breaking news
Family
-
టీ తాగుతూ.. పొగ తాగుతున్నారా?
చాలా మంది టీ తాగేటప్పుడు దానికి కాంబినేషన్గా పొగ త్రాగడానికి ఇష్టపడతారు, ముఖ్యంగా పని విరామ సమయంలో. కానీ చాలా మందిలో కనిపించే ఈ సాధారణ అలవాటు వారికి ఏ మాత్రం గమనించని విధంగా వారి శరీరానికి హాని కలిగించవచ్చు. ‘‘నికోటిన్ కెఫిన్ కలిసి మెదడులో తాత్కాలికంగా చురుకుదనాన్ని పెంచుతాయి,దాంతో ఆ డబుల్ స్టిమ్యులేషన్ కూడా ఈ కాంబోను మరింతగా అలవాటు చేసి వ్యసనంగా మారుస్తుంది అని ఫరీదాబాద్లోని మెట్రో హాస్పిటల్లోని గ్యాస్ట్రోఎంటరాలజీ డైరెక్టర్ డాక్టర్ విశాల్ ఖురానా తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన చెబుతున్న ప్రకారం...వ్యసన ఫలం...నిద్రలేమి...నికోటిన్ డోపమైన్ రష్ను ప్రేరేపిస్తుంది, ఇది మెదడు కు ‘మంచి అనుభూతిని కలిగించే’ రసాయనం, అయితే కెఫిన్ నిద్రను ప్రేరేపించే రసాయనమైన అడెనోసి¯Œ ను అడ్డుకుంటుంది. ఈ రెండూ కలిసి పనిచేసినప్పుడు, అవి రెండూ స్వయంగా ఉద్దీపనను పెంచుతాయి అలా రెండింటినీ కలిపి తాగినప్పుడు ఆ కాసేపు మరింత చురుకుదనాన్ని అనుభవించవచ్చు, కానీ మనకు తెలీకుండా మన మెదడుకు ఆ రెండింటినీ కలిపి కోరుకునేలా శిక్షణ ఇస్తున్నామని అర్ధం.గ్రీన్ టీ తో ప్రభావం తగ్గించవచ్చు...టీలో కూడా నికోటిన్ ఉన్నప్పటికీ చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది, అయితే అది ధూమపానంతో పోలిస్తే దాదాపు లేనట్టే. అంతేకాకుండా సిగరెట్తో జత చేసే టీ రకం ఏమిటి అనేది కూడా ముఖ్యమైనదే. గ్రీన్ టీలో బ్లాక్ టీ కంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, తద్వారా ఇది కొంత నికోటిన్ వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కోవడంలో శరీరానికి సహాయపడుతుంది కానీ ఒకటి మాత్రం నిజం ఏ రకమైన: టీ అయినా సిగరెట్ పొగ ప్రభావాలను పూర్తిగా దూరం చేయదు.సిగిరెట్టు మానే ఆలోచన వెనక్కి...ధూమపానం మానాలనుకునేవాళ్లని కూడా ఈ అలవాటు నిరుత్సాహపరుస్తుంది. టీ తాగితే ధూమపానం మానేయడం కష్టం. ‘‘ మెదడు టీ ఆనందాన్ని నికోటిన్ నుంచి వచ్చే కిక్తో అనుసంధానించడం ప్రారంభిస్తుంది. ఒకటి మరొకదానికి ట్రిగ్గర్ అవుతుంది, అందుకే టీ తాగిన ప్రతిసారీ సిగరెట్ తాగాలని కోరుకోవడం ఎక్కువ అవుతుంది.జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం...కెఫిన్ నికోటిన్ రెండూ హృదయ స్పందన రేటు అలాగే రక్తపోటును కూడా పెంచుతాయి. రక్త నాళాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి, కాబట్టి ఈ రెండింటినీ కలపడం గుండె జబ్బులు ఉన్నవారికి మరింత ప్రమాదకరంగా మారుతుంది. టీ కడుపు లో ఆమ్లాన్ని పెంచుతుంది మరోవైపు నికోటిన్ జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తుంది ఇవి రెండూ కలిసిన తర్వాత కడుపు ఉబ్బరం, ఆమ్లత్వం దీర్ఘకాలిక జీర్ణ సమస్యలను కూడా కలిగిస్తాయి, ముఖ్యంగా ఖాళీ కడుపుతో తీసుకోవడం పేగుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది.గొంతుకీ ప్రమాదమే...అలాగే గొంతుపై కూడా దీని ప్రభావం పడుతుంది ‘ధూమపానం గొంతు పొరను చికాకుపెడుతుంది. దానికి వేడి టీ జోడిం^è డం అంటే వేడి మంటను మరింత తీవ్రతరం చేయడమే. కాలక్రమేణా, ఇది దీర్ఘకాలిక గొంతు సమస్యలతో పాటు అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.టీ , సిగరెట్ల మేళశింపు నాడీ వ్యవస్థను అతిగా ప్రేరేపించే, గుండెను శ్రమపెట్టే ప్రేగులను కలవరపరిచే హానికరమైన జంట అనేది నిస్సందేహం కాబట్టి వీలైనంత వరకూ పొగతాగడాన్ని పూర్తిగా మానేయాలి, టీని పరిమితంగా తీసుకోవాలి రెండింటినీ మాత్రం కలిపి తీసుకోవడం మాత్రం పొరపాటున కూడా చేయవద్దు అని వైద్యులు సూచిస్తున్నారు. -
'వంట నూనె వాడకం తగ్గించండి': వరల్డ్కప్ విజేతలతో ప్రధాని మోదీ
భారత ఐసీసీ మహిళల ప్రపంచ కప్ విజేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం అయ్యారు. చారిత్రాత్మక విజయం సాధించినందుకు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు సభ్యులను ప్రధాని అభినందించారు. వారితో సంభాషణ సందర్భంగా దేశంలో పెరుగుతున్న ఊబకాయ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో దేశ పౌరులంతా తమవంతు సాయం అందించాలని కోరారు. జాతీయ ఆరోగ్య చొరవలో భాగంగా నూనె వినియోగాన్ని తగ్గించుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ఫిట్ ఇండియ ఉద్యమం ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. నిజానికి మోదీ ప్రతి భారతీయుడు దైనందిన జీవితంలో ఫిట్నెస్ను అంతర్భాగం చేయడానికి 2019 నుంచి ఈ ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. మన దేశంలో ఊబకాయం పెద్ద సమస్యగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు ఫిట్ ఇండియా ఒక్కటే పరిష్కారమని నొక్కి చెబుతున్నారు. దయచేసి అంతా వంట నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గిస్తే, పైగా కొనుగోలు చేసే సమయం కూడా తగ్గుతుందని అన్నారు. అలాగే భారత మహిళా జట్టుని ఉద్దేశించి..తమ పాఠశాలలను సందర్శించి యువతరాలకు స్ఫూర్తినివ్వాలని సూచించారు. కాగా, గట్టి భద్రతా చర్యల మధ్య ప్రదానమంత్రితో సమావేశం కావడానికి భారత జట్టు మంగళవారమే న్యూఢిల్లీకి చేరుకుంది. అలాగే భాతర జట్టు అద్భుతమైన విజయ సాధించిన వెంటనే మోదీ సోషల్ మీడియా పోస్ట్లో "టోర్నమెంట్ అంతటా భారత జట్టు అసాధారణమైన కృషిని, పట్టుదలను ప్రదర్శించింది. మన క్రీడాకారులందరికి అభినందనలు. ఈ చారిత్రాత్మక విజయం భవిష్యత్తు చాంపియన్ క్రీడలను చేపట్టడానికి ప్రేరేపిస్తుంది." అని పోస్ట్లో పేర్కొన్నారు మోదీ.(చదవండి: అందాల బొమ్మలం కాదు..! వివాదంలో మిస్ యూనివర్స్ పోటీ..) -
అందాల బొమ్మలం కాదు..! వివాదంలో మిస్ యూనివర్స్ పోటీ..
ప్రతిష్టాత్మకమైన మిస్ యూనివర్స్ పోటీలు వివాదంలో చిక్కుకున్నాయి. సాక్షాత్తు ఆతిథ్య దేశ అధికారే ఈ వివాదానికి కారకుడు కావడం దురుదృష్టకరం. ఈ ఘటనతో ఒక్కసారిగా అందాల భామలు..తాము కేవలం అందానికే కాదు, ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమని యావత్తు ప్రపంచానికి చూపించారు. తామంతా ఒక్కటేనని..ఒక్కరికి జరిగిన అవమానాన్ని ఎదుర్కొనేందుకు సాటి అందాల పోటీదారులంతా ముందుకు వచ్చి మద్దతు పలకడం..హర్షించదగ్గ విషయం. పైగా మమ్మల్ని చులకనగా చూస్తే ఊరుకోం అని తమ చేతలతో చెప్పకనే చెప్పారు ఈ సుందరీమణులు.అసలేం జరిగిందంటే..మిస్ మెక్సికో ఫాతిమా భాష్ను మిస్ యూనివర్స్ థాయిలాండ్ డైరెక్టర్ నవత్ ఇట్సారగ్రిసిల్ (60) బహిరంగా అవమానించినట్లు ఆరోపణలు వచ్చాయి. అందాల పోటీకి ఆతిథ్యమిస్తున్న థాయిలాండ్ దేశ అందాల పోటీల అధికానూ ఇలా అనడ సర్వత్ర చర్చనీయాంశమైంది. వారి మధ్య జరిగిన సంభాషణ మొత్తం అధికారిక ఫేస్బుక్ లైవ్ స్ట్రీమ్లో జరిగింది. ఇట్సారగ్రిసిల్ థాయిలాండ్ గురించి ప్రమోషనల్ కంటెంట్ను పోస్ట్ చేయనందుకు మిస్ మెక్సికో బాష్ను విమర్శించాడు. ఇతర పోటీదారుల ముందు ఆమెను "డమ్మీ" అని అవమానించాడు. వారి మధ్య సంభాషణ దాదాపు నాలుగు నిమిషాలు కొనసాగింది. మెక్సికో మీరు ఎక్కడ ఉన్నారు, థాయిలాంగ్కి మద్దతు ఇవ్వడం లేదు, పైగా మీరు మిస్ యూనివర్స్ టీమ్ మాట కూడా ఎందుకు వినడం లేదని గట్టిగా నిలదీశాడు ఇట్సారగ్రిసిల్. తాను అందరితో మాట్లాడుతున్నానని, మీకేంటి సమస్య అని మిస్ మెక్సికో భాష్పై ఫైర్ అయ్యాడు. అందుకామె తనని మహిళగా గౌరవించడం లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. దాంతో కోపంతో ఊగిపోయిన డైరక్టర్ ఇట్సారగ్రిసిల్ ఆమెను బయటకు పంపించమని భద్రతా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాడు. ఈ అనూహ్య ఘటనతో మిగతా పోటీదారులంతా మిస్ మెక్సికో బాష్కు సంఘీభావం తెలుపుతూ ఆమె తోపాటు బయటకొచ్చేసారు.మరికొందరు ఇట్సారగ్రిసిల్పై అరుస్తూ..నిరసన తెలిపారు. దీంతో ఇట్సారగ్రిసిల్ మెక్సికోకు మద్దతు ఇచ్చేవారిని అనర్హులుగా ప్రకటిస్తానంటూ బెదిరింపులకు దిగాడు. పైగా ఎవరైనా పోటీని కొనసాగించాలనుకుంటే కూర్చోండి అని ఆర్డర్ జారీచేయడమే కాదు, నువ్వు బయటకు వెళ్లినంత మాత్రాన ఈ పోటీ ఆగదు, మిగిలిన అమ్మాయిలతో ఈ పోటీ నిరాటంకంగా కొనసాగుతుంది అని దురుసుగా చెప్పాడు. Amazing scenes in Bangkok as Miss Universe organiser Nawat Itsaragrisil tries to prevent a mass walkout of contestants after he had publicly berated Miss Mexico pic.twitter.com/M8GgqBc0gQ— Andrew MacGregor Marshall (@zenjournalist) November 4, 2025 ఈ వ్యాఖ్యలతో మరికొంతమంది పోటీదారులు ఈవెంట్ నుంచి నిష్క్రమించాడరు కూడా. అంతేగాదు పలువురు సుందరీమణులు..ఇది మహిళల హక్కుల గురించి అని..అందుకు అస్సలు ఇలా వ్యవహరించాల్సిన పనిలేదు అంటూ ఇట్సారగ్రిసిల్పై మండిపడ్డారు . అయినా ఒక అమ్మాయిని ఇంత దారుణంగా అనడం, ఆమె గౌరవాన్ని కించపరచడమే అని తిట్టిపోస్టూ బయటకు వెళ్లిపోయారు. ఈ ఘటనపై మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్(ఎంయూఓ) సైతం స్పందించింది. ఈ అందాల పోటీ ప్రతిష్ట అతని ప్రయేయం కారణం తగ్గుతోందని ఫైర్ అయ్యింది. అయినా తాము మహిళల గౌరవం, విలువలను ఉలంఘించడాన్ని అనుమతించం. అతను హోస్ట్గా ఎలా వ్యవహరించాలో మర్చిపోవడం బాధకరం అంటూ చివాట్లుపెట్టింది. అతని ప్రవర్తనా తీరుపై చట్టపరమైన చర్యల తీసుకుంటానని వెల్లడించింది. ఇది చాలమంది మహిళల కలల పోటీ దాన్ని నిరూపయోగంగా మారనివ్వం అని స్పష్టం చేసింది. దాంతో ఇట్సారగ్రిసిల్ దెబ్బకు తను చేసినదానికి క్షమాపణలు చెప్పడమే గాక, చాలా ఒత్తికి గురయ్యి అలా మాట్లాడానంటూ వివరణ ఇచ్చుకున్నాడు. అంతేగాదు ఎవరినైనా చెడుగా, అసౌకర్యం కలిగించేలా మాట్లాడినట్లు భావిస్తే గనుక తనని క్షమించండి అని అభ్యర్థించాడు. అలాగే ప్రత్యేకంగా హాజరైనా 75 మంది అమ్మాయిలను కూడా క్షమాపణలు కోరుతున్నాను అని వేడుకున్నాడు. దీనిపై బాధిత మిస్ మెక్సికో ఫాతిమా బాష్ ఒక ఇంటర్వూలో మాట్లాడుతూ..తన దేశానికి ఒకటి తెలియజేయాలనుకుంటున్నా. "నా గొంతును వినిపించడానికి భయపడను. మనం 21వ శతాబ్దంలో ఉన్నామా..?. అలంకరణ చేసుకోవడానికి, స్టైలింగ్ చేయడానికి, బట్టలు మార్చుకోవడానికి బొమ్మను కాదు. తమ లక్ష్యం కోసం పోరాడే అమ్మాయిల గొంతుకగా ఉండటానికి, నాదేశానికి పూర్తిగా కట్టుబడి ఉన్నానను. అది చెప్పడానికే ఇక్కడకు వచ్చానంటూ భావోద్వేగానికి గురైంది బాష్. కాగా, ఆ తర్వాత పోటీ ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగింది. బుధవారం బ్యాంకాక్లో జరిగిన ఒక కార్యక్రమంలో అందాల సుందరీ మణిలు పాల్గొన్నారు. అలాగే విజేతకు నవంబర్ 21న కిరీటం అందజేయనున్నారు. Y’all heard about the whole Miss Universe drama?Apparently Nawat(one of the directors of MU) openly called out Miss Mexico in a room full of other contestants to shame her but she stood up for herself. He called security to walk her out and other contestants walked out with her pic.twitter.com/1eHLnMHooR— Tobi_lobs (@Landladyeko) November 5, 2025 (చదవండి: బాడీషేమింగ్ చేస్తే తక్షణ శిక్ష తప్పదు!) -
పర్వతమే పరమేశ్వరుడు..!
కంచిలో పృథివీ లింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం... ఈ అయిదు లింగాలను పంచ భూత మహాలింగాలు అని అంటారు. ఈ అయిదు క్షేత్రాలను ఒకేసారి దర్శించుకోవటం మంచిదని చాలా మంది అలా దర్శించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇందులో నాలుగు తమిళనాడులో, ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. దాదాపు 200 కిలోమీటర్ల పరిధిలోనే ఈ ఆలయాలు ఉండటం గమనించదగిన విషయం. వరుసక్రమంలోనే కాకుండా దూరం రీత్యా కూడా అరుణాచలం మధ్యలో నిలుస్తుంది.పంచభూత మహాలింగాల్లో మూడవది అరుణాచలం క్షేత్రం. దీనినే తమిళనాడులో తిరువణ్ణామలై క్షేత్రంగా కూడా పిలుస్తారు. స్వామి వారు అరుణాచలేశ్వరుడు కాగా అమ్మవారు అపిత కుచలాంబా దేవి. సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని వచ్చిన దానివి కాబట్టి నిన్ను ‘అపీతకుచాంబ’ అని పిలుస్తున్నాను అని స్వామివారే చె΄్పారట. అద్భుత శిల్పకళతో అలరారే ఈ ఆలయాన్ని సాక్షాత్తూ దేవశిల్పి విశ్వకర్మ నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. చోళరాజులు పల్లవులు, విజయనగర సార్వభౌములు ఇక్కడ ఆలయాలను ఎంతగానో అభివృద్ధి పరిచారు. ఇరవై అయిదు ఎకరాల్లో నిర్మిత మైన ఈ క్షేత్రం ఎంతో పురాతనమైనది. నాలుగు దిక్కుల్లో ఎత్తయిన గోపురాలు ఉన్నాయి. తూర్పు గోపురం పదకొండు అంతస్తుల్లో అలరారుతుంది. ఆరు ప్రాకారాలతో, ఎన్నో ఉపాలయాలతో, విశాలమైన ప్రాంగణంతో ఉండే ఈ ఆలయానికి నిత్యం దేశమంతటి నుంచి భక్తులు వస్తూ ఉంటారు.ఇక్కడి వెయ్యి స్తంభాల మండపానికి సమీపంలో శివ గంగ తీర్థం ఉంది. అక్కడే రమణ మహర్షి తన ఐహిక బంధాల నుంచి విముక్తి పొందారు. అరుణాచలం క్షేత్రం అంటే రమణ మహర్షిని తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ఆయన్ని సుబ్రహ్మణ్యస్వామి మరో అవతారంగా భక్తులు చెబుతారు. ఇక్కడ దేవాలయానికి ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో అరుణగిరి (పర్వతం) కు కూడా అంతే ప్రాధాన్యం ఉన్నది. ’అ–రుణాచలం’ అనే పదానికి ఐహిక బంధాలను తొలగించే పర్వతం అని అర్థం. సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపమైన ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే జీవితం పరిపూర్ణమవుతుందని నమ్మకం. ఈ క్షేత్రంలో వెలిసిన శివుడు అగ్ని లింగమని, అందుకే ఆలయంలో వేడిగా వుంటుందని అంటారు.ఆలయ విశేషాలుతిరువణ్ణామలైలోని అణ్ణామలయ్యార్ (శివుడు) ఆలయం 24 ఎకరాల స్ధలంలో విస్తరించి వుంది. నాలుగు వైపులా నాలుగు ఉన్నత గోపురాలతో అలరారే ఈ ఆలయం వాస్తు, శిల్ప, నిర్మాణ శాస్త్రాలపరంగా అపురూపమైనది. ఆలయంలో మొత్తం 6 ప్రాకారాలు, 9 గోపురాలు వున్నాయి. ఆలయ ప్రాంగణంలో అనేక మండపాలు, వసారాలు, ఉపాలయాలు కన్నుల పండుగగా దర్శనమిస్తాయి.ఈ గోపురాలలో తూర్పువైపున వున్నదానిని రాజ గోపురమంటారు. ఇదే ప్రధాన ద్వారం. నేలమట్టంమీద 135 అడుగుల వెడల్పు, 98 అడుగుల పొడవు కలిగి, దీర్ఘచతురస్రాకారంలో వున్న ఈ గోపురానికి 11 అంతస్తులున్నాయి. ఇక్కడ తంజావూరు బహదీశ్వరాలయానికన్నా ఎత్తయిన గోపురం నిర్మించాలని, దానికన్నా ఒక అడుగు ఎత్తుగా, అంటే 217 అడుగుల ఎత్తయిన గోపురాన్ని నిర్మించారు. బయటి ప్రాకారానికి వున్న మిగతా మూడు గోపురాలను అమ్మణి అమ్మాళ్ గోపురం, తిరుమంజరం గోపురం, పేయి గోపురం అంటారు. ఇవి 171, 157, 144 అడుగుల ఎత్తులో వున్నాయి. 70 అడుగుల ఎత్తులో వున్న మిగిలిన గోపురాలు లోపల ప్రాకారాలకు వున్నాయి.ఎలా వెళ్ళాలంటే..?కాట్పాడి, చెన్నై మొదలగు తమిళనాడులోని అనేక ప్రదేశాలనుంచేగాక చిత్తూరు, తిరుపతి నుంచికూడా బస్సులున్నాయి. చెన్నై నుంచి 185 కి.మి. దూరంలో ఉంది. చెన్నై నుంచి బస్సు, ట్రైన్ సౌకర్యం ఉంది. చెన్నై లోని కోయంబేడు (సి.యమ్.బి.టి.) బస్సు స్టాండ్ నుంచి అరుణాచలం చేరటానికి 4–5 గంటల సమయం పడుతుంది.గిరి ప్రదక్షిణఇక్కడ గిరి ప్రదక్షిణ విశేషం. అరుణాచలం అర్ధనారీశ్వర రూపమని, దానికి ప్రదక్షిణ చేస్తే శివ పార్వతులకు ప్రదక్షిణ చేసినట్లేనని భక్తుల విశ్వాసం. 14 కి.మీ.ల దూరం ఉండే ఈ ప్రదక్షిణ మార్గమంతా విశాలమైన తారు రోడ్డు, ఇరు ప్రక్కలా ఎత్తయిన వృక్షాలతో సుందరంగా ఉంటుంది. దోవలో అష్టదిక్పాలకుల పేర్లతో ఎనిమిది శివాలయాలు, దుర్గాదేవి, ఆంజనేయస్వామి, ఆది అణ్ణామలై వగైరా అనేక ఆలయాలేగాక, సుప్రసిద్ధ రమణ మహర్షి, శేషాద్రి మహర్షి వంటివార్ల ఆశ్రమాలుకూడా దర్శనీయాలు. భక్తులు ఎంత భక్తి శ్రద్ధలతో ఈ గిరి ప్రదక్షిణ చేస్తారంటే పాదరక్షలు వేసుకోరు. రోడ్డుకి ఎడమవైపే నడుస్తారు. ఇప్పటికీ అనేకమంది సిద్ధపురుషులూ, యోగి పుంగవులూ అదృశ్యరూపం లో గిరి ప్రదక్షిణ చేస్తుంటారని, రోడ్డుకి కుడివైపు వెళ్తే వారికడ్డవుతామని వారి నమ్మకం. ఎన్నో అద్భుతమైన విశేషాలుగల ఈ ఆలయాన్ని దర్శించినవారందరూ తమని తాము అదృష్టవంతులుగా భావిస్తారు. ఇంత అద్భుతమైన ఈ ఆలయం విల్లుపురం – కాట్పాడి రైలు మార్గంలో, చెన్నైకి సుమారు 180 కి.మీ.ల దూరంలో వుంది. (చదవండి: Kashi Manikarnika Ghat Mystery: కాశీలో అంత్యక్రియల సమయంలో బూడిదపై 94 ఎందుకు రాస్తారు..? దాగున్న ఆధ్యాత్మిక రహస్యం) -
దేవుడు ఎలా ఉంటాడో తెలుసా..?
ఒకసారి బాగ్దాదు నగరంలో గొప్ప ధార్మిక సభ జరుగుతోంది. వేలాది మంది ప్రజలు ఆ సభలో పాల్గొన్నారు. అనేకమంది పండితులు ప్రజలను ఉద్దేశించి ప్రవచనం చేస్తున్నారు. అంతలో ఒక వ్యక్తి సభలోకి ప్రవేశించి, పండితులకు ఒక సవాలు విసిరాడు. ‘మీరు చెబుతున్న ప్రకారం, ఈ సృష్టి మొత్తానికి ఒక కర్త ఉన్నాడు. అయన అల్లాహ్, అంటే సృష్టికర్త. మరి ఆయనే సమస్తాన్ని సృష్టించినప్పుడు ‘ఆయన్ని’ ఎవరు సృష్టించారు? ఆయనకు ముందు ఎవరున్నారు?’అని ప్రశ్నించాడు.సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. పండితులు అతని ప్రశ్నకు సమాధానం చె΄్పారు. కాని అతను సంతృప్తి చెందలేదు. పండితులు తల పట్టుకున్నారు. అతనికి అర్ధమయ్యేలా సంతృప్తికరమైన సమాధానం ఎలా చె΄్పాలో వారికి అర్థం కాలేదు. ఆ వ్యక్తి గర్వంగా సభికుల వైపు చూశాడు. అంతలో సభికుల్లోంచి ఓ పదకొండేళ్ళ బాలుడు సమాధానం చెబుతానని ముందుకొచ్చాడు. ఆ వ్యక్తి బాలుణ్ణి చూసి,‘నువ్వు సమాధానం చెబుతావా?’ అంటూ వెటకారంగా నవ్వాడు.ఆ బాలుడు ఏమాత్రం తొణక్కుండా, ‘అవును నేనే.. మీప్రశ్న మరోసారి వినిపించండి’ అన్నాడు. ‘అన్నిటికీ అల్లాయే అంటున్నారు గదా.. మరి అల్లా‹ß కు ముందు ఎవరున్నారు? ’ అని ప్రశ్నించాడు. అప్పుడా బాలుడు, ‘మీకు ఒకటి, రెండు ఒంట్లు వచ్చుగదా..? ఒకటి నుండి పది వరకు లెక్కించండి’. అన్నాడు.‘ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఇదేమి పిచ్చి ప్రశ్న’ అంటూనే ఒకటి నుండి పది వరకు లెక్కించాడు. ‘పది తరువాత..?’ అన్నాడా బాలుడు. ‘పదకొండు..పన్నెండు..’ఇలా ఎంతవరకైనా వెళ్ళవచ్చు.’ అన్నాడా వ్యక్తి. ‘అవును కదా..! అలాగే పది నుండి వెనక్కి లెక్కించండి. ’అన్నాడా బాలుడు. ‘పది..తొమ్మిది..ఎనిమిది..ఇలా .. ఒకటి వరకు వచ్చి ఆగి ΄పొయ్యాడు.‘తరువాత..? లెక్కించండి..’ అన్నాడు బాలుడు. ‘తరువాత ఇంకేముంటుంది. ఏమీలేదు.. సున్నా.. శూన్యం.’ అన్నాడా వ్యక్తి. ‘..కదా..? అల్లాహ్కు ముందు కూడా ఏమీ లేదు.. అంతా శూన్యం. అన్నిటికీ కర్త ఆయనే..’అన్నాడు బాలుడు. సభలో కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ప్రశ్నించిన వ్యక్తి ముఖం వాడిపోయింది. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
కాశీలో అంత్యక్రియల సమయంలో బూడిదపై 94 ఎందుకు రాస్తారు..?
కాశీ లేదా బనారస్గా పిలిచే వారణాసిని మోక్ష నగరం అని కూడా పిలుస్తారు. ఇక్కడ కాశీ, వారణాసి రెండు వేర్వేరు కాదు. వారణాసినే కాశీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రవహించే గంగానది ఒడ్డునే జీవన్మరణాలు కలిసే పవిత్ర స్థలం ఉంది. అదే అత్యంత ప్రసిద్ధిగాంచిన మణికర్ణిక ఘాట్. ఇక్కడే శవాలను దహనం చేసేది. ఇది హరిశ్చంద్రుల కాలం నుంచే నిరంతరం మండుతూనే ఉన్నట్లు చెబుతుంటారు. అంతేగాదు దీన్ని ప్రపంచంలోని అత్యంత మర్మమైన దహన సంస్కార ప్రదేశాల్లో ఒకటిగా పేర్కొంటారు. అయితే ఇక్కడ అంత్యక్రియల అనంతరం జరిగే ఒక తంతు సోషల్ మీడియా దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. అక్కడ చితి చల్లారక ప్రజలు బూడిదపై 94 సంఖ్యను రాస్తారట. అలా ఎందుకు రాస్తారు..దానిలో దాగున్న ఆధ్యాత్మిక రహస్యం ఏంటి వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఇక్కడ వారణాసిలో ఎన్నో ఇతర ఘాట్లు ఉన్నా.. ఈ మర్ణికఘాట్కే అత్యంత ప్రాముఖ్యత ఉంది. దీన్ని పరమ పవిత్రమైన ప్రదేశంగా భక్తులు భావిస్తారు. ముందుగా ఈ ప్రదేశానికే ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం..మర్ణికఘాట్కి ఆ పేరు ఎలా వచ్చిందంటే..హిందూ పురాణాల ప్రకారం సతీదేవి చెవి ఆభరణం(కర్ణ కుండలం) పడిపోయిన ప్రదేశం కాబట్టి ఈ ఘాట్కి మణికర్ణిక అనే పేరు వచ్చింది. అలాగే మరో పురాణ కథనం ప్రకారం శివుడు సుదీర్ఘ ధ్యానంలో నిమగ్నమై ఉన్నప్పుడూ..విష్ణువు తన సుదర్శన చక్రంతో ఇక్కడ పవిత్ర చెరువుని సృష్టించాడని, ఆ చెరువులో శివుడు స్నానం చేసి వచ్చినప్పుడూ అతని చెవిపోగు((మణికర్ణిక) జారిపడి అదృశ్యమైందని అందుకే ఈ ప్రదేశానికి మణికర్ణిక ఘాట్ అని పిలుస్తారని చెబుతుంటారు. అంతేగాదు దీన్ని మహాశ్మశానం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ అగ్నిజ్వాలలు నిరంతరం ఎగిసిపడుతూనే ఉంటాయట. పగలు, రాత్రి అనునిత్యం అంత్యక్రియలు జరుగుతూనే ఉంటాయట. ఇది విముక్తిని ప్రసాదించే ప్రవిత్రమైన ప్రదేశంగా భక్తులు భావిస్తారట.బూడిదపై 94 రాయడానికి కారణం..ఈ మణికర్ణిక ఘాట్లో అంత్యక్రియలు చేసిన వ్యక్తి..అంటే ఆ కార్యక్రమం జరిపే కుటుంబ సభ్యుడు అగ్ని చల్లారక బూడిదపై 94 అనే సంఖ్యను రాస్తారట. ఈ చర్య అక్కడ స్థానిక సంప్రదాయంలో భాగమట. ఈ సంఖ్య మరణించిన వ్యక్తి ఆత్మ విముక్తి కోరికను సూచిస్తుందట. మోక్ష మంత్రంగా '94'ఈ సంఖ్యను అక్కడ స్థానికులు ముక్తి మంత్రంగా పిలుస్తారట. ఆ సంఖ్యను వ్రాసిన తర్వాత అతడికోసం దుఃఖిస్తున్న కుటుంబ సభ్యుడు ఆత్మను స్వర్గం వైపు నడిపించమని శివుడిని ప్రార్థిస్తాడట. తర్వాత చితిపై నీటి కుండను పగలు కొడతాడు. ఇది అంత్యక్రియల ఆచారం ముగింపుని సూచిస్తుంది.ఈ సంఖ్యలో దాగున్న ఆధ్యాత్మిక రహస్యం..హిందూ శాస్త్రాల ప్రకారం మానవుడి జీవితాన్ని 100 కర్మలు నడిపిస్తాయట. వాటిలో 94మనిషి చేతుల్లో ఉన్న కర్మలు. మిగిలిన ఆరు మాత్రం దైవాధీనంలో ఉంటాయి. జీవితం, మరణం, లాభం, నష్టం, కీర్తి, అపకీర్తి అనే ఆరు కర్మలు బ్రహ్మచే ముందే నిర్ణయించబడినవి, పైగా మానవ నియంత్రణకు మించినవట. మిగిలిన 94మనిషి చేతితో నిర్మించిన మార్గాలగా చెబుతారు. అంటే మనిషి ఆలోచనలు, చర్యలు, ధర్మం, పాపం లాంటి ఈ 94 సంఖ్యల్లో ఉంటాయి. మణికర్ణిక ఘాట్లో దహనమవుతున్నప్పుడు ఆ కర్మలు అగ్నిలో కరిగిపోతాయని, మిగిలేది దేవుని నిర్ణయమని నమ్మకం. అందుకే ఆ సంఖ్యను రాయడం అనేది దివ్య సమర్పణతో పాటు జీవన సమీకరణం కూడా అని స్థానిక పండితులు చెబుతున్నారు.అందువల్లే చితి చల్లారక బూడిదపై 94 అనే సంఖ్యను రాసి.. ఈ మానవ లక్షణాలకు పునర్జన్మ చక్రం నుంచి విముక్తి కోరూతూ..శివుడిని ప్రార్థిస్తారట. ఈ ఆచారం కేవలం మణికర్ణిక ఘాట్లోని దహన సంస్కాల వద్ద మాత్రమే అనుసరిస్తారట. దీని గురించి ఏ హిందూ గ్రంథంలోనూ ప్రస్తావించలేదట. అక్కడ స్థానికుల నుంచి పరంపరగా సాగుతన్న సంప్రదాయమట. అంతేగాదు. ఈ సంఖ్య'94' రాయడం అనేది మోక్షానికి ప్రతీకాత్మక అభ్యర్థన అని భక్తుల ప్రగాఢ విశ్వాసం, నమ్మకం కూడా.(చదవండి: Chithira Thirunal Balarama Varma: 'చిత్తర అట్టవిశేషం'..!మాలధారులు సందర్శనం కంటే ముందు..!) -
బాల స్టార్టప్... బ్రహ్మాండం!
ఎంటర్ప్రెన్యూర్షిప్కు ఏజ్తో పనేమిటి! బెంగళూరుకు చెందిన ఇద్దరు బాలికలు, ఒక బాలుడు ‘ఎకోవాలా’ అనే స్టార్టప్ను ప్రారంభించి జిగురు, కత్తెర ఉపయోగించకుండా పర్యావరణహితమైన కాగితపు సంచులను తయారు చేస్తున్నారు. నెలకు రూ.10 రూపాయల సబ్స్క్రిప్షన్తో కస్టమర్లకు ప్రతి ఆదివారం ‘ఎకోవాలా’ నుంచి రెండు చేతిసంచులు అందుతాయి.‘చిన్న వయసులో మంచి ఆలోచన చేశారు అని చాలామంది ప్రశంసిస్తున్నారు. సబ్స్క్రిప్షన్ ఉన్నవారు అదనపు బ్యాగ్లు అడగవచ్చు. వీటి గురించి తెలియని వారికి ఫ్రీ శాంపిల్ బ్యాగులు ఇస్తాం. ఇప్పటికంటే సబ్స్క్రిప్షన్ల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది’ అంటుంది ఫౌండర్లలో ఒక బాలిక.‘ఇవి మేము తయారు చేసిన బ్యాగ్లు’ అంటూ ఉత్సాహంగా ఫొటోలకు పోజ్ ఇచ్చారు’ ఎకోవాలా యజమానులు. వీరి స్ఫూర్తిదాయకమైన ఫొటోను ‘ఎక్స్’లో షేర్ చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ‘ఎకోవాలా’ స్టార్టప్ గురించి ప్రశంస పూర్వక కామెంట్ రాశారు. ఎంతోమంది నెటిజనులు ‘ఎకోవాలా’ ఫౌండర్స్ను ప్రశంసించారు.‘ఇది కేవలం స్టార్టప్ కాదు. నెలకు రూ.10కి మన ఇంటికి చేరువయ్యే పర్యావరణ బాధ్యతలలో ఒక పాఠం’ అని ఒకరు రాశారు. ‘ఈరోజుల్లో చాలామంది పిల్లలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్కు అతుక్కుపోయి బుర్రకు పనిచెప్పడం లేదు. అలాంటి వారికి ఎకోవాలా ఫౌండర్స్ ఆదర్శంగా నిలుస్తారు’ అని మరో యూజర్ స్పందించారు. View this post on Instagram A post shared by Startups Talk India (@startupstalkindia) (చదవండి: Pari Bishnoi Success Story: ఐఏఎస్ అయ్యాను ఇలా..! అదే నా గెలుపు మంత్ర..) -
అలా చేస్తేనే విజయం తథ్యం..! ఐఏఎస్ పారి బిష్ణోయ్ సక్సెస్ స్టోరీ
యూపీఎస్సీ ప్రయాణంలో ఎన్నో ప్రతికూలతలు, ఎదురుదెబ్బలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా నిశ్శబ్ద పోరాటంతో ఐఏఎస్ సాధించింది పారి బిష్ణోయ్(Pari Bishnoi ). ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో తాను ఎదుర్కొన్న ఒత్తిడి, తన ప్రయాణంలో అత్యంత కష్టమైన దశ గురించి వివరించింది. యూపీఎస్సీలో మొదటి ప్రయత్నంలో విఫలం అయినప్పుడు రాజస్థాన్లోని తన స్వస్థలానికి వెళ్లింది పారి. ప్రపంచం నుండి తనను తాను దూరం చేసుకొని ఒంటరి ప్రపంచంలోకి వెళ్లిపోయింది. తట్టుకోలేని ఒత్తిడిలో బాగా తినేది. దీంతో 30 కిలోలకు పైగా బరువు పెరిగింది! మానసిక భారంతో పాటు శారీరక భారం కూడా తనను భయపెట్టింది. దీంతో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇచ్చింది. పొద్దుటే లేచి వ్యాయామాలు చేసి బరువు తగ్గింది. మనసు తేలిక పడింది. తేలిక పడిన మనసు తిరిగి లక్ష్యం వైపు దృష్టి సారించింది.‘ఈసారి ఎలాగైనా సాధించాల్సిందే’ అని తనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. పరీక్ష ప్రిపరేషన్కు సంబంధించిన వ్యూహాన్ని మెరుగుపరుచుకుంది. దృఢనిశ్చయంతో అనుకున్నది సాధించింది.పారి బిష్ణోయ్ షేర్ చేసిన వీడియో ఇప్పటికే పది లక్షల లైక్లను దాటింది. View this post on Instagram A post shared by Pari Bishnoi (@pari.bishnoii) (చదవండి: మందు పెట్టడం, కక్కించడం... రెండూ అపోహలే!) -
బాడీషేమింగ్ చేస్తే తక్షణ శిక్ష తప్పదు!
మామూలుగానైతే భార్య మొబైల్ నంబరును సేవ్ చేసుకోడానికి ‘జానూ’, ‘సోనా’ అనో లేదా ‘బంగారం’ అనో... ఇలా రకరకాల ముద్దు పేర్లు పెట్టుకుంటుంటారు. మరికొందరు శిరీషకు ‘సిరి’ అనీ, దీపికకు ‘దీపూ’ అంటూ షార్ట్కట్లో షార్ట్ పేర్లూ పెట్టుకోవడం మనకు తెలిసిన విషయమే. కాపురంలో కొద్దికాలం గడిచాక ఆమెలో నచ్చని అంశాలేవైనా కనిపించినా సదరు ముద్దుపేర్లకు బదులుగా తన కోపాన్నీ, కసినీ సైలెంటుగా వెల్లడించుకునేలా ‘దెయ్యం’ అనో, ‘రాక్షసి’ అంటూ వయొలెంటు పేర్లు పెట్టుకోవాలనుకున్నా అలా చేయకపోవడమే మంచిదంటూ టర్కీలో జరిగిన ఓ ఉదంతం తెలుపుతోంది. టర్కీలో ఓ ప్రబుద్ధుడికి భార్య మీద కోపం వచ్చింది. ఆమె కాస్తంత లావుగా ఉండటంతో ఆమె పేరును ‘టాంబిక్’ అంటూ సేవ్ చేసుకున్నాడు ఆ మహానుభావుడు. అంతే... ఆ అంశం మీద అతడికి జరిమానా విధిస్తూ... అతడి వల్ల తన భార్యకు కలిగిన మనోవేదనకు గాను పరిహారం, విడాకులూ మంజూరయ్యాయి. ఇంతకీ ‘టాంబిక్’ అంటే టర్కీలో స్థూలకాయాన్ని (ఛబ్బీ) తెలిపే పదం. ఇది కేవలం స్థూలకాయాన్ని సూచించే పదం మాత్రమే కాదు... ఏ ‘బండ’దనో, ‘మొద్దు’దనో, ‘లడ్డు’దనో... ఇలా కాస్తంత దురర్థమో, నిందార్థమో ఇచ్చేలాంటి వాడుక మాట కావడంతో... అలా సేవ్ చేసుకున్న ఆ భర్తకు కోర్టులో మొట్టికాయలు తప్పలేదు. పైగా ఓ అమ్మాయి స్థూలకాయాన్ని ఎగతాళి చేసేలా ఆమె పేరును అభ్యంతరకరమైన పదాలతో సేవ్ చేసుకున్నందుకు ఆ భర్తకు భారీ జరిమానా విధించింది అక్కడి కోర్టు. అంతేకాదు.. పరోక్ష దూషణే అయినా... ఫోన్లో అలాంటి అభ్యంతరకరమైన మాటతో భార్యపేరు సేవ్ చేసుకున్నందున ఆమెకు కలిగిన మనోవేదనను పరిగణనలోకి తీసుకుని వెంటనే విడాకులు సైతం మంజూరు చేసింది టర్కీ కోర్టు. (చదవండి: మందు పెట్టడం, కక్కించడం... రెండూ అపోహలే!) -
మందు పెట్టడం, కక్కించడం... రెండూ అపోహలే!
మా పెళ్లయి ఆరు సంవత్సరాలయింది. ఇద్దరు పిల్లలు. మాది అన్యోన్య దాంపత్యమే. అయితే. ఇటీవలే ఆయనకు ఒకావిడతో పరిచయం అయింది. అప్పటినుంచి నన్నూ, పిల్లలనీ పట్టించుకోవడం లేదు. ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి రావడం, వెళ్లడం.... అదేమని అడిగితే, నా ఇష్టం అని సమాధానం చెబుతారు. నామీద ఎంతో ఇష్టంతో నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా నాతో ఉన్నాయన ఈ మధ్య నాకు క్రమేపీ దూరమై మరో మహిళకు దగ్గరవుతున్నారు. మా బంధువులు ఇది తెలుసుకుని ఆయనకు ఆమె మందుపెట్టి తనవైపు తిప్పుకున్నదని, అందుకే ఆమె వ్యామోహంలో పడిపోయి ఉంటాడని చెబితే రెండుసార్లు మందు కూడా కక్కించాం. అయినా ఆయనలో ఎలాంటి మార్పూ రాలేదు. మళ్లీ ఇంకోసారి మందు కక్కించమంటున్నారు. అసలు నిజంగా ఒక వ్యక్తిని మందుపెట్టి ఇలా లోబరచుకోవడం జరుగుతుందా? మేము ఎన్నిసార్లు కక్కించాలి?– స్వరాజ్యలక్ష్మి, తణుకుమందుపెట్టడం, మందు కక్కించడం రెండూ ఫార్సే! అనాదిగా మనలో నాటుకు΄ోయిన మూఢనమ్మకాలకు ఇది నిదర్శనం తప్ప వీటిలో ఏమాత్రం నిజం లేదు. విషప్రయోగం చే సి, ఒక వ్యక్తిని హత్య చేయవచ్చేమోగాని, ఒక వ్యక్తిని లొంగదీసుకోవడానికి మనసు మార్చి మరొకరివైపు మళ్లించడానికి మందులంటూ ఏమీ లేవు. ఉండవు. మనకున్న కొన్ని నమ్మకాల వల్ల మందు పెట్టడం, మంత్రం వేయడం, చేతబడి చేయించడం లాంటివి ఉన్నాయని మన పూర్వీకులు మనకు నూరి΄ోశారు. ఈ మూఢనమ్మకాలను ఆధారం చేసుకుని మందు పెట్టే వారు కొందరు, ఆ పెట్టిన మందును కక్కించే స్పెషలిస్టులు కొందరూ తయారయ్యారు. ఎప్పుడో కొన్ని రోజుల కిందట పెట్టిన మందులు మాకులూ ఇన్నాళ్లు కడుపులో ఉందే అవకాశమే లేదు. అది జీర్ణమైనా అవాలి లేదా విరేచనం ద్వారా రెండు రోజుల్లో బయటపడాలే తప్ప అన్నేసి రోజులు అలాగే లోపల అంటిపెట్టుకుని΄ోయే అవకాశమే లేదు. శాస్త్రీయమైన ఇలాంటి నిజాలు తెలియక చాలామంది అవన్నీ నిజమని మీలాగా అ΄ోహపడుతుంటారు. ఇప్పటికయినా మీరు ఆ పెట్టని మందును కక్కించే ప్రయత్నాలు విరమించి, మీ ఆయన ఎందుకలా మూడోవ్యక్తి వైపు ఆకర్షితులవుతున్నారో ఆలోచించండి. మీలో నచ్చనిది, ఆవిడలో నచ్చినది ఏదైనా ఉందేమో మీకు మీరుగా ఆలోచించండి లేదా ఓర్పుగా నేర్పుగా ఆయన నుంచి తెలుసుకుని నిదానంగా ఆయనను మళ్లీ మీవైపు తిప్పుకునే ప్రయత్నం చేయండి. కొన్నిసార్లు మీలో ఎలాంటి నెగటివ్స్ లేకపోయినా, కొందరు మగవారు మనస్తత్వరీత్యా ఇలా ఇతరులవైపు ఆకర్షితులవుతారు. అదే నిజమైతే, మీరు ఇద్దరూ కలిసి మానసిక నిపుణులను సంప్రదిస్తే, వారు మరింత లోతుగా పరిశీలించి ఇరువురికీ కౌన్సెలింగ్ చేసి మీ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తారు. ఆల్ ది బెస్ట్!డా. ఇండ్ల విశాల్ రెడ్డి,సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.( మీ సమస్యలు,సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com)(చదవండి: -
అడవి – ఆమె
చిన్నప్పుడు ‘అనగనగా ఒక అడవి ఉంది’ లాంటి కథలు మాత్రమే కాదు... అడవులు పర్యావరణానికి ఎంత ప్రాణప్రదమో చెప్పే కథలెన్నో విన్నది రీటా. కట్ చేస్తే... రీటా బెనర్జీ ఇప్పుడు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన వైల్డ్లైఫ్ ఫిల్మ్మేకర్. ‘అదిగో...అడవి మాట్లాడుతోంది వినండి’ అంటాయి ఆమె చిత్రాలు. గ్రీన్ ఆస్కార్ (పాండా అవార్డ్)లాంటి ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్లు అందుకుంది.రీటా బెనర్జీకి అడవి చిరకాల నేస్తం. వైల్డ్లైఫ్ ఫిల్మ్మేకర్గా మూడు దశాబ్దాల ప్రయాణంలో అడవితో ఆమెకు ఎంతో అనుబంధం ఉంది. అడవి లోతుపాతులు తెలిసిన సూక్ష్మగ్రాహి. ది టర్టిల్ డైరీస్, ది వైల్డ్ మీట్ ట్రయల్, ది అమూర్ ఫాల్కన్ స్టోరీ, ఏ షాల్ టు డైఫర్... మొదలైన చిత్రాలలో అడవి సూక్ష్మరూపం నుంచి విశ్వరూపం వరకు చూపించింది.ఎ షాల్ టు డై ఫర్టిబెటన్ జింకకు ముప్పు పొంచి ఉంది. ఈ జింక ఉన్నిని కోసి షాతుష్ శాలువాలు నేస్తారు. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. షాతుష్ శాలువాల వ్యాపారం నిషేధించినప్పటికీ చాటుమాటుగా జరుగుతూనే ఉంది. వైల్డ్లైఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ యానిమల్ వెల్ఫేర్ కశ్మీర్లోయలో నిర్వహించిన సర్వేలో షాతుష్ శాలువాల తయారీలో 14,293 మంది వరకు పాల్గొంటున్నారని తేలింది. జమ్మూ కశ్మీర్ వణ్య్రపాణుల సంరక్షణ చట్టంలోని లొసుగులు ఉపయోగించుకొని అక్రమంగా షాతుష్ శాలువాలు నేస్తున్నారు. ఈ అక్రమాలు ఎందుకు కొనసాగుతున్నాయి అనేదాని గురించి ‘ఎ షాల్ టు డై ఫర్’ చిత్రాన్ని తీసింది రీటా బెనర్జీ.పర్యావరణం, వన్య్రపాణుల చిత్రాలకు సంబంధించిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవం సీఎంఎస్లో ఈ చిత్రం ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో టెక్నికల్ ఎక్స్లెన్స్ అవార్డ్ గెలుచుకుంది.శక్తిమంతమై దృశ్యభాషపంచ్ డైలాగ్లకు కాదు ‘పవర్ ఆఫ్ విజువల్ వొకాబులరీ’కి అధిక ప్రాధాన్యత ఇస్తుంది రీటా. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ప్రొఫెసర్లు. ప్రకృతి ప్రేమికులు. చిన్న వయసు నుంచి పర్యావరణ హిత విషయాలను పిల్లలకు చెబుతుండేవారు. ప్రమాదంలో ఉన్న పాములను రక్షించేవాడు తండ్రి. వారి ఇంటి వెలుపల ఉన్న గుల్మొహర్ చెట్టుకు పక్షిగూళ్లు ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. కాలేజీ రోజుల్లో రీటాకు పాత ఆగ్ఫా అనలాగ్ కెమెరాను బహుమతిగా ఇచ్చాడు తండ్రి. ఆ కెమెరా తనకు కొత్తదారిని చూపించింది. ఫిల్మ్మేకింగ్లోకి రావడానికి ఆ పాత కెమెరా తొలి మెట్టు అయింది. డిగ్రీ పూర్తయిన తరువాత ‘రివర్బ్యాంక్ స్టూడియోస్’లో చేరింది. ప్రముఖ పర్యావరణవేత్త మైక్ పాండే నడుపుతున్న స్టూడియో అది.కెమెరా లెన్స్లో నుంచి ప్రతిసారీ రీటాకు కొత్త ప్రపంచం కనిపించేది.గ్రీన్హబ్ నెట్వర్క్అస్సాంలోని తేజ్పూర్లో ‘గ్రీన్హబ్ నెట్వర్క్’ ప్రారంభించిన రీటా, ఈశాన్య భారతంలోని మారుమూల గ్రామాల యువత పర్యావరణ అంశాలను డాక్యుమెంట్ చేసేలా తీర్చిదిద్దింది. ‘అడవి నుంచి ఎన్నో విషయాలను నేర్చుకోవడానికి ఫిల్మ్మేకింగ్ ఉపకరిస్తుంది. చెట్టు నుంచి పుట్ట వరకు ప్రతిదీ అడవికి తమ వంతుగా సహాయపడుతుంది. అవి అడవితో పాటు వృద్ధి చెందుతాయి. ఈ సమష్టి వృద్ధి అందమైనది. ఎన్నో విషయాలు నేర్చుకోదగినది’ అంటుంది రీటా.అరుణాచల్ప్రదేశ్లోని నైషీ తెగ ప్రజలకు జంతువులతో అనుబంధం ఉన్నప్పటికీ, మాంసం కోసం వాటిని వేటాడుతారు. వాటి ఈకలు, ఎముకలను అమ్ముకుంటారు. ఇలాంటి విషయాలెన్నో ‘ది వైల్డ్ మీట్ ట్రయల్’ చిత్రం ద్వారా చూపించింది రీటా. ఈ చిత్రం పాండా అవార్డ్ గెలుచుకుంది. ‘వేట అనేది పరిశ్రమ స్థాయికి చేరి రాష్ట్రాల సరిహద్దులను దాటింది. వన్య ప్రాణులకు వేట ఎలా ముప్పుగా మారిందో మా చిత్రం ద్వారా చూపాం’ అంటుంది రీటా.నేషనల్ జాగ్రఫిక్ అశోకా అవార్డ్, సీఎంఎస్ పృథ్వీరత్న అవార్డ్, ఆర్బీఎస్ ఎర్త్ హీరోలాంటి ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన అవార్డులతో పాటు మూడు గ్రీన్ ఆస్కార్ అవార్డ్లు అందుకుంది రీటా బెనర్జీ.వెలగాలి ఆశాదీపాలుఏమాత్రం ఇక ఆశ లేదు అని మనం ఆగిపోతే నిజంగానే ఏమీ జరగదు. ఆశాదీపాలు వెలిగితేనే ఆ వెలుగులో సమస్యలకు పరిష్కారాలు చూపే కొత్త దారులు కనిపిస్తాయి. ఒక లక్ష్యం అంటూ ఏర్పాటు చేసుకొని పనిచేస్తుంటే ఎక్కడో ఒకచోట తప్పకుండా ఫలితం దక్కుతుంది. అపనమ్మకాలతో కాకుండా ఏదీ చేసినా గట్టి విశ్వాసంతో చేయాలి. సమస్యలలాగే వాటి పరిష్కారాలు కూడా ఎల్లప్పుడూ ఉంటాయి. అయితే ఆ పరిష్కారాల వైపు మనం దృష్టి పెడుతున్నామా లేదా అనేది అసలు సమస్య. ఉదాహరణకు... తీ ర్రపాంతాలలో నివసించే ప్రజల మాట మనం నిజంగా వింటున్నామా? వారితో కలిసి పనిచేస్తున్నామా? ఆ అనుభవాల నేపథ్యంలో సరిౖయెన నిర్ణయాలు తీసుకుంటున్నామా లేదా అనేది ఆలోచించాలి.– రీటా బెనర్జీ -
సరిగమల్లో నవ మాసాలు
స్త్రీ గర్భం దాల్చాక శిశు జననం వరకూ ఎన్నో ఆనంద ఘడియలు, అన్నే ఆందోళనలు. తల్లి ఆరోగ్యమూ, బిడ్డ ఆరోగ్యమూ కాపాడుకోవాలి. తల్లితో లోపలి బిడ్డ బంధం బలపడాలి. ఇవన్నీ సంగీతం వల్ల సాధ్యమవుతాయంటోంది చెన్నైకి చెందిన మ్యూజిక్ టీచర్ దివ్యలక్ష్మి. గర్భం దాల్చిన తల్లులకు శాస్త్రీయ సంగీతం నేర్పేందుకు దివ్య తయారు చేసిన ఆరు నెలల కోర్సుకు కాబోయే తల్లులు సరిగమలతో బదులిస్తున్నారు. వివరాలు...దివ్యలక్ష్మి కమలాకన్నన్కు ఈ ఐడియా తన కూతురిని చూశాక వచ్చింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్ చదివి ఆ తర్వాత బాల్యం నుంచి నేర్చుకుంటున్న కర్నాటక సంగీతంలోనే తన జీవితాన్ని నిమగ్నం చేయాలని నిశ్చయించుకున్న దివ్య లక్ష్మి మెడ్రాస్ యూనివర్సిటీ నుంచి సంగీతంలో పట్టా తీసుకుంది. ఆ తర్వాత సౌత్ చెన్నైలో ఆమె ఎన్నో సంగీత ప్రదర్శనలు ఇవ్వడమే కాక అక్కడి కిల్పార్క్ గార్డెన్లో ‘ఆరోహణ’ పేరుతో సంగీత పాఠశాల నెలకొల్పింది. కర్నాటక, హిందూస్తాని, ఇన్స్ట్రుమెంటల్ సంగీతాలలో ఇక్కడ శిక్షణ ఇస్తూ గుర్తింపు పొందిన దివ్యలక్ష్మి లాక్డౌన్ రావడంతో డీలా పడింది. ఇన్స్టిట్యూట్ మూసేసింది. ఆ సమయానికి ఆమె గర్భంతో ఉంది. ఇంట్లో తనే సంగీత సాధన చేస్తూ వెళ్లింది.కుమార్తె ఆరోహి పుట్టాక ఆ పాప ఒకటిన్నర సంవత్సరాల వయసుకే విపరీతంగా జ్ఞాపకశక్తి ప్రదర్శించడం దివ్యలక్ష్మికి ఆశ్చర్యం కలిగించింది. మూడున్నరేళ్లు వచ్చేసరికి ఆరోహి వయొలిన్ చేత పట్టుకుని సరిగమలు పలికించడం ఇంకా సంతోషపెట్టింది. ఆరోహి తన కడుపులో ఉన్నప్పుడు తాను సాధన చేసిన శాస్త్రీయ సంగీతం పాప తెలివితేటల ఎదుగుదలకు ఉపయోగపడిందని దివ్యలక్ష్మికి అనిపించింది. గర్భవతులకు శాస్త్రీయ సంగీతం నేర్పిస్తే, వారు డెలివరీ అయ్యేంత వరకు శాస్త్రీయ సంగీతం వింటూ ఉంటే పుట్టబోయే బిడ్డకు అన్ని విధాలా ఉపయోగమని అర్థం చేసుకుంది. ఈ విషయాన్ని మరింతగా నిర్థారించుకోవాలని నిశ్చయించుకుంది.మ్యూజిక్ థెరపీకొన్ని అధ్యయనాల ప్రకారం మ్యూజిక్ థెరపీ కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యానికి, గుండె స్పందనలకు బాగా పని చేస్తుందని నిర్థారితమైంది. సంగీతం గర్భిణుల్లో ఉండే యాంగ్జయిటీ, లో–బీపీ వంటి సమస్యలను దూరం చేయగలదని స్వీయ పరిశీలన ద్వారా అర్థం చేసుకున్న దివ్యలక్ష్మి తమ కాలనీలో ఉన్న నలుగురైదుగురు గర్భవతులకు ప్రయోగాత్మకంగా శాస్త్రీయ సంగీతం నేర్పించసాగింది. వారికి ఆ పాఠాలు ఆహ్లాదం కలిగించడమే కాదు ప్రసవాలు కూడా కాంప్లికేషన్స్ ఎదురవకుండా జరిగాయి. దాంతో ఆరునెలల కోర్సు తయారు చేసిన దివ్యలక్ష్మి మళ్లీ సంగీత పాఠశాల తెరిచి ఇప్పుడు గర్భిణులకు సంగీత పాఠాలు చెబుతోంది.ఆమె దగ్గర నేర్చుకోలేకపోయినా, ఉన్నచోట నేర్చుకోలేకపోయినా, గర్భిణులు తరచూ ఆహ్లాదపరిచే సంగీతం వినడం, మంచి పాటలు హమ్ చేసుకుంటూ ప్రశాంతంగా గడపడం వల్ల మాత్రం కచ్చితంగా మేలు జరుగుతుంది.నాదమే వైద్యం‘సంగీతంలో నాదం ఉంటుంది. ఆ నాదం గర్భిణీ స్త్రీ శరీరంలోని నీటిలో అనునాదం పుట్టిస్తుంది. ఆమె ఆరోగ్యాన్ని సమతుల్యం చేయడమే కాకుండా పిండస్థ శిశువు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అంతే కాదు... ఇలా సంగీత పాఠాల కోసం వచ్చే గర్భిణుల మధ్య ఒక స్నేహం ఏర్పడి ఒకరికొకరు అన్నట్టుగా ఉండటంతో ఆందోళనలు పూర్తిగా పోతాయి’ అంటోంది దివ్యలక్ష్మి. -
మమ్దానీ లవ్ స్టోరీ : ఎవరీ ‘మోడ్రన్ యువరాణి డయానా’
న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) చారిత్రాత్మక విజయం యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది. ఆది నుంచి చురుకైన ఉపన్యాసాలు, పదునైన విమర్శలతో దూసుకుపోయిన మామ్దానీ ఘన విజయం సాధించారు. న్యూయార్క్ సిటీకి తొలి ముస్లిం మేయర్గా, తొలి ఇండియన్–అమెరికన్ మేయర్గా చరిత్ర సృష్టించాడు. అయితే ఆయన ఈ విజయం వెనుక ప్రముఖంగా నిలిచింది ఎవరో తెలుసా?జోహ్రాన్ మమ్దానీ భార్య కళాకారిణి, యానిమేటర్, రైటర్ రమా దువాజీ (Rama Duwaji). భర్త విజయంలో తన వంతు ప్రచారంలో కీలక భూమిక నిర్వహించారు. ప్రచార లోగోలు, ప్రచారం మొత్తాన్ని ఆకర్షణీయంగా రూపొందించడంలో ఆమెదే కీలక పాత్ర. లోగోలో బోల్డ్ ఎల్లో, నారింజ, నీలం రంగుల్లో బ్రాండింగ్ అనేది ఆయన ఉద్యమానికి పర్యాయపదంగా మారిందని సీఎన్ఎన్ నివేదిక తెలిపింది. ఇదీ చదవండి: మేయర్గా జోహ్రాన్ మమ్దానీ : తల్లి మీరా నాయర్ తొలి స్పందనతాను ఎక్కువగా వెలుగులోకి రాకుండానే రమా దువాజీ నిశ్శబ్దంగా తెర వెనుక ఉంటూనే భర్త విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. డెమొక్రాటిక్ సోషలిస్ట్ విలక్షణమైన ప్రచార గుర్తింపు, సోషల్ మీడియా ఉనికిని రూపొందించడంలో తన ఘనతను చాటుకున్నారు. ఎన్నికల రోజు వరకు జరిగే చర్చలు, ప్రచార కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉండేవారు.. అలాగే మేయర్ రేసు గురించి ఆన్లైన్లో అరుదుగా పోస్ట్ చేసేవారు. అయితే మమ్దానీ ఆశ్చర్యకరమైన ప్రాథమిక విజయం తర్వాత జూన్లో ఆమె ఎన్నికలకు సంబంధించిన ఏకైక సోషల్ మీడియా పోస్ట్ విశేషంగా నిలిచింది. “ఇంతకంటే గర్వం కారణం ఏముంటుంది.” ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చారు. చదవండి: పనస కాయ చిప్స్తో ఏడాదికి రూ. 12 లక్షలుతాజాగా మంగళవారం నాటి ఓటింగ్ సమయంలో మమ్దానీ తన ఓటు వేసే క్రమంలో భర్తకు అండగా నిలిచారు. ది డైలీ షోలో కనిపించినప్పుడు భర్త పక్కనే కొండంత అండగా ఉండటంతోపాటు, క్వీన్స్లోని ఫారెస్ట్ హిల్స్ స్టేడియంలో ప్రతినిధి అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్, సెనేటర్ బెర్నీ సాండర్స్తో కలిసి మమ్దానీ తన చివరి ర్యాలీ ప్రసంగం సమయంలో కూడా 10వేల మంది మద్దతుదారులతో పాటు ఆమె కూడా కనిపించింది. దువాజీ న్యూయార్క్ కు చెందిన సిరియన్-అమెరికన్ ఆర్టిస్ట్ దువాజీ. నాలుగేళ్ల క్రితం న్యూయార్క్కు వెళ్లినా ఆమె డల్లాస్లో పెరిగారు. దుబాయ్లో చదివారు. ఆమె అనేక జర్నల్స్ను కూడా ప్రచురించారు. న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీకి మమ్దానీ ఎన్నికైనపుడు 2021లో దువాజీ, మమ్దానీ డేటింగ్ యాప్ హింజ్లో కలుసుకున్నారు. వారి మొదటి డేట్ బ్రూక్లిన్లోని యెమెన్ కేఫ్ అయిన క్వాహ్వా హౌస్లో జరిగింది. మమ్దానీ తన మేయర్ ప్రచారాన్ని ప్రారంభించడానికి కొన్ని రోజుల ముందు, అక్టోబర్ 2024లో వారు నిశ్చితార్థం చేసుకున్నారు. గత డిసెంబర్లో దుబాయ్లో వేడుకలు జరుపుకున్న తర్వాత, ఫిబ్రవరిలో లోయర్ మాన్హట్టన్లోని ఒక సాధారణ కోర్టు హౌస్ వేడుకలో వారు వివాహం చేసుకున్నారు. దువాజీ సోషల్ మీడియా ఫీడ్ అంతా సిరామిక్, ఇలస్ట్రేషన్ వర్క్స్తో నిండి ఉంటాయి. పాలస్తీనాతో సంఘీభావాన్ని వ్యక్త పరిచే అనేక రచనలు కూడా చూడొచ్చు. ఆమెకు పెరుగుతున్న ప్రజా ఆకర్షణ, ఆదరణపై స్పందించిన స్నేహితులు మెడ్రన్ డే ప్రిన్సెస్ డయానా అంటూ ముద్దుగా పిలుచుకోవడం విశేషం. -
పనస కాయ చిప్స్తో ఏడాదికి రూ. 12 లక్షలు
పండిన పంటకు గిట్టుబాటు ధర దొరకనప్పుడు, డిమాండ్ లేనప్పుడు ఆయా పంటలను రోడ్డుమీద కుప్పలు కుప్పలుగా పారబోయడం, తగల బెట్టడం లాంటి బాధాకరమైన దృశ్యాలను చూస్తూ ఉంటాం. అలాంటపుడు ‘అయ్యో.. రేటు వచ్చేదాకా వీటిని భద్రపరిస్తే ఎంత బాగుండు’ అని అనుకుంటాం. అలా పుట్టిన ఆలోచనే ఆధునిక పద్దతులకు బాటలు వేస్తుంది. అదే ఇద్దరు అన్నాదమ్ముళ్లకు లక్షల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. పదండి వారి విజయ గాథ ఏంటో తెలుసుకుందాం.మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలోని గగన్బావ్డా తహసీల్లో, తేజస్-రాజేష్ పొవార్ అనే ఇద్దరు అన్నదమ్ముల సక్సెస్ స్టోరీ ఇది. అది జాక్ఫ్రూట్ (పనస) చిప్స్ బిజినెస్తో. సాధారణంగా పనసకాయలు ఒకసారి కాతకొచ్చాయంటే విపరీతమైన దిగుబడి వస్తుంది. కొల్హాపూర్ జిల్లాలోని ఒక గ్రామంలోని దాదాపు ప్రతి రైతు తమ పూర్వీకుల నుండి పనస చెట్లు వారసత్వంగా వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే వాటి ద్వారా మంచి జీవనోపాధిని కూడా పొందుతున్నారు. ప్రతీ ఏడాది ఉత్తిత్తి కూడా చాలా అధికంగా ఉండేది. దీంతో రైతులు వాటిని కోయలేక, మార్కెట్ చేసుకోలేక, మండీకి రవాణా ఖర్చులు కూడా భరించలేక వాటిని అలాగే పారవేసేవారు.తేజస్, రాజేష్ తల్లిదండ్రులకు జాక్ఫ్రూట్ చెట్లు బాగానే ఉండేవి. ఒక ఏడాది పనసకాయలుబాగా రావడంతో కొల్హాపూర్లో నివసించే బంధువులైన సంగీత, విలాస్ పొవార్ ఇంటికి తీసుకెళ్లారు.మా దగ్గర చాలా కాయలున్నాయి. వృధాగా పార వేస్తున్నామనే విషయాన్ని వారితో షేర్ చేసుకున్నారు. ఈ సందర్బంగా వాటిని పారవేయడానికి బదులు చిప్స్గా తయారు చేయాలని, మార్కెట్లో డిమాండ్ ఉందని వారు సూచించారట. అంతే అక్కడినుంచి వారి జీవితం మరో మలుపు తిరిగింది.15 కిలోల చిప్స్తో మొదలుదీంతో కుమారులతో కలిసి వారు రంగంలోకి దిగారు. తొలి ప్రయత్నంలో దాదాపు 15 కిలోల చిప్స్ను తయారు చేసి కొల్హాపూర్లో ఇంటింటికీ వెళ్లి విక్రయించారు. డిమాండ్ పెరిగినప్పటికీ, ఇంటింటికీ డెలివరీ అందించడం సాధ్యం కాలేదు. దీంతో ఐటీఐ చదువు అయిన వెంటనే తేజస్ పనస చిప్స్ తయారీపై మరింత దృష్టి సారించాడు. ప్యాకేజింగ్ చేయడానికి కొన్ని ప్రాథమిక యంత్రాలను ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే నేరుగా హోల్సేల్ వ్యాపారులు రిటైలర్లకు విక్రయించే పద్దతులను ప్రారంభించారు. ఐదుగురు కుటుంబ సభ్యులతో పాటు మరో పది పన్నెండు మందికి ఉపాధి కల్పిస్తున్నారు. జాక్ఫ్రూట్ కోత జనవరి-ఫిబ్రవరిలో ప్రారంభమైజూలై-ఆగస్టు వరకు కొనసాగుతుంది. ఏటా 4,000 కిలోల జాక్ఫ్రూట్ను ప్రాసెస్ చేసి 1,000 కిలోల వేఫర్లను ఉత్పత్తి చేస్తారు.మార్కెట్ డిమాండ్ బట్టి కేజీ చిప్స్ను రూ. 900 నుంచి రూ. 10 వేల వరకు విక్రయిస్తారు. ఇక జాక్ఫ్రూట్ పోలీలు కేజీకి రూ. 700 చొప్పున అమ్ముడవుతాయి. అలా ఏడాది కాలంలో రూ. 12 లక్షలు సంపాదిస్తున్నారు. అంతేకాదు తమ పని పనసపంట వృధాను అడ్డుకోవడంతోపాటు, రైతులకు అధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతోందని, ఉద్యోగ అవకాశాలను సృష్టించింది అంటూరు తేజస్ సంతోషంగా.పనస చెట్లు 30 అడుగుల నుండి 70 అడుగుల వరకు పెరుగుతాయి. పెద్ద పెద్దకాయలతో దిగుబడి కూడా భారీగా వస్తుంది. దీనికి తోడు భారీ బరువు, కాయలనుంచి వచ్చే జిగట రబ్బరు పాలు కారణంగా వాటిని కోయడం చాలా ఛాలెంజ్ అంటారు తేజస్. అందుకే రైతు లనుంచి కిలోకు రూ. 30 నుంచి రూ. 70 వరకు చెల్లించి కొనుగోలు చేస్తారట. అలాగే పనసకాయలను ప్రత్యేక పద్ధతిలో కోసేలా నిపుణులను ఏర్పాటు చేసుకుంటారు. అనంతరం వాటిని చిప్స్, ఇంకా పండిన పండ్లను ఫనాస్ పో (భక్ష్యాలు) జాక్ఫ్రూట్ గుజ్జు, బెల్లం, గోధుమ పిండితో కలిపి తీపి ఫ్లాట్బ్రెడ్ తయారు చేస్తారు. చదవండి: మేయర్గా జోహ్రాన్ మమ్దానీ : తల్లి మీరా నాయర్ తొలి స్పందన పనసకాయలో పోషక విలువలు, ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అందుకే దీన్ని మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా భావిస్తారు ఇపుడు ఏ పెళ్లిళ్లు, పంక్షన్లలో చూసినా పనస కాయ బిర్యానీ చాలా ఫ్యామస్. జాక్ఫ్రూట్ కబాబ్లు, బిర్యానీలు, ఇతర రెడీ-టు-కుక్ ఉత్పత్తులకు, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ ఉంది.భారతదేశ జాక్ఫ్రూట్ ఉత్పత్తుల మార్కెట్ విలువ రూ. 1252 కోట్లు. రానున్న ఐదేళ్లలో దాదాపు రూ. 1580 కోట్లకు పెరుగుతుందని చౌదరి చరణ్ సింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ (CCSNIAM) నివేదిక పేర్కొంది. -
‘షట్డౌన్’ తెచ్చిన ఆహార సంక్షోభం
ప్రస్తుతం అమెరికాలో ఆహార సంక్షోభం తలెత్తింది. ఈ మాట వినడానికే వింతగా ఉన్నా... వాస్తవం! అక్కడ ప్రస్తుతం ‘షట్డౌన్’ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ షట్డౌన్ ప్రభావం అనేక రంగాలపై పడింది. తాజాగా వివిధ రాష్ట్రాలలో ఆహార సంక్షోభా నికి దారి తీసింది. ప్రధానంగా వాణిజ్య రాజధాని అయిన న్యూయా ర్క్పై పడింది. ఫెడరల్ ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆహార సాయం నిలిచిపోయింది. దీంతో ఆ రాష్ట్రం ‘స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ’ని ప్రకటించింది. ఫెడరల్ ప్రభుత్వ షట్డౌన్ అమెరికాలోని కోట్లాది మంది అల్పాదాయ కుటుంబాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ అల్పాదాయ కుటుంబాలకు జీవనాధారమైన ‘సప్లి మెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్’ లేదా ‘ఫుడ్ స్టాంప్స్’ ప్రయోజనాలు అందకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. అమెరికాలో ఈ ప్రోగ్రామ్ ద్వారా దాదాపు నాలుగున్నర కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు. వీరిలో ఎక్కువమంది పేద వారే! ఇదిలా ఉంటే, నిధుల కొరత కారణంగా నవంబరు నెల ప్రయోజనా లను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు నిలిపివేయాలని ఇటీవల రాష్ట్ర ఏజెన్సీ లను అమెరికా వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. కాగా ఆహార సంక్షో భాన్ని పరిష్కరించాలన్న చిత్తశుద్ధి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు లేదని గవర్నర్ కేథీ హోచుల్ ఆరోపించారు. చట్టబద్ధంగా ఆమోదించిన ఎమర్జెన్సీ ఫండ్ను విడుదల చేయడానికి ట్రంప్ సర్కార్ నిరాకరిస్తోందని కేథీ ఘాటు ఆరోపణలు చేశారు. ఆహార సంక్షోభాన్ని పరిష్కరించడానికి అమెరికాలోని అనేక రాష్ట్రాలు సొంతంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ జాబితాలో లూసియానా, వెర్మంట్, న్యూ మెక్సికో ముందు వరుసలో ఉన్నాయి.ఇదీ చదవండి : మేయర్గా జోహ్రాన్ మమ్దానీ : తల్లి మీరా నాయర్ తొలి స్పందనఅమెరికా ఫెడరల్ ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రతి ఏడాది తప్పనిసరిగా ఒక బడ్జెట్ను లేదా తాత్కాలిక ఖర్చులను అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు అంటే అక్టోబరు ఒకటో తేదీలోగా కాంగ్రెస్ ఈ బడ్జెట్ను ఆమోదించాల్సిఉంటుంది. అలా జరగకపోతే, ప్రభుత్వంలో అత్యవసరం కాని సేవలు తాత్కా లికంగా నిలిచిపోతాయి. దీనినే ‘ప్రభుత్వ షట్డౌన్’ అంటారు. వాస్తవానికి ప్రభుత్వ సొమ్ము వృ«థా కాకుండా చూడాలనే సదుద్దేశంతో షట్డౌన్ చట్టాన్ని తొలి రోజుల్లో తీసుకువచ్చారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ సొమ్ము వృథా కాకుండా చూడాలనే నియమాన్ని అన్ని రాజకీయ పార్టీలూ పక్కన పెట్టి... తమ విధానపరమైన డిమాండ్లను నెరవేర్చుకోవడానికి బడ్జెట్ ఆమోదాన్ని అడ్డుకుంటున్నాయి. అయితే సామాన్య అమెరికన్లు మధ్యలో నలిగి పోవడం గమనార్హం.– ఎస్. అబ్దుల్ ఖాలిక్, సీనియర్ జర్నలిస్ట్ -
మేయర్గా మమ్దానీ: తల్లి తొలి స్పందన
ప్రముఖ సినీ దర్శకురాలు మీరా నాయర్ (Mira Nair) తన కుమారుడు జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన నేపథ్యంలో తొలిసారి స్పందించారు. తన కుమారుడి సంచలనాత్మక విజయంపై ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఆమె సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట సందడి చేస్తోంది.కుమారుడు జోహ్రాన్ మమ్దానీ విజయంపై మీరా నాయర్, బాలీవుడ్ దర్శకురాలు జోయా అక్తర్ ఇన్స్టా పోస్ట్ను షేర్ చేశారు. హార్ట్, బాణసంచా ఎమోజీలతో "జోహ్రాన్ యు బ్యూటీ" అనే శీర్షికతో ఆమె స్టోరీని రీ పోస్ట్ చేశారు. అమెరికాలో, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి కీలకమైన న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమ్దానీ విజయంపై జోయా అక్తర్ ప్రశంసలు కురిపించారు."జోహ్రాన్ మమ్దానీ 34 ఏళ్ల వయసులో అధికారికంగా NYC మేయర్ రేసులో గెలిచారు" అంటూ కొనియాడారు. కాగా ఉగాండాలో జన్మించిన మమ్దానీ, ప్రఖ్యాత చరిత్రకారుడు మహమూద్ మమ్దానీ , మీరా నాయర్ దంపతుల కుమారుడు.జోహ్రాన్కు ఐదేళ్ల వయసున్నప్పుడు ఆ కుటుంబం దక్షిణాఫ్రియాలోని కేప్టౌన్కు చేరుకుంది. రెండేళ్ల తర్వాత అమెరికాలోని న్యూయార్క్లో స్థిరపడింది. జోహ్రాన్ మమ్దానీకి 2018లో అమెరికా పౌరసత్వం లభించింది. బ్రాంక్స్ హైసూ్కల్ ఆఫ్ సైన్స్తోపాటు బౌడిన్ కాలేజీలో విద్యాభ్యాసం చేశాడు. 2017లో డెమొక్రటిక్ సోషలిస్టు ఆఫ్ అమెరికా అనే సంస్థలో చేరాడు. తర్వాత డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా 2020, 2021, 2022, 2024లో క్వీన్స్ 36వ జిల్లాకు ప్రతినిధిగా న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. తాజాగా న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. తద్వారా న్యూయార్క్ సిటీకి మొట్టమొదటి ముస్లిం మేయర్గా, తొలి ఇండియన్–అమెరికన్ మేయర్గా చరిత్ర సృష్టించాడు. -
దేవ దీపావళి దేవతలకూ పర్వదినమే!
చంద్రమా మనసో జాతః – చంద్రుడు (సృష్టికారకుడైన) విరాట్ పురుషుడి మనసు నుండి పుట్టాడు – అని ఋగ్వేద వాక్యం. అందుకే, సముద్రపు ఆటుపోట్లకూ, అమా వాస్య – పూర్ణిమలకూ ఉన్న సంబంధం లాగే, భూమి మీద మనుషుల మనసుల పని తీరు తీవ్రతకూ, ఆకాశంలో చంద్రబింబం వృద్ధి క్షయాలకూ కాదనలేని సంబంధం కనిపిస్తుంది. మానసిక రోగ చికిత్సా నిపుణులు కూడా మద్దతునిచ్చే మాట ఇది.నిండు పున్నమి దినాలలో మనిషి మనసుకు చురుకు ఎక్కువ. పున్నమి నాళ్ళలో, అటు రసభావాల వైపుగానీ ఇటు ఆధ్యాత్మికత వైపుగానీ మనసు ఎప్పటికంటే ఎక్కువ తీవ్రతతో స్పందిస్తుంది. అందుకే సాధకులకూ, భక్తులకూ, యోగులకూ పౌర్ణమి ప్రత్యేక విశిష్టత గల తిథి. అది మంత్రోపదేశాలకూ, ఉపాసనలకూ, తీవ్రమైన ధ్యానాలకూ మహత్తరమైన ముహూర్తం. పున్నమి అంటేనే పొంగిపోయే మనసు, శరత్కాల పూర్ణిమ అంటే మరీ ఉరకలెత్తు తుంది. శివకేశవులిరువురి అర్చనకూ సమానంగా ప్రశస్తమైనది కార్తిక పౌర్ణమి. ఆ పర్వ దినాన, మనసు పరుగునూ, చురుకునూ మంత్ర జపాల వైపు, ఇష్టదేవతారాధన వైపు మళ్ళిస్తే మరింత ఫలప్రాప్తి పొందవచ్చునని పెద్దల మాట.కార్తిక పూర్ణిమ మనుషులకే కాదు, దేవతలకు కూడా పవిత్రమైన పర్వదినమని పురాణాలు చెబున్నాయి. ఆస్తికావళికి ఆధ్యాత్మిక రాజధాని అయిన కాశీ క్షేత్రంలో, కార్తిక పూర్ణిమను ‘దేవ దీపావళి’గా పరిగణిస్తారు. వారణాసిలో గంగా తీరాన అన్ని ఘాట్లనూ దీపాలతో అలంకరించటంతో, గంగ ఒడ్డు లోకాతీతంగా ప్రకాశిస్తుంది. దేవతలు వారణాసికి వచ్చి గంగామాతను ఘనంగా అర్చించి వెళతారని ఆస్తికుల విశ్వాసం. కార్తిక దీపాలూ, జ్వాలాతోరణాలు, దేవ దీపావళుల లాంటి నైమిత్తిక సంప్రదాయాలతోనూ; అర్చనలూ, జపతపాలూ, అభిషేకాలూ, ధానధర్మాలతోనూ, ఆస్తికులు తమ మనసుకు నచ్చిన మార్గంలో, తమతమ ఇష్ట దేవతలను కొలుచుకొని, విశేషమైన అనుగ్రహం పొందటానికి అనుకూలమైన రోజు కార్తిక పూర్ణిమ. అలాగే, సాధకులు తమలో అనవరతం ప్రకాశించే ఆత్మజ్యోతి వైపు దృష్టి కేంద్రీకరించేందుకూ అది అనువైన రోజు. – ఎం. మారుతి శాస్త్రి -
చెట్లు తప్పు చేయవు..చెట్లను బతికిస్తున్నాడు
‘చెట్టే కదా అని నరికివేయకండి. దానికి ప్రాణం ఉంది. శక్తి ఉంది. పదిమందికి మేలు చేసే గుణం ఉంది అని గ్రహించండి’ అంటున్న సత్తెయ్య కుప్పకూలిన చెట్లు తిరిగి లేచేలా, పచ్చదనంతో నవ్వేలా చేస్తున్నాడు. ట్రీ ట్రాన్స్లొకేషన్ విధానం ద్వారా చనిపోయిన చెట్లకుప్రాణం పోస్తున్నాడు...అది అందరి బాధ్యతమొక్కలు నాటడం, చెట్లను కాపాడుకోవడం అనేది ఏ ఒక్కరి బాధ్యతో కాదు. అది అందరి బాధ్యత. ‘నేను ఒక్కరిని తలచుకుంటే ఏం అవుతుంది!’ అని ఎవరికి వారు నిరాశపడడం కంటే ‘నాకు తోచింది నేను చేస్తాను’ అని ఎవరికి వారు అనుకుంటే సమాజానికి, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. ట్రీ ట్రాన్స్లొకేషన్కు సంబంధించిన అవగాహన పర్యావరణ ప్రేమికులకే కాదు సామాన్య ప్రజలకు కూడా ఉండాలి. – సుంకిసాల సత్తయ్య తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ఇటిక్యాల గ్రామానికి చెందిన సుంకిసాల సత్తయ్య పెద్ద చదువులు చదువుకోలేదు. ఇంటర్మీడియెట్ వరకు బైపీసీ చదువుకున్న సత్తయ్యకు చెట్లు, జీవవైవిధ్యం. పర్యావరణ విషయాలపై ఆసక్తి ఎక్కువ. ‘చెట్లు కూడా మనలాంటి జీవులే’ అంటాడు.బతుకుదెరువు కోసం దుబాయ్ వెళుతూ వెళుతూ... ‘ఇప్పటిలాగే మీరు ఎప్పుడూ పచ్చగా వర్థిల్లాలి’ అని మనుషులకు చెప్పినట్లే చెట్లకు కూడా చెప్పి వెళ్లిపోయాడు. దుబాయ్కి వెళ్లి తిరిగి వచ్చిన సత్తయ్య తనకు ఇష్టమైన ఎన్నో చెట్లు నరికివేసి ఉండటాన్ని చూసి తల్లడిల్లిపోయాడు. నరికిన చెట్లను ఎలాగైనా బతికించాలని పట్టుదలగా ముందుకు కదిలాడు. సత్తయ్య బాధపడుతున్న తీరు, పట్టుదల కొద్దిమందికి ఆశ్చర్యంగా అనిపించింది.‘చెట్లను కొట్టేయడం మామూలే కదా, ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు?’ అని అడిగారు.‘చెట్టు మనిషి కాదు కదా!’ అని కూడా అన్నారు. అప్పుడు సత్తెయ్య ఇలా అన్నాడు... ‘తెలిసో తెలియకో మనిషి తప్పుచేస్తాడేమోగానీ చెట్టు ఎప్పుడూ తప్పు చేయదు. పదిమందికి ఉపకారమే చేస్తుంది. అలాంటి చెట్లను నరికితే బాధ కలగదా!’చెట్టును బతికించడానికి చేయూత ఇవ్వండి...‘అయ్యా ఇదీ పరిస్థితి. చెట్లను బతికించే పనిలో మీ చేయి కూడా ఉండాలి’ అని ఎంతోమంది రైతులు, దాతలను అడిగాడు. అలా వారి సహకారంతో ఎకరం భూమిలో ట్రీ ట్రాన్స్లొకేషన్ చేపట్టి సుమారు 40 మహావృక్షాలకు ప్రాణంపోశాడు. ఇది తెలంగాణలోనే మొట్టమొదటి ట్రాన్స్లొకేషన్. గ్రామంలోని వాగు పక్కన ఎకరం భూమిలో గత ఏడాది ఆగస్టులో చెట్లకు ప్రాణం పోసే కార్యక్రమం ప్రారంభం అయింది. సుమారు 30 చెట్లను బతికించారు. ట్రాన్స్లొకేషన్ చేసిన ఎకరం భూమిలో తనకు సహకరించిన చెన్నమనేని హిమవంతరావు, కాటిపల్లి నారాయణరెడ్డి, సుంకిసాల సత్తయ్య, కొక్కు శేఖర్, కొమ్ముల రాధ, సింగని వీరేందర్ పేర్లను ఆయా చెట్ల బోర్డులపై రాయించాడు.ప్రతి పండుగ... మొక్కలు నాటే పండుగ‘ఇక నా బాధ్యత పూర్తయింది’ అనుకోలేదు సత్తెయ్య. ‘మొక్కలు నాటాలి. నాటించాలి’ అని ప్రతిజ్ఞ తీసుకున్నాడు. గ్రామంలో ప్రతి ఒక్కరితో మొక్కలు నాటించాలనే లక్ష్యంతో ఎనిమిది వేల మొక్కల వరకు నాటించాడు. గ్రామంలో ఏ పండగ వచ్చినా మొక్కలు నాటేలా కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు.– నాగమల్ల శ్రీకర్, సాక్షి, రాయికల్, జగిత్యాల జిల్లా -
ఆ నియామకం మీ హక్కు కాకున్నా... మీరు ఆ ఉద్యోగానికి అర్హులే!
