breaking news
Family
-
ఆర్మీడ్యూటీ అసలు బ్యూటీ
ఒక మోడల్ ఆర్మీ ఆఫీసర్ కావడమంట సౌందర్యం కంటే దేశం ముఖ్యం అనుకోవడమే. 2023లో ‘మిస్ ఇంటర్నేషనల్ ఇండియా’ కిరీటం గెలిచిన కషిష్ మెత్వాని 2024లో ‘కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎంట్రన్స్’లో 2వ ర్యాంకు సాధించింది. ఏడాది పాటు చెన్నైలో శిక్షణ పొందాక తాజాగా ఆమె లెఫ్టినెంట్ హోదాలో ఆర్మీ ఆఫీసర్గా దేశసేవకై అడుగు ముందుకేసింది. అందాల కిరీటం కన్నా ఆర్మీ యూనిఫామ్ గొప్ప సంతృప్తిని ఇస్తుందంటున్న పూణె అమ్మాయి కషిష్ పరిచయం.‘ముఝే సబ్కుచ్ కర్నా హై’... (నాకు అన్నీ సాధించాలని ఉంది)... ఇదీ కషిష్ మెత్వాని తరచూ చెప్పేమాట. ‘నాకు నచ్చిన పనులన్నీ చేస్తూ సంతోషాన్ని పొందడమే నాకు కావలసింది’ అని కూడా ఆమె చెబుతూ ఉంటుంది. పుణెకు చెందిన ఈ యువతి చిన్నప్పటి నుంచి సాధించినవి వింటే ఆశ్చర్యం వేస్తుంది. మోడల్గా, ‘మిసెస్ ఇంటర్నేషనల్ ఇండియా’ టైటిల్ విన్నర్గా గ్లామర్ రంగంలో రాణిస్తుందనుకుంటే ఏకంగా ఆర్మీ ఆఫీసర్గా ట్రైనింగ్ పూర్తి చేసుకుని సెప్టెంబర్ మొదటి వారంలో లెఫ్టినెంట్గా ‘ఆర్మీ ఎయిర్ డిఫెన్స్’లో పని చేయడానికి సిద్ధమైంది. ‘మా ఇంట్లో ఎవరూ ఆర్మీలో పని చేయలేదు. నేనే మొదటిదాన్ని. ఈ పని చాలా కష్టమని తెలుసు. కష్టమైనది సాధిస్తేనే కదా సంతోషం’ అంటోంది.న్యూరో సర్జన్ కాబోయి..కషిష్ మెత్వానీది పుణె. ఆమె తండ్రి సైంటిస్ట్గా పని చేస్తుంటే తల్లి టీచరుగా ఆర్మీ స్కూల్లో పాఠాలు చెప్పేది. ‘మా ఇంట్లో టీవీ ఉండేది. కాని ఏ రోజూ నేను దానిని చూసి టైమ్ వేస్ట్ చేసుకోలేదు. స్కూలు పుస్తకాలు చదవడం, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం చేసేదాన్ని. నేను ప్రతి పోటీలో పాల్గొని గెలవాలని కోరుకునేదాన్ని. అలాగే గెలిచేదాన్ని కూడా’ అంది కషిష్. చదువులో విశేష ప్రతిభ చూపిన కషిష్ చిన్నప్పుడు న్యూరోసర్జన్ కావాలనుకుంది. కాని స్కూల్లో, ఇంటర్లో ఎన్.సి.సిలో చేరడంతో ఆమె ఆలోచనలు మారాయి. ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో ఎన్.సి.సి కాడెట్గా పాల్గొనడం ఆమె మీద ప్రభావం చూపింది. ఆర్మీలో చేరాలన్న ఆలోచన అప్పుడే వచ్చింది. ఈలోపు చదువు కొనసాగించి ఎం.ఎస్సీ. చేశాక బెంగళూరులో న్యూరోసైన్స్లో థీసిస్ సమర్పించింది. ఆ సమయంలోనే హార్వర్డ్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసే అవకాశం వచ్చినా తన జీవితం దేశసేవకే అంకితం అని కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎంట్రన్స్– 2024 రెండో ర్యాంక్ సాధించింది. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీలో శిక్షణ పూర్తయ్యాక ఆఫీసర్గా పని చేయడానికి ‘ఆర్మీ ఎయిర్ డిఫెన్స్’ వింగ్ను ఎంచుకుంది.బహుముఖ ప్రజ్ఞాశాలికషిష్ బహుముఖ ప్రజ్ఞాశాలి. చదువుతూనే పిస్టల్ షూటింగ్ నేర్చుకుంది. వాలీబాల్ ప్లేయర్గా ప్రతిభ చాటింది. తబలా నేర్చుకుంది. భరతనాట్యం సాధన చేసింది. అదేవిధంగా గ్లామర్ రంగంలో కూడా తన ఉనికి చాటుకోవడానికి మోడల్గా మారింది. అదే సమయంలో మిస్ ఇంటర్నేషనల్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. ఇవన్నీ 24 ఏళ్లలో సాధించింది. ఆ తర్వాత ఆర్మీ ఆఫీసర్ అయ్యింది. ‘ఇన్ని చేయడానికి కారణం నా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించడమే. ఆర్మీ శిక్షణలో కూడా నేను ఎక్కడా తగ్గలేదు. శిక్షణా కాలంలో అనేక పోటీల్లో నేను ఫస్ట్ నిలిచాను’ అంటుంది కషిష్.సామాజిక సేవలో ఇన్ని పనులు చేసిన కషిష్ సామాజిక సేవలో కూడా తనదైన కృషి సాగిస్తోంది. ‘క్రిటికల్ కాజ్’ అనే ఎన్.జి.ఓ.ను స్థాపించి అవసరమైన వారికి ΄్లాస్మా, అవయవ దానం వంటి ప్రాణాధార సహాయం అందేలా చేస్తోంది. ‘మన కోసం మనం కష్టపడుతూనే సమాజం కోసం కూడా కష్టపడాలి. అది ప్రతి ఒక్కరి బాధ్యత’ అంటోంది కషిష్.నిజంగానే ఆమె ఒక భిన్నమైన ప్రతిభాశాలి. హార్వర్డ్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసే అవకాశం వచ్చినా తన జీవితం దేశసేవకే అంకితం అని కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎంట్రన్స్– 2024 రెండో ర్యాంక్ సాధించి, శిక్షణ పూర్తయ్యాక ఆఫీసర్గా ‘ఆర్మీ ఎయిర్ డిఫెన్స్’ వింగ్ను ఎంచుకుంది కషిష్. -
అడవులన్నీ పైలంగా.. ఆపదలన్నీ దూరంగా..
‘అడవి పూల సింగారం.. చేను చెల్కల బంగారం పైలమే తల్లీ.. పైలమే బతుకమ్మా.. గునుగు పూలెయ్యాలో.. తంగెడు పూలెయ్యాలో.. ఊరూ.. అడవి.. ఆడీపాడంగా.. అడవులన్నీ పైలంగా.. ఆపదలన్నీ దూరంగా.. చప్పట్లే మిరిమిట్లవ్వంగా.. రావే చెల్లి.. రావే అక్క.. బతుకమ్మ ఆడగరావే.. ఉయ్యాలో.. ఉయ్యాలో.. బతుకు సుడిగుండం దాటి బరిగీసి నిలువగ రావే.. ఉయ్యాలో.. ఉయ్యాలా..’ఇలా సాగే బతుకమ్మ పాటతో బహుజన బతుకమ్మ సింగారించుకుంది. ఈ పాటను వేములవాడకు చెందిన కూర దేవేందర్ అలియాస్ అమర్ అలియాస్ మిత్ర రాయగా.. ఆయన సతీమణి విమలక్క గానం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిసరాల్లోనే చిత్రీకరణ జరిగింది. హైదరాబాద్లోని బంజారాహిల్స్ ప్రసాద్ ల్యాబ్స్లో ఆదివారం బహుజన బతుకమ్మ పాటను ఆవిష్కరించారు. పన్నెండు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా బహుజన బతుకమ్మ (Bahujana Bathukamma) ఆటాపాటలతో అలరించనుంది.ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ అని చాటుదాం ‘బహుజన బతుకమ్మ కేవలం ఉత్సవం మాత్రమే కాదు ఉద్యమం అంటూ..’ ప్రారంభమైన ఈ కార్యక్రమానికి 15 ఏళ్లు నిండుతున్నాయి. తెలంగాణ ప్రాంత మెట్టపంటలు అందివచ్చే కాలానికి పంటల పండుగలా (హార్వెస్ట్ ఫెస్టివల్) వస్తున్న బతుకమ్మను తెలంగాణ ప్రజలు వందల ఏళ్లుగా జరుపుకుంటున్నారు. ఈ సాంస్కృతిక ఉత్సవం మహత్తర తెలంగాణ (Telangana) సాయుధ పోరాటకాలంలోనూ, రైతాంగ పోరాటాలలోనూ, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాల్లో సాధనంగా మారిన అనుభవం ఉంది. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలనే డిమాండ్తో మొదలైన బహుజన బతుకమ్మ, కులం, మతం అని తేడాలు లేకుండా, వనరుల విధ్వంసం జరగకుండా, ప్రత్యేకించి స్త్రీల సమానహక్కుల ప్రస్తావనతో సెక్యులర్ పండుగగా జరగాలని బహుజన బతుకమ్మ కృషి చేస్తుంది. ‘ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ’అనే నినాదంతో ఈ ఏడాది బహుజన బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. సిరిసిల్ల ప్రాంతంలో చిత్రీకరణ బహుజన బతుకమ్మ పాటను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి, గోపాల్రావుపల్లి, తాడూరు శివారుల్లో చిత్రీకరించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలు విమలక్క బృందం, జానపద కళాకారుడు వంతడ్పుల నాగరాజు పర్యవేక్షణలో ఈ పాట షూటింగ్ జరిగింది. ‘ప్రకృతి విధ్వంసమంటే.. ప్రజలపై యుద్ధమే.. శాంతి స్వావలంబన చాటుదామని ఈ ఏడాది ప్రజాబాహుళ్యంలోకి వెళ్లారు. గత 15 ఏళ్లుగా బహుజన బతుకమ్మను అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నిర్వహిస్తోంది. కళాకారుల నృత్యాలు, ఆటపాటలతో గోపాల్రావుపల్లి, తాడూరు, తంగళ్లపల్లి పరిసరాల్లో సందడి చేశారు.పన్నెండు రోజులు పాటల పండుగే బహుజన బతుకమ్మ పాటల పండుగను రాష్ట్రమంతంటా నిర్వహించనున్నారు. తొలిరోజు సెప్టెంబర్ 20న గన్పార్క్లో 11 గంటలకు నివాళితో మొదలై.. 3 గంటలకు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఆటపాటలతో ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 21న సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లి, 22న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు, 23న వనపర్తి జిల్లా కొత్తకోట, 24న ఉమ్మడి నల్లగొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రం, 25న ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం ఉల్వనూరు, 26న ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం పెద్దాపురంలో, 27న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వేడుకలు నిర్వహించనున్నారు. చదవండి: గత చరిత్రకు సజీవ సాక్ష్యం.. అమ్మాపురం సంస్థానంసెప్టెంబర్ 28న ఉమ్మడి మెదక్ జిల్లా పెద్ద నిజాంపేట మండలం కల్వకుంట, 29న హైదరాబాద్లోని మల్లాపురం గోకుల్నగర్లో, 30న మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం వెన్నాచెడ్, అక్టోబర్ 3న నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలో బహుజన బతుకమ్మ వేడుకలు ముగియనున్నాయి.- సిరిసిల్ల -
ఆర్డబ్ల్యుఈ సర్చ్ అండ్ హెల్త్ ఇన్నోవేషన్ సమ్మిట్-2025
హెల్త్ ఆర్క్ ఆధ్వర్యంలో ఆర్డబ్ల్యుఈ సర్చ్ అండ్ హెల్త్ ఇన్నోవేషన్ సమ్మిట్-2025 మూడు రోజుల పాటు వైభవంగాసాగి ఘనంగా ముగిసింది. ఈ సమ్మిట్లో సుమారు 13దేశాల నుంచి రెండు వేల మందికిపైగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 62 మంది ప్రముఖులు, సుమారు 42 అగ్రశ్రేణి సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో ఆరోగ్యరంగంలో వాస్తవిక ప్రపంచం సాక్ష్యాలు(ఆర్డబ్ల్యూఈ), కృత్రిమ మేధస్సు(ఏఐ), డిజిటల్ హెల్త్, ఇన్నోవేషన్పై లోతైన చర్చలు జరిగాయి. ఈ సమ్మిట్ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఇండస్ట్రీస్ & లెజిస్లేటివ్ అఫైర్స్ శాఖా మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఇలాంటి వేదిక సమయోచితమైందని, ఈ వేదికపైకి గ్లోబల్ నిపుణులను తీసుకొచ్చిన హెల్త్ ఆర్క్ బృందం అభినందనీయం అని పేర్కొన్నారు.ఇక మాజీ భారత శాశ్వత ప్రతినిధి, ప్రస్తుత కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ డీన్ రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ ఔషధరంగం, లైఫ్సైన్సెస్ రంగాల అగ్రనేతలతో జరిగిన ప్రత్యేక సమావేశంలో ప్రసంగించారు. దాంతోపాటు ప్రస్తుత జియోపాలిటికల్ క్లిష్ట పరిస్థితులు, వాటి వ్యాపార ప్రభావం” పై ప్రసంగిస్తూ.. మారుతున్న ప్రపంచ సమీకరణలు రంగంపై చూపుతున్న అవకాశాలు, సవాళ్ల గురించి విశ్లేషించారు.చదవండి: Shubhanshu Shukla: స్పేస్లో వ్యోమగాములు ఫిట్నెస్ను ఎలా నిర్వహిస్తారంటే..! -
స్పేస్లో వ్యోమగాములు ఫిట్నెస్ను ఎలా నిర్వహిస్తారంటే..!
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో కాలుమోపి చరిత్ర సృష్టించిన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష వ్యాయామ పద్ధతుల గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. మెక్రోగ్రావిటీలో శారీరక శ్రమ ఎంత ప్రధానమైనదో వివరించారు. వాళ్లు ఫిట్నెస్పై ఉంచే దృష్టి మొత్తం మిషన్ సక్సెస్కి అత్యంత కీలకమని చెప్పారు. అయితే ఇక్కడ భూమ్మీద ఉన్నట్లుగా జిమ్ సభ్యత్వం ఉండదు. అక్కడ చేసిన సౌలభ్యకరమైన పరికరాలతో చేసే ఛాన్సే ఉండదు. మరి ఎలా చేస్తారంటే..అలాంటప్పుడూ ప్రత్యేక శిక్షణతో కూడిన వ్యాయామాలను వ్యోమగాములు అనుసరిస్తారని చెబుతున్నారు శుభాంశు. జీరో గ్రావిటీలో చాలా రకాల శారీరక మార్పులు ఉంటాయి. శరీరం జీరో గురుత్వాకర్షణ వద్ద మొత్తం బాడీ బద్ధకంగా ఉంటుందట. కండరాలు కుచించుకుపోయి, ఎముకలు బలహీనంగా అయిపోతాయట. దాంతోపాటు శరీరంలోని శక్తి కూడా సహకరించేందుకు ఇష్టపడదట. మన కార్డియో, బలం రెండూ దెబ్బతింటాయట. అందువల్ల అంతరిక్షంలో వ్యాయామం అనేది ఒక ఆప్షన్ కాదు. వ్యోమగాములకు అది తప్పనిసరిగా చేయాల్సిన శారీరక శ్రమ. స్పేస్ బైక్..అందుకోసం స్పేస్ స్టేషన్లోని వ్యోమగాములు CEVIS (వైబ్రేషన్ ఐసోలేషన్ సిస్టమ్తో సైకిల్ ఎర్గోమీటర్) వంటి పరికరాలను ఉపయోగిస్తారని చెప్పారు శుభాంశు. ఇది ప్రాథమికంగా షాక్ అబ్జార్బర్కు బోల్ట్ చేయబడిన స్పేస్ బైక్ లాంటిదని అన్నారు. CEVIS వ్యవస్థ వ్యాయామం ద్వారా ఉత్పన్నమయ్యే కంపనాలను గ్రహిస్తుంది. ఫలితంగా అంతరిక్ష కేంద్రం అనాలోచిత కదలికలను నిరోధిస్తుంది. ఈ స్పేస్ బైక్లో సీటు ఉండదు ఎందుకంటే తేలుతున్నట్లు ఉంటుంది ాకాబట్టి ీసీటుతో పని ఉండదట. దానిపై కూర్చొన్న భంగిమలో పాదాలను లాక్ చేసి పెడలింగ్ చేస్తారట. అంతేగాదు పాదాలను పట్టీల సాయంతో నియంత్రణలో సురక్షితంగా ఉంచుకుంటారట. ఈ వ్యాయామం సమగ్ర హృదయనాళ వ్యవస్థను మెరుగ్గా ఉంచి, కండరాల క్షీణత, ఎముక సాంద్రత నష్టాన్ని నివారిస్తుందని చెప్పుకొచ్చారు వ్యోమగామి జీపీ కెప్టెన్. ఇక్కడ స్పేస్ వాతావరణానికి తగ్గట్టుగా ఫిట్నెస్ పరంగా "జీరో గ్రావిటీ, జీరో సాకులు." అని చమత్కరించారు శుభాంశు. చివరగా అంతరిక్షంలో జీవిత సవాళ్లకు అనుగుణంగా ఆరోగ్యంగా ఉండేలా పనితీరును నిర్వహించడానికి అంకితభావంతో కూడిన నిబద్ధత అత్యంత ముఖ్యమని నొక్కి చెప్పారు. (చదవండి: హ్యాట్సాఫ్ గుత్తా జ్వాలా..! అమ్మతనానికి ఆదర్శంగా..) -
సుదీర్ఘ చరిత్రకు సంక్షిప్త రూపం
దాదాపు 120 వేల సంవత్సరాల ప్రయాణం నుంచి ఓ 5 వేల సంవత్సరాల భారత ఉపఖండ చరిత్రను వేరు చేసి, సూక్ష్మంలో మోక్షంగా అందించడం సాహసమే! అమెరికాకు చెందిన చరిత్ర పరిశోధకురాలు, బోధకురాలైన ఆడ్రే త్రుష్కీ ఆ పని చేశారు. ఈ‘ఇండియా... 5000 ఇయర్స్’ పుస్తకం రాశారు. మధ్య యుగం కాలంలో సంస్కృతంపైన, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుపైన గతంలో రాసిన పుస్తకాల ద్వారా ఆడ్రే పేరు సుపరిచితమే. ఔరంగజేబును ఆనాటి సమకాలీన హిందూ, ముస్లిములిరువురూ గౌరవభావంతో చూశారనీ, ఆ తర్వాత కాలంలోనే ఆయనను రాక్షసుడిగా చిత్రించడం జరిగిందని ఆమె పేర్కొనడం అప్పట్లో వివాదాస్పదమైంది. ఒక వర్గం దాడులకు దిగవచ్చనే శంకతో ఆమె భారత్కు రావడానికి కూడా వెనుకాడాల్సి వచ్చింది. అయితే, బెదిరింపులు ఎన్ని ఉన్నా చరిత్ర పరిశోధకురాలిగా తన అధ్యయనం ఆగదని పేర్కొనే ఆడ్రే నాలుగో పుస్తకం ఈ ‘ఇండియా’. సాధికారికంగా చెబుతూనే, సామాన్యులకు అర్థమయ్యేలా చరిత్ర లోగుట్టు విప్పడం ఈ రచన ప్రత్యేకత. ఈ ప్రసిద్ధ ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రచురణ ఒక రకంగా ఇది భారత భూఖండ చరిత్ర కాదు. ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దిన పరిణామాలు, ప్రజల చరిత్ర. వలసలు మానవ నాగరికతతో పాటు చరిత్రను మారుస్తాయని భావించిన ఆడ్రే ఆ కోణం నుంచి కలం కదిపారు. గతమెంతో ఘనమనే కీర్తిగానానికి భిన్నంగా రచన చేశారు. అందుకే, ఈ పుస్తకంలోని ఆనాటి జీవిత కథలు తెలియని కోణం తెర మీదకు తెచ్చి ఆశ్చర్యపరుస్తాయి. సుమారు 65వేల ఏళ్ళ క్రితం ఆఫ్రికా పరిసరాల ప్రాంతాల నుంచి వచ్చి, స్థిరపడిన జనమే ‘ఫస్ట్ ఇండియన్స్’ అనే మాటను ఆడ్రే పునరుద్ఘాటిస్తారు. వారి జన్యువులే ఇప్పటికీ ప్రధానంగా దక్షిణ భారతావనిలో కనిపిస్తాయంటారు.సాక్ష్యాధారాల సహితంగానే తప్ప అనుశ్రుత కథలతో చరిత్రను అక్షరీకరించలేమన్నది సరైన శాస్త్రీయ దృక్కోణం. ఈ రచన ఆ కోణంలోనే సాగుతుంది. దానివల్ల కొన్ని అంశాల్లో పాతుకుపోయిన నమ్మకాలను ‘ఇండియా’ సమర్థించదు. గతంలోకి తొంగి చూస్తున్నప్పుడు చరిత్రలోని భిన్న స్వరాలను వినిపించడం ముఖ్యమని ఆడ్రే భావన. అందుకే, బౌద్ధం, హైందవం వగైరా గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మహిళల గొంతుకలను వినిపించడానికి ప్రయత్నిస్తారు. ఈ చరిత్ర పునఃకథనంలో నిమ్నవర్గాలను ముందు నిలుపుతారు. అలాగే, ఆ రోజుల్లోనే ఉన్న ‘సోకాల్డ్’ శూద్ర రాజుల గాథల నుంచి అగ్రవర్ణ ఆధిపత్యాన్ని చూపే అలనాటి సాహిత్య రచనల్ని కూడా చాలామందికి భిన్నంగా అప్పటి చరిత్రపై అవగాహనకు ఆకరాలుగా వాడారు. హైందవం, బౌద్ధం, జైనం, ఇస్లామ్, వేదాలు, మౌర్య సామ్రాజ్యం, చోళులు, మొఘల్ సామ్రాజ్యం, యూరోపియన్ వలస పాలన, భారత స్వాతంత్య్రోద్యమం, చివరకు తాజాగా పెరిగిన హిందూ జాతీయవాదం దాకా అనేక అంశాలను ఈ రచనలో వివరించారు.అయిదు వేల ఏళ్ళ సుదీర్ఘకాలాన్ని దాదాపు 700 పేజీల ఒకే సంపుటంలో పొందుపరచాలన్నప్పుడు నిడివి రీత్యా ఉండే ఇబ్బందులు సహజం. అందుకే, చాలామందికి తెలిసిన అంశాలు, చరిత్ర అనగానే ఎక్కువగా కనిపించే రాజవంశ గాథలను రచయిత్రి పక్కనపెట్టేశారు. ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ రాజుల చరిత్ర, రాజకీయ చరిత్ర ఎంత ముఖ్యమో... సామాజిక, ఆర్థిక చరిత్ర అంతే కీలకమని గుర్తించి, ఈ రచనలో వాటికి ఆమె పెద్ద పీట వేశారు. ఆ రకంగా ఇది రోమిలా థాపర్ (romila thapar) లాంటి పలువురి కాలక్రమాణిక చరిత్ర రచనలకు పరిపూరకం.అయితే, ఆధునిక భారత చరిత్రలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, నైజామ్లో రజాకార్ల ఆగడాలు, ప్రాంతీయ చరిత్రలను ఆడ్రే ప్రస్తావించక పోవడం ఆశ్చర్యకరమే. భారత్పై చైనా దురాక్రమణ, బంగ్లాదేశ్ విమోచన వగైరా ప్రస్తావించిన తీరేమో నిరాశపరుస్తుంది. వెరసి, సుదీర్ఘ చరిత్రకు సంక్షిప్త రూపమే తప్ప ఈ పుస్తకం సమగ్రం కాదు. సర్వజన సమ్మతమూ కాదు. అది గుర్తించి, ఒకే అంశానికున్న పలు పార్శ్వాలను తెలుసుకొనేందుకు చదివితే... ఈ రచన ఆసక్తి అనిపిస్తుందే తప్ప ఆశాభంగం కలిగించదు. -
నొప్పిని పోగొట్టే ‘అయాన్’
‘నొప్పి’ని తగ్గించేందుకు వైద్య శాస్త్రంలో నిరంతరం పరిశోధనలు జరుగుతున్నాయి. అయినా నొప్పికి విరుగుడు కనిపెట్టడంలో ఇంకా పూర్తి విజయాన్ని సాధించలేకపోయారు. కీళ్ల నొప్పి, ఆర్థరైటిస్, గాయాలు... ఇవన్నీ మనిషికి నొప్పి కలిగిస్తాయి. శరీరంలో నొప్పి, సందేశాలను అణచివేసే రసాయనాలు ప్రవేశపెడితే ఈ నొప్పికి విరుగుడుగా ఉంటుంది. శరీరంలో నొప్పికి విరుగుడుగా ‘విద్యుత్ చికిత్స’ ఉత్తమమని పరిశోధకులు గుర్తించారు. శరీరంలోకి బలహీనమైన విద్యుత్ను ప్రసారం చేస్తే అది మత్తు మందులా పనిచేసి రోగికి నొప్పి తెలియకుండా చేస్తుంది.నొప్పిని కల్గించే ప్రేరణలను మందగింపచేయడమే గాక మెదడుకు సమచారం వెళ్లకుండా ఈ విద్యుత్ నిరోధిస్తుంది. దీనినే ‘ఎలక్ట్రిక్ స్టిములేషన్’ పద్ధతి అంటారు. మన భారతీయ పరిశోధకుడు ఒకాయన ‘అయాన్ వైద్య చికిత్స’ రూపొందించారు. ఈ చికిత్స వలన అనేక మంది రోగులు నొప్పి నుండి విముక్తి పొందినట్లు ఆయన ప్రకటించారు. అమెరికాలోని వైద్య పరిశోధకులు ఈ ‘అయాన్ వైద్య చికిత్స’ బాగా పనిచేస్తోందని చెప్పారు. మూడవ డిగ్రీ స్థాయి వరకు శరీరం కాలిన రోగులకు విద్యుదావేశం కాబడిన గాలిని తగిలేటట్లు చేస్తే కొంతమేర స్వస్థత చేకూరిందని తెలియ జేశారు. అంటే నొప్పికి విద్యుత్ ఒక ‘బామ్’గా పనికి వస్తుందన్నమాట. విద్యుత్ పరికరాల సహాయంతో ఋణవిద్యుదావేశం గల గాలిని తయారు చేశారు. ఈ గాలిని బాగా పోగుచేసి నొప్పిగల ప్రదేశం మీదకు పంపారు. ఫలితంగా నొప్పి తగ్గినట్లు వారు గుర్తించారు.ఈ అయాన్లు గల గాలి వైద్యంతో కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడుం నొప్పులు వంటి వాటిని నయం చేయడానికి ప్రయోగించి మంచి ఫలితాలు సాధించారు. శరీరానికి గాయం అయితే ఆ ప్రాంతంలో నొప్పి ఉంటుంది. ఎందుకంటే అక్కడి జీవకణాలకు విద్యుత్ నిరోధం తక్కువగా ఉంటుంది. ఆ కారణంగా ఆ ప్రాంతంలో ఏర్పడే ద్రవపదార్థాలకు విద్యుత్ వాహకత్వం ఉంటుంది. రష్యాలోని పరిశోధకులు ఈ నిజాలు తెలుసుకుని తక్కువ విద్యుత్ నిరోధం గల జీవకణం పైకి విద్యుత్ను ప్రవహింప చేశారు. ఫలితంగా అది తిరిగి విద్యుత్ నిరోధక శక్తిని పుంజుకుంది. ‘ఇదే నొప్పి నివారణకు విద్యుత్ ఉపయోగపడుతున్న తీరు’ అని వివరించారు.చదవండి: డయాబెటిస్ రోగుల కాళ్లకు దెబ్బ తగిలితే ఏం చేయాలి?ఈ చికిత్స వలన నొప్పి తగ్గిన వారిలో మళ్ళీ నొప్పి పునరావృతం కాలేదు. రోగి విద్యుత్ చికిత్స సమయంలో గాని ఆ తరువాత నాలుగు గంటల వరకు గానీ ఎటువంటి లోహపు వస్తువులనూ తాకకూడదు. నీటితో శరీరాన్ని శుభ్రం చేసుకోకూడదు. రబ్బరు తొడుగులు ధరించి రోగి చికిత్స చేయించుకోవాలి. లేకపోతే రోగికి సరఫరా చేసిన విద్యుత్ ఎర్త్ అయిపోతుంది.– డాక్టర్ సి.వి. సర్వేశ్వర శర్మ, పాపులర్ సైన్స్ రచయిత -
హ్యాట్సాఫ్ జ్వాలా గుత్తా..! అమ్మతనానికి ఆదర్శంగా..
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాల గుత్తా, తమిళ నటుడు, నిర్మాత విష్ణు విశాల్ దంపతులు ఈ ఏడాది పండంటి ఆడబిడ్డకు జన్మించిన సంగతి తెలిసిందే. ఆమె కూడా తల్లిపాలకు దూరమైన శిశువులు అకాల అనారోగాల బారిన పడకుండా తన వంతుగా తల్లిపాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ తల్లిపాల డ్రైవ్లో అందరూ పాలుపంచుకునేలా ప్రేరేపించేలా ఆమె తల్లిపాలను దానం చేశారు. జ్వాలా ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నారు. "అంతేగాదు తల్లిపాలు బిడ్డల ప్రాణాలను కాపాడుతుంది, పైగా అనారోగ్యం బారిన పడకుండా రక్షిస్తుంది. మన దానం చేసే పాలు ఓ బిడ్డ జీవితాన్ని ఆరోగ్యంగా మార్చేస్తాయి. అలాంటి పాలను దానం చేసేందుకు ప్రతి అమ్మ ముందుకు రావాలి. పైగా ఈ పాలు అవసరం ఉన్న కుటుంబం పాలిట దేవతా లేక హీరోగా ఉంటారు. అందువల్ల దయచేసి పాల బ్యాంకుకి మద్దతివ్వండి. "అంటూ పోస్లులో రాసుకొచ్చారామె. ఇకజ్వాల ఇప్పటివరకు 30 లీటర్ల తల్లిపాలను దానం చేసినట్లు తెలిపారు. అంతేగాదు ఆమె విశాల హృదయానికి ఫిదా అవ్వుతూ ప్రశంసల వర్షం కురిపించారు నెటిజన్లు. అంతేగాదు. దీనిపై అందరు అవగాహన పెంచుకోవాలంటూ పోస్టులు పెట్టారు. కాగా జ్వాల గుత్త.. నటుడు విష్ణు విశాల్ను 22 ఏప్రిల్ 2021న వివాహం చేసుకున్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత తల్లి అయ్యింది. జ్వాల తన ఆడపిల్లకు పాలు ఇచ్చిన తర్వాత తన పాలన్నింటినీ దానం చేస్తుంది. భారతదేశంలో మొదటిసారిగా, ఒక అథ్లెట్ ఈ విధంగా తన పాలను దానం చేయడం నిజంగా స్ఫూర్తిదాయకమంటూ అందరు ఆమెను ప్రశంసిస్తున్నారు. చదవండి: కలం'.. కలకాలం..! పాఠకులతో నేరుగా రచయితల సంభాషణ -
'కలం'.. కలకాలం..! పాఠకులతో నేరుగా రచయితల సంభాషణ
ఒకప్పుడు రచయిత తాను రాసిన నవలలను ప్రచురణ సంస్థ ద్వారా మార్కెట్లోకి విడుదల చేసి పాఠకుల చెంతకు చేర్చేవాడు. లేదంటే అప్పట్లో వచ్చిన వారపత్రికలు, సీరియళ్లు తదితర మాధ్యమాల ద్వారా తన నవల ఇతివృత్తాన్ని పాఠకులతో పంచుకునేవారు. ప్రస్తుతం వారపత్రికలు ఆదరణ కోల్పోవడం, సామాజిక మాధ్యమాల ప్రభావం కారణంగా రచయితలు నేరుగా పాఠకులతో సంభాషించేందుకు ఆసక్తి చూపుతున్నారు. తద్వారా పుస్తక ప్రియుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఇలా హైదరాబాద్లో రచయితలను, పాఠకులను ఒక చోటకు చేర్చేందుకు పలు క్లబ్స్ సైతం ఏర్పాటయ్యాయి. అంతేకాదు వాటికి డిమాండ్ కూడా పెరుగుతోంది. నవలలను పాఠకుడికి చేర్చడం, పాఠకుడి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం, తద్వారా పరస్పరం తమ అభిప్రాయాలను పంచుకోవడం ప్రస్తుతం ట్రెండ్గా నడుస్తోంది. దశాబ్దం క్రితం రచయితలు పాఠకులతో ముచ్చటించడానికి తమ నవలను పరిచయం చేయడానికి అక్షర పుస్తక విక్రయశాలతో పాటు, సప్తపరి్ణ, లా మకాన్, రవీంద్ర భారతి, ఆంధ్ర సారస్వత పరిషత్, విశాలాంధ్ర బుక్హౌస్, స్టార్ హోటళ్లు, ప్రసాద్ ల్యాబ్స్, ప్రెస్క్లబ్స్ తదితర వేదికలను ఎంచుకునేవారు. ప్రస్తుతం వీటితోపాటు ఈ క్లబ్స్ కూడా రచయితలకు బాసటగా నిలుస్తున్నాయి. ఆఫ్లైన్ క్లబ్ పేరుతో..పాఠకులతో నేరుగా ముచ్చటించేందుకు పలువురు రచయితలు ఎదురు చూస్తున్న తరుణంలో కొన్ని క్లబ్స్ వేదికలుగా మారుతున్నాయి. ఇందులో భాగంగానే ఆఫ్లైన్ క్లబ్ పేరిట కొంత మంది యువతీ, యువకులు ఓ క్లబ్ను ఏర్పాటుచేసి, రచయితలను ఆహా్వనిస్తూ.. పాఠకులతో ముచ్చటించే సదావకాశాన్ని కలిగిస్తున్నాయి. ఇందుకోసం వీరు స్టార్ హోటళ్లను, పెద్ద పెద్ద హాళ్లను ఎంచుకోకుండా ఆసక్తిగలవారు ఉండేచోటనే ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇందుకోసం కెఫేలు బుక్ చేసుకుంటూ నెల రోజుల ముందు నుంచే ఆ రచయితతో మాట్లాడుతూ ఫలానా తేదీన రచయితతో ఇంటరాక్షన్ ఉంటుందని తెలియజేయడం, ఆ తర్వాత పరస్పర భావాలు పంచుకోవడానికి వేదికగా నిలుస్తున్నారు.యువ రచయితల సంఖ్య పెరుగుతోంది.. ఔత్సాహిక యువ రచయితలను ప్రోత్సహిస్తూ.. పాఠకులను, రచయితలను ఒకే వేదికపై చేర్చి ఓ గొప్ప సాహిత్య సంఘాన్ని నిర్మించాలన్నదే లక్ష్యం. ఇప్పటి వరకూ ఎందరో రచయితలతో ఈ ఇంటరాక్షన్ సెషన్స్ నిర్వహించాం. నగరంలో యువ రచయితల సంఖ్య పెరుగుతోంది. పాఠకులతో ముచ్చటించాలనుకునే రచయితలు ఇన్స్టా ద్వారా ఆఫ్లైన్ క్లబ్లోగానీ, ఆథర్ బ్యాంటర్ క్లబ్లోగానీ సంప్రదించవచ్చు. – బిశ్వరూప్ బారిక, ఆఫ్లైన్ క్లబ్ వ్యవస్థాకురాలుపాఠకులు ఉత్సాహంగా సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు ఇటీవల యువ రచయిత చైతన్య ముంగందతో ఆయన రాసిన ‘ప్రేమ కావ్యం’ నవలపై క్లబ్లో ముచ్చటించాం. జూబ్లీహిల్స్లోని ఓ కెఫే దీనికి వేదికైంది. ఈ ప్రేమ కావ్యం ఓ మధ్య తరగతి జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఆశయాలు, బాధ్యతలు, సంబంధాలను సమతుల్యం చేస్తూ.. ఓ విద్యార్థి ప్రొఫెషనల్గా మారడాన్ని చిత్రీకరించింది. పాఠకులు ఎంతో ఉత్సాహంగా తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. – మహ్మద్ నుష్రత్ ఖాద్రిపాఠకులతో ప్రత్యేక సెషన్స్..తాము రాసిన నవల సారాంశాన్ని, అందులోని పాత్రలను కూలంకషంగా చర్చించేందుకు పాఠకులు ముందుకొస్తున్నారు. పలువురు రచయితల తమ పుస్తక ప్రయాణాన్ని, ఆ పుస్తకాల్లోని కథల సారాంశాన్ని చర్చిస్తున్నారు. ఆఫ్లైన్ క్లబ్స్ ఇన్స్టాలో చురుకుగా ఉంటూ కొత్త రచయితలను ప్రోత్సహించడమే కాకుండా పాత రచయితలను కూడా ఈ వేదికలకు దగ్గరచేస్తున్నారు. ప్రతి సెషన్ కూడా పుస్తక సంతకంతో ముగుస్తుస్తోంది. ఇది రచయితలకు, పాఠకులకు ఒక మధురానుభూతిని కల్పిస్తుంది. కెఫేల్లో కాఫీ విత్ ఆథర్ పేరుతో ఇటీవల కాలంలో ఈ తరహా కార్యక్రమాలు జోరందుకున్నాయి. గొప్ప అనుభూతినిచ్చింది.. ‘ఎట్ ది ఎండ్ ఆఫ్ ది రెయిన్ బో’ అనే పుస్తకాన్ని రచించా. ఇది భావోద్వేగ ప్రేమకు ప్రతీక. నిజజీవిత సమస్యలు, సామాజిక అంచనాలు తాకుతుంది. పోరాటాలు, భావోద్వేగాలను అన్వేషిస్తూ ఆశను కలిగిస్తుంది. కష్టాల ద్వారా ప్రేమ బలాన్ని చూపుతుంది. ఆఫ్లైన్ క్లబ్ ద్వారా పాఠకులతో నేరుగా ముఖాముఖిలో పాల్గొన్నా. వారి అభిప్రాయాలను విని, సందేహాలను నివృత్తి చేశా. రాయడం కన్నా.. సారాంశాన్ని పాఠకులతో పంచుకోవడం గొప్ప అనుభూతినిచ్చింది. – కావ్య కృష్ణన్, రచయిత్రిఆవిష్కరణ కేంద్రాలుగా..రచయితలు, పాఠకులను ఒక చోట చేర్చడం, ఆఫ్లైన్ క్లబ్ రచయితల సమావేశాలు ఏర్పాటు చేయడం, రచయితలను, పాఠకులను ఒక చోట చేర్చడం నగరంలో కొంతకాలంగా జరుగుతున్న ట్రెండ్. వారానికోమారు గచ్చిబౌలి, మాదాపూర్, కోకాపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజగుట్ట, బేగంపేట, కూకట్పల్లి, హిమాయత్ నగర్ తదితర ప్రాంతాల్లో రచయితలతో సమావేశాలు, పుస్తకావిష్కరణ కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. పాఠకుల నుంచి వస్తున్న ఆదరణను రచయితలు కూడా ఆస్వాదిస్తున్నారు. (చదవండి: 22 నుంచి నవకర్ నవరాత్రి ఉత్సవ్) -
22 నుంచి నవకర్ నవరాత్రి ఉత్సవ్
నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ ప్రాంగణం దాండియా వేడుకలకు వేదిక కానుంది. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 1 వరకూ నవకర్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవ్–2025 సీజన్–8 పేరుతో దీనిని నిర్వహించనున్నారు. మానేపల్లి జ్యువెలర్స్, అన్విత సమర్పణలో జరిగే ఈ వేడుకలకు సంబంధించిన ఎంట్రీ పాస్ పోస్టర్ను బాలీవుడ్ గర్భా కొరియోగ్రాఫర్ జిగర్ సోనీ, ఆర్గనైజర్లు కవిత, సలోని జైన్తో కలిసి ఆదివారం ఆవిష్కరించారు. వేడుకల్లో భాగంగా ప్రతి రోజూ గర్భా, దాండియా, సంగీతం, మహా ఆర్తి, లైవ్ ఢోలు, ఫుడ్ కోర్టులు, సెలబ్రిటీల కార్యక్రమాలు, ప్రత్యేక బహుమతులు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. కొరియోగ్రాఫర్ సోని ఆధ్వర్యంలో యువతకు గర్భా, దాండియా నృత్యంపై వర్క్షాపు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన డీజే మ్యూజిక్, దాండియా నృత్యాలు అలరించాయి. (చదవండి: గ్రీన్ ట్రయాంగిల్..! ప్రకృతి చెక్కిన అద్భుతం..) -
గ్రీన్ ట్రయాంగిల్..! ప్రకృతి చెక్కిన అద్భుతం..
ప్రకృతికి పక్షపాతం కొంచెం ఎక్కువే. దక్షిణాదిన కేరళను అక్కున చేర్చుకుంది. ఉత్తరాన ఉత్తరాఖండ్ను ఒడిలో దాచుకుంది. ‘గాడ్స్ ఓన్ కంట్రీ’ అనే భుజకీర్తి ఒకరిది. ‘దేవభూమి’ అనే అతిశయం మరొకరిది. ఆ రెండు రాష్ట్రాల్లో పుట్టని వాళ్లేం చేయాలి? వీలయినప్పుడు అక్కడికి వెళ్లి చూసి రావాలి? హైదరాబాద్లో రైలెక్కి ఢిల్లీలో రైలు దిగుదాం. ఢిల్లీలో బస్సెక్కి ఉత్తరాఖండ్ టూర్కి చెక్కేద్దాం. ఇది... మూడు వేల అడుగుల ఎత్తు మొదలు... ఏడు వేల అడుగుల ఎత్తుకు సాగే ప్రయాణం.1వ రోజుఉదయం ఆరు గంటలకు ట్రైన్ నంబర్ 12723 తెలంగాణ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది. 2వ రోజు ఉదయం 7.40 గంటలకు ఢిల్లీ స్టేషన్కు చేరుతుంది. హోటల్లో రిఫ్రెష్మెంట్, బ్రేక్ఫాస్ట్ తరవాత కార్బెట్కు ప్రయాణం. కార్బెట్కు చేసేటప్పటికి సాయంత్రం అవుతుంది. అక్కడ హోటల్ గదిలో చెక్, రాత్రి భోజనం, బస.3వ రోజుతెల్లవారు జామున లేచి కార్బెట్ సఫారీకి వెళ్లడం, జలపాతాల వీక్షణం తర్వాత హోటల్కి వచ్చి బ్రేక్ఫాస్ట్, రిఫ్రెష్మెంట్ తర్వాత గది చెక్ అవుట్ చేయాలి. నైనితాల్కు ప్రయాణం. నైనితాల్లో హోటల్లో చెక్ ఇన్, రాత్రి భోజనం, బస అక్కడే.వేటగాడి జ్ఞాపకం!చందమామ కథల్లో చెప్పుకున్నట్లు కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి కాదు కానీ ఇది దట్టమైన అటవీప్రదేశం అని చెప్పడంలో సందేహం లేదు. బ్రిటిష్ పాలన కాలంలో ఏర్పాటయిన నేషనల్ పార్క్ ఇది. తొలి తొలి నేషనల్ పార్క్ కూడా. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జిమ్ కార్బెట్ పార్కుగా పేరు మార్చుకుంది. ఇది పులుల సంరక్షణ కేంద్రం. నిజానికి పులులను సంరక్షించడంలో జిమ్ కార్బెట్ పాత్ర ఏమీ లేదు. ఇతడు గొప్ప వేటగాడు. కుమావ్ రీజియన్లో మనుషులకు హాని కలిగిస్తున్న పులులను, చిరుత పులులను హతమార్చిన ఘనత ఇతడిది. తన పులుల వేట కథనాలను రాశాడు కూడా. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ సఫారీలో మనకు పులులు, ఏనుగుల గుంపులు, జింకలు, రకరకాల పక్షులు కనువిందు చేస్తాయి. నగరవాసుల ఈ టూర్ ఒక లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్గా మిగులుతుంది. ఈ ప్రదేశం హిమాలయ పర్వత శ్రేణుల్లో భాగమైన శివాలిక్ రీజియన్ ఉంది. అటవీప్రదేశంలో పర్వతసానువులు, జలపాతాలు కూడా ఉన్నాయి. అడవి మధ్యలో ప్రవహిస్తున్న రామ్ గంగ నది, దాహం తీర్చుకోవడానికి నది తీరానికి వచ్చిన జంతువులను చూస్తూ పిల్లలు కేరింతలు కొడతారు. వన్య్రప్రాణుల సంరక్షణ కోసం ఎకో టూరిజమ్ పాలసీ అమలులో ఉంది. కాబట్టి ప్రకృతికి, వన్య్రప్రాణులకు హాని కలిగించే వస్తువులను అనుమతించరు. 4వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత నైనితాల్ లోని పర్యాటక ప్రదేశాల సందర్శనం. రాత్రి బస నైనితాల్లో.ప్రకృతి అద్భుతం ఈ నయనం!నైనితాట్ పట్టణానికి పౌరాణిక ప్రాశస్త్యంతోపాటు రాజకీయ ప్రాధాన్యం కూడా ఉంది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ (వింటర్ క్యాపిటల్, వింటర్ సెషన్స్), నైనితాల్ సమ్మర్ క్యాపిటల్, అలాగే జ్యూడిషియల్ క్యాపిటల్ కూడా, గవర్నర్ బంగ్లా కూడా నైనితాల్లోనే. తాల్ అంటే సరస్సు, నయనం (కన్ను) ఆకారంలో ఉంటుంది కాబట్టి ఈ తటాకానికి నైనితాల్ అని పేరు. ప్రకృతి దేవత రూపంలో కొలిచే సంస్కృతిలో భాగంగా నెలకొన్న నయనాదేవి (నైనాదేవి) ఆలయం కూడా ఉంది. ఇక్కడ ఒక పర్వత శిఖరానికి నైనా పీక్ అని పేరు. అది ఎనిమిది వేల అడుగులకు పైగా ఉంటుంది. చర్చ్, ప్రాచీన కాల నిర్మాణశైలి మసీదు నిర్మాణశైలి సునిశితంగా ఉంటుంది. హనుమాన్ ఘరి ఆలయం నైనితాల్లోని మాల్ రోడ్లో ఉంది. ఈ ఆలయం ఉన్న ప్రదేశం మంచి వ్యూ ΄ాయింట్. ఇక్కడి నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయాలు అద్ధుతంగా ఉంటాయి. మంచు దుప్పటి కప్పుకున్న హిమాలయ శిఖరాలను కూడా చూడవచ్చు.5వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత అల్మోరా, ముక్తేశ్వర్ దిశగా ప్రయాణం. దర్శనం తర్వాత తిరిగి నైనితాల్కు చేరాలి. రాత్రి బస నైనితాల్లో.ఇక్కడ ఆది మానవుడు నివసించాడు!అల్మోరాలో చూడాల్సిన ప్రదేశాలు ఏమున్నాయి అనే ప్రశ్న ఉదయిస్తుంది. దీనికి జవాబు ఇది ఒక అందమైన ప్రదేశం. ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి వచ్చిన ప్రముఖుల పాదముద్రలే పర్యాటక ప్రదేశాలు. స్వామి వివేకానందుడు ప్రకృతి సౌందర్యం, ప్రశాంతతల «మధ్య ధ్యానం చేసుకోవడానికి సరైన ప్రదేశంగా ఎంచుకున్నాడు. మహాభారత కాలంలో కూడా ఈ ప్రదేశం ప్రస్తావన ఉంది. అది కేవలం పుక్కిటి పురాణం కాదనడానికి నిదర్శనంగా చంద్ రాజవంశం నివసించిన భవనాలున్నాయి.రాజభవనాలంటే మనకు రాజస్థాన్ కోటలు, ప్యాలెస్లే గుర్తొస్తాయి. కానీ ఇక్కడి రాజభవనాన్ని చూస్తే రాజు అత్యంత నిరాడంబరంగా జీవించాడనిపిస్తుంది. పెద్ద రాతి గోడలు, ఆకు పచ్చ రంగు రేకులతో ఏటవాటు పైకప్పు భవనమే చంద్ రాజవంశపు కోట. కుమావ్ పర్వతశ్రేణుల్లో రాజ్యాన్ని స్థాపించి అల్మోరా రాజధానిగా పాలించారు. ప్రాచీనకాలంలో ఇక్కడ మనుషులు నివసించారని నిరూపించే లఖుదియార్ గుహలున్నాయి. క్రికెట్ క్రీడాకారుడు మహేంద్ర సింగ్ ధోనీ పూర్వికులు అల్మోరా వాసులే.అదిగో మంచుకొండ ముక్తేశ్వర్ శైవ క్షేత్రం. ఇక్కడి శివుడిని దర్శించుకుంటే ముక్తి లభిస్తుందని చెబుతారు. ఉత్తరాఖండ్ పర్యటనలో హిమాలయాలు పర్యాటకులతో దోబూచులాడుతూ ఉంటాయి. పర్వత సానువుల మధ్య ప్రయాణం సాగుతున్నప్పుడు కొంత మేర ఆకాశాన్నంటే శిఖరాలతో ప్రపంచంతో సంబంధాలు తెగి΄ోయినట్లయినిపిస్తాయి. ఒక మలుపు తిరగ్గానే సూర్యకిరణాలతో ధగధగలాడుతూ మంచుకొండలు దర్శనమిస్తాయి. కొండవాలులో ప్రయాణిస్తున్నప్పుడు లోయలు వెన్నులో భయాన్ని పుట్టిస్తాయి. గూగుల్ సెర్చ్ చేస్తే ఏడు వేల అడుగుల ఎత్తులో ఉన్నామని చూపిస్తుంది. ఇక భయాన్ని అదిమిపెట్టి లోయవైపు చూడకుండా కొండంత అండగా కనిపిస్తున్న కొండనే చూస్తూ ముందుకు సాగిపోవాలి.6వ రోజుబ్రేక్ ఫాస్ట్ తర్వాత ఉదయం గది చెక్ అవుట్ చేసి ఢిల్లీకి ప్రయాణం. ఢిల్లీ చేరేటప్పటికి సాయంత్రం అవుతుంది. అక్షరధామ్ టెంపుల్ సందర్శనం తర్వాత హోటల్లో చెక్ ఇన్. రాత్రి బస.లోహరహిత నిర్మాణంఅక్షరధామ్ ఆలయం విశాలమైన నిర్మాణం. ఇది స్వామి నారాయణ ఆలయం. ఈ ఆలయాన్ని ్ర΄ాచీన భారత శిల్పశాస్త్రాన్ని అనుసరించి నిర్మించారు. ఇంత భారీ నిర్మాణంలో ఎక్కడా లోహాలను ఉపయోగించలేదు. అందుకే పిల్లర్లు ఎక్కువగా కనిపిస్తాయి. 234 స్తంభాలున్నాయి. ఒక్కొక్క స్తంభం మీద సునిశితమైన శిల్పచాతుర్యమయం. ఉత్తరాది నిర్మాణాలకు పాలరాయి ఒక వరం అనే చె΄్పాలి. పాలరాతితో పూలరెక్కలను కూడా అంతే సున్నితంగా చెక్కగలిగిన నిపుణులు ఉండడం మనదేశ గొప్పదనం. అందుకే పాలరాతి ఆలయాలకు వెళ్లినప్పుడు చుట్టూ చూసి సరిపెట్టుకోకుండా తలెత్తి పైకప్పును కూడా చూడాలి. అక్షరధామ్ ఆలయ సందర్శనంలో వాటర్ ఫౌంటెయిన్లు, లేజర్ షోలను మిస్ కాకూడదు.7వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత కుతుబ్మినార్, లోటస్ టెంపుల్ సందర్శనం, మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీ రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తారు. నాలుగు గంటలకు 12724 నంబర్ తెలంగాణ ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరుతుంది. ఎనిమిదవ రోజు సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ స్టేషన్కు చేరుతుంది.ఏనాటిదో ఈ మినార్!కుతుబ్ మినార్ నిర్మాణం గురించి చరిత్ర తవ్వకాల్లో కొత్త సంగతులు బయటకు వస్తున్నాయి. అప్పటికప్పుడు ఓ చిన్న వివాదం, ఆ తర్వాత సమసి΄ోవడం, కొత్త వాస్తవాలను స్వీకరించడం జరుగుతోంది. ఈ నిర్మాణాన్ని క్రీ.శ పన్నెండవ శతాబ్దంలో కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడనే ఆధారాలను కొట్టి పారేస్తూ ఐదవ శతాబ్దంలో రాజా విక్రమాదిత్యుడు నిర్మించాడనే ఆధారాలు వ్యక్తమయ్యాయి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనలను కొనసాగిస్తోంది. ఈ వాస్తవాలెలా ఉన్నప్పటికీ కుతుబ్ మినార్ కాంప్లెక్స్ ఓ గొప్ప నిర్మాణ విశేషం. అందుకే యునెస్కో దీనిని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది.ధ్యాన కలువప్రతి ఆర్కిటెక్చర్ స్టూడెంట్ చూడాల్సిన నిర్మాణం. ఎక్కడా పిల్లర్ లేదు. కలువ రెక్కల లోపల లోహపు కడ్డీల ఆధారంగా నిర్మించారు. గొప్ప ఆధ్యాత్మికత అన్వేషణలో భాగంగా ధ్యానం కోసం నిర్మించిన బహాయీ ధ్యానమందిరం ఇది. లోటస్ టెంపుల్ గిన్నిస్ రికార్డు సాధించిన ఆలయం. ఈ ఆలయం, నిర్మాణ వైశిష్ట్యాలను వివరిస్తూ ఐదు వందల వ్యాసాలు, వార్తాకథనాలు ప్రచురితమయ్యాయి. ఈ ప్రాంగణం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. కానీ శబ్దం వినిపించదు. నిర్వహకులు పిన్డ్రాప్ సైలెన్స్ మెయింటెయిన్ చేస్తారు. చక్కటి గార్డెన్ల మధ్య మెల్లగా నడుస్తూ లోపలికి వెళ్లి కొద్ది సేపు ధ్యానం చేసి బయటకు రావడం గొప్ప అనుభూతినిస్తుంది.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: అబుదాబిలో గంగా హారతి..! ఏకంగా రూ. 961 కోట్లు..) -
బొమ్మలాట
ఒక ఊర్లో ఓ మోతుబరి రైతు ఉండేవాడు. బాగా సంపాదించిన అతడికి వయసుపైబడింది. వృద్ధాప్యం సమీపించే కొద్దీ అతడిలో ప్రాణ భయం పట్టుకుంది. ఒక రోజు పొలం పనుల మీద పక్క ఊరికెళ్ళాడు. చిన్నగా మొదలైన వాన చినుకులు కొద్దిసేపటికే పెద్ద వర్షంగా మారింది. అటూ ఇటూ చూశాడు. దూరంగా పెద్ద మర్రిచెట్టు కనిపించింది. గబగబా నడుచుకుంటూ వెళ్ళి చెట్టుకింద నిలబడ్డాడు. ఆ మర్రి చెట్టు కింద మట్టితో బొమ్మలు తయారు చేసే కుమ్మరి ఉన్నాడు. రకరకాల అందమైన బొమ్మలు తయారు చేసి అమ్మకానికి పెట్టి ఉన్నాడు.ఇంతలో వాన ఉధృతమయ్యింది. వానకి మట్టి బొమ్మలు కొన్ని చిన్నచిన్నగా కరిగిపోసాగాయి.దాన్ని కళ్ళారా చూసిన రైతు, ఆ కుమ్మరి దగ్గరకు వెళ్ళి ‘‘నీకు బాధగా లేదా?’’ అని అడిగాడు. ‘‘బాధగా లేదు. ఇది సహజం!’’ అని బదులిచ్చాడు కుమ్మరి. ‘‘ఎందుకు బాధ లేదని చెబుతున్నావు? నీకు నష్టం జరుగుతోంది కదా’’ అని మళ్ళీ ప్రశ్నించాడు రైతు.‘‘ఈ మట్టి బొమ్మలు ఆకాశంలో నుంచి ఊడి పడలేదు. అవి మట్టితో తయారు చేసినవి. మట్టినుంచి వచ్చినవి మట్టిలోకే కదా పోతాయి. దానికెందుకు బాధపడాలి. నాకు దేవుడిచ్చిన శరీరం ఉంది. మరింత కష్టపడి మరిన్ని బొమ్మలు తయారు చేయగలను, ఈ జానెడు పొట్ట నింపుకోగలను.నిజంగా ఈ మట్టిబొమ్మల మీద నాకు ఏ హక్కూ లేదు. కారణమేమిటంటే అవి ప్రకృతిలో ఉచితంగా దొరికిన మట్టితో తయారు చేయబడినవి. అది ప్రకృతి నాకిచ్చిన అవకాశం. ఈ మట్టిని బొమ్మలుగా మార్చి నా పొట్ట గడుపుకుంటున్నానని ప్రతి క్షణం గుర్తు తెచ్చుకుంటాను. అందుకే నేను లాభాలకు పొంగిపోను, నష్టాలకు క్రుంగి పోను. నిజం చె΄్పాలంటే ఈ కరిగిపోతున్న మట్టిని చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అవి పుట్టింటికి వెళ్తున్నాయన్న స్పృహ నాకుంది’’ అని బదులిచ్చాడు.కుమ్మరి చెప్పిన జీవిత సత్యం విని రైతు ఆశ్చర్యపోయాడు. అదే విషయాన్ని తనకి అన్వయించుకున్నాడు. ‘మన జీవితం కూడా మూన్నాళ్ళ ముచ్చటే కదా. దేవుడు ఆడించే బొమ్మలాటే కదా. ఎక్కడినుంచి వచ్చామో, అక్కడికి వెళ్ళడం ఎవ్వరికైనా తప్పదు కదా’ అని గుర్తు తెచ్చుకున్నాడు. ఇంతలో వాన నిలవడంతో అక్కడినుంచి కదిలాడు రైతు. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు1 -
ఈ పక్షం.. పితృపక్షం
ఈ ఏడాది పితృ పక్షాలు గ్రహణంతో ప్రారంభం అయ్యాయి. తిరిగి గ్రహణంతోనే ముగియనున్నాయి. అంటే.. సెప్టెంబర్ 7వ తేదీ చంద్రగ్రహణంతో ప్రారంభమై.. సెప్టెంబర్ 21, ఆదివారం, అమావాస్య నాడు సంభవించబోయే సూర్యగ్రహణం రోజున ముగియనున్నాయి.సుమారు 100 ఏళ్ల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంటున్నట్లు పండితులు, పెద్దలు చెబుతున్నారు. వివేకవంతులు ఈ రోజులను సద్వినియోగం చేసుకుంటారు. అదెలాగంటే...జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. పితృదోషాల వల్ల అనేక రకాల సమస్యలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా చేపట్టిన పనులలో పదే పదే ఆటంకాలు కలగడం, కీర్తి, గౌరవ ప్రతిష్టలకు భంగం వాటిల్లడం, కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులోనే వైధవ్యం ప్రాప్తించడం, ఎవరో ఒకరికి మానసిక స్థితి సరిగా లేకుండా ఉండటం, అన్నిటికంటే ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం, ఒకవేళ సంతానం కలిగినా ఆ పుట్టిన సంతానం జీవించకపోవడం వంటి సమస్యలు సంభవించే అవకాశం ఉంది. ఇవన్నీ పితృ శాపాల వల్ల లేదా పితృదేవతలు అసంతృప్తికి గురవడం వల్ల కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల పితృ పక్షాల సమయం పూర్వీకుల ఆశీస్సుల కోసం అలాగే పితృదేవతలను సంతృప్తి పరిచేందుకు అనుకూలమైన సమయం. అలాగే.. మహాలయ పక్షంలో ఆచరించే శ్రాద్ధ కర్మలు, దానాలు, పుణ్య కార్యాల వల్ల సంతానం లేని వారికి సంతానం కలిగి, వంశాభివృద్ధి అవుతుంది. పితృదోషాల వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలు, అడ్డంకులు, ఆటంకాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు. పితృపక్షంలో రోజూ సాయంత్రం పితృదేవతా నిలయమైన నైరుతి మూలన దీపం వెలిగించడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయని, అలాగే.. పితృదేవతలను స్మరించుకుంటూ వారి కోసం ధ్యానం చేస్తే ఆ ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయని కూడా బలమైన నమ్మకం.అలాగే.. పితృదేవతలకు రోజూ అపరాహ్న వేళ అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో జల తర్పణాలు వదలాలి. ఒకవేళ జల తర్పణాలు 15 రోజులు వదలడం వీలు కాని వాళ్లు మహాలయ అమావాస్య రోజునైనా తర్పణం వదలాలి. కాకులకు, జంతువులకు ఆహారం పెట్టాలి. పేదవారికి అన్నదానం, వస్త్ర దానం చేయడం, పండితులకు, గురువులకు భోజనం పెట్టి తాంబూలం ఇవ్వడం వంటివి మంచి ఫలితాలను ఇస్తాయి.పితృ పక్షం సమయంలో ఇంట్లో పూజలు, హోమాలు ఆచరించడం పుణ్యప్రదం. పితృపక్షంలో ఇప్పటికే వారం రోజులకు పైగా గడిచిపోయింది. ఇంకా వారం కూడా పూర్తిగా లేదు. అందువల్ల చివరి రోజైన మహాలయ అమావాస్య వరకు వాయిదా వేయకుండా వీలయినప్పుడల్లా పేదలకు అన్నదానం చేయడం మంచిది. ఇక మహాలయ అమావాస్య రోజున తర్పణాలు వదిలే కార్యక్రమం పూర్తి చేశాక.. దసరా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాక మాత్రమే తిరిగి శుభకార్యాలు ప్రారంభించాలి.– డి.వి.ఆర్. -
తుఫానులోనూ చెదరని ప్రశాంతత
మన జీవితంలో సవాళ్లు మనల్ని ముంచెత్తే తుఫానులా వస్తాయి. ఆ అలల తాకిడికి మన మనసు అలజడి చెందుతుంది. కానీ, ఆ తుఫాను మధ్యలో నిశ్చలంగా నిలబడిన కొండలా మనల్ని నిలబెట్టేదే ఓర్పు. బయటి ప్రపంచం ఎంత అల్లకల్లోలంగా ఉన్నా, మన అంతరంగంలో తుఫానులోనూ చెదరని ప్రశాంతతను నింపుకునే శక్తి ఇది. ఓర్పు కేవలం నిరీక్షించడం కాదు, అది ఆత్మబలానికి అసలైన నిర్వచనం.ఓర్పు అనేది మనసును నియంత్రించే ఒక శక్తి. సనాతన ధర్మంలో ఇది ఒక అత్యున్నత విలువగా పరిగణించబడింది. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు కష్టాలను, సుఖాలను సమంగా చూడమని అర్జునుడికి ఉపదేశిస్తాడు. అదే నిజమైన జ్ఞానానికి, స్థిరత్వానికి పునాది అని వివరిస్తాడు. క్షమా వీరస్య భూషణం శక్తిమతాం క్షమా శ్రేయః ఓర్పు అనేది వీరులకు ఆభరణం. శక్తిమంతులకు ఓర్పు ఒక గొప్ప ధర్మం. ఈ సూక్తి ఓర్పును బలహీనతగా కాకుండా, అత్యంత ఉన్నతమైన ధైర్యంగా, శక్తిగా గుర్తిస్తుంది. నిజమైన బలం శారీరక శక్తిలో కాదు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా శాంతంగా, స్థిరంగా ఉండగల మానసిక శక్తిలో ఉందని ఇది నొక్కి చెబుతుంది.శానైర్గచ్ఛన్ శనైర్గచ్ఛన్ పంథాః సంపూర్ణో భవతినెమ్మదిగా, ఓర్పుతో అడుగులు వేసేవాడు దారిని పూర్తిగా చేరుకుంటాడు. అంటే, ఓర్పుతో, నిలకడగా కృషి చేసేవారు ఖచ్చితంగా తమ గమ్యాన్ని చేరుకుంటారు. ఇది ఆధునిక జీవితంలో కూడా అంతే సత్యం. పరీక్షల్లో విజయం సాధించడానికి రోజూ కొంతసేపు చదవాలి, ఒక్కరోజులో కాదు. ఒక వ్యాపారం విజయవంతం కావడానికి ఎన్నో ఏళ్ల నిరంతర కృషి, ఓర్పు అవసరం. ఓర్పు అనేది మన లక్ష్యంపై మనకున్న నమ్మకాన్ని, నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.క్షమా బలం అశక్తానాం, శక్తానాం భూషణం క్షమా ఓర్పు అనేది బలహీనులకు బలం, శక్తిమంతులకు ఆభరణం. ఓర్పును అలవరచుకోవడం ద్వారా బలహీనులు కూడా శక్తివంతులుగా మారగలరు. అది ఒక శక్తిమంతుని కీర్తిని, గౌరవాన్ని పెంచుతుంది. ఈ సూక్తి ఓర్పు సార్వత్రిక శక్తిని, అది అందరికీ ఎలా ప్రయోజనకరంగా ఉంటుందో స్పష్టం చేస్తుంది.ఓర్పు అనేది కేవలం నిరీక్షించడం కాదు, అది జీవితాన్ని అర్థవంతంగా, ప్రశాంతంగా జీవించే ఒక గొప్ప కళ. ఓర్పును అలవరచుకోవడం ద్వారా మనం అనవసరమైన ఆందోళనల నుండి విముక్తి పొందవచ్చు, ప్రశాంతంగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. కష్టాల పర్వతాలను చిన్న మెట్లుగా మార్చగల శక్తి ఓర్పుకు మాత్రమే ఉంది. ఓర్పు అనే బలం మనకు జీవితంలో ఎలాంటి తుఫానులనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఈ గొప్ప గుణాన్ని మన జీవితంలో నిత్యం సాధన చేయడం ద్వారా విజయం, ప్రశాంతత, ఆనందం తప్పక లభిస్తాయి.భారతంలో సత్యవంతుడి భార్య సావిత్రి, తన భర్త జీవితం ముగిసే రోజున యమధర్మరాజు వెంట వెళ్లి, తన పట్టుదల, వాదన, అపారమైన ఓర్పుతో తన భర్త ప్రాణాలను తిరిగి తెచ్చుకుంది. ఈ కథ ఓర్పు దృఢ సంకల్పానికి ఉండే అద్భుత శక్తికి నిదర్శనం. అలాగే, హరిశ్చంద్రుడు తన సర్వస్వాన్ని కోల్పోయినా, చివరి క్షణం వరకు సత్యానికే కట్టుబడి ఉన్నాడు. ఆయన సత్యనిష్ఠకు, ఓర్పుకు అంతర్జాతీయంగా ప్రసిద్ధి.ప్రఖ్యాత శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బును కనిపెట్టే క్రమంలో వేలసార్లు విఫలమయ్యారు. ప్రతి వైఫల్యం తర్వాత, ఆయన ‘ఈసారి పని చేయని ఇంకో మార్గాన్ని కనుగొన్నాను‘ అని ఓర్పుతో, పట్టుదలతో కృషి చేశారు. ఆయన ఓర్పు కారణంగానే ప్రపంచం చీకటి నుంచి వెలుగులోకి వచ్చింది. అలాగే, మహాత్మాగాంధీ తన జీవితంలో ఎదురైన ఎన్నో అవమానాలను, కఠిన పరిస్థితులను ఓర్పుతో ఎదుర్కొని, అహింసను, సత్యాగ్రహాన్ని తన ఆయుధాలుగా మలచుకున్నారు. ఆయన ఓర్పు, శాంతం, అకుంఠిత విశ్వాసంతో ప్రపంచంలోనే అతిపెద్ద బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఓడించి, భారతదేశానికి స్వాతంత్య్రం సాధించారు. ఇది ఓర్పుకు, దాని శక్తికి ఉన్నతమైన ఉదాహరణ.– కె. భాస్కర్ గుప్తా(వ్యక్తిత్వ వికాస నిపుణులు) -
ఆరోగ్య సంరక్షణలో భారత్ బెస్ట్..!
భారతదేశంలో నివశిస్తున్న అమెరికన్ మహిళ క్రిస్టెన్ ఫిషర్ ఆరోగ్య సంరక్షణపై నెట్టంట షేర్ చేసిన పోస్ట్ నెటిజన్ల మనసును దోచుకోవడమే కాదు చర్చనీయాంశంగా మారింది. అంతేగాదు అక్కా మీరు చాలా బాగా చెప్పారంటూ ఆము ప్రశంసల వర్షం కురింపించారు నెటిజన్లు. అంతేగాదు అత్యంత నిజాయితీగా మాట్లాడిన తీరు కూడా చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఇంతకీ ఆమె పోస్ట్లో ఏం రాసిందంటే..భారతదేశంలో గత కొన్నేళ్లుగా నివశిస్తున్న క్రిస్టెన్ ఫిషర్ భారతదేశం, అమెరికాలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల తీరు ఎలా ఉంటుందో సోష్ల మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఇరు దేశాల్లోని ఆస్పత్రులు, వైద్యులు, మందులు పరంగా ఆరోగ్య సంరక్షణ ఏ దేశంలో బాగుంటుందో వెల్లడించింది. ఖర్చు, ఔషధాల పరంగా భారతదేశం బెటర్ అని, అదే యూఎస్లో ఈ పరంగా రోగిపై అత్యధిక భారం పడుతుందని తెలిపింది. అలాగే అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టం అని అన్నారు. భారత్లో అపాయింట్మెంట్తో పనిలేకుండానే క్లినిక్కి వెళ్లగలం, పైగా సమయం కూడా ఎక్కువ పట్టదని అంటోంది. అలాగే డాక్టర్లు వైద్యుడిని పర్యవేక్షించే విషయంలో కూడా భారత్ బెటర్ అని, ఎందుకంటే క్షుణ్ణంగా అతడిని విచారించి..చికిత్స అందిస్తుందని, యూఎస్లో రోగితో డాక్టర్ స్పెండ్ చేసే టైం చాలా తక్కువ, పైగా అంత సమయం కేటాయించేందుకు ఇష్టపడరనికూడా పేర్కొంది. ఇక ఆస్ప్రతిలో అందించే భోజనం పరంగా అమెరికా బెటర్ అని, కానీ రోగికి ఇచ్చే మెనూ ఆధారంగా వారి పర్యవేక్షకులకు అదే ఆహారం ఉంటుందని, అంత మెరుగ్గా లేదని అన్నారామె. మొత్తంగా చూస్తే ఆరోగ్య సంరక్షణ భారత్లోనే బాగుంటుంది, ఇక్కడ వైద్య ఖర్చు తక్కువే, పైగా మందులు కూడా సులభంగా దొరుకుతాయంటూ పోస్ట్లో తన అభిప్రాయాన్ని రాసుకొచ్చిందామె. ఈ పోస్ట్ నెట్టింట చర్చకు దారితీయడమే గాక, నిజాయితీగా తన అభిప్రాయాన్ని వెల్లడించిన తీరుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. అదీగాక మా దేశాన్ని అభినందిస్తుందన్నందుకు అక్కా మీపై రోజురోజుకి గౌరవం పెరిగిపోతుందోందటూ పోస్ట్లు పెట్టారు నెటిజన్లు. కాగా, ఆమె గతంలో కూడా పలు విషయంలో భారత్లోనే పిల్లలు మంచిగా పెరుగుతారని, ఈ నేల నివశించడానికి అనువైనదని, ఎవ్వరినైనా తనలో కలిపేసుకునే ఆకర్షణ ఈ ప్రదేశంలో ఉందంటూ భారత్పై పొగడ్తల వర్షం కురిపించింది కూడా. View this post on Instagram A post shared by Kristen Fischer (@kristenfischer3) (చదవండి: ఆర్మీ ఆఫీసర్గా అందాలరాణి..!) -
ఆర్మీ ఆఫీసర్గా అందాలరాణి..!
అందం పరంగానూ సేవలోనూ మేటీ అనేలా విభిన్న రంగాల్లో సత్తా చాటారామె. గ్లామర్పరంగా నటన, మోడల్ రంగంల వైపుకి పరిమితం కాకుండా దేశ సేవలో పాలుపంచుకుని సైనికురాలు కావాలని ఆకాంక్షించిందామె. అత్యంత విరుద్ధమైన రంగాన్ని ఎంచుకుని యువతకు ఆదర్శంగా నిలిచింది. సుకుమారం అనేది శరీరానికే గానీ మనసుకు కాదని, మనః సంకల్పం ఉంటే ఎందులోనైనా రాణించగలం అని ప్రూవ్ చేసి స్ఫూర్తిగా నిలిచింది.ఆమెనే కాశీష్ మెత్వానీ. ఆమె 2023లో మిస్ ఇంటర్నేషనల్గా ఇండియాగా కిరీటాన్ని గెలుచుకుంది. నిజానికి అందాలరాణిగా సత్తా చాటగానే మోడలింగ్ ఆఫర్లు, యాక్టింగ్ ఆఫర్లు అందుకుని గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెడుతుంటారు చాలామంది. కానీ కాశీష్ అందుకు విరుద్ధంగా సాయుధ రంగాన్ని ఎంచుకోవడం విశేషం. నిజానికి ఆమె కుంటుంబం ఆర్మీ నేపథ్యానికి చెందింది కూడా కాదు. అయినా ఆమె దేశ సేవలో భాగం కావాలనే ఆకాంక్షతో ఆర్మీలో చేరింది. పూణేకి చెందిన కాశీష్ చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(ఓటీఏ)లో శిక్షణ పూర్తి చేసుకుని భారత సైన్యంలో కీలక భాద్యతలు నిర్వర్తిస్తోందామె. ఎప్పుడూ కొంగొత్త విషయాలను తెలుసుకోవడంపై ఉన్న ఆసక్తే ఆమెనే ఈ విరుద్ధమైన రంగంలోకి వచ్చేలా చేసింది. అదీగాక ఎన్సీసీలో ఉండగా రిపబ్లిక్ డే పరేడ్ కవాతులో భాగస్వామ్యం అయినప్పుడు తనకు ఆర్మీ ఫీల్డే బెస్ట్ అని ఫీలయ్యేదట. ఆ నేపథ్యంలోనే తన కుటుంబాన్ని ఒప్పించి మరి ఇలా ఆర్మీలో చేరానని చెబుతోంది కాశీష్. విద్యా నేపథ్యం..పూణేలోని సావిత్రిబాయి ఫులే విశ్వవిద్యాలయం నుంచి బయోటెక్నాలజీలో ఇంటిగ్రేటడ్ మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది. అలాగే బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో థీసిస్ పూర్తి చేసి, హార్వర్డ్ విశ్వవిద్యాయలంలో పీహెచ్డీ చేసే ఛాన్స్ కొట్టింది కూడా. కానీ సైన్యంలో చేరాలనే ఉద్దేశ్యంతో ఆ ఆఫర్ని తిరస్కరించినట్లు కాశీష్ వెల్లడించింది. రెండేళ్ల క్రితమే మిస్ ఇంటర్నేషనల్ ఇండియాగా కిరీటం కైవసం చేసుకున్న తాను మోడలింగ్, నటన వైపుకు వచ్చేలా పలు ఆఫర్లు వచ్చాయని, కానీ తాను ఆర్మీ రంగాన్ని ఎంచుకోవాలనే ఆలోచన మనసులో ఉండటంతో వెళ్లలేదని చెప్పుకొచ్చింది. అంతేగాదు ఇటీవల ఆపరేషన్ సిందూర్లో కీలకపాత్ర పోషించిందామె. ఆ సమయంలో ఆమె ఎయిర్ డిఫెన్స్ విభాగంలో సేవలందించింది. ఇక కాశీష్ తండ్రి మాజీ శాస్త్రవేత్త. ప్రస్తుతం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ (DGQA)లో డిఫెన్స్ సివిలియన్గా చేరారు. ఆమె తల్లి ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఉపాధ్యాయురాలు. తన కుటుంబానికి ఎలాంటి ఆర్మీ నేపథ్యం లేకపోయినా తన నిర్ణయానికి మద్దతిచ్చారని అంటోంది కాశీష్. ఇక ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ శిక్షణలో అత్యున్నత మెరిట్ని అందుకుని ప్రతిష్టాత్మకమైన ఏఏడీ మెడల్, సిఖ్ లి రెజిమెంట్ మెడల్, షూట్ డ్రిల్, డిసిప్లీన్ బ్యాడ్జ్, కమాండెంట్స్ పెన్ వంటి విశిష్ట పురస్కారాలను అందుకుంది. ప్రస్తుతం బెటాలియన్ అండర్ ఆఫీసర్గా, అకాడమీ అండర్ ఆఫీసర్గా సారథ్యం వహించనుంది. ఇక కాశీష్ బహుముఖ ప్రజ్ఞాశాలి కూడా. బాస్కెట్బాల్, వాలీబాల్, హ్యాండ్బాల్లో కూడా అకాడమీకి ప్రాతినిధ్యం వహించింది. ప్రతిభను చాటడమే కాకుండా, ప్రధాన ఈవెంట్లకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించిందామె. (చదవండి: టీ బ్రేక్' అలా మన లైఫ్లో భాగమైంది..!) -
'టీ బ్రేక్' ఎలా వచ్చిందో తెలుసా..!
సంస్కృతి పరంగా ఎన్నో రకాల గొప్పతనాన్ని కలిగి ఉన్న మన నగరం, చక్కని చిక్కని చాయ్ సంస్కృతికి కూడా ప్రసిద్ధి చెందింది. నగర రోజువారీ జీవితంలో అంతర్భాగంగా మారింది. కాసిన్ని కబుర్లు కలబోసుకునే స్నేహితుల కోసం కావొచ్చు.. కాస్ట్లీ లావాదేవీలు నిర్వహించే కార్పొరేట్స్కి కావొచ్చు.. టీ బ్రేక్స్ ఉండాల్సిందే.. ఇంత బలంగా సిటీ లైఫ్లోకి చొచ్చుకుపోయిన చాయ్ పునాదులు కూడా అంతే బలమైనవి అంటోంది చరిత్ర. మొఘలుల కాలంలో, ఇది పాలకవర్గానికి చెందిన ఒక ఫ్యాషన్ పానీయంగా చరిత్రకారులు పేర్కొంటారు. ఈ ప్రాంతాన్ని శతాబ్దాల తరబడి పాలించిన నిజాంలు టీ తాగడాన్ని తాము ఆస్వాదించడంతో పాటు ప్రజలనూ ప్రోత్సహించారు. అదే చేత్తో వారు దక్షిణాదికి తీసుకువచ్చిన పర్షియన్ ప్రభావాలు టీ చుట్టూ ఒక అధునాతన మర్యాద వ్యవస్థను రూపొందించడంలో సహాయపడ్డాయి. పర్షియన్ టీ హౌస్ల స్ఫూర్తితో నగరంలో తొలిదశ ఇరానీ కేఫ్లను జొరాస్ట్రియన్ వలసదారులు ప్రారంభించారని చెబుతారు. ఇవి తొలినాళ్లలో కేవలం పురుషుల రాజకీయ చర్చలకే పరిమితమై ఉండేవట.ఏదేమైనా నేడు అది ఒక అందమైన శక్తివంతమైన చాయ్ కల్చర్గా నగరంలో స్థిరపడింది. ప్రస్తుతం నగరంలో చాయ్ ఒక పానీయం మాత్రమే కాదు.. ఉల్లాసమైన సంభాషణలతో స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన సామాజిక అనుభవం కూడా. టీ సంస్కృతి నగరంలో వరి్థల్లడానికి బాటలు వేసిన వాటిలో ఇరానీ కేఫ్స్దే ప్రధాన పాత్ర కాగా మిగిలినవి కూడా తమవంతు పాత్ర పోషించాయి.రుచికరమైన వంటకాలతో పాటు చాలా చరిత్ర కలిగిన అత్యంత ప్రజాదరణ పొందాయి ఇరానీ కేఫ్లు ‘ఇరానీ చాయ్’ సహా వివిధ రకాల టీలను ఇవి అందిస్తాయి.స్నేహపూర్వక చాయ్ వాలాలు నిర్వహించే స్ట్రీట్ చాయ్ స్టాల్స్ కూడా సిటీలో టీ కల్చర్కు తమవంతు బలాన్ని అందించాయి. తక్కువ, సరసమైన ధరలకు పొగలు వచ్చే ఛాయ్లను ఇవి అందిస్తాయి.ఇటీవల వినూత్న మిశ్రమాలు ఫ్యూజన్ పానీయాలను అందించే ఆధునిక కేఫ్ సంస్కృతిని సైతం నగరం స్వీకరిస్తోంది. చాయ్ పాయింట్, చాయ్ షాయ్ మసాలా, చాయ్ లాట్టే, ఐస్డ్ చాయ్ వంటివి విభిన్న రుచులతో ప్రయోగాలు చేసే యువతను ఆహా్వనిస్తున్నాయి. సిటీలో చాయ్ వ్యాపారం ఒక భారీ పరిశ్రమగా మారింది. అనేక మంది వ్యవస్థాపకులు తమ సొంత టీ బ్రాండ్లు కేఫ్లను ప్రారంభించారు. చాయ్ సబ్స్క్రిప్షన్ సేవలను ప్రారంభించి, తాజా మిశ్రమ టీలను వినియోగదారుల ఇంటికే అందించే వారు కూడా ఉన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న తరాన్ని చేరుకోవడానికి ఆన్లైన్లో చాయ్ని ఆర్డర్ చేసే యాప్లు ప్లాట్ఫారమ్లు కూడా ఉద్భవించాయి. చాయ్ రుచి కోసం ఎక్కువ మంది వినియోగిస్తుండగా, ఆరోగ్యం కోసం కూడా కొందరు ఎంచుకుంటున్నారు. దీని తయారీలో అల్లం ఏలకులు మిరియాలు తదితర సుగంధ ద్రవ్యాలు సైతం మేళవిస్తూ ఆరోగ్యార్థులను ఆకట్టుకుంటున్నారు.నగరంలో చాయ్ మాత్రమే కాదు దానికి తోడుగా తీసుకునే సైడ్ డిష్లూ అంతే ఫేమస్. తేలికపాటి తీపి, ఉప్పదనాల కలయికగా ఉండే ఉస్మానియా బిస్కెట్లు ఇరానీ చాయ్తో శతాబ్దాలుగా జట్టు కట్టాయి. అలాగే టీతో జత కట్టడంలో ఖారా బిస్కెట్స్ కూడా వీటితో పోటీపడుతున్నాయి. మరోవైపు మసాలా దినుసులతో నిండిన త్రిభుజాకారపు పట్టి సమోసా కూడా క్లాసిక్ కాంబినేషన్స్లో ఒకటిగా కొనసాగుతోంది. ఉల్లి సమోసాలతో పాటు ఇప్పుడు పోహా సమోసా దాకా భిన్న రకాలు వచ్చేశాయి. మలైబన్, బన్మస్కా వంటి బన్స్ క్లాసిక్ ఆధునిక కేఫ్లు అందించే ఇరానీ చాయ్కి ప్రసిద్ధ అనుబంధంగా పేరొందాయి.కేఫ్ నీలోఫర్: నగరంలోని అత్యంత ప్రసిద్ధ ఐకానిక్ టీ హౌస్లలో ఒకటి, ఇది ఒక సాధారణ స్టాల్ నుంచి బహుళ అవుట్లెట్ బ్రాండ్గా విస్తరించింది. మార్చి 2025లో, ఇది రాయదుర్గంలో 40,000 చదరపు అడుగుల దేశంలోనే అతిపెద్ద కేఫ్ను ఏర్పాటు చేసింది.చార్మినార్ సమీపంలో ఉన్న నిమ్రా కేఫ్ బేకరీ, తాజా బిస్కెట్లు స్ట్రాంగ్ చాయ్లతో స్థానికులతో పాటు పర్యాటకులనూ స్వాగతిస్తుంది.జూబ్లీహిల్స్లోని చాయ్ పానీ కేఫ్ భిన్న రకాల చాయ్ వెరైటీలకు పేరొందింది. ఇది చాయ్తో పాటు వైవిధ్యభరిత రెట్రో వాతావరణాన్ని అందించే ప్లేస్. దీని అల్లం టీ బాగా ఫేమస్..బ్లూ సీ: సికింద్రాబాద్లో పేరొందిన ఇరానీ చాయ్ సెంటర్ ఇది. టీతో పాటు ఎగ్ పఫ్లు, దిల్ఖుష్(తీపి బన్)లకు ప్రసిద్ధి.రోస్ట్ సిసికె: బంజారాహిల్స్లోని ఈ కేఫ్ వివిధ రకాల బేకరీ ఉత్పత్తులను అందిస్తుంది. ఇక్కడి మసాలా చాయ్కి ఫ్యాన్స్ ఉన్నారు.కాఫీ సంగమ్: 90ల నాటి క్లాసిక్ తెలుగు స్నాక్స్ను తిరిగి గుర్తు చేసే కేఫ్, కడక్ చాయ్తో పాటు పామ్ షుగర్ బన్ శాండ్విచ్లు వంటి ప్రత్యేకమైన కాంబినేషన్కు పేరొందింది.అబిడ్స్లో 1935లో ఏర్పాటైన గ్రాండ్ హోటల్ సిసలైన హైదరాబాదీ చాయ్ను అందిస్తుంది. సోమాజిగూడలోని రెడ్ రోజ్ రెస్టారెంట్ విద్యార్థులు యువతను ఆకట్టుకుంటుంది. ఇన్స్ట్రాగామ్లో సైతం ఈ కేఫ్ యాక్టివ్గా ఉండటం విశేషం.అఫ్జల్గంజ్లోని గ్రాండ్ ఓవెన్ బేకరీ/ కేఫ్ గ్రాండ్ ఓవెన్ అనేది ఇరానీ కేఫ్ ఆధునిక కేఫ్ సంస్కృతుల మేళవింపుగా టేస్టీ చాయ్లకు పేరొందింది. -
మధుమేహంతో బాధపడేవాళ్లు పాదాల సంరక్షణ కోసం..!
