:14, రా.గం.6:46. పూర్వాషాఢ రా.గం.10:59. శుభం ఉ.గం.7:00. వనిక్ ఉ.గం.5:50. అహస్సు ఘ.32:26. వర్జ్యం లేదు. అమృ ప.గం.11:42ల 1:28వ. భు.ఘ.3:1:56. మ.దు.11:32ల 12:24వ.04/06 సా.06:00 బ.చవితి గురు ఘ.37:08, రా.గం.8:19. ఉత్తరాషాఢ రా.గం.1:07. శుక్లం ఉ.గం.7:26. బాలవ ఉ.గం.7:32. అహస్సు ఘ.32:28. వర్జ్యం ఉ.గం.7:42ల 9:26వ. అమృ సా.గం.6:09ల 7:55వ. భు.ఘ.3:11:33. ఉ.దు.9:48ల 10:40వ. మ.దు.2:59ల 3:51వ. సంకటహర చతుర్థి05/06 సా.05:30 బ.పంచమి శుక్ర ఘ.40:01, రా.గం.9:28. శ్రవణం రా.గం.2:51. బ్రహ్మం ఉ.గం.7:34. కౌలవ ఉ.గం.8:54. అహస్సు ఘ.32:28. వర్జ్యం ఉ.గం.5:24ల 7:07వ. అమృ ప.గం.3:42ల 5:25వ. భు.ఘ.3:21:10. ఉ.దు.8:04ల 8:56వ. మ.దు.12:24ల 1:16వ.06/06 సా.06:00 బ.షష్ఠి శని ఘ.41:46, రా.గం.10:10. ధనిష్ఠ రా.తె.గం.4:09. ఐంద్రం ఉ.గం.7:22. గరజి ఉ.గం.9:49. అహస్సు ఘ.32:30. వర్జ్యం ఉ.గం.7:04ల 8:45వ. అమృ సా.గం.5:11ల 6:52వ. భు.ఘ.3:30:47. ఉ.దు.5:28ల 7:12వ.07/06 సా.06:00 బ.సప్తమి ఆది ఘ.42:06, రా.గం.10:18. శతభిషం రా.తె.గం.4:51. వైధృతి ఉ.గం.6:48. విష్టి ఉ.గం.10:14. అహస్సు ఘ.32:30. వర్జ్యం ప.గం.11:34ల 1:12వ. అమృ రా.గం.9:26ల 11:05వ. భు.ఘ.3:40:24. సా.దు.4:44ల 5:36వ.08/06 సా.06:00 బ.అష్టమి సోమ ఘ.41:17, రా.గం.9:59. పూర్వాభాద్ర తె.గం.5:08. విష్కంభం ఉ.గం.5:48. ప్రీతి తె.గం.4:41. బాలవ ఉ.గం.10:09. అహస్సు ఘ.32:30. వర్జ్యం ప.గం.11:08ల 12:45వ. అమృ రా.గం.9:02ల 10:39వ. భు.ఘ.3:50:1. ప.దు.12:24ల 1:16వ. పునః 3:01ల 3:53వ.09/06 సా.05:00 బ.నవమి మంగళ ఘ.39:8, రా.గం.9:07. ఉత్తరాభాద్ర తె.గం.4:51. ఆయుష్మాన్ రా.గం.2:41. తైతుల ఉ.గం.9:33. అహస్సు ఘ.32:32. వర్జ్యం ప.గం.2:37ల 4:12వ. అమృ రా.గం.12:06ల 1:41వ. భు.ఘ.3:59:38. ఉ.దు.8:04ల 8:56వ. రా.దు.10:53ల 11:45వ.10/06 సా.07:00 బ.దశమి బుధ ఘ.36:00, రా.గం.7:52. రేవతి తె.గం.4:14. సౌభాగ్యం రా.గం.12:34. వనిక్ ఉ.గం.8:30. అహస్సు ఘ.32:32. వర్జ్యం సా.గం.4:33ల 6:07వ. అమృ రా.గం.1:53ల 3:28వ. భు.ఘ.4:9:15. మ.దు.11:33ల 12:25వ.11/06 రా.06:00 బ.ఏకాదశి గురు ఘ.31:51, సా.గం.6:12. అశ్విని రా.తె.గం.3:12. శోభ రా.గం.10:06. బాలవ సా.గం.6:12. అహస్సు ఘ.32:34. వర్జ్యం రా.గం.11:22ల 12:54వ. అమృ రా.గం.8:18ల 10:50వ. భు.ఘ.4:18:52. ఋ ఉ.దు.9:49ల 10:41వ. మ.దు.3:01ల 3:53వ. మతత్రయ (పురుషోత్తమ) ఏకాదశి12/06 సా.05:40 బ.ద్వాదశి శుక్ర ఘ.26:59, ప.గం.4:16. భరణి రా.గం.1:56. అతిగండ రా.గం.7:28. తైతుల ప.గం.4:16. అహస్సు ఘ.32:34. వర్జ్యం ప.గం.12:09ల 1:39వ. అమృ రా.గం.9:07ల 10:36వ. భు.ఘ.4:28:29. ఉ.దు.8:04ల 8:56వ. మ.దు.12:25ల 1:17వ.13/06 సా.06:00 బ.త్రయోదశి శని ఘ.21:29, ప.గం.2:04. కృత్తిక రా.గం.12:24. సుకర్మ సా.గం.4:36. వనిక్ ప.గం.2:04. అహస్సు ఘ.32:34. వర్జ్యం ప.గం.1:10ల 2:39వ. అమృ రా.గం.10:10ల 11:40వ. భు.ఘ.4:38:6. ఉ.దు.5:28ల 7:12వ. మాసశివరాత్రి14/06 సా.06:00 బ.చతుర్దశి ఆది ఘ.15:42, ప.గం.11:46. రోహిణి ప.గం.10:49. ధృతి ప.గం.1:39. శుభం ప.గం.11:46. అహస్సు ఘ.32:34. వర్జ్యం సా.గం.3:21ల 4:50వ. పునః తె.4:01ల 5:30వ. అమృ రా.గం.7:50ల 9:19వ. భు.ఘ.4:47:43. సా.దు.4:46ల 5:38వ. తర్పణాలకు అమావాస్య15/06 ప.11:00 ∙బ.అమావాస్య సోమ ఘ.9:30, ఉ.గం.9:17. మృగశిర రా.9:09. శూల ఉ.గం.10:37. నాగవం ఉ.గం.9:17. అహస్సు ఘ.32:36. వర్జ్యం తె.గం.4:58ల 5:29వ. అమృ ప.గం.12:57ల 2:26వ. భు.ఘ.4:57:20. పు.భు.5:02. ప.దు.12:26ల 1:18వ. పునః 3:03ల 3:55వ. మృగ 3 రవిః రా.8:00 ప్రవేశాత్ పూర్వతః మిథున సంక్రమణం ప.దు.12:27ల 1:19వ. పునః ప.3:04ల 3:56వ. శుక్లాదేవీపూజ23/06 సా.05:00 శు.నవమి మంగళ ఘ.35:10, రా.గం.7:34. హస్త సా.గం.3:27. వరీయాన్ ప.గం.2:10. బాలవ ఉ.గం.7:35. అహస్సు ఘ.32:38. వర్జ్యం రా.గం.11:50ల 1:31వ. అమృ ఉ.గం.9:18ల 10:56వ. భు.ఘ.1:17:20. ఉ.దు.8:07ల 8:59వ. రా.దు.10:56ల 11:48వ. బ్రాహ్మణీదేవీపూజ24/06 సా.05:00 శు.దశమి బుధ ఘ.36:41, రా.గం.8:10. చిత్త సా.గం.4:37. పరిఘ ప.గం.1:33. తైతుల ఉ.గం.7:52. అహస్సు ఘ.32:38. వర్జ్యం రా.గం.10:36ల 12:18వ. అమృ ఉ.గం.9:54ల 11:35వ. భు.ఘ.1:27:46. మ.దు.11:35ల 12:27వ.25/06 సా.06:00 శు.ఏకాదశి గురు ఘ.39:17, రా.గం.9:14. స్వాతి సా.గం.6:15. శివం ప.గం.1:19. వనిక్ ఉ.గం.8:43. అహస్సు ఘ.32:38. వర్జ్యం రా.గం.12:19ల 2:03వ. అమృ ఉ.గం.8:51ల 10:33వ. భు.ఘ.1:38:12. ఉ.దు.9:52ల 10:44వ. మ.దు.3:05ల 3:57వ. మతత్రయ (నిర్జల) ఏకాదశి26/06 రా.09:00 శు.ద్వాదశి శుక్ర ఘ.42:46, రా.గం.10:38. విశాఖ రా.గం.8:18. సిద్ధం ప.గం.1:27. బవ ఉ.గం.9:57. అహస్సు ఘ.32:36. వర్జ్యం రా.గం.12:42ల 2:28వ. అమృ ఉ.గం.10:45ల 12:28వ. భు.ఘ.1:48:38. ఉ.దు.8:09ల 9:01వ. మ.దు.12:29ల 1:21వ. రామలక్ష్మణద్వాదశీ27/06 ప.02:00 శు.త్రయోదశి శని ఘ.47:17, రా.గం.12:27. అనురాధ రా.గం.10:42. సాధ్యం ప.గం.1:50. కౌలవ ప.గం.11:33. అహస్సు ఘ.32:36. వర్జ్యం తె.గం.4:37ల 5:32వ. అమృ ప.గం.12:15ల 2:01వ. భు.ఘ.1:59:4. ఉ.దు.5:32ల 7:16వ.28/06 ప.02:00 శు.చతుర్దశి ఆది ఘ.52:18, రా.గం.2:27. జ్యేష్ఠ రా.గం.1:17. శుభం ప.గం.2:26. గరజి ప.గం.1:27. అహస్సు ఘ.32:36. వర్జ్యం శేషం గం.5:32ల 6:19వ. అమృ ప.గం.2:46ల 4:28వ. భు.ఘ.2:9:30. సా.దు.4:49ల 5:41వ.29/06 ప.11:00 ఝ శు.పౌర్ణమి సోమ ఘ.57:23, రా.గం.4:29. మూల రా.గం.3:56. శుక్లం ప.గం.3:07. విష్టి సా.గం.3:28. అహస్సు ఘ.32:36. వర్జ్యం ఉ.గం.10:10ల 11:56వ. పునః రా.తె.2:10ల 3:56వ. అమృ రా.గం.8:50ల 10:36వ. భు.ఘ.2:19:56. ప.దు.12:29ల 1:21వ. పునః 3:06ల 3:58వ. 30/06 ప.12:00 బహుళ పాడ్యమి మంగళ పూర్తి. పూర్వాషాఢ పూర్తి. బ్రహ్మం ప.గం.3:46. బాలవ సా.గం.5:23. అహస్సు ఘ.32:36. వర్జ్యం ప.గం.2:31ల 4:17వ. అమృ రా.గం.1:05ల 2:51వ. భు.ఘ.2:30:22. ఉ.దు.8:09ల 9:01వ. రా.దు.10:57ల 11:49వ.01/07 ఉ.09:00 బ.పాడ్యమి బుధ ఘ.1:54, ఉ.గం.6:18. పూర్వాషాఢ ఉ.గం.6:22. ఐంద్రం ప.గం.4:14. కౌలవ ఉ.గం.6:18. అహస్సు ఘ.32:36. వర్జ్యం ప.గం.3:08ల 4:53వ. అమృ రా.గం.1:39ల 3:25వ. భు.ఘ.2:40:48. మ.దు.11:37ల 12:29వ.02/07 ఉ.10:45 బ.విదియ గురు ఘ.5:51, ఉ.గం.7:52. ఉత్తరాషాఢ ఉ.గం.8:39. వైధృతి ప.గం.4:26. గరజి ఉ.గం.7:52. అహస్సు ఘ.32:34. వర్జ్యం ప.గం.12:56ల 2:39వ. అమృ రా.గం.11:14ల 12:57వ. భు.ఘ.2:51:14. ఉ.దు.9:54ల 10:46వ. మ.దు.3:06ల 3:58వ.03/07 ప.02:00 బ.తదియ శుక్ర ఘ.8:44, ఉ.గం.9:02. శ్రవణం ప.గం.10:22. విష్కంభం ప.గం.4:18. భద్ర ఉ.గం.9:02. అహస్సు ఘ.32:34. వర్జ్యం ప.గం.2:36ల 4:17వ. అమృ రా.గం.12:44ల 2:25వ. భు.ఘ.3:1:40. ఉ.దు.8:09ల 9:01వ. మ.దు.12:30ల 1:22వ. సంకటహర చతుర్థి04/07 ప.02:00 బ.చవితి శని ఘ.10:30, ఉ.గం.9:45. ధనిష్ఠ ప.గం.11:45. ప్రీతి ప.గం.3:48. బాలవ ఉ.గం.9:45. అహస్సు ఘ.32:34. వర్జ్యం రా.గం.7:12ల 8:51వ. అమృ తె.గం.5:08ల 5:33వ. భు.ఘ.3:12:6. ఉ.దు.5:38ల 7:11వ. 05/07 ప.11:00 బ.పంచమి ఆది ఘ.10:55, ఉ.గం.9:55. శతభిషం ప.గం.12:35. ఆయుష్మాన్ ప.గం.2:53. తైతుల ఉ.గం.9:55. అహస్సు ఘ.32:34. వర్జ్యం సా.గం.7:05ల 8:42వ. అమృ ఉ.గం.5:33ల 6:47వ. పునరమ తె.గం.4:49ల 5:33వ. భు.ఘ.3:22:32. సా.దు.4:50ల 5:42వ.06/07 సా.06:00 బ.షష్ఠి సోమ ఘ.10:08, ఉ.గం.9:37. పూర్వాభాద్ర ప.గం.12:57. సౌభాగ్యం ప.గం.1:27. వనిక్ ఉ.గం.9:37. అహస్సు ఘ.32:32. వర్జ్యం రా.గం.10:29ల 12:04వ. అమృ ఉ.గం.5:33ల 6:26వ. భు.ఘ.3:32:58. ప.దు.12:30ల 1:22వ. పునః 3:07ల 3:59వ.07/07 సా.05:00 బ.సప్తమి మంగళ ఘ.7:59, ఉ.గం.8:46. ఉత్తరాభాద్ర ప.గం.12:46. శోభ ప.గం.11:50. బవ ఉ.గం.8:46. అహస్సు ఘ.32:32. వర్జ్యం రా.గం.12:31ల 2:05వ. అమృ ఉ.గం.8:01ల 9:36వ. భు.ఘ.3:43:24. ఉ.దు.8:10ల 9:02వ. రా.దు.10:59ల 11:51వ. 08/07 సా.04:00 బ.అష్టమి బుధ ఘ.5:03, ఉ.గం.7:35. రేవతి ప.గం.12:16. అతిగండ ప.గం.9:50. కౌలవ ఉ.గం.7:35. అహస్సు ఘ.32:32. వర్జ్యం లేదు. అమృ ఉ.గం.9:55ల 11:29. పునః తె.గం.4:26ల 5:39వ. భు.ఘ.3:53:50. మ.దు.11:38ల 12:30వ.09/07 సా.06:00 బ.నవమి గురు ఘ.1:00, ఉ.గం.5:59. బ.దశమి ఘ.55:17, తె.గం.4:06. అశ్విని ప.గం.11:23. సుకర్మ ఉ.గం.7:30. ధృతి తె.గం.4:58. గరజి ఉ.గం.5:59. వనిక్ సా.గం.5:02. అహస్సు ఘ.32:30. వర్జ్యం ఉ.గం.7:32ల 9:04వ. పునః రా.8:29ల 10:00వ. అమృ శేషం ఉ.గం.5:35ల 5:58వ. భు.ఘ.4:4:16. ఉ.దు.9:55ల 10:47వ. మ.దు.3:07ల 3:59వ.10/07 ఉ.07:30 బ.ఏకాదశి శుక్ర ఘ.50:38, రా.గం.1:50. భరణి ప.గం.10:10. శూల రా.గం.2:06. బవ ప.గం.2:58. అహస్సు 32:30. వర్జ్యం రా.గం.9:26ల 10:56వ. అమృ ఉ.గం.5:36ల 7:06వ. భు.ఘ.4:14:42. ఉ.దు.8:11ల 9:03వ. మ.దు.12:31ల 1:23వ. మతత్రయ యోగినీ ఏకాదశి11/07 సా.06:00 బ.ద్వాదశి శని ఘ.44:45, రా.గం.11:30. కృత్తిక ఉ.గం.8:44. గండ రా.గం.11:08. బాలవ ప.గం.12:40. అహస్సు ఘ.32:28. వర్జ్యం రా.గం.11:42ల 1:12వ. అమృ ఉ.గం.6:24ల 7:54వ. పునరమ తె.4:14ల 5:36వ. భు.ఘ.4:25:8. సా.దు.5:36ల 7:20వ. కూర్మజయంతీ12/07 సా.06:00 బ.త్రయోదశి ఆది ఘ.38:32, రా.గం.9:01. రోహిణి ఉ.గం.7:12. మృగశిర తె.5:32. వృద్ధి రా.గం.8:06. గరజి ఉ.గం.10:15. అహస్సు ఘ.32:28. వర్జ్యం ప.గం.12:24ల 1:53వ. అమృ శేషం ఉ.గం.5:36ల 5:44వ. పునరమ రా.గం.9:20ల 10:49వ. భు.ఘ.4:35:44. సా.దు.4:50ల 5:32వ. మాసశివరాత్రి నిశీధి వారికి13/07 ఉ.07:00 బ.చతుర్దశి సోమ ఘ.32:20, సా.గం.6:32. ఆర్ద్ర రా.తె.గం.3:47. ధవం సా.గం.5:02. శకుని ఉ.గం.7:46. అహస్సు ఘ.32:28. వర్జ్యం ప.గం.1:19ల 2:48వ. అమృ సా.గం.6:31ల 8:01వ. భు.ఘ.4:46:10. ప.దు.12:31ల 1:23వ. పునః 3:07ల 3:59వ. మాసశివరాత్రి ప్రదోషం వారికి14/07 ఉ.10:00 ∙బ.అమావాస్య మంగళ ఘ.25:39, ప.గం.3:52. పునర్వసు రా.గం.2:14. వ్యాఘాతం ప.గం.2:02. నాగవం ప.గం.3:52. అహస్సు ఘ.32:26. వర్జ్యం ప.గం.3:00ల 4:30వ. అమృ రా.గం.11:59ల 1:29వ. భు.ఘ.4:56:36. ఉ.దు.8:12ల 9:04వ. రా.దు.10:59ల 11:51వ. వటసావిత్రీవ్రతం, తర్పణాలకు అమావాస్య స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయనం, 17/07 నుండి దక్షిణాయనం గ్రీష్మఋతువు, ఆషాఢ మాసం15/07 ఉ.07:00 శుద్ధ పాడ్యమి బుధ ఘ.20:39, ప.గం.1:52. పుష్యమి రా.గం.12:50. హర్షణం ప.గం.11:09. బవ ప.గం.1:52. అహస్సు ఘ.32:26. వర్జ్యం ప.గం.9:46ల 11:16. అమృ రా.గం.6:48ల 8:18వ. భు.ఘ.5:7:2. మ.దు.11:39ల 12:31వ.16/07 ఉ.06:00 శు.విదియ గురు ఘ.15:33, ప.గం.11:49. ఆశ్లేష రా.గం.11:42. వజ్రం ఉ.గం.8:26. కౌలవ ప.గం.11:49. అహస్సు ఘ.32:24. వర్జ్యం ప.గం.1:02ల 2:34వ. అమృ రా.గం.10:11ల 11:43వ. భు.ఘ.5:17:28. ఉ.దు.9:55ల 10:47వ. మ.దు.3:06ల 3:58వ. రథోత్సవం17/07 ప.03:00 శు.తదియ శుక్ర ఘ.11:09, ఉ.గం.10:05. మఘ రా.గం.10:57. సిద్ధి ఉ.గం.5:57. వ్యతీపాత తె.గం.3:40. గరజి ఉ.గం.10:05. అహస్సు ఘ.32:22. వర్జ్యం ప.గం.11:20ల 12:53వ. అమృ రా.గం.8:38ల 10:11వ. భు.ఘ.5:27:54. పు.భు.5:30. ఉ.దు.8:12ల 9:04వ. మ.దు.12:31ల 1:23వ. పున 4 రవిః ప.11:53. ప్రవేశాత్ పూర్వతః దక్షిణాయన పుణ్యకాల. కర్కాటక సంక్రమణం18/07 సా.06:00 శు.చవితి శని ఘ.7:39, ఉ.గం.8:41. పుబ్బ రా.గం.10:31. వరీయాన్ రా.గం.1:45. భద్ర ఉ.గం.8:41. అహస్సు ఘ.32:22. వర్జ్యం ఉ.గం.6:49ల 8:23వ. అమృ సా.గం.4:14ల 5:48వ. భు.ఘ.00:7:51. ఉ.దు.5:38ల 7:22వ.19/07 సా.06:00 శు.పంచమి ఆది ఘ.5:12, ఉ.గం.7:43. ఉత్తర రా.గం.10:38. పరిఘ రా.గం.12:19. బాలవ ఉ.గం.7:43. అహస్సు ఘ.32:20. వర్జ్యం ఉ.గం.5:46ల 7:22వ. అమృ సా.గం.3:24ల 5:00వ. భు.ఘ.00:18:22. సా.దు.4:51ల 5:43వ. 20/07 ప.11:10 శు.షష్ఠి సోమ ఘ.3:55, ఉ.గం.7:13. హస్త రా.గం.11:08. శివం రా.గం.11:11. తైతుల ఉ.గం.7:13. అహస్సు ఘ.32:18. వర్జ్యం ఉ.గం.7:13ల 8:51వ. అమృ సా.గం.5:01ల 6:39వ. భు.ఘ.00:28:53. ప.దు.12:32ల 1:24వ. పునః ప.2:59ల 3:51వ. కుమారషష్ఠీ21/07 ప.12:10 శు.సప్తమి మంగళ ఘ.3:49, ఉ.గం.7:11. చిత్త రా.గం.12:11. సిద్ధం రా.గం.10:32. వనిక్ ఉ.గం.7:11. అహస్సు ఘ.32:18. వర్జ్యం ఉ.గం.7:29ల 9:09వ. అమృ సా.గం.5:29ల 7:09వ. భు.ఘ.00:39:24. ఉ.దు.8:14ల 9:06. రా.దు.10:59ల 11:51వ. వివస్వత్సప్తమీ22/07 సా.04:15 శు.అష్టమి బుధ ఘ.5:10, ఉ.గం.7:43. స్వాతి రా.గం.1:42. సాధ్యం రా.గం.10:12. బవ ఉ.గం.7:43. అహస్సు ఘ.32:16. వర్జ్యం ఉ.గం.6:09ల 7:51వ. అమృ సా.గం.5:09ల 6:51వ. భు.ఘ.00:49:55. మ.దు.11:40ల 12:32వ. 23/07 సా.05:00 శు.నవమి గురు ఘ.7:36, ఉ.గం.8:41. విశాఖ రా.తె.గం.3:41. శుభం రా.గం.10:16. కౌలవ ఉ.గం.8:41. అహస్సు ఘ.32:16. వర్జ్యం ఉ.గం.7:41ల 9:25వ. అమృ సా.గం.6:09ల 7:53వ. భు.ఘ.1:00:26. ఉ.దు.9:47ల 10:38వ. మ.దు.3:06ల 3:57వ. ఐంద్రీపూజ, చాక్షుషమన్వాది24/07 ఉ.07:30 శు.దశమి శుక్ర ఘ.11:34, ప.గం.10:17, అనురాధ పూర్తి. శుక్లం రా.గం.10:36. గరజి ప.గం.10:17. అహస్సు ఘ.32:14. వర్జ్యం ఉ.గం.8:04ల 9:50వ. అమృ రా.గం.7:37ల 9:23వ. భు.ఘ.1:10:57. ఉ.దు.8:15ల 9:07వ. మ.దు.12:32ల 1:24వ. మహాలకీ‡్ష్మవ్రతారంభం25/07 ప.10:30 శు.ఏకాదశి శని ఘ.15:36, ప.గం.11:54. అనురాధ ఉ.గం.6:03. బ్రహ్మం రా.గం.11:23. భద్ర ప.గం.11:54. అహస్సు ఘ.32:12. వర్జ్యం ప.గం.12:14ల 2:00వ. అమృ రా.గం.10:51ల 12:37వ. భు.ఘ.1:21:28. ఉ.దు.5:40ల 7:32వ. తొలిఏకాదశీ, మతత్రయ శయన ఏకాదశి, గోపద్మవ్రతారంభ26/07 ప.02:00 శు.ద్వాదశి ఆది ఘ.20:06, ప.గం.1:42. జ్యేష్ఠ ఉ.గం.8:35. ఐంద్రం రా.గం.11:51. బాలవ ప.గం.1:42. అహస్సు ఘ.32:10. వర్జ్యం సా.గం.5:28ల 7:14వ. అమృ రా.తె.గం.4:03ల 5:49వ. భు.ఘ.1:31:59. సా.దు.4:49ల 5:41వ. 27/07 సా.07:00 శు.త్రయోదశి సోమ ఘ.25:30, సా.గం.3:52. మూల ప.గం.11:13. వైధృతి రా.గం.12:30. తైతుల సా.గం.3:52. అహస్సు ఘ.32:10. వర్జ్యం ప.గం.9:27ల 11:13వ. పునః రా.గం.9:49ల 11:35వ. భు.ఘ.1:42:30. ప.దు.12:31ల 1:22వ. పునః3:06ల 3:57వ.28/07 సా.07:00 శు.చతుర్దశి మంగళ ఘ.30:13, సా.గం.5:45. పూర్వాషాఢ ప.గం.1:48. విష్కంభం రా.గం.1:01. వనిక్ సా.గం.5:45. అహస్సు ఘ.32:08. వర్జ్యం రా.గం.10:30ల 12:15వ. అమృ ప.గం.10:02ల 11:48వ. భు.ఘ.1:53:1. ఉ.దు.8:15ల 9:06వ. రా.దు.10:59ల 11:50వ. పవిత్రార్చనం, నోములకు పౌర్ణమి29/07 రా.07:00 ఝ శు.పౌర్ణమి బుధ ఘ.34:13, రా.గం.7:22. ఉత్తరాషాఢ సా.గం.4:01. ప్రీతి రా.గం.1:18. విష్టి ఉ.గం.6:33. అహస్సు ఘ.32:6. వర్జ్యం రా.గం.8:21ల 10:05వ. అమృ ఉ.గం.9:01ల 10:46వ. భు.ఘ.2:3:32. మ.దు.11:40ల 12:31వ. 30/07 రా.08:00 బహుళ పాడ్యమి గురు ఘ.37:18, రా.గం.8:36. శ్రవణం సా.గం.5:56. ఆయుష్మాన్ రా.గం.1:15. బాలవ ఉ.గం.7:59. అహస్సు ఘ.32:4. వర్జ్యం రా.గం.10:11ల 11:53. అమృ ఉ.గం.6:43ల 8:27వ. భు.ఘ.2:14:3. ఉ.దు.9:58ల 10:41వ. మ.దు.3:06ల 3:57వ.31/07 ఉ.07:30 బ.విదియ శుక్ర ఘ.39:05, రా.గం.9:20. ధనిష్ఠ రా.గం.7:24. సౌభాగ్యం రా.గం.1:48. తైతుల ఉ.గం.8:58. అహస్సు ఘ.32:02. వర్జ్యం రా.తె.గం.2:54ల 4:34వ. అమృ ఉ.గం.8:22ల 10:04వ. భు.ఘ.2:24:34. ఉ.దు.8:16ల 9:07వ. మ.దు.12:32ల 1:23వ. చాతుర్మాస్యద్వితీయ01/08 సా.06:00 బ.తదియ శని ఘ.39:44, రా.గం.9:36. శతభిషం రా.గం.8:23. శోభ రా.గం.11:59. వనిక్ ఉ.గం.9:28. అహస్సు ఘ.32:02. వర్జ్యం రా.గం.2:06ల 3:44వ. అమృ ప.గం.12:53ల 2:33వ. భు.ఘ.2:35:5. ఉ.దు.5:42ల 7:24వ.02/08 సా.06:00 బ.చవితి ఆది ఘ.38:55, రా.గం.9:16. పూర్వాభాద్ర రా.గం.8:48. అతిగండ రా.గం.11:40. బవ ఉ.గం.2:06. అహస్సు ఘ.32:00. వర్జ్యం లేదు. అమృ ప.గం.11:52ల 1:30వ. భు.ఘ.2:45:36. సా.దు.4:48ల 5:39వ. సంకటహర చతుర్థి03/08 ప.11:00 బ.పంచమి సోమ ఘ.37:2, రా.గం.8:29. ఉత్తరాభాద్ర రా.గం.8:48. సుకర్మ రా.గం.9:02. కౌలవ ఉ.గం.8:54. అహస్సు ఘ.31:58. వర్జ్యం ఉ.గం.6:24ల 8:00వ. అమృ సా.గం.4:00ల 5:36వ. భు.ఘ.2:56:7. ప.దు.12:31ల 1:22వ. పునః 3:04ల 3:55వ.04/08 ఉ.10:15 బ.షష్ఠి మంగళ ఘ.33:58, రా.గం.7:17. రేవతి రా.గం.8:19. ధృతి రా.గం.7:01. గరజి ఉ.గం.7:54. అహస్సు ఘ.31:56. వర్జ్యం ఉ.గం.8:33ల 10:07వ. అమృ సా.గం.5:58ల 7:32వ. భు.ఘ.3:6:38. ఉ.దు.8:16ల 9:07వ. రా.దు.10:58ల 11:49వ.05/08 ఉ.09:00 బ.సప్తమి బుధ ఘ.30:00, సా.గం.5:42. అశ్విని రా.గం.7:29. శూల ప.గం.5:00. బవ సా.గం.5:42. అహస్సు ఘ.31:54. వర్జ్యం ప.గం.3:37ల 5:10వ. పునః తె.4:36ల 6:07వ. అమృ ప.గం.12:32ల 2:05వ. భు.ఘ.3:17:9. మ.దు.11:40ల 12:31వ.06/08 ఉ.10:45 బ.అష్టమి గురు ఘ.25:11, సా.గం.3:47. భరణి సా.గం.6:19. గండ ప.గం.2:08. కౌలవ సా.గం.3:47. అహస్సు ఘ.31:52. వర్జ్యం తె.గం.5:33ల 5:43వ. అమృ ప.గం.1:45ల 3:16వ. భు.ఘ.3:27:40. ఉ.దు.9:58ల 10:49వ. మ.దు.3:03ల 3:54వ. ధర్మసావర్ణిమన్వాది07/08 రా.08:40 బ.నవమి శుక్ర ఘ.19:47, ప.గం.1:38. కృత్తిక సా.గం.4:47. వృద్ధి ప.గం.11:20. గరజి ప.గం.1:38. అహస్సు ఘ.31:50. వర్జ్యం శేషం ఉ.గం.5:43ల 7:03వ. అమృ ప.గం.2:33ల 4:03వ. భు.ఘ.3:38:11. ఉ.దు.8:16ల 9:07వ. మ.దు.12:30ల 1:21వ.08/08 ప.02:00 బ.దశమి శని ఘ.14:04, ప.గం.11:22. రోహిణి సా.గం.3:21. ధ్రువం ఉ.గం.8:25. వ్యాఘాతం తె.గం.5:19. విష్టి ప.గం.11:22. అహస్సు ఘ.31:48. వర్జ్యం ఉ.గం.7:50ల 9:20వ. పునః రా.8:34ల 10:04వ. అమృ ప.గం.12:21ల 1:51వ. పునరమ తె.5:30ల 5:44వ. భు.ఘ.3:48:42. ఉ.దు.5:44ల 7:26వ.09/08 ప.03:00 బ.ఏకాదశి ఆది ఘ.7:37, ఉ.గం.8:47. మృగశిర ప.గం.1:41. హర్షణం రా.గం.2:20. బాలవ ఉ.గం.8:47. అహస్సు ఘ.31:46. వర్జ్యం రా.గం.9:30ల 11:00వ. అమృ శేషం ఉ.గం.5:44ల 6:59వ. పునరమ రా.2:43ల 4:12వ. భు.ఘ.3:59:13. సా.దు.4:44ల 5:35వ. మతత్రయ కామిక ఏకాదశి10/08 సా.06:00 బ.ద్వాదశి సోమ ఘ.1:36, ఉ.గం.6:22. త్రయోదశి ఘ.53:55. తె.గం.3:56. ఆర్ద్ర ప.గం.12:01. వజ్రం రా.గం.11:15. తైతుల ఉ.గం.6:22. గరజి సా.గం.5:09. అహస్సు ఘ.31:44. వర్జ్యం రా.గం.11:04ల12:34వ. భు.ఘ.4:9:44. ప.దు.12:31ల 1:21వ. పునః 3:02ల 3:52వ.11/08 ఉ.10:30 బ.చతుర్దశి మంగళ ఘ.49:45, రా.గం.1:39. పునర్వసు ప.గం.10:28. సిద్ధి రా.గం.8:19. విష్టి ప.గం.2:48. అహస్సు ఘ.31:42. వర్జ్యం సా.గం.5:59ల 7:29వ. అమృ ఉ.గం.8:13ల 9:43వ. పునరమ రా.తె.3:00ల 4:30వ. భు.ఘ.4:20:15. ఉ.దు.8:17ల 9:07వ. రా.దు.10:57ల 11:47వ. మాసశివరాత్రి12/08 ఉ.09:30 ∙బ.అమావాస్య బుధ ఘ.44:39, రా.గం.11:37. పుష్యమి ఉ.గం.9:01. వ్యతీపాత సా.గం.5:34. చతుష్పాత్ ప.గం.12:38. అహస్సు ఘ.31:40. వర్జ్యం రా.గం.9:12ల 10:43వ. భు.ఘ.4:30:46. మ.దు.11:40ల 12:30వ.స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్షఋతువు, శ్రావణమాసం13/08 ఉ.11:15 శుద్ధ పాడ్యమి గురు ఘ.40:15, రా.గం.9:51. ఆశ్లేష ఉ.గం.7:51. వరీయాన్ ప.గం.3:01. కింస్తుఘ్నం ప.గం.10:44. అహస్సు ఘ.31:38. వర్జ్యం రా.గం.7:24ల 8:56వ. అమృ ఉ.గం.6:20ల 7:51వ. పునరమ తె.4:38ల 5:46వ. భు.ఘ.4:41:17. ఉ.దు.9:59ల 10:49వ. మ.దు.3:02ల 3:52వ. యాగకాలం14/08 ప.02:00 శు.విదియ శుక్ర ఘ.36:45, రా.గం.8:28. మఘ ఉ.గం.6:58. పరిఘ ప.గం.12:45. బాలవ ఉ.గం.9:10. అహస్సు ఘ.31:36. వర్జ్యం ప.గం.2:48ల 4:22వ. అమృ శేషం ఉ.గం.5:46ల 6:10వ. పునరమ రా.12:16ల 1:50వ. భు.ఘ.4:51:48. ఉ.దు.8:17ల 9:07వ. మ.దు.12:30ల 1:20వ. చంద్రదర్శనం (నెలపొడుపు)15/08 సా.06:00 శు.తదియ శని ఘ.34:25, రా.గం.7:32. పుబ్బ ఉ.గం.6:33. శివం ఉ.గం.10:51. తైతుల ఉ.గం.8:00. అహస్సు ఘ.31:34. వర్జ్యం ప.గం.1:43ల 3:19వ. అమృ రా.గం.11:16ల 12:52వ. భు.ఘ.5:2:19. ఉ.దు.5:46ల 7:27వ. 16/08 సా.06:30 శు.చవితి ఆది ఘ.32:54, రా.గం.6:56. ఉత్తర ఉ.గం.6:26. సిద్ధి ఉ.గం.9:11. వనిక్ ఉ.గం.7:14. అహస్సు ఘ.31:32. వర్జ్యం ప.గం.2:50ల 4:26వ. అమృ రా.గం.12:26ల 2:02వ. భు.ఘ.5:12:50. సా.దు.4:42ల 5:32వ. 17/08 సా.07:00 శు.పంచమి సోమ ఘ.32:53, రా.గం.6:55. హస్త ఉ.గం.6:50. సాధ్యం ఉ.గం.7:58. బవ ఉ.గం.6:55. అహస్సు ఘ.31:30. వర్జ్యం సా.గం.3:09ల 4:49వ. అమృ రా.గం.1:07ల 2:47వ. భు.ఘ.5:23:11. పు.భు.5:31. ప.దు.12:29ల 1:19వ. పునః ప.3:00ల 3:50వ. మఘ 1 రవిః రా.11:08 ప్రవేశదినే సింహ సంక్రమణం18/08 సా.05:00 శు.షష్ఠి మంగళ ఘ.34:2, రా.గం.7:23. చిత్త ఉ.గం.7:46. శుభం ఉ.గం.6:45. కౌలవ ఉ.గం.7:09. అహస్సు ఘ.31:28. వర్జ్యం ప.గం.1:41ల 3:23వ. అమృ రా.గం.11:51ల 1:33వ. భు.ఘ.00:02:50. ఉ.దు.8:18ల 9:08వ. రా.దు.10:55ల 11:45వ. సూర్యపూజ 19/08 రా.07:30 శు.సప్తమి బుధ ఘ.36:32, రా.గం.8:24. స్వాతి ఉ.గం.9:11. శుక్లం ఉ.గం.6:45. గరజి ఉ.గం.7:54. అహస్సు ఘ.31:26. వర్జ్యం ప.గం.3:13ల 4:57వ. అమృ రా.గం.1:34ల 3:18వ. భు.ఘ.00:13:03. మ.దు.11:39ల 12:29వ.20/08 సా.06:00 శు.అష్టమి గురు ఘ.40:01, రా.గం.9:47. విశాఖ ప.గం.11:07. బ్రహ్మం ఉ.గం.6:43. విష్టి ఉ.గం.9:05.అహస్సు ఘ.31:24. వర్జ్యం ప.గం.3:26ల 5:11వ. అమృ రా.గం.1:55ల 3:40వ. భు.ఘ.00:23:16. ఉ.దు.9:58ల 10:48వ. మ.దు.3:00ల 3:50వ.21/08 ప.02:15 శు.నవమి శుక్ర ఘ.44:29, రా.గం.11:35. అనురాధ ప.గం.1:18. ఐంద్రం ఉ.గం.6:58. బాలవ ఉ.గం.10:41. అహస్సు ఘ.31:22. వర్జ్యం రా.గం.7:28ల 9:14వ. భు.ఘ.00:33:29. ఉ.దు.8:18ల 9:08వ. మ.దు.12:29ల 1:19వ. వరలకీ‡్ష్మవ్రతం, కౌమారీదేవీపూజ22/08 సా.06:00 శు.దశమి శని ఘ.49:26, రా.గం.1:34. జ్యేష్ఠ సా.గం.3:48. వైధృతి ఉ.గం.7:29. తైతుల ప.గం.12:35. అహస్సు ఘ.31:20. వర్జ్యం రా.గం.12:41ల 2:27వ. అమృ ఉ.గం.6:05ల 7:51వ. భు.ఘ.00:43:42. ఉ.దు.5:48ల 7:28వ. 23/08 ప.03:00 శు.ఏకాదశి ఆది ఘ.54:39, రా.గం.3:40. మూల సా.గం.6:26. విష్కంభం ఉ.గం.8:07. వనిక్ ప.గం.2:39. అహస్సు ఘ.31:18. వర్జ్యం సా.గం.4:40ల 6:26వ. పునః తె.5:04ల 5:48వ. అమృ ప.గం.11:20ల 1:06వ. భు.ఘ.00:53:55. సా.దు.4:36ల 5:26వ. 24/08 రా.07:00 శు.ద్వాదశి సోమ ఘ.59:30, రా.తె.గం.5:36. పూర్వాషాఢ రా.గం.9:00. ప్రీతి ఉ.గం.8:44. బవ సా.గం.4:38. అహస్సు ఘ.31:15. వర్జ్యం శేషం ఉ.గం.5:48ల 6:50వ. అమృ సా.గం.3:41ల 5:27వ. భు.ఘ.1:4:8. ప.దు.12:27ల 1:17వ. పునః ప.2:57ల 3:47వ. దామోదరద్వాదశీ, వాసుదేవ పవిత్రారోపణం25/08 రా.07:00 శు.త్రయోదశి మంగళ పూర్తి. ఉత్తరాషాఢ రా.గం.11:19. ఆయుష్మాన్ ఉ.గం.9:14. కౌలవ సా.గం.6:22. అహస్సు ఘ.31:12. వర్జ్యం ఉ.గం.5:46ల 7:31వ. పునః రా.3:40ల 5:24వ. అమృ సా.గం.4:18ల 6:04వ. భు.ఘ.1:14:21. ఉ.దు.8:18ల 9:08వ. రా.దు.10:53ల 11:43వ.26/08 సా.04:00 శు.త్రయోదశి బుధ ఘ.3:22, ఉ.గం.7:09. శ్రవణం రా.గం.1:21. సౌభాగ్యం ఉ.గం.9:32. తైతుల ఉ.గం.7:09. అహస్సు ఘ.31:10. వర్జ్యం తె.గం.5:37ల 5:48వ. అమృ ప.గం.2:04ల 3:48వ. భు.ఘ.1:24:34. మ.దు.11:37ల 12:27వ. 27/08 సా.06:00 శు.చతుర్దశి గురు ఘ.6:32, ఉ.గం.8:25. ధనిష్ఠ రా.గం.2:54. శోభ ఉ.గం.9:30. వనిక్ ఉ.గం.8:25. అహస్సు ఘ.31:8. వర్జ్యం శేషం ఉ.గం.5:48ల 7:19వ. అమృ ప.గం.3:50ల 5:32వ. భు.ఘ.1:34:47. ఉ.దు.9:57ల 10:47వ. మ.దు.2:55ల 3:45వ. నోములకు పౌర్ణమి28/08 ప.02:15 ఝశు.పౌర్ణమి శుక్ర ఘ.8:29, ఉ.గం.9:12. శతభిషం తె.గం.4:04. అతిగండ ఉ.గం.9:07. బవ ఉ.గం.9:12. అహస్సు ఘ.31:6. వర్జ్యం ఉ.గం.10:27ల 12:07వ. అమృ రా.గం.8:33ల 10:15వ. భు.ఘ.1:45:00. ఉ.దు.8:17 9:07వ. మ.దు.12:26ల 1:16వ. యాగకాలం, హయగ్రీవోత్పత్తి, యజుర్వేద ఉపాకర్మ, విఖనసజయంతీ29/08 సా.07:00 బహుళ పాడ్యమి శని ఘ.9:07, ఉ.గం.9:27. పూర్వాభాద్ర తె.గం.4:34. సుకర్మ ఉ.గం.8:18. కౌలవ ఉ.గం.9:27. అహస్సు ఘ.31:4. వర్జ్యం ప.గం.10:36ల 12:14వ. అమృ రా.గం.8:24ల 10:2వ. భు.ఘ.1:55:13. ఉ.దు.5:48ల 7:27వ.30/08 సా.06:00 బ.విదియ ఆది ఘ.8:36, ఉ.గం.9:14. ఉత్తరాభాద్ర తె.గం.4:41. ధృతి ఉ.7:08. శూల తె.గం.5:42. గరజి ఉ.గం.9:14. అహస్సు ఘ.31:2. వర్జ్యం ప.గం.2:12ల 3:48వ. అమృ రా.గం.11:50ల 1:26వ. భు.ఘ.2:5:26. సా.దు.4:33ల 5:23వ. బహత్తల్ప ద్వితీయ31/08 ప.11:00 బ.తదియ సోమ ఘ.6:57, ఉ.గం.8:35. రేవతి తె.గం.4:18. గండ తె.గం.3:42. భద్ర ఉ.గం.8:35. అహస్సు ఘ.31:00. వర్జ్యం ప.గం.4:30ల 6:05వ. అమృ రా.గం.1:46ల 3:20వ. భు.ఘ.2:15:39. ప.దు.12:25ల 1:14వ. పునః ప.2:54ల 3:43వ. సంకటహర చతుర్థి01/09 సా.04:30 బ.చవితి మంగళ ఘ.3:54, ఉ.గం.7:23. అశ్విని రా.తె.గం.3:32. వృద్ధి రా.గం.1:25. బాలవ ఉ.గం.7:23. అహస్సు ఘ.30:58. వర్జ్యం రా.గం.11:40ల 1:13వ. అమృ రా.గం.8:34ల 10:07వ. భు.ఘ.2:25:52. ఉ.దు.8:18ల 9:07వ. రా.దు.10:50ల 11:39వ.02/09 సా.04:00 బ.పంచమి బుధ ఘ.00:04, ఉ.గం.5:51. బ.షష్ఠి ఘ.55:23, రా.తె.గం.4:00. భరణి రా.2:22. ధ్రువం రా.గం.10:50. తైతుల ఉ.గం.5:51. గరజి సా.గం.4:55. అహస్సు ఘ.30:56. వర్జ్యం ప.గం.12:40ల 2:11వ. అమృ రా.గం.9:48ల 11:19వ. భు.ఘ.2:36:5. మ.దు.11:36ల 12:25వ. 03/09 సా.05:00 బ.సప్తమి గురు ఘ.50:05, రా.గం.1:52. కృత్తిక రా.గం.1:02. వ్యాఘాతం రా.8:04. విష్టి ప.గం.2:56. అహస్సు ఘ.30:53. వర్జ్యం ప.గం.1:43ల 3:13వ. అమృ రా.గం.10:46ల 12:16వ. భు.ఘ.2:46:18. ఉ.దు.9:57ల 10:46వ. మ.దు.2:53ల 3:42వ.04/09 ఉ.07:50 బ.అష్టమి శుక్ర ఘ.44:12, రా.గం.11:31. రోహిణి రా.గం.11:28. హర్షణం సా.గం.5:07. బాలవ ప.గం.12:41. అహస్సు ఘ.30:50. వర్జ్యం ప.గం.3:59ల 5:29వ. పునః తె.గం.4:40ల 5:50వ. అమృ రా.గం.8:28ల 9:58వ. భు.ఘ.2:56:31. ఉ.దు.8:18ల 9:07వ. మ.దు.12:24ల 1:13వ. శ్రీకష్ణ జన్మాష్టమీ, శ్రీకష్ణజయంతీ05/09 సా.06:00 బ.నవమి శని ఘ.38:08, రా.గం.9:05. మృగశిర రా.గం.9:48. వజ్రం ప.గం.2:04. తైతుల ప.గం.10:38. అహస్సు ఘ.30:48. వర్జ్యం శేషం ఉ.గం.5:50ల 6:09వ. పునః తె.గం.5:37ల 5:50వ. అమృ ప.గం.1:36ల 3:05వ. భు.ఘ.3:6:44. ఉ.దు.5:50ల 7:28వ. కౌమారీదేవీపూజ06/09 సా.06:00 బ.దశమి ఆది ఘ.31:57, రా.గం.6:37. ఆర్ద్ర రా.గం.8:07. సిద్ధి ప.గం.10:59. వనిక్ ఉ.గం.7:51. అహస్సు ఘ.30:46. వర్జ్యం శేషం ఉ.గం.5:50ల 7:06వ. అమృ ఉ.గం.10:49ల 12:18వ. భు.ఘ.3:16:57. సా.దు.4:29ల 5:18వ.07/09 ప.11:00 బ.ఏకాదశి సోమ ఘ.25:59, సా.గం.4:14. పునర్వసు సా.గం.6:30. వ్యతీపాత ఉ.గం.7:55. వరీయాన్ తె.గం.4:52. బాలవ సా.గం.4:14వ. అహస్సు ఘ.30:44. వర్జ్యం ఉ.గం.7:20ల 8:50వ. పునః రా.2:01ల 3:31వ. భు.ఘ.3:27:10. ప.దు.12:24ల 1:13వ. పునః ప.2:51ల 3:40వ. మతత్రయ అజా ఏకాదశి08/09 సా.04:30 బ.ద్వాదశి మంగళ ఘ.20:21, ప.గం.1:59. పుష్యమి సా.గం.5:03, పరిఘ రా.గం.2:04. తైతుల ప.గం.1:59. అహస్సు ఘ.30:41. వర్జ్యం తె.గం.5:11ల 5:51వ. అమృ ప.గం.11:03ల 12:33వ. భు.ఘ.3:37:23. ఉ.దు.8:18ల 9:07వ. రా.దు.10:48ల 11:36వ.09/09 సా.04:00 బ.త్రయోదశి బుధ ఘ.15:20, ప.గం.11:59. ఆశ్లేష ప.గం.3:48. శివం రా.గం.11:24. వనిక్ ప.గం.11:59. అహస్సు ఘ.30:38. వర్జ్యం శేషం ఉ.గం.5:51ల 6:51. పునః రా.3:20ల 4:52వ. అమృ ప.గం.2:17ల 3:47వ. భు.ఘ.3:47:36. మ.దు.11:33ల 12:22వ. మాసశివరాత్రి10/09 ఉ.06:30 బ.చతుర్దశి గురు ఘ.10:51, ఉ.గం.10:11. మఘ ప.గం.2:52. సిద్ధం రా.గం.9:06. శకుని ఉ.గం.10:11. అహస్సు ఘ.30:36. వర్జ్యం రా.గం.10:40ల 12:14వ. అమృ ప.గం.12:33ల 2:05వ. భు.ఘ.3:57:49. ఉ.దు.9:56ల 10:45వ. మ.దు.2:49ల 3:38వ. రుద్రసావర్ణిమన్వాది, తర్పణాలకు అమావాస్య11/09 రా.08:30 ∙బ.అమావాస్య శుక్ర ఘ.7:20, ఉ.గం.8:47. పుబ్బ ప.గం.2:17. సాధ్యం రా.గం.7:02. నాగవం ఉ.గం.8:47. అహస్సు ఘ.30:34. వర్జ్యం రా.గం.9:25ల 11:00వ. అమృ ఉ.గం.8:02ల 9:34వ. భు.ఘ.4:8:02. ఉ.దు.8:19ల 9:08వ. మ.దు.12:29ల 1:18వ. యాగకాలం కుశగ్రహణం, పోలాల అమావాస్య, శైవమౌనవ్రతము, అగస్త్యార్ఘ్యంస్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్షఋతువు, భాద్రపద మాసం12/09 సా.06:00 శుద్ధ పాడ్యమి శని ఘ.4:49, ఉ.గం.7:48. ఉత్తర ప.గం.2:08. శుభం సా.గం.5:43. బవ ఉ.గం.7:48. అహస్సు ఘ.30:32. వర్జ్యం రా.గం.10:38ల 12:15వ. అమృ ఉ.గం.6:58ల 8:33వ. భు.ఘ.4:18:15. ఉ.దు.5:52ల 7:30వ. చంద్రదర్శనం (నెలపొడుపు), మహత్తమవ్రతం13/09 సా.06:00 శు.విదియ ఆది ఘ.3:33, ఉ.గం.7:17. హస్త ప.గం.2:25. శుక్లం ప.గం.4:01. కౌలవ ఉ.గం.7:17. అహస్సు ఘ.30:29. వర్జ్యం రా.గం.10:41ల 12:20వ. అమృ ఉ.గం.8:21ల 9:58వ. భు.ఘ.4:28:28. సా.దు.4:27ల 5:16వ. 14/09 సా.06:30 శు.తదియ సోమ ఘ.3:27, ఉ.గం.7:15. చిత్త ప.గం.3:14. బ్రహ్మం ప.గం.3:06. గరజి ఉ.గం.7:15. అహస్సు ఘ.30:26. వర్జ్యం రా.గం.9:06ల 10:47వ. అమృ ఉ.గం.8:37ల 10:16వ. భు.ఘ.4:38:41. ప.దు.12:11ల 12:59వ. పునః ప.2:37ల 1:25వ. సువర్ణగౌరీవ్రతం, వినాయకచతుర్థీ, గణపతినవరాత్రి ప్రారంభం, గౌరీపూజ15/09 సా.05:30 శు.చవితి మంగళ ఘ.4:45, ఉ.గం.7:46. స్వాతి సా.గం.4:32. ఐంద్రం ప.గం.2:34. భద్ర ఉ.గం.7:46. అహస్సు ఘ.30:24. వర్జ్యం రా.గం.10:32ల 12:15వ. అమృ ఉ.గం.9:39ల 11:20వ. భు.ఘ.4:48:54. ఉ.దు.08:08ల 8:56వ. రా.దు.10:46ల 11:34వ. ఋషిపంచమీ16/09 సా.04:00 శు.పంచమి బుధ ఘ.7:19, ఉ.గం.8:48. విశాఖ సా.గం.6:16. వైధృతి ప.గం.2:24. బాలవ ఉ.గం.8:48. అహస్సు ఘ.30:22. వర్జ్యం రా.గం.10:38ల 12:23వ. అమృ ఉ.గం.8:50ల 10:33వ. భు.ఘ.4:59:7. మ.దు.11:32ల 12:20వ.17/09 సా.05:00 శు.షష్ఠి గురు ఘ.10:47, ప.గం.10:11. అనురాధ రా.గం.8:26. విష్కంభం ప.గం.2:35. తైతుల ఉ.గం.10:11. అహస్సు ఘ.30:20. వర్జ్యం రా.గం.2:36ల 4:22వ. అమృ ఉ.గం.9:06ల 10:51వ. భు.ఘ.5:9:20. పు.భు.5:17. ఉ.దు.9:54ల 10:42వ. మ.దు.2:45ల 3:33వ. కన్యా రవిః రా.11:29 ప్రవేశాత్ కన్యా సంక్రమణం18/09 ఉ.07:50 శు.సప్తమి శుక్ర ఘ.15:15, ప.గం.11:58. జ్యేష్ఠ రా.గం.10:52. ప్రీతి ప.గం.3:00. వనిక్ ప.గం.11:58. అహస్సు ఘ.30:17. వర్జ్యం లేదు. అమ ప.గం.1:10ల 2:56వ. భు.ఘ.00:02:45. ఉ.దు.8:17ల 9:05వ. మ.దు.12:17ల 1:08వ.19/09 ప.12:10 శు.అష్టమి శని ఘ.20:16, ప.గం.1:58. మూల రా.గం.1:30. ఆయుష్మాన్ ప.గం.3:34. బవ ప.గం.1:58. అహస్సు ఘ.30:14. వర్జ్యం ఉ.గం.7:44ల 9:30. పునః రా.11:44ల 1:30వ. అమృ రా.గం.6:24ల 8:10వ. భు.ఘ.00:13:00. ఉ.దు.5:52ల 7:29వ.20/09 సా.06:30 శు.నవమి ఆది ఘ.25:28, సా.గం.4:03. పూర్వాషాఢ రా.గం.4:06. సౌభాగ్యం ప.గం.4:11. కౌలవ సా.గం.4:03. అహస్సు ఘ.30:12. వర్జ్యం ప.గం.12:08ల 1:44వ. అమృ రా.గం.10:47ల 12:33వ. భు.ఘ.00:23:15. సా.దు.4:19ల 5:07వ. నందాదేవీపూజ, కేదారవ్రతం21/09 ప.11:00 శు.దశమి సోమ ఘ.30:23, సా.గం.6:01. ఉత్తరాషాఢ పూర్తి. శోభ సా.గం.4:42. గరజి సా.గం.6:01. అహస్సు ఘ.30:10. వర్జ్యం ప.గం.12:53ల 2:39వ. అమృ రా.గం.11:26ల 1:12వ. భు.ఘ.00:33:30. ప.దు.12:17ల 1:05వ. పునః ప.2:42ల 3:30వ. క్షీరవ్రతారంభ22/09 ప.12:00 శు.ఏకాదశి మంగళ ఘ.34:38, రా.గం.7:43. ఉత్తరాషాఢ ఉ.గం.6:27. అతిగండ సా.గం.5:02. వనిక్ ఉ.గం.6:52. అహస్సు ఘ.30:07. వర్జ్యం ప.గం.10:48ల 12:32వ. అమృ రా.గం.9:14ల 10:58వ. భు.ఘ.00:43:45. ఉ.దు.8:16ల 9:04వ. రా.దు.10:41ల 11:29వ. మతత్రయ పరివర్తన ఏకాదశి23/09 ఉ.09:00 శు.ద్వాదశి బుధ ఘ.37:50, రా.గం.9:01. శ్రవణం ఉ.గం.8:33. సుకర్మ సా.గం.5:04. బవ ఉ.గం.8:23. అహస్సు ఘ.30:04. వర్జ్యం ప.గం.12:49ల 2:31వ. అమృ రా.గం.11:05ల 12:48వ. భు.ఘ.00:54:00. మ.దు.11:29ల 12:15వ. కటదానం(దర్భాసనం), శక్రద్వాదశీ, కల్కిద్వాదశీ, వామన జయంతీ, శ్రవణద్వాదశీ24/09 సా.05:00 శు.త్రయోదశి గురు ఘ.40:01, రా.గం.9:53. ధనిష్ఠ ప.గం.10:12. ధృతి సా.గం.4:45. కౌలవ ఉ.గం.9:27. అహస్సు ఘ.30:02. వర్జ్యం సా.గం.5:45ల 7:26వ. అమృ రా.తె.గం.3:50ల 5:31వ. భు.ఘ.1:4:15. ఉ.దు.9:53ల 10:41వ. మ.దు.2:41ల 3:29వ.25/09 ఉ.07:45 శు.చతుర్దశి శుక్ర ఘ.40:45, రా.గం.10:11. శతభిషం ప.గం.11:23. శూల సా.గం.4:00. గరజి ఉ.గం.10:02. అహస్సు ఘ.30:00. వర్జ్యం సా.గం.5:58ల 7:36వ. అమృ తె.గం.3:50ల 5:29వ. భు.ఘ.1:14:30. ఉ.దు.8:17ల 9:05వ. మ.దు.12:17ల 1:05వ. అనంతవ్రతం (అనంత పద్మనాభచతుర్దశీ)26/09 ప.12:15 ఝ శు.పౌర్ణమి శని ఘ.40:21, రా.గం.10:01. పూర్వాభాద్ర ప.గం.12:06. గండ ప.గం.2:53. విష్టి ఉ.గం.10:06. అహస్సు ఘ.29:58. వర్జ్యం రా.గం.9:44ల 11:21వ. భు.ఘ.1:24:45. ఉ.దు.5:53ల 7:29వ. నోములకు పౌర్ణమి, ఉమా మహేశ్వరవ్రతం27/09 ప.02:30 బహుళ పాడ్యమి ఆది ఘ.38:31, రా.గం.9:17. ఉత్తరాభాద్ర ప.గం.12:15. వృద్ధి ప.గం.1:21. బాలవ ఉ.గం.9:39. అహస్సు ఘ.29:55. వర్జ్యం రా.గం.12:07ల 1:42వ. అమృ ఉ.గం.7:25ల 9:02వ. భు.ఘ.1:35:00. సా.దు.4:15ల 05:03వ. యాగకాలం, మహాలయపక్షప్రారంభః28/09 ప.11:00 బ.విదియ సోమ ఘ.35:50, రా.గం.8:14. రేవతి ప.గం.12:00. ధవం ప.గం.11:29. తైతుల గం.8:47. అహస్సు ఘ.29:52. వర్జ్యం లేదు. అమృ ఉ.గం.9:38ల 11:13వ. పునః అమృ తె.గం.4:19ల 5:52వ. భు.ఘ.1:45:15. ప.దు.12:16ల 1:03వ. పునః ప.2:39ల 3:26వ.29/09 సా.05:30 బ.తదియ మంగళ ఘ.31:52, సా.గం.6:39. అశ్విని ప.గం.11:19. వ్యాఘాతం ఉ.గం.9:16. వనిక్ ఉ.గం.7:26. అహస్సు ఘ.29:50. వర్జ్యం ఉ.గం.7:26ల 8:59వ. పునః రా.8:30ల 10:02వ. అమృ తె.గం.5:41ల 5:54వ. భు.ఘ.1:55:30. ఉ.దు.8:17ల 9:04వ. రా.దు.10:39ల 11:26వ. సంకటహర చతుర్థి, ఉండ్రాళ్ళతద్ది30/09 సా.04:30 బ.చవితి బుధ ఘ.27:14, సా.గం.4:48. భరణి ఉ.గం.10:17. హర్షణం ఉ.గం.6:45. వజ్రం తె.గం.4:05. బాలవ సా.గం.4:48. అహస్సు ఘ.29:48. వర్జ్యం రా.గం.9:38ల 11:09వ. అమృ శేషం ఉ.గం.5:54ల 7:12వ. భు.ఘ.2:5:45. మ.దు.11:27ల 12:14వ.01/10 సా.06:00 బ.పంచమి గురు ఘ.22:1, ప.గం.2:42. కృత్తిక ఉ.గం.8:59. సిద్ధి రా.గం.1:05. తైతుల ప.గం.2:42. అహస్సు ఘ.29:45. వర్జ్యం రా.గం.11:58ల 1:28వ. అమృ ఉ.గం.6:42ల 8:12వ. పునః రా.తె.4:28ల 5:58వ. భు.ఘ.2:16:00. ఉ.దు.9:51ల 10:38వ. మ.దు.2:36ల 3:14వ. 02/10 రా.08:00 బ.షష్ఠి శుక్ర ఘ.16:14, ప.గం.12:24. రోహిణి ఉ.గం.7:28, మృగశిర తె.5:52. వ్యతీపాత రా.గం.10:02. వనిక్ ప.గం.12:24. అహస్సు ఘ.29:42. వర్జ్యం ప.గం.12:42ల 2:11వ. అమృ రా.గం.9:39ల 11:09వ. భు.ఘ.2:26:15 ఉ.దు.8:16ల 9:03వ. మ.దు.12:14ల 1:01వ. వ్యతీపాత మహాలయం03/10 ఉ.08:45 బ.సప్తమి శని ఘ.10:14, ఉ.గం.10:00. ఆర్ద్ర రా.తె.గం.4:08. వరీయాన్ సా.గం.6:55. బవ ఉ.గం.10:00. అహస్సు ఘ.29:40. వర్జ్యం ప.గం.1:38ల 3:07వ. అమృ సా.గం.6:49ల 8:18వ. భు.ఘ.2:36:30. ఉ.దు.5:54ల 7:29వ. 04/10 ప.11:30 బ.అష్టమి ఆది ఘ.4:10, ఉ.గం.7:34. నవమి ఘ.53:57. తె.గం.5:09. పునర్వసు రా.గం.2:29. పరిఘ సా.గం.3:48. కౌలవ ఉ.గం.7:34. తైతుల సా.గం.6:21. అహస్సు ఘ.29:38. వర్జ్యం ప.గం.3:18ల 4:47వ. అమృ రా.గం.12:15ల 1:44వ. భు.ఘ.2:46:45. సా.దు.4:10ల 4:57వ. ఉమామహేశ్వరపూజ, మహాలకీ‡్ష్మ వ్రతోద్వాసనం, 05/10 రా.07:00 బ.దశమి సోమ ఘ.52:33, రా.గం.2:55. పుష్యమి రా.గం.12:58. శివం ప.గం.12:46. వనిక్ గం.4:06. అహస్సు ఘ.29:35. వర్జ్యం ప.గం.9:58ల 11:28వ. అమృ రా.గం.6:58ల 8:28వ. భు.ఘ.2:57:00. ప.దు.12:12ల 12:59వ. పునః ప.2:34ల 3:21వ.06/10 సా.05:15 బ.ఏకాదశి మంగళ ఘ.47:27, రా.గం.12:53. ఆశ్లేష రా.గం.11:39. సిద్ధం ప.గం.9:53. బవ ప.గం.1:54. అహస్సు ఘ.29:32. వర్జ్యం ప.గం.1:04ల 2:34వ. అమృ రా.గం.10:08ల 11:38వ. భు.ఘ.3:7:15. ఉ.దు.8:16ల 9:03వ. రా.దు.10:35ల 11:22వ.07/10 సా.04:10 బ.ద్వాదశి బుధ ఘ.43:11, రా.గం.11:10. మఘ రా.గం.10:39. సాధ్యం ఉ.గం.7:10. శుభం రా.తె.గం.4:38. కౌలవ ప.గం.12:02. అహస్సు ఘ.29:30. వర్జ్యం ప.గం.11:09ల 12:41వ. అమృ రా.గం.8:21ల 9:53వ. భు.ఘ.3:17:30. మ.దు.11:25ల 12:12వ. యతిమహాలయం08/10 సా.5:15 బ.త్రయోదశి గురు ఘ.39:43, రా.గం.9:48. పుబ్బ రా.గం.9:58. శుక్లం రా.గం.2:27. గరజి ఉ.గం.10:30. అహస్సు ఘ.29:28. వర్జ్యం ఉ.గం.6:27ల 8:00వ. పునః రా.తె.గం.5:05ల 5:55వ. అమృ ప.గం.3:45ల 5:18వ.భు.ఘ.3:27:45. ఉ.దు.9:20ల 10:07వ. మ.దు.2:33ల 3:20వ. కలియుగాది, మాసశివరాత్రి నిశీధి వారికి09/10 ప.02:30 బ.చతుర్దశి శుక్ర ఘ.37:21, రా.గం.8:51. ఉత్తర రా.గం.9:43. బ్రహ్మం రా.గం.12:41. విష్టి ఉ.గం.9:20. అహస్సు ఘ.29:26. వర్జ్యం శేషం గం.5:55ల 6:40వ. అమృ ప.గం.2:36ల 4:11వ. భు.ఘ.3:38:00. ఉ.దు.8:16ల 9:03వ. మ.దు.12:11ల 12:58వ. మాసశివరాత్రి ప్రదోషం వారికి, శహతమహాలయం10/10 ప.11:00 ∙బ.అమావాస్య శని ఘ.35:57, రా.గం.8:15. హస్త రా.గం.9:49. ఐంద్రం రా.గం.11:09. చతుష్పాత్ ఉ.గం.8:35. అహస్సు ఘ.29:24. వర్జ్యం ఉ.గం.6:09ల 7:45వ. అమృ ప.గం.3:48ల 5:24వ. శ్రాద్ధతిథి అమావాస్య. భు.ఘ.3:48:15. ఉ.దు.5:55ల 7:31వ. మహాలయ అమావాస్య స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదతువు, ఆశ్వయుజ మాసం. 11/10 ప.02:30 శుద్ధ పాడ్యమి ఆది ఘ.36:13, రా.గం.8:25. చిత్త రా.గం.10:37. వైధృతి రా.గం.10:11. కింస్తుఘ్నం ఉ.గం.8:22. అహస్సు ఘ.29:21. వర్జ్యం ఉ.గం.6:06ల 7:45వ. పునః తె.గం.4:29ల 5:56వ. అమృ ప.గం.4:00ల 5:39వ. భు.ఘ.3:58:30. సా.దు.4:06ల 4:53వ. యాగకాలం, శారదానవరాత్రి ప్రారంభం 12/10 సా.06:00 శు.విదియ సోమ ఘ.37:16, రా.గం.8:50. స్వాతి రా.గం.11:46. విష్కంభం రా.గం.9:34. బాలవ ఉ.గం.8:38. అహస్సు ఘ.29:18. వర్జ్యం శేషం ఉ.గం.5:56ల 6:09వ. పునః తె.గం.5:45ల 5:56వ. అమృ ప.గం.2:34ల 4:15వ. భు.ఘ.4:8:45. ప.దు.12:10ల 12:56వ. పునః ప.2:31ల 3:17వ. చంద్రదర్శనం (నెలపొడుపు)13/10 రా.07:00 శు.తదియ మంగళ ఘ.40:8, రా.గం.9:59. విశాఖ రా.గం.1:26. ప్రీతి రా.గం.9:16. తైతుల ఉ.గం.9:25. అహస్సు ఘ.29:16. వర్జ్యం శేషం ఉ.గం.5:56ల 7:27వ. పునః తె.గం.5:47ల 5:56వ. అమృ సా.గం.4:02ల 5:45వ. భు.ఘ.4:19:00. ఉ.దు.8:16ల 9:02వ. రా.దు.10:33ల 11:19వ.14/10 ఉ.09:00 శు.చవితి బుధ ఘ.43:25, రా.గం.11:18. అనురాధ రా.తె.గం.3:30. ఆయుష్మాన్ రా.గం.9:18. వనిక్ ఉ.గం.10:38. అహస్సు ఘ.29:14. వర్జ్యం శేషం గం.5:56ల 7:31వ. అమృ సా.గం.4:12ల 5:56వ. భు.ఘ.4:29:15. మ.దు.11:24ల 12:10వ.15/10 ప.12:00 శు.పంచమి గురు ఘ.48:21, రా.గం.1:17. జ్యేష్ఠ రా.తె.గం.5:56. సౌభాగ్యం రా.గం.9:39. బవ ప.గం.12:18. అహస్సు ఘ.29:11. వర్జ్యం ఉ.గం.9:41ల 11:26వ. అమృ రా.గం.8:15ల 10:01వ. భు.ఘ.4:39:30. ఉ.దు.9:50ల 10:36వ. మ.దు.2:30ల 3:16వ. 16/10 రా.08:15 శు.షష్ఠి శుక్ర ఘ.53:28, రా.గం.3:20. మూల పూర్తి. శోభ రా.గం.10:10. కౌలవ ప.గం.2:19. అహస్సు ఘ.29:08. వర్జ్యం ప.గం.2:48ల 4:34వ. అమృ రా.గం.1:26ల 3:12వ. భు.ఘ.4:49:45. ఉ.దు.8:17ల 9:03వ. మ.దు.12:10ల 12:56వ. సరస్వతీపూజా ప్రారంభం 17/10 ప.02:00 శు.సప్తమి శని ఘ.58:48, రా.తె.గం.5:28. మూల ఉ.గం.8:33. అతిగండ రా.గం.10:46. గరజి సా.గం.4:24. అహస్సు ఘ.29:6. వర్జ్యం ఉ.గం.6:47ల 8:33. పునః రా.7:10ల 8:46వ. అమృ తె.గం.5:49ల 5:57వ. భు.ఘ.5:00:00. ఉ.దు.5:57ల 7:30వ. దేవీత్రిరాత్రవ్రతం18/10 ప.02:00 శు.అష్టమి ఆది పూర్తి. పూర్వాషాఢ ప.గం.11:8. సుకర్మ రా.గం.11:19. విష్టి సా.గం.6:29. అహస్సు ఘ.29:04. వర్జ్యం రా.గం.7:58ల 9:44వ. అమృ శేషం ఉ.గం.5:57ల 7:35వ. భు.ఘ.5:10:15. పు.భు.5:12. సా.దు.4:02ల 4:48వ. చిత్త 2 రవిః ఉ.9:54 ప్రవేశదినే మహాష్టమీ, దుర్గాష్టమీ, తులా సంక్రమణం19/10 రా.08:30 శు.అష్టమి సోమ ఘ.3:51, ఉ.గం.7:30. ఉత్తరాషాఢ ప.గం.1:40. ధృతి రా.గం.12:06. బవ ఉ.గం.7:30. అహస్సు ఘ.29:02. వర్జ్యం రా.గం.6:00ల 7:44వ. అమృ ఉ.గం.6:35ల 8:21వ. పునరమ తె.గం.4:27ల. భు.ఘ.00:09:00. ప.దు.12:09ల 12:55వ. పునః ప.2:28ల 3:14వ. మహానవమీ 20/10 సా.05:30 శు.నవమి మంగళ ఘ.8:00, ఉ.గం.9:10. శ్రవణం ప.గం.3:45. శూల రా.గం.11:46. కౌలవ ఉ.గం.9:10. అహస్సు ఘ.28:59. వర్జ్యం రా.గం.8:08ల 9:51వ. అమృ శేషం ఉ.గం.5:58ల 6:11వ. భు.ఘ.00:19:50. ఉ.దు.8:18ల 9:04వ. రా.దు.10:31ల 11:17వ. విజయదశమీ, శమీపూజ, అపరాజితాదేవీపూజ21/10 సా.04:15 శు.దశమి బుధ ఘ.11:05, ప.గం.10:25. ధనిష్ఠ సా.గం.5:28. గండ రా.గం.11:29. గరజి ప.గం.10:25. అహస్సు ఘ.28:56. వర్జ్యం రా.గం.1:05ల 2:46వ. అమృ ఉ.గం.6:15ల 7:58వ. భు.ఘ.00:29:40. మ.దు.11:22ల 12:08వ.22/10 ప.11:30 శు.ఏకాదశి గురు ఘ.13:24, ప.గం.11:21. శతభిషం సా.గం.6:49. వృద్ధి రా.గం.10:53. భద్ర ప.గం.11:21. అహస్సు ఘ.28:54. వర్జ్యం రా.గం.1:26ల 3:05వ. అమృ ప.గం.11:13ల 12:54వ. భు.ఘ.00:39:30. ఉ.దు.9:50ల 10:36వ. మ.దు.2:27ల 3:13వ.23/10 రా.08:10 శు.ద్వాదశి శుక్ర ఘ.14:19, ప.గం.11:39. పూర్వాభాద్ర రా.గం.7:39. ధ్రువం రా.గం.9:52. బాలవ ప.గం.11:33. అహస్సు ఘ.28:52. వర్జ్యం రా.తె.గం.5:23ల 5:59వ. అమృ ఉ.గం.11:23ల 1:02వ. భు.ఘ.0:49:20. ఉ.దు.8:17ల 9:03వ. మ.దు.12:08ల 12:54వ. 24/10 సా.06:00 శు.త్రయోదశి శని ఘ.13:53, ప.గం.11:32. ఉత్తరాభాద్ర రా.గం.7:59. వ్యాఘాతం రా.గం.8:23. తైతుల ప.గం.11:32. అహస్సు ఘ.28:50. వర్జ్యం శేషం ఉ.గం.5:59ల 7:00వ. అమృ ప.గం.3:07ల 4:44వ. భు.ఘ.1:00:10. ఉ.దు.5:59ల 7:31వ.25/10 సా.06:30 శు.చతుర్దశి ఆది ఘ.12:16, ప.గం.10:53. రేవతి రా.గం.7:47. హర్షణం సా.గం.6:35. వనిక్ ప.గం.10:53. అహస్సు ఘ.28:48. వర్జ్యం ఉ.గం.7:53ల 9:28వ. అమృ సా.గం.5:24ల 6:59వ. భు.ఘ.1:11:00. సా.దు.3:58ల 4:44వ.26/10 ప.11:30 ఝ శు.పౌర్ణమి సోమ ఘ.9:28, ప.గం.9:46. అశ్విని రా.గం.7:11. వజ్రం ప.గం.4:24. బవ ఉ.గం.9:46. అహస్సు ఘ.28:45. వర్జ్యం ప.గం.3:16ల 4:50వ. పునః రా.తె.గం.4:24ల 5:56వ. అమృ ప.గం.12:10ల 1:44వ. భు.ఘ.1:21:50. ప.దు.12:07ల 12:52వ. పునః ప.2:25ల 3:10వ. యాగకాలం27/10 ప.12:30 బహుళ పాడ్యమి మంగళ ఘ.5:44, ఉ.గం.8:18. భరణి సా.గం.6:13. సిద్ధి ప.గం.1:56. కౌలవ ఉ.గం.8:18. అహస్సు ఘ.28:42. వర్జ్యం తె.గం.5:35ల 6:00వ. అమృ ప.గం.1:37ల 3:09వ. భు.ఘ.1:32:40. ఉ.దు.8:18ల 9:03వ. రా.దు.10:29ల 11:14వ.28/10 ఉ.07:30 బ.విదియ బుధ ఘ.1:12, ఉ.గం.6:29. బ.తదియ ఘ.54:52, తె.గం.4:26. కృత్తిక సా.గం.4:57. వ్యతీపాత ప.గం.11:13. గరజి ఉ.గం.6:29. వనిక్ సా.గం.5:28. అహస్సు ఘ.28:40. వర్జ్యం శేషం ఉ.గం.6:00ల 7:05వ. అమృ ప.గం.2:41ల 4:11వ. భు.ఘ.1:43:30. మ.దు.11:22ల 12:07వ. అట్లతద్దె, లలితాదేవీయాత్ర29/10 ఉ.11:15 బ.చవితి గురు ఘ.50:21, రా.గం.2:09. రోహిణి ప.గం.3:30, వరీయాన్ ఉ.గం.8:20. పరిఘ తె.గం.5:20. బవ సా.గం.3:24. అహస్సు ఘ.28:38. వర్జ్యం ఉ.గం.7:59ల 9:29వ. పునః రా.8:43ల 10:12వ. అమృ ప.గం.12:29ల 1:59వ. పునరమ తె.గం.5:41ల 6:01వ. భు.ఘ.1:54:20. ఉ.దు.9:50ల 10:35వ. మ.దు.2:24ల 3:09వ. సంకటహర చతుర్థి30/10 రా.08:15 బ.పంచమి శుక్ర ఘ.44:22, రా.గం.11:43. మృగశిర ప.గం.1:53. శివం రా.గం.2:06. కౌలవ ప.గం.12:57. అహస్సు ఘ.28:36. వర్జ్యం రా.గం.9:41ల 11:10వ. అమృ శేషం ఉ.గం.6:01ల 7:11వ. పునరమ రా.గం.2:54ల 4:24వ. భు.ఘ.2:5:10. ఉ.దు.8:18ల 9:03వ. మ.దు.12:07ల 12:52వ.31/10 సా.06:00 బ.షష్ఠి శని ఘ.38:19, రా.గం.9:21. ఆర్ద్ర ప.గం.12:12. సిద్ధం రా.గం.11:01. గరజి ఉ.గం.10:33. అహస్సు ఘ.28:34. వర్జ్యం రా.గం.11:22ల 12:51వ. భు.ఘ.2:16:00. ఉ.దు.6:01ల 7:34వ.01/11 ప.11:00 బ.సప్తమి ఆది ఘ.32:29, రా.గం.7:02. పునర్వసు ప.గం.10:34 సాధ్యం రా.గం.7:57. విష్టి ఉ.గం.7:12. అహస్సు ఘ.28:32. వర్జ్యం సా.గం.6:03ల 7:33వ. అమృ ఉ.గం.8:20ల 9:49వ. పునరమ రా.తె.గం.3:02ల 4:32వ. భు.ఘ.2:26:50. సా.దు.3:55ల 4:40వ.02/11 సా.06:30 బ.అష్టమి సోమ ఘ.27:00, సా.గం.4:50. పుష్యమి ఉ.గం.9:02. శుభం సా.గం.4:58. కౌలవ సా.గం.4:50. అహస్సు ఘ.28:30. వర్జ్యం రా.గం.9:06ల 10:36వ. భు.ఘ.2:37:40. ప.దు.12:07ల 12:52వ. పునః ప.2:24ల 3:09వ.03/11 ప.12:30 బ.నవమి మంగళ ఘ.22:01, ప.గం.2:51. ఆశ్లేష ఉ.గం.7:40. శుక్లం ప.గం.2:12. గరజి ప.గం.2:51. అహస్సు ఘ.28:27. వర్జ్యం రా.గం.7:07ల 8:39వ. అమ ఉ.6:09ల 7:39వ. పునరమ తె.గం.4:17ల 5:41వ. భు.ఘ.2:48:30. ఉ.దు.8:19ల 9:04వ. రా.దు.10:28ల 11:13వ.04/11 ఉ.07:30 బ.దశమి బుధ ఘ.17:48, ప.గం.1:10. మఘ ఉ.గం.6:34. పుబ్బ రా.తె.గం.5:41. బ్రహ్మం ప.గం.11:38. భద్ర ప.గం.1:10. అహస్సు ఘ.28:24. వర్జ్యం ప.గం.2:17ల 3:49వ. అమృ రా.గం.11:31ల 1:03వ. దశమి తిథి ప్రాంతీయంగా మారును. భు.ఘ.2:59:20. మ.దు.11:21ల 12:06వ.05/11 ఉ.11:15 బ.ఏకాదశి గురు ఘ.14:28, ప.గం.11:51. ఉత్తర రా.తె.గం.5:22. ఐంద్రం ఉ.గం.9:22. బాలవ ప.గం.11:51. అహస్సు ఘ.28:22. వర్జ్యం ప.గం.3:30ల 5:05వ. అమృ రా.గం.10:16ల 11:50వ. భు.ఘ.3:10:10. ఉ.దు.9:51ల 10:36వ. మ.దు.2:23ల 3:08వ.06/11 రా.08:15 బ.ద్వాదశి శుక్ర ఘ.12:11, ప.గం.10:56. హస్త రా.తె.గం.5:24. వైధృతి ఉ.7:25. విష్కంభం తె.గం.5:40. తైతుల ప.గం.10:56. అహస్సు ఘ.28:20. వర్జ్యం ప.గం.01:48ల 3:24వ. అమృ రా.గం.11:28ల 12:59వ. భు.ఘ.03:21:00. ఉ.దు.8:20ల 9:05వ. మ.దు.12:06ల 12:51వ.07/11 సా.06:30 బ.త్రయోదశి శని ఘ.11:05, ప.గం.10:30. చిత్త రా.తె.గం.5:58. ప్రీతి తె.గం.4:29. వనిక్ ఉ.గం.10:30. అహస్సు ఘ.28:18. వర్జ్యం ప.గం.01:35ల 3:13వ. అమృ రా.గం.11:24ల 1:12వ. భు.ఘ.03:31:50. ఉ.దు.6:04ల 7:54వ. మాసశివరాత్రి08/11 ప.03:00 బ.చతుర్దశి ఆది ఘ.11:09, ప.గం.10:33. స్వాతి పూర్తి. ఆయుష్మాన్ రా.తె.గం.3:43. శకుని ఉ.గం.10:33. అహస్సు ఘ.28:16. వర్జ్యం ప.గం.11:51ల 1:32వ. అమృ రా.గం.9:56ల 11:37వ. భు.ఘ.03:42:40. సా.దు.3:53ల 4:38వ. స్వాత్యభ్యంగస్నానం, దీపావళీ, లకీ‡్ష్మపూజ, తర్పణాలకు అమావాస్య09/11 ఉ.07:30 ∙బ.అమావాస్య సోమ ఘ.12:40, ప.గం.11:09. స్వాతి ఉ.గం.7:10. సౌభాగ్యం రా.తె.గం.3:21. నాగవం ప.గం.11:09. అహస్సు ఘ.28:14. వర్జ్యం ప.గం.1:08ల 2:50వ. అమృ రా.గం.11:22ల 1:04వ. భు.ఘ.3:53:30. ప.దు.12:06ల 12:51వ. పునః ప.2:22ల 3:07వ. కేదారవ్రతం, ఆకాశదీపప్రారంభం స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదతువు, కార్తీక మాసం10/11 ప.12:30 శుద్ధ పాడ్యమి మంగళ ఘ.15:25, ప.గం.12:15. విశాఖ ఉ.గం.8:45. శోభ రా.తె.గం.3:17. బవ ప.గం.12:15. అహస్సు ఘ.28:14. వర్జ్యం ప.గం.1:05ల 2:49వ. అమృ రా.గం.11:28ల 1:17వ. భు.ఘ.4:4:20. ఉ.దు.8:21ల 9:06వ. రా.దు.10:27ల 11:12వ. యాగకాలం, బలిచక్రవర్తి పూజ, చంద్రదర్శనం (నెలపొడుపు)11/11 ప.04:20 శు.విదియ బుధ ఘ.19:14, ప.గం.1:48. అనురాధ ఉ.గం.10:44. అతిగండ రా.తె.గం.3:33. కౌలవ ప.గం.1:48. అహస్సు ఘ.28:11. వర్జ్యం సా.గం.4:54ల 6:40వ. అమృ రా.తె.గం.3:25ల 5:11వ. భు.ఘ.4:15:10. మ.దు.11:23ల 12:08వ. యమద్వితీయ, భగినీహస్తభోజనం12/11 సా.06:00 శు.తదియ గురు ఘ.23:55, ప.గం.3:41. జ్యేష్ఠ ప.గం.1:06. సుకర్మ రా.తె.గం.4:01. గరజి ప.గం.3:41. అహస్సు ఘ.28:8. వర్జ్యం రా.గం.9:57ల 11:43వ. భు.ఘ.4:26:00. ఉ.దు.9:52ల 10:37వ. మ.దు.2:22ల 3:07వ. 13/11 ఉ.07:15 శు.చవితి శుక్ర ఘ.29:07, సా.గం.5:46. మూల ప.గం.3:38. ధృతి రా.తె.గం.4:35. భద్ర సా.గం.5:46. అహస్సు ఘ.28:06. వర్జ్యం ప.గం.1:52ల 3:38వ. పునః రా.గం.2:17ల 4:03వ. అమృ ఉ.గం.8:33ల 10:19వ. భు.ఘ.4:36:50. ఉ.దు.8:22ల 9:07వ. మ.దు.12:07ల 12:52వ. నాగచతుర్థీ14/11 ఉ.11:00 శు.పంచమి శని ఘ.34:31, రా.గం.7:55. పూర్వాషాఢ సా.గం.6:15. శూల తె.గం.5:08. బవ ఉ.గం.6:51. అహస్సు ఘ.28:04. వర్జ్యం రా.గం.3:05ల 4:51వ. అమృ ప.గం.12:56ల 2:42వ. భు.ఘ.4:47:40. ఉ.దు.6:07ల 7:37వ. నాగపంచమీ15/11 సా.06:15 శు.షష్ఠి ఆది ఘ.39:35, రా.గం.9:58. ఉత్తరాషాఢ రా.గం.8:46. గండ తె.గం.5:33. కౌలవ ఉ.గం.8:59. అహస్సు ఘ.28:02. వర్జ్యం రా.గం.1:09ల 2:54వ. అమృ సా.గం.5:54ల 7:40వ. భు.ఘ.4:58:30. సా.దు.3:53ల 4:38వ.16/11 ప.11:20 శు.సప్తమి సోమ ఘ.44:00, రా.గం.11:44. శ్రవణం రా.గం.11:01. వృద్ధి తె.గం.5:44. గరజి ఉ.గం.10:47. అహస్సు ఘ.28:00. వర్జ్యం రా.గం.3:22ల 5:06వ. అమృ ప.గం.11:40ల 1:25వ. భు.ఘ.5:09:20. ప.దు.12:06ల 12:51వ. పునః ప.2:21ల 3:06వ.17/11 ప.12:15 శు.అష్టమి మంగళ ఘ.47:31, రా.గం.1:08. ధనిష్ఠ రా.గం.12:58. ధ్రువం తె.గం.5:38. విష్టి ప.గం.12:26. అహస్సు ఘ.28:00. వర్జ్యం లేదు. అమృ ప.గం.1:44ల 3:28వ. భు.ఘ.5:20:10. పు.భు.5:24. ఉ.దు.8:23ల 9:08వ. రా.దు.10:27ల 11:12వ. విశాఖ 4 రవిః ఉ.7:15. ప్రవేశాత్పరతః గోష్ఠాష్టమీ, వృశ్చిక సంక్రమణం18/11 ప.04:45 శు.నవమి బుధ ఘ.49:40, రా.గం.1:01. శతభిషం రా.గం.2:23. వ్యాఘాతం తె.గం.5:05. బాలవ ప.గం.1:35. అహస్సు ఘ.27:58. వర్జ్యం ఉ.గం.8:36ల 10:18వ. అమృ సా.గం.6:46ల 8:28వ. భు.ఘ.00:10:48. íమ.దు.11:23ల 12:08వ. 19/11 సా.04:45 శు.దశమి గురు ఘ.50:36, రా.గం.2:24. పూర్వాభాద్ర తె.గం.5:20. హర్షణం తె.గం.4:10. తైతుల ప.గం.2:13. అహస్సు ఘ.27:56. వర్జ్యం ఉ.గం.9:03ల 10:43వ. అమృ సా.గం.7:02ల 8:42వ. భు.ఘ.00:22:8. ఉ.దు.9:53ల10:38వ. మ.దు.2:21ల 3:06వ.20/11 ప.03:40 శు.ఏకాదశి శుక్ర ఘ.50:05, రా.గం.2:12. ఉత్తరాభాద్ర తె.గం.3:43. వజ్రం రా.గం.2:46. వనిక్ ప.గం.2:18. అహస్సు ఘ.27:54. వర్జ్యం ప.గం.1:05ల 2:42వ. అమృ రా.గం.10:50ల 12:28వ. భు.ఘ.00:33:28. ఉ.దు.8:25ల 9:10వ. మ.దు.12:08ల 12:53వ. 21/11 ప.02:25 శు.ద్వాదశి శని ఘ.48:22, రా.గం.1:34. రేవతి తె.గం.3:43. సిద్ధి రా.గం.1:04. బవ ప.గం.1:53. అహస్సు ఘ.27:52. వర్జ్యం ప.గం.3:43ల 5:19వ. అమృ రా.గం.1:19ల 2:55వ. భు.ఘ.00:44:48. ఉ.దు.6:11ల 7:42వ. క్షీరాబ్ధిద్వాదశీ 22/11 ఉ.08:00 శు.త్రయోదశి ఆది ఘ.45:34, రా.గం.12:26. అశ్విని రా.తె.గం.3:10. వ్యతీపాత రా.గం.10:06. కౌలవ ప.గం.1:00. అహస్సు ఘ.27:50. వర్జ్యం రా.గం.11:16ల 12:50వ. అమృ రా.గం.8:08ల 9:42వ. భు.ఘ.00:56:8. సా.దు.3:51ల 4:36వ.23/11 ఉ.06:30 శు.చతుర్దశి సోమ ఘ.41:52, రా.గం.10:58. భరణి రా.గం.2:19. వరీయాన్ రా.గం.8:34. గరజి ప.గం.11:42. అహస్సు ఘ.27:48. వర్జ్యం ప.గం.12:14ల 1:46వ. అమృ రా.గం.9:41ల 11:13వ. భు.ఘ.1:7:28. ప.దు.12:09ల 12:53వ. పునః ప.2:23ల 3:07వ.24/11 ప.12:15 ఝ శు.పౌర్ణమి మంగళ ఘ.37:11, రా.గం.9:06. కృత్తిక రా.గం.1:05. పరిఘ సా.గం.5:53. విష్టి ఉ.గం.10:02. అహస్సు ఘ.27:46. వర్జ్యం ప.గం.1:42ల 3:12వ. అమృ రా.గం.10:59ల 12:29వ. భు.ఘ.1:18:48. ఉ.దు.8:27ల 9:11వ. రా.దు.10:29ల 11:13వ. కార్తీకవ్రతోద్యాపనం, కేశబంధనగౌరీవ్రతం, జ్వాలాతోరణం, కుమారస్వామి దర్శనం25/11 సా.04:30 బహుళ పాడ్యమి బుధ ఘ.32:01, రా.గం.7:02. రోహిణి రా.గం.11:41. శివం ప.గం.3:02. బాలవ ఉ.గం.8:04. అహస్సు ఘ.27:46. వర్జ్యం ప.గం.4:09ల 5:39వ. పునః తె.గం.4:54ల 6:14వ. అమృ రా.గం.8:40ల 10:10వ. భు.ఘ.1:30:8. మ.దు.11:25ల 12:09వ. యాగకాలం26/11 సా.04:30 బ.విదియ గురు ఘ.25:28, సా.గం.4:25. మృగశిర రా.గం.10:04. సిద్ధం ప.గం.12:01. గరజి సా.గం.4:25. అహస్సు ఘ.27:44. వర్జ్యం శేషం గం.6:14ల 6:23వ. పునః తె.5:52ల 6:15వ. అమృ ప.గం.1:51ల 3:20వ. భు.ఘ.1:41:28. ఉ.దు.09:57ల 10:41వ. మ.దు.2:22ల 3:16వ. చాతుర్మాస్యద్వితీయ, అశూన్యశయనవ్రతం27/11 రా.08:15 బ.తదియ శుక్ర ఘ.19:59, ప.గం.2:15. ఆర్ద్ర రా.గం.8:24. సాధ్యం ఉ.8:54. శుభం తె.గం.5:46. భద్ర ప.గం.2:15. అహస్సు ఘ.27:42. వర్జ్యం శేషం ఉ.గం.6:15ల 7:21వ. అమృ ప.గం.11:06ల 12:35వ. భు.ఘ.1:52:48. ఉ.దు.8:28ల 9:12వ. మ.దు.12:10ల 12:54వ. సంకటహర చతుర్థి28/11 సా.06:30 బ.చవితి శని ఘ.14:18, ప.గం.11:58. పునర్వసు సా.గం.6:39. శుక్లం రా.గం.2:28. బాలవ ప.గం.11:58. అహస్సు ఘ.27:42. వర్జ్యం ఉ.గం.7:32ల 9:01వ. పునః రా.గం.2:09ల 3:39వ. అమృ ప.గం.4:26ల 5:55వ. భు.ఘ.2:4:8. ఉ.దు.6:15ల 7:45వ. 29/11 ఉ.09:00 బ.పంచమి ఆది ఘ.8:45, ఉ.గం.9:46. పుష్యమి సా.గం.5:10. బ్రహ్మం రా.గం.11:34. తైతుల ఉ.గం.9:46. అహస్సు ఘ.27:40. వర్జ్యం రా.తె.గం.5:13ల 6:43వ. అమృ ప.గం.11:10ల 12:40వ. భు.ఘ.2:15:28. సా.దు.3:52ల 4:36వ.30/11 సా.06:30 బ.షష్ఠి సోమ ఘ.3:25, ఉ.గం.7:39. బ.సప్తమి ఘ.54:45, తె.గం.5:37. ఆశ్లేష ప.3:47. ఐంద్రం రా.గం.8:44. వనిక్ ఉ.గం.7:39. విష్టి సా.గం.6:36. అహస్సు ఘ.27:38. వర్జ్యం శేషం ఉ.గం.6:17ల 6:43. పునః రా.తె.గం.3:12ల 4:43వ. అమృ ప.గం.2:16ల 4:43వ. భు.ఘ.2:26:48. ప.దు.12:10ల 12:54వ. పునః ప.2:23ల 3:07వ. 01/12 సా.06:30 బ.అష్టమి మంగళ ఘ.54:03, రా.గం.3:54. మఘ ప.గం.2:37. వైధృతి సా.గం.6:01. బాలవ సా.గం.4:45. అహస్సు ఘ.27:36.వర్జ్యం రా.గం.10:20ల 11:53వ. అమృ ప.గం.12:20ల 1:51వ. భు.ఘ.2:38:8. ఉ.దు.8:31ల 9:15వ. రా.దు.10:31ల 11:15వ.02/12 సా.04:30 బ.నవమి బుధ ఘ.50:54, రా.గం.2:40. పుబ్బ ప.గం.1:46. విష్కంభం ప.గం.3:42. తైతుల ప.గం.3:17. అహస్సు ఘ.27:34. వర్జ్యం రా.గం.8:50ల 10:24వ. అమృ ఉ.గం.7:36ల 9:09వ. భు.ఘ.2:49:28. మ.దు.11:28ల 12:12వ.03/12 సా.05:00 బ.దశమి గురు ఘ.48:43, రా.గం.1:47. ఉత్తర ప.గం.1:19. ప్రీతి ప.గం.1:37. వనిక్ ప.గం.2:13. అహస్సు ఘ.27:34. వర్జ్యం రా.గం.9:43ల 11:19వ. అమృ ఉ.గం.6:15ల 7:49. భు.ఘ.3:00:48. మ.దు.11:28ల 12:12వ.04/12 ఉ.07:00 బ.ఏకాదశి శుక్ర ఘ.47:53, రా.గం.1:29. హస్త ప.గం.1:18. ఆయుష్మాన్ ప.గం.11:53. బవ ప.గం.1:37. అహస్సు ఘ.27:34. వర్జ్యం రా.గం.9:27ల 11:05వ. అమృ ఉ.గం.7:18ల 8:54వ. భు.ఘ.3:12:8. ఉ.దు.8:31ల 9:15వ. మ.దు.12:11ల 12:55వ.05/12 సా.06:30 బ.ద్వాదశి శని ఘ.48:06, రా.గం.1:33. చిత్త ప.గం.1:46. సౌభాగ్యం ఉ.గం.10:33. కౌలవ ప.గం.1:31. అహస్సు ఘ.27:32. వర్జ్యం రా.గం.7:36ల 9:16వ. అమృ ఉ.గం.7:15ల 8:53వ. పునరమ తె.గం.5:35ల 6:19వ. భు.ఘ.3:23:28. ఉ.దు.6:19ల 7:49వ.06/12 ప.02:30 బ.త్రయోదశి ఆది ఘ.49:50, రా.గం.2:15. స్వాతి ప.గం.2:44. శోభ ఉ.గం.9:35. గరజి ప.గం.1:44. అహస్సు ఘ.27:32. వర్జ్యం రా.గం.8:40ల 10:22వ. అమృ ఉ.గం.6:19ల 7:15వ. భు.ఘ.3:34:48. సా.దు.3:54ల 4:38వ.07/12 ఉ.06:50 బ.చతుర్దశి సోమ ఘ.52:35, రా.గం.3:22. విశాఖ ప.గం.4:12. అతిగండ 9:04. విష్టి ప.గం.2:49. అహస్సు ఘ.27:30. వర్జ్యం రా.గం.8:30ల 10:14వ. అమృ ఉ.గం.6:52ల 8:34వ. భు.ఘ.3:46:8. ప.దు.12:13ల 12:57వ. పునః ప.2:25ల 3:09వ. మాసశివరాత్రి08/12 ఉ.10:15 ∙బ.అమావాస్య మంగళ ఘ.56:38, రా.తె.గం.5:00. అనురాధ సా.గం.6:06. సుకర్మ ఉ.గం.8:51. చతుష్పాత్ సా.గం.4:11. అహస్సు ఘ.27:30. వర్జ్యం రా.గం.12:13ల 1:58వ. అమృ ఉ.గం.6:53ల 8:37వ. భు.ఘ.3:57:28. ఉ.దు.8:33ల 9:17వ. రా.దు.10:33ల 11:17వ. కౌముద్యుత్సవం, తర్పణాలకు అమావాస్యస్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతఋతువు, మార్గశిర మాసం09/12 ఉ.09:30 శుద్ధ పాడ్యమి బుధ పూర్తి. జ్యేష్ఠ రా.గం.8:21. ధృతి ఉ.గం.8:59. కింస్తుఘ్నం సా.గం.5:59. అహస్సు ఘ.27:28. వర్జ్యం రా.తె.గం.5:13ల 6:22వ. అమృ ఉ.గం.10:43ల 12:28వ. భు.ఘ.4:8:48. మ.దు.11:30ల 12:14వ. 10/12 సా.05:00 శు.పాడ్యమి గురు ఘ.1:32, ఉ.గం.6:59. మూల రా.గం.10:54. శూల ఉ.గం.9:21. బవ ఉ.గం.6:59. అహస్సు ఘ.27:28. వర్జ్యం శేషం ఉ.గం.6:22ల 6:59వ. పునః రా.గం.9:08ల 10:54వ. అమృ ప.గం.2:50ల 4:36వ. భు.ఘ.4:20:8. ఉ.దు.10:03ల 10:47వ. మ.దు.2:26ల 3:10వ. చంద్రదర్శనం (నెలపొడుపు)11/12 ప.03:30 శు.విదియ శుక్ర ఘ.6:54, ఉ.గం.9:09. పూర్వాషాఢ రా.గం.1:33. గండ ఉ.గం.9:53. కౌలవ ఉ.గం.9:09. అహస్సు ఘ.27:28. వర్జ్యం ఉ.గం.9:46ల 11:32వ. అమృ రా.గం.8:13ల 9:59వ. భు.ఘ.4:31:28. ఉ.దు.8:36ల 9:20వ. మ.దు.12:15ల 12:59వ. రంభావ్రతం12/12 సా.05:40 శు.తదియ శని ఘ.12:18, ప.గం.11:19. ఉత్తరాషాఢ రా.తె.గం.4:07. వృద్ధి ఉ.గం.10:26. గరజి ప.గం.11:19. అహస్సు ఘ.27:26. వర్జ్యం ఉ.గం.10:25ల 12:11వ. అమృ రా.గం.9:20ల 10:48వ. భు.ఘ.4:42:48. ఉ.దు.6:24ల 7:52వ.13/12 ప.11:40 శు.చవితి ఆది ఘ.17:3, ప.గం.1:14. శ్రవణం పూర్తి. ధ్రువం ఉ.గం.10:52. భద్ర ప.గం.10:14. అహస్సు ఘ.27:26. వర్జ్యం ఉ.గం.8:35ల 10:21వ. అమృ రా.గం.7:15ల 9:01వ. భు.ఘ.4:54:8. సా.దు.3:56ల 4:40వ.14/12 సా.06:30 శు.పంచమి సోమ ఘ.21:44, ప.గం.3:07. ధనిష్ఠ పూర్తి. వ్యాఘాతం ఉ.11:05. బాలవ ప.గం.3:07. అహస్సు ఘ.27:26. వర్జ్యం ఉ.గం.10:45ల 12:29వ. అమృ రా.గం.9:07ల 10:49వ. భు.ఘ.5:5:28. ప.దు.12:17ల 1:01వ. పునః ప.2:28ల 3:12వ. నాగపంచమీ15/12 రా.07:30 శు.షష్ఠి మంగళ ఘ.25:05, ప.గం.4:28. ధనిష్ఠ ఉ.గం.8:23. హర్షణం ప.గం.11:01. తైతుల ప.గం.4:28. అహస్సు ఘ.27:24. వర్జ్యం ప.గం.4:01ల 5:41వ. అమృ రా.గం.2:12ల 3:54వ. భు.ఘ.5:16:48. ఉ.దు.8:37ల 9:23వ. రా.దు.10:37ల 11:21వ. 16/12 ఉ.09:30 శు.సప్తమి బుధ ఘ.27:10, సా.గం.5:18. శతభిషం ఉ.గం.9:51. వజ్రం ఉ.గం.10:35. వనిక్ సా.గం.5:18. అహస్సు ఘ.27:24. వర్జ్యం ప.గం.4:32ల 6:12వ. అమృ రా.గం.2:34ల 4:14వ. భు.ఘ.5:28:8. పు.భు.5:34. మ.దు.11:34ల 12:18వ. మూల 1 రవిః 07:13. ప్రవేశదినే ధనుస్సంక్రమణం మిత్రసప్తమీ, నందాసప్తమీ17/12 ప.11:15 శు.అష్టమి గురు ఘ.28:01, సా.గం.5:39. పూర్వాభాద్ర ఉ.గం.10:56. సిద్ధి ఉ.గం.9:48. బవ సా.గం.5:39. అహస్సు ఘ.27:24. వర్జ్యం రా.గం.8:45ల 10:23వ. భు.ఘ.00:5:4. ఉ.దు.10:06ల 10:50వ. మ.దు.2:29ల 3:13వ. కాలభైరవాష్టమీ18/12 రా.08:30 శు.నవమి శుక్ర ఘ.27:39, ప.గం.5:31. ఉత్తరాభాద్ర ప.గం.11:29. వ్యతీపాత ఉ.గం.8:35. కౌలవ ప.గం.5:31. అహస్సు 27:24. వర్జ్యం రా.గం.11:30ల 1:06వ. అమృ ఉ.గం.6:34ల 8:12వ. భు.ఘ.00:15:5. ఉ.దు.8:39ల 9:23వ. మ.దు.12:19ల 1:13వ.19/12 ప.02:30 శు.దశమి శని ఘ.25:53, సా.గం.4:49. రేవతి ప.గం.11:32. వరీయాన్ ఉ.7:00. పరిఘ తె.గం.5:18. గరజి సా.గం.4:49. అహస్సు ఘ.27:24. వర్జ్యం లేదు. అమృ ఉ.గం.9:09ల 7:15వ. పునః రా.తె.గం.4:04ల 5:38వ. భు.ఘ.00:25:26. ఉ.దు.6:28ల 7:56వ.20/12 ప.11:25 శు.ఏకాదశి ఆది ఘ.23:08, ప.గం.3:43. అశ్విని ప.గం.11:09. శివం రా.గం.2:50. భద్ర ప.గం.3:43. అహస్సు ఘ.27:24. వర్జ్యం ఉ.గం.7:13ల 8:47వ. పునః రా.8:26ల 9:59వ. అమృ తె.గం.5:43ల 7:16వ. భు.ఘ.00:36:47. సా.దు.3:58ల 4:42వ. ముక్కోటి ఏకాదశి, గీతా జయంతి21/12 సా.06:45 శు.ద్వాదశి సోమ ఘ.19:20, ప.గం.2:12. భరణి ఉ.గం.10:22. సిద్ధం రా.గం.12:12. బాలవ ప.గం.2:12. అహస్సు ఘ.27:24. వర్జ్యం రా.గం.9:48ల 11:20వ. అమృ ఉ.గం.7:16ల 8:46వ. భు.ఘ.00:47:38. ప.దు.12:19ల 1:03వ. పునః ప.2:31ల 3:15వ.22/12 సా.05:00 శు.త్రయోదశి మంగళ ఘ.14:45, ప.గం.12:23. కృత్తిక ఉ.గం.9:15. సాధ్యం రా.గం.9:22. తైతుల ప.గం.12:23. అహస్సు ఘ.27:22. వర్జ్యం రా.గం.12:21ల 1:51వ. అమృ ఉ.గం.6:58ల 8:30వ. పునరమ తె.గం.4:53ల 6:23వ. భు.ఘ.00:58:29. ఉ.దు.8:40ల 9:24వ. రా.దు.10:39ల 11:23వ. హనుమద్వ్రతం23/12 సా.04:40 శు.చతుర్దశి బుధ ఘ.9:36, ఉ.గం.10:19. రోహిణి ఉ.7:54. మృగశిర తె.గం.6:22. శుభం సా.6:22. వనిక్ ఉ.గం.10:09. అహస్సు ఘ.27:22. వర్జ్యం ప.గం.1:08ల 2:37వ. రా.గం.10:07ల 11:37వ. భు.ఘ.1:9:20. మ.దు.11:37ల 12:21వ. దత్తజయంతీ, పాషాణచతుర్దశీ, నోములకు పౌర్ణమి24/12 సా.06:00 ఝ శు.పౌర్ణమి గురు ఘ.3:57, ఉ.గం.8:05.బహుళ పాడ్యమి ఘ.54:11, తె.గం.5:45. ఆర్ద్ర రా.గం.4:42. శుక్లం ప.గం.3:17. బవ ఉ.గం.8:05. బాలవ సా.గం.6:55. అహస్సు ఘ.27:22. వర్జ్యం ప.గం.2:12ల 3:41వ. అమృ రా.గం.7:15ల 9:44వ. భు.ఘ.1:20:11. ఉ.దు.10:09ల 11:53వ. మ.దు.2:32ల 3:16వ. యాగకాలం25/12 సా.05:45 బ.విదియ శుక్ర ఘ.52:07, రా.గం.3:21. పునర్వసు రా.గం.3:00. బ్రహ్మం ప.గం.12:07. తైతుల సా.గం.4:33. అహస్సు ఘ.27:22. వర్జ్యం ప.గం.3:51ల 5:20వ. అమృ రా.గం.12:46ల 2:15వ. భు.ఘ.1:31:2. ఉ.దు.8:41ల 9:25వ. మ.దు.12:20ల 1:04వ.26/12 సా.06:30 బ.తదియ శని ఘ.46:26, రా.గం.1:05. పుష్యమి రా.గం.1:24. ఐంద్రం ఉ.9:00. వైధృతి తె.గం.6:00. వనిక్ ప.గం.2:13. అహస్సు ఘ.27:24. వర్జ్యం ప.గం.10:29ల 11:58వ. అమృ సా.గం.7:26ల 8:55వ. భు.ఘ.1:41:53. ఉ.దు.6:31ల 7:59వ.27/12 సా.06:30 బ.చవితి ఆది ఘ.41:6, రా.గం.10:57. ఆశ్లేష రా.గం.11:58. విష్కంభం రా.గం.2:56. బవ ప.గం.12:00. అహస్సు ఘ.27:24. వర్జ్యం ప.గం.1:26ల 2:56వ. అమృ రా.గం.10:27ల 11:57వ. భు.ఘ.1:52:44. సా.దు.4:02ల 4:46వ. సంకటహర చతుర్థి28/12 సా.06:00 బ.పంచమి సోమ ఘ.36:18, రా.గం.9:03. మఘ రా.గం.10:44. ప్రీతి రా.గం.12:12. కౌలవ ప.గం.10:01. అహస్సు ఘ.27:14. వర్జ్యం ప.గం.11:22ల 12:52వ. అమృ రా.గం.8:08ల 9:38వ. భు.ఘ.2:3:35. ప.దు.12:23ల 1:07వ. పునః ప.2:34ల 3:18వ.29/12 సా.06:00 బ.షష్ఠి మంగళ ఘ.32:21, సా.గం.7:28. పుబ్బ రా.గం.9:50. ఆయుష్మాన్ రా.గం.9:43. గరజి ఉ.గం.8:16. అహస్సు ఘ.27:24. వర్జ్యం ఉ.గం.6:26ల 7:58వ. పునః తె.గం.4:52ల 6:26వ. అమృ రా.తె.గం.3:40ల 5:12వ. భు.ఘ.2:14:26. ఉ.దు.8:44ల 9:28వ. రా.దు.10:44ల 11:28వ.30/12 సా.05:00 బ.సప్తమి బుధ ఘ.29:13, సా.గం.6:14. ఉత్తర రా.గం.9:16. సౌభాగ్యం రా.గం.7:32. విష్టి ఉ.గం.6:50. అహస్సు ఘ.27:24. వర్జ్యం తె.గం.5:38ల 6:34వ. అమృ ప.గం.2:14ల 3:48వ. భు.ఘ.2:25:17. మ.దు.11:41ల 12:25వ. 31/12 సా.06:00 బ.అష్టమి గురు ఘ.27:17, సా.గం.5:29. హస్త రా.గం.9:12. శోభ సా.గం.5:45. కౌలవ సా.గం.5:21. అహస్సు ఘ.27:24. వర్జ్యం ఉ.గం.6:34ల 7:14వ. పునః తె.గం.5:18ల 6:35వ. అమృ ప.గం.3:13ల 4:49వ. భు.ఘ.2:36:8. ఉ.దు.10:14ల 10:58వ. మ.దు.2:37ల 3:21వ.01/01 సా.03:30 బ.నవమి శుక్ర ఘ.25:26, సా.గం.4:45. చిత్త రా.గం.9:32. అతిగండ సా.గం.4:14. గరజి సా.గం.4:45. అహస్సు ఘ.27:26. వర్జ్యం ఉ.గం.6:35ల 6:55వ. పునః రా.తె.3:20ల 5:00వ. అమృ ప.గం.3:03ల 4:40వ. భు.ఘ.2:46:59. ఉ.దు.8:47ల 9:31వ. మ.దు.12:26ల 1:10వ.02/01 సా.06:00 బ.దశమి శని ఘ.26:56, సా.గం.5:21. స్వాతి రా.గం.10:23. సుకర్మ ప.గం.3:08. భద్ర సా.గం.5:21. అహస్సు ఘ.27:26. వర్జ్యం రా.తె.గం.4:17ల 5:58వ. అమృ ప.గం.1:17ల 2:56వ. భు.ఘ.2:57:50. ఉ.దు.6:35ల 8:03వ.03/01 సా.07:00 బ.ఏకాదశి ఆది ఘ.28:41, సా.గం.6:03. విశాఖ రా.గం.11:39. ధతి ప.గం.2:27. బాలవ సా.గం.6:03. అహస్సు ఘ.27:26. వర్జ్యం రా.తె.గం.3:57ల 5:41వ. అమృ ప.గం.2:23ల 4:04వ. భు.ఘ.3:8:41. సా.దు.4:07ల 4:51వ. 04/01 సా.07:00 బ.ద్వాదశి సోమ ఘ.31:43, రా.గం.7:17. అనురాధ రా.గం.1:34. శూల ప.గం.2:09. కౌలవ ఉ.గం.6:39. అహస్సు ఘ.27:26. వర్జ్యం లేదు. అమృ ప.గం.2:20ల 4:04వ. భు.ఘ.3:19:32. ప.దు.12:28ల 1:12వ. పునః ప.2:39ల 3:23వ.05/01 సా.06:00 బ.త్రయోదశి మంగళ ఘ.35:48, రా.గం.8:55. జ్యేష్ఠ రా.గం.3:44. గండ ప.గం.2:10. గరజి ఉ.గం.8:06. అహస్సు ఘ.27:28. వర్జ్యం ఉ.గం.7:40ల 9:25వ. అమృ సా.గం.6:08ల 7:53వ. భు.ఘ.3:30:23. ఉ.దు.8:48ల 9:32వ. రా.దు.10:47ల 11:31వ.06/01 సా.04:50 బ.చతుర్దశి బుధ ఘ.40:41, రా.గం.10:52. మూల రా.తె.గం.6:13. వృద్ధి ప.గం.2:27. విష్టి ఉ.గం.9:54. అహస్సు ఘ.27:28. వర్జ్యం ప.గం.12:34ల 2:20వ. పునః రా.తె.4:27ల 6:13వ. అమృ రా.గం.11:09ల 12:55వ. భు.ఘ.3:41:14. మ.దు.11:44ల 12:28వ.07/01 సా.06:00 ∙బ.అమావాస్య గురు ఘ.46:6, రా.గం.1:02. పూర్వాషాఢ పూర్తి. ధ్రువం ప.గం.2:55. చతుష్పాత్ ప.గం.11:57. అహస్సు ఘ.27:30. వర్జ్యం సా.గం.4:52ల 6:38వ. అమృ రా.తె.గం.3:32ల 5:18వ. భు.ఘ.3:52:5. ఉ.దు.10:17ల 11:01వ. మ.దు.2:41ల 3:25వ. తర్పణాలకు అమావాస్యస్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, జనవరి 15 నుండి ఉత్తరాయనం హేమంతఋతువు, పుష్య మాసం08/01 రా.08:45 శుద్ధ పాడ్యమి శుక్ర ఘ.51:36, రా.గం.1:15. పూర్వాషాఢ ఉ.గం.8:53. వ్యాఘాతం ప.గం.3:28. కింస్తుఘ్నం ప.గం.2:09. అహస్సు ఘ.27:30. వర్జ్యం సా.గం.5:44ల 7:30వ. అమృ రా.తె.గం.4:22ల 6:08వ. భు.ఘ.4:2:53. ఉ.దు.8:49ల 9:33వ. మ.దు.12:29ల 1:13వ. యాగకాలం.09/01 ఉ.11:15 శు.విదియ శని ఘ.56:31, రా.తె.గం.5:13. ఉత్తరాషాఢ ఉ.గం.11:27. హర్షణం ప.గం.3:57. బవ ప.గం.4:14. అహస్సు ఘ.27:32. వర్జ్యం ప.గం.3:51ల 5:37వ. అమృ రా.గం.2:24ల 4:10వ. భు.ఘ.4:13:44. ఉ.దు.6:37ల 8:05వ. చంద్రదర్శనం.10/01 ఉ.08:00 శు.తదియ ఆది పూర్తి. శ్రవణం ప.గం.1:50. వజ్రం ప.గం.4:14. తైతుల సా.గం.6:05. అహస్సు ఘ.27:32. వర్జ్యం సా.గం.6:10ల 7:54వ. అమృ రా.గం.4:35ల 6:19వ. భు.ఘ.4:24:35. సా.దు.4:10ల 4:54వ.11/01 ఉ.07:00 శు.తదియ సోమ ఘ.00:49, ఉ.గం.6:57. ధనిష్ఠ ప.గం.3:53. సిద్ధి ప.గం.4:16. గరజి ఉ.గం.6:57. అహస్సు ఘ.27:32. వర్జ్యం రా.గం.11:35ల 1:17వ. భు.ఘ.4:35:26. ప.దు.12:30ల 1:14వ. పునః ప.2:42ల 3:26వ.12/01 ఉ.10:30 శు.చవితి మంగళ ఘ.4:04, ఉ.గం.7:15. శతభిషం సా.గం.5:31. వ్యతీపాత ప.గం.3:57. భద్ర ఉ.గం.7:15. అహస్సు ఘ.27:34. వర్జ్యం రా.గం.12:14ల 1:55వ. అమృ ప.గం.9:49ల 11:31వ. భు.ఘ.4:46:17. సిజేరియన్ ప.12:00. ఉ.దు.8:50ల 9:34వ. రా.దు.10:50ల 11:34వ.13/01 ఉ.07:00 శు.పంచమి బుధ ఘ.6:06, ఉ.గం.8:03. పూర్వాభాద్ర సా.గం.6:41. వరీయాన్ ప.గం.3:18. బాలవ ఉ.గం.8:03. అహస్సు ఘ.27:36. వర్జ్యం రా.తె.గం.4:33ల 6:11వ. అమృ ప.గం.10:18ల 11:59వ. భు.ఘ.4:57:8. మ.దు.11:47ల 12:31వ.14/01 ప.11:00 శు.షష్ఠి గురు ఘ.6:53, ఉ.గం.9:23. ఉత్తరాభాద్ర సా.గం.7:20. పరిఘ ప.గం.2:14. తైతుల ఉ.గం.9:23. అహస్సు ఘ.27:36. వర్జ్యం లేదు. అమృ ప.గం.2:25ల 4:03వ. భు.ఘ.5:7:59. పు.భు.5:18. ఉ.దు.10:19ల 11:03వ. మ.దు.2:44ల 3:28వ. మకరే రవిః రా.తె.3:06. ప్రవేశాత్ మకర సంక్రమణ ప్రయుక్త ఉత్తరాయణ పుణ్యకాలః భోగి, మకర సంక్రమణం15/01 ఉ.07:00 శు.సప్తమి శుక్ర ఘ.6:18, ఉ.గం.9:09. రేవతీ రా.గం.7:32. శివం ప.గం.12:46. వనిక్ ఉ.గం.9:09. అహస్సు ఘ.27:38. వర్జ్యం ఉ.గం.7:26ల 9:03వ. అమృ ప.గం.1:06ల 2:43వ. భు.ఘ.00:01:24. ఉ.దు.8:51ల 9:35వ. మ.దు.12:36ల 1:16వ. ఉత్తరాషాఢ 2 రవిః రా.తె.3:06. సంక్రాంతి. తర్పణాలకు ప.3:06 వరకు పుణ్యకాలం.16/01 ప.12:00 శు.అష్టమి శని ఘ.4:35, ఉ.గం.8:28. అశ్విని రా.గం.7:13. సిద్ధం ఉ.గం.10:56. బవ ఉ.గం.8:28. అహస్సు ఘ.27:40. వర్జ్యం ప.గం.3:16ల 4:51వ. పునః తె.గం.4:32ల 6:05వ. అమృ ప.గం.12:07ల 1:42వ. భు.ఘ.00:10:54. ఉ.దు.6:38ల 8:06వ. కనుమ17/01 ఉ.09:00 శు.నవమి ఆది ఘ.1:40, ఉ.గం.7:18. శు.దశమి ఘ.56:24, తె.గం.5:52. భరణి సా.గం.6:31. సాధ్యం ఉ.గం.8:44. శుభం తె.గం.6:19. కౌలవ ఉ.గం.7:18. తైతుల సా.గం.6:35. అహస్సు ఘ.27:40. వర్జ్యం రా.తె.గం.6:00ల 6:38వ. అమ ప.గం.1:52ల 3:25వ. భు.ఘ.00:20:24. సా.దు.4:14ల 4:58వ.18/01 సా.07:00 శు.ఏకాదశి సోమ ఘ.53:33, రా.తె.గం.4:03. కృత్తిక సా.గం.5:30. శుక్లం రా.తె.గం.4:37. వనిక్ సా.గం.4:58. అహస్సు ఘ.27:42. వర్జ్యం శేషం ఉ.గం.6:38ల 7:32వ. అమృ ప.గం.3:12ల 4:44వ. భు.ఘ.0:29:44. ప.దు.12:33ల 1:18వ. పునః ప.2:46ల 3:31వ. మతత్రయ పుత్రదా ఏకాదశి, రైవతమన్వాది19/01 రా.07:50 శు.ద్వాదశి మంగళ ఘ.48:04, రా.గం.1:52. రోహిణి ప.గం.4:10. బ్రహ్మం రా.గం.12:38. బవ ప.గం.2:57. అహస్సు ఘ.27:44. వర్జ్యం ఉ.గం.8:37ల 10:07వ. పునః రా.గం.9:22ల 10:51వ. అమృ ప.గం.1:09ల 2:39వ. పునఃతె.గం.6:16ల 6:38వ. భు.ఘ.0:39:24. ఉ.దు.8:51ల 9:36వ. రా.దు.10:54ల 11:39వ. కూర్మద్వాదశీ20/01 రా.08:00 శు.త్రయోదశి బుధ ఘ.41:53, రా.గం.11:23. మృగశిర ప.గం.2:27. ఐంద్రం రా.గం.9:33. కౌలవ ప.గం.12:37. అహస్సు ఘ.27:44. వర్జ్యం రా.గం.10:21ల 11:51వ. అమృ ఉ.గం.6:38ల 7:45వ. పునః తె.గం.3:36ల 5:06వ. భు.ఘ.0:48:54. మ.దు.11:49ల 12:34వ.21/01 రా.06:45 శు.చతుర్దశి గురు ఘ.36:29, రా.గం.9:14. ఆర్ద్ర ప.గం.1:01. వైధతి సా.గం.6:24. గరజి ఉ.గం.10:18. అహస్సు ఘ.27:46. వర్జ్యం రా.గం.12:11ల 1:40వ. భు.ఘ.0:58:24. ఉ.దు.10:120ల 11:05వ. మ.దు.2:47ల 3:32వ.22/01 ఉ.08:00 ఝ శు.పౌర్ణమి శుక్ర ఘ.30:34, రా.గం.6:52. పునర్వసు ప.గం.11:21. విష్కంభం ప.గం.3:15. విష్టి ఉ.గం.8:02. అహస్సు ఘ.27:48. వర్జ్యం రా.గం.6:52ల 8:21వ. అమృ ఉ.గం.9:07ల 10:36వ. పునరమ తె.గం.3:46ల 5:16వ. భు.ఘ.1:7:54. ఉ.దు.8:52ల 9:37వ. మ.దు.12:34ల 1:19వ. 23/01 సా.06:00 బహుళ పాడ్యమి శని ఘ.24:54, ప.గం.4:36. పుష్యమి ఉ.గం.9:44. ప్రీతి ప.గం.12:10. కౌలవ ప.గం.4:36. అహస్సు ఘ.27:50. వర్జ్యం రా.గం.9:44ల 11:14వ. శ్రాద్ధతిథి పాడ్యమి. భు.ఘ.1:17:24. ఉ.దు.6:38ల 8:07వ. 24/01 సా.06:50 బ.విదియ ఆది ఘ.19:36, ప.గం.2:28. ఆశ్లేష ఉ.గం.8:15. ఆయుష్మాన్ ఉ.గం.9:11. సౌభాగ్యం తె.గం.6:15. గరజి ప.గం.2:28. అహస్సు ఘ.27:52. వర్జ్యం రా.గం.7:36ల 9:06వ. అమృ ఉ.గం.6:45ల 8:15వ. పునరమ తె.గం.4:47ల 6:17. భు.ఘ.1:26:54. సా.దు.4:18ల 5:03వ.25/01 ప.12:00 బ.తదియ సోమ ఘ.14:51, ప.గం.12:36. మఘ ఉ.గం.6:58. పుబ్బ రా.తె.గం.5:52. శోభ రా.తె.గం.3:42. భద్ర ప.గం.12:36. అహస్సు ఘ.27:52. వర్జ్యం ప.గం.2:36ల 4:08వ. అమృ రా.గం.11:47ల 11:19వ. భు.ఘ.1:36:24. ప.దు.12:35ల 1:20వ. పునః ప.2:49ల 3:34వ. సంకటహర చతుర్థి26/01 ప.11:00 బ.చవితి మంగళ ఘ.10:57, ప.గం.11:01, ఉత్తర తె.గం.5:10. అతిగండ రా.గం.1:23. బాలవ ప.గం.11:01. అహస్సు ఘ.27:54. వర్జ్యం ప.గం.12:51ల 2:24వ. అమృ రా.గం.10:13ల 11:46వ. భు.ఘ.1:45:54. ఉ.దు.8:52ల 9:36వ. రా.దు.10:56ల 11:41వ.27/01 ప.09:50 బ.పంచమి బుధ ఘ.7:57, ఉ.గం.9:49. హస్త తె.గం.5:00. సుకర్మ రా.గం.11:28. తైతుల ఉ.గం.9:49. అహస్సు ఘ.27:56. వర్జ్యం ప.గం.1:31ల 3:06వ. అమృ రా.గం.11:02ల 12:37వ. భు.ఘ.1:55:24. మ.దు.11:51ల 12:36వ.28/01 సా.07:15 బ.షష్ఠి గురు ఘ.6:04, ఉ.గం.9:04. చిత్త తె.గం.5:11. ధతి రా.గం.9:50. వనిక్ ఉ.గం.9:04. అహస్సు ఘ.27:58. వర్జ్యం ప.గం.1:04ల 2:41వ. అమృ రా.గం.10:44ల 12:21వ. భు.ఘ.2:4:54. ఉ.దు.10:21ల 11:06వ. మ.దు.2:50ల 3:35వ.29/01 సా.04:00 బ.సప్తమి శుక్ర ఘ.5:19, ఉ.గం.8:45. స్వాతి తె.గం.5:57. శూల రా.గం.8:38. బవ ఉ.గం.8:45. అహస్సు ఘ.28:00. వర్జ్యం ప.గం.10:57ల 12:36వ. అమృ రా.గం.9:52ల 11:31వ. భు.ఘ.2:14:24. ఉ.దు.8:52ల 9:37వ. మ.దు.12:36ల 1:21వ.30/01 సా.06:00 బ.అష్టమి శని ఘ.5:55, ఉ.గం.8:59. విశాఖ పూర్తి. గండ రా.గం.7:48. కౌలవ ఉ.గం.8:59. అహస్సు ఘ.28:02. వర్జ్యం ప.గం.11:52ల 1:33వ. అమృ రా.గం.9:59ల 11:40వ. భు.ఘ.2:23:54. ఉ.దు.6:37ల 8:07వ.31/01 సా.07:00 బ.నవమి ఆది ఘ.7:52, ఉ.గం.9:46. విశాఖ ఉ.గం.7:17. వృద్ధి రా.గం.7:24. గరజి ఉ.గం.9:46. అహస్సు ఘ.28:04. వర్జ్యం ప.గం.11:34ల 1:17వ. అమృ రా.గం.9:50ల 11:33వ. భు.ఘ.2:33:24. సా.దు.4:22ల 5:07వ.01/02 సా.06:50 బ.దశమి సోమ ఘ.10:52, ఉ.గం.10:58. అనురాధ ఉ.గం.9:00. ధ్రువం రా.గం.7:18. భద్ర ఉ.గం.10:58. అహస్సు ఘ.28:6వర్జ్యం ప.గం.3:05ల 4:49వ. అమృ రా.గం.11:32ల 11:16వ. భు.ఘ.2:42:54. ప.దు.12:36ల 1:21వ. పునః ప.2:51ల 3:36వ.02/02 సా.05:40 బ.ఏకాదశి మంగళ ఘ.15:00, ప.గం.12:37. జ్యేష్ఠ ప.గం.11:06. వ్యాఘాతం రా.గం.7:33. బాలవ ప.గం.12:37. అహస్సు ఘ.28:08. వర్జ్యం రా.గం.7:55ల 9:41వ. అమృ తె.గం.6:29ల 6:36వ. భు.ఘ.2:52:24. ఉ.దు.8:51ల 9:36వ. రా.దు.10:58ల 11:43వ.03/02 ప.09:50 బ.ద్వాదశి బుధ ఘ.19:55, ప.గం.2:34. మూల ప.గం.1:30. హర్షణం రా.గం.7:56. తైతుల ప.గం.2:24. అహస్సు ఘ.28:10. వర్జ్యం ప.గం.11:46ల 1:30వ. పునః రా.గం.12:08ల 1:54వ. అమృ శేషం ఉ.గం.6:36ల 8:15వ. భు.ఘ.3:1:54. మ.దు.11:52ల 12:37వ.04/02 సా.04:30 బ.త్రయోదశి గురు ఘ.25:14, ప.గం.4:42. పూర్వాషాఢ ప.గం.4:06. వజ్రం రా.గం.8:30. వనిక్ సా.గం.4:42. అహస్సు ఘ.28:12. వర్జ్యం రా.గం.12:59ల 2:45వ. అమృ ఉ.గం.10:47ల 12:33వ. భు.ఘ.3:11:24. ఉ.దు.10:26ల 11:11వ. మ.దు.2:52ల 3:37వ. మాసశివరాత్రి05/02 సా.06:00 బ.చతుర్దశి శుక్ర ఘ.30:46, సా.గం.6:53. ఉత్తరాషాఢ సా.గం.6:42. సిద్ధి రా.గం.8:36. శకుని సా.గం.6:93. అహస్సు ఘ.28:14. వర్జ్యం రా.గం.11:07ల 12:53వ. అమృ ప.గం.10:09ల 11:55వ. భు.ఘ.3:20:54. ఉ.దు.8:51ల 9:36వ. మ.దు.12:37ల 1:22వ.06/02 సా.06:00 ∙బ.అమావాస్య శని ఘ.35:42, రా.గం.8:52. శ్రవణం రా.గం.9:09. వ్యతీపాత రా.గం.9:24. చతుష్పాత్ ఉ.గం.7:52. అహస్సు ఘ.28:16. వర్జ్యం రా.గం.1:31ల 3:15వ. అమృ ప.గం.9:42ల 11:28వ. భు.ఘ.3:30:24. ఉ.దు.6:34ల 8:04వ.స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయనం, శశిరఋతువు, మాఘ మాసం07/02 ప.11:45 శుద్ధ పాడ్యమి ఆది ఘ.40:24, రా.గం.10:44. ధనిష్ఠ రా.గం.11:17. వరీయాన్ రా.గం.9:32. కింస్తుఘ్నం ఉ.గం.9:47. అహస్సు ఘ.28:18. వర్జ్యం లేదు. అమృ ప.గం.11:57ల 1:41వ. భు.ఘ.3:39:54. సా.దు.4:23ల 5:08వ. యాగకాలం, శ్యామలా నవరాత్రి ప్రారంభం08/02 రా.1:30 శు.విదియ సోమ ఘ.43:02, రా.గం.11:47. శతభిషం రా.గం.1:03. పరిఘ రా.గం.9:23. బాలవ ప.గం.11:15. అహస్సు ఘ.28:20. వర్జ్యం ఉ.గం.7:01ల 8:44వ. అమృ సా.గం.5:19ల 7:02వ. భు.ఘ.3:49:24. ప.దు.12:37ల 1:22వ. పునః ప.2:53ల 3:38వ. చంద్రదర్శనం09/02 సా.06:00 శు.తదియ మంగళ ఘ.45:00, రా.గం.12:34. పూర్వాభాద్ర రా.గం.2:31. శివం రా.గం.8:52. తైతుల ప.గం.12:10. అహస్సు ఘ.28:22. వర్జ్యం ఉ.గం.7:48ల 9:29వ. అమృ సా.గం.5:56ల 7:37వ. భు.ఘ.3:58:54. ఉ.దు.8:50ల 9:35వ. రా.దు.10:57ల 11:42వ. 10/02 సా.05:00 శు.చవితి బుధ ఘ.45:33, రా.గం.12:47. ఉత్తరాభాద్ర రా.గం.3:07. సిద్ధం రా.గం.7:54. వనిక్ ప.గం.12:40. అహస్సు ఘ.28:24. వర్జ్యం ప.గం.12:16ల 1:55వ. అమృ రా.గం.10:10ల 11:48వ. భు.ఘ.4:8:24. మ.దు.11:52ల 12:37వ. 11/02 సా.06:00 శు.పంచమి గురు ఘ.44:56, రా.గం.12:32. రేవతి రా.తె.గం.3:26. సాధ్యం సా.గం.6:35. బవ ప.గం.12:40. అహస్సు ఘ.28:26. వర్జ్యం ప.గం.3:16ల 4:53వ. అమృ రా.గం.1:00ల 2:37వ. భు.ఘ.4:17:54. ఉ.దు.10:22ల 11:07వ. మ.దు.2:55ల 3:40వ. శ్రీపంచమీ, వసంతోత్సవం12/02 రా.06:45 శు.షష్ఠి శుక్ర ఘ.42:58, రా.గం.11:45. అశ్విని రా.గం.3:11. శుభం సా.గం.4:52. కౌలవ ప.గం.12:09. అహస్సు ఘ.28:28. వర్జ్యం రా.గం.11:14ల 12:49వ. అమృ రా.గం.8:04ల 9:39వ. భు.ఘ.4:27:24. ఉ.దు.8:51ల 9:36వ. మ.దు.12:39ల 1:24వ.13/02 ప.12:00 శు.సప్తమి శని ఘ.39:59, రా.గం.10:33. భరణి రా.గం.2:35. శుక్లం ప.గం.2:49. గరజి ప.గం.11:09. అహస్సు ఘ.28:30. వర్జ్యం ప.గం.1:01ల 2:35వ. అమృ రా.గం.10:51ల 12:25వ. భు.ఘ.4:46:54. పు.భు.4:40. ఉ.దు.6:33ల 8:04వ. ధని 3 రవిః ప.1:55 ప్రవేశదినే కుంభ సంక్రమణం, రథసప్తమీ, సూర్యజయంతీ14/02 ప.11:45 శు.అష్టమి ఆది ఘ.35:54, రా.గం.8:55. కృత్తిక రా.గం.1:34. బ్రహ్మం ప.గం.12:26. విష్టి ఉ.గం.9:43. అహస్సు ఘ.28:32. వర్జ్యం ప.గం.2:05ల 3:37వ. అమృ రా.గం.11:18ల 12:50వ. భు.ఘ.00:5:46. సా.దు.4:27ల 5:12వ. భీష్మాష్టమీ15/02 రా.08:00 శు.నవమి సోమ ఘ.31:17, రా.గం.7:03. రోహిణి రా.గం.12:19. ఐంద్రం ఉ.గం.9:51. బాలవ ఉ.గం.7:58. అహస్సు ఘ.28:34. వర్జ్యం సా.గం.4:45ల 6:15వ. పునః తె.5:30ల 6:31వ. అమృ రా.గం.9:17ల 10:47వ. భు.ఘ.00:14:5. ప.దు.12:38ల 1:24వ. పునః ప.2:55ల 1:24వ. 16/02 రా.08:00 శు.దశమి మంగళ ఘ.25:58, ప.గం.4:54. మృగశిర రా.గం.10:49. వై«ధృతి ఉ.గం.6:56. విష్కంభం తె.గం.3:56. గరజి ప.గం.4:54. అహస్సు ఘ.28:37. వర్జ్యం శేషం ఉ.గం.6:31ల 7:00వ. అమృ ప.గం.2:34ల 4:04వ. భు.ఘ.00:22:24. ఉ.దు.8:47ల 9:33వ. రా.దు.10:59ల 11:45వ.17/02 ఉ.09:50 శు.ఏకాదశి బుధ ఘ.20:17, ప.గం.2:37. ఆర్ద్ర రా.గం.9:11. ప్రీతి రా.గం.12:35. భద్ర ప.గం.2:37. అహస్సు ఘ.28:40. వర్జ్యం ఉ.గం.6:38ల 8:07వ. అమృ ప.గం.11:52ల 1:21వ. భు.ఘ.00:30:43. మ.దు.11:51ల 12:37వ. మతత్రయ భీష్మ ఏకాదశి.18/02 ప.04:40 శు.ద్వాదశి గురు ఘ.14:51, ప.గం.12:26. పునర్వసు రా.గం.7:31. ఆయుష్మాన్ రా.గం.9:40. బాలవ ప.గం.12:26. అహస్సు ఘ.28:42. వర్జ్యం ఉ.గం.8:21ల 9:50వ. పునః వర్జ్యం రా.2:58ల 4:27వ. అమృ సా.గం.4:17ల 5:46వ. భు.ఘ.00:39:02. ఉ.దు.10:20ల 11:06వ. మ.దు.2:56ల 3:42వ. 19/02 సా.04:00 శు.త్రయోదశి శుక్ర ఘ.8:30, ఉ.గం.9:54. పుష్యమి సా.గం.5:53. సౌభాగ్యం సా.గం.6:33. తైతుల ఉ.9:54. అహస్సు ఘ.28:44. వర్జ్యం రా.తె.గం.5:52ల 6:30వ. అమృ ప.గం.11:55ల 1:24వ. భు.ఘ.00:47:21.ఉ.దు.8:48ల 9:34వ. మ.దు.12:38ల 1:24వ. వరాహకల్పం20/02 ప.02:40 శు.చతుర్దశి శని ఘ.2:45, ఉ.గం.7:36. శు.పౌర్ణమి ఘ.54:87, తె.గం.5:23. ఆశ్లేష ప.గం.4:20. శోభ ప.గం.3:32. వనిక్ ఉ.గం.7:36. విష్టి సా.గం.6:30. అహస్సు ఘ.28:46. వర్జ్యం శేషం ఉ.గం.6:30ల 7:22వ. పునః తె.గం.3:41ల 5:11వ. అమృ రా.గం.2:50ల 4:20వ. భు.ఘ.00:55:40. ఉ.దు.6:30ల 8:02వ. 21/02 ప.03:00 బహుళ పాడ్యమి ఆది ఘ.52:33, రా.గం.3:30. మఘ ప.గం.3:00. అతిగండ ప.గం.12:40. బాలవ సా.గం.5:04. అహస్సు ఘ.28:48. వర్జ్యం రా.గం.10:39ల 12:10వ. అమృ ప.గం.12:44ల 2:14వ. భు.ఘ.1:3:59. సా.దు.4:28ల 5:14వ.22/02 సా.07:00 బ.విదియ సోమ ఘ.48:32, రా.గం.1:53. పుబ్బ ప.గం.1:55. సుకర్మ ఉ.గం.8:48. తైతుల ప.గం.2:43. అహస్సు ఘ.28:50. వర్జ్యం రా.గం.8:54ల 10:27వ. అమృ ఉ.గం.7:48ల 8:20వ. పునరమ తె.గం.6:13ల 6:27వ. భు.ఘ.1:12:18. ప.దు.12:36ల 1:22వ. పునః ప.2:55ల 3:41వ.23/02 సా.05:00 బ.తదియ మంగళ ఘ.45:42, రా.గం.12:44. ఉత్తర ప.గం.1:11. «ధృతి ఉ.గం.7:36. శూల తె.గం.5:25. వనిక్ ప.గం.1:18. అహస్సు ఘ.28:52. వర్జ్యం రా.గం.9:28ల 11:03వ. అమృ శేషం ఉ.గం.6:27ల 7:46వ. భు.ఘ.1:20:37. ఉ.దు.8:45ల 9:31వ. రా.దు.10:58ల 11:44వ. యాగకాలం, వసంతోత్సవం, చూతకుసుమభక్షణం 24/03 సా.04:30 బ.విదియ బుధ ఘ.20:10, ప.గం.2:09. చిత్త రా.గం.8:30. గరజి ప.గం.2:09. ధ్రువం ఉ.గం.10:41. అహస్సు ఘ.30:04. వర్జ్యం రా.గం.1:01ల 2:39వ. అమృ ప.గం.2:05ల 3:41వ. భు.ఘ.1:10:34. మ.దు.11:37ల 12:25వ.25/03 ప.11:15 బ.తదియ గురు ఘ.20:33, ప.గం.2:18. స్వాతి రా.గం.8:58. వ్యాఘాతం ఉ.గం.8:52. భద్ర ప.గం.2:18. అహస్సు ఘ.30:06. వర్జ్యం రా.గం.8:49ల 10:29వ. అమృ ప.గం.12:00ల 1:38వ. భు.ఘ.1:18:32. ఉ.దు.10:07ల 10:55వ. మ.దు.2:55ల 3:43వ. సంకటహర చతుర్థి26/03 ఉ.07:00 బ.చవితి శుక్ర ఘ.20:03, ప.గం.2:05. విశాఖ రా.గం.9:59. హర్షణం ఉ.గం.8:13. బాలవ ప.గం.2:05. అహస్సు ఘ.30:08. వర్జ్యం రా.గం.2:14ల 3:57వ. అమృ ప.గం.12:48ల 1:28వ. భు.ఘ.1:26:30. ఉ.దు.8:29ల 9:17వ. మ.దు.12:30ల 1:18వ.27/03 ఉ.11:00 బ.పంచమి శని ఘ.21:53, ప.గం.2:49. అనురాధ రా.గం.11:27. వజ్రం ఉ.గం.7:12. తైతుల ప.గం.2:49. అహస్సు ఘ.30:10. వర్జ్యం రా.తె.గం.5:31ల 6:03వ. అమృ ప.గం.12:25ల 2:07వ. భు.ఘ.1:34:28. ఉ.దు.6:04ల 7:40వ.28/03 ఉ.08:30 బ.షష్ఠి ఆది ఘ.24:58, సా.గం.4:02. జ్యేష్ఠ రా.గం.1:24. సిద్ధి ఉ.గం.6:57. వనిక్ సా.గం.4:42. అహస్సు ఘ.30:12. వర్జ్యం శేషం ఉ.గం.6:03ల 7:15వ. అమృ సా.గం.3:53ల 5:37వ. భు.ఘ.1:42:26. సా.దు.4:31ల 5:19వ.29/03 ఉ.07:20 బ.సప్తమి సోమ ఘ.28:59, సా.గం.5:38. మూల రా.గం.3:39. వ్యతీపాత ఉ.గం.7:02. బవ సా.గం.5:38. అహస్సు ఘ.30:14. వర్జ్యం ప.గం.10:08ల 11:53. పునః రా.1:54ల 3:39వ. అమృ రా.గం.8:39ల 10:24వ. భు.ఘ.1:50:24. ప.దు.12:30ల 1:19వ. పునః ప.2:55ల 3:44వ. 30/03 ఉ.09:50 బ.అష్టమి మంగళ ఘ.33:52, రా.గం.7:34. పూర్వాషాఢ పూర్తి. వరీయాన్ ఉ.గం.7:22. బాలవ ఉ.గం.6:36. అహస్సు ఘ.30:17. వర్జ్యం ప.గం.2:17ల 4:03వ. అమృ రా.గం.12:55ల 2:41వ. భు.ఘ.1:58:16. ఉ.దు.8:28ల 9:17వ. రా.దు.10:54ల 11:43వ.31/03 ఉ.07:00 బ.నవమి బుధ ఘ.39:07, రా.గం.9:40. పూర్వాషాఢ ఉ.గం.6:14. పరిఘ ఉ.గం.7:55. తైతుల ఉ.గం.8:37. అహస్సు ఘ.30:20. వర్జ్యం ప.గం.3:06ల 4:52వ. అమృ రా.గం.1:45ల 3:31వ. భు.ఘ.2:6:14. మ.దు.11:47ల 12:36వ.01/04 ఉ.11:30 బ.దశమి గురు ఘ.44:19, రా.గం.11:44. ఉత్తరాషాఢ ఉ.గం.8:50. శివం ఉ.గం.8:30. వనిక్ ఉ.గం.10:41. అహస్సు ఘ.30:22. వర్జ్యం ప.గం.1:16ల 3:02వ. అమృ రా.గం.11:53ల 1:39వ. భు.ఘ.2:14:12. ఉ.దు.10:02ల 10:51వ. మ.దు.2:53ల 3:42వ.02/04 ప.02:00 బ.ఏకాదశి శుక్ర ఘ.49:09, రా.గం.1:19. శ్రవణం ప.గం.11:22. సిద్ధం ఉ.గం.8:53. విష్టి ప.గం.12:41. అహస్సు ఘ.30:24. వర్జ్యం ప.గం.3:45ల 5:30వ. అమృ రా.గం.2:17ల 4:02వ. శ్రాద్ధతిథి ఏకాదశి. భు.ఘ.2:22:10. ఉ.దు.8:25ల 9:14వ. మ.దు.12:27ల 1:18వ. మతత్రయ పాపమోచనీ ఏకాదశి03/04 సా.06:30 బ.ద్వాదశి శని ఘ.53:7, రా.గం.3:13. ధనిష్ఠ ప.గం.1:40. సాధ్యం ఉ.గం.9:24. కౌలవ ప.గం.2:25. అహస్సు ఘ.30:27. వర్జ్యం రా.గం.9:27ల 11:11వ. భు.ఘ.2:30:8. ఉ.దు.5:58ల 7:35వ.04/04 సా.06:30 బ.త్రయోదశి ఆది ఘ.56:7, రా.తె.గం.4:24. శతభిషం ప.గం.3:36. శుభం ఉ.గం.9:28. గరజి ప.గం.3:48. అహస్సు ఘ.30:30. వర్జ్యం రా.గం.10:24ల 12:06వ. అమృ ఉ.గం.7:49ల 9:33వ. భు.ఘ.2:38:6. సా.దు.4:30ల 5:19వ.05/04 సా.07:00 బ.చతుర్దశి సోమ ఘ.57:40, రా.తె.గం.5:00. పూర్వాభాద్ర సా.5:04. శుక్లం ఉ.గం.9:12. విష్టి సా.గం.3:41. అహస్సు 30:33. వర్జ్యం తె.3:05ల 4:45వ. అమృ ఉ.గం.8:35ల 10:17వ. భు.2:46:4. ప.దు.12:28ల 1:17వ. పునః దు.2:54ల 3:43వ. మాసశివరాత్రి06/04 ప.12:30 ∙బ.అమావాస్య మంగళ ఘ.58:14, రా.తె.గం.5:13. ఉత్తరాభాద్ర సా.గం.6:05. బ్రహ్మం ఉ.గం.8:33. చతుష్పాత్ సా.గం.5:06. అహస్సు 30:35. వర్జ్యం లేదు. అమృ ప.గం.1:05ల 2:45వ. భు.2:54:2. ఉ.దు.8:23ల 9:12వ. రా.దు.10:52ల 11:41వ.పంచాంగ కర్తశ్రీ కప్పగన్తు సుబ్బరామ సోమయాజులుఫోన్లు: 08676 2414336 /98485 20336Email: kappagantusomayajulu@gmail.com -
గ్లోబల్ సినిమాకు కేరాఫ్ అడ్రస్గా హైదరాబాద్
హైదరాబాద్ నగరం ఇప్పుడు కేవలం ఐటీ, ఫార్మా హబ్ మాత్రమే కాదు.. గ్లోబల్ సినిమా టెక్నాలజీ సెంటర్గానూ తన స్థానాన్ని బలపరుచుకుంటోంది. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్లో ప్రారంభమైన అత్యాధునిక ఏ అండ్ ఎమ్ మోషన్ క్యాప్చర్ ల్యాబ్తో పాటు ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన నెట్ ఫ్లిక్స్ ఐ లైన్ హబ్.. ఆధునిక పోస్ట్–ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ హబ్.. ఇవన్నీ కలిపి ఇండియన్ సినిమా స్వరూపాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. ఇప్పటి వరకూ కథ, నటన, సంగీతం వరకే పరిమితమైన భారతీయ సినిమా ప్రయాణం ప్రస్తుతం టెక్నాలజీ ఆధారిత విజువల్ స్టోరీ టెల్లింగ్ వైపు వేగంగా దూసుకెళ్తోంది. ఈ మార్పుకు కేంద్రబిందువుగా హైదరాబాద్ మారుతోంది. ఇది ఒక ట్రెండ్ కాదు.. ఇది సినిమా చరిత్రలో ఒక కొత్త అధ్యాయం. హైదరాబాద్ పాన్ ఇండియా స్థాయి నుంచి పాన్ వరల్డ్ స్థాయికి దూసుకుపోతోందనడానికి నిదర్శనం. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అంటే నటుడి ప్రతి కదలిక, భావం, శరీర కదలికల ద్వారా వ్యక్తమయ్యే భాషను సెన్సార్ల ద్వారా రికార్డ్ చేసి, డిజిటల్ క్యారెక్టర్గా మార్చడం. హాలీవుడ్లో అవతార్ లాంటి సినిమాలను ఈ టెక్నాలజీతోనే నిర్మించారు. ఇప్పటివరకు ఈ సౌకర్యం కోసం భారతీయ దర్శకులు విదేశాలపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం నగరంలోని అన్నపూర్ణ స్టూడియోలో, నెట్ ఫ్లిక్స్ వంటి వేదికల్లోని ఆధునిక మోషన్ క్యాప్చర్ ల్యాబ్తో.., భారీ బడ్జెట్ ఫ్యాంటసీ, మైథలాజికల్, సై–ఫై, యానిమేషన్ హైబ్రిడ్ సినిమాలు హైదరాబాద్ నుంచే రూపొందే అవకాశం ఏర్పడింది. ఇది తెలుగు సినిమాకు మాత్రమే కాదు, మొత్తం ఇండియన్ సినిమాకు కీలకంగా మారనుంది. గ్లోబల్ సినిమాకు కేరాఫ్ అడ్రస్.. ఫ్యూచర్ సిటీలో ప్రారంభమైన నెట్ ఫ్లిక్స్ గ్లోబల్ వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ హబ్ మరో కీలక మైలురాయి. ఇది కేవలం ఓ స్టూడియో కాదు.. ప్రపంచవ్యాప్తంగా నెట్ఫ్లిక్స్ కోసం వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్లకు విజువల్ ఎఫెక్ట్స్, వర్చువల్ ప్రొడక్షన్, కలర్ గ్రేడింగ్, డిజిటల్ ఇంటరీ్మడియట్ అన్నీ ఇక్కడే జరగనున్నాయి. దీని ద్వారా హైదరాబాద్కు అంతర్జాతీయ సినిమా అవకాశాలు రావడం, వందల సంఖ్యలో యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్, కామిక్స్కు సంబంధించిన ఉద్యోగాలు లభించనున్నాయి. లోకల్ టాలెంట్ అంతర్జాతీయ ప్రాజెక్టులపై పనిచేయడం వంటి మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.గతం నుంచి వర్తమానానికి..! హైదరాబాద్కు సినిమా రంగంలో బలమైన చరిత్ర ఉంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన స్టూడియోలు, ల్యాబ్స్ వంటివి పోస్ట్–ప్రొడక్షన్ రంగంలో దేశానికే తలమానికంగా నిలిచాయి. ఇప్పుడు అదే వారసత్వం ఏఐ ఆధారిత ఎడిటింగ్, వర్చువల్ సెట్స్, రియల్ టైమ్ వీఎఫ్ఎక్స్, వర్చువల్ కెమెరా టెక్నాలజీ వంటి ఆధునిక హంగులతో కొత్త రూపాన్ని సంతరించుకోనుంది.పాన్ వరల్డ్ స్థాయికి.. ఈ మార్పుల వల్ల భారతీయ చిత్ర నిర్మాణ రంగం కేవలం లోకల్ మార్కెట్కే కాదు.. నేరుగా గ్లోబల్ ఆడియన్స్ను లక్ష్యంగా చేసుకోనుంది. ఇటీవలి పాన్–ఇండియా, పాన్–వరల్డ్ సినిమాల విజయాలకు టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, ఊహా ప్రపంచాలు, వర్చువల్ యుద్ధాలు.. ఇవన్నీ ఇప్పుడు బడ్జెట్ పరిమితుల్లో భాగంగా ఉన్నాయి. అయితే తక్కువ ఖర్చుతో వీటిని నిర్మించాలంటే కేవలం మన దేశంలోనే సాధ్యమవుతుంది. దీంతో కథల స్థాయి మాత్రమే కాదు, ప్రెజెంటేషన్ స్థాయి కూడా అంతర్జాతీయంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
ఆస్కార్ ఫుడ్ మెనూ..! 600 పిజ్జాలు, 24-క్యారెట్ల 'ద్రవ బంగారం..