మా అమ్మగారు ఒక ప్రభుత్వ కార్పొరేషన్లో పనిచేసేవారు. ఇంకో 3 సంవత్సరాలు సర్వీసు ఉండగానే ఆమె చనిపోయారు. ఇది జరిగి కూడా 2 ఏళ్ళు కావస్తోంది. మా నాన్నగారు చిన్న వ్యాపారస్తులు. ఆయనకి 68 ఏళ్లు. మా అమ్మగారు పోయాక మనస్తాపంతో ఆయన వ్యాపారం సరిగా చేయలేక΄ోతున్నారు. రేపో మాపోవ్యాపారం మూతపడేలా ఉంది. నేను డిగ్రీ చదివాను కానీ నిరుద్యోగిని. అందువల్ల మా అమ్మగారి ఉద్యోగం నాకు ఇవ్వవలసిందిగా దరఖాస్తు చేశాను. ఇది జరిగి ఏడాదిపైనే అయినప్పటికీ ఇంకా ఎటువంటి ఉత్తర్వులూ రాలేదు. సంబంధిత అధికారులను అడిగితే ఏదో ఒక కారణం చూపి ఆఫీసు చుట్టూ తిప్పుకుంటున్నారు కానీ ప్రయోజనం లేదు. మా అమ్మ గారి ఉద్యోగం నాకు వస్తుందా? –హరికృష్ణ, రాజమండ్రి సానుభూతి లేదా కారుణ్య నియామకం (Compassionate Appointment) అనేది మానవతా దృక్పథంతో ఇచ్చే తాత్కాలిక ఉపశమనం మాత్రమే కానీ, అది ఎవరి వారసత్వ హక్కు కాదని జస్టిస్ దీ΄ాంకర్ దత్తా, జస్టిస్ పీకే మిశ్రాలతో కూడిన ద్విసభ్య సుప్రీంకోర్టు బెంచ్ ఇటీవలే ఇచ్చిన ఒక తీర్పులో పేర్కొంది. అంతేకాక, సానుభూతి నియామకాలలో పరిగణించవలసిన అంశాలను, 10 న్యాయ సూత్రాలను కూడా సూచించింది. అందులో భాగంగా చెప్పిన కొన్ని ముఖ్యమైన సూత్రాలు : సానుభూతి నియామకం అనేది ప్రజా ఉ;eధికి (అందరికీ సమానంగా రావాల్సిన ఉద్యోగ అవకాశాలకు) ఒక మినహాయింపే తప్ప హక్కు కాదు.సానుభూతి నియామకం కోసం ప్రభుత్వం లేదా ఆ యాజమాన్యం/సంస్థ చట్టబద్ధమైన – నిర్దిష్టమైన నియమాలు, ఆదేశాలు జారీచేయాలి. అవి లేకుండా నియామకం చేయడం చట్టవిరుద్ధం. ఉద్యోగి అకస్మాత్తుగా మరణించడం లేదా ఆరోగ్య కారణాలతో పనిచేయలేకపోవడం (మెడికల్ అన్ ఫిట్) వల్ల కుటుంబం పడే ఆర్థిక సంక్షోభాన్ని తీరుస్తుందే తప్ప, ఇతర సందర్భాల్లో ఈ పథకం వర్తించదు. ఇలాంటి నియామకాలు ఆలస్యం కాకుండా త్వరగా ఇవ్వాలి, ఎందుకంటే కుటుంబం ఎదుర్కొనే కష్టాలకు తక్షణ ఉపశమనమే దీని ఉద్దేశ్యం. ∙ఇది ‘‘సైడ్ డోర్ ఎంట్రీ’’గా పరిగణించబడుతుంది కాబట్టి, నియమాలను కఠినంగా అమలు చేయాలి. ఇది శాశ్వత హక్కు కాదు. అభ్యర్థి సంబంధిత నియమాల్లో ఉన్న అర్హతలు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ∙కుటుంబం నిజంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందా లేదా అన్నదే ప్రధానం. కుటుంబ పరిస్థితిని పరిగణించకుండా ఇచ్చే నియామకాలు చట్టబద్ధం కావు. కారుణ్య నియామకం కోసం దరఖాస్తు ఆ ఉద్యోగి మరణం లేదా అశక్తత తర్వాత తక్షణమే ఇవ్వాలి. సంవత్సరాల తర్వాత దరఖాస్తు చేస్తే, ఆ కుటుంబానికి తక్షణ అవసరం లేదన్నట్టుగా పరిగణించాల్సి వస్తుంది. నియమాలు అనుమతిస్తే తప్ప, చిన్నవాడైన అభ్యర్థి పెద్దవాడయ్యేవరకు ఉద్యోగాన్ని అలాగే ఉంచరాదు. ఫ్యామిలీ పెన్షన్, ఆరోగ్య బీమా వంటి పెన్షన్ బెనిఫిట్ స్కీం కింద లభించే నెలవారీ చెల్లింపులు సానుభూతి నియామకానికి అడ్డం కావు.పైన చెప్పిన నియామకాల్లో మీకు ప్రతికూలంగా ఏమీ లేవు. ఆర్థికంగా కూడా మీకు ఇబ్బందులు ఉన్నట్లు ఉన్నాయి కాబట్టి, ఆ విషయాన్ని మీ దరఖాస్తులో ప్రస్తావించారనే అనుకుంటున్నాను. పైగా మీరు మీ అమ్మగారు మరణించిన వెంటనే దరఖాస్తు కూడా చేసుకున్నారు. పైన పేర్కొన్న నియమాలలో మీరు సరిపోకపోతే తప్ప, మీకు ఉద్యోగాన్ని తిరస్కరించే హక్కు ఆ సంస్థవారికి లేదు. ఒకవేళ ఇంకా ఆలస్యం చేస్తే, త్వరితగతిన మీ నియామకంపై నిర్ణయం తీసుకోవాలని కోరుతూ మీరు హైకోర్టును ఆశ్రయించటం ఉత్తమం.ఇదీ చదవండి: దిగుబడుల్లో అంతరాలెందుకుశ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. -
దిగుబడుల్లో అంతరాలెందుకు
వరి, గోధుమ, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, పండ్లు తదితర పంటల దిగుబడి, ఉత్పత్తి వ్యయంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మధ్య ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి. 1960 నుంచి 2023 మధ్యకాలంలో సాగు భూముల విస్తీర్ణం, భూసారం తగ్గిపోవటం, ఎరువుల వాడకం, పంట దిగుబడుల్లో వివిధ దేశాల మధ్య ఎన్నెన్నో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. అందుకు గల కారణాలేమిటి? వ్యవసాయం, ఆహార భద్రతల విషయంలో భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? అధిక జనాభా భారంతో ఉండే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయంలో ఇప్పటికీ దిగుబడులు పెంచుకోవటానికి గల అవకాశాలు, మార్గాలేమిటి? ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఏ.ఓ.) తాజాగా ప్రకటించిన గణాంకాలతో ప్రత్యేక కథనం. 12,000 సంవత్సరాల క్రితం వ్యవసాయం ప్రారంభమైంది. అప్పటి నుండి నాగరికతలను నిలబెట్టడంలో భూమి కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం, ప్రపంచ ఆహార సరఫరాలో 95 శాతానికి పైగా భూమి ఆధారంగా జరిగే వ్యవసాయం ద్వారానే వస్తోంది. 2022లో వ్యవసాయ రంగం ప్రపంచవ్యాప్తంగా 89.2 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది (మొత్తం ఉపాధిలో 26.2 శాతం). ΄÷లాల బయట ఆహార రవాణా, నిల్వ, పంపిణీ (ఆహార వ్యవస్థల)కి సంబంధించిన పనులు, ఉద్యోగాలలో ప్రపంచ శ్రామిక శక్తిలో అదనంగా 13 శాతం మంది నిమగ్నమై ఉన్నారు. చిన్న, సన్నకారు రైతులే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. భూమి విస్తీర్ణం, పశువుల సంఖ్య, ఆదాయాల పంపిణీని బట్టి చిన్న, సన్నకారు రైతులను గుర్తించే ప్రమాణాలు దేశాన్ని బట్టి మారుతుంటాయి. ఒక దేశంలో 2 హెక్టార్ల భూమి ఉన్న రైతులు చిన్న, సన్నకారు రైతులైతే.. మరొక దేశంలో 50 హెక్టార్లున్న వారు చిన్న రైతులు. ఒక దేశంలో వార్షికాదాయం 1,500 డాలర్ల ఆదాయం ఉండే వారు చిన్న, సన్నకారు రైతులైతే.. మరొక దేశంలో 2,50,000 డాలర్లు వార్షిక ఆదాయం వున్న వారు కావచ్చు.2 శాతం తగ్గిన వ్యవసాయ భూమిఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఏ.ఓ.) ఇటీవలే ప్రకటించిన 2023 నాటి గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం భూభాగంలో వ్యవసాయ భూమి (అంటే.. స్వల్పకాలిక పంటలు పండించే వ్యవసాయ యోగ్యమైన భూమి, శాశ్వత / దీర్ఘకాలిక తోటలు సాగు చేసే భూమి కలిపి) విస్తీర్ణం 12 శాతం మాత్రమే. శాశ్వత పచ్చిక భూములు, పచ్చిక బయళ్ళు మొత్తం భూమిలో నాలుగింట ఒక వంతు ఆక్రమించగా, అడవులు మూడింట ఒక వంతు ఆక్రమించాయి. 2001 – 2023 మధ్య, ప్రపంచ వ్యవసాయ భూమి విస్తీర్ణం నికరంగా 7.5 కోట్ల హెక్టార్ల (2 శాతం) తగ్గింది.1961 – 2020 మధ్య ప్రపంచ వ్యవసాయ భూమిలో కేవలం 8 శాతం విస్తరణతో వ్యవసాయ ఉత్పత్తిలో నాలుగు రెట్ల పెరిగింది. పంటల ఉత్పాదకతలో గణనీయమైన మెరుగుదలను ఇది సూచిస్తోంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఆహార లభ్యతకు ఢోకా లేదు. నేడు కొరత సమస్య కాదు. ఆహారాన్ని పొందగలిగే స్థోమత లేకపోటం, అశాంతి, యుద్ధాలతో ఆహార పంపిణీ సమస్యలు ఎదురవుతున్నాయి. వ్యవసాయ ఉత్పాదకత పెరుగుదలలో చారిత్రకంగా నమోదైన పురోగతితో ఆహార భద్రత, పేదరికం తగ్గింపు, ఆర్థిక అభివృద్ధికి ప్రాథమికంగా కనిపించింది. అయినప్పటికీ కొన్ని ్ర΄ాంతాల్లో స్థానిక పరిస్థితులు గణనీయంగా భిన్నంగా మారుతూ ఉంటాయి.తీవ్రంగా పెరిగిన ఉత్పాదకాల వాడకం ఒకే రకం పంట దిగుబడుల విషయంలో వివిధ దేశాల్లో చాలా ఎక్కువ స్థాయిలో తారతమ్యాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వ్యవసాయంలో ఉత్పాదకత ధోరణులను విశ్లేషించేటప్పుడు నికర వ్యవసాయ ్ర΄ాంతం, దిగుబడులను పరిగణనలోకి తీసుకుంటారు. కానీ అధిక దిగుబడులు ఉత్పాదకాల వాడకం తీరుపై ఆధారపడి ఉంటాయి. స్థానిక వ్యవసాయ వాతావరణ పరిస్థితులు, విత్తనం, ఎరువులు, పురుగుమందులు, నీటి΄ారుదల సదు΄ాయాలు వంటి జీవభౌతిక ఉత్పాదకాలతోపాటు శ్రమ, పెట్టుబడులను బట్టి పంటల ఉత్పాదకతను, ఉత్పాదక సామర్థ్యాన్ని నిర్ణయిస్తాయి. వ్యవసాయంలో భూమి పాత్రను అర్థం చేసుకోవడానికి వీటన్నిటినీ అర్థం చేసుకోవటం అవసరం. ఉత్పాదకాల వినియోగించే తీవ్రత స్థాయి, సాంకేతిక ఆవిష్కరణలు, మెరుగైన నిర్వహణను బట్టి దిగుబడుల్లో తారతమ్యాలు వస్తాయి. అందువల్ల, ఎరువులు, యంత్రాలు లేదా మానవ శ్రమ మరింత ఎక్కువ స్థాయిలో వెచ్చించటం వల్లనే దిగుబడి పెరుగుదల నమోదైందని గుర్తించాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఆహారోత్పత్తి వృద్ధిలో సాగు భూమి విస్తీర్ణం పెరుగుదల చాలా తక్కువ పాత్ర పోషించిందని, అయితే, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పంట భూముల విస్తరణే ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉందని ఎఫ్ఎఓ చెబుతోంది.దిగుబడుల్లో అంతరాలుదిగుబడి పెరుగుదలలో విజయం సాధించినప్పటికీ.. సాధిస్తున్న దిగుబడిలో దేశాల మధ్య అంతరాలు కొనసాగుతున్నాయి. దిగుబడి అంతరం అంటే? ఒక నిర్దిష్ట వాతావరణంలో ఒక పంటకు గరిష్టంగా సాధించగల దిగుబడికి, అక్కడి రైతులు ప్రస్తుతం సాధిస్తున్న వాస్తవ దిగుబడికి మధ్య వ్యత్యాసాన్నే దిగుబడి అంతరం అంటారు. దిగుబడి పెరుగుదలలో గతంలో విజయాలు సాధించినప్పటికీ, అనేక దేశాలు, అనేక పంటలలో గణనీయమైన దిగుబడి అంతరాలు ఉన్నాయి.ఉత్పాదకతలో ఆస్ట్రేలియా రారాజుఉదాహరణకు.. వరిలో (హెక్టారుకు టన్నుల్లో) 2023లో ఆస్ట్రేలియా 9.52 టన్నుల దిగుబడి సాధిస్తే, భారత్ 4.32, అమెరికా 8.57, చైనా 7.14, బ్రెజిల్ 6.94 టన్నుల దిగుబడి సాధించింది. ఈ అంతరాలు గత 63 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. 1961లో వరి దిగుబడిలో అత్యధికంగా ఆస్ట్రేలియా 5.9 టన్నులతో నంబర్ వన్గా నిలిచింది. 9.52 టన్నులతో ఇప్పటికీ ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. భారత్ 1.54 టన్నుల నుంచి 4.32 టన్నులకు పెంచుకోగలిగింది. చైనా వరి దిగుబడులు మన కన్నా ఎక్కువ శాతం పెరిగాయి. 1961లో 2.04 టన్నులున్న చైనా వరి ధాన్యం దిగుబడి 2023 నాటికి 7.14 టన్నులకు పెరిగింది. అమెరికా 3.82 టన్నుల నుంచి 8.57 టన్నులకు పెంచుకోగలిగింది. వ్యవసాయ భూమి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో సమర్థవంతంగా ఉపయోగించుకోవటంలో కొన్ని దేశాలు వెనుకబడటం కూడా ఈ స్థాయిలో దిగుబడి అంతరాలు ఏర్పడటానికి కారణమని ఎఫ్.ఏ.ఓ. చెబుతోంది. ముఖ్యంగా, ఈ అంతరాలకు జీవ భౌతిక కారణాలు మాత్రమే కాకుండా సామాజిక, ఆర్థిక, సంస్థాగత పరిమితులు కూడా కారణమవుతున్నాయి. పెరిగిన ఎరువుల ధరలు, గిట్టుబాటుకాని పంటల ధరలు, రుణం లేదా బీమా సదు΄ాయాలు అంతగా అందకపోవటం, కౌలుదారుల్లో అభద్రత.. వేర్వేరు దేశాల్లో దిగుబడుల అంతరాలు కారణమవుతున్నాయని ఎఫ్.ఏ.ఓ. తెలిపింది.భూసార క్షీణతతో 170 కోట్ల మందికి ముప్పుమనుషుల పనుల కారణంగా భూసారం నష్టపోతోంది. ఈ కారణంగా పంట దిగుబడులు తగ్గుతున్నాయి. సుమారు 170 కోట్ల మంది నివసిస్తున్న భారత్ తదితర ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఈ ముప్పు ఏర్పడిందని ఎఫ్.ఎ.ఓ. నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న అధిక జనాభా గల దేశాలకు ఈ ముప్పు ఉంది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యానికి, వ్యవసాయ ఉత్పాదకతకు ఈ నిశ్శబ్ద సంక్షోభం గొడ్డలి పెట్టుగా మారిందని ఎఫ్.ఏ.ఓ. హెచ్చరిస్తోంది.ధాన్యపు పంటలు: ప్రపంచ దేశాల్లో 1961–2023 మధ్యకాలంలో గోధుమ, వరి, మొక్కజొన్న, చిరుధాన్యాలు తదితర ధాన్యపు పంటలకు సంబంధించి హెక్టారుకు పెరిగిన ఉత్పాదకత వివరాలు టన్నుల్లో. భారత్: 0.95(1961)–3.63(2023). ఆస్ట్రేలియా:1.08–3.23, చైనా:1.19–6.42. బ్రెజిల్: 1.35–5.34. అమెరికా: 2.52–8.33.వరి: ప్రపంచ దేశాల్లో 1961–2023 మధ్యకాలంలో వరి పంటకు సంబంధించి హెక్టారుకు పెరిగిన ఉత్పాదకత వివరాలు టన్నుల్లో. భారత్: 1.54(1961)–4.32(2023). ఆస్ట్రేలియా:5.9–9.52, చైనా:2.04–7.14. బ్రెజిల్: 1.7–6.94. అమెరికా: 3.82–8.57. ఈల్డ్ గ్యాప్ ఒక దేశంలో ఒక పంటకు గరిష్టంగా ఎంత దిగుబడి సాధించే అవకాశం ఉంది? రైతులు ప్రస్తుతం ఎంత తీస్తున్నారు? ఈ రెండిటి మధ్య వ్యత్యాసాన్నే దిగుబడి అంతరం(ఈల్డ్ గ్యాప్) అంటారు. హెక్టారులో వరి దిగుబడిని భారత్ 0.4, చైనా 0.61, రష్యా 3.61, అల్జీరియా 7.57 టన్నుల వరకు పెంచుకునే అవకాశం ఉంది. అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా ఇప్పటికే పూర్తిస్థాయి ఉత్పాదకత సాధించాయి. అందుకే ఈ దేశాల ఈల్డ్ గ్యాప్ సున్నాగా ఉంది. 2023లో పత్తి దిగుబడి (హెక్టారుకు టన్నుల్లో).. భారత్: 1.27, ప్రపంచం:2.3, చైనా:6.64, మెక్సికో:4.52,బ్రెజిల్:4.39, ఆస్ట్రేలియా:3.79, పెరు:2.86, అమెరికా:2.84.2023లో మొక్కజొన్న దిగుబడి (హెక్టారుకు టన్నుల్లో).. భారత్: 3.54, ప్రపంచం:5.96, అమెరికా:11.25, ఇండోనేషియా:8.07, ఈజిప్టు:7.51, రష్యా:6.92, చైనా:6.53.2023లో పప్పుధాన్యాల దిగుబడి (హెక్టారుకు టన్నుల్లో).. భారత్: 0.74, ప్రపంచం:0.98, ఈజిప్టు:4.24, ఆస్ట్రేలియా:2.07, అమెరికా:1.97, రష్యా:1.95, చైనా:1.86. 2023లో కూరగాయల దిగుబడి (హెక్టారుకు టన్నుల్లో)..భారత్: 15.81, ప్రపంచం:20.07, అమెరికా:36.64, ఇరాన్:29.59, రష్యా:29.36, జపాన్:27.6, చైనా:26.14, బ్రెజిల్:25.79.2023లో పండ్ల దిగుబడి (హెక్టారుకు టన్నుల్లో)..భారత్:15.11, ఇండోనేషియా:27.06, దక్షిణాఫ్రికా:24.55, ఈజిప్టు: 20.94, అమెరికా:20.91, కజకిస్తాన్:19.54, బ్రెజిల్: 18.39.2023లో వరి దిగుబడి (హెక్టారుకు టన్నుల్లో).. భారత్: 4.32, ఆస్ట్రేలియా: 9.52, ఈజిప్టు: 8.72, అమెరికా: 8.57, పెరు:8.07, చైనా: 7.14, బ్రెజిల్: 6.94. 2023లో గోధుమ దిగుబడి (హెక్టారుకు టన్నుల్లో)..భారత్: 3.52, ఈజిప్టు: 7.19, మెక్సికో: 6.2, చైనా: 5.78, జపాన్: 4.72. – నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
ఈ నెల 9న పాడు బ్రో..!
సాక్షి, సిటీబ్యూరో: అతిథులే గాయకులై పాటల తోటలో ఊయలలూగేలా చేసే ‘సింగ్ ఎలాంగ్’ కార్యక్రమాన్ని నగరంలోని దుర్గం చెరువు సమీపంలో ఉన్న అకాన్ రెస్టారెంట్ నిర్వహిస్తోంది. ‘పాడు బ్రో’పేరిట నిర్వహిస్తున్న ఈ సింగ్ ఎలాంగ్ సెషన్ 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. సంగీతంలో ప్రవేశం లేకపోయినా, గాత్రంపై పట్టు లేకపోయినా హాయిగా అందరితో కలిసి పాటలు పాడే ఈ పాటల సందడి 21 ఏళ్లు పైబడినవారికి మాత్రమే పరిమితం. దాదాపు 4 గంటలపాటు కొనసాగే ఈ ఈవెంట్లో పాల్గొని గాత్రం కలపాలన్నా, సరదా గాయకుల సందడి చూడాలన్నా ఆన్లైన్ ద్వారా ఎంట్రీ పాస్లు కొనుగోలు చేయాలి. నెక్సస్లో ది గ్లోస్ బాక్స్ షురూ... కూకట్పల్లిలోని నెక్సస్ హైదరాబాద్ మాల్లో బ్యూటీ ఫెస్టివల్ ‘‘ది గ్లోస్ బాక్స్’’ప్రారంభమైందని మాల్ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. పెళ్లిళ్లు, పార్టీ సీజన్ను పురస్కరించుకొని డిసెంబర్ 7 వరకు ఈ ఫెస్ట్ జరగనుందని, దేశంలోనే ప్రముఖ బ్యూటీ, గ్రూమింగ్, వెల్నెస్ బ్రాండ్లు అందుబాటులోకి కొలువు దీరనున్నాయని పేర్కొన్నారు. ది గ్లోస్ బాక్స్లో లైవ్ డెమోలు, సౌందర్య నిపుణుల చిట్కాలు, ఫన్ మేకోవర్ జోన్లు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ఫన్ జోన్స్ను క్లిక్ చేసి షేర్ చేసుకునేందుకు వీలుగా ఆసక్తికరమైన రీతిలో ఏర్పాటు చేశామని వివరించారు. -
ఈ ఊబర్ డ్రైవర్ కోటీశ్వరుడు
కోటీశ్వరుడు ఉబర్ డ్రైవర్గా పనిచేస్తాడనేది ఊహకు కూడా అందదు. అయితే కొన్ని వాస్తవాలు ఊహాప్రపంచానికి కూడా అందవని చెబుతుంది ఈ వైరల్ వీడియో. ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్ నవ్ షా ఇటీవల ఫిజీకి వెళ్లాడు. ఉబర్లో ప్రయాణిస్తున్న షా 86 ఏళ్ల డ్రైవర్తో మాటలు కలిపాడు.‘ఈ వయసులో పనిచేస్తున్నారు. డబ్బులకు ఇబ్బందిగా ఉందా?’ అని అడిగాడు.ఆ డ్రైవర్ పెద్దగా నవ్వి... ‘అయ్యా! నేను కోటీశ్వరుడిని. గత దశాబ్ద కాలంగా ప్రతి సంవత్సరం 24 మంది అమ్మాయిలను చదివిస్తున్నాను. డ్రైవింగ్ ద్వారా వచ్చిన డబ్బును వారి చదువు కోసం వెచ్చిస్తున్నాను. నాకు ముగ్గురు ఆడపిల్లలు. బాగా చదివించాను. పేదింటి బిడ్డలు కూడా వారిలా చదువుకోవాలనుకుంటున్నాను’ అన్నాడు.అప్పుడెప్పుడో తన తండ్రి మొదలుపెట్టిన వ్యాపారాన్ని మరింతగా విస్తరించాడు ఈ పెద్దాయన. ఈయనకు 13 జువెలరీ షాప్లు, ఆరు రెస్టారెంట్లు, నాలుగు సూపర్మార్కెట్లు ఉన్నాయి. ఇప్పుడు వాటి బాధ్యతలు కూతుళ్లు చూస్తున్నారు.‘నిజమైన విజయం అనేది మీరు ఎంత ఎత్తుకు ఎదిగారనేదాని మీద ఆధారపడదు. ఎంతమందికి మీరు సహాయం చేశారు అనేదాని మీదే ఆధారపడి ఉంటుంది’ అనే కామెంట్తో వీడియో అప్లోడ్ చేశాడు నవ్ షా. -
అమ్మానాన్నలూ గెలిచారు
పిల్లల ప్రతిభను ప్రపంచం కంటే ముందు తల్లిదండ్రులే గుర్తించాలి. గోరుముద్దల్లో ఉత్సాహం.. వేలు పట్టి నడిపే నడకలో ప్రోత్సాహం అందించినప్పుడే పిల్లలు పులుల్లా మారతారు... చిరుతల్లా కదలాడతారు. తల్లిదండ్రులు అమ్మాయిలను చదివించి... ఉద్యోగాలు చేయించడం వరకు ఆలోచిస్తారు. కానీ, క్రీడల్లో కొనసాగమని చెప్పడం తక్కువ. మన మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ విజయం సాధించడం చూసి ఇకపై పెద్ద మార్పు రావచ్చు. ఈ జట్టులోని అమ్మాయిలను తల్లిదండ్రులు ప్రోత్సహించిన తీరు చూస్తే ‘క్రీడాకారిణి కావాలని ఉంది’ అని ఏ అమ్మాయి కోరినా తల్లిదండ్రులు తప్పక ‘మేమున్నాం’ అనే రోజులు వచ్చేశాయి.ఇంట్లో నాతోనే క్రికెట్ ఆడేది!చిన్నప్పటినుంచి అథ్లెటిక్స్ అంటే శ్రీచరణికిప్రాణం. జాతీయ స్థాయిలో ఖోఖో అడింది. కానీ, క్రికెట్ అంటేనే చాలా ఇష్టం. ఇంట్లో క్రికెట్ ఆడతానని అలిగేది. తన తండ్రి కూడా అథ్లెటిక్స్ ఆడమని చెప్పారు. కానీ, నేను మాత్రం శ్రీచరణీకి తోడుగా నిలిచి క్రికెట్ను ప్రోత్సహించాను. నాతోనే ఇంట్లో క్రికెట్ ఆడేది. ఇప్పుడు ఏకంగా వరల్డ్ కప్ గెలుపులో కీలకంగా నిలవడం మాకెంతో గర్వకారణం. ఇక మా సంతోషానికి హద్దులు లేవు. – నల్లపురెడ్డి రేణుక (శ్రీచరణి తల్లి)తండ్రిగా చెప్పుకోవడానికిగర్వంగా ఉంది..ఉమెన్స్ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్ క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీచరణి తండ్రిగా చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. నా కూతురు వరల్డ్ కప్లో క్రికెట్ ఆడుతుంటే చాలా సంతోషంగా ఉంది. – నల్లపురెడ్డి చంద్రశేఖర్రెడ్డి, శ్రీచరణి తండ్రిమహిళల ప్రపంచ కప్ పోటీల్లో సాటిలేని ప్రతిభ కనబర్చి వైఎస్సార్ కడప జిల్లా పేరును ప్రపంచ పటంలో నిలిపిన శ్రీచరణి వైఎస్సార్ జిల్లా వీరపునాయునిపల్లె మండలం యర్రంపల్లె గ్రామానికి చెందిన నల్లపురెడ్డి చంద్రశేఖరరెడ్డి, రేణుక దంపతుల కుమార్తె. తండ్రి ఆర్టీపీపీలో ఎలక్ట్రికల్ ఫోర్మన్ . ఒకటి నుంచి 10వ తరగతి వరకూ ఆర్టీపీపీలోని డీఏవీ స్కూల్లో చదివింది. హైదరాబాద్ లేపాక్షి జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ పూర్తిచేసింది. ప్రస్తుతం వీఎన్ పల్లె వీఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో బీఎస్పీ కంప్యూటర్స్ చదువుతూ క్రికెట్లో విశేష ప్రతిభ కనబరుస్తోంది.ఇదీ చదవండి: స్టార్ క్రికెటర్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ లగ్జరీ వాచ్ : ధర ఎంతో తెలుసా?అండర్–19 నుంచి భారత జట్టు స్థాయికి..తొలుత శ్రీచరణి 2017–18లో జిల్లా అండర్–19 జట్టుకు ఎంపికైంది. అప్పటినుంచి ఇంక వెనక్కి తిరిగి చూడలేదు. అదే ఏడాది రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభించింది. జిల్లాకు చెందిన క్రికెట్ శిక్షకులు ఖాజా మొయినుద్దీన్, మధుసూదన్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఎన్నో మెళకువలు నేర్చుకుంది. ఆ తర్వాత..⇒ 2021లో అండర్–19 చాలెంజర్స్ ట్రోఫీలో ఇండియా–సి జట్టుకుప్రాతినిధ్యం వహించి నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ⇒ శ్రీచరణి ఆట నైపుణ్యం గుర్తించిన డబ్ల్యూపీఎల్ ప్రతినిధులు ఢిల్లీ క్యాపిటల్స్కు రూ.55 లక్షలతో ఎంపిక చేసుకున్నారు. ⇒ ఏప్రిల్ 27 నుంచి మే 11 వరకు జరిగిన శ్రీలంక ముక్కోణపు వన్డే సీరీస్ క్రికెట్ టోర్నీకి నల్లపురెడ్డి శ్రీచరణి తొలిసారి భారత జట్టుకుప్రాతినిధ్యం వహించింది. ⇒లండన్ లో జరిగిన టీ–20 టూర్కు భారత జట్టు తరఫున ఎంపికైంది. ⇒ ప్రస్తుతం ఐసీసీ మహిళ విభాగంలో భారత జట్టు తరఫున ప్రపంచకప్లో నిలకడగా రాణించింది. ఈ టోర్నీలో 14 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన రెండో బౌలర్గా ఘనత సాధించింది.కుటుంబ సభ్యుల ప్రోత్సాహం..చిన్నప్పటి నుంచి ఆటలపై మక్కువ చూపే శ్రీచరణి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. మొదట్లో అథ్లెటిక్స్లో రాణిస్తున్న శ్రీచరణి ఆ తర్వాత క్రికెట్పై ఆసక్తి చూపుతుండడంపై అమ్మానాన్నలు సందేహించారు. కానీ, క్రికెట్పై ఉన్న ఆసక్తిని గమనించిన మామ కిశోర్కుమార్రెడ్డి శ్రీచరణిని ప్రోత్సహించారు. సరదాగా మొదలుపెట్టిన క్రికెట్ ఇప్పుడు శ్రీచరణికి సర్వస్వం అయింది. ప్రోత్సాహం ఉంటే అమ్మాయిలు ఎందులోనైనా రాణించగలరని శ్రీచరణి రుజువు చేసింది. – మోపూరు బాలకృష్ణారెడ్డి. సాక్షి ప్రతినిధి, కడపదిసీజ్ ఫర్ యూ..!‘పిల్లల ఇష్టాలు కనిపెట్టి, వారు ఎంచుకున్న మార్గంలో వెళ్లేలా ప్రోత్సహించడం, తగిన స్వేచ్ఛను ఇస్తూ, సపోర్ట్గా ఉండటం పేరెంట్స్ నిర్వర్తించాల్సిన పనులు’ అంటారు ఇండియన్ విమెన్ క్రికెటర్ అరుంధతీరెడ్డి తల్లి భాగ్యరెడ్డి. మహిళా క్రికెట్లో వరల్డ్ కప్ కైవసం చేసుకున్న మన భారత జట్టులో భాగమైన ఫాస్ట్ బౌలర్ అరుంధతి రెడ్డి హైదరాబాద్ వాసి. ఈ విజయోత్సవ ఆనందంలో కూతురి కల గురించి అమ్మగా భాగ్య రెడ్డి పంచుకున్న విషయాలు..‘‘ఫైనల్స్ చూడటానికి ముంబయ్ వెళ్లి, ఈ రోజే వచ్చాను. మ్యాచ్ గెలవగానే ‘అమ్మా.. దిస్ ఈజ్ ఫర్ యు’ అని చెప్పింది నా బిడ్డ. ఆ క్షణంలో పొందిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఈ గెలుపును ఇప్పుడు మా కుటుంబం అంతా ఎంజాయ్ చేస్తున్నాం. చిన్నప్పుడు తన అన్న రోహిత్, ఇతర కజిన్స్తో కలిసి గల్లీలో క్రికెట్ ఆడేది. టీవీలో క్రికెట్ చూసేది. సోర్ట్స్లో చాలా చురుకుగా ఉండేది. నేను వాలీబాల్ స్టేట్ ప్లేయర్ని. స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉన్నా కుటుంబ పరిస్థితుల కారణంగా నా కలలను నెరవేర్చుకోలేకపోయాను. నా కూతురుకి ఉన్న ఇష్టాన్ని కాదనకూడదు అనుకున్నాను. క్రికెట్ ఫస్ట్..మేముండేది సైనిక్పురిలో. ప్రైవేట్ స్కూల్ టీచర్ని. మధ్యతరగతి కుటుంబం. సోర్ట్స్లో అరుంధతికి ఉన్న ఇష్టాన్ని చూసి, పన్నెండేళ్ల వయసులో స్పోర్ట్స్ సెంటర్లో చేర్పించాను. ఉదయం నాలుగు గంటలకే స్పోర్ట్స్ సెంటర్కి వెళ్లిపోయేవాళ్లం. అక్కణ్ణుంచి స్కూల్. మళ్లీ సాయంత్రం ఇద్దరం గ్రౌండ్కి వెళ్లిపోయేవాళ్లం. క్రికెట్ప్రాక్టీస్ చేస్తూనే ఓపెన్ లో టెన్త్ ఎగ్జామ్స్ రాసింది. 15 ఏళ్లకే అండర్ –19 హైదరాబాద్ జట్టుకు ఎంపికయ్యింది. ఫాస్ట్ బౌలర్ గా పేరు తెచ్చుకుంది. పెద్ద కల ఉంటే త్యాగాలు ఎన్నో...2017లో రైల్వేలో చేరింది. అక్కడ ఉంటూనే చాలా విషయాల పట్ల అవగాహన ఏర్పరుచుకుంది. అండర్ 23 జోనల్ టోర్నమెంట్ లో రాణించింది. మళ్లీ ఒక దశలో క్రికెట్– జాబ్ .. దేనిని ఎంచుకోవాలనే నిర్ణయం వచ్చింది. ఓ రోజు తన నిర్ణయం క్రికెట్ మాత్రమే అని చెప్పింది. నేనూ ‘సరే’ అన్నాను. రెండేళ్ల కిందట జాబ్ మానేసి పూర్తి సమయాన్నిప్రాక్టీస్కే కేటాయించింది.ప్రాక్టీస్లో భాగంగా కుటుంబంలో ఎన్నో సంతోష సమయాలలో తను దూరంగా ఉండాల్సి వచ్చేది. ఈ రోజు దేశాన్ని గెలిపించిన జట్టులో నా బిడ్డ ఉందంటే... చాలా ఆనందంగా ఉంది. ధైర్యమే పెద్ద సపోర్ట్అరుంధతికి క్రికెట్తో పాటు పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. సమయం దొరికితే మెలోడీస్ ను చాలా ఇష్టంగా పాడుతుంది. అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా వారి జీవితాన్ని వారు ఎంచుకునే స్వేచ్ఛ వారికే ఇవ్వాలి. పెద్దలుగా మనం కనిపెడుతూ ఉండాలి. పిల్లల ఆసక్తితో ఎంచుకున్న మార్గంవైపు మనకు తెలిస్తే ఏవైనా సూచనలు ఇవ్వాలి. లేదంటే, ధైర్యంగా వెళ్లు అని చెప్పాలి. ఈ ఏడాది పిల్లలను సోర్ట్స్ అకాడమీలో చేర్చాం. వచ్చే ఏడాదికి పెద్ద ప్లేయర్ అయిపోవాలని వారిపై ఒత్తిడి తీసుకురావద్దు. అది సాధ్యం కాదు కూడా.ఎంచుకున్న దానిపైన అంకితభావం, క్రమశిక్షణ, సాధన ఉండాలి. మా అమ్మాయి ఆలోచన ఎప్పుడూ క్రికెట్ వైపు ఉండేది. మా కుటుంబం అంతా ఆమె వైపు ఉన్నాం. నా కలలను పిల్లల ద్వారా తీర్చుకోవాలి అనుకోలేదు. నా జీవితంలో ఎదురైన స్ట్రగుల్స్ని ఎప్పుడూ పిల్లల ముందు చెప్పలేదు. నా జర్నీలో మా అమ్మ నాకు పెద్ద మోరల్ సపోర్ట్. నా కూతురు ఎదుగుదలలో నేను కూడా అంతే. ఎంచుకున్న మార్గం వైపు ధైర్యంగా వెళ్లమనే చెబుతుంటాను. ఈ రోజు ఆ సక్సెస్ను చూస్తున్నాం’’ అంటూ ఆనందంగా వివరించారు. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఆ పేపర్ బాయ్ స్కిల్కి మాటల్లేవ్ అంతే..!
ప్రతి ఒక్కరి ఏదో ఒక దాంట్లో అపారమైన నైపుణ్యం ఉంటుంది. అయితే దాన్ని ఎవరో గుర్తించి అంటే గానీ వాళ్లకూడా అంతగా పట్టించుకోరు. అలాంటి సంఘటన ఇక్కడ చోటు చేసుకుంది. దీప్ అనే పేపర్ బాయ్ న్యూస్పేపర్ డెలివరీ చేయు విధానం చూస్తే మతిపోతుంది. అబ్బా ఏం స్కిల్ ఇది..అని అనుకుండా ఉండలేరు. అతడు పేపర్ విసిరే విధానం..అవి నేరుగా వాళ్ల వాకిళ్లు లేదా గుమ్మాల్లోనూ, అక్కడ మనుషుల చేతుల్లోకి సరాసరి వెళ్లిపోతుండటం ఓ మ్యాజిక్లా జరిగిపోతుంది. ఎక్కడ మిస్ అయ్యే ఛాన్స్ లేదన్నట్లుగా వెళ్లిపోతున్నాయి. అరే ఏం టెక్నిక్ ఇది అనిపిస్తుంది. అతడు అలా న్యూస్ పేపర్లను డెలివరి చేస్తున్నంత సేపు కళ్లు తిప్పుకోలేం కూడా. అంతలా చాకచక్యంగా స్కూటర్పై స్పీడ్గా వెళ్లిపోతూ వేసుకుంటూ వెళ్లిపోతుంటాడు. ఎక్కడ పొరబాటు, తడబాటు జరగకపోవడం విశేషం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Paper boy (@paper_boy_deep) (చదవండి: ఎయిర్ ఇండియా ప్రమాద మృత్యుంజయడు: ఆ రోజు అతను బతకడం ఓ అద్భుతం..కానీ ఇప్పుడు ప్రతిక్షణం..) -
Air India survivor: ఆ రోజు అతను బతకడం ఓ అద్భుతం..కానీ ఇప్పుడు ప్రతిక్షణం..
జూన్ 12న అహ్మదాబాద్లో టేకాప్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేశ్..ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఆ రోజు తానెలా బతకాననేది ఒక అద్భుతం కానీ ఇవాళ అదొక పీడకలలా వెంటాడుతోందని ఆవేదనగా చెబుతున్నాడు. ప్రమాద ఘటన అనంతరం బ్రిటన్లో నివాసం ఉంటున్న ఆయన.. స్థానిక మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడంతో అతడి హృదయ విదారక పరిస్థితి వెలుగులోకి వచ్చింది. లక్కీమ్యాన్ కాదు..అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ఇండియా ప్రమాదంలో మొత్తం 241 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో బయటపడ్డ ఒకే ఒక్క మృత్యుంజయుడిగా రమేశ్ వార్తల్లో నిలిచారు. బ్రిటన్లో నివాసముంటున్న విశ్వాస్ కుమార్.. గుజరాత్లోని తన కుటుంబానికి కలిసేందుకు వచ్చి తిరుగు ప్రయాణం అవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ రోజు విమానంలో 11-ఏ సీటులో విశ్వాస్ కుమార్ కూర్చున్నారు. ప్రమాదం అనంతరం రక్తపుమరకలతో నడుచుకుంటూ వచ్చి అంబులెన్సు ఎక్కిన దృశ్యాలు ఇప్పటికీ అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. అంత పెద్ద ప్రమాదంలో బయటపడ్డ లక్కీమ్యాన్గా అందరూ అతన్నిచూస్తుంటే..ఆయన మాత్రం రోజు రోజుకి కుంగిపోతున్నాడు. నిత్య నరకం అనుభవిస్తున్నా అంటూ కన్నీటిపర్యంతమవుతున్నాడు. ఆ ప్రమాదం కారణంగా తన ప్రాణానికి ప్రాణమైన తమ్ముడిని కోల్పోయా..అని బోరుమన్నాడు. ఆ తర్వాత తన జీవితమే తలకిందులైపోయిందని, తన సోదరుడితో కలిసే చేసిన వ్యాపారం కూడా మూతపడిందని ఆవేదనగా చెప్పుకొచ్చాడు. తాను తిరిగి నార్మల్గా అవ్వడం అంత సులభం కాదని అంటున్నాడు. ఆ ఘటన తర్వాత నెలలతరబడి మౌనంగా ఉన్నట్లు తెలిపాడు. తానెప్పుడు ఇంటిని వదలి బయటకు వెళ్లడం లేదని, బెడ్రూంలోనే ఒంటిరిగా కూర్చొని ఉంటానని. తనకోసం తలుపు బయట అమ్మ కూర్చొని ఉంటుందని చెబుతున్నాడు. కనీసం తన కొడుకుతో కూడా సరిగా మాట్లాడలేకపోతున్నానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. భరించలేని మానసిక గాయంతో బాధపడుతున్నాని చెబుతున్నాడు. ఇంకా శారీరక అసౌక్యర్యాన్ని ఎదుర్కొటున్నట్లు వివరించాడు. భార్య సాయం లేనిదే కనీసం..తన మోకాలు, భుజం, వెన్ను నొప్పి తోపాటు చేతికి అయ్యిన కాలిన గాయాలతో బాధపడుతున్నానని, భార్య సాయం లేనిదే స్నానం కూడా చేయలేకపోతున్నట్లు బాధగా వెల్లడించాడు. ఇదిలా ఉండగా, లండన్ లీసెస్టర్ కమ్యునిటీ నాయకుడు, సంజీవ్ పటేల్, అతని సలమాదారు, ప్రతినిధి రాడర్ సీగర్లు కూడా తమ వంతుగా రమేష్కి మద్దతు అందిస్తున్నామని అన్నారు. అలాగే ఎయిర్ ఇండియా కూడా రమేష్కు సుమారు రూ. 21 లక్షల పరిహారం అందించిందని తెలిపారు. అతనికి ఇప్పుడు ఆర్థిక సాయంతోపాటు మానసిక స్థైర్యం, భరోసా అందించాలని అన్నారు. అదే అతడిని తిరిగి కోలుకునేలా చేయగలదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా సైతం రమేష్కు అవసరమైన సహాయాన్ని అందించడం తమ బాధ్యత అని పేర్కొనడం విశేషం.#WATCH | New video shows miracle survivor from seat 11A walking away from Ahmedabad plane crash site.More news & updates ▶️https://t.co/cetvZaId2H#AirIndiaPlaneCrash #AhmedabadPlaneCrash pic.twitter.com/QdcZJNqef6— Hindustan Times (@htTweets) June 16, 2025 (చదవండి: భారత్పై జర్మన్ పర్యాటకుడి ప్రశంసల జల్లు...!) -
క్రికెట్ గాళ్స్ ...స్టైలిష్ స్టార్స్...
భారత మహిళా క్రికెట్ జట్టు విజయాల పరుగును ఆస్వాదిస్తోంది. ఇటీవలి ప్రపంచ కప్ విజయం కేవలం క్రీడా మైలురాయి మాత్రమే కాదు శక్తి సామర్ధ్యాలున్న మహిళల భవితకు స్ఫూర్తి. క్రీడల్లో మాత్రమే కాదు ఈ మహిళలు మైదానంలో వెలుపల కూడా నవ యువతికి ప్రేరణ అందిస్తున్నారు.ఈ ఆధునిక క్రీడాకారులు సంప్రదాయ నియమాలను తిరిగి వ్రాస్తున్నారు: నైపుణ్యానికి అత్యాధునిక జీవనశైలిని జోడిస్తున్నారు. వరల్డ్ కప్ విజయం తర్వాత ఒక్కసారిగా వారి లైఫ్ స్టైల్ కూడా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ముఖ్యంగా వారి ఫ్యాషన్ ఎంపికలపై నవయువ తరం దృష్టి సారించింది. అంతేకాదు పలు ఫ్యాషన్, లైఫ్ స్టైల్ బ్రాండ్స్ సైతం వీరితో ఒప్పందాలకు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ నేపధ్యంలో అనుసరించే ఫ్యాషన్స్, స్టైల్స్ ఆధారంగా చూస్తే... స్మృతి మందాన...భారతీయ మహిళా క్రికెట్లో స్మృతి మంధానకు తిరుగులేని గుర్తింపు ఉంది. ఆమె బ్యాటింగ్ స్టైల్ లాగే ఆమె ఫ్యాషన్ ఎంపికలు కూడా వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రయాణ రోజులకు రిలాక్సడ్ కుర్తా అయినా లేదా స్నీకర్లతో జత చేసిన భారీ చొక్కా అయినా, తన లుక్ను ఎలా చిక్గా చూపించాలో స్మృతికి తెలుసు. ఆమె పండుగ సమయంలో పాస్టెల్ షరారాస్ లేదా పూల చీరలలో నిజమైన భారతీయతను ప్రతిబింబిస్తుంది. ప్రసరింపజేస్తుంది. కానీ బిజీ వర్క్ లేని రోజుల్లో ఆమె సాధారణ కో–ఆర్డ్లు, డెనిమ్లు, సిల్హౌట్లను ఇష్టపడుతుంది. ఆత్మవిశ్వాసంతో కదిలే ఆమె తీరు ఆమె దుస్తులు ధరించే విధానం బాగా కనిపించడానికి భారీ స్టైలింగ్ అవసరం లేదని రుజువు చేస్తుంది.చదవండి: స్టార్ క్రికెటర్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ లగ్జరీ వాచ్ : ధర ఎంతో తెలుసా?జెమీమా రోడ్రిగ్స్ప్రశాంతమైన స్మృతికి భిన్నంగా జెమీమా రోడ్రిగ్స్ మెరుపులా ఉంటుంది. ఆమెను ప్రస్తుత భారత జట్టులో జెన్–జెడ్ శక్తిగా పేర్కొంటున్నారు. ఎల్లప్పుడూ తన లుక్తో ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉంటుంది. స్పోర్టి జాకెట్లు, రంగురంగుల స్నీకర్లు, ప్రింటెడ్ టీస్ స్ట్రీట్వేర్ గ్లామ్ టచ్ తో ఆమె వార్డ్రోబ్ నవ యవ్వన ఉత్సాహంతో తొణికిసలాడుతుంటుంది .జెమీమా వ్యక్తిత్వం ఆమె ఫ్యాషన్ ద్వారా ప్రకాశిస్తుంది. ఆమె ట్రెండ్తో కంఫర్ట్ను కలపడం, రోజువారీ దుస్తులను స్టైల్ స్టేట్మెంట్లుగా మార్చడాన్ని ఇష్టపడుతుంది. డెనిమ్–ఆన్–డెనిమ్ సెట్ల నుంచి స్నీకర్ల, కుర్తాల వరకు, ఆమె ఫ్యాషన్ ఆకట్టుకుంటుంది. కెమెరాల కోసం కాదు, ఆమె తనకోసం తాను దుస్తులు ధరిస్తుంది. అణువణువూ కనిపించే ఆత్మవిశ్వాసమే జెమీమాను ఇన్ స్ట్రాగామ్లో నిజ జీవితంలో నిజమైన ట్రెండ్సెట్టర్గా మార్చింది.హర్మన్ ప్రీత్ కౌర్జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వ లక్షణాల్లానే ఆమె వార్డ్రోబ్ కూడా అదే శక్తిని ప్రతిబింబిస్తుంది. టైలర్డ్ బ్లేజర్ అయినా, స్మార్ట్ ప్యాంట్సూట్ అయినా, లేదా మట్టి టోన్లలో సొగసైన కుర్తా అయినా, డ్రెస్సింగ్లో ఆమె ఒక మాస్టర్ క్లాస్. హర్మన్ ప్రీత్ లుక్ నాటకీయతను కాకుండా ఆమె బలాన్ని ప్రదర్శిస్తుంది.ఆమె వస్త్రధారణ శైలి ఆధునికంగా అనిపించే భారతీయతను కలిగి ఉంటుంది, తరచుగా లినెన్ లేదా చేనేత పట్టు వంటి ఫ్యాబ్రిక్స్లో కనిపిస్తుంది. ఆమె ఎంపికలలో ఒక పరిపక్వత ఉంటుంది, ఆమె ట్రెండ్ల వెంట పడదు.చదవండి: జుకర్బర్గ్కే షాక్ : 22 ఏళ్లకే బిలియనీర్ క్లబ్లోకియాస్టికా భాటియాకొత్త తరం క్రికెటర్లలో, యాస్టికా భాటియా సొగసైన సౌందర్యానికి కేరాఫ్గా నిలుస్తుంది. ఆమె లుక్స్ అన్నీ క్లీన్ కట్స్, మ్యూట్ ప్యాలెట్లతో ఉంటాయి. యాస్టికా ఫ్యాషన్ సెన్స్లో భారీ ఉపకరణాలు లేదా రంగులు ఉండవు. ఆమె తరచుగా మోనోక్రోమ్ సెట్లు, తెల్ల చొక్కాలు లేత పాస్టెల్ కుర్తాలలో కనిపిస్తుంది, అవి మీరు ఎక్కడైనా ధరించవచ్చు ఓవర్స్టైల్డ్ సెలబ్రిటీ ఫ్యాషన్ యుగంలో ఆమె ఎంపికలో సరళత రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది.హర్లీన్ డియోల్స్పోర్టీ గ్లామర్ల పరిపూర్ణ సమ్మేళనం హర్లీన్ డియోల్ . మైదానంలో అద్భుతమైన క్యాచ్లు గొప్ప శక్తి ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందిన ఆమె తన ఫ్యాషన్ కు అదే స్పార్క్ను తెస్తుంది. ఆమె బోల్డ్ లుక్లను ఇష్టపడుతుంది – స్టేట్మెంట్ డ్రెస్సులు, సొగసైన పోనీ టెయిల్స్, ట్రెండీ స్నీకర్లు ఆమె అథ్లెటిక్ ఫ్రేమ్ను హైలైట్ చేసే బాగా సరిపోయే అథ్లెటిజర్ సెట్లు. జిమ్ గేర్ నుంచి గ్లామర్కు సులభంగా మారే కొద్దిమంది క్రీడాకారిణులలో ఒకరు. ఆమె ఒక రోజు చిక్ స్ట్రీట్వేర్తో మరోక రోజు మరో స్టైల్తో రోజుకో ప్రయోగం చేస్తుంది. ఉపకరణాల పట్ల ఆమెకున్న ప్రేమ, మేకప్ సమన్వయంతో కూడిన లుక్స్ ఆమెకు బలమైన వ్యక్తిగత బ్రాండ్ను సృష్టించాయి.స్టేడియంల నుంచి ఫోటో షూట్ల వరకు వీరి ప్రయాణం ఆద్యంతం ఆసక్తికరమే. వీరిలో ఎవరూ సెలబ్రిటీ అనే కిరీటంతో తమ స్టైల్స్ను పంచుకోవాలని ప్రయత్నించడం లేదు, వారి ఫ్యాషన్ వారి సహజమైన తీరుతెన్నులకు ఒక పొడిగింపుగా మాత్రమే చూస్తున్నారు. అందుకే ఈ అథ్లెట్లు ఇప్పుడు ఫ్యాషన్ ప్రేరణలు, బ్రాండ్ అంబాసిడర్లు మాత్రమే కాదు అత్యున్నతమైన కలలు కనే ధైర్యం ఉన్న భారతీయ యువతులకు రోల్ మోడల్స్ కూడా. -
ఇస్రో బాహుబలి : భవిష్యత్తుకు బంగారు బాట
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అంతరిక్ష ప్రయోగాల పరంపరలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు దూసుకెళ్తోంది. తాజాగా ఇస్రో ఒక ప్రతిష్ఠాత్మక బాహుబలి రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ఎల్వీఎం3–ఎం5 అనే బాహుబలిగా పేరుబడ్డ రాకెట్ ద్వారా 4,400 కేజీల జీశాట్–7ఆర్ (సీఎంఎస్–03) అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది ముఖ్యంగా భారత నౌకాదళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేసిన ప్రయోగం. ఈ ఉపగ్రహాన్ని భూమి నుంచి 36,000 కిలోమీటర్ల ఎత్తున ఉన్న జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి నవంబర్ 2న విజయవంతంగా ప్రవేశపెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. షార్ నుండి ఇంత బరువైన ఉపగ్రహాన్ని పంపడం ఇదే మొదటిసారి కావడం విశేషం.సీఎంఎస్–03 కమ్యూనికేషన్ ఉపగ్రహం పది సంవత్సరాల పాటు భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమిస్తూ సేవలు అందిస్తుంది. ఇంటర్నెట్ సౌకర్యాల కోసం ఇస్రో 2013లో ఫ్రెంచ్ గయానా నుంచి ప్రయోగించిన ‘జీశాట్ 7’ ఉపగ్రహ కాల పరిమితి ముగియడంతో శాస్త్రవేత్తలు సరికొత్త టెక్నాలజీతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో సీఎంఎస్–03ని తయారు చేసి పంపారు. మల్టీ–బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్ సీఎంఎస్–03 భారత ప్రధాన భూభాగంతో సహా విస్తారమైన సముద్రప్రాంతానికి సేవలను అందిస్తుంది. ఈ ఉపగ్రహం ‘సీ’, ‘ఎక్స్టెన్డెడ్ సీ, ‘క్యూ’ బ్యాండ్లలో వాయిస్, డేటా, వీడియోల కోసం ట్రాన్స్పాండర్ సౌకర్యాలనుఅందిస్తుంది. ఈ శాటిలైట్ కీలకమైన సముద్ర ప్రాంతంలో భారత నౌకా దళ కమ్యూనికేషన్ సామర్థ్యాలను గణనీయంగా పెంచడంలో ఎంతో సహాయ పడుతుంది.‘ఆత్మనిర్భర భారత్’కు దోహదం చేస్తూ ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో ఇక్కడే తయారు చేసి ప్రయోగిస్తున్న ఇటువంటి ఉపగ్రహాలు భారత కీర్తి కిరీటంలో కలికితురాళ్లుగా నిలిచిపోతాయి. ప్రస్తుత ఉపగ్రహ ప్రయోగ విజయం... విక్రమ్ సారాభాయ్ దూరదృష్టికీ, అబ్దుల్ కలాం స్ఫూర్తికీ, సతీష్ ధావన్ నిబద్ధతకూ, ఇస్రో శాస్త్రవేత్తల కఠోరశ్రమకూ ప్రతీక. ఇస్రో కేవలం రాకెట్లు ప్రయోగించడమే కాదు, భారత భవి ష్యత్తును అంతరిక్షంలో సువర్ణాక్షరాలతో లిఖిస్తోంది. ఇదీ చదవండి: స్టార్ క్రికెటర్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ లగ్జరీ వాచ్ : ధర ఎంతో తెలుసా?– వి. సుధాకర్ -
స్టార్ క్రికెటర్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ లగ్జరీ వాచ్ : ధర ఎంతో తెలుసా?
భారత మహిళా క్రికెట్ జట్టు సారధిగా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) తొలిసారి ఐసీసీ మహిళల ప్రపంచకప్ ట్రోఫీ అందుకొని చరిత్ర సృష్టించారు. అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్గా ప్రతిభ కనబర్చి ప్రపంచ అత్యుత్తమ మహిళ క్రికెటర్లలో నిలవడమే కాదు, ప్రపంచకప్ను సాధించిన కెప్టెన్గా చరిత్రలో నిలిచిపోయిన పేరు. ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ మ్యాచ్ తరువాత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ సందర్బంగా ఆమె ధరించిన రోలెక్స్ వాచ్ అందరి దృష్టినీ ఆకర్షించింది.ఇటీవలి లెక్కల ప్రకారం భారత రిచెస్ట్ మహిళా క్రికెటర్గా ఉన్న హర్మన్ ప్రీత్ కౌర్ నికర విలువ రూ. 25 కోట్లు. ఆమె ధరించి లిమిటెడ్ ఎడిషన్ వాచ్లను కూడా ఇష్టపడుతుంది. ది ఇండియన్ హోరాలజీ అందించిన వివరాల ప్రకారం తాజా వీడియోలో ఆమె ధరించిన వాచ్ ఐకానిక్ రోలెక్స్ డేట్జస్ట్గా గుర్తించారు. చదవండి: జుకర్బర్గ్కే షాక్ : 22 ఏళ్లకే బిలియనీర్ క్లబ్లోకిహర్మన్ ప్రీత్కు క్లాసీ టచ్ ఇచ్చిన ఈ రోలెక్స్ డేట్జస్ట్ విలువ భారతదేశంలో సుమారు రూ. 8.7 లక్షలు. 36 mm ఓస్టర్స్టీల్ కేసు, స్క్రూ-డౌన్ స్టీల్ క్రౌన్, రోమన్ సంఖ్యలతో కూడిన తెల్లటి డయల్ స్పెషల్ లుక్లో కనిపిస్తోంది. అంతేకాదు విజయానికి చిహ్నంగా, ఐకానిక్గా రాయల్ లుక్లో ప్రీమియం అనుభవాన్నిస్తుంది.చదవండి: బెంగళూరు డాక్టర్ కేసులో ట్విస్ట్ : ప్రియురాలికి షాకింగ్ మెసేజ్అలాగే ప్రపంచ కప్ ట్రోఫీతో ఆమె పంచుకున్న ఫోటోకూడా వైరల్గా మారింది. క్రికెట్ అనేది జెంటిల్ మేన్ గేమ్కాదు ప్రతీ ఒక్కరిదీ అని అర్థం వచ్చేలా ఉన్న టీ షర్ట్ ట్రెండింగ్లో ఉంది. క్రికెట్ అందరి ఆట అనేది సందేశాన్ని హర్మన్ప్రీత్ గట్టిగానే ఇచ్చినట్టైంది. View this post on Instagram A post shared by THEINDIANHOROLOGY (@theindianhorology)కాగా పంజాబ్కు చెందిన హర్మన్ ప్రీత్ కౌర్ క్రికెట్ ప్రయాణం పంజాబ్ నుంచే ప్రారంభమైంది.2009లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగ్రేటం చేసింది మొదలు క్రికెట్ లో అద్భుతమైన క్రీడాకారిణిగా రాణిస్తూ ఎన్నో అవార్డులు, రివార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. మహిళల క్రికెట్లో అత్యంత ప్రభావ వంతమైన క్రికెటర్లలో ఒకరిగా నిలిచారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ వరకు ప్రతీ ఫార్మాట్లోనూ ఆమెది ప్రత్యేకమైన ముద్ర. తాజాగా మహిళల ప్రపంచకప్ 2025 (Women's World Cup 2025) ట్రోఫిని దక్కించుకుని సూపర్ స్టార్గా నిలిచింది హర్మన్ ప్రీత్ కౌర్. కోట్లాది మంది క్రికెట్ అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది. -
ఘనంగా రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి విగ్రహ ప్రతిష్ట
కోకాపేటలోని ఏఎస్బీఎల్ స్పైర్లో శ్రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థాన కుంభాభిషేకం, విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుక అక్టోబర్ 31, 2025 శుక్రవారం ఉదయం 10:26 గంటలకు పూర్తి భక్తి శ్రద్దలతో, ఆగమ శాస్త్ర నియమాలు, తెన్నాచార్య సంప్రదాయానికి అనుగుణంగా జరిగాయి.ASBL స్పైర్ లోపల కొత్తగా నిర్మించిన ఆలయం భక్తి, సాంస్కృతిక కొనసాగింపుకు చిహ్నంగా నిలుస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. సాంప్రదాయ దక్షిణ భారత నిర్మాణ శైలిలో రూపొందించిన ఈ ఆలయ గర్భగుడి దైవిక కృప, ప్రశాంతతను వెదజల్లుతుంది.ఈ సందర్భంగా ASBL గ్రూప్ వ్యవస్థాపకులు, సీఈఓ శ్రీ అజితేష్ కొరుపోలు మాట్లాడుతూ, “ ఇలాంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు భక్తులందర్నీ దగ్గర చేస్తాయని, ఆధునిక జీవనానికి అర్థాన్ని జోడిస్తాయని మేము విశ్వసిస్తున్నాం. మా భవిష్యత్ ప్రాజెక్టులన్నింటిలో ఈ తరహా పవిత్ర స్థలాలను సృష్టించాలని, విశ్వాసం, శాంతి, సామరస్యాన్ని సమిష్టి వేడుకగా జరుపుకోవాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము”అని అన్నారు.ఈ వేడుకకు అనేక మంది భక్తులు, నివాసితులు, ASBL కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా యాగాలు, హోమాలను నిర్వహించారు. గోవింద, హరే కృష్ణ మంత్రాలతో ప్రాంగణం మొత్తం ప్రతిధ్వనించింది.(చదవండి: యాత్రికులు, నివాసితుల సౌకర్యార్థం రూ. ₹6.12 కోట్లతో స్పెషాలిటీ ఆస్పత్రి) -
'ఇంత స్వేచ్ఛగా ఎప్పుడూ అనిపించలేదు'!
మన మాతృగడ్డపై చాలామంది విదేశీయలు పలు విధాలుగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక్కడ తన మనసుకి హత్తుకున్న వాటి గురించి కూడా మాట్లాడారు. తాజాగా ఆ కోవలోకి జర్మన్ మోటార్ సైకిల్ రైడర్ చేరిపోయాడు. ఆయన కూడా భారతదేశంలో పర్యటించేటప్పుడూ తనకు కలిగిన అనుభూతిని పంచుకోవడమే కాదు, ఇతర దేశాలతో పోల్చుతూ ఇక్కడే లభించే ఆనందం మాటలకందనిది అంటూ తన అనుభూతిని సోషల్ మీడియలో షేర్ చేసుకున్నాడు.జర్మన్కి చెందిన మోటార్ రైడర్ మార్క్ ట్రావెల్స్గా పేరుగాంచిన మార్కస్ ఎంగెల్ భారతదేశాన్ని బెస్ టూరిస్ట్ ప్లేస్గా అభివర్ణిస్తూ..ఈ మాతృగడ్డపై తన అనుభవాన్ని షేర్ చేశారు. తన పర్యటనలో భారతదేశం అంతటా ప్రయాణించేటప్పుడూ..ప్రపంచంలో మరెక్కడా లేనంత స్వేచ్ఛను అనుభవించానంటూ ఇన్స్టాగ్రామ్లో వీడియోని షేర్ చేశారు. ఆ వీడియోలో భారతదేశం గురించి ఇంతకముందు చెప్పాను..మళ్లీ ఇప్పుడూ చెబుతాను. నేను ఇప్పటివరకు చాలా దేశాల్లో పర్యటించాను, కానీ భారతదేశంలో పొందిన స్వేచ్ఛ మరెక్కడ పొందలేదు. ఈ ప్రదేశం నాకెంతో ఇష్టమైనది అని వీడియోలో చెప్పడం స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి, మార్కస్ ఎంగెల్ సాహసయాత్రలు, సుదూర మోటార్ సైకిల్ పర్యటనలకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఆ నేపథ్యంలోనే భారత్ వచ్చి కొన్నాళ్లు ఇక్కడ గడిపాడు కూడా. అతను కేవలం ద్విచక్ర వాహనంపై ఆ ప్రాంతంలోని సంస్కృతిని అన్వేషిస్తాడు. ఇక మార్కస్ వీడియోలో తాను మళ్లీ కచ్చితంగా భారత్కి తిరిగి వస్తానని చెప్పాడు. ఇక్కడ ఉండటం అంటే చాలా ఇష్టం. చాలాకాలం ఇక్కడ ఉన్నా. అయినా నాకు ఇక్కడ ఉండేలా ఐదేళ్ల వీసా ఉంది. కాబట్టి మళ్లీ అవకాశం వచ్చినప్పుడల్లా భారత్లో వాలిపోతా. ఇక్కడ పర్యటిస్తే కలిగే ఫీల్ వేరేలెవెల్. అని వీడియోని ముగించాడు. ఈ వీడియో నెట్టింట రెండు లక్షలు పైనే వ్యూస్, వేలల్లో లైక్లు వచ్చాయి. భారతదేశం అద్దం లాంటిదని..ఇక్కడ తన అందమైన గమ్యస్థానాలను చూపిస్తూ..తనలో కలిపేసుకుంటుంది. అలానే మిమ్మల్ని వశపరుచుకుంది అంటూ పోస్టులు పెట్టారు. కాగా, 15 సంవత్సరాలకు పైగా ప్రొఫెషనల్ సంగీతకారుడిగా పనిచేసిన తర్వాత మార్క్ 2020లో పూర్తి సమయం మోటో-వ్లాగర్గా మారాడు. View this post on Instagram A post shared by Marc Travels (@marc.travels.blog)(చదవండి: వండర్ బర్డ్స్..థండర్ కిడ్స్..) -
శబరిమలలో రూ. ₹6.12 కోట్లతో స్పెషాలిటీ ఆస్పత్రి
శబరిమల యాత్రా కాలం ప్రారంభానికి ముందే నీలక్కల్లో రూ.6.12 కోట్లతో అధునాతన స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నట్లు కేరళ ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. ఈ ఆసుపత్రిని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు(TDB) కేటాయించిన స్థలంలో నిర్మించనున్నారు. మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ సౌకర్యం నివాసితులకు, ఆలయాన్ని సందర్శించే లక్షలాది యాత్రికులకు ఉపయోగపడుతుందని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. నిజానికి ఈ ఆస్పత్రి ఏర్పాటు శబరిమల యాత్రికుల శ్రేయస్సుని నిర్థారించడంలో ప్రభుత్వ నిబద్దతను ప్రతిబింబిస్తుందని మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు. సుమారు పదివేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు ఔట్ పేషెంట్ గదులు, అత్యవసర విభాగం, ఐసియు,నర్సుల స్టేషన్ , ఇసిజి గది, ఫార్మసీ వంటివి ఉంటాయన్నారు. మొదటి అంతస్థులో ఎక్స్రే, బహుళ ఆపరేటింగ్ స్క్రభ్ స్టేషన్ తదితరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నీలక్కల్ బేస్ క్యాంప్కు రోడ్డు మార్గంలో వచ్చే యాత్రికులకు అత్యవసర,సాధారణ వైద్య సహాయాన్ని ఈ ఆస్పత్రి గణనీయంగా బలోపేతం చేస్తుందని మంత్రి వీణా జార్జ్ అన్నారు. నీలక్కల్ ఆలయ సమపంలోనే ఈ ఈ ఆస్పత్రి నిర్మాణ ప్రారంభోత్సవం జరగునుంది. దీనికి ఎమ్మెల్యే ప్రమోద్ నారాయణ్ , ఎంపీ ఆంటో ఆంటోనీ , డిప్యూటీ స్పీకర్ చిత్తయం గోపకుమార్ , జిల్లా పంచాయతీ అధ్యక్షుడు జార్జ్ అబ్రహం , టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తదితరులు హాజరు కానున్నారు. కాగా, నవంబర్ 16 నుంచి ప్రారంభమయ్యే రెండు నెలల వార్షిక తీర్థయాత్ర కాలంలో భారతదేశం, విదేశాల నుంచి వేలాది భక్తులు శబరిమలను సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు.(చదవండి: Chithira Thirunal Balarama Varma: 'చిత్తర అట్టవిశేషం'..!మాలధారులు సందర్శనం కంటే ముందు..!) -
కృష్ణా.. ఓ మినీ ఇండియా
అనగనగా ఓ రైల్వేస్టేషన్.. ఆ స్టేషన్ సమీపంలో రైల్వే ఉద్యోగుల కోసం బ్రిటీషర్లు కొన్ని నిర్మాణాలు చేపట్టారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్.. ఇలా ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చిన రైల్వే ఉద్యోగులు ఇక్కడే నివాసం ఉండేవారు. ఆ ప్రాంతం నచ్చడంతో కాలక్రమేణా అక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. క్రమంగా జనం పెరగడంతో వ్యాపారాలు చేసేందుకు వర్తకులు వచ్చారు. వీధులు వెలిసి.. అక్కడ ఓ ఊరే ఏర్పడింది. భిన్న మతాలు.. విభిన్న సంస్కృతులు.. కులాలు.. జాతులు.. ప్రాంతాల వారితో ఏర్పడిన ఆ గ్రామమే కృష్ణా. కృష్ణానది ఒడ్డున ఉండడంతో ఆ పేరే గ్రామం పేరుగా వాడుకలోకి వచ్చింది. ఎన్నో రాష్ట్రాల ప్రజలంతా ఒకేచోట ఉండడంతో కృష్ణా మండల కేంద్రాన్ని ఓ మినీ ఇండియాగా అభివరి్ణస్తుంటారు. అయితే.. బ్రిటిషర్ల కాలంలో కేవలం రైల్వేస్టేషన్ మాత్రమే ఉండగా.. అనంతరం దానిని అనుసరించి ఓ ఊరే ఏర్పడడం గమనార్హం. కృష్ణా గ్రామంలో నివసించే ప్రజలంతా ఇక్కడికి వలస వచ్చిన వారే కావడం విశేషం. మరాఠ కాలనీ, ధర్మశాల ఇలా విభిన్న పేర్లతో కూడిన కాలనీలు ఇక్కడ కనిపిస్తాయి.కృష్ణా: రాష్ట్ర సరిహద్దులోని కృష్ణా మండల కేంద్రాన్ని ఓ మినీ ఇండియాగా అభివర్ణిస్తుంటారు. దేశంలోని వివిధ రాష్ట్రాల వారు ఇక్కడ కలిసి ఉండడమే ఇందుకు కారణం. 1907 సంవత్సరంలో బ్రిటీష్ ప్రభుత్వం తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు కృష్ణానదిపై వంతెన నిర్మించి.. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు మొదట రైలు మార్గాలను ఏర్పాటు చేసింది. ఆ సమయంలో నది పక్కన ఒక స్టేషన్ ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ రైల్వేస్టేషన్ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో అప్పట్లో ఊరేలేదు. కేవలం రైల్వే ఉద్యోగులే ఉండేవారు. ఎన్నో రాష్ట్రాల వారు ఇక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఇక్కడే ఉండిపోవడంతో కాలక్రమేణా గ్రామంగా ఏర్పడింది. కృష్ణానది ఒడ్డున ఉండడంతో కృష్ణా గ్రామంగా పేరు వాడుకలోకి వచ్చింది. ఇదిలా ఉండగా.. 1911లో నిజాం కాలం నాటి హైదరాబాద్ ఫస్ట్ తాలుక్దార్గా (కలెక్టర్) ఉన్న గోవింద్నాయక్ తన భార్య రంగుబాయి జ్ఞాపకార్థం కృష్ణానది ఒడ్డున తిరుపతిలోని శ్రీవేంకటేశ్వరస్వామి మూలవిరాట్ను పోలిన మరో విగ్రహాన్ని ప్రతిష్టించాడు. అప్పట్లో ఈ ఆలయంలో పూజలు చేసేందుకు బ్రాహ్మణులు మహదేవ్ దీక్షిత్, నారాయణభట్, రాఘవేంద్రచారి, గణపతిభట్, భీమాచారిని నియమించి.. వారి భృతికి కొంత భూమిని కొనిచ్చారు. ఈ ఐదు కుటుంబాలకు చెందిన వారసులే ఇప్పుడు వందల సంఖ్యలో ఇక్కడ నివసిస్తూ కర్మకాండలు, తద్దినం, నిత్యకర్మ, సావత్రిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కర్మకాండలకు దేశంలో మొదటిది కాశీ అయితే.. రెండోది కృష్ణా కావడం మరో విశేషం. మాజీ ప్రధాని ఇందిరాగాం«దీ, రాజీవ్గాంధీ, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎనీ్టఆర్ అస్తికలను ఇక్కడున్న కృష్ణా, భీమానదుల సంఘమ క్షేత్రంలోనే నిమజ్జనం చేసినట్లు పురోహితులు తెలిపారు.రాజ్పుత్లు: మహారాష్ట్ర నుంచి ఇక్కడికి రైల్వే ఉద్యోగులుగా 75 ఏళ్ల క్రితం వలస వచ్చారు. ఒక్క కుటుంబం నుంచి దాదాపు 10 కుటుంబాలు అయ్యాయి. తాతల కాలం నుంచి రైల్వే ఉద్యోగులుగా కొనసాగుతున్నారు. ఒకరి నుంచి ఒకరికి ఉద్యోగాలు వచ్చాయని, మరికొందరు చిన్నపాటి వ్యాపారాలు, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ ఇక్కడే స్థిరపడ్డారు. వీరి వాడుక భాష హిందీ. కట్టుబొట్టు వేరుగా ఉంటాయి. ఉగాది, దీపావళి, దసరా ముఖ్య పండుగలు. గోదుమ పిండితో చేసిన చపాతి, పూరీలు ఎక్కువగా తింటారు.మరాఠీలు : మహారాష్ట్ర నుంచి ఇక్కడికి రైల్వే ఉద్యోగాలపైన 60 ఏళ్ల క్రితం వచ్చారు. ప్రస్తుతం ఆ కుటుంబాల్లో కొందరు మాత్రమే ఉద్యోగాల్లో ఉండడంతో మిగతా వారు ఖాళీగా ఉండకుండా.. గ్రామంలో కిళ్లీ కొట్లు, సప్లయింగ్ తదితర వ్యాపారాలు చేస్తున్నారు.అగర్వాల్లు : ఉత్తరప్రదేశ్, ఢిల్లీ నుంచి 80 ఏళ్ల క్రితం వ్యాపార నిమిత్తం ఇక్కడికి వచ్చారు. హోటళ్లు, స్వీట్స్ దుకాణం, ధాన్యం కొనుగోలు తదితర రంగాల్లో వ్యాపారం చేసేవారు. అప్పట్లో మక్తల్ మార్కెట్ కంటే ఇక్కడే ఎక్కువగా ధాన్యం కొనుగోళ్లు జరిగేవి. 40 ఏళ్లుగా ఇక్కడ వ్యాపారం పడిపోవడంతో ఇక్కడున్న వ్యాపారులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు.ముస్లింలు :రజాకార్ల పరిపాలనలో వ్యాపారం నిమిత్తం ఇక్కడికి వచ్చారు. అప్పట్లో వీరు దాదాపు 800 మంది ఉండగా.. ప్రస్తుతం 400 మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ వ్యాపారం పడిపోవడంతో కర్ణాటక, మహారాష్ట్రకు వలస వెళ్లారని సమాచారం.బ్రాహ్మణులు : కర్ణాటక నుంచి ఇక్కడికి మొట్టమొదట వచ్చింది వీరే. పూజలు నిర్వహించేందుకు వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడంతో ఇక్కడ గ్రామం అవతరించింది. వీళ్లు కర్ణాటకలోని శృంగేరి మఠంకు చెందినవారు. అప్పట్లో సాధువులు నది ఉన్నందున ఎక్కువగా వచ్చేవారు. అలా వచ్చిన క్షీరలింగేశ్వరుడు ఆయన మంత్రశక్తితో ఇక్కడి ప్రజల బాధలు, రోగాలను నయం చేసేవారు. ఆయన మరణంతో ఆయనను పూడ్చిన స్థానంలోనే సమాధి కట్టి, విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఏటా జనవరి 14న బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.జైనులు: 70 ఏళ్ల కిందట రాజస్తాన్ నుంచి వ్యాపార నిమిత్తం కృష్ణాకు వలస వచ్చారు. రైళ్లలో సరుకులు, వస్తువులను తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం చేసేవారు. 35 ఏళ్ల కిందట 100 మంది ఉంటే ఈ రోజు రెండు కుటుంబాలు మాత్రమే మిగిలాయి. వ్యాపారం పడిపోవడం, ఇతర రంగాలవైపు వెళ్లడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మరాఠ, ధర్మశాల కాలనీలు.. నది ఒడ్డున నివసిస్తున్న బ్రాహ్మణుల కాలనీ ధర్మశాలగా, రైల్వేస్టేషన్కు సమీపంలో ఉన్న కాలనీని మరాఠకాలనీ అని పిలుస్తారు. ఇక్కడ మహారాష్ట్రకు చెందినవారు ఎక్కువగా ఉండడంతో ఆ గల్లీని మరాఠ కాలనీగా పిలుస్తున్నట్లు తెలిపారు. అలాగే, జైనులు, రాజ్పుత్లు, వాల్మీకి (బోయ), ముదిరాజ్, చాకలి, కుర్వ, హరిజన్, ముస్లిం, వైశ్య తదితర కులాలకు చెందినవారు నివసిస్తున్నారు.సంప్రదాయాలు కొనసాగిస్తున్నాం ఇక్కడి ఆచారాలు, అలవాట్లు, భాష, ప్రాంతం వేరైనప్పటికీ మా సంప్రదాయాలు, అలవాట్లు, ఆచారాలు కొనసాగిస్తున్నాం. కొన్ని విషయాల్లో అంటే ఇక్కడున్న కట్టు, బొట్టు, తిండి విషయాల్లో మా వాటిని వదులుకొని ఇక్కడున్న విధంగా నడుచుకుంటున్నాం. మా ప్రాంతాలకు వెళ్తే మా అలవాట్ల ప్రకారమే ఉంటాం. – లక్ష్మీరాజ్పుత్, కృష్ణా గ్రామంవ్యాపారం చేస్తూ.. ఉపాధి మాది రాజస్తాన్. మా వంశస్తులు వ్యాపారం నిమిత్తం కృష్ణాకు వచ్చారు. వ్యాపారం చేస్తూ మరికొందరికీ ఉపాధి కల్పించారు. అలాగే మావారు ఆస్తులు సంపాదించారు. కాలక్రమేణా వ్యాపారం పడిపోయింది. ఈ గ్రామంలోని ఎంతోమంది పేదలకు భూములు ఇచ్చాం. మా తాతలు ఇచ్చిన ఆస్తులతో ఇప్పటికీ కొందరు జీవనం సాగిస్తున్నారు. – కపిల్సేట్, మార్వాడి, కృష్ణా వ్యాపారం కోసం.. మా వంశస్తులు 50 మందికి పైగా ఇక్కడకు రజాకార్ల పరిపాలనలో వ్యాపార నిమిత్తం వచ్చారు. వారి సంతానమే ఈ రోజు గ్రామంలో దాదాపు 400 మందికి పైగా ఉన్నాం. ప్రస్తుతం వివిధ వ్యాపారాలు, ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ జీవనం గడుపుతున్నాం. – మహ్మద్ రియాజ్, కృష్ణా -
'చిత్తర అట్టవిశేషం'..!మాలధారులు సందర్శనం కంటే ముందు..!
కార్తీక మాసంలో అయ్యప్ప మాలధారణతో స్వామియే శరణం అయ్యప్ప అనే శరణు ఘోష మారుమ్రోగిపోగా.., మరోవైపు కార్తీక దీపాలు, సోమవారాల పూజలతో సాధారణ భక్తుల కోలహాలం. అంత పుణ్యప్రదమై మాసం ఈ కార్తీక మాసం. ఈ సమయంలోనే చలి మొదలయ్యేది కూడా. ఈ గజగజలాడించే చలిలో మండలకాలం పాటు చన్నీటి స్నానాలతో అయప్పస్వాములు ఎంత నిష్టగా ఉదయం సాయంత్రాలు పూజలు చేస్తారో తెలిసిందే. ఆఖరున శబరిమల వెళ్లి ఆ అయ్యప్ప స్వామిని దర్శించుకుని దీక్ష ముగించడం జరగుతుంది. సాధారణంగా అయ్యప్ప ఆలయం నవంబర్, జనవరి మధ్య కాలంలోనే తెరుస్తారనే విషయం తెలిసిందే. అది కూడా మండలదీక్ష పూర్తి చేసుకునేందుకు వచ్చే అయ్యప్ప భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటుంది. అయితే అంతకంటే ముందు ఒక విశిష్ణ పూజ నిమిత్తం ఐదు రోజులు తెరిచే ఉంచుతారు. అది శబరిమలలో అత్యంత ప్రత్యేకమైన వేడుక. ఈ సందర్భంగా ఆ పండుగ విశేషాల గురించి సవివరంగా తెలుసకుందామా..!.ఆ పండుగే చిత్తిర అట్టవిశేషం (అత్తతిరునాల్) ఇది శబరిమలలో జరుపుకునే ప్రత్యేక పండుగ. ట్రావెన్కోర్ మహారాజు చితిర తిరునాళ్ బలరామ వర్మ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పండుగను నిర్వహిస్తారట. ఆయన గౌరవార్ధం ఈ వేడుకను నిర్వహిస్తారు. అప్పటి పందళం రాజవంశం శబరిమల ఆలయాన్ని ట్రావెన్కోర్కు అప్పగించింది. ఆ నేపథ్యంలోనే ఈవేడుకను ఆలయన నిర్వహాకులు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు. సరిగ్గా ఆయన పుట్టిన రోజున 1942లో చితిర తిరునాళ్ మహారాజు తన కుటుంబంతో శబరిమల సందర్శించినందుకు గుర్తుగా కూడా ఈ వేడుకను నిర్వహిస్తారు. అంతేగాదు ఆ సమయంలో ఆయనతో పాటు ఉన్న మహారాజు తమ్ముడు ఉత్రాడం తిరునాల్ మార్తాండ వర్మ శబరిమల దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. అది ఇప్పటికీ నెట్టింట వైరల్ ఫోటోగా సంచలనం సృష్టిస్తోంది. ఇక ఈ వేడుకను మహారాజు జన్మదినమైన తులా మాసంలో చిత్తా నక్షత్రం ఉన్న రోజున నిర్వహిస్తారు. చెప్పాలంటే సాధారణంగా ఆ పండుగ అక్టోబర్ నెలాఖరు-నవంబర్ మొదటి వారంలో జరుగుతుంటుంది.చిత్తిర అట్టవిశేషం విశిష్టత..అత్తతిరునాల్ పూజ కోసం అయ్యప్ప ఆలయం దాదాపు 29 గంటలు తెరిచి ఉంటుంది. ఈ వేడుకను అచ్చం మళయాళుల జరుపుకునే సంవత్సరాది వేడుక మాదిరిగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆ పండుగ రోజు ఉదయ 5 గంటలకు ఊరేగింపు, అభిషేకం జరుగుతాయి. దాంతోపాటు నెయ్యాభిషేకం, అష్టద్రవ్య మహాగణపతి హోమం, ఉష పూజ వంటి కైంకర్యాలు నిర్వహిస్తారు. ఇక్కడ మరోవిశేషం ఏంటంటే..తిరువనంతపురంలోని కవడియార్ ప్యాలెస్ నుంచి ట్రావెన్కోర్ రాజకుటుంబం తీసుకొచ్చిన ప్రత్యేక నెయ్యిని అయ్యప్పస్వామికి అభిషేకం చేస్తారు.అంతేగాదు ఈ ప్రత్యేక రోజున, అయ్యప్పన్ సన్నిధిలో ఉదయం సాయంత్రాల్లో పూజ, అష్టాభిషేకం, లక్షార్చనే, సహస్రకలశాభిషేకం, పడిపూజ, పుష్పాభిషేకం వంటి ప్రత్యేక పూజలు జరుగుతాయి. రాత్రి భోజనాల అనంతరం భస్మానికి అభిషేకం చేసి 10 గంటలకు హరివరాసన గానంతో ఊరేగిస్తారు. ఈ ‘చిత్తిర అట్టవిశేషం’ వేడుకల అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. మకరవిళక్కు మండలం(మండల దీక్ష) కోసం తిరిగి నవంబరు నుంచి మూడు మాసాల పాటు తెరిచి ఉంచుతారు. ఆ సమయంలోనే లక్షలాది మంది అయ్యప్ప స్వామి భక్తులు శబరిమల ఆలయాన్ని దర్శించుకుంటుంటారు. (చదవండి: చంద్రుడు ప్రతిష్టించిన సోమేశ్వరులు..! ఎనిమిది దిక్కులలో కొలువై..) -
ప్రియుడి మత్తులో భర్తపై హత్యాయత్నం!
అక్రమ సంబంధాలంటే.. హత్యలు చేసే మగాళ్లను చాలాకాలం నుంచి చూస్తున్నాం కానీ.. ప్రియుడి కోసం భర్తను హత్య చేసే స్త్రీల గురించి అరుదుగానే విని ఉంటాం. తాజాగా ఉత్తర ప్రదేశ్లోని బరేలీలోని సుభాష్ నగర్ ప్రాంతంలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ప్రియుడి మాయలో పడ్డ ఓ మహిళ భర్త అడ్డు తొలగించుకునేందుకు నిద్రమాత్రలను ప్రయోగించింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో తానొకటి తలిస్తే.. విధి ఇంకోటి తలచిందన్నట్లు ఆమె ప్రయత్నం బెడిసికొట్టింది. వివరాలు ఇలా ఉన్నాయి...ఆరోగ్యశాఖలో పని చేసి రిటైర్ అయిన వైద్యుడు అతడు. కూతురు పెళ్లయిపోవడంతో ఇంట్లో భార్య, భర్తలు మాత్రమే ఉంటున్నారు. సౌరభ్ సక్సేనా అనే ఎలక్ట్రిషియన్ అప్పుడప్పుడూ ఇంటికి వచ్చిపోతూండే వాడు. ఈ క్రమంలోనే అతడికి, వైద్యుడి భార్యకు సాన్నిహిత్యం పెరిగింది. ఈ విషయం తెలిసిన భర్త.. తగదని భార్యను వారించాడు. ఆమె వినలేదు సరికదా.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసే ప్లాన్ చేసింది. నిద్రమాత్రలు కలిపిన పాలను భర్తకు ఇచ్చింది. పాలు తాగిన ఆ వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకోగానే.. ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. సౌరభ సక్సేనా, ఆ మహిళ ఇద్దరూ ముందుగా సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేశారని, ఆ తరువాత సృ్పహ తప్పి పడి ఉన్న భర్తను ఇంకో గదిలోకి లాక్కెళ్లారు. మెడకు ఉరి బిగించి.. ఒక సుత్తితో అతడిపై దాడి చేశారు. చెక్బుక్, బ్యాంకు పాస్బుక్కులను స్వాధీనం చేసుకున్నారు. ఆస్తి పత్రాలపై బలవంతంగా సంతకాలు పెట్టించే ప్రయత్నమూ చేశారు కానీ.. కథలో ట్విస్ట్ ఇక్కడే చోటు చేసుకుంది. సౌరభ్కు తాగుడు అలవాటు ఎక్కువ. ఈ తతంగమంతా నడుస్తున్న సమయంలో మనోడికి మందు తాగాలనిపించింది. ప్రియురాలు వారించినా వినలేదు. మందు కావాల్సిందేనని పట్టుబట్టాడు. చేసేదేమీ లేక ఆమె భర్త తాగే ఖరీదైన మద్యం తెచ్చి ఇచ్చింది. ఫ్రీగా వచ్చిందనుకున్నాడో ఏమో కానీ.. ఫుల్లుగా తాగేశాడు. మత్తు ఎక్కువై అక్కడే పడిపోయాడు. ఈ లోపు నిద్ర మాత్రల మత్తులోనే ఉన్న వైద్యుడు ఎలాగోలా కష్టపడి పక్కింటి తలుపు తట్టగలిగాడు. జరిగిందంతా వారికి వివరించగలిగాడు. పక్కింటోళ్ల ఫిర్యాదుతో పోలీసులు ఇంటికి వచ్చేసరికి సౌరభ సక్సేనా ఎలాగోలా పారిపోయాడు. వైద్యుడి భార్య, సౌరభ్ సక్సేనాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సాటి లేని మాసం.. పుణ్యకార్తీక మాసం
స్కాంద పురాణంలో కార్తికమాస మహిమ ఈ విధంగా వర్ణితమయ్యింది: ‘న కార్తికే సమో మాసం, న కృతేన సమం యుగం, న వేద సదృశం శాస్త్రం, న తీర్థంగంగాయ సమం.’ యుగాలలో కృతయుగానికీ, శాస్త్రాలలో వేదాలకూ, తీర్థాలలో గంగకూ సమానమైనవి లేవు. అలాగే మాసాలలో కార్తికమాసానికీ సమానమైన మాసం లేదని ఈ వాక్యం స్పష్టం చేస్తుంది. ఈ మాసంలో వచ్చే కార్తిక పౌర్ణమి అత్యంత విశిష్టతను సంతరించు కుంది. శివ–విష్ణువులిద్దరికీ ఎంతో ప్రీతికరమైన ఈ పౌర్ణమిని శరత్ పూర్ణిమ, త్రిపుర పూర్ణిమ వంటి పేర్లతో పిలుస్తారు. కార్తికేయుడు జన్మించిన కృత్తికా నక్షత్రంలోనే ఈ పౌర్ణమి వస్తుంది. వేదాలను అపహరించి సముద్రంలో దాచిన సోమకాసురుణ్ణి సంహ రించడానికి శ్రీహరి మత్సా్యవతారం ధరించింది ఈ రోజే. ఉసిరిక చెట్టు కింద శ్రీహరి దామోదర స్వరూపాన్ని ప్రతిష్ఠించి ఉసిరికాయలతో పూజించడం కార్తిక మాసపు ప్రత్యేకత. కార్తికమాసం భక్తి, జ్ఞానం, ధ్యానం సమన్వయమైన మాసం. పౌర్ణమి చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉన్నప్పుడు వచ్చే ఈ మాసానికి అధిదేవత అగ్ని. అందుచేత ఇది యజ్ఞ సంబంధమైన పవిత్ర మాసం. కార్తిక మాసంలోని సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు. ఉసిరి చెట్లు ఉన్న వనంలో బంధు మిత్రులతో కలిసి వనభోజనం చేయడం మరొక ప్రత్యేకత. కార్తికమాసంలోని ఆచారాలు కేవలం ఆధ్యాత్మిక ప్రయోజనాలనే కాకుండా ఆరోగ్యపరమైన ప్రయోజనాలనూ అందిస్తాయి. ఈ కాలంలో జఠరాగ్నిమందగిస్తుందనే శాస్త్రపరమైన సత్యాన్ని గ్రహించి, ఉపవాసం ద్వారా శరీర శుద్ధి సాధించడం పద్ధతి. ఈ విధంగా, కార్తిక మాసం కేవలం పూజల, వ్రతాల మాసం మాత్రమే కాదు– భక్తి, జ్ఞానం, ఆరోగ్యం, సమాజ సమతా,ప్రకృతి పట్ల కృతజ్ఞతా భావాలను పునరుద్ధరించే దివ్య మాసం! ఇదీ చదవండి: హైపర్ సెన్సిటివిటీ న్యూమొనైటిస్ : కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు – వాడవల్లి శ్రీధర్ -
హ్యాకథాన్ విత్ ఇన్నోవేషన్
హైదరాబాద్లో సాంకేతికత, సృజనాత్మకత, యువశక్తి వినూత్న పంథాలో దూసుకుపోతోంది. వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నిర్వహిస్తున్న ‘కాన్వర్జెన్స్ 2కే25ఆర్ –ది హ్యాకథాన్’ దీనికి నిదర్శనంగా నిలిచింది. ‘ఎక్స్పీరియన్స్ ఇన్నోవేషన్’ అనే థీమ్తో ప్రారంభమైన ఈ 24 గంటల హ్యాకథాన్లో దేశం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు. అధునాతన అంశాలను ప్రదర్శించి తమ ఆలోచనలను వాస్తవ రూపంలోకి తీసుకురావడంలో వీరు సక్సెస్ అయ్యారు. రోబోటిక్స్, హెల్త్కేర్ టెక్, గ్రీన్ ఎనర్జీ, ఫిన్టెక్ వంటి ఎనిమిది విభాగాల్లో పోటీ పడుతున్న జట్లు కేవలం టెక్ ప్రాజెక్టులకే కాదు, బాధ్యతతో కూడిన భవిష్యత్తుకు కూడా ఒక మార్గదర్శకత్వాన్ని చూపాయి. ఈ సందర్భంగా ఆర్సీఐ–డీఆర్డీవో శాస్త్రవేత్త డాక్టర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ విద్యార్థులు ‘భయం లేకుండా కలలు కనండి, నిజాయితీతో నూతనత్వాన్ని సృష్టించండి’ అంటూ ప్రేరేపించారు. ఈ హ్యాకథాన్లో భాగంగా రూ.5 లక్షల బహుమతులతో పాటు పరిశ్రమ మెంటార్షిప్ అవకాశాలు కూడా అందించి ఇది టెక్ ఈవెంట్ మాత్రమే కాకుండా.. ‘లైఫ్ స్టైల్ లెరి్నంగ్ ఫెస్టివల్’గా నిలిచింది. (చదవండి: వండర్ బర్డ్స్..థండర్ కిడ్స్..) -
వండర్ బర్డ్స్..థండర్ కిడ్స్..