డయాబెటిస్ పేషెంట్లలో కాలికి దెబ్బతగిలి, అది సెప్టిక్ కావడంతో కాలు తొలగించాల్సి వచ్చిందని వింటుండటం మామూలే. ఇలా కాలు సెప్టిక్ కావడాన్ని వైద్య పరిభాషలో గ్యాంగ్రీన్ అంటారు. డయాబెటిస్ ఉన్నవారికి కాళ్లకూ, వేళ్లకూ చివర్లలో ఉన్న నరాలు మొద్దుబారుతుండటం సాధారణం. దాంతో వాళ్లకు చిన్న చిన్న దెబ్బలు తగిలినా నొప్పి తెలియదు. కొందరిలోనైతే చిన్న చిన్న గులకరాళ్లు గుచ్చుకున్నా కాలికి గ్యాంగ్రీన్ వచ్చే వరకు విషయం తెలియదు. తీరా పరిస్థితి విషమించాక వారు తమ ఫిజీషియన్ దగ్గరకు రావడం, వాళ్లు వ్యాస్క్యులార్ సర్జన్ దగ్గరికి పంపితే కాలు తొలగించాల్సిన పరిస్థితి అని చెప్పడం చాలామందికి ఎదురయ్యే పరిస్థితే! ఈ పరిస్థితి నివారించడానికి ఏం చేయాలో తెలిపే కథనమిది.డయాబెటిస్తో బాధపడే వ్యక్తుల్లో కాలికి ఏదైనా దెబ్బతగిలి అది గ్యాంగ్రీన్గా మారిన దాదాపు 80% మందిలో కాలు తొలగించాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. ఇలా కాలు తొలగించడాన్ని వైద్యపరిభాషలో ‘నాన్ట్రామాటిక్ లోయర్ లింబ్ యాంపుటేషన్’గా చెబుతారు. పల్లె వాసుల్లో కాలు తొలగింపు ముప్పు... నిజానికి పట్టణవాసులతో పోలిస్తే డయాబెటిస్ కారణంగా కాలు తొలగింపు ముప్పు పల్లెప్రజల్లోనే ఎక్కువగా ఉంటుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అవి... పల్లెల్లోని రక్కిస పొదలతో నిండి ఉండే డొంకదారుల్లో నడుస్తున్నప్పుడు కాలికి ముళ్లు గుచ్చుకోవడం లేదా ముళ్ల కంచెకు కాలు తగిలి చీరుకుపోవడంతో గాయాలు కావడం పట్టణ ప్రజలతో పోలిస్తే చెప్పుల్లేకుండా ఖాళీ పాదాలతో నడిచేవారు పల్లెల్లోనే ఎక్కువగా ఉండటం. దాంతో పాదం కింద చిన్న చిన్న గులకరాళ్లు గుచ్చుకోవడం లేదా కాలివేళ్లకు తాకుడు రాయి తలగడం ఎక్కువ పశువులను మేతకు విడుస్తున్నప్పుడు అవి పొరబాటున కాలు తొక్కడంతో గాయం కావడం వ్యవసాయ పనుల్లో కొడవలి వంటి పదునైన పనిముట్లు తగిలి గాయం కావడం ∙డొంకదారులను పశువులు నడవడానికి వీలుగా కంప కొడుతున్నప్పుడు... అది గీరుకుపోవడం... పత్తి పంట కోశాక... ఎండిన మొదళ్లపైన పొరబాటున కాలు పడ్డప్పుడు... అవి పాదాల్లో గుచ్చుకుపోవడం.ఇప్పుడు పట్టణ / నగరా ప్రాంతాల్లోనూ... ఇలాంటి ప్రమాదాలకు పల్లెల్లో అవకాశాలు ఎక్కువ. అయితే ఇటీవల పట్టణ ప్రాంతాల్లోనూ ఈ తరహా కేసులు పెరుగుతున్నాయి. డిజైనర్ వేర్ పాదరక్షలు ధరించేవారిలో, ఎప్పుడూ కదలకుండా పనిచేస్తూ ఉండే ఐటీ రంగాలకు చెందిన ఉద్యోగుల్లో, ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో ఆరుబయట నిర్వహించే ప్రత్యేక పూజలూ / ప్రార్థనల్లో భాగంగా చెప్పులు లేకుండా నడవటం వంటి సందర్భాల్లో పాదాలకు గాయాలు కావడంతో ఇప్పుడు పట్టణ, నగరవాసుల్లో కూడా ఈ తరహా గాయాలు అవుతున్నాయి. అవి పల్లెవాసులకైనా లేదా పట్టణ ప్రాంతాలవారికైనా వాళ్ల కాళ్లకు అయ్యే గాయాలు ‘ఫుట్ అల్సర్’ అని పిలిచే పుండ్లుగా మారి కాలు దాదాపుగా గ్యాంగ్రీన్గా మారినప్పుడు కొందరిలో కాలిని తొలగించాల్సి వచ్చే ‘యాంపుటేషన్’ తప్పకపోవచ్చు. కాలు తొలగించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే..? సాధారణంగా కాలికి గానీ ఇతరత్రా ఏ అవయవానికైనా గాయమైతే వెంటనే నొప్పి వస్తుంది. గాయమైనప్పుడు ఆ భాగం పూర్తిగా కోలుకోవడానికి వీలుగా మనలోని రక్షణ వ్యవస్థ ఆ భాగంలో ‘నొప్పి’ని కలిగిస్తుంది. దాంతో మనం కాలిని కదిలించకుండా దానికి తగినంత విశ్రాంతినిస్తాం. అయితే డయాబెటిస్తో బాధపడే వ్యక్తుల్లో నొప్పిని తెలిపే ‘నరాలు’ మొద్దుబారి ఉండటంతో నొప్పి పెద్దగా తెలియదు. దాంతో అదే కాలిని ఉపయోగిస్తున్నప్పుడు తగిలిన చోటే మళ్లీ మళ్లీ దెబ్బ తగులుతూ గాయం మాటిమాటికీ రేగుతుంది. అప్పుడా ఇన్ఫెక్షన్ దెబ్బతగిలిన చోటి నుంచి పైపైకి ΄ాకవచ్చు. ఇలా జరగడాన్ని వాడుక భాషలో మనం సెప్టిక్ కావడం అంటుంటాం.గాయం ఒక ముప్పు అయితే గ్యాంగ్రీన్ మరో ముప్పు... మన దేహంలోని ప్రతి అవయవానికీ, అందులోని ప్రతి కణానికీ నిత్యం రక్తసరఫరా జరుగుతూ ఉంటుంది. అలాగే దేహంలోని ప్రతి భాగానికీ స్పర్శ తెలిపే నరాలూ ఆవరించుకుని ఉంటాయి. వాటి వల్ల మనకు స్పర్శజ్ఞానంతో ΄ాటు దెబ్బతగిలినప్పుడు నొప్పి, బాధ తెలుస్తుంటాయి. కాలక్రమంలో డయాబెటిస్ వ్యాధి నరాల చివరలను మొద్దుబారేలా చేయడం వల్ల దేహంలోని కొన్ని భాగాలు... మరీ ముఖ్యంగా కాలివేలి చివర్లలో స్పర్శజ్ఞానం అంతగా తెలియదు. పైగా దేహంలోని చివరి భాగాలకు రక్తం సరఫరా చేసే అతి సన్నటి రక్తనాళాల్లో (క్యాపిల్లరీస్) అడ్డంకులు ఏర్పడటం వల్ల అక్కడికి అందాల్సిన షకాలు, ఆక్సిజన్ అందక΄ోవడంతో ఆ భాగం కుళ్లి΄ోవడం మొదలవుతుంది. ఇలా జరగడాన్ని ‘గ్యాంగ్రీన్’గా చెబుతారు. స్పర్శజ్ఞానం, నొప్పి తెలియక΄ోవడంతో గ్యాంగ్రీన్ మొదలైనప్పటికీ ఆ విషయమే డయాబెటిస్ బాధితులకు వెంటనే తెలియదు. అలా ఇన్ఫెక్షన్ పైపైకి పాకుతూ పోతుంటే మొత్తం ప్రాణానికే ప్రాణాపాయం జరిగే అవకాశముంటుంది కాబట్టి గ్యాంగ్రీన్ ఎంతవరకు పాకిందో అక్కడి వరకు ఆ కుళ్లిన భాగాన్ని తొలగించాలంటూ (యాంపూట్ చేయాలంటూ) డాక్టర్లు చె΄్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.ప్రమాదం కేవలం కాళ్లకేనా..? ఇలా యాంపూటేషన్ చేయాల్సిన పరిస్థితి కేవలం కాళ్లకు మాత్రమే కాకుండా చేతులకూ వచ్చే ప్రమాదముంది అయితే కాళ్లతో ΄ోలిస్తే చేతులూ, చేతి వేళ్లతో మనం ప్రతినిత్యం పనిచేస్తుంటాం కాబట్టి... చేతులకు అలాంటి కండిషన్ వస్తే కాళ్లతో ΄ోలిస్తే త్వరగా తెలిసి΄ోతుంది. అందుకే చేతులతో ΄ోలిస్తే కాళ్లు, కాలివేళ్లకే గ్యాంగ్రీన్ ముప్పు మరింత ఎక్కువ.మరో జాగ్రత్త ‘యాంకిల్ బ్రేకిల్ ఇండెక్స్’ పరీక్ష...ఏడాదికోసారి లేదా డాక్టర్లు చెప్పిన విధంగా పాదాల విషయంలో వైద్యులను కలిసి పాదాలకు పల్స్ చెక్ చేయించుకుంటూ ఉండాలి. చేతుల మణికట్టు దగ్గర చూసినట్టే... డాక్టర్లు కాలి దగ్గర కూడా పల్స్ చెక్ చేసి చూస్తారు. అక్కడ నాడీస్పందనలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తారు. అలాగే యాంకిల్ బ్రేకిల్ ఇండెక్స్ అని మరో పరీక్ష ఉంటుంది. ఇందులో బీపీ పరిశీలించేటప్పుడు చేతికి చుట్టినట్టే కాలి దగ్గర కూడా బీపీ పరిశీలించేప్పుడు చుట్టే పట్టాచుట్టి ఈ పరీక్ష చేసి, కాలిలో బీపీ కొలత చూస్తారు. కొలత విలువ ‘ఒకటి (1)’ ఉంటే అంతగా ఆందోళన పడాల్సిందేమీ ఉండదు. కానీ ఈ కొలత 0.5 కంటే తగ్గుతూ ΄ోతూ ఉంటే (అంటే ఆ విలువలో సగానికంటే తక్కువగా ఉంటే... చేతితో ΄ోలిస్తే అందులో సగం కంటే తక్కువగా ఉంటే) కాలిలో రక్త ప్రసరణ తగ్గుతూ ఉందని అర్థం. ఇలాంటప్పుడు ‘సూపర్వైజ్డ్ ఎక్సర్సైజ్ థెరపీ’లాంటి వ్యాయామాల చికిత్స తప్పక అవసరమని గుర్తించాలి. చివరగా... డయాబెటిక్ ఫుట్ సమస్యలో సాదానికి పుండ్లు పడ్డప్పుడు అది కేవలం వాస్క్యులార్ సర్జన్ మాత్రమే కాకుండా ఒక సమగ్రమైన కార్యాచరణతో పలువురు నిపుణులు ఓ బృందంగా ఏర్పడి చికిత్స అందించాల్సి అవసరం ఉంటుంది. ఇందులో వాస్క్యులార్ సర్జన్లు, ΄ప్లాస్టిక్ సర్జన్లు, డయాబెటాలజిస్టులు, ఫుట్ యాంకిల్ సర్జన్లు, పాడియాట్రిక్ నిపుణులు, ఇంటర్నల్ మెడిసిన్ చికిత్సకులు, ఫిజియోథెరపిస్టులు ఇలా టీమ్వర్క్తో డయాబెటిక్ లింబ్ సాల్వేజ్ టీమ్గా ఏర్పడి పాదాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తారు. ఆ తర్వాత ఆహారంలో చక్కెర మోతాదులను తగ్గించే విధంగా న్యూట్రిషనిస్టులు, రక్తంలో చక్కెరను అదుపు చేయడానికీ, రక్తంలో కొవ్వులు తగ్గించే మందులిచ్చే జనరల్ ఫిజీషియన్లు... ఇలా డాక్టర్ల బృందమంతా సమగ్రంగా పనిచేయాల్సి ఉంటుంది.ఎవరికి వారు కాళ్లను స్వయంగా పరీక్షించుకుంటూ ఉండాలి. ఇందుకోసం పాదాల కింద అద్దంపెట్టుకుని, పాదాల అడుగుభాగం ఎలా ఉందో చూసుకుంటూ ఉండాలి. అలాగే కాలి పైభాగాన్ని కూడా శ్రద్ధగా పరిశీంచుకోవాలి. కాలి వేళ్ల మధ్య భాగాలనూ జాగ్రత్తగా చూస్తూ... అక్కడ చిన్న పోక్కుల్లాంటివి ఏవైనా ఉన్నాయేమో చూడాలి. అలాంటివి ఉంటే వెంటనే డాక్టర్కు తెల΄ాలి. లేదంటే అవి పుండ్లుగా మారే ప్రమాదం ఉండవచ్చు.కాలిగోళ్లను ప్రతివారమూ కట్ చేసుకోవాలి. ఈ సమయంలో గోళ్లను మరీ లోపలికి కట్ చేసుకోకూడదు. అలాంటప్పుడు ఒక్కోసారి గోరు మూలల్లో రక్తం వచ్చేంతగా గోరు కట్ కావచ్చు. ఇది జరిగినప్పుడు కొందరిలో గోరు లోపలి వైపునకు పెరగవచ్చు. డయాబెటిస్ బాధితుల్లో ఇది చాలా ప్రమాదకరం.వేడి వస్తువులనుంచి కాళ్లను దూరంగా ఉంచుకోవాలి.పాదాలను మృదువుగా ఉంచుకోవాలి. ఇందుకోసం కాళ్లు కడుక్కున్న తర్వాత పొడిగా తుడుచుకొని, ఆ తర్వాత వాజిలైన్ రుద్దుకొని, మళ్లీ ఆ తర్వాత పొడిగా మారేంతవరకు తుడుచుకోవాలి.పాదాలను ప్రతినిత్యం పొడిగా ఉంచుకోవాలి. కాళ్లు కడుక్కున్న వెంటనే అవి పొడిబారే వరకు తుడుచుకోవాలి. కాలి వేళ్ల మధ్య పొడిగా ఉండటం కోసం పౌడర్ రాసుకోవాలి.కాలికి చెప్పులు, బూట్లు లేకుండా నడవకూడదు. అయితే ఈ చెప్పులు, బూట్లు కాలికి సౌకర్యంగా ఉండాలి. ఏమాత్రం అసౌకర్యం ఉన్నా అలాంటివి తొడగడం సరికాదు.కాళ్ల మీద పులిపిరి కాయల్లాంటివి ఏవైనా ఏర్పడితే డాక్టర్ను సంప్రదించి, వారి పర్యవేక్షణలోనే వాటిని తొలగించుకోవాలి. లేదంటే అవే భవిష్యత్తులో పుండ్లుగా మారే అవకాశం లేకపోలేదు.ఇంట్లో కూడా పాదరక్షలు లేకుండా నడవకూడదు. ప్రత్యేకంగా తడి, తేమలో పనిచేసే మహిళలు (పురుషులు కూడా) స్లిప్పర్స్ వంటివి తొడుక్కునే పనిచేసుకోవాలి.మానని పుండ్లకు చికిత్స ఇలా... కాలిపైన పుండుగానీ లేదా చాలాకాలం వరకు మానని గాయం గానీ ఉంటే వెంటనే డాక్టర్కు చూపించుకోవాలి. ఇలా ఎంత త్వరగా డాక్టర్కు చూపిస్తే కాలిని కాపాడుకునే అవకాశాలు అంత ఎక్కువని గుర్తుంచుకోవాలి. యాంకిల్ బ్రేకిల్ ఇండెక్స్ పరీక్షలో కాలి నాడీ స్పందనల కొలత 0.5 కు లేదా అంతకంటే తగ్గుతున్నప్పుడు ‘సూపర్వైజ్డ్ ఎక్సర్సైజ్ థెరపీ’ కింది రోజుకు అరగంటకు తగ్గకుండా, అది కూడా వారంలో ఐదు రోజులకు తగ్గకుండా బ్రిస్క్వాకింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. దీనివల్ల యాంజియోగ్రామ్కు మించిన ఫలితం ఉంటుందని చాలా పరిశోధనల్లో నిర్ధారణ అయ్యింది ఇలా యాంకిల్ బ్రేకిల్ ఇండెక్స్ పరీక్షలో కొలత 0.5 కంటే తగ్గుతున్నవారిలో ప్రోటీన్తో కూడిన ఆహారాలూ, ద్రవాహారాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల రక్తప్రసరణ వేగం పెరగడం వల్ల కాలికి జరగాల్సిన నష్టం నివారితమవుతుంది కాలిలో రక్తప్రసరణ వేగాలు తగ్గుతున్నాయని గుర్తించిన తొలి దశల్లో రక్తాన్ని పలచబార్చేవీ, కాలిలో రక్తప్రసరణవేగాన్ని మెరుగుపరిచేవి కొన్ని రకాల మందులతో మున్ముందు రాబోయే కాలి తొలగింపు ముప్పును నివారించవచ్చు అత్యాధునిక టీసీపీఓటూ (క్యూటేనియస్ ఆక్సిజన్ మెజర్మెంట్) పరీక్షతో అతి సన్నటి రక్తనాళాల (క్యాపిల్లరీస్) ద్వారా కాలి కొనగోరు చివరల వరకూ ఆక్సిజన్ అందుతున్న తీరును పరిశీలించి ఒకవేళ అందక΄ోతే ఇవ్వాల్సిన చికిత్సను డాక్టర్లు నిర్ణయిస్తారు. ఇలాంటి కొన్ని సందర్భాల్లో రక్తం అందడం లేదు / పుండు పడి మానడం లేదని తెలిస్తే మొదట ‘యాంజియోగ్రామ్’ ప్రక్రియ ద్వారా రక్తప్రసరణను మెరుగుపరచవచ్చు. అప్పటికీ రక్తప్రసరణ మెరుగుపడటక΄ోతే ‘బైపాస్’ వంటి కొన్ని ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. అదీ కుదరకపోతే ‘వీనస్ ఆర్టీరియలైజేషన్’ ప్రక్రియ అనే మరో ప్రత్యామ్నాయం అందుబాటులో ఉంది. అంటే ఇందులో సిరలూ, ధమనులను కలిపి... కొనగోరు చివరి వరకూ రక్తప్రసరణ సరిగా జరిగేలా చూస్తారు ∙గాయానికి చికిత్సను ఎంత త్వరగా అందిస్తే అది అంత త్వరగా మానుతుంది. పుండు మానకుండా మరింత ఆలస్యమయ్యేకొద్దీ అది గ్యాంగ్రీన్గా మారే అవకాశాలెక్కువ. ఇలా డాక్టరుకు గాయాన్ని చూపించడం ఆలస్యమైనవాళ్లలో డాక్టర్లు ‘స్టెమ్ సెల్ థెరపీ’ వంటి అత్యాధునిక ప్రక్రియలతో కాలిని కాపాడే అవకాశం ఉంది.డాక్టర్ కార్తీక్ మిక్కినేని, సీనియర్ వాస్క్యులార్ సర్జన్ (చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో ఆస్పిరన్ మందులు వాడొచ్చా..? బిడ్డకు సురక్షితమేనా?) -
ఈ వారం కథ: హృదయ స్పర్శ
‘థాంక్యూ మేడం..! ఐ లవ్ యు మేడం..!!’ కృతజ్ఞతా ప్రేమపూర్వకంగా చెప్పాడు రాజేష్.‘ఇట్స్ ఓకే..!... బట్ లవ్..?! నా కౌన్సెలింగ్తో పూర్తిగా నయమయ్యావు కదా! ఇక జాగ్రత్తగా జీవితాన్ని గడుపు. లవ్ అంటూ మరో మానసిక రోగివి కాకు! సీరియస్గా హితవు చెప్పింది సైకాలజిస్ట్ కోమలి.‘సారీ మేడం..! నా ఉద్దేశం అది కాదు..! అదీ..!’... సంజాయిషీ ఇచ్చుకోబోతుండగా...‘స్టాప్ నాన్సె¯Œ ్స... సారీ ఒకటి..! ఒక అమ్మాయి నాలుగు రోజులు మంచిగా మాట్లాడితే అడ్వాంటేజ్గా తీసుకొని ‘లవ్’... ఆ తర్వాత ఇంకోటి అంటూ వచ్చే మగాళ్ళ తీరు అసహ్యం వేస్తుంది. వృత్తిరీత్యా సన్నిహితంగా ఉంటే, ఈ విధంగా వచ్చే వారి పట్ల ఏ విధంగా ఉండాలో నాకు బాగా తెలుసు. ‘లవ్’ అనే పేరుతో ట్రాప్ చేయాలనుకునే మనస్తత్వం గలవాళ్లను ఒక కౌన్సెలర్గా దూరం పెట్టడమూ తెలుసు.కుదుటపడిన ఆరోగ్యంతో మంచిగా బతుకు. నా ట్రీట్మెంట్ పూర్తయింది. ఇంకెప్పుడూ ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. బై!’ అంటూ ఫోన్ పెట్టేసింది కోమలి. ఏదో చెబుదామనుకొని మళ్లీ కాల్ చేయాలని చూస్తే, ఎంతకూ కలవకపోవడంతో తనను బ్లాక్ చేసిందని అర్థమైంది రాజేష్కి.‘ఏమిటి..? ఈ రోజు మూడీగా ఉన్నావు. ఏమైంది..? ఏమంటున్నారు మీ పేషెంట్లు?’ఏదో ఆలోచనలో పరధ్యానంగా ఉన్న కోమలిని అడిగాడు ప్రదీప్.‘ఆ... ఏమీ లేదు లెండి..! కొందరు మగవాళ్లకు తిక్క ఎక్కువైంది. ఎవరైనా అమ్మాయి నాలుగు రోజులు మంచిగా మాట్లాడితే చాలు వాళ్ళ పైత్యం చూపిస్తున్నారు. రాజేష్ చెప్పిన విషయం ప్రదీప్కి చెప్పింది. ఈ అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రదీప్ వెంటనే స్పందిస్తూ, నువ్వు అందరినీ సమదృష్టితో చూడాలని, కౌన్సెలింగ్పరంగా వారికి దగ్గరవుతావు కదా! ఇలాంటివి వస్తూ ఉంటాయి. అంతకుముందు నీ కౌన్సెలింగ్ తీసుకున్న రాజీవ్, చక్రి, సురేష్.. వీళ్లంతా చివరకు లవ్ ప్రపోజల్ తెచ్చారు కదా! ఇప్పుడు అదే జాబితాలో రాజేష్ చేరాడేమో!? అవునూ! నీ పేషెంట్లను కొందరిని వాయిస్ కాల్లో, మరికొందరిని వీడియో కాల్లో కౌన్సెలింగ్ చేస్తావెందుకని?’ చికిత్స విధానం గురించి ఆరా తీశాడు ప్రదీప్.‘నేను చేసేది మానసిక చికిత్స. అది కూడా కౌన్సెలింగ్ మాత్రమే! వారి మానసిక పరిస్థితిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఎంచుకుంటాను. సమస్య పరిష్కారం కావాలి’ తను ప్రత్యేకంగా ఉపయోగించే చికిత్స విధానాన్ని చెప్పింది కోమలి.‘నీ కౌన్సెలింగ్ ఏమో గాని, చివరకు నాకు దక్కకుండా పోతావా ఏంది?’ నవ్వుతూ చురకేశాడు ప్రదీప్.‘నో.. నెవర్..! అంత సీన్ లేదు. ఆ పరిస్థితి నాకు రాదు. ఈ ప్రదీప్కి కాకుండా ఇంకెవరికీ నో చా ఎటాల్! అవతలి వాళ్ళ ఆటిట్యూడ్ ప్రకారం నేను వెళ్తుంటాను. వృత్తిరీత్యా ఇవన్నీ తప్పవండీ..!’‘కొందరికి కౌన్సెలింగ్ ఫీజు కూడా లేకుండా ఉచితంగా సర్వీస్ చేస్తావెందుకని?’‘ఏమండీ..! చెదిరిన వాళ్ల జీవితాలు చక్కబడితే, మానసిక వేదన, ఒత్తిడి నుంచి బయటపడి సాధారణ జీవితంలోకి వస్తే, అంతే చాలు. అదే వెలకట్టలేని ఫీజు. అది కూడా వాళ్ల స్థాయిని బట్టి పోతుంటాను. కొందరికి ఉచితం తప్పదు. అయినా నా రీసెర్చ్ పని కోసం రెండు సంవత్సరాల పాటు కౌన్సెలింగ్ ప్రాక్టీస్కి ఫుల్స్టాప్ పెడుతున్నాను’ అంటూ తన రూమ్లోకి వెళ్లి రీసెర్చ్ బుక్ ముందరేసుకుంది కోమలి.కోమలి.. పేరుకు తగ్గట్టుగానే కోమలంగా ఉంటుంది. మూడేళ్ల కిందట దంపతులైన ప్రదీప్, కోమలి ఇద్దరూ వారి వారి వృత్తులలో బిజీగా ఉంటున్నారు. ప్రదీప్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండగా, కౌన్సెలర్గా ఆన్లైన్లో కావాల్సిన వారికి కౌన్సెలింగ్ ఇస్తుంది కోమలి. ఆమె మాట తీయదనం, సమస్యల పరిష్కార దిశలో ఓ అమ్మలా లాలించడం, సాంత్వన చేకూర్చడంతో మానసికతత్త్వ వికాస నిపుణురాలిగా మంచిపేరు తెచ్చుకొని ఎందరికో నూతన జీవితాలను అందించింది. కాని ‘లవ్’ పేరుతో కొందరి ప్రవర్తనతో విసిగివేసారింది. ఆ మాట అంటేనే హృదయం భగ్గుమంటుంది. లవ్ అంటూ శారీరక వాంఛతో దానిని పూర్తి చేసుకోవాలనుకునే వారిని తప్పిస్తూ, తన వృత్తిని కొత్త చాలెంజ్గా ఎదుర్కొంటూ మంచి కౌన్సెలర్గా రాణిస్తుంది కోమలి. వ్యక్తిగతంగా లవ్ విషయంలో తన జీవితంలో జరిగిన అనేక చేదు అనుభవాలు, మానసిక అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఒక సైకాలజిస్ట్గా తన మనసును దిటవుపరచుకొని, ఇక ‘లవ్’ని దరిచేరనీయకుండా స్ట్రాటజీస్ ఉపయోగించుకుంటూ వృత్తిని విజయవంతంగా కొనసాగిస్తోంది.‘ఏవండీ..! ఈ అసోసియేషన్ వాళ్లు వాచ్మన్ను మార్చారా? కొన్ని రోజులుగా నాగయ్య, లక్ష్మి కనిపించడం లేదు’ అనుమానంగా అడిగింది కోమలి.‘ఆ.. అవును..! వాళ్లు వాళ్ల ఊరు వెళ్లిపోయారట! కొత్త వాచ్మన్ను పెట్టారు..చంద్రయ్య అట!’‘సర్లేండి..! వర్షం వస్తోంది. టాబ్లెట్స్ తేవాలి ఎలా? వాచ్మన్కి చెప్పనా?’‘చెప్పి చూడు కొత్తవాడు కదా! వీలుంటే తెస్తాడేమో!’ఇంటర్ కమ్ నొక్కి కబురు పంపగానే, పరుగు పరుగున రెండవ అంతస్తుకు చేరుకున్నాడు చంద్రయ్య.‘నువ్వేనా కొత్త వాచ్మన్వి? సార్ వర్క్ చేసుకుంటున్నారు. గొడుగేసుకుని వెళ్లి ఈ టాబ్లెట్స్ తెస్తావా?’ మృదువుగా అడిగింది కోమలి .‘అలాగే అమ్మగారూ..!’ పీల గొంతుతో, తలూపి ఆమె ఇచ్చిన ఖాళీ స్ట్రిప్, పైసలు తీసుకుని పది నిమిషాల్లో తిరిగొచ్చాడు చంద్రయ్య.తడిసి వచ్చిన చంద్రయ్యను చూసి‘అదేంటి..? గొడుగు వేసుకొని వెళ్లలేదా పూర్తిగా తడిసిపోయావు’‘గొడుగు లేదమ్మగారూ..!’‘అవును.. నీ పేరేమిటి అన్నావ్..?’‘చంద్రయ్య.. అమ్మగారు’ అంటూ మిగిలిన చిల్లర ఇవ్వబోతుండగా,..‘ఉంచుకో..! టీ తాగు..’ అంది‘వద్దమ్మగారు..’ అంటూ వణుకుతూ వెళుతున్న చంద్రయ్య వైపు జాలిగా చూసింది కోమలి.వర్క్ చేసుకుంటూ ఇదంతా గమనిస్తున్న ప్రదీప్‘తల్లీ..! అతనికేం కౌన్సెలింగ్ అవసరం ఉండదులే..! వదిలేయ్..! నీ మంచితనంతో చస్తున్నా..!’ సరదాగా నవ్వుతూ అన్నాడు ప్రదీప్.‘సహానుభూతి ఉండాలండీ..! మనకు సాయం చేసే వాళ్లకు కనీసం మంచి మాటైనా తిరిగి ఇవ్వకపోతే, మనం మనుషులమే కాదు’ తనలో పురివిప్పిన సైకాలజిస్ట్ మాటలకు చెప్పేదేమీ లేక ‘మరి.. అంతేగా.. అంతేగా..’ అనుకుంటూ తన పనిలో నిమగ్నమయ్యాడు ప్రదీప్.కాసేపటికి మళ్ళీ ఏదో గుర్తొచ్చి,‘ఇంకో విషయం.. ఈ వాచ్మన్కు భార్య లేదట! రెండేళ్ల కొడుకున్నాడు. వాడితోనే ఇక్కడికి వచ్చాడు. మరి పాత వాచ్మన్ భార్య నీకు అంట్లు, బట్టలు, ఇంటి పని ఆమెనే చేసేది కదా, ఇప్పుడెలా?’ అన్నాడు ప్రదీప్.పనిమనిషి సమస్య ఎప్పుడూ రావణకాష్టమే! ‘ఒకసారి చంద్రయ్యను అడిగి చూద్దాం! ఎవరినైనా కుదురుస్తాడేమో!’ అంది.ఇస్త్రీ బట్టలు పైకి తీసుకొచ్చి ఇవ్వడానికి వచ్చిన చంద్రయ్యను ఇదే విషయం అడిగింది.‘అమ్మా! మీకు అభ్యంతరం లేకపోతే, నేనే అంట్లు, బట్టలు, ఇంటి పని చేస్తాను. చిన్నోడి ఖర్చులకు వెళుతుంది కదమ్మా! మీరు ఎంత ఇచ్చినా పర్లేదు’ బావిలో నుంచి వచ్చినట్లుగా లో గొంతుకతో అన్నాడు.‘అవును..! మా ఇద్దరికీ టైం ఉండదు. ఎంతైనా పనిమనిషి లేనిది వెళ్లదు. ఇంటి పనిలో ఇతనిని పెట్టుకుంటే పదిమంది ఏమైనా అనుకుంటారా? కాని, అతని పిల్లాడి పోషణ ఖర్చుకు పనికొస్తుంది కదా! ఎవరేమైనా అనుకోనీ! అనుకున్న వాళ్లు ఏమీ చేయరు. నా ప్రదీప్ ఓకే అంటే చాలు’ అనుకుంటూ భర్తను ఒప్పించి, ఇంటి పని మొత్తాన్ని చంద్రయ్యకు అప్పగించింది కోమలి.అప్పటì æనుంచి చంద్రయ్య వాళ్ళ కుటుంబంలో ఒకడయ్యాడు. చిన్న పని నుంచి పెద్ద పని వరకు ఏ సమస్య వచ్చినా, అందరికన్నా ముందుండేది అతనే. వాచ్మన్గా డ్యూటీ చేస్తూనే, సమయాన్ని కుదుర్చుకుంటూ కార్ డ్రైవర్గా, సర్వెంట్గా, ప్రదీప్కు అన్నిట్లో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఏమీ ఆశించడు. కల్మషం లేని చిత్తశుద్ధి. మొదటిసారి చంద్రయ్యను నిశితంగా చూడాలనిపించింది కోమలికి. ముప్పయ్యేళ్ళు వుంటాయేమో! మాసిన గడ్డం.. తెల్లగా చెదిరిన మనసుకు అద్దంలా వున్నాడు. మంచి డ్రెస్ కూడా వేసుకోకుండా బేలగా ఓ పిల్లోడిలా కనిపించాడు.వారం రోజులుగా చంద్రయ్య ఇంటి వైపుకు రాకపోవడంతో ‘మీరు కిందికి వెళ్ళినప్పుడు, చంద్రయ్యను రమ్మనమని చెప్పండి’ భయాందోళనగానే అంది కోమలి.‘ఇంకెక్కడి చంద్రయ్య! పిల్లోడిని తీసుకొని తన ఊరెళ్ళాడట! ఆరోగ్యం దెబ్బతిందని అసోసియేషన్ వాళ్ళు చెప్పారు. మళ్ళీ మనకు మరో కొత్త వాచ్మన్.. అంతే!’చంద్రయ్య లేకపోవడంతో కోమలి మనసులో మనసు లేదు. ఏదో వెలితి ఆవరించినట్లయింది.‘ఏవండీ! మనకు ఇంత సర్వీస్ చేసిన చంద్రయ్యను వాళ్ల ఊరెళ్ళి ఒకసారి చూసొద్దాం అండీ’ బతిమాలింది కోమలి.‘ఏం చేస్తాం! కాదంటానా? నీ మాటే నా మాట. ఈ రోజే పోదాం పద’ కోమలి మాటను ఎప్పుడూ కాదనని ప్రదీప్– చంద్రయ్య ఊరు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అసోసియేషన్ వాళ్ళకు చంద్రయ్య ఇచ్చిన ఆధార్ కార్డు ఆధారంతో ఆ అడ్రస్తో ఆ ఊరికి చేరుకుని చంద్రయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి ఆరా తీయగా, ఇంట్లో వాళ్లు బయటకు వచ్చి‘చంద్రయ్య గొంతు వ్యాధితో నాలుగు రోజుల క్రితం చనిపోయాడు. మీరు కోమలి, ప్రదీప్ గారేనా?హైదరాబాద్ నుంచి వచ్చారా? మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తారని, చనిపోయే ముందురోజు మాకు చెప్పి ఈ ఉత్తరం మీకు ఇవ్వమన్నాడు’ అంటూ ఉత్తరాన్ని ఇచ్చారు.అప్పటికే ఆ విషాద వార్త విన్న కోమలి గుండె చెరువై బరువవుతుండగా, ఆ ఉత్తరాన్ని తీసి చదవడం ప్రారంభించింది.‘ఐ లవ్ యూ.. మేడం..!’ఈ పిలుపు మీకు ఎక్కడో తాకుతుంటుంది.. నేనమ్మా..! మీ పాత పేషెంట్ రాజేష్ చంద్రను. గుర్తొచ్చానా అమ్మా! ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నన్ను మీ కౌన్సెలింగ్తో బతికించి ఊపిరి పోశారు. అంతేకాదు ఓ నెలరోజుల పాటు ప్రతిరోజూ ఫోన్లో క్రమం తప్పకుండా వేసుకునే మందులను సూచించడం, చేయాల్సిన వ్యాయామం, మంచి మాటలు, జీవన నైపుణ్యాలు, మానవ సంబంధాలను ఓ అమ్మలా చెప్పారు. ఆ విధంగా నాకు మీరు పునర్జన్మనిస్తే, చాలాకాలం తర్వాత కడుపుతో ఉన్న నా భార్య సైకోగా, హిస్టీరిక్గా చేస్తుంటే, ఆమెకు కూడా కౌన్సెలింగ్ ఇచ్చి, మంచి డాక్టర్ తో వైద్యం చేయించి మామూలు మనిషిని చేసి.. ఇదిగో...! ఈ వారసుడి జననానికి కారణమయ్యారు. ఆ తర్వాత నా భార్య అనారోగ్యంతో పోయింది. మీకు ఈ విషయాలు చెప్పుకోవాలని తపించినా, ఎంత తాపత్రయపడినా, ఫోన్ కలవకపోవడంతో చెప్పుకోలేకపోయాను. ఒక రోజు అటక పైన ఉన్న ఆనాడు మీరు నాకు పంపిన మందుల పార్సిల్ కవర్ కింద పడటంతో దాని పైన గల ఫ్రమ్ అడ్రస్తో పిల్లాడితో ఈ సిటీకి చేరుకున్నాను. మీ అపార్ట్మెంట్లో వాచ్మన్ ఉద్యోగం కోసం నాలుగు నెలలు వేచి చూస్తే గాని ఈ ఉద్యోగం నాకు దొరకలేదు. ఆ భగవంతుడు మీ దగ్గరికి రప్పించేందుకు కూడా నాకు వరం ఇచ్చాడు తల్లి..! అదేంటో తెలుసా..? నాకు కౌన్సెలింగ్ ఇచ్చే ఆ రోజుల్లో నా గొంతు మీకు తెలిసి ఉంటుంది కదా! మరి మీ సన్నిధికి రావడానికి నన్ను గుర్తుపట్టకుండా ఉండేందుకు నాకు గొంతు వ్యాధిని ఇచ్చాడు. దాంతో పీలగా అయిన గొంతును గుర్తుపట్టలేకపోయారు. మీ తీయటి మాట, పలకరింపు, ప్రేమ, వాత్సల్యం, మానవత్వం ఫోన్కాల్లో చూశాను. దగ్గరుండి అవన్నీ మీ చల్లని చూపుల్లో, చేతల్లో చూసే అదృష్టం కలిగింది. కౌన్సెలర్గా మాలాంటి వాళ్లను బాగు చేసేంత వరకే మీ బాధ్యతగా, ఆ తర్వాత మాతో సంబంధాలను ఎంతవరకు ఉంచాలో అంతవరకే చేసే మీ విధానం నిజంగా గ్రేట్ మేడం! ఎందుకంటే కౌన్సెలింగ్ పరంగా ఏర్పడే మీ సాన్నిహిత్యాన్ని అలుసుగా తీసుకునే కొందరు వెధవల్ని దరిచేరనీయకపోవడమే కరెక్ట్. ఒక డాక్టర్, ఒక రోగికి ఉన్న సంబంధంలాగా అంతవరకే! కాని, త్వరలో చనిపోయే నాకు మీ రుణం తీర్చుకోవాలనిపించింది. ఆ రుణం తీర్చుకోవడమే ఈ ‘లవ్’ మేడం.. అంతే! మన మధ్య ఏ బంధమున్నదని ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా కౌన్సెలింగ్ చేసి, మా రెండు జీవితాలను బతికించి, పిల్లాడిని కూడా అందించారు చెప్పండి! పూర్వజన్మ సంగతి, మరుజన్మ సంగతి నాకు తెలియదమ్మా! కాని, ఈ జన్మలో మీరు చేసిన సహాయానికి నేను తిరిగి నా వంతుగా బాధ్యత గల సర్వీసును అందించాలని మీ చెంతకు చేరాను.నేనెలాగో ఎక్కువకాలం బతకనని తెలుసు. బతికినన్ని రోజులు మీరు చేసిన దానికి రుణం తీర్చుకునేందుకు నా చేతనైనంత సేవ చేయాలనే ఉద్దేశంతోనే మీ వద్దకు చేరాను. ఈ బంధానికి పేరేమి పెడతారో తెలియదు కాని, చెదిరిపోని ‘లవ్’ ఉంటుంది. అంతే! ఆనాడు మీరు మాపై చూపించింది కూడా బాధ్యతగల ప్రేమనే!నేను చూపించేది కూడా కొందరి అవాంఛిత దృష్టి మాదిరిగా స్వార్థం, కోరికతో కూడిన ప్రేమ కాదు. ఇది బాధ్యతతో ఒక అమ్మకు చేసే సేవా ప్రేమ ఇది. కాదంటారా అమ్మా! ఒప్పుకుంటారా తల్లీ..? నిశీధిలో కొట్టుమిట్టాడుతున్న ఎందరో నాలాంటి జీవితాలకు వెలుగునిచ్చే వెలుగు దివ్వెమ్మా..! మీకు, మీ కుటుంబానికి చేసే ప్రతి పనిలో కష్టమనిపించలేదు, ఇష్టంతో చేశాను. ఎండలో వానలో, తినీ తినక అనారోగ్యాన్ని లెక్క చేయక చేసిన నా ఇష్టమైన పనులే నా ఆత్మ శాంతించడానికి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. చిన్నోడి రూపంలో వున్న ఈ ఆత్మరుణానుబంధానికి మీ పేరే పెట్టుకున్నానమ్మా! వాడే ఈ కోమల్!!ఇక నా ప్రాణం పోయినా పర్లేదు. ఆత్మసంతృప్తి మిగిలింది. ఆ రాత్రి గొంతు నొప్పి ఎక్కువ కావడంతో, ఇక నేను ఎక్కువ రోజులు బతకనని తెలిసి పిల్లోడిని తీసుకొని మా ఊరు వచ్చాను. ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. అందుకే ఈ లేఖ ముందస్తుగా రాస్తున్నా. మీ మంచితనం, మానవత్వం పదికాలాలపాటు చెరిగిపోకుండా మరెందరో అభాగ్యులకు కొత్త జీవితాలు అందిస్తే అదే చాలు. నేను చేసిన దానికి అర్థం! పరమార్థం!ఇంకో విషయం తల్లీ! మన సార్ పాత బండికి సరిగా బ్రేకులు లేవు. ఇంజిన్ కూడా రిపేరుకు వచ్చింది. అందుకే నేను చేసిన సర్వీస్కు మీరిచ్చిన జీతాన్ని దాచుకొని, ఆ పైకంతో మన సార్కు నా గిఫ్ట్గా కొత్త బైక్ కొన్నాను. సెల్లార్లో మీ పార్కింగ్లో పెట్టాను. కీస్ వాచ్మెన్ రూమ్లో ఉన్నాయి. తీసుకోండి!ఇక... సార్..నమస్తే..! మేడంకు ఇవ్వడమే కాని, ఎవరి నుంచి ఏదీ తీసుకోదు. అందుకే నేనెవరో తెలియకుండా వచ్చి నా రుణం నేను తీర్చుకున్నాను. మీరు ఆపద్బాంధవులు. ఒకరోజు నా పిల్లోడికి జ్వరం వస్తే రాత్రికి రాత్రి మీరు ఆసుపత్రికి తీసుకెళ్లి దగ్గరుండి వైద్యం చేయించిన గుర్తులు మరువలేనివి. ఒకసారి గుర్తుందా సార్ మీకు...! మీ డ్రైవింగ్లో బైక్ పైన ఇద్దరం వెళ్తుంటే, మీ బైకుకు బ్రేకులు సరిగా లేవుగా.. అదుపుతప్పి ఇంకో బైక్కు తగిలితే పెద్ద గొడవైంది ఆరోజు.. వెంటనే మిమ్మల్ని ఆటో ఎక్కించి ఇంటికి పంపాను కదా..! ఆ తర్వాత అక్కడికి పోలీసులు వస్తే, నేనే డ్రైవ్ చేశానని చెబితే వాళ్లు కొట్టిన లాఠీ దెబ్బలు ఇంకా మానలేదు.. అయితేమాన్లే సార్..! ఇష్టంతో తిన్న దెబ్బలు కదా..! అవి తీయగా తడుముతున్నాయి.. ఈ విషయం ఎందుకు చెప్పానంటే అది యాక్సిడెంట్ కేస్ చేశారు కదా! పోలీసులు నాకోసం మీ దగ్గరికి వస్తారేమో? లేడు.. చనిపోయాడని చెప్పండి! ఇవన్నీ చెప్పి మిమ్మల్ని బాధ పెడుతున్నానని అనుకోకండి! కాని, చెప్పకుండా అదృశ్యమైతే మీరన్న జాబితాలో చేరిన మనిషిగానే మిగిలిపోతాను కదా సార్!ఒక్కసారి నవ్వండి సార్..! ‘చంద్రా’..! అని కేకేయండి! మీ ముందు వాలుతానేమో!ఇక ఉంటాను..! సెలవు!’చదువుతున్న కోమలి కంట నీటి ధార కారుతుండగా ఆ కాగితం తడుస్తుంటే, అక్షరాలు చెదిరిపోకుండా ఆ కాగితాన్ని మృదువుగా తడుముకుని హృదయానికి హత్తుకుంది. మెలి పెడుతున్న బాధతో వున్న కోమలిని పొదివి పట్టుకుని నిలబడ్డాడు ప్రదీప్.తల్లి, తండ్రిని కోల్పోయి బేలగా చూస్తున్న కోమల్ వైపు చూస్తూ..‘ఏవండీ! ఆ బాబు! కన్నీటితో అంటుండగా... అర్థం చేసుకున్న ప్రదీప్,‘నీ ఇష్టమే నా ఇష్టం! మన చంద్రయ్య గుర్తులు మానవ సంబంధాలకు, అనుబంధాలకు చాలా అవసరం’ అంటూ ఆ పిల్లోడిని అక్కడి వారి అనుమతితో కారులో ఎక్కించుకొని, హైదరాబాద్ బయలుదేరారు. తన వెచ్చని ఒడిలో చల్లగా నిద్రపోతున్న ఆ పిల్లోడు కోమలి తలపై నిమురుతూ, ‘ఆత్మబంధాన్నిచ్చావా.. చంద్రయ్యా! పిల్లలు లేరని బాధపడుతున్న తమకు ఆ దేవుడు ఈ రూపేణా వీడిని ప్రసాదించాడా? ఈ రుణానుబంధాన్ని బాధ్యతగా చూసుకుంటా! ఇది కదా! నిజమైన ‘లవ్ ’... ఐ లవ్ యు టూ రాజేష్..! ఐ మిస్ యు.. రాజేష్ చంద్రయ్య!’ అనుకుంటూ తన అంతరంగ తరంగాలను సముదాయించుకుంటూ, హృదయస్పర్శతో మనసులోనే చంద్రయ్య పాదాలను తడిమింది కోమలి. -
ఈ సండే సరదాగా వంకాయ–తమలపాకు బజ్జీ ట్రై చేయండిలా..!
స్పైసీ బాంబూ షూట్స్ సలాడ్కావలసినవి: వెదురు చిగుర్లు (బాంబూ షూట్స్)– ఒక కప్పుతురిమిన క్యారట్లు–ఒక కప్పుకీరదోస– అర కప్పు (సన్నగా తరగాలి)కొత్తిమీర తురుము– పావు కప్పుఉల్లిపాయ ముక్కలు– పావు కప్పుమిరపకాయలు– 2వేరుశనగలు– పావు కప్పు (దోరగా వేయించినవి) రైస్ వెనిగర్– 3 టేబుల్ స్పూన్లుసోయా సాస్– 2 టేబుల్ స్పూన్లునువ్వుల నూనె– టేబుల్ స్పూన్తేనె– టేబుల్ స్పూన్అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ పేస్ట్, నిమ్మరసం– ఒక టీ స్పూన్ చొప్పునతయారీ: ముందుగా పండ్లను శుభ్రంగాకడిగి, పూర్తిగా ఆరబెట్టాలి. ముందుగా వెదురు చిగుర్లను కడిగి సన్నగా ముక్కలుగా చేసుకోవాలి. ఒకవేళ తాజా వెదురు చిగుర్లను ఉపయోగిస్తే, వాటిని ఉడికించి చల్లార్చాలి. ఒక పెద్ద గిన్నెలో ఈ వెదురు చిగుర్లు, కట్ చేసిన క్యారట్ ముక్కలు, కీరదోస ముక్కలు, కొత్తిమీర తురుము, ఉల్లిపాయ ముక్కలు, మిరపకాయ ముక్కలను వేసి కలుపుకోవాలి. ఈలోపు ఒక చిన్న గిన్నెలో రైస్ వెనిగర్, సోయా సాస్, నువ్వుల నూనె, తేనె, అల్లం–వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న కూరగాయల మిశ్రమంపై పోసి బాగా కలపాలి. 15 నిమిషాల తర్వాత వేరుశనగలు కూడా వేసి కలుపుకుని సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది.వంకాయ–తమలపాకు బజ్జీకావలసినవి: వంకాయలు– 8 (మీడియం సైజులో ఉన్న వాటిని మధ్యలో నిలువుగా కత్తిరించుకోవాలి), తమలపాకులు– కొన్ని (పేస్ట్లా చేసి పెట్టుకోవాలి)శనగపిండి– ఒక కప్పు, బియ్యపు పిండి–2 టీ స్పూన్లు, వాము కొద్దిగానువ్వులు, కొబ్బరి పొడి– 2 టీ స్పూన్లు చొప్పున, జీలకర్ర– అర టేబుల్ స్పూన్పసుపు– పావు టీ స్పూన్, కారం– ఒక టీ స్పూన్, ఉప్పు– కావాల్సినంతవెల్లుల్లి రెబ్బలు–8, నిమ్మరసం– ఒక టీ స్పూన్, నూనె– సరిపడాతయారీ: ముందుగా ఒక పాన్లో నూనె వేసి వంకాయలను లైట్గా ఫ్రై చేసి పెట్టుకోవాలి. చల్లారాక కొద్దికొద్దిగా తమలపాకు గుజ్జు నింపుకుని ఉంచుకోవాలి. అనంతరం నువ్వులు, కొబ్బరి పొడి, జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, నిమ్మరసం కలిపి కచ్చాబిచ్చా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. మరో వైపు ఒక కప్పు శనగపిండిలో బియ్యపు పిండి, వాము, కారం, ఉప్పు, సరిపడా నీళ్లు కలిపి బజ్జీల పిండిని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఆ వంకాయలను శనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది. వీటిని వేగిన పల్లీలు, కొత్తిమీర తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలతో గార్నిష్ చేసుకుని తింటే భలే రుచిగా ఉంటాయి.జపనీస్ పొటాటో సలాడ్కావలసినవి: బంగాళదుంపలు (సుమారు ఒక కేజీ, తొక్క తీసి ముక్కలు కట్ చేసుకోవాలి)క్యారెట్–1 (కాస్త స్టీమ్ చేసి, చిన్నగా తరగాలి)కీరదోసకాయ–1ఉప్పు– ఒక టీ స్పూన్ఉల్లిపాయ–1 (బాగా తురుముకోవాలి)ఉడికించిన గుడ్డు– 1మాయొనీస్ సాస్– ముప్పావు కప్పురైస్ వైన్ వెనిగర్–1 టేబుల్ స్పూన్ఇతర కూరగాయ ముక్కలు– అభిరుచిని బట్టితయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసి బంగాళదుంప ముక్కలను మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి. మరోవైపు కీరదోసకాయను ముక్కలుగా కత్తిరించి ఉప్పు చల్లి పెట్టుకోవాలి. బంగాళదుంప ముక్కలు చల్లారాక, వాటిని గుజ్జులా చేసుకోవాలి. ఇందులో కీర దోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన గుడ్డును వేసి బాగా కలపాలి. అభిరుచిని బట్టి ఇతర కూరగాయల ముక్కలను కూడా కలుపుకోవచ్చు. ఇక బంగాళదుంప మిశ్రమంలో మాయొనీస్ సాస్, రైస్ వైన్ వెనిగర్ వేసి నెమ్మదిగా మరోసారి కలుపుకోవాలి. అనంతరం దాన్ని ఒక గంట పాటు ఫ్రిజ్లో ఉంచి, తర్వాత బౌల్స్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. (చదవండి: నూడుల్స్ తినడమే ఒక గేమ్!) -
బతుకుతున్న సంస్కృత నాటక పరంపర
భారత ఉపఖండంలో వేల సంవత్సరాలు సాహిత్య భాషగా వున్న సంస్కృతం సుమారు వెయ్యేళ్ళకు పైగా ఒక ప్రదర్శన కళారూపంగా కూడా బతికి ఉండటం విశేషం. అదే కేరళలోని కూడియాట్టం. కూడియాట్టం అంటే కలిసి ఆడే నాట్యం అని అర్థం. ఇది కేరళలోని నాట్య ప్రక్రియలలో ప్రాచీనమైనది. కేరళలోని ప్రాచీన దేవాలయాలలో ఈ నాట్య ప్రదర్శనకు ప్రత్యేకమైన మందిరం ‘కూతాంబళం’ ఉంటుంది. సుమారు 5వ శతాబ్దిలో ప్రారంభమైన సంస్కృత నాటకాలలో పురాణేతిహాసాలు నేపథ్యంగా ఉన్న నాటకాలను పూర్వం చాక్యార్ బ్రాహ్మణులు మాత్రమే కూతాంబళాలలో ప్రదర్శించేవారు. ఇప్పుడు ఇతర కులాల వారు కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ నాట్యాన్ని యునెస్కో మౌఖిక వారసత్వ కళారూపంగా గుర్తించడంతో కొన్ని దశాబ్దాలుగా ఖండాంతరాలలో ప్రదర్శితమవుతోంది. త్రిసూర్ కళామండలం, తిరువనంతపురం మార్గి, మూడికుళం నేపథ్య వంటి సంస్థలు ఈ వ్యాప్తికి కృషి చేస్తున్నాయి.ఐదు నుండి పది అంకాల సంస్కృత నాటకాన్ని పూర్తిగా ప్రదర్శించడానికి ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ రోజులే పట్టవచ్చు. ఒక్కొక్క శ్లోకాన్ని దాదాపు అరగంట వరకు ప్రదర్శించడం ఈ ప్రక్రియ ప్రత్యేకత. నాటకం మొదలు పెట్టడానికి ముందు ఒకరోజు మొత్తం ప్రదర్శన అంతా ఒకే నటుడు నాటక నేపథ్యం చెప్పడం, ప్రతిరోజూ ముందు సంక్షేపం, నిర్వహణం అనే ప్రదర్శనా పద్ధతులు ఉండటం వల్ల నాటకం మొత్తం పూర్తవడానికి ఎక్కువ రోజులు పడుతుంది.ప్రదర్శన ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమై రాత్రి పది, పదకొండు గంటలకు ముగుస్తుంది. ప్రదర్శనలో ముఖ్యమైన వాయిద్యం మిళావు. గంగాళంలాంటి రాగి పాత్రకు ఉన్న సన్నటి మూతిపై బిగుతుగా కట్టిన తోలు మీద వాయిద్యకారులు దరువులు వేస్తారు. ఈ దరువుల శబ్దం ప్రేక్షకులను తాదాత్మ్యతలోకి తీసుకువెళ్తాయి. మిళావుకి తోడుగా ఎడక్క అనే మృదంగం కూడా నాటక ప్రదర్శన సాంతం వాయిస్తూ వుంటారు. ఆడవాళ్ళు మాత్రమే తాళం వాయిస్తారు. కర్ణాటక సంగీత తాళగతులకు భిన్నంగా ఈ తాళాలు వుంటాయి. ‘ఎడక్క’ వాయిద్యకారుడే అవసరమైన సందర్భాలలో శంఖం కూడా ఊదుతాడు. ప్రదర్శనకు ముందు వేదిక ముందుభాగం మధ్యలో ఉంచిన పెద్ద దీపపు సెమ్మెలోని వత్తులు వెలిగిస్తారు. వెంటనే మిళావు ఆహ్వాన దరువుతో ప్రదర్శన ప్రారంభమవుతుంది.కూడియాట్టంలో పాత్రలకు అనుగుణమైన ప్రత్యేక అలంకరణ వుంటుంది. సూత్రధార, దైవిక, రాజ పాత్రలకు ఒక విధంగానూ; సూత, విదూషక మొదలైన ద్వితీయశ్రేణి పాత్రలకు ఒక విధంగానూ అలంకరణ వుంటుంది. మగ పాత్రలకు దవడ మొత్తం చుట్టి వుండే ‘చుట్టి’ అనే సన్నటి తెల్లటి పట్టా వేయడం కూడియాట్టం నుండే కథాకళికి కూడా సంక్రమించింది. చుట్టి వేయడానికి ప్రదర్శనకు ముందు మూడుగంటల నుండి నటుడు సిద్ధం కావలసి వుంటుంది. స్త్రీ పాత్రలు ఎర్రటి అంచులు వుండే తెల్లటి చీరలు ధరిస్తారు.ఈ నాట్యంలో వుండే ముద్రలు ప్రత్యేకమైనవి. భరతుని నాట్యశాస్త్రానికి అనుగుణంగా ఉంటూనే ప్రత్యేక రీతిలో పాద, హస్త ముద్రలు వుంటాయి. సన్నివేశానికి అనుగుణంగా మానవ అనుభూతులకు ప్రదర్శించేటపుడు నటుల ముఖ కవళికలు, కనుబొమల విన్యాసాలు వివరణాత్మకంగా ఉండి ప్రేక్షకుని తమలో లీనం చేసుకుంటాయి. సంస్కృత శ్లోకాలను నటులు స్పష్టంగా ఒక ప్రత్యేకమైన రీతిలో పాడతారు. అవసరమైన సందర్భాలలో శ్లోకాన్ని పద విభాగం చేసి కూడా వినిపిస్తారు. ఒకసారి శ్లోకాన్ని పాడి అర్థ వివరణల ముద్రలతో నటించి మళ్ళీ శ్లోకాన్ని పాడతారు. నేపథ్యం చెప్పే సందర్భంలో వచ్చే శ్లోకాలను తాళం వాయించే నంగియార్లు పాడతారు.కాళిదాసు శాకుంతలం, భాసుని ప్రతిమ, అభిషేకం, స్వప్న వాసవదత్తం, శక్తిభద్రుని ఆశ్చర్య చూడామణి, హర్షుని నాగానంద, కులశేఖర వర్మ తపతీ సంవరణం, బోధాయనుని భగవదజ్జుకం మొదలైన నాటకాలను కూడియాట్టంలో ప్రదర్శిస్తూ వుంటారు. కాలానుగుణంగా కూడియాట్టం కూడా మార్పు చేర్పులతో కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక రోజు ప్రదర్శనలు, ఏక పాత్రాభినయాలు కూడా చేస్తోంది. శూద్రకుని మృచ్ఛకటికాన్ని కూడియాట్టం ప్రదర్శనకు అనుగుణంగా మార్చి వేణు.జి. ఇటీవల ప్రదర్శిస్తున్నారు. కొచ్చికి నలభై కి.మీ.ల దూరాన ఉన్న మూడికుళం గ్రామంలోని నేపథ్య థియేటర్ మధు చాక్యార్, డా.ఇందు తన బృందంతో కలిసి కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఆదివారం ప్రదర్శనలు కూడా ఇస్తున్నారు. నేపథ్య బృందం, కపిల వేణు బృందం దేశవిదేశాలలో ప్రదర్శనలు ఇచ్చారు. ప్రొఫెసర్ డేవిడ్ షూల్మన్, డా. సుధా గోపాలక్రిష్ణన్, ప్రొఫెసర్ పౌలోస్ వంటివారు కూడియాట్టం మీద ఇంగ్లిష్లో పరిశోధనాత్మక గ్రంథాలు రాశారు. ఆగస్టు మొదటి వారంలో కూడియాట్టం అంతర్జాతీయ ఉత్సవాన్ని కళామండలం సంస్థ, వారం రోజుల పాటు త్రిసూర్లో ఘనంగా నిర్వహించారు. మలయాళీల పెద్ద పండగ ‘ఓణం’కు ముందు పదిరోజుల కూడియాట్టం ఉత్సవాలను మూడికుళం నేపథ్య సెంటర్ గత పదహారేళ్లుగా నిర్వహిస్తునారు.ఇజ్రాయెల్ హీబ్రూ యూనివర్సిటీ ఎమిరిటస్ ప్రొఫెసర్ డేవిడ్ షూల్మన్ ఆధ్వర్యంలోని దక్షిణాసియా విభాగపు ‘నీమ్’ ప్రాజెక్ట్, యూరోపియన్ రీసెర్చ్ కౌన్సిల్ సహాయ సహకారాలతో ఈ ఉత్సవాలు నడుస్తున్నాయి. ఇందులో భాగంగా 7వ శతాబ్దపు పల్లవ మహేంద్రవిక్రమవర్మ రచించిన ‘మత్తవిలాస ప్రహసనాన్ని’ మూడికుళంలో పూర్తిగా ఆరురోజులపాటు ప్రదర్శించారు. కంచిలోని కల్లు దుకాణాల దగ్గర జరిగిన కథ ఇందులోని ఇతివృత్తం. బౌద్ధ, శైవ మత శాఖలలోని లోపాలను హాస్యభరితంగా విమర్శించిన ప్రహసనంగా ప్రఖ్యాతి పొందిన ఈ ప్రహసనం సంస్కృత ప్రహసనాల్లో మొదటిదని అంచనా. కాపాలిక, దేవసోమ, శాక్యభిక్షు, పాశుపత, ఉన్మత్తుని పాత్రలతో వున్న ఈ ఏకాంక ప్రహసనాన్ని గత కొన్ని వందల సంవత్సరాలుగా పూర్తిగా ఎక్కడా ప్రదర్శించలేదు. అందువల్ల ఈ కూడియాట్టం ప్రదర్శనను చూడటానికి దేశ విదేశాల సంస్కృత పండితులు, పరిశోధకులు వచ్చారు. ప్రతి సంవత్సరం కూడియాట్టం చూడడానికి వీరంతా మూడికుళం వస్తూనే ఉంటారు. ∙డా. కె.రామచంద్రారెడ్డి -
అగ్గిపెట్టంత జనరేటర్!
ఒక చిన్న అగ్గిపెట్టె పరిమాణంలోని బాక్స్ జేబులో పెట్టుకొని తిరిగితే, లైటు వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది, కంప్యూటర్, మొబైల్ వంటి వాటికి పవర్ వస్తుంది. ఇది మ్యాజిక్ కాదు, జపాన్ సైంటిస్టుల కొత్త ఆవిష్కరణ. వారు తయారు చేసిన ఈ చిన్న మ్యాచ్బాక్స్ సైజ్ జనరేటర్ రోజుకు ఇరవై నాలుగు గంటలూ, ఏడాదంతా నిరంతరంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. దీని కోసం పెద్ద వనరులు అవసరం లేదు. కేవలం గాలిలో తేమ చాలు. ప్రత్యేకమైన లేయర్డ్ నానోఫిల్మ్ టెక్నాలజీ ఉపయోగించి, గాలిలోని తేమను ఇది నేరుగా విద్యుత్గా మార్చేస్తుంది. ఎలాంటి మోషన్ పార్ట్స్ లేవు, మెయింటెనెన్స్ కూడా జీరో. ఒక్కసారి సెట్ చేస్తే చాలు. ఈ మధ్యనే దక్షిణ ఆసియా పంట పొలాల్లో టెస్టులు జరిపినప్పుడు ఎటువంటి బ్రేక్డౌన్ , చార్జింగ్ అవసరం లేకుండా నిరంతరం విద్యుత్ ఉత్పత్తి చేసింది. త్వరలోనే దీన్ని మార్కెట్లోకి తీసుకురానున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. (చదవండి: చేపలంటే నోరూరించే వంటకాలు కాదు..! ఇకపై ఫ్యాషన్..)· -
వెయ్యేళ్ల నాటి నాట్య ప్రదర్శన ఇంకా కళారూపకంగా..!
భారత ఉపఖండంలో వేల సంవత్సరాలు సాహిత్య భాషగా వున్న సంస్కృతం సుమారు వెయ్యేళ్ళకు పైగా ఒక ప్రదర్శన కళారూపంగా కూడా బతికి ఉండటం విశేషం. అదే కేరళలోని కూడియాట్టం. కూడియాట్టం అంటే కలిసి ఆడే నాట్యం అని అర్థం. ఇది కేరళలోని నాట్య ప్రక్రియలలో ప్రాచీనమైనది. కేరళలోని ప్రాచీన దేవాలయాలలో ఈ నాట్య ప్రదర్శనకు ప్రత్యేకమైన మందిరం ‘కూతాంబళం’ ఉంటుంది. సుమారు 5వ శతాబ్దిలో ప్రారంభమైన సంస్కృత నాటకాలలో పురాణేతిహాసాలు నేపథ్యంగా ఉన్న నాటకాలను పూర్వం చాక్యార్ బ్రాహ్మణులు మాత్రమే కూతాంబళాలలో ప్రదర్శించేవారు. ఇప్పుడు ఇతర కులాల వారు కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ నాట్యాన్ని యునెస్కో మౌఖిక వారసత్వ కళారూపంగా గుర్తించడంతో కొన్ని దశాబ్దాలుగా ఖండాంతరాలలో ప్రదర్శితమవుతోంది. త్రిసూర్ కళామండలం, తిరువనంతపురం మార్గి, మూడికుళం నేపథ్య వంటి సంస్థలు ఈ వ్యాప్తికి కృషి చేస్తున్నాయి.ఐదు నుండి పది అంకాల సంస్కృత నాటకాన్ని పూర్తిగా ప్రదర్శించడానికి ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ రోజులే పట్టవచ్చు. ఒక్కొక్క శ్లోకాన్ని దాదాపు అరగంట వరకు ప్రదర్శించడం ఈ ప్రక్రియ ప్రత్యేకత. నాటకం మొదలు పెట్టడానికి ముందు ఒకరోజు మొత్తం ప్రదర్శన అంతా ఒకే నటుడు నాటక నేపథ్యం చెప్పడం, ప్రతిరోజూ ముందు సంక్షేపం, నిర్వహణం అనే ప్రదర్శనా పద్ధతులు ఉండటం వల్ల నాటకం మొత్తం పూర్తవడానికి ఎక్కువ రోజులు పడుతుంది.ప్రదర్శన ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమై రాత్రి పది, పదకొండు గంటలకు ముగుస్తుంది. ప్రదర్శనలో ముఖ్యమైన వాయిద్యం మిళావు. గంగాళంలాంటి రాగి పాత్రకు ఉన్న సన్నటి మూతిపై బిగుతుగా కట్టిన తోలు మీద వాయిద్యకారులు దరువులు వేస్తారు. ఈ దరువుల శబ్దం ప్రేక్షకులను తాదాత్మ్యతలోకి తీసుకువెళ్తాయి. మిళావుకి తోడుగా ఎడక్క అనే మృదంగం కూడా నాటక ప్రదర్శన సాంతం వాయిస్తూ వుంటారు. ఆడవాళ్ళు మాత్రమే తాళం వాయిస్తారు. కర్ణాటక సంగీత తాళగతులకు భిన్నంగా ఈ తాళాలు వుంటాయి. ‘ఎడక్క’ వాయిద్యకారుడే అవసరమైన సందర్భాలలో శంఖం కూడా ఊదుతాడు. ప్రదర్శనకు ముందు వేదిక ముందుభాగం మధ్యలో ఉంచిన పెద్ద దీపపు సెమ్మెలోని వత్తులు వెలిగిస్తారు. వెంటనే మిళావు ఆహ్వాన దరువుతో ప్రదర్శన ప్రారంభమవుతుంది.కూడియాట్టంలో పాత్రలకు అనుగుణమైన ప్రత్యేక అలంకరణ వుంటుంది. సూత్రధార, దైవిక, రాజ పాత్రలకు ఒక విధంగానూ; సూత, విదూషక మొదలైన ద్వితీయశ్రేణి పాత్రలకు ఒక విధంగానూ అలంకరణ వుంటుంది. మగ పాత్రలకు దవడ మొత్తం చుట్టి వుండే ‘చుట్టి’ అనే సన్నటి తెల్లటి పట్టా వేయడం కూడియాట్టం నుండే కథాకళికి కూడా సంక్రమించింది. చుట్టి వేయడానికి ప్రదర్శనకు ముందు మూడుగంటల నుండి నటుడు సిద్ధం కావలసి వుంటుంది. స్త్రీ పాత్రలు ఎర్రటి అంచులు వుండే తెల్లటి చీరలు ధరిస్తారు.ఈ నాట్యంలో వుండే ముద్రలు ప్రత్యేకమైనవి. భరతుని నాట్యశాస్త్రానికి అనుగుణంగా ఉంటూనే ప్రత్యేక రీతిలో పాద, హస్త ముద్రలు వుంటాయి. సన్నివేశానికి అనుగుణంగా మానవ అనుభూతులకు ప్రదర్శించేటపుడు నటుల ముఖ కవళికలు, కనుబొమల విన్యాసాలు వివరణాత్మకంగా ఉండి ప్రేక్షకుని తమలో లీనం చేసుకుంటాయి. సంస్కృత శ్లోకాలను నటులు స్పష్టంగా ఒక ప్రత్యేకమైన రీతిలో పాడతారు. అవసరమైన సందర్భాలలో శ్లోకాన్ని పద విభాగం చేసి కూడా వినిపిస్తారు. ఒకసారి శ్లోకాన్ని పాడి అర్థ వివరణల ముద్రలతో నటించి మళ్ళీ శ్లోకాన్ని పాడతారు. నేపథ్యం చెప్పే సందర్భంలో వచ్చే శ్లోకాలను తాళం వాయించే నంగియార్లు పాడతారు.కాళిదాసు శాకుంతలం, భాసుని ప్రతిమ, అభిషేకం, స్వప్న వాసవదత్తం, శక్తిభద్రుని ఆశ్చర్య చూడామణి, హర్షుని నాగానంద, కులశేఖర వర్మ తపతీ సంవరణం, బోధాయనుని భగవదజ్జుకం మొదలైన నాటకాలను కూడియాట్టంలో ప్రదర్శిస్తూ వుంటారు. కాలానుగుణంగా కూడియాట్టం కూడా మార్పు చేర్పులతో కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక రోజు ప్రదర్శనలు, ఏక పాత్రాభినయాలు కూడా చేస్తోంది. శూద్రకుని మృచ్ఛకటికాన్ని కూడియాట్టం ప్రదర్శనకు అనుగుణంగా మార్చి వేణు.జి. ఇటీవల ప్రదర్శిస్తున్నారు. కొచ్చికి నలభై కి.మీ.ల దూరాన ఉన్న మూడికుళం గ్రామంలోని నేపథ్య థియేటర్ మధు చాక్యార్, డా.ఇందు తన బృందంతో కలిసి కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఆదివారం ప్రదర్శనలు కూడా ఇస్తున్నారు. నేపథ్య బృందం, కపిల వేణు బృందం దేశవిదేశాలలో ప్రదర్శనలు ఇచ్చారు. ప్రొఫెసర్ డేవిడ్ షూల్మన్, డా. సుధా గోపాలక్రిష్ణన్, ప్రొఫెసర్ పౌలోస్ వంటివారు కూడియాట్టం మీద ఇంగ్లిష్లో పరిశోధనాత్మక గ్రంథాలు రాశారు. ఆగస్టు మొదటి వారంలో కూడియాట్టం అంతర్జాతీయ ఉత్సవాన్ని కళామండలం సంస్థ, వారం రోజుల పాటు త్రిసూర్లో ఘనంగా నిర్వహించారు. మలయాళీల పెద్ద పండగ ‘ఓణం’కు ముందు పదిరోజుల కూడియాట్టం ఉత్సవాలను మూడికుళం నేపథ్య సెంటర్ గత పదహారేళ్లుగా నిర్వహిస్తునారు.ఇజ్రాయెల్ హీబ్రూ యూనివర్సిటీ ఎమిరిటస్ ప్రొఫెసర్ డేవిడ్ షూల్మన్ ఆధ్వర్యంలోని దక్షిణాసియా విభాగపు ‘నీమ్’ ప్రాజెక్ట్, యూరోపియన్ రీసెర్చ్ కౌన్సిల్ సహాయ సహకారాలతో ఈ ఉత్సవాలు నడుస్తున్నాయి. ఇందులో భాగంగా 7వ శతాబ్దపు పల్లవ మహేంద్రవిక్రమవర్మ రచించిన ‘మత్తవిలాస ప్రహసనాన్ని’ మూడికుళంలో పూర్తిగా ఆరురోజులపాటు ప్రదర్శించారు. కంచిలోని కల్లు దుకాణాల దగ్గర జరిగిన కథ ఇందులోని ఇతివృత్తం. బౌద్ధ, శైవ మత శాఖలలోని లోపాలను హాస్యభరితంగా విమర్శించిన ప్రహసనంగా ప్రఖ్యాతి పొందిన ఈ ప్రహసనం సంస్కృత ప్రహసనాల్లో మొదటిదని అంచనా. కాపాలిక, దేవసోమ, శాక్యభిక్షు, పాశుపత, ఉన్మత్తుని పాత్రలతో వున్న ఈ ఏకాంక ప్రహసనాన్ని గత కొన్ని వందల సంవత్సరాలుగా పూర్తిగా ఎక్కడా ప్రదర్శించలేదు. అందువల్ల ఈ కూడియాట్టం ప్రదర్శనను చూడటానికి దేశ విదేశాల సంస్కృత పండితులు, పరిశోధకులు వచ్చారు. ప్రతి సంవత్సరం కూడియాట్టం చూడడానికి వీరంతా మూడికుళం వస్తూనే ఉంటారు.డా. కె.రామచంద్రారెడ్డి(చదవండి: స్లీప్..స్క్రీన్..స్టడీ..!) -
కలియుగ కుంభకర్ణుడు: ఏడాదిలో 300 రోజులు నిద్రలోనే!
రామాయణంలో కుంభకర్ణుడి సంగతి అందరికీ తెలిసిందే! కుంభాలకు కుంభాలు భోంచేశాక శుభ్రంగా ఆరునెలల పాటు ఏకధాటిగా గుర్రుపెట్టి నిద్రపోయేవాడు. సుదీర్ఘకాలం నిర్విరామంగా నిద్రపోవాలంటే, ఎంతటి బద్ధకస్తులకైనా సాధ్యమయ్యే పనికాదు. అయితే, నాగపూర్లో పుర్ఖారామ్ అనే వ్యక్తిని మాత్రం అక్కడి జనాలు కలియుగ కుంభకర్ణుడని అంటున్నారు. అతగాడు ఒకేసారి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల పాటు నిర్విరామంగా నిద్రపోగలడట! ఆయనకు ‘యాక్సిస్ హైపర్సోమ్నియా’ అనే అరుదైన నిద్ర వ్యాధి ఉంది. ఈ వ్యాధి కారణంగా శరీరం క్రమంగా అలసిపోతుంది, మెదడు వేకప్ బటన్నే మరచిపోతుంది. ఈ వ్యాధి ఫలితంగానే పుర్ఖారామ్కు నిద్రే జీవితం అయ్యింది. ఇలా ఇతను ఒక సంవత్సరం మొత్తంలో 300 రోజులు నిద్రలోనే గడిపేస్తాడు. ఇతడి కథ విన్నవారు ‘ఒకవైపు ప్రపంచం రోజుకు 8 గంటల నిద్ర తప్పనిసరి అని పోరాడుతుంటే, ఇతనికి మాత్రం నిద్రలోనే జీవితం గడిచిపోతోంది’ అంటూ ఆశ్చర్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇతడి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, నిద్ర సంబంధ వ్యాధులపై అనేక చర్చలు మొదలయ్యాయి. -
జుట్టును స్టైలిష్గా మార్చడం కోసం..!
వయసుతో సంబంధం లేకుండా ఆడవారంతా తమ జుట్టును అందంగా, ఆకర్షణీయంగా మార్చుకోవాలనే కోరుకుంటారు. ట్రెండ్కు తగ్గట్టుగా, అందరినీ ఆకట్టుకునేలా తమ కురులను మార్చుకోవాలని ఆశ పడతారు. అలాంటి వారి కోసం జుట్టును స్టైలిష్గా మార్చే పరికరమే ఈ డైసన్ ఎయిర్రాప్ ఐడీ 6 ఇన్ 1 మల్టీ స్టైలర్.జుట్టు స్టైలింగ్ అంటే చాలామంది అధిక వేడి, జుట్టు చివర్లు చిట్లిపోవడం, గంటల తరబడి శ్రమ అని అనుకుంటారు. అయితే ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే అని చెబుతూ డైసన్ కంపెనీ ఈ పరికరాన్ని సృష్టించింది. ఈ డివైజ్ ఎక్కువ వేడి లేకుండా కేవలం ఎయిర్ ఫ్లో సాయంతో జుట్టును స్టైల్ చేస్తుంది. అధునాతన సాంకేతికతో ఇది మీ జుట్టుకు ట్రెండీ లుక్ను అందిస్తుంది. డైసన్ ఎయిర్రాప్ పరికరం బ్లూటూత్ కనెక్టివిటీతో పని చేస్తుంది. ముందుగా ఫోన్లో మై డైసన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో మీ వెంట్రుకల తీరు, అలాగే మీరు ఎలాంటి స్టైల్ కోరుకుంటున్నారో ముందుగానే సెట్ చేసుకోవచ్చు. ఇది మీకు ఎలాంటి స్టైల్ సరిపోతుందో కూడా సూచనలిస్తుంది. దీంతో జుట్టును ఎలా స్టైల్ చేసుకోవాలో అనే విషయంలో క్లారిటీ వస్తుంది. సెలెక్ట్ చేసుకున్న స్టైల్ ప్రకారం ఈ పరికరం మీ జుట్టుకు అందమైన రూపాన్ని ఇస్తుంది. డైసన్ ఎయిర్రాప్ ఆరు రకాల ఎటాచ్మెంట్స్తో లభిస్తుంది. ఈ పరికరంలో మూడు రకాల హీట్ సెట్టింగ్లు, 3 రకాల స్పీడ్ సెట్టింగ్లు ఉన్నాయి. వీటి సాయంతో మీరు తడి జుట్టును ఆరబెట్టుకోవచ్చు. జుట్టుకు బౌన్సీ కర్ల్స్, అందమైన అలల రూపాన్ని సులభంగా అందించవచ్చు. ఈ పరికరంలోని లార్జ్ రౌండ్ వాల్యూమైజింగ్ బ్రష్ జుట్టుకు మంచి ఆకృతిని ఇస్తుంది. అలాగే దీనిలోని సాఫ్ట్ స్మూతింగ్ బ్రష్ చిక్కులను తొలగిస్తుంది. ఈ పరికరంలో అత్యాధునిక హీట్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. ఇది సెకెన్కు 40 సార్లు వేడిని చెక్ చేస్తుంది. దీంతో మీ జుట్టుకు వేడి కారణంగా ఎటువంటి డ్యామేజీ జరగదు. మొత్తంగా ఈ మల్టీ హెయిర్ స్టైలర్ సాయంతో బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా, జుట్టుకు ఎలాంటి డ్యామేజీ కాకుండా ఇంట్లోనే రింగులు తిరిగే ముంగురులను సొంతం చేసుకోవచ్చు. దీని ధర రూ. 45,900. (చదవండి: -
త్రిశంకుస్వర్గం
సూర్యవంశ రాజులలో త్రిశంకుడు ఒకడు. అతడు ధర్మపరాయణుడు, సద్గుణవంతుడు. ఒకసారి అతడికి చిత్రమైన కోరిక కలిగింది. తన మానవ శరీరంతోనే స్వర్గానికి వెళ్లాలనేదే ఆ కోరిక. ‘మహర్షీ! బొందితో స్వర్గానికి వెళ్లాలని నా కోరిక. అది నెరవేరడానికి తగిన యజ్ఞం నిర్వహించండి’ అని కులగురువు వసిష్ఠుడిని కోరాడు. ‘రాజా! నీ కోరిక అసమంజసమైనది, అస్వాభావికమైనది. నీ కోరిక తీర్చడానికి నేనెలాంటి సాయం చేయలేను’ అంటూ వసిష్ఠుడు నిరాకరించాడు.వసిష్ఠుడి నిరాకరణతో త్రిశంకుడు దిగులు చెందాడు. సింహాసనాన్ని విడిచిపెట్టి, దక్షిణ దిశగా ప్రయాణం ప్రారంభించాడు. ఆ ప్రయాణంలో అతడు వసిష్ఠుడి కుమారులను కలుసుకున్నాడు. తపస్సంపన్నులైన వసిష్ఠుడి నూరుగురు కుమారులు తన కోరిక ఈడేర్చగలరని భావించి, వారికి తన కోరికను తెలిపి, తగిన యజ్ఞాన్ని చేయమని కోరాడు.త్రిశంకుడి కోరిక విని వసిష్ఠ కుమారులు ఆగ్రహోదగ్రులయ్యారు.‘మా తండ్రి నిరాకరించిన తర్వాత అదే కోరికను నెరవేర్చమని మమ్మల్ని అడగటానికి నీకెంత ధైర్యం? నీ కోరిక కుర్రతనమో, వెర్రితనమో అర్థం కాకుండా ఉంది. ఇది అస్వాభావికం, అనుచితం. నువ్వు మూర్ఖుడివి, పాపాత్ముడివి. అందుకే మా తండ్రి నిరాకరించినా పట్టించుకోకుండా, అదేపనిగా పాకులాడుతున్నావు’ అని నిందించారు.వసిష్ఠ కుమారుల మాటలకు త్రిశంకుడు చిన్నబోయాడు. ‘మా కులగురువైన వసిష్ఠులవారు నిరాకరించారని, గురుపుత్రులైన మిమ్మల్ని ఆశ్రయించాను. మీరు నన్ను అర్థం చేసుకోకుండా దూషిస్తున్నారు. మీరు కూడా నా కోరికను తిరస్కరిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో నాకు ఒకటే ఉపాయం మంచిదనిపిస్తోంది. నా కోరికను నెరవేర్చగల మరో గురువు కోసం అన్వేషించడమే ఇప్పుడు నేను చేయదగిన పని’ అన్నాడు త్రిశంకుడు.త్రిశంకుడి మాటలకు వసిష్ఠపుత్రులు మండిపడ్డారు.‘పాపాత్ముడా! నువ్వు గురుద్రోహాన్ని తలపెడుతున్నావు. మీ వంశానికి తరతరాలుగా గురువైన మా తండ్రిని కాదని, మరో గురువును చూసుకుంటానని అంటున్నావు. ఈ క్షణం నుంచి నువ్వు చండాలుడివి అవుతావు’ అని శపించారు.త్రిశంకుడు విచారంతో రాజధానికి వచ్చాడు. రాత్రి అశాంతిగా నిద్రించాడు. రాత్రి గడిచేసరికి తాను చండాలుడైనట్లు కనుగొన్నాడు. బంగారు వన్నెతో ఉన్న అతడి శరీరం నల్లగా మారింది. స్ఫురద్రూపి అయిన త్రిశంకుడు కురూపిగా మారిపోయాడు. అతడి ఆకారాన్ని చూసి, మంత్రులు కూడా నమ్మలేకపోయారు. ప్రజలు హేళన చేశారు. తన పరిస్థితికి త్రిశంకుడు కుంగిపోయాడు. దీర్ఘంగా ఆలోచించాడు. తన దుస్థితిని తప్పించి, తన కోరికను తీర్చగలవాడు ఒక్కడే ఒక్కడు– మహా తపస్సంపన్నుడైన విశ్వామిత్రుడు అని తలచాడు. అతడి కోసం వెదుకులాడుతూ బయలుదేరాడు. త్రిశంకుడు విశ్వామిత్రుడి ఆశ్రమానికి చేరుకునే వేళకు విశ్వామిత్రుడు ధ్యానంలో ఉన్నాడు. కాసేపటికి విశ్వామిత్రుడు కళ్లు తెరిచాడు.ఎదురుగా దీనవదనంతో కురూపిగా ఉన్న త్రిశంకుడు కనిపించాడు. అతడిని దగ్గరకు పిలిచాడు. ‘నువ్వు అయోధ్య రాజువైన త్రిశంకుడివని నాకు తెలుసు. నీ పరిస్థితి ఎందుకు ఇలాగైంది? నువ్వు ఏదో దిగులుతో ఉన్నావు, కారణమేంటి? నీకు నేను చేయగల ఉపకారమేముంది?’ అని అడిగాడు.విశ్వామిత్రుడు ఆదరంగా పలకరించే సరికి త్రిశంకుడు కన్నీళ్లు పెట్టుకుని, చేతులు జోడించాడు.‘మహర్షీ! బొందితో స్వర్గానికి వెళ్లాలనేది నా కోరిక. మా కులగురువు వసిష్ఠుడు నా కోరికను నిరాకరించాడు. ఆయన పుత్రులను ఆశ్రయించాను. వారు కూడా నా కోరికను నిరాకరించారు. అంతేకాదు, నన్ను శపించారు. వారి శాపం వల్లనే ఇలా మారాను. నా కోరిక నెరవేర్చగల సమర్థులు మీరు మాత్రమే! అందుకే మిమ్మల్ని ఆశ్రయించాను. ఇక మీరే నాకు దిక్కు’ అన్నాడు.విశ్వామిత్రుడు అతడి దుస్థితికి జాలిపడ్డాడు. ‘నీ కోరికను నేను తీరుస్తాను’ అని అభయమిచ్చాడు.త్రిశంకుడి కోసం విశ్వామిత్రుడు ఒక మహాయాగం నిర్వహించాడు.విశ్వామిత్రుడి తపోబలం వల్ల త్రిశంకుడు బొందితోనే స్వర్గానికి చేరుకున్నాడు.త్రిశంకుడు స్వర్గానికి చేరడం ఇంద్రుడికి ఇష్టంలేక, ‘త్రిశంకూ! గురుపుత్రుల శాపం పొందిన నువ్వు స్వర్గంలో ఉండటానికి అనర్హుడవు. వెంటనే భూలోకానికి వెళ్లిపో!’ అన్నాడు. ఇంద్రుడి ఆజ్ఞతో దేవతలు అతడిని తోసేశారు.‘మహర్షీ! దేవతలు నన్ను తోసేశారు. నేను కిందకు పడిపోతున్నాను. కాపాడండి’ అంటూ త్రిశంకుడు ఆర్తనాదాలు చేశాడు. విశ్వామిత్రుడు ‘నువ్వు అక్కడే నిలు’ అని పలికి, తన మంత్రబలంతో త్రిశంకుడు ఉన్నచోటునే మరో స్వర్గాన్ని నిర్మించాడు. ‘త్రిశంకూ! ఇది నీ స్వర్గం. నీ పేరుతో త్రిశంకు స్వర్గంగా ప్రఖ్యాతి పొందుతుంది. ఇంద్రుడి స్వర్గం అంతరించిపోతే అంతరించవచ్చు గాని, నేను నీ కోసం నిర్మించిన స్వర్గం నిలిచి ఉంటుంది.’ అన్నాడు విశ్వామిత్రుడు.∙సాంఖ్యాయననువ్వు అయోధ్య రాజువైన త్రిశంకుడివని నాకు తెలుసు. నీ పరిస్థితి ఎందుకు ఇలాగైంది? నువ్వు ఏదో దిగులుతో ఉన్నావు, కారణమేంటి? నీకు నేను చేయగల ఉపకారమేముంది? -
సాధారణ దొంగ కాదు... సాహు
ఒక నగల దుకాణంలోకి చొరబడిన వ్యక్తిని సాధారణ దొంగగా భావించి, పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అతడు పేరుమోసిన ‘గుడి’దొంగ ప్రకాశ్కుమార్ సాహుగా తేలడంతో వారు అవాక్కయ్యారు. ఈ ఉదంతం 2012లో జరిగింది. ఛత్తీస్గఢ్లోని జమునాచౌక్ సమీపాన ఉన్న డాక్బంగ్లా ప్రాంతానికి చెందిన ప్రకాశ్కుమార్ సాహు 1996 నుంచి కొన్నేళ్ల పాటు దేవాలయాల్లోనే చోరీలు చేశాడు. ఇతడు ఆంజనేయస్వామి భక్తుడు కావడంతో ఆంజనేయుడి ఆలయాలు తప్ప మిగిలిన అన్ని ఆలయాల్లోనూ చేతివాటం చూపించాడు. ఎక్కువగా సాయిబాబా, అమ్మవార్ల ఆలయాలపైనే కన్నువేసేవాడు. ఇతగాడు 1998లో విజయవాడ కనకదుర్గ ఆలయంలోకి చొరబడి అమ్మవారి ముక్కుపుడక, కిరీటం సహా ఆభరణాలను చోరీ చేశాడు. ఒడిశాలోని పూరీ జగన్నాథస్వామి ఆలయంలో 2001 నవంబర్ 10 అర్ధరాత్రి చొరబడి, పదమూడో శతాబ్ది నాటి మదనమోహన, అంబస్యనారాయణ విగ్రహాలను ఎత్తుకుపోయాడు. ఈ రెండు సంఘటనల్లోనూ అప్పటి ముఖ్యమంత్రులు స్పందించాల్సి వచ్చింది.తొలినాళ్లల్లో కేవలం దేవాలయాలను మాత్రమే టార్గెట్గా చేసుకునే సాహు కొన్నాళ్లకు తన పంథా మార్చుకున్నాడు. జగన్నాథస్వామి ఆలయంలో జరిగిన చోరీ కేసులో సాహు అదే ఏడాది నవంబర్ 27న భువనేశ్వర్ రైల్వేస్టేషన్లో చిక్కాడు. ఈ విచారణ నేపథ్యంలోనే ఇతగాడు బరంపురంలోని పెద్దబజారు ప్రాంతంలో ఉన్న రెండు నగల దుకాణాలనూ లూటీ చేసినట్లు అంగీరించాడు. వీటికి ముందే భువనేశ్వర్లోని లింగరాజ్ దేవాలయంలోనూ దొంగతనానికి పాల్పడ్డాడు. జగన్నాథస్వామి, లింగరాజ్ దేవాలయాల చోరీ కేసుల్లో సాహు జైలు శిక్ష పడింది. ఇతడు ఏ దేవాలయాన్ని టార్గెట్గా చేసుకుంటాడో, అక్కడ ‘పని’ చేయడానికి ముందు భక్తుడిగా ప్రవేశించి ప్రార్థనలు చేస్తాడు. పూరీ గుడిలో చోరీకి వెళ్లిన సందర్భంలో విగ్రహాలు ముట్టుకునేప్పుడు, తీసేప్పుడు కళ్లు మూసుకుని చేశాడు. ఆపై భయపడిన సాహు మదనమోహన విగ్రహాన్ని భువనేశ్వర్ శివార్లలోని ఓ నూతిలో పడేశాడు. ఇతడు చేతివాటం ప్రదర్శించిన వాటిలో అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని పురాతన ఆలయాలూ ఉన్నాయి. ఇతడు కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బిహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లోనూ నేరాలు చేశాడు. 2010లో హైదరాబాద్ను టార్గెట్ చేసిన సాహు అనేక ఆలయాల్లో చోరీలు చేశాడు. ఆపై కేపీహెచ్బీ భాగ్యనగర్ కాలనీలోని వాసవి జ్యూలర్స్, జూబ్లీహిల్స్లోని శ్రీకృష్ణానగర్లో బాబూలాల్ హీరాచంద్ జైన్ జ్యూలరీ షాపుల్లో నేరాలు చేశాడు. 2012 అక్టోబర్ 11న ఉప్పల్లోని మహాలక్ష్మీ జ్యూలర్స్ను టార్గెట్ చేసుకున్న సాహు ముందే రెక్కీ చేశాడు. ఆ రోజు అర్ధరాత్రి అక్కడకు తన అనుచరులతో కలిసి వచ్చి ‘పని’ ప్రారంభించాడు. తన వెంట తెచ్చుకున్న పరదాను జ్యూలరీ షాపు ముఖద్వారం రోడ్డుపైకి కనిపించకుండా అడ్డుగా కట్టాడు. దుకాణం పైఅంతస్తులో ఉండే యజమాని కిందికి రాకుండా దర్వాజా, గ్రిల్స్ను బిగించేశాడు. తొలుత జ్యూలరీ షాపు గ్రిల్స్కు వేసిన తాళాలను కట్టర్లతో కట్ చేశాడు. షట్టర్ మధ్య భాగంలో గ్యాస్ కట్టర్తో కట్ చేసి, ఆ భాగం తెరిచి దుకాణం లోపలికి ప్రవేశించి, రెండు సీసీ కెమెరాలను ధ్వంసం చేశాడు. అయితే, ఆలోపే ఒక దాంట్లో సాహు కదలికలు రికార్డు అయ్యాయి. అనంతరం ఇన్వర్టర్ను ఆఫ్ చేశాడు. లాకర్ను కట్టర్తో కట్ చేస్తుండగా పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది.సాహు ఈ దుకాణంలోని ఇన్వర్టర్ విషయంలో చిన్న పొరపాటు చేశాడు. యజమాని హస్తామల్ శర్మ నివసించేది షాపు పైన ఉన్న ఇంట్లోనే. దుకాణానికి, ఇంటికి కలిపి ఒకే ఇన్వర్టర్ను ఏర్పాటు చేసుకున్నారు. షాపులోకి ప్రవేశించిన సాహు గ్యాంగ్ అవసరం లేకపోయినా ఇన్వర్టర్ వైరు కట్ చేసింది. ఆ రోజు అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో ఉప్పల్ ఏరియాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అప్పటికే ఇన్వర్టర్ వైర్ కూడా తెగి ఉండటంతో అదికూడా పని చేయలేదు. ఉక్కపోతతో మెలకువ వచ్చిన శర్మ బాల్కనీలోకి వచ్చి చూశాడు. గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి పొగలు కనిపించడంతో అప్రమత్తమై చుట్టుపక్కల వారితో పాటు పోలీసులకు సమాచారం అందించాడు. శర్మ పిలుపుతో అప్రమత్తమైన చుట్టుపక్కల వారు ఇళ్లల్లో లైట్లు వేశారు. ఇది గమనించిన సాహు అనుచరులు పరారవగా, ఆ అవకాశం లేని సాహు దుకాణం మెట్ల కిందే నక్కాడు. చుట్టుపక్కల వారు దుకాణం వద్దకు చేరుకోవడంతో పాటు అదే సమయంలో పోలీసులూ వచ్చారు. అప్పటి వరకు మెట్ల కింద నక్కిన సాహు ఈ హడావుడితో కంగారు పడ్డాడు. బయటకు వచ్చి జనం మధ్య నుంచి కొంతదూరం వెళ్లి ఒక్కసారిగా పరిగెత్తడం ప్రారంభించాడు. దీంతో స్థానికులు, పోలీసులు వెంబడించి అతడిని పట్టుకుని పోలీసుస్టేషన్కు తరలించారు. మామూలు దొంగగా భావించిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఇతడు సాహు అనే విషయం బయటపడింది. దీంతో మల్కాజ్గిరి సెంట్రల్ క్రైమ్ స్టేషన్కు తరలించారు. అప్పట్లో గుడులు, జ్యూలరీ దుకాణాలు కలిపి 13 చోరీలు అంగీకరించిన సాహు ఆ సొత్తును మహారాష్ట్రలో ఉన్న మిత్రుడి వద్ద దాచినట్లు చెప్పాడు. ఆఖరుసారిగా సాహు 2023 ఫిబ్రవరిలో కేరళలోని కొచ్చి పోలీసులకు చిక్కాడు. -
ప్రెగ్నెన్సీ టైంలో ఆస్పిరిన్ మందులు వాడొచ్చా..? బిడ్డకు సురక్షితమేనా?
నేను ఐదు నెలల గర్భవతిని, వయసు ముప్పైఏడు. డాక్టర్ రక్తాన్ని పలుచగా చేసే మందులు ఆస్పిరిన్ టాబ్లెట్లు వాడమన్నారు. ఇవి బిడ్డకు సురక్షితమేనా? అలాగే ఈ వయస్సులో గర్భధారణలో సమస్యలు రాకుండా ఉండేందుకు నేను ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?– సుజాత, విజయవాడమీ ఆందోళన సహజమే. ముప్పై ఐదు ఏళ్లకు పైబడిన గర్భిణులను మేము అధిక ప్రమాద గర్భిణులుగా పరిగణిస్తాం. ఎందుకంటే వయస్సు పెరిగేకొద్దీ తల్లి, శిశువుకు కొన్ని ప్రత్యేక సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. మీరు అడిగిన మందుల విషయం మొదట చెబుతాను. తక్కువ మోతాదులో ఇచ్చే ఆస్పిరిన్ టాబ్లెట్ చాలా సురక్షితం. ఇది రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. అలాగే గర్భధారణలో వచ్చే కొన్ని సమస్యలను తగ్గిస్తుంది. డాక్టర్ సూచించిన విధంగా తీసుకుంటే ఇది తల్లి, బిడ్డ ఇద్దరికీ మేలు చేస్తుంది. ఈ వయస్సులో గర్భధారణలో కొన్ని సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. మొదటి మూడు నెలల్లో గర్భస్రావం వచ్చే అవకాశం పెరుగుతుంది. శిశువులో జన్యు సంబంధిత లోపాలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. గర్భధారణ సమయంలో రక్తపోటు, షుగర్ వంటి సమస్యలు తల్లికి రావచ్చు. కొన్నిసార్లు సిజేరియన్ డెలివరీ అవసరం అవుతుంది. తల్లిలో ఉన్న ఆరోగ్య సమస్యల వలన శిశువు పెరుగుదలలో లోపం రావచ్చు, ముందుగా పుట్టే అవకాశం కూడా ఉంటుంది. అలా పుడితే ప్రత్యేక శిశు సంరక్షణ అవసరం అవుతుంది. ఈ సమస్యలను తగ్గించుకోవడం మీ చేతిలోనే ఉంది. క్రమం తప్పకుండా గర్భధారణ పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్ చెప్పినట్టుగా ఫాలో అప్ తప్పనిసరిగా చేయాలి. అల్ట్రాసౌండ్ స్కాన్లు చేయించుకోవడం ద్వారా శిశువు ఆరోగ్యాన్ని పర్యవేక్షించవచ్చు. అవసరమైతే జన్యు పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా డాక్టర్ సూచించే ఔషధాలను సమయానికి తీసుకోవాలి. ఈ వయస్సులో గర్భధారణ కొంత రిస్క్ ఉన్నప్పటికీ, భయపడాల్సిన పనిలేదు.నా వయసు ఇరవైనాలుగు. ఇది నా రెండవ ప్రెగ్నెన్సీ, ప్రస్తుతం నాలుగో నెలలో ఉన్నాను. నా మొదటి కాన్పు, ముప్పై వారాల సమయంలో ప్రీటర్మ్ డెలివరీ జరిగింది. ఈ గర్భధారణలో మళ్లీ అలాంటి సమస్య రాకుండా సర్జరీ చేయాలని డాక్టర్ సూచించారు. గర్భధారణ సమయంలో శస్త్రచికిత్స చేయించుకోవాలంటే నాకు భయంగా ఉంది. ఇది నిజంగా అవసరమా? ఈసారి కూడా నాకు ముందుగా పుట్టిన బిడ్డ అవుతాడా? ఈ ప్రక్రియ తర్వాత నేను తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?– వనజ, నర్సాపురంమీ ప్రశ్న చాలా ముఖ్యమైనది. గతంలో ప్రీటర్మ్ డెలివరీ జరిగిన మహిళల్లో, మళ్లీ అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే మేము ముందుగానే జాగ్రత్తలు సూచిస్తాం. గర్భాశయానికి దిగువ భాగాన్ని ‘సర్విక్స్’ అంటారు. సాధారణంగా ఇది పొడవుగా, బిగుతుగా మూసి ఉండాలి. ప్రసవ సమయం దగ్గర పడే సరికి మాత్రమే ఇది చిన్నదవుతూ తెరుచుకోవాలి. కాని, కొంతమంది మహిళల్లో, ముఖ్యంగా మీరు చెప్పినట్లుగా నెలలు నిండక ముందే బిడ్డ పుట్టిన అనుభవం ఉన్నవారిలో, ఇది గర్భధారణ పూర్తయ్యే లోపే చిన్నదై తెరుచుకోవడం ప్రారంభమవుతుంది. దీనిని సర్వికల్ ఇన్సఫిషియెన్సీ అంటారు. ఈ పరిస్థితిని సకాలంలో గుర్తించకపోతే, మళ్లీ ప్రీటర్మ్ డెలివరీ జరగవచ్చు. ఈ పరిస్థితిని తెలుసుకోవడానికి సర్వికల్ లెంగ్త్ స్కాన్ అనే ఒక సాధారణ వజైనల్ అల్ట్రాసౌండ్ పరీక్ష చేస్తాం. ఇందులో సర్విక్స్ పొడవు, బిగుతు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. అది తక్కువగా ఉంటే లేదా బలహీనంగా కనిపిస్తే, రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ప్రొజెస్టెరోన్ మందులు ఇవ్వడం, రెండోది సర్విక్స్ను బిగుతుగా కట్టే చిన్న శస్త్రచికిత్స చేయడం. ఇందులో సర్విక్స్ను ప్రత్యేకమైన దారంతో కట్టి, గర్భధారణ పూర్తయ్యేంత వరకు బిగుతుగా ఉంచుతాం. ఇది సురక్షితమైన పద్ధతి, అనేకమందికి మంచి ఫలితాలను ఇచ్చింది. ఈ చికిత్స చేసిన తర్వాత మీరు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. వీలైనంత వరకు బెడ్రెస్ట్ తీసుకోవాలి, భారమైన పనులు చేయకూడదు, బరువులు అస్సలు ఎత్తకూడదు. లైంగిక చర్యలు నివారించాలి. డాక్టర్ చెప్పినట్లుగా రెగ్యులర్గా ఫాలోఅప్ చేయాలి. తరచు స్కాన్లు చేయించుకోవాలి, బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతున్నదీ లేనిదీ చూడాలి. ఈ విధంగా ముందుగానే చర్యలు తీసుకుంటే, గర్భధారణను సురక్షితంగా కొనసాగించే అవకాశం చాలా పెరుగుతుంది. నిజానికి ఈ శస్త్ర చికిత్స లేదా ప్రొజెస్టెరోన్ వాడకం తర్వాత చాలామంది మహిళలు ముప్పై ఏడు వారాలు లేదా అంతకన్నా ఎక్కువ వరకు గర్భధారణ కొనసాగించి, ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిస్తున్నారు. డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: భావోద్వేగాలను అదుపు చేసుకోవాలంటే..!) -
స్లీప్..స్క్రీన్..స్టడీ..!
ఈతరం విద్యార్థులు ప్రతిరోజూ పరీక్షలు, అసైన్మెంట్లు, పరీక్షలతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి, బెస్ట్ రిజల్ట్స్కు ఉపయోగపడే అంశాలు నిద్ర, స్క్రీన్ టైమ్. స్టడీ హేబిట్స్. ఏమాత్రం వ్యాయామం చేయకుండా అర్ధరాత్రి వరకూ స్క్రీన్ చూసుకుంటూ గడిపేస్తే ఫోకస్ తగ్గిపోతుంది, ఒత్తిడి పెరుగుతుంది, అకడమిక్ పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది. స్లీప్, స్క్రీన్, స్టడీ మధ్య బ్యాలెన్స్ ఉన్నప్పుడే మీరు కోరుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. అందుకే ఈ రోజు వాటిని ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలుసుకుందాం. 1. నిద్రతోనే మేధస్సు పునరుజ్జీవంనిద్ర మన జీవితంలో విడదీయలేని భాగం. ఇది మన ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన అంశం. మానసిక శక్తి, రోజువారీ పనులు నిర్వహించడంలోనూ కీలకమైన పాత్ర పోషిస్తుంది. అందుకే విద్యార్థుల విజయంలో హార్డ్ వర్క్తో పాటు వారి నిద్ర కూడా ముఖ్యమైన అంశం.మనం పగలు నేర్చుకున్న అంశాలు రాత్రి నిద్రలో మెదడులో నిక్షిప్తమవుతాయి. నిద్ర తగ్గితే మెమరీ కెపాసిటీ కూడా 40 శాతం తగ్గుతుందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్యయనాల్లో వెల్లడైంది.నిద్ర అనేది మనం నిర్ణయాలు తీసుకోవడానికి, భావోద్వేగాలను నియంత్రించడానికి అవసరమయ్యే మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ను ప్రభావితం చేస్తుంది. నిద్ర లేని పిల్లలు ఎక్కువగా కోపం, తీరని భావోద్వేగాలు అనుభవిస్తారు. ఇది వారి ఫోకస్ను, నమ్మకాన్ని కూడా దెబ్బతీయవచ్చు.2. నిద్ర, మార్కులు తగ్గించే స్క్రీన్ టైమ్ ఈ డిజిటల్ యుగంలో ప్రతి చోటాస్క్రీన్లు ఉన్నాయి. పిల్లలు స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు లేదా వీడియో గేమ్స్ పైనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇది బిడ్డ పుట్టినప్పటి నుంచీ వారి అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. స్క్రీన్లు ఉత్పత్తి చేసే బ్లూ లైట్ మెలటోనిన్ హార్మోన్ను కదిలించి నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. నిద్రకు వెళ్లడానికి గంట ముందు వరకూ స్క్రీన్ చూస్తుంటే అది నిద్రపట్టడాన్ని 90 నిమిషాలు ఆలస్యం చేస్తుంది. రీల్స్, వీడియోలు చూడటం వల్ల సంతోషాన్నిచ్చే డోపమైన్ హార్మోన్ విడుదలవుతుంది. దీంతో మళ్లీ మళ్లీ చూడాలనే కోరిక పెరుగుతుంది. స్క్రీన్కు అడిక్ట్ అవుతారు. దీంతో చదువుకునే సమయం, కుటుంబంతో గడిపే సమయం తగ్గిపోతుంది. పిల్లల స్క్రీన్ టైమ్ రోజుకు మూడు గంటలుంటే వారి అకడమిక్ స్కోర్లు తగ్గినట్లు అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ అధ్యయనంలో వెల్లడైంది. 3. ఫోకస్, రిటెన్షన్ మెరుగుపరచడంనిద్రను, స్క్రీన్ టైమ్ను సరిగా సెట్ చేస్తేనే విద్యార్థులు సరిగా చదవగలుగుతారని, మార్కులు పెరుగుతాయని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. 25 నిమిషాల చదువు తర్వాత ఐదునిమిషాల విరామం తీసుకోవడం, మానసిక అలసట నుండి రీచార్జ్ కావడం అకడమిక్ సక్సెస్లో చాలా కీలకమైన విషయం.ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కోసం మొక్కుబడిగా చదవడం కంటే ఇష్టంగా చదవడం, చదివిన దాన్ని ఇతరులతో చర్చించడం వల్ల సమాచారం నిలుపుకోగల శక్తి 50 శాతం పెరుగుతుంది. పోమోడోరో టెక్నిక్ ఉపయోగించండి. 25 నిమిషాలు ఫోకస్తో చదివి, 5 నిమిషాలు విరామం తీసుకోండి. ఇది మెదడుకు విశ్రాంతి ఇస్తుంది.ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం అలవాటు చేసుకోండి. కనీసం7–8 గంటలు నిద్రపోవాలి.నిద్రకు ఒక గంట ముందు మొబైల్, ల్యాప్టాప్, టీవీ వాడకండి. బ్లూ లైట్ నిద్ర హార్మోన్ మెలటోనిన్ను తగ్గిస్తుంది.మల్టీ టాస్కింగ్ తగ్గించండి. ఒకేసారి ఒక్క పనిపై ఫోకస్ చేయండి. చదువుతో పాటు మొబైల్ చూడడం ఏకాగ్రతను తగ్గిస్తుంది. యాక్టివ్ లెర్నింగ్ చేయండి. సబ్జెక్ట్ను మళ్లీ మళ్లీ చదవకుండా, ప్రశ్నలు వేసుకుని సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి.రోజూ వ్యాయామం చేయండి. 20–30 నిమిషాల వాకింగ్, యోగా లేదా క్రీడలు ఆడడం ఏకాగ్రతను పెంచుతుంది.చదువుల మధ్యలో ఐదునిమిషాలు మైండ్ఫుల్ బ్రేక్లు తీసుకోండి. డీప్ బ్రీతింగ్ లేదా మెడిటేషన్ చేయండి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.ఒకేసారి ఎక్కువగా చదవకండి. కొన్ని రోజులకు ఒకసారి రివిజన్ చేస్తే మెదడులో నిలుస్తుంది.జంక్ ఫుడ్ తగ్గించి, పళ్లు, గింజలు, కూరగాయల్లాంటి ఆరోగ్యకరమైన ఆహారం ఎక్కువగా తినండి. ఇవి మెదడుకు శక్తినిస్తాయి.రోజులో కనీసం రెండు గంటలు మొబైల్ లేకుండా గడపండి. ఆ టైమ్లో పుస్తకం చదవండి లేదా కుటుంబంతో మాట్లాడండి. (చదవండి: నూడుల్స్ తినడమే ఒక గేమ్!) -
థీమ్డ్ మిర్రర్స్..! అదంలా తళతళలాడేలా అలంకరిద్దాం ఇలా..
ఒకప్పుడు మన రూపాన్ని చూసుకోవడానికి మాత్రమే ఇంట్లో అద్దాలు ఉండేవి. ఇప్పుడు ఇంటి అలంకరణలో అద్దం అంతర్భాగంగా మారింది. ఇంటీరియర్ థీమ్కి అనుగుణంగా థీమ్డ్ మిర్రర్స్ను డిజైన్ చేస్తున్నారు నిపుణులు. వీటి రూపకల్పనలోనే డిజైనర్లు తమదైన ప్రతిభ చూపుతున్నారు. ఇంటికి వినూత్న కళను తీసుకువస్తున్నారు. మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే డెకరేషన్ వస్తువులుగా మారిన అద్దాలను సరైన థీమ్తో ఎంపిక చేసుకుంటే, అది కేవలం అద్దం మాత్రమే కాకుండా ఒక కళాఖండంగానూ మారుతుంది. పెద్ద గదులకు థీమ్ మిర్రర్స్వింటేజ్ థీమ్ మిర్రర్ డిజైన్స్లో పాతకాలపు డిజైన్లు కనిపిస్తాయి. కార్వింగ్తో ఉండే వుడ్ లేదా బ్రాస్ ఫ్రేమ్స్ 19వ శతాబ్దపు ఛాయలు కనిపిస్తాయి. బొహిమియన్ స్టైల్లో చూపులను తిప్పుకోనివ్వని రంగులు, కార్వింగ్ డిజైన్లు కనువిందు చేస్తాయి. చిన్నగదులకు సింపుల్ మిర్రర్స్అద్దాలు అలంకరణలో కీలకం అని, నచ్చింది కదా అని మన ఇంటి గదుల నిర్మాణం గురించి ఆలోచించకుండా ఎంచుకోవచ్చు. చిన్న గదులకు క్లియర్ లైసెన్స్, సింపుల్ డిజైన్, న్యూట్రల్ కలర్స్, మెటల్ ఫ్రేమ్స్ చక్కగా నప్పుతాయి. ఇవి రూ.500 నుంచి లభిస్తున్నాయి.ప్రకృతి నుంచి స్ఫూర్తి పొందే మిర్రర్స్పువ్వులు, లతలు, ఆకులతో మిర్రర్ ఔట్ డిజైన్స్, వుడ్ టెక్స్చర్, ప్రకృతిని ప్రతిబింబించే రూపాలు వీటిలో కనిపిస్తాయి. ఇవి పెద్ద హాల్, డైనింగ్ ఏరియాలో సెట్ అవుతాయి. కార్టూన్ క్యారెక్టర్స్, యానిమల్ షేప్స్వి కిడ్ రూమ్ డెకరేషన్కు బాగా సరిపోతాయి. ఉన్నదాని కన్నా గది విశాలంగా చూపాలంటే థీమ్డ్ మిర్రర్ వర్క్ బాగా ఉపయోగపడుతుంది. ఇంటి వాల్ కలర్, ఫర్నిచర్తో సరిపోయేలా మిర్రర్ డిజైన్ ఎంచుకోవాలి. ఇలాంటివి ఆన్లైన్ మార్కెట్లోనూ దొరుకుతున్నాయి. మోడల్, వింటేజ్ స్టైల్ థీమ్ను బట్టి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ మార్కెట్లో మిర్రర్స్ లభిస్తున్నాయి. ఎన్నార్(చదవండి: చేపలంటే నోరూరించే వంటకాలు కాదు..! ఇకపై ఫ్యాషన్..) -
గగన యంత్రడికి ఘనమైన వీడ్కోలు
మనుషులకైనా, యంత్రాలకైనా ‘విధుల విరమణ’ వీడ్కోలు ఇవ్వటం అన్నది భావోద్వేగ భరితంగా ఉంటుంది. ఆగస్టు 25న మిగ్–21 యుద్ధ విమానాలకు చివరి టేకాఫ్తో లాంఛనంగా వీడ్కోలు పలకటానికి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ స్వయంగా ఒక మిగ్–21ను నడిపారు. ఆ క్షణాలలో అక్కడున్న వారి హృదయాలన్నీ భారమైన కళ్లతో ఆ దృశ్యాన్ని వీక్షించాయి. ‘మిగ్–21’ను కనుక మనిషి అనుకుంటే.. యుద్ధ యోధుడు అనాలి. ఆయుధం అనుకుంటే కనుక... ఆకాశపు ఏకే–47 అనాలి. ఎన్నో యుద్ధాలలో భారత్ వెన్నుదన్నుగా ఉన్న ఈ గర్జించే ‘గన్ను’, కనిపించని టార్గెట్ను సైతం ఒక్క చూపుతో భస్మం చేసే ఈ ‘కన్ను’... రూపురేఖలకు విహంగమే కాని, ఇండియన్ ఆర్మీలో సకల బలాల, దళాల ‘అక్షౌహిణి!’ ఇండియన్ ఎయిర్ఫోర్స్కు ఆరు దశాబ్దాలకు పైగా దోస్త్ మేరా దోస్త్!!పాం ర్స్... కోబ్రాస్భారత వైమానిక దళం (ఐ.ఎ.ఎఫ్) ఈ నెల 26న మిగ్–21 యుద్ధ విమానాలకు ఘనంగా వీడ్కోలు పలకబోతోంది. దీనర్థం – ఇకపై ఈ ఫైటర్ జెట్లను మన ఆర్మీ ఏ విధమైన విధులకూ ఉపయోగించదు. 62 ఏళ్లుగా సైన్యానికి సేవలు అందిస్తున్న మిగ్–21 లకు స్వస్తి చెప్పటం కోసం భారత ప్రభుత్వం చండీగఢ్లో ఆ రోజున ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. ఐ.ఎ.ఎఫ్లో ప్రస్తుతం మిగ్–21 విమానాలకు చెందిన స్క్వాడ్రన్లు రెండు మాత్రమే ఉన్నాయి. ఒకటి : ‘పాంథర్స్’ (23వ స్క్వాడ్రన్), రెండు : ‘కోబ్రాస్’ (3వ స్క్వాడ్రన్). రాజస్థాన్లోని బికనీర్కు సమీపంలో – ‘నల్’ ఎడారి యుద్ధ విమానాల స్థావరం నుంచి ఇవి పని చేస్తుంటాయి. రెండు లేదా అంతకంటే ఎక్కువ విమానాలు, నిర్వహణా సిబ్బంది, వాటిని నడిపే పైలట్లతో కూడిన విభాగాన్ని ‘స్క్వాడ్రన్’ అంటారు. వేరియంట్లలో చివరి మిగ్ఐ.ఎ.ఎఫ్. ఈ ఆరు దశాబ్దాలలో పలు రూపాంతర (వేరియంట్) రకాలైన మిగ్–21లను యుద్ధాలలో ప్రయోగించింది. అవి : మిగ్–21 ఎఫ్, మిగ్–21 పిఎఫ్, మిగ్–21 ఎఫ్.ఎల్, మిగ్–21 ఎం, మిగ్–21 బిస్, మిగ్–21 బైసన్. చివరి వేరియంట్ అయిన ఈ బైసన్ మిగ్లనే ఇప్పుడు మన వైమానిక దళం పక్కన పెట్టబోతున్నది. స్క్వాడ్రన్ 3, స్క్వాడ్రన్ 23లో కలిపి ప్రస్తుతం మొత్తం 36 మిగ్–21 బైసన్లు ఉన్నాయి. అరవై ఏళ్లకు పైగా భారత వైమానిక దళానికి వెన్నెముకగా నిలిచిన ఈ మిగ్–21 యుద్ధ విమానాలలో ఒక దానిని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ గత నెలలోనే నడిపి మిగ్లకు లాంఛనంగా వీడ్కోలు పలికారు. (పైన ఫోటోలు). రష్యన్ సంతతికి చెందిన ఈ ఫైటర్ జెట్పై శిక్షణ పొందిన పైలట్లు ఆ వీడ్కోలు క్షణాలలో భావోద్వేగానికి లోనయ్యారు. నిజానికి భారత వైమానిక దళం దశల వారీగా మిగ్–21ల వాడకాన్ని తగ్గించుకుంటూ వస్తోంది. ఆ క్రమంలో ఇది చిట్టచివరి ఉపసంహరణ. ప్రధానంగా భద్రతా సంబంధ కారణాలతో ఐ.ఎ.ఎఫ్. వీటిని నిలిపివేస్తోంది. టెక్నాలజీ పాతపడి పోవటం, ఫైటర్ స్క్వాడ్రన్లను ఆధునికీకరించవలసిన అవసరం ఏర్పడటం వల్ల కూడా మిగ్–21 ల నుంచి భారత్ ఆధునాతన దేశవాళీ ఎల్.సి.ఎ. ఎంకె–1ఎ ఫైటర్ జెట్లకు మళ్లుతోంది. రష్యా నుంచి తొలి మిగ్మిగ్–21 అన్నది 1950లలో సోవియట్ యూనియన్ వృద్ధి చేసిన సూపర్సోనిక్ యుద్ధ విమానం. ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి అయిన జెట్గా కూడా దీనికి రికార్డు ఉంది. భారత్ మొట్టమొదట 1963లో సోవియెట్ యూనియన్ నుండి మిగ్–21ను కొనుగోలు చేసింది. ఆ తర్వాత, రష్యా నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని, విడి పరికరాలు దిగుమతి చేసుకుని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ (హాల్)లో స్వయంగా మిగ్లను తయారు చేసుకోవటం మొదలుపెట్టాం. మిగ్–21లోని వేరియంట్లన్నీ భారత్ వృద్ధి చేసుకున్నవే. అంతేకాదు, ఐ.ఎ.ఎఫ్. దగ్గరున్న మొత్తం 850 మిగ్–21లలో అత్యధికంగా ‘హాల్’ ఉత్పత్తి చేసినవే. 1987 తర్వాత çహాల్లో మిగ్–21ల తయారీ వివిధ కారణాలతో ఆగిపోయింది. రష్యా 1986లోనే పూర్తి స్థాయిలో మిగ్ల ఉత్పత్తిని నిలిపివేసింది. మిగ్–21ల ఘన చరిత్ర వియత్నాం యుద్ధం (1955–1975) : ఉత్తర వియత్నాం వైమానిక దళం మిగ్–21 లను విస్తృతంగా ఉపయోగించి అమెరికాపై విజయం సాధించింది. 1966లో అమెరికా డ్రోన్లను కూల్చేసింది! అరబ్–ఇజ్రాయెల్ ఘర్షణలు: 1967లో జరిగిన ఆరు రోజుల యుద్ధంలో (జూన్ 5 నుంచి 10 వరకు), ఆ తర్వాతా జరిగిన ఘర్షణల్లో ఈజిప్ట్, సిరియా, ఇరాక్... ఇజ్రాయెల్పై మిగ్–21లతో తలపడ్డాయి. అయితే ఆరు రోజుల యుద్ధం ప్రారంభంలోనే చాలా వరకు మిగ్లు ధ్వంసం అయ్యాయి!ఇరాన్–ఇరాక్ యుద్ధం (1980–1988):ఇరాన్, ఇరాక్ రెండూ కూడా ఈ ఎనిమిదేళ్ల దీర్ఘ పోరాటంలో పరస్పరం మిగ్–21లను ప్రయోగించుకున్నాయి. సిరియా అంతర్యుద్ధం, లిబియా ఘర్షణలు: సిరియన్ వైమానిక దళం, లిబియా ఘర్షణల్లో లిబియా వైమానిక దళం మిగ్–21లను ఉపయోగించాయి. భారత్–పాక్ యుద్ధాలు 1965లో జరిగిన ఇండో–పాక్ యుద్ధంలో మిగ్–21ల పాత్ర పరిమితంగానే ఉంది. గగనతల దాడులేమీ జరగలేదు. 1971లో మిగ్–21 లు భారత్కు గగనతల పోరాటంలో ఆధిక్యతను చేకూర్చాయి. పాక్ విమానాలను కూల్చేశాయి. 1971లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పాకిస్తా¯Œ సేనలపై భారత్ మిగ్–21 యుద్ధ విమానాలు విరుచుకుపడిన తీరు ప్రపంచ దేశాలను సైతం విస్మయపరచింది. డిసెంబర్ 13వ తేదీన ఢాకాలోని గవర్నర్ అధికార భవనంపై భారత్ మిగ్–21 బాంబులతో దాడిచేసింది. ఆ మర్నాడే గవర్నర్ తన పదవికి రాజీనామా చేశారు. తర్వాతి రోజే 93,000 మంది పాక్ సైనికులు భారత సైన్యం ఎదుట లొంగిపోయారు.1999 కార్గిల్ వార్లో ఎత్తయిన ప్రదేశాల నుండి ఉపరితల దాడులకు భారత్ మిగ్–21 లను సంధించింది. వైమానిక రక్షణ కార్యకలాపాల కోసం కూడా వీటిని ఉపయోగిం చింది. ఆపరేష¯Œ సఫేద్ సాగర్లో భాగంగా ఆనాడు పాకిస్తానీ అట్లాంటిక్ విమానాన్ని మిగ్ ఒక్క దెబ్బతో నేలమట్టం చేసింది. 2019లో పాక్తో ఉద్రిక్తతలు పెరిగినప్పుడు పాక్పై భారత్ జరిపిన భారీ దాడిలో మిగ్–21లు కీలక పాత్ర పోషించాయి. అత్యంత శక్తిమంతమైన ఎఫ్–16ను సైతం నేల కూల్చాయి. మిగ్కు ఆ పేరెలా వచ్చింది?మాస్కోలో 1939లో ప్రారంభమైన ‘మికోయన్’ ఏరోస్పేస్ కంపెనీ సంస్థాపకుల పేర్ల నుండి మిగ్–21 అనే మాట వచ్చింది. ఇందులో 21 అనేది మిగ్ విమానం మోడల్ నెంబరు. ‘మికోయన్’ సంస్థ.. ఆర్టెమ్ మికోయన్, మిఖాయిల్ గురేవిచ్ అనే ఇద్దరు ఏరో డిజైనర్ల ఆలోచన నుంచి ఆవిర్భవించింది. అన్నీ ఇన్నీ కాని ప్రత్యేకతలు!మిగ్లు తేలికపాటి, సూపర్సోనిక్ ఫైటర్ జెట్లు. గగనతలం నుంచి గగనతలంలోకి, గగనతలం నుండి భూతలంలోకి ఇవి సులువుగా మెరుపు దాడులు చేయగలవు. బాంబులను, మిసైళ్లను మోసుకుపోగలవు. సెకనుకు 250 మీటర్ల వేగంతో నిట్టనిలువుగా కూడా ప్రయాణించి శత్రు దేశాలను భయభ్రాంతులకు గురి చేయగలవు. కొన్ని సాంకేతికతలైతే అత్యంత అధునాతనమైనవి. కంటికి కనిపించని సుదూర లక్ష్యాలపైనా నేరుగా దాడి చేయగల రాడార్ వ్యవస్థ మిగ్లలో ఉంది. ప్రస్తుతం 60 కంటే ఎక్కువ దేశాల వాయుసేనల్లో 11,000కు పైగా మిగ్–21 విమానాలు పని చేస్తున్నాయి. ఇజ్రాయెల్ దొంగిలించింది!భారత వైమానిక దళానికి చేరిన తొలి సోపర్సోనిక్ ఫైటర్ జెట్లు మిగ్–21 లు. 1960–70 ల మధ్య భారత్కు గగనతల యుద్ధంలో ఇవి శక్తిమంతమైన అదనపు బలగాలు అయ్యాయి. పశ్చిమ దేశాలకు పక్కలో బల్లెంలా మారాయి. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ మిగ్–21ల టెక్నాలజీని దొంగిలించిందని కూడా అంటారు! ఒకసారి వీటిని నడిపిన పైలట్లు మరే విమానాన్నీ నడపటానికి ఆసక్తి చూపరనే మాటా వినిపిస్తుంటుంది. గాలిలో చురుగ్గా కదలటం, అత్యధిక వేగాన్ని అందుకోవటం మిగ్లలోని మరికొన్ని ప్రత్యేకతలు. సాధారణ యుద్ధ విమానాలు ‘ఫ్లయ్–బై–వైర్’ అనే సిస్టమ్తో వేగాన్ని నియంత్రించుకుంటాయి. మిగ్లు గేర్ సిస్టమ్తో పని చేస్తాయి. దాంతో గంటకు 2000 కి.మీ. వేగాన్ని కూడా ఇవి అందుకోగలవు! అంత వేగంలో పైలట్ పట్టు కోల్పోవటమే తరచు జరిగే మిగ్ల ప్రమాదాలకు కారణం అని నిపుణులు చెబుతున్నారు. ‘ఎగిరే శవపేటికలు’!మొదట్లో గగన సింహాలై గర్జించి, విజయ చిహ్నాలుగా గుర్తింపు పొందిన మిగ్–21 లు తర్వాత్తర్వాత తరచు ప్రమాదాలకు గురవుతూ పైలట్లు, పౌరులు మరణిస్తుండటంతో ‘ఎగిరే శవపేటిక’లు అనే అప్రతిష్ఠను, అపకీర్తిని మోయవలసి వచ్చింది. కాలం చెల్లిన మిగ్లను ఇంకా ఎన్నేళ్లు ఉపయోగిస్తాం అనే విమర్శలు కూడా ఎక్కువయ్యాయి. మరోవైపు సుఖోయ్, రఫేల్, తేజస్ వంటి యుద్ధ విమానాల రాకతో వీటికి ప్రాముఖ్యం తగ్గిపోయింది. భారత వాయుసేన ఆధ్వర్యంలోని 872 మిగ్ విమానాల్లో 482 విమానాలు పలు ప్రమాదాల్లో నేలకూలాయని 2012లోనే ఆనాటి రక్షణమంత్రి ఏకే ఆంటోని రాజ్యసభలో వెల్లడించారు కూడా. ఆనాటి లెక్కల ప్రకారమే చూసుకున్నా... 171 మంది పైలట్లు, 39 మంది పౌరులు మరణించారు. పైగా భారత వాయుసేనలో అత్యధికంగా కూలిపోయిన యుద్ధ విమానాలు కూడా ఇవే. యాదృచ్ఛికంగా – 1963లో తొలిసారిగా ఎక్కడైతే భారత వాయుసేనలోకి వీటిని తీసుకుని జాతికి అంకితం చేశారో అదే వైమానిక స్థావరంలో తుది వీడ్కోలు పలకనున్నారు. మిగ్ల స్థానంలో ‘ఎంకె–1ఎ’లుభారత వాయు సేన 1963 నుండి మిగ్–21లను ఉపయోగిస్తోంది. ఇప్పుడు వీటి స్థానంలోకి, దేశీయంగా తయారౌతున్న ఎల్.సి.ఎ. తేజస్ ఎంకె–1ఎ విమానాలను వినియోగంలోకి తేబోతోంది. ‘హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్’ (హెచ్.ఎ.ఎల్.) ఈ ఎంకె–1ఎ లను ఉత్పత్తి చేస్తోంది. హెచ్.ఎ.ఎల్.తో ఇప్పటికే 83 ఎంకె–1ఎ ల కోనుగోలు కోసం ఆర్డర్ పెట్టిన ప్రభుత్వం, భారత వాయుసేన ను మరింత బలోపేతం చేయటానికి ఇటీవలే మరో 93 ఎంకె–1ఎల కోసం రూ.66,000 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. నాలుగేళ్ల క్రితం తొలి విడతగా 2021 ఫిబ్రవరిలో రూ.48,000 కోట్లతో ప్రభుత్వం ఆర్డరు ఇచ్చిన 83 విమానాల డెలివరీ కూడా మొదలు కావలసి ఉంది. -
ఫిష్ ఫ్యాషన్..!