సినీ ప్రపంచం ఎంతగానో ఎదురుచూసిన ఆస్కార్ వేడుక ఘనంగా జరిగింది. మార్చి 16న అమెరికాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్ 98వ ఆస్కార్ అవార్డుల వేడుకకు వేదికగా నిలిచింది. మరి ఈ వేడుకకు వచ్చే అతిరథ మహారథులకు ఆస్కార అవార్డుల అనంతరం జరిగే విందు ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రముఖులు, సెలబ్రిటీల కోసం ప్రత్యేక మెనూతో కూడిన వంటకాలను సర్వ్ చేయనున్నారు. ఈసారి ఆస్కార్ వేడుక అనంతరం జరిగే పార్టీలో ఏం వంటకాలు ఉన్నాయో చూద్దామా..!.ప్రఖ్యాత చెఫ్ రెస్టారెంట్ వ్యాపారి వుల్ఫ్గ్యాంగ్ పుక్ ఈ ఆసార్క్ వేడుకకు వచ్చే అతిథులు తీవ్రమైన ఆకలితో ఉంటారని అందుకే పిజ్జా వంటి కంఫర్ట్ ఫుడ్(మనసుకు హాయినిచ్చే ఆహారం)ని ఇష్టపడతారని చెబుతున్నారు. ఈసారి విందుని 75 మంది ప్రధాన చెఫ్లు (savoury chefs), 45 మంది పేస్ట్రీ చెఫ్లు, 325 మంది సేవా సిబ్బంది, నిర్వాహకులు కలిసి తయారు చేస్తారని అన్నారు. ఈ ఏడాది హాలీవుడ్ ప్రముఖులకు వడ్డించే వంటకాల మెనూలో ఏం ఉన్నాయంటే..ఇలా ఆస్కార్ అతిథులకు రుచికరమైన ఆహారం వడ్డించడం అనేది పుక్ బృందానికి వరుసగా ఇది 32వ సంవత్సరం కావడం విశేషం. అందుకే ఈసారి 70కి పైగా వంటకాలు వడ్డించామని తెలిపారు పుక్. వీటిలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ మార్పులు చేర్పులు ఏమిటంటే: జపనీస్ శైలి పబ్ ఆహారాన్ని అందించే 'live izakaya station', అప్పుడే తయారుచేసిన ఐస్క్రీమ్ను వడ్డించే ఇటాలియన్ 'gelato machine' వంటివి హైలెట్గా నిలవనున్నాయి.ఈ ఏడాది మెనూలో 600 హోం మేడ్ పిజ్జాలు, 'artichoke agnolotti' అనేది ఇటాలియన్ పాస్తా మాదిరి శాకాహార వంటకం, బంగారు పొడితో అలంకరించిన రెండు వేల చిన్న చాక్లెట్ ఆస్కార్ విగ్రహాలు. ఈ చాక్లెట్ ఆస్కార్ విగ్రహాలపై రెండు గ్యాలన్ల 24-క్యారెట్ల 'ద్రవ బంగారం' వినియోగిస్తారట. మొత్తం 1500 మంది వంట చేసి సర్వ్ చేస్తారట. వంటకాలన్ని చాలా లైట్వైట్గా తయారు చేస్తారు. అలాగే ఈ వంటకాల కోసం ఇబ్బడిముబ్బడిగా సాస్లను వినియోగించరట. ముఖ్యంగా వంటల్లో అన్ని నాణ్యమైన దినుసులనే వినియోగిస్తారట. వాటిలో దాదాపు 91 కిలోల డ్రై-ఏజ్డ్ రిబే, 136 కిలోల హౌస్-స్మోక్డ్ సాల్మన్, 14 కిలోల కలుగా కేవియర్, 227 కిలోల వైల్డ్ మష్రూమ్లు, 91 కిలోల నిషికి రైస్, 181 కిలోల చీజ్లు తదితరాలు ఉంటాయి. ఈ ఏడాది ఆస్కార్ వంటకాలు సర్వ్ చేసే మెనూ పేరు వచ్చేసి ఎలిగాన్స్ అండ్ కంఫర్ట్ కంబైన్. అలాగే కొత్తవంటకాల ప్రయోగాలను పరిచయం చేయరట. ఎందుకంటే అవి అందరికీ పడకపోవచ్చు..ఏదైన హెల్త్ సమస్యలు ఉత్ఫన్నమయ్యే అవకాశం ఉండొచ్చు. అంతేకాదండోయ్ విందుతోపాటు మందు కూడా ఉంది. ఏకంగా 1700 షాంపైన్ బాటిళ్లు అతిథులకు సర్వ్ చేస్తారట. అలాగే ఈ విందులో మిగిలిపోయిన ఆహారాన్ని లాస్ ఏంజెల్స్లో ఉంటున్న నిరాశ్రయ ప్రజలకు పంపిణీ చేస్తారట. (చదవండి: మూడువేల అడుగుల లోతుల భూగర్భంలో మారథాన్..! 18 దేశాలు..) -
కట్నం ఇవ్వొద్దు.. తీసుకోవద్దు
వరకట్నం.. వివాహ సమయంలో వధువు కుటుంబం నుంచి వరుడి కుటుంబా నికి నగదు, బంగారం, ఆస్తుల రూపేణ బదిలీ చేసే ఒక సామాజిక దురాచారం. ఆడపడుచు కుటుంబా నికి ఇబ్బందిగా మారిన దీనిని రూపుమాపేందుకు ప్రభుత్వాలు చట్టాలెన్ని చేసినా క్షేత్రస్థాయిలో అమలుకు మాత్రం నోచుకోని దుస్థితి. ఈ క్రమంలో సామాజిక బాధ్యతగా గుర్తించిన ఆదివాసీ తెగలు వరకట్నం నిషేధం వైపు మొగ్గు చూపుతున్నాయి. కట్నం ఇవ్వొ ద్దు.. తీసుకోవద్దు అని గ్రామాల్లో తీర్మానాలతో పాటు అమలుకు శ్రీకారం చుడుతున్నాయి. ‘హైరి కీవల్ సిల్లే’ ‘కట్నం ఇదే కాద్ తోద్’ వంటి తీర్మానాలతో ముందడుగు వేస్తున్న ఆయా తెగలపై ఈ వారం సండే స్పెషల్. కట్నం ఇడే కాద్ తోద్.. అంటున్న ‘కొలాం’సాత్నాల: వరకట్న సమస్య కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుందని కొలాం తెగ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పెళ్లి అనేది పవిత్ర బంధమని.. దానిని డబ్బు, ఆస్తులతో కొలవకూడదని భావించింది. ఇకపై వరకట్నం ఇవ్వొద్దు.. తీసుకోవద్దని నిర్ణయించింది. ఇందులో భాగంగా సాత్నాల మండలంలోని టెంబ్రీగూడలో పటేళ్లు, కులస్తులు ఇటీవల సమావేశమయ్యారు. సాత్నాల, బేల, జైనథ్, ఇంద్రవెల్లి మండలాల్లోని ఆయా గ్రామాలకు చెందిన దాదాపు 150 పాల్గొన్నారు. వరకట్నం అనేది తమ సంస్కతిలో భాగం కాదని నిషేధించాలని తీర్మానం చేశారు. ఆడంబరాలకు వెళ్లి అప్పుల పాలు కావద్దన్నారు. పెళ్లిళ్లు సాంప్రదాయబద్ధంగా ఉండాలని, రూ.లక్షలు ఖర్చయ్యే రెడీమేడ్ మండపాలకు దూరంగా ఉండడంతో పాటు మద్యపానం నిషేధించాలన్నారు. డీజేలు వంటి వాటి జోలికి వెళ్లకుండా పిప్రి వాయిద్యాలతో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. పెళ్లిలో చదివింపుల్లో భాగంగా వస్తువులు కాకుండా నగదు రూపంలో అందిస్తే కుటుంబాలనికి ఆసరాగా ఉంటుందని తీర్మానించారు.ఆడబిడ్డ పెళ్లికి ఊరంతా సాయంసిరికొండ: ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్లంటే ఆ కుటుంబంపై ఆర్థిక భా రం చెప్పనవసరం లేదు. కట్నా లు, కానుకలు, ఆర్భాటాలు వంటివి చెప్పుకుంటే పోతే పెద్ద లిస్టే అవుతోంది. అలాంటిది తమ గూడెంలో అమ్మాయి పెళ్లిని ఆర్భాటం లేకుండా సంప్రదాయబద్ధంగా నిర్వహించాలని ఊరి పెద్దలు భావించారు. ఈనెల 9న సమావేశమయ్యారు.‘హైరి కీవల్ సిల్లే’ వరకట్నం నిషేధించడంతో పాటు పెళ్లి కూతురు కుటుంబానికి తలా కొంత ఆర్థికంగా చేదోడుగా నిలవాలని నిర్ణయించారు. వెంటనే అమలులోకి తెచ్చారు సిరికొండ మండలంలోని కోసుపటేల్ గూడవాసులు.కొలాం సంస్కృతిలో లేదువరకట్నం అనేది కొలాం సంస్కృతిలో లేదు. ఆడపిల్లల పెళ్లిళ్లు చేసిన తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. – దేశ్ముఖ్ లేతు, టెంబ్రీగూడ పటేల్తల్లిదండ్రులకు భారం కావద్దని..ఆడపిల్లల తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో వరకట్నాన్ని నిషేధించాం. ఇకపై కొలాం సమాజంలో జరిగే వివాహాలు సాదాసీదాగా, సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తాం. వరకట్న నిర్మూలనలో సమాజంలో సమానత్వం పెరిగి, పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుంది. – కొడప సోనేరావు, కొలాం సంఘ రాష్ట్ర అధ్యక్షుడుకట్నమియ్యలే.. మొన్ననే నా బిడ్డ పునేశ్వరి లగ్గం చేసిన. ఉట్ను ర్ మండలం సుద్దగూడ కు ఇచ్చిన. వరకట్నం మాత్రం ఇయ్యలే. నేను కూలీ పని చేస్తుంటా. బిడ్డ పెండ్లీడుకు రావడంతో గుబులు పడ్డా. అయితే గ్రా మస్తులంతా కలిసి వరకట్నం నిషేధించడంతో పాటు లగ్గానికి రూ.20 వేలు సాయం కూడా చేశారు. – పెందుర్ జంగుబాయి,కోసుపటేల్ గూడవరకట్నం నిషేధించాం..మా గూడెంలో అంతా పేదవారే. ఆడపిల్ల తల్లిదండ్రులు పెళ్లి చేయలంటే చాలా కష్టంగా మారింది. దీంతో మేము ఇటీవల సమావేశమయ్యాం. వరకట్నం నిషేధించాం. అలాగే అమ్మాయి కుటుంబానికి తలా కొంత జమ చేసి రూ.20 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.– కుమురం రావుజీ, పటేల్, కోసుపటేల్గూడపెళ్లింటికి.. ఆర్థిక చేయూతఇంద్రవెల్లి: ఆదివాసీ, గోండు తెగల్లోనూ చాలామంది వరకట్నాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే అమ్మాయి, అబ్బాయి పెళ్లి ఎవరిదైనా ఆయా గ్రామాల్లో కులస్తులు కానుకలు ఇవ్వకుండా ఆర్థిక సాయం అందజేస్తున్నారు. పెళ్లింటికి చేదోడుగా నిలుస్తున్నారు. మండలంలోని వడగామ్ గ్రామంలో కనక కోసేరావ్ పెళ్లి రెండు రోజుల క్రితం జరిగింది. ఈమేరకు గ్రామస్తులంతా కలిసి రూ.25 వేలు అందించారు. కేస్లాపూర్ గ్రామానికి చెందిన పెళ్లి కూతురు ఆత్రం రోష్ణకు గ్రామస్తులు రూ.26 వేలు అందించారు. మండలంలోని పిప్రి గ్రామంలో ఆదివారం పెళ్లి పీటలు ఎక్కనున్న ఆత్రం సుజాతకు గ్రామస్తుల ఆధ్వర్యంలో రూ.7,100 అందించారు. ఇలా ఆదివాసీలు తలా కొంత నగదు సేకరించి పెళ్లి కుటుంబాలకు అందించి ఆర్థికంగా మద్ధతిస్తున్నారు. -
మూడువేల అడుగుల లోతుల భూగర్భంలో మారథాన్..! 18 దేశాలు..
సాధారణ పరిస్థితుల్లో మారథాన్ చేయడమే కష్టం. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత లోతైన భూగర్భంలో మారథాన్ అంటే..సవాలు ఏ రేంజ్లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అలాంటి భయానక పరిస్థితులను తట్టుకుని విజయవంతంగా అత్యంత లోతైన భూగర్భంలో మారథాన్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించి.. అరుదైన ఘనతను రన్నర్ నమోదు చేశారు . ఈ అసాధారణ మారథాన అక్టోబర్ 25, 2025న స్వీడన్లోని గార్పెన్బర్గ్లో జరిగింది.తలకు హెడ్ల్యాంప్లు ధరించి షూలేస్లను గట్టిగా కట్టి ..రన్నర్లు అత్యంత లోతైన భూమి లోపల ఈ ప్రత్యేకమైన రేసుని పూర్తి చేశారు. భూమి ఉపరితలం నుంచి సుమారు 1,118.56 మీటర్లు (3,669 అడుగుల 10 అంగుళాలు) లోతులో జరిగిన సర్టిఫైడ్ మారథాన్లో దాదాపు 18 దేశాల నుంచి యాభైఐదు మంది రన్నర్లు పాల్గొన్నారు. ఇక్కడ వాతావరణం వేడిగా, తేమగా, కొద్దిగా దుమ్ముతో కూడినది. ఇక ఈ రేసు జరిగిన లోతుని గురించి చెప్పాలంటే..ఈ భూగర్భ స్థాయి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఏంజెల్ జలపాతం, స్కాట్లాండ్లోని UKలోని ఎత్తైన పర్వతం బెన్ నెవిస్ కిందగా ఎంతో లోతు ఉంటుందో అంత లోతైనదిగా గుర్తించారు. ఈ మారథాన్ని బికమింగ్ఎక్స్ (యూకే), ఐసిఎంఎం (యూకే), బోలిడెన్ (స్వీడన్) సంయుక్తంగా నిర్వహించాయి. ఈ మారథాన్తో దాదాపు రూ. 8 కోట్ల డబ్బుని సేకరించారు. వీటిని దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించనున్నారు. ఈ మారథాన్ రైసుతో మరో ప్రపంచ రికార్డుని కూడా నమోదు చేశారు. అదేంటంటే ఈ రన్నర్లు లోతైన భూగర్భ మారథాన్ దూరం వచ్చేసి 1,082.30 మీటర్ల (3,550 అడుగుల 10 అంగుళాలు) రన్ చేసి మరో రికార్డుని క్రియేట్ చేశారు. ఈ మేరకు ఈ మారథాన్ని నిర్వహించిన బికమింగ్ఎక్స్ సహ వ్యవస్థాపకుడు బేర్ గ్రిల్స్ మాట్లాడుతూ..వందల మీటర్ల భూగర్భంలో మారథాన్ను నిర్వహించడం అసాధారణమైన ఘనత అని, అయినప్పటికీ అది సాధ్యమయ్యే పరిధిలో ఉండేలా చూసుకోవడం చాలా అవసరమని పేర్కొన్నారు. సాధారణ పరిస్థితుల్లో కూడా మారథాన్ సహజంగానే కష్టమైనది, అలాంటి కఠినమైన వాతావరణంలో ఈ మారథాన్ రేసులో పాల్గొనడం అనేది తీవ్రమైన ఒత్తిడి అధిగమించే సవాలుగా పేర్కొన్నారు.(చదవండి: అదే అసలైన కాన్ఫిడెన్స్..!) -
అదే అసలైన కాన్ఫిడెన్స్..!
కాన్ఫిడెన్స్ అంటే ఎదుటివారిని డామినేట్ చేయడం లేదా గట్టిగా అరవడమని చాలామంది అనుకుంటుంటారు. కానీ సైకాలజీలో కాన్ఫిడెన్స్ అంటే "నేను గొప్పవాడిని" అని అరుచుకోవడం కాదు, "నేను దేనినైనా ఎదుర్కోగలను" అని మనసులో ఉండే 'Self-Efficacy' (ఆత్మసామర్థ్యం). దీనికి గర్వానికి (Arrogance) మధ్య ఉన్న తేడాను గుర్తించడమే అసలైన వ్యక్తిత్వ వికాసం. అసలైన కాన్ఫిడెన్స్ ఒక 'నిశ్శబ్ద బలం' (Silent Strength).1. Albert Bandura సిద్ధాంతంకాన్ఫిడెన్స్ అనేది ఒక పుట్టినప్పుడు వచ్చే లక్షణం కాదు. ఆల్బర్ట్ బాండూరా అనే సైకాలజిస్ట్ దీనిని 'Self-Efficacy' అని పిలిచారు. దీనికి నాలుగు మూలస్తంభాలు ఉన్నాయి.Mastery Experiences: మీరు ఒక పనిని పదే పదే చేసి, అందులో నైపుణ్యం సంపాదించినప్పుడు వచ్చే నమ్మకం.Vicarious Experiences: మీలాంటి వారే ఒక పనిని సాధించడం చూసి, "అతనే సాధించగలిగినప్పుడు నేను ఎందుకు సాధించలేను?" అని అనుకోవడం.Social Persuasion: మీపై నమ్మకం ఉన్నవారు మిమ్మల్ని ప్రోత్సహించడం.Physiological States: మీ శరీరంలోని ఒత్తిడిని, ఉత్సాహాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది.2. గర్వానికి, కాన్ఫిడెన్స్ కి తేడా ఏంటి?Arrogance (గర్వం): "నేను అందరికంటే తోపు, నేను ఎప్పుడూ తప్పు చేయను." ఇది భయాన్ని దాచుకోవడానికి వేసే ముసుగు.Confidence (ఆత్మవిశ్వాసం): "నేను తప్పు చేయవచ్చు, కానీ ఆ తప్పు నుండి నేర్చుకుని మళ్ళీ లేవగలను." ఇది వాస్తవాన్ని ఒప్పుకునే ధైర్యం.కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తికి తన బలహీనతలు తెలుసు, అందుకే అతను ఇతరుల విమర్శలకు భయపడడు. గర్వం ఉన్న వ్యక్తికి తన బలహీనతలు తెలిస్తే భయం, అందుకే అతను ఇతరుల మీద అరుస్తాడు.3. నిజమైన కాన్ఫిడెన్స్మోటివేషన్ ట్రైనర్లు "నువ్వు అద్దంలో చూసి నిన్ను నువ్వు పొగుడుకో, నువ్వు గెలుస్తావు" అని చెప్తారు. ఇది కేవలం పైన పూసే రంగు. కానీ సైకాలజీ ప్రకారం కాన్ఫిడెన్స్ రావాలంటే 'కాంపిటెన్స్' (నైపుణ్యం) ఉండాలి (Competence-based Confidence). మీరు ఒక పనిని కష్టపడి నేర్చుకుని, అందులో ప్రావీణ్యం సంపాదిస్తే.. ఆటోమేటిక్గా మీలో కాన్ఫిడెన్స్ పుడుతుంది.4. కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయడం ఎలా?Genius Matrix ఫిలాసఫీ ప్రకారం మూడు అంచెల్లో ఆత్మవిశ్వాసాన్ని ఎలా పొందాలో చూద్దాం.Step 1: అభద్రతా భావాన్ని బ్రేక్ చేయండిముందుగా I am not enough అనే అభద్రతా భావాన్ని బ్రేక్ చేయండి. మీరు ఎవరితోనూ పోటీ పడనవసరం లేదు, మీ నిన్నటి వెర్షన్ తో మాత్రమే పోటీ పడండి.Step 2: చిన్న చిన్న విజయాలుఒక రోజులో మీరు అనుకున్న పనిని పూర్తి చేయండి. ఆ చిన్న 'విజయం' మీ సబ్-కాన్షియస్ మైండ్కి మీరు నమ్మదగ్గ వ్యక్తి అని చెప్తుంది. ఇలా రోజురోజుకూ మీ కాన్ఫిడెన్స్ మజిల్ని Build చేయండి.Step 3: నిశ్శబ్ద విజేతమీరు స్టేజ్ ఎక్కనవసరం లేదు, అరవనవసరం లేదు.. మీ నడకలో, మీ కళ్ళలో, మీ మాటల్లో ఆ బలం కనిపిస్తుంది. ఎదుటివారికి మీరు ఒక 'ముప్పు'గా కాకుండా, ఒక 'ప్రేరణ'గా కనిపిస్తారు. ఇదే 'Beyond' స్టేజ్.5. మీ కాన్ఫిడెన్స్ రిపోర్ట్ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.మీరు ఎప్పుడు, ఏ పని చేస్తున్నప్పుడు ఎక్కువగా కాన్ఫిడెంట్గా ఫీలవుతారు? మీలో ఉన్న ఒక బలహీనతను మీరు గర్వంగా ఒప్పుకోగలరా?ఇతరుల విమర్శలు మిమ్మల్ని ఇంకా కదిలిస్తున్నాయా?కాన్ఫిడెన్స్ ఒక ప్రయాణం!బ్రో, కాన్ఫిడెన్స్ అనేది ఒక రోజులో రాదు. ఇది ఒక ప్రయాణం. మీ నైపుణ్యాలను పెంచుకోండి, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, మీ గాయాలను హీల్ చేసుకోండి.. అప్పుడు కాన్ఫిడెన్స్ దానంతట అదే ఒక నీడలా మిమ్మల్ని అనుసరిస్తుంది."Confidence is silent. Insecurities are loud."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: సమయాన్ని గౌరవిస్తే మిమ్మల్ని మీరు గౌరవించుకున్నట్టే..) -
పద్మవ్యూహం అంటే..?
ఎవరైనా తీవ్రసమస్యలు, కష్టాల్లో చిక్కుకుంటే వాళ్ళు పద్మవ్యూహంలో చిక్కుకున్నారని అంటుంటాం. అలనాటి ద్వాపర యుగంలో 18 రోజులు జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో 13 వ రోజున కౌరవుల సర్వ సైన్యాధ్యక్షుడు ద్రోణాచార్యుడు పద్మవ్యూహాన్ని అమలు పరిచాడు. ఈ వ్యూహం చూసేందుకు పద్మం, చక్రం ఆకారంలో ఉండటంతో దీనిని పద్మవ్యూహం లేదా చక్రవ్యూహం అని కూడా అంటారు. మొత్తం కౌరవ సైన్యాన్ని తామరపువ్వు ఆకారంలో ఉండేలా ఏడు వలయాలలో రథ, గజ, తురగ, పదాతి సైన్యాలతో శత్రుదుర్భేద్యంగా పద్మవ్యూహాన్ని ద్రోణచార్యుడు ఏర్పాటు చేశారు. ఈ పద్మవ్యూహం అతిరథ మహారథులకే అంతుచిక్కనిదిగా ఉంటుంది. సామాన్యుడెవరూ, ఈ వ్యూహంలోకి వెళ్ళలేరు.ఒకవేళ వెళ్లినా మృత్యువలయానికి దగ్గరవుతూ, సజీవంగా తిరిగి రాలేరు. అందుకే అతి పరాక్రమ వంతుడైన అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళగలిగాడే కానీ, తిరిగి రాలేక అమరుడయ్యాడు. ఈ వ్యూహాన్ని పాండవుల తరఫున ఛేదించగలిగిన వారు కేవలం శ్రీ కృష్ణుడు, అర్జునుడు, శ్రీ కృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడు, అర్జునుని కుమారుడైన అభిమన్యుడు మాత్రమే. అయితే శ్రీ కృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడు మహాభారత యుద్ధంలో పాల్గొనడానికి నిరాకరించాడు. అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి ప్రవేశించడమే కానీ, వెనుకకు వచ్చే విద్య తెలియకపోవడం వల్ల కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు వీరమరణం పొండాడు. కేవలం శ్రీ కృష్ణుడు అర్జునుడు మాత్రమే ఈ పద్మవ్యూహాన్ని ఛేదించగలిగిన యోధులు. ఇక కౌరవుల తరఫున భీçష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామలు మాత్రమే పద్మవ్యూహాన్ని ఛేదించ గలిగినవారు.పద్మవ్యూహ నిర్మాణం ఇలా....కురుక్షేత్ర మహా సంగ్రామంలో 18 అక్షౌహిణుల సైన్యం పాల్గొన్నారు. ఒక అక్షౌహిణిలో 21,870 రథాలు, మరో 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 పదాతి దళాలు కలిపి 2,18,700 మంది మొత్తం సైన్యం ఉంటారు. దీనిని 18తో హెచ్చవేస్తే 39,36,600 మంది సైన్యం పాల్గొంటారు. సుమారుగా పద్మవ్యూహం విస్తీర్ణం 5,929 చదరపు కిలోమీటర్లు అని చెప్పుకోవచ్చు.పద్మ వ్యూహంలో ఎవరెవరు ఏయే స్థానాల్లో...కౌరవసేనలను తామరపూవు ఆకారంలో నిలిపిన ద్రోణుడు అలనాటి వివిధ దేశాధిపతులను తామరపూవులోని రేకుల మాదిరిగా నిలిపాడు. వారి కుమారులను పూవు మధ్యభాగంలోని కేసరాలుగా నిలబెట్టాడు. కర్ణుడు, దుశ్శాసనుడు సేనలతో కలిసి పద్మం లోపల భాగంలో, వారి మధ్య దుర్యోధనుడు సైన్యంగా నిలిచారు. సైంధవుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, శకుని, కృతవర్మ, భూరిశ్రవుడు, శలుడు, శల్యుడు, కౌరవులు వారి కుమారులు ఇతర స్థానాల్లో నిలిచారు. – సి.ఎన్.మూర్తి, పాత్రికేయులు -
నవనాయక ఫలితాలు (2026– 2027)
రాజు గురువు: ద్విజులు సత్కర్మ నిరతులై ఉందురు. రాజులు, ప్రజలు న్యాయముగా సంచరించెదరు. రాజనీతి బాగుంటుంది. సుభిక్ష క్షేమ ఆరోగ్యములతో ప్రజలు సుఖించెదరు. సస్యానుకూల వృష్టిచే సస్యములు ఫలించును. అందరూ స్వధర్మ ఆచరణలో మంచి బుద్ధి ప్రదర్శించెదరు.మంత్రి కుజుడు: కలహములు, యుద్ధ, చోర, అగ్ని, రోగ భయములు పెరుగును. వాయుపీడ అధికము. వర్షము మధ్యమముగా ఉండును. పంటలకు తెగుళ్ళు రాగలవు. ధాన్యాదుల ధరలు పెరుగును. సేనాధిపతి చంద్రుడు: ఆహార ధాన్యములు, వెండి, బంగారం, బియ్యం, నూనెలు, నెయ్యి, పంచదార, నూలు ధరలు పెరుగును. మంచి వర్షములు ఉండును. సస్యములు బాగుగా ఫలించును. పశువులు క్షీరసమృద్ధి కలిగి ఉండును.సస్యాధిపతి శుక్రుడు: పంటలు బాగుగా పండును. తెల్లని ధాన్యము, తెల్లని భూమి బాగా ఫలించును. దేశమంతటను సుభిక్ష క్షేమారోగ్య సంపదలు ఉండును. సమస్త ధాన్యములు, వస్తువులకు ధరలు సరసమై ఉండును.ధాన్యాధిపతి బుధుడు: మధ్యస్థాయి వర్షములు పంటలు మధ్యస్థాయిగా ఫలించును. జనులకు భయము కలుగును. సూక్ష్మధాన్యములు బాగా ఫలించును.అర్ఘాధిపతి రవి: సువృష్టి సస్యాభివద్ధి కలుగును. ధరలు అధికం అవుతాయి. రాజులు సుఖించెదరు. ప్రజలకు అభివృద్ధి ఉంటుంది. నిత్యావసర సరుకులు ధరలు పెరుగును.మేఘాధిపతి చంద్రుడు: సర్వదేశములందు సువృష్టి. ధాన్యజాతులు అన్నియు ఫలించును. గోవులు విశేషంగా పాలిచ్చును.రసాధిపతి రవి: నెయ్యి, నూనెలు, బెల్లము, తేనె మొదలగు రస జాతుల ధరలు లేనట్లుండును. ‘‘కార్పాస తైలేక్షు గుడాదికానాః’’ అని పాఠాంతరం ఉన్నది.నీరసాధిపతి శుక్రుడు: కర్పూరము, అగరు, చందనము, బంగారము, వెండి, ముత్యములు, వస్త్రములు అధిక ధరలకే లభించును.-పంచాంగ కర్తశ్రీ కప్పగన్తు సుబ్బరామ సోమయాజులుఫోన్లు: 08676 2414336 /98485 20336 -
శ్రీ పరాభవ నామ సంవత్సర కర్తరీ నిర్ణయం
∙డొల్లు కర్తరీ ప్రారంభం: ది.04–05–2026 రా.12:59లకు స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరం వైశాఖ బహుళ తదియ సోమవారం రోజు డొల్లుకర్తరీ ప్రారంభం. ∙పెద్ద కర్తరీ ప్రారంభం: ది.11–05–2026 రా.11:00లకు వైశాఖ బహుళ నవమి తత్కాల దశమి సోమవారం నిజకర్తరీ (పెద్ద కర్తరీ) ప్రారంభం. ∙కర్తరీ త్యాగం: 29–05–2026 ఉ.7:57 అధిక జ్యేష్ఠ శుద్ధ త్రయోదశీ శుక్రవారం రోజు కర్తరీ త్యాగం అవుతుంది. మట్టి, కర్ర, రాయి ఉపయోగించి చేయు గృహకర్మల ప్రారంభానికి కర్తరీ కాలంలో చేయరాదు. దీనికి వాస్తుకర్తరీ అని పేరు. శంకుస్థాపన, ద్వారం ఎత్తుట, పాకలు, షెడ్లు, పెంకుటిళ్ళు, పైకప్పు పనులు ప్రారంభించడం శ్రేయస్కరం కాదు. ∙రాబోవు ప్లవంగ నామ సంవత్సరం (2027–28) కర్తరీ నిర్ణయము ∙ది.05–05–2027 ప్లవంగ చైత్ర బహుళ చతుర్దశీ బుధవారం డొల్లు కర్తరీ ప్రారంభం. ∙ది.12–05–2027 వైశాఖ శుద్ధ సప్తమీ మంగళ/బుధ నిజ కర్తరీ ప్రారంభం.∙ది.29–05– 2027 వైశాఖ బహుళ నవమీ శనివారం కర్తరీ త్యాగం. (సౌరమానం, చాంద్రమానం బార్హస్పత్య మానం అన్ని పంచాంగాలలోనూ కేవలం మాసం యొక్క ఆరంభం మార్పు తీసుకుంటుంది. చాంద్రమానం వారికి అమావాస్య వెళ్ళిన మరునాడు మాసం ప్రారంభం అవుతుంది. సౌరమానం వారికి రవి సంక్రమణం మరునాటి నుండి మాసం ప్రారంభం అవుతుంది. మిగతా అన్ని అంశాలలోనూ తిథి, వార నక్షత్రాలు ఒక్కటే ఉంటాయి.)-పంచాంగ కర్తశ్రీ కప్పగన్తు సుబ్బరామ సోమయాజులుఫోన్లు: 08676 2414336 /98485 20336 -
కొడుకే ప్రేరణ..తల్లిగా లాలన..
ఒక కంటితో చూపు.. ఏం మాట్లాడినా వినపడదు.. ఏది చెప్పాలన్నా మాటలేదు.. ఆలోచనా శక్తి లేదు.. మానసికంగా ఎలాంటి ఎదుగుదల లేని కుమారుడినే ఓ తల్లి ‘ప్రేరణ’గా మార్చుకుంది. తన కుమారుడి వంటి ఎంతో మంది పిల్లలను అమ్మగా లాలిస్తోంది. వారి ఆలనా పాలనా చూస్తోంది. వారి సంక్షేమమే తప్ప ఎలాంటి లాభాపేక్ష లేకుండా దాదాపు 22 ఏళ్లుగా స్పెషల్ స్కూల్ నడుపుతోంది. ఇలాంటి పిల్లలంతా ఆత్మవిశ్వాసంతో జీవించాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది హైదరాబాద్లోని మలక్పేటకు చెందిన ఈ అమ్మ..మలక్పేటకు చెందిన తొగరుచేడు విజయలక్ష్మి 2004లో అక్బర్బాగ్ పల్టాన్లో నలుగురితో ‘ప్రేరణ స్పెషల్ స్కూల్’ ప్రారంభించింది. వయసు భేదం లేకుండా 22 ఏళ్లుగా సేవలు అందిస్తోంది. స్పెషల్ ఎడ్యుకేషన్లో శిక్షణ పొంది, టీచర్గా పనిచేసిన ఆమె ప్రస్తుతం మలక్పేట ప్రభుత్వ క్వార్టర్స్లో దాతల సహకారంతో 12 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందితో ఓ స్కూల్ నడిపిస్తోంది. పిల్లలకు స్వశక్తిలో శిక్షణ.. ఇక్కడ ఎక్కువ మంది సెరిబ్రల్ పాల్సీ, స్పాస్టిక్ చి్రల్డన్స్ ఉన్నారు. మెంటల్లీ చాలెంజ్ పిల్లలకు స్వీయరక్షణ, మాట్లాడటం, ఫిజియోథెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్ రకరకాల వాటితో పాటు కంప్యూటర్లో శిక్షణ ఇస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్, పేరంటల్ గైడెన్స్ తరగతుల్ని నిర్వహిస్తున్నారు. మైనంతో దీపాలు, గ్రీటింగ్ కార్డులు, స్క్రీన్ ప్రింటింగ్, ఆఫీస్ ఫైల్స్ చేయించడంలో తరీ్ఫదు ఇస్తున్నారు. పప్పుల ప్యాకింగ్, బుక్ బైడింగ్, ఆడపిల్లలకు వంటింటి పనులు నేర్పిస్తున్నారు. నిత్యజీవిత అవసరాలు తీర్చుకునేలా బ్యాంకు పనులు, సరుకులు కొనుక్కోవడం, బస్సులో వెళ్లి తిరిగి రావడం, రైలు, బస్సు రిజర్వేషన్లు చేయించడం, అక్షరాలు చదవగలగడం వంటి తదితర వాటిని నేర్పిస్తారు.ఆత్మవిశ్వాసంతో.. మెంటల్లీ చాలెంజ్డ్ పిల్లలను ప్రారంభంలోనే గుర్తించి.. వారికి సరైన వైద్యం, సంబంధిత ఇన్స్టిట్యూట్లో వారికి శిక్షణ అందిస్తే ఫలితాలు ఉంటాయి. పిల్లల తల్లులు ఆ పనిని సవాల్గా తీసుకుంటే ఎవరిపై ఆధారపడకుండా ఆత్మవిశ్వాసంతో జీవిస్తారు. ఒక కన్నుతోనే చూసి.. వినపడని, మాట్లాడలేని, మానసికంగా ఎదగని నా కొడుకు వంశీ నాకు ‘ప్రేరణ’. పిల్లల సంక్షేమమే ధ్యేయంగా, లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ మాది.తొగరుచేడు విజయలక్ష్మి, ప్రేరణ స్పెషల్ స్కూల్ నిర్వాహకురాలు (చదవండి: డెలివరీ బాయ్గా 78 ఏళ్ల వ్యక్తి..!) -
డెలివరీ బాయ్గా 78 ఏళ్ల వ్యక్తి..!
జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సానుకూలంగా స్పందించాలని పెద్దలు చెబుతుంటారు. అయితే అది చెప్పినంత సులువు కాదు. ఒక్కోసారి ఈ వయసులో ఇంత కష్టమా అని తల్లడిల్లిపోతాం. కానీ కొందరే ధైర్యంగా ఎదురెళ్లతారు. అలాంటి వాళ్లకు ఆ దేవుడు సదా తోడుగా ఉంటాడనేందుకు ఈ తాతగారే ఉదాహరణ.అమెరికాలోని టేనస్సీలోని మాంచెస్టర్కు చెందిన రిచర్డ్ పుల్లీ అనే 78 ఏళ్ల వ్యక్తి డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఆ వయసులో ఆ తాతగారి ఏం కష్టం వచ్చిందో అనిపిస్తుంది అతడు పడుతున్న తపన చూస్తే. వస్తువులను డెలివరీ చేసేందుకు వెళ్తున్నప్పుడూ.. వయసురీత్యా జారిపోయే అవకాశం ఉండటంతో ఎంతో జాగ్రత్తగా డెలివరీ చేస్తుంటాడు. నిజం చెప్పాలంటే అతడు తీసుకుంటున్న శ్రద్ధను చూస్తే ముచ్చటేస్తుంది. ఇంతలా కష్టపడుతూ డెలివరీ చేయడం ఎందుకని బాధ కూడా కలుగుతుంది. అలానే అనుకుంది బ్రిటనీ స్మిత్ అనే మహిళ కూడా స్టార్బక్స్ ఆర్డర్స్ డెలివరీ చేస్తున్న రిచర్డ్ పుల్లీని చూసి. అతడు డెలివరీ చేస్తున్న విధానానికి ఫిదా అయ్యి అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ..ఆ తాతగారి గురించి వివరించింది. ఆయన ఏడుపదుల వయసులో ఎందుకు ఇంకా పనిచేస్తున్నాడో కూడా తెలిపింది. ఫుల్లీ తన భార్య వైద్య ఖర్చులను నిర్వహించడానికి ఇబ్బంది పడుతున్నట్లు తెలుపుతాడు. తన భార్య ఆమె తప్పిదం లేకుండానే ఉద్యోగం కోల్పోయిందని చెప్పుకొచ్చాడు ఫుల్లీ. దాని ఫలితంగా ఆమె ఆరోగ్య భీమా కూడా కోల్పోయింది. అందువల్ల తాను తమ జీవన ఖర్చుల తోపాటు మందులు, వైద్య ఖర్చులకు లెక్క చూస్తే..నెలాఖరుకి ఏమి ఉండదు. అందువల్ల ఇలా డెలివరీ బాయ్గా పనిచేస్తున్నట్లు తెలిపాడు ఫుల్. తమది 56 ఏళ్ల వైవాహిక బంధమని చెప్పాడు. తన భార్య ఉద్యోగం కోల్పోయినప్పటి నుంచి ఒక ఏడాదికిపైగా ఇలా డెలివరీ ఏజెంట్గా పనిచేస్తున్నట్లు తెలిపారు. దాంతో బ్రిటనీ స్మిత్ ఆ వృద్ధ దంపతులకు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో GoFundMe ప్రచారాన్ని ప్రారంభించింది. ఆ దంపతులకు అండగా నిలిచేందుకు, వారి ఖర్చుల నిర్వహణలో సహాయపడేందుకు వేలాది మంది ప్రజలు ముందుకు వచ్చారు. ఏకంగా రూ. 4.5 కోట్లు దాక విరాళం రావడం విశేషం. NEW: Internet users have raised $280,000 for an elderly man who became a DoorDash delivery driver to help pay for his and his wife's bills.A Tennessee woman decided to take matters into her own hands when she saw the man delivering her Starbucks."I work because I have to. I… pic.twitter.com/qWIXG8ZzSt— Collin Rugg (@CollinRugg) March 12, 2026(చదవండి: రూ. 9 వేలతో దుస్తుల వ్యాపారం ప్రారంభించి..ఇవాళ ఏకంగా రూ. 57 కోట్లు టర్నోవర్..) -
పైల్స్ నుంచి ఫ్రీ అవండి ఇలా...
ముళ్ల మీద కూర్చోవడం అనే మాట వాడుకగా వాడుతుంటారు. మొలల సమస్య ఉంటే ఈ మాట అక్షరాలా నిజమే అనిపిస్తుంది. ‘మొల’ అంటే మేకు అని అర్థం. ఆకృతిలోనూ అవి మేకును పోలి ఉంటాయి. అలాగే కూర్చునే చోట నిజంగా మేకులే ఉంటే ఎంత సమస్యగా ఉంటుందో తెలుసు కాబట్టే ఈ సమస్యకు ఆ పేరొచ్చిందేమో అనిపిస్తుంటుంది. మలద్వారం దగ్గర వచ్చే మొలల సమస్యను ఇంగ్లిష్లో పైల్స్ అనీ, హిమరాయిడ్స్ అని అంటారు. ఈ సమస్యకు కారణాలు, నివారణ, చికిత్స వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. మలద్వారం దగ్గరి కణజాలంలో రక్తనాళాలు చాలా ఎక్కువ. ఒకరకంగా ఇది దేహానికి చివరి ప్రాంతం కూడా కావడంతో ఇక్కడ పెద్ద ఎత్తున రక్తనాళాలు ఎక్కువ సంఖ్యలో అల్లుకు΄ోయినట్టుగా ఉంటాయి. కొందరిలో ఈ రక్తనాళాలు వ్యాకోచించినట్లుగా అయి ఉబ్బి బుడిపెలా మారతాయి. ఇలా బుడిపెలుగా వచ్చే వాటిని తెలుగులో మొలలు అనీ మూలశంక అని వ్యవహరిస్తుంటారు. ఇవి కొందరిలో మల ద్వారం నుంచి బయటకూ వచ్చేసి బాధిస్తుంటాయి. ఒక్కోసారి కొందరిలో ఆ బుడిపెలు ఒరుసుకు΄ోవడం వల్ల ఒక్కోసారి రక్తస్రావమూ అవుతుంటుంది. మలద్వారం వద్ద తీవ్రమైన దురదా నొప్పీ కూడా ఉంటాయి. వెరసి అవన్నీ కూర్చోనివ్వకుండా, కదల్లేకుండా బాధపెడుతుంటాయి. కారణాలు... మలద్వారం వద్ద రక్తనాళాల వాపునకు కారణమైన ఏ అంశాల వల్లనైనా ఇవి రావచ్చు. ఉదాహరణకు...కడుపులో ఒత్తిడి పెరగడం (మలబద్ధకం ఉన్నవాళ్లు ముక్కుతూ విసర్జన చేయడానికి ప్రయత్నించడంతో అక్కడి రక్తనాళాల్లో ఒత్తిడి పెరగడం మొలలకు ప్రధాన కారణం)స్థూలకాయం హై΄ో థైరాయిడిజం మహిళల్లో ప్రెగ్నెన్సీ సమయంలో కడుపు కండరాలపైనా, రక్తనాళాలపైనా పడే ఒత్తిడి వల్లశారీరక శ్రమ లేని వృత్తుల్లో ఉన్నవాళ్లలో దేహానికి తగినంత వ్యాయామం లేకపోవడంతోదీర్ఘకాలం పాటు నీళ్ల విరేచనాలు అవుతుండటం (డయేరియా)... ఈ అంశాలన్నీ మొలల సమస్యకు కొన్ని కారణాలు నివారణ / చికిత్స... మూలశంకవ్యాధిలో లక్షణాల తీవ్రతను బట్టి చికిత్స ఉంటుంది. ఇందుకు కారణాలను తెలుసుకుని వాటినీ అదుపు చేయాల్సిన అవసరముంటుంది. ఉదాహరణకు... మలబద్దకం, స్థూలకాయం, బరువు పెరగడం వంటి అంశాలు కారణమైతే వాటినీ అదుపు చేయాలి. అక్కడి రక్తనాళాలను గాయపరచకుండా విసర్జితమయ్యేందుకు మలం మృదువుగా ఉండాలంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, తాజాపండ్లు, పాలిష్ చేయని తృణధాన్యాలతో వండిన పదార్థాల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇక ద్రవాహారం, నీళ్లు కూడా ఎక్కువగా తీసుకోవడం మంచిది. రోజూ ఒకేవేళలో మలవిసర్జనకు వెళ్లేలా విసర్జన అలవాట్లు ఉండాలి. తగినంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. వ్యాయామం చేయాలి. ఈ జాగ్రత్తలతో కొద్దిపాటి తీవ్రత ఉన్న మొలలను నివారించుకోవచ్చు. కాని నొప్పి తీవ్రతరమై, రక్తస్రావం అవుతుంటే దానికి చికిత్స అవసరం. తీవ్రతను బట్టి డాక్టర్లు కొన్ని రకాల చికిత్సలు మొదలుకొని శస్త్రచికిత్స వరకు సూచిస్తుంటారు. ఈ శస్త్రచికిత్సల్లోనూ లేజర్, క్రయోథెరపీ, మినిమల్లీ ఇన్వేజివ్ ప్రోసీజర్ ఫర్ హీమరాయిడ్స్ / హీమరాయిడోపెక్సీ (ఇందులో అదనంగా పెరిగిన రక్తనాళాలకు రక్తసరఫరా జరగకుండా ఆపి, అవి తొలగి΄ోయేలా చేయడంతో పాటు నొప్పి, రక్తస్రావం వీలైనంతగా నివారించే అడ్వాన్స్డ్ ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల ‘రఫాలో ప్రొసిజర్’ అనే నొప్పిలేని అత్యాధునిక చికిత్స ప్రక్రియ కూడా అందుబాటులోకి వచ్చింది. లక్షణాలు... మొలల వ్యాధి ఉన్నా... చాలా సందర్భాల్లో ఎలాంటి లక్షణాలూ కనిపించక΄ోవచ్చు. మొలలు ఉన్నాయన్న విషయమే వాళ్లకు తెలియకపోవచ్చు కూడా. మరికొందరిలో మాత్రం కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి... మలవిసర్జన తర్వాత ప్రక్షాళన సమయంలో ఓ ఉబ్బులాగా లేదా కండలాగా చేతికి తగలడం. (అందులో రక్తం గడ్డకట్టి ఉంటే గట్టిగా కూడా తగలవచ్చు) కొందరిలో మలద్వారం నుంచి రక్తస్రావం అవుతుండటం ∙మల విసర్జన తర్వాత మలంపై రక్తపు చారికలా కనిపించడంకొన్సిసార్లు లోపలి దుస్తులకు తడిలా నీళ్లలా ఏదైనా మరకలా అంటడం మలద్వారం చుట్టూరా దురదగా అనిపించడం.కొందరిలో అరుదుగా నొప్పి... పైల్స్ వల్ల నొప్పి చాలా అరుదుగా కలుగుతుంది. మొలలలోపల రక్తం గడ్డకట్టినప్పుడు మాత్రమే మొలలతో నొప్పి తెలుస్తుంది. కొందరిలో పైల్స్తో పాటు మలద్వారంలో చిన్న పగులు (ఫిషర్) కూడా ఉండవచ్చు. అలాంటి సమయంలో మాత్రం నొప్పి రావచ్చు. కొందరిలో మల విసర్జన వల్ల లోపల ఉండే మొలలన్నీ గుత్తిలా బయటకు రావచ్చు. అలాంటప్పుడు అవి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. మొలల సమస్యలో ఇది సమస్య తీవ్రతకు ఇదొక తార్కాణం.డాక్టర్ ఆసిఫ్ మెహరాజ్, సీనియర్ కోలోరెక్టల్ సర్జన్ (చదవండి: జీఎస్ఎమ్’: చెప్పుకోకుంటే ముప్పు అవుతుంది!) -
చెప్పుకోకుంటే ముప్పు అవుతుంది!
మహిళలకు అది బయటకు చెప్పుకోలేని ఓ సమస్య. ఎవరితోనూ పంచుకోలేని ఓ పెను ఇబ్బంది. ఇప్పటి తరానికి ఒక తరం ముందున్న వారు కావడంతో వీళ్లంతా ఓపెన్గా చర్చించాలంటే కొంతైనా అసౌకర్యంగా, ఇంకాస్త బిడియంగా ఫీలయ్యే ఈ సమస్య పేరు ‘జెనైటో యూరినరీ సిండ్రోమ్ ఆఫ్ మెనోపాజ్’. సంక్షిప్తంగా దీన్ని ‘జీఎస్ఎమ్’గా పేర్కొంటారు. సమస్య ఎప్పటినుంచో ఉన్నదే అయినప్పటికీ... ఇటీవల ఆధునిక జీవనశైలితో వచ్చే హార్మోన్ల అసమతౌల్యపు సమస్యలు ఎక్కువ కావడంతో ఇంతకుముందు కంటే ఇప్పుడు మరికాస్త ఎక్కువగా కనిపిస్తోంది. కేవలం పీరియడ్స్ ఆగిపోయిన ముందు తరానికే కాకుండా అండాశయాలు తొలగించుకున్న ఈతరం వారినీ వేధిస్తూ ఇటీవల ఈ కేసులు మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి. జస్ట్... ఒక్కసారి తమ బిడియం వీడి... గైనకాలజిస్టులనూ, యూరో గైనకాలజిస్టులను సంప్రదిస్తే నూరుశాతం తగ్గి΄ోయే ఈ సమస్య ఇది. మరెవరితోనో అంత ఓపెన్గా మాట్లాడే అవకాశం లేకపోయినా మహిళలు చదువుకొని తెలుసుకోగలిగే ఈ సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం.సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా మెనోపాజ్ తర్వాత దాదాపు 40 నుంచి 60 శాతం మహిళల్లో కనిపించే ఈ సమస్య ఇప్పుడు మనదేశంలో ప్రతి ఇద్దరు మహిలల్లో ఒకరికి తప్పక ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అంటే మెనోపాజ్ వచ్చివారిలో 50% మంది జీఎస్ఎమ్ సమస్యతో బాధపడుతున్నారు. ఇక మెనోపాజ్ నుంచి కాలం గడుస్తున్నకొద్దీ జీఎస్ఎమ్ బారిన పడే మహిళల సంఖ్య పెరుగుతూ ఉంది. ఒక అధ్యయనం ప్రకారం మహిళలకు తమ చివరి పీరియడ్ నుంచి కేవలం ఐదేళ్ల వ్యవధిలోపే ఆ సంఖ్య 65% చేరుకుంటోంది. ఇక పూర్తిగా మోనోపాజ్ వచ్చిన వాళ్లలో చూస్తే వారిలో ఐదేళ్లలోపే 74% మందిలో జీఎస్ఎమ్ కనిపిస్తోంది. పేరును బట్టి కేవలం మెనోపాజ్ వచ్చినవారిలోనే కనిపిస్తుందా అంటే అది కూడా అపోహే. ఈతరం మహిళల్లోనూ... అంటే 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వారిలోనూ కనిపిస్తోంది. కేవలం మెనోపాజ్ వచ్చినవారిలోనే కాకుండా ఏదైనా మెడికల్ కారణాల వల్ల అండాశయాలు తొలగించుకున్నవారిలో లేదా క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నవారిలోనూ కనిపించే సమస్య ఇది.తొలుత శారీరకమైన సమస్యే... కానీ తర్వాత మానసికంగా కూడా... సాధారణంగా ఇది శారీరకంగా ఇబ్బంది పెట్టే సమస్యే అయినప్పటికీ దీర్ఘకాలంలో ఇది మహిళను కుంగదీస్తుంది. చికిత్స తీసుకోకపోవడం వల్ల భర్త నుంచి దూరం జరుగుతుండటంతో భార్యాభర్తల మధ్య ఏడబాటు, బయటకు వెళ్లడానికి ఇష్టపడకపోవడంతో సామాజికంగా నలుగురికీ దూరం అవ్వడం, ప్రయాణాలకు దూరంగా ఉండటం, ఏ పనిలోనూ ఆసక్తిలేకపోవడం వంటి కారణాలతో సమాజం నుంచి దూరంగా జరుగుతూ కుంగుబాటుకూ (డిప్రెషన్కూ) లోనయ్యే అవకాశాలు లేక΄ోలేదు.గుర్తించడమెలా (డయాగ్నసిస్) జీఎస్ఎమ్కు ఎలాంటి నిర్దిష్టమైన వైద్య పరీక్ష ఉండదు. కానీ మహిళలు తమ బిడియం విడిచి డాక్టర్ను సంప్రదిస్తే తేలిగ్గా తెలుసుకోగల వైద్య సమస్య ఇది. పైగా వైద్య చికిత్సతో నూటికి నూరు΄ాళ్లు నయం చేయగల (ట్రీటబుల్) సమస్య ఇది. చేయాల్సిందల్లా మహిళలు ఈ సమస్యనలా భరిస్తూ ఉండేందుకు బదులు డాక్టర్ దగ్గర చెప్పుకుంటే చాలు.చికిత్స ఈ సమస్యకు చికిత్స అన్నది అందరికీ ఒకేరకంగా కాకుండా వ్యక్తిగత ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని వ్యక్తిగతంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు కొందరిలో ఇన్ఫెక్షన్ / ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్తో పాటు జీవనశైలి మార్పులు సూచించడం, పెల్విక్ ఫ్లోర్ కండరాలకు వ్యాయామాన్ని ఇచ్చే వర్కవుట్స్ సూచించడం వంటివి. అలాగే సమస్య తీవ్రతను బట్టి పూతమందులుగా ఇచ్చే మాయిశ్చరైజర్లు, ల్యూబ్రికెంట్లతో పాటు సిస్టమేటిక్ హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీగా హార్మోన్లు ఇవ్వడంలాంటి వైద్య చికిత్సతో పాటు కౌన్సెలింగ్ ఇస్తూ సలహా సూచనలందిస్తూ పేషెంట్లలో ధైర్యం, స్థైర్యం పాదుగొలిపేలా మాట్లాడటమూ అవసరమవుతుంది.సమస్య ఎందుకొస్తుందంటే... సాధారణంగా మహిళల్లో స్రవించే ఈస్ట్రోజెన్... వారి ప్రైవేట్ పార్ట్స్ను తేమగా ఉంచుతుంది. కానీ మెనోపాజ్ తర్వాత ప్రైవేట్ పార్ట్స్ పొడిబారిపోవడం (ఇలా పొడిబారడం వల్ల ఇన్ఫెక్షన్లు తరచూ వస్తుంటాయి), సాగే గుణం తగ్గడంతో కండరాలు స్టిఫ్గా మారడంతో మూత్రవిసర్జనలో నొప్పి, మంట, తీవ్రమైన అసౌకర్యం వంటివి కనిపిస్తాయి.డాక్టర్ సిందూరి గోరంట్ల, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రీషియన్ – గైనకాలజిస్ట్ -
రూ. 9 వేలతో దుస్తుల వ్యాపారం ప్రారంభించి..ఇవాళ ఏకంగా రూ. 57 కోట్లు..
సింగల్ మదర్ సక్సెస్ స్టోరీ ఇది. ఓ సాధారణ వీధి దుకాణం నుంచి బ్రాండ్ని నిర్మించే స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు బట్టలు అమ్ముడైతే చాలు అనుకునే స్థాయి నుంచి ఇవాళ ఏకంగా ఓ బ్రాండ్ వ్యస్థాపకురాలిగా కోట్లు గడిస్తూ..సక్సెస్కి చిరునామాగా మారిందామె. ఎవరామె అంటే..చైనాలో డాంగ్ అనే మహిళ కేవలం రూ. 9,240లతో వీధి దుకాణం నడుపుతుండేది. 1990లలో హెనాన్ ప్రావిన్స్లోని జెంగ్జౌలో నిర్మించిన డాంగ్ తన విజయవంతమైన దుస్తుల వ్యాపారం కారణంగా ప్రజలందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. 2012లో డాంగ్ వద్ద ఎలాంటి పొదుపులు, ఆదాయం లేక ఒంటిరి తల్లిగా రోడ్డుపై నిలబడిపోయింది. కనీసం తన బిడ్డకు పాలపొడిని కొనడానికి కూడా డబ్బులు లేని దారిద్యాన్ని అనుభవించింది. ఇరవైల వయసులో తన బిడ్డను పోషించుకోవాల్సిన పరిస్థితి ఆమెది. ఆ నేపథ్యంలో చిన్నగా వీధి వస్త్ర దుకాణాన్ని ప్రారంభించింది. అయితే వ్యాపారం అంతగా లాగాక.. ఇబ్బందిపడింది. ఒక్కోసారి ఈ వ్యాపారం తన వల్ల కాదేమో అన్నంతగా చేతులెత్తేసి దిగాలు పడేది. మళ్లీ ఆ క్షణంలోనే నేడు ఓడిపోతే..నా బిడ్డ బాధ్యతను ఎవరు చూసుకుంటారని భయపడేది. అయినా తాను పేదదాన్ని అయ్యిండొచ్చు, కానీ తన బిడ్డ ఎందుకు పేదవాడిగా ఉండాలన్న ఆలోచన తనకు వెనుకడగు వేయనివ్వని పట్టుదలను ఇచ్చేదట. అదే తనకు కఠినమైన ఆ పరిస్థితులను తట్టుకునే శక్తిని అందించిందట. తన వ్యాపారాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు రాత్రి మార్కెట్ల వైపుకి మొగ్గు చూపేదట. తక్కువ పెట్టుబడితో ఆదాయం పొందాలంటే మంచి పరిచయాలు కూడా అవసరమని తెలుసుకుంది డాంగ్. అలా డబ్బు ఆదా చేస్తూ..స్టాక్ కొనడానికి ఉదయం ఐదుగంటల కల్లా మేల్కొనేది. తర్వాత రాత్రి కూరగాయల మార్కెట్ వెలుపల బట్టలు అమ్ముతుండేది. రోజుకి మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయేది. బేరమాడటం, భారీ వస్తువులను తక్కువ ధరకే తీసుకెళ్లగలిగే మాట చాతుర్యం అన్నింటిని స్వయంగా నేర్చుకుంది. ఈ పనుల బిజీలో బిడ్డ ఆలనాపాలనా చూడటం కష్టంగా ఉండేది. ఒక్కోసారి రాత్రిపూట వీధుల్లో బిడ్డను ఒంటరిగా వదిలేసి వ్యాపారం చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. అలా కష్టాలను ఓర్చుకుంటూ..నెమ్మదిగా రిటైల్ దుకాణాలను నడిపే స్థాయికి చేరుకుంది. అప్పుడే చైనీస్ సంప్రదాయాన్ని సమకాలీన డిజైన్తో మిళితం చేస్తూ ఒక ప్రసిద్ధ బ్రాండ్ను నిర్మించింది. ఈ బ్రాండ్కి చైనా దేశ్యవాప్తంగా గుర్తింపు వచ్చేలా అమ్మకాలు జోరందుకున్నాయి. దీంతో ఆమె ఏకంగా ఏడాదికి రూ. 54 కోట్లు పైనే గడించే స్థాయికి చేరుకుంది. నెటిజన్లు సైతం ఆమె కథ విని ఒంటిరి తల్లి చాలా శక్తిమంతమైనది. ఎన్ని కష్టాలు ఓర్చుకుందో ఆమెకే తెలుసు అంటూ పోస్టులు పెట్టారు. (చదవండి: 76 రోజుల్లో ఏడు కిలోల బరువు..!) -
76 రోజుల్లో ఏడు కిలోల బరువు..!
బరువు తగ్గడంలో కొందరు అనుసరించే ఆరోగ్యకరమైన విధానాలు ఎందరికో ప్రేరణగా ఉంటాయి. అలాంటి వెయిట్లాస్ జర్నీ గురించి మహారాష్ట్ర వైద్యుడు చూసిన ఒక కేసు గురించి చెప్పుకొచ్చారు. ఒక రియల్ జంట అద్భుతంగా బరువు తగ్గినం విధానాన్ని షేర్చేసుకున్నారు. మొదట తన వద్దకు కాస్త తగ్గితే చాలని వచ్చిన వాళ్లు ఎంతలా అనూహ్యంగా బరువు తగ్గారో చెప్పారు. జస్ట్ రెండున్నర నెలలో ఇంతలా బరువు తగ్గుతారని అస్సలు ఊహించలేదని అంటున్నారు. మరి అదెలాగో చూద్దామా..!పిసిఒఎస్, డయాబెటిస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఊబకాయం తదితరాల హోపియోపతిక్ ప్రాక్టీషనర్ డాక్టర్ సయాజిరావ్ గైక్వాడ్ తన అనుభవంలో చూసిన ఒక జంట కేసు గురించి చెప్పుకొచ్చారు. ఆ దంపతులు సాధారణ వెయిట్లాస్ కోసం వచ్చారని అన్నారు. సూచించిన కొద్ది ఆహారపు మార్పులతో ఇద్దరూ జస్ట్ రెండున్నరనెలల్లోనే ఏకంగా ఏడు కిలోలు తగ్గారని చెప్పారు. భర్త 71 కిలోల నుంచి 64 కిలోలకు, భార్య 82 నుంచి 75 కిలోలకు తగ్గారని చెప్పుకొచ్చారు. ఇలా బరువు తగ్గడంతో ఇద్దరికి వాపు, ఎల్డీఎల్ స్థాయిలు, బొడ్డుకొవ్వు కూడా గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. మలబద్దక సమస్య కూడా చాలావరకు తగ్గిందని అన్నారు. అయితే ఈ దంపతులు ఎలాంటి క్రాష్డైట్ అనుసరించలేదని, స్థిరమైన ఆహార విధానాన్ని అనుసరించారని చెప్పారు. ఈ ఇద్దరు ఉపకరించిన ఆ ఏడు ఆహారపు అలవాట్ల గురించి వెల్లడించారు.రెండుపూటలా తినడం..ప్రతి రోజు రెండు పూటలా తింటే చాలని అన్నారు. అలాగని అల్పాహారం ఎక్కువగా తీసుకోవద్దని సూచించారు.ప్రోటీన్కు ప్రాధాన్యత ఇవ్వండినిపుణుడి ప్రకారం, ప్రతి భోజనంలో ప్రోటీన్ను కీలకమైన భాగంగా చేసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని అన్నారు. ముఖ్యంగా గుడ్లు, పప్పులు, పెరుగు, పనీర్ను వారి ఆహారంలో చేర్చుకోవాలని ఆయన దంపతులకు సలహా ఇచ్చారు.శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తొలగించారుతరువాత, హోమియోపతి నిపుణుడు ఆహారం నుంచి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తొలగించాలని సూచించారు. ఈ జంట స్వీట్లు, చక్కెర, బేకరీ ఆహారాలను తినకుండా ఉండాలని చెప్పానని అన్నారు.ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు చేర్చుకోవడం..నిపుణుడు దంపతులకు ప్రతిరోజూ వారి భోజనంలో ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలను చేర్చుకోవాలని సలహా ఇచ్చారు. ఆ ఆహార ప్రణాళికలో ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పనిసరి అయిన అంశం. ఇది కడుపు నిండిన భావనను పెంచుతుంది. అలాగే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నివారించండిబర్గర్లు, పిజ్జాలు, సమోసాలు వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలు దరిచేరనివ్వదని సూచించారు. బరువు తగ్గడానికి ప్రయత్నించే వాళ్లు సదా ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. డాక్టర్ సాయాజీరావు గైక్వాడ్ దంపతులు ఇంట్లో వండిన భోజనం మాత్రమే తినాలని, అల్ట్రా-ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నివారించాలని చెప్పారు.రోజుకు 30-40 నిమిషాలు నడవండినిపుణుడు దంపతులను రోజుకు 30-40 నిమిషాలు నడవమని సూచించారు. అది కూడా ముఖ్యంగా భోజనం తర్వాత.స్థిరంగా ఉండండిబరువు తగ్గడం అనేది ఒక్కసారిగా జరిపోయేది కాదు. క్రమంత తప్పకుండా బరువు తగ్గడానికి ఏర్పాటు చేసుకున్న నియమాలను ఉల్లంఘించకుండా చూసకోవడం అత్యంత కీలకం. ఇక్కడ బరువు తగ్గడం అంత తేలికై పని కాకపోవచ్చు. కానీ శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లకు దూరంగా ఉంటూ..ఆకలి కోరికలు తగ్గేలా ఫైబర్ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకుంటే..వెయిట్లాస్ అనేది అత్యంత ఈజీ. అన్నింట్లంకంటే ముఖ్యమైనది స్థిరత్వాన్ని మెయింటైన్ చేయడమే అన్ని నొక్కి చెబుతున్నారు డాక్టర్ సయాజిరావ్ గైక్వాడ్. 2.5 months.One couple.Simple home-cooked food.✅ Results:• Weight ↓ 7 kg (both)• HbA1c improved• LDL cholesterol ↓• Waist ↓ ~3 inches• Constipation resolved• Energy levels ↑No crash diets.No supplements.Just disciplined nutrition. pic.twitter.com/d2302h5Iti— Dr.Sayajirao Gaikwad (@DietDrsayajirao) March 9, 2026 (చదవండి: ధన్యవాదాలకు మించింది..!ఇలాంటి కూతుళ్లు ఉంటే..) -
ధన్యవాదాలకు మించింది..!ఇలాంటి కూతుళ్లు ఉంటే..
పేరెంట్స్ పిల్లలకు గిఫ్ట్ల ఇవ్వడం అనేది సర్వసాధారణం. అదే పిల్లలు పెరిగి పెద్దయ్యాక..తల్లిదండ్రులు తమ కోసం చేసిన ప్రతి పనిని గుర్తించుకుని తోచిన రీతిలో గిఫ్ట్ ఇచ్చే అద్భుతమైన రోజు ఎంతమంది పెద్దలకు వస్తుంది ఈ అదృష్టం. అలాంటి అదృష్టాన్నే పొందారు ఈ తల్లిదండ్రులు. అంతేకాదండోయ్ అమ్మో ఇద్దరూ కూతుళ్లా..?! అనే వారికి ఈ ఘటన చెంపపెట్టు. ఇద్దరు టీనేజ్ కూతుళ్లు తమ తల్లిదండ్రులకు జీవితకాలం గుర్తుండిపోయే మంచి సర్ప్రైజ్ ఇచ్చారు. ఏంటా సర్ప్రైజ్ అంటే..తమ తల్లిదండ్రల కళ్లకు గంతలుగట్టి మరి రోడ్డు మీదకు నడిపిస్తారు. కుటుంబ సభ్యులు చుట్టూ గుమిగూడి నవ్వుతూ..ఉంటారు. ఒకపక్క ఈ తల్లిదండ్రలుకు మనసులో ఏం జరుగుతుంది, ఏంటని ఆత్రం..ఏంటా అద్భుతమని కుతుహలంతో ఉంటారు. అంతే ఆ తర్వాత కూతుళ్ల గంతలు విప్పి పార్క్ చేసిన కొత్త కారుని చూపిస్తారు. వారి చేసిన ఆ సడెన్ సర్ప్రైజ్కి నోట మాట రాక భావోద్వేగం చెందుతున్న ఆ తల్లిదండ్రుల ఆనందం మాటలకందనిది. చుట్టుపక్క ఉన్న కుటుంబ సభ్యులంతా చప్పట్లతో సంతోషం వ్యక్తం చేస్తారు. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేస్తూ ‘జీవితకాలానికి ఒక చిన్న ధన్యవాదాలు’ అనే క్యాప్షన్ను జోడించారు. అంతేగాదు ఆ పోస్ట్లో మీరు మాకు ఎప్పుడు ఇది చేయలేరు అన్న మాటలు చెప్పలేదు. హాయిగా ఎరిగిపోండి అని మాత్రమే చెప్పేవారు. ఈ కారు మీరు మాకిచ్చిన జీవితకాల భద్రత, మద్దతు, నమ్మకానికి చిన్న పాటి ధన్యవాదాలు తెలుపుతూ ఇస్తున్నదే అంటూ పోస్ట్ ముగించారు. చాలామంది నెటిజన్లు ఇది కన్నీళ్లు పెట్టించే ఘటన అని, తల్లిదండ్రులకు ఇంతకు మించిన ఆనందం ఇంకొకటి ఏముంటుంది అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Varsha (@varshhaa.n) (చదవండి: నాలుగేళ్లలో రూ. 3.5 లక్షల నుంచి రూ. 65 లక్షల రేంజ్..!) -
ఏమీ తినకున్నా షుగర్ ఎందుకు పెరుగుతుంది?
మధుమేహం అనేది కేవలం తీపి పదార్థాలు, పిండి పదార్థాలు తింటేనే పెరుగుతుందని చాలామంది అనుకుంటారు. కానీ ఒక్కోసారి మనం ఏమీ తినకపోయినా, కడుపు ఖాళీగా ఉన్నా రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగిపోతుంటాయి. దీని వెనుక ఉన్న రహస్యాలను కెనడాకు చెందిన డాక్టర్ రాచెల్ వాంగ్, డాక్టర్ చిరాగ్ టాండన్లు వివరించారు. మనం చేసే నాలుగు చిన్న పొరపాట్లు మన ప్రాణాల మీదకు తెస్తాయని వారు హెచ్చరిస్తున్నారు.నిద్ర లేమి: ఇన్సులిన్కు శత్రువుచాలామంది పని ఒత్తిడిలోనో, మొబైల్ ఫోన్లు చూస్తూనో రాత్రి నిద్రను నిర్లక్ష్యం చేస్తారు. ఎవరైతే రాత్రిపూట ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోతారో, వారిలో ఉదయాన్నే ‘ఫాస్టింగ్ బ్లడ్ షుగర్’ అధికంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. నిద్ర సరిగ్గా లేనప్పుడు శరీరం ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’కు గురవుతుంది. అంటే శరీరం ఇన్సులిన్ను సమర్థవంతంగా వాడుకోలేక, కాలేయం నుంచి గ్లూకోజ్ను నేరుగా రక్తంలోకి విడుదల చేస్తుంది. అందుకే మధుమేహ సమస్య ఉన్నవారు తప్పనిసరిగా 7-8 గంటల పాటు నిద్ర పోవాలి.మానసిక ఒత్తిడి: సైలెంట్ కిల్లర్ఎవరైనా సరే మానసిక ఆందోళనకు గురైనప్పుడు శరీరంలో ‘కోర్టిసాల్’, ‘అడ్రినలిన్’ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించే క్రమంలో కాలేయంలో నిల్వ ఉన్న గ్లూకోజ్ను రక్తం వైపు మళ్లిస్తాయి. ఫలితంగా పూటంతా ఉపవాసం ఉన్నా సరే, ఒత్తిడి కారణంగా షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. ప్రశాంతంగా ఉండటం కేవలం మానసిక ఆరోగ్యానికే కాదు, షుగర్ కంట్రోల్కు కూడా చాలా అవసరమని వెద్యులు చెబుతుంటారు.ఖాళీ కడుపుతో కాఫీ: ఒక హెచ్చరికఉదయాన్నే ‘బెడ్ కాఫీ’ తాగే అలవాటు ఉందా? అయితే మీరు జాగ్రత్తపడాల్సిందే. ఖాళీ కడుపుతో కెఫిన్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు అది ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తుంది. ముఖ్యంగా కాఫీలో చక్కెర, క్రీమ్ జోడిస్తే ఆ ప్రభావం రెట్టింపు అవుతుంది. డయాబెటిస్ ఉన్నవారు కాఫీ తాగాలనుకుంటే, అల్పాహారం తర్వాత లేదా బ్లాక్ కాఫీని మితంగా తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.భోజనం మానేయడం: అస్సలు చేయకూడదుబరువు తగ్గాలనో లేదా బిజీ షెడ్యూల్ వల్లో భోజనం మానేస్తే షుగర్ తగ్గుతుందని చాలామంది పొరబడతారు. కానీ, ఎక్కువ సేపు శరీరం ఆకలితో ఉన్నప్పుడు, దానికి కావాల్సిన శక్తి కోసం కాలేయమే సొంతంగా గ్లూకోజ్ను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలలో అస్థిరత ఏర్పడి, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. క్రమబద్ధమైన సమయాల్లో భోజనం చేయడం రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుతుంది.జీవనశైలి మార్పులే అసలైన మందుఈ నాలుగు అంశాలను గమనిస్తే, రక్తంలో చక్కెర పెరగడానికి కేవలం ఆహారమే కాదు, మన దైనందిన అలవాట్లు కూడా ప్రధాన కారణమని అర్థమవుతోంది. సరైన నిద్ర, ఒత్తిడి లేని జీవితం, సరైన సమయంలో ఆహారం తీసుకోవడం వంటివి షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చిన్న మార్పులే పెద్ద ఫలితాలను ఇస్తాయి.వైద్యుల సలహా తప్పనిసరిఆరోగ్యం విషయంలో సొంత నిర్ణయాల కంటే నిపుణుల సలహాలే సురక్షితంగా ఉంచుతాయి. ఎవరైనా సరే వారి జీవనశైలిలో లేదా డైట్ ప్లాన్లో ఏవైనా మార్పులు చేసే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. నిరంతరం గ్లూకోజ్ లెవల్స్ను పర్యవేక్షించుకుంటూ, ఆరోగ్యకరమైన అలవాట్లను జీవితంలో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: గ్యాస్ కష్టాలు: పనుల్లేక సొంతూళ్లకు వలస కూలీలు -
శ్రీ పరాభవ నామ సంవత్సర పండుగలు 2026–27
శ్రీ పరాభవ నామ సంవత్సర పండుగలు 2026–27చైత్ర మాసం మార్చి19 ఉగాది, తెలుగు సంవత్సరాది వసంతనవరాత్రి ప్రా.21 సౌభాగ్యశయినవ్రతం సౌభాగ్య గౌరీవ్రతం శివడోలోత్సవం27 శ్రీరామనవమీ29 ధర్మరాజదశమీ విష్ణుడోలోత్సవం, రుక్మిణీపూజ మతత్రయ (కామద) ఏకాదశి30 వామనద్వాదశీ31 అనంగత్రయోదశీ ఏప్రిల్01 నోములకు పౌర్ణమి02 సావిత్రీవ్రతం, ఇంద్రపూజ05 సంకటహర చతుర్థి07 మత్స్యజయంతీ13 మతత్రయ (వరూధినీ) ఏకాదశి14 మేష సంక్రమణం15 వరాహజయంతీవైశాఖ మాసం18 చంద్రదర్శనం (నెలపొడుపు)20 అక్షయతృతీయ, బలరామజయంతీ21 శంకర జయంతి, నాగచతుర్థీ23 విద్యారణ్య జయంతి, 24 అపరాజితాదేవీపూజ25 చండికాదేవీపూజ26 వాసవి జయంతి27 అన్నవరం సత్యదేవ కళ్యాణం, మోహినీ ఏకాదశి28 పరశురామద్వాదశీ30 నృసింహజయన్తీమే01 మహావైశాఖీ, సంపద్గౌరీవ్రతం11 హనుమజ్జయంతీ 15 వృషభ సంక్రమణంఅధిక జ్యేష్ఠ మాసం18 చంద్రదర్శనం జూన్15 మిథున సంక్రమణంనిజజ్యేష్ఠ మాసం16 చంద్రదర్శనం 25 మతత్రయ నిర్జల ఏకాదశి29 సావిత్రీవ్రతం, వృషభపూజజులై10 మతత్రయ యోగినీ ఏకాదశి11 కూర్మజయంతీ14 వటసావిత్రీవ్రతంఆషాఢ మాసం15 చంద్రదర్శనం 16 జగన్నాథ రథయాత్ర17 కర్కాటక సంక్రమణం20 కుమారషష్ఠీ25 తొలిఏకాదశీఆగస్టు09 మతత్రయ కామిక ఏకాదశిశ్రావణ మాసం14 చంద్రదర్శనం 16 నాగపూజ (నాగచతుర్థీ)21 వరలక్ష్మీవ్రతం, సెప్టెంబర్04 శ్రీకృ ష్ణ జన్మాష్టమీ 11 పోలాల అమావాస్య భాద్రపద మాసం12 చంద్రదర్శనం 14 వినాయకచతుర్థీ గణపతినవరాత్రి ప్రారంభం15 ఋషిపంచమీ17 కన్య సంక్రమణం27 మహాలయపక్ష ప్రారంభః29 ఉండ్రాళ్ళతద్ది, మహాభరణీ (పితృతిథి)అక్టోబర్10 మహాలయ అమావాస్యఆశ్వీయుజ మాసం12 చంద్రదర్శనం 16 సరస్వతీపూజా ప్రారంభం17 దేవీత్రిరాత్రవ్రతం18 మహాష్టమీ, దుర్గాష్టమీ తుల సంక్రమణం19 మహానవమీ20 విజయదశమీ, శమీపూజ28 అట్లతద్దె, లలితాదేవీయాత్రనవంబర్08 దీపావళీ, లక్ష్మీపూజ09 కేదారవ్రతం, ఆకాశదీప ప్రారంభంకార్తీక మాసం10 అఖండదీప ప్రారంభం చంద్రదర్శనం 13 నాగచతుర్థీ17 వృశ్చిక సంక్రమణం21 క్షీరాబ్ధిద్వాదశీ, 24 కార్తీక వ్రతోద్యాపనం తులస్యుద్వాసనండిసెంబర్04 మతత్రయ (ఉత్పన్నా) ఏకాదశి05 గోవత్సద్వాదశీమార్గశిర మాసం15 స్కందషష్ఠీ16 ధనుస్సు సంక్రమణం20 ముక్కోటి ఏకాదశి గీతా జయంతి22 హనుమద్వత్రం23 దత్తజయంతి జనవరిపుష్యమాసం09 చంద్రదర్శనం 14 భోగి, మకర సంక్రమణం15 సంక్రాంతి16 కనుమఫిబ్రవరిమాఘ మాసం11 శ్రీపంచమీ వసంతోత్సవం13 రథసప్తమీ కుంభ సంక్రమణం14 భీష్మాష్టమీ17 భీష్మ ఏకాదశీమార్చి06 మహాశివరాత్రి, మాసశివరాత్రిఫాల్గుణ మాసం09 చంద్రదర్శనం 15 మీన సంక్రమణం20 కామదహనం22 హోలికాపూర్ణిమ, హోలీ23 వసంతోత్సవంఏప్రిల్06 తర్పణాలకు అమావాస్య -పంచాంగ కర్తశ్రీ కప్పగన్తు సుబ్బరామ సోమయాజులుఫోన్లు: 08676 2414336 /98485 20336 -
అమ్మకు అండగా...
బిడ్డ పుట్టగానే ఆ ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. కాని, ఆ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి మనసులో మాత్రం చీకటి అలుముకుంటుంది. ఎప్పుడూ లేని ఆందోళన, నిరాశ, నిస్పృహలు ఆమెను ఒక్కసారిగా అలుముకుంటాయి. చాలామంది ఇదంతా బాలింతల్లో సహజమే అని సరిపెట్టుకుంటుంటారు. కానీ ఇది ఆమెను నిశ్శబ్దంగా వేధిస్తున్న పోస్ట్పార్టమ్ డిప్రెషన్ (ప్రసవానంతర కుంగుబాటు) అని గుర్తించరు. ⇒ ప్రసవం తర్వాత 2 నుంచి 3 రోజులు మూడ్ స్వింగ్స్ ఉండటం సాధారణం. దీనినే బేబీ బ్లూస్గా పిలుస్తుంటారు. కానీ, రెండు వారాల కంటే ఎక్కువ కాలం నిరాశ, ఆకలి లేకపోవడం, నిద్ర పట్టకపోవడం, బిడ్డను ఎత్తుకోవాలనే కోరిక కలగకపోవడం, ఏదైనా హాని జరుగుతుందని భయపడుతుండటం పోస్ట్పార్టమ్ డిప్రెషన్ లక్షణాలు. ఒక్కోసారి ఇది తీవ్ర సమస్యలకు దారితీయవచ్చు.⇒ దేశంలో ప్రతి ఐదుగురు తల్లులలో ఒకరు అంటే సుమారు 22% మంది ప్రసవానంతర కుంగుబాటుకు గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 13% మంది తల్లులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ శాతం ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం.⇒ ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో (తెలుగు రాష్ట్రాలతో సహా) ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంది. దాదాపు 26% వరకు నమోదవుతోంది.⇒ ప్లాన్ చేయకుండా గర్భం దాల్చిన వారిలో డిప్రెషన్ వచ్చే అవకాశం 1.5 రెట్లు ఎక్కువగా ఉంది.⇒ గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం, పోషకాహార లోపం, మగబిడ్డ కావాలనే సామాజిక ఒత్తిడి వంటి వాటివల్ల 18% మందిలో ఈ సమస్య కనిపిస్తుంది. ఇక నగరాల్లోని మహిళలల్లో ఒంటరితనం, ఉద్యోగ ఒత్తిడి వల్ల ఈ సమస్య 24% మందిలో కనిపిస్తోంది. అంటే గ్రామాల్లో కంటే పట్టణాల్లోనే తల్లులు ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారు.⇒ దాదాపు 70% మంది మహిళలు తమకు ఉన్న మానసిక సమస్యను బయటకు చెప్పడానికి భయపడుతున్నారు. కొంతమంది అది అనారోగ్యం అని కూడా గుర్తించలేకపోతున్నారు. కేవలం 10% నుంచి 15% మంది మాత్రమే ఈ సమస్యకు సరైన వైద్య సహాయం పొందుతున్నారు. ⇒ మన దేశంలో సామాజిక అపోహల వల్ల 60% కంటే ఎక్కువ మంది తల్లులు ఈ డిప్రెషన్కు చికిత్స తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. సరైన సమయంలో కౌన్సెలింగ్, కుటుంబ మద్దతు లభించిన 80% నుంచి 90% మంది మహిళలు 3 నుంచి 6 నెలల్లో పూర్తిగా కోలుకుంటున్నారు.⇒ ఇంటి పనిలో, బిడ్డ సంరక్షణలో భర్త సహకరించడం వల్ల తల్లిపై 40% ఒత్తిడి తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కేవలం ఆర్థిక బాధ్యతలే కాకుండా, ఆమె మాటలను ఓపికగా వినడం కూడా ముఖ్యం.⇒ సుమారు 10% మంది పురుషుల్లో (కొత్తగా తండ్రి అయిన వారు) కూడా ప్రసవానంతర డిప్రెషన్ కు గురవుతారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.⇒ ఇంటిలోని అత్తమామలు, తల్లిదండ్రులు.. మా కాలంలో ఇవన్నీ లేవు అనే విమర్శల కంటే, మేమున్నాం అనే భరోసానివ్వడం ఆమెకు కొండంత అండ. అమ్మకు కావాల్సింది కేవలం ΄ûష్టికాహారం మాత్రమే కాదు.. తగినంత నిద్ర ఉండేలా చూడటం, ఒత్తిడి లేకుండా చూడటం కుటుంబం ప్రాథమిక బాధ్యత. -
ఇది అశ్వమేలు యాగం!