పక్షుల కిలకిలరావాలు చెవులకు ఎంత ఇంపుగా ఉంటాయో.. చిన్నారుల కేరింతలూ అంతే వినసొంపుగా ఉంటాయి. మరి చిన్నారులు, పక్షులు ఒకే చోట ఉంటే ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉంటుందో కదా. ఈ అందమైన ఊహను నిజం చేస్తోంది హైదరాబాద్ నగరానికి చెందిన మహిళ డైరెక్టర్గా ఉన్న వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్లు్యడబ్లు్యఎఫ్). ఈ నెలను యంగ్ బర్డర్స్ మంత్ (వైబీఎమ్)గా ప్రకటించడం ద్వారా పక్షులతో చిన్నారులకు అనుబంధాన్ని పెంచే కార్యక్రమాలు చేపట్టింది. నగరవాసి ఫరీదా తంపాల్ 1980లలో వ్యక్తిగతంగా పక్షుల వేటను ప్రారంభించారు. అలా అలా మరెందరో పక్షి ప్రేమికులకు మార్గదర్శకురాలిగా వ్యవహరిస్తూ, డబ్లు్యడబ్లు్యఎఫ్ డైరెక్టర్గా మారారామె. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెంచేందుకు బర్డ్వాచింగ్ ఉపకరిస్తుందని ఇటీవలే అధ్యయనాలు వెల్లడించిన నేపధ్యంలో దేశంలోనే తొలిసారిగా చిన్నారుల కోసం బర్డ్ వాచింగ్ ఈవెంట్స్ను పరిచయం చేస్తూ వైబీఎమ్ను ప్రారంభించారు. వాచింగ్....విన్నింగ్... ‘పక్షులు కనిపించడమే కాకుండా, అవి ప్రకాశవంతమైనవి, విభిన్నమైన కిలకిలలను, ధ్వనులను కలిగి ఉంటాయి. ఆసక్తికరమైన ప్రవర్తనలను ప్రదర్శిస్తాయి. మానవులతో లోతైన ప్రకృతి అనుబంధాలను కలిగి ఉంటాయి. ప్రస్తుత పర్యావరణ పరిరక్షణ లేదా వన్యప్రాణుల రంగంలో నిమగ్నమైన వారిలో అత్యధికులు తమ ప్రయాణాన్ని పక్షులను చూడటంతోనే ప్రారంభించి ఉంటారు‘ అని ఫరీదా తంపాల్ అంటున్నారు. చిన్నారికి సిరి...ప్రకృతి దారి ‘పక్షుల వీక్షణ అనేది చిన్నారులను సహజ ప్రపంచంలోకి ఆకర్షించడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి. ఎందుకంటే అవి వారిని ఆకట్టుకునేలా ఆసక్తికరమైన పనులు చేస్తాయి. పాడటం, నృత్యం చేయడం, తమ భాగస్వాములను ఎంచుకోవడం, గూళ్లను, ఇళ్ళు నిరి్మంచడం, ఇంకా ఎన్నో..’ అని చెప్పారామె. పక్షుల ద్వారా పిల్లలను సహజ ప్రపంచానికి పరిచయం చేయడమే ఎర్లీబర్డ్ అనే సంస్థ ప్రాథమిక విధి. దీని కోసం విద్యా సామగ్రిని వృద్ధి చేయడం, ప్రకృతి విద్యావేత్తలకు శిక్షణ ఇవ్వడం ప్రకృతి సంబంధిత విద్యను ప్రోత్సహించడానికి ఔట్రీచ్ వంటివి నిర్వహిస్తోంది. అదే క్రమంలో ఎర్లీ బర్డ్తో కలిసి డబ్లు్యడబ్లు్యఎఫ్–ఇండియా నుంచి ఫరీదా, గరిమా సహా సభ్యులతో కూడిన ఆర్గనైజింగ్ కమిటీ వైబీఎమ్ను నిర్వహిస్తోంది. ఈ దేశవ్యాప్త కార్యక్రమం, మరింత మంది పిల్లలను మనోహరమైన పక్షుల ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రయత్నిస్తుంది. నవంబర్ నెలే ఎందుకంటే... వైబీఎం ఈవెంట్కు నవంబర్ నెలనే ఎంచుకోవడం ఎందుకంటే... ఈ నెల దేశంలోని అనేక ప్రాంతాలలో వలస పక్షుల రాకకు ఊపునిస్తుంది. అంతేకాక ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ జన్మదినం (నవంబర్ 12). అదే విధంగా బాలల దినోత్సవం (నవంబర్ 14) కూడా ఇదే నెలలో ఉన్నాయి కాబట్టి ఈ నెలను వైబీఎమ్ కోసం ఎంచుకున్నారు. వాక్స్, టాక్స్...మరెన్నో... వైబీఎంలో భాగంగా హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా అనేక చోట్ల బర్డ్ వాక్స్, ఆటలు, క్విజ్లు నిర్వహిస్తారు. నెల పొడవునా అనేక నడకలు, ఆటలు నేచర్ జర్నలింగ్ సెషన్లతో పాటు, పక్షుల నేపథ్య ఉత్సవాలు కూడా ఇందులో భాగంగా నిర్వహిస్తున్నారు. కథ చెప్పడం, పక్షి కవిత్వం నుంచి ప్రకృతి జర్నలింగ్, పక్షి పాట అనుకరణ పోటీ వరకు చిన్నారుల కోసం కార్యక్రమాలు ఉంటాయి, అలాగే పెద్దల కోసం, చలనచిత్ర ప్రదర్శనలు, పక్షుల గురించి చర్చలు అవార్డు గెలుచుకున్న పక్షి ఛాయాచిత్రాల ప్రదర్శన ఉంటుంది‘ అని నిర్వాహకులు వెల్లడించారు. డబ్లు్యడబ్లు్యఎఫ్, ఎర్లీ బర్డ్ ప్రస్తుత నెట్వర్క్లతో పాటు, ‘బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ, బర్డ్వాచర్స్ సొసైటీ (పశ్చిమ బెంగాల్) గ్రీన్ హబ్తో సహా దేశవ్యాప్తంగా పకృతి విద్యపై పనిచేస్తున్న సంస్థలు వ్యక్తులు దీని కోసం చేతులు కలిపాయి. ‘ఇప్పటిదాకా వివిధ ప్రదేశాలలో దాదాపు 35 ఈవెంట్లు నిర్వహించాం. మరిన్ని ప్రణాళికలు కూడా ఉన్నాయి.’ అని తెలిపారు. బర్డ్ వాక్ ఈ నెల 8న రంగారెడ్డి జిల్లాలోని మోకిలాలో ఈ కార్యక్రమం ఉంటుంది. పక్షులను పసిగట్టడం దగ్గర నుంచి వాటిని పరిశీలించడం వరకూ పలు అంశాల్లో ప్రాథమిక అవగాహన కలి్పస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ జరుగుతుంది. వెబినార్ ఈ నెల 9న నగరానికి చెందిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఎం.శ్రీరామ్రెడ్డి ఆధ్వర్యంలో పలు బర్డింగ్ యాప్స్ పరిచయం చేస్తారు. పక్షులు పర్యవేక్షణ, పరిరక్షణపై అవగాహన అందిస్తారు. ఎకో ఆఫ్ ది ఏవియన్ ఈ నెల 22న యువత, చిన్నారుల కోసం ఈ పేరుతో వినోద భరితంగా ఎకో ఆఫ్ ది ఏవియన్ పేరిట ఒక బర్డ్ కాల్ కాంటెస్ట్ నిర్వహిస్తారు. బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్లో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకూ ఈ కార్యక్రమం ఉంటుంది. నగరంలో 8న కార్యక్రమం...దేశంలోనే తొలిసారిగా చిన్నారుల కోసం ప్రత్యేకించిన ఒక యంగ్ బర్డర్స్ మంత్ను నిర్వహిస్తున్నాం. పక్షులు, ప్రకృతిపై అవగాహన పెంచేలా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం ఉంటుంది. నగరంలో ఈ నెల 8వ తేదీన తొలి ఈవెంట్ మోకిలాలో జరుగుతోంది. మరిన్ని వివరాలను మా సంస్థ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. – ఫరీదా, డైరెక్టర్, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ -
హైపర్ సెన్సిటివిటీ న్యూమొనైటిస్ : కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు
నిమోనియా గురించి దాదాపు మనలో చాలామందికి తెలుసు. అయితే ‘హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్’ అనే మాట అంతగా తెలియదు. కానీ... ఇటీవలి మోంథా తుఫానులా చాలాకాలం పాటు వాతావరణం చల్లగా మందంగా ఉండటం, ఆ తర్వాత మళ్లీ చలికాలం మొదటి రోజులు కావడంతో అదే తరహా చలి కంటిన్యూ కావడం లాంటి వాతావరణం కొనసాగుతున్న రోజుల్లో ఇది ‘హైపర్ సెన్సిటివిటీ న్యూమొనైటిస్’గా చెప్పే కొన్ని రకాల న్యుమోనియాలకు అనువైన కాలమిది. కాబట్టి దీనిపై అవగాహన పెంచుకోడానికీ, దీని నుంచి అప్రమత్తంగా ఉండటానికీ, దీని గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయమిది. అందుకే ‘హైపర్ సెన్సిటివిటీ న్యూమొనైటిస్’ అంటే ఏమిటో తెలుసుకుందాం. కొన్ని రకాల నిమోనియాలను కలగలపుకొని ‘హైపర్ సెన్సిటివిటీ న్యూమొనైటిస్’ అనవచ్చు. దీని గురించి తెలుసుకునే ముందర మన పల్లెల్లోని కొన్ని నిర్దిష్టమైన చోట్ల వస్తుండే రకరకాల వాసనల వివరాలను చూద్దాం. అసలు హైపర్ సెన్సిటివిటీ న్యూమొనైటిస్ (Hypersensitivity pneumonitis) అంటే ఏమిటి...?అవి గరిసెలూ, గాదాలైనా, గడ్డివాములైనా, పావురాలూ, పిట్టలుండే పక్షిగూళ్లైనా అక్కడి గాలుల్లో వ్యాపించే వాసనలతో వాతావరణం కలుషితం కావడం, వాటినుంచి గాల్లోకి వ్యాపించే మనుషులకు సరిపడని అనేక కాలుష్య రేణువుతోనూ వచ్చే ఊపిరితిత్తుల సమస్యనే ‘హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్’గా చెప్పవచ్చు. పైగా ఇటీవల తుఫాను వాతావరణం, చలిగాలుల నేపథ్యంలో గడ్డీగాదం తడిసిపోవడంతో ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దీని గురించి తెలుసుకోవడం అవసరమే. ఒకరకంగా వృత్తిపరం...మరోరకంగా జన్యుపరం...చూడటానికి ఇదో వృత్తిపరమైన సమస్యగా అనిపించవచ్చు. రైతులు, పౌల్ట్రీ పనివారు, పక్షులు పెంచి జీవనోపాధి పొందేవారు తమ వృత్తులో భాగంగా ఈ సమస్యకు గురికావడంతో మనకు ఇదో వృత్తిపరమైన సమస్య (ప్రొఫెషనల్ హజార్డ్)గా కనిపిస్తుంది. అయితే మరోరకంగా చెప్పాలంటే ఇదో జన్యుపరమైన సమస్య కూడా. ఎందుకంటే... కొంతమందిలో కొన్ని అలర్జెన్స్ సరిపడకపోవడమన్న అంశం వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి సంతానానికి వస్తుంటుంది. దాంతో కొన్ని అంశాలకు తీవ్రమైన అలర్జీ ఉన్నవారిలో ఈ సమస్య కనిపిస్తుంటుంది. అందుకే కొన్ని కుటుంబాల్లోని వారిలో (ఫెమీలియల్గా) ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుండటం చాలా సాధారణం. ఈ కోణంలో చూసినప్పుడు ఇది జన్యుపరమైన దుష్ప్రభావంగా కనిపించవచ్చు. అయితే సాధారణంగా వయసు పెరుగుతూ వారు 50, 60 ఏళ్ల వయసుకు చేరుతున్నప్పుడు ఈ సమస్య మనుషుల్లో తీవ్రతరమవుతుంటుంది. ఈ సమయంలో ఇమ్యూనిటీ కొంత తగ్గుతుండటం ఇలా జరుగుతుంది. కానీ వ్యాధినిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తక్కువగా ఉండి, బాగా బలహీనంగా ఉన్న వాళ్లలో ‘హైపర్ సెన్సిటివిటీ న్యూమొనైటిస్’ సమస్య ఏ వయసు వారిలోనైనా కనిపించవచ్చు. పల్లెటూళ్లలో గరిసెల్లో వడ్లూ, ఇతర ధాన్యాలూ నిల్వ చేసేటప్పుడూ, వరిగడ్డితో గడ్డివాము / గడ్డివామి పేర్చే సమయంలో ఆ ప్రదేశంలో ఒక రకమైన వాసనలు వస్తుంటాయి. ఆ వాసనలు వచ్చే చోట వ్యాప్తిచెందే నిమోనియాను ‘ఫార్మర్స్ లంగ్’ అంటారు. అలాగే కోళ్ల గూళ్ల దగ్గర మరో రకం వాసన వస్తుంటుంది. అది సరిపడనివారికి ‘బర్డ్ ఫ్యాన్సియర్స్ లంగ్’ అనే మరో ఆరోగ్య సమస్య వస్తుంది. అంటే ఈ తరహా సమస్య పౌల్ట్రీల్లో పనిచేసేవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాదు... ఇటీవల చాలామంది ఆరోగ్య నిపుణులూ, డాక్టర్లు ఒక మాట చెబుతుండటాన్ని చాలామంది వినే ఉంటారు. అదే పావురాళ్లకు ఆహారం వేయకండి. వాటి విసర్జకాలతో ప్రాణహాని సైతం కలగవచ్చంటూ హెచ్చరిస్తుండటం చాలామంది దృష్టికి వచ్చే ఉంటుంది. అలా పక్షులు పెంచుకునేవాళ్లలో, పావురాల రెట్టలతోనూ ఈ తరహా నిమోనియా రావచ్చు.హైపర్ సెన్సిటివిటీ నిమోనియా వ్యాప్తికి దోహదపడే అంశాలు... మన పరిసరాల్లో నిత్యం వ్యాపించి ఉండే దాదాపు 300 రకాల రేణువులూ, కాలుష్య పదార్థాలు ‘హైపర్ సెన్సిటివిటీ నిమోనియా’కు కారణమయ్యే అవకాశముంది. కొంతమందికి కొన్ని పదార్థాలూ, అంశాల వల్ల అలర్జీ కలగడం మనకు తెలిసిందే. ఏ అంశాల వల్ల అలర్జీ కలుగుతుందో వాటిని అలర్జెన్స్ అంటారు. ఆ అలర్జెన్స్ను వర్గీకరించినప్పుడు నాలుగు రకాల నిమోనియాలు వచ్చేందుకు అవకాశముంది. అవి...ఫార్మర్స్ లంగ్: ఇది చాలావరకు రైతుల్లో కనిపిస్తుంది. పంటకోతలు పూర్తయ్యాక ధాన్యాన్ని గరిసెల్లో నిల్వ చేయడం, వాటిల్లోకి దిగి ధాన్యాన్ని పైకి తోడాల్సి రావడం, గడ్డివాముల్లాంటివి పేర్చాల్సి వస్తుండటం వంటి అంశాలతో రైతుల్లో ప్రధానంగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని ‘ఫార్మర్స్ లంగ్’ అంటారు.బర్డ్ ఫ్యాన్సియర్స్ లంగ్: జీవనోపాధి కోసం కొందరు పక్షుల్ని పెంచుతుంటారు. ప్రధానంగా పౌల్ట్రీ రంగంలోని వారూ, అలాగే హాబీగా మరికొందరు పెద్దసంఖ్యలో పక్షుల పెంపకం చేస్తుంటారు. ఇక మరికొందరు సరదాగా పక్షులకు ఆహారం వేసి ఆనందిస్తుంటారు. ఇలాంటి వాళ్లు ముఖ్యంగా పావురాళ్లకు ఆహారం వేస్తుంటారు. అలాంటి చోట్లలో పక్షుల వాసనా, వాటి వ్యర్థాల వాసనతోనూ, వాటి విసర్జకాలతో ఈ సమస్య వస్తుంది కాబట్టి దీన్ని ‘బర్డ్ ఫ్యాన్సియర్స్ లంగ్’గా చెబుతుంటారు. హ్యుమిడిఫయర్స్ లంగ్: కొందరు వృత్తిరీత్యా బాగా తేమతో కూడిన వాతావరణంలో పనిచేయాల్సి రావడమో లేదా నివాసం ఉండాల్సి రావడమో జరగవచ్చు. అక్కడి తేమ కారణంగా ఆ చోట్లలో పెరిగే ఫంగస్తో, వాటి స్పోరుల (అవి వ్యాప్తి చెందడానికి పండించే గింజలవంటివి) కారణంగా అవి తమ ఆరోగ్యానికి సరిపడనప్పుడు ‘హ్యుమిడిఫయర్స్ లంగ్’ అనే ఈ సమస్య వస్తుంది. నిత్యం ఎయిర్కండిషనర్లో ఉండేవారి కొందరికి ఆ చల్లటి వాతావరణం సరిపడకపోవడం వల్ల కూడా రావచ్చు. ఆ తేమ సరిపడదు కాబట్టి దీన్ని ‘హ్యుమిడిఫయర్స్ లంగ్’గా పేర్కొంటారు.హాట్ టబ్ లంగ్: కొందరు హాబీగానో, రిలాక్సింగ్ కోసమో లేదా తమ ఆరోగ్యం కోసమో ‘స్పా’ల వంటి చోట్ల ‘తొట్టి స్నానాలు’ వంటివి చేస్తుంటారు. మరికొందరు ఇన్హెలేషన్ థెరపీ పేరిట మంచి సువాసన ద్రవ్యాలతో కూడిన నీటిని పీలుస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఆ నీరు నిల్వ ఉండిపోవడం లేదా ఎప్పుడూ నీళ్లతో నిండి ఉండే ఆ పాత్రను సరిగా కడగక΄ోవడం, తొట్టిస్నానం చేసే ఆ తొట్లలో సరైన పారిశుద్ధ్య వసతులు లేకపోవడంతో అక్కడ పలు రకాల అలర్జెన్స్ పెరగవచ్చు. ఆ అలర్జెన్స్ సరిపడక వచ్చే ఈ సమస్యను ‘హాట్ టబ్ లంగ్’ అంటారు. మరీ ముఖ్యంగా గాలి సరిగా ప్రసరించని చోట్లలోని కలుషితమైన నీటి మీదుగా వచ్చే గాలినీ, ఆ నీటి తాలూకు ఆవిరులను పీల్చడం వల్ల ఈ సమస్య వస్తుంటుంది.లక్షణాలు... మనకు సరిపడని వాతావరణంలోకి వెళ్లినప్పుడు లక్షణాలు కనిపించవచ్చు. అవి అప్పటికప్పడు అక్యూట్గా కనిపించి బాధించవచ్చు. లేదా మరికొందరిలో దీర్ఘకాలంపాటు (క్రానిక్గా) వస్తూ వేధించవచ్చు. ఆ లక్షణాలేమిటంటే..ఒళ్లునొప్పులు, తలనొప్పి, ఊపిరి అందకపోవడం తీవ్రమైన ఆయాసం, జ్వరం, చలితో వణుకు రావడం కొందరిలో తీవ్రమైన దగ్గు వంటివి కనిపిస్తాయి. కఫం ఉండవచ్చు లేదా లేకపోవచ్చు. ఉంటే తెల్లగా, పసుపురంగులో ఒక్కోసారి రక్తపు చారికతోనూ కనిపించవచ్చు. గాలి పీలుస్తున్నా అది లోపలికి వెళ్లదు. కారణం... ఊపిరితిత్తుల్లో గాలి చేరే చివరి స్థానమైన గాలిసంచి (ఆల్వియోలై)లో వ్యర్థపదార్థాలు (ఎగ్జుడస్) నిల్వ ఉండిపోయి, అవి అడ్డంకిగా మారడంతో గాలి పీలుస్తున్నా లోపలికి వెళ్లదు. దాంతో శరీరానికి అవసరమైనంత ఆక్సిజన్ అందదు. ఫలితంగా ఊపిరితిత్తులు తమ పని తాము చేయలేని పరిస్థితికి వస్తాయి. ఇలాంటి కండిషన్ను ‘హైపాక్సిక్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్’ అంటారు. ఊపిరి అందకపోవడంతో నుదుట చెమటలు పట్టడం, ముఖం నీలంగా మారిపోవడం, కంగారుగా ఉండటం, గుండె స్పందన వేగం పెరగడం, డీలా పడిపోవడం, బీపీ పడిపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.అలర్జెన్లకు కొద్దిగా ఎక్స్పోజ్ కాగానే ఈ లక్షణాలు తీవ్రమై 4 నుంచి 12 గంటలపాటు కనిపించవచ్చు. ఆ వాతావరణం నుంచి బయటకు రాగానే కొందరిలో లక్షణాలు తగ్గవచ్చు. లేదా జన్యుపరమైన సమస్యలున్నవారికి అలర్జెన్స్ కారణంగా లక్షణాలు ఎడతెరిపిలేకుండా బాధిస్తూ ఉండవచ్చు. ఊపిరితిత్తులకు జరిగే నష్టమిలా... ఈ సమస్యతో ఊపిరితిత్తులపై దుష్ప్రభావం పడుతుంది. దాంతో వాటి సామర్థ్యం తగ్గుతుంది. అంతేకాదు... పరిస్థితి తీవ్రమైనప్పుడు ఊపిరితిత్తులపై గాయమైనట్టుగా గాట్లవంటివి ఏర్పడవచ్చు. ఇలా జరగడాన్ని ‘స్కారింగ్’ అంటారు. అంతే కాదు... ఊపిరితిత్తులు తమ సాగే గుణాన్ని కోల్పోయే ప్రమాదమూ ఉంది. ఇలా జరగడాన్ని ‘పల్మునరీ ఫైబ్రోసిస్’గా చెబుతారు.ఏ ప్రశ్నలతో క్లినికల్గా డాక్టర్లు ఈ సమస్యను నిర్ధారణ చేస్తారంటే... లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్లు తొలుత స్టెత్తో ఊపిరితిత్తులను పరీక్షిస్తారు. పల్స్ ఆక్సిమీటర్తో రక్తంలో ఆక్సిజన్ మోతాదులను, నాడీ స్పందనలను చూస్తారు. సమస్య నిర్ధారణ కోసం సాధారణంగా ఈ ప్రశ్నలు అడిగే అవకాశముంది. వృత్తిపరంగా ఏవైనా ఘాటైన వాసనలు, దుమ్ముధూళి రేణువులకు ఎక్స్పోజ్ అవుతున్నారా? ఇంట్లో ఎయిర్కండిషనర్ చాలా రోజుల్నుంచి శుభ్రం చేయలేదా? ఫిల్టర్లు మార్చి చాలాకాలమైందా? ఇంట్లో ఎక్కడైనా లీకేజీ ఉంటే, అక్కడి నిల్వ నీళ్ల వాసన పీల్చారా? తరచూ తొట్టిస్నానం (టబ్ బాత్) చేస్తారా? ఆ తొట్టి శుభ్రంగా ఉందా? పరిసరాల్లో పక్షులు ఉంటాయా? ఇంటి చుట్టూ పిట్టలు రెట్టలేస్తుంటాయా? డాక్టర్లు అడిగే ఈ ప్రశ్నలను తమకు తాముగా వేసుకున్నప్పుడు అవునని మీకే అనిపిస్తే వెంటనే డాక్టర్ను కలిసి, ఈ అంశాలను వివరించడం బాధితులకు ఎంతో మేలు చేస్తుంది. వీళ్లకు మరింత ముప్పు... ఆస్తమా లేదా తీవ్రమైన అలర్జిక్ రియాక్షన్ వచ్చేవారిలో సీఓపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ – బ్రాంకైటిస్, ఎంఫసీమా) ఉన్నవాళ్లలో / పొగతాగే అలవాటు ఉన్నవారిలో గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవారిలో , స్పీలనెక్టమీ అనే ప్రక్రియ ద్వారా స్పీ›్లన్ తొలగించిన వాళ్లలో , పోస్ట్ కోవిడ్ సమస్యలతో పాటు ఇదివరకే ఊపిరితిత్తుల సమస్యలు, టీబీ ఉన్నవారిలో.నిర్ధారణ పరీక్షలు... తొలుత స్టెతస్కోప్తో సాధారణమైన శబ్దాలు కాకుండా ఏవైనా అసాధారణమైన శబ్దాలు వినిపిస్తున్నాయా అని పరీక్షించడం. ఛాతీ ఎక్స్–రే, అవసరమనుకుంటే సీటీ స్కాన్ వంటి ఇమేజింగ్ పరీక్షలతో.శ్వాస ప్రక్రియ సరిగా ఉందా అని తెలుసుకోడానికీ లేదా ఊపిరితిత్తుల పనితీరు తెలుసుకోడానికి చేసే ‘లంగ్ ఫంక్షన్ టెస్ట్’. ∙ఏవైనా అలర్జెన్స్తో అలర్జీ ఉందేమో తెలుసుకునే యాంటీబాడీస్ రక్తపరీక్ష. నోటి నుంచి లేదా ముక్కు నుంచి ఊపిరితిత్తులకు గాలి వెళ్లే దారులను పరీక్షించే బ్రాంకోస్కోప్ పరీక్ష. (దీంతో వోకల్ కార్డ్స్, విండ్పైప్ వంటి చోట్లలో ఏమైనా అసాధారణతలు ఉన్నాయా అని తెలుస్తుంది).మరీ అవసరమైనప్పుడు ఊపిరితిత్తులనుంచి చిన్నముక్క సేకరించి చేసే ‘సర్జికల్ లంగ్ బయాప్సీ’ లేదా... ‘క్రయో లంగ్ బయాప్సీ’ (దీన్ని ఇంటర్వెన్షనల్ పల్మునాలజిస్ట్ నిర్వహిస్తారు) లేదా ‘వాట్స్ గైడెడ్ లంగ్ బయాప్సీ (టీబీసీబీ) వంటి పరీక్షలు. చాలాకాలం పాటు మూసి ఉన్న ఇళ్లలోకి వెళ్లినప్పుడు... చాలాకాలంపాటు మూసి ఉన్న ఇళ్లలోకి ఏ వృత్తిపరమైన కారణం వల్లనో లేదా ఇల్లు మారడం వల్లనో వాసనతో కూడిన ఆ వాతావరణంలోకి వెళ్లినప్పుడు అకస్మాత్తుగా ఊపిరి అందక΄ోవడం, ఆయాసపడటం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అక్కడ తమకు అలర్జీ కలిగించే రేణువులూ, వాసనలూ, అతి సన్నటి కాలుష్య పదార్థాలు ఉండటమే అందుకు కారణం. ఇది కొందరిలో తక్షణం సమస్యగా (అక్యూట్గా) కనిపించి... ఆ పరిసరాల నుంచి దూరంగా రాగానే తగ్గవచ్చు. హైపర్ సెన్సిటివిటీ న్యూమొనైటిస్ అనేది ఎంత సాధారణ సమస్య అంటే.. దీని వ్యాప్తి చాలా సాధారణం. మన సమాజంలోని ఐదు శాతం మందిలో ఈ సమస్య కనిపిస్తుండటమే దీనికి నిదర్శనం. చికిత్స... యాంటీ హిస్టమైన్ మందులతోమరీ అవసరమైనవారికి అవసరమైన మోతాదుల్లో కార్టికో స్టెరాయిడ్స్. ఊపిరితిత్తుల్లోని నాళాలను వెడల్పు చేసి, ఊపిరి అందేలా చేసే ‘బ్రాంకోడయలేటర్స్’ జన్యుపరమైన కారణాలతో సమస్య వస్తున్న వారిలో దేహంలో ఇమ్యూన్ వ్యవస్థ తీవ్రతను తగ్గించడానికి అవసరమైతే ‘ఇమ్యూనో సప్రెసివ్ మందులు’ రక్తంలో ఆక్సిజన్ మోతాదులు తగ్గితే, అవసరాన్ని బట్టి ఆక్సిజన్ పెట్టాల్సిరావడం. తీవ్రతను బట్టి మందుల్ని స్వల్పకాలం కోసం లేదా ఒక్కోసారి మూడు నెలలు, సమస్య మరింత తీవ్రంగానూ, జటిలంగానూ ఉన్నప్పుడు సుదీర్ఘకాలం పాటు మందులు వాడాల్సి రావచ్చు. ఒక్కోసారి ఊపిరితిత్తులపై స్కార్ వచ్చి, అవి పీచు (ఫైబ్రస్)గా అయిపోయినవాళ్లకు ఊపిరితిత్తుల మార్పిడి (లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్) మాత్రమే చివరి ఆప్షన్ కావచ్చు. డా. రమణ ప్రసాద్ సీనియర్ పల్మునాలజిస్ట్,– స్లీప్ స్పెషలిస్ట్ -
ఆట.. అంతకుమించి...
వ్యూహం.. బలం ఈ రెంటికి జెండర్ లేదని క్రీడలు నిరూపిస్తాయి! అందులో క్రికెట్ ఒకటి.. వ్యూహం.. బలం.. టీమ్ స్పిరిట్ ప్రతిఫలించే ఆట! మహిళా క్రికెట్లో వరల్డ్ కప్ కైవసం చేసుకుని ఈ మూడింటిలోనూ భేష్ అని నిరూపించుకుంది మన జాతీయ మహిళా జట్టు! ఈ టీమ్లో ప్రతి ఒక్కరిదీ ఒక్కో ప్రత్యేకత.రాహుల్ ద్రవిడ్ బ్యాట్తో...స్మృతి మంధాన అంటే తెలియనిదెవరికి? క్రికెట్తోనే కాకుండా తన ΄్యాషన్ అయిన మొబైల్ గేమింగ్ (బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా బీజీఎమ్ఐ)తోనూ ప్రసిద్ధి. కుకింగ్ అండ్ ట్రావెలింగ్ హాబీస్తో ఫేమస్. క్రికెట్ మ్యాచ్లు లేకపోతే మొబైల్ గేమింగ్.. కుకింగ్.. ట్రావెల్తో సేదతీరుతుందీ ఏ23 అంబాసిడర్. పంజాబీ వంటకాల్లో చేయితిరిగిన నైపుణ్యం ఆమెది. స్పైసీ పనీర్ టిక్కా మసాలా ఆమె సిగ్నేచర్ డిష్. దాన్ని ఆమె థెరపీ ఇన్ ఎ బౌల్గా అభివర్ణిస్తుంది. ఇష్టమైన ట్రావెల్ డెస్టినేషన్ స్విట్జర్లాండ్. క్రికెట్ విషయానికి వస్తే.. స్మృతి మంధానది సహజంగా కుడిచేతి వాటమే. కానీ వాళ్ల నాన్నకున్న లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ అబ్సెషన్ వల్ల ఆయన బలవంతంగా కూతురిని క్రికెట్లో ఎడమచేతి వాటం ప్లేయర్గా మార్చాడు. డొమెస్టిక్ క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి మహిళా క్రికెటర్గా ఘనత వహించిన విషయం తెలిసిందే కదా! కానీ ఆ డబుల్ సెంచరీ చేసిన బ్యాట్ ఎవరిదో తెలుసా.. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ది. అయితే ఆ బ్యాట్ను స్మృతి సోదరుడు శ్రవణ్కు (జూనియర్ క్రికెటర్గా ఉన్న రోజుల్లో) ద్రవిడ్ గిఫ్ట్గా ఇచ్చాడట. ముచ్చటపడి ఆ బ్యాట్తో తాను ఆడటం మొదలుపెట్టి అలా రికార్డ్ క్రియేట్ చేసింది స్మృతి మంధాన.వంటాగింటా జాన్తా నై ..క్రికెట్టే జీవితంహర్మన్ ప్రీత్ కౌర్.. మన మహిళా క్రికెట్ జట్టు సారథి. కూలెస్ట్ పర్సన్. ధైర్యసాహసాలు అని పర్ప్లెక్సిటీని అడిగితే ఆమెనే చూపిస్తుంది. పంజాబ్కు చెందిన 36 ఏళ్ల ఈ ప్లేయర్ క్రికెట్లో తన ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడానికి సంప్రదాయ మూసధోరణులతో ఒక యుద్ధమే చేసింది. ఆటల్లో హర్మన్ప్రీత్కి స్ఫూర్తి ఆమె తండ్రి హర్మందర్ సింగ్ భుల్లర్. ఆయన బాస్కెట్బాల్, వాలీబాల్ ప్లేయర్. తనూ తండ్రిలాగే దేశం తరపున ఆడాలని చిన్నప్పుడే నిశ్చయించుకుంది. క్రికెట్లో మహిళల జట్టు లేకపోతే మగవాళ్ల జట్టులో అయినా సరే ఆడి తన సత్తా చాటాలనుకుంది. స్థానిక మేల్ టీమ్తోనే ప్రాక్టీస్ మొదలుపెట్టింది కూడా. అలా కూతురు ప్యాంట్, షర్ట్ వేసుకుని.. అస్తమానం మగపిల్లలతోనే ఆడుతుండటం చూసిన హర్మన్ప్రీత్ తల్లి కంగారు పడింది. పిల్ల భవిష్యత్ ఏం గానూ అని కలవరం చెందింది. ‘నువ్విలా ప్యాంట్, షర్ట్లు వేసుకుని మగపిల్లలతో ఆటలాడ్డం ఏమీ బాగోలేదు. అందరు ఆడపిల్లల్లా చక్కగా సల్వార్ కమీజ్ వేసుకుని ఇంటిపట్టునే ఉండు. రోజూ వంటింట్లో నాకు చేదోడు వాదోడుగా ఉంటూ వంట నేర్చుకో’ అని అల్టిమేటం కూడా జారీ చేసింది. కానీ మన ప్లేయర్ ‘వంటాగింటా జాన్తా నై.. క్రికెటే నా జీవితం.. నేను ఇలాగే ఉంటాను’ అని తేల్చేసింది. ‘నా ఆ జవాబుతో అమ్మ మళ్లీ మాట్లాడలేదు’ అంటుంది హర్మన్ప్రీత్ కౌర్.ఆటకే కాదు పాటలకూ అంతే ఫాలోయింగ్.. మన మహిళా క్రికెట్ జట్టుకు జెమీమా రోడ్రిగ్స్ ఒక మెరుపు. తండ్రి గైడెన్స్తో ఏడేళ్ల వయసులోనే క్రికెట్ గ్రౌండ్లో అడుగుపెట్టింది. అయితే ఆమెకు స్ఫూర్తి మాత్రం సోదరులు ఎలి, ఎనోచ్లే! క్రికెట్లో ఆమె సూపర్స్టార్ అవుతుందని ప్రపంచానికి జోస్యం చెప్పింది ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్. అన్నట్టుగానే ఆమె సూపర్స్టార్ అయింది. క్రికెట్తోపాటు ఆమెకు పాటలు పాడటం.. రీల్స్ చేయడం ప్రాణం. ఆటలో ఆమె పట్ల ఎంత క్రేజ్ ఉందో.. ఆమె రీల్స్కి సోషల్ మీడియాలో అంతే ఫాలోయింగ్ ఉంది.అమ్మ ఆనంద తాండవంమన టీమ్ ఘన విజయం తరవాత పేసర్ రేణుక సింగ్ తల్లి సునీత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో స్థానికులతో కలిసి పాట పాడుతూ, డ్యాన్స్ చేస్తున్న దృశ్యం నెటిజనులను ఆకట్టుకుంటోంది. హిమాచల్ ప్రదేశ్లోని పర్సా అనే మారుమూల గ్రామానికి చెందిన రేణుక చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయింది. అప్పటి నుంచి తల్లే తండ్రిగా మారింది.రేణుక తండ్రికి క్రికెట్ అంటే మహా ఇష్టం. తన కూతురిని క్రికెటర్గా చూడాలనుకునేవాడు. తండ్రి కల నెరవేర్చడానికి రేణుక ఎంతో కష్టపడింది. ఆమె ప్రయాణంలో ప్రతి అడుగులో తల్లి అండగా నిలిచింది.ఈ అమ్మాయి పేరు... ముంబై కీ డొనాల్డ్ ట్రంప్ప్రపంచ కప్ ఘన విజయ సంబరాలు అం» రాన్ని అంటుతున్న నేపథ్యంలో ఒక అమ్మాయి సోషల్ మీడియాలో ఎట్రాక్షన్గా మారింది. ప్రపంచ కప్ విజయం గురించి ఈ అమ్మాయి అద్భుతమైన ఇంగ్లీష్లో మాట్లాడిన తీరు, హావభావాలకు నెటిజనులు ఫిదా అయ్యారు. అంతేకాదు, ఈ అమ్మాయికి ‘ముంబై కీ డొనాల్డ్ ట్రంప్’ అని పేరు పెట్టారు. డొనాల్డ్ ట్రంప్ లెవెల్లో ఇంగ్లీష్ మాట్లాడుతుందని ఆ పేరు పెట్టారు! ‘ఈ విజయం గురించి మాట్లాడడానికి నాకు మాటలు రావడం లేదు. ప్రతి ప్లేయర్ అద్భుతంగా ఆడారు. ఎంతో నిరీక్షణ తరువాత వరల్డ్ కప్ గెలుచుకున్నాం. సహనానికీ , అంకితభావానికి అద్దం పట్టే విజయం ఇది’ అని చెప్పింది ముంబై కి డోనాల్డ్ ట్రంప్.విల్పవర్తో వీల్చైర్లో...గాయం కారణంగా ఐకానిక్ మహిళల ప్రపంచ కప్ టోర్నమెంట్ నుంచి తప్పుకున్న ప్రతీక రావల్ నవీముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో వీల్చైర్లో విజయోత్సవంలో పాల్గొంది. టీమ్ సభ్యులు ఆమెను వీల్చైర్పై వేదికపైకి తీసుకువస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది.‘నేను మైదానంలో పోరాడలేకపోయాను. కానీ నా మనసు ఎప్పుడూ ఆటతోనే ఉంది. ప్రతి ఉత్సాహం నాదే, కన్నీటి బొట్టు కూడా నాదే’ అని ‘ఎక్స్’లో ఫోటో షేర్ చేసింది, కామెంట్ రాసింది రావల్. ‘సీరియస్లీ స్వీట్ మూమెంట్’ అని ఒక నెటిజనుడు ఈ ఫొటో గురించి కామెంట్ రాశాడు.→ ఐర్లండ్తో జరిగిన మ్యాచ్లో 320 పరుగులు సాధించి.. ఇంటర్నేషనల్ వన్ డే మ్యాచ్లలో 300 పరుగుల భాగస్వామ్యం సాధించిన తొలి మహిళా జోడీగా దీప్తి శర్మ, పూనమ్ రౌత్లు రికార్డ్ నెలకొల్పారు.→ మన దేశంలో తొలి మహిళా క్రికెట్ క్లబ్ పేరు ‘ది అల్బీస్’. దీన్ని ముంబైలో.. 1969లో అలూ బామ్జీ ఏర్పాటు చేశారు. ఇండియన్ క్రికెట్ క్లబ్ సభ్యురాలైన ఆమె.. క్రికెట్లో మహిళలూ ప్రొఫెషనల్గా ఆడాలని .. వాళ్లకూ అందులో కీలక స్థానం కల్పించాలని సాఫ్ట్బాల్ ప్లేయర్స్ను పరిచయం చేశారు. -
ఫెస్టివ్ సీజన్లో రికార్డ్ షాపింగ్ రూ.6 లక్షల కోట్లు, ఎందుకో?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 22 నుండి దాదాపు 400 వర్గాల ఉత్పత్తులకు జీఎస్టీ టాక్స్ను తగ్గించింది. ఈ టాక్స్ తగ్గింపు పుణ్యమా అని మనోళ్లు తెగ షాపింగ్ చేసేశారుట. పైగా ఫెస్టివ్ సీజన్ కావడంతో ఈ అవకాశాన్ని వినియోగదారులుబాగా వాడుకున్నారు. కార్ల నుండి వంట సామాగ్రి వరకు వస్తువులపై విచ్చలవిడిగా డబ్బులు వెచ్చించారు. ఫలితంగా అమెరికా ట్రంప్ ప్రభుత్వం విధించిన 50 శాతం దిగుమతి సుంకం ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చింది అంటున్నారు ఆర్థిక నిపుణులు.రిటైల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ బిజోమ్ బ్లూమ్బెర్గ్ న్యూస్తో పంచుకున్న డేటా ప్రకారం వరుసగా దసరా, దీపావళి సందర్భంగా దేశవ్యాప్తంగా 6 లక్షల కోట్లు( 67.6 బిలియన్ డాలర్లు) అమ్మకాలు నమోదైనాయి. ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్, దుస్తులు, ఫర్నిషింగ్ మరియు స్వీట్లు వంటి వస్తువులకు అత్యధిక డిమాండ్ ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ జాతీయ అధ్యక్షుడు బి.సి. భార్టియా ఒక ప్రకటనలో తెలిపారు.సెప్టెంబర్ 22- అక్టోబర్ 21 మధ్య వచ్చిన నవరాత్రి, దీపావళి మధ్య కాలంలో గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 8.5శాతం పెరిగాయి. పండుగ షాపింగ్ సమయంలో ప్రెషర్ కుక్కర్లు వంటి ఉత్పత్తులు పన్ను తగ్గింపు వల్ల ప్రయోజనం పొందాయట. మరో విషయం ఏమిటంటే జీఎస్టీ తగ్గింపు వార్తలతో ఆగస్టు మధ్యకాలం నుండి సెప్టెంబర్ చివరి దాకా కొనుగోలుదారులు తమ కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారట.భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీదారులు మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ మరియు మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ . నెలవారీ అమ్మకాలు పెరిగాయి, దాదాపు దశాబ్దంలో తొలిసారిగా పన్ను తగ్గింపు కారణంగా కార్ల ధరలు దిగివచ్చాయి. ఇది ఆయాకంపెనీలకు బాగా లాభించాయి.గత సంవత్సరంతో పోలిస్తే బంగారంతో సహా పెద్ద టికెట్ వస్తువులను షాపింగ్ చేయడానికి శుభ దినమైన ధన్తేరాస్ రోజున అమ్మకాలు పుంజుకున్నాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ గత సంవత్సరంతో పోలిస్తే ధన్తేరస్ రోజున అమ్మకాలు 20 శాతం పెరిగాయి. టాటా మోటార్స్ నవరాత్రి , ధన్తేరాస్ మధ్య లక్ష కంటే ఎక్కువ కార్లను డెలివరీ చేసింది.హెల్మెట్లు లెక్కలేకపోయారటమహాంద్రా ట్రాక్టర్ అమ్మకాలలో 27శాతం పుంజుకున్నాయిమంచి రుతుపవనాలు గ్రామీణ ఆదాయాలను పెంచాయి, దీనికి తోడు పన్ను తగ్గింపు మహీంద్రా ఉత్పత్తుల కొనుగోళ్లకు ఊతమిచ్చాయి. మహీంద్రా ఉత్పత్తి బృందం ఆదివారాల్లో బుకింగ్ల పెరుగుదలను నిర్వహించడానికి పని చేస్తోందని మార్కెటింగ్ , అమ్మకాల సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ గత వారం పోస్ట్-ఎర్నింగ్స్ కాల్లో తెలిపారు. ఆల్టో, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ఆర్, సెలెరియో వంటి ఎంట్రీ-లెవల్ మోడళ్లకు డిమాండ్ ఎంతగా ఉందంటే, మారుతి డీలర్లు ఇప్పుడు ద్విచక్ర వాహనదారులు కార్లకు అప్గ్రేడ్ అవుతున్నప్పుడు తమ షోరూమ్లలో వదిలిపెట్టిన హెల్మెట్లను లెక్కిస్తున్నారని బెనర్జీ చమత్కరించారు.మరోవైపు పన్ను మార్పులు కొన్ని భారతీయ వ్యాపారాల సప్లయ్ చైన్ కూడా దెబ్బతీసాయని, పాత ధరలకు వస్తువులను ఆఫ్లోడ్ చేయడానికి తొందరపడటంతో అమ్మకాలను దెబ్బతీశాయంటున్నారు మార్కెట్ నిపుణులు. అక్టోబర్ 27నాటి నోట్లో అమ్మకాల పెరుగుదలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అన్నారునోమురా ఆర్థికవేత్తలు సోనాల్ వర్మ , ఆరోదీప్ నంది. ఎందుకంటే దానిలో కొంత భాగం సాధారణం కంటే ఎక్కువగా ఉన్న డిమాండ్ కారణంగా ఉంటుందన్నారు. -
ఐఏఎస్ సారూ..! మీరే ఇలా చేస్తే ఎలా..?
అత్యున్నత హోదాలో ఉన్నవాళ్లు ఏ మాటైనా, విమర్శ అయినా చాలా ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే అందరికి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన వాళ్లే..అనుకోకుండా లేదా ప్రమాదావశాత్తు చిన్న మాట తూలిన అంతే సంగతులు. ఇదేంటి సారూ..! ఇలా చేశారు అని అంతా వేలెత్తి చూపించేస్తారు. పైగా విమర్శలపాలవ్వక తప్పదు. అందుకే పెద్దలు సదా అటెన్షన్, నమ్రతగా ఉండాలి అని చెబుతుండేది అందుకే కాబోలు. ఇప్పుడిదంతా ఎందుకంటే..పాపం ఈ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఉద్దేశ్యం మరొకటి అయితే ప్రజల్లో మరొలా వెళ్లి..ఆయన ప్రవర్తననే ప్రశ్నించే పరిస్థితికి దారితీసింది. అసలేం జరిగిందంటే..విదేశాల్లో ఉంటున్న మాజీ ఐఏఎస్ అధికారి ఎల్వీ నీలేష్ చేసిన ఒక్క పోస్ట్ పెద్ద వివాదాస్పదమై, సోషల్మీడియాలో చర్చలకు దారితీసింది. మన దేశ రాజాధానిలో వాయు నాణ్యత ఏ పరిస్థితిలో ఉందో తెలిసిందే. ఈ విషయమై నిపుణులు ఈపాటికే ప్రజలకు హెచ్చరికలు, జాగ్రత్తలు జారీ చేశారు కూడా. అయితే ఆ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ తాను ఆ నేపథ్యంలోనే ఢిల్లీని వదిలి విదేశాల్లో బతుకుతున్నానంటూ..తాను అమెరికాలో ఉన్న స్థితిని, ఢిల్లీలోని పరిస్థితిని పోల్చి మరి వివరించారు. పైగా ఢిల్లీ గగన వీధుల్లో పొగమంచుతో ఉన్న స్కైలైన్ని, అమెరికాలోని మౌంట్ రైనర్ నేషనల్ పార్క్ ప్రకృతి దృశ్యం చూపిస్తూ..రెండింటి మధ్య ఎంత వ్యత్యాసమో గమనించండి అని పోస్ట్లో రాసుకొచ్చారు. ముఖ్యంగా భారతదేశ రాజధానిలోని ప్రమాదకర గాలి నాణ్యత, విదేశాలలో కాలుష్యం లేని వాతావరణం మధ్య వ్యత్యాసాన్నిరీడింగ్లతో సహా చూపించారు. అయితే మన రాజధానిలో గాలి నాణ్యత అంతకంతకు పడిపోతుంది అని చెప్పడం వరకు బాగానే ఉంది, కానీ ఇలా వేరే దేశంతో పోల్చి మనల్ని మనం దిగజార్చుకుంటూ చెప్పడం నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దేశానికి సేవ చేసే బాధ్యతయుతమైన వృత్తిలో ఉండి, ఇలా దేశం విడిచి వచ్చి మంచి పనిచేశాను, ఇప్పుడు నేను చాలా సురక్షితంగా ఉన్నానంటూ.. ఏదో ఘనకార్యం చేసినట్లుగా మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారా అంటూ మండిపడ్డారు నెటిజన్లు. అసలు సమస్య పరిష్కారంలో భాగం కావలి గానీ మీరే ఇలా చేస్తారా?. నిజానికి మీరు దేశ సేవ చేయడానికే ఐఏఎస్ చేశారనుకున్నా..కానీ.. అని మిమర్శిస్తూ పోస్టులు పెట్టారు.If I hadn't left India, I would have had to live and breathe in this mess otherwise known as the North Block Secretariat.Note the stark contrast. 🤯 https://t.co/vBKuC0Te7p pic.twitter.com/GHUUtJfQNQ— LV Nilesh (@LVNilesh) November 2, 2025 (చదవండి: ఆ రూ. 500 కోట్లు డీల్..దెబ్బకు డ్రైవర్ తీరు మారిందిగా..!) -
భీష్మ పంచుక నాలుగురోజులే : అపురూప దర్శనం
భువనేశ్వర్: మహా పవిత్ర కార్తిక మాసం(karthika Masam 2025) చిట్ట చివరి 5 రోజులను మహా కార్తిక పంచుకగా వ్యవహరిస్తారు. కార్తిక మాసం నెల పొడవునా ఉపవాసం, ప్రత్యేక పూజలతో ప్రాప్తించే పుణ్యం కంటే పంచుక ఉపవాసం ప్రాప్తించే పుణ్య ఫలం అత్యంత మోక్షదాయకమని విశ్వసిస్తారు. దీన్ని భీష్మ పంచుక అని కూడా అంటారు. ఒడిశాలోని పూరీలోని జగన్నాథ స్వామి దేవాలయంలో ఈసారి పంచుక 5 రోజులకు బదులు 4 రోజులకు పరిమితం అయింది. పంచాంగం గణాంకాల ప్రకారం కార్తిక శుక్ల ద్వాదశి క్షీణతతో ఈ పరిస్థితి నెలకొంది. పంచుక సందర్భంగా శ్రీ మందిరం రత్న వేదికపై సోదర సోదరీ సమేత శ్రీ జగన్నాథ స్వామి రోజుకో అలంకరణలో శోభిల్లుతాడు. ఈ అలంకారాల్లో మూల విరాటులను దర్శిస్తే సకల పాపాలు నశిస్తాయని నమ్ముతారు. శ్రీ మందిరం పెద్ద సంఖ్యలో భక్తుల తాకిడితో కిటకిటలాడుతోంది. రద్దీ నియంత్రణ కోసం దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహా లఘు దర్శనం భక్తులకు వెలుపలి గడప (బహారొ కఠొ) నుండి రత్న వేదికపై మూల విరాట్ల దర్శనం ఏర్పాటు చేశారు. కార్తిక పూర్ణిమ రోజున ప్రథమ భోగ మండప సేవ ముగిసే వరకు ఈ కట్టడి నిరవధికంగా కొనసాగుతుంది. ఆ తర్వాత లోపలి గోడలపై నుంచి దర్శనం కల్పిస్తారు. సింహ ద్వారం గుండా ప్రవేశం భక్తులు సింహ ద్వారం గుండా ప్రవేశించి మిగిలిన మూడు ద్వారాల గుండా బయటకు రావాల్సి ఉంది. సేవకులు అన్ని ద్వారాల గుండా రాకపోకలు చేస్తారు. యాత్రికులతో ఆలయం లోనికి ప్రవేశించే యాత్రీ పండాలను మాత్రం అనుమతించరు. శ్రీ మందిరం లోపలి ప్రాంగణంలో మరియు బగేడియా ధర్మశాల సమీపంలో రాత్రింబవళ్లు సేవలు అందించే ఆరోగ్య కేంద్రం తెరిచారు. ఆలయం సమీపంలో రాత్రింబవళ్లు 2 అంబులెన్స్లు అందుబాటులో ఉంటాయి. వృద్ధులు, దివ్యాంగులకు వీల్చైర్ సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. భక్తులకు సులభ దర్శనం కల్పించేందుకు రద్దీ నియంత్రణ కార్యకలాపాల కోసం 32 ప్లాటూన్ల బలగాలను మోహరించినట్లు డీఐజీ డాక్టర్ సత్యజిత్ నాయక్ తెలిపారు. పంచుక ముగిసేంత వరకు ఈ నెల 5వ తేదీ వరకు ఈ ఏర్పాట్లు కొనసాగుతాయన్నారు. పంచుక తొలి రోజు పురస్కరించుకుని ఆది వారం భద్రతా ఏర్పాట్లుని ప్రత్యక్షంగా సందర్శించి సమీక్షించారు. ఇదీ చదవండి: నో ఫోటో షూట్, నో హగ్స్ : వరుడి10 డిమాండ్లు, నెట్టింట చర్చ -
నో ఫోటో షూట్, నో హగ్స్ : వరుడి10 డిమాండ్లు
‘పెళ్లి చూసి చూడు..ఇల్లు కట్టి చూడు’ అనేది ఇప్పటికీ నూటికి నూరుపాళ్లు నిజం అనిపించే మాట. దీనికి ఇండియాలో కొనసాగుతున్న ట్రెండ్ మరింత ఆజ్యం పోస్తుంది. ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట అనేదిఒకప్పటి మాట. ఇవాల్టి పెళ్లి ళ్ల ట్రెండ్ దీన్ని దాటేసి మరింత ముందుకు పోయింది. లక్షలకు, లక్షలకు కుమ్మరించి, హంగూ ఆర్భాటాలతో నిశ్చితార్థం, ప్రీ వెడ్డింగ్, షూట్లు, ఖరీదైన బట్టలు, డైమండ్ నగలు, ఖరీదైన రిసార్ట్లు, పెళ్లి పందిటిలో స్క్రీన్లు,డ్రోన్ కెమెరాలు, ఇక భోజనాల సంగతి సరేసరి ఇంత తతంగం లేనిది ఏ మధ్య తరగతి ఇంట్లో పెళ్లి జరగడంలేదు. తాజాగా ఒక పెళ్లి కొడుకు 10 డిమాండ్లు మాత్రం సంచలనంగా నిలిచాయి. అవేంటో చూద్దామా..అసలే రానున్నది అంతా పెళ్లిళ్ల సీజన్. మన దేశంలో కట్నం తీసుకోవడం చట్టరీత్యా నేరం. ఇప్పటి తరం లో కొంత మార్పు వచ్చినప్పటికీ గిప్ట్లు, కానుకలు పేరుతో తెరవెనుక, ఒప్పందాలు, భారీ ఎత్తు లావాదేవీలు జరిగిపోతూనే ఉంటాయి. అబ్బాయి తరపు కుటుంబం గొంతెమ్మ కోర్కెలు తీర్చేందుకు అమ్మాయి తరబు కుటుంబాలు శక్తికిమించి ఖర్చు చేస్తాయి, తమ కుమార్తె సంతోషంగా ఉంటుంది కదా అని అప్పు చేయడానికైనా వెనుకాడరు. కానీ ఒక వరుడు మాత్రం కట్నం వద్దు కానీ 10 కోరికలు అంటూ షేర్ చేసిన డిమాండ్లు అందర్నీ ఆలోచింప చేస్తున్నాయి. 10 డిమాండ్లు ఏంటంటే..ప్రీ-వెడ్డింగ్ షూట్ ఉండకూడదు.అతని వధువు లెహంగాకు బదులుగా చీర ధరించాలిపెళ్లిలో బిగ్గరగా, అసభ్యకరమైన సంగీతానికి బదులుగా, వాయిద్య సంగీతం ఉండాలి.దండలు మార్చుకునే సమయంలో ప్రశాంతంగా తామిద్దరమే ఉండాలి. దండలు మార్చుకునేటపుడు ఎవరైనా వరుడ్నిగానీ, వధువును గానీ పైకి ఎత్తడం లాంటి చేస్తే..తక్షణం వాళ్లు వేదికను వీడాల్సి ఉంటుంది.పెళ్లికి సంబంధించి ఇతర తంతులో కూడా ఫోటోగ్రాఫర్లు ,వీడియోగ్రాఫర్లు జోక్యం అస్సలు ఉండకూడదు.వేడుక ప్రారంభమైన తర్వాత పూజారిని అస్సలు ఎవరూ అడ్డుకోకూడదు.తాను , తన వధువు ఫోటోగ్రాఫర్లు అడిగి పిచ్చి పిచ్చి పోజులు ఇవ్వబోం.వివాహం పగటిపూట జరగాలి. సాయంత్రం నాటికి బధాయి(వధువును అత్తారింటికి సాగనంపే వేడుక) అన్ని సర్దుకోవాలి. తద్వారా అర్థరాత్రి కార్యక్రమాలు 'అతిథులకు అసౌకర్యం' లాంటివి ఉండవు.పెళ్లి తరువాత, వధూవరులు హగ్గులు, కిస్లు ఇలాంటివేవీ ఉండకూడదు.అంతేకాదు ఇది అగ్ని దేవుడి సాక్షిగా జరిగే పవిత్ర పవిత్ర వివాహం, సినిమా షూట్ కాదు."నెటిజన్లు ఏమన్నారంటే..!ఈ డిమాండ్లు కొందరికి న్యాయంగా అనిపించినప్పటికీ, మరికొందరు మాత్రం వీటిని తోసిపుచ్చారు. కొంతమంది అతను చెప్పింది సహేతుకమే అన్నారు. అయితే కట్నం తీసుకోకపోవడం అక్షరాలా చట్ట విరుద్ధం.. అదేదో నువ్వు గొప్పవ్యక్తిలా ఫోజులివ్వనక్కర లేదు అని ఒకరు, వివాహంలో సరదాగా గడపాలని అందరూ కోరుకుంటారు బ్రో అని మరొకరు వ్యాఖ్యానించడం గమనార్హం. పెళ్లి కూతురు పెళ్లిలో ఎలాంటి దుస్తులు ధరించాలో, పెళ్లి కొడుకు ఎందుకు డిసైడ్ చేయాలి అని కొందరు విమర్శించారు. "ఇలాంటి చిన్న చిన్న అసౌకర్యాకే అసహనానికి లోనైతే అతను పెళ్లి చేసుకుని ఇతరుల జీవితాలను పాడుచేయకూడదు ఒక యూజర్ అన్నారు. మరికొందరు అతన్ని సమర్థిస్తూ, "ఇది చాలా బాగుంది !!! వివాహం అనేది ఒక పవిత్ర బంధం, ఇన్స్టాగ్రామ్ లైక్ల కోసం కాదు !!!" అని అన్నారు. -
అందువల్లే టీనేజర్లలో పాప్కార్న్ బ్రెయిన్ సిండ్రోమ్..!
భారతీయ టీనేజర్లలో ఎక్కువ మంది "పాప్కార్న్ బ్రెయిన్ సిండ్రోమ్" బారినపడుతున్నారని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో చిన్నపిల్లల నుంచి యువకుల వరకు చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అసలేంటి పాప్కార్న్ బ్రెయిన్ సిండ్రోమ్? ఎందువల్ల వస్తుందంటే..అధిక స్క్రీన్ సమయం, డిజిటల్ స్టిమ్యులేషన్తో ముడిపడి ఉన్న పరిస్థితినే పాప్కార్న్ బ్రెయిన్ సిండ్రోమ్గా వ్యవహరిస్తారు. సోషల్ మీడియాలో, ఆన్లైన్ కార్యకలాపాల్లో ఎక్కువ సేపు గడిపితే ఇలా వచ్చేస్తుందా అంటే..ఔనని చెబుతున్నారు వైద్యులు. దీనివల్ల శ్రద్ధ అనేది లోపిస్తుందట. ఒక పనిపై ఫోకస్ అనేది భారంగా మారిపోతుందట. ఇటీవల కాలంలో యువకులు, పెద్దలు స్కీన్ సమయాన్ని పెంచేస్తున్నారు. ముఖ్యంగా యాప్లు, గేమ్లు, వీడియోలు అంటూ తదేకంగా డిజిటల్ కార్యకలాపాల్లోనే టైం స్పెండ్ చేస్తున్నారు. దాంతో ఈ బ్రెయిన్ సిండ్రోమ్ బారినడుతున్నట్లు తెలిపారు. ఏదైన అతి అయితే ప్రమాదమే అన్నది జగమెరిగిన సత్యం. అలానే డిజిటల్ ఓవర్లోడ్ శారీరకంగానే కాకుండా మానసికంగా హాని అని, దీనివల్ల దృష్టి లోపం, జ్ఞాపకశక్తి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. పాప్కార్న్ బ్రెయిన్ సిండ్రోమ్ అంటే..2011లో వాషింగ్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు డేవిడ్ లెవీ ఈ పేరుని సూచించారు. ఏ విషయంపైన శ్రద్ధ, ఫోకస్ లేకపోవడాన్ని పాప్కార్న్ గింజలు మాదిరిగా మెదడు తన అటెన్షన్ కోల్పోయింది అనే సూచగా పరిశోధకుడు లెవీ ఇలా వ్యవహరించారు. ఈ డిజిటల్ మీడియా వల్ల ఒక వ్యక్తి ఆలోచనలు ఒకదాని నుంచి మరొకదానికి వేగంగా మారిపోతుంటాయి. దాంతో శ్రద్ధ అనేది కరువవుతుంది. అంటే ఒకే కార్యచరణపై దృష్టి పెట్టడంలో ఇబ్బంది ఎదురవుతుంది. మానసికంగా అస్థిరత ఏర్పడుతుంది. ఇలాంటి స్థితినే పాప్కార్న్ బ్రెయిన్ సిండ్రోమ్ అంటారు. అధికారికంగా వైద్య నిర్థారణ కానప్పటికీ..ఈ పరిస్థితి చాలా తీవ్రమైనదని చెబుతున్నారు నిపుణులు. ఎందువల్ల వస్తుందంటే..? తరుచుగా మల్టీటాస్కింగ్, సోషల్ మీడియా, డిజిటల్ నోటిపికేషన్ తదితరాలే ఈ పరిస్థితికి కారణమని చెబుతున్నారు నిపుణులు.వాటిలో కొన్ని కారణాలు..అధిక స్క్రీన్ సమయంమొబైల్లో ఎక్కువ సమయంల గడపడం వల్ల డిజిటల్ కాని కార్యకలాపాలపై దృష్టి పెట్టడం కష్టమవుతుంతక్షణ సంతృప్తిఇంటర్నెట్, సోషల్ మీడియా త్వరిత రివార్డులను అందిస్తాయి. అది మెదడులో డోపమైన్ను పెంచి రోజువారీ పనులను నిస్తేజంగా, ఆసక్తికరంగా కానివిగా చేస్తుంది.నిరంతర నోటిఫికేషన్లుతరచుగా వచ్చే నోటిఫికేషన్లు మన దృష్టిని విచ్ఛిన్నం చేస్తాయి. ఇది చాలా మానసిక అంతరాయాలను కలిగిస్తుందట. ఒకే పనిపై దృష్టి పెట్టడం కష్టతరం అవుతుందట.మల్టీ టాస్కింగ్వేర్వేరు యాప్లు లేదా పనుల మధ్య త్వరితగతిన మారడం వల్ల శ్రద్ధ తగ్గిపోతుందటఎవరిని ఎక్కువగా ప్రభావితం చేస్తుందంటే?వైద్యుల అభిప్రాయం ప్రకారం, పాప్కార్న్ మెదడు ఎక్కువగా టీనేజర్లు, యువకులలో కనిపిస్తున్నప్పటికీ, ఈ పరిస్థితి ఇప్పుడు 30 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల వారిలో కూడా సాధారణంగా కనిపిస్తోందని చెబుతున్నారు వైద్యులు. అయితే, ఇది ఇంటర్నెట్ వ్యసనం లాంటిది కాకపోయినా.. రోజువారీ జీవితంలో పని సంబంధంల మధ్య అంతరాయం కలిగించి, సోమరిగా నిలబెట్టేంత చెడ్డదిని చెబుతున్నారు నిపుణులు. కలిగించడంలో సమానంగా చెడ్డది. ఈ పాప్కార్న్ బ్రెయిన్ శ్రద్ధ, భావోద్వేగ శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఈ పరిస్థితి లక్షణాలు..చిరాకు, ఆందోళన పెరగడంనిద్రలేమి దృష్టిని కేంద్రీకరించడంలో లేదా శ్రద్ధ వహించడంలో ఇబ్బందిఅతిగా అప్రమత్తంగా లేదా ఒత్తిడికి లోనవుతున్నట్లు అనిపించడంఆఫ్లైన్ జీవితం నీరసంగా లేదా ఆసక్తిలేనిదిగా అనిపిస్తుంది.అధిక ఒత్తిడికి గురవ్వ్వడంఈ పరిస్థితిని అధిగమించాలంటే..శ్వాస వ్యాయామాలుప్రతిరోజూ కనీసం 10 నిమిషాలు ధ్యానం చేయండిఒకేసారి ఒక పనిపై దృష్టి పెట్టడం అనేది ప్రాక్టీస్ చేయడం అంటే సింగిల్ టాస్కింగ్కి ప్రాధాన్యత ఇవ్వడం లాంటిది. జ్ఞాపకశక్తిని పెంపొందించేలా యోగా ఆసనాలుస్క్రీన్ సమయాన్ని సర్దుబాటు చేయడంటెక్-ఫ్రీ జోన్ను నియమించుకోవడంస్వయంగా ఎవరికి వారుగా డిజిటల్ డిటాక్స్కు ప్రాధాన్యత ఇవ్వడంస్కీన్న సమయం, ఎలక్ట్రిక్ పరికరాలతో గడపడంలో సరిహద్దును ఏర్పాటు చేసుకోవడం వంటి వాటితో ఈ సమస్యను అధిగమించగలుగుతారనా చెబుతున్నారు నిపుణులు. లేదంటే అచ్చం పాప్కార్న్ మాదిరిగా బ్రెయిన్ ఏపని మీద ఫోకస్, శ్రద్ధని కనబర్చడంలో విఫలమై మానసికంగా స్ట్రగులవుతారని హెచ్చరిస్తున్నారు. ఆదిలోనే ఈ పరిస్థితిని గుర్తించి రికవరీ అయ్యే ప్రయత్నాలు చేయడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: రుతుస్రావ బాధలు మరింత సుదీర్ఘంగా!) -
ధ్రువ చరిత్ర
నిబద్ధత వ్యక్తి జీవితాన్ని విజయపథంలో నడిపిస్తుందనడానికి మహాభాగవతంలోని ధ్రువ చరిత్ర మంచి ఉదాహరణ. ఉత్తానపాదుని కుమారుడు ధ్రువుడు (Dhruvudu) ఒకరోజు తన తండ్రి ఒడిలో కూర్చొని వుండగా, సవతి తల్లి సురుచి అతన్ని వారించి, నీకా అర్హత లేదు. నువ్వు విష్ణుభగవానుని ప్రసన్నం చేసుకోగలిగితే, అప్పుడు మాత్రమే నీతండ్రి ఒడిలో కూర్చోవడానికి అర్హుడవౌతావు అని అనడంతో ధ్రువుడు అవమానంగా భావించి, యీ మాటలను సవాలుగా స్వీకరించాడు. అప్పుడు ధ్రువుని వయసు ఐదు సంవత్సరాలే. కాని సవతి తల్లి మాటలు ధ్రువునికి తీవ్ర మనస్తాపాన్ని కలుగజేసాయి. విష్ణుని ప్రసన్నం చేసుకోవాలనే బలమైన కోరిక ధ్రువుని మనసులో స్థిరపడింది. ధ్రువుడు రాజ్యాన్ని వదలి అడవికి పోయాడు. నారదుడు ధ్రువుని ఇంటికి రప్పించే ప్రయత్నం చేశాడు గాని ‘నేను విష్ణువుని దర్శించే వరకు యింటికి రాను’ అన్న ధ్రువుని సమాధానంతో నారదుడు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అన్న మంత్రాన్ని ధ్రువునికి ఉపదేశించాడు.ధ్రువుడు అనేక సంవత్సరాలు ఆహారం, నిద్ర, చలనం లేకుండా ఘోర తపస్సు చేశాడు. కనీసం శ్వాస కూడా తీసుకోకుండా తపస్సు చేశాడు. అతని తపశ్శక్తి ముందు విశ్వశక్తి బలహీనపడింది. దేవతలంతా విష్ణువుని దర్శించి,‘స్వామీ జగద్రక్షకా ఆ బాలుని తపోశక్తి ముందు విశ్వమే తలవంచవలసి వస్తుంది. కనుక అతనికి మీ దర్శనభాగ్యం కలిగించమని మొరపెట్టుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి ధ్రువునికి తన దర్శన భాగ్యం కలిగించాడు. ధ్రువుడు అమితానంద భరితుడై విష్ణువుని కీర్తించాలనుకున్నాడు కాని నోట మాటరాలేదు. అపుడు విష్ణుమూర్తి తన శంఖంతో ధ్రువుని నుదురు స్పృశించగానే దైవశక్తి దవునిలో ప్రవేశించింది. అప్పుడు దవుడు విష్ణుమూర్తిని కీర్తించగా, విష్ణుమూర్తి ‘‘ధ్రువా! నీవు ఈ భూమండలాన్ని వేల సంవత్సరాలు పాలిస్తావు. అంతేగాకుండా నువ్వు అమరుడవై ధ్రువనక్షత్రంగా వెలుగుతావు, అందరికీ మార్గదర్శక మౌతావు’’ అని ఆశీర్వదించాడు.ధ్రువుడు సత్యాన్వేషణ లో బాధని అవకాశంగా మార్చుకోవడం వల్ల, కోరిక భవిష్యత్ దర్శినిగా మారింది. కష్టాలకోర్చి అడవిలో చేసిన తపస్సు, విజయానికి అంతః క్రమశిక్షణ అవసరమని నిరూపించింది. ధ్రువుడు లౌకిక విజయం (తండ్రి ఒడిలో కూర్చోవడం) కోసం ప్రయత్నిస్తే దైవానుగ్రహంతో అమరత్వాన్ని పొందాడు. గురువు (నారదుడు) చూపిన మార్గాన్ని విడిచిపెట్టకపోవడం విపత్తునెదుర్కొనే శక్తినిచ్చింది. విజయం నిబద్ధత తో కూడిన స్థిర చిత్తం నుంచి పుడుతుందని ధ్రువ చరిత్ర మానవాళికి సందేశం మిస్తుంది.– డా. విశ్వేశ్వర వర్మ భూపతిరాజు -
జీవన సమరానికి గీతాఖడ్గం
గీత అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగిస్తుంది. అయితే ఈ జ్ఞానం కేవలం మేధస్సుతో పొందేదికాదు. భక్తి, ధ్యానం ద్వారానే అది పరిపూర్ణమ వుతుంది. విజయుడు అంటే బయటి శత్రువులను జయించిన వాడు కాదు, తన అంతరంగ శత్రువులైన కోపం, భయం, మోహం, అసూయలను జయించిన వాడే అసలైన విజేత. మనిషి పతనం బయటి పరిస్థితుల వల్ల రాదు. అది అంతరంగ బలహీనతల ఫలితం. అలాగే ఉన్నతి ఎవ్వరూ ప్రసాదించలేరు. అది ఆత్మవిశ్వాసం, ఆత్మజయంతోనే సాధ్యమవుతుంది. ఇప్పటి సమాజంలో మానవ జీవనం చాలా సంక్లిష్టం. ఉద్యోగ భారం, కుటుంబ బాధ్యతలు, సామాజిక ΄ోటీలు, భవిష్యత్తు భయాలు ఇవన్నీ మనసును అల్లకల్లోలంగా మార్చుతున్నాయి. మనసు ఒకవైపు ఆకాంక్షలతో పరుగెత్తుతుంటే, మరొకవైపు నిరాశలతో కుంగి΄ోతుంది. ఈ సందిగ్ధంలో గీత బోధించే తాత్పర్యం మనసుకు శాంతి, బుద్ధికి స్పష్టత, ఆత్మకు దిశ చూపిస్తుంది. అర్జునుడు నైరాశ్యంలో ఉన్నప్పుడు కృష్ణుడు జ్ఞానాన్ని బోధించాడు. మనం కూడా నిరాశలో ఉన్న ప్రతి సందర్భంలో గీత మనలోని ఆత్మస్థైర్యాన్ని మేల్కొలు పుతుంది.ఇదీ చదవండి: నీతా అంబానీకి స్టాఫ్ సర్ప్రైజ్ : భర్త, తల్లి కాళ్లు మొక్కి బర్త్డే సెలబ్రేషన్స్ చూశారా?గీత బోధించే సమత్వం జీవన గర్భరహస్యం. సుఖదుఃఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు ఇవన్నీ జీవనయాత్రలో సహజమైనవి. ఆ ప్రవాహంలో కొట్టుకు΄ోకుండా స్థిరంగా నిలబడగలగడమే గీత వలన మనం పొందే శిక్షణ. కర్తవ్యాన్ని ఫలాపేక్ష లేకుండా చేయడమే గీతాజ్ఞానం. గీతలోని వైరాగ్య భావం అత్యున్నత విముక్తి. తామరాకుమీద నీటిబిందువులా జీవనం కొనసాగిస్తూ లోకబంధనాలకు అతీతంగా ఉండగలగడం అనాసక్తి. ఇది త్యాగం కాదు, సంసారంలోనే ఉండి కర్తవ్యాన్ని సమర్పణతో నిర్వర్తించడం.భగవద్గీత ఒక శాస్త్రగ్రంథం కాదు. కాలాతీత మానసికశాస్త్రం, ఆత్మవికాస శస్త్రం. ఇది యుగాల మార్పులోనూ, నాగరికతల పరివర్తనలోనూ శాశ్వతంగా నిలిచి ఉంటుంది. నేడు శాస్త్రవేత్తలు విశ్వరహస్యాలను అన్వేషిస్తుంటే, గీత మనలోని ఆత్మరహస్యాన్ని వెలికితీస్తుంది. శరీరాన్ని సంరక్షించేది వైద్యం అయితే, ఆత్మను కాపాడేది గీత. ఇదీ చదవండి: భీష్మ పంచుక నాలుగురోజులే : అపురూప దర్శనంమనసును జయించడం ద్వారా మనిషి విశ్వాన్ని జయించగలడు. కో;eన్ని అధిగమించడం ద్వారా భయాన్ని జయించగలడు. అనాసక్తితో విముక్తిని పొందదగలడు. కర్తవ్యాన్ని ఆరాధనగా భావించడం ద్వారా జీవితం పవిత్రమవుతుంది. జ్ఞానం వెలుగుతో ఆత్మజ్యోతి ప్రసరిస్తుంది. ఇదే గీతామాధుర్యం. ఇదే యుగయుగాలకీ తియ్యని జ్ఞానామృతం. – సత్యశ్రీ -
నీతా అంబానీకి స్టాఫ్ సర్ప్రైజ్ : భర్త, తల్లి కాళ్లు మొక్కి బర్త్డే సెలబ్రేషన్స్ చూశారా?
రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ 62వ పుట్టినరోజు జామ్నగర్లో తన ఉద్యోగుల మధ్య ఘనంగా జరిగింది. నవంబరు 2, శనివారం నాడు 62వ బర్తడే సందర్బంగా సిబ్బంది బర్త్డే సెలబ్రేషన్స్తో ఆమెను సర్ప్రైజ్ చేశారు. నీతా పుట్టిన రోజును ఆమె స్టాఫ్ అంతా కలిసి ఆనందంగా నిర్వహించిన నెట్టింట సందడిగా మారింది. సిబ్బంది పాటలు, కేరింతలు కరతాళ ధ్వనుల మధ్య కేక్ ఉన్న టేబుల్ వద్దకు ఆమె పువ్వులపై నడిచి వచ్చారు. కేక్ను కట్ చేసిన అనంతరం సిబ్బందితో కలిసి ఉల్లాసంగా డ్యాన్స్ చేశారు. అంతే కాదు ఒక మహిళా ఉద్యోగి ఆమ నీతా ముక్కుపై కేక్ పూయడంలాంటివి ఈ సరదా వేడుకలో చూడవచ్చు.మరోవైపు పుట్టిన రోజు సందర్భంగా దేవుని ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే భర్త అంబానీ కాళ్లకు మొక్కి తన ప్రేమను చాటుకున్నారు. అంతేకాదు తనకు జన్మనిచ్చిన తల్లి పాదిభి వందనం చేసి, ఆమె ఆశీస్సులు కూడా తీసుకున్నారు నీతా. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) ఇష్టమైన పింక్ కలర్ డ్రెస్లో నీతా అద్భుతమైన చీరలు, డైమండ్నగలు, ఖరీదైన వాచీలు, లగ్జరీ బ్యాగులకు పెట్టింది పేరైనా నీతా అంబానీ తన 62 బర్త్డే కోసం తన ఫ్యావరెట్ పింక్ కుర్తా సెట్లో మెరిసారు. ఆరుగజాలతో అద్భుతంగా ఎంబ్రాయిడరీ చేసిన రాణి పింక్ సూట్ సెట్ ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచింది. ఫుల్ స్లీవ్స్తో, జరీ ఎంబ్రాయిడరీ, సీక్విన్ వర్క్, బ్రోకేడ్ ఎంబ్రాయిడరీ , పట్టీ వర్క్ తో ఆమెను లుక్ను మరింత ఎలివేట్ చేశారు.దీనికి జతగా బంగారు బ్రాస్లెట్లు, భారీ డైమండ్ సెంటర్పీస్, స్టేట్మెంట్ రింగ్, పోల్కీ బంగారు చెవిపోగులు గులాబీ రంగు స్ట్రాపీ చెప్పులు, ధరించారు. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) కాగా భారతీయ బిలియనీర్ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఛైర్పర్సన్, వ్యవస్థాపకురాలు,రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్. ముఖేష్-నీతా దంపతుల పిల్లలు ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ , అనంత్ అంబానీ రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యంలో భాగంగా ఉన్నారు. 2016లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC)లో సభ్యురాలిగా ఎన్నికైన తొలి భారతీయ మహిళగ. 2023లో, ఆమె నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)ను స్థాపించారు. దీని ద్వారా భారతీయ కళలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో కళలు, చేతిపనులు, సంస్కృతి, క్రీడలు, విద్య మరియు ఆరోగ్య సంరక్షణ రంగాలలో ప్రపంచంలోని బెస్ట్ సర్వీసులకు భారతదేశానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. -
బరువుని నిర్వహించడానికి ఐదు వాక్లు..! జిమ్తో పనిలేదు..
వాకింగ్ చేయడాన్ని రోటీన్ పనిగా, తేలిగ్గా చూస్తాం. కానీ ఇది అద్భుతమైన ఫలితాలనిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉండటంలో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే చేసే తీరులో సరైన విధానం ఉంటే వాకింగ్కి మించిన వర్కౌట్ లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. దాంతో బరువుని సులభంగా నిర్వహించొచ్చు, అధిక బరువు అనే సమస్య రాదు అని నమ్మకంగా చెబుతున్నారు. అంతేగాదు భోపాల్కు చెందిన పోషకాహార నిపుణురాలు, ఆరోగ్యకోచ్ రేణు రఖేజా ఈజీగా చేసే ఐదు రకాల వాక్లను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేశారు. ఇవి మొత్తం ఆరోగ్యాన్ని శరీర తీరుని మార్చగలవని చెబుతోందామె. పైగా జిమ్కి వెళ్లాల్సిన పని ఉండదు అని అంటున్నారు. మరి ఆ ఐదు వాక్లేంటో చూద్దామా..!.నడకకు మించిన అద్భుతమైన వ్యాయామం మరొకటి లేదని అంటోంది రేణు రఖేజా. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందని అంటున్నారు. జిమ్కి వెళ్లలేం. ఎక్కువ సమయం వ్యాయమాలకు కేటాయించలేం అనుకునేవాళ్లు సింపుల్గా ఈజీగా చేసే ఈ ఐదు వాక్లు చేస్తే చాలట. అద్భుతంగా బరువుని నిర్వహించడమే గాక హెల్దీగా ఉంటారని అంటోంది.కాలి నడక (తడసానా) - 1 నిమిషంఇది నడక భంగిమను మెరుగుపరుస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో సహాయపడుతుంది. చేతులు నిటారు తలపైకి చాచి కాళ్ల మీద నడవండి.మడమ నడక - 1 నిమిషంమడమ నడకలు చీలమండలను బలోపేతం చేస్తాయి. మెరుగైన రక్త ప్రసరణ/ప్రసరణను నిర్ధారిస్తాయి, వాపును తగ్గిస్తాయి. ఈ వ్యాయామం చేస్తున్నప్పుడూ.. ఫోజ్ నిటారుగా ఉంచాలి.హిప్ రొటేషన్ నడక - 1 నిమిషంహిప్ రొటేషన్ నడక బిగుతుగా ఉన్న తుంటిని వదులు చేయడం ద్వారా హిప్ కదలికను మెరుగుపరుస్తుంది. ఇది వీపు దృఢత్వాన్ని తగ్గిస్తుంది, పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ వ్యాయామం చేయడానికి, కాలును పైకి లేపి మీ పాదాన్ని నేలపై ఉంచే ముందు తిప్పండి. మరొక కాలుతో కూడా ఇలానే రిపీట్ చేయండిసైడ్ బై సైబ్ వాక్..1 నిమిషంఈ వ్యాయామం టోన్డ్ తొడలను సాధించడానికి, తుంటి కండరాలను నిర్మించడానికి, సమతుల్యతను ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది. ముందుగా చేతులను ముందు పట్టుకుని, మోకాళ్లను వంచి పక్కకు నడవండి. View this post on Instagram A post shared by Renu Rakheja | Nutritionist & Health Coach (@consciouslivingtips) రివర్స్ వాక్ (వెనుకకు నడవడం) - 2 నుంచి5 నిమిషాలురివర్స్ లేదా బ్యాక్ వాక్స్ మోకాలి నొప్పిని తగ్గిస్తాయి, స్థిరత్వాన్ని పెంచుతాయి, కీళ్ల నొప్పిని నివారిస్తాయి. ఇది చాలా సులభం కూడా. చేయాల్సిందల్లా వెనుకకు నడవడమే, దాదాపు చంద్రుని నడక లాగా కానీ నెమ్మదిగా.చివరిగా శరీరం చెప్పేది వినండి, కొత్త వ్యాయామం లేదా వర్కౌట్లను ప్రారంభించే ముందు సంబంధిత ఆరోగ్య నిపుణులు లేదా వ్యక్తిగత వైద్యులను సంప్రదించండి. అలాగే మీకు కీళ్ల నొప్పులు, లేదా ఇతర వైద్య పరిస్థితులు ఉంటే..నిపుణులు సలహాలు సూచనలతో ప్రారంభిస్తేనే చాలామటుకు మంచిది అని సూచించింది రేణు రఖేజా.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: అలా ఉంటే..డయాబెటిస్ బోర్డర్లోకి వచ్చినట్లే..?) -
ఎం.ఎస్. స్వామినాథన్ జీవితగాథ పుస్తకాన్ని ఆవిష్కరించిన కమల్హాసన్
వ్యవసాయ శాస్త్రవేత్తగా, జన్యుశాస్త్ర నిపుణుడు ఎం.ఎస్. స్వామినాథన్ జీవితగాథను 'ఎం.ఎస్. స్వామినాథన్: ది మ్యాన్ హూ ఫెడ్ ఇండియా' పుస్తకాన్ని ప్రముఖనటుడు కమల్ హాసన్ చెన్నైలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఈ పుస్తకం రచయిత్రి, ఆయన మేనకోడలు, ప్రియంవద జయకుమార్ ఎం.ఎస్. స్వామినాథన్తో తన అనబంధాన్ని పంచుకున్నారు. "నేను ఆయనను ఎంతగానో ఆరాధించాను, రాయాలనుకున్నాను. నా అభిమానిని. చిన్నతనంలో ఆయనను చూసి పెరిగిన వ్యక్తి. కానీ నేను ఆయన గురించి విన్న అనే విశేషాలు పుస్తకంలోకి రాలేదు. అందుకే ఆయన జీవితాన్ని గురించి ఒక పుస్తకం రాయాల్సిన సమయం ఆసన్నమైందని నేను అనుకున్నాను. అదే సమయంలో భారతదేశాన్ని నిర్వచించాను. నిజంగి ఇది ఎం.ఎస్. స్వామినాథన్ కథ. ఆయలన కలగన్న ఆశ, స్థితిస్థాపకత కలిగిన భారతదేశం కథ. భారతదేశం యొక్క ఎప్పటికీ చెప్పలేని స్ఫూర్తి మరియు ఎప్పటికీ వదులుకోలేని స్ఫూర్తిని మీకు తెలుసు, దీనిని ఆయన తరం భారతీయులు ఉదాహరణగా చూపించారు."అని పేర్కొన్నారు. గొప్ప శాస్త్రవేత్త... చక్కటి వ్యవహర్త ఉన్నత విద్యావంతులున్న ఉమ్మడి కుటుంబంలో మాన్కోంబు సాంబశివన్ స్వామి నాథన్ (M.S. Swaminathan) జన్మించారు (1925). తండ్రి బాటలో మెడిసిన్ చదివి కుంభకోణంలోని వాళ్ల హాస్పిటల్ను నడిపే అవకాశం; ఐపీఎస్కు ఎంపికైనందున అటు వైపుగానూ కెరీర్ మలుచుకునే వీలు ఆయనకు ఉండినాయి. కానీ లక్షల మంది చావు లకు కారణమైన బెంగాల్ క్షామం(1943) వేసిన ముద్ర ఆయన్ని వ్యవసాయం వైపు నడిపించింది. వ్యవసాయ శాస్త్రవేత్తగా, జన్యుశాస్త్ర నిపుణుడిగా ఆయన కృషిని చెప్పే పుస్తకం ‘ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా’. ఆయన మేనకోడలు రాసిన జీవిత కథ. స్వాతంత్య్రానంతర భారతదేశం ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య... తిండి గింజల కరువు. ‘ఏదైనా ఆగుతుంది కానీ వ్యవసాయం ఆగదు’ అన్నారు నెహ్రూ. సోమవారాలు పస్తులుండమని పిలుపు నిచ్చారు లాల్ బహదూర్ శాస్త్రి. ‘బ్లడీ అమెరికన్ల’ ముందు చేయి చాచకుండా ఉండే మార్గాల కోసం వెతికారు ఇందిరా గాంధీ. ఒక దశలో ‘పీఎల్ 480’ పథకం కింద అమెరికా పంపే గోధుమలే దిక్కు. ఓడలు దిగితేగానీ నోళ్లు ఆడని పరిస్థితి. ఈ దిగుమ తులకు చెల్లించాల్సిన మూల్యం విదేశాంగ విధానంలో స్వతంత్రంగా నిలబడలేకపోవడం. అలాంటి స్థితిలో స్వామినాథన్ దేశంలో హరిత విప్లవానికి బాటలు పరిచారు. ‘చరిత్ర ఆయనకు అవకాశం ఇచ్చింది, దాన్ని ఆయన రెండు చేతులా అందుకున్నారు’అంటారు రచయిత్రి.VIDEO | Chennai, Tamil Nadu: Actor, politician Kamal Haasan launches book on 'MS Swaminathan - The Man who fed India' authored by Priyambada Jayakumar. (Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/HfsbGoozj4— Press Trust of India (@PTI_News) November 2, 2025 గాలికి పడిపోకుండా నిలబడే పొట్టి రకం గోధు మల మీద గామా కిరణాలతో ‘ఐండియన్ అగ్రికల్చర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్’లో స్వామినాథన్ ప్రయోగాలు చేశారు. దానికోసం ‘ఆటమిక్ ఎనర్జీ కమిషన్’ సాయంతో ‘గామా గార్డెన్’ ఏర్పాటుచేశారు. వ్యవ సాయం కోసం అన్ని రంగాలూ సహకరించుకోవాలంటారాయన. ఈ దశలోనే పొట్టి రకం హైబ్రిడ్ గోధు మలను మెక్సికోలో నార్మన్ బోర్లాగ్ విజయవంతంగా పరీక్షించారని తెలిసి, స్వామినాథన్ ఆయనకు ఉత్తరం రాశారు(1963). దానివల్ల పదేళ్ల కాలం కలిసొస్తుంద నేది ఆయన ఆలోచన. ఇక వంద కేజీల చొప్పున వచ్చిన ఆ నాలుగు రకాల విత్తనాలను ఇక్కడి నేలలకు అనుగుణంగా కల్యాణ్ సోనా, సోనాలిక లాంటి విత్తనాలుగా మార్చి, వ్యవస్థలోని అన్ని అడ్డంకులను అధిగమించి, రైతుల అనుమానాలను తీర్చి, దిగు బడుల ‘చమత్కారాన్ని’ చూపించి, ఇండియా వచ్చిన నార్మన్ బోర్లాగ్నే ఆశ్చర్యపరిచేలా చేశారు స్వామి నాథన్. నాలుగు హెక్టార్లతో మొదలైన ప్రయోగం, 1968 నాటికి పది లక్షల హెక్టార్లకు విస్తరించింది. ఈ మధ్యలోనే విక్రమ్ సారాభాయి సహకారంతో రైతుల కోసం దూరదర్శన్లో ‘కృషి దర్శన్’ మొదలైంది (1967). సైన్సు శక్తి, విధాన నిర్ణయం, రైతుల ఉత్సాహం – కలగలిసి ‘యూఎస్ ఎయిడ్’కు చెందిన విలియమ్ గాడ్ నోటి నుంచి తొలిసారిగా వెలువడిన మాట ‘గ్రీన్ రివల్యూషన్’ అనేది విజయవంతమైంది. 1981లో ఫిలిప్పైన్స్లోని ‘ఇంటర్నేషనల్ రైస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్’ డైరెక్టర్ జనరల్ పదవి ఆయన్ని వరించింది. ఆ స్థానంలోకి వెళ్లిన మొదటి ఆసియన్ ఆయన. ఐఆర్64 లాంటి పాపులర్ వరి రకం ఈ కాలంలోనే వచ్చింది. ప్రణాళికా సంఘం, వ్యవసాయ మంత్రిత్వ శాఖల్లోనూ పనిచేసిన స్వామినాథన్ పాత్ర ఇండియాకే పరిమితం కాలేదు. చైనా, పాకిస్తాన్,ఇండోనేషియా, మయన్మార్, టాంజానియా, ఇథియో పియా లాంటి ఎన్నో దేశాల్లో వరి పరిశోధనాకేంద్రాలు ఏర్పాటయ్యేలా సహకరించారు. టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన అత్యంత ప్రభావశీల ఆసి యన్ల జాబితాలోని ముగ్గురు భారతీయుల్లో స్వామి నాథన్ ఒకరు (మిగిలిన ఇద్దరు: గాంధీజీ, టాగూర్). ‘పది జీవితాల్లో కూడా సాధించలేనిది ఆయన ఒక్క జీవితంలో సాధించారు’ అంటారు రచయిత్రి. ముగ్గురు కూతుళ్ల తండ్రిగా, స్వతంత్ర భావాలున్న భార్య మీనా భర్తగా ఆయన కుటుంబ విశేషాలు మేళవిస్తూ పది అధ్యాయాలుగా రాసిన పుస్తకమిది. ఫిలిప్పైన్స్ వదిలివచ్చేటప్పుడు టగలాంగ్లో వీడ్కోలు ఉపన్యాసం చేసి ఆశ్చర్యపరిచారు మీనా. రైతుల కోసం నియమించిన జాతీయ కమిషన్తో సహా పదుల కమి టీలకు చైర్మన్గా వ్యవహరించి; రామన్ మెగసెసే, వరల్డ్ ఫుడ్ ప్రైజ్, భారతరత్న లాంటి గౌరవాలు పొందిన ఎంఎస్ తన జీవితంతోనే ఆశ్చర్యపరిచారు.- ఎడిటోరియల్ టీం(M.S. Swaminathan: The Man Who Fed India)ఎం.ఎస్. స్వామినాథన్: ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా (జీవిత చరిత్ర)రచన : ప్రియంవద జయకుమార్ -
మహిళా క్రికెటర్లకు నీతా అంబానీ స్పెషల్ విషెస్ : సింపుల్ అండ్ స్టైలిష్ లుక్లో
వన్డే మహిళల వరల్డ్ కప్ 2025 (ICC Womens World Cup 2025) భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలుచుకుని సరికొత్త చరిత్రను లిఖించింది. దక్షిణాఫ్రికా-ఇండియా జట్ల మధ్య నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో ఆదివారం జరిగిన తొలి ప్రపంచ కప్ ట్రోఫీని భారత మహిళా క్రికెట్ జట్టు గెలుచుకున్న సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ క్రికెట్ ప్రేమికురాలు, ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీఅభినందనలు తెలిపారు.దేశం మొత్తాన్ని గర్వపడేలా చేసినందుకు జట్టుకు కృతజ్ఞతలు తెలిపారు నీతా. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్ను తిలకించడానికి వచ్చిన నీతా అంబానీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టీమిండియా మహిళల ప్రపంచ కప్ సాధించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. జట్టుకు ప్రత్యేక అభినంనదనలు తెలిపారు. అర్ధరాత్రి వేళ, మన అమ్మాయిలు మొట్టమొదటి ఐసీసీ ప్రపంచ ఛాంపియన్షిప్ను గెలుచుకున్నారు. ధైర్యం, దృఢ నిశ్చయం, ఆత్మవిశ్వాసంతో ఆడిన తీరుతో, మొత్తం దేశాన్ని గర్వంతో ఉప్పొంగేలా చేశారని భావిస్తున్నాఅన్నారు. మీ విజయం పట్ల చాలా గర్వపడుతున్నాం. ధన్యవాదాలు, జై హింద్ అని ఉత్సాహంగా చెప్పారు. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు , చైర్పర్సన్ నీతా అంబానీ మ్యాచ్ జరుగుతున్నంత సేపు భారత జెండాను ఊపుతూ, జట్టుకు ఉత్సాహపరుస్తూ, అమ్మాయిలు ప్రపంచ కప్ గెలుచుకోగానే పట్టరాని సంతోషంగా కనిపించారు. మ్యాచ్ ఆద్యంత ఆమె ఎంజాయ్ చేసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ సందడి మారాయి. సింపుల్ అండ్ స్టైలిష్ లుక్సింపుల్ అండ్ స్టైలిష్ దుస్తులలో నీతా అంబానీ అదరగొట్టారు. సమయానికి తగ్గట్టు అన్నట్టగా క్లాసిక్ వైట్ షర్ట్ , నీలిరంగు డెనిమ్ జీన్స్లో మెరిసారు. అలాగే విలాసవంతమైన బంగారు బ్రాస్లెట్ వాచ్, భారీ డైమండ్ సెంటర్ స్టోన్ పొదిగిన స్టేట్మెంట్ గోల్డ్ రింగ్, డైమండ్ ఇయర్ స్టడ్లను ఆమె ఎంచుకున్నారు.ముంబై వేదికగా జరిగిన మహిళల ప్రపంచ కప్ ఫైనల్ పోరుకు ఆకాష్ అంబానీ కూడా హాజరయ్యారు. సచిన్ టెండూల్కర్, భార్యతో కలిసి రోహిత్ శర్మ, ఇతర టీమిండియా మాజీ క్రికెటర్లు, వ్యాపారవేత్తలు, ప్రముఖ రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ఆదివారం జరిగిన మ్యాచ్లో ఇండియా మహిళల సేన దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. #WATCH | Founder-Chairperson of Reliance Foundation, Nita M. Ambani congratulates Indian captain Harmanpreet Kaur after she guided India to the first-ever women's World Cup title.(Source: Special Arrangement) pic.twitter.com/vdgVy7eere— ANI (@ANI) November 3, 2025“The way you have played with courage, confidence and conviction. We are all so proud of you.”Mrs. Nita Ambani shared her feeling of pride towards the Women in Blue 💙✨ #AaliRe #CWC25 #INDvSA pic.twitter.com/ItCsYn93M3— Mumbai Indians (@mipaltan) November 2, 2025 -
ఆ రూ. 500 కోట్లు డీల్..దెబ్బకు డ్రైవర్ తీరు మారిందిగా..!