చేపలను తలచుకోగానే చాలామందికి నోరూరే వంటకాలు గుర్తు రావడం సహజమే! కాని, ఇకపై న్యూ ఫ్యాషన్ గుర్తొస్తుంది. అదెలా అనుకుంటున్నారా? త్వరలోనే చేపల చర్మంతో తయారైన అలంకరణ వస్తువులు, ఫ్యాషన్ సామగ్రి అందుబాటులోకి రానున్నాయి!అమెరికాలోని ‘కోస్టా డి పజారోస్’ అనే గ్రామానికి చేపల వేట ప్రధాన జీవనాధారం. ఈ గ్రామం పసిఫిక్ మహాసముద్ర తీరంలో ఉంది. ఈ గ్రామస్థులు చేపల వేటకు అనుసరించే ‘బాటమ్ ట్రాలింగ్’ పద్ధతి కారణంగా వీరిపై ఆంక్షలు మొదలయ్యాయి. బాటమ్ ట్రాలింగ్ అంటే పడవ అడుగుభాగంలో ఒక బరువైన వలను కట్టి, అన్ని రకాల చేపలను, సముద్ర జీవులను బయటికి లాగేస్తారు. ఈ పద్ధతి వల్ల సముద్ర ఆవాసాలు తీవ్రంగా దెబ్బతిని, సముద్ర జలాల్లోని జీవవైవిధ్యం నాశనం అవుతోంది. అందుకే ‘బాటమ్ ట్రాలింగ్’పై ఆంక్షలు పెరిగాయి. దీంతో ఆ గ్రామస్థులు ప్రత్యామ్నాయ ఆర్థిక కార్యకలాపాలను అన్వేషించడం మొదలుపెట్టారు. అందులో భాగమే ఈ ఫిష్ ఫ్యాషన్!చేపల చర్మాన్ని ఉపయోగించి వినూత్న ఫ్యాషన్ ఉత్పత్తులను తయారు చేయడం మొదలుపెట్టారు. ఈ గ్రామస్థులు. చేపల చర్మాన్ని శుభ్రం చేసి, ఆకర్షణీయమైన తోలుగా మార్చి, దానితో చెవి పోగులు, నెక్లెస్లు, బ్యాగులు వంటి చాలా రకాల వస్తువులను తయారు చేస్తున్నారు. ఇది సరికొత్త ఫ్యాషన్గానే కాదు, స్థానికులకు జీవనోపాధిగా కూడా మారిపోయింది. ‘పీల్ మెరీనా’ అనే సహకార సంస్థ, స్థానిక మహిళలతో కలిసి చేపల చర్మాన్ని పలు ఉత్పత్తులుగా మారుస్తుంది. చేపల వేట ప్రధాన వృత్తిగా ఉన్న ఈ గ్రామస్థులు చేపల చర్మాన్ని పారవేయకుండా ఉపయోగించుకోవడం పర్యావరణానికి కూడా మేలు చేస్తోందంటున్నారు నిపుణులు. చేపల చర్మాన్ని తోలుగా మార్చే ప్రక్రియలో అనేక దశలుంటాయి. మొదట చేప చర్మాన్ని చేతులతో సున్నితంగా రుద్ది పొలుసులు, చర్మానికి అతుక్కున్న మాంసాన్ని తొలగిస్తారు. ఆ తరువాత, బట్టలు ఉతికినట్లు సబ్బుతో బాగా ఆ చర్మాన్ని కడుగుతారు. అనంతరం, గ్లిజరిన్, ఆల్కహాల్, సహజ రంగులను ఉపయోగించి ఆ చర్మానికి రంగులద్దుతారు. ఈ ప్రక్రియకు నాలుగు రోజులు పడుతుంది. ఆ తర్వాత మరో నాలుగు రోజుల పాటు ఆ చర్మాన్ని ఎండలో ఆరబెడతారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత, చేప చర్మం మృదువుగా, బలమైన తోలులా మారుతుంది. అలాగే వాటికి చేపల వాసన పూర్తిగా పోతుంది.ఇలా తయారు చేసిన చేపతోలుతో తయారు చేసిన వాటిలో బటర్ఫ్లై ఆకారంలో ఉండే చెవిపోగుల జత ధర సుమారు ఏడు డాలర్లు పలుకుతోందంటే, ఈ ఫిష్ ఫ్యాషన్ గిరాకీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చేప తోలుతో తయారు చేసిన ఈ ఉత్పత్తులను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా విక్రయిస్తున్నారు. అంతేకాకుండా, పంటారెనాస్లోని చిన్న తరహా వస్త్ర ఉత్పత్తిదారులకు కూడా ఈ తోలును అందిస్తున్నారు. భవిష్యత్తులో బ్యాగులు, పర్సులు, షూలను కూడా తయారుచేయాలని వీరు లక్ష్యంగా పెట్టుకున్నారు.చేపల చర్మాన్ని తోలుగా మార్చే ఈ సంప్రదాయం కొత్తది కాదు. అలాస్కా నుంచి స్కాండినేవియా, ఆసియా వరకు అనేక స్థానిక మత్స్యకార తెగలు వేల సంవత్సరాలుగా ఈ పద్ధతిని పాటిస్తున్నాయి. ఆన్లైన్లో కూడా ఈ ఉత్పత్తుల అమ్మకం సాగుతోంది. కోస్టా రికా కూడా ఇప్పుడు ఈ పద్ధతిని అనుసరించి, పర్యావరణ పరిరక్షణ ఉత్పత్తులను తయారుచేయడంలో ముందు వరుసలో నిలుస్తోంది. దీంతో అక్కడి మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రాన్ని అందించడమే కాకుండా, వారి సృజనాత్మకతకు ఒక వేదిక దొరికింది. ఇంటి పనుల నుంచి బయటపడి, చక్కటి ఉపాధిని పొందుతున్న ఈ మహిళలు, తమ ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయిలో చూడాలని ఆశిస్తున్నారు. ఇది పర్యావరణ పరిరక్షణకు కూడా చక్కని మార్గం. -
ఒకప్పుడు కల, నేడు కలిసిన వాస్తవం
ఒకప్పుడు తెరపై మాయాజాలం ప్రదర్శించిన వస్తువులు నేడు మన చేతిలోకి వచ్చేశాయి. సారథిలేని రథాలు కలల దృశ్యాల్లో నడిచేవి. ఇప్పుడు డ్రైవర్లెస్ కార్లు రోడ్ల మీదకు వచ్చేశాయి. పురాణాల్లో అక్షయపాత్ర కోరిన భోజనాన్ని వెంటనే వడ్డించేది. నేడు ఫుడ్ డెలివరీ యాప్లు దాదాపు అదే తీరులో పనిచేస్తున్నాయి. విలన్ కోటలోని మంత్రదర్పణం నిఘా సాధనంగా ఉంటే, ఇపుడు సీసీ కెమెరాలు ప్రతిచోటా కాపలా కాస్తున్నాయి.శాస్త్ర సాంకేతికతలు ఇంతగా అభివృద్ధి చెందని కాలంలో సినిమాలు ప్రేక్షకులకు చూపిన అద్భుత స్వప్నాలివి. మానవ మేధ వీటిని ఒక్కొక్కటిగా సాకారం చేస్తూ, వాస్తవ జీవితంలోకి తీసుకొచ్చేసింది.ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో హీరోలు గాల్లో రెక్కలు కట్టుకొని ఎగిరిపోతే, కార్లు డ్రైవర్ లేకుండా పరిగెత్తితే, గడియారం తిప్పగానే కాలంలో వెనక్కు వెళ్లిపోతే – థియేటర్లో కూర్చున్న మనకు ఒక్కటే అనిపించేది: ‘అయ్యో! ఇది కలల్లోనూ జరగదు.’ కాని, జీవితం కూడా ఒక సినిమా కథలాంటిదే కదా! అందుకే, ఆ కల్పనలు ఒక్కొక్కటిగా నిజం అవుతూనే ఉన్నాయి. నేడు స్మార్ట్వాచ్ పెట్టుకొని ఫోన్ మాట్లాడుతున్నాం. తెరపై కనిపించిన మాయా అక్షయపాత్రలాగా, ఇప్పుడు ఫుడ్ డెలివరీ యాప్ రూపంలో ఇంటి గుమ్మం వద్దకే పిజ్జా చేరుస్తోంది. వర్చువల్ కళ్లజోడు పెట్టుకుంటే మనం గదిలో కూర్చుని కూడా చంద్రుడి మీద నడుస్తున్నాం. మరమనిషి ఒకప్పుడు హీరోకి తోడుగా పోరాడితే, ఇప్పుడు మనకి ఇళ్లలో వాక్యూమ్ క్లీనర్ రూపంలో గచ్చు తుడుస్తోంది. మనుషులు, వస్తువులను మాయం చేసే అదృశ్యశక్తుల పరికరాల ఆవిష్కరణలు, ఇప్పుడు పరీక్షల్లో నిజమయ్యే ఫలితాలను చూపిస్తున్నాయి. మొత్తానికి, సినిమాల్లో కనిపించిన కలల గాడ్జెట్లు ఒక్కొక్కటిగా మన దగ్గరికి వచ్చి, మనల్ని బులిపిస్తున్నాయి, ఆశ్చర్య పరుస్తున్నాయి. రేపు తెరపై కనిపించే కొత్త గాడ్జెట్ ఏ రూపంలో మన ఇంటి లివింగ్ రూమ్లో దిగిపోతుందో! ఒకవేళ అలా దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.జెట్ప్యాక్ – థండర్బాల్ (1965)సినిమాలో హీరో జెట్ప్యాక్ వేసుకొని భవనం మీద నుంచి ఎగిరిపోతాడు. ఆ సన్నివేశం చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయి ‘ఇది అసలు సాధ్యమేనా?’ అనుకున్నారు. కాని, 1961లోనే అమెరికా రక్షణ పరిశోధన సంస్థ బెల్ ఏరోసిస్టమ్స్ కంపెనీతో కలిసి మొదటి జెట్ప్యాక్ను పరీక్షించింది. తర్వాత 2011లో ఫ్రాన్స్లో, 2019లో అమెరికాలో పర్యాటక ప్రదర్శనల్లో వాడారు. కొన్ని దేశాల సైన్యాలు కూడా శిక్షణలో ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నాయి. ఇంకా మన దగ్గరకు రాలేదు కాని, ఒకవేళ వస్తే? మొదటగా ట్రాఫిక్ దాటడానికి ఉపయోగించవచ్చు. లేజర్ కట్టర్ – గోల్డ్ఫింగర్ (1964)సినిమాలో హీరోను కుర్చీకి కట్టి, కింద నుంచి లేజర్ ఆన్ చేసే సన్నివేశం మరచిపోలేనిది. అప్పట్లో అది కత్తి కంటే భయంకరంగా అనిపించింది. ఆ కాలంలో లేజర్ టెక్నాలజీ కొత్తగా ఉండేది, ప్రజలు అద్భుతంగా భావించారు. కాని, 1960లో అమెరికా శాస్త్రవేత్త థియోడోర్ మైమన్ మొదటి లేజర్ను రూపొందించారు. 1970ల నుంచి వైద్యరంగంలో కంటి శస్త్రచికిత్సలకు, 1980లలో పారిశ్రామిక రంగంలో లోహాలను కత్తిరించడానికి ఉపయోగించడం మొదలైంది. నేడు పచ్చబొట్లను తొలగించడం నుంచి ఎన్నోరకాల శస్త్రచికిత్సల వరకు లేజర్ వాడకం సాధారణంగా మారింది. రోలెక్స్ గాడ్జెట్ వాచ్ – లివ్ అండ్ లెట్ డై (1973)గడియారం అంటే అప్పట్లో సమయం చెప్పే యంత్రం మాత్రమే! కాని, బాండ్ వాచ్? శత్రువు బుల్లెట్లను దూరంగా తోసే మాగ్నెట్, తలుపులు తెరిచే లేజర్, అవసరమైతే విద్యుత్ షాక్ కూడా! అది చూసి, ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఇప్పుడు ఆ పనులన్నీ మన వాచ్ కూడా చేస్తుంది. 1972లో హామిల్టన్ కంపెనీ మొదటి డిజిటల్ వాచ్ విడుదల చేసింది. 2010లలో యాపిల్, శాంసంగ్ స్మార్ట్వాచ్లు మార్కెట్లోకి వచ్చాయి. ఒకప్పుడు బాండ్ వాచ్ శత్రువులను ఎదుర్కొంటే, ఇప్పుడున్న వాచ్ అంతకంటే ఎక్కువ పనులే చేస్తుంది. అడుగులు లెక్కపెడుతుంది, నిద్ర కొలుస్తుంది, గుండె కొట్టుకోవడమే కాదు – ‘నువ్వు ఎక్కువగా కూర్చున్నావు, ఇక లే’ అని హెల్త్ అలర్ట్ కూడా ఇస్తుంది. సబ్మరైన్ కారు – ది స్పై హూ లవ్డ్ మీ (1977)బాండ్ లోటస్ కారు నీటిలోకి దూకి సబ్మరైన్ గా మారిపోతే థియేటర్లో చప్పట్లు మిన్నంటాయి. ఆ సమయంలో ఇలాంటిది ఊహించడమే గొప్ప. ఇప్పుడు చిన్న పర్సనల్ సబ్మరైన్ ్స ఉన్నాయి. 2008లో టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఈ కారుకు ప్రేరణగా ఒక సబ్మరైన్ కారు ప్రాజెక్ట్ ప్రకటించాడు. చిన్నపాటి వ్యక్తిగత సబ్మరైన్లు ఇప్పటికే లగ్జరీ యాట్స్లో ఆటబొమ్మల్లా వాడుతున్నారు. మన దగ్గర అయితే? పెద్ద పెద్ద చేపలు పట్టి బజారులో అమ్మడానికి కూడా వాడుతున్నారు. కమ్యూనికేటర్ వాచ్ – డిక్ ట్రేసీ (1946)హీరో తన గడియారంలోనే ఫోన్ కాల్ మాట్లాడిన సీన్ అప్పట్లో ప్రేక్షకులకు అద్భుతం. చాలామందికి అది జాదూగా అనిపించింది. ఇప్పుడేమో మనకు స్మార్ట్వాచ్లు సాధారణమే. 1970లలో మొదటి వాచ్ రేడియో వచ్చింది. 2000ల తర్వాత స్మార్ట్వాచ్లు అభివృద్ధి చెందాయి. ఇప్పుడు వాచ్తోనే వీడియో కాల్స్ కూడా చేయగలుగుతున్నారు. దీంతోనే జీపీఎస్ ఆధారంగా లొకేషన్ షేరింగ్, అలెర్ట్ బటన్స్ వంటివి కూడా ఉపయోగించుకోగలుగుతున్నారు.స్టార్ట్రెక్ కమ్యూనికేటర్ – స్టార్ట్రెక్ (1966)చిన్న పరికరంలా కనిపిస్తూ ఓపెన్ చేసే ఫోన్. అంటే మన ఆధునిక భాషలో ఫోల్డబుల్ ఫోన్. అప్పట్లో ఫోన్ మూసే శబ్దం ‘క్లక్!’ ఒక స్టయిల్ ఐకాన్గా మారిపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరినీ ఆకట్టుకున్న విషయం. ఇప్పుడు మనకు టచ్ స్క్రీన్ ఫోన్లకు డిమాండ్ ఉన్నా, ఫ్లిప్ ఫోన్ డిజైన్కే క్రేజ్ ఉంది. ట్రైకార్డర్ – స్టార్ట్రెక్ (1966)ఒక చిన్న పరికరం శరీరాన్ని స్కాన్ చేసి ఆరోగ్య ఫలితాలు చెబుతుంది. అప్పట్లో అది అద్భుతం. కాని, 2017లో అమెరికా ‘క్వాల్కమ్ ట్రైకార్డర్ ఎక్స్ ప్రైజ్’ పోటీలో కొన్ని కంపెనీలు వాస్తవికంగా రోగ నిర్ధారణ చేసే స్కానర్లు అభివృద్ధి చేశాయి. ఇప్పుడు పోర్టబుల్ మెడికల్ స్కానర్లు సాధారణం అవుతున్నాయి. మన ఇంట్లో ఉంటూనే రోజూ స్కాన్ చేసి మన ఆరోగ్య విషయాలను తెలుసుకోవచ్చు. హోవర్బోర్డ్ – బ్యాక్ టు ది ఫ్యూచర్ 2 (1989)గాల్లో ఎగిరే స్కేట్బోర్డ్ అప్పట్లో కలలా కనిపించింది. 2015లో లెక్సస్ కంపెనీ మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీతో హోవర్బోర్డ్ను ప్రదర్శించింది. ఇప్పుడు వాటిల్లో ఎన్నో ప్రోటోటైప్లు ఉన్నాయి, అయితే ఖరీదు ఎక్కువ. వినియోగం పరిమితం. మన దగ్గర ఉంటే? ఎక్కువగా వర్షకాలంలో గుంతలు దాటడానికి ఉపయోగిస్తామేమో! ఎలక్ట్రికల్ కారు, ఎగిరే కార్లు – బ్యాక్ టు ది ఫ్యూచర్ (1985)ఇంధనంతో నడిచే కార్లు కామన్ కాని, విద్యుత్ శక్తితో నడిచే కారు– అది కూడా అవసరమైనప్పుడల్లా గాల్లో ఎగురుతుంది. ఇది చూసి, అందరూ ఆశ్చర్యపోయారు. కాని, ప్రపంచంలోనే మొదటి విద్యుత్ కారు 1880లలోనే తయారైంది! కాలక్రమంలో పెట్రోల్ చౌక కావడంతో దాదాపు శతాబ్దానికి పైగా అవి మూలపడ్డాయి. పూర్తిగా, 1996లో అమెరికా ‘జీఎం ఈవీ1’ అనే ఆధునిక ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తెచ్చింది. 2008 తర్వాత టెస్లా రాకతో విద్యుత్ కార్లు మళ్లీ పుంజుకున్నాయి. భారత్లో 2010 తర్వాత టాటా, మహీంద్రా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడం మొదలుపెట్టాయి. 2021లో జపాన్ ‘స్కైడ్రైవ్’ కంపెనీ ఫ్లైయింగ్ కారును విజయవంతంగా పరీక్షించింది. ఒకవేళ మన దగ్గర వస్తే? ట్రాఫిక్ టెన్షనే ఉండదు.వాయిస్ కార్ (కిట్) – నైట్రైడర్ (1982)హీరో కారుతో మాట్లాడుతూ – ‘హే కిట్, రా!’ అని పిలిస్తే వెంటనే కారు వచ్చేది. ఇప్పటి సిరి, అలెక్సా, గూగుల్ అసిస్టెంట్స్ ఇదే చేస్తున్నాయి. కాని, కొన్నిసార్లు ఇవి పొరపాటున తప్పు దారి చూపించడం మాత్రం ఇంకా మానలేదు. భారతీయ సినిమాలు ఎప్పటి నుంచో కేవలం వినోదం మాత్రమే కాదు, ఊహాశక్తికి అద్దం పట్టే వేదికలు కూడా. ఇక్కడ హీరో పాట పాడితే పూలు కురుస్తాయి, విలన్ చేతిలోంచి మంటలు ఎగసిపడతాయి, దేవతలు ఆకాశం నుంచి దిగిపోతారు. కాని, వీటన్నింటికంటే ఆసక్తికరమైనవి సినిమాల్లో కనిపించే గాడ్జెట్లు. ‘మాయాబజార్’లో ఘటోత్కచుడు తెరిచిన మాయాపేటిక– ప్రియదర్శిని, ‘ఆదిత్య 369’లో టైమ్ మెషిన్, జగదేకవీరుడు అతిలోకసుందరిలో కనిపించిన శ్రీదేవి ఉంగరం. ఇవన్నీ అప్పట్లో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాయి. ‘ఇలాంటివి నిజంగా ఎప్పుడైనా వస్తాయా?’అనుకున్నారు. ఆ కలలే తర్వాత ఒక్కొక్కటిగా వాస్తవ రూపం దాల్చాయి.టైమ్ మెషిన్ – ఆదిత్య 369 (1991)బాలకృష్ణ టైమ్ మెషిన్ లో కూర్చుని గతానికి, భవిష్యత్తుకి వెళ్తాడు. ఈ కాలయానం ఇప్పటికీ పూర్తిగా ఊహే. కానీ 1905లో ఆల్బర్ట్ ఐన్ స్టీన్ చెప్పిన సాపేక్ష సిద్ధాంతం ప్రకారం కాంతి వేగానికి దగ్గరగా వెళ్తే కాలప్రవాహం మారుతుందని నిరూపించారు. అంటే సినిమా కల్పన అయినా, దానికి శాస్త్రీయ పునాది ఉంది. భవిష్యత్తులో ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అదృశ్య గడియారం – మిస్టర్ ఇండియా (1987)అనిల్ కపూర్ గడియారం పెట్టుకున్న వెంటనే కనబడకుండా పోతాడు. ఇది 2006లో అమెరికాలో శాస్త్రవేత్తలు మెటా పదార్థాలు వాడి చిన్న వస్తువులను అదృశ్యం చేయగలిగారు. 2015లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం మరింత మెరుగైన ప్రయోగాలు చేసి, మరికొన్ని వస్తువులను అదృశ్యం చేయడాన్ని ప్రదర్శించింది. మాయాపేటిక – మాయాబజార్ (1957)ఘటోత్కచుడు పెట్టె తెరిస్తే ఎవరు కోరుకున్నవి వాళ్లకు కనిపిస్తాయి– బంగారం కావచ్చు, భోజనం కావచ్చు. ఇప్పుడు ఒక్క బటన్ నొక్కితే భోజనం మన ఇంటి తలుపు దగ్గరే! 2010 తర్వాత ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సేవలు ఈ కలను వాస్తవం చేశాయి. గూగుల్ సెర్చ్ ఇంజిన్ కూడా అచ్చం ఆ పెట్టెలా – మనం ఏం కోరుకుంటామో, దాన్నే చూపిస్తుంది.మరమనిషి – రోబో (2010)రజనీకాంత్ ఈ సినిమాలో ‘చిట్టి’ పాత్రలో జనాలను మెప్పించారు. ‘చిట్టి’ చదివే, ప్రేమించే, కోప్పడే మరమనిషి. 2016లో హాంకాంగ్ ‘హాన్సన్ రోబోటిక్స్’ రూపొందించిన ‘సోఫియా’ రోబో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2021లో టెస్లా కూడా మానవాకార రోబో ప్రాజెక్ట్ను ప్రకటించింది. నేడు రోబోలు ప్రధానంగా పరిశ్రమల్లో, స్మార్ట్ హోమ్లలో సహాయకులుగా ఉన్నా, మన ‘చిట్టి’లా భావోద్వేగాలు పంచుకునే రోబోలు ఇంకా పూర్తిస్థాయిలో రాలేదు.భవిష్యత్ కళ్లజోడు – రావన్ (2011)ఈ సినిమాలో కళ్లజోడు పెట్టుకుంటే హీరో ఆటలోకి ప్రవేశిస్తాడు. 2012లో మొదటి వర్చువల్ రియాలిటీ పరికరాలు మార్కెట్లోకి వచ్చాయి. ఇప్పుడు వీటిని గేమ్స్, పాఠశాలలు, సమావేశాలు, శిక్షణ కార్యక్రమాల్లో వాడుతున్నారు.శక్తిమంతమైన దుస్తులు – క్రిష్ (2006)హీరో ప్రత్యేక దుస్తులు వేసుకున్న వెంటనే అద్భుత శక్తులు పొందుతాడు. 2013లో అమెరికా సైన్యం ‘ఎక్సోస్కెలిటన్ ’ సూట్లను అభివృద్ధి చేసింది. ఇవి ధరిస్తే భారాన్ని మోయడం సులభం అవుతుంది, ప్రమాదాల నుంచి రక్షణ కలుగుతుంది. భవిష్యత్తులో ఇవి సామాన్యులకు కూడా అందుబాటులోకి రానున్నాయి. మాయా పరికరం– జగదేకవీరుడు అతిలోకసుందరి (1990)శ్రీదేవి దగ్గర ఉన్న మాయా ఉంగరం ఏ పనైనా ఇట్టే చేసేస్తుంది. 2007 తర్వాత స్మార్ట్ఫోన్లు మన జీవితంలోకి వచ్చి బ్యాంకింగ్, షాపింగ్, భోజనం ఆర్డర్, సంభాషణ – అన్నీ ఒకే పరికరంలో సాధ్యమయ్యాయి. సినిమాలో మాదిరే బటన్ నొక్కగానే ఇంట్లో తలుపులు తెరుచుకోవడం, భోజనం సిద్ధమవ్వడం, బట్టలు మడతవేయడం చూసి ప్రేక్షకులు ‘అరే వాహ్!’ అనుకున్నారు. కాని, నేడు మన ఇళ్లలోని వాషింగ్ మెషిన్ , డిష్ వాషర్, మైక్రోవేవ్, వాక్యూమ్ క్లీనర్ అన్నీ ఆటోమేటిక్. ఇంకా మొబైల్తో నియంత్రించే ‘స్మార్ట్ హోమ్’ అప్లికేషన్స్ ఎన్నో వచ్చేశాయి. ఒక్క సైగ చేస్తే లైటు వెలిగిపోతుంది, ఫ్యాన్ ఆగిపోతుంది. సీసీ కెమెరా – రాక్షసరాజు, గజని గంధర్వుడుపాత సినిమాల్లో విలన్ కోటలోకి ఎవరెవరు వస్తున్నారో కనిపెట్టడానికి ఒక పెద్ద అద్దం ముందు కూర్చుని ‘సీసీ టీవీ’లా చూపించే సన్నివేశాలు గుర్తున్నాయా? అప్పట్లో అది మాంత్రిక ప్రభావంలా అనిపించింది. కాని, 1960లోనే మొదటి సీసీ కెమెరాలను జర్మనీలో సైనిక వినియోగానికి వాడారు. తర్వాత 1990లలో వాణిజ్య రంగంలోకి వచ్చి, 2000ల తర్వాత భారత్లో ఇళ్లలో, ఆఫీసుల్లో, రోడ్లపైకి కూడా విస్తరించాయి. ఇప్పుడు ఇవి లేకుండా భద్రత ఊహించలేము.హోలోగ్రామ్ సన్నివేశం – జీన్స్ (1998)హీరోయిన్ హోలోగ్రామ్ టెక్నాలజీని వినియోగించి సంగీతం, నృత్యం, కొన్ని విచిత్ర సందర్భాలు చూపిస్తూ నవ్వించే ప్రదర్శన ఇస్తుంది. ఆ హోలోగ్రామ్ సన్నివేశం అప్పట్లో కేవలం సినిమా మ్యాజిక్, స్పెషల్ ఎఫెక్ట్ మాత్రమే! కాని, హోలీగ్రామ్ టెక్నాలజీ నిజ జీవితంలో అంతకుముందే రూపుదిద్దుకుంది. 1960లో లేజర్ ఆవిష్కరణతో హోలోగ్రఫీ శాస్త్రానికి పునాది పడింది. 2012లో టుపాక్ షకూర్ అనే ర్యాపర్ మరణించినా, అతని హోలోగ్రామ్ ప్రదర్శన కోచెల్లా స్టేజ్పై ప్రత్యక్షమై ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. ఆ తర్వాత మైకేల్ జాక్సన్ , ఎల్విస్ ప్రెస్లీ వంటి ప్రముఖుల ప్రదర్శనలకు కూడా హోలోగ్రామ్ను వినియోగించారు. నేడు హోలోగ్రామ్లు విద్య, వైద్యం, వ్యాపార సమావేశాలు, వర్చువల్ ఈవెంట్స్ వంటి అనేక రంగాల్లో ఉపయోగపడుతున్నాయి. ఇక భవిష్యత్తులో మన ఇళ్లలో, పెళ్లిళ్లలో, సమావేశాల్లో హోలోగ్రామ్ రూపంలో అతిథులకు ‘హాయ్!’ చెప్పే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. డ్రైవర్ లేని కార్లు – శ్రీకృష్ణ పాండవీయమ్ (1966)ఘటోత్కచుడు తన మాయాశక్తితో రథాన్ని సారథి లేకుండానే నడిపిస్తాడు. ఇదే విధంగా మరెన్నో పాత చిత్రాల్లో రథం లేదా కారు దేవతా శక్తితో తనంతట తానే నడుస్తుంది. డ్రైవర్ లేని వాహనం అప్పట్లో కల్పన. 2010 తర్వాత గూగుల్, టెస్లా, ఊబెర్ వంటి కంపెనీలు అమెరికా, జపాన్ , యూరప్లలో స్వయంచాలిత కార్లను రోడ్లపై పరీక్షించాయి. 2020లలో కొన్ని నగరాల్లో టాక్సీ సర్వీసులుగా కూడా ప్రారంభమయ్యాయి. భారతదేశంలో ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నాయి. నిన్న సినిమాల్లో కలలా కనబడినవి, నేడు శాస్త్రవేత్తల చేతుల్లో వాస్తవమయ్యాయి. రేపు మరెన్నో ఆవిష్కరణలతో, ఊహలకు కూడా అందని పరికరాలు జీవితంలో భాగమవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇలా రీల్ నుంచి రియల్కి ప్రయాణించే ఈ గాడ్జెట్ కథలు అంతులేని కథలా కొనసాగుతూనే ఉంటాయి! ఊహలకు అందని ఆవిష్కరణలు! భవిష్యత్తు ఊహలు ఇప్పటికీ తెరపై మాయాజాలంలా కనబడుతున్నా, రేపటికి అవి మన జీవితంలో రొటీన్ గా మారిపోవడం ఖాయం. ఒక టెలిపోర్టేషన్ మెషిన్ తో ఇంటి గుమ్మం నుంచి నేరుగా ఆఫీసు కుర్చీలో కూర్చోవచ్చు. అప్పుడు ట్రాఫిక్ అనే టెన్షన్ ఉండదు. మెమరీ ట్రాన్ ్సఫర్ గాడ్జెట్తో పరీక్ష ముందు రాత్రుళ్లు నిద్ర మానుకుని పుస్తకం చదవాల్సిన అవసరమే లేదు, సబ్జెక్ట్ డౌన్ లోడ్ చేసుకుంటే చాలు! ఆలోచన చదివే పరికరం మన మైండ్లో దాగి ఉన్న మాటల్ని బయటపెడుతుంది, అప్పుడు ‘ఏం అనుకుంటున్నావు?’ అనే ప్రశ్నే ఉండదు. రోబో–షెఫ్ మన ఇష్టం అడిగి భోజనం సిద్ధం చేస్తాడు, డ్రోన్లు కిరాణా వస్తువులను గుమ్మం ముందు పడేస్తాయి. నిద్రలో చూసిన కలలను కలల ప్రొజెక్టర్లో సినిమాలా తిరిగి చూడగలిగే రోజులు కూడా వస్తాయి. గాల్లో ఎగిరే మనుషుల్లా మారిపోతే, ట్రాఫిక్ను చరిత్రలోకి నెట్టేయవచ్చు. స్వయంచాలిత డ్రోన్ ప్యాకేజీలతో పాటు మనల్ని కూడా ఎయిర్టాక్సీలా తీసుకెళ్తాయి. ఇక ఇంట్లో పనులు? రోబో మేడ్స్, స్మార్ట్ ఫర్నిచర్ అన్నీ స్వయంగా చూసుకుంటాయి. నేడు ఇవన్నీ సైన్ ్స ఫిక్షన్ లా అనిపిస్తున్నా, నిన్న ఫోన్ లేకుండా ఊహించలేనట్టు, రేపు ఈ గాడ్జెట్లు లేకుండా కూడా జీవితాన్ని ఊహించలేకపోవచ్చు. -
నటి లావణ్య త్రిపాఠి లుక్ని యంగ్గా చూపించే ఫ్యాషన్ సీక్రెట్స్ ఇవే..!
స్టయిల్కి ఒక ఫ్రెండ్, సింపుల్ బ్యూటీకి ఒక సీక్రెట్ ఉంటే అది లావణ్య త్రిపాఠీనే! ఎక్కడ చూసినా ఆమె చిన్న చిరునవ్వు, సాఫ్ట్ గ్లో కలసి తన మొత్తం లుక్ను నెక్ట్స్ లెవెల్కి తీసుకెళ్తాయి. చిన్న స్టడ్స్, మినిమల్ జ్యూలరీ నా ఫేవరెట్. అవే నా పర్సనాలిటీని బెస్ట్గా రిఫ్లెక్ట్ చేస్తాయి. కొన్నిసార్లు ఒక్క స్టేట్మెంట్ పీస్ చాలు, లుక్ మొత్తం ఎలివేట్ అవుతుంది. డ్రెస్లలో పేస్టల్ షేడ్స్, సాఫ్ట్ కలర్స్నే నేను ఎక్కువగా ఎంచుకుంటాను. ఇవి నన్ను ఎప్పుడూ ఫ్రెష్గా, యంగ్గా చూపిస్తాయని అంటుంది లావణ్య త్రిపాఠి. ఇక్కడ లావణ్య ధరించిన డ్రెస్ బ్రాండ్ ఇస్సా స్టూడియో. ధర: రూ. 19,500, జ్యూలరీ బ్రాండ్: రియా, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.చెవిపోగుల బాస్!అమ్మాయిల అలంకరణకు ప్రాణం పోయడానికి పెద్ద పెద్ద ఆభరణాలు అవసరం లేదు, సరైన చెవిపోగులు ఉంటే చాలు. మొత్తం స్టయిల్నే మరో లెవెల్కి తీసుకెళ్తాయి. అలాంటి వాటిలో ముందుండేవి ఈ లాంగ్ డ్రాప్ స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్. గోల్డెన్ టచ్తో మెరిసే స్టోన్స్, లేయర్ డిజైన్ , చూసే వారందరినీ ఆకట్టుకునే మెరుపు – ఇవన్నీ కలిపి ఒకేసారి రాయల్గా, మోడ్రన్ గా కనిపించేలా చేస్తాయి. పొడవుగా ఉండటం వలన ముఖాన్ని సన్నగా చూపిస్తాయి, ముఖానికి ఎలిగెన్స్ ఇస్తాయి. జుట్టు వెనక్కి కట్టుకున్నా, లైట్ వేవ్స్లో వదిలినా, ఈ ఇయర్రింగ్స్ మెరుపే మొదట కనిపిస్తుంది. డీప్ వీ నెక్ లేదా బోట్ నెక్ టాప్ వేసుకుంటే చెవిపోగులు ఇంకా క్లాసీగా మెరిసిపోతాయి. మేకప్ విషయానికి వస్తే షిమ్మరీ ఐలిడ్, లైట్ మస్కారా, న్యూడ్ లిప్ షేడ్ సరిపోతాయి. స్టేట్మెంట్ పీస్ కాబట్టి నెక్లెస్ అవసరం లేదు, సింపుల్ రింగ్ లేదా బ్రేస్లెట్ చాలు. వెడ్డింగ్, రిసెప్షన్ , ఫెస్టివల్ లేదా పార్టీ ఏ సందర్భంలో వేసుకున్నా ఈ చెవిపోగులు లుక్కి ఒక స్పెషల్ స్టన్నింగ్ టచ్ ఇస్తాయి. సింపుల్ డ్రెస్పైనా కూడా ఇవి వేసుకుంటే ఆటోమేటిక్గా గ్లామరస్గా, రాయల్గా మారిపోతారు. (చదవండి: నూడుల్స్ తినడమే ఒక గేమ్!) -
నూడుల్స్ తినడమే ఒక గేమ్!
చాలా దేశాల్లో ఆడుతూ పాడుతూ ఆహారాన్ని ఆస్వాదించడం కూడా ఒక సంప్రదాయమే! తినేవారిలో గొప్ప అహ్లాదాన్నీ, అనుభూతినీ నింపే ఈ కళలకు ప్రజాదరణా ఎక్కువే! ఆయా దేశాల జీవనశైలికి తగినట్లుగా ప్రత్యేకమైన, ఆహ్లాదకరమైన ఆహారపు విధానాలు ప్రపంచదేశాల పర్యాటకుల్ని ఇట్టే ఆకట్టుకుంటాయి. అలాంటిదే జపాన్లోని ‘నాగాషి సోమెన్’ అనే అహ్లాదకర విధానం. ఈ విధానం అక్కడ వేసవి కాలంలో (జూన్ నుంచి సెప్టెంబర్ మొదటి వారం వరకూ) ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమయంలో జపాన్ వెళ్లిన పర్యాటకులు కూడా ఈ ‘నాగాషి సోమెన్’ నూడుల్స్ని రుచి చూస్తుంటారు. జపనీస్ భాషలో ‘నాగాషి’ అంటే ‘ప్రవహించేది’, ‘సోమెన్’ అంటే సన్నని నూడుల్స్ అని అర్థం. ఈ పద్ధతిలో, గోధుమతో చేసే సాఫ్ట్ నూడుల్స్ వెదురు గొట్టాల గుండా ప్రవహించే చల్లని నీటిలో వెళ్తుంటాయి. వాటిని ఇరువైపులా కూర్చున్న జనాలు చాప్స్టిక్లతో పట్టుకుని తినడం ఒక సరదా ఆటలా ఉంటుంది. ఇది ఒక సవాలుతో కూడిన సరదా ఆట. పట్టుకున్న నూడుల్స్ని ‘త్సుయు’ అనే సోయా డిప్పింగ్ సాస్లో ముంచుకుని తింటారు. ఈ సాస్ నూడుల్స్కు మంచి రుచిని ఇస్తుంది. వేసవిలో వేడి ధాటి నుంచి ఈ చల్లని నూడుల్స్ ఉపశమనం ఇస్తాయట. నాగాషి సోమెన్ అనేది స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపే ఒక సామాజిక కార్యక్రమం. చాలా నాగాషి సోమెన్ రెస్టరెంట్లు ప్రకృతి ఒడిలో, నదులు లేదా అడవుల పక్కన ఉంటాయి. ఇది ఆహారాన్ని ఆస్వాదించడంతో పాటు ప్రకృతి అందాలను చూసే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. ఒక ఆసక్తికరమైన అంశమేమిటంటే, మీరు ఒకసారి పట్టుకోవడంలో విఫలమైతే, ఆ నూడుల్స్ కిందకు వెళ్లిపోతాయి. అందుకే ఈ వెదురు బొంగుల పక్కన కూర్చున్నవారు చాలా జాగ్రత్తగా, చురుకుగా ఉండాలి. నూడుల్స్ మొత్తం అయిపోయాయని సూచించడానికి చివరగా షెఫ్స్ ఒక గులాబీ రంగు నూడుల్ను వదులుతారు. ఇది ముగింపుకు సంకేతం. (చదవండి: ఎకో ఫ్రెండ్లీ లైఫ్కి నిర్వచనం ఈ దంపతులు..!) -
యాభై లక్షల ప్రశ్న... పచ్చల రాజధాని ఏది?
స్త్రీలకు నవరత్నాలు ఇష్టం. అయితే వాటిలో కొన్నే కొందరికి ‘మేచ్‘ అవుతాయి అని కూడా నమ్ముతారు. వజ్రం, ముత్యం, కనకపుష్యరాగం, కెంపు, పగడం, వైఢూర్యం, నీలం, గోమేధికం... వీటన్నింటితో పాటు పచ్చ... అన్నీ అద్భుతమైన ఆకర్షణ కలిగినవే. స్త్రీలు వీటిని తమ ఆభరణాల్లో పొదిగి మిలమిలా మెరుస్తారు. అయితే ఇప్పుడు ఈ నవరత్నాలకు సంబంధించిన ఒక ప్రశ్నకు జవాబు తెలియపోవడం వల్ల 25 లక్షలు కోల్పోయింది మాన్సీ శర్మ. ఇటీవల ప్రసారమైన కౌన్ బనేగా కరోడ్పతి ఎపిసోడ్లో మాన్సీ శర్మకు హాట్సీట్ దక్కింది. ఆమె ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తోంది. అమితాబ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం వల్ల 25 లక్షలు గెలుచుకుంది. తర్వాతి ప్రశ్నకు సమాధానం చెప్తే 50 లక్షలు వస్తాయి. అప్పుడు అమితాబ్ అడిగిన ప్రశ్న– పచ్చల రాజధానిగా పేరుబడ్డ ముజో నగరం ఏ దేశంలో ఉంది అని. ఆప్షన్స్లో ఎ) నికరాగ్వే బి)నైజీరియా సి)జింబాబ్వే డి)కొలంబియా అని ఇచ్చారు.అయితే ఈ ప్రశ్నకు మాన్సీ శర్మ జవాబు చెప్పలేకపోయింది. 25 లక్షలతో ఆట ముగించి అంతటితో సంతృప్తి పడింది. ఈ ప్రశ్నకు సరైన జవాబు కొలంబియా. పచ్చల రాజధానిగా పేరుబడ్డ ముజో నగరం ఈ దేశంలోనే ఉంది. ఇక్కడ పచ్చల మైనింగ్ కోసం పూర్వం జాతుల మధ్య రక్తపాతాలు జరిగాయి. స్పానిష్ జాతీయులు ఇక్కడి ఆదివాసులైన ముజో ఇండియన్సును ఊచకోత కోశారు కూడా. అయితే కాలక్రమంలో ఈ ప్రాంతం అన్ని దాడులను తట్టుకుని నిలబడింది. ఇక్కడి పచ్చల గనుల్లో నేటికీ విలువైన పచ్చలు వెలికి తీస్తున్నారు. అవి ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన పచ్చలుగా డిమాండ్ కలిగి ఉన్నాయి. ఇందుకు కారణం ఇక్కడి పచ్చలు దాదాపు 30 లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినవి అని శాస్త్రవేత్తల అంచనా. అందుకే వీటి క్వాలిటీకి తిరుగు ఉండదు. అన్నట్టు ఇక్కడి ముజో ఇండియన్సు ఈ పచ్చల గనులకు ఒక దేవత ఉందని నమ్ముతారు. ఆమె పేరు ‘ఆరె’. ఆ దేవత చల్లగా చూడటం వల్లే ఇక్కడ పచ్చలు పండుతుంటాయని అంటారు. -
ప్రయాణికులకు ముఖ్య గమనిక
ఒక్కసారి రైల్వేప్లాట్ఫామ్పై అడుగు పెడితే ఎన్నో దృశ్యాలు కంటబడతాయి. అనుబంధాలకు అద్దం పట్టే తీయటి దృశ్యం, అత్తారింటికి వెళుతున్న కూతురికి వీడ్కోలు చెబుతూ కళ్లనీళ్ల పర్యంతమయ్యే తల్లిదండ్రుల విచార దృశ్యం, కొత్త ప్రాంతానికి వెళ్లే ఆనందంలో స్నేహితుల వినోద దృశ్యం. యాచకుల హడావిడి దృశ్యం, ఒంటరి జీవుల ఏకాంత దృశ్యం...ఎన్నో ఎన్నెన్నో దృశ్యాలు కనిపిస్తాయి. ఇలాంటి ఎన్నో దృశ్యాలకు సంగీత వల్లట్ పుస్తకాలు అద్దం పడతాయి. రైల్వేడిపార్ట్మెంట్లో కమర్షియల్ క్లర్క్గా పద్నాలుగు సంవత్సరాలు ఉద్యోగం చేసిన సంగీత ప్లాట్ఫామ్ టికెట్’ పేరుతో తాజాగా పుస్తకం రాసింది. తన ఉద్యోగ జీవితంలో ఎన్నో జ్ఞాపకాలు, అనుభవాలకు ఈ పుస్తకంలో అక్షరరూపం ఇచ్చింది. చెన్నై రైల్వే స్టేషన్లో డెబ్బైమంది ఉద్యోగులు పనిచేసే రోజుల్లో తాను ఒక్కరే మహిళా ఉద్యోగి.హృదయాలను కదిలించే సంఘటనలు మాత్రమే కాదు హాయిగా నవ్వించే సంఘటనలు ఎన్నో ప్లాట్ఫామ్ టికెట్’లో ఉన్నాయి. ‘భారతీయ రైల్వే దృశ్యాలు’ అనే మాట వినబడగానే ఆర్కే నారాయణ్, రస్కిన్ బాండ్ పుస్తకాలు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు ఆ కోవలో సంగీత పేరు కూడా చేరుతుంది. ఉద్యోగిగా రైల్వే డిపార్ట్మెంట్తో ఉన్న అనుబంధమే ఆమె కలానికి ఉన్న అసలు బలం.రైల్వేస్టేషన్లలో కనిపించే విభిన్న వర్గాల జీవన దృశ్యాలను మాత్రమే కాదు భారతీయ రైల్వే వ్యసస్థ విశ్వరూపాన్ని సూక్ష్మంగానైనా అర్థం చేసుకునే ప్రయత్నం తన రచనల ద్వారా చేస్తోంది సంగీత. -
నాన్నా... నువ్వెక్కడ?
2016లో ‘లయన్’ అనే సినిమా వచ్చింది. కథానాయకుడు దేవ్ పటేల్. స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్. లయన్ కథకు వస్తే సరూ అనే అయిదేళ్ల పిల్లాడు ఇంటి నుంచి పారిపోయి రైలెక్కుతాడు. అది వేల కిలోమీటర్లు ప్రయాణించి కోల్కతా చేరుకుంటుంది. అప్పటినుంచి ఆ పిల్లాడి ఒంటరి పోరాటం మొదలవుతుంది. అక్కడ ఆ బాలుడి జీవితం రకరకాల మలుపులతో ఆఖరుకు ఒక ఆస్ట్రేలియన్ జంటకు దత్తతతో ఆస్ట్రేలియా చేరుకుంటుంది. పాతికేళ్ల తర్వాత సొంతకుటుంబాన్ని కలవాలనే తాపత్రయంతో గుప్పెడు బాల్య జ్ఞాపకాలను తోడు చేసుకుని, గూగుల్ ఎర్త్ సాయంతో తన ఇంటిని కనుక్కుంటాడు, కుటుంబాన్ని కలుసుకుంటాడు. వాస్తవ సంఘటన ఆధారంగా తీసిన సినిమా అది.సంధ్యారాణి కథా అలాంటిదే! అయితే ఆమె ఇంకా సొంత కుటుంబాన్ని కలుసుకోలేదు. అన్నం, పప్పు తిన్న లీలామాత్రపు జ్ఞాపకాలతో తల్లిదండ్రుల అన్వేషణలో ఉంది. తన కథ సుఖాంతం కావడం కోసం ఎదురు చూస్తోంది. సంధ్యారాణి చెప్పిన వివరాల ప్రకారం ఆ కథ ఎక్కడ మొదలైందంటే..1987...హైదరాబాద్, ఖైరతాబాద్లోని ప్రేమ్నగర్ వాసి కె.రామయ్య నిజాం కాలేజ్లో తోటమాలి. అతనికి అబిడ్స్లోని పరాస్ బార్ అండ్ రెస్టారెంట్లో వెయిటర్ బి. రాజ్కుమార్తో స్నేహం కుదిరింది. మాటల్లో తనదీ, రాజ్కుమార్దీ ఇద్దరిదీ ఒకే కులమని తేలింది. దాంతో తన మరదలు అనసూయకు రాజ్కుమార్తో పెళ్లి చేయాలనుకుని రాజ్కుమార్ ని అడిగాడు. అయితే తనకు అంతకుముందే పెళ్లై, మూడేళ్ల కూతురూ ఉందని, కాకపోతే భార్య చనిపోయిందని చెప్పాడు రాజ్కుమార్. అయినా సరే తమ ఆర్థికపరిస్థితి దృష్ట్యా మరదలికి రాజ్కుమార్తో వివాహం జరిపించాడు రామయ్య. ముచ్చటగా మూడు నెలలు గడిచాయి. రాజ్కుమార్ పత్తాలేకుండా పోయాడు బిడ్డను అనసూయ దగ్గరే వదిలి. పరాస్ బార్ అండ్ రెస్టరెంట్కి వెళ్లి వాకబు చేశాడు రామయ్య. నెల రోజులుగా పనిలోకి రావట్లేదని చెప్పారు హోటల్ సిబ్బంది. రాజ్కుమార్ కోసం వెదికి వేసారిన రామయ్య.. సంధ్యను విజయనగర్ కాలనీలోని సేవా సమాజం.. బాలికా నిలయమనే అనాథాశ్రమంలో వదిలేశాడు.1988...సంతానం లేని స్వీడన్ జంట మిస్టర్ అండ్ మిసెస్ లిండ్గ్రెన్ సంధ్యారాణిని దత్తత తీసుకున్నారు. అలా స్వీడన్ వెళ్లిన సంధ్యారాణి.. ఊహ తెలిసేప్పటికి అది తన మాతృదేశం కాదని.. వాళ్లు తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కారనే సత్యాన్ని గ్రహించింది! పై చదువు కోసం యూకే వెళ్లాక ఓ ఫ్రెండ్ ప్రేరణతో తన అసలు పేరెంట్స్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టింది. తనది హైదరాబాద్ అని, సేవా సమాజం బాలికా నిలయం నుంచి తనను తెచ్చుకున్నామనే స్వీడన్ పేరెంట్స్ చెప్పిన విషయం తప్ప ఇంకే సమాచారమూ లేదు. కాబట్టి యూకేలో ఉంటూ హైదరాబాద్లో తన మూలాల కోసం చేసిన వాకబు అంగుళం కూడా ముందుకు కదల్లేదు. దాంతో 2009లో తొలిసారిగా హైదరాబాద్కు వచ్చింది సంధ్య. తనను దత్తత ఇచ్చిన అనాథాశ్రమానికి వెళ్లింది. పెద్దగా వివరాలేవీ దొరకలేదు. చదువైపోయి లండన్లో ఉద్యోగం చేస్తూ, వీలు దొరికినప్పుడల్లా హైదరాబాద్ వస్తున్నా.. ఏళ్లు గడుస్తున్నా ఒంటరి వెదుకులాట దారీతెన్నూ చూపలేదు.2025...జన్మనిచ్చిన తల్లిదండ్రులను కలవాలనుకునే దత్తత పిల్లలెందరికో సహాయపడుతున్న సంస్థ.. పుణేలోని అడాప్టీ రైట్స్ కౌన్సిల్ గురించి సంధ్యకు తెలిసింది. ఆ సంస్థ డైరెక్టర్ అంజలి తారా బబన్రావ్ పవార్ని కాంటాక్ట్ చేసింది. ఆమె.. సంధ్యకు సాయం చేయడానికి సిద్ధపడింది. మొత్తానికి అంజలి సహకారంతో రామయ్యను కలుసుకోగలిగింది సంధ్య. అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో ఉన్నాడు. సంధ్య సవతి తల్లి అనసూయ చనిపోయిందని చెప్పాడు. అంతేకాదు రాజ్కుమార్ సొంతూరు వరంగల్ అని, అతని తోబుట్టువులు అక్కడే ఉన్నారనీ తెలిపాడు. ఆ మాత్రం ఆధారంతోనే ఆత్రంగా సంధ్య వరంగల్ ప్రయాణమైంది. అమ్మానాన్నలు కనిపిస్తే.. అంతకన్నా అదృష్టం ఉంటుందా అంటుంది నీళ్లు నిండిన కళ్లతో. ‘వరంగల్లో నాన్నే కాదు అమ్మా కనిపిస్తుందని ఆశ. అమ్మ చనిపోయిందని రామయ్యగారితో నాన్న చెప్పినా నాకు మాత్రం అమ్మ బతికే ఉందనిపిస్తోంది. నాలా విదేశాలకు దత్తత వెళ్లి.. సొంత తల్లిదండ్రులను కలవాలనుకుంటున్న వాళ్లెందరో! పెద్దలందరికీ నాదొకటే విన్నపం.. దయచేసి పిల్లలను విదేశీయులకు దత్తత ఇవ్వకండి. ఎంత కష్టమైనా సొంత దేశంలోనే పెరగనివ్వండి. దత్తత వెళ్లిన పిల్లలకు అక్కడ జీవితం వడ్డించిన విస్తరేం కాదు. అమ్మానాన్నలనే కాదు సొంత ఊరు, భాష, సంస్కృతి.. ఒక్కమాటలో చెప్పాలంటే మా గుర్తింపును, ఉనికినే కోల్పోతున్నాం. దానంత నరకం ఇంకోటి లేదు. నా సంబంధీకులెవరైనా ఉండి.. నన్ను పోల్చుకోగలిగితే దయచేసి నన్ను కాంటాక్ట్ అవండి. మా అమ్మానాన్నల జాడ చెప్పండి!’ సంప్రదించాల్సిన నంబర్.. 9822206485.’’ అంటూ తన కథ చెప్పింది సంధ్య. ఆమె త్వరలో తన తల్లిదండ్రులను కలుసుకుంటుందని ఆశిద్దాం.– సరస్వతి రమ– ఫొటోలు: గడిగె బాలస్వామి -
అద్భుతం.. అమ్మాపురం సంస్థానం
చిన్నచింతకుంట: మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గత చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. అమరచింత, ఆత్మకూర్ సంస్థానాల పాలన అమ్మాపురం కేంద్రంగా సాగింది. అప్పట్లో 69 గ్రామాలు, 190 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన అమ్మాపురం సంస్థానాన్ని కాకతీయుల కాలం నుంచి రెడ్డి రాజుల కాలం వరకు ముక్కెర వంశీయులు పరిపాలించారు. 1268 నుంచి 1948 వరకు వీరి పరిపాలన కొనసాగింది. ఇది 19వ శతాబ్దంలో భారత యూనియన్లో విలీనమైంది.కురుమూర్తి క్షేత్రం అభివృద్ధికి.. కురుమూర్తి స్వామి క్షేత్రం అభివృద్ధి కోసం ముక్కెర వంశీయులు అమ్మాపురంలో సంస్థానం ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెబుతోంది. కాకతీయుల కాలంలో అమరచింత, ఆత్మకూర్ సంస్థానాలు వెలుగొందాయి. ముక్కెర వంశీయులు ఆ సంస్థానాల్లో పరిపాలన సాగిస్తూ. కురుమూర్తి క్షేత్రం దర్శనానికి వచ్చేవారు. కురుమూర్తి క్షేత్రాన్ని నిత్యం దర్శించుకోవాలనే ఆకాంక్ష, ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో అమ్మాపురంలో సంస్థానం ఏర్పాటు చేశారు. రాణి భాగ్యలక్ష్మీ దేవమ్మ ఇక్కడి నుంచే అమరచింత, ఆత్మకూర్ సంస్థానాలను పరిపాలించారు.ఇప్పటికీ నాటి ఆనవాళ్లు.. 16వ శతాబ్దంలో రాణి భాగ్యలక్ష్మీదేవి అమ్మాపురంలో నిర్మించిన కోట బురుజు, శివాలయం, మసీదుతో పాటు 200 ఏళ్ల క్రితం వారి వంశీయులు నిర్మించిన రాజ భవనం, సింహద్వారం, రాజ భవనంలోని కోనేరు, గుర్రాల స్థావరాలు, అతిథి గృహాలు నేటికీ ఉన్నాయి.సజీవ సాక్ష్యాలుగా కట్టడాలు.. ముక్కెర వంశస్తుల పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామానికో సుభేదారును నియమించారు. వారి ద్వారా వచ్చే కప్పాలతో ఆయా గ్రామాల్లో చెరువులు, బావులను తవ్వించారు. వనపర్తి జిల్లా ఆత్మకూర్ పట్టణం నాటి సంస్థానంలో ఒక భాగంగా ఉండటంతో.. అక్కడే రాజ విడిది భవనాలు నిర్మించారు. ముక్కెర వంశానికి చెందిన పెద్ద సోమ భూపాలుడు తరచూ ఈ ప్రాంతానికి వస్తూ పరిపాలన కొనసాగించే వాడని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. ఆత్మకూర్లో చెరువును తవ్వింస్తుండగా.. శివుడి విగ్రహం లభ్యం కావడంతో అక్కడే శివాలయాన్ని నిర్మించారు. ఇప్పటికీ చెర్ల పరమేశ్వరుడిగా పిలుస్తున్నారు. అమరచింతలో గుర్రాలను మేపేందుకు అనువైన స్థలాన్ని గుర్తించి.. వాటి సంరక్షణ బాధ్యతలను హజారి వంశస్తులకు అప్పగించారు. అక్కడ కోటబురుజును నిర్మించారు. వాటితో పాటు తిప్పడంపల్లిలో నిర్మించిన కోట బురుజు నాటి చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఆత్మకూర్లో సంస్థానాదీశులు నిర్మించిన పలు భవనాలను ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగిస్తున్నారు. తిరుపతి నుంచి వచ్చి.. వర్ధమానపురం (నేటి వడ్డేమాన్)కు గన్నారెడ్డి సామంత రాజుగా ఉండే వాడు. అప్పట్లో గన్నారెడ్డి తన పరివారంతో తిరుపతి యాత్రకు వెళ్లాడు. తిరుపతి సమీపంలోని చంద్రగిరి ప్రాంతంలో పేరు ప్రఖ్యాతులున్న ముక్కెర వంశీయుడు గోపాల్రెడ్డిని కలిశాడు. గోపాల్రెడ్డి గుణగణాలు, ధైర్య సాహసాలు మెచ్చి వర్ధమానపురం ఆహ్వానించాడు. గోపాల్రెడ్డి తన కుటుంబ సమేతంగా వర్ధమానపురం చేరుకోగా.. గన్నారెడ్డి అతన్ని గౌరవించి మక్తలవాడ పదవి అప్పగించాడు. చదవండి: ఊరు ఊరంతా ప్రభుత్వ అధికారులే!క్రమంగా గోపాల్రెడ్డి మక్తల, ఊట్కూర్, కడేమార్, వడ్డేమాన్, అమరచింత పరిగణాలపై ఆధిపత్యం సాధించారు. అప్పట్లో కురుమూర్తి క్షేత్రం వడ్డేమాన్ పరిధిలో ఉండటం.. గోపాల్రెడ్డి వైష్ణవ భక్తుడు కావడంతో తన ఇంటి ఇలవేల్పుగా ఆరాధించాడు. అది మొదలుకొని నేటివరకు ముక్కెర వంశీయులు కురుమూర్తిస్వామిని ఆరాధిస్తూ వస్తున్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తూ శాశ్వత ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు. -
ఊరంతా ఐఏఎస్, ఐపీఎస్లే!
అదో చిన్న ఊరు. అక్కడ 75 ఇళ్లు మాత్రమే ఉన్నాయి. ఊరు చిన్నదే కానీ దాని ప్రత్యేకత మాత్రం చాలా ఘనం. ఆ ఊరి నుంచి 50 మంది పైగా ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు సాధించారు. వీరిలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, పీసీఎస్ జాబ్స్ సాధించిన వారు ఉన్నారు. దీంతో ఆఫీసర్స్ విలేజ్, యూపీఎస్సీ ఫ్యాక్టరీగా ఆ ఊరిని పిలుస్తుంటారు. ఇంత చిన్న ఊరి నుంచి అంత మంది ఉన్నత ఉద్యోగాలు సాధించారంటేఅక్కడేదో పెద్ద కోచింగ్ సెంటర్ ఉండే ఉంటుందని ఊహిస్తున్నారా? అలాంటిదేమి లేదక్కడ. ఇంతకీ ఆ ఊరు పేరేంటి, ఎక్కడ ఉంది..?ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఊరి పేరు మాధోపట్టి. ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలో ఉంది. ఈ ఊరి విజయగాథ (success story) గురించి తెలుసుకోవాలంటే వందేళ్లు వెనక్కి వెళ్లాలి. స్వాతంత్ర్య సమరయోధుడు ఠాకూర్ భగవతి దిన్ సింగ్, ఆయన భార్య శ్యామరతి సింగ్తో ఈ విలేజ్ సక్సెస్ స్టోరీ ప్రారంభమైంది. శ్యామరతి సింగ్ 1917లో అమ్మాయిలకు చదువు చెప్పడం ప్రారంభించారు. తర్వాత అబ్బాయిలు కూడా ఆమె దగ్గర చదువుకోవడానికి వచ్చేవారు. ఇలా ఆ ఊళ్లో విద్యార్జనకు బీజం పడింది.మాధోపట్టి మహిమస్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆ ఊరి నుంచి ఒకరు తొలిసారిగా ఓ యువకుడు ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యాడు. తర్వాత వినయ్ కుమార్ సింగ్ అనే మరో యువకుడు ఐఏఎస్ సాధించాడు. ఒకే కుటుంబంలోని నలుగురు అన్నదమ్ములు ఐఏఎస్, ఐపీఎస్కు ఎంపిక కావడంతో మాధోపట్టి గ్రామం పేరు మార్మోగిపోయింది. యూపీఎస్ జాబ్స్ సాధించడం మాధోపట్టి (Madhopatti) వాసులకు అలవాటుగా మారిపోయింది. అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఆ ఊరికి కోడళ్లుగా వచ్చిన యువతులు కూడా ఈ విజయంలో భాగస్వాములయ్యారు. మెట్టింటిలో అడుగు పెట్టగానే పుస్తకాలతో కుస్తీ పట్టి సర్కారీ కొలువులు సాధించారు. మాధోపట్టి మహిమ అది!విజయ రహస్యంఇంత మందికి ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు రావడానికి అక్కడేమి పెద్ద కోచింగ్ సెంటర్లు లేవు. గ్రామమే కోచింగ్ సెంటలా పనిచేస్తుంది. ఇప్పుడు అధికారులుగా ఉన్న సీనియర్లు కొత్త విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారు. ఒకరు గెలిచినప్పుడు మొత్తం గ్రామం సంబరాలు జరుపుకుంటుంది. ఎవరైనా విఫలమైనప్పుడు మళ్లీ ప్రయత్నించడానికి మద్దతు ఇస్తుంది. ఇదే మాధోపట్టి విజయ రహస్యం.చదవండి: ఐఏఎస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా.. ఆ రాష్ట్రం!మాధోపట్టి అనేది కేవలం మ్యాప్లో ఉన్న ప్రదేశం మాత్రమే కాదు. సంకల్పానికి చేయూత తోడైతే ఎలాంటి విజయాన్నైనా సాధింవచ్చనే భరోసాయిచ్చే స్ఫూర్తిదాయక ప్రాంతం. కష్టపడి పనిచేసే వారికి అండగా నిలబడేవారు ఉంటే అపజయం అన్నమాటే ఉండదనడానికి మాధోపట్టి గ్రామ విజయమే ప్రత్యక్ష నిదర్శనం. -
యూపీఎస్సీ టాపర్స్ చిరునామా.. ఆ రాష్ట్రం!
ఏ రాష్ట్రం నుంచి అత్యధికంగా UPSC టాపర్లు వచ్చారో చెప్పమని ఎవరినైనా అడిగితే.. వారి నుంచి వెంటనే వచ్చే సమాధానం బిహార్. అయితే కొన్నేళ్ల క్రితం వరకు ఇది సరైన సమాధానమే. కానీ ఇప్పుడు కాదు. గతంలో యూపీఎస్సీ టాపర్లు అనగానే ముందుగా బిహార్ పేరుకు గుర్తుకు వచ్చేది. ఎందుకంటే ఆ రాష్ట్రానికి చెందిన చాలా మంది సివిల్స్లో సత్తా చాటి యావత్ దేశం తమవైపు చూసేలా చేశారు. అకుంఠిత దీక్ష, పట్టుదలతో కష్టసాధ్యమైన సివిల్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా, ముందు వరుసలో నిలిచి బిహార్కు పేరు తెచ్చారు. దీంతో చాలా కాలం పాటు యూపీఎస్సీ టాపర్లకు చిరునామాగా బిహార్ నిలిచింది.ఐఏఎస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాఅయితే గడిచిన నాలుగేళ్లలో యూపీఎస్సీ టాపర్ల కేరాఫ్ అడ్రస్ మారింది. బిహార్ పొరుగు రాష్ట్రమైన యూపీ 'టాప్' లేపింది. ఉత్తరప్రదేశ్కు చెందిన అభ్యర్థులు సివిల్స్లో విజయపతాకం ఎగురువేశారు. వరుసగా నాలుగేళ్లు అత్యధిక సంఖ్యలో టాపర్లను అందించి ఐఏఎస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా యూపీ అవతరించింది. అధికారిక గణాంకాల ప్రకారం చూసుకుంటే.. గత ఐదు UPSC టాపర్లలో నలుగురు ఉత్తరప్రదేశ్కు చెందినవారే ఉన్నారు.యూపీఎస్సీ టాపర్లు2021: శ్రుతి శర్మ (ఉత్తరప్రదేశ్)2022: ఇషితా కిషోర్ (ఉత్తరప్రదేశ్)2023: ఆదిత్య శ్రీవాస్తవ (ఉత్తరప్రదేశ్)2024: శక్తి దుబే (ఉత్తరప్రదేశ్)ఎలా సాధ్యమైంది?ఐఏఎస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా యూపీ ఎదగడానికి గల కారణాలు ఏంటని చూస్తే.. ఆ రాష్ట్రం ప్రధాన బలం అధిక జనాభా. ప్రభుత్వ సేవను విలువైనదిగా భావించే సాంస్కృతిక వాతావరణం రెండో కారణంగా చెప్పుకోవచ్చు. ప్రయాగ్రాజ్, లక్నో(Lucknow) వంటి నగరాలు సివిల్స్ కోచింగ్ కేంద్రాలుగా మారడం మూడో కారణం. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉండడంతో అక్కడి కోచింగ్ సెంటర్లు కూడా అందుబాటులో ఉండడం వల్ల యూపీ వాసులకు ఎక్కువగా సివిల్స్ యోగం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.చదవండి: ఆరాటం ముందు ఆటంకం ఎంతవరుసగా నాలుగేళ్ల నుంచి సివిల్స్ టాపర్లలో యూపీ ముందున్నా, బిహార్ (Bihar) ఘనమైన వారసత్వం మరుగన పడదు. ఇతర ప్రాంతాల నుంచి కూడా విజేతలు ఉద్భవిస్తారనే వాస్తవాన్ని తాజా గణింకాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు విజయం ఎప్పుడూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదన్న నిజాన్ని చాటి చెబుతున్నాయి. -
జూపిటర్ ది సూపర్ కంప్యూటర్..!
ఇక్కడ కనిపిస్తున్నదేమిటో తెలుసా? యూరప్లోనే ఫాస్టెస్ట్ కంప్యూటర్. పేరు జూపిటర్. పశ్చిమ జర్మనీలోని జూలిచ్ నగరంలో గత వారం దీనిని ప్రారంభించారు. ఇది యూరప్లో తొలి ఎక్సాస్కేల్ సూపర్ కంప్యూటర్. అంటే ఇది సెకనుకు ఒక క్విన్టిలియన్ (అంటే 1 పక్కన 18 సున్నాలు) కాలిక్యులేషన్స్ చేయగలదు. ఈ సూపర్ కంప్యూటర్ భారీ సైజ్లో ఉంటుంది. పర్యావరణ పరిశోధనల్లో, ఏ.ఐ.లో కొత్త పరిశోధనలకు ఈ కంప్యూటర్ బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. మీరు నెట్లో దీని గురించి మరింతగా చదివి తెలుసుకోండి. టెక్ టాక్ జూపిటర్– ది సూపర్ కంప్యూటర్ ఇక్కడ కనిపిస్తున్నదేమిటో తెలుసా? యూరప్లోనే ఫాస్టెస్ట్ కంప్యూటర్. పేరు జూపిటర్. పశ్చిమ జర్మనీలోని జూలిచ్ నగరంలో గత వారం దీనిని ప్రారంభించారు. ఇది యూరప్లో తొలి ఎక్సాస్కేల్ సూపర్ కంప్యూటర్. అంటే ఇది సెకనుకు ఒక క్విన్టిలియన్ (అంటే 1 పక్కన 18 సున్నాలు) కాలిక్యులేషన్స్ చేయగలదు. ఈ సూపర్ కంప్యూటర్ భారీ సైజ్లో ఉంటుంది. పర్యావరణ పరిశోధనల్లో, ఏ.ఐ.లో కొత్త పరిశోధనలకు ఈ కంప్యూటర్ బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. మీరు నెట్లో దీని గురించి మరింతగా చదివి తెలుసుకోండి.(చదవండి: పుట్టకతో రికార్డు..ఒక్కసారిగా సెలబ్రిటీగా ఆ తల్లి..!) -
పుట్టకతో రికార్డు..ఒక్కసారిగా సెలబ్రిటీగా ఆ తల్లి..!
సాధారణ శిశువు ఆరోగ్యకరమైన బరువు 2.5 నుంచి 4.5 కిలోల మధ్య ఉంటుంది. అంతకు మించి ఉంటే అసాధారణ శిశువుగా పరిగణిస్తారు. కానీ ఈ బుడతడు పుట్టుకతో వైద్యులనూ, అమ్మనూ విస్తుపోయేలా చేశాడు. ప్రసూతి వార్డులోనే ఇంత పెద్ద శిశువు ఎప్పుడూ చూడలేదని వైద్యులే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ శిశువుని చూసి ఆ తల్లి ఈ బిడ్డ నా బిడ్డేనా అనే సందేహం వ్యక్తం చేసేలా అతడి ఆకృతి సంభ్రమాశ్చర్యాలకు గరయ్యేలా చేసింది. ఇదంతా ఎక్కడంటే..అమెరికాలోని టంపాకు దక్షిణంగా ఉండే ఫ్లోరిడాలో చేసుకుంది. 42 ఏళ్ల డానియెల్లా హైన్స్ అనే మహిళ సెప్టెంబర్ 03న భారీ మగ శిశవుకి జన్మనిచ్చింది. ఆ శిశువు బరువు దగ్గర దగ్గర ఏడు కేజీలు. అసాధారణ బరువుతో జన్మించి..పుట్టుకతో రికార్డు సృష్టించిన ఘనత దక్కించుకోవడమే కాదు పూర్తి ఆరోగ్యంతో ఉండటం విశేషం. ఇలా పుట్టడం అనేది అత్యంత అసాధారణమైతే, ఆరోగ్యంగా ఉండటం అనేది కూడా అత్యంత అరుదు. డానియల్కు సీజేరియన్ ఆపరేషన్ చేసి ఆ శిశువుని బయటకు తీశారు. స్పృహ వచ్చాక తన బిడ్డను చూసి..ఇది తన బిడ్డేనా అని ఆశ్చర్యపోయింది. ఇంత పెద్దగానా..! అని నోరెళ్లబెట్టింది. అంతేగాదు ఆమె ప్రసూతి వార్డుకి ప్రజలు తండోపతండాలుగా వచ్చి మరి ఆ బిడ్డను తిలకిస్తున్నారు. ఆహా పుట్టుకతో సెలబ్రిటీగా మారడమే కాదు, నన్ను కూడా ప్రత్యేకమైన తల్లిగా నిలబెట్టావురా కన్నా..! అంటూ సంబరపడిపోయింది ఆ తల్లి. నిజంగా భగవంతుడు మాకు ఇంత పెద్ద ఆశీస్సులు అందించాడని ఊహించలేకపోయా అంటూ నాటి మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఆ సంగతులను వివరించింది డానియోల్లా. అలాగే ఆ శిశువు కూడా అత్యంత పొడవే. డానియెల్లా దంపతులు కూడా పొడుగ్గానే ఉంటారు. అయితే డానియెల్లా గర్భంతో ఉన్నప్పుడూ..మధుమేహంతో బాధపడింది. శరీరంలోని గ్లూకోజ్ స్థాయిల అసాధారణత వల్ల గర్భణీలకు ఇంత పెద్దగా శిశువులు పుట్టే అవకాశం ఉందని వైద్యులు ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కూడా. అయినప్పటికీ ఇలా భారీ సైజులో శిశువు జన్మించడమే అందర్నీ విస్తుపోయేలా చేసింది. కాగా, ఇంతకుమునుపు ఈ రికార్డు బ్రెజిల్లో ఓ తల్లి ప్రసవించిన మగబిడ్డ పేరు మీద ఉండేదట. (చదవండి: ఎకో ఫ్రెండ్లీ లైఫ్కి నిర్వచనం ఈ దంపతులు..!) -
భావోద్వేగాలను అదుపు చేసుకోవాలంటే..!
మెదడుకు చేరాల్సిన ఆక్సిజన్ స్థాయిల్లో మార్పులు, రక్తప్రసరణల అడ్డంకులు రకరకాల సమస్యలకు కారణం అవుతుంటాయి. మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపే ఈ సమస్యను యోగాసనాల ద్వారా బ్యాలెన్స్ చేసుకునే ఎన్నో పద్ధతులున్నాయి. వాటిలో ప్రసరిత హస్త ఉత్థానాసన ఒకటి. దీన్నే వైడ్ స్టాన్స్ ఫార్వర్డ్ బెండ్ అని కూడా అంటారు.ప్రసరిత హస్త ఉత్థానాసన...సంస్కృతంలో ‘హస్త’ అంటే చేతులు, ‘ఉత్’ అంటే తీవ్రమైన, ‘తాన్’ అంటే సాగదీయడం, ‘ప్రసరిత’ అంటే విస్తరించడం. చేతులు, పాదాలను స్ట్రెచ్ చేయడం ఈ ఆసనంలో చూస్తాం. ఈ ఆసనం ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరుస్తుందని, గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని హైలైట్ చేసింది. మీరు దీన్ని ఎలా చేయవచ్చో ఇక్కడ ఉంది.ఇలా చేయాలి... సమస్థితిలో నిలబడి, దీర్ఘ శ్వాస తీసుకొని, వదలాలి చేతులను తలపైకి లేపి, వెన్నును ముందుకు తలను వెనక్కి వంచాలి. ఈ సమయంలో చేతులు కూడా వెనక్కి వంచాలి అదే భంగిమ నుంచి మెల్లగా తల భూమికి ఆనేలా ముందుకు వంగాలి. చేతులను నేలకు ఆనించడం, వీలైతే దాలను పట్టుకోవడం.. చేయవచ్చు ఈ భంగిమలు ఐదు దీర్ఘ శ్వాసలు తీసుకొని, వదలాలి. తిరిగి యధా స్థితికి చేరుకోవాలి దీంతో ఉచ్ఛ్వాస నిశ్వాసలు మెరుగు అవుతాయి. సూర్య నమస్కారాల్లో రెండవ భంగిమతో మొదలుపెట్టే ఈ ఆసనం వల్ల ఆక్సిజన్ లెవల్స్, రక్త ప్రసరణలో మెరుగైన ఫలితాలు పొందవచ్చు. దీని వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన వంటివి బ్యాలెన్స్డ్గా ఉంటాయి. (చదవండి: ఎకో ఫ్రెండ్లీ లైఫ్కి నిర్వచనం ఈ దంపతులు..!) -
అందమైన జీవితానికి అర్థం ఈ దంపతులు..!
పక్షుల కువకువలే తప్ప హారన్ మోతలు లేవు, ఎటు చూసినా పచ్చని చెట్లు, పంటపొలాలే తప్ప. ఎత్తైన భవనాలు లేవు. అలారం మోతతోనో మొబైల్ఫోన్ కాల్తోనో కాకుండా నులివెచ్చని సూర్యకిరణాలు తట్టిలేపుతున్నాయి. బ్రేక్ మీద నుంచి కాలు తీయలేని ట్రాఫిక్ జామ్లు లేవు, కాలినడకతో ఎంతదూరం వెళ్లినా అడుగులకు బ్రేక్ వేయాల్సిన పనిలేదు. ఎండ, వాన, చలికాలాలను అచ్చంగా ఆస్వాదించవచ్చు. నీల్, మోమోలుగా ప్రాచుర్యంలోకి వచ్చిన స్వప్నిల్ రావు, మృణ్మయీ దేశ్పాండేల జీవితం ఇది. వాళ్లు ఐదేళ్ల కిందట మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ కొండల్లోని ఓ గ్రామానికి వెళ్లారు. అక్కడ కొంత బంజరు నేలను కొని సాగు చేశారు. గొప్ప ఇంజినీరింగ్ స్కిల్తో ఇంటిని నిర్మించుకున్నారు. నగరంలో పుట్టి పెరిగిన వాళ్లకు గ్రామం ఎలా ఉంటుందో తెలియదు. సినిమాల్లో చూడడం తప్ప గ్రామాన్ని, గ్రామీణ జీవితాన్ని ఎక్స్పీరియెన్స్ చేయలేరు. ముంబయి దంపతులు నగరాన్ని వదిలి కొండకోనల్లోని ఓ కుగ్రామానికి వెళ్లి అక్కడే నివసిస్తున్నారు. అది కూడా పర్యావరణ హితంగా. స్థానికంగా దొరికే ల్యాటరైట్ ఇటుకలతో ఇద్దరూ ఇటుక ఇటుక పేర్చి ఇంటిని నిర్మించుకున్నారు. బంజరు భూమిని చదును చేసి సాగులోకి తెచ్చి స్వయంగా మొక్కలు నాటి పంటలు పండిస్తున్నారు. జీరో వేస్ట్ లైఫ్స్టైల్ను అనుసరిస్తున్నారు. ఇది నీల్, మోమో దంపతుల అచీవ్మెంట్.ఎకోఫ్రెండ్లీ జీవితం స్వప్నిల్, మృణ్మయిలు సిటీ బిజీ జీవితంలో అలసిపోయారు. జీవితం ఇంకోలా ఉంటే బావుణ్ణనుకున్నారు. ఆ ఆలోచన ఫలితమే ఇప్పుడు వాళ్లు ములుసార్ గ్రామంలో జీవిస్తున్న ఎకోఫెండ్లీ జీవితం. 2020 నుంచి అక్కడే జీవిస్తూ పొలాన్ని సాగు చేసి రకరకాల కూరగాయలు, పండ్లు పండిస్తున్నారు. ఆ ఉత్పత్తులతో నగరానికి ఉపయోగపడే పని ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది. నీల్ అండ్ మోమో పేరుతో పర్యావరణహితమైన సబ్బులు, షాంపూలు ఇతర ఉత్పత్తుల పరిశ్రమ నిర్వహిస్తున్నారు. మదర్ ఎర్త్ని కాపాడుకోవడం నగర జీవితంలో సాధ్యం కావడం లేదు. ప్రకృతితో కలిసి జీవిస్తూ నగరాల్లో ఉండే వారికి పర్యారణహితమైన ఉత్పత్తులను చేరుస్తున్నారీ దంపతులు. (చదవండి: దటీజ్ సప్నా': చెదిరిపోయిన కలను సేవతో సాకారం చేస్తోంది..!) -
'దటీజ్ సప్నా': చెదిరిపోయిన కలను సేవతో సాకారం చేస్తోంది..!
పశ్చిమ బెంగాల్లోని మాల్డా వీధుల్లో సాదాసీదాగా ఉండే ఒక వృద్ధ మహిళ ఒక ముతక సంచీ భుజాన వేసుకుని షేరింగ్ ఆటోలో ప్రయాణిస్తుండటం కనిపిస్తుంది. ఆమె వయసు 70 ఏళ్లు, అయితేనేం.. ఉత్సాహంలో.. చురుకుదనంలో పాతికేళ్ల యువతీ యువకులతో పోటీ పడుతోందామె. స్కూల్ టీచర్గా పుష్కరం క్రితం రిటైరైందామె. ప్రభుత్వం వారిచ్చే పెన్షన్ తీసుకుంటూ హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు కదా... ఈ వయసులో మీరు ఇంత శ్రమ తీసుకోవడం అవసరమా? అనడిగితే... ‘‘చదువుకోవాలని కొండంత కోరిక ఉన్నా, బోలెడంత డబ్బు పెట్టి చదువు కొనలేక నిరుత్సాహంతో నీరసపడిపోయే నిరుపేద పిల్లలకు నాకు తెలిసిన నాలుగు అక్షరం ముక్కలు నేర్పి, వారి కాళ్ల మీద వాళ్లను నిలబడేలా చేయాలన్న నా కలే నాకు ఉత్సాహాన్నిస్తోంది’’ అంటుందామె. ఆమె సప్నా ఘోష్ రాయదాస్, గత పదేళ్లుగా ఆమె జీతం లేకుండా గణితం, సైన్సుబోధిస్తోంది.ఆమె 2015లో ఉద్యోగ విరమణ చేసినప్పటినుంచి ఇంట్లో కూర్చోవడానికి బదులుగా, ఆమె ప్రతిరోజూ 7 కిలోమీటర్లు ప్రయాణించి మరీ మారుమూలన ఎక్కడో నిరుపేదల కోసం ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన ఆ పాఠశాలకు వెళ్లి, గణితం, సైన్స్ బోధించాలనుకుంది. ఎందుకంటే ఆమెకు అందులోనే శాంతి, విశ్రాంతి కూడా.సప్నాకు సొంత పిల్లలు లేరు, కానీ ఆమె బోధించిన పిల్లలు వీధిలో ఆమెను చిరునవ్వుతో పలకరించి ఆమె పాదాలను తాకినప్పుడు, ఆమె హృదయం గర్వం, ఆనందంతో నిండిపోతుంది. ‘చిన్నప్పటినుంచి డాక్టర్ కావాలని కలలు కనేదాన్ని, కానీ మా ఇంటి పరిస్థితులు నన్ను టీచర్ కావడానికి దారితీశాయి. నా విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు, అధికారులు కావడం చూసినప్పుడు, నేను చేసినది నా కల కంటే గొప్పదని నాకు అనిపిస్తుంది.‘ అంటున్న సప్న రాయ్ అందరికీ స్ఫూర్తిదాయకం. (చదవండి: లిటిల్ పొయెట్..! ) -
సిరిసిల్లవాసి.. బాలీవుడ్లో తిరుగులేని హీరోగా స్టార్డమ్
తెలుగు నేల మీద పుట్టి, ముంబై మహానగరానికి వెళ్లి, అక్కడ హీరోగా విశేషమైన పేరు తెచ్చుకున్న ఓ వ్యక్తి ఉన్నారు. ఆయనే పైడి జైరాజ్ (Paidi Jairaj). పైడి జైరాజ్ పూర్తి పేరు పైడిపాటి జైరాజ్. ఆయన తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లలో 28 సెప్టెంబర్ 1909న జన్మించారు. ఆయనకు ఇద్దరు అన్నలు. పైడిపాటి సుందరరాజా, పైడిపాటి దీనదయాళ్. జైరాజ్ చిన్నవాడు కావడంతో అందరూ అతణ్ని అపురూపంగా చూసుకునేవారు. హైదరాబాద్ నగరంలోని నిజాం కళాశాలలో జైరాజ్ డిగ్రీ చదువుకున్నారు. మూకీ సినిమాలుఆ సమయంలో నాటక రంగం, చలనచిత్రాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఎలాగైనా సినిమాల్లో చేరాలన్న ఉద్దేశంతో 1929లో బొంబాయికి వెళ్లిపోయారు. ‘స్టార్ క్లింగ్ యూత్’ అనే నిశ్శబ్ద చిత్రంతో నటుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ‘మాతృభూమి’, ‘ఆల్ ఫర్ లవర్’, ‘మహాసాగర్ మోతి’, ‘ఫ్లైట్ ఇంటూ డెత్’ తదితర సైలెంట్ సినిమాల్లో నటించారు.బాలీవుడ్లో రాణించిన తెలుగు వ్యక్తిమంచి నటుడిగా పేరు తెచ్చుకొని హమారీ బాత్ (1943), సింగార్ (1949), అమర్ కహానీ(1949), రాజ్పుత్ (1951), రేషమ్(1952) తదితర చిత్రాల్లో హీరోగా నటించారు. పృథ్వీరాజ్ చౌహాన్, మహారాణా ప్రతాప్ వంటి కీలకమైన పాత్రల్లో నటించి మెప్పించారు. 1952లో ‘సాగర్’ అనే సినిమాను తనే నిర్మించి దర్శకత్వం వహించారు. తెలుగు వ్యక్తిగా హిందీ సినిమాల్లో హీరోగా ఎదిగిన అరుదైన ఘనతను సాధించారు. జీవితంపై డాక్యుమెంటరీనటుడిగా ఎదుగుతున్న సమయంలోనే ఢిల్లీకి చెందిన పంజాబీ మహిళ సావిత్రిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. భారతీయ సినీరంగానికి ఆయన చేసిన సేవలకు గానూ 1980లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందించారు. జైరాజ్ 2000వ సంవత్సరం 11 ఆగస్టున ముంబైలో మరణించారు. ఆయన జీవితంపై 2018లో తెలంగాణ ప్రభుత్వం ‘లైఫ్ జర్నీ ఆఫ్ జైరాజ్’ అనే డాక్యుమెంటరీని రూపొందించింది.చదవండి: 'మిరాయ్' విజయం.. మనోజ్ తల్లి ఎమోషనల్.. వీడియో వైరల్ -
కసివద్దు..'పంచ్'కోండి..! కోపాన్ని కక్కేయండిలా..
‘‘శిలలపై పిడిగుద్దు గుద్దినారూ... మనవాళ్లు మనసులో కోపాన్ని బయటికే తోసినారూ...!’’ అంటూ పాడుకుంటూ ప్రస్తుతం థాయిలాండ్ వాసులు తమలోని ఫ్రస్టేషన్ను బయటకు వెళ్లగక్కుతున్నారు. ‘‘అహో ఆఫీసు బాసూ... ఆ యముడంటి క్రూరిస్టు శాడిస్టు ఫేసూ... ఈ ఆఫీసు యజమానిగా మా పిడిగుద్దుల పాలబడ్డావయా...’’ అని ఆలాపన పాడిన తర్వాత... ‘‘ప్రతిమపై పిడిగుద్దు గుద్దినారూ... మనవాళ్లు కసితీర అక్కసును వెళ్లగక్కినారూ’’ అంటూ ఖూనీచేయాల్సినంత కసిని... కూనిరాగాలతో సరిపెట్టుకుని తమ కోపాల్నీ, ఫ్రస్టేషన్లనూ బయటకు తీసిపడేస్తున్నారు. దాంతో తమ ‘కోప్తాపాలూ డీప్ డిప్రెషన్ల’ నుంచి చప్పున బయటకు వచ్చేస్తున్న ఫీలింగ్ కలుగుతోందంటూ హ్యాపీగా చెబుతున్నారు. ఇలా కోపం వెళ్లగక్కేది విధిగా మన బాసు పైనే కానక్కర్లేదు... అది యథేచ్ఛగా మన ఎక్స్ గాళ్ఫ్రెండూ కావచ్చూ లేదా మన బాయ్ఫ్రెండూ కావచ్చు. ఇలా వాళ్లెవరైనప్పటికీ... వాళ్ల మీద ఉన్న కసినీ, అక్కసును కూడా హాయిగా... ‘‘వారెవా ఏమి ఎక్సు... నన్ను వదిలేసి దౌడు తీసూ’’ అంటూ మాజీ ప్రేమిక (కుడి) మీద ఉన్న కోపాన్ని వెళ్లగక్కుకోవచ్చు. అలా మన మనసులోని కోపాగ్రహబాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది మరెక్కడో కాదు... మన పొరుగున ఉన్న థాయిలాండ్లోనే. అక్కడి వీధుల్లో ప్రతిమలు తయారు చేసే ఓ స్కల్ప్చర్ షాప్ ఉంది. మనం చేయాల్సిందల్లా మన ఆగ్రహానికి గురికాబోయే సదరు అభాగ్యుల ఫొటో తీసుకెళ్లి... జస్ట్ వాళ్లకు హ్యాండోవర్ చేసేయడమే. వాళ్లు శ్రద్ధగా జీవం ఉట్టిపడేలా మనక్కావాల్సిన ప్రతిమను తయారు చేసి పెడతారు. అంతే... ఆ తర్వాత మనం దాంట్లోని జీవకళంతా వెళ్లి΄ోయేలా, మన మనసులోని కోపమంతా పారిపోయేలా, మన మదిలోని అక్కసంతా తీరి΄ోయేలా బాదేయవచ్చు. ఇక మనలో కసి మరీ ఎక్కువగా ఉందనుకోండి... పుస్తకాల్లో సాదా ప్రతీ, మేలుప్రతిలాగానే... ఆ బంకమట్టిలోపలే కాస్తంత మెటల్ఫ్రేము గట్టిగా అమర్చి మరో పది దెబ్బలకు నిలిచేలా, ఇంకో నాలుగు దెబ్బలు కాసేలా మేలైన స్టాండర్డు మట్టిప్రతిమలు తయారు చేసిస్తారు. మనసాగలేక మనం అక్కడికక్కడే మనస్పూర్తిగా కొట్టేశాక కూడా మన కసి తీరలేదనుకోండి. పర్లేదు... మరో నాల్రోజులకోసం అద్దెకిస్తారు లేదా కాస్త డబ్బులెక్కువ పే చేస్తే మనక్కావల్సిన ప్రతిమను మనకే పర్మనెంటుగా అమ్మేస్తారు కూడా. ఈ ప్రతిమలూ దెబ్బల వ్యవహారమంతా చూస్తూ... ‘‘అద్దిరా కసితీరా కొట్టే దెబ్బలోని పవరు. అరెరె... భలే టెక్నిక్కు కదా... బహుమంచి క్రియేటివిటీ కదా’’ అంటూ కొందరంటూ ఉంటే.. ‘‘ఆ... ఆ టెక్నిక్కుదేవుందీ... ఈ టైపు క్రియేటివిటీ మనకెప్పట్నుంచో తెలుసు. దెబ్బకు దెయ్యం దిగొస్తుందనే సామెత మన దగ్గర లేదా’’ అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. ‘‘మన హాస్య దర్శకుడు జంధ్యాల ఇలాంటి టెక్నిక్కులనెప్పుడో కనిపెట్టేశారంటూ ‘అహ నా పెళ్లంట’ సినిమాల్లో బ్రహ్మానందం... వాళ్ల బాసూ, పరమ పిసినారి పీసు కోట శ్రీనివాసరావును షాట్ ఫ్రీజు చేసి మరీ ‘‘పోతావురా ఒరేయ్... మట్టిగొట్టుకుపోతావు రా... నాశనమైపోతావురా’’ అంటూ తిట్టే షాట్లూ... ‘‘బాబాయ్ అబ్బాయ్ సినిమాలో సుత్తివేలు తనకు కోపం వచ్చినప్పుడల్లా చిందులు తొక్కుతూ... రోజుకు ‘మూడు పూటల కోటా’ చొప్పున తాను కసితీరా బాదేయడానికి ఓ బానపొట్ట పహిల్వాన్ను పనిలో పెట్టుకున్న సీన్లూ ఉదాహరిస్తున్నారు. ఏతావాతా చెప్పొచ్చేదేమంటే ‘‘మనం ఎవరిపట్ల కోపం కలిగి ఉన్నామో వారికి ఏమాత్రం హాని కలగని విధంగా... కసితీరా మన కినుకను వెళ్లగక్కి హాయిగా కునుకు తీయగలుగుతున్నప్పుడు ఏమార్గమైతేనేమీ... ఈ మార్గమైతేనేమీ’’ అంటూ కొందరిప్పుడు సన్నాయినొక్కులు నొక్కి మరికొందరు... ప్రతిమ మీద దెబ్బలాగా ఢంకా బజాయించి ఇంకొందరూ కసి తీర్చుకునే మార్గానికి సపోర్టు చేస్తున్నారు.– యాసీన్ (చదవండి: చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకోగలవు) -
లిటిల్ పొయెట్..!
కేరళ రాష్ట్రం కోళికోడ్కు చెందిన అజ్ఞా యామి దేశంలో అతి పిన్న వయస్కురాలైన కవయిత్రిగా రికార్డు సృష్టించింది. ఐదేళ్లకే కవిత్వం రాసి పుస్తకం వేసింది. రైమ్స్ చెప్పే వయసులో సొంతంగా కవిత్వం రాయడం చాలా గ్రేట్.అజ్ఞా యామి 2017లో జన్మించింది. యూకేజీ చదువుతున్న సమయంలోనే మలయాళ పదాలతో వాక్యాలు రాస్తూ తన భావాలను వ్యక్తం చేసేది. ఆమె ప్రతిభ, భాష పట్ల మక్కువ చూసిన తల్లిదండ్రులు, శ్రీశాంత్, శ్రుతి ప్రోత్సహించారు. కవిత్వం గురించి, కవితల గురించి వివరించారు. కొన్ని కవితలు విన్న అజ్ఞా యామి తనూ కవిత్వం రాయడం మొదలెట్టింది. చుట్టూ ఉన్న ప్రపంచంలోని రకరకాల అంశాలపై కవితలు అల్లింది. బాల్యంలోని అమాయకత్వం మొదలుకొని, ప్రకృతిలోని రంగుల వరకు అనేక రకాల సబ్జెక్ట్స్ పై పోయెమ్స్ రాసింది. 30 కవితల్ని కలిపి ‘వర్ణపట్టం’(రంగుల గాలిపటం) పేరుతో పుస్తకం వెలువరించింది. వాటికి బొమ్మలు కూడా తనే గీయడం విశేషం. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు అతి పిన్న వయస్కురాలైన కవయిత్రిగా రికార్డు అందించారు. (చదవండి: చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకోగలవు) -
చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకోగలవు
ఈ ప్రకృతిలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. మనం మన మేధోశక్తితో శాస్త్ర సాంకేతికతను ఉపయోగించుకుని ఒక్కొక్క రహస్యాన్ని చేధిస్తూ వస్తున్నాం. ఉన్నచోటే ఉంటూ మనకు నిత్యం ఆక్సిజన్ అందిస్తున్న చెట్లకు/మొక్కలకు ప్రాణం ఉందని జగదీష్ చంద్రబోస్ అనే శాస్త్రవేత్త శాస్త్రీయ ఆధారాలతో నిరూపించారు. మరి ప్రాణమున్న ప్రతీ జీవి శిలావిగ్రహంలా ఉండిపోదు కదా! ఇంకో ప్రాణితో కమ్యూనికేట్ చేస్తుంది. మనుషులకు భాష ఉన్నట్లు చెట్లకు కూడా వాటిదైన భాష ఉంటుందా అని సందేహం వచ్చింది మనిషికి. పరిశోధన చేశాడు.అన్ని ప్రాణుల్లాగానే చెట్లు కూడా ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయని, అవి వాటి సామాజిక నెట్వర్క్లో భాగమని కెనడా శాస్త్రవేత్త సుజానే సిమార్డ్ తన పరిశోధనల ద్వారా నిర్థారించారు. చెట్లు ‘వుడ్ వైడ్ వెబ్’ అని పిలిచే భూగర్భ మైకోరైజల్ ఫంగస్ నెట్వర్క్ ద్వారా కమ్యూనికేట్ చేస్తాయట. పోషకాలు, నీరు వంటి వాటి గురించి వాకబు చేసుకోవడం, ఏదైనా ప్రకృతి విపత్తులను ముందుగానే గుర్తించి హెచ్చరిక చేసుకోవడం వంటి చర్యల ద్వారా ఇవి కమ్యూనికేట్ అవుతాయి. ఈ నెట్వర్క్ చెట్ల రూట్ సిస్టమ్లను కలుపుతుంది, ఇది మానవ మెదడు న్యూరాన్ల వంటిది.సిమార్డ్, 1997లో నేచర్ జర్నల్లో తన పరిశోధనను పబ్లిష్ చేస్తూ –– పేపర్ బిర్చ్, డగ్లస్ ఫిర్ చెట్ల మధ్య కార్బన్ బదిలీని రేడియోఆక్టివ్ ఐసోటోప్లతో ట్రాక్ చేసినట్టు చెప్పారు. బిర్చ్ చెట్టు అధిక కార్బన్ను ఫిర్ చెట్టుకి పంపితే తరువాత ఫిర్ చెట్టు బిర్చ్ చెట్టుకి కార్బన్ని పంపింది. ఇది చెట్ల పరస్పర సహకారాన్ని చూపిస్తుంది. మరో ఎక్స్పెరిమెంట్లో గాయపడిన డగ్లస్ ఫిర్ చెట్టు పొరుగు చెట్టయిన పాండెరోసా పైన్కు రక్షణ ఎంజైమ్లను ఉత్పత్తి చేయమని సిగ్నల్ పంపగా అది ప్రతిస్పందిచింది. ఇలాంటి అనేక పరిశోధనల తర్వాత ఇతర జీవుల్లానే చెట్లు కూడా సంభాషించుకుంటాయనే నిర్ధారణకు వచ్చారు శాస్త్రవేత్తలు. (చదవండి: 'ఊరంత స్కూలు': ఎర్లీ లెర్నింగ్ విలేజ్) -
'ఊరంత స్కూలు': ఎర్లీ లెర్నింగ్ విలేజ్
మీ స్కూల్లో మొత్తం ఎంతమంది చదువుతున్నారు? 500 మంది, వెయ్యి మంది.. అంతకంటే ఎక్కువుండటం కష్టం కదూ. అయితే ఒక ఊరంత స్కూల్ మీకు తెలుసా? అక్కడ ఏకంగా 2,100 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఇంకో విశేషమేమిటంటే, వీరంతా ప్రీ–స్కూల్ చదివే చిన్నారులు. సింగపూర్ నగరం లోరాంగ్ చువాన్లోని ఆస్ట్రేలియన్ ఇంటర్నేషనల్ స్కూల్ (ఏఐఎస్) క్యాంపస్ పక్కనే ఈ స్కూల్ ఉంది. దీన్ని ‘ఎర్లీ లెర్నింగ్ విలేజ్ (Early Learning Village) అంటారు. ఏఐఎస్, స్టాంఫోర్డ్ అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ కలిసి దీన్ని నిర్మించాయి. ప్రపంచంలో అతి పెద్ద ప్రీస్కూల్ ఇదే. సుమారు 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని కట్టించారు. అంటే మొత్తం ఏడు ఫుట్బాల్ మైదానాలంత స్థలంలో ఐదు భవనాలు, 100 కంటే ఎక్కువ తరగతి గదులతో ఈ స్కూల్ని నిర్మించారు. 18 నెలల నుండి ఆరు సంవత్సరాల వయస్సున్న పిల్లలు ఇక్కడ చదువుకుంటారు. వారికోసం ఈ క్యాంపస్ అంతా చెట్ల పచ్చదనంతో నిండి ఉంటుంది. 2017లో ఈ స్కూల్ని ప్రారంభించారు. స్కూల్ అంటే కేవలం పుస్తకాలతో కుస్తీ పట్టడం, పద్యాలు పాడించడం మాత్రమే ఉండదు. ఇక్కడ పిల్లలు ఆడుకునేందుకు అనేక ఆట పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఈత నేర్పేందుకు సిబ్బందితోపాటు 20 మీటర్ల స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇక్కడ ఇండోర్ ఎయిర్ కండిషన్డ్డ జిమ్ కూడా ఉంది. ఇక్కడ వివిధ దేశాల చిన్నారులు చేరుతుండటంతో కొన్ని పాఠాలు వారి దేశాలు, ఖండాలకు తగ్గట్లుగా నేర్పిస్తారు. ఈ క్రమంలో ఒకే వయనున్న పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక అంతస్తు కేటాయించారు. ప్రతి తరగతి విద్యార్థులను నాలుగు బృందాలుగా విభజించి, వారు మరింత చురుగ్గా మారేందుకు టీచర్లు శ్రద్ధ చూపిస్తారు. ఈ స్కూల్ గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి తమ పిల్లల్ని ఇక్కడ చేర్పిస్తూ ఉంటారు. (చదవండి: నోరూరించే చాక్లెట్తో టేస్టీ..టేస్టీ రెసిపీలు..!) -
నోరూరించే చాక్లెట్తో టేస్టీ..టేస్టీ రెసిపీలు..!
వయసు తేడాలు లేకుండా అందరికీ నచ్చేది. ఎవరికైనా కానుకగా ఇవ్వాలన్నా సరైన ఎంపికగా ఉండేది. భావోద్వేగాల అదుపుకు సహాయకారిగా మారేది. నలుగురిలో ఉన్నప్పుడు ఆనందపు సంబరాన్ని క్షణాల్లో మూటగట్టి తెచ్చే నేస్తం... చాక్లెట్. పండ్ల ముక్కలతో, డ్రై ఫ్రూట్స్తో చాక్లెట్ను సులువుగా తయారు చేసుకుందాం. ఆరోగ్యకరమైన ఆనందాన్ని ఇంటర్నేషనల్ చాక్లెట్ డే సందర్భంగా మన వంటింటి నుంచే పంచుకుందాం.ఫ్రూట్ – నట్స్ చాక్లెట్కావల్సినవి: డార్క్ చాక్లెట్ – 350 గ్రా.లు; జీడిపప్పు – 50 గ్రా.లు / అర కప్పు; బాదం పప్పు – 50 గ్రా.లు / అర కప్పు; కిస్మిస్ – 50 గ్రా.లు / అరకప్పు; టూటీ ఫ్రూటీ – అరకప్పు (నారింజ – ఆకుపచ్చవి); నచ్చిన అచ్చు – 1; బటర్ – అచ్చులపైన రాయడానికి టీస్పూన్;తయారీ: ∙ముందుగా నచ్చిన అచ్చు తీసుకొని, దానిని బటర్తో రాసి, కాసేపు పక్కన ఉంచాలి.డబుల్ బాయిలర్ పద్ధతిలో చాక్లెట్ను కరిగించి, పక్కన పెట్టాలి. నట్స్, డ్రై ఫ్రూట్స్ని సన్నని ముక్కలుగా కట్ చేయాలి. వీటిని కరిగిన చాక్లెట్లో వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని స్పూన్తో తీసుకొని, సిద్ధంగా ఉంచిన అచ్చును నింపి, పైన డ్రై ఫ్రూట్స్తో అలంకరించి, గంటసేపు డీప్ ఫ్రీజర్లో ఉంచాలి. ∙మిశ్రమం పూర్తిగా గట్టిపడిందని నిర్ధారించుకున్నాక, దానిని ఆస్వాదించవచ్చు. గిఫ్ట్గానూ ఇవ్వచ్చు.చాక్లెట్ కవర్డ్ ఫ్రూట్కావల్సినవి:సెమీ స్వీట్ కోకో చాక్లెట్ చిప్స్ – కప్పుబటర్ – 2 టేబుల్ స్పూన్లుఫ్రూట్స్ (స్ట్రాబెర్రీ/ఆరెంజ్/ ద్రాక్ష / అరటిపండు,.. ) స్లైసులుగా కట్ చేసుకోవాలి – తగినన్నిబేకింగ్ షీట్ – 1తయారీ: చాక్లెట్ను డబుల్ బాయిలర్ పద్ధతిలో కరిగించాలి. (స్టెయిన్ లెస్ లేదా గాజు గిన్నెలో చాక్లెట్ వేసి, మరుగుతున్న నీటిలో ఆ గిన్నెను ఉంచి, కలుపుతూ ఉండాలి. చాక్లెట్ కరిగాక ఆ గిన్నెను బయటకు తీసి, ఒక్కో స్ట్రాబెర్రీ లేదా నచ్చిన పండు ముక్కను ఆ మిశ్రమంలో ముంచి, ప్లేట్పై పరిచిన బేకింగ్ షీట్పై ఉంచాలి. దానిని డీప్ ఫ్రీజర్లో ఉంచి, అరగంట తర్వాత బయటకు తీసి సర్వ్ చేయాలి.చాక్లెట్ బాల్స్కావల్సినవి:డ్రై ఆప్రికాట్స్ – 125 గ్రా. (తరగాలి);ఎండుద్రాక్ష – అర కప్పు (తరగాలి);ఆరెంజ్ తొక్క తరుగు – 2 టీ స్పూన్లు;డార్క్ చాకోలెట్ తరుగు – 75 గ్రా.;డార్క్ చాకోలెట్ (అదనంగా) – 200 గ్రాం.లు;బటర్ – 75 గ్రా.;తయారీ: ఒక గిన్నెలో ఆప్రికాట్, ఎండ్రుద్రాక్ష, ఆరెంజ్ తొక్క తరుగు, డార్క్ చాకోలెట్ తరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని టీ స్పూన్ అంత తీసుకొని బాల్స్లా చేయాలి. వీటిని డీప్ ఫ్రీజర్లో రాత్రంతా ఉంచాలి. అదనంగా తీసుకున్న 200 గ్రా.ల చాకోలెట్ను ముక్కలుగా చేయాలి. ఒక గిన్నెలో బటర్, చాకోలెట్ ముక్కలు వేయాలి. పాన్లో నీళ్లు ΄ోసి, మరిగించి, ఆ నీటిలో ఈ గిన్నె ఉంచి చాకోలెట్ కరిగించాలి. మిశ్రమం మృదువుగా అయ్యాక దించాలి. ఫ్రిజ్ నుంచి తీసిన ఫ్రూట్ బాల్స్ని చాకోలెట్ మిశ్రమంలో ముంచి, తీయాలి. ఆరాక ఫాయిల్ పేపర్లో ఒక్కో చాకోలెట్ బాల్ని ఉంచి, చుట్టాలి. వీటిని ఫ్రిజ్లో ఉంచి అరగంట తర్వాత సర్వ్ చేయాలి. (చదవండి: -
అక్షర ప్రియ
నటిగా సుపరిచితురాలైన ప్రియాంక చోప్రా సింగర్, రైటర్ కూడా. పుస్తకాలు బాగా చదివే అలవాటు ఉన్న ప్రియాంక, తాను చదివిన పుస్తకాల గురించి తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ‘మీరు ఈ పుస్తకాలు చదివితే బాగుంటుంది’ అంటూ కొన్ని పుస్తకాల పేర్లు సూచించింది. అవి...వాయిసెస్ ఆఫ్ పవర్ఫుల్ ఉమెన్– జోయి సలీస్లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ – నెల్సన్ మండేలహోమ్గోయింగ్ –యా గ్యాసీఅన్టేమ్డ్ –గ్లెనన్ డోయల్లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ నెలన్స్ మండేల అనే పేరులోనే పిడికిలి బిగించిన దృశ్యం ఆవిష్కారం అవుతుంది. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా, ఎన్ని సంవత్సరాలు జైలుపాలైనా ఎప్పుడూ రాజీపడలేదు. మడమ తిప్పలేదు. జాత్యహంకారంపై నిరంతర పోరాటం చేశాడు. ‘లాంగ్ వాక్ టు ఫ్రీడమ్’ ఆయన జీవితానికి అద్దం పట్టే పుస్తకం. బాల్యం నుంచి అధ్యక్షుడి వరకు మండేలా జీవితంలోని ఎన్నో ఘట్టాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి.హోమ్ గోయింగ్యా గ్యాసీ రాసిన ‘హోమ్గోయింగ్’ కాల్పనిక చారిత్రక నవల. బ్రిటిష్ వలసవాద కాలంలోని బానిసల జీవితానికి అద్దం పట్టే పుస్తకం ఇది. ఈ నవల కాలం 18వ శతాబ్దం. అక్క, చెల్లెళ్లు ఈ నవలలో ప్రధాన పాత్రలు. అక్క బానిస. చెల్లి ఒక బ్రిటిష్ గవర్నర్ను వివాహం చేసుకుంటుంది. పద్నాలుగు పాత్రలు కేంద్రంగా నడిచే ‘హోమ్గోయింగ్’ వందల సంవత్సరాల చారిత్రక ఘట్టాలను గుర్తు తెస్తుంది. ‘చిన్న కథలతో కూడిన పెద్ద నవల’ అని ఈ పుస్తకం గురించి చెబుతుంటారు.అన్టేమ్డ్గ్లెనన్ డియోల్ ‘అన్టేమ్డ్’ సండే టైమ్స్ నంబర్ వన్ బుక్ సెల్లర్గా నిలిచింది. స్వీయశోధన తాలూకు ప్రయాణంలో రచయిత్రి జ్ఞాపకాల సమాహారమే... అన్టేమ్డ్. ఈ పుస్తకానికి అక్షర బలం... స్త్రీ సాధికారత.‘మీ మనసులో భూంకంపం పుట్టించే పుస్తకం ఇది’ అంటాడు ఒక విశ్లేషకుడు. ‘మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలిగినప్పుడే అనంతమైన శక్తి మీలోకి వచ్చి చేరుతుంది. అలాంటి శక్తి మీలోకి రావాలంటే ఈ పుస్తకం చదవండి’ అంటాడు మరో విమర్శకుడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘అన్టేమ్డ్’ చదవడమంటే... మన మనసుతో చేసే మౌనసంభాషణ. ‘చదవండి... సాధన చేయండి’ అనేది ఈ పుస్తకం ఇచ్చే నినాదం.వాయిస్ ఆఫ్ పవర్ఫుల్ ఉమెన్ఎన్నో కష్టాలు, ఎన్నో పోరాటాలు చేసి విజయం సాధించిన స్ఫూర్తియకమైన మహిళల గురించి రాసిన పుస్తకం ‘వాయిస్ ఆఫ్ పవర్ఫుల్ ఉమెన్’. మహిళా సాధికారత, వారి నాయకత్వ పటిమ, స్త్రీవాద భావజాలం, వ్యక్తిత్వ వికాసానికి అద్దం పట్టే పుస్తకం ఇది. ఇసాబెల్ అలెండే, జంగ్ చాంగ్, మారి కొల్విన్, కార్ల డెల్ పాంటే, శామి చక్రవర్తి, బేనజీర్ భుట్టో, స్వానీ హంట్, వంగారి మాథాయి, ట్రేసీ ఎమిన్... మొదలైన నలభైమంది స్ఫూర్తిదాయక మహిళల జీవితకథలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి. ఈ నలభైమంది మహిళలలో రాజకీయ నాయకులు, పర్యావరణ ఉద్యమకారులు, సంగీతకారులు, వ్యాపారవేత్తలు, సంఘసేవకులు... వివిధ రంగాలకు చెందిన మహిళలు ఉన్నారు. -
వెళ్లకోయి పరదేశీ..!