మెరుపు వేగంతో పరుగెత్తే గుర్రాలను చూసి ‘ఆహా’ అనుకుంటాం. చాలామంది గుర్రపు డెక్కల వేగాన్ని మాత్రమే చూస్తారు. కొద్దిమంది మాత్రం వాటి కళ్లలోకి చూస్తారు. ఆ కళ్లలోని అలసటను, అనారోగ్యాన్ని గ్రహిస్తారు. ఉత్తరాఖండ్కు చెందిన గౌరీ మౌలేఖీ అలాంటి వారిలో ఒకరు. తీర్థయాత్రల దారుల్లో గుర్రాలు పడే బాధలు, హింసను కళ్లారా చూసింది. గుర్రాల సంక్షేమం కోసం నడుం బిగించింది. వేలాది గుర్రాలను రక్షించింది. వాటి కోసం సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. గుర్రాలపై హింస జరగకుండా స్వచ్ఛంద సేవకులతో సైన్యాన్ని ఏర్పాటు చేసింది. ఆమెది రాజ్యవిస్తరణ కోసం చేసే అశ్వమేధ యాగం కాదు... అశ్వాల సంక్షేమం కోసం చేసే అశ్వమేలు ఉద్యమ యాగం...ఎర్రటి ఎండలో రెండు గుర్రాలు ఒక బండిని లాగుతూ అలసటతో డెహ్రాడూన్ సమీపంలో కుప్పకూలిపోయాయి. ‘అయ్యో!’ అనుకోలేదు యజమాని. అతడికి ఆగ్రహం వచ్చింది. భయపెట్టి పరుగెత్తించడానికి వాటి ముక్కుల దగ్గర కాగితం వెలిగించాడు. అవి భయాందోళనలతో మళ్లీ పరుగెత్తడం ప్రారంభించాయి. ఈ సంఘటన గౌరి మౌలేఖీకి పదే పదే గుర్తుకు వచ్చి బాధ పెట్టేది. చార్ధామ్, వైష్ణోదేవి వంటి ప్రసిద్ధి తీర్థయాత్ర మార్గాలలో గుర్రాలను ఉపయోగిస్తారు. అక్కడ కొన్ని గుర్రాలు ఎదుర్కొనే బాధలు ఇన్నీ కావు. ఈ అమానవీయ దృశ్యాన్ని మార్చాలనుకుంది గౌరి.న్యాయస్థానం దృష్టికి...వివిధ రూపాల్లో గుర్రాలు ఎదుర్కొంటున్న హింసను ఉత్తరాఖండ్ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చింది గౌరి. గుర్రాలను మాతృప్రేమతో ఎలా చూసుకోవాలో చెప్పుకోవడానికి ఒక ఉదాహరణగా నిలిచింది. గాయపడి ఎవరూ పట్టించుకోని గుర్రాలకు ఆశ్రయం కల్పించడానికి ఉత్తరాఖండ్లో గుర్రాల అభయారణ్యం ఏర్పాటు చేసింది. ఆమె పని కేవలం గుర్రాలకు పునరావాసం కల్పించడం మాత్రమే కాదు, ఎక్కడ గుర్రాలపై హింస జరిగినా నిరోధించడం, జంతువుల పట్ల కరుణతో ఉండాలనే సందేశాన్ని జనాలలోకి తీసుకువెళ్లడం. జంతు సంక్షేమ ఉద్యమానికి ముందు విద్యాబోధన, రేడియో జాకీ, సాఫ్ట్వేర్ ఉద్యోగం, థియేటర్... ఇలా ఎన్నో పనులు చేసింది గౌరి మౌలేఖీ.క్షేత్రస్థాయిలో...‘మా జోక్యానికి ముందు రాష్ట్రంలో జంతువుల పరిస్థితి దారుణంగా ఉండేది. ఏవో ఆచారాల పేర్లతో లక్షలాది జంతువులను బలి ఇచ్చేవారు. పశువైద్యుల కొరత ఉండేది. ప్రభుత్వ సహకారంతో వన్య్రపాణుల సంరక్షణ కేంద్రాలు, జంతు జనన నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేశాం. క్షేత్రస్థాయిలో పరిస్థితులను మెరుగుపరచడానికి సహకార విధానంతో అధికారులతో కలిసి పనిచేయడం మొదలుపెట్టాం, జంతువులకు సంబంధించి ఆరోగ్యకరమైన పరీక్షలు నిర్వహించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. తీర్థయాత్ర మార్గాలలో రిజిస్టర్డ్, ఆరోగ్యకరమైన గుర్రాలను మాత్రమే అనుమతించేలా చూశాం’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది గౌరి.అడ్డంకులు ఎదురైనా సరే...గత కొన్ని సంవత్సరాలుగా డెహ్రాడూన్ చీఫ్ వెటర్నిటీ ఆఫీసర్ డా.సతీష్ జోషి, గౌరీతో కలిసి జంతు సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ‘సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ కేదార్నాథ్, యమునోత్రిలాంటి ప్రాంతాలలో మా వైద్య అధికారులతో పాటు గౌరి బృందం చెప్పుకోదగినరీతిలో జంతుసంక్షేమం కోసం కృషి చేస్తోంది’ అంటున్నాడు డాక్టర్ సతీష్. ఒకప్పుడు ఏ గుర్రాలను చూసి అయితే గౌరి బాధపడిందో అవి ఇప్పుడు ఆమె సంరక్షణలో క్షేమంగా... ఆరోగ్యంగా ఉన్నాయి. ‘ఇప్పుడు అవి నా దగ్గర క్షేమంగా, సంతోషంగా ఉన్నాయి. చనిపోయే వరకు జంతువులతో పనిచేయించాలనే క్రూరత్వం అంతరించాలి’ అంటుంది గౌరి.జంతు సంక్షేమం... అషిమ ఫెలోషిప్జంతు సంక్షేమానికి సంబంధించి యువతరానికి శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటైన కార్యక్రమం... అషిమ ఫెలోషిప్. చట్టపరమైన జ్ఞానాన్ని అందించడమే కాకుండా ప్రభుత్వ విభాగాలు, పరిశ్రమలతో వ్యూహాత్మక కమ్యూనికేషన్లకు ఉపయోగపడుతుంది. ఈ ఫెలోషిన్ అన్లైన్ సెషన్తో ప్రారంభమవుతుంది.‘జంతు సంక్షేమ చట్టాల గురించి సమగ్ర జ్ఞానాన్ని అందించే ఫెలోషిప్ ఇది’ అంటుంది సనా సింగ్. దిల్లీకి చెందిన సనా సింగ్కు చాలాసంవత్సరాలుగా జంతుసంక్షేమం ఆసక్తి. ఆ ఆసక్తితోనే అషిమ ఫెలోషిప్ చేసింది సింగ్. ‘ఫెలోషిప్ కోసం ఇచ్చే ఎనిమిది నెలల శిక్షణ ఎంతో ఉపయోగపడుతున్నప్పటికీ ఇది మాత్రమే సరిపోదు. జంతు సంక్షేమానికి సంబంధించి సమాజం సీరియస్గా ఆలోచించాలి’ అంటుంది. – గౌరి మౌలేఖీ -
శ్రీ పరాభవ నామ సంవత్సర రాశిఫలాలు...
మేష రాశి ఆదాయం11, వ్యయం5, రాజయోగం2, అవమానం4.అశ్విని 1,2,3,4 పాదములు (చూ, చే, చో, లా)భరణి 1,2,3,4 పాదములు (లీ, లూ, లే, లో)కృత్తిక 1వ పాదము (ఆ)విశేష గౌరవ మర్యాదలు అందుకుంటారు. పుణ్యకార్యాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చే విషయంలో శ్రద్ధ వహించరు. అనవసర విషయాలతో సమస్యలు కొని తెచ్చుకుంటారు. ఏలినాటి శని ప్రభావంగా కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపాలు ఉంటాయి. ఆర్థికంగా క్రమక్రమంగా మంచి మార్పులు ఉంటాయి. ఖర్చులు అదుపు చేయలేరు. వస్త్రాభరణ వాహనాదుల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తారు. కొత్త ఋణాలు సమయానికి అందుబాటు అవుతాయి. ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన రీతిగా ప్రమోషన్ లు ఉండవు. స్థానచలన ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ప్రతిపనిలోనూ శ్రమ, ఒత్తిడి ఎక్కువవుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారులకు ఒత్తిడి పెరిగినా, లాభదాయకంగానే ఉంటుంది. మార్కెటింగ్ ఉద్యోగులకు శుభ పరిణామాలు. నూతన వ్యాపార ప్రయత్నాలలో పనులు వేగవంతం అవుతాయి. షేర్ వ్యాపారులకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ధనం, కాలం అధికంగా ఖర్చు అవుతాయి. కోర్టు వ్యవహారాలలో చిక్కులు తప్పవు. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాల ప్రయత్నాలు జోరుగా సాగుతాయి. స్త్రీలకు ఉద్యోగాలలో ఒత్తిడి ఎక్కువవుతుంది. ఆరోగ్య రక్షణ, కుటుంబ రక్షణలో విజయవంతం అవుతారు. గర్భిణులకు ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. అశ్విని: ఉద్యోగంలో అధికారుల సహాయ నిరాకరణ ఎదురవుతుంది. బంధువులతో తరచుగా కలçహాలు ఉంటాయి. నూతన ప్రయత్నాలు విఫలం అవుతాయి. ఆర్థిక లావాదేవీలలో అసంతృప్తి ఎదురవుతుంది. ఇతరుల వ్యవహారాలలో కలుగ చేసుకొని అవమానపడుతుంటారు.భరణి: ఆగ్రహావేశాలు ప్రదర్శించి, కలహాలలో చిక్కుకుంటారు. అన్ని అంశాలలో అగౌరవం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరుల వ్యవహారాల జోలికి పోతే సమస్యలు తప్పవు. స్థానచలన, ప్రమోషన్ ప్రయత్నాలకు విఘ్నాలు ఎదురవుతాయి.కృత్తిక: ఓర్పు నేర్పులతో సాధించుకుంటూ ముందుకు వెడతారు. పుణ్యక్షేత్ర సందర్శన, పుణ్యకార్యాలలో పాల్గొనడం ద్వారా ధనవ్యయం అధికంగా చేస్తుంటారు. నమ్మించి మోసం చేసేవారు అధికంగా ఉంటారు. వాహన మరమ్మతుల కోసం తరచు ధనవ్యయం అవుతుంది.శాంతి మార్గం: శనికి జప దాన తర్పణలు చేయిస్తూ ఉండండి. రోజూ శివాలయంలో ప్రదోష కాలంలో ‘శ్రీమాత్రే నమః’ అని చెబుతూ 11 ప్రదక్షిణలు చేయండి. సుందరకాండ, గజేంద్రమోక్షం పారాయణ, పంచముఖ రుద్రాక్షధారణ శుభప్రదం. ఏప్రిల్: ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోండి. 10వ తేదీ తరువాత దూర ప్రయాణాలు విరమిస్తే మంచిది. ధనం వెసులుబాటు ఇబ్బందికరం అవుతూ ఉంటుంది. అధికారుల సహకారం తగ్గుతుంది. బుద్ధి చురుకుగా పనిచేసినా, పనులు శ్రమతో పూర్తవుతాయి. కొత్త ఋణాలు చేయడం మంచిది కాదు. వృథా కాలక్షేపాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ పెద్దల ఆరోగ్య రీత్యా ఖర్చు పెరుగుతుంది. మే: తెలివి, ధైర్యం ఉన్నా, చాలా విషయాల్లో పనులు సానుకూలం కావు. ఆదాయ మార్గాలు బాగానే ఉన్నా, అనవసర ఖర్చులు నియంత్రించలేరు. ఆర్థిక వ్యవహారాలలో కుటుంబసభ్యులతో విభేదాలు రాగలవు. ఋణ సౌకర్యం బాగుంటుంది. ఆరోగ్యం చికాకు సృష్టిస్తుంది. విద్యార్థులకు, షేర్ వ్యాపారులకు గురుబలం అనుకూలం. జూన్: పనుల్లో ఆటంకాలు ఉంటాయి. 8వ తేదీ తరువాత మంచి మార్పులు. 20 తేదీ నుంచి కాలం ఇంకా బాగుంటుంది. 20వ తేదీ లోపల ఆరోగ్యం బాగా చూసుకోవాలి. అన్ని వ్యవహారాలలోనూ మంచి సలహాలు అందుతాయి. ఇతరులకు సలహాలిచ్చి అవమానాలు పొందుతారు. తరచు దేవాలయ సందర్శన చేస్తారు. జులై: కుటుంబ వ్యవహారాలను బాగా చక్కదిద్దుతారు. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య స్నేహ బంధం బాగుంటుంది. వృత్తి విషయాలలో అధికారులకు, వర్కర్స్కు మధ్య బంధం బాగా ఉంటుంది. స్థానచలన, ప్రమోషన్ ప్రయత్నాలు స్వయంగా చేసుకోవడం మంచిది. ఆర్థిక విషయాలను స్వయంగా చక్కబెట్టుకుంటారు. గౌరవ మర్యాదలు పొందుతారు.ఆగస్ట్: వృత్తి విషయంలో ఆధిపత్యం సాధిస్తారు. కుటుంబ కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు. నూతన ప్రయత్నాలు వేగం పుంజుకుంటాయి. వ్యాపారులకు లాభాలు అందుతాయి. విద్యార్థులకు కాలం అనుకూలం. కోర్టు విషయాలు, శుభకార్య విషయాలు సానుకూలం. నూతన వస్తువుల కొనుగోలుకు అధిక ధనవ్యయం చేస్తారు. సెప్టెంబర్: అనవసర సంచారం పెరుగుతుంది. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య పరిరక్షణ కారణంగా కొంతకాలం ఏ పనిలోనూ సమయపాలన కుదరదు. అధికారులు సహకరిస్తారు. ఋణాలు తీర్చే విషయంలో మాట నిలబెట్టుకోలేరు. 18వ తేదీ తరువాత మంచి మార్పులు ఉంటాయి. ఇతరుల పొరపాట్లకు మీరు సమాధానం చెప్పవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. అక్టోబర్: కొన్నిసార్లు శారీరక శ్రమ, కొన్నిసార్లు మానసిక చికాకులతో ఇబ్బందులు పడతారు. జాగ్రత్తగా వ్యవహరించినా, వారికి మంచి ఫలితాలు దక్కక ఇబ్బందికరంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోండి. ఖర్చుల నియంత్రణ మీద దృష్టి పెట్టాలి. ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. దూర ప్రాంతాలకు స్వయంగా వాహనాలు నడపడం శ్రేయస్కరం కాదు. నవంబర్: ప్రతిపని సమస్యాత్మకం అవుతూ ఉంటుంది. ఉద్యోగ భద్రత మీద దృష్టి ఉంచండి. కుటుంబ విషయాలు సాధారణ స్థాయిగా ఉంటాయి. మనసుకు ఆనందం ఇచ్చే వార్తలు వింటారు. రోజువారీ పనుల్లో కూడా సొంత నిర్ణయాలు, సమయపాలన లేకపోవడం ఉంటాయి. పుణ్యకార్యాలపై శ్రద్ధ వహిస్తారు. పనులు వేగం పుంజుకుంటాయి. డిసెంబర్: పనులేవీ సరిగా సాగవు. ప్రధానంగా కుటుంబ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. నూతన ప్రయత్నాలు సరిగా ఉండవు. కావలసిన వనరులు లభ్యంకాక వ్యాపారం ఇబ్బందికరం అవుతుంది. ఆరోగ్య పరిరక్షణ మీద దృష్టి పెడతారు. సమస్యలు పెరుగుతాయి. ధనం సర్దుబాటు కాకపోవడం వల్ల కొన్ని పనులను మధ్యలోనే వదిలేస్తారు. మాటతీరు నియంత్రించుకోవలసిన కాలం. జనవరి: ఆర్థిక లావాదేవీలను విజయవంతంగా నడుపుతారు. ఉద్యోగ వ్యాపారాలలో ప్రోత్సాహకర ఫలితాలు అందుతాయి. కుటుంబంలో మంచి వాతావరణం నెలకొని సుఖపడతారు. చాలా ప్రయాణాలు చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రుల రాకపోకలు ఎక్కువ అవుతాయి. వీలైనంత వరకు మితభాషణ చేస్తూ ఉండండి. కొత్త ఋణాలు చేయవద్దు. ఫిబ్రవరి: అన్ని అంశాలలోను పురోగతి ఉంటుంది. తేలికగా పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. అందరి నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రతికూలత ఉన్న పనులు కూడా ఈ నెలలో ప్రారంభిస్తే సానుకూలం అవుతాయి. ఉద్యోగ వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో స్థానచలనం, ప్రమోషన్లు వంటివి ఆశించినట్లయితే, ఈ నెలలోనే వాటికి ప్రయత్నం ప్రారంభించాలి. మార్చి: ఉద్యోగంలో ఉన్న ఒత్తిడిని దాటవేస్తారు. అధికారుల అండదండలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా మారతాయి. శుభకార్య పుణ్యకార్య ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అలంకరణ వస్తువులు, వాహనాల కొనుగోలు విషయాలలో దృష్టి పెంచుతారు. వ్యాపారులు జాగ్రత్తగా ఉండవలసిన కాలం. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో ఇబ్బందులు ఉంటాయి. వృషభ రాశిఆదాయం–5, వ్యయం–14, రాజయోగం–5, అవమానం–4కృత్తిక 2,3,4 పాదములు (ఈ, ఊ, ఏ) రోహిణి 1,2,3,4 పాదములు (వో,వా,వీ,వూ)మృగశిర 1,2 పాదములు (వే,వో)నిబద్ధతతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధు విరోధం ఎక్కువగా ఉంటుంది. కుటుంబసభ్యులతో కలిసి ధర్మ కార్యాచరణ చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తుంటారు. పెద్దల ఆరోగ్యం, పిల్లల అభివృద్ధి వార్తలు సంతోషం కలిగిస్తాయి. శుభకార్య ప్రయత్నాలలో సానుకూలత ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉంటారు. ఆదాయ వ్యయాలను అదుపులోకి తెచ్చుకుంటారు. వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, అలంకరణ వస్తువుల కొనుగోలు ఖర్చు పెరుగుతుంది. ఫైనాన్స్ వాప్యారులు లాభాలు అందుకుంటారు. సకాలంలో ఋణాలు దొరుకుతాయి. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటారు. ఉద్యోగ కార్యకలాపాలలో తెలివిగా వ్యవహరిస్తారు. మార్కెటింగ్ ఉద్యోగులు మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగ వ్యవహారాలలో తెలివితేటలతో, ధైర్య సాహసాలతో వ్యవహరించి ఊహకు అందని లాభాలను అందుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలతో కూడిన శుభ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు శ్రమతో లాభాలు పొందుతారు. అధికారుల నుంచి సహకారం తక్కువ ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్నాలలో సహకారం అందుతుంది. షేర్ వ్యాపారులకు దినదినాభివృద్ధిగా ఉంటుంది. విద్యార్థులకు కాలం అనుకూలం. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కోర్టు వ్యవహారాలు ఏదో రీతిలో పరిష్కారమవుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ఈ రాశి స్త్రీలకు సమర్థతకు తగిన గుర్తింపు వస్తుంది. శుభ, పుణ్యకార్యాలలో పాల్గొంటారు. గర్భిణీ స్త్రీలకు గ్రహానుగ్రహం బాగుంది. కృత్తిక 2, 3, 4: ఎన్నో విజయాలు సాధిస్తారు. నరఘోష తరచుగా అనుభవిస్తారు. బంధువులతో పొరపొచ్చాలు ఎదురు కావచ్చు. మాటతీరు నియంత్రించుకోవడం లాభిస్తుంది. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు బాగుంటాయి.రోహిణి: వృత్తిరీత్యా దూరప్రయాణాలు చేస్తారు. అనారోగ్య వంతులైన కుటుంబసభ్యులకు కావలసిన వసతులు సమకూరుస్తారు. ఏదో తెలియని మానసిక చికాకులు వెంటాడుతుంటాయి. బంధుమిత్రుల ద్వారా నరఘోషకు గురవుతారు.మృగశిర 1, 2: ఆటంకాలు ఎదురైనా, ప్రారంభించిన ప్రతిపనిలోనూ విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం సహకరించడం, పిల్లల వలన శుభ పరిణామాలు, కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం అనుకూలంగా ఉండడం వల్ల ఆనందంగా ఉంటారు. శాంతి మార్గం : రోజూ గోపూజ, లక్ష్మీనారాయణ పూజ చేయడం శుభప్రదం. దక్షిణామూర్తి స్తోత్రం రోజూ పారాయణ చేయడం ద్వారా విజయశాతం పెరుగుతుంది. అక్టోబర్లో రాహు కేతువులకు జప, దాన, తర్పణలతో పాటు తెల్లటి పుష్పాలతో అమ్మవారి అర్చన, సప్తముఖ రుద్రాక్షధారణ శుభప్రదం. ఏప్రిల్: ఉద్యోగ, వ్యాపారాలలో అంతా సానుకూలం. కుటుంబంలో చికాకులు వస్తాయి. తెలివిగా సరిచేస్తారు. ఆర్థిక, ఆరోగ్య విషయాలలో జాగ్రత్తపడతారు. తరచు మానసిక ఒత్తిడి ఉంటుంది. కలహాలు రాకుండా జాగ్రత్త పడండి. విజయాలు సాధించి, గౌరవ మర్యాదలు పొందుతారు. నూతన వాహనాలు, అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభవార్తలు వింటారు. మే: వాతావరణ ప్రభావంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. భవిష్యత్ కార్యాచరణ మీద దృష్టి కేంద్రీకరిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. 15వ తేదీ తరువాత పనులు వేగంగా చేయలేని పరిస్థితి ఉంటుంది. వద్దు అనుకుంటూనే అనేక ప్రయాణాలు చేస్తారు. స్నేహితులు, బంధువులతో వ్యవహార సమస్యలు సానుకూలం కాగలవు. జూన్: చాలా జాగ్రత్తగా కాలక్షేపం చేయండి. సంబంధం లేని సమస్యలు రాగలవు. రోజువారీ పనులు కూడా సరిగా చేయలేరు. ఇతరుల వ్యవహారములలో కలుగచేసుకోవద్దు. ఆరోగ్య, ఋణ, కలహ విషయాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుతుంది. వ్యాపారులకు పనివారితో సమస్యలు ఎక్కవవుతాయి. ముఖ్యులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అన్ని వ్యవహారాలలోను మంచి సలహాలు పొందుతారు. జులై: ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. కలహాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం కాపాడుకుంటారు. ఉద్యోగ భద్రత ఉంటుంది. పనులు విజయవంతం అవుతాయి. వ్యాపారులు తమ ఆలోచనలను అమలు చేయగలుగుతారు. ఒక్కోసారి పెంపుడు జంతువుల సేవల కోసం ముఖ్యమైన పనులు ఆలస్యం చేస్తుంటారు. ఆగస్ట్: పనులు వేగంగా సాగినా, శ్రమాధిక్యం ఉంటుంది. వాహన, యంత్రాల మరమ్మతులకు అధిక వ్యయం జరుగుతుంది. పుణ్య, శుభకార్యాలలో బంధుమిత్రులను కలుస్తారు. ఆరోగ్యం సమస్యల విషయంలో వైద్యులను కలవడం శ్రేయస్కరం. గృహోపకరణాల కొనుగోలుకు ధనవ్యయం అవుతుంది. కోర్టు, ఇతర వ్యవహారాలలో మంచి సలహాలు అందుతాయి. సెప్టెంబర్: తరచు ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొంటారు. ఉద్యోగాలలో సాధారణ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు అంతా శుభప్రదం. దూర ప్రయాణాలు చేస్తారు. ఋణాలు తీర్చేందుకు అవకాశాలు ఉండవు. ఓర్పుగా వ్యవహరించడం మంచిది. మార్కెటింగ్ ఉద్యోగులు, విద్యార్థులకు శ్రమాధిక్యం. ప్రతిరోజూ ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది. అక్టోబర్: కొత్త కొత్త ప్రణాళికలు చేస్తారు. వాహనాలు అలంకరణ వస్తువుల కొనుగోలు గురించి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితులు, కుటుంబసభ్యులతో కలహాలు రాకుండా జాగ్రత్తపడండి. పిత్రార్జిత ఆస్తి వ్యవహారాలలో ఓర్పుతో వ్యవహరించడం మంచిది. అధికారుల సహకారం బాగా ఉంటుంది. చదువు బాగా సాగుతుంది. మీ తెలివిని అందరూ గుర్తిస్తారు. నవంబర్: పెద్దల ఆరోగ్య విషయంగానూ, పిల్లల అభివృద్ధి విషయంలోనూ అసంతృప్తిగా ఉంటారు. ఉద్యోగ వ్యాపారాలలో మొండిగా ఉంటారు. కోపావేశాలు నియంత్రించుకోవాలి. అవయవ ప్రతికూలతలు ఉంటాయి. వైద్యపరంగా అనవసర ఖర్చు ఉంటుంది. బంధుమిత్రులతో పాత విషయములలో కలహములు రాగలవు. పిల్లల విషయంలో ప్రత్యేక పర్యవేక్షణ ఉంచండి. డిసెంబర్: మామూలు పనులు కూడా ఒత్తిడితో పూర్తవుతాయి. ఉద్యోగ భద్రత ఉంటుంది. పనులు స్వయంగా చేసుకుంటే వృత్తి ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఋణాలను సకాలంలో చెల్లించకుంటే, ఇబ్బందులు తప్పవు. తరచు తలెత్తే అజీర్ణ సమస్యలు భయం కలిగిస్తాయి. జనవరి: నూతన ప్రయత్నాలు సరిగా సాగవు. దూర ప్రయాణాలను విరమించండి. కుటుంబ, వృత్తి విషయాలకు సమయం సమతూకంగా కేటాయించలేక ఇబ్బంది పడే సందర్భాలు ఉంటాయి. ఋణ సౌకర్యం బాగానే ఉంటుంది కాని, అది పొందకపోవడం భవిష్యత్కు మంచిది. ఫిబ్రవరి: తరచుగా భోజన సౌకర్యం లోపిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలలో అనవసరంగా అధికారుల నుంచి, తోటివారి నుంచి మాట పడతారు. ఆర్థిక, కుటుంబ విషయాలు అనుకూలం. సమయపాలన లోపించి, పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. అవమానకర సంఘటనలు ఎదురు కాకుండా వ్యవహరించండి. మార్చి: అప్రయత్నంగా కొన్ని వ్యవహారములు సానుకూలం అవుతాయి. ఉద్యోగాలలో పనులు తెలివిగా చేస్తారు. ఎంతో శ్రమతో ఆర్థిక సమస్యలను పరిష్కరించుకో గలుగుతారు. అన్ని విషయాలలో కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. అనవసర కాలక్షేపాలు చేయరు. కుటుంబ, వృత్తి విషయాలకు ప్రాధాన్యం ఇచ్చిన వారికి లాభదాయకంగా ఉంటుంది. విద్యా వ్యాసంగంలో వారికి కాలం అనుకూలం.మిథున రాశిఆదాయం– 8, వ్యయం– 11, రాజయోగం– 1, అవమానం– 7.మృగశిర 3,4 పాదములు (కా, కి)ఆరుద్ర 1,2,3,4 పాదములు (కూ, ఖం, ఙ, ఛ)పునర్వసు 1,2,3 పాదములు (కే, కొ, హా)వృథా కాలక్షేపాలకు అవకాశం ఇవ్వవద్దు. కుటుంబ విషయాలలో అనుకూలత ఉన్నా, సంవత్సరాంతంలో తెలియని భయానికి గురవుతారు. శుభ, పుణ్యకార్య ప్రయత్నాలలో పాల్గొంటారు. ఆర్థిక కార్యకలాపాలలో సానుకూలత. విఘ్నాలు ఎదురైనా, పనులు పూర్తవుతాయి. ప్రయాణాలు అధికంగా చేయవలసి ఉంటుంది. ఫైనాన్స్ వ్యాపారులకు అక్టోబర్ వరకు అనుకూలం. సంవత్సరం ద్వితీయార్ధంలో ఋణాలు ఇబ్బందులు సృష్టిస్తాయి. ఆరోగ్య పరిస్థితులు అక్టోబర్ వరకు బాగుంటాయి. అక్టోబర్ నుంచి మానసిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగులకు అధికారుల మందలింపులు ఎక్కువ అవుతాయి. స్థానచలనం, ప్రమోషన్లలో సానుకూలతలు తక్కువ. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారులు ఏడాది ప్రథమార్ధంలో ఒత్తిడి లేకుండా వ్యాపారం చేస్తారు. ద్వితీయార్ధంలో ఒత్తిడికి లోనవుతారు. మార్కెటింగ్ ఉద్యోగుల స్థితి కూడా ఇలాగే ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్నాలకు అక్టోబర్ వరకు అద్భుతమైన కాలం. షేర్ వ్యాపారులకు మధ్యమధ్యలో ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులు సంవత్సరాంతంలో అనాలోచితంగా ప్రవర్తించే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో శుభపరిణామాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాలు ఒత్తిడి కలిగిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలలో మోసపోయే అవకాశాలు ఎక్కువ. ఈ రాశి స్త్రీలకు అక్టోబర్ వరకు సానుకూలంగానూ, అక్టోబర్ తర్వాత మానసిక ఒత్తిడితోనూ ఉంటుంది. శ్రమతో పనులు పూర్తవుతాయి. వ్యాపారులకు పనివారితో ఇబ్బందులు. గర్భిణులు సాధారణస్థాయి జాగ్రత్తలు పాటించి మంచి ఫలితాలు పొందుతారు.మృగశిర 3, 4: సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంప్రదించకుండా అక్టోబర్ తరువాత పుణ్య, సామాజిక కార్యక్రమాలకు విరాళాల వంటివి హామీ ఇవ్వవద్దు. దూరప్రాంత ప్రయాణాలు కూడా చేయవద్దని సూచన. వృథా కాలక్షేపాలు, అనవసర శ్రమ ఎక్కువ చేస్తారు.ఆరుద్ర: కుటుంబ విషయంలో సరైన నిర్ణయాలు జరగవు. వృథా ఖర్చులు నియంత్రించలేని స్థితి. సంవత్సరం ద్వితీయార్ధంలో విచిత్రస్థితిని ఎదుర్కొంటారు. మానసిక ఇబ్బందులు ఉంటాయి. కొత్త ప్రయత్నాలు శ్రేయస్కరం కాదు. పాత ఆరోగ్య, ఋణ సమస్యలు చికాకులు యిస్తాయి.పునర్వసు 1, 2, 3 : అన్ని అంశాలు సాధారణ స్థాయిలో ఉంటాయి. ప్రణాళిక లేకుండా ఆర్థిక కార్యకలాపాలు సాగిస్తూ ఉంటారు. గోప్యత పాటించక సొంత విషయాలను బయటపెట్టుకుని, చికాకులు పొందుతారు. అక్టోబర్ తరువాత వృథా కాలక్షేపాలు ఎక్కువ అవుతాయి.శాంతి మార్గం: అక్టోబర్లో రాహు కేతువులకు జప, దాన, తర్పణలు చేయించండి. స్వయంగా దత్తస్తవరాజం, విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం శ్రేయస్కరం. అక్టోబర్ నుంచి దుర్గా సప్తశ్లోకీ పారాయణ ప్రతిరోజూ 11 సార్లు చేయండి. మినుములతో చేసిన పదార్థాలను దానం చేయండి. త్రిముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్: చక్కటి బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు. ముందు జాగ్రత్తలలో ఆరోగ్య రక్షణ చేసుకుంటారు. పనులు అర్ధాంతరంగా వదిలేయడం వంటివి ఎక్కువవుతాయి. కుటుంబ సభ్యులతో సయోధ్య పెరుగుతుంది. అవరో«ధాలు సృష్టించే సహచరులు ఉంటారు. వృత్తిలో పనివారితో ఒత్తిడి పెరుగుతుంది. తరచుగా వాహన సమస్యలు వస్తాయి. మే: పెండింగ్లో ఉన్న పనులు వేగంగా సాగుతాయి. వాహనాలతోనూ, స్నేహితులతోనూ జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు తలెత్తుతాయి. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. ప్రయత్నాలన్నీ అధిక వ్యయంతో ముడిపడి ఉంటాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు. జూన్: బంధువులకు అనారోగ్య విషయంగా తరచుగా ప్రయాణాలు చేస్తారు. ఆదాయం బాగానే ఉన్నా, అనవసర వ్యయం ఎక్కువగా చేస్తుంటారు. వృథా ప్రయాణాలు చేస్తుంటారు. అకాల భోజనం నిత్యకృత్యం అవుతుంది. వ్యాపారులు కొత్త కొత్త ఆలోచనలను అమలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు అనుకూలం అవుతాయి. జులై: రోజువారీ పనుల్లోను, వృత్తి విషయాల్లోను ఆటంకాలు తప్పవు. ఉద్యోగులకు అధికారుల నుంచి రక్షణ లభించని స్థితి ఉంటుంది. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా జాగ్రత్తపడండి. వ్యాపారులు బాగా జాగ్రత్తలు పాటించవలసిన కాలం. కొత్త ఋణాలు దొరకక పోగా, పాత ఋణాలు ఇబ్బంది పెడతాయి. ఖర్చులు అదుపు తప్పుతాయి. ఆగస్ట్: విజ్ఞాన వినోద కార్యాలలో పాల్గొంటారు. అవసరమైన పనులు వాయిదా వేస్తారు. రోజువారీ పనులు ఆలస్యం చేస్తారు. విద్యార్థులకు విద్యాభంగం అనేకసార్లు ఎదురవుతుంది. ఋణ సౌకర్యం అందుకుంటారు. ఎందులోనూ స్థిరబుద్ధి ఉండదు. అనవసర కాలక్షేపాలకు ఆకర్షితులవుతారు. కుటుంబ అవసరాలలో కూడా దృష్టి ఉంచరు. సెప్టెంబర్: ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తారు. అందరి సహాయ సహకారాలతో మాసం చివర్లో విజయాలు సాధిస్తారు. పుణ్య కార్యాలలో ఆటంకాలు ఎదురవుతాయి. శుభకార్య ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. అలంకరణ వస్తువులు, వాహనాలు తరచు మరమ్మతులకు వస్తాయి. ఆర్థిక వ్యవహారాలను స్వయంగా చూసుకోవడం మంచిది. అక్టోబర్: కుటుంబ సభ్యులతో కలసి తీర్థయాత్రలు, విజ్ఞాన విహారయాత్రలు చేస్తారు. కొన్నిసార్లు అవయవ ప్రతికూలత ఉన్నట్లు భావనలోకి వెడతారు. వృత్తి విషయాలు సానుకూలం. దురలవాట్లు ఉన్నవారికి ఇబ్బందులు రాగలవు. వద్దు అనుకుంటూనే ఇతరులకు ధనం సర్దుబాటు చేస్తారు. ఆరోగ్య, ఆర్థిక వ్యవహారాలలో తెలివిగా మెలగుతారు. నవంబర్: మాట తీరు, నడవడి నియంత్రించుకుంటారు. భార్యా పుత్ర కలహం పెరుగుతుంది. ఉద్యోగం వ్యాపారాలలో తోటివారితో కలహాలు రాగలవు. వాహన మరమ్మతు ఖర్చులు ఉంటాయి. స్వయంగా వాహనాలు నడుపుతూ దూర ప్రయాణములు చేయవద్దు. విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ అయినా, పనులు లాభిస్తాయి. డిసెంబర్: కాలం అనుకూలిస్తుంది. గత సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయండి. రోజువారీ పనులు అకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో విజయాలు అందుకుంటారు. సమస్యలు రాకుండా జాగ్రత్తపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. మంచి వ్యక్తులు మీకు మంచి సలహాలు ఇస్తుంటారు. జనవరి: కుటుంబ విషయంలోను, బంధుమిత్రులతోను జాగ్రత్తలు పాటించాలి. దూర ప్రయాణాలు చేయవద్దు. ఆదాయ వ్యయాలపై పూర్తి నియంత్రణకు ప్రయత్నించండి. పాత ఋణములు, పాత ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తపడండి. నూతన ప్రయత్నాలు ఆర్భాటంగా మొదలైనా, సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు లేవు.ఫిబ్రవరి: స్థిరచిత్తం ఉంచరు. మొండి ధైర్యంతో అనవసర విషయాలను కదిలిస్తారు. సోమరితనంతో తోటివారితో కలహాలు తెచ్చుకుంటారు. కుటుంబ అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. ఆర్థిక వనరులు బాగానే సమకూరుతాయి. విజ్ఞాన, వినోద, విహార కార్యక్రమాల వైపు మనసు లాగుతుంది. అత్యవసరమైన పనుల్లో సరిగా దృష్టి ఉంచక ఇబ్బంది పడతారు. మార్చి: ఏ సమస్యనైనా తెలివిగా సాధిస్తారు. బుద్ధి కుశలతతో ఉద్యోగ విధి నిర్వహణలో గౌరవం పెంచుకుంటారు. రాబోవు కాలంలో ప్రమోషన్ ఆశించేరీతి పనితీరు ఉంటుంది. ఆరోగ్యం బాగా కాపాడుకుంటారు. వ్యాపారులు సమస్యలను అధిగమిస్తారు. ఋణ సౌకర్యం బాగుంటుంది. నూతన ఉద్యోగ వ్యాపారాలలో ప్రణాళికతో ఉంటారు. పుణ్య కార్యాలు చేస్తారు. స్థానచలన, ప్రమోష¯Œ లకు ప్రత్యేక ప్రయత్నాలు సాగిస్తారు. విద్యా వ్యాసంగం బాగుంటుంది. కర్కాటక రాశిఆదాయం–2, వ్యయం–11, రాజయోగం–4, అవమానం–7.పునర్వసు 4వ పాదము (హి)పుష్యమి 1,2,3,4 పాదములు (హూ, హే, హొ, డా)ఆశ్లేష 1,2,3,4 పాదములు (డీ, డూ, డే, డొ)దైనందిన కార్యక్రమాలలో సమయపాలన, నియమపాలన లేకుండా వ్యవహరిస్తారు. భార్యాపుత్రల నడవడి మీకు నచ్చక, మీ నడవడి వారికి నచ్చక చికాకులు పొందుతారు. పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంఘంలో గౌరవ మర్యాదలకు ఇబ్బంది రాకుండా జాగ్రత్తపడండి. స్నేహితులతో జాగ్రత్తలు వహించండి. అవసరానికి తగిన ఆదాయం అందదు. ఖర్చులు నియంత్రించలేరు. శుభ కార్యాల వలన ఖర్చులు పెరుగుతాయి. వృథా ఖర్చులు అధికమవుయి. ఋణాల వల్ల ఇబ్బందులు ఎదరవుతాయి. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాల్సిన కాలం. ఉద్యోగాలలో రావలసిన ప్రమోష¯Œ లకు అడ్డంకులు సృష్టించే వారు ఉంటారు. మార్కెటింగ్ ఉద్యోగులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. ట్రాన్స్ఫర్ వ్యవహారాలు స్వయంగా చూసుకోవడం మంచిది. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి చక్కని అవకాశాలు జారిపోతాయి. వ్యాపారులు ఋణాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఫైనాన్స్ వ్యాపారులకు మొండి బాకీలు పెరుగుతాయి. అవసరానికి కొత్త ఋణాలు సర్దుబాటు కావు. నూతన వ్యాపార ప్రయత్నాలలో ధనవ్యయం అధికం అవుతుంది. షేర్ వ్యాపారులకు లాభాలు ఉన్నా చికాకులు తప్పవు. విద్యార్థులకు శ్రద్ధ లోపిస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ధనవ్యయం, కాలహరణం తప్పవు. కోర్టు వ్యవహారాలు చికాకులను కలిగిస్తాయి. స్థిరాస్తి లావాదేవీలు కలసిరావు. ఈ రాశి స్త్రీలకు పని ప్రదేశాల్లో తోటివారితోనూ, ఇంట్లోని పనివారితోను ఇబ్బందులు తలెత్తుతాయి. అక్టోబర్ తరువాత మొండి వైఖరి పెరుగుతుంది. గర్భిణులకు అనాలోచిత ప్రవర్తన ఎక్కువ అవుతుంది. జాగ్రత్త పడండి.పునర్వసు 4: పిల్లల నుంచి సహాయ సహకారాలు పెరుగుతాయి. రోజువారీ పనులు సకాలంలో జరుగుతాయి. ఆర్థిక జాగ్రత్తలు పాటిస్తారు. కొన్ని సందర్భాలలో ఆలోచనలను వేగంగా అమలు చేసి జరగవు అనుకున్న పనులను సాధించగలుగుతారు. అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది.పుష్యమి: ఒంటరి ప్రయాణాలు, అనవసర కాలక్షేపాలు మానుకోండి. సంబంధం లేని వ్యవహారాల గురించి సమయం పాడుచేసుకోవడం, అవసరం లేని వస్తువులు కొనుగోలు చేయడం వంటివి చేస్తూ ఉంటారు. బంధు మిత్రుల రాకపోకలు పెరుగుతాయి. శుభకార్య ప్రయత్నాలు జరుగుతాయి.ఆశ్లేష: పుణ్యకార్యాలు చేస్తారు. మానసిక ఒత్తిడిని జయిస్తారు. ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తారు. పాత ఋణ వ్యవహారాలు అక్టోబర్ లోపుగా కొలిక్కి వస్తాయి. అక్టోబర్ తరువాత ఇతరుల నుంచి సహాయ నిరాకరణ పెరుగుతుంది. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.శాంతి మార్గం: రాహు, కేతువులకు జపదాన హోమాదులు చేయండి. రాహు శాంతికి రోజూ దుర్గా సప్తశ్లోకీ పారాయణ చేయండి. కేతు శాంతికి రోజూ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయండి. మంగళవారాలలో పొయ్యిదానం చేయండి. షణ్ముఖ రుద్రాక్షధారణ శుభప్రదం. ఏప్రిల్: ఆదాయం ఆలస్యంగా అందుతుంది. ఖర్చులు నియంత్రించలేరు. శరీరం శుష్కించే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలలో సానుకూలత తక్కువ. స్థిరాస్తి వ్యవహారాలు సరిగా సాగవు. మనస్పర్థలు, వృథా కాలక్షేపాలు విడనాడిన వారికి సౌఖ్యం ఉంటుంది. షేర్ వ్యాపారులకు అనుకూలత తక్కువ. విద్యార్థులు జాగ్రత్త వహించాలి. మే: ఆదాయం తక్కువగా ఉన్నా, ఖర్చులు నియంత్రించగలుగుతారు. పుణ్య, శుభకార్యాలలో పాల్గొంటారు. స్వేచ్ఛగా సంచరిస్తారు. ద్వితీయార్ధంలో వాహన సంబంధ చికాకులు ఉంటాయి. షేర్ వ్యాపారులకు కాలం బాగుంది. విద్యార్థులకు, రైతులకు ఈ నెల 15 తరువాత అసంతృప్తి ఉంటుంది. కళత్ర అవయోగాలు ఉంటాయి. జూన్: వాహన చికాకులు ఉంటాయి. పనిముట్ల వాడకంలో గాయపడే అవకాశం ఉన్నది. వృథా కాలక్షేపాలు చేస్తారు. మాటతీరు వల్ల కలహాలు, ఆరోగ్య సమస్యలు తరచుగా ఉంటాయి. పెంపుడు జంతువుల వలన ఇబ్బంది ఉంటుంది. చేసిన పనులకు గుర్తింపు దొరకదు. జులై: కొన్నిసార్లు ధైర్యంగా ఉంటారు. కొన్నిసార్లు తెలియని అధైర్యంతో తెలివి తక్కువ పనులు చేస్తూ ఉంటారు. కోర్టు వ్యవహారాలలో మంచి సలహాలు ఇచ్చేవారు ఉంటారు. ప్రశాంతత తగ్గుతుంది. ఉద్యోగ విధి నిర్వహణలో నిబద్ధత లేక అధికారుల ఆగ్రహావేశాలకు లోనవుతారు. ఆగస్ట్: సందర్భానుసారంగా ప్రవర్తింప లేకపోవడం, అందరినీ దూషించడం వంటి చేష్టలు అధికం అవుతాయి. సహకరిస్తారు అనుకున్న వారు సహకరించని స్థితి ఎదురవుతుంది. కొన్ని ముఖ్య వ్యవహారాలను మరచిపోయే అవకాశం ఉంటుంది. కుటుంబ కార్యక్రమాలలో పాల్గొంటారు. మాట తీరు అదుపులో ఉంచుకోవడం క్షేమం. సెప్టెంబర్: స్థానచలన ప్రయత్నాలు బాగా జరుగుతాయి. ఉద్యోగ వృద్ధిలో ఆటంకాలు ఉంటాయి. తల్లి దండ్రుల ఆరోగ్య విషయంలో చికాకులు రాగలవు. ప్రతి పనిలోనూ ఆర్థిక వెసులుబాటు తక్కువ. వ్యాపారులకు విచిత్ర పరిస్థితులు ఎదురవుతాయి. భార్యాభర్తలకు; యజమానికి, పనివారికి సయోధ్య సరిగా ఉండని కాలం. కొన్ని పాత సమస్యలు సానుకూలం చేసుకుంటారు. అక్టోబర్: కుటుంబంలో పెద్దల ఆరోగ్యం అనుకూలం. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. అన్ని వ్యవహారాలు స్వయంగా చూసుకోవడం వలన విజయాలు సాధిస్తారు. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఉంటాయి. సమస్యలను ముందే గ్రహంచి. జాగ్రత్తలు పాటిస్తారు. భోజన వసతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. కుటుంబ విషయాలకు ప్రాధాన్యం యిస్తారు. నవంబర్: అన్ని వ్యవహారాల్లోనూ సానుకూలత. ఆర్థిక ఇబ్బందులు దాటగలరు. స్నేహితుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శ్రమ ఎక్కువ అవుతుంది. విద్యా వ్యాసంగం బాగా ఉంటుంది. ఋణ వ్యవహారాలలో మాట నిలబెట్టుకోలేరు. ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉండవు. డిసెంబర్: కాలం అనుకూలం. క్రమంగా చాలా విజయాలు సాధిస్తారు. నూతన ప్రయోగాలు చేస్తారు. కుటుంబంలో మంచి మార్పులు ప్రారంభం అవుతాయి. ఒక్కో సమస్య పరిష్కరించే క్రమంలో మంచి సలహాలు అందుతాయి. అధికారుల సహకారం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. జనవరి: రోజువారీ పనులలోనూ బుద్ధి స్థిరత్వం ప్రదర్శించలేరు. కుటుంబ సభ్యుల సహకారం మాత్రం బాగుంటుంది. «ఖర్చుల నియంత్రణలో విఫలమవుతారు. పనులు స్వతంత్రంగా చేయడం శ్రేయస్కరం. నూతన ప్రయత్నాలు తగ్గించడం శ్రేయస్కరం. పాత సమస్యల విషయంలో మాత్రమే దృష్టి ఉంచండి. ఇతరులకు చేసే సహకారం ఇబ్బందికరం కాగలదు.ఫిబ్రవరి: వృత్తి్త విషయాలను స్వయంగా చూసుకోకపోతే భవిష్యత్తు ఇబ్బందికరం కాగలదు. ఉద్యోగ విషయాలలో మార్పులకు అవకాశం ఇవ్వవద్దు. ఆదాయం తగ్గుతుంది. కుటుంబ అవసరాలు తీర్చడంలో ఇబ్బంది పడతారు. పెద్దల ఆరోగ్యం ఇబ్బందికరం. ప్రతిపనిలోనూ అధిక ధనవ్యయం జరుగుతుంది. మార్చి: అత్యవసరమైన వృత్తి విషయాలు సమయ పాలన లేకుండా చేసి ఇబ్బందిపడతారు. ఋణాలు చికాకు పెడతాయి. స్వల్పంగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. నూతన ప్రయత్నాలకు సానుకూలత లేదు. వృథా ఖర్చు పెరుగుతుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. తరచుగా వాతావరణ ప్రభావానికి లోనవుతుంటారు.సింహ రాశిఆదాయం–5, వ్యయం–5, రాజయోగం–7, అవమానం–3.మఘ 1,2,3,4 పాదములు (ము, మే, మూ, మే)పుబ్బ 1,2,3,4 పాదములు (మో, టా, టే, టూ)ఉత్తర 1వ పాదము (టే)దైనందిన కార్యక్రమాలలో పనులు సమయానికి పూర్తికావు. కుటుంబ విషయాలలో మీ ప్రవర్తన ఇతర కుటుంబ సభ్యులకు ఇబ్బందికరం కాకుండా జాగ్రత్తపడండి. శుభకార్యాలలో తరచుగా బంధుమిత్రులను కలుస్తుంటారు. రోజువారీ స్నాన భోజన నిద్రాసమయాలు భంగపడేలా అనవసర కాలక్షేపాలు పెరుగుతాయి. పిల్లల వలన ఖర్చు పెరుగుతుంది. విరో«ధాలు ఎక్కువ అవుతాయి. అనవసర భయం పెరుగుతుంది. ఒక అవసరం కోసం ఉంచుకొన్న డబ్బు మరొకదానికి ఖర్చవుతుంది. అనవసర హామీలు ఇవ్వకండి. అక్టోబర్ నుంచి క్రమంగా మంచి మార్పులు ఉంటాయి. ఫైనాన్స్ వ్యాపారులకు మొండి బాకీలు పెరుగుతాయి. ఋణ వ్యవహారాలలో సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. ఉద్యోగాలలో సమయపాలన పాటించలేరు. మార్కెటింగ్ ఉద్యోగులకు మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి అక్టోబర్ తర్వాత క్రమంగా అనుకూలం. వ్యాపారులకు ద్వితీయార్ధం బాధాకరంగా ఉంటుంది. భాగస్వాములతో విభేదాలు వ్యాపారాలలో ఇబ్బందులు పెంచుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలలో ఆటంకాలు అధికం. షేర్ వ్యాపారులు ఓర్పుగా వ్యవహరించాలి. తప్పుడు సలహాలకు ఆకర్షితులై సమస్యలు తెచ్చుకుంటారు. విద్యార్థులకు వృథా కాలక్షేపాలు ఎక్కువవుతాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఆలస్యంగా పనులు పూర్తవుతాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు అందవు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఈ రాశి స్త్రీలకు ఆర్థిక అనుకూలత ఉండదు. ఉద్యోగ వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వస్తువులు పోగొట్టుకోవడం వంటివి జరుగుతాయి. గర్భిణులు పెద్దలు, వైద్యుల సలహాలు అనుసరించడం మంచిది.మఘ: తెలివి బాగా పని చేస్తుంది. అక్టోబర్ నుంచి తెలివికి ధైర్యం తోడవుతుంది. ఆదాయ వ్యయ ఋణాలను సమతూకంగా నడపలేక శ్రమకు లోనవుతారు. కుటుంబ సభ్యులతో మోసపూరిత వాతావరణం ఉంటుంది.పుబ్బ: మానసికంగా చికాకులకు లోనవుతారు. ప్రయాణాలలో వస్తువులు మరచిపోవడం వంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. స్నేహితులతో కలిసి చేసే పనులలో సమస్యలు ఎదురవుతాయి. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంలో ఖర్చులు అధికం అవుతాయి.ఉత్తర 1: ఇతరుల వ్యవహారాలలో కలుగ చేసుకోకండి. పనుల్లో ఖర్చులు ఎక్కువ అవుతాయి. నమ్మినవారు సరిగా సహకరించరు. పనివారు తరచుగా ఇబ్బందులు సృష్టిస్తారు. వ్యాపారులు ఒత్తిడికి లోనవుతారు. లాభాలు లేని వ్యాపారం చేయవలసి ఉంటుంది.శాంతి మార్గం: శని రాహు కేతు గురువులకు శాంతి చేయించండి. రోజూ గోపూజ, నవగ్రహ పూజ చేయడం శ్రేయస్కరం. నిత్యం రావిచెట్టు కింద ఆంజనేయస్వామి ఉన్న దేవాలయంలో ‘శ్రీరామ శ్శరణం మమ’ అని చెబుతూ 11 ప్రదక్షిణలు చేయడం, చతుర్ముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్: పుణ్యకార్యాలు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి విషయాలలో దృష్టి ఉంచలేరు. మాటతీరు నియంత్రించుకోవాలి. ప్రయాణ అసౌకర్యాలు తరచుగా ఉంటాయి. బంధుమిత్రుల కలయికలు ఉంటాయి. షేర్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులు సత్ఫలితాలను సాధిస్తారు. మే: ఆగ్రహావేశాలను అదుపు చేసుకోవాలి. వృత్తి ఉద్యోగాలలో గొప్పగా వ్యవహరిస్తారు. అయితే ఫలితాలు గొప్పగా ఉండవు. రోజువారీ కార్యక్రమాలు సరిగా సాగవు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం పట్ల ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. జూన్: ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడతారు. పని ఒత్తిడి పెరుగుతుంది. 20వ తేదీ తర్వాత ఆరోగ్య ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో సరిగా దృష్టి ఉంచలేని స్థితి. శ్రమతో పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు ఒత్తిడి. షేర్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులు సక్సెస్ అవుతారు. జులై: ఉద్యోగరీత్యా తిరుగుడు పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పులు గమనిస్తారు. జీర్ణ సమస్యలు ఇబ్బంది పెడతాయి. శుభ, పుణ్యకార్య ప్రయత్నాలలో విశేష లాభాలు అందుకుంటారు. సమయపాలన పాటించక ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు.ఆగస్ట్: వ్యర్థ ప్రయాణాలు, వ్యర్థ కాలక్షేపాలు విరమించుకోవడం మంచిది. వాహనాలు యంత్ర పరికరాలు ఇబ్బంది పెడతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. విద్యా వ్యాసంగం బాగుంటుంది. స్థిరాస్తులు, వాహనాల అమ్మకాలలో జాగ్రత్తలు పాటించాలి. సెప్టెంబర్: ఆరోగ్యం విషయంలో 18వ తేదీ తరువాత జాగ్రత్త వహించాలి. ఋణ ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడాలి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు 18వ తేదీ వరకు సానుకూలం షేర్ వ్యాపారులు దూకుడు తగ్గించాల్సిన కాలం. విద్యార్థులకు రైతులకు ప్రత్యేక జాగ్రత్తలు అవసరము. అక్టోబర్: అధికారుల ఆగ్రహావేశాలు ఎక్కువ అవుతాయి. కొత్త ప్రయత్నాలు చేయవద్దు. బుద్ధి స్థిమితం కోల్పోవుతారు. బంధువులతో కలసి చేసే పనులలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపారులకు ఇబ్బందికర ఘటనలు ఎక్కువ అవుతాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత ఉండదు. నవంబర్: బుద్ధి స్థిరత్వం తరచుగా తగ్గుతుంది. ఇతరుల వ్యవహారాలలో కలుగచేసుకోవద్దు. కుటుంబ విషయాలు అస్తవ్యస్తంగా నడుస్తాయి. కొత్త ప్రయత్నాలు చేయకండి. ఆర్థిక విషయాల్లో ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. నూతన ఉద్యోగ, వ్యాపారాలలో ప్రయత్నాలు సఫలం అవుతాయి. డిసెంబర్: ప్రతి పనిలోనూ అవరోధాలు ఎదురైనా, వాటిని అధిగమిస్తారు. ఓర్పుగా సమస్యలు దాటగలరు. కొత్త ప్రయత్నాలు చేయవద్దు. మితభాషణ అవసరం. ఇతరులను నమ్మి ఆర్థిక లావాదేవీలు చేయవద్దు. పాత ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తిరగ బెట్టకుండా జాగ్రత్తలు పాటించండి. జనవరి: ప్రతి విషయంలో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలు అనుకూలం కాదు. ఆర్థిక లావాదేవీలు సానుకూలంగా సాగవు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కూడా సానుకూలం కాదు. ఖర్చులు, అనారోగ్యం ఇబ్బంది పెడతాయి. కుటుంబ సభ్యులకు వచ్చే సమస్యలు మీ పనులను పాడు చేస్తాయి. వాహన సౌకర్యం కూడా సరిగా ఉండదు అనే చెప్పాలి. ఫిబ్రవరి: పాత కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఋణ సమస్యలు తిరగబెట్టకుండా జాగ్రత్తపడండి. ఆదాయ వ్యయాలు సమన్వయంతో ఉండవు. అధికారుల అనాదరణ, తోటివారితో సహాయ నిరాకరణ వలన పని ఒత్తిడి పెరుగుతుంది. ఇతరుల మీద ఏమాత్రం ఆధారపడినా ఇబ్బందులు తప్పవు. ప్రయాణాలు తగ్గించడం శ్రేయస్కరం. మార్చి: తొందరపాటుగా ప్రవర్తించడం మంచిదికాదు. భోజన సౌఖ్యం కొరవడుతుంది. వాహన చికాకులు ఉంటాయి. ఇతరుల నుంచి ఆశించిన రీతిగా సహకారం అందదు. ప్రతి పనిలోనూ శ్రమాధిక్యం. ఉద్యోగంలో పని బాధ్యత పెరుగుతుంది. వ్యాపారులకు శ్రమ ఎక్కువ, లాభం తక్కువగా ఉంటుంది. ఆర్థిక వెసులుబాటు తక్కువగా ఉంటుంది. ఋణాలు చేయకపోవడం మంచిది.కన్యా రాశిఆదాయం– 8, వ్యయం– 11, రాజయోగం– 3, అవమానం– 3.ఉత్తర 2,3,4 పాదములు (టే, పా, పీ)హస్త 1,2,3,4 పాదములు (పూ, ష, ణా, ఠా)చిత్త 1,2 పాదములు (పే, పో)ఈ సంవత్సరం గురువు మి«థునంలో (దశమం) జూన్ 1 వరకు ఉంటారు. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు, తిరిగి జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు కర్కాటకంలో (లాభం), అక్టోబర్ 31 నుంచి జనవరి 25 వరకు సింహంలో (వ్యయం) సంచరిస్తారు. శని సంవత్సరం అంతా మీనంలో (సప్తమం) సంచరిస్తారు. రాహువు డిసెంబర్ 6 వరకు కుంభంలో (షష్ఠం) కేతువు సింహంలో (వ్యయం); తర్వాత రాహువు మకరంలో (పంచమం) కేతువు కర్కాటకంలో (లాభం) సంచరిస్తారు.రోజువారీ పనులు ఆలస్యమైనా ఆ ప్రభావం ఇతర కార్యక్రమాలపై పడకుండా చూసుకుంటారు. కుటుంబ విషయాలలో సానుకూలం. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శనలు. పనులు ఆలస్యమైనా, విజయవంతం. శుభ, పుణ్యకార్య ప్రయత్నాలు సఫలం. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. కొత్త కొత్త ఖర్చులు పెరుగుతాయి. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. తీర్థక్షేత్ర దర్శనం, వాహన మార్పులు చేస్తారు. ఫైనాన్స్ వ్యాపారులకు లాభాలు. బాకీల వసూలు ఆలస్యం. నరాలు, గుండె సమస్యలు ఉన్నవారికి ఇబ్బందులు. మిగిలినవారికి అనుకూలం. ప్రమోషన్ వ్యవహారాలు సానుకూలం. మార్కెటింగ్ ఉద్యోగులకు అనుకూలం. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో నిదానంగా పనులు సానుకూలం. నూతన వ్యాపార ప్రయత్నాలలో పనులు మందకొడిగా సాగినా, ఫలితాలు లాభదాయకం. షేర్ వ్యాపారులకు లాభాలు మందగమనం. విద్యార్థులకు విద్యా వ్యాసంగం కుంటుపడుతుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో శుభపరిణామాలు. కోర్టు వ్యవహారాలలో సానుకూలత. స్థిరాస్తి వ్యవహారాలలో సత్ఫలితాలు. ఈ రాశి స్త్రీలకు సకాలంలో ఏ పనీ సాగదు. అవసరానికి తగిన ఆర్థిక వెసులుబాటు దొరకని పరిస్థితి. గర్భిణులకు ఇబ్బందులు ఉండవు కాని, ఏదో తెలియని ఆందోళనకు లోనవుతారు.ఉత్తర 2, 3, 4: ప్రమోషన్లు ఆలస్యం. పిల్లలు సహకరిస్తారు. పెద్దల ఆరోగ్యం అనుకూలం. హస్త: కిందిస్థాయి వారితో అవమానపడే పరిస్థితులు. తెలివిగా పనులు సాధించుకోగలుగుతారు. శ్రమాధిక్యత. చిత్త 1, 2: ఆర్థికంగా, శారీరకంగా శ్రమకు లోనవుతారు. ఇతరుల మీద ఆధారపడి పనులు పాడు చేసుకుంటారు. శాంతి మార్గం: దశరథకృత శని స్తోత్రం రోజూ పఠించండి. శ్రీరామ శ్శరణం మమ అని చెబుతూ ఆంజనేయస్వామికి రోజూ 11 ప్రదక్షిణలు చేయండి. బీదసాదలకు చెప్పులు, వస్త్రాలు దానం, శనివారం నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేయడం, షణ్ముఖ రుద్రాక్ష ధారణ శుభప్రదం.ఏప్రిల్: పాత ఋణములు ఇబ్బందికరం. కొత్త ఋణాలు అవసరానికి అందవు. ఖర్చులు నియంత్రించలేరు. విద్యార్థులు, షేర్ వ్యాపారులు, ఫైనాన్ వ్యాపారులకు చికాకులు. సామాజిక గౌరవం. మే: కుటుంబ విషయంలోనూ, వృత్తి విషయంలోనూ పనివారితో సమస్యలు. పనులు వాయిదా వేస్తుంటారు. షేర్ వ్యాపారులకు అనుకూలం కాదు. జూన్: ఒత్తిడి లేకుండా పనులు నెరవేరవు. ఆర్థిక వెసులుబాటులో చికాకు పడతారు. నూతన ప్రయత్నాలు సరిగా సాగవు. ఋణ వ్యవహారాలు, స్నేహితులతో కలసి చేసే పనులలో ఇబ్బందులు. కుటుంబ సభ్యులతో సఖ్యత తగ్గుతుంది. జులై: వాగ్వాదాలు తరచుగా ఉంటాయి. భోజన అసౌకర్యం. వాహనాలు, పనిముట్ల వల్ల గాయాలు. పిల్లల ప్రవర్తన నచ్చకపోవడం. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రేగడం జరుగుతాయి. ఆగస్ట్: వ్యవహారాలలో లాభాలు అందుకుంటారు. ఆర్థిక, కుటుంబ అనుకూలత తక్కువ. సమాజంలో విలువ పెరుగుతుంది. సెప్టెంబర్: తేలికగా పనులు సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాలు అనుకూలం. విచిత్ర సందర్భాలు ఎదురవుతాయి. యంత్రాలు, పనిముట్లు, వాహనాలు ఇబ్బంది కలిగిస్తాయి. అక్టోబర్: కొత్త కొత్త ప్రణాళికలను అమలు చేస్తారు. చాలా లాభాలు అందుకుంటారు. విజయాలు, గౌరవ మర్యాదలు పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాలలో శుభ పరిణామాలు. నవంబర్: రోజువారీ వ్యవహారాలు సరిగా సాగవు. సహకరించే వారు వ్యతిరేకించే అవకాశం ఉన్నది. సంబంధంలేని విషయాలలో అవమానాలు. అధిక ఖర్చులు, కలహాలు. డిసెంబర్: క్రమంగా మంచి మార్పులు. శుభవార్తలు వింటారు. లాభాలు బాగా అందుతాయి. సుఖశాంతులు, విజయావకాశాలు పెరుగుతాయి. జనవరి: పనులు ఆలస్యం. ఉద్యోగంలో ఒత్తిడి. వ్యాపారులకు పెట్టుబడులు అందినా, స్థిరమైన వ్యాపారం చేయలేని పరిస్థితి. ఫిబ్రవరి: అద్భుతమైన బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు. అకారణంగా విచిత్ర సమస్యలు వస్తుంటాయి. విద్యా విషయంతో గౌరవం పొందుతారు. కుటుంబ విషయాలు అనుకూలం. వృథా కాలక్షేపంతో పనులకు ఆటంకాలు. మార్చి: రోజువారీ పనులలో ఆలస్యం. అవమానకర ఘటనలు. తరచుగా వృథా ఖర్చులు. ప్రయాణాలలో ఇబ్బందులు. శుభ, పుణ్యకార్యాలలో చికాకులు. ∙∙తులా రాశిఆదాయం– 5, వ్యయం– 14, రాజయోగం– 6, అవమానం– 3చిత్త 3,4 పాదములు (రా, రి)స్వాతి 1,2,3,4 పాదములు (రూ, రే, రో, తా)విశాఖ 1,2,3 పాదములు (తీ, తూ, తే)ఈ సంవత్సరం గురువు మిథునంలో (భాగ్యం) జూన్ 1 వరకు ఉంటారు. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు, తిరిగి జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు కర్కాటకంలో (దశమం) అక్టోబర్ 31 నుంచి జనవరి 25 వరకు సింహంలో (లాభం) సంచరిస్తారు. శని సంవత్సరం అంతా మీనంలో (షష్టం) సంచరిస్తారు. రాహువు డిసెంబర్ 6 వరకు కుంభంలో (పంచమం) కేతువు సింహంలో (లాభం); తర్వాత రాహువు మకరం (అర్ధాష్టమం)లో కేతువు కర్కాటకంలో (రాజ్యం) సంచరిస్తారు.దైనందిన కార్యక్రమాలలో సాధారణ స్థితి. సమయపాలనతో పనులు పూర్తి చేసుకుంటారు. కుటుంబ విషయాలలో శ్రద్ధగా వ్యవహరిస్తారు. పెద్దల ఆరోగ్యం బాగుంటుంది. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. సమాజంలో గౌరవ మర్యాదలు. ఆర్థిక సమస్యలను నివారించుకుంటారు. ఆదాయం సకాలంలో అందుతుంది. పెద్ద పెద్ద వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, శుభకార్య విజయాల వలన ఖర్చులు. పుణ్యకార్యాలు, పుణ్యక్షేత్ర సందర్శనలు. కొత్త స్నేçహాలు భవిష్యత్తుకు ఉపకరిస్తాయి. సకాలంలో కావలసిన ఋణాలు. ఆరోగ్య అనుకూలత. ఉద్యోగ కార్యకలాపాలలో గౌరవ మర్యాదలు. ప్రమోషన్లకు, స్థానచలనాలకు, నూతన ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలం. వ్యాపారులకు లాభాలు. వ్యాపార ఋణాలు తీర్చుకోవడానికి, మొండి బాకీల వసూలుకు అనుకూలం. మార్కెటింగ్ ఉద్యోగులకు, ఫైనాన్స్ వ్యాపారులకు పూర్తి సానుకూలత. షేర్ వ్యాపారులకు లాభాలు. విద్యార్థులకు విద్యావ్యాసంగం బాగుంటుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలో, కోర్టు వ్యవహారాలలో విజయావకాశాలు. ఈ రాశి స్త్రీలకు ఉద్యోగ భద్రత అధికం. ఆదాయ వ్యయాల మధ్య సమతూకం. బంధువులతో వైరం రాకుండా జాగ్రత్తపడండి. గర్భిణులు చక్కటి జాగ్రత్తలు పాటిస్తారు. సుఖ ప్రసవం జరుగుతుంది.చిత్త 3, 4 : వృత్తి వ్యవహారాలలో గౌరవ మర్యాదలు. ఆదాయ వ్యయాలను అదుపు చేస్తారు. స్వాతి: కొన్ని పనులు తేలికగాను, మరికొన్ని పనులు అధిక శ్రమతోను పూర్తవుతాయి. విశాఖ 1, 2, 3: రోజువారీ పనులు అకాలంలో పూర్తి అవుతుంటాయి. వృత్తిలో అభివృద్ధి సాధిస్తారు.శాంతి మార్గం: లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం నిత్యం పారాయణ చేయండి. పుట్టతో ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రంలో రోజూ అర్చనలు చేయండి. లేకుంటే ఇంటిలోనైనా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. దత్తాత్రేయ చరిత్ర పారాయణ చేయడం, అష్టముఖ రుద్రాక్షధారణ శుభప్రదం. ఏప్రిల్: మంచి నిర్ణయాలు తీసుకుంటారు.ఆరోగ్య, ఆదాయ విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటారు. అందరి నుంచి సహకారం. పనులు సకాలంలో అవుతాయి. ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం చికాకులు సృష్టిస్తుంది. మే: గౌరవ మర్యాదలు పొందుతారు. ఆర్థిక, కుటుంబ, ఆరోగ్య విషయాలలో శ్రద్ధగా వ్యవహరిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో కొత్త ప్రయోగాలకు అనుకూలం కాదు. జూన్: కొన్ని సందర్భాలలో కలహప్రదంగా వ్యవహరిస్తారు. పనులు సరిగా సాగవు. విద్యార్థులకు, రైతులకు సాధారణ ఫలితాలు. జులై: బుద్ధి కుశలతను ప్రదర్శిస్తారు. కొన్నిసార్లు ఆగ్రహావేశాలకు లోనవుతారు. పెద్దల ఆరోగ్య విషయంలో చికాకులు రాగలవు. ఆగస్ట్: సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులు, మిత్రులు సహకరిస్తారు. గౌరవ మర్యాదలు పొందుతారు. స్థానచలన ప్రయత్నాలు వేగవంతం. శుభకార్య ప్రయత్నాలకు అనుకూలం. సెప్టెంబర్: ఆర్థిక వనరులు అందుతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. పుణ్య, శుభకార్యాలలో శుభ పరిణామాలు. పెద్దలను, బంధువులను దర్శిస్తారు. అక్టోబర్: వాహనాల కొనుగోలు, పాడైన వస్తువుల మరమ్మతులపై శ్రద్ధ చూపుతారు. కుటుంబ అవసరాలు తీర్చడంలో, శుభకార్యాలలో లాభదాయక ఫలితాలు. నవంబర్: చాలా విజయాలు సాధిస్తారు. వాహన ఖర్చులు పెరుగుతాయి. పనుల వాయిదా వల్ల చికాకులు. ఉద్యోగ, ఆర్థిక విషయాలలో సత్ఫలితాలు. పిల్లల గురించి మంచి వార్తలు వింటారు. పెద్దల ఆరోగ్యం బాగుంటుంది. డిసెంబర్: తెలివిగా వ్యవహారాలు సాధిస్తారు. కొన్ని విషయాలు ఇబ్బందికరం. వృత్తి ఉద్యోగాలలో విజయాలు. ఋణ సౌకర్యం అవసరానికి తగిన విధంగా అందుకుంటారు. జనవరి: ఆదాయ వ్యయ ఋణ వ్యవహారాలలో సమన్వయం. ఇబ్బంది లేని జీవనం. క్షణం వృథా చేయకుండా ఉంటారు. ఎంతటి పని అయినా తేలికగా సాధిస్తారు. ఫిబ్రవరి: అనేక విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం. అవయవ ప్రతికూలతలు. ఉద్యోగంలో అభివృద్ధి. ఊహించని లాభాలు పొందుతారు. మార్చి: ఒక్కోసారి విజయపరంపర కొనసాగుతుంది. కొన్నిసార్లు ఇబ్బందికర ఘటనలు ఎదురవుతాయి. వృత్తి విషయాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. కుటుంబ అవసరాలు తీర్చే విషయంలో శ్రద్ధ చూపక కలహాలకు అవమానాలకు అవకాశం ఇస్తారు. వృథా కాలక్షేపాలు ఎక్కువ అవుతాయి. ఋణ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. వ్యాపార భాగస్వాములతో విభేదాలు తలెత్తవచ్చు. ∙∙ వృశ్చిక రాశిఆదాయం– 11, వ్యయం– 5, రాజయోగం– 2, అవమానం– 6విశాఖ 4 వ పాదము (తొ)అనురాధ 1,2,3,4 పాదములు (నా, నీ, నూ, నే)జ్యేష్ఠ 1,2,3,4 పాదములు (నో, యా, యీ,యూ)ఈ సంవత్సరం గురువు మిథునంలో (అష్టమం) జూన్ 1 వరకు ఉంటారు. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు, తిరిగి జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు కర్కాటకంలో (భాగ్యం) అక్టోబర్ 31 నుంచి జనవరి 25 వరకు సింహంలో (రాజ్యం) సంచరిస్తారు. శని సంవత్సరం అంతా మీనంలో (పంచమం) సంచరిస్తారు. రాహువు డిసెంబర్ 6 వరకు కుంభంలో (అర్ధాష్టమం) కేతువు సింహంలో (దశమం); తర్వాత రాహువు మకరంలో (తృతీయం) కేతువు కర్కాటకంలో (భాగ్యం) సంచరిస్తారు.దైనందిన కార్యక్రమాలను సక్రమంగా పూర్తి చేస్తుంటారు. మంచి ఫలితాలు అందుకుంటారు. కుటుంబ విషయాలలో జూన్ వరకు చికాకులు. సంవత్సరం అంతా సాధారణ ఫలితాలు. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం జూన్ వరకు ఇబ్బందికరంగానూ, జూలై నుంచి బాగా అనుకూలంగానూ ఉంటుంది. విద్యా విజ్ఞాన వినోద కార్యకలాపాలలో పిల్లలతో కలిసి పాల్గొంటారు. ద్వితీయార్ధంలో ఆర్థిక లాభాలు బాగుంటాయి. దాన ధర్మాలు, సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తారు. పిల్లల శుభ కార్యాలకు అధిక వ్యయం చేస్తారు. చోరభయం, రోగభయం, అగ్నిభయంతో జులై వరకు ముఖ్య వ్యవహారాలను వదిలేస్తారు. ఋణ వ్యవహారాలు అనుకూలం. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా చూసుకుంటారు. అక్టోబర్ వరకు చిన్న చిన్న ఇబ్బందులు. ఉద్యోగ వ్యవహారాలలో గౌరవ మర్యాదలు. మార్కెటింగ్ ఉద్యోగులకు ద్వితీయార్ధంలో అభివృద్ధికరం. నూతన ఉద్యోగ ప్రయత్నాలు వేగంగా జరుగుతాయి. వ్యాపారులకు జులై నుంచి అనుకూలం. నూతన వ్యాపార ప్రయత్నాలలో శ్రమతో విజయాలు. షేర్ వ్యాపారులకు లాభాలు. విద్యార్థులు ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఫలితాలు బాగుంటాయి. స్థిరాస్తి లావాదేవీలు నెమ్మదిగా సానుకూలం. ఈ రాశి స్త్రీలకు ఆదాయం బాగుంటుంది. అలంకరణ వస్తువులు, గృహోపకరణాల కొనుగోలు. శుభకార్య ప్రయత్నాలు లాభిస్తాయి. గర్భిణులకు ప్రతిబంధకాలు ఉండవు. విశాఖ 4: శ్రమతో పనులు సాధ్యపడతాయి. శుభ, పుణ్యకార్య ప్రయత్నాలు విజయవంతం.అనురాధ: ఆర్థికంగా ఎదుగుతారు. విదేశీ నివాస ప్రయత్నాలు విజయవంతం. జ్యేష్ఠ: తెలియని భయం. కుటుంబ సభ్యులతో కలహాలు. అనవసర ప్రయాణాలు. గురువుల సందర్శన.శాంతి మార్గం: నవగ్రహ మండపం ఉన్న దేవాలయంలో రోజూ పూజ చేయండి. దత్తాత్రేయ స్వామి ఆరాధన విశేష ఫలప్రదం. పేద విద్యార్థులకు అవసరమైన వస్తువులు ఇవ్వడం మంచిది. షణ్ముఖ రుద్రాక్షధారణ శుభçప్రదం.ఏప్రిల్: కుటుంబంలో అనైక్యత. స్వబుద్ధితో పనులు సానుకూలం అవుతాయి. పనుల్లో చికాకులు. ఒంటరిగా దూర ప్రయాణాలు తగ్గించండి. ఋణ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. మే: పనులు వాయిదా వేస్తారు. సొంత విషయాల్లో గోప్యత పాటించడం మంచిది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు. అనుకున్న ప్రణాళికలకు, ఆచరణకు పొంతన ఉండదు. జూన్: నూతన ప్రయత్నాలు సాగకున్నా, రోజువారీ వ్యవహారాలు బాగా పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో అధికారుల సహకారం పెరుగుతుంది. వ్యాపారంలో చురుకుగా పాల్గొంటారు. బంధువుల సహకారం బాగుంటుంది. జులై: పనులు సానుకూలం అవుతున్నట్లుగా గోచరించినా, ఏదో ఒక చికాకు దాగి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు, వ్యవహార చికాకులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. పుణ్య, శుభకార్యాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. విద్యా వ్యాసంగం సరిగా సాగదు. ఆగస్ట్: చాలాసార్లు సోమరితనం ప్రదర్శిస్తారు. కొన్నిసార్లు విజయలక్ష్యంతో ముందుకు వెడతారు. ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తారు. పుణ్య, శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగ, వ్యాపారాలలో సహకారం బాగుంటుంది. సెప్టెంబర్: క్రమక్రమంగా మంచి ఫలితాలు. ఉద్యోగ వ్యాపారాలలో పనుల సానుకూలతలో అన్ని వనరులు సహకరిస్తాయి. అక్టోబర్: ఉద్యోగులకు అనుకూలత తక్కువ. సకాలంలో అన్న వస్త్రాలు సమకూరని పరిస్థితి. ఇతరుల మాటలు విని కుటుంబ కలహాలు తెచ్చుకుంటారు. వ్యాపారులు ఓర్పు వహించాలి. విద్యార్థులకు అనుకూలత తక్కువ. నవంబర్: బంధువుల సహకారం బాగుంటుంది. ఉద్యోగ వ్యాపారాలు ప్రోత్సాహకరం. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు చక్కగా చేస్తారు. పుణ్యకార్యాలు చేస్తారు. జరగవని వదిలేసిన పనులు కూడా పూర్తవుతాయి.డిసెంబర్: కాలాన్ని లాభదాయకంగా మార్చుకుంటారు. ఉద్యోగ వ్యాపారాలలో శ్రద్ధ పెంచుతారు. శుభకార్య ప్రయత్నాలలో భార్య తరఫు బంధువులు సహకరిస్తారు. కొత్త ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలకు సానుకూలం. జనవరి: మంచి మార్పులు ఉంటాయి. ఓర్పుగా ప్రవర్తించి విజయాలు సాధిస్తారు. స్నేహితులు, బంధువులు సహకరిస్తారు. పుణ్యకార్యాలు చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఫిబ్రవరి: కుటుంబ అవసరాలు తీర్చడానికి బాగా శ్రమిస్తారు. వృత్తి వ్యాపారాలలోను, కుటుంబ వ్యవహారాలలోను బంధు మిత్రుల సహకారం బాగుంటుంది. అధికారుల ప్రశంసలు పొందుతారు. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.మార్చి: పని ఒత్తిడి పెరుగుతుంది. ధైర్యంగా ఉంటారు. అందరి సహకారం ఉంటుంది. ఏదో తెలియని అంశాలలో కలహాలు తప్పవు. ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకం. అలంకరణ వస్తువుల కొనుగోలు, శుభకార్య ప్రయత్నాలు బాగుంటాయి. వాహనములు, ఎలక్ట్రికల్ వస్తువులకు మరమ్మతులు చేయించాల్సి వస్తుంది.ధనూ రాశిఆదాయం–14, వ్యయం–11, రాజయోగం– 5, అవమానం– 6మూల 1,2,3,4 పాదములు (యే, యో, బా, బీ)పూర్వాషాఢ 1,2,3,4 పాదములు (బూ, ధా, భా, ఢా)ఉత్తరాషాఢ 1వ పాదము (బే)ఈ సంవత్సరం గురువు మిథునంలో (సప్తమం) జూన్ 1 వరకు ఉంటారు. జూన్ 1 నుండి అక్టోబర్ 31 వరకు, తిరిగి జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు కర్కాటకంలో (అష్టమం) అక్టోబర్ 31 నుంచి జనవరి 25 వరకు సింహంలో (నవమం) సంచరిస్తారు. శని సంవత్సరం అంతా మీనంలో (చతుర్థం) సంచరిస్తారు. రాహువు డిసెంబర్ 6 వరకు కుంభంలో (తృతీయం) కేతువు సింహంలో (భాగ్యం); తర్వాత రాహువు మకరం (ద్వితీయం)లో కేతువు కర్కాటకంలో (అష్టమం) సంచరిస్తారు.దైనందిన కార్యక్రమాలలో చిన్న చిన్న సమస్యలు. సకాలంలో పనులు పూర్తి చేసుకోవడానికి శ్రమిస్తారు. కుటుంబ విషయాలలో అనుకూలత తక్కువ. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉండవు. దేహ గాంభీర్యం కోల్పోయే అవకాశం ఉన్నది. ఫైనాన్స్ వ్యాపారులకు సమస్యలు రాగలవు. అనవసర ఋణాలు చేస్తారు. ఆరోగ్య విషయాలలో ద్వితీయార్ధంలో చికాకులు. ఉద్యోగ కార్యకలాపాలలో నిబద్ధతతో విధి నిర్వహణ చేయవలసిన కాలం. మార్కెటింగ్ ఉద్యోగులు ఎంతో శ్రమిస్తేనే తప్ప టార్గెట్లు చేరుకోలేరు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో చికాకులు. నూతన వ్యాపార ప్రయత్నాలలో ఉన్నవారు తొందరపడి చేస్తున్న వ్యాపారం మానవద్దు. షేర్ వ్యాపారులకు శ్రమ ఎక్కువ. లాభాలు తక్కువ. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఎక్కడా ఇబ్బంది ఉండదు. కోర్టు వ్యవహారాలు సానుకూలం. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం. ఈ రాశి స్త్రీలకు అనాలోచిత ప్రవర్తన వల్ల చికాకులు. సంఘంలో గౌరవ మర్యాదలు. ఉద్యోగం ఒత్తిడి. వైద్య ఖర్చులు అధికం.మూల: ఆర్థిక లావాదేవీలు భారంగా ఉంటాయి. వ్యాపారులకు ఇబ్బందులు. సమయపాలన ఉండదు. పూర్వాషాఢ: తరచుగా అలసట, శ్రమ. చోర, అగ్ని, అధికార బాధలు. మాట తీరుతో సమస్యలు తలెత్తుతాయి. ఉత్తరాషాఢ 1: ప్రతిపనిలోనూ ప్రారంభంలో ధనం సమకూరక ఇబ్బందిపడటం, క్రమంగా సర్దుబాటు జరిగి పనులు పూర్తి చేసుకోవడం వంటివి ఉంటాయి. తరచుగా బుద్ధి భ్రంశానికి లోనవుతారు. శాంతిమార్గం: గురువుకు, శనికి శాంతి చేయించుకోవడం అవసరం. ప్రాతఃకాలంలో ఆంజనేయస్వామి దేవాలయంలోనూ, ప్రదోషకాలంలో ‘శ్రీమాత్రే నమః’ అని చెబుతూ శివాలయంలో 11 ప్రదక్షిణలు చేయండి. నిత్యం గోసేవ చేయండి. కుదిరినప్పుడు యతీశ్వరులను ధర్శించి సేవించండి. చతుర్ముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్: అన్ని వ్యవహారాలలోను 19వ తేదీ లోపల వేగం పెంచండి. 19వ తేదీ నుంచి వ్యవహార ప్రతిబంధక అంశాలలో బాగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోండి. వృత్తి విషయాలలో దూకుడు తగ్గించాలి. షేర్ వ్యాపారులకు సామాన్య ఫలితాలు, విద్యార్థులకు మంచి ఫలితాలు. మే: కోపావేశములు నియంత్రించుకోవాలి. రోజువారీ పనులపై దృష్టి కేంద్రీకరించండి. కొత్త పనులు చేపట్టవద్దు. ప్రతిపనీ స్వయంగా చేసుకోవలసి వస్తుంది. తద్వారా పని ఒత్తిడి పెరుగుతుంది. అధికారులు, కింది ఉద్యోగల వల్ల చికాకులు. జూన్: ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు. మీ వ్యవహారాలలో ఇతరుల ప్రమేయం తగ్గించండి. ఆదాయ వ్యయాల సమన్వయంపై దృష్టి ఉంచండి. ఉద్యోగ విధి నిర్వహణలో అన్యమనస్కంగా వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవు. స్నేహితుల సహాయ నిరాకరణ తరచుగా ఉంటుంది. జులై: అన్ని వ్యవహారాలలో ఓర్పు ప్రదర్శించాలి. ఇతరుల మీద ఆధారపడి పనులు చేయవద్దు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు పాటించండి. పాత ఋణాల పట్ల జాగ్రత్తపడండి. అనవసర ప్రయాణాలు తగ్గించండి.ఆగస్ట్: చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన కాలం. వృథా ఖర్చులు, అనవసర ప్రయాణాలు చేయవద్దు. ఇతరులకు హామీలు ఇవ్వవద్దు. భార్య తరపు బంధువుల రాకపోకలు పెరుగుతాయి. తరచుగా శుభకార్య నిమిత్తం చేసే ప్రయాణాలలో అధిక వ్యయం జరుగుతుంది.సెప్టెంబర్: ఎంతో శ్రమతో తెలివిగా పరిస్థితులు చక్కబెడతారు. భోజన, వస్త్ర, స్నాన సౌకర్యాలు కూడా ఇబ్బందికరం. కుటుంబ సభ్యులతో కలహాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ, వృత్తి విషయాలను ఇతరులతో చర్చించకండి. అక్టోబర్: తరచుగా శుభవార్తలు, పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. కుటుంబ పెద్దల ఆరోగ్యంలో మంచి మార్పు. తరచు చోర, అగ్ని, రోగ భయాలు. శరీర సౌష్టవం, మాటల గాంభీర్యం కోల్పోతారు. నవంబర్: ఇబ్బందుల నుంచి బయటపడతారు. నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు వేగం అందుకుంటాయి. కావలసిన ఋణ సౌకర్యం, సహకారం అందుతాయి. శుభకార్య ప్రయత్నాలు సఫలం. విద్యార్థులకు అనుకూలం కాదు. డిసెంబర్: మంచి మార్పులు ప్రారంభం. పనులు సానుకూలం. చాలాకాలంగా ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు. ఆర్థిక వెసులుబాటు.ప్రయాణాలు, అలంకరణ వస్తువుల కొనుగోలు అధికం. జనవరి: తరచుగా చోర, రోగ, అగ్ని భయం. వాహన సమస్యలు, ఖర్చులు. తరచుగా ద్రవ్యలోపం. ఆరోగ్య, ఋణ విషయాలలో సమస్యలు. ఉద్యోగ వ్యాపారాలలో డబ్బు ఇబ్బందులు, అధికార ఒత్తిడి. నమ్మిన వారు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి: మందకొడితనం ఆవహిస్తుంది. పనులు వేగం చేయలేరు. అన్ని పనులూ శ్రమతో పూర్తి అవుతాయి. ఆర్థిక, కుటుంబ, ఉద్యోగ విషయాలను సమన్వయం చేయలేరు. దూర ప్రయాణాలు విరమించడం మంచిది. విద్యార్థులు జాగ్రత్తగా వ్యవహరించ వలసిన కాలం. మార్చి: ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. అనవసర విషయాలలో తలదూర్చవద్దు. ఉద్యోగ, కుటుంబ వ్యవహారాలలో శ్రమచేసి లబ్ధి పొందుతారు. నూతన ఉద్యోగ వ్యాపారాలు ఇబ్బందికరం. అధికారుల అండ ఉన్నా, వృత్తి చికాకులు తప్పవు. విద్యార్థులకు అనుకూలం కాదు.మకర రాశిఆదాయం– 2, వ్యయం– 8, రాజయోగం– 1, అవమానం– 2ఉత్తరాషాఢ 2,3,4 పాదములు (బొ, జా, జీ)శ్రవణం 1,2,3,4 పాదములు (జే, జో, ఖా, ఖొ)ధనిష్ఠ 1,2 పాదములు (గా, గి)ఈ సంవత్సరం గురువు మిథునంలో (షష్ఠం) జూన్ 1 వరకు ఉంటారు. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు, తిరిగి జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు కర్కాటకంలో (సప్తమం) అక్టోబర్ 31 నుంచి జనవరి 25 వరకు సింహంలో (అష్టమం) సంచరిస్తారు. శని సంవత్సరం అంతా మీనంలో (తృతీయం) సంచరిస్తారు. రాహువు డిసెంబర్ 6 వరకు కుంభంలో (ద్వితీయం) కేతువు సింహంలో (అష్టమం); తర్వాత రాహువు మకరంలో (జన్మం) కేతువు కర్కాటకంలో (సప్తమం) సంచరిస్తారు.దైనందిన కార్యక్రమాలకు ఆటంకాలు వస్తుంటాయి. వాటిని తెలివిగా దాటవేస్తారు. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. కుటుంబ విషయాలలో ఇతరుల ప్రమేయం వల్ల తరచుగా కలహాలు. ఆర్థిక కార్యకలాపాలలో ఓర్పు అవసరం. ఖర్చులు పరిధి దాటతాయి. శుభకార్యాల కోసం, వస్తువుల మరమ్మతుల కోసం ఖర్చులు పెరుగుతాయి. ప్రతి పనిలోనూ ఓర్పు అవసరం. ఇతరులపై ఆధారపడి ఏ పనీ చేయవద్దు. ఫైనాన్స్ వ్యాపారులకు అక్టోబర్ నుంచి మోసపూరిత వాతావరణం. అవసరానికి కావలసిన ఋణాలు అందవు. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉంటారు. అక్టోబర్ నుంచి ఆరోగ్య సమస్యల వల్ల పనులకు ఆటంకాలు. ఉద్యోగ కార్యకలాపాలలో మంచి ఫలితాలు. తోటివారి నుంచి సహకారం తక్కువ. మార్కెటింగ్ ఉద్యోగులకు శ్రమ ఎక్కువ. జూన్ నుంచి అక్టోబర్ వరకు అనుకూలం. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో అయోమయ పరిస్థితులు. వ్యాపారులకు అనవసర చికాకులు. శ్రమాధిక్యం, లాభాలు సామాన్యంగా ఉంటాయి. ఇతరుల సలహాలు విని పెట్టుబడుల జోలికి పోవద్దు. నూతన వ్యాపార ప్రయత్నాలలో తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. షేర్ వ్యాపారులు తెలివిగా వ్యాపారం చేసినా, అనుకున్న స్థాయి ఫలితాలు దక్కవు. విద్యార్థులకు విద్యా వ్యాసంగం దారి మళ్ళుతుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఉన్నవారికి మంచి సలహాలు సహకారం అందవు. కోర్టు వ్యవహారాలలో మోసపోయే అవకాశాలు ఎక్కువ. స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు ఉంటాయి. ఈ రాశి స్త్రీలకు ఉద్యోగ విధి నిర్వహణలో చక్కటి పరిస్థితులు ఉంటాయి. అయితే, ఆర్థిక ఎదుగుదల తక్కువ. అక్టోబర్ తరువాత వైద్య విషయంలో కూడని సలహాలు అందుతాయి. గర్భిణులు అక్టోబర్ నుంచి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.ఉత్తరాషాఢ 2, 3,4: ప్రతిపనికీ అధిక శ్రమ చేయవలసి వస్తుంది. ఉద్యోగ విషయంగా రక్షణ అధికంగా ఉంటుంది. తోటివారి సహాయ సహకారాలు తక్కువ. కొత్త పెట్టుబడులకు కాలం అనుకూలం. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది.శ్రవణం: ఆదాయానికి తగిన ఖర్చు ఉంటుంది. వృథా ఖర్చులను నియంత్రించ గలుగుతారు. ణాలు తీర్చే ప్రయత్నంలో గొప్ప కృషి చేస్తారు. శుభకార్య ప్రయత్నాలలో మంచి ఫలితాలు ఉంటాయి. అధిక శ్రమ తప్పదు. ధనిష్ఠ 1, 2: ఉద్యోగ వ్యాపారాలలో చాలా చక్కటి ఫలితాలు అందుకుంటారు. తరచుగా దూరప్రాంత సందర్శన చేస్తుంటారు. ఏ విషయంలోనూ స్థిరబుద్ధి ప్రదర్శించరు. వృత్తి విషయాలలో అవసరమైన సలహాలు అందవు. శాంతి మార్గం: ప్రతినిత్యం ఎక్కడ వేదపారాయణ జరుగుతున్నా వెళ్ళి వినడం ప్రారంభించండి. ప్రాతఃకాలంలో దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్తోత్ర పారాయణ లేదా శ్రవణం చేయండి. అక్టోబర్లో గురు రాహు కేతువులకు శాంతి చేయించండి. గురువారం శనగలు, తీపి పదార్థాలను దానం చేయండి. సప్తముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్: ప్రతి విషయంలోనూ సానుకూల ఫలితాలు. ఆర్థిక లావాదేవీలు సాఫీగా సాగవు. వృత్తి విషయాలలో ఒత్తిడి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో అనుకూల వార్తలు. కోరుకున్న రీతిగా స్వేచ్ఛగా సంచరిస్తారు. సంతానం ద్వారా అనుకూలత. మే: పెద్దల ఆరోగ్య విషయంగా, పిల్లల వృద్ధి విషయంగా చికాకులు. రోజువారీ పనులలో సమయ పాలన చేయలేరు. ఆరోగ్య, ఋణ విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటారు. షేర్ వ్యాపారులకు 15వ తేదీ వరకు అనుకూలం. విద్యా వ్యాసంగం, ప్రయాణాలు ఇబ్బందికరం. జూన్: తెలివి బాగా పనిచేసినా, చాలా పనులు సాధించలేని పరిస్థితి. ఖర్చులు విచిత్రంగా వస్తుంటాయి. వాటిని నియంత్రించలేరు. ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలం. ప్రయాణాలు తగ్గించాలి. వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనలు చేసి అమలు చేసి సఫలమవుతారు. జులై: సమస్యలు సరిచేసుకోవడంలో నైపుణ్యం ప్రదర్శిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో శుభవార్త అందుతుంది. ఆర్థిక విషయాలు సామాన్యం. వృత్తి విషయంలో తోటివారి సహాయ సహకారాలు, అధికారుల అండదండలు బాగుంటాయి. ఆగస్ట్: స్వయంగా చేసుకునే పనులు బాగా పూర్తవుతాయి. ఇతరుల సమస్యలపై దృష్టి పెట్టకుండా, మీ రోజువారీ పనులకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. విదేశీ నివాస ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలలో మంచి సలహాలు అందుతాయి. స్థిరాస్తి వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. సెప్టెంబర్: శ్రమ ఎక్కువ అయినా, సోమరితనం ప్రదర్శించకుండా వేగంగా ప్రణాళికలు చేస్తే సానుకూల ఫలితాలు అందుతాయి. 18వ తేదీ తరువాత సానుకూలత తక్కువ. సహకరించేవారు తక్కువ. ఖర్చులు ఎక్కువ. ఋణ సౌకర్యం సరిలేక కొన్ని పనులు ఆగుతాయి. విద్యా వ్యాసంగం బాగుంటుంది. అక్టోబర్: ఆకస్మిక ధనలాభం. వృత్తి రీత్యా తరచు అవరోధాలు. శుభ, పుణ్యకార్యాలలో మీ శ్రమ ఆలస్యంగా సఫలం అవుతుంది. ఋణ వ్యవహారాలలో అవమానాలు రాకుండా జాగ్రత్తపడండి. ఇతరుల మాటలు నమ్మి కొత్త ప్రయత్నాలు చేయవద్దు. వృత్తి విషయాలు స్వయంగా చూసుకోండి. నవంబర్: కుటుంబ వ్యవహారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. వృత్తిరీత్యా కలహాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు సానుకూలంగా ఉండవు. ఆరోగ్య సమస్యలకు మంచి సలహాలు అందుతాయి. తరచుగా విద్యాభంగం పొందుతారు.డిసెంబర్: మంచి మార్పులకు శ్రీకారం పడుతుంది. వ్యాపారులకు మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగంలో శ్రద్ధ ప్రదర్శించి అధికారుల ప్రోత్సాహం అందుకుంటారు. కుటుంబ, ఉద్యోగ, వ్యాపారాలలో పనివారిపై ఆధారపడటం మంచిది కాదు. ఆర్థిక లాభాలు బాగుంటాయి. జనవరి: ఆర్థిక లావాదేవీలు సమస్య కాకుండా జాగ్రత్త పడతారు. రోజువారీ పనులలో అవాంతరములు ఉంటాయి. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాలలో సమస్యలు రాకుండా చూసుకుంటారు. స్నేహితులతో జాగ్రత్త వహించాలి. ప్రతి నిమిషం ఒక పరీక్షా కాలంగా ఉంటుంది. ఫిబ్రవరి: మోసపూరిత వాతావణానికి దగ్గరవుతారు. కలహాలు, ఋణాలు, వాహన చికాకులు, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి నిత్యం వెంబడిస్తాయి. స్త్రీలు పని ఒత్తిడికి లోనవుతారు. ఋణ వ్యవహారాలలో తెలివిగా వ్యవహరిస్తే మంచిది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో శుభవార్తలు. మార్చి: మానసిక చికాకులు ఉంటాయి. అన్నీ తెలిసి కూడా పనులు సానుకూలం చేయలేని స్థితి. ఆర్థిక వెసులుబాటు సామాన్యంగా ఉంటుంది. వస్తువుల కొనుగోలులో మోసపోతారు. ఉద్యోగ, వ్యాపార విషయాలు ఎవరితోనూ చర్చించవద్దు. వృత్తి విషయంలో ఒత్తిడి పెరుగుతుంది.∙∙కుంభ రాశిఆదాయం– 2, వ్యయం– 8, రాజయోగం– 4, అవమానం– 2ధనిష్ఠ 3,4 పాదములు (గూ, గే)శతభిషం 1,2,3,4 పాదములు (గొ, సా, సీ, సు)పూర్వాభాద్ర 1,2,3 పాదములు (సే, సొ, దా)ఈ సంవత్సరం గురువు మిథునంలో (పంచమం) జూన్ 1 వరకు ఉంటారు. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు, తిరిగి జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు కర్కాటకంలో (షష్ఠం) అక్టోబర్ 31 నుంచి జనవరి 25 వరకు సింహంలో (సప్తమం) సంచరిస్తారు. శని సంవత్సరమంతా మీనంలో (ద్వితీయం) సంచరిస్తారు. రాహువు డిసెంబర్ 6 వరకు కుంభంలో (జన్మం) కేతువు సింహంలో (సప్తమం) తర్వాత రాహువు మకరం (వ్యయం)లో కేతువు కర్కాటకంలో (షష్ఠం) సంచరిస్తారు.దైనందిన కార్యక్రమాలలో ఒక మాయ వెంబడిస్తున్నట్లుగా ఉంటుంది. పనులు సమయపాలనతో చేయలేరు. ఫలితంగా ఇతర పనులు పాడవుతాయి. కుటుంబ విషయాలు సహా అన్ని వ్యవహారాలలోనూ ఏలినాటి శని, జన్మ వ్యయ రాహు ప్రభావంగా వృథా కాలక్షేపాలు, దాటవేత పద్ధతి, అవమానించడం, అవమానాలు పొందడం, పరుష వాక్య ప్రయోగంతో ఇబ్బందులు పొందుతారు. ఆర్థిక కార్యకలాపాలలో ఆదాయ వ్యయాలు నియంత్రణలో ఉంటాయి. ఋణ వ్యవహారాలలో అవమానం ఎదురవుతుంది. ఫైనాన్స్ వ్యాపారులకు అనుకూలత తక్కువ. ఆరోగ్యం పట్ల తగిన దృష్టి ఉంచరు. పాత సమస్యలు తిరగపెట్టే అవకాశం ఉంటుంది. ఉద్యోగ కార్యకలాపాలలో సరైన నిర్ణయాలు చేయలేరు. తోటివారి సహాయ సహకారాలు తక్కువ. అధికారుల ఒత్తిడి జూన్ తరువాత పెరుగుతుంది. మార్కెటింగ్ ఉద్యోగులకు అనుకూలత లేదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో మంచి సలహాలు అందవు. వ్యాపారులకు మానసిక ఒత్తిడి, మోసపూరిత వాతావరణం. స్వయంగా పరిశీలించాకనే నిర్ణయాలు చేయండి. ఇతరుల జోలికిపోవద్దు. నూతన వ్యాపార ప్రయత్నాలలో పనులు సమయపాలనతో సాగవు. షేర్ వ్యాపారులలో ఆలోచనకు, అమలుకు పొంతన ఉండదు. విద్యార్థులకు మానసిక సానుకూలత ఉండదు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో పనులు సరిగా సాగవు. కోర్టు వ్యవహారాలలో సమస్యలు పెరుగుతాయి. స్థిరాస్తి లావాదేవీలు ఇబ్బందికరం. ఈ రాశి స్త్రీలకు పని ఒత్తిడి ఎక్కువ. తరచుగా చికాకులు. కుటుంబ సభ్యులతో సఖ్యత తగ్గుతుంది. ఉద్యోగంలో ఎదుగుదల లోపిస్తుంది. గర్భిణులకు జాగ్రత్తలు అవసరం. పెద్దలు, వైద్యుల సలహాలు పాటించండి. ప్రయాణాలు తగ్గించండి.ధనిష్ఠ 3, 4 : మోసపూరిత వాతావరణం ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల మీద ఆధారపడిన పనులు ఇబ్బంది కలిగిస్తాయి. వస్తువులు మరచిపోవడం, చోరీ కావడం వంటివి జరుగుతాయి.శతభిష: కలహాలకు అవకాశం ఇవ్వవద్దు. ఓర్పు, సహనం అవసరం. పాత ఆరోగ్య సమస్యలు తిరగపెట్టకుండా జాగ్రత్తపడండి. కొత్త వ్యవహారాలలో తలదూర్చకండి. ఋణాలు చేయవద్దు. ఉద్యోగంలో జాగ్రత్తలు అవసరం.పూర్వాభాద్ర 1, 2, 3: ఆగ్రహావేశాలు తగ్గించాలి. ఇతరుల వ్యవహారాలలో కలుగ చేసుకోకండి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగండి. వృథా కాలక్షేపాలకు స్వస్తి పలకండి. తక్కువ స్థాయి వారి నుంచి ప్రమాదాలకు అవకాశం. శాంతి మార్గం: గ్రహచారం పూర్తి విరుద్ధంగా ఉన్నందున రోజూ రామాయణ పారాయణ చేయడం శ్రేయస్కరం. శని గురు రాహు కేతువులకు శాంతి చేయించండి. ఇష్టదైవ నామస్మరణ చేయండి. రోజూ దుర్గా సప్తశ్లోకీ పారాయణ చేయడం ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణలు చేయడం, అష్టముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్: కొత్త వ్యవహారాల జోలికి వెళ్ళవద్దు. చాలావరకు పనులు సఫలం. ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది లేకుండా సాగుతాయి. 10వ తేదీ నుంచి పనులు వేగం అందుకుంటాయి. విద్యా వ్యాసంగం ఇబ్బందికరం. వృత్తిలో అధికారుల సహకారం గొప్పగా ఉంటుంది. పుణ్యకార్యాలు చేస్తారు. మే: ఒంటరి కాలక్షేపాలు, ఒంటరిగా ప్రయాణాలు శ్రేయస్కరం కాదు. మోసపూరిత వాతావరణం. ఇతరులపై ఆధారపడి ఏ పనీ చేయవద్దు. మొండి ధైర్యం పెరుగుతుంది. తెలివిగా ఉంటారు. అలా ఉన్నా, చికాకుపడే అవకాశం ఉన్నది. స్థిరాస్తి వ్యవహారాలు చికాకులు సృష్టిస్తాయి. జూన్: ప్రతిపనికీ ఆదాయ వనరులు ఇబ్బందికరం. కుటుంబసభ్యులతో సఖ్యత లోపిస్తుంది. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందులు. విద్యార్థులు, ఫైనాన్స్, షేర్ వ్యాపారులకు బుద్ధి స్థిరంగా పనిచేయక ఇబ్బందిపడే అవకాశం ఉంది. జులై: ఇతరుల విషయాల జోలికి వెళ్ళవద్దు. ఆర్థిక వ్యవహారాలు అదుపులో ఉండవు. తెలియక పొరపాటు చేసి పశ్చాత్తాపపడే పరిస్థితి ఎదురవుతుంది. కుటుంబ సభ్యులతో మనస్పర్థలు. విద్యావ్యాసంగం సరిగా సాగదు. ఆగస్ట్: కుటుంబ కలహాలు తలెత్తవచ్చు. సంబంధంలేని సమస్యలకు బాధ్యత వహించవలసి వస్తుంది. నూతన ప్రయత్నాలు విరమించడం మంచిది. ఖర్చులు పెరుగుతాయి. అజీర్ణ సమస్యలు ఇబ్బందిపెట్టే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్: పనులు చక్కగా పూర్తవుతాయి. తెలియక పొరపాట్లు చేసి పశ్చాత్తాపపడతారు. అందరినీ గౌరవించడం, అందరి చేత గౌరవం పొందడం జరుగుతుంది. వృత్తి రీత్యా జాగ్రత్తలు తీసుకుని ఫలితాలు సాధిస్తారు. శ్రమ ఎక్కువ అవుతుంది. విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది. అక్టోబర్: పుణ్యకార్యాలలో కాలక్షేపం చేస్తారు. ప్రతిపనినీ సానుకూలం చేసుకుంటారు. కుటుంబ సమస్యలకు పరిష్కారం అందుతుంది. ఇతరులకు సలహాలు చెప్పి కొన్ని సందర్భాలలో గౌరవం పొందుతారు. కొన్నిసార్లు ఇబ్బంది పడతారు. ఆర్థిక వ్యవహారాలలో ఇబ్బందులు. నవంబర్: పని ఒత్తిడి ఎక్కువ. ఫలితాలు శూన్యం. రోజువారీ పనులు సరిగా సాగవు. పుణ్య శుభకార్యాలలో ఇబ్బందులు, ఉద్యోగ వ్యాపారాలలో ప్రతికూలతలు. అవసరానికి కావలసిన ధనం, ఋణం సర్దుబాటు కాని స్థితి. డిసెంబర్: తెలివిగా వ్యవహరిస్తారు. శ్రమతో పనులు పూర్తి అవుతుంటాయి. ఆర్థిక వ్యవహారాలలో విచిత్ర పరిస్థితులు. అధిక వ్యయం ఉంటుంది. ఓర్పుతో కుటుంబ విషయాలు సర్దుబాటు చేసుకుంటారు. అనవసర విషయాలలో భయాందోళనలు పెరుగుతాయి. జనవరి: ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. మోసపూరిత వాతావరణం అధికం. కొత్త వ్యవహారాలు చేయరాదు. ఆర్థిక లావాదేవీలు సమన్వయం చేయలేక ఒత్తిడికి లోనవుతారు. అందరినీ అవమానించడం, అవమానింపబడడం వంటివి జరిగి చికాకులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి: ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగ వ్యాపారాలలో ముఖ్యమైన అంశాలు వదిలివేసి అధికారుల ఆగ్రహావేశాలకు లోనవుతారు. ప్రయాణ చికాకులు, వాహన చికాకులు ఉంటాయి. విద్యార్థులు కాలానుగుణంగా ప్రవర్తించని స్థితి ఉంటుంది. మార్చి: ఆర్థిక వెసులుబాటు ఇబ్బందికరం. కావలసిన సమయానికి ఋణాలు దొరకవు. ప్రయాణ అసౌకర్యం తరచుగా ఎదురవుతుంది. వస్తువులు మరచిపోవడం కాని, దొంగతనానికి గురవడం కాని జరుగుతుంది. మీ ప్రవర్తన పిల్లల దగ్గర తేలికపడేలా ఉంటుంది. మీన రాశి ఆదాయం– 14, వ్యయం– 11, రాజయోగం– 7, అవమానం– 5పూర్వాభాద్ర 4 వ పాదము (ది)ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు (దు, శ్య, ఝా, థా)రేవతి 1,2,3,4 పాదములు (దే, దొ, చా, చి)ఈ సంవత్సరం గురువు మిథునంలో (అర్ధాష్టమం) జూన్ 1 వరకు ఉంటారు. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు, తిరిగి జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు కర్కాటకంలో (పంచమం) అక్టోబర్ 31 నుంచి జనవరి 25 వరకు సింహంలో (షష్ఠం) సంచరిస్తారు. శని సంవత్సరం అంతా మీనంలో (జన్మం) సంచరిస్తారు. రాహువు డిసెంబర్ 6 వరకు కుంభంలో (వ్యయం) కేతువు సింహంలో (షష్ఠం); తర్వాత రాహువు మకరంలో (లాభం) కేతువు కర్కాటకంలో (పంచమం) సంచరిస్తారు. దైనందిన కార్యక్రమాలో మిశ్రమ స్పందనగా కాలక్షేపం జరుగుతుంది. కుటుంబ విషయాలలో కుటుంబసభ్యుల ధోరణి సరిపడదు. మనసు సరిలేని స్థితి. తరచుగా పనులు మరచిపోతుంటారు. అక్టోబర్ వరకు ప్రతిభకు తగిన గుర్తింపు దొరకదు. పనులు సానుకూలమే కాని, ఆలస్యం అవుతాయి. అక్టోబర్ వరకు అనాలోచితంగా ఉంటారు. ఆర్థిక కార్యకలాపాలలో ఇబ్బంది ఉండదు. అన్ని కార్యక్రమాలోనూ తగిన ఆర్థిక వనరులను స్వయంగా సమకూర్చుకుంటారు. జూన్ తర్వాత శుభ పుణ్య సామాజిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. ఫైనాన్స్ వ్యాపారులు అక్టోబరు నుంచి మంచి ఫలితాలు అందుకుంటారు. పాత ఋణాలు ఇబ్బందికరం కాదు. ద్వితీయార్ధం కొత్తవి కావలసిన రీతిగా అందుతాయి. ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తారు. పాత సమస్యలు తీరతాయి. చర్మవ్యాధులు ఉన్నవారికి ఇబ్బంది తప్పదు. ఉద్యోగ కార్యకలాపాలలో జూన్ వరకు పనులు ఆలస్యంగా సాగుతాయి. జూన్ తరువాత క్రమంగా అక్టోబర్ వరకు మంచి మార్పు ఉంటుంది. అక్టోబర్ తరువాత ప్రమోషన్ అవకాశాలు ఎక్కువ. మార్కెటింగ్ ఉద్యోగులకు మంచి మార్పులు ప్రారంభం అవుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో పనులు వేగంగా సాగుతాయి. వ్యాపార్తలకు ఆశించిన మంచి ఫలితాలు ప్రారంభంలో ఉండవు కాని, క్రమంగా భవిష్యత్తు బాగుంటుంది అనే ఆశ చిగురిస్తుంది. నూతన వ్యాపార ప్రయత్నాలలో ఇబ్బందులు లేని స్థితి. షేర్ వ్యాపారులు నవంబర్ నుంచి లాభాలు అందుకుంటారు. విద్యార్థులకు అనుకున్న స్థాయిలో ఫలితాలు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో పనులు సజావుగా పూర్తి అవుతాయి. కోర్టు వ్యవహారాలలో ఏదో ఒక స్థాయిలో సమస్య పరిష్కారం చేసుకునే అవకాశం వస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలం. ఈ రాశి స్త్రీలకు బుద్ధికుశలత ప్రదర్శించడానికి అవకాశం లేని పరిస్థితులు. ఉద్యోగ వ్యాపార కుటుంబ విషయాలలో సమస్యలు ఉంటాయి. నూతన ప్రయత్నాలు సరిగా సాగవు. గర్భిణులు జాగ్రత్తలు పాటించడం ద్వారా సుఖపడతారు.పూర్వాభాద్ర 4: ద్వితీయార్ధంలో మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి పనిలోనూ ధనవ్యయం అధికం. ఏ పనీ సకాలంలో చేయరు. అయినా అన్ని పనులు సానుకూలం. కుటుంబ సభ్యుల సహకారం అందుకుంటారు. ఉత్తరాభాద్ర: ఎక్కువ కాలం పనులు మందగమనం. తరచుగా జీర్ణ, చర్మసంబంధ సమస్యలు రాగలవు. ఆలోచనలు అమలు చేయుదిశగా ఎవరితోనూ మనోభావాలను పంచుకోరు. రేవతి: అద్భుతమైన మాటతీరుతో ఎన్నో విజయాలు అందుకుంటారు. బంధు మిత్రులు బాగా సహకారం చేస్తారు. వృత్తిరీత్యా ఏర్పడుతున్న ఆలస్యం గురించి చింతించకుండా ధైర్యంగా ముందుకు సాగుతారు.శాంతి మార్గం: శని రాహు కేతువులకు సంవత్సరారంభంలోను, అక్టోబర్లో శని గురువులకు శాంతి చేయించడం మంచిది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ‘మంచం’ దానం చేయండి. నిత్యం ప్రదోషకాలంలో శివ సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం. అష్టముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్: చాలా వ్యవహారాలలో పనులు ఆలస్యం. నిత్యకృత్యాలు కూడా అకాలంలో సాగిస్తారు. అధికారుల వ్యతిరేకత ఉంటుంది. వాహనాలు తరచు మరమ్మతులకు వస్తుంటాయి. షేర్ వ్యాపారులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. మే: క్రమంగా మంచి ఫలితాలు ప్రారంభం అవుతాయి. భవిష్యత్ మీద ఆశ జనిస్తుంది. ఆరోగ్యం సానుకూలంగా ఉంటుంది. శుభ కార్యాలలో పాల్గొనడం, పుణ్యకార్యాలు చేసే ఆలోచనలు పెరుగుతాయి. షేర్ వ్యాపారులకు, మార్కెటింగ్ ఉద్యోగులకు క్రమంగా మంచి ఫలితాలు ఉంటాయి. జూన్: పెద్దల ఆరోగ్య విషయంలో బాగా జాగ్రత్తలు పాటించండి. పిల్లల విషయంలో అసంతృప్తి ఉంటుంది. ఓర్పుగా ఉంటారు. అయితే చాలాసార్లు నిరుత్సాహంగా ఉంటారు. పనులు స్వయంగా చేసుకోవడం అవసరం. దూరప్రయాణాలు విడనాడండి. జులై: తెలివిగా పనులు సానుకూలం చేసుకుంటారు. రోజువారీ పనులు అకాలంలో జరుగుతాయి. స్వబుద్ధితో విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారి ప్రయత్నాలు తేలికగా పూర్తి అవుతాయి. కోర్టు, స్థిరాస్తి వ్యవహారాలు, శుభకార్య ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆగస్ట్: శ్రమతో పనులు పూర్తవుతాయి. మాటతీరు నియంత్రించుకోవాలి. అవగాహన లోపాలు పెరిగి ఉద్యోగ వ్యాపారాలలో చికాకులు. నూతన ప్రయత్నాలు వేగంగా చేసినా, ఫలితం ఉండదు. కోర్టు వ్యవహారాలలో అనుకూలత లేదు. సెప్టెంబర్: శుభకార్య ప్రయత్నాలలో విశేష ఫలితాలు. సోమరితనం ప్రదర్శించి పనులు పాడు చేస్తారు. ఆర్థిక లావాదేవీలను స్వయంగా చూసుకోవాలి. వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందికర ఘటనలు. మంచి పనులపై దృష్టి కేంద్రీకరిస్తారు. అక్టోబర్: నిత్యకృత్యాలు అకాలంలో చేయడం వలన వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులు. ప్రతి పనిలోనూ వ్యాకులతకు లోనవుతారు. బంధుమిత్రులతో కలహాలకు అవకాశం ఇవ్వకండి. ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తారు. విద్యార్థులకు కాలం అనుకూలం. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు తొందరపాటును విడనాడాలి. కోర్టు వ్యవహారాలు సానుకూలం. నవంబర్: రోజువారీ పనులు సరిగా సాగవు. సహకరించే వారు కూడా వ్యతిరేకించే పరిస్థితి. నూతన ప్రయత్నాలు విఫలం. ఉద్యోగ భద్రత, వ్యాపార అనుకూలత తక్కువ. కొత్త ప్రయోగాలు చేయవద్దు. ఇతరుల నుంచి శత్రుభావం ఎక్కువ. పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. డిసెంబర్: ఆరోగ్యం జాగ్రత్తలు పాటించాలి. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా చూసుకోవాలి. రోజువారీ పనులకు, ఉద్యోగ విధులకు సమన్వయం కుదరక ఇబ్బందులు. ఆర్థిక, కుటుంబ, వృత్తి విషయాలలో ఇతరుల సలహాలు తీసుకోకండి. కొత్త ఋణాలు చేయవద్దు. జనవరి: బుద్ధికుశలతతో పనులు సానుకూలం చేసుకుంటారు. అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది. పాత సమస్యలు పరిష్కరించుకుంటారు. ధనం వెసులుబాటు, ఆరోగ్యం బాగుంటాయి. కుటుంబ సమస్యలు తీర్చుకోవడంలో తెలివిగా ఉంటారు. ఫిబ్రవరి: చేపట్టిన పనులు తేలికగా పూర్తికావు. తెలివి ధైర్యం విడనాడరు. కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాలు సమర్థంగా సాధిస్తారు. నూతన ప్రయత్నాలు వేగం అవుతాయి. సామాజిక కార్యక్రమాలలో కీర్తి పెరుగుతుంది. విదేశీ నివాస ప్రయత్నాలకు అనుకూలం. అందరి నుంచి ఆశించిన సహకారం అందుతుంది. మార్చి: మంచి ఫలితాలు ఎన్ని ఉంటాయో, ఇబ్బందికర అంశాలు కూడా అన్ని ఉంటాయి. కుటుంబ అవసరాలు తీర్చే విషయంలో అలసత్వం ప్రదర్శిస్తారు. అందరికీ సలహాలు ఇస్తుంటారు. అతిధోరణితో తోటివారి నుంచి చికాకులు కొని తెచ్చుకుంటారు. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, నూతన వృత్తి ప్రయత్నాలలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. పుష్కర నిర్ణయముయమునా నదీ పుష్కరములు: ది.01–06–2026 తెల్లవారితే 02–06–2026 గం.12:17లకు గురువు కర్కాటక రాశిలో ప్రవేశం. యమునానదీ పుష్కరాలు ప్రారంభం. రాత్రికాలంలో గురువు ప్రవేశం అయినది కావున 2వ తేదీ నుంచి 12 రోజులు పుష్కరదినములుగా గణన చేయవలెను. అధిక జ్యేష్ఠ బహుళ విదియ మంగళవారం నుండి అధిక జ్యేష్ఠ బహుళ త్రయోదశీ శనివారం వరకు. ముఖ్య గమనిక : పితృశ్రాద్ధం చేశాక దేవాలయములకు వెళ్ళరాదు. నేడు పుష్కరాలు వ్యాపారధోరణిని అనుసరిస్తున్నాయి. పితృకార్యం చేసిన రోజు ఇతర దేవతా ఆరాధనలకు విశేషం లేదు. పితృ దేవతలే ప్రతిమనిషి జీవితంలోను ప్రధాన దేవతలు. పుష్కర యాత్రకు వెళ్ళినవారు ముందురోజే దేవాలయ సందర్శనం చేయండి. పితృ దేవతా సంబంధంగా కార్యం చేసిన రోజు దేవాలయ దర్శనం కూడదు. (పితృకార్యం అనంతరం). గమనించి సంచరించండి. పుష్కర సందర్భంగా ప్రారంభం నుంచి 12 రోజులు పూర్తిగా పుష్కరుడు ఆ పుష్కర నది మీదే విహరిస్తూ ఉంటారు. కావున 12 రోజులు 24 గంటలూ కూడా విశేషమే. అయినప్పటికీ రాత్రి 2వ యామము, 3వ యామము స్నానానికి నిషేధము. అలాగే కృత్రిమమైన మురికినీరుతో పుష్కరశ్రాద్ధము చేయుట కూడా నిషేధమే. పుష్కరాలు 12 రోజులు అయిన తరువాత ప్రతిరోజూ అపరాహ్ణ కాలంలో ఆ నదిమీదే పుష్కరుడు విహరిస్తాడు. అందువలన ఆ సంవత్సర కాలంలో ఏ రోజైననూ అపరాహ్ణ కాలంలో ఆ పుష్కరనదిని ఉద్దేశించి శుచిగా, శుభ్రమైన జలంతో పుష్కరశ్రాద్ధము నిర్వహించవచ్చు. అది ఈ 12 రోజుల మధ్యలో చేసిన ఫలితాన్నే సూచిస్తుంది. రాబోవు ప్లవంగ సంవత్సరంలో గోదావరి నది పుష్కరాలు: ది.26–06–2027 ప్లవంగ జ్యేష్ఠ బహుళ సప్తమీ శనివారం గోదావరి నదీ పుష్కరాలు ప్రారంభం. -పంచాంగ కర్తశ్రీ కప్పగన్తు సుబ్బరామ సోమయాజులుఫోన్లు: 08676 2414336 /98485 20336 -