డబ్బు దేన్నైనా మార్చేయగలదు. అది మనుషుల దగ్గర ఉంటే..ఒక్కసారిగా వారి రేంజే మారిపోతుంది. మాట తీరు మారిపోతుంది. అందుకు నిదర్శనం ఈ సీఈవోకి ఎదురైన ఘటనే. అప్పటి వరకు సీఈవో దగ్గర నార్మల్గా పనిచేసిన వ్యక్తిలో..ఒక్కసారిగా అనూహ్యమైన మార్పు. విస్తుపోవడం సీఈవో వంతైంది. ఆ తర్వాత గానీ తెలియదు అసలు కారణం ఇది అని. ఇంతకీ ఏం జరిగిందంటే..ఆస్ట్రోటాక్ సీఈవో పునీత్ గుప్తా ఇటీవల కొత్తగా కారు డ్రైవర్ని నియమించుకున్నారు. పనిలో జాయిన్ అయిన రెండు రోజులు సాధారణంగానే పనిచేశాడు. మూడోవ రోజు..ఏకంగా ఆఘ మేఘాల మీద పునీత్ గుప్తాకి ఎదురొచ్చి డోర్ ఓపెన్ చేసి స్వాగతం పలికాడు. ఈ అనుహ్య చర్యకు విస్తుపోయిన సీఈవో..ఇంత హడావిడి ఏం అవసరం లేదు. కారు స్టార్ట్ చేసి ఉంటే తాను ఎక్కగానే కారు వెళ్లిపోయేది కదా అని చీవాట్లు పెట్టారు పునీత్ గుప్తా. పైగా మరోసారి రిపీట్ అవ్వనివ్వద్దు, కేవలం టైం వేస్ట్ అవ్వకుండా చూసుకో చాలు అని కాస్త గట్టిగా చెప్పారు. కానీ కారు డ్రైవర్ మాత్రం తన పనే తాను చేసుకుంటున్నానని చెప్పే యత్నం చేసినా..గుప్తా అలా వద్దని వారించారు. ఆ తర్వాత ఇన్ని రోజులు నార్మల్గా ఉన్న వ్యక్తి ఈ రోజు ఇలా ప్రవర్తించడానికి గల కారణం ఏంటా అని ఆలోచించారు గుప్తా. అప్పుడే గుర్తొచ్చింది. ఇందాక ఫోన్ కాల్లో రూ. 500 కోట్ల ఒప్పందం గురించి మాట్లాడానని, బహుశా దానివల్లే ఇతడిలో ఇంత మార్పు వచ్చిందా అని విస్తుపోయారాయన. డబ్బు నిజానికి ఎవ్వరినైనా మార్చేస్తుంది. అంటూ తనకు జరిగిని అనుభవాన్ని నెట్టింట షేర్ చేసుకున్నారు. అయితే నెటిజన్లు ఈ పోస్ట్పై మిశ్రమంగా స్పందించారు. కొందరు డ్రైవర్ అంకితభావంతో పనిచేస్తున్నాడని పేర్కొనగా, మరికొంతమంది కోట్లు గురించి వినగానే బ్రో 'కార్పొరేట్ డ్రైవర్ మోడ్'ని అన్లాక్ చేసాడు" అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: Success Story: ఐఐటీలో సీటు నుంచి డ్రీమ్ జాబ్ వరకు అన్ని ఫెయిలే..! కానీ ఇవాళ..) -
మలేసియా– సింగపూర్ ట్విన్ టూర్
సింగపూర్– మలేసియాలు ట్విన్ కంట్రీస్ కాదు... కానీ టూరిజం ప్రధానంగా కవలల్లాగ సరిపోలి ఉంటాయి.ఇండియా నుంచి టూర్ ప్యాకేజ్లు కలగలిసి ఉంటాయి.ఈ టూర్లో ఏమేమి చూడవచ్చు... అంటే లిస్ట్ పెద్దదే.మలేసియాలో... ఒక ఇండిపెండెన్స్ స్క్వేర్... మరో నేషనల్ మాన్యుమెంట్. కింగ్స్ ప్యాలెస్ ఇస్తానా నెగారా...తళతళ మెరిసే ట్విన్ టవర్స్.కుమారస్వామి కొలువైన బటూకేవ్స్...ప్రధాని కొలువైన పుత్రజయ.సింగపూర్కి వస్తే...దేశ చిహ్నం మెర్లయన్ పార్క్... సంతోషాల హరివిల్లు సెంటోసా.హైబ్రీడ్ పూల ఆర్చిడ్ గార్డెన్... కోట్లాది వీక్షకుల యూనివర్సల్ స్టూడియోస్.స్టార్ ఇమేజ్ల మేడమ్ టుస్సాడ్స్... పక్షుల నిలయం బర్డ్ ప్యాడైజ్. ఒకసారి దుస్తులు సర్దుకుంటే... ఆరు రోజుల్లో రెండుదేశాలు తిరిగి రావచ్చు. జీరో డే: సాయంత్రం 19.30 గంటలకు హైదరాబాద్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ లో టూర్ ఆపరేటర్లకు రిపోర్ట్ చేయాలి. పర్యాటకులకు స్వాగతం పలకడం, ఎయిర్పోర్ట్ ఫార్మాలిటీస్ పూర్తి చేయడం, విమానం ఎక్కడం. విమానం రాత్రి 11.10కి బయలు దేరుతుంది. తొలిరోజు ప్రయాణం సాగుతుంది. కానీ పర్యటన ఏమీ ఉండదు. కాబట్టి ఈ టూర్ ఐటెనరీలో తొలిరోజును జీరో డే గా గుర్తిస్తారు. రెండవ రోజును ఐటెనరీ తొలిరోజుగా గుర్తిస్తారు. ఫస్ట్ డే: ఉదయం 8.10 గంటలకు కౌలాలంపూర్ ఎయిర్పోర్టులో దిగడం. లగేజ్ తీసుకుని, ఎయిర్పోర్ట్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోవాలి. ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ గేట్ దగ్గర టూర్ ఆపరేటర్లు రిసీవ్ చేసుకుని హోటల్కు తీసుకెళ్తారు. గదిలో చెక్ ఇన్, రిఫ్రెష్మెంట్ తర్వాత విశ్రాంతి, మధ్యాహ్న భోజనం తర్వాత సైట్ సీయింగ్. ఫొటో స్టాప్ ఇండిపెండెన్స్ స్క్వేర్, కింగ్స్ ప్యాలెస్, నేషనల్ మాన్యుమెంట్, చాకొలేట్ హోల్సేల్ షాప్, పెట్రోనాస్ ట్విన్ టవర్స్. ఇండియన్ రెస్టారెంట్లో డిన్నర్ చేసి హోటల్కు చేరడం. రాత్రి బస కౌలాలంపూర్.స్వాతంత్య్రవేడుకల నేలఇండిపెండెన్స్ స్క్వేర్ అనేది మలేసియా దేశ గర్వకారణం. బ్రిటిష్ పాలన నుంచి మలేసియా విముక్తి పొందిన రోజు అంటే... 1957, ఆగస్టు 31వ తేదీన యునైటెడ్ కింగ్డమ్ పతాకాన్ని అవనతం చేసి అదే స్థానంలో మలేసియా పతాకాన్ని ఎగురవేశారు. అప్పటి నుంచి దీనికి ఇండిపెండెన్స్ స్క్వేర్ అనే పేరు వచ్చింది. ఏటా ఆ దేశ స్వాతంత్య్రదినోత్సవరం రోజున ఇక్కడే జాతీయ పతాకావిష్కరణ జరుగుతుంది.రాజప్రాసాదంకౌలాలంపూర్లో రాజప్రాసాదం పేరు ఇస్తానా నెగారా. ఈ కింగ్స్ ప్యాలెస్ ఉన్న ప్రదేశం జలన్ ఇస్తానా. 13 ఎకరాల్లో విస్తరించిన ప్యాలెస్ ఇది. రాజు నివసిస్తాడు. ఈ ప్యాలెస్ది పల్లడియన్ స్టైల్ ఆర్కిటెక్చర్. రాజురాణి ప్రజలకు దర్శనమిస్తే హాల్లో సింహాసనాలు రెండు ఉంటాయి. ఇక్కడి పదాలు భారతీయతకు దగ్గరగా ఉన్నట్లే అనిపిస్తాయి. సింహాసనానన్ని సింగాహ్సన అంటారు. నేషనల్ మాన్యుమెంట్ దేశభక్తికి ప్రతీక. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో దేశం స్వాతంత్య్రం కోసం ΄ోరాడిన సైనికుల గౌరవార్థం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహానికి ప్రపంచ రికార్డు ఉంది. వరల్డ్స్ టాలెస్ట బ్రాంజ్ ఫ్రీ స్టాండింగ్ స్కల్ప్చర్ ఇది. నాటి రికార్డ్ టవర్స్స్టీల్, గ్లాస్తో నిర్మించిన పెట్రోనాస్ ట్విన్ టవర్స్ తళతళలాడుతూ కౌలాలంపూర్ నలుమూలలకూ కనిపిస్తుంటాయి. 88 అంతస్థుల నిర్మాణం. 86వ అంతస్థులో అబ్జర్వేటరీ డెక్ ఉంది. ఇక్కడికి పర్యాటకులను అనుమతిస్తారు. మలేసియాలోని ప్రధాన వ్యా΄ార సంస్థల కార్యాలయాలు ఇందులోనే ఉన్నాయి. వీటిని 1998లో నిర్మించారు. నిర్మించినప్పటి నుంచి 2004 వరకు వరల్డ్ టాలెస్ట్ టవర్స్ అనే భుజకీర్తిని ధరించాయి. దీని నిర్మాణానికి మోడల్ స్ట్రక్చర్ మనదేశ రాజధాని ఢిల్లీలోని కుతుబ్ మినారే. సెకండ్ డే: బ్రేక్ఫాస్ట్ తర్వాత బటూ కేవ్స్కు ప్రయాణం. బటూ కేవ్స్ విహారం తర్వాత గెంటింగ్ హైలాండ్స్ సందర్శనం. తిరిగి కౌలాలంపూర్కి చేరి ఇండియన్ రెస్టారెంట్లో డిన్నర్ తర్వాత బస చేసిన హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారు. రాత్రి బస అక్కడే.మలేసియా కుమారస్వామిమలేసియాలో బటూ కేవ్స్ పరిసరాల్లోకి వెళ్లగానే తమిళం వినిపిస్తుంది. మనదేశంలో తమిళనాడులో అడుగుపెట్టినట్లు ఉంటుంది. మురుగా అని తరచూ వినిపిస్తూంటుంది. ఇక్కడున్న మురుగన్ ఎత్తు 140 అడుగులు. బంగారు వర్ణంలో మెరిసి΄ోతూ ఉంటాడు. మనం కుమారస్వామిగా పిలిచే దైవమే మురుగన్. కుమారస్వామిని గుండెల్లో పెట్టుకుని కొలిచే తమిళులు ఇక్కడ ఆకాశమంత రూపాన్నిచ్చారు. ఇరవై ఏళ్ల కిందట దాదాపు 20 కోట్లు ఖర్చయింది. గాంబ్లింగ్ హైల్యాండ్స్గెంటింగ్ హైల్యాండ్స్ అనేది మలేసియాలో ఉలుకాలి శిఖరం మీద ఉన్న పెద్ద థీమ్ పార్క్. గాంబ్లింగ్ అడ్డా. ఇక్కడ గాంబ్లింగ్కి అధికారికంగా అనుమతిస్తారు. పర్యాటకులు ఆ భారీ ఎస్టాబ్లిష్మెంట్ను చూసి ఆనందించడానికి పరిమితం కావాలి. గెంటింగ్ హైల్యాండ్స్ సమీపంలో చిన్ స్వీ కేవ్స్ టెంపుల్ ఉంది. చైనా నిర్మాణాలను పోలి ఉంటుంది. అద్భుతమైన ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్ట్లు, నిర్మాణ నిపుణులు, శిల్పకారులకు సలామ్ చేయాలనిపిస్తుంది. ఫోర్త్ డే: బ్రేక్ఫాస్ట్ తర్వాత సింగపూర్ సిటీ టూర్. ఆర్చిడ్ గార్డెన్, మెర్లయన్ పార్క్, సింగపూర్ ఫ్లైయర్ రైడ్. లంచ్ తర్వాత కేబుల్ కార్లో సెంటోసాకు చేరాలి. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం, ఐఓఎస్, వింగ్స్ ఆఫ్ టైమ్ ఫస్ట్ షో వీక్షణం. ఇండియన్ రెస్టారెంట్లో డిన్నర్ తర్వాత హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారు. రాత్రి బస సింగపూర్లోనే.హైబ్రీడ్ గార్డెన్సింగపూర్ ఆర్చిడ్ గార్డెన్ మామూలు పూలతోట కాదు. ఈ గార్డెన్కు ప్రత్యేకమైన హోదా ఉంది. దీని పూర్తి పేరు నేషనల్ ఆర్చిడ్ గార్డెన్. దేశంలో ఎత్తైన ప్రదేశంలో విస్తరించి ఉంది. కొండ మీద బొటానికల్ గార్డెన్కి గుండె వంటిది ఈ ఆర్చిడ్ గార్డెన్. బొటానికల్ గార్డెన్లోని కోర్ ఏరియా అని చెప్పవచ్చు. రంగుల కలలా అనిపిస్తుంది. గార్డెన్లో విహరించినంత సేపూ రంగుల పూలను విభ్రమగా చూస్తాం. కానీ గార్డెన్ విహారం తర్వాత ఒక చోట కూర్చుని గార్డెన్ మొత్తాన్ని లాంగ్ షాట్లో చూస్తూ సింహావలోకనం చేసుకుంటే ఏదో మిస్ అయినట్లు అనిపిస్తుంది. ఆలోచించగా ఆలోచించగా ఈ పూలకు వాసనలు లేవనే వాస్తవం స్ఫూరిస్తుంది. పూలన్నీ హైబ్రీడ్ వంగడాలే. కనువిందు చేయడంలో ఏ కొరతా ఉండదు. సింహంచేపఈ పదం ఎంత విచిత్రంగా ధ్వనిస్తుందో ఈ శిల్పం కూడా అలాగే ఉంటుంది. దిగువ భాగం చేప ఆకారం, పై భాగం సింహం ఆకారంతో మిళితమై ఉంటుంది. ఇది మెర్లయన్ పార్కులో ఉంది, ఈ శిల్పం సింగపూర్ పర్యాటక చిహ్నం. ఇక సింగపూర్ ఫ్లయర్ రైడ్ లైఫ్టైమ్ ఎక్స్పీరియెన్స్ అని చెప్పవచ్చు. ఇది కేవలం ఐవు వందల అడుగుల ఎత్తులో తిరిగే జెయింట్వీల్ మాత్రమే కాదు, ఏసీ జెయింట్ వీల్. ఇక్కడ పర్యటిస్తుంటే ఈ దేశ పర్యాటకరంగం దేశంలో ఏ ఒక్క అంశాన్నీ వదిలిపెట్టకుండా అభివృద్ధి చేసిందనపిస్తుంది. చదవండి: మహిళా క్రికెటర్లకు నీతా అంబానీ స్పెషల్ విషెస్ : సింపుల్ అండ్ స్టైలిష్ లుక్లోసెంటోసా టుస్సాడ్స్సెంటోసా ఐలాండ్ అంటే సింగపూర్లో రిలాక్సేషన్, రిక్రియేషన్ హబ్. మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియం కూడా ఈ దీవిలోనే ఉంది. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియాలు ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్నాయి. సింగపూర్లో ఉన్నది ఏడవ బ్రాంచ్. ఇంకా ఈ దీవిలో గోల్ఫ్ కోర్సులు, హోటళ్లు, రిసార్టులు, యూనివర్సల్ స్టూడియో. థీమ్ ΄ార్కులు, మెరీనా బే సాండ్స్ విహారాలన్నీ కలిసి సింగపూర్ టూర్ అంటే నెక్ట్స్ లెవెల్ అనే ఫీలింగ్నిస్తాయి. కేబుల్ కార్లో ప్రయాణిస్తూ ఐలాండ్లో వీటన్నింటినీ విహంగవీక్షణం చేయవచ్చు. మలేసియాలో ఉన్నట్లు సింగపూర్లో కూడా ప్రదేశాల పేర్లు సంస్కృత మూలాలతో ఉన్నాయి. సెంటోసా అనే పదానికి మూలం కూడా సంస్కృతమే. సంతోష అనే పదం నుంచి వచ్చింది. ఈ దీవిలో ఇప్పటి వరకు చూసినవన్నీ ఒక ఎత్తయితే... వింగ్స్ ఆఫ్ ఫైర్ పేరుతో జరిగే క్రాకర్స్ ఫెస్ట్ మరో ఎత్తు. ఫిఫ్త్ డే: బ్రేక్ఫాస్ట్ తర్వాత యూనివర్సల్ స్టూడియోస్కి ప్రయాణం. సూడియోస్ విజిట్ తర్వాత గార్డెన్స్ విహారం, సింగపూర్ బే, డోమ్స్ విజిట్. ఇండియన్ రెస్టారెంట్లో భోజనం తరవాత హోటల్ దగ్గర డ్రాపింగ్. రాత్రి బస సింగపూర్లోనే. సంతోషాల దీవిసెంటోసా ఐలాండ్ విహారం ఒక రోజులో పూర్తయ్యేది కాదు. యూనివర్సల్ స్టూడియోస్లో ఉన్న థీంపార్క్ల కోసం కొన్ని గంటలు కేటాయించాలి. ఇందులో 24 రకాల రైడ్లుంటాయి. ఓ యాభై ఏళ్లు దాటిన వాళ్లకు ఏ రైడ్ అయినా ఒకటే అన్నట్లు ఉంటుంది, కానీ ఇరవై ఏళ్ల వాళ్లకు ప్రతి రైడ్నీ ఎంజాయ్ చేస్తే తప్ప టూర్ ఇచ్చే సంపూర్ణమైన సంతోషాన్ని ఫీలవ్వలేదు. ఆసియా ఖండం అంతటిలో ఇలాంటి థీమ్ పార్క్ స్టూడియో మరొకటి లేదు. ఆసియా వాసుల మాత్రమే కాదు, ప్రపంచ దేశాలన్నీ సింగపూర్ని మంచి టూరిస్ట్ డెస్టినేషన్గా చూస్తాయి. అందుకే ఏడాదికి నాలుగు కోట్ల మంది ఈ యూనివర్సల్ స్టూడియోస్కి వస్తారు. ఇక ఇక్కడ సముద్ర తీరాన బే గార్డెన్స్, డోమ్స్ పేరుతో చాలా ఉద్చానవనాలుంటాయి. ఉన్న కొద్దిపాటి నేలను పర్యాటకమే ప్రధానంగా అభివృద్ధి చేసుకుని చక్కటి రాబడిని చూస్తోందీ దేశం అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఆరో రోజు : బ్రేక్ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి బర్డ్ ప్యారడైజ్కి ప్రయాణం. లంచ్, షాపింగ్ తర్వాత నిర్వాహకులు పర్యాటకులను సింగపూర్ ఎయిర్΄ోర్ట్లో డ్రాప్ చేస్తారు. రాత్రి ఎనిమిది గంటలకు హైదరాబాద్ విమానం ఎస్క్యూ– 522 బయలుదేరుతుంది. పక్షుల స్వర్గంబర్డ్స్ ప్యారడైజ్... నలభై ఎకరాల్లో విస్తరించిన పక్షిధామం ఇది. పక్షుల స్వర్గధామం అనే పేరు అక్షరాలా నిజం. ప్రపంచంలోని అన్ని రకాల వాతావరణాల్లో జీవించే పక్షిజాతులన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఆ పక్షుల కోసం వాటికి అనువైన వాతావరణంతో గూళ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ పర్యటించేటప్పుడు చేయాల్సింది నేలను, నింగినీ చూసుకుంటూ నడవడం కాదు, చెట్ల కొమ్మల మీద కూర్చుని కువకువలాడుతున్న పక్షుల కోసం తలెత్తి కళ్లు విప్పార్చుకుని చూస్తూ సాగి΄ోవాలి. ఒక పక్షి ఉన్నట్లు మరో పక్షి ఉండదు. వాటి రెక్కలకు ప్రకృతి అద్దిన రంగులు గాఢంగా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇండియా టూ సింగపూర్ వయా మలేసియాసింగపూర్, మలేసియాలను కవర్ చేసే ఈ ఆరు రోజుల టూర్ పేరు ‘మ్యాజికల్ మలేసియా వింత్ సింగపూర్ సెన్సేషన్ ఎక్స్ హైదరాబాద్’. టూర్ కోడ్ : ఎస్హెచ్ఓ1.ప్రయాణం ఎప్పుడు? డిసెంబర్ 11వ తేదీ మొదలవుతుంది.ఎస్క్యూ – 523/104 విమానం రాత్రి 23.10 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణం 17వ తేదీన. ఎస్క్యూ–522 విమానం సింగపూర్లో రాత్రి 20.00 గంటలకు బయలుదేరి 21.55 గంటలకు హైదరాబాద్కు చేరుతుంది.టారిఫ్ ఇలాగ!సింగిల్ షేరింగ్లో ఒకరికి 1,56,900 రూపాయలు, డబుల్ షేరింగ్లో ఒక్కొక్కరికి 1,29,250 ట్రిపుల్ షేరింగ్లో ఒక్కొక్కరికి 1,29,000 రూపాయలు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
వేగన్ వేవ్..! సస్టైనబుల్ లైఫ్స్టైల్గా వేగనిజం!
నగరంలో ఇటీవల వేగన్ ప్లీ మార్కెట్, వేగన్ ఫుడ్ డొనేషన్, వేగన్ వాక్స్ వంటి వినూత్న కార్యక్రమాలు జరుగుతుండడం విధితమే. అంతేకాకుండా రానున్న రోజుల్లో నగరంలో వేగన్ కమ్యూనిటీ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. పదేళ్ల క్రితం నగరంలోని కొద్దిమంది మాత్రమే పాటించే ‘వేగన్ జీవనశైలి’ ప్రస్తుతం హైదరాబాద్ యువత, ఫిట్నెస్ ప్రేమికులు, జంతు ప్రేమికులు, పర్యావరణ హిత జీవనశైలిని ఆచరించే వారందరి మధ్య వేగంగా విస్తరిస్తోంది. రెస్టారెంట్ల మెనూలో ‘వేగన్ ఆప్షన్’లు కొత్తగా చేరడం, షాపింగ్ మాల్స్లో ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్కు ప్రత్యేక కౌంటర్లు రావడం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వేగన్ ఫుడ్ను ప్రమోట్ చేయడం ఈ మార్పుకు ప్రతికూలంగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ ఇప్పుడు దేశంలో వేగన్ హబ్గా ఎదుగుతున్న నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందుతోంది. స్థానిక ఫుడ్ బ్రాండ్లు, క్లౌడ్ కిచెన్లు, ఫుడ్ డెలివరీ యాప్స్ కూడా ప్లాంట్ బేస్డ్ సెగ్మెంట్ విస్తరణపై దృష్టి సారిస్తున్నాయి. హైదరాబాద్లో వేగనిజం ఇప్పుడు ఒక ట్రెండ్ కాదు, ఒక చైతన్యం. జంతువుల పట్ల మమకారం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ, భూమి పట్ల బాధ్యత కలిపి ఏర్పడిన ఈ వేగన్ వేవ్ నగర జీవనశైలిని కొత్త దిశలో నడిపిస్తోంది. ఈ మార్పు కేవలం ఫ్యాషన్ కోసం కాదు.., పర్యావరణం, జంతు సంరక్షణ, ఆరోగ్యానికి దోహదపడే విలువలపై ఆధారపడి ఉంది. వేగనిజం అనేది కేవలం స్వచ్ఛమైన శాకాహారం స్వీకరించే పద్ధతి మాత్రమే కాదు.. ఇది ఒక జీవన తత్వం. జంతువులకు హానికరమైన ఏ (ఎనిమల్ బెస్ట్ ప్రొడక్ట్స్) ఉత్పత్తినీ ఉపయోగించకుండా జీవించడమే దీని మంత్రం. అంటే పాలు, మాంసం, గుడ్లు, తేనె వంటి ఉత్పత్తులు తినకుండా, లెదర్, సిల్క్ వూల్ వంటి జంతు ఆధారిత వ్రస్తాలను వాడకుండా జీవించడం. పచ్చి ఆహారం, ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ద్వారా శరీరానికి అవసరమైన అన్ని పోషకాలూ పొందడమే దీని లక్ష్యం.నగరంలో వేగన్ కల్చర్.. దశాబ్దం క్రితం హైదరాబాద్లో వేగన్ రెస్టారెంట్లు అరుదు. కానీ ప్రస్తుతం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచి్చ»ౌలి, హైట్టెక్ సిటీ ప్రాంతాల్లో అనేక వేగన్ కేఫేలు తెరుచుకున్నాయి. ఈ స్పాట్స్ వేగన్ ఫుడ్ ప్రేమికుల అడ్డాగా మారాయి. వీటిలో సోయా మిల్క్ లాటేలు, టోఫూ బర్గర్లు, క్వినోవా బౌల్స్, ప్లాంట్–బేస్డ్ పిజ్జాలు అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. సోషల్ మీడియా, ఎన్జీవోల ప్రభావం.. జంతు హక్కుల కోసం పనిచేసే పీపుల్ ఫర్ యానిమల్స్ ( పీఎఫ్ఏ), బ్లూ క్రాస్ హైదరాబాద్, వేగన్ ఇండియా మూమెంట్ వంటి సంస్థలు వేగన్ లైఫ్స్టైల్పై విస్తృత అవగాహన కల్పిస్తున్నాయి. అదే సమయంలో సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్లో స్థానిక వేగనిస్టులు తమ రోజువారీ ఫుడ్ హ్యాబిట్స్, రెసిపీలు, షాపింగ్ టిప్స్ పంచుకుంటున్నారు. వేగన్ హైదరాబాద్ వంటి కమ్యూనిటీ గ్రూప్ సోషల్ మీడియాలో వేల మందికి పైగా సభ్యులను, ఫాలోవర్స్ను కలిగి ఉంది. వేగన్ ఫెస్టివల్స్, మార్కెట్లు.. హైదరాబాద్లో ప్రతి యేటా వేగన్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది. ప్లాంట్ బేస్డ్ ఫుడ్ స్టాల్స్, వేగన్ క్లాతింగ్, జీరో వేస్ట్ ప్రొడక్ట్స్, పర్యావరణ హిత జీవన పద్ధతులపై వర్క్షాప్స్ జరుగుతాయి. గచి్చ»ౌలి స్టేడియం, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో జరిగిన ఈ వేడుకలు ప్రజల్లో భారీగా ఆదరణ పొందుతున్నాయి. తద్వారా వేగన్ పాప్ అప్ మార్కెట్లు కూడా కొత్త ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక్కడ స్థానిక బ్రాండ్లు హస్తకళలతో చేసిన ప్లాంట్ బేస్డ్ ఉత్పత్తులను అమ్ముతాయి.వేగన్ ఫుడ్ – హెల్తీ బెనిఫిట్స్.. ఫిట్నెస్ ప్రియులు, యోగా ప్రేమికులు ఈ జీవనశైలిని ఎక్కువగా అంగీకరిస్తున్నారు. రక్తపోటు, కొలె్రస్టాల్, మధుమేహం వంటి వ్యాధులను తగ్గించడంలో వేగన్ ఆహారం సహాయపడుతుందని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. వేగన్ డైట్లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరానికి డిటాక్సిఫై ప్రభావాన్ని ఇస్తుంది. కానీ సరైన మార్గదర్శకత్వంతో మాత్రమే దీని ప్రయోజనం పూర్తవుతుందని హైదరాబాద్ ఆధారిత న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఎకో ఫ్రెండ్లీ ఫ్యాషన్ వైపు..వేగన్ ఫ్యాషన్ కూడా హైదరాబాద్ యువతలో కొత్త ట్రెండ్గా మారింది. లెదర్కు బదులుగా కార్క్, పైనాపిల్ ఫైబర్, రీసైకిల్ చేసిన కాటన్తో తయారు చేసిన బ్యాగులు, షూలు, బెల్టులు మార్కెట్లోకి వస్తున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లోని బొటిక్ స్టోర్లలో వీటికి భారీ డిమాండ్ ఉంది. (చదవండి: సెన్స్లెస్ సెల్ఫీ..! ఆందోళన వ్యక్తం చేస్తున్న పోలీసులు, నిపుణులు) -
సెన్స్లెస్ సెల్ఫీ..!
బడికెళ్తున్నా సెల్ఫీ... గుడి కొచ్చినా ఫొటో... వంట చేస్తూ వీడియో... స్మార్ట్ ఫోన్తో మొదలై, సోషల్మీడియాతో విపరీతంగా మారిన పోకడలకు ఉదాహరణలు ఇవి. ఇటీవలి కాలంలో వీటన్నింటినీ మించి వీడియో వైరల్ కిక్ కల్చర్ పెరుగుతోంది. జాఢ్యంలా విస్తరిస్తున్న దీని కారణంగా అనేక మంది మానవత్వాన్ని సైతం మర్చిపోతున్నారు. మొన్న నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్కు కత్తిపోట్ల ఉదంతం... నిన్న చిన్నటేకూరులో జరిగిన వి.కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం... ఇలా అనేక ఉదంతాల్లో స్పందించాల్సిన వ్యక్తులే వీడియో రికార్డింగ్కు పరిమితం అవుతున్నారు. ఆ ఉదంతంపై నిజామాబాద్ సీపీ సాయి చైతన్య... ఈ ఉదంతంపై నగరవాసి హేమ ఈ ధోరణి పైనే ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పెరుగుతున్న ఈ వీడియో వైరల్ కల్చర్పై పోలీసులు, నిపుణులు చెప్తున్న అభిప్రాయాలివి... ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు, వాటి విలువలు తగ్గాయి. మనుషులను బట్టే సమాజం కూడా ఉంటుంది. అనేక మంది ఇళ్లల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి ఒక్కరిలో స్వార్థం పెరిగిపోవడంతో ఎదుటి వారికి సహాయం చేస్తే నాకేంటి లాభం అని ఆలోచిస్తున్నారు. గతంలో వీరికి సహాయం అవసరమైనప్పుడు ఎవరూ ముందుకు రాకపోవడమూ ఈ ధోరణికి ఓ కారణమే. సినిమాలు, మీడియా తదితరాలు కూడా సక్సెస్ అంటే ఉన్నత స్థితికి చేరడం, డబ్బు సంపాదించడం అంటూ.. హీరోయిజమంటే ఎదుటి వారిని కొట్టడం అన్నట్లు చూపిస్తున్నాయి. ఇలాంటి వారికి లభిస్తున్న ప్రచారం పది మందికి సహాయపడిన, పడుతున్న వారికి లభించట్లేదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బతినడం కూడా మానవ సంబంధాలు, అనుబంధాలు–ఆప్యాయతలు తగ్గిపోవడానికి కారణమైంది. వీటితో పాటు సమాజంలో అనునిత్యం జరుగుతున్న నేరాలు చూడటం అలవాటుపడిన వాళ్లు తమ కళ్ల ముందే ఘోరం జరుగుతున్నా స్పందించట్లేదు. సెన్సేషనలిజాన్ని ఆస్వాదించడానికే...కళ్లు జరుగుతున్న ఘోరాన్ని ఆపడానికి బదులు దాన్ని తమ సెల్ఫోన్లలో చిత్రీకరించే ధోరణి పెరిగిపోయింది. ఆ వీడియో వైరల్ కావడం వల్ల వచ్చే కిక్, ఆ సెన్సేషనలిజాన్ని ఆస్వాదించడానికి కొందరు ఇలా చిత్రీకరిస్తున్నారు. ఈ వీడియోలను సోషల్మీడియాలో వైరల్ చేస్తూ లైక్స్, కామెంట్స్, ఫార్వర్డ్స్లో తమ సక్సెస్ వెతుక్కునే వాళ్లు పెరిగిపోయారు. స్మార్ట్ ఫోన్ సామాన్యుడి చేతికి రావడంతో ఈ మీడియా పరిధి పెరిగిపోవడం, ఇందులోని అంశాలు వేగంగా విస్తరించడం తదితర కారణాలతో తమ వీడియో వైరల్ కావడం ఓ కిక్గా భావిస్తున్నారు. కొన్నింటిని వైరల్ చేస్తూ అందులో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. సోషల్ ట్రోలర్స్..సోషల్మీడియాలో ట్రోలర్స్ ఎవరనేది ఎదుటి వారికి తెలీదు. దీంతో వాళ్లు చేసే కామెంట్స్, పోస్టులు నేరుగా వీళ్లపై ప్రభావం చూపదు. ఈ కారణంగానూ ఘోరాలను వీడియో తీసి వైరల్ చేయడం అనే ధోరణి పెరిగిపోయింది. ప్రస్తుత విద్యా వ్యవస్థ మార్కులు, ర్యాంకుల ఆధారితంగా మారిపోయింది. ఈ పరిస్థితులను మారాలంటే కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలి. తల్లిదండ్రులు, చదువు చెప్పే గురువులు ఆ కోణంలో కృషి చేయాల్సిన అవసరం ఉంది. సామాజిక బాధ్యతలు, విలువలు విద్యలో భాగంగా మారాలి. ప్రతి వ్యక్తి జీవితంలో రోల్ మోడల్స్ను ఎంచుకునే విధానం మారాలి. అలా ప్రతి ఒక్కరూ కృషి చేస్తేనే ఫలితాలు ఉంటాయి. (చదవండి: ఒకప్పుడు కూలీ..ఇవాళ ఏకంగా ఊరినే విమానంలో..) -
దేవ దీపావళి... జ్వాలాతోరణం
కార్తీకమాసమంతా పర్వదినాల పరంపరే అయినప్పటికీ ఈ మాసంలో కొన్ని పర్వాలు కన్నుల పండువగా జరుగుతాయి. అలాంటి వాటిలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలాతోరణం. ఏ ఇతర మాసంలోనూ ఇలాంటి ఆచారం మనకు కనబడదు. బుధవారం కార్తీక పౌర్ణమి సందర్బంగా జ్వాలాతోరణ విశిష్టత ఏమిటి, ఎలా నిర్వహిస్తారో తెలుసుకుందాం.కార్తీక పౌర్ణమినాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి.. ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అలా అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకువచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు. ఈ నిర్మాణంపై ఆవునెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుంచి పార్వతీ పరమేశ్వరులని పల్లకిలో అటూ ఇటూ మూడుసార్లు ఊరేగిస్తారు. అలా వారి ఊరేగింపు అనంతరం భక్తులు కూడా ఆ మంటల కింది నుంచి దూరి వెళ్తారు.మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనక ఒక కారణముంది. యమలోకంలోకి వెళ్లిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం, యమలోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తీ ఈ తోరణం గుండానే లోపలికి వెళ్లాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. ఈ శిక్షను తప్పించుకోవాలంటే శ్రీమన్నారాయణుని ప్రార్థించటం ఒకటే మార్గం. అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడు సార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి సర్వదేవతా కటాక్షం లభిస్తుందనీ, వారికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదనీ కార్తీక పురాణం చెబుతోంది. అందుకే భక్తులు తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తారు.దీనివెనక మరో తత్వకోణం కూడా ఉంది. జ్వాలాతోరణం కింద స్వామివారి పల్లకి పక్కనే నడుస్తూ...‘‘నేను ఇప్పటి దాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి. వచ్చే ఏడాది దాకా ఎటువంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తా..’’ అని సంకల్పం చెప్పుకోవాలి. అనంతరం ఆ జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి – ఇంటి చూరులోనో.. గడ్డివాములోనో.. ధాన్యాగారంలోనో పెడతారు. అది ఉన్న చోట్ల భూతప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని.. ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం...లక్ష్మీనారాయణులను కూడా...కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు శివుడితో పాటుగా లక్ష్మీనారాయణులను కూడా ఆరాధిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు వ్రతమాచరించి సత్యనారాయణ స్వామి వ్రత కథను వినాలి. సాయంకాలం ఆలయాల్లో లేదా రావిచెట్టు, తులసిచెట్టు ఈ మూడింట్లో ఎక్కడో ఒక చోట దీపం వెలిగించాలి.కాశీలో దేవ దీపావళికాశీలో ఈ కార్తీక పున్నమినాడు దేవదీపావళీ రూపంలో వేడుకలు జరుగుతుంటాయి. ఆ రోజున కాశీలోని గంగా ఘాట్లలో లక్షలాది దీపాలు వెలిగిస్తారు. ఒకేసారి ఘాట్లలో దీపాల వరుసలు వెలిగినప్పుడు, మొత్తం నగరం దీపతోరణంలా కనిపిస్తుంది. ఈ కమనీయ దృశ్యాన్ని చూడటానికి దేశ విదేశాల నుంచి భక్తులు అసంఖ్యాకంగా వారణాసికి చేరుకుంటారు.ఈ రోజున శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని వధించాడనీ, ఆ విజయాన్ని పురస్కరించుకుని దేవతలు కాశీలో దీపాలు వెలిగించి వేడుక చేసుకున్నార నీ, అప్పటినుండి ఈ పండుగ దేవ దీపావళిగా ప్రసిద్ధి చెందిందనీ స్థలపురాణం చెబుతోంది. కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం గంగా హారతి చూడడం ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుంది. ఈ దివ్య వీక్షణం కోసం గంటల తరబడి భక్తులు ఘాట్లలో ఓపిగ్గా ఎదురు చూస్తారు. కార్తీక పౌర్ణమిని సిక్కులు గురునానక్ జయంతిగా జరుపుకుంటారు. – డి.వి.ఆర్. -
ఒకప్పుడు కూలీ..ఇవాళ ఏకంగా ఊరినే విమానంలో..
వచ్చింది కదా అవకాశం.. ఓ మంచి మాట అనుకుందాం.. ఎందుకు ఆలస్యం అందరినీ రమ్మందాం.. అంటూ బ్రహ్మోత్సవం సినిమాలో సీతారామశాస్త్రి రచించిన పాటను గుర్తుచేసేలా ఊరంతా ఒకేసారి విమానం ఎక్కారు. ఇందుకు హైదరాబాద్ నగరానికి చెందిన ఒకప్పటి అడ్డా కూలీ ఆతిథ్యం ఇచ్చాడు. ఒకరిని కాదు.. ఇద్దరిని కాదు.. ఏకంగా ఒకే ఊరికి చెందిన 500 మందిని విమానం ఎక్కించి గోవా తీసుకెళ్లాడు.. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.. ఆ వివరాలు.. ఒకప్పుడు ఆయనో అడ్డా కూలీ. పొట్టకూటికోసం నగరానికి వచ్చి దినసరి కూలీగా కాలం గడిపాడు.. 40 ఏళ్ల క్రితం ఫుట్పాత్పై దొరికే బ్రెడ్బన్ తిని బస్టాండ్ ఆవాసంగా బతికాడు.. పదేళ్ల తర్వాత 1995లో సెంట్రింగ్ పని ప్రారంభించాడు. అనతికాలంలో బీజే కన్స్ట్రక్షన్స్ పేరుతో పెద్ద కాంట్రాక్టర్గా స్థిరపడ్డాడు. ఈ క్రమంలోనే తన చిన్ననాటి కలను నెరవేర్చుకున్నాడు. సొంత ఊరు నుంచి 500 మందిని విమానం ఎక్కించాడు. దీనికి తన కుమారుడి వివాహాన్ని సందర్భంగా చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఆయనే జవహర్నగర్ మాజీ మేయర్ మేకల కావ్య తండ్రి మేకల అయ్యప్ప. ఊరంతా ఒకేసారి.. నాగర్కర్నూలు జిల్లా బిజినపల్లి మండల గుడ్లనర్వ గ్రామంలో కోళ్ల ఫారంలో కూలీగా పనిచేసే అయ్యప్ప పంటలు పండక ఆర్థిక ఇబ్బందులతో హైదరాబాద్ వచ్చాడు. ప్రస్తుతం ఆర్థికంగా స్థిరపడిన ఆయన జవహర్నగర్లో నివాసం ఉంటున్నాడు. అయితే కుమారుడి నిశి్చతార్థం సందర్భంగా ఊరందరినీ ఒకేసారి విమానం ఎక్కించి గోవా తీసుకెళ్లాడు. ఆయన కల నెరవేర్చుకోవడంతో పాటు ఊరందరూ ఆనందపడేలా చేశాడు. ‘నా కుటుంబ సభ్యులతో పాటు.. ఊర్లో ఉన్న బంధువులను విమానంలో గోవాలో తీసుకెళ్లి వారితో ఆనందంగా గడిపాను.. ఆ మధుర క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను’ అంటున్నారు అయ్యప్ప. (చదవండి: Success Story: ఐఐటీలో సీటు నుంచి డ్రీమ్ జాబ్ వరకు అన్ని ఫెయిలే..! కానీ ఇవాళ..) -
ఈ సండే వెరైటీగా లెమెన్ షార్ట్బ్రెడ్, రైస్ కోకోనట్ ఇడ్లీ ట్రై చేయండిలా..!
లెమెన్ షార్ట్బ్రెడ్కావలసినవి: మైదాపిండి, పంచదార పొడి– 2 కప్పులు చొప్పున, బటర్– ఒక కప్పు (తురుములా చేసుకోవాలి)నిమ్మ తొక్క తురుము– ఒక టీ స్పూన్ పైనేఉప్పు– కొద్దిగా, చిక్కటి పాలు– పావు కప్పునిమ్మరసం– 6 టేబుల్ స్పూన్లుతయారీ: ముందుగా మైదాపిండి, ఉప్పును ఒక గిన్నెలో వేసి, బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఒక పెద్ద మిక్సీ గిన్నెలో బటర్ తురుము, అర కప్పు పంచదార పొడి, ఒక టీ స్పూన్ నిమ్మ తొక్క తురుము వేసి, మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. అనంతరం మైదా మిశ్రమాన్ని దీనికి జోడించి, కొద్దిగా నీళ్లు కలుపుతూ, పిండిని ముద్దగా అయ్యే వరకు కలపాలి. మరీ ఎక్కువగా కలపకూడదు. పిండి మెత్తగా ముద్ద అయ్యే వరకు చేతులతో తేలికగా కలపితే సరిపోతుంది. ఆ ముద్దను ప్లాస్టిక్ ర్యాప్లో చుట్టి కనీసం ఒక గంటసేపు ఫ్రిజ్లో ఉంచాలి. ఈలోపు ఒక పాత్రలో ఒకటిన్నర కప్పుల పంచదార పొడి, నిమ్మరసం, పాలతో పాటు అభిరుచిని బట్టి ఏలకుల పొడి వేసుకుని, బాగా కలుపుకోవాలి. గంట తర్వాత మైదా ముద్దను బ్రెడ్ ట్రేలో వేసి ఓవెన్లో బేక్ చేసుకుని, నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి ముక్కపైన నిమ్మ తొక్క తురుము, పాలు– పంచదార మిశ్రమం వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు.రైస్ కోకోనట్ ఇడ్లీకావలసినవి: అన్నం– ఒక కప్పు (మెత్తగా ఉడికినది)బెల్లం కోరు– పావు కప్పు (పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు)అరటిపండు– 1 (మీడియం సైజ్)కొబ్బరి కోరు– అర కప్పు, ఏలకులు– 3 (పౌడర్ చేసుకోవాలి)నెయ్యి– కొద్దిగా, డ్రై ఫ్రూట్స్– అలంకరణకు తగినంతతయారీ: ముందుగా అన్నం, బెల్లం కోరు, అరటిపండు ముక్కలు మిక్సీ బౌల్లో వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి. అనంతరం అందులో కొబ్బరి కోరు, ఏలకుల పొడి వేసుకుని మరోసారి మిక్సీ పట్టుకోవాలి. ఆపై ఇడ్లీ రేకులకు నెయ్యి రాసుకుని, అందులో అన్నం–బెల్లం మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పెట్టుకుని సుమారు పది నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించుకోవాలి. తర్వాత ఆ ఇడ్లీలపై నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అలంకరించుకుని సర్వ్ చేసుకోవాలి.రాజస్థానీ ఘేవర్కావలసినవి: మైదా పిండి– ఒక కప్పు, నెయ్యి– పావు కప్పు (గడ్డకట్టినది తీసుకోవాలి), చల్లని నీళ్లు– పావు కప్పు ఐస్ ముక్కలు– 8 ముక్కలు, చల్లని పాలు– 3 కప్పులు, శెనగ పిండి– ఒక టీస్పూన్, నిమ్మరసం– కొద్దిగా, నూనె– సరిపడా, పంచదార– ఒక కప్పునీళ్లు– అర కప్పు, ఏలకుల పొడి– పావు టీస్పూన్తయారీ: ముందుగా ఒక గిన్నెలో పంచదార, అరకప్పు నీళ్లు కలిపి స్టవ్ మీద పెట్టుకోవాలి. పంచదార కరిగేంత వరకు వేడి చేసి, ఆ తర్వాత 2 నిమిషాలు ఉడికించాలి. ఒక తీగ పాకం వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు ఏలకుల పొడి, మూడు చుక్కల నిమ్మరసం కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక పెద్ద గిన్నెలో నెయ్యి, ఐస్ ముక్కలు వేసి, నెయ్యి తెల్లటి క్రీములా మారేవరకు బాగా కలపాలి. ఇప్పుడు మైదా పిండిని కొద్దికొద్దిగా జల్లించి, చల్లని పాలు కొంచెం కొంచెం పోస్తూ, పిండిని ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమం చాలా పల్చగా ఉండాలి. దానిలో ఒక టీ స్పూన్ నిమ్మరసం కలపాలి. అనంతరం ఒక లోతైన, వెడల్పాటి కడాయిలో నూనెను సగ భాగం కంటే కొంచెం తక్కువగా పోసి బాగా వేడి చేయాలి. ఇప్పుడు మైదా మిశ్రమాన్ని ఒక గరిటెతో నూనె మధ్యలోకి, పైనుండి నెమ్మదిగా సన్నని ధారలా పోయాలి. నూనె పైకి నురగలా వస్తుంది. నురగ తగ్గిన తర్వాత, మళ్లీ కొంచెం మైదా మిశ్రమాన్ని అదే విధంగా పోయాలి. ఇలా సుమారు ఏడెనిమిది సార్లు రిపీట్ చేస్తే, గుండ్రటి జల్లెడలా (ఘేవర్) మారి, దాని మధ్యలో ఒక చిన్న రంధ్రం ఏర్పడుతుంది. ఇప్పుడు దాన్ని గోధుమ రంగులోకి మారేవరకు వేయించాలి. మధ్యలో రంధ్రం దగ్గర చిన్న కర్ర లేదా స్పూన్ సహాయంతో నెమ్మదిగా బయటికి తీసి, టిష్యూ పేపర్స్ మీద కాసేపు ఉంచాలి. ఇదే మాదిరి చాలా ఘేవర్లు తయారుచేసుకోవచ్చు. వేడి తగ్గిన తర్వాత వాటిని ఒక పెద్ద బౌల్లోకి జాగ్రత్తగా ఉంచి, వాటిపైన పంచదార పాకం పోసి, సర్వ్ చేసుకునే ముందు పిస్తా బాదం వంటి ముక్కలతో నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. (చదవండి: అలా ఉంటే..డయాబెటిస్ బోర్డర్లోకి వచ్చినట్లే..?) -
అలా ఉంటే..డయాబెటిస్ బోర్డర్లోకి వచ్చినట్లే..?
డయాబెటిస్ నిర్ధారణ కోసం పొద్దున్నే పరగడుపున (ఫాస్టింగ్) ఒకసారి రక్తపరీక్షా, అలాగే ఏదైనా తిన్నాక దాదాపు రెండు గంటల తర్వాత మరోసారి రక్తపరీక్ష చేస్తారు. ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ అని పిలిచే ఆ పరీక్షల్లో... ఫాస్టింగ్లో 100 పోస్ట్ లంచ్లో 140 ఉంటే అది నార్మల్గా పరిగణిస్తారు. ఒకవేళ ఫాస్టింగ్లో 126 వరకు వచ్చినా... అప్పుడే మందులు మొదలు పెట్టరు. కానీ... అలా వచ్చినవారికి వారు ‘బార్డర్లైన్’ కండిషన్లో ఉన్నారనీ... అంటే భవిష్యత్తులో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ అని, డయాబెటిస్ చాలాకాలం వరకు రాకూడదంటే ఆ టైమ్లో ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు చేసుకోవలంటూ డాక్టర్లు సూచిస్తారు. మరి... ఫాస్టింగ్ విలువలు ఎక్కువగానూ... పోస్ట్ లంచ్ మరీ తక్కువగానూ ఉంటే...? కొందరిలో ఫాస్టింగ్ విలువలు నూరుకు బదులుగా 115 నుంచి 124 వరకు కనిపించవచ్చు. కానీ భోజనం తర్వాత చేసే పోస్ట్ లంచ్లో విలువలు మరీ తక్కువగా అంటే... 130, 135 రావచ్చు. ఇలా ఫాస్టింగ్లో ఉండాల్సిన దానికంటే ఎక్కువ, పోస్ట్ లంచ్లో మరీ తక్కువగా రావడాన్ని కూడా బార్డర్లైన్గానే పరిగణించాలి. అంతేతప్ప... పోస్ట్ లంచ్లో విలువలు మరీ తక్కువగా రావడాన్ని అంతా బాగున్నట్లుగా అనుకోడానికి వీల్లేదు. ఇలా జరగడానికి కారణాలేమిటంటే... రక్తంలో ఉన్న చక్కెర మోతాదును అదుపులో పెట్టేందుకు ఎంత అవసరమో తెలుసుకుని, దానికి తగ్గట్టుగా ప్యాంక్రియాస్ గ్రంథి తగినంత ఇన్సులిన్ని విడుదల చేస్తుంది. కానీ రక్తంలో ఎంత చక్కెర ఉందన్న అంచనా ఒక్కోసారి ప్యాంక్రియాస్కు తెలియదు. అలాంటి సందర్భాల్లో అది ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్ను స్రవిస్తుంది. దాంతో రక్తంలోని చక్కెర మోతాదులు బాగా పడిపోతాయి. ఇలా జరిగినప్పుడు పోస్ట్ లంచ్ విలువలు మరీ తక్కువగా వస్తుంటాయి. ఇదీ ఓ ముందస్తు హెచ్చరికే... డయాబెటిస్ వచ్చే ముందు ఇలా జరిగే అవకాశం ఉంది కాబట్టి... కాబట్టి దీన్ని కూడా డయాబెటిస్కు ముందు దశగా అంటే ‘బార్డర్లైన్’గా పరిగణించాలి. డయాబెటిస్ను సాధ్యమైనంత ఆలస్యం చేసేందుకు లేదా చాలాకాలం పాటు నివారించేందుకు ఆహారంలో అన్నం (పిండిపదార్థాలు) తగ్గించి, అన్ని రకాల ΄ోషకాలు అందేలా కూరలు ఎక్కువగా కలుపుకుని తింటుండాలి. వీలైనంతవరకు ఎక్కువగా ఆకుకూరలు ఉపయోగించడం మంచిది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒత్తిళ్లకు దూరంగా ఉంటూ, బరువును అదుపులో పెట్టుకోవాలి. ఈ నియమాలు కేవలం బార్డర్లైన్ వారికి మాత్రమే కాకుండా డయాబెటిస్ను నివారించాలని కోరుకునే ఆరోగ్యవంతులకూ మేలు చేసేవే. (చదవండి: గుండె రంధ్రాలా..? గుబులొద్దు!) -
లాంగ్ కోవిడ్తో బాధపడ్డ మహిళల్లో..!
అప్పట్లో కోవిడ్ బారినపడటంతో పాటు దాని లక్షణాలు చాలాకాలంపాటు కొనసాగిన లాంగ్ కోవిడ్తోనూ బాధపడ్డ మహిళల్లో రుతుస్రావకాలం మరింత సుదీర్ఘంగా ఉంటోందంటూ ఓ అధ్యయనంలో తేలింది. ఈ పరిశోధన అంశాలను సైన్స్ / మెడికల్ జర్నల్ అయిన ‘నేచర్’లో ప్రచురితమయ్యాయి. కోవిడ్ అంటే ఏమిటో అందరికీ తెలిసిందే. ఇక లాంగ్ కోవిడ్ కూడా చాలామందికి గుర్తుండే ఉంటుంది. దాని గురించి పెద్దగా తెలియనివాళ్ల కోసం ‘లాంగ్ కోవిడ్’ అంటే ఏమిటో చూద్దాం.లాంగ్ కోవిడ్ అంటే...అప్పట్లో కోవిడ్ పాజిటివ్ సమయంలో బాధితుల్లో కొన్ని లక్షణాలు కనిపించేవి. ఉదాహరణకు జ్వరం వచ్చి తగ్గాక విపరీతమైన నీరసం, నిస్సత్తువలతో పాటు రుచి, వాసనలు తెలియకపోవడం వంటి లక్షణాలు కనిపించేవి. ఇక కొంతకాలం తర్వాత కరోనా వైరస్ తాలూకు చురుకుదనం దేహంలో బాగా తగ్గి΄ోయాక కోవిడ్–19 పరీక్షలు చేయిస్తే... వాటిల్లో నెగెటివ్ వచ్చిన తర్వాత కూడా కొందరిలో కోవిడ్ తాలూకు లక్షణాలు కొనసాగుతూ ఉండేవి. అలా కొనసాగుతున్న లక్షణాలను డాక్టర్లు ‘లాంగ్ కోవిడ్’గా చెప్పేవారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయిన తర్వాత కొందరిలో చాలా కాలం వరకు కొన్ని రకాల సమస్యలు బాధితులను వేధిస్తూ ఉండేవి. ఒక ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గాక ఆ తర్వాత కూడా కొన్ని సమస్యలు కనిపిస్తూనే ఉంటాయనీ, అవన్నీ చాలా సాధారణమంటూ మొదట్లో వైద్యులు కొట్టి΄ారేసినా, తర్వాత్తర్వాత మాత్రం ఇవి ఒక కొత్త రకమైన జబ్బుని సూచిస్తున్నట్లు కనిపించాయంటూ డాక్టర్లలో చాలామంది పేర్కొన్నారు. అలా నెగెటివ్ ఫలితాలు వచ్చాక కూడా అనేక జబ్బుల తాలూకు లక్షణాలు కనిపించడాన్ని ‘లాంగ్ కోవిడ్’గా వ్యవహరించారు.లాంగ్కోవిడ్కు ఉన్న మరికొన్ని పేర్లు...అమెరికన్ హెల్త్ సంస్థ అయిన ఎన్ఐహెచ్ వారు దీనికి ‘పీఏఎస్సీ’ అని పేరు పెట్టారు. అంటే ‘పీఏఎస్సీ’ అనే సంక్షిప్త నామానికి విస్తరణే పోస్ట్ అక్యూట్ సీక్వెల్ ఆఫ్ కోవిడ్ 19’. ఈ లక్షణాలతో బాధపడే వారిని ‘లాంగ్ హాలర్స్’ అని కూడా కొందరు పిలిచారు. మరి కొంతమంది దీన్ని ‘ఆన్ గోయింగ్ సింప్టమాటిక్ కోవిడ్ 19’ అనీ లేదా ‘క్రానిక్ కోవిడ్–19 సిండ్రోమ్’ అని కూడా పేర్కొన్నారు.పేషెంట్లే కనిపెట్టిన జబ్బు... సాధారణంగా ప్రపంచంలో అత్యధికమైన జబ్బులను డాక్టర్లు కనిపెడతారు. అయితే ఈ లాంగ్ కోవిడ్ మాత్రం పేషెంట్లు కనిపెట్టి వాళ్లు డాక్టర్లను అప్రమత్తం చేశారు. మొదట్లో చాలా మంది డాక్టర్లు ఈ విషయం చెప్పిన పేషెంట్ల వాదనను కొట్టిపడేశారు. వాస్తవానికి లాంగ్ కోవిడ్ అనే పేరుని ‘ఎలీసా పెరెగో’ అనే ఇటలీకి చెందిన బాధిత పేషెంట్ మొట్టమొదటిసారిగా వాడారు. లాంగ్ కోవిడ్ అనేది ఒక ప్రత్యేకమైన జబ్బు అనీ, దాన్ని అర్థం చేసుకోవడానికీ, చికిత్స చేయటానికి ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమవుతోందని ప్రపంచవ్యాప్తంగా చాలామంది డాక్టర్లు గుర్తించారు. డాక్టర్ మాధురి మొవ్వ, సీనియర్ ఆబ్స్టిట్రీషియన్, గైనకాలజిస్ట్ – లాపరోస్కోపిక్ సర్జన్ (చదవండి: గుండె రంధ్రాలా..? గుబులొద్దు!) -
గుండె రంధ్రాలా..? గుబులొద్దు!
కొంతమంది చిన్నపిల్లల్లో వారి పసివయసులో కనిపించే గుండె రంధ్రాలు తల్లిదండ్రులను చాలా ఆందోళనలో ముంచెత్తుతాయి. ఇలా పిల్లల గుండెల్లో రంధ్రాలు కనిపించడానికి కారణముంది. మహిళ గర్భవతిగా ఉన్నప్పుడే ఒక పొడవాటి పైప్ వంటి నిర్మాణం నుంచి శిశువు గుండె రూపుదిద్దుకుంటుంది. ఈ క్రమంలో ఆ పైప్ లాంటి నిర్మాణం నుంచే గుండె తాలూకు వివిధ భాగాలు అభివృద్ధి చెందుతాయి. ఇలా అభివృద్ధి చెందే క్రమంలో కొన్ని రంధ్రాలు ఉండిపోతాయి. గుండెలో రంధ్రాలకు కారణాలు... దాదాపు పిల్లలందరిలోనూ గుండె అభివృద్ధి చెందే సమయంలో ముందుగా ఏర్పడ్డ రంధ్రాలు ఆ తర్వాతి కాలంలో పూర్తిగా పూడుకుంటాయి. అయితే కేవలం కొద్దిమంది చిన్నారుల్లో మాత్రం గుండె రూపొందే క్రమంలో ఏర్పడ్డ రంధ్రాలు వాటంతట అవే పూడుకుపోవు. కొన్ని సందర్భాల్లో జన్యుపరమైన అంశాలూ ఈ రంధ్రాలకు కారణమవుతాయి.అప్పుడేమవుతుందంటే... ఏట్రియల్ లేదా వెంట్రికల్ గదుల గోడల మధ్య పుట్టుకతో ఏర్పడే ఇలాంటి రంధ్రాల కారణంగా... రక్తం ఒక గది నుంచి మరొక గదిలోకి ప్రవహించి, తిరిగి ఆక్సిజన్ కోసం మళ్లీ మళ్లీ ఊపిరితిత్తుల్లోకి చేరుతుంటుంది. దాంతో ఊపిరితిత్తులపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. చాలావరకు వాటంతట అవే పూడుకునేలా... గుండెలో రంధ్రాలు కనిపించిన వెంటనే వాటికి సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. మరీ ప్రమాదకరమని భావించిన కేసుల్లో తప్ప... చాలా సందర్భాల్లో డాక్టర్లు కొన్ని రకాల మందులు వాడుతూ కొంతకాలం వేచిచూస్తారు. పుట్టుకతో గుండెలో రంధ్రాలతో జన్మించేవారిలో 25 – 30 శాతం మంది వీఎస్డీ లోపం అనే సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి రంధ్రాలు పూడ్చటానికి మొదట్లో సర్జరీ మాత్రమే అందుబాటులో ఉండేది. ఇలా సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు ఆ పిల్లల్ని సర్జరీ తాలూకు గాయం బాధించడంతో పాటు శస్త్రచికిత్స తాలూకు మచ్చలు కూడా శాశ్వతంగా మిగిలి΄ోయేవి. కానీ ఇప్పుడు వైద్యశాస్త్రంలో వచ్చిన అత్యాధునిక పురోగతి వల్ల ఇలాంటి పిల్లలకు అలాంటి అసౌకర్యం, నొప్పి లేకుండా గుండెలోని రంధ్రాలను పూడ్చటం చాలా సాధారణమైన వైద్యప్రక్రియగా మారి΄ోయింది. ఇందుకోసం అప్పుడు సర్జరీ అవసరమే లేదు. మొదట గజ్జల్లో ఉండే రక్తనాళాల ద్వారా కార్డియాక్ కేథటర్ను సూది ద్వారా పంపి గుండె పనితీరును తెలుసుకుంటారు. అలాగే గుండె రంధ్రం పరిమాణంతో పాటు దాని తీరును రేడియోకాంట్రాస్ట్ను ఇంజెక్ట్ చేసి తెలుసుకుంటారు. ఆ తర్వాత రంధ్రాన్ని మూసివేసే ప్రక్రియను చేపడతారు. ఈ చికిత్స పూర్తయ్యాక గుండెలోకి పంపిన కేథటర్స్ అన్నింటినీ బయటకు తొలగిస్తారు. ఆ తర్వాత ఎకోకార్డియోగ్రామ్ పరీక్ష చేసి రంధ్రం పూడుకుందా లేదా అన్నది డాక్టర్లు నిర్ధారణ చేస్తారు. కాబట్టి ఇప్పుడు చిన్నప్లిల్లలో కనిపించే ఇలాంటి గుండెరంధ్రాల విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ఏఎస్డీ, వీఎసీడీ మాత్రమే కాకుండా ఇంకా అనేక రకాలైన గుండెకు సంబంధించిన పుట్టుకతో వచ్చే సమస్యలు ఉంటాయి. వాటిలో కొన్నివాటికి (టీఏపీవీసీ, టీజీఏ వంటి వాటికి) చిన్నవయసులోనే ఆపరేషన్ అవసరం పడవచ్చు. ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్ (చదవండి: వాసా ప్రీవియా ఉంటే సాధారణ ప్రసవం అవ్వడం కష్టమా..?) -
ఐఐటీలో సీటు నుంచి డ్రీమ్ జాబ్ వరకు అన్ని ఫెయిల్..! కానీ ఇవాళ..
అందరు లక్షల్లో వేతనం అందుకునే స్థాయికి చేరుకోవాలనుకుంటారు. అందుకోసం ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక కాలేజీల్లో చదివి మరి అనుకున్న డ్రీమ్ని నెరవేర్చుకుంటుంటారు. అలానే ఈ వ్యక్తి కూడా 17 ఏళ్ల వయసులో ఐఐటీలో చేరడమే లక్ష్యంగా చదివాడు. కానీ లక్షల్లో ర్యాంకు రావడంతో ఆ కల చేజారిపోయింది. పోనీలే 20 ఏళ్లకే మంచి జాబ్ కొట్టేద్దామనుకున్నాడు. అది కూడా విఫలమే. ఇన్ని ఫెయ్యిల్యూర్స్ ఎదురైనా..నా వల్ల కాదని చేతులెత్తేయలేదు. చివరికి అనుకున్న లక్ష్యానికి చేరుకుని యువతకు ఆదర్శంగా నిలిచాడు. అతడే డ్రీమ్లాంచ్ సీఈవో హర్షిల్ తోమర్. పాపం చిన్నప్పటి నుంచి తను కన్న ప్రతి కల నీరుగారిపోయేది. అడుగడుగునా వైఫల్యాలే. చిన్నప్పటి నుంచి ఐఐటీలో చేరడమే హర్షిల్ లక్ష్యం . కానీ లక్షల్లో ర్యాంకు రావడంతో మరోసారి ప్రయత్నించాడు. అప్పుడు కూడా 75 వేల ర్యాంకు తెచ్చకున్నాడు. దీంతో ఆ ఐఐటీ డ్రీమ్ కలగానే మిగిలిపోయింది. చివరికీ మాములు కాలేజ్లో చేరి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. పోనీలే 20 ఏళ్లకే అందరికంటే మంచి పొజిషన్లో ఉండేలా లక్షల వేతనంతో కూడిన జాబ్ కొట్టేయాలనుకున్నాడు. కానీ అది కూడా సాధ్యం కాలేదు. చివరికి నెలకు రూ. 30 వేలు సంపాదించే సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగాన్ని అతికష్టం మీద తెచ్చుకున్నాడు. ప్రతి రోజు తనను తాను అసహ్యించుకుంటూ..ఇదేం ఉద్యోగం అని బాధపడిపోతుండేవాడు. అయినా సరే తన డ్రీమ్ని వదిలిపెట్టకుండా..అలా చాలా ఉద్యోగాలు ఆన్లైన్లోనే అప్లై చేసుకుంటూనే ఉండేవాడు. అలా చేస్తుండగా ఏ కంపెనీ నుంచి రిప్లై వచ్చేది కాదు. అలా ఆరు నెలలుగా కేవలం చదువుకోవడం, వ్యాయామాలు చేయడం, ఉద్యోగం కోసం వేట. ఇంతలా చేసినా..ఎలాంటి ఫలితం లేదు. అయితే ఒకరోజు నుంచి ఆకస్మికంగా ఇటర్వ్యూ కాల్స్ రావడం ప్రారంభించాయి. అలా 2024 నాటికి ఓ చిన్న ఆన్లైన్ ఉద్యోగాన్ని సంపాదించాడు. ఇంటర్న్షిప్నే పూర్తి సమయం ఉద్యోగంగా మార్చుకున్నాడు. తొందరలో ఆ ఉద్యోగానికి స్వస్తి పలకక తప్పలేదు. అయినా తన ప్రయత్నం ఆపలేదు. అలా పెద్దపెద్ద సంస్థలతో స్పాన్సర్ షిప్లు చేసే స్థాయికి చేరుకుని.. సొంతంగా కంపెనీకి పెట్టుకునే రేంజ్కి ఎదిగాడు. ఇవాళ ఏకంగా రూ. 54 లక్షలు అధిక వేతనానన్ని అందుకుంటూ తన కలను నెరవేర్చుకున్నా అంటూ సోషల్ మీడియా పోస్ట్లో తన సక్సెస్ జర్నీ గురించి వివరించాడు డ్రీమ్లాంచ్ సీఈవో హర్షిల్ తోమర్. ఇది నెటిజన్లను ఎంతగానో ఆకర్షించింది. బ్రో మీది చాలా స్ఫూర్తిదాయకమైన స్టోరీ, ఎదురుదెబ్బలను ఎలా ఇంధనంగా మార్చుకోవాలనేది చాలా చక్కగా వివరించారు. దృఢ సంకల్పంతో ఉండేవాడికి అదృష్టమే ఒళ్లోకొచ్చి వాలుతుంది అనేందుకు ఉదాహరణగా నిలిచారు అంటూ హర్షిల్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: డ్రీమ్లాంచ్ సీఈవో హర్షిల్ తోమర్) -
సరిపోయారు ఇద్దరూనూ!
అనగనగా ఒక అడవిలో ఒక మర్రిచెట్టు ఉండేది. మర్రిచెట్టు తొర్రలో ఉడత, కొమ్మ మీది గూటిలో కాకి నివసించేవి.ఉడుత, కాకి రెండూ స్నేహంగా ఉండేవి.ఒకరోజు ఉదయం ఆహారం కోసం చెట్టు దిగింది ఉడుత.ఒక కుందేలు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి చెట్టు నీడలో కాసేపు ఆయాసం తీర్చుకుంది. ఉడుతతో ‘మిత్రమా! నాకు చాలా దాహంగా ఉంది. చెరువుకు దారి చెప్తావా!’ మర్యాదగా అడిగింది కుందేలు.‘చెరువుకు దారి ఎటంటే, అయ్యో... మర్చిపోయానే! అయ్యో ... మర్చిపోయానే!’ అంటూ తల గోక్కుంది.చెట్టు మీదనే ఉన్న కాకి విషయం తెలుసుకొని, ‘నేరుగా వెళ్లి కుడి చేతి వైపు తిరిగితే చెరువు వస్తుంది!’ అంది.‘అవునవును.. గుర్తుకొచ్చింది!’ అంది ఉడుత.అప్పుడు ఉడుత వైపు వింతగా చూసింది కుందేలు.‘నువ్వేమీ కంగారు పడకు! ఉడుతకు మతిమరుపు. అది కొద్దిసేపైతే నువ్వు అడిగింది కూడా మర్చిపోతుంది. అందుకే నేను ఉడుతకు తోడుగా ఉంటాను!’ అంది కాకి.‘సరిపోయారు... ఇద్దరూనూ!’ అనుకుంటూ చెరువు వైపు పరిగెత్తింది కుందేలు.కాకి ఆహారం కోసం ఎగిరి బయటకి వెళ్లింది. ఉడుత దాచుకున్న గింజల కోసం చెట్టు తొర్రంతా వెతికింది గాని, కనపడలేదు. ఏదో గుర్తొచ్చి చెట్టుకిందకు దూకింది.నేల తవ్వి అక్కడ దాచుకున్న గింజలు తింటుండగా నక్క అక్కడికి వచ్చింది.‘మిత్రమా! నేను పక్క అడవి నుంచి వస్తున్నాను. పులిరాజు గుహకు దారి చెపుతావా!’ అని అడిగింది.‘పులిరాజు గుహకు దారి ఎటంటే, అయ్యో... మర్చిపోయానే! అయ్యో ... మర్చిపోయానే!’ అంటూ నెత్తి గోక్కుంది. అప్పుడే ఆహారంతో తిరిగి వచ్చిన కాకి విషయం తెలుసుకుని, ‘నేరుగా వెళ్లి ఎడమ చేతి వైపు తిరిగితే పులిరాజు గుహ వస్తుంది!’ అంది కాకి‘అవునవును.. గుర్తుకొచ్చింది!’ అంది ఉడుత.అప్పుడు ఉడుత వైపు విచిత్రంగా చూసింది నక్క.‘నువ్వేమీ అనుకోకు! ఉడుతకు మతిమరుపు. అది కొద్దిసేపైతే నువ్వు వచ్చిన సంగతి కూడా మర్చిపోతుంది. అందుకే నేను ఉడుతకు సాయంగా ఉంటాను!’ అంది కాకి.‘సరిపోయారు... ఇద్దరూనూ!’ అనుకుంటూ గుహ వైపు నడిచింది నక్క.నక్క పులిరాజు గుహకు దారి అడగటంతో..ఉడుత చెట్టు పైకి చూసి, ‘మిత్రమా! నీకు చెప్పటం మరచా! నీకోసం మంత్రి ఎలుగుబంటి వచ్చింది. పులిరాజు చాటింపు వేయమన్నాడని చెప్పమంది’ అంది ఉడుత. ‘ఏమి చాటింపు?’ అడిగింది కాకి.‘చాటింపు ఏమిటంటే, అయ్యో... మర్చిపోయానే! అయ్యో ... మర్చిపోయానే!’ అంటూ బుర్ర గోక్కుంది.‘పులిరాజు ఏమి పురమాయించాడో గుర్తుకు తెచ్చుకుని చెప్పకపోయావో నా చేతిలో నీచావు తప్పదు!’ అంది కోపంగా కాకి.‘ఆ.. చావంటే గుర్తొచ్చింది. రేపు పులిరాజు తల్లి చనిపోయిన రోజట! అడవంతా విందుకు రమ్మని చాటింపు వేయమని మంత్రి ఎలుగుబంటి నీకు చెప్పమంది!’ అంది ఉడుత. కాకి వెంటనే అడవంతా చాటింపు వేసింది.మరునాడు అడవి జీవులన్నీ పులిరాజు గుహకు చేరాయి. అక్కడ పులిరాజు చిట్టి కూన పుట్టిన రోజు వేడుక జరుగుతోంది. కాకి తప్పు చాటింపు వేశాడని వేడుకకు వచ్చిన అడవి జీవులన్నీ గుసగుసలాడుకున్నాయి. ఆ విషయం ఎలుగుబంటికి, పులికి కూడా తెలిసింది. ఎలుగుబంటి ఉడుతను, కాకిని పిలిచింది. పులిరాజు చేతిలో చచ్చామనుకున్నాయి. కాకి, ఉడుత భయంతో వణుక్కుంటూ వెళ్లాయి. ఉడుత మతిమరపు విషయం చెప్పింది కాకి. పొరపాటుకు క్షమించమని పులి కాళ్లు పట్టుకున్నాయి కాకి, ఉడుత.‘భయపడకండి! మీరు మంచే చేశారు. ఈరోజు నా చిట్టికూన పుట్టినరోజే కాదు, మా అమ్మ చనిపోయిన రోజు కూడా! మా అమ్మే గత యేడు చనిపోయి, చిట్టి కూనగా పుట్టింది. మతిమరపు ఉడుతది కాదు, కూన పుట్టిన ఆనందంలో మరచిన నాదే!’ అంది పులిరాజు.కాకి, ఉడుతలకు విలువైన కానుకలిచ్చాడు పులిరాజు. అడవి జీవులన్నీ కమ్మటి విందు చేశాయి. చేతిలో విలువైన కానుకలతో తిరుగుతున్న కాకి, ఉడుతలను చూసి అడవి జీవులన్నీ ‘సరిపోయారు... ఇద్దరూనూ!’ అనుకున్నాయి. పులిరాజు రాజ వైద్యుడు కోతితో ఉడుతకు వైద్యం చేయించి, మతిమరపు పోగొట్టాడు. ∙ముద్దు హేమలత -
స్మార్ట్ఫోన్తో తగ్గుతున్న అటెన్షన్
ఒకప్పుడు పిల్లలు ఆటల్లో మునిగి తేలేవారు. ఇప్పుడు స్క్రీన్లో మునిగిపోతున్నారు. తల్లిదండ్రులు ప్రేమతో ఇచ్చే ఫోన్ ఇప్పుడు పిల్లల అటెన్షన్, క్రియేటివిటీ, ఎమోషనల్ గ్రోత్ను దోచుకుంటోంది. సైలెంట్ డిజిటల్ బేబీ సిట్టర్ పిల్లల మెదడు మొదటి ఐదేళ్లలో నిర్మాణం చెందుతుంది. ఈ వయసులో వచ్చే ప్రతి ఇంద్రియానుభవం వారి మెదడులోని న్యూరాన్ల మధ్య బంధాలను ఏర్పరుస్తుంది. కాని, బిజీగా ఉన్న తల్లిదండ్రులు తరచుగా అనే మాట– ‘నేను కాసేపు పనిచేసుకోవాలి, అప్పటివరకు ఫోన్లో కార్టూన్ చూసుకో!’అలా ‘డిజిటల్ బేబీ సిటింగ్’ మొదలవుతుంది. స్క్రీన్ ఆ బిడ్డ మొదటి స్నేహితుడిగా మారిపోతుంది. స్క్రీన్ అందించే అనుభవం వేగంగా, ప్రాసెసింగ్–లోడ్ ఎక్కువగా, సహజ ప్రపంచం కంటే అసంబద్ధంగా ఉత్తేజపరుస్తుంది. ఫలితంగా మెదడు నిజ జీవితంలోని అనుభవాలపట్ల ఆసక్తి కోల్పోతుంది. డోపమైన్ లూప్ స్క్రీన్ టచ్ చేసిన ప్రతిసారీ పిల్లల మెదడులో సంతోషాన్నిచ్చే రసాయనం ‘డోపమైన్’ విడుదలవుతుంది. కాని, అది వెంటనే తగ్గిపోతుంది. దానికోసం మరొక వీడియో కావాలి. ఇంకో కార్టూన్ కావాలి. ఇంకో గేమ్ కావాలి. అలా వలయంలో చిక్కుకుపోతారు. అంటే స్క్రీన్కు అలవాటైన పిల్లలు తక్షణ సంతృప్తికి అలవాటు పడతారు. అంటే, తక్షణ ఆనందం తప్ప మిగతా ఏదీ విలువైనదిగా కనిపించదు. దీనివల్ల పిల్లలు కేంద్రీకరించడం, శాంతంగా ఆలోచించడం, సహనంతో నేర్చుకోవడం వంటి నైపుణ్యాలను కోల్పోతున్నారు.తగ్గిన అటెన్షన్ స్పాన్ అటెన్షన్ స్పాన్ కేవలం చదువుకోడానికే కాదు, జీవితానికే ఆధారం. కాని, మానవుల సగటు అటెన్షన్ స్పాన్12 సెకన్ల నుండి 8 సెకన్లకు తగ్గిందని మైక్రోసాఫ్ట్ చేసిన అధ్యయనం చెబుతోంది. అది ఎంత తక్కువంటే ఒక గోల్డ్ ఫిష్ అటెన్షన్ స్పాన్ కంటే తక్కువ. పిల్లలు ఒక్క క్షణం కూడా ఫోన్ లేకుండా ఉండలేకపోవడం, బోర్ అనిపిస్తే వెంటనే యూట్యూబ్ తెరవడం– ఇది కేవలం అలవాటు కాదు, అటెన్షన్ డెఫిషిట్ కండిషన్ ప్రారంభమైందనడానికి సంకేతం. మాయమైన ఆటల ప్రపంచం...‘ఆటలే పిల్లల పని’ అన్నారు మరియా మాంటిస్సోరి. కాని, ఆ ఆటల స్థానంలో ఇప్పుడు డిజిటల్ ప్లే వచ్చింది.ఫోన్ గేమ్లో హీరో పరిగెడతాడు. కాని, పిల్లాడు కదలడు. వీడియోలో రంగులు మారతాయి, కాని, బిడ్డ బయట పూల రంగులు చూడడు. దీనివల్ల కేవలం శారీరక కదలిక తగ్గడమే కాదు, ఇమాజినేషన్, క్రియేటివిటీ, సోషల్ అవేర్నెస్ అన్నీ తగ్గిపోతున్నాయి.పిల్లలు ‘ఏం చేయాలి?’ అనే ప్రశ్నను అడగరు, ‘ఏం చూపిస్తావు?’ అనే అంచనాతో ఎదురు చూస్తారు.ఇది వారి సహజ కుతూహలాన్ని ముంచేస్తుంది.భావోద్వేగ శూన్యతస్క్రీన్ అనుభవాలను చూపిస్తుంది కాని, భావోద్వేగాలను కాదు. వాటిని చూసి పిల్లలు నవ్వుతారు, కాని, అర్థం లేకుండా విసిగిపోతారు. కాని, ఎందుకో తెలియదు. వాస్తవ ప్రపంచంలోని సంబంధాలు, మమత, శ్రద్ధ, సహానుభూతి– ఇలాంటి ఎమోషనల్ స్కిల్స్ ఇంటరాక్షన్ ద్వారా మాత్రమే అభివృద్ధి చెందుతాయి. కాని, ఫోన్పై మమకారం పెరిగితే, మనుషుల పట్ల మమకారం తగ్గిపోతుంది.పేరెంట్స్ మారాలిపిల్లల చేతిలో స్మార్ట్ఫోన్ ఉండవచ్చు కాని, నియంత్రణ తల్లిదండ్రుల చేతిలో ఉండాలి. పేరెంట్స్ ఫోన్ చూస్తూ పిల్లలతో మాట్లాడుతుంటే, ‘మా పేరెంట్స్కు ఫోనే ముఖ్యం, నేను కాదు’ అని అర్థం చేసుకుంటారు. పిల్లలు మనం చెప్పేది వినరు, మనమేం చేస్తున్నామో చూస్తారు. తల్లిదండ్రులే స్క్రీన్కు బానిసలైతే, పిల్లలకు డిజిటల్ డిసిప్లిన్ గురించి చెప్పడం వృథా. కాబట్టి మొదటి మార్పు పెద్దల్లోనే ప్రారంభం కావాలి.అటెన్షన్ లోపం చిహ్నాలుచదువుతుంటే తక్షణం బోర్ అనిపించడం · గేమ్ ఆడకపోతే చిరాకు, ఆగ్రహం · ఒకే పని పైన దృష్టి నిలపలేకపోవడం · ఆటలలో క్రియేటివిటీ లేకపోవడం · మాట్లాడేటప్పుడు అర్థం లేని సారాంశం ఇవి కేవలం ప్రవర్తనా సమస్యలు కాదు, న్యూరో–డెవలప్మెంటల్ వార్నింగ్స్.అటెన్షన్ పెంచే మార్గాలుఅటెన్షన్ పెంచడానికి పరిష్కారం టెక్నాలజీని ద్వేషించడం కాదు, దానిని సమయ పరిమితితో, మనో పరిమితితో ఉపయోగించడం.1. రోజుకు ఒక గంట మాత్రమే స్క్రీన్ టైమ్. 2. రోజూ బయట ఆటలు, చేతులతో చేసే క్రియేటివిటీ3. భోజన సమయంలో ఫోన్ లేకుండా మాట్లాడుకోవడం4. కథలు, పుస్తకాలు, సంగీతం ద్వారా మెదడుని మెల్లగా ఉత్తేజపరచడం.5. ఫోన్ వినియోగంలో తల్లిదండ్రులు ఆదర్శంగా నిలవడం. సైకాలజిస్ట్ విశేష్, ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్ (చదవండి: వజ్రనేత్రుడు..! ఏకంగా రెండు కేరట్ల వజ్రంతో..) -
కంటి ఆరోగ్యం కోసం..!
ఈ డిజిటల్ ప్రపంచంలో చాలామందికి కళ్ల అలసట, కళ్లు పొడిబారడంతో పాటు నిద్రలేమి కూడా ఎక్కువ అవుతుంది. కంప్యూటర్ స్క్రీన్లు, మొబైల్ ఫోన్లో ఎక్కువగా చూడటంతో కళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. చిత్రంలోని ఈ హీటెడ్ ఐ మాస్క్–పై సమస్యలన్నింటికీ అద్భుతమైన, సౌకర్యవంతమైన పరిష్కారాన్ని అందిస్తుంది. ఇది కేవలం నిద్ర మాస్క్ మాత్రమే కాదు, కంటి ఆరోగ్యం కోసం రూపొందిన చికిత్సా సాధనం. ఈ మాస్క్ ఉపయోగిస్తే దీనిలోని ‘ఫార్ ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ’ చాలా ఉపశమనం కలిగిస్తుంది. ఇది కళ్ళకు వేడిని సమర్థంగా అందిస్తుంది. కళ్లు పొడిబారడాన్ని తగ్గిస్తుంది. ఎక్కువ స్క్రీన్ చూడటంతో ఏర్పడే ఒత్తిడిని ఇట్టే తగ్గిస్తుంది. సైనస్, తలనొప్పి వంటి సమస్యలకు కూడా ఈ ఐ మాస్క్ బెస్ట్ ఆఫ్షన్ అని చెప్పుకోవచ్చు. అంతే కాదు ఈ మాస్క్ ధరిస్తే కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గుతాయి. ఈ డివైస్ కంటి వాపును తగ్గించి, గ్రంథుల పనితీరును మెరుగుపరుస్తుంది. సాధారణ మైక్రోవేవ్ లేదా స్టీమ్ మాస్క్ల మాదిరిగా కాకుండా, నిరంతరం వేడిని అందిస్తుంది.ఇందులో 95 డిగ్రీల ఫారెన్ హీట్ నుంచి 3–స్థాయిల హీట్ సెట్టింగ్లు ఉన్నందున మన సౌలభ్యం మేరకు ఉష్ణోగ్రతను ఎంచుకోవచ్చు, మార్చుకోవచ్చు. అలాగే దీనిలో 15 నిమిషాలు, 30 నిమిషాలు, 45 నిమిషాలు, 60 నిమిషాలతో టైమర్ కూడా ఉంది. ఇది సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ మాస్క్ యుఎస్బీ–పవర్డ్ కావడంతో దీనిని ఎక్కడైనా సులభంగా ఉపయోగించుకోవచ్చు. వాల్ చార్జర్లు, ల్యాప్టాప్లు, పోర్టబుల్ పవర్ బ్యాంక్లు, కార్ చార్జర్లు ఇలాంటి వాటికి కనెక్ట్ చేసి ఆఫీసులో, ఇంట్లో లేదా ప్రయాణంలో కూడా ఈ మాస్క్ను వినియోగించుకోవచ్చు.కళ్లకింద నల్లటి వలయాలను పోగొట్టే స్క్రబ్మృతకణాలను పోగొట్టి, చర్మాన్ని మృదువుగా మార్చే స్క్రబ్ను ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. అందుకోసం ముందుగా నిమ్మకాయ తొక్క పైపొరను ఒలిచి ఎండపెట్టుకోవాలి. బాగా ఎండిన తర్వాత మిక్సీ పట్టి పౌడర్లా చేసి దాచుకోవాలి. అలా తయారు చేసుకున్న నిమ్మతొక్క పొడిని టేబుల్ స్పూన్ తీసుకుని దానిలో టేబుల్ స్పూన్ పంచదార, టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా కలుపుకుని, ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. అనంతరం బాగా స్క్రబ్ చేసుకుని ఓ ఐదు నిమిషాలు వదిలెయ్యాలి. ఆపై చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా క్రమం తప్పకుండా చేయడంతో మృతకణాలు తొలగిపోతాయి. కంటి కింద నల్లటి వలయాలు తగ్గుతాయి. చర్మం మృదువుగా మారుతుంది.(చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం..! హైలెట్గా వెనక్కి ప్రవహించే నది..) -
దేశానికో చంద్రుడు!