అనుబంధాలు, ఆప్యాయతలకు భాష, సరిహద్దులతో పనిలేదు అని చెప్పడానికి ఈ వైరల్ వీడియో నిదర్శనం. విదేశీ పర్యాటకురాలిగా బెంగళూరుకు వచ్చిన అరీనా అక్కడే పదిహేను రోజులు ఉన్నది. ఆ రోజులు తనని మరో ప్రపంచంలోకి తీసుకువెళ్లాయి.పర్యాటక ప్రదేశాలు మాత్రమే కాదు రద్దీతో నిండిన మార్కెట్లు, పండగ ఉత్సవాలు, జాతరలు, కష్టజీవుల జీవితాలను దగ్గరి నుంచి చూసింది. ఈ క్రమంలో తనకు ఎంతోమంది పరిచయం అయ్యారు.‘బెంగళూరులో పదిహేను రోజులు ఉన్న నేను ఈ దేశంతో పూర్తిగా ప్రేమలో పడిపోయాను. ఇండియా అనేది ఆధ్యాత్మిక శక్తితో కూడిన అద్భుతం దేశం’ అని తన పోస్ట్లో రాసింది అరీనా.బెంగళూరులోని వైవిధ్య భరిత సాంస్కృతిక సౌరభాన్ని ప్రశంసించింది. ‘బెంగళూరు వీధుల్లో అలా నడుచుకుంటూ పోతే చాలు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. ప్రతి మూల ఏదో ఒక ప్రత్యేకత కళ్లకు కడుతుంది’ అంటున్న అరీనా బెంగళూరులో ఉన్నన్ని రోజులు సంప్రదాయ దుస్తులే ధరించింది. మతసంబంధమైన కార్యక్రమాలు, ప్రార్థనలలో పాల్గొనేది. ‘ఈ దేశాన్ని విడిచి వెళ్లాలంటే మనసుకు చాలా కష్టంగా ఉంది’ అని భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది ఆరీనా. -
నమ్మకంతో నక్షత్రాలై!
‘స్థిరమైన ఉద్యోగం ఉంటే చాలు’ అనుకునే మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రుచి కల్రా డిక్షనరీలో ‘ఇక చాలు’ అనే మాట ఎప్పుడూ లేదు. సక్సెస్ఫుల్ కన్సల్టెంట్ నుంచి సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా మారింది. మొదట 73 మంది ఇన్వెస్టర్ల నుంచి ఆమెకు తిరస్కారం ఎదురైంది. ఒకే ఒక్క ఇన్వెస్టర్ నమ్మాడు. ఆ నమ్మకమే గొప్ప విజయం అయింది.పేషెంట్లు, హాస్పిటల్స్ మధ్య దూరం ఉందని గ్రహించిన గరిమ సానే ‘ప్రిస్టీన్ కేర్’తో హెల్త్కేర్ రంగంలోకి అడుగు పెట్టింది. మొదట్లో ఆమె మాటలను పెద్దగా ఎవరూ విశ్వసించలేదు. అయినా ఆమె ప్రయాణం ఆపలేదు. విశ్వసనీయతే జీవనాడిగా ప్రయాణం ప్రారంభించిన ప్రిస్టీన్కేర్ హెల్త్కేర్ రంగంలో సరికొత్త సంచలనం అయింది.‘సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్’గా పేరు తెచ్చుకోవాలనే ఉత్సాహంతో ఒక స్టార్టప్తో ప్రయాణం మొదలుపెట్టిన వినీతా సింగ్కు అపజయాలు హాయ్ చెప్పాయి. ఎంటర్ప్రెన్యూర్గా రాణించాలంటే ఉత్సాహం ఒక్కటే సరిపోదని వ్యూహం కూడా కావాలని గ్రహించి మేకప్ బ్రాండ్ ‘షుగర్ కాస్మోటిక్స్’తో తిరుగులేని విజయాన్ని సాధించింది.దేశీయ యూనికార్న్ క్లబ్లో కొన్ని స్టార్టప్లు యూనికార్న్ హోదాను కోల్పోయాయి. కొన్ని మాత్రం ఆ హోదాను స్థిరంగా నిలుపుకుంటూనే, ఔత్సాహికులకు స్ఫూర్తినిస్తున్నాయి.‘వైవిధ్యమైన రంగాలలో మహిళా వ్యాపారవేత్తలు అద్భుత విజయాలు సాధించారు’ అంటూ గరిమ సానే (ప్రిస్టీన్ కేర్), రుచి కల్రా (ఆఫ్ బిజినెస్), వినీతా సింగ్ (షుగర్ కాస్మోటిక్స్) పేర్లను ప్రస్తావించింది ఏఎస్కె ప్రైవేట్ వెల్త్ హురున్ ఇండియా యూనికార్న్ అండ్ ఫ్యూచర్ యూనికార్న్–2025 నివేదిక.ఈ ముగ్గురు ఎవర్గ్రీన్ యూనికార్న్ స్టార్ల సక్సెస్ మంత్రా గురించి...పరాజయాల తరువాత ఘన విజయంలక్నోకు చెందిన వినీతాసింగ్ చదువులో ఎప్పుడూ ముందుండేది. స్కూల్, కాలేజి రోజుల్లో బంగారు పతకాలు అందుకుంది. ఐఐటీ, మద్రాస్లో చదువుకున్న వినీత బ్యాడ్మింటన్లో సత్తా చాటేది. ఎన్నో టోర్నమెంట్స్లో విజయం సాధించింది. పరుగు పందేలలో కూడా దూసుకుపోయేది. ఒక్కమాటలో చెప్పాలంటే చురుకుదనానికి కేరాఫ్ అడ్రస్లా ఉండేది.ఇన్వెస్టింగ్ బ్యాంకింగ్లో విలువైన అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని వదులుకొని ‘క్వెజాల్’ వెంచర్ మొదలు పెట్టింది. ఆ స్టార్టప్ విజయం సాధించలేదు. ఆ తరువాత ప్రారంభించిన ‘ఫ్యాబ్–బాగ్’ అంతంతమాత్రమే అనిపించింది. అయిన్పటికీ ‘ఇక చాలు’ అనుకోలేదు. గట్టి విజయం కోసం తపన పోలేదు. ‘షుగర్ కాస్మోటిక్స్’ స్టార్టప్తోతో అసలు సిసలు విజయాన్ని అందుకుంది. ‘రకరకాల స్కిన్ టోన్లను దృష్టిలో పెట్టుకొని అధిక నాణ్యతతో కూడిన, అందుబాటు ధరల్లో ఉండే ప్రాడక్ట్స్ను తీసుకువచ్చాం’ అంటుంది వినీతాసింగ్.‘షుగర్ కాస్మోటిక్స్’లో పనిచేస్తున్న 75 శాతం మంది ఉద్యోగులు మహిళలే కావడం విశేషం. రియాలిటీ షో ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ కార్యక్రమంలో జడ్జీ, ఇన్వెస్టర్గా రెండు బాధ్యతలు నిర్వహిస్తోంది వినీత. ఈ కార్యక్రమం ద్వారా ఎంటర్ప్రెన్యూర్ కావాలనుకునే ప్రతిభావంతులకు విలువైన సలహాలు ఇస్తోంది. వారి కలలు సాకారం చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తోంది. యూనికార్న్ స్టార్గా వినీతాసింగ్ విజయం ఎన్నో విషయాలను చెప్పకనే చెబుతుంది. అందులో ఒకటి.... ‘కష్టపడితే... కాలంతో పాటు నడిస్తే ఏదీ అసాధ్యం కాదు’డెబ్బైమూడు మంది తిరస్కరించారు!పంజాబ్లోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రుచి కల్రా కెమికల్ ఇంజినీరింగ్ చదువుకుంది. అయినప్పటికీ ఆర్థికవిషయాలపై ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోనే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో ఎంబీఎ చేసింది. చదువు పూర్తయిన తరువాత మెకెన్జీ అండ్ కంపెనీలో తొమ్మిది సంవత్సరాల పాటు పనిచేసింది. ఆ కంపెనీలో పనిచేసిన అనుభవం తనలోని నైపుణ్యాలను మెరుగు దిద్దుకునేలా చేసింది. ఆ నైపుణ్య బలమే వ్యాపారవేత్తగా తన ప్రయాణానికి ఇంధనం అయింది. మెటల్స్, కెమికల్స్, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన బి2బి కామర్స్ ΄్లాట్ఫామ్ ‘ఆఫ్బిజినెస్’కు శ్రీకారం చుట్టింది. చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు ముడి సరుకును అందించే కంపెనీ ఇది. మొదట్లో 73 మంది ఇన్వెస్టర్ల నుంచి తిరస్కారం ఎదురైంది. ఒకే ఒక్క ఇన్వెస్టర్ నమ్మాడు.‘ఆఫ్బిజినెస్’ను సక్సెస్ఫుల్ వెంచర్గా తీర్చిదిద్దిన రుచి కల్రా ఆ తరువాత ఈ కంపెనీకి అనుబంధంగా ‘ఆక్సీజో’ పేరుతో ఫైనాన్షియల్ సర్సీసెస్ మొదలుపెట్టింది.బలమైన నాయకత్వ సామర్థ్యానికి అంకితభావం తోడైతే ఎంత విజయం సాధించవచ్చో నిరూపించింది రుచి. ‘ఆఫ్బిజినెస్’ విజయంతో ఎంతోమంది ఔత్సాహికులు, వ్యాపార రంగంలోకి రావాలని కలలనే కనే యువతరానికి స్ఫూర్తిగా నిలిచింది.మొదట్లో ఎవరూ విశ్వసించలేదు!గైనకాలజిస్ట్గా మంచి పేరు తెచ్చుకున్న డా. గరిమ సానే ‘ప్రిస్టీన్ కేర్’తో ఎంటర్ప్రెన్యూర్గా మారింది. తన వైద్యవృత్తి ద్వారాఎన్నోరకాల నైపుణ్యాలను సొంతం చేసుకున్న గరిమకు ఓపిక ఎక్కువ. తొందరపాటు లేదు. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది. అధిక పనిభారం, తక్కువమంది సిబ్బంది, పేషెంట్లపై సరిౖయెన శ్రద్ధ చూపకపోవడం... కొన్ని హాస్పిటల్స్లో ఈ పరిస్థితిని చూసిన గరిమ ‘ప్రిస్టీన్ కేర్’తో హెల్త్కేర్ రంగంలోకి అడుగుపెట్టింది. హాస్పిటల్స్కు, పేషెంట్లకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాలి, పేషెంట్లు కోరుకునే క్వాలిటీ సర్జికల్ కేర్ను అందించాలి అనే లక్ష్యంతో ప్రయాణం మొదలు పెట్టింది.వైద్యుల ఎంపిక, క్లినిక్లో అపాయింట్మెంట్, డయాగ్నోస్టిక్ కేంద్రాలలో టెస్ట్లు బుకింగ్ చేయడం, ఇన్సూరెన్స్ పేపర్ వర్క్, హాస్పిటల్ ఆడ్మిషన్–డిశ్చార్జీ ప్రాసెస్, సర్జరీ తరువాత ఫాలో–అప్ కన్సల్టేషన్, రకరకాల డిపార్ట్మెంట్లతో సమన్వయం... మొదలైన పనులు ప్రిస్టీన్ కేర్ జాబితాలో ఉన్నాయి. అందుకే పేషెంట్ల సర్జరీని సులభతరం చేసే అత్యాధునిక హెల్త్కేర్ కంపెనీగా ‘ప్రిస్టీన్ కేర్’ పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ప్రిస్టీన్ కేర్ 150కి పైగా క్లినిక్స్, 800కి పైగా పార్ట్నర్ హాస్పిటల్స్, 400కి పైగా సూపర్ స్పెషలిస్ట్ సర్జన్లను ఆపరేట్ చేస్తుంది.మొదట్లో చాలామంది వైద్యులు, హాస్పిటల్స్ గరిమ చెప్పే మాటలను పెద్దగా విశ్వసించలేదు. ఆ తరువాత వారికి ప్రిస్టీన్ కేర్ అంకితభావం, కష్టం అర్థమయ్యాయి.‘హెల్త్కేర్ అనేది కేవలం సైన్స్ మాత్రమే కాదు నమ్మకం, భావోద్వేగాలు కూడా అందులో మిళితమై ఉన్నాయి’ అంటున్న గరిమ మార్కెటింగ్ వ్యూహాలను బాగా అర్థం చేసుకుంది. ఆ వ్యూహాలతో కంపెనీని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లింది. ‘సర్జరీ సింప్లిఫైడ్’ అనేది పిస్ట్రీన్ కేర్ ట్యాగ్లైన్. -
ఇంతవరకు ఎవ్వరూ ఈ ట్రైన్ జర్నీని పూర్తి చేయలేదట..!
ఏ ట్రైన్ అయిన తన గమ్య స్థానం చేరుకోవడానికి ఒకటి లేదా రెండురోజులు పడుతుంది. మరి దూరం అనుకుంటే మూడు నుంచి ఐదు రోజులు పట్టేవి కూడా ఉంటాయి. అలా ఇలా కాకుండా ఏకంగా నెలల తరబడి ప్రయాణించి తన గమ్యస్థానానికి చేరుకునే రైలు గురించి విన్నారా..?. ఈ రైలు ఏకంగా 13 దేశాలను కవర్ చేసుకుంటూ వెళ్తుంది. రైలు జర్నీ ఇష్టపడే ఔత్సాహికులకు నచ్చే సుదీర్ఘ ట్రైన్ జర్నీ ఇది. ఎక్కడంటే ఇదంతా..ఈ రైలు పోర్చుగల్ నుంచి ప్రయాణికులను సింగపూర్కి తీసుకువెళ్తుంది. ప్రపంచంలోనే అతి సుదీర్ఘ రైలు జర్నీ ఇదేనట. మొత్తం 18,755 కిలోమీటర్లు ప్రయాణిస్తోంది ఈ రైలు. ఈ రైలు ప్రయాణం పోర్చుగల్ సముద్ర తీర పట్టణం లాగోస్ నుంచి ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి స్పెయిన్ గుండా ఉత్తరం వైపుకి వెళ్లి పారిస్కి చేరుతుంది. ఫ్రాన్స్ రాజధాని చేరుకున్న తర్వాత యూరప్ గుండా పశ్చిమానికి వెళ్లి..సైబీరియన్కు వెళ్తారు. అక్కడ నుంచి బీజింగ్ చేరుకోవడానికి ఆరు రాత్రులు పడుతుందట. అక్కడ నుంచి సుదీర్ఘ ప్రయాణంలో వియంటియాన్ రైల్వే నుంచి బ్యాంకాక్కు పయనమవుతుంది. ఈ జర్నీలో చివరి భాగం మలేషియా గుండా ప్రయాణించి తన గమ్యస్థానమైన సింగపూర్కు చేరుకుంటుంది. మొత్తం ఈ సుదీర్ఘ ట్రావెలింగ్కి దగ్గర దగ్గర 21 రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు కానీ, ఒక్కోసారి రైలు ఆగిన స్టాప్లను పరిగణలోనికి తీసుకుంటే నెలల తరబడి సాగే అవకాశం కూడా లేకపోలేదని చెబుతున్నారు రైల్వే అధికారులు. ఎందుకిలా అంటే..ఉక్రెయిన్పై రష్యా యుద్ధం చేయడం వల్ల యూరోపియన్ లోపల నుంచి రష్యాకు అన్ని రైలు ప్రయాణాలను నిలిపేశారు. అలాగే కామన్వెల్త్ డెవలప్మెంట్ కార్యాలయం(ఎఫ్డీఓ) కూడా రష్యా గుండా వెళ్లే అన్ని ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించింది. భద్రత దృష్ట్యా ఇలా రష్యా గుండా వెళ్లే అవకాశం లేకపోవడం తోపాటు యూకేకి నేరుగా విమానాలు లేకపోవడం, అక్కడ ప్రభుత్వానికి ఉన్న పరిమిత సామర్థ్యం తదితరాల దృష్ట్యా ఇలా చుట్టి తిరిగి సింగపూర్కి చేరుకోక తప్పని పరిస్థితి.(చదవండి: వాటే పబ్లిక్ టాయిలెట్.. టూరిస్ట్ స్పాటా..?!! రీజన్ ఇదే..) -
గురి తప్పని బాణం
ప్రపంచయూత్ ఛాంపియన్షిప్ కాంపౌండ్ విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ మహిళ క్రీడాకారిణిగా సత్తా చాటింది తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన తానిపర్తి చికిత....చికిత హైస్కూల్లో చదువుతున్న రోజుల్లో బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఒలింపిక్స్లో పతకం సాధించింది. ఆమె స్ఫూర్తితో కూతురిని క్రీడాకారిణిగా తీర్చిదిద్దాలని సంకల్పించిన తండ్రి శ్రీనివాసరావు చికితకు మొదట కరాటే నేర్పించాడు. అందులో బ్లాక్బెల్ట్ సాధించింది. ఒకసారి కరీంనగర్ స్టేడియంలో ఆర్చరీ పోటీలు జరుగుతుండగా చూసిన చికితకు ఆసక్తి కలిగింది. ‘ఆర్చరీ నేర్చుకుంటాను’ అని తండ్రికి చెప్పింది. తమ పొలంలోని గడ్డివాములనే లక్ష్యంగా ఆర్చరీ సాధనకు శ్రీకారం చుట్టింది. సీనియర్ ప్లేయర్ శ్రీనివాస్ దగ్గర ఆర్చరీలో మెలకువలు నేర్చుకుంది. 2019లో గోవాలో నిర్వహించిన జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలో, 2022లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా బెంగళూరులో జరిగిన జాతీయ స్థాయి పోటీలో బంగారు పతకం సాధించి నేషనల్ ఆర్చరీ అసోసియేషన్ ఇండియా (న్ ఏఏఐ) దృష్టిలో పడింది. ఆర్చరీ అకాడమీలో చోటు లభించడంతో వరుస విజయాలు నమోదు చేస్తూ ΄ోయింది. ఈ ఏడాదిలో చైనాలోని షాంఘైలో జరిగిన టోర్నిలో టీమ్ విభాగంలో రజత పతకం, ఆసియా గ్రాండ్ప్రి టీమ్ విభాగంలో కాంస్యం సాధించింది. తాజాగా కెనడాలో జరిగిన ప్రపంచ యూత్ చాంఫియన్షిప్ కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా సత్తా చాటింది. – శ్రీనివాస్ గుడ్ల, సాక్షి. పెద్దపల్లి (చదవండి: Saurabh Pandey: మారుమూల గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి..! ఓ ఫ్యాషన్ డిజైనర్ స్టోరీ) -
ఆ 77 ఏళ్ల తల్లి ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు..!
ఓ తల్లి కొడుకు ఆచూకి కానరాక తల్లడిల్లింది. అది కూడా చెట్టంత కొడుకు ఆసరాగా ఉండాల్సిన వయసులో.. అతడి ఆచూకీకై నిరీక్షించడం అంటే ఆ తల్లికి అదొక శాపం. పాపం ఆ తల్లి బాధను చూడలేక ఆ దేవుడే ఇలా ఇన్స్పెక్టర్ రూపంలో వచ్చి కొడుకును ఆమె వద్దకు చేర్చాడేమో అన్నట్లుగా కలుసుకుంది. ఈ ఘటన ఢిల్లీలోని అమ్రోహాలో చోటు చేసుకుంది.అమ్రెహాకు చెందిన ఇన్స్పెక్టర్ అశ్వని మాలిక్ కేవలం పోలీప్ ఆఫీసర్ మాత్రమే కాదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి. ఆయన తప్పిపోయిన వ్యక్తులను వారి కుటుంబాలతో తిరిగి కలపడానికి సోషల్ మీడియా ఫ్లాట్ఫాంని ఎలా ఉపయోగించుకోవచ్చు అనే విషయంలో ఫేమస్. ఒకరోజు మాలిక్ ఎప్పటిలానే తన డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా..రోడ్డు పక్కన ఒంటరిగా కూర్చున్నవ్యక్తిని గమనించాడు. ఆ వ్యక్తి దిక్కుతోచని స్థితిలో అపరిశుభ్రంగా ఎలాంటి భావోద్వేగం లేనట్లుగా కనిపించాడు. దాంతో ఆయన తన సహచర పోలీసులు మొహ్మద్ సల్మాన్, కాషిఫ్ల సాయంతో అతన్ని లోపలకి తీసుకెళ్లి స్నానం చేయించి, బట్టలు శుభ్రం చేసి, ఆహారం ఇచ్చి..అతడి వివరాలను కనుక్కొన్నారు. తర్వాత ఆ వ్యక్తిని మొహమ్మద్ సలీంగా గుర్తించారు. తప్పిపోయిన వ్యక్తులను వారి కుటుంబాలతో కలిపే తన సోషల్ మీడియా సేవలో భాగంగా ఈ వ్యక్తికి సంబంధించిన వీడియోని కూడా నెట్టింట షేర్ చేశాడు. ఆ వీడియో ముంబైలోని సలీం మేనల్లుడు మొహమ్మద్ గుఫ్రాన్ అనే వ్యక్తి దృష్టిని ఆకర్షించింది. అతను సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తుండగా ఈ వీడియో కంటపడింది. వెంటనే తన 77 ఏళ్ల అమ్మమ్మ రసుమా బానోకు చూపించాడు. ఆమె వెంటనే ఆ వ్యక్తిని చాలా కాలం క్రితం తప్పిపోయిన తన కొడుకుగా గుర్తించింది. నిజానికి మొహమ్మద్ సలీం ఒకప్పుడూ ఉత్తరప్రదేశ్లోని డియోరియా హరైయా గ్రామంలో నివశించేవాడు. అతను తన భార్య మరణంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. అలా ఆ బాధలో ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. సుమారు 12 ఏళ్లుగా మళ్లీ తిరిగి రాలేదు. సంవత్సరాల తరబడి ఆ తల్లి కొడుకు చనిపోయాడా లేదా బతికే ఉన్నాడో తెలియక తల్లడిల్లింది. పాపం సలీం తండ్రి కూడా అతడు ఇల్లు వదిలి వెళ్లినప్పుడే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. అయితే అతడి తల్లి కొడుకు ఆచూకి కనుగొంటానని గానీ, చూస్తానని గానీ అస్సలు భావించలేదు. నిజానికి అస్సలు ఆమె ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కూడా అనుకోలేదట. ఇన్నాళ్లు బతకాలి కాబట్టి బతుకుతున్నా అన్నట్లుగా ఆ తల్లి రోజులు నెట్టుకుంటూ వచ్చింది. ఎప్పుడైతో తన కొడుకుని ఆ వీడియోలో గుర్తించి కలుసుకుందో తన ఇన్నాళ్ల బాధకు ఒక్కసారిగా తెరపడినట్లయ్యిందని ఆవేదనగా అంటోంది ఆ తల్లి రసుమా బానో. అతడి మేనల్లుడు గుఫ్రాన్ కూడా తన అమ్మమ్మ ఇలాంటి రోజుని చూస్తుందని అస్సలు అనుకోలేదంటూ భావోద్వేగానికి గురయ్యాడు. View this post on Instagram A post shared by Ashwani Kumar (@ashmalikupcop) (చదవండి: వాట్ పబ్లిక్ టాయిలెట్ టూరిస్ట్ స్పాటా..?! రీజన్ ఇదే..) -
'18-10-8-4-1 రూల్'..! జస్ట్ 21 రోజుల్లో ఏడు కిలోల బరువు..
స్పూర్తిదాయకమైన వెయిట్లాస్ స్టోరీలు ఎన్నో చూశాం. వాటన్నింటిలో క్రమశిక్షణ, నిబద్ధతకు పీఠం వేస్తే బరువు తగ్గడం సాధ్యమని తేలింది. ఇది కాస్త కఠినమైనదే అయినా అసాధ్యం మాత్రం కాదు. అంతలా కష్టతరమైన నియమాలు ఫాలో అవ్వాల్సిన పని లేకుండానే ఈ చిన్న ట్రిక్స్తో సులభంగా బరువు తగ్గొచ్చని చెబుతోంది ఈ డైటిషియన్. జస్ట్ ఈ చిన్న రూల్తో సులభంగా వెయిట్లాస్ అవ్వోచ్చు అంటూ తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారామె. మరి ఆ రూల్ ఏంటో చూద్దామా..!డైటీషియన్ రిచా గంగాని సోషల్ మీడియా పోస్ట్లో తాను 21 రోజుల్లోనే ఏడు కేజీల బరువు తగ్గినట్లు తెలిపారు. అంతేగాదు తన నడుము సైజు కూడా చాలా వరకు తగ్గిందని రాసుకొచ్చారామె. తాను 18-10-8-4-1 రూల్ని అనుసరించి జస్ట్ 21 రోజుల్లోనే దాదాపు 63 కిలోలు నుంచి 56 కిలోలకు తగ్గినట్లు తెలిపారు. గంటలతరబడి ఆకలితోనూ, కార్డియో వంటి వ్యాయమాల హెల్ప్ లేకుండా స్లిమ్గా మారానని అన్నారామె. తన వెయిట్లాస్ జర్నీలో ఉపవాసం, యాక్టివ్గా ఉండటం, తగినంత హైడ్రేషన్, సమతుల్య ఆహారం, తదితర ప్రధానాంశాలు ఉన్నాయని అన్నారు.18-10-8-4-1 రూల్ అంటే..ఇక్కడ 18 అంటే..18 గంటల అడపాదడపా ఉపవాసం. తాను ఉదయం 11 నుంచి సాయంత్రం 5/6 గంటల మధ్య తింటానని తెలిపింది. ఇది బరువు తగ్గేలా చేయడమే కాకుండా మైండ్ని కూడా క్లియర్గా ఉంచుతుంది.ఇక 10 అంటే..పదివేల అడుగులు..ప్రతి ఒక్కరూ ఇన్ని అడుగులు వేసేలా దశలా వారిగా ప్రారంభించాలని సూచించారామె. ఎందుకంటే ఇది 500 నుంచి 700 కేలరీల దాక సులభంగా బర్న చేయగలదని చెప్పారు.8- ఎనిమింది గంటల నిద్ర. తగినంత విశ్రాంతి కూడా అత్యంత ముఖ్యమైనది. ఈ సమయంలో శరీరంలోని కొవ్వు ఈజీగా కరిగిపోతుందట.4- నాలుగు లీటర్ల నీరు. హైడ్రేషన్ తోపాటు యాంటీ ఇన్ఫ్లమేటరీల అందిస్తుంది. ఇది పొట్ట ఉబ్బరాన్ని తగ్గించి చర్మం రంగుని మెరుగుపరుస్తుంది.చివరగా 1-- ఒక గ్రాము ప్రోటీన్ తీసుకోవడాన్ని హైలెట్ చేశారు రిచా. ఇది కండరాలను సురక్షితంగా ఉండేలా బలోపేతం చేస్తుంది. View this post on Instagram A post shared by Richa Gangani - Weightloss👉Thyroid👉PCOS Expert (@dieticianricha2095) అడపదడపా ఉపవాసం ఎలా ఉండాలంటే..రిచా వివిధ రకాల అడపదడపా ఉపవాసాలను పేర్కొన్నారు. 16:8 ఎనిమిదిగంటలు తిని, 16 గంటలు ఉపవాసం ఫ్లెక్సిబిలిటీ కావాలనుకునేవారికి ఇది బెస్ట్5:2 ఇది సాధారణంగా వారంలో ఐదు రోజులు తినడం, రెండు రోజులు ఉపవాసం ఉండటం14:10 ప్రారంభికులకు గొప్పది, పది గంటలు తిరడం, పదిగంటలు ఉపవాసం ఉండటం18:6 ఇది వ్యక్తిగతం కేవలం ఆరు గంటే తినడం, ఏకంగా 18 గంటలు ఉపవాసం ఉండటం. వ్యక్తిగత సామర్థ్యం అనుసరించి పాటించాల్సిన విధానం ఇది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను అనుసరించడం ఉత్తమం.(చదవండి: వాట్ పబ్లిక్ టాయిలెట్ టూరిస్ట్ స్పాటా..?! రీజన్ ఇదే..) -
కొత్త భాషలు ఈజీగా నేర్చుకోండిలా..!
కొత్త భాషలు నేర్చుకునేవారిలో జ్ఞాన విస్తృతి ఒక కోణం అయితే, ఉల్లాసం, ఉత్సాహం అనేది మరో కోణం. మరి మీరు కొత్త భాష నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా! గతంతో పోల్చితే కొత్త భాష నేర్చుకోవడం ఆట్టే కష్టం కాదు. ఇప్పుడు ఎన్నో లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్స్ ఉన్నాయి. అయితే అన్ని యాప్స్ ఉచితం కాదు. ఈ నేపథ్యలో గూగుల్ ట్రాన్స్లేట్ యాప్కు ప్రాధాన్యత పెరిగింది. ఈ యాప్ కేవలం అనువాదానికి మాత్రమే పరిమితం కావడం లేదు. కొత్త భాషలు నేర్చుకునే సాధనంగా కూడా ఉపయోగపడనుంది. ‘గూగుల్ ట్రాన్స్లేట్’ యాప్ను ఏఐ–పవర్డ్ లైవ్ ట్రాన్స్లేషన్, లాంగ్వేజ్ లెర్నింగ్ టూల్స్తో అప్డేట్ చేసింది గూగుల్.జెమిని ఏఐ ద్వారా కొత్త గూగుల్ ట్రాన్స్లేట్ ప్రాక్టీస్ మోడ్తో కొత్త భాషలు నేర్చుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ అవసరం లేకుండానే ఈ ఫీచర్ని ఉపయోగించుకోవచ్చు. కొత్త భాషను వినే, మాట్లాడే అనుభవాన్ని సొంతం చేసుకోవచ్చు. రకరకాల సంభాషణలతో భాషా నైపుణ్యాలకు పదును పెట్టవచ్చు. ఉదాహరణకు మీరు స్పానిష్ మాట్లాడే ప్రాంతానికి వెళ్లబోతున్నారనుకుందాం. అక్కడికి వెళ్లిన తరువాత స్థానికులను ఎలా పలకరించాలి? సహాయం ఎలా అడగాలి....మొదలైన వాటిని నేర్చుకోవచ్చు. మీరు భాషను ఎంత మేరకు నేర్చుకున్నారు అనేదానికి సంబంధించి పద పరీక్షలు కూడా ఉంటాయి.ఇలా... లేటెస్ట్ గూగుల్ ట్రాన్స్లేట్ యాప్ లాంచ్ చేయాలి ప్రాక్టీస్ బటన్ నొక్కాలి ‘గెట్ స్టార్టెడ్’ ఎంపిక చేసుకోవాలి డిస్ప్లే లాంగ్వేజ్ (మీరు మాట్లాడే భాష), ప్రాక్టీస్ లాంగ్వేజ్(మీరు నేర్చుకోవాలనుకుంటున్న భాష) సెలెక్ట్ చేసుకోవాలి నెక్ట్స్–బటన్ నొక్కాలి కొత్త భాషకు సంబంధించి మీ అవగాహనను ఏఐ అర్థం చేసుకోవడానికి కొన్ని ప్రశ్నలు అడుగుతుందికొత్త భాష నేర్చుకోవడానికి సంబంధించి ‘బేసిక్’ ‘ఇంటర్మీడియెట్’ ‘అడ్వాన్స్డ్’ ఆప్షన్లు ఉంటాయి ‘గోల్స్’ లిస్ట్ కనిపిస్తుంది. నచ్చింది ఎంపిక చేసుకోవచ్చు. నచ్చకపోతే టాప్ రైటర్ కార్నర్లోని స్కిప్ బటన్ నొక్కవచ్చు ఫైనల్గా ‘స్టార్ట్ ప్రాక్టీసింగ్’ను సెలెక్ట్ చేసుకోవాలి లిజన్, స్పీక్ ఆప్షన్లు ఉంటాయి. వినడం అనేది పదాల పరిచయానికి, మాట్లాడడం అనేది ఉచ్చారణను మెరుపరచడానికి ఉపయోగపడతాయి. కొత్త భాషలు నేర్చుకునే విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కో లక్ష్యం ఉండొచ్చు. మీ లక్ష్యం సిద్దించిందా? కొత్త లక్ష్యం ఏర్పాటు చేసుకున్నారా? ఇందుకోసం స్క్రీన్ టాప్లో ఉన్న ‘గోల్ బాక్స్’ను నొక్కాలి. సొంతంగా ప్రాక్టిస్ సినారియో క్రియేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక కొత్త ఫ్రెండ్ను కలుసుకోబోతున్నారనుకుందాం. దృశ్య సంబంధిత సంభాషణల ఆధారంగా లెర్నింగ్ సెషన్ను క్రియేట్ చేయవచ్చు. (చదవండి: ఫిఫ్టీ ప్లస్.. టాలెంట్ జోష్..! యాభై దాటాకా లైఫ్ స్టార్ట్ అంటున్న 'ఖ్యాల్') -
యూత్లో ఎగ్'రికల్చర్'..! కాబోయే తల్లుల పాలిట వరం...
‘ఉద్యోగంలో నిలదొక్కుకోవాలి... ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలి... ‘సొంత ఇల్లు, బ్యాంకు బ్యాలెన్స్.. జీవితంలో స్థిరపడాలి ఆ తర్వాతే పిల్లల గురించి ఆలోచించాలి..’ ఇలా అనుకునేవారి శాతం ఈ రోజుల్లో బాగా పెరిగిపోయింది. వయసు మూడు పదులు దాటుతున్నా పెళ్లి, పిల్లలు అనే దశలను వాయిదా వేస్తూ ఉన్నారు. ఫలితంగా భవిష్యత్తులో పిల్లలు కలగరేమో అనే ఆందోళన కూడా ఉంటోంది. అందుకే, ముంబైలోని నవతరం అమ్మాయిల జీవనశైలి, వారి ఆలోచనా విధానంలో వినూత్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కువ మంది యువతులు తమ అండాలను నిల్వ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్టు ఒక సర్వే వెల్లడించింది. ఇది మారుతున్న సామాజిక ఎంపికలకు అద్దంలాంటిది. భవిష్యత్తులో మాతృత్వాన్ని పొందాలనుకునే మహిళలకు ఇది ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది.ఇటీవల జరిగిన సర్వేలో పాతికేళ్ల వయసున్న (జెన్జెడ్) దాదాపు 18 శాతం మంది యువతులు మారుతున్న జీవనశైలి వైపుగా కదులుతున్నారని, రెండింతల ఆదాయంవైపు మొగ్గుచూపుతూ పిల్లలు వద్దు అనే ఆలోచనలో ఉంటున్నారని తెలియజేసింది. మెరుగైన కెరీర్, వ్యక్తిగత ఉద్దేశాల కోసం వారు పిల్లలను కనకూడదని లేదా మాతృత్వాన్ని వాయిదా వేయాలని ఎంచుకుంటున్నారు. ఎక్కువ మంది యువతులు విద్య, వృత్తిపరమైన అభివృద్ధిపై దృష్టి పెట్టడానికి పిల్లలను కనడాన్ని వాయిదా వేస్తున్నారు. అయితే వారిని ఎప్పుడూ హెచ్చరించే బయోలాజికల్ క్లాక్ ఒత్తిడి లేకుండా భవిష్యత్తు కోసం సంతానోత్పత్తిని కాపాడుకోవడానికి అండాలను నిల్వ చేసుకోవడం ఒక మార్గంగా కనిపిస్తోంది. అయితే, సంతానోత్పత్తి ఇండికేటర్స్ గురించి అవగాహన లేకపోవడాన్ని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా అMఏ (యాంటీ–ముల్లెరియన్ హార్మోన్), ఇది స్త్రీ అండాశయ నిల్వలను అంచనా వేయడానికి సహాయపడుతుంది. సర్వే చేసిన 50 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు, 35 సంవత్సరాల వయస్సు తర్వాత సంతానోత్పత్తి తగ్గుతుందని గ్రహించినప్పటికీ, వారిలో చాలామందికి వారి అండాలను నిల్వ చేసుకునే సమయం, కుటుంబ జీవనాన్ని మొదలపెట్టడానికి సరైన వయస్సు గురించి ఏ మాత్రం అవగాహన ఉండటం లేదని చెబుతున్నారు. వైద్యులు కూడా అలా కోరుకునేవారికి భవిష్యత్తులో సంతానోత్పత్తి ప్రయోజనాలను అందుకోవచ్చుని సలహా ఇస్తున్నారు. వంధ్యత్వం సమస్య పురుషులు, మహిళలు ఇద్దరినీ బాధపెడుతుంది కాబట్టి, అండాలు నిల్వ చేసుకోవడానికి, సంబంధిత చికిత్సలకు సపోర్ట్ ఇవ్వడానికి కంపెనీలు కూడా ఆసక్తిచూపుతున్నాయి. దీనికి కారణం తమ ఉద్యోగుల ప్రతిభను ఆకర్షించడానికి, వారిని నిలుపుకోవడానికి మద్దతునివ్వడం ఒక కారణంగా ఉంటోంది.ఈ మార్పు చాలా మెరుగైన పునరుత్పత్తి ఆరోగ్య విద్య అవసరాన్ని వివరిస్తుంది. బహిరంగంగా చర్చలు జరపడం ద్వారా, అందుబాటులో ఉన్న సమాచారాన్ని తెలియపరచడం ద్వారా, మహిళలు తమ సంతానోత్పత్తి, కెరీర్, భవిష్యత్తు కుటుంబ నియంత్రణ గురించి మరిన్ని విషయాల్లో అవగాహనతో పాటు నిర్ణయాలు తీసుకోవచ్చు. భారతదేశంలో ఎక్కువ మంది మహిళలు పిల్లలు కనడాన్ని వాయిదా వేసుకోవడాన్ని బట్టి చూస్తుంటే సంతానోత్పత్తి, వ్యక్తిగత ఎంపిక గురించి చర్చ ఇంకా పెరగాల్సి ఉందని స్పష్టం అవుతుంది.మహిళల వయసు పెరుగుతున్న కొద్దీ అండాల సంఖ్య, నాణ్యత తగ్గిపోతుంది. 35 ఏళ్ల తర్వాత గర్భధారణ అవకాశాలు తగ్గుతాయి, జెనెటిక్ రిస్కులు పెరుగుతాయి. కెరీర్, ఎడ్యుకేషన్, వ్యక్తిగత పరిస్థితుల వల్ల తల్లి కావడం ఆలస్యమవుతుంటే, ఎగ్ ఫ్రీజింగ్ ఒక మంచి ఎంపిక. అయితే, 30 – 35 ఏళ్ల లోపు అండాల నాణ్యత బాగుంటుంది కాబట్టి ఈ వయసు అనుకూలం. హార్మోన్ ఇంజెక్షన్లతో అండాశయాల్లో ఒకేసారి ఎక్కువ అండాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తారు. అండాలను శస్త్రచికిత్స లేకుండా సులభమైన ప్రక్రియ (egg retrieval ) ద్వారా బయటకు తీస్తారు. వాటిని ప్రత్యేకమైన సాంకేతికతతో ఫ్రీజ్ చేస్తారు. భవిష్యత్తులో అవసరం ఉన్నప్పుడు ఐవిఎఫ్ పద్దతి ద్వారా అండాలను ఉపయోగిస్తారు. లేటు వయసులో కూడా తల్లి కావాలనుకుంటే ఈ పద్ధతి సురక్షితమైనది. క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చి వైద్య చికిత్స జరిగినప్పుడు ఫెర్టిలిటీ సమస్య ఉత్పన్నం కావచ్చు. అందుకని ముందే నిల్వ చేసుకున్న అండాశయాల ద్వారా బిడ్డలను పొందవచ్చు. అయితే వీటి విషయంలో వంద శాతం గ్యారంటీ అని చెప్పలేం. ఎందుకంటే నిల్వ చేసిన అండాలు విజయవంతంగా ఫలదీకరించలేకపోవచ్చు. ఖరీదైన ప్రక్రియ (లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది) కూడా. హార్మోన్ ట్రీట్మెంట్ వల్ల ఉబ్బరం, తలనొప్పి, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎన్ని సంవత్సరాలు నిల్వ చేసినా, అండం నిల్వ సమయంలో ఉన్న వయసు ఆధారంగానే ఫలితం వస్తుంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, పూణే, న్యూఢిల్లీ నగరాలలోని హాస్పిటళ్లు ఎగ్ ఫ్రీజింగ్ అవకాశాన్నీ అందిస్తున్నాయి. – డా.శిరీష, గైనకాలజిస్ట్ (చదవండి: వాట్ పబ్లిక్ టాయిలెట్ టూరిస్ట్ స్పాటా..?! రీజన్ ఇదే..) -
వాటే పబ్లిక్ టాయిలెట్.. టూరిస్ట్ స్పాటా..?!
టూరిస్ట్ స్పాట్ అనగానే ఏ అద్భుతమైన ప్రకృతి దృశ్యమో లేక మిస్టరీ ప్రదేశాలో అనుకుంటాం. కానీ ఇలాంటి టూరిస్ట్ స్పాట్ ఒకటి ఉందని అస్సలు ఊహించరు. ఆ ప్రదేశం పేరు వినగానే ఇదేం పర్యాటక ప్రదేశం రా బాబు అని తలపట్టుకుంటారు. కానీ చూస్తే మాత్రం..దీన్ని పర్యాటక ప్రదేశంగా మార్చాలన్న వారి అద్భుత ఆలోచనను ప్రశంసించకుండా ఉండలేరు. ఇంతకీ అదేంటో చక చక చదివేయండి మరి..చైనాలోని గన్సు ప్రావిన్స్లోని డన్హువాంగ్ నైట్ మార్కెట్లో కొత్తగా పునరుద్ధరించిన పబ్లిక్ టాయిలెట్ ఊహించని విధంగా సాంస్కృతిక ఆకర్షణగా మారింది. ఓ సాధారణ రెస్ట్రూమ్కి ఇంత క్రేజ్ ఏంటా అనే కదా..!. అయితే ఇది అలాంటి ఇలాంటి రెస్ట్రూమ్ కాదు. "డన్హువాంగ్ ప్యూర్ రియల్మ్ పబ్లిక్ కల్చరల్ స్పేస్"గా పిలిచే ఈ టాయిలెట్ యునెస్కోలో చోటు దక్కించుకున్న ప్రసిద్ధ మొగావో గుహలకు నిలయంగా కళాత్మకంగా తీర్చిదిద్దారు. చారిత్రాత్మక కళా నైపుణ్యానికి నిదర్శనంగా ఉంటుంది ఈ రెస్ట్రూమ్. చెప్పాలంటే వారసత్వ కళకు ప్రతిబింబంలా ఉంటుంది ఈ పబ్లిక్ టాయిలెట్ రూపురేఖలు. రెండు అంతస్తుల్లో విస్తరించి ఉన్న ఈ డన్హువాంగ్ పబ్లిక్ టాయిలెట్ సంస్కృతికి అర్థం పట్టేలా కుడ్య చిత్రాలు, ఏదో రాజదర్బారులో ఉన్న అనుభూతిని ఇస్తాయి. బయటి భాగంలో అల్ట్రా క్లియర్ గాజు కర్టెన్ గోడలు ఉన్నాయి. అంతేకాదండోయ్ ఈ రెస్ట్రూమ్లో యాంటీ బ్యాక్టీరియల్ నర్సింగ్ టేబుల్స్, చైల్డ్ సేఫ్టీ సీట్లు, స్వీయ క్లీనింగ్ సిస్టమ్తో కూడిన పాలిచ్చే తల్లుల కోసం ప్రత్యేకంగా ఓ గది కూడా ఉంది. అలాగే ఇక్కడ సౌకర్యవంతమైన సీటింగ్ ప్రదేశం తోపాటు డ్రింక్ డిస్పెన్సర్లు, వృద్ధులు, వికలాంగులకు అనువైన సౌకర్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఆగస్టు 16న ప్రారంభించిన ఈ పబ్లిక్ టాయిలెట్ అతి కొద్ది సమయంలోనే పర్యాటకులకు ఇష్టపమైన స్పాట్గా మారిపోయింది. దీన్ని సందర్శించడానికి పర్యాటకులు సాంప్రదాయ హన్పు దుస్తులను కూడా ధరిస్తారట. అందుకు సంబంధించిన వీడీయో నెట్టింట సంచలనం సృష్టించడమే గాదు, రకరకాల చర్చలకు దారితీసింది కూడా. View this post on Instagram A post shared by China Exploring (@china__exploring) (చదవండి: ఫిఫ్టీ ప్లస్.. టాలెంట్ జోష్..! యాభై దాటాకా లైఫ్ స్టార్ట్ అంటున్న 'ఖ్యాల్') -
ఫిఫ్టీ ప్లస్.. టాలెంట్ జోష్..!
పోటీలు అనగానే మనకు టక్కున గుర్తుకొచ్చేది యువతే.. అండర్ 14, అండర్ 17.. ఇలా పలు విభాగాల్లో యువతకు పోటీలు నిర్వహిస్తుండడం తెలిసిందే. అయితే మరి వయసు మళ్లిన వారి పరిస్థితి ఏంటి? వారికేమీ ఆటలు ఉండవా? వారిలో ఎలాంటి ప్రతిభా ఉండదా? అంటే ఉంటుందనే చెబుతున్నారు ముంబయికి చెందిన ‘ఖ్యాల్’ నిర్వాహకులు. ఈ విషయం మనలో చాలా మందికి తెలిసినా పెద్దగా పట్టించుకోము.. సరిగ్గా దీని కోసమే ఏర్పాటైన వేదికే ఖ్యాల్. అప్పటి వరకూ కుటుంబ బాధ్యతలు, ఉద్యోగల బాధ్యతలతో తలమునకలై.. వయసు మళ్లిన తర్వాత తమలోని ప్రతిభను ప్రదర్శించేందుకే ఖ్యాల్ ఏర్పాటు చేశారు. ఖ్యాల్ అంటే తమలోని సృజనాత్మకతను స్వేచ్ఛగా ప్రదర్శించడానికి, మెరుగుపరచడానికి కల్పించే అవకాశం.. అంటున్నారు నిర్వాహకులు.. వయసు మళ్లిన వారు అంటే చాలా మందికి ఓ చులకన భావం.. వారు ఏమీ చేయలేరు.. సాధించలేరు.. మరి అలాంటి భావాన్ని చెరిపేశారు కొందరు ప్రముఖులు.. సాధించాలనే తపన ఉంటే వయసుతో పనేంటి అను నిరూపించారు. ‘హార్లాండ్ సాండర్స్ 62 సంవత్సరాల వయసులో కేఎఫ్సీని ప్రారంభించారు. ఫల్గుణి నాయర్ 49 సంవత్సరాల వయసులో నైకాను స్థాపించారు. హెన్రీ ఫోర్డ్ 45 సంవత్సరాల వయసులో మొదటి ఫోర్డ్ మోటార్ కారును ప్రజలకు పరిచయం చేశారు..’ ఇవన్నీ కథలు కావు విజయాలకు ప్రేరకాలు అంటారు ఖ్యాల్ నిర్వాహకులు హేమాన్షు జైన్, ప్రీతిష్ నెల్లెరి. యువత కోసమేనా కాంటెస్ట్స్?ఏ పోటీ చూసినా అండర్ 25, అండర్ 30 ఇలా యువత, మధ్యవయసు వారికోసమే ఉంటున్నాయి. కానీ సిసలైన జీవితం 50 సంవత్సరాల వయసులో ప్రారంభమవుతుంది, ఆర్థిక స్థిరత్వం, జ్ఞానం, అభిరుచిని ఆస్వాదించే స్వేచ్ఛ అన్నీ ఉండేది అప్పుడే. వర్గీకరించబడేది వయసు మాత్రమే.. టాలెంట్ కాదు.. అందుకే ఖ్యాల్ 50 అబోవ్ 50ని ప్రారంభించింది. ఇందులో సింగర్ ఆఫ్ ది ఇయర్, చెఫ్ ఆఫ్ ది ఇయర్, మాస్టర్ గార్డెనర్ ఆఫ్ ది ఇయర్, పొయెట్ ఆఫ్ ది ఇయర్, క్రాస్ వర్డ్ చాంపియన్ ఆఫ్ ది ఇయర్... ఇలా ఏ రకమైన టాలెంట్ ఉన్నా సరే పాల్గొనేలా రూపొందించాం. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని ఈ పోటీ ప్రపంచానికి గుర్తు చేయనుంది.50 విభాగాల్లో 50మంది విజేతలు..వయసు 50 ఏళ్లు దాటిన దగ్గర నుంచి రిటైర్మెంట్ ప్లానింగ్లోనో, ఆధ్యాతి్మక యాత్రల షెడ్యూల్ ఖరారులోనో బిజీగా ఉండే వారి ఆలోచనల్ని సమూలంగా మార్చడమే తమ ధ్యేయం అంటున్నారు ఈ కాంటెస్ట్స్ నిర్వాహకులు. ఫిఫ్టీ ప్లస్ వయసు వారి కోసం 50 అబోవ్ 50 పేరుతో ఏకంగా 50 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ దీనికి సంబంధించిన ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. అదే విధంగా గత నెలాఖరున నగరంలోనూ ఆడిషన్స్ నిర్వహించిన సందర్భంగా వీరు పంచుకున్న విశేషాలు వారి మాటల్లోనే..ఇకిగై.. భావనకు అనుగుణంగా..జపనీయుల దీర్ఘకాల, సంతోషకర జీవనానికి దోహదం చేస్తున్న ‘ఇకిగై’ కాన్సెప్ట్కు అనుగుణంగా రూపుదిద్దుకుంది. ‘ఉద్యోగ విరమణ తర్వాత జీవితం పూర్తిగా కొత్తగా నిర్మించడం’ దీని లక్ష్యం. గత 2020లో స్థాపించిన మా ఖ్యాల్, సీనియర్ సిటిజన్లకు సబ్స్కిప్షన్ ప్రాతిపదికన సేవలను అందిస్తుంది. వారి శారీరక, మానసిక, భావోద్వేగ సామాజిక శ్రేయస్సును పరిరక్షిస్తుంది. మా యాప్కు మూడు మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. ‘సీనియర్లు వివిధ రకాల కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఇష్టపడే ధోరణిని గమనించాం, ప్రోత్సహిస్తున్నాం, అంతిమంగా విభిన్న ఆసక్తులు కలిగిన సమూహాలను సృష్టించాలన్నదే మా తాపత్రయం.. అదే నేటి ఆడిషన్స్కు దారితీసింది. ఈవెంట్ జరిగే తీరిది.. 50 అబోవ్ 50 కోసం ఈ స్టార్టప్ ఆన్న్లైన్ వీడియో ఆడిషన్న్లను కూడా నిర్వహిస్తోంది. మే 1 నుంచి ప్రారంభమయ్యే పోటీల్లో హైదరాబాద్ అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పుణె, లక్నో, జైపూర్, కొచ్చి, ఇండోర్ వంటి 20 నగరాలు పాల్గొంటాయి. ఇందులో భాగంగా పోటీదారులను ఒకచోట చేర్చడానికి కారి్నవాల్ నిర్వహిస్తారు. సరదా నిండిన కార్యకలాపాలను నిర్వహిస్తారు. ఈ పోటీలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న వ్యక్తుల కోసం వ్యక్తిగత ఆడిషన్స్ సైతం ఉంటాయి. వడపోత తర్వాత, ప్రతి విభాగం నుంచి టాప్–10 ఫైనలిస్టులను సంబంధిత కేటగిరీ నిపుణులు షార్ట్లిస్ట్ చేస్తారు. చివరకు ప్రతి కేటగిరీ కింద బెస్ట్ని ఎంపిక చేయడానికి పబ్లిక్ ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ జ్యూరీ సభ్యుల్లో ప్రముఖ ఇంద్రజాలికుడు నకుల్ షెనాయ్, రచయిత్రి గీతా రామానుజం, విజువల్ ఆర్టిస్ట్ సెల్వప్రకాష్ లక్ష్మణన్, కవి–ఎడిటర్ వినితా అగర్వాల్, కర్ణాటక న్యూమిస్మాటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్ర మరుధర్ తదితరులు ఉన్నారు. ఖ్యాల్ విజేతలకు మొత్తం కలిపి రూ.1 కోటి నగదు బహుమతిని అందజేస్తారు. గ్రాండ్ ఫినాలే నవంబర్లో ముంబైలోని నెస్కో మైదానంలో జరుగుతుంది.నగరంలో ముగిసిన తొలి దశ ఆడిషన్స్.. నగరంలోని హిమాయత్నగర్లో ఇటీవలే ఈ పోటీ కోసం ఆడిషన్స్ నిర్వహించారు. పదుల సంఖ్యలో హాజరైన అభ్యర్థులు తమ ప్రతిభ, సామర్థ్యం ఆధారంగా పరీక్షించారు. వీరిలో ఎంపికైన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. (చదవండి: మారుమూల గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి..! ఓ ఫ్యాషన్ డిజైనర్ స్టోరీ) -
మారుమూల గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి..!
కలలకు ఆకాశమే హద్దు అనడానికి ఉదాహరణ డిజైనర్ సౌరభ్ పాండే. ఉత్తర్ప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో పుట్టిన అతని పేరు ఈరోజు ప్రపంచ ఫ్యాషన్ వేదికలపై వినిపిస్తోంది. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈ యువకుడు, తన కలలకోసం కష్టపడుతూ, పట్టుదలతో ఫ్యాషన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఓ ప్రత్యేకతను చూపుతున్నాడు.స్కూల్ కెళ్లే సమయంలోనే సౌరభ్కి డ్రాయింగ్, డిజైన్స్ పై ప్రత్యేక ఆసక్తి. పాత బట్టలను కొత్తగా కట్ చేసి, రంగులు కలిపి, తన గ్రామంలోనే చిన్న చిన్న డిజైన్స్ చేస్తూ, ‘ఫ్యాషనః అంటే ఏంటి?’ అనే ప్రశ్నకు తన స్టైల్లో సమాధానం చెప్పేవాడు.సవాళ్లే అవకాశాలకు మార్గంఉన్న ఆ చిన్న ఊళ్లో అవకాశాలు లేవు. ఫ్యాషన్ కోర్సులు, స్టడీ మెటీరియల్, ఫ్యాబ్రిక్ అందనంత దూరంలో ఉన్నాయి. అయినా అతని కృషి ఆగలేదు. నీరసపడలేదు. పేపర్పైన స్కెచ్లు వేసి, సోషల్ మీడియాలో తన టాలెంట్ను ప్రదర్శించాడు. అదే అతనికి పెద్ద అవకాశాలు తెచ్పిపెట్టింది.అంతర్జాతీయ బ్రాండ్ల దృష్టిసౌరభ్ పనిని గమనించిన ప్రతిభావంతులు అతన్ని మొదట స్థానిక ఈవెంట్లలో ΄ాల్గొనమని ఆహ్వానించారు. అటు నుంచి 17 ఏళ్ళ వయసులో అతన్ని ముంబై వైపుగా నడిపించింది. ఆ మహా నగరంలో మనుగడ కష్టమే. ఒక చిన్న ఇల్లు లాంటి గదిలో తల్లిదండ్రులు, తోబుట్టువులతో కలిసి ఉండేవాడు. ఇల్లు గడవడం కోసం ఒక మాల్లో 12 గంటలు షిఫ్టులో పనిచేస్తూ, రాత్రిళ్లు ఫ్యాషన్ డిజైన్లు గీస్తూ వాటిని సోషల్మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నాడు. అతను తన పరిస్థితుల కంటే పెద్ద లక్ష్యాన్ని చాలా ఏకాగ్రతతో నడిపించాడు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా సౌరభ్ పనిని గమనించినప్పుడు అతని జీవితం గొప్ప మలుపు తిప్పింది. ఒక అవకాశం మరికొన్ని మార్గాలను చూపించింది. అక్కడి నుంచి అతని డిజైన్లు గూచీ, డియోర్, ప్రాడా వంటి ప్రపంచ లగ్జరీ బ్రాండ్ల దృష్టికి వచ్చాయి. ఇప్పుడు అతను ఈ ఫ్యాషన్ హౌస్లతో కలసి ప్రత్యేక కలెక్షన్లు రూపొందిస్తున్నాడు.స్టైల్ ప్రత్యేకతభారతీయ సంప్రదాయ బట్టల టెక్స్చర్స్కి ఆధునిక డిజైన్ల కలయిక, నేచురల్ కలర్స్, ఎకో–ఫ్రెండ్లీ ఫాబ్రిక్ల వాడకం, సింపుల్ కట్లు, గ్లోబల్ లుక్ .. ఈ ప్రత్యేకతలు అతన్ని అందరిలో ముందుంచుతున్నాయి. ఫ్యాషన్ వేదికల మీద అతని డిజైన్స్ ప్రదర్శించేంతగా వెళ్లింది. సోషల్ మీడియాలో అతని విచిత్రమైన వీడియోలకు ఎగతాళి చేసిన జనమే, ఆ తర్వాత అవే వీడియోలకు కనెక్ట్ అవ్వడం ప్రారంభించారు. తిరస్కరణ, ఎగతాళి నుండి ఇప్పుడు అతను కోట్లు సంపాదించేంతగా ఎదిగాడు. తన కథను తానే తిరగ రాసుకున్నాడు. అతన్ని సక్సెస్ గురించి అడిగితే ‘ఎవ్వరు ఏమనుకున్నా నేను నాలా ఉండటమే నాకు ఇష్టం. అదే నా నిజమైన ఫ్యాషన్ స్టేట్మెంట్’ అంటాడు. మారుమూల గ్రామాల యువతకు సౌరభ్ ఒక స్ఫూర్తి. ‘కల అంటే పెద్దది కావాలి. మన దగ్గర వనరులు లేకపోయినా, కష్టపడితే ప్రపంచమే మన దారికి రావచ్చు’ అని అతను చెప్పే సందేశం ప్రతి యువకుడిలో కొత్త ఆశను నింపుతోంది. (చదవండి: 'కంగ్రాట్యులేటరీ మనీ ఆన్ డెలివరీ' గురించి విన్నారా..?) -
నన్హీ పరీ
ఈ రోజుల్లో పిల్లలందరూ ప్రతిభాఘనులే! అయితే చదువు ఒత్తిడిలో అది మసకబారుతోంది! అలాంటి పిల్లలు ముఖ్యంగా అమ్మాయిలు తమ ప్రజ్ఞను ప్రదర్శించడానికి భువనేశ్వర్లోని కిట్స్ (కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) వేదిక కల్పిస్తోంది.. ‘నన్హీ పరీ లిటిల్ మిస్ ఇండియా’ పేరుతో!ఈ పోటీల్లో పదమూడేళ్ల నుంచి పదిహేనేళ్ల బాలికలందరూ పాల్గొనవచ్చు! విజేతలకు క్యాష్ప్రైజ్తోపాటు గెలుపొందిన స్థానాన్ని బట్టి కిట్స్లో తమకు ఇష్టమైన కోర్స్లో ఉచిత, భారీ రాయితీలతో విద్యనూ అందిస్తోంది. ఆ వివరాలు.. టాలెంట్ లేని పిల్లలు కనపడట్లేదిప్పుడు. ఇంజినీరింగ్, మెడిసిన్ చదువులకు స్కూల్ నుంచే పునాది వేస్తూ పిల్లల్లోని సహజమైన ప్రతిభను బయటకు రానీకుండా చేస్తున్నాం. దానివల్ల వాళ్లు తమకు పరిచయంలేని పదిమంది ముందుకు రావడానికి జంకుతున్నారు. మాట్లాడ్డానికి వణుకుతున్నారు. వేదికెక్కడానికి వెనుకాడుతున్నారు. దాన్ని గమనించింది.. ఆడపిల్లల చదువు కోసం కొన్ని దశాబ్దాలుగా పాటుపడుతున్న కిట్స్. ఒక్క చదువుకే కాదు బాలికల ప్రతిభాపాటవాలకూ ప్లాట్ఫామ్ కావాలని నిశ్చయించుకుంది. 2001లో ఒడిశాలో ‘నన్హీ పరీ లిటిల్ మిస్ ఇండియా’ పోటీలను మొదలుపెట్టింది. 2004కల్లా ఉత్తర భారతంలోని ప్రతి రాష్ట్రం పాల్గొనే స్థాయికి ఎదిగింది. 2015లో దక్షిణాది రాష్ట్రాలకూ చేరిన ఈ పోటీలు ఇప్పుడు జాతీయ స్థాయిని అందుకున్నాయి. ఈ ఏడు పాతికేళ్ల సంబరాన్ని జరుపుకోనున్నాయి. వీటి కోసం తెలుగు రాష్ట్రాల బాలికలకు ఈ నెల 20న హైదరాబాద్లోని తెలుగు యూనివర్సిటీలో ఆడిషన్స్ జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని 13–15 ఏళ్ల బాలికలు తమ పరిచయంతోపాటు తమ ప్రతిభను చూపే వన్ మినిట్ వీడియోను https://forms.gle/ 1QzSwfVcuPy5jTto8 అనే లింక్కి గానీ, 8790161155/ 8790163355 నంబర్లకు వాట్సాప్ గానీ, kiitnanhipari.hyd@ gmail.comకి మెయిల్ గానీ చేయొచ్చు. ఆఖరు తేదీ 15 సెప్టెంబర్. 20వ తేదీన జరిగే ఆడిషన్స్లో ఇంట్రడక్షన్, పెర్ఫార్మెన్స్ అనే రెండు రౌండ్లు ఉంటాయి. ఇందులోంచి ఇద్దరు భువనేశ్వర్లో జరిగే ఫైనల్స్కి ఎంపిక అవుతారు. అలా దేశమంతటా ఆడిషన్స్ జరిగి.. ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపికై ఫైనల్ పోటీలకు వస్తారు. రెండు రోజులు జరిగే ఈ పోటీల్లోంచి ముగ్గురు విజేతలను ఎంపికచేస్తారు. మొదటి బహుమతిగా పదిలక్షల క్యాష్ ప్రైజ్, కళింగ ఇన్స్టిట్యూట్లో ఉచిత విద్య, ఫస్ట్ రన్నరప్కి రూ. అయిదు లక్షల క్యాష్ ప్రైజ్, కిట్స్లో యాభై శాతం ఫీజు డిస్కౌంట్, సెకండ్ రన్నరప్కి రూ. మూడు లక్షల క్యాష్ ప్రైజ్, కిట్స్లో యాభై శాతం ఫీజు డిస్కౌంట్ ఉంటుంది. ఇవికాక మరో పది కేటగిరీల్లో కేటగిరీకి రూ. 20 వేల చొప్పున మొత్తం రూ. 2 లక్షల క్యాష్ ప్రైజ్ ఉంటుంది. ఇలా ఈ పోటీలు భవిష్యత్లో అమ్మాయిలు పలు అంతర్జాతీయ వేదికల మీద బెరుకు లేకుండా పెర్ఫార్మెన్స్ ఇచ్చేలా... ఇలాంటి పోటీల్లో నిర్భయంగా పాల్గొనేలా తర్ఫీదునిస్తున్నాయి. -
నయా నానో బనానా ట్రెండ్
రోజుల వ్యవధిలోనే సోషల్ మీడియాలో రకరకాల ట్రెండ్స్ వస్తున్నాయి. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ నానో బనానా ట్రెండ్. తాజాగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ‘గో విత్ ది ట్రెండ్’ అంటూ బనాన ట్రెండ్ ఫాలో కావడం విశేషం.ఇంతకీ ఏమిటీ ట్రెండ్?ఈ సరికొత్త వైరల్ త్రీడి ఫిగరీన్ ట్రెండ్ అనేది గూగుల్ వారి జెమిని 2.5 ఫ్లాస్ ఇమేజ్ టూల్కు సంబం«ధించింది. ఈ ట్రెండ్ను ‘నానో బనానా’ అనే నిక్నేమ్తో కూడా పిలుస్తున్నారు. ఈ పవర్ఫుల్ ఏఐ టూల్ క్షణాల వ్యవధిలోనే ఏ ఫోటోను అయినా వాస్తవికత ఉట్టిపడేలా త్రీడీ మోడల్లోకి మారుస్తుంది. ఈ టూల్ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.టాలీవుడ్ నుంచి హాలివుడ్ వరకు హీరోల అభిమానులు ఈ ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. ఈ ట్రెండ్లో మీరూ భాగం కావాలనుకుంటే ఇలా చేయండి...∙గూగుల్ ఏఐ స్టూడియో వెబ్సైట్: గో టు గూగుల్ ఏఐ స్టూడియోలోకి వెళ్లాలి. ∙ట్రై నానో బనాన ఆప్షన్ ఎంచుకోవాలి ∙ఫొటో ప్లస్ ప్రాంప్ట్ అనేది రికమెండెడ్ మెథడ్ ∙ప్లస్ బటన్ నొక్కి ఇమేజ్ను అప్లోడ్ చేయాలి. ప్రాంప్ట్ ఇవ్వాలి -
సూపర్ బైకర్
‘ఆడపిల్లలకు బైక్లు ఎందుకు!’ అని ఆ తండ్రి నిరాశపరిచి ఉంటే ఆ అమ్మాయి భవిష్యత్లో ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చేది కాదు. ‘బైక్ రేసింగ్ అంటే బాయ్స్కు మాత్రమే’ అనే అలిఖిత నిబంధనను జగతిశ్రీ కుమరేశన్ బ్రేక్ చేసింది. ప్రొఫెషనల్ మోటర్ సైకిల్ రేసర్గా దూసుకుపోతోంది. ట్రిపుల్ నేషనల్ చాంపియన్ జగత్శ్రీ కుమరేశన్ థాయ్లాండ్లో జరిగే ఎఫ్ఐఎం ఆసియా మహిళల కప్ ఆఫ్ సర్క్యూట్ రేసింగ్(ఏసీసీఆర్)లో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళితే... చెన్నైకి చెందిన జగత్శ్రీ ఒకానొక రోజు బైక్ రేసింగ్ చూసి ఆహా అనుకుంది. ఆరోజు నుంచి బైక్ రేసింగ్పై పాషన్ మొదలైంది. తండ్రికి తన మనసులోని మాట చెబితే సరే అని ప్రోత్సహించాడు. అలా శిక్షణ మొదలైంది. పెద్ద పెద్ద బైక్లపై ప్రాక్టీస్ మొదలుపెట్టేది. 2021లో టీవీఎస్ రూకీస్ ఛాంపియన్షిప్ కోసం బాయ్స్తో పోటీ పడి సత్తా చాటింది. చదువు కారణంగా 2022లో పోటీలకు విరామం ఇచ్చింది. 2023లో ఎంఎంఎస్సీ ఎఫ్ఎంఎసీఐ ఇండియన్ నేషనల్ డ్రాగ్ రేసింగ్ చాంపియన్షిప్లో నేషనల్ టైటిల్ గెలుచుకుంది. మద్రాస్ క్రిస్టియన్ కళాశాల ఆర్కియాలజీ గ్రాడ్యుయేట్ అయిన జగత్శ్రీ ఎఫ్ఐఎం ఉమెన్స్ సర్క్యూట్ రేసింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్(వరల్డ్ డబ్ల్యూసీఆర్) తనదైన స్థానాన్ని నిలుపుకోవాలని పట్దుదలగా ప్రయత్నిస్తోంది. -
వెరవని వ్యక్తిత్వం
సంక్షుభిత సమయంలో ఒక జాతి తమను నడిపే నేతగా ఒక స్త్రీ వైపు చూడటం అరుదు. నేపాల్లో ఇప్పుడు అక్కడి యువత అలాంటి ఒక స్త్రీ వైపు చూస్తోంది. అక్కడ ఏర్పడబోతున్న ఆపద్ధర్మ ప్రభుత్వానికి అధినేతగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి ఉంటే బాగుంటుందని ఆశిస్తోంది. ఆమె ఆర్మీ చీఫ్ను కలిశారు కూడా! భారతదేశంలో చదువుకుని, టీచర్ స్థాయి నుంచి సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి వరకూ ఎదిగిన సుశీలా కర్కీది వెరవని వ్యక్తిత్వం. ఆమె రచయిత కూడా. వివరాలు...‘ఇండియా– నేపాల్ దేశాల మధ్య అనుబంధం ఈనాటిది కాదు. దశాబ్దాలది. ప్రభుత్వాలు వాటి వాటి విధానాల వల్ల పని చేస్తుండొచ్చు. కాని ఇరుదేశాల ప్రజలు ఏనాటి నుంచో స్నేహంగా ఉన్నారు. ప్రధాని మోదీపై నాకు మంచి అభి్రపాయం ఉంది. మా స్నేహితులు, బంధువులు ఎందరో ఇండియాలో ఉన్నారు. మావారు ఎక్కువ కాలం ఇండియాలోనే గడిపారు. భారతీయులు నేపాలీలను ఆదరిస్తూనే ఉన్నారు’ అన్నారు సుశీలా కర్కి.73 ఏళ్ల ఈ మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేపాల్లో ఏర్పడనున్న ఆపద్ధర్మ ప్రభుత్వానికి ప్రధాని అయ్యే అవకాశాలు ఖరారయ్యాయి. నేపాల్లో ఉద్యమం కొనసాగిస్తున్న జెన్ జి విద్యార్థుల బృందం తాజా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సుశీలా కర్కి మా ఎంపిక అని తేల్చి చెప్పింది. సుశీలా కర్కి తన సోషల్ మీడియా అకౌంట్లో ‘దేశ పరిస్థితుల రీత్యా నాకు అప్పజెప్పే బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను’ అని తెలియచేశారు.‘నేను బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నాను. మా హాస్టల్ నుంచి నిత్యం పారే గంగను చూసే దాన్ని. ఎండాకాలం హాస్టల్ టెర్రస్ మీద పడుకునేవారం. ఉదయాన్నే గంగను చూసేవారం. అక్కడ నాతో పాటు చదువుకున్న విద్యార్థులు, పాఠాలు చెప్పిన గురువులు ఇంకా స్పష్టంగా గుర్తున్నారు’ అన్నారామె. ‘మా ఊరు విరాట్నగర్ నుంచి భారత్ సరిహద్దు 25 మైళ్లు ఉంటుంది. మేము తరచూ బోర్డర్ మార్కెట్కు వెళ్లేవాళ్లం. నాకు హిందీ వచ్చు’ అని తెలిపారామె.ప్రభుత్వంలో అవినీతి, మంత్రుల పట్ల వ్యతిరేకత, నయా సంపన్నుల వైఖరి, సోషల్ మీడియాపై నిర్బంధం... వీటన్నింటి దరిమిలా నేపాల్లో యువతరం తెచ్చిన తిరుగుబాటు వల్ల నాయకత్వ మార్పు స్పష్టమైంది. సుశీలా కర్కి ఆపద్ధర్మ ప్రధాని అయితే త్వరలో ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వ ఏర్పాటు చేయించి తప్పుకోవడమే ఆమె ప్రధాన బాధ్యత. ఆ బాధ్యతకు ఆమె సమర్థురాలని యువత భావిస్తోంది.టీచర్గా మొదలైసుశీలా కర్కి నేపాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని నిర్వహించిన ఏకైక మహిళగా ఆ దేశవాసుల్లో గుర్తింపు, గౌరవం పొందారు. జూన్ 7, 1952న నేపాల్లోని శంకర్పూర్కు చెందిన ఓ కుటుంబంలో పుట్టిన కర్కి ఏడుగురు పిల్లలలో మొదటి సంతానం. 1972లో బిరాట్నగర్లోని మహేంద్ర మొరాంగ్ క్యాంపస్ నుండి బీఏ డిగ్రీ చేసి మన బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రం చదివారు. అక్కడ చదువుతున్న సమయంలోనే నేపాలీ కాంగ్రెస్ సభ్యుడు, యువజన విభాగ నాయకుడు దుర్గా ప్రసాద్ సుబేదిని కలుసుకున్నారు. అనంతరం వారిద్దరూ వివాహం చేసుకున్నారు. 1979లో కార్కి బిరాట్నగర్లో లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 1985లో ధరణ్లోని మహేంద్ర మల్టిపుల్ క్యాంపస్లో అసిస్టెంట్ టీచర్గా పనిచేశారు. 2007లో సీనియర్ అడ్వకేట్గా 2009లో ఆ దేశ సుప్రీంకోర్టులో అడ్–హాక్ జస్టిస్గా నియమితులయ్యారు. నవంబర్ 18, 2010న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 ఏప్రిల్ నుండి 2016 జూలై వరకు నేపాల్ సుప్రీంకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, 2017 జూన్ వరకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.రచయితగా...కర్కి 2018లో ‘న్యాయ’ పేరుతో తన ఆత్మకథ రాశారు. 2019 డిసెంబర్లో ‘కారా’ అనే నవల ప్రచురించారు. నేపాల్లో 1960 నుంచి 90ల మధ్యకాలంలో రాజు కనుసన్నల్లో సాగిన ‘పంచాయత్’ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రజల అనుభవాలను ఆమె తన రచనల్లో ఉటంకించారు. ఆపద్ధర్మ అధినేతగా తన ఎంపిక జరిగితే శాంతి నెలకొల్పడం, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు భరోసా ఇవ్వడం తన తొలి ప్రాధాన్యం అని ఆమె అన్నారు.సుశీలా కర్కిది వెరవని వ్యక్తిత్వం అని అందరూ అంటారు. ఆమె న్యాయనిపుణత, అవినీతి రహిత నేపథ్యం చాలా కేసుల్లో కీలకమైన తీర్పులు ఇచ్చేలా చేసింది. ఒక అవినీతి కేసులో మంత్రిని జైలుకు పంపించడానికి సైతం ఆమె వెనుకాడలేదు. ఇవన్నీ ఆమెకు సానుకూలంగా మారాయని చర్చ సాగుతోంది. ఆ పేరు బయటకు వచ్చాక నేపాల్లో ముఖ్యంగా ఖాట్మండులో శాంతి నెలకొనడం ఆమె మాటకు విలువ ఉంటుందనడానికి ఉదాహరణ.గమనిక: ఈ కథనం రాసే సమయానికి సుశీలా కర్కితోపాటు మరికొన్ని పేర్లు కూడా ఆపద్ధర్మ ప్రధాని పదవికి పరిశీలనలోకి వచ్చాయి. -
వారసత్వం.. జవసత్వం!
హైదరాబాద్ నగరంలోని వారసత్వ కట్టడాలను ఆకర్షణీయంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నగరంలో చాలా చారిత్రక భవనాలు, ప్రదేశాలు, స్మారక చిహ్నాలు తదితర వారసత్వ కట్టడాలు ఉన్నాయి. పట్టించుకునేవారు లేక అవి మరుగున పడిపోతున్నాయి. వాటిని పరిరక్షించి నేటి ప్రజలకు, సందర్శకులకు నచ్చేవిధంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. తద్వారా వాటికి తగిన గుర్తింపు లభించడమేకాక పర్యాటక ప్రాంతాలుగానూ అభివృద్ధి చెందుతాయని భావిస్తోంది. తొలిదశలో 12 ప్రాంతాల్లోని కట్టడాలను తీర్చిదిద్దాలనుకుంటోంది.అందుకుగాను ఆయా ప్రాంతాల్లోని వనరులు, సదుపాయాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక మ్యూజియాలను ఏర్పాటు చేయాలని, లేదంటే కల్చరల్ సెంటర్లుగా మార్చాలని యోచిస్తోంది. ఈ రెండూ కుదరకుంటే ప్రజలకు ఉపయోపడే మరో రూపంలోనైనా అభివృద్ధి చేయాలనుకుంటోంది. తద్వారా ఓ వైపు చారిత్రక, వారసత్వ ప్రదేశాల పరిరక్షణతోపాటు సందర్శకులతో అవి పర్యాటక ప్రాంతాలుగానూ అభివృద్ధి చెందుతాయని భావిస్తోంది. ఈ దిశగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ల రూపకల్పనకుగాను టెండర్లు ఆహ్వానించినట్లు సంబంధిత అధికారి తెలిపారు. ఆ యా కట్టడాలు, ప్రదేశాల పరిరక్షణ, పునర్వినియోగం, అభివృద్ధి అంశాల ప్రాతిపదికన ఆయా ఏజెన్సీ డీపీఆర్లు రూపొందించాల్సి ఉంటుందన్నారు. వారసత్వ పరిరక్షణ.. పర్యాటక ఆకర్షణ పాత కట్టడాలను కొత్తగా తీర్చిదిద్దడం ద్వారా సద రు నిర్మాణాల జీవితకాలాన్ని పెంచడం, నగర సాంస్కృతిక వారసత్వాన్ని, శిల్పకళా వైశిష్ట్యాన్ని కాపాడినట్లు అవుతుందని అధికారులు చెబుతున్నారు.టెండర్లు పిలిచిన కట్టడాలు⇒ రోనాల్డ్ రోస్ భవనం, సికింద్రాబాద్ ⇒ చెన్నకేశవస్వామి ఆలయం, చాంద్రాయణగుట్ట ⇒ రేమండ్ సమాధి, మూసారాంబాగ్ ⇒ పురానాపూల్ దర్వాజా, హుస్సేనీ ఆలమ్ ⇒ ఖజానా భవనం, గోల్కొండ ⇒ షంషీర్ కోట, గోల్కొండ ⇒ గగన్ఫౌండ్రీ, అబిడ్స్ ⇒ మసీద్–ఇ–మియాన్ మిష్క్, జుమ్మెరాత్ బజార్ ⇒ టోలి మసీద్, కార్వాన్ ⇒ హయత్ బక్షి బేగం మసీద్, హయత్నగర్ ⇒ షేక్పేట్ మసీద్, షేక్పేట్ ⇒ ఖైరతాబాద్ మసీదు, సమాధి, ఖైరతాబాద్ఎంపికయ్యే ఏజెన్సీ ప్రతి స్థలాన్ని సమగ్రంగా పరిశీలించి, చారిత్రక ప్రాముఖ్యత, ప్రస్తుత పరిస్థితులను డాక్యుమెంట్ చేయాలి. ప్రతి స్థలానికి సంబంధించిన సాంస్కృతిక, చారిత్రక, శిల్పకళ, పర్యావరణ ప్రాముఖ్యతను వివరించాలి. ప్రాజెక్ట్ నిర్వహణ, డిజైన్, పర్యవేక్షణ, చారిత్రక నేపథ్యం, భౌతిక సంరక్షణ, ప్రజల సందర్శన.. ఆర్థిక అవకాశాలు వంటి అంశాలను డీపీఆర్లో పొందుపరచాలి. చదవండి: సరదా కారాదు విషాదం.. మనకు ఇదో హెచ్చరిక! -
పొలం పంటల కన్నా.. ఇంటి పంటలే బెటరా?
పంటలు అనగానే మనకు ఆరుబయట పొలంలో పండించే పంటలే (అవుట్డోర్ ఫార్మింగ్) గుర్తుకొస్తాయి. కానీ, ఆధునిక కాలంలో ఇండోర్ పంటలా (ఇంటి పంటలా), అవుట్డోర్ పంటలా అని వివరణ అడగాల్సిన పరిస్థితి. మేడపైన ఇంటి పంటలు, పెరటి తోటలు, వర్టికల్ గార్డెన్స్, పాలీహౌస్ పంటలు.. ఇలా అనేక రకాలుగా ఇవ్వాళ పంటలు పండించుకుంటున్నాం. వాతావరణ పరిస్థితులు ఆరుబయట అనుకూలంగా లేనప్పుడు పాలీహౌస్లు, భవంతుల్లో ప్రత్యేక వాతావరణ పరిస్థితులు కల్పించి మరీ సాగు చేస్తున్నాం. రూరల్ అగ్రికల్చర్, అర్బన్ అగ్రికల్చర్గా కూడా విడమర్చి మాట్లాడుకుంటున్నాం. అయితే, ఇండోర్ ఫార్మింగ్లో (Indoor Farming) చాలా విషయాలను మనం నియంత్రించగలం కాబట్టి ఆరుబయట సాగుతో పోల్చితే అన్నీ మెరుగ్గానే ఉంటాయన్న గ్యారంటీ ఏమీలేదు. అక్కడ ఉండే ఇబ్బందులు అక్కడా ఉంటాయి. అయితే, ఇండోర్ ఫార్మింగ్ పద్ధతుల్లో ఏయే ఆహార భద్రతా చిక్కులొస్తాయి? సాధారణ వ్యవసాయానికి దీనికీ ఏమి తేడాలుంటాయి? అనే అంశంపై చర్చ చాలాకాలంగానే ఉన్నప్పటికీ అధ్యయనాల, ప్రమాణాల లోపం వెంటాడుతూ ఉంది. ఈ కొరత తీర్చడానికి ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (యూఎన్ ఎఫ్ఏవో) ఇటీవల ఒక నివేదికను వెలువరించింది. ఆరుబయట పంటలు పండించటంతో పోల్చితే ఇంట్లో పండించే పంటలతో ప్రయోజనాలేమి ఉన్నాయి? ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి?.. ఇటువంటి ఆసక్తికరమైన వివరాలను ఆ నివేదికలో చర్చించారు. వాటిని రేఖామాత్రంగా పరిశీలిద్దాం..ఆధునిక ఇండోర్ వ్యవసాయంతో ముడిపడి ఉన్న ఆహార భద్రత (Food Security) ప్రమాదాలు, నియంత్రణలపై మొట్టమొదటి సమగ్ర సమీక్షా నివేదికను ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) నివేదికలో సాకల్యంగా చర్చించింది. ఇండోర్ వ్యవసాయం లేదా నియంత్రిత పర్యావరణ వ్యవసాయం (కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ అగ్రికల్చర్ – సీఈఏ) వల్ల ఒనగూడే ప్రయోజనాలు అనేకం. స్థిరత్వంతో కూడిన ఉత్పత్తి, ఉత్పాదకత, వాతావరణ మార్పులకు అనుకూలత, ఆహార భద్రతను మెరుగుపరచడం వంటివాటిని ఎఫ్ఏవో ఈ జాబితాలో చేర్చింది.ప్రస్తుత రోజుల్లో, సాంప్రదాయకంగా ఆరుబయట పండించే ఆకుకూరలతో పాటు మైక్రోగ్రీన్, బేబీ లీఫ్ వంటి స్వల్పకాలిక పంటల ఇండోర్ వ్యవసాయమే వాణిజ్యపరంగా లాభదాయకంగా మారిందని నివేదిక చెబుతోంది. ప్రపంచవ్యాప్త పరిస్థితులు ముఖ్యంగా సంపన్న చలి ప్రాంత పాశ్చాత్య, ఐరోపా దేశాలను దృష్టిలో పెట్టుకొని చెప్పిన మాటగా దీన్ని మనం పరిగణించాలి. ఎందుకంటే.. మన దేశంలో ఇండోర్ వ్యవసాయం ఇంకా శైశవ దశలోనే ఉంది. ఈ పరిమితిలోనే ఈ నివేదికలోని అంశాలను పరిశీలిద్దాం.ఏ వ్యవసాయమైనా ఆరోగ్యదాయకమైన, రోగకారకం కాని భద్రమైన ఆహారోత్పత్తే లక్ష్యంగా సాగుతుంది. అయితే, సాంప్రదాయ వ్యవసాయం కంటే ఇండోర్ వ్యవసాయమే సులభంగా నిర్వహించదగిన ఆహార భద్రత ప్రమాదాలతో కూడి ఉంటుందని తరచుగా భావిస్తుంటారు. అయితే, ఇండోర్ పంటలకు సంబంధించిన ఆహార భద్రత సమస్యలు సాధారణంగా సాంప్రదాయ బహిరంగ వ్యవసాయంలో కనిపించే సమస్యల అంతటి తీవ్రంగానే ఉంటాయని ఎఫ్ఏవో నివేదిక (FAO Report) నొక్కి చెబుతోంది. విత్తనాలు, మట్టికి బదులుగా వాడే పదార్థాలు, నీటికి సంబంధించి సూక్ష్మక్రిములతో కూడిన కాలుష్య ప్రమాదాలు పొంచి ఉంటాయి. అలాగే మొలకల ఉత్పత్తిలోనూ సమస్య రావచ్చు.బహిరంగ వ్యవసాయంతో పోల్చినప్పుడు ఇండోర్ వ్యవసాయంలో అంతర్లీనంగా ఉన్న కొన్ని అనియంత్రిత కాలుష్య సమస్యలు ఉండవు. బహిరంగ వాతావరణంలో సూక్ష్మక్రిముల పోటీ, ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు, ఎండ సోకటం వల్ల కొన్ని సహజ వ్యాధికారకాలు నశిస్తాయి. ఇండోర్ వ్యవసాయంలో వ్యాధికారకాలు ఎక్కువ కాలం సమస్యను సృష్టించే వీలుంటుంది. ఇందులో విత్తనాలు, నీరు, మట్టికి బదులుగా వాడే పదార్థాలు, ఎరువులు వంటి ఉత్పాదకాల జీవ భద్రతపై నియంత్రణకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి.ఇండోర్ వ్యవసాయంలో అధిక తేమ, నీటి ఆధారిత వ్యవస్థలు వాడతాం కాబట్టి సూక్ష్మక్రిములతో ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇండోర్ వ్యవసాయంలో సూక్ష్మక్రిముల వల్ల వచ్చే ప్రమాదాలు రసాయనాలతో వచ్చే ప్రమాదాల కంటే చాలా విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అయినప్పటికీ, పర్యావరణ కాలుష్యం, పొలాస్టిక్ పరికరాల సంబంధిత పదార్థాల నుంచి వెలువడే కాలుష్యం వంటి రసాయన సమస్యలను కూడా నివేదిక పేర్కొంది.ఆర్థిక పోటీకి నిలబడితేనే భవిష్యత్తు‘ఇండోర్ వ్యవసాయం వాతావరణ మార్పుల్ని తట్టుకొని స్థిరమైన దిగుబడినిచ్చే విషయంలో గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. కానీ ఈ సామర్థ్యాన్ని ఆచరణలో నిజం చేయడానికి బలమైన ఆహార భద్రతా పద్ధతులు, పర్యవేక్షణ చాలా అవసరం’ అని ఎఫ్ఏవో నివేదిక రూపుకల్పనలో కీలకంగా వ్యవహరించిన ఆహార భద్రతా అధికారి మసామి టకేచి అన్నారు.‘సాంప్రదాయ పంటల సాగుతో తక్కువ ఖర్చుతో ఉత్పత్తిని వెలువరించగలిగే విషయంలో ఆర్థికంగా పోటీకి నిలవగలగడమే ఇండోర్ వ్యవసాయం విజయానికి కీలకం’ అని డాక్టర్ కీత్ వారినర్ అన్నారు. ఈ నివేదికను రూపొందించిన బృందంలోని గ్వెల్ఫ్ విశ్వవిద్యాలయ నిపుణుల్లో కీత్ ఒకరు. ‘అదే సమయంలో, ఇండోర్ పొలాల లోపల నియంత్రిత వాతావరణ పరిస్థితులు వ్యాధికారక సూక్ష్మజీవుల మనుగడకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి అవి లోపలికి ప్రవేశించకుండా నిరోధించడమే తొలి ప్రాధాన్యతగా ఉండాలి. అప్రమత్తతకు నవీన ఆవిష్కరణలు తోడైతే ఇండోర్ వ్యవసాయం సురక్షితంగా, స్థిరంగా పెరుగుతుంది. భవిష్యత్తు బాగుంటుంది..’ అని డా. కీత్ వివరించారు.‘ఇండోర్ ఫార్మింగ్’కు పేర్లెన్నో!?ఇండోర్ వ్యవసాయాన్ని వివిధ రకాలుగా వ్యవహరిస్తున్నారు. ‘రక్షిత వ్యవసాయం‘ అనే పదంతో ‘ఇండోర్ ఫార్మింగ్’ను 13వ శతాబ్దంలో మొదటి సారి వాడారు. బయటి వాతావరణానికి దూరంగా ఉంచే సౌకర్యాల మధ్య పెరిగే మొక్కలనే అర్థంలో వాడారు. ఆ తర్వాత కాలంలో ‘ఇండోర్ వ్యవసాయం‘ అనే పదానికి ‘పట్టణ వ్యవసాయం‘, ‘మొక్కల కర్మాగారం‘, ‘గ్రీన్హౌస్‘, ‘హాట్హౌస్‘, ‘గ్లాస్హౌస్‘ వంటి అదనపు పదాలు తోడయ్యాయి. ఇవన్నీ పర్యాయపదాలుగా ఉపయోగించబడుతున్నాయి. ఇందులోని వివిధ పద్ధతులను, వాటి భాగాలను వివరించడానికి ఉపయోగించే పదాలను నిర్వచించాల్సిన అవసరం ఏర్పడింది.పట్టణ వ్యవసాయం: నగరాలు, పట్టణ ప్రాంతాలు, వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆహారాన్ని పండించడం, ప్రాసెస్ చేయడం, పంపిణీ చేయడం.ఇండోర్ వ్యవసాయం: ఆరుబయట కాకుండా మూసివున్న వాతావరణంలో పంటలను పెంచే ఏవైనా పద్ధతులు. ఒక గదిలో మొక్కలను పెంచే వ్యవసాయ వ్యవస్థను వివరించేందుకు వాడే పదం.గ్రీన్హౌస్: గ్రీన్హౌస్ అనేది నియంత్రిత పర్యావరణ నిర్మాణం. ఇది ఉష్ణోగ్రత, సూర్యకాంతి వంటి పరిస్థితులను మారుస్తుంది. మొక్కల పెరుగుదలను సులభతరం చేస్తుంది, ముఖ్యంగా సహజ వాతావరణ పరిస్థితులు తక్కువ అనుకూలంగా ఉన్న వాతావరణాలలో దీన్ని వాడతారు. గ్లాస్హౌస్, పాలీ వినైల్ క్లోరైడ్ గ్రీన్హౌస్, పాలిథిలిన్ గ్రీన్హౌస్ ఇవన్నీ దీనికి పర్యాయపదాలే.చదవండి: ఒక్కసారి నాటు.. ఆరు సార్లు కోతలునియంత్రిత పర్యావరణ వ్యవసాయం: పట్టణ, పట్ణణాల చుట్టూ గలప్రాంతాల్లో ఆరుబయట, మట్టిలో గాని, మట్టిలేకుండా గాని చేసే వ్యవసాయం.మొక్కల కర్మాగారం: కృత్రిమ/సహజ/సౌర కాంతిని ఉపయోగించి అధిక నాణ్యత గల పంటలను నిరంతరం ఉత్పత్తి చేసే భవనం.– పంతంగి రాంబాబు సాక్షి సాగుబడి డెస్క్ -
మైఖేల్ జాక్సన్ని తలపించేలా ఆ పక్షి డ్యాన్స్కి ఫిదా అవ్వాల్సిందే..!
ఈ ప్రకృతి ఆశ్చర్యంగొలిపే వింతలకు నెలవు. అందులోనూ పక్షులు గురించి ప్రత్యేకగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి పక్షి ఒక్కో ప్రత్యేకతతో అద్భుతం చేస్తుంటాయి. అలాంటి అందమైన పక్షుల్లో ఒకటి ఈ మనాకిన్ అనే ఎర్రటి టోపి పక్షి. వీటిని టోపీ పక్షులు అని కూడా పిలుస్తారు. ఇది అచ్చం మనుషుల మాదిరిగా డ్యాన్స్ చేస్తుందని విన్నారా..?. అది కూడా బ్రేక్ డ్యాన్స్లకు పేరుగాంచిన పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ని తలపించేలా అద్భుతంగా చేస్తోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. ఆ వీడియోలో కోస్టారికాలో ఎర్రటి టోపీతో ఉండే మానకిన్ పక్షి అచ్చం మేఖేల్ జాక్సన్ చేసిన మూన్వాక్ డ్యాన్స్ మాదిరిగా నృత్యాన్ని ప్రదర్శించింది. దాని మ్యాజిక్ స్టెప్లు చూస్తే కళ్లుఆర్పడం మరిచిపోతాం. అంతలా కాళ్లు అద్భుతంగా కదుపుతోంది. ఇంతవరకు ఈ పక్షుల ఎర్రటి టోపీనే ప్రధాన ఆకర్షణగా ఉండేది. ఇప్పుడూ యూట్యూబర్ పీటర్ బాంబౌసెక్ షేర్ చేసిన వీడియో పుణ్యమా అని డ్యాన్స్కి పేరుగాంచిన పక్షులుగా పేరుగాంచుతాయేమో. కాగా, ఈ పక్షులు దక్షిణ అమెరికాలో నివసిస్తాయి. ఇవి ఎక్కువగా బెలిజ్, కొలంబియా, కోస్టారికా, ఈక్వెడార్, గ్వాటెమాల, హోండురాస్, మెక్సికో, నికరాగ్వా, పనామా వంటి దేశాల్లో కనిపిస్తాయి. అవి ఇలా నృత్యం చేసి ఆడపక్షులను ఆకర్షించి సంతానాన్ని పొందుతాయట. ఇంకెందుకు ఆలస్యం ఆ పక్షి అందమైన డ్యాన్స్పై మీరు ఓ లుక్కేయండి మరి..!.. (చదవండి: 'కంగ్రాట్యులేటరీ మనీ ఆన్ డెలివరీ' గురించి విన్నారా..?) -
ఆ దేశంలో తల్లులకు ఆర్థిక భరోసా వేరే లెవెల్..!
వర్కింగ్ విమెన్ ప్రెగ్నెంట్ అయితే..కొన్ని కార్పొరేట్ కంపెనీలు నిర్థాక్షిణ్యంగా తొలిగించిన ఉదంతాలను చూశాం. కానీ ఈ దేశంలో ఓ విదేశీ మహిళ ప్రెగ్నెంట్ అయితే అక్కడి ప్రభుత్వం అండగా నిలబడి ఆర్థిక సాయం అందించింది. ఆ ప్రసూతి సాయం డెలివరీ అయినా తర్వాత కూడా నిరంతరాయంగా కొనసాగడం విశేషం. ఇంతకీ అదంతా ఎక్కడంటే..దక్షిణ కొరియాలో నేహా అరోరా అనే భారత సంతతి తల్లికి తన గర్భధారణ సమయంలో అక్కడి ప్రభుత్వం అందించిన ఆర్థిక మద్దతు గురించి నెట్టింట షేర్ చేసుకున్నారు. దక్షిణ కొరియా ప్రభుత్వం కాబోయే తల్లులకు అందించే ఆర్థిక సహాయన్ని గురించి సవివరంగా విని నెటిజన్లు సైతం విస్తుపోయారు. ఆ ఆర్థిక సాయం ఎలా ఉంటుందంటే..నెహా తాను ప్రెగ్నెంట్ అని నిర్థారణ అయ్యిన వెంటనే వైద్య పరీక్షలు, మందులు తదితరాలన్నింటికి అక్కడి కొరియా ప్రభుత్వం రూ. 63,100 ఇచ్చిందని, దాంతోపాటు బస్సు/టాక్సీ లేదా ప్రైవేట్ వాహనం వంటి ట్రావెల్ ఖర్చుల కోసం అదనం రూ. 44,030లు అందించినట్లు వెల్లడించింది. ఇలాంటి సహాయం డెలివరీ సమయంలో సైతం అందించిందని, ప్రసవ సమయంలో ఒకేసారి సుమారు రూ. 1.26 లక్షలు దాక ఆర్థిక సహాయం అందించిందని చెప్పుకొచ్చింది. దీనిని అధికారికంగా “కంగ్రాగ్యులేటరీ మనీ ఆన్ డెలివరీ(అభినందన ప్రసూతి సహాయం)” అని పిలుస్తారని కూడా తెలిపింది. ఈ ఆర్థిక మద్దతు తన బిడ్డ పుట్టాక కూడా కొనసాగిందని, నెలవారీగా ఆర్థిక సహాయ అందించినట్లు వెల్లడించింది. అంటే..నవజాత శిశువు తొలి ఏడాది ప్రతి నెల రూ. 63,100, రెండో ఏడాది నెలకు రూ. 31,000 చోప్పున..అలా తన బిడ్డకు ఎనిమిదేళ్లు వచ్చే వరకు రూ. 12,600లు చొప్పున ఆర్థిక సహాయం అందించిందని ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో వెల్లడించడమే గాక అందుకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేసింది. ఈ పోస్ట్ని చూసిన నెటిజన్లు దక్షిణ కొరియా ప్రభుత్వం ప్రసూతి ప్రయోజనాలను ప్రశంసించడమే గాక భారతదేశంలో అందించే ప్రసూతి ప్రయోజనాలతో పోల్చారు. అలాగే దక్షిణ కొరియా కుటుంబాలు, పిల్లల సంరక్షణను పట్ల ఎంతలా కేర్ తీసుకుంటుందో అవగతమవుతోందంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Neha Arora (@mylovefromkorea17) (చదవండి: 'నాన్ డైరియల్ డీహైడ్రేషన్'..! సాధారణ నీటితో భర్తీ చేయలేం..) -
'నాన్ డైరియల్ డీహైడ్రేషన్'..! సాధారణ నీటితో భర్తీ చేయలేం..
అలసట, మానసిక మందకొడితనం (బ్రెయిన్ ఫాగ్), తలనొప్పి, లోబీపీ వంటి లక్షణాలతో క్లినిక్స్ను సందర్శిస్తున్న వారి సంఖ్య నగరంలో పెరుగుతోంది. గతంలో ఈ తరహా సమస్యలకు వేర్వేరు కారణాలు ఉండేవి.. కానీ ఇప్పుడు వీటన్నింటికీ శరీరంలో ద్రవాల కొరతే ప్రధానంగా కనిపిస్తోందని వైద్యులు అంటున్నారు. వాంతులు, విరేచనాలు లేకపోయినా శరీరం తీవ్ర ద్రవాల కొరతను ఎదుర్కొంటోంది. అందుకే ప్రస్తుతం వైద్యులు దీనిని ‘నాన్ డైరియల్ డీహైడ్రేషన్’ అని పేర్కొంటున్నారు. వైద్యులు చెబుతున్న ప్రకారం.. డీహైడ్రేషన్ అనేది ఇప్పుడు సర్వకాల సర్వావస్థలలోనూ కలిగే సమస్యగా మారింది. గతంలో వేసవి కాలంలో మాత్రమే సంభవించేదని చాలా మంది భావించేవారు. కానీ తాజాగా వైద్యుల క్లినికల్ అనుభవాల్లో కాలంతో పాటు లక్షణాలను కూడా ఇది మార్చుకుంటోందనే కొత్త మార్పు గుర్తిస్తున్నారు. ఇది హఠాత్తుగా సంభవించేది కాదని గుర్తించలేని విధంగా గుట్టుగా శరీరంలో ఉండి నిదానంగా పెరుగుతోంది. దీనికి కొన్ని కారణాల్లో.. నగరంలో ఎక్కువగా వేడి – తేమ వాతావరణం ఉంటోంది. ఇలా వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు చెమట ఆవిరి కాకుండా చర్మంపై ఆగిపోతుంది. దీని వల్ల ద్రవనష్టం జరుగుతూనే ఉంటుంది. కానీ దాహం వేయడానికి బదులు అలసట, మత్తు, శరీరం బరువు అనిపించడం ఉంటుంది. తరచూ మూత్రానికి వెళ్లడం, మూత్రనాళం దగ్గర నొప్పి వంటి సమస్యల వల్ల చాలామంది నీరు తాగడాన్ని తగ్గిస్తారు. దీని ఫలితంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్ సమస్య వస్తుంది. నగరంలో దీర్ఘకాలిక ప్రయాణాలు చేసేవారు ఎక్కువయ్యారు. విమాన ప్రయాణాల్లో నీరు తీసుకోవడం బాగా తక్కువ. పైగా పొడి గాలి, సాల్టెడ్ స్నాక్స్, వేడి పానీయాల సేవనం.. వల్ల కూడా ద్రవనష్టం జరుగుతుంది. పరిష్కారం ఏమిటి? హైడ్రేషన్ అంటే కేవలం నీటి పరిమాణం మాత్రమే కాదు, దాని ఖచ్చితత్వం కూడా. కాబట్టి నీటి పరిమాణం తగ్గింది అని నీరు తీసుకుంటే మాత్రమే సరిపోదు.. తగిన పోషకాలున్న ద్రవాహారం అవసరం. సోడియం, పొటాషియం, క్లోరైడ్ వంటి ముఖ్య ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్ కలిగిన తక్కువ గ్లూకోజ్. క్యాలరీ, డయాబెటిక్ సేఫ్ ఫార్ములాతో తయారైన రెడీ టు డ్రింక్స్ కూడా ఈ లోటును భర్తీ చేయగలవు. పనిలో ఉండగా అలసట వచ్చినా లేదా ప్రయాణంలోనూ సరిపడా నీటితో పాటు ఎలక్ట్రోలైట్స్, గ్లూకోజ్, ఎనర్జీ సమతుల్యంగా తీసుకోవడం శరీరానికి అవసరం. ఊపిరి పీల్చడం నుంచి మొదలై ఆహారం జీర్ణం కావడం వరకు ప్రతీదీ ద్రవ ప్రమేయంతోనే జరుగుతుంది. వీటితో పాటు చెమట వల్ల రోజుకు కనీసం 2.5 లీటర్ల ద్రవ నష్టం జరుగుతుంది. కాఫీ, టీ వంటివి అతిగా తీసుకోవడం, భోజనాలు స్కిప్ చేయడం, ఒత్తిడి ఇవన్నీ కలిపితే ఆ నష్టం మరింత భారీగా ఉంటుంది. ద్రవాహారంతో.. అసమతుల్యత సరిచేయాలి.. డీహైడ్రేషన్ డయాబెటిస్, బీపీ ఉన్నవారికి ఇది ఎక్కువ ప్రమాదకరం. ఎప్పుడూ వాంతులు, విరేచనాలతోనే వస్తుందని కాదు. ఇది రోజువారీగా నిశ్శబ్దంగా ఏర్పడి, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దీనికి పరిష్కారాన్ని కేవలం నీటితో సరిపెట్టకూడదు. శరీరం కోల్పోతున్న అసలు మూలకాలు ఏవో తెలుసుకుని భర్తీ చేయాలి. ఎలక్ట్రోలైట్స్ లేకపోతే మెదడు, కండరాలు సరిగా పనిచేయవు. శరీరం కోల్పోయే సోడియం, పొటాషియం, గ్లూకోజ్ వంటి మూలకాల్ని భర్తీ చేయకపోతే కణాల పనితీరు దెబ్బతింటుంది. – డా.మోసిన్ అస్లం, కన్సల్టెంట్ ఫిజీషియన్, ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ, హైదరాబాద్ (చదవండి: అబుదాబిలో గంగా హారతి..! ఏకంగా రూ. 961 కోట్లు..) -
అబుదాబిలో గంగా హారతి..! ఏకంగా రూ. 961 కోట్లు..
అబుదాబిలో ఆధ్యాత్మికత వెల్లివిరవడం అనేది ఆశ్చర్యాన్ని రేకెత్తించే అంశం. అసలు అక్కడ హిందూ దేవాలయాలా..! అనే అనిపిస్తుంది గానీ నమ్మశక్యంగా ఉండదు. కానీ ఇది నిజం అనేలా కళ్లముందు కదాలాడుతున్న ఆ వైరల్ వీడియోనే అందుకు నిదర్శనం. ఆ హారతి ఘటన చూస్తే..మనం దుబాయ్లో ఉన్నామా? కాశీలో ఉన్నామా..? అన్న సందేహం రాక మానదు. మరి ఆ కథా కమామీషు ఏంటో చదివేద్దాం రండి..ఇటీవల దుబాయ్కు వెళ్లిన ఒక భారతీయుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబిలోని బోచసన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ(BAPS) హిందూ మందిర్లో గంగా హారతి చూసి తన్మయత్వానికి గురయ్యాడు. యూఏఈకి మకాం మార్చిన మూడు వారాల తర్వాత ఈ 24 ఏళ్ల వ్యక్తి ఈ ఆలయ సందర్శన వీడియోని నెట్టింట పంచుకున్నాడు. రెండు వారాలు ఒక హోటల్లో గడిపి..చివరికి ఒక కొత్త ఇంట్లోకి మారిన తర్వాత ఈ ఐకానికి ఆలయాన్ని అన్వేషించాడు. ఒక వీక్ఆఫ్(సెలవు) రోజున ఈ ఆలయాన్ని సందర్శించి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని పొందాడు. అక్కడ గంగా హారతిని చూసి తన దేశంలోనే ఉన్నానా అన్న బ్రాంతిని పొందానంటూ అందుకు సంబంధించిన వీడియోని నెటిజన్లతో పంచుకున్నాడు. ఆ వీడియోకి నేను "నేను UAEలో గంగా హారతిని చూశాను" అనే క్యాప్షన్ని జోడించి మరీ పోస్ట్ చేశాడు. విదేశాలలో భారతీయ సంస్కృతిని పరిరక్షించడంలో ఈ ఆలయాల పాత్ర హైలెట్గా నిలుస్తుంది. BAPSకి చెందిన ఈ ప్రార్థనా స్థలాలు మంచి ఆధ్యాత్మిక ఓదార్పుని అందిస్తాయి. తాము వేరు అనే భావన కాకుండా తన స్వదేశం మూలాలు, సంస్కృతితో గాఢంగా పెనవేసుకునేందుకు ఉపకరిస్తుంది కూడా. కాగా, ఈ ఆలయంలో రోజువారి గంగా ఆరతి వేడుకలను నిర్విఘ్నంగా నిర్వహిస్తారు. ఇక ఈ అబుదాబిలోని బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ హిందూ మందిర్ (BAPS) 27 ఎకరాల స్థలాన్ని విస్తరించి ఉంది. దీన్ని UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఉదారంగా ఇచ్చిన 13.5 ఎకరాల స్థలంలో నిర్మించడం విశేషం. ఈ ఆలయాన్ని 2019లో నిర్మించారు. అందుకు 400 మిలియన్ యుఏఈ దిర్హామ్లు అంటే మన భారతీయ కరెన్సీలో అక్షరాల రూ. 961 కోట్లు పైనే ఖర్చు అయ్యింది. View this post on Instagram A post shared by Akash Kawale (@akashkawale10) (చదవండి: నైట్ ఈటింగ్ సిండ్రోమ్..! ఆరోగ్యాన్ని అమాంతం తినేస్తుంది..) -
భద్రం బీకేర్ ఫుల్ బ్రదరూ.. సోలో టూరే సో బెటరూ...