శ్రీ పరాభవ నామ సంవత్సర శుభ ముహూర్తములు (2026 – 27)
చైత్ర మాసం 19/03 చైత్ర శుద్ధ పాడ్యమి గురు ఉత్తరాభాద్ర ఉగాది నూతన వస్త్రాభరణధారణ వ్యాపారాదులకు వృషభం ఉ.11:00 (దుస్పక్). మిథునోపి ప.12:01 20/03 విదియ శుక్ర రేవతీ వృషభం ఉ.10:19. మి«థునం ప.11:45 (రహితం లేదు)21/03 తదియ శని అశ్విని దం, అన్న, అక్షర, సీమంత, పుంసవన, దేవతా ప్రతిష్ఠ, నిశ్చితార్థం, వాస్తు కర్మలు, రిపేర్లు మిథునం ప.12:01 విశేషం.25/03 సప్తమి బుధ మృగశిర అన్న, అక్షర, ఉప, వ్యాపార, దేవతా ప్రతిష్ఠ, సీమంత, పుంసవన, వాస్తుకర్మలు, రిపేర్లు నిశ్చితార్థం వృషభం ఉ.గం.9:5527/03 నవమి కళ్యాణములు కర్కాటక లగ్న ప.1:00–3:12. 1:00కు తలంబ్రాలు పోసేలాగా చూసుకోండి. దశమి పుష్యమి గృప్ర ధను రా.12:30.28/03 దశమి శని పుష్యమి అన్న, అక్షర, వ్యాపార, సీమంత, పుంసవన, వాస్తు కర్మలు, రిపేర్లు, బోరింగ్, ఉపనయనం, దేవతా ప్రతిష్ఠలు వృషభం ఉ.గం.9:43. 29/03 ద్వాదశీ ఆది మఘ వివాహం వృషభం రాత్రి 11:55 నిశీధి.30/03 త్రయోదశీ సోమ మఘ వివాహం వృషభం ప.గం.ఉ.9:30 (సగ్రహ)01/04 పౌర్ణమి, బుధ, ఉత్తర, అన్న, వాస్తుకర్మలు, వివాహం, దేవతాప్రతిష్ఠ, వివాహం, సీమంత, పుంసవన, నిశ్చితార్థం వ్యాపారం వృషభం మార్తాండ రహితం ఉ.గం.9:30. హస్త ధనుస్సు రా.గం.11:45 వివాహం.02/04 పాడ్యమి గురు హస్త అన్న, వాస్తుకర్మలు, రిపేర్లు, దేవప్రతిష్ఠ, వ్యాపార, సీమంత పుంసవన, బోరింగ్, నిశ్చితార్థం, వృషభం ఉ.గం.9:23 03/04 విదియ శుక్ర, చిత్త, గృప్ర, శంకు, వాస్తు కర్మలు దేవతాప్రతిష్ఠలు అన్న, సీమంత, పుంసవన, నిశ్చితార్థం, వ్యాపారం, బోరింగ్, దం మిధునం ప.11:01 శుభాంశ. స్వాతీ ధనస్సు రా.11:35.04/04 తదియ శని స్వాతి వివాహం, అన్న, అక్షర, వ్యాపార, దేవ ప్రతిష్ఠ, వాస్తుకర్మలు, రిపేర్లు, సీమంత పుంసవన, నిశ్చితార్థం, బోరింగ్లకు వృషభం 9:16.05/04 చవితి ఆది అనురాధ వివాహం, గృప్ర, గర్భాదానం, ధనస్సు రా.గం.11:45.06/04 చవితి సోమ అనురాధ వ్యాపారం, అన్న, సీమంత, పుంసవన, గృప్ర, శంకు, దేవతాప్రతిష్ఠ, వాస్తు రిపేర్లు, బోరింగ్, నిశ్చితార్థం వృషభం ఉ.గం.9:07. మిధునోపి ఉ.11:45 (6శుక్ర)08/04 షష్ఠి బుధ మూల సమస్త శుభకర్మలు దేవతా ప్రతిష్ఠ, వ్యాపార, అన్న, శంకు, బోరింగ్ వృషభం ఉ.గం.8:59 (8చం). మి«థునోపి ఉ.గం.11:00 (7చం)10/04 నవమి శుక్ర ఉత్తరాషాఢ వివాహం, గర్భాదాన, గృప్ర, ధనస్సు రా.గం.11:45.11/04 నవమి శని ఉత్తరాషాఢ సమస్త శుభకర్మలు వాస్తు కర్మలు వ్యాపారాదులకు బోరింగ్, నిశ్చితార్థ సీమంతాదులకు వృషభం ఉ.గం.8:51. శ్రవణం మిథునం ఉ.గం.11:00. దశమి శ్రవణం వివాహం, గర్భాదానం ధనుస్సు రా.గం.11:30.12/04 దశమి ఆది శ్రవణం వివాహం, శంకు, వాస్తుకర్మలు దేవ ప్రతిష్ఠలు, బోరింగ్, అన్న, అక్షర, ఉప, వ్యాపార, సీమంత, పుంసవన, వృషభం ఉ.గం.8:42. మిథునోపి 11:00. ఏకాదశీ ధనిష్ఠ వివాహం గృప్ర, గర్బ, ధనస్సు రా.గం.11:45.13/04 ఏకాదశీ, సోమ, ధనిష్ఠ, మిథునం ప.గం.11:00.వైశాఖ మాసం18/04 పాడ్యమి శని అశ్వినీ మిథునం ప.గం.11:01. పూర్ణచంద్రుడితో కూడిన సోమవారం వివాహమునకు దోషం కాదు. 20/04 తదియ సోమ రోహిణీ వివాహం అన్న, అక్షర, ఉప, సీమంత, పుంసవన దేవతాప్రతిష్ఠ, గృప్ర, శంకు, బోరింగ్, వ్యాపారం మిథునం ఉ.గం.10:51. కర్కాటకం ప.గం.12:01. చవితి వివాహం, గృప్ర, గర్భాదానం, వృశ్చికం రా.గం.8:27.23/04 సప్తమి గురు పునర్వసు, అన్న, అక్షర, సీమంత, పుంసవన, శంకుస్థాపన, బోరింగ్, దేవతా ప్రతిష్ఠ, వ్యాపారం, మిథునం ఉ.గం.10:49. కర్కాటకోపి ప.గం.11:46. గర్భాదానాదులకు వృశ్చికం రా.గం.8:19.24/04 అష్టమి శుక్ర పుష్యమి కర్కాటకం బోరింగ్, పుంసవనం, అత్యవసర విషయాలకు ఉ.గం.11:38. గర్భాదానం వృశ్చికం రా.గం.8:15.25/04 నవమి శని మఘ వివాహం మకరం రా.గం.12:53 (8చం. సగ్రహచంద్ర)26/04 దశమి ఆది మఘ వివాహం వృషభం ఉ.గం.7:44. మిథునోపి ఉ.గం.10:33.29/04 త్రయోదశీ బుధ హస్త అత్యవసర ఉప నయనాది శుభాలకు ఉ.గం.11:01. చతుర్దశీ వివాహం, గర్భాదానం, నిశ్చితార్థం వృశ్చికం రా.గం.9:01. బుధ/గురు చిత్త మకరం రా.గం.12:33.30/04 చతుర్దశి గురు చిత్త అన్న, శంకు, గృప్ర, ప్రతిష్ఠ, బోరింగ్, వ్యాపారం, నిశ్చితార్థం, సీమంత పుంసవన వృషభం ఉ.గం.7:30. గృప్ర వశ్చికం రా.గం.7:47.01/05 పూర్ణిమ శుక్ర స్వాతి మిథునం ఉ.గం.10:15. సమస్త శుభాలకు కర్కాటకం ఉ.గం.11:14. వివాహం గప్ర వృశ్చికం రా.గం.7:43. మకరోపి వివాహార్థం రా.గం.12:29.03/05 విదియ ఆది అనురాధ వివాహం, శంకు, గృప్ర, వ్యాపారం, బోరింగ్, నిశ్చితార్థం, దేవతాప్రతిష్ఠ, సీమంత, పుంసవన, అన్న, అక్షర, ఉప, వృషభం మార్తాండ రహితం ఉ.గం.7:22 (12ర7చం) గర్భాదానం వివాహం మకరం రా.గం.12:21.04/05 తదియ సోమ అనురాధ, అన్న, అక్షర, ఉప, శంకు, గృప్ర, నిశ్చితార్థం, వివాహం, సీమంతం, గృప్ర, దేవతాప్రతిష్ఠ, వ్యాపారం వృషభం ఉ.7:14.06/05 పంచమి బుధ మూల అన్న, సీమంత, పుంసవన, వివాహం, నిశ్చితార్థం, బోరింగ్, వాస్తుకర్మలు, దేవతాప్రతిష్ఠ వృషభం ఉ.గం.7:05.07/05 షష్ఠి గురు ఉత్తరాషాఢ వివాహం గృప్ర వృశ్చికం రా.గం.7:23.08/05 షష్ఠి శుక్ర ఉత్తరాషాఢ అన్న, అక్షర, ఉప, సీమంత, పుంసవన, శంకు, గృప్ర, వివాహ నిశ్చితార్థం దేవతాప్రతిష్ఠ, వ్యాపారం, బోరింగ్ వృషభం ఉ.గం.6:58. సప్తమి మిథునం ప.గం.9:45. కర్కాటకం ప.గం.10:42. సప్తమి శ్రవణం వివాహం. సీమంత వేడుక నిశ్చితార్థం వృశ్చికం రా.గం.7:15.09/05 సప్తమి శని శ్రవణం మిథునం ఉ.గం.8:55 విశేషం. అష్టమి శని ధనిష్ఠ మకరం రా.గం.11:45.10/05 అష్టమి ఆది ధనిష్ఠ మిథునం ఉ.గం.9:39. నవమి వృశ్చికం రా.గం.7:10.అధిక జ్యేష్ఠ మాసంక్రింద యిచ్చిన ముహూర్తములు, అత్యవసరంలో బోరింగ్కు, వాస్తు రిపేర్లకు, నిత్యంలో అన్నప్రాశన, సీమంతం, వేడుక సీమంత, పుంసవన, జాతకర్మ, నామకరణలకు మాత్రమే.18/05 విదియ సోమ రోహిణీ కర్కాటకం ఉ.గం.10:01.20/05 పంచమి బుధ పునర్వసు ధనుస్సు ఉ.గం.8:30.21/05 పంచమి గురు పునర్వసు మిథునం ఉ.గం.8:50.22/05 షష్ఠి శుక్ర పుష్యమి మిథునం ఉ.గం.7:30.25/05 దశమి సోమ ఉత్తర మి«థునం ఉ.గం.8:30. కర్కాటకం ప.గం.9:26. ధనుస్సు రా.గం.8:00.27/05 ఏకాదశీ బుధ హస్త మిథునం ఉ.గం.7:30.28/05 ద్వాదశీ గురు చిత్త మిథునం ఉ.గం.7:30. త్రయోదశీ కర్కాటక ఉ.గం.9:30. ధనుస్సు సా.గం.8:00.29/05 చతుర్దశీ శుక్ర స్వాతీ కర్కాటకం ఉ.గం.10:01.30/05 పౌర్ణమి శని అనురాధ ధనుస్సు సా.గం.8:00.31/05 పౌర్ణమి ఆది అనురాధ మిథునం ఉ.గం.7:30.04/06 చవితి గురు ఉత్తరాషాఢ మిథునం ఉ.గం.7:00. ధనస్సు రా.గం.7:30.05/06 పంచమి శుక్ర శ్రవణం ధనిష్ఠ రా.గం.7:30.06/06 షష్ఠి శని ధనిష్ఠ కర్కాటకం ఉ.గం.10:01. ధనస్సు రా.గం.7:30. సగ్రహ చంద్రక్రాంతి దోషం07/06 సప్తమి ఆది శతభిషం కర్కాటకం ఉ.గం. 10:01. ధనుస్సు రా.7:30. సగ్రహ చంద్రక్రాంతి దోషం.నిజ జ్యేష్ఠ మాసం16/06 విదియ మంగళ / బుధ పునర్వసు బోరింగ్ వృషభం తె.గం.5:26.17/06 తదియ బుధ పునర్వసు అన్న, సీమంతం, పుంసవనం కర్కాటకం ఉ.గం.9:01. పుష్యమీ గర్భాదానం రా.గం.9:25.18/06 చవితి గురు పుష్యమీ అన్న, పుంసవన, సీమంత, బోరింగ్ కర్కాటకం ఉ.గం.8:03.19/06 షష్ఠి శుక్ర మఘ వివాహం మకరం రా.గం.9:18.20/06 షష్ఠి శని మఘ వివాహం కర్కాటకం ఉ.గం.7:55.21/06 అష్టమి ఆది ఉత్తర మకరం వివాహాది రా.గం.8:45. అష్టమి ఆది/సోమ ఉత్తర వివాహం వృషభం తె.గం.4:02. విశేషం.22/06 అష్టమి సోమ ఉత్తర సమస్త శుభాలకు కర్కాటకం ఉ.గం.9:01. నవమి హస్త మకరం వివాహం గృప్ర రా.గం.9:01.23/06 దశమి మంగళ/బుధ చిత్త, గృప్ర, బోరింగ్ వృషభం తె.గం.4:02.24/06 దశమి బుధ చిత్త (అన్న, అక్షర) ఏకాదశీ స్వాతి, వివాహం, గర్భాదానం మకరం రా.గం.9:01. ఏకాదశీ బుధ / గురు స్వాతీ వివాహం మేషం రా.గం.2:23.25/06 ఏకాదశి గురు స్వాతీ అన్న, అక్షర, వివాహ, బోరింగ్ కర్కాటకం ఉ.గం.7:38.27/06 త్రయోదశీ శని అనురాధ వివాహం మకరం రా.గం.8:46.28/06 చతుర్దశీ ఆది/సోమ మూల వివాహం మేషం రా.గం.2:01 విశేషం.29/06 పౌర్ణమి సోమ మూల వివాహాది శుభాలకు కర్కాటకం మార్తాండ రహితం ఉ.గం.7:30. వివాహం మకరం రా.గం.8:38 విశేషం.01/07 విదియ బుధ ఉత్తరాషాఢ అన్న, అక్షర, సీమంత, పుంసవన, బోరింగ్, వ్యాపార, దేవతాప్రతిష్ఠ, నిశ్చితార్థం, వివాహం, కర్కాటకం ఉ.గం.7:15. మేషం రా.1:30.02/07 విదియ గురు ఉత్తరాషాఢ అన్న, అక్షర, అకాలవటు, ఉప, వివాహ, సీమంత, పుంసవన, బోరింగ్ వ్యాపారం, దేవతాప్రతిష్ట, నిశ్చితార్థం కర్కాటకం ఉ.7:11 (8రా). తదియ శ్రవణం వివాహం మకరం రా.గం.8:22. వివాహం మేషం రా.గం.1:52.03/07 తదియ శుక్ర శ్రవణం అన్న, అక్షర, బోరింగ్, వివాహ, సీమంత, పుంసవన, వ్యాపారం ప్రతిష్ఠ నిశ్చితార్థం కర్కాటకం ఉ.7:07 (8రా). చవితి ధనిష్ఠ మకరం వివాహం రా.8:18. శుక్ర/శని మేషం వివాహం రా.1:48.08/07 నవమి బుధ అశ్వినీ వివాహం మకరం మార్తాండ రహితం రా.8:01. బుధ/గురు మేషం రాత్రి 1:31.ఆషాఢ మాసంసీమంత, పుంసవన, వాస్తు తదితరాలకు అత్యవసర ముహూర్తాలు 15/07 పాడ్యమి బుధ పుష్యమీ కర్కాటకం ఉ.7:30 19/07 షష్ఠి ఆది ఉత్తర ధనుస్సు సా.6:00.20/07 సప్తమి సోమ హస్త ధనుస్సు సా.6:00.22/07 నవమి బుధ స్వాతి ధనుస్సు సా.5:30.24/07 ఏకాదశీ శుక్ర అనురాధ ధనుస్సు సా.5:30.29/07 పౌర్ణమి బుధ శ్రవణం ధనుస్సు సా.5:00.30/07 పాడ్యమి గురు శ్రవణం ధనుస్సు సా.5:00.31/07 విదియ శుక్ర ధనిష్ఠ ధనుస్సు సా.5:00.08/08 ఏకాదశీ శని మృగశిర ధనుస్సు సా.4:30.19/07 షష్ఠి ఆది ఉత్తర తుల ప.11:55.24/07 ఏకాదశీ శుక్ర అనురాధ తుల ప.11:50.30/07 పాడ్యమి గురు శ్రవణం తుల ప.11:50.31/07 విదియ శుక్ర ధనిçష్ఠ తుల ప.11:50.08/08 దశమి శని రోహిణి తుల ప.11:50.శ్రావణ మాసం15/08 తదియ శని ఉత్తర నిశ్చితార్థం, అన్న, అక్షర, వ్యాపార, సీమంత, పుంసవన, వివాహ, శంకు, బోరింగ్లకు తుల ప.గం.12:00 (12చం/శు)16/08 చవితి ఆది హస్త, అన్న, వ్యాపార, బోరింగ్, శంకు, సీమంత, పుంసవన, వివాహములకు తుల ప.గం.11:55. హస్త ఆది/సోమ వివాహం వృషభం రా.12:32.20/08 అష్టమి గురు అనురాధ తుల ప.గం.11:50. నవమి గురు/శుక్ర అనురాధ వివాహం వృషభం రా.గం.12:30 (7చం). వివాహ శంకు కర్కాటకం తె.గం.4:01.21/08 నవమి శుక్ర అనురాధ వివాహం, అన్న, అక్షర, బోరింగ్, వ్యాపారం, సీమంత, పుంసవన, నిశ్చితార్థం తుల ప.గం.11:34.22/08 ఏకాదశీ శని/ఆది మూల వివాహం శంకు కర్కాటకం తె.గం.4:30.26/08 త్రయోదశీ బుధ శ్రవణం అన్న అక్షరాది శుభాలకు తుల ప.గం.10:01. చతుర్దశి శ్రవణం వివాహం వృషభం రా.గం.11:50. వివాహం, శంకు కర్కాటకం రా.గం.4:16.27/08 పౌర్ణమి గురు ధనిష్ఠ సమస్త శుభాలకు తుల ప.గం.11:01. గృప్ర, వివాహం వృషభం రా.గం.11:50 28/08 పాడ్యమి శుక్ర శతభిషం సీమంతం వేడుకలకు నిశ్చితార్థములకు మకరం ప.గం.4:33. గృప్ర, వివాహం, వృషభం రా.గం.11:42. శుక్ర/శని వివాహ, శంకు, వ్యాపార, బోరింగ్లకు కర్కాటక తె.గం.3:20.30/08 తదియ ఆది ఉత్తరాభాద్ర తుల ఉ.గం.10:54 . వివాహం గృప్ర వృషభం రా.గం.11:34. శంకు, వివాహం, బోరింగ్ కర్కాటకం తె.గం.3:18. తె.గం.4:01. శుభాంశ.31/08 చవితి సోమ రేవతి తుల ఉ.గం.10:56. వృషభం రా.గం.11:30.01/09 పంచమి మంగళ/బుధ అశ్విని కర్కాటకం తె.గం.4:05. అద్భుతమైన ముహూర్తం.03/09 అష్టమి గురు/శుక్ర రోహిణి కర్కాటకం తె.గం.3:50.04/09 అష్టమి శుక్ర రోహిణి తుల ప.గం.10:39. నవమి శుక్ర/శని మృగశిర శంకు, బోరింగ్ తె.గం.3:50 కర్కాటకం.05/09 నవమి శని మృగశిర తుల ప.గం.10:35.06/09 ఏకాదశీ ఆది పున వృషభం రా.గం.11:11. ఆది/సోమ కర్కాటకం తె.గం.3:45 శుభాంశ.07/09 ఏకాదశీ సోమ పున తుల ప.గం.10:25.భాద్రపద మాసంఅన్నప్రాశన, జాతకర్మ, సీమంత, పుంసవన, నామకరణాదులకు ముహూర్తములు12/09 విదియ శని ఉత్తర తుల ప.గం.10:01.13/09 తదియ ఆది హస్త తుల ప.గం.10:03.14/09 చవితి సోమ చిత్త తుల ప.గం.9:50.16/09 షష్ఠి బుధ అనురాధ మేషం రా.గం.8:01.17/09 షష్ఠి గురు అనురాధ తుల ఉ.గం.9:10.21/09 దశమి సోమ ఉత్తరాషాఢ తుల ఉ.గం.9:00. ఏకాదశీ మేషం రా.8:81.24/09 త్రయోదశీ గురు ధనిష్ఠ తుల ఉ.గం.9:10. శతభిషం మేషం రా.గం.7:50.25/09 చతుర్దశీ శుక్ర శతభిషం తుల ఉ.గం.9:20.26/09 పౌర్ణిమ శని ఉ.భాద్ర మేషం రా.గం.7:55. ఆశ్వీయుజ మాసం11/10 శుద్ధ పాడ్యమి ఆది చిత్త నవరాత్రి కలశ స్థాపనలకు తుల ఉ.గం.6:40–7:00. వ్యాపారాదులకు నిశ్చితార్థం మేషం రా.7:29.12/10 విదియ సోమ స్వాతి వ్యాపారం అన్న, అక్షర, నిశ్చితార్థం తుల ఉ.గం.8:01. నిశ్చితార్థం సీమంత వేడుకలు మేషం రా.గం.7:00.14/10 చవితి బుధ అనురాధ అన్న, అక్షర, సీమంత, పుంసవన, నిశ్చితార్థం వృశ్చికం ఉ.గం.8:51. సీమంతాదులకు మేషం రా.గం.7:00.మూలా నక్షత్రం అక్షరాభ్యాస నక్షత్రాలలో లేదు తెలుసుకోండి.17/10 సప్తమి శని మూల త్రిరాత్ర దీక్ష కలశస్థాపనలకు వృశ్చికం ఉ.గం.8:30.18/10 దుర్గాష్టమీ సందర్భంగా వాహనపూజ, యంత్రపూజలకు ఉ.గం.9:30.19/10 మహానవమి సందర్భంగా వాహనపూజలు యంత్ర పూజలకు ఉ.గం.9:30.20/10 విజయదశమి సందర్భంగా వ్యాపారులకు పూజ సమయం ఉ.9:50సా.6:0021/10 దశమీ బుధ ధనిష్ఠ అన్న, సీమంత, పుంసవనలకు వృశ్చికం 8:35. ఏకాదశీ శతభిషం మేషం సా.6:30.22/10 ఏకాదశీ గురు శతభిషం అన్న సీమంత పుంసవన వృశ్చికం ఉ.గం.8:00.24/10 చతుర్దశీ శని ఉత్తరాభాద్ర మేషం రా.గం.6:50.25/10 పౌర్ణమి ఆది రేవతి మేషం రా.గం.6:50.28/10 తదియ బుధ రోహిణి వృషభం రా.గం.7:45.29/10 చవితి గురు మృగశిర వృషభం రా.గం.7:41 (వివాహ, గృప్ర, గర్భాదానం)30/10 పంచమి శుక్ర మృగశిర వృశ్చికం ఉ.7:40.01/11 సప్తమి ఆది పునర్వసు అన్న, అక్షర, శంకు, బోరింగ్, సీమంత, పుంసవన వృశ్చికం ఉ.గం.7:30.02/11 అష్టమి సోమ పుష్యమి వృశ్చికం ఉ.గం.7:30.05/11 ఏకాదశీ గురు ఉత్తర వృశ్చికం ఉ.7:30.07/11 ధ¯Œ తేరస్ పూజలకు మిథునం రా.గం.8:309:00.08/11 దీపావళి పూజలకు మిథునం రా.గం.8:35.కార్తీక మాసం11/11 విదియ బుధ అనురాధ అన్న, అక్షర, వైశ్యోపనయన, నిశ్చితార్థం, సీమంత, పుంసవన, వివాహం, బోరింగ్, శంకు, గృప్ర, వ్యాపారం వృశ్చికం ఉ.గం.7:08.12/11 చవితి గురు మూల వివాహం మిథునం రా.గం.9:31.13/11 చవితి శుక్ర మూల అన్న, అక్షర, వైశ్యోప నయన, నిశ్చితార్థ, సీమంత, పుంసవన, వివాహం, బోరింగ్, ధనుర్లగ్న ఉ.గం.10:13.14/11 పంచమీ శని ఉత్తరాషాఢ వివాహం, నిశ్చితార్థం, వేడుక సీమంత, గృప్ర వషభం రా.గం.6:50. షష్ఠి వివాహం కర్కాటకం రా.గం.10:30. 15/11 షష్ఠి ఆది ఉత్తరాషాఢ అన్న, అక్షర, వైశ్యోప నయన, వివాహ, దేవ ప్రతిష్ఠ, నిశ్చితార్థ, సీమంత, పుంసవన, వ్యాపార, బోరింగ్, శంకు, గృప్ర, వృశ్చికం ఉ.గం.6:52. నిశ్చితార్థం, వివాహం, గృప్ర వృషభం రా.గం.6:36. మిథునం రా.గం.9:22.16/11 సప్తమి సోమ శ్రవణం అన్న, అక్షర, వైశ్యోప నయనం, శంకు, బోరింగ్, వ్యాపార, సీమంత, ప్రతిష్ఠ వ్యాపారం వృశ్చికం ఉ.గం.6:45. వేడుక సీమంతం, వివాహం, వృషభం రా.గం.6:29. మిథునం రా.గం.9:15.18/11 నవమి బుధ శతభిషం వివాహం, గృప్ర, గర్భాదాన, నిశ్చితార్థం మిధునం రా.గం.7:55. వివాహం కర్కాటకం రా.గం.10:02.20/11 ఏకాదశీ శుక్ర, ఉత్తరాభాద్ర అన్న, అక్షర, సీమంత, పుంసవన, వైశ్యోపనయన, వివాహ, శంకు, గృప్ర, ప్రతిష్ఠ, వ్యాపారం ధనుస్సు ఉ.గం.9:39. ద్వాదశీ శుక్ర/శని రేవతీ శంకు వివాహం తుల తె.గం.5:30.21/11 ద్వాదశీ శని రేవతీ వివాహం గృప్ర మిథునం రా.గం.8:57. వివాహం కర్కాటకం రా.గం.9:47. త్రయోదశీ శని/ఆది శంకు వివాహం తుల తె.గం.5:30.22/11 త్రయోదశీ ఆది అశ్వినీ అన్న, అక్షర, వైశ్యోప నయన, సీమంత, పుంసవన, వివాహం, శంకు, బోరింగ్, వ్యాపారం, ధనుస్సు ఉ.గం.9:32. వివాహం, గృప్ర, గర్భాదానం మిథునం రా.గం.8:50.24/11 బ.పాడ్యమి మంగళ/బుధ రోహిణి వివాహం, శంకు, బోరింగ్ తుల తె.గం.5:16.25/11 పాడ్యమి బుధ రోహిణి అన్న, వివాహ, శంకు, గృప్ర, ప్రతిష్ఠ, వ్యాపార, సీమంత, పుంసవన, ధనుః ఉ.గం.9:23. వివాహ, సీమంత వేడుక, గృప్ర, మిథునం రా.గం.8:30. వివాహం కర్కాటకం రా.గం.9:31.26/11 విదియ గురు మృగశిర అన్న, అక్షర, వైశ్యోప నయన, ప్రతిష్ఠ, వివాహం, గృప్ర, మిథునం రా.గం.8:30. కర్కాటకం రా.గం.9:27.28/11 పంచమి శని/ఆది పుష్యమి శంకుస్థాపన తుల తె.గం.4:59.29/11 పంచమీ ఆది పుష్యమీ అన్న, అక్షర, శంకు, గృప్ర, బోరింగ్, వ్యాపారం, వైశ్యోపనయన, దేవప్రతిష్ఠ ధనుః ప.గం.9:0402/12 దశమి బుధ/గురు ఉత్తర శంకు/వివాహ, బోరింగ్, తుల తె.గం.4:44.03/12 దశమి గురు ఉత్తర అన్న, అక్షర, వైశ్యోపనయన, శంకు, గృప్ర, బోరింగ్, సీమంత, పుంసవన, నిశ్చితార్థం, వ్యాపార, దేవతాప్రతిష్ఠ, ధనుః ఉ.గం.8:53. హస్త వివాహం గర్భాదానం మిథునం రా.గం.8:01.04/12 ఏకాదశీ శుక్రవారం హస్త అన్న, అక్షర, వైశ్యోపనయనం, శంకు, ప్రతిష్ఠ, బోరింగ్, వ్యాపార, వివాహం, ధనుస్సు ఉ.గం.7:50. చిత్త గృప్ర ధనుస్సు రా.గం.9:57.మార్గశిర మాసం10/12 విదియ గురు మూల ధనుస్సు ఉ.గం.8:24. వివాహం మిథునం రా.గం.7:35.11/12 తదియ శుక్ర/శని ఉత్తరాషాఢ వివాహం బోరింగ్ తుల తె.గం.4:08.12/12 చవితి శని ఉత్తరాషాఢ వివాహం నిశ్చితార్థం గృప్ర మిథున రా.గం.7:26. శని/ఆది వివాహం శంకు తుల తె.గం.3:50.13/12 చవితి ఆది శ్రవణం ధనుస్సు ఉ.గం.7:10. పంచమి ఆది శ్రవణం వివాహం నిశ్చితార్థం మిథునం రా.గం.7:28. ఆది/సోమ వివాహం శంకు తుల తె.గం.3:50.14/12 పంచమి సోమ ధనిష్ఠ వివాహ, అన్న, అక్షర, శంకు, గృప్ర, బోరింగ్, వ్యాపారం, సీమంత, పుంసవన, నిశ్చితార్థం, ప్రతిష్ఠ, ధనుస్సు ఉ.గం.8:10. షష్ఠి వివాహం గృప్ర నిశ్చితార్థం మిథునం రా.గం.7:24.16/12 సప్తమి బుధ శతభిషం వివాహం, గృప్ర, శంకు, నిశ్చితార్థం, బోరింగ్, వ్యాపారం, అన్న అక్షర, సీమంత, పుంసవన, ధనుస్సు ఉ.గం.8:02.17/12 నవమి గురు/శుక్ర ఉత్తరాభాద్ర వివాహం తుల తె.గం.3:45 (6చం)18/12 దశమి శుక్ర/శని రేవతి వివాహం వృశ్చికం తె.గం.4:42.19/12 ఏకాదశీ శని/ఆది అశ్విని వివాహం వృశ్చికం తె.గం.4:38.22/12 చతుర్దశీ మంగళ/బుధ రోహిణి వివాహం గృప్ర వృశ్చికం తె.గం.4:26.25/12 తదియ శుక్ర/శని పుష్యమి గృప్ర వృశ్చికం తె.గం.4:11.27/12 పంచమి ఆది/సోమ మఘ వివాహం వృశ్చికం తె.గం.4:02.30/12 అష్టమి బుధ/గురు హస్త సమస్త శుభాలకు వృశ్చికం తె.గం.3:56.31/12 నవమి గురు/శుక్ర చిత్త సమస్త శుభాలకు వృశ్చికం తె.గం.3:53.01/01 దశమి శుక్ర/శని స్వాతి సమస్త శుభాలకు వృశ్చికం తె.గం.3:49పుష్య మాసంపగటికాల ముహూర్తములు తక్కువ ఉన్నాయి. విప్రాజ్ఞతో శిశువులకు అన్నప్రాశనలు పూర్తి చేసుకోండి. మేషలగ్నం మాత్రమే సీమంతాదులకు గ్రాహ్యం.09/01 విదియ శని శ్రవణం మేషం ప.గం.12:30.10/01 తదియ ఆది శ్రవణం మేషం ప.గం.12:30.11/01 చవితి సోమ ధనిష్ఠ మేషం ప.గం.12:20.14/01 సప్తమి గురు ఉత్తరాభాద్ర మేషం ప.గం.12:15.15/01 అష్టమి శుక్ర రేవతి మేషం ప.గం.12:15.16/01 నవమి శని అశ్విని మేషం ప.గం.12:05.22/01 పౌర్ణమి శుక్ర పుష్యమి మేషం ప.గం.12:00.27/01 షష్ఠి బుధ హస్త మేషం ప.గం.11:15.28/01 సప్తమి గురు చిత్త మేషం ప.గం.11:30.31/01 దశమి ఆది అనురాధ మేషం ప.గం.11:00.మాఘ మాసం08/02 విదియ సోమ శతభిషం అన్న, అక్షర (ఉప10ర) దేవతా ప్రతిష్ఠ, వ్యాపారం, శంకు, బోరింగ్, సీమంత, పుంసవన మేషం ప.గం.11:28. తుల రా.గం.11:11.ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం బహుదోషం09/02 చవితి మంగళ / బుధ ఉత్తరాభాద్ర ధనుః తె.గం.4:30.10/02 చవితి బుధ ఉత్తరాభాద్ర మేషం ప.గం.11:20. తుల రా.గం.11:03. పంచమి బుధ/గురు ఉత్తరాభాద్ర వృశ్చికం రా.గం.1:08.11/02 పంచమి గురు రేవతి అన్న, అక్షర, అకాల వటు, ఉప, సీమంత, పుంసవన, నిశ్చితార్థం మేషం ప.గం.11:13. వషభం ప.గం.12:01. వివాహాదులకు తుల రాగం.12:04 నిశీధి. షష్ఠి గురు/శుక్ర రేవతీ వివాహం, గృప్ర వృశ్చికం రా.గం.1:01. అశ్విని వివాహం, బోరింగ్, శంకు ధనుస్సు తె.గం.3:13.12/02 షష్ఠి శుక్ర అశ్విని శంకు, బోరింగ్, నిశ్చితార్థం వివాహం (ఉప10ర) అన్న, అక్షర, సీమంత, పుంసవన ప్రతిష్ఠలకు మేషం ప.గం.11:13.14/02 నవమి ఆది/సోమ రోహిణి వివాహాదులకు వృశ్చికం రా.గం.2:01.15/02 నవమి సోమ రోహిణి, అన్న, అక్షర, ఉప, వివాహం, నిశ్చితార్థం, దేవతా ప్రతిష్ట, వ్యాపారం, శంకు, గృప్ర, అన్న, అక్షర మేషం ప.గం.11:01. వివాహం తుల రా.గం.11:30.17/02 ఏకాదశీ బుధ ఆర్ద్ర మేషం ప.గం.10:50. ద్వాదశీ బుధ పునర్వసు గర్భాదానం తుల రా.గం.11:43.18/02 ద్వాదశీ గురు పునర్వసు అన్న, సీమంత పుంసవన, శంకు బోరింగ్లకు వృషభం ప.గం.11:45. త్రయోదశీ పుష్యమి గృప్ర, గర్భాదానం వృశ్చికం రా.గం.12:33.19/02 చతుర్దశీ పుష్యమి శుక్ర అన్న, శంకు, బోరింగ్, సీమంత, పుంసవన, వృషభం ప.గం.11:46.20/02 పౌర్ణమి శని మఘ వివాహం తుల రా.గం.11:29.21/02 పౌర్ణమి శని మఘ వివాహం వృషభం ప.గం.12:01.22/02 విదియ సోమ ఉత్తర వివాహం తుల రా.గం.11:20. పూర్ణచంద్రుడు + సోమవారం దోషం కాదు.25/02 పంచమి గురు చిత్త అన్న, అక్షర, శంకు, గృప్ర, నిశ్చితార్థం, సీమంత, ఉప, పుంసవన ప్రతిష్ఠ, వ్యాపారం వృషభం ఉ.గం.11:52. స్వాతీ వివాహం తుల రా.గం.11:01. ధనుస్సు రా.గం.3:21. వృశ్చికం రా.గం.12:10.26/02 షష్ఠి శుక్ర స్వాతి వషభం అగ్నిపంచకం ప.గం.11:44.27/02 సప్తమి శని అనురాధ తుల అగ్నిపంచకం రా.గం.11:04. వివాహం, గృప్ర వృశ్చికం రా.గం.12:10. అష్టమి శని/ఆది అనురాధ వివాహ, గృప్ర, శంకు, ధనుః రా.తె.గం.3:13.ఫాల్గుణ మాసం 10/03 విదియ బుధ రేవతి నిశ్చితార్థం వృషభం ప.11:01. తదియ బుధ రేవతి వివాహం గర్భాదానం తుల రా.గం.10:19 వివాహ గృప్ర వృశ్చికం రా.గం.11:16.11/03 తదియ గురు రేవతి అన్న, అక్షర, వివాహ, శంకు, బోరింగ్, వ్యాపార, సీమంత, పుంసవన నిశ్చితార్థ, ప్రతిష్ఠ మేషం ఉ.గం.9:21. అశ్విని వృషభం ఉ.గం.11:30. చవితి గురు అశ్విని వివాహం తుల రా.గం.10:15. వృశ్చికం రా.గం.11:12.12/03 చవితి శుక్ర అశ్విని అన్న, వివాహ, శంకు, బోరింగ్, సీమంతం, పుంసవనం, నిశ్చితార్థం, ప్రతిష్ఠలకు వృషభం ఉ.గం.10:20 మార్తాండ రహితం.14/03 షష్టి ఆది రోహిణి వివాహ, గృప్ర, నిశ్చితార్థం, సీమంత, పుంసవన (ఉపనయన 10ర) అన్న, అక్షర, దేవతా ప్రతిష్ఠ, బోరింగ్, శంకు, వృషభం ఉ.గం.10:44. సప్తమి ఆది రోహిణి వివాహ గృప్ర రా.గం.12:12.15/03 సప్తమి సోమ మృగశిర సమస్త శుభాలకు, వాస్తు కర్మలకు ప్రతిష్ఠలకు మేషం ఉ.గం.09:01.17/03 దశమి బుధ పునర్వసు అన్న, అక్షర, అత్యవసర ఉప సీమంతం పుంసవనం, శంకు, బోరింగ్లకు మేషం ఉ.గం.8:49 వృషభం ఉ.గం.10:30.18/03 ఏకాదశీ గురు పుష్యమి అన్న, అక్షర, నిశ్చితార్థ, సీమంత, పుంసవన, ప్రతిష్ట, శంకు, బోరింగ్, వ్యాపార, మేషం ఉ.గం.8:45. గృప్ర, గర్భాదానం వృశ్చికం రా.గం.10:40 (సగ్రహచంద్ర)20/03 త్రయోదశీ శని మఘ వివాహం వృషభం ఉ.గం.10:15. చతుర్దశీ మఘ వివాహం వృశ్చికం రా.గం.10:35.21/03 పౌర్ణమి ఆది ఉత్తర వివాహం గృప్ర వృశ్చికం రా.గం.10:30.22/03 పౌర్ణమి సోమ ఉత్తర అన్న, వివాహం, సీమంత, పుంసవన, నిశ్చితార్థ, శంకు, గృప్ర, బోరింగ్, వ్యాపారం మేషం ఉ.గం.8:36. వృషభం ఉ.గం.10:06. బ.పాడ్యమి సోమ హస్త తుల రా.గం.9:21. వృశ్చికం రా.గం.10:24.24/03 విదియ బుధ చిత్త అన్న, అక్షర, ఉప, నిశ్చితార్థ, సీమంత, పుంసవన, శంకు, గృప్ర, బోరింగ్, వ్యాపారం, వషభం ఉ.గం.9:59. తదియ బుధ స్వాతి వివాహ, వృశ్చికం రా.గం.10:16.25/03 తదియ గురు స్వాతి వివాహాది మేషం ఉ.గం.8:28. వృషభం ఉ.గం.9:30.26/03 పంచమి శుక్ర అనురాధ వృశ్చికం రా.గం.10:30.27/03 పంచమి శని అనురాధ వృషభం ఉ.గం.9:51. షష్ఠి శని వృశ్చికం రా.గం.10:30.29/03 సప్తమి సోమ మూల వృషభం ఉ.గం.9:44. తుల రా.గం.8:56.31/03 నవమి బుధ ఉత్తరాషాఢ çవృషభం ఉ.గం.9:40. దశమి వృశ్చికం రా.గం.10:01.01/04 దశమి గురు శ్రవణం వృషభం ఉ.గం.9:28. వృశ్చికం రా.గం.9:45. -పంచాంగ కర్తశ్రీ కప్పగన్తు సుబ్బరామ సోమయాజులుఫోన్లు: 08676 2414336 /98485 20336 -
ఎరుమేలిలో కొత్త చెక్ డ్యామ్ నిర్మాణం
ఎరుమేలిలో అయ్యప్ప భక్తులు పవిత్ర స్నానం చేయడానికి సరిపడా నీటి లభ్యతను నిర్ధారించేందుకు వలియంబలం ప్రాంతంలోని వలియ తోడ్ వద్ద కొత్త చెక్ డ్యామ్ నిర్మాణానికి 75 లక్షల రూపాయల నిధిని కేటాయించినట్లు పూన్జార్ ఎమ్మెల్యే Sebastian Kulathunkal ప్రకటించారు.ఇప్పటికే ఉన్న చెక్ డ్యామ్ పాతదై దెబ్బతిన్న కారణంగా నీటిని నిల్వ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అందువల్ల కొత్త చెక్ డ్యామ్ నిర్మాణాన్ని చేపడుతున్నారు.ఈ కొత్త చెక్ డ్యామ్ 16 మీటర్ల వెడల్పు, 14.1 మీటర్ల పొడవుతో నిర్మించబడుతుంది. ఇది 1.8 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది.అదనంగా , ఈ చెక్ డ్యామ్లో మొత్తం 8 షట్టర్లు ఉంటాయి. వాటిలో 6 FRP షట్టర్లు, 2 యాంత్రిక (మెకానికల్) షట్టర్లు ఉంటాయి.ఈ మెకానికల్ షట్టర్ల వాడకం వల్ల యాత్రాకాలంలో అయ్యప్ప భక్తులకు అవసరమైన నీటి లభ్యతను నిర్ధారించడం మాత్రమే కాకుండా, నీటి ప్రవాహాన్ని నియంత్రించడమూ సులభం అవుతుంది అని ఎమ్మెల్యే తెలిపారు.(చదవండి: భూలోక స్వర్గం శబరిమల సన్నిధానం మీనమాస పూజలు) -
భూలోక స్వర్గం శబరిమల సన్నిధానం మీనమాస పూజలు
ఆ మణికంఠుని అపార కృపాకటాక్షాలతో, అత్యంత పవిత్రమైన మీనమాస పూజలు, శబరిమల ఉత్సవం 2026 కొరకు అయ్యప్ప సన్నిధాన ద్వారాలు తెరుచుకున్నాయి. "స్వామియే శరణం అయ్యప్ప" అనే నామస్మరణతో ఆ దివ్య దర్శనానికి తరలి వెళ్దాం.మీనమాస పూజల షెడ్యూల్నడ తెరిచే సమయం: మార్చి 14, 2026 (శనివారం) సాయంత్రం 5:00 గంటలకు.నడ మూసివేత: మార్చి 19, 2026 (గురువారం) రాత్రి 10:00 గంటలకు (అత్తాజ పూజ, హరివరాసనం అనంతరం).శబరిమల ఉత్సవం, పంగుని ఉత్తరం 2026వార్షిక ఉత్సవాల నిమిత్తం మార్చి 22 సాయంత్రం 5:00 గంటలకు ఆలయ ద్వారాలు తిరిగి తెరవబడతాయి.మార్చి 23: కొడియేట్టు (ధ్వజారోహణం)మార్చి 24: ఉత్సవ బలిమార్చి 31: పళ్ళివేట (రాజవేట)ఏప్రిల్ 01: పంపా ఆరాట్టు & పంగుని ఉత్తరం – భగవాన్ అయ్యప్ప స్వామి వారి దివ్య జన్మదినోత్సవం.ముగింపు: ఏప్రిల్ 1, 2026.ఏప్రిల్ 1వ తేదీన సన్నిధానం ఉదయం 5:00 నుండి 8:00 వరకు మాత్రమే తెరవబడుతుంది. తిరిగి పంపా ఆరాట్టు ముగిసిన తర్వాత సాయంత్రం 6:00 గంటలకు తెరిచి, రాత్రి 10:00 గంటలకు మూసివేస్తారు.(చదవండి: మహిళల శబరిమల..! ఆటుకాల్ భగవతి) -
వడగండ్లా... బండరాళ్లా...
పిల్లలూ...వడగండ్ల వాన అప్పుడప్పుడు పడుతూ ఉంటుంది. మన దేశంలో వేసవిలో ఎక్కువ పడుతుంటుంది. చిన్న చిన్న గోలీల వంటి వడగళ్లు (Hailstones) పడుతుంటాయి. కొన్ని చోట్ల ఇంకాస్త పెద్ద వడగండ్లు పడుతుంటాయి. వడగండ్లు ఎందుకు పడతాయి? వడగళ్ల వర్షానికి ప్రధాన కారణం వాతావరణంలో ఎత్తులో ఉండే మేఘాలు. భూమి ఎక్కువగా వేడెక్కి, ఆ వేడిగాలి తేమతో సహా బాగా ఎత్తుకు వెళ్లినప్పుడు అకస్మాత్తుగా ఏర్పడే మేఘాలను క్యుములోనింబస్ మేఘాలు అంటారు.అంతటి ఎత్తులో ఆ మేఘాల్లోని తేమ వల్ల చిన్న చిన్న మంచు ముక్కలతో కూడిన ఫలకాలు ఏర్పడతాయి. అక్కడ గాలులు కిందకూ, పైకి కదులుతూ ఉండటం వల్ల ఫలకాలుగా ఉన్న మేఘాలు ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకుంటాయి. అప్పుడు ఆ ఫలకాలు మంచు ముక్కలుగా విడిపోయి నేలపై పడతాయి. ఇలా కురిసే వాననే మనం వడగళ్ల వాన అంటాం.ఇదీ చదవండి: షాకింగ్ : సవానీ గ్రూపు సోదరులకు 835 ఏళ్ల జైలు శిక్షఅయితే అమెరికాలోని ఇలినాయిస్లో ఎంత పెద్ద వడగండ్లు పడ్డాయో. ఒక్కోటి పెద్ద రాయంత ఉంది. నాలుగు అంగుళాల వెడల్పుతో ఉంది. కంకాకీలో 6 అంగుళాల వడగళ్లను గుర్తించారు. రాష్ట్రంలోనే ఒక కొత్త రికార్డు వడగండ్లుగా NWS బుధవారం తెలిపింది. అందుకే వడగండ్ల వానలో చిక్కుకుని చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఇదీ చదవండి: ఆరు వేళ్లు.. నెతన్యాహూ సేఫేనా? రూమర్లు హల్చల్(మోదీకి, యోగీకి విజ్ఞప్తి : మహిళ సూసైడ్ వీడియో వైరల్) -
రసభరితం : 40 రసాల మాధుర్యం
సాధారణంగా పెద్దలు మనకు నవరసాల చాతుర్యం గురించి చెబుతుంటారు. సంధ్య రాణి లింగ చెప్పే 40 రసాల మాధుర్యం గురించీ తప్పక తెలుసు కోవాల్సిందే! తెలుగు రాష్ట్రాలలో తరతరాలుగా వస్తున్న సంప్రదాయ రసాల తయారీ గురించి ‘ఫ్రమ్ మై కిచెన్ టు యువర్స్’ బుక్ ద్వారా వివరించారు సంధ్య రాణి లింగ. ఐదు తరాల నుంచి వచ్చిన వారసత్వ వంటలు, వాటి వెనక వెనక దాగి ఉన్న సాంస్కృతిక కథనాలనూ పరిచయం చేస్తున్నారు. హైదరాబాద్ వాసి సంధ్య లింగ చెబుతున్న తెలుగింటి వారసత్వ వంటకాల పరిచయం గురించి ఆమె మాటల్లోనే... ‘‘వంట చేయడం, వడ్డించడమే కాదు కొత్త రుచులను సృష్టించడమూ చాలా ఇష్టం. పుట్టింటి–అత్తింటివారసత్వ వంటకాలను, మూలాలను మర్చిపోకుండా ముందు తరాలకు అందించాలన్నది నా ఆలోచన. ఆ ప్రయత్నమే ఇలా మీ అందరి ముందుకు వచ్చేలా చేసింది. రోజూ పండగే! రసం అనేది భోజనంలోకి ఉపయోగించే వంటకం మాత్రమే కాదు. అనారోగ్యంలో ఉపశమనం ఇచ్చే ఔషధం కూడా. రసాలు, వాటిలో ఉపయోగించే మసాలాలు కూడా విభిన్నమే. సికింద్రాబాద్లోని లింగ పేరుతో ఉండే ఉమ్మడి కుటుంబం మాది. మా మామయ్య వాళ్లు ఎనిమిది మంది అన్నదమ్ములు. అందరూ కుటుంబాలతో కలిసే ఉండేవారు. నేను ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టేనాటికి యాభైమందికి పైగా ఉండేవాళ్లు. అందరికీ కలిపి ఒకే వంటగది. అక్కడ ఉదయం లేచింది మొదలు రోజూ పదిహేను మంది వంటల తయారీలోనే ఉండేవారు. మా అత్తగారు వారి పుట్టింటి నుంచి నేర్చుకున్న వంటకాలతోపాటు, మిగతా కోడళ్లందరమూ కలిసి వంటలలో ఎన్నో వెరైటీలు చేసేవాళ్లం. ప్రతిరోజూ పండగ వాతావరణం లాగే ఉండేది. కొబ్బరి చారు, కట్టుచారు, చుక్కకూర, బలుసాకు, పాలక్, క్యాలీఫ్లవర్, పప్పులతో రసాలు, నిమ్మ, ఉసిరి, ఉల్లి, టొమాటో ... ఇలాంటి ఒక్కోప్రత్యేక కూరగాయలు, ఆకుకూరలతో 40 రకాల రసాలు ఉంటాయి. వీటిని నేరుగా సూప్గా సేవించవచ్చు. ప్రయోగాల వంటిల్లు... పిల్లల చిన్నతనంలో ఉమ్మడి కుటుంబం నుంచి మేం విడిగా జూబ్లీహిల్స్కు వచ్చేశాం. అప్పటివరకు నేర్చుకున్నవే చేసేదాన్ని. అయితే, పిల్లలు కూరగాయలతో చేసిన వంటకాలను తినడానికి ఇష్టపడేవారు కాదు. దీంతో ప్రతి కూరగాయ, ఆకుకూరతో రసాలు చేయడం మొదలుపెట్టాను. వాటిలో మా అత్తగారు, అమ్మ చెప్పిన దినుసులను నోట్ చేసుకున్నాను. నెలలో నేను 40 రసాలు చేసేదాన్ని. పిల్లలు బాగా ఇష్టపడేవారు. దూరంగా ఉండే బంధువులు కూడా ఈ రసాల తయారీ గురించి అడిగేవారు. మా కూతురు నిఖిత ‘చాలా హెల్తీగా, కొత్తగా వంటలు చేస్తావు కదా, బుక్ తీసుకురావచ్చు కదమ్మా’ అనేది. బంధువులు కూడా చెప్పేవారు. కానీ, పిల్లలకు పెళ్లిళ్లు అయ్యి, వారి జీవితాల్లో స్థిరపడటంలో ఆ ఆలోచన పక్కకు వెళ్లిపోయింది. ఇదీ చదవండి: కోడలు వచ్చాక, తను నా వంటకాల రుచిని ఆస్వాదించడంతో పాటు వంటల బుక్ ఆలోచనను తీసుకువచ్చింది. మొత్తం రాసుకున్నాక, రెండు రోజులు ఫోటోషూట్ చేశాం. దీని నిర్వహణ అంతా ప్రియే చూసుకుంది. ఈ తరం వాళ్లకు ఇన్ని రసాలు ఉంటాయని తెలియదు. వారు స్వయంగా తెలుసుకొని, చేసుకునే విధంగా సిద్ధం చేశాం. దీనిని కిందేటేడాది తీసుకువచ్చాం.పండగకు ప్రత్యేకం... తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా ఒక్కో పండగకు ఒక్కో ప్రత్యేకరసాలు, వంటకాల తయారీలు ఉంటాయి. ఇక ఊరగాయలు, రోటి పచ్చళ్లు, పులావ్, బిర్యానీలలో విభిన్న రుచులు ఉన్నాయి. అలాగే, తెలుగు ప్రాతాల్లోని మూలాల్లోకి వెళితే చాలా వైవిధ్యమైన వంటకాలు పరిచయం అవుతాయి. వాటిని అందించడానికి ప్రిపరేషన్ మొదలుపెట్టాను’’ అని వివరించారు ఈ పాకశాస్త్ర నిపుణురాలు.వంటే ఔషధంగా...‘మా అత్తమ్మ ఆలోచనలు చాలా మోడర్న్గా ఉంటాయి. తన పాకశాస్త్ర నైపుణ్యాన్ని, వారసత్వ వంటకాలు ముందు తరాలకు పరిచయం చేస్తే బాగుంటుందనుకున్నాం. సోషల్ మీడియాలో చూస్తే చాలా వంటకాలు కనిపిస్తాయి. కానీ, వాటిలో వారసత్వ వంటకాల గురించి, వంట మెడిసిన్లా ఎలా ఉపయోగపడుతుందో అంత వివరంగా చెప్పలేక΄ోతున్నారు. అందుకే, మేం కలిసి ఈ ప్రయత్నం చేశాం. – ప్రియ, కోడలు – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
సినిమా ఇన్సెక్ట్స్ అసోసియేషన్ అంటే సీఐఏ గురించి తెలుసా?
సినిమా అసోసియేషన్ ఫర్ చిన్న చిన్న పురుగులూ...జిందాబాద్! : సంగతేమిటంటే... చీమలూ, బొద్దింకలూ, బల్లులూ... ఆఖరికి దోమల వంటి చిన్న చిన్న కీటకాలన్నీ కలిసి ‘‘సినిమా అసోసియేషన్ ఫర్ చిన్నచిన్న పురుగులు’’ సంఘం (సినిమా ఇన్సెక్ట్స్ అసోసియేషన్ అంటే సీఐఏ) పెట్టుకున్నాయి. ఆ సంఘ ప్రారంభ సమావేశం సందర్భంగా... ప్రెస్ మీట్లో పత్రికల, టీవీ ఛానెళ్ల రిపోర్టర్లు అడుగుతున్న పలు ప్రశ్నలకు సమాధానాలిస్తున్నాయి. అవి ఇవి... రిపోర్టర్ : ఈ సంఘం ప్రెసిడెంటుగా ఎన్నికైనందుకు కంగ్రాచ్యులేషన్స్ దోమగారూ... అయినా మీ కీటకాలన్నీ ఎందుకండీ ఈ ‘చిన్న పురుగుల’ అసోసియేషన్ పెట్టాయి? అసోషియేషన్ ప్రసిడెంట్ దోమ (స్పీచ్ ఇస్తున్న ధోరణిలో) : ఇప్పుడూ... పున్నమినాగు ఫార్మూలాతో బోల్డన్ని సూపర్హిట్టుపాముల మూవీస్ వచ్చేశాయి. కొండవీటి ‘సింహాలూ’, ‘చిరుత’ల్లాంటి పేర్ల మీద బంపర్హిట్లూ ఉన్నాయి. ఇక అడవిరాముడూ, వేటగాడులాంటి బ్లాక్బస్టర్లలో ఏనుగులూ, సింహాలూ, పులులూ, ఎలుగుబంట్లూ ఎట్సెట్రాలు తెగ యాక్టింగు చేసేశాయి. ముత్యాలముగ్గు సినిమాలో కోతి, ఆఖరికి పొట్టేలు పున్నమ్మల్లో పొట్టేలు సైతం తెగ పెర్ఫార్మెన్సు చూపించేశాయి. మరి ఇంకా చెప్పాలంటే... ‘అద్దమంటి మనసు ఉందీ... అందమైనా వయసు ఉందీ’ పాటలో మా ప్రియతమ సోదరీమణి అయిన బర్రెగారు సాక్షాత్తూ పెద్ద ఎన్టీఆర్ను తన వీపు మీద కూర్చోబెట్టుకుని యాక్షనింగు కుమ్మేసింది. వాళ్లంటే పెద్ద పెద్ద జీవులు. అవన్నీ పెద్ద జీవుల అసోసియేషన్ పెట్టుకున్నాయి. మరి... ఈ నేపథ్యంలో మాకూ ఓ సంఘం ఉండొద్దా మరి? రిపోర్టర్ : అవంటే పెద్ద జీవులూ... పెద్ద హీరోలకు దీటుగా వాటి పేర్ల మీదే డైరెక్టుగా మూవీలొచ్చేశాయి. సినిమాల విజయంలో మరి మీ చిన్న పురుగుల పాత్ర ఏమిటి? చీమ (గొంతు సవరించుకుంటూ గొట్టం ముందుకు వస్తూ) : ‘సింహాద్రి’ సినిమా చూశారా సార్? హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టడానికి మా చీమనే యూజ్ చేసుకున్నారు. మాకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఏకంగా ఓ లవ్సాంగ్ రాయాల్సి వచ్చిందీ... తీయాల్సి వచ్చింది...చీమ చీమ చిమ చీమా చీమా చీమ చీమ చిమ చీమ చీ...ఈ...ఈ...మా... చీమ తీపి చిరునామా ప్రేమా... తెలుసుకోవె భామా... అంటూ సదరు డ్యూయెట్టులో హీరోహీరోయిన్లు చీమ చుట్టూ చిందులు తొక్కితేగానీ మూవీ హిట్టవ్వలేదు మరి! రిపోర్టర్ : సినిమాలకు మీరెలా కంట్రిబ్యూట్ చేస్తున్నారు బొద్దింకగారూ, బల్లిగారూ?బొద్దింక : హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టడానికి ఈ సినిమా రంగానికి ఇతోధికంగా మేము చేసుకుంటున్న పవిత్రమైన సేవలు ఇన్నని చెప్పడానికి లేదండీ. చాలా మూవీస్లో మమ్మల్ని చూసి... ‘‘అమ్మో బొద్దింక...’’ అంటూ అరుస్తూ హీరోయిన్... హీరో ఒళ్లోకి దూకుతుంది. అంతే... లవ్వూ... డ్యూయెట్టూ!! (అంటూ గర్వంగా తన పొడవాటి కాక్రోచు మీసాల్ని దువ్వుకుంది). అంతేకాదండి... మేమిలా నటించినా హిట్టే... మమ్మల్ని చంపాలన్నా ‘హిట్టే’! (కప్బోర్డులోని హిట్ మందును సీసా కేసి చూపిస్తూ అన్నది).బల్లి : మేము కూడా ఏమీ తక్కువ కాదండి. బొద్దింకల్లాగే మమ్మల్ని చూసి హీరో మీదకు గెంతే హీరోయిన్లకు కొదవలేదండీ. ఇప్పుడంటే పెద్దగా లేదుగానీ... పాత సినిమాటాకీసుల్లో వెండితెర మీద మా బంగారు పాదాలు మోపుతూ... హీరో హీరోయిన్ల ముఖాలమీదా, ఒంటిమీదా పాకుతూ తెగ తిరిగేవాళ్లం. తెరమీద ఒక్కోసారి స్ప్రింటూ, మరోసారి మారథానూ ఇంకోసారి ఫోర్,ఫోర్ మీటర్సు రిలేలాంటి రన్నింగు రేసులూ చేసేవాళ్లం. ఇక ‘ఒక రాధా ఇద్దరు కృష్ణులు’ లాంటి సినిమాలో పరకాయ ప్రవేశం చేసే హీరోయిన్ గారు తన బాత్రూమ్లో పాకుతున్న బల్లిని చూసి... పరకాయ ప్రవేశం చేసిన హీరోయేమో అనుకుంటుంది. బల్లిని చూసి హీరో అనుకుందంటే... దీన్ని బట్టి తెలియడం లేదూ మేం ‘హీరో మెటీరియల్’ అనీ! చదవండి: కూరగాయ హీరోల 'పోకిరి' కిరిరిపోర్టర్ : (కొద్దిగా వ్యంగ్యం ధ్వనిస్తూ...) అన్నట్టూ దోమగారూ!! మలేరియాలూ, డెంగీలు తీసుకొచ్చే మీరు ఈ అసోసియేషన్కు ప్రెసిడెంట్ ఎలా అయ్యారు సార్? దోమ : (కోపంగా...) హేం మాహాడుతున్నారు మీరు? రోబో సినిమాలో హీరోయిన్ ఐశ్వర్యారాయ్ అండ్ రోబో చిట్టీల మధ్య ప్రేమకు కారణం మేమే. ‘రోబోకు ఐశ్వర్యారాయ్ పెట్టే ‘ప్రేమ పరీక్ష’ ఏమిటో తెల్సా మీకు? తనను కుట్టిన దోమను పట్టుకొచ్చి దాంతో సారీ చెప్పించమనే కదా! మొత్తం ప్రపంచ సినిమా చరిత్రలో ఇంతవరకూ మిస్ వరల్డు ఐశ్వర్యారాయ్ను కుట్టిన జీవేదైనా ఉందా... ఒక్క దోమ తప్ప? మరి ఈ నేపథ్యంలో చూస్తే... ఈ చిన్న పురుగుల సంఘానికి నేను తప్ప ప్రెసిడెంట్గా ఉండటానికి అర్హులెవరైనా ఉన్నాయా సార్? ...అంటూ అరుస్తూ ‘‘చిన్న పురుగుల సంఘం పట్ల మీ కానొర్టర్ల వివక్ష నశించాలీ... మా సీఐఏ అదే... సినిమా ఇన్సెక్ట్స్ అసోసియేషన్ వర్థిల్లాలి... చిన్న చిన్న సినీ పురుగులూ జిందాబాద్’’ అని నినాదాలిస్తూ కోపంగా ప్రెస్మీట్ నుంచి వాకౌట్ చేసింది దోమ. దాంతోపా టే మిగతా ఇన్సెక్ట్స్ కూడా!– యాసీన్ -
పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా?
పిల్లలూ... పేపర్లలో, న్యూస్పేపర్లలో యుద్ధాలు చూస్తున్నాం. ఈ యుద్ధాలు పైకి ఏ కారణంతో జరిగినా చాలా మటుకు వీటి వెనుక ‘పెట్రోల్’ ఉంటుంది. పెట్రోల్ ప్రపంచానికి చాలా ముఖ్యమైన ఇంధనం. అది కొన్నిచోట్లే దొరుకుతుంది. అందుకని దాని కోసం చాలా పోరాటాలు సాగుతూ ఉంటాయి. మనం రోజూ బయటకు వెళ్లాలంటే ఏదో ఒక వాహనం కావాలి. అది నడవాలంటే పెట్రోల్ కావాల్సిందే! రోజూ లక్షలాది కార్లు, మోటార్ సైకిళ్ళు, యంత్రాలు పెట్రోల్ సాయంతో నడుస్తాయి. వందల మిలియన్ల సంవత్సరాల క్రితం మహాసముద్రాలలో పెట్రోల్ నిక్షేపాలు ఏర్పడ్డాయి. ΄ప్లాంక్టన్, ఆల్కే వంటి చిన్న సముద్ర జీవులు మహాసముద్రాలలో నివసించేవి. ఈ జీవులు చనిపోయినప్పుడు, వాటి అవశేషాలు సముద్రపు అడుగుభాగంలో మునిగిపోయాయి. కాలక్రమేణా ఈ పదార్థాలు సముద్రపు అడుగుభాగంలోని బురద, ఇసుక అవక్షేపాలతో కలిసిపోయాయి. ఆ పోరలు మరింతగా పేరుకుపోవడంతో అవశేషాలు భూమి ఉపరితలం కింద మరింత లోతుగా ఏర్పడ్డాయి. అలా ఇంధన నిక్షేపాలు తయారయ్యాయి. భౌగోళిక పరిస్థితులను బట్టి, పెట్రోల్ ఏర్పడటానికి దారితీసే ముడి చమురు ఏర్పడటానికి 10 మిలియన్ల నుండి 300 మిలియన్ సంవత్సరాలు పట్టవచ్చు. అయితే పెట్రోల్ నేరుగా తయారు కాదు. భూమి అడుగులోని ముడిసరుకును బయటకు తీసి, కర్మాగారాల్లో దాన్ని రిఫైన్ చేసి పెట్రోల్గా మారుస్తారు. కొన్ని దేశాలలో పెట్రోల్ని ‘గ్యాసోలిన్’ అని కూడా పిలుస్తారు. కార్బన్ డై ఆక్సైడ్ నుంచి సూర్యరశ్మి సహాయంతో పెట్రోలును తయారు చేసే పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి పరుస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి మేలు కలుగుతుందని, కాలుష్యం తగ్గుతుందని భావిస్తున్నారు. ఇది సాధ్యమైతే పెట్రోల్ ఇబ్బందులు తప్పుతాయి. ప్రస్తుతం పెట్రోల్తో నడిచే వాహనాలకు ప్రత్యామ్నాయంగా విద్యుత్తు వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఛార్జ్ చేసి వాడటం ద్వారా పెట్రోల్ ఖర్చు తగ్గించడంతోపాటు పర్యావరణానికీ మేలు కలుగుతుంది. -
నెయిల్ కట్టర్ కథ తెలుసా?
పిల్లలూ! మీ గోళ్లు పెరిగితే స్కూల్లో టీచర్లు కోప్పడతారు. గోళ్లు పెంచుకోవడం, కొరకడం చెడ్డ అలవాట్లని చెప్తారు. నెయిల్ కట్టర్తో గోళ్లు తీసుకుని స్కూల్కి రమ్మంటారు. మరి ఈ నెయిల్ కట్టర్ కథేమిటో మీకు తెలుసా? నెయిల్ కట్టర్ని కొన్ని చోట్ల ‘నెయిల్ క్లిప్పర్’ అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఇది స్టెయిన్ లెస్ స్టీల్తో తయారు చేస్తారు. ప్టాస్టిక్, అల్యూమినియంతో తయారు చేసినవి కూడా మార్కెట్లో లభిస్తాయి. గోళ్ల గరుకు అంచులను సున్నితంగా చేయడానికి నెయిల్ కట్టర్ వెనక వైపు ఫైల్ ఉంటుంది. కొన్ని నెయిల్ కట్టర్లు నెయిల్ క్యాచర్తో వస్తాయి.నెయిల్ కట్టర్ తయారు చేయడానికి ముందు ప్రజలు తమ గోళ్లను కత్తిరించడానికి చిన్న కత్తులను ఉపయోగించేవారు. గోళ్లు కత్తిరించడం అనే ఆచారం గురించి మతగ్రంథాల్లో కూడా ప్రస్తావించారు. క్రీ.పూ రాసిన గ్రంథాల్లో గోళ్లు కత్తిరించడం గురించి రాసి ఉంది. అయితే ఇందుకోసం ప్రత్యేక సాధనమేమీ ఉండేది కాదు. చిన్నకత్తులతోనే గోళ్లు తీసుకునేవారు. ఆధునిక కాలంలో నెయిల్ కట్టర్పై మొదటి పేటెంట్ను 1875లో వాలెంటైన్ ఫోగెర్టీ ఫొందారు. అనంతరం 1876లో విలియం సి.ఎడ్జ్, 1878లో జాన్ హెచ్. హోల్మాన్ ఆ నమూనాను మరింత అభివృద్ధి చేశారు. ఆపై అనేకమంది దీని మీద ప్రయోగాలు చేసి ఇప్పుడున్న నమూనాను స్థిరపరిచారు. మొదట్లో ఇవి కేవలం కొందరి ఇళ్లకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లో ఇవి విరివిగా దొరుకుతున్నాయి. -
తండ్రీకొడుకు.. ఒక ఆర్టీసీ బస్సు!
సిద్ధిపేట జిల్లా: ఒకే బస్సులో తండ్రీకొడుకు విధులు నిర్వహించారు. ఈ ఆసక్తికరమైన ఘటన శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నా బాద్ బస్టాండ్లో చోటు చేసుకుంది. హుస్నాబాద్కు చెందిన బంధనాపురం ఎల్లయ్య 34 ఏళ్లుగా ఆర్టీసీ డ్రైవర్గా సేవలు అందిస్తున్నాడు. ఆయన కుమారుడు బంధనాపురం ప్రేమ్ కండక్టర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో తండ్రీకొడుకు ఇద్దరూ ఒక్కటే బస్సులో డ్యూటీ చేయడం ప్రయాణికులు ఆసక్తిగా గమనించారు. ఎల్లయ్య ఆర్టీసీ డ్రైవర్గా సేవలు అందిస్తూ ఉత్తమ డ్రైవర్గా పలుసార్లు అవార్డులు అందుకున్నాడు. ప్రమాదరహిత డ్రైవర్గా సేవలు కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం కుమారుడితో కలిసి ఒకే బస్సులో విధులు నిర్వహించడంపై తండ్రి ఎల్లయ్య సంతోషం వ్యక్తం చేశాడు. -
‘ఉగ్గు’తో ఉసురు తీయకండి!
కొందరు పెద్దలు సంప్రదాయంలో భాగమంటూ ‘ఉగ్గు’ పేరుతో పసిపిల్లల నాలుకకు తేనె రాస్తుంటారు. ఈ కార్యాన్ని శుభసూచికగా చెబుతారు. అయితే ముద్దులొలికే పసిపాపలకు అందించే ఆ ఒక్క తేనె చుక్క వారి ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐర్లాండ్లోని అట్లాంటిక్ టెక్నలాజికల్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ నిపుణులు డాక్టర్ సురేష్ సి పిళ్ళై చిన్నారులకు తేనె పెట్టడం వలన కలిగే ప్రాణంతక ముప్పును తెలియజెప్పారు.జపాన్ చిన్నారి మరణంతో వెలుగులోకి..గత కొంతకాలంగా పసిబిడ్డలకు తేనె పెట్టడంతో కలిగే ముప్పుపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. 2017లో టోక్యోలో జరిగిన ఒక విషాద ఘటన ఈ నాటికీ వెంటాడుతోంది. నాడు ఆరు నెలల వయసున్న చిన్నారికి తేనె కలిపిన ఆహారాన్ని ఇవ్వగా, ఆ పసిపాప ‘ఇన్ఫాంట్ బోటులిజం’ బారిన పడి మృతి చెందింది. తేనెలో ఉండే ప్రమాదకర బ్యాక్టీరియా కారణంగా ఈ వ్యాధి సంభవిస్తుందని వైద్య పరీక్షల్లో తేలింది.శరీరం మొద్దుబారిపోయేలా చేసి..అప్పటి నుంచి జపాన్ సహా పలు దేశాలు ఏడాదిలోపు పిల్లలకు తేనె ఇవ్వకూడదనే కఠిన నిబంధనను అమలు చేస్తున్నాయి. తేనెలో 'క్లోస్ట్రిడియం బోటులినమ్' అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది అత్యంత కఠిన పరిస్థితుల్లోనూ ఏళ్ల తరబడి సజీవంగా ఉంటుంది. ఏడాదిలోపు చిన్నారుల జీర్ణవ్యవస్థ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందదు. వారి పేగుల్లో మంచి బ్యాక్టీరియా తక్కువగా ఉండటంతో, ఈ ప్రమాదకర బ్యాక్టీరియా సులభంగా లోపలికి ప్రవేశించి, విషతుల్యమైన 'బోటులినమ్ టాక్సిన్'ను విడుదల చేస్తుంది. ఇది నేరుగా బిడ్డ నరాల వ్యవస్థపై ప్రభావం చూపి, శరీరం మొద్దుబారిపోయేలా చేస్తుంది.పెద్దలకు లేని ముప్పు.. పిల్లలకే ఎందుకు?తేనెను పెద్దలు తీసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే పెద్దవారి జీర్ణాశయంలో ఉండే శక్తివంతమైన ఆమ్లాలు, ఇతర బ్యాక్టీరియాలు ఈ బోటులినమ్ మూలాలను నిర్వీర్యం చేస్తాయి. అయితే పసిపిల్లల విషయంలో ఇలా జరగదు. అందుకే అమెరికాకు చెందిన ఎఫ్డీఏ (ఎఫ్డీఏ) వంటి సంస్థలు సైతం ఏడాది దాటే వరకు పిల్లలకు కనీసం ఒక్క తేనె చుక్క కూడా ఇవ్వకూడదని స్పష్టం చేస్తున్నాయి.పాత అలవాట్లకు స్వస్తి పలకాల్సిందే!సంప్రదాయం పేరిట గర్భవతులు, బాలింతలు లేదా పసిబిడ్డలకు తేనెను రుచి చూపించడం మానుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆహార పదార్థాల నిల్వలో తేడా వచ్చినా లేదా కలుషితమైన క్యాన్డ్ ఫుడ్ తిన్నా పెద్దల్లో కూడా అప్పుడప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. గత ఏడాది ఇటలీలో జరిగిన ఒక ఘటనలో ఇలాంటి విషతుల్యమైన ఆహారం తిని ఒకరు మరణించగా, మరో తొమ్మిది మంది ఆస్పత్రి పాలయ్యారు. అందుకే సహజసిద్ధమైన ఆహారమైనప్పటికీ పసిపిల్లల విషయంలో తేనె అత్యంత ప్రమాదకరమని గుర్తుంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: ట్రంప్ విధ్వంసం: ‘క్రౌన్ జ్యువెల్’పై భీకర దాడి -
సమయాన్ని గౌరవిస్తే మిమ్మల్ని మీరు గౌరవించుకున్నట్టే..
సమయం అంటే కేవలం గడియారంలోని ముల్లులు కాదు, అది మీ జీవితం. మీరు ఒకరికి సమయాన్ని ఇచ్చినప్పుడు, ఆ సమయం తిరిగి రాదు. అంటే, మీరు వారికి మీ 'జీవితం' లోని కొంత భాగాన్ని ఇస్తున్నారు. కాబట్టి, సమయాన్ని వృథా చేయడం అంటే, మీ జీవితాన్ని మీరు వృథా చేసుకోవడమే.చాలామంది టైమ్ మేనేజ్మెంట్ని ఒక Technique అనుకుంటారు, కానీ సైకాలజీ ప్రకారం "సమయాన్ని గౌరవించడం అంటే, మిమ్మల్ని మీరు గౌరవించుకోవడమే". ఇది మీ వ్యక్తిత్వ వికాసానికి వజ్రాయుధం లాంటింది. 1. The Psychology of Procrastinationచాలామంది "నాకు సమయం సరిపోవడం లేదు" అంటారు. ఇది అబద్ధం! అందరికీ 24 గంటలే ఉంటాయి. అసలు సమస్య 'సమయం' కాదు, 'ప్రాధాన్యత' (Priority).మీరు వాయిదా వేస్తున్నారంటే (Procrastination), అది బద్ధకం కాదు. అది ఆ పని పట్ల మీకు ఉన్న 'భయం' లేదా 'అభద్రత'. మీరు ఆ భయాన్ని దాటలేనప్పుడు, సమయాన్ని వృథా చేస్తూ పారిపోవడానికి ప్రయత్నిస్తారు.2. మీ సమయం.. మీ ఆత్మగౌరవంSelf-Respect: మీరు ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకున్నప్పుడు, మీ పట్ల మీకే గౌరవం పెరుగుతుంది.Self-Disrespect: మీరు "ఈ పని చేస్తాను" అని చెప్పి, వాయిదా వేస్తే.. "నేను నా మాటను నిలబెట్టుకోలేను" అనే నెగటివ్ సిగ్నల్ మీ సబ్-కాన్షియస్ మైండ్కి వెళ్తుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని లోపల నుండి తినేస్తుంది.3. నిజమైన టైమ్ మేనేజ్మెంట్ట్రైనర్స్ "ఒక రోజులో 100 పనులు చేసేయ్, యంత్రంలా పని చెయ్" అని చెప్తారు. ఇది మీకు స్ట్రెస్ ఇస్తుంది. మీరు 10 పనులు చేయడం కాదు, మీ జీవితానికి ముఖ్యమైన 1 పని చేయడం ముఖ్యమని సైకాలజీ చెప్తుంది. 'Busy'గా ఉండటం వేరు, 'Productive'గా ఉండటం వేరు.4. మీ సమయాన్ని మీరు ఎలా ఓన్ చేసుకోవాలి?Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, మీ సమయాన్ని మీరు గౌరవించడానికి మూడు స్టెప్స్. Step 1: వాయిదా అలవాటును బ్రేక్ చేయండివాయిదా వేయడానికి గల కారణాన్ని వెతకండి. అది భయమా? పర్ఫెక్షనిజమా? ఆ భయాన్ని 'Break' చేయండి. "పని పర్ఫెక్ట్గా ఉండక్కర్లేదు, కానీ పూర్తవ్వాలి" అని మీ మైండ్ని ప్రోగ్రామ్ చేయండి.Step 2: The Priority Boxమీ పనులను ఇలా విభజించండి.ముఖ్యమైనవి & అత్యవసరమైనవి: ఇవి వెంటనే పూర్తి చేయాలి.ముఖ్యమైనవి కానీ అత్యవసరం కానివి: వీటికి మీరు సమయాన్ని 'Build' చేయాలి. ఇవే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మిగతా వాటిని తగ్గించండి.Step 3: Presenceసమయాన్ని గౌరవించడం అంటే, పని చేస్తున్నప్పుడు ఆ పనిలోనే లీనమైపోవడం. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి. మీ సమయం మీ చేతుల్లో ఉన్నప్పుడు, మీరు ప్రపంచాన్ని శాసించగలరు. ఇదే 'Beyond' స్టేజ్.5. మీ సమయం ఎక్కడికి వెళ్తోంది?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.నిన్నటి రోజున మీరు వృథా చేసిన రెండు గంటలు ఎక్కడ వెచ్చించారు?ఆ రెండు గంటల్లో మీరు మీ లక్ష్యం కోసం ఏమైనా చేసి ఉంటే ఏమయ్యేది?మీరు మీ సమయానికి మీరే యజమాని అని ఈ రోజు అంగీకరిస్తున్నారా?సమయమే మీ నిజమైన ఆస్తి!బ్రో, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ సమయం పోతే ఆయుష్షు తగ్గుతుంది. మీ సమయాన్ని ఎవరికీ, దేనికీ చౌకగా అమ్మకండి. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, అప్పుడు ప్రపంచం మిమ్మల్ని గౌరవిస్తుంది."Time is the most valuable thing a man can spend."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: సహానుభూతి పవర్..! ఎలా బిల్డ్ చేయాలంటే..) -
తొక్కతో తింటే... తలనొప్పి తగ్గుతుందా?
ఇటీవల ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల మీద ఆహార సలహాలు చాలా వస్తున్నాయి. ఫలానా ఆహారం ఇలా తింటే ఈ లాభాలనీ, ఫలానా పదార్థాలతో ఇవీ ప్రయోజనాలంటూ రకరకాల సలహాలూ, సూచనలూ నెటిజనులను నిత్యం ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. అందులో ఒకటి... ఆపిల్ను తొక్కతో సహా పరగడుపునే తీసుకుంటే దీర్ఘకాలికంగా వచ్చే తలనొప్పులు తగ్గుతాయన్నది. అయితే ఇది ఎంతవరకు వాస్తవమో చూద్దాం! వాస్తవాలేమిటంటే... ఆపిల్ స్కిన్లో చాలారకాల పోషకాలున్న మాట వాస్తవమే. ఉదాహరణకు మలబద్ధకాన్ని తొలగించే పీచు, వ్యాధి నిరోధకశక్తిని సమకూర్చే విటమిన్ సి, ఎన్నో రకాల క్యాన్సర్ల నుంచి నివారణనిచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలుంటాయి. ముఖ్యంగా ఆపిల్ తొక్కలో క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. దీనివల్ల ఇతరత్రా ఆరోగ్య ప్రయోజనాలకు అవకాశాలున్నాయి. అయితే సాధారణంగా ఆపిల్ తొక్క మెరిసేలా చేయడానికి చాలామంది ఒక రకం మైనపుపూత (వ్యాక్స్)తో ఆపిల్కు మెరుపు తెప్పించి ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తారు కాబట్టి తొక్కతో తినాలనుకునేవారు వీలైనంతగా కడిగి తినడం మేలు. అదో అపోహ మాత్రమే... పరగడుపున పొట్టుతోనే ఆపిల్ తినడం వల్ల తలనొప్పులు తగ్గుతాయనుకోవడం అపోహ మాత్రమే. తలనొప్పులు అనేక కారణాల వల్ల వస్తుంటాయి. ఉదాహరణకు ఒంట్లో నీటి మోతాదు తగ్గడం, తీవ్రమైన ఒత్తిడి వంటివి. తొక్కతో సహా తినడం వల్ల దేహం రీహైడ్రేట్ కావడం, ఒత్తిడి తగ్గడం వంటివేమీ జరగవు. కాబట్టి తొక్క వల్ల తలనొప్పులు తగ్గడమనేది అపోహేనని నిపుణుల అభిప్రాయం.అయితే తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి వాటిలో ‘యాంటీ ఇన్ఫ్లమేటరీ’ గుణాలు కూడా ఉన్నందువల్ల నొప్పి తగ్గడంలో అవి కొంత ఉపయోగపడవచ్చు గానీ... ఉదయం పరగడుపున తొక్కతో ఆపిల్ తినడం వల్లనే తలనొప్పుల నుంచి పూర్తి విముక్తి కలుగుతుందనుకోవడం మాత్రం అపోహ అంటూ నిపుణులు చెబుతున్నారు. ఇది కొంతవరకు వాస్తవమే అయినా ‘ప్రతి రోజూ ఆపిల్ తింటే... వైద్యుడి దగ్గరకు వెళ్లక్కర్లేదు’ (ఏన్ ఆపిల్ ఏ డే... కీప్స్ ద డాక్టర్ అవే) అనే సూక్తి ప్రకారం ఆపిల్ను బాగా కడిగాక తొక్కతో తినడంలో ప్రయోజనమే తప్ప నష్టమీదీ ఉండదనేది ఆహార నిపుణుల మాట. -
నదులకు లాలపోసే తల్లులు!
ప్రాణం పోసే శక్తి స్వరూపిణి స్త్రీ. మనుషులకే కాదు దైవసమానమైన నదులకు కూడా ప్రాణం పోస్తోంది ఆ శక్తి. జీవం కోల్పోయి, మృత్యుదిబ్బలుగా మారిన ఎన్నో నదులకు దేశవ్యాప్తంగా ప్రాణం పోస్తున్నారు మహిళలు. సామాజిక, ఆర్థిక ముఖచిత్రాన్ని మారుస్తున్నారు...తమిళనాడులోని వెల్లూరు, తిరువణ్ణామలై జిల్లాల గుండా ప్రవహించే పాలార్ నది ఉపనది నాగనది పూర్వవైభవం కోల్పోయింది. ఎండిపోయి నిర్జీవంగా మారింది. వర్షాలు పడినా సరే ఆ మృత నదిలో నీటి గలగలలు లేవు. ఈ నది ఎండి పోవడం పంట పొలాలపై, అక్కడి ప్రజల ఉపాధిపై ప్రభావం చూపింది. ఎంతోమంది పొట్ట చేతపట్టుకొని పట్టణాల బాట పట్టారు.ఈ నేపథ్యంలో నదిని పునర్జీవింపజేయడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం అయింది. ఈ కార్యక్రమంలో మహిళలు క్రియాశీల పాత్ర పోషించడం విశేషం. వెయ్యిమంది మహిళలు సంవత్సరం పాటు 21 గ్రామ పంచాయతీలలో రీఛార్జ్ బావులు, రెండు వందల బౌల్డర్ చెక్లను నిర్మించారు. బౌల్డర్ చెక్లతో నీటి ప్రవాహాన్ని నెమ్మదింపజేయడానికి, నీటి కోతను నివారించడానికి, భూగర్బ జల మట్టాలను పెంచడానికి ఎంతో కష్టపడ్డారు.వారి శ్రమ ఫలించిందిభూగర్భ జలాలు పెరిగాయి. అవి నాగనదిలోకి వెళ్లాయి. నది మెల్లగా ప్రాణం పోసుకోడం మొదలైంది. ఈ వార్త తెలిసిన మరింతమంది మహిళలు నాగనది పునర్జీవనోద్యమంలో భాగం అయ్యారు.ఇప్పుడు..నాగనది ఏడాది పొడవునా ప్రవహిస్తోంది. ఈ సజీవ ప్రవాహం ఈ ప్రాంతంలోని సామాజిక, ఆర్థిక దృశ్యాన్ని మార్చివేసింది. వ్యవసాయం తిరిగి మొదలైంది. తమిళనాడులోని పదిహేను జిల్లాలలో ఇరవై అయిదు నదులను పునర్జీవింప చేయడానికి నాగనది స్ఫూర్తిగా మారింది.కోసీ నది కోసం...అటవీ నిర్మూలన పెరగడం వల్ల కోసీ నది ప్రమాదంలో ఉందని గ్రహించిన సామాజిక కార్యకర్త బసంతిదేవి బాధపడడానికి మాత్రమే పరిమితం కాలేదు. తన బాధ్యతగా గట్టిపని ఏదైనా చేయాలని అనుకుంది. నదితోపాటు సమీపంలోని అడవులను కాపాడాలని నిర్ణయించుకుంది.‘నదిని రక్షించుకుందాం’ అనే నినాదంతో ఉద్యమంలో మహిళలను భాగం చేయడానికి ఊరూ వాడా తిరిగింది ఉత్తరాఖండ్కు చెందిన బసంతి. ఎన్నో సంవత్సరాలు అలుపెరుగని కృషి చేసింది. వందలాది మంది మహిళలను కోసి నది పరిరక్షణ ఉద్యమంలో భాగం చేసింది. వందలాది గ్రామ మహిళలు చెట్లను రక్షించడానికి, మొక్కలను నాటడానికి, నదిని కాపాడుకోవడానికి నడుం కట్టారు.ప్రతి గ్రామంలో ఏర్పడిన మహిళా సంఘాల సమష్టి కృషి ద్వారా అడవుల నరికివేత ఆగిపోయింది. మొక్కలు చెట్లు అయ్యాయి. కోసి నది ప్రాంతంలో ఎండిపోయిన ప్రదేశాలలో నీరు సమృద్ధిగా దొరకడం మొదలైంది. నీటి ఊటలు పునర్జీవనం పొందాయి. దీంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి.‘సేవ్ కోసీ ఉద్యమం’ నేటికీ కొనసాగుతుండడం విశేషం.‘మేము ఉద్యమంలో అడుగుపెట్టిన రోజులలో చాలా సందేహాలు ఉండేవి. అయితే ఉద్యమకారులకు సంకల్పబలం తప్ప సందేహాలు ఉండకూడదు అనే మాట మాకు చాలా బలాన్ని ఇచ్చింది. ఉద్యమాన్ని విజయవంతం చేసింది’ అంటుంది ఉత్తరాఖండ్లోని చోప్రియాలి గ్రామానికి చెందిన భువనేశ్వరీ. ఆమె ‘మహిళా మంగళ్ దళ్’ సభ్యురాలు.నదుల నేస్తం... నీతా పటేల్గుజరాత్లోని వెనకబడిన జిల్లాలలో డాంగ్ ఒకటి. ఈ జిల్లాలోని గిరిజన గ్రామాలను సందర్శిస్తున్న క్రమంలో నర్మదా, బహ్రూచ్ కొండ ప్రాంతాల్లో జూన్ అక్టోబర్ మాసాల మధ్య సమృద్ధిగా వర్షాలు కురిసిన్పటికీ ఆ ప్రాంతాలలో పచ్చదనం లేకపోవడాన్ని గమనించింది నీతా పటేల్. గ్రామస్తులు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక ఉద్యమానికి శ్రీకారం చుట్టింది పటేల్.గ్రామాలు తిరుగుతూ ఎంతోమందిని సమీకరించింది. వందలాదిమందితో వేలాది మొక్కలు నాటించింది. డాంగ్ జిల్లాలో ప్రవహించే పూర్ణ, ఖాప్రి, అంబికా, గిరా, దోధాద్ నదులపై ఎన్నో చెక్ డ్యామ్లు, గ్రూప్ వెల్స్, చెక్ వాల్స్, బోరీ బంద్లు (ఇసుక నిండిని సంచుల) ఏర్పాటు చేసింది. ఎన్నో గ్రామాలలో మహిళలతో నీటి సంఘాలు ఏర్పాటు చేయించింది. సౌరశక్తితో నడిచే నీటిపారుదల వ్యవస్థలను నీతా అభివృద్ధి చేసింది. దీనివల్ల వేలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరింది. ‘నది పరిరక్షణ ఉద్యమంలో విజయం సాధించడానికి ఈ ఉద్యమంలో భాగమైన ఎంతోమంది గిరిజన మహిళలు కారణం’ అంటుంది నీతా పటేల్....వీరు మాత్రమే కాదు జయశ్రీ వెంకటేశన్(తమిళనాడు), గౌరీ మిరాషి (కామ్ నది, ఔరంగాబాద్), కిరణ్ కౌర్ (బహ్మపుత్ర/వారద బేసిన్, అస్సాం), శాంతిరాయ్ (తీస్తా నది, పశ్చిమ బెంగాల్), జల్ సహేలి (ఉత్తర్ప్రదేశ్)... ఎంతో మంది వాటర్ ఛాంపియన్లు మృత్యుశయ్యపై ఉన్న నదులకు జీవం పోస్తున్నారు. నదుల కళ్లలో కొత్త వెలుగు తీసుకు వస్తున్నారు.సేవ్ గంగోత్రిపర్వతారోహకురాలు అయిన డాక్టర్ హర్షవంతి ‘సేవ్ గంగోత్రి’ ప్రాజెక్ట్తో ఎంతోమందిలో అవగాహన కలిగిస్తోంది. భోజ్ అడవిని పునరుద్ధరించే పని చేపట్టింది. వేలాది మొక్కలు నాటించింది. ఉత్తరాఖండ్లోని గంగోత్రి ప్రాంతంలో ప్రధాన జల వనరుల దగ్గర పరిస్థితులను మెరుగు పరచడానికి విశేష కృషి చేసింది. నదుల రక్షణ, పర్యావరణంపై అవగాహన కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. ‘మహిళా శక్తితో ఎన్ని విజయాలు అయినా సాధించవచ్చు’ అంటుంది హర్షవంతి.మన నదులు మన భవిష్యత్విధ్వంసక నీటి అభివృద్ధి ప్రాజెక్ట్లను (పెద్ద డామ్లు) వ్యతిరేకించడానికి, నదులకు జీవం పోసి కాపాడుకోవడానికి నదుల పరిరక్షణ దినం మొదలైంది. ఈ సంత్సరం థీమ్: మన నదులు–మన భవిష్యత్. నదీ పర్యావరణ వ్యవస్థలను రక్షించడం, పునరుద్ధరించడం లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ఎన్నో సమావేశాలు, సదస్సులు, నదులను శుభ్రపరిచే కార్యక్రమాలు జరుగుతాయి, బ్రెజిల్లోని కురిటిబాలో 1997లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో నదుల పరిరక్షణ దినోత్సవానికి బీజం పడింది. -
పువ్వులే డ్రెస్సులు!
సంప్రదాయ వివాహ వేడుకలలో పువ్వుల అలంకరణకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ పూల అందం అమ్మాయిల డ్రెస్సులుగా మారితే మరింత ఆకర్షణీయం అవుతుంది. పెళ్లికి ముందు జరిగే హల్దీ వేడుకకైనా... మాతృత్వపు మధురిమను పొందే బేబీ షవర్కైనా.. పువ్వుల దుపట్టా, పువ్వుల కేప్, పువ్వుల బ్లౌజ్... చీరకు కొంగుగా, లెహంగాకు డిజైన్గా అమరే పువ్వుల అందం ఇప్పుడు వేడుకలకు ప్రత్యేకతను తీసువస్తుంది.సుగంధాలు వెదజల్లే మల్లెలతో చేసిన దుపట్టా, బ్లౌజ్ డిజైన్స్ ఇప్పుడు పెళ్లిళ్లు, హల్దీ, మెహందీ వంటి ఫంక్షన్స్లో చాలా ట్రెండింగ్గా ఉన్నాయి. ఇవి ఫ్రెష్ పూలతో తయారు చేసిన కావడంతో ఒక నేచురల్, రాయల్ లుక్ను తీసుకువస్తున్నాయి.ఫ్రెష్ ఫ్లవర్ దుపట్టా...గులాబీలతో.. రెడ్ లేదా పింక్ రోజ్ పూలను ఈ దుపట్టా తయారీలో ఉపయోగిస్తారు. రెడ్ లేదా పింక్ గులాబీలతో చేసిన దుపట్టాను ధరిస్తే రాయల్ లుక్తో కనిపిస్తారు. మల్లెపూలతో – సన్నని కాడ మల్లెలతో చేసే ఈ డిజైన్ సింపుల్గానూ, క్లాసీ లుక్తో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కలర్ డ్రెస్ ఎంచుకున్నా మల్లెల దుపట్టాతో ప్రత్యేకత నింపుకుంటుంది. వివిధ రకాల పువ్వులు – గులాబీ, బంతి, జిప్సీ వంటి పూల మిక్స్తో దుపట్టాను అలంకరిస్తారు. ∙హల్దీ స్పెషల్ దుపట్టా – పసుపు రంగు వచ్చేలా బంతిపూలు, మల్లెలతో కలిపి దీనిని తయారుచేస్తారు. ఈ దుపట్టాలను ఎక్కువగా హల్దీ, మెహందీ ఫంక్షన్స్ కోసం వాడతారు.పువ్వుల బ్లౌజ్ డిజైన్స్...ఫ్రంట్ ఫ్లోరల్ టాప్ స్టైల్లో బ్లౌజ్ మొత్తం పూలతో కవర్ చేస్తారు. పువ్వులను బ్లౌజ్ బోర్డర్కి మాత్రమే అలంకరిస్తారు. పువ్వులను దారం లేదా వైర్ థ్రెడ్తో నెటెడ్ మెటీరియల్ మీద ఫిక్స్ చేస్తారు. వీటిలో ఎక్కువ శాతం బంతి, గులాబీ, మల్లెలతో పాటు అలంకరణకు తామర మొగ్గలను కూడా ఉపయోగిస్తుంటారు. ఈ డిజైన్స్ వేడుకకు రెండు గంటల ముందు లేదా ఆర్డర్ మీద డిౖజైన్ చేస్తున్నారు. డిజైన్ను బట్టి, పువ్వుల ఎంపికను బట్టి వీటి ధరలు ఉంటున్నాయి. -
కాఫీకి ఒక రోజు..!
కాఫీ అంటే ఉదయించే ఉత్సాహం. సరికొత్త రోజుకు కాఫీ సేవనంతో ఉత్సాహంగా స్వాగతం చెప్పటం తప్పనిసరైన ఇష్టమని గాఢంగా భావించే కాఫీ ప్రేమికులు ప్రపంచవ్యాప్తంగా కోకొల్లలు. ఒక మహత్తరమైన ఆహార సాంస్కృతిక వారసత్వానికి కాఫీ ఒక ప్రతీక. అటువంటి కాఫీకి ఇప్పటి వరకు ఒక ప్రత్యేక రోజంటూ లేదు. ఇప్పుడా కొరత తీరింది. అక్టోబర్ 1వ తేదీన ఇక ఏటా అంతర్జాతీయ కాఫీ డే (International Coffee Day) జరుపుకోవచ్చు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఈ నెల 10వ తేదీన ఈ మేరకు తీర్మానించింది. తన సువాసనలతో ఉత్తేజపరిచే కాఫీకి జేజేలు చెప్పని వారు ఈ విశాల భూతలమ్మీద ఎవరుంటారు? కమ్మటి కాఫీని సిప్ చేస్తూ మైమరచే వినియోగదారులతో పాటు కాఫీ గింజలను ఆరుగాలం కష్టించి పండించే రైతుల వరకూ కాఫీ దినోత్సవ ప్రకటన ఒక ఉత్తేజకరమైన వార్తే కదూ! ఆహార భద్రతకు దోహదపడే కాఫీ పంట సామాజిక–ఆర్థిక ప్రాముఖ్యత గురించి అవగాహన పెంపొందించడానికి కాఫీకి ఒక రోజును కేటాయిస్తున్న ఐక్యరాజ్యసమితి తీర్మానం పేర్కొంది. ఈ సందర్భంగా కాఫీ కబుర్లు మీ కోసం!కాఫీకి ఉన్న సాంస్కృతిక, సామాజిక, చారిత్రక ప్రాముఖ్యతను ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఇదొక ముఖ్యమైన వ్యవసాయక ఉత్పత్తి మాత్రమే కాదు, కోట్లాది మంది వ్యవసాయ సమూహాలకు జీవనోపాధి కూడా. సామాజిక ఆతిథ్యం, సాంస్కృతిక వ్యక్తీకరణ, రోజువారీ సంప్రదాయానికి చిహ్నంగా కూడా కాఫీ మారింది అని ఐరాస తీర్మానం పేర్కొంది. ఆకలికి వ్యతిరేకంగా పోరాటం, తీవ్ర పేదరికాన్ని తగ్గించడం, మహిళల సాధికారత, మంచి పనిని ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం వంటి అనేక సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు కాఫీ సాగు, ప్రాసెసింగ్ దోహదపడుతున్నాయని ఐరాస పేర్కొంది.2.5 కోట్ల రైతుల పంట ప్రపంచంలో అత్యంత విస్తృతంగా సేవించే పానీయాలలో కాఫీ ఒకటి. గత దశాబ్దంలో ప్రపంచ తలసరి వినియోగం సంవత్సరానికి 1.2 శాతం పెరుగుతోంది. ఈ రంగం సుమారు 2.5 కోట్ల రైతుల జీవనోపాధికి తోడ్పడుతోంది. తోటల సాగు నుంచి ప్రాసెసింగ్, వినియోగం వరకు విస్తరించిన విలువ గొలుసు అంతటా ఎందరికో ఉపాధి అవకాశాలను కాఫీ కల్పిస్తోంది. మొత్తం మీద, ప్రపంచ కాఫీ పరిశ్రమ వార్షిక ఆదాయం 20,000 కోట్ల డాలర్లు.3,400 కోట్ల డాలర్ల వాణిజ్యంప్రపంచంలోనే అత్యధికంగా క్రయవిక్రయాలు జరిగే వస్తువులలో కాఫీ ఒకటిగా ఉంది. 2024లో ప్రపంచ కాఫీ ఉత్పత్తి 1.1 కోట్ల టన్నులను అధిగమించింది. అంతర్జాతీయంగా సుమారు 80 లక్షల టన్నుల కాఫీ గింజల వర్తకం జరుగుతోంది. 2024లో ప్రపంచ కాఫీ ఉత్పత్తి విలువ దాదాపు 2,500 కోట్ల డాలర్లని అంచనా, అయితే, కాఫీ గింజల ప్రపంచ వాణిజ్యం సుమారు 3,400 కోట్ల డాలర్లకు చేరుకుంది.పుట్టిల్లు ఇథియోపియాఅనేక తక్కువ ఆదాయ దేశాలు విదేశీ మారకద్రవ్యం ఆర్జనకు కాఫీ ఎగుమతులు కీలకంగా మారాయి. కాఫీ పుట్టిల్లు ఇథియోపియా. 2024లో ఇథియోపియా మొత్తం వస్తువుల ఎగుమతుల్లో కాఫీ వాటా 27.9 శాతం. ఉగాండాలో 20.1 శాతం, బురుండిలో 19.5 శాతం. ఇథియోపియా, ఉగాండా రెండింటిలోనూ, కాఫీ ఎగుమతి ఆదాయాలు ఆహార దిగుమతి బిల్లులను మించిపోయాయి. 2024లో బ్రెజిల్, వియత్నాం ప్రముఖ కాఫీ ఎగుమతిదారులుగా ఉన్నాయి. యూరోపియన్ యూనియన్, అమెరికా అతిపెద్ద దిగుమతిదారులుగా ఉన్నాయి.కాఫీ రైతులు ఎదుర్కొంటున్న వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడంలో ఆహార – వ్యవసాయ సంస్థ ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్ కార్యక్రమం ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఫీల్డ్ స్కూల్స్ ద్వారా తూర్పు ఆఫ్రికాలో, క్యూబాలో సహకార కాఫీ సాగు నమూనాలను ఎఫ్ఏవో బలోపేతం చేసింది. ప్రపంచ కాఫీ మార్కెట్కు అవసరమైన బలమైన ట్రేసబిలిటీ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి రైతులు, ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోంది. ఏడో స్థానంలో భారత్కాఫీ సాగులో ప్రపంచంలో ఏడో స్థానంలో, ఎగుమతిలో ఐదో స్థానంలో భారత్ ఉంది. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తదితర దక్షిణాది రాష్ట్రాల్లోనే 90% కాఫీ గింజలు పండుతాయి. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ కనుమల్లోని కొండ్రప్రాంతాల్లో కాఫీ సాగు విస్తరించింది. అరకు కాఫీ ఘుమఘుమలకు ప్రపంచ ప్రఖ్యాతి ఉంది. కాఫీ రకాల్లో అరబిక 30%, రోబస్ట 70% మన దేశంలో సాగవుతున్నాయి. 17వ శతాబ్దంలో బాబా బుడాన్ ఎమెన్ నుంచి ఏడంటే ఏడు కాఫీ గింజల్ని మన దేశానికి రహస్యంగా తీసుకొచ్చారు. బ్రిటీష్ పాలనలో 19వ శతాబ్దం మధ్య నుంచి వాణిజ్యపరంగా కాఫీ పంట సాగు మన దేశంలో డచ్ వారి చొరవతో ప్రారంభమైంది. మన దేశంలో ఉత్పత్తయ్యే కాఫీ గింజల్లో 70% ఇటలీ, రష్యా, జర్మనీ కొనుగోలు చేస్తున్నాయి. 6 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్న కాఫీ పరిశ్రమ కార్యకలాపాలను కాఫీ బోర్డు పర్యవేక్షిస్తోంది.చదవండి: మహిళా రైతులకు మద్దతిస్తే..!కాఫీ అనేది ఒక పానీయం కంటే ఎక్కువ. ఇది ప్రపంచవ్యాప్త వాణిజ్య వస్తువు. గింజల నుండి కాఫీ సేవనం వరకు – కోట్లాది వ్యవసాయ కుటుంబాల జీవనోపాధిని నిలబెడుతోంది. గ్రామీణులను ప్రపంచ మార్కెట్లతో అనుసంధానం చేస్తోంది. కాఫీ రంగానికి గల విలువను గుర్తించటం, దాని సామాజిక–ఆర్థిక ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచుతుంది. పేదరిక నిర్మూలనకు దాని సహకారాన్ని బలోపేతం చేస్తుంది. కాఫీ దినోత్సవాన్ని, దాని విలువలను సంబరంగా జరుపుకోటానికి ఎదురుచూస్తున్నాం.– క్యూ.యూ. డోంగ్యు, డైరెక్టర్ జనరల్, ఐరాస ఆహార–వ్యవసాయ సంస్థ, రోమ్.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
మహిళా రైతులకు మద్దతిస్తే..!
ఒక మహిళా రైతు సాధికారితను పెంపొందిస్తే (అంటే, మద్దతు ఇస్తే లేదా బలోపేతం చేస్తే).. ఏమవుతుంది? ఆ కుటుంబం, సమాజం బాగుపడుతుంది. ఇందుకోసమే 2026 అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (యూఎన్–ఎఫ్ఏఓ) మహిళా రైతుల సాధికారితపై నాలుగు మాటల్లో ఏమంటోందో చూద్దాం..మీకు తెలుసా? దాదాపు ప్రతి గ్రామీణ మహిళ ఒక కార్మికురాలే, తిని కూర్చునే వారెవరూ లేరు! ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం, 2021లో ప్రపంచ వ్యవసాయ రంగం, ఆహార శుద్ధి, పంపిణీ రంగాల్లో పనిచేస్తున్న వారిలో మహిళలు 41% ఉన్నారు. అయినప్పటికీ గ్రామీణ మహిళలు అసమానతలను ఎదుర్కొంటున్నారు. వారి ఉపాధికి గ్యారంటీ లేదు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. హక్కులను పరిమితంగా మాత్రమే పొందగలుగుతున్నారు.ఆదాయం వచ్చే పొలం పనుల కన్నా ‘వేతనం లేని కుటుంబ సంరక్షణ పనుల’కు మహిళా రైతులు ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. ఇది లేబర్ మార్కెట్లో వారి విలువను తగ్గిస్తోంది. ఆర్థిక సాధికారత తగ్గిపోతోంది. ఈ పరిస్థితులు మహిళా రైతులకు అంత శ్రేయస్కరంగానూ లేదు. ప్రపంచవ్యాప్తంగా, మహిళలు, బాలికలు చేసే కుటుంబ సంరక్షణ పనులకు విలువ కడితే ఎంతవుతుందో తెలుసా? ఏడాదికి ఏకంగా రూ.9,95,264 కోట్లు అవుతుంది!మహిళా రైతులు సాధారణంగా పురుషుల కంటే చిన్న కమతాల్లోనే పంటలు పండిస్తున్నారు. పురుషులతో సమానమైన విస్తీర్ణం గల పొలాల్లో పంటలు పండిస్తున్న చోట్ల కూడా.. మహిళా రైతులకు వనరుల లభ్యత, వ్యవసాయ శిక్షణ, సలహాల అందుబాటు అరకొరగా అందుతుండటంతో ఉత్పాదకతలో వెనుకబడుతున్నారు. వీరి ΄పొలాల్లో పంటల దిగుబడి 24% తక్కువగానే వస్తోందని బెంగళూరుకు చెందిన ‘ఫౌండేషన్ ఫర్ అగ్రేరియన్ స్టడీస్’ చెబుతోంది.ఆహార అభద్రత పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువ. ప్రపంచం లో ఏ ప్రాంతంలో చూసినా పరిస్థితి ఇలాగే ఉంది. ఉపాధి, విద్య, ఆదాయంలో లింగపరమైన వివక్షలను తొలగించటం ద్వారా ఈ అంతరం 52% పోతుందని నిపుణులు చెబుతున్నారు.మన దేశంలో మహిళా రైతుల పరిస్థితేమిటి?ఫౌండేషన్ ఫర్ అగ్రేరియన్ స్టడీస్ సర్వేల (2017–18) ప్రకారం, వ్యవసాయ సీజన్లో 92% గ్రామీణ మహిళలు ఆదాయం వచ్చే వ్యవసాయ పనులు చేస్తున్నారు. పనులు అంతగా ఉండని సీజన్ లో కూడా 64% మంది ఏదో ఒక పని చేస్తున్నారు. ఏడాది పొడవునా గ్రామీణ మహిళలు చాలా మంది పనిలో నిమగ్నం అవుతున్నారని ఈ గణాంకాలు చెబుతున్నాయి.పాడి పనుల్లో నిమగ్నమయ్యే వారిలో దాదాపు 70% మంది మహిళలే. అయినప్పటికీ ఈ రంగం యొక్క అసంఘటిత స్వభావం కారణంగా వారి పనిని చాలా సార్లు చిన్న చూపు చూస్తున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకారం, 2022–23లో, ఉపాధి హామీ పనులు చేసే శ్రామికుల్లో 57.43% మంది మహిళలు ఉన్నారు.సాధికార మహిళా రైతులువారి కుటుంబాలు, సమాజాల శ్రేయస్సుకు దోహదపడుతుంది. ఆహార కొరత తగ్గుతుంది.అనేక రకాల ఆహారం, పౌష్టికాహారం మరింత మెరుగ్గా అందుతుంది. రైతు కుటుంబాల ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయి.రకరకాల ఒడొదుడుకులను తట్టుకునే శక్తి కుటుంబాలకు పెరుగుతుంది. (చదవండి: సేంద్రియ ఆహార మార్కెట్లకు చోటివ్వండి!) -
చేతులు లేవు కానీ పెయింటింగ్లో ప్రపంచ రికార్డు..!
కొందరి ప్రతిభ అసాధారణంగా బయటకొస్తుంది. సాధారణంగా చిత్ర కళాకారులు ప్రయాణం చేతిలో పెన్సిల్ పట్టుకోవడంతో ప్రారంభమవుతుంది. కానీ కొందరి విధివంచితులకు ఆ అవకాశమే లేకుండా చేసి వెక్కిరిస్తుంటుంది. అయినప్పటికీ వారి కళా ప్రయాణం ఆగదు..పైగా విభిన్న ప్రతిభపాటవంతో ప్రపంచమే చేతులెత్తి సలాం కొట్టేలా చేస్తారు. అంతేగాదు అసాధారణ ధృడ సంకల్పం ముందు ఎంతటి వైకల్యమైన వెలవెలబోవాల్సిందే..!. అందుకు నిలువెత్తు నిదర్శనం ఈ యువకుడు.ఆ యువకుడే చత్తీస్గఢ్కు చెందిన గోకరణ్ పాటిల్. పుట్టుకతో చేతులు, వినికిడి లోపంతో జీవిస్తున్న వ్యక్తి శక్తిమంతమై సృజనాత్మక వ్యక్తీకరణ రూపంగా మారాడు. గోకరణ్ పాటిల్ చత్తీశ్గఢ్లోని భిలాయ్లో పెరిగాడు. అక్కడ అతను తన తల్లి, తోబుట్టువులతో పెరిగాడు. రోజువారీ పనులకు అతడి శారీరక లోపాలు పెను సవాళ్లుగా మారాయి. అయినప్పటికీ పాటిల్ వెనక్కి తగ్గలేదు. అలా పాఠశాలలో చదువుకుంటున్నప్పుడూ అందరిలా చేతితో పెన్సిల్ పట్టుకోలేకపోతేనేం.. కాళ్లు ఉన్నాయి కదా అని అనుకున్నాడు పాటిల్. అలా కాలి వేళ్ల మధ్య పెన్సిల్ పట్టుకుని రాయడం ప్రారంభించాడు. అతనికి తన పాదాలపై ఉన్న అద్భుతమైన నియంత్రణకు ఉపాధ్యాయులు అబ్బురపడి..డ్రాయింగ్ వేసే దిశగా ప్రోత్సహించారు. దాంతో పాటిల్ ఆ మార్గంలోనే గట్టిగా సాధన చేశాడు. కాలక్రమేణ చిత్రీకరణ ఒక గొప్ప శక్తిగా రూపాంతరం చెందింది. అతి కాస్తా తన అభిరుచి, ఫ్యాషన్గా మారిపోయింది. అతడికి ఈ కళ ఒకరకంగా అపారమైన ఏకాగ్రత అబ్బేలా చేసింది. ఆ నేపథ్యంలోనే వివరణాత్మక చిత్రపటాలు, శక్తిమంతమైన ప్రకృతి దృశ్యాలతో ప్రేక్షకులను అలరించాడు. అలా చివరికి లలిత కళలలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశాడు. పాటిల్ చిత్రీకరణ సాంకేతికతపై మంచి పట్టుని సంపాదించుకున్నాడు. ప్రపంచ దృష్టించిన ఆకర్షించేలా రికార్డు..పాటిల్ అంకితభావం చివరికి అతనికి అంతర్జాతీయ గుర్తింపును సంపాదించిపెట్టింది. యుక్తవయసులో, ఒక గంటలోపు తన కాలి వేళ్లను ఉపయోగించి అత్యధిక సంఖ్యలో డ్రాయింగ్లను సృష్టించిన తర్వాత అతను గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకెక్కాడు. ఈ ఘనత వేగం కంటే అతడు వేసిన తీరు అతడిని వార్తల్లో నిలిచేలా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. నిజానికి పాదాలతో బొమ్మలు చిత్రించాలంటే..బ్రష్ను నియంత్రించడానికి సమతుల్యత, కండరాల బలం, తీవ్రమైన ఏకాగ్రత, నిరంతర సాధన చాలా అవసరం. అయితే పాటిల్ వాటిన్నింటిని మరింత మెరుగపరుచుకున్నాడు. అదే అతడని ఇలా ప్రపంచ రికార్డు నెలకొల్పేలా చేసింది. పాటిల్ చిత్రాలు కళాభిమానులు, ప్రభుత్వ అధికారులు, సోషల్ మీడియా ప్రేక్షకుల దృష్టిని అమితంగా ఆకర్షించాయి. అంతేగాదు ఈ అభిరుచి కాస్తా.. స్థిరమైన జీవనోపాధిగా మార్చుకున్నాడు. అంతేగాదు పాటిల్ వ్యక్తిగతంగా సక్సెస్ అయితే చాలు అనుకోలేదు. ముఖ్యంగా తనలాంటి విద్యార్థులకు, వినికిడి లోపం ఉన్నవారికి క్రియేటివిటీ, సాంకేతికత నైపుణ్యాలను నేర్చుకోవడంలో సహాయ సహకారాలు అందిస్తుండటం విశేషం. (చదవండి: 109 కిలోల నుంచి 72 కిలోలకు తగ్గిన డయాబెటిస్ డాక్టర్..!) -
109 కిలోల నుంచి 72 కిలోలకు తగ్గిన డయాబెటిస్ డాక్టర్..!
సుదీర్ఘ పనిగంటలు, ఒత్తిడి, వర్కౌట్ల లేమి తదితరాల వల్ల బరువు తగ్గడం కష్టంగా ఉంటుంది. అలాంటివాళ్లు స్థిరమైన అలవాట్లతోనే బరువుకి చెక్పెట్టగలరు. శాశ్వత ఫలితాలు కావాలనుకుంటే క్రమశిక్షణతో కూడిన స్థిరత్వం అత్యంత ప్రధానం అని చెబుతున్నారు నిపుణుల. ఇక్కడ వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఈ డయాబెటిస్ డాక్టర్ కూడా..సుదీర్ఘ పనిగంటలతో బిజీగా ఉంటూ..వ్యక్తిగత ఆరోగ్యాన్ని పాడు చేసుక్నుఆడు. ఎందరో రోగులకు బరువు తగ్గడంపై శిక్షణ ఇస్తూ..వారికి ఆరోగ్య సూచనలిచ్చే వ్యక్తి వ్యక్తిగత హెల్త్, జీవనశైలి సవ్యంగా లేదు. ఫలితంగా ఊబకాయం బారినపడి ఇబ్బందిపడ్డాడు. విచిత్నం ఏంటంటే తన క్లినికల్ అనుభవంతో సాధ్యమైనంత తొందరగానే ఆ సమస్య నుంచి బయటపడి వెయిట్లాస్ ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలిచాడు. మరి అతడు ఈ అధిక బరువుని ఎలా జయించాడంటే..ఆ డాక్టరే న్యూఢిల్లీ చెందిన డయాబెటాలజిస్ట్ డాక్టర్ బ్రిజ్మోహన్ అరోరా. వృత్తిరీత్యా అత్యంత బిజీగా ఉండటం, లేట్నైట్ మీటింగ్స్ తదితరాల కారణంగా సరైన ఆహారపు అలవాట్లు ఉండేవి కావు. మద్యం సేవించడం, బయట తినడం, తీపి పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వడం తదితరాలతో ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నాడు. శారీరక శ్రమ అన్నదే అతని దైనందిన జీవితంలో దాదాపుగా లేదని చెప్పొచ్చు. దాంతో అతడు దాదాపు 109 కిలోల బరువుకి చేరుకున్నాడు. అది ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేసింది కూడా. దాంతో అరోరా ఎలాగైనా స్లిమ్గా మారాలనే కృతనిశ్చయంతో ఉన్నాడు. అయితే వేగవంతంగా బరువు తగ్గించే పద్ధతుల జోలికిపోకుండా..వ్యాయామం, సక్రమమైన జీవినశైలిపై దృష్టి పెట్టాడు. ఈ పద్ధతులు అతడి బాడీలోని ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడమే గాక, కండర ద్రవ్యరాశిని రక్షించడం, తగినంత నిద్ర పోవడం వంటి అలవాట్లతో మెరుగైన ఫలితాలు అందుకున్నారు. ప్రభావవంతమైన మార్పుతో కొద్దికాలంలోనే స్లిమ్గా మారిపోయాడు. అలా 72 కిలోల ఆరోగ్యకరమైన బరువుకి చేరుకున్నాడు. ఇలా బరువు తగ్గడంతో ఏ పనైనా సునాయాసంగా చేసేలా యాక్టివ్గా మారింది శరీరం. ఈ వెయిట్లాస్ జర్నీలో కడరాలు కోల్పోకుండా కొలెస్ట్రాల్ తగ్గించుకున్నానని, రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరిచానని అన్నారు. అన్నీట్లకంటే ఏ మార్పు అయినా స్వీకరించేందుకు ముందుకు వచ్చినప్పడూ..స్థిరత్వంతో కూడిన సహనం, క్రమశిక్షణ చాలా అవసరమని, అప్పుడే అనుకున్న లక్ష్యానికి మనం చేరుకోగలమంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు అరోరా. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: నాలుగేళ్లలో రూ. 3.5 లక్షల నుంచి రూ. 65 లక్షల రేంజ్..!) -
నాలుగేళ్లలో రూ. 3.5 లక్షల నుంచి రూ. 65 లక్షల రేంజ్..!