ఇప్పటికీ ఎవరైనా కొత్తగా అమెరికా వెళ్లొస్తే అక్కడి నుండి చాక్లెట్స్ తెస్తారు. ఇక్కడ నలుగురికీ పంచుతారు. అమెరికా వెళ్లొచ్చిన వారికి, అమెరికా చాక్లెట్లు కానుకగా అందుకున్న వారికి.. ఇద్దరికీ అదొక ‘తీపి’ జ్ఞాపకం. అదే విధంగా యాభై ఐదేళ్ల క్రితం ‘నాసా’ తొలిసారి ‘చంద్ర శిలల్ని’ భూమి మీదకు తెచ్చినప్పుడు ఆనాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ప్రపంచ దేశాలకు తలా ఒక శిలా ఖండాన్ని ‘దేశానికో చంద్రుడి’లా గుడ్విల్ గిఫ్టు పంపారు. మనకూ ఒక చాక్లెట్... అదే, మనకూ ఒక రాయి (ఆ తర్వాత ఇంకో రాయి కూడా) బహుమతిగా లభించింది. రాయితో పాటుగా నిక్సన్.. ‘మానవ ప్రయత్నాలలోని ఐక్యతకు చిహ్నం’ అని ఒక సందేశాన్ని కూడా జత చేశారు. నాడు ఆ ఘనత సాధించిన ‘నాసా’.. ఇప్పుడు మరో ప్రయత్నానికి సమాయత్తం అవుతోంది. చంద్రుడి పైన చంద్ర శిలల్ని తవ్వేందుకు ఒక జేసీబీని తయారు చేస్తోంది. ఈ సందర్భంగా ‘చంద్ర శిల’ల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. చంద్ర శిలలపై శాస్త్ర పరిశోధనలు‘నాసా’కు చెందిన అపోలో మిషన్ వ్యోమగాములు చంద్రుని పైకి వెళ్లినప్పుడు అక్కడి నుండి భూమి మీదకు అద్భుతమైన ‘జ్ఞాపకాలను’ మోసుకొచ్చారు. అవే.. చంద్ర శిలలు!విజయవంతం అయిన 6 అపోలో యాత్రల నుంచి 12 మంది వ్యోమగాములు దాదాపు 382 కిలోల బరువున్న 2,196 శిలా శకలాలను సేకరించారు.చంద్ర శిలలు కేవలం విజయ చిహ్నాలు మాత్రమే కాదు. వీటిపై భూమి మీద శాస్త్ర పరిశోధనలు జరుగుతున్నాయి. వీటిల్లో కొన్నింటిని సందర్శకుల కోసం మ్యూజియంలలో ప్రదర్శనకు ఉంచారు. మరికొన్ని ప్రపంచ దేశాలకు బహుమతులుగా వెళ్లాయి. నాసా చేపట్టిన మొత్తం అపోలో యాత్రల సంఖ్య 17. ఈ యాత్రలను నాసా 1969–1972 మధ్యకాలంలో నిర్వహించింది. వీటిల్లో మొత్తం 11 మానవ సహిత యాత్రలు కాగా, వాటిలో ఆరు యాత్రలు చంద్రుని పైకి వ్యోమగాములను విజయవంతంగా దింపాయి. అవి అపోలో 11, 12, 14, 15, 16, 17. ఈ ఈరు యాత్రల వ్యోమగాములు తెచ్చినవే ఈ చంద్రశిలలు. ఏయే దేశాలలో ఉన్నాయి?చంద్రుడి పైకి వ్యోమగాముల మొదటి ల్యాండింగ్ 1969 జూలైలో ‘అపోలో 11’ ద్వారా విజయవంతమైంది. అందులోనే నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ ఉన్నారు. ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ భూమిపైకి తెచ్చిన చంద్ర శిలలతో పాటు చంద్రుడి పైకి 1972లో ‘అపోలో 17’ ద్వారా జరిగిన వ్యోమగాముల చివరి ల్యాండింగ్ వరకు అసంఖ్యాకంగా శిలలు భూమికి చేరాయి. ఆ శిలల్లోని 50,000 శిలా శకలాలను ప్రపంచంలోని 15 దేశాలలోని 500 ప్రయోగశాలలకు నాసా పంపించింది. నిజానికి, వ్యోమగామలు తెచ్చిన చంద్రశిలల్లో ఇంకా 80 శాతం అలాగే, ఎవరూ కదలించకుండా ఉన్నాయి. ఈ 80 శాతంలో 15 శాతం చంద్రశిలల్ని ‘నాసా’, హ్యూస్టన్లోని తన ప్రధాన స్థావరానికి దూరంగా, న్యూ మెక్సికోలో ఒక దుర్భేద్యమైన భాండాగారంలో భద్రపరచింది. మానవులే స్వయంగా తెచ్చినవి·చంద్రుడి నుండి భూమి మీదకు కేవలం రాళ్లు మాత్రమే రాలేదు. మట్టి, ధూళిని కూడా వ్యోమగాములు తీసుకొచ్చారు. వీటిల్లో అపోలో చంద్ర శిలలు ఎందుకు ఇంత ప్రత్యేకమైనవి అంటే, మానవులు వాటిని తమ స్వహస్తాలతో చంద్రుడి పైనుంచి సేకరించుకుని వచ్చినవి కావటం. సోవియట్ యూనియన్ కూడా కొన్ని రాళ్ల నమూనాలను సేకరించింది. కానీ, అవి.. చంద్రుడి పైకి సోవియట్ యూనియన్ పంపిన మానవ రహిత అంతరిక్ష నౌకలోని రోబో మిషన్లు కిందికి తీసుకు వచ్చినవి. అలాగే, కొన్ని చంద్రశిలలు వాటంతటవే ఉల్కపాతంలా భూమిపై పడినవి. అయితే అవి చంద్రుడి లోని ఏ నిర్దిష్ట ప్రదేశం నుండి పడ్డాయో గుర్తించటం కష్టం. ఆ కారణంగా కొన్ని రకాల పరిశోధనలకు ఆ రాళ్లు తక్కువ ఉపయోగకరంగా ఉంటాయి. ప్రపంచదేశాలకు నిక్సన్ గిఫ్ట్1969లో అపోలో 11 చంద్రయానం ద్వారా తొలిసారి వ్యోమగాములు భూమి పైకి తెచ్చిన చంద్రశిలల నమూనాలను అప్పటి అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్... అమెరికా సంయుక్త రాష్ట్రాలకు, 135 దేశాలకు బహుమతిగా పంపించారు. అయితే ఆ దేశాలలో సోవియట్ యూనియన్ లేదు!తిరిగి 1972లో, అపోలో 17 ద్వారా వచ్చిన చంద్ర శిలల్ని నిక్సన్ మళ్లీ అన్ని దేశాలకూ కానుకగా పంపించారు. ఈసారి సోవియట్కు ఆ అపురూపమైన బహుమతి పంపించారు. కాగా, ఇలా రెండుసార్లు నిక్సన్ పంపిన శిలా బహుమతులను ఆయా దేశాలు ఏం చేశాయో తెలీదు! కొన్ని దేశాలు ప్రదర్శనకు ఉంచాయి. కొన్ని దేశాలు పోగొట్టుకున్నాయి. కొన్ని చోరీ అవగా, మరికొన్ని దేశాలు స్టోర్ రూమ్లో పడేసినట్లు తెలుస్తోంది. భారతదేశానికి కూడా నిక్సన్ ఒక చంద్రశిలను కానుకగా పంపారు. 1973లో ఆ కానుక ఇండియా చేరింది. నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ఆ చంద్రశిలను న్యూఢిల్లీలోని పార్లమెంటు మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం ఏర్పాటు చేయించారు. అంతకు ముందరి అపోలో 11 గుడ్ విల్ ‘రాక్’ను కూడా అమెరికా ఇండియాకు బహుకరించింది. అదిప్పుడు రాష్ట్రపతి భవన్ మ్యూజియంలో ఉంది. వివిధ దేశాలకు నిక్సన్ పంపిన ఈ చంద్రశిలా కానుకలతో పాటు, ‘మానవ ప్రయత్నాలలో ఐక్యతకు చిహ్నం’ అనే సందేశం కూడా జతపరిచి ఉంది.కొన్ని శిలలైతే ఎక్కడివక్కడే!అపోలో వ్యోమగాములు భూమి పైకి తెచ్చిన చంద్రశిలల్లో కొన్నింటిని నేటికీ కదల్చనేలేదు. అవి ఇప్పటికీ చంద్రునిపై ఉన్నట్లుగానే ఉండిపోయాయి!ర్యాన్ జీగ్లర్ వంటి శాస్త్రవేత్తలు ఈ విలువైన చంద్రశిలల్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. వాటిపై సరైన విధంగా పరిశోధనలు జరుగుతున్నాయా లేదా అని తరచు నిర్ధారించుకుంటూ ఉంటారు. అపోలో వ్యోమగాముల తీసుకొచ్చిన రాళ్లలో కొన్ని 400 కోట్ల సంవత్సరాల క్రితం నాటివని శాస్త్రవేత్తలు గుర్తించారు. కొన్ని 200 కోట్ల సంవత్సరాల నాటివి. ఈ రాళ్లను భూవాతావరణం, సూక్ష్మక్రిములు, కాలుష్యం నుండి సంరక్షించటానికి నత్రజని నింపిన గదులలో భద్రపరచారు. (చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం..! హైలెట్గా వెనక్కి ప్రవహించే నది..) -
స్కూల్ ప్రాజెక్ట్లో క్యూట్ సైంటిస్ట్!
ఐదో తరగతి విద్యార్థుల సైన్స్ ప్రాజెక్ట్లలో ఎక్కువగా రంగురంగుల పేపర్లు, కార్డ్బోర్డ్, గ్లూ, పెద్దగా రాసిన టైటిల్ కార్డ్స్తో వోల్కేనో మోడల్ లేదా సోలోర్ సిస్టమ్ మోడల్ చేస్తారు. కాని, అమెరికాలోని మిడ్టౌన్ పట్టణంలో చదువుతున్న 12 ఏళ్ల ఎనియోలా షోకుబ్ని చేసిన సైన్స్ ప్రాజెక్ట్ అందరినీ ఆశ్చర్యపరచింది. తన ప్రాజెక్ట్ కోసం ఆమె ఎంచుకున్నది జీవితానికి ఉపయోగపడే, సూపర్ ఇన్నోవేటివ్ ఐడియా. లాక్డౌన్ సమయంలో పాఠశాలల వాయు భద్రతను మెరుగుపరచడం కోసం, టీచర్ ఇచ్చిన సూచనలతో అందరికీ స్వచ్ఛమైన గాలి అందేలా చేయాలనుకుంది. అందుకోసం, ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ రూపొందించింది. కేవలం అరవై డాలర్ల ఖర్చుతో, ఒక చిన్న బాక్స్, ఫ్యాన్, ఫిల్టర్లు, డక్ట్ టేప్, కార్ట్బోర్డ్లతో ఎయిర్ ప్యూరిఫైర్ నమూనా తయారుచేసి, కమర్షియల్ ప్యూరిఫైర్స్కు అత్యంత చౌకైన ప్రత్యామ్నాయం చూపింది. ఈ ఎయిర్ ఫిల్టర్ను యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్ సైంటిస్టులు పరీక్షించారు. ఫలితాలు అద్భుతంగా వచ్చాయి. గాలిలో ఉన్న వైరస్లను తొంభై తొమ్మిది శాతం కంటే ఎక్కువ తొలగించే సామర్థ్యం దీనికి ఉందని తేల్చి, డిజైన్ను సర్టిఫై చేశారు. అందుకే, ఈ చిన్నారి ఐడియా, ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్గా మారింది. కనెక్టికట్ ప్రభుత్వం 11.5 మిలియన్ డాలర్ల (సుమారు రూ.101 కోట్లు) నిధిని మంజూరు చేసి, ఈ ఫిల్టర్లను అన్ని పబ్లిక్ స్కూళ్లలోనూ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా, త్వరలోనే ప్రతి తరగతి గది పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన గాలి పొందనుంది. (చదవండి: వాసా ప్రీవియా ఉంటే సాధారణ ప్రసవం అవ్వడం కష్టమా..?) -
ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం..! హైలెట్గా వెనక్కి ప్రవహించే నది..
కంబోడియాలోని సీమ్ రీప్ నగరంలో ఉన్న ‘ఆంగ్కోర్ వాట్’ ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం. అలాగే ఇది ఆగ్నేయాసియా చరిత్రలో సుదీర్ఘకాలం పాటు ఉనికిలో ఉన్న ఖ్మేర్ సామ్రాజ్యపు అద్భుత సృష్టి. ఇది క్రీ.శ. పన్నెండో శతాబ్దంలో రెండవ సూర్యవర్మ ఆధ్వర్యంలో నిర్మించిన వైష్ణవాలయం. విష్ణువు వెలసిన ఈ ఆలయం తర్వాత బౌద్ధ ఆరామంగా మారింది. దీని నిర్మాణ శైలి హిందూ పురాణాలలోని దేవతల నివాసమైన మేరు పర్వతాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయం గోడలపై చెక్కిన శిల్పాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. రామాయణం, మహాభారతం, క్షీరసాగర మథనం తదితర పురాణ గాథల దృశ్యాలను అత్యంత నైపుణ్యంతో చెక్కారు. వందలాది మంది అప్సరసల నృత్య భంగిమలు, నాటి కళాకారుల ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. ఈ ఆలయానికి గల చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత కారణంగా, దీన్ని 1992లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇక్కడ సూర్యోదయాన్ని వీక్షించడం అద్భుతమైన అనుభూతినిస్తుంది. నదికి నీరాజనం‘బోన్ ఓమ్ టౌక్’ అనే వేడుక– కంబోడియాలో అత్యంత ఆకర్షణీయమైన ఉత్సవం. ఇది వర్షాకాలం ముగింపును, టోన్లే సాప్ నది ప్రత్యేకతను సూచిస్తుంది. ఈ సంబరాలు మూడురోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఈ ఏడాదిలో నవంబర్ 4 నుంచి మొదలై నవంబర్ 6 వరకు కొనసాగుతాయి.‘వర్షాకాలంలో మీకాంగ్ నది ఉప్పొంగడంతో– టోన్లే సాప్ నది దాని సహజ దిశలో ప్రవహించకుండా, వెనక్కి ప్రవహిస్తుంది. ఈ పండుగ సమయంలో, వర్షాకాలం ముగిసిపోవడంతో, ఆ వెనక్కి ప్రవహించే ప్రవాహం ఆగిపోయి, టోన్లే సాప్ నది తిరిగి తన సహజ దిశలో మీకాంగ్ వైపు ప్రవహించడం మొదలవుతుంది. టోన్లే సాప్ నది తిరిగి సహజదిశలో ప్రవహించడాన్ని స్థానికులు ఈ వేడుకతో పండుగ చేసుకుంటారు.ఈ పండుగలో ప్రధాన ఆకర్షణగా రాజభవనం ముందు టోన్లే సాప్ నదిపై సంప్రదాయబద్ధంగా పొడవైన పడవల రేసులు (డ్రాగన్ బోట్ రేసులు) నిలుస్తాయి. ఆ దేశ నలుమూలల నుంచి వందలాది పడవలు పోటీపడతాయి. మూడు రోజులు అందంగా అలంకరించిన, దీపాలతో వెలిగించిన పడవల ఊరేగింపు జరుగుతుంది. ఈ పోటీలే కాకుండా పలు క్రీడా పోటీలు జరుగుతాయి. ఈ సంబరాలు చూడటానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు తరలివస్తారు. చివరగా పౌర్ణమి రాత్రి చంద్రుడికి ప్రత్యేక వందనాలు తెలుపుతారు. అలాగే అక్ అంబోక్ అనే బియ్యం లేదా అటుకులతో చేసే తీపి వంటకాన్ని ప్రసాదంగా తీసుకుంటారు. ఈ ఉత్సవం కంబోడియన్ల ఐక్యతకు నిదర్శనం. హిందూ, బౌద్ధ విశ్వాసాలతో ముడిపడి ఉన్న ఈ సంప్రదాయంలో, చంద్రుడిని గౌరవించడం ఒక ఆచారం. (చదవండి: వజ్రనేత్రుడు..! ఏకంగా రెండు కేరట్ల వజ్రంతో..) -
వజ్రనేత్రుడు..! ఏకంగా రెండు క్యారెట్ల వజ్రంతో..
సంతోషంతో కళ్లు మెరిసేటప్పుడు కళ్లల్లో నక్షత్రాలు మెరిశాయనడం ఒక వాడుక. కళ్లల్లో నక్షత్రాల సంగతి సరే, అతడి కంటిలో మాత్రం ఏకంగా వజ్రమే మిలమిల మెరుస్తుండటం విశేషం. ఇతగాడి పేరు స్లేటర్ జోన్స్. అలబామా దేశస్థుడు. కొంతకాలం కిందట ప్రమాదవశాత్తు ఒక కన్ను పోగొట్టుకున్నాడు. ప్రమాదాల్లో కన్ను కోల్పోతే, సాధారణంగా కృత్రిమంగా గాజు కనుగుడ్డును అమర్చుకుంటారు. స్లేటర్ దొరగారు బాగా డబ్బున్న మారాజు, పైగా వజ్ర వైడూర్యాది ఆభరణాలతో వ్యాపారం చేసే నగల వర్తకుడు కావడంతో అందరిలాగా గాజు కనుగుడ్డును అమర్చుకుంటే తన ప్రత్యేకత ఏముంటుందని అనుకున్నాడో ఏమో! ఏకంగా రెండు క్యారెట్ల వజ్రంతో కృత్రిమ కనుగుడ్డును ప్రత్యేకంగా తయారు చేయించుకుని, పోయిన కనుగుడ్డు స్థానంలో అమర్చుకున్నాడు. ప్రపంచంలో బహుశా ఇదే అత్యంత ఖరీదైన కృత్రిమ కనుగుడ్డు కావచ్చని అంతర్జాతీయ వార్తాసంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఈ వజ్రనేత్రుడి వ్యవహారం ఇటీవల ఇంటర్నెట్లో వైరల్గా మారింది.(చదవండి: సేఫ్టి షర్ట్..!) -
టీచర్ కాబోయి యాంకర్.. ఈమె ఎవరో తెలుసా?
ఎమ్మెస్సీ బీఈడీ చదివిన ఆమె.. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఉద్యోగం రాలేదని బాధపడుతూ ఇంట్లో కూర్చోలేదు. తన మధుర స్వరం, సంభాషణ చాతుర్యం ఆమెను ముందుకు నడిపించాయి. వ్యాఖ్యాతగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. యాంకరింగ్ చేస్తూనే ఈవెంట్స్ నిర్వహణతో మరో యాభై మందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కామారెడ్డికి చెందిన ప్రసన్నలక్ష్మి.సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని మారుమూల ప్రాంతమైన నారాయణఖేడ్లో జన్మనిచ్చిన ప్రసన్నలక్ష్మి కులకర్ణి.. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. కామారెడ్డికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మధు విజయవర్ధన్తో ఆమెకు వివాహమైంది. ప్రస్తుతం ఆమె భర్త, కుమారుడితో కలిసి పట్టణంలోని దేవి విహార్లో నివసిస్తున్నారు. ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేసిన ఆమె ఉపాధ్యాయ ఉద్యోగం కోసం రెండుసార్లు డీఎస్సీ రాసినా ఎంపిక కాలేదు. అయినా నిరుత్సాహ పడలేదు. తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లి ష్, మరాఠీ, కన్నడ భాషల్లో ప్రావీణం ఉన్న ప్రసన్నలక్ష్మికి చదువుకునే సమయంనుంచి ప్రసంగాలు చేయడం, పాటలు పాడడం, రాయడం అలవాట్లున్నాయి. అదే ఆమెకు బతుకుబాట చూపింది. భర్తతో పాటు కుటుంబ సభ్యులు అందించిన ప్రోత్సాహంతో ఏడేళ్ల క్రితం వ్యాఖ్యాతగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. మంచి గాత్రంతోపాటు సంభాషణ చాతుర్యం ఉన్న ఆమె ఈ రంగంలో సక్సెస్ అయ్యారు. వందలాది కార్యక్రమాల్లో ఆమె తన మాట, పాటలతో వేలాది మందిని ఆకట్టుకున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో అధికారిక కార్యక్రమాల్లోనూ తనదైన యాంకరింగ్తో మెప్పిస్తున్నారు.పెళ్లిళ్లు, ఫంక్షన్లలో...ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లను అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. ఆట, పాటలతో అలరింపజేసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయా కార్యక్రమాలకు అవసరమైనవన్నీ ఈవెంట్ ఆర్గనైజర్లే చూసుకుంటున్నారు. ప్రసన్నలక్ష్మి అన్నపూర్ణ ఈవెంట్స్ కూడా నిర్వహిస్తున్నారు. కామారెడ్డి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో జరిగే ఫంక్షన్లు, పెళ్లిళ్లకు ఈ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, హైదరాబాద్... ఇలా వివిధ ప్రాంతాల నుంచి కూడా బుకింగ్స్ ఉంటున్నాయి. తమ సంస్థలో యాభై నుంచి అరవై మందికి ఉపాధి కలి్పస్తున్నామని ప్రసన్నలక్ష్మి తెలిపారు.మాట, పాటలతో...ప్రసన్నలక్ష్మి ఐదు భాషలలో మాట్లాడడంతో పాటు శ్రావ్యంగా పాటలూ పాడతారు. వీడియోలకు అవసరమైన వాయిస్ ఓవర్ కూడా ఇస్తారు. ఉద్యోగుల సన్మాన కార్యక్రమాలు, ఉద్యోగ విరమణ కార్యక్రమాలు, బదిలీ కార్యక్రమాలలో వారికి సంబంధించిన సక్సెస్ స్టోరీలను ప్రిపేర్ చేసి తన మాట, పాటలతో ఆహూతులను ఆకట్టుకుంటారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లలో దాండియా, కోలాటం, బతుకమ్మ ఆటలు కూడా ఆడించడం ద్వారా అందరినీ ఉత్తేజపరుస్తుంటారు. తన వెంట ఉండే బృందంతో నృత్యాలు చేయిస్తూ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు. -
దండుడి వృత్తాంతం
ఇక్ష్వాకుడికి వందమంది కొడుకులు. వారిలో అందరికంటే చిన్నవాడు చదువు సంధ్యలు లేక మూఢుడిగా మారాడు. పెద్దలను ఏమాత్రం లెక్కచేసేవాడు కాదు. అన్నలను ధిక్కరించేవాడు. ‘వీడి శరీరంపై దండం పడక తప్పదు’ అనుకునేవాడు ఇక్ష్వాకుడు. అల్పతేజస్కుడైన చిన్న కొడుకుకు దండుడు అని పేరుపెట్టాడు. సమస్త భూమండలాన్నీ పాలించిన ఇక్ష్వాకుడు తన కొడుకులందరికీ రాజ్యాలు ఇచ్చాడు. చిన్నకొడుకైన దండుడికి తగిన రాజ్యం కోసం అన్వేషించి, చివరకు వింధ్య, శైవల పర్వతాల మధ్యగల ప్రదేశాన్ని దండుడికి రాజ్యంగా ఇచ్చాడు.దండుడు ఆ పర్వత మధ్య ప్రాంతానికి వెళ్లి, అక్కడ నివాసయోగ్యమైన గొప్ప పట్టణాన్ని నిర్మించుకుని, దానికి మధుమంతమని పేరుపెట్టాడు. మధుమంతపురాన్ని రాజధానిగా చేసుకుని, దండుడు పరిపాలన సాగించేవాడు. దానవ గురువైన శుక్రాచార్యుడిని తన పురోహితుడిగా నియమించుకున్నాడు. దండుడు తన రాజ్యాన్ని వైభవోపేతంగా పాలించసాగాడు. బృహస్పతిని పురోహితుడిగా చేసుకున్న దేవేంద్రుడిలా; శుక్రాచార్యుడిని పురోహితుడిగా చేసుకున్న దండుడు తన రాజ్యాన్ని స్వర్గతుల్యంగా తీర్చిదిద్దాడు. తన శౌర్య పరాక్రమాలతో రాజ్యానికి శత్రుబాధ లేకుండా చేశాడు. దండుడి పరిపాలనలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండేవారు.ఇలా సాగుతుండగా దండుడు చైత్రమాసంలో ఒక రోజున వనవిహారానికి వెళ్లాడు. వసంత శోభతో వనమంతా కళకళలాడుతూ ఉల్లాసభరితంగా ఉంది. పక్షుల కిలకిలరావాలు తప్ప అక్కడ మరెలాంటి రణగొణలు లేకపోవడంతో వాతావరణం ప్రశాంతంగా ఉంది. అదే వనంలో శుక్రాచార్యుడి ఆశ్రమం ఉంది. శుక్రాచార్యులను దర్శించుకుందామని దండుడు ఆయన ఆశ్రమం వైపు బయలుదేరాడు. శుక్రాచార్యుడి ఆశ్రమ వాటికలో ఒక ముగ్ధమనోహరి పూలు కోసుకుంటూ కనిపించింది. ఆమె శుక్రాచార్యుడి కుమార్తె. ఆ సమయంలో శుక్రాచార్యుడు ఆశ్రమంలో లేడు. సమిధల కోసం శిష్యులతో కలసి అడవిలోకి వెళ్లాడు.ఆశ్రమం ఆవరణలో ఒంటరిగా కనిపించిన శుక్రాచార్యుడి పుత్రికను చూసి, దండుడికి మతి చలించింది. ఆమెను చూసీ చూడటంతోనే మోహావేశం పొందాడు. వడివడిగా ఆమెను సమీపించాడు.‘సుందరీ! నువ్వెవరివి? నిన్ను చూసిన క్షణంలోనే నా మనసు వశం తప్పింది. నీ పొందుతోనే నాకు మోక్షం లభించగలదు. నన్ను కాదనకు’ అని పలికాడు.అతడి మాటలకు ఆమె విచలితురాలైంది.‘రాజా! నేను శుక్రాచార్యుల జ్యేష్ఠపుత్రికను. నా పేరు అరజ. నా తండ్రి నీ గురువు. నువ్వు ఆయన శిష్యుడివి. మహా తపశ్శాలి అయిన ఆయనకు ఆగ్రహం కలిగిస్తే, నీకు అనర్థం తప్పదు. నన్ను పరిణయం చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నట్లయితే, ధర్మసమ్మతమైన మార్గంలో నా తండ్రిని అర్థించు. అందుకు భిన్నంగా ప్రవర్తిస్తే, నీకు ముప్పు తప్పదు’ అని హెచ్చరించింది. మోహావేశంలో యుక్తాయుక్త విచక్షణ కోల్పోయిన దండుడు ఆమె మాటలను పట్టించుకోలేదు. ‘సుందరీ! అనవసరంగా కాలాన్ని వృథా చేయకు. నువ్వు కాదంటే, నా ప్రాణం పోయేలా ఉంది. నిన్ను పొందిన తర్వాత నాకు మరణమే వచ్చినా, పాపమే చుట్టుకున్నా, మరే ఆపద వచ్చినా నేను చింతించను. ఇక జాగు చేయకు’ అంటూ ఆమెను తన బాహువులతో బంధించాడు. ఆమె విలపిస్తూ, వారించినా వినిపించుకోకుండా ఆమెను బలాత్కరించి, అక్కడి నుంచి తన రాజధానికి వెళ్లిపోయాడు.కొద్దిసేపటికి శుక్రాచార్యుడు ఆశ్రమానికి వచ్చాడు. దీనురాలిలా విలపిస్తున్న అరజను చూశాడు. జరిగిన ఘోరాన్ని తెలుసుకుని ఆగ్రహోదగ్రుడయ్యాడు. పక్కనే ఉన్న శిష్యులతో, ‘దండుడికి ఎలాంటి ఘోరమైన ఆపద రాబోతోందో వినండి. అగ్నిజ్వాలలాంటి నా కుమార్తెను స్పృశించిన దురాత్ముడు దండుడి పరివారానికి వినాశనం సమీపించింది. ఈ దుర్మార్గుడు తన పాపకర్మకు తప్పక తగిన ఫలితాన్ని అనుభవించగలడు. ఇతడి దేశానికి నూరుయోజనాల పరిధిలో ఇంద్రుడు ధూళి వర్షాన్ని కురిపించి, నాశనం చేయగలడు. ఏడురోజులు అహోరాత్రులు కురిసిన ధూళివర్షంలో దండుడి రాజ్యం పూర్తిగా నశిస్తుంది. మీరందరూ రాజ్యానికి సరిహద్దులు దాటి వెళ్లండి’ అని చెప్పాడు.తర్వాత అరజతో ‘నువ్వు ఈ ఆశ్రమంలోనే యోగాభ్యాసం చేస్తూ కాలం గడుపు. ఈ ఆశ్రమం, దీని ఎదుట యోజనం విశాలమైన సరోవరం, ఈ ఆశ్రమ పరిధిలో నీ చెంత ఉండే ప్రాణులకు ధూళివర్షం వల్ల ఎలాంటి ఆపదా రాదు. నువ్వు కాలం కోసం నిరీక్షించు’ అని పలికి, దండుడి రాజ్యాన్ని విడిచి శిష్యసమేతంగా శుక్రాచార్యుడు వెళ్లిపోయాడు.శుక్రాచార్యుడు దండుడి రాజ్యాన్ని విడిచి వెళ్లగానే, ధూళి వర్షం కురిసింది. ఏడురోజులు తెరిపి లేకుండా కురిసిన ధూళి వర్షంలో దండుడి రాజ్యం నామరూపాలు లేకుండా సర్వనాశనమైంది. దండుడు, అతడి పరివారం, భృత్యులు ప్రాణాలు కోల్పోయారు. కొంతకాలం గడిచాక దండుడు రాజ్యం ఏలిన ప్రాంతంలో దట్టమైన కీకారణ్యం ఏర్పడింది. మునులు అక్కడకు చేరుకుని, ఏకాంత ప్రదేశంలో తపస్సు చేసుకునేవారు. దండుడి రాజ్యంలో ఏర్పడిన అరణ్యం కనుక దీనికి దండకారణ్యం అనే పేరు వచ్చింది. మునిజనులు నివాసం ఏర్పరచుకోవడం వల్ల జనస్థానమనే పేరు కూడా వచ్చింది. వనవాస సమయంలో రాముడు కొన్నాళ్లు దండకారణ్యంలో గడిపాడు. ఆ కాలంలోనే అగస్త్య మహర్షి రాముడికి దండకారణ్యానికి సంబంధించిన ఈ వృత్తాంతాన్ని చెప్పాడు.∙సాంఖ్యాయననిన్ను పొందిన తర్వాత నాకు మరణమే వచ్చినా, పాపమే చుట్టుకున్నా, మరే ఆపద వచ్చినా నేను చింతించను. -
బారిష్ బాబా!
2016 జూన్ 15– హైదరాబాద్లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇల్లు– కుటుంబ సభ్యులంతా ‘ప్రత్యేక’ పూజలో నిమగ్నమయ్యారు. పూజ పూర్తయితే ఇంట్లో కరెన్సీ వర్షం కురవాల్సి ఉంది. ఇంటి హాలులో వేసిన ముగ్గులో పెట్టిన రూ.1.33 కోట్లు ఏకంగా రూ.10 కోట్లుగా మారాల్సి ఉంది. పూజ చేయిస్తున్న బాబా కొద్దిసేపటికి ప్రసాదంగా పరమాన్నం పెట్టాడు. అది తిన్న కుటుంబ సభ్యులు స్పృహ కోల్పోయారు. కొన్ని గంటలకు లేచి చూసేసరికి, బాబాతో పాటు నగదు కూడా గల్లంతవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరవైనాలుగు గంటల్లోనే పోలీసులు బుడ్డప్పగారి శివ అనే బురిడీ బాబాను, అతడికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పం మండలం వెండుగంపల్లికి చెందిన శివ తండ్రి విద్యుత్ శాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఇంటర్ చదువును 1996లో మధ్యలోనే ఆపేసిన శివ తల్లిదండ్రులతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. బెంగళూరు వెళ్లిన ఇతగాడికి రవి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడి ద్వారా ఒక హోటల్లో ఉద్యోగంలో చేరాడు. తర్వాత అక్కడి తిప్పసముద్రంలో ఓ కన్సల్టెన్సీ ఏర్పాటు చేసి, విద్యుత్, పారిశుద్ధ్య కార్మికులను పనికి పంపిస్తూ కమీషన్ తీసుకునేవాడు. కొన్నాళ్లకు ఆ పనీ మానేసి, అక్కడి ఓ ఆశ్రమంలో విద్యుత్ పనులు చేసే ఉద్యోగిగా చేరాడు. కొన్నాళ్లకు తిరుపతి సమీపంలోని కరువాయల్ ఆయుర్వేద ఆశ్రమంలో చేరాడు. అక్కడ షణ్ముగం అనే వ్యక్తి నుంచి కొంత ఆయుర్వేదం నేర్చుకున్నాడు. అప్పుడే ఇతడికి ఉమ్మెత్త గింజల గుజ్జుతో ఎదుటి వారిని మత్తులో దించవచ్చని తెలిసింది. అక్కడ నుంచి తిరిగి మళ్లీ తిప్పసముద్రంలోని ఆశ్రమానికే చేరాడు. శివకు అక్కడ అనంతాచార్యులు అనే ‘స్వామి’తో పరిచయం ఏర్పడింది. ఆయన ద్వారానే పూజలతో నగదు రెట్టింపు మోసం నేర్చుకున్నాడు. ఈ గురువుతోనే కలిసి హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలో 2009లో తొలిసారిగా పంజా విసిరాడు. అక్కడ రూ.25 లక్షలు, బెంగళూరులోని కుమ్మలగూడలో రూ.40 లక్షలు స్వాహా చేశాడు. ఆపై శనేశ్వర్ బాబా అనే మరో దొంగ స్వామితో కలిసి కర్ణాటకలోని చామరాజనగర్లో రూ.10 లక్షలు దోచుకున్నాడు. ఈ మూడు ఉదంతాలతో అనుభవం పెంచుకున్న శివ తానే స్వయంగా ‘పూజలు’ చేయడం ప్రారంభించాడు. తాను ఎంచుకున్న ‘టార్గెట్’ దగ్గర పూజ చేయడానికి ముందే శివ నిర్ణీత మొత్తాన్ని తొడ భాగంలో కట్టుకుని, పంచె ధరించి కూర్చుంటాడు. లక్ష్మీ కటాక్షం కోసం కొంత మొత్తాన్ని పూజలో పెట్టాలని, పూజ పూర్తవగానే అది రెట్టింపు అవుతుందని చెప్తాడు. భక్తుల పెట్టిన మొత్తానికి తాను ‘తొడలో’ దాచిన నగదు చాకచక్యంగా కలిపేస్తాడు. రెట్టింపు మొత్తాన్ని పూజా ఫలితం అంటూ భక్తులకు ఇచ్చేస్తాడు. ఇది చూసిన వారికి బురిడీ బాబాపై పూర్తి నమ్మకం ఏర్పడుతుంది. అక్కడితో బురిడీ బాబా అసలు కథ« ప్రారంభించి అందినకాడికి దోచుకుంటాడు. కొందరు భక్తులకు తాను చెప్పిన మొత్తం పూజలో పెడితే దానికి పది రెట్లు వర్షం రూపంలో (బారిష్) కురుస్తుందని నమ్మిస్తుంటాడు. భక్తులు ‘ముగ్గులోకి’ దిగాక ‘పెద్ద పూజ’కు రంగం సిద్ధం చేస్తాడు. ఉమ్మెత్త గింజల గుజ్జును తనతో గుట్టుగా తీసుకువస్తాడు. అత్యాశకుపోయే భక్తులు ఈసారి గతంలో పెట్టిన మొత్తానికి ఎన్నో రెట్లు సమీకరించుకుని పూజకు సిద్ధమవుతారు. పూజ చేసేప్పుడు ఇతరులెవ్వరూ ఉండకూడదంటూ కుటుంబీకుల్ని మాత్రమే ఇంట్లో ఉంచుతాడు. తంతు పూర్తయ్యే తరుణంలో ప్రసాదమంటూ పరమాన్నం సిద్ధం చేసే ఈ బురిడీ బాబా అందులో ఉమ్మెత్త గింజల గుజ్జు కలిపేస్తాడు. అది తిన్న వారంతా మత్తులోకి జారుకున్నాక పూజలో ఉంచిన సొత్తు, సొమ్ముతో ఉడాయిస్తాడు. ఈ దొంగ బాబా శివ 2012లో కూకట్పల్లిలో ‘పూజ’ చేసి పోలీసులకు చిక్కాడు. ఆపై బెంగళూరుకు మకాం మార్చి 2014 జూన్ 6న తిరుపతి అర్బన్ జిల్లా అలిపిరి ఆటోనగర్లో ఉండే రియల్టర్ ఆర్కే యాదవ్ కుటుంబంపై ‘మత్తు మందు’ జల్లాడు. పూజలో ఉంచిన రూ.63.43 లక్షలు తీసుకునే లోపే యాదవ్ సంబంధీకులు దామోదర్ రావడంతో ఉడాయించాడు. మత్తులో ఉన్న కుటుంబాన్ని చూసిన దామోదర్ ఆ మొత్తం తస్కరించి దొంగ బాబా దొరకడనే ఉద్దేశంతో నేరాన్ని అతడి మీదికి నెట్టాడు. అలిపిరి నుంచి నెల్లూరు చేరుకున్న బురిడీ బాబా అక్కడి ఆనంద్రెడ్డి ఇంట్లో ‘పూజ చేసి’ రూ.40 లక్షలు ఎత్తుకుపోయాడు. యాదవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన అలిపిరి పోలీసులు శివ హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించారు. అమీర్పేటలోని ఓ లాడ్జిని అడ్డాగా చేసుకుని నల్లగొండకు చెందిన మరో బడా బాబును మోసం చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుసుకున్నారు. ఆ లాడ్జిపై మెరుపుదాడి చేసిన పోలీసులు శివను పట్టుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో దామోదర్ను అరెస్టు చేసి ఇరువురి నుంచి మొత్తం రూ.1.30 కోట్ల నగదు, సొత్తు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ రియల్టర్కు కొంపల్లి వాసితో పరిచయం ఉంది. శివ ఇతడి ద్వారానే హైదరాబాద్ రియల్టర్కు పరిచయమయ్యాడు. బెంగళూరు శివార్లలో స్థిరపడిన శివను 2015లో ఆ స్నేహితులు ఇద్దరూ వెళ్లి కలిశారు. పక్కా పథకంతో అక్కడి గోల్ఫ్ కోర్ట్లో ‘ప్రత్యేక’ పూజ’ చేసిన శివ వీళ్లు తెచ్చిన రూ.లక్షను రూ.2 లక్షలు చేసిచ్చాడు. దీని కోసం దక్షిణ తప్ప అదనంగా ఏమీ తీసుకోకపోవడంతో హైదరాబాద్ రియల్టర్కు పూర్తి నమ్మకం ఏర్పడింది. 2016లో మళ్లీ ఈయన్ను సంప్రదించిన శివ తన వద్ద 1616 నాటి రైస్పుల్లర్గా పిలిచే ఇరీడియం కాయిన్ ఉన్నట్లు చెప్పాడు. దీన్ని అంతర్జాతీయ మార్కెట్లో రూ.వందల కోట్లకు అమ్మవచ్చని, జర్మనీలో పార్టీని వెతుకుదామని చెప్పాడు. ఈ కాయిన్తో పాటు డబ్బును రెట్టింపు చేయడానికి మీ ఇంట్లో పూజ చేద్దామంటూ మరో ఇద్దరితో కలిసి హైదరాబాద్ చేరాడు. 2016 జూన్ 15 హైదరాబాద్ రియల్టర్ ఇంట్లో ముగ్గు వేసి పూజ ప్రారంభించిన శివ ఆ ముగ్గులో హ్యారీపోటర్ పుస్తకాన్నీ ఉంచడం గమనార్హం. అదేమంటే మహిమలకు అతడు ప్రతీకంటూ నమ్మించాడు. బురిడీ బాబా శివ 2009–16 మధ్య పదిమంది నుంచి రూ.4.25 కోట్ల మేర స్వాహా చేశాడు. హైదరాబాద్లోని బంజారాహిల్స్, కేపీహెచ్బీ, మైలార్దేవ్పల్లి; చిత్తూరు జిల్లా అలిపిరి, బెంగళూరులోని కుంబులుగుడ్డు, కడప జిల్లా రాజంపేట, నెల్లూరుల్లో అరెస్టు అయ్యాడు. రైస్పుల్లింగ్ కాయిన్ పేరుతో బెంగళూరు గోల్ఫ్ కోర్ట్లో ఇద్దరి నుంచి రూ.52 లక్షలు, చెన్నైలోని ఓ త్రీ స్టార్ హోటల్ యజమాని నుంచి రూ.35 లక్షలు కాజేసిన ఉదంతాల్లో వాంటెడ్గా ఉన్నాడు. 2016 తర్వాత ఇతడి పేరు మళ్లీ రికార్డుల్లోకి ఎక్కలేదు. -
ఈ వారం కథ: లక్కీ యాప్
టేబుల్ మీద ఉన్న ఫోన్ రింగ్టోన్ మోగుతోంది.‘‘లక్ అన్న మాటే నిల్లో నిల్లు, లైఫ్ ఏమో చాల డల్లో డల్లు’’ అని పాట వినిపిస్తోంది.ఫోన్ చేసింది ఎవరో అనే ఆలోచన లేకుండా, అదే పాటను హమ్ చేస్తూ...‘‘నేనో జీరోని, వ్యాల్యూ లేనోన్ని’’ అంటూ ఫోన్ ఎత్తాడు రఘువరన్ .వెంటనే, ఆ పక్కనుంచి ‘‘ఒరేయ్! రాసిన లాస్ట్ అటెంప్ట్ ఎగ్జామ్ కూడా ఫెయిల్ అయ్యింది రా!’’ అని బాధతో చెప్పాడు ఫ్రెండ్. రఘువరన్ మాత్రం షాక్ కాకుండా, చిరునవ్వు చిందిస్తూ, హీరో రజనీకాంత్లా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని, ‘‘చూడు ఇదంతా మామూలే, నువ్వు బాధపడకు’’ అన్నాడు.‘‘ఒరేయ్! ఫెయిల్ అయ్యింది నువ్వురా!’’ అన్న వెంటనే, రఘువరన్, ‘‘తెలుసు! నన్ను అదృష్ట దేవత డైరెక్ట్గా వచ్చి వరాలు ఇచ్చినా, నా బెస్ట్ ఫ్రెండ్ వాటిని సక్సెస్ఫుల్గా ఫెయిల్ చేయగలడు’’ అన్నాడు. ‘‘ఎవర్రా వాడు? చెప్పు వాడ్ని చంపేద్దాం..’’‘‘రేయ్, వాడ్ని ఏం అనకు. నేను పుట్టినప్పటి నుంచి నన్ను ఒక్క క్షణం కూడా వీడని ఫ్రెండ్రా వాడు. నా వన్ అండ్ ఓన్లీ బెస్ట్, బ్లడ్ ఫ్రెండ్ నా బ్యాడ్ లక్! బై!’’ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. తర్వాత మళ్లీ అదే పాట పెట్టుకొని ‘‘నా బాధే నాకు భంగు, నే చెత్త కుప్ప కింగు, నా ఫేట్ నల్లరంగు, నే కొమ్మల్లో పతంగు!’’ అని పాడుతూ, డ్యాన్ ్స చేస్తూ స్నానం పూర్తి చేసి, ఇంటర్వ్యూకి బయలుదేరాడు. ఇలా దాదాపు దశాబ్దంపాటు, రఘువరన్ రోజూ ఉదయం రెడీ అవ్వడం, మధ్యాహ్నం ఇంటర్వ్యూ అటెండ్ కావడం, సాయంత్రం స్నేహితుల గొప్పలు వింటూ ఇంటికొచ్చి భోజనం చేయడం, రాత్రి కొత్త ఉద్యోగానికి అప్లయ్ చేసి నిద్రపోవడం అంతే! ఇదే రఘువరన్ జీవితం.ఇలా ఒక తుప్పు పట్టిన చక్రంలా, రోజులన్నీ ఒకేలా గడుస్తున్న సమయంలో ఒక రాత్రి ల్యాప్టాప్ మూసి పడుకోబోతుంటే, తెర మీద వింత అక్షరాలు మెరిశాయి. ‘‘బ్యాడ్ లక్కి బై చెప్పి, లక్కి హాయ్ చెప్పాలనుందా?అయితే వెంటనే ఈ ఆర్టిఫిషియల్ లక్ యాప్ను ఇన్ స్టాల్ చేసుకోండి.ఇది నంబర్ వన్ లక్ గ్యారంటీ యాప్!’’రఘువరన్ రెండు క్షణాలు స్క్రీన్ చూస్తూ ఆగిపోయాడు.‘‘ఇలాంటి యాప్స్ కూడా ఉంటాయా? ఉన్నా పనిచేస్తాయా?’’ అని అనుకుంటూ ఇన్ స్టాల్ బటన్ నొక్కాడు. యాప్ ఓపెన్ చేయగానే, కంప్యూటరైజ్డ్ వాయిస్, ‘‘వెల్కమ్! ప్లీజ్ సెలెక్ట్ యువర్ ప్యాకేజ్. డైలీ ఫ్రీ లక్. ప్రీమియం లక్. జాక్పాట్ లక్.’’ ‘‘అబ్బో! ఇప్పడు అదృష్టం కూడా డేటా ప్లాన్ ్స ఇస్తుందా?’’ అనుకుంటూ... ఫ్రీ లక్ సెలెక్ట్ చేసుకున్నాడు. అప్పుడే యాప్ నుంచి ఫన్నీ నోటిఫికేషన్ :‘‘ఈ రోజు ఇంటర్వ్యూలో మిస్టర్ రఘువరన్ కడియాలా, యూ ఆర్ సెలెక్టెడ్!’’ ఆ మెసేజ్ చూసి నవ్వుకుంటూ బెడ్ మీద పడ్డాడు. ‘‘ఏమో, ఏడేళ్ల తర్వాత ‘బేవార్స్, ఇడియట్’ అన్నవాళ్లు, నిజంగానే ‘మిస్టర్ రఘువరన్ ’ అంటారేమో!’’ అని అనుకుంటూ కళ్ళు మూశాడు. మరుసటి ఉదయం టింగ్..! ఫోన్ నోటిఫికేషన్: ‘‘యువర్ డైలీ ఫ్రీ లక్ యాక్టివేటెడ్!’’తన బ్యాడ్ లక్ గురించి బాగా తెలిసిన రఘువరన్ ఏమాత్రం ఎగై్జట్ కాలేదు. మూమూలుగానే ఇంటర్వ్యూకి రెడీ అయ్యి బైక్లో బయలుదేరాడు. ఆరోజు ఎందుకో, అన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ గ్రీన్ . జేబులోని పెన్ ఇంక్ లీక్ కాలేదు. షూస్కి దుమ్ము అంటలేదు. లిఫ్ట్ కరెక్ట్గా వర్క్ అయ్యింది. వేడి కాఫీ కిందపడకుండా తాగాడు. ఇంటర్వ్యూలో కూడా అచ్చం యాప్ చెప్పిన ట్టు. ‘‘మిస్టర్ రఘువరన్ కడియాలా, యూ ఆర్ సెలెక్టెడ్!’’ అన్నారు. జాబ్ ప్యాకేజీ కూడా బాగానే ఉంది. ఆ తర్వాత కూడా ఆడగకుండానే షాపింగ్ చేసిన తర్వాత ఆఫర్ అంటూ డిస్కౌంటు ఇచ్చారు. బైక్కి టైర్ పంచర్, పెట్రోల్ అయిపోవటం లాంటి ఇబ్బందులు లేకుండా ఇంటికి వెళ్లాడు. అపార్ట్మెంట్లో కూడా పార్కింగ్ ఈజీగా దొరికింది. ఆ రోజు అంతా బాగా గడిచిపోయింది. అంతా యాప్ చెప్పినట్టు రోజంతా అదృష్టంతో నిండిపోయింది. దీంతో, అప్పటి దాకా, రింగ్ టోన్ మోగితే కానీ, చూడని ఫోన్ ముఖాన్ని కళ్లార్పకుండా చూశాడు. కుతూహలంతో ఆ యాప్ తెరిచాడు. ఇదంతా నిజమేనా? అని సందేహంతోనే నిద్రపోయాడు. మళ్లీ ఉదయాన్నే ఫోన్ నోటిఫికేషన్ . ‘‘యువర్ ఫ్రీ లక్ ఈజ్ ఓవర్! అప్డేట్ కోసం రూ. 99 ప్రీమియం ప్యాకేజీని సెలెక్ట్ చేసుకోండి.’’ఇదంతా నమ్మాలా వద్దా అన్న అయోమయంలోనే రఘువరన్ ప్రీమియం ప్యాకేజీని సెలెక్ట్ చేసుకున్నాడు.ఆ రోజూ కూడా రఘువరన్ కి అదృష్టమే కలిసివచ్చింది. బస్సులో ఎక్కినప్పుడల్లా కిటికీ సీటు ఖాళీగా ఉంటుంది. బిస్కెట్ను టీలో ముంచినప్పుడు కూడా జారిపోకుండా తింటున్నాడు.బార్ బిల్లు ఎప్పుడూ ఫ్రెండ్గాడికే పడుతోంది. దొంగిలించిన వాలెట్ని దొంగే తిరిగి తెచ్చి ఇస్తున్నాడు.అడుగు బయట పెట్టగానే ఘోరంగా కురుస్తున్న వాన ఒక్కసారిగా సైలెంట్గా మారుతోంది. ఆఫీసులో బాస్ అడక్కుండానే పొగుడుతున్నాడు. ఆఫీస్ బాయ్ కూడా అడక్కుండానే వాటర్, టీ కాఫీలు తెచ్చి టేబుల్ పై పెడుతున్నాడు. మొబైల్ బ్యాటరీ వన్ పర్సెంట్ ఉన్నా, మూడు రోజులు వరకు ఆన్గానే ఉంటుంది. ఫేవరెట్ వైట్ షర్ట్ని వాషింగ్ మెషీన్లో వేసినా, అది ఏ కలర్ అంటకుండా, చాలా చక్కగా మారి, మృదువుగా, సువాసనతో బయటకు వస్తుంది. అనుకోకుండా, చేయి ఎత్తితే, అటుగా వెళ్తున్న వక్తి, లిఫ్ట్ అనుకొని, నేరుగా స్కూటీ మీద ఎక్కించుకొని ఇంటి వద్ద దింపాడు. ఇంతేకాదు, ఏటీఎమ్లో ఐదు వందల రూపాయలు విత్డ్రా చేసుకోగా, మెషిన్ ఐదు వంద నోట్లకు బదులు యాభై నోట్లను ఇచ్చేసింది. ఆన్లైన్లో బ్యాటరీ ఆర్డర్ పెడితే, డెలివరీలో స్మార్ట్ వాచ్, బ్లూటూత్ స్పీకర్ వచ్చాయి. ఇలా అప్పటి వరకు హారర్ సినిమాలా సాగిన రఘువరన్ జీవితం, ఒక్కసారిగా, సూపర్ హిట్ కామెడీ సినిమాలా సాగిపోతోంది. సరిగ్గా, ఒక నెల తర్వాత మళ్లీ ఫోన్ నోటిఫికేషన్ ‘‘యువర్ ప్రీమియం లక్ ఈజ్ ఓవర్! అప్డేట్ కోసం రూ. 999 జాక్పాట్ లక్ ప్యాకేజీని సెలెక్ట్ చేసుకోండి.’’ ఈసారి ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే పేమెంట్ చేశాడు.వెంటనే నోటిఫికేషన్ , ‘‘బొంబాయి లాటరీ నంబర్ 5834.’’ ఆ నంబర్ చూసిన వెంటనే రఘువరన్ పరుగెత్తుకుంటూ వెళ్లి లాటరీ కొన్నాడు. నంబర్ కూడా అదే 5834. ఇక అప్పటి నుంచి రఘువరన్ కి నిద్ర పట్టడం లేదు. ప్రతిరోజూ అదృష్టం ఇచ్చే ఆనందాలను ఎంజాయ్ చేయలేకపోతున్నాడు.క్యూలో నిల్చున్నా, వెయిట్ చేసే పని లేకుండా గణేశ్ అన్నదానంలో భోజనం దొరికినా ఆస్వాదించలేకపోయాడు.ఆఫీసులో అందమైన అమ్మాయి నవ్వుతూ పొగుడుతున్నా తిరిగి నవ్వలేకపోయాడు.చికెన్ బిరియానీ ఆర్డర్ చేస్తే, అందులో లెగ్పీస్ వచ్చినా ఎంజాయ్ చేయలేకపోయాడు. బుక్ చేసిన క్యాబ్ డ్రైవర్ అడ్రస్ని పది సార్లు అడగకుండానే వేగంగా డెస్టినేషన్ కు తీసుకెళ్తున్నా సంతోషం లేదు. తన పాత క్రష్ సడెన్ గా ‘నిన్ను కలవాలని ఉంది’ అని మెసేజ్ పంపినా, అతను ‘ఊమ్’ అని రిప్లయ్ ఇస్తున్నాడు. అమెజాన్ లో బ్యాటరీ ఆర్డర్ చేశాడు, డెలివరీలో డ్రోన్ , స్మార్ట్వాచ్, బ్లూటూత్ స్పీకర్ వచ్చాయి! ‘సారీ సర్, సిస్టమ్ గ్లిచ్’ అని కంపెనీ వాళ్లు చెప్పి, మీరు ఆ వస్తువులను కావాలనుకుంటే మీ వద్ద పెట్టుకోవచ్చు అని చెప్పి, ప్రతి సారి గ్లిచ్ కేవలం రఘుకే వస్తున్నాయి. అలా ప్రతిరోజూ అదృష్టం తన తలుపు తట్టి మరీ ఇచ్చే ఆనందాలు అన్నీ క్రమంగా తనకు బోరింగ్గా మారిపోయింది. షాపింగ్కి వెళ్లినా రఘు ఏ షర్ట్ పట్టుకున్నా దానిపైనే ‘టుడే ఫ్రీ ఆఫర్!’ బోర్డు వొచ్చేస్తుంది! చాలా డిస్కౌంట్ ఆఫర్తో షాపింగ్ చేసినా, తరువాత కాసేపటికే బ్యాంక్ నుంచి మెసేజ్ ‘మీ కొనుగోలుపై క్యాష్బ్యాక్ రూ. 4999.’ వచ్చినా కూడా తనకు ఆనందం లేదు. ఎప్పుడూ లాటరీ విన్నర్ అనౌన్ ్సమెంట్ కోసమే ఎదురుచూస్తూ, అదృష్టంపై చిన్న చూపు మొదలయింది. సరిగ్గా, నలభై ఐదు రోజుల తర్వాత ఆ రోజు వచ్చింది.విన్నింగ్ నంబర్ను అనౌన్ ్స చేశారు. యాప్ చెప్పినట్టుగానే విన్నింగ్ లాటరీ నంబర్ 5834.ఇక రఘువరన్ ఆనందానికి అవధులు లేవు.లాటరీ ప్రైజ్ వంద కోట్లు.‘‘ఇక నా కష్టాలన్నీ పోయాయి!’’ అని ఆ రోజంతా ఫుల్ పార్టీ చేసుకొని పడుకున్నాడు.ఉదయం లేవగానే ఫోన్ నోటిఫికేషన్ , ‘‘యువర్ జాక్పాట్ లక్ ఈజ్ ఓవర్! అప్డేట్ కోసం రూ. 9999 జాక్పాట్ లక్ అప్డేషన్ ప్యాకేజీని సెలెక్ట్ చేసుకోండి.’’‘‘వంద కోట్లు ఉంటే నాకు ఇంకా లక్తో పని ఏముంది’’ అనుకొని యాప్ను అన్ఇన్ స్టాల్ చేసి బొంబాయి లాటరీ ఆఫీసుకు వెళ్లాడు. చాలా కాన్ఫిడెంట్గా లాటరీ టికెట్ ఇచ్చి. ‘‘ఐ వాంట్ ఓన్లీ క్యాష్’’ అన్నాడు.కౌంటర్లోని వ్యక్తి టికెట్ తీసుకొని, ‘‘సారీ సార్, ఈ లాటరీ టికెట్ ఎక్స్పైర్ అయింది’’ అన్నాడు.వెంటనే షాక్తో టికెట్ తీసుకొని చెక్ చేసుకున్నాడు. నిజంగానే అది లాస్ట్ ఇయర్ టికెట్.‘‘మరి నాకు డబ్బులు రావా!’’ అని బాధతో అడిగాడు.‘‘సారీ సార్!’’ అంటూ టికెట్ తిరిగి అతని చేతిలో పెట్టారు.వెంటనే రింగ్టోన్ మోగింది. ‘‘లక్ అన్న మాటే నిల్లో నిల్లు, లైఫ్ ఏమో చాల డల్లో డల్లో’’. ఈసారి చాలా సైలెంట్గా ఫోన్ ఎత్తాడు.‘‘రఘువరన్ , డ్యూ టు యువర్ లోయర్ పర్ఫార్మెన్ ్స అండ్ నో కమిట్మెంట్ ఫర్ ఆఫీస్ వర్క్, లాట్ ఆఫ్ లీవ్స్, యూ ఆర్ టెర్మినేటెడ్’’ అని చెప్పి ఫోన్ కట్ చేశారు.రఘువరన్ కి ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాలేదు.‘‘ఇదంతా నేను కేవలం పదివేల రూపాయలకు కక్కుర్తి పడి కోల్పోయానా!’’ అని అనుకుంటూ అయోమయంలో పడ్డాడు.యాప్ అప్డేట్ చేసుకోకపోవడమే కారణం అనుకొని వెంటనే యాప్ను మళ్లీ ఇన్ స్టాల్ చేయడానికి ప్రయత్నించాడు. ఎంత వెతికినా ఆ యాప్ దొరకలేదు. ఇక చేసేదేమీ లేక లాటరీ ఆఫీసు నుంచి బయటకు వచ్చాడు.కాలు బయట పెట్టగానే చెప్పు తెగిపోయింది. చాలా కష్టంగా రోడ్డు దాటుకొని నిల్చుంటే వెంటనే ఓ కారు అటుగా పోయి బకెట్ బురదను అతని బట్టలపై చల్లి వెళ్లింది. పైపై తుడుచుకొని బస్స్టాండ్కు పరుగెత్తుకుంటూ వెళ్తే, అప్పటిదాకా ఆగి ఉన్న బస్సు రఘువరన్ రాగానే చాలా అర్జెంట్ పని ఉన్నట్లు వేగంగా బయలుదేరింది. దీంతో, ‘ఓరి దేవుడా! ’ అని కాస్త పైకి తలెత్తి చూస్తే, ఎదురుగ్గా, ఒక బోర్డింగ్.. ‘ఐ యామ్ బ్యాక్!’. అది చూడగానే, అప్పటిదాకా దిగాలుగా ఉన్న రఘువరన్ ముఖం ఒక్కసారిగా చిరునవ్వు చిందించింది. ‘‘ఇన్ని రోజులు బ్యాడ్లక్ నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా, కాదు.. కాదు.. బ్యాడ్లక్కే నేను బెస్ట్ ఫ్రెండ్ని!’’ అని అనుకొని స్టయిల్గా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ‘‘లక్ అన్న మాటే నిల్లో నిల్లు, లైఫ్ ఏమో చాల డల్లో డల్లో’’ అని పాడుకుంటూ చెప్పులు చేతిలో పట్టుకొని నడుచుకుంటూ ఇంటికి బయలుదేరాడు. ∙కొండి దీపిక -
కథాకళి: తల్లి ప్రేమ
డాక్టర్ రాగానే ఆ తల్లి కళ్ళల్లో నీళ్ళు చూశాడు.‘‘డాక్టర్గారు. నెలల పిల్ల. ఒళ్ళు కాలిపోతోంది.’’ ఆ తల్లి దుఃఖంగా చెప్పింది.ఆయన ఆ పిల్ల టెంపరేచర్ చూశాడు.‘‘నూట రెండు! తగ్గకపోగా పెరిగింది. నాకు చేతనైన చికిత్స చేస్తున్నాను. ఆపైన దైవం మీదే భారం. నుదుటి మీద ఉడుకులాం పట్టీని తడిపి వేయడం మానకండి. టెంపరేచర్ ఇంకో గంటలో తగ్గితే సరే, లేదా ప్రమాదం.’’ ఆయన హెచ్చరించాడు.దేవుడిని నమ్మేవారు అసాధ్యాలు సాధ్యాలు అవచ్చని నమ్ముతారు. ఆయన వెళ్ళాక ఆమె పూజగదిలోకి వెళ్ళి, ఏడు తరాల నుంచి తమ కులదైవమైన హూళిగాదేవి విగ్రహం ముందు మోకాళ్ళ మీద కూర్చుని, మనసులో ఆ దేవి రూపాన్ని నింపుకుని, తను అంతదాకా ఏదీ కోరలేదని, తన కూతుర్ని కాపాడే కోరికని తీర్చమని ప్రార్థించసాగింది.‘‘దైవం కొన్ని కోరికలని ఎందుకు తీర్చడంటే అవి చేటు చేస్తాయని.’’ మృదుమధుర కంఠం వినబడి ఆమె కళ్ళు తెరచి చూసింది.ఎదురుగా చిరునవ్వుతో కనపడ్డ దేవిని చూసి ఆ తల్లి కోరింది.‘‘నా కూతుర్ని బతికించు మాతా.’’ఆ పాపకి అమ్మవారి నామాలలో ఒకటైన క్రియేశ్వరి పేరుని ఆ దంపతులు పెట్టుకున్నారు.మూడో ఏడు వచ్చేసరికి క్రియేశ్వరికి అన్ని వస్తువులని విసరడం అలవాటైంది. కనిపించిన వస్తువుని తీసుకుని విసిరి కొడుతుంది.‘‘తప్పు. అది ఎవరికైనా తగలొచ్చు.’’ తల్లి మందలిస్తుంది.ఆరో ఏట క్రియేశ్వరి విసిరిన పుస్తకం అంచు భాగం తండ్రి కంట్లో గుచ్చుకోవడంతో రక్తం కారసాగింది. తక్షణం హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఆయన కుడి కంటి చూపు శాశ్వతంగా పోయింది. ‘‘మంచిది. పోయింది నా కన్నేగా. ఇదే పరాయి వాళ్ళ కన్నైతే ఎంతో తగువులాట జరిగేది.’’ తండ్రి చెప్పాడు.క్రియేశ్వరి వస్తువులని విసరడం ఏడో ఏడు దాకా ఆపలేదు.క్రియేశ్వరి ఎనిమిదో ఏట స్కూల్ హెడ్ మాస్టర్ ఆమె తల్లిదండ్రులని పిలిచి టీసీ ఇచ్చి చెప్పాడు.‘‘మీ అమ్మాయి ప్రవర్తన, చదువు ఏ మాత్రం బాలేవు. మీ అమ్మాయిని సరైన దారిలో పెట్టమని నాలుగైదుసార్లు హెచ్చరించినా మీరు పట్టించుకోలేదు. తోటిపిల్లల పుస్తకాలు ఎత్తుకెళ్ళి మిఠాయి షాపుల్లో ఇచ్చి మిఠాయి కొనుక్కుంటోంది. అందరితోనూ పోట్లాటే.’’క్రియేశ్వరికి పన్నెండో ఏడు వచ్చేసరికి మూడు స్కూల్స్ మారింది. తమ కూతురిలోని చెడ్డ లక్షణాలకి ఆ దంపతులకి రంపపు కోతగా ఉంది. క్రియేశ్వరి బంధువులు, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు తమ ఇంటికి క్రియేశ్వరితో రావద్దని నిష్కర్షగా చెప్పారు.పధ్నాలుగో ఏట వాళ్ళకి క్రియేశ్వరి పెద్ద కష్టాన్ని తెచ్చింది. ఆమె డబ్బు కోసం మగాళ్ళతో గడుపుతోందని ఆమె తల్లిదండ్రులకి తెలిసింది. కుటుంబ గౌరవం మంట కలుపుతోందని మొదటిసారి తండ్రి కూతుర్ని కొట్టాడు. ఆమె ఎదురు తిరిగి తండ్రి కళ్ళజోడుని విరగ్గొట్టి చొక్కాని చింపేసి, ఆయన్ని గదిలో బంధించి తలుపు గడియ పెట్టింది. గంట తర్వాత ఓ వీధి రౌడీ వచ్చి క్రియేశ్వరి తండ్రిని చితకబాదాడు.‘‘ఖబడ్దార్ గుడ్డి నాయాల. క్రియ నాది. దాన్నేమైనా అంటే నిన్ను చంపేస్తాను.’’ బెదిరించాడు.‘‘నేనంటే వాడికి ఎంత ప్రేమో చూశారా?’’ క్రియేశ్వరి నవ్వుతూ చెప్పింది.మరో ఆరు నెలల తర్వాత మరో కష్టం వారికి వచ్చింది. క్రియేశ్వరి గర్భవతైంది. ఆమె బిడ్డని కంటానని పట్టుపట్టింది. బలవంతంగా అబార్షన్ చేయించారు.క్రియేశ్వరికి పదిహేడో ఏట ఆల్కహాల్ అలవాటైంది. పంతొమ్మిదో ఏట కాల్ సెంటర్లో చేరింది. అయితే, ఆమెని మూడు వారాల తర్వాత ఉద్యోగంలోంచి తీసేశారు. తల్లితండ్రులు ఆమెకి పెళ్ళి చేయకూడదని నిర్ణయించుకున్నారు. తన ఇరవై మూడో ఏట క్రియేశ్వరి ఓ ఏభైరెండేళ్ళ ఆయనతో వచ్చి చెప్పింది.‘‘ఈయన నన్ను ప్రేమిస్తున్నాడు. పెళ్ళి చేసుకుంటాడు. మా పెళ్ళి ఘనంగా చేయండి.’’ఆ పెళ్ళి మానుకోమని బతిమాలారు. క్రియేశ్వరి ఎప్పటిలా పట్టినపట్టు విడవలేదు. ఆమె తండ్రి పీఎఫ్ మొత్తం విత్డ్రా చేసి కూతురి పెళ్ళి జరిపించాడు. వృద్ధాప్యంలో వాళ్ళని ఆదుకునే ప్రధాన వనరు అలా మాయమైంది. ఆమె తన ఇరవై ఎనిమిదో ఏట తండ్రి మీద దావా వేసి గెలిచి, ఇంట్లోని తన భాగాన్ని కావాలని పరాయి మతస్తులకి అమ్మింది. ఆ పొరుగుని భరించలేక వాళ్ళు అద్దె ఇంటికి మారారు. తన తండ్రి తన భాగాన్ని అమ్మాడని రెండేళ్ళ తర్వాత తెలిసి వచ్చి ఆ డబ్బు ఇవ్వమని గొడవ చేసింది. ఆయన నిరాకరిస్తే జరిగిన ఘర్షణలో క్రియేశ్వరి కొట్టిన దెబ్బలకి ఆయన మరణించాడు.‘‘ఇల్లమ్మి ఆ డబ్బు నాకు ఇవ్వనందుకు.’’ అరిచింది.ఎర్రబడ్డ కూతురి మొహంలోని రోషాన్ని, కోపాన్ని, ద్వేషాన్ని చూసి ఆ తల్లి భయంతో వణికిపోయింది. ఆవిడ చూస్తూండగానే క్రియేశ్వరి మొహంలో క్రమంగా వయసు తగ్గసాగింది. ఇరవై మూడు నించి పదిహేనుకి, పదికి, ఐదుకి, ఏడాదికి, చివరకి మూడు నెలల పసిపాప మొహం కనిపించింది. ఆమె కళ్ళు తెరచి చూస్తే ఉయ్యాలలోని, ఇంకా పేరు పెట్టని తన కూతురు కనిపించింది. తను కలగనలేదని, అమ్మవారు భవిష్యత్తును చూపించిందని గ్రహించింది. మళ్ళీ అశరీరవాణి వినిపించింది.‘‘నీ ప్రార్థనని నువ్వు మన్నిస్తావో లేదో నీ చేతుల్లో ఉంది. పాపని నువ్వు మరో మూడు నిమిషాల్లో ఎత్తుకుంటే బతుకుతుంది. లేదా మరణిస్తుంది.’’అత్యంత అమాయక మొహం గల ఆ పాప కళ్ళు తెరిచి నీరసంగా తల్లి వంక చూస్తూంటే ఆ పాప నోట్లోంచి బలహీనమైన శబ్దాలు వినిపించాయి. రెండు నిమిషాలు తటపటాయించాక ఆమె లేచి పక్కగదిలోకి వెళ్ళింది. అంతలోనే పరిగెత్తుకు వచ్చి ఉయ్యాలలోంచి కూతుర్ని తీసుకుని గుండెలకి హత్తుకుంది. క్రమంగా నూట రెండు నించి టెంపరేచర్ నూట ఒకటికి, వందకి, తొంభై తొమ్మిదికి, చివరకి నార్మల్కి దిగింది.తల్లి తన బిడ్డల మీద ప్రేమని ఎన్నటికీ కోల్పోదు. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
వాసా ప్రీవియా ఉంటే సాధారణ ప్రసవం అవ్వడం కష్టమా..?
నేను ఎనిమిది నెలల గర్భవతిని. స్కాన్లో నాకు వాసా ప్రీవియా ఉందని తేలింది. సాధారణ ప్రసవం కాకుండా సిజేరియన్ చేసే అవకాశం ఎక్కువ ఉందని డాక్టర్ చెప్పారు. అయితే, సాధారణ ప్రసవం అయ్యే అవకాశం ఏమైనా ఉందా? చెప్పండి? – రమ్య, నెల్లూరు. వాసా ప్రీవియా అనేది గర్భధారణలో అరుదుగా వచ్చే ఒక పరిస్థితి. ఈ సమయంలో బొడ్డు తాడు లేదా మాయ, శిశువు రక్తనాళాలు రక్షణ లేకుండా గర్భాశయం ముఖద్వారం పైన లేదా దాని దగ్గరగా ఉంటాయి. ప్రసవ సమయంలో ఇవి పగిలితే, తీవ్రమైన రక్తస్రావం జరగవచ్చు, ఇది చాలా ప్రమాదకరం. ఈ రక్తనాళాలు పగిలితే తీవ్ర రక్తస్రావం జరిగి, శిశువు ప్రాణానికి ప్రమాదం ఏర్పడవచ్చు. వాసా ప్రీవియాకు కచ్చితమైన కారణం తెలియదు. కాని, కొన్ని పరిస్థితులు ఈ సమస్య వచ్చే అవకాశాన్ని పెంచుతాయి. మాయ తాడు గర్భాశయం దిగువలో ఉండటం, బొడ్డు తాడు మధ్యలో కాకుండా పక్కకు మాయ తాకడం, చిన్న అనుబంధ మాయ ఉండటం లేదా కృత్రిమ గర్భధారణ పద్ధతులు ఉపయోగించడం వలన వాసా ప్రీవియా వచ్చే ప్రమాదం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వాసా ప్రీవియాను సకాలంలో గుర్తించడం చాలా అవసరం. సాధారణంగా దీనిని త్రైమాసికంలో స్కాన్లోనే గుర్తించవచ్చు. ఈ సమయంలో ప్రత్యేక లక్షణాలు కనిపించవు. కాని, ఈ పరిస్థితిని గుర్తించకపోతే, ప్రసవానికి ముందు లేదా ప్రసవ సమయంలో రక్తనాళాలు పగిలి శిశువు వేగంగా రక్తాన్ని కోల్పోవచ్చు. తీవ్రమైన రక్తస్రావం వల్ల శిశువుకు ఆక్సిజన్ తగలకపోవడం, మెదడు దెబ్బతినడం లేదా గర్భంలోనే శిశువు మరణించడం కూడా సంభవించవచ్చు. గర్భధారణ సమయంలో వాసా ప్రీవియా ఉన్నట్లు గుర్తించిన వెంటనే పనులు తగ్గించుకోవాలి. లైంగిక సంబంధానికి దూరంగా ఉండాలి, కొన్ని సందర్భాల్లో ఆసుపత్రిలో చేరి, నిశితంగా పర్యవేక్షణలో ఉండటం అవసరం. వాసా ప్రీవియా ఉన్న చాలా సందర్భాల్లో, శిశువుకు రక్తస్రావ ప్రమాదం తగ్గే విధంగా 34 నుంచి 36 వారాల మధ్య నిర్ణీత సిజేరియన్ ప్రసవం చేస్తారు. అవసరమైతే శిశువు ఊపిరి తిత్తులు పూర్తిగా పెరగడానికి స్టెరాయిడ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రసవ సమయంలో కూడా వాసా ప్రీవియా ఉన్నట్లు అనుమానం ఉంటే, శిశువు భద్రత కోసం అత్యవసర సిజేరియన్ చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో బిడ్డకు రక్త మార్పిడి అవసరమవుతుంది. వాసా ప్రీవియాను పూర్తిగా నివారించలేరు కాని, నిరంతర చెకప్ ద్వారా దీన్ని ముందుగానే గుర్తించి, ప్రమాదాలను తగ్గించవచ్చు. ఇలా చేయడం ద్వారా శిశువుకు హాని లేకుండా, సురక్షితంగా జన్మించే అవకాశం ఎక్కువ అవుతుంది. కాబట్టి, సాధారణ ప్రసవం లేదా సిజేరియన్ అనే తేడా లేకుండా, ముందే సిజేరియన్కు మానసికంగా సిద్ధంగా ఉండటమే మంచిది. ఆ వ్యాధులు మహిళల్లోనే ఎక్కువశాశ్వత పరిష్కారం లేని వ్యాధుల్లో ఆటో ఇమ్యూన్ వ్యాధులనే ముందు వరుసలో చెప్పుకోవాలి. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ పొరబడి ఆరోగ్యవంతమైన కణాల మీద దాడి చేయడం వల్ల రకరకాల ఆటో ఇమ్యూన్ వ్యాధులు తలెత్తుతుంటాయి. రుమాటాయిడ్ ఆర్థరైటిస్, టైప్–1 డయాబెటిస్, లూపస్, గ్రేవ్స్ డిసీజ్, మల్టిపుల్ స్లె్కరోసిస్, సొరియాసిస్, సొరియాటిక్ ఆర్థరైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులకు లోనైన వారు జీవితాంతం వాటికి మందులు వాడుతూ, చికిత్స కొనసాగించాల్సిందే! ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిలో పురుషుల కంటే మహిళల సంఖ్యే ఎక్కువని తాజా పరిశోధనల్లో తేలింది. ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిలో దాదాపు 70 శాతం మహిళలేనని ఇండియన్ రుమాటాలజీ అసోసియేషన్ 40వ వార్షికోత్సవ నివేదిక ఇటీవల వెల్లడించింది. వీరిలో 20–50 సంవత్సరాల లోపు వయసులో ఉన్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని తెలిపింది. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఆటో ఇమ్యూన్ వ్యాధులు చాలా సర్వసాధారణంగా కనిపిస్తున్నట్లు ఇటీవల స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధన కూడా వెల్లడించింది. జన్యు కారణాలు, పునరుత్పాదక వయసులో ఉన్న మహిళల్లో సంభవించే హార్మోన్ మార్పులు, గర్భధారణ, ప్రసవం వల్ల కలిగే మానసిక ఒత్తిడి, పోషకాహార లోపాలు, స్థూలకాయం వంటివి మహిళల్లో ఆటో ఇమ్యూన్ వ్యాధులకు కారణం కావచ్చని భావిస్తున్నట్లు ఢిల్లీ ‘ఎయిమ్స్’లోని రుమాటాలజీ విభాగాధిపతి డాక్టర్ ఉమా కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ అంశమై కారణాలను కచ్చితంగా గుర్తించడానికి మరింతగా పరిశోధనలు జరగాల్సి ఉందని ఆమె అన్నారు.డాక్టర్ ప్రమత శిరీష, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ‘చుక్క’బీరు.. చుక్కల్లో ధర..) -
స్క్రోలాటం చిట్టి రీల్స్.. గట్టి ఆదాయం
నవ్వించు, ప్రేరేపించు, షేర్ చేయించు ఇవన్నీ రెండు నిమిషాల్లోనే! ఇక్కడ సమయం తక్కువ, ఐడియాలు ఎక్కువ. కాని, పవర్ మాత్రం మ్యాక్స్! టైమింగ్లో రీల్స్ కంటే ఎక్కువ, షార్ట్ ఫిల్మ్ కంటే తక్కువ. కానీ, ఫుల్ ఎంటర్టైన్ మెంట్, ఫుల్ ఇంపాక్ట్, ఫుల్ మనీ! అవే, ఈ టూ మినిట్స్ వీడియోల చిన్న సినిమాలు! అందుకే, ఇవి రీల్స్నే కాదు, రియల్ లైఫ్లోనూ ఫాస్ట్ ఇంపాక్ట్ ఇస్తున్నాయి.చిన్న వీడియోల పెద్ద హంగామాఒకప్పుడు సినిమా థియేటర్లో మూడు గంటలు కూర్చుని ఒక కథ చూస్తే, ఇప్పుడు అదే ఎమోషన్, అదే మెసేజ్, అదే ఫీల్ను రెండు నిమిషాల వీడియోలోనే చూస్తున్నాం! కారణం? డిజిటల్ ప్రపంచం వేగంగా పరుగులు తీస్తోంది. ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్లు, డేటా ఇవన్నీ కలసి మనకు రీల్స్ స్క్రోలింగ్ అనే ఒక కొత్త అలవాటు తెచ్చాయి. ఇప్పుడు ఆ రీల్సే కాస్త పెద్దవై షార్ట్ స్క్రోలింగ్ సినిమాలుగా మారాయి. అందుకే, ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, జోష్, మోజ్ ఏ యాప్ తెరిచినా ఒక్కో స్క్రోల్లోనే నవ్వు, డ్రామా, పాట, డ్యాన్ ్స, ట్రెండ్, ఎమోషన్ అన్నీ మీ చేతిలోకి వస్తున్నాయి, అది కూడా రెండు నిమిషాల్లోనే! ఇంతలోనే వాటికి మిలియన్ల వ్యూస్, కోట్ల లైక్స్, సూపర్స్టార్ ఫేమ్. ఈ రెండు నిమిషాల ఫేమ్తో లక్షల ఆదాయం కూడా వస్తోంది.ఎందుకు ఈ పిచ్చి?మనిషి మైండ్ ఇప్పుడు ఫాస్ట్ మోడ్లో ఉంది. తక్కువ టైమ్లో ఎక్కువ ఎంటర్టైన్ మెంట్ కావాలని కోరుకుంటోంది. పది నిమిషాల వీడియో ఎవరు చూస్తారు? అదే తొంభై సెకన్లలో నవ్వు, ప్రేమ, డ్యాన్ ్స, డ్రామా అన్నీ ఇస్తే, దాన్ని మిస్సవ్వడం కష్టం! అందుకే మనసు వెంటనే ‘నెక్ట్స్’ అంటుంది. ఇదే డోపమైన్ లూప్. ప్రతి స్క్రోల్లో చిన్న సంతోషం, ప్రతి వీడియోలో కొత్త హిట్. సైకాలజిస్టుల మాట ప్రకారం, చిన్న వీడియోలు మన మెదడులో ‘ఇన్ స్టంట్ రివార్డ్’ ఫీలింగ్ కలిగిస్తాయి. అందుకే మనం ‘ఇంకో వీడియో మాత్రమే’ అని మళ్లీ మళ్లీ స్క్రోల్ చేస్తూనే ఉంటాం! వీటిలో యూట్యూబ్ షార్ట్స్ వీడియోస్కు ఎక్కువ క్రేజ్ రావడంతో, క్రియేటర్లు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్, వీడియోస్ కంటే రీల్స్లోనే తమ క్రియేటివిటీతో కథలను సృష్టిస్తున్నారు. అలా ‘ఒక్క నిమిషం చాలదు, రెండు నిమిషాలైనా ఇవ్వండి!’ అని క్రియేటర్లు డిమాండ్ చేసినప్పుడు, యూట్యూబ్ ‘సరే! మీకు 180 సెకన్లు!’ అని అంగీకరించింది. ఈ నేపథ్యం వలనే వివిధ రకాల సోషల్ మీడియా యాప్స్ కూడా ఈ రెండు, మూడు నిమిషాల వీడియోలకు ఆసక్తి చూపించడం మొదలుపెట్టాయి. ప్రస్తుతం, టిక్టాక్, యూట్యూబ్ షార్ట్స్ నిడివి మూడు నిమిషాల వరకు పొడుగవుతుండగా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా పొడవవుతున్నాయి! అలా ఇప్పుడు ప్రపంచం మొత్తం టూ మినిట్స్ రివల్యూషన్ మొదలైంది. క్విక్ కరెన్సీగా!వాణిజ్య ప్రకటనలు అంటే పెద్ద క్యాంపెయిన్, టీవీ యాడ్స్, బిల్బోర్డులను అనుకుంటే, ఇప్పుడు అవి మొబైల్లో ఒక్క స్క్రోల్తో సరిపోతుంది! మార్కెటింగ్ ఇప్పుడు డైలాగ్ కాదు, రెండు నిమిషాల డ్రామాగా మారింది. ఫ్లిప్కార్ట్ రీల్స్లో డిస్కౌంట్ చెబుతుంది, స్విగ్గీ రీల్స్లో కర్రీ చూపిస్తుంది, మీషో రీల్స్లో సేల్స్ పెంచుతుంది! పక్కా మార్కెటింగ్ కన్సల్టెంట్స్ అందరూ ఇదే మంత్రం ‘ప్రోడక్ట్ ఎంత గొప్పదో కాదు, రెండు నిమిషాల్లో ఎవరి మనసు దోచుకుంటామో అదే బ్రాండ్ సక్సెస్!’ అంటున్నారు. వీటికి కంటెంట్ క్రియేటర్స్, ఇన్ ఫ్లుయెన్సర్స్ తోడవటంతో, బ్రాండ్స్కు క్రియేటర్లకు షార్ట్ వీడియోలు ఒక క్విక్ కరెన్సీగా మారాయి. స్టార్టప్స్ కూడా ఈ షార్ట్ వీడియోస్ ఆధారంగా కస్టమర్ను కట్టిపడేస్తున్నాయి. సంక్లిష్టమైన టెక్నాలజీని కేవలం రెండు నిమిషాల్లో అర్థమయ్యేలా చూపించి, మార్కెటింగ్లో కొత్త ఫ్యాషన్ క్రియేట్ చేశారు. మార్కెటింగ్ నిపుణుల ప్రకారం, 2026 నాటికి ప్రపంచం చూసే కంటెంట్లో 70 శాతం షార్ట్ వీడియోలే ఉంటాయి. సినిమా ట్రైలర్లు, యూనివర్సిటీ క్యాంపెయిన్లు, ఏ సందేశాలు అయినా ఇప్పుడు రీల్ రూట్లోనే అందరికీ చేరుతున్నాయి.అంతర్జాతీయ స్థాయిలో..ప్రపంచం మొత్తం ఇప్పుడు ‘స్క్రోల్, ప్లే, షేర్!’ అనే రిథమ్లో నడుస్తోంది. అందుకే, ప్రపంచ వ్యాప్తంగా టిక్టాక్, యూట్యూబ్ షార్ట్స్, ఇన్ స్టాగ్రామ్ రీల్స్, క్వాయ్, మోజ్, జోష్ కలిపి 80 శాతం మొబైల్ డేటా వినియోగానికి కారణం. ఈ కారణంగానే 2020లో యూజర్లు రోజుకు సుమారు 35 నిమిషాలు స్క్రోల్ చేస్తే, ఇప్పుడు 80 నిమిషాలు స్క్రోల్ చేస్తున్నారట! అందులో మన దేశం ముందు వరుసలో ఉంది. రోజుకు సుమారు 65 కోట్ల మంది యూజర్లు ఈ షార్ట్ వీడియోస్ వీక్షిస్తారు. ముఖ్యంగా తెలుగు, తమిళం, హిందీ వంటి ప్రాంతీయ భాషల కంటెంట్కు డిమాండ్ ఎక్కువ. అందుకే, స్థానిక క్రియేటర్లు ఇప్పుడు గ్లోబల్ ఇన్ఫ్లుయెన్సర్లుగా ఎదుగుతున్నారు. ఈ నేపథ్యంలో, ‘2025 గ్లోబల్ షార్ట్ వీడియోస్ ట్రెండ్స్’ సర్వే ప్రకారం, వివిధ సంస్థలు పరిశీలించిన ఫలితాలను వెల్లడి చేశారు. వివిధ మొబైల్ యాప్ల డేటా, యూజర్ సర్వేలు, సోషల్ మీడియా విశ్లేషణల ద్వారా, ఒక్కో దేశంలో ప్రత్యేక కంటెంట్, ట్రెండ్స్ స్పష్టమయ్యాయి. ప్రతి చోటా స్థానిక భాషలు, సంస్కృతులు ఆధారంగా షార్ట్ వీడియోలు కొత్త దారులు సృష్టిస్తున్నాయి.డబుల్ లైఫ్!ఉదయం బాస్ ‘మీటింగ్ టైమ్’ అంటాడు, రాత్రి ఫాలోవర్స్ ‘రీల్ టైమ్’ అంటారు! ఇలా రెండు ప్రపంచాల మధ్య బ్రిడ్జ్ వేసుకుని నడుస్తున్నవారే డబుల్ లైఫ్ ఇన్ ఫ్లుయెన్సర్లు! పగలు ఆఫీస్లో ప్రెజెంటేషన్ ్స చేసి, రాత్రి కెమెరా ముందు ప్రెజెన్ ్స ఇస్తున్నారు. ఇలా ఇండియాలో ఇప్పటి వరకు 45 లక్షల షార్ట్ వీడియో క్రియేటర్లు ఉన్నారని, వారిలో దాదాపు 60 శాతం మంది ప్రైవేట్ ఉద్యోగులు లేదా ఫ్రీలాన్సర్లు అని తాజా రిపోర్టులు చెబుతున్నాయి. ప్రపంచం మొత్తం చూస్తే, సోషల్ మీడియాలోని క్రియేటర్లలో 40 శాతం మంది రెండు ఉద్యోగాలు చేస్తున్నార ని అంచనా. వీరిలో దాదాపు 6 లక్షల మంది క్రమంగా వీడియోల ద్వారా ఆదాయం పొందుతున్నారు. అంటే పగలు జీతం, రాత్రి వైరల్ వీడియోల ఆదాయం! దీంతో చాలామంది ప్రొఫెషనల్ ఉద్యోగం కంటే ఈ సైడ్ ఇన్ కమ్ పైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఆఫీస్లో ఇంక్రిమెంట్ రాకపోయినా, రీల్లో ఎంగేజ్మెంట్ పెరుగుతుంది! అందుకే, ఒక్క రీల్ సక్సెస్ అయితే నెల జీతం కన్నా ఎక్కువ డబ్బు వచ్చేస్తుంది. వీరంతా ప్రతిరోజూ ల్యాప్టాప్ బ్యాగ్లో లంచ్ బాక్స్తో పాటు మరో పక్క ట్రైపాడ్తో ఆఫీస్లకు వెళ్తూ, ఒక కొత్త వర్క్ కల్చర్తో పనిచేస్తున్నారు. మరికొందరు ‘వర్క్ ఫ్రమ్ ఆఫీస్’ మాదిరి ‘వర్క్ ఫ్రమ్ రీల్’ అనే కొత్త ఫుల్ టైమ్ ఉద్యోగం చేస్తున్నారు! ఇలా వచ్చిన పాపులారిటీతో టీవీ షోలు, ఇంటర్వ్యూలు, బ్రాండ్ కొలాబరేషన్లు, సిల్వర్ స్క్రీన్ చాన్ ్సలు కూడా దక్కించుకుంటున్నారు. ఇలా సాధారణ ఉద్యోగుల కంటే వీరి జీవితం ఇప్పుడు మరింత ఆదాయభరితంగా, ఆనందభరితంగా, వైరల్గా మారింది. ఏఐ క్రియేటర్లు! ఇప్పటి క్రియేటర్లకు కెమెరా మాత్రమే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ ్స కూడా పెద్ద సహాయంగా మారింది. వీడియో తీసేందుకు డైరెక్టర్, ఎడిటర్, మ్యూజిక్ డిజైనర్ అవసరం లేదు. ఏఐ వాయిస్, ఫేస్ ఫిల్టర్, స్మార్ట్ ఎడిటింగ్ యాప్లు ఇవే కొత్త టెక్నాలజీ టీమ్ మెంబర్స్. ఒక క్లిక్తో బ్యాక్గ్రౌండ్ మారిపోతుంది, వాయిస్ టోన్ అడ్జస్ట్ అవుతుంది, మూడ్కి సరిపోయే మ్యూజిక్ వచ్చేస్తుంది. కెమెరా ముందు ఉన్నది మనిషే కాని, వెనుక ఆలోచిస్తున్నది మొత్తం ఏఐనే. ఇదే కారణంగా ఇప్పుడు కంటెంట్ క్రియేటర్ల వేగం పెరిగింది. ఒకప్పుడు వీడియోకి రోజులు పట్టేది, ఇప్పుడు నిమిషాల్లో సిద్ధమవుతోంది!రీల్లోనే ఫీల్స్, డ్రీమ్స్! బ్రేక్అప్ అయినా, బర్త్డే అయినా ఇప్పుడు ప్రతి ఒక్క సందర్భానికి రీల్ తప్పనిసరి! ముఖ్యంగా 16 నుంచి 25 ఏళ్ల వయసు వారు ‘రియల్ లైఫ్ కంటే రీల్ లైఫ్ బెటర్!’ అని నమ్ముతున్నారు. సినిమా చూడటానికి ఓపిక లేదు కానీ, రీల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ‘ఒక్క నిమిషం లవ్ స్టోరీ’, ‘30 సెకండ్ల అడ్వెంచర్’, ‘45 సెకండ్ల ట్రాజెడీ’ ఇవే ఇప్పుడు న్యూ ఏజ్ బ్లాక్బస్టర్స్! జెన్ జీ కి రీల్ అంటే భాష కాదు లైఫ్ స్టయిల్. ఇదే కారణంగా ఈ వయసు వారు సోషల్ మీడియాలో అత్యధికంగా యాక్టివ్గా ఉంటున్నారు. ఫ్యాషన్ నుంచి ఫుడ్ వరకూ, ట్రావెల్ నుంచి ట్రెండ్ వరకూ అన్నీ వీళ్ల చేతుల్లోనే! అందుకే, అసలైన వైరల్ పవర్ కూడా వీరివద్దే దాగుంది. ప్రాంతీయ భాషల శక్తిప్రపంచం ఇంగ్లీష్లో మాట్లాడినా, సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రాంతీయ భాషలే రాజ్యం చేస్తున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ భాషల్లో ఉన్న కంటెంట్ ఎక్కువగా వైరల్ అవుతోంది.వీక్షకులు తమ భాషలో ఉన్న కంటెంట్కి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ఇందుకే ఇప్పుడు ప్రతి యాప్ కూడా ‘మీ భాషలో రీల్ క్రియేట్ చేయండి’ అని ప్రోత్సహిస్తోంది. తెలుగు క్రియేటర్ల రీల్స్ ఇప్పుడు గ్లోబల్ ట్రెండ్స్లోకి చేరాయి!రేపటి రియాలిటీ!భవిష్యత్తులో షార్ట్ వీడియోల ప్రపంచం మరింత టెక్ రిచ్గా మారబోతోంది. త్రీడీ వీడియోలు, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ కంటెంట్ ఇవే రేపటి రీల్స్. క్రియేటర్లు ఇప్పుడు కెమెరాతో కాదు, మెటావర్స్లో రికార్డు చేయబోతున్నారు! అప్పుడు ప్రేక్షకులు కేవలం వీడియో చూడరు, దానిలోకి అడుగుపెడతారు. అంటే రేపటి రీల్ కేవలం వినోదం కాదు. ఒక వాస్తవిక అనుభవం అవుతుంది! ఇప్పటికే కొంతమంది క్రియేటర్లు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు కూడా. త్వరలోనే రీల్స్ చూడటం కాదు, అందులో జీవించబోతున్నాం. భవిష్యత్తులో రెజ్యూమేలో డిగ్రీ కాదు. ఫాలోవర్స్ కౌంటే కెరీర్ డిసైడ్ చేస్తుందేమో! హై పెయిడ్ జాబ్స్లో షార్ట్ వీడియో క్రియేటర్ ఒకటిగా మారచ్చు కూడా! అప్పుడు, డాక్టర్ రీల్ మధ్యలో ఆపరేషన్ చేస్తాడు. లాయర్ వాదన మధ్యలో ‘లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్!’ అంటాడు. టీచర్ కూడా కెమెరా ముందు ‘టుడేస్ ట్రెండ్!’ అని క్లాస్ మొదలుపెడుతుంది. ఇలా చాలామంది కంటెంట్ క్రియేటర్నే మెయిన్ జాబ్గా, మిగతా ఉద్యోగాలను పార్ట్టైమ్లా చేస్తారేమో!కిచెన్ నుంచి కెమెరా వరకు!భారతదేశంలో షార్ట్ వీడియోల రంగంలో మహిళల సంఖ్య ఆశ్చర్యకరంగా పెరిగింది. తాజా గణాంకాల ప్రకారం 40 శాతం పైగా షార్ట్ వీడియో క్రియేటర్లు మహిళలే! వంటింటి కథల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ టిప్స్, ఫ్యాషన్ నుంచి ఫిట్నెస్ వరకు, మహిళలు కంటెంట్ ప్రపంచాన్ని కొత్తగా మలుస్తున్నారు. ఇప్పుడు వాళ్లు కేవలం కంటెంట్ క్రియేటర్లు మాత్రమే కాదు, బ్రాండ్ అంబాసిడర్లు, ఇన్ ఫ్లుయెన్సర్లు, స్టార్టప్ ఫేస్లు కూడా అయ్యారు.లక్షల్లో ఆదాయం!చూస్తున్న వీడియోలు కేవలం రెండు నిమిషాలే అయినా, క్రియేటర్లకు మాత్రం లక్షల్లో ఆదాయం తెచ్చిపెడుతుంది. ఇందులో ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న క్రియేటర్ మార్కెట్. 2019లో షార్ట్ వీడియో మార్కెట్ విలువ 1.3 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2025 నాటికి అది 3 బిలియన్ డాలర్లకు చేరనుందని అంచనా. 2027 నాటికి ఇండియాలో క్రియేటర్ ఎకానమీ 45,000 కోట్ల రూపాయల విలువకు చేరనుంది. అందుకే మార్కెటింగ్ కూడా రీల్ ఫార్మ్లోకి వచ్చేసింది. రెండు నిమిషాల్లో బ్రాండ్ కథ చెప్పగలిగిన వారే గెలుస్తున్నారు. ఒక్క స్క్రోల్కి కోట్ల రూపాయల మార్కెట్– ఇదే కొత్త డిజిటల్ వండర్! ఈ కారణంగానే ఇండియాలో ఇప్పటికే పదకొండు వేలకు పైగా చానెల్స్ మిలియన్ల సబ్స్క్రైబర్లు దాటాయి. రోజూ కోటాను కోట్ల వ్యూస్! అంటే ఒక్కొక్క షార్ట్ వీడియో చూస్తే, మన ఫింగర్స్ స్క్రోల్ చేస్తూ ‘ఓ మై గాడ్!’ అని చెప్పాల్సిందే. మనీకంట్రోల్ సంస్థ ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం, ప్రస్తుతం 45 లక్షల ఇండియాలో క్రియేటర్లలో సుమారు 6 లక్షల మంది డబ్బు సంపాదిస్తున్నారు. వారి సబ్స్క్రైబర్లు, ఫాలోవర్స్ ఆధారంగా ఆదాయం వస్తుంది. యూట్యూబ్ గత మూడు సంవత్సరాల్లో 5.8 లక్షల కోట్ల రూపాయలు క్రియేటర్లకు చెల్లించిందట! ఎవరికి తెలుసు? ఈరోజు మీరు చూసిన చిన్న రీల్ రేపటికి లక్షలు తెచ్చే కంటెంట్ కావచ్చు! -
‘చుక్క’బీరు.. చుక్కల్లో ధర..