ఒంటరి ప్రయాణం అనేది ఒక ఆసక్తికరమైన అనుభవం, ఎందుకంటే ఇది ఎంపిక చేసుకునే స్వేచ్ఛ, స్వీయ–ఆవిష్కరణ ఫ్లెక్సిబులిటీలను అందిస్తుంది. అయితే అలా సింగిల్గా ప్రయాణించాలనుకునే వ్యక్తికి ఉల్లాసమైన అనుభవాలు మాత్రమే కాదు భద్రత, సౌలభ్యం కూడా ప్రధానమే. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని చూస్తే 5 దేశాలు సోలో ట్రావెల్కి అత్యంత ఎంచుకోదగినవిగా మారాయి. ఒంటరిగా ప్రయాణీకులకు కొత్త సంస్కృతులను నేర్చుకోవడానికి, విభిన్న వ్యక్తులతో సంభాషించడానికి రాజీ పడకుండా మనసుకు నచ్చిన ప్రదేశాలను అన్వేషించడానికి వీలు కల్పించే ఆ దేశాలలో...జపాన్భద్రత, పరిశుభ్రత అత్యంత సమర్థవంతమైన రవాణా వ్యవస్థ కారణంగా వ్యక్తిగత ప్రయాణికులకు నెం1 గమ్యస్థానం జపాన్. టోక్యో, క్యోటో ఒసాకా వంటి నగరాలు ప్రశాంతమైన దేవాలయాలు, రద్దీగా ఉండే మార్కెట్లు ఆధునిక ఆకర్షణలతో సంప్రదాయ మిశ్రమాన్ని కలిగి ఉంటాయి. ఒంటరి ప్రయాణికులు ఇబ్బంది లేకుండా ప్రాంతాలు సందర్శించేలా ప్రజా రవాణా బాగా పనిచేస్తుంది చౌకగా బస చేయడానికి క్యాప్సూల్ హోటళ్ళు హాస్టళ్లు కూడా పుష్కలంగా లభిస్తాయి.న్యూజిలాండ్ఇది స్నేహపూర్వకంగా ఉండే ప్రజలు తక్కువ నేరాలు కలిగిన చిన్న దేశం, అందువల్ల ఒంటరి ప్రయాణానికి సరైనది. టోంగారిరో ఆల్పైన్ క్రాసింగ్ను హైకింగ్ చేయడం సౌత్ ఐలాండ్లోని ఫ్జోర్డ్లను సందర్శించడం వంటి అన్ని స్థాయిల ఫిట్నెస్కు అనుగుణంగా ఉండే కార్యకలాపాలతో న్యూజిలాండ్ సోలో ట్రావెల్కు అనుకూలతలు కలిగి ఉంది.పోర్చుగల్సుందరమైన ప్రదేశం, పురాతన పట్టణాలు పర్యాటకులను ఇష్టపడుతూ ఆకర్షించే ఆదరించే సంస్కృతి కలిగిన దేశం పోర్చుగల్. లిస్బన్ పోర్టో వంటి చిన్న నగరాలు కాంపాక్ట్, నడవడానికి అనుకూలమైనవి సాంస్కృతిక అనుభవాలతో నిండి ఉన్నాయి పాత స్మారక చిహ్నాలు సందడిగా ఉండే స్ట్రీట్ లైఫ్ రెండూ ఆకట్టుకుంటాయి. పోర్చుగల్లోని కేఫ్ సంస్కృతి పెద్ద సంఖ్యలో హాస్టళ్లు స్థానికులు ఇతర ప్రయాణికులతో సులభంగా పరిచయాలను ఏర్పరచుకోవడానికి వీలు కల్పిస్తాయి.కెనడాఇది వాంకోవర్, టొరంటో మాంట్రియల్ వంటి బహుళ సాంస్కృతిక, బాగా అనుసంధానించబడిన నగరాలను కలిగి ఉన్న దేశం. భద్రత విషయంలో ఉన్నత స్థానంలో ఉంది. ఒంటరి ప్రయాణికులు పట్టణాల్లోనే పలు ఆకర్షణలను సందర్శించవచ్చు. జాతీయ ఉద్యానవనాలలో ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు లేదా కాలానుగుణ స్కీయింగ్, హైకింగ్ వన్యప్రాణుల వీక్షణను చేపట్టవచ్చు.థాయిలాండ్చౌక ధరలకు ప్రయాణించాలనుకునే ఒంటరి ప్రయాణికులకు థాయిలాండ్ అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానాలలో ఒకటి. బ్యాంకాక్, చియాంగ్ మాయి, ద్వీపాలు స్ట్రీట్ ఫుడ్ టూర్స్, దేవాలయాలు, బీచ్లు నైట్ లైఫ్తో సహా అన్ని రకాల అనుభవాలకూ నిలయం. థాయిలాండ్ పర్యాటక మౌలిక సదుపాయాలు హాస్టళ్లు, గైడెడ్ టూర్లు, రవాణా సేవలు మొదలైన వాటితో బాగా అభివృద్ధి చెందాయి.(చదవండి: శ్రీనగర్ టూర్..! మంచుతోటలో చందమామ కథ) -
తద్దినాలు పెడుతున్నాం కదా... మహాలయ పక్షాలు పెట్టాలా?
ఈ సందేహం దాదాపు అందరికీ కలుగుతుంది. ఎందుకంటే, మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం...ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయపక్షం పదిహేను రోజులు చేయలేనివారు ఒక్క మహాలయమైనా చేసి తీరాలని చెబుతోంది శాస్త్రం... పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి, తాత, మత్తాతలను తలచుకుని పితృ యఙ్ఞాన్ని నిర్వహిస్తాడు... పుత్రులు లేనివారి సంగతి ఏమిటి మరి? వారి గతి అథోగతేనా? అంటే..కాదు’ అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్లికాని సోదర, సోదరీలు మరణించి ఉండవచ్చు, లేదా..పెళ్లయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు...లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు ఉండవచ్చు, లేదా యుద్ధాలలో కానీ, శిక్షల ద్వారా కానీ, ఆత్మహత్యల ద్వారా కానీ, ప్రకృతి వైపరీత్యాల (వరదలు, భూకంపాలు) ద్వారా కానీ గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు...అటువంటి వారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్థ్వలోకాలకు పంపడం కోసం ఈ ‘మహాలయ పక్షాలు’ నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు మూడు తరాలవారికి (తండ్రి, తాత, ముత్తాత) మాత్రమే తిలోదకాలతో, పిండప్రదానం యివ్వబడుతుంది. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి, తద్దినం పెట్టకపోతే.., ఆ తద్దినం పెట్టని దోషం ‘మహాలయం’ పెట్టడం వలన పోతుంది. ఎలా పెట్టాలంటే..?సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు ‘మహాలయం’ పెట్టడం ఉత్తమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థితిలో ‘మహాలయ అమావాస్య’నాడు పెట్టడం ప్రశస్తం. దీనినే ‘సర్వ పితృ అమావాస్య’ అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ..వారి వారి తిథులతో సంబంధం లేకుండా ‘మహాలయం’ పెట్టాలి. మహాలయం పెట్టే కర్త శుచిగా స్నానంచేసి, పవిత్రమును(దర్భలతో చేసిన ఉంగరం) ధరించి, శ్రధ్ధగా, భక్తిగా, మంత్రపూర్వకంగా ఐదుగురు బ్రాహ్మణభోక్తలతో ఈ పితృకార్యాన్ని నిర్వహించాలి. మహాలయం పెట్టలేని పక్షంలో కనీసం గతించిన పెద్దలను తలచుకుని వారి పేరు మీదుగా శక్తిమేరకు శుచిగా వంట చేసి భోజనాలు పెట్టాలి. ఇలాంటి క్రతువులపై విశ్వాసం లేనివారు కూడా పేదలకు అన్నదానం చేయడం ఆవులకు పచ్చగడ్డి తినిపించడం, శునకాలకు, కాకులకు ఆహారం పెట్టడం మంచిది. మహాలయ పక్షాలలో శ్రాద్ధ కర్మ చేత పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రవచనం. (సెప్టెంబర్ 8 నుంచి 21 వరకు మహాలయ పక్షాలు) (చదవండి: మహిమాన్వితం... ముక్తిప్రదం పుష్పగిరి క్షేత్రం) -
విశుద్ధి చక్ర నిలయా..!
475వ నామం వద్ద అమ్మవారిని ‘విశుద్ధి చక్ర నిలయా‘ అనగా విశుద్ధి చక్రంలో నివసించునది అని వర్ణిస్తారు. ఈ చక్రం మన సూక్ష్మ శరీరంలో కంఠం వద్ద ఉంటుంది. కుండలినీ శక్తి ఈ చక్రాన్ని దాటునప్పుడు మనిషికి సంఘ జీవనం అలవడి, సాక్షీభూత స్థితిలో దైవికమైన చాతుర్యంతో మాట్లాడగల వాక్ శక్తి లభిస్తుంది.103వ నామం వద్ద అమ్మవారిని ‘ఆజ్ఞా చక్రాంత రాళస్థా‘అనగా ఆజ్ఞాచక్రం మధ్యలో ఉండునది అంటూ వర్ణిస్తారు. ఈ ఆజ్ఞాచక్రం మనం నుదురు మీద బొట్టు పెట్టుకునే ప్రాంతంలో ఉంటుంది, కుండలినీ శక్తి ఈ చక్రాన్ని దాటినప్పుడు మనిషి లోపల క్షమాగుణం నెలకొని పరిపూర్ణ నిర్విచార స్థితి అనగా ఆలోచనలు లేని స్థితిని పొందుతాడు. సాధారణం గా మనిషికి ఆలోచనలు లేకుండా ఉండడం నిద్రలో మాత్రమే సాధ్యమవుతుంది. కానీ ఈ స్థితిని చేరుకున్న మనిషి మెలకువగా ఉన్నప్పుడు కూడా ఆలోచనలు లేని స్థితిని పొందగలుగుతాడు. 105వ నామం వద్ద ‘సహస్రారాంబుజారూఢా‘ అనగా సహస్ర దళ పద్మంలో నివసించునది అని వర్ణిస్తారు. ఈ చక్రం మన తల మీద మాడు ప్రాంతం లేదా బ్రహ్మ రంధ్రం వద్ద ఉంటుందని, కుండలినీ శక్తి ఈ చక్రాన్ని ఛేదించుకొని పైకి వచ్చినప్పుడు మనిషికి యోగం లభిస్తుందని వివరిస్తారు. మానవ చేతన తన చుట్టూ ఉండే భగవంతుని పరమ చైతన్య శక్తితో అనుసంధానాన్ని పొందుతుందని, మానవ మెదడును లోపల నుండి గమనిస్తే, 1000 నరాలు కలిసి, 1000 దళాలు గల పద్మంలా కన్పిస్తుందని, అందుకే ‘సహస్రారం’ అని పిలుస్తారని చెబుతారు. 106వ నామం వద్ద ‘సుధాసారాభి వర్షిణి’ అనగా అమృతధారలు కురిపించునది అని వర్ణిస్తారు. కుండలినీ శక్తి సహస్రార చక్రాన్ని దాటిన తరువాత చైతన్య తరంగాల అనుభూతి మొదలవుతుంది. అమృత ధారల వంటి ఈ చైతన్య తరంగాలను అనుభూతి చెందడం కుండలినీ జాగృతి వల్లే సాధ్యమవుతుంది. ఆ సమయంలో సాధకులు బ్రహ్మానందానుభూతిలో లీనమవుతారు.– డా. పి. రాకేష్పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి గారి ప్రవచనాల ఆధారంగా (చదవండి: మహిమాన్వితం... ముక్తిప్రదం పుష్పగిరి క్షేత్రం) -
మహిమాన్వితం... ముక్తిప్రదం పుష్పగిరి క్షేత్రం
పూర్వం తన తల్లి దాస్య విముక్తికోసం దేవలోకం నుంచి గరుత్మంతుడు అమృతభాండాన్ని తీసుకుపోతూండగా దేవేంద్రుడు ఎదిరించాడు. అప్పుడు ఇద్దరి మధ్యనా ఘోరయుద్ధం జరిగింది. ఆ పోరాటంలో అమృతబిందువు ఒకటి చింది, భూలోకంలో ఇప్పుడు ఆ మడుగు ఉండేచోటున పడిందట. దాని ఫలితంగా అప్పట్లో ఆ మడుగులో స్నానం చేసిన వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగానూ, యవ్వనవంతులుగానూ మారిపోవడంతోపాటు అమరత్వం కూడా పొందేవారట. దాని మహిమను ప్రత్యక్షంగా చూసిన నారదుడు బ్రహ్మదేవుడికి నూరిపోసిన మీదట, అమరత్వం యిచ్చే ఇటువంటి మడుగు భూలోకంలో ఉండకూడదు అని బ్రహ్మకు అనిపించింది. వెంటనే బ్రహ్మ, హనుమంతుని రప్పించి, ‘‘హనూ! ఒక పర్వతం తెచ్చి పడవేసి, పినాకినిలో ఉండే ఆ మడుగును కప్పెట్టివేసెయ్యి‘ అన్నాడు. చెప్పటమే తడవుగా ఆంజనేయుడు బ్రహ్మాండమైన పర్వతం ఒకటి తెచ్చి దభీమని ఆ మడుగులో పడవేశాడు. కాని, ఆ పినాకినీ జల మహిమ యేమిటో కాని, హనుమంతుడు పడవేసిన పర్వతం మడుగును కప్పి వేయటానికి బదులు బెండు లాగా నీటిపైన తేలి ఆడుతూ వుంది.ఈ చిత్రం చూచి బ్రహ్మకు కంగారుపుట్టింది. నారదుణ్ణి వెంటబెట్టుకుని, సరాసరి శివుని వద్దకు వెళ్లాడు. శివునికి కూడా ఈ విషయంలో ఏమీ పాలు΄ోక, ఆ ముగ్గురూ కలిసి వైకుంఠంలో వుండే విష్ణుమూర్తి వద్దకు ΄పోయి జరిగిన వైనాలన్నీ పూసగుచ్చినట్టు ఆ జగన్నాటక సూత్రధారుడికి విన్నవించారు. విష్ణుమూర్తి అంతా విని, ‘‘నాకూ, శివునికి ఎప్పుడూ ఇటువంటివే చిక్కులు తగులుతూ ఉంటాయి. తిన్నగా ఉండడు కదా ఈ నారదుడు!‘ అని చెప్పి, బ్రహ్మనూ నారదుణ్ణి పంపివేశాడు. తరువాత శివకేశవులు మానవరూపంతో భూలోకానికి దిగివచ్చి, ఆ మడుగు పైన తేలి ఆడుతూ వున్న పర్వతాన్ని ఒక వైపున శివుడూ, రెండోవైపున కేశవుడూ అదిమిపట్టి అణిచివేశారు. అప్పుడు వారి ప్రభావంవల్ల ఆ పర్వతం భూమి పైన అణిగి వుండి, మడుగు మూసుకు΄ోయింది.అస్తికలను పువ్వులుగా మార్చగల మహిమ గలిగింది– పినాకినీ నది జలం. అటువంటి నీటిలో ఆంజనేయుడు పర్వతాన్ని తెచ్చి పడవేశాడు. ఈ రెండు కారణాలవల్ల ఆ పర్వతానికి ‘పుష్పగిరి’ అనే పేరు వచ్చిందంటారు. శివకేశవులు ఇద్దరూ దిగివచ్చి ఆ పర్వతాన్ని అణచటంచేత, కొండకు రెండు పక్కలా ఆ ఇద్దరి ఆలయాలూ వెలిసి, అది ఈనాడు ఒక దివ్య క్షేత్రమై వెలుగొందుతోంది. ఇక్కడ యేటా గొప్ప ఉత్సవాలు జరుగుతాయి. లక్షలాది జనం స్వాముల దర్శనానికి వస్తుంటారు. ఇది చెప్పదగిన పుణ్య క్షేత్రం గనకనే పుష్పగిరి స్వాములవారు ఇక్కడ మఠం ఏర్పరచుకొన్నారు. దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది. ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది.కడప నుంచి కర్నూలుకు వెళ్ళే మార్గంలో చెన్నూరు సమీపంలో ఎడమ వైపు పక్క మార్గంలో వెళితే పుష్పగిరి వస్తుంది. ఈ క్షేత్రం కొండ మీద ఉంది. కింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది. శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం. వైష్ణవులు దీనిని ‘మధ్య అహోబిలం’ అనీ, శైవులు దీనిని ’మధ్య కైలాసం’ అనీ అంటారు. ఆంధ్రప్రదేశ్లో ఇదొక్కటే శంకరాచార్య మఠం. పుష్పగిరి సమీపంలో పాపఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్నలో కలుస్తాయి. అందుకే పుష్పగిరిని పంచనదీక్షేత్రమంటారు.హరిహరాదుల క్షేత్రంశివ స్వరూపుడైన వైద్యనాథేశ్వరుడు, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవస్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.జనమేజయుడు చేసిన సర్పయాగ పాపరిహారార్థం శుక మహర్షి ఆదేశంపై పుష్పగిరి కొండపై ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది.చోళులు, పల్లవులు, కృష్ణదేవరాయలు ఆ తర్వాతి కాలంలో ఆలయాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర ద్వారా తెలుస్తుంది.కొండ మీద ఒకే ఆవరణంలో చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వరాలయం ఉన్నాయి. ఈ ఆవరణంలోనే ఉమా మహేశ్వర, రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ, సాక్షిమల్లేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు.పుష్పగిరిలోనే పాపవినాశేశ్వరుడు, డుంటి వినాయకుడు, పుష్పనాథేశ్వరుడు, కమలసంభవేశ్వరుడు, దుర్గాంబ ఆలయాలున్నాయి. రుద్రపాదం, విష్ణుపాదం ఈ కొండ మీదే ఉన్నాయి. వరదలు వచ్చినప్పుడు పెన్న దాటి ఆవలి వైపుకు వెళ్ళలేరు. అప్పుడు ఈవలి వైపు అభినవ చెన్నకేశవస్వామికి పూజలు జరుగుతాయి. పాతాళగణపతిని దర్శించుకొని పూజలు చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు.జగద్గురువు ఆదిశంకరాచార్యులు స్వహస్తాలతో ప్రతిష్టించిన శ్రీ చక్రాన్ని దర్శించుకోవడం భక్తులు భాగ్యంగా భావిస్తారు.(చదవండి: లాల్బాగ్చా నిమజ్జనంలో ఏం జరిగింది..? మండిపడుతున్న భక్తులు..) -
నైట్ ఈటింగ్ సిండ్రోమ్..!
ఈశ్వర్ తిండి అలవాట్లు ఇటీవల చాలా విచిత్రంగా మారాయి. ఈమధ్య రాత్రి భోజనం కాగానే వెంటనే నిద్రపట్టడం లేదు. కాసేపాగాక ఏదైనా తిందామంటూ మాటిమాటికీ ఫ్రిజ్ తెరచి చూస్తుంటాడు. రాత్రిపూట ఆకలేయడం గుర్తుకొచ్చి ప్రతిరోజూ రాత్రి తినడం కోసం చిప్స్ అనీ, కారా అనీ... ఏదో ఒక రకమైన శ్నాక్స్ తెచ్చుకుంటూ ఉంటాడు. కొన్నిసార్లు ముందుగానే స్వీట్స్ కూడా తెచ్చిపెట్టుకుంటాడు. రాత్రి రెండు గంటలయినప్పటికీ ఆ టైమ్లోనైనా తింటే తప్ప నిద్రపట్టదు. ఇలా రాత్రి తినేయడంతో పొద్దున్న బ్రేక్ఫాస్ట్ టైమ్కు అంతగా ఆకలేయదు. ఈ అలవాటు వల్ల ఇటు ఆహారపు అలవాట్లూ, అటు నిద్రవేళలూ ఈ రెండూ అస్తవ్యస్తంగా మారాయి. ఎట్టకేలకు డాక్టర్ను సంప్రదిస్తే ఇది ఒకరకమైన రుగ్మత అనీ దీని పేరే ‘నైట్ ఈటింగ్ సిండ్రోమ్–(ఎన్ఈఎస్)’ అనీ తెలిసింది. ఈ అనారోగ్య సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం...ఈ కేస్ స్టడీలో ఈశ్వర్ అంతగా పట్టించుకోలేదుగానీ... ఈ అలవాటు అదేపనిగా కొనసాగుతుండటంతో కొన్ని ఇబ్బందులు వచ్చిపడుతుంటాయి. పెందరాళే నిద్రలేవలేకపోవడంతో ఆఫీసులో మందకొడిగా మారిపోవడం, అర్ధరాత్రి తినేసి ఉండటంతో బ్రేక్ఫాస్ట్ టైమ్కు ఆకలి లేకపోవడం... దాంతో పగలు భోజన వేళలు తప్పడం వంటి అనర్థాలు ఏర్పడతాయి. దాంతో దీర్ఘకాలంలో ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదమూ ఉంటుంది.గుర్తించడం ఎలా... రాత్రిళ్లు వారంలో కనీసం నాలుగు నుంచి ఐదు రాత్రులు నిద్రలేకపోవడం ఉదయం లేచాక ఆకలి లేకపోవడం రాత్రి భోజనం తర్వాత ఎంతకీ నిద్రపట్టకపోతే నిద్రపట్టాలంటే మళ్లీ ఏదోటి తినక తప్పదని అనుకుంటూ ఉండటం ఒకలాంటి డిప్రెషన్ మూడ్... సాయంత్రాలు ఈ ఫీలింగ్ మరింత ఎక్కువ.ఇలాంటిదే మరో సమస్య...బింజ్ ఈటింగ్ డిజార్డర్ అనే మరో సమస్య కూడా ఉంది. ‘నైట్ ఈటింగ్ సిండ్రోమ్’ కంటే ఇది కాస్త వేరుగా ఉంటుంది. బింజ్ ఈటింగ్ డిజార్డర్లో బాధితులు ఏమాత్రం గ్యాప్ లేకుండా అదేపనిగా తినేస్తుంటారు. కానీ నైట్ ఈటింగ్ సిండ్రోమ్లో బాధితులు అదేపనిగా కాకుండా కొద్ది కొద్ది మొత్తాల్లో తింటుంటారు.‘నైట్ ఈటింగ్ సిండ్రోమ్’కు కారణాలు... ఈ సమస్యకు కారణం ఇదమిత్థంగా తెలియదు. డాక్టర్ల అంచనా ప్రకారం నిద్ర΄ోవడానికి – నిద్రలేవడానికి తోడ్పడే నిద్ర సైకిల్లో అస్తవ్యస్తతతోపాటు కొన్ని హార్మోన్ల అసమతౌల్యత వల్ల ఇలా జరుగుతుంది. స్థూలకాయుల్లో ఇది కనిపించడంతోపాటు డిప్రెషన్, యాంగై్జటీతో బాధపడేవారిలో ఇది సాధారణంగా కనిపిస్తుంటుంది. సాధారణంగా నైట్ ఈటింగ్ సిండ్రోమ్ సమస్య ప్రతి వందమందిలో ఒకరి లో కనిపిస్తుంటుంది. ఒకవేళ స్థూలకాయుల్లోనైతే ప్రతి 10 మందికి ఒకరిలో కనిపిస్తుంది. ఇక ఈ సమస్యకూ జన్యుపరమైన అంశాలకూ సంబంధముందని వైద్యపరిశోధకులు చెబుతున్నారు. బాడీ క్లాక్ని నియంత్రించే ‘పీఈఆర్–1’ అనే జన్యువులోని లోపం కారణంగా ఈ సమస్య ఉత్పన్నమవుతుందన్నది శాస్త్రవేత్తల మాట.నిర్ధారణ పరీక్షలు: బాధితులు తిండి, నిద్ర అలవాట్ల గురించి డాక్టర్లు తెలుసుకోవడం పాలీసోమ్నోగ్రఫీ అనే పరీక్ష సహాయంతో మెదడులోని తరంగాలు, ఆక్సిజన్ మోతాదులు, గుండె స్పందనల, శ్వాస తీసుకునే రేటు వంటి పరీక్షల సహాయంతో డాక్టర్లు ఈ సమస్యను నిర్ధారణ చేస్తారు.ఆరోగ్యంపై ఎన్ఈఎస్ దుష్ప్రభావాలు... ఎన్ఈఎస్కూ స్థూలకాయానికీ సంబంధం ఉందని తెలుసుగానీ... స్థూలకాయం వల్లనే ఈ ఎన్ఈఎస్ వస్తుందా అన్న విషయం ఇంకా వైద్యనిపుణులకు తెలియరాలేదు. అయితే వీళ్లలో చాలామందికి స్థూలకాయం ఉంటుంది కాబట్టి ఒబేసిటీ వల్ల వచ్చే అన్ని రకాల దుష్ప్రభావాలూ ఎన్ఈఎస్లో కనిపించడానికి అవకాశముంది. ఇక కొందరిలోనైతే ఈ ఎన్ఈఎస్ వల్లనే తర్వాత్తర్వాత ఊబకాయం వచ్చే అవకాశమూ ఉంటుంది.చికిత్స... సైకియాట్రిస్టుల ఆధ్వర్యంలో కొన్ని రకాల యాంటీడిప్రెసెంట్లతో పాటు అవసరాన్ని బట్టి బిహేవియర్ థెరపీ ఇస్తారు. కొన్ని రకాల రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబిస్తూ రాత్రి తిండిని క్రమంగా ఉదయం బ్రేక్ఫాస్ట్కి షిఫ్ట్ అయ్యేలా కౌన్సెలింగ్ చేయడం ద్వారా చికిత్స అందిస్తారు. (చదవండి: ఎవరీ టీనేజర్ తేజస్వి మనోజ్? వృద్ధుల రక్షణ కోసం..) -
వెనిస్లో గెలిచింది
వెనిస్ నగరంలో ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు జరిగిన వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో మన యువ దర్శకురాలు అనుపర్ణా రాయ్ అవార్డు గెలుచుకుంది. మొదటి, రెండవ దర్శకత్వ సినిమాల కేటగిరి ‘ఒరిజోంటి’ కేటగిరిలో తన మొదటి సినిమా ‘సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్’కు ఆమె అవార్డు గెలుచుకుంది. అనురాగ్ కశ్యప్ సమర్పించిన సినిమా ఇది. అనుపర్ణ పరిచయం.‘స్త్రీల లోపల ఉండే ఖాళీలు స్త్రీలకే తెలియవు. ఆ ఖాళీలు ఏ విధాన పూరింపబడతాయో కూడా తెలియదు. స్త్రీలు తమలో తాము చేసే అంతర్గత ప్రయాణానికి వీలు ఉండదు. అలాంటి ఇద్దరు స్త్రీలు తమను తాము తెలుసుకోవడమే కాక ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నమే నేను తీసిన సాంగ్స్ ఆఫ్ ఫర్గాటోన్ ట్రీస్ సినిమా’ అంది అనుపర్ణా రాయ్.29 ఏళ్ల అనుపర్ణా రాయ్ ఇటీవల వెనిస్లో జరిగిన వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అందరి దృష్టి ఆకర్షించింది. ఆమె దర్శకత్వం వహించిన 77 నిమిషాల ‘సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్’ హిందీ సినిమా మూడు షోస్ వేస్తే హౌస్ఫుల్గా నడిచాయి. అందరూ ఆమెను ప్రశంసించారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో మొదటిసారి దర్శకత్వం వహించే సినిమాల విభాగం ‘ఒరిజోంటి’లో ఈ సినిమా సెలక్ట్ కావడమే గొప్ప అనుకుంటే అవార్డు గెలవడం మరింత గొప్ప. ఆ విధంగా అనుపర్ణా రాయ్ చరిత్ర సృష్టించింది. వివిధ దేశాల నుంచి 19 సినిమాలు ఎంట్రీ పొందిన ఈ విభాగంలో మన భారతీయ చిత్రం ‘సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్’కు అవార్డు దక్కడం దేశంలో యువ ప్రతిభకు లోటు లేదనే విషయాన్ని నిరూపిస్తోంది. సినీ రంగంలో మహిళల సృజనకు తార్కాణంగా నిలుస్తోంది.కథ ఏమిటి?‘సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్’ కథ ముంబైలో జరుగుతుంది. ముంబైకి వలస వచ్చిన ఔత్సాహిక నటి తోయ, సేల్స్ రంగంలో పని చేసే శ్వేత ఒక అపార్ట్మెంట్లో రూమ్మేట్స్గా కలిసి జీవిస్తూ ఉంటారు. తోయకు నటిగా అవకాశాలు రావు. అందువల్ల తప్పనిసరై సెక్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే శ్వేతకు ఎదురు పడుతున్న పురుషులు ఆమెను అర్థం చేసుకోవడంలో విఫలమవుతుంటారు. ఈ క్రమంలో తోయ, శ్వేత ఒకరికొకరు తోడవుతారు. ఉద్వేగాలను అర్థం చేసుకొని ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చుకుంటారు. వారి మధ్య ప్రేమ ఏర్పడుతుంది. అయితే తోయ చేసే సెక్స్వర్క్ ఇరుగు పొరుగుకు తెలిసి చివరకు ఫ్లాట్ ఖాళీ చేయాల్సి వస్తుంది. ఆమెతో పాటు శ్వేత కూడా బయటకు నడవడంతో సినిమా ముగుస్తుంది. అయితే ఇప్పుడు వారు ఒంటరి కాదు. ఒకరికి ఒకరు ఉన్నారు. అదీ తేడా. ఈ కథంతా అపార్ట్మెంట్లోని వంట గదిలో, డ్రాయింగ్ రూమ్లో, కిటికీ దగ్గర, కారిడార్లలో జరుగుతుంది. స్త్రీలకు దొరికే ఈ మాత్రపు స్థలంలోనే వారు ఏ విధంగా జీవితాలను నిభాయించుకుంటారో దర్శకురాలు చూపుతుంది.బెంగాల్ అమ్మాయిఅనుపర్ణా రాయ్ పశ్చిమ బెంగాల్లోని పురూలియా జిల్లాలో పుట్టి పెరిగింది. మాస్ కమ్యూనికేషన్ చదివి ఢిల్లీలో కాల్ సెంటర్లో పని చేసింది. 2022లో ముంబైకి వలస వచ్చింది. దర్శకురాలిగా ఆమెకు ఎటువంటి శిక్షణ లేదు. చిన్నప్పుడు సినిమా హాలుకు వెళ్లడం కూడా కష్టమయ్యేది. కాలేజీ వయసులోనే సినిమా అంటే ఏమిటో పైరెటెడ్ సినిమాలను తన లాప్టాప్లో చూసి తెలుసుకుంది. ‘రన్ టు ది రివర్’ అనే షార్ట్ఫిల్మ్ తర్వాత ‘సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్’ తీయాలనుకుంది. అయితే ఇందుకు ఆమె దగ్గర డబ్బు లేదు. కొద్దిపాటి ఫండ్ దొరికితే తన అద్దె ఫ్లాట్లోనే ఇద్దరు ముఖ్యపాత్రధారులను తనతోపాటు ఉంచుకుని సినిమా తీసింది. తర్వాత అనురాగ్ కశ్యప్ ఈ సినిమాను మెచ్చి సమర్పకుడిగా వచ్చాడు. దాంతో సినిమా వెనిస్కు చేరింది. అవార్డు కూడా సాధించింది.అంతా రాజకీయమే‘చిన్నప్పుడు నాకో స్నేహితురాలు ఉండేది. దళితురాలు. ఆమె పేరు ఝూమా దాస్. ఆమెతో మాట్లాడవద్దని మా నాన్న చె΄్పాడు. అలా ఆ స్నేహం వదులుకున్నాను. కాని ఆ పని చేసినందుకు మా నాన్నను ఇప్పటికీ క్షమించలేకపోతున్నాను. ఝూమా దాస్కు చిన్న వయసులోనే పెళ్లయ్యింది. దానికి కారణం పెళ్లి ఖర్చు భరించే ప్రభుత్వ పథకమే. ప్రభుత్వాలు ఆడపిల్లల పెళ్ళిళ్లకు డబ్బు ఇవ్వడం కన్నా వారి చదువుకు డబ్బు ఇవ్వాలి. తక్కువ కులాల ఆడపిల్లల ఎదుగుదలను పట్టించుకోక వారిని త్వరగా వదిలించుకోవడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నమే పెళ్లి ఖర్చు భరించడం. స్త్రీలు ఎన్నో సంఘర్ఘణలు ఎదుర్కొంటూనే ఉన్నారు. వారి కథలు నాలో నిండిపోయి ఈ సినిమాగా బయటకు వచ్చాయి’ అని తెలిపింది అనుపర్ణ రాయ్.∙ -
సోషల్ మీడియా.. ఆ ఆనందం కృత్రిమమే!
నాకు పెళ్లయి నాలుగు సంవత్సరాలయింది. మాది మధ్య తరగతి కుటుంబం. నాది ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం, నా భార్య ఓ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. ఆమెకు ఇతరులతో పోల్చుకునే తత్వం ఎక్కువ. స్నేహితులు, చుట్టాలు సోషల్ మీడియాలో పెట్టే రకరకాల పోస్టులు చూసి వాళ్ళలాగా ఖరీదైన బట్టలు, నగలు కొనుక్కోవాలి, రెస్టారెంట్లుకి తరచు వెళ్ళాలి, విలాసవంతమైన లైఫ్ గడపాలి అని నన్ను ఇబ్బంది పెడుతుంటుంది. అందుకోసం అప్పులు చేస్తుంది. నాతో కూడా అప్పులు చేయించింది. హోటల్కు కానీ, టూర్కి కానీ వెళ్లినా, అక్కడి ఫుడ్ని, ప్లేస్ని ఎంజాయ్ చేయకుండా తన ఆలోచన అంతా ఫోటోలు తీయడం, వెంటనే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మీదే ఉంటుంది. ఆ తర్వాత వాటికి ఎన్ని లైక్లు, కామెంట్స్ వచ్చాయని చూసుకోవడం... రోజంతా ఇదే సరిపోతుంది. ఆమె పైన ఉన్న ప్రేమతో ఇప్పటిదాకా నేను సహించాను కానీ ఇక నావల్ల కావట్లేదు. ఆమె పద్ధతి మార్చే మార్గముంటే చె΄్తారని ఆశిస్తున్నాను.– శ్రీకుమార్, విశాఖపట్టణం సోషల్ మీడియాలో చూసి ఇతరులతో పోల్చుకుంటూ వాళ్లలా ఉండటం కోసం అప్పులు చేస్తూ ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే కుటుంబాలు ఎలా ఛిన్నాభిన్నమవుతాయో చెప్పడానికి మీ జీవితమే ఒక ఉదాహరణ. ప్రపంచంలోని వేరు వేరు ప్రాంతాల్లోని వారు కనెక్టవడం కోసం, స్నేహితులు, బంధువులతో మన సంతోషాలు, బాధలు పంచుకోవడం కోసం, సోషల్మీడియా ఒక ΄్లాట్ఫాం లాగా ఉపయోగపడుతుంది. అయితే చాలామంది వాస్తవ జీవితానికి దూరంగా, డిజిటల్ లైఫ్లోనే బతుకుతూ, సోషల్ మీడియా మాయలో పడి వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా నల్గురితో ఫ్రీగా కలవలేనివారు, ఆత్మన్యూనతతో బాధపడేవారు, జీవితంలోని ప్రత్యేక సంఘటనలను ఫిల్టర్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, వాటికి వచ్చే కామెంట్స్, లైక్స్ చూసుకుని ఒక ‘ఫేక్ సక్సెస్’(కృత్రిమ విజయం)ని ఆనందిస్తున్నారు. ఎవరి జీవితాల్లోనూ అన్నీ సంతోషాలే ఉండవు. తమ బాధలను, కష్టాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయరు, కేవలం సక్సెస్ సోరీస్’ మాత్రమే పోస్ట్ చేస్తుంటారు. అది చూసి ఇతరులు కూడా తమ బాధలను పక్కన పెట్టి సక్సెస్ను మాత్రమే పోస్ట్ చేయాలన్న తాపత్రయంతో ఇలాంటివి పోస్ట్ చేసి కృత్రిమ ఆనందాన్ని పొందుతుంటారు. సోషల్ మీడియాలో చూసేవన్నీ నిజమని నమ్మి మీ భార్యలాంటి చాలామంది లేనిపోని ఆర్భాటాలకు పోయి ఇలా అప్పుల పాలవుతున్నారు. కుటుంబంతో కలిసి బయటకు వెళ్ళటం, సరదాగా ప్రయాణాలు చేయాలనుకోవటం తప్పేం కాదు, కానీ మన స్థోమతని బట్టి అందుబాటులో ఉన్న ప్రదేశాలకి వెళ్ళడం.. అలా వెళ్ళే ప్రదేశమేదైనా కానీ అక్కడ అందరూ సరదాగా గడిపిన క్షణాలు, కబుర్లే మనకు మర్చిపోలేని తీపి జ్ఞాపకాలని గుర్తుంచుకోవాలి. నిజమైన సంతోషం అంటే లాంగ్టూర్లు, కాస్ట్లీ రెస్టారెంట్లూ కాదు, మనవారితో గడిపే సంతోష క్షణాలే! మీరిద్దరూ కలిసి, ఒకసారి మానసిక వైద్యనిపుణుని కలిస్తే ఆమెకేవైనా వ్యక్తిత్వ సమస్యలు, ఇతర మానసిక ఇబ్బందులు ఉంటే, పరీక్షించి, వాటికి తగిన కౌన్సెలింగ్, చికిత్స ఇస్తారు. మీరు కూడ ఇక ఆర్థిక క్రమశిక్షణ పాటించండి. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని ఆశిద్దాం! ఆల్ ది బెస్ట్! డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
సర్వీస్ స్టార్
‘నా టైమ్ బాగ లేదు’ అనుకున్నాడు తాతయ్య. ఎందుకంటే ఆయన ఆన్లైన్ మోసానికి గురయ్యాడు. దాంతో తీవ్ర నిర్వేదానికి లోనయ్యాడు. ఈ నేపథ్యంలో తన తాతయ్యలాంటి ఎంతో మంది వృద్ధుల కోసం ‘షీల్డ్ సీనియర్స్’ అనే వెబ్సైట్ను రూపొందించిన పదిహేడు సంవత్సరాల ఇండియన్–అమెరికన్ తేజస్వి మనోజ్... టైమ్స్ మ్యాగజైన్ ‘కిడ్ ఆఫ్ ది ఇయర్–2025’ ఘనత సాధించింది. ‘ఆన్లైన్ మోసానికి గురైతే ఏం చేయాలి...’ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తల వరకు సెమినార్లు, తన వెబ్సైట్ ద్వారా విస్తృత ప్రచారం చేస్తోంది తేజస్వి. ఇప్పుడు తేజస్వి ‘టైమ్’ బాగుంది. ఆమె చెప్పే సాంకేతిక విషయాల గురించి వినడానికి ఆబాలగోపాలం ఆసక్తి కనబరుస్తోంది. టైమ్ మ్యాగజైన్ తేజస్విని ‘సర్వీస్ స్టార్’గా కొనియాడింది...కాలిఫోర్నియాలో పుట్టి డాలస్లో పెరిగింది తేజస్వి మనోజ్. తేజస్వి తల్లిదండ్రులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. కోడింగ్ అంటే తేజస్వికి ఎంతో ఇష్టం. చాలా చిన్న వయసులోనే కోడింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. బొమ్మలతో ఆడుకుందో లేదో తెలియదుగానీ కోడింగ్ ప్రపంచంలో జావా, పైథాన్లతో ఆడుకుంది.కోడింగ్ శక్తి... ‘గర్ల్స్ హూ కోడ్’ అనే స్వచ్ఛంద సంస్థ సైబర్ సెక్యూరిటీపై నిర్వహించే క్లాసులకు రెగ్యులర్గా హాజరయ్యేది తేజస్వి. ఎయిర్ ఫోర్స్, స్పేస్ఫోర్స్ ప్రోగ్రామ్ ‘సైబర్–పేట్రియాట్’లో చురుగ్గా పాల్గొనేది. ‘కోడింగ్ అనేది ఎంతో అద్భుత ప్రక్రియ. కోడింగ్ ను చాలా ఎంజాయ్ చేస్తాను. కోడింగ్ను నేర్చుకోవడం వల్ల దానిశక్తి ఏమిటో తెలుసుకోగలిగాను. భవిష్యత్లో కూడా కోడింగ్తో నా ప్రయాణం కొనసాగుతుంది’ అంటుంది తేజస్వి.ఎంతోమంది తాతయ్యల కోసం...గత సంవత్సరం తేజస్వి తాత ఆన్లైన్ మోసానికి గురయ్యాడు. మోసగాళ్లు ఆయన నుంచి డబ్బు డిమాండ్ చేశారు. అయితే కుటుంబసభ్యులకు ఈ ఆన్లైన్ మోసం గురించి తెలియడంతో వారి ఆటలు సాగలేదు. తాతయ్యకు ఆన్లైన్ మోసాల గురించి అవగాహన లేకపోవడం తేజస్విని ఆశ్చర్యపరిచింది. అయితే తన తాత మాత్రమే కాదు ఎంతోమంది వ్యక్తులకు ఆన్లైన్ మోసాల గురించి బొత్తిగా అవగాహన లేదనే విషయం తెలుసుకుంది. అలా అని తేజస్వి బాధపడుతూ కూర్చోలేదు.‘నా వంతుగా ఏదైనా చేయాలి’ అని పరిశోధన బాట పట్టింది. సీనియర్ సిటిజన్లకు ఆన్లైన్ మోసాల గురించి హెచ్చరించడానికి ‘షీల్డ్ సీనియర్స్’ పేరుతో వెబ్సైట్ రూపొందించింది. సైబర్సెక్యూరిటీకి సంబంధించిన ప్రాథమిక సూత్రాలను ‘షీల్డ్ సీనియర్స్’ తెలియజేస్తుంది.స్వతంత్రంగా... సగర్వంగా...‘సీనియర్ సిటిజనులు ఎలాంటి సంకోచం లేకుండా స్వతంత్రంగా, సగర్వంగా ఆన్లైన్ ప్రపంచంలో తమ పనులు తాము చేసుకునేలా షీల్డ్ సీనియర్స్’కు రూపకల్పన చేశాం’ అంటుంది తేజస్వి.ఆన్లైన్ మోసాలపై అవగాహన కలిగించడానికి తేజస్వి నిర్వహించే సమావేశాలకు ఎంతోమంది వృద్ధులు హాజరవుతుంటారు. ఆమె ప్రసంగిస్తుంటే నోట్స్ రాసుకుంటారు. ప్రసంగం పూర్తయిన తరువాత తేజస్విని రకరకాల సందేహాలు అడుగుతుంటారు. వాటికి ఓపికగా జవాబులు ఇస్తుంటుంది తేజస్వి.‘మాది టెక్ ఫ్యామిలీ’ అని ఘనంగా చెబుతుంటాడు తేజస్వి తండ్రి మనోజ్. ఆ ఘనతకు సామాజిక ప్రయోజానాన్ని జోడించి ‘డిజిటల్ డిఫెండర్’గా పేరు తెచ్చుకుంది తేజస్వి. ∙ఆహా... ఆల్రౌండర్!కోడింగ్లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న తేజస్వి మనోజ్ వయోలిన్ అద్భుతంగా వాయిస్తుంది. తన ఆర్కెస్ట్రాతో హైస్కూల్లో ఎన్నో కచేరీలు చేసింది. కరాటేలో కూడా ప్రవేశం ఉంది. స్కౌటింగ్–అమెరికాలో యాక్టివ్గా ఉంది. తాజాగా ఈగిల్ స్కౌట్ ర్యాంక్ అందుకుంది. ‘వైభ’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా భూటాన్ కాందిశీకుల పిల్లలకు మ్యాథ్స్, ఇంగ్లీష్ బోధిస్తోంది. సామాజిక సేవాకార్యక్రమాలలో ఎప్పుడూ ముందుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ తనకు ఇష్టమైన సబ్జెక్ట్లు. భవిష్యత్లో కంప్యూటర్ సైన్స్ చదవాలనుకుంటుంది. ‘ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలనే ఉత్సాహవంతుల దగ్గరికి విజయాలు ఉత్సాహంగా నడిచొస్తాయి’ అని చెప్పడానికి బలమైన ఉదాహరణ తేజస్వి మనోజ్.ఉక్కుకవచం... షీల్డ్ సీనియర్స్‘షీల్డ్ సీనియర్స్’లో ఆన్లైన్ మోసాలకు సంబంధించిన సందేహాలకు చాట్బాట్ ద్వారా సమాధానాలు తెలుసుకోవచ్చు. అనుమానాస్పద టెక్ట్స్, మెజేస్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా విశ్లేషించుకోవచ్చు. ‘షీల్డ్ సీనియర్స్’లో నాలుగు విభాగాలు ఉంటాయి. ‘లెర్న్’ విభాగంలో ఇంటర్నెట్ సెక్యూరిటీకి సంబంధించి ప్రాథమిక విషయాలు తెలుసుకోవచ్చు. స్ట్రాంగ్ పాస్వర్డ్స్ రూపొందించుకోవడానికి, ప్రైవసీ సెట్టింగ్స్ను అర్థం చేసుకోవడానికి, ఎలాంటి సమాచారం షేర్ చేయవచ్చు, ఏది చేయకూడదు...మొదలైనవి తెలుసుకోవచ్చు. ‘ఆస్క్’ విభాగంలో చాట్బాట్ ద్వారా సందేహ నివృత్తి చేసుకోవచ్చు. ‘ఎనలైజ్’ అనేది మూడో విభాగం. యూజర్లు ఈ ట్యాబ్ క్లిక్ చేసి అనుమానాస్పద టెక్ట్స్, ఈ మెయిల్స్ను అప్లోడ్ చేయవచ్చు. ‘రిపోర్ట్’ సెక్షన్లో ఆన్లైన్ మోసగాళ్లపై ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులపై స్పందించే 14 ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలకు చెందిన లింక్స్ ఇందులో ఉంటాయి. -
సరదా కారాదు విషాదం.. మనకిదొక హెచ్చరిక!
సాక్షి, హైదరాబాద్: ‘‘బెంగళూరులో ఓ బాలుడు కుటుంబంతో కలిసి కారులో ప్రయాణిస్తున్నాడు. సన్రూఫ్లోంచి తల బయటికి పెట్టి వెళ్తుండగా.. డ్రైవర్ రోడ్డుపై ఉన్న ఓవర్ హెడ్ బారికేడ్ను గమనించకుండా అలాగే వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. అంతే అకస్మాత్తుగా బారికేడ్ బాలుడికి తగిలి తల పగిలిపోయింది.’’ అయితే ఈ ఘటన పొరుగు రాష్ట్రంలో జరిగినప్పటికీ.. మనకిదొక హెచ్చరిక! ఈ రోజుల్లో ప్రతి మోడ్రన్ కారుకు సన్రూఫ్ (Sunroof) తప్పనిసరి అయిపోయింది. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ సన్రూఫ్ అనుభూతిని పొందాలని భావిస్తున్నారు. అయితే ఆనందం మాటున ప్రమాదం కూడా పొంచి ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చాలామంది యువతీ యువకులు సన్రూఫ్లోంచి బయటికి చూస్తూ వికృత చేష్టలకు పాల్పడుతుంటారు. సెల్ఫీలు దిగుతూ, రీల్స్ చేస్తూ వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటారు. పిల్లలను తిప్పడం, తిరగడం పేరెంట్స్కు ఓ సరదా, స్టేటస్ సింబల్. అయితే ఈ సరదా విషాదం కాకూడదని రాచకొండ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.సరదా కారాదు విషాదం..ఇరుకు, బిజీ రోడ్లలో ఎత్తయిన వాహనాలు వెళ్లకుండా పోలీసులు ఓవర్ హెడ్ బారికేడ్లను ఏర్పాటు చేస్తుంటారు. ఇలాంటి రోడ్లలో సన్రూఫ్ నుంచి వేలాడుతూ ప్రయాణించకూడదు. విద్యుత్ వైర్లు, టీవీ, ఇంటర్నెట్ కేబుళ్లు, పతంగుల దారాలు, మాంజా, ఇతరత్రా సన్నని తీగలు రోడ్లపై వేలాడుతుంటాయి. ఇది సాధారణంగా డ్రైవర్లకు కనిపించవు. దీంతో సన్రూఫ్లో ప్రయాణించే వారికి ఇవి తగిలి మెడ, తల, మొండెం భాగాలకు తీవ్ర గాయాలయ్యే ప్రమాదం ఉంది. అలాగే నడుం భాగం వరకూ బయట పెట్టి చేతులను ఊపుతూ ప్రయాణిస్తున్న క్రమంలో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే సన్రూఫ్లో ఉన్నవారికి పట్టు ఉండదు. దీంతో సన్రూఫ్ ఫ్రేమ్ తగిలి పక్కటెముకలు, ఊపిరితిత్తులకు గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. పొత్తి కడుపులో బలంగా తగిలితే తీవ్ర రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. వంకలు, మూల వంపులు అధికంగా ఉన్న రోడ్లలో అయితే ఏకంగా కార్లో నుంచి కిందపడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.సహజ కాంతి కోసమే..సన్రూఫ్ అనేది కేవలం వెంటిలేషన్ కోసమే ఉద్దేశించబడింది. కారు క్యాబిన్ స్పేస్ విశాలంగా అనిపించడంతో అత్యవసర పరిస్థితుల్లో కారు డోర్లు లాక్ అయిపోతే సన్రూఫ్ నుంచి బయటికి వెళ్లిపోవచ్చు. అంతేకాకుండా వేసవి కాలంలో ఎండలో కార్ పార్కింగ్ చేసినప్పుడు క్యాబిన్ చాలా వేడెక్కిపోతుంది. ఇలాంటి సమయంలో ఏసీ ఆన్ చేసి, సన్రూఫ్ను తెరిస్తే కారులోని వేడి గాలి బయటికి వెళ్లి, కార్ క్యాబిన్ త్వరగా చల్లబడుతుంది. ఇరుకైన రహదారులు, బిజీ రోడ్లలో సన్రూఫ్లను వినియోగించకూడదు. వీటిని హైవేలు, వెడల్పాటి రోడ్లపై మాత్రమే వినియోగించాలి.జైలు, జరిమానా..ర్యాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ ఉల్లంఘనల తరహాలోనే బిజీ రోడ్లపై సన్రూఫ్ వినియోగాన్ని కూడా తీవ్రమైన నేరంగా పరిగణించాలని ట్రాఫిక్ నిపుణులు సూచిస్తున్నారు. సన్రూఫ్లతో వ్యక్తిగతంగా ప్రాణాంతకమే కాకుండా రోడ్లపై ఇతర వాహనదారులకు అంతరాయం కలిగిస్తుంది. సన్రూఫ్, కారు కిటికీల నుంచి తలను బయటికి వేలాడుతూ ప్రయాణం చేస్తే భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్–281 కింద కేసులు నమోదు చేస్తారు. ఈ కేసులలో ఆరు నెలల వరకు జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా లేదా రెండూ విధించవచ్చు. అలాగే ఇతర వాహనాల నుంచి వెళువడే పొగ, దుమ్ము ధూళి నేరుగా ముక్కులోకి వెళ్లి రోగాలకు కారణమవుతాయి.చదవండి: జేఈఈ అడ్వాన్స్డ్ లేకుండానే.. ఐఐటీలో అడ్మిషన్!ఆలోచింపజేసిన రాచకొండ పోస్టుసన్రూఫ్ ప్రయాణం చాలా ప్రమాదం అంటూ రాచకొండ పోలీసులు అవగాహన కోసం సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు అందరినీ ఆలో చింపజేస్తోంది. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే ఆనందం కోసం ఇలా ప్రమాదకరంగా స్టంట్లు చేయొద్దంటూ బెంగళూరులో జరిగిన సన్రూఫ్ ప్రమాద ఘటన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లతో ఈ వీడియో హల్చల్ చేస్తుంది. -
కురులు... వివరాల విరులు..
అరచేతులు, అరికాళ్లు, పెదవులు, మ్యూకస్ పొరలు తప్ప శరీరంలోని మిగిలిన అన్ని భాగాల్లోనూ వెంట్రుకలు పెరుగుతాయి. ఎముకల్లోని మూలగ తర్వాత అత్యంత వేగంగా పెరిగే కణజాలం జుట్టు మాత్రమే. మనిషి తలపై సగటున లక్ష వరకు వెంట్రుకలు ఉంటాయి. తలవెంట్రుకల్లో 90 శాతం పెరుగుతూ ఉంటే, 10 శాతం విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. తలపై లక్ష వరకు ఉండే వెంట్రుకల్లో రోజూ వంద వరకు వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. పురుషుల్లో సగం మందికి యాభయ్యేళ్ల లోపు వయసులోనే బట్టతల వస్తుంది. థైరాయిడ్ సమస్యల వల్ల, ఐరన్ లోపంవల్ల తాత్కాలికంగా తలపై వెంట్రుకలు పలచబడతాయి. అలాగే, కొన్ని రకాల ఔషధాల ప్రభావం వల్ల కూడా తలవెంట్రుకలు గణనీయంగా రాలిపోతాయి.వెంట్రుకల ఆయుర్దాయం మూడు నుంచి ఏడేళ్లు. పోషకాలతో నిండిన ఆహారం తీసుకుంటే వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి. గుడ్లు, చేపలు, లివర్, కిడ్నీలు, ఆకు కూరలు, ఆకుపచ్చని కూరగాయలు వంటివి జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు దోహదపడతాయి.జుట్టులోని పిగ్మెంట్స్ కారణంగానే జుట్టుకు రంగు ఏర్పడుతుంది. వయసు మళ్లే దశలో పిగ్మెంట్స్ తగ్గడం కారణంగా జుట్టు నెరుస్తుంది. వెంట్రుకలు గరిష్టంగా 90 సెం.మీ. వరకు పెరుగుతాయి. ఏడాది వ్యవధిలో వెంట్రుకల పెరుగుదల 12 సెం.మీ. వరకు ఉంటుంది. (చదవండి: ఆ ఒక్క క్షణం..! క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు) -
ఎవరీ టీనేజర్ తేజస్వి మనోజ్? వృద్ధుల రక్షణ కోసం..
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎంతలా ఉన్నాయో తెలిసిందే. ముఖ్యంగా ఒంటిరిగా ఉండే వృద్ధులను లక్ష్యంగా చేసుకుని వాళ్ల డబ్బుని కాజేస్తున్న సైబర్ నేరగాళ్లు ఆగడాలు అంత ఇంత కాదు. పైగా వయసు మళ్లడంతో వస్తున్న కాల్స్, మెసేజ్లు ఒక స్కామ్ అని గ్రహించలేనితనం, టెక్నాలజీ లేమి తదితరాలను ఆసరా చేసుకుని ఈ నేరాగాళ్లు మరింతగా రెచ్చిపోతున్నారు. ఇలాంటి ఆగడాలకు చెక్పెట్టేలా పరిష్కార దిశగా అడుగులు వేస్తోంది ఈ టీనేజర్. తన తాతమామల్లాంటి ఎందరో వృద్ధులకు భరోసానిచ్చే వెబ్సైట్ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అంతేగాదు వాళ్లు కూడా సులభంగా టెక్నాలజీపై పట్టు సాధించేలా ఈ 16 ఏళ్ల అమ్మాయి చేస్తున్న కృషికి మేధావులు సైతం ఆశ్చర్యపోవడమే కాదు, అవార్డులతో ప్రశంసించారు కూడా. ఎవరా ఆ టీనేజర్ అంటే..ఆ అమ్మాయే 16 ఏళ్ళ తేజస్వి మనోజ్. టెక్సాస్ ఫ్రిస్కోలో హైస్కూల్ జూనియర్గా ఉండగా ఆమె ఎదుర్కొన్న సంఘటనే ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది. తన తాతగారిలాంటి వృద్ధులు సైబర్ నేరాగాళ్ల వలలో ఎలా చిక్కుకుంటున్నారో అనుభవపూర్వకంగా తెలుసుకుని, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ రోజు తన 85 ఏళ్ల తాతాగారి మాదిరిగా ఓ వ్యక్తి ఫోన్ చేసి తన వద్ద డబ్బులు అయిపోయాయని, ఒక లక్ష రూపాయాలు పంపించాల్సిందిగా మెయిల్ ఐడీ, ఫోన్ కాల్స్ రెండూ వచ్చాయి. దాంతో ఆమె డబ్బు పంపేందుకు రెడీ అవుతుండగా, ఎందుకైనా మంచిది ఒకసారి డబుల్ చెక్చేసి పంపు అని తండ్రి సూచన మేరకు చెక్చేయడంతో..అదిస్కామ్ అని తేలింది. దాంతో తేజస్వి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నాన్న అలా సూచించి ఉండకపోతే..అంతేగా పరిస్థితి అంటూ ఊపిరి పీల్చుకుంది. వృద్ధుల సంరక్షణ కోసం..ఇక ఆ తర్వాత అలాంటి సైబర్ క్రైం నేరాల గురించి ఆరా తీసింది తేజస్వి. ఒక్క 2024 ఏడాదిలోనే ఆన్లైన్ స్కామ్లకు సంబంధించిన సుమారు రూ. 8 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయని తెలిసి కంగుతింది. అంతేగాదు వాటిల్లో వృద్ధులే ఎక్కువ మొత్తం డబ్బు నష్టపోతున్నట్లు గుర్తించింది. దాంతో తేజస్వి తన తాతా లాంటి వాళ్లు ఇలాంటి సైబర్ క్రైంలో చిక్కుకోకుండా ఏదైనా చేయాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యింది. ఆ నేపథ్యంలోంచి వచ్చిందే "షీల్డ్ సీనియర్స్" అనే వెబ్సైట్. సైబర్ నేరాలకు వ్యతిరేకంగా పోరాడటం కోసం వృద్ధుల సేఫ్టీనే ప్రధాన లక్ష్యంగా చేసుకుని నెలల తరబడి కోడింగ్ రాసి దీన్ని డిజైన్ చేసింది. ఈ వెబసైట్ సాయంతో పెద్దలు ఎలాంటి మోసాల్లో చిక్కుకుండా, సులభంగా వినియోగించే సాంకేతికతను అభివృద్ధి చేసింది. సీనియర్ సిటీజన్లు సులభంగా పాస్వర్డ్లు, సెట్టింగులు, స్కామ్ వ్యూహాలు గుర్తించేలా మార్గదర్శకాలను కూడా రూపొందించింది. అలాగే తరుచుగా సాంకేతిక పరిభాష సమస్య రాకుండా తక్కవ వాక్యాల సమాధానాల చాట్బాట్ని కూడా డిజైన్ చేసింది. ఈ వెబ్సైట్లోని ఏఐ ఆధారిత సాధనం అనుమానాస్పద సందేశాలు, ఇమెయిల్లను 95% కచ్చితత్వంతో స్కాన్ చేస్తుంది. అంతేగాదు సీనియర్ సిటీజన్లు కూడా ధైర్యంగా ఆన్లైన్ ప్రపంచాన్ని నావిగేట్ చేసేలా తయారుచేసింది. ప్రస్తుతం ఆమె దాన్ని వాణిజ్య ఏఐ ఫ్లాట్ఫాంగా మార్చేలా నిధులను సేకరిస్తున్నందున ఈ "షీల్డ్ సీనియర్స్ వెబ్సైట్" ప్రివ్యూ మోడ్లో ఉంది. అయితే ఇది అమెరికా అసోసీయేషన్ ఆఫ్ రిటైర్డ్ పర్సన్స్ దృష్టిని ఆకర్షించడమే కాదు, వాళ్లు నేరుగా ఆమెని సంప్రదించి తమ ఫీడ్బ్యాక్ని ఇచ్చి లింక్డ్ఇన్లో షేర్ చేశారు కూడా. దాంతో తేజస్వి సేవనిరతి ప్రయత్నాలకుగానూ టైమ్ కిడ్ ఆఫ్ ది ఇయర్ 2025 గౌరవం లభించడమే కాదు ఇలా టైమ్ ఫర్ కిడ్స్ సర్వీస్ స్టార్గా పేరొందిన తొలి గ్రహితగా ఘనతను కూడా దక్కించుకుందామె. అంతేగాదు సీనియర్ సిటీజన్లకు ఈ టీనేజర్ సైబర్ సెక్యూరిటీ పాఠాలను కూడా బోధిస్తూ..తన సేవనిరతిని చాటుకుంటోంది కూడా. జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉండే ఈ టీనేజ్ వయసులో పెద్దల పట్ల ఇంతలా బాధ్యతతో వ్యవహరిస్తూ..సాంకేతిక సాయం అందిస్తున్న ఆ అమ్మాయి యువతరానికి గొప్ప స్ఫూర్తి కదూ..!.(చదవండి: ఇది ఫ్యామిలీ ఫ్లైట్..!) -
శిల్పారామం వేదికగా ఛాప్..!
చేనేత, హస్తకళలు.. వీటి కొనసాగింపులో ఆధునిక ఫ్యాషన్, టెక్నాలజీ వంటి అంశాలతో దేశంలోనే అతిపెద్ద కార్యక్రమ నిర్వహణకు కేంద్ర టెక్స్టైల్ మినిస్ట్రీ, నేషనల్ ఇన్ష్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్), తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ శాఖ భాగస్వామ్యంతో ‘ఛాప్’ నిర్వహించనున్నారు. నగరంలోని శిల్పారామం వేదికగా ఈ నెల 12 నుంచి 17 వరకూ జరుగుతోంది. దీనికి సంబంధించిన వివరాలను ప్రతినిధులు నిఫ్ట్ వేదికగా మంగళవారం వెల్లడించారు. ఛాప్ 2025లో భాగంగా భారతదేశపు చేనేత, హస్తకళల వారసత్వాన్ని ప్రదర్శించడంతో పాటు సమకాలీన డిజైన్ల ఆవిష్కరణ, వ్యవస్థాపకత ప్రాధాన్యతను తెలియజేసేలా భిన్న కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. శిల్పారామం వేదికగా నిర్వహించే స్టాల్స్లో హస్తకళాకారులు, నిఫ్ట్ పూర్వ విద్యార్థులు, వ్యవస్థాపకులు, డిజైనర్లు, పరిశ్రమల ప్రముఖులు భాగస్వామ్యం కానున్నారు. రాష్ట్రంలోని టూరిజం డెస్టినేషన్ ప్రాధాన్యతను ప్రదర్శించి, సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని క్లస్టర్ హెడ్ ప్రొఫెసర్ డాక్టర్ పూర్వ ఖురానా పేర్కొన్నారు. ఫ్యాషన్ షోలు, మాస్టర్ క్లాసులు.. దేశవ్యాప్తంగా 19 నిఫ్ట్ క్యాంపస్లు ఉన్నాయని, హైదరాబాద్ క్యాంపస్ భాగస్వామ్యంతో ఈ ప్రదర్శనలో 60 క్రాఫ్టŠస్, 40 అలుమ్ని బృందాలు పాల్గొంటాయి. ఆరు రోజుల కార్యక్రమంలో దేశవ్యాప్తంగా చేనేత, హస్త కళాకారుల ప్రదర్శనలతో పాటు ఫ్యాషన్ షోలు, మాస్టర్ క్లాసులు, 6 ప్రధాన క్రాఫ్ట్ ప్రదర్శనలు చేపట్టామని, విద్యార్థుల పరిశోధనాత్మక డాక్యుమెంటేషన్స్ కూడా ప్రదర్శిస్తాం. తెలంగాణలోని తోలుబొమ్మలాట లాంటి అరుదైన కళల ప్రాధాన్యత తెలియజేసి, పలు అరుదైన కళలకు పేటెంట్స్, జీయో ట్యాగ్ ప్రాధాన్యత వంటి అంశాలపై అవగాహన కలి్పంచనున్నాం. – డా.మాలిని, నిఫ్ట్ డైరెక్టర్ (చదవండి: సౌకర్యం + సంతోషం = కవాయి) -
చీకట్లో.. చిరుదీపం..
వివిధ సామాజిక మాధ్యమాలు, ప్రసార సాధనాల ద్వారా రోష్నీ అనేకమంది బాధితులకు చేరువయ్యింది. 1997లో నలుగురితో ప్రారంభమైన సంస్థ ప్రస్తుతం 70 మంది సుశిక్షితులైన వాలంటీర్లతో నిత్యం కౌన్సెలింగ్ ఇస్తూ అనేక మందికి అందగా నిలుస్తోంది. వీధినాటకాలు, కరపత్రాలు, ప్లకార్డుల ప్రదర్శనలతో 28 ఏళ్లుగా వేలాది మందికి అండగా.. ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిన వారి కోసం సైకాలజిస్టులు, సైక్రియాట్రిస్టులతో మానసిక చికిత్స, ఉచితంగా మందులు అందిస్తోంది. ప్రతి శుక్రవారం రామకృష్ణ మఠంలో సెషన్స్ నిర్వహిస్తోంది. 040–6620 2000, 040–6620 2001 రోష్నీ కౌన్సెలింగ్ సెంటర్ టోల్ఫ్రీ.పురుషులే ఎక్కువ.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2023 ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నవారిలో పురుషులే అధికంగా ఉన్నారు. ప్రతి 40 సెకన్లకు ఒకరు చొప్పున ఏటా 8 లక్షల మంది, ఒక్క భారత్లోనే మూడు నిమిషాలకు ఒకరు చొప్పున యేడాదికి 1.71 లక్షల మంది, రోజుకు 512 మంది ఆత్మహత్యలు చేసికుంటున్నారు. ఏపీ, తెలంగాణలో ప్రతి రోజు 6 నుంచి 8 ఆత్మహత్యలు రికార్డవుతున్నాయి. గుర్తించాలి.. ఆలోచన తుంచాలి.. ఎవరితో కలవకుండా దూరంగా ఉండటం, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, బతకాలని లేదని అంటుండటం వంటి లక్షణాలను గుర్తించాలి. వారితో మనసువిప్పి మాట్లాడి.. కారణాలు గుర్తించాలి. అవసరమైతే మానసిక నిపుణులను సంప్రదించాలి. – ఆనంద దివాకర్ (సీనియర్ కౌన్సెలర్) చావు పరిష్కారం కాదు.. చిన్న సమస్యలకు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసికుని విలువైన జీవితాన్ని కోల్పోతున్నారు. చావు శాశ్వత పరిష్కారం కాదు. మనలో బాధను ఇతరులతో పంచుకుంటే పరిష్కారం దొరుకుతుంది. కుటుంబంలో ఒకరు ఆత్మహత్య చేసుకుంటే ఆ ప్రభావం కుటుంబం మొత్తం మీద ఉంటుందని గుర్తించాలి. – విద్యారెడ్డి (కౌన్సెలర్) (చదవండి: ఆ ఒక్క క్షణం..! క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు) -
ఆ ఒక్క క్షణం..!
ఒకప్పుడు ఒకలా ఉండదు.. ఎక్కడ ఆగిపోనివ్వదు.. యెదరేముందో చెప్పదు కదిలే సమయం.. నీడలా జ్ఞాపకం వదలదు.. తోడుగా ఏ నిజం నడవదు.. ఒంటిగా సాగటం తప్పదు జరిగే పయనం.. నీతోనె మొదలైందా.. నీతోనె ముగిసిందా.. ఇదే కదా కోరిందని.. వేరే ఇంకేం కావాలని.. అన్నామంటే ఈనాటికి రేపంటూ ఉంటుందా.. ఇవ్వాళ ఎంతో బాగుందని అయినా ఏదో లోటుందని.. ఇంకా ఏదో కావాలని అనుకోని రోజుందా.. కలకే మన ఈ గమనం.. అని ‘ఊపిరి’ చిత్రంలో సీతారామశాస్త్రి చెప్పినట్లు.. ఆ ఒక్క క్షణం దాటితే అందమైన లోకం మనకళ్లముందుంటుంది. రోజులోనే కొంత సమయం చీకటి.. కొంత సమయం వెలుతురు ఉంటుంది.. అంతమాత్రానికే భయపడిపోతామా..? అక్కడే ఆగిపోతామా? అలాంటిది జీవితంలోనూ చీకటి వెలుగులు సహజమే.. అలాంటి అందకారాన్ని అధిగమిస్తేనే కదా వెలుతురు లాంటి భవిష్యత్తును చూడగలం.. జీవితంలో ఓడిపోయామనో.. బ్రేకప్ అయ్యిందనో.. లేదా కుటుంబంలో ఏదో సమస్య తలెత్తిందనో.. తొందరపాటు నిర్ణయం తీసుకుంటే ఎలా? అంటున్నారు పలువురు కౌన్సెలర్లు.. వయసుతో పనిలేకుండా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారికి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు నగరంలోనూ, దేశంలోనూ పలు ఎన్జీఓలు కృషిచేస్తున్నాయి.. ఆత్మహత్యల నివారణకు తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి.. సెప్టెంబర్ 10 ప్రపంచ ఆత్మహత్యల నివారణా దినం సందర్భంగా ఈ కథనం.. ‘22 ఏళ్ల మహిళ.. రైల్వే పట్టాలపై ఆత్మహత్యకు సిద్ధమైంది. ఫోన్లో స్నేహితురాలు వద్దని వారించి.. రోషీ్నకి ఫోన్ చేయమని బతిమాలింది. దీంతో ఫోన్ చేయగా ‘అమ్మా నీ ప్రాణం నీ ఇష్టం.. కానీ నీ ఆత్మహత్యను రెండు నిమిషాలు వాయిదా వేసుకో.. నా మాటలు విన్న తర్వాత నీ ఇష్టం..’ అంటూ కన్విన్స్ చేసింది. లివింగ్ రిలేషన్షిప్లో బాబు పుట్టిన తర్వాత ఆ వ్యక్తి వదలి పెట్టాడని.. ప్రస్తుతం ఆనారోగ్య సమస్యలు వచ్చాయని.. ఎంతో ఇష్టమైన తన ఐదు నెలల బాబుని ఇంట్లో అమ్మ దగ్గర వదిలేశానని చెప్పింది. ఆ తర్వాత కౌన్సెలర్ మాటలతో ఆత్మహత్య ఆలోచన విరమించుకుంది.’ ‘చున్నీతో ఉరేసుకుంటున్నా.. మీరెలా కాపాడతారో కాపాడండి.. అంటూ 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థి రోషీ్నకి కాల్ చేసి చాలెంజ్ విసిరాడు. గర్ల్ఫ్రెండ్ ఇంకొకరితో తిరుగుతోదని, తనను పట్టించుకోవడం లేదని మనసులో బాధను బయటపెట్టాడు.’ కనీ పెంచిన తల్లిదండ్రులు ముఖ్యమో.. రెండేళ్ల క్రితం పరిచయమైన అమ్మాయి ముఖ్యమో.. ఆలోచించుకో? ప్రేమించడానికి ఇంకొకరు దొరకొచ్చు.. నీ ప్రాణం పోతే మళ్లీ వస్తుందా?.. అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేయడంతో పునరాలోచనలో పడ్డాడు..ఇలా.. ఆర్థిక ఇబ్బందులతో ఒకరు.. కుటుంబ కలహాలతో మరొకరు చెప్పుకుంటూ.. కొన్ని వేల మందికి అండగా నిలిచింది రోషీన్.. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని విద్యార్థులు, ఉద్యోగం రాలేదని నిరుద్యోగులు, వివాహం కాలేదని యువత, పని ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామని ఉద్యోగులు, రిలేషన్షిప్లో అనుమానాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు.. ఇలా చిన్నపాటి సమస్యలకు మనసు చిన్నబుచ్చుకుంటున్నారు. గోరంత సమస్యను కొండంతగా భావించి తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. చిన్నిపాటి కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బంగారు భవిష్యత్తును అర్ధాంతరంగా ముగించేస్తున్నారు. ప్రపంచంలో సమస్యలు మనకు మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రూపంలో ఉంటూనే ఉంటాయని భావించి ఆ ఒక్క క్షణం తొందరపడకుండా ఉంటే.. మన భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకోవచ్చు.. మనలోని బాధను కావాల్సిన వారితోనో.. ఇతరులతో పంచుకుంటే 90 శాతం పరిష్కారాలు లభిస్తాయని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఏదో ఒకదాంట్లో ఓటమి చెందామనో..పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో.. తల్లిదండ్రులు మందలించారనో కుమిలిపోకుండా.. వాటిని అధిగమించేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు.. ఎన్జీఓల కృషి..నగరానికి చెందని పలు ఎన్జీఓ సంస్థలు ఆత్మహత్యల నివారణకు కృషి చేస్తున్నాయి. ఇందులో ఏటా సుమారు 18 వేల నుంచి 23 వేల మంది కాల్ సెంటర్ ద్వారా సమస్యలు చెప్పుకుంటున్నారని కొన్ని అధ్యయనాల నివేదికల చెబుతున్నాయి. ఆ నివేదిక ప్రకారం..ఆ మూడు నెలలే కీలకం.. విద్యార్థుల ఆత్మహత్యల్లో ఆ మూడు నెలలే కీలకంగా మారుతున్నాయి. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇతర అకడమిక్ కోర్సుల్లో పాస్ కాలేదని కొందరు, తక్కువ మార్కులు వచ్చాయని మరికొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చదువుల విషయంలోనూ కొందరు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. లక్షలు పోసి చదివిస్తున్నామని తల్లిదండ్రులు కూడా పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నారని, ఇది వారి సున్నిత మనసును మరింత కుంగదీస్తున్నాయి. తల్లిదండ్రుల ఆలోచనా విధానంలోనూ మార్పు రావాలి. పిల్లలతో స్నేహపూర్వక వాతావరణం ఉండాలి. – డాక్టర్ బీ.సూర్యారావు, సైకాలజిస్టుఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న వారిలో కుటుంబ తగాదాలు, రిలేషన్షిప్, బ్రేకప్ వంటివి 30 శాతం ఉన్నాయి.ఒంటరితనం, కుంగుబాటు, ఇతర మానసిక సమస్యలతో మరో 10 శాతం. వివాహం కాలేదని, ఇతర సామాజిక సమస్యలతో 12 శాతం. ఇలా పలు కారణాలతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిరుద్యోగం, అప్పులు, ఆర్థిక పరమైన సమస్యలతో 25 శాతం మంది. విద్య, వృత్తిపరమైన ఒత్తిడిని తట్టుకోలేక మరో 22 శాతం.ఆవేశంలో నిర్ణయాలు వద్దు..ఆత్మహత్యల నివారణకు 22 రాష్ట్రాల్లో తెలుగు, ఇంగ్లీష్, హిందీతో సహా 16 ప్రాంతీయ భాషాల్లో హెల్ప్ లైన్ సెంటర్లు నిర్వహిస్తున్నాం. ఎక్కువ మంది మహిళలు ప్రేమ, వివాహం, కుటుంబ ఇబ్బందులని చెబుతున్నారు. మగవారిలో ఆర్థిక సమస్యలు, విద్య, ఉద్యోగం, పని ఒత్తిడితో.. పూర్తిగా నెగిటివ్ ఆలోచనల్లోకి వెళ్లిపోతున్నారు. ఒక్కోసారి ఎవరికీ చెప్పుకోలేక ఒంటరితనాన్ని ఫీలవుతున్నారు. ఇటువంటి వారికి వారం లేదా 15 రోజులకు ఒక సెషన్ చొప్పున హైదరాబాద్లోనూ కౌన్సిలింగ్ ఇస్తున్నాం. 78930 78930 హెల్ప్లైన్ ద్వారా సాయం పొందవచ్చు. (చదవండి: నింద, ఒత్తిడి, మౌనం..ఇంత ప్రమాదకరమైనవా? అంత దారుణానికి ఒడిగట్టేలా చేస్తాయా..?) -
సౌకర్యం + సంతోషం = కవాయి
‘కవాయి’ అనేది ఇప్పుడు సరికొత్త ఇంటీరియర్స్ ట్రెండ్గా మారింది. మృదువైన రంగులు, కంటికి సంతోషాన్ని ఇచ్చే వస్తువులతో జపసనీస్ ఇంటీరియర్ డిజైన్ కవాయి విజువల్ థెరపీలా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు. ‘నా గది నా కంఫర్ట్ప్లేస్’ అనుకునేవాళ్లకు తమ గదిని మానసిక ప్రశాంతత ఇచ్చేలా తీర్చిదిద్దుకోవడానికి కవాయి డిజైన్ ఉపయోగపడుతుంది. ‘ఎంతోమంది, ముఖ్యంగా మహిళలు కవాయి ఇంటీరియర్స్ గదులను బాగా ఇష్టపడుతున్నారు. కవాయి డిజైనింగ్ వ్యక్తులపై సానుకూల ప్రభావం కలిగిస్తుంది’ అంటుంది బెంగళూరు చెందిన ఆర్కిటెక్ట్ సిరి శేఖర్. ‘కవాయి’ అనే జపనీస్ పదానికి అందమైన, ఆకర్షణీయమైన అని అర్థం. క్లౌడ్–షేప్డ్ ల్యాంప్స్, ఫ్లోరల్ ల్యాంప్స్, మష్రూమ్ మోటిఫ్స్, వాల్ స్టికర్స్, క్యూట్ బౌల్స్, మినియేచర్లు... మొదలైనవి కవాయిలో భాగం.ఫ్యాషన్, కళ, సంగీతం, జీవనశైలి (లైఫ్స్టైల్), ఇంటీయర్స్లో కవాయి ప్రభావం కనిపిస్తోంది. మన దేశంలో కవాయి ఇంటీరియర్స్కు సంబంధించి డిజైనర్ల సంఖ్య పెరిగింది. ‘గది అలంకరణ అనేది కేవలం ఆకర్షణ కోసం మాత్రమే కాదు. ఆ అలంకరణ మనల్ని ఎప్పుడూ ఉల్లాసంగా ఉంచుతుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. కవాయి ఇంటీరియర్స్తో నా గదిని తీర్చిదిద్దుకున్నాను. గదిలోకి అడుగు పెడితే ఉత్సాహంగా ఉంటుంది’ అంటుంది గోవాకు చెందిన కంటెంట్ క్రియేటర్ రిచా దేశాయ్. (చదవండి: ఇది ఫ్యామిలీ ఫ్లైట్..!) -
ఇది ఫ్యామిలీ ఫ్లైట్..!
‘మా అమ్మాయి పైలట్’ ‘నా మనవరాలు పైలట్’ అని చెప్పుకోవడంలో సంతోషం ఉంది. అంతకంటే ఎక్కువ సంతోషం ఆమె నడుపుతున్న విమానంలో ప్రయాణించడంలో ఉంది. ఇండిగో పైలట్ తనిష్క ముగ్దల్ తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మలకు విమానం ఎక్కడం అదే మొదటి సారి. అది తమ ఇంటి ఆడబిడ్డ నడిపే విమానం. యూనిఫామ్లో ఉన్న తనిష్క ఆనందబాష్పాలతో అమ్మా,నాన్నలు, తాత,అమ్మమ్మలకు ఇండిగో విమానంలో స్వాగతం పలుకుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో క్లిప్లో భారీ సంభాషణలు, గ్రాఫిక్స్ హంగామా లేకపోవచ్చు. భావోద్వేగాలే బలం అయ్యాయి.ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ...‘అమ్మానాన్నల ప్రోత్సాహం, చేసిన ప్రార్థనలు, చేసిన త్యాగాలు నేను పైలట్ కావడానికి తోడ్పడ్డాయి’ అని రాసింది తనిష్క. ‘ఆ తల్లిదండ్రుల కళ్లలో ఎంత సంతోషం కనిపిస్తుందో చూడండి’‘పిల్లలు మంచి స్థాయికి వెళ్లినప్పుడు, ఆ స్థాయిని కళ్లారా చూసినప్పుడు, వారికి అంతకు మించిన శక్తి ఏముంటుంది!’ ‘మనం ఎంత పెద్ద స్థాయికి వెళ్లినా తల్లిదండ్రులను ఎప్పుడూ గుండెలో పెట్టుకోవాలి’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. View this post on Instagram A post shared by Tanishka Mudgal ♥️ | aviation | travel | fashion (@pilottanishka) (చదవండి: విలేజ్ సైంటిస్ట్ బనిత) -
విలేజ్ సైంటిస్ట్ బనిత
‘అలా సరే, ఇలా అయితే ఎలా ఉంటుంది?’ అని ఆలోచించడమే ఆవిష్కరణ. వచ్చిన ఆలోచనను ఇష్టపడి, కష్టపడి నిజం చేసుకోవడమే ఆవిష్కరణ. ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం ఆమెకు తెలుసో లేదో తెలియదు. ఆమె సైన్స్ పుస్తకాలు చదివింది కూడా లేదు. అయితే కొత్త కొత్త ఆవిష్కరణలు అంటే ఆమె ఇష్టం. అదే సమయంలో మనం మరిచిపోయిన సంప్రదాయ వస్తువులు అంటే ఇష్టం. వాటిని ఈ తరానికి పరిచయం చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావడం అంటే ఇష్టం.పశ్చిమబెంగాల్లోని గ్రామీణ ప్రాంతానికి చెందిన బనితకు ఇన్స్టాగ్రామ్లో లక్షమందికి పైగాఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పుడూ ఏదో కొత్త ఆవిష్కరణ చేస్తూ ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంటుంది.ఇందులో ఎన్నో వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా...ఫ్యాన్ స్ట్రక్చర్, ప్లాస్టిక్ బాక్స్,నీళ్లు, ఐస్, వైర్లను ఉపయోగించి ‘మినీ ఏసీ’ తయారుచేసింది. ‘ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా? ఎలా తయారుచేయాలో తెలుసా?’ అంటూ డెమో కూడా ఇచ్చింది.‘విలేజ్లైఫ్ విత్ బనిత’ ట్యాగ్లైన్తో బనిత ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో పోస్ట్ చేసే వీడియోలు సంభ్రమాశ్చర్యాలకు గురి చేయడమే కాదు పట్టణ, గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. (చదవండి: చేతుల పరిశుభ్రత కోసం..!) -
ఉద్యోగం మాని మూడేళ్లయినా ఫైనల్ సెటిల్మెంట్ రాలేదు?
ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో ఏడాది పాటు పని చేశాను. మరొక మంచి ఉద్యోగం రావడంతో కంపెనీ మారాను. మొదటి కంపెనీ వారు రిలీవింగ్ లెటర్ ఇస్తూ నా పని విధానం బాగుంది అంటూ – భవిష్యత్తుకు అభినందనలు కూడా తెలియజేశారు. రెండవ కంపెనీ వారు బ్యాక్ గ్రౌండ్ పరిశీలనలో కూడా నామీద సానుకూలంగానే చె΄్పారు. 3,4 ఏళ్ల తర్వాత ఇప్పుడు మూడవ కంపెనీకి ఇటీవలే మారాను. నా బ్యాక్ గ్రౌండ్ పరిశీలనలో మొదట పని చేసిన కంపెనీ వారు నా మీద కొన్ని అభియోగాలు మోపారు. నేను వారి కంపెనీ గోప్యతను దెబ్బతీశాను అని, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కూడా ఇంకా చేయలేదు అని చెప్పగా ప్రస్తుతం పని చేస్తున్న కంపెనీ వారు నాకు నోటీసు జారీ చేశారు. మూడేళ్ల తర్వాత ఇదేమిటి అని మొదటి కంపెనీ వారిని ప్రశ్నించగా, నా బ్యాక్గ్రౌండ్ లో ఎటువంటి లోపం లేదు అంటూ మరలా ఒక రి΄ోర్ట్ ఇవ్వడంతో ప్రస్తుత కంపెనీ వారు నోటీసును ఉపసంహరించుకున్నారు. కానీ మొదటి కంపెనీ వారు ఇప్పటికీ కూడా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేయలేదు – అడిగితే వారి గోప్యతకు నేను భంగం కలిగించాను అని అభియోగం ఉన్నది కాబట్టి మేము చేయము అని అంటున్నారు. రెండేళ్ల క్రితం ఒక మెయిల్ రాసి వదిలేసాను కానీ ఇప్పుడు ఈ సమస్య వస్తుంది అని అనుకోలేదు. మరొక కంపెనీకి మారినప్పుడు కూడా ఇదే సమస్య రావచ్చు అని అనిపిస్తుంది. ఈ పరిస్థితులలో నేను ఏం చేయాలి?– జాన్ వెస్లీ, విశాఖపట్నం ఒక కంపెనీలో ఉద్యోగం చేసిన తర్వాత రిలీవింగ్ లెటర్ తీసుకుని వెళ్లి మరొక కంపెనీలో కూడా చేరిన తర్వాత, మూడు సంవత్సరాలపాటు నిశ్శబ్దంగా ఉండి, ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మీకు వ్యతిరేకంగా సమాచారాన్ని ఇవ్వడం చట్టరీత్యా తప్పు. రిలీవింగ్ లెటర్లో మీ కాండక్ట్ కూడా బాగుంది అని రాశారు కాబట్టి, ఒకసారి ఒక స్టేట్మెంట్ చేసిన తర్వాత ఆ స్టేట్మెంట్ను వ్యతిరేకిస్తూ మరొక స్టేట్మెంట్ చేయడం కుదరదు. మీ కేసులో అది పరువు నష్టానికి కూడా దారితీస్తుంది. ఒకవేళ కంపెనీ వారికి మీపై ఏదైనా ఫిర్యాదు వంటివి ఉండి ఉంటే వారు సరైన సమయంలోగా మీకు నోటీసులు లేదా సమాచారాన్ని అందించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు కూడా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ రాకపోయినప్పటికీ చాలా సమయాన్ని వృథా చేశారు. ఏది ఏమైనా, సదరు కంపెనీ వారు మీకు భవిష్యత్తులో ఇబ్బంది కలిగే విధంగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో సమాధానాలు ఇచ్చే ఆస్కారం లేకపోలేదు. ఉద్యోగం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి కంపెనీ వారితో సామరస్యంగా మాట్లాడి పరిష్కరించుకునే ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. అప్పటికీ కూడా వారు వినకపోతే, అన్ని విషయాలను ΄పోందుపరిచి ఒక లీగల్ నోటీస్ పంపండి. తదుపరి మీకు రావలసిన ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్తో పాటు మీకు జరిగిన అన్యాయానికి తగిన పరిహారం కోరుతూ సివిల్ కోర్టులో దావా కూడా వేయవచ్చు. మీకు లేబర్ హక్కుల చట్టాలు వర్తించినట్లయితే లేబర్ కమిషనర్ను, తద్వారా లేబర్ కోర్టును కూడా ఆశ్రయించవచ్చు. -
ఏమ్మా ఎలా ఉన్నావు?
‘ఏమ్మా...ఇంతకీ నువ్వు ఎక్కడుంటావు?ఎంత మంది పిల్లలు, చిన్నవాళ్లేనా?నాకు ఒక మంచి ఫోన్ కొనిపెట్టవచ్చు కదా!... ఈ మాటలు విని పెద్దగా నవ్వుకోవడానికి ఏముంది!అయితే ఇంటర్నెట్వాసులు మాత్రం తెగ నవ్వుతున్నారు. అసలు విషయంలోకి వద్దాం... ఒక బామ్మ చాట్జీపీటీతో ముచ్చటించడం మొదలుపెట్టింది. అందులో భాగంగానే ‘ఎక్కడుంటావు? ఎంత మంది పిల్లలు?’ అని అడిగింది.బామ్మ అమాయకత్వానికి నవ్వులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో 2 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. కామెంట్ సెక్షన్ ఫన్నీ రియాక్షన్స్తో నిండిపోయింది. బామ్మలు ఏఐ చాట్బాట్స్తో సరదాగా సంభాషించడం అనేది సోషల్ మీడియాలో ట్రెండ్గా మారింది. -
నది పాడే ఏకాంత గీతం
నది పాడే గీతాన్ని ఎప్పుడైనా విన్నారా?నది మౌనాన్ని ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? సముద్రంలో కలిసే నది చెప్పే జీవిత సత్యం ఏమిటి?..నది అనేది తత్వశాల. ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ప్రవాహంలోనే జవాబులు ఉంటాయి. ఆరుగురు మహిళా ఆర్టిస్ట్లు... అలము కుమరెసన్, అపరాజిత జైన్ మహాజన్, డా. సవిత, హన్సిక శర్మ, లక్ష్మీ మాధవన్, మీనాక్షి నిహలాని ‘వేర్ ది రివర్ మీట్స్ ది సీ’ పేరుతో ముంబైలోని ఆర్ట్ గ్యాలరీ ‘అనూప్ మెహతా కాన్టెంపరరీ ఆర్ట్’లో ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు.ఫైబర్, క్లాత్, ఎంబ్రాయిడరీలకు ఆధునిక కళారీతులను జోడించి కన్నుల పండగ చేశారు. ‘జీవన ప్రయాణానికి నది ప్రతీకలాంటిది’ అంటారు ఆ ఆరుగురు ఆర్టిస్ట్లు. ఈ చిత్రాలలో మన వారసత్వ సంపద, సంస్కృతి కనిపిస్తాయి. స్త్రీవాద గొంతుక వినిపిస్తుంది.టెక్స్్టటైల్ ఆర్ట్కు కాలం చెల్లుతుందా? అనుకునే రోజుల్లో అది ప్రపంచవ్యాప్తంగా పునరుజ్జీవించింది. సమకాలీన అంశాలతో మమేకం అవుతూ కొత్త కాంతులు విరజిమ్ముతోంది. ఈ ఆరుగురు ఆర్టిస్ట్ల ‘వేర్ ది రివర్ మీట్స్ ది సీ’ వస్త్రకళను మరింత కొత్తగా చూపే ప్రయత్నం. -
పీసీఓఎస్ & ఫిట్నెస్
అందమే ఆనందం... ఆనందమే ఆత్మవిశ్వాసం!ఆత్మవిశ్వాసం శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రతిబింబం!అందుకే నార్మల్ గర్ల్ నుంచి సారా టెండూల్కర్ దాకా ఎవరికైనా ఫిట్నెసే జీవనసాఫల్య మంత్రం!దీనికి సెలబ్రిటీల అనుభవాలే ఉదాహరణలు!ముఖం మీద ఓ మొటిమ రాగానే అమ్మాయి ఇబ్బంది పడుతుంది. దాన్ని దాచడానికి ఎన్నోరకాలుగా ప్రయత్నిస్తుంది. చివరకు బయటకు వెళ్లడానికి.. కనీసం ఫ్రెండ్స్ని కలవడానిక్కూడా ఇష్టపడదు. ఈ క్రీమ్ వాడండి.. తెల్లారికల్లా మొటిమ మాయమంటూ స్క్రీన్ మీద ఓ క్రీమ్ను చూపిస్తూ ఓ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. ఇలాంటి ప్రకటనలతో క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు, రిజిస్టర్డ్ న్యూట్రిషనిస్ట్ సారా టెండూల్కర్ కూడా ప్రభావితమైంది.ఒక్క కాస్మెటిక్ క్రీమ్స్కే కాదు హెయిర్ ఆయిల్ యాడ్స్కూ ఇన్ఫ్లుయెన్స్ అయింది.. ఆమె స్కూల్ రోజుల్లో. ఆ టీనేజ్లో ఆమెకు ముఖం నిండా మొటిమలు, జుట్టు సమస్యలుండేవి. అవి ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. దాంతో ఫ్రెండ్స్ని కలవాలన్నా మేకప్ వేసుకునే వెళ్లేదట. టీవీ కమర్షియల్స్లో కనిపించిన క్రీములు, ఆయిల్స్ అన్నిటినీ వాడిందట. అసలామె సమస్యలకు కారణం .. పీసీఓఎస్. దేశంలో రీప్రొడక్టివ్ ఏజ్లోని ప్రతి అయిదుగురు అమ్మాయిల్లో ఒకరు దీనితో బాధపడుతున్నారు.సారా ఏం చేసింది?మొటిమలు, జుట్టు సమస్యల్లాంటి సైడ్ఎఫెక్ట్స్ మీద శ్రద్ధ పెట్టి సత్వర ఫలితాల కోసం ఆరాటపడిన సారా.. అసలు సమస్య అయిన పీసీఓఎస్ను పట్టించుకోలేదు. దాన్ని కంట్రోల్ చేసే శాశ్వత పరిష్కారం గురించి ఆలోచించలేదు. కాస్మెటిక్స్తో రిజల్ట్స్ రాక΄ోయేసరికి ఒత్తిడికిలోనై డాక్టర్ కూడా అయిన అమ్మ అంజలి టెండూల్కర్ దగ్గర వా΄ోయింది. అప్పుడు అంజలి తన కూతురిని వైద్యనిపుణుల దగ్గరకు తీసుకెళ్లింది. ‘వాళ్లు నా దినచర్య, డైట్ హాబిట్స్ గురించి అడిగారు. పౌష్టికాహారం తీసుకొమ్మన్నారు. ఫిజికల్ ఎక్సర్సైజ్ తప్పనిసరని చె΄్పారు.ఆ సలహాలు, సూచనలు పాటించసాగాను. మైండ్ఫుల్నెస్ మీదా కాన్సన్ట్రేట్ చేశాను. వెంటనే రిజల్ట్స్ రాలేదు. కొంచెం టైమ్ పట్టింది.. ఆలస్యమైనా ఆరోగ్యం చేకూరింది. పీరియడ్స్ రెగ్యులర్ అయ్యాయి. ముఖం మీది మొటిమలు పోయాయి. జుట్టూ పెరగసాగింది. అప్పటి నుంచి అదే జీవనశైలిని అనుసరిస్తున్నాను. పీసీఓఎస్తో లైఫ్ సవాలే. అది శారీరకంగానే కాదు మానసికంగానూ కుంగదీస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది. దాని వల్ల నేను స్ట్రెస్ ఫీలయ్యి, ఫ్రస్ట్రేట్ అయిన సందర్భాలు కోకొల్లలు. అయితే సరిచేసుకోలేనంత మొండి సమస్య కాదు. ఇన్స్టంట్ రిజల్ట్స్ పర్మినెంట్ సొల్యుషన్స్ కావు. కాబట్టి షార్ట్ టర్మ్ రిజల్ట్స్ మీద టైమ్ వేస్ట్ చేసే బదులు మన జీవనశైలిని మెరుగుపరచుకునే ప్రయత్నం చేయాలి.పర్ఫెక్షన్ మీద కన్నా స్థిరత్వం మీద శ్రద్ధ పెట్టాలి. బ్యాలెన్స్డ్ డైట్, ఎక్సర్సైజ్లను జీవితంలో భాగం చేసుకుని కొనసాగించాలి! శారీరక, మానసిక ఆరోగ్యానికవే దివ్యౌషధాలు. అయితే నిపుణుల సలహా, హెల్ప్ కంపల్సరీ. ఈ విషయంలో అమ్మకు థాంక్స్ చెప్పుకోవాలి. సరైన సమయంలో నన్ను నిపుణుల దగ్గరకు తీసుకెళ్లింది. నిజానికి మా ఇంట్లో నాన్న గానీ, అమ్మ గానీ ఫిజికల్ యాక్టివిటీ, మిత ఆహారం, మైండ్ఫుల్నెస్కి చాలా విలువిస్తారు.ఫిట్నెస్ అండ్ వెల్నెస్ మా డిన్నర్ టేబుల్ కన్వర్జేషన్స్లో భాగం. అలాంటి వాతావరణంలో పెరిగిన నేను.. స్కూల్ డేస్లో కాస్త నిర్లక్ష్యం చేశాను. కానీ అమ్మ గైడెన్స్ వల్ల త్వరగానే మళ్లీ సరైన దారిలో పడ్డాను. ఇప్పుడు బ్లాక్ కాఫీతో నా డే స్టార్ట్ అవుతుంది. ఎక్సర్సైజ్, నట్స్, మాచా టీ, బ్యాలెన్స్డ్ డైట్.. ఎట్సెట్రాతో కంటిన్యూ అవుతుంది’ అని చెబుతుంది సారా టెండూల్కర్.పీసీఓఎస్ అండ్ పీసీఓడీ అంటే...పీసీఓఎస్ ( పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) అనేది హార్మోన్ల సమస్య. అండాశయాలు అధిక స్థాయిలో మేల్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల నెలసరి క్రమం తప్పడం, అధిక రక్తస్రావం లేదంటే రక్తస్రావం సరిగాకాక΄ోవడం, అండాశయాల్లో సిస్ట్లు, అవాంఛిత రోమాలు, జుట్టు పలచబడటం, మొటిమలు, అలసట, మూడ్ స్వింగ్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, స్థూలకాయం, టైప్ 2 డయాబెటీస్, గుండె జబ్బుల రిస్క్ పెరగడం, కొలెస్ట్రాల్ అధికమవడం, సంతానోత్పత్తి సమస్యలు వంటివి తలెత్తుతాయి.పీసీఓడీ ( పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్)లో అండాశయాలు అపరిపక్వ లేదా పాక్షికంగా పరిపక్వత చెందిన అండాలను ఉత్పత్తి చేస్తాయి. తర్వాత ఇవి సిస్ట్స్గా మారే చాన్స్ ఉంటుంది. పీసీఓఎస్, పీసీఓడీ రెండిటికీ జీవనశైలి, హార్మోన్ల అసమతౌల్యం, జన్యపరమైన అంశాలు కారణాలు. పీసీఓఎస్, పీసీఓడీ రెండూ కూడా 15–30 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిల్లో కనపడతాయి. జీవనశైలి మార్పులతో పాటు డాక్టర్ సూచించిన చికిత్సతో ఈ రెండు సమస్యలను తగ్గించుకోవచ్చు. – డాక్టర్ పూజిత సూరనేని, సీనియర్ ఆబ్స్టట్రీషన్, గైనకాలజీ అండ్ లాపరోస్కోపిక్ సర్జన్ఇంకెంతో మంది సెలబ్రిటీలు.. ఒక్క సారా టెండూల్కరే కాదు పీసీఓఎస్, పీసీఓడీలతో సోనమ్ కపూర్, శ్రుతి హాసన్, మసాబా గుప్త, సారా అలీఖాన్ లాంటి సెలబ్రిటీలూ బాధపడ్డారు. పీసీఓఎస్ వల్ల సోనమ్ కపూర్ స్థూలకాయంతో ఇబ్బంది పడింది. ‘పీసీఓఎస్ని డీల్ చేసే ఏకైక విధానం.. జీవనశైలిని మార్చుకోవడమే. లైఫ్స్టయిల్ అండ్ యోగాతోనే నేను పీసీఓఎస్ను మేనేజ్ చేశాను’ అని చెబుతుంది సోనమ్ కపూర్. శ్రుతి హాసన్, మసాబా గు΄్తాలూ అంతే! లైఫ్స్టయిల్లో మార్పులు, వ్యాయామం, పౌష్టికాహారంతోనే పీసీఓఎస్కి చెక్ పెట్టారు. సారా అలీఖాన్ పీసీఓడీ బాధితురాలు. దానివల్ల ఆమె 96 కిలోల బరువుండేది. దానికి ఆమె కూడా జీవనశైలిని మార్చుకోవడమే పరిష్కారమని గ్రహించి కసరత్తు మొదలుపెట్టింది. బరువు తగ్గడం మొదలయ్యాక పీసీఓడీ తగ్గింది. ఆమె ఆ ఎక్సర్సైజ్ ఆపలేదు. క్రమశిక్షణ గల జీవనశైలిని తప్పలేదు. ఈ ఆరోగ్య సూత్రం సమస్యలున్న వారికే కాదు.. భవిష్యత్లో ఎలాంటి శారీరక, మానసిక సమస్యలు రావద్దని కోరుకుంటున్న అందరికీ అనుసరణీయమే! -
మా అమ్మతో ఆరు నెలలే ఉన్న మాజీ బాయ్ ఫ్రెండ్
కొన్ని బంధాలు ఎలా బలపడతాయో ఎలా రూపుమారతాయో ఎవరూ చెప్పలేరు. అవ్యాజ్యమైన అనుబంధాలు అనుభూతించిన వాళ్లు మాత్రమే ఆ అనుభూతిని వర్ణించగలరు. ఒంటరి తల్లికి బాయ్ ఫ్రెండ్గా తండ్రి స్థానంలోకి వచ్చిన ఓ వ్యక్తి కేవలం ఆర్నెళ్లలోనే ఆమెతో బ్రేకప్ అయి విడిపోతే... కూతురు స్థానంలో ఉన్న చిన్నారితో... జీవిత కాలపు బంధం అల్లుకోవడం నిజంగా ఆశ్చర్యకరం మాత్రమే కాదు అపురూపం కూడా. దక్షిణాఫ్రికాలో నివసించే లారెన్ మెల్నిక్ ఈ తరహా అనుబంధాన్ని ఆస్వాదించారు. ఒక అంతర్జాతీయ మేగ్జైన్ కోసం ఆమె తమ అనుభవాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...నాకు నాలుగు సంవత్సరాల వయసులో చార్లెస్ మా అమ్మతో ఆరు నెలల పాటు డేటింగ్ చేశాడు, ఆమెను విడిచిపెట్టినా ఆ తర్వాత కూడా నా జీవితాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. బ్రేకప్ అనంతరం కూడా అతను అమ్మ స్నేహం గానే ఉన్నారు. దీని వల్ల అతను ఎక్కడ ఉంటున్నా అప్పుడప్పుడు ఇంటికి రావడం వచ్చినప్పుడల్లా నాకు చిన్న చిన్న బహుమతులు తీసుకువస్తుండేవాడు. , అతను (మేం నివసించిన) జోహన్నెస్బర్గ్ నుంచి ఆస్ట్రేలియాకు మారిన తర్వాత కూడా నాతో టచ్లో ఉండటానికి ఫోన్ కాల్స్ చేసేవాడు.మా బంధం గురించి మా అమ్మకు ఎప్పుడూ మిశ్రమ భావాలు ఉండేవి, నేను టీనేజర్గా ఉన్నప్పుడు అమ్మతో ఏదైనా గొడవ పడినప్పుడు, నేను ఫోన్ తీసుకుని, చార్లెస్కు ఫోన్ చేసి, సరదాగా అరిచేదాన్ని ‘నా తల్లితో మాట్లాడండి ఆమె సరిగా లేదు!‘ అంటూ చెబుతుంటే ఆమె నన్ను నెట్టేసేది. ఈ రోజుల్లో, చార్లెస్ నేను మా గ్రూప్ కాల్స్లో పరిహాసాలతో ఆమెను నిత్యం ఆటపట్టించేవాళ్లం. మా బంధాన్ని చార్లెస్ నాకు చూపించిన ఊహించని మార్గాలను కూడా అమ్మ అర్ధం చేసుకుంది. అతను నాకు డ్రైవింగ్ స్కూల్ పాఠాలు కూడా కొని పెట్టాడు నా విద్యార్థి రుణంలో మిగిలిన భాగాన్ని తను తీర్చడం ద్వారా మా ఇద్దరినీ ఆశ్చర్యపరిచాడు ఆ తర్వాత నేను ఉద్యోగినై సంపాదించడం ప్రారంభించినప్పుడు, అతను నా అత్యంత తరచుగా గడిపే ప్రయాణ స్నేహితులలో ఒకడు గా మారాడు.మేం కలిసి ప్రయాణించేటప్పుడు, అపరిచితులు తరచుగా ఆయన నా తండ్రి అని అనుకుంటారు ఎందుకంటే మా సంబంధంలో సాంప్రదాయ తండ్రి–కూతురు సంబంధం లోని అన్ని లక్షణాలు ఉన్నాయి – అది నిజం కాదు అనేది తప్ప. ఇలాంటి క్షణాలు మా బంధం ఎంత అసాధారణమైనదో నాకు తరచు గుర్తు చేస్తాయి.నేను పసిబిడ్డగా అతని ఒడిలో కూర్చోనివ్వమని అడిగినప్పుడు చార్లెస్ తక్షణమే బంధాన్ని అనుభవించానని చెప్పాడు. నాకు తెలిసినది ఏమిటంటే, నా తల్లి (నా తండ్రి కాకుండా) మా ఇంటికి తీసుకువచ్చిన వారిలో నేను ఇష్టపడిన అంగీకరించిన ఏకైక వ్యక్తి ఆయనే. నా జీవితంలో ఆయన ఉండాలనే ఆలోచన ప్రణాళికా బద్ధంగా జరగనప్పటికీ... విధికి మాత్రం తన ప్లాన్స్ తనకు ఉన్నాయి.అందుకే నేను చార్లెస్ను ‘రెండవ తండ్రి‘ అనే పేరుకు స్థిరపడ్డాను. ఎల్లప్పుడూ షరతులు లేని మద్దతు, మార్గదర్శకత్వం ప్రేమను అందించే వ్యక్తిని మీరు అలా కాక ఇంకా ఏమని పిలుస్తారు? డిఎన్ఎ బంధం కాకపోవచ్చు కానీ అతను తండ్రికి సిసలైన నిర్వచనం.తన లాంటి డైనమిక్ పర్సన్ని మరెవరినీ నేను ఎప్పుడూ కలవలేదు. ఖచ్చితంగా, కొందరు సవతి నాన్నలతో చక్కని బంధాలను ఏర్పరుచుకుంటారు, కానీ అమ్మ మాజీ ప్రియుడితోనా? అంటే... అవును ఇది అసాధారణమైనది, వింతైనది కుటుంబం అంటే మీ ఇంటిపేరు పంచుకునే వ్యక్తుల కంటే ఎక్కువ అని చార్లెస్ నాకు అర్థమయ్యేలా చేశాడు – అది మీరు నిర్మించేది. నిజమైన నిబద్ధత లేబుల్స్ రూపంలో రాదు అని ఆయన నాకు నేర్పించారు. ఇది ఉద్దేశపూర్వకంగా ఒకరి జీవితంలో కనిపించడానికి మీరు ప్రతిరోజూ చేసే పని. మనలో చాలా మందికి సంక్లిష్టమైన కుటుంబ బంధాలు ఉన్నాయి, కానీ మా సంబంధం ద్వారా నేను నేర్చుకున్నది... మిమ్మల్ని నిస్సందేహంగా కావాలని ఎంచుకునే వ్యక్తులే మిమ్మల్ని ఎక్కువగా అనుభూతి చెందేలా చేస్తారు. అది మీ రక్తం అయినా లేదా మీరు కనుగొన్న కుటుంబం అయినా సరే. -
చేతుల పరిశుభ్రత కోసం..!