ఉద్యోగ కెరీర్లో అంచలంచెలుగా ఎదుగుతూ..అత్యున్నతి స్థాయికి చేరుకోవాలనే ఎవరైన కోరుకుంటారు. అందుకోసం చాలా కష్టపడుతుంటారు కూడా. కానీ కొందరు మాత్రమే చాలా తక్కువ సమయంలోనే అత్యధిక జీతం అందుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. అలాంటి కోవకు చెందినవాడే ఈ టెకీ. తన కెరీర్ సక్సెస్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కేవలం నాలుగేళ్లలో ఏడాకి రూ. 3.5 లక్షలు అందుకునే స్థాయి నుంచి ఏకంగా ఏడాదికి రూ. 65 లక్షలు అందుకునే రేంజ్కి వెళ్లిపోయాడు. అప్పుల భారంతో సతమతమవుతున్న అతడి మధ్యతరగతి కుటుంబానికి అతి పెద్ద ఊరట తోపాటు సంతోషాలు వెల్లివెరిశాయి. 2021లో క్యాంపస్ ఇంటర్వ్యూలో తక్కువ ప్యాకేజీతో నియమాకం అందుకున్నట్లు టెకీ తెలిపారు. అప్పుడు తన జీతం కేవలం రూ. 26 వేలు అని. అయితే ఆ టైంలో జాబ్లో ఉన్నత స్థానానికి చేరుకోవాలన్న లక్షం, కష్టబడేతత్వం పెద్దగా ఏమి లేవని, హాయిగా సినిమాలు చూస్తూ, ఎంజాయ్ చేస్తూ జాబ్ చేసేవాడినని అన్నారు. అయితే ఇంట్లో అప్పులభారం పెరిగిపోవడం, అందుకున్న జీతం ఏమాత్రం సరిపోకపోవడంతో..అప్పుడు వాస్తవికంగా నాలాంటి సాఫ్ట్వేర్ అందుకనే జీతం ఇది కాదని గ్రహించానంటున్నాడు. అప్పటి నుంచి మరింత కష్టపడటం మొదలుపెట్టా. అందులోనూ లాజికల్ మ్యాథ్స్లో ఉన్న పట్టుతో..లక్షల వేతనం అందుకునే టెకీల మాదిరి ఉద్యోగాలు అందుకునే వేటలో ఉన్నాను. అప్పుడు నా లక్ష్యం అప్పులు క్లియర్ చేసేలా మంచి ఉద్యోగం పొందడం. ఆ క్రమంలో 2023లో 45 శాతం జీతం పెంపు, 2024లో 28 శాంతం పెంపు కూడా అందుకోగలిగా. సరిగ్గా ఆ టైంలో ఇంజనీర్గా రూ. 19 లక్షలు వార్షిక జీతంతో కొత్త కంపెనీలో చేరా. విహారయాత్రాలు, ఎంజాయ్మెంట్ వంటి వాటితో సంబంధం లేకుండా చాలా కష్టపడ్డ..అయితే ఆ క్రమంలో కొన్ని ఇంటర్వ్యూలను చాలా త్రుటిపాయంలో పోగొట్టుకున్నట్లు తెలిపాడు. చివరికి తన కష్టం ఫలించి సర్వీస్నౌ, పేపాల్, సిస్కో వంటి అత్యున్న కంపెనీల ఆఫర్లు అందుకోగలిగా. చివరికి తాను అనుకున్నట్లుగానే ఒక అగ్రశ్రేణి ఉత్పత్తి సంస్థ నుంచి రూ. 65 లక్షల ఆఫర్ అందుకున్నా. తనను అందురు కార్పొరేట్ బానిసగా భావించి ఉండొచ్చు..కానీ తన తల్లిదండ్రులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అలాగే ఎన్నటికీ ఊహించని గొప్ప వస్తువులను సైతం కొనుగోలు చేయగలను అని ఆనందంగా చెబుతూ పోస్ట్ని ముగించాడు. నెటిజన్లు సైతం సదరు టెక్నీషియన్ సక్సెస్ జర్నీ చాలా స్పూర్తిదాయకమైన విజయవంతంగా కెరీర్ని నిర్మిచుకోవడం ఎలా అనేందుకు గొప్ప స్ఫూర్తి అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: సహానుభూతి పవర్..! ఎలా బిల్డ్ చేయాలంటే..) -
ఫిట్నెస్లో సరికొత్త ట్రెండ్
నగరవాసులు శాకాహారులుగా మారుతున్నారు.. ఆహారంపై క్రమంగా పెరుగుతున్న అవగాహనతో అటువైపు అడుగులు వేస్తున్నారు. వేగవంతమైన లైఫ్స్టైల్కు కేంద్రమైన హైదరాబాద్లో.. ఓ వైపు మెట్రో పరుగులు, ఆఫీస్ డెడ్లైన్లు, పార్టీ కల్చర్, మరోవైపు వీకెండ్ హ్యాంగౌట్స్.. ఇవన్నీ కలిసి మన ఆహార అలవాట్లను పూర్తిగా మార్చేశాయి. ఎప్పుడు, ఏమి, ఎంత తింటున్నాం అన్న ఆలోచన లేకుండానే రోజులు గడిచిపోతున్నాయి. ఫలితం.. డైట్ బ్యాలెన్స్ తప్పుతోంది. ఫలితంగా ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి పెరుగుతున్నాయి. దీనికితోడు అడుగడుగునా రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్.. అంతేనా! మొబైల్ ఫోన్లో ఒక్క క్లిక్తో.. నిమిషాల్లో ఇంటికి వచ్చే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వంటివి మన అలవాట్లను దెబ్బతీస్తున్నాయి. దీన్ని మార్చేందుకు కొందరు కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు.. సిటీ ట్రెండ్స్ కారణంగా మన ఆహార అలవాట్లలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పని ఒత్తిడి కారణంగానో.. అలసట కారణంగానో.. ‘ఈ రోజు వండుకోకపోతే ఏమైంది?’ అనే భావన సాధారణం అయ్యింది. ఉదయం అల్పాహారాన్ని తప్పించి కాఫీతో సరిపెట్టడం, లంచ్కు బిర్యానీ/ బర్గర్తో ముగించడం, రాత్రి ఆలస్యంగా హెవీ డిన్నర్.. ఇవన్నీ నగర యువతలో సాధారణ అంశాలు. వీటన్నింటినీ సమత్యుల్యం చేయడంపై దృష్టి సారిస్తున్నారు కొందరు నగరవాసులు. ఇందులో భాగంగా వెజ్ వీక్, లంచ్ బాక్స్ మంథ్ అంటూ కొత్త ట్రెండ్కు నాంది పలుకుతున్నారు. నాన్ వెజ్ డామినేషన్? ఒకప్పుడు మాంసాహారం వారానికి ఒకటి, రెండు సార్లు మాత్రమే ఉండేది. ప్రస్తుతం చికెన్, మటన్, ఫిష్ పేర్లతో రోజుకో వెరైటీ మన ప్లేట్లో వచ్చి చేరుతోంది. ప్రొటీన్ పేరుతో మాంసాహారాన్ని అధికంగా తీసుకుంటున్నారు. ఫైబర్ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, కూరగాయల నిర్లక్ష్యం.. వంటి కారణాలతో ఊబకాయం, కొలె్రస్టాల్, షుగర్ వంటి రోగాల భారిన పడుతున్నారు. ముఖ్యంగా 25–40 ఏళ్ల వయసులోనే లైఫ్స్టైల్ రోగాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీనిని అధిగమించేందుకు నిపుణుల సూచనల మేరకు కొందరు క్రమంగా శాకాహారంపై ఆసక్తి కనబరుస్తున్నారు.నో ఔట్సైడ్ ఫుడ్ చాలెంజ్.. ఇలాంటి పరిస్థితుల్లో నగరవాసుల్లో కొత్త అవేర్నెస్ కనిపిస్తోంది. పూర్తిగా డైట్ మార్చలేకపోయినా, కనీసం కొన్ని రోజులు నియంత్రణలో ఉండాలనే ప్రయత్నం పెరిగింది. ‘వెజ్ వీక్’, ‘వెజ్ మంథ్’ అంటూ కొన్ని రోజులు నాన్వెజ్కు బ్రేక్ పెట్టడం.. ఏడు రోజులు ‘నో ఔట్సైడ్ ఫుడ్’ చాలెంజ్, ఓన్లీ హోమ్ ఫుడ్’, రెగ్యులర్ లంచ్ బాక్స్.. వంటివి ట్రెండ్గా మారాయి. ఆఫీసులో సహోద్యోగులతో కలిసి ‘హోమ్ ఫుడ్ డేస్’ ప్లాన్ చేయడం.. ఒకప్పటి స్కూల్ డేస్ను గుర్తు చేస్తున్నాయి. స్వయంగా వంట చేసుకునే యువత కూడా పెరుగుతోంది. రైస్, కూర, పప్పు, పెరుగు వంటి సింపుల్ మీల్స్ ఎంత ఆరోగ్యకరమో మళ్లీ అర్థమవుతోంది. దీనికి తోడు మీల్ ప్రిప్ కల్చర్, వారం రోజులు వంట సిద్ధం చేసుకోవడం వంటి కాన్సెప్్ట్స హైదరాబాద్లో పాపులర్ అవుతున్నాయి.చిన్న ప్రయత్నం.. పెద్ద మార్పు.. అందరూ ఒక్కసారిగా ఫిట్ ఫుడ్కే మారాలి అనుకోవడం ఆచరణసాధ్యం కాకపోవచ్చు. కానీ వారానికి కొన్ని రోజులు కంట్రోల్డ్ డైట్, ఇంటి ఆహారానికి ప్రాధాన్యం, నాన్ వెజ్ను పరిమితంగా తీసుకోవడం, బయట ఆహారం తగ్గించడం.. ఇవే పెద్ద మార్పుకు పునాది. నగర జీవనశైలిలో ఫాస్ట్ ఫుడ్ తప్పదనిపించినా, ఆరోగ్యం కోసం తీసుకునే చిన్న నిర్ణయాలే భవిష్యత్తును కాపాడతాయనేది డైట్ నిపుణుల అభిప్రాయం. -
సహానుభూతి పవర్..! ఎలా బిల్డ్ చేయాలంటే..
మనుషులతో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే.. మనం ఎప్పుడూ 'మన' కోణం నుండే ప్రపంచాన్ని చూస్తాం. అందుకే గొడవలు, అపార్థాలు వస్తాయి. కానీ, నిజమైన వ్యక్తిత్వ వికాసం సహానుభూతి (empathy)లో ఉంటుంది. ఇది మీ పర్సనాలిటీని ఒక అసాధారణమైన స్థాయికి తీసుకెళ్తుంది. ఎంపతీ ఉన్న వ్యక్తి ఎదుటివారి దృష్టిని అర్థంచేసుకుని (Walking in their shoes), వారు ఏమనిపిస్తుందో ఆలోచించగలడు. ఇదే మీకు దొరికే అత్యంత శక్తివంతమైన సామాజిక ఆయుధం.1. Sympathy vs EmpathySympathy (జాలి): ఎదుటివారిని చూసి బాధపడటం. ఇది పైపైన ఉంటుంది.Empathy (సహానుభూతి): ఎదుటివారి బాధను, ఆనందాన్ని లోతుగా అనుభూతి చెందడం.ప్రఖ్యాత సైకాలజిస్ట్ కార్ల్ రోజర్స్ ప్రకారం, ఎంపతీ అంటే ఎదుటివ్యక్తిపై ఎలాంటి తీర్పులు ఇవ్వకుండా (Non-judgmental) వారిని అర్థం చేసుకోవడం. ఇది ఒక 'సూపర్ పవర్' ఎందుకంటే, ప్రపంచంలో ఎవరూ తమని అర్థం చేసుకునే వ్యక్తిని వదులుకోరు.2. ఇది ఒక సూపర్ పవర్ ఎలా అవుతుంది?మీరు ఎంపతీని పెంచుకుంటే మీకు కలిగే లాభాలు.Influence: మీరు ఎదుటివారిని డామినేట్ చేయకుండానే, వారి మనసు గెలుచుకోగలరు. మీ మాటలకు, మీ ప్రవర్తనకు ఒక ప్రత్యేకమైన విలువ వస్తుంది.Conflict Resolution: గొడవలు పడే వ్యక్తుల మధ్య మీరు ఉంటే, మీరు వారిద్దరి కోణాన్ని అర్థం చేసుకుని, సులభంగా పరిష్కరించగలరు.Emotional Intelligence: మీ EQ ఆకాశాన్ని తాకుతుంది. ఎదుటివారికి మీరు ఇచ్చే 'అర్థం చేసుకునే అవకాశం' వారికి ఒక గొప్ప ఊరటనిస్తుంది.3. నిజమైన ఎంపతీట్రైనర్స్ "ఎదుటివారిని ఎలా మానిప్యులేట్ చేయాలో నేర్చుకో" అని చెప్తారు. ఇది మీకు అశాంతిని మిగులుస్తుంది. "ఎదుటివారికి మీరు ఇచ్చే గౌరవం, మీకున్న హృదయ విశాలతను పెంచుతుంది" అని సైకాలజీ చెప్తుంది. ఎంపతీ అనేది ఒక 'హార్ట్ సెంట్రిక్' పవర్, ఇది మిమ్మల్ని మనిషిగా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది.4. ఎంపతీని ఎలా బిల్డ్ చేయాలి?Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఈ సూపర్ పవర్ను ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం:Step 1: జడ్జిమెంట్ బ్రేక్ చేయండిఎదుటి వ్యక్తిని చూడగానే "వీడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు?" అని జడ్జ్ చేయడం మానేయండి. ఆ జడ్జిమెంట్ మీ మెదడులో పడితే, ఆ వ్యక్తిని అర్థం చేసుకునే అవకాశం పోతుంది. ఈ అహంకారాన్ని 'Break' చేయండి.Step 2: లిజనింగ్ స్పేస్వారు మాట్లాడుతున్నప్పుడు, మీ సమాధానం గురించి కాకుండా, వారు ఆ మాట ఎందుకు అంటున్నారో అని ఆలోచించండి. వారు ఏదైనా అంటున్నప్పుడు "నీకు అలా అనిపించడానికి కారణం ఏంటి?" అని అడగండి. ఇది మీకు వారి మనసులో ఒక స్థానాన్ని 'Build' చేస్తుంది.Step 3: యూనివర్సల్ కనెక్షన్ప్రతి వ్యక్తిలోనూ ఒక గాయం, ఒక ఆశ, ఒక భయం ఉంటాయి. ఎదుటివారిని చూసినప్పుడు వారి 'ముసుగు'ను కాకుండా, వారిలోని 'మనిషి'ని చూడటం మొదలుపెడితే, మీరు ఒక యూనివర్సల్ స్థాయికి చేరుకుంటారు. ఇదే 'Beyond' స్టేజ్.5. ఒక పరీక్ష!ఈ రోజు మీరు ఒక చిన్న పని చేయండి.మీకు నచ్చని వ్యక్తిని ఎంచుకోండి.ఆ వ్యక్తి స్థానంలో ఉండి, తన బాధను, తన కష్టాలను ఆలోచించడానికి ప్రయత్నించండి.మీకు అప్పుడూ కోపం వస్తోందా? లేక ఒక రకమైన అర్థం చేసుకునే భావం కలుగుతోందా?ప్రపంచం మీకు మిత్రులుగా మారుతుంది!బ్రో, ప్రపంచం లోని సమస్యలన్నీ మాయమవ్వాలంటే ఎంపతీ ఒక్కటే మార్గం. మీరు ఎంపతీని వాడినప్పుడల్లా మీరు ఎదుటివారిని గెలవడమే కాదు, మీ మనసును విస్తరించుకుంటున్నారు. ఇదే అసలైన లెగసీ!"Empathy is a bridge that connects the heart of one person to another."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: మీ మాట..మీ బాట) -
ఇస్మార్ట్ స్లీప్... హాయి హాయిగా
సుఖమెరుగని నిద్రకు సమస్యల కష్టాలు ఎదురవుతున్నాయి. ‘నాకు కంటినిండా నిద్రపడుతుంది’ అనే వాళ్లు అదృష్టవంతులయ్యారు. ఆరోగ్యంతో ముడి పడి ఉన్న నిద్ర ఈ డిజిటల్ కాలంలో నిర్లక్ష్యానికి గురవుతోంది. ఉరుకు పరుగుల మీద నిద్ర మన దగ్గరకు రావాలంటే మంత్రదండం ఏదీ అక్కర్లేదు, ఆ శక్తి మన దగ్గరే ఉంది. స్లీప్ టెక్ అనేది ఈ సంవత్సరం ప్రముఖ అంశాల్లో ఒకటిగా మారింది. స్లీప్ యాక్సెసరీలను కొనేవారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. యాంటి–స్నోరింగ్ టెక్నాలజీకిప్రాధాన్యత పెరుగుతోంది....హూప్ 5. ఓ బ్యాండ్ఇన్–డెప్త్ స్లీప్ ఇన్ఫర్మేషన్, పర్సనలైజ్డ్ రికమండేషన్లకు సంబందించి ఉపకరించే స్లీప్ ట్రాకర్...హూప్ 5.ఓ బ్యాండ్. బటన్లు, స్క్రీన్స్లాంటివేమీ లేకుండా సరళంగా ఉంటుంది. బ్యాండ్లోని ఎల్ఈడీ, బాడీ టెంపరేచర్ సెన్సర్లు, ఫొటో డియోడ్లు మన నిద్రకు సంబంధించి విలువైన సమాచారాన్ని అందిస్తాయి. ఆరోగ్యకరమైన అలవాట్లకు శ్రీకారం చుట్టడానికి ఇందులోని ఏఐ హూప్ కోచ్ ఉపయోగపడుతుంది. నిద్ర తక్కువైతే, స్లీప్ స్ట్రెస్కు గురవుతుంటే దాని నుంచి బయట పడి సుఖనిద్ర పోవడానికి ఈ ఏఐ కోచ్ అందించే వివరాలు ఉపయోగపడతాయి. ఫీచర్లు: స్లీప్, స్ట్రెయిన్ అండ్ రికవరీ, పర్సనలైజ్డ్ కోచింగ్, హార్ట్ రేట్ జోన్స్యాంటీ–స్నోరింగ్ గ్యాడ్జెట్స్స్లీప్ ట్రాకర్స్తోపాటు ‘స్మార్ట్స్లీప్ ఆప్నియా ఎయిడ్’లాంటి యాంటీ–స్నోరింగ్ టెక్నాలజీ గ్యాడ్జెట్లకుప్రాధాన్యత పెరిగింది. ఈ డివైజ్ గురకను నివారించడంలో సహాయపడడమే కాకుండా నిద్రనాణ్యతను మెరగుపరుస్తుంది. ‘బ్రీతింగ్ కరెక్షన్’లాంటి ఫీచర్లు ఉన్న ఈ పరికరాన్ని తేలికగా ఉపయోగించవచ్చు.గార్మిన్ ఫోర్రన్నర్ వితింగ్స్ వాచ్‘గార్మిన్ ఫోర్రన్నర్ 165’ స్లీప్ట్రాకర్లో స్లీప్ కోచ్, స్లీప్ స్కోర్, న్యాప్ డిటెక్షన్లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది స్లీప్ సైకిల్స్, రెస్ట్లెస్ మూమెంట్స్... మొదలైన వాటిని ట్రాక్ చేస్తుంది. ‘వితింగ్స్ వాచ్ 2’ అనేది హై–క్వాలిటీ స్లీప్ ట్రాకర్. తేలికగా, సౌకర్యవంతంగా ఉండే ఈ ట్రాకర్ సంప్రదాయ వాచ్లాగే కనిపిస్తుంది. రాత్రిపూట దృష్టి మరల్చే ఎల్ఈడీ స్క్రీన్కు దూరంగా ఉండాలనుకునేవారికి ఈ ట్రాకర్ సరైన ఎంపిక. దీని స్లీప్–ట్రాకింగ్ ఫీచర్లు మార్కెట్లో ఇతర స్మార్ట్ వాచ్ల మాదిరిగానే ఉంటాయి.ఆరా రింగ్సుఖనిద్రకు సంబంధించి ఆకర్షణీయమైన, ఆరోగ్యకరమైన ఎంపిక...ఆరా రింగ్. తేలికైన ఈ హైటెక్ పరికరం ‘స్లీప్ రీడింగ్స్’ను అందించడంతో పాటు ఇతర ఆరోగ్య అంశాలపై కూడా దృష్టి పెట్టి అప్రమత్తం చేస్తుంది. ప్రతిరోజూ నిద్ర లేవగానే స్లీప్ స్కోర్ చూసుకోవచ్చు. యాక్టివిటీని ఆటోమేటిక్గా ట్రాక్ చేస్తూ యాపిల్ హెల్త్, స్ట్రవ, గూగుల్ ఫిట్లాంటి యాప్లతో అనుసంధానం అవుతుంది. నిద్రను ట్రాక్ చేయడానికి, గురకను గుర్తించడానికి ఉపకరించి సౌకర్యవంతమైన స్మార్ట్ రింగ్....శాంసంగ్ గెలాక్సీ. నిద్రకు సంబంధించి విశ్లేషణతో పాటు వర్కవుట్లు, యాక్టివిటీస్, హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్, టెంపరేచర్లాంటి హెల్త్ మెట్రిక్స్ను ఆటోమేటిక్గా ట్రాక్ చేయడానికి శాంసంగ్ గెలాక్సీ రింగ్ ఉపకరిస్తుంది. స్నోర్ డిటెక్షన్, గెశ్చర్ కంపాటిబిలిటీలాంటి అదనపు ఫీచర్లు ఇందులో ఉన్నాయి.స్మార్ట్ దిండు... స్లీప్ మాస్క్!మరో ట్రెండ్...స్మార్ట్ స్లీప్ సపోర్ట్ సిస్టమ్. ఈ ట్రెండులో భాగంగా సంప్రదాయ దిండ్లను వాడకుండా, గాఢమైన నిద్ర కోసం మెడలు, వెన్నెముకకు సపోర్ట్ చేసే కంటోర్డ్, అడాప్టివ్ డిజైన్లను వాడుతున్నారు. ఉదాహరణకు... 3డీ ఆర్థోపెడిక్ నెక్ పిల్లో. ‘మెడనొప్పి, గురక సమస్యకు మా 3డీ ఆర్థోపెడిక్ నెక్ పిల్లో పరిష్కారం చూపుతుంది. హై–ఎలాస్టిక్, బ్రీతబుల్ మెమరీ ఫోమ్ నుంచి రూపొందించిన ఈ దిండు మెడకు సౌకర్యంగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది’ అని తెలియజేసింది కంపెనీ. స్లీప్ మాస్క్ అనేది నిద్ర ప్రేమికుల తప్పనిసరి అవసరం అయింది. పరిసరాల కాంతికి దూరంగా చీకటి వాతావరణంలో త్వరగా నిద్రపోవడానికి, నాణ్యమైన నిద్రకు, నిద్రలేమి చికిత్సకు ఈ మాస్క్లు ఉపయోగపడతాయి. -
నీలాల కన్నుల్లో మెలమెల్లగా....
బాగా నిద్ర పోండి... హాయిగా జీవించండి⇒ ప్రపంచ నిద్ర దినోత్సవం 2026 థీమ్: స్లీప్ వెల్, లివ్ బెటర్ శారీరక, మానసిక ఆరోగ్యానికి నాణ్యమైన నిద్ర అవసరం అని వరల్డ్ స్లీప్ సొసైటీ నొక్కి చెబుతోంది. ⇒ 3–3–3 రూల్ అనేది నిద్ర నాణ్యతను విశ్లేషించుకునే రూల్.⇒ ఒకటి... మూడు రోజులుగా మీకు సరిగా నిద్ర పట్టడం లేదా?⇒ రెండు... మూడు నెలలుగా మీకు సరిగా నిద్ర పట్టడం లేదా?⇒ మూడు... నిద్ర లేమి అనేది మూడు సమస్యల (అలసట, మూడ్ సరిగా లేకపోవడం, ఏకాగ్రత కుదరకపోవడం)కు కారణం అవుతుందా? అని ఎవరికి వారు విశ్లేషించుకోవడమే 3–3–3 రూల్.‘నిద్ర సుఖమెరగదు’ అని అంటారు గానీ...మొద్దు నిద్రకు మించిన భాగ్యం లేదని నిద్ర పట్టనివారు వగస్తుంటారు. ఎంత వైభవం ఉన్నా. కంటి నిండా నిద్ర... అసలైన భాగ్యం. అందుకే పెద్దలు ‘జోకొట్టే’ పాటలు పాడేవారు పసిపిల్లలకు. మరి పెద్దలకు? సినిమా పాటలు ఉన్నాయిగా. వినండి. కంటి నిండా నిద్రపోండి.‘నీలాల కన్నుల్లో మెలమెల్లగానిదురా రావమ్మ రావే నిండారా రావే’....నిద్రను కూడా బుజ్జగించి లాలించాలేమో. ముద్దు చేస్తూ ఆహ్వానించాలేమో. నిద్రను ప్రతి మనిషి తన మనసు పాదులో మొక్కలా చేసి రోజూ కాసిని నీళ్లు పోసి పెంచుకుంటూ రావాలేమో. పచ్చటి చెట్టులా అది ఎదిగితే కోరినన్ని నిద్రాఫలాలు ఇస్తుందేమో. రోజూ కొన్ని ఆరగించి బజ్జోవాలేమో.ఉన్నప్పుడు విలువ తెలీదు. లేనప్పుడు ఏం చేసినా పొందడానికి రాదు. కష్టాలు లేని జీవితం కోసం పోరాడాల్సిందే. మరి కలత ఎరుగని నిద్ర కోసం ఏం చేయాలి? పాట వినాలి.కరుణ లేని ఈ జగానా కలత నిదురే మేలురా...కలలు పండే కాలమంతా కనుల ముందే కదలిపోయేలేత మనసున చిగురుటాశ పూతలోనే రాలిపోయేనిదుర పోరా తమ్ముడా...ఎవరైనా ఉండాలి స్నేహానికో. మాట సాయానికో. మనసుకు దగ్గరగానో. మనెద పంచుకోవడానికో. ఉండాలి ఒకరు. మనల్ని గమనించి, మన కొరకు అక్కర ప్రదర్శించి వారొక ఆలంబనగా ఉంటా పాటగా ఉంటే నిదురెందుకు రాదు?పాడుతా తీయగా సల్లగాపసిపాపలా నిదురపో తల్లిగాబంగారు తల్లిగా...సడి సేయకో గాలి సడి సేయబోకేబడలి ఒడిలో రాజు పవళించెనేసడి సేయకో గాలి...శిశుర్వేత్తి పశుర్వేత్తి... గానం విలువ అది. పసిపాపకు జోల పాడితే జోలకు మాత్రమే కాదు నిదుర పట్టేది. పెరిగి పెద్దదయ్యి జీవన లాలిత్యం ఏర్పరుచుకుంటే అందుక్కూడా నిదురపడుతుంది. గాలి తగిలే శయ్య ఉంటే సరిపోదు.. స్వీయ జీవితంలోగాని, ఎదుటివారి జీవితంలోగాని తెలిసి తెలిసి కర్కశపు చప్పుళ్లు, సద్దులూ చేయకపోతే ఆ మనసుకు తప్పక హాయిగా నిదుర పడుతుంది.ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడుసద్దు చేశారంటే ఉలికులికి పడతాడు....అందాల పసిపాప అన్నయ్యకు కనుపాపబజ్జోవే బుజ్జాయి నేనున్నది నీ కొరకేనీకన్నా నాకెవరే...పసి పిల్లల్ని చూసినప్పుడు చిరునవ్వు మీకు రాలేదంటే మీకు నిదుర కూడా రాదు. సుకూమారమైనవి కదా కన్నులు. అంతటి సుకుమారమైన కన్నుల్లో నిదుర రావాలంటే ఎంతటి కరుణ మీలో ఉండాలి. జగతి పట్ల ఎంతటి కారుణ్యం కలిగి ఉండాలి.ముద్దుముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వుజాజిమల్లె పూవు బజ్జోమ్మ నువ్వు...నిదుర పట్టాలంటే స్థిమితత్వం కూడా ఉండాల్లేంటి. అంటే ఏమిటి? స్థితికి సంబంధించిన మంచి ఉద్యోగం, ఆస్తిపాస్తులు, చక్కటి కుటుంబం... ఇవి సరే. బాంధవ్యాలు? ఒకప్పటి బంధుత్వాలు ఇప్పుడు సన్నగిల్లిపోయాయి. తల్లిదండ్రులతో, అవ్వా తాతలతో కలిసి ఉండలేని స్థితి. పెదనాన్న, బాబాయి, మేనమామ, మేనత్త... వీరు మనకు ఉన్నారు అనే భావన కూడా మొద్దు నిద్ర పట్టడానికి మంచి టాబ్లెట్ ఏమో.అత్త ఒడి పువ్వు వలే మెత్తనమ్మాఆదమరిచి హాయిగా ఆడుకొమ్మాఆడుకొని ఆడుకొని అలసిపోతివాఅలుపుతీర బజ్జొమ్మ అందాల బొమ్మ...పిల్లల్ని బాగా పెంచుకోవాలి. ప్రేమగా అక్కున చేర్చుకోవాలి. వారి మంచి అలవాట్లు తల్లిదండ్రులకు మంచి నిద్ర. వారి పట్ల ఆర్తి, వారితో గడిపే సమయం తిరిగి మనల్ని సంతోష సమీరంగా తాకుతుంది. మన కోసం పాడి మురిపాల నిద్రను ప్రసాదిస్తుంది.పచ్చని చెట్టు ఒకటివెచ్చని చిలుకలు రెండుపాటలు పాడి జోకొట్టాలిజో...జో... జో...నిదుర రావడం లేదంటే అది కేవలం భౌతిక ఆరోగ్యానికి సంబంధించిన సంగతి కాదు. మీ నిద్ర మీ అందమైన ΄÷దరింట్లో ఉంది. తప్పులకు బలహీనతలకు వ్యసనాలకు లొంగని జీవనంలో ఉంది. మీరు నిలబెట్టుకునే బాంధ్యవాల్లో ఉంది. మీ మంచి స్నేహాల్లో ఉంది. మీ కళాభిరుచుల్లో ఉంది. పిసరంత సాయగుణం... చిటికెడంత ఆర్ద్రత... ఇవి ఉంటే నిదుర మీకే తోకాడించే బుజ్జి కుక్కపిల్ల.– కె -
కంటినిండా నిద్రకోసం...
కంటి నిండా నిద్రపట్టేందుకు ఈ కింది సూచనలు పాటించవచ్చు. ఈ ఏడాది స్లీప్ డే థీమ్ ‘స్లీప్ వెల్... లివ్ బెటర్’ అంటూ హాయిగా నిద్రపోతూ... చక్కగా జీవించడానికి ఈ కింద పేర్కొన్నవి అనుసరించడం మేలు.⇒ రోజూ ఒకే వేళకు నిద్రపోవడం, ఉదయం మళ్లీ వేళకు నిద్రలేవడం.⇒ బెడ్రూమ్ నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవడం.⇒ పడక గది మరీ చల్లగా అదేవిధంగా వురీ ఎక్కువ వేడిగా లేకుండా చూసుకోవడం.⇒ నిద్రవేళలో మరీ ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోడం. ఇలా గదిలో ఎక్కువ వెలుగు లేకుండా మసక చీకటి ఉన్నప్పుడు నిద్రలోకి జారుకునేలా చేసే ‘మెలటోనిన్’ అనే జీవరసాయనం విడుదల అవుతుంది. వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు ఇది వెలువడదు. అందుకే నిద్రపోవడాలనుకున్నవారు కళ్లపై ఏదైనా కప్పుకుంటారు.⇒ ΄÷గతాగడం, ఆల్కహాల్ తీసుకునే అలవాటుకు పూర్తిగా దూరంగా ఉండటం.⇒ సాయంత్రం ఆరు దాటాక కాఫీ, టీలతో పాటు కెఫిన్ ఉండే కూల్డ్రింక్స్కు దూరంగా ఉండటం.⇒ రాత్రిపూట నిద్రకు ముందర గోరువెచ్చని నీటితో స్నానం చేయడం.⇒ రాత్రి భోజనం త్వరగా భోజనం ముగించడం. మరీ కడుపు నిండుగా తినకపోవడం మేలు.⇒ నిద్రకు వుుందు టీవీలో ఉద్విగ్నభరితమైన లేదా ఉద్వేగాన్ని కలిగించే దృశ్యాలున్న సినివూలూ, సీరియళ్లు చూడకపోవడం. (వీలైతే బెడ్రూమ్లో టీవీ లేకుండా చూసుకోవడం మేలు. బెడ్రూమ్లో కూర్చుని పనిచేయకూడదు. పడకగదిని వర్క్ప్లేస్గా మార్చడం సరికాదు.⇒ రాత్రి వుంచి నిద్ర పట్టాలంటే పగలు కనీసం అరగంట సేపయినా పూర్తిస్థాయి పగటి వెలుగులో (డే లైట్) గడపడం మంచిది.⇒ నిద్రకు వుుందు హాయిగొలిపే ఆహ్లాదకరమైన లైట్ వు్యూజిక్ను వినడం మంచిది. రణగొణధ్వని ల్లాంటి వు్యూజిక్తో నిద్రపట్టదు.⇒ నిద్రకు ముందర గోరువెచ్చని పాలు తాగడం మంచిది. గోరువెచ్చని పాలలో ఉండే ‘ట్రి΄÷్టఫాన్’ అనే ఓ అసెన్షియల్ అమైనోయాసిడ్ నిద్ర పట్టేలా చేస్తుంది.⇒ నిద్రకు వుుందు పుస్తకాలు చదివితే కొందరికి నిద్ర వస్తుంది కానీ... అందులో ఉత్కంఠకు గురిచేసే ఆసక్తికరమైన విషయాలున్న పుస్తకాలు చదవద్దు. నిద్రపట్టడానికి ఉపకరించేందుకే పుస్తకపఠనం తోడ్పడాలి తప్ప నిద్రకు దూరం చేయకూడదు.⇒ వాకింగ్ వంటి వ్యాయమాలు చేయాలి. అయితే వాటిని ఉదయం వేళలోనే చేయడం మంచిది. రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు కఠిన వ్యాయామాలు చేయడం సరికాదు. నిద్రకు ముందు చేసే వ్యాయామాలతో ఒక్కోసారి నిద్రపట్టకపోవచ్చు.⇒ మంచి నిద్ర కోసం అనుసరించాల్సిన మంచి అలవాట్లను ‘స్లీప్ హైజీన్’గా పేర్కొంటారు. ఈ ‘స్లీప్ హైజీన్’ను అనుసరించడం వల్ల మంచి నిద్ర పడుతుంది. – యాసీన్ -
పేద గుండెల అందెల రవళి
మట్టిలో మాణిక్యాలకుప్రోత్సాహం తోడైతే ఎలాంటి ఫలితం వస్తుందో ఆచరణా త్మకంగా చూపిస్తోంది నృత్య పరిచయ్.ముంబైలోని మురికివాడలో నివసించే పేదింటి బిడ్డ మానస్ అహిరేకు డ్యాన్స్ నేర్చుకోవడం అనేది ఒకప్పుడు కలలో మాట. డ్యాన్స్ అంటే అతడికిప్రాణం. కాని చాలామంది పిల్లలలాగే మానస్ దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడానికి డబ్బు, సరైన వేదిక లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేషనల్ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్సీపీఏ) మానస్ కలను నిజం చేసింది. సంగీత నాటక అకాడమీ అవార్డ్ అందుకున్న లతసనాదేవి ఆధ్వర్యంలో మానస్ మణిపురి నేర్చుకోవడంప్రారంభించాడు. శిక్షణ ఉచితం. ఈ నృత్యశిక్షణ అభిరుచికి మాత్రమే కాదు క్రమశిక్షణ విషయంలోనూ మానస్లాంటి విద్యార్థులకు బాగా ఉపయోగపడింది. మూడు సంవత్సరాల డి΄÷్లమా పూర్తి చేసిన తరువాత, మానస్ అసిస్టెంట్ టీచర్గా ఎంపికయ్యాడు. ఈ ఉద్యోగం ద్వారా వచ్చే జీతం తన ఇంజినీరింగ్ చదువుకు ఉపయోగపడుతోంది. ‘నృత్యం నాలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’ అంటున్నాడు మానస్.‘ఎన్సీపీఏ’ నృత్య పరిచయ్ కార్యక్రమం ద్వారా పేదపిల్లలకు నృత్యంలో ఉచిత శిక్షణ ఇస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా మానస్లాంటి ఎంతోమంది పేదింటి పిల్లలు లబ్ధి పొందుతున్నారు. ముంబై శివారులోని నెరూల్కు చెందిన సిద్ది మాత్రే 2019లో తన నృత్యప్రస్థానాన్నిప్రారంభించింది. నెరూల్లోని ధ్యాన్దీప్ సేవా మండపంలో గురు శర్మిష్ఠ చటోపాధ్యాయ ఆధ్వర్యంలో ఒడిస్సీలో శిక్షణ పొందింది. ఇప్పుడు సిద్ధి అసిస్టెంట్ టీచర్గా పనిచేస్తోంది. ఖజురహో ఉత్సవంలో ఏడు వందల మంది విద్యార్థులతో కలిసి నృత్య ప్రదర్శన ఇవ్వనుంది సిద్ది మాత్రే.నృత్య పరిచయ్ కార్యక్రమంలో భాగంగా వెయ్యి మందికి పైగా పేదింటి విద్యార్థులు నృత్యం నేర్చుకున్నారు. ‘నృత్యం అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఆలోచన నుంచి పుట్టిందే నృత్య పరిచయ్’ అంటారు ఎన్సీపీఏ నృత్యవిభాగం అధిపతి స్వ΄్నోకల్పదాస్ గుప్తా.‘పిల్లలకు ప్రతిభ ఉండవచ్చు. సరిౖయెన ఆదరణ,ప్రోత్సాహం లేకపోతే తమ అభిరుచి నుంచి దూరం జరుగుతారు. దీన్ని నివారించడానికి నృత్య పరిచయ్ పేద పిల్లలకు చేరువ అవుతుంది’ అంటారు గుప్తా. నృత్యపరిచయ్తో పాటు ఎన్సీపీఏ ‘నృత్య గురుకుల్’ అనే అధునాతన మార్గదర్శక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ‘నృత్యగురుకుల్’ కార్యక్రమం క్రింద ఇరవైనాలుగు మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ప్రతిభ, అంకితభావం, నిబద్ధత ఆధారంగా ఎనిమిది మంది గురువులు వీరిని ఎంపిక చేశారు. మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులకుప్రాధాన్యత ఇస్తారు. -
గోల్ఫ్కి అమూల్యం
మాజీ ఐఆర్ఎస్ అధికారి, గోల్ఫ్ ప్రేమికుడు డాక్టర్ ఎన్ఆర్ఎన్ రెడ్డి టీ గోల్ఫ్ ఫౌండేషన్ స్థాపించి అమెచ్యూర్ గోల్ఫర్లనుప్రోత్సహిస్తున్నారు. టాలెంట్ ఉన్న ప్లేయర్లకు టోర్నీల్లో ఆడేందుకు వీలుగా టికెట్లు, వసతి సౌకర్యం వంటి వాటిని అందిస్తున్నారు.గోల్ఫ్ అంటే ఖరీదైన క్రీడ కదా మనకెందుకులే అని ఆమె అనుకోలేదు. రైతులం కదా అంతటి ఖరీదైన ఆటకు శిక్షణ ఇప్పించడం మన తరమవుతుందా అని ఆమె తల్లిదండ్రులూ వెనకడుగు వేయలేదు.. తండా అమ్మాయి కదా గోల్ఫ్కిప్రోత్సహించడం వల్ల ప్రయోజనం ఏముంటుంది అని ఆమె కోచ్ కూడా భావించలేదు. పట్టుదలతో ఆటపై పట్టు సాధిస్తే, అవకాశాలు వాటంతట అవే వస్తాయి అని ఆమె.. బిడ్డ ఆసక్తి, పట్టుదలే వెన్నుదన్నుగా నిలవడం ఖాయమని ఆమె తల్లిదండ్రులు.. వెన్నుతట్టిప్రోత్సహిస్తే ఆమె అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణి కావడం తథ్యమని ఆమె కోచ్ బలంగా విశ్వసించారు.వారి నమ్మకం నిజమైంది. తండా నుంచి వచ్చిన ఓ సాధారణ అమ్మాయి.. గోల్ఫ్లో అదరగొడుతోంది. ఎందరో దిగ్గజ గోల్ఫర్లను వెనక్కి నెట్టి ఇటీవల జరిగిన హైదరాబాద్ ఓపెన్ కప్ని కైవసం చేసుకుని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ట్రోఫీని అందుకుంది. ఆమె పేరు జి.అమూల్య. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం ఎర్ర సోమ్లా తండాకు చెందిన రైతులు జి.రవికుమార్, సునీత దంపతుల కుమార్తె. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతోంది.వాస్తవానికి మన దేశంలో బాగా క్రేజ్ ఉండేది క్రికెట్కే... తర్వాత బ్యాడ్మింటన్ , టెన్నిస్, హాకీ.. గత కొంతకాలంగా ఒలింపిక్స్ పతకాలు వస్తున్న రెజ్లింగ్, బాక్సింగ్, షూటింగ్ వంటి వాటినీ క్రీడాభిమానులు ఫాలో అవుతున్నారు. దీంతో చాలామంది తల్లిదండ్రులు దాదాపుగా ఇవే క్రీడల్లో తమ పిల్లలను ప్రోత్సహిస్తున్నారు. ధనవంతుల క్రీడగా భావించే గోల్ఫ్ పట్ల ఎవరూ ఆసక్తి చూపించరు. ఎందుకంటే ఈ ఆటలో ఉపయోగించే గోల్ఫ్ స్టిక్, బాల్స్ వంటివన్నీ ఇతర క్రీడలతో పోలిస్తే చాలా ఖరీదు. అయినా అమూల్య మాత్రం గోల్ఫ్ పై ఆసక్తి పెంచుకుంది.స్థానికంగా సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుతున్నప్పుడు ఆమెలో గోల్ఫ్ ఆటపై ఉన్న ఆసక్తిని, నైపుణ్యాన్ని కోచ్ భాస్కర్ గుర్తించారు. కెరీర్ ఆరంభం నుంచే అమూల్యను వెన్నుతట్టిప్రోత్సహించారు. రాష్ట్రస్థాయి, సౌత్ జోన్ లెవెల్ టోర్నీల్లో ఆడేలాప్రోత్సహించారు. అప్పటి సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అమూల్యను హైదరాబాద్ బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ కోర్సు, హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో శిక్షణ తీసుకునేలా సిఫార్సు చేశారు. ఈప్రోత్సాహానికి తగ్గట్టే అమూల్య పలు టోర్నీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా 2022–23 మధ్యలో పలు జూనియర్, సౌత్ జోన్ స్థాయి టోర్నీల్లో ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంది.మలుపు తిప్పిన హైదరాబాద్ ఓపెన్మాజీ ఐఆర్ఎస్ అధికారి, గోల్ఫ్ ప్రేమికుడు డాక్టర్ ఎన్ఆర్ఎన్ రెడ్డి టీ గోల్ఫ్ ఫౌండేషన్ స్థాపించి అమెచ్యూర్ గోల్ఫర్లనుప్రోత్సహిస్తున్నారు. టాలెంట్ ఉన్న ప్లేయర్లకు టోర్నీల్లో ఆడేందుకు వీలుగా టికెట్లు, వసతి సౌకర్యం వంటి వాటిని అందిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోనే తొలిసారి అమెచ్యూర్ గోల్ఫర్ల కోసం హైదరాబాద్ ఓపెన్ గోల్ఫ్ ఛాంపియన్ షిప్ పేరుతో జాతీయస్థాయి టోర్నీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా 300 మందికి పైగా గోల్ఫర్లు దీనిలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అమూల్య కూడా ఎన్ఆర్ఎన్ రెడ్డిని కలిసి టోర్నీలో ఆడతానని అడగడంతో.. ఆమె నేపథ్యం తెలుసుకున్న ఆయన ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా అవకాశమిచ్చారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అమూల్య క్వాలిఫైయింగ్ రౌండ్లో అదరగొట్టి, ప్రధాన రౌండ్లో పెద్ద పెద్ద గోల్ఫర్లను వెనక్కి నెట్టి ఓవరాల్ గ్రాస్ విన్నర్గా నిలిచింది. తద్వారా రూ.90వేల ప్రైజ్ మనీతో పాటు గవర్నర్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక హైదరాబాద్ ఓపెన్ ట్రోఫీ, గోల్ఫర్లు ధరించే గ్రీన్ జాకెట్ అందుకుంది. గోల్ఫ్ ట్రిప్ సంస్థ ద్వారా బ్యాంకాక్లో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్సులో ఆడే అవకాశాన్ని కూడా గెలుచుకుంది. గోల్ఫ్ కిట్ను టీ గోల్ఫ్ ఫౌండేషన్ అందించింది. భవిష్యత్తులో ఆమెకు ఎలాంటి సహకారం కావాలన్నా తమ ఫౌండేషన్ కు రావొచ్చని ఎన్ఆర్ఎన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఓ మారుమూల తండా నుంచి వచ్చి గోల్ప్ లో అదరగొడుతున్న అమూల్య భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. – సత్య కిషోర్ కొండ్రెడ్డి -
అంకిత అద్భుత విజయం
ఎప్పుడూ నడిచే దారిలో నడిస్తే కొత్తేముంది! కొత్త దారులు వెదకాలి. అప్పుడే కొత్త వెలుగు కనిపిస్తుంది. అలాంటి వెలుగును చూసింది అంజలి. ఇన్వెస్టర్గా ప్రయాణం ప్రారంభించిన అంజలి ఎంటర్ప్రెన్యూర్ కావాలనుకుంది. తన ఆలోచనలకు సృజన, శ్రమలను జోడించి విజయకేతనం ఎగరేసింది.కొన్ని నెలల క్రితంప్రారంభమైన 10–మినిట్ హోమ్ సర్వీసెస్ స్టార్టప్ 'ప్రొంటో’కు ఇన్వెస్టర్లు, వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. తక్షణ గృహ సహాయాన్ని ఆర్డర్ చేయడానికి వినియోగదారులకు 'ప్రొంటో’ వీలు కల్పిస్తుంది. బెంగళూరు కేంద్రంగా మొదలైన ఈ స్టార్టప్ ఆ తరువాత ఎన్నో నగరాలకు విస్తరించింది. 23 సంవత్సరాల అంజలి సర్దానా 'ప్రొంటో’కు వ్యవస్థాపకురాలు, సీయీవో.'ప్రొంటో’ అనేది శిక్షణ పొందిన డొమెస్టిక్ వర్కర్లతో వినియోగదారులను అనుసంధానించే వేదిక. వినియోగదారులు ఈ యాప్ ద్వారా స్వీపింగ్, పాత్రలు కడగడం, వంటగది, బాత్రూమ్ శుభ్రపర్చడం, లాండ్రీ... మొదలైన ఇంటి పనుల కోసం స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. మరిన్ని నగరాల్లోకి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్న'ప్రొంటో’ రాబోయే రోజుల్లో వంట, కార్ వాషింగ్, సెలూన్ సేవలపై కూడా దృష్టి పెట్టనుంది.భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సి రావడం, సుదీర్ఘమైన పనిగంటలు, బిజీ షెడ్యూల్స్ నేపథ్యంలో'ప్రొంటో’లాంటి హౌస్–హోల్డ్ యాప్లకు డిమాండ్ పెరుగుతోంది.ప్లాట్ఫామ్లో రోజుకు 18,000 బుకింగ్స్ జరుగుతున్నాయి. మంచి వేతనం,ప్రోత్సాహకాలు, నాణ్యతతో కూడిన పని విధానం ద్వారా పట్టణ భారతదేశంలో గృహ సేవలకు సంబంధించి కొత్త అధ్యయనాన్ని సృష్టించింది ప్రొంటో. పనుల ఒత్తిడిలో ఆఫీసులోనే నిద్రించడం నుంచి ఒక సంవత్సరం లోపు కంపెనీని పై స్థాయికి తీసుకువెళ్లడం వరకు అంజలి కృషి ఎంతో ఉంది. జార్జ్టౌన్ యూనివర్శిటీలో జీవశాస్త్రంలో డిగ్రీ చేసిన అంజలి బెయిన్ క్యాపిటల్, బీవిసిలలో ఇన్వెస్టర్గా పనిచేసింది. -
పప్పీని పెంచుకుంటారా?
గత కొంత కాలంగా నగరవ్యాప్తంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నిర్వహిస్తున్న వీధి శునకాల దత్తత కార్యక్రమం నెమ్మదిగా సత్ఫలితాలనిస్తోంది. ఈ శిబిరాలతో పాటు పలు మార్గాల ద్వారా స్ట్రీట్ డాగ్స్ను ఇంటికి తెచ్చి పెంచుకునేవారు పెరుగుతున్నారు. వాటితో తమకి చక్కని అనుబంధం ఏర్పడిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెట్స్గా ఎంచుకోవడానికి గొప్ప గొప్ప బ్రీడ్స్ మాత్రమే అవసరం లేదని, ఈ వీధి శునకాలు సైతం చక్కని తోడుగా మారతాయని అంటున్నారు. పిల్లలకు బాధ్యత నేర్పింది.. బషీర్బాగ్కు చెందిన డ్రైవర్ యాదగిరి జీహెచ్ఎంసీ (GHMC) వారాంతపు డ్రైవ్లో ఒక కుక్కని దత్తత తీసుకుని శంషాబాద్లోని తన మనవళ్లకు బహుమతిగా ఇచ్చాడు. ‘నేను వారికి అర్థవంతమైన బహుమతి ఇవ్వాలనుకున్నా. కేవలం కొన్ని రోజులు వాడి పడేసే బొమ్మ కాకుండా.. ప్రేమను నేర్పే కుక్కపిల్లని ఇచ్చాను. అప్పటి నుంచీ పిల్లలు దాంతో బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. దీనికి క్రమం తప్పకుండా పాలు, గుడ్లు తినిపిస్తున్నారు. అంతకు ముందు కన్నా చాలా బాధ్యతగా మారారు’ అని యాదగిరి అంటున్నారు. వీధుల్లో నుంచి ఆ శునకం సరాసరిగా తమ ఇంట్లోకి కొత్త ఉత్సాహాన్ని తెచ్చిందని అంటున్నారాయన.గ్రహణశక్తి అమోఘం.. ‘ఇది చాలా త్వరగా మమ్మల్ని అర్థం చేసుకుంది. మేం పెద్దగా శిక్షణ ఇవ్వకపోయినా మాతో పాటు మంచం మీద పడుకుంటుంది.. బాత్రూమ్ ఉపయోగించాల్సిన అవసరం వచ్చినప్పుడల్లా బయటకు వెళ్తుంది’ అని శ్రీనివాస్ వెల్లడించాడు. 12 మంది కుటుంబ సభ్యులు ఉన్న శ్రీనివాస్ ఉమ్మడి కుటుంబంలో పప్పీ అందరికీ చేరువగా మారింది. ‘పిల్లలు వృద్ధులతో సహా మాలో ఎనిమిది మంది దాని బాగోగులు చూసుకుంటున్నాం. పాలు, పెరుగు అన్నంతో పాటు పెట్ ఫుడ్ అందిస్తున్నాం’ అంటూ శ్రీనివాస్ చెబుతున్నాడు.నీడనివ్వాలి అనుకున్నా.. ‘చాలాసార్లు, దారినపోయే వీధి కుక్కలపై చిన్నా పెద్దా తేడా లేకుండా రాళ్లు విసరడం, వాటితో ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం చూసి బాధ కలిగేది. కనీసం వాటిలో ఒకదానికైనా సురక్షితమైన నీడ ఇవ్వాలని అనిపించింది’ అని గుర్తు చేసుకున్నారు రాయ్. దాదాపు ఎనిమిది నెలల క్రితం ఓ కుక్కని ఇస్నాపూర్ నుంచి ఇంటికి తీసుకొచ్చానని చెప్పారు. ‘మొదట నెల పాటు సింబా (కుక్కకి పెట్టుకున్న పేరు) మాతో మమేకం కావడానికి సమయం తీసుకుంది. వీధుల్లో స్వేచ్ఛగా సంచరించేది కావడంతో.. నాలుగ్గోడల మధ్య సర్దుబాటు చేసుకోవడం కొంచెం కష్టమైంది.. క్రమంగా స్వేచ్ఛగా తిరగడం ప్రారంభించింది. ఇప్పుడు మాతో ఎంతో ఆప్యాయంగా ఉంటోంది గొప్ప రక్షణగా మారింది. వచ్చే వరకూ మా కోసం తలుపు దగ్గర వేచి ఉంటుంది’ అని రాయ్ ఆనందం వ్యక్తం చేశారు.ఆమెకు తోడు.. ముచ్చటగా మూడు.. నగరంలో ఓ స్టార్టప్ నిర్వాహకురాలైన ఆశా టంపాకు, ఇండీ కుక్కలను దత్తత తీసుకోవడం ఒక జీవన విధానంగా మారింది. నా మూడు కుక్కలు ఒకప్పుడు వీధి కుక్కలే. వాటి సంరక్షణకు సురక్షితమైన స్థలం అవసరం’ అని ఆమె అంటున్నారు. అలా ఆశా దత్తత తీసుకున్న మూడో వీధి కుక్క పేరు ‘కూపర్’. దాదాపు సంవత్సరం క్రితం, ఓ ఎన్జీఓ నుంచి రెండు నెలల వయసున్న వీధి కుక్క.. ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. పరిస్థితి విషమంగా ఉందని సమాచారం తెలిసింది. ఎవరు జోక్యం చేసుకోకపోయినా బ్రతికేది కాదు. దానికి వెంటనే వైద్య సహాయం సరైన చికిత్స అందించాను. ప్రస్తుతం కూపర్ ఆరోగ్యంగా, ఉల్లాసంగా మాతో గాఢమైన అనుబంధాన్ని ఏర్పరుచుకుంది. నా స్నేహితులతో కలిసిపోతూ ఆడుకుంటుంది’ అని కూపర్ ముచ్చట్లు పంచుకున్నారు.ఇవి గుర్తుంచుకోండి.. ⇒ వీధి కుక్కలను దత్తత తీసుకోవడం, వాటికి భద్రత కలిగిన శాశ్వత నివాసాన్ని అందించడం ఓ సబబైన మార్గం. అదే విధంగా రోజువారీ పనుల ద్వారా వాటికి ఆసరా అందించాలి. ⇒ దయచేసి కుక్కలపై రాళ్లు రువ్వడం చేయవద్దు. మనం కేవలం కుక్కకు ఒక రొట్టె ముక్క, ఒక పిడికెడు అన్నం పెడితే చాలు, అవి మన కోసం తమ ప్రాణాలను ఇస్తాయి. ⇒ కారంగా ఉన్న, మనం తినగా మిగిలిపోయిన ఆహార పదార్థాలను వాటికి తినిపించవద్దు. వాటి కోసం ప్రత్యేక ఆహారాన్ని అందించాలి. ⇒ నగర వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర తేడాలు ఏర్పడినప్పుడు ప్రజలు వాటికి తమ ఇళ్లలో ఆశ్రయం ఇవ్వాలి. ⇒ వీధికుక్కల సంఖ్య భారీగా పెరగకుండా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ స్థానిక అధికారులతో సహకరించాలి. అలాగే వీధి కుక్కలను క్రిమిరహితం చేయడానికి కూడా. ⇒ జంతువుల పట్ల కరుణ చూపడాన్ని పిల్లలకు నేర్పించాలి. తల్లిదండ్రులు తమ పిల్లలను తరచూ డాగ్ షెల్టర్లకు తీసుకెళ్లాలని సుధామూర్తి (Sudha Murthy) సూచించారు. వీధికుక్కల పట్ల నిర్దయ వద్దు.. ‘జంతువులు సైతం మన సమాజంలో అంతర్భాగమే. వీధి కుక్కల పట్ల సానుభూతి చూపాలి. నా పెంపుడు శునకమైన గోపి గురించి అనేక పుస్తకాలు రాశా. నిరంతర సహచరుడైన గోపీకి, నాకంటే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. శీతాకాలంలో గోపికి పలువురు చిన్నారులు శాలువాలు పంపుతారు. మైసూరు దసరా వేడుకల సమయంలో సన్మానిస్తారు.’ అంటూ గోపితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. – సుధామూర్తి, రచయిత్రి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ఫిల్మ్ నగర్కు చెందిన పాఠశాల విద్యార్థి ఆర్ శ్రీనివాస్ గత శనివారం కేబీఆర్ పార్కులో (KBR Park) జరిగిన కార్యక్రమంలో ఒక ఇండీని దత్తత తీసుకున్నాడు. ‘మేం తొలుత దీన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు, టీకా ప్రభావం కారణంగా నీరసంగా ఉంది. మొదటి రెండు రోజులు, చాలా ఎక్కువగా నిద్రపోయింది. కానీ మూడు రోజుల్లోనే పూర్తిగా కోలుకుని చురుకుగా మారింది. దాని గ్రహణ శక్తి తమని ఆశ్చర్యపరుస్తోంది’ అని అంటున్నాడు. చదవండి: హైదరాబాద్లో మితిమీరిన సోషల్ మీడియా వినియోగంబీరంగూడకు చెందిన ఐటీ ప్రొఫెషనల్ రాయ్ ఇటీవలే ఒక ఇండీ డాగ్ని దత్తత తీసుకున్నారు. ‘ఇండీ కుక్కపిల్లని దత్తత తీసుకోవడం మా ఉత్తమ నిర్ణయాల్లో ఒకటి. వాటికి ప్రేమ, సమయం మాత్రమే అవసరం. అవి మనల్ని విశ్వసించిన తర్వాత, మనం ఇచ్చిన దానికన్నా ఎక్కువగానే తిరిగి ఇస్తాయి’ అంటారాయన. – సాక్షి, సిటీబ్యూరో -
లంబోర్గిని... పక్కా లోకల్!
లంబోర్గిని కారు అనేది సామాన్యులకు అందనంత ఎత్తులో ఉంటుంది. మరి అలాంటి అతి ఖరీదైన కారులో రయ్ రయ్మని రోడ్డుపై దూసుకుపోతున్నాడు జార్ఖండ్లోని చండిల్ అనే చిన్న గ్రామానికి చెందిన మెకానిక్. అతడికి లాటరీలో కోట్ల రూ΄ాయలు ఏమైనా వచ్చాయా? అబ్బే... అంత సీన్ లేదు. ఇంతకీ ఏం జరిగింది అంటే...ఆరీఫ్ అనే మెకానిక్ మారుతి 800 కారును అచ్చం లంబోర్గిని కారులా తీర్చిదిద్దాడు. అది పూర్వజన్మలో మారుతి 800 అంటే నమ్మడానికి సంకోచించేంతగా మాయ చేశాడు. కటింగ్, వెల్డింగ్, ప్యానెల్ డిజైన్ చేసిన అతడి సాంకేతిక చాతుర్యానికి నెటిజనులు ప్రశంసల వాన కురిపిస్తున్నారు. -
వెల్నెస్ డ్రింక్స్ మంచివేనా?
ఇటీవల కొన్ని పోషకాహార పదార్థాలూ, ఖనిజ లవణాలతో కూడిన పదార్థాలు చేర్చిన పానీయాలు చాలా ఎక్కువ ్రపాచుర్యం పొందుతున్నాయి . వీటినే వెల్నెస్ డ్రింక్స్గా పేర్కొంటున్నారు. మంచి ఆరోగ్యం కోసం వీటిని తీసుకోవాలంటూ కొంతమంది ఆహార నిపుణులు సిఫార్సు చేస్తున్నారు కూడా. అయితే కొందరు మాత్రం వీటితో చాలా ఆరోగ్య ప్రయోజనాలుంటాయంటూ పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ వెల్నెస్ డ్రింక్స్ తీసుకోవడం ఏ మేరకు ప్రయోజనం... ఎంత వరకు సహాయపడతాయనే అంశాలను పరిశీలిద్దాం...మాక్టెయిల్స్ పేరిట మంచి రుచికరమైన పానీయాలు ఎప్పటినుంచో ఉన్నవే. కాకపోతే ఇటీవల వెల్నెస్ డ్రింక్స్ ట్రెండింగ్ అవుతున్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్స్లో ఈ వెల్నెస్ డ్రింక్స్ అవి తయారు చేసే పద్ధతులను పెడుతూ, వాటిని తీసుకుంటే ఆరోగ్యమూ, వ్యాధినిరోధక శక్తి సమకూరతాయంటూ చెబుతున్నారు. వాటి తాలూకు ఉపయోగాలూ, పరిమితులు చూద్దాం...వీటిల్లో ఏముంటాయంటే... మామూలు మాక్టెయిల్స్లో సాధారణ సోడా డ్రింక్స్తో పాటు అనేక రకాల రుచికరమైన ఎసెన్స్లను కలిపి తయారు చేస్తారు. ఒకటికంటే ఎక్కువ ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టే మాక్టెయిల్స్ అని పిలుస్తారు. అయితే వీటిల్లో ఆరోగ్యానికి తోడ్పడే విటమిన్లు, ఖనిజలవణాలూ, యాంటీ ఆక్సిడెంట్స్,ప్రోబయాటిక్స్, కొబ్బరినీళ్లు, గ్రీన్ టీ...లతో పాటు... పసుపు, అల్లం, కొలాజెన్, అడాప్టోజెన్స్ సమృద్ధిగా ఉండే పదార్థాలు వాడతారు. అడాప్టోజెన్స్ అంటే మొక్కల నుంచి లభ్యమయ్యే మెడిసినల్ విలువలుండే రకరకాల పదార్థాలు. వీటిని తీసుకోగానే ఒక ఆనందకరమైన భావన (యుఫోరియా ఫీలింగ్) కలుగుతుంది. ఉదాహరణకు... కొబ్బరినీరు తీసుకోగానే కలిగిన మంచి ఫీలింగ్స్ లాంటివి. అల్లం వాడగానే గొంతులోని శ్లేష్మం వదిలిపోయిన భావనల్లాంటివి.ప్రధానంగా మెగ్నీషియమ్ డ్రింక్స్... ఈ వెల్నెస్ డ్రింక్స్లో ప్రధానంగా మెగ్నీషియమ్తో చేసినవి ఎక్కువగా వాడుతుంటారు. ఎందుకంటే మెగ్నీషియమ్ లవణాలు మెదడును ప్రశాంతంగా ఉండే న్యూరో ట్రాన్స్మిటర్ అయిన ‘గాబా’ (గాబా అమైనో బ్యూటెరిక్ యాసిడ్కు సంక్షిప్త రూపం)ను క్రియాశీలం చేయడం ద్వారా మెదడును... తద్వారా మనసును ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి. దాంతో దేహం ‘రెస్ట్ అండ్ రిపేర్’ మోడ్లోకి వెళ్తుందన్నది నిపుణుల మాట. ఇలా మెగ్నీషియమ్ ప్రధానంగా ఉండేవాటిల్లో కొన్ని...∙మెగ్నిషియమ్ గ్లైసినేట్ ప్రధానంగా ఉన్నవి మంచి నిద్రపట్టడానికీ, యంగై్జటీ తగ్గడానికీ ∙మెగ్నీషియమ్ టారేట్ ఉన్నవి నరాల వ్యవస్థను ఎగై్జట్ కాకుండా కామ్గా ఉంచడానికీ ∙మెగ్నీషియమ్ సిట్రేట్ ఉన్నవి బాగా నిద్రపట్టడంతో పాటు తేలిగ్గా విరేచనమయ్యేలా చేసి మలబద్ధకం తొలగించడానికి ఉపయోగపడతాయి.ఏయే పదార్థాలతో తయారు చేస్తారంటే... సాధారణంగా పింక్ రంగులో చాలా కలర్ఫుల్గా ఉండే ఈ డ్రింక్స్లో టార్ట్ చెర్రీ జ్యూస్, మాగ్నీషియం ΄÷డి, స్పార్క్లింగ్ వాటర్తో తయారు చేస్తారు. వీటిల్లో మెగ్నీషియమ్ ఖనిజాలే కాకుండా అరటిపండ్లు, కివీ పండ్లు, అవకాడో పండ్లు, ఆకుకూరలలో పాలకూర (స్పినాచ్) వంటివీ ఉపయోగిస్తారు. పాలు కూడా ఉపయోగిస్తారు. ఉదాహరణకు పాలలో ఉండే ‘ట్రి΄÷్టఫాన్’ అనే అమైనో యాసిడ్ నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ అనే మెదడు రసాయనాన్ని స్రవింపజేసి హాయిగొలిపే నిద్రను ఇస్తుంది. అలాగే పండ్లతో కూడిన ఈ వెల్నెస్ డ్రింక్స్లో స్వాభావికంగా దొరికే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్ ఉండటంతో ఆరోగ్య నిర్వహణకు బాగానే తోడ్పతాయి.ఆహార నిపుణులఅభిప్రాయాల మేరకు... ప్రయోజనాలేమిటంటే... మెగ్నీషియమ్ లవణాలూ, ఖనిజాలూ, విటమిన్ బి–12, ఐరన్ వంటి పోషకాలూ, ఆహారంలో లభ్యమయ్యే పీచు (ఫైబర్)లు స్వాభావికమైన పదార్థాలతోనే సమకూరడం వల్ల ఈ పోషకాలన్నీ సప్లిమెంట్లలా మనకు మామూలుగా దొరుకుతాయి. దాంతో ఆ ఆహార లోపాలేవైనా (విటమిన్ / మినరల్ డెఫిషియెన్సీస్) ఉంటే అవి నేచురల్గానే భర్తీ అవుతాయి. ఇకప్రోబయాటిక్స్ వంటి వాటివల్ల జీర్ణకోశ ఆరోగ్యం (గట్–హెల్త్) మెరుగుపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పానీయాలతో దేహంలోని సెల్ రిపేర్స్ జరుగుతుంటాయి. తీవ్రమైన ఒత్తిడిలో పనిచేసేవారికీ, సరైన నిద్రలేనివారికి ఇవి కొంతవరకు తోడ్పడతాయి.పరిమితులేమిటంటే... ఈ వెల్నెస్ డ్రింక్స్ అన్నవి మామూలుగా పోషకలోపాలు ఉన్నవారికి ఇచ్చే ‘న్యూట్రస్యూటికల్ మెడిసిన్స్’ లాంటివే. అంటే విటమిన్ సప్లిమెంట్ల మాదిరిగానే పనిచేస్తాయి. అయితే మంచి పోషకాహారం తీసుకుంటూ, కంటినిండా నిద్రపోతూ, సరైన వ్యాయామం చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఇవి అదనంగా సమకూరుతూ దేహ ఆరోగ్యాన్ని కొంతమేరకు బూస్ట్ చేయడానికి పనికి వస్తాయి. అంతే తప్ప... మిగతా పోషకాహారాలకూ, వ్యాయామలేమికీ ఇవి ప్రత్యామ్నాయంగా గానీ లేదా కొన్ని ఆరోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారాలుగా పనిచేయవు. కాకపోతే వీటివల్ల నష్టమేదీ లేనందున అదనంగా తీసుకోవడంలో తప్పేమీ ఉండదు. వెల్నెస్ డ్రింక్స్ అనేవి ఆరోగ్యకరమైన జీవనశైలికి కొంతమేరకు తోడ్పడవచ్చు గానీ అవి మాత్రమే మన ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చివేయలేవని గుర్తించాలం’’టూ ఆహార నిపుణులు పేర్కొంటున్నారు.నిర్వహణ: యాసీన్ -
అగ్రస్థానానికి ఆమడ దూరంలో...
విద్య, శాస్త్ర సాంకేతికత వంటి అన్ని రంగాల్లోనూ మహిళలు దూసుకుపోతున్నప్పటికీ కంపెనీల అగ్రస్థానాల్లో మాత్రం వారి ప్రాతినిధ్యం నత్తనడక నడుస్తోందనే చెప్పాలి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ –2025తో పాటు, ఇటీవల నిర్వహించిన ‘ఆన్’ సర్వే నివేదికలలో ఆందోళనకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నైపుణ్యం ఉన్నప్పటికీ సంస్థల్లోని పక్షపాత ధోరణి వల్లే మహిళలు టాప్ రోల్స్కి చేరుకోలేకపోతున్నారని ఈ అధ్యయనాలు తెలుపుతున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్– 2025, మెకిన్సే, లింక్డ్ ఇన్ నివేదికల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వం సిద్ధించాలంటే మరో 123 ఏళ్లు పడుతుందని అంచనా. కంపెనీల్లో ప్రతి 100 మందిలో 81 మందికి పురుషులకు మేనేజర్గా ప్రమోషన్ వస్తుంటే, మహిళల్లో కేవలం మాత్రమే 19 మందికి మాత్రమే ఆ అవకాశం దక్కుతోంది. దీనినే నిపుణులు ‘బ్రోకెన్ రంగ్’ (విరిగిన నిచ్చెన మెట్టు) అని పిలుస్తున్నారు. ్రపారంభ దశలోనే ఎదురయ్యే ఈ అడ్డంకి వల్ల ఉన్నతస్థాయికి వెళ్లే మహిళల సంఖ్య తగ్గిపోతోంది.ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థల అత్యున్నత పదవుల్లో (సీఈవో, సీఎఫ్వో) మహిళల వాటా కేవలం 29% మాత్రమే ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఇందులో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. ‘ఆన్’ సర్వే ప్రకారం 50 ఏళ్ల వయస్సు వచ్చేసరికి, కేవలం 20% మంది మహిళలు మాత్రమే (ఐదుగురిలో ఒకరు) ఉన్నత స్థాయి పదవులకు చేరుకోగలుగుతున్నారు. అదే పురుషులలో దాదాపు సగం మంది అంటే 50% మంది ఉన్నత పదవులను అధిరోహిస్తున్నారు. కెరీర్ మొదట్లో మహిళల భాగస్వామ్యం 48% ఉండగా, సీనియర్ స్థాయికి వచ్చేసరికి అది 27 శాతానికి పడిపోతోంది. వేతన సమానత్వానికి వస్తే పురుషుడు 100 రూపాయలు సంపాదిస్తుంటే, అదే పనికి మహిళ 84 రూపాయలు మాత్రమే పోందుతోంది. అంటే ప్రతి వంద రూపాయలలో మహిళ 16 రూపాయలను నష్టపోతోంది. ఈ వ్యత్యాసం కేవలం అంకెలకు సంబంధించినది మాత్రమే కాదు. వారి ఆర్థిక స్వేచ్ఛను, పోందుపును కూడా ప్రభావితం చేస్తోంది. 2 ఇక వేతన వ్యత్యాసానికి వస్తే... ఒకసారి బ్రేక్ తీసుకున్న తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరినప్పుడు, అదే అనుభవం ఉన్న పురుషుల కంటే మహిళలు 20–30% తక్కువ వేతనాన్ని పోందుతున్నారు.2 ప్రపంచవ్యాప్తంగా కేవలం 27 దేశాలకు మాత్రమే మహిళలు దేశాధినేతలుగా ఉన్నారు.2 భారత కార్పొరేట్ రంగంలో బోర్డు మెంబర్లలో మహిళల వాటా కేవలం 20% మాత్రమే. కన్స్ట్రక్షన్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో నాయకత్వ పదవుల్లో మహిళలు 12 నుంచి 15 శాతానికి మించి లేరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పురుషులతో పోలిస్తే మహిళలకు శిక్షణ, ్రపోత్సాహం 12% తక్కువగా అందుతోంది.2 మహిళల్లో దాదాపు 70 శాతం మంది తమ పిల్లల పెంపకం, కుటుంబ అవసరాల కోసం కెరీర్లో విరామం తీసుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ విరామం వల్ల వారి కెరీర్ గ్రాఫ్ పడిపోవడమే కాకుండా, వేతనాల్లోనూ కోత తప్పట్లేదు.2 కంపెనీల్లో సపోర్టింగ్ రోల్స్లో మహిళలు (60%) కనిపిస్తున్నప్పటికీ, కీలక విభాగాల్లో మహిళల ్రపాతినిధ్యం 15% కంటే తక్కువ.2 అంతర్గత ప్రమోషన్ల విషయంలో వివక్ష ఎదురవడంతో, మహిళలు తమ ఎదుగుదల కోసం పురుషుల కంటే 1.5 రెట్లు ఎక్కువగా ఉద్యోగాలు మారాల్సి వస్తోంది.ఈ గణాంకాలు కేవలం సంఖ్యలు మాత్రమే కాదు, పని ప్రదేశాల్లో మారాల్సిన సంస్కృతికి నిదర్శనం. కంపెనీలు ఫ్లెక్సిబుల్ పని గంటలు, సమాన వేతనం, కీలక విభాగాల్లో మహిళలకు ్రపాధాన్యత ఇచ్చినప్పుడే ఈ వ్యత్యాసం తగ్గుతుంది. -
మార్చి ప్రత్యేకం: విశ్వం మెచ్చిన వింత పూలు
ప్రకృతి ఒడిలో వసంత కాల ఆగమనం సరికొత్త శోభను సంతరించుకుంది. గడ్డకట్టే చలికాలానికి వీడ్కోలు పలుకుతూ, వేసవికి స్వాగతం పలికే మార్చి నెల భూలోకానికి రంగుల అద్దినట్లుగా రూపుదిద్దుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఈ నెలలోనే వికసించే కొన్ని అరుదైన, అత్యంత సుందరమైన పుష్పాలు అందరినీ మంత్రముగ్ధులను చేస్తున్నాయి. తోటలు, పార్కులు, పచ్చని మైదానాలు ఈ వర్ణరంజిత కుసుమాలతో కొత్త పెళ్లికూతురిలా ముస్తాబయ్యాయి.ఆకులు రావడానికి ముందే పూలువసంతానికి తొలి సంకేతం ఫోర్సిథియా. దక్షిణ కొరియా, చైనా దేశాల్లో ఈ పుష్పాలు విరిసే మొక్కలు విరివిగా కనిపిస్తాయి. వీటి ప్రత్యేకత ఏమిటంటే ఆకులు రాకముందే కొమ్మల నిండా పసుపు పచ్చని పూలు వికసిస్తాయి. దూరం నుంచి చూస్తే చెట్లన్నీ బంగారు వర్ణపు కంచెలా మెరిసిపోతూ పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తాయి. ఆకులు లేని కొమ్మలపై కేవలం పూలు మాత్రమే కనిపించడం ఎంతో అద్భుతంగా ఉంటుంది.ప్రకృతి నాట్యంమధ్యధరా ప్రాంతంలో కనిపించే ఈ పూలను 'పాపీ అనెమోన్' అని కూడా పిలుస్తారు. ఎరుపు, ఊదా, నీలం, తెలుపు రంగుల్లో వికసించే ఈ పూలు వసంతకాలపు ప్రారంభంలో పొలాలను ఒక రంగుల లోకంలా మారుస్తాయి. వీటి సున్నితమైన రేకులు, మధ్యలో ఉండే నల్లని భాగం ప్రకృతి ఆరాధకులకు కనువిందు చేస్తాయి. గాలికి ఊగే ఈ పూల రేకులు చూస్తుంటే ప్రకృతి నాట్యం చేస్తున్నట్లు అనిపిస్తుంది.భువిపై నీలి మేఘాలుసాధారణంగా మే నెలలో వికసించే జకరండా పూలు, కొన్ని ప్రాంతాల్లో మార్చి నుంచే సందడి చేస్తాయి. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా తదితర నగరాల్లో వీధులన్నీ ఊదా రంగు పూలతో నిండిపోయి, భూమిపై నీలి మేఘాలు పరుచుకున్నాయా అన్న భ్రమను కలిగిస్తాయి. రాలిపడిన పూలతో రహదారులు పర్పుల్ రంగు తివాచీ పరిచినట్లుగా మారిపోయి, పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి.అడవిలో సిగ్గుపడే పుష్పాలువీటిని 'లెంటెన్ రోజ్' అని కూడా పిలుస్తారు. యూరప్లోని అటవీ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. తెలుపు, పింక్, ఆకుపచ్చ తదితర విలక్షణ రంగుల్లో వికసించే ఈ పూలు మార్చి నెలలో తమ పూర్తి సౌందర్యాన్ని సంతరించుకుంటాయి. మంచు వాతావరణాన్ని కూడా తట్టుకుని నిలబడే శక్తి వీటికి ఉండటం విశేషం. ఇవి కొంచెం కిందికి వంగి ఉండటం వల్ల వీటిని ‘సిగ్గుపడే పుష్పాలు’ అని కూడా అంటుంటారు.జీవవైవిధ్యానికి ప్రతీకగా..అమెరికా, చైనాల్లో మార్చి నెలలో మగ్నోలియా చెట్లు పూలతో నిండిపోతాయి. పెద్ద పరిమాణంలో ఉండే ఈ పూలు అద్భుతమైన సువాసనను వెదజల్లుతాయి. మరోవైపు జపాన్, కొరియా దేశాల్లో 'గులాబీ'ని పోలి ఉండే కెమిలియా పుష్పాలు పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. రాజసం ఉట్టిపడే ఈ పుష్పాలు కేవలం అందానికే పరిమితం కాకుండా, జీవవైవిధ్యానికి, పర్యావరణ సమతుల్యతకు చిహ్నాలుగా నిలుస్తున్నాయి.ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర అలవాటు? -
మనుషుల కోసమే నియమాలు... నియమాల కోసం మనుషులు కాదు!
డాక్టర్ గారు, నా భర్త వయసు నలభై ఐదు సంవత్సరాలు. ఆయన ఒక మెడికల్ కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. ఆయన చిన్నప్పటి నుంచే చాలా ‘పర్ఫెక్షనిస్ట్’ స్వభావం కలిగిన వ్యక్తి. ప్రతి పని సమయానికి జరగాలని గట్టిగా పట్టుబడతారు. ఆయనతో పనిచేసే ఉద్యోగులు లేదా స్టూడెంట్స్ ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా వారిపై కోపంగా అరుస్తారు. అలాగే కాలేజీలో ఎవరైనా తప్పులు చేస్తున్నారని అనిపిస్తే వెంటనే ప్రిన్సిపాల్కు; ఒక్కోసారి ప్రిన్సిపాల్ గురించి పై అధికారులకూ ఫిర్యాదు చేస్తుంటారు. అందువల్ల అందరూ ఆయనను దూరంగా ఉంచుతున్నారు. ఆహారం విషయంలో కూడా క్యాలరీలు, పోషక విలువలు ఒక్కొక్కటి జాగ్రత్తగా పరిశీలించి మాత్రమే తింటారు. ఖర్చు చేసే ప్రతి పైసాను లెక్కపెడతారు. ఆయనకు స్నేహితులు లేదా సామాజిక జీవితం దాదాపు లేవు. ఇంట్లో పిల్లలకు గానీ, బయటివారికి గానీ చిన్న విషయాలకే ఉపన్యాసాలు ఇస్తుంటారు. దాంతో మా కుటుంబ జీవితంలోనూ, ఆయన ఉద్యోగ జీవితంలోనూ అనేక సమస్యలు వస్తున్నాయి. అయినప్పటికీ ఆయన మాత్రం తాను మారాల్సిన అవసరం లేదని, ఈ ప్రపంచమే మారాలని భావిస్తున్నారు. డాక్టర్ గారు, ఇది ఏమైనా సమస్యేనంటారా? లేక నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నానా? మాకు సరైన మార్గదర్శకత్వం ఇవ్వండి. ప్లీజ్.– కవిత, బెంగుళూరుమీ ప్రశ్నను చూసిన తరువాత ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. మీరు ఖచ్చితంగా ఎక్కువగా ఆలోచించడం లేదు. మీరు మీ భర్త గారి గురించి రాసిన లక్షణాలు చాలా వరకు ‘‘అబ్సెస్సివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిసార్డర్’’ అనే వ్యక్తిత్వ లోపం సమస్యకు సంబంధించినవిగా కనిపిస్తున్నాయి. ఇది సుమారుగా వంద మందిలో ముగ్గురికి కనిపించవచ్చు. ఇది చాలా సాధారణంగా కనిపించే వ్యక్తిత్వ విధానం. పురుషులలో కొంత ఎక్కువగా ఈ మనస్తత్వం కనిపిస్తుంది. ఇది జెనెటిక్ కారణాల వల్ల రావచ్చు లేదా పెరిగిన వాతావరణ ప్రభావంతో రావచ్చు. చిన్నవయసులో తల్లిదండ్రులతో ఉన్న అటాచ్మెంట్ స్టైల్ వల్ల కూడా ఇలాంటి మనస్తత్వ లక్షణాలు అభివృద్ధి చెందవచ్చు. వీరు నియమాలు, క్రమశిక్షణ, పద్ధతి అనే వాటిని అత్యంత ్రపాముఖ్యంగా చూస్తారు. ప్రతి పని ఖచ్చితంగా, ఒక క్రమంలో జరగాలని కోరుకుంటారు. ఇలాంటి వ్యక్తులు పనులను ఇతరులకు అప్పగించడానికి ఇష్టపడరు. అన్ని పనులు తామే చేయాలనుకుంటారు. చిన్న చిన్న తప్పుల గురించి ఎక్కువ సమయం వృథా చేస్తారు. దానివల్ల కొన్ని సందర్భాల్లో డెడ్లైన్లు కూడా మిస్ అవుతుంటాయి. తమ గురించి ఎవరూ తప్పుగా మాట్లాడకూడదని అనుకుంటారు. వీరికి మోరల్ విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. డబ్బు ఖర్చు చేసే విషయంలో కూడా చాలా కట్టుదిట్టంగా ఉంటారు. మానవ సంబంధాలలో కూడా వీరు చాలా ప్రోఫెషనల్గా ఉంటారు. వ్యక్తిగత అనుబంధాలు తక్కువగా ఉండవచ్చు. పని విషయంలో మాత్రం చాలా శ్రద్ధగా ఉంటారు. కొన్నిసార్లు పనిరాక్షసుల్లా మారిపోతారు. కుటుంబంతో సమయం గడపడం లేదా సరదా వీరికి ఉండకపోవచ్చు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి.. ఇలాంటి లక్షణాలు కొంతమేర అందరిలో ఉంటాయి. కానీ అవి మోతాదుకు మించి, కుటుంబ బంధాల్లో లేదా ఉద్యోగ జీవితంలో సమస్యలు సృష్టించినప్పుడు మాత్రమే దాన్ని ఒక డిసార్డర్గా పరిగణిస్తాం. సమాజంలో ఎంతో సక్సెస్ సాధించిన వ్యక్తుల్లో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి, కానీ అవి నియంత్రణలో ఉంటాయి. ఇక్కడ ప్రధాన సమస్య ఏమిటంటే, ఇలాంటి వ్యక్తులు సాధారణంగా చికిత్సకు సహకరించరు.‘‘నేనే కరెక్ట్, ఇతరులే మారాలి’’ అనేది వారి భావన. అందుకే చికిత్సకు ఒప్పించడం కొంచెం కష్టమే. ఒకవేళ తీసుకు వస్తే, కొన్ని రకాల సైకోథెరపీ పద్ధతుల ద్వారా కొంత మార్పు తీసుకురావడం సాధ్యమే. కొంతమందిలో వయసు పెరుగుతున్న కొద్దీ ఈ లక్షణాలు తగ్గవచ్చు. మరికొందరిలో పెరగవచ్చు కూడా. కాబట్టి వీలైనంత త్వరగా ఒక క్లినికల్ సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్లి మాట్లాడిస్తే మంచిది. అక్కడ నిపుణులు తగిన మార్గదర్శకత్వం అందిస్తారు. ఏమైనా... నియమాలు మనుషుల కోసమే కానీ, మనుషులు నియమాల కోసం కాదనే విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పాల్సి ఉంటుంది. ప్రయత్నించండి. ఆల్ ది బెస్ట్!డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
మీ మాట… మీ బాట
మన వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి చూపించే అతిపెద్ద సాధనం-'కమ్యూనికేషన్' (Communication). చాలామంది ఏమనుకుంటారంటే, కమ్యూనికేషన్ అంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడటం లేదా ఎదుటివారిని బురిడీ కొట్టించడం. కానీ అసలైన కమ్యూనికేషన్ అంటే ఒక ఆత్మ నుంచి మరొక ఆత్మకు వారధి నిర్మించడం.కమ్యూనికేషన్ అనేది కేవలం సమాచార మార్పిడి కాదు, అది ఒక మనిషి మరొక మనిషిని అర్థం చేసుకునే పద్ధతి. మీరు ఎలా మాట్లాడుతున్నారో, మీ వ్యక్తిత్వం ఎలా ఉందో అది ప్రపంచానికి చెబుతుంది. అందుకే, "మీ మాట.. మీ బాట". మీరు మాట్లాడే విధానమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.1. The Three-Layered Modelకమ్యూనికేషన్ అంటే కేవలం మనం వాడే పదాలు మాత్రమే కాదు. దీనికి మూడు పొరలు ఉంటాయి.పదాలు (7%): మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది చాలా తక్కువ ప్రభావం చూపుతుంది.స్వరం/టోన్ (38%): మీరు ఎలా మాట్లాడుతున్నారు? (కోపంగానా? ఆవేశంగానా? ఆప్యాయంగానా?) అనేది ఎక్కువ ప్రభావం చూపుతుంది.బాడీ లాంగ్వేజ్ (55%): మీ కళ్ళు, మీ చేతులు, మీ నడక, మీ నిలబడే విధానం.. ఇవే అసలైన భాష.2. కమ్యూనికేషన్ అడ్డంకులు మనం ఎదుటివారిని ఎందుకు అర్థం చేసుకోలేకపోతాం? ఎందుకు గొడవలు అవుతాయి?Judgmental Listening: అవతలి వ్యక్తి మాట్లాడుతుంటే, మనం మన మనసులో సమాధానాలు వెతుకుతాం. ఇది వారధిని కూల్చేస్తుంది.డిఫెన్సివ్ మోడ్: మనం ఎప్పుడూ మనల్ని మనం సమర్థించుకోవడానికి చూస్తాం, ఎదుటివారి పాయింట్ వినం.స్పష్టత లేకపోవడం: మనకు ఏం కావాలో మనకే స్పష్టత లేనప్పుడు, ఎదుటివారికి ఎలా చెప్తాం?3. నిజమైన కమ్యూనికేషన్మోటివేషన్ "ఎదుటివారిని ఇంప్రెస్ చెయ్, గొప్పగా మాట్లాడు" అని చెప్తుంది. సైకాలజీ (Active Listening) "ఎదుటివారిని అర్థం చేసుకో, వారు ఏమనుకుంటున్నారో ఫీలవ్వడం మొదలుపెట్టు" అని చెప్తుంది. నిజమైన లీడర్ మాట్లాడటం కంటే, వినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు.4. వారధిని నిర్మించడం సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: చిన్న అలవాట్లు.. పెద్ద మార్పులు) -
శిఖరాగ్రాన విడాకులు...
‘ఆల్పైన్ డివోర్స్’... ప్రస్తుతం ఈ పదం ట్రెండ్ అవుతోంది. భార్యాభర్తలు విడిపోయే ఒక విచిత్ర పద్ధతి ఇది. నేటి యువత పెళ్లిలోగాని, ప్రేమలో గాని బ్రేకప్కు ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. తమ బ్రేకప్లో ప్రకృతిని భాగం చేస్తున్నారు. దూరంగా ప్రకృతి రమణీయ దృశ్యాలను చూస్తూ తమ భాగస్వామికి విడాకులు ఇస్తున్నారు.ఆల్పైన్ డివోర్స్... ఎలా పుట్టింది? జీవిత భాగస్వామితో కలిసి దూరంగా అడవికో, పర్వతాల వైపుకో వెళ్తారు. అక్కడ ఆనందంగా గడుపుతున్న సమయంలో ’నీతో ఇక నేను కలిసి ఉండలేను’ అని చెప్పి వచ్చేస్తారు. ఇదే ‘ఆల్పైన్ డివోర్స్’. భాగస్వామిని దూరంగా తీసుకెళ్లి, అక్కడ వదిలేసి రావడం ఇందులో కీలకమైన విషయం. రాబర్ట్ బార్ రాసిన ‘యాన్ ఆల్ఫైన్ డివోర్స్’ కథతో ఈ పదం ట్రెండ్ అయ్యింది. ఓ భర్త తన భార్యను పర్వతం అంచుల్లోకి తీసుకెళ్లి, అక్కడినుంచి తోసేసి చంపాలనుకోవడం ఇందులో కథాంశం. టిక్టాక్ ద్వారా ఈ పదంపాపులర్ అయ్యింది.కారణాలేంటి?ఆల్పైన్ డివోర్స్కు కారణాలేంటి? అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారనేది మానసిక విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. తమ భాగస్వామి తమను మోసం చేస్తున్నారన్న అనుమానం ఉన్నవారు, ఎలాగైనా తనను వదిలేసుకోవాలని భావించేవారు ఇటువంటి డివోర్స్కుపాల్పడుతున్నారని, కొందరి మానసిక ఆందోళన కూడా కారణమని అంటున్నారు. దంపతుల మధ్య అన్యోన్యత దూరమవడం ఈ ఆల్పైన్ డివోర్స్ను ప్రోత్సహిస్తోందని నిపుణులు అంటున్నారు. ఒకరి అవసరాలు మరొకరు గుర్తించకపోవడం, ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గిపోవడం, నమ్మకం లేకపోవడం వంటివి పెరిగినప్పుడు, ఆ బంధం హింసకు దారితీయకుండా ఆల్పైన్ డివర్స్ను ఆశ్రయిస్తున్నారు. కొట్టుకుంటూ, తిట్టుకుంటూ బంధంలో ఉండిపోకుండా దూరమవుతున్నారు.దూరం కావాలనుకుంటే ఇలాగా? భార్యాభర్తలు విడిపోవాలనుకోవడం సహజమే, కానీ దీనికోసం ఇలాంటి విధానం వాడుకోవడం మంచిదేనా అని చర్చ జరుగుతోంది. దూరంగా తీసుకెళ్లి అక్కడ వదిలేయడం వల్ల మానసికంగా తీవ్ర ప్రభావం చూపుతుందని, భద్రత అంశాలపై ఆందోళన తప్పదని అంటున్నారు. ఇలా ప్రవర్తిస్తున్నవారి మానసిక ఆరోగ్యానికీ చికిత్స అవసరం అంటున్నారు. విడాకులను చట్టబద్ధంగా ΄÷ందడమే మేలని, ఇలా అసంబద్ధంగా ΄÷ందడం సరికాదని వివరిస్తున్నారు. -
భరించలేకపోయా..అందుకే ఈ కఠిన నిర్ణయం..!
ఈరోజుల్లో కూడా అమ్మాయి పెళ్లి విషయంలో కుటుంబం నుంచి వస్తున్న ఒత్తిడి ఏవిధంగా ఉందో తెలిపే ఘటన ఒకటి నెట్టింట వైరల్గా మారింది. పెళ్లి చేసుకోవాలంటూ కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక ఓ యువతి శిరోముండనం చేయించుకుంది. కాజల్స్ మూవ్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన ఈ వీడియోలో తన ఆవేదనను పంచుకుంది. ‘అందరు అమ్మాయిల్లాగే నాకు కూడా నా జుట్టు అంటే ఎంతో ఇష్టం. కానీ, ప్రతిరోజూ ఇంట్లో పెళ్లి సంబంధాల గురించి వస్తున్న ఒత్తిడి, చుట్టుపక్కల వారి మాటలు భరించలేకపోయాను. ఈ ఒత్తిడి నుంచి విముక్తి పొందేందుకే నేను ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాను’ అని ఆమె తెలిపింది. ఈ సందర్భంగా ఆ యువతి సమాజపు ద్వంద్వ ప్రమాణాలపై, వివక్షపై గళమెత్తింది. మగవారు తమ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటే పట్టించుకోని ఈ సమాజం, ఒక మహిళ తన రూపం గురించి, తన జీవితం గురించి స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటే ఎందుకు వేలెత్తి చూపుతుంది.. పెళ్లి ప్రస్తావన లేకుండా ఒక మహిళను తన స్వంత కాళ్లపై నిలబడనివ్వరా.. ప్రతిదానికీ ఒక టైమ్ లైన్ ఉండాలని ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసం.. అంటూ ప్రశ్నించింది. తాను ఈ వీడియోను ఎవరి సానుభూతి కోసం చేయలేదని ఆమె స్పష్టం చేసింది. తనలాగే పెళ్లి ఒత్తిడిని ఎదుర్కొంటున్న వేలాది మంది యువతుల్లో ధైర్యం నింపడమే తన ఉద్దేశమని తెలిపింది. ‘జీవితం ఒక్కటే.. అది చేజారిపోయాక ఎవరూ వచ్చి మనకేం కావాలని అడగరు. కాబట్టి, మీ కలల కోసం, మీ జీవితం కోసం పోరాడండి’ అని ఆమె పిలుపునిచ్చింది. ఈ వీడియో పోస్ట్ చేసిన కొంతసమయానికే 3.7 లక్షల వ్యూస్ను సొంతం చేసుకుంది. దీనిపై స్పందించిన నెటిజన్లు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. తమ జీవితాలను తామే శాసించుకోవాలనుకునే మహిళలకు నువ్వు ఒక స్ఫూర్తి, అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ఇది ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం కాదు, సమాజంపై ఒక తిరుగుబాటు అని మరొకరు రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by 24rapidnews (@24rapidnews) (చదవండి: స్ట్రోక్ బాధితురాలి ఘనత..! ఏకంగా రెండు ప్రపంచ రికార్డులు..) -
పాపరాజిలను ఎందుకు నిరోధించడం లేదు?