బీరు బాబులు మగ్గుల్లో బీరు పోసుకుని గుక్కలు గుక్కలుగా తాగుతారు గాని, ఈ సీసాలో ఉన్న బీరును అలా తాగడం కుదరదు గాక కుదరదు. ఎందుకంటే, ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్న బీరు సీసా. ఇందులో ఉన్నది కేవలం ఒక చుక్క బీరు మాత్రమే! గొంతు తడుపుకోవడానికైనా చాలని చుక్క బీరుతో ఈ సీసాను అసలు ఎందుకు తయారు చేశారోననేగా మీ అనుమానం? స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లోని రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అతి చిన్న బీరు సీసా తయారీలో పోటీ నిర్వహించింది. ఈ పోటీలో గెలుపొందిన వారికి నగదు బహుమతితో పాటు, డెన్మార్క్ రాజధాని కోపెన్హాగెన్ కేంద్రంగా పనిచేసే బహుళజాతి బీర్ల తయారీ సంస్థ ‘కార్ల్స్బర్గ్’ ప్రధాన కార్యాలయం సందర్శనకు పంపనున్నట్లు ప్రకటించింది. ఈ పోటీలో పాల్గొన్న స్వీడిష్ మినియేచర్ కళాకారిణి ఆసా స్ట్రాండ్ ‘కార్ల్స్బర్గ్’ బీరుసీసా నమూనాలోనే ధాన్యం గింజంత పరిమాణంలో ఒక్క చుక్క బీరు మాత్రమే పట్టేంత ఈ సీసాను తయారు చేసి, విజేతగా నిలిచింది. ఈమె రూపొందించిన సీసాలో ఉన్న బీరు పరిమాణం 0.05 మిల్లీలీటర్లు మాత్రమే! దీనికి బహుమతిగా చెల్లించిన మొత్తం పదివేల స్వీడిష్ క్రోన్లు (రూ.93,410) కావడం విశేషం.(చదవండి: నటి ప్రగ్యా జైస్వాల్ స్టైలింగ్ టిప్స్..! బ్లాక్ డ్రెస్ ధరించేటప్పుడు..) -
నటి ప్రగ్యా జైస్వాల్ స్టైలింగ్ టిప్స్..!
ప్రగ్యా జైస్వాల్ అంటే సింపుల్ లుక్తోనే మెరిసే స్టార్.ఏ రంగులోనైనా ఏ డ్రైస్లోనైనా, కేవలం కంఫర్ట్ ఫ్లస్ కాన్ఫిడెన్స్ కలయికతో ఫ్యాషన్ స్పార్క్ చూపించే ఆమె స్టయిలింగ్ టిప్స్ మీ కోసం! జిమ్లో గంటల కొద్దీ గడపటం కంటే, శరీరానికి కావలసిన విశ్రాంతి ఇవ్వడమే ముఖ్యం. రెస్ట్, హైడ్రేషన్, హెల్తీ మీల్స్ ఇవే నా ఫిట్నెస్ సీక్రెట్స్. ఫ్యాషన్ విషయానికి వస్తే, సింపుల్, క్లాసీ లుక్స్ను ఇష్టపడతాను. రెడ్, గోల్డ్ నా ఫేవరెట్ కలర్స్. కాని, బ్లాక్ డ్రెస్ వేసుకున్నప్పుడు వచ్చే ఆ క్లాసిక్ ఫీలింగ్ వేరేలా ఉంటుంది. స్టయిలింగ్ ఏదైనా వాటికి కాన్ఫిడెన్స్ కలిస్తేనే అవే బెస్ట్ లుక్ అవుతాయి అని చెబుతోంది ప్రగ్యా జైస్వాల్. ఆమె ధరించిన చీర బ్రాండ్: స్వాన్ గాంధీ, ధర: రూ. 88,000, జ్యూలరీ బ్రాండ్: రాజ్వాడా జ్యూలర్స్, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. రంగురంగుల దండ!ఏ చీర వేసుకున్నా ఈజీగా సెట్ అయిపోయే సీక్రెట్ వెపన్ కావాలా? అయితే వెంటనే ఒక మల్టీకలర్డ్ నెక్పీస్ రెడీ చేసుకోండి. ఇది సాధారణ ఆభరణం కాదు, నవరత్నాల ఫ్యాషన్లో పటాకా మోడ్ ఆన్ చేసే రంగురంగుల మణుల దండ! ఎరుపు, పచ్చ, గులాబీ, ముత్యాలు అన్నీ ఒక్కటే లైఫ్లో మెరిసిపోతూ, ‘నిన్ను చూడగానే దేవతా వైబ్ వచ్చిందమ్మా!’ అని చెప్పించే మ్యాజిక్ ఇది. ఏ రంగు చీర వేసుకున్నా ఈ మల్టీకలర్డ్ నెక్లెస్ ఆటోమేటిక్గా మ్యాచ్ అయిపోతుంది. నలుపు చీర వేసుకుంటే నయగారంగా, పసుపు చీర వేసుకుంటే పండుగలా మారిపోతుంది! జుట్టు బన్ వేసుకుంటే ఈ నెక్లెస్ మెడ చుట్టూ మెరిసిపోతూ లుక్ను హైలైట్ చేస్తుంది. ఓపెన్ హెయిర్ అయితే కంఫర్ట్ ఫీల్తో కూల్ లుక్ ఇస్తుంది. చెవుల్లో చిన్న జుంకాలు పెయిర్ చేస్తే లుక్కి ఫుల్ మార్క్స్. లిప్ కలర్ని నెక్లెస్లోని ఏదో ఒక స్టోన్ షేడ్కి మ్యాచ్ చేస్తే ఇక మీ లుక్ సూపర్హిట్ అనిపించక మానదు. (చదవండి: ఈత కొడుతూ ఫ్లూట్ వాయిస్తూ.. ప్రపంచ రికార్డు !) -
సేఫ్టి షర్ట్..!
‘అన్న షర్టేస్తే మాస్!’ మాత్రమే కాదు, ఇప్పుడు అన్న ఈ షర్టేస్తే సేఫ్ కూడా! అవును, జర్మన్ పరిశోధకులు సృష్టించిన ఈ స్మార్ట్ ఫ్యాబ్రిక్తో తయారైన షర్ట్ చూడ్డానికి సాధారణ షర్ట్లాగే ఉంటుంది. కాని, ఇందులో దాగి ఉన్న మ్యాజిక్ మాత్రం అదిరిపోతుంది! ఈ ఫ్యాబ్రిక్లోని మాలిక్యూల్స్ను వారు ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఫ్యాబ్రిక్ చూడ్డానికి మృదువుగా, ఫ్లెక్సిబుల్గానే ఉంటుంది. కాని, దానిపై ఒక్కసారిగా బలమైన దెబ్బ పడితే, వెంటనే గట్టి కవచంలా మారిపోతుంది. అచ్చం, క్షణాల్లో మారే సాఫ్ట్ షర్ట్ బుల్లెట్ ప్రూఫ్లాగా. బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్ల మాదిరి రక్షణ ఇస్తూనే, చాలా తేలికగా ఉంటుంది, శ్వాస తీసుకోవడానికీ సౌకర్యంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ సైట్లలో ప్రమాదాలు, క్రీడల్లో గాయాలు, వాహన ప్రమాదాలు వంటి ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్న వారికి ఉపయోగపడేలా దీనిని తయారు చేశారట శాస్త్రవేత్తలు. భవిష్యత్తులో ఈ షర్ట్ ఒక ఫ్యాషన్ మాత్రమే కాదు, సేఫ్టీ వేర్ కూడా! (చదవండి: Railway TTE of Rs 50 bribery charge: 44 ఏళ్ల నాటి లంచం కేసు..! చనిపోయినే కొన్నేళ్లకు క్లీన్ చిట్) -
స్వస్థ్ నారీ ముచ్చటగా మూడు రికార్డులు
కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ ప్రచార కార్యక్రమం ‘స్వస్థ్ నారి, సశక్త్ పరివార్ అభియాన్’ (ఎస్ఎన్ఎస్పీఏ) మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్లను సాధించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం... ఈ ప్రచారం దేశంలోని ప్రతి జిల్లాకు చేరింది. 19.7 లక్షల ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. ఆరోగ్య వేదికలలో 11 కోట్ల మందికి పైగా పాల్గొన్నారు.ఒకే నెలలో 3.21 కోట్ల మందికి పైగా హెల్త్కేర్ ప్లాట్ఫామ్లో పేర్లు నమోదు చేసుకోవడం, రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ఒకేవారంలో అత్యధికంగా 9.94 లక్షల మంది పేర్లు నమోదు చేసుకోవడం, హెల్త్ స్క్రీనింగ్ కోసం రాష్ట్ర స్థాయిలో ఒకే వారంలో 1.25 లక్షల మంది ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవడానికి సంబంధించి ‘ఎస్ఎన్ఎస్పీఏ’ గిన్నిస్ రికార్డ్లు సొంతం చేసుకుంది.‘ఎస్ఎన్ఎస్పీఏ’ ప్రచార కార్యక్రమాలలో భాగంగా 1.78 కోట్లమందికి పైగా రక్తపోటు, 1.73 కోట్ల మంది డయాబెటిస్, 69.5 లక్షల మందికి నోటి క్యాన్సర్ పరీక్షలు, 1.51 కోట్ల మందికి రక్తహీనత పరీక్షలు నిర్వహించారు. 1.43 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇవ్వబడ్డాయి. క్షయవ్యాధికి సంబంధించి 85.9 లక్షలకు పైగా మహిళలకు పరీక్షలు నిర్వహించారు.కౌన్సెలింగ్, వెల్నెస్ సెషన్లలో 2.14 కోట్ల మంది పాల్గొన్నారు. ‘మై భారత్’ వాలంటీర్ల క్రియాశీల భాగస్వామ్యంతో 2.68 లక్షల మందికి పైగా నిక్షయ్ మిత్ర ప్రచారం కోసం పేరు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ జాతీయ టీబీ నిర్మూలన క్యాక్రమం (ఎన్టిఇపి) కింద క్షయ రోగులకు అండగా ఉండే వ్యక్తులకు ‘నిక్షయ్ మిత్ర’ బిరుదు ప్రదానం చేస్తారు. -
సీతావనం
‘ఎప్పటికీ ఇలానే ఉంటావా... పెరగవా?’... మొక్కని ముద్దుగా విసుక్కున్నారు సీత. ఆశ్చర్యం... తర్వాత ఆ మొక్కలో పెరుగుదల కనిపించింది. ఆమె తాకితే గాలి లేకపోయినా మొక్క ఊగుతుంది. మొక్కల పట్ల సీత చూపించే మమకారం ఆ స్థాయిలో ఉంటుంది. ‘ఏంటీ ఎవరైనా ఏమైనా అన్నారా... నాతో చెప్పు’... గిన్నె కోడిని దగ్గరకు తీసుకుని అడిగారు సీత.. ‘అవును’ అన్నట్లు మరో కోడి వైపు చూసింది గిన్నె కోడి. మూగ జీవాలతో సీత కమ్యూనికేట్ అయ్యే విధానం ఇలా ఉంటుంది. విచిత్రంగా ఉందా! సీత ఇన్స్టాగ్రామ్ చూడండి. ఆ ప్రేమ మనకూ అర్థమవుతుంది. సీత ఎంత గొప్పగా నటిస్తారో మనకు తెలుసు. తెరవెనక ఆమె మొక్కలను, చెట్లను, మూగజీవాలను ప్రేమిస్తారు. ‘సీతావనం నేచురల్ ఫామ్’లోకి వెళ్లిపోతే, ఆమెది పూర్తిగా వేరే ప్రపంచం. అదొక ప్రేమవనం. ఆ ప్రపంచం ఎలా ఉంటుందో ‘సాక్షి’తో సీత ప్రత్యేకంగా పంచుకున్నారు.→ నా చిన్నప్పుడు హాలిడేస్కి మా అమ్మమ్మవాళ్లింటికి వెళ్లేదాన్ని. మా అమ్మ తోడబుట్టినవాళ్లు మొత్తం పదకొండు మంది. మా పొలంలో పండించిన బియ్యం, కూరగాయలు అవీ చూసినప్పుడు నాకు భలే అనిపించేది. వంకాయలు, బెండకాయలు కోస్తున్నప్పుడు బాగా అనిపించేది. ఎప్పటికైనా ఫామింగ్ చేయాలనే ఆలోచన నాకు అప్పుడే మొదలైంది. అయితే అనుకోకుండా సినిమా హీరోయిన్ని కావడం, బిజీ కావడం, పెళ్లి, పిల్లల వల్ల ఆ ఇష్టాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. కెరీర్ నుంచి కొంచెం బ్రేక్ కూడా తీసుకున్నాను. మళ్లీ నటించడం మొదలుపెట్టాను. ఫైనల్లీ కాస్త టైమ్ దొరకడంతో ముందు ‘రూఫ్ టాప్’ గార్డెనింగ్ మొదలుపెట్టాను. మొక్కలు పెరుగుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఇక నెక్ట్స్ ఏంటి? అనుకుని ఒక ‘ఫామ్’ ఏర్పాటు చేసుకోవాలనుకున్నాను. కాంచీపురంలో ఫామ్ హౌస్ని ప్లాన్ చేసుకున్నాను.→ కాంచీపురంలోని నా ‘సీతావనం ఫామ్’లో రకరకాల పండ్లు, కూరగాయలు పెంచడంతో పాటు గేదెలు, మేకలు, గాడిదలు, కోళ్లు... ఇలా చాలా ఉన్నాయి. ఫామ్ అనేది నా కల మాత్రమే కాదు... మా అమ్మగారిది కూడా. ఈ మధ్యే అమ్మ దూరమయ్యారు. అయితే తన కల నెరవేర్చగలిగినందుకు ఆనందంగా ఉంది. షూటింగ్ లేనప్పుడు కాంచీపురం వెళ్లిపోతాను. ఫామ్లో చిన్న ఇల్లు కట్టుకున్నాను. మొక్కలు, చెట్లు, మూగజీవాల మధ్య ఉన్నప్పుడు నాకు ‘దేవలోకం’లో ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది.→ ఇప్పుడు మనం తింటున్న ఆహారం దాదాపు కలుషితమే. అయితే నేచురల్ ఫామింగ్ అనేది చాలా కష్టం. నేను కొంచెమే పండిస్తాను కాబట్టి ఓకే. కానీ పంట లార్జ్ స్కేల్లో ఉన్నప్పుడు కొన్ని ‘ప్రిజర్వేటివ్స్’ వాడతారు. మరి... పండించినవి పాడవ్వకుండా ఉండాలంటే వాళ్లకు తప్పదు. నేను నా ఫ్యామిలీ వరకే పండించుకుంటాను కాబట్టి ప్రిజర్వేటివ్స్తో నాకు పని లేదు. ఏడాదికి 20 నుంచి 25 మూటల బియ్యం వస్తే... మాకు, మా బంధువులకే సరిపోతుంది. కూరగాయలు, పండ్లు కూడా మావాళ్లకు పంపించేస్తాను. మనం పండించుకున్నవాటికి, బయట కొనుకున్న వాటికి తాజాదనం, రుచిలో చాలా తేడా ఉంటుంది.→ ఫామింగ్ని కమర్షియలైజ్ చేయాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదు. కానీ అందరికీ నేచురల్ ఫుడ్ అందించాలనే లక్ష్యం ఉంది. లార్జ్ స్కేల్లో అందివ్వాలనుకున్నప్పుడు ఉచితంగా ఇవ్వలేం కదా. అయితే ఎలాంటి కలుషితాలు లేకుండా ఆర్గానిక్ ఫుడ్ అందించడమంటే ఇతరుల ఆరోగ్యానికి మేలు చేసినట్లే.→ మంచి ఆహారం తీసుకున్నప్పుడు మన శారీరక ఆరోగ్యం బాగుంటుందనేది అందరికీ తెలిసిందే. ఫామింగ్ వల్ల ‘మెంటల్ హెల్త్’ కూడా బాగుంటుంది. నేను ఎప్పుడైతే ‘రూఫ్ టాప్ గార్డెనింగ్’ మొదలుపెట్టానో అప్పుడే మానసికంగా రిలాక్స్›్డగా ఉంటున్న విషయం నాకు అర్థమైంది. ఫామింగ్ మొదలుపెట్టాక మనుషులతో కమ్యూనికేట్ కావడం తగ్గిపోయింది. మొక్కలు, చెట్లతో కమ్యూనికేట్ అవుతున్నాను.→ మొక్కలు, మూగజీవాలు మన ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటాయి. మనం ఏడిస్తే అవీ ఏడుస్తాయి. ఈ మాటలు కొందరికి విచిత్రంగా అనిపించొచ్చు. కానీ స్వయంగా అనుభవించినవారికి అర్థం అవుతుంది. చెబితే పిచ్చి అనుకుంటారేమో కానీ నేను మాట్లాడినప్పుడు ఆ మూగజీవాలు కూడా నాతో కమ్యూనికేట్ అవుతాయి. అది నాకు మాత్రమే అర్థం అవుతుంది. అలాగే మన ‘టచ్’ కూడా వాటికి ముఖ్యం. నేను ఒక్కో చెట్టుని తాకుతూ వెళుతుంటాను. అప్పుడు గాలి లేకపోయినా అవి ఊగుతాయి. మన స్పర్శ వాటిని అంత ఆనందపరుస్తుంది. నేను ఇన్స్టాగ్రామ్లో రెండు మూడు రీల్స్ పెట్టాను. అవి చూస్తే మీకు అర్థం అవుతుంది. ఓ రెండు మూడు నెలలు ఫామ్కి వెళ్లడానికి కుదరక, ఆ తర్వాత వెళ్లినప్పుడు గేదె పక్కన కూర్చుని, ‘మునియన్ (వాచ్మేన్ పేరు) బాగా చూసుకుంటున్నాడా... సరిగ్గా తిండి పెడుతున్నాడా... మమ్మీ దగ్గర చెప్పు’ అని అడిగితే ‘ఇస్తున్నాడు’ అన్నట్లు వేగంగా తలూపింది. ఆ రీల్ పోస్ట్ చేశాను. ఇంకోటి ఏంటంటే... చిన్నది చాలా నాటీ. నన్ను చూడగానే ఎగురుతుంది. నేను దాంతో ‘ఏంటి ఇంత నాటీ’గా ఉంటావ్? అని అడిగితే, అమ్మకు తన బిడ్డను ఏదో అంటున్నానని అర్థం అయి, నా మీద మీదకు వచ్చింది (నవ్వుతూ). నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. మనకీ, వాటికీ ఉన్న ఒకే ఒక్క తేడా... మనం మాట్లాడగలం... అవి మాట్లాడలేవు... అంతే.→ షూటింగ్ కోసం ఎక్కడికి వెళ్లినా నా మనసంతా నా ఫామ్లో ఉన్న నా పిల్లల పైనే ఉంటుంది. వాచ్మేన్ సరిగ్గా నీళ్లు పెట్టాడా? టైమ్కి ఆహారం పెట్టాడా? వంటివి కెమెరాలో చెక్ చేసుకుంటాను. ఇక రాత్రి నేను నిద్రపోయే ముందు ఫామ్ని ఓసారి కెమెరాలో చూస్తాను. నాలుగు గేదెలు, ఆ తర్వాత ఒక గాడిద, ఆ తర్వాత మేకలు వరుసగా నిద్రపోతుంటాయి. అవి అలా ఒకేచోట హ్యాపీగా నిద్రపోతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నేను పెట్టిన మొక్కకు పువ్వులు పూయలేదనుకోండి... అప్పుడు ఆ మొక్కతో ‘నీకేం తక్కువ చేశాను... బాగానే చూసుకుంటున్నా’ కదా అని మాట్లాడతాను. ఆ మాటలు దానికి అర్థం అవుతాయి. పువ్వులు పూయిస్తుంది. అలాగే చెట్టు పెరగనప్పుడు ‘ఎప్పుడూ ఇలానే ఉండిపోతావా... పెరగనే పెరగవా’ అని నా బాధనంతా వెళ్లగక్కుతాను. అది పెరుగుతుంది. వాటికి నీళ్లు మాత్రమే పోస్తే సరిపోదు... ప్రేమ కూడా ఇవ్వాలి. నేను ఫామ్హౌస్లో లేనప్పుడు వాచ్మేన్ నీళ్లు పోస్తాడు. కానీ ప్రేమను ఇవ్వలేడు కదా. అందుకే నేను వెళ్లినప్పుడల్లా ప్రేమను పంచుతాను. నేను అక్కడ ఉన్నప్పుడు రెండు పూటలా నేనే నీళ్లు పోస్తాను. వాటితో మాట్లాడుతూ, తాకుతూ ప్రేమను పంచుతాను.→ నా ఫామ్లో గిన్ని కోళ్లు కూడా ఉన్నాయి. ఒకసారి నేను కూర్చుని ఉంటే... నా దగ్గరకు వచ్చి కాళ్లెత్తుతూ ఏదో చె΄్పాలని ప్రయత్నం చేసింది. నాకేం అర్థం కాలేదు. బాధగా కనిపించింది. ‘ఏంటమ్మా... ఎవరైనా గొడవపడ్డారా? ఏమైనా అన్నారా?’ అంటే, వెనక్కి తిరిగి చూసింది. దూరంగా ఇంకో కోడి అలిగినట్లు మునగదీసుకుని కూర్చుని ఉంది. వెంటనే దాన్ని తీసుకొచ్చి, ‘ఏంటీ తనతో ఎందుకు మాట్లాడటంలేదు. చూడు... ఎలా ఉందో’ అన్నాను. ‘అమ్మ దగ్గర చెబితే సాల్వ్ చేస్తుంది’ అని దాని నమ్మకం. ఈ రీల్ కూడా నా ఇన్స్టాలో ఉంది. ఇక ఇదే గిన్ని కోడి గురించి ఇంకోటి చెబుతాను. నాతో మాట్లాడటానికి ఎవరైనా కొత్తవాళ్లు వస్తే... వాళ్లని పొడవడానికి వెళ్లిపోతుంది. నేను చాలా రోజుల తర్వాత వెళితే, నా మీదకు ఎగురుతుంది. దానికి చాలా బలం ఎక్కువ. ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అని అలా ఎగురుతూ ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఆ రోజు నా చేతిలో ఒక కర్ర ఉంటే, కోపంగా దాన్ని లాగి కిందపడేసింది. నాకైతే నవ్వాగలేదు. నేను ఫామ్హౌస్కి వెళిపోతే బయటకు రానే రాను.మనం తింటున్న ఆహారాన్ని మనమే పండించుకోవాలనే ఆలోచన నాకు నా పెద్దవాళ్లని చూసి కలిగింది. సందర్భం, సమయం కుదిరినప్పుడు కచ్చితంగా చేయాలనే ధ్యేయంతో పెరిగాను. అనుకున్నట్లే చేయగలిగాను. సహజమైన పద్ధతిలో మన ఆహారాన్ని మనం పండించుకోవడంకన్నా మంచి బహుమతి ఇంకోటి ఉండదన్నది నా ఫీలింగ్. ‘ఐయామ్ రియల్లీ ఎంజాయింగ్’. – డి.జి. భవాని -
దోసె బిజినెస్తో నెలకు రూ. కోటి సంపాదిస్తున్న జంట
ఒక్కోసారి మనకు తగిలిన దెబ్బలే విజయపథంవైపు అడుగులు వేయిస్తాయి. మన అభిరుచులు, కోరికలే మన జీవితంలోఊహించని సక్సెస్కు బాటలు వస్తాయి.ముంబైకు చెందిన జంట సక్సెస్ స్టోరీ కూడా అలాంటిదే.బెంగళూరుకు చెందిన అఖిల్, శ్రీయ దంపతులు ముంబైలో మొదట్లో కొన్ని కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకుంటూ అరకొర జీతాలతో నెట్టుకొచ్చేవారు. దీంతో ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచన ఇద్దరిలోనూ బాగా ఉండేది. అఖిల్ అయ్యర్, శ్రియ నారాయణకు కర్ణాటకలోని దావణగిరె దోసెలంటే పిచ్చి ప్రేమ. దాన్ని తమ స్నేహితులకు రుచి చూపించారు. మంచి స్పందన లభించింది. అంతే వ్యాపార ఆలోచనకు పదును పెట్టారు. ఆ అభిరుచి, పట్టుదలకు కృషి తోడైంది. అలా ఎంబీఏలు, ఐఐటీలు లేకుండానే నెలకు కోటి రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగారు. View this post on Instagram A post shared by Benne (@benne.bombay) ఎలాంటి పెట్టుబడి దారులు, ఫుడ్ ఇండస్ట్రీలో అనుభవం లేకుండానే బాంద్రాలో ఒక చిన్న కేఫ్ను ప్రారంభించారు. కేవలం 12 సీట్లతో కెఫే మొదలైంది. మెల్లిగా మంచి పేరు తెచ్చుకుంది. తాజా దోసెకు తోడు రుచికరమైన చట్నీ ఇంత కంటే ఏం కావాలి. స్పందన అఖండంగా మారిపోయింది. త్వరలోనే, నగరం నలుమూలల నుండి ప్రజలు బెన్నే దోసెల రుచి చూడటానికి అవుట్లెట్ వెలుపల బారులు తీరారు. నేడు ప్రతీ రోజుకి 800కు పైగా దోసెలమ్మే స్థాయికి వారి బిజినెస్ వృద్ధి చెందింది. ఒక్కో దోసె ధర రూ. 250 నుండి రూ. 300 వరకు ఉంటుంది. ఫలితంగా నెలకు రూ. 1 కోటి సంపాదన ఆర్జించే వ్యాపారంగా మారింది. దోసె టేస్టే పెద్ద సక్సెస్ ఫ్యాన్సీ ఇంటీరియర్స్ లేదా సెలబ్రిటీ ఎండార్స్మెంట్లేవీ లేవు. ఒక చిన్న ప్రాంతాన్ని అద్దెకు తీసుకుని దానిని క్లౌడ్ కిచెన్లా మార్చారు. తమ కలల కేఫ్ అయిన బెన్నేగా పేరుపెట్టుకున్నారు. శుభ్రత, నిజమైన రుచి, తాజా వంటలు ఆహార ప్రియులకు తెగ నచ్చేశాయి. ఆ నోటా ఈ నోటా కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారా మంచి గిరాకీ వచ్చింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల ద్వారా ఈ రెస్టారెంట్ ఖ్యాతి పెరిగింది. ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ , అనుష్క జంట 2024లో బెన్నే కేఫ్ను సందర్శించి ఆహా అని అరగించారు. ఇంకా రోహిత్శర్మ లాంటి ప్రముఖుల మనసు దోచుకుందీ బెన్నే దోసె ఇంకా దీపికా పదుకొనే, రణవీర్ సింగ్, రాజ్కుమార్ రావు, శ్రద్ధా కపూర్ , దియా మీర్జా వంటి ప్రముఖులు విరాట్ జంటతో కలిసి కన్నడ బెన్నే దోసెలమీద మనసు పారేసుకున్నవారే. అంతేకాదు సోషల్మీడియా ద్వారా బాగా ప్రచారం చేసుకున్నారు. రీల్స్ ద్వారా మంచి ఆదరణను పెంచుకున్నారు. ఇక్కడ అన్ని రకాల దోసెలతో పాటు, ఇడ్లీ, ఇతర సౌత్ ఇండియన్ టిఫిన్లు, కాఫీ కూడా ప్రత్యేకమే. కాగా శ్రియ నారాయణ్ , అఖిల్ అయ్యర్ దంపతులు ముంబైలో ‘బెన్నే, బెంగళూరు హెరిటేజ్’ గోవాలో ‘బెన్నే బ్రాంచ్లను నిర్వహిస్తున్నారు. అన్నట్టు అఖిల్ ఒకప్పుడు సినిమా నిర్మాత. కాగా ఆమె మనస్తత్వవేత్త. View this post on Instagram A post shared by Benne (@benne.bombay) -
62 ఏళ్ల వయసులో నీతా హాలోవీన్ వేషం, బీటౌన్ ప్రముఖుల సందడి
రిలయన్స్ ఫౌండేషన్ చైర్మన్ నీతా అంబానీ హాలోవీన్ 2025 వేడుకల్లో ఆకర్షణీయంగా నిలిచారు. జామ్నగర్లో నీతా ముఖేష్ అంబానీ ఈ ఈవెంట్ను హోస్ట్ చేయగా, బాలీవుడ్ ప్రముఖులంతా సందడి చేశారు. నీతా ప్రముఖ నటి ఆద్రీ హెప్బర్న్గా కనిపించారు. ఈ వేడుకలో ఆమెతో పాటు మరికొంతమంది బాలీవుడ్ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఓర్హాన్ అవత్రమణి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వేడుకకు సంబంధించిన వీడియోను పంచుకున్నారు. దీంతో ఇది వైరల్గా మారింది. ముంబైలో జరిగిన ఈ వేడుకల్లో ఆలియా భట్ మరియు రణవీర్ సింగ్ వంటి ఇతర బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు నీతా అంబానీ 1950ల నాటి నటి ఆద్రీ హెప్బర్న్ని పోలిన దుస్తుల్లో మెరిశారు. 62 వయసులో కూడా Gen-Z ఐకాన్గా నీతా అంబానీ మారిపోవడం పలువురిని ఆకర్షించింది. భారతదేశంలో పెద్దగా జరుపుకోని ఈ పండుగకు ఇంతటి విలాసం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అటు బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకొనే తన లేడీ సింఘం పాత్రలో కనిపించగా మరో స్టార్ హీరోయిన్ అలియా భట్ లారా క్రాఫ్ట్ పాత్రను పోషించింది. ఇక రణ్వీర్ సింగ్ వే డాన్ 3 హీరో డెడ్పూల్ వేషధారణలో కనిపించగా, ఓర్రీ వీడియోలో అది మార్వెల్ సూపర్ హీరో విశ్వం నుండి వచ్చిన స్పైడర్ మ్యాన్ అని పేర్కొన్నారు. ఇంకా నీతా అంబానీ పెద్దకుమారుడు ఆకాష్ అంబానీ, భార్య శ్లోకా మెహతా కూడా ప్రత్యేక వేషధారణలో అలరించారు.బాలీవుడ్ అర్జున్ కపూర్ ది టెర్మినేటర్ వేషధారణలో ,జాన్వీ కపూర్ ఏంజెలా డి మార్కో వేషధారణలో అలరించారు. ఇదీ చదవండి: Happy Birthday to Nita Ambani దాతగా, వ్యాపారవేత్తగా ఆమెకు ఆమే సాటి! View this post on Instagram A post shared by Orhan Awatramani (@orry)చదవండి: బ్లాక్ ఫంగస్ ఉల్లి, తొక్కే కదా, అని తీసి వాడేస్తున్నారా? -
సౌందర్యపోషణలోనూ ఏఐ..
సాక్షి, సిటీబ్యూరో : ఇందుగలడు అందులేదను సందేహంబు వలదన్నట్లు.. మార్కెట్లో ట్రెండ్ సృష్టిస్తోన్న ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)అన్నింటా చొచ్చుకుపోతోంది. సాంకేతికంగా ప్రగతి పధంలో ఉన్న నగరంలో ఇది మరింత స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోనే తొలిసారిగా సౌందర్య చికిత్సలు అందించేందుకు ఏఐ ఆధారిత క్లినిక్ నగరంలో ఏర్పాటుకావడం విశేషం. కొండాపూర్లోని బొటానికల్ గార్డెన్స్ రోడ్డులో ఏర్పాటైన మైరా ఈస్తటిక్ సెంటర్ (మ్యాక్)ను ప్రముఖ టాలీవుడ్ తారలు హెబ్బా పటేల్, సత్యకృష్ణన్ సందర్శించారు.సినీతారలకు మాత్రమే కాదని, ప్రతి ఒక్కరికీ అందం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోందనడంలో సందేహం లేదన్నారు. ప్రస్తుతం ఆడ, మగ వ్యత్యాసం లేకుండా అందరికీ సౌందర్య చికిత్సలు అవసరం అవుతున్నాయ న్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సౌందర్య పోషణ రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం వల్ల సేవలు మరింత ఉపయుక్తమవుతాయని వీరు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మ్యాక్ వ్యవస్థాపకురాలు శ్రీవల్లి కొర్రపాటి మాట్లాడుతూ దేశంలోనే ప్రప్రథమ ఏఐ ఆధారిత క్లినిక్గా తాము అందించే చికిత్సలు మరింత ఖచ్చితత్వంతో ఉంటాయన్నారు. ఇదీ చదవండి: World Vegan Day 2025 శాకాహారంతో ఆరోగ్య ప్రయోజనాలు -
అందరి నోట.. ‘అమ్మ పాట’, ఏకంగా పదికోట్లు
సాక్షి, సిటీబ్యూరో: ‘అమ్మ పాటే.. జోల పాట.. అమృతానికన్న తియ్యనంటా’.. అంటూ సాగే అమ్మ పాట సోషల్ మీడియాలను ఓ ఊపు ఊపిన సంగతి తెలిసిందే. ప్రతి 2, 3 ఏళ్లకోసారి ఇలాంటి ఒక పాట వైరల్ అవ్వడం మామూలే.. అయితే అలా వచ్చిన పాటల్లో ఎక్కువ కాలం అందరినోట.. ‘అమ్మ పాట’ మెదిలింది.. అంతేకాదు.. అందరి మనసుల్లో అల్లుకుపోయింది. అమ్మ ప్రేమలోని కమ్మదనం, జానపదంలోని నాటుదనానికి అధునాతన సంగీతాన్ని జోడించి ఈ తరం సంగీత ప్రియులను అత్యద్భుతంగా అలరించింది. మిట్టపల్లి సురేందర్ రచించిన ‘అమ్మ పాట’ను గాయని జాహ్నవి శంకర్ ఆలపించారు. ఈ తెలుగు పాట దేశంలోనే కాకుండా విదేశాల్లోని తెలుగువారందరికీ చేరువైంది. ఈ పాట 100 మిలియన్ వ్యూస్ మైలురాయిని చేరిన నేపథ్యంలో ఫిల్మ్నగర్లోని శ్రీకాంత్ షూటింగ్ హౌస్లో సక్సెస్ మీట్ నిర్వహించారు. చదవండి: Happy Birthday to Nita Ambani దాతగా, వ్యాపారవేత్తగా ఆమెకు ఆమే సాటి!ఇప్పటికీ వినిపిస్తోంది.. అమ్మపాట 100 మిలియన్ వ్యూస్ దాటిన సందర్భంగా జాహ్నవి శంకర్ తన సంతోషాన్ని పంచుకున్నారు.. ‘అమ్మ పాట’ కేవలం ఒక పాట కాదు.. ఇదొక అద్భుతమైన అనుభూతని, ప్రతి తల్లికీ అంకితం అన్నారు. తనను, తన పాటను ఆదరించిన ప్రతి ఒక్కరికీ ఈ క్రెడిట్ దక్కుతుందని పేర్కొన్నారు. లాక్డౌన్ సమయంలో విడుదలైన ఈ పాట.. ఈ రోజుకీ అనేక మంది నోట వినిపిస్తోందన్నారు. ఈ సక్సెస్ మీట్కు ముఖ్య అతిథిగా నటి శ్వేతా వర్మ హాజరై జాహ్నవిని అభినందించారు. అమ్మ ప్రేమను మరోసారి ఈ పాట గుర్తు చేసిందని శ్వేతా అన్నారు. ఇందులో సోషల్ మీడియా క్రియేటర్లు, అభిమానులు, ఇన్ఫ్లుయెన్సర్లు పాల్గొన్నారు. ఇదీ చదవండి: బ్లాక్ ఫంగస్ ఉల్లి, తొక్కే కదా, అని తీసి వాడేస్తున్నారా? -
అదిరిపోయే రుచి : ఉసిరితో ఇన్ని రకాలు చేయొచ్చు తెలుసా?
శీతాకాలంలో ఉసిరి చెట్టు గాలి కూడా ఆరోగ్యానికి మంచిది.ఉసిరికాయలో ఉండే పోషకాలు మనలోని రోగనిరోధక శక్తికి, చర్మం, జుట్టు, కీళ్ల ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. పులుపు, తీపి, వగరు కలిసిన ఉసిరితో టేస్టీ టేస్టీ వంటకాలు చేసుకోవచ్చు. హెల్తీ డ్రింక్స్తో మార్నింగ్ను మొదలుపెట్టవచ్చు. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా ఉసిరితో చేసుకోదగిన ఉత్తమ వంటకాలు చూద్దాం.పులిహోర కావల్సినవి: వండి, చల్లార్చిన అన్నం – 2 కప్పులు; ఉసిరి పేస్ట్ – అర కప్పు; పచ్చి మిర్చి – 3; ఎండు మిర్చి – రెండు; ఆవాలు -అర టీస్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; కరివేపాకు – 2 రెమ్మలు; నూనె – 2 టేబుల్ స్పూన్లు; పసుపు – పావు టీ స్పూన్; ఉప్పు – తగినంత; పల్లీలు – టేబుల్ స్పూన్; శనగపప్పు – టీ స్పూన్, జీడిపప్పు– టేబుల్ స్పూన్తయారీ: ఉసిరికాయలోని గింజ తీసేసి, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి ∙బాణలిలో నూనె పోసి, వేడి చేయాలి. దాంట్లో శనగపప్పు, జీడిపప్పు, పల్లీలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి, వేయించాలి పోపు దినుసులు వేగాక ఉసిరి పేస్ట్ వేసి, కలపాలి ∙పై మిశ్రమాన్ని అన్నంలో వేసి, కలపాలి. జామ్కావల్సినవి: ఉసిరి – 250 గ్రా.లు; బెల్లం – 200 గ్రా.లు; నీళ్లు – అర కప్పు; ఏలకులు – 2.తయారీ: ∙ఉసిరిని ఉడికించి, గింజ తీసేసి, మెత్తగా పేస్ట్ చేయాలి ∙మరొక పాత్రలో నీళ్లు, బెల్లం వేసి మరిగించాలి. దీంట్లో ఉసిరి పేస్ట్ వేసి, ఉడికించాలి ∙మిశ్రమం ఉడుకుతుండగా, ఏలకుల పొడి వేసి కల పాలి ∙మిశ్రమ గట్టిగా అయ్యేంతవరకు ఉడికించి, దించాలి. చల్లారాక బ్రెడ్ లేదా చపాతీతో సర్వ్ చేయాలి. చదవండి: World Vegan Day 2025 శాకాహారంతో ఆరోగ్య ప్రయోజనాలులడ్డుకావల్సినవి: ఉసిరి తురుము – అర కప్పు; బెల్లం ΄పొడి – పావు కప్పు; నీళ్లు – పావు కప్పు; నెయ్యి – 2 టీ స్పూన్లు; ఏలకుల పొడి – చిటికెడు; డ్రై ఫ్రూట్స్ (బాదంపప్పు, జీడిపప్పు)– తరిగినవి.తయారీ: ∙ఉసిరి తురుమును నెయ్యిలో కొద్దిగా వేయించుకోవాలి ∙బెల్లం సిరప్ (పావు కప్పు నీళ్లలో బెల్లం తురుము వేసి, పాకం తయారు చేయాలి) తయారు చేసి, అందులో వేయించిన ఉసిరి, డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి ∙మిశ్రమం చల్లారాక చిన్న చిన్న లడ్డూలు చేయాలి. రోజుకు ఒకటి తిన్నా ఇమ్యూనిటీకి బూస్ట్లా ఈ లడ్డూ ఉపయోగపడుతుంది. ఉసిరి హనీ డ్రింక్ కావల్సినవి: ఉసిరి రసం – 2 టేబుల్ స్పూన్లు; తేనె – టేబుల్ స్పూన్; మిరియాల పొడి – చిటికెడు; అల్లం రసం – పావు టీ స్పూన్.తయారీ: ∙అన్నింటినీ కలిపి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి ∙ఇమ్యూనిటీ పెరుగుతుంది, చర్మం నిగనిగలాడుతుంది, జీర్ణక్రియ బాగుంటుంది. ఇదీ చదవండి: బ్లాక్ ఫంగస్ ఉల్లి, తొక్కే కదా, అని తీసి వాడేస్తున్నారా? -
వెజ్ మంచిదా? నాన్ వెజ్ మంచిదా?
శాకాహారం తీసుకునే వారిలో రకరకాల వారుంటారు. కొందరు మాంసాహారాన్ని ఏమాత్రం తీసుకోకపోయినా గుడ్డు వంటి వాటిని శాకాహారంగా ఎంచి అంతవరకు తీసుకుంటూ ఉంటారు. కొందరు జంతువుల నుంచి వచ్చే పాలు, పెరుగు వంటి వాటినీ తీసుకుంటారు గానీ జంతుమాంసానికి దూరంగా ఉంటారు. వీళ్లనే వెజిటేరియన్స్గా చెబుతారు. అయితే శాకాహార నియమాలను చాలా కఠినంగా పాటించే వారిలో మరికొందరు మాంసాన్ని ఎలాగూ తినరు సరే... జంతువుల నుంచి వచ్చే ఉత్పాదనలైనపాలు, పెరుగు వంటి వాటికి సైతం దూరంగా ఉంటారు. ఇలాంటి వారినే ‘వీగన్స్’ అని, వారు ఆచరించే శాకాహార వీగనిజమ్ అంటారు. ఈరోజు (నవంబరు మొదటి తేదీ) ‘వరల్డ్ వీగన్స్ డే’ (World Vegan Day 2025 ) సందర్భంగా శాకాహారంతో కలిగే అనేక ప్రయోజనాలనూ అలాగే వీగనిజమ్తో ఉన్న కొన్ని ప్రతికూలతలనూ, శాకాహారంతోనే వాటిని అధిగమించే మార్గాలను తెలుసుకుందాం.శాకాహారం దేహానికి మేలు చేస్తుందని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. మాంసాహారం తీసుకోవడం వల్ల మన శరీరంలోకి కొన్ని సూక్ష్మజీవులు చేరే అవకాశం లేక΄ోలేదు. వాటివల్ల కొన్ని వ్యాధులూ దరిచేరవచ్చు. కానీ శాకాహారంతో అలాంటి ప్రమాదాలకు అవకాశాలు చాలా తక్కువ.ఆకుకూరలతో త్వరగా కడుపెందుకు నిండుతుందంటే: భోజనంలోకి మటన్, చికెన్ వంటి మాంసాహారం ఉన్నప్పుడు నాలుగు ముద్దలు ఎక్కువగా తినడం కూడా కద్దు. ఇలా ఎందుకు జరుగుతుందంటే... ఆకుకూరలలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. జీవక్రియలకు ఏ మేరకు ఆహారం కావాలో మెదడుకు తెలుసు. అందుకే ఎంత తినాలనుకుంటే అంతా తినలేం.సరిపోయినంత తినేశాక... మెదడు కడుపునకు ఓ సంకేతం పంపిస్తుంది. దాంతో సంతృప్త భావన కలుగుతుంది. దీన్నే ‘సేషియేషన్’ అంటారు. అదే పీచు పదార్థాలు లేని మాంసం తింటున్నప్పుడు దేహానికి అవసరమైన ఫైబర్ సమకూరక΄ోవడంతో కడుపునిండా ఆహారం ఉన్నప్పటికీ ‘ఇంకాస్త కావాలి, మరికాస్త తినాలి’ అనిపిస్తుంది. మెదడు నుంచి అందాల్సిన సంతృప్త సంకేతం అందకపోవడంతో ఇలా జరుగుతుంది. ఇది స్థూలకాయానికీ, తద్వారా అనారోగ్యాలకూ... ఇలా ఓ వలయం కొనసాగుతుంది. మరికాస్త తినాలనిపించే మాంసాహారం కంటే తగినన్ని పీచుపదార్థాల శాకాహారంతో త్వరగా కడుపునిండటమే ఆరోగ్యానికి అన్నివిధాలా మంచిది. ఎందుకంటే అవసరానికంటే ఎక్కువగా ఆహారం తీసుకున్నప్పటికీ... అందులో ఫైబర్ తగినంతగా లేకపోవడంతో జీర్ణవ్యవస్థలోని చిన్నపేగు, పెద్దపేగు క్యాన్సర్లకు అవకాశాలు ఎక్కువ. అదే నిత్యం కూరగాయలు, ఆకుకూరలతో ఆహారం తీసుకునేవారిలో పేగు క్యాన్సర్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. పైగా మాంసాహారంతో త్వరగా సంతృప్త భావన కలగక అదేపనిగా తింటూ ఉండటం వల్ల ఆ ఆహారం కొవ్వు రూపంలో శరీరంలో పేరుకోవడం, దాంతో అనేక ఆరోగ్య అనర్థాలు కలగడం మామూలే. ఈ ప్రమాదాన్ని నివారించడానికి మాంసాహార ప్రియులు తమ జిహ్వ సంతృప్తి కోసం మాంసాహారాన్ని తీసుకుంటూ దానికి సమానంగా వెజిటబుల్ సలాడ్స్ తీసుకుంటూ ఉండాలి. దాంతో స్థూలకాయం, క్యాన్సర్ల ముప్పు తప్పుతుందని నిపుణుల మాట.చదవండి: బ్లాక్ ఫంగస్ ఉల్లి, తొక్కే కదా, అని తీసి వాడేస్తున్నారా?ఆరోగ్యానికి ఆకుకూరలు చేసే మేలు... వెజిటబుల్స్గా పరిగణించే వాటిల్లో... కాయగూరలతోపాటు ఆకుకూరలూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులోని పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల గుండెజబ్బుల నియంత్రణ, బరువు, బీపీ అదుపులో ఉండటం వంటి ప్రయోజనాలు చేకూరుతాయి. ఆకుకూరలు, పండ్లలో కాపర్, మెగ్నీషియమ్ వంటి ఖనిజాలు, లవణాలు, ఫ్లేవనాయిడ్స్ లభిస్తాయి. శాకాహారం నుంచి దొరికే కొవ్వుల్లో ఒమెగా 3, మ్యూఫా, ప్యూఫా వంటి ఆరోగ్యవంతమైన కొవ్వులుంటాయి. జంతువుల నుంచి లభ్యమయ్యే కొవ్వులలో చెడు కొలెస్ట్రాల్ మోతాదులు ఎక్కువగా ఉండటంతో... అవి అంత ఆరోగ్యకరం కాకపోగా, హృద్రోగాల వంటి జబ్బులకు దారితీస్తాయి. ఫలితంగా మాంసాహారం తినేవారితో పోలిస్తే శాకాహారం తినేవాళ్లలో టైప్–2 డయాబెటిస్ (మధుమేహం) అవకాశాలు తక్కువ. అదే మాంసాహారం ఎక్కువ తినేవారిలో స్థూలకాయం వస్తుంది. ఈ స్థూలకాయం మళ్లీ మధుమేహం, రక్తపోటు వంటి అనేక సమస్యలకు ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఆకుకూరలు తినేవాళ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల చర్మానికి ఎప్పటికప్పుడు మంచి పోషణ లభిస్తుంది కాబట్టి వాళ్లలో మేని మెరుపు బాగుంటుంది. ఏజింగ్ ఆలస్యం కావడం వల్ల చాలాకాలం పాటు యంగ్గా కనిపిస్తారు. ప్రోటీన్ల లభ్యత: శాకాహారంతో పోలిస్తే మాంసాహారంలోనే ప్రోటీన్ల లభ్యత ఎక్కువ. మాంసాహార ప్రోటీన్లతో పోలిస్తే శాకాహార ప్రోటీన్లు 50 – 70 శాతమే జీర్ణమవుతాయి. అయితే శాకాహారంతోనే కావలసినన్ని ప్రోటీన్లు లభ్యం కావాలంటే పప్పులు, చిక్కుళ్లు, సోయా ఉత్పాదనలైన... సోయా బీన్స్, సోయా చీజ్, సోయా మిల్క్, టోఫూ వంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఐరన్: రక్తహీనత (అనీమియా) నివారణకు ఐరన్ చాలా అవసరం. ఇది మాంసాహారంలో తక్షణం లభిస్తుంది. మాంసాహారం వల్ల దొరికే హీమ్ ఐరన్ తక్షణం రక్తంలో కలిసి పోతుంది. అయితే శాకాహారం నుంచి కూడా ఐరన్ లభ్యమవుతుంది గానీ... వాటినుంచి వచ్చే నాన్–హీమ్ ఐరన్... కొంత ప్రాసెస్ జరిగాకే రక్తంలోకి చేరుతుంది. అందువల్ల శాకాహారంతో దొరికే ఐరన్ కొంత ఆలస్యంగా రక్తంలోకి ఇంకుతుంది. ఇదీ చదవండి: Henna dye లివర్ సమస్యలకు హెన్నాతో చెక్?అందువల్ల వీగన్స్ ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు (పాలకూర, బ్రకోలీ), డ్రైఫ్రూట్స్, గుమ్మడి గింజలు, నువ్వులు, సోయాబిన్ నట్స్ వంటివి పుష్కలంగా తీసుకోవాలి. విటమిన్–సి ఎక్కువగా ఉండే నిమ్మజాతి పండ్లు, టమాటాలు తినడం వల్ల కూడా ఐరన్ తేలిగ్గా శరీరంలోకి ఇంకుతుంది. విటమిన్ బి12 : ఇది కూడా మాంసాహారంలోనే పుష్కలంగా లభిస్తుంది. ఆ తర్వాత పాలలో అధికంగా ఉంటుంది. ఇక శాకాహారం నుంచే దీన్ని తీసుకోవాలంటే సోయామిల్ వంటి వాటిపై ఆధారపడాలి. కొన్ని సందర్భాల్లో శాకాహారుల్లో విటమిన్–బి12 తగ్గడం వల్ల మెదడు నుంచి అవయవాలకు ఆదేశాలందడంలో ఆటంకాలు, దాంతో స్పృహతప్పడం (సింకోప్) వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఎండకు ఎక్స్పోజ్ కాకుండా ఇన్డోర్స్లోనే ఉంటూ, శాకాహారాన్ని మాత్రమే తీసుకునే వారి లో విటమిన్–డి, విటమిన్–బి12 లోపంతో వచ్చే నరాల సమస్యలు ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే వెజిటేరియన్ ఆహారంపైనే ఆధారపడే వీగన్స్... విటమిన్–డి, విటమిన్–బి 12, ఐరన్ వంటి కీలకమైన పోషకాల కోసం ప్రత్యామ్నాయాలపై మరింత ఎక్కువ దృష్టిపెట్టాలి. విటమిన్ డి: మన శరీరంలోకి క్యాల్షియమ్ ఇంకిపోవాలంటే విటమిన్–డి అవసరం. మాంసాహారం నుంచి కాకుండా వెజిటేరియన్ ఉత్పాదనల ద్వారానే అది లభ్యం కావాలంటే సోయా వంటి ఉత్పాదనలపై ఆధారపడాలి. క్యాల్షియం కోసం: స్ట్రిక్ట్ వీగనిజమ్ పేరిట పాలూ, పాల పదార్థాలకు దూరంగా ఉండేవారిలో క్యాల్షియమ్ లోపం కనిపించే అవకాశాలున్నాయి. అందుకే వీగన్స్ అందరూ తమ దేహాలకు, ఎముకలకు తగినంత క్యాల్షియం అందడం కోసం పాకూర, బ్రాకలీ, పొద్దుతిరుగుడు గింజలు, సోయా ఉత్పాదనల వంటివి తీసుకోవాలి. శాకాహారం తీసుకునేవారిలో ఎముకలో బోన్ మాస్ తగ్గడం, దాంతో కండరాలు, ఎముకల (మస్కులో స్కెలిటల్) సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున కౌమార వయసులో ఉన్న (ఎడాలసెంట్) బాలలు, గర్భిణుల వంటి వారు అన్ని పోషకాలు అందేలా, సమతులాహారం సమకూరేలా మరింత జాగ్రత్తగా పోషకాహారాన్ని తీసుకోవాలి.శాకాహారంతో ప్రయోజనాలివే...ఇటీవల వెల్లడవుతున్న పరిశోధనలు శాకాహారం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు ఇలా వివరిస్తున్నాయి. అనేక రకాల క్యాన్సర్లు ప్రధానంగా పెద్దపేగు (కొలోన్ క్యాన్సర్) ముప్పు తగ్గుదల; ఫ్యాటీలివర్ రిస్క్ తగ్గే అవకాశం. ∙మాంసాహారం వల్ల దేహంలో కొవ్వులు ఎక్కువగా పేరుకు΄ోవడంతో కొలెస్ట్రాల్ మోతాదులు పెరిగి గుండెజబ్బులు, పక్షవాతం, కంటి జబ్బులు, హైబీపీ వంటి వాటికి ఆస్కారమిస్తాయంటూ అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇక మాంసాహారం అరగడానికి పట్టే సమయం ఎక్కువ కాబట్టి అది తిన్నప్పుడు చాలాసేపు మనిషి మందకొడిగా మారతాడని, చురుగ్గా ఉండటం జరగదనేది కొందరు నిపుణుల మాట. శాకాహారం వల్ల దేహంలో పేరుకుపోయే విష పదార్థాలు స్వాభావికంగానే తొలగిపోతాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. దాంతో శాకాహార పదార్థాలను నేచురల్ డీ–టాక్సిఫైయింగ్ ఏజెంట్స్గా చెబుతారు. రంగురంగుల శాకాహారాలతో ఆరోగ్యం : మాంసాహారం సాధారణంగా ఒకే రకమైన రంగుతో కంటికి అంత ఇంపుగా కనిపించకపోవచ్చు. కానీ శాకాహారంలోని రకరకాల వెజిటెబుల్స్ అనేక రకాల రంగులీనుతూ ఆకర్షణీయంగా ఉంటాయి. ఉదాహరణకు క్యారట్, బీట్రూట్లతో ΄ాటు ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగుల్లో లభ్యమయ్యే కాప్సికం (బెల్పెప్పర్) వంటివి. తేలికగా జీర్ణం: శాకాహారంలో పీచు ఎక్కువ కాబట్టి జీర్ణం కావడం కూడా చాలా తేలిక. ఆహారంలో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మొలలు, స్థూలకాయం, డయాబెటిస్, మలబద్దకం, హయటస్ హెర్నియా, డైవర్టిక్యులైటిస్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, పిప్పి పళ్లు (డెంటల్ కేరిస్), పిత్తాశయంలో రాళ్లు వంటి అనేక వ్యాధుల నివారణ జరుగుతుంది. శాకాహారం దేహానికి మేలు చేస్తుందని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. మాంసాహారం తీసుకోవడం వల్ల మన శరీరంలోకి కొన్ని సూక్ష్మజీవులు చేరే అవకాశం లేకపోలేదు. వాటివల్ల కొన్ని వ్యాధులూ దరిచేరవచ్చు. కానీ శాకాహారంతో అలాంటి ప్రమాదాలకు అవకాశాలు చాలా తక్కువ.డాక్టర్ కె. శివరాజుసీనియర్ ఫిజీషియన్ – నిర్వహణ, యాసీన్ -
గాజులండోయ్ గాజులు... తయారు చేసేదిలా!
పిల్లలూ! ఆడవాళ్లు చేతులకు గాజులు వేసుకుంటారని తెలుసు కదా? మరి వాటిని ఎలా తయారు చేస్తారో తెలుసా? గాజుల తయారీకి క్వార్ట్న్, ఇసుక, సోడా యాష్ వాడతారు. వీటిని గాజు స్వభావాన్ని బట్టి మిశ్రమంగా కలిపి యంత్రాల సాయంతో మెత్తనిపోడిగా చేస్తారు. ఈపోడిని ఒక గాజు బట్టీలో నింపి దాదాపు 1400 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 1600 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు వేడి చేస్తారు. ఈ ఉష్ణోగ్రత వల్ల రసాయనిక చర్య జరిగి ఆ మిశ్రమం బుడగలతో కూడిన జిగురులా మారుతుంది. అంటుకునేలా ఉండే ఆ పదార్థాన్ని 1000 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు చల్లారుస్తారు. ఆ సమయంలో ‘మాంగనీస్ డై ఆక్సైడ్’ కలుపుతారు. దీని వల్ల ఆ మిశ్రమంలో ఏమైనా మలినాలు ఉంటే తొలగిపోతాయి. మిశ్రమానికి స్వచ్ఛత వస్తుంది. ఇందులోనే కలరింగ్ ఏజెంట్స్ను కలపడం ద్వారా కావాల్సిన రంగులు వస్తాయి. చల్లార్చిన ఆ పదార్థాన్ని అచ్చుయంత్రాల సాయంతో కావాల్సిన మందం కలిగిన గాజులుగా తయారు చేస్తారు. ఆ తర్వాత వాటికి మెరుగుపెట్టి, చమ్కీలు అద్దుతారు. -
ప్రపంచంలోనే తొలి రోబో షూస్..మార్నింగ్ వాక్ మజాగా!
‘మార్నింగ్ వాక్ మంచిది’ అనే విషయం తెలిసినా...‘మార్నింగ్ వాక్ చేయాలంటే బద్దకంగా ఉంది’ అని మీకు అనిపిస్తుందా? ‘కొంచెం దూరం కూడా పరుగెత్తలేను బాబోయ్’ అనేవారిలో మీరూ ఉన్నారా? అయితే ప్రాజెక్ట్ యాంప్లిఫై’ గురించి మీరు తెలుసుకోవాల్సిందే...ప్రాజెక్ట్ యాంప్లీఫై అనే రోబోటిక్ షూస్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది నైక్ కంపెనీ. తక్కువ శ్రమతో, ఎక్కువ దూరం వేగంగా నడవడానికి ఈ సరికొత్త ఫుట్వేర్ ఉపయోగపడుతుంది. ‘నడక, పరుగు, జాగింగ్కు సంబంధించి ఇది సౌకర్యవంతమైన ఆవిష్కరణ’గా ప్రాజెక్ట్ యాంప్లీఫై గురించి తెలియజేసింది నైక్. తేలికైన మోటర్, డ్రైవ్బెల్ట్, రీచార్జబుల్ బ్యాటరీ ఈ రోబోటిక్ షూస్లో ఉంటాయి. నడక, రన్నింగ్, జాగింగ్ను సులభతరం చేయడమే కాదు... మైలుదూరాన్ని పది నుంచి పన్నెండు నిమిషాల వేగంతో అధిగమించే అథ్లెట్లకు ఈ ప్రాజెక్ట్ యాంప్లీఫై సౌకర్యంగా ఉంటుందని, ఎలక్ట్రిక్ బైక్లు సైక్లిస్ట్లకు ఎలా సహాయపడతాయో అదే విధంగా రోజువారీ కదలికలకు అదనపు శక్తిని అందించడానికిప్రాజెక్ట్ యాంప్లీఫై సహాయపడుతుందని తెలియజేసింది నైక్. చదవండి: Happy Birthday to Nita Ambani దాతగా, వ్యాపారవేత్తగా ఆమెకు ఆమే సాటి! -
లివర్ సమస్యలకు హెన్నాతో చెక్?
జుట్టు, చర్మం రంగును మార్చే గుణం హెన్నాకు (Henna dye) ఉంది. అయితే ఇది అందాన్ని పెంచడమే కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని చెప్తున్నారు నిపుణులు. తాజాగా జరిగిన అధ్యయనం ప్రకారం సహజమైన హెన్నా లివర్ సమస్యలను దూరం చేస్తుందని గుర్తించారు. ఇంతకీ ఇది ఎంతవరకు నిజం. హెన్నా ప్రభావం కాలేయంపై ఎలా ఉంటుందో చూద్దాం. ఒసాకా మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల ప్రకారం.. హెన్నాలోని లాసోనియా ఇనర్మిస్ అనే రంగు.. లివర్ ఫైబ్రోసిస్కు చికిత్స చేయగలదని గుర్తించారు. అధిక మద్యపానం వల్ల, జీవనశైలి వల్ల వచ్చే దీర్ఘకాలిక కాలేయ సమస్యలను తగ్గించడంలో హెన్నా మంచి ఫలితాలు ఇస్తుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. అధ్యయన ఫలితాలు ఇవే.. ఒసాకా మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయం ఒక రసాయన స్క్రీనింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. కాలేయ సమతుల్యతను కాపాడే యాక్టివేటెడ్ హెపాటిక్ స్టెలేట్ కణాలపై నేరుగా పనిచేసే పదార్థాలను గుర్తించడంలో ఇది సహాయపడుతుంది. ఈ వ్యవస్థను ఉపయోగించి.. లాసోన్ను హెపాటిక్ స్టెలేట్ కణాల యాక్టివేషన్ను ఇది నిరోధిస్తున్నట్లు గుర్తించారు. ఎలుకలపై చేసిన అధ్యయనంలో లివర్ ఫైబ్రోసిస్ తగ్గినట్లు తెలుసు కున్నారు. చదవండి: Happy Birthday to Nita Ambani దాతగా, వ్యాపారవేత్తగా ఆమెకు ఆమే సాటి!అధ్యయనంలో హెపాటిక్ స్టెలేట్ కణాల్లోని యాంటీ ఆక్సిడెంట్ ఫంక్షన్లతో సంబంధం ఉన్న అప్ రెగ్యులేటెడ్ సైటోగ్లోబిన్ను గుర్తించారు. అంటే ఈ కణాలు సాధారణ కణాలుగా మారుతున్నాయన్నమాట. హెన్నాలోని లాసోన్ ద్వారా ఔషధాలు తయారు చేస్తే.. లివర్ ఫైబ్రోసిస్ను నియంత్రించవచ్చని శాస్త్రవేత్తలు నమ్ము తున్నారు. హెపాటిక్ స్టెలేట్ కణాలను యాక్టివేట్ చేసి.. ఔషధాలను రవాణా చేయగల డ్రగ్ డెలివరీ సిస్టమ్ను అభివృద్ధి చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దానిని లివర్ ఫైబ్రోసిస్ ఉన్న రోగులకు అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేస్తున్నామని ఒసాకా మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మెడిసన్ డాక్టర్ అట్సుకో డైకోకు తెలిపారు. చదవండి: Karthika masam 2025 దర్శించుకోవాల్సిన పవిత్ర శివాలయాలు -
బ్లాక్ ఫంగస్ ఉల్లి, తొక్కే కదా, అని తీసి వాడేస్తున్నారా?
మార్కెట్ నుంచి మన ఇంటికి ఉల్లిపాయలను తీసుకువచ్చినప్పుడు, చాలా సార్లు ఉల్లిపాయలో నల్లటి పొర కనిపిస్తుంది. సాధారణంగా ఈ పొర తొక్క లోపల కనిపిస్తుంది. మనం దీనిని ఏదో దుమ్ముగా భావించి, కడిగి వాడుకుంటాం. కానీ ఇది నల్లటి ఫంగస్. దీని కారణంగా అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం.బ్లాక్ ఫంగస్ ఉన్న ఉల్లిపాయలు తినడం వల్ల అది మన రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తుంది. దీంతో, అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారు ఈ ఉల్లిపాయల జోలికి పోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.చదవండి: Happy Birthday to Nita Ambani దాతగా, వ్యాపారవేత్తగా ఆమెకు ఆమే సాటి!ఉల్లిపాయలపై నల్లటి మచ్చలు ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇలాంటి వాటిని తినడం వల్ల మ్యూకోర్మైకోసిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ ఇన్ఫెక్షన్ చాలా హాని కలిగిస్తుంది. వివిధ అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి ఉల్లిపాయల్ని తినకపోవడమే మేలు.ఉల్లిపాయ నుంచి ఆ భాగాన్ని తీసివేసి తింటే అది ప్రాణాపాయం కలిగించదు. కానీ, ఇది కొంతమందిలో అలెర్జీని కలిగిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే అలెర్జీలు ఉన్నవారు ఇలాంటి ఉల్లిపాయల్ని తినకూడదు. అదేవిధంగా, ఉబ్బసం ఉన్నవారికి ఇది హానికరం. ఈ ఫంగస్ గాలిలో వ్యాపించి, ఉబ్బసం ఉన్న వ్యక్తి దానిని పీల్చినప్పుడు, అది హాని కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉల్లిపాయను ఒకటి లేదా రెండు పొరలను తీసివేసిన తర్వాత మాత్రమే వాడండి లేదా ఉల్లిపాయలు కొనేటప్పుడు, తొక్క నల్లగా ఉండకుండా చూసుకోండి.మరో ముఖ్య విషయం... ఉల్లిపాయలను ఫ్రిజ్లో ఉంచకూడదు. ఒకవేళ మీరు ఉల్లిపాయలను ఫ్రిజ్లో ఉంచాలనుకుంటే దానిపై ఎటువంటి నల్లటి ఫంగస్ ఉండకూడదు. అలా ఉంటే అది ఇతర ఆహార పదార్థాలతో కలిసిపోయి విషంగా మారుతుంది. అందుకే ఇలాంటి తప్పులు చేయకండి.చదవండి: Karthika masam 2025 దర్శించుకోవాల్సిన పవిత్ర శివాలయాలు -
నీతా అంబానీ : దాతగా, వ్యాపారవేత్తగా ఆమెకు ఆమే సాటి!
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ 62 పుట్టిన రోజు (Happy Birthday to Nita Ambani ) జరుపుకుంటున్నారు. దాతగా వ్యాపారవేత్తగా, ఫ్యాషన్ ఐకాన్గా నీతా అంబానీ పేరు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ భార్యగా మాత్రమేకాదు, వ్యాపారవేత్తగా, దాతగా తన ప్రత్యేకతను చాటుకుంటున్న మహిళ. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, క్రీడలు, సాంస్కృతిక విభాగం, విపత్తు నిర్వహణ లాంటి అనేక అంశాల్లో నీతా అంబానీ తనదైన శైలిలో సేవలందించి లక్షలాదిమందికి దగ్గరయ్యారు. Warmest birthday wishes to our Founder and Chairperson, Mrs. Nita Mukesh Ambani. pic.twitter.com/mK2hdQQ8eU— Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) November 1, 2025 అంతేకాదు ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ సహ యజమానిగా జట్టు విజయవంతంగా నడిపించిన ఘనత ఆమె సొంతం. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సొసైటీ ద్వారా, కళలకు, దేశీయ వస్త్రాలకు ఎంతో ప్రచారం కల్పిస్తున్నారు. అలాగే ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా కూడా ఎంపికైన తొలి భారతీయురాలు. ఇటీవల పారిస్లో జరిగిన ఒలింపిక్స్లో ‘ఇండియా హాల్’ ఏర్పాటుతో ప్రపంచ స్థాయిలో భారతీయ సంస్కృతిని ప్రచారం చేశారు. భారతీయ హస్తకళలను నీతా అంబానీ ‘స్వదేశీ బ్రాండ్’ పేరుతో ప్రోత్సహించారు. నీతా అంబానీ 62వ పుట్టిన రోజు (నవంబరు 1)అనేక మంది ప్రముఖులు, పలువురు సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు అందించారు. అలాగే రిలయన్స్ ఫౌండేషన్, ఎన్ఎంఏసీసీ కూడా నీతా అంబానీ ప్రత్యేకంగా బర్త్డే విషెస్ అందించాయి. -
జిమ్ లేకున్నా హోమ్ చాలు
ఈ రోజుల్లో మహిళల బాధ్యతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇంట్లో గృహిణిగా, ఆఫీసుల్లో ఉద్యోగినిగా మల్టీ టాస్కింగ్గా పనులను చక్కబెట్టాల్సి వస్తోంది. ఇలాంటప్పుడు మైండ్ అండ్ బాడీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. అందుకు రోజువారీ వ్యాయామాలు చేయాలి. జిమ్కు వెళ్లలేం అనుకునేవారు ఇంట్లోనే పాటించదగిన ఫిట్నెస్ కేర్ గురించి తెలుసుకుని ఆచరిస్తే ఎంతో మేలు జరుగుతుంది. బాలీవుడ్ సెలబ్రిటీ జిమ్ ట్రైనర్ యాస్మిన్ చెబుతున్న జిమ్ ఫిట్నెస్΄పాఠాలు ఇవి... దీపికా పదుకొనే, అలియాభట్ ఫిట్నెస్ ట్రైనర్ యాస్మిన్ మహిళల దినచర్యలకు తగిన విధంగా ఇంట్లోనే చేసుకోదగిన ఫిట్నెస్కు మార్గనిర్దేశం చేస్తుంది. పోషకాహారంపైనా దృష్టి పెడుతుంది. మహిళల ఫిట్నెస్ కోసం కోర్ స్ట్రెంత్, ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్ ట్రైనింగ్తో కూడిన బ్యాలెన్స్ను గట్టిగా చెబుతుంది. అంతేకాదు, మెనోపాజ్ వంటి దశలలో మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి సరైన సూచనలనూ అందిస్తుంది.స్థిరత్వం ముఖ్యంచాలా మందిలో ఫిట్నెస్ విషయంలో తీవ్రమైన నిర్ణయాలు ఉంటాయి. ఎక్కువ సమయం, వేగంగా వ్యాయామాలు చేయడం కంటే సరైన సమయంలో సరైన వ్యాయామాలు చేస్తూ ఫిట్నెస్ సాధించడం ముఖ్యం. సమతుల ఆహారం : ప్రాసెస్ చేసి, చక్కెర ఉన్న ఆహారాలను నివారించి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ఫిట్నెస్ లక్ష్యాలలో చాలా ముఖ్యమైనది.అనుకూలమైన వ్యాయామాలు: ఇంట్లో, జిమ్లో ఎక్కడైనా చేయడానికి ఎన్నో రకాల వ్యాయామాలు ఉన్నాయి. నిత్యం బిజీగా ఉండే వ్యక్తులు కూడా అనుకూలమైనవి ఎంచుకొని చేయవచ్చు.ఇంట్లోనే చేయదగిన కొన్ని వ్యాయామాలుట్రైసెప్ డిప్స్: మీ ట్రైసెప్స్ కోసం డిప్స్ చేయడానికి బలమైన కుర్చీని ఉపయోగించవచ్చు. అప్పర్కట్, పంచ్: చేతులను బలోపేతం చేసేలా బాక్సింగ్ విధానంలో కదలికలు ఉండాలి.∙డబుల్ లెగ్ స్ట్రెచ్: నేలపైన పడుకొని, మోకాళ్ళను ఛాతీ వద్దకు తీసుకురావడం, తిరిగి చేతులు, కాళ్లను యధాస్థానానికి తీసుకువెళ్లడం.. ఇలా పదే పదే చేయడం ద్వారా ఉదర కండరాలలో మార్పులు తీసుకురావచ్చు.స్ట్రెయిట్ లెగ్ లిఫ్ట్లు : నేలమీద వీపుపై పడుకుని, కాళ్లను సమాంతరంగా చాపుతూ పైకి ఎత్తాలి. తర్వాత తిరిగి కిందకు చేర్చాలి. మడమ స్పర్శ: నేలమీద పడుకొని, మోకాళ్ల దగ్గర కాళ్లను వంచి, చేతులతో మడమలను తాకడానికి ప్రయత్నం చేయాలి. వ్యాయామం చేసేటప్పుడు శ్వాస లయను కూడా ఒక రిథమ్గా నిర్వహించడం ముఖ్యం. ఎటువంటి గాయం కాకుండా మరొకరి పర్యవేక్షణలో సాధన చేయడం ఉత్తమం.నిటారుగా నిల్చొని, ఒక చేతిని తలకిందుగా పట్టుకుని, నెమ్మదిగా వంగిపాదాన్ని మరొక చేతితో తాకండి. అలాగే రెండో చేతితో చేయాలి. తక్కువ పరికరాలతో వ్యాయామాలుహాలో డంబెల్: పాదాలను, భుజాలను వెడల్పుగా ఉంచి భుజాలు, ట్రైసెప్స్, వీపును లక్ష్యంగా చేసుకోవడానికి రెండు చేతులతో డంబెల్ను పట్టుకొని, దానిని తల చుట్టూ తిప్పాలి. బ్యాండ్ ట్విస్ట్: మార్కెట్లో జిమ్ బ్యాండ్స్ లభిస్తాయి. కాళ్లు, చేతులతో ఈ బ్యాండ్ పట్టుకుంటూ ఎగువ, దిగువ వీపు కండరాలపై నిమగ్నం చేయాలి.కెటిల్బెల్ : ఇది సైడ్ బెండ్ చేయడానికి బాగా ఉపయోగపడే మరొక పరికరం. ఈ కెటిల్బెల్ తో మోచేయి నుండి మోకాలికి ఒక డైనమిక్ కదలిక ఉంటుంది. దీనివల్ల నడుము టోన్ అవ్వడమే కాకుండా, కోర్ కో ఆర్డినేషన్ కూడా మెరుగుపడుతుంది. చేతితో కెటిల్బెల్ తీసుకొని, బరువు ఉన్న వైపు పక్కకు వంగి, రెండో మోకాలిని మోచేయి కలిసే విధంగా పైకి ఎత్తాలి. ఇలా పది నుంచి పన్నెండు సార్లు చేయాలి.మెడిసిన్ బాల్ ట్విస్ట్ దీనితో వ్యాయామం చేస్తే పక్కలు బలోపేతం అవుతాయి. ఇందులో ఛాతీ స్థాయిలో మెడిసిన్ బాల్ పట్టుకుని, తల కింద నుంచి ఒక వైపు నుండి మరొక వైపుకు కదలించాల్సి ఉంటుంది.రోజులో ఖాళీ కడుపుతో కొంత సమయం ఈ వ్యాయామాలు చేస్తే మైండ్కు–బాడీకీ మధ్య సమతుల్యత ఏర్పడుతుంది. పనులకు తగినట్టు శక్తిని పుంజుకోవడానికి, శారీరక చురుకుదనం పెంపొందించుకోవడానికి, పోషకాహారంపై దృష్టి పెట్టడానికి ఈ పై వ్యాయమాలు పనిచేస్తాయి. చదవండి: Karthika masam 2025 దర్శించుకోవాల్సిన పవిత్ర శివాలయాలు -
శతమారథానుడు
మంగళూరుకు చెందిన మాధవ్ సరిపెల్ల ఆటోరిక్షా డ్రైవర్. 68 సంవత్సరాల మాధవ్ ఇప్పటికీ మారథాన్లలో ఉత్సాహంగా పాల్గొంటున్నాడు. ఇప్పటి వరకు 100 మారథాన్లు పూర్తి చేసి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. మాధవ్ కుమారుడు ధనరాజ్ ప్రతిభావంతుడైన స్కేటర్. ఎన్నో పతకాలు గెల్చుకున్నాడు. చైనాలో జరిగిన పోటీలో పాల్గొన్న మాధవ్ తీవ్రంగా గాయపడి ఆటలకు దూరం అయ్యాడు.‘నాన్నా, నేను ఆటలకు దూరం అయ్యాను. నువ్వు దగ్గర కావాలి’ అని ధనరాజ్ అడిగాడో లేదో కానీ కేవలం కుమారుడి కళ్లలో వెలుగు చూడడానికే మారథాన్లలో పాల్గొనేవాడు మాధవ్. తండ్రి పతకం గెల్చుకున్నప్పుడల్లా తానే గెలిచినంతగా సంతోషించేవాడు కుమారుడు.తాజా విషయానికి వస్తే... ఈ నెల 9న జరిగే ‘మంగళూరు మారథాన్ 2025’ కోసం సాధన చేస్తున్నాడు మాధవ్. ‘ఆటో నడపడం తప్పనిసరి కాబట్టి ప్రాక్టీసింగ్ కు నాకు పెద్దగా సమయం దొరకదు. అయినప్పటికీ వారానికి మూడు రోజులు ప్రాక్టీస్ చేస్తున్నాను. 2.45 గంటల్లో 20 కిలోమీటర్లకు పైగా పరుగెత్తాను’ అంటున్నాడు మాధవ్. మాధవ్ బతుకు బండి భారంగానే కదులుతోంది. కుమార్తె నందిని దివ్యాంగురాలు. తన ఇంట్లో కొంత భాగం కూలిపోయింది... కష్టాల సంగతి ఎలా ఉన్నా మారథాన్లో పాల్గొనడం అంటే తనకు ఇష్టం. ఎందుకంటే తనను పోటీల్లో చూడడం, విజేతగా చూడడం కుమారుడికి ఇంకా ఇంకా ఇష్టం కాబట్టి! -
ఆమె ఇల్లే ఓ ల్యాండ్ మార్క్!
ఎవరికైనా ఇంటి అడ్రస్ చెప్పడానికి చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ మార్క్ చెబుతాం తేలిగ్గా కనుక్కోవడానికి! కానీ ఇల్లే అలా ల్యాండ్మార్క్ అయిన అబ్బురం గురించి విన్నారా? ఆ ఘనత క్రికెటర్ దీప్తి శర్మకు దక్కుతుంది. ఆమె ఇంటి ముందు ‘అర్జున అవార్డీ క్రికెటర్ దీప్తి శర్మ మార్గ్: సర్వజన్ వికాస్ సమితి అవద్పురి మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది’ అనే ఆర్చ్ కనపడుతుంది. ఇప్పుడు ఎందుకీ ప్రస్తావన అంటే మహిళా క్రికెట్ వరల్డ్ కప్ పోటీలే! ఆల్రౌండర్గా అందులో ఆమె చూపిస్తున్న ప్రతిభనే సందర్భంగా దీప్తి పరిచయం.. ఆగ్రాలోని షాగంజ్, అవద్పురి కాలనీలో పుట్టి పెరిగారు దీప్తి. చిన్నప్పటి నుంచీ క్రికెట్ అంటే ప్రాణం. క్రికెట్ బ్యాట్తో ఆగ్రా వీధులను చుట్టారు. తన స్పిన్ బౌలింగ్తో ఆ ఊరి దారులను సుపరిచితం చేసుకున్నారు. క్రికెటర్ కావాలన్న ఆ దీక్షే ఆమెను ఈ రోజు స్టేడియంలో నిలబెట్టింది. వరల్డ్ కప్ టీమ్లో భాగస్వామిని చేసింది.అన్నయ్యే తొలి గురువుగా.. దీప్తికి క్రికెట్ మీద ఆసక్తి ఏర్పడింది అన్నయ్య సుమిత్ శర్మ క్రికెట్ ఆడటాన్ని చూసే. అన్నయ్యను అనుకరిస్తూ ఆమె క్రికెట్ ఆడేవారు. అది అన్నయ్య దృష్టిలో పడింది. క్రికెట్ అంటే దీప్తికున్న మక్కువనూ, ఆ ఆటలో ఆమె ప్రతిభనూ గమనించాడు. అంతే! చెల్లికి తొలి కోచ్గా మారాడు. ‘ఆడపిల్లకు క్రికెట్ ఏంటీ?’ అన్న బంధువుల మాటలకు తలొగ్గిన తల్లి .. చెల్లిని క్రికెట్ ఆడనీయకుండా ప్రయత్నించేది. కానీ అమ్మకు తెలియకుండా చెల్లిని గ్రౌండ్కి తీసుకెళ్లి క్రికెట్లోని మెలకువలను నేర్పించాడు అన్నయ్య. ఆట పట్ల ఆ పిల్లలకున్న నిబద్ధతను చూసి తల్లిదండ్రులూ ప్రోత్సహించడం మొదలుపెట్టారు. బంధువుల మాటను బేఖాతరు చేసి. చదువునూ సీరియస్గా తీసుకోవాలనే షరతు పెట్టారు. అలా ఆ ఇంటి పెద్దలు రెండిటి మధ్య సమన్వయం పాటించినట్లే దీప్తి కూడా చదువు, క్రికెట్ రెండిటినీ సమన్వయం చేసుకుంది. ప్రొఫెషనల్ క్రికెటర్గా..గ్రౌండ్లో అన్నాచెల్లెళ్ల క్రికెట్ కమిట్మెంట్ చూసిన స్థానిక కోచ్లు దీప్తికి తదుపరి శిక్షణనివ్వడానికి ముందుకు వచ్చారు. ఆ శిక్షణ ఆమె బ్యాటింగ్ను, బౌలింగ్ స్కిల్స్ను మెరుగుపరచాయి. దానికి తోడు గ్రౌండ్లో గంటల కొద్దీ ప్రాక్టీస్.. ఆమెను ఆల్రౌండర్గా మలిచింది. ఆ ప్రత్యేకతే నేషనల్ సెలెక్టర్లను ఆకట్టుకుంది. పదిహేడేళ్ల వయసులోనే ఆమెకు ఇండియన్ విమెన్స్ క్రికెట్ జట్టులో స్థానం కల్పించేలా చేసింది. ఆమె ప్రతిభ యూపీ వారియర్స్ (ఐపీఎల్)కి కెప్టెన్ను చేసింది. తర్వాత అంతర్జాతీయ క్రికెట్కూ చేర్చింది. సవాళ్లు.. విజయాలుగెలుపు దారి అంత సులువుగా ఉండదు. ఇందుకు దీప్తి క్రికెట్ ప్రయాణం మినహాయింపు కాదు. ఆడపిల్ల క్రికెట్ ఆడటం ఏంటీ అని పెదవి విరవడాల దగ్గర్నుంచి క్రికెట్లో లింగవివక్ష లాంటి నుదురు చిట్లింపుల వరకు ప్రతి చిన్నా పెద్దా సవాళ్లకు ఎదురొడ్డింది దీప్తి. అన్నిటినీ బౌల్డ్ చేసింది.. మూస ఆలోచనలను బౌండరీకి ఆవల నెట్టేసింది. ఒక్కమాటలో క్రికెట్లో ఆమె ప్రకంపనలు సృష్టించిందని చెప్పవచ్చు. వన్ డే ఇంటర్నేషనల్స్లో డబుల్ సెంచరీ చేసిన తొలి భారతీయ మహిళా క్రికెటర్గా రికార్డ్ క్రియేట్ చేయడమే కాదు క్రికెట్లో ఉన్న పురుషాధిపత్యాన్నీ బ్రేక్ చేసింది. ఇలా ఆటలోని ఆమె శైలి, వ్యూహం, స్థిరత్వం అన్నీ మన దేశ మహిళా క్రికెట్ను ఉన్నత స్థితికి చేర్చాయి. అందుకే మన మహిళా క్రికెట్లో ఆమెను ఒక అద్భుతంగా అభివర్ణిస్తారు క్రికెట్ విశ్లేషకులు. చిన్న పట్టణం నుంచి పెద్ద కలతో విశాలమైన మైదానంలోకి అడుగుపెట్టి ఆ కలను ఆమె సాకారం చేసుకున్న తీరు అమ్మాయిలకే కాదు అబ్బాయిలకూ స్ఫూర్తే! అందుకే దీప్తి శర్మ అర్జున అవార్డ్ అందుకున్న వెంటనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఆమె ఇంటిముందున్న రోడ్లను సువిశాలం చేసి.. ఆమె ఉంటున్న వీథికి మౌలిక సదుపాయాలను కల్పించారట. ఆ గౌరవంతోనే అవద్పురి వాసులు తమ వీథి ముందు ‘అర్జున అవార్డీ క్రికెటర్ దీప్తిశర్మ మార్గ్ : సర్వజన్ వికాస్ సమితి అవద్పురి మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది’ అనే ఆర్చ్ను ఏర్పాటు చేశారు. ‘జీవితంలో.. ఆటలో ఎక్కడైనా ఒడిదొడుకులు ఉంటాయి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడమే విజయం. ఆ చాలెంజెసే మనల్ని అద్భుతమైన ప్లేయర్గా తీర్చిదిద్దుతాయి ఆటలో అయినా.. జీవితంలో అయినా!– దీప్తి శర్మ -
మరీ ఇంత అలసత్వమా? 44 ఏళ్ల తర్వాత క్లీన్ చిట్
మన దేశంలో కొన్ని కేసులు ఏళ్లుగా కోర్టుల్లో నలుగుతూనే ఉంటాయి. కింద కోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చినా..పైకోర్టులో సవాలు వేయడంతో కొన్నేళ్లుగా ఆ కేసులు ఓ కొలిక్కి రాకుండా ఉండిపోతాయి. ఈ క్రమంలో క్లయింట్లు చనిపోతే ఇక ఆ కేసు కోసం సంబంధిత బాధితులు ఏళ్లుగా నిరీక్షించి పోరాడితే గానీ న్యాయం జరగదు. ఈ పెండింగ్ కేసులు దేశం మొత్తంగా చాలానే ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే..40 ఏళ్ల నాటి లంచం కేసు.. బాధితుడి చనిపోయిన కొన్నేళ్లకు క్లీన్ చీట్ లభించడం విశేషం. అత్యున్నత న్యాయస్థానం అతడి గౌరవాన్ని పునరుద్ధరించి.. పెన్షన్తో సహా తత్సంబంధిత ద్రవ్యప్రయోజనాలను చట్టపరమైన వారసులకు ఇవ్వాల్సిందిగా అదేశించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..దాదార్ నాగ్పూర ఎక్స్ప్రెస్లో టీటీఈగా పనిచేసిన వీఎం సౌదాగర్ 1988లో ప్రయాణికుల నుంచి రూ. 50ల లంచం తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. శాఖపరమైన విచారణ అనంతరం 1996లో సర్వీస్ నుంచి తొలగించారు. ప్రస్తుతం సదరు బాధితుడు బతికి లేకపోయినప్పటికీ..అతడి కుటుంబసభ్యులు న్యాయం కోసం అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. నిజానికి ట్రిబ్యూనల్ కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిన బాంబే హైకోర్టులో సవాలు వేయండంతో..ఆ తీర్పు నిలిచిపోయింది. అప్పటి నుంచి ఆ కేసు..అలా పెండింగ్లోనే ఉండిపోయింది. గత సోమవారం అత్యున్నత న్యాయస్థానం సదరు బాధితులకు ఊరట లభించేలా చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు సంజయ్ కరోల్, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం బాధితుడిపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని అతడి గౌరవాన్ని పునరుద్ధరించి పెన్షన్తో సహా అన్ని ద్రవ్య ప్రయోజనాలను మూడు నెలల్లోపు అతని చట్టపరమైన వారసులకు ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఈ వివాదం ఎలా వచ్చిందంటే..ఈ వివాదం మే 31, 1988 నాటిది. సౌదాగర్ ముగ్గురు ప్రయాణికుల నుంచి రూ. 50 డిమాండ్ చేశాడని, వారిలో ఒకరికి ఛార్జీలో బ్యాలెన్స్లో రూ.18 తిరిగి ఇవ్వలేదని రైల్వే విజిలెన్స్ బృందం ఆరోపించింది. దీని ఆధారంగా డిపార్ట్మెంట్ విచారణ ప్రారంభించి..ఎనిమిదేళ్ల తర్వాత 1996లో సౌదాగర్ను సర్వీస్ నుంచి తొలగించారు. అయితే ఈ కేసులో కచ్చితమైన ఆధారాలు లేవని, విజిలెన్స్ బృందం గట్టి సాక్ష్యాలను సమర్పించడంలో విఫలమైంది. ప్రయాణికుల సాక్ష్యాలు లంచం తీసుకున్నారనే ఆరోపణకు మద్దతు ఇవ్వలేదు. అంతేగాదు ముగ్గురు ప్రయాణికుల్లో ఇద్దరు ఆయన ఎలాంటి డబ్బులు కోరలేదని, మిగతా కోచ్లను కూడా పర్యవేక్షించాక, రసీదు జారీ చేసి, మిగిలిన ఛార్జీని తిరిగి ఇస్తానని స్పష్టంగా చెప్పారు. దీంతో2002లో, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) కేసును పరిశీలించి, సౌదాగర్ను తిరిగి నియమించాలని భారత రైల్వేలను ఆదేశించింది. అలాగే అధికారులు సమర్పించిన ఆధారాలేవి అతని తొలగింపుని సమర్థించలేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే నాటి ప్రభుత్వం దాన్ని అమలు చేయడానికి బదులు..బాంబే హైకోర్టులో ట్రిబ్యునల్ ఉత్తర్వుని సవాలు చేయండంతో కోర్టు తీర్పుని నిలిపివేసింది. దాంతో అతని నియమకానికి అన్ని విధాలుగా తలుపులు మూసుకుపోయాయి. కానీ అతడి కుటుంబం ఆశ వదులు కోలేదు, ఎప్పటికైన న్యాయం లభిస్తుందని పోరాటం కొనసాగించింది. చివరికి 44 ఏళ్ల తర్వాత ఉపశమనం..దశాబ్దాల నాటి కేసుని సమీక్షించిన ధర్మాసనం సౌదాగర్పై వచ్చిన అభియోగాలు నిరాధారమైనవని తేల్చింది. విచారణ అధికారి విషయాలను వక్రీకరించారని, తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని పేర్కొంది సుప్రీం కోర్టు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సర్వీస్ ఇచ్చిన తీర్పు సరైనదేనని, విచారణ అధికారి చెబుతున్న ఆధారాలు సాక్ష్యుల మాటలతో ఏకభవించలేదని, అందువల్ల తొలగింపు శిక్షను రద్దు చేసే హక్కు ట్రిబ్యునల్కి ఉందని హైకోర్టు గుర్తించడంలో విఫలమైందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అదీగాక ఎలాంటి అధారాలు లేకుండా ఒక చనిపోయిన వ్యక్తి పేరు అవినీతి ఆరోపణలతో కళంకితమైందని మండిపడింది. అందువల్ల ఆయన గౌరవాన్ని పునరుద్ధరించేలా ఇలా సుప్రీం కోర్టు ఆయనకు క్లీన్ చీట్ ఇచ్చింది. ఏదీఏమైనా ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత ఉపశమనం లభించడం బాధకరం. చనిపోయేంత వరకు ఎంత మనోవేదన అనుభవించి ఉంటాడో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కొన్ని కేసుల్లోని అలసత్వం..బాధితులు చనిపోయేంత వరకు న్యాయం లభించకపోవడం అనేది గమనార్హం, బాధకరం కూడా.(చదవండి: చెత్త వేశారో.. మీచెంతకే 'రిటర్న్ గిఫ్ట్'! స్ట్రాంగ్ క్లీనింగ్ పాఠం) -
హర హర మహాదేవ : కార్తీకంలో దర్శించుకోవాల్సిన పవిత్ర శివాలయాలు
కార్తీక మాసంలో మహాశివుడిని భక్తితో పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం, అలాగే కార్తీక మాసం అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనది. అందుకే ఈ మాసం శివరాధనకు అంకితం. ఈ మాసంలో ఒక్కసారైనా శివాలయాలన్ని సందర్శించి, భక్తితో దీపారాధన చేస్తే మోక్షం లబిస్తుందని, కష్టాలన్నీ తొలగి, అన్నీ శుభాలే జరుగుతాయని విశ్వాసం. కార్తీక మాసంలో ఒక్క రోజులోనే పంచారామాలను ఒక్కరోజులోనే సందర్శించడం మరో విశేషం. ఈ సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లో సందర్శించదగిన కొన్ని శివాలయాల గురించి తెలుసుకుందాం.నిజానికి చెప్పాలంటే శివాలయం లేని గ్రామం ఉండదు. అయినా ప్రసిద్ధ శివాలయాలను, జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాలను దర్శించి తరించాలని భక్తులు భావిస్తారు. అమరారామం: గుంటూరు జిల్లాలోని అమరావతిలో ప్రధాన దైవం అమరలింగేశ్వర స్వామి. అమరేంద్ర ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించినందున ఈ పేరు వచ్చింది. కృష్టా నది దక్షిణ ఒడ్డున ఉన్న బాల చాముండిక అమరలింగేశ్వర స్వామి భార్య. ఈ ఆలయం రెండు అంతస్తులను కలిగి ఉన్న భారీ శివలింగానికి ప్రసిద్ధి చెందింది.ద్రాక్షారామం: తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రపురం పట్టణానికి సమీపంలో ఉన్న ద్రాక్షారామంలో కొలువైన శివుడిని భీమేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇక్కడ శివలింగాన్ని సూర్య భగవానుడు స్వయంగా ప్రతిష్టించాడని నమ్ముతారు.దీనిని దక్షిణ కాశి అని కూడా పిలుస్తారు. ఇక్కడి రాతి స్థంభాన్ని ఆలింగనం చేసుకుని భక్తితో మొక్కితే కోరిన కోర్కెలు తీరతాయని విశ్వాసం.సోమారామం: భీమవరంలో ఉన్న సోమారామం పంచారామాలలో మూడవది. ఇక్కడ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించాడట. ఇక్కడ శివుడిని పూజించడం ద్వారా చంద్రుడు తన పాపాలను పోగొట్టుకున్నాడని నమ్ముతారు. అందుకే దీనికి సోమారామం అని పేరు వచ్చింది. చంద్రుని దశల ఆధారంగా దాని రంగు మారుతూ ఉంటుంది. పౌర్ణమి సమయంలో , సోమారామంలోని శివలింగం తెల్లగాను, అమావాస్య కు నల్లగా మారుతుందట.సామర్లకోట: తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోటలోని కుమార రామ ఆలయం పంచారామాలలో చివరిది. వుడిని కుమార భీమేశ్వర స్వామిగా కొలుస్తారు. ఇక్కడ శివలింగాన్ని కార్తికేయుడు ప్రతిష్టించాడని ప్రతీతి. పూర్తిగా సున్నపురాయితో తయారు చేసిన ఇక్కడి శివలింగం దాదాపు 16 అడుగుల ఎత్తు ఉంటుంది అలాగే ఈ ఆలయం 100 స్తంభాల మండపం, ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఏకశిలా నంది ప్రత్యేకం. కోటప్పకొండ : అత్యంత ప్రసిద్ధ శైవ దేవాలయాలలో గుంటూరు జిల్లాలోని కోటప్ప కొండ ఒకటి. 1587 అడుగుల ఎత్తులో ఉన్న ఒక కొండలో అత్యంత పురాతనమైన శివాలయం. శివుడిని త్రికూటేశ్వర స్వామి అని పిలుస్తారు.కోటప్పకొండ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నరసరావు పేటకు 15 కిలోమీటర్ల దూరంలో ఉండే కోటప్పకొండలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇక్కడ శివయ్యను త్రికుటేశ్వరంగా, త్రికుటాచలేశ్వరుడు, త్రికోటేశ్వరునిగా కొలుస్తారు. ఈ కోటప్ప కొండను కాకులు వాలని కొండగా కూడా ఇది ప్రసిద్ధి. శ్రీశైలం: నంద్యాల జిల్లాలో కొలువై ఉన్న శ్రీశైలం దేవస్థానం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 179 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి వయా పాలమూరు జిల్లా నుంచి 229 కిలోమీటర్ల దూరంలో ఈ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రం ఉంది. ఈ దేవాలయాన్ని రెండో శతాబ్దంలో నిర్మించాని చెబుతారు. ఈ క్షేత్రంలో పాతాళగంగ, శిఖరేశ్వర దేవాలయం, సాక్షి గణపతి దేవాలయం, పాలధార, పంచధార వంటి సందర్శనీయ ప్రదేశాలు.ఛాయ సోమేశ్వర స్వామి : నల్లగొండ జిల్లాలోని ఛాయ సోమేశ్వర స్వామి ఆలయం. దీన్ని ఇక్ష్వాకు వంశస్తులు 11, 12వ శతాబ్దంలో నిర్మించారట. ఈ గుడిలోని శివ లింగం ప్రతిరోజూ శాశ్వతమైన నీడను కలిగి ఉంటుంది. అందుకే ఈ గ ఇక్కడి శివుడికి ఛాయా సోమేశ్వరుడనే పేరు వచ్చింది.రామప్ప దేవాలయం: తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు తెచ్చుకున్న ముఖ్యమైన దేవాలయం. తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉంది. అత్యున్నతమైన వాస్తు, శిల్ప సంపదతో ఎనిమిదో శతాబ్దంలో నిర్మించిన ఆలయం. రామప్ప గుడిగా పిలిచే రుద్రేశ్వర స్వామి ఆలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించారు.యాగంటి : కర్నూలు జిల్లాలోనే మరో ప్రముఖ శివాలయం ఉంది. 5వ శతాబ్దంలో నిర్మించారని ప్రతీతి. పార్వతీ పరమేశ్వరులు అర్ధనాదీశ్వర రూపంలో ఒకే రాతితో చెక్కిన విగ్రహ రూపంలో దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. అంతేకాదు శివయ్యను లింగ రూపంలో కాకుండా విగ్రహ రూపంలో కొలవడం మరో ప్రత్యేకత. అలాగే యాగంటి నంది ప్రతీ ఏడాదీ కొంచెం కొంచెం పెరుగుతుందని చెబుతారు.ఆలంపూర్ నవ బ్రహ్మ. : జోగుళాంబ-గద్వాల జిల్లాలో నవబ్రహ్మగా పిలిచే ఈ తొమ్మిది దేవాలయాల శ్రేణిని చాళుక్యులు నిర్మించారు. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ శివుని కోసం తపస్సు చేస్తాడు. శివుడు అనుగ్రహించి ప్రపంచ సృష్టించడానికి కావలసిన శక్తులు బ్రహ్మకు ప్రసాదిస్తూ ఆశీర్వాదిస్తాడు. అందువల్ల శివునికి బ్రహ్మేశ్వరుడు అని కూడా పిలుస్తారు. బ్రహ్మ ఉపసర్గ మొత్తం కుమార, అర్క, వీర, బాల, స్వర్గ, గరుడ, విశ్వ, పద్మ, తారక బ్రహ్మ అనే తొమ్మిది ఆలయాలున్నాయి.సంగమేశ్వరుడు : కర్నూలు జిల్లాలో సప్త నదుల మధ్య కొలువై ఉన్న సంగమేశ్వర ఆలయం ప్రత్యేకత. సప్తనదీ సంగమంగా పిలువబడే శివయ్య ఏడాదిలో కేవలం వేసవి కాలంలో మాత్రమే భక్తులకు దర్శనమిస్తాడు. వేల ఏళ్లనాడు ఆలయంలో ప్రతిష్టించిన వేప లింగం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉండటం విశేషం.వేములవాడ రాజన్న: రాజన్న సిరిసిల్లాల జిల్లాలో వేములవాడ దేవస్థానంలో కొలువై ఉన్న శివాలయం నిర్మాణం, ఆధ్యాత్మిక పవిత్రత రెండింటికీ ప్రసిద్ధి చెందింది. దక్షిణ కాశీగా పేరొందిది. ఇక్కడి ధర్మ గుండం జలాల్లో తప్పనిసరిగా పవిత్ర స్నానం చేయాలని పెద్దలు చెబుతారు.కీసర : లింగ స్వరూపుడైన మహాశివుడు రాముని కోరి క మేరకు శ్రీరామలింగేశ్వరస్వామిగా ఉద్భవించిన అపురూప శైవక్షేత్రమే కీసరగుట్ట. శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం పశ్చిమ అభిముఖంగా ఉండటం ఇక్కడ విశేషం.ఇవి కొన్ని శివాలయాలు మాత్రమే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరెన్నో శివాలయాలు, పవిత్రమైనవిగా, భక్తులు కోర్కెలు తీర్చే కొంగుబంగారం విలసిల్లుతున్నాయి. భక్తుల ఆదరణకు నోచుకున్నాయి. -
రిటర్న్ గిఫ్ట్.. ఫుడ్ డెలివరీ కాదు చెత్త డెలివరీ!