విద్యార్థుల్లో మంచి ఆరోగ్య పద్ధతులను, పరిశుభ్రత అలవాట్లను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఇల్నెస్ టు ఫౌండేషన్ సహకారంతో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (PEFI) ‘స్వస్థ్ హాత్, స్వస్థ్ బచ్పన్’ (ఆరోగ్యకరమైన చేతులు, ఆరోగ్యకరమైన బాల్యం) అనే ప్రచారాన్ని ప్రారంబించింది. సుమారు వంద పాఠశాలలు కవర్ చేసేలా దాదాపు 40 వేల మంది విద్యార్థులను భాగస్వామ్యం అయ్యేలా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. గతేడాది దాదాపు 35 పాఠశాలల్లో దగ్గర దగ్గర 30 వేల మందికి పైగా విద్యార్థులను విజయవంతంగా భాగస్వామ్యం అయ్యేలా చేసింది. ఈ ప్రచార కార్యక్రమం విద్యార్థులు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడంలో సహాయపడటమే కాకుండా పాఠశాల వాతావరణం తోపాటు సమాజంలోని ప్రజారోగ్య అవగాహనను బలోపేతం చేస్తోంది. ఈ వెల్నెస్ పద్ధతులను విద్యార్థులు జీవితాంత అనుసరించేలా చేయడం తోపాటు నిజమైన స్వస్థ్ భారత్ మార్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఈ ఇల్నెస్ టు వెల్నెస్ ఫౌండేషన్ సలహా మండలి చైర్పర్సన్ అనిల్ రాజ్పుత్ తెలిపారు. కేవలం సాంప్రదాయ ఉపన్యాసాలపై మాత్రమే ఆధారపడకుండా, వివిధ రకాల ఆకర్షణీయమైన, వినూత్న ఫార్మాట్ల ద్వారా హ్యాండ్వాషింగ్ టెక్నిక్లను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఇక ఈ 'స్వస్థ్ హాత్, స్వస్థ్ బచ్పన్' ప్రచారం ప్రారంభ కార్యక్రమం సెప్టెంబర్ 6,2025న న్యూఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ - IIలోని బల్వంత్రాయ్ మెహతా విద్యా భవన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారికి డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలకు అనుగుణమైన హ్యాండ్వాషింగ్ టెక్నిక్లపై నిపుణుల సలహాలతో కూడిన ఇంటరాక్టివ్ ప్రెజెంటేషన్ను అందించారు కూడా.(చదవండి: Weight Loss Story: లైఫ్స్టైల్లో ఆ ఐదు మార్పులు తప్పనిసరి..! 59 కిలోలు తగ్గిన ఇన్ఫ్లుయెన్సర్) -
లైఫ్స్టైల్లో ఆ ఐదు మార్పులు తప్పనిసరి..! 59 కిలోలు తగ్గిన ఇన్ఫ్లుయెన్సర్
బరువు తగ్గడం అంటే సాధారణంగా అందరు అనుకునేది నోటిని కంట్రోల్ చేయడమే మార్గం అని. కానీ ఈ ఇన్ఫ్లుయెన్సర్ మాత్రం ముమ్మాటికి అది మాత్రం కాదని చెప్పేస్తోంది. అలాగే మాటిమాటికి బరువుని చెక్చేసుకుంటూ వర్కౌట్లు చేయడం కాదని అంటోంది. ఆహారంతో ఆరోగ్యకరమై, స్థిరమైన బంధాన్ని ఏర్పరుచుకుంటే బరువుకి చెక్పెట్టగలమని చెబుతోందామె. ఆ విధంగానే తాను బరువు తగ్గానంటూ తన వెయిట్లాస్ సీక్రెట్ని బయటపెట్టారామె. ఇంతకీ ఆమె ఎలాంటి చిట్కాను అనుసరించిందంటే..సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గురిష్క్ కౌర్ తన వెయిట్లాస్ సీక్రెట్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారామె. ప్రతి కేలరీలను లెక్కించడం కంటే సమతుల్యతకు పెద్దపీటను వేయమని చెబుతున్నారామె. దాంతోపాటు తాను అనుసరించిన ఈ సింపుల్ చిట్కాలను కూడా అనుసరించినట్లు తెలిపింది. సింపుల్ చిట్కాలు..నేచురల్ ఆహారం..ఆహారం పట్ల వ్యామోహాన్ని నియంత్నించేలా సహజమైన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే ప్రాసెస్ చేసిన ఆహారాల కంటే మొక్కల ఆధారిత ఆహారాలనే స్వీకరించాలి. ఆరోగ్య అవసరాలను, ఆకలి కోరికను తీర్చే ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలంటోంది. ఆకలి సంకేతాల తోపాటు..సమతుల్యంగా తినడం మరవకూడదంటోంది. ఆకలి సంకేతాలు..సమతుల్య భోజనంపైనే ఫోకస్ పెట్టినట్లు నర్మగర్భంగా చెప్పింది.మైండ్ఫుల్గా తినడం..పోషకాహారాలను మనఃపూర్వకంగా తినాలి. ఏదో గబగబ ితినేయడం ాకాకుండా. వాటిని ఇష్టంగా, ఎలా తింటున్నాం అనే దానిపై అటెన్షన్ ఉండాలని చెబుతోందామె.ఆరోగ్యకరమైన ఆహారానికే ప్రాధాన్యత..చీట్మీల్ వంటి వాటికి చోటివ్వకుండా, స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కొన్ని ఆహారాలు మరింత ోపోషకాలు ఉన్నా కూడా ఆరోగ్యానికి బెస్ట్ అయితేనే తీసుకోవాలి. ఒకవేళ జంక్ఫుడ్ని తినేసినా..దాన్ని కరిగించేలా వర్కౌట్లు బాగా చేయాలి. ఆహరం కంటే..లైఫ్స్టైల్ మారాలి..కేవలం డైట్కే ప్రాధాన్యత ఇవ్వొద్దు. సమతుల్యంగా తినడం, మంచి ఆహారపు అలవాట్లును భాగం చేసుకునే ప్రయత్నం చేయాలంటోంది.బ్రేక్ చేయకపోవడం..ఏర్పరచుకున్న లక్ష్యానికి అనుగుణంగా తినేలా ఉండాలి. ఏ మాత్రం ఆశయాన్ని బ్రేక్ చేయని స్ట్రాంగ్ మైండ్సెట్తో ఉండాలి. ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ గురిష్క్ కౌర్ బరువు తగ్గడం అనేది ఎలాంటి ఆహారం ఎంచుకోవాలి అనేదాని కంటే..మనసుకి సంబంధించిన పని అని అంటోంది. అది మన నియంత్రణలో ఉంటే ప్రతీది అవలీలగా జయించగలమని చెబుతోంది. ఆ విధమైన జీవనశైలి మార్పులతోనే సుమారు 59 కిలోలు తగ్గినట్లు చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Gurishq Kaur (@gurishqkaur) (చదవండి: 'నో ఛాన్స్..జస్ట్ ఫోర్స్'..! వైరల్గా మహిళ భావోద్వేగ పోస్ట్) -
'నో ఛాన్స్..జస్ట్ ఫోర్స్'..! భారత్ని వీడక తప్పని స్థితి..!
ఒక భారతీయ మహిళ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లక తప్పని పరిస్థితి ఎదురైంది. ఆ విషయాన్ని నెట్టింట షేర్ చేయడంతో..ఒక్కసారిగా భారతదేశ రిజర్వేషన్ విధానం హాట్టాపిక్గా మారింది. ఇదేలా రాజకీయ జిమ్మిక్కుగా మారి ఉన్నత విద్యావంతుల పాలిట శాపంగా ఎలా మారిందో ఓ యువతి ఇన్స్టా వేదికగా వాపోయింది.అసలేం జరిగిందంటే..భారతదేశాన్ని విడిచి వెళ్లడం అనేది అంత ఈజీ కాదని, తప్పని పరిస్థితి అంటూ సోషల్మీడియా వేదికగా తన గోడును వెళబోసుకుంది. తాను ఉన్నత విద్యను భారత్లోనే అభ్యసించాలనుకున్నాని, తన మేథస్సు తన దేశ అభ్యున్నతి ఉపయోగపడాన్నేదే తన ఆకాంక్ష, లక్ష్యం కానీ విధిలేక దేశాన్ని విడిచి వెళ్తున్నానంటూ పోస్ట్లో కన్నీటి పర్యంతమైంది. తనకు భారతదేశం అంటే ఎంతో ఇష్టమని, ఇక్కడే మంచిగా స్థిరపడాలని కలలు కనేదాన్ని కానీ పరిస్థితులు మరో గత్యంతర లేకుండా చేసేశాయ్ అని ఆవేదనగా చెప్పుకొచ్చిందది. భారత్లో బలమైన విద్యా వ్యవస్థ ఉన్నప్పటికీ..ఇక్కడ ఉన్నత విద్యను అందుకోవడంలో అడగడుగునా ఎలా అండ్డంకులు ఎదురయ్యాయో వివరించింది. తాను లక్నో విశ్వవిద్యాలయంలో చదివానని, అధిక మార్కులతో పట్టభద్రురాలినయ్యానని తెలిపింది. అలాగే కష్టపడి చదివి క్యాట్ ఎగ్జామ్ పాసయ్యానని చెప్పుకొచ్చింది. కానీ తనకు మంచి సంస్థలో చదివే అవకాశం లభించలేదని. సీట్లు చాలా తక్కువ స్కోరు చేసిన వారినే ఎలా వరించాయో కూడా తెలిపింది. వారందరికి మెరిట్ కారణంగా కాకుండా రిజర్వేషన్ ప్రాతిపదికన మంచి కాలేజ్ సీట్లు వచ్చాయని దాంతో తాను 2013లో రాజీపడి ఐఐఎంలో కాకుండా ఎఫ్ఎంఎస్లో చేరానని రాసుకొచ్చింది. అలాగే 2025లో జీమ్యాట్లో ఉత్తీర్ణత సాధించినప్పుడూ కూడా జనరల్ కేటగిరీలో పరిమిత సంఖ్యలోస్లాట్లు ఉండటంతో మంచి సంస్థలో సీటు సంపాదించలేకపోయాను. అందువల్లే తాను విదేశాలకు వెళ్లాల్సి వస్తోందని చెప్పుకొచ్చింది. ఇది తనొక్క వ్యథే కాదని, తనలాంటి ఎందరో టాపర్స్ ఆవేదన అని చెప్పుకొచ్చింది. జనరల్ కేటగిరీ అనేది ఆర్థికంగా అణగదొక్కబడిన సముహాలను వెనక్కి నెట్టేసి, రాజకీయ అంకగణిత సాధనంగా మారిందో వివరించింది. న్యాయం కోసం వచ్చిన రిజర్వేషన్ ఎలా అన్యాయంగా రూపాంతరం చెందిందో చెప్పుకొచ్చింది. అందువల్లే తనలా దేశానికి సేవ చేయాలని కలలు కనే ప్రతిభావంతులంతా ఈ దారుణమైన వ్యవస్థ కారణంగా దేశానికి దూరంగా నెట్టబడుతున్నారంటూ ఆవేదనగా చెప్పింది. చివరిగా తాను ఏ కమ్యూనిటీకి వ్యతిరేకం కాదని కేవలం సమాన అవకాశం కోసం విజ్ఞప్తి, అన్నిటికంటే యోగ్యత, ప్రతిభను గుర్తించే వ్యవస్థ కోసం పడుతున్నా తపనే తన ఆవేదన అంటోంది. అలాగే తనలా ఎవ్వరూ భారంగా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లే పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నట్లు పోస్ట్లో రాసుకొచ్చింది. దాంతో ఒక్కసారిగా నెట్టింట భారతదేశ రిజర్వేషన్ అంశం చర్చనీయాంశంగా మారింది. విద్య, దాని అభివృద్ధికి సంబంధించిన సమగ్ర విధానంపై దృష్టిపెట్టాల్సిన తరుణం ఇది, లేదంటే మేధో ప్రవాహం తరలి వెళ్లిపోతుంది అంటూ పలువురు నెటిజన్లు అవేదనగా పోస్టుల పెట్టడం గమనార్హం.(చదవండి: నింద, ఒత్తిడి, మౌనం..ఇంత ప్రమాదకరమైనవా? అంత దారుణానికి ఒడిగట్టేలా చేస్తాయా..?) -
నింద, ఒత్తిడి, మౌనం..ఇంత పనిచేయిస్తాయా?
దేశవ్యాప్తంగా ఒత్తిడి, మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని, అవి ఆత్మహత్య ఆలోచనలకు దారితీస్తున్నాయని హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఆత్మహత్య నిరోధ హెల్ప్లైన్ (7893078930) అయిన 1 లైఫ్ సంస్థ (1life.org.in) తెలిపింది. తాజాగా విడుదల చేసిన నివేదికలో ఇందుకు సంబంధించి పలు అంశాలు వెల్లడించింది. తమకు ఫోన్ చేసేవారిలో చాలామంది తీవ్రమైన భావోద్వేగ, ఆర్థిక, సామాజిక ఒత్తిడిలో ఉంటున్నారని.. దానివల్ల వారిలో ఆత్మహత్యల ఆలోచనలు వస్తున్నాయని వెల్లడించింది.1 లైఫ్ హెల్ప్లైన్కు ఏడాదికి సగటున 23వేల కాల్స్ వస్తుంటాయి. వీటిని కౌన్సెలర్లు విశ్లేషించి, సమాజంలో మానసిక ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయని తెలిపారు. ఈ కష్టాల నుంచి కోలుకోవడం చాలా ముఖ్యం. వాటిలో వ్యక్తిగత సంబంధాలు తెగిపోవడం, వ్యవస్థాపరమైన సమస్యలు, నిరాశావాదం లాంటివి చాలా ఉంటాయి. ప్రతి కాల్లోనూ తీవ్ర సంక్షోభంలో ఉన్న వ్యక్తులు ఎదురవుతారు. వాళ్లను బాగా అర్థం చేసుకోవడం, సానుభూతి చూపించడం, మద్దతు ఇవ్వడం లక్ష్యంగా కౌన్సెలర్లు మాట్లాడతారు.మానసిక ఆరోగ్యం మీద బహిరంగంగా జరగాల్సిన చర్చలను నింద, మౌనం ఎలా అడ్డుకుంటాయో కూడా ఈ డేటా చెబుతుంది. చాలా కుటుంబాల్లో వ్యక్తులు తమ సమస్యలను చెప్పడానికి అనుమతించరు. ఎవరైనా తమను తప్పుగా అనుకుంటారేమో, లేదా సమాజంలో చిన్నచూపు చూస్తారేమోనన్న భయంతో కూడా తమ లోపలి ఆలోచనలను బయటపెట్టకుండా లోలోపలే కుమిలిపోతుంటారు. తమ లోపలి భావాలను బయటపెట్టకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. దాంతో వాళ్లు మరింత ఒంటరి అయిపోయినట్లు భావిస్తారు. ఈ తరహా ట్రెండ్లను బట్టి చూస్తే.. జాలి, సమయానికి జోక్యం చేసుకోవడం లాంటి వాటి ప్రాధాన్యం సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని 1లైఫ్ భావిస్తోంది.హైరిస్క్ ఫోన్ కాల్స్ విషయంలో..రిలేషన్షిప్ సమస్యలు (సుమారు30%): గొడవలు, బ్రేకప్ లేదా వైవాహిక సమస్యలు చాలావరకు ఆత్మహత్య ఆలోచనలకు కారణమవుతున్నాయి. కాల్ చేసేవారిలో చాలామంది తమ మాట వినిపించుకోవడం లేదని, ఒంటరిగా అయిపోయామని చెబుతూ ఈ కష్టాల నుంచి తప్పించుకోవాలంటే ఆత్మహత్య ఒక్కటే మార్గమని భావిస్తారు. కుటుంబాల్లో సరిగా మాట్లాడుకోలేకపోవడం, యుక్త వయసులో భావోద్వేగాలను తట్టుకునే శిక్షణ లేకపోవడం వల్ల పరిస్థితి ఇంతవరకు వస్తుంది. సామాజికంగా చురుగ్గా ఉంటున్నా, విజయాలు సాధిస్తున్నా కూడా వ్యక్తిగత సంబంధాల విషయంలో బాగా ఇబ్బంది పడుతున్నవారు తమలో తామే కుమిలిపోతున్నారని కౌన్సెలర్లు గుర్తించారు.అప్పులు, ఆర్థికసమస్యలు (25%): నిరుద్యోగం, పెరిగిపోతున్న అప్పులు, బెట్టింగ్ యాప్లలో నష్టాలు, తిరిగి ఇవ్వని వ్యక్తిగత రుణాలు, ఆర్థిక మోసాలకు గురికావడం లాంటివి చాలామందిని నిరాశలోకి నెట్టేస్తాయి. ఆర్థికంగా విఫలమయ్యామన్న కుంగుబాటు, అప్పులవాళ్లు, కుటుంబసభ్యుల నుంచి పెరిగిపోయే ఒత్తిడి వల్ల ఇక నిస్సహాయంగా మిగిలిపోతారు. చాలామందికి తమ కుటుంబాలను పోషించలేకపోవడంతో సిగ్గుపడి, అది చివరకు తీవ్ర నిరాశలోకి దించేస్తుంది. ఆర్థిక అక్షరాస్యత, సమాజం నుంచి మద్దతు లాంటివి బలహీనంగా ఉండడంతో ఊరట కోసం సురక్షిత ప్రాంతాలకు వెళ్దామనుకున్నా అవి ఉండవు.విద్య/వృత్తిపరమైన ఒత్తిడి (సుమారు 22%): విద్యార్థులు, యువ వృత్తినిపుణులు తరచు తమకు పరీక్షలు, వృత్తిపరమైన సమస్యలు, పనివాతావరణం సరిగా ఉండకపోవడం లాంటి సమస్యలతో సతమతం అవుతున్నట్లు చెబుతారు. విఫలం అవుతామన్న భయం, అంచనాలను అందుకోలేకపోవడంతో తరచు తమమీద తమకే అనుమానం వచ్చి, ఆందోళనతో ఆత్మహత్య ఆలోచనలొస్తాయి. పక్కవాళ్లతో పోల్చిచూడడం, సోషల్ మీడియాలోనూ పోలికలు ఎక్కువ కావడంతో ఈ సమస్యలు ఎక్కువైపోయి తాము వెనకబడుతున్నామని అనుకుంటారు. మెంటార్లు లేదా మద్దతిచ్చే వృత్తివాతావరణం లేకపోవడంతో చాలామంది తమ పరిస్థితి డెడ్ ఎండ్ అని భావిస్తారు.మానసిక ఆరోగ్య సమస్యలు (సుమారు 10%): ఒంటరితనం, ఒత్తిడి, కుంగుబాటు, పనికిరామన్న భావనలు ఎక్కువమంది కాలర్స్లో కనిపిస్తున్నాయి. కుటుంబం నుంచి సమాజం నుంచి తగిన మద్దతు లేకపోతే చాలామంది మౌనంగా బాధపడుతూ, కనిపించని ఇబ్బందిలో మునిగిపోతారు. కొందరు సాయంకోసం ప్రయత్నించినా తమను ఎద్దేవా చేస్తున్నారని, కొట్టిపారేస్తున్నారని చెబుతూ మరింత ఒంటరితనంలో కూరుకుపోతున్నారు. అందుబాటులో మానసిక ఆరోగ్య సేవలు లేకపోవడంతో వారు సరైన సమయానికి సాయం అందుకోకవడం కష్టమవుతోంది.సామాజిక సమస్యలు (సుమారు 12%): ఎల్జీబీటీక్యూ లాంటి కొన్ని వర్గాలకు చెందినవారు బలవంతపు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వస్తుంది, తరచు వీరిని వెలివేస్తారు, లేదా తాము అంగీకరించని గుర్తింపుతో జీవించాల్సి వస్తుంది. ఇలా తరచు ఉండే ఒత్తిడి వల్ల వారికి తప్పనిసరిగా ఆత్మహత్య ఆలోచనలొస్తాయి. చాలా సందర్భాల్లో కుటుంబం, సమాజం వెలివేయడంతో వాళ్లకు చాలా అవసరమైన మద్దతు దొరకదు. తమ గుర్తింపును నిరూపించుకోవడానికి పోరాడుతుంటే తరచు ఎదురయ్యే ఛీత్కారాలు వారికి తీవ్ర మానసిక సమస్యలను సృష్టించి, తప్పించుకోవడాన్ని అసాధ్యం చేస్తాయి.ఈ మేరకు 1 లైఫ్ ఆత్మహత్యల నిరోధ హెల్ప్లైన్లోని కన్సల్టెంట్ సైకాలజిస్ట్ మిస్ రెబెక్కా మాట్లాడుతూ, “ప్రతి కాల్ వెనుక భరించలేని బాధ, భయం, లేదా ఒంటరితనంతో పోరాడే ఒకవ్యక్తి ఉంటారు. నిజానికి వాళ్లు చనిపోవాలని అనుకోరు. కానీ తమ కష్టాలకు ముగింపు కోరుకుంటారు. వాళ్లను జడ్జ్ చేయకుండా, వారికి ఒక ఆశ కల్పించేలా వినడం ద్వారా జీవించడానికి తగిన కారణాలు కనుగొనడంలో వారికి సాయం చేయగలం. ఒకసమాజంగా, మనం తప్పనిసరిగా మానసిక ఆరోగ్యం గురించి చర్చించడం, సామాజిక సమస్యలు తగ్గించడం, బేషరతుగా మద్దతు ఇవ్వడం లాంటివి చేయాలి” అని వివరించారు.కష్టాల్లో ఉన్నవారు మౌనంగా బాధపడడం కంటే సహాయం పొందడాన్ని 1లైఫ్ ప్రోత్సహించింది. తగిన సమయానికి చేసే కౌన్సెలింగ్.. నిరాశను అనుకూలతగా మార్చగలదని సంస్థ పేర్కొంది. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చే వ్యవస్థలను రూపొందించడానికి విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు, ఉద్యోగ నియామక సంస్థలు, సమాజంలో నాయకులు కూడా ప్రోయాక్టివ్ చర్యలు తీసుకోవాలి. ఆత్మహత్యల నిరోధం అనేది కేవలం హెల్ప్లైన్ల బాధ్యత మాత్రమే కాదని 1లైఫ్ నొక్కిచెబుతోంది. కుటుంబాలు, కార్యాలయాలు, మొత్తం సమాజం కలిసికట్టుగా చేయాల్సిన పని అని పేర్కొంది. -
'మా నాన్న గ్రాడ్యుయేట్'..!
అందరికి ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లభించదు. కుటుంబ బాధ్యతల రీత్యా కొందరికి అది అందని ద్రాక్షలా ఉంటుంది. అలాంటి వాళ్లు తమకు అవకాశం చిక్కినప్పుడు వయోభారాన్ని సైతం పక్కన పెట్టి చదవాలనుకున్న కోర్సులని చదివేయడమే కాదు ఉత్తీర్ణులై ఆశ్చర్యపరుస్తారు. అలాంటి అద్భుత ఘట్టమే ఇక్కడ చోటు చేసుకుంది. దాన్ని అతని కొడుకు ఎలా సెలబ్రేట్ చేశాడో చూస్తే మాత్రం విస్తుపోతారు. అందుకు సంబంధించిన వీడియ నెట్టింట తెగ వైరల్గా మారింది 52 ఏళ్ల ముంబై వ్యక్తి ఎంబిఏ పట్టాని సంపాదించి అద్భుతమైన మైలు రాయిని సాధించాడు. చదవాలనే జిజ్ఞాశ ఉంటే వయసు ఆశయానికి అడ్డంకి కాదని ప్రూవ్ చేశాడు. ఆ అపురూప క్షణాన్ని అతడి కుమారుడు మైత్రేయ సాథే ఎంత అందంగా గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేశాడంటే..ఆ తండ్రి ఆ సర్ప్రైజ్కి ఉబ్బితబ్బిబైపోయాడు. తన తండ్రి ముఖాకృతితో కూడిన గ్రాడ్యుయేట్ క్యాప్ని ముఖానికి పెట్టుకుని దర్శనమిస్తూ..కంగ్రాట్స్ చెబుతారు. ఆ అనుహ్యపరిణామానికి నోట మాటరాక ఒక్క క్షణంపాటు బిగిసుకుపోయి..ఆ తర్వాత తేరుకుని చిరునవ్వులు చిందిస్తాడు ఆ తండ్రి. అంతేగాదు అతడి కోసం కుటుంబం మొత్తం రాసిన కలర్ఫుల్ సందేశాల నోట్స్ని చదువుతూ..ఉప్పొంగిపోతాడు. పైగా ఆ ఘన సత్కారానికి ఆ తండ్రి ముఖం చిచ్చుబుడ్డిలా కాంతిగా వెలిగిపోతుంది. అందుకు సంబంధించిన వీడియోకి ..'మా నాన్న గ్రాడ్యుయేట్' అనే క్యాప్షన్ జత చేసి మరి పోస్ట్ చేశాడు. ఆన్లైన్లో ఇలాంటి విస్తుపోయే కథలెన్ని చూసినా..ఓ తండ్రి తన ఆశయాన్ని నెరవేర్చుకున్నప్పుడూ అతడి మొత్తం కుటుంబమే సంబంరంలో మునిగిపోతుంది. వయసులో ఉన్నప్పుడూ సాధించిన విజయం కంటే వయసు మళ్లినప్పుడూ అంతే ఉత్సాహంతో విజయం సాధిస్తే ఆ కిక్కే వేరు, పైగా ఫ్యామిలీ ముందు హీరో రేంజ్లో ఫోజులిచ్చే ఛాన్స్ని కొట్టేయొచ్చు కదూ..! View this post on Instagram A post shared by Maitreya Sathe 「マイトレヤ サテェ」 (@maitreyasathe) (చదవండి: వర్షం సైతం ఆ నృత్యాన్ని అడ్డుకోలేకపోయింది..!) -
కొద్దిసేపు ఆనందం..డిప్రెషన్ జీవితాంతం..!
నగరం మత్తెక్కుతోంది.. మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన కొందరు వాటిని తరలించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. మత్తులో జోగుతూ వారి జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. ఫామ్ హౌస్లు, పబ్బులు దాటి పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ప్రస్తుతం మత్తు పదార్థాల అమ్మకాలకు అడ్డాలుగా మారుతున్నాయి.. ఇదేదో ఉత్తిగనే చెప్పే మాటలు కావు.. ఇటీవల జరిగిన ఘటనలే దీనికి బలమైన సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. పలు రకాల డ్రగ్స్తో పాటు మనిషి జీవితాన్ని సర్వనాశనం చేసే గంజాయి వ్యర్థాలు గుప్పుమంటున్నాయి.! వరుస ఘటనల్లో విద్యార్థులు కేసుల్లో ఇరుక్కుంటూ వెలుగు చూస్తున్న వాస్తవాలు తల్లిదండ్రులకు వణుకు పుట్టిస్తున్నాయి. ఇలాంటి డ్రగ్స్కు చెక్ పెట్టేదెలా..? విద్యార్థులకు డ్రగ్స్ దూరం చేసేదెలా..? అనే అంశాలపై తలలు పట్టుకుంటున్నారు అధికారులు. ‘ఓపెన్ చేస్తే’.. నగరంలో డ్రగ్స్ సరఫరాపై పోలీసులు నిఘా పటిష్టం చేశారు. హైదరాబాద్కు చెందిన కొందరు విద్యార్థులు డ్రగ్స్ సరఫరాలో భాగస్వాములైనట్లు గుర్తించారు. ఏకంగా యూనివర్సిటీకి సరఫరా చేసే డిక్షనరీ మధ్యలో, మట్టిగాజుల మాటున డ్రగ్స్ సరఫరా చేయడం చూసి ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలో నలుగురు విద్యార్థులను అరెస్టు చేశారు. అయితే కొన్ని కొరియర్ సంస్థల నుంచి రెండేళ్లలో సుమారు వంద కోట్లకుపైగా విలువైన డ్రగ్స్ తరలించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విష సంస్కృతి విద్యార్థులను ఆకర్షించడం, భవిష్యత్తు తరాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆందోళన కలిగించేలా.. నగర యువత గంజాయి, డ్రగ్స్ బాధితులగా మారిపోతున్నారన్న అంశం ఆందోళన కలిగిస్తోంది. పబ్స్ మొదలు ఇంటర్, డిగ్రీ, వర్సిటీ హాస్టల్స్ను డ్రగ్స్ అడ్డాలుగా మార్చేస్తున్నారు. విద్యార్థి దశ నుంచి ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తున్న యువత వరకూ ఎంతో మంది మత్తుకు బానిసైపోతున్నారు. స్టైల్, ఫ్యాషన్ అంటూ మద్యం సేవించడం మొదలు డగ్స్ర్ వైపు అడుగులు వేసే విషసంస్కృతి వేళ్లూనుకుంటోంది. ఈ క్రమంలో పోలీసులకు పట్టుబడితే సమాజంలో తలెత్తుకోలేని విధంగా, నేరస్తులుగా ముద్ర వేసుకుంటున్నారు. పని ప్రదేశాల్లో, తరగతిగదుల్లో స్వేచ్ఛగా ఉండాల్సిన యువత కటకటాల వెనుక ఊచలు లెక్కబెడుతున్నారు. సమాజానికి, కుటుంబానికి శత్రువులుగా మారిపోతున్నారు. క్షణికానందం కోసం జీవితాంతం పలు మానసిక రుగ్మతలకు, రోగాలకు, మెదడు సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. నగరంలో పెరుగుతున్న డ్రగ్ అడిక్షన్స్ డీ–అడిక్షన్ సెంటర్లకు.. ఒక దఫా అలవాటుపడితే డ్రగ్స్ మహమ్మారి నుంచి తప్పించుకోవడం అంత సులువేంకాదని నిపుణులు చెబుతున్నారు. దీనిని నుండి బయట పడడానికి నానా తిప్పలు పడుతున్నారు. ఇటీవల కాలంలో ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలోని డీ–అడిక్షన్ సెంటర్కు భారీ సంఖ్యలో బాధితులు చేరుతున్నారు. ఒక్క ఆగస్టు నెలలోనే మద్యం, గంజాయి, మత్తు పదార్థాల భారి నుంచి విముక్తి కోసం 612 మంది డీ–అడిక్షన్ కేంద్రానికి వచ్చారని అధికారిక నివేదికలు చెబుతున్నాయంటే మహమ్మారి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.యాంటీ సోషల్ పర్సన్గా మారతారు.. మద్యం తాగే వారితో పోలి్చతే డ్రగ్స్, గంజాయి బాధితులు వేంగంగా బానిసలైపోతారు. మానసిక ఆస్పత్రికి పాలీసబ్స్టెన్స్ కేసులు అధికంగా వస్తున్నాయి. సమయానికి డ్రగ్స్ దొరక్కపోతే పిచి్చవారిగా ప్రవర్తిస్తారు. విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఏమీ లేకున్నా ఎవరో వస్తున్నారని భయపడటం, ఆందోళన, అనుమానాలు, అపోహలు ఎక్కువగా ఉంటాయి. నిద్ర పట్టదు. ఇటువంటి వారి కుటుంబాల్లో గృహ హింస ఎక్కువగా ఉంటుంది. చిన్న విషయాలకే అబద్దాలు చెప్పడం, దొంగతనాలు చేయడం, నిబంధనలు పాటించకపోవడం, రఫ్గా వ్యవహరించడం, వైలెంట్గా మారిపోవడం జరుగుతుంది. ఇటువంటి వారితో చాలా ప్రమాదం. సామాజిక వ్యతిరేక వక్తిత్వానికి అలవాటుపడతారు. – డాక్టర్ ఆర్ అనిత, ఎర్రగడ్డమానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్అవార్డింగ్ హార్మోన్స్తో ప్రమాదం.. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు ఆ వ్యక్తిలో అవార్డింగ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దీంతో వ్యక్తి నేను చాలా గొప్పవాడిననే ఫీలింగ్లో ఉంటాడు. నేను ఏం చేసినా, ఏం మాట్లాడినా నాకు ఎదురు లేదనే ఓవర్ కాని్ఫడెన్స్లోకి వెళతాడు. ప్రవర్తనలోనూ విపరీత ధోరణి కనిపిస్తుంది. క్షణికానందం కోసం వెంపర్లాడతాడు. ఆ వెంటనే డిప్రెషన్లోకి వెళ్లిపోతాడు. డ్రగ్స్లో ఉండే కెమికల్స్ మెదడులోని న్యూరాన్స్పై తీవ్రపభ్రావం చూపిస్తాయి. నెమ్మదిగా జ్ఞాపకశక్తి నశిస్తుంది. తీవ్ర ఒత్తిడి, భయం, ఆందోళనకు గురవుతాడు. హార్మోన్లు బ్యాలెన్స్ తప్పుతాయి. ఫిట్స్, బీపీ వంటివి వచ్చే అవకాశం ఉంది. స్నేహితులతో కలసి తొలిసారి ఏదో సరదాగా రుచి చూద్దామనుకుంటే.. చివరికి మానుకోలేని వ్యసనంగా మారిపోతుంది. ఇటువంటి వాటిపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులు సైతం పిల్లల ప్రవర్తన, నడవడికపై దృష్టిసారించాలి. డగ్ర్ దొరక్కపోతే ఆత్మహత్య ఆలోచనలకు వెళ్లిపోతారు. ప్రతి ఒక్కరినీ అనుమానించడం, పరిస్థితులను సక్రమంగా అర్థం చేసుకోలేకపోవడం, ఎదుటివారి మాటలను అంచనా వేయలేకపోవడం, సెల్ఫ్ జడ్జిమెంట్ చేకపోవడం దీని ప్రధాన లక్షణాలు. – డాక్టర్ బీ వెంకట నాని కుమార్, జనరల్ సర్జన్ (చదవండి: ఇండో వెస్ట్రన్ అంటే ఇష్టం: అనుపమ పరమేశ్వరన్) -
ఇండో వెస్ట్రన్ అంటే ఇష్టం: అనుపమ పరమేశ్వరన్
‘ఫ్యాషన్ అంటే మనల్సి మనం అందంగా తీర్చిదిద్దుకోవడం.. సౌందర్యంగా కనిపిస్తూనే సౌకర్యంగా ఉండటం మరింత బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఈ మధ్యనే సరికొత్త కథాంశంతో విడుదలైన ‘పరదా’ సినిమాలో మగువల భావోద్వేగాలను, సామాజిక పరిస్థితులను తెరకెక్కించాం. ఇది ప్రభావవంతమైన కథాంశం, నటన పరంగానూ అందరి ప్రశంసలు పొందింది.’ అంటూ చెప్పుకొచ్చారు అందాల తార అనుపమ పరమేశ్వరన్. నగరంలోని బంజారాహిల్స్ వేదికగా స్వదేశీ ఫ్యాషన్ బ్రాండ్ ‘బిబా’ ఫ్లాగ్ప్ స్టోర్లో సోమవారం సందడి చేశారు. ఈ వేదికపై నూతనంగా రూపొందించిన ఫెస్టివ్ కలెక్షన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనుపమ ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఫ్యాషన్ ట్రెండ్స్, తదుపరి సినిమాల విశేషాలు ఆమె మాటల్లోనే..! హైదరాబాద్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న ఫ్యాషన్ హంగులను చూస్తే సంతోషంగా అనిపిస్తుంది. వ్యక్తిగతంగా ఇండో వెస్ట్రన్ ఫ్యాషన్ వేర్ అంటే నాకు చాలా ఇష్టం. ఇదే నా స్టైల్ స్టేట్మెంట్. ముఖ్యంగా కాటన్, స్మూత్కాటన్ ఇష్టపడతాను. గ్రాండ్ లుకింగ్ కన్నా కంఫర్ట్ ముఖ్యం. మన మూలాల్లోని ఫ్యాబ్రిక్, సంస్కృతి–అధునాతన డిజైనింగ్ సమ్మిళిలితం చేస్తే ఎక్కువగా ఆకర్షిస్తుంది. వాటిని ప్రోత్సహిండం ఇష్టం. బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ అమ్మాయిలకు అనువుగా ఉంటుంది. సందర్భాన్ని బట్టి శారీస్, ఈవెంట్స్ను బట్టి డ్రెస్ వేసుకుంటా. మహిళల ఫ్యాషన్ వేర్ అంతర్గత శక్తిని, మానసిక స్థితిని తెలియజేస్తుందని నమ్ముతాను. నాకు రెడ్ కలర్, మస్టర్డ్ యెల్లో రంగుల దుస్తులే నచ్చుతాయి. రెడ్ అంటే పవర్ఫుల్.. నేను ఎక్కువ షాపింగ్ చేయను. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్లినప్పుడు కచి్చతంగా షాపింగ్ చేస్తుంటాను. సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి షూటింగ్స్ వెళ్లినప్పుడు ఎయిర్పోర్ట్లో, సందడి లేని ఇతర షాపింగ్ ప్రదేశాల్లో కొనుగోలు చేస్తాను. ‘డిఫరెంట్ బై డిజైన్’ అనే ఫిలాసఫీని ప్రతిబింబించేలా బిబా అందిస్తున్న దసరా కలెక్షన్ మన సాంస్కృతిక మూలాలను గుర్తుచేస్తుంది. వరుస షూటింగ్స్తో బిజీ.. సినిమాల పరంగా తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్న తీరు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ వాతావరణంలో సరికొత్త అనుభూతిని పొందుతాను. ఈ మధ్యే తెలుగులో నా ‘పరదా’ చిత్రం విడుదలైంది. ప్రస్తుతం బిజీ షెడ్యూల్ కొనసాగుతోంది. మరికొద్ది రోజుల్లో ‘కిష్కిందపురి’ సినిమా విడుదల కానుంది. కిష్కిందపురి తరువాత ‘బైసన్’ కూడా విడుదలకు సిద్ధమౌతోంది. ఈ రెంటితో పాటు ‘భోగీ’ అనే చిత్రంలో నటిస్తున్నాను. ఇది షూటింగ్ పూర్తి కానుంది. మరో తెలుగు సినిమాలోనూ నటిస్తున్నాను. ఇవి కాకుండా మలయాళంలో మరో రెండు సినిమాలు చేస్తున్నా. -
వయసు పెరిగినా..నోరు బోసి పోదు..!
వృద్ధులకు వయసు పరంగా వచ్చే అనేక సమస్యలతో పాటు పళ్ల సమస్యలూ తప్పవు. వృద్ధుల పళ్లకు సంబంధించిన వైద్యశాస్త్రాన్ని ‘జీరియాట్రిక్ డెంటిస్ట్రీ’ లేదా ‘జీరియోడాంటిక్స్’ అంటారు. ఇందులో వృద్ధుల పళ్లకు వచ్చే వైద్య, ఆరోగ్య సమస్యలు, వాటి నిర్ధారణ, చికిత్స వంటి అంశాలు ఉంటాయి. పళ్లు కోల్పోకుండా కేవలం వాటికి వచ్చే సమస్యలను మాత్రమే పోగొట్టుకోవడం ఎలాగో చెప్పే కథనమిది. ఇటీవలి వైద్యవిజ్ఞానం బాగా పురోగతమించింది. దాంతో గతం సగటుతో పోలిస్తే ప్రజల సగటు ఆయుర్దాయమూ బాగా పెరిగింది. ప్రజలు చాలాకాలం జీవిస్తున్నారు. దాంతో సమాజంలో వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఒకనాడు ముసలితనానికి బోసినోరు ఒక ప్రతీక. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. జీవితంలో కష్టపడాల్సినంత పడి... తమ వృద్ధాప్యాన్ని ఒక సంతోషకరమైన మజిలీగా చేసుకుంటూ ఇకపై జీవితాన్ని అనుభవించాల్సిందంతా ఈ వయసునుంచే అనే భావన పెరగడంతో ఆ వయసునూ ఆనందమయం చేసుకుంటున్నారు. ఫలితంగా ఒకనాడు పళ్లూడిపోయే వృద్ధులకు బదులు మంచి పలువరస ఉన్నవారే ఎక్కువగా కనబడుతున్నారు. ఎందుకంటే... ఎంతగా వయసు పైబడినప్పటికీ పళ్లు, చిగుర్ల సమస్యలు రాకుండా చూసుకుంటే పళ్లు ఎన్నాళ్లైనా గట్టిగానే ఉంటాయి. ఇందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దాం.వృద్ధాప్యంలో వచ్చే పంటి సమస్యలు/కారణాలు సాధారణంగా వయసు పెరుగుతున్నకొద్దీ పళ్లు కూడా వదులైపోతాయన్నది చాలామందిలో ఉండే ఓ అ΄ోహ. ఆ వయసులో బీపీ, షుగర్ లాంటి సమస్యలుంటే పళ్లు వాటంతట అవే ఊడి΄ోతాయని అనుకుంటారు. ఆ పరిస్థితి కోసం మానసికంగా సిద్ధపడుతుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. పళ్లకు లేదా చిగుర్లకు సంబంధించన జబ్బులు వస్తేనే పళ్లు ఊడి΄ోవడమో లేదా వదులై΄ోవడమో లేదా తీసేయాల్సిన పరిస్థితి ఎదురుకావడమో జరుగుతుంది. నోటి జబ్బులు రానంతవరకు పళ్లు జీవితకాలం దృఢంగానే ఉంటాయి.వృద్ధాప్యంలో దంతాలకు వచ్చే సమస్యలు...సాధారణంగా వృద్ధాప్యంలో వచ్చే కొన్ని దంత సమస్యలు పంటిమూలంలో వచ్చే పిప్పిపళ్లు (రూట్కేరిస్), పళ్లు అరిగి΄ోవడం (అట్రిషన్), చిగుర్లవ్యాధులు (పెరియోడాంటల్ డిసీజ్), పళ్ల మధ్య అక్కడోపన్ను, ఇక్కడోపన్ను కోల్పోవడం కారణంగా వచ్చే సందులు (ఎడెంట్యులిజమ్), పైవరస పళ్లు, కిందివరస పళ్ల గట్టిదనంలో నాణ్యత లేకపోవడం (పూర్ క్వాలిటీ ఆఫ్ అల్వియొలార్ రిడ్జ్), కట్టుడుపళ్లు సరిగా అమర్చకపోవడం, దవడల పక్కన ఉండే మృదువైన మ్యూకోజాలో పుండ్లు, నోటిలో పుండ్లు, నోటిలో తడి తక్కువ కావడం (గ్జీరోస్టోమియా), నోటి క్యాన్సర్లు వంటివి.చేజేతులారా తెచ్చిపెట్టుకునే సమస్యలు...ఇక మరికొన్ని యౌవనంలో ఉన్నప్పుడు మనలో కొందరు వారంతట వారే చేజేతులారా తెచ్చిపెట్టుకునేవే ఎక్కువ. ఉదాహరణకు వయసులో ఉన్నప్పుడు పొగతాగడం, పొగాకు నమలడం, పాన్పరాగ్, గుట్కా, వక్కపొడి నమలడం వంటి పంటికి చేటు చేసే అలవాట్లు. ఈ అలవాట్లను మానకపోవడం, అలా నిర్లక్ష్యం చేస్తూ పోవడం వల్ల వృద్ధాప్యంలో పళ్లు తీవ్రంగా దెబ్బతింటాయి.వృద్ధాప్యంలో వ్యాధినిరోధక శక్తి తగ్గడంతో... యౌవనంతో పోలిస్తే వృద్ధాప్యదశలో వ్యాధినిరోధకశక్తి ఎంతోకొంత తగ్గుతుంది. కాబట్టి అప్పటివరకూ నిద్రాణంగా ఉన్న కొన్ని సమస్యలు పళ్లపై ప్రభావం చూపుతాయి.వృద్ధాప్యంలో వాడుతూ ఉండే మందుల కారణంగా...పెద్దవయసు వచ్చేనాటికి చాలామందిలో హై–బీపీ, షుగర్ సమస్యలు కనిపిస్తాయి కాబట్టి వాటికోసం మందులు వాడుతుంటారు. ఇలా... బీపీ, షుగర్లను అదుపులో పెట్టేందుకు వాడే మందులు, మానసిక సమస్యలకోసం వాడే యాంటీసైకోటిక్, యాంగ్జైటీని తగ్గించడం కోసం వాడే యాంగ్జియోలైటిక్స్... ఇలాంటి మందుల కారణంగా నోటిలో లాలాజల స్రావాలు తగ్గుతాయి. దాంతో అవి నోటిని పొడిబారిపోయేలా చేస్తాయి. ఈ అంశం కూడా దంతసమస్యలకు కారణమవుతుంది. వృద్ధాప్యంలో సంపాదన లేమితో : వృద్ధాప్యంలో చాలామందికి మునుపు ఉన్నంత సంపాదన ఉండదు. ఇలా తమకు ఉండే ఆదాయవనరులు తగ్గిపోవడం, దానికి తోడు కుటుంబసభ్యుల నుంచి అందాల్సినంత ప్రోత్సాహం ఉందక΄ోవడమనే అంశం కూడా దంత సమస్యలకు ఓ పరోక్ష కారణమవుతుంది. పైన పేర్కొన్న అనేక సమస్యల కారణంగా పళ్లు వదులైపోవడంతో వృద్ధాప్యంలో ఆహారం తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతాయి. అంతేకాదు.. పళ్ల వల్లనే మానవుల్లో ఉచ్చారణ స్పష్టంగా ఉంటుంది. పళ్లలో సమస్యల కారణంగా భాషలో స్పష్టతా లోపించి కమ్యూనికేషన్కూ ఇబ్బందులు కలుగుతాయి.వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలూ – పళ్లపై వాటి ప్రభావాలుడయాబెటిస్... పళ్ల సమస్యలు : ఈ రెండు అంశాలూ ఒకదాని కారణంగా మరొకటి కనిపిస్తూ ఉంటాయి. అంటే డయాబెటిస్ ఉన్నవారిలో పళ్లూ, చిగుళ్ల సమస్యలు ఎక్కువ. అలాగే పళ్లూ చిగుళ్ల సమస్యలు ఉన్నవారిలో... ఆ అంశాలు రక్తంలోని గ్లూకోజ్ పెరిగేలా చేసి, డయాబెటిస్కు కారణమవుతాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారూ పంటి జబ్బుల విషయంలో జాగ్రత్తపడాలి. లేనివారూ పళ్లను శుభ్రంగా ఉంచుకుని డయాబెటిస్ను రాకుండా నివారించుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారికి సీరియస్ చిగుర్ల సమస్యలు, దంతక్షయం, లాలాజల గ్రంధులు సరిగా పనిచేయకపోవడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, లైకెన్ప్లానస్, లైకెనాయిడ్ రియాక్షన్, నోటి ఇన్ఫెక్షన్లు అంత తేలిగ్గా తగ్గకపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి.నివారణకు సూచనలివి : పళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఆర్నెల్లకోమారు దంతవైద్యుడిని కలిసి క్లీనింగ్ చేయించుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో గ్లూకోజ్ ΄ాళ్లను సమర్థంగా నియంత్రించుకుంటూ ఉండేలా తగిన మందులు తీసుకోవాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవలి. డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్లు సూచించినవిధంగా తాము తీసుకోవాల్సిన ఆహారాన్ని తీసుకోవాలి.గుండెజబ్బులూ... చిగుర్ల వ్యాధులు...ఇటీవలి కొత్త పరిశోధనల వల్ల నోటి ఆరోగ్యానికీ, గుండెజబ్బులకూ దగ్గరి సంబంధం ఉందని తేలింది. సాధారణంగా చిగుర్ల వ్యాధి ఉన్నవాళ్లలో... తమకు పెద్దగా నొప్పి తెలియకుండానే పంటికింద ఉండే గులాబిరంగు చిగురుభాగం నెమ్మదిగా కిందికి కిందికి తగ్గుతూపోతుంది. కానీ పంటి కింది ఎముక భాగం కూడా నాశనమయ్యే దశకు చేరినప్పుడు, అక్కడ చేరిన బ్యాక్టీరియా రక్తప్రవాహంలో కలుస్తుంది. దాంతో అది గుండె కండరాన్ని దెబ్బతీసి, గుండెజబ్బులకూ దారితీసే ప్రమాదం ఉందని ఇటీవలి అనేక పరిశోధనల వల్ల తేలింది. ఇక పంటి మీద ఉండే పాచి/గారలో ఉండే సూక్ష్మక్రిములు రక్తనాళాలల్లోకి చేరడం వల్ల రక్తనాళాలు సన్నబడి కూడా రక్తప్రవాహ సంబంధమైన (వాస్క్యులార్ డిసీజెస్) రావచ్చు. పెద్దవయసువారంతా తెలుసుకోవాల్సిన మరో అంశం ఏమిటంటే దీర్ఘకాలంగా ఉండే చిగుర్ల వ్యాధుల వల్ల అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు ముప్పు కూడా ఉంటుంది.నివారణకు సూచనలివి : ఈ సమస్య నివారణకు చేయాల్సిందల్లా సరైన రీతిలో బ్రషింగ్, మన ఆహారాన్ని బాగా నమిలి మింగడం. ఈ రెండూ శ్రద్ధగా చేస్తూ ఉంటే... పెద్దవయసు వారిలో చాలావరకు గుండెజబ్బులనూ, గుండెపోటునూ నివారించవచ్చు. పక్షవాతం – పంటి జబ్బులు: పక్షవాతానికి, పంటిజబ్బులకూ నేరుగా సంబంధం లేకపోయినా... గుండెజబ్బులకు ఉన్న సంబంధమే ఇక్కడా పనిచేస్తుంటుంది. ఉదాహరణకు పంటికి పట్టే గార/పాచి (ప్లాక్) వంటివి, పంటి జబ్బుల వల్ల రక్తప్రవాహంలో పేరుకుపోయే సూక్ష్మక్రిముల వల్ల రక్తనాళాలు సన్నబడటం, రక్తనాళాల్లో ప్లాక్ పేరుకుని అది రక్తం సాఫీగా ప్రవహించకుండా అడ్డుపడటం జరుగుతాయన్న విషయం తెలిసిందే. ఇదే ప్రమాదం గుండెకు సంబంధించిన ధమనుల విషయంలో జరిగితే అది గుండెపోటుకు దారితీస్తుంది. ఒకవేళ అదే మెదడుకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల (ధమనుల) విషయంలో జరిగితే అది పక్షవాతానికి దారితీసే ప్రమాదముంటుంది. నివారణకు సూచనలివి: పంటి జబ్బులను నివారించుకోవడం లేదా నిరోధించుకోవడం; పంటి సమస్యలను దూరం చేసుకోవడం; పంటి శుభ్రతను పాటించడం (డెంటల్ హైజీన్) వల్ల ఒకవైపు గుండెజబ్బులనూ మరోవైపున పక్షవాతాన్నీ నివారించుకోగలమని గుర్తుంచుకోవాలి.చివరగా... ఒకవేళ నివారణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోయినవారు, దురదృష్టవశాత్తూ తమ పళ్లు కోల్పోయినప్పటికీ... వాళ్ల దవడ ఎముక ఎంత సన్నగా ఉన్నప్పటికీ, కృత్రిమ దంతాలు అమర్చడానికి ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా మనకు అందుబాటులో ఉన్న నేటి డెంటిస్ట్రీలో అందుబాటులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కృత్రిమ దంతాలను అమర్చడం, ఎలాంటి దంతసమస్యలకైనా పరిష్కారాలను అందించడమూ పూర్తిగా సాధ్యమయ్యే విషయమే.ఆర్థరైటిస్... పంటి సమస్యలుదాదాపుగా 65 ఏళ్లుదాటిన 50 శాతం మందిలో ఎముకలకు సంబంధించిన జబ్బు అయిన ఆర్థరైటిస్ కనపడుతుంది. దీనివల్ల ఎముకల మధ్య రాపిడి, ఎముకల సాంద్రత తగ్గి, పెళుసుగా మారడం, ఫలితంగా అవి తేలిగ్గా విరిగి΄ోవడంలాంటివి తరచూ జరుగుతుంటాయి. ఈ జబ్బులో కూడా ఎముకలు, కీళ్ల మధ్య నొప్పిని నివారించడానికి నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ఎస్ఏఐడీ మందులు) వాడటం సాధారణం. ఈ ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారికి సాధారణంగా మెథోట్రెక్సేట్ అనే మందులను ఉపయోగిస్తారు. ఇవన్నీ నోటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేవే. ఉదాహరణకు మెథోట్రెక్సేట్ మందులు వాడేవాళ్ల నోళ్లలో పుండ్లు (అల్సర్స్) వస్తుంటాయి. ఇక రుమటాయిడ్ ఆర్థరైటిస్కు వాడే గోల్డ్ సోడియమ్ థయోమెలనేట్ అనే మందు వల్ల జింజివైటిస్ అనే చిగుర్లకు వచ్చే ఇన్ఫెక్షన్, గ్లాసైటిస్ అనే నాలుక ఇన్ఫెక్షన్, స్టొమటైటిస్ అనే నోటి ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇక పై మందుల వాడకం వల్ల రక్తంలోని తెల్లరక్తకణాలు తగ్గడం, ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గడం వంటి దుష్పరిణామాలూ ఉంటాయి. కాబట్టి వాటి వల్ల రోగనిరోధకశక్తి తగ్గడం, పంటి చిగుర్ల నుంచి రక్తస్రావం వంటి పరిణామాలూ కనిపిస్తుంటాయి. లాలాజల గ్రంథులు...నోటి సమస్యలు నోటిలో ఉరుతూ ఉండే లాలాజలం (సలైవా) వల్ల నోరు ఎప్పుడూ తడిగా ఉంటుంది. ఇది నిత్యం నోటిలో ఉండే ఆహారపదార్థాలను కడిగేస్తూ ఉంటుంది. నోరు పొడిబారిపోవడం అనే లక్షణం డయాబెటిస్ బాధితులతో బాటు, కొన్ని వ్యాధుల్లో మందులు తీసుకునేవారికి, తల, గొంతు క్యాన్సర్ కారణంగా రేడియేషన్ చికిత్స తీసుకున్నవారికి లాలాజలం తగ్గుతుంది. నోటిలో తగినంత లాలాజలం లేకపోవడం వల్ల బ్యాక్టీరియా పెరిగిపోతుంది. నోరు పొడిబారిపోవడం దీర్ఘకాలంపాటు సాగితే నోటిలోని మృదుకణజాలం దెబ్బతిని, నొప్పి వస్తుంది. దాంతో దంతక్షయం (టూత్ డికే), చిగుర్ల వ్యాధులకు అవకాశాలు పెరుగుతాయి.కొన్ని సూచనలూ – మరికొన్ని చికిత్సలు... లాలాజల స్రావాలు తగ్గి తరచూ నోరు పొడిబారుతుంటే తక్షణం దంతవైద్యులను కలవాలి. వారు కొన్ని పుక్కిలించే ద్రావణాలు, పైపూత (టాపికల్)గా వాడదగ్గ ఫ్లోరైడ్ ద్రావణాలను సూచిస్తారు. కొన్ని చక్కెర లేని గమ్స్, మింట్స్ వంటివి నోటిలో తగినంత లాలాజలం ఊరేలా చేస్తాయి. దాంతోపాటు తరచూ కొద్దికొద్దిగా నీళ్లు తీసుకుని గుటక వేస్తుండటం, కరిగే ఐస్ను చప్పరించడం కూడా నోరు పొడిబారడాన్ని తగ్గిస్తాయి. ఇలా నోరు పొడిబారేవాళ్లు కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీలాంటి డ్రింక్స్ను చాలా తక్కువగా తీసుకోవడం, ఆల్కహాల్ను మానివేయడం మేలు.హైబీపీ – పంటిసమస్యలుఈ రెండు అంశాలకూ మధ్య సంబంధం ఉంది. హై–బీపీతో బాధపడేవారిలో వాళ్ల అధిక రక్తపోటు అనే అంశం గుండెజబ్బులకూ, గుండెపోటుకు దారితీయకుండా కొన్ని మందులు ఇస్తుంటారన్న విషయం తెలిసిందే. పంటి సమస్యలు ఉన్నవారికి ఇచ్చే నాన్స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ఎన్ఏఐడి మందుల) వల్ల... హై–బీపీ ఉన్నవారు తాము తీసుకునే మందుల ప్రభావం తగ్గుతుంది. దీంతోపాటు మరో ప్రమాదమూ ఉంది. హై–బీపీ ఉన్నవారికి ఇచ్చే మందుల వల్ల నోటిలో తడి తగ్గి అది జీరోస్టోమియా అన్న కండిషన్కు దారితీస్తుంది. ఈ జీరోస్టోమియా కూడా పంటి సమస్యలను పెంచడమే కాకుండా... పలువరసలో అమర్చిన కృత్రిమ దంతాలకూ, స్క్రూల వంటి అనుబంధ అంశాలకూ నోటిలోని మృదుకండరాలకూ మధ్య ఘర్షణ (ఫ్రిక్షన్)ను పెంచి మరిన్ని పంటి సమస్యలకు దారితీసేలా చేస్తుంది. క్యాల్షియమ్ బీటా బ్లాకర్స్ అనే మందులు వాడే పది శాతం మందిలో దాని తాలూకు సైడ్ఎఫెక్ట్గా జింజివల్ హైపర్ప్లేసియా అనే చిగుర్లవ్యాధి కనిపిస్తుంది. ఈ వ్యాధి మందులు మొదలుపెట్టిన కొన్ని నెలల్లోనే ఇది కనిపిస్తుందని అనేక పరిశీలనల్లో తేలింది.నివారణకు సూచనలివి...హైబీపీకి మందులు వాడేవారు తమకు ఎదురైన అనుభవాన్ని తమ ఫిజీషియన్ను వివరించి, తరచూ తమ దంతవైద్యులను కూడా కలిసి తమ మందులను వారిచేత కూడా సమీక్షింపజేసుకుంటూ ఉండాలి. సరైన నోటి శుభ్రత పాటిస్తూ డయాబెటిస్ను సాధ్యమైనంతవరకు నివారించుకుంటూ ఉండటం మేలు. డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి, సీనియర్ డెంటల్ స్పెషలిస్ట్ (చదవండి: వర్షం సైతం ఆ నృత్యాన్ని అడ్డుకోలేకపోయింది..!) -
sagubadi: గడ్డికి నిప్పు పెడితే ఏమవుతుందో తెలుసా?
పంట కోసిన తర్వాత గడ్డి లేదా కట్టెకు అక్కడే నిప్పు పెట్టేస్తుంటాం కదా.. పొగ వల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని మనకు తెలుసు. అయితే, అంతకుమించి ఏమి నష్టం జరుగుతుందో మనకు తెలియదు. ‘సైన్స్ ఆఫ్ టోటల్ ఎన్విరాన్మెంట్’ జర్నల్లో ఇటీవల అచ్చయిన ఒక అధ్యయన పత్రం ఈ విషయాలను లోతుగా చర్చించింది. గడ్డిని కాల్చేస్తే ఆ భూమిలోని సూక్ష్మజీవరాశి జీవవైవిధ్యం నశించి, పొలం పర్యావరణ వ్యవస్థల సహజ క్రియలకు విఘాతం కలుగుతుందని ఈ అధ్యయనం వివరించింది. భారత్ సహా అనేక దేశాల్లోని పొలాల్లో గడ్డిని కాల్చటం వల్ల భూమికి, రైతుకు ఎలా నష్టం జరుగుతున్నదో తెలుసుకోవటానికి 250 అధ్యయన ఫలితాలను క్రోడీకరించి విశ్లేషించటం విశేషం.గడ్డిని తగులబెట్టినప్పుడు 33.8–42.2 డిగ్రీల సెల్సియస్ వరకు మట్టి ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఆ వేడికి మట్టిలోని నత్రజని నశిస్తుంది. సేంద్రియ పదార్థం తగ్గిపోతుంది. అంగుళం లోతు వరకూ ఉండే మట్టిలోని అపారమైన సూక్ష్మజీవులు చనిపోతాయి. అంతేకాదు, చీడపీడల బెడద పెరుగుతుంది. ఎరువు మరింత ఎక్కువ వేయాల్సి వస్తుంది. పొలంలో కనిపించే పురుగులను ఏరుకు తినేసే సాలీళ్లు, ఆరుద్ర పురుగులు, కప్పల సంఖ్య గడ్డీ గాదాన్ని తగులబెట్టిన పొలాల్లో పెద్దగా కనిపించవు. మంటపెట్టినప్పుడు వెలువడే అధిక ఉష్ణోగ్రత మట్టి ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. మట్టిలో ఉండే పోషకాలను మొక్కల వేర్లు తీసుకోగలిగే రూపంలోకి మార్చి అందించే అద్భుతమైన సహజ పోషణ వ్యవస్థ దెబ్బతింటుంది. గడ్డీగాదాన్ని కాలబెట్టకుండా నేలపై కప్పి ఆచ్ఛాదన చేయటం ఎన్ని విధాలా మేలో ఈ అధ్యయనం తేటతెల్లం చేసింది. -
Sagubadi: ఒక్కసారి నాట్లు...ఆరుసార్లు కోతలు!
ఒక్కసారి నాట్లేసి మూడేళ్లలో వరుసగా ఆరు సార్లు పంట కోసుకునే రోజులు రానున్నాయి. ఇలాంటి వరిని ‘పెరెన్నియల్ రైస్’(పీఆర్) అంటున్నారు. ఈ విలక్షణ వరి వంగడాలను రూపొందించుకున్న చైనా ఏడేళ్లుగా సాగు చేస్తోంది. ఉత్పత్తి ఖర్చులు 40% మేరకు తగ్గుతాయి. నికరలాభం పెరుగుతుంది. పనిలో పనిగా భూసారం, జీవవైవిధ్యం కూడా పెరుగుతుంది. చైనా తదితర దేశాల్లో ఏటేటా పీఆర్ వరి సాగు విస్తరిస్తోంది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) కూడా దీనిపై తాజాగా దృష్టి సారించింది. ‘ఫార్మింగ్ సిస్టం’ జర్నల్ తాజా సంచికలో భారతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఐఆర్ఆర్) శాస్త్రవేత్త డాక్టర్ విజయకుమార్ షణ్ముగం రాసిన అధ్యయన పత్రం ఆధారంగా ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనంఖర్చులు పెరిగిపోవటం, ఆదాయం తగ్గిపోవటం, నీటి అవసరాలు పెరగటం, భూసారం క్షీణించటం, హరితగృహ వాయువులతో పర్యావరణానికి తీరని హాని జరగటం.. ఇవీ ప్రస్తుతం మన దేశంలో వరి వ్యవసాయాన్ని వేధిస్తున్న సవాళ్లు. దాదాపు ఈ సమస్యలన్నిటికీ ఏకకాలంలో చెక్ పెట్టే అద్భుతమైన ‘పెరెన్నియల్ రైస్’ వంగడాలను చైనా శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ వరి వంగడాలను చైనాలో రైతులు ఏడేళ్లుగా సాగు చేస్తున్నారు. సాధారణంగా వరి పంటను ఒక్కసారి నాటితే ఒక్కసారే పంట చేతికి వస్తుంది. తర్వాత సీజన్లో మళ్లీ దున్ని, దమ్ము చేసి, నాట్లు వేసుకుంటున్నాం. ఈ వంగడం ఒక్కసారి నాటితే చాలు. మొత్తంగా చూస్తే పీఆర్ వరుసగా 6 సీజన్లలో తిరిగి పెరిగే వరి పంటను కోసుకోవచ్చు. పటిష్టంగా ఉండే కుదుళ్లు పంట కోసిన తర్వాత మళ్లీ చిగురించి, పిలకలన్నీ మొదటి పంటలాగే ఏపుగా పెరగటం పీఆర్23 వంగడం ప్రత్యేకత. ఒక్కసారి నాట్లు వేస్తే చాలు.. ఇక తర్వాత ప్రతి పంట కాలంలోనూ మళ్లీ మళ్లీ పొలాన్ని దున్ని, నాట్లు వేయాల్సిన అవసరం ఉండదు. ఈ వరి మొక్కల వేర్లు సాధారణ రకాల (అడుగు) మొక్కల వేర్ల కన్నా బలంగా ఉండి రెట్టింపు (2 అడుగుల) లోతుకు చొచ్చుకెళ్తాయి. యున్నన్ యూనివర్సిటీ ఆవిష్కరణచైనాలోని యున్నన్ రాష్ట్రంలోని ‘యున్నన్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ (వైఏఏఎస్)’ పెరెన్నియల్ రైస్ వంగడాలను రూపొందించింది. ఒరిజా సటివ అనే సాధారణ వరి రకాన్ని ఒరిజా సాంగిస్తామినట అనే ఆఫ్రికా అటవీ జాతి వరి మొక్కతో ఎంబ్రయో రెస్క్యూ టెక్నిక్ను ఉపయోగించి సంకరం చేసి ‘పెరెన్నియల్ రైస్– పీఆర్23’ వంగడాన్ని రూపొదించింది. అధిక దిగుబడి, గింజ నాణ్యత గల పీఆర్24, పీఆర్25, పీఆర్101, పీఆర్107 వంగడాలను 2020లో విడుదల చేసింది.17 దేశాల్లో ప్రయోగాత్మక సాగు 2018 నుంచి దక్షిణ చైనాలో 44,752 మంది చిన్న రైతులు 15,333 హెక్టార్లలో పీఆర్ వంగడాలను నీటిపారుదల సదుపాయంతో సాగు చేస్తున్నారు. వీరంతా ఆర్థికంగా, పర్యావరణ పరంగా ప్రయోజనాలు పొందుతున్నారని యున్నన్ యూనివర్సిటీ ప్రకటించింది. ఇంటర్నేషనల్ పెరెన్నియల్ రైస్ కొలాబరేషన్ తోడ్పాటుతో యున్నన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని 17 దేశాల్లో విభిన్న పర్యావరణ పరిస్థితుల్లో సాగవుతున్న పీఆర్ వంగడాలు స్థిరంగా మెరుగైన దిగుబడిని ఇస్తు న్నట్లు యున్నన్ యూనివర్సిటీ తెలిపింది. వరి గడ్డితో ఆచ్ఛాదనకోతల తర్వాత గడ్డిని సాళ్ల మధ్య ఆచ్ఛాదనగా వేస్తున్నారు. దీంతో పోషకాలు పునర్వినియోగమవుతూ భూసారం మెరుగవుతోంది. నేలలో సూక్ష్మజీవరాశి జీవవైవిధ్యం పెరుగుతోంది. కలుపు సమస్య తగ్గుతోంది. రసా యనిక పురుగుమందులు, కలుపుమందుల అవ సరం తగ్గుతున్నది. అవసరం మేరకు ఏడాదంతా కొద్ది కొద్దిగా నీరు ఇచ్చినప్పటికీ, మొత్తంగా సాగు నీటి వాడకం తగ్గుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. 29% తగ్గిన ఉత్పత్తి వ్యయంప్రతి ఏటా నాట్లు వేసే పద్ధతిలో కన్నా ఒక్కసారి నాట్లు వేసి మూడేళ్లలో మొత్తం ఆరు పంటలు కోసుకునే ఈ పద్ధతిలో అన్ని ఖర్చులూ కలిపి ఉత్పత్తి వ్యయం 29% తగ్గిందని నాలుగేళ్ల అధ్యయనంలో తేలింది. మొదటి సీజన్లో అన్ని ఖర్చులూ మామూలే. రెండో సీజన్ నుంచి 54% వరకు కూలి ఖర్చులు ఆదా అవుతాయి. మొత్తం మూడేళ్లలో ఆరు పంట సీజన్లకు గాను.. 5 పంట సీజన్లలో సీజన్కు 68–77 పనిదినాల అవసరం తగ్గుతుంది. వాతావరణాన్ని కలుషితం చేసే యంత్రాల వాడకమూ తగ్గుతుంది. పీఆర్23 ధాన్యం మిల్లింగ్ సామర్థ్యం 73% నమోదైంది. ప్రతి ఏటా నాట్లు వేసే పద్ధతి కన్నా పీఆర్ పద్ధతిలో దిగుబడి 8.8% తక్కువైనప్పటికీ, రైతుకు నికరాదాయం 235% పెరిగిందని అధ్యయన పత్రం తెలిపింది. మన సగటు దిగుబడి కన్నా ఎక్కువేఒకసారి పంట కోసిన తర్వాత తిరిగి పెరగటంలో పీఆర్23 వంగడం పనితీరు మెరుగ్గా ఉందని గుర్తించారు. దీని పిలకలు 90–98% తిరిగి పెరిగాయి. అందువల్ల వాణిజ్యపరమైన సాగుకు ఈ వంగడాన్ని ఉపయోగిస్తున్నారు. 119 రోజుల్లో పీఆర్23 పంట కోతకు వస్తోంది. తొలి కోతలో హెక్టారుకు 6.8–7.5 టన్నుల ధాన్యం దిగుబడిని ఇస్తుండగా, తర్వాత కోతల్లో 5.4–6.3 టన్నుల వరకు దిగుబడి వస్తోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భారత్లో సగటు వరి ధాన్యం దిగుబడి హెక్టారుకు 4.2 టన్నులు మాత్రమే. కాబట్టి మన రైతులకు ఇది ఉపయోగకరమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముందున్న సవాళ్లుపీఆర్ వరి సాగులో ప్రయోజనాలతో పాటు సవాళ్లు కూడా ఉన్నాయి. మన దేశపు వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన పీఆర్ వరి వంగడాలను రూపొందించుకోవాలి. పంట కోసిన తర్వాత తిరిగి పంట చిగురించటం కోసం నీరు పెడతాం. మొలకలు రాకముందే మోళ్లు కుళ్లిపోయే అవకాశం ఉంది. మొలకల కన్నా కలుపు వేగంగా పెరిగే అవకాశం ఉంది. గడ్డిని ఆ పొలంలోనే ఆచ్ఛాదనగా వేయటం వల్ల కలుపు కొంత అదుపులో ఉన్నప్పటికీ, కలుపు మందులు వాడక తప్పదు. మోళ్లలో మిగిలిన రోగకారకాలు చీడపీడల బెడదను పెంచవచ్చు. వేసవి అత్యధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల్లో పంటను రక్షించుకోవటం అంత తేలిక కాదు. సవాళ్లను అధిగమించడానికి ప్రభుత్వం నిధులను విరివిగా వెచ్చించి పరిశోధనలను వేగంగా కొనసాగించాలి. అన్నీ సజావుగా జరిగితే కొద్ది సంవత్సరాల్లో భారతీయ పెరెన్నియల్ రైస్ వంగడాలు మన రైతులకు అందుబాటులోకి రావచ్చు. -
మూరెడు పూల మూల్యం లక్షకు పైగానే!
మీరు ఆస్ట్రేలియా వెళుతున్నారా? అయితే అక్కడి చట్టాలు, నియమ నిబంధనల గురించి కాస్తంత తెలుసుకుని ఆ తర్వాతే వెళ్లండి. ఎందుకంటే అక్కడ బ్యాగులో పూలు పెట్టుకోవడం కూడా తప్పే! మరీ ముఖ్యంగా బయటి నుంచి పూలు తీసుకువెళ్లామా... భారీ జరిమానా చెల్లించేందుకు సిద్ధపడాల్సిందే. ఇదెక్కడి చోద్యం... అంటారా? చోద్యం కాదు.. నిజం. ఎందుకంటే మలయాళ నటి నవ్యా నాయర్ విషయంలో అదే జరిగింది. ఓనమ్ పండుగ వేడుకలలో పాల్గొనేందుకు ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లిన నవ్య నాయర్, తండ్రి ప్రేమతో ఇచ్చిన మల్లెచెండులో కొంత తలలో పెట్టుకుని మిగిలింది తర్వాత పెట్టుకుందాం లే అని బ్యాగ్లో పెట్టుకుందట. మెల్బోర్న్ విమానాశ్రయంలో ‘కష్టమ్స్’ అధికారులు ఆమె బ్యాగ్ను చెక్ చేసేటప్పుడు ఈ పూలమాల బయట పడిందట. అంతే! వారు ఆమె ఏదో ఘోర నేరం చేసినట్లు చూసింది చాలక, 1980 ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా విధించారట. (మన రూపాయలలో అది దాదాపు లక్షా పద్నాలుగు వేలు) ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం బయటి నుంచి పూలు, మొక్కలు, విత్తనాల వంటివి తీసుకు రావడం నేరమట. ఎందుకంటే బయటినుంచి వచ్చే ఇటువంటి వాటివల్ల అంటువ్యాధులు, వాతావరణ కాలుష్యం ప్రబలే ప్రమాదం ఉందట. అందుకే అలాంటి వాటి విషయంలో చాలా కఠినంగా ఉంటారట. ఈ విషయాన్ని నటి నవ్య సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ‘‘మా నాన్న ఇచ్చిన మూరెడు పూల చెండు మూల్యం అక్షరాలా లక్షా పద్నాలుగు వేల పైమాటే’’ అని కామెంట్ చేసింది. ఆమె పోస్ట్ చేయడం మంచిదే అయింది.. లేకపోతే అది తెలియని మన వాళ్లు తలనిండా పూలు తురుముకుని బ్యాగులో మరికాసిని పెట్టుకుని ఆస్ట్రేలియా వెళితే మన కరెన్సీలో సంచెడు రూపాయలు చలానాగా కట్టాల్సి వస్తుంది! -
అయిదు తరాల అద్భుతం
‘మా ముత్తాత నాన్న... మిలిటరీ; మా ముత్తాత... మిలిటరీ. మా తాత... మిలిటరీ; మా నాన్న మిలిటరీ. మా అన్న మిలిటరీ. కట్... చేస్తే... ఇప్పుడు నేను కూడా మిలిటరీ. మా వంశవృక్షం... ట్రీ... మిలిటరీ’... ఇదేమీ సినిమా డైలాగ్ కాదు. లెఫ్టినెంట్ పారుల్ ధడ్వాల్ గురించి చెప్పే సగర్వ డైలాగ్.చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్ గర్వించిన దగిన సందర్భం. ఈ పరేడ్లో 155 మంది ఆఫీసర్ క్యాడెట్స్ పాల్గొన్నారు. ఇందులో 25 మంది మహిళలు ఉన్నారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వీరు భారత సైన్యంలో విధులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అసలు సిసలు విశేషం... పారుల్ ధడ్వాల్, తమ సైనిక కుటుంబంలో అయిదవ తరానికి చెందిన తొలి మహిళా ఉమెన్ ఆఫీసర్ పారుల్. అద్భుత ప్రతిభ, అంకితాభావంతో రాష్ట్రపతి చేతుల మీదుగా సువర్ణపతకం అందుకుంది.పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాలోని జనౌరీ గ్రామానికి చెందిన పారుల్ అయిదో తరం మిలిటరీ వారసత్వానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. పారుల్ ముత్తాత, తాతలు హర్నామ్సింగ్ (సుబేదార్), ఎల్.ఎస్.ధడ్వాల్ (మేజర్), దల్జిత్సింగ్ ధడ్వాల్ (కల్నల్), నాన్న బ్రిగేడియర్ జగత్ జమ్వాల్ (బ్రిగేడియర్) మిలిటరీలో పనిచేశారు. సోదరుడు ధనుంజయ్ ధడ్వాల్ కెప్టెన్ హోదాలో పనిచేస్తున్నాడు. మిలిటరీలో చేరిన అయిదవ తరానికి చెందిన తొలి మహిళగా తన ప్రత్యేకతను నిలుపుకుంది పారుల్.‘ఇన్ఫినిటీ ప్రైడ్–ఏ లెగసీ ఆఫ్ ఫైవ్ జనరేషన్’ కాప్షన్తో ‘ఎక్స్’ వేదికగా పారుల్ ధడ్వాల్ కుటుంబానికి అభినందనలు తెలియజేసింది ఇండియన్ ఆర్మీ. -
మరణాన్ని ఓదార్పు అడగకు
బతుకులో జ్వాలలు ఉన్నాయని శరీరాన్ని అగ్నికి ఆహుతి ఇవ్వడం పరిష్కారం ఎలా అవుతుంది అంటారు విజ్ఞులు. ‘అన్ని కష్టాలకు విముక్తి చావే’ అనే మాటకు మించిన అవివేకం లేదంటారు కౌన్సెలర్లు. బలవన్మరణం ఆ వ్యక్తిని చనిపోయాక కూడా వెంటాడుతుంది. ఒక అపప్రథగా... కుటుంబాన్ని కష్టాల పాలు చేస్తుంది. మనిషి లేని లోటు ఏం చేసినా తిరిగి రాదు. అటువంటి సమయంలో మరణం ఎందుకు? నిరాశ, నిస్పృహ పరిస్థితులు, సవాళ్లు ఎవరికీ కొత్త కాదు. బతకడమే చేయవలసింది. నిపుణుల సలహాలతో కథనం.అంకెలు దుర్మార్గమైనవి. అవి నిజమైన నష్టాన్ని చూపించవు. కావాలంటే ఈ అంకె– 1,80,000 చూడండి. దీనిని చూస్తే ఏమీ అనిపించదు. కాని మన దేశంలో ప్రతి ఏటా ఇంతమంది ఆత్మహత్యల ద్వారా చనిపోతున్నారు. వీరందరి ఫొటోలను సముద్రతీరం వెంబడి ప్రదర్శిస్తే ఎన్ని కిలోమీటర్ల తీరం కావాలి? అలా ప్రదర్శిస్తే తెలుస్తుంది తీవ్రత,,, ఇంత మంది చనిపోతున్నారా అని. వీరిలో కనీసం 1,20,000 మంది పురుషులు. ఇప్పుడు ఆలోచించండి. పితృస్వామ్య ఆధారితమైన మన సమాజంలో పురుషుడు చనిపోతే ఆ ఇంట్లోని ఎంతమంది సభ్యులు దిక్కులేనివారు అవుతారు. జీవితాలు తల్లకిందులు చేసుకుంటారు. మరెన్నో కష్టాల్లో కూరుకుపోతారు. కరోనా అనో మరోటనో మహమ్మారులను చూసి భయపడటం కాదు. ఈ భూగ్రహాన్ని పీడిస్తున్న అతి పెద్ద మహమ్మారి ఆత్మహత్యే. ప్రతి ఏటా అన్ని దేశాలలో కలిపి 8 లక్షల మంది ఆత్మహత్యల ద్వారా మరణిస్తున్నారు. ఇది ఒక రకంగా కాకిలెక్కే. అసలు లెక్క తెలియక పోవడమే మంచిది. మరో విషయం తెలుసా? ప్రతి మరణానికీ ఒకరు చనిపోవడమే కనిపిస్తుంది... కాని ఆ సమయానికి మరో ఇరవై మంది ఆత్మహత్యాయత్నం చేసి బతికి బయటపడ్డ వాళ్లు ఉంటారు.ఆరుకు ఒకరుప్రస్తుతం మన దేశంలో 15 నుంచి 29 మధ్య వయసు లో ఉన్న పురుషులు ఎక్కువ సంఖ్యలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే దేశంలోని ప్రతి ఆరు ఆత్మహత్యల్లో ఒకటి ఈ ఏజ్ గ్రూప్ నుంచే ఉంది. బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన వయసులో ఆత్మహత్యల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. కారణం–∙చదువు ఒత్తిడి ∙పని చోట పీడన∙బంధాలలో దగా ∙ఆర్థిక సమస్యలు ∙అన్ని జీవన పార్శా్వలలో బెస్ట్గా ఉండమని కోరే సాంఘిక నియమంఇదొక జబ్బుఆత్మహత్యను జబ్బుగా ఎవరూ చూడరు. కాని ఇదొక జబ్బు. పట్టలేని ఉద్వేగం వల్ల, క్షణికావేశం వల్ల, నేను చస్తే అవతలివాళ్లు పశ్చాత్తాపంతో బాధ పడాలి అన్నట్టుగా, సమస్యలకు పరిష్కారమే ఉండదన్న నెగెటివ్ స్వభావం వల్ల, పరువు ప్రతిష్టలకు ఎక్కువ విలువివ్వాలనే భావన వల్ల, నోరు తెరిచి సమస్యను బయటపడేయని స్వభావం వల్ల ఆత్మహత్యలు జరుగుతుంటాయి. తరచి చూస్తే ఇవన్నీ మెదడు చేసే విన్యాసాలే. కెమికల్ రియాక్షన్సే. ఉద్వేగాలను, ఆవేశాలను దాటి వస్తే, మనం పోయి మరొకరిని సాధించడమనే భావన ఎంతటి హాస్యాస్పదమో ఎరుకలోకి వస్తే, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందనే నమ్మకం కలిగి ఉంటే, పరువు ప్రతిష్టలు తర్వాత ముందు ప్రాణం ముఖ్యం అనుకుంటే, ఆత్మాభిమానం కంటే సమస్య నుంచి బయటపడటం ముఖ్యం అనుకుంటే ఆత్మహత్యలు జరగవు. మరో విషయం ఏమిటంటే ఒకరికి ప్రపంచ సమస్యగా ఉండేది ఎదుటివారికి అసలు సమస్యే కాకపోవచ్చు. ‘ఇంత చిన్న విషయానికి చనిపోయాడా?’ అని ఆశ్చర్యపోతారు తప్ప జాలి కూడా చూపరు. మరి ఆత్మహత్య చేసుకోవడం ఎందుకు? ఆత్మహత్య ఆలోచనలు వస్తే జ్వరానికి మాత్ర మింగినట్టు ఆ ఆలోచనలు పోయే కౌన్సిలింగ్ తీసుకోవాలి. మిత్రుల సహకారం తీసుకోవాలి. అవసరమైతే వైద్యుల సలహాతో మందులు వాడాలి. అంతే చేయవలసింది. చనిపోవడం కాదు.భళ్లున తెల్లారుతుందిఈ చీకటి రాత్రి విషమ పరీక్షలు ఎన్ని పెట్టినా ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఉంటే మరునాడు భళ్లున తెల్లారుతుంది. ఆ వెలుతురు దారి చూపిస్తుంది. కొత్త ఊపిరి వస్తుంది. కాని రాత్రే శాశ్వతం అన్నట్టు ప్రాణాలు తీసుకుంటారు కొంత మంది. గత రాత్రి వ్యక్తి చనిపోయినా మరుసటి రోజు లోకం స్తంభించదు. అందరూ ఎవరి పనుల్లో వారుంటారు. సినిమా లు ఆడుతుంటాయి. కెఫేలు బిజీగా ఉంటాయి. బ్యాంకు లావాదేవీలు జరుగుతుంటాయి. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి నిర్జీవం కావడం తప్ప అంతా మామూలుగా ఉంటుంది. ఆ అంతా మామూలుగా ఉండే జగత్తులో ఉంటూ జీవితాన్ని మిస్ కాకుండా ఉండాలనే భావన కలిగించుకుంటూ ఉండాలి. అందరూ కష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నారని ఎవరిని కదిపినా తెలుస్తుంది. మరి వారంతా చనిపోనప్పుడు మనం ఎందుకు చనిపోవాలి అనుకోవడంలోనే ఉంది విజ్ఞత. ఈ కమ్యూనికేషన్ రోజుల్లో 24 గంటలు ఎన్నో కౌన్సెలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కాల్ చేస్తే సాయం చేస్తారు. ఆ సాయం పొందాలి. వ్యక్తులు బలహీనంగా ఉన్నప్పుడు కుటుంబ బలాన్ని, బంధుబలాన్ని, స్నేహబలాన్ని, సమాజ బలాన్ని తోడు తీసుకోవాలి. సోషల్ మీడియాలో సమస్యను పంచుకుని బయటపడినవారు ఉన్నారు. పోలీసులు, న్యాయ వ్యవస్థ, పాలనా వ్యవస్థ, ప్రజాప్రతినిధులు వీరంతా పౌరులకు ఏదో ఒక మార్గం చూపాల్సినవారే. వారి సాయం పొందాలి. అన్నింటికి మించి జీవితాన్ని సరళంగా, సులభం గా నిర్మించుకుంటే, ఆరోగ్యకరమైన జీవన విధానాలు, అలవాట్లు, క్రమశిక్షణ, ఆహారం, స్నేహితులు.. తోడు చేసుకుంటే జీవించడంలో ఆనందం తెలుస్తుంది.చెప్పుకునే మనిషీ కోరుకునే అండమనిషి తనకొచ్చే కష్టాల వల్ల ఆత్మహత్య చేసుకోడు. ఆ కష్టాలను వినే మనిషి లేకపోవడం వల్ల, నేనున్నాననే భరోసా దొరకకపోవడం వల్ల, నిస్సహాయత ఫీలయ్యి ఆత్మహత్య శరణ్యం అనుకుంటాడు. ఆత్మహత్య చేసుకోవడం ఒక నిమిషపు నిర్ణయం కాదు చాలామంది విషయంలో. కొందరు రోజుల తరబడి దీని గురించి ఆలోచిస్తారు. ఆలోచిస్తూ ఉంటారు. చివరకు ప్రయత్నిస్తారు. అందుకు సంబంధించిన మార్పులు వ్యక్తులలో, కుటుంబ సభ్యులలో గుర్తించడం చాలామటుకు సాధ్యం. సమస్య ఏమిటో తెలుసుకుంటే, వారిని కదిలించి రాబట్టగలిగితే వారు ప్రమాదపు అంచుకు వెళ్లరు. దురదృష్టవశాత్తు కుటుంబ సభ్యులే ఒకరిని మరొకరు గమనించలేనంతగా బిజీగా ఉంటూ అంతా అయ్యాక కళ్లు తెరుస్తున్నారు. -
తెలంగాణలోని ఈ ఆలయానికి 600 ఏళ్ల చరిత్ర
మహబూబ్నగర్ రూరల్: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పేరెన్నికగన్న శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం కలియుగ వైకుంఠంగా బాసిల్లుతోంది. తెలంగాణ తిరుపతిగా ఖ్యాతికెక్కింది. కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతోంది. మహబూబ్నగర్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో రాయచూర్ అంతర్రాష్ట్ర రహదారి పక్కన ఎత్తైన గుట్టలపై మన్యంకొండ దేవస్థానం కొలువుదీరింది. స్టేజీ నుంచి మూడు కిలోమీటర్ల మేర ఘాట్రోడ్డు గుండా వెళ్తే స్వామివారి దేవస్థానం ఉంటుంది. దాదాపు 600 సంవత్సరాల చరిత్ర గల స్వామి దేవస్థానం దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల పాలిట ఇలవేల్పు దైవంగా మారింది. తవ్వని కోనేరు, చెక్కని పాదాలు, ఉలి ముట్టని స్వామి ఇక్కడి ప్రత్యేకత. ఇంత విశిష్టత గల స్వామివారి దేవస్థానానికి ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు. ప్రతి సంవత్సరం స్వామివారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. కేవలం ఒక్క ఉత్సవాల్లోనే దాదాపు లక్షకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకొని తరిస్తారు. ఏటా స్వామివారికి భక్తుల నుంచి దాదాపు రూ.1.50 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది.దేవస్థానం చరిత్ర.. 600 సంవత్సరాల క్రితం తమిళనాడులోని శ్రీరంగం సమీపంలోని అళహరి గ్రామ నివాసి అళహరి కేశవయ్య కలలో శ్రీనివాసుడు కనిపించి కృష్ణానది తీరప్రాంతంలో గల మన్యంకొండపై నేను వెలిసి ఉన్నానని సెలవిచ్చారు. దీంతో ఆయన తన తండ్రి అనంతయ్యతో పాటు కుటుంబసభ్యులతో కలిసి మన్యంకొండ సమీపంలో గల కోటకదిరలో నివాసం ఏర్పరుచుకొని గుట్టపైకి వెళ్లి స్వామివారికి సేవ చేయడం ప్రారంభించారు. కేశవయ్య దక్షిణాదిగల అన్ని దివ్యక్షేత్రాలు సందర్శించడం ప్రారంభించారు. ఓ రోజు కృష్ణానదిలో స్నానం చేసి సూర్యభగవానుడికి నమస్కరించి ఆయన దోసిలితో ఆర్ఘ్యం వదులుతున్న సమయంలో చెక్కని శిలారూపంలో గల వేంకటేశ్వరస్వామి ప్రతిమ నదిలో అలల ద్వారా వచ్చి కేశవయ్య దోసిలిలో నిలిచింది. దీంతో నదిలో నుంచి వచ్చి దోసిలిలో నిలిచిన విగ్రహాన్ని పరిశీలించగా.. ఆ విగ్రహం శ్రీనివాసుడిగా గుర్తించారు.ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మన్యంకొండపై శేషషాయి రూపంలో గల గుహలో ప్రతిష్టించి నిత్య ధూప దీప నైవేద్యంతో స్వామిని ఆరాధించడం ప్రారంభించారు. అంతేకాకుండా దేవస్థానం మండపంలో ఆంజనేయస్వామి, గరుడ్వాలర్ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు. ఈ దేవస్థానం సమీపంలో మునులు తపస్సు చేయడంతో ఈ దేవస్థానం మన్యంకొండగా వినతికెక్కింది. దేవస్థానం ఎదురుగా ఉన్న గుట్టపై అప్పట్లో మునులు తపస్సు చేసిన గుహ ఇప్పటికీ ఉంది. కొన్నేళ్ల పాటు మన్యంకొండపై నిరంతరం పూజలు జరిగిన తర్వాత పూజలు ఆగిపోయాయి. హనుమద్దాసుల కీర్తనలతో ఖ్యాతి.. అళహరి వంశానికి చెందిన హనుమద్దాసుల వారి కీర్తనలతో మన్యంకొండ ఖ్యాతి గడించింది. దీంతో ఆగిపోయిన స్వామి పూజలు మళ్లీ ప్రారంభమయ్యాయి. హనుమద్దాసుల వారు మళ్లీ పూజలు ప్రారంభించి స్వామివారికి సంబంధించి దాదాపు 300 కీర్తనలు రచించారు. ఈ కీర్తనలు అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి. దేవస్థానం చరిత్రను చాటి చెప్పాయి. హనుమద్దాసుల కృషిని తెలుసుకున్న గద్వాల, వనపర్తి సంస్థానాధీశులు మన్యంకొండకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే స్వామివారి ఉత్సవాలకు తమవంతు ధర్మంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో తమ సైనికులతో కలిసి ప్రతి ఏడాది మన్యం కొండకు వచ్చి స్వయంగా ఏర్పాట్లు చేసేవారు. ఏనుగులతో స్వామివారికి సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు.స్వామివారు నిజంగా ఉన్నారని నిరూపించడానికి హనుమద్దాసుల వారు ఎన్నో పనులు చేసి చూపించారు. అప్పట్లో ఆయన దేవస్థానం వద్ద కోనేరును తవ్వించడంతో పాటు పెద్దగుడి గంటను కూడా ఏర్పాటు చేశారు. ఆ గంట ఇప్పటికీ చైర్మన్ గది పక్కన కనిపిస్తుంది. హనుమద్దాసుల తర్వాత ఆయన వంశానికి చెందిన అళహరి రామయ్య దేవస్థానం బాధ్యతలు తీసుకున్నారు. వంశపారంపర్య ధర్మకర్తగా ఉండటంతో పాటు దేవస్థానం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.స్వామివారి సేవ చేసిన అళహరి వంశీయులు వీరే.. మన్యంకొండ (Manyamkonda) స్వామివారి సేవలో అళహరి వంశీయులు చేసిన కృషి ఎంతో ఉంది. వారిలో అళహరి అనంతయ్య, కేశవయ్య, రంగయ్య, వెంకయ్య, పాపయ్య, హనుమద్దాసు, మేఘయ్య, అనంతయ్య, రామయ్య, వెంకటస్వామి, నారాయణస్వామి ఉన్నారు. ప్రస్తుతం అదే వంశానికి చెందిన అళహరి మధుసూదన్కుమార్ వంశపారంపర్య ధర్మకర్తగా కొనసాగుతున్నారు. దేవస్థానం స్థాపనకు కృషి చేసిన అళహరి వంశీయుల వంశవృక్షానికి తెలియజెప్పే చిత్రపటం దేవస్థానంలో ఏర్పాటు చేశారు. కొంతమంది ఫొటోలను కూడా ఏర్పాటు చేశారు.తెలంగాణ తిరుపతి మన్యంకొండ తిరుపతికి మన్యంకొండకు చాలా దగ్గరి పోలికలు ఉండటంతో తెలంగాణ తిరుపతిగా మన్యకొండను పిలుస్తారు. ఆర్థిక స్తోమత లేని భక్తులు మన్యంకొండకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటే తిరుపతికి వెళ్లినంత పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. తిరుపతిలో ఏడుకొండలు ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే మన్యంకొండలో కూడా దేవస్థానం చుట్టూ ఏడు కొండలు ఉన్నాయి. అంతేకాకుండా ఇలాంటి పోలికలు చాలా ఉన్నాయి. మన్యంకొండ దేవస్థానానికి చాలా మంది భక్తులు తమ సహకారం అందిస్తుండటంతో దేవస్థానం దినదినాభివృద్ధి చెందుతోంది.చదవండి: 65 అడుగుల ఎత్తులో అద్భుత కట్టడంఒక్కొక్కరు ఒకరిగా.. ముందుకు అళహరి మధుసూదన్కుమార్, చైర్మన్, మన్యంకొండ దేవస్థానం మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం కలియుగ వైకుంఠంగా బాసిల్లుతోంది. తవ్వని కోనేరు, చెక్కని పాదాలు, ఉలి ముట్టని స్వామివారు ఇక్కడ ప్రత్యేకం. ఇంత విశిష్టత గల స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. స్వామివారి సేవలో అళహరి వంశీయుల కృషి ఎంతో ఉంది. వంశీయుల్లో ఒక్కొక్కరు ఒకరిగా ముందుకు నడుస్తున్నాం. ప్రస్తుతం స్వామివారి సేవలో తాను పదవ తరం వంశీయుడిగా కొనసాగుతున్నా. ప్రతి సంవత్సరం స్వామివారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం. రాష్ట్రంలోనే ఆదర్శ దేవస్థానంగా తీర్చిదిద్దడానికి తమవంతు కృషి చేస్తున్నాం. -
లాల్బాగ్చా నిమజ్జనంలో ఏం జరిగింది..? మండిపడుతున్న భక్తులు..
దేశవ్యాప్తంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ముంబైలో అత్యంత ప్రాచుర్యం పొందిన లాల్బాగ్చా (Lalbaugcha Raja) గణపతి నిమజ్జనం ఆదివారం రాత్రి 9.35గంటల సమయంలో పూర్తయ్యింది. సుమారు నిర్దేశించిన సమయం కంటే దాదాపు 13 గంటలు ఆలస్యంగా నిమజ్జనం పూర్తయ్యింది. ఆచార సంప్రదాయాలకు విరుద్ధంగా జరగడంతో భక్తులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. నిమజ్జనం ఊరేగింపు తంతు మొత్తం..ఆది నుంచి అన్నీ ఆటంకాలతోనే ప్రారంభమైందని నిర్వాహకులు చెబుతున్నారు.అసలేం జరిగిందంటే..నిమజ్జనంలో భాగంగా శనివారం మధ్యాహ్నం 12.30కు లాల్బాగ్చా గణపతి ఊరేగింపు మొదలయ్యింది. ఆదివారం ఉదయం 8 గంటలకు నిమజ్జనం చేసే గిర్గావ్ చౌపటీ బీచ్కు చేరుకుంది. అనంతరం మత్స్యకారుల పడవలతో ప్రత్యేకంగా నిర్మించిన తెప్ప (Raft) సాయంతో సముద్రంలో నిర్దేశించిన ప్రాంతానికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ తెప్పలో సాంకేతిక సమస్యలు తలెత్తి..నిర్ణయించుకున్నమయం కంటే 10-15 నిమిషాలు ఆలస్యంగా బీచ్కు రావడం, అంచనాల కంటే ముందస్తుగానే ఆటుపోట్లు ప్రారంభం కావడం సమస్యగా మారింది.దాంతో నిర్వాహకులు ఆటుపోట్లు తగ్గేవరకు వేచి చూడాల్సి వచ్చింది. అనేక ప్రయత్నాల అనంతరం సాయంత్రం 4.45గంటలకు రాఫ్ట్పైకి తరలించారు. వేలాది మంది భక్తులు గణపతి బప్పా మోరియా నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. అయినప్పటికీ సముద్రంలో ప్రతికూల వాతావరణంతో ఆటుపోట్లు తగ్గేవరకు వేచిచూడాలని నిర్వాహకులు నిర్ణయించారు. చివరకు సాయంత్రం 7-8గంటల సమయంలో రాఫ్ట్ తేలడంతో సముద్రంలోపలికి తరలించారు. ప్రత్యేక పూజల అనంతరం రాత్రి 9.35గంటల ప్రాంతంలో జరిగింది. అందులోనూ ఆరోజు చంద్రగ్రహణం పైగా ఆ సమయం సూతక్ కాలం కావడంతో ఇది సంప్రదాయన్ని ఉల్లఘించడమే అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి 18 అడుగుల పొడవైన విగ్రహం ఊరేగింపు అనంత చుతర్ధశినాడు ప్రారంభమవుతుంది. అంటే నిమజ్జనం చివరి రోజు కానీ మరుసటి రోజు ఉదయం 9 గంటలకు జరుగుతుంది. ఈ ఏడాది కూడా అలాగే జరిగేలా ప్లాన్ ఉండగా...విగ్రహాన్ని తరలించే పడవలో సాంకేతిక లోపం, మరోవైపు సముద్ర అలలు తదితరాల కారణంగా లాల్బాగ్చా రాజా(వినాయకుడి విగ్రహం) గిర్గావ్ చౌపట్టి వద్ద కొన్ని గంటల పాటు నిలిచిపోయింది.మండిపడుతున్న మత్స్యకారులువినాయకుడు అందరి దేవుడని, అయితే ఆలయ నిర్వాహకులు మమల్ని దర్శించుకునే అవకాశం లేకుండా పక్కనపెట్టారంటూ మండిపడుతున్నారు మత్స్యకారులు. 1934లో, మత్స్యకారులు వద్ద డబ్బులు లేనప్పడు, చేపలు అమ్మడానికి మార్కెట్లో సమస్యలు వచ్చినప్పుడు గణపతి బప్పాకు మత్స్యకారులు గట్టిగా మొక్కుకున్నారట. తమ సమస్య తీరితే ప్రతి ఏడాది లాల్బాగ్చా రాజాని గణేశ్ చతుర్థి రోజున ఘనంగా పూజించి, నిమజ్జనం కార్యక్రమంలో తమ వంతు సహకారం అందిస్తామని గణపతికి మొక్కుకున్నారు. అయితే ఈ ఏడాది నిర్వాహకులు వీఐపీ దర్శనాలతో వారికి ఇచ్చిన ఒక్క రోజు దర్శనం అవకాశంలో కొన్ని గంట వ్యవధి తగ్గిపోయింది. దీంతో వారంత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు, వీఐపీలకు ప్రాధాన్యాత ఇస్తూ..సామాన్య భక్తులకు దర్శించుకునే అవకాశాన్ని పక్కనపెట్టేశారంటూ లాల్బాగ్చా ఆలయ నిర్వాహకులపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతేగాదు తమ గోడుని నేరుగా లాల్బాగ్చా రాజాను స్థాపించిన పూర్వీకుల వారసులకు తెలియజేసేలా మా తరుఫున ఒక ప్రతినిధిని సంస్థలోకి తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. విఘ్నాలను హరించే ఆ వినాయకుని దర్శనం చేసుకోలేకపోయామన్న భక్తుల అసంతృప్తి, మరోవైపు సాంకేతి లోపాలు, సముద్ర అలలు అన్ని కలగలసి ఈ ఏడాది లాల్బాగ్చా గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని మరింత ఆలస్యంగా పూర్తి అయ్యేలా చేశాయి. ఊరేగింపు మొదలైనప్పటి నుంచి 32గంటల తర్వాత మహాగణపతి నిమజ్జనం పూర్తికావడం గమనార్హం(చదవండి: వర్షం సైతం ఆ నృత్యాన్ని అడ్డుకోలేకపోయింది..!) -
వర్షం సైతం ఆ నృత్యాన్ని అడ్డుకోలేకపోయింది..!
బృందంగా శాస్త్రీయ నృత్యం చేస్తుంటే రెండు కళ్లు చాలవేమో అన్నంత అద్భుతంగా ఉంటుంది. అలాంటి గ్రూప్ డ్యాన్స్ ప్రదర్శనలో అనుకోని అవాంతరంలా వర్షం వస్తే.. కాలు కదపడం కష్టం. అడుగు వేస్తే జరర్రుమని జారిపోవడం ఖాయం. ఆ చిరుజల్లుల్లో అడుగులు తడబడకుండా..లయబద్ధంగా నృత్యం చేయడం అంత ఈజీ కాదు. కానీ ఇక్కడ ఈ బృందం వర్షానికే సవాలు విసిరేలా అత్యంత అద్భుతంగా నృత్యం చేశారు. ఇదంతా ఎక్కడ అంటే..కర్ణాటకలోని ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన మహిళా విద్యార్థులు బృందంగా భరతనాట్యం చేశారు. అది కూడా హనుమాన్ చాలిసాను నృత్య రూపకంగా ప్రదర్శన ఇస్తున్నారు. అయితే కుండపోత వర్షం కురుస్తున్న ఆ విద్యార్థులంతా ఎక్కడ ఆగకుండా ఎంత లయబద్ధంగా డ్యాన్స్ చేశారో చూస్తే..వావ్ ఏం భరతనాట్య ప్రదర్శన అని ప్రశంసించకుండా ఉండలేరు. అందులో అత్యంత హైలెంట్.. అంతమంది అమ్మాయిల మధ్య ఒకేఒక పురుషుడు భరతనాట్య చేస్తూ కనిపించడం. మన కళ్లుచూస్తోంది నిజమేనా అన్నట్లుగా ఆ అమ్మాయిల్లో ఒక అమ్మాయిగా కలిసిపోయిన ఆ కళాకారుడి నృత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అందుకు సంబంధించిన వీడియోని ప్రత్యక్షంగా వీక్షించిన ఒక ప్రేక్షకుడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది. ఆయన ఆ వీడియోకి జత చేసిన పోస్ట్లో వర్షం మీ ప్రదర్శనను అడ్డుకోలేకపోగా..మీ అసామాన్యమైన ప్రదర్శనకు అందంగా మారింది ఆ వర్షపు జల్లు. జోరు వానలో నాట్యం చేయడం మాటలు కాదనేది సత్యమే అయినా..మీ బృందమంతా ప్రతి స్టెప్ని అత్యంత అద్భుతంగా ప్రదర్శించి అలరించారు అంటూ ఆ వీడియోకి వర్షం మీ బృందం ప్రదర్శన ఇవ్వకుండా ఆపలేకపోయింది అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Prarthana Rao (@prarthana_nanana) (చదవండి: లండన్లో 'బెస్ట్ సమోసా'..! టేస్ట్ అదుర్స్..) -
చరిత్ర సృష్టించిన లెఫ్టినెంట్ పారుల్ ధద్వాల్..! నిబద్ధతకు నిదర్శనం..
కుటుంబంలో ఒక్కరు సక్సెస్ సాధిస్తే..ఆ తర్వాత తరాలకు వాళ్లు ఆదర్శంగా మారడమే కాదు వారిలా అధికారుల పరంపరను కొనసాగిస్తారు కొందరు. అలా వారసత్వాన్ని కొనసాగించడం అనేది అరుదు కూడా. అలా కంటిన్యూస్గా వారసత్వాన్ని అందిపుచుకుని కొనసాగడమే గాక, ఒకే కుంటుంబంలోని రెండు జనరేషన్లు వరుసగా కొనసాగడం అనేది అత్యంత అరుదు. అలాంటి అరుదైన సంఘటన చోటుచేసుకోవడమే కాదు, చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలవనుంది ఈ అరుదైన ఘటన. ఏం జరిగిందంటే..లెఫ్టినెంట్ పారుల్ ధద్వాల్ ఐదు తరాలుగా ఆర్మీసేవలందిస్తున్న కుటుంబం నుంచి వచ్చిన తొలి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. ఆమె తన కుటుంబంలోని ఐదోతరం ఆర్మీ అధికారిగా కొనసాగనున్నారు. చెన్నైలోని ఆపీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(ఓటీఏ)లో శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకుని ఇండియన్ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్లో చేరారు. ఆమె తన అంకితభావం, నైపుణ్యానికి గుర్తింపుగా ఈ ట్రైనింగ్ కోర్సులో ఆర్డర్ ఆఫ్ మెరిట్లో తొలి స్థానంలో నిలిచి రాష్ట్రపతి బంగారు పతకాన్ని కూడా సొంతం చేసుకున్నారు. పారుల్ ధద్వాల్ నేపథ్యం..ఆమె పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాలోని జనౌరి గ్రామం నుండి వచ్చింది. ఈ ప్రాంతం యుద్ధానికి సంబంధించిన వీరసైనికుల నిలయంగా పేరుగాంచింది. ఇక పారల్ ధద్వాల్ కుటుంబ ఆర్మీలో ముత్తాతల కాలం నుచి సేవలందిస్తోంది. ఆమె ముత్తాత సుబేదార్ హర్నామ్ సింగ్ జనవరి 1, 1896 నుంచి జూలై 16, 1924 వరకు సేవలందించారు. ఆమె రెండో ముత్తాత ఎల్ఎస్ ధద్వాల్ 3 JATతో పనిచేశారు. మూడోతరంలో జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్కు చెందిన కల్నల్ దల్జిత్ సింగ్ ధద్వాల్ 3 కుమాన్కు చెందిన బ్రిగేడియర్ జగత్ జామ్వాల్లో ఉన్నారు. ఇక ఆమె తండ్రి మేజర్ జనరల్ కేఎస్ ధద్వాల్ ఎస్ఎమ్ విశిష్ట సేవా మెడల్ గ్రహిత. ప్రస్తుతం ఆమె తన సోదరుడు కెప్టెన్ ధనంజయ్ ధద్వాల్లతో కొనసాగుతోంది. వీరిద్దరు 20 మంది అత్యున్నత సిక్కు అధికారుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. అదీగాక ఒకే కుటుంబానికి చెందిన రెండు తరాలకు చెందిన ముగ్గురు అధికారులు దేశానికి సేవలందిస్తున్న అరుదైన ఘటన ఇది. ఈ ఘటన దేశం పట్ల ఉన్న వారి శాశ్వత నిబద్ధతకు తార్కాణంగా నిలిచింది. A Legacy of Five GenerationsOne Uniform – Infinite PrideThe journey of Lt Parul Dhadwal is a saga of a family dedicated to service to the Motherland. A proud descendant of a long lineage of brave soldiers, she represents the fifth-generation who now dons the Olive Green in… pic.twitter.com/3BtXn8SlT8— ADG PI - INDIAN ARMY (@adgpi) September 6, 2025 (చదవండి: లండన్లో 'బెస్ట్ సమోసా'..! టేస్ట్ అదుర్స్..) -
లండన్లో 'బెస్ట్ సమోసా'..! టేస్ట్ అదుర్స్..
విదేశాల్లో మన చిరుతిండ్లు ఫేమస్ అవ్వడం కాదు..వాటి రుచికి విదేశీయులు ఫిదా అవుతూ లొట్టలేసుకుంటూ లాగిస్తున్నారు. కేవలం మన ప్రవాస భారతీయులే కాదు..అక్కడ స్థానిక విదేశీయులు కూడా ఇష్టపడటం విశేషం. మళ్లీ మళ్లీ తినేందుకు ఆయా భారతీయ రెస్టారెంట్లు లేదా హోటళ్లకు వస్తున్న వీడియోలను చూశాం. అయితే ఇప్పుడు మనమంతా ఇష్టంగా స్నాక్స్ టైంలో తినే సమోసా లండన్లో నివశిస్తున్న భారతీయులకే కాదు అక్కడున్న విదేశీయలకు కూడా అత్యంత ఇష్టమైన వంటకంగా మారింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది.ఆ వీడియోలో బీహార్కి చెందిన వ్యక్తి లండన్లోని రద్దీగా ఉండే వీధుల్లో సమోసాలు అమ్ముతున్నట్లు కనపిస్తుంది. ఆ స్టాల్పై ఘంటావాలాస్ సమోసాస్. అతడు సమోసాలను పరిశుభ్రంగా తయారు చేసిన తీరుతోపాటు వాటిని అక్కడివాళ్లు ఎంత ఇష్టంగా ఆస్వాదిస్తారో కూడా వివరించడమే కాదు, కళ్లకు కట్టినట్టుగా చూపిస్తాడు. అంతేగాదు ఒక బిహారీ లండన్లో ఉన్నంత వరకు సమోసాల రుచి ఎల్లప్పుడూ సజీవంగా ఉంటుందని సగర్వంగా చెబుతున్నాడు. అంతేగాదు ఈ వీడయోకి "లండన్లో అత్యుత్తమ సమోసా" అనే క్యాప్షన్ జోడించి మరి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకి ఏకంగా 37 మిలియన్ల వ్యూస్, లైక్లు వచ్చాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి మరి..!. View this post on Instagram A post shared by Bihari Samosa UK (@biharisamosa.uk) (చదవండి: భారత్లోనే 11 ఏళ్లుగా రష్యన్ మహిళ..! ఆ మూడింటికి ఫిదా..) -
భారత్లోనే 11 ఏళ్లుగా రష్యన్ మహిళ..! ఆ మూడింటికి ఫిదా..