కర్నాటకలో కదలిక మొదలయ్యింది. సినీ వేడుకలలో, ప్రయివేట్ ఫంక్షన్స్లో మహిళా సెలబ్రిటీలను, హీరోయిన్లను అభ్యంతరకరమైన యాంగిల్స్లో వీడియోలు తీసి రీల్స్గా సొమ్ము చేసుకుంటున్న పాపరాజిల మీద ప్రతిఘటన ప్రారంభమైంది. ‘మమ్మల్ని ఎలాంటి బట్టలు వేసుకోవాలో నిర్దేశిస్తున్న వారు మా శరీరాన్ని అభ్యంతరకరంగా చూపుతున్నపాపరాజిలను ఎందుకు నిరోధించడం లేదు?’ అని అడుగుతున్నారు. కన్నడ తారలు రుక్మిణి వసంత్, సప్తమి గౌడ, అషిక రంగనాథ్ ఈ చర్చను లేవదీశారు. వివరాలు...ఒక వృత్తిని సక్రమంగా చేసేవారు ఎందరో ఉంటారు. అదే వృత్తిని వక్రమార్గంలో చేస్తూ డబ్బు గడించాలని చూసేవారు కొందరు ఉంటారు. ఇలాంటి వారి వల్ల మొత్తం వృత్తికే చెడ్డపేరు వచ్చే సందర్భం ఉంటుంది. సినీ ప్రపంచంలో తారల కార్యక్రమాల ప్రచారానికి ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అవసరం. వారు తీసే ఫొటోలు, వీడియోల వల్ల తారలు పాల్గొన్న కార్యక్రమాలు తెలుస్తాయి. తమ అభిమాన తారలను ఆ విధంగా చూసి జనం సంతోషపడతారు.ఇక్కడి వరకు ఎవరికీ అభ్యంతరం లేదు.అయితే ఇటీవల తారల కార్యక్రమాల కవరేజ్కు వచ్చేవారి కన్నా వారు తమ కెమెరాలకు ఎక్కడ దొరుకుతారా ఏ అసభ్య యాంగిల్లో వారిని తీసి ఆ వీడియోను సొమ్ము చేసుకుందామా అనేవారు ఎక్కువగా తయారయ్యారు. వీరిని పాపరాజిలు అంటారు. ఇటీవల ఫోన్లలో రీళ్లు చూస్తున్నవారికి ఈ అసభ్య వీడియోలు తెలియనివి కావు. తారలు నడిచి వస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, వేదికలు ఎక్కుతున్నప్పుడు లేదా డాన్సులు చేస్తున్నప్పుడు కెమెరాను అనవసర భంగిమల్లో ఉంచి వారి శరీర కదలికలను స్లోమోషన్ చేసి రీల్స్గా విడుదల చేస్తున్నారు. వీటికి వ్యూస్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి. అంతేకాదు తారలు జిమ్, యోగా, ఎక్సర్సైజులు చేయడానికి వచ్చే సెంటర్ల దగ్గర కాపుకాచి వారు అందుకై వేసుకు వచ్చే దుస్తుల్లోనే వారిని అనుమతి లేకుండా వారి ఫొటోలు షూట్ చేసి వదులుతున్నారు. రాను రాను ఈ పాపరాజి బెడద ముదిరి బాలీవుడ్లో జయభాదురి లాంటి వాళ్ళు బహిరంగంగా నిరసన తెలుపుతుంటే ఇప్పుడు శాండల్వుడ్ (కన్నడ పరిశ్రమ)లో ఆ నిరసన మొదలైంది.గతంలో నిరసనలు2014లో దీపికా పడుకోన్ ఛాతీని ఒక దినపత్రిక అసభ్యరీతిలో ప్రచురిస్తే ఆమె ఎక్స్లో ప్రతిస్పందించారు. ‘నేను స్త్రీని. నాకు వక్షం ఉంటుంది. మీకేంటి సమస్య’ అని రాశారు. నోరా ఫతేహి, నేహా భాసిన్ వంటి తారలు కూడా పాపరాజిలను వ్యతిరేకించారు. అయితే పాపరాజిలు కూడా ఎదురు బెదిరింపులు చేస్తారు. ‘మీ కవరేజ్కు రాము’ అని బాయ్కాట్కు సైతం వెనుకాడటం లేదు. వీరి బెడద ఎక్కడి దాకా వెళ్లిందంటే ‘సంసారపక్షంగా దుస్తులు వేసుకొని తారలు వచ్చే వేడుకకు మేము వచ్చి చేసేదేముంది’ అనేవరకు వెళ్లారు. దాంతో సినిమాల పబ్లిసిటీ కోసం ట్రెండీ దుస్తులు వేసుకొని తారలు రావడం, పాపరాజిలు వారిని వక్రంగా చిత్రీకరించడం కొనసాగుతోంది.సప్తమి గౌడ ప్రశ్న‘బహిరంగ కార్యక్రమాలలో నటీమణుల వీడియోలు, చిత్రాలను అనుచిత యాంగిల్స్లో తీయడం ఏం పద్ధతి?’ అని కన్నడ నటి, ‘కాంతార’ ఫేమ్ సప్తమి గౌడ తాజాగా ప్రశ్నించారు. అలా తీసిన చిత్రాలను వైరల్ చేసి, వారి శరీరాలను ప్రదర్శించే హక్కు ఎవరిచ్చారని అడిగారు. ‘ఇటువంటి పని చేయడం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. కొందరు పోటీ పడి మరీ ఇటువంటివి చేస్తున్నారు. వీటిని ఇప్పుడే ఖండించకపోతే మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఈవెంట్లను కవర్ చేసే వారు వారి మర్యాదను కాపాడుకుంటే బాగుంటుంది’ అని ఆమె అన్నారు. సప్తమి గౌడ మాటలకు పెద్దఎత్తున మద్దతు లభిస్తోంది. ఆమెకు సపోర్టుగా కన్నడ పరిశ్రమకు చెందిన ఇద్దరు తారలు రుక్మిణి వసంత్, అషిక రంగనాథ్ కూడా ముందుకొచ్చి మాట్లాడారు. ‘సెలబ్రెటీలు మార్నింగ్ వాక్, జిమ్, బంధువుల ఇళ్లు, ఫంక్షన్లు, ఎయిర్పోర్ట్... ఇలా ఎక్కడికి వెళ్లినా వారిని అనుసరిస్తూ, వెంటపడుతూ ఫొటోలు తీయడం అలవాటుగా మారింది. సెలబ్రెటీల చిత్రాలకు సోషల్ మీడియాలో పాపులారిటీ దక్కడం, వాటిని కొన్ని పేజీలు డబ్బులిచ్చి కొనుగోలు చేయడం వంటి కారణాలతో ఈ ‘పాపరాజీ’ల పని కొనసాగుతోంది’ అని వారన్నారు. ‘మమ్మల్ని ఎలాంటి దుస్తులు వేసుకోవాలో చెప్తున్నారుగానీ వీరెందుకు ఇలా మమ్మల్ని అసభ్యంగా తీస్తున్నారో ప్రశ్నించరేం?’ అని నిలదీస్తున్నారు. కర్నాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ విషయమై స్పందించాలని, కెమెరామెన్లకు నియమ నిబంధనలు విధించాలని కోరుతున్నారు. ఇలాంటి వీడియోలు ఫేక్ అకౌంట్స్ను నుంచి చలామణి అవుతుండటం వల్ల విచ్చలవిడితనం ఎక్కువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Darshana Shah (@thedarshanashahshow)(చదవండి: స్ట్రోక్ బాధితురాలి ఘనత..! ఏకంగా రెండు ప్రపంచ రికార్డులు..) -
వివక్షకు తిరగమోత పెడదాం
ఇళ్లల్లో రోజువారీ వంటచేసేది మహిళలే అయినా, బయట మాత్రం పాకనిపుణులుగా పురుషులే రాణిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ షెఫ్లుగా పేరుపొందిన వారిలో పురుషులే ఎక్కువగా ఉన్నా, నెమ్మదిగా పరిస్థితులు మారుతున్నాయి. ఈ రంగంలోకి మహిళలు మరింతగా రావాల్సి ఉంది. ఇప్పుడిప్పుడే మహిళలు షెఫ్లుగా రాణిస్తూ ఉన్నా, ఈ రంగంలో మహిళా షెఫ్ల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. నేను వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్ని అయినా, అమెరికాలో ఉన్నప్పుడు అనివార్యంగా వంట చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్రమంగా వంటలపై ఆసక్తి పెరిగి, షెఫ్గా మారాను. మాది అనకాపల్లి. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బీఆర్క్, ఐఐటీలో ఎంఆర్క్ చేశాను. మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లినప్పటి నుంచి నాకు వంటపై ఆసక్తి పెరిగింది. ఇండియాకి తిరిగి వచ్చేశాక ఒకవైపు ఆర్కిటెక్ట్గా పనిచేస్తూనే, మరోవైపు హోమ్ షెఫ్గా షెరటాన్, మేరియట్లాంటి హోటళ్లలో; ఇంట్లో ఓనం సధ్యలాంటివి హోస్ట్ చేయడం మొదలుపెట్టాను. పలు ఫైవ్ స్టార్ హోటల్స్లో తెలుగు వంటల ఈవెంట్స్ చేశాను. ఈ రంగంలోకి వచ్చిన మొదట్లో కొన్ని ఇబ్బందులూ ఎదుర్కొన్నాను. అమ్మాయినని చిన్నచూపు చూసేవారు. వెళ్లిన ప్రతిచోటా అమ్మాయిలు షెఫ్గా ఉన్నా, తొక్కేయాలనే చూస్తారు. అయితే, నా ప్రతిభా సామర్థ్యాల మీద నాకు నమ్మకం ఉంది.మీరా గిరిజ తాడిమేటి షెఫ్వివక్ష ఇంకా పోలేదు..అది 2000 సంవత్సరం. నేను వరంగల్లో ఒక గవర్నమెంట్ స్కూల్లో ఆడపిల్లలకు క్లాస్ చెబుతున్నాను. ఒక అమ్మాయి ఏడ్చుకుంటూ నా క్లాస్లోకి అడుగుపెట్టింది. ఏమైందని అడిగితే, కాలి మీద కాల్చిన వాత చూపించింది. గిన్నెలు కడగలేదని వాళ్ల నాన్న పొయ్యిలోని కట్టె తీసి కాల్చాడని చెప్పింది. వెంటనే అమ్మాయిని తీసుకుని వాళ్ల ఇంటికి వెళ్లాను. వాళ్ల అమ్మా నాన్నలు నన్ను చూసి ఆశ్చర్యపోయారు. ‘ఆడపిల్లను అలా కాలుస్తావా?’ అని వాళ్ల నాన్నను అడిగాను. ఆయన చాలా క్యాజువల్గా ‘తప్పేముంది, పని చేయకపోతే ఆడపిల్ల ఎందుకు?’ అని అడిగాడు. ఆడపిల్ల ఎందుకు చదువుకోవాలో వివరంగా చెప్పాను. చివరకు తప్పయిందని ఒప్పుకున్నాడు. ఇకపై స్కూలుకు పంపిస్తానని చెప్పాడు. ఈమధ్య నేను గోవాకు వెళ్లాను. అక్కడ బీచ్కి వెళ్లాం. నాకు ఒక దృశ్యం కనిపించింది. ఒక తండ్రి పదేళ్ల పాపను తిడుతూ, కాళ్లతో వెనకవైపు తంతున్నాడు. నేను వెళ్లి ఆ తండ్రిని అడిగేలోపే జనంలో కలిసిపోయారు. ఇన్నాళ్లలో ఆడపిల్లల జీవితాలు ఏమీ మారలేదు కదా అనిపించింది.నేను గత 26 సంవత్సరాలుగా ఆడపిల్లలు, మహిళల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేస్తూ వస్తున్నాను. నేను 2000 సంవత్సరంలో నా సంస్థ మొదలుపెట్టినప్పుడు ఆడపిల్లలపై వివక్ష, భ్రూణహత్యలు, ఎనీమియా, పౌష్టికాహార లోపం, బాల్యవివాహాలు, బాల కార్మికులు, ఆడపిల్లలపై అత్యాచారాలు తదితర ఎన్నో అంశాలపై పనిచేయాల్సి వచ్చింది. ఆడపిల్లలను వద్దనుకుని, చెత్తకుండీలలో పడేస్తున్నప్పుడు ఆస్పత్రులు, బస్టాండ్లు, అంగన్వాడీ కేంద్రాలలో ‘తరుణి’ ఊయలలు పెట్టి, ఆడపిల్లలను రక్షించగలిగాం. ఎన్నో వేల బాల్యవివాహాలను ఆపగలిగి,ఆ ఆడపిల్లలను మళ్లీ చదువులో పెట్టగలిగాం. మేం 2004లో జాతీయ మానవ హక్కుల కమిషన్లో వేసిన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఫలితంగా బాల్యవివాహ నిరోధక చట్టం–2006 వచ్చింది. బాలికలపై లైంగిక అత్యాచారాలను నిరోధించడానికి అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. తెలంగాణ పోలీసులతో కలిసి భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయగలిగాం. హైదరాబాద్లో మొదలైన ఈ భరోసా కేంద్రాలు ఇప్పుడు 33 జిల్లాలకూ విస్తరించాయి. అత్యాచార బా«ధితులైన బాలికల్లో ఆత్మహత్యలు పెరుగుతుండటం చూసి, వారి కోసం తరుణి స్వావలంబన రీహాబిలిటేషన్, స్కిల్ సెంటర్ను హైదరాబాద్లో రెండేళ్లుగా నడుపుతున్నాం.మహిళల్లో కూడా దురలవాట్లు, సంపాదించగలమనే ధైర్యంతో బాధ్యతారాహిత్యం పెరిగాయి. మహిళల్లో పెరిగిన దురలవాట్లను మాన్పించడానికి ‘సాంత్వన’ డీఅడిక్షన్ సెంటర్, అలాగే చంచల్గూడ మహిళా జైలులో ‘నివృత్తి’ డీఅడిక్షన్ సెంటర్ నడుపుతున్నాం. లింగవివక్షను రూపుమాపడానికి మా సంస్థ తరఫున ‘సమదృష్టి’ అనే వేదికను నిర్వహిస్తున్నాం. తరుణి సంస్థ పలు ప్రైవేటు, ప్రభుత్వ ఆఫీసులలో ఎక్స్టర్నల్ మెంటర్గా అంతర్గత కమిటీలలో పనిచేస్తూ, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. డాక్టర్ ఆచంట, మమతా రఘువీర్, తరుణి స్వచ్ఛంద సంస్థ వంటల పుస్తకం రాసిన తొలి మహిళ అనా వెకర్. జర్మనీలోని న్యూరెంబర్గ్కు చెందిన అనా, 1596లో ‘న్యూ డిలైట్ఫుల్ అండ్ యూజ్ఫుల్ కుక్బుక్’ రాశారు. ఈ పుస్తకం పలు భాషల్లోకి అనువాదం పొంది ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఇళ్లలో రోజువారీ వండుకునే వంటకాలు, ప్రత్యేక వంటకాలు, వంటకాల రుచిని పెంచే చిట్కాలను ఇందులో విపులంగా రాశారు. వంటకాల రచన మాత్రమే కాకుండా, అనా వెకర్ అరుదుగా కొన్ని కవితలు కూడా రాశారు.నిర్మలా రెడ్డి(చదవండి: ‘ఆమె’ ఆరోగ్యమే... సమాజ ఆరోగ్యం!) -
ప్రశ్నలే ఎక్కువవుతున్నాయి
స్త్రీవాదం ఒక ఉద్యమంగా మొదలై దశాబ్దాలు గడచి, స్త్రీలు ఓటింగ్ హక్కు సంపాదించుకుని శతాబ్దం దాటి, ప్రపంచమంతా స్త్రీల సాధికారతపై ప్రతి ఏటా మార్చి 8 న గొంతులు చించుకునే సందర్భంలో– ఈ 21 వ శతాబ్దంలో, జెన్ జీల కాలంలో– ఫ్రాన్స్లో ఒక భర్త తన భార్యకు మత్తుమందిచ్చి, తను రేప్ చెయ్యడమే కాక మరెందరో స్నేహితుల చేత ఆమెను కొన్ని ఏళ్ల పాటు రేప్ చేయిస్తాడు; ఒక మాజీ భర్త, తనకు విడాకులిచ్చి మళ్లీ పెళ్లి చేసుకుని 4 నెలల గర్భం దాల్చిన భార్యను నరికి చంపేస్తాడు. ప్రపంచనాయకత్వం ప్రకటించుకునే దేశంలో, మరింత గొప్ప వలసాధిపత్య దేశం రాజకుమారుడు, బాలికలపై ఏళ్ల తరబడి అత్యాచారం చేస్తాడు. అక్కడిదాకా ఎందుకు? యూట్యూబ్ ఛానెల్ నడిపే ఆడపిల్లలను ట్రోలింగ్తో మానసిక హింసకు గురిచేయడం తన జన్మహక్కు అనుకుంటాడు సగటు తెలుగు మగోడు; ఇక మన అగ్రేసర తెలుగు నటుడు, ‘థప్పడ్’ వంటి సినిమాలు వచ్చిన తర్వాత కూడా నాయికను లాగి చెంపదెబ్బ కొడతాడు; ఇంకో సూపర్ స్టార్ కొడుకు కమ్ అందాల హీరో దాదాపు ప్రతి సినిమాలోనూ తన నాయికను చెంపదెబ్బలు కొట్టందే ప్రేమించలేడు.జీవితంలోనూ, కళలోనూ కూడా అదే హింస. కాని, మనం మాత్రం స్త్రీలు చాలా చాలా ప్రగతి సాధించారు. రాజ్యాలేలుతున్నారు; బిజినెస్ టైకూన్లు అయ్యారు; పార్లమెంటులో గొంతు వినిపిస్తున్నారు. పార్టీలకు నాయకత్వం వహిస్తున్నారు; అంతర్జాతీయ సమావేశాల నుంచి తమకు నచ్చకపోతే వాకౌట్లు చేస్తున్నారు– అని పొంగిపోతున్నాం. ఇంకా చెప్పాలంటే, స్త్రీలకట... స్వేచ్ఛ ఎక్కువైంది. కనక భర్తలను హతమారుస్తున్నారు; యూట్యూబ్లో రెచ్చిపోయి మగవాళ్లను ఆడిపోసుకుంటున్నారు. ‘అసలు స్త్రీలకు స్వేచ్ఛ ఇవ్వకుండా ఉండాల్సింది’ అని బాధపడిపోయే జనాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది? 19 వ శతాబ్దిలో మొదలైన స్త్రీల అస్తిత్వ పోరాటాలు సత్ఫలితాలను ఇచ్చాయని, అందుకే ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా స్త్రీల పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందనీ పొంగిపోదామా? ఎందరో స్త్రీలు గృహహింసకు ఇప్పటికీ గురవుతూండగా, దొంగ కట్నం కేసులతో అత్తారింటివారిని జైళ్ళకు పంపుతున్న కొంతమంది స్త్రీల అవివేకానికి ఎక్కువ ప్రచారం వస్తోందని బాధపడదామా? ఎందరో భర్తలు అతి చిన్న కారణాలకు భార్యలను హతమారుస్తున్న రోజుల్లో, కొందరు భార్యలు భర్తలను, తాగుడు భరించలేకో, మరెందుకో హతమారుస్తున్నందుకు వారిపై తీర్పులు చెప్దామా? మరోవైపు, తమ తల్లులు ఊపిరాడనివ్వని బంధనాల నుంచి విముక్తి కోసం ఎంతగా పోరాడారో తెలిసి కూడా, తమ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటున్న ఆడపిల్లలను చూసి జాలి పడదామా? ఈ రోజున మహిళా దినోత్సవాన్ని గురించి మాట్లాడుకోవడం ఎప్పటికంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. రోజురోజుకీ ప్రశ్నలే ఎక్కువవుతున్నాయి, సమాధానాలు అంత సులభంగా దొరకడం లేదు. ప్రపంచమంతా స్వార్థపూరితమైపోతున్న వేళ, ప్రపంచమంతా ఒక మార్కెట్గా, లాభనష్టాలే అసలైన విలువలవుతున్న వేళ, ఎవరికీ తమ ప్రయోజనాలు తప్ప, ఏ విలువల పట్లా ఏ నిబద్ధతా, ఏ అంకితభావమూ లేకుండా పోతున్న వేళ– సమాజాన్ని కాస్తంత మానవీయం చేయడానికి స్త్రీలు మాత్రమే కాదు; వారితో పాటు పురుషులు ఏం చెయ్యగలరో ఆలోచించడం ఇప్పటి అవసరం.మృణాళిని, సాహితీవేత్తతొలి నవలా రచయిత్రిప్రపంచ సాహిత్యంలో తొలి నవలా రచయిత్రి మూరాసాకీ షీకీబు. జపాన్ రాజాస్థానంలో రాచ మహిళలకు సహాయకురాలిగా పనిచేసేది. పదకొండో శతాబ్దిలోనే ఆమె ‘గెంజీ మోనోగటారి’ (ది టేల్ ఆఫ్ గెంజి) నవల రాసింది. ఆమె ఈ నవల రాసేనాటికి ప్రపంచంలోని మరే భాషలోనూ నవలా పక్రియ రూపుదిద్దుకోలేదు. ఈ నవలను మూరాసాకీ షీకీబు క్రీస్తుశకం 1010–1021 కాలంలో రాసి ఉంటుందని చరిత్రకారుల అంచనా. అప్పట్లో జపాన్లో చైనీస్ భాష రాచభాషగా ఉండేది. హెలాన్ రాచమహిళలు చైనీస్ భాషను నేర్చుకోరాదనే నిషేధం ఉండేది. అయినా మూరాసాకీ తన తండ్రి ద్వారా చైనీస్ భాషను నేర్చుకుని, ఆ భాషలోని మేలి రచనలు చదువుకుంది. చైనీస్ సాహిత్యాధ్యయనం వల్ల అబ్బిన పరిజ్ఞానానికి తన సృజనాత్మకతను జోడించి, జపానీస్ భాషలో నవల రాసింది. ప్రపంచ సాహిత్యంలో ఇదే తొలి నవలగా పరిశోధకులు పరిగణిస్తారు.నిలదీతలో పదునెక్కుతున్నామా?ఏటా జరుపుకొనే మహిళా దినోత్సవమే. ఆ ప్రాతిపదికన మహిళలుగా మన ఆలోచనలను మెరుగుపరచుకునే దిశగా చూస్తున్నామా? సమాజంలో గుర్రపుడెక్కలా అల్లుకుపోయిన మూఢత్వాన్ని, అశ్లీలతనీ, హింసను నిలదీయటంలో పదునెక్కుతున్నామా? మనల్ని మనం కాపాడుకోగలుగుతున్నామా? ఇటువంటి ప్రశ్నలకు ‘అవును’ అని చెప్పుకోవాలంటే అందుకు భూమికలు ఏవి; కాదు అని తలవాల్చుకునేట్లయితే, కారణాలు వెతికి పట్టుకుని పరిష్కారాలు ఏవి అని ఆలోచించవలసి వుంటుంది.భిన్న రంగాల్లో దూసుకుపోతున్న అమ్మాయిల తెలివితేటల్ని, చొరవను, ఆర్థికస్వేచ్ఛను– వీటన్నిటి ఫలితమైన స్వతంత్ర వ్యక్తిత్వాన్ని, నిర్ణయాత్మకతను– మగపిల్లలు సహించలేకపోతున్న స్థితి రాజ్యమేలుతున్నది. భారతదేశానికి గర్వకారణమైన క్రీడాకారిణి మిథాలీ ఏమన్నదో గుర్తున్నదా! తనకు ఎదురైన పెళ్ళి ప్రతిపాదనలలో ఒకరు ‘అత్తగారిని చూసుకోవాలి’ అన్నారు. (అది తప్పు కాదు– కానీ ఒక రంగంలో శిఖరస్థాయికి చేరిన వ్యక్తిని, కేవలం మహిళ అయిన కారణంగా, షరతులతో బంధించాలని చూడటం నేరం.) మరొకరు, ‘వేరే వ్యాపకం వద్దు– ఇల్లు, పిల్లల్ని చూసుకోవాలి‘ అన్నారని చెప్పిన మిథాలీ, ‘కనీసం ముందే చెప్పినందుకు వాళ్ళకి థాంక్స్‘ అన్నది. ఇటువంటి అనుభవాలే ఎందరో మహిళా డాక్టర్లు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలవి! అంటే తమకు ఏమి కావాలో నిర్ణయించుకోగల స్థాయిలో ఆధునిక యువతులు వుండగా, న్యాయమైన వారి ఆశలు ఆకాంక్షల్ని సహించలేని యువకులూ మన ముందే కనిపిస్తున్నారు.ప్రేమ, పెళ్ళి వంటి సొంత వ్యవహారాలలో తమ ఎంపిక, తమ నిర్ణయమే చెల్లాలనే అబ్బాయిల ధోరణి వల్ల తెల్లవారి లేస్తే దినపత్రికల నిండా ఏకపక్షపు ప్రేమ(!)వంటివాటి దుష్ఫలితాల్ని చూస్తున్నాం. అయితే స్వార్జన, స్వేచ్ఛ వల్ల అందరమ్మాయిలలోనూ వ్యక్తిత్వ పటిష్ఠత ఏర్పడటం లేదు. ఇప్పటికీ ప్రేమ పేరిట వంచనకు, అఘాయిత్యాలకు, ఆధునిక సాంకేతికత పుణ్యమా అని బ్లాక్ మెయిలింగ్ వంటి ద్రోహాలకూ అమ్మాయిలు ఆస్కారం ఇస్తుండటం విషాదకరం. తన ప్రేమికుడు వేరొక అమ్మాయితో సాన్నిహిత్యం వెలగబెడుతుంటే అతన్ని ఛీత్కరించి దూరంపెట్టవలసింది పోయి, ‘అతను నావాడు... నువ్వు పో’ అంటూ ఆ రెండో అమ్మాయి మీద దాడి చేయటం చూస్తున్నాం. మరోపక్క ఆధునిక ఉద్యోగ జీవితాలు, నిరంతరం కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతిక సౌకర్యాల వల్ల వెర్రితలలు వేస్తున్న ప్రలోభాలు మనుషుల్ని నిలవనివ్వక వ్యామోహాలపాలు, తత్ఫలితంగా నేరాలపాలు చేస్తున్నాయి. సరైన పెంపకం, మొక్కగానే వంచి బుద్ధులు చెప్పే సంస్కృతి నానాటికీ కొరవడుతున్నప్పుడు ఆడ, మగపిల్లలు శారీరక ఉద్వేగాలకు, ఉద్రేకాలకు, మానసిక ఘర్షణలకు లోనుకావటమే జరుగుతుంది. ఇరవైల వయసులోనే ఉద్ధృతమైన సంపాదనలతో విలసిల్లుతున్న నేటి అమ్మాయిలు, అబ్బాయిలకు మందలింపులు అటువుంచి– సలహాలు ఇచ్చేందుకూ పెద్దలు భయపడుతున్నారు కదా! ఈ సామాజిక సామూహిక విషమస్థితికి అంతర్జాల విషాలగాలం ముఖ్యకారణమని ఎన్నో అధ్యయనాలు తేల్చిచెప్తున్నాయి. యువతీ యువకులకే కాక, కౌమార దశలో వున్న పిల్లలకు– ముఖ్యంగా బాలికలకు అంతర్జాలపు కత్తిఅంచు ప్రాణాంతకమవుతున్నది. గర్భాలతో ప్రాణాల మీదకు తెచ్చే అశాస్త్రీయ గర్భస్రావాలతో మన నగరాలు, పల్లెలు ఒక్కలాగే అతలాకుతలమవుతున్నాయి. ఒకవైపు పూర్ణ వంటి అట్టడుగు సామాజిక స్థాయినుంచి వచ్చిన బాలికలు పర్వతారోహణ, క్రీడలు, శాస్త్రవిజ్ఞానం, కళలు, అంతరిక్షయానాల వంటి విభిన్న రంగాల్లో వజ్రాల్లా ప్రకాశిస్తుంటే, మరోవైపు జీవితాల్ని ఛిన్నాభిన్నం చేసుకుంటున్న బాలికలు, యువతులు, మహిళలు కొల్లలుగా కనిపిస్తూండటం బాధాకరం.ఇప్పటికీ మహిళలు గృహహింసకు గురవుతూనే వున్నారు. భార్యా పిల్లల్ని, ‘ఎముకలు విరిగేలా లేదా రక్తస్రావ మయ్యేలా కొడితే మాత్రమే‘ నేరమని, అదైనా ‘నిరూపించబడితేనే శిక్షార్హ’మని, ఆ శిక్ష కూడా గరిష్టంగా పదిహేనురోజులని చట్టం చేసిన తాలిబన్ రాజ్యం మన పొరుగునే ఉన్నది. ‘శారీరకంగా చొరబడకుండా కేవలం స్ఖలనం జరిగితే అత్యాచారం కాదు’ అని వాకృచ్చే న్యాయస్థానాలు మన దేశంలోనే ఉన్నాయి! ఇప్పటికీ కొందరు రాజకీయనాయకుల దృష్టిలో ‘రేప్’ అంత పెద్ద నేరం కాదు!మౌలికంగా మన ఇళ్ళలో ఆడ, మగ పిల్లల పట్ల సమదృష్టి, సమధోరణిలో వాళ్ళ పెంపకం, లింగవైవిధ్యం పట్ల శాస్త్రీయదృష్టి ఏర్పరచుకునే దిశగా ప్రోత్సాహం, విజ్ఞానం సద్వినియోగం పట్ల అవగాహన పెంపుదల, మనుషుల మధ్య లింగవివక్షతో సహా– ఎటువంటి విభజనలైనా కేవలం కృతకమైనవనే వాస్తవాలను బోధించే సంస్కారం, వివేచన పాదుకున్నప్పుడే నేటి సామాజిక రుగ్మతలబారి నుంచి తల్లులు, చెల్లెళ్ళు, యావత్ మానవజాతి బయటపడేందుకు దారులు ఏర్పడతాయి. ఘంటశాల నిర్మల కవయిత్రి, సీనియర్ జర్నలిస్ట్ఆఖరి మైలు వరకు నడవాలినన్ను నేను కచ్చితంగా ఒక మహిళగా భావిస్తాను, అలాగే ఒక ప్రచురణకర్తగా కూడా భావిస్తాను, కాని ఎప్పుడూ నన్ను నేను ఒక మహిళా ప్రచురణకర్తగా మాత్రం చూసుకోలేదు. ఒక మహిళగా నాకు అదనపు గౌరవం లభించిందని, అందువల్ల నేను వివక్షకు గురికాలేదని చెప్పడం సులభమే. కాని, ఈ ప్రయాణంలో ఇబ్బందులు ఉన్నాయి, అవి పని స్వభావం వల్ల ఎదురైనవే తప్ప, నేను చేస్తున్న ప్రచురణ వల్ల కాదు. ఉదాహరణకు, ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో మహిళలకు కనీసం పబ్లిక్ టాయిలెట్లు కూడా ఉండేవి కావు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోనూ మౌలిక వసతులు అంతంత మాత్రంగానే ఉండేవి. పుస్తకాలు అమ్మడానికి రోజంతా స్టాల్ వద్దే నిలబడాల్సి వచ్చేది. అలాంటి సమయంలో పక్కనే ఉన్న ఇళ్లకు వెళ్లి వారి అనుమతి కోరడం లేదా వేరే దారి లేనప్పుడు మొహమాటాన్ని వదిలేసి పని పూర్తి చేయడమే ముఖ్యం అని నాకు తోచేది. పురుషులతో పని చేసేటప్పుడు వారు నాతో మాట్లాడటానికి సంకోచించేవారు. నేను పని మీద ఒకరి ఇంటికి వెళ్తే, వారు నన్ను నేరుగా చూడటానికి భయపడేవారు. ‘ఇంట్లోకి వెళ్లి మా ఆవిడతో మాట్లాడు’ అని వంటగది వైపు చూపించేవారు. కానీ నేను పని మీద వచ్చింది మిమ్మల్ని కలవడానికేనని స్పష్టంగా చెప్పేదాన్ని. సమాజంలో మార్పే లక్ష్యంగా..నక్సలైట్ ఉద్యమ స్ఫూర్తితో, సమాజంలో మార్పు తీసుకురావాలనే పట్టుదలతో 26 ఏళ్ల వయసులోనే ఈ రంగంలోకి అడుగుపెట్టాను. ఎందరో మహానుభావుల మార్గదర్శకత్వంలో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఒక మహావృక్షంలా ఎదిగింది. ఆ రోజుల్లో ప్రజలు సమయాన్ని డబ్బుతో కొలిచేవారు కాదు, నిస్వార్థంగా పని చేసేవారు. ఆర్థిక సరళీకరణల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాఠకుల నమ్మకమే...మహిళనైనందుకు నాకు కొన్ని ప్రయోజనాలు కూడా కలిగాయి. వయసులో పెద్దవారైన రచయితలు, మేధావులు నన్ను ఎంతగానో ఆదరించారు. పాఠకులు మహిళలను ఎక్కువగా నమ్మేవారు. ఈ నమ్మకమే ఈ రంగంలో రాణించడానికి నాకు ఎంతగానో సహాయపడింది. కేవలం సాయంత్రం వేళల్లో జరిగే మందు పార్టీల చర్చలకు మాత్రం నేను దూరంగా ఉండాల్సి వచ్చేది. కీలక నిర్ణయాలన్నీ అక్కడే జరుగుతుంటాయి. ఒక మహిళగా ఆ వాతావరణంలో నేను ఇమడలేకపోయాను. అక్కడ నాకు ప్రవేశం కూడా ఉండేది కాదు. కొత్త తరం అమ్మాయిలు..నేడు చాలామంది మహిళలు ఈ రంగంలోకి రావడం సంతోషకరం. భాగ్యలక్ష్మి (మంచి పుస్తకం), పూర్ణిమ తమ్మిరెడ్డి (ఎలమి) వంటి వారు ముందు వరుసలో ఉంటే, జ్యోతి వలబోజు (జేవీ పబ్లికేషన్స్), శ్వేత (అజూ పబ్లికేషన్స్), ఉష ప్రత్యూష (బాలా బుక్స్), మానస ఎండ్లూరి, అపర్ణ తోట వంటి వారు ప్రస్తుతం ఈ రంగంలో రాణిస్తున్నారు. ప్రచురణ నా ప్యాషన్దశాబ్దాల కాలంలో పుస్తక విక్రేతలు, రచయితలు, అనువాదకులు, సమీక్షకులతో ఏర్పడిన అనుబంధం వెలకట్టలేనిది. ఈ రంగం అనుకున్నంత ఆడంబరంగా ఉండదు. దీనికి గుండె ధైర్యం, అంతులేని ఓపిక కావాలి. ఇక్కడ రకరకాల మనుషులు ఉంటారు. ప్రూఫ్ రీడింగ్ కోసం గంటల తరబడి కళ్లు కాయలు కాచేలా చూడటం, ప్రింటర్ల వెనుక పడటం, అనువాదకులను ఒప్పించడం, పుస్తక విక్రేతల నుంచి బాకీలు వసూలు చేయడం– ఇవన్నీ తెర వెనుక అలసటతో కూడిన పనులు. కొందరు రచయితల్లో అహం ఎక్కువగా ఉంటుంది. అనువాదకులు మాత్రం అణకువతో ఉండి పుస్తకాలను ప్రేమిస్తారు. ఇన్ని సవాళ్లున్నప్పటికీ మళ్ళీ అవకాశం వస్తే మాత్రం కచ్చితంగా ప్రచురణనే ఎంచుకుంటాను కానీ మరే వృత్తినీ ఎంచుకోను.డబ్బుతో ముడిపెట్టలేనిదిప్రచురణ రంగం కేవలం పుస్తకం మీద ఉన్న మమకారంతో, ఆఖరి మైలు వరకు నడిచే సత్తా ఉన్నవారికి మాత్రమే! ప్రైవేట్ కంపెనీలకు కూడా ఈ రంగంలో వచ్చే లాభాలు చాలా తక్కువ. అవినీతి ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటేనో లేదా పాఠ్యపుస్తకాలు అమ్ముకుంటేనో తప్ప, ఇందులో ఆర్థికంగా స్థిరపడటం కష్టం. ఇది కేవలం ప్యాషన్తో చేసే అక్షర యజ్ఞం.గీతా రామస్వామి, ప్రచురణ కర్తజంబుల రమాదేవి(చదవండి: నేను... ఉమన్ జర్నలిస్ట్) -
నేను... ఉమన్ జర్నలిస్ట్
జర్నలిస్ట్గా 1980లో ప్రయాణం ప్రారంభించినప్పుడు నన్ను నేను ‘మహిళా జర్నలిస్ట్’ అని ఎప్పుడూ అనుకోలేదు. వేరే లేబుల్స్ లేకుండా నేను జర్నలిస్ట్ను. దిల్లీలో క్రైమ్బీట్ చూశాను. క్రైమ్బీట్ అంటే ‘ఇది పురుషులకు మాత్రమే’ అన్నట్లుగా ఉండేది పరిస్థితి. తరువాత చెన్నైలో ఒక జాతీయ పత్రికకు కరస్పాండెంట్గా పనిచేశాను.గతతరం జర్నలిస్ట్లు ద్వారాలు తెరిచి, ఈ వృత్తిని ఎంచుకున్న మా తరం మహిళలకు పునాది వేశారు. అయినప్పటికీ శ్రీలంక, పాకిస్తాన్లలో విదేశీ కరస్పాండెంట్గా నా పోస్టింగ్ను అసాధారణంగా, ఆశ్చర్యంగా చూశారు. అయితే హైప్రొఫైల్ అసైన్మెంట్స్కు నా జెండర్ అడ్డు కాదనిపించింది. పాకిస్తాన్లో నేను మొదటి మహిళా జర్నలిస్ట్ అయ్యే అవకాశం వచ్చింది. భారతదేశాన్ని వదిలి పాక్కు వెళ్లే ముందు...‘నీకు అప్పగించిన బాధ్యత పురుషులకు కూడా కష్టమైనది. ఒంటరిగా ఉన్నందున ఆ అపాయింట్మెంట్ను తిరస్కరించడం మంచిది’ లాంటి సలహాలు వినిపించాయి. నేను ఆ సలహాలు పాటించనందుకు సంతోషంగా ఉంది. అక్కడి (పాక్) నుంచి రిపోర్టింగ్ చేయడం నాకు చాలా ఇష్టంగా అనిపించింది. ఒకటి నేను పురుషుడినై ఉంటే ఇంత కంటే బాగా చేసేదాన్ని అని చెప్పలేను కాని, జర్నలిజంలో నా పనికి గుర్తింపుగా రెండు అవార్డులు వచ్చాయి.రెండవది, ఆ దేశంలో నేను కలిసిన ప్రతి ఒక్కరూ, పాకిస్తాన్లో నియమితురాలినైన మొదటి మహిళా జర్నలిస్ట్ నేనే అని చెప్పడం ప్రారంభించారు. మూడవది, ‘మహిళా జర్నలిస్ట్’ అనే మాటకు అర్థం ఏమిటో నాకు పాకిస్తాన్లో అర్థమైంది. నేను భారతదేశానికి తిరిగి రావాల్సి వచ్చినప్పుడు నా స్థానంలో వేరొకరిని నియమించడానికి అన్వేషణ మొదలైంది. ఇతర విషయాల సంగతి ఎలా ఉన్నా మహిళ లేదా అవివాహితుడు అయితే బాగుంటుందని అనుకున్నారు.పూర్వకాలంలో పాక్లో పోస్ట్ చేసిన పురుషుల పిల్లలు అంతర్జాతీయ స్థాయి పాఠశాలలో చదవడానికి అయ్యే ఖర్చును ప్రచురణ సంస్థే భరించేది. ఎందుకంటే భారతీయ పిల్లలకు స్థానిక పాఠశాలల్లో చదవడం కష్టంగా ఉండేది. ఒక పురుష జర్నలిస్ట్ను ఇస్లామాబాద్లో నియమించారు. దీంతో ఆయన భార్య ఇక్కడ తాను చేసే ఉద్యోగాన్ని వదులుకొని భర్తతో వెళ్లాల్సి వచ్చింది. ఉద్యోగం వదులుకున్నందుకు సంస్థ ఆమెకు పరిహారం కూడా చెల్లించింది.కాని, కాలం మారిపోయింది. అప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు.పాక్ను వదిలి భారత్కు వచ్చే ముందు ఇస్లామాబాద్లోని నా స్నేహితులకు నా స్థానంలో వచ్చే మహిళ గురించి చెప్పాను. అప్పుడు వారి స్పందన ఇలా ఉంది... ‘వోహ్! వచ్చేది కూడా మహిళా జర్నలిస్టేనా? ఇక్కడ మాత్రమే మహిళలను ఎందుకు పోస్ట్ చేస్తున్నారు? హానీ ట్రాప్లుగా మహిళలను పంపాలనేది మీ నిఘా సంస్థల వ్యూహం అయి ఉండాలి’– అపోహల అద్దాలతో చూస్తున్నప్పుడు, అలాంటి సమయంలో వివరణ ఇవ్వడం అర్థరహితం అనిపించింది.‘మహిళా జర్నలిస్ట్లు మరింత ముందుకు సాగాలి. వారు గొప్ప కథనాలెన్నో రాయగలరు. అదే సమయంలో సంస్థ వారి దీర్ఘకాలిక కెరీర్ పురోగతి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు’ అని ఒక అగ్ర సంపాదకుడు రాశారు. ఎందుకంటే చాలామంది మహిళా జర్నలిస్ట్లు వివాహం కాగానే రెండు, మూడు సంవత్సరాల్లోనే ఫీల్డ్ను వదిలిపెట్టారు. ఈ రకంగా ఆయన నిజం మాట్లాడారు.ఈరోజుల్లో ఎక్కువగా కనిపించే బైలైన్లను చూడండి. వారందరూ మహిళా జర్నలిస్ట్లే. కాని ఎడిటర్లు ఎవరో చూడండి. గత ఇరవయ్యేళ్లుగా మీడియాలో వచ్చిన మార్పుల కారణంగా కొంతమంది మహిళలు ఉన్నత స్థానంలో ఉన్నారు. ముఖ్యంగా ప్రసార మాధ్యమాలు(బ్రాడ్కాస్ట్ మీడియా), ఆన్లైన్ వార్తా సంస్థలలో గ్రాఫ్ ఇప్పటికీ పురుషులకు అనుకూలంగానే ఉంది. జర్నలిజం స్కూల్స్లో పురుషులతో పోల్చితే మహిళా విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. నేను క్లాస్ చెప్పే ఒక జర్నలిజం స్కూల్లో పదిహేనుమంది విద్యార్థులలో ముగ్గురు మాత్రమే పురుషులు. వార్త సంస్థలలో మహిళల నాయకత్వానికి సంబంధించిన ఆశ బహుశా భవిష్యత్తులోనే ఉంటుంది.నిరూపమా సుబ్రమణియన్, సీనియర్ జర్నలిస్ట్ (చదవండి: హెల్త్కేర్’లో నారీశక్తి) -
‘హెల్త్కేర్’లో నారీశక్తి
హెల్త్కేర్ రంగంలో మహిళల భూమిక రోజురోజుకూ విస్తరిస్తోంది. ఆరోగ్యరంగంలో మహిళల ఆరోగ్యం కోసం కృషిచేయాల్సిన రంగాలు నిజానికి చాలా ఎక్కువే ఉన్నాయి. ఇటీవల తమ సాధికారతలో భాగంగా మహిళా డాక్టర్లు కేవలం చికిత్సకే పరిమితం అయిపోవడం లేదు. దాంతోపాటు కొత్త స్టార్టప్ల ఏర్పాటు; హాస్పిటల్ నిర్వహణ బాధ్యతలూ; మహిళలకు పీరియడ్స్ సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత; ప్రెగ్నెన్సీ ప్లానింగ్; సురక్షితంగా ప్రసవం జరపడం, హోమ్ సర్వీసెస్, పాలియేటివ్ కేర్ వంటి అనేక రంగాల్లో పనిచేస్తున్నారు. ఈ అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు అందివస్తున్న కొత్త టెక్నాలజీ సహాయంతో మహిళలకు ఉపయోగపడే స్టార్టప్స్ ఏర్పాట్లు చేయడం వంటి అంశాల్లో చొరవ తీసుకుంటున్నారు. హస్పిటల్స్/ క్లినిక్స్ నిర్వహణ, స్టార్టప్స్, పబ్లిక్ హెల్త్, టెక్నాలజీ వంటి కీలకమైన నాలుగు అంశాల్లో మహిళల బాగు కోసం అనునిత్యం శ్రమించడంతో పాటు ఈ అంశాల్లో ఎంటర్ప్రెన్యూర్స్గా ఎదగడానికి మహిళా వైద్యులు విశేషంగా కృషిచేస్తున్నారు. ఆ నాలుగింటినీ విపులీకరిస్తే, తొలి అంశంగా– తాము ఎవరి కోసమో పనిచేయకుండా కేవలం తమ కోసం తామే సంస్థను ఏర్పాటు చేసుకోదలచుకున్న వారు... ఉదాహరణకు చూసినప్పుడు గైనకాలజీ రంగంలో సొంతంగా ఐవీఎఫ్ వంటి సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడమూ, కాస్మెటిక్ గైనకాలజీ, ఈస్తటిక్ గైనకాలజీ రంగాలలో విస్తృతంగా తమవైన క్లినిక్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాగే పీడియాట్రీ, డెర్మటాలజీ, యూరోగైనకాలజీ వంటి స్పెషాలిటీ క్లినిక్స్ కూడా ప్రారంభిస్తున్నారు. ఇక పెద్ద పెద్ద హాస్పిటల్ సెటప్స్ కష్టం అనుకుంటే పొద్దున్నే సర్జరీ చేసేసి, పేషెంట్ను సాయంత్రానికల్లా ఇంటికి పంపించే ‘డే కేర్’ సెంటర్స్ మొదటి కేటగిరీలోకి వస్తాయి. ఇక రెండో అంశానికి వస్తే, ఇందులోనే హెల్త్ యాప్స్ రూపొందించి, మెంటల్ హెల్త్ వంటి విభాగాల్లో బాధితులకు అవసరమైన మార్గదర్శకాలు చెప్పడం; ప్రెగ్నెన్సీ సమయాల్లో పాటించాల్సిన జాగ్రత్తలపై సలహా, సూచనలందించడం వంటి స్టార్టప్స్ యాప్ల రూపకల్పన అనుకోవచ్చు. వీటిల్లో భాగంగానే డయాగ్నస్టిక్ సేవలందించే సంస్థలనూ ఏర్పాటు చేస్తున్నారు. ఇక మూడో విభాగంలో వెల్నెస్తో పూర్తి సమగ్ర ఆరోగ్యం పొందడం కోసం అనుసరించాల్సిన యోగా, ధ్యానం వంటి ప్రక్రియల గురించి వివరించేందుకు అవసరమైన ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేయడం. జీవనశైలి కారణంగా అందరిలోనూ వచ్చే లైఫ్స్టైల్ జబ్బులైన డయాబెటిస్ వంటివి మొదలుకొని మహిళల్లోనే వచ్చే పీసీఓఎస్ (పాలీ సిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్), ఎండోమెట్రియాసిస్ వంటి వాటి విషయంలో అవసరమైన మేనేజ్మెంట్ గురించి అవగాహన కల్పించే కేంద్రాలను నెలకొల్పుతున్నారు. ఇక్కడ సమగ్ర చికిత్స అంటే... సమస్యకు ప్రిస్క్రిప్షన్ సూచించడం ఒక్కటే కాకుండా తీసుకోవాల్సిన ఆహారాలూ, చేయాల్సిన వ్యాయామాలు... ఇలా 360 డిగ్రీలలో అవసరమైనవన్నీ అందేలాంటి సెంటర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక నాలుగో విభాగంలోకి వస్తే హోమ్ హెల్త్కేర్ సేవలు. ఇటీవల హాస్పిటల్ ఖర్చులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. ఒకరోజు హాస్పిటల్లో ఉండాల్సి వస్తే లక్షల్లో ఖర్చు. కాని, అంతే క్వాలిటీ సేవలు ఇంట్లోనూ అందితే? ఈ కొత్త కాన్సెప్ట్తో పేషెంట్ కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించడానికి సర్జరీ అనంతర సేవలూ, వృద్ధులకు అవసరమైన కేర్, జీవిత చరమాంకంలో ఉన్నవారికి అవసరమైన పాలియేటివ్ కేర్ లాంటి అత్యంత కీలకమైన రంగంలోనూ ఎంటర్ ప్రెన్యూర్షిప్కు అవకాశాలు చాలా విస్తృతంగా పెరిగాయి. ఇవే కాకుండా, సాంకేతికత పెరుగుతున్న కొద్ది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందు బాటులోకి వస్తున్న కొద్ది అందివస్తున్న కొత్త సాంకేతికత సహాయంతో ఈ రంగాలను మరింత విస్తృతపరచే అవకాశం ఎంతో ఉంది. దానికి ఆకాశమే హద్దు. మరి మహిళలంటేనే ఆకాశంలో సగం అంటూ చెబుతుంటారు. ఇలా చూసినప్పుడు వారికి మరింత విశాలమైన అవకాశాలున్నాయో ఊహించవచ్చు. అంతేకాదు, వీటిలో మరింతగా విస్తరించడానికి మహిళల్లో సహజంగా ఉండే ఆర్ద్రత, దయ, సానుభూతి, సహానుభూతి, మల్టీ టాస్కింగ్ సామర్థ్యాల వంటి సహజ లక్షణాలు వారికి మరింతగా అవకాశమిస్తుంటాయి. అందుకే మహిళలు తమ సహజ లక్షణాలతో మరింతగా ముందుకు దూసుకుపోవాలనేది ఓ మహిళగా నా అభిలాష.డాక్టర్ మంజుల అనగాని, సీనియర్ గైనకాలజిస్ట్ ‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీతయాసీన్పరిష్కారాలు మనమే వెతుక్కోవాలియంగ్ జనరేషన్ గమనించాల్సింది ఏమిటంటే, మన చాయిస్ పట్ల మనం ప్యాషనేట్గా ఉండాలి. మన ప్రొడక్టివిటీని మగవాళ్లతో సమానంగా, చెప్పాలంటే కాస్తంత ఎక్కువగానే రిజల్ట్స్ చూపించాలి. మనం చేసే పని ప్యాషనేట్గా చేస్తూ, ఇతరులకు సహాయం చేయగలిగితే, పరిశోధనారంగంలో సక్సెస్ మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అమ్మాయిలు తమ అభిరుచి ఎందులో ఉందో గుర్తించి, మనస్ఫూర్తిగా ఆ రంగంలో పనిచేస్తూ పోవాలి. అయినా అందులోనూ ఆటంకాలు, అపజయాలు వస్తాయి. ఆటంకాలు వచ్చినప్పుడు ఎవరో వచ్చి మనకు ఏదో చేస్తారని ఎదురుచూడకూడదు. మనకు మనమే ధైర్యంగా ముందుకు సాగాలి. సమస్యలు ఎదురైనప్పుడు సమస్యలకు పరిష్కారాలను మనమే వెతుక్కోవాలి. నేను అలాగే పనిచేశాను. మనం ఎవరికన్నా తక్కువ కాదు. మనం అందరితోనూ సమానం, సమానం కంటే మనం ఎక్కువ అనే భావనతో మనం పనిచేసినప్పుడే ఆనందంగా ముందుకు సాగిపోగలం.నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బయోకెమిస్ట్రీలో పీజీ, జేఎన్టీయూ నుంచి బయోటెక్నాలజీలో ఎంటెక్ పూర్తి చేశాను. అప్పట్లో నాకు యూజీసీ ఫెలోషిప్ వచ్చినా, సెంటర్ ఫర్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)లో పీహెచ్డీ చేయాలని మా ప్రొఫెసర్స్, పేరెంట్స్ ఒత్తిడి చేయడంతో ఇందులో చేరాను. అలాగని సీసీఎంబీలో చేరడం పట్ల నాకు ఎలాంటి విచారం లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) పరిధిలో పనిచేసే సీసీఎంబీ హైదరాబాద్లోని హబ్సిగూడలో ఉంది. సీసీఎంబీ ఫౌండర్ డైరెక్టర్ పుష్పమిత్ర భార్గవ, ప్రొఫెసర్ లాల్జీ సింగ్ నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఆయన వద్దనే ఏడాదిన్నర పాటు డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ వర్క్, తర్వాత డాక్టర్ ఎం.ఆర్.దాస్ వద్ద బ్రెస్ట్ ట్యూమర్స్, హెపటైటిస్–బి వైరస్ పరిశోధనలు సాగించాను. ఆ తర్వాత 1996లో ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీకి మారి, అక్కడి పరిశోధనల్లో కొత్త వరివంగడాలను కనుగొనడం చాలా సంతోషకరమైన కాంట్రిబ్యూషన్. మన దేశంలోని రైతులకు ఉపయోగపడే వరివంగడం కనుగొనడంలో కీలక పాత్ర పోషించాను. వరి పంటకు ఎక్కువగా సోకే ఎండాకు తెగులు (బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్) తట్టుకునే వరివంగడాన్ని నాటి గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా 2008లో నల్లగొండ జిల్లా గడ్డపల్లిలో విడుదల చేయించాం. మా సూపర్వైజర్ డాక్టర్ రమేష్ శొంఠి. ఆయన ఆధ్వర్యంలో ఈ వర్క్ అంతా నేనొక్కదాన్నే చేశాను. నిజానికి ఇది ముగ్గురు మనుషులు చేయాల్సిన పని. మహిళలు తలచుకుంటే చేయలేనిది ఏదీ లేదు అనేదే నా సందేశం. మహిళల్లో మల్టీ టాస్కింగ్ టాలెంట్ ఎక్కువగా ఉంటుంది. వరి వంగడాలపై నా పరిశోధనవరి పండించే రైతులకు ఎండాకు తెగులు (బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్) పెద్ద సమస్య. ఈ తెగులును తట్టుకునే రోగనిరోధక శక్తిగల జన్యువులను సన్నబియ్యం దిగుబడిని ఇచ్చే వరిలోకి ‘ఇంట్రోగ్రెస్’ చేసి, 2008లో ‘ఇంప్రూవ్డ్ సాంబ మసూరి’ రకాన్ని విడుదల చేశాం. ఇప్పుడు దాని మీద మరిన్ని పరిశోధనలు సాగి స్తున్నాం. ‘స్టీల్త్ బ్లైట్’, ‘బ్రౌన్ ప్లాంట్ హోపర్’ వంటి వ్యాధులను తట్టుకోవడమే కాకుండా, ఫాస్ఫరస్ లోపం, పొలంలో నీరు నిల్వ చేరడం, నీటిలో అధిక లవణీయత వంటి ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకునేలా దీనిని రూపొందించడానికి కొన్ని జన్యువులను ఇదే వరి వంగడంలోకి చొప్పించి, మూడు కొత్త వంగడాలను సృష్టించాం. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ మూడు రకాల వంగడాలను జాతికి అంకితం చేశారు. వీటి విత్తనాలను త్వరలోనే రైతులకు ఉచితంగా పంపిణీ చేయనున్నాం. ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్’ సహకారంతో సీసీఎంబీ వరి వంగడాలను అభివృద్ధి చేస్తోంది. సీసీఎంబీ రూపొందించిన వంగడాలను ఐఐఆర్ఆర్ బ్రీడింగ్ చేస్తోంది. మా పరిశోధనల ఫలితంగా రైతన్నలకు అధిక దిగుబడులు వచ్చి, వారికి గిట్టుబాటు ధర లభించి, వారి జీవితాల్లో కొంతైనా మార్పు తేగలిగినందుకు మాకు సంతృప్తిగా ఉంది.డాక్టర్ విష్ణుప్రియ, శాస్త్రవేత్త, సీసీఎంబీ గోపాలకృష్ణ మయ్యా(చదవండి: ‘ఆమె’ ఆరోగ్యమే... సమాజ ఆరోగ్యం!) -
‘ఆమె’ ఆరోగ్యమే... సమాజ ఆరోగ్యం!
ఓ ప్రఖ్యాత కవి అంటారు... ‘‘ఇచ్చుటలో ఉన్న హాయీ వేరెచ్చటనూ లేనే లేదనీ’’!. అంటే మీరు ఇలా ఇవ్వడం మొదలుపెట్టగానే దాన్ని కొనసాగించడం కోసమైనా ప్రకృతి మీకూ ఇవ్వడం ప్రారంభిస్తుంది. దాంతో మీకు ఇచ్చే సామర్థ్యం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. మహిళ విషయంలో కూడా ఎప్పుడూ ఇంతే. ‘మీ ఆరోగ్యం జాగ్రత్త’ అంటూ ప్రతిసారీ ఆమె తన తల్లిదండ్రులకో, భర్తకో, పిల్లలకో, కుటుంబసభ్యులకో చెబుతూనే ఉంటుంది. ఇక భర్త విషయంలోనైతే ‘మీ యాన్యువల్ హెల్త్ చెకప్ చేయించుకోండి’ అంటూ పోరుతూ ఉంటుంది. వాళ్ల ఆరోగ్యాన్ని కాపాడటం కోసం... వాళ్లు వేళకు మందులు తీసుకుంటున్నారా అంటూ చెక్ చేస్తూ ఉంటుంది. ఇక హాస్పిటల్ విషయానికి వస్తే... ఆ పని చేసేది కూడా ‘నర్స్’ రూపంలోని మహిళే. ఇక లేడీ డాక్టర్, లేడీ టెక్నీషియన్ రూపంలో మరిన్ని సేవలు అందిస్తూనే ఉంటుంది. భారతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో మహిళ ఎప్పుడూ ఓ భాగమే. కాని, ఇంతటి కీలకమైన ఆ మహిళ తన ఆరోగ్యం విషయానికి వచ్చేప్పటికీ ‘ఆ... రేపు చూసుకుందాం లే’ అనుకుంటుంది. తన ఆరోగ్య సంరక్షణను ఎప్పుడూ వాయిదా వేసుకుంటూ ఉంటుంది. దీనికి చెల్లించాల్సిన మూల్యం ఒక్కోసారి గణనీయంగానే ఉండవచ్చు. ప్రస్తుతం మన దేశంలో జీవనశైలి జబ్బులైన ‘నాన్ కమ్యూనికబుల్’ వ్యాధులు దాదాపు 65 శాతం మరణాలకు కారణమవుతున్నాయి. వీటిల్లోనూ ప్రతి నాలుగు మరణాల్లో ఒకదానికి గుండెజబ్బులే కారణంగా మారుతున్నాయి. ఇక క్యాన్సర్ విషయానికి వస్తే ప్రతి ఏటా 1,70,000 కొత్త కేసులు జాబితాకు జతవుతున్నాయి. సర్వైకల్ క్యాన్సర్ ఏటా వేలాది మహిళల ప్రాణాలను బలి తీసుకుంటోంది. సమయానికి చిన్న స్క్రీనింగ్ పరీక్ష చేయిస్తే, ఆ మరణాలను దాదాపుగా పూర్తిగా నివారించడం సాధ్యం. ఇక దేశంలోని మొత్తం మహిళల్లో సగం మందికి రక్తహీనత ఉంది. అది వారిని నిస్సత్తువగా, నీరసంగా మార్చేస్తోంది. దీర్ఘకాలంలో వాళ్ల వ్యాధినిరోధకతను బలహీనంగా మార్చేస్తోంది. మహిళల్లో రొమ్ముక్యాన్సర్ కేసులు గంటగంటకూ డజన్ల సంఖ్యలో పెరుగుతున్నాయి. దురదృష్టం ఏమిటంటే... వీటిల్లో చాలా వాటి నివారణ పూర్తిగా సాధ్యం. టైముకు కనుక్కుంటే మరికొన్నింటికి పూర్తి చికిత్సగాని, లేదా మేనేజ్మెంట్గాని సాధ్యమే. అయినప్పటికీ మహిళలు తమ ఇంటిపనుల్లో, కుటుంబాన్ని చూసుకునే పనుల్లో పడిపోయి తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు. ముందునుంచే నివారించుకోవడం గాని, లేదా ముందే కనుగొనడంగాని చేస్తే, మహిళల ముప్పయిలు లేదా నలభైల వయసులోనే మహిళల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. కుటుంబం మొత్తం ఆరోగ్యాన్ని చూసుకునే అత్యంత విలువైన మహిళల ఆరోగ్యాన్ని సమర్థంగా కాపాడవచ్చు. ఇక ఇప్పుడు అందివచ్చిన కృత్రిమ మేధ (ఏఐ) సహాయంతో ఇంకాస్త కచ్చితంగా మహిళల ఆరోగ్యాన్ని అంచనావేసి, రానున్న ముప్పును తప్పించవచ్చు. అందుకే ఆమె కోసం సగౌరవంగా వైద్యపరీక్షల స్లాట్ బుక్ చేసి హైబీపీ, చక్కెర, కొలెస్ట్రాల్ పరీక్షల వంటివి చేయించాలి. లేదంటే మహిళల ఆరోగ్యం చెడిపోయే ముప్పు నిశ్శబ్దంగా పెరుగుతూనే ఉంటుంది. ఈ ఏడాది మహిళా దినోత్సవ థీమ్ ఏమిటంటే... ‘గివ్ టు గెయిన్’! మహిళ తన కుటుంబానికీ, ఈ సమాజానికీ ఎప్పుడూ ఇస్తూనే ఉంటుంది. అందుకే ఈ నేపథ్యంలో ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ ద్వారా ఆమెకు దక్కాల్సింది దక్కేలా చేయడమే ఇప్పుడు మనముందూ సమాజం ముందూ ఉన్న బాధ్యత. అప్పుడే మన భారత్లోని కుటుంబాల్లో ఆరోగ్యం నిండుతుంది. కార్యాలయాల్లో ఉత్పాదకత పెరుగుతుంది. దేశం ముందుకు పురోగమిస్తుంది. మహిళలు తమ ఇంటిపనుల్లో, కుటుంబాన్ని చూసుకునే పనుల్లో పడిపోయి తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు. ముందునుంచే నివారించుకోవడం గాని, లేదా ముందే కనుగొనడంగాని చేస్తే... మహిళల ముప్పయిలు లేదా నలభైల వయసులోనే మహిళల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. కుటుంబం మొత్తం ఆరోగ్యాన్ని చూసుకునే అత్యంత విలువైన మహిళల ఆరోగ్యాన్ని సమర్థంగా కాపాడవచ్చు. డాక్టర్ సంగీతారెడ్డిజాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, అపోలో హాస్పిటల్స్ యాసీన్(చదవండి: ఆత్మవిశ్వాసమే అసలు బలం) -
ఆ విచారణకు మీ హాజరు తప్పనిసరేం కాదు!
నేను ఒక ప్రభుత్వ కార్యాలయానికి ఆర్టీఐ దరఖాస్తు ఇచ్చాను. వారు సమాధానం ఇవ్వకపోవడంతో నేను ఫస్ట్ అప్పీల్ దాఖలు చేశాను. ఇప్పుడు వారు రిజిస్టర్డ్ పోస్టు ద్వారా ఒక లేఖ పంపి, 7 రోజులలోపల విచారణకు హాజరు కావాలని చెప్పారు. నన్ను ఎందుకు రమ్మంటున్నారో అర్థం కాలేదు. ఇప్పుడు నేను తప్పనిసరిగా ఆ విచారణకు హాజరు కావాలా? లేదా ఏమీ చేయకుండా సెకండ్ అప్పీల్ సమయం వచ్చిన తర్వాత నేరుగా రెండవ అప్పీల్ వేయాలా లేక కమిషన్కుపోవాలా? – నరేష్, నందిగామఆర్టీఐ చట్టం ప్రకారం, కోరిన సమాచారం సాధారణంగా రాతపూర్వకంగా లేదా మీరు కోరిన రూపంలో ఇవ్వాలి. ఇవ్వని పక్షంలో సమాచార హక్కు చట్టం, 2005 ప్రకారం, మొదటి అప్పీల్కు ప్రజా సమాచార అధికారి ఇచ్చిన సమాధానం వుంటే ఆ సమాధానం ఆధారంగా లేదా అప్పీల్లో పేర్కొన్న కారణాల ఆధారంగా నిర్ణయిస్తారు. అప్పీల్ అధికారి తన విచక్షణ ప్రకారం అప్పీల్దారుని విచారణకు పిలవవచ్చు కానీ మీరు హాజరు కావడం తప్పనిసరేమీ కాదు. రాతపూర్వక రికార్డుల ఆధారంగానే అప్పీల్ను నిర్ణయించవచ్చు. చాలా అప్పీలు దరఖాస్తులు అప్పీలు దారుడు వ్యక్తిగతంగా హాజరు కాకుండానే నిర్ణయించబడుతాయి.మీరు హాజరు కావాలనుకోకపోతే, రాతపూర్వకంగా కేసును పరిశీలించి రికార్డు ఆధారంగా నిర్ణయించాలని అభ్యర్థించవచ్చు. విచారణకు పిలవడం ద్వారా ఆర్టీఐ దరఖాస్తుకు రాతపూర్వక (లేదా మరే ఇతర విధానంలో కోరితే అలాగ) సమాధానం ఇవ్వాల్సిన బాధ్యతను కాదనలేరు. అందువల్ల, మీ ఆర్టీఐ ప్రశ్నలకు రాతపూర్వక సమాధానం ఇవ్వాలని మీరు కోరడం పూర్తిగా చట్టబద్ధమైనది.మీరు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావడం సాధ్యం కాదని, అప్పీల్ను రాతపూర్వక రికార్డుల ఆధారంగా నిర్ణయించాలని అభ్యర్థిస్తున్నారని లేఖ రాయండి. పోస్టల్ స్లిప్పులు భద్రపరచుకోండి. మీకు సమాచారం లేదా పరిష్కారం దొరక్కపోతే, 90 రోజుల్లోగా కమిషన్ను ఆశ్రయించవచ్చు. ఇలా చేయడం వల్ల మీరు విచారణ నోటీసును పూర్తిగా పట్టించుకోలేదని ఎవరూ చెప్పలేరు. సంబంధిత అధికారం కేంద్ర ప్రభుత్వానికి చెందితే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వానికి చెందితే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ – వద్ద అప్పీల్ చేయాలి.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. ) (చదవండి: స్ట్రోక్ బాధితురాలి ఘనత..! ఏకంగా రెండు ప్రపంచ రికార్డులు..) -
స్ట్రోక్ బాధితురాలి ఘనత..! ఏకంగా రెండు ప్రపంచ రికార్డులు..
చాలామంది అప్పటి వరకు సామాన్యులుగా కనిపించినవాళ్లు..జీవితం పెట్టిన పరీక్షలతో ఒక్కసారిగా స్ఫూర్తిదాయకమైన వ్యక్తులుగా నిలుస్తారు. ప్రపంచమే జైజైలు పలికేలా ఆకామంత ఎత్తున నిలుస్తారు. అంతేగాదు కష్టం వస్తే కాళ్లు మునగదీసి ఏడుస్తూ కూర్చొవడం కాదు..కన్నెర్రజేసేలా హీరోలా బతికి చూపించాలి..మార్గదర్శకంగా ఉండాలని చేతలతో చూపిస్తారు. అలాంటి మాటలకు నిలువెత్తు అర్థం ఈ మహిళ. భయంకరమైన అనారోగ్య సమస్య ఆమెను భయపెట్టలేదు కదా..మరింత బలోపేతమై గొప్ప విజయాన్ని అందుకునేందుకు పురిగొల్పింది. ఆ మహిళే జయశ్రీ విజయ్ మోహన్. చెన్నైకి చెందిన జయశ్రీ కొన్ని నెలల క్రితం టాంజానియాలో ఉన్న ప్రపంచంలోనే ఎత్తైన స్వేచ్ఛా పర్వతం అయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారామె. ఇది అత్యంత కఠినమైన పర్వత శిఖరాగ్రం. ఎందుకంటే శిఖరాగ్రం సమీపం చేరుకునే రోజున అస్సలు విశ్రాంతి తీసుకోకుండా సుమారు వెయ్యి మీటర్లు దాక 15 గంటల పాటు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సముద్ర మట్టంలో సాధారణంగా లభించే ఆక్సిజన్ స్థాయిలో సగం మాత్రమే ఉంటుంది. అలాంటి దుర్భేద్యమైన పర్వతాన్ని కేవలం ఐదు రోజుల్లో అదికూడా 6.5 గంటల్లో అవలీలగా అధిరోహించింది. అలాగే వెనక్కి(అవరోహణ) 10.26 గంటల్లో ట్రెక్కింగ్ చేస్తూ వచ్చేశారామె. ఈ అరుదైన ఘనతతో జయశ్రీ ఒకటి కాదు ఏకంగా రెండు గిన్నిస్ రికార్డుల నెలకొల్పింది. ఇలా అతి తక్కువ సమయంలో మహిళల విభాగంలో కిలిమంజారోని అధిరోహించి.. వెనక్కి వచ్చేసిన తొలి మహిళగా నిలిచారామె. ఇంతటి ఘనతను సృష్టించిన జయశ్రీ నిజానికి ఆరోగ్యవంతమైన మహిళ కాదు. ఆమె ఒక స్ట్రోక్ బాధితురాలు. తన రికార్డు ఇతర మహిళలను ప్రేరేపించాలనే ఉద్దేశ్యంతో ఈ సాహసానికి పూనుకున్నట్లు తెలిపారామె. ఆమె ఒక తల్లిగా, విజయవంతమైన వ్యవస్థాపకురాలిగా హాయిగా సాగిపోతున్న జీవితాన్ని స్ట్రోక్ ఒక్క కుదుపుతో దబాలున కిందపడేసినట్లయ్యింది. జయశ్రీ ఎడమవైపు మొత్తం పక్షవాతానికి గురై ఆస్పత్రులు చుట్టూ తిరుగుతున్నా..తనకేమైందన్నది అర్థం గాక, తన శరీరం తనమాట వినక పడిన బాధ అంత ఇంత కాదు. పిల్లల కళ్లలో ఆందోళన ఒక్కటే తనకేదో అయ్యిందని అనిపిస్తోంది కానీ తన చుట్టూ ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి. వివిధ ఆస్ప్రతులు తిప్పుతూ తన వాళ్లు పడుతున్న బాధ అర్థమవుతున్నా..ఏం చేయలేని ఆ నిస్సహాయత ఎప్పటికీ మర్చిపోలేనంటోంది జయశ్రీ. ఆ తర్వాత వైద్యులు తన వద్దకు వచ్చి..ఆమె గతంలోలా మాములు మనిషి అవ్వలేదని, నాడీ సంబంధిత పూర్తి నష్టాన్ని తిప్పికొట్టలేమని తేల్చి చెప్పేశారు. అప్పుడే తేలిసిందామెకు ఇలాంటి పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలనేది.. అయితే తన స్థితిని మార్చలేకపోవచ్చు గానీ, ధైర్యాన్ని పోగొట్టుకోనక్కర్లేదని అంటోంది జయశ్రీ. అంతేగాదు ఆ సమయంలోనే అసలైనవి "బలం", "సంయమనం" అని తెలసుకున్నానని చెబుతోంది. అప్పుడు అర్థం చేసుకున్నా.. శరీరం మాట వినడం, దాని పరిమితులు అర్థం చేసుకుంటూ ముందుకు సాగడం ఎలా అని పూర్తిగా తెలుసుకున్నానని చెప్పుకొచ్చింది. కోలుకోవడం మొదలయ్యాక..ఏదో అనారోగ్య బాధితురాలిలా ఉండిపోవడం నచ్చక ఏదో ఒకటి సాధించి చూపించాలి అలాగే తనలాంటి మహిళల్లో స్థైర్యం నింపాలన్న ఆకాంక్ష ఈ సాహసానికి పురిగొల్పిందని చెప్పుకొచ్చింది జయశ్రీ. నిజానికి ఈ పర్వత ట్రెక్కింగ్ కోసం ముందుగా ఆమె శారీరకంగా మానసికంగా ప్రిపేరయ్యేందుకు ఎంతగానో శిక్షణ, ట్రీట్మెంట్ల తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వాటన్నింటిని భేఖాతరు చేయకపోగా..రికార్డులు మీద రికార్డులు నెలకొల్పడం అంటే మాటలు కాదుగదా..!. View this post on Instagram A post shared by Storyboard18 (@brandstoryboard) (చదవండి: ఫిట్నెస్ అంటే సిక్స్ ప్యాక్ కాదు..ఆ సామర్థ్యం పొందడమే!: మిలింద్ సోమన్) -
ఫిట్నెస్ అంటే సిక్స్ ప్యాక్ కాదు..ఆ సామర్థ్యం పొందడమే!
భారతదేశంలో గ్లామర్ రంగంలో ఉంటూ ఫిట్నెస్లో గట్టి ప్రభావం చూపిన కొద్దిమంది వ్యక్తులలో మిలింద్ సోమన్ ఒకరు. సాధారణంగా ప్రతీ ఒక్కరూ రిటైర్ మెంట్ తీసుకునే 60 సంవత్సరాల వయస్సులో ఆయన యువ తరానికి గొప్ప ప్రేరణగా మారాడు. కానీ, సోమన్ తనను తాను ప్రేరణగా భావించుకోడు, అది మన చుట్టూ ఎప్పటి నుంచో ఉన్నదని గమనించడంలోనే తేడా ఉందని అంటాడు. తాను ఎవరినీ ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించలేదని ఆయన అంటున్నాడు. అయితే కొందరైనా ప్రేరణ పొందినందుకు తనకు సంతోషంగా ఉందన్నాడు. మిళింద్ సోమన్ 1990లలో సూపర్ మోడల్గా నిలిచాడు. ఆ తర్వాత జుర్మ్, ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్,, డిసెంబర్ 16, ఎమర్జెన్సీ వంటి చిత్రాలు సిరీస్లలో నటించడం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. వీటికి అదనంగా, అతను రన్నింగ్ ట్రాక్పై తనకు సాటిలేని స్థానాన్ని కూడా సుస్థిరం చేసుకున్నాడు సుదూర ప్రాంతాలు, కఠినమైన భూభాగాలు అసాధ్యమైన పరిస్థితులను పరుగుతో కవర్ చేశాడు.మనం మహిళలకు మాత్రమే ఒక ప్రత్యేక ఫిట్నెస్ ఈవెంట్ను సృష్టిస్తే? ఈ ప్రశ్నకు సమాధానంగా గత 2012లో, సోమన్ ఆయన భార్య అంకితా కోన్వర్లు కలిసి పింక్థాన్ను స్థాపించారు ఇప్పుడు ఆ ఈవెంట్ భారతదేశంలోనే అతిపెద్ద మహిళల పరుగు కార్యక్రమంగా అవతరించింది. ఈ సందర్భంగా ఆయన ఇటీవల మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు అనుభవాలు పంచుకున్నారు.చాలా మంది కండలు తిరిగిన శరీరం అనుకుంటారని అయితే తన దృష్టిలో ఫిట్నెస్ అంటే అది ఒత్తిడిని ఎదుర్కోగల సామర్థ్యం అని ఆయన పేర్కొంటాడు. శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, భావోద్వేగ ఒత్తిడి... వీటిని ఎంత బాగా ఎదుర్కోగలిగితే, జీవితం అంత మెరుగ్గా ఉంటుందని ఆయన స్పష్టం చేస్తున్నాడు. ఇది సిక్స్ ప్యాక్స్ లేదా బైసెప్స్ గురించి అవి అందించే లుక్స్ గురించి కాదు. ఇది మన శరీరపు పనితీరు గురించి అని విశ్లేషిస్తున్నాడు.తాను దాదాపు 25 సంవత్సరాల క్రితమే పరుగు ప్రారంభించానని, కొంత కాలం తర్వాత చాలా మంది పరుగు ప్రారంభించారని, అలాగే కేవలం ముంబైలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా పరుగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని గమనించానన్నాడు. అయితే మహిళల భాగస్వామ్యం 4–5 శాతం మించి ఉండడం లేని పరిస్థితిలో.. మనం మహిళలకు మాత్రమే ఒక ఈవెంట్ను సృష్టించాలని ఆలోచించానన్నాడు. అయితే వారు స్పందిస్తారా?అని తొలిదశలో సందేహించానన్నాడు. ఎందుకంటే చాలా మంది మహిళలు ఇప్పటికీ వ్యాయామం క్రీడలు అంటే పురుషుల కోసమే అని భావిస్తున్నారని..అయితే మేం ధైర్యంగా ముందడుగు వేశామన్నాడు. చీర ధరించి పరుగులు తీయడం, చీర ధరించి సైక్లింగ్ చేయడం, యోగా నడక...వంటివన్నీమేళవించి.. ఈ కార్యక్రమం తన కోసం కాదని ఏ మహిళా భావించకుండా దీనిలో భాగం చేశామని వివరించాడు. మహిళలు ఎవరికోసమో లేదా బయటి దానికోసమో కాదు, తమ కోసం తాము పరుగు తీయడమే ఈ కార్యక్రమ లక్ష్యమన్నాడు. View this post on Instagram A post shared by Milind Usha Soman (@milindrunning)(చదవండి: ఆపిల్ వాచ్ ధరిస్తున్నారా..? పోషకాహార నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్) -
ఆపిల్ వాచ్ ధరిస్తున్నారా..? పోషకాహార నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్
యాపిల్ వాచ్లను ఇష్టపడని వారుండదరు. ఇవి మన ఆరోగ్యం, జిమ్కి సంబంధించి కేలరీల ఖర్చు, ఆరోగ్య సమాచారం వరకు అన్ని అందించే ఆధునిక పరికరం. చెప్పాలంటే గడియారానికి మించినది. మన బాడీలోని అతిముఖ్యమైన పార్ట్లా బాగమైపోయింది. కానీ ఈ యాపిల్ వాచ్లను ఆ విధంగా అస్సలు చూడొద్దని అంటున్నారు అమెరికా ఆరోగ్య నిపుణులు. మిమ్మల్ని ఆరోగ్యపరంగా అలర్ట్ చేసే గొప్ప సాధనమే అయినా..కేర్ఫుల్గా ఉండకపోతే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు పోషకాహార నిపుణులు. ఎందువల్ల ఇలా అంటున్నారంటే..జేబులో ఉండే స్మార్ట్ఫోన్ లేదా డెస్క్పై ఉపయోగించే ల్యాప్టాప్లా కాకుండా..స్మార్ట్వాచ్ చాలా ప్రత్యేకమైనది. ఇది 24/7 మన సంరక్షణ కోసం రూపొందించిన సాధనంగా అందరికీ అత్యంత ప్రీతీపాత్రమైనది. ఈ వాచ్లపై ఉండే మక్కువతో దాని భద్రత గురించి పెద్దగా అస్సలు పట్టించుకోరు కూడా. కానీ ఈ పరికరం గంటల తరబడి రేడియోఫ్రీక్వెన్సీ(RF) సంకేతాలను నేరుగా మన కణజాలంలోకి పంపుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఈ ఫ్రీక్వెన్సీలను గ్రేడ్ 2B కార్సినోజెన్లుగా పేర్కొంది. ఆయా సంస్థలు ఈ వాచ్లో ఉద్గారాలు పరిమితుల్లో ఉన్నాయని చెబుతున్నప్పటికీ.. దీని పరిమితులు మనం నిద్రిస్తున్నపుడూ కూడా చేతికే ధరించేంత సురక్షితంగా రూపొందించింది మాత్రం కాదని నొక్కి చెబుతున్నారు నిపుణులు. ఇది కేవలం రేడియేషన్ మాత్రమే కాదు..దాని చుట్టూ ఉండే హై-ఎండ్ 'ఫ్లోరోఎలాస్టోమర్' బ్యాండ్లు తరుచుగా PFAS లేదా ఎక్కువ మోతాదులో రసాయనాలు ఉంటాయని పలు అధ్యయనాల్లో తేలింది. అమెరికన్ కెమికల్ సొసైటీ ప్రకారం, ఫ్లోరినేటెడ్ సింథటిక్ రబ్బరుతో తయారు చేసిన ఖరీదైన రిస్ట్బ్యాండ్లు ముఖ్యంగా అధిక స్థాయిలో రసాయనాలు ఉంటాయని 2024 జరిపిన అధ్యయనాల్లో తేలింది. దీనిలో PFAS సమస్య ఉందనేది వాస్తవమే అని నిరూపితమైంది. అందువల్ల దీన్ని గనుక దీర్ఘకాలంపాటు మణికట్టు వద్ద ధరిస్తే..ఈ రసాయనాలు చర్మం, రక్తప్రవాహంలోకి చొచ్చుకుపోతాయని అంటున్నారు నిపుణులు. ఈ PFAS విచ్ఛిన్నం కానందున, అవి కాలక్రమేణా అవయవాలలో పేరుకుపోతాయి. అవి కాస్తా కాలేయం, మూత్రపిండాలపై ఒత్తిడిని కలుగజేసి అనారోగ్యానికి దారితీస్తుందని చెబుతున్నారు. అంతేగాదు హార్మోన్లు ఇన్బ్యాలెన్సింగ్కి కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు పరీక్షించిన 22 ప్రముఖ బ్యాండ్లలో 15 ఈ విషపదార్థాలను కలిగి ఉన్నాయని, అందులోనూ అధిక ధర కలిగిన ప్రీమియం బ్యాండ్లలో ఈ సమస్య మరింత ఎక్కువని అంటున్నారు.ఇది అవగాహన..సంరక్షణ కోసమే..ఇది లేనిపోని భయాలు కలుగజేసందుకు కాదని అవగాహన కల్పించేందుకేనని నొక్కి చెబుతున్నారు నిపుణులు. ఆపిల్ వాచ్ శక్తిమంతమైన సాధనమే కానీ..దాన్ని మన శరీరంలోని సహజ భాగంగా పరిగణించొద్దని హెచ్చరిస్తున్నారు. సురక్షితంగా ఎలా ఉపయోగించాలంటే.. సాంకేతిక ప్రయోజనాలు పొందేలా సురక్షితంగా ఎలా ఉపయోగిస్తే మంచిదంటే..సింథటిక్ ఫ్లోరోఎలాస్టోమర్ బ్యాండ్లను సేంద్రీయ తోలు, స్టెయిన్లెస్ స్టీల్ లేదా జనపనార వంటి సహజ పదార్థాలతో ఉపయోగించేందుకు ప్రయత్నించండివర్కింగ్ టైంలో లేదా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వాచ్ను తీసివేయండిపడుకునే ముందు వాచ్ ధరించడం మానేయండి. నిద్ర అంటే శరీరం నిర్విషీకరణపై దృష్టి పెడుతుంది కాబట్టి ఈ సమయంలో ఇతర రసాయనాలకు గురికావడం వల్ల సహజమైన నిద్ర ప్రక్రియకు అంతరాయం ఏర్పడుతుందని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Zib - Ayus Wellness - Health Optimisation | Mindset | Longevity (@ayuswellnessuk) (చదవండి: జస్ట్ ఒక్క ఏడాదిలో 26 కిలోల బరువు..! నో డైట్ ప్లాన్, నో ఫిట్నెస్ మంత్ర) -
జస్ట్ ఒక్క ఏడాదిలో 26 కిలోల బరువు..! నో డైట్ ప్లాన్, నో ఫిట్నెస్ మంత్ర
దేశంలో ప్రధాన ఆరోగ్య సమస్య అధిక బరువు అందర్నీ వేధిస్తున్న సమస్యగా మారింది. గంటల తరబడి కూర్చొని చేసే డెస్క్ ఉద్యోగాలు, కదలికలు లేకపోవడం, వీటికి తోడు జంక్ ఫుడ్ ఇవన్నీ ఊబకాయానికి దారితీస్తున్నాయి. దీన్ని తగ్గించుకోవాలని ఎంతో ప్రయాసపడి కఠిన డైట్లు అనసరించినా ఫలితం శూన్యంగా ఉంటుంది. అలాంటి వాళ్లు తప్పనిసరిగా ఈ మిరాకిల్ పద్ధతిని అనుసరించి త్వరితగతిన బరువు తగ్గొచ్చని చెబుతున్నారు కంటెంట్ క్రియేటర్ జెసికా ఆర్ట్వానీ. అదెలాగో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. తాను ఆ పద్ధతిలోనే దాదాపు 26 కిలోలు బరువు తగ్గినట్లు తెలిపారు కూడా. మరి ఆ మిరాకిల్ టెక్నిక్ గురించి సవివరంగా తెలుసుకుందామా..!.చాలామంది బరువు తగ్గేందుకు షార్ట్కట్లు, తీవ్రమైన దినచర్యలు అనుసరిస్తుంంటారు. నిజానికి బరువు తగ్గడం అనేది సాధారణంగా స్థిరంగా చేసే చిన్న అలవాట్ల వల్లే సాధ్యమవుతుందని అంటున్నారు. గతేడాది నుంచి తాను చిన్ని చిన్న సాధారణ అలవాట్లపై దృష్టిపెట్టి 26 కిలోల బరువు తగ్గినట్లు తెలిపారు. తనకు ఈ 26 కిలోలు బరువు తగ్గడానికి ఆ ఐదు సాధారణ అలవాట్లు హెల్ప్ అయ్యాయని చెబుతోంంది. త్వరితగతిన బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఓ అద్భుతమైన పద్ధతని అభివర్ణిస్తోంది. తాను ఎలాంటి స్ట్రిక్ట్ డైట్లు, ఖరీదైన ఫిట్నెస్ ప్రోగ్రామ్లు పాటించలేదని చెబుతోంది జెసికా. తన వెయిట్లాస్ జర్నీ గురించి మాట్లాడుతూ..తాను బరువు తగ్గడానికి స్థిరంగా ఈ ఐదు పనులు చేశానని తెలిపింది. ఎలాంటి ఫ్యాన్సీ హ్యాక్స్, షార్ట్కట్లు లేవని అంటోంది. సహాయపడిన ఆ ఐదు అలవాట్లు..వీలైనంత ఎక్కువగా నడవడం: నడక తన దినచర్యలో అతిపెద్ద మార్పులలో ఒకటి. సాధ్యమైనప్పుడల్లా తన రోజులో కదలికను ఒక భాగంగా చేసుకున్నానని జెసికా చెప్పింది. ఆమె మార్నింగ్ వాకింగ్, భోజనం తర్వాత రాత్రి తప్పనిసరిగా కొద్దిసేపు నడక చేసినానని వివరించారామె.ప్రాసెస్ చేసిన చక్కెరను పూర్తిగా తగ్గించడం: ప్రాసెస్ చేసిన చక్కెరను పూర్తిగా తొలగించానని తెలిపింది. అంటే అప్పుడప్పుడూ కనీసం దాని జోలికి పోలేదని, పూర్తిగా దూరం పెట్టానని చెప్పుకొచ్చింది. ఎక్కువ నీరు త్రాగడం: ఆమె దృష్టి సారించిన మరో అలవాటు హైడ్రేషన్. కానీ తగినంత నీరు త్రాగడం చాలా పెద్ద తేడాను చూపిస్తుంది. ఇది చాలా శక్తిమంతమైన మార్పుకి నాంది అని అంటోంది. ప్రోటీన్కు ప్రాధాన్యత ఇవ్వడం: ప్రోటీన్ తన భోజనంలో కీలక పాత్ర పోషించిందని చెబుతోంది. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేస్తాయి పైగా అనవసరమైన చిరుతిండిని తగ్గిస్తాయి. ఇక్కడ ప్రోటీన్ ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతినందించి, ఆకలి కోరికలను నియంత్రిస్తుంది.ఒక సవాలు పెట్టుకోవడం: తాను అనుకున్నట్లుగా అన్ని పాటించానా లేదా అనే సెల్ఫ్ చెకింగ్ లేదా జవాబుదారితనం తనకు బరువు తగ్గాలనే ఆకాంక్షను రెట్టింపు చేసేదట. దాంతో చాలా కేర్ఫుల్గా ఉండటమే గాక తనను తాను ప్రశ్నించుకునేటప్పడూ..దోషిలా ఉండకూదన్న భయం సదా వెయిట్లాస్ అయ్యేందుకు ప్రేరేపించేదట.ఇక్కడ జెసికా వెయిట్లాస్ జర్నీలో ..బరువు తగ్గాలంటే తీవ్రమైన మార్పులు, అతి వర్కౌట్లు అవసరం లేదు. కేవలం చిన్న అలవాట్లే స్థిరంగా.. కంటిన్యూటీ మిస్ కాకుండా చేస్తే చాలు బరువు తగ్గడం చాలా సులభమని తెలుస్తోంది కదూ.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: చిన్న అలవాట్లు.. పెద్ద మార్పులు) -
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర అలవాటు?
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలతో కూడిన ఆహారం, వ్యాయామం ఎంత అవసరమో.. కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని పనులు మన శరీరంలోని అంతర్గత అవయవాలను దెబ్బతీస్తాయి. అయితే, వీటిలో అన్నింటికంటే ప్రమాదకరమైన అలవాటు ఏది? అనే ప్రశ్నకు దశాబ్దాల అనుభవం కలిగిన ప్రముఖ వైద్యుడు సమాధానమిచ్చారు. అమెరికాకు చెందిన బోర్డ్-సర్టిఫైడ్ కార్డియోవాస్కులర్ సర్జన్ డాక్టర్ జెరెమీ ప్రపంచంలోని చాలామందిని పట్టిపీడిస్తున్న ఆ అలవాటు గురించి హెచ్చరించారు.అవయవాల విధ్వంసకారిప్రముఖ పాడ్కాస్టర్ మెల్ రాబిన్స్తో నిర్వహించిన చర్చలో డాక్టర్ జెరెమీ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఒక హృద్రోగ నిపుణునిగా మనిషి తప్పనిసరిగా దూరంగా ఉంచాల్సిన అలవాటు ఏది? అని అడిగినప్పుడు ఆయన ఏమాత్రం తడుముకోకుండా ‘ధూమపానం’ అని సమాధానమిచ్చారు. ‘సిగరెట్ తాగడం వల్ల శరీరంలోని ప్రతి అవయవానికి జరిగే నష్టం అంతా ఇంతా కాదు. దీనికి మించిన ప్రమాదకరమైన అలవాటు మరొకటి లేదని స్పష్టంగా చెప్పగలను’ అని ఆయన పేర్కొన్నారు.ఎందుకు అంత ప్రమాదకరంధూమపానం అనేది కేవలం ఊపిరితిత్తులను మాత్రమే దెబ్బతీసే అనారోగ్య సమస్య కాదని, ఇది ఒక 'మల్టీ-ఆర్గాన్ కిల్లర్' అని డాక్టర్ జెరెమీ అభివర్ణించారు. ఆయన విశ్లేషణ ప్రకారం:రక్తనాళాలు దెబ్బతినడం: సిగరెట్లలోని రసాయనాలు రక్తనాళాల లోపలి పొరలను నాశనం చేస్తాయి.ఆక్సిజన్ కొరత: రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని తగ్గించి, గుండెపై విపరీతమైన ఒత్తిడిని పెంచుతాయి.క్యాన్సర్ కారకం: ఊపిరితిత్తుల క్యాన్సర్కు ప్రధాన కారణం ధూమపానం. ఇది ఇతర రకాల క్యాన్సర్లకు కూడా పునాది వేస్తుంది.‘నా 25 ఏళ్ల కెరీర్లో ఎంతోమంది రోగులను చూశాను. నికోటిన్ వ్యసనం నుండి బయటపడటం ఎంత కష్టమో నాకు తెలుసు. ఇది ప్రాణాలను హరిస్తుందనే నిజాన్ని ఎవరూ ఎంతమాత్రం విస్మరించకూడదు. నా దృష్టిలో అత్యంత ప్రమాదకరమైన అలవాట్ల జాబితాలో మొదటి మూడు స్థానాలు ధూమపానానివే’ అని ఆయన హెచ్చరించారు.శాస్త్రీయ ఆధారాలుకేవలం డాక్టర్ జెరెమీ అనుభవమే కాకుండా, అంతర్జాతీయ పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. ‘క్యురియస్’ (Cureus) జర్నల్లో 2023లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ధూమపానం అనేది శరీరంలోని దాదాపు అన్ని వ్యవస్థలపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలు, సంతానోత్పత్తి లోపాలు, మరెన్నో దీర్ఘకాలిక వ్యాధులకు ఇది మూలకారణంగా నిలుస్తుంది. ముఖ్యంగా 'ప్యాసివ్ స్మోకింగ్' (పక్కన ఉన్నవారు వదిలిన పొగను పీల్చడం) కూడా అంతే ప్రమాదకరమని ఈ నివేదిక వెల్లడించింది.ఆరోగ్యకరమైన భవిష్యత్తు..ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ధూమపానాన్ని వదిలిపెట్టడం అనేది తప్పనిసరి అని ఈ అలవాటు కలిగినవారు గుర్తించాలి. ఇటువంటి నిర్ణయం కేవలం గుండెను మాత్రమే కాకుండా, శరీరంలోని ప్రతి అణువును కాపాడుతుంది. డాక్టర్ జెరెమీ లాంటి నిపుణుల హెచ్చరికలను గమనించి, ధూమపానం అలవాటు కలిగినవారు తక్షణమే మేల్కొనడం అవసరం.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలి.ఇది కూడా చదవండి: బాస్ కుర్చీలో ‘బాట్’.. ‘ఏజెంట్’ చెప్పింది చేయాల్సిందే! -
చిన్న అలవాట్లు.. పెద్ద మార్పులు
చాలామంది పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే పెద్ద పెద్ద పనులు చేయడమే అనుకుంటారు. కానీ, అసలైన విప్లవం చిన్న చిన్న అలవాట్లలోనే ఉంది. అవి మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టే ఇటుకలని జేమ్స్ క్లియర్ (James Clear) అంటాడు.మనం చేసే ప్రతి పనికి, మనకు ఒక 'ఐడెంటిటీ' (Identity) ఉంటుంది. మీరు రోజూ చదివితే మీరు 'రీడర్' అవుతారు. మీరు రోజూ వ్యాయామం చేస్తే మీరు 'అథ్లెట్' అవుతారు. మన పర్సనాలిటీ అనేది మనం రోజూ చేసే పనుల మొత్తమే. అయితే, కొత్త అలవాట్లను మొదలుపెట్టడం చాలా కష్టం. అందుకే, Habit Stacking అనే టెక్నిక్ మీకు అద్భుతంగా పనిచేస్తుంది.1. Habit Stacking అంటే ఏంటి?మీకు ఇప్పటికే అలవాటుగా ఉన్న ఒక పాత పనిని (Anchor Habit), కొత్తగా మీరు చేయాలనుకుంటున్న పనితో కలిపి (Stack) చేయడం.పాత అలవాటు (Anchor): కాఫీ తాగడం, పళ్ళు తోముకోవడం, బాత్రూమ్కి వెళ్లడం.కొత్త అలవాటు (New Habit): పుస్తకం చదవడం, మెడిటేషన్, ప్లానింగ్.ఉదాహరణకు, "నేను కాఫీ తాగాక, వెంటనే 5 నిమిషాలు నా గోల్స్ రాసుకుంటాను" అని నిర్ణయించుకుంటారు. ఇక్కడ 'కాఫీ తాగడం' అనేది పాత అలవాటు, 'గోల్స్ రాయడం' అనేది కొత్త అలవాటు. దీనివల్ల మీరు కొత్తగా ఏమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, పాతది దానంతట అదే మిమ్మల్ని కొత్త పనికి తీసుకెళ్తుంది.2. పర్సనాలిటీకి ఇది ఎందుకు కీలకం?ఒక రోజులో లేదా ఒక వారంలో లేదా ఒక నెలలో నా పర్సనాలిటీ మారిపోవాలనే లక్ష్యం పెట్టుకుంటే మెదడు భయపడుతుంది. అదే చిన్న అలవాట్లతో మనం మెదడుకు తెలియకుండానే గొప్ప మార్పులను తీసుకొస్తాం.Consistency: ఇది మిమ్మల్ని క్రమశిక్షణతో ఉంచుతుంది.Compound Effect: చిన్న అలవాట్లు రోజులు గడిచేకొద్దీ పెద్ద రిజల్ట్స్ని ఇస్తాయి.Self-Identity: "నేను ప్రతిరోజూ 5 నిమిషాలు మెడిటేషన్ చేస్తున్నాను" అని మీ మైండ్ నమ్మినప్పుడు, మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.3. మోటివేషన్ మాయ vs సైకలాజికల్ సిస్టమ్స్"రేపటి నుండి రోజూ రెండు గంటలు చదువుతాను" అనుకోవడం మోటివేషన్. కానీ రెండు రోజుల్లో ఆపేస్తారు"నేను ప్రతిరోజూ పడుకునే ముందు 1 పేజీ చదువుతాను" అని చిన్నదిగా మొదలుపెట్టడం అలవాటు చేసుకోండి. అలవాటు అనేది 'గోల్' కాదు, అది ఒక 'సిస్టమ్'.4. మీ 'Habit Stack' ని బిల్డ్ చేయండిGenius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, మీ కొత్త పర్సనాలిటీకి కావాల్సిన స్టాక్ ఇది.Step 1: చెడు అలవాట్లను బ్రేక్ చేయండిముందుగా మీకు ఉన్న చెడు అలవాట్లను గుర్తించి వాటిని 'బ్రేక్' చేయండి. ఉదాహరణకు, నిద్రలేవగానే ఫోన్ చూడటం. దానికి బదులుగా ఒక మంచి హ్యాబిట్ స్టాక్ పెట్టండి.Step 2: మీ స్టాక్ ని డిజైన్ చేయండిమీ డైలీ రొటీన్లో ఈ మూడు స్టాక్స్ను ప్రయత్నించండి:ఉదయం: "నేను లేవగానే, ఒక గ్లాసు నీళ్లు తాగి, రెండు నిమిషాలు నా పర్సనాలిటీ లక్ష్యం గురించి ఆలోచిస్తాను."మధ్యాహ్నం: "నేను లంచ్ చేశాక, ఒక పేజీ పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకం చదువుతాను."రాత్రి: "నేను పడుకునే ముందు, రోజంతా ఏం నేర్చుకున్నానో ఒక డైరీలో రాస్తాను."Step 3: ఆటో-పైలట్ పర్సనాలిటీఒక్కసారి ఈ స్టాక్స్ ఆటోమేటిక్ అయిపోతే, మీ వ్యక్తిత్వం దానంతట అదే మారుతుంది. అప్పుడు మీరు ఆలోచించక్కర్లేదు, మీ అలవాట్లే మిమ్మల్ని గెలిపిస్తాయి. ఇదే 'Beyond' స్టేజ్.5. ఈరోజు మీరు ఏ స్టాక్ మొదలుపెడతారు?ఈ రోజు మీరు ఒక చిన్న పని చేయండి.మీకున్న ఒక మంచి పాత అలవాటుని గుర్తించండి (ఉదా: టీ తాగడం).దానికి జత చేయాల్సిన ఒక చిన్న కొత్త అలవాటుని ఎంచుకోండి (ఉదా: రెండు నిమిషాల ప్రార్థన లేదా ప్లానింగ్).వచ్చే ఏడు రోజులు దీన్ని కచ్చితంగా చేయండి.మీ అలవాట్లే మీ వారసత్వం!బ్రో, ఒక మహా వృక్షం చిన్న విత్తనం నుండే మొదలవుతుంది. మీ పర్సనాలిటీ కూడా అంతే. చిన్న చిన్న అలవాట్లే రేపు మీ లెగసీ (Legacy) గా మిగిలిపోతాయి. గొప్ప వ్యక్తులు గొప్పగా ఉండటం వల్ల గొప్పవారు కాలేదు, వారు చేసే పనులు గొప్పవి కాబట్టి గొప్పవారు అయ్యారు."We are what we repeatedly do. Excellence, then, is not an act, but a habit." : Aristotleసైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: అణిగిపోవద్దు..అతిగా అరవవద్దు..!) -
నెట్టింటి నిండా సైబర్ సైకోలే!
ఇంటర్నెట్.. సమాచారానికి, అవకాశాలకు ఒక విస్తారమైన డిజిటల్ వేదిక. అయితే, నేడు ఇదే వేదిక నేరాలకూ నిలయంగా మారుతోంది. ముఖ్యంగా మహిళలు సైబర్ నేరగాళ్ల మాయలో చిక్కుకుంటున్నారు. స్మార్ట్ఫోన్ వినియోగం పెరగడం, సరైన అవగాహన లేకపోవడంతో సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం.⇒ 31.2% నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2025–26 నివేదికల ప్రకారం, 2023తో పోలిస్తే 2024–25 నాటికి దేశంలో సైబర్ నేరాలు 31.2% పెరిగాయి. ఇది ఆందోళనకరమైన అంశం.⇒ 50 భారతదేశంలో ప్రతి గంటకు సగటున 50 కంటే ఎక్కువ మంది మహిళలపై హింస, నేరాలు జరుగుతున్నాయి. అందులో గణనీయమైన నేరాలు డిజిటల్ మాధ్యమాల ద్వారానే చోటుచేసుకుంటున్నాయి.⇒ 28.15 - 2025లో భారతదేశంలో మొత్తం సైబర్ క్రై మ్ కేసులు 28.15 లక్షలకు చేరాయి (ఇది 2024తో పోలిస్తే 24% ఎక్కువ). ఇందులో మహిళలు బాధితులుగా ఉన్న కేసుల శాతం గణనీయంగా ఉంది.⇒ 51- నేషనల్ సైబర్ క్రై మ్ రిపోర్టింగ్ పోర్టల్ గణాంకాల ప్రకారం, ప్రతి గంటకు సగటున 51 ఫిర్యాదులు నమోదవుతున్నాయి.⇒ రూ. 22,495 కోట్లు సైబర్ నేరాల వల్ల దేశం మొత్తం మీద దాదాపు రూ. 22,495 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లింది. మహిళలు ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ మోసాల బారిన ఎక్కువగా పడుతున్నారు.⇒ 20,551 మహిళలపై సైబర్ నేరాల రేటులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ప్రతి లక్షమంది మహిళలకు 125 మంది సైబర్నేరగాళ్ల వలలో చిక్కకుంటున్నారు. హైదరాబాద్లో డిజిటల్ కేసులపై అవగాహన ఎక్కువగా ఉండటం వల్ల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కేవలం 2025లోనే రాష్ట్రవ్యాప్తంగా 20,551 మహిళా సంబంధిత కేసులు నమోదయ్యాయి.⇒ 48,475- 2020లో మహిళలపై 22,188 సైబర్ నేరాలు నమోదు కాగా, 2024 నాటికి ఈ సంఖ్య 48,475కు (దాదాపు 118% పెరుగుదల) చేరిందని నివేదికలు చెబుతున్నాయి.⇒ 2వ స్థానం దేశంలోని మెట్రో నగరాల్లో మహిళలపై సైబర్ వేధింపుల విషయంలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ ముఖ్యంగా అసభ్యకరమైన కంటెంట్ సర్క్యులేషన్, మార్ఫింగ్, బ్లాక్మెయిలింగ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి.⇒ 69% మహిళలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న సైబర్ నేరాలలో లైంగిక వేధింపులు 4.9%, బ్లాక్మెయిలింగ్ 3.8%, ఆర్థిక మోసాలు 69% ప్రధానంగా ఉన్నాయి.⇒ 9% మహిళలను, ముఖ్యంగా ఉద్యోగినులను భయపెట్టి లక్షల రూ΄ాయలు వసూలు చేసే (డిజిటల్ అరెస్ట్) మోసం 2025–26లో 9% పెరిగింది.⇒ 15-20% ఏఐ డీప్ఫేక్ కేసులు 2026 లో దాదాపు 15–20% పెరిగాయి. ఫొటోలను అసభ్యంగా మార్చి సోషల్ మీడియాలో పోస్టు చేయడం ప్రధాన సమస్యగా మారింది.⇒ 18,236 అత్యధికంగా సైబర్ నేరాలు నమోదవుతున్న రాష్ట్రంగా కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. మొత్తం కేసుల సంఖ్య 21,889. తెలంగాణ రెండో స్థానంలో అంటే నమోదైన కేసుల సంఖ్య 18,236. ఉత్తరప్రదేశ్ 10,794 కేసులతో మూడో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో కేసుల సంఖ్య 2,500 మార్కును దాటింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఫిర్యాదుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, జనాభా ప్రాతిపదికన సైబర్ నేరాల రేటు దక్షిణ రాష్ట్రాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. -
ఒక‘ట్రెండు’సార్లు ఆలోచించండి...
‘ఏమవుతుంది లే’ అనే నిర్లక్ష్యం కంటే... ‘ఎందుకైనా మంచిది’ అనే ముందు చూపు చాలా మంచిది. ఇప్పుడు డిజిటల్ మీడియాలో ‘వైరల్ ఏ.ఐ. క్యారికేచర్’ ట్రెండ్ అనేది హాట్ టాపిక్. ‘ఇదిగో నా గురించి నీకు అన్నీ చెప్పేస్తున్నాను. క్యారికేచర్ అదిరిపోవాలి’ అని ఏ.ఐ.కి ప్రాంప్ట్ ఇవ్వడం అనేది ఈ ట్రెండ్లో భాగం. అయితే అయితే... ఈ ట్రెండ్లో భాగంగా వేలం వెర్రిగా వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయడం వల్ల, మోసగాళ్లకు చేతినిండా పనే అని హెచ్చరిస్తున్నారు డిజిటల్ నిపుణులు...యూజర్లు పర్సనల్ ఫొటోను షేర్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ను క్యారికేచర్ లేదా ఇలస్ట్రేషన్ క్రియేట్ చేయమని అడగడమే వైరల్ ఏఐ క్యారికేచర్ ట్రెండ్. మన అభిరుచులు, జీవిత విశేషాలు, ఉద్యోగ విశేషాల ఆధారంగా ఈ క్యారికేచర్ క్రియేట్ అవుతుంది. క్యారికేచర్ కదా అనుకోవద్దు! ‘ఏమవుతుంది? వస్తే గిస్తే నా క్యారికేచర్ బయటికి వస్తుంది. దీంతో మోసాలు ఎలా చేస్తారు?’ అనే వాళ్లు బోలెడు మంది. అయితే మనం అనుకున్నట్లు బయటికి వచ్చేది క్యారికేచర్ మాత్రమే కాదు...‘ఎవ్రీథింగ్ యూ నో ఎబౌట్ మీ’ అనే ఒకే ఒక ప్రాంప్ట్తో ఏఐ ఎన్నో వివరాలను లాగేస్తుంది. చివరికి మన కమ్యూనికేషన్ స్టైల్ను కూడా విడిచి పెట్టదు. ఒక్కముక్కలో చె΄్పాలంటే... బయటికి వచ్చేది క్యారికేచర్ రూపంలోని మన పర్సనల్ ప్రోఫైల్! అది మనం ఇష్టపూర్వకంగా అందజేసిందే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.ట్రెండ్లో భాగంగా...వైరల్ క్యారికేచర్ ట్రెండ్ క్రియేటివ్గా, ఎంటర్టైనింగ్గా కనిపించినప్పటికీ, ఈ ట్రెండ్ ద్వారా బయటికి వచ్చే వ్యక్తిగత సమాచారం ఆధారంగా మోసాలు జరిగే అవకాశం ఉందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘నా మనస్తత్వానికి అద్దం పట్టే క్యారికేచర్ క్రియేట్ చేసుకోవాలి’ అనే ఉత్సాహంతో యూజర్లు ఎటువంటి పరిమితులూ లేకుండా సమాచారాన్ని యాక్సెస్ చేసుకోవడానికి అనుమతి ఇస్తారు. సమాచారం ఎంత ఎక్కువ ఇస్తే క్యారికేచర్ అంత బాగా వస్తుందనేది వారి ఉద్దేశం. ట్రెండ్లో భాగంగా రెఫరెన్స్ ఫొటోతో పాటు అదనపు సమాచారం కూడా అందిస్తున్నారు. ఉదాహరణకు... కంపెనీ పేరు, కార్పొరేట్ లోగో, చేస్తున్న ఉద్యోగం, పని చేస్తున్న నగరం పేరు, దినచర్య, కుటుంబ వివరాలు... మొదలైనవి తెలియజేస్తున్నారు.ఎమోషనల్ మానిప్యులేషన్ఫొటోగ్రాఫ్కు సందర్భోచిత వివరాలు జత చేస్తే డిజిటల్ మోసాలు జరిగే అవకాశం ఉంది. ఒక వ్యక్తి ఫొటోతో స్కామర్లు వివిధ ΄్లాట్ఫ్లామ్లలో నకిలీ ప్రోఫెషనల్ ప్రోఫైళ్లను సృష్టించవచ్చు. జెనరేటివ్ వాయిస్ లేదా డీప్ఫేక్లను రూపొందించడానికి ఉపయోగించవచ్చు. ఫొటోను డిస్ప్లే ఇమేజ్గా ఉపయోగించి కంపెనీ లేదా ప్రోఫైల్ పేజీలను క్లోన్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. ప్రామాణికంగా, నమ్మదగినదిగా చేయడానికి ఇలాంటి ట్రిక్స్ను ఉపయోగిస్తుంటారు. ఫొటోగ్రాఫ్తో పాటు ఉద్యోగం, ఆఫీసు వివరాలు మోసగాళ్ల చేజిక్కితే ఎంతమాత్రం అనుమానం రాకుండా బిజినెస్ ఈమెయిల్స్, మెసేజ్లను స్కామర్లు రూపొందించి ఆ వ్యక్తి కొలీగ్స్కు ఫేక్ ఇన్స్ట్రక్షన్స్, రిక్వెస్ట్లను పంపే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల వివరాలు తెలిస్తే స్కామర్లు ఎమోషనల్ మానిప్యులేషన్కూ పాల్పడే ప్రమాదం ఉంది.యస్... ఇది నిజమేమనం అందించే డేటా పాయింట్స్ సవివరమైన డిజిటల్ ప్రోఫైల్ను రూపొందించడానికి ఉపకరిస్తాయి. ఇమేజ్తో జత చేసిన వివరాలతో సైబర్ నేరగాళ్లు సోఫిస్టికేటెడ్ స్కామ్లు చేసే అవకాశం ఉంది ‘ఏఐ–జనరేటెడ్ పర్సనల్ ఇమేజ్లు స్కామర్లకు ఉపయోగపడతాయా?’ అనే ప్రశ్నకు వచ్చే జవాబు... ‘అవును’ సాధారణంగా సైబర్ నేరగాళ్లు ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ (వోఎస్ఐఎన్టీ)పై తగిన సమయం వెచ్చిస్తారు. లింక్డిన్, ఇన్స్టాగ్రామ్, న్యూస్ ఆర్టికల్స్....మొదలైన వాటి ద్వారా వ్యక్తుల డిజిటల్ ఫుట్ప్రింట్ను సేకరిస్తారు. వైరల్ ఏఐ క్యారికేచర్ ట్రెండ్ ద్వారా వారి పని మరింత సులభం అవుతుంది. వ్యక్తిగత సమాచారాన్ని వివిధ మార్గాలు, ΄్లాట్ఫామ్ల ద్వారా సేకరించడానికి బదులు ఒకేచోటు నుంచి తీసుకోవడానికి స్కామర్లకు అవకాశం ఇస్తుంది.‘యూజర్లు పంచుకునే ఏ ఒక్క సమాచారం విడిగా ప్రమాదం కాదు. అయితే ఈ ట్రెండ్తో వచ్చిన చిక్కు ఏమిటంటే, అలవాట్ల నుంచి ఆందోళన వరకు యూజర్ షేర్ చేసే సమాచారాన్ని మొత్తం ఒకే దగ్గర చేరుస్తుంది. స్కామర్లు ఏ సమాచారాన్ని అయితే తెలుసుకోవాలనునుకుంటున్నారో ఆ సమాచారాన్ని ఇస్తుంది.ఏ చెడు జరిగినా ‘ఇది కలికాలం నాయనా’ అనే మాట బాగా వినిపిస్తుంది. ఇప్పుడు కాలం మారింది. ‘ఇది డిజిటల్ కాలం నాయనా’ అనుకోవాల్సి వస్తోంది. ఏ ట్రెండ్ నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు కదా! అందుకే జాగ్రత్త అవసరం...అత్యవసరం.ఇలా చేయాలి...⇒ ఐడెంటిఫైయబుల్ డేటా ప్రాంప్ట్స్ ఇవ్వవద్దు. ఉదా: పూర్తి పేరు, చేస్తున్న ఉద్యోగం, కంపెనీ పేరు, ఇంటి అడ్రస్... మొదలైనవి.⇒ మీ లొకేషన్ లేదా, సంస్థ గురించి తెలుసునేలా చేసే లోగోలు, ఐడీ కార్డ్, డాక్యుమెంట్లు, లైసెన్స్ ప్లేట్స్, స్క్రీన్లు, భవన ముఖద్వారాలు, స్ట్రీట్ సైన్లు, బిల్డింగ్ పేర్లు కనిపించే ఫొటోలను అప్లోడ్ చేయవద్దు.⇒ ఎమోషనల్ స్కామ్స్ నివారించడానికి పిల్లలకు సంబంధించి సమాచారాన్ని షేర్ చేయకూడదు. కుటుంబ వివరాలను వెల్లడించకూడదు.⇒ ‘ఎవ్రీథింగ్ యూ నో ఎబౌట్ మీ’లాంటి ప్రాంప్ట్లు ఇవ్వకూడదు. దీనికి బదులుగా ‘క్రియేట్ యూజింగ్ వోన్లీ ది డిటేల్స్ ఇన్ దిస్ మెసేజ్ అండ్ డోన్ట్ యూజ్ పాస్ట్ చాట్స్ ఆర్ హిస్టరీ’ అని ఇస్తే సరిపోతుంది.⇒ ఇతరుల అనుమతి లేకుండా వారి ఫొటోను అప్లోడ్ చేయవద్దు.⇒ ప్లాట్ఫామ్ను ఉపయోగించే ముందు ప్రైవసీ పాలసీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. కంటెంట్ను ఎంత కాలం స్టోర్ చేస్తారు? కంటెంట్ను మోడల్ ట్రైనింగ్, సర్వీస్ ఇంప్రూమెంట్స్ కోసం ఉపయోగిస్తారా?... మొదలైన విషయాలు తెలుసుకోవాలి.⇒ ‘టెంపరరీ చాట్’లాంటి ప్రైవసీ మోడ్స్ను ఉపయోగించడం మంచిది.⇒ ఒకవేళ మీరు ట్రెండ్ను ఫాలో కావాలనుకుంటే తాజాగా తీసిన హై–రిజల్యూషన్ ఫొటో కాకుండా పాత లేదా ఎడిటెడ్ ఇమేజ్ను ఉపయోగించాలి.⇒ వైరల్ ట్రెండ్తో సంబంధం ఉన్న హానికరమైన లింక్లు, ప్రమాదకరమైన డౌన్లోడ్లు, ఫిషింగ్ నివారించడానికి సెక్యూరిటీ టూల్స్ను ఉపయోగించాలి. -
ఆ నిర్ణయం ఆ జంటను హెల్దీగా మార్చింది..! ఏం చేశారంటే..
ఆరోగ్యం, వ్యాయామాలు సామాన్యుల వల్ల ఎక్కడవుతుంది అన్నమాటలు ఎన్నోసార్లు విని ఉంటారు. బాగా డబ్బున్నవాళ్లకు, యువతకు మాత్రమే సాధ్యం అనేది చాలామంది భావన. వాళ్లకు ఏ బాధ్యతలు, బరువులు అంతగా ఉండవు కాబట్టి హాయిగా చేయగలరని అనుకుంటుంటారు. కానీ ఈ మధ్యతరగతి జంట గురించి విన్నాక ఆ అభిప్రాయం కచ్చితంగా మారుతుంది. 50లలో ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని.. మేల్కొని విజయం సాధించడమే గాక..ఇతరులకు స్వచ్ఛందంగా ఆరోగ్యస్పృహ కలిగిస్తున్నారు. మరి ఆ జంట ఫిట్నెస్ ప్రయాణం ఎలా సాగిందంటే..చాలామందికి ఫిట్నెస్ అనేది యువతకు చెందినదిగా అనిపిస్తుంది. పెద్దలకు సుదీర్ఘ పనిదినాలు, కుటుంబ బాధ్యతలు ఆరోగ్యాన్ని పక్కన పెట్టేలా చేస్తాయి. కనీసం శరీరం చెప్పే సంకేతాలను కూడా పట్టించుకోరు. తమ ఆరోగ్యం కంటే..కుటుంబ బరువు బాధ్యతలే ముఖ్యమన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. అలానే భావించారు డెహ్రాడూన్కు చెందిన తారా థాపా ఆయన భార్య సుశీలా. తార ఎలక్ట్రానిక్స్ సేల్స్ అండ్ రిపేర్ షాపుని నడుపుతుండగా, సుశీల బీమా సలహాదారుగా పనిచేస్తోంది. ఈ ఇద్దరి ఫోకస్ కుటుంబ బాధ్యతలపైనే ఉంది. తమ ఇద్దరు కుమారులను పెంచడం, ఓ చక్కటి ఇంటిని నిర్మించుకోవడం ఇవే తమ ఆశయలు, జీవితం అన్నట్లుగా బతికారిద్దురు. అనుకున్నట్లుగా కుమారులు చక్కగా జీవితంలో స్థిరపడ్డారు. ఒకరు సోలార్ పర్మిట్ డిజైనర్గా, మరొకరు కంటెంట్ క్రియేటర్గా పనిచేస్తున్నారు. కానీ అప్పటికే ఆ జంటను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. తారాకి తీవ్రమైన వెన్నునొప్పి, సుశీల నిరంతర అలసట, పునరావృతమయ్యే మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడ్డారు ఇద్దరూ. అప్పుడే ఇరువురికి తమ శారీరక పరిమితులను అంగీకరిస్తూ ఆగిపోకూడదని అనిపించింది. ఆ అనారోగ్య సమస్యలను సవాలు చేసేలా.. ఫిట్నెస్పై ఫోకస్ పెట్టాలని స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నారు. 2017లో, తార ఫిట్నెస్పై తీవ్రంగా దృష్టి పెట్టడం ప్రారంభించారు. దాన్ని చూసి భార్య సుశీల రెండేళ్ల తర్వాత 2019లో ఆయన బాటలోనే నడిచింది. అలా ఈ జంట రోజు సూర్యోదయానికి చాలా ముందుగానే ప్రారంభమవుతుంది. ఉదయం ఐదు గంటలకల్లా..వ్యాయామాలు చేయడానికి, వాకింగ్కి రెడి అయిపోతారు. కొండలలో నివసించడం వల్ల వారు ప్రకృతిని సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా మారింది. తరచుగా డెహ్రాడూన్ చుట్టూ ఉన్న పర్వతాల గుండా ట్రెక్కింగ్ చేస్తూ సెలవులను ఆస్వాదిస్తుంటారు. భోజనంలో కూడా పప్పులు, కూరగాయలు, కాలనుగుణ పండ్లను భాగం చేసుకునేవారు. పండుగల సమయంలో కూడా, వారు అతిగా తినడం కంటే సమతుల్యతపే పాటిస్తూ.. మితంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. వారి ప్రయాణం తమ సొంత ఇంటిని దాటి ప్రేరేపించడం మొదలైంది. మూడేళ్ల క్రితం సుశీల పింక్ పాంథర్ అనే మహిళా సమూహాన్ని ప్రారంభించారు. ఈ బృందంలో మహిళలు సౌకర్యవంతమైన ప్రాంతాల నుంచి బయటకు వెళ్లి ఫిట్నెస్ను స్వీకరించమని ప్రోత్సహిస్తుంది. ఒకప్పుడు తమ ఇళ్లను వదిలి వెళ్ళడానికి కూడా సంకోచించిన చాలా మంది సభ్యులు ఇప్పుడు ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరం పరిగెత్తుతుండటం విశేషం. అంతేగాదు ఈ జంట తమ ఫిట్నెస్ ప్రయాణాన్ని ఆన్లైన్లో పంచుకోవాలని నిర్ణయించుకోవడంతో వారి కథ చాలమందికి కనెక్ట్ అయ్యి..ఎందరినో ప్రేరేపించింది. ఈ జంట వ్యక్తిగత వృద్ధి వాయిదాగా మారకూడదని, వయసు ఎప్పుడూ సాకుగా మారకూడదని తమ చేతలతో చెప్పకనే చెప్పారు కదూ. నెటిజన్లు సైతం చాలా స్ఫూర్తిదాయకం అని ఈ జంటపై ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) గమనిక: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కలిగించడానికే. అనుసరించే ముందు వ్యక్తిగత సమస్యలను పరిగణనలోనికి తీసుకోవాలి, అలాగే వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: అక్కడ మహిళలను అవమానిస్తే అంతే..!) -
అక్కడ మహిళలను అవమానిస్తే అంతే..!
మహిళల్ని గౌరవించాలి...అనేది మన భారతీయ సంప్రదాయంలో కీలకమైన విషయం. అయితే గౌరవించడం అలా ఉంచి ఏ ఇద్దరు వ్యక్తులు గొడవపడినా.. ఆ సమయంలో గొడవతో సంబంధంలేని మహిళలను అవమానపరిచేలా తిట్లు దుర్భాషలు ఉపయోగించడం మన దగ్గర సర్వసాధారణంగా మారిపోయింది. ఇలాంటి సమయాల్లో తరచుగా ఎందరో తల్లులు, అక్కలు...బాధితులుగా మారుతున్నారు. మన రాజకీయ నేతలు, సినిమా సెలబ్రిటీలు సైతం దీనికి అతీతంగా లేకపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపధ్యంలో అలాంటి తిట్లకు అడ్డుకట్ట వేసేందుకు భారతదేశంలోని ఓ మారుమూల గ్రామం తొలి అడుగు వేసింది.ఒకరి తల్లి లేదా సోదరిని ఉద్దేశించి దుర్భాషలాడే వ్యక్తులను వెనువెంటనే శిక్షించాలని ఒక వినూత్న తీర్మానాన్ని ఆ గ్రామం ఆమోదించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామంలోని మహిళా సాధకులను సత్కరించడానికి నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన ఒక స్వయం సహాయక సంఘ సభ్యురాలు ఈ ఆలోచనను సూచనప్రాయంగా తెలియజేశారు. .అహల్యానగర్లోని శ్రీగొండలోని కోల్గావ్ గ్రామ పంచాయతీ దీనిని ఆమోదించింది.విభిన్న కులాలు మతాలకు చెందిన సుమారు 9,000 మంది నివాసితులున్న కోల్గావ్ గ్రామం ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. ఈ గ్రామంలో ఇటీవల ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా, సీనియర్ అంగన్ వాడీ సేవిక (కార్యకర్త) శకుంతల దేశ్ముఖ్ అధ్యక్షతన ప్రత్యేక మహిళా గ్రామసభను ఏర్పాటు చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా జగ్తాప్ అనే మహిళ లేవనెత్తిన మాటలతో మహిళల్ని అవమానించే అంశం గ్రామ సభలో వివరణాత్మక చర్చకు దారితీసింది. సుదీర్ఘ మధనం తర్వాత, మహిళలను కించపరిచేలా అవమానకరమైన భాషను ఉపయోగించే వారికి జరిమానాగా రూ. 500 విధించాలని నిర్ణయించారు. మరోవైపు ఈ నిబంధన దుర్వినియోగాన్ని నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దుర్భాషలు ఆడినట్టు డిజిటల్ ఆధారాలు అందించినప్పుడు మాత్రమే జరిమానాలు విధించాలని నిర్ణయించారు. ‘అవమానకరంగా మాట్లాడిన వారిని గుర్తించడడంలో మహిళలు ( అవసరమైతే, వారి పిల్లలు) ముందుండాలని పంచాయతీ కోరింది, అలా వసూలు చేసిన జరిమానాలను గ్రామాభివృద్ధికి ఉపయోగిస్తామని వీరు చెబుతున్నారు.‘తల్లి లేదా సోదరిని ప్రస్తావిస్తూ తిట్టడం ద్వారా మహిళల్ని అవమానించడం ఇప్పుడు సర్వ సాధారణమైంది. అమ్మాయిలు కుటుంబ బాధ్యతలను భరించే మహిళలుగా ఎదుగుతారు. అలాంటి దుర్వినియోగాలను సాధారణం గా అంగీకరించే స్థాయికి వారి గుర్తింపులను కించపరచకూడదు’అని జగ్తాప్ అంటున్నారు. ఇలాంటివే అనూహ్యమైన మరికొన్ని తీర్మానాలతో ఈ పంచాయితీ గత కొంతకాలంగా ఆదర్శవంతంగా నిలుస్తోంది.గతేడాది తీసుకున్న ఓ నిర్ణయం కూడా అనేకమందిలో ఆలోచన రేకెత్తించేలాంటిదే. దీని ప్రకారం.. గ్రామంలో పిల్లలు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇంట్లో టెలివిజన్ లేదా సెల్ఫోన్ వినియోగించరు. పుస్తకాలు మాత్రమే చేతబట్టుకోవాలి. ప్రస్తుతం గ్రామంలో తల్లిదండ్రులు కూడా పాటించే నియమం ఇది. గ్రామసభ పరిశుభ్రతకు సంబంధించి మరొక తీర్మానాన్ని కూడా ఆమోదించింది, నివాసితులు తమ ఇళ్లలో వాణిజ్య సంస్థలలో పరిశుభ్రతను కాపాడుకోవాలని కోరింది. గ్రామ పంచాయతీకి సమర్పించిన ఫోటో/వీడియో ఆధారాల ద్వారా ఎవరైనా దీనిని ఉల్లంఘించినట్లు తేలిదే, వారికి రూ. 100 జరిమానా విధిస్తారు. (చదవండి: అలనాటి అందాల నటి బ్యూటీ రహస్యం..! ఆరుపదుల వయసులోనూ..) -
సివిల్స్లో సత్తా చాటిన మహిళామణులు..!
ఒకప్పుడు... ‘సివిల్ సర్వీసెస్ పరీక్షలలో మహిళలు’ అనేమాట ఊహకు అందేది కాదు. ఇప్పుడు... ఆర్థిక, సామాజిక పరిమితులను అధిగమిస్తూ సివిల్స్ లో సత్తా చాటుతున్నారు...24-35%: ఇండియన్ సివిల్ సర్వీసెస్లో మహిళల ప్రాతినిధ్యం 2019లో 24 శాతం ఉండగా 2023లో 35 శాతానికి పెరిగింది.41%: 2023 ఐఏఎస్ బ్యాచ్లో రికార్డ్ స్థాయిలో 41 శాతం మంది మహిళలు ఉన్నారు.18%: అత్యున్నత స్థాయి పదవుల విషయానికి వస్తే, కేంద్రస్థాయి కార్యదర్శులలో 18 శాతం మంది మహిళలు ఉన్నారు.అసామాన్య విజేతలుఆర్థిక, ఆరోగ్య పరిమితులు ఆశయ సాధనకు అడ్డుకాదని నిరూపించారు యూపీఎస్సీ–2026 పరీక్షలో విజయం సాధించిన ఎంతోమంది మహిళలు. ∙డాక్టర్ కావాలని కలలు కన్న కేరళంలోని కోజికోడ్కు చెందిన అథిరా మగతన్ రోడ్డు ప్రమాదానికి గురై శరీరమంతా చచ్చుబడిపోయింది. రెండు సంవత్సరాలు జ్ఞాపకశక్తిని కోల్పోయింది. జ్ఞాపకశక్తి తిరిగి వచ్చిన తరవాత చదువుకోవాలనే సంకల్ప బలం పెరిగింది... దాని ఫలితమే సివిల్స్లో ఆమె 483 ర్యాంక్. పెద్దపల్లి జిల్లాకు చెందిన గుడెల్లి సృజన 55వ ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి సింగరేణి కార్మికుడు. పాటియాలాలోని సభాకు చెందిన సిమ్రాన్దీప్ కౌర్ యూపీఎస్సీలో ఆల్ ఇండియా ర్యాంక్ 15 సాధించింది. కౌర్ తండ్రి సామాన్య రైతు. కేరళలోని నెయ్యట్టింకరకు చెందిన ఎఎస్ శ్రీజ చిన్న స్టడీ రూమ్లో సంస్కృతం నుంచి ఆంగ్లం వరకు ఎన్నో స్ఫూర్తిదాయకమైన కొటేషన్లు కనిపిస్తాయి. తాను మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించడానికి ఆ కొటేషన్లు ఎంతో బలాన్ని ఇచ్చాయి. తండ్రి కన్స్ట్రక్షన్ వర్కర్. తల్లి సాధారణ గృహిణి. గుజరాత్లోని కాండ్లా పట్టణానికి చెందిన ఆస్తా జైన్ ఆల్ ఇండియా ర్యాంక్ 9 సాధించింది. ఆమె తండ్రి లక్ష్మీనారాయణ్ ఆలయం సమీపంలో చిన్న మిఠాయి దుకాణం నడుపుతున్నాడు.పంజాబ్లోని చిన్న గ్రామానికి చెందిన సిమ్రాన్దీప్ కౌర్ మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా స్థాయిలో 51 వ ర్యాంక్ సాధించింది. ఆమె తండ్రి జస్వీందర్సింగ్ పంజాబ్ స్టేట్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్లో లైన్మన్గా పనిచేస్తున్నారు. తల్లి స్వరణ్ కౌర్ గృహిణిమధురైకి చెందిన రాజేశ్వరీ సువే డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసేది. అయినా ఆమె సంతృప్తి పడలేదు. తాజాగా యూసీఎస్సీలో కూడా సత్తా చాటింది. మొదటి అయిదు ర్యాంకులలో రాజేశ్వరీ ఏకైక మహిళా టాపర్.ఒకే ఒక్కరు!సిక్కింలోని రాయ్గావ్కు చెందిన అన్నీలా షెర్పా, యూపీఎస్సీ పరీక్షలో ఆ రాష్ట్రం నుంచి ఉత్తీర్ణత సాధించిన ఏకైక అభ్యర్థిగా నిలిచి ఆల్ ఇండియా ర్యాంకు 893 సాధించింది. (చదవండి: అలనాటి అందాల నటి బ్యూటీ రహస్యం..! ఆరుపదుల వయసులోనూ..) -
IWD ప్రతీ అడుగు కన్నీటి మడుగు
ఇంట్లో ఆడ, మగ తేడా చూపని తల్లిదండ్రులు.. ఉన్నత ఉద్యోగాల్లో కొలువుదీరుతున్న మహిళలు.. మహిళా దినోత్సవం రోజున మహోన్నత సత్కారాలు.. ఇది నాణేనికి ఓ వైపు కాగా.. నాణేనికి ఇంకో వైపు ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టిన ప్రతిక్షణం.. అడుగడుగునా ఆకతాయిల ఆగడాలు.. కామాంధుల కర్కశత్వం.. మోసం చేయాలనే కేటుగాళ్లు.. రోజుకో లైంగికదాడి.. సమాజంలో తప్పని లైంగిక వేధింపులు.. ఎన్ని కఠిన చట్టాలున్నా.. మహిళ నేటికీ సభ్యసమాజంలో వివక్షకు గురవుతూనే ఉంది. ఇంటి నుంచి బయటకు వచ్చిన తరువాత క్షేమంగా ఇల్లు చేరతామన్న ధీమా లేకపోయింది.తిరుపతి సిటీ: ఆకాశమే హద్దుగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. నవసమాజ నిర్మాణంలో స్త్రీ పాత్ర కీలకం. తెల్లవారకముందే దినచర్య మొదలుపెట్టి అర్ధరాత్రి వరకు అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. ఇటు కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే అటు ఉద్యోగాల్లోనూ తమ సత్తా చాటుతూ శభాష్ అనిపించుకుంటున్నారు. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతున్న నేటి తరణంలోనూ సమాజంలో మహిళలు వివక్షకు గురవుతూనే ఉన్నారు. వేధింపులు నిత్యకృత్యంగా మారాయి. ఇంట్లో నుంచి కాలు బయటపెడితే సమాజం అనుమానపు చూపులతో చంపుతోంది. కొందరి మానవమృగాల నుంచి మహిళాలోకానికి నేటికీ ముప్పుతప్పడం లేదు. ఇంట్లో ఆడ, మగ అనే వివక్ష ప్రస్తుతం చాలా వరకు తగ్గినా, బయట సమాజంలో ఎటువంటి మార్పు కనబడలేదు. ప్రపంచ మహిళా దినోత్సవం రోజున నేటి సమాజంలో మహిళల రక్షణ, వివక్ష అనే అంశంపై సాక్షి మహిళా సంఘాల నేతలతో, విద్యార్థినులతో మాట్లాడగా పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ఇంట్లో పరిస్థితి మెరుగుపడినా.. బయటే భయం ఆధునిక యుగంలో కుటుంబంలో ఆడ, మగ వివక్షణ చాలా వరకు తగ్గింది. ఇద్దరీ సమానంగా చూడాలనే అవగాహన తల్లిదండ్రులకు కలిగింది. కానీ బయట కాలు పెడితే చాలు మళ్లీ ఇంటికి చేరినంతవరకు క్షణక్షణం భయంగానే బతకాల్సి వస్తోంది. పోలీసులు ఎంత అభయమిస్తున్నా, కఠిన చట్టాలున్నా సమాజంలో పరిస్థితి మారలేదు. మా తల్లిదండ్రులు నేను కళాశాలకు బయలు దేరినప్పటి నుంచి ఇంటికి వచ్చేవరకు నా కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. కనీసం ఐదు సార్లు ఫోన్ చేసి మాట్లాడుతారు. మహిళలకు బయట రక్షణ ప్రశ్నార్థకంగానే ఉంది. – సరళ, ఎంబీఏ విద్యార్థిని, తిరుపతి గౌరవించకపోయినా.. హాని కలిగించకుంటే చాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రత కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా అత్యాచారాలు, మానుభంగాలు, వేధింపులు తగ్గకపోవడం దారుణం. మ రిన్ని కఠినమైన చట్టాలు తీసుకురావాలి. మహిళలను గౌరవించకపోయినా పర్వా లేదు. కనీసం వారికి హాని కలిగించకుంటే చాలు. పదేళ్ల చిన్నారులను సైతం బయటకు ఒంటరిగా పంపాలంటే తల్లిదండ్రులకు వణుకుపట్టే పరిస్థితి ఉంది. సమాజంలో మార్పు రావాలి, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకునేందుకు నూతన చట్టాలను తీసుకురావాలి. – పుష్పావతి, ప్రైవేటు కళాశాల ఉపాధ్యాయురాలు, తిరుపతి రూరల్పరిస్థితుల్లో మార్పు రాలేదు మహిళల రక్షణకు కఠిన చర్యలు తీసుకువస్తున్నాం..అవగాహన కార్యక్రమాలు నిర్వస్తున్నామంటున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయినా పరిస్థితుల్లో మార్పు కనిపించడలేదు. ఇంటి నుంచి కాలు బయటపెడితే ప్రతి క్షణం భయం భయంగా బతకాల్సిన పరిస్థితి ఉంది. ఏ క్షణంలో ఏమిజరుగతుందో తెలియని పరిస్థితిలో మహిళలు ఉన్నారు. కళాశాలలోనూ, విధులు నిర్వహించే ప్రాంతాలలోనూ వేధింపులకు గురవుతున్న మహిళలు బయటకు చెప్పుకోలేక మానసికంగా కుంగిపోతున్నారు. మహిళా దినోత్సవం అంటూ హంగామా చేయడం కాదు..మహిళ రక్షణ కల్పించాలి. – డాక్టర్ సాయిలక్ష్మి, ఐద్వా జిల్లా కార్యదర్శి, తిరుపతిఒంటరిగా వెళ్లాలంటే భయం పాఠశాలకు, కళాశాలలకు విద్యార్థినులు ఒంటరిగా నేటి వెళ్లలేకపోతున్నారు. తల్లిదండ్రులు వెన్నంటి ఉంటే తప్ప వెళ్లలేని పరిస్థితి. విద్యాసంస్థల వద్ద, బస్టాండుల వద్ద భద్రత లేదు. ఓ మహిళా ఒంటరిగా నడిచి వెళుతుంటే సమాజం వింతగా అదోలా కన్నెత్తి చూస్తుంది. దారిన వెళ్లే పోకిరీలు అసభ్యమాటలతో వేధింపులకు గురికాక తప్పడం లేదు. తల్లిదండ్రుల అండ లేని విద్యార్థినుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బయట కాలుపెట్టాలంటే వణికిపోతున్నారు. కుటుంబంలో వివక్షణను తప్పించు కున్నా బయట ప్రపంచం వివక్షతో పాటు వేధింపులకు ఎంతో మంది మహిళలు గురవుతూనే ఉన్నారు. – ఆర్ ఆషా, పీడీఎస్ఓ,జిల్లా కార్యదర్శి, తిరుపతి (చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ : తెలుగు రాష్ట్రాల రూట్ గైడ్)ఆ రోజు ఆర్భాటాలు.. తర్వాత షరా మామూలే.. ప్రస్తుతం సమాజం ఎలా తయారైందంటే మహిళా దినోత్సవం రోజున సభలు, సమావేశాలు పెట్టి మహిళలను పొగుడుతూ సన్మానాలు చేయడం..మరుసటి రోజు నుంచి షరా మామూలుగా వివక్ష చూపడం ఇది నేటి సమాజం మహిళలకు ఇచ్చే గౌరవం. కుటుంబంలోని…కుటుంబంలోని మహిళలపై వివక్ష కాస్త తగ్గినప్పటికీ బయట కళాశాలల్లోనూ, బస్టాప్ల్లోనూ, ఉద్యోగం చేసే ప్రాంతాల్లోనూ నేటికీ వందకు 80శాతం మంది మహిళలు వివక్షకు, వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ఈ సంస్కృతిలో మార్పు రావాలంటే కుటుంబంలోని ప్రతి పురుషుడు పర స్త్రీలను గౌరవించడం నేర్చుకోవాలి.– పవిత్ర, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు, తిరుపతి వివక్షకు గురవుతున్నారు ఉన్నత లక్ష్యంతో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉన్నత చదువులు చదివిన మహిళలు నేడు వివక్షకు గురవుతుండడం దారుణం. విధులు నిర్వహిస్తున్న ఎంతో మంది ఉద్యోగినులు వివక్షతో పాటు వేధింపులకు గురవుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలను యావత్ సమాజం గమనిస్తూనే ఉంది. కానీ వాటి అరికట్టేందుకు ప్రభుత్వాలు తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్న మహిళా కారి్మకుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. – లక్ష్మమ్మ, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్, తిరుపతి -
సహజ సౌందర్యానికి కేరాఫ్ ఈ నటి..! రియల్ బ్యూటీ అంటే..
బాలీవుడ్ నటి కొల్హాపురే ఒకప్పుడు అత్యంత బిజీగా ఉండే హీరోయిన్లలో ఆమె ఒకరు. 'ప్యార్ ఝక్తా నహీ' వంటి హిట్ చిత్రాల్లో నటించిన ఆమె ప్రస్తుతం ఉర్దూ నాటకాల్లో నటిస్తూ తన నటనను మెరుగుపరుచుకుంటున్నారామె. ఆరు పదుల వయసులోనూ..నటి పద్మిని ఎవర్గ్రీన్ అందంతో గ్లామర్గా ఉంటారామె. అంతలా నవయవ్వనంగా ఉండటానికి గల కారణాలను వెల్లడిస్తూ..అందంపై తన అభిప్రాయాన్ని చాలా అద్భుతంగా వివరించారామె.ప్రముఖ నటి పద్మిని కొల్హాపురే తన సహజ సౌందర్యం, స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా అందరికీ ఆరాధ్య దేవత ఆమె. ఇటీవల ఒక ఇంటర్యూలో తన చర్మ సంరక్షణ, మేకప్ అలవాట్ల గురించి షేర్ చేసుకున్నారు. అలాగే నిజమైన అందం సౌందర్య సాధనాలకు మించినదని ఎందుకు విశ్వసిస్తుందో కూడా చెప్పారామె. తాను స్వతహాగా కఠినమైన చర్మ సంరక్షణను అనుసరించే వ్యక్తిని కాదని అన్నారామె. తాను రసాయన ఉత్పత్తుల కంటే సహజ సౌందర్య సాధనాలనే ఎంచుకుంటానని అన్నారు. ముఖ్యంగా సహజ సేంద్రీయ ఆయుర్వేద ఉత్పత్తులనే ఉపయోగిస్తానని చెప్పారామె. ముఖ్యంగా ఇంట్లోనే లభించే వాటికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. వంటింట్లో బాగా ఉపయోగించే పసుపుని పెరుగుతో కలిపి ముఖానికి అప్లై చేసేవాళ్లమని అన్నారు. అలాగే పసుపు, ఉప్పుతో సదా పుక్కిలించేవాళ్లమని, ఇది నోటి ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతోంది. సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడూ..24/7 మేకప్ వేసుకోవాల్సి వచ్చేదన్నారు. కొన్నిసార్లు అలిసిపోయి నిద్రపోయేటప్పుడు కూడా తొలగించుకోలేకపోయే వాళ్లమని నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు బాగా మారిపోయాయని చెబుతున్నారు. ప్రస్తుతం తాను చర్మాన్ని బాగా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని, అస్సలు మేకప్ వాడటం లేదని అన్నారు. తన బ్యూటీకిట్ మూడింటిని తప్పనిసరిగా వాడతానని అన్నారు. వాసెలిన్, మేకప్ రిమూవర్, సహజ వైప్లను ఇష్టపడతానని చెప్పారు. అవన్నీ కూడా సహజసిద్ధమైనవేనని చెప్పారు. మేకప్ పరంగా చాలా తక్కువ ప్రొడక్ట్స్, సౌకర్యవంతమైనవే ఉపయోగిస్తానని చెబుతున్నారు.హెయిర్ కేర్ ఎలాగంటే..జుట్టు సంరక్షణ విషయానికి వస్తే నేను సాంప్రదాయ పద్ధతులను ఇష్టపడతానని చెప్పారు. ఆయుర్వేద షాంపూలు, షికాకాయి, భ్రింగ్ రాజ్ వంటివి ఉపయోగిస్తానని చెప్పారు. హెయిర్ డ్రైయర్లు, కర్లర్లు వంటివి తక్కువగానే ఉపయోగిస్తానని అన్నారు. తలకు సైతం కెమికల్స్ లేనివే ఎంచుకుంటానని అన్నారు. చివరగా అందం అనేది బాహ్యంగా కంటే అంతర్గతంగా ప్రతిబింబించేది అని నమ్ముతానన్నారు. స్వచ్ఛమైన హృదయం కలిగి ఉండి, నిస్వార్థపరులు అయితే ఆ అందం మీ ముఖంపై తొణికిసలాడుతుంది. మెరిసే చర్మం కోసం ప్రజలు బాగా తినాలని, తగినంత విశ్రాంతి తీసుకోవాలని, హైడ్రేటెడ్గా ఉండాలని అన్నారు. అలాగే అప్పట్లో తమకు రెండే రెండు మేకప్ బ్రాండ్లు ఉండేవని, ఇప్పుడు తల నుంచి కాలి వరకు ఇబ్బడిముబ్బడిగా బ్రాండెడ్ మేకప్ ఉత్పత్తులు ఉన్నాయిని అన్నారు.(చదవండి: ఇప్పటికీ డ్రైవింగ్ చేస్తున్న 82 ఏళ్ల బామ్మ..! కేన్సర్ రోగులకు..) -
కడుపులో బుజ్జాయిలు ఎందుకు అడ్డం తిరుగుతారంటే..!