పరిశుభ్రత గురించి ఎంతలా అవగాహాన కార్యక్రమాలు చేపట్టినా..మార్పు మాత్రం శూన్యం. స్వచ్ఛభారత్ అంటున్న..చెత్త, అపరిశుభ్రత తాండవిస్తూనే ఉంటుంది. ఈ విషయంలో బెంగళూరు నగరవాసులకు గట్టి పాఠమే చెప్పనుంది గ్రేటర్ బెంగళూరు అథారిటీ. చాలా వినూత్నమైన రీతీలో తగిన గుణపాఠం చెబుతోంది. చెప్పినా..వినకపోతే ఈ శాస్తి తప్పదని గట్టిగానే హెచ్చరిస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం దీన్ని వింతైన చర్యగా అభివర్ణించడమే కాదు..ఈ పనిష్మెంట్ హాట్టాపిక్గా మారింది. విననివాళ్లకు అదే 'రిటర్న్ గిఫ్ట్'..ఈ మేరకు బెంగళూరు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్(బీఎస్డబ్ల్యూఎంఎల్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) కరిగౌడ మాట్లాడుతూ.."ఇది వింతైన చర్య కాదు. మా కార్మికులు ప్రతి ఇంటికి వెళ్లి వ్యర్థాలను వేరు చేయడం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పొడి, తడి చెత్తను సేకరించడానికి ఇళ్లకు దాదాపు 5 వేలకు పైగా ఆటోలు వెళ్తున్నాయి. అయినప్పటికీ కొందరు మాత్రం రోడ్లపైనే చెత్త వేస్తున్నారు. ఆ వ్యక్తులను పట్టుకునేందుకే సీసీటీవీలను కూడా ఏర్పాటు చేశాం. ఎవరైతే చెత్తవెయ్యొదని అవగాహన కల్పిస్తున్నా వేస్తున్నారో వారికి రిటర్న్ గిఫ్ట్లా ఆ చెత్తను వాళ్ల ఇంటి వద్ద తిరిగి వేయడమేగాక, రూ. 2000లు వరకు జరిమానా విధిస్తాం. అలాగే ఇదేమి వింతేన చర్య కాదు. ఎందుకంటే మా కార్మికులు ప్రతి ఇంటికి వెళ్లి వ్యర్థాలను వేరు చేయడం గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఆఖరికి సోషల్ మీడియాలో కూడా అవగాహన కల్పిస్తున్నాం. అలాగే రోడ్లపై చెత్త వేయకండని అభ్యర్థిస్తున్నాం. అయినా ఇలా చేస్తే..ఇలాంటి చర్య సమంజసమే. బెంగళూరు ఒక "ఉద్యానవన నగరం" అని హైలైట్ చేస్తూ.. ప్రజలను చెత్తను వేయొద్దని, పరిశుభ్రతను కాపాడుకోవాలని చెప్పారు. అయితే కొన్నిచోట్ల చెత్త సేకరించేవారు లేకపోవడంతోనే వాళ్లంతా ఇలా వీధుల్లో చెత్త వేస్తున్నారని అన్నారు. అందుకోసమే భారీ చెత్తడబ్బాలను కూడా ఏర్పాటు చేయనున్నామని." కరిగౌడ తెలిపారు. ఇలాంటి చర్యలు అన్ని రాష్ట్రాల్లో గట్టిగా అమలైతే పూర్తి స్థాయిలో స్వచ్ఛ భారత నినాదం విజయవంతమైనట్లే కదూ..!.(చదవండి: ఈత కొడుతూ ఫ్లూట్ వాయిస్తూ.. ప్రపంచ రికార్డు !) -
అమలా నవమి ఉత్సవాలు, సాక్షి గోపాల్ టెంపుల్ గురించి తెలుసా?
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలోని పూరీ జిల్లా సాక్షి గోపాల్ పవిత్ర పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. పూరీ నుండి 19 కి.మీ దూరంలో ఉన్న సాక్షిగోపాల్ పట్టణంలో ఉంది. ఇక్కడ రాధా కృష్ణులను ఆరాధిస్తారు. మధ్యయుగ ఆలయం కళింగ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. భక్తులు ఇక్కడకు పెద్ద సంఖ్యలో వచ్చి బియ్యం బదులుగా దేవతకు గోధుమలు సమర్పిస్తారు.సాక్షి గోపాల్ ఈ పేరు ఎలా వచ్చింది?సఖిగోపాల్ అని పిలువబడే ఒక పేదవాడు గ్రామాధికారి కుమార్తెను ప్రేమించి ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు.కానీ వారి ఆర్థిక స్థితిలో తేడాను చూసి గ్రామ పెద్ద వీరి ప్రేమను తిరస్కరిస్తాడు. అయితే కొంతకాలానికి గ్రామపెద్ద సఖిగోపాల్తో పాటు, కొంతమంది ప్రజలు తీర్థయాత్ర కోసం కాశీకి వెళ్లారు. అక్కడ గ్రామ పెద్ద అనారోగ్యానికి గురవుతాడు. గ్రామస్తులు ఎవరూ అతనికి సహాయం చేయలేదు. అప్పుడు సఖిగోపాలు మాత్రమే సపర్యలు చేస్తాడు. దీంతో తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని వాగ్దానం చేస్తాడు. కానీ ఇంటికి వచ్చిన మాట మారుస్తాడు. దీనికి సాక్షులని తెమ్మంటాడు. దీంతో స్వయంగా శ్రీకృష్ణుడు సాక్ష్యమిస్తాడు. అలా ఈ ఆలయానికి సాక్షిగోపాల్ అని పేరు వచ్చింది. ఇదీ చదవండి: పంచారామాలలో ప్రథమం అమరలింగేశ్వరాలయంఈ క్షేత్రంలో రాధాదేవీ పాద దర్శనం ప్రముఖ ఉత్సవం. ఏటా కార్తీక మాసం శుక్ల నవమి నాడు ఈ దర్శనం లభిస్తుంది. ఈ ఏడాది శుక్రవారం రాధా పాద దర్శనం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ గోపాల్ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. దీన్నే అక్షయ నవమి, అమలా నవమిగా పేర్కొంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో రాష్ట్రం, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. సాక్షిగోపాల్ పట్టణం ఉత్సవ సన్నాహాలతో కళకళలాడుతోంది. ఈ ప్రత్యేక రోజున, భక్తులకు రాధారాణి దేవి పాదాలను చూసే అరుదైన అవకాశం లభిస్తుంది. ఏడాది పొడవునా దేవీ పాదాల దర్శనం లభించదు. ఈ దివ్య దృశ్యాన్ని ప్రత్యక్షంగా దర్శించేందుకు లక్షలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తారు. రాధా పాద దర్శనం మోక్షం ప్రసాదిస్తుందని భక్తుల నమమ్మకం. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ప్రాచీన సంప్రదాయానికి అనుగుణంగా రాధా పాద దర్శనం ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రాధారాణి దేవత అద్భుతమైన ఒడియా ఇంటి ఆడపడుచు (ఒడియాణి) అలంకరణలో, సాక్షి గోపాలుడు నటవర్ అలంకరణలో భక్తులకు దర్శనమివ్వడం విశేషం. శుక్రవారం ఉదయం 5 గంటలకు దర్శనం ప్రారంభమవుతుంది. సంప్రదాయ ఆచార వ్యవహారాలతో పూజాదులు నిర్వహించి భక్తులకు సులభ దర్శనం కల్పించేందుకు సకల ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల భారీ రద్దీకి అనుగుణంగా ఆలయ అధికార యంత్రాంగం విçస్తత ఏర్పాట్లు చేస్తుంది. గట్టి భద్రత రాధా పాద దర్శనం కార్యక్రమం సజావుగా సాగేందుకు పోలీసులు, స్థానిక యంత్రాంగం సమన్వయంతో సాక్షి గోపాలు పట్టణ వ్యాప్తంగా భద్రత వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. వరుస క్రమంలో భక్తులకు సులభ దర్శనం కల్పించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాల రవాణా క్రమబద్ధీకరణ, రద్దీ నియంత్రణ పట్ల ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ ఏడాది దాదాపు 5 లక్షల పైబడి భక్తులు రాధా పాద దర్శనం కోసం తరలి వస్తారని నిర్వహణ యంత్రాంగం అంచనా. తదనుగుణంగా భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పూరీ జిల్లా మేజి్రస్టేటు , పోలీసు సూపరింటెండెంట్ తదితర ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా సాక్షిగోపాల క్షేత్రం సందర్శించి ఏర్పాట్లు సమీక్షించారు. దర్శనం పురస్కరించుకుని 11 వరుసల బారికేడింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వాహనాలు నిలిపేందుకు పంచసఖ బహిరంగ స్థలం, పరిసర ప్రాంతాలలో సువిశాల పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. -
ఈత కొడుతూ ఫ్లూట్ వాయిస్తూ.. ప్రపంచ రికార్డు!
ఒకేసారి రెండు స్కిల్స్ని ప్రదర్శించడం మాటలు కాదు. అది కూడా సంగీతాన్ని, స్మిమ్మింగ్ని మిళితం చేస్తూ..ప్రదర్శించడానికి ఎంతో ప్రాక్టీస్ ఉండాల్సిందే. లేదంటే నీటిలో తేలుతూ..సంగీత వాయిద్యా పరికరాలను వాయించడం అంత సులువు కాదు. అదికూడా రివర్స్(బ్యాక్ స్టోక్)తో ఈత కొడుతూ వాయిద్యడం అంత ఈజీ కాదు. కానీ ఈ యువకుడు ఆ అసాధారణ ప్రతిభను ప్రదర్శించి రికార్డు సృష్టించాడు. ఈ ఘనతను సృష్టించింది బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మ్యూజిక్ టీచర్ రూబెన్ జాసన్ మచాడో. మంగళూరులోని సెయింట్ అలోసియస్ కాలేజ్ స్విమ్మింగ్ పూల్లో 700 మీటర్లకు పైగా వెనుకకు(బ్యాక్స్ట్రోక్) ఈత కొడుతూ ఫ్లూట్ వాయిస్తూ ఈ 30 ఏళ్ల సంగీతకారుడు ఒక ప్రత్యేకమైన ప్రపంచ రికార్డును క్రియేట్ చేశాడు. ఉదయం పదిగంటలకు బ్యాక్స్ట్రోక్ ప్రదర్శనను ప్రారంభించి..150 మీటర్లు వరకు ఈత కొడితే చాలన్నుకున్నాడట. కానీ అనుహ్యంగా 700 మీటర్ల వరకు ఈత కొట్టి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్(GBWR)లకెక్కాడు. ఈ మేరకు GBWR రూబెన్కి అధికారిక సర్టిఫికేట్ను అందజేసింది. తన తండ్రి సూచన మేరకు ఈ వినూత్న రికార్డుని ప్రయత్నించానని చెబుతున్నాడు రూబెన్ జాసన్ఎవరీ రూబెన్ జాసన్..నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ సేఫ్టీ (NIWS) ధృవీకరించిన లైఫ్ సేవర్ రూబెన్కు హిందూస్తానీ, వెస్ట్రన్ ఫ్లూట్ రెండింటిలోనూ ప్రావీణ్యం ఉంది. అలాగే సాక్సోఫోన్, గిటార్, వంటి ఇతర వాయిద్యాలను వాయించడంలో దిట్ట. ఇక ఆయన బాలీవుడ్, శాండల్వుడ్, కోస్టల్ చిత్రాలలో పలు పాటలకు సంగీతం సమకూర్చారు. అంతేగాదు భారతదేశం అంతటా అనేక ప్రతిష్టాత్మక కార్యక్రమాలలో ప్రదర్శనలు ఇచ్చారు కూడా. ఆయన 2016 వరల్డ్ కల్చర్ ఫెస్టివల్లో కూడా పాల్గొన్నాడు. ఇక రూబెన్కు ఈ ఫ్లూట్ ప్రదర్శనలో సుమారు 15 ఏళ్లకు పైగా అనుభవం ఉండటం విశేషం. (చదవండి: ఎవరీ అయ్యలసోమయూజుల లలిత..? 'స్పెషల్ కేసు'గా ఆ మినహాయింపు..) -
నోటి ఆరోగ్యంతో కొన్ని రకాల క్యాన్సర్లకు చెక్!
నోటి ఆరోగ్యాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అదే పోతుందిలే అని ఉదాసీన వైఖరితో ఉంటారు. నిజానికి నోటి ఆరోగ్యం అంటే దంతాలు ,చిగుళ్ళు మాత్రమే కాదు. మొత్తం శరీర ఆరోగ్యానికి మూల స్థంభం లాంటిది. నోటి అరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే గుండె జబ్బులు, ప్రమాదకర క్యాన్సర్లకు దారి తీస్తుంది. అందుకే దంతవైద్యులు, వైద్యులు ఇద్దరూ నోటి ఆరోగ్యం ముఖ్యమైనదని నొక్కి వక్కాణిస్తున్నారు. అదెలాగో చూద్దాం.డాక్టర్ సోనియా దత్తా, MDS, PhD, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ ప్రొఫెసర్ ప్రకారం సరైన నోటి ఆరోగ్యం దైహిక ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని క్యాన్సర్లు ప్రమాదాలను తగ్గిస్తుంది. అంతేకాదు క్యాన్సర్ నివారణలో ఇదొక కీలక అంశం.క్యాన్సర్ నివారణకు సరైన నోటి ఆరోగ్యంమంచి నోటి ఆరోగ్యం కేవలం శుభ్రమైన దంతాలను కలిగి ఉండటం కంటే ఎక్కువ.నోటి ఆరోగ్యం అందం సౌకర్యం మాత్రమే కాదు. తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారికి, నోటి పరిశుభ్రతను పాటించడం అవసరం.ఇది జీవన నాణ్యతను నేరుగా ప్రభావితం చేస్తుంది. సరిగా శుభ్రం చేయని నోటిలో బ్యాక్టీరియా పెరిగి, దీర్ఘకాలిక వాపు (inflammation) ఏర్పడుతుంది, ఇది కణజాల క్షీణతకు దారితీయవచ్చు.డాబర్ రెడ్ పేస్ట్ వంటి ఆయుర్వేద పేస్ట్తో రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం, ఫ్లాసింగ్ చేయడం మరియు యాంటీ బాక్టీరియల్ మౌత్ వాష్ ఉపయోగించడం వంటి సాధారణ అలవాట్లు బ్యాక్టీరియా భారాన్ని తగ్గించడ , నోటి లోపలి వ్యవస్థను సమతుల్యంగా ఉంచడం ద్వారా ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గిస్తాయి.AIIMS (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, నోటి పరిశుభ్రతను ప్రామాణిక ఆంకాలజీ సంరక్షణలో విలీనం చేయాలి . INHANCE (ఇంటర్నేషనల్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఎపిడెమియాలజీ) కన్సార్టియం, మంచి నోటి పరిశుభ్రత, (వార్షిక దంత పరీక్షలు, తక్కువ పళ్ళు తప్పిపోవడం, రోజువారీ బ్రషింగ్) తల , మెడ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని కనుగొంది.క్రమం తప్పకుండాచేసుకునే సాధారణ దంత పరీక్షలు చాలా ముఖ్యమైనవి. తద్వారా నోటి క్యాన్సర్ ముందస్తు సంకేతాలను గుర్తించవచ్చు. కనిపించకుండా ఉండే అనుమానాస్పద గాయాలు, నిరంతర పూతల లేదా కణజాల ఆకృతిలో మార్పులు ఈ పరీక్షల్లో వైద్యులు గుర్తిస్తారు. అలాగే పొగాకుకు నిషేధించడం, మద్యం పరిమితం చేయడం ద్వార క్యాన్సర్ ప్రమాదం మరింత తగ్గుతుంది. ఈ చర్యలు నోటి ఆరోగ్యాన్ని రక్షించడమే కాకుండా దీర్ఘకాలిక క్యాన్సర్ నివారణ వ్యూహాలలో శక్తివంతమైన సాధనాలుగా కూడా పనిచేస్తాయి, ముఖ్యంగా తల మరియు మెడ క్యాన్సర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో.నోటి ఆరోగ్యం - కొన్ని రకాల క్యాన్సర్లు తల, మెడ క్యాన్సర్లు: దీర్ఘకాలిక చిగుళ్ల వ్యాధి, పేలవమైన నోటి పరిశుభ్రత లాంటివి నోరు, గొంతు స్వరపేటికలో ప్రాణాంతంగా మారే వాపు మరియు సెల్యులార్ మార్పులను పెంచుతాయి.జీర్ణవ్యవస్థ క్యాన్సర్లు: పీరియాడోంటల్ వ్యాధి కడుపు, ప్యాంక్రియాటిక్ మరియు కొలొరెక్టల్ క్యాన్సర్ల ప్రమాదాలతో ముడిపడి ఉంది.ఊపిరితిత్తుల మరియు ప్రోస్టేట్ క్యాన్సర్లు: నోటి అపరిశుభ్రత, అనారోగ్యం ఈ క్యాన్సర్ల ముప్పును పెంచుతుంది. (స్వరోవ్స్కి ఈవెంట్లో రష్మిక స్టైలిష్ లుక్ : ఎంగేజ్మెంట్ రింగ్ స్పెషల్!)అయితే ఇది అన్ని క్యాన్సర్లను నిరోధించకపోయినా, మంచి నోటి సంరక్షణ కొన్ని రకాల క్యాన్సర్లు ముప్పును తగ్గిస్తుంది. మ్యూకోసిటిస్, ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలను తగ్గించడం ద్వారా క్యాన్సర్ చికిత్స ఫలితాలను మెరుగు పడతాయి. రోగనిరోధక పనితీరు మెరుగుపడుతుంది. నోటి సంరక్షణ ఎలా?ఆయుర్వేద పేస్ట్తో ప్రతిరోజూ రెండుసార్లు బ్రష్ చేయడం, క్రమం తప్పకుండా ఫ్లాసింగ్ చేయించుకోవడం. యాంటీ బాక్టీరియల్ మౌత్ వాష్ పొగాకు, ఆల్కహాల్కు దూరంగా ఉండటం చక్కెర, యాసిడ్ ఫుడ్స్, పానీయాలకు దూరంగా ఉండాలి. లేదంటే ఇవి దంతాల ఎనామిల్ను పాడుచేస్తాయి, బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. కనీసం సంవత్సరానికి ఒకసారైనా దంతవైద్యుడిని సంప్రదించాలి.నోటిలో ఏదైనా అసాధారణ గడ్డలు, పుండ్లు లేదా ఇతర మార్పులను గమనించి నట్లయితే, వెంటనే దంతవైద్యుడిని సంప్రదించండి. -
ఎవరీ అయ్యలసోమయూజుల లలిత..? 'స్పెషల్ కేసు'గా ఆ మినహాయింపు..
తొలి మహిళ ఇంజనీర్గా కంప్యూటర్ రంగంలో కృషి చేసిన కర్ణాటకకు చెందని రాజేశ్వరి ఛటర్జీ లేదా మెరైన్ ఇంజనీర్ సోనాలి బెనర్జీ పేర్లనే చెప్పుకుంటాం. కానీ వారందరికంటే ఒక వితంతవు..నాటి సామాజిక పరిస్థితులను చేధించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రంగంలో చేరి, రాణించి దేశానికే ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరుకుంది. చరిత్ర ఆమె విజయాలను అంతగా గుర్తించకపోయినా..ఎలక్రికల్ ఇంజనీర్లో తొలి మహిళా గ్రాడ్యుయేట్ అనేది కాదనలేని సత్యం. అంతేగాదు ఎందరో అమ్మాయిలు ఆ రంగంలో చేరేలా పురికొల్పేందుకు కారణమైంది. నాడు ఆ ఒక్క మినహాయింపుతో..ఎవ్వరూ చేయలేని సాహసం చేసిన తొలి మహిళ ఆమె. ఔను ఏరంగంలోనైనా ఫస్ట్ పొజిషన్లో ఉండటం అంటే భయంగానే ఉంటుంది. ఎందుకంటే మార్గదర్శకులు ఉండరు, పైగా ఎన్నో కళ్లు మన గెలుపుని అనుమానిస్తాయి, తక్కువ అంచనా వేస్తాయి. వాటన్నింటిని అధిగమించి అసాధారణ గెలుపుని ఒడిసి పట్టి యావత్తు ప్రపంచం గుర్తించుకునేలా చేసిన తొలి మహిళా ఇంజనీర్ ఆమె. ఈ తరానికి అంతగా తెలియని, గుర్తింపుకు నొచుకుని ఆ మహిళ ఇంజనీర్ ఎవరంటే..ఆ మహిళే..భారతదేశపు తొలి మహిళా ఇంజనీర్ అయ్యలసోమయూజుల లలిత. మన తెలుగమ్మాయే. చెన్నైలోని గిండిలోని ఇంజనీరింగ్ కళాశాలలో చేరినప్పుడూ తొలి రోజు కాలేజీలో ఎదురైన ఘటనకు మరెవ్వరైనా..మళ్లీ అడుగు పెట్టడానికే భయపడిపోతారు. కానీ లలిత ఉక్కు ధైర్యంతో ముందుకుసాగారామె. ఆ రోజుల్లో ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్లో అంతా అబ్బాయిలే ఉండేవారు. ఒకే ఒక్క అమ్మాయి తన సహచర విద్యార్థిగా అడుగుపెడుతుందని తెలిసి అంతా వింతగా, ఎగతాళిగా నవ్వులు వినిపిస్తున్నా..ఓపికతో భరించింది. కూర్చొనేందుకు చోటు లేని పరిస్థితి. ఆమె కోసం ప్రత్యేకంగా సెపరేట్గా వేసిన కూర్చీలో కూర్చొని పాఠాలు వినింది. కాటన్ చీరలో తలొంచుకుని నిశబ్దంగా వస్తున్న అమ్మాయిని చూసి అందరికీ చిన్న చూపు, ద్వేషం. అయినా తన పని, లక్ష్యంమీద దృష్టిపెట్టి..కొద్దికాలంలోనే ప్రొఫైసర్లకు, తన తోటి పురుష విద్యార్థులకు అభిమాన సహచర విద్యార్థినిగా పేరుతెచ్చుకుంది. అంతేగాదు ఆ కాలేజీలో మహిళ హాస్ట్ల్ లేకపోయినా..తన కోసం కేటాయించిన ప్రత్యేక గదిలో ఉండి, చదువుకోవడానికి ఎంతో ధైర్యం కావాలి.ఇంజనీరింగ్ కోర్సులో చేరేందుకు దారితీసిన పరిస్థితి..ఆగస్టు 27, 1919 చెన్నైలో ఒక తెలుగుకుటుంబంలో జన్మించిన లలిత నాటి కాలంలోని సామాజిక పరిస్థితులన్నింటిని ధిక్కరించి చదువుకున్న తొలి మహిళ. 15 ఏళ్ల ప్రాయానికే వివాహం చేసుకుని 18 ఏళ్లకే వితంతువుగా మారింది. శ్యామల అనే కూతురుకి తల్లిగా మారింది. ఒక్కసారిగా నిశబ్దంలోకి తొంగి చూస్తున్న ఆమె జీవితాన్ని మార్చాలనుకున్నాడు ఆమె తండ్రి ఇంజనీర్, లెక్చరర్ అయిన ప్రొఫెసర్ అయ్యల సోమయాజుల సుబ్బారావు. ఆమె జీవితంలోకి వచ్చిన నష్టాన్ని పూరించలేకపోవచ్చు..ఏదో వ్యాపకంతో ఆమె జీవితం చిగురించేలా చేయాలని ఆశించారు. కేవలం విద్యతోనే ఆర్థిక స్వాతంత్య్రాన్ని పొంది ధైర్యంగా మనగలదని ప్రగాఢంగా నమ్మారాయన. ఆ ఉద్దేశ్యంతోనే ఇంట్లోనే లలితకు గణితం, భౌతిక శాస్త్రాన్ని బోధించారాయన. ఆ తర్వాత గిండిలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కు దరఖాస్తు చేసుకోమని ప్రోత్సహించారు. అయితే ఆ సమయంలో మహిళా హాస్టళ్లు లేవు, ప్రత్యేక సౌకర్యాలు లేవు. స్త్రీని చేర్చుకునే విద్యావిధానం కూడా లేదు. కానీ సుబ్బారావుగారు స్వయంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రెడ్డికి విజ్ఞప్తి చేసి లలితను 'స్పెషల్ కేసు'గా చేర్చుకునేలా ఒప్పించారు. ఆ ఒక్క మినహాయింపు చరిత్ర గతిని మార్చేసింది. అయితే లలిత తండ్రి నమ్మకాన్ని నిజం చేసేలా తన కోర్సులో రాణించింది, మంచి స్కిల్ సంపాదించుకుంది. అలా 1944 నాటికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రురాలై..భారతదేశపు తొలి మహిళా ఇంజనీర్ అయ్యిందామె. గ్రాడ్యుయేషన్ అనంతరం లలిత సిమ్లాలోని సెంట్రల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్(సీఎస్ఓ)లో చేరారు. అక్కడ ఆమె దేశానికి కీలకమైన విద్యుత్ పరికరాలు సాంకేతికత భద్రతా ప్రమాణాలను నిర్ణయించే విధులను నిర్వర్తించేది. ఆ తర్వాత కలకత్తాలోని అసోసియేటెడ్ ఎలక్ట్రికల్(ఏఈఐ)లో విద్యుత్ కేంద్రాల కోసం విద్యుత్ జనరేటర్లు, రక్షణ రిలేను రూపొందించారు. అంతేగాదు దేశ పురోగతికి శక్తినిచ్చే.. విద్యుత్గ్రిడ్కి సంబంధించిన సమర్థవంతమైన వ్యవస్థలో స్పెషలిస్ట్గా ఉన్నారు. నిశబ్దంగా ఉండే ఆమె ధోరణి వల్లే ప్రపంచానికి లలితా అనే ఎలక్ట్రికల్ ఇంజనీర్ గురించి తెలియకుండాపోయింది. ఒక పక్క కూతురు శ్యామలను పెంచుతూనే ఇంజనీరింగ్ వృత్తిలో అంచలంచెలుగా రాణిస్తోందామె. ఆమెకు దక్కిన అసాధారణ గుర్తింపు..1964లో, న్యూయార్క్లో జరిగిన మొదటి అంతర్జాతీయ మహిళా ఇంజనీర్లు, శాస్త్రవేత్తల సదస్సు(ICWES)లో లలిత భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆ సదస్సులో ఆమె 35 దేశాల మార్గదర్శకులతో వేదికను పంచుకుంది. అంతలా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విశేష ప్రతిభను కనబర్చిన ఆమె 1979లో మరణించారు. కానీ చరిత్ర ఆమె సాధించిన విజయాలను అంతగా గుర్తించలేదు. తొలి మహిళా ఇంజనీరింగ్గా ఎవరెవరో పేర్లను వినిపించేదే తప్ప వారందరికంటే..లలిత ఒక వితంతువుగా నాటి సామాజిక పరిస్థితులను చేధించుకుంటూ సాగిన వైనాన్ని గుర్తించకపోవడం బాధకరం.(చదవండి: ఇద్దరు పిల్లల తల్లి సాహసం..! మరో రికార్డు కోసం..) -
స్వర్గం, నరకం అంతా మన లోపలే!
ఒకానొకసారి, ఓ బలవంతుడైన వస్తాదు జ్ఞానం, ప్రశాంతతకు పేరుగాంచిన బౌద్ధ గురువు వద్దకు వచ్చాడు. ఆ వస్తాదు అంటే అందరికీ భయమే. అతని హృదయం కోపంతో గందరగోళంగా ఉండేది. చేస్తున్న పనుల పట్ల చిరాకూ పరాకూ పడుతుంటేవాడు. అతను సన్యాసి వద్దకు వచ్చీ రావడంతోనే తలవంచి నప్పటికీ అహంకారంతో అడిగాడు: ‘గురువుగారూ! నాకు స్వర్గం, నరకం గురించి బోధించాలి’. సన్యాసి అతని వైపు చూసి చిన్నగా నవ్వి, ‘నీకు వాటి గురించి చెప్పాలా? నీ మాటలో గర్వం కనిపిస్తోంది. నేను విడమరిచి చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు’ అన్నారు. ఆ మాటతో వస్తాదు కోపంతో ఊగిపోతూ, తన దగ్గరున్న కత్తిని తీసి ‘మీరన్న మాట నన్ను అవమానపరిచింది. నేను ఇప్పుడే మిమ్మల్ని చంపగలను’ అని అరిచాడు. సన్యాసి ఏమాత్రం కంగారు పడలేదు. అతని కళ్ళలోకి చూసి ప్రశాంతంగా చూస్తూ, ‘ఇదిగో ఈ నీ చర్యే నరకం’ అని చెప్పారు. వస్తాదు స్తంభించిపోయాడు. అతని కోపం కరిగిపోయింది. సిగ్గుపడ్డాడు. తన కత్తిని పక్కనపెట్టి సన్యాసి ముందు మోకరిల్లి, ‘క్షమించండి... నాకు వాస్తవాన్ని చిన్న మాటతో నేర్పించినందుకు ధన్యవాదాలు’ అని మృదువుగా అన్నాడు. సన్యాసి సున్నితంగా నవ్వి, ‘ఇదిగో ఇదే నువ్వడిగిన స్వర్గం’ అన్నారు. ఈ చిరుఘటన ధ్యానం సారాంశాన్ని చెబుతోంది. ధ్యానం జీవితం నుండి తప్పించుకోవడం గురించినది కాదు, అది మన అంతర్గత ప్రపంచాన్ని స్వాధీనం చేసుకోవడం గురించి చెప్పేది. ధ్యానం చేసినప్పుడు ఆలోచనలు, భావోద్వేగాలు సముద్రంలో అలల వలె పైకి ఎగరడం, కింద పడటం అనుభవంలోకి రావడం గమనిస్తాం. అప్పుడు ఆందోళనపడటం మానేసి, దాని కింద ఉన్న ప్రశాంతతను చూస్తాం. అందుకే బుద్ధుడంటాడు: ‘శాంతి లోపలినుండి వస్తుంది. బయట దానిని వెతక్కండి’ అని! -యామిజాల జగదీశ్ -
యోగ కోచ్గా ఐఐటీయన్..!
ఐఐటియన్గా పెద్ద కలలు, ఖరీదైన కలలేవీ కనలేదు సౌరభ్. ‘మార్పు తెచ్చే శక్తి యోగాలో ఉంది’ అని గ్రహించిన ఈ కుర్రాడు దేశవ్యాప్తంగా యోగా తరగతులు నిర్వహిస్తున్నాడు. ‘హబిల్డ్’ గ్లోబల్ మూమెంట్ ప్లాట్ఫామ్ ప్రారంభించాడు. ఈ విశ్వవేదికలో 169 దేశాల నుంచి 1.2 కోట్ల మంది యోగాభ్యాసకులుఉన్నారు. ఇక వరల్డ్ రికార్డ్లు సరే సరి... ‘ఐఐటీ పూర్తి చేసి ఆరుసంవత్సరాలైనా సౌరభ్ ఏమీ సంపాదించలేదు’ అని కొద్దిమంది అనుకునేవారు. వారికి తెలియని విషయం ఏమిటంటే సౌరభ్ చాలా సంపాదించాడు. ఎంతో పేరు! ఎన్నో రికార్డ్లు!! మహారాష్ట్రలోని ధనజ్ అనే చిన్న గ్రామంలో పుట్టాడు సౌరభ్. అతడి పూర్వీకులు రాజస్థాన్కు చెందిన వారు. తాత లక్ష్మీచంద్ 1955లో యంబీబీయస్ పూర్తి చేశాడు. బాగా డబ్బులు సంపాదించాలి, లగ్జరీగా బతకాలి, పట్టణాలలో మాత్రమే ఉండాలి అనుకోలేదు. పేద ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రోడ్లు కూడా సరిగ్గా లేని మారుమూల గ్రామంలో ప్రాక్టీస్ ప్రారంభించాడు. వైద్యుడిగా సేవలందించడమే కాకుండా గ్రామ అభివృద్ధి కోసం ఎంతో చేశాడు లక్ష్మీచంద్. చిన్నప్పటి నుంచి తాత గురించి ఎన్నో మంచి విషయాలు విన్నాడు సౌరభ్. అలా తనకు తెలియకుండానే తాత స్ఫూర్తిగా మారాడు. స్వామి వివేకానంద బోధనలు కూడా సౌరభ్ను ఎంతో ప్రభావితం చేశాయి. ఈ నేపథ్యంలోనే ‘ఉద్యోగం కాదు. సమాజం కోసం ఏదైనా చేయాలి’ అనుకున్నాడు. కాలేజి రోజుల్లో ఒకసారి బెనారస్ నుంచి నాగ్పూర్కు ప్రయాణిస్తున్న సౌరభ్కు ఒక ధ్యానకేంద్రానికి చెందిన సభ్యులతో పరిచయం ఏర్పడింది. వారితో పరిచయం తన జీవనగమనాన్ని మార్చింది. యోగాపై ఆసక్తి పెంచుకునేలా చేసింది. వారు నిర్వహించే ధ్యాన, యోగ తరగతులకు హాజరయ్యేవాడు. యోగ తరగతులకు హాజరుకావడం టర్నింగ్ పాయింట్గా మారింది. క్రమం తప్పకుండా ధ్యానం, యోగా చేసేవాడు. దీనివల్ల చిన్నప్పటి నుంచి ఉన్న ఆస్తమ సమస్య ఉపశమనం దొరికినట్లయింది.యోగాలో ప్రావీణ్యం సాధించిన సౌరభ్ ఆ విద్యను వీలైనంత ఎక్కువ మందికి నేర్పించాలనే లక్ష్యంతో ప్రయాణం ప్రారంభించాడు. దేశం నలుమూలలా తిరుగుతూ ఎంతోమందికి యోగా నేర్పించాడు. ‘యోగా బోధించడం కోసం ఎన్నో ప్రాంతాలు తిరిగాను. ఆ సమయంలో నా సంతోషం మాటలకు అందనిది. ప్రతిరోజూ కొత్తగా, ఉత్సాహంగా ఉండేది. రోజూ నిద్ర లేవగానే ఈరోజు క్లాస్లో ఎలా బోధించాలి అనేదాని గురించి ఆలోచించేవాడిని. ప్రతిరోజూ పండగ జరుపుకున్నంత ఉత్సాహంగా ఉండేది’ అని గతాన్ని గుర్తు తెచ్చుకున్నాడు సౌరభ్.కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా యోగా ఆన్లైన్ క్లాస్లు ప్రారంభించాడు. అయితే మొదట్లో కేవలం ముగ్గురు మాత్రమే ఈ ఆన్లైన్ క్లాస్లకు హాజరయ్యేవారు. తాను నిర్వహించే తరగతులు ఉచితం కాబట్టి వాటిని ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదని గ్రహించిన సౌరభ్ తన ఆన్లైన్ క్లాస్లకు నెలకు వంద రూపాయలు ఫీజుగా పెట్టాడు.ముగ్గురితో మొదలైన ఆన్లైన్ క్లాస్ విద్యార్థుల సంఖ్య వందకు చేరింది. ఆ తరువాత దేశదేశాలకు విస్తరించి, విద్యార్థుల సంఖ్య లక్షలు దాటింది. తాను నిర్వహించే ఆన్లైన్ తరతులకు ముగ్గురు మాత్రమే హాజరైనప్పుడు సౌరభ్ నిరాశకు గురికాలేదు. ఘనమైన రికార్డ్లు నెలకొల్పినప్పుడు అహంతో ప్రవర్తించడం లేదు. యోగా నేర్పిన సమ్యక్ దృష్టితోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు.వావ్ అనిపించే వరల్డ్ రికార్డులుయూట్యూబ్లో యోగా లైవ్ స్ట్రీమ్ను అత్యధికంగా వీక్షించిన ప్లాట్ఫామ్గా హబిల్డ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది. అదే సంవత్సరం ఈ ప్లాట్ఫామ్ రెండు వరల్డ్ రికార్డ్స్ టైటిల్స్ సాధించింది. అందులో ఒకటి...ఒకేరోజులో చాలామంది లైవ్ వ్యూయర్స్కు సంబంధించింది, రెండోది లార్జెస్ట్ వర్చువల్ మెడిటేషన్ క్లాస్కు సంబంధించింది. మొదటి దానిలో 5,99,162 మంది, రెండో దానిలో 2,87,711 మంది పాల్గొన్నారు. ఈ సంవత్సరం 169 దేశాలకు చెందిన 7,52,074 మందితో వర్చువల్ యోగా సెషన్ నిర్వహించి మరో రికార్డ్ సొంతం చేసుకున్నాడు సౌరభ్. (చదవండి: ఇద్దరు పిల్లల తల్లి సాహసం..! మరో రికార్డు కోసం..) -
ఇద్దరు పిల్లల తల్లి సాహసం..! మరో రికార్డు కోసం..
గ్లోబల్ ఫెరారీ రేసింగ్ సిరీస్లో పాల్గొంటున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించనుంది పుణేకి చెందిన రేసర్ డయానా పండోలె. ఈ ఛాంపియన్షిప్ నవంబర్లో మొదలవుతుంది. ఫెరారీ 296 చాలెంజ్ కారుతో దూసుకుపోనుంది. డయాన. ఫెరారీ 296 అనేది ఇటాలియన్ బ్రాండ్కు సంబంధించిన అత్యాధునిక, ట్రాక్–ఫోకస్ట్ మెషీన్.‘రేసింగ్’ అనేది డయానా ఎవరి నోటి నుంచో విన్న మాట కాదు. చిన్నప్పటి నుంచే రేసింగ్కు సంబంధించిన కబుర్లు ఇంట్లో వినేది. అమ్మా,నాన్నలకు రేసింగ్ అంటే ఇష్టం. కాలక్రమంలో వారి ఇష్టమే తన ఇష్టంగా మారింది.మొదట బైక్ నేర్చుకుంది. ఆ తరువాత కారు నడపడం నేర్చుకుంది. ఆ తరువాత రేస్ కార్లతో దూసుకుపోయేది. డయానాలో ఉత్సాహమే కాదు దానికి తగిన శక్తి,సామర్థ్యాలు ఉన్నాయి. అందుకే ఇండియన్ నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్ను గెల్చుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది డయానా.పోటీలకు సంబంధించి పెళ్లికి ముందు ఉన్న ఉత్సాహం పెళ్లయిన తరువాత కొద్దిమందిలో కనిపించదు. ఇద్దరు పిల్లల తల్లి అయిన 32 ఏళ్ల డయానాలో మునపటి ఉత్సాహం ఎంతమాత్రం తగ్గలేదు. తరగని ఆ ఉత్సాహమే గ్లోబల్ ఫెరారీ రేసింగ్ సిరీస్ పాల్గొంటున్న తొలి భారతీయ మహిళగా మరోసారి చరిత్ర సృష్టించేలా చేస్తోంది.(చదవండి: ధనాధన్..వాకథాన్..! ఊపందుకుంటున్న సుదీర్ఘ నడక ఈవెంట్లు..) -
వెరీ సారీ... వారి దారి రహదారి కానే కాదు!
అనగనగా దోల్ కోతర్ అనే గ్రామం ఉంది. మధ్యప్రదేశ్ సిది జిల్లాలోని ఈ గ్రామం సామాజిక మాధ్యమాలలో నవ్వులు పూయించడమే కాదు కోపంతో భగ్గుమనేలా చేస్తోంది. ఇంతకీ ఆ ఊళ్లో ఏం జరిగింది?ప్రధాన్మంత్రీ గ్రామ్ సడక్ యోజన ప్రాజెక్ట్లో భాగంగా గ్రామంలో కొత్తగా ఒక రోడ్డు నిర్మించాలనుకున్నారు. దారి మధ్యలో చేతి పంపు ఉంది. గ్రామ నీటి అవసరాలకు ఇదే ఆధారం.చేతి పంపును తీసేసి రోడ్డు నిర్మించడం సరికాదు అనుకున్న కాంట్రాక్టర్, ప్రత్యేక నిర్మాణంతో పంప్ను అలాగే ఉంచి, కొత్త రోడ్డు నిర్మించాడు.అయితే కథ సుఖాంతం కాలేదు. కాస్త సరదాగా చె΄్పాలంటే దుఃఖాంతం అయింది! గోతిలో హ్యాండ్ పంప్ ఉందని తెలియని వాహనదారులు అందులో పడి΄ోయి గాయాల ΄ాలవుతున్నారు. పిల్లలు ఆడుకుంటూ, ఆడుకుంటూ అందులో పడి΄ోతున్నారు.‘ఇదెక్కడి పంప్ రా బాబూ’ అని గ్రామ ప్రజలు నెత్తి, నోరు బాదుకుంటున్నారు. ఈ రోడ్డు పంప్ వ్యవహారం ఊరు దాటి, జిల్లా దాటి ప్రభుత్వ దృష్టికి వచ్చింది. సురక్షితమైన మరో చోట హ్యాండ్ పంప్ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. నెటిజనులు మాత్రం ‘రోడ్డు మధ్యలో ఉన్న దేశంలోని తొలి హ్యాండ్పంప్’ అని కామెంట్స్ పెడుతున్నారు! (చదవండి: ధనాధన్..వాకథాన్..! ఊపందుకుంటున్న సుదీర్ఘ నడక ఈవెంట్లు..) -
ధనాధన్..వాకథాన్..! ఊపందుకుంటున్న సుదీర్ఘ నడక ఈవెంట్లు..
నడిస్తే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప.. అని వైద్యులు పదే పదే చెవిన ఇల్లు కట్టుకుని చెబుతున్నారు. మరోవైపు కోవిడ్ తర్వాత శారీరక శ్రమ, ఫిట్నెస్కు ప్రాధాన్యత ఇవ్వడానికి నగరవాసులు ఆసక్తి కనబరుస్తున్నారు. మహమ్మారి సమయంలో ఎదురైన అనుభవాల రీత్యా.. వాకథాన్లపై క్రమంగా ఆసక్తి పెరుగుతోంది. దీంతో పార్కుల్లో వాకర్స్ మాత్రమే కాదు సుదూర ప్రాంతాలకు నడిచే వాకథానర్లు కూడా పెరుగుతున్నారు. వీరి కోసం పలు కార్పొరేట్ సంస్థలు వాకథాన్ ఈవెంట్లను నిర్వహిస్తున్నాయి. ప్రజల నుంచి కూడా ఈ తరహా ఈవెంట్ల పట్ల ఆసక్తి పెరుగుతోంది. దీంతో పలు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్లు.. ఏదో ఒక ఈవెంట్కు అనుగుణంగానో, సామాజిక కార్యక్రమాలకు నిధుల సమీకరణ కోసమో హైదరాబాద్ నగరంలో ఇటువంటి వాకథాన్లు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ‘వాకథాన్లు’ – ‘వాకింగ్ మారథాన్ల’ సంక్షిప్త రూపం దేశవ్యాప్తంగా ఆరోగ్య ప్రియుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఫిట్నెస్, ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన రీత్యా ‘వాకథాన్లు’ బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. వాకథాన్లు నగర రోడ్లకే పరిమితం కాలేదు. చాముండి కొండలలోని అటవీ ట్రైల్స్, రాజస్థాన్లోని ఎడారి ప్రదేశాలతో సహా ప్రకృతి అందాల నడుమ ఇవి జరుగుతున్నాయి. సామాజిక ‘కారణాల’ కోసం నిధులను సమీకరించేందుకు నిర్వహించే వాకథాన్లు కూడా పెరిగాయి. ముంబైలో జరిగిన ‘చలో భారత్ వాకథాన్ 2025’లో 6,500 మందికి పైగా పాల్గొన్నారు. అవయవ దానం, రొమ్ము కేన్సర్ అవగాహన వన్యప్రాణుల సంరక్షణ వంటివి కూడా వాకథాన్లకు థీమ్స్గా మారుతున్నాయి. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ‘ఫిట్ ఇండియా‘ ఉద్యమం పెద్ద ఎత్తున వాకథాన్లను ప్రోత్సహించింది. గత 2020లో రాజస్థాన్లో 200కి.మీ ‘ఫిట్ ఇండియా వాకథాన్’ను నిర్వహించారు. వ్యవస్థలూ.. వ్యక్తిగతంగానూ.. వాకథాన్లు కార్పొరేట్ ప్రపంచాన్ని సైతం ఆకర్షించడం ప్రారంభించాయి. థ్రిల్ జోన్ వంటి ప్రత్యేక ఈవెంట్ నిర్వాహకులు టౌన్ స్క్రిప్ట్ వంటి ఈవెంట్–బుకింగ్ ప్లాట్ఫారమ్లు దేశవ్యాప్తంగా ఎండ్యూరెన్స్ వాకింగ్ ఈవెంట్లను సృష్టిస్తున్నాయి. ప్రతి సంవత్సరం భారతదేశంలోని నగరాల్లో డజనుకు పైగా వాకథాన్లు జరుగుతున్నాయి. ‘మేం 2011–12లో బెంగళూరులో మా మొదటి ‘ట్రైల్వాకర్’ నిర్వహించినప్పుడు 320 మంది పాల్గొన్నారు. ప్రస్తుతం రెండు నగరాల్లో నిర్వహిస్తుంటే ప్రతి సంవత్సరం 1600 మందికి పైగా పాల్గొంటున్నారు’ అని ఆక్స్ఫామ్ ఇండియా సీఈఓ అమితాబ్ బెహర్ చెప్పారు. మరోవైపు వ్యక్తిగతంగానూ రికార్డు స్థాయి నడకలతో గుర్తింపు పొందారు. కోయంబత్తూరుకు చెందిన నటరాజ్ 2021– 2023 మధ్య 798 రోజుల్లో 6,614 కి.మీ నడిచి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కారు. 2024లో పర్యావరణ అవగాహన పెంచడానికి విరాగ్ మధుమాలతి నవీ ముంబై నుంచి రాజస్థాన్ వరకూ 1,305 కి.మీ. నడిచి ప్రపంచ రికార్డును నెలకొల్పారు. కొంకణ్ ట్రయల్ నిర్వహిస్తున్నాం.. ‘గతంలో పలు మార్లు వాకథాన్, మారథాన్లలో పాల్గొన్న అనుభవం ఉంది. ప్రస్తుతం పుణె సమీపంలోని అందమైన గ్రామాలు, చిన్న చిన్న పట్టణాలు, చెరువులు, వాగులు, వంకలు, ఘాట్లు.. ఇంకా అనేక ప్రకృతి సౌందర్యాల నడుమ కొంకణ్ ట్రయల్ వాకథాన్ నిర్వహిస్తున్నాం’ అని గ్రీన్ ట్రయిల్ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. తమ వాకథాన్ను నగరానికి పరిచయం చేసిన సందర్భంగా వీరు తమ ఈవెంట్ వివరాలు వెల్లడించారు. విభిన్న రంగాల్లో సేవలు అందిస్తున్న వ్యాయామ, ఆరోగ్య ప్రియులమైన తామంతా కలిసి ఈ వేదికను స్థాపించామన్నారు. ఈ ఈవెంట్లో పాల్గొనేవారు 100 కి.మీ దూరాన్ని 50 గంటల్లో, 50 కి.మీ దూరాన్ని 25 గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. కనీసం ఇద్దరు నుంచి నలుగురు టీమ్గా పాల్గొంటారు. తమ వాకథాన్లో పాల్గొనేందుకు హైదరాబాద్తో పాటు బెంగళూర్, ముంబై, పుణె తదితర నగరాల నుంచి వాకర్స్ ఉత్సాహం చూపిస్తున్నారన్నారు. బహుళ వాకథాన్లు.. బహుళ వాకథాన్లు చేసిన వారు 100 కి.మీ ట్రయల్ను పూర్తి చేయడానికి 32 గంటలకు పైగా సమయం గడుపుతారు. వారు ప్రతి 15–20 కి.మీ తర్వాత చిన్న విరామాలు తీసుకుంటూ నడుస్తారు. మొదటి 50 కి.మీలు పూర్తి చేసిన తర్వాత దాదాపు రెండు గంటల పాటు ఒక దీర్ఘ విరామం తీసుకుంటారు. ఒక వ్యక్తి 100 కిలోమీటర్లు పూర్తి చేయడానికి కనీసం 1.5 లక్షల అడుగులు వేస్తాడు. చివరి 100 అడుగులు అత్యంత కష్టతరమైనదని వాక్థానర్లు అంటున్నారు. ఓపికకు పరీక్ష.. ‘వాకథాన్లు స్టామినాను, ఓపికను పరీక్షిస్తాయి.. మొదటి 10 కి.మీ. సరదాగా ఉంటుంది. కానీ తర్వాత నుంచి కష్టం మొదలవుతుంది’ అని వాకథాన్ ప్రియుడు ఇష్మీత్ సింగ్ చెప్పారు. ‘మారథాన్ 2–3 గంటల్లో ముగుస్తుందని ముందే తెలుస్తుంది. దానికి అనుగుణంగా శిక్షణ పొందినట్లయితే, దానిని పూర్తి చేయగలం. కానీ వాకథాన్ల కోసం చాలా దృఢసంకల్పం అవసరం’ అని సింగ్ అంటున్నారు. ఆయన తన చివరి 100 కి.మీ వాకథాన్ను 32 గంటల్లో పూర్తి చేశారు. వాకథాన్ శిక్షణలో భాగంగా రోజువారీ సెషన్లు, పోషకాహారం వంటివి సూచిస్తారు.. అమెచ్యూర్ వాకథానర్లు ఒకేసారి 25–30 కి.మీ లను కవర్ చేసే వారాంతపు నడకలతో ప్రారంభిస్తారు. వీరు నగర రోడ్లు, గ్రామ దారులు, పగలు, రాత్రి వేళల్లో, అలాగే అన్ని రకాల భూభాగాల్లో నడవడానికి అవకాశం పొందుతారు. ఇది గొప్ప అనుభవం అని వాకథానర్లు అంటున్నారు. (చదవండి: అక్కాచెల్లెళ్లు నలుగురికి అరుదైన వ్యాధి..! విస్తుపోయిన వైద్యులు) -
ఎనిమిది పదుల వయసులో.. జాతీయ స్థాయి ఈత పోటీల్లో ప్రతిభ
ఎనిమిది పదుల వయసులో ఎంతో చలాకీగా ఈత కొడుతూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు. అంతేకాదు పదుల సంఖ్యలో పతకాలు సొంతం చేసుకున్నాడు. జాతీయ స్థాయి ఈత పోటీల్లో తన ప్రతిభను చాటుతున్నాడు నగరంలోని కేపీహెచ్బీ కాలనీకి చెందిన లక్ష్మారెడ్డి. వ్యాయామం చేయడానికి కూడా బద్దకించే అనేక మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. – కూకట్పల్లి నగరంలోని కేపీహెచ్బీ కాలనీ ఫేజ్ –6లో నివాసముండే కే.లక్ష్మారెడ్డి(79) జాయతీ స్థాయి ఈత పోటీల్లో సత్తా చాటుతున్నాడు. ఎనిమిది పదుల వయసులోనూ ఇటీవల (అక్టోబర్–11,12) ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన జాతీయ స్థాయి ఈత పోటీల్లో 25, 50 మీటర్ల కేటగిరీలో రెండు ప్రథమ బహుమతులు సొంతం చేసుకున్నాడు. అక్కడితో ఆగలేదు.. అదే పోటీల్లో 50, 100 మీటర్ల ఈత పోటీల్లోనూ రెండు ద్వితీయ పతకాలు, మిడ్లే పోటీలో ప్రథమ బహుమతి, రిలే పోటీల్లో ద్వితీయ బహుమతి సాధించి వివిధ కేటగిరీల్లో ఒకే సారి ఏకంగా ఆరు పతకాలు కైవసం చేసుకున్నాడు. 65వ ఏట నుంచి.. లక్ష్మారెడ్డి తన 65వ ఏట నుంచి ఈత పోటీల్లో పాల్గొంటున్నారు. సికింద్రాబాద్, నాందేడ్, కర్నూలు, కూకట్పల్లిలో నిర్వహించిన వివిధ కేటగిరిలో ఇప్పటికి 21 పతకాలను సాధించి, ఉత్తమ ప్రతిభను కనబరుస్తూ యువతకు, తన తోటి వయసు వారికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆరోగ్యానికి నిత్యం సాధన.. ప్రతి రోజూ స్థానికంగా ఉండే స్విమ్మింగ్ పూల్లో ఈత ప్రాక్టీస్ చేస్తుంటారు. ముగ్గురు పిల్లలు ఉద్యోగాల రీత్యా ఒకరు విదేశాల్లో, మిగిలిన వారు బెంగళూరులో ఉంటున్నారు. భార్యతో పాటు కేపీహెచ్బీలో ఉంటూ స్థానికంగా అనేక సంక్షేమ కార్యక్రమాల్లోనూ భాగస్వామ్యం అవుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. చుట్టుపక్కల ఆసక్తి కలిగిన పిల్లలకు కూడా ఈత నేర్పిస్తుంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామాలు గానీ, లేదా ఈత గానీ సాధన చేయాలని సూచిస్తున్నారు. లక్ష్మా రెడ్డి స్వస్థలం కృష్ణాజిల్లా, పెద ఓగిరాల. తన విజయాల గురించి చెబుతూ మిత్రుల ప్రోత్సాహంతోనే తాను ఈ పోటీల్లో పాల్గొంటున్నానని వివరించారు.ఇదీ చదవండి: స్వరోవ్స్కి ఈవెంట్లో రష్మిక్ స్టైలిష్ లుక్ : ఎంగేజ్మెంట్ రింగ్ స్పెషల్! -
పంట పొలాలకు బాలీవుడ్ పాటలు వినిపిస్తాడు!
మధ్యప్రదేశ్కు చెందిన యువ రైతు ఆకాష్ చౌరాసియ (Akash Chaurasia) ప్రతిరోజు ఉదయం తన ΄పొలానికి వెళతాడు. ‘వెళ్లి ఏం చేస్తాడు?’ అనే ప్రశ్నకు ‘ఇంకేమి చేస్తాడు. ΄ పొలం పనులు’ అంటే పప్పులో కాలేసినట్లే.అతడు వెళ్లేది పంట΄ పొలాలు, మొక్కలకు సంగీతం వినిపించడానికి!‘మనుషులే కాదు పంట పొలాలు కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తాయి. తద్వారా అవి ఆరోగ్యంగా ఉంటాయి’ అంటున్న ఆకాశ్ గత పది సంవత్సరాలుగా పంట పొలాలకు సంగీతం వినిపిస్తున్నాడు. కొత్త మొక్కలు నాటినప్పుడు స్పెషల్ మ్యూజికల్ థెరపీ సెషన్లు నిర్వహించడం అనేది మరో విశేషం.‘మొక్కల ఎదుగుదలపై సంగీతం సానుకూల ప్రభావం చూపుతుంది’ అంటున్నాడు ఆకాష్. ఆకాష్ మరో అడుగు ముందుకు వేసి ఆవులకు కూడా సంగీతాన్ని వినిపిస్తున్నాడు. ‘ఆవులకు రోజూ సంగీతం వినిపించడం వల్ల గతంలో పోల్చితే అవి ఎక్కువ పాలు ఇస్తున్నాయి’ అని కూడా అంటున్నాడు. ఇదేదో బాగుంది కదూ..!ఇదీ చదవండి: స్వరోవ్స్కి ఈవెంట్లో రష్మిక్ స్టైలిష్ లుక్ : ఎంగేజ్మెంట్ రింగ్ స్పెషల్! -
వారసత్వ వెలుగులు
కాలంతో పాటు ఫ్యాషన్లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. కానీ, కొన్నింటికి కాలం అడ్డంకి కాదు. అవి భావాలూ, జ్ఞాపకాలూ కలిపిన అందంతో మరింత ప్రత్యేకతను చాటుతుంటాయి. అలాంటి వారసత్వ ఆభరణాలు బాలీవుడ్–టాలీవుడ్లలోనూ కొత్తగా వెలుగుతున్నాయి. వివాహ వేడుకలు, ఫ్యాషన్ వేదికలు, సినిమా ఈవెంట్లలో ప్రధానంగా కనిపిస్తున్నాయి. ప్రతి ఆభరణం ఒక కథను, ఒక బంధాన్ని, ఒక జ్ఞాపకాన్ని మన ముందుంచుతుంది.వెండితెరమీద మెరిసే తారలు మోడర్న్ను మాత్రమే పరిచయం చేస్తారు అనుకుంటేపొరబాటు. తమ కుటుంబ వారసత్వాన్ని, ఆత్మీయతను ఆభరణాలలోనూ చూపుతుంటారు. శోభిత ధూళిపాళవివాహానికి ముందు జరిగే వేడుక సమయంలో శోభిత తన తల్లి, తాతమ్మగారి వారసత్వ ఆభరణాలు ధరించింది. వీటిలో సంప్రదాయ పసిడి హారం, కాసులపేర్లు ఉన్నాయి. ఆమె మాటల్లో – ‘మా అమ్మమ్మ ఈ ఆభరణాలు ధరించినప్పుడు నేను చిన్నపిల్లను. ఇప్పుడు అవే ఆభరణాలను నేను వేసుకున్నప్పుడు ఆమె నాకు మరీ మరీ గుర్తుకొచ్చింది’ అని చెబుతుంది. ఈ ఒక్క మాటతోనే ఆ ఆభరణం బంగారం కాదు, బంగారం లాంటి జ్ఞాపకం అని మనకు తెలిసిపోతుంది.కుటుంబ వారసత్వం అలియా తన వివాహ వేడుకలో పాత కాలపుపొల్కీ నెక్లెస్ ధరించింది. ఆ పీస్ ఆమె తల్లి సోనీ రాజ్దాన్ కానుకగా ఇచ్చినది. ‘ఇది కేవలం ఒక ఆభరణం కాదు. తల్లి ప్రేమకు ప్రతీక అని చెబుతుంది. ఆమె ఆ తర్వాత కూడా ఆ నెక్లెస్ని రీ–స్టైల్ చేసి మనీష్ మల్హోత్రా ఈవెంట్లో వాడింది.కీర్తీ సురేశ్తల్లి మేనక ఇచ్చిన టెంపుల్ జ్యువెలరీని కీర్తి పబ్లిక్ ఈవెంట్స్లో కూడా రీ–స్టైల్ చేసి వేసుకుంటుంది. ఆమె చెప్పినట్టుగా ‘మా అమ్మ ఆభరణాలు నేను మళ్లీ వేసుకుంటే, అది ఫ్యాషన్ కాదు గౌరవం’ అని చెబుతుంది.వారసత్వ రత్నాలుబాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తన వివాహ వేడుకలో ధరించిన చోకర్ నెక్లెస్ వందేళ్ల కిందట ఆమె కుటుంబం నుంచి వారసత్వంగా వచ్చింది. దానిని రాజస్థానీ డిజైనర్లు పొల్కీ ఆభరణంగా రూపొందించారు. ‘ఈ నెక్లెస్ మా అమ్మమ్మ ధరించింది. ఇప్పుడు నేను వేసుకుంటున్నానంటే అందుకు మా మధ్య ఉండే ఆత్మీయ బంధమే కారణం’ అని చెబుతుంది సోనమ్. ఇప్పుడు ఆభరణాల డిజైనర్లు కూడా ‘సెంటిమెంట్ స్టైల్’ అనే కొత్త లైన్ ను ఎంచుకుంటున్నారు. పాత ఆభరణాలను మోడర్న్ టచ్తో రీ–డిజైన్ చేయడం, వాటి కథను చెప్పేలా ప్రదర్శించడం ట్రెండ్ అయ్యాయి. వారసత్వ ఆభరణం అంటే కేవలం అలంకారమే కాదు అది ప్రేమ, గౌరవం, జ్ఞాపకం కూడా! -
ఈ కెమెరాకు భయం లేదు
‘బిందూ... బాడీ’... అని ఆమెకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది. సాధారణంగా అర్ధరాత్రి సమయంలో. బిందు ఫ్రీలాన్స్ ఫోరెన్సిక్ ఫొటోగ్రాఫర్. రాత్రిళ్లు ప్రమాదాలు, నేరాలు జరిగినప్పుడు సీన్ దగ్గర ఉన్న మృతదేహాలను చట్టపరమైన సాక్ష్యాలకు ఉపయోగపడేలా ఫొటోలు తీయడం ఒక విద్య. ఆ విద్యలో ఆరితేరిన బిందు కేరళలో ఇప్పటికి 3000 కేసులకు ఫొటోగ్రాఫర్గా పని చేసింది. పురుషులైనా స్త్రీలైనా ధైర్యంగా చేయలేని ఈ పనిని చేసి చూపిస్తున్న బిందు పరిచయం.కేరళ త్రిషూర్ జిల్లా కొడంగలూర్లోని బిందూ (46) ఇంటిలో అర్ధరాత్రి ఫోన్ మోగిందంటే ఆమెకు వెంటనే డ్యూటీ పడిందని అర్థం. ఎక్కడో ఏదో ప్రమాదం జరిగింది... నేరం జరిగింది.. సూసైడ్ కేసు... అక్కడకు వెళ్లి వెంటనే ఫొటోలు తీయకపోతే ఆ సాక్ష్యాధారాలు చెదిరిపోవచ్చు. అందుకే బిందు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కెమెరా బ్యాగ్ భుజాన వేసుకుని మోటర్ సైకిల్ మీద బయలుదేరుతుంది. త్రిషూర్ జిల్లాలోని ఏడు పోలీస్ స్టేషన్లకు బిందూయే ఔట్సోర్స్ ఫొటోగ్రాఫర్. ఘటనా స్థలాలలో పోలీసులకు సహాయంగా, చట్టపరమైన పరిశోధనకు వీలుగా, న్యాయస్థానాల్లో ప్రవేశానికి అర్హమైన ఫొటోలు తీసే వారిని ‘ఇన్క్వెస్ట్ ఫొటోగ్రాఫర్’ అంటారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇలాంటి ఫొటోగ్రాఫర్లు ఉంటారు. లేనప్పుడే సమస్య. త్రిషూర్లో బిందూయే చాలామందికి ఇన్క్వెస్ట్ ఫొటోగ్రాఫర్.అనుకోకుండా ఒకరోజువి.వి.బిందుది కొడంగల్లో మధ్యతరగతి కుటుంబం. ఇంటర్ వరకూ చదివాక ఆర్థిక స్తోమత లేక చదువు మానేసి ఒక ఫొటోస్టూడియోలో రిసెప్షనిస్టుగా చేరింది. అక్కడ లైటింగ్ చేసే కుర్రాళ్లు యజమాని లేనప్పుడు కెమెరాతో ఎలా ఫొటో తీయాలో ప్రయోగాలు చేస్తుంటే అప్పుడప్పుడు వారితో పాటు కలిసి గమనించేది. తొలుత ఏ ఆసక్తి లేకపోయినా తర్వాత ఆసక్తి ఏర్పడి ఆరు నెలల్లో కెమెరా అంటే ఏమిటో ఫొటోలు ఎలా తీయాలో ఫండమెంటల్స్లో కొట్టినపిండి అయ్యింది. దాంతో యజమాని ఆమెను అప్పుడప్పుడు వెడ్డింగ్ షూట్స్కు పంపేవాడు. అయితే ఒకరోజు పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది... ఘటనా స్థలంలో ఫొటోలు తీయాలని. వేరే ఎవరూ దొరక్క బిందూను పంపాడు యజమాని. ఇది 2004లో జరిగింది. అది బావిలో మృతదేహం కేసు. అక్కడకు వెళ్లి ఫొటోలు తీసిన బిందు మళ్లీ ఆ పని జన్మలో చేయకూడదని నిశ్చయించుకుంది. ‘అలాంటి వృత్తిలో ఎవరు ఉంటారు?’ అంటుందామె. కాని మరి కొన్ని రోజులకు మళ్లీ ఫోన్ వచ్చింది. డబ్బు అవసరం ఆమెకు మళ్లీ కెమెరా పట్టుకుని వెళ్లేలా చేసింది.విరామం తీసుకున్నాపెళ్లయ్యాక ఈ పనికి విరామం ఇచ్చి 2008లో భర్తతో కలిసి బెంగళూరు వెళ్లిపోయింది బిందు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక భర్తతో విడిపోయి తిరిగి 2014లో కొడంగలూరుకు చేరుకుంది. వచ్చిన రోజే ఆమెకు మళ్లీ పోలీసుల నుంచి ఫోన్. ‘ఆశ్చర్యం ఏమిటంటే ఇన్నేళ్లలో నాలాగా ముందుకొచ్చిన ఫొటోగ్రాఫర్లు అక్కడ లేరు. నైపుణ్యం కూడా లేదు’ అందామె గర్వంగా. అందుకే పోలీసులు ఆమెను బతిమిలాడి తిరిగి పనిలో పెట్టారు. ఒక సి.ఐ. అయితే తన శాలరీ సర్టిఫికెట్ ఆమె లోను కోసం పూచీ పెట్టి 2 లక్షలు అప్పు ఇప్పించి మంచి కెమెరా కొనుక్కునేలా చేశాడు. ఇక బిందూ ఆగలేదు. పనిలో కొనసాగుతూనే ఉంది నేటికీ.కేసుకు 2000 రూపాయలుబిందు ఇప్పుడు ఏడు స్టేషన్లకు ఇన్క్వెస్ట్ ఫొటోగ్రాఫర్గా ఉంది. ‘నాకు రోజుకు యావరేజ్గా ఒకటి లేదా రెండు కేసులు వస్తాయి. వెళ్లి ఫొటోలు తీస్తాను. కేసుకు రెండు వేల రూపాయలు ఇస్తారు. ఘటనా స్థలికి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు అక్కడ చూసినవన్నీ మైండ్లో నిండిపోతాయి. కాని ఇంటికి వచ్చి ఒక్కసారి పిల్లల్ని చూసుకున్నాక అన్నీ మర్చిపోతాను. నా పని ఎలా చేయాలో నాకు తెలుసు. సీనియర్ ఆఫీసర్లు నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అప్పుడప్పుడు యంగ్ ఆఫీసర్లు ఇలా కాదు అలా అంటూ తెలివి ప్రదర్శిస్తారు. ఇవన్నీ మామూలే’ అంటుందామె. ఇంత భిన్నమైన వృత్తిలో ఇంతగా రాణిస్తున్న బిందూ గురించి బయటి లోకానికి తెలియదు. ఇటీవలే అక్కడి సీనియర్ ఫొటోగ్రాఫర్, నటుడు కె.ఆర్.సునీల్ ‘అసామాన్య సామాన్యుల’ పై ఒక పుస్తకం అక్కడ వెలువరించాడు. అందులో బిందూపై కూడా కథనం ఉంది. అలా ఆమె జీవితం అందరికీ తెలిసింది. గుండె దడదడనేర/ప్రమాద ఘటనా స్థలాల్లోకి పోలీసులు వెళ్లడానికే జంకుతారు. అలాంటిది బిందు వెళ్లి ఊరికే చూసి రావడం కాదు... కొన్ని నిర్దేశిత యాంగిల్స్లో దగ్గరగా వెళ్లి తీయాలి. కొత్తల్లో ఆమెకు చాలా వొణుకుగా ఉండేది. ‘ఒకసారి భయంతో ఫ్లాష్ మర్చిపోయి వెళ్లాను. మళ్లీ తెచ్చుకొని తీయాల్సి వచ్చేది. మరోసారి కెమెరాలో రీల్ లోడ్ చేయడం మర్చిపోయాను. కాని రాను రాను మెల్లగా అన్నీ అలవాటయ్యాయి. ఏ వృత్తయినా ప్రొఫెషనలిజం వచ్చేంత వరకూ కష్టమే. ఆ తర్వాత అంతా నల్లేరు మీద నడకే’ అంటుంది బిందూ. -
ప్రమథ గణాలు, వారిలో ముఖ్యులు ఎవరంటే..?
ప్రమథ గణాలంటే శివపరివారం లేదా శివుని సేన. ప్రమథ అంటే బాగా మథించగలిగే వారని అర్థం. వీరు దేవతలను కూడా శిక్షించ గలవారు. వీరు అన్నిచోట్లా వ్యాపించి ఉండే రుద్రశక్తులు. ప్రమధ గణాలు కోట్లకొలది ఉంటారు. మహాభక్తులై శివలోకానికి చేరే జీవులు కూడా శాశ్వత శివ సాయుజ్యం పొంది రుద్రగణాలుగా ఉండి పోతారని ప్రతీతి. అయితే వారికి నాయకులు లేదా గణాధిపతులు కూడా ఉంటారు. వీరిలో ముఖ్యులువీరభద్రుడు: సాక్షాత్ శివస్వరుపం. అందరికన్నా ముఖ్యమైన గణాధిపతి.ఆది వృషభం: ధర్మదేవత. శివున్ని మోయ గలిగే వరం పొంది, అతని సమీపం లో ఎప్పుడు సంచరించే తెల్లని వృషభ మూర్తి. నందీశ్వరుడు: శివునికి ఆంతరంగికునిగా ఉండే గణ మూర్తి. కైలాసానికి ఎవరు వచ్చినా ఇతని అనుమతి పొందితేనే శివదర్శనం! భృంగి: శివుని పరమ భక్తుడు. భ్రమరము లాగా శివుని చుట్టూ ప్రదక్షణం చేయడం పనిగా ఉన్న వాడు కాబట్టి భృంగి అని ఖ్యాతిగాంచాడు. స్కందుడు: కుమారస్వామి శివకుమారుడు. దేవసేనాధిపతి. బ్రహ్మజ్ఞాని.కాలాగ్నిరుద్రుడు లేదా కాలభైరవుడు: బ్రహ్మ ఐదవ తలను తీసేసిన రుద్రుడు. క΄ాల హస్తుడు. కాశీ పురాధీశుడు.రిటి: ఉద్దాలకుని పుత్రుడు. శివకప చేత పరమ జ్ఞానిగా మారి శివ గణములలో చేరాడు.బాణుడు: శివుని పరమభక్తుడు. శివునితోనే యుద్ధం కోరాడు. తత్సముడైన శ్రీ కృష్ణునితో యుద్ధం చేసి సహస్ర బాహువులు పోగొట్టుకొని శివగణాలలో చేరాడు. నర్మదా నదిలో బాణలింగాలు ఇతనికి ఇచ్చిన వరం వల్ల బాణ లింగాలని పిలువ బడతాయి.చండీశుడు: ఒక గోప బాలుడు. శివ నింద చేసేవారికి అతడు చండశాసనుడు. ఇలా శివగణాలలో ఎన్నో రకాల వారు ఉంటారని బసవ పురాణం వివరిస్తుంది. -
ఇండియాలో తొలి మసీదు గురించి తెలుసా?
క్రీ.శ. 629 (హిజ్రీ 7) సంవత్సరంలో నిర్మించబడిన చేరమాన్ జుమా మస్జిద్, కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు; అది భారత ఉపఖండంలో మతసామరస్యానికి, ఆధ్యాత్మిక అన్వేషణకు, సంస్కృతీ సంప్రదాయాల సంగమానికి అపుర్వమైన చిహ్నంగా నిలిచింది. మస్జిద్ నిర్మాణ శైలిలో ఆ కాలపు కేరళ శిల్ప సౌందర్యం ప్రతిబింబిస్తుంది. కానోపు (గుడార ఆకారం) ఆకారంలో కట్టిన గోపురం, కలపతో నిర్మించిన పైకప్పు, పురాతన సాంప్రదాయ నూనెదీపం – ఇవన్నీ దక్షిణ భారత ఆర్కిటెక్చర్కి ఇస్లామిక్ రూపాన్ని అద్దిన అరుదైన ఉదాహరణ. కాలక్రమేణా అనేక పునరుద్ధరణలు జరిగినా, ప్రాథమిక రూపం చెక్కు చెదరకుండా కాపాడబడుతూ వస్తోంది. అక్కడి ఇమామ్లు ఇప్పటికీ తమ వంశావళిని మాలిక్ ఇబ్నె దినార్ వరకు కలిపి చెప్పుకుంటారు.మస్జిద్ చతురస్ర ఆకారంలో పురాతన కళా వైభవాన్ని చాటుతోంది. మస్జిద్ కు సంబంధించిన కాంప్లెక్స్ లో చేరామన్ మ్యూజియం, వెనుక భాగంలో అందమైన కొలను, కుడి పక్కన ఖబ్రస్తాన్ , అందులో పచ్చని నిశ్శబ్దంతో తలలూపుతున్న కొబ్బరి చెట్లు, వివిధ రకాల మొక్కలు, కాలానికి అనుగుణంగా మార్పు చెందిన రాతి మెట్లు, మస్జిద్ లోపలి భాగం మధ్యలో వేలాడుతున్న పురాతన నూనెదీపం, అత్యంత సుందరమైన చెక్క మింబర్ ఇవన్నీ ఆ ప్రదేశాన్ని ఒక చరిత్రకావ్యంలా మార్చేశాయి.అక్కడి స్థానికులు చెప్పిన ఒక మాట ప్రకారం ‘‘ఇది కేవలం మస్జిద్ కాదు, ఇది భారత దేశానికి ఇస్లాం ప్రవేశ ద్వారం.’’ఈ ఒక్క వాక్యంతో ఆ స్థలం ప్రాముఖ్యత పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. సముద్ర గాలిలోనూ, ప్రార్థన ధ్వనిలోనూ, ఆ భూమి ఇంకా చెరామాన్ పెరుమాళ్ ఆత్మను ఆత్మీయంగా మీటుతూనే ఉన్న అనుభూతి కలుగుతుంది. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
స్వరోవ్స్కి ఈవెంట్లో రష్మిక స్టైలిష్ లుక్ : ఎంగేజ్మెంట్ రింగ్ స్పెషల్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) లాస్ ఏంజిల్స్లో జరిగిన స్వరోవ్స్కీ మాస్టర్స్ ఆఫ్ లైట్ ప్రారంభోత్సవ వేడుకలో స్టన్నింగ్ లుక్తో అందర్నీ ఆకట్టుకుంది. స్వరోవ్స్కీ స్థాపించి 130 సంవత్సరాలు పూర్తయిన ( Swarovski’s 130 years) సందర్భంగా 2025లో 130వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. "130 ఇయర్స్ ఆఫ్ లైట్ & జాయ్" అనే పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది.లాస్ ఏంజిల్స్లో జరిగిన బ్రాండ్ మాస్టర్స్ ఆఫ్ లైట్ ఓపెనింగ్ వేడుకలో రష్మిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత రాయబారిగా స్వరోవ్స్కి ఈవెంట్లో గౌరవ్ గుప్తా కార్యక్రమంలో రష్మిక మందన్న స్టైలిష్గా అరంగేట్రం చేసింది. ప్రముఖ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా దుస్తుల్లో రష్మిక ఈవెంట్కు హైలైట్గా నిలిచింది.గౌరవ్ గుప్తా రాబోయే హాలిడే 2026 కలెక్షన్ నుంచి రష్మిక మందన్న బెస్పోక్ పెటల్ కార్సెట్ స్కల్ప్ట్ ఫ్రాక్ ధరించింది. దీనికి హై-వెయిస్టెడ్, ఫ్లోర్-లెంగ్త్ బ్లాక్ స్కర్ట్తో జత చేసింది. ఇంకా అద్భుతమైన స్వరోవ్స్కీ ఆభరణాలు రష్మిక్ గ్లామర్ లుక్ను పెంచాయి. మాస్టరీ ఆఫ్ లైట్ థీమ్కు సరిపోయేలా, ఆమె అష్టభుజి-కట్ క్రిస్టల్స్ ఐకానిక్ మిలీనియా చోకర్ను ధరించింది. స్వరోవ్స్కీ నెక్లెస్, రెండు ఇయర్ కఫ్లతో పాటు సరిపోయే డాంగ్లర్ చెవిపోగులను కూడా ధరించింది. అలాగే రోడియం ప్లేటింగ్తో అలంకరించబడిన భారీ స్టేట్మెంట్ నడుం బెల్ట్ కూడా అందంగా అమిరి మెడ్రన్ లుక్ను తెచ్చిపెట్టాయి. దీంతోపాటు, ఫోటోగ్రాఫర్ల కోసం ఫోజులిస్తున్నపుడు కనిపించిన రింగ్, ఎంగేజ్మెంట్ రింగ్ అనే ఊహాగానాలు మాత్రం జోరుగా ఉన్నాయి.మాస్టర్స్ ఆఫ్ లైట్ - హాలీవుడ్ ఎగ్జిబిషన్ స్వరోవ్స్కీ వేడుకలు నవంబర్ 3 వరకు జరగనున్నాయి. ఇక్కడ ఎన్నె అద్భుతమైన ఫ్యాషన్ , ఐకానిక్ దుస్తులు ప్రదర్శించనున్నారు. ఎగ్జిబిషన్ ఈవెంట్లో చెర్, ఎలిజబెత్ ఒల్సెన్, జెఫ్ గోల్డ్బ్లమ్, వియోలా డేవిస్, వీనస్ విలియమ్స్, లా రోచ్, లారా హారియర్, ఎమిలీ రాటజ్కోవ్స్కీ, డిటా వాన్ టీస్, అనోక్ యాయ్ ,అమేలియా గ్రే వంటి ప్రముఖ హాజరైన ప్రముఖులతో సహా స్టార్-స్టడ్డ్ ప్రేక్షకులను ఆకర్షించింది. 2025 దీపావళి సందర్భంగా రష్మిక మందన్నాను స్వరోవ్స్కి ఇండియా తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించింది. ఈసందర్భంగా కొన్ని ఈవెంట్లను నిర్వహిస్తూ వస్తోంది. మెట్ గాలా 2025:"టైలర్డ్ ఫర్ యు" అనే థీమ్తో ఒక గ్రాండ్ ఈవెంట్ నిర్వహించింది. అరియానా గ్రాండేతో కలిసి స్ప్రింగ్-సమ్మర్ 2025 ప్రచారాన్ని కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
కొడుకు కెరీర్ కోసం..ఆ తండ్రి ఏం చేశాడో తెలిస్తే విస్తుపోతారు..!
పిల్లల కోసం కన్నవాళ్లు ఎంతైన కష్టపడతారు. ఏం చేయడానికైనా వెనుకాడరు. అలానే ఈ తండ్రి తను కుమారుడు కెరీర్ కోసం చేస్తున్న పని అందర్నీ ఆలోచింప చేసేలా ఉండటమే గాదు, అందరి హృదయాలను తాకింది. మార్కెటింగ్ నైపుణ్యాలు పెంచుకునేందుకు ప్రయత్నించే ఎంబీఏ స్టూడెంట్స్కి ఇవి గొప్ప పాఠాలు.ఒక క్యాబ్డ్రైవర్ తన వాహనాన్ని మొబైల్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్గా మార్చాడు. వాట్ అనుకోకండి అసలు కథలోకి వెళ్దాం. రోజువారిగా ప్రయాణీకులను డ్రాప్ చేసి వారితో సంభాషిస్తు..తన కుమారుడి కెరీర్కు తన వంతు ప్రోత్సాహం అందిస్తున్నాడు. అదికూడా సాంకేతిక సాయంతో. దీన్ని గమనించిన మార్కెటింగ్ ప్రొఫెషనల్ దివ్యుషి సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట షేర్ చేయడంతో వైరల్గా మారింది. ఆమె క్యాబ్ డ్రైవర్ సీటుకి అటాచ్ చేసిన క్యూర్ కోడ్ని చూసి డిజిటల్ చెల్లింపు అనుకుందామె. అదే విషయం డ్రైవర్ని అడగగా..ఇది చెల్లింపులకు సంబంధించినది కాదని, తన కొడుకు స్వయంగా తయారు చేసుకున్న రాప్ సంగీతాన్ని ప్రదర్శించే యూట్యూబ్ ఛానెల్ ప్రత్యక్ష లింక్ని సమాధానమిస్తాడు. ఎలాంటి అధికారిక విద్య నేపథ్యం లేకపోయినా..ఇతడి ఆలోచన తీరుకి దివ్యుషి ఇంప్రెస్ అయ్యింది. ప్రతి ప్రయాణికుడిని ఎక్కించుకుంటూ..దీని గురించి వాళ్లకి చెబుతూ..కుమారుడి డిజిటల్ కంటెంట్ని పైసా ఖర్చు లేకుండా ప్రమోట్ చేస్తున్నాడాయన అని రాసుకొచ్చింది పోస్ట్లో దివ్యుషి. పరిమితమైన వనరులతో తను చేయగలిగింది చేస్తున్న ఈ తండ్రి సాయం నెటిజన్లు హృదయాలను గెలుచుకుంది. అంతేగాదు స్థానిక ట్యాక్సీలు డిజిటల్ విజయానికి లాంచ్ప్యాడ్లా ఉంటాయని ఇప్పుడే తెలిసిందని మరికొందరు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: మన వంటకం దోసె..బ్రిటిష్ చెఫ్ని ఎంతలా మార్చేసింది..!) -
మన వంటకం దోసె..బ్రిటిష్ చెఫ్ని ఎంతలా మార్చేసింది..!