విదేశాలను ఆకర్షిస్తున్న మన దేశ సంస్కృతి వారిని ఇక్కడే ఉండేలా చేసేలా మన్ననలను అందుకుంటోంది. ఎందరో మనసులను దోచిన ఇచ్చటి విభిన్న సంస్కృతులు, ఆతిథ్యం తమను మళ్లీ మళ్లీ ఈ గడ్డ వద్దకు వచ్చేలా చేస్తుందని, వదిలి వెళ్లలేమని అంటున్నారు. అలా ప్రశంసలు కురిపిస్తున్న విదేశీయుల కోవలోకి తాజాగా ఈ రష్యన్ మహిళ కూడా చేరిపోయింది. పైగా ఆమూడింటికే పడిపోయానని, అంతలా అవి తనని ప్రభావితం చేశాయని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. రష్యాన్ మహిళ కంటెంట్ క్రియేటర్ యులియా ఇన్స్టా పోస్ట్లో భారత్లోనే 11 ఏళ్లుగా ఉన్నట్లు వెల్లడించింది. ఇక్కడి భారతదేశం తనను ఎలా ప్రభావితం చేసిందో పంచుకుంది. ఐదు నెలల్లో పూర్తిచేసే ఇంటర్న్షిప్కు వచ్చి..అతుక్కుపోయానంటోంది. ఇంటర్న్షిప్ పూర్తి అయ్యి తిరిగి రష్యాకు పయనమయ్యానని, ఆ తర్వాత కొన్నేళ్లకు సర్కస్ కోసం ఏనుగుని కొనడానికి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయానని చెప్పుకొచ్చింది. ఇక్కడే విజయవంతంగా వ్యాపారం చేయడమే గాక, ఇక్కడ ఒక కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టి ఇక్కడే ఉండిపోయానంటోంది. కట్టిపడేసిన ఆ మూడు విషయాలు..భారతదేశంలో ఆతిథ్యం వేరేస్థాయిలో ఉంటుంది. ప్రజలు చాలా ఘటనంగా స్వాగతిస్తారు. వారి విశాల హృదయం కట్టిపడేస్తుంది. ప్రతి విషయంలోనూ మంచి సహాయకారిగా ఉంటారు. ఇక్కడ చాలామటుకు అందరూ సహాయం చేయడానికే ప్రయత్నిస్తారు. అంతేగాదు భారతదేశం ఒక అయస్కాంతంలాంటిదని, ఇక్కడ ఏమి చూడాలనుకుంటున్నారో, విశ్వానికి ఏమి అందించాలనుకుంటున్నారో, అన్నింటిని ఈనేలే మీకు దిశానిర్దేశం చేస్తుంది. నాలా ఈ భారతదేశంలోకి అడుగుపెట్టి, కొన్ని సవాళ్లను అధిగమించి మరి ఇక్కడి అందాలకు మంత్రముగ్ధులైన వారిక కథలెన్నో నా చెంత ఉన్నాయని ఇన్స్టా పోస్ట్లో రాసుకొచ్చింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Iuliia Aslamova (@yulia_bangalore) (చదవండి: Dance For Fitness: మొన్నటి వరకు ఆనంద తాండవమే..ఇవాళ ఆరోగ్య మార్గం..!) -
బ్లడ్ మూన్.. వెరీ స్పెషల్..!
బ్లడ్ మూన్ హైదరాబాద్ ఆకాశాన్ని మాత్రమే కాదు, సోషల్ మీడియా వేదికలను కూడా ఆక్రమించింది. శాస్త్రీయ నిజాలు, మూఢనమ్మకాలు, యువత ట్రెండ్.. అన్నీ కలిపి నగరాన్ని బ్లడ్ మూన్ ముచ్చట్లతో ముంచెత్తాయి. వచ్చే బ్లడ్ మూన్ వరకూ హైదరాబాదీలు ఈ జ్ఞాపకాన్ని ఫొటోల రూపంలో, పోస్టుల రూపంలో ఆస్వాదిస్తూ మిగిలిపోతారు. నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకూ జరిగిన చంద్ర గ్రహణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చంద్రుడు ఎర్రటి వర్ణంలో మెరిసిపోవడం వల్ల దీనిని ప్రజలు బ్లడ్ మూన్ అని పిలిచారు. సహజసిద్ధంగా ఏర్పడే ఈ ఖగోళ క్షణం హైదరాబాద్ నగరాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. గ్రహణానికి గంటల ముందే ట్విట్టర్, ఇన్స్టా, ఫేస్బుక్ వేదికలు హాష్ట్యాగ్లతో సందడి చేశాయి. కొందరు గ్రహణం ఫొటోలు పంచుకుంటే, మరికొందరు ‘బ్లడ్ మూన్ అంటే ఏమిటి?’ అనే గూగుల్ సెర్చ్లో మునిగిపోయారు. ఒక్క రాత్రిలోనే వేల పోస్టులు, వీడియోలు షేర్ కావడం గమనార్హం. ముఖ్యంగా యువత ఈ గ్రహణాన్ని ఫొటోషూట్లుగా మార్చుకుని #సెలనోఫైల్ #బ్లడ్ మూన్ వంటి హాష్ట్యాగ్లతో క్రియేటివ్గా ఎక్స్ప్రెస్ చేశారు. సైన్స్ వర్సెస్ మూఢనమ్మకాలు.. ఒకవైపు శాస్త్రవేత్తలు, పరిశోధన సంస్థలు ఈ ఘటనకు వెనుక ఉన్న ఖగోళ శా్రస్తాన్ని వివరించగా, మరోవైపు సోషల్ మీడియాలో మూఢనమ్మకాలు విపరీతంగా చెక్కర్లు కొట్టాయి. ‘గ్రహణ సమయంలో బయటకు వెళ్లకూడదు’, ‘ఆహారం తినకూడదు’ వంటి అపోహలను కొందరు జోరుగా ప్రచారం చేశారు. అయితే హైదరాబాద్లోని బీఎం బిర్లా ప్లానిటోరియం నిపుణులు, సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైన్స్ రీసెర్చ్, ఐఐటీఎస్ శాస్త్రవేత్తలు ఈ గ్రహణం సహజ ఖగోళ సంఘటన అని, దీనికీ మన ఆరోగ్యం లేదా దైనందిన జీవితానికీ ఎటువంటి సంబంధం, ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. ‘బ్లడ్ మూన్ కేవలం విజువల్ ఎఫెక్ట్ మాత్రమే. దీనిని చూసి భయపడాల్సిన అవసరం లేదు, ఇది ప్రకృతి అందించే అద్భుత క్షణం’ అని వివరించారు. బ్లడ్ మూన్ అంటే? సాధారణంగా చంద్రుడు భూమి నీడలోకి వెళ్లినప్పుడు చంద్ర గ్రహణం జరుగుతుంది. కానీ ఈ సమయంలో సూర్యకిరణాలు భూమి వాతావరణాన్ని దాటి చంద్రుని చేరుకున్నప్పుడు, నీలి కాంతి ఫిల్టర్ అవుతుంది, ఎర్రటి కాంతి మాత్రమే చంద్రుడిపై ప్రతిబింబిస్తుంది. అందుకే చంద్రుడు ఎర్రటి రంగులో కనిపిస్తాడు. దీనినే ‘బ్లడ్ మూన్’ అని పిలుస్తారు. గతం–భవిష్యత్తు బ్లడ్ మూన్లు.. చరిత్ర చెబుతున్నట్లు.. గతంలో హైదరాబాద్లో 2018 జూలై 27న ఒక విశేషమైన బ్లడ్ మూన్ కనిపించింది. అది 21వ శతాబ్దంలోనే అత్యంత దీర్ఘమైన చంద్ర గ్రహణంగా రికార్డయ్యింది. 2022లో కూడా కనిపించిన ఈ బ్లడ్ మూన్ ఈ ఏడాది మార్చిలోనూ కనువిందు చేసింది. 2026లో మరో బ్లడ్ మూన్ దర్శనమివ్వనుంది. ఈ విధంగా తరచూ కాకపోయినా, కొన్ని ఏళ్లకోసారి మాత్రమే ఈ అపూర్వ క్షణాలు మన కళ్లముందు మెరుస్తాయి.హైదరాబాద్ ప్రత్యేకత.. హైదరాబాద్ ఆకాశం నుండి చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించడం ఈ సారి ప్రత్యేకత. నగరంలోని హుస్సేన్ సాగర్ తీరంలో, గోల్కొండ కోట ప్రాంగణంలో, షామీర్ పేట్, శంషాబాద్ ప్రాంతాల్లో చాలా మంది ఫొటోగ్రాఫర్లు, సెలనోఫైల్స్ టెలిస్కోపులతో గ్రహణాన్ని ఆస్వాదించారు. టెర్రస్ పార్టీల రూపంలో కూడా బ్లడ్ మూన్ నైట్ జరుపుకున్నవారు ఉన్నారు. చంద్రుడి అందాన్ని ఆస్వాదించే వారికి ‘సెలనోఫైల్స్’ అని పేరు. ఈ తరం యువతలో ఈ ట్రెండ్ బాగా పెరిగింది. ఇది ‘అంతరిక్షంతో కనెక్ట్ అవుతున్నామనే ఫీలింగ్ ఇస్తుంది’ అని పలువురు యువత భావించారు. (చదవండి: Dance For Fitness: మొన్నటి వరకు ఆనంద తాండవమే..ఇవాళ ఆరోగ్య మార్గం..!) -
మొన్నటి వరకు ఆనంద తాండవమే..ఇవాళ ఆరోగ్య మార్గం..!
ఒకప్పుడు డ్యాన్స్ క్లాస్లో చేరుతున్నారంటే.. నృత్యంలో నైపుణ్యం సాధించడానికి అని అనుకునేవాళ్లు. ఇప్పుడు అది క్యాలరీల ఖర్చుకో, వెయిట్లాస్ కోసమో అన్నట్టు మారింది. నగరంలో డ్యాన్స్ను ఆసక్తితోనో, ఆదాయ మార్గంగా మలుచుకుందామనో అనుకునేవారికన్నా.. సమూహంలో కలిసిపోవడానికి, సందడిగా గడపడానికి, వీటన్నింటినీ మించి ఆరోగ్య మార్గంగా చూస్తున్నవారే ఎక్కువయ్యారు. బరువులు మోస్తూ వ్యాయామం చేయడానికి ఇష్టపడని, జిమ్ వర్కవుట్స్కి దూరంగా ఉండే వారు ఫిట్నెస్ సాధించడానికి డ్యాన్స్ ప్రత్యామ్నాయంగా అవతరించింది. నగరంలోని ప్రతి డ్యాన్స్ స్టూడియో నేమ్బోర్డుల్లో డ్యాన్స్కు అదనంగా‘ఫిట్నెస్’ జోడిస్తున్నారు. ఏరోబిక్స్ను ఒక వ్యాయామంగా కన్నా డ్యాన్స్ వర్కవుట్గానే చాలా మంది ఇప్పటికీ పరిగణిస్తున్నారు.అధ్యయనాలు చెబుతున్న లాభాలు..అమెరికన్ కౌన్సిల్ ఆన్ ఎక్సర్సైజ్ ప్రకారం, జుంబా గంటకు 300–600 కేలరీల మధ్య బర్న్ చేయగలదు, ఇది ఉత్సాహంగా ఉంటూనే బరువు తగ్గడానికి ఒక అద్భుతమైన మార్గం అని.. జర్నల్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ హెల్త్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, డ్యాన్స్ కార్డియో హృదయనాళాల ఆరోగ్యంతోపాటు మొత్తం ఫిట్నెస్ను గణనీయంగా మెరుగుపరుస్తుంది. క్యాలరీలను బర్న్ చేయడానికి ఇది ఒక ఆహ్లాదకరమైన మార్గం. జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్లోని అధ్యయనం ప్రకారం, హిప్–హాప్ డ్యాన్స్ ఒత్తిడిని తగ్గించడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుంది.క్యాలరీలు కరుగుతున్నాయ్..సుమారు 100కిలోల బరువున్న వ్యక్తి నిమిషం పాటు నృత్యం చేస్తే దాదాపు 1.4 క్యాలరీలు ఖర్చు అవుతాయి. 70కిలోల బరువున్న వ్యక్తి 20 నిమిషాలు నృత్యం చేస్తే దాదాపు 196 క్యాలరీలు ఖర్చు అవుతాయని, సావధానంగా చేయడం వల్ల 20 నిమిషాలకు 140 నుంచి 150 క్యాలరీలు, మధ్యస్థంగా చేయడం వల్ల 160 నుంచి 180 క్యాలరీలు, వేగంగా చేసే విధానం వల్ల 180 నుంచి 200 క్యాలరీలు ఖర్చవుతాయని ఓ పరిశోధన వెల్లడించింది. ఈ డ్యాన్స్ వర్కవుట్స్ని వారంలో 2 నుంచి నాలుగు సార్లు తమ వ్యాయామ రొటీన్లో భాగంగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. లాటిన్ అంతర్జాతీయ సంగీతాన్ని సరదా, ఉత్సాహభరిత నృత్య కదలికలతో మిళితం చేసే నృత్య వ్యాయామం జుంబా. ఇది వ్యాయామాన్ని డ్యాన్స్ పారీ్టగా మారుస్తుంది. దీని ద్వారా మనం వ్యాయామం చేస్తున్నామనే విషయం మర్చిపోయేలా ఇది రూపొందింది.లాభాల నృత్యం.. ఫుట్ వర్క్ బ్యాలెన్స్ చేసుకోవడం నేర్పుతుంది. రక్తప్రసరణను మెరుగు పరుస్తుంది. కొన్ని సైకలాజికల్, బిహేవియర్ సమస్యలకు నాన్ వెర్బల్ సైకోథెరపీగా పనిచేస్తుందని డాన్స్ థెరపిస్టులు అంటున్నారు. డిప్రెషన్, ఈటింగ్ డిజార్డర్స్ వంటి సమస్యలను దూరంచేస్తుంది. ఎముకల్లో క్యాల్షియం సమన్వయానికి, ఆస్టియోపొరోసిస్ వ్యాధి నివారణకు ఉపకరిస్తుంది. లో బీపీ, అధిక కొలె్రస్టాల్ సమస్యలకూ సమాధానం ఈ డాన్స్. కోర్ మజిల్స్ పటిష్టతకు సహకరిస్తుంది. ఫీల్గుడ్ హార్మోన్ లైన అడ్రినలిన్, సెరొటోనిన్, ఎండారి్ఫన్ల ఉత్పత్తికి దోహదం చేస్తుంది. బాడీ లాంగ్వేజ్ మెరుగుపరుస్తుంది. కాళ్లు, హిప్ జాయింట్స్తో పాటు లోయర్ పార్ట్ మరింత దృఢత్వాన్ని సంతరించుకునేందుకు దోహదం చేస్తుంది. డ్యాన్స్ఫ్లోర్.. పారా హుషార్.. చల్లని వాతావరణంలో నర్తించేటప్పుడు ముందుగా బాడీ వార్మప్ కావాల్సిందే. లేకపోతే గాయాలకు కారణమవుతుంది. బాల్రూమ్ ప్రాక్టీస్కు తగిన షూస్ ఎంపిక చేసుకోవాలి. టర్న్ తిరిగేటప్పుడు అత్యుత్సాహం కూడదు. షోల్డర్ జాయింట్స్ మీద ఒత్తిడిని గమనించాలి. సామర్థ్యానికి అనుగుణంగా నిర్ణీత సమయంలో చేయడం మేలు. ఒత్తిడిని జయిస్తుంది..ఆరోగ్యసాధనకు ఉపకరించి పని ఒత్తిడిని దూరం చేస్తుంది నృత్యం. కార్పొరేట్ ఉద్యోగుల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు.. ‘కార్పొరేట్ ఉద్యోగుల్లో అత్యధికులు జంటగా చేసే సల్సా నృత్యం పట్ల మక్కువచూపుతున్నారు. చక్కని ఫిట్నెస్కు ఇదో మార్గమని వారు చెబుతున్నారు. కనీసం గంట పాటు చేసే నృత్యం 450 నుంచి 550 క్యాలరీలు ఖర్చవుతాయని స్పెషల్ డ్యాన్స్ ట్రైనింగ్ ప్యాకేజ్లు అందిస్తోన్న స్టెప్స్ అకాడమీ నిర్వహకులు పృధ్వీరాజ్ చెప్పారు.డ్యాన్స్ మస్ట్.. లుక్ బెస్ట్.. ‘బాగా డాన్స్ చేయడమంటే బాగా కని్పంచడమే’ అని ప్రసిద్ధ ఫిట్నెస్ శిక్షకురాలు దినాజ్ వర్వత్ వాలా సూత్రీకరించారు. సిటీలో ఇంటర్నేషనల్ డ్యాన్సింగ్ స్టైల్స్కు భారీగా ఆదరణ ఉంది. వీటిలో చిన్నారుల్ని బాలీవుడ్ డ్యాన్స్ స్టైల్స్ ఆకర్షిస్తుంటే.. టీనేజర్స్ హిప్–హాప్, వర్కింగ్ పీపుల్ సల్సాని లైక్ చేస్తున్నారని డ్యాన్స్ మాస్టర్ బాబీ చెబుతున్నారు. హిప్–హాప్ డ్యాన్స్.. హిప్–హాప్ వర్కౌట్లు ఫిట్నెస్ను తాజా నత్య కదలికలతో కలపడానికి ఒక గొప్ప మార్గం. ఈ దినచర్య తరచూ బలం, చురుకుదనం, సమన్వయాన్ని కలిగి ఉంటాయి. ఉల్లాసమైన సంగీతాన్ని ఇష్టపడేవారి ఫిట్నెస్ దినచర్యకు కొంచెం చురుకుదనాన్ని జోడిస్తుంది హిప్–హాప్. (చదవండి: శ్రీనగర్ టూర్..! మంచుతోటలో చందమామ కథ) -
శ్రీనగర్ టూర్..! మంచుతోటలో చందమామ కథ
ఆది శంకరుడు సౌందర్యలహరి రాసిన చోటు. రాజతరంగిణిలో కల్హణుడు చెప్పిన కథనాల నేల. సోన్మార్గ్ మంచు మీద వెండి వెన్నెల విహారం. గుల్మార్గ్ కేబుల్ కార్లో విహంగ వీక్షణం. పహల్గామ్ కుంకుమ పువ్వు తోటల ప్రయాణం. ఐదు వేల అడుగుల ఎత్తులోదాల్ లేక్ శికార్ రైడ్.నీటి మీద నడిచే రాజమందిరం హౌస్బోట్ స్టే. షాలిమార్ గార్డెన్స్లో గిలిగింతల పర్యాటకం. ఆరు రోజుల్లో వీటన్నింటినీ చూపించే టూర్ ఇది.1వ రోజుహైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 14.40 గంటలకు 6ఈ–6253 విమానంలో శ్రీనగర్కి ప్రయాణం. సాయంత్రం 17.40 గంటలకు విమానం శ్రీనగర్కు చేరుతుంది. శ్రీనగర్ ఎయిర్΄ోర్టులో టూర్ నిర్వహకులు రిసీవ్ చేసుకుంటారు. హోటల్లో చెక్ ఇన్ తర్వాత సాయంత్రం ఫ్రీ టైమ్. పర్యాటకులు ఎవరికి వారు సిటీలో నచ్చిన ప్రదేశంలో విహరించవచ్చు. రాత్రి బస శ్రీనగర్లో.2వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత శ్రీనగర్ నుంచి టూరిస్ట్ బస్సులో సోన్మార్గ్కు ప్రయాణం. సోన్మార్గ్ పర్యటన పూర్తి చేసుకుని సాయంత్రానికి తిరిగి శ్రీనగర్కు రావాలి. రాత్రి బస శ్రీనగర్లో. సోన్మార్గ్కు చేరిన తర్వాత టూరిస్ట్ బస్ ఒక పాయింట్లో ఆగుతుంది. పర్యాటకులు బస్సు దిగి స్థానికంగా ఉన్న పోనీ (చిన్న గుర్రం)లను సొంత ఖర్చుతో అద్దెకు తీసుకుని పర్యటించాలి.వెండి వెన్నెలసోనామార్గ్కు రోడ్డు మార్గంలో ప్రయాణం ఆద్యంతం కళ్లు మిరుమిట్లు గొలుపుతుంది. శ్రీనగర్ నుంచి 80 కిలోమీటర్ల దూరాన ఉంది సోనామార్గ్. ఈ ప్రదేశం తొమ్మిది వేల అడుగుల ఎత్తులో ఉంది. కొండల మీద తెల్లటి మంచు పొడి పొడిగా పై నుంచి బియ్యప్పిండి పోసినట్లు ఉంటుంది. మంచు మీద పడిన సూర్యుడి కిరణాలు సప్తవర్ణాలను ప్రతిఫలిస్తుంటాయి. మంచు మీద వెండి వెన్నెల విన్యాసాలు కనువిందు చేస్తాయి. ఈ పర్యటనకు మే నుంచి అక్టోబర్ వరకు వెళ్లగలం. శీతాకాలంలో మంచు కురుస్తుంటుంది. తజివాస్ గ్లేసియర్ శీతాకాలంలో గడ్డకట్టి వేసవి కాలంలో కరిగి ప్రవహిస్తుంది. సోనామార్గ్ నుంచి ఈ ప్రదేశానికి పోనీల మీద వెళ్లవచ్చు. ఇక్కడ ట్రెకింగ్ చేయవచ్చు. పోనీలు నడిపే వాళ్లను అడిగితే జల΄ాతాల దగ్గరకు కూడా తీసుకువెళ్తారు.3వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత శ్రీనగర్ నుంచి గుల్మార్గ్కు ప్రయాణం. గుల్మార్గ్లో గోండాలా కేబుల్ కార్ రైడ్ టికెట్లను పర్యాటకులు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఆసక్కి ఉన్న వారు గుల్మార్గ్ నుంచి కిలాన్మార్గ్కు కి ట్రెక్కింగ్ చేయవచ్చు. సాయంత్రం టూరిస్ట్ బస్ గుల్మార్గ్ నుంచి శ్రీనగర్కు బయలుదేరుతుంది. రాత్రి బస శ్రీనగర్లో.గుల్మార్గ్ మంచు తివాచీగుల్మార్గ్ పెద్ద స్కీయింగ్ స్పాట్. శ్రీనగర్ నుంచి 50 కిమీల దూరాన ఉంది. మంచు అంటే అలా ఇలా కాదు, అర అడుగు మందంలో తెల్లటి తివాచీ పరిచినట్లు ఉంటుంది. ఇక్కడ గోండాలా కేబుల్ కార్లో ప్రయాణిస్తూ విహంగ వీక్షణం చేయవచ్చు. కిందకు చూస్తే తెల్లగా పరుచుకున్న మందపాటి మంచు మిలమిల మెరుస్తూ ఉంటుంది. స్కీయింగ్లో నిష్ణాతులు కాకపోయినప్పటికీ హెల్పర్స్ సహాయంతో ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ మహారాణి టెంపుల్, సెయింట్ మేరీస్ చర్చ్ ఉన్నాయి. గుల్మార్గ్ ప్రాచీన నామం గౌరీమార్గ్. గౌరీదేవి మార్గంగా పిలిచేవారు. మొఘల్ పాలకుడు జహంగీర్ ఇక్కడ పూలతోటలను పెంచడంతో గుల్మార్గ్గా వాడుకలోకి వచ్చింది. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్న గోల్ఫ్ కోర్స్, స్కీ జోన్ వంటి ఆధునిక సౌకర్యాలన్నీ బ్రిటిష్ పాలకులు ఏర్పాటు చేసినవే. వారు ఈ ప్రదేశాన్ని వేసవి విడిదిగా, విహార కేంద్రంగా ఆస్వాదించేవాళ్లు. గుల్మార్గ్ ఎనిమిది వేలకు పైగా అడుగుల ఎత్తులో ఉంది. అక్కడి నుంచి కేబుల్ కార్లో దాదాపు 14 వేల అడుగుల ఎత్తున్న మౌంట్ అఫర్వాత్ శిఖరానికి చేరడం ఓ గిలిగింత. ఇక్కడ పర్యటిస్తున్నప్పుడు చిన్నప్పుడెప్పుడో చూసిన హిందీ సినిమాలు గుర్తుకు వస్తే మీ జ్ఞాపకశక్తికి సలామ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ డింపుల్ కపాడియా, రిషీకపూర్ నటించిన సూపర్ డూపర్ హిట్ సినిమా ‘బాబీ’ చిత్రీకరణ ఇక్కడే జరిగింది. ఇంకా అనేక బాలీవుడ్ సినిమాలు ఈ లొకేషన్లో విజువల్ రిచ్నెస్ని ఉపయోగించుకున్నాయి. గుల్మార్గ్లో మరో వింత ఇగ్లూ కేఫ్. ఇగ్లూ అంటే మంచు ఖండంలో మంచుతో కట్టే ఇల్లు. ఇగ్లూ రెస్టారెంట్లో భోజనం చేసిన అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. భోజన సమయం కాక΄ోతే ఇగ్లూ కేఫ్లో కాఫీ, టీ తాగడం మరిచి΄ోవద్దు.4వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత శ్రీనగర్ నుంచి పహల్గామ్కు ప్రయాణం. పహల్గామ్లో టూరిస్ట్ బస్ దిగిన తర్వాత సొంత ఖర్చులతో ప్రైవేట్ జీపులు, పోనీలతో పగలంతా పహల్గామ్ పర్యటన పూర్తి చేసుకోవాలి. సాయంత్రం బస్ హోటల్కు బయలుదేరుతుంది. హోటల్లో చెక్ ఇన్. రాత్రి బస పహల్గామ్లో.స్విస్ కాదు ఇండియానే!పహల్గామ్కు పర్యాటక ప్రాధాన్యం మాత్రమే కాదు, ప్రాచీన పౌరాణిక ప్రాధాన్యత కూడా ఉంది. శివుడు తన వాహనం నందిని ఇక్కడ వదిలాడని కథనం. ఇక్కడ ఉన్న లిద్దర్ వ్యాలీ, బైసరన్ వ్యాలీ, బేతాబ్ వ్యాలీ ఆరు వ్యాలీలు ఒకదానిని మించి మరొకటి ప్రకృతి సౌందర్యాన్ని వైవిధ్యతను ఇముడ్చుకున్నాయా అనిపిస్తుంది. స్విట్జర్లాండ్లో ఉన్నామా భారత్లో ఉన్నామా అనే సందేహం కలుగుతుంది కూడా. ఇంత అందమైన ప్రదేశాలు మనదేశంలో ఉండగా ఇక పాశ్చాత్యదేశాల విహారం ఎందుకు... అనిపిస్తుంది. కుంకుమ పువ్వు తోటల మధ్య ప్రయాణం సాగుతుంది. చెట్లు ఎత్తుగా ఆకాశాన్ని తాకడానికే ఎదుగుతున్నట్లుంటాయి. అతి శీతల వాతావరణం కావడంతో కొమ్మలు పక్కలకు విస్తరించవు. చెట్ల ఆకుల మీద ముగ్గు చల్లినట్లు మంచు రేణువులు వాలి ఉంటాయి. సూర్యకిరణాలకు ఆవిరవుతూ సాయంత్రం నుంచి మళ్లీ కొత్త మంచు చేరుతూ ఉంటుంది. పహల్గామ్లో పర్యటిస్తున్నప్పుడు ఇదేదో సినిమాలో చూసిన ప్రదేశంలా ఉందేంటబ్బా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అనేక సినిమాల చిత్రీకరణ జరుగుతుంది. అరువ్యాలీ, బేతాబ్ వ్యాలీ, చందన్వారీ వ్యాలీలను చూడవచ్చు. లిద్దర్ వ్యాలీలో గోల్ఫ్ కోర్స్ ఉంది. ఆడే సమయం లేక΄ోయినా చూసి రావచ్చు. ఇదంతా చదివిన తర్వాత మీకు ఒక విషయం గుర్తుకు వచ్చి ఉండాలి. అదే... పహల్గామ్, బైసరన్ వ్యాలీ. ఈ రెండు పదాలకు కలిపి చదువుకుంటే ఏప్రిల్లో టీఆర్ఎఫ్ ఉగ్రదాడి గుర్తుకు వస్తుంది. 28 మంది అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్న సంఘటన కళ్ల ముందు మెదలుతుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు పూర్తిగా చక్కబడ్డాయి. బందోబస్తు కూడా పటిష్టంగా ఉంది.5వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత పహల్గామ్ నుంచి శ్రీనగర్కు ప్రయాణం. శంకరాచార్య ఆలయ దర్శనం. సాయంత్రం దాల్ లేక్లో శికారా రైడ్, దాల్ లేక్ అలల మీద సూర్యాస్తమయాన్ని ఆస్వాదించడం, ఫ్లోటింగ్ గార్డెన్స్ మధ్య విహారం, సాయంత్రం హౌస్బోట్లో చెక్ ఇన్. రాత్రి భోజనం, బస హౌస్బోట్లో.కల్హణుడు చెప్పాడు ఇది శంకరాచార్య టెంపుల్గా వ్యవహారంలోకి వచ్చింది, కానీ ఇక్కడ పూజలందుకునే దేవుడు శివుడు. ఆది శంకరాచార్యుడు భారతదేశ పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చాడని చెబుతారు. అంతే కాదు సౌందర్యలహరిని ఇక్కడే రాశాడని కూడా చెబుతారు. రాజతరంగిణి గ్రంథంలో కల్హణుడు ఈ ఆలయం గురించి అనేక విషయాలను పొందుపరిచాడు. శ్రీనగర్ అంతటినీ ఓ పది నిమిషాల్లో చూడాలంటే ఆది శంకరాచార్య ఆలయమే రైట్ పాయింట్. ఇక్కడి నుంచి చూస్తే దాల్ లేక్, జీలం నది, హరిపర్బత్ వంటి ముఖ్యమైన ప్రదేశాలన్నీ కనిపిస్తాయి.ఐదు వేల అడుగుల ఎత్తులో శికారా రైడ్శికారా అంటే పై కప్పు ఉన్న చెక్కతో చేసిన పడవ. ఈ సరస్సు ఐదు వేల అడుగుల ఎత్తులో ఉంది. దాల్ లేక్లో శికారా రైడ్ ఒక మధురానుభూతి. శీతాకాలంలో నీరు గడ్డకడుతుంది. దాల్లేక్ నీరు మరీ ఎక్కువగా గడ్డకట్టినప్పుడు ఆ మంచు మీద వాహనాలను నడపడం, క్రికెట్ ఆడడం వంటి సరదాలు చేస్తుంటారు. అయితే ఏటా ఈ స్థాయిలో నీరు గడ్డకట్టదు. శికారాతోపాటు హౌస్బోట్ విహారం, బస కూడా ఎక్స్పీరియెన్స్ చేసి తీరాలి. విదేశీ పర్యాటకులను ఆకట్టుకోవడం కోసం హౌస్బోట్లకు హాలీవుడ్, యంగ్ హాలీవుడ్, క్వీన్స్ లాప్ వంటి పేర్లు పెడతారు. ఈ హౌస్బోట్లు ఏదో రాత్రి బస కోసం చేసిన చిన్న ఏర్పాటులా ఉండదు. రాజమందిరంలాగ ఉంటుంది. నీటి మీద తేలుతున్న రాజభవనంలో బస చేసినట్లు ఉంటుంది. దాల్ లేక్లో ఫ్లోటింగ్ గార్డెన్స్ మాత్రమే కాదు ఫ్లోటింగ్ ఏటీఎమ్ కూడా ఉంది. ఫ్యాబ్రికేటెడ్ వాల్స్తో చేసిన గదిలో ఎస్బీఐ ఏటీఎమ్ సెంటర్ నిర్వహిస్తోంది. ఇక్కడ పర్యటిస్తుంటే ఆమ్స్టర్డామ్లోని ఫ్లోటింగ్ ఫ్లవర్ మార్కెట్లో విహరిస్తున్నట్లు ఉంటుంది. కశ్మీర్ను ప్యారడైజ్ ఆన్ ఎర్త్ అని ఎందుకంటారో ఇక్కడ విహరిస్తే అవగతమవుతుంది. కేరళలో బోట్హౌస్లో బస, విహారం చేసిన వాళ్లు శ్రీనగర్ హౌస్బోట్ కూడా అలాగే ఉంటుందని లైట్ తీసుకోవద్దు. దేనికదే ప్రత్యేకమైన అనుభూతి.6వరోజుఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత హౌస్బోట్ చెక్ అవుట్ చేయాలి. మొఘల్ గార్డెన్స్, బొటానికల్ గార్డెన్స్, షాలిమార్ గార్డెన్స్ సందర్శనం తర్వాత శ్రీనగర్ ఎయిర్΄ోర్టుకు చేర్చి, టూర్ నిర్వహకులు వీడ్కోలు పలుకుతారు. సాయంత్రం 18.20 గంటలకు 6ఈ– 6255 విమానంలో శ్రీనగర్ నుంచి ప్రయాణం, ఈ విమానం రాత్రి 21.20 గంటలకు హైదరాబాద్కు చేరుతుంది.ఉద్యావనాల కశ్మీరంకశ్మీర్లోని మొఘల్ గార్డెన్స్ ఆరు చోట్ల ఉన్నాయి. ఇవన్నీ నిజానికి మొఘలులు మనదేశంలోకి రావడానికి రెండు వందల ఏళ్ల ముందు నుంచే ఉన్నాయి. పర్షియా నుంచి కశ్మీర్కు వచ్చిన పాలకులు, పర్షియన్ ప్రభావం ఉన్న పరిసర ప్రదేశాల పాలకులు ఇక్కడ చక్కటి ఉద్యానవనాలను ఏర్పాటు చేశారు. నిషాద్ బాగ్, షాలిమార్ బాగ్, అచల్బాల్ బాగ్, చష్మా షాహీ, పరి మహల్, వెరినాగ్ అలా ఏర్పడినవే. మొఘలులు మనదేశానికి వచ్చిన తర్వాత అక్బర్, జహంగీర్, షాజహాన్లు ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని అభివృద్ధి చేశారు. అందమైన పూలతోటల మధ్య రాజవంశస్తుల విడిది భవనాలుంటాయి. ఈ గార్డెన్స్లో పర్యటన అక్టోబర్ నుంచి పూలు విచ్చుకోవడం మొదలవుతుంది. మార్చి వరకు పూలు సువాసనలు విరజిమ్ముతుంటాయి. నెహ్రూ మెమోరియల్ బొటానికల్ గార్డెన్ను కూడా చక్కగా మెయింటెయిన్ చేస్తుంటారు. శీతల పవనాల మధ్య చక్కగా విరిసిన పూలు, మెత్తగా రాలిపడుతున్న పూల రెక్కల మధ్య విహారం లైఫ్ టైమ్ ఎక్స్పీరియెన్స్ అనే చె΄్పాలి.శ్రీనగర్ టూర్ ప్యాకేజ్ప్యాకేజ్ పేరు ‘మిస్టికల్ కశ్మీర్ ఎక్స్ హైదరాబాద్’. ప్యాకేజ్ కోడ్ ఎస్హెచ్ఏ11. ఇది ఆరు రోజుల టూర్. హైదరాబాద్ నుంచి మొదలై హైదరాబాద్కు చేరడంతో పూర్తయ్యే ఈ టూర్లో కశ్మీర్లోని శ్రీనగర్, గుల్మార్గ్, సోన్మార్గ్, పహల్గామ్ కవర్ అవుతాయి.ఈ పర్యటనలు అక్టోబర్ ఆరవ తేదీన మరియు నవంబర్ 13వ తేదీన మొదలవుతాయి. ఎవరికి సాధ్యమైన ట్రిప్లో వారు బుక్ చేసుకోవచ్చు. ప్యాకేజ్ ధరలిలాగ ఉన్నాయి. సింగిల్ ఆక్యుపెన్సీలో 45,100 రూపాయలు, డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 34,950, ట్రిపుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 33,510 రూపాయలు. ప్యాకేజ్లో... విమానం టికెట్లు, నాలుగు రోజులు హోటల్ బస, ఒక రోజు హౌస్బోట్లో బస, బ్రేక్ఫాస్ట్లు, రాత్రి భోజనాలు, ఐటెనరీలో సూచించిన ప్రదేశాలకు రవాణా, టూర్ ఎస్కార్ట్ సౌకర్యం, ట్రావెల్ ఇన్సూరెన్స్, టోల్ ఫీజులు, పార్కింగ్ ఫీజు, పన్నులు వర్తిస్తాయి. పర్యాటక ప్రదేశాల ఎంట్రీ ఫీజులు, మధ్యాహ్న భోజనాలు, ఇంటి నుంచి ఎయిర్పోర్టుకు రవాణా, విమానంలో కొనుక్కునే ఆహారపదార్థాలు– డ్రింకులు, పర్యాటక ప్రదేశాల్లో లోకల్ రవాణా, రైడ్ల ఖర్చులు ప్యాకేజ్లో వర్తించవు. పర్యాటకులు విడిగా భరించాలి.గోండాలా కేబుల్ కార్ బుక్ చేసుకోవడానికి లింక్:https://www.jammukashmircablecar.comవాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: యోగాతో ఇంత మార్పు..! ఏడాదికే ఏకంగా 83 కిలోల బరువు మాయం) -
సంభాషణ హృదయాల కలయిక
మనిషినీ జంతువునీ వేరు చేసేది మాట, మనిషినీ మనిషినీ వేరు చేసేదీ మాటే. నిజమైన సంభాషణ మనకు జీవం పోస్తుంది. మనలో ధైర్యాన్ని నింపే దీపం, మనలో ఆశను వెలిగించే వెలుగు. అది మన గమ్యాన్ని నిర్దేశించే మార్గదర్శి, మనలోని భయాన్ని జయించే సైనికుడు. మాటే మన కీర్తిని నిర్మించే శిల్పం, మాటే భవిష్యత్తు అనే వనంలో విత్తే తొలి విత్తనం. మనం పలికే ప్రతి మాటా ఒక సంబంధానికి మూల బీజం. అది బంధాలను విడగొట్టగలదు, లేదా కొత్త సంబంధాలను స్థాపించగలదు.అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ ్ఢ స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే ఇతరులకు బాధ కలిగించని, సత్యంతో కూడిన, ప్రియమైన, మేలు చేసే మాటలను పలకడం, మరియు ఆత్మ పరిశీలన చేయడం – ఇవి తపస్సుగా చెప్పబడ్డాయి. ఈ శ్లోకం సంభాషణ కేవలం మాటల మార్పిడి కాదని, అది ఒక పవిత్రమైన సాధన అని తెలియజేస్తుంది.సంభాషణ ఒక మహోన్నతమైన కళ. అది కేవలం పెదవుల నుండి వచ్చే పదాల సమూహం కాదు, అది ఆత్మల మధ్య జరిగే గానం. నిజమైన సంభాషణ మన అంతరంగపు చీకటిలో వెలుగును నింపుతుంది, కన్నీళ్లను ఆనందపు జల్లులుగా మారుస్తుంది, యుద్ధం లేకుండానే విజయాన్ని సాధిస్తుంది.దీనికి అత్యుత్తమ ఉదాహరణ శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన ఉపదేశం. ధర్మానికి, కర్మకు మధ్య చిక్కుకున్న అర్జునుడి మనసు సంశయం అనే దట్టమైన పొగమంచులో నిలిచిపోయింది. కానీ, శ్రీకష్ణుని మాటలు కేవలం గొంతు నుండి రాలేదు; అవి జ్ఞానపు సూర్యోదయంలా ఆ పొగమంచును తొలగించి, మార్గాన్ని స్పష్టంగా చూపాయి. ప్రేమతో, కరుణతో నిండిన ఆ మాటలు, అర్జునుడిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, శాంతితో కూడిన విజయాన్ని అందించాయి.మాటలకు ఉన్న శక్తికి మరొక ఉదాహరణ, ఒక అసాధ్యమైన సముద్రాన్ని చూసి నిరాశలో ఉన్న హనుమంతుడు ఒకప్పుడు, తన అపారమైన శక్తిని మరచిపోయే ఒక శాపంతో బంధించబడిన హనుమంతుడు నిరాశలో ఉన్నప్పుడు, ఆ శాపాన్ని తొలగించే మంత్రం లాంటి జాంబవంతుడి మాటలు, ‘ఓ వాయుపుత్రా! నీ అపార శక్తిని మరచితివి!’ అని గర్జించాయి. ఆ మాటల గర్జనకే, హనుమంతుడిలో నిద్రపోయిన సామర్థ్యం తిరిగి మేల్కొల్పబడింది. ఆ ఒక్క మాటే వేలాది యోజనాల సముద్రాన్ని దూకే శక్తినిచ్చింది. మాట అంటే కేవలం ఒక ధ్వని కాదు, అది మనలోని అంతులేని సామర్థ్యాన్ని బయటకు తెచ్చే ఒక ప్రేరణ.సంగచ్ఛధ్వం సంవదధ్వం, సం వో మనాంసి జానతామ్అందరూ కలిసి నడవండి, కలిసి మాట్లాడండి, మీ మనసులు ఒకరినొకరు అర్థం చేసుకోండి. ఈ సూక్తి సంఘటిత జీవితానికి సంభాషణ ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. హృదయాల మధ్య గోడలు కట్టే మాటల బదులు, వారధులు నిర్మించే మాటలను పలకాలి. అదే అసలైన సంభాషణ. మన మాటలు మన వ్యక్తిత్వానికి, మన హృదయానికి ప్రతిబింబాలు. వాటిని శుభ్రంగా, సున్నితంగా, ప్రేమతో ఉంచినప్పుడే మన జీవితం ఒక అందమైన కవితలా మారుతుంది.మాటలు కేవలం అక్షరాల సమ్మేళనం కాదు, అవి మన అంతరంగపు భావాలకు ప్రతిరూపాలు. మనసులో ఉన్న ఆలోచనలను, హృదయంలో ఉన్న అనుభూతులను వెలికి తీసే ఒక అద్భుతమైన శక్తి సంభాషణకు ఉంది. అది ఒక నిశ్శబ్ద ప్రవాహం. ఒకరి హృదయాన్ని మరొకరి హృదయంతో కలిపే ఒక అద్భుతమైన వారధి. ఈ వారధి ఎంత దృఢంగా ఉంటే, మన మధ్య సంబంధాలు అంత గాఢంగా ఉంటాయి. అందుకే సంభాషణ కేవలం సమాచార మార్పిడి కాదు, అది హృదయాల కలయిక. – కె. భాస్కర్ గుప్తా (వ్యక్తిత్వ వికాస నిపుణులు) -
మహిళా పాఠకులు చదవాల్సిన 20 పుస్తకాలు
స్త్రీలు రాసిన పుస్తకాలు, స్త్రీల గురించిన పుస్తకాలు చదవడం అంటే కొత్త మైదానాల్లోకి అడుగు వేయడమే. సాహిత్యం వికాసాన్ని, వివేచనను ఇస్తుంది. ఇంటిలోని మహిళ పుస్తక పఠనం మొదలెడితే ఇంటిల్లిపాది పాఠకులు అవుతారు. ‘సాక్షి’ పాఠకుల కోసం ప్రత్యేకంగా ప్రతి మహిళ కనీసం చదివి ఉండాల్సిన 20 పుస్తకాలు ఇక్కడ ఇస్తున్నాం. ఇలా ఎంపిక చేయదగ్గవి తెలుగు నుంచి మరో వందైనా ఉన్నాయి. ఈ ఎంపికలో నచ్చినవి తీసుకొని చదవండి.1. సచ్చరిత్ర– బండారు అచ్చమాంబతొలి తెలుగు కథకురాలు బండారు అచ్చమాంబ జీవిత్రచరిత్ర ఇది. గురజాడ అ΄్పారావు కన్నా ముందే ‘ధనత్రయోదశి’ కథ రాసి తెలుగు కథకు బాటలు వేశారు. ‘సచ్చరిత్ర’ తప్పక చదవదగ్గది.2. మావూరి ముచ్చట్లు– పాకాల యశోదారెడ్డితెలంగాణ ప్రాంతం నుంచి మాండలిక సౌందర్యంతో కథలు రాసిన రచయిత్రి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు.3. నా ఇంగ్లండు యాత్ర– పోతం జానకమ్మజానకమ్మ అనే తెలుగింటి ఆడపడుచు 1873లో ఓడలో చేసిన ఇంగ్లండు ప్రయాణ విశేషాలను, ఆనాటి సామాజిక పరిస్థితులను పుస్తక రూపంలో రాశారు. 1876లో ఈ పుస్తకం వెలువడింది.4. శారద లేఖలు– కనుపర్తి వరలక్ష్మమ్మ సాహితీవేత్తగా ప్రసిద్ధి చెందిన వరలక్ష్మమ్మ 1929 నుంచి 1934 వరకు ‘గృహలక్ష్మి’ మాసపత్రికలో రాసిన శారద లేఖలు ప్రసిద్ధి పొందాయి. దురాచారాలను ఖండిస్తూ, స్త్రీల అభ్యున్నతి కాంక్షించేలా నడిచే ఈ లేఖలు అనేక అంశాల గురించి చర్చిస్తాయి.5. స్త్రీ(నవల)– గుడిపాటి వెంకటాచలంస్త్రీవాదాన్ని బలపరుస్తూ ప్రసిద్ధ రచయిత గుడిపాటి వెంకటాచలం 1925లో రాసిన నవల. స్త్రీలు ఏ అడ్డూ లేకుండా స్వేచ్ఛగా జీవించాలన్న తృష్ణకు ఈ నవల నేపథ్యం.6. జానకి విముక్తి (నవల)– రంగనాయకమ్మ స్త్రీలలో రావాల్సిన మార్పులను, వారు సాధించాల్సిన అభ్యున్నతిని కాంక్షిస్తూ రాసిన నవల ఇది. ‘జానకి’ అనే పాత్ర జీవితంలో జరిగిన అనుభవాలను వివరంగా తెలుపుతుంది ఈ పుస్తకం.7. కాలాతీత వ్యక్తులు (నవల) – పి.శ్రీదేవితెలుగు సాహిత్యంలో పేరెన్నికగన్న నవల. పురుషాధిక్యతను నిరసిస్తూ, స్త్రీలు స్వతంత్రంగా ఎదగాలన్న కాంక్షను కనబరుస్తూ సాగే పాత్రలు ఇందులో కనిపిస్తాయి.8. నాలో నేను (ఆత్మకథ) – భానుమతీ నటి, దర్శకురాలు, రచయిత్రి, గాయని, సంగీతకారిణి అయిన భానుమతీ రామకృష్ణ ఆత్మకథ ఈ పుస్తకం. సామాన్య కుటుంబంలో జన్మించిన ఆమె, అంచెలంచెలుగా ఎదిగిన తీరు ఈ పుస్తకంలో చదవొచ్చు.9. గోరాతో నా జీవితం– సరస్వతి గోరాప్రముఖ హేతువాద ఉద్యమకారుడు గోరా సతీమణి సరస్వతి రాసిన ఆత్మకథ ఈ పుస్తకం. సామాన్య గృహిణిగా ఉన్న ఆమె గోరా సాహచర్యంతో హేతువాదిగా ఎదిగిన క్రమాన్ని ఇందులో పొందుపరిచారు.10. రాజకీయ కథలు– ఓల్గాస్త్రీల జీవితాల్లోని విభిన్న పార్శా్వలను, వాటి చుట్టూ అల్లుకున్న రాజకీయాలను పొందుపరిచిన కథలివి. స్త్రీ వాదానికి బలమైన దన్నుగా నిలిచిన కథలు.11. ఇల్లాలి ముచ్చట్లు– పురాణం సుబ్రహ్మణ్య శర్మవారపత్రికలో ప్రచురితమైన ఈ ఇల్లాలి ముచ్చట్లు తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని పొందాయి. రోజువారీ సంఘటనలు మొదలుకొని, అంతర్జాతీయ అంశాల దాకా అన్నింటి పట్ల సగటు ఇల్లాలి స్పందన ఇది. హాస్యం, వ్యంగ్యం, సామాజిక అవగాహన కలగలిసిన ముచ్చట్లు.12. రాయక్క మాన్యం (కథలు)– తెలంగాణలోని దళిత జీవన నేపథ్యాన్ని, స్థితిగతులను యథాతథంగా చిత్రించిన కథలివి. దళిత స్త్రీల జీవనపోరాటాన్ని ఈ కథల్లో చూడొచ్చు.13. నల్లపొద్దు– సంపాదకురాలు: దళిత స్త్రీలు రచించిన సాహిత్యాన్ని తొలిసారిగా పుస్తక రూపంలోకి తీసుకొచ్చి అందించిన పుస్తకం. ఈ రచనల్లో అస్తిత్వ ఘర్షణ, నిరంతర పోరాట స్ఫూర్తి కన్పిస్తాయి. 14. నీలి మేఘాలు (స్త్రీవాద కవిత్వం)తెలుగు స్త్రీవాద సాహిత్యంలో కీలకమైన కవిత్వ సంపుటి. స్త్రీల సమస్యలు, వారి అంతరంగాలు, అభ్యంతరాలకు బలమైన వ్యక్తీకరణతో కవిత్వరూపం ఇక్కడ కనిపిస్తుంది.15. నిర్జనవారధి (ఆత్మకథ)– కొండపల్లి కోటేశ్వరమ్మ కమ్యూనిస్టు ఉద్యమకారిణి కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ. 92 ఏళ్ల వయసులో ఆమె రాసిన ఈ పుస్తకం తెలుగు రాష్ట్రాల్లోని అనేక పరిణామాలను వివరిస్తుంది.16. ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు: ఫాతిమా షేక్భారతదేశ తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు, సామాజిక సంస్కర్త, జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల సహోద్యోగి ఫాతిమా షేక్. ఆమె జీవిత చరిత్ర తప్పక తెలుసుకోవాల్సినది. రచన: నసీర్ అహ్మద్.17. చదువు తీర్చిన జీవితం (ఆత్మకథ)– కాళ్లకూరి శేషమ్మమెట్టు మెట్టు ఎక్కిన ఒక సామాన్య మహిళ ఆత్మకథ ఈ పుస్తకం. క్రమశిక్షణ, సంయమనంతో తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్న కాళ్లకూరి శేషమ్మ ఏడు దశాబ్దాల అనుభవసారం స్ఫూర్తిదాయకమైనది.18. నా మాటే తుపాకీ తూటా (ఆత్మకథ)తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని, ఆపై ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కమ్యూనిస్టు నేత మల్లు స్వరాజ్యం జీవితాన్ని గ్రంథస్తం చేసిన పుస్తకం ఇది. 19. కుప్పిలి పద్మ కథలుఆధునిక స్త్రీల జీవనంలో వస్తున్న మార్పులు, యువతీయువకుల జీవితపు ఆకాంక్షలను ఒడిసిపట్టిన కథలివి. కథలను కవితాత్మకంగా చిత్రించటం కుప్పిలి పద్మ రచనల ప్రత్యేకత.20. ఎదారి బతుకులు(కథలు)– ఎండపల్లి భారతిబడుగుజీవుల జీవన క్రమాన్ని, వారి సంతోషాలను, సరదాలను, బాధలనూ ఒకచోట చేర్చిన కథలివి. పల్లెవాసుల జీవనాన్ని యథాతథంగా చిత్రించి అందించారు రచయిత్రి ఎండపల్లి భారతి. -
మా ఆడపిల్లల్ని "అదోలా" చూస్తున్నారు..
తమ ఊరికి మంచి పేరు తేవాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఊరి పేరే తమకు చెడ్డ పేరు తెస్తోందని ఆ ఊరివాళ్లు వాపోతున్నారు. గతంలో అప్పుడెప్పుడో తమ తాతల కాలం నాడు వాడుకలోకి వచ్చిన ఆ పేరు ఇప్పుడు తమ పాలిట శాపంలా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తుకు కూడా అడ్డంకిలా పరిణమించిందని ఆందోళన చెందుతూ అధికారుల చుట్టూ ప్రదక్షిణాలు కూడా చేస్తుండడం విశేషం. ఆ ఊరు ఏంటి? ఆ ఊరి పేరు ఎందుకు ఆ ఊరివాళ్ల పాలిట గుదిబండలా మారింది అనే వివరాల్లోకి వెళితే... శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో ఉన్నాయి పక్కపక్కనే ఉన్న రెండు ఊర్లు. ప్రస్తుతం ఆ ఊరి పేర్లే మార్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. అసభ్యకరంగా ఉన్న ఆ పేర్లను చెప్పడానికి ఇబ్బందిగా ఉందని తాము సభ్యతగా జీవిస్తున్నా తమ ఊరి పేరు మాత్రం తమను దిగజారుస్తోందనేది వీరి ఆవేదన. ఆ ఊర్లకు అలాంటి పేర్లు రావడానికి కూడా గత చరిత్ర దోహదం చేసిందని ఆ ప్రాంతంలోని పాత తరం వారు చెబుతున్నారు. ఈ రెండు గ్రామాలు కొండల్ని ఆనుకుని ఏర్పడ్డాయి చాలా కాలం క్రితం సంపన్నులైన పర్లాఖిమిండి రాజవంశీయుల ప్రాపకంతో ఆ ఊర్లు ఏర్పడ్డాయట. సదరు రాజ వంశంలోని మగవారు తమ ఆధీనంలోని ఉంపుడుగత్తెలను ఉంచడం కోసం ఆ ప్రాంతాలను ఎంచుకున్నారట. అంతేకాకుండా వారికి కొన్ని భూములను కూడా బహుమతులుగా ఇచ్చారట. ఈ కారణంగానే ఆ ఊర్లకు అలాంటి పేర్లు వచ్చాయని ఆ ఊరి చరిత్ర గురించి తెలిసిన వారు చెబుతున్నారు. అక్కడ ఉంపుడుగత్తెలను ఉంచేవారు కాబట్టి ఆ ఊర్లను సానిపాలెం, సవర సానిపాలెం అంటూ పిలిచేవారట. అలా అలా అదే పేర్లు రికార్డులలోకి కూడా ఎక్కాయట. ఆ ఊర్లలోని ఒకటైన సానిపాలెంలో దాదాపు 220 కుటుంబాలు ఉన్నాయి. ఆ దగ్గరలో ఎస్టీ కులాల వారు ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న ప్రాంతాన్ని సవర సానిపాలెంగా పిలుస్తున్నారు. కొంత కాలం పాటు ఆ పేర్లు అలాగే కొనసాగినా... ప్రస్తుతం ఆ ఊర్లలో అనేక మంది విద్యావంతులుగా , అన్ని రకాలుగానూ అభివృద్ధి చెందుతుండడంతో ఆ ఊరి పేర్లు వారిని ఇబ్బంది పెడుతున్నాయి. దాంతో గ్రామస్తులు తమ ఊర్ల పేర్లను మార్చాలని కోరుతున్నారు. ఆధార్, రేషన్ కార్డులు, విద్యార్థుల సర్టిఫికెట్లలో ఆ ఊరి పేర్లు ఉండటంతో అవమానంగా ఉందని, మరీ ముఖ్యంగా పెళ్లి సంబంధాలు కూడా రావడం లేదని అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపధ్యంఓ తమ ఊర్ల పేరు మార్చాలని కోరుతూ ఈ రెండు గ్రామాల ప్రజలు తహసీల్దార్, డీఆర్వోలకు అలాగే శ్రీకాకుళం జెడ్పీ కార్యాలయంలో కూడా . వినతిపత్రాలు అందజేశారు. సానిపాలెం పేరును రామయ్యపాలెంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో కూటమి ప్రభుత్వం జిల్లాల పేర్లు, మండలాల పేర్లు, గ్రామాల పేర్లు మార్చుకునేందుకు అవకాశం ఇచ్చిన విషయాన్ని ఆ ఊరివాళ్లు గుర్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే పేరు మార్పునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు.చాలా సందర్భాల్లో తమ ఊరి పేరు చెప్పాలంటేనే సిగ్గుగా ఉంటోందని స్థానికులు అంటున్నారు.. తమ గ్రామం పేరు చెప్పి అవమానాలు కూడా పడ్డామంటున్నారు. కొందరు ఊరి పేరు చెప్పగానే నవ్వుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడో రాజుల కాలం నాటి పేర్లు అలాగే ఉన్నాయని.. వాటిని ఇప్పుడైనా మార్చాలని కోరుతున్నారు. వీరి వినతికి స్పందించి ప్రభుత్వం పేరు మార్పు ఎప్పుడు చేస్తుందో...చూడాలి. -
యోగాతో ఇంత మార్పు..! ఏడాదికే ఏకంగా 83 కిలోల బరువు మాయం
వెయిట్ లాస్ జర్నీలకు సంబంధించిన ఎన్నో స్ఫూర్తిదాయకమైన కథలను విన్నాం. ఎన్నో త్యాగాలు, కఠినమైన డైట్లు అవలంబించామనే చెబుతుంటారు చాలామంది. ముఖ్యంగా ఇన్ని గంటలు వర్కౌట్లు, డైట్ వంటివి క్రమంతప్పకుండా చేస్తేనే మంచి ఫలితం అని విన్నాం. కానీ ఈ బామ్మ యోగాతో అద్భుతం సృష్టించింది. ఏకంగా ఒక్క ఏడాదికే కిలోలుకొద్ది బరువు తగ్గి యోగా పవర్ ఏంటో చాటిచెప్పి.. అందరికి స్ఫూర్తిగా నిలిచింది. ఆ బామ్మనే అమృత్సర్కు చెందిన 87 ఏళ్ల శకుంతల దేవి. ఆమె యోగాతో ఒక ఏడాదిలోనే 83 కిలోలు పైనే బరువు తగ్గింది. వయస్సుని ధిక్కరించేలా అత్యంత చురుకుగా ఉందామె. వృద్ధురాలిలా కాకుండా ఒక వండర్ బామ్మని చూసిన అనుభూతిని కలిగిస్తోంది. బాలీవుడ్ బుల్లితెర షో లాఫ్టర్ చెఫ్స్ 2లో కనిపించి..అందరినీ ఆశ్చర్యపరించిందామె. ఆమె అసామాన్య ఎనర్జీని చూసి అక్కడ సెలబ్రిటీలే విస్తుపోయారు. ఆ షో హోస్ట్ భారతి సింగ్తో మాట్లాడుతూ తాను ఒకప్పుడు దగ్గర దగ్గర.. 123 కిలోలు పైనే బరువు ఉండేదాన్ని అని చెప్పింది. దాంతో ఒక్కసారిగా అక్కడున్నవారంతా విస్తుపోయారు. తాను యోగా మీద నమ్మకంతో వెయిట్లాస్ జర్నీని ప్రారంభించానని చెప్పుకొచ్చింది. "బరువు తగ్గడం అనేది ఒక స్థిరమైన ప్రయాణం. కేవలం క్రమశిక్షణతో కూడిన స్థిరత్వంతో శరీరం బరువు తగ్గించేలా మనసుని ప్రేరేపించగలం అని చెబుతోంది". ఆ షోలో శకుంతలా దేవి వేసిన యోగాసనాలను చూసి అంత షాకయ్యారు. ప్రతి ఒక్క ఆసనాన్నిచాలా అలవోకగా వేసిందామె.123 కిలోల నుండి 40 కిలోలకు ఎలా చేరుకుందంటే..2008 ఆ సమయంలో శకుంతల దేవి విపరీతమైన బరువు పెరిగి ఇబ్బందిపడింది. దాంతో ఆమె దైనందిన జీవితం భారంగా మారింది చిన్న చితక పనులు కూడా చేయలేని పరిస్థితికి వచ్చేసింది. భారతీయ గురువు బాబా రాందేవ్ ఆమెను యోగాకు పరిచయం చేసినప్పుడు తన పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెబుతోందామె. టెలివిజన్లో ఆయన యోగాసనాలు ప్రదర్శించడం చూసి తన వెల్నెస్ నియమావళిలో ఆరోగ్యకరమైన అలవాట్లను చేర్చుకోవాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యిందట. ఆమె చికిత్స కోసం మందులను ఆశ్రయించకూడదని ఇంట్లోనే సాధారణ ఆసనాలను అభ్యసించడం ప్రారంభించింది. ఒక ఏడాది తర్వాత 2009లో శకుంతలా దేవి యోగాను సరిగా నేర్చుకోవడానికి హరిద్వార్కు వెళ్లింది. రోజువారి దినచర్యలో భాగంగా 4 గంటలకు మేల్కొని ఆసనాలు వేయడం చేసేది. దాంతో కేవలం ఒక్క ఏడాదిలోనే బరువు తగ్గడమే కాకుండా యోగా ఆమె ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చివేసింది. ఇది ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఇప్పటికీ ఈ వయసులో కూడా ఆమె కఠినమైన ఫిట్నెస్ నియమాన్ని అనుసరిస్తుంది. అలాగే ఇతరులకు యోగాని నేర్పుతోంది. దృఢ సంకల్పం, నిబద్ధతలతో మెరుగైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోగలమని శకుంతల దేవి వెయిట్ లాస్స్టోరీనే చెబుతోంది. కాగా, హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ ప్రకారం, యోగా కేలరీలను బర్న్ చేయడమేగాక, అతిగా తినడాన్ని నివారించి బరువు తగ్గేలా చేస్తుందని జర్నల్లో పేర్కొంది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by 𝐀𝐍𝐀𝐘𝐀 ᥫ᭡. (@minexspace) (చదవండి: రక్తపరీక్షతో ప్రీఎక్లాంప్సియా గుర్తింపు!) -
నన్నుఇంటికి తీసుకువెళ్ళు
ఒక ప్రదేశానికి వెళ్లే మార్గాన్ని కనుగొనడానికి మనకు రెండు విషయాలు అవసరం. అవి ఒకటి మ్యాప్ రెండు దిక్సూచి. లేదా రెండింటిని కలిపే గూగుల్/ఆపిల్ మ్యాప్స్. మ్యాప్ మన గమ్యస్థానానికి సంబంధించి ..ప్రస్తుత స్థానం తోపాటు వెళ్లాల్సిన ప్రదేశం దిశను తెలియజేస్తుంది. అయితే దీన్ని సులభంగా జంతువులు పసిగట్టేయగలవట. అందుకుతగ్గట్టుగా మెదడు, అవయవాల ప్రత్యేక అమరిక ఉందని జీవశాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతేగాదు హోమింగ్ పావురాలలో ఈ నావిగేషన్ సామర్థ్యం ఉందని అర్ధ శతాబ్దానికి పైగా చేసిన అధ్యయనం వెల్లడైందట అందుకోసం ఇవి సూర్యుడిని ఆధారంగా చేసుకుంటాయని గుర్తించి విస్తుపోయారు శాస్త్రవేత్తలు. అందుకోసం రాత్రిపూట కృత్రిమంగా వెలుగుని ప్రసరించేలా చేసి, పగటిపూట చీకటి ఉంటేలా చేశారట పరిశోధకులు. దాంతో అవి శరీర గడియారాన్ని మార్చుకునే వ్యస్థను తటస్థీకరించిందని గుర్తించాయట. ఎందుకంటే దాని వల్లే కొన్ని పక్షులు ఎండగా ఉన్నప్పుడు ఇంటికి వెళ్లలేని పరిస్థితిలో ఉండగా, మరికొన్ని ఇంటికి వెళ్లే మార్గాన్నే గుర్తించడంలో విఫలమయ్యాయట. కానీ మేఘావృతమైన రోజుల్లో ఎలాంటి సమస్య లేకుండా ఉంటాయట. అదెలా అని పరిశోధించగా..అవి భూమి అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగిస్తున్నట్లు అంచనా వేశారు. అనేక జంతువులు, పక్షులు మాదిరిగా ఈ పావురాల ముక్కుల పై భాగంలో మాగ్నెటైట్ (లేదా ఐరన్ ఆక్సైడ్) కణాలు ఉంటాయట, అవి భూమి అయస్కాంత క్షేత్రాన్ని దిక్సూచిలాగా గ్రహించడానికి సహాయపడతాయట. ఈ ఇంద్రియాన్ని నిష్క్రియం చేసేలా పరిశోధకులు పక్షుల తలలకు అయస్కాంతాలను అనుసంధానించారు. అలాగే వాటి ముక్కులకు అనస్థీషియా ఇచ్చారు. దాంతో అవి సూర్యుడిని ఉపయోగించి నావిగేట్ చేయలేకపోయాయి. అలాగే మబ్బుగా ఉన్న రోజుల్లో దారితప్పాయట. అయితే ఎండగా ఉన్న రోజుల్లో అవి తమ మార్గాన్ని సులభంగా గుర్తించాయట. ఇక్కడ ఆ పావురాలు ఒక ఇంద్రియాన్ని కోల్పోతే మరొక ఇంద్రియాన్ని భర్తీ చేస్తున్నట్లు గుర్తించారు పరిశోధకులు. ఇది నిజం అనేలా ఒక అమెరికన్ భూవిజ్ఞాన శాస్త్రవేత్త జాన్ హాగ్ర్స్టమ్ పక్షులు తాము ఎక్కడ ఉన్నాయో ఎలా చెప్పగలవో వివరించేలా ఒక సిద్ధాంతాన్ని వివరించారట. ఆ సిద్ధాంతం ప్రకారం..భూమి అయస్కాంత క్షేత్రంలో స్థిరమైన పౌనపున్యం ఇన్ఫ్రాసౌండ్ విడుదల చేస్తుందని, అయస్కాంత క్షేత్రం వలే గ్రహం ప్రతి భాగానికి దాని స్వంత సోనిక్ సౌండ్ ఉంటుంది. కొన్ని పక్షులు ఈ ఇన్ఫ్రాసౌండ్లను వినగలగడమే కాదు, అవి ఎటు నుంచి వస్తుందో గుర్తించగలదని అంటున్నారు జాన్. అయితే మరికొందరు ఆ శాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతంతో విభేదిస్తున్నారు. కచ్చితంగా ఇది ఎలా సాధ్యం అనేది నిర్థారించాల్సి ఉంది. చెప్పాలంటే జంతువులు తమ గమ్యస్థానానికి తిరిగి వెళ్లడానికి దృష్టి, వాసన, సూర్యుడు, నక్షత్రాలు, భూమి అయస్కాంత క్షేత్రం, ఇన్ఫ్రాసౌండ్ లేదా వీటన్నింటి కలయికను వినియోగిస్తాయా? లేదా అనేది ఒక మిస్టరీగా ఉంది. అయితే ఈ సామర్థ్యం వాటికి ఎలా వచ్చిందనేది తెలుసుకునేందుకు వందల కిలోమీటర్ల దూరం నుంచి తిరిగి గూళ్లకు సులభంగా చేరుకునే హోమింగ్ పావురాల ఎంపిక చేసి మరి పెంచుతారట. సింపుల్గా చెప్పాలంటే ఇది జన్యు లక్షణం. అయితే ఇది కొన్నింటి ఉంటుంది. మరికొన్నింటికి ఉండదు. కొన్ని జంతువులు దారితప్పితే తమ గమ్యస్థానానికి చేరుకోవాలో తెలియగా గందరగోళానికి గురవ్వుతాయట. దీనిపై సంవత్సరాలుగా రోమ్, నేను జంతువుల మాదిరిగానే తమలో ఎవరికి దిశానిర్దేశం ఉందో వాదించుకున్నాం. కానీ ఒక అసాధారణ క్షేత్ర పరిశోధకురాలు, జె. విజయకు అద్భుతమైన దిశానిర్దేశం ఉంది. ఆమె తెలియని అడవిలో తిరుగుతుంది. చెట్టును కోయకుండా లేదా కొమ్మను కొట్టకుండా, ఖచ్చితంగా తన మార్గాన్ని కనుగొంటుంది. ఆమెకు ఎలా సామర్థ్యం ఎలా వచ్చిందో తెలియదు, అందుకోసం ఏం చేస్తుందో కూడా తెలియదు. రెండు సంవత్సరాల క్రితం ఇంటికి తిరిగి వచ్చాక, చీమల దాడితో పోరాడినప్పుడు ఈ హోమింగ్ స్వభావం నాపై తిరిగి వచ్చింది. అత్తగారి మాట గుర్తుకు వచ్చి, నేను తృణప్రాయంగా తోట నుంచి రెండు కప్పలను పట్టుకుని సింక్ కింద వదిలేశాను. అవి నేరుగా తమ అడవి తోటలోకి వెళ్లిపోయాయి. ఈసారి అలా కాదని ఒక కార్డ్ బోర్డు పెట్టేలో పెట్టాను..అవి మల విసర్జనలతో దుర్వాసన కలిగించినా.. చీమల బెడదను నివారించాయి. ఈసారి ఈ కప్పలను ఇలా కార్డ్బోర్డ్లో బంధించకుండా రెడ్ కార్పెట్ట్రీట్మెంట్ సౌకర్యం అందిస్తా..ఎందుకంటే చీమల బెడద లేకుండా చేస్తే కచ్చితం వాటిని ముద్దుపెట్టుకుంటా.Author : Janaki Lenin -- జానకి లెనిన్Photo credit - జానకి లెనిన్(చదవండి: Frogs నన్ను ఇంటికి తీసుకు వెళ్ళు) -
ఒక్కటి తగ్గినా.. పర్ఫెక్ట్గా కుదరదు
ఒక్క చూపుతోనే అందరి చూపునూ తనవైపు తిప్పుకొనే మ్యాజిక్ నిధి అగర్వాల్ది. ట్రెండ్స్ వెంట పరుగెట్టకుండా, సింపుల్ స్టయిలింగ్తోనే గ్లామర్ని క్రియేట్ చేస్తుంది. స్టయిలింగ్లో కొత్తదనాన్ని, కాన్ఫిడెన్స్ను మిక్స్ చేసే నిధి స్టయిల్ సీక్రెట్ మీకోసం. ఇక్కడ ఆమె ధరించిన డ్రెస్ బ్రాండ్: నితికా గుజ్రాల్, ధర: రూ. 2,18,500, జ్యూలరీ: బ్రాండ్ ముసలద్దీన్ జెమ్స్ అండ్ జ్యూలర్స్, ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.ఔట్ఫిట్ చాయిస్లో ఎప్పుడూ కంఫర్ట్, స్టయిల్ రెండూ ఉండేలా చూసుకుంటాను. ఏ ఒక్కటి తగ్గినా స్టయిలింగ్ పర్ఫెక్ట్గా కుదరదు. డ్రెస్కు సరిపోయే మేకప్ తప్పనిసరి. ఎక్కువగా మినిమల్ మేకప్, జ్యూలరీనే ప్రిఫర్ చేస్తానని చెబుతోంది నిధి అగర్వాల్.నుదుటిన మెరిసే మ్యాజిక్!నుదుటి మధ్యలో వేలాడుతూ ఉండే ఈ మాంగ్ టిక్కా ఒక చిన్న ఆభరణం మాత్రమే కాదు, అమ్మాయిలకు క్వీన్ ఫీలింగ్ ఇచ్చే మాయాజాలం. పెళ్లి, సంగీత్, మెహందీ, పార్టీ– ఏ సందర్భమైనా సరే, పాపిట బిళ్ల వేసుకున్న వెంటనే మిగతా ఆభరణాలు అన్నీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్లిపోతాయి. చీర కట్టుకుంటే గోల్డ్ లేదా కుందన్స్ పాపిట బిళ్ల మెరుస్తూ రాయల్టీ టచ్ ఇస్తుంది.లెహంగా లేదా హాఫ్శారీ అయితే పర్ల్ లేదా స్టోన్ పాపిటి బిళ్లతో మెరిసిపోతూ ప్రిన్సెస్ లుక్ గ్యారంటీ! వెస్ట్రన్ గౌన్ వేసుకున్నారా? పాపిట బిళ్ల కూడా మినిమల్ స్టయిల్కి వచ్చి మీ లుక్ను మరింత స్టయిలిష్గా మార్చేస్తుంది. మధ్య పాపట ఉండే హెయిర్ స్టయిల్స్ ఎంచుకుంటే మంచిది. ఎందుకంటే, మధ్య భాగం జుట్టుతో పాపట బిళ్ల వేసుకుంటే ఫొటోలు సూపర్గా వస్తాయి, పెళ్లిపూల జడతో కలిపితే మాత్రం ఇక నువ్వే అసలైన మహారాణి! మార్కెట్లో ఎన్నో రూపాల్లో లభిస్తున్నాయి. గోల్డ్, వెండి, కుందన్ డిజైన్స్లోనూ. జ్యూలరీ షాపుల్లో లైట్ వెయిట్ మోడల్స్లోనూ ఉంటాయి, ఆన్లైన్లో అయితే కలర్ఫుల్ డిజైన్స్ ఒక్క క్లిక్తో ఇంటికి చేరిపోతాయి. (చదవండి: 'అద్భుత భవంతులు': వాస్తుకళా నైపుణ్యానికి సాంకేతిక జత చేసి..) -
అక్కడ చనిపోయి... ఇక్కడ బతికాడు!
అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసానికి ప్రతీకారంగా హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ముప్పయ్యారు బాంబు పేలుళ్లకు పాల్పడిన డాక్టర్ బాంబ్ అలియాస్ జలీస్ అన్సారీ ప్రధాన అనుచరుడు సయ్యద్ ముసద్దిక్ వహీదుద్దీన్ ఖాద్రీ వింత కథ ఇది. ముంబైలోని ఏడు విధ్వంసాలకు బాధ్యుడైన ఖాద్రీ అక్కడి పోలీసుల రికార్డుల ప్రకారం 2003లో చనిపోయాడు. రికార్డుల్లో చనిపోయిన ఇతగాడు రహస్యంగా హైదరాబాద్కు మకాం మార్చి, 2010 వరకు గుట్టుగా బతికాడు. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి తన అనుచరులకు ఈ–మెయిల్ పంపడంతో మహారాష్ట్ర ఏటీఎస్కు పట్టుబడ్డాడు. ప్రస్తుతం పరవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.సినిమాను తలపించే ఖాద్రీ ఉదంతం ఇదీ...ముంబైకి చెందిన డాక్టర్ జలీస్ అన్సారీ ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం తరవాత అతివాద భావాలు గల కొందరిని అనుచరులుగా చేసుకుని ముఠా కట్టాడు. వారిలో ఖాద్రీ కూడా ఒకడు. ఈ ముఠా 1993–94ల్లో రాజస్థాన్, మహారాష్ట్ర, హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 36 ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు పాల్పడింది. వీరు టార్గెట్ చేసిన వాటిలో రైళ్లు, రైల్వేస్టేషన్లే ఎక్కువగా ఉన్నాయి. జలీస్ అన్సారీ ముఠా 1993లో హైదరాబాద్లోని నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లు, రిజర్వేషన్ కౌంటర్లలో పేలుళ్లుకు ఒడిగట్టింది. తక్కువ ప్రభావం గల బాంబులను తయారు చేయడంలో దిట్ట అయిన జలీస్ అన్సారీని పోలీసు, నిఘా వర్గాలు ‘డాక్టర్ బాంబ్’ అని పిలుస్తుంటాయి. 1994 జనవరి 3న పోలీసులకు చిక్కడంతో ఇతడి విధ్వంసాలకు పుల్స్టాప్ పడింది. జలీస్ అన్సారీకి ప్రధాన అనుచరుడు ఖాద్రీపై ముంబైలో అనేక కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ఉన్న జంజీరామురాజ్ ఇతడి స్వగ్రామం. ముంబైలోని కేసులన్నీ 1998లో వీగిపోవడంతో నిర్దోషిగా బయటకు వచ్చాడు. కర్ణాటకలోని మంగుళూరుకు చెందిన అంతర్రాష్ట్ర గజదొంగ యాడ వసంత్ గ్యాంగ్లో చేరి ఇతని ప్రధాన అనుచరుడైన గోపాల రమణ శెట్టితో కలిసి మహారాష్ట్రలో దోపిడీలకు పాల్పడ్డాడు. 2004లో హైదరాబాద్ అబిడ్స్లోని రాజ్యలక్ష్మీ జ్యూలర్స్ నుంచి రూ.1.5 కోట్లు సొత్తు దోపిడీ చేసింది ఈ ముఠానే! అయితే, ఆ కేసులో ఖాద్రీ ప్రమేయం లేదు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో జరిగిన దోపిడీల్లోనే ఇతను పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలోనే 2001లో ముంబై పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లాడు. ఆ తరవాతి ఏడాది బెయిల్పై విడుదలయ్యాడు. ఖాద్రీపై ముంబై ఏటీఎస్తో పాటు ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నిఘా పెరగడంతో ఓ పెద్ద కుట్ర పన్నాడు. పోలీసుల దృష్టిలో, ప్రభుత్వ రికార్డుల ప్రకారం తాను చనిపోయినట్లు నమ్మిస్తేనే నిరాటంకంగా తన కార్యకలాపాలు కొనసాగించడానికి అవకాశం ఉంటుందని భావించిన ఖాద్రీ భార్యతో కలిసి పక్కా ప్లాన్ వేశాడు. 2003 ఆగస్టు 15న ముంబైలోని మీరారోడ్లో ఉన్న ఎస్ఏ అపార్ట్మెంట్స్లోని తన ఫ్లాట్కు సలీమ్ అనే అనుచరుడిని పిలిచాడు. మాటల్లో పెట్టి అతడి గొంతు నులిమి చంపేశాడు. శవాన్ని ఎవరూ గుర్తుపట్టలేనంతగా అదే గదిలో కాల్చేశాడు. మృతదేహాన్ని అక్కడే ఉంచి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అప్పట్లో ఆ మృతదేహాన్ని చూసిన ఖాద్రీ భార్య అది తన భర్తదే అంటూ వాంగ్మూలం ఇచ్చింది. దీంతో పోలీసులు ఖాద్రీ చనిపోయాడని, గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారని కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసు కొలిక్కి రాకపోయినా, పోలీసు రికార్డుల్లో మాత్రం ఖాద్రీ చనిపోయాడు. తన భార్య, సోదరుడి సాయంతో తానే చనిపోయినట్లు ముంబై పోలీసులను నమ్మించిన ఖాద్రీ– తర్వాత జలీస్ అన్సారీ ముఠాలోని వ్యక్తుల సహకారంతో హైదరాబాద్కు వచ్చాడు. 2003 నుంచి 2006 వరకు సికింద్రాబాద్ ప్రాంతంలో నివసించాడు. ఆపై ఇమ్రాన్ అబు మన్సూర్ హత్మీ పేరుతో గోల్కొండలోని మొహల్లాగంజ్ ప్రాంతంలో అద్దె ఇంట్లో దిగాడు. అత్తర్లు, సుగంధ ద్రవ్యాలు విక్రయించే వ్యాపారి ముసుగు ధరించాడు. 2008లో ఇదే పేరు, చిరునామాతో డ్రైవింగ్ లైసెన్స్, 2009లో ఓటర్ గుర్తింపు కార్డు పొందాడు. తన కుటుంబాన్ని మాత్రం మహారాష్ట్రలోని చింబూర్లో ఉంచిన ఖాద్రీ తరచు అక్కడికి వెళ్లి వచ్చేవాడు. ఎప్పటికైనా మళ్లీ ముంబై వెళ్లాలని భావించిన ఇతగాడు అందుకోసం ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తన రూపురేఖలు మార్చుకోవాలని భావించాడు. దీనికోసం హైదరాబాద్లోని ఓ డాక్టర్ను సంప్రదించాడు. ఇక్కడ ఉంటూ కూడా ఉగ్రవాద కార్యకలాపాలు సాగించిన ఖాద్రీ 2003 చివరలో పాకిస్తాన్ వెళ్లివచ్చాడు. అప్పటి నుంచి ఇతగాడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కొందరు ఉగ్రవాద సానుభూతిపరులైన వ్యక్తులతో పాటు తన అనుచరులతోనూ ఈ–మెయిల్ ద్వారా సంప్రదింపులు జరిపేవాడు. వీటి కోసం ఆసిఫ్నగర్లోని ఓ జిరాక్స్ అండ్ ఇంటర్నెట్ సెంటర్లో ఉన్న కంప్యూటర్లను వినియోగించాడు. ఆ ఉగ్రవాదుల్లో కొందరి ఈ–మెయిల్స్పై నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీల దృష్టి హైదరాబాద్ నుంచి వారికి వస్తున్న మెయిల్స్పై పడింది. తరచుగా ఇవి వస్తుండటంతో వాటిలోని సంభాషణలను అధ్యయనం చేశాయి. వీటిని పంపుతున్నది 2003లో ‘చనిపోయిన’ ఖాద్రీగా నిర్ధారించారు. దీనిపై సమాచారం అందుకుని రంగంలోకి దిగిన ముంబై ఏటీఎస్ అధికారులు ఈ–మెయిల్స్ పంపుతున్న ఐపీ (ఇంటర్నెట్ ప్రొటోకాల్) అడ్రస్ ఆధారంగా మెహదీపట్నంలోని ఇంటర్నెట్ సెంటర్ను గుర్తించారు. అక్కడ దాదాపు పది రోజులు మాటు వేసిన ప్రత్యేక బృందం 2010 ఆక్టోబర్లో ఖాద్రీని పట్టుకుని ముంబై తరలించింది. ఇతడు ఇప్పటికీ మహారాష్ట్ర జైలులోనే ఉన్నాడు. -
హలో.. వినబడుతుందా?
‘కరీంనగర్కు చెందిన శ్రీనివాస్కు ఎక్కువ వాల్యూంతో ఇయర్ ఫోన్లు పెట్టుకొని పాటలు వినడం, సినిమాలు, రీల్స్ చూడడం ఇష్టం. బైక్పై వెళ్తున్నా.. బస్సుల్లో ప్రయాణిస్తున్నా.. ఆఫీసులో ఉన్నా.. రోడ్డుపై ఉన్నా ఇదే ధ్యాస. నిత్యం ఏడెనిమిది గంటలపాటు ఇదే పరిస్థితి. ఇటీవల అతనికి చెవిలో ఒకటే హోరు మొదలైంది. భరించలేక ఈఎన్టీ వైద్యుడిని సంప్రదిస్తే అసలు విషయం తెలిసింది. గంటల తరబడి ఎక్కువ సౌండ్తో ఇయర్ ఫోన్స్ వినడంతో చెవిలోపలి భాగంలో సమస్య తలెత్తినట్లు గుర్తించి చికిత్స చేశారు. అయినా పూర్థిస్థాయి ఫలితం రాలేదు.’హుజూరాబాద్/కరీంనగర్ టౌన్: ఇయర్, హెడ్ఫోన్లు విచ్చలవిడిగా వాడుతున్నారా... గంటల కొద్దీ వాటితోనే కాలం గడుపుతున్నారా? అయితే జాగ్రత్త ఎక్కువ శబ్ధంతో వీటిని వినియోగించడం వల్ల కొందరిలో దీర్ఘకాలంగా వినికిడి శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఈఎన్టీ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చెవి, వినికిడి సమస్యతో వారానికి వేయి నుంచి 1500 మంది సంప్రదిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మంది 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు్కలే ఉంటున్నారని పేర్కొంటున్నారు. సాధారణంగా ఇయర్ ఫోన్లు, హెడ్ఫోన్ల నుంచి వచ్చే ధ్వని తరంగాలు కర్ణభేరికి చేరుతాయి. తర్వాత అవి చెవిలోని చిన్న ఎముక ద్వారా లోపలి చెవిని(ఇన్నర్ ఇయర్) తాకుతాయి. అక్కడ ఉన్న కోక్లియా వాటిని గ్రహిస్తుంది. ఎక్కువ శబ్ధం వినడంతో మొత్తం చెవి ఆరోగ్యంపైనే ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కోక్లియాలో అతి సూక్ష్మకణాలు, ద్రవం ఉంటాయి. అతి శబ్దం, దీర్ఘకాలిక, నిరంతర ధ్వనుల తాకిడి వల్ల అందులోని సున్నితమైన కణాలు దెబ్బతింటాయి. నిపుణుల సూచనల ప్రకారం ప్రతీ వ్యక్తి రోజుకు 8 గంటలపాటు 8,5 డెసిబుల్స్ శబ్దాల వరకు వింటే ఎలాంటి ఇబ్బంది ఉండదరు. అయితే చాలామంది 85–100 వరకు డెసిబుల్ సౌండ్స్తో ఇయర్ ఫోన్లు, హెడ్ఫోన్లు వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.‘హుజూరాబాద్కు చెందిన శ్రావణికి (పేరు మార్చాం) ఫోన్లో రీల్స్ చూడడం.. పాటలు వినడం అలవాటు. ఎప్పుడు చూసినా ఇయర్ ఫోన్లు పెట్టుకొనే కనిపిస్తుంది. దీంతో ఆమె కర్ణభేరి దెబ్బతింది. రెండు చెవులు వినిపించడంలేదు. మెదడులో నరాలు దెబ్బతిన్నాయి. అప్పుడప్పుడు మతిస్థిమితం లేకుండా వ్యవహరిస్తోంది. డాక్టర్లను సంప్రదిస్తే అతిసీపం నుంచి శబ్ధం.. అంటే ఇయర్ ఫోన్స్ లాంటివి వాడితే ఇలాంటి ఇబ్బందులు వస్తాయని తెలిపారు. ఇప్పుడామెది ఏమీ వినలేని పరిస్థితి.’‘సిరిసిల్లకు చెందిన పరమేశ్కు(పేరు మార్చాం) ఇయర్ ఫోన్స్ పెట్టి సెల్ఫోన్లో పాటలు వినడం, సినిమాలు చూడడం అలవాటు. క్రమంగా ఆయన వినికిడి శక్తిని కోల్పోయాడు. చెవిలో అతిదగ్గరినుంచి శబ్దం వినడంతో కర్ణభేరికి ఇబ్బందిగా మారిందని వైద్యులు చెప్పారు. ఇప్పుడాయనా చెవికి వినికిడి పరికరం అమర్చుకున్నాడు. లేదంటే ఆయన ఎలాంటి శబ్ధం వినలేడు’.చెవికి తీవ్ర నష్టంసెల్ఫోన్ వచ్చాక చెవుడు సమస్యలు ఎక్కువయ్యాయి. 12–34 ఏళ్ల మధ్య 24శాతం మంది పర్సనల్ లిసెనింగ్ డివైజ్ (హెడ్ఫోన్స్, ఇయర్ బడ్స్) వాడుతూ, 48శాతం మంది 85 డిసెబుల్స్ కన్నా ఎక్కువ శబ్దాన్ని వింటూ వినికిడి సమస్యల బారిన పడుతున్నారు. తీవ్రమైన శబ్దం వినడం వల్ల శ్రవణ వ్యవస్థలో ఉండే సూక్ష్మమైన హెయిర్ సెల్స్ దెబ్బతిని చెవుడు ఏర్పడుతుంది. డీజే సౌండ్ లాంటి అధిక వాల్యూమ్తో శాశ్వత చెవుడు వచ్చే అవకాశముంది. మ్యూజిక్, వాయిస్కాల్స్ హెడ్ఫోన్స్, ఇయర్ బడ్స్తో ఎక్కువ సమయం వినడం వల్ల బ్రెయిన్ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇయర్ఫోన్స్, హెడ్ఫోన్స్, సెల్ఫోన్, డీజే సౌండ్ను ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత మేలు. – ప్రశాంత్, ఈఎన్టీ నిపుణుడుచెవి ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలంలో వినికిడి సమస్య తలెత్తుతుంది. అందుకే లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు.చెవుల్లో శబ్దాల హోరుచిన్న శబ్దాలను కూడా వినలేకపోవడంచెవుల్లో తరచూ ఇన్ఫెక్షన్లు, నొప్పిఅధికంగా గులిమి ఏర్పడడంచెవిపై ఒత్తిడి పెరగడంతో వర్దిగో సమస్యఇయర్ ఫోన్స్ వాడొద్దు ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. ప్రజలు మరింత సౌలభంగా ఉండేందుకు వీలుగా ఇయర్ ఫోన్స్ వాడుతున్నారు. ప్రస్తుతం వచ్చిన ఇయర్ ఫోన్స్లో శబ్ద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. చెవి నొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యం కోసం ఇయర్ ఫో¯Œన్లను తక్కువ వాడటమే ఉత్తమం.– రాజు, ఈఎన్టీ వైద్యుడు, హుజూరాబాద్ -
'అద్భుత భవంతులు': వాస్తుకళా నైపుణ్యానికి సాంకేతిక జత చేసి..
ప్రపంచంలోని కొన్నిచోట్ల ఇటీవలి కాలంలో చిత్ర విచిత్రమైన వింత భవంతులు పుట్టుకొస్తున్నాయి. వాస్తుకళా నైపుణ్యానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జతచేసి నిర్మించిన ఈ అద్భుత భవంతులు సందర్శకులను అబ్బురపరుస్తున్నాయి. వీటిలో కొన్నింటి విశేషాలను తెలుసుకుందాం.ది డ్యాన్సింగ్ హౌస్ఇది చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ నగరంలో ఉంది. ఈ భవనం 1996లో పూర్తయింది. దీని ఆకృతి డ్యాన్స్ చేస్తున్న జంటను పోలి ఉంటుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. అయితే దీన్ని మొదట్లో ‘జింజర్ అండ్ ఫ్రెడ్‘ అని పిలిచేవారు. ఆ పేరు ప్రముఖ డ్యాన్సర్లు జింజర్ రోజర్స్, ఫ్రెడ్ ఆస్టైర్ల పేర్ల నుంచి వచ్చింది. ఇది ఒక కార్యాలయ భవనం. అయితే, దీని పై అంతస్తులో ఒక రెస్టరెంట్ ఉంటుంది. ఆ రెస్టరెంట్లో కూర్చుని భోంచేస్తూ, ప్రేగ్ నగర అందాలను తిలకించడం మరపురాని అనుభూతిగా ఉంటుంది.ది వేవ్ బిల్డింగ్ఇది డెన్మార్క్లోని వెజ్లే నగరంలో ఉంది. దీనిని హెన్నింగ్ లార్సెన్ ఆర్కిటెక్ట్స్ సంస్థ డిజైన్ చేసింది. పేరుకు తగ్గట్టుగానే, ఇది వెజ్లే నౌకాశ్రయం పక్కన, సముద్ర కెరటాల ఆకారంలో ఉంటుంది. దీని నిర్మాణం 2009లో మొదలైంది. ఇది రెండు దశల్లో పూర్తయింది. మొదట ఒక వైపు నిర్మాణం పూర్తయిన తర్వాత, 2018లో రెండవ వైపు నిర్మాణం కూడా పూర్తయింది. వేవ్ బిల్డింగ్లో మొత్తం 140 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ భవనం తన డిజైన్, లైటింగ్తో ఆ ప్రాంతానికి ఒక కొత్త అందాన్ని తీసుకొచ్చింది. రాత్రిపూట ఈ భవనం విద్యుత్ కాంతులతో మరింత అద్భుతంగా కనిపిస్తుంది. ఈ భవనం డిజైనింగ్ నైపుణ్యానికి అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి.ఎలిఫెంట్ బిల్డింగ్ఇది థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో ఉంది. దీని నిర్మాణం 1997లో పూర్తయింది. థాయ్ ఆర్కిటెక్ట్ ఒంగ్–అర్డ్ సత్రాబంధు, ఇంజినీర్ డాక్టర్ అరుణ్ చైసెరితో కలిసి దీనిని రూపొందించారు. ఈ భవనం మూడు టవర్లను కలిగి ఉంటుంది, ఇవి ఏనుగు కాళ్లు, తొండంలా కనిపిస్తాయి. దీనికి ఏనుగు చెవులు, కళ్లు, దంతాలలాంటి డిజైన్ కూడా ఉంది. ఇది కేవలం ఒక ఆకర్షణీయమైన కట్టడం మాత్రమే కాదు, ఇందులో నివాసయోగ్యమైన అపార్ట్మెంట్లు, కార్యాలయాలు, షాపింగ్ సెంటర్లు, బ్యాంక్, పోస్టాఫీసు వంటివి చాలానే ఉన్నాయి. ఏనుగు థాయ్లాండ్ జాతీయ జంతువు కావడంతో ఈ భవనం థాయ్ జాతీయ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది. ఇది ప్రపంచంలోని అత్యంత విచిత్ర, విలక్షణ భవనాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.క్రాస్ టవర్స్ఇది దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ఉంది. ఈ భవనాన్ని డానిష్ ఆర్కిటెక్ట్ సంస్థ బ్యార్కే ఇంగెల్స్ గ్రూప్ 2012లో డిజైన్ చేసింది. రెండు వేర్వేరు టవర్లు ఒకదానికొకటి ఎదురుగా ఉండేలా, వాటి మధ్యలోని కొన్ని గదులు ఒకదానితో ఒకటి కలిసేలా డిజైన్ చేశారు. ఇది బయట నుంచి చూడటానికి హ్యాష్ట్యాగ్లా కనిపిస్తుంది. అందుకే దీన్ని ‘హ్యాష్ట్యాగ్ టవర్స్’ అని కూడా అంటారు. గాలి, సూర్యరశ్మి భవనంలోకి ధారాళంగా వెళ్లేలా దీన్ని నిర్మించారు. దాంతో విద్యుత్ వినియోగం తగ్గుతుంది. ఇందులో పలు కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, నివాసయోగ్యమైన అపార్ట్మెంట్లు ఉన్నాయి.జిగ్జాగ్ టవర్స్ఇది ఖతార్ రాజధాని దోహాలో ఉంది. ఈ టవర్స్ను 2009లో నిర్మించారు. ఈ టవర్స్ రూపకల్పన చాలా ప్రత్యేకంగా ఉంటుంది. భవనం నిర్మాణం బయట నుంచి చూస్తే జిగ్జాగ్ ఆకారంలో ఉంటుంది. అందుకే దీనికి ఈ పేరు వచ్చింది. మాల్స్, రెస్టారెంట్లు, కేఫ్లు, వివిధ రకాల దుకాణాలు ఇందులో ఉంటాయి. ఈ రెండు టవర్స్లో మొత్తం 748 లగ్జరీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి.లాంగాబెర్గర్ బిల్డింగ్ ఇది అమెరికాలోని ఒహాయోలో ఉంది. ఈ భవనం లాంగాబెర్గర్ కంపెనీ ప్రధాన కార్యాలయం. ఈ కంపెనీ చేతితో తయారు చేసే చెక్క బుట్టలకు ప్రసిద్ధి చెందింది. తమ ప్రత్యేకతకు గుర్తుగా వారు తమ ప్రధాన కార్యాలయాన్ని ఒక పెద్ద బుట్ట ఆకారంలో 1997లో నిర్మించారు. ఇది నిజంగానే చూడటానికి బుట్టలా కనిపిస్తుంది. ఈ భవనం సుమారు 192 అడుగుల పొడవు, 126 అడుగుల వెడల్పు, 79 అడుగుల ఎత్తుతో ఉంటుంది. లాంగాబెర్గర్ కంపెనీ కార్యకలాపాలను నిలిపివేసిన తర్వాత, ఈ భవనాన్ని 2018లో అమ్మకానికి పెట్టింది. ప్రస్తుతం ఇది ఖాళీగా ఉంది, కాని, దాని ప్రత్యేకమైన డిజైన్ కారణంగా ఇది ఇప్పటికీ ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది. సంహిత నిమ్మన -
ఈ సండే ఛత్తీస్గఢ్ ముఠియా, చైనా తాంగ్హుల్ క్యాండీ రెసిపీలు చేద్దాం ఇలా..!
పనీర్ బిర్యానీ బాల్స్కావలసినవి: బాస్మతి రైస్– ఒక కప్పు (ఉడికించి తీసుకోవాలి)పనీర్ కర్రీ– ఒక కప్పు, పుదీనా తురుము, కొత్తిమీర తురుము– కొద్దికొద్దిగాబిర్యానీ మసాలా– ఒక టీ స్పూన్, గుడ్లు– 4, పాలు– ఒక టేబుల్ స్పూన్బ్రెడ్ పౌడర్, మైదా పిండి– ఒక కప్పు చొప్పున, నూనె– సరిపడాతయారీ: ముందుగా ఒక గిన్నెలో బాస్మతి అన్నం తీసుకుని అందులో పనీర్ కర్రీ, పుదీనా తురుము, కొత్తిమీర తురుము, బిర్యానీ మసాలా, మూడు కోడి గుడ్లు వేసుకుని బాగా కలిసి గుండ్రటి ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చిన్న గిన్నెలో మైదా పిండి, మరొక చిన్న గిన్నెలో మిగిలిన కోడి గుడ్డు సొన, పాలు కలిపి పెట్టుకోవాలి. మరో గిన్నెలో బ్రెడ్ పౌడర్ వేసి పెట్టుకోవాలి. అనంతరం ఈ బిర్యానీ ఉండలను తీసుకొని, ముందుగా గుడ్డు మిశ్రమంలో రోల్ చేసి, ఆపై మైదాపిండిలో దొర్లించాలి. ఆ తర్వాత అదే ఉండను మరోసారి గుడ్డు సొనలో రోల్ చేసి, చివరకు బ్రెడ్ పౌడర్లో రోల్ చేయాలి. అన్ని బాల్స్ను అదే విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని నూనెలో దోరగా వేయించి, నచ్చిన విధంగా సర్వ్ చేసుకోవచ్చు.చైనా తాంగ్హుల్ క్యాండీకావలసినవి: స్ట్రాబెర్రీలు, ద్రాక్ష, కివీ, ఆరెంజ్, చెర్రీస్ లేదా నచ్చిన పండ్లు – కొన్ని, పంచదార– ఒక కప్పు, నీళ్లు– అర కప్పు, నూనె– కొద్దిగా, ఐస్ లేదా చల్లని నీళ్లు– పంచదార పాకం గట్టి పడటానికి, పుల్లలు– కొన్నితయారీ: ముందుగా పండ్లను శుభ్రంగా కడిగి, పూర్తిగా ఆరబెట్టాలి. వాటిపై నీటి చుక్క కూడా ఉండకూడదు. తడి ఉంటే పంచదార పాకం పండ్లపై సరిగా అంటుకోదు. ఈలోపు ఒక చిన్న పాన్ లేదా గిన్నెలో పంచదార, నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. మంటను మధ్యస్థంగా ఉంచి, పంచదార పూర్తిగా కరిగే వరకు కలపాలి. పంచదార కరిగిన తర్వాత, కలపడం ఆపి, పాకం బుడగలు వచ్చి, కాస్త రంగు మారేవరకు మరిగించాలి. ఒక చల్లని నీళ్ల గిన్నెలో కొన్ని చుక్కల పాకాన్ని వేసిన వెంటనే గట్టిపడి, క్రిస్పీగా మారితే అది సరైన స్థితిలో ఉన్నట్టే గుర్తించొచ్చు. దాంతో స్టవ్ ఆఫ్ చేసుకుని పండ్లు ఉన్న పుల్లలను ఒకదాని తర్వాత ఒకటిగా పాకంలో ముంచాలి. పాకం పండ్ల మీద అన్ని వైపులా సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ పాకం ఉంటే గిన్నె అంచున తట్టి తీసివేయాలి. పాకం పూసిన పండ్లను నూనె రాసిన బేకింగ్ షీట్ మీద పెట్టుకోవాలి. చల్లారాక తింటే భలే క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. పండ్లు డైరెక్ట్గా తినని వారు ఇలా ట్రై చేయొచ్చు.]ఛత్తీస్గఢ్ ముఠియాకావలసినవి: బంగాళదుంపలు– 3 (మీడియం సైజ్, ఉడికించి తొక్క తీసి మెత్తగా గుజ్జులా చేసుకోవాలి), బియ్యప్పిండి– ఒకటిన్నర కప్పులు, ఉల్లిపాయ– ఒకటి (సన్నగా తరిగినవి)పచ్చిమిర్చి– 3 (సన్నగా తరిగినవి)కొత్తిమీర తురుము– కొద్దిగాఅల్లం వెల్లుల్లి పేస్ట్– ఒక టీస్పూన్కొత్తిమీర, కరివేపాకు, నువ్వులు, ఆవాలు– కొద్దికొద్దిగా, ఉప్పు,మసాలా, పసుపు– తగినంత, నూనె– కొద్దిగాతయారీ: ముందుగా ఒక గిన్నెలో బియ్యప్పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, బంగాళదుంప గుజ్జు, మసాలా, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి, నచ్చిన ఆకారంలో ఒత్తుకోవాలి. వాటిని ఆవిరి మీద ఉడికించడానికి ఇడ్లీ పాత్ర లేదా ఏదైనా స్టీమర్ ఉపయోగించొచ్చు. అవి ఉడికిన తర్వాత ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక నువ్వులు, కరివేపాకు, ఆవాలు, కొత్తిమీర ఇలా అన్నీ వేసుకుని వేగించాలి. ఆవాలు చిటపటలాడాక, ముందుగా ఆవిరిపై ఉడికించి పెట్టుకున్న ముఠియా ముక్కలు వేసి, కొద్దిగా పసుపు వేసి, బాగా కలిపి సుమారు 2 లేదా 3 నిమిషాలు వేగించాలి. అంతే, రుచికరమైన ముఠియా వేడి వేడిగా సిద్ధం అవుతుంది. -
ఫ్లోర్కూ వాల్ పేపర్..!
పువ్వులు, లతలు, బీచ్ తీరాలు, కొలనులు వంటి ఆకర్షణీయమైన ప్రకృతి హంగులన్నీ మన కాలి కింద కొలువుదీరితే, చూడటానికి ఎంత అందంగా ఉంటుందో మాటల్లో వర్ణించలేం. త్రీడీ ఫ్లోర్ వాల్పేపర్ ఆ హంగులన్నీ మన గదుల్లోకి తీసుకు వస్తుంది. గది వైశాల్యం, రంగు, డిజైన్కు తగిన వాటిని ఎంచుకోవడంలో శ్రద్ధ పెడితే చాలు. ప్రకృతి దృశ్యాలన్నీ మన కళ్ల ముందే నిలిచి ఉంటాయి.గది థీమ్ను మార్చేసేలా..సముద్ర తీరాలు, స్కై లైన్ వంటివి గది థీమ్నే మార్చేస్తాయి. ఆధునిక లివింగ్ రూమ్ కోసం రేఖాగణిత నమూనాలను ఎంచుకోవచ్చు. పెద్ద, బోల్డ్ డిజైన్లు విశాలమైన గదులకు, చిన్న డిజైన్లు తక్కువ స్థలం ఉన్న చోటుకు బాగా సరిపోతాయి.రంగు.. స్థలంఫర్నిచర్, గది గోడల రంగులను ఎలివేట్ చేసేలా ఫ్లోర్ డిజైన్ వాల్ పేపర్ల ఎంపిక ఉండాలి. గోడల రంగు ప్లెయిన్గా, లైట్ కలర్లో ఉండే ఫ్లోర్ డిజైన్ బోల్డ్ డిజైన్స్ ఎంపిక చేసుకోవచ్చు. గోడల రంగు గాఢత ఎక్కువ ఉంటే సాదా సీదా ఫ్లోర్ డిజైన్స్ను ఎంచుకోవచ్చు. ఫ్లోర్ వాల్ పేపర్స్ కొనుగోలుకు ముందు మీ గదుల వాస్తవ స్థలం ఎంత ఉందో చూసుకోవాలి. ఆ డిజైన్స్ ఎంత కాలం వరకు ఉంటే బాగుంటుందో ముందే నిర్ణయించుకొని, దాన్నిబట్టి ఎంపిక చేసుకోవడం మంచిది. ప్రయోజనాలుత్రీడీ ఫ్లోర్ వాల్పేపర్లు ప్రత్యేకమైన, అద్భుతమైన దృశ్య అనుభవాన్ని సృష్టిస్తాయి.త్రీడీ ఫ్లోర్ వాల్పేపర్ మన్నిక ఎక్కువ. దీర్ఘకాలం ఉంటుంది.చాలా త్రీడీ వాల్పేపర్లను శుభ్రం చేయడం సులభం. తడి క్లాత్తో తుడవడం చాలా సులువు. ఎప్పుడూ తాజాగా కనిపిస్తుంది. .ఇన్స్టాలేషన్ సులువు. నచ్చకపోతే తొలగించి, మరొక వాల్పేపర్ని అతికించవచ్చు. డిజైన్ల ఎంపిక కోసం, ఎలాంటి లోపాలు లేని త్రీడీ వాల్ పేపర్ను నిపుణుల సాయంతో ఎంపిక చేసుకోవడం తెలివైన ఎంపిక. గది వైశాల్యాన్ని బట్టి త్రీడీ వాల్ పేపర్ల ధరలు ఉంటాయి. (చదవండి: రోబో కుందేళ్ల పాముల వేట!) -
రోబో కుందేళ్ల పాముల వేట!
భయంకరమైన పాములతోనే కొన్ని కుందేళ్లు సరదా చెలగాటం ఆడుతున్నాయి. ఆశ్చర్యపోతున్నారా? ఫ్లోరిడా ఎవర్గ్లేడ్స్ అడవుల్లోని పాములు నగరంలోకి వచ్చి ఊరంతా విందు చేసుకుంటున్నాయి. వందలాది పెంపుడు జంతువులు, చిన్న చిన్న జీవులన్నీ వాటికి ఆహారమవుతుంటే, శాస్త్రవేత్తలు ఒక కొత్త ఉపాయం ఆలోచించారు. నిజమైన కుందేళ్లకు బదులు, రోబో కుందేళ్లను తయారు చేశారు. అవి బయటకు చూస్తే బొమ్మలా ఉంటాయి, కానీ లోపల చిన్న చిన్న యంత్రాలు దాచబడి ఉంటాయి. ఇవి వేడి పీల్చి వదులుతాయి, కదులుతూ నిజమైన కుందేళ్లలాగా కనిపిస్తాయి. అంతేకాదు, వీటికి నిజమైన కుందేళ్ల వాసన కూడా వచ్చేలా రూపొందించారు. అంటే వాసన, రూపం, కదలిక మొత్తం కుందేలు మాదిరే! ఒక్కసారి పాము చూసిన వెంటనే ‘ఆహా.. నా విందు రెడీ!’ అనుకుని దూకేస్తుంది. అలా పాములు బయటకురాగానే, వాటిని సులభంగా పట్టేస్తున్నారు. ఇలా శాస్త్రవేత్తలు పాముల మీద సరదా చెలగాటం ఆడుతుంటే, మోసపోయిన పాములను చూసిన మిగతావి మాత్రం ఇకపై కుందేళ్లను తినే ముందు ‘నిజమా? నకిలీనా?’ అని రెండు సార్లు ఆలోచిస్తూ అయోమయంలో పడుతున్నాయి. (చదవండి: అతి పెద్ద మేథమెటీషియన్ దేవుడే!) -
ప్రచారం లేకుండా... పేటెంట్ల పరంపర!