రోబో సినిమా చూశారా? అందులో రోబో చిట్టి ఓ మహిళకు ప్రసవం చేస్తుంటాడు. అడ్డం తిరిగిన బిడ్డను బయటకు తీసుకురావడానికి తాను ప్రయత్నిస్తానంటే లేడీ డాక్టర్ వద్దంటుంది. తానేదో చాలా పురాతన ప్రక్రియను అమలు చేస్తానంటూ బిడ్డను సరైన రీతిలో తిప్పడం కంప్యూటర్ మీద ప్రేక్షకులకు కనిపిస్తూ ఉంటుంది. దీన్ని బట్టి మనకు తెలిసేదేమిటంటే... ఓ చిన్నారి బుద్ధిగా ఈలోకంలోకి రావాలంటే... తల్లిలోంచి మొదట తలను బయటకు తేవాలి. కానీ కొంతమంది చిలిపి చిన్నారులు మొదటే లోకానికి ‘ఎదురు తిరుగుతారు’! ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు మొట్టమొదటి పనే పూర్తిగా భిన్నంగా చేస్తారు. అందుకే ఇలాంటి బిడ్డల్ని తల్లులూ, అత్తమ్మలూ, నానమ్మలూ, అమ్మమ్మలూ ‘ఎదురుకాళ్ల’తో పుట్టాడంటూ ముద్దుగా మురిపెంగా తిడుతుంటారు. వీళ్లనే ఇంగ్లిష్లో ‘బ్రీచ్’ బేబీస్ అంటారు. కడుపులోని బిడ్డ ఎందుకిలా అడ్డం తిరుగుతాడు. ఇలా తిరిగి΄ోయినప్పుడు డాక్టర్లు ఏం చేస్తారు... వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.నిజానికి ఎదురుకాళ్లు అంటారుగానీ... తల ముందుకు రావాల్సిన చోట వాస్తవంగా బిడ్డ పిరుదులు ముందుకు వస్తాయి. అలా అడ్డం తిరిగినప్పుడు ప్రసవమూ సాఫీగా జరగదు. అలాంటప్పుడు ఆ చిన్నారిని ఈ లోకంలోకి తీసుకువచ్చేందుకు చాలాసార్లు శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుంది. ప్రసవం వేళకు పిండం అడ్డం తిరిగి పుట్టేందుకు ప్రయత్నించే ఈ ‘బ్రీచ్’ బేబీ విషయంలో ఏయే ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉంటాయి. వాటి సంగతేమిటో చూద్దాం...బిడ్డ పుట్టేవరకూ గర్భసంచిలోని ఆమ్నియాటిక్ ఫ్లుయిడ్ అనే ద్రవంలో తేలియాడుతూ ఉంటుంది. మనం ఉమ్మనీరు అని పిలిచే ఆ ద్రవంలో అన్నివైపులకూ తిరుగుతూ... తనకు అందుబాటులో ఉన్న స్పేస్లో తలను ఎటువైపునకైనా తిప్పుతూ తిరిగే ఆ పిండం సరిగ్గా ప్రసవం వేళకు మాత్రం తలను బయటపెడుతూ ఈలోకంలోకి రావాలి. అలా శిరస్సు ముందుగా బయటకు రావడాన్ని సంప్రదాయ భాషలో ‘శీర్షోదయం’ అని అంటుంటారు. అయితే ఇలా శీర్షోదయం కాకుండా బిడ్డ అడ్డం తిరిగే కండిషన్స్ దాదాపు 3 శాతం నుంచి 4 శాతం ప్రసవాల్లో కనిపిస్తుంటాయి. ఇటీవల కొద్దిగా పెరిగాయి కూడా. గతంలోనైతే ఇలా బిడ్డ అడ్డం తిరిగే కండిషన్ కారణంగా దాదాపు 25 శాతం కేసుల్లో శిశుమరణాలు చోటుచేసుకుంటూ ఉండేవి. కానీ ఇటీవల దాదాపూ ప్రతి ప్రసవమూ ఆసుపత్రుల్లో (ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్) జరిగేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ తరహా ప్రసవం ముప్పులు చాలావరకు తగ్గాయంటూ నిశ్చయంగా చెప్పవచ్చు. బిడ్డ అడ్డం తిరగడానికి కారణాలు... ప్రసవం వేళకు బిడ్డ పూర్తిగా ఎదగకపోవడం (ప్రీ–మెచ్యురిటీ). ఒక అండం మాత్రమే కాకుండా అనేక అండాల ఫలదీకరణ జరగడం (మల్టీఫీటల్ జెస్టేషన్) (సాధారణంగా ఇలాంటి కండిషన్స్లోనే కవలలు (ట్విన్స్) వంటి కేసుల్లోనూ సహజ ప్రసవం జరగకపోవచ్చు).పుట్టుకతో ఏర్పడే లోపాల వల్ల... బిడ్డ తలకు బాగా నీరు పట్టి ఉండటం (హైడ్రోసెఫాలస్), బిడ్డ మెదడు ఎదగాల్సిన చోట చాలా సందర్భాల్లో అది లోపించి, మెదడులోని అనేక భాగాలు ఎదగకపోవడం (అనెన్సెఫాలస్). కడుపులో బిడ్డకు పిండ దశలోనే అనేక రకాల లోపాలు ఏర్పడటం. ఎవరైనా తల్లికి వరసగా తన మూడు ప్రసవాల్లోనూ (లేదా అంతకంటే ఎక్కువగానూ) చిన్నారులు ఎదురుకాళ్లతో పుడితే... ఆ తల్లికి సాధారణంగా మరోసారి కూడా ఇలాంటి కండిషన్ ఏర్పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీన్నే వైద్యపరిభాషలో ‘మల్టీపారా విత్ లాక్స్ అబ్డామిన్’గా చెబుతారు. బిడ్డను అంటిపెట్టుకుని ఉండే మాయ.. గర్భాశయ ముఖద్వారంలోకి ప్రవేశించడం.ఈసీవీ ఎవరిలో చేయవచ్చంటే... ప్రెగ్నెన్సీ 36 – 37 వారాల వ్యవధి తర్వాత ప్రయత్నించవచ్చు. కాబోయే తల్లికి ఎలాంటి కాంప్లికేషన్లూ లేనప్పుడు మాత్రమే ప్రయత్నించాలి. ఉమ్మనీరు తగినంతగా ఉండాలి. ఈసీవీ విజయవంతం అవడానికి కేవలం 50 % మాత్రమే అవకాశముంటుంది. (అయితే కొన్నిసార్లు ఈసీవీ ప్రక్రియ తర్వాత కూడా చిన్నారి తిరిగి మళ్లీ బ్రీచ్ కండిషన్కు వెళ్లవచ్చు... అంటే మళ్లీ చిన్నారి ఎదురు తిరిగేందుకు అవకాశముంది). ఒకవేళ ఆ టైమ్లో పురిటి నొప్పులు వచ్చినప్పుడు బేబీ బ్రీచ్డ్ కండిషన్లో ఉంటే... ఆ టైమ్లో ఈసీవీ చేయడం సరికాదు. నేరుగా సిజేరియన్కు వెళ్లాల్సి ఉంటుంది. బ్రీచ్ బేబీస్ విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలుఒకవేళ కాబోయే తల్లిదండ్రులు సిజేరియన్ను కోరుకోకపోతే అప్పుడు ‘ఎక్స్టర్నల్ సెఫాలిక్ వర్షన్’ (ఈసీవీ) అనే ప్రత్యామ్నాయానికి వెళ్లవచ్చు. అయితే ఇలాంటి సందర్భాల్లో ఆ తల్లిదండ్రులు ఈప్రోసిజర్లో ఉన్న ముప్పు దీన్ని ఎప్పుడు చేస్తారన్న అంశాలు తప్పక తెలుసుకుని ఈప్రోసిజర్పై అవగాహన ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. ఎక్స్టర్నల్ సెఫాలిక్ వర్షన్ (ఈసీవీ) అంటే..బిడ్డ కడుపులోంచి బయటికి రావడానికి అనువైన రీతిలో తిరగకుండా... (తలను ముందుకు తీసుకురాకుండా) ఇతరత్రా పొజిషన్స్లో ఉన్నప్పుడు నేరుగా శస్త్రచికిత్సతో బిడ్డను బయటకు తీసుకురావడానికి బదులుగా ప్రసవం మొదట్నుంచీ కొద్దికొద్దిగా ప్రయత్నిస్తూ... చిన్నారి తల భాగాన్ని ముందుకు తీసుకొచ్చేలా చేయడాన్ని ‘ఎక్స్టర్నల్ సెఫాలిక్ వర్షన్–ఈసీవీ’ అంటారు. సాధారణంగా కడుపులోని బిడ్డ గర్భసంచిలోని ఉమ్మనీటిలో నిత్యం దొర్లుతున్నట్లుగా అటూఇటూ తిరుగుతూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. గర్భసంచిలో బిడ్డ ఎదుగుతున్న కొద్దీ బిడ్డ సైజు పెరుగుతూ, అది ఎటుపడితే అటు తిరగడానికి వీలుకల్పించే ఉమ్మనీటి ద్రవం తగ్గుతూ పోతుంది. అయితే ప్రసవం సమయానికి బిడ్డ తల ఆటోమేటిగ్గా బయటకు రావడానికి వీలుగా కిందివైపునకు తిరుగుతుంది. కొందరిలో ఇలా తిరగకపోతే తల్లి కడుపుపై చేతులుంచి బయటినుంచే లోపలి పిండాన్ని తిరిగేలా చేస్తూ తలను కిందివైపునకు తిరిగేలా చేసే ప్రక్రియను ‘ఎక్స్టర్నల్ సెఫాలిక్ వర్షన్’ (ఈసీవీ) అంటారు.బిడ్డ అడ్డం తిరగడంలో రకాలు బిడ్డ కేవలం ఎదురు కాళ్లతోనే కాకుండా ఇంకా అనేక రకాలుగా బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇలా బిడ్డ అడ్డం తిరగడమన్నది ఎన్ని రకాలుగా జరుగుతుందో చూద్దాం...1) ఫ్రాంక్ / ఇన్కంప్లీట్ బ్రీచ్... ఇందులో బిడ్డ తన తలకు బదులుగా మొదట తన పిరుదులను బయటకు తేవడానికి ప్రయత్నిస్తుంటుంది. ఇలాంటి పొజిషన్లో బిడ్డ ఒక పాదం తన చెవుల దగ్గర ఉంటుంది.2) కంప్లీట్ బ్రీచ్ / ఫ్లెక్సెడ్ బ్రీచ్... ఈ కేస్లోనూ బిడ్డ తలకు బదులుగా పిరుదులను తొలుత బయటకు తేవడానికి ప్రయత్నిస్తుంటుంది. అయితే ఈ పొజిషన్లో ‘ఫ్రాంక్ / ఇన్కంప్లీట్ బ్రీచ్’లోలా ఒక పాదం మాత్రమే చెవి దగ్గర ఉండదు. బిడ్డ రెండు పాదాలూ ముడుచుకుని ఉంటాయి.3) ఫూట్లింగ్ ప్రజెంటేషన్... ఈ కండిషన్లో బిడ్డ పిరుదులు, మోకాళ్లు... ఇవన్నీ ముడుచుకునే ఉంటాయి. లేదా ఒక కాలు పూర్తిగా చాపి ఉంటుంది. అయితే పాదాలు పిరుదుల కంటే కింది భాగంలో ఉండి ప్రసవం కష్టమవుతుంది. బిడ్డ అడ్డం తిరిగిన సందర్భాల్లో తల్లిదండ్రులు ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనుకుంటే మాత్రం సిజేరియన్ సెక్షన్కు వెళ్లడం చాలా సురక్షితమైన, మంచి ప్రత్యామ్నాయం. మొదటి ప్రెగ్నెన్సీ విషయంలో ఇది మరింత అవసరం కూడా. ఈసీవీ చేయడానికి సాధ్యం కాని పరిస్థితులు ఏమిటంటే...తలలో పుట్టుకతో వచ్చే లోపాలు హైడ్రోసెఫాలస్ / అనెన్సెఫాలీ వంటి పుట్టుకతోనే లోపాలున్న సందర్భాల్లో : కొందరు బిడ్డల్లో మెదడు ఎదగాల్సిన చోట కేవలం నీరు మాత్రమే ఉంటుంది. ఈ కండిషన్ను హైడ్రోసెఫాలస్ కండిషన్ అంటారు. ఇక మరికొందరు బిడ్డల్లో మెదడులోని అన్ని భాగాలూ పూర్తిగా ఎదగ కుండా ఉండిపోతాయి. ఈ కండిషన్స్ను అనెన్సెఫాలీ కండిషన్ అంటారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఈసీవీ చేయడం ఏమాత్రం సాధ్యం కాదు. ఆలిగో హైడ్రామ్నియస్ (అంటే ఉమ్మనీరు చాలా తక్కువగా ఉండటం లేదా పాలీ హైడ్రామ్నియస్ (అంటే ఉమ్మనీరు అవసరమైనదాని కంటే ఎక్కువగా ఉండటం. యుటెరైన్ అనామలీస్ : యుటెరన్ లోపాలున్నప్పుడు. ఫూట్లింగ్ బ్రీచ్ : అంటే పుట్టే సమయంలో కడుపులోని బిడ్డ కాళ్లు మొదట బయటకు రావడం. ఎక్స్టెండెడ్ హెడ్ అండ్ కార్డ్ ఎరౌండ్ నెక్ : బిడ్డ పుట్టే సమయంలో తల బయటకు వచ్చేందుకు బర్త్ కెనాల్లో తగినంత స్థలం లేక΄ోవడంతో తలమీద చాలా ఒత్తిడి పడటం. ఇక కార్డ్ ఎరౌండ్ నెక్ అంటే బొడ్డుతాడు మెడ చుట్టూ బిగుసుకుపోయే కండిషన్. ప్రీవియస్ సిజేరియన్ : గతంలో జరిగిన ప్రసవంలో సిజేరియన్తో బిడ్డను బయటకు తీసుకువచ్చిన కేస్ అయి ఉండటం. ప్లాసెంటా ప్రివియా : ఈ కండిషన్లో గర్భధారణ జరిగినప్పుడు మాయ (ప్లాసెంటా) గర్భాశయం కింది భాగానికి అతుక్కుపోయి, గర్భాశయ ముఖద్వారాన్ని (సర్విక్స్ను) పాక్షికంగా గానీ, పూర్తిగాగానీ కప్పి ఉంచడం.యాంటీరియర్ ప్లాసెంటా : గర్భధారణ సమయంలో బిడ్డకు పోషకాలు అందించే బొడ్డుతాడు (మాయ) గర్భాశయం ముందువైపు గోడకు అతుక్కుపోయి ఉండటం (ఇది చాలా సాధారణం, ఆరోగ్యకరమైన గర్భధారణకు సంకేతం).ఈసీవీ చేయించుకోవాలని కోరేవారు అన్ని వసతులూ ఉండే మంచి ప్రసూతి ఆసుపత్రిని ఎంచుకుని అక్కడ బాగా అనుభవజ్ఞులైన ‘ఆబ్స్ట్రెట్రీషియన్స్’ (గర్భస్త పిండ వైద్యచికిత్స, ప్రసూతి నిపుణులు) ఉన్నారేమో ఎంక్వైరీ చేయాలి. అక్కడ ఈసీవీ జరుగుతున్నప్పుడు కడుపులోని బిడ్డను కంప్యూటర్ తెరపై ఎప్పుడూ చూసేందుకు వీలయ్యేలా ‘రియల్ టైమ్ అల్ట్రాసౌండ్ డాప్లర్’ సౌకర్యమూ ఉండాలి. చదవండి: ప్రసవానంతరం బరువు తగ్గాలంటే..! ఈ వర్కౌట్లు తప్పనిసరి..ఈ డాప్లర్ ఉండటం వల్ల ఈసీవీ చేస్తున్నప్పుడు బిడ్డ తాలూకు బొడ్డు తాడు అతడి మెడకు చుట్టుకుపోయి బిగుసుకుపోతుందా లేక మామూలుగానే ఉందా అని ఎప్పటికప్పుడు పరిశీలనగా చూడటానికి వీలవుతుంది. ఇలా చేస్తున్నప్పుడు ఒకవేళ తల్లికి తీవ్రమైన నొప్పి కలుగుతున్నా లేదా బిడ్డ తాలూకు గుండె స్పందనలు తగ్గుతున్నా లేదా ఈ గుండె స్పందనల్లోని లయ (రిథమ్) క్రమబద్ధంగా లేక΄ోయినా ఈ ప్రక్రియను నిలిపివేయాలి. వీలుకాకపోతే అప్పుడు శస్త్రచికిత్స (సిజేరియన్ సెక్షన్)కు తప్పక వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.చివరగా... శస్త్రచికిత్స వల్ల తమకు ఒనగూరే ప్రయోజనాలూ, ఆర్థిక అంశాల కారణంగా కొందరు డాక్టర్లు శస్త్రచికిత్స (సిజేరియన్)లను ప్రోత్సహిస్తున్నారనే వాదన చాలా సందర్భాల్లో వినిపిస్తూ ఉంటుంది. చాలామందిలోనూ ఈ అ΄ోహ ఉంటుంది. ఇందులో వృత్తిలో నైతికతకు సంబంధించిన అంశాలతోపాటు శస్త్రచికిత్స చేయడం తప్ప ఇతరత్రా అవకాశాలు లేని పరిస్థితులూ ఉంటాయి. దాంతో లోకంలో ఈ శస్త్రచికిత్సల విషయంలో చాలా వాదనలూ, భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉంటాయి. ఇక మరికొందరు తల్లులు తాము ప్రసవం తాలూకు నొప్పులను భరించడానికి ఇష్టపడకపోవడం అనే అంశమూ శస్త్రచికిత్సలను తప్పనిసరి చేస్తోంది. కాబట్టి ఈ అంశాలన్నింటిలోనూ డాక్టరుకూ, ప్రసవమవుతున్న తల్లికీ... ఈ ఇరువురికీ ఓ స్పష్టత ఉండాలి. తమ డాక్టరును నమ్మి, తనపై పూర్తిగా విశ్వాసం ఉంచినప్పుడే ప్రసవం విషయంలో అంతా సజావుగా జరిగిపోతుంది. అందుకే తాము నమ్మకం ఉంచిన డాక్టర్ దగ్గరే ప్రసవం జరిగేలా చూసుకోవడం ఇటు కాబోయే తల్లికీ, తన కుటుంబ సభ్యులకూ, అటు డాక్టరుకూ సౌకర్యంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. - నిర్వహణ: యాసీన్ -
ఇప్పటికీ డ్రైవింగ్ చేస్తున్న 82 ఏళ్ల బామ్మ..! కేన్సర్ రోగులకు..
ఆడపిల్లలను బయటకు పంపించని కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన సాహసోపేతమైన రైడర్ ఆమె. భర్త ప్రోత్సాహంతో సవాలుతో కూడిన డ్రైవ్లను సర్క్యూట్ రేసింగ్లను చాలా చాకచక్యంగా చేసేసిందామె. అలాగే విధి కన్నెర్రజేసి భర్తను తీసుకుపోయినా..అజేయమైన ధైర్య సాహసాంతో కుటుంబాన్ని నడిపించింది. భర్త నింపిన స్థైర్యాన్ని కొనసాగిస్తూ.. ఎనిమిది పదుల వయసులోనూ డ్రైవింగ్ చేస్తూ స్ఫూర్తిగా నిలిచింది. సమస్యలు, కష్టాలు నీ గమనాన్ని ఆపే యత్నం చేస్తాయి..అంతమాత్రాన చేతులెత్తేస్తే జీవితమే ఉండదు అని అంటోంది ఈ డైనమిక్ బామ్మ..!.ఆ ధీర వనితే ముంబైకి చెందని 82 ఏళ్ల జరీన్. బొంబాయిలోని ముస్లీం కుటుంబంలో పెరిగిన ఆమె..కళాశాలకు వెళ్ళి చదువుకున్న మొట్టమొదటి అమ్మాయి కూడా జరీనానే. సాంప్రదాయ అడ్డంకులని ఆ టీనేజ్ వయసులోనే అధిగమించి శెభాష్ అనుపించుకుంది. అంతేగాదు బాల్య దశలోనే డ్రైవింగ్ పట్ల మక్కువ ఉండేది. అయితే అందుకు ప్రోత్సాహం, నేర్పేవాళ్లు లేకపోవడంతో మౌనంగా ఉండిపోయింది. పెళ్లితో ఆమె భర్త తన అభిరుచికి అండగా నిలిచాడు, ప్రోత్సహించాడు. హైవేలపై మినీ బస్సులను నడపడం నుంచి బెంగళూరు నుంచి దాదాపు నిరంతర డ్రైవింగ్ సవాలు వరకు అన్ని డ్రైవ్లను స్వీకరించేలా ప్రోత్సహించాడు. ఇరవైల నాటికి సర్క్యూట్ రైసింగ్ ప్రయత్నించి..థ్రిల్ ఫీల్ని ఎంజాయ్ చేసింది. ప్రతి అనుభవం సాయంతో డ్రైవింగ్లో మరింత స్కిల్ని పుణికిపుచ్చుకుంది జరీన్. దాంతో ఆమెకు డ్రైవింగ్ అభిరుచికి మించినదిగా జీవితంలో భాగమైంది. 1996లో ఆమె భర్త అనూహ్య మరణంతో కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా చేపట్టింది. పిల్లలను పెంచుతూ..సొంతంగా డిపార్ట్మెంట్ స్టోర్ని నడిపేది కూడా. ప్రస్తుతం ప్రతి ఉదయం మనవరాళ్లను పాఠశాలకు తీసుకువెళ్తోంది. ఆమె రోజు అపాయింట్మెంట్లు, సామాజిక పని, సమావేశాలతో బిజీగా ఉంటుంది. అలాగే కేన్సర్ రోగులకు తన వంతు సహాయ సహకారాలను అందిస్తుంది కూడా. అంతేగాదు జరీన్ డ్రైవింగ్ అనేది ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లడానికి ఒక మార్గానికి మించినదని చెబుతోంది. ఇది స్వాతంత్ర్యం, విశ్వాసం, వ్యక్తిగత స్వేచ్ఛకు చిహ్నం. చాలా మందికి, చక్రం తిప్పడం అనేది వారి స్వంత మార్గాన్ని రూపొందించుకునేలా చేయడమే గాక సాహసోపేతంగా సవాళ్లను స్వీకరించే శక్తిని, పరిమితుల నుంచి విముక్తి పొందే సామర్థ్యాన్ని అందిస్తుందని ఆత్మస్థైర్యంగా చెబుతోంది జరీన్. నెటిజన్లు కూడా ఈ అమ్మమ్మ నిజంగా గ్రేట్. ఎనభైలలో కూడా డ్రైవింగ్ చేస్తున్న ఈ బామ్మ సదా స్ఫూర్తి, ప్రేరణ అని పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) (చదవండి: అణిగిపోవద్దు..అతిగా అరవవద్దు..!) -
చక్కని గాజులు.. చెక్కిన చేతులు..
సాక్షి, హైదరాబాద్: అమ్మాయిల అలంకరణల్లో ఎన్ని రకాల నగలున్నా.. గాజుల స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. అయితే, ఒకప్పటిలా నిండుగా కాకుండా.. ఆఫీసుకైనా, కాలేజీకైనా సింపుల్గా ఓ గాజు వేసుకుంటే చాలనుకుంటున్నారు. దీంతో పాటు కస్టమైజేషన్ గాజులంటే మరింతగా ఇష్టపడుతున్నారు. దీంతో చార్మినార్ ప్రాంతంలోని లాడ్ బజార్లో ‘లైవ్ బ్యాంగిల్ మేకింగ్’ ప్రాంతానికి క్యూ కడుతున్నారు. అక్కడ కస్టమర్ల అభిరుచి మేరకు వారి కళ్ల ఎదుటే, నచి్చన డిజైన్లలో గాజులు తయారు చేయించుకుంటున్నారు. ఈ ప్రక్రియను పర్యాటకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. కాగా సోమవారం ఓ యువతి కళాకారుడి సూచనల మేరకు స్వయంగా గాజులు తయారుచేయించుకుంది. -
సేంద్రియ ఆహార మార్కెట్లకు చోటివ్వండి!
కురుగంటి కవిత... మన దేశంలో రైతుల హక్కులు, సుస్థిర వ్యవసాయ జీవనోపాధుల పరిరక్షణ కోసం పోరాడుతున్న ఓ ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి. దేశవ్యాప్తంగా సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులు, రైతు శాస్త్రవేత్తలు, దేశీ విత్తన పరిరక్షకులు, స్వతంత్ర శాస్త్రవేత్తలు, పౌర సంస్థలు, వ్యక్తులతో కూడిన ఒక విస్తృతమైన నెట్వర్క్ ‘అలియన్స్ ఫర్ సస్టెయినబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చర్ (ఆషా)’. దీనికి కవిత జాతీయ కన్వీనర్గా సేవలందిస్తున్నారు. ఆషా–కిసాన్ స్వరాజ్, జాతీయ మహిళా రైతుల హక్కుల సంఘం (మకాం), ప్రకృతి వ్యవసాయంపై జాతీయ మిషన్ (ఎన్సీఎన్ఎఫ్), కోలిషన్ ఫర్ ఎ జీఎం–ఫ్రీ ఇండియా వంటి అనేక జాతీయ వేదికల్లో ఆమె దశాబ్దాలుగా కీలకపాత్ర పోషిస్తున్నారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. స్వావలంబనే శ్వాసగా కదిలే సేంద్రియ, ప్రకృతి వ్యవసాయదారులకు, రైతు శాస్త్రవేత్తలకు, రైతుల హక్కుల కోసం కృషి చేసే స్వచ్ఛంద కార్యకర్తలు, సంస్థలకు బలమైన సమష్టి గొంతుకగా ఆషా–కిసాన్ స్వరాజ్ నెట్వర్క్ నిలుస్తోంది. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్మితేనే వారికి సముచిత ఆదాయం వస్తుంది. సేంద్రియ మార్కెట్ల నిర్వహణకు కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో రైతులకు కాస్త చోటివ్వమని నగర/పట్టణవాసులకు ఆమె పిలుపు ఇచ్చారు. ఆరో కిసాన్ స్వరాజ్ సమ్మేళనాన్ని (kisan swaraj sammelan 2026) ఇటీవల మైసూరులో ఘనంగా నిర్వహించిన కవిత కురుగంటితో ‘సాక్షి సాగుబడి’ ముఖాముఖిలో కొన్ని ముఖ్యాంశాలు.‘ఆషా’ ఎప్పుడు, ఎలా పుట్టింది? కురుగంటి కవిత (kavitha kuruganti): 15 ఏళ్ల క్రితం ‘ఆషా’ కిసాన్ స్వరాజ్ సంస్థ పుట్టింది. బీటీ వంగ ప్రతిఘటన ఉద్యమకాలంలో ‘కోలియేషన్ ఫర్ ఎ జీఎం–ఫ్రీ ఇండియా’ను మేమంతా 2004లో సేవాగ్రామ్లోని గాంధీ ఆశ్రమంలో కూర్చొని ఏర్పాటు చేసుకున్నాం. బీటీ పత్తి మన దేశంలోకి వచ్చి అప్పటికి రెండేళ్లు గడిచాయి. బీటి పత్తి (BT Cotton) వల్ల ఆచరణలో ఎదురవుతున్న సమస్యలు ఆధారసహితంగా తెలిసివస్తున్న రోజులవి. కార్పొరేట్ కంపెనీల నియంత్రణ నుంచి బయటకు రావటం కోసం, స్వావలంబన సేద్యం కోసం రైతులు అనుసరించవలసిన పద్ధతులు, విష ముక్త, రుణ ముక్త, ఆత్మహత్య ముక్త జీవనోపాధుల వ్యవస్థ సాధించాలన్నది మా లక్ష్యం. అప్పుడు మేం అనుకున్నదేమిటంటే.. రైతు తన పొలంలో నడుము వంచి పనిచేసుకుంటున్నప్పుడు ఏదైనా ఎద్దు చేనులోకి చొరబడితే చేతిలో పని ఆపేసి ముందు ఆ ఎద్దును బయటకు తరమాలి కదా. అలాగే మిగతా పనులన్నీ పక్కనపెట్టి జన్యుమార్పిడి పంటలను పారదోలాలని అనుకున్నాం. ఆ విధంగా దేశంలో ఒక ఉద్యమం నిర్మించటానికి ఆరేళ్లు విపరీతంగా కష్టపడ్డాం.కేంద్ర పర్యావరణ మంత్రి జయరామ్ రమేశ్ 2009 డిసెంబర్ నుంచి జీఎం వంగపై ప్రజాభిప్రాయ సేకరణ మొదలు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వాల చేత నో అనిపించటం కోసం, సైంటిస్టులను, డాక్టర్లను ఈ ఉద్యమంలోకి తేవటం కోసం దేశమంతా తిరుగుతూ, చర్చలు పెడుతూ.. రాత్రి, పగలు అవిశ్రాంతంగా పని చేశాం. 2010 ఫిబ్రవరి 9న బీటీ వంగపై నిరవధిక మారటోరియం ప్రకటించారు. అదే మా తొలి విజయం. అదే సంవత్సరం మార్చిలో నాగపూర్లో మేం మళ్లీ కలిసి కార్యాచరణ నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా పత్తి రైతుల ఆత్మహత్యలు జరుగుతున్న ప్రాంతాల్లో ‘కిసాన్ స్వరాజ్ యాత్ర’ చేపట్టాం. 71 రోజులు 220 మందిమి 20 వేల కిలోమీటర్లు 20 రాష్ట్రాల్లో బస్సు యాత్ర చేసి రాజ్ఘాట్లో ముగించి, సోనియా గాంధీకి మా డిమాండ్ల పత్రాన్ని ఇచ్చాం.మేము బయలుదేరిందేమో ఆత్మహత్య దారితీయని సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వ్యాప్తి కోసమని. అయితే, దేశవ్యాప్తంగా రైతులు ఇతర సమస్యలను మా దృష్టికి తెచ్చారు. ఆర్గానిక్ సేద్యం (Organic Farming) కన్నా ముందు గిట్టుబాటు ధర, భూసేకరణ, వ్యవసాయంపై పారిశ్రామిక కాలుష్యం ముప్పు వంటి సమస్యలను పరిష్కరించాలని గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల్లో రైతులు కోరారు. సిటీల్లో ప్రజలు తమకు రసాయన అవశేషాల్లేని ఆహారం కావాలని అడిగారు. ముంబైలో మహేశ్ భట్ వంటి బాలీవుడ్ పెద్దలూ మాకు స్వాగతం పలికారు. ఈ యాత్ర నుంచే ‘ఆషా–కిసాన్ స్వరాజ్’ పుట్టింది. ‘కిసాన్ స్వరాజ్ నీతి’ పేరుతో మార్గదర్శకాలను నిర్దేశించుకొని, వాటి సాధన కోసం పని చేస్తున్నాం.మీరు సాధించిందేమిటి?కవిత: దేశంలో వ్యవసాయం మీద ఇష్టం ఉన్నవాళ్లకి మనం ముందుకెళ్లాల్సిన దారి ఏమిటో దిశా నిర్దేశం చెయ్యటంలో ఆషా–కిసాన్ స్వరాజ్ విజయం సాధించింది. గందరగోళాన్ని పారదోలింది. బీటీ వంగ పంట రాకుండా ఆపింది. రసాయనిక వ్యవసాయంతో ఎదురవుతున్న రకరకాల సంక్షోభాలు, జన్యుమార్పిడి పంటలతో (genetically modified crops) సమస్యలు వంటి వాటిపై వాస్తవ గణాంకాల ఆధారిత నివేదికలను రూపొందించటం, సంబంధిత సమగ్ర జ్ఞానాన్ని అందుబాటులోకి తేవటంలో మేం సఫలమయ్యాం. ఉదాహరణకు.. రైస్ ఫోర్టిఫికేషన్. అధ్యయన నివేదికలు రూపొందించాం. ఇది ప్రజారోగ్యానికి హానికరం కాబట్టి వద్దు అని చెప్పాం. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేశాం. 23 ఏళ్లుగా మరో జన్యుమార్పిడి పంటను వాణిజ్యపరంగా బయటకు రాకుండా ఆపగలిగాం. అంతేకాదు, ముఖ్యంగా ఏ రాష్ట్రంలోనూ క్షేత్ర ప్రయోగాలు జరపకుండా కూడా ఆయా ప్రభుత్వాలను విజయవంతంగా ఒప్పించగలిగాం.ప్రజల నుంచి మీరేమి ఆశిస్తున్నారు?కవిత: ఆరోగ్యదాయకమైన ఆహారం గురించి అందరూ చైతన్యం పెంచుకోవాలి. మీ కోసం, మీ పిల్లల ఆరోగ్యం కోసం మీరు ఈ పని చెయ్యగలిగితే.. అనేక విధాలుగా మేలు కలుగుతుంది. మీ ఆరోగ్యం బాగవుతుంది. వ్యవసాయంపై కార్పొరేట్ కంపెనీల నియంత్రణ కొంత తగ్గుతుంది. ఎక్కువ మంది రైతులు స్వావలంబనతో కూడిన వ్యవసాయం వైపు మొగ్గుచూపుతారు. నగరాలు, పట్టణాల్లో ప్రజలను నేను కోరుతున్న మరో విషయమేమిటంటే.. సేంద్రియ/ ప్రకృతి రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్ముకోవటానికి చోటివ్వండి. మీ ఇళ్లు/ గేటెడ్ కమ్యూనిటీలు/ కాలనీల్లో తరచూ సేంద్రియ సంతల నిర్వహణకు చోటు కల్పించండి. తద్వారా మధ్యవర్తుల బెడద తీరి, రైతుల ఆదాయం పెరుగుతుంది. అర్హులైన రైతులను గుర్తించి, సమన్వయపరచడానికి స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులకు కొదువ లేదు. చెన్నై, మాండ్యలలో రైతులే నిర్వహించుకునే సేంద్రియ మార్కెట్లే ఇందుకు నిదర్శనాలు.ఏమిటా ‘కిసాన్ స్వరాజ్ నీతి’ సూత్రాలు?కవిత: డా. జయతీఘోష్, డా. డి. నరసింహారెడ్డి వంటి చాలా మంది మేధావులతో లోతుగా చర్చించి 4 మార్గదర్శకాలను నిర్దేశించుకున్నాం. 1. కనీస మద్దతు ధర కావాలని రైతులు అడుగుతుంటారు. అయితే, అది దొరికినా ఆదాయ భద్రత దొరక్కపోవచ్చు. అందుకే రైతులకు ఆదాయ భద్రత కల్పించాలి. 2. ప్రభుత్వం వ్యవసాయ విధాన నిర్ణయం ఏది చేసినా అది పర్యావరణ సుస్థిరతకు లోబడి ఉండేలా చూడాలి. 3. భూమి, విత్తనం, నీరు వంటి వ్యవసాయ వనరులపై హక్కు రైతు సముదాయం చేతుల్లోనే ఉండాలి. 4. వినియోగదారులందరికీ వైవిధ్యభరితమైన, భద్రమైన, పుష్కలంగా, పోషక సంపన్నమైన ఆహారాన్ని అందించాలి. మా లక్ష్యం కేవలం సుస్థిర వ్యవసాయం కాదు. ఇవన్నీ కలిసి ఉండే హోలిస్టిక్ అగ్రికల్చర్. ఈ మార్గదర్శకాలే మమ్మల్ని నడిపిస్తున్నాయి. మహిళా రైతులు, కౌలు రైతులు, ఆదివాసీ రైతుల హక్కులపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం.‘ఆషా’ నిర్మాణం ఎలా ఉంది?కవిత: మాది సభ్యత్వం, ఎన్నికల ఆధారంగా పనిచేసే సంస్థ కాదు. దేశవ్యాప్తంగా భావసారూప్యత ఉన్న సంస్థలు, వ్యక్తుల్ని కలుపుకొని వెళ్లే ఒక వేదిక మాత్రమే. ఆషా స్వచ్ఛంద సంస్థ కాదు. మాకు బ్యాంకు ఎకౌంట్ లేదు, ఆఫీసు, సిబ్బంది లేరు. ఇళ్ల నుంచే మేం పనిచేస్తున్నాం. మా సొంత డబ్బునే ఖర్చు పెట్టుకొని పనిచేస్తున్నాం. వేరే యూనియన్ల మాదిరిగా ఇది వద్దు, అది వద్దు అనే వైఖరికి పరిమితం కాకుండా.. సమస్యలకు నిర్మాణాత్మక పరిష్కారాలను చూపే సంఘర్ష్, నిర్మాణ్లతో కూడిన వేదికగా ‘ఆషా’ను తీర్చిదిద్దాం. మాలో చాలా మందిమి ధర్నాల్లో పాల్గొంటాం, ప్రభుత్వ సలహా బృందాల్లోనూ సభ్యులుగా ఉంటాం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చెయ్యటానికని కేంద్ర ప్రభుత్వం నియమించిన అశోక్ దల్వాయి వర్కింగ్ కమిటీలో నేను, కిరణ్ సభ్యులుగా ఉండి, మూడు సంపుటాలలో మా సూచనలిచ్చాం. అదే సమయంలో కిసాన్ ముక్తి యాత్ర వంటి ఆందోళనలు నిర్వహించాం.చదవండి: ఆహార వృథాను అరికట్టే ‘అర్క ట్రైసైకిల్’తెలుగు బిడ్డ!కురుగంటి కవిత తెలుగింటి బిడ్డే! ఆమె తల్లిదండ్రులు గంగాభవాని (తూ.గో. జిల్లా పలివెల), రమేశ్ (గుంటూరు). హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మే చదివిన తర్వాత జహీరాబాద్ వద్ద పస్తాపూర్లోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్)లో దళిత మహిళా రైతుల అభ్యున్నతి కోసం ఐదేళ్లపాటు పనిచేశారు. తదనంతరం బెంగళూరులో (ఈ మధ్యనే మైసూరుకు మారారు) స్థిరనివాసం ఉంటూ జాతీయ రైతాంగ ఉద్యమం నిర్మాణానికి కృషి చేస్తున్నారు. జాతీయ స్థాయిలో 400కుపైగా సంస్థలు, వ్యక్తులతో కూడిన ‘అలియన్స్ ఫర్ సస్టెయినబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చర్ (ఆషా) ఉద్యమాన్ని గత 15 ఏళ్లుగా ముందుండి నడిపిస్తున్నారు. ప్రభుత్వ విధానాల్లో గుణాత్మక మార్పు కోసం జరిగే పోరాటాల్లో ఆమె కీలక పాత్ర నిర్వహిస్తున్నారు.ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి -
ఇయర్ఫోన్ల వాడకంలో ఈ తప్పు చేస్తున్నారా?
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో స్మార్ట్ఫోన్ ఎంత అవసరమో, చెవుల్లో ఇయర్ఫోన్లు కూడా అంతే అనివార్యమయ్యాయి. ప్రయాణాల్లో పాటలు విన్నా, ఆఫీస్ కాల్స్ మాట్లాడినా.. ఇయర్ఫోన్లు లేనిదే రోజు గడవని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ అలవాటే శాశ్వత చెవిటితనంలోకి నెట్టేస్తుందనే సంగతి మీకు తెలుసా? గంటల తరబడి చెవిని హోరెత్తించే ఆ శబ్దం, వినికిడి శక్తిని మటాష్ చేస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.యువతపై ‘సౌండ్’ సర్జికల్ స్ట్రైక్!సాధారణంగా 60 ఏళ్లు దాటిన వారికి వచ్చే వినికిడి సమస్యలు ఇప్పుడు 20 ఏళ్ల యువకుల్లోనే కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీకి చెందిన ప్రముఖ ఈఎన్టీ నిపుణులు డాక్టర్ దీప్తి సిన్హా తెలిపిన వివరాల ప్రకారం 'నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్' (NIHL) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇయర్ఫోన్ల మితిమీరిన వాడకం వల్ల లోపలి చెవిలో జరిగే నష్టం వెంటనే తెలియదు. ఇది ఒక ‘స్లో పాయిజన్’ మాదిరిగా పనిచేసి, మనం గుర్తించే లోపే వినికిడి శక్తిని హరిస్తుంది.తిరిగి రాని ‘కేశ కణాలు’.. జాగ్రత్త!శరీరంలో ఏ భాగం దెబ్బతిన్నా నొప్పి వస్తుంది. కానీ చెవి లోపల వినికిడి దెబ్బతినేటప్పుడు ఎలాంటి నొప్పి ఉండదు. మనం 85 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం విన్నప్పుడు, లోపలి చెవిలోని సున్నితమైన 'హెయిర్ సెల్స్' (కేశ కణాలు) శాశ్వతంగా చనిపోతాయి. మానవ శరీరంలోని ఈ కణాలు ఒక్కసారి నశిస్తే తిరిగి పుట్టవు. అంటే ఆ సెల్స్ పోయాయంటే వినికిడి శక్తిని మళ్లీ పొందడం అసాధ్యం.రక్షణ కవచం: ‘60/60’ మ్యాజిక్ ఫార్ములాఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు వైద్యులు ఒక అద్భుతమైన సూత్రాన్ని సూచిస్తున్నారు. అదే '60/60' రూల్. దీని ప్రకారం ఫోన్ వాల్యూమ్ను ఎప్పుడూ 60 శాతం కంటే పెంచకూడదు. రోజులో ఇయర్ఫోన్లు వాడే సమయాన్ని కేవలం 60 నిమిషాలకే పరిమితం చేయాలి. ప్రతి గంట వాడకం తర్వాత కనీసం ఐదు నిమిషాలు చెవులకు విశ్రాంతినివ్వడం వల్ల శ్రవణ వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుంది.నాయిస్ క్యాన్సిలేషన్: ఒక వరంబయట ట్రాఫిక్ లేదా రద్దీగా ఉన్నప్పుడు మనం వాల్యూమ్ పెంచుతుంటాం. ఇది చెవికి మరింత చేటు చేస్తుంది. అందుకే బయటి శబ్దాలను అడ్డుకునే 'ఆక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్' (ANC) ఫీచర్ ఉన్న ఇయర్ఫోన్లను వాడటం ఉత్తమం. దీనివల్ల తక్కువ వాల్యూమ్లో కూడా స్పష్టమైన శబ్దం వినిపిస్తుంది. తద్వారా చెవి లోపలి సున్నిత భాగాలకు రక్షణ లభిస్తుంది.ఈ లక్షణాలు ఉంటే..తరచుగా చెవుల్లో 'రింగు'మనే శబ్దం (Tinnitus) వస్తున్నా, ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు మాటలు అస్పష్టంగా అనిపిస్తున్నా వెంటనే మేల్కోవాలి. చెవులు మూసుకుపోయినట్లు ఉండటం లేదా శబ్దాలు మందకొడిగా వినిపించడం లాంటివాటిని ప్రమాద ఘంటికలుగా గుర్తించాలి. ముఖ్యంగా బీపీ, షుగర్ ఉన్నవారు ఏటా ఒకసారి వినికిడి పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: రష్యాలో ఆఫ్రికన్ యువత మృత్యు ఘోష -
అణిగిపోవద్దు..అతిగా అరవవద్దు..!
పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే అందరినీ మెప్పించడం లేదా అందరినీ ఎదిరించడమని చాలామంది అపోహపడుతుంటారు. మీరు గమనిస్తే, ఆఫీసులోనో లేదా కుటుంబంలోనో కొందరు వ్యక్తులు ఎప్పుడూ అందరినీ ప్లీజ్ చేస్తూ ఉంటారు, కొందరు మాత్రం ఎప్పుడూ గొడవ పడుతుంటారు. ఈ రెండూ సరైన పద్ధతులు కావు. అసలైన పర్సనాలిటీ గ్రోత్ 'Assertiveness' (నిశ్చయత) లో ఉంది. ఇది ఎదుటివారిని గౌరవిస్తూనే, మన హక్కులను మనం కాపాడుకోవడం.1. మూడు రకాల ప్రవర్తనలు (The Behavioral Spectrum)సైకాలజీలో మనం మనుషులతో ప్రవర్తించే విధానాన్ని మూడు రకాలుగా విభజించవచ్చు.Passive (అణగిపోవడం): ఎదుటివారు ఏమనుకుంటారో అని మీ అభిప్రాయాలను దాచుకోవడం. దీనివల్ల మీ ఆత్మగౌరవం తగ్గుతుంది, దీనివల్ల మీకు లేనిపోని ఒత్తిడి పెరుగుతుంది.Aggressive (అతిగా అరవడం): ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడటం, డామినేట్ చేయడం. దీనివల్ల మనుషులు మీకు దూరమవుతారు, మీ చుట్టూ ఉన్నవారు భయపడతారు తప్ప గౌరవించరు.Assertive (The Golden Mean): "నా అభిప్రాయం ముఖ్యం, అలాగే నీ అభిప్రాయం కూడా ముఖ్యం." ఇది ఎదుటివారిని హర్ట్ చేయకుండా మీ బౌండరీని మీరు సెట్ చేసుకోవడం.2. Assertiveness ఎందుకు అవసరం? Assertiveness అనేది కేవలం ఒక కమ్యూనికేషన్ స్కిల్ మాత్రమే కాదు, అది మీ ఆత్మగౌరవానికి (Self-Respect) ప్రతిరూపం.మీరు 'Assertive' గా ఉన్నప్పుడు, మీ నిర్ణయాలకు ఒక విలువ ఉంటుంది.మీరు చెప్పే 'Yes' కు ఒక గౌరవం, చెప్పే 'No' కు ఒక క్లారిటీ ఉంటుంది.అతిగా అరవాల్సిన అవసరం లేదు, అణగిపోవాల్సిన అవసరం అస్సలు లేదు.3. మోటివేషన్ మాయ vs నిజమైన సైకాలజీట్రైనర్స్ "ఎవ్వరినీ వదిలిపెట్టకు, సింహంలా ఉండు, గర్జించు" అని చెప్తారు. ఇది మీకు అగ్రెసివ్ ట్యాగ్ను ఇస్తుంది. కానీ సైకాలజీ మీ గొంతును కాదు, మీ పాయింట్ని బలంగా చెప్పమంటుంది. కోపం తగ్గించి, స్పష్టతను పెంచుకోమంటుంది. నిజమైన నాయకుడు అరిచి పని చేయించడు, తన క్లారిటీతో పని చేయిస్తాడు.4. Assertive గా ఉండటం ఎలా?Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఈ ఆర్ట్ను ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం.Step 1: మొహమాటాన్ని బ్రేక్ చేయండిమొహమాటం అనేది ఒక జబ్బు. "నేను వాళ్ళని ఏమీ అనకూడదు" అనే ఆలోచనని బ్రేక్ చేయండి. మీరు ఎదుటివారికి రెస్పెక్ట్ ఇవ్వడం అంటే, వారు చెప్పే ప్రతి తప్పుకు తల ఊపడం కాదు. మీ బౌండరీలను దాటినప్పుడు సున్నితంగా, బలంగా 'No' చెప్పడం ప్రాక్టీస్ చేయండి.Step 2: Build 'I' స్టేట్మెంట్స్ఇతరులను విమర్శించేటప్పుడు "నువ్వు తప్పు చేస్తున్నావు" అనకుండా, "నీ వల్ల నాకు ఇలా ఇబ్బందిగా ఉంది" (I feel... when you...) అని చెప్పండి. ఇది ఎదుటివారిని డిఫెన్సివ్ మోడ్లో పడకుండా, మీ పాయింట్ని అర్థం చేసుకునేలా చేస్తుంది. దీన్నే మనం బిల్డ్ చేసుకోవాలి.Step 3: ప్రశాంతతే బలంమీరు ఏ పరిస్థితిలో అయినా ప్రశాంతంగా, క్లారిటీతో మాట్లాడగలిగినప్పుడు, అది మీ వ్యక్తిత్వానికి ఒక గొప్ప బలాన్ని ఇస్తుంది. మీరు ఎవరినీ డామినేట్ చేయరు, ఎవరూ మిమ్మల్ని డామినేట్ చేయలేరు. ఇదే 'Beyond' స్టేజ్.5. మీరు ఎక్కడ ఉన్నారు?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.మీరు నిన్నటి రోజున ఎవరికైనా ఇష్టం లేకపోయినా 'సరే' అని అన్నారా? (Passive)మీరు ఎవరి మీదైనా అనవసరంగా కోప్పడ్డారా? (Aggressive)ఏ సందర్భంలో మీరు మీ పాయింట్ను గౌరవంగా చెప్పగలిగారు? (Assertive)మీ గొంతుకే మీ ఆయుధం!బ్రో, మీ గొంతులో ఉండేది కేవలం శబ్దం మాత్రమే కాదు, మీ అస్తిత్వం (Identity). దాన్ని అణచివేయనివ్వకండి, అలాగని దాన్ని ఎదుటివారిపైకి గర్జనలా వాడకండి. ఒక స్పష్టమైన, ప్రశాంతమైన, దృఢమైన గొంతుకను డెవలప్ చేసుకోండి."Assertiveness is not about what you say, but how you say it."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: దెబ్బ తగిలినా తిరిగి నిలబడే తత్వం) -
ఉమెన్ సివిల్ పవర్
ఒకప్పుడు... ‘సివిల్ సర్వీసెస్ పరీక్షలలో మహిళలు’ అనేమాట ఊహకు అందేది కాదు. ఇప్పుడు... ఆర్థిక, సామాజిక పరిమితులను అధిగమిస్తూ సివిల్స్ లో సత్తా చాటుతున్నారు...⇒ 24 - 35%: ఇండియన్ సివిల్ సర్వీసెస్లో మహిళలప్రాతినిధ్యం 2019లో 24 శాతం ఉండగా 2023లో 35 శాతానికి పెరిగింది.⇒ 41%: 2023 ఐఏఎస్ బ్యాచ్లో రికార్డ్ స్థాయిలో 41 శాతం మంది మహిళలు ఉన్నారు.⇒ 18%: అత్యున్నత స్థాయి పదవుల విషయానికి వస్తే, కేంద్రస్థాయి కార్యదర్శులలో 18 శాతం మంది మహిళలు ఉన్నారు.అసామాన్య విజేతలుఆర్థిక, ఆరోగ్య పరిమితులు ఆశయ సాధనకు అడ్డుకాదని నిరూపించారు యూపీఎస్సీ–2026 పరీక్షలో విజయం సాధించిన ఎంతోమంది మహిళలు. ⇒ డాక్టర్ కావాలని కలలు కన్న కేరళంలోని కోజికోడ్కు చెందిన అథిరా మగతన్ రోడ్డు ప్రమాదానికి గురై శరీరమంతా చచ్చుబడి΄ోయింది. రెండు సంవత్సరాలు జ్ఞాపకశక్తిని కోల్పోయింది. జ్ఞాపకశక్తి తిరిగి వచ్చిన తరవాత చదువుకోవాలనే సంకల్ప బలం పెరిగింది... దాని ఫలితమే సివిల్స్లో ఆమె 483 ర్యాంక్. ⇒ పెద్దపల్లి జిల్లాకు చెందిన గుడెల్లి సృజన 55వ ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి సింగరేణి కార్మికుడు. ⇒ పాటియాలాలోని సభాకు చెందిన సిమ్రాన్దీప్ కౌర్ యూపీఎస్సీలో ఆల్ ఇండియా ర్యాంక్ 15 సాధించింది. కౌర్ తండ్రి సామాన్య రైతు. ⇒ కేరళలోని నెయ్యట్టింకరకు చెందిన ఎఎస్ శ్రీజ చిన్న స్టడీ రూమ్లో సంస్కృతం నుంచి ఆంగ్లం వరకు ఎన్నో స్ఫూర్తిదాయకమైన కొటేషన్లు కనిపిస్తాయి. తాను మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించడానికి ఆ కొటేషన్లు ఎంతో బలాన్ని ఇచ్చాయి. తండ్రి కన్స్ట్రక్షన్ వర్కర్. తల్లి సాధారణ గృహిణి. ⇒ గుజరాత్లోని కాండ్లా పట్టణానికి చెందిన ఆస్తా జైన్ ఆల్ ఇండియా ర్యాంక్ 9 సాధించింది. ఆమె తండ్రి లక్ష్మీనారాయణ్ ఆలయం సమీపంలో చిన్న మిఠాయి దుకాణం నడుపుతున్నాడు. ∙పంజాబ్లోని చిన్న గ్రామానికి చెందిన సిమ్రాన్దీప్ కౌర్ మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా స్థాయిలో 51 వ ర్యాంక్ సాధించింది. ఆమె తండ్రి జస్వీందర్సింగ్ పంజాబ్ స్టేట్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్లో లైన్మన్గా పనిచేస్తున్నారు. తల్లి స్వరణ్ కౌర్ గృహిణి.⇒ మధురైకి చెందిన రాజేశ్వరీ సువే డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసేది. అయినా ఆమె సంతృప్తి పడలేదు. తాజాగా యూసీఎస్సీలో కూడా సత్తా చాటింది. మొదటి అయిదు ర్యాంకులలో రాజేశ్వరీ ఏకైక మహిళా టాపర్. -
ఇది సొసైటీ... నడబడిక!
స్కూళ్లలో గంజాయి, స్కూళ్లలో వీడియోగేమ్స్, స్కూళ్లలో చెడ్డ మాటలు, స్కూళ్లలో రౌడీయిజం చదువుకునే పిల్లల మధ్య కలుపుమొక్కలు. చివరకు క్లాస్రూమ్లో టీచర్ మీద చెయ్యెత్తే వరకూ వచ్చారు. ఇందులో ఎవరి మీద నెపం నెడదాం? ఈ విద్యా భారతాన్ని ఎలా చూద్దాం?బడి అంటే ఉత్తి భవనం కాదు. విద్యార్థుల భవితను తీర్చిదిద్దే ఆలయం. చదువు చెప్పే ప్రతి గురువు దైవంతో సమానం. తల్లిదండ్రుల తర్వాతి స్థానం మన పెద్దలు గురువుకే ఇచ్చారు. విద్యార్థుల్ని సొంత పిల్లల్లా చూసుకుంటూ, వారి బతుకును తీర్చిదిద్దే దిక్సూచులుగా మారి వారిని గమ్యానికి చేర్చే బాధ్యత ఉపాధ్యాయులది. కానీ.. పరిస్థితి తారుమారైంది. చదువు చెప్పే గురువులకు మర్యాద కరువైంది. విద్య నేర్పే ఒజ్జలకు విలువనిచ్చే సంస్కృతి కనుమరుగవుతోంది. తప్పు చేస్తే విద్యార్థులను ఉపాధ్యాయులను దండించే కాలం పోయి, విద్యార్థులే ఉపాధ్యాయులను దండించే కాలం వచ్చింది. ఇది కాలరీతి అనుకోవాలా లేక సమాజంలో దిగజారిపోతున్న విలువలకు తార్కాణంగా భావించాలా తెలియని పరిస్థితి. ఇటీవలి ఘటన కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జడ్పీ ఉన్నతపాఠశాలలో జరిగిన ఘటన అందరినీ నివ్వెరపరిచింది. మరుగుదొడ్ల వద్ద సిగరెట్లు తాగుతున్న ముగ్గురు విద్యార్థులను గమనించి ల్యాబ్ అసిస్టెంట్ మందలించారు. దీనిపై ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ విద్యార్థులు ఆయనతో వాగ్వాదానికి దిగి దాడి చేశారు. ఈ ఘటనను వీడియో తీస్తున్న వారిపైనా దాడి చేశారు. దీంతో ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో తరచూ జరుగుతున్నాయి. బడిలో మద్యం, గంజాయి తాగడం, అమ్మాయిలను ఏడిపించడం, గ్రూపులుగా విడిపోయి కొట్టుకోవడం తరచూ కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల ఇవి తీవ్రస్థాయికి చేరుతున్నాయి. వీటిని కట్టడి చేయలేక ఉపాధ్యాయులు చేతులెత్తేస్తున్నారు. గట్టిగా చర్యలు తీసుకోవాలని చూస్తున్నా స్థానిక రాజకీయాలు, ఒత్తిడి వారి ఆ పని చేయనీయకుండా చేస్తోంది. దీంతో మిన్నకుండిపోతున్నారు.సినిమాలు... సోషల్ మీడియా ప్రభావంస్కూల్ పిల్లలు చెడ్డదారిలో పడటానికి సినిమాలు, సోషల్ మీడియా ప్రధాన కారణంగా మారుతున్నాయని నిపుణులు అంటున్నారు. సినిమాల్లో విద్యార్థులు తమ లెక్చరర్లను ఏడిపించడం, వారి మీద జోకులేయడం వంటి సన్నివేశాలు చూసి తామూ అలా చేయాలని భావిస్తున్నారని అంటున్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ వీడియోలు, బూతులు, అశ్లీల వీడియోలు సైతం వారి మనసుల మీద చెడు ప్రభావం చూపిస్తున్నాయంటున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉండటం వల్ల చాలా సులభంగా వీటిని చూస్తూ ఆ ప్రభావానికి లోనవుతున్నారని అంటున్నారు.తల్లిదండ్రుల మాటలనూ లెక్కచేయక...విద్యార్థులు బడిలోనే ఇలా ఉంటున్నారనుకుంటే ΄÷రపాటే. కొందరు తమ ఇళ్లల్లోనూ ఇదే రీతిలో ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రుల మాట వినకుండా, వారి మాటలకు ఎదురుచెప్తూ, వారి మీదే దాడికి పాల్పడుతున్నవారూ ఉన్నారు. అతిగారాబం, అడిగినవన్నీ అందించడం, అందరిలోనూ గొప్పగా ఉండాలని కోరుకోవడం వంటి కారణాలతో తల్లిదండ్రులే పిల్లల్ని ఇటువంటి ప్రవర్తనకు పురిగొల్పుతున్నారని మానసిక వైద్యులు అంటున్నారు. చివరకు సొంత అమ్మానాన్నల మాట కూడా వినని స్థితికి చేరుకున్నాక ఏమీ చేయలేక కుమిలిపోతున్నారని అంటున్నారు.ఇలా చేస్తే మేలు...⇒ పిల్లలను అతిగారాబం చేయకూడదు. వారి అవసరాలను గుర్తించి అందుకు తగ్గట్టు అందించాలి తప్ప వారి అడిగిన ప్రతి వస్తువూ కొనివ్వకూడదు. ⇒ పెద్దల్ని గౌరవించడం, ఆడవారితో మర్యాదగా ఉండటం, తోటివారితో స్నేహంగా మెలగడం వంటివి చిన్ననాటి నుంచే నేర్పించాలి. ⇒ పిల్లలు వారి ఫోన్ లో ఏమేం చూస్తున్నారో కనిపెడుతూ ఉండాలి. చూడకూడదని మొండికేస్తే ఆ ఫోన్ వారి నుంచి తీసుకోవాలి. ⇒ పిల్లల స్నేహితులు ఎవరు, వారి అలవాట్లు ఏమిటి, వారి పద్ధతి ఎలా ఉంది అనేది గమనించాలి. ఎక్కడైనా తప్పుడు స్నేహాల బారిన పడుతున్నట్లు అనిపిస్తే వెంటనే హెచ్చరించాలి. ⇒ కనీసం నెలకోసారైనా బడికి వెళ్లి పిల్లల ప్రవర్తన గురించి ఆరా తీయాలి. కేవలం మార్కుల గురించే కాకుండా నడవడిక గురించి కనుక్కోవాలి. ⇒ రాత్రుళ్లు ఆలస్యంగా ఇంటికి రావడం, రోజంతా ఫోన్ లోనే గడపడం, అందరిపట్లా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటివి గమనిస్తే వెంటనే పిల్లల్ని మందలించాలి. అయినా మారకపోతే కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించక తప్పదు. -
8 రోజులు.. 800 కిలోమీటర్లు..!
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎనిమిది రోజుల పాటు హైదరాబాద్ నుంచి ముంబై వరకూ 800 కిలోమీటర్ల సైకిల్ యాత్రకు సంకలి్పంచాడు.. ఇందులో భాగంగా 30 చోట్ల ఫిట్నెస్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు నిర్ణయించుకున్నాడు.. మార్చి 7 ప్రారంభమైన ఈ సైకిల్యాత్ర 14 వరకూ కొనసాగనుంది. ప్రజలకు ఫిట్నెస్, సైక్లింగ్ ప్రాముఖ్యతను వివరించడమే లక్ష్యంగా వెల్నెస్ అడ్వొకేట్ కాంతి దత్ ముందుకు కదులుతున్నాడు. ఫియర్ ప్రాజెక్ట్ పేరిట స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సహకారంతో ఈ యాత్రను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని నోవోటెల్ హోటల్లో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో పలువురు అతిథులు, ఫిట్నెస్ ప్రేమికులు పాల్గొని కాంతి దత్కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడి నుంచే సైక్లింగ్ యాత్రను ప్రారంభించారు. ఎనిమిది రోజుల పాటు.. మొత్తం ఎనిమిది రోజుల పాటు సాగనున్న ఈ ప్రయాణంలో దాదాపు 800 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ సుమారు 30 ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. యాత్రలో భాగంగా పలు పాఠశాలలు, కళాశాలలను సందర్శించి విద్యార్థులతో సమావేశమై ఫిట్నెస్ ప్రాముఖ్యత, సైక్లింగ్ ప్రయోజనాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి అవగాహన కల్పించనున్నారు. ‘పర్యావరణానికి అనుకూలమైన రవాణా వ్యవస్థ అయిన సైక్లింగ్ను ప్రోత్సహించడం, రోజువారీ జీవితంలో సైక్లింగ్ను భాగం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై అవగాహన కల్పించడం’ ప్రాధాన లక్ష్యమని కాంతి దత్ తెలిపారు. (చదవండి: తండ్రైన క్షణం..! ఎంత స్ట్రాంగ్గా ఉండేవాడైనా..) -
తండ్రైన క్షణం..! ఎంత స్ట్రాంగ్గా ఉండేవాడైనా..
కొన్ని క్షణాల్లో ఎంతటి బలంగా ఉండే వ్యక్తికైనా..ఒక్కసారిగా చేతులు వణుకుతాయి. అప్పుడే మనకు ధైర్యం విలువ గొప్పదనం తెలుస్తుంది కూడా. ప్రతి తండ్రికి ఎదురయ్యే ఈ గొప్ప మధుర క్షణాల్లో చేతులు వణుకుతాయోమో!?..ఇలానే భయపడతారేమో..!?. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోని డాక్టర్ సుగన్య శరవణకుమార్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు. డాక్టర్ శరవణ కుమార్ నవజాత శిశువుని తండ్రికి అప్పగిస్తున్నట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి చాలా భయపడిపోయాడు. తన బిడ్డను పట్టుకోవడానికి సిద్ధమవుతున్నప్పుడు అతని చేతులు వణుకుతున్నాయి. డాక్టర్ అతనికి భరోసా ఇస్తూ చేతుల్లోకి ఇచ్చినవప్పుడూ తీవ్రమైన భావోద్వేగంలో మునిగిపోతూ..చేతుల్లోకి శిశువుని తీసుకున్నాడు. అయినప్పటికీ బిగిసుకుపోతున్నట్లుగా షాక్లోనే ఉన్న అతన్ని డాక్టర్ ప్లీజ్ టెన్షన్ పడొద్దు ఫ్రీగా ఉండండి అని సూచనలిస్తూ..తండ్రైన క్షణాన్ని అనుభవించేలా చేశారు. అంతేగాదు ఆ క్షణాలను కెమెరాలో బంధించి "బలమైన వ్యక్తి చిన్న ఆనందాన్ని పట్టుకున్నప్పుడు చేతులు వణుకుతాయి. కొత్త ఆనందం కుటుంబంలో చేరినప్పుడు క్షణాలు మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ప్రతి నిమిషం, ప్రతి సెకను ఎంతో విలువైంది". అనే క్యాప్షన్ని జోడించి మరి పోస్ట్ చేశారు. ప్రతి తండ్రికి ఈ అనుభూతి తెలుసు, ఆ క్షణం భయంతో కూడిన ప్రేమ బయటకొస్తుంది అని పోస్టులు పెట్టారు.(చదవండి: ఎండిపోయిన నదికి ప్రాణం పోసిన మహిళా శక్తి..!) -
ఇంతై..ఇంతింతై..! సందిడిగా సాక్షి 'ఆల్ ఫర్ హర్'
‘ఇంతింతై.. వటుడింతయై’ పోతన భాగవతంలోని వామనావతార ఘట్టానికి చెందిన ప్రసిద్ధ పద్యం తెలిసిందే.. వామనుడు విశ్వరూపం దాల్చి భూమి, ఆకాశం, నక్షత్రలోకాలను ఆక్రమించిన దృశ్యాన్ని ఈ పద్యం వరి్ణస్తుంది.. అలాగే సమాజాభివృద్ధిలో కీలకపాత్ర వహిస్తున్న మహిళా శక్తి కీర్తి ప్రతిష్టలు ఇంతై.. ఇంతింతై.. అన్నట్లు విశ్వవ్యాప్తమవుతున్నాయి. ఓ వైపు కుటుంబాన్ని నడిపించే శక్తిగా, మరోవైపు ప్రతి రంగంలోనూ ప్రతిభను చాటుతూ ఇంతులు కొత్త కీర్తి శిఖరాలను అధిరోహిస్తున్నారు. మహిళల ఆత్మవిశ్వాసాన్ని, స్వీయ సాధికరాతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ‘సాక్షి’ గ్రూప్ మరో ముందడుగు వేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఆల్ ఫర్ హర్’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. హైదరాబాద్లోని రాజపుష్ప అట్రియా వేదికగా జరిగిన వేడుకలు మహిళల సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, స్వయం అభివృద్ధి సందేశాన్ని ప్రతిధ్వనించేలా చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సెలబ్రిటీ మేకప్ ఆరి్టస్ట్ తమన్నా రూజ్ మేకప్ మాస్టర్ క్లాస్ సెషన్ ప్రత్యేక ఆకర్షణ కాగా..ఈ సెషన్లో మహిళలకు ట్రెండీ మేకప్ పద్ధతులు, సేఫ్టీ మేకప్ టెక్నిక్స్, స్కిన్ కేర్ సంబంధిత సూచనలు అందించారు. తమన్నా రూజ్ హైదరాబాద్లో మేకప్ స్టూడియోను ప్రారంభించిన తొలి మేకప్ ఆరి్టస్ట్గానే కాకుండా లండన్ స్కూల్ ఆఫ్ మేకప్ నుంచి పట్టభద్రురాలు.. రష్యా, లెబనాన్, దుబాయ్ వంటి పలు దేశాల్లో ప్రత్యేక శిక్షణ పొందారు. రాజపుష్ప అట్రియా అసోసియేషన్ సభ్యులతో పాటు కమ్యూనిటీకి చెందిన మహిళలు ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు. సాధికారత..సమన్వయం.. మహిళల ఆత్మవిశ్వాసం, స్వీయ సాధికారత ప్రదర్శించేలా నిర్వహించిన ‘ఫేస్ ఆఫ్ సాక్షి కమ్యూనిటీ’ క్రౌన్ సెర్మనీ విశేషంగా అలరించింది. ఇందులో భాగంగా సూపర్ మామ్ క్రౌన్ను మధు, బ్యాలెన్సింగ్ చాంప్ కిరీటాన్ని సంగీత, గ్రేస్ ఫుల్ సీనియర్ లేడీ క్రౌన్ను సుమతి గెలుచుకున్నారు. దీంతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాప్ డ్యాన్స్ యాక్టివిటీలో మహిళలు ఉత్సాహంగా స్టెప్పులేశారు. అనంతరం ఉమెన్స్ డే కేక్ కట్టింగ్ చేశారు. వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలకు జోయాలుక్కాస్ జ్యువెల్స్ ప్రోత్సాహక బహుమతులు అందించారు. పాఠకులతో సాక్షి మమేకం.. సాక్షి మీడియా గ్రూప్ 18 సంవత్సరాలుగా ప్రజలకు, పాఠకులకు కొత్త ఆలోచనలు, కొత్త ఫార్మాట్లను అందించడంలో ఎల్లప్పుడూ ముందంజలో ఉందని, సమాజంతో మమేకమవుతూ ప్రజలతో సాన్నిహిత్యాన్ని బలోపేతం చేయడం సాక్షి గ్రూప్ లక్ష్యమని సంస్థ డైరెక్టర్ రాణీ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే మహిళలతో నేరుగా కలిసేందుకే ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిత్వానికి కేరాఫ్ అడ్రస్.. నేటి తరం మహిళల్లో అందంగా కనబడాలనే ఆసక్తి పెరుగుతోందని తమన్నా రూజ్ పేర్కొన్నారు. సాక్షి టీవీతో ప్రత్యేక అనుబంధం ఉన్న తాను మేకప్ ఆర్టిస్ట్ కెరీర్కు ముందు ‘సాక్షి’ టీవీలో పనిచేసినట్లు గుర్తుచేసుకున్నారు. సెల్ఫ్ మేకప్, సెల్ఫ్ గ్రూమింగ్ పట్ల అవగాహన కల్పించడమే ఈ సెషన్ లక్ష్యమని, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటారని, మహిళల దైనందిన జీవితంలో అందం, వ్యక్తిత్వం ఎంతో ముఖ్యమని అన్నారు. మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ.. నేటి తరం పురుషుల ఆలోచనా విధానంలో మార్పువచి్చందని, అమ్మ, భార్య, చెల్లి, ఇలా కుటుంబంలోని మహిళలను వారు ఎన్నుకున్న రంగంలో ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. నగరంలో బ్యూటీ రంగం ఎంతో మార్పు చెందిందని, ముఖ్యంగా దక్షిణ భారత సమాజంలో మేకప్పై ఉన్న సంప్రదాయ భావనలు క్రమంగా మారుతున్నాయని పేర్కొన్నారు.వెల్ డన్ ‘సాక్షి’.. ఉమెన్స్ డే రోజున సాక్షి ఆధ్వర్యంలో మా కోసం స్ఫూర్తివంతంగా నిర్వహించిన ఈ ‘ఆల్ ఫర్ హర్’ వేడుకలు అభినందనీయం. ఈ వేడుకలు మా అందరికీ సరికొత్త అనుభూతిని, స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని అందించిన సాక్షి గ్రూప్కు ప్రత్యేక అభినందనలు. – జానకి (పార్టిసిపేషన్ ప్రైజ్ విన్నర్) (చదవండి: వసంతాన్ని ఎక్స్పీరియెన్స్ చేయాలనుకుంటే.. అక్కడకు వాలిపోవాల్సిందే..!) -
ఎండిపోయిన నదికి ప్రాణం పోసిన మహిళా శక్తి..!
తమిళనాడులో కాలానుగుణ నది నాగనది. గత 20 ఏళ్లుగా ఎండిపోయి నిర్జీవంగా మారిపోయింది. చక్కగా నీటితో కళకళలాడే నది కాస్తా..బీడు వారిపోయింది. ఈ నదే అక్కడ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలకు ఆధారం. అలాంటి నదికి నారీ శక్తి ప్రాణం పోసి 365 రోజులు నీటితో పారేలా చేస్తోంది. అదెలా ఈ మహిళామణులకు సాధ్యమైందో తెలుసుకుందామా..!.సరిగ్గా ఆ టైంలోనే గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ దార్శనికతతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ దేశవ్యాప్తంగా నదీ పరీవాహక ప్రాంతాలను పునరుద్ధరించడానికి నదీ పునరుజ్జీవన ప్రాజెక్టును ప్రారంభించింది. దేశంలో నీటి కొరత నిర్వహణలో భాగంగా నాగనది నది పునరుజ్జీవన పనిని అమలు చేసే నిమిత్తం 2014లో వెల్లూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలను సర్వే చేసేందుకు శాస్త్రవేత్తలు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు స్వచ్ఛంద సేవకులతో సహా సాంకేతిక నిపుణుల బృందం కదిలివచ్చింది. ఈ నదిని తిరిగి పునరుజ్జీవింప చేయాలంటే బావులు, బండరాళ్ల చెక్డ్యామ్లు నిర్మించాలన్సి అవసరం ఉంది. ప్రారంభంలో ఈ ప్రాజెక్టు ద్వారా ఎండిపోయిన నదులను పునరుద్ధరించేందుకు దాదాపు 20 వేల మంది మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఆ తర్వాత ఈ వార్త దావానలం ఆ చుట్టపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద స్వచ్ఛంద సేవకులుగా ఈ పనుల్ల పాలుపంచుకునేవాళ్ల సంఖ్య అనుహ్యంగా 40 వేలకు పైగా చేరింది. వారంతా మహిళామణులే కావడం విశేషం. ఈ మహిళా స్వచ్ఛంద సేవకులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ మార్గదర్శకత్వంలో బావులు తవ్వడం, సిమెంట్ రింగులు నిర్మించడం వంటి వాటితో అవిశ్రాంతంగా పనిచేశారు. ఫలితంగా భూగర్భజల మట్టాలు ఒక మీటర్ నుంచి ఎనిమిది మీటర్లకు పెరిగాయి. దెబ్బతో నదికి తిరిగి జీవం వచ్చినట్లైంది. ఇదంతా కేవలం మహిళా శ్రామిక శక్తి వల్ల సాధ్యం కావడం విశేషం. ఆ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తన వందవ 'మన్ కీ బాత్' ఎపిసోడ్లో చెప్పి..ఆ నారీ శక్తి జట్టు కృషిని ప్రశంసించారు. ఒకరకంగా సమాజం కోసం అందరూ నడుబిగించాలని చెప్పడమే కాదు..ఐక్యతను సైతం చాటి చెప్పింది ఈ నారీ శక్తి. మహిళ తలుచుకుంటే భూమిని స్యశ్యామలంగా ఉంచగలరు. అలాగే ప్రకృతి సైతం పులకరించిపోయేలా అందంగా అపురూపంగా మార్చగలరు. అలాంటి మహిళామణులకు, మహిళా శక్తికి సదా జోహార్లు అని కీర్తిద్దాం, గౌరవిద్దాం. కేవలం విమెన్ డే ఒక రోజున మాత్రమే కాదు..ప్రతి సందర్భంలోనూ అవకాశంలోనూ మహిళలను పురుషులతో సమానంగా చూస్తే చాలు. అంతకుమించి ఇంకేమి ఆశించరు అని గుర్తిస్తే చాలు కదూ..!. View this post on Instagram A post shared by Art of Living (@artofliving) (చదవండి: చాయ్వాలాగా ఐటీ ఉద్యోగి..! టెక్ ఉద్యోగం వద్దనడానికి కారణం అదే..) -
చాయ్వాలాగా ఐటీ ఉద్యోగి..!
ఐఐటీ విద్యార్థి చాయ్ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అది కూడా అమెరికాలో. ఈ భారత సంతతి వ్యక్తి కథ నెట్టింట సెన్సేషన్గా మారింది. ఈ టెకీ కథ ప్రతి ఒక్కర్ని కదలించడమే కాదు, ఆలోచింపచేసేలా చేసింది. అతడే చాయ్వాలా లేదా చాయ్గుయ్గా ప్రసిద్ధి చెందిన ప్రభాకర్ ప్రసాద్. బిహార్ పాట్నా సమీపంలోని బార్ అనే చిన్న పట్టణానికి చెందిన ప్రభాకర్ ఈ ఫిబ్రవరి 2025లో టెక్ లేఆఫ్లు నేపథ్యంలో అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో చాయ్స్టాల్ని ప్రారంభించి ఒక్కో టీ కప్పుని రూ. 780లకు విక్రయిస్తున్న అతడి కథ నెట్టింట వైరల్ అవ్వడంతో..ఒక్కసారిగా అతడి బిజినెస్ కూడా లాభాసాటిగా పుంజుకోవడం విశేషం. ఎక్కడో బిహార్ నుంచి అగ్రరాజ్యం అమెరికాకు ఎలా వలస వచ్చాడంటే.. నిజానికి ప్రభాకర్ కుటుంబం కడు పేదరికంతో ఇక్కట్లు పడుతుండేది. కనీసం దుప్పట్లు కూడా కొనుక్కోలేని దారుణ పరిస్థితి. దాంతో వాళ్లు శీతాకాలం వచ్చిందంటే చాలు వెచ్చదనం కోసం పప్పుబస్తాల కింద నిద్రించేవారట. ప్రభాకర్ తండ్రి అనేక వ్యాపారాలు చేసినా..ఎందులోనే విజయం సాధించలేకపోయేవాడట. కానీ అతడి తల్లిదండ్రులు విద్య శక్తిని మాత్రం గట్టిగా విశ్వసించేవారట. ఇక ప్రభాకర్ చిన్నతనంలో బిహార్లోని ఓ హిందీ పాఠశాలలో చదువుకున్నాడు. అక్కడ ప్రభాకర్ క్లాస్ ఫస్ట్, లీడర్ కూడా. క్రికెట్ దగ్గర నుంచి పాటలు పాడటం వరకు అన్నింట్లోనూ మనోడే ఫస్ట్. అయితే తన సోదరుడు కిడ్నాప్కి గురవ్వడంతో తన జీవితం అనూహ్యమైన మలుపులు తిరిగిందని చెబుతున్నాడు. తన కుటుంబం అకస్మాత్తుగా బీహార్ వదిలి భోపాల్కు వెళ్లిపోయింది. ఆ మార్పుని తట్టుకోవడం చాలా కష్టంగా అనిపించింది ప్రభాకర్కి. భోపాల్లో తోటి విద్యార్థులంతా ఇంగ్లీస్లో అనర్గళంగా మాట్లాడంతో..తన ఆంగ్లయాసను చూసుకుని అంత నవ్వేవారంటూ నాటి ఘటనను గుర్తుచేసుకున్నాడు. బిహార్ బోర్డు స్కూల్ నుంచి ఇంగ్లీష్ సీబీఎస్ఈ స్కూల్ వరకు కనీసం ప్రాథమిక పదాలు అర్థమయ్యేవి కాదని చెప్పుకొచ్చాడు. అయితే కష్టపడి ఏదో రకంగా నేర్చుకున్నానని, అలా ఐఐటీ స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యానని చెప్పుకొచ్చారు. ఐఐటీ అడ్మిషన్ తన జీవిత గమనాన్ని మార్చిందని చెబుతున్నాడు. ఐఐటీ పూర్తి అయిన వెంటనే 2008లో మొట్టమొదటి ఉద్యోగాన్నిపొందాను, అయితే టెక్ ప్రపంచం నాకెందుకో అంతగా నచ్చలేదు. కోడింగ్ నన్ను ఎప్పుడు ఉత్సాహపరచలేదని అంటున్నాడు. దాంతో అక్కడి కార్పొరేట్ ఒత్తిడి తట్టుకునేందుకు జిమ్లో గడుపుతుండేవాడినని, అలా బాడీబిల్డింగ్ తన అభిరుచిగా మారిందని అంటున్నాడు. దాంతో కొత్తగా వేరే ఏదైనా ప్రయత్నించాలనే ఉద్దేశ్యంతో ముంబైకి వెళ్లి మోడలింగ్ ఆడిషన్లకు వెళ్తుండేవాడినని చెప్పుకొచ్చాడు. అలా మోడలింగ్లో రాణించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతుండగా అతడి స్నేహితురాలు అమెరికా వెళ్లిపోయింది. దాంతో ప్రభాకర్ కూడా అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ వీసా రెండుసార్లు తిరస్కరణకు గురైంది. చివరికి 2014లో మాత్రమే ఎంబిఏ చేయడానికి యూఎస్ వెళ్లగలిగానంటూ తన గతాన్ని గుర్తుచేసుకున్నాడు. అయితే అనుకున్నంత అందంగా అమెరికా జీవితం ఉండదు అని తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. అక్కడ ఆరోగ్య సమస్యలు, పని ఇబ్బందులు తదితరాలన్నింటిని ఎదుర్కొన్నాడు. దాదాపు పదేళ్లు అమెరికాలో ఒక నగరం నుంచి మరొక నగరానికి తిరుగుతూనే ఉన్నానని, ఎన్నో కార్పొరేట్ ఉద్యోగాలు కూఆ చేశానని, అయితే తాను లేఆఫ్ వేటుకి గురయ్యానంటూ బాధగా చెప్పుకొచ్చాడు. ఇంతలో తన ఆరోగ్యం కూడా కుదుటపడింది. అయితే నా గమ్యం ఎటు వెళ్తుందో తెలియని ఈ అస్థిరతకు ఎలా చెక్ పెట్టాలా అని ఆలోచిస్తుండగా..ఒక స్నేహితుడి సూచన మేరకు చాయ్వాలాగా మారినట్లు చెప్పుకొచ్చాడు. తాను బిహారీ శైలి చాయ్ అమ్ముతూ ఓ వీడియోని నెట్టింట పోస్ట్ చేశాను. ఇది తన వ్యాపార ప్రచారంలో భాగంగా చేశానని, అనుకున్నట్లుగా చాలామందికి ఆ వీడియో చేరువై వ్యాపారం కూడా పుంజుకుందని అంటున్నాడు ప్రభాకర్. అయితే కార్పొరేట్ జాబ్లలో పనిచేస్తున్నప్పుడు చేతినిండా డబ్బు ఉంది..స్వేచ్ఛ, ఆనందం లేకుండా పోయాయి. కానీ ఇవాళ్ల తన వద్ద డబ్బు తక్కువగానే ఉంది, కానీ స్వేచ్ఛ ఆనందం చాలా గరిష్టస్థాయిలో ఉన్నాయని అంటున్నాడు. అంతేగాదు తన స్వంత ఇష్టానికి తానే యజమానిని అని చెబుతున్నాడు కూడా. తాను కార్పొరేట్ బానిసను కాదని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నాడు. గౌరవంగా బతకాలనుకుంటే..ఎంత చిన్న ఉద్యోగమైనా.. మంచిదే..అదే స్వేచ్ఛ, ఆనందం నిల్ అయితే కోట్లు గడించే ఉద్యోగమైనా వేస్టే కదా అని ప్రభాకర్ గాథ చూస్తే తెలుస్తోంది కదూ..!.(చదవండి: ప్రసవానంతరం బరువు తగ్గాలంటే..! ఈ వర్కౌట్లు తప్పనిసరి..) -
వసంతాన్ని ఎక్స్పీరియెన్స్ చేయాలనుకుంటే.. అక్కడకు వాలిపోవాల్సిందే..!
కొన్ని ప్రదేశాలను కళ్లతో చూస్తాం. కొన్ని ప్రదేశాలను మనసులో అనుభూతి చెందుతాం. అలాంటి ఒక అందమైన ప్రదేశమే జూన్లోని క్యోటో. క్యోటోలో వసంతాన్ని ఎక్స్పీరియెన్స్ అయితేదానిని జీవితాంతం ఒక మెమోరీగా దాచుకుంటాం. జూన్లో ఉన్న క్యోటో అనే ప్రాచీన నగరం మార్చి నుంచి సమ్మర్ ప్రారంభం వరకు ఒక అందమైన రంగుల కథలా మారిపోతుంది. సకూరా లేదా చెర్రీ బ్లాసమ్ చెట్ల గులాబీ పుష్పాలతో విరిసిన సమయంలో వీధులు, చెరువులు, సరస్సులు, ఆలయాలు ఇవన్నీ కలిసి ఒక లైవ్ పెయింటింగ్లా అనిపిస్తాయి. ఇక్కడ ప్రయాణం అంటే చెక్లిస్ట్ టూరిజం కాదు ఒక స్లో వాక్ం ఒక సైలెంట్ ఫీలింగ్.వసంత వెలుగుల్లో క్యోటో రిథమ్మార్నింగ్ టైమ్లో? లైట్ మిస్ట్ మధ్య నడుస్తే గాలిలో ఒక ఆహ్లాదకరమైన సువానస గుండెల్ని మీటుతుంది. రోడ్ సైడ్లో చిన్న చిన్న కేఫేలు ఉదయమే తెరుచుకుంటాయి. సైకిల్పై డిసిప్లెన్గా స్కూల్కు వెళ్లే పిల్లలు కనిపిస్తారు. అలాగే పక్కనే ఓల్డ్ వుడెన్ హౌసెస్ సైలెంట్గా గంభీరంగా నగరంలో జరిగే మార్పులను గమనిస్తూ ఉంటాయి. ఇక్కడ లైఫ్ అంటే వేగం కాదు. ప్రశాంతంగా జీవించాలే వేదంలాంటిది. మధ్యాహ్నం సమయంలో కెనాల్ పక్కనే కూర్చుంటే నీటిపై పడిన చెర్రీ బ్లాసమ్ పెటల్స్ స్లోగా ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఆ సీన్ చూస్తే టైమ్ కూడా స్లో మోషలో నడుస్తున్నట్టు అనిపిస్తుంది. క్యోటోలో సమ్మర్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఈ వసంత కాలంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.లోకల్ ఫీల్ ఇచ్చే ప్రాచీన కల్చర్క్యోటో అంటే జూన్ కల్చరల్ క్యాపిటల్ లాంటిది. జియాన్ ఏరియాలో సాయంత్రం సమయంలో వాక్ చేస్తే అక్కడి ట్రెడిషనల్ కిమోనో వేసుకున్న అమ్మాయిలు చాలా మంది కనిపిస్తారు. ఓల్డ్ టీ హౌసెస్ నుంచి వచ్చే వార్మ్ లైట్ స్ట్రీట్ మీద పడితే సిటీ ఒక వింటేజ్ సినిమా ఫ్రేమ్లో మనం ΄ాత్రధారులం అయినట్టు అనిపిస్తుంది. ఇక్కడ టీ సెర్మనీ అనుభవం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సింపుల్గా టీ సర్వ్ చేసే విధానంలో కూడా ఒక డిసిప్లిన్, ఒక గౌరవం ఉంటుంది. లోకల్ మార్కెట్లో ఫ్రెష్ ఫ్రూట్స్, హ్యాండ్మేడ్ క్రాఫ్ట్సŠ, సీజనల్ స్వీట్స్ లభిస్తాయి. ఇక్కడి ప్రజలు ప్రకతితో మమేకం అయ్యి జీవిస్తారు. అది మీరు బాగా గమనించవచ్చు.సందర్శనీయ స్థలాలుక్యోటోలో ప్రయాణం అంటే ప్లేస్ నుంచి ప్లేస్కు ట్రావెల్ కాదు. ఫీలింగ్ నుంచి ఫీలింగ్కి మూవ్ అవ్వడం లాంటిది.ఫుషిమీ ఇనారీ తైషా దగ్గర రెడ్ టోరీ గేట్స్ మధ్య నడవటం అంటే ఒక స్పిరిచువల్ టన్నెల్లో వెళ్తున్నట్టు ఉంటుంది. ప్రతీ అడుగులో నిశ్శబ్దానికి, ప్రశాంతతకు మరింత చేరువ అవుతున్నట్టు అనిపిస్తుంది.కింకాకు–జి, అంటే గోల్డెన్ పెవిలియన్. దీని ప్రతిబింబం సరస్సులో కనిపిస్తే వెంటనే ఫోటోలు తీయాలని అనిపిస్తుంది. కానీ అలా చేయకుండా మౌనంగా ఆ నిమిషాన్ని ఎంజాయ్ చేయడమే కరెక్ట్ అని మనసు కూడా చెబుతుంది.అరాషియామా బాంబూ గ్రోవ్లో గాలి తనువుతోపాటు మనసును తాకుతూ వెళ్తుంది. ఆ గాలికి వినిపించే నేచురల్ సౌండ్స్ ఇవన్నీ ఒక మ్యూజికల్ ఎక్స్పీరియెన్స్లా మిగిలిపోతాయి.ఫిలాసఫర్స్ పాత్ కెనాల్ పక్కన సకూరా ఛాయలో నడుస్తే ప్రతీ టర్న్లో గులాబీ పెటల్స్ పడుతున్న భావన కలుగుతుంది. ఇక్కడ వాక్ పూర్తయ్యాక కూడా ఆ సీన్ మనసులో కొనసాగుతూనే ఉంటుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి టోక్యో లేదా ఒసాకాకు కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి. అక్కడి నుంచి ట్రైన్ ద్వారా క్యోటోకి ఈజీగా చేరుకోవచ్చు. జూన్ రైల్వే సిస్టమ్ చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి ట్రావెల్ ఎక్స్పీరియెన్స్ కూడా జర్నీ భాగంగా అనిపిస్తుంది.ఎక్కడ ఉండాలి?సిటీ సెంటర్ దగ్గర్లో ట్రెడిషనల్ ర్యోకన్ స్టైల్ స్టేలు అందుబాటులో ఉంటాయి. సింపుల్ వుడెన్ రూమ్స్, తతామీ మ్యాట్స్, స్లైడింగ్ డోర్స్ ఇలా స్టే కూడా ఒక కల్చరల్ ఎక్స్పీరియెన్స్లా ఉంటుంది. మోడర్న్ హోటల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కానీ ఓల్డ్ స్టైల్ అకామడేషన్లో ఉంటేనే క్యోటో వైబ్ బాగా ఫీల్ అవుతుంది.ఏం చూడాలి?ఆలయాలు, చిన్న చిన్న మందిరాలు, కెనాల్ వాక్స్, బాంబూ ఫారెస్ట్, ఈవినింగ్ లాంటర్న్ స్ట్రీట్స్ ఇవన్నీ రష్ లేకుండా స్లోగా చూడాలి. ఇక్కడ బ్యూటీ కేవలం కళ్లకు ఇంపుగానే కాదుం మెమోరీస్లో సింక్ అయ్యేలా ఉంటుంది.ఏం తినాలి?క్యోటోలో మీరు తప్పకుండా లోకల్ రామెన్ ట్రై చేయండి. దీంతోపాటు మాచా బేస్డ్ స్వీట్స్, తాజా సుషీ, సీజనల్ సకూరా ఫ్లేవర్ ఉన్న డెజర్ట్స్ మిస్ చేయకండి. అలాగే చిన్న స్ట్రీట్ కేఫేలో సింపుల్ టీ తాగితే కూడా ఎక్స్పీరియెన్స్ కంప్లీట్ అవుతుంది.ఎప్పుడు వెళ్లాలి?క్యోటో వెళ్లేందుకు వసంతమే ఉత్తమ సమయం. మార్చి నుంచి ఏప్రిల్ మధ్యలో సకూరా పీక్ సీజన్ ఉంటుంది. సమ్మర్ ప్రారంభం అవ్వడానికి ముందే వాతావరణం కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ట్రిప్ ప్లాన్ చేయడం మంచిది. సమ్మర్ మొదలయ్యాక కూడా పచ్చదనంతో క్యోటో అందంగా కనిపిస్తుంది.క్యోటో ప్రయాణం పూర్తయ్యాక ఫోటోల కన్నా మెమోరీస్ ఎక్కువగా మిగులుతాయి. గులాబీ పెటల్స్ పడిన ఆ మూమెంట్స్, బాంబూ సౌండ్స్, ఆలయ గంటల శబ్దాలు ఇవన్నీ కలిసి ఒక పీస్ఫుల్ చాప్టర్లా మనసులో నిలిచిపోతాయి. ఎందుకంటే క్యోటోలో వసంతం ఒక సీజన్ కాదు. ఆనందానికి ఒక రీజన్ కూడా. (చదవండి: మిర్చి హోలీ'..రంగు పులుముకున్న పుడమి తల్లి..!: ఆనంద్ మహీంద్రా) -
ప్రసవానంతరం బరువు తగ్గాలంటే..! ఈ వర్కౌట్లు తప్పనిసరి..
ప్రసవానంతరం బరువు తగ్గడం చాలా సవాలుగా ఉంటుంది. మాములుగా బరువు తగ్గడానికి గర్భధారణ అనంతరం తగ్గడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. పైగా శరీరంలో వచ్చే మార్పులకు తోడు నవజాత శిశువుని హ్యాండిల్ చేస్తూ బరువు తగ్గడం తదితరాలన్ని చాలా సవాలుగా ఉంటాయి. ముందుగా శరీరం మునపటి పటుత్వం లేక..కొద్దిపాటి వ్యాయామాలను ఓర్చుకునే శక్తి స్వతహాగా కొత్త తల్లులకు ఉండదు. మరి అలాంటప్పుడు ఎలాంటి తేలిక పాటి వ్యాయామాలు చేయాలి..? కొత్త తల్లులు నిజంగానే తీవ్రమైన వ్యాయామాల జోలికి పోకపోవడమే మంచిదా..? తదితరాల గురించి కంటెంట్ క్రియేటర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిధి త్యాగి చెప్పే సలహాలు సూచనలే గురించి సవివరంగా చూద్దామా..!.ప్రసవానంతరం బరువు తగ్గం అనేది సాధారణ విషయం కాదని అంటోంది నిధి త్యాగి. దీని గురించి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో అమూల్యమైన సలహాలు సూచనలు షేర్ చేశారు. ఇక్కడ కొత్త తల్లులు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం కంటే..కేలరీలలోటు, కదలికలపై దృష్టిపెట్టాలని అంటోంది. చాలామంది డెలివరీ తర్వాత పాలిస్తారు కాబట్టి బరువు తగ్గిపోతారని అనుకుంటుంటారు. కానీ అది ముమ్మాటికీ అబద్ధమని అంటోంది. తాను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మామిడపండ్లు అధికంగా తినేదాన్ని అని ఆ టైంలో ఏకంగా 20 కిలోలకు పైగా అదనపు బరువు ఉన్నానని చెప్పుకొచ్చింది. ప్రసవం తర్వాత పదికిలోలు మాత్రమే తగ్గానని, మిగిలిని పదికిలోల బరువు అలాగే ఉందని తెలిపింది. ఏడాదికి పైగా బిడ్డకు పాలిచ్చానని, ఇంట్లో వండిన భోజనం మాత్రమే తీసుకున్నానని, అలాగే తేలికపాటి వాకింగ్ వంటివి చేసేదాన్ని అని వెల్లడించింది. కానీ అంతలా కేర్ తీసుకున్నా..బరువులో అంతగా మార్పులు కనిపించలేదని అంటోంది. పైగా డెలివరీ తర్వాత బరువు తగ్గడానికి తీవ్రమైన వ్యాయామాల జోలికి అస్సలు పోకూడదని అంటోంది. ఎందుకంటే కొత్త తల్లుల శరీరం సున్నితంగా మారిపోయి ఉంటుంది..దాంతో ఆ వర్కౌట్లు తట్టుకోవడం అంత సులభం కాదని చెబుతోంది. కనీసం 15 నిమిషాలు కూడా చేయలేమని అంటోంది. అలా అని బయటకు జిమ్ వెళ్లే పరిస్థితి కూడా లేకపోవడంతో హోమ్ ఇన్స్ట్రక్టర్ని నియమించుకున్నట్లు తెలిపింది. అతను సూచించిన కోర్ వ్యాయామాలు, కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్ వ్యాయామాలతో బలం పుంజుకోగలిగానని అంటోంది. వీటివల్ల కండరాలు బలోపేతం అవుతుతాయి. కొద్దిపాటి బరువులు ఎత్తి..బోడ్డులోపలికి కోర్ని స్ట్రాంగ్గా మార్చుకోగలిగానని అంటోంది. అలా తాను నాలుగు నెలల్లో నాలుగు నుంచి ఐదు కిలలోలు వరకు తగ్గగలిగానని అంటోంది. ప్రస్తుతం తాను ప్లాంక్లు కూడా వేయగలనని, వెన్నునొప్పి లేదని అంటోంది. కానీ ప్రసవానంతరం వేగవంతంగా బరువు తగ్గాలనుకోవడం తప్పులేదు గానీ..ఆ క్రమంలో తప్పుడు మార్గంలో వెళ్లొద్దని, ఆరోగ్యకరమైన మార్గాన్ని ఎంచుకోమని చెబుతోంది కంటెంట్ క్రియేటర్ నిధి త్యాగి. View this post on Instagram A post shared by Nidhi Tyagi (@thenidhityagi) (చదవండి: చీరకట్టులో స్నోబోర్డింగ్ స్టంట్..!) -
Hyderabad: రంజాన్ ఉపవాసం పాటిస్తున్న పిల్లి
మనమేం చేస్తే పిల్లలు చూస్తారు.. అదే చేస్తారు.. కుటుంబ సభ్యులు ఏం చేస్తే ఇంట్లోని పెట్స్ కూడా అలాగే చేయడం చూస్తూనే ఉంటాం. కుటుంబ సభ్యుల్లా కలిసిపోయిన పెట్స్ చేసే కొన్ని పనులు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఓ పిల్లి రంజాన్ ఉపవాస దీక్షను అనుసరిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. మోతీనగర్ డివిజన్లో నివాసం ఉండే ఓ ముస్లిం కుటుంబం కొన్ని నెలల క్రితం ఆన్లైన్లో ఓ పిల్లిని కొనుగోలు చేసింది. దానికి జీజీ అని పేరుపెట్టి ప్రేమతో పెంచుకుంటున్నారు. రంజాన్ మాసం కావడంతో కుటుంబ సభ్యులంతా ఉపవాస దీక్షలు ప్రారంభించారు. ఈ క్రమంలో నిత్యం వారిని అనుసరిస్తున్న ఆ పిల్లి ఉపవాస దీక్షలను పాటిస్తూ వారితో పాటు స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రతిరోజూ సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉంటుంది. ఇఫ్తార్ సమయంలో కుటుంబ సభ్యుల వద్దకు వచ్చి కూర్చుంటుంది. ఎలాంటి ఆహార పదార్థాలు స్వీకరించదు. వారంతా ఇఫ్తార్ పూర్తి చేసుకున్న తర్వాత దానికి ఆహారం పెడితే మాత్రమే తింటుంది. పిల్లి క్రమశిక్షణతో మెలగడంపై ఇంటి యజమాని షేక్ రియాజ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. – మోతీనగర్ -
తల్లీబిడ్డల ‘ఎల్లిపాయ కారం’
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల నగరానికి చెందిన తల్లీకూతుళ్లు రాచకొండ చందన, సాయిశ్రీ కొత్త రకం వంటలను రుచి చూపిస్తూ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్నారు. ఇటీవల సోనీ టీవీ మాస్టర్ చెఫ్ ఇండియా సీజన్–9 వంటల రియాలిటీ షోలో రన్నరప్గా నిలిచి అందరి దృష్టిని ఆకర్శించారు. గతంలోనే ఎల్లిపాయ కారంతో వైరెటీలు చేస్తూ కొత్త రుచులను పరిచయం చేశారు. హైదరాబాద్ మాదాపూర్లో ఎల్లిపాయ కారం పేరుతో ఓ రెస్ట్రారెంట్ నిర్వహిస్తున్నారు. చందన తన భర్త రవీందర్ సహకారంతో మంచిర్యాలలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఇక కూతురు సాయిశ్రీ బీటెక్ చేయగా.. సాఫ్ట్వేర్ ఉద్యోగావకాశాలు వచ్చాయి. కానీ తనకు ఇష్టమైన వంటల రంగాన్నే ఎంచుకున్నారు. నాలుగో తరగతి నుంచే వంట చేసేందుకు ఆసక్తి చూపడంతో తల్లిదండ్రులు అదే దిశగా ప్రోత్సాహించారు. గతంలో జెమిని టీవీలో తెలుగు మాస్టర్లో పాల్గొన్నప్పటికీ ఫైనల్ వరకు చేరలేదు. తాజాగా తల్లీకూతురు మాస్టర్ ఇండియా చెఫ్ జోడిగా కొనసాగిన 45ఎపిసోడ్స్లో వంటల్లో వైవిధ్యతను ప్రదర్శించారు.పుష్పరాజ్ చికెన్, స్పెషల్ లడ్డురియాలిటీ షోలో కఠిన పరీక్షలైన అగ్ని పరీక్ష, నీరు లేకుండా వంట, కట్టల పొయ్యిపై వండడం, వెజ్, నాన్వెజ్ వంటకాలు చేశారు. దేశంలో పలు ప్రాంతాల వంటకాల్లో మసాలాలు, పదార్థాలతో కొత్త రుచులు వచ్చేలా చేసి సత్తా చాటారు. ప్రఖ్యాత చెఫ్ సంజీవ్ కపూర్తోపాటు న్యాయనిర్ణేతలు వికాస్ ఖన్నా, రణవీర్ బ్రార్, కునాల్ కపూర్ నుంచి ప్రశంసలు అందుకున్నారు.ఆ సమయంలో పుష్పరాజ్ పేరుతో వండిన చికెన్తో న్యాయనిర్ణేతలను ఆకర్షించారు. ‘మా రెస్టారెంట్లో లడ్డుకు ప్రత్యేక ఆదరణ ఉంది. మహిళలు వంట తెలియకుండానే నేర్చుకునే ఓ గొప్ప నైపుణ్యం. మా పాప అభిరుచి కోసం నేను తోడుగా నిలిచా’ అని తల్లి చందన చెబుతుంటే, అమ్మ అందించిన ప్రోత్సాహంతోనే తనకు దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తోందని సాయిశ్రీ అంటున్నారు. -
సమయపాలన
ప్రపంచంలో విజయవంతమైన వ్యక్తులందరిలో కనిపించే ఒకే ఒక ఉమ్మడి లక్షణం సమయపాలన. సమయాన్ని సరిగ్గా నిర్వహించే వ్యక్తి తన పనులను సకాలంలో పూర్తి చేయడమే కాకుండా, ఇతరుల గౌరవాన్ని కూడా పొందుతాడు. ప్రకృతి కూడా సమయపాలననుపాటిస్తుంది. సూర్యోదయం, చంద్రోదయం, రుతువులు అన్నీ సమయానికే జరుగుతాయి. మనిషి కూడా ప్రకృతిని చూసి సమయపాలన నేర్చుకోవాలి. మనం పనులను వాయిదా వేయకుండా సమయానికి పూర్తి చేస్తే, చివరి నిమిషంలో పడే కంగారు లేదా ఒత్తిడి ఉండదు. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. సమయపాలన అనేది కేవలం గడియారం చూసి పని చేయడం కాదు, అది ఒక క్రమశిక్షణ.సమయాన్ని గౌరవించడం అంటే సాక్షాత్తు భగవంతుడిని గౌరవించడమే. సమయాన్ని వృథా చేసేవాడు దైవనింద చేసినట్లే అని ఆధ్యాత్మిక భావన. ఒక వ్యక్తి సమయానికి వస్తున్నాడంటే, అతనికి తన బాధ్యతల పట్ల పూర్తి అవగాహన ఉందని అర్థం. సమయపాలనపాటించకపోయినా, సద్వినియోగం వేసుకోకపోయినా ఏ మనిషి కూడా ఆలోచనలను, ఉన్నత లక్ష్యాలను యిప్పుడే కాదు, ఎప్పటికీ చేరుకోలేడు. సోమరిపోతుగానే జీవితాన్ని గడపక తప్పదు. ఒకసారి సమయం దాటిపోయింది. అంటే తిరిగి దానిని అందుకోవడం మన వల్ల కాదు. అందుకనే ప్రతి క్షణం కూడా మనం మెలకువతో ఉండి, రెట్టింపు ఉత్సాహంతో పనిచేయగలిగితేనే విజయం ఎప్పుడూ మన వెంటే ఉంటుంది.మనం చేసే ప్రతి పనికి ఒక సమయం ఉంటుంది. విత్తనం నాటడానికి ఒక సమయం, ఫలం రావడానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చే వరకు వేచి ఉండటం (ఓర్పు), అలాగే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఆధ్యాత్మిక లక్షణం. ఒక కార్యం తలపెట్టినప్పుడు ప్రణాళిక ఎంత ముఖ్యమో, ఆ పనిని పూర్తి చేయడానికి ఒక నిర్దిష్ట సమయం కూడా అంతే ముఖ్యం. ఆ సమయ పరిపాలన మనంపాటించకపోతే ఆ కార్యం ఫలాలను మనం పూర్తిగా అందుకోలేం. సమయాన్ని నిరుపయోగంగా మొబైల్ ఫోన్లకే కేటాయించడం అనేది ఒక సామాజిక సమస్యగా మారుతోంది.మొబైల్ అనేది ఒక అద్భుతమైన సాధనం అయినప్పటికీ, దానిని అతిగా వాడటం వల్ల యువత తమ విలువైన భవిష్యత్తును పణంగా పెడుతున్నారు యువత ఈ మొబైల్ మాయలో పడి తమలోని దైవత్వాన్ని కోల్పోతున్నారు. ఈ అనవసరపు యాప్ల నుండి బయటపడి, రోజులో కనీసం 15 నిమిషాలు మౌనంగా లేదా ధ్యానంలో గడిపితే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో వారు గ్రహించ గలరు. మొబైల్ ఫోన్ మన అవసరానికి ఉండాలి కానీ, మనల్ని శాసించేలా ఉండకూడదు. యువత తమ కాలాన్ని కెరీర్ నిర్మాణానికి, జ్ఞానసముపార్జనకు వాడుకుంటేనే దేశానికి, వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. విలువైన ఈ జీవిత పయనంలో సమయం విలువ నేటి యువత తెలుసుకోవాల్సిందే,పాటించాల్సిందే. లేకుంటే వారి జీవితాలు అధోగతిపాలుకావడం ఖాయం. ఎంత ప్రతిభ ఉన్నా సమయపాలనపాటించనపుడు అతని ప్రతిభ నిరుపయోగంగా మారిపోతుంది. ఏ సమయంలో అది అందించాలో తెలియనపుడు అతడు ఎంత నాణ్యమైన వస్తువు తయారుచేసినా నిరుపయోగంగా మారిపోతుంది. వీటన్నిటికీ కూడా సమయమే ముఖ్యం. ఈ సమయ పరిపాలన అనే మంత్రం మాత్రమే వారి ఆలోచనలను, లక్ష్యాలను, దీర్ఘకాలిక ప్రణాళికలను నెరవేర్చగలుగుతుంది. సమయం ఎంతో విలువైనది. ప్రతి క్షణం ఎంతో అమూల్యమైనది. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోగలిగిన వారే పనులను విజయవంతంగా నెరవేర్చుకోగలుగుతారు. ఆ సమయం విలువను గుర్తించి దాన్ని అనుసరించగలిగితే ఆ వ్యక్తి ఉన్నత స్థితికి చేరుకోవటానికి మార్గం సులభమైనట్లే. – రామలక్ష్మీ సదానందమ్ -
చీరకట్టులో స్నోబోర్డింగ్ స్టంట్..!
స్కేటింగ్, స్నోబోర్డింగ్ వంటివి చీరతో సాధ్యమయ్యేవి కావు. అందులోనూ మంచు పర్వతాల్లో రెయ్రెయ్ మని వెళ్లాలంటే శారీతో సాధ్యమైన పనికాదు. కానీ ఇద్దరు మహిళలు చీరతో చాలా ఈజీగా చెయ్యొచ్చని చూపించి అందర్నీ షేక్ చేశారు. భారతీయతను ఉట్టిపడేలా చేసే చీరకట్టుతో చేసిన స్నోబోర్డింగ్ అందర్నీ కట్టిపడేసింది. ఆరుగజాల చీరలో ఊర్మిలా పేబుల్, లిండా ష్మిటర్ అనే ఇద్దరు మహిళలు మంచు పర్వతాల్లో చాలా చక్కగా స్కోబోర్డింగ్ చేసి నోటమాట రాకుండా చేశారు. ప్రొఫెషనల్ అథ్లెట్లు అయినా ఈ ఇద్దరూ చీరకట్టుతో స్నోబోర్డింగ్ చేసే థ్రిల్ కోసం చేసినా..అందర్నీ ఆలోచించేలా చేసింది. భారతీయురాలైన ఊర్మిలా పేబుల్, తన స్విస్ స్నేహితురాలితో కాశ్మీర్లోని గుల్మార్గ్లో మంచుకొండలపై ఈ స్టంట్ చేశారు. అందుకు సంబంధించిన కమనీయ దృశ్యాల్ని స్వీడిష్లో జన్మించిన అడ్వెంచర్ ఫిల్మ్ మేకర్, డ్రోన్ పైలట్ అయిన హెరాల్డ్ ఎడ్లండ్ కెమెరాలో బంధించారు. ఊర్మిళ, లిండా మాదిరిగానే, అతను పారాగ్లైడింగ్, స్పీడ్ఫ్లైయింగ్ వంటి అనేక హై-ఇంటెన్సిటీ అడ్వెంచర్ క్రీడలపై ఆసక్తితోపాటు, పర్వత ప్రకృతి దృశ్యాలను కెమెరాలో బంధించడంలో నిపుణుడు. అయితే ఆ దృశ్యాలకు "శారీ నాట్ సారీ" అనే క్యాప్షన్ జోడించి మరి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది ఊర్మిలా పేబుల్. ఇదిలా ఉండగా, ఊర్మిలా 19 ఏళ్ల ఉత్సాహభరితమైన ప్రొఫెషనల్ స్కేట్బోర్డర్. ఐదేళ్ల వయసులో రోలర్ స్కేటింగ్ నేర్చుకుంది. అలా ఆమెకు స్కేట్ బోర్డింగ్ పట్ల మక్కువ పెరిగింది. ఇక లిండా ష్మిటర్ స్విట్జర్లాండ్, హిమాలయాలు, వంటి దిగ్గజ ప్రదేశాలలో సాహసోపేతమైన కంటెంట్కు ప్రసిద్ధి చెందింది. అలాగే ఆమెకు బర్టన్, మమ్ముట్ వంటి ప్రధాన బహిరంగ స్నోబోర్డింగ్ బ్రాండ్ల నుంచి అనేక స్పాన్సర్షిప్లు కూడా వచ్చాయి. View this post on Instagram A post shared by Urmila P. (@ursk8kid) (చదవండి: ఫ్లైట్ వాష్రూమ్ని జిమ్గా మార్చేశాడుగా..!) -
ఎవరీ నమ్రత స్టాన్లీ..? ఏకంగా వైన్ బ్రాండ్ని..