మన భారతీయ వంటకాలకు ఫిదా కానివారెవ్వరూ.!. దేశ దేశాలలో ఉన్న వివిధ రుచల యందు భారతీయుల రుచులు వేరయా అనొచ్చు కదూ..మనవాళ్లు టేస్ట్..మాములుగా ఉండదు. ఎందుకంటే మన దక్షిణ భారతదేశ బ్రేక్ఫాస్ట్లపై మనుసు పారేసుకున్న బ్రిటిష్ చెఫ్..ఎంతలా మన టేస్ట్కి దాసోహం అయ్యేడో తెలిస్తే విస్తుపోతారు. మరీ ఆ కథేంటో చకచక చదివేయండి మరి..భారతీయులు మినపప్పు, బియ్యంతో చేసుకునే దోసెలంటే చెవికోసుకుంటారని చెప్పొచ్చు. చాలామటుకు భారతీయులు దోసెకు ఫ్యాన్సే. అంతలా ఇష్టంగా తినే దోసెకు వైట్ చట్నీగా పిలిచే బ్రిటిష్ చెఫ్ టిమ్ డార్లింగ్ దాసోహమైపోయాడు. ఆ వంటకాన్నే తన జీవనోపాధిగా మార్చుకుని..దోసెల వేయడంలో దిట్ట అనుపించుకుంటున్నాడు. బ్రిటన్కి చెందిన ఈ చెఫ్ బ్రిస్టల్లోని భారతీయ కమ్యూనిటీలకు తను రుచులను అందిస్తున్నాడు. మొదట చిన్న కారవాన్గా దోసె స్టాల్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత రెస్టారెంట్ పెట్టుకునే రేంజ్కి వెళ్లిపోయాడు. దోసె గురించి ఎలా తెలిసిందంటే..వైట్ చట్నీగా పిలిచే టిమ్ డార్లింగ్ ఉపాధి కోసం చిన్న చిన్న పనుల చేస్తుండేవాడు. అలా ఉపాధి నిమిత్తమై లండన్కి వెళ్లగా..అక్కడ వంట చేయడంపై ఆసక్తి పెరిగింది. అక్కడ దీపక్ అనే భారతీయ చెఫ్ని కలిశాడు. అతడు డార్లింగ్కి దక్షిణ భారత వంటకాలను పరిచయం చేశాడు. క్రిస్పీ దోసెలు, స్పాంజీలాంటి ఇడ్లీల రుచికి ఫిదా అయిపోయాడు. ముఖ్యంగా చింతపండు, కరివేపాకు, కొబ్బరితో చేసిన చెట్నీ అతడి మనసుని కదిలిచింది. అప్పుడే డార్లింగ్కి తానే ఏం చేస్తే తన లైఫ్ సెటిల్ అవుతుందో అర్థమైందట. అలా లాక్డౌన్ సమయంలో సోమర్సెట్ స్ట్రీట్లో కారవాన్లో దోసెలు వేసి భారతీయ కమ్యూనిటీలకు సర్వ్ చేసేవాడు. అక్కడ ఒక బ్రిటిష్ వ్యక్తి దోసెలు అమ్ముతున్నాడా అని తెలిసి..జనం కిటకిటలాడిపోయారు. అతడు అచ్చం మన భారతీయ వంటవాళ్లు వేసినట్లుగా అలవోకగా వేస్తున్న తీరు అందర్నీ ఆకర్షించింది. ఎలాంటి అడ్వర్టైస్మెంట్ అవసరం లేకుండానే అతడి గురించి క్షణాల్లో అందరికీ తెలిసిపోయింది, వ్యాపారం కూడా బాగా నడచింది. దాంతో నెమ్మదిగా ఫుడ్ వ్యాన్గా అప్గ్రేడ్ చేశాడు. అతడు అచ్చం ఇండియాలోని హోటల్ మాదిరిగానే కొబ్బరి చెట్నీ, సాంబారు, అల్లం చట్నీ వంటివన్నీ సర్వ్ చేశాడు. ప్రస్తుతం రెండు రెస్టారెంట్లను నిర్వహిస్తున్నాడు. అంతేకాదండోయ్ డార్లింగ్కి మన వంటల్లో ప్రావీణ్యం సంపాదించడానికి దాదాపు 15 ఏళ్లు పట్టిందని చెబుతున్నాడు. తమ మాతృభూమికి దూరంగా వచ్చేశామన్న బాధ, తన రెస్టారెంట్కి వస్తే పోతుందని భారతీయులు మెచ్చుకునే రేంజ్లో రుచికరంగా అందిస్తాడని పేరుతెచ్చుకున్నాడు డార్లింగ్. నాణ్యతలో రాజీ పడకుండా అందించి భారతీయుల అభిమానమే కాదు..అక్కడే ఉండే బ్రిటన్ దేశస్తులు కూడా ఈ రుచులను ఆస్వాదిస్తున్నారట. నిజంగా టిమ్ డార్లింగ్ గ్రేట్ కదూ..!. వేరే దేశం వంటకాలను నేర్చుకోవడమే కాదు..దాన్ని జీవనోపాధిగా మార్చుకుని అభివృద్ధి చెందడం అంటే మాటలు కాదు కదా..!.(చదవండి: అక్కాచెల్లెళ్లు నలుగురికి అరుదైన వ్యాధి..! విస్తుపోయిన వైద్యులు) -
అక్కాచెల్లెళ్లు నలుగురికి అరుదైన వ్యాధి..! విస్తుపోయిన వైద్యులు
ఒకే తల్లికి పుట్టిన పిల్లలకు ఒకే విధమైన సమస్య రావడం చూస్తుంటాం. అలా కాకుండా..ఆఖరి పిల్లవాడిలో చూసిన రుగ్మత పెద్దపిల్లల్లో ఒకరి తర్వాత ఒకరూ బారినపడితే..అదొక మెడికల్ మిస్టరీలా ఉంటుంది. అలాంటి ఘటనే ఇక్కడ ఆవిష్కృతమైంది. వైద్యులు సైతం ఇదెలా సాధ్యం అని విస్తుపోతున్నారు.అసలేం జరిగిందంటే..అమెరికాలోని వెస్ట్ వర్జినియాకు చెందిన ఒక కుటుంబంలో నలుగురు కుమార్తెలు ఒకరు తర్వాత ఒకరు ఒకే విధమైన మెదడు సంబంధిత రుగ్మత బారినపడ్డారు. తొలుత చిన్న కుమార్తెకు 18 నెలల వయసు ఉండగా ఈ సమస్యను గుర్తించారు. అదీగా తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి ప్రతిదీ నేర్చుకోవడం ఆలస్యం కావడంతో..ఆ చిన్నారి విషయంలోనే ఆందోళ చెందేవారు. ఇప్పుడూ పెద్దవాళ్లైన ముగ్గురు పిల్లలు అదే రుగ్మత బారినపడ్డారని తెలిసి తల్లడిల్లిపోయారు. ఏంటా వ్యాధి అంటే..మెదడుకి సంబంధించిన చియారీ వైకల్యం. వైద్యానికి సవాలు విసిరేలా నలుగురు ఒకేసారి ఈ వ్యాధిని ఎదుర్కొవడం అంతుచిక్కని మిస్టరీలా అనిపించింది వైద్యులకు. చియారీ వైకల్యం అంటే..పుర్రె వెనుకభాగం మెదడు కణజాలం వెన్నెముకలోకి ప్రవేశించే పరిస్థితి. ఫలితంగా ఇది మెదడుపై ఒత్తిడిని కలిగిస్తుంది. దాంతో తలనొప్పి, మైకము, మెడ నొప్పి, బ్యాలెన్సింగ్కి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. సింపుల్గా చెప్పాలంటే మెదడు యొక్క దిగువ భాగం పుర్రె దాటి విస్తరించి, పుర్రె వెన్నుపాముతో కలిసే ద్వారం పొడుచుకు వచ్చే పరిస్థితి. ఇది సాధారణంగా పుట్టుకకు ముందు అభివృద్ధి చెందుతుందని వైద్యులు. ఈ సమస్యల ప్రతి 2,000 మందిలో ఒకరిని ప్రభావితం చేస్తుంది. అయితే ఈ పరిస్థితి ఎందువల్ల వస్తుందనేది ఖచ్చితమైన కారణం తెలియదు. అయితే పెద్దవాళ్లైన ముగ్గురు ఆడపిల్లలు అమేలియా, ఆబ్రే, అడాలీలకి పీడియాట్రిక్ న్యూరో సర్జన్ శస్త్ర చికిత్స చేసి సమస్య నుంచి మెరుగయ్యేలా చేశారు. ఇక్కడ వైద్యులు ఈ పరిస్థితికి..మెదడుతో కుదించి ముడిపడి ఉన్న వెన్నుపాములను కోసి సెరెబ్రోస్పానియల్ ద్రవ ప్రవాహాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా శస్త్రచికిత్స చేస్తారు. ప్రస్తుతం ఆ ముగ్గురు ఈ సమస్య నుంచి విజయవంతంగా బయటపడ్డారు. కానీ ఇలా ఈ చియారీ వైకల్యం బారిన నలుగురు అక్కాచెల్లెళ్లు ఒకేసారిపడటం అనేది అత్యంత అసాధారణం, అరుదుగా పేర్కొన్నారు వైద్యులు. ఈ సమస్య సుమారు 10% వరకు వంశపారంపర్యంగా వస్తున్నట్లు భావిస్తున్నప్పటికీ..జన్యుపరమైన కారణాల వల్ల సంభవిస్తుందనేది మరికొందరు నిపుణులు వాదన. చివరగా.. ఈ సమస్యకు గనుక సకాలంలో చికిత్స తీసుకోకపోతే అవయవాల బలహీనత, శ్వాస సమస్యలు, పార్శ్వగూని, తలనొప్పి, నరాల నొప్పికి దారితీసి పక్షవాతానికి గురయ్యే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు వైద్యులు. (చదవండి: రోబోటిక్తో..స్ట్రోక్ శరవేగంగా రికవరీ) -
అవరోధాలనే అవకాశాలుగా..!
మానవ జీవిత గమనంలో గమ్యం చేరుకునే దారిలో అవరోధాలు ఏర్పడటం సహజం. సష్టిలో ఏ ఇద్దరికీ జీవనప్రయాణం ఒకేలా సాగదు. ఏకోదరులకు కూడా ఒకేరకంగా జీవనప్రయాణం ఉండదు. భౌతిక ప్రపంచంలో కష్టాలు మనుషుల్ని బలహీన పరుస్తాయి. కానీ, ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే ప్రతి అవరోధమూ మన సహనం, విశ్వాసం, అంతర్గతశక్తిని పరీక్షించడానికి దైవం కల్పించిన గొప్ప అవకాశం. పురాణ ఇతిహాసాలు ఈ సత్యాన్ని నిరూపించాయి. రామాయణంలో అయోధ్యకాండను పరిశీలిస్తే పట్టాభిషేకానికి సిద్ధమైన శ్రీరాముడు, కైకేయికి తండ్రి దశరథమహారాజు ఇచ్చిన వరాల కారణంగా అరణ్యానికి వెళ్లాల్సి వచ్చింది. పదునాలుగేండ్లు వనవాసం చేయాల్సి వచ్చింది. అది శ్రీరాముని జీవితంలో పెద్ద అవరోధం. కానీ స్థితప్రజ్ఞత కలిగిన రాముడు దీనినొక అవకాశంగా చేసుకున్నాడు. ధర్మాన్ని కాపాడటం తన కర్తవ్యంగా భావించాడు. పితృవాక్య పరి΄ాలకుడిగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అరణ్యంలోనూ రాముని జీవనం సజావుగా సాగలేదు. సీతాపహరణం తీవ్ర అవరోధంగా పరిణమించింది. అయితే ఈ అవరోధమే కోదండరామునికి కొత్త సహచరులను పరిచయం చేసింది. వానర, సుగ్రీవ, హనుమ వంటి వీరులతో మైత్రి ఏర్పరిచింది. రావణసంహారం గావించాడు. అసుర చెరనుండి అయోనిజ ని విడిపించాడు. పురుషోత్తమ రాముడయ్యాడు.సుందరకాండను పరిశీలిస్తే సీతమ్మ జాడకై వెళ్లిన పవనసుతునికి లంకలో అవమానం ఎదురైంది. అసురులు తన తోకకు నిప్పంటించారు. ఈ అవరోధాన్ని ఆంజనేయుడు అవకాశంగా మార్చుకున్నాడు. శత్రుశక్తిని ఆయుధంగా మలిచాడు. మండుతున్న తోకతో మొత్తం లంకానగరాన్ని దహనం చేసాడు. అటు మహాభారతంలో ద్యూతక్రీడలో కౌరవులపై ఓటమి చెందిన పాండవులు అరణ్యవాసం, ఆపై అజ్ఞాతవాసం అనుభవించాల్సి వచ్చింది. ఈ అవరోధనా కాలాన్ని, పాండవులు అవకాశంగా మరల్చుకున్నారు. వారు నేర్చుకున్న విద్యలనూ, అభ్యసించిన శాస్త్రాలనూ, ఆయుధవిద్యలో ప్రావీణ్యం సంపాదించుకునే దిశలో వినియోగించుకున్నారు. తమ వీరత్వాన్ని చాటారు.భాగవతంలో ప్రహ్లాదుడు ఎదుర్కొన్న అవరోధం అసాధారణం. తండ్రి హిరణ్యకశిపుడే శత్రువుగా మారాడు. నిప్పులో వేయించడం, ఏనుగులతో తొక్కించడం, కొండపైనుండి తోయించడం వంటివి అవరోధాలు. కానీ ప్రహ్లాదుడు ఈ అవరోధాలన్నింటినీ తన భక్తిని మరింత దృఢం చేసుకునే అవకాశంగా మార్చుకున్నాడు. ఎన్ని కష్టాలెదురైనా అతని మనస్సు ఆ పరమాత్మ స్మరణ నుండి తొలగలేదు. అంతిమంగా ఆ పీడనమే నృసింహ అవతార రూపంలో భగవంతుని సాక్షాత్కారానికి దారితీసింది. ఇక్కడ అవరోధం ప్రహ్లాదునికి మోక్ష సాధన మార్గమైంది.ధ్రువుడు చిన్న వయసులోనే సవతి తల్లి చేతిలో తీవ్ర అవమానాన్ని చవి చూశాడు. ఈ చేదు అనుభవం అతనికి అవరోధం. ఈ అవరోధమే అతణ్ణి మహా భక్తునిగా మార్చింది. నారద మహర్షి మార్గ దర్శకత్వంలో ధ్రువుడు కఠిన తపస్సు చేశాడు. చివరికి మహా విష్ణువు ప్రత్యక్షమై ధ్రువుని అచంచల భక్తిని సదా జ్వలించే ధ్రువ నక్షత్రంగా స్థాపించాడు. అవమానం అనే అవరోధం విశ్వనక్షత్రమనే అవకాశం గా మారింది.పురాణాలన్నీ బోధించేది ఒక్కటే. జీవితంలో ఎదురయ్యే ప్రతీ అవరోధమూ మన ఆత్మశక్తిని, భగవంతునిపై విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి దొరికిన అవకాశం. కష్టాలు, సవాళ్లు అనేవి మనల్ని దిగజార్చడానికి కాక మన అంతరంగం లో నిగూఢమై ఉన్న దైవత్వాన్ని వెలికితీయడానికి, మనల్ని ఉన్నత ఆధ్యాత్మికస్థితికి చేర్చడానికి తోడ్పడతాయి. కాబట్టి అవరోధాలను చూసి భయపడకుండా దానిని ఒక ఆశీర్వాదంగా భావించి ధైర్యంతో, విశ్వాసంతో ముందడుగు వేయడమే నిజమైన ఆధ్యాత్మిక మార్గం. ఆధ్యాత్మిక వికాసం ఉన్నచోట ఆటంకం కూడా అవకాశంగా కొత్తరూపు ఏర్పడుతుంది. అదే విజయానికి పునాది అవుతుంది.ఓటమి విజయానికి గెలుపు అనుకుంటే అవరోధమేమే అవకాశానికి తలుపు అవుతుంది.ఆధ్యాత్మిక సాధనతోనే ఇది సాధ్యమవుతుంది. – కె.వి.లక్ష్మణరావు (చదవండి: చంద్రుడు ప్రతిష్టించిన సోమేశ్వరులు..! ఎనిమిది దిక్కులలో కొలువై.) -
రోబోటిక్తో..స్ట్రోక్ శరవేగంగా రికవరీ
పక్షవాతం(స్ట్రోక్)కు గురైన రోగి శరవేగంగా కోలుకునేందుకు రోబోటిక్ ప్రక్రియ అద్భుతంగా తోడ్పడుతుందని హెల్త్ కేర్ ఎట్ హోమ్(హెచ్సీఏహెచ్) ఇండియా సహ వ్యవస్థాపకుడు ఢిల్లీకి చెందిన డాక్టర్ గౌరవ్ తుక్రాల్ అన్నారు. ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రోబోటిక్స్ అండ్ రికవరీని సోమాజిగూడలోని సువిటాస్ రిహాబిలిటేషన్ సెంటర్ బుధవారం ప్రారంభించింది. కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ఇది స్ట్రోక్ న్యూరో రిహాబిలిటేషన్లో కీలకమైన ముందడుగని, రోబోటిక్స్, ఏఐ, సైన్స్, డేటా మిళితం చేయడం ద్వారా రోగులకు అత్యంత ఖచ్చితత్వంతో కూడిన రికవరీని అందించగలమన్నారు. నడక సహా పలు అవయవాల కదలికలకు శిక్షణ అందించే ఈ సరికొత్త రోబోటిక్ గైటర్ పూర్తి మేడ్ ఇన్ ఇండియా కాగా రోగులు ఇప్పుడు ఎక్సోస్కెలిటన్–సహాయక నడక వ్యవస్థలను ఉపయోగించి కేవలం 30 నిమిషాల్లో వెయ్యి గైడెడ్ స్టెప్స్ తీసుకోవచ్చన్నారు. హెచ్సీఏహెచ్కు చెందిన అంకిత్ గోయెల్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: బ్రెస్ట్ కేన్సర్పై అవగాహన.. గిన్నిస్ బుక్లో చోటు..) -
బ్రెస్ట్ కేన్సర్పై అవగాహన.. గిన్నిస్ బుక్లో చోటు..
మహిళల్లో రొమ్ము కేన్సర్పై ప్రముఖ ప్రైవేటు రంగ బీమా సంస్థ ఎస్బీఐ లైఫ్ చేపట్టిన అవగాహన ప్రచారం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకుంది. ఈ విషయాన్ని సంస్థ నగర ప్రతినిధులు తెలిపారు. బ్రెస్ట్ హెల్త్ను ప్రతి ఇంటా చర్చించుకోవాల్సిన విషయం అనే అవగాహన పెంపొందించడం లక్ష్యంగా 1,191 ‘హగ్ ఆఫ్ లైఫ్’ హాట్ వాటర్ బ్యాగ్లను ఉపయోగించి, ‘టేక్ ఎ బ్రెస్ట్ సెల్ఫ్–ఎగ్జామ్ విత్ థాంక్స్–ఎ–డాట్’ అనే సందేశాన్ని ప్రదర్శించే అతి పెద్ద మొజాయిక్ను రూపొందించడం ద్వారా ఈ ఘనత సాధించామన్నారు. 2023లోనే మహిళలు స్వయంగా సెల్ఫ్–బ్రెస్ట్ పరీక్షను సురక్షితంగా నిర్వహించుకునేందుకు తోడ్పడేలా ప్రపంచంలోనే తొలిసారిగా తమ సంస్థ ‘హగ్ ఆఫ్ లైఫ్’ హాట్ వాటర్ బ్యాగ్ను ప్రవేశపెట్టిందని వివరించారు. (చదవండి: ఈ తరం వైబ్స్.. దేశీ టూన్స్..) -
ఈ తరం వైబ్స్.. దేశీ టూన్స్..
యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్, కామిక్స్(ఏవీజీసీ) రంగాల సమ్మేళనంగా నిర్వహించే వినూత్న సృజనాత్మక వేడుక ‘దేశీ టూన్స్ 2025’కు భాగ్యనగరం వేదిక కానుంది. దేశంలో సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు రూపకల్పన చేస్తున్న అతిపెద్ద వేడుక ఇండియాజాయ్ 2025, ఈ ఏడాది తన 8వ ఎడిషన్తో మరింత వైభవంగా రాబోతోంది. ఇందులో భాగంగా దేశీ టూన్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. చోటా భీమ్ వంటి ప్రముఖ భారతీయ పాత్రలను సృష్టించిన గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సంస్థ నిర్వహిస్తున్న ఈ యానిమేషన్ కాన్క్లేవ్వచ్చేనెల 1న హైదరాబాద్ నగరంలోని హెచ్ఐసీసీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనుంది. ఈ ఏడాది ఎడిషన్లో భారతీయ సాంస్కృతిక మూలాల నుంచి ప్రేరణ పొందిన కథలను అంతర్జాతీయ ప్రేక్షకుల మనసులను తాకేలా మలుస్తున్న సృజనకారుల విజయగాథలను ప్రదర్శించనున్నారు. మాస్టర్క్లాస్లు, ప్యానెల్ చర్చలు, ఇంటరాక్టివ్ సెషన్లు.. అన్నీ క్రియేటర్స్, నిర్మాతలు, పరిశ్రమ నిపుణుల కోసం ప్రేరణాత్మక అనుభవంగా ఉండబోతున్నాయి. గ్లోబల్ ప్లాట్ఫామ్.. ‘దేశీ టూన్స్’ భారతీయ కథన శక్తికి, సృజనాత్మక ప్రతిభకు ప్రతీకగా నిలుస్తోంది. భారతీయ యానిమేషన్ ప్రపంచానికి వేదికగా ఈ కాన్క్లేవ్ కొత్త ప్రతిభను వెలికితీయడంతో పాటు పాలసీ, పెట్టుబడి, సాంకేతికత వంటి రంగాల్లో సమన్వయం సృష్టించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ వేదిక ద్వారా రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ యానిమేషన్, విజువల్ మీడియా రంగాలకు ఉత్సాహం, అవకాశాలను కల్పించే నిర్ణయాలకు అద్భుత వేదికగా నిలవనుంది. అంతేగాకుండా ‘పవర్ ప్లేయర్స్ ఆఫ్ ఇండియన్ యానిమేషన్’, ‘క్వైట్ స్టోరీస్, పవర్ఫుల్ ఇంపాక్ట్’, ‘ది రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ బూస్టింగ్ ఏవీజీసీ సెక్ట్సర్’ చర్చలు జరుగుతాయి. ఇందులో పాన్ ఇండియా హిట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు నాగ్ అశి్వన్, ‘మహావతార్ నరసింహ’ (2025) దర్శకుడు అశి్వన్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సౌత్ ఆసియా కిడ్స్ కంటెంట్ హెడ్ సాయి అభిõÙక్ వంటి ప్రముఖులు పాల్గొననున్నారు. యానిమేషన్ అభిమానులు, విద్యార్థులు, పరిశ్రమ నిపుణులు తదితరులు ఇందులో భాగం కానున్నారు. మన కథల గురించి చెప్పుకోవాలి.. ఈ నేపథ్యంలో గ్రీన్ గోల్డ్ యానిమేషన్ వ్యవస్థాపకులు రాజీవ్ చిలకా మాట్లాడుతూ.. భారతీయ కథలు ప్రపంచ వేదికపై వెలుగొందాలి. మన సంస్కృతికి చెందిన నిజమైన కథలు సాంకేతికత, ఊహాశక్తి, క్రియేటివిటీ ద్వారా ప్రపంచాన్ని ఆకట్టుకునేలా మలచవచ్చని తెలిపారు. ఇండియాజాయ్ ప్రతినిధి మాధవరెడ్డి యతం మాట్లాడుతూ.. దేశీ టూన్స్ భారతీయ సృజనాత్మకతకు ప్రతీక. గ్రీన్ గోల్డ్ భాగస్వామ్యంతో ఇండియాజాయ్ ఆవిష్కరిస్తున్న ఈ వేదిక భారతదేశం కేవలం సృజనాత్మక భాగస్వామి కాకుండా గ్లోబల్ లీడర్గా ఎదిగే క్రమాన్ని ప్రదర్శిస్తోందని అన్నారు. (చదవండి: రుచులదాత 'సుషీ'భవ..! భోజనప్రియులు ఇష్టపడే క్రేజీ వంటకం) -
కార్తీక దీపానికి భక్తకోటి కాంతులు
అవి ప్రతి యేటా జరిగే బ్రహ్మోత్సవాలు కాదు... సనాతనంగా నిర్వహించుకునే నవరాత్రులూ కాదు తరతరాలుగా చేసుకునే పండుగలో పర్వదినాలో కాదు అలాగని అది మునుపెన్నడూ చేయని క్రతువు కాదు. వేదాలు.. పురాణేతిహాసాలు అందించిన ఒక చిన్న వెలుగుకు కోటికాంతులు అద్దిన ఉత్సవం. కార్తికమాసానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన అద్భుతం. సుమారు పుష్కరకాలం క్రితం కార్తికమాసానికి నూతన వైభవాన్ని తీసుకువచ్చిన సంరంభం. అదే భక్తిటీవీ కోటి దీపోత్సవం. కార్తికమాసం వస్తోందనగానే ఆస్తికులందరికీ గుర్తుకువచ్చే అపురూప సంరంభం. భక్తిటీవీ కోటిదీపోత్సవం. చరిత్రలో మునుపెవ్వరూ చేయని విధంగా భక్తిటీవీ చేపట్టిన విశిష్ట కార్యక్రమం కోటిదీపోత్సవం. 2012లో లక్షదీపోత్సవంగా ప్రారంభమైన ఈ దీపయజ్ఞం.. 2013లో కోటిదీపోత్సవమై... పుష్కరకాలానికి పైగా భక్తుల మదిలో అఖండజ్యోతిగా వెలుగొందుతోంది. ఎప్పటిలాగే భక్తుల నుంచి ఎలాంటి రుసుములు, కానుకలు తీసుకోకుండా.. ప్రాంగణంలో ప్రమిదలు, నూనె, వత్తులు, శివలింగాలు, దేవతాప్రతిమలు, పూలు, పూజాసామాగ్రి ఇలా ప్రతీది ఉచితంగా సిద్ధం చేస్తారు.సుమారు పుష్కరకాలం క్రితం... పదమూడేళ్లక్రితం శృంగేరీ దక్షిణామ్నాయ పీఠ జగద్గురువులు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామివారు విజయ యాత్రలో భాగంగా భాగ్యనగరానికి విచ్చేశారు. ఈ సందర్భాన్ని రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత తుమ్మల నరేంద్రచౌదరి, రమాదేవి దంపతులకు ఓ సంకల్పం కలిగింది. భక్తులందరి సమక్షంలో వారికి గురువందనం చేయాలని భావించారు. దానితోపాటు కార్తికమాసంలో శివస్వరూపమైన జగద్గురువులు స్వయంగా విచ్చేశారు గనుక.. వారి సమక్షంలో కార్తికదీపోత్సవం నిర్వహించాలని సంకల్పించారు. ఆ చిన్న సంకల్పానికి ప్రతిరూపమే 2012లో జరిగిన లక్షదీపోత్సవం. భక్తిటీవీ చేపట్టిన దీపయజ్ఞానికి నాంది అది. ఎన్టీఆర్స్టేడియం వేదికగా కైలాసాన్ని తలపించే సభావేదికను ఏర్పాటు చేశారు. ఆ వేదికపై శృంగేరి జగద్గురువులు దీపారాధన చేసి భక్తులను ఆశీర్వదించారు.ముక్కోటి దేవతలు ఒక్కటైనారు...కార్తికమాసంలో శంకరనారాయణులనే కాదు.. సమస్త దేవతలను కోటిదీపోత్సవ వేదికపై దర్శించుకోవచ్చు. వారికి జరిగే కల్యాణోత్సవాలను, విశేష పూజలను వీక్షించవచ్చు. ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచభూతలింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, శ్రీవైష్ణవ దివ్యదేశాలు ఇలా అనేకానేక విశిష్టధామాల నుంచి కోటిదీ΄ోత్సవ వేదికపై ఉత్సవమూర్తులు కొలువుదీరతాయి. ఆ ఉత్సవర్లను దర్శించడం సాక్షాత్తూ ఆ క్షేత్రాలకు వెళ్లడంతో సమానం. ఉజ్జయిని, అరుణాచలం, వేములవాడ, కాళేశ్వరం వంటి శైవ క్షేత్రాలు.. యాదాద్రి, శ్రీరంగం, కొండగట్టు తదితర వైష్ణవ క్షేత్రాలు... అలంపురం, కంచి, వారణాసి వంటి శక్తిపీఠాలు. ఇలా ఒకటేమిటి దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధ దేవతామూర్తులు కోటిదీ΄ోత్సవ వేదికపై కొలువుదీరతారు. కోటిదీపోత్సవం అంటే కేవలం దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదు... పాల్గొనే ప్రతీ భక్తుడికి ఎన్నో అద్భుత ఆధ్యాత్మిక అనుభవాలు పదిలపర్చుకునే మహాపర్వం. ఎన్నో పూజలు – పరిణయోత్సవ వైభవ సమాహారం.గురుర్దేవో మహేశ్వరఃప్రతి ఏటా దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధ జగద్గురువులు, పీఠాధిపతులు తరలి వస్తుంటారు. శివైక్యం చెందిన కంచికామకోటి పీఠాధిపతి శ్రీజయేంద్రసరస్వతి, పుష్పగిరి పీఠాధిపతి శ్రీవిద్యానృసింహ భారతిస్వామి, ఉడిపి పెజావర్ మఠం పీఠాధిపతి శ్రీవిశ్వప్రసన్నతీర్థస్వామి, ఆర్షవిద్యాగురుకులం శ్రీదయానందసరస్వతి వంటి మహామహులు కోటిదీపోత్సవానికి విచ్చేసి భక్తులను అనుగ్రహించడం వీక్షకుల అదృష్టం. శృంగేరి శంకరాచార్య భారతీ తీర్థమహాస్వామి, పూరీ శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి, జ్యోతిర్మఠం శంకరాచార్య అవిముక్తేశ్వరానందస్వామి, ఈశా ఫౌండేషన్ సద్గురు జగ్గివాసుదేవ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ, సమతామూర్తి స్థాపకులు త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైసూరు దత్తపీఠం పీఠాధిపతి శ్రీగణపతి సచ్చిదానందస్వామి, కుర్తాళం పీఠాధిపతి శ్రీవిద్యాశంకరభారతిస్వామి, ధర్మస్థల క్షేత్రాధికారి వీరేంద్రహెగ్డే, అక్షయ΄ాత్ర ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీమధుపండితదాస, ఇస్కాన్ అంతర్జాతీయ అధ్యక్షులు జయపతాకస్వామి, పతంజలి యోగ బాబారామ్ దేవ్, కుర్తాళం పీఠాధిపతి శ్రీసిద్ధేశ్వరానంద భారతిస్వామి, రుషికేశ్ పరమార్థ్నకేతన్ చిదానంద సరస్వతి, కాశీ – శ్రీశైల జగద్గురువులతో పాటు ఎందరెందరో యోగీశ్వరులు, పీఠాధిపతులు, జగద్గురువులు, మాతాజీలు భక్తిటీవీ కోటిదీపోత్సవానికి విచ్చేసి భక్తులను అనుగ్రహించారు. గురుదేవులే మహేశ్వరులై భక్తకోటిని అనుగ్రహించారు. ఈ ఏడాది సైతం శృంగేరి జగద్గురు విధుశేఖరభారతిస్వామివారు.. కంచి జగద్గురు విజయేంద్రసరస్వతి స్వామివారు విచ్చేయడం కోటిదీపోత్సవానికి సూర్యచంద్రుల ఆగమనం లాంటి శుభతరుణం. సువర్ణాక్షరాల ఘట్టాలు కోటిదీపోత్సవ చరిత్రలోనే కాదు... భక్తిటీవీ ప్రస్థానంలో సైతం సువర్ణాక్షరాలతో లిఖించదగిన అద్భుత ఘట్టాలు. కోటిదీపోత్సవం – 2023. కోటిదీపోత్సవం – 2024. రెండేళ్ల క్రితం మహాదేవునికి కోటిదీపాల నీరాజనం అర్పించేందుకు తుమ్మల నరేంద్రచౌదరి – రమాదేవి దంపతుల ఆహ్వానం మేరకు.. సాక్షాత్తూ దేశప్రధానమంత్రి నరేంద్రమోది విచ్చేయడం... దీపారాధన కార్యక్రమాన్ని ఆద్యంతం గమనించి.. తాను సాక్షాత్తూ కాశీలోనే ఉన్న భావన కలుగుతోందని ప్రశంసించడం ఓ అపూర్వ జ్ఞాపకం. గతేడాది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచ్చేయడం మరో మరపురాని ఘట్టం. దేశ ప్రథమ ΄ పౌరురాలి చేతులమీదుగా కార్తికదీపం వెలిగింది. భక్తుల ఆనందం కోటిదీపాల కాంతులై మెరిసింది. ఇటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా అదృష్టమని ద్రౌపది ముర్ము పేర్కొనడం అద్వితీయం. సప్తహారతులు... మహానీరాజనాలు ఈ అపూర్వ వేడుకలో అన్నింటికీమించిన ప్రధాన ఘట్టం దీపారాధన. ప్రధాన వేదికపై పీఠాధిపతులు, అతిరథ మహారథుల సమక్షంలో తొలి దీపారాధన జరిగిన వెంటనే.. కైలాస ప్రాంగణమంతా కాంతులీనుతుంది. అప్పటిదాకా విద్యుత్ దీపాల వెలుగులతో ఉన్న ప్రాంగణం నిజమైన దీపకాంతులతో మెరిసిపోతుంది. ప్రాంగణంలోని భారీ శివలింగానికి నిర్వహించే మహానీరాజనం మరో ఎత్తు. ప్రమథ గణాలు తరలివచ్చి మహాదేవునికి మహానీరాజనం చేస్తున్నారా అనేంతలా ఉంటుందా అద్భుత దృశ్యం. ఇలాంటి అనేక ఘట్టాలను వీక్షించే భక్తులకు శివుడు ఎక్కడో కాదు.. ఈ కోటిదీపోత్సవ ప్రాంగణంలోనే ఉన్నాడని అనిపించక మానదు.లక్ష కాదు.. కోటి 2013లో... మళ్లీ కార్తికమాసం రానే వస్తోంది. 2012లో జరిగిన వైభవం ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంది. లక్షదీపోత్సవం కంటే మించినది ఏదైనా చేయాలని తుమ్మల నరేంద్రచౌదరి, రమాదేవి – వారి కుమార్తె రచనా చౌదరిల సంకల్పం. ఆ సంకల్పానికి ప్రతిరూపమే అంతవరకూ ఎవరూ చేయని మహోత్సవం. నూతన ఆధ్యాత్మిక యుగానికి పునాదులు వేసిన భక్తిటీవీ కోటిదీపోత్సవం. ఆనాడు వెలిగిన దీపజ్యోతి ఇంతింతై అన్నట్లుగా... పుష్కరకాలంగా కొనసాగుతోంది. అఖండదీపమై ప్రకాశిస్తోంది. ప్రతి ఏటా కొత్త కొత్త హంగులతో వెలుగొందుతోంది. కోటిదీ΄ోత్సవానికి వస్తే సమస్త క్షేత్రాలకు వెళ్లినట్లే అనే భావన ప్రతీ భక్తుడికీ కలిగేలా కార్యక్రమ రూపకల్పన జరిగింది. నటరాజుకు కళాంజలి: జానపద కళలకు సైతం కోటిదీపోత్సవం పెద్దపీట వేస్తుంది. కథకళి, కైకుట్టి, మోహినిఆట్టం, ఒడిస్సీ, మణిపురి, లావణి వంటి సంప్రదాయ నృత్యాలతో పాటు.. డోలుకుణిత, భాంగ్రా, కోలాటం వంటి అనేకానేక విభిన్న పదనర్తనలు కోటి దీ΄ోత్సవ వేదికపై కదం తొక్కనున్నాయి. ఇందుకోసం ప్రసిద్ధ కళాకారులు సైతం తరలివస్తారు. సద్గురు జగ్గీవాసుదేవ్ ఆధ్వర్యంలోని ఈశా ఫౌండేషన్ తరఫున బ్రహ్మచారులు చేసే అగ్నినృత్యం భక్తులను ఆశ్చర్యపరుస్తుంది. ఇలాంటి ఎన్నో అద్భుత ప్రదర్శనలు ప్రతిఏటా చోటుచేసుకుంటాయి.ఆ అపూర్వ యజ్ఞంమరోమారు...కార్తికమాసాన్ని పురస్కరించుకునినవంబరు1 నుంచి 13 వరకుహైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో... -
పంచారామాలలో ప్రథమం అమరలింగేశ్వరాలయం
కృష్ణానదిలో స్నానం... అమరేశ్వరుని దర్శనం’ మోక్షదాయకం అన్నారు పెద్దలు. తెలుగునేల మీద ఉన్న పంచారామాలలో ప్రథమమైనదిగా భావించే అమరేశ్వర స్వామి ఆలయం మన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా కృష్ణానది ఒడ్డున వందల ఏళ్లుగా పూజలు అందుకుంటున్నది. ఇక్కడ వెలసిన బాల చాముండికా సమేత అమరేశ్వర స్వామిని దర్శించి తరించటానికి భక్తజనం నిత్యం అమరావతిని సందర్శిస్తుంటారు. శ్రీశైలానికి ఈశాన్య భాగాన కృష్ణానది దక్షిణపు గట్టున ఉన్న ఈ క్షేత్రం దేవతలు, గంధర్వులు, ఋషులు సేవించిన మహిమ గల క్షేత్రంగా భక్తులు భావిస్తారు.దేవాలయంలో గల వివిధ శాసనాలు ద్వారా అమరేశ్వరుణ్ణి క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల నుంచి వివిధ రాజవంశీయులు సేవించినట్లు తెలుస్తుంది. ప్రధానంగా పల్లవ, రెడ్డి, కోటకేతు రాజులు అమరేశ్వరుని సేవించినట్లు చరిత్ర చెపుతోంది.శ్రీ కృష్ణదేవరాయలు అమరేశ్వరుని దర్శించి తులాభారం తూగినట్లు, బ్రాహ్మణులకు దానాలిచ్చినట్లు ఆధారాలున్నాయి. అలాగే 18వ శతాబ్దంలో చింతపల్లిని రాజధానిగా చేసుకుని దక్షిణాంధ్రదేశాన్ని పరిపాలించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఆలయాన్ని పునరుద్ధరించి, మూడు ప్రాకారాలతో 101 లింగాలను ప్రతిష్ఠించారు. నేటికీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు వంశీకులే అనువంశీక ధర్మకర్తలుగా స్వామివారి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. అమరావతి క్షేత్రం హరిహర క్షేత్రంగా కూడా పిలవబడుతుంది.ఆలయంలో వేంచేసి ఉన్న వేణుగో΄ాల స్వామి క్షేత్ర΄ాలకునిగా విరాజిల్లుతూ శివ కేశవులకు భేదం లేదని చాటుతున్నాడు.ఏకశిలా రూపంగా దాదాపు 15 అడుగుల ఎత్తున, మూడు అడుగుల కైవారం కలిగిన ఈ లింగం జగద్విఖ్యాతం. ఓంకారానికి ప్రతిరూపంగా స్వామి వారి నుదుట మూడు చిన్న గుంటలు నేటికి దర్శనమిస్తాయి.శుక్రాచార్యుడి సందేహంఅసుర గురువు శుక్రాచార్యుడు తన గణాలతో వచ్చి భవిష్యత్తులో సహ్యాద్రి పర్వతం మీద కృష్ణవేణి అనే నది పుట్టి ఇటువైపుగా ప్రవహిస్తుంది కనుక దాని ప్రవాహానికి అమరేశ్వరుడు మునిగిపోవచ్చునేమో అనే సందేహం వెలిబుచ్చాడు. అందుకు బృహస్పతి సమాధాన మిస్తూ, అమరేశ్వరుడు వెలసిన దీన్ని క్రౌంచగిరి అంటారనీ, దీని అడుగు పాతాళం దాకా ఉందనీ, దానివల్ల ఈ లింగం స్థిరంగా ఉంటుందనీ, కృష్ణమ్మ ఈ గిరి పక్క నుంచి వంక తిరిగి పారుతుందే తప్ప ఎన్నటికీ దీనిని ముంచెత్తదనీ బదులు చెప్పాడు. దీనికి ఆధారంగా ఇప్పటికీ కృష్ణానది ఈ క్షేత్రాన్ని ఆనుకొని ప్రవహిస్తూ ఉంది.అమరలింగేశ్వరాలయ ప్రాముఖ్యత...ద్వాపర యుగం చివరిలో 5053 సంవత్సరాల క్రితం మరియూ కలియుగ ప్రారంభంలో సౌనకాది మహర్షి నారదుడిని మోక్షానికి ఉత్తమమైన మార్గాన్ని కోరినట్లు స్కాంద పురాణం పేర్కొంది. నారదుడు శౌనకాది మహర్షిని కృష్ణానదిలో రోజూ స్నానం చేసి, కృష్ణుడు సృష్టించిన నది ఒడ్డున, అమరేశ్వరుణ్ణి దర్శిస్తూ నివసించమని సలహా యిచ్చాడు.నారద మహర్షి సౌనకాది అమరేశ్వర ఆలయ కథను చెప్పాడు, తన భక్తులకు కోరికలు తీర్చడానికి శివుడు ఇక్కడ లింగం రూపంలో వెలిశాడని చెప్పాడు. అలాగే కష్ణానదిలో స్నానం చేసి ఇక్కడి ఆలయంలోని అమరేశ్వరుడిని పూజించిన వారికి పాపాలు తొలగిపోతాయని చెప్పారు. ఈ ప్రదేశంలో మూడు రోజులపాటు ఉండి భక్తిశ్రద్ధలతో శివపూజ చేసిన భక్తులు శివలోకాన్ని పొందుతారన్నారు. ఇక్కడ ఏ భక్తుడు మరణించినా శివుడు గ్రహిస్తాడు.అమరలింగేశ్వర ఆలయ ఉత్సవాలు...ఈ ఆలయంలో కార్తీక మాసం, మహా బహుళ దశమి, నవరాత్రి, మహా శివరాత్రి అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆలయ సమయాలు...మామూలు రోజుల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరచి ఉంటుంది. ప్రస్తుత కార్తికమాసాన్ని పురస్కరించుకుని ఉదయం 5.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సా. 4 గంటల నుండి రాత్రి 8.30 వరకు గుడిని తెరచి ఉంచుతారు.కార్తీకమాసం పౌర్ణమి, సోమవారాలలో ఉ.3 నుండి రాత్రి 10 వరకు, ఆదివారాలలో ఉ. 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచుతారు. -
రుచులదాత 'సుషీ'భవ..! భోజనప్రియులు ఇష్టపడే క్రేజీ వంటకం
జపాన్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకువచ్చేది ‘సుషీ’.. ఆ ఫుడ్ ఇప్పుడు ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో ఆదరణ పొందుతోంది. ఆ రుచి కొన్నేళ్లుగా నగరవాసులను ఆకట్టుకుంటోంది. దేశంలో సుషీ ప్రజాదరణ పొందడానికి ప్రధాన కారణం మనది బియ్యం ఉత్పత్తి చేసే ప్రధాన దేశం కావడం. అలాగే చేపలు తినే సంస్కృతితో విస్తారమైన తీర ప్రాంతాన్ని కలిగి ఉండటం అని ఎగ్జిక్యూటివ్ చెఫ్ స్వప్నదీప్ ముఖర్జీ చెప్పారు. 1990లలో ఆర్థిక సంస్కరణల సమయంలో మనం విదేశీ కంపెనీలకు తలుపులు తెరిచినప్పుడు, చాలా మంది జపనీస్, కొరియన్ ఇతర దేశాల నుంచి ప్రజలు మన దేశానికి వచ్చారు. ఇది మన దేశంలో అంతర్జాతీయ ప్రమాణాల జపనీస్ ఆహారం కోసం డిమాండ్ను పెంచింది. తద్వారా మరిన్ని జపనీస్ అవుట్లెట్లు ఏర్పడ్డాయని ఆయన చెప్పారు. నేటి ‘మన జపనీస్ వంటకాల అభిరుచులకు ఊపిరిలూదింది ఢిల్లీలోని మెట్రోపాలిటన్ హోటల్ స్పాలో ‘సకురా’ రెస్టారెంట్. తర్వాత అలా అలా అన్ని నగరాలకు విస్తరించింది. విస్తృత శ్రేణి భారతీయ పాలెట్ ప్రకారం సుషీ మార్పుచేర్పులకు లోనవుతోంది. ఆచారి సుషీ, పనీర్ టిక్కా సుషీ, జైన్ సుషీ, అరబిక్ సుషీ వంటి విభిన్న పేర్లతో మమేకమైంది. సుషీ కేవలం పచ్చి చేప మాత్రమే కాదని, ఇది చాలా సూక్ష్మంగా ఉండే క్రమశిక్షణ కలిగిన క్రాఫ్ట్ అని ప్రజలు అర్థం చేసుకోవడానికి పెరిగిన ఎక్స్పోజర్ సహాయపడింది. నగరానికి దశాబ్దాల క్రితమే పరిచయమై నానాటికీ డిమాండ్ పెంచుకుంటున్న వంటకం సుషి. సిటీలో ఆరోగ్య స్పృహ బాగా పెరిగిన నేపథ్యంలో పుష్కలమైన ప్రోటీన్లను అందించేదిగా పేరున్న ‘సుషి’ డిమాండ్ కూడా ఊపందుకుంది. జపనీయులు ఆరోగ్య వంతులుగా ఉండటానికి అక్కడి వండేశైలి ప్రధాన కారణమనేది జగమెరిగిన సత్యం. రా ఫిష్, వెజిటబుల్స్, రైస్లతో కేవలం 30శాతం మాత్రమే కొవ్వు పదార్థాలు ఉండే సుషీ అధికంగా తినడం వల్లనే అక్కడ గుండె జబ్బులు ప్రపంచంలోని మిగతా అన్ని దేశాలకన్నా చాలా తక్కువగా ఉన్నాయని, అలాగే రైస్, రాఫిష్తో కలగలిపిన సుషి కర్రీ.. లంగ్ కేన్సర్లు రాకుండా కూడా నివారిస్తోందని పాకశాస్త్ర నిపుణుల విశ్లేషణ. ఫినిష్.. అనారోగ్యం.. ఈ సంప్రదాయ జపనీస్ వంటకాన్ని ముడి చేప, బియ్యం, సాధారణంగా రెండు పదార్థాలతో తయారు చేస్తారు. దీనిలో వాడే వినెగర్డ్ రైస్ను సముద్ర ఆహారం, కూరగాయలు నుంచి మాంసం వరకు పలు పదార్థాలతో కలపవచ్చు. సుషి, టెంపురా, సాషి్మ.. వగైరా వంటకాల ద్వారా ప్రతి జపనీయుడు రోజుకు 100 గ్రాముల చేపల్ని ఆహారంలో భాగం చేస్తాడట. చేపల్లో ఉండే ఒమెగా–3 యాసిడ్స్ గుండెకు రక్షణ అందిస్తాయి. ఈ అధ్యయనానికి సారథ్యం వహించిన ప్రొఫెసర్ టొషిరో ట్యాకెజకి ఏమంటారంటే.. ‘జపనీస్కి తాజా చేప అంటే చాలా ఇష్టం.. సుషిలో రాఫిష్ ప్రధాన భాగం. అందుకే యుకె లాగే ఇక్కడ కూడా బాగా పొగతాగే అలవాటు ఉన్నప్పటికీ లంగ్ కేన్సర్ మాత్రం అక్కడితో పోలిస్తే చాలా తక్కువగా ఉంది’ అని జపనీయులు పరిచయం చేసిన ఆహార పదార్థం సుషి. సిటీలో ఎక్కడంటే.. వండటం అనే ప్రక్రియకు చాలా వరకూ దూరంగా ఉంటుంది కాబట్టి ఇది దాదాపుగా రా డిష్ అనే చెప్పాలి. ఉడకబెట్టిన ఏదైనా రైస్ వెరైటీని సముద్రపు ఆకుల్లో చుట్టి ఫిష్, మటన్, చికెన్, రొయ్యలు లేదా కూరగాయలు గానీ కలిపి రోల్ చేస్తారు. (జపనీస్ కేవలం చేపలు మాత్రమే వినియోగిస్తారు) అనంతరం తగిన ఫ్లేవర్లు అద్ది సర్వ్ చేస్తారు. దీనికి సపోర్ట్గా సాసెస్ కూడా ఉంటాయి. సుషితో పాటు తరచూ సర్వ్ చేసే వ్యాసబీ అనే గ్రీన్ పేస్ట్లో ఉండే ఇసొతైసైనేట్స్ పలు ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టి, రక్తం గడ్డకట్టుకుపోయే పరిస్థితుల్ని కూడా నివారిస్తాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. సుషికి అదనపు రుచిని అందించే ఫ్లేవర్లలో ఒకటైన అల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. సుషిని టేస్ట్ చేయాలంటే.. కోకాపేట్లోని కోకోకాయి. జూబ్లీహిల్స్లోని అర్బన్ ఏషియా, యూమీ, నోహో, హైటెక్ సిటీలోని కోకో, బంజారాహిల్స్లోని హిడెన్ లీఫ్, మాదాపూర్లోని మోషె, జూబ్లీహిల్స్లోని మాకో బ్రూ కేఫ్ అండ్ రెస్టారెంట్.. తదితర రెస్టారెంట్స్కు ఓ రౌండ్ కొట్టాల్సిందే. లేదా స్టార్ హోటల్స్లో ప్రత్యేకంగా ఏర్పాటయ్యే థాయ్, చైనీస్ రెస్టారెంట్లను సందర్శించాలి. (చదవండి: Power Of Love: రోగాలతో ఒక్కటయ్యారు.. ఆ తర్వాత..) -
మా ఆయన ప్రతీ అమ్మాయిని అదోలా చూస్తాడు? ఎందుకలా..?
నాకు పెళ్లి అయి 12 సంవత్సరాలు అవుతోంది. ఇద్దరు పిల్లలున్నారు. నా భర్త మంచివాడే, ఎలాంటి దురలవాట్లు లేవు. కానీ తనలో ఉన్న ఒక చిత్రమైన అలవాటు నన్ను చాలా ఇబ్బంది పెడుతోంది. అదేమంటే అతను రోడ్డు మీద వెళ్లే ప్రతి అమ్మాయిని అదోలా చూస్తుంటాడు. వారికి ఏదో ఒక పేరు పెడతాడు. తర్వాత నాతో వారి శరీర సౌష్టవం గురించి కామెంట్స్ చేస్తాడు. మా ఏకాంత సమయంలో ఆ పేర్లు కలవరిస్తూ ఉంటాడు. మొదట్లో అంతగా అనిపించలేదు కానీ పోను పోనూ ఆయన ప్రవర్తన నాకు కంపరంగా తయారైంది. దాంతో అతని మీద ఒకవిధమైన విముఖత ఏర్పడింది. ఒక్కోసారి అతన్ని వదిలేసి వెళ్ళి పోవాలనిపిస్తుంది కూడా! గట్టిగా అడిగితే అలా ఊహించుకోకుండా ఉండలేక పోతున్నానంటారు. ఇదేమైనా మానసిక సమస్య అంటారా! ‘మా సమస్యకేదైనా పరిష్కారముందా? – ఒక సోదరి, నంద్యాలమీ ఉత్తరం చదివి మీరు పడే క్షోభను అర్థం చేసుకోగలను. ఊహ అనేది మనిషికి మాత్రమే ఉన్న ఒక అద్భుత శక్తి. ఒక విజయం సాధిస్తానని ఊహించడం మనలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. అలాగే భార్యా భర్తల బంధం కొంచెం రొటీన్గా మారినప్పుడు ఇలా ‘ఫాంటసైజ్’ చేయడం కొందరికి కొత్త ఉత్సాహన్ని ఇస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు ఇలా ఊహించుకోవడం మామూలే! ఇది పురుషుల్లో అధికంగా చూసినప్పటికీ, స్త్రీలు కూడా ఇలా ‘ఫాంటసైజ్’ చేసుకుంటారని పరిశోధనల్లో తేలిన విషయం. అమెరికాలో 90వ దశకంలో జరిపిన ఒక పరిశోధన ప్రకారం కొందరు స్త్రీ, పురుషులు తమ భాగస్వామితో ఉన్నప్పుడు, వేరే వారిని ఊహించుకుంటారని తెలిసింది. మనదేశంలో జరిపిన పరిశోధన లో కూడా కనీసం 35 శాతం మంది ఇలా వేరే వారిని ఊహించుకుంటారని తెలిసింది. పురుషులు ఎక్కువగా తెలియని వారిని, సెలబ్రిటీలను ఊహించుకుంటే, స్త్రీలు తమకు తెలిసిన వారినే ఎక్కువ ఊహించుకుంటారని తెలిసింది. దీనికి ప్రధానమైన కారణం మెదడులో, ‘డోపమిన్’ అనే రసాయనం చాలా తొందరగా తగ్గిపోడం, అలాంటప్పుడు ఇతర స్త్రీల మీద పురుషులు మోహం పెంచుకుంటారు. లేదా వాళ్ళని ఫాంటసైజ్ చేసుకుంటూ ఉంటారు. దీన్ని ‘సెవెన్ ఇయర్ ఇచ్’ అని కూడా అంటారు. మామూలుగా చాలామంది మగవారు వారి భాగస్వామికి తెలియకుండా ఇలా చేస్తారు. కొంతకాలానికి అదే సర్దుకుంటుంది. అయితే మీవారి విషయంలో ఈ ప్రవర్తన హద్దులు మీరిందంటే అది ఒక మానసిక సమస్యను సూచిస్తుంది. కాబట్టి తనకి పారాఫిలియా’ లేదా ‘కంపల్సివ్ సెక్యువల్ బిహేవియరల్ డిజార్డర్ వంటి మానసిక సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది చూడాల్సి ఉంటుంది. అలాగే మీరు బాధపడతారని కొంచెం కూడా తను ఎంపతీ చూపలేకపోతున్నాడు. కాబట్టి, పర్సనాలిటీ సమస్యలు కూడా ఉండి ఉండచ్చు. ఏమైనా మీరు సహనాన్ని కోల్పోకండి. అలాగని ఇంకా ఆలస్యం చేయకండి. ఇద్దరూ కలిసి ఒక మంచి సైకియాట్రిస్టుని లేదా అనుభవం కలిగిన క్లినికల్ సైకాలజిస్టుని సంప్రదించండి. వారు మీ ఇద్దరితోనూ వివరంగా మాట్లాడి, కూలంకషంగా ఆయన్ని పరీక్షించి ఆయనకు ఉన్న సమస్య ఏమిటనేదానిపై ఒక నిర్థారణకు వస్తారు. అప్పుడు అవసరాన్ని బట్టి కౌన్సెలింగ్, మందులు, ఇతరత్రా సలహాలు ఇస్తారు. తప్పకుండా ఆయనలో మంచి మార్పు వస్తుంది. విష్ యు ఆల్ ది బెస్ట్.డా. ఇండ్ల విశాల్ రెడ్డి,సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు,సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
బీచ్లో కలిశారు.. ‘గ్రీన్ వెడ్డింగ్’తో ఒక్కటయ్యారు
2018.. ముంబయిలో బీచ్ క్లీనింగ్ జరుగుతోంది. చాలామంది యువత కార్యక్రమంలో పాల్గొని ఫొటోలు తీసుకుంటున్నారు. కానీ.. ఓ యువకుడు, యువతి మాత్రం.. నిజాయతీగా బీచ్లో చెత్తను పోగేస్తూ.. మొదటి సారి కలుసుకున్నారు. ‘నా పేరు అశ్విన్ మాల్వాడే.. మర్చంట్ నేవీలో ఫస్ట్ ఆఫీసర్’ అని యువకుడు, ‘నా పేరు నుపూర్ అగర్వాల్.. మార్కెట్ రీసెర్చర్’ అని యువతి ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. మాటలు కలిశాయి.. మనసులు దగ్గరయ్యాయి. పర్యావరణంపై ఉన్న ప్రేమ వారిని మరింత దగ్గర చేసింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాక, ఓ స్నేహితుడి వివాహంలో ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆహార వృథా చూసి చలించిపోయారు. తమ పెళ్లిని పర్యావరణ హితంగా.. ‘గ్రీన్ వెడ్డింగ్’ కాన్సెప్ట్ లో చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అప్పుడే ‘గ్రీన్మైనా’స్వచ్ఛంద సంస్థ రెక్కలు తొడిగింది. తమ పెళ్లి నుంచి మొదలుపెట్టిన గ్రీన్ వెడ్డింగ్ కాన్సెప్ట్ ను ముంబయితో పాటు ఇతర రాష్ట్రాలకు విస్తరించారు. ఇప్పుడు క్రికెట్ మైదానాల్లో చెత్తపై సమరం ప్రారంభించారీ పర్యావరణ జంట. సాక్షి, విశాఖపట్నం: 2019 డిసెంబర్లో అశ్విన్, నుపూర్ పెళ్లి పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా జరిగింది. తమ పెళ్లి వేడుకలు సున్నా కర్బన ఉద్గారాలుగా ఉండాలని వెడ్డింగ్ ప్లానర్లని కోరితే ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. దీంతో వీరే వెడ్డింగ్ ప్లానర్లుగా మారి.. సమాజానికి సరికొత్త వివాహాన్ని పరిచయం చేశారు. ఆ పెళ్లిలో వాడిన ప్రతి వస్తువూ పర్యావరణ హితమైనదే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. చేతితో నేసిన కాటన్ దుస్తుల్నే పెళ్లిలో ధరించారు. నుపూర్ తన వెడ్డింగ్ లెహెంగాపై ‘బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్.. సేవ్ ది ప్లానెట్’అని.. అశ్విన్ ‘క్లైమేట్ క్రైసిస్.. బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్’అని నినాదాలు రాసి ధరించారు. అలంకరణకు తాజా పువ్వులు, గాజు సీసాలు, పునర్వినియోగం కాగితాలు వాడారు. మట్టి కప్పులు, వెదురు స్పూన్లు ఉపయోగించారు. పెళ్లి పత్రికను సైతం నాటితే మొక్కలు మొలిచేలా విత్తనాలతో తయారుచేశారు. ఊరేగింపునకు ఎలక్ట్రిక్ కారు వాడారు. పెళ్లికి ప్లాస్టిక్ వస్తువులు బహుమతిగా తేవద్దని కార్డులోనే ముద్రించారు. ఇలా జరిగిన అశ్విన్, నుపూర్ వివాహం అందరినీ ఆకట్టుకుంది. ‘గ్రీన్మైనా’ఆవిర్భావం తమ ఇంట్లో పెళ్లి కూడా ఇలాగే చేయాలంటూ చాలా మంది అశ్విన్, నూపూర్ జంటను సంప్రదించారు. తమ పెళ్లి స్ఫూర్తితో, పర్యావరణ హిత వివాహాలను ప్రోత్సహించడానికి వారు ‘గ్రీన్మైనా’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి 2020లో గ్రీన్ వెడ్డింగ్ కాన్సెప్ట్ని ముంబయికి పరిచయం చేశారు. తర్వాత కోవిడ్ వచ్చినా.. క్రమంగా దేశ వ్యాప్తంగా గ్రీన్ వెడ్డింగ్ కార్యకలాపాలు విస్తరింపజేశారు. ఈ కాన్సెప్ట్తో ఇప్పటివరకు ముంబయి, ఢిల్లీ, రాయ్పూర్, జైపూర్, బెంగళూరు వంటి నగరాల్లో 50కి పైగా వివాహాలు జరిపించారు. 2022లో రాయ్పూర్లో జరిగిన ఓ పెళ్లిలో 1,225 కిలోల తడి చెత్తను, 800 కిలోల ప్లాస్టిక్ను భూమిపైకి రాకుండా కాపాడారు. మిగిలిన ఆహారాన్ని 1,200 మందికి పంచారు. నూతన దంపతులతో 50 చెట్లు నాటించారు. ప్రస్తుతం ఈ సంస్థలో 10 మంది ప్రధాన సభ్యులు ఉండగా.. పదుల సంఖ్యలో వలంటీర్లు చేరారు. మైదాన్ సాఫ్.. క్రికెట్ స్టేడియంలే లక్ష్యంగా.. క్రికెట్ అభిమానులైన ఈ జంట.. ఓ రోజు ముంబయిలో జరిగిన ఒక క్రికెట్ మ్యాచ్ను చూసేందుకు వెళ్లారు. అక్కడ మ్యాచ్ల తర్వాత పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను గమనించారు. పారిశుధ్య కార్మికులకు చెత్త విభజనపై అవగాహన లేకపోవడంతో ‘మైదాన్ సాఫ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక మున్సిపాలిటీలు, రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లతో మాట్లాడి మైదాన్ సాఫ్ అమలుకు మార్గం సుగుమం చేసుకున్నారు. 2023 ఐసీసీ ప్రపంచ కప్ సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఐసీసీ, బీసీసీఐ మద్దతుతో.. కోకా–కోలా ఇండియాతో కలిసి ఇప్పుడు 2025 ఐసీసీ మహిళల ప్రపంచ కప్ మ్యాచ్ల్లోనూ వ్యర్థాల నిర్వహణ చేస్తున్నారు. నవీ ముంబయి, గౌహతి, ఇండోర్, విశాఖపట్నంలోని స్టేడియాల్లోనే తడి, పొడి చెత్తను వేరు చేసి, పొడి చెత్తను రీసైక్లింగ్కు, తడి చెత్తను కంపోస్టింగ్కు పంపారు. పంపుతు న్నారు. 2030 నాటికి దేశంలో జరిగే పెద్ద కార్యక్రమాలన్నిటినీ వ్యర్థ రహితంగా మార్చడమే తమ లక్ష్యమని గ్రీన్ దంపతులు చెబుతున్నారు.గ్రీన్మైనా ఇంపాక్ట్ ఇదీ గ్రీన్మైనా సంస్థ ద్వారా గ్రీన్ వెడ్గింగ్స్, మైదాన్ సాఫ్ వంటి కార్యక్రమాలతో పర్యావరణంపై అశి్వన్, నుపూర్ దంపతులు గణనీయమైన ప్రభావాన్ని చూపారు. ఆ ఫలితాలను పరిశీలిస్తే.. కర్బన ఉద్గారాల నియంత్రణ 2,39,000 కిలోలు నాటిన మొక్కల సంఖ్య 5,860 ఆహార పంపిణీ(మిగిలిన ఆహారం) 12,000 మందికి పొడి చెత్త రీసైక్లింగ్ 30,750 కిలోలు తడి చెత్త కంపోస్టింగ్ 41,155 కిలోలు -
వెండికొండల నడుమ వెండితెర పండగ
హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలో చిత్రదర్శకురాలు రీతు సరిన్ నాటిన విత్తనం ఇప్పుడు పెద్ద చెట్టు అయింది. శాఖోపశాఖలుగా విస్తరించింది. ధర్మశాల ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్గా ప్రపంచ ప్రసిద్ధి పొందింది...ధర్మశాల అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (డిఐఎఫ్ఎఫ్) ఈరోజు నుండి నవంబర్ 2 వరకు జరుగుతుంది. మహిళా దర్శకుల 40 చిత్రాలతో సహా మొత్తం 88 చిత్రాలను ప్రదర్శిస్తారు. ఈ సంవత్సరం ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రముఖ చిత్ర దర్శకురాలు కిరణ్రావుతో ముఖాముఖి ఉంటుంది. తన సినిమా ప్రయాణం నుంచి ఇండిపెండెంట్ సినిమాలలో వస్తున్న మార్పుల వరకు తన అభి్రపాయాలను ఈ ముఖాముఖీలో తెలుసుకోవచ్చు.రీతు కృషి... ధర్మశాల ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ దిల్లీలో పుట్టి పెరిగిన రీతు సరిన్ కాలిఫోర్నియా కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్(సిసిఏ)లో ఫిల్మ్ అండ్ వీడియో విభాగంలో ఎంఎఫ్ఏ చేసింది. ‘సిసిఏ’లో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు తీసింది. ది సిఖ్స్ ఆఫ్ యూబా సిటీ, టిబెట్, ఫిష్టేల్స్, ఎ స్ట్రేంజర్ ఇన్ మై నేటివ్ ల్యాండ్, ది షాడో సర్కస్....మొదలైన ఎన్నో ప్రయోగాత్మకమైన చిత్రాలను తీసింది. టిబెటన్ చిత్రదర్శకుడు టెన్జింగ్ సోనమ్ను వివాహం చేసుకుంది. 2012లో సోనమ్తో కలిసి వైట్ క్రేన్ ఆర్ట్స్ అండ్ మీడియా అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఆ తరువాత సోనమ్తో కలిసి ధర్మశాల ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(డిఎఫ్ఎఫ్)కు శ్రీకారం చుట్టింది. టాప్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో డిఐఎఫ్ఎఫ్ ఒకటిగా నిలిచింది.మరచిపోయిన చెట్టు పాట ఒకటిధర్మశాల అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శితమయ్యే చిత్రాలలో అనుపర్ణ రాయ్ రచన, దర్శకత్వం వహించిన ‘సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్’ ఒకటి. 82వ వెనిస్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలోని ఒరిజోంటి (హారిజన్స్) విభాగంలో ఈ చిత్రం ప్రదర్శితమైంది. ఈ విభాగంలో ‘బెస్ట్ డైరెక్టర్’ అవార్డ్ గెల్చుకున్న ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్మేకర్గా ప్రత్యేకత నిలుపుకుంది రాయ్. ఈ చిత్రకథ విషయానికి వస్తే...బాలీవుడ్లో అవకాశాలు వెదుక్కుంటూ ఎక్కడినుంచో ముంబైకి వచ్చి ఒక అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటుంది తోయ. శ్వేత అనే మరో యువతి కూడా బతుకుదెరువు కోసం ముంబైకి వస్తుంది. కాల్–సెంటర్లో పనిచేసే శ్వేత, తోయతో పాటు అదే అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటుంది. కాలక్రమేణా వారి మధ్య నిశ్శబ్ద అనుబంధం ఏర్పడుతుంది. అది ఎలాంటి అనుబంధం, ఒకరినొకరు ఎలా అర్థం చేసుకున్నారనేదే సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్ కథ. పశ్చిమ బెంగాల్ పురులియ జిల్లాలోని నారాయణ్పూర్కు చెందిన అనుపర్ణరాయ్ ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ చేసింది. సినిమా రంగంలోకి రావడానికి ముందు దిల్లీలోని ఒక కాల్సెంటర్లో, ముంబైలో ఐటీ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసింది.హైప్ కాదు... సహజంగానే!దేశంలోని ప్రముఖ స్వతంత్ర చలనచిత్రోత్సవాలలో ఒకటిగా ఎదగాలని మేమూ ఎప్పుడూ అనుకోలేదు. అర్థవంతమైన, అద్భుత సినిమాలకు ప్రశాంతమైన పర్వతాలు వేదికగా ఉండాలని మాత్రం గట్టిగా అనుకున్నాం. హైప్ ద్వారా కాకుండా గత 14 సంవత్సరాలుగా డిఐఎఫ్ఎఫ్ సహజంగా అభివృద్ధి చెందింది. చిత్రనిర్మాతల అభిరుచి, ప్రేక్షకుల విశ్వాసం డిఐఎఫ్ఎఫ్ విజయానికి కారణం.– రీతు సరిన్, ఫిల్మ్ మేకర్, డిఐఎఫ్ఎఫ్ ఫౌండర్స్త్రీవాద కోణంలో..రేణుక షహానే మరాఠీ యానిమేటెడ్ లఘుచిత్రం ‘లూప్ లైన్’ డిఐఎఫ్ఎఫ్లో ప్రదర్శితం కానుంది. మధ్యతరగతి మహిళల జీవితాలపై తీసిన చిత్రం ఇది. రకరకాల భావోద్వేగాలతో పాటు, మాటలతో హింసించడం అనేది కుటుంబ వ్యవస్థలో ఎంత సాధారణంగా మారిందో చెబుతుంది లూప్ లైన్. స్త్రీవాద దృక్పథంతో తీసిన ఈ లఘుచిత్రం ఎన్నో చిత్రోత్సవాలలో ప్రదర్శించబడింది. తస్వీర్ ఫిల్మ్ ఫెస్టివల్, ముంబై షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రశంసలతో పాటు అవార్డులు కూడా అందుకుంది.స్త్రీ విముక్తితనిష్ట ఛటర్జీ దర్శకత్వం వహించిన ‘ఫుల్ ప్లేట్’ చిత్రం డిఐఎఫ్ఎఫ్లో ప్రదర్శితం కానుంది. తన దర్శకత్వలో వచ్చిన తొలిచిత్రం ‘రోమ్ రోమ్ మెయిన్’కు మేరీ క్లైర్ ఆసియా స్టార్ అవార్డ్ అందుకుంది. ‘ఫుల్ ప్లేట్’ అనేది స్త్రీ విముక్తికి సంబంధించిన చిత్రం. స్త్రీల సమస్యను సీరియస్గా కాకుండా చమత్కార రీతిలో చెప్పిన చిత్రం. ఈ చిత్రంలో వంటను సామాజిక శాస్త్ర విశ్లేషణ సాధనంగా చూపారు. -
వర్షాలు, వణికించే చలిగాలులు : ఈ హెల్త్ టిప్స్ పాటించండి!
మోంథా తుఫాను ప్రభావం బాగా కనిపిస్తోంది. వర్షం, చల్లటి గాలులు కూడా వణికిస్తున్నాయి. మరోవైపు చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. వర్షంలో తడవడం వల్ల జలువు, జ్వరం గొంతు నొప్పి లాంటి వ్యాధులు ముసిరే అవకాశం ఉంది. వ్యాధి నిరోధకశక్తి తగ్గుతుంది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవాల్టీ టిప్ ఆఫ్ ది డేలో భాగంగా అలాంటి జాగ్రత్తలు కొన్ని చూద్దాం.చలికాలంలో ఫ్లూ, సైనసైటిస్, ఊపిరితిత్తుల్లో వైరల్ ఇన్ఫెక్షన్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి(సీవోపీడీ), ఆస్తమా వంటి సమస్యలు తలెత్తుతాయి. హైపోథెర్మియా, చర్మం లోపలి కణజాలం గడ్డ కట్టి గాయాలు కావటం, పెర్నియో, ఇమ్మర్షన్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.చలిగాలులు అనేక రకాల వ్యాధులను మోసుకొస్తాయి. వైరస్లు వృద్ధి చెందే ప్రమాదం ఉంది. దగ్గు, జలుబు, గొంతునొప్పి, తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఆయాసం, న్యూమోనియా వంటి లక్షణాలు కనిపిస్తాయి. గొంతు ఇన్ఫెక్షన్స్, గతంలో కీళ్ల నొప్పులు ఉన్నవారిలో కీళ్ల నొప్పులు పెరుగుతాయి. కొందరిలో తలనొప్పి వస్తుంది. గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కనీస జాగ్రత్తలువర్షంలో తడవకుండా జాగ్రత్త పడాలి. పూర్తిగా కప్పి ఉంచేలా వస్త్రాలను ధరించాలి. రెయిన్ కోట్లు, గొడుగులు, చలికి తట్టుకునేలా స్వెట్లర్లు, చెవులు కవర్ అయ్యేలా టోపీలు తప్పనిసరిగా వాడాలి. ఒకవేళ వర్షంలో తడిచినా, వెంటనే వేడినీటితో స్నానం చేయడం, జుట్టు తడిలేకుండా పూర్తిగా ఆరబెట్టుకోవడం తప్పనిగా పాటించాలి.చలి ఎక్కువగా ఉన్న సమయాల్లో మాస్కులు ధరించాలి. దీంతో వైరస్ సోకదు. వేరేవారికి సోకకుండా ఉంటుంది. చలితీవ్రత అధికంగా ఉంటే బయటకు రాకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడేవారు బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారు ఇన్హేలర్లను అందుబాటులోఉంచుకోవాలి. ఫ్రిజ్లో పెట్టిన చల్లటి ఆహారం కాకుండా, అప్పటికప్పుడు వండుకున్నది వేడి, వేడిగా భుజించాలి.చల్లని డ్రింక్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీంలకు పిల్లల్ని ఎంత దూరంగా పెడితే అంత మంచిది.నిల్వ పదార్థాలను జోలికి వెళ్లవద్దు. పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి.వ్యాధి నిరోధకశక్తి పెంచుకునేలా చలికాలంలో వ్యాధి నిరోధకతను పెంచుకోవాలి పౌష్టికాహారం తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా సిట్రస్ జాతికి చెందిన ఉసిరి, నిమ్మకాయల రసం తీసుకోవాలి. ఎక్కువగా నీటిని తాగాలి. కాచి చల్లార్చిన నీటిని తాగడం మరింత మంచిది. శరీరంలో వేడి ఉత్పత్తి అయ్యేలా జీర్ణవ్యవస్థ నిరంతరం పనిచేస్తుండాలి. ప్రోటిన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. గుడ్లు, పనీర్ లాంటివి తీసుకోవాలి. అలాగే ఈ చలిగాలులు చర్మాన్ని, జుట్టును కూడా ఇబ్బంది పెడతాయి. వాతావరణం చల్లగా ఉన్నా గాలిలో తేమశాతం తక్కువగా ఉంటుంది. శరీరంలోని తేమ బయటికి పోవడంతో చర్మం పొడిబారుతుంది. అందుకే వాటర్ ఎక్కువగా తీసుకుంటూ, చర్మంపైన ఉండే నూనె పొరను కాపాడుకునేలా మంచి మాయిశ్చరైజర్ను వాడాలి. ఇదీ చదవండి: గర్ల్ ఫ్రెండ్తో బ్రేకప్ సార్... లీవ్ ప్లీజ్! వైరల్ మెయిల్ -
గర్ల్ ఫ్రెండ్తో బ్రేకప్ సార్... లీవ్ ప్లీజ్! వైరల్ మెయిల్
సాధారణంగాఉద్యోగులకు బాస్ను లీవ్ అడగాలంటే భయం. నిజాయితీగా ఉన్నకారణం చెబితే లీవ్ ఇస్తారా? లేదా అనేదాంతో ఏవో వంకలు చెప్పేస్తూ ఉంటారు. ఆరోగ్యం బాగాలేదనో, ఇంట్లో వాళ్లకి బాలేదనో అలవోకగా అబద్ధాలు చెప్పేస్తారు. అంతేకాదండోయ్.. అల్ రెడీ చనిపోయిన, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మలను మళ్లి మళ్లీ చంపేస్తూ లీవ్ పెట్టే ప్రబుద్ధులు కూడా చాలామందే ఉన్నారు. తాజాగా ఒక లీవ్ మెయిల్ఆన్లైన్లో చర్చకు దారి తీసింది. ఇటీవలి కాలంలో కార్పొరేట్ కంపెనీల సీఈవో కొన్ని విచిత్రాలను, విశేషాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. తాజాగా గుర్గావ్కు చెందిన CEO ఉద్యోగి సెలవు అడిగిన తీరును షేర్ చేశారు. అతని నిజాయితీని మెచ్చుకున్నాడు. జెన్ జెడ్ (Gen Z) వారి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని నావిగేట్ చేసే విధానం తరచుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..గురుగ్రామ్లోని నాట్ డేటింగ్ కో ఫైండర్, సీఈవో జస్వీర్ సింగ్ తన కంపెనీ ఉద్యోగి లీవ్ కు సంబంధించిన ఒక మెయిల్ సెలవు స్క్రీన్షాట్ను షేర్ చేశారు. అందులో ఇటీవల బ్రేకప్ అయింది సార్, లీవ్ కావాలి.. పనిమీద దృష్టి కేంద్రీకరించలేకపోతున్నాను. కొంత సమయం కావాలి. 28వ తేదీ నుంచి 8వ తేదీ వరకు (దాదాపు 11 రోజులు) సెలవు తీసుకోవాలని అనుకుంటున్నాను." అంటూ లీవ్ కోసం దరఖాస్తు చేశాడు. అతనికి లీవ్ మంజూర్ చేశారట. సింగ్ దీనిని తాను అందుకున్న "అత్యంత నిజాయితీగల సెలవు దరఖాస్తు"గా అభివర్ణించడం తోపాటు, జెన్ జెడ్ (Gen Z) ఏదీ దాచుకోదు అంటూ కమెంట్ చేయడం విశేషం.ఉద్యోగి నిజాయితీని, దానికి మద్దతుగా నిలిచిన సీఈఓ నిర్ణయాన్ని ప్రశంసించారు నెటిజన్లు. మీరు మంచిబాస్ ఒకరు వ్యాఖ్యానించగా, మరొకరు Gen-Z ను మిలీనియల్స్తో పోల్చి వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. "జనరల్ జెడ్ బ్రేకప్ అయితే లీవ్ పెడతారు..కానీ మిలీనియల్స్ అలా కాదు వాష్రూమ్లో ఏడ్చుకుంటారు.. టార్గెట్లను ఫినీష్ చేస్తారు భావోద్వేగంతో స్పందించారు.చదవండి: పాపం.. పిల్లి అనుకుని పాంపర్ చేశాడు, అసలు సంగతి ఇదీ! -
ఆద్యంతం సంగీతమే...! ఆ మ్యూజిక్ సిటీ ఏదంటే..
ఆ నగరంలో ప్రతీ వీధీ వీనుల విందు చేస్తుంది. ప్రతీ మదీ గానాలాపానలో మునిగి తేలుతుంది. నలు చెరగులా సంగీత ప్రదర్శనల సందడి, చరిత్ర సృష్టించిన సంగీతజ్ఞుల ఒరవడి కనిపించే ఏకైక నగరం అది. అందుకే దానిని మ్యూజిక్ సిటీగా పేర్కొంటారు. కేవలం అనుకోవడం మాత్రమే కాదు గత 2017లో యునెస్కో ద్వారా సంగీత నగరంగా అధికారికంగాఎంపికైంది, ఇంతకీ ఆ నగరం ఏది?ఆ నగరానికి ఆ పేరు రావడానికి కారణం ఏమిటి?గొప్ప వారసత్వం...ఆస్ట్రియా రాజధాని నగరం.. వియన్నా సంగీత నగరంగా పేరొందింది. శాస్త్రీయ సాంస్కృతిక వారసత్వంతో లోతైన సంబంధానికి ప్రసిద్ధి చెందిన వియన్నా, మొజార్ట్, బీతొవెన్, షుబెర్ట్, హేద్న్, స్ట్రాస్ వంటి ప్రపంచ ప్రఖ్యాత స్వరకర్తలను అందించింది, వీరే తదనంతర కాలంలో పాశ్చాత్య శాస్త్రీయ సంగీతానికి మూలంగా నిలిచారు. గత 18వ 19వ శతాబ్దాలలో, ఈ నగరం గొప్ప స్వరకర్తలు సంగీతకారులను ఆకర్షించి, యూరప్ కు కళాత్మక రాజధానిగా మారింది. ఆస్ట్రియన్ రాచరికం, గ్రాండ్ ఒపెరా హౌస్లు, ప్రేక్షకుల మద్దతు కలిసి వియన్నాను సృజనాత్మకతకు చిరునామాగా మార్చింది.వీధి వీధినా...వీనుల విందేగా...వియన్నాలో సంగీతం రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుంది. ప్రతి వీధి, కచేరీ హాల్, కేఫ్ కాలాతీత సంగీత స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి. ఈ నగరం సింఫొనీలు ఒపెరాల నుంచి వీధి ప్రదర్శనల వరకు నిర్వహిస్తుంది. ఇక్కడ, సంగీతం కేవలం వినోదం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రేరేపించే ఒక సజీవ సంప్రదాయం. సంగీత నగరంగా వియన్నాను మార్చిన ప్రసిద్ధ స్వరకర్తలలో వోల్ఫ్గ్యాంగ్ అమేడియస్ మొజార్ట్ ఒకరు.. ఆయన వియన్నాలో నివసిస్తున్నప్పుడు ది మ్యాజిక్ ఫ్లూట్ ది మ్యారేజ్ ఆఫ్ ఫిగరో వంటివి సృష్టించారు. అందులో వియన్నాలో తొమ్మిదవ సింఫనీతో సహా గొప్ప సింఫొనీలను కంపోజ్ చేసిన లుడ్విగ్ వాన్ బీథోవెన్, వియన్నా స్థానికుడు, వందలాది పాటలు సింఫొనిక్ భాగాలకు ప్రసిద్ధి చెందిన ఫ్రాంజ్ షుబెర్ట్, సింఫొనీ పితామహుడు జోసెఫ్ హేద్న్, వియన్నా వాల్జ్ను ప్రపంచ ప్రసిద్ధి చెందేలా చేసిన జోహన్ స్ట్రాస్ ఉన్నారు. అలా ఎంతో కాలంగా వియన్నా సంగీతానికి ప్రపంచ కేంద్రంగా ఎదుగుతూనే ఉంది. చాంబర్ రిసైటల్స్ నుంచి గ్రాండ్ ఆర్కెస్ట్రా ప్రదర్శనల వరకు. ఈ నగరం ప్రతి సంవత్సరం 15,000 కంటే ఎక్కువ సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తుండడం విశేషం. వియన్నా ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా, వియన్నా స్టేట్ ఒపెరా వియన్నా బాయ్స్ కోయిర్ వంటి సంస్థలు నగర సంగీత వారసత్వాన్ని నిలబెట్టేలా ఉంటాయి. ఆకట్టుకునే కచేరీ హాళ్లలో లేదా బహిరంగ వేదికలలో ప్రతీ చోటా ఈ సిటీ దైనందిన జీవితంలో సంగీతం భాగమై ఉంటుంది. ప్రతి హృదయం సంగీతంతో మమేకమైపోయి లయబద్ధంగా ధ్వనిస్తుంది.విశేషాలెన్నో...ప్రపంచంలోని ఏ ఇతర నగరంలో లేని విధంగా 60 కంటే ఎక్కువ మంది ప్రపంచ ప్రఖ్యాత స్వరకర్తలకు వియన్నా నిలయంగా ఉంది. నగరంలోని దాదాపు ప్రతి ప్రదేశం సంగీతంతో చారిత్రక సంబంధాలను కలిగి ఉంటుంది.ప్రసిద్ధ నృత్యం వాల్జ్ 19వ శతాబ్దంలో వియన్నాలో ఉద్భవించింది యూరప్ అంతటా ఆకట్టుకునే నృత్యంగా మారింది.1842లో స్థాపితమైన వియన్నా ఫిల్హార్మోనిక్ ప్రపంచంలోని పురాతన అత్యంత పేరొందిన ఆర్కెస్ట్రాలలో ఒకటి, ఇది ఆస్ట్రియా కు చెందిన గొప్ప సంగీత శైలిని ప్రతిఫలిస్తుంది. వియన్నాలో ప్రతి రాత్రి 10 కంటే ఎక్కువ శాస్త్రీయ సంగీత కచేరీలు జరుగుతాయి,ఫిల్హార్మోనిక్ ప్రదర్శించే వార్షిక నూతన సంవత్సర కచేరీని 90 కి పైగా దేశాలకు ప్రసారం చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షిస్తారు.వియన్నా నగరవాసుల్లో దాదాపు సగం మంది సంగీత వాయిద్యం వాయించేవారు లేదా గాయక బృందంలో పాడేవారో అయి ఉంటారు.(చదవండి: Power Of Love: రోగాలతో ఒక్కటయ్యారు.. ఆ తర్వాత..) -
పూజా బాత్రా ఫిట్నెస్ సీక్రెట్..! టోన్డ్ బాడీ కోసం..
బాలీవుడ్ నటి పూజా బాత్రా తన గ్లామర్తో సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. తన అందం అభినయంతో కుర్రాళ్ల మదిని కొల్లగొట్టిన ఈ బ్యూటీ..నాలుగు పదుల వయసు దాటినా..ఇంకా అంతే అందం, ఫిట్నెస్తో అలరించడమే కాదు. ఇప్పటకీ ఆమెకు అంతే క్రేజ్ ఉంది. పూజ అంతలా ఫిట్గా యంగ్ లుక్లో కనిపించడానికి గల సీక్రెట్ ఏంటో ఓ ఇంటర్వ్యూలో ఆమెనే స్వయంగా బయటపెట్టింది. మరి అవేంటో చూద్దామా..!.ఈ నెల అక్టోబర్ 27తో 49 ఏళ్లు నిండాయి. అయినా ఇప్పటికీ అంతే అందంగా గ్లామర్గా కనిపిస్తుంది పూజ బాత్రా. అందుకోసం ఫిట్నెస్ విషయంలో చాలా కేర్ తీసుకుంటానని అంటోందామె. అంతేగాదు ఫిట్నెస్ అంటే కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా అని అంటోందామె. మన శరీరాన్ని మనం ఎలా చూసుకుంటున్నాం, మాననసిక ఆరోగ్యం పట్ల ఎలాంటి శ్రద్ధ తీసుకుంటున్నాం అనే దానిపైనే మన లుక్ ఆధారపడి ఉంటుందని పూజా నొక్కి చెబుతోంది. మానసికంగా స్ట్రాంగ్ ఉండటమే అసలైన గేమ్ ఛేంజర్ అని అంటోంది. తాను ఆరేళ్లుగా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నానని, వారానికి మూడు రోజులు తప్పనిసరిగా చేస్తానని అంటోంది. పైగా దాంట్లో తాను రెండు బ్రౌన్ బెల్ట్లు గెలుచుకున్నట్లు కూడా వెల్లడించిందామె. ఇది తనను చురుకుగా ఉండేలా చేసి, బరువుని నిర్వహించడం సులభమయ్యేలా చేస్తుందని చెబుతోంది. అన్నిట్లకంటే సంతోషంగా ఉండేందుకు ఫిట్నెస్ అనేది అందరికి అవసరం అని పూజా పేర్కొంది. అంతేగాదు ఆమె మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ హైకింగ్ కూడా చేసినట్లు తెలిపింది. హైకింగ్ పరంగా మౌంట్ ఎవరెస్ట్, మోంట్ బ్లాంక్,యోస్మైట్ బేస్ క్యాంప్లతో సహా పలు ఎత్తైన ప్రదేశాలను చుట్టొచ్చారామె. View this post on Instagram A post shared by Pooja Batra Shah (@poojabatra) లండన్లోని లాస్ ఏంజిల్స్లో ఉండే పూజా యోగా టీచర్ కూడా. మార్షల్ ఆర్ట్స్తోపాటు యోగా అంటే కూడా మహా ఇష్టమని పూజ చెప్పుకొచ్చింది. ఇది సమతుల్య జీవితాన్ని గడపడానికి హెల్ప్ అవుతుందని అంటోంది. చివరగా ఆమె మానవవులు అభివృద్ధి చెందాలంటే సత్వ అనే సంస్కృపదానికి ప్రాధాన్యత ఇవ్వాలంటుంది. అంటే సమతుల్యత అనే దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తే అంతలా హాయిగా జీవితాన్ని గడిపేలా అవకాశం లభిస్తుందని అంటోంది పూజా బాత్రా.(చదవండి: Power Of Love: రోగాలతో ఒక్కటయ్యారు.. ఆ తర్వాత..) -
హ్యాండ్సమ్ బాయ్ : సినీ స్టార్లా ఇంత అందమా? ఎలా?
సింహాలు పౌరుషంతో గంభీరంగా కనిపిస్తాయి.మగ సింహాలు అందమైన జూలుతో మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. మరి జూలు రింగు రింగులుగా ఉంటే. ప్రస్తుతం సోషల్ మీడియాలో కర్లీ మేన్ సింహం బ్యూటీ చర్చకు దారిసింది."హ్యాండ్సమ్ బాయ్ ఇన్ ది వైల్డ్" ("Handsome Boy In The Wild") అంటూ మసాయి మారా వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ కాంబిజ్ పౌర్ఘనాద్ తీసిన కర్లీ మేన్ సింహం అరుదైన ఫోటో ఆన్లైన్లో వైరలవుతోంది.ఇది వన్యప్రాణి ప్రియులను బాగా ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by Kambiz Cameo Pourghanad (@silent_whispers.photography) మగ సింహాల శరీరం రంగు ,ఆకృతి చాలా మారుతూ ఉంటాయి. కానీ జుట్టు ఇలా మారడం చాలా అరుదు. ఎంతో ఓపిగ్గా, వన్యప్రాణి ఫోటోగ్రాఫర్లు అలాంటి సింహ రాజాలను పరిచయం చేస్తూ ఉంటారు. అలా గిరిజాల జుట్టుతో ఉన్న సింహం అద్భుతమైన క్లోజప్ ఫోటోలను తీశారు. అడవిలో చాలా అరుదుగా కనిపించే దృశ్యాన్ని తన కెమెరాలలో బంధించారు. సెలూన్ బ్లోఅవుట్ చేసి చక్కగా మేకప్ చేసినట్టు అందంగా కనిపించింది. ఈ అందమై హీరో పేరు న్జురి - M6. ఒలెపోలోస్ కుమారుడు . అలాగే కెన్యాలోని మసాయి మారాలో ఏడు టోపి ప్రైడ్ సింహాల్లో ఒకటి. ఇన్స్టాగ్రామ్లో షేర్ అయిన ఈ సింహం ఫోటోను షేర్ చేస్తూ ఇలా కామెంట్ చేశారు ’’రాసి పెట్టుకోండి, న్జురి ప్రస్తుతం మసాయి మారాలో అత్యంత అందమైన సింహాలలో ఒకటి. అలాగే అందంలో భవిష్యత్తులో ఆఫ్రికాలో బాన్ జోవి, కింగ్ మోయా ,బ్లాండీ సరసన నిలబడుతుంది’’ అని. View this post on Instagram A post shared by Kambiz Cameo Pourghanad (@silent_whispers.photography) ఫోటోలో న్జురి అద్భుతమైన అలలుగా, దాదాపుగా స్టైల్ చేయబడిన మేన్ తో కనిపిస్తుంది, ఇది సాధారణ అడవి సింహం మేన్ కంటే లాగా కనిపిస్తుంది. జన్యుశాస్త్రం, అధిక తేమ , వర్షంలో తడిసిన తర్వాత సహజంగా ఎండిన మేన్ కలయిక వల్ల కర్ల్స్ ఏర్పడి ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.ఈ ప్రకృతి చమత్కారాన్ని చూసి ఆశ్చర్యపోయిన వన్యప్రాణుల ఔత్సాహికులు, సాధారణ ప్రేక్షకుల నుండి ప్రశంసలందుకుంటోంది. భలే ముద్దుగా గిరజాలు అని ఒకరు, "హ్యాండ్సమ్ బాయ్! సినిమా స్టార్లా ఉన్నాడు" అని ఒక యూజర్ చమత్కరించారు. "ఎంత అందం, దురాశాపరుడైన మానవుని చేతిలో దానికి నష్టం కలగకుండా చూడాలి అతన్ని రక్షించాలి" అని ఒకరంటే, " ఒక అందమైన సింహం, మారా నుండి నాకు ఇష్టమైన వాటిలో ఒకటి" అని అంటూ మరొకరు కమెంట్ చేశారు. దీంతో న్జూరి మిలియన్ల కొద్దీ వ్యూస్ను దక్కించుకుంటోంది.ఇదీ చదవండి : పాపం.. పిల్లి అనుకుని పాంపర్ చేశాడు, వైరల్ వీడియో