మహిళా సాధికారత, మహిళా చైతన్యం అని ఏవేవో చెబుతుంటారు గానీ ఇంకా వివక్ష తగ్గలేదనే గణాంకాలు చెబుతున్నాయి. అందుకు నిదర్శనంగా సమాజంలో జరుగుతున్న కొన్ని ఉదంతాలే ఉదాహరణ. వాటిని చూస్తే..ఇంకా ఏ కాలంలో ఉన్నామనే ఫీల్ కలుగుతుంది. మహిళలు పురుషులతో సమానమని పైపై మాటలుగా చెబుతుంటారే గానీ వాస్తవికంగా అది పూర్తి స్థాయిలో జరగదు. అయినప్పటికీ కొందరు ధీర వనితాలు.. ఆ మాటను అక్షరాల నిజం చేసి..అందర్నీ ఆశ్చర్యపరిచేలా సక్సెస్ని అందుకుంటున్నారు. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా వివక్ష, గృహహింసను ఎదుర్కొంటూనే అంచలంచెలుగా ఎదిగిన ఈ నారీమణి గురించి తెలుసుకుందామా. పైగా పురుషాధిక్య వ్యాపారమైన వైన్ బిజినెస్లో రాణిస్తున్న ఏకైక మహిళగా పేరు కూడా తెచ్చుకుందామె. ఇంతకీ ఎవరామె అంటే..ఆ శక్తిమంతమైన మహిళే 45 ఏళ్ల నమ్రత స్టాన్లీ. బెంగళూరు చెందిన నమ్రత కుటుంబంలో కూడా ఆడపిల్లకు ఉద్యోగం ఎందుకు అనే భావజాలం ఎక్కువగా ఉండేది. అంతగా ఆడపిల్లలకు ప్రాధాన్యతలోని తన కుటుంబంలో తండ్రి తీరు అస్సలు నచ్చేది కాదు నమ్రతకు. ఆమె తల్లి గృహిణిగి ఇంటి బాధ్యతలు చూసుకోవాలి. ఆయన ఇంటి నిర్ణయాలన్నింటిని తీసుకునేవారు. మా అమ్మకు ప్రతిభ ఉన్న ఇంటి గోడలకే పరిమితం చేశారాయన. ఇక నమ్రత ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో హాస్పిటాలిటీ చదివింది, అలాగే పాటిస్సేరీ(డెజర్ట్స్ తయారీ) నైపుణ్యం ఉందామెకు. 2024లో సరిగ్గా పెళ్లైంది. ఇక అక్కడ కూడా ఆడపిల్లలకు జాబ్ అనవసరం అనే అభిప్రాయమే బలంగా ఉండేది. అంతేగాదు ఆమె అత్తారింటిలో చీరకట్టుకుంటే గానీ బయటకు రాకూడదు, కనీసం స్నేహితులను కలవకూడదు, బేకరీ లాంటి వ్యాపారం వంటివి ఏమి చేయకూడదు. ఇంతలో 2007లో తనకు పాప జన్మించడంతో గృహహింస, ఛీత్కారాలు మొదలయ్యాయి. ఇవన్ని కూడా ఆమెను ఆపలేకపోయాయి. వీటన్నింటిని తట్టుకుంటూనే బెంగళూరులోని అలయన్స్ ఫ్రాంకైస్ స్థానిక కేంద్రానికి సమీపంలో నివసిస్తున్న ఆమె రహస్యంగా ఫ్రెంచ్ తరగతుల్లో చేరింది. మార్కెట్కి వెళ్తున్నా అని ఫ్రెంచ్ క్లాస్లకు వెళ్లేది. రాత్రిపూట కూతుర్ని పడుకోబెట్టి హెడ్ఫోన్లలో చదువుకునేది. ఇక తన కుటుంబానికి తానెంటో చూపాలనే ఉద్యేశ్యంతో 2013లో రెజ్యూమ్ని ఒక జాబ్సైట్లో అప్లోడ్ చేసింది. అయితే స్టాన్లీ స్కిల్స్కి ఫిదా అయ్యి ఒక ఫ్రెంచ్ ఐటీ సంస్థ ఆమెను పారిస్లో నియమించుకుని శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. తన పాపను అమ్మ చూసుకుంటుందని ఒప్పించి, భర్త అనుమతితో వెళ్లింది. అది కూడా ఒక నెలపాటు ట్రైనింగ్కి మాత్రమే పంపించారు స్టాన్లీని. అయితే స్టాన్లీ అక్కడ విజయవంతంగా ట్రైనింగ్ని పూర్తిచేసుకుని కుమార్తె కోసం ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఫ్రెంచ్కి వెళ్లినప్పుడు సరదాగా భుజం మీద వేయించుకున్న టాటు కారణంగా భర్త ఆగ్రహానికి గురైంది. ఆ తర్వాత బెంగళూరులో జాబ్లు అన్వేషిస్తున్న ఆమెను వారించే ప్రయత్రం చేయడమే గాక, ఆమె పాస్పోర్ట్ని మాయం చేయడం, అర్థరాత్రి సమయంలో ఇంటి నుంచి బయటకు పంపించేయడం వంటి టార్చర్ ఎక్కువైంది. దాంతో ఆ గృహహింస నుంచి బయటపడి 2017లో తల్లి మద్దతుతో ఫ్రాన్స్ బోర్డియక్స్లో వైన్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ MBA ప్రోగ్రామ్లో చేరింది. చెప్పాలంటే ఆ క్లాస్లో అందరికంటే పెద్దది స్టాన్లీనే..అయినా సరే..లక్ష్యంపైనే ఫోకస్ పెట్టేది స్టాన్లీ. వైన్ తయారీ ప్రక్రియకు సంబంధించి.. ద్రాక్షపండను పండించడం నుంచి వైన్గా మారే వరకు ప్రతిదాని గురించి క్షుణ్ణంగా తెలుసుకుంది. అదీగాక బోర్డియక్స్లోని కఠినమైన చట్టాలు నీటిపారుదలను నిషేధిస్తాయి, దాంతో ద్రాక్ష పాదులను పండించడం చాలా సవాలుగా ఉండేది. అదే తనకు స్ట్రాంగ్గా పోరాడుతూ నిలబడటం ఎలాగో నేర్పిందని అంటోంది స్టాన్లీ. అలాగే ఈ వైన్ తయారీలో ప్రతి దశ చాలా కచ్చితత్వం అవసరమని అంటోంది. ఆ తర్వాత వైన్ వ్యాపారం చేయాలని నిర్ణయించుకుని..వైన్ తయారీ కేంద్రాల నుంచి నేరుగా సోర్సింగ్ చూస్తూ..కంపెనీని బోర్డియక్స్లో నమోదు చేయించుకుంది. క్రమేణ తన సొంత బ్రాండ్ 'సోలికాంటస్' పేరుతో వైన్ని విక్రయించే రేంజ్కు చేరింది. ఇక్కడ సోలి అంటే నేల, కాంటస్ అంటే లాటిన్లో శ్రావ్యత. పురుషాధిక్యత ఎక్కువగా ఉండే ఈ వైన్ వ్యాపార సామ్రాజ్యంలో శక్తిమంతమైన వ్యాపారవేత్తగా సాగుతూ..మహిళలు ఎందులోనైనా రాణించగలరు అని చాటి చెబుతోంది. అంతేగాదు స్టాన్లీ వైన్ నాణ్యత, రుచిని నిర్ణయించేది కూడా ఆమెనే కావడం విశేషం. (చదవండి: ఇడ్లీలు అమ్ముతూ.. రిసెర్చ్ స్కాలర్ విజయ గాథ) -
Women's Day: ఇడ్లీలు అమ్ముతూ.. రిసెర్చ్ స్కాలర్ విజయ గాథ
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ఈ సందర్భంగా స్ఫూర్తిదాయక మహిళలను గుర్తుచేసుకోవడం మన కర్తవ్యం. కేరళకు చెందిన రేవతి విజయన్ ఓ వైపు ఉన్నత చదువుల కోసం ‘పరిశోధన’ సాగిస్తూ, మరోవైపు కుటుంబాన్ని ఆదుకునేందుకు అర్ధరాత్రి వరకు ఇడ్లీల వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఒట్టపాలం మయన్నూర్ వంతెన సమీపంలో రాత్రిపూట రోడ్డు పక్కన ఆమె నడుపుతున్న చిన్నపాటి ఇడ్లీ స్టాల్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది.త్రిస్సూర్ జిల్లా పజయన్నూర్ నివాసి అయిన 30 ఏళ్ల రేవతికి చిన్నప్పటి నుంచి చదువంటే ఎంతో మక్కువ. తండ్రి విజయన్ టైలర్ కాగా, తల్లి ప్రియ పాఠశాలలో వంట మనిషిగా పని చేస్తున్నారు. త్రిస్సూర్లోని విమల కళాశాలలో మలయాళంలో డిగ్రీ, అనంతరం ఒట్టపాలం ఎన్ఎస్ఎస్ కళాశాలలో రేవతి బీఈడీ పూర్తి చేశారు. తన చదువు ఖర్చుల కోసం కుటుంబంపై భారం పడకూడదనే ఉద్దేశంతో రేవతి ట్యూషన్లు చెబుతూ, ఆర్థిక స్వాలంబన సాధించారు.వివాహం, ఇద్దరు పిల్లల బాధ్యతల మధ్య తన విద్యాభ్యాసం ఆగిపోతుందేమోనని రేవతి ఆందోళన చెందారు. అయితే తిరిగి పుస్తకం చేత పట్టి, పీజీ పూర్తి చేయడమే కాకుండా, గోల్డ్ మెడలిస్ట్గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. మొదటి ప్రయత్నంలోనే ‘నెట్’ (NET) అర్హత సాధించారు. అనంతరం రేవతికి పీహెచ్డీ చేసే అవకాశం లభించింది. అయితే ఇందుకోసం ప్రతిరోజూ పజయన్నూర్ నుంచి త్రిస్సూర్ వరకు ప్రయాణించడం ఆర్థికంగా భారమైంది. దీంతో రాత్రిపూట ఏదైనా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్న రేవతి మయన్నూర్ వంతెన వద్ద ‘ఫ్రెష్ మూన్’ పేరుతో ఇడ్లీ స్టాల్ ప్రారంభించారు.కేవలం సాధారణ ఇడ్లీలే కాకుండా.. తట్టు ఇడ్లీ, మసాలా ఇడ్లీ, ఎగ్ ఇడ్లీ, మటన్ ఇడ్లీ, చికెన్ ఇడ్లీ, పొడి ఇడ్లీ వంటి దాదాపు 10 రకాల వైవిధ్యమైన రుచులతో వినియోగదారుల మనసు గెలుచుకుంటున్నారు. రేవతి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కళాశాలలో పరిశోధన పనుల్లో నిమగ్నమై, సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12:30 గంటల వరకు స్టాల్ దగ్గర కష్టపడుతుంటారు. ఈ ప్రయాణంలో ఆమె భర్త అనూప్, సోదరి గౌరీ నంద ఆమెకు సాయంగా నిలుస్తున్నారు. ఇది కూడా చదవండి: రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఎగబడిన జనం -
ఈ వారం కథ: పుత్ర కామేష్టి
‘‘శేఖర్ గారూ! మీ ఆవిడకు ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ సర్జరీ చాలా బాగా జరిగిందండీ! ఐవీఎఫ్ ప్రాసెస్లోని ప్రధానాంకం ముగిసింది. సక్సెస్ అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. తనను ఓ ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్లో అబ్జర్వేషన్లో ఉంచి, ఇంటికి పంపిస్తాము. ఇచ్చిన మెడిసిన్స్ జాగ్రత్తగా వాడుకుంటూ, పదిహేను రోజుల తరువాత బ్లడ్ టెస్ట్కి రావాల్సి ఉంటుంది. ఓకేనా?’’ చెపుతున్న డాక్టర్ మాటలను శ్రద్ధగా ఆలకిస్తూ, సరేనన్నట్లు తలాడించి, ‘‘థాంక్స్ డాక్టర్గారూ..!’’ అన్నాను.‘‘ఇంకా రెండుసార్లు వాడుకునేందుకు మీ ఎంబ్రియోస్ ఉన్నప్పటికీ మీకా అవసరం రాకపోవచ్చు లెండి. ఆల్ ది బెస్ట్! ఆమెను జాగ్రత్తగా చూసుకోండి!...’’ అంటూ ముందుకు కదిలింది డాక్టర్.‘ఇప్పుడు సక్సెస్ అయితే అయినట్లు. లేదంటే, నేరుగా ఎడాప్షన్ కు వెళ్ళిపోవడమే. గత నాలుగైదేళ్ళ నుంచి పడినపాట్లు చాలు. ఇంకా శ్రావ్యను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు...’ అనుకుంటూ, మగతగా పడుకున్న తనను కదిలించకుండా, బ్రేక్ఫాస్ట్ చేసి వద్దామని బయటకు నడిచాను. అలవాటుగా సుబ్బన్న బడ్డీ హోటల్ దాపుకు చేరుకున్నాయి నా కాళ్ళు. అక్కడి అనూహ్య దృశ్యాన్ని చూసి, నా చిన్నకళ్ళు పెద్దవయ్యాయి. ఆకలిని రెట్టింపు చేసే దోసెలను, అలసటను ఆవిరి జేసే ఇడ్లీలను, నోరును ఊట బావిగా మార్చేసే పూరీలను కొసరి కొసరి వడ్డిస్తూ, ఆ పదార్థాలంత కమ్మగా పలకరిస్తూ, పైరగాలి వీచినంత ఒడుపుగా పొట్లాలు కడుతూ నిత్యం పారే ఏరల్లే కనిపించే సుబ్బన్న– సముద్రుడిలా గంభీరంగా వంట సామాగ్రినంతా గోతాలకు సర్దేస్తున్నాడెందుకో!రాములవారి వెంట సీతమ్మలా, ఆదిశివుడిలో సగమైన గౌరమ్మలా సుబ్బన్న చేతి ఒడుపుకనుగుణంగా సైనికురాలిలా వెంట ఉంటూ, ముప్పొద్దులా వండి అందించే అతని ఇల్లాలేది, ఎక్కడా కనబడదే...!? తినడానికి వచ్చిన జనాలు పిలుస్తున్నా వినబడనట్లు అలా మిన్నకున్నాడేంటి ఈ సుబ్బన్న. ఏం జరిగుంటుంది? తెలుసుకోమని మనసు రొద పెడుతుంటే, అతనికి దగ్గరగా వెళ్ళి నిలబడి, ‘‘ఏంటి సుబ్బన్నగారూ.. ఏమయింది..?’’ అన్నాను. అతనేం మాట్లాడకపోయే సరికి మళ్లీ రెట్టించాను. తలెత్తకుండానే, ‘‘ఈ ఊరొదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం సార్..!’’ అన్నాడు. ‘‘అరెరే... ఏమయింది?...’’ అని మొదలెట్టి, కొనసాగింపుగా ఓ పది ప్రశ్నలు వేశాను. దేనికీ జవాబు చెప్పలేదు కానీ, ‘‘ఇప్పుడేమీ అడగొద్దు సార్..!’’ అంటున్నప్పుడు అతని గొంతులో జీర నా చెవులను దాటిపోలేదు. ఏదో తీరని వేదనలో ఉన్నట్లున్నాడు. ముఖం కూడా చూపించలేక పోతున్నాడు. ఇంకా అక్కడే ఉండి, అతన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకనిపించి, వేరేచోటకు వెళ్ళి తినేసి, శ్రావ్యకు పార్సిల్ కట్టించుకుని హాస్పిటల్కు చేరుకున్నాను.తనను ఎక్కువగా మాట్లాడించడమంత మంచిది కాదనిపించి, తన పనులన్నీ చూచి, పక్క బెడ్పై కూర్చున్నాను. తలపుల గూడులోకి సుబ్బన్న ప్రవేశించాడు. దాదాపు ఐదేళ్ళక్రితం.., ఈ హాస్పిటల్కు వచ్చిన మొదటిరోజు ఓపీ వ్రాయించి, ఏదైనా తిందామని మేమిద్దరమూ బయలుదేరాము. అక్కడికి దగ్గరలో ఓ ప్రభుత్వ భవనపు ప్రహరీగోడ మూల మీద నాలుగు రేకులు వేసి, వాటికింద నాలుగు అరుగులు కట్టి ఉన్నాయి. సుబ్బన్న దంపతులు వండి, అందిస్తుంటే... జనాలు కూర్చుని తింటున్నారు.‘‘ఇక్కడ తినేసి వెళదామా..?’’ అంది శ్రావ్య. ‘‘ఆ అరుగుల వెనక చూడు... అంతా బురద... పైగా పందులు, కుక్కలు పొర్లుతున్నాయి ఛండాలంగా... ఇక్కడెలా తింటాము?’’ అన్నాను. ‘‘ఒక్కసారి తిని చూడండి... వదిలిపెట్టరు...’’ అక్కడ తిని వెళుతున్న ఒక వ్యక్తి అన్నాడు. ఇక చేసేదిలేక, అప్పటికంత కన్నా దూరం వెళ్ళలేక అక్కడే తినడానికి కూర్చున్నాము. మా ఇంట్లో చేసుకున్నంత రుచిగా, శుచిగా అనిపించాయి దోసె, ఇడ్లీ... ధర కూడా చాలా సాధారణంగా అనిపించింది. డబ్బులు ఇచ్చేటప్పుడు మంచీ చెడ్డా మాట్లాడుతూ, అతని వివరాలు కనుక్కొని, ‘‘ఆ వెనక పందులవీ తిరగకుండా శుభ్రం చేయించకూడదా సుబ్బన్నగారూ?’’ అన్నాను నవ్వుతూ.‘‘చేయిద్దామనే అనుకుంటున్నాను సార్... ఏ నెలకానెల మా అబ్బాయి ఫీజులకనీ, పుస్తకాలకనీ వచ్చిన డబ్బు కాస్తా అయిపోతా ఉంది. వచ్చే నెల సెలవులు వస్తున్నాయిగా, కాస్తన్నా మిగుల్చుకుని గోడ పెట్టిచ్చేస్తా’’ అన్నాడతను. ‘‘ఏం చదువుతున్నాడు మీ అబ్బాయి..? ఎందరు పిల్లలు మీకు?’’ అడిగాను. ‘‘ఒక్కడే అబ్బాయండి... ఆరోక్లాసయి పోయి, ఏడుకొస్తాడింక... మామూలు గవర్నమెంటు బడికి పంపుదామంటే, ఈ మనిషి వినకుండా పెద్దపెద్దోళ్ళ పిల్లలు చదివే బడిలో చేర్చాడు. ఆ ఖర్చులు పెరుగుతూనే వున్నాయి. తట్టుకోలేక పోతున్నాము’’ అంటున్న భార్యను వారించి, ‘‘మనం ముప్పొద్దులా తిప్పలు పడేదెందుకు... వాడికోసం కాదూ..?’’ అన్నాడు. ‘‘ఏంటో ఈ మనిషి పిచ్చి... ఆ కొడుకే లోకం. వాడిమీద ఈగ వాలనివ్వడు కదా..! పాతికేళ్ళ నుంచి చేయి కాల్చుకుంటున్నా గాని, తలదాచుకునేందుకు చిన్నపాక గూడా వేసుకోలేకపోయాము’’ అందామె.వాళ్ళిద్దరికీ నలభై ఏళ్ళపైనే ఉంటుంది వయస్సు. అతనేమో ఇనుపకడ్డీలాగ నల్లగా, పొడవుగా ఉన్నాడు. ఆమేమో, బంగారపు ముద్దలాగా తెల్లగా, బొద్దుగా ఉంది. ఇద్దరికీ కొడుకంటే పంచప్రాణాలు కాబోలు. అయినా పిల్లలు పుడితే అంతేనేమో! వాళ్ళకోసం సర్వ సుఖాలను ఒడ్డి, పోరాటం చేయాలనిపిస్తుందేమో..! త్వరగా మేము కూడా తల్లిదండ్రులమైతే ఎంత బాగుంటుంది..!? ఇద్దరం మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వచ్చేశాము. ఓ రెండునెలల తరువాత, మళ్ళీ హాస్పిటల్కు వెళ్ళినపుడు, సుబ్బన్న హోటల్కే వెళ్ళాము తినడానికి. ఆ వెనుక వైపంతా చదును చేయించి, నాపరాళ్ళు పరిపించి ఓ పరదా కట్టాడు. ‘‘ఇప్పుడు చాలా శుభ్రంగా ఉంది సుబ్బన్నగారూ..!’’ అన్నాను దోసె తింటూ. ‘‘గోడ పెడదామంటే, డబ్బులు చాల్లేదు సార్!’’ నొచ్చుకుంటున్నట్లు అన్నాడు. ‘‘పోన్లెండి, ఆ పందులవీ లేకుండా ప్రశాంతంగా ఉంది..’’ అన్నాను.‘‘అవి మురికి జీవాలు సార్... మిగిలిపోయినవి, మురిగిపోయినవి అక్కడ పారబోస్తే తిని, ఆ బురదలోనే పొర్లుతుండేవి. ఈ బండలు పరిచిన తరువాత, మేమేది పడేసినా తినడానికి కూడా రావట్లేదు. ఏ మురుగులో బతుకీడుస్తున్నాయో పాపం..!’’ అన్నాడు జాలిగా ముఖంపెట్టి. ‘‘పోన్లెండి... అవి పంకిల ప్రేమికులు కదా, నచ్చిన గూటికి చేరుంటాయి’’ అన్నాను అతన్ని నవ్విద్దామని. ‘‘డాడీ... అర్జెంట్గా ఓ తౌజెండ్ రూపీస్ కావాలి... రేపు మా స్కూల్ పిల్లలమంతా ఎక్స్కర్షన్కు వెళుతున్నాం’’ అంటూ సుబ్బన్న చెంతకు చేరుకున్నాడొక పిల్లవాడు. పదకొండేళ్ళు ఉంటాయేమో, చాలా తెల్లగా, బొద్దుగా ఉండి... భలే ముద్దొస్తున్నాడు. ‘‘మీ బాబు, వాళ్ళమ్మ పోలికట్లుందండి... చాలా బాగున్నాడు’’ అన్నాను. అతను గుంభనంగా నవ్వుకుంటూ, కొడుకుకు డబ్బులిచ్చి, జాగ్రత్తలు చెప్పి పంపించాక, ‘‘మీకు కూడా మా మనీష్ లాంటి మంచి బాబు పుడతాడు లెండి సార్!’’ అన్నాడు చిరునవ్వుతో.‘‘థాంక్సండి!’’ అంటూ డబ్బిచ్చి వచ్చేశాము. అలా డాక్టర్ రమ్మన్నప్పుడల్లా హాస్పిటల్కు, అటునుండి సుబ్బన్న హోటల్కు ఐదేళ్ళుగా తిరుగుతున్నా గాని, శ్రావ్య కడుపు పండలేదు, అమ్మానాన్నలు కావాలనే మా కాంక్ష తీరలేదు. కాని, సుబ్బన్నతో, అతని కుటుంబంతో మంచి స్నేహం ఏర్పడింది. ఈ ఊరు వచ్చినప్పుడల్లా అక్కడే తినడం, అతనితో పిచ్చాపాటీ మాట్లాడడం పరిపాటైపోయింది. జ్ఞాపకాల నుంచి బయటికొచ్చిన నాకు, ‘ఇప్పుడింత అర్ధాంతరంగా, మంచి ఆదాయాన్నిస్తున్న హోటల్ని ఎందుకు తీసేసుకుంటున్నట్లు? పుట్టి పెరిగిన ఊరునెందుకు వదిలి వెళుతున్నట్లు? ఏం కష్టమొచ్చిందో పాపం..! ఎలా అతని బాధ తెలుసుకోవడం..’ అనుకుంటూ లేచి కూర్చున్నాను. ‘‘శేఖర్..!’’ మెల్లిగా శ్రావ్య పిలుపు వినబడడంతో,తనకు చేరువగా వెళ్ళి, ‘‘ఏంటి శ్రావ్యా..!’’ అన్నాను. ‘‘ఈ పదిహేను రోజులు ఈ ఊళ్ళోనే ఉండనా... అదే మా వాణీ వాళ్ళింట్లో ఉండనా నేను? తననడిగితే, సంతోషంగా రమ్మంది. ఈ పరిస్థితిలో దూర ప్రయాణం అంత మంచిది కాదేమో కదా..!’’ ఆశగా అడిగింది. వాణి శ్రావ్య పెద్దమ్మ కూతురు. తనమాట తోసివేయలేక సరేనన్నాను. తరువాతి రోజు హాస్పిటల్ నుంచి వాణీ వాళ్ళింటికి చేరుకున్నాము. ప్రతిరోజూ బోలెడు మాత్రలు మింగడంతో పాటు, బొడ్డుకు ఇంజక్షన్లు కూడా చేయించవలసి రావడంతో, ఓ నర్సును మాట్లాడి, మిగతా ఏర్పాట్లన్నీ చూసి, వ్యాపార పనుల నిమిత్తమై నేను మా ఊరు వచ్చేశాను. కాల్ చేసినప్పుడల్లా, కన్సీవ్ అవుతుందో, లేదోనని ఆందోళన పడుతున్న శ్రావ్యకు ఒక దారి మూసుకు పోయినప్పుడు మరిన్ని దారులు తెరచుకుంటాయని, ఇది కాకపోతే దత్తతావకాశం ఉండనే ఉన్నదని, పాజిటివ్గా ఉండమని చెప్పి ధైర్యాన్ని అందించాను.పదిహేనవ రోజు శ్రావ్య రక్తం తీసుకుని, హాస్పిటల్ ల్యాబ్లో ఇస్తే, సాయంత్రం ఐదుగంటలకు రమ్మన్నారు వాళ్ళు. ఎంత వద్దనుకున్నా, గుండెలో అలల్లా అలజడి. ఓ క్షణం పాజిటివ్ తీరానికి చేరుకుంటుంది.. మరుక్షణమే నెగెటివ్ అగాధానికి తీసుకెళుతుంది. ఇలాంటి అనిశ్చితమైన మనసుతో శ్రావ్య ఎదుట ఎందుకు లెమ్మని, లేని పని కలిగించుకుని... ఊళ్ళో బలాదూరు తిరుగుడు మొదలెట్టాను. అలవాటుగా సుబ్బన్న హోటల్ వైపుకు మళ్ళాయి కాళ్ళు. సుబ్బన్న స్థానంలో మరొకతను కనిపించాడు. పరదా బదులు గోడ, అరుగుల స్థానే ప్లాస్టిక్ కుర్చీలు కనిపించాయి. ‘లోపలికెళ్ళి, సుబ్బన్న వివరాలు అడిగితేనో..’ మెదడు తలపును, తడబాటునున్న మనసు తోసిపుచ్చేసింది. కళ్ళు ఆ వైపుకే చూస్తున్నా, కాళ్ళు మాత్రం ముందుకు కదిలాయి. అలా మూడు, నాలుగు వీధులు నడుచుకుంటూ వెళ్ళాక... రోడ్డు దాటబోతుంటే, చాట్ మసాలా, పానీపూరితో కూడిన తోపుడుబండి ఎదురొచ్చింది.దాన్ని తప్పించుకునే క్రమంలో అప్రయత్నంగా బండిని తోసే వ్యక్తిని చూసి నిర్ఘాంతపోయి, నిలబడిపోయాను. నేను తేరుకుని, అతన్ని పిలిచేటప్పటికల్లా.., గబగబా బండిని తోసుకుంటూ వీధి మలుపు తిరిగేశాడు. వెంబడిద్దామనుకున్నాను కాని, తను ఉద్దేశపూర్వకంగా వెళ్ళినపుడు ఎందుకు లెమ్మని వాచ్ చూసుకుని హాస్పిటల్ వైపుకు మళ్ళాను. వెళ్ళేదారిలో యథాలాపంగా హోటల్ వైపుకు మళ్ళాయి నా కళ్ళు. ‘‘రండి సార్... వేడివేడి బజ్జీలు తిందురు గానీ..!’’ అన్నాడా కొత్త యజమాని. విషయం తెలుసుకోవాలనే ఉత్కంఠకు ఆ పిలుపును జోడించి కాళ్ళను హోటల్లోకి మళ్ళించాను. ‘‘సుబ్బన్న ఉన్నప్పుడు మీరు తరచు వస్తుండేవారు కదా సార్..! నేను చాలాసార్లు చూశాను’’ బజ్జీలు అందిస్తూ అన్నాడతడు. తీగ లాగడానికి మార్గం సుగమమయిందని తృప్తిపడుతూ, ‘‘అవును వచ్చేవాణ్ణి. సుబ్బన్నకు ఏమైందసలు..? వాళ్ళబ్బాయి పానీపూరి బండి దగ్గరున్నాడేంటీ..!?’’ అడిగేశాను.అతను ఓ నిట్టూర్పు విడిచి, ‘‘ఏముంది సార్, ఆయనది చల్లటి గుండె కదా... రగిలిన మమతల మంటల్లో మండిపోయింది’’ అన్నాడు.‘‘మమతలేంటీ.. మండటమేంటి..? అర్థమయ్యేట్లు చెప్పవయ్యా..!’’ అన్నాను. ‘‘పదహారేళ్ళు ప్రాణప్రదంగా పెంచుకున్న కొడుకు... ఆ తల్లిదండ్రుల మనసుల్లో మంటలు రాజేసి వెళ్ళిపోయాడు సార్!’’ మరుగుతున్న నూనెలో వడల పిండి వేస్తూ చెపుతున్నాడతడు.‘‘పదహారేళ్ళ పసివాడు ఎక్కడికి వెళతాడు..? తల్లిదండ్రులను వదిలి ఎలా బతుకుతాడు..?’’ ఆవేశంగా అన్నాను.‘సుబ్బన్న దంపతులకు పెళ్ళయ్యాక పదిహేనేళ్ళు గడచినా బిడ్డలు కలగకపోతే, ఏడుగురు పిల్లలను సాకలేక తిప్పలు పడుతున్న వడ్డెర దంపతులతో మాట్లాడి, వాళ్ళకు కొంత పైకమిచ్చి, రెండు నెలల పసిగుడ్డయిన మనీషుని దత్తత తెచ్చుకున్నారంట! వాడు వీళ్ళ నీడన పెరుగుతూ.. చెడు స్నేహాలు పెంచుకుని, దురలవాట్లు నేర్చుకున్నాడు. అది తెలుసుకుని, సుబ్బన్న మందలిస్తుండేసరికి.., స్నేహితులు, చుట్టాల ద్వారా అసలు తల్లిదండ్రుల గురించి తెలుసుకుని వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోయాడు. ఆ కుటుంబంలో తండ్రీ, తోబుట్టువులంతా తాగుడికి బానిసలయ్యారని, ఇల్లు గడిచే పరిస్థితి లేదని మనీష్ కన్నతల్లి వీడిని చదువు మానిపించేసి, పనిలో పెట్టిందట. ‘అదేమిట్రా..’ అని అడిగితే, ‘నన్ను కన్నోళ్ళు, నాకు తోడబుట్టినోళ్ళే నావాళ్ళు, వాళ్ళతోనే బతుకుతాను... బతకలేక పోతే చస్తాను..’ అని తెగేసి చెప్పాడట!’ సుబ్బన్న దంపతులు తట్టుకోలేక, ఊరొదిలి పెట్టి వెళ్ళిపోయారు. ఇన్నాళ్ళూ సుబ్బన్న దంపతుల కష్టంతో ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్న వాడు, పశువుల పాక వంటి మురికింట్లో పడుకుంటూ, పానీపూరీ అమ్ముకుంటున్నాడు. ‘‘ప్రేమ పెంచుకున్న కొడుకు దూరమవడం, పదిమందిలో పరువు పోవడం జీర్ణించుకోలేక, పెంచిన మమతను వదులుకోలేక ఈ హోటల్ను నాకు అమ్మేసి, వాళ్ళెటో వెళ్ళిపోయారు సార్! ఈ పిల్లవాడికి తెలివిలేకపోయింది సరే.. కనీసం ఏడుగుర్ని కన్న ఆ తల్లికైనా వీళ్ళమీద జాలి లేకపోయింది. ఎవరో తెలియని అనాథను చట్టబద్ధంగా దత్తత తీసుకుని ఉంటే, ఇవాళ సుబ్బన్నకింతటి కడుపుకోత ఉండేది కాదేమో..! ఇట్లా ఎన్నెన్నో అనుకుంటాం గాని, కడుపున పుట్టినోళ్ళతో సాటిరాగలరా సార్, ఈ సాకుడు పిల్లలు..!?’’ అతడింకా ఏదో చెపుతున్నాడు. ఆ గాథ అంతా వినేసరికి, నా మనసంతా మొద్దుబారిపోయింది. ‘నాది అనే భావన ముందు ఇంకేదీ నిలవదా? అమ్మో... బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ ఎలా వస్తుందో..! మమతల విలువ తెలియని ఈ వ్యవస్థలో వేరెవరినైనా దత్తత తీసుకోవడమంటే, మరణంతో సమానమే కదా..! సుబ్బన్న వంటి దుస్థితిని ఎదుర్కోవడం మా వంటి సున్నిత మనస్కులకు సాధ్యమయ్యే పనేనా? ప్రస్తుతం ఫలితమెలా ఉన్నా..మిగిలున్న ఎంబ్రియోలను వాడుకోవడం నయం కదూ..? నేను వెళుతున్న కృత్రిమ పద్ధతే రాళ్ళదారి అనుకుంటే, దత్తత ముళ్ళదారైతే... పిల్లలు కలగని మావంటి వారి పరిస్థితి ఏమిటి? చట్టపరమైన దత్తతకు చెట్టు ఆకులన్ని నిబంధనలు ఉండటం వలనేకదా... సుబ్బన్న దంపతుల వంటివారు అవస్థలకు లోనవుతున్నది? అనేక మార్గాలవెంట పయనించి, పాట్లు పడుతున్నది..! ఇటువంటి పరిస్థితులు ఇలాగే కొనసాగితే, పెంపుడు తల్లిదండ్రులకు సమాజం నుంచి సవాళ్ళు ఎదురైతే, ఏ ఆదరణకూ నోచుకోని అనాథల గతేంకాను..? మమతలు పంచాలనుకునే మనస్సులెలా లభించేను!? మానవత్వపు చిరునామా ఎటుపోయేను..!?’ అనే సందిగ్ధ ఆలోచనలు, సంశయాల ఆందోళనల మధ్య హాస్పిటల్ మెట్లు ఎక్కాను. పెండ్యాల గాయత్రి -
నయనిక రెడ్డి అల్లు శిరీష్ పెళ్లిలో హైలెట్ 'శంకు చక్రం' మెహందీ డిజైన్
ఈసారి సెలబ్రిటీల జంట ట్రెండ్ని సెట్ చేయడం లేదు. వాళ్లే సరికొత్త ట్రెండ్ని సెట్ చేసేలా భారతీయ మూలాలను గౌరవించడం విశేషం. ఈ మార్చి 6న అల్లు శిరీష్ నయనిక రెడ్డీల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో అల్లు శిరీష్ చేతి మెహందీ అందర్నీ అమితంగా ఆకర్షించింది. మన సంస్కృతికో పాతుకపోయిన గోరింటాకు అంతరార్థాన్ని తెలియజెప్పేలా శిరీష్ చేతి మెహిందీ ఉంది. నిజంగానే మన భారతీయ సంప్రదాయంలో వధువరులను లక్ష్మీ నారాయణులుగా భావిస్తారు. నారాయణుడకి తమ ఇంటి ఆడపిల్ల చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతిని అందిస్తున్నాం అన్నట్లుగా కాళ్లు కడిగి మామగారు అల్లుడి చేతిలో పెడతారు. నారాయణ..మా లక్ష్మీకి ఇక నుంచి అన్ని నీవే అని చెబుతారు. ఆ నేపథ్యాన్ని ఇలా శిరీస్ చేతిపై ఉన్న మెహందీ డిజైన్ ద్వారా చెప్పకనేచెప్పారు. ఈ శంకు చక్రాలు ఎక్కువగా వైష్ణవులు తమ భుజాలపై ఛాతీపై ధరిస్తారు. అలాగే ప్రతి వైష్ణవ ఆలయాల్లో ఇవి దర్శనిమిస్తాయి. నిజంగా ఆ వివాహ వేడుకలో నారయణుడిగా శిరీష్..లక్ష్మీదేవిగా నయనికలు అతిథులకు చూడచక్కని జంటలా కనువిందు చేశారు. ఇక్కడ శంఖం అనేది శుభ శుచికానికి, ధనానికి ప్రతీక అయితే..చక్రం మన జీవిత గమనానికి సంకేతం..ఇక మధ్యలో ఉండే తిరునామాలు..అందరిలోనూ ఉండే సర్వాంతర్మామి ఆ నారాయణుడి అని గొంతెత్తి చెప్పేలా చాలామంది వైష్ణవులు ముఖంపై ధరిస్తుంటారు. కాగా ఈ వివాహ వేడుకలో అల్లు శిరీష్ బంగారు రంగులో క్లిష్టమైన ఎంబ్రాయిడీ కలిగి న్న ఆఫ్ వైట్ సిల్క్ షేర్వానీని ఎంచుకోగా, నయనికా రెడ్డి బంగారం వెండి జర్దోజీ వర్క్తో అంకరించబడిన లావెండర్ రంగు పట్టు చీరను ఎంచుకుంది. దానికి అనుబంధంగా రూబీ, వజ్రాల నెక్లెస్లు, స్టేట్మెంట్ చెవిపోగులు, గాజులతో ముగ్ధమనోహరంగా ఉంది. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) (చదవండి: Arjun Saaniya Chandhoks wedding: సారా మీనాకారి నెక్లెస్..! ఇంత స్పెషాల్టీ దాగుందా..?!) -
సారా మీనాకారి నెక్లెస్..! ఇంత స్పెషాల్టీ దాగుందా..?!
సచిన్ టెండూల్కర్ అంజలి దంపతుల కుమారుడు అర్జున్ టెండూల్కర్ల వివాహం గత గురవారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు, క్రికెట్ దిగ్గజాలు, పలువురు ప్రముఖులు, రాజకీయనాయకులు విచ్చేసి వధువరులు ఆశ్వీరదించారు కూడా. అయితే ఈ వేడుకలో అర్జున్ అక్క సారా కుందనపు బొమ్మలా అందరి కళ్లను ఆకర్షించింది. ముఖ్యంగా ఆమె ధరించిన మీనాకారి నెక్లెస్ అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. సునీతా షెఖావత్ కలెక్షన్కి సంబంధించిన ఈ నెక్లెస్ చాలా ప్రత్యేకంగా తయారు చేశారట. ఇందులో హస్తకళ, సంప్రదాయ కుందన్ సెట్ పోల్కీలు, పూల మోటిఫ్లు తరతరాల సంప్రదాయాన్ని గుర్తుచేస్తాయి. ప్రముఖ ఆభరణాల నిపుణురాలు ప్రియంషు గోయెల్ జైపూర్కి చెందిన సునీతా షెఖావత్ తయారు చేసిన ఈ నెక్లెస్ ధర దగ్గర రూ. 40 నుంచి రూ. 60 లక్షలు పైన ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెక్లెస్లో కొలంబియన్ ఎమరాల్డ్లు, సౌత్ సీ ముత్యాలను పొందుపరిచారు. అద్భుతమైన వారసత్వ ఆభరణాలు.. మన దేశ సంస్కృతిని, గత వైభవాన్ని కళ్లముందు కదలాడలే చేసింది ఈ ఆభరణం. అంతేగాదు దీన్ని తయారు చేసేందుకు 360 గంటలు పైనే పట్టిందట. ఈ ఆభరణం ప్రత్యేకతలను వివరిస్తూ నెట్టింట షేర్ చేశారు ప్రియంషు గోయెల్. View this post on Instagram A post shared by Sunita Shekhawat (@sunita_shekhawat_jaipur) (చదవండి: Arjun-Saaniya Chandhok Wedding: అంజలి, సారా ఆ చీరలే ఎందుకు ఎంచుకున్నారంటే..) -
కుటుంబ బాధ్యత.. ఆర్థిక భరోసా!
మూసాపేట: మహిళలు ఆర్థికంగా ఎదిగనప్పుడే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుత తరంలో ఎందరో మహిళలు చిన్న ఉద్యోగాల నుంచి రైలు, విమానాలు నడిపిస్తున్నారు. ఉద్యోగాలే కాకుండా వ్యాపార రంగంలోనూ దూసుకుపోతున్నారు. ప్రభుత్వాలు పేద, మద్య తరగతి మహిళలను, చదువురాని మహిళలు కూడా తమ కాళ్లపై నిలబడేవిధంగా ప్రోత్సహిస్తున్నాయి. మూసాపేట పరిసర ప్రాంతాల్లో సమైఖ్య మహిళ గ్రూపులో ఉండి బ్యాంకు లోన్లు తీసుకుని చిన్న, చిన్న వ్యాపారాలు ఎదుగుతూ తోటి వారికి ఆదర్శంగా ఉన్న పలువురి మహిళల గురించి అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. లోన్తో మేకప్ టీచర్గా... మూసాపేటలో నివాసం ఉండే భాగ్యవతి వైష్ణవి దేవి మహిళ గ్రూపులో 10 మంది మహిళల్లో ఆమె ఒక్కరు. మూడు సంవత్సరాల క్రితం గ్రూపునకు బ్యాంక్ లోన్ మంజూరైంది. తన భాగానికి వచ్చిన రూ. 60 వేలతో మేకప్గా శిక్షణ తీసుకుంది. అనంతరం వాటికి మరికొంత డబ్బు జమ చేసి మేకప్ కిట్ కొనుగోలు చేసింది. అనంతరం మూసాపేట భవానీనగర్లో ఉన్న మేకప్ స్టూడియోలో 12 మందికి టీచింగ్ చేస్తుంది. బ్యాచ్కు 12 మందికి టీచింగ్ ఇస్తూ వారిని మేకప్ ఆర్టిస్టులుగా తీర్చిదిద్దుతుంది. అంతేగాక ఈవెంట్లు, పెళ్లిలకు మేకప్లు వేస్తూ నెలకు రూ.50 నుంచి 70వేల వరకు సంపాదిస్తుంది. బ్యాంక్ లోన్ తానేకడుతూ మేకప్లో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లేందేకు కృషి చేస్తుంది. ప్రముఖ సింగర్ గీత మాధురికి కూడా మేకప్ వేసి ఔరా అనిపించింది. గోలీసోడా వ్యాపారంలో.. గోలిసోడా కొడుతూ వ్యాపారంలో రాణిస్తుంది భరత్నగర్కాలనీకి చెందిన ఎస్. సంధ్య. కాలనీలోని కల్వరి మహిళ పొదుపు సంఘంలో పది మందిలో తాను ఒక్కరు. నెలన్నర క్రితం గ్రూపునకు భ్యాంక్ లోన్ రావడంతో తన భాగం రూ.1.80 లక్షలు వచ్చాయి. వాటితో కొన్ని అప్పులు తీర్చుకుని సుమారు రూ.50వేలతో ఆరెంజ్ గోలి సోడా షాపును ఏర్పాటు చేసుకుంది. వేసవికాలంలో గోలిసోడకు ఆదరణ ఉండటంతో వ్యాపారంలోకి అడుగుపెట్టింది. పిల్లలను స్కూల్కు పంపి, భర్తను ఉద్యోగానికి పంపి గోలి సోడా కొడుతుంది. ఉదయం నుంచి రాత్రి వరకు షాపు నడిపిస్తుంది. ఒక్కరి వద్ద ఉద్యోగం చేసే బదులు వ్యాపారం ఎంతో మేలు అని అంటుంది. రాజకీయాల్లో రాణిస్తూ బోటిక్ నడిపిస్తూ.. గృహిణిగా పిల్లలు, భర్త బాధ్యతలు చూసుకుంటూనే రాజకీయాలపై మక్కువతో బీఆర్ఎస్ మహిళ కార్యకర్తగా, సోషల్ మీడియా వారియర్గా రాణిస్తుంది మూసాపేట జనతానగర్కు చెందిన శిరీష. కుట్టు మిషన్స్ ఏర్పాటు చేసుకుని శ్రీహర్ష పేరుతో బోటిక్ నడిపిస్తుంది. భర్త ఇచ్చిన డబ్బులతో పాటు మూసాపేట మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్కుమార్ రూ. 35వేలతో కుట్టు మిషన్ ఇప్పించడంతో షాపును ఏర్పాటు చేసింది. షాపులో ప్రస్తుతం ముగ్గురు పనివారు, నాలుగు కుట్టు మిషన్స్ ఏర్పాటు చేసుకుంది. చీరలు అమ్మడంతో పాటు సంక్రాంతికి గాలి పటాలు, దీపావళికి టపాసులు, రాఖీ పౌర్ణమికి రాఖీలు విక్రయిస్తుంది. -
మీ ఆరోగ్యం మీ చెవుల్లోనే..
‘మీరు నలభై ఏళ్ల మైలురాయిని దాటేశారా? అయితే మీ శరీరం లోపల ఒక నిశ్శబ్ద మార్పు మొదలైందని గుర్తించండి. మనం కేవలం వినడానికి మాత్రమే చెవులను వాడుతామని అనుకుంటాం.. కానీ మనల్ని భూమి మీద నిలబెట్టే అసలైన ‘బ్యాలెన్సింగ్ రిమోట్’ మన లోపలి చెవిలోనే ఉంది. అది ఒక్కసారి రిపేరుకు వస్తే, సోఫాలో నుంచి లేచి నిలబడాలన్నా ప్రపంచమంతా గిర్రున తిరుగుతుంది. ఈ ముప్పు గురించి ఆరోగ్య నిపుణులు ఇస్తున్న హెచ్చరికలు ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.లోపలి చెవిలో ఏం జరుగుతోంది? మన లోపలి చెవిలో 'వెస్టిబ్యులర్ వ్యవస్థ' అనే ఒక అత్యంత సంక్లిష్టమైన నెట్వర్క్ ఉంటుంది. ఇది ఒక జీపీఎస్ (GPS) లాగా పనిచేస్తూ, మనం ఎటు తిరుగుతున్నాం, ఎలా నిలబడాలి అనే సమాచారాన్ని సెకనులో వందో వంతు కాలంలో మెదడుకు పంపిస్తుంది. అయితే, 40 ఏళ్లు దాటాక ఈ వ్యవస్థలోని సూక్ష్మమైన ‘హెయిర్ సెల్స్’ (Hair Cells) చనిపోవడం మొదలవుతాయి. అంటే మీ బాడీ బ్యాలెన్సింగ్ సిస్టమ్ తన పట్టును కోల్పోతోంది. ఫలితంగా నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా పక్కకు వాలిపోవడం లేదా కళ్లు బైర్లు కమ్మడం లాంటివి జరుగుతాయి.నడక కూడా కష్టమే!లోపలి చెవిలో రెండు విభాగాలు ఉంటాయి: ఒకటి శబ్దాలను వినే 'కోక్లియా', రెండోది బ్యాలెన్స్ను చూసే 'వెస్టిబ్యులర్'. విచిత్రమేమిటంటే ఈ రెండింటికీ మెదడుకు చేరే దారి (Nerve) ఒక్కటే.. అందుకే మీ చెవిలో ఏ చిన్న సమస్య వచ్చినా అది కేవలం వినికిడి లోపంతో ఆగదు. వినికిడి తగ్గడంతో పాటు తీవ్రమైన తల తిరగడం (Vertigo), చెవిలో జోరీగ రొద పెట్టినట్లు శబ్దాలు రావడం (Tinnitus) లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనిని నిర్లక్ష్యం చేస్తే, భవిష్యత్తులో శాశ్వతంగా నడవలేని స్థితికి చేరుకునే పరిస్థతి ఏర్పడుతుంది.ఈ మూడు ‘సైలెంట్ కిల్లర్స్’ గురించి తెలుసా?బీపీపీవీ: మీరు పడుకుని అటు ఇటు తిరిగినా లేదా పైనున్న వస్తువు కోసం తల ఎత్తినా సెకన్ల పాటు ప్రపంచమంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇది లోపలి చెవిలోని కాల్షియం కణాలు స్థానభ్రంశం చెందడం వల్ల వస్తుంది.మెనియర్స్ వ్యాధి: చెవిలో నీరు చేరినట్లు ఇబ్బందిగా అనిపించడం. వినికిడి మందగించడం దీని ప్రధాన లక్షణం.వెస్టిబ్యులర్ మైగ్రేన్: విపరీతమైన తలనొప్పితో పాటు కళ్లు తిరగడం. ఇది మీ దైనందిన జీవితాన్ని నరకప్రాయం చేస్తుంది.ఆందోళన కలిగించేలా..శరీర సమతుల్యత కోల్పోవడం అనేది కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు. ఎక్కడ పడిపోతామో అన్న భయం మనిషిని మానసిక రోగిగా మారుస్తుంది. ఒంటరిగా బయటకు వెళ్లడానికి భయపడటం, మెట్లు ఎక్కాలంటే వణుకు రావడం వల్ల చాలామంది సామాజికంగా ఒంటరి అయిపోతారు. ఇది తీవ్రమైన ఆందోళన (Anxiety), కుంగుబాటు (Depression)కు దారితీస్తుంది. ఒకప్పుడు ధైర్యంగా నడిచిన వ్యక్తి, తన ఇంట్లోనే తాను నడవడానికి ఇతరుల సాయం కోరాల్సి రావడం అత్యంత బాధాకరంగా పరిణమిస్తుంది.ఇప్పటికైనా మించిపోయింది లేదు!మీకు తల తిరుగుతున్నట్లు అనిపించినా, వినికిడిలో మార్పు వచ్చినా అది వయసు రీత్యా వచ్చే నీరసం అని భ్రమపడకండి. వెస్టిబ్యులర్ రీహాబిలిటేషన్ వంటి ప్రత్యేక వ్యాయామాలు, ఆహార నియమాల ద్వారా ఈ ముప్పును తప్పించుకోవచ్చు. మీ లోపలి చెవి ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను ఇప్పుడే గుర్తించండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే (చెవుల్లోనే) ఉంది!గమనిక: ఈ సమాచారం కేవలం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే తక్షణం నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించండి.ఇది కూడా చదవండి: Women’s Day: ట్రావెలింగ్ నుంచి హోస్టింగ్ వరకూ.. -
మైండ్ ఫుల్నెస్.. బిజీ షెడ్యూల్లో ప్రశాంతతను వెతుక్కోవడం
నేటి ఆధునిక కార్పొరేట్ ఉద్యోగి జీవితం ఒక నిరంతర పరుగుపందెం. ఉదయం నిద్రలేచిన క్షణం నుండి రాత్రి పడుకునే వరకు టార్గెట్లు, డెడ్లైన్లు, ఈమెయిల్ నోటిఫికేషన్లు, ఫోన్ కాల్స్.. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా పనులు మిమ్మల్ని చుట్టుముడుతుంటాయి. ఈ ఉరుకుల పరుగుల మధ్య మీ మెదడు నిరంతరం భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ లేదా గతం గురించి అసహనంతో ఉంటుంది. మనం ఎక్కడ ఉన్నామో, ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో యంత్రంలా మారిపోతాం. ఇలాంటి సందర్భంలో మైండ్ఫుల్నెస్ (Mindfulness) అనేది ఒక విలాసం కాదు, అది అత్యవసరమైన జీవన నైపుణ్యం.మైండ్ఫుల్నెస్ అంటే కేవలం ధ్యానం కాదు..చాలామంది మైండ్ఫుల్నెస్ అంటే కళ్లు మూసుకొని గంటల తరబడి ధ్యానం చేయడం అనుకుంటారు. అది తప్పు. మైండ్ఫుల్నెస్ అంటే 'ప్రస్తుత క్షణంలో పూర్తిగా నిమగ్నమై ఉండటం'. మీరు కాఫీ తాగుతున్నప్పుడు కేవలంకాఫీ రుచిని, దాని సువాసనను మాత్రమే అనుభవిస్తూ తాగడం. ఆఫీసులో మీటింగ్ జరుగుతున్నప్పుడు, పక్కాగా ఆ మీటింగ్ మీదే దృష్టి పెట్టడం. గతంలోని అపజయాల గురించి గానీ, భవిష్యత్తులోని భయాల గురించి గానీ ఆలోచించకుండా, ఆ క్షణంలో మీరు చేసే పనిని పూర్తిగా ఆస్వాదించడమే మైండ్ఫుల్నెస్.బిజీ షెడ్యూల్లో మైండ్ఫుల్నెస్ను ఎలా పాటించాలి?మీకు గంటల కొద్దీ సమయం లేకపోయినా, పద్ధతిగా ప్రయత్నిస్తే బిజీ షెడ్యూల్లోనే ప్రశాంతతను పొందవచ్చు.మైండ్ఫుల్ బ్రీతింగ్: ఆఫీసులో ప్రతి గంటకు ఒకసారి కేవలం ఒక నిమిషం పాటు పని ఆపేయండి. మీ కళ్లు మూసుకొని, మీ శ్వాస గాలి లోపలికి వెళ్లడం, బయటకు రావడం మీద దృష్టి పెట్టండి. అది మీ నాడీ వ్యవస్థకు ఒక 'రీసెట్ బటన్'లా పనిచేస్తుంది.ఏకకాలంలో ఒకటే పని: మల్టీ-టాస్కింగ్ అనేది మెదడును త్వరగా అలసిపోయేలా చేస్తుంది. ఒకే సమయంలో పది పనులు చేసే ప్రయత్నం చేయడం మానేసి, ప్రస్తుతం చేస్తున్న పని మీద మాత్రమే దృష్టి పెట్టండి. దీనివల్ల మీ ఉత్పాదకత పెరుగుతుంది, మానసిక అలసట తగ్గుతుంది.ఆహారపు అలవాట్లు: లంచ్ బ్రేక్ సమయంలో ఫోన్ చూస్తూ తినడం మానేయండి. మీరు తినే ఆహారం రుచి, రంగు, వాసనను గమనిస్తూ తినండి. ఇది మీ మనసును ఆఫీసు ఒత్తిడి నుండి ఆ క్షణానికి తీసుకువస్తుంది.నడకలో ధ్యానం (Walking Meditation): ఆఫీసు కారిడార్లో నడుస్తున్నప్పుడు లేదా పార్కింగ్ ఏరియాకు వెళ్తున్నప్పుడు, ప్రతి అడుగును గమనిస్తూ నడవండి. మీ పాదాలు నేలను తాకడం, మీ చుట్టూ ఉన్న గాలిని గమనించడం చేయండి. ఇది చాలా శక్తివంతమైన టెక్నిక్.నా దగ్గరికి వచ్చిన ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ప్రవీణ్ (పేరు, వివరాలు మార్చాను) తన బిజీ షెడ్యూల్ వల్ల ప్రతిరోజూ పానిక్ అటాక్స్కు గురయ్యేవాడు. అతను ప్రతి రోజూ కనీసం 50 కాల్స్ అటెండ్ చేసేవాడు. మేము అతనికి '3-సెకన్ల రూల్' నేర్పించాం. ఫోన్ మోగగానే వెంటనే ఎత్తకుండా, 3 సెకన్లు ఆగి, రెండు సార్లు దీర్ఘ శ్వాస తీసుకున్న తర్వాతే ఫోన్ ఎత్తడం అలవాటు చేసుకున్నాడు. ఆ చిన్న మార్పు అతని మొత్తం రోజువారీ అనుభవాన్ని మార్చేసింది. ఆ మూడు సెకన్లు అతనికి ఎంతో ప్రశాంతతను ఇచ్చాయి.ఎందుకు మైండ్ఫుల్నెస్ అవసరం?👉ప్రశాంతంగా ఉన్న మెదడు సంక్లిష్టమైన నిర్ణయాలను తప్పులు లేకుండా తీసుకోగలదు.👉మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా వారి వైపు శ్రద్ధ చూపిస్తే, సంబంధాలు మెరుగుపడతాయి.👉కోపం, భయం వంటి భావోద్వేగాలను మీ మెదడు పసిగట్టి, వాటికి ప్రతిస్పందించేలా చేస్తుంది.మీ కోసం ఒక చిన్న టాస్క్...ఈ రోజు మీరు పని చేస్తున్నప్పుడు మీ చుట్టూ ఉన్న శబ్దాలను గమనించండి. ఏసీ శబ్దం, కీబోర్డ్ టైపింగ్ శబ్దం, పక్కవారి మాటలు.. కేవలం గమనించండి, వాటికి రియాక్ట్ అవ్వకండి. మీరు గమనించిన క్షణమే మీరు మైండ్ఫుల్గా ఉన్నట్టు లెక్క. జీవితం అంటే మీరు ఎక్కడికో వెళ్లడం కాదు, మీరు ఉన్న చోటే ఎలా జీవిస్తున్నారో అన్నదే ముఖ్యం. బిజీగా ఉండటం అంటే కష్టపడటం మాత్రమే కాదు, మీకంటూ ఒక ప్రశాంతమైన స్థానాన్ని మెదడులో నిర్మించుకోవడం. కాస్త ఆగి, శ్వాస తీసుకోండి.. ప్రపంచం ఎక్కడికీ పారిపోదు, కానీ మీ ప్రశాంతత మీతోనే ఉంటుంది.- సైకాలజిస్ట్ విశేష్ కెరీర్ & మైండ్సెట్ కోచ్8019 000066www.psyvisesh.com -
దెబ్బ తగిలినా తిరిగి నిలబడే తత్వం
పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే చాలామంది ఎప్పుడూ నవ్వుతూ ఉండటం, గెలుస్తూ ఉండటం అనుకుంటారు. కానీ నిజమైన పర్సనాలిటీ గ్రోత్.. మీరు కింద పడ్డప్పుడు ఎంత వేగంగా లేచి నిలబడతారో, అందులోనే ఉంది. సైకాలజీలో దీనినే 'Resilience' అంటారు.1. Resilience అంటే ఏమిటి?మనిషి జీవితంలో ఎప్పుడూ 'హ్యాపీగా' ఉండలేడు. ఓటములు, అవమానాలు, గాయాలు అనేవి రాక మానవు. కానీ, అక్కడే ఆగిపోకుండా, మనల్ని మరింత పవర్ఫుల్గా మలిచే శక్తి Resilience (పునరుద్ధరణ శక్తి).జీవితం అనేది ఒక సముద్రంలాంటిది, అలలు (సమస్యలు) వస్తూనే ఉంటాయి. రెసిలియన్స్ అంటే అలలను ఆపడం కాదు, ఆ అలల మీద సర్ఫింగ్ చేయడం నేర్చుకోవడం. ఇది ఒక టాలెంట్ కాదు, ఇది మనం ప్రాక్టీస్ చేసి పెంచుకోవాల్సిన ఒక 'మజిల్' (Muscle).* Fixed Mindset: "నేను ఓడిపోయాను, నా వల్ల కాదు" అని అనుకోవడం.* Growth Mindset (Resilience): "నేను ఓడిపోయాను, కానీ ఇది ఒక లెసన్. దీన్నుండి నేను ఏం నేర్చుకున్నాను?" అని అనుకోవడం.2. The 3 Pillars of Resilienceఒక వ్యక్తి కింద పడ్డా తిరిగి లేవాలంటే, అతని మైండ్సెట్లో ఈ మూడు ఉండాలి.* Acceptance: "ప్రస్తుతం నా జీవితంలో ఒక క్లిష్ట పరిస్థితి ఉంది" అని ఆ వాస్తవాన్ని భయపడకుండా అంగీకరించడం.* Purpose: మీరు ఎందుకు బ్రతకాలి? మీ లక్ష్యం ఏంటి? మీకంటూ ఒక 'ఎందుకు' (Why) బలంగా ఉంటే, మీరు 'ఎలాంటి' (How) పరిస్థితినైనా దాటగలరు.* Adaptability: పాత పద్ధతులు పని చేయనప్పుడు, మూర్ఖంగా వాటినే పట్టుకోకుండా, కొత్త మార్గాలను వెతకడం.3. మోటివేషన్ మాయ vs నిజమైన దృఢత్వంమోటివేషన్ "ఎప్పుడూ గెలుస్తూనే ఉండు" అని చెప్తుంది. ఇది ఒక అబద్ధం, ఎందుకంటే గెలవకపోతే వారు కుంగిపోతారు.రెసిలియన్స్ "ఓడిపోవడం సహజం, కానీ ఆ ఓటమికి నీ జీవితాన్ని అప్పగించకు" అని చెప్తుంది. రెసిలియన్స్ ఉన్న వ్యక్తికి ఓటమి ఒక 'ఎండ్' కాదు, ఒక 'ఎపిసోడ్' మాత్రమే.4. రెసిలియెంట్ మైండ్సెట్ బిల్డింగ్Genius Matrix మోడల్ ఉపయోగించి, మీరు కూడా ఒక 'అజేయమైన వ్యక్తి'గా ఎలా మారాలి?Step 1: భయం బంధనాలను బ్రేక్ చేయండిఓడిపోతే ఏమవుతుందో అన్న భయం, ఇతరులు ఏమనుకుంటారో అన్న భయం.. వీటిని 'Break' చేయండి. ఓటమిని అవమానంగా కాకుండా, ఒక 'డేటా పాయింట్' (Data Point) లా చూడండి. మీరు ఎంత ఎక్కువ ప్రయోగాలు చేస్తే, అంత ఎక్కువ డేటా మీకు దొరుకుతుంది.Step 2: పోరాట పటిమ (Build)మీ రెసిలియెన్స్ను ఒక మజిల్ లాగా బిల్డ్ చేయండి. చిన్న చిన్న సవాళ్లను తీసుకోవడం ద్వారా మీ మెదడును ట్రైన్ చేయండి. కష్టాల్లో ఉన్నప్పుడు "ఎందుకు నాకు ఇలా జరిగింది?" అని కాకుండా, "దీన్ని నేను ఎలా అధిగమించగలను?" అని అడగండి. మీ మైండ్ని 'Solutions' వైపు 'Build' చేయండి.Step 3: స్టాయిక్ మాస్టరీ ( Beyond)పరిస్థితులు మీ కంట్రోల్లో లేనప్పుడు, మీరు వాటికి ఇచ్చే 'రియాక్షన్' మీ కంట్రోల్లో ఉంటుంది. తుఫానులో కూడా ప్రశాంతంగా ఉండటమే 'Beyond' స్టేజ్. దీంతో మీరు అజేయంగా మారుతారు.5. మీ రెసిలియన్స్ స్కోర్ ఎంత?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.* మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న అతి పెద్ద ఓటమి ఏంటి?* ఆ ఓటమి మీకు నేర్పిన ఒకే ఒక్క ముఖ్యమైన పాఠం ఏంటి?* ఇప్పుడు ఆ ఓటమిని మీరు గర్వంగా (ఒక అనుభవంగా) చెప్పుకోగలరా?కింద పడటం ఒక కళ!బ్రో, కింద పడటం వల్ల కాదు, పడి అక్కడే ఉండిపోవడం వల్ల మీ వ్యక్తిత్వం దెబ్బతింటుంది. కింద పడి, దుమ్ము దులుపుకుని, నవ్వుతూ లేచి నిలబడటమే ఒక కళ (Art of Resilience). మీరు ఎంత బలంగా దెబ్బ తింటే, అంత బలంగా తిరిగి రాగలరు. ఇదే మీ Real Personality కి అసలైన కొలమానం."The greatest glory in living lies not in never falling, but in rising every time we fall." -Nelson Mandela-సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com -
ఆత్మవిశ్వాసమే అసలు బలం
అమ్మాయిలకు నేనిచ్చే సలహా– వీలైనంత త్వరగా ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించాలి. సంపాదించడం, దానిని ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు ప్రపంచాన్ని చూసే కోణం మారుతుంది. దేనికైనా మీరు సిద్ధంగా లేరనుకుంటూ ఎక్కువకాలం వేచి చూడవద్దు. చాలా అవకాశాలు మీరు పూర్తిగా సిద్ధం కానప్పుడే వస్తాయి. పొరపాటు అయిందేమోనని మథనపడకండి. దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకోండి. కెరీర్ అనేది దశాబ్దాల కృషి. రాత్రికి రాత్రే జరిగిపోదు. ఈ ప్రయాణం మీది. మీరే సృష్టించుకోండి. అది వేరెవరి మాదిరో ఉండాల్సిన పనిలేదు.తొలినాళ్లలో నాతో నేనే ఎక్కువగా పోరాడాల్సి వచ్చింది, బయటివాళ్లతో కాదు. నా మీద నాకు నమ్మకం రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆర్థిక రంగం– మన పనితీరును అంకెల్లో కళ్లెదుట నిలపాల్సిన రంగం. ఈ రంగంలో మన చుట్టూ ఉండేవారు మామూలు వ్యక్తులు కాదు, చక్కని ట్రాక్ రికార్డు, స్పష్టమైన అభిప్రాయాలు ఉండే తెలివైనవారే! నా కెరీర్ తొలినాళ్లలో నేను ఆలోచించి తీసుకున్న నిర్ణయాన్ని కూడా నేనే అనుమానించాల్సి వచ్చేది. ఈ ప్రయాణంలో నాపై నేను నమ్మకాన్ని పెంచుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. రాను రాను నేను తెలుసుకున్నది ఏమిటంటే, ఆత్మవిశ్వాసం పుట్టుకతో వచ్చే వ్యక్తిత్వ లక్షణం కాదు. అది మన చర్యల ద్వారా మనం నిర్మించుకునే కోట. నిర్ణయాలు తీసుకోవడం, ఫలితాలను స్వీకరించడం, అంతకంతకూ మెరుగుపడటం– ఇదో నిరంతర ప్రక్రియ. అదే మనపై మనకు నమ్మకాన్ని పెంచుతుంది. ఆత్మవిశ్వాసమే అసలు బలం. అది ఎవరికి వారే సాధించుకోవాలి.అదే నా జీవితంలో మలుపుఏదో ఒకే ఒక్క కారణంతో నా జీవితం నాటకీయంగా మారిపోయిందా అంటే లేదనే చెబుతాను. ఇన్వెస్ట్మెంట్ల మాదిరే ఆత్మవిశ్వాసం రెట్టింపవుతూ వచ్చింది. ఇదంతా నా అనుభవం, చేసిన తప్పులు, వాటి నుంచి నేర్చుకున్న పాఠాలతో కాలం గడుస్తున్న కొద్ది సాధించిన పురోగతి. వృత్తిపరంగా నేను ఎదుగుతున్న కొద్ది నేనెందులో రాణిస్తానో, ఎందులో రాణించనో నాకు స్పష్టంగా తెలుస్తూ వచ్చింది. ముందు మనం అంతర్గతంగా మారాలి. నాయకత్వం అంటే ఇలాగే ఉండాలని భావించి, అందులో ఇమడటానికి ప్రయత్నించడం మానేయాలి. మన బలాబలాలు తెలుసుకుని, దానికి తగ్గట్లు ముందుకెళ్లాలి. ఈ క్రమంలో నాయకత్వమే మన చేతుల్లోకి వస్తుంది. పురోగతి స్పష్టతనిస్తుంది. స్పష్టతతో ఆత్మవిశ్వాసం సాధ్యమవుతుంది. వైఫల్యాలు... గుణపాఠాలునా జీవితంలో ఇదొక్కటే అతిపెద్ద వైఫల్యమని చెప్పలేను. చిన్న చిన్న వైఫల్యాలు కూడా ఉన్నాయి. నేను ఊహించినట్లుగా రాణించని ఫండ్స్ ఉన్నాయి. మార్కెట్ కదలికలను సరిగా అంచనా వేయలేని సందర్భాలూ ఉన్నాయి. ఆర్థికరంగంలో ఫలితాలు స్పష్టంగా కనబడతాయి. అంకెలు అబద్ధాలు చెప్పవు. వైఫల్యాలే మానసిక దృఢత్వాన్ని నేర్పిస్తాయి. ప్రతి వైఫల్యానికీ కుంగిపోతూ ఉంటే మార్కెట్లో దీర్ఘకాలిక కెరీర్ను నిర్మించుకోవడం సాధ్యం కాదు. ఒక త్రైమాసికంలో మంచి ఫలితాలు రాకుంటే అది వ్యక్తి తప్పిదం కాదు. చేయాల్సింది ఒక్కటే, వేగంగా నేర్చుకోవడం– మరింత వేగంగా దానికి తగ్గట్లు మారడం, దృఢంగా నిలవటం, అంతే!మదర్స్కు చెప్పేదేమంటే...వృత్తిని, కుటుంబాన్ని చూసుకోవటంలో ఎంపికలు, ప్రా«ధాన్యాలే ఉంటాయి తప్ప కచ్చితమైన బ్యాలెన్స్ అంటూ ఏమీ ఉండదు. ఒక్కోసారి కుటుంబానికి, ఒక్కోసారి పనికి ఎక్కువ అంకితం కావాల్సి వస్తుంది. ప్రతిరోజూ రెంటికీ న్యాయం చేయాలని చూస్తే అనవసరమైన అపరాధభావాన్ని మోయాల్సి ఉంటుంది. పిల్లలకేమీ పర్ఫెక్షన్ అవసరం లేదు. స్థిరత్వం, ప్రేమ, తమ ఆశయాలను తాము గౌరవించుకునే రోల్మోడల్ ఉంటే చాలు. ‘మా అమ్మ చేస్తన్నదాంట్లో అర్థం ఉంది’ అని భావించిన నాడు వాళ్లూ స్వతంత్రంగా, దృఢంగా, ఇతరులకు ఆదర్శంగా నిలబడతారు. అపరాధభావం వద్దు, చేస్తున్న పనిపై ఫోకస్ పెట్టండి. వీటిని పాటిస్తే మంచిది...» ఇన్వెస్ట్మెంట్లను వీలైనంత త్వరగా మొదలుపెట్టండి. అది ఎంత చిన్నమొత్తమైనా సరే, దాన్ని కొనసాగించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. » మీకు రావాల్సినవి అడిగి మరీ సాధించుకోండి. అవి వేరెవరూ మీకోసం చెయ్యరు.» ఏదైనా సాధించాలనుకున్నప్పుడు సమర్థతను పెంచుకోండి. అదే చిరకాలం మిమ్మల్ని ముందు నిలబెడుతుంది.» మీ మానసిక, శారీరక ఆరోగ్యాలను నిరంతరం కాపాడుకోండి. అవి చాలా ఖరీదైనవి.» ఆర్థికంగానైనా, జీవితంలోనైనా దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి.-రమణమూర్తి మంథా -
సవాలే....అయినా సరే!
2022 ఫిబ్రవరి... సైబరాబాద్లోని మాదాపూర్లో ఉన్న ఓ హుక్కాపార్లర్ కేంద్రంగా జరుగుతున్న దందాల ఆట కట్టించడానికి ఒక ఐపీఎస్ అధికారిణి ఎస్సైతో కలిసి సాధారణ కస్టమర్స్ కపుల్లాగా వెళ్లారు. రెడ్హ్యాండెడ్గా చెక్ చెప్పారు.2026 ఫిబ్రవరి...రాత్రి విధుల్లో ఉన్న ఐపీఎస్ అధికారిణి సాధారణ ఫిర్యాదీగా హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసుస్టేషన్కు వెళ్లారు. ఆ సమయంలో అక్కడి సిబ్బంది పనితీరు, స్పందనను స్వయంగా పరిశీలించారు. బాధితులతోనూ మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. ఈ రెండు టాస్క్లు చేసిన ఐపీఎస్ అధికారిణి ఒక్కరే! ఆమె 2020 బ్యాచ్కు చెందిన కె.శిల్పవల్లి. అప్పట్లో మాదాపూర్ డీసీపీ, ఇప్పుడు ఖైరతాబాద్గా మారిన సెంట్రల్ జోన్ డీసీపీ. ఈ రెండు జోన్లకూ తొలి మహిళా అధికారిణి ఆమెనే కావడం విశేషం.‘పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడం అంటే మాటలా!’ అనే మాటను బొత్తిగా ఖాతరు చేయలేదు శిల్పవల్లి. నిజానికి ఆమె ఐఏఎస్ కావాలని బలంగా అనుకున్నారు. నాలుగు ప్రయత్నాల్లో సివిల్స్కు ఎంపిక కాకపోయినా, డీలా పడిపోలేదు.‘పోలీసు ఉద్యోగం అంటే బోలెడు రిస్కు. ఆడవాళ్లకు చాలా ఇబ్బంది’ అనే మాట పదే పదే వినిపిస్తున్నా, ఆ సవాలును స్వీకరించి ఖాకీ యూనిఫామ్ ధరించారు.1990లలో పాఠశాలలో చదువుకున్న వారందరికీ ఒక అనుభవం అనివార్యం. ఉపాధ్యాయులు క్లాసులో విద్యార్థుల్ని నిలబెట్టి ‘పెద్దయ్యాక ఏమవుతావు?’ అని అడిగేవారు. విద్యార్థులు ఏమాత్రం సంకోచించకుండా డాక్టర్ అనో, ఇంజినీర్ అనో ఏదో ఒకటి ఠక్కున చెప్పేవాళ్లు. నా వంతు వచ్చినప్పుడు నేను చెప్పిన మాట ‘సివిల్స్ రాసి కలెక్టర్ అవుతా’. అప్పట్లో చాలామంది పిల్లలకు సివిల్స్ అంటే ఏమిటో తెలియకపోవడంతో అంతా నన్ను ఆశ్చర్యంగా చూశారు. మా నాన్న సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. నేను సివిల్స్ రాయాలనుకోవడానికి ఆయనే స్ఫూర్తి.అలా ఐపీఎస్ అయ్యాను!సివిల్స్ కోసం నేర్చుకున్న అంశాలు గ్రూప్–1 ద్వారా డీఎస్పీని చేశాయి. ఆపై అదనపు ఎస్పీ, నాన్–క్యాడర్ ఎస్పీల తర్వాత 2020 బ్యాచ్ ద్వారా ఐపీఎస్ అయ్యాను. నా పరిధిలోని పోలీసుస్టేషన్లలో నమోదయ్యే ప్రతి కేసునూ స్వయంగా పర్యవేక్షించడం నాకు అలవాటు. నేరం జరిగినప్పుడు ఫోన్ ద్వారా అక్కడ ఉన్న అధికారులను సంప్రదించి, వివరాలు తెలుసుకోవడం కంటే క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలిస్తుంటాను. నేరస్థలాలతో పాటు ఇతర ప్రదేశాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ను స్వయంగా అధ్యయనం చేస్తాను.కొండల్లో కోనల్లో...చేవెళ్ల డీఎస్పీగా పని చేస్తున్నప్పుడు ఫామ్హౌస్లో తల్లిదండ్రుల్ని చంపిన కుమారుడి కేసు దర్యాప్తు మంచి అనుభవాన్ని ఇచ్చింది. ముగ్గురు మహిళల్ని చంపిన సీరియల్ కిల్లర్ కేసు దర్యాప్తులో భాగంగా చెంగొముల్ అడవుల్లో గుట్టల పైకి చేసిన ట్రెక్కింగ్ మర్చిపోలేనిది. షాబాద్లో ఓ చిన్నారి కిడ్నాప్ అయినప్పుడు శంషాబాద్లో కిడ్నాపర్ను పట్టుకుని, బాలుడిని రెస్క్యూ చేసే వరకు ఫీల్డ్లోనే ఉన్నాను.ఆ బాలుడి తండ్రిని వెంట తీసుకుని, అతడి ద్వారానే కిడ్నాపర్ను ట్రాప్ చేసి చిన్నారిని రక్షించాం. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ)లో పని చేసినప్పుడు టెక్నికల్ అనాలసిస్ వింగ్ను పర్యవేక్షించాను. బీఏలో తీసుకున్న కంప్యూటర్స్ సబ్జెక్ట్ అక్కడ పని చేసింది. ఆ కోర్సులో ఆఖరి సంవత్సరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పేపర్ ఉంది. అలా నేర్చుకున్న విషయ పరిజ్ఞానం ఎస్ఐబీలో పనికి వచ్చింది. అలాంటి ఆలోచన వద్దు‘అమ్మాయిలకు ఐపీఎస్ ఎందుకు!’ అనే ఆలోచన అప్పుడూ ఉంది. ఇప్పుడూ ఉంది. ఆ ఆలోచన నుంచి బయటికి రావాలి. దేశవ్యాప్తంగా ఎంతోమంది మహిళా ఐపీఎస్ అధికారులు తమ సత్తా చాటుకున్నారు, చాటుకుంటున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. గతంతో పోల్చితే అమ్మాయిలలో ఐపీఎస్పై ఆసక్తి పెరుగుతోంది. ఐపీఎస్ సాధించడం ఒక సవాలు అయితే, ఆ తరువాత వృత్తిజీవితంలో ప్రతిరోజూ ఎన్నో సవాళ్లు ఉంటాయి. అయినా సరే, అమ్మాయిలు వెనకడుగు వేయడం లేదు. ‘నేను ఐపీఎస్ అవుతాను’ అనే మాట వారి నుంచి గట్టిగా వినిపిస్తోంది. ఇది శుభసూచకం. నేను ఐపీఎస్ కావాలని అనుకోనప్పటికీ, అయిన తరువాత గర్వంగా ఫీల్ అవుతున్నాను. వృత్తిజీవితంలో విలువైన అనుభవాలు సొంతం చేసుకున్నాను.ఆ అవసరం ఇప్పుడు మరీ ఎక్కువగతంలో కంటే ఇప్పుడే మహిళలు, యువతులలో ఎక్కువ సంఖ్యలో బాధితులు ఉన్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత ఎక్కువమంది మహిళలు పోలీస్ శాఖలోకి రావాలి. బాధిత మహిళలు విమెన్ పోలీస్ ఆఫీసర్లతో ఫ్రీగా, ఎలాంటి భయాలు లేకుండా మాట్లాడగలరు. సోదరితో మాట్లాడుతున్నట్లే కంఫర్ట్గా ఫీలవుతారు. ఇదే సందర్భంలో మహిళా అధికారుల వృత్తినిబద్ధత వల్ల బాధితులకు త్వరితగతిన న్యాయం జరుగుతుంది.ఎవరికీ చెప్పుకోలేని సమస్యలను చెప్పుకునేవారుమాదాపూర్లో పని చేసినప్పుడు దాదాపు 60–65 స్కూళ్లల్లో జరిగిన స్పోర్ట్స్, కల్చరల్, యాన్యువల్ డేలకు అతిథిగా వెళ్లాను. అక్కడికి వచ్చిన చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులకూ డ్రగ్స్, డిజిటల్ హైజీన్, గుడ్ టచ్–బ్యాడ్ టచ్తో సహా వివిధ అంశాల గురించి చెప్పే అవకాశం దక్కింది. నా మాటలు విన్న ఎంతోమంది మహిళలు, యువతులు ఆ తర్వాత ఆఫీస్కు వచ్చి నన్ను కలిసే వాళ్లు. బాహ్యప్రపంచంలో ఎవరికీ చెప్పుకోలేని సమస్యల్ని నా దృష్టికి తీసుకువచ్చి పరిష్కార మార్గాలు కోరేవారు. అలాంటి వారికి నా చేతనైనంతలో సాయం చేశాను.-శ్రీరంగం కామేష్ -
న్యాయదేవతగా రాణిద్దాం!
మహిళలు ఇంటర్ పూర్తి కాగానే మెడిసిన్, ఇంజనీరింగ్ తమ కెరీర్గా ఎంచుకుంటున్నారు. డిగ్రీ తర్వాత ఎంబీఏ, ఎంసీఏ లాంటి కోర్సులవైపు మొగ్గు చూపుతున్నారు. చాలెంజింగ్గా ఉండే న్యాయవాద వృత్తిని ఎంచుకునే వారు చాలా తక్కువ. తల్లిదండ్రుల్లో కూడా తమ పిల్లలు ఈ కెరీర్ను ఎంచుకోవడానికి ఇష్టపడని వారే ఎక్కువ. కోర్టులు, కేసులు అనగానే ఓ రకమైన భయం నిండి ఉంటుంది. అయితే, కాలం మారుతున్న కొద్ది ఇలాంటి ఆలోచనల్లో మార్పులొస్తున్నాయి. పాతికేళ్ల ముందుతో పోలిస్తే ఇప్పుడు మహిళా న్యాయవాదుల సంఖ్య పెరుగుతున్నా, మిగతా రంగాలతో పోలిస్తే తక్కువే. న్యాయవాద వృత్తి ఎంతో గొప్పది. పురుషులతో సమానంగా మహిళలు కూడా ఈ వృత్తిని ఎంచుకోవాలి. తెలంగాణ హైకోర్టులో 32 మంది న్యాయమూర్తుల్లో ఏడుగురే మహిళలు ఉన్నారు. ఈ నిష్పత్తిలో మార్పు వచ్చేలా, సగం స్థానాల్లో మహిళలు ఉండేలా రాణించాలి. డిజిగ్నేటెడ్ సీనియర్స్లోనూ మహిళల శాతం అంతంతే. ఇది మారాలి. న్యాయవాద వృత్తిని ఎంచుకునే మహిళల సంఖ్య పెరుగుతున్నా, పలు కారణాల వల్ల ఉన్నత స్థానాలకు ఎదగడం లేదు. కాని, సమరంగా కెరీర్ సాగిస్తే, అందలాలు అధిరోహించ వచ్చనడానికి స్ఫూర్తిగా నిలుస్తున్నవారు ఎందరో! వచ్చే ఏడాది సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇది ప్రతి మహిళా న్యాయవాది గర్వించదగిన సందర్భం. సమర్థతతో అత్యున్నత శిఖరాలను అధిరోహించవచ్చని చెప్పేందుకు ఆమె నిదర్శనం. కోర్టు మెట్లెక్కాలంటే భయపడే మహిళలకు న్యాయం అందించాలంటే, అదే వర్గానికి చెందిన వారు నల్లకోటు ధరించాలి. ప్రజాప్రతినిధి, అధికారి సహా ఎవరు తప్పు చేసినా శిక్షించే అధికారం కోర్టులకు మాత్రమే ఉంటుంది. ప్రజలకు న్యాయం చేయాలనుకునే వారు ఈ వృత్తి స్వీకరించి, రాణించాలి. తొలుత కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, నేను నిలబడి గెలిచా. అత్యంత తక్కువ మంది న్యాయవాదులకు అందించే ‘డిజిగ్నేటెడ్ అడ్వొకేట్ హోదా’ను అతి చిన్న వయసులో అందుకున్నా. ఇంకా ఉన్నత స్థానాలను పొందే అవకాశం ఉంది. ప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో కొన్ని ఆటుపోట్లు వచ్చినా పట్టుబట్టి పోరాడి సమర్థత నిరూపించు కోవాలి. కుటుంబ బాధ్యతల కారణంగా వనితలు ఎక్కువ గంటలు పనిచేయడం ఇబ్బందే! న్యాయవాదులుగా ఏటా నమోదు చేసుకుంటున్న వారిలో పురుషులే ఎక్కువ. ఆ ధోరణి మారాలి. ఒక మహిళ న్యాయవాద వృత్తిలోకి వస్తే చుట్టూ ఉన్న వందమందికి సాయం అందించగలదన్న విషయం గుర్తుంచుకోవాలి. కోర్టుల్లోనూ మహిళల కోసం ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారు. భయాలు వదిలి నల్లకోటు ధరించి ‘న్యాయదేవత’లుగా మారే సమయం వచ్చింది. న్యాయం ఆశించే స్థాయి నుంచి అందించే స్థాయికి మగువ ఎదగాలి.దేశంలో తొలి న్యాయవాది1866, నవంబర్ 15న నాసిక్లోని పార్సీ కుటుంబంలో కార్నెలియా సొరాబ్జీ జన్మించారు. మహిళలకు, సమాజానికి ఏదో ఒకటి చేయాలన్నది ఆమె సంకల్పం. బాంబే వర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. స్కాలర్షిప్ ఇచ్చేందుకు నాటి బ్రిటిష్ సర్కార్ నిరాకరించడంతో కొందరు సేకరించి ఇచ్చిన నిధులతో ఆక్స్ఫర్డ్లో బ్యాచిలర్ ఆఫ్ సివిల్ లాలో 1892లో ఉత్తీర్ణత సాధించినా, డిగ్రీ పట్టా ఇచ్చేందుకు కాలేజీ నిరాకరించింది.1920లో లండన్ బార్ మహిళలను లా ప్రాక్టీస్ చేయడానికి అనుమతించినప్పుడు కార్నెలియా అక్కడికి వెళ్లారు. తర్వాత కలకత్తా హైకోర్టులో తొలి మహిళా న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు.దేశంలో తొలి మహిళా న్యాయమూర్తిఅన్నా చాందీ 1959 ఫిబ్రవరి 9న కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి, దేశంలోనే తొలి మహిళా హైకోర్టు న్యాయమూర్తిగా అరుదైన ఘనత సాధించారు. అంతకు ముందు 1937లో తొలి మహిళా న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. ట్రావెన్కోర్ రాజ్యంలో (ప్రస్తుతం కేరళ) 1905 ఏప్రిల్ 5న జన్మించిన అన్నా చాందీ, తిరువనంతపురంలో పెరిగారు. చిన్నప్పటి నుంచే చదువు, సామాజిక అవగాహన, మహిళా హక్కులపై ప్రత్యేక ఆసక్తి కలిగిన ఆమె, ఆ కాలంలో మహిళలకు అరుదైన రంగమైన న్యాయ విద్యను ఎంచుకుని, 1926లో ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి కేరళలో లా డిగ్రీ పొందిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిసుప్రీం కోర్టు తొలి మహిళా న్యాయ మూర్తి జస్టిస్ ఫాతిమా బీవీ 1989లో నియమితుల య్యారు. కేరళలోని పతనంతిట్టలో 1927 ఏప్రిల్ 30న మీరా సాహిబ్, ఖదీజా బీవీ దంపతులకు జన్మించారు. పతనంతిట్టలో పాఠశాల విద్య, తిరువనంతపురంలో బీఎస్సీ పూర్తి చేశారు. అనంతరం తిరువనంతపురంలో ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి బీఎల్ పట్టా పుచ్చుకున్న జస్టిస్ బీవీ 1950లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకున్నారు. సెషన్స్ కోర్టులో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగి 1983న హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 1989లో సుప్రీంకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1992 ఏప్రిల్ 29న పదవీ విరమణ చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ తొలి చైర్పర్సన్గా, ముస్లిం వర్గం నుంచి గవర్నర్గా నియమితురాలైన తొలి మహిళ కూడా ఆమే కావడం విశేషం.-గండ్రాతి అరవింద్ రెడ్డి -
జిమ్ చేద్దాం... ఫిట్గా ఉందాం...
పురుషులకే కాదు, మహిళలకూ వ్యాయామం అవసరం. నిజానికి మహిళలకు వ్యాయామం మరింత ముఖ్యం. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే, తర్వాతి తరం ఆరోగ్యంగా ఉంటుంది. మొత్తం సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాయామం చేసినా, చేయకపోయినా యవ్వనంలో సహజంగానే ఆరోగ్యంగా ఉంటాం. వయసు గడిచే కొద్ది కండరాల పటుత్వం సడలిపోతుంది. మన శరీరానికి శక్తి కావాలి, కండరాలకు పటుత్వం కావాలి. వయసు మళ్లినా, కండరాల్లో పటుత్వం సడలిపోకుండా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి. తేలికపాటి వ్యాయామాలు మొదలుకొని బరువులు ఎత్తడం లాంటి వ్యాయామాలు చేస్తూ ఉంటే, క్రమంగా శక్తి పెరిగి, కండరాలు పటుత్వాన్ని సంతరించుకుంటాయి. హార్మోన్లలో అసమతుల్యతలు ఉన్నట్లయితే, క్రమంగా అవి ఒక కొలిక్కి వస్తాయి. నాకు చిన్నప్పటి నుంచే చదువుతో పాటు క్రీడల్లో ఆసక్తి ఉండేది. స్కూల్ రోజుల్లోనే రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్ వంటి పోటీల్లో బహుమతులు గెలుచుకునేదాన్ని. మా నాన్నగారు నన్ను ప్రోత్సహించేవారు. నా బాల్యమంతా కాకినాడలో జరిగింది. అక్కడే ఏడో తరగతి వరకు చదువుకున్నాను. టెంత్, ఇంటర్, డిగ్రీ రోజుల్లో స్టేట్ లెవల్కు వెళ్లాను. పెళ్లయిన తర్వాత వైజాగ్ వచ్చాను. జిమ్ నడపాలని అనుకుంటున్నట్లు మావారికి చెబితే, ప్రోత్సహించారు. వైజాగ్లో జిమ్ పెట్టడానికి ముందు ఏరోబిక్స్లో శిక్షణ తీసుకున్నాను. మహిళలు తలచుకుంటే ఏమైనా సాధించగలరు. అయితే, సాధించాలనే తపన ఉండాలి. క్రమశిక్షణ, చేసే పని పట్ల ఏకాగ్రత, అంకితభావం ఉండాలి. మనం ఏ రంగాన్ని ఎంచుకున్నా, ఈ సూత్రాలను తప్పకుండా పాటించాలి. నా దగ్గరకు వచ్చే మహిళల్లో ఎక్కువమంది నెలసరి క్రమం తప్పడం, స్థూలకాయం, హార్మోన్ అసమతుల్యతలు, కాన్పుల తర్వాత శరీరతత్త్వంలో మార్పులు వంటి సమస్యలతో బాధపడేవారే ఎక్కువ. ఇలాంటి సమస్యలను అధిగమించడానికి వారి శరీర తత్త్వం తెలుసుకుని, వారి వయసును బట్టి, ఆరోగ్య సమస్యలను బట్టి ఎలాంటి వ్యాయామాలు చేయాలో, ఎలాంటి ఆహారం తీసుకోవాలో వారికి చెబుతుంటాను. చాలామంది మహిళలు ఒకటి రెండు రోజులు జిమ్కు వచ్చాక తర్వాత మానేస్తారు. ముందు వాళ్ల మైండ్సెట్ మార్చాలి. ఆరోగ్యం కాపాడుకోవడానికి అతిగా ప్రయాస పడనక్కర్లేదు. మన వంటిల్లే ఔషధాలయం. వంటింట్లో తరచుగా వాడుకునే దినుసులతోనే చాలావరకు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. జీలకర్ర, మిరియాలు, మెంతులు, దాల్చినచెక్క, లవంగాలు, కరివేపాకు, కొత్తిమీర, ఉసిరి, గుమ్మడి గింజలు, కర్బూజా గింజలు, చియా విత్తనాలు వంటివి శరీరాన్ని డీటాక్స్ చేసుకోవడానికి బాగా ఉప కరిస్తాయి. ఫిట్నెస్ నిపుణురాలిగా ఈ సమాజం నాకు ఒక స్థానాన్ని ఇచ్చింది. సమాజానికి నేను తిరిగి ఇవ్వగలిగేది నా విద్యను మాత్రమే! నాకు తెలిసిన విద్య హెల్త్ అండ్ ఫిట్నెస్. నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో ప్రతిరోజూ తప్పనిసరిగా ఒక ఫిట్నెస్ రీల్ పెడతాను. నాకు దాదాపు ఎనభైవేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇంట్లోనే ఉంటూ మహిళలు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునేందుకు ఉపయోగపడే వ్యాయామాలు, చిట్కాలతో పాటు వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు తగిన రెసిపీస్ కూడా పెడుతుంటాను. పగటిపూట వేళకు తినడం, రాత్రివేళ త్వరగా భోజనం ముగించడం, రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. కూల్డ్రింక్స్, మద్యం, పొగతాగడం వంటివి మానుకుని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, తగిన వ్యాయామం చేస్తూ ఉన్నట్లయితే చిరకాలం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఫిట్నెస్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ మాత్రమే కాదు, జిమ్లో వ్యాయామాలు చేయడం మాత్రమే కాదు. మనిషికి ఫిట్నెస్ నాలుగు రకాలుగా ఉండాలి. ఫిజికల్, మెంటల్, ఫైనాన్షియల్, స్పిరిచ్యువల్ ఫిట్నెస్ ఉంటేనే మనిషి సంపూర్ణంగా ఫిట్గా ఉన్నట్లు. -అను ప్రసాద్ , హెల్త్ అండ్ ఫిట్నెస్ మోటివేటర్ -
అతడు c/o ఆమె
ఆమె నా బాబా భవానీ: డా.గురవారెడ్డి, ప్రముఖ వైద్య నిపుణులుబాగా అరిగిపోయిన ఓ రొటీన్ సూక్తితోనే మొదలుపెట్టాలంటే ‘ప్రతి పురుషుడి విజయం వెనక ఓ మహిళ హస్తం తప్పక ఉంటుంద’ంటారు. నా విజయాలూ, ఉత్థానాలూ, జీవితమూ అన్నింటి వెనక నా లైఫ్ పార్ట్నర్ భవానీవి రెండు హస్తాలూ, పాదాలూ... ఆ మాటకొస్తే మొత్తంగా తానే ఉంటుంది. జోక్స్ అపార్ట్... భవానీ నా పట్ల తన ప్రేమను ప్రకటించేనాటికి నేనో మామూలు మెడికల్ స్టూడెంట్ని. వాళ్లది ఆర్థికంగా, సామాజికంగా చాలా ఎత్తున ఉన్న కుటుంబం. ఆ టైమ్లో ఆమె నా గురించి వాళ్ల నాన్నకు ఓ లెటర్ రాసింది. ‘ఇవాళ అతడో మామూలు వ్యక్తి కావచ్చు.కానీ రేపు తన జీవితంలో ఓ సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాడు. చాలా ఎత్తులకు ఎదుగుతాడు. అంతకు మించి మంచివాడు. నా భాగస్వామిగా చాలా కరెక్ట్’ అంటూ తన లేఖలో నా గురించి చెప్పింది. నా మీద నాకూ ఆత్మవిశ్వాసం ఉండేది. అయితే భవానీకి మాత్రం నా మీద నాకు ఉన్న దాని కంటే కూడా నా సామర్థ్యాల మీద ఆమెకు ఉన్న నమ్మకం చాలా చాలా ఎక్కువ. మామూలుగానైతే ఫలానావాడు నాకు తగినవాడా కాదా అంటూ అమ్మాయిలు ప్రేమపరీక్షలు పెడుతుంటారు. తమ గీటురాయి మీద ఒకటికి నాలుగుసార్లు పరీక్షించి చూస్తూ ఉంటారు. కానీ నా విషయంలో అంతా డిఫరెంట్. నేను భవానీకి ప్రేమ పరీక్షలు పెట్టాను. కారుల్లో తిరిగే అమ్మాయిని సిటీబస్సుల్లో ఇరికిస్తే ఎలా తట్టుకుంటుందో తెలుసుకోడానికి గుంటూరు శ్రీనివాసకాలనీ నుంచి నాజ్ సెంటర్ వరకు సిటీబస్సుల్లో తిప్పేవాణ్ణి. అలా మా సిటీబస్సు టైర్ల జాడల్లో పయనించగలదా లేదా అని ఆమెనుటెస్ట్ చేస్తూ ఉండేవాణ్ణి. తనకున్న ఆర్థిక సామాజిక నేపథ్యం కారణంగా భవానీకి అన్ని సదుపాయాలూ సమకూరి ఉండేవి. ఓ చిన్నకూతురుగా ఆమె ఆ ఇంటి గారాలపట్టి. నేను అప్పట్లో ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాణ్ణి. అలాంటిది తాను తన ప్రివిలేజెస్ అన్నింటినీ వదులుకొని ఓ పెద్దకోడలు హోదాలో ఇంటి బాధ్యతలన్నింటినీ తలకెత్తుకుంది. వాటిని ఎంతో బాధ్యతాయుతంగా నిభాయించింది కూడా. ఆ సమయంలో నా ఆర్థికలేమిని ఏమాత్రం లెక్కచేయకుండా నా వెంటనడిచింది. ఈ మాట ఎలా చెప్పగలుగుతున్నానంటే... నా చదువు పూర్తయ్యాక పూణేలో ఉద్యోగం చేస్తున్న సమయంలో నా జీతం కేవలం రూ.1,800 మాత్రమే! అలాంటి మా ఇంటికి వచ్చిన భవాని ఇంటి పెద్దకోడలుగా నా పెద్ద ఫ్యామిలీ బాధ్యతలు తీసుకుని మా తమ్ముళ్లకు వదినగా... మా అమ్మనూ, నాన్ననూ చూసుకుంటూ వాళ్ల కూతురిగా ఉండిపోయింది. ఇంగ్లాండ్లో నేను ఉద్యోగాల కోసం పరుగెత్తుతూ ఉన్నప్పుడు నా కుటుంబం పర్యవేక్షణ ఆమె కనుసన్నల్లోనే సాగింది. నేనెక్కడో సుదూరతీరాల్లో ఉన్నప్పుడు ఇంటి పెద్ద్దకొడుకు స్థానాన్నీ ఆమే భర్తీ చేసింది. అలా నా కలలను తరుముతూ వాటిని అందుకునేందుకు వాటి వెంట నేను పరుగెత్తుతున్నప్పుడు నా వెన్నంటే ఉంది. అప్పుడూ... ఇప్పుడూ... ఎప్పుడూ!!నేను ఆమెను సరదాగా ‘బాబా భవానీ’ అంటూ పిలుస్తుంటా. ఈమాట ఎందుకు చె΄్పాల్సి వస్తుందంటే ఈ 40 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా ఏరోజూ తనని ఆనందంలో ఎగరడం గానీ... దిగులులో తరగడంగానీ చూడలేదు. ఎప్పుడూ ఒకేలా ఉండటం మహర్షులకే కదా సాధ్యమయ్యేది. అందుకే నాకెప్పుడూ ఆమె మా ‘బాబా భవానీ’యే! నేను తీసుకునే నిర్ణయాలను చాలా నిశితంగా పరిశీలిస్తుంది. నా తప్పులను విమర్శనాత్మకంగా చూస్తుంది. ఎక్కడైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే దాన్ని పెద్దమనసుతో భరిస్తుందీ... సరిచేస్తుంది. నా ఆనందాలూ, నా అభిరుచులూ, నాకు నచ్చే విషయాలూ ఆమెకు నచ్చకపోయినా నా స్పేస్లో నన్ను ఉండనిస్తుంది. అలా ఉండనిచ్చినంత సేపూ ఉండనిచ్చి... తాను ముందుకెళ్తూ నన్నూ తీసుకెళ్తుంది.తీరని రుణం: చంద్రబోస్, ప్రముఖ గీతరచయితమన వెనకాల నిశ్శబ్దంగా కొంతమంది శ్రమిస్తూ ఉంటారు. అది ప్రపంచానికి తెలియదు. మనం మన వెలుగులో ఉంటాం. రాణిస్తుంటాం. గుర్తింపునకు నోచుకుంటాం. అందరి అభినందనలూ, సన్మానాలు మనం పొందుతుంటాం కానీ.. మనం ఇంత దూరం రావడానికి వెనకాల నిశ్శబ్దంగా, నిరంతరం పని చేస్తూనే ఉంటారు. శ్రమిస్తుంటారు. వారే ఇంటి ఇల్లాళ్లు. మా ఆవిడ (ప్రముఖ కొరియోగ్రాఫర్–డైరెక్టర్ సుచిత్ర) నిరంతరం తెర వెనకాల పని చేస్తూ, కష్టపడుతూ నా గురించి ఆలోచిస్తూ నన్ను ఇంకా బాగా రాసే విధంగా ప్రోత్సహిస్తూ ఉండటం వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. దీని వెనకాల ఉన్నదంతా ఒక స్త్రీ మూర్తి, స్త్రీ శక్తి. తనను గుర్తు చేసుకోవడం నాకు చాలా చాలా ఆనందం. నిజానికి తను ఎన్నో సాధించింది. ఎన్నో వందల సినిమాల్లో వేల పాటలు కంపోజ్ చేసింది. ఎంతో గుర్తింపు పొందింది. తను ఒక పెద్ద టెక్నీషియన్ అయినా, తను నా కన్నా సీనియర్ అయినా నా జీవితంలోకి వచ్చాక నా జీవితం కోసం, నా భవిష్యత్తు కోసం పాటు పడిన విధానం చూస్తుంటే ఖచ్చితంగా ఇదేదో అనుబంధం కాదు... రుణానుబంధమే అయ్యుంటుంది. ఎందుకంటే ఎక్కడో చెన్నైలో పుట్టిన తను, వరంగల్లో పుట్టిన నేను.. మేమిద్దరం కలిసేలాగా చేసింది విధి. ఇదంతా కూడా భగవంతుడి లీలేమో అనుకుంటుంటాను. ఈ మహిళా దినోత్సవం రోజు మన జీవితంలోని మహిళలు... వాళ్లెంత గొప్పవాళ్లు, మన కోసం ఎన్ని త్యాగాలు చేస్తారు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతారు, మన క్షేమం కోసం, సౌభాగ్యం కోసం, ఆనందం కోసం, మన విజయం కోసం ఎంత శ్రమిస్తారు, ఎంత చెమటోడుస్తారు, ఎన్ని కన్నీళ్లు కూడా కారుస్తారు అనేది ఒకసారి గుర్తు చేసుకోవాలి. వాళ్లకు మనం ఏమిచ్చినా ఆ రుణానుబంధం రుణం తీర్చుకోలేం. స్త్రీలు మొత్తం ఉన్నదంతా మనకిచ్చేసి తిరిగి వాయిదాల పద్ధతిలో చిన్నచిన్నగా కొంత కొంత అడుగుతారు. మనం ఇవ్వాల్సింది ప్రేమ, గౌరవం, గుర్తింపు, కాస్త మన సమయం, తనకు కావలసిన సమయం ఇచ్చి, ఎప్పుడు వెనకాల ఉంటూ వాళ్లు మన విజయాలను చూసి ఆనందించేలాగా మనం విజయపథంలో నడవడం వాళ్లకు నిజంగా గొప్ప బహుమతి అని భావిస్తున్నాను.నాలో మార్పు తీసుకొచ్చిందిచాలా విషయాల్లో నాలో మార్పు తీసుకువచ్చింది మా ఆవిడ సుచిత్ర. చాలా విషయాల్లో అంటే నా అలవాట్లు, నా వ్యసనాలు, తరువాత నా పద్ధతులు ఇవన్నీ మారడానికి ప్రధాన కారణం నా భార్య. నాకు 21 ఏళ్ల క్రితం కొన్ని చెడు అలవాట్లుండేవి. పాట రాసేపుడు ఒక చెడు అలవాటుతో కూర్చొని రాసేవాణ్ణి. అది ఆరోగ్యానికి మంచిది కాదు. అది హానికరం అని చాలా విధాలుగా చెప్పినా నేను వినలేదు. కానీ తను ఓపిగ్గా చెబుతూ చెబుతూ ఇంతకాలంగా చెబుతోందని దృష్టి పెట్టేలాగా చేసింది. అపుడు ఆ అలవాటు నుంచి పక్కకొచ్చాను. చాలా చాలా మంచి జీవితానికి అపుడు శ్రీకారం చుట్టాను. అట్లాగే ఇంకొక అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే కుటుంబాన్ని పూర్తిగా తన భుజస్కంధాలపై వేసుకోవడం. పిల్లలు గానీ, మా కుటుంబ సభ్యులు గానీ, మా వైపువాళ్లు, మా స్నేహితులు, ఇంకా ఇంటికొచ్చేవాళ్ల ఆదరణ అంతా తాను చూసుకోవడం. కుటుంబం కోసం నా సమయాన్ని వెచ్చించనివ్వకుండా పూర్తిగా నా వృత్తి మీద, నా పాటల మీద మాత్రమే పెట్టేలాగా అంత సమయాన్ని నాకిచ్చింది. వేరే ఏమీ ఉండదు పాట.. పాట.. లేదంటే చదవడం చదవడం. ఈ రెండే... అంటే సృజించడం... అధ్యయనం చేయడం ఈ రెండే .. వీటి మీదే మనసు లగ్నం చేసేలాగా నన్ను సిద్ధం చేసిందన్నమాట. ఇంకొకటి ఏంటంటే... అసలు ఆస్కార్ వస్తుందని ముందు ఊహించిందే నా భార్య. ఆస్కార్ కంటే ముందు ఆస్కార్ తను నాకిచ్చింది. 2022 డిసెంబర్ 22న నాకు ఒక ఉత్తరం రాసిచ్చింది – మీరు ఆస్కార్ అవార్డు సాధించబోతున్నారని. అప్పటికి నామినేషన్స్కు కూడా ప్రక్రియ మొదలవ్వలేదు. ఊరికే నామినేషన్కి పంపించామంతే! అప్పుడు తను నాకు ఉత్తరం రాసిస్తే ఇది ఎలా... అన్నాను. మీరు చూడండని చెప్పి దృఢమైన విశ్వాసంతో దేవుడికి పూజలు చేయడం మొదలు పెట్టింది. నేను అసలు నమ్మలేదు. నామినేషన్ 35 నుంచి 15 లోకి; 15 నుంచి 5 లోకి వచ్చింది మనది. అప్పుడు నమ్మడం మొదలెట్టాను. అవును... మా ఆవిడ చెప్పింది ముందే అని. ఏంటంటే నమ్మకం అనేది ఒక పక్షి లాంటిదని. పక్షి సూర్యోదయాన్ని అందరికంటే ముందే, లోకం కంటే ముందే పసిగడుతుంది. అట్లా మా ఆవిడ ఒక నమ్మకంతో ముందుకెళ్లింది. ఆ నమ్మకాన్ని నాలో కూడా నింపింది. నాలో కూడా ఆ నమ్మకం కలిగేలాగ చేసింది.ఒక కవిగా నేను చెడు అలవాట్లతో చెడు పద్ధతులతో ఉంటూ మంచి మాట చెప్పినా దాంట్లో నిజాయితీ లోపిస్తుందని నా భావన. అందువల్ల మనం మంచి దారిలో ఉండి మంచి మాట చెబితే అది సరైన పద్ధతి. అలా ఆ సరైన పద్ధతిలోకి తీసుకువచ్చింది నా భార్య. నేను రాత్రిపూట రాసేవాణ్ణి. పగటిపూట రాసేలా నన్ను ప్రోత్సహించి నాలో నమ్మకాన్ని నింపింది. ఇప్పుడు హాయిగా రాత్రి పడుకోవడం... పగలు రాయడం.బెటర్ ఫుల్: మల్లాది వెంకట కృష్ణమూర్తి, ప్రముఖ రచయితనా జీవిత కథలోని ప్రధాన పాత్ర పద్మజ. పద్మజ నా భార్య. మాకు ఎలా పరిచయమైంది? 1982లో ఓ వారపత్రిక సంపాదకుడు ఏదైనా మంచి శీర్షిక సజెస్ట్ చేయండి అని అడిగితే ‘మీ భార్యని మీరు ఎలా ఎప్పుడు కలుసుకున్నారు?’ అనే శీర్షికని సూచించాను. ‘పెళ్లిచూపులు లేదా పార్క్ అంతేగా?’ అని ఆయన దాన్ని స్వీకరించలేదు. కానీ అందరూ తమ భార్యలని అలాగే కలుసుకుంటారా? పద్మజ స్వగ్రామం గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గర చింతలపూడి. అభిమాన రచయితగా నాకు అక్కడ నుంచి రాసిన ఉత్తరాల ద్వారా మా పరిచయం. నన్ను చూడాలని ఉందంటే, హైదరాబాద్ వచ్చినప్పుడు ఫోన్ చేయమని ఆఫీస్ నంబర్ ఇచ్చాను. అలా 1983లో నిమ్స్ హాస్పిటల్లో కలిశాను. కొద్దిసేపట్లో ఆమెకి సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది. నేను అమెరికన్ హాఫ్డాలర్ కాయిన్ని ప్రెసెంట్ చేశాను. లాస్ట్ మినిట్లో సర్జన్ సర్జరీ అవసరం లేదని చెప్పడంతో అది లక్కీచామ్గా పద్మజ భావించింది. ఈ రోజుకి అది తన దగ్గర భద్రంగా ఉంది.పద్మజలో సాహిత్యం మీద చక్కటి అభిరుచి ఉంది. అందరికి తెలిసిందే... సోక్రటీస్ భార్య కోపంగా అతని మీద కడవలో తెచ్చిన నీళ్లు కుమ్మరించింది. ఆయన ప్రశాంతంగా ‘ఈ రోజు వాన, ఉరుములు కలిసి వచ్చాయి’ అని శిష్యులతో చె΄్పాడు. ‘ఆమె ఎందుకు కుమ్మరించింది?’ అనే కోణంలోంచి ఆలోచించి తను రాసిన మొదటి కథ ‘సోక్రటీస్ భార్య’ నాకు బాగా నచ్చింది. పద్మజ పురుష ద్వేషి కాకపోయినా ఆ కథలో స్త్రీవాదం స్పష్టంగా ఉంది. ఆమె స్త్రీవాది అనే చె΄్పాలి. పద్మజ చక్కటి ఇల్లాలు. ముందు నేను, తర్వాత పిల్లలు ముఖ్యం. ఆ తర్వాతే మరేదైనా. 1989లో నేను యూరప్ వెళ్తూ తనని కూడా రమ్మంటే ఇద్దరు చిన్నపిల్లల్ని వదిలి రావడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు ఆ జాబితాలో మనవరాలు, మనవడు కూడా చేరారు. తనకి నా మీద ఎంత శ్రద్ధ అంటే ఏ రోజు నేను వేసుకోవాల్సిన బట్టలు ఆరోజు తనే ఇస్తుంది. ఏ కారణంగానైనా అన్నం కొంచెం తక్కువ తింటే తను రుచిగా వండలేదని బాధపడుతుంది. అది కాదని చెప్పినా నమ్మదు. మా ముగ్గురు పిల్లలు కావ్య, ఊహ, లిపి తల్లిని స్నేహితురాలుగా భావిస్తారు. అన్ని మనసు విప్పి ఫ్రీగా చర్చిస్తారు. నాతో మాత్రం అలా కాదు.తమస్విని అనే కలం పేరుతో కౌముది డాట్ నెట్లో ‘సంసారంలో సరిగమలు’ అనే శీర్షికతో 10 ఏళ్ళుగా 100కి పైగా కథలు రాసింది. ఇవన్నీ మన మధ్య కనపడే మధ్యతరగతి మనుషులకి చెందిన కథలే. నా మొదటి పాఠకురాలు పద్మజ. నా రచనలను పత్రికకి పంపే ముందు తనే తప్పులను దిద్దుతుంది– ఈ వ్యాసంతో సహా. ప్రూఫ్రీడింగ్, పుస్తకాలకి పేజ్ మేకప్ తనే చేస్తుంది. పద్మజ తండ్రి ఎం.ఎ. సాంస్క్రిట్ పండిట్గా పని చేసేవారు. ఆయన పిల్లలకి తెలుగుని బాగా నేర్పించారు. ళ ని ల గా, ణ ని న గా పలికితే తను చాలా బాధపడుతుంది. అలాగే, నేను సెన్సిటివ్ కానీ కవిత్వాలు రాయలేను. తను నా అంత సెన్సిటివ్ కాదు కానీ టచింగ్గా ఉండే కవిత్వాలు రాయగలదు. పద్మజకూ నాకూ వయసులో పదహారేళ్ల తారతమ్యం ఉన్నా పద్మజకి నాతో సమానమైన మెచ్యూరిటీ ఉంది. సమానం అన్నానా? తప్పు. ఇంకాస్త ఎక్కువ మెచ్యూరిటీ ఉంది.1996లో తను పీజీ చేయాలని అనుకుంది. నేను అందుకు అభ్యంతరం చెప్పలేదు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎం.ఏ. పొలిటికల్ సైన్స్ లో పీజీ చేసింది. తనకి రాజకీయాల మీద అవగాహన ఉంది. నిత్యం దినపత్రిక చదువుతుంది. కాఫీ తాగే టైంలో దినపత్రిక చదివేప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే చాలా కోపం వస్తుంది. 2000వ సంవత్సరం నుంచి పద్మజే ఆర్థిక వ్యవహారాలు, ఇంటి విషయాలు చూసుకుంటోంది. ఎప్పుడైనా అనుమానం వచ్చినా, సలహా అవసరమైనా నాతో సంప్రదిస్తుంది. పెద్దయ్యాక పిల్లలు ముగ్గురు విదేశాలకు వెళ్లాక మేము ఇప్పుడు ఇద్దరమే ఒంటరిగా ఇంట్లో. అప్పుడప్పుడు ఇద్దరం కలిసి వంట చేయడం ఓ సరదా. మా అమ్మ చివరి దశలో ఆఖరి పదేళ్లు నా దగ్గర ఉన్నప్పుడు ఓపెన్గా పద్మజతో ఆవిడ చెప్తూ ఉండేది ‘నువ్వంటే నాకు ఇష్టం లేదు’ అని. అయినా చివరిదాకా మా అమ్మని పద్మజ ఎంతో సహనంగా శ్రద్ధగా చూసుకుంది. మా అమ్మలో ఆ ద్వేషం పోకుండానే వెళ్ళిపోయింది. కారణం శాఖాభేదం!పద్మజకి వంట చేసుకుని తినడమే ఇష్టం. బయటి భోజనం ఇష్టం ఉండదు. సాధ్యమైనంత వరకు రెస్టారెంట్స్కి వెళ్లడానికి అవాయిడ్ చేస్తుంటుంది ముఖ్యంగా పిల్లల దగ్గరికి విదేశాలకు వెళ్ళినప్పుడు అనేక దేశాలకు చెందిన రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాం పీజా, న్యూడిల్స్ లాంటివి తనకి ఇష్టం ఉండదు. అన్నం మాత్రమే ఇష్టం. నేను చాలా తరచూ మా పిల్లలకి చెప్పే జోకు ‘నాకు ఇది వద్దు’ అంటే చిన్నప్పుడు మీ అమ్మ అది తినలేదు కాబట్టి వద్దు అంటుంది. చిన్నప్పడు ఏం తిన్నదో అదే తింటుంది. కొత్తవి ఏమి తినదు. రెస్టారెంట్కి వచ్చినప్పుడు ఒక్కోసారి ఇంటికి వెళ్లి అన్నం వండుకొని తినే సందర్భాలు కూడా ఉన్నాయి. మల్లాది ముచ్చట్లు అనే టోరీ రేడియో కార్యక్రమం ప్రతి శుక్రవారం రాత్రి 9:30 నుంచి 11:30 దాకా వస్తుంది. ఆ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని మేమిద్దరం కలిసి నిర్వహిస్తున్నాం. ఒక్కోసారి అనిపిస్తుంటుంది, పద్మజని కాక నేను మరొకరిని ఎవరినైనా చేసుకుని ఉంటే బహుశా విడిపోయి, ఈరోజు ఒంటరిగా ఉండేవాడినేమో అని. మేమిద్దరం కలిసి కొనసాగడానికి కారణం పూర్తిగా పద్మజే.మా ఇద్దరిలో నవ్వని వ్యక్తి నేను. ఎప్పుడూ నవ్వే వ్యక్తి పద్మజ. తను మాటకారి. నేను ముభావిని. తను లగ్జరీలని ఇష్టపడుతుంది. నేను మినిమలిస్ట్ని. నేను ఇంగ్లీషు పాత సినిమాలు చూడడానికి ఇష్టపడతాను. తను కొత్తగా వచ్చే సిరీస్ని చూడడానికి ఇష్టపడుతుంది. ఇలా మేము చాలా విషయాల్లో ఉత్తర దక్షిణ ధ్రువాలైనా మా మధ్య ఎలాంటి ఇబ్బందీ లేదు. కారణం ఒకరి పట్ల మరొకరికి గల సహనం.ప్రతి కష్టంలోనూ నాతో...: బాబీ, ప్రముఖ సినీ దర్శకుడునా లైఫ్లో నా వెనకాలే కాదు ముందు కూడా స్త్రీనే ఉంది. ముందు ఉండే స్త్రీ అమ్మ అయితే, వెనకాల ఉండే స్త్రీ నా భార్య అనూష. ఎక్కడో గుంటూరులో ఉండే నాకు చిన్నప్పటి నుంచి సినిమాలకి వెళ్ళడానికి డబ్బులిచ్చి ఎంకరేజ్ చేసింది మా అమ్మ. అయితే ప్రేమలో ఉన్నప్పుడు నేను సినిమాలలోకి వెళ్ళి దర్శకుడిని అవుతా అంటే నా వెనక ఉండి నా వెన్ను తట్టింది నా భార్య. నాకు ముందు... వెనక వీళ్ళు ఉండటం వల్ల నేను ఇంత దూరం రాగలిగాను.అనూషతో ప్రేమలో ఉన్నప్పుడు నేను ఇంట్లో చెప్పుకోలేని సీక్రెట్స్ అన్నీ తనతో చెప్పుకునే వాడిని. ఇప్పుడు తనని పెళ్లి చేసుకున్నాక నేను మనసులో అనుకునే అబద్ధాన్ని కూడా తను ముందే గెస్ చేసి ‘మీ అమ్మానాన్నకి చెప్పినట్టు నాకు చెప్పలేవు’ అని హెచ్చరిస్తుంది. తనకి నేనొక తెరిచిన పుస్తకం. ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలి’ అంటారు కదా. అలా నేను నా కథలన్ని మొదట తనతోనే చెబుతాను. వంద శాతం నిర్మొహమాటంగా బాగుంటే బాగుంది అని బాలేకపోతే బాలేదని చెబుతుంది. కథలే కాదు... ట్యూన్స్, టీజర్స్, ప్రోమోస్ అన్నీ చూపిస్తాను. ఎందుకంటే నా భార్యకి ఏ ఫిల్టర్స్ ఉండవు. ఏదైనా నిజాయితీగా చెబుతుంది. నా క్రియేటివిటీని ఫస్ట్ జడ్జ్ చేసేది తనే. చిరంజీవిగారితో ‘వాల్తేరు వీరయ్య’ మూవీ షూటింగ్ చేస్తుంటే మా నాన్నగారు కాలం చేశారు. మా నాన్న చిరంజీవి గారికి చాలా పెద్ద అభిమాని. ఆ టైమ్ నాకు మోస్ట్ టఫెస్ట్ సిచ్యువేషన్. మా నాన్న లేని లోటు నా భార్య తీర్చింది. నన్ను ముందుకు నడిపింది. ప్రతి రోజు షూటింగే నా గోల్ కింద గుర్తు చేసేది. మీ నాన్నకి చిరంజీవిగారి పై ఉన్న ప్రేమ అందరికీ తెలిసేలా ఒక బ్లాక్ బస్టర్ సినిమా తియ్యమని నన్ను రోజూ మోటివేట్ చేసేది. తన మోటివేషన్ వల్లే నేను అంత పెద్ద సినిమా (‘వాల్తేరు వీరయ్య’) తియ్యగలిగాను. నాన్నకి చిరంజీవి గారి మీద ఉన్న ప్రేమ, నాకు నాన్న మీద ఉన్న ప్రేమే ‘వాల్తేరు వీరయ్య’. అది మా నాన్నకి నేను ఇచ్చిన ట్రిబ్యూట్ అవ్వాలి అంటూ నన్ను ప్రోత్సహించింది నా వైఫ్. నేను ఇంట్లో ఎక్కువసేపు ఉంటే ఆఫీస్ లేదా? అని గుర్తు చేస్తూ ఉంటుంది. వెళ్ళి పని చేసుకో అని ఇండైరెక్ట్ సెటైర్స్ వేస్తుంటుంది,. మోస్ట్ ఆఫ్ ది టైమ్ షూటింగ్ లేనప్పుడు నేను గడిపేది ఇంట్లోనే. నేను, నా కూతురు వైష్ణవి, నా భార్య ఇదే నా ప్రపంచం. నా భార్య ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్. ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో ్రపొఫెసర్గా కూడా చేసింది. నా కోసం, మా కూతురి కోసం తన కెరియర్ శాక్రిఫైస్ చేసి, మమ్మల్ని బాగా చూసుకుంటుంది. ఇల్లు మ్యానేజ్ చేయడం అంటే ఈజీ కాదు. మా అమ్మని చూశాను, మా అక్కని చూశాను. మా అత్తగారిని చూశాను, తరువాత అనూషని చూస్తున్నాను. వీళ్లందరిని చూసిన తరువాత ఇల్లు మెయింటెయిన్ చేసుకోవటంలో ఆడవాళ్ళ తరువాతే ఎవరయినా అని నాకు అర్థం అయ్యింది.నా ప్రతి కష్టంలోనూ నా భార్య అనూష నాతో ఉంది. నేను అయిదు వందలు సంపాదిస్తున్న టైమ్ నుండి నా సంపాదన ఆమెకు తెలుసు. ఘోస్ట్ రైటర్గా నా పేరు పడని దగ్గర్నుంచి నా గ్రోత్ తెలుసు. నేను డైరెక్టర్ అవక ముందే పెళ్లి చేసుకున్నాం. అద్దె ఇళ్ల కోసం ఓనర్ల చుట్టూ తిరగడం, కారు ఈఎంఐ వస్తుంటే భయపడడం, గోల్డ్ లోన్లు పెట్టి రెంట్లు కట్టడం, ఇన్ని కష్టాలు పడుతున్నా ఏ రోజూ నన్ను ఇబ్బంది పెట్టలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్న దాంట్లో హ్యాపీగా బతకాలి అనే మెంటాలిటీతో ఉంటుంది. నా సక్సెస్ వెనకాల ఉండే ప్రశాంతానికి తనే కారణం. -
కలుపు మొక్కలకు భయపడొద్దు
సమాజం మనల్ని ఇలానే ఉండాలని నిర్దేశిస్తుంది. కొన్ని కలుపు మొక్కలు మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తాయి. మన లక్ష్యాలను నెరవేర్చుకోనివ్వకుండా అడ్డంకులు సృష్టిస్తాయి.అయినా ఆగిపోకుండా మహిళలు ధైర్యంగా బతుకుతూ ముందుకు సాగిపోవాలి అంటున్నారు నటి, దర్శకురాలు వరలక్ష్మి.⇒ నా స్కూల్ డేస్లో నేను ఈవ్ టీజింగ్కి గురైన సందర్భాలు చాలా ఎక్కువ. వాళ్లందరికీ నా స్టైల్లో నేను బుద్ధి చెప్పాను. కొందరికి మాటలతో చెబితే పనికి రాదు; అలాంటివాళ్లకు చెంప దెబ్బతో సమాధానం చెప్పడం చాలా అవసరం.⇒ అమ్మాయిలను వేధించేవాళ్లు ఎక్కడున్నా వారికి బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు. కొత్త అమ్మాయిలనూ వేధిస్తారు... బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయిలనూ ఇబ్బందులపాలు చేస్తారు. వాళ్లకు ఎవరూ స్పెషల్ కాదు. నేనైతే సినిమాలో యాక్షన్ రోల్స్ చేసినప్పుడు ఎలా కొడతానో అలాగే రియల్ లైఫ్లోనూ. అయితే ‘అలాంటివాళ్లను ఇలా చేయండి’ అని నేను ఎవరికీ సలహా ఇవ్వను. ఎందుకంటే ఒక్కొక్కరి తీరు ఒక్కోలా ఉంటుంది. కాని నేను చెప్పేదొక్కటే– పరిస్థితి ఏదైనా కావొచ్చు, ధైర్యంగా ఎదుర్కోండి.⇒ నా కెరీర్ ఆరంభంలో నేను ‘ఇన్సెక్యూరిటీ’కి గురయ్యాను. దానికి కారణం సరైన అవకాశాలు రాకపోవడమే. అయితే ఆ అభద్రతాభావం నన్ను మానసికంగా కుంగదీయలేదు. శరత్కుమార్గారి కూతురిగా నాకు ఒక విజిటింగ్ కార్డ్ ఉంటుంది. కాని, నన్ను నేను నిరూపించుకోవాల్సిందే! ఆర్టిస్ట్గా నాకు దక్కే ప్రతి చాన్స్ ద్వారా నన్ను నేను నిరూపించుకుంటూ వస్తున్నాను.⇒ అమ్మాయిలు వాళ్లకు నచ్చినట్లు వాళ్లు ఉండాలి. అమ్మాయిలు సున్నితంగానే ఉండాలి. అప్పుడే అందరికీ నచ్చుతారు. ఇగోయిస్ట్లను ఇష్టపడరని చాలామంది ఫిక్స్ అయిపోతారు. అసలు ఒకరికి నచ్చేట్లు ఉండాలని ఎందుకు అనుకోవాలి? మన వ్యక్తిత్వానికి తగ్గట్టు మనం నడుచుకోవాలి. వేరేవాళ్ల కోసం మన తీరు మార్చుకుంటే మనకంటూ ఒక ఉనికి ఉండదు. సమానత్వం అనేది మనకి ఇక్కడే ఉంది. ఇక మనం ఎందుకు తక్కువ అవుతాం.⇒ మహిళలు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ‘బాడీ షేమింగ్’ ఒకటి. సన్నగా ఉంటే మరీ సన్నగానా? అంటారు. బొద్దుగా ఉన్నా విమర్శిస్తారు. ఇప్పుడు ఒక గదిలో పదిమంది ఉంటే ఐదుగురికి వెజ్ పలావ్ నచ్చుతుంది, మరో ఐదుగురికి నాన్వెజ్ బిర్యానీ నచ్చుతుంది. ఎవరి టేస్ట్ వారిది. అలాగే ఎవరి బాడీ వారిది, ఎవరి చాయిస్ వారిది. దాన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదు. మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలానే ఉండాలి. ఎవరేం అనుకుంటే మనకేంటి? మన వ్యక్తిత్వమే మనం.⇒ కొన్ని విషయాల్లో అమ్మాయిలకు అమ్మాయిలే శత్రువులైపోతారు. చదువుకో! జాబ్ చెయ్! పెళ్లి చేసుకో!– ఇలా సలహాలు ఇస్తారు. ఒకవేళ పెళ్లి చేసుకోలేదనుకోండి, ‘ఇంకా పెళ్లి చేసుకోకపోవడం ఏంటి?’ అంటారు. ఆ అమ్మాయి వెనక కామెంట్ చేస్తారు. ఇలాంటి ఆడవాళ్ల తీరు మారాలి.⇒ సినిమా ఇండస్ట్రీలో నేను ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలే ‘సేవ్ శక్తి’ పౌండేషన్ ఆరంభించేలా చేశాయి. నాకు ఎదురైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొన్నాను. నాలా ఎదుర్కోలేనివాళ్ల కోసమే ఈ ఫౌండేషన్ ఆరంభించాను. డిప్రెషన్కు గురైనవారిని అందులోంచి బయటకు తేవడానికి డాక్టర్స్ సహాయం తీసుకుంటాం. ఇప్పటివరకూ చాలామంది అమ్మాయిలకు హెల్ప్ చేశాం. ‘సేవ్ శక్తి’కి సంబంధించిన వ్యవహారాలను ఎక్కువగా మా అమ్మ ఛాయ చూసుకుంటారు.⇒ స్టేజి మీద నేను సాధారణంగా ఎమోషనల్ అవ్వను. కాని, ఆ రోజు (‘సరస్వతి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్. ఈ సినిమా ద్వారా వరలక్ష్మి దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు) అలా ఎందుకు అయ్యానంటే నటిగా స్టార్ట్ అయి, డైరెక్టర్ స్థాయికి రావడం చిన్న విషయం కాదు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నాకెన్నో అవకాశాలు ఇచ్చింది. అలాంటి ఒక ఇండస్ట్రీ వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు కాస్త ఎమోషనల్గా అనిపించింది. - డి.జి. భవాని