ఎలక్ట్రిసిటీ అంటే ఎడిసన్, టెలిఫోన్ అంటే గ్రాహం బెల్, కంప్యూటర్ అంటే ట్యూరింగ్ గుర్తొస్తారు. కాని, ఈ జాబితాలోకి ఇప్పుడు భారతీయ శాస్త్రవేత్త గురుతేజ్ సంధు పేరు చేర్చాల్సిన సమయం వచ్చింది. ఎలాంటి హడావుడి లేకుండా యూఎస్లో ఎడిసన్ పొందిన పేటెంట్ల సంఖ్యను కూడా దాటేసిన ఈ టెక్ టైగర్– ప్రపంచ టెక్నాలజీని వేగవంతం చేసిన మాస్టర్మైండ్! ఆయన పేరు ఇప్పటివరకు ఎక్కువమందికి తెలియకపోవచ్చు. కాని, ప్రపంచవ్యాప్తంగా రోజూ వాడే టెక్నాలజీకి ఆధారం ఆయన ఆవిష్కరణలే! అమెరికాలోని మైక్రాన్ టెక్నాలజీలో పనిచేస్తూ, టెక్ రంగంలో నిశ్శబ్దంగా విప్లవం సృష్టించారు. వివిధ టెక్నాలజీలపై ఆయనకు ఇప్పటి వరకు ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 1,380 పేటెంట్లు ఉన్నాయి. ఇది ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎడిసన్ యూఎస్ పేటెంట్స్ కౌంట్ 1,093 కంటే ఎక్కువ. సాధారణంగా పేటెంట్ అనేది సాధించడమే ఓ పెద్ద విషయం. ఒక్కటి పొందటానికి సంవత్సరాలు పడుతుంది. అలాంటిది అత్యధిక పేటెంట్స్ కలిగిన భారతీయుడుగా గురుతేజ్ సంధు నిలిచారు. మన ఫోన్లు, ల్యాప్టాప్లు, క్లౌడ్ స్టోరేజ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల వేగం, సామర్థ్యం పెంచడంలో ఆయన పాత్ర అంచనాకు అందని స్థాయిలో ఉంది. ఆయన అభివృద్ధి చేసిన ‘అటామిక్ లేయర్ డిపాజిషన్’, ‘పిచ్ డబ్లింగ్’ లాంటి సాంకేతిక పద్ధతులు మెమరీ చిప్ల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచాయి. అంటే చిన్న పాకెట్లో పెద్ద ప్రపంచాన్ని నిక్షిప్తం చేయగల టెక్నాలజీని గురుతేజ్ రూపొందించారు. ప్రస్తుతం ఇవే గ్లోబల్ టెక్ పరిశ్రమలో ఇండస్ట్రీ స్టాండర్డ్గా మారిపోయాయి. మీరు ఫోన్లో వీడియో చూస్తుంటే, ప్రతి పది సెకన్లకు ‘పాజ్’ కాకుండా స్మూత్గా ప్లే అవుతుంటే, దానికి మూల కారణం గురుతేజ్ సంధునే! ఇలానే, మరెన్నో మనం రోజూ వాడే టెక్నాలజీ పరిజ్ఞానాల్లో ఆయన మేధస్సు పనిచేస్తోంది.ప్రపంచాన్ని నడిపించే ఎన్నో అద్భుతాలను సృష్టించిన ఈ మనిషికి గుర్తింపు లభించిందా అంటే – కొద్దిపాటి అవార్డులు మాత్రమే అని చెప్పాలి. ఆయనకు ‘ఐఈఈఈ ఆండ్రూ ఎస్. గ్రోవ్ అవార్డ్’ అనే అత్యున్నత గౌరవం దక్కింది. అంతేకాదు, ఆయనకు అంతర్జాతీయ మైక్రాన్ సంస్థలో అతి ముఖ్య సాంకేతిక గౌరవమైన ఫెలో హోదా దక్కింది. వివిధ టెక్నాలజీ పరిశోధనల్లో అద్భుత ప్రతిభ చూపినందుకు గాను ‘జార్జ్ ఈ. పేక్’ బహుమతిని కూడా అందుకున్నారు. అయితే, ఇంతటి ఘనత ఉన్నా ఆయన పేరు బహిరంగ ప్రపంచానికి పెద్దగా తెలియకపోవడం కొంచెం ఆశ్చర్యకరం. ఫ్యామిలీ స్టార్! ఒక మధ్యతరగతి భారతీయ కుటుంబం నుంచి ఈ మేధావి కథ ప్రారంభమైంది! లండన్లో జన్మించిన గురుతేజ్ సంధు, మూడేళ్ల వయసులో తల్లిదండ్రులతో భారత్కు వచ్చేశారు. తండ్రి సర్జీత్ సంధు, తల్లి గురుమీత్ సంధు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచే ప్రపంచ సాంకేతిక రంగాన్ని శాసించే మేధావిగా ఎదిగాడు. అలా ఆయన మేధస్సు మొదట ఐఐటీ ఢిల్లీ గేట్లు దాటింది, అక్కడే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అనంతరం అమెరికా ప్రయాణం, నార్త్ కరోలినా యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్లో పీహెచ్డీ సాధించారు. అప్పటి నుంచే ల్యాబ్లో సైలెంట్గా పని చేస్తూ, ప్రపంచ మెమరీ చిప్లకు మెమరబుల్ సైంటిస్టుగా మారారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరు సంగీతంలో ప్రావీణ్యం పొంది డీజేగా గుర్తింపు పొందారు. మరొకరు ఆస్ట్రేలియాలో ఒక ప్రముఖ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నారు. ఇలా ఆయన ఇద్దరు కుమారులు కూడా, ఒకరు మ్యూజిక్లో, మరొకరు మైక్రోచిప్లతో తమ తమ రంగాల్లో మ్యాజిక్ చేస్తున్నారు!. ప్రపంచాన్ని నడిపించే ఎన్నో అద్భుతాలను సృష్టించిన ఈ మనిషికి గుర్తింపు లభించిందా అంటే – కొద్దిపాటి అవార్డులు మాత్రమే అని చెప్పాలి. -
అతి పెద్ద మేథమెటీషియన్ దేవుడే!
‘పరీక్షలో పాస్ మార్కులు రాకపోతే దేవుడు సాయం చేస్తాడా? పోయి, చదువుకో పో..! ’ అని ఎవరైనా చెప్తే, ఇకపై ఈ ఫార్ములా చూపండి. ఎందుకంటే, ‘దేవుడు అంటే ఒక అతి పెద్ద మ్యాథమెటీషియన్ ’ అని రుజువు చేస్తూ, కేంబ్రిడ్జ్ మేధావి పాల్ డైరాక్ ఒక గణిత సూత్రంతో నిర్వచించారు. ఈ విశ్వం ఏదో యాదృచ్ఛికంగా రాలేదు. ప్రకృతిలోని ప్రతి సృష్టిని ఎవరో జాగ్రత్తగా డిజైన్ చేసి, సెట్ చేశారు. గణిత సూత్రాలతో ఆకాశాలు, నక్షత్రాలు, మన ప్రాణాలను కూడా ముందే లెక్కపెట్టేశారు. అంతేకాదు, మనకున్న వెలుగు కూడా దేవుడిచ్చిందే అని గణిత సూత్రాలతో వివరించారు. అయితే, అందరు శాస్త్రవేత్తలూ ఇలాగే ఆలోచించరు. శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ చివరిసారిగా రాసిన పుస్తకంలో, ‘దేవుడు అనేది ఒక నిర్వచనం మాత్రమే, సాక్ష్యం కాదు’ అని స్పష్టంగా చెప్పారు. కానీ, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒకరు గణితంతో దేవుని వెతుకుతుంటే, ఇంకొకరు అదే గణితంతో దేవుడే లేరని చెప్తున్నారు. అంతిమంగా చెప్పుకోవాల్సింది ఒక్కటే: దేవుడు ఉన్నాడా లేడా అన్నదానికంటే, ఆయన ఉంటే ఈ గణిత పరీక్షలో మనకు పాస్ మార్కులు ఇవ్వగలడా లేదా అన్నది పెద్ద ప్రశ్న! (చదవండి: సాహసానికి అరవై ఏళ్లు) -
సాహసానికి అరవై ఏళ్లు
ఇండో–పాక్ యుద్ధం మొదలై అప్పటికి పదహారు రోజులు– ఆరోజు 1965 సెప్టెంబర్ 5, ఉదయం ఆరున్నర గంటలకు పాకిస్తాన్ యుద్ధవిమానాలు రెండు కొండలను చాటు చేసుకుని, భారత భూభాగంలోకి దూసుకొస్తున్నాయి. అవి శత్రుదుర్భేద్యమైన శాబర్జెట్ ఫైటర్ విమానాలు. జమ్ము–కశ్మీర్లోని తావి బ్రిడ్జిని సమీపించేలోగానే అక్కడి శిఖరం పైనుంచి భారత ఎయిర్క్రాఫ్ట్ గన్ గర్జించింది. మూడువేల అడుగుల ఎత్తులో 1300 కిలోమీటర్ల వేగంతో వస్తున్న శాబర్జెట్ విమానం పేలిపోయింది. ఆ విమానాన్ని కూల్చిన వీరుడు మన ఆంధ్రుడు హవల్దార్ తాతా పోతురాజు. అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న శాబర్జెట్ విమానాలను 1942 నాటి మన పాత గన్లతో కూల్చడం సాధ్యం కాదనే భావనతో ఉన్న నాటి భారత సైన్యానికి పోతురాజు గురితప్పకుండా ఛేదించిన లక్ష్యం స్ఫూర్తినిచ్చింది. అదే ఉత్సాహంతో అప్పటి 27 ఏడీ రెజిమెంట్ ఏకంగా పన్నెండు పాక్ యుద్ధ విమానాలను కూల్చింది. ఇంతటి స్ఫూర్తికి కారకుడైన హవల్దార్ పోతురాజుకు భారత ప్రభుత్వం నాటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతుల మీదుగా ‘వీరచక్ర’ పురస్కారాన్ని బహూకరించింది.తెనాలి సమీపంలోని నిజాంపట్నం గ్రామంలో రైతు కుటుంబంలోని ఐదుగురు కుమారుల్లో నాలుగోవాడు పోతురాజు, ఎస్ఎస్ఎల్సీ చదువుతుండగా ఒకరోజు తండ్రితో కలిసి పొలం వెళ్లి, వేరుశెనక్కాయలు ఆరబెట్టారు. అటుగా వెళుతున్న బావాజీపాలెం సైనికులు అక్కడాగి వేరుశెనక్కాయలు తింటూ కాసేపు కూర్చున్నారు. ‘నేను మిలటరీకి పనికొస్తానా?’ అని పోతురాజు వారిని అడిగాడు. తప్పకుండా పనికొస్తావని బదులిచ్చారు. ఎలాగోలా సైన్యంలో చేరాలనే కోరిక పుట్టింది. తండ్రికి భోజనం తీసుకువస్తానని చెప్పి, ఇంటికి బయలుదేరిన పోతురాజు, అటునుంచి అటే గుంటూరు ఆర్మీ సెలక్షన్స్కు వెళ్లాడు. అందులో ఎంపికయ్యాక నాసిక్లో శిక్షణకు పంపారు. ఆవిధంగా 1958లో 18 ఏళ్ల వయసులో పోతురాజు సైన్యంలోకి ప్రవేశించాడు. అక్కడ స్పెషల్ టెస్ట్లో మంచి మార్కులు తెచ్చుకోవటంతో ‘యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్ ’ శిక్షణనిచ్చారు. స్క్రీన్ పై రకరకాల విమానాల కదలికలను గుర్తించే ‘స్పాటింగ్ టెస్ట్’లో పోతురాజు నూరుశాతం మార్కులు తెచ్చుకోవడంతో 27 ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్లోకి తీసుకున్నారు. 1965 ఆగస్టు 14 నుంచి పాక్తో యుద్ధం తలెత్తినప్పుడు పోతురాజు ఆర్మీ మెయిల్ సర్వీస్లో ఉన్నారు. సెప్టెంబర్ ఒకటి నుంచి పాకిస్తాన్ ఎయిర్ ఎటాక్ చేయటానికి సిద్ధంగా ఉందని గూఢచార వర్గాల సమాచారం రావడంతో జమ్ము ఎయిర్ఫీల్డ్కు, బ్రిడ్జికి ఎయిర్క్రాఫ్ట్ గన్స్ వెళ్లాయి. పోతురాజు గన్ కూడా వెళ్లింది. యుద్ధం చేయకుండా డాక్ సర్వీసులో కొనసాగేందుకు పోతురాజుకు మనసొప్పలేదు. రెజిమెంట్ కమాండర్ను కలిసి, తనను యుద్ధానికి పంపాల్సిందేనని పట్టుబట్టాడు. పోతురాజు పట్టుదలకు ముచ్చటపడ్డ కమాండర్, 1965 సెప్టెంబరు 1న తావి బ్రిడ్జి రక్షణ అప్పగించారు. సెప్టెంబర్ 5వ తేదీ ఉదయం 6.30 గంటల ప్రాంతంలో పాకిస్తాన్కు చెందిన రెండు శాబర్జెట్ విమానాలు రాడార్లకు అందనంత తక్కువ ఎత్తులో దూసుకొస్తుండటం బైనాక్యులర్లో గమనించిన పోతురాజు ఉలిక్కిపడ్డాడు. తన దగ్గరున్న సమచార సాధనంతో కమాండర్ను సంప్రదిస్తే, ‘కచ్చితంగా గుర్తించగలిగితే కొట్టు. ఆ బాధ్యత నీదే!’ అన్నారు. శిక్షణలో నేర్చుకున్న పరిజ్ఞానంతో అప్పటికే వాటిని శాబర్జెట్గా పోల్చుకున్నాడు పోతురాజు. వెంటనే ఫైరింగ్ ఓపెన్ చేశాడు. మొదటి శాబర్జెట్ కెనోబీపై గురితప్పకుండా పేలిన గుండుకు ఫర్లాంగు దూరంలోని సిటీలో పడిపోయింది. రెండో విమానం డైవ్ కొట్టి గన్ రేంజికి దూరంగా వెళ్లిపోయింది. ఈ పరిణామానికి భారత సైన్యం రెట్టించిన ఉత్సాహంతో విజృంభించి, ఒక్కో ఏరియాను స్వాధీనం చేసుకుంటూ సియోల్కోట వరకు వెళ్లాయి. ఆ తరుణంలో తాష్కెంట్ ఒప్పందంతో యుద్ధం ఆగిపోయింది. తర్వాత పోతురాజును భారత ప్రభుత్వం ‘వీరచక్ర’ అవార్డుతో సత్కరించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానంతో పోతురాజుకు సెలవు మంజూరుచేసి పంపారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పోతురాజుకు ఘనసత్కారాలు జరిగాయి. ఒంగోలులో ఒక ట్రక్కుపైన ఎయిర్క్రాఫ్ట్ ఏర్పాటుచేసి తనను కూర్చోబెట్టి చేసిన ఊరేగింపు మరిచిపోలేదని అంటారు పోతురాజు. 1971 బంగ్లాదేశ్ యుద్ధంలో పోతురాజు ముక్తివాహిని సైన్యంలో పనిచేశారు. రాష్ట్రపతి రాధాకృష్ణన్ చేతుల మీదుగా ‘వీరచక్ర’ అవార్డు అందుకున్న సందర్భంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి తనను పరిచయం చేసినపుడు, ఆమె రెండు చేతులు జోడించి నమస్కరించారు. అప్పుడు పోతురాజు ‘హాత్ జోడ్కే నమస్తే నహీ కర్తా! సోల్జర్ సెల్యూట్ కర్తా! నైతో షేక్హాండ్ లేతా హై!’అని వినమ్రంగా చెప్పాడు. ఆ మాటలకు ఎంతగానో సంతోషించిన ప్రధాని ఇందిరాగాంధీ ‘ఓకే! ఆప్ వీర్ జవాన్ హై!’ అని షేక్హ్యాండ్ ఇచ్చారని గుర్తుచేసుకున్నారు.1965 యుద్ధం ముగిసిన కొంతకాలానికి వివాహం చేసుకున్న పోతురాజుకు బాధ్యతలు వచ్చిపడ్డాయి. తండ్రి మరణంతో మరింత పెరిగాయి. పదహారున్నర సంవత్సరాల సర్వీసుతో 1975లో హవల్దార్గా స్వచ్ఛంద విరమణ చేశారు. అప్పటికే ఆ కుటుంబం తెనాలిలో స్థిరపడింది. గుంటూరులో ఆర్టీసీ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్గా చేరారు. 1998లో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా రిటైరయ్యారు. ప్రస్తుతం శేషజీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నారు.బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి (చదవండి: చాకిరీనే ఆమె నౌకరీ) -
టీనేజర్స్.. మూడ్స్వింగ్స్..!
రాహుల్ ఒక కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్నాడు. ఆర్నెలలుగా అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. చిన్న చిన్న విషయాలకే పెద్దగా రియాక్ట్ అవుతున్నాడు. పేరెంట్స్పై అరుస్తున్నాడు. చదువుపై శ్రద్ధ తగ్గింది. అర్ధరాత్రి వరకు స్మార్ట్ ఫోన్ స్క్రోల్ చేస్తున్నాడు. అదేమని అడిగితే గొడవపడుతున్నాడు. టీనేజ్లో ఇలాంటి మూడ్ స్వింగ్స్, కోపతాపాలు, తిరుగుబాట్లు సహజం. కాని, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో చాలామంది పేరెంట్స్ కు తెలియదు. అందుకే రాహుల్ పేరెంట్స్ అతన్ని కౌన్సెలింగ్కు తీసుకొచ్చారు. రెండు వారాల్లో కోపతాపాలు తగ్గాయి. మూడో వారానికి స్క్రీన్ టైమ్ సెట్ అయ్యింది. నాలుగో వారానికి తనకు ఎంత బ్రేక్ టైమ్ కావాలో చెప్పడం ప్రారంభించాడు. ఎందుకిలా ప్రవర్తిస్తారు? టీనేజర్ల తిరుగుబాటు, మూడ్ స్వింగ్స్ ఆ వయసులో వచ్చే ఒక మార్పు. అంతే తప్ప మీ పిల్లలు చెడ్డవారని కాదు. అందుకు కారణాలు తెలుసుకుంటే వారి ప్రవర్తన మీకు అర్థమవుతుంది.మెదడులో ఎమోషన్ సెంటరైన లింబిక్ సిస్టమ్ టీనేజ్లో త్వరగా యాక్టివ్ అవుతుంది. కాని, కంట్రోల్ సెంటరైన ప్రీఫ్రంటల్ కార్టెక్స్ 20 ఏళ్ల తర్వాత పరిపక్వతకు చేరుతుంది. అందుకే ముందు ఎమోషన్, తర్వాత ఆలోచన.టీనేజ్లో కొత్తదనం, థ్రిల్, తక్షణ రివార్డులకు మెదడు సులభంగా ఆకర్షితమవుతుంది. డోపమైన్,సెన్సేషన్ సీకింగ్ ఉంటుంది. అందుకే టీనేజ్లో అన్ని మూడ్ స్వింగ్స్.టీనేజ్లో మెలటోనిన్ ఆలస్యంగా విడుదలవడం వల్ల రాత్రి ఆలస్యంగా నిద్ర, ఉదయం ఆలస్యంగా లేవడం సహజం. నిద్ర తక్కువ కావడం వల్ల చిరాకు ఉంటుంది.సొంత అస్తిత్వం కోసం వెతుకులాట మొదలవుతుంది. ‘నేనెవరు?’ అనే అన్వేషణ, ‘నా మాట వినండి’ అనే అవసరం ఏర్పడుతుంది. ఆ క్రమంలోనే పేరెంట్స్పై తిరుగుబాటు. ఇక ఇతరులతో పోలిక, ఏదో కోల్పోతున్నాననే భావన భావోద్వేగాలను పక్కకు నెట్టేస్తాయి. ఎప్పుడు జాగ్రత్త పడాలి?చిన్న చిన్న విషయాలకే పెద్దగా రియాక్ట్ అవ్వడం, కేకలు, తలుపులు బిగించడం. ఏ కారణం లేకుండానే విపరీతమైన మూడ్ స్వింగ్ తన భావాలను సమర్థించుకునేందుకు మౌనంగా ఉండటంస్కూల్ను అవాయిడ్ చేయడం, నిద్ర, ఆహారంలో తీవ్ర మార్పులు. ‘సేఫ్ కాదు’ అనిపించినప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా బిగుసుకుపోవడందీర్ఘకాల దుఃఖం, స్వీయనింద, పేరెంట్స్కు దూరంగా ఉండటంఇలాంటప్పుడు ఆలస్యం చేయకండి. వెంటనే సైకాలజిస్ట్ను సంప్రదించండి. ఎమోషనల్ మెడిసిన్గా కౌన్సెలింగ్ త్వరగా పనిచేస్తుంది.B.R.I.D.G.E. ఫ్రేమ్వర్క్టీనేజర్ల భావాలు ‘సమస్య’ కాదు, సిగ్నల్స్. వాటిని అర్థం చేసుకుని స్పష్టమైన బౌండరీలు పెడితే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అందుకు ఈ రోజు నుంచే B.R.I.D.G.E.., RESET మొదలు పెట్టండి. Breathe & Body Co&regulation: టీనేజర్లను టీజ్ చేయకండి, తర్కం చేయకండి. 20 శాతం గొంతు తగ్గించండి.Reflect the Feeling: ‘నీకు ఇప్పుడు ఒత్తిడి,కోపం మిక్స్డ్గా ఉన్నట్టుంది’ అని గుర్తించండి. వారి భావోద్వేగాలను మీరు గుర్తించడం వాటి తీవ్రతను తగ్గిస్తుంది. Invite Choice:: ‘ఇలా చేయాలి’ అని చెప్పకుండా, రెండు ఆప్షన్లు ఇవ్వండి. అందులో ఒకటి ఎంచుకుంటారు. Define Boundary: ‘కేకలు, వస్తువులు విసరాల్సిన అవసరంలేదు. నీకు అలసటగా ఉంటే కాసేపు బ్రేక్ తీసుకుందాం’ అని చెప్పండి. Guide with Skills:: భావోద్వేగాల నియంత్రణకు అవసరమైన టెక్నిక్స్ నేర్పించండి. Engage & Repair: కోపతాపాలు తగ్గాక, ‘ఇప్పుడు శాంతంగా ఉన్నాం. అసలేం జరిగింది? నెక్స్ట్ టైమ్ ఏం చేస్తే బాగుంటుంది?’ అని మాట్లాడండి. ఐదునిమిషాల్లో ‘రీసెట్’Regulate:: శ్వాసను నియంత్రించుకోండి. నాలుగు సెకండ్లు ఉచ్ఛ్వాస, రెండు సెకన్లు బంధనం, ఆరు సెకండ్లు నిశ్వాసEmpathize: ‘నీ మాటలు వినకపోవడమే నీ కోపానికి కారణమా?’Set Limit: ‘చర్చ ఓకే, అవమానం, విసరడం ఓకే కాదు.’Explore Trigger: ‘ఇవాళ స్కూల్లో ఏదైనా జరిగిందా?’Each Tiny Tool: 3 పాయింట్స్ రూల్–‘నీకు ముఖ్యమైన మూడు పాయింట్లు చెప్పు; తరువాత నా మూడు.’(చదవండి: భారత్లోనే బాగుంది.. అందుకే ఇక్కడ ఉండిపోయా..!) -
పట్టులాంటి జుట్టు కోసం..!
ఒత్తైన జుట్టు అందాన్ని రెట్టింపు చేస్తుంది. అందుకే చాలామంది పొడవాటి, నల్లని కురుల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే పెరుగుతున్న కాలుష్యం, పోషకాహార లోపం, ఒత్తిడి కారణంగా చిట్కాలు కూడా పనిచేయడం లేదు. దీంతో జుట్టు విపరీతంగా రాలిపోతోంది. కొన్నిసార్లు జుట్టు రాలడాన్ని తగ్గించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిష్కారం లభించకపోవచ్చు. అటువంటి వారికి నానో టెక్నాలజీతో రూపొందించిన ఈ హ్యాట్ అమోఘంగా పనిచేస్తుంది. ఇందులో ఉన్న శక్తిమంతమైన ఎల్ఈడీ డయోడ్స్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఈ చిత్రంలో కనిపిస్తున్న టోపీ పేరు రెడ్ లైట్ థెరపీ బెరెట్ హ్యాట్. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. జుట్టును పొడవుగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఈ టోపీలో ఉన్న ఎరుపు రంగు లైట్లు జుట్టు కుదుళ్లకు కాంతిని అందిస్తాయి. ఈ కాంతి అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ (ఏటీపీ) ఉత్పత్తిని పెంచి కణాలకు శక్తిని అందిస్తుంది. దీంతో కుదుళ్లు బలంగా మారి, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ కాంతి తలలోని రక్తప్రసరణను పెంచుతుంది. ఈ టోపీలో ఆప్షన్ల ప్రకారం నీలి రంగుల లైట్లు కూడా ఉంటాయి. నీలి రంగు లైట్లు స్కాల్ప్ను ఆరోగ్యంగా ఉంచి, చుండ్రును తగ్గిస్తాయి. దీంతో జుట్టు రాలకుండా ఉంటుంది. ఈ పరికరం స్కాల్ప్ను ఆరోగ్యంగా ఉంచి పొడవాటి జుట్టును అందిస్తుంది. బ్యాటరీతో పనిచేసే ఈ టోపీని ఎక్కడైనా సులువుగా వాడుకోవచ్చు. ఈ టోపీని స్త్రీలు, పురుషులు ఇద్దరూ ఉపయోగించవచ్చు. వారానికి రెండు లేదా మూడు సార్లు 30 నిమిషాల పాటు ఈ టోపీ పెట్టుకుంటే చాలు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. దీని ధర 44 డాలర్లు అంటే రూ.3,852 అన్నమాట. ఇదే మోడల్లో టెక్నాలజీ పెరిగేకొద్దీ ధరలో మార్పు ఉంటుంది.ఒతై ్తన జుట్టు అందాన్ని రెట్టింపు చేస్తుంది. అందుకే చాలామంది పొడవాటి, నల్లని కురుల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే పెరుగుతున్న కాలుష్యం, పోషకాహార లోపం, ఒత్తిడి కారణంగా చిట్కాలు కూడా పనిచేయడం లేదు. దీంతో జుట్టు విపరీతంగా రాలిపోతోంది. కొన్నిసార్లు జుట్టు రాలడాన్ని తగ్గించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిష్కారం లభించకపోవచ్చు. అటువంటి వారికి నానో టెక్నాలజీతో రూపొందించిన ఈ హ్యాట్ అమోఘంగా పనిచేస్తుంది. ఇందులో ఉన్న శక్తిమంతమైన ఎల్ఈడీ డయోడ్స్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఈ చిత్రంలో కనిపిస్తున్న టోపీ పేరు రెడ్ లైట్ థెరపీ బెరెట్ హ్యాట్. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. జుట్టును పొడవుగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఈ టోపీలో ఉన్న ఎరుపు రంగు లైట్లు జుట్టు కుదుళ్లకు కాంతిని అందిస్తాయి. ఈ కాంతి అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ (ఏటీపీ) ఉత్పత్తిని పెంచి కణాలకు శక్తిని అందిస్తుంది. దీంతో కుదుళ్లు బలంగా మారి, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ కాంతి తలలోని రక్తప్రసరణను పెంచుతుంది.ఈ టోపీలో ఆప్షన్ల ప్రకారం నీలి రంగుల లైట్లు కూడా ఉంటాయి. నీలి రంగు లైట్లు స్కాల్ప్ను ఆరోగ్యంగా ఉంచి, చుండ్రును తగ్గిస్తాయి. దీంతో జుట్టు రాలకుండా ఉంటుంది. ఈ పరికరం స్కాల్ప్ను ఆరోగ్యంగా ఉంచి పొడవాటి జుట్టును అందిస్తుంది. బ్యాటరీతో పనిచేసే ఈ టోపీని ఎక్కడైనా సులువుగా వాడుకోవచ్చు. ఈ టోపీని స్త్రీలు, పురుషులు ఇద్దరూ ఉపయోగించవచ్చు. వారానికి రెండు లేదా మూడు సార్లు 30 నిమిషాల పాటు ఈ టోపీ పెట్టుకుంటే చాలు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. దీని ధర 44 డాలర్లు అంటే రూ.3,852 అన్నమాట. ఇదే మోడల్లో టెక్నాలజీ పెరిగేకొద్దీ ధరలో మార్పు ఉంటుంది.పట్టులాంటి జుట్టుకు...పట్టులా సుతిమెత్తగా ఉండే జుట్టు అందాన్ని పెంచుతుంది. జుట్టు మృదువుగా ఉంటే స్టైలింగ్ చేయడం కూడా ఈజీ. అయితే పెరిగిన కాలుష్యం, జుట్టుపై సరైన శ్రద్ధ తీసుకోకపోవడంతో జుట్టు పొడిబారి, రఫ్గా మారుతుంది. ఇలాంటి జుట్టుకు తగిన తేమ, పోషణను అందించే చికిత్సే డీప్ కండిషనింగ్. ఈ డీప్ కండిషనింగ్ హెయిర్ ట్రీట్మెంట్ వల్ల జుట్టు తేమగా, ఆరోగ్యంగా మారుతుంది. దీంతో మెరిసే జుట్టును పొందవచ్చు. ఇంట్లో డీప్ కండిషనింగ్ చేసుకోవాలనుకునేవారు ముందుగా హెయిర్ మాస్క్ ఎంపిక చేసుకోవాలి. పెరుగు–తేనె, గుడ్డు–ఆలివ్ నూనె మాస్క్ అయితే బెటర్. కండిషనింగ్ చేసుకునే ముందు తక్కువ గాఢత ఉన్న షాంపూతో తల స్నానం చేయాలి. జుట్టు ఆరిన తర్వాత హెయిర్ మాస్క్ అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత తల స్నానం చేస్తే సుతిమెత్తని జుట్టు మీ సొంతమవుతుంది. ఇంట్లో డీప్ కండీషనింగ్ చేసుకోలేని వారు పార్లర్కు వెళ్లవచ్చు. బ్యూటీ పార్లర్లోని నిపుణులు జుట్టు రకాన్ని బట్టి ప్రత్యేకమైన ఉత్పత్తులతో కండిషనింగ్ చేస్తారు. అవసరం బట్టి పార్లర్లో స్టీమ్ థెరఫీ కూడా ఇస్తారు. దీనివల్ల జుట్టుకు మరింత పోషణ అందుతుంది. కురులు అందంగా, ఆకర్షణీయంగా మారుతాయి. (చదవండి: రక్తపరీక్షతో ప్రీఎక్లాంప్సియా గుర్తింపు!) -
రక్తపరీక్షతో ప్రీఎక్లాంప్సియా గుర్తింపు!
చాలామంది గర్భిణులు ప్రీఎక్లాంప్సియా సమస్యకు లోనవుతుంటారు. ఇప్పటి వరకు ఈ సమస్య వచ్చాక గుర్తించి, చికిత్స చేసే పద్ధతులే ఉన్నాయి తప్ప ముందుగా గుర్తించే పద్ధతులేవీ అందుబాటులో లేవు. అయితే, ఇటీవల స్పానిష్ వైద్య నిపుణులు ప్రీఎక్లాంప్సియాను నెలల ముందుగానే గుర్తించగల రక్తపరీక్ష విధానాన్ని కనుగొన్నారు. ప్రీఎక్లాంప్సియా సాధారణంగా గర్భిణుల్లో మొదటి ఇరవై వారాల తర్వాత తలెత్తుతుంది. దీనివల్ల రక్తపోటు పెరగడం; మూత్రంలో ప్రొటీన్ పోవడం; శరీరంలో నీరు నిలిచిపోవడం వల్ల బరువు పెరగడం; ముఖంలోను, చేతుల్లోను వాపులు రావడం; వాంతులు, వికారం పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ‘ప్లాస్మా సెల్ ఫ్రీ ఆర్న్ఏ’ (సీఎఫ్ఆర్ఎన్ఏ) రక్తపరీక్ష ద్వారా ప్రీఎక్లాంప్సియా వచ్చే అవకాశాలను నెలల ముందుగానే గుర్తించవచ్చు. ఈ పరీక్షను స్పానిష్ వైద్య పరిశోధన సంస్థ ‘ఐప్రీమామ్’కు చెందిన టమారా గారిడో గోమెజ్ నేతృత్వంలోని వైద్య నిపుణులు రూపొందించారు. వీరు 2021–2024 మధ్య 9,586 మంది మహిళలకు ఈ రక్తపరీక్షలు నిర్వహించి, విజయవంతమైన ఫలితాలను సాధించారు. డాక్టర్ ప్రమత శిరీష, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ఏడాది తర్వాత రక్తస్రావం అవుతుంది..ఇది పెద్ద సమస్యనా?) -
సినిమాల్లో నటించాలనేది నా కోరిక: నాగదుర్గ
చిన్ననాటి నుంచి ఆమెకు నృత్యంపై మక్కువ. యూకేజీ చదివే సమయంలోనే తల్లిదండ్రులు కూచిపూడి శిక్షణ ఇప్పించారు. ఆ నాటి నుంచి మొదలైన ఆమె డ్యాన్స్ ప్రయాణం తన అందం.. అభినయంతో నేడు వందల జానపద పాటల్లో రాణిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు పొందింది నల్లగొండ పట్టణానికి చెందిన గుత్తా నాగదుర్గ. అతి తక్కువ సమయంలోనే యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్గా గుర్తింపు పొంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్న నాగదుర్గను శనివారం ‘సాక్షి’ పలకరించగా.. ఆమె తన కేరీర్కు సంబంధించిన విషయాలను పంచుకుంది. వివరాలు ఆమె మాటల్లోనే.. రామగిరి (నల్లగొండ) : మా స్వస్థలం ఉమ్మడి నల్లగొండ జిల్లా అడ్డగూడూరు. ఉద్యోగరీత్యా మా అమ్మానాన్న గుత్తా చలపతిరావు, వాసవి నల్లగొండలో స్థిరపడ్డారు. నేను పదో తరగతి వరకు నల్లగొండలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్నాను. హైదరాబాద్లో ఇంటర్, బీఏ జర్నలిజం పూర్తి చేశాను. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో కూచిపూడిలో పీజీ చేశాను. మా అమ్మకు నాట్యం అంటే ఇష్టం. తను నేర్చుకోవాలకుంది. కానీ కుటుంబ పరిస్థితుల వల్ల కుదరలేదు. నేను చిన్ననాటి నుంచి డాన్స్ బాగా వేసే దాన్ని. అమ్మ గుర్తించి కూచిపూడి నేర్పించింది. పాలబిందెల బాలు మాస్టారు వద్ద కూచిపూడి నేర్చుకున్నాను. అనేక సందర్భాల్లో స్టేజీ ప్రోగ్రాముల్లో కూచిపూడి నాట్యం చేశాను. అప్పుడు వచ్చిన ప్రశంసలు నాకు ప్రేరణ కలిగించాయి. నాట్యంతో పాటు సంగీతం కూడా నేర్చుకున్నాను. కానీ డాన్స్ పైనా ఎక్కువ శ్రద్ద పెట్టాను. పేరిణి లాస్యంలో కూడా శిక్షణ తీసుకున్నాను. ప్రఖ్యాత కూచిపూడి కళాకారిణి మంజుభార్గవి వద్ద కూచిపూడి వర్క్షాపుకు హాజరయ్యాను. నల్లగొండకు చెందిన మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ వద్ద రీ రికారి్డంగ్లో పనిచేశాను. ఆ తర్వాత జానదప పాటల్లో నటించే అవకాశం లభించింది.2021లో మొదటి అవకాశం2021లో సై టీవీ రూపొందించిన ‘తిన్నాతీరం పడతలే’ అనే పాటలో మొదటిసారి నటించాను. ఆ పాటకు మంచి గుర్తింపు వచ్చింది. నాలుగు సంవత్సరాల్లో 300 వరకు జానపద పాటల్లో నటించాను. చాలా అవకాశాలు వస్తున్నా.. అందులో మంచివి మాత్రమే ఎంచుకుంటాను. ఫోక్ పాటలకు ప్రేక్షకుల్లో బాగా క్రేజ్ లభించింది. యూట్యూబ్లో 100 మిలియన్ బేంచ్ మార్క్కు చేరింది. శాస్త్రీయ నాట్యం నుంచి జానపదానికి వస్తానని అనుకోలేదు. అనుకోకుండా జానపద పాటల్లో ప్రారంభమైన నటన నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చింది. సినిమాల్లో నటించాలనేది నా కోరిక. ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘కలివి వనం’ అనే సినిమాలో నటించాను. ఆ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.కూచిపూడిలో పీహెచ్డీ చేస్తా..చిన్నప్పటి నుంచి కూచిపూడి నాట్యంలో శిక్షణ తీసుకున్నా. అనేక వర్క్షాపులకు హాజరయ్యా. డిప్లొమా కోర్సు కూడా పూర్తి చేశా. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంలో కూచిపూడిలో మాస్టర్స్ డిగ్రీ చదివాను. అయినప్పటికీ కూచిపూడిలో పరిశోధన చేసి పీహెచ్డీ చేయాలనేది నా లక్ష్యం. అంతే కాదు నేను నేర్చుకున్న విద్యను అందరికీ పంచాలని భావించాను. నల్లగొండలో మాకు సొంత ఇల్లు ఉంది. అవకాశాల కోసం హైదరాబాద్లో ఉంటున్నాం. నేను నేర్చుకున్న కళ పది మందికి నేర్పించాలనేది నా కోరిక. నల్లగొండలో నాగదుర్గ నాట్యాలయం పేరుతో కూచిపూడి శిక్షణ కేంద్రం నడిపిస్తున్నా. 60 మంది వరకు విద్యార్థులు శిక్షణకు వస్తున్నారు. షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా.. ప్రతి శని, ఆదివారం నల్లగొండకు వస్తాం. -
ఏడాది తర్వాత రక్తస్రావం అవుతుంది..ఇది పెద్ద సమస్యనా?
డాక్టర్గారు, నాకు 45 ఏళ్లు. దాదాపు సంవత్సరం రోజులుగా రుతుస్రావం రాలేదు. ఇది మెనోపాజ్ అనుకున్నాను కాని, ఇప్పుడు మళ్లీ రక్తస్రావం వస్తోంది. ఇది ఏదైనా పెద్ద సమస్యనా అని చాలా భయపడుతున్నాను.– లావణ్య, తూప్రాన్ఒక మహిళకు 45 ఏళ్లు దాటాక వరుసగా 12 నెలలు రుతుస్రావం లేకపోతే మెనోపాజ్ దశలో ఉన్నట్లుగా పరిగణిస్తాం. అయితే ఆ తర్వాత రక్తస్రావం వస్తే దాన్ని పోస్టు మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు. ఇది తరచు కనిపించే సమస్యలలో ఒకటి. అయినప్పటికీ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయరాదు. సుమారు ఐదు శాతం మహిళల్లో ఈ సమస్య కనిపిస్తుంది. అందులో ఎక్కువగా కనిపించే కారణం అట్రోఫిక్ వెజైనిటిస్. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల యోని గోడలు పలచబడి చిన్న గాయాలు అవుతాయి. దాంతో రక్తస్రావం మాత్రమే కాకుండా, పదే పదే మూత్రపిండ ఇన్ఫెక్షన్లు కూడా రావచ్చు. మరికొంతమందిలో గర్భాశయం లోపల ఏర్పడే పాలిప్స్ వలన రక్తస్రావం ఉంటుంది. ఇవి గడ్డల్లా మారుతాయి. పోస్టు మెనోపాజల్ బ్లీడింగ్ ఉన్నవారిలో పదిహేను నుంచి ఇరవై శాతం వరకు ఇవే కారణం అవుతాయి. వీటిలో తొంభై శాతం ఫాల్స్ అయినప్పటికీ నిర్ధారణ అవసరమే! ఇంకా కొంతమందిలో ఎండోమెట్రియల్ హైపర్ప్లాసియా లేదా గర్భాశయ క్యాన్సర్కు కారణం అవుతుంది. దాదాపు పది శాతం కేసుల్లో ఈ సమస్య కనిపిస్తుంది. హైపర్ప్లాసియాలో కూడా ఏటిపికల్ అనే రకం ఉంటే కేన్సర్గా మారే ప్రమాదం ఎక్కువ. అరుదుగా యోని లేదా వల్వా కేన్సర్లు కూడా ఈ రక్తస్రావానికి కారణం కావచ్చు. మధుమేహం ఉన్నవారు, అధిక బరువు కలిగినవారు, గర్భాశయ కేన్సర్ కుటుంబ చరిత్ర ఉన్నవారు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మెనోపాజ్ లక్షణాలను తగ్గించుకోవడానికి ఈస్ట్రోజన్ మాత్రలు తీసుకునే కొంతమందికి కూడా రక్తస్రావం కలగవచ్చు. అందుకే మెనోపాజ్ తర్వాత రక్తస్రావం వస్తే అది పెద్ద విషయం కాదని ఊహించుకోవడం తప్పు. ఎక్కువసార్లు కారణం తేలికపాటిదే అయినా, కొన్నిసార్లు తీవ్రమైన సమస్యకు సంకేతం కావచ్చు. కాబట్టి ఒకసారి అయినా గైనకాలజిస్ట్ను సంప్రదించి అల్ట్రాసౌండ్, ఎండోమెట్రియల్ టెస్టులు చేయించుకోవడం చాలా అవసరం. డాక్టర్ ప్రమత శిరీష, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: జాతీయ పోషకాహార వారోత్సవాలు: అరవైల్లోనూ యవ్వనంగా!) -
చాకిరీనే ఆమె నౌకరీ
భారతీయ మహిళకు ఇంటా, బయటా మోయలేనంతగా రెండింతల పని భారం ఉంటోందని తాజాగా విడుదలైన ‘టైమ్ యూజ్’ సర్వే వెల్లడించింది. ఎక్కువ చదువుకున్న, సంపన్నులైన మహిళలు సైతం ఈ విషయంలో మెరుగ్గా ఏమీ లేరని కూడా వ్యాఖ్యానించింది. పురుషులు జీతం వచ్చే పనికి బయట ఎంత సమయం వెచ్చిస్తున్నారో, అంతకుమించిన సమయాన్ని మహిళలు జీతం రాని పనికి ఇంట్లో వెచ్చిస్తున్నారని సర్వే పేర్కొంది.భారత ‘స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్’ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్.ఎస్.ఒ.) 2024లో దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘టైమ్ యూజ్’ సర్వేలో – రోజువారీ పనులకు స్త్రీలు, పురుషులకంటే రెండింతలు ఎక్కువగా సమయాన్ని వెచ్చిస్తున్నట్లు వెల్లడైంది. ఈ సర్వే కోసం ఎన్.ఎస్.ఒ. 1,67,000 మందిని కలిసి వివరాలు సేకరించింది. శ్రమలో అసమానతలుఉద్యోగం, నిద్ర, ఆహారం, విశ్రాంతి మొదలు.. చదవటం, షాపింగ్, వంట పని వంటి 165 రోజువారీ పనులకు స్త్రీ పురుషులు వెచ్చించిన సమయాన్ని సర్వే నమోదు చేసింది. పురుషులు, మహిళలు నిద్రించడానికి దాదాపు సమాన సమయాన్ని వెచ్చిస్తుండగా, సగటు స్త్రీ, సగటు పురుషుడు బయట నలుగురితో కలిసి గడిపే దాని కంటే కూడా ఎక్కువ సమయాన్ని ఇంటి పనులకే కేటాయిస్తోంది. నిద్రను మినహాయిస్తే, పురుషులు ఉద్యోగం లేదా స్వయం ఉపాధి పనులలో రోజుకు సగటున గ్రామాలలో 4.6 గంటలు, పట్టణ ప్రాంతాలలో 5.3 గంటలు వెచ్చిస్తున్నారు. ఆ తరువాతనైనా వారికి విశ్రాంతి లభిస్తోంది. లేదా బయటి కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. కాని మహిళల్లో ఇంటి పనులు సుదీర్ఘంగా ఉంటున్నాయి. ఈ ధోరణి శ్రమ చేయటంలో స్త్రీ పురుష అసమానతల్ని స్పష్టంగా చూపిస్తోంది. 2024–25లో దేశంలో 15ఏళ్లు, అంతకు పైబడిన వయసు గల మహిళల కార్మిక భాగస్వామ్య రేటు 41.7 శాతం ఉండగా, పురుషులలో ఈ శాతం 78.8 వరకు ఉంది. తక్కువ జీతం, తక్కువ అవకాశాలు స్త్రీలు ఉద్యోగం చేయటానికి ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయి.రెండింతల రెట్టింపు పని మహిళలు విద్యలో ఎంతగా పురోగతి సాధిస్తున్నా, ఉద్యోగాలలో పెద్దగా ప్రయోజనం పొందటం లేదు. జీతం ఉన్న పని, జీతం లేని పని రెండింటినీ కలిపి, విద్యాస్థాయి లేదా సామాజిక–ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా మహిళలు పురుషుల కంటే ఎక్కువగా శ్రమిస్తున్నారు. నిరక్షరాస్యులైన మహిళలు సగటున రోజుకు 103 నిమిషాలకు పైగా జీతం ఉన్న ఉపాధి పనులకు, 281 నిమిషాలకు పైగా జీతం లేని పనికి వెచ్చిస్తున్నారు. డిగ్రీ ఉన్న మహిళలు సైతం ఉపాధి కోసం 106 నిమిషాలు, జీతం లేని పనికి చాలా ఎక్కువగా 323 నిమిషాలు కేటాయిస్తున్నారు. ఇది పురుషులు చేస్తున్న శ్రమ కంటే చాలా ఎక్కువ. నేటికీ నెమ్మదిగానే పురోగతిఅనేక విద్యా స్థాయులలో బాలురు, పురుషుల కంటే బాలికలు, మహిళలు మెరుగ్గా ఉన్నప్పటికీ, ఉద్యోగావకాశాలలో మహిళలింకా పురుషుల కంటే వెనుకబడే ఉన్నట్లు సర్వే పేర్కొంది. ఇంటి బాధ్యతలు తరచుగా వారిని ఉద్యోగావకాశాలకు దూరంగా ఉంచుతున్నాయని ఆర్థికవేత్తలు, విధాన నిర్ణేతలు ఎప్పటి నుండో చెబుతూ ఉన్న విషయమే. కాగా 2023 నోబెల్ గ్రహీత క్లాడియా గోల్డిన్, 200 సంవత్సరాల అమెరికా ఉద్యోగ రంగ డేటాను అధ్యయనం చేసి... వేతనం లేని పని భారం, ముఖ్యంగా మాతృత్వం... ఉపాధి అవకాశాలలో లింగ భేదాలకు దారి తీసిందని తెలిపారు. గర్భనిరోధక మాత్రల లభ్యత, సేవా రంగ ఉద్యోగాల ఆవిర్భావం కారణంగా పరిస్థితి కొంత మెరుగవటం కూడా క్లాడియా గమనించారు. అయితే, భారతదేశంలో ఈ పురోగతి ఇప్పటికీ నెమ్మదిగానే ఉంది. ∙∙ కాస్త బ్రేక్ తీస్కో తల్లీ! సినిమా మధ్యలో ‘విశ్రాంతి’ పడుతుంది, ప్రేక్షకుల రెస్ట్ కోసం. యుద్ధం మధ్యలో ‘కాల్పుల విరమణ’ ఉంటుంది, సైనికుల రెస్ట్ కోసం. ఆఫీస్లలో చిన్న చిన్న బ్రేక్లు ఉంటాయి, ఉద్యోగుల రెస్ట్ కోసం. ‘‘ఎటూ కదలకండి’’ అని డాక్టర్లు సలహా ఇస్తారు. పేషెంట్ల రెస్ట్ కోసం. డాక్టర్లే కాదు, ఒక పనిలో అదే పనిగా ఉండిపోతే, మన శరీరం కూడా మనకు రెస్ట్ సిగ్నల్ కొడుతుంది. ‘‘కాస్త ఆగు తల్లీ’’ అంటుంది. కానీ మనం ఆ సిగ్నల్స్ను పట్టించుకోం. పని పూర్తి చేసేస్తే ఒక పనైపోతుంది అనుకుంటాం. మన ఆలోచన ఏమిటంటే, పనిని మధ్యలోనే వదిలేయటం ఎందుకని? ఆలోచన మంచిదే కాని, ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సలహా ఇస్తున్నారు. పని మధ్యలో రెస్ట్ అవసరం అయినప్పుడు పనిని మధ్యలోనే కదా వదిలేయాలి అని సున్నితంగా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా... మహిళలకు చెబుతున్నారు. రెస్ట్ తీసుకోవటం అంటే?అలసట నుండి తేరుకోవటానికి రెస్ట్ అవసరం కనుక, అలసట తీరేవరకు పనిని పక్కన పెట్టటమే రెస్ట్ తీసుకోవటం. చేస్తున్న పనిని బట్టి, అప్పటి మీ శారీరక స్థితిని బట్టి కొన్ని నిముషాల రెస్ట్, లేదా కొన్ని గంటల రెస్ట్, లేదంటే కొన్ని రోజుల రెస్ట్ అవసరం అవుతుంది. అయితే రెస్ట్ తీసుకున్నంత మాత్రాన బాడీ, మైండ్ రెండూ రీచార్జ్ అవుతాయని చెప్పలేం. రెస్ట్ ఉంటుంది. ఉత్సాహం ఉండదు. ఉత్సాహం లేని రెస్టు కూడా మళ్లీ పనితో సమానమే. అందుకే, ముల్లును ముల్లుతోనే తీసినట్లుగా పని వల్ల వచ్చిన అలసటను పనితోనే పోగొట్టుకోవటం అవసరం. అందుకోసం ఏ రకం రెస్టు మనల్ని ఏ రకం అలసట నుంచి కోలుకునేలా చేస్తుందో తెలుసుకోవాలి. ముందు, రెస్టులోని రకాలు ఏమిటో తెలుసుకుంటే, వాటిల్లో ఏ రెస్ట్ మన స్థితికి సరిపోతుందో తెలిసిపోతుంది.రెస్టులో 7 రకాలుఫిజికల్ రెస్ట్, ఎమోషనల్ రెస్ట్, స్పిరిచ్యువల్ రెస్ట్, సోషల్ రెస్ట్, సెన్సరీ రెస్ట్, క్రియేటివ్ రెస్ట్, మెంటల్ రెస్ట్ అని ఏడు రకాలైన రెస్ట్లు ఉన్నాయి.ఫిజికల్ రెస్ట్: ఇది శారీరక విశ్రాంతి. చక్కగా నిద్రపోతే సరిగ్గా రెస్ట్ దొరుకుతుంది. ఇందుకు భిన్నంగా యోగా, బాడీనీ స్ట్రెచ్ (సాగతీయటం) వంటివి మంచి ఫలితాన్ని ఇస్తాయి. శరీరం తేలిపోతున్నట్లుగా ఉంటుంది. పని కోసం మళ్లీ మనసు పరుగులు పెడుతుంది. ఫిజికల్ రెస్ట్ వల్ల క్రియాశీలం అయ్యే రక్త ప్రసరణ మహిమ ఇది. ఇవి కాక.. మసాజ్, చిన్న చిన్న విరామాలు, వాకింగ్.ఎమోషనల్ రెస్ట్: ఇది భావోద్వేగ విశ్రాంతి. అంటే మీ కోపాన్ని, అసహనాన్ని, విసుగును, అసంతృప్తిని, ఆందోళనను.. ఆరోగ్యంగా వ్యక్తపరచడం. మీ మనసు లోపలి ఉద్దేశాల గురించి నిజాయితీగా బయటికి చెప్పుకోవటం. అవసరం అయితే సహాయం తీసుకోవటం. ఉద్వేగం మితిమీరకుండా నిగ్రహించుకోవటం. ఇందువల్ల మీకు మానసికమైన విశ్రాంతి లభిస్తుంది. ఇవి కాక.. ఒంటరిగా సమయం గడపడం, మీ గురించి మీరు శ్రద్ధ వహించటం. డైరీ రాయటం, ప్రకృతిలో గడపటం.స్పిరిచ్యువల్ రెస్ట్ : ఇది ఆధ్యాత్మిక విశ్రాంతి. దినచర్యలకు మించి జీవితానికి అర్థం, పరమార్థం కనుగొనే ప్రయత్నం చేయటం. అందుకోసం ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనటం. హృదయంతో ఆలోచించటం. ఇవన్నీ మనసును తేటపరుస్తాయి. భౌతికమైన ఒత్తిళ్ల నుంచి విశ్రాంతిని చేకూరుస్తాయి. ఇవి కాక.. మీకు నచ్చిన ఆధ్యాత్మిక సాధనలో పాల్గొనడం, ఒక సత్కార్యం కోసం స్వచ్ఛందంగా పనిచేయడం.సోషల్ రెస్ట్: ఇది సామాజిక విశ్రాంతి. సానుకూలంగా ఉండేవాళ్లు, మనకు మద్దతుగా ఉండేవాళ్లతో సమయాన్ని గడపటం. అదే సమయంలో అలసట కలిగించే, ఒత్తిడితో కూడిన సంబంధాలకు దూరంగా ఉండటం. మనం సామాజిక జీవులం. అయినప్పటికీ అంతర్ముఖులకు ఈ సోషల్ రెస్ట్ అలసట కలిగించేది కావచ్చు. అలాంటి వారికి సోషల్ రెస్ట్ వల్ల నష్టం తప్ప ప్రయోజనం ఉండదని గమనించాలి. ఇవి కాక.. ఒంటరిగా లేదా సన్నిహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపడం. సోలో పిక్నిక్, టూర్ లేదా ఉన్న చోటే బయటికి వెళ్లి భోజనం చేయడం, మీ ఒంటిపై మీరు ధ్యాస పెట్టటం.సెన్సరీ రెస్ట్: ఇది ఇంద్రియ విశ్రాంతి. దేదీప్యమానంగా వెలిగే లైట్లు, రణగొణధ్వనులు; టీవీ, స్మార్ట్ఫోన్ స్క్రీన్ల వంటి వాటికి దూరంగా, డిమ్ లైట్లు, నిశ్శబ్దాల మధ్య పొందే విశ్రాంతి. ఇవి కాక.. కాసేపు కళ్లు మూసుకోవడం, నిశ్శబ్దంగా ఉండే గదిలో సమయం గడపడం, ఎక్కువసేపు స్నానం చేయడం.క్రియేటివ్ రెస్ట్: సృజనాత్మక విశ్రాంతి. ఇది మీలోని క్రియేటివిటీని తట్టి లేపుతుంది. అలసటకు ఇది దివ్యౌషధం. మెదడుకు మేత వల్ల మీ మనసు పునరుత్తేజితం అవుతుంది. ఇవి కాక.. పని నుండి విరామం తీసుకోవడం, సృజనాత్మకమైన పనులు చేయటం (డ్రాయింగ్, పెయింటింగ్, అల్లికలు మొదలైనవి)మెంటల్ రెస్ట్: ఇది మానసిక విశ్రాంతి. ఇది మీ మెదడుకు బ్రేక్ ఇస్తుంది. నిర్ణయాలు తీసుకోవడం, సమస్య పరిష్కారం వెతకటం వంటి ఒత్తిళ్ల నుంచి తాత్కాలికంగా విరామం ఇస్తుంది. ధ్యానం వంటి అభ్యాసాలు లేదా తీవ్రమైన ఏకాగ్రత అవసరం లేని తేలిక పాటి సాధనల్లో పాల్గొనడం వల్ల మానసిక విశ్రాంతి లభిస్తుంది. ఇవి కాక.. మీ ఫోన్ను ఆఫ్ చేయడం, సోషల్ మీడియాకు కొన్నాళ్లు దూరంగా ఉండటం. (చదవండి: జాతీయ పోషకాహార వారోత్సవాలు: అరవైల్లోనూ యవ్వనంగా!) -
ఉచిత పోషకాహార శిబిరం
నేషనల్ న్యూ ట్రిషన్ వీక్ సందర్భంగా ఆలివ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుండి 10 వరకు ఉచిత పోషకాహార శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఈ శిబిరంలో పాల్గొనే వారికి ఉచిత ఆరోగ్య పరీక్షలు, నిపుణుల సలహాలు, వ్యక్తిగత డైట్ ప్లాన్లు అందిచనున్నారు. సాధారణంగా నిర్లక్ష్యం చేస్తున్న విటమిన్ లోపాలు — అలసట, రోగనిరోధక శక్తి తగ్గడం, శక్తి లోపం వంటి సమస్యలపై వైద్యులు, పోషకాహార నిపుణులు దృష్టి సారించి సులభమైన ఆహార మార్పులపై మార్గదర్శనం ఇవ్వనున్నారు.ఈ సందర్భంగా డాక్టర్ సుగ్రా ఫాతిమా, కన్సల్టెంట్ డైటీషియన్ అండ్ న్యూ ట్రిషనిస్ట్ మాట్లాడుతూ...“ఆహారం మన ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన శరీరానికి ఏం కావాలో అర్థం చేసుకుంటే అనేక జీవనశైలి సమస్యలను నివారించవచ్చు. ఈ న్యూట్రిషన్ వీక్ ద్వారా ఆరోగ్యకరమైన జీవితం కోసం సరైన పోషకాహార ప్రాధాన్యతను నగర వాసులకు తెలీయజేయడమే" అని అన్నా రు. ఈ శిబిరంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని, ఉచిత పరీక్షలు, సలహాలను పొంది ఆరోగ్యకరమైన జీవనానికి తొలి అడుగు వేయాలని ఆలివ్ హాస్పి టల్ యాజమాన్యం కోరింది.(చదవండి: జాతీయ పోషకాహార వారోత్సవాలు: అరవైల్లోనూ యవ్వనంగా!) -
అరవైల్లోనూ యవ్వనంగా!
అరవై ఏళ్లు దాటిన కొందరు సెలబ్రిటీలను, వారి ఫిట్నెస్ చూసి చాలా మంది ‘వయసును ఆపేశారు’ అని మాట్లాడుకోవడం చూస్తుంటాం. వారు తీసుకునే పోషకాహారం, వ్యాయామం, చేసే పనుల నిర్వహణ ఇంకా యవ్వనంగా ఉండేలా చేస్తుంది. అరవై ఏళ్ల వయసు పై బడిన వారు ఇక జీవితం అయి΄ోయిందని అనుకోకుండా తమ రోజువారీ తీసుకునే ఆహారం పట్ల సరైన శ్రద్ధ వహిస్తే ఆరోగ్యంగానూ, పనుల నిర్వహణలోనూ ఉత్సాహంగా ఉంటారు.రోజువారీగా తీసుకోవాల్సిన...కేలరీలు: 1500–1700ప్రొటీన్లు: పురుషులు – రోజుకు 54 గ్రా‘‘ మహిళలు – రోజుకు 45గ్రా‘‘ నాణ్యమైన ప్రొటీన్ కోసం: ఉడికించిన గుడ్డు, పాలు, కోడి మాంసం, చేపలు, పప్పు దినుసులుకొవ్వులు: రోజుకు 25.గ్రా (ఆరోగ్యకరమైన కొవ్వులు – 1 టేబుల్ స్పూన్ నూనె, గింజలు, నువ్వులు)కార్బోహైడ్రేట్లు: మొత్తం కాలరీలలో 45–65% విటమిన్లు, ఖనిజాలువిటమిన్–ఎ: 840–1000 మైక్రోగ్రాములువిటమిన్– ఇ: రోజుకు 65 మి.గ్రా‘‘క్యాల్షియం: రోజుకు 1200 మి.గ్రా‘‘ఐరన్: రోజుకు 11–19 మి.గ్రా‘‘ఫుడ్ గ్రూఫ్స్ పండ్లు: రోజుకు 1–2 సర్వింగ్స్ (మీడియం సైజు ఉన్న పండు)కూరగాయలు: రోజుకు 3–4 సర్వింగ్స్ (వంట చేసినవి లేదా ఉడికించినవి)ధాన్యాలు: రోజుకు 6–8 సర్వింగ్స్ (1 కప్పు = 30గ్రా) అన్నం, సజ్జలు, లేదా గోధుమ నూకడైరీ ఉత్పత్తులు: రోజుకు 2–3 సర్వింగ్స్ (పాలు, పెరుగు, పనీర్)సాధారణంగా రోజూ ఈ కాంబినేషన్లో ఆహారం ఉండేలా చూసుకోవాలి.రోజువారీ భోజన ప్రణాళిక...బ్రేక్ఫాస్ట్ఇడ్లీ (60గ్రా.) + 1 కప్పు సాంబార్ లేదాఉప్మా (60గ్రా.) + 1 కప్పు సాంబార్ లేదాఓట్స్ / కిచిడీ (60గ్రా.) + ఉడికించిన గుడ్డు తెల్లసొనమధ్యాహ్న భోజనం1 కప్పు బియ్యం / బ్రౌన్ రైస్1 జొన్న/రాగి ఫుల్కా (25గ్రా‘‘)1 కప్పు తోటకూర పప్పు1 కప్పు కాకర కాయ కూర / ఇతర కూరస్నాక్స్ఆపిల్ / కివి / కమలపండుకొద్దిగా నానబెట్టిన గింజలు కొబ్బరి నీళ్లుఈవెనింగ్ స్నాక్స్1 కప్పు చికెన్ సూప్ / వెజిటబుల్ సూప్ / మజ్జిగరాత్రి భోజనం1 కప్పు అన్నం / బ్రౌన్ రైస్ / కిచిడీ లేదా 1 ఫుల్కా1 కప్పు పాలక్ పనీర్ కూర / పలుచని పప్పు/ ఏదైనా ఒక కూర (చదవండి: మనపై ‘గాండ్రు’మన్న పులులే మెత్తని గ్రాండ్ పేరెంట్స్ అయ్యారే!) -
మనపై ‘గాండ్రు’మన్న పులులే మెత్తని గ్రాండ్ పేరెంట్స్ అయ్యారే!
ఈ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారే... వాళ్ల రెండు నాల్కల ధోరణే వేరు. వీళ్లు పేరెంట్స్గా ఉన్నప్పుడు తమ పిల్లలు అన్నం తినకపోయినా... సరిగా చదవక΄ోయినా... మాట వినక΄ోయినా విపరీతంగా తిట్టేవారు. కసితీరా కొట్టేవారు. వెరసి... చెడుగుడాడేవాళ్లూ... చెమడాలెక్కతీసేవాళ్లు. ఈ ధోరణితో వాళ్లు ప్రవర్తిస్తున్న కాలంలో పిల్లలుగా మనం బితుకూ బితుకూమంటూ బతికేవాళ్లం. ఎట్టకేలకు వాళ్లిప్పుడు గ్రాండ్స్పేరెంట్స్ అయ్యారు.కాలచక్రం గిర్రున తిరిగి మనకూ ఇప్పుడు పిల్లలు పుట్టారు. కాలేజీలో జూనియర్స్ సీనియర్స్ అయి ‘పేరేంట్య్రాగింగు’ పర్వదినాల కోసం మనమూ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నామా...? అదృష్టవశాత్తూ ఇప్పుడు మన వంతు రాగానే మన పిల్లలు అన్నం తిననప్పుడు మనం బెల్టు పట్టుకోబోయామా... వాళ్లెదురుగా వచ్చి పిల్లలముందు నిలబడిపోతారు. బెత్తం పట్టుకోబోయామా... అడ్డంగా వచ్చేసి కలబడిపోతారు. థూ మన బతుకుచెడా... మన బండపడా... అప్పుడు మనం పిల్లలుగా ఉన్నప్పుడూ బితుకూ బితుకే...ఇప్పుడూ అదే బతుకే! వాళ్లే మన పేరెంటూ... మన నాటి పేరెంట్సే... నేటి గ్రాండ్ పేరెంట్సు. మళ్లీ సదరు గ్రాండు పేరెంట్సు... గ్రాండుగా వాళ్లు చెప్పొచ్చేదేమిటంటే... ‘‘ఏం మాకు పిల్లలు పుట్టలేదా? మేం పెంచలేదా, పెంచడం మాకు తెలియదా’’ అంటూ దబాయింపు. అలా వాళ్లు తమ రెండు నాల్కల ధోరణితో మనల్ని నానామాటలు అంటూ ఉంటే... సదరు మన పేరెంట్సుకూ, మన పిల్లల గ్రాండుపేరెంట్సుకూ ఎదురుచెప్పకూడదంటూ మనలో మనం అనేసుకునే మాటేమిటంటే... ‘‘అయ్యో.... మీకు తెలియక΄ోవడమేమిటీ? అప్పుడు మీరు పెంచిందీ, గసిరిందీ, కొట్టిందీ మమ్మల్నే... ఇప్పుడు పిల్లల ఎదురుగా నిలబడి΄ోతూ, కలబడిపోతూ గసురుతున్నదీ, మాటలు విసురుతున్నదీ మమ్మల్నే!’’ అంటూ గుసగుసగా గునుస్తూ... నేటి మన గ్రాండ్ పేరెంట్స్ గాండ్రుగాండ్రుల పట్ల మురుస్తూ ఇలా బతికేస్తున్నాం... బతికేస్తుంటాం. (చదవండి: -
హయగ్రీవ అవతారం
శ్రీమహావిష్ణువు ఒకప్పుడు దానవులతో పదివేల సంవత్సరాలు యుద్ధం చేయవలసి వచ్చింది. యుద్ధంలో దానవులను దునుమాడిన తర్వాత అలసిన అతడు పద్మాసనంపై కూర్చుని, ధనుస్సుకు చివర తలవాల్చి, నిద్రలోకి జారుకున్నాడు.అదే సమయంలో ఇంద్రాది దేవతలు విష్ణువు సహాయంతో ఒక యాగాన్ని చేయాలని సంకల్పించుకున్నారు. ఈ సంగతిని విన్నవించుకోవడానికి దేవతలందరూ మహావిష్ణువు దగ్గరకు వెళ్లారు. అప్పుడు ఆయన ఆదమరచి నిద్రపోతూ కనిపించాడు. అలాంటి పరిస్థితిలో ఆయనకు మేల్కొలపడం ఎలాగని దేవతలు చింతాక్రాంతులయ్యారు. ‘నిద్రాభంగం చేయడం దోషం. అలా చేయవద్దు’ అన్నాడు ఇంద్రుడు.అప్పుడు బ్రహ్మ కలగజేసుకుని, ‘నేను ఒక చెదపురుగును సృష్టించి, దానిని విష్ణుధనువు నారిని కొరికేలా ఆజ్ఞాపిస్తారు. నారి తెగినప్పుడు ఏర్పడే ధ్వనికి దేవదేవుడు మేల్కొంటాడు’ అని చెప్పి, చెదపురుగును సృష్టించి, వింటినారిని కొరకమని ఆజ్ఞాపించాడు. ‘ఈ పాపకార్యం చేయడం వల్ల నాకు నరకం తప్ప ఒరిగేదేమిటి?’ అని బ్రహ్మదేవుడిని అడిగింది చెదపురుగు.‘నీకు నరకం ఉండదు. మేం తలపెట్టిన యాగంలో నీకూ కొంత భాగం ఇస్తాం’ అని మాట ఇచ్చాడు బ్రహ్మదేవుడు.చెదపురుగు వెంటనే వెళ్లి, విష్ణువు వింటినారిని కొరికింది. భీకరమైన ధ్వని ఏర్పడింది. దేవతలు చూసేసరికి కిరీట కుండలాలతో ప్రకాశించే విష్ణువు తల కనిపించలేదు. నారి తాకిడికి అతడి తల తెగిపోయింది. ఇది చూసి దేవతలు హాహాకారాలు చేశారు. బృహస్పతి జోక్యం చేసుకుని, ‘ఇప్పుడు ఇలా ఏడ్వడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? తరుణోపాయం ఏమిటో ఆలోచించాలి గాని’ అన్నాడు. ‘ఇంతటి విపత్కర పరిస్థితి నుంచి బయటపడాలంటే, పరదేవతను ఆశ్రయించడం తప్ప గత్యంతరం లేదు’ పలికాడు బ్రహ్మదేవుడు.దేవతలందరూ హుటాహుటిన జగన్మాత వద్దకు వెళ్లి, ఆమెను వేనోళ్ల స్తుతించి, తమను ఈ విషమ పరీక్ష నుంచి గట్టెక్కించమని ప్రార్థించారు.‘దేవతలారా! వినండి. శ్రీహరి శిరస్సు తెగిపడటానికి ఒక కారణం ఉంది. పూర్వం అతడు తన ప్రియురాలి ముఖం చూసి నవ్వాడు. ఆమె కుపితురాలై, నీ తల తెగిపడుగాక అని శపించింది. ఆ శాపం ఇప్పుడిలా ఫలించింది. ఇందులో మరో విషయం కూడా ఉంది. పూర్వం హయగ్రీవుడనే రాక్షసుడు సరస్వతీ నదీతీరంలో నా గురించి ఘోరతపస్సు చేశాడు. నేను అతడికి ప్రత్యక్షమై వరం కోరుకోమంటే, మరణం లేకుండా వరం కావాలన్నాడు. పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు గనుక అది అసాధ్యమని చెప్పాను. దానికి బదులుగా మరో వరం కోరుకోమని చెప్పాను. తనకు గుర్రం ముఖం ఉండేవాని వల్ల తప్ప మరెవరివల్లా మరణం లేకుండేలా అనుగ్రహించమన్నాడు. నేను సరేనని వరమిచ్చాను. అతడు వరగర్వంతో లోకులను, బ్రాహ్మణులను పీడించడం మొదలుపెట్టాడు. అతడి ఆగడాలు నానాటికీ శ్రుతిమించుతుండటంతో భక్తులు మొరపెట్టుకుంటున్నారు. అతడి అంతానికి ఇప్పుడు సమయం ఆసన్నమైంది. అందువల్ల ఇప్పుడు బ్రహ్మదేవుడు గుర్రం తలను తెప్పించి, శ్రీహరికి అతికించినట్లయితే, అతడు పునర్జీవితుడై, ఆ రాక్షసుడిని సంహరించగలడు’ అని జగన్మాత పలికింది.ఆమె మాటలకు దేవతలు సంతోషించి, ఆమెను మరోసారి స్తుతించారు.బ్రహ్మదేవుడు వెంటనే విశ్వకర్మను పిలిపించాడు.అతడికి జరిగినదంతా చెప్పి, తెగిపడిన శిరస్సు స్థానంలో శ్రీహరికి గుర్రం శిరస్సును అతికించాలని ఆదేశించాడు. విశ్వకర్మ ఒక గుర్రం తలను నరికి తీసుకువచ్చాడు. దానిని విష్ణువుకు అతికించాడు. అలా విష్ణువు హయగ్రీవ అవతారం దాల్చాడు. హయగ్రీవుడిగా మేల్కొన్న శ్రీహరికి ఇంద్రాది దేవతలందరూ జయజయ ధ్వానాలు పలికారు. హయగ్రీవుడనే అసురుడి ఆగడాలను తెలిపి, జగన్మాత చెప్పిన ప్రకారం అతడిని సంహరించి, లోకాలకు పీడను విరగడ చేయమని కోరారు.హయగ్రీవావతారంలో శ్రీహరి హయగ్రీవుడనే అసురుడిపై యుద్ధానికి వెళ్లాడు.హోరాహోరీగా సాగిన యుద్ధంలో శ్రీహరి తన సుదర్శనచక్రాన్ని ప్రయోగించి, హయగ్రీవాసురుడిని సంహరించాడు.∙సాంఖ్యాయన -
ఈ వారం కథ: పరోపకారార్థం ఇదం శరీరం
‘‘అన్నయ్యా! రామారావు బాబాయికి హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్లో ఉన్నాడు. ఈసారి ఆయన కండిషన్ క్రిటికల్ అన్నాడు డాక్టర్. నువ్వు చూసి వెళితే బావుంటుంది’’ సొంత బాబాయి అనారోగ్యం కబురు తెలిసిన రెండురోజుల తర్వాత ఊళ్లో ఉన్న అన్న విశ్వనాథ్కి తీరిగ్గా ఫోన్ చేశాడు తమ్ముడు శంకరం.‘‘నేను సిటీకి నిన్ననే వచ్చాను. హాస్పిటల్లో ఉన్నాను. బాబాయి ఇంతకు ముందే పోయాడు. కబురింకా ఎవరికీ చెప్పలేదు. బిల్లు డబ్బు పూర్తిగా కడితే గాని శవాన్ని ఇవ్వరట. చంద్రం డబ్బు కోసం వెళ్లాడు’’ నిర్లిప్తంగా అన్నాడు విశ్వనాథ్.‘‘ఓ నిన్ననే వచ్చావా? చంద్రం నిన్నేమైనా డబ్బు అడిగాడా?’’ ఆతృతగా అడిగాడు శంకరం.‘‘అడిగాడు. అవసరానికి నేనేమీ సర్దలేకపోయాను. సమయానికి వాడి దగ్గర డబ్బు లేదట. అప్పో సప్పో చేసి తెద్దామంటే సమయం లేదు. ఉత్త చేతులతో వచ్చాను. బిల్లు ఆరు లక్షల ప్యాకేజీ. చంద్రం ఇబ్బంది పడుతున్నాడు’’ బాధగా అన్నాడు విశ్వనాథ్ తమ్ముడు శంకరంతో.‘‘అన్నయ్యా! వాళ్ల దగ్గర డబ్బు లేకపోవడమేమిటి? జాలి కబుర్లు! నీ దగ్గర్నుంచి ఎంతో కొంత గుంజుదామని చంద్రం ప్రయత్నం. వాడు డబ్బు తిరిగిచ్చే మనిషి కాదు. నన్నూ అడిగాడు. నిర్మొహమాటంగా లేదని చెప్పాను’’ అన్నాడు శంకరం కఠినంగా.‘‘అవేం మాటలురా! కష్టంలో సాయం చేయకపోతే ఎలా? అందునా మనకి సాయం చేసిన బాబాయి కుటుంబానికి...’’ తమ్ముడిని మందలించాడు విశ్వనాథ్.‘‘నీదంతా అమాయకత్వం. నేనన్న దాంట్లో తప్పేముంది? అందరినీ నమ్ముతావు. చంద్రం సంగతి నీకు తెలియదు. అటు ఉద్యోగం, ఇటు రియల్ ఎస్టేట్ బిజినెస్. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. బాబాయి మాత్రం తక్కువా? బోలెడంత వెనకేసుకున్నారు. వాళ్లకేం తక్కువని మనల్ని డబ్బడగాలి?’’ తమ్ముడి మాటల్లో ఈర్షా్య ద్వేషాలు విశ్వనాథ్ని కలవరపెట్టాయి.‘‘ఎవరెంతటి వారైనా సమయానికి చేతిలో డబ్బు ఉండకపోవచ్చు. అత్యవసరమని అడిగినా సాయం చేయలేకపోయాము. ఇక ఆ విషయం వదిలెయ్’’ అసహనంగా అన్నాడు విశ్వనాథ్.‘‘అయినా నీ దగ్గర డబ్బెక్కడుంది అప్పనంగా ఇవ్వడానికి? అయినాదానికి, కానిదానికి అప్పు చేస్తావు. వడ్డీలు కడతావు. నీకలవాటేగా!’’ అన్నని రెట్టించి దెప్పుతూ అన్నాడు శంకరం.తమ్ముడి మాటలు మౌనంగా భరించాడు విశ్వనాథ్.‘‘సరేలే! ఈ వాదులాట మనకెప్పుడూ ఉన్నదేగా! నిన్ననంగా సిటీకి వచ్చినవాడివి ఇంటికి రాలేదు. నీ ఆరోగ్యం మాత్రం పట్టించుకోవు’’ నిష్ఠూరమాడాడు శంకరం.‘‘బాబాయి దగ్గర నేనొక్కడినే ఉన్నాను. ఇంకెవరూ రాలేదు. అందుకే రాలేకపోయాను’’ సంజాయిషీ ఇచ్చాడు విశ్వనాథ్.‘‘ఏం వాడింట్లో మనుషులేమయ్యారు? అన్నీ నాటకాలు..’’ ఉడుక్కుంటూ అంటుండగానే సిస్టర్ వచ్చి, ‘రామారావు పేషెంటు తాలూకు ఎవరున్నారో లోనికి రండి’ అని చెప్పి వెళ్లింది. తమ్ముడి ఫోన్ కట్ చేసి లోనికి వెళ్లాడు విశ్వనాథ్.‘‘డబ్బు కట్టి రూమ్ నంబరు పద్దెనిమిదికి వెళ్లండి. బాడీ ఎంబామ్ అవుతోంది’’ అంటూ తొందరపెట్టింది సిస్టర్.‘‘ఎంబామ్ అవుతోందా? అంటే?’’ ప్రశ్నించాడు విశ్వనాథ్.‘‘ఏం లేదు! బాడీని రెడీ చేస్తున్నాం’’ అని వివరం చెప్పకుండా లోనికి వెళ్లింది నర్సు.చంద్రం సాయంకాలం ఆరుగంటలకు వచ్చి బిల్లు కట్టాక శవాన్ని ఇచ్చారు. చంద్రం తన కారులో, విశ్వనాథ్ బాడీతో అంబులెన్సులో చంద్రం ఇంటికి బయలుదేరారు.మరుసటిరోజు రామారావు దహన సంస్కారాలు పూర్తయ్యే సరికి ఉదయం పదకొండు గంటలు దాటింది. అక్కడికి వచ్చిన బంధువులు, స్నేహితులు ఒక్కొక్కరుగా శ్మశానం వీడి వెళుతున్నారు. స్నానం చేసి, బట్టలు ఆరేసి ఓ మూల బెంచీ మీద నీరసంగా కూర్చుని ఉన్నాడు విశ్వనాథ్.‘‘శంకరం ఇంటికి వెళుతున్నావుగా! కర్మలకు రా అన్నా!’’ అని చెప్పి వెళ్లాడు చంద్రం.‘‘పద! ఇక మనం కూడా వెళదాం’’ అన్నాడు శంకరం అన్న దగ్గరకొచ్చి.ఆరేసిన బట్టలు మడిచి సంచిలో పెట్టుకుని, ‘‘ఒంట్లో నలతగా, తల దిమ్ముగా ఉందిరా! నిన్నటి నుంచి సరిగ్గా తినలేదు. ఆకలవుతోంది. అన్నం తిని వెంటనే ఊరికి బయలుదేరాలి. తెచ్చుకున్న డబ్బు ఖర్చయిపోయింది. దారి ఖర్చుకు డబ్బులు కావాలి’’ శ్మశానం బయటకు నడుస్తూ, మొహమాటపడుతూ తమ్ముడితో మెల్లగా అన్నాడు విశ్వనాథ్.అదే సమయానికి వారి పక్కనుంచి మహాప్రస్థానం వ్యాన్ పెద్ద శబ్దం చేస్తూ వెళ్లింది. ఆ రొదలో విశ్వనాథ్ మాటలు గాలిలో కలిసిపోయాయి. తన మాటలు శంకరం వినలేదని విశ్వనాథ్ గమనించలేదు. ఇద్దరూ శ్మశానం నుంచి బయట రోడ్డు మీద ఆటో స్టాండ్కి వచ్చారు. అదే సమయానికి ఫోన్ రావడంతో పక్కకు వెళ్లి మాట్లాడాడు శంకరం.తిరిగి వస్తూనే, ‘‘అన్నయ్యా! మీ మరదలు ఫోన్ చేసింది. తనకు పట్టింపులు ఎక్కువ. శ్మశానం నుంచి ఎవరిళ్లకు వారు వెళ్లాలట. నీకు తెలిసే ఉంటుంది. అందుకే నువ్వు సరాసరి ఊరికి వెళ్లు. ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు’’ అని పక్కన నిలబడి, పాసింజర్ కోసం తమనే గమనిస్తున్న ఆటోను పిలిచాడు శంకరం.‘‘సార్ని బస్టాండ్లో దింపు’’ అని ఆటో డ్రైవర్కి చెప్పి, ఇంకొక ఆటో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాడు శంకరం నిర్దయగా.తమ్ముడేమన్నాడో సరిగ్గా అర్థమయ్యీ కాక క్షణంపాటు తొట్రుపాటుకు లోనయ్యాడు విశ్వనాథ్.తమ మధ్య జరిగిన సంభాషణ మననం చేసుకున్నాడు. తమ్ముడన్న మాట అప్పుడు అర్థమైంది.‘అవును వాడన్నది నిజమే! కొందరికి ఇలాంటి పట్టింపులు ఉంటాయి. అయినా సొంత అన్నదమ్ముల మధ్య ఇలాంటి ఆంక్షలా?’ విరుద్ధ ఆలోచనలతో విశ్వనాథ్ మనసు కళ్లెంలేని గుర్రంలా పరుగెట్టింది. అంతటి నిస్సత్తువ, అశక్తతలోను అతని పెదవులపై వెర్రి చిరునవ్వొకటి తళుక్కుమని మాయమైంది. ఇంటికి చేరాలి. ఎలా వెళ్లాలి? అన్న ఆలోచన మిగతా ఏ ఆలోచనను దరిచేరనివ్వలేదు. ఏం చేయాలో తోచడం లేదు.తెచ్చుకున్న డబ్బు బాబాయి అత్యవసర మందులకు ఖర్చయింది. ఆ డబ్బును చంద్రాన్ని అడిగి తీసుకుందామనుకున్నాడు. మనసొప్పక అడగలేదు. ఇప్పుడు బస్సు టికెట్కి కూడా సరిపడా డబ్బులు లేవు. ఎవర్ని అడగాలి? దిక్కుతోచని స్థితి. శరీరంలో సత్తువ క్షీణించింది. నాలుగు పిడచగట్టింది. మెదడు మొద్దుబారింది. చుట్టూ ఏం జరుగుతోందో, తనెక్కడ ఉన్నాడో సైతం అర్థం కావడంలేదు అతనికి. ఆలోచనా శక్తి మందగించింది. ఎవరో.. ఏదో.. అడుగుతున్నట్లుగా అనిపిస్తోంది.‘‘ఏ బస్టాండ్కి వెళ్లాలి సార్?’’ అడుగుతున్నాడు ఆటో డ్రైవర్.సమాధానం ఏం చెప్పాలో తోచడం లేదు. అతనికి మెదడు నుంచి నోటి మాటకు సంకేతం అందడం లేదు. యాంత్రికంగా జేబులు తడుముకున్నాడు విశ్వనాథ్.జేబులో మిగిలి ఉన్న ఒక్క యాభై రూపాయల నోటు, మొబైల్ ఫోను చేతిలోకి తీసుకున్నాడు.‘‘ఎక్కడికి వెళ్లాలి సార్?’’ మళ్లీ అడిగాడు ఆటో డ్రైవర్, విశ్వనాథ్ని పరికించి చూస్తూ.‘‘ఆటో వద్దు, డబ్బుల్లేవు..’’ అతని నోటి మాటలు ముద్దగా వచ్చాయి.‘‘గూగుల్ పే ఉంది సార్!’’‘‘నాకు లేదు. బస్టాండ్కి దారి చెప్పు. నడిచి వెళతాను’’ ఒంట్లో శక్తినంతా కూడదీసుకుని అంటూనే, మొదలు నరికిన మానులా కుప్పకూలిపోయాడు విశ్వనాథ్.ఆటో అతను కంగారుపడుతూ ఆటో పక్కకు ఆపి, ఇంజిన్ ఆఫ్ చేసి, పడిపోయిన విశ్వనాథ్ని తట్టి లేపుతూ, స్పృహ కోల్పోయాడని నిర్ధారించుకున్నాడు. పరుగున ఆటో నుంచి వాటర్ బాటిల్ తెచ్చి, విశ్వనాథ్ ముఖం మీద నీళ్లు చల్లుతూ, ‘‘సార్.. సార్!’’ అంటూ తట్టి లేపే ప్రయత్నం చేశాడు.రెండు మూడు నిమిషాల తర్వాత కొద్ది తెలివి వచ్చి, మగతగా కళ్లు తెరిచాడు విశ్వనాథ్.విశ్వనాథ్ వీపు చుట్టూ చేయి వేసి, కూర్చోవడానికి సాయం చేసి, వాటర్ బాటిల్ అందించి, ‘‘కాసిని నీళ్లు తాగండి సార్’’ అన్నాడు ఆటో డ్రైవర్.నీళ్లు తాగి, ‘‘నాకేమైంది?’’ పీలగా లోగొంతుతో ప్రశ్నించాడు విశ్వనాథ్.‘‘మీరు స్పృహతప్పి పడిపోయారు. మీరు పడిపోయినప్పుడు.. మీ ఫోను, యాభై రూపాయల నోటు కింద పడ్డాయి’’ అని వాటిని, బట్టలున్న బ్యాగును విశ్వనాథ్ చేతికి అందించాడు ఆటో డ్రైవర్.ఆ నోటును అతనికే తిరిగి ఇచ్చి, తినడానికి ఏమైనా తెమ్మని సైగ చేశాడు విశ్వనాథ్.అతను పరుగున వెళ్లి, పక్కనే ఉన్న పాన్షాపులో బిస్కట్ ప్యాకెట్ తెచ్చి, ‘‘ఇవి తినండి! మీ సుగర్ లెవల్ పడిపోయినట్లుంది’’ అని పక్కనే ఉన్న పళ్ల బండి మీద నుంచి రెండు అరటిపండ్లు తెచ్చి ఇచ్చాడు.నీళ్లు తాగి, నాలుగు బిస్కట్లు, అరటిపండు తిని, రెండో పండు బ్యాగులో వేసుకుని,‘‘చాలా సాయం చేశావు. థాంక్యూ తమ్మీ! ఒంట్లో ఇప్పుడు బాగుంది. కొద్దిగా శక్తి వచ్చింది’’ అని లేచి, వెళ్లడానికి ఉద్యుక్తుడయ్యాడు.‘‘నిన్ను ఇందాక నా ఆటో కాడ వదిలి వెళ్లినతను ఎవరు?’’ అడిగాడు ఆటో డ్రైవర్.‘‘నా తమ్ముడు’’ అన్నాడు విశ్వనాథ్.‘‘సొంత తమ్ముడా? ఇందాక ఆయనన్న మాటలు నేను ఇన్నా. నిన్ను ఇంటికి రావద్దు. సీదా ఊరికి పొమ్మన్నడు కదా!’’ అన్నాడు ఆటో డ్రైవర్.మౌనంగా లేచి నిలబడి, ‘‘నేను వెళతాను’’ అన్నాడు విశ్వనాథ్.‘‘ఎలా వెళతారు? డబ్బులు లేవన్నారు కదా!’’ అన్నాడు ఆటో డ్రైవర్.‘‘నడిచి వెళతాను. ఎవరైనా తెలిసిన వాళ్లకి ఫోను చేద్దామన్నా ఫోన్ చార్జ్ అయిపోయినట్టుంది. నంబర్లు అందులో ఉన్నాయి. దేవుడు ఏదో విధంగా తప్పక సాయం చేస్తాడు’’ అన్నాడు విశ్వనాథ్ ఆకాళంలోకి చూస్తూ.‘‘అంతదూరం నడవడం కష్టమన్నా! నువ్వు నడిచే స్థితిలో లేవు. నిన్ను బస్టాండులో దింపి వెళతాను’’ అని విశ్వనాథ్ భుజం చుట్టూ చేయి వేసి, ఆటో దగ్గరికి నడిచాడు అతను.‘‘నీ పేరేంటి?’’ అడిగాడు విశ్వనాథ్.‘‘శంకర్’’‘‘ఓ.. నీది నా తమ్ముడి పేరే’’‘‘తమ్ముళ్లందరూ ఒకేలా ఉండరన్నా’’‘‘ఎందుకలా అన్నావు?’’‘‘మీకు తెల్వదా?.. ఇంతకీ ఏ ఊరెళ్లాలి?’’ మాట మారుస్తూ అడిగాడు శంకర్.‘‘కోదాడ వెళ్లాలి.. శంకర్! నువ్వు నా ఫోన్ తీసుకో. నాకు బస్సు చార్జి మందం మూడువందలు ఇవ్వు. ఫోను ఖరీదు పదిహేను వందలు ఉంటుంది’’ అన్నాడు విశ్వనాథ్.‘‘తప్పు సార్! అట్టా మాట్లాడొద్దు. అవసరం ఎప్పుడు ఎట్టా ఎవరికి ఎవరితో వస్తుందో ఎవరికి ఎరుకన్నా! సాయానికి వెల కట్టకూడదు’’ అన్నాడు ఆటో శంకర్.ఆటో స్పీడ్ అందుకుంది. కాసేపట్లో బస్టాండ్ ఎంట్రీ గేటు దాటి ఆటోను ఓ మూలగా పార్క్ చేశాడు శంకర్. విశ్వనాథ్ని క్యాంటీన్కి తీసుకువెళ్లి భోజనం అయ్యాక, కోదాడ టికెట్ తీసుకుని బస్సు ఎక్కించాడు.‘‘శంకర్! నీ ఫోన్ నంబరు ఒక చిట్టీ మీద రాసివ్వు. ఊరికెళ్లగానే డబ్బు పంపిస్తాను. నువ్వు చేసిన సాయం జీవితాంతం గుర్తుంచుకుంటాను. నీకు కృతజ్ఞతలు ఎన్నిసార్లు చెప్పినా తక్కువే! మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం నువ్వు. చిన్నవాడివైనా చేతులెత్తి దణ్ణం పెడుతున్నాను’’ నమస్కరిస్తూ అన్నాడు విశ్వనాథ్.చిట్టీ మీద తన ఫోన్ నంబరు రాసి ఇస్తూ, ‘‘అన్నా! అట్టా చేయకు. నాకస్సలు నచ్చదు. నీ పానం బాగా లేదని కండక్టర్కి చెప్పి, నా ఫోన్ నంబరు ఇంకో చిట్టీ మీద రాసిచ్చిన. తోవలో అవసరమొస్తే నాకు ఫోన్ చెయ్యమని చెప్పిన. ఎందుకైనా మంచిది, నీ తమ్ముడి ఫోన్ నంబరు నోటికి గుర్తుంటే నాకు చెప్పన్నా’’ అడిగాడు ఆటో శంకర్.ఫోన్ నంబరు చెప్పాడు విశ్వనాథ్. నంబరు నోట్ చేసుకుని, ‘‘ఇంటికి చేరగానే ఫోను చెయ్యన్నా. నమస్తే! నేనుంట’’ అని చెప్పి బయటకు వచ్చి, బస్టాండులోని పబ్లిక్ ఫోన్ నుంచి విశ్వనాథ్ తమ్ముడు శంకరానికి ఫోన్ చేశాడు ఆటో శంకర్.‘‘హలో! సంకరం గారేనా మాట్లాడేది?’’ అన్నాడు ఆటో శంకర్.‘‘నా పేరు శంకరం.. సంకరం కాదు’’‘‘సంకరన్నా! ఇది ఇను. ఇందాక ఒక పెద్దాయన అమీర్పేట శ్మశానం బయట ఆటో స్టాండు కాడ స్పృహ తప్పి పడిపోయిండు. ఆయన ఫోను నుంచి గిదే నంబరుకి చివరి ఫోన్ చేసిండు. అందుకే నీకు ఫోన్ చేసిన. ఆయన నీకు చుట్టమో పక్కమో నాకు తెల్వదు. అంబులెన్సుకు నేనే ఫోను చేసిన. వాళ్లొచ్చి ఆయన్ని తీసుకుపోయిన్రు. ఏ హాస్పిటల్కి తీసుకుపోయిన్రో నాకు తెల్వదు. ఆ మనిషి నీకు తెలిసుంటే వివరం కనుక్కుంటావని, ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఫోను చేసిన, గంతే!’’ అని ఫోను పెట్టేశాడు ఆటో శంకర్.అన్న విశ్వనాథ్కి ఏమైనా ప్రమాదం జరిగిందా అనే అనుమానం వచ్చి భయపడ్డాడు శంకరం. వెంటనే అన్నకి ఫోన్ చేశాడు. ఫోన్ పనిచేయడం లేదని రికార్డెడ్ మెసేజ్ వస్తోంది.‘‘రమా! అన్నయ్య శ్మశానం దగ్గర స్పృహతప్పి పడిపోయాడట! అంబులెన్స్ వాళ్లు ఏదో ఆస్పత్రికి తీసుకెళ్లారట. నీ మాట విని బుద్ధిలేని పనిచేశాను. నీకు పట్టింపని నన్ను పెంచిన అన్నని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలేసి వచ్చాను. ఇంటికి రాకూడదన్నాను. మానవత్వం లేకుండా ప్రవర్తించాను. చేతిలో డబ్బుందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు అన్నయ్యను ఎక్కడని వెదకాలి?’’ అని తల పట్టుకుని బాధపడుతూ వెంటనే బయలుదేరాడు.అమీర్పేట చుట్టుపక్కల ఉన్న ఆస్పత్రులన్నీ మూడుగంటల పాటు వెదికాడు.గాంధీ హాస్పిటల్ ఎమర్జెన్సీ చెక్ చేశాడు. జాడ తెలియలేదు. మళ్లీ అన్నకి ఫోన్ చేశాడు. ఇంకా ఫోన్ పనిచేయడం లేదని మెసేజ్ వస్తోంది. ఏం చేయాలో పాలు పోలేదు.ఊళ్లో వదినకు ఫోన్ చేశాడు. అన్న ఇంకా రాలేదని, ఆయన ఫోను పనిచేయడంలేదని వదిన చెప్పింది. శంకరానికి కంగారు ఇంకా ఎక్కువైంది. తను చేసిన పనికి శంకరం మనసు వ్రయ్యలైంది.ఇంతలో ఫోను మోగింది. ఫోను తీశాడు శంకరం. ఏదో ల్యాండ్లైన్ నుంచి ఫోను.‘‘శంకరం! ఇప్పుడే కోదాడ బస్సు దిగి, నువ్వు కంగారు పడుతున్నావేమోనని బస్టాండు నుంచి ఫోను చేస్తున్నాను. నువ్వు నన్ను వదిలి వెళ్లాక నీరసంతో కళ్లు తిరిగి కూలబడ్డాను. ఎవరో ఆటో అతను.. అతని పేరు కూడా శంకరమే! సొంత తమ్ముడిలా నాకు భోజనం పెట్టించి, టికెట్ కొని బస్సు ఎక్కించి వెళ్లాడు. క్షేమంగా ఊరికి చేరానని చెప్పడానికి ఫోన్ చేశాను. ఉంటాను’’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు విశ్వనాథ్! -
ఆకలేస్తే.. స్మార్ట్ఫోన్ ఉందిగా..
ఆకలేస్తే కిచెన్ వైపు చూసే రోజులు పోయాయి.ఆకలేస్తే జనాలిప్పుడు స్మార్ట్ఫోన్ చూస్తున్నారు.ఫుడ్ డెలివరీ యాప్లను క్షుణ్ణంగా శోధిస్తున్నారు.నచ్చిన వంటకాలను వెతికి మరీ ఆర్డర్ చేస్తున్నారు.కూర్చున్న చోటుకే కావలసిన వాటిని రప్పించుకుంటున్నారు.మడిసన్నాక కూసింత కలాపోసన ఉండాలన్నాడు ‘ముత్యాలముగ్గు’లో రావుగోపాల్రావు. ఆ సినిమాలో ఆయన ముళ్లపూడివారు రాసిన ఆ డైలాగు చెప్పాడని కాదు గాని, మనవాళ్లు ఎంతోకొంత కళాపోషకులు. ఒక్కొక్కరి కళాపోషణ ఒక్కొక్కరకం. ఇప్పుడు ఈ ఆన్లైన్ జమానాలో భోజన కళాపోషణ తాజా ట్రెండ్. పొద్దున్న లేచినది మొదలుకొని అర్ధరాత్రి దాటే వరకు మనవాళ్లు ఎడాపెడా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లతో బిజీ బిజీగా భోజన కళాపోషణ కానిస్తున్నారు. ఒకవైపు రెస్టరెంట్లు, హోటళ్లపై ఆహార భద్రతా అధికారులు తరచుగా దాడులు చేస్తూ, ఆహార కల్తీ వ్యవహారాలను బయటపెడుతున్నా, ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లలో మాత్రం తగ్గేదే లేదంటున్నారు. ‘స్విగ్గీ’, ‘జొమాటో’, ‘ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్’ (ఓఎన్డీసీ) వంటి సంస్థలు వెల్లడించిన తాజా నివేదికలు మన భారతీయుల ఆహారప్రీతికి అద్దం పడుతున్నాయి. మనవాళ్ల ఆహార ధోరణులపై ఒక విహంగ వీక్షణం...బిర్యానీ నంబర్ వన్ భారతీయులు ఆన్లైన్లో అత్యధికంగా ఆర్డర్ చేస్తున్న వంటకం బిర్యానీ. గడచిన 2024 సంవత్సరంలో ఏకంగా 8.30 కోట్ల బిర్యానీలను ఆర్డర్ చేశారు. అంటే, ప్రతి సెకనుకు సగటున 2.63 బిర్యానీ ఆర్డర్లు స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ సంస్థలకు వస్తున్నాయి. ఇవే గణాంకాలను చూసుకుంటే, 2023లో ప్రతి సెకనుకు సగటున 2.5 బిర్యానీ ఆర్డర్లు నమోదయ్యాయి. బిర్యానీ తర్వాత పిజ్జాకు 2024 సంవత్సరంలో అత్యధిక ఆర్డర్లు నమోదయ్యాయి. ఈ ఏడాది పిజ్జాకు 5 కోట్ల ఆర్డర్లు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో మసాలా దోసెకు దేశవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. ఏకంగా 2.30 కోట్ల ఆర్డర్లతో మసాలా దోసె మూడో స్థానంలో నిలిచింది. ఇదే సంవత్సరంలో చాకో లావా కేక్కు 36 లక్షలు, చికెన్ రోల్కు 24.80 లక్షలు, చికెన్ బర్గర్కు 18.40 లక్షలు, చికెన్ మోమోస్కు 16.30 లక్షల ఆర్డర్లు, బంగాళ దుంపల ఫ్రెంచ్ ఫ్రైస్కు 13 లక్షలు చొప్పున ఆన్లైన్ ఆర్డర్లు నమోదయ్యాయి. తాజా ఆహార ధోరణులుఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు సునాయాసంగా వండిన పదార్థాలను ఇళ్లకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అలాగని వీటి ప్రయోజనం అంతవరకు మాత్రమే పరిమితం కాదు. వీటి గణాంకాలను అధ్యయనం చేస్తే, జనాల్లో మారుతున్న ఆహార ధోరణులు అవగతమవుతాయి. వివిధ ఫుడ్ డెలివరీ సంస్థలు వెల్లడిస్తున్న వివరాల ప్రకారం ఈ ఏడాదిలో జనాల ఆహార ధోరణుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. జనాలలో వచ్చిన మార్పులకు తగినట్లుగానే ప్రముఖ రెస్టరెంట్లలోని షెఫ్లు తమ నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకుంటూ, జనాలు కోరుకునే ఆహారాన్ని వండి వడ్డిస్తున్నారు. స్విగ్గీ తాజాగా విడుదల చేసిన ‘టాప్ ఫుడ్ ట్రెండ్స్– 2025’ నివేదిక ప్రకారం ఈ ఏడాది ప్రాచుర్యంలోకి వచ్చిన ఆహార ధోరణులు ఇవీ:ఏఐ డైట్ ప్లాన్స్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం అన్ని రంగాల్లోనూ పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య స్పృహ ఉన్నవారు తమ శరీరతత్త్వానికి, ఆరోగ్య పరిస్థితులకు తగిన ఆహారాన్ని ఎంపిక చేసుకోవడానికి ఏఐని ఆశ్రయిస్తున్నారు. ఏఐ సూచనల ఆధారంగానే ఆన్లైన్లో తమకు నచ్చిన వంటకాలను ఆర్డర్ చేసుకుంటున్నారు.పర్యావరణ స్పృహప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో పర్యావరణ స్పృహ పెరుగుతోంది. ఇది ప్రజల ఆహారపు ఎంపికలోనూ ప్రస్ఫుటంగా ప్రతిఫలిస్తోంది. పర్యావరణానికి హాని కలిగించరాదనే ఉద్దేశంతో చాలామంది తక్కువ కర్బన ఉద్గారాలు కలిగిన ఆహార పదర్థాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఆన్లైన్ ఆర్డర్లు చేసేటప్పుడు ఈ మేరకు జాగ్రత్తలు పాటిస్తున్నారు. జనాల్లో వచ్చిన ఈ మార్పును గమనించిన షెఫ్స్ చాలావరకు స్థానికంగా కాలానుగుణంగా దొరికే పదార్థాలను, పర్యావరణానికి చేటు కలిగించని రీతిలో కర్బన ఉద్గారాలు తక్కువగా ఉండే పదార్థాలను తమ వంటకాల కోసం ఎంపిక చేసుకుంటున్నారు.జీరో వేస్ట్ కుకింగ్జీరో వేస్ట్ కుకింగ్ ట్రెండ్ మాత్రమే కాదు, ప్రపంచానికి అవసరం కూడా! ఆహార పదార్థాలను వండటంలో ఎంతో కొంత వృథా కావడం సహజం. ఇటీవలి కాలంలో వండేటప్పుడు ఆహార వృథాను అరికట్టేందుకు షెఫ్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జనాలు కూడా జీరో వేస్ట్ కిచెన్లలో వండిన ఆహారానికే మొగ్గు చూపుతున్నారు. ఆహార వృథాను వీలైనంతగా అరికట్టాలనే స్పృహ జనాల్లో పెరుగుతూ వస్తుండటం ఒకరకంగా మంచి పరిణామమే!చక్కెర తక్కువడయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతుండటంతో జనాలు చక్కెర కలిగిన పదార్థాల పట్ల ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. చక్కెరను అతి తక్కువగా వినియోగించే పదార్థాల వైపు, చక్కెరకు ప్రత్యామ్నాయ పదార్థాల వైపు మళ్లుతున్నారు. పలు రెస్టరెంట్లలోని షెఫ్లు కూడా జనాలలో వచ్చిన ఈ మార్పుకు అనుగుణంగా చక్కెర తక్కువగా వినియోగిస్తున్నారు.ప్రోబయోటిక్స్జీర్ణకోశ సమస్యల పట్ల ప్రజల్లో అవగాహన బాగా పెరిగింది. అందువల్ల చాలామంది రోజువారీ ఆహారంలో ప్రోబయోటిక్స్ ఉండేటట్లు చూసుకుంటున్నారు. ప్రజల్లో వచ్చిన ఈ మార్పుకు అనుగుణంగా చాలా రెస్టరెంట్లలోని షెఫ్లు కడుపుకు, పేగులకు మేలు చేసే పెరుగు, పులియబెట్టిన పిండి, పులియబెట్టిన ఇతర పదార్థాలతో వంటకాలను వండి వడ్డిస్తున్నారు.ఫ్యూజన్ రుచులుఆరోగ్య స్పృహతో వంటకాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రజలు రుచుల్లో కొత్తదనాన్ని కూడా కోరుకుంటున్నారు. ప్రజల అభిరుచికి తగినట్లుగానే పలు రెస్టరెంట్లు దేశ దేశాల రుచులను సమ్మిళితం చేసి, ఫ్యూజన్ రుచులను అందిస్తున్నాయి. ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఈ జాబితాలో ఇండియన్ రామెన్, కొరియన్ టాకోస్, మెడిటరేనియన్ సూషి వంటివి చాలానే ఉన్నాయి. అంతేకాదు, ఈ జాబితాలోకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాత్మక వంటకాలు చేరుతూనే ఉన్నాయి.మూడ్ బూస్టింగ్ ఫుడ్ఇటీవలి కాలంలో జనాలు ఆహారం వల్ల ఆరోగ్యంతో పాటు అంతకు మించిన ప్రయోజనాలను కూడా కోరుకుంటున్నారు. ఉదయాన్నే రోజును తాజాగా ప్రారంభించడానికి; సాయంత్రం పని ఒత్తిడి పోగొట్టుకోవడానికి; రాత్రివేళ ప్రశాంతమైన నిద్రకు తగిన ఆహారాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. జనాల ‘మూడ్ బూస్టింగ్’ ఎంపికను గమనించిన రెస్టరెంట్లు కూడా అందుకు తగిన పదార్థాలను ఎప్పటికప్పుడు వండి వడ్డిస్తున్నాయి.హైపర్ లోకల్భోజన ప్రియుల్లో కొందరు కొత్తదనం కోసం ఫ్యూజన్ రుచులను కోరుకుంటూ ఉంటే, ఇంకొందరు మాత్రం పూర్తిగా స్థానిక రుచులకే ప్రాధాన్యమిస్తున్నారు. స్థానికంగా పండే పంటలు, స్థానికంగా పేరుపొందిన వంటకాల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని పలు రెస్టరెంట్లు స్థానికంగా పండే చిరుధాన్యాలు, కూరగాయలతో వండిన పదార్థాలను; స్థానికంగా ప్రసిద్ధి పొందిన వంటకాలను అందిస్తున్నాయి.ఐదో స్థానంలో భారత్ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ల మార్కెట్లో 2024 సంవత్సరం నాటికి భారత్ ఐదో స్థానంలో ఉంది. భారత్లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ 2019 నాటితో చూసుకుంటే, 2024 నాటికి 2.8 రెట్ల వృద్ధి సాధించినా, ఇప్పటికి ఐదో స్థానానికే పరిమితం కావడం గమనార్హం. ఈ మార్కెట్లో చైనా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియా ఉన్నాయి. ఈ దేశాల ఆన్లైన్ ఫుడ్ మార్కెట్ విలువ 2024 నాటికి నమోదైన వివరాలు:టాప్ 5 నగరాలుమన దేశంలోని మెట్రో నగరాలు ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లలో ముందంజలో ఉంటున్నాయి. వీటిలో బెంగళూరు మొదటి స్థానంలో ఉంటే, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, పుణే ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆన్లైన్లో ఈ నగరాలు ఎంత శాతం మేరకు ఫుడ్ ఆర్డర్లు చేస్తున్నాయంటే...విస్తరణకు మరిన్ని అవకాశాలుజనాభాలో చైనాను అధిగమించినప్పటికీ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్లో భారత్ ఇప్పటికి కొంతవరకు వెనుబడే ఉంది. అయితే, మెట్రో నగరాల నుంచి ఈ ధోరణి శరవేగంగా ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరిస్తున్న నేపథ్యంలో త్వరలోనే ఈ మార్కెట్ శరవేగంగా విస్తరించగలదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి రావడం; నగర జీవితాలు తీరికలేకుండా మారడం; చిన్న నగరాలు, పట్టణాల్లో సైతం జీవనశైలిలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటుండటం; జనాల్లో ఆరోగ్య స్పృహతో పాటు రుచుల వైవిధ్యాన్ని చవిచూడాలన్న కోరిక పెరగడం వంటి కారణాల వల్ల చాలామంది ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదివరకు సెలవు రోజుల్లోను, తీరిక వేళల్లోను సకుటుంబంగా లేదా బంధు మిత్రులతో కలసి రెస్టరెంట్లకు స్వయంగా వెళ్లేవారు సైతం ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు చేస్తున్నారు. నగరాల్లోని ఇరుకిరుకు ట్రాఫిక్లో తంటాలు పడటం కంటే, నేరుగా ఇంటికే కోరుకున్న వంటకాలు వచ్చేస్తుండటం సౌకర్యవంతంగా ఉండటంతో ఎక్కువమంది ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్లు చేయడానికే ఇష్టపడుతున్నారు. ‘కోవిడ్’ కాలం నుంచి ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు గణనీయంగా పెరిగినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలు అందుబాటులో ఉన్న నగరాలు, పట్టణాల సంఖ్య వెయ్యికి లోపు మాత్రమే ఉంది. దేశంలోని ప్రధానమైన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల్లో జొమాటో 800 నగరాల్లోను, స్విగ్గీ 580 నగరాల్లోను సేవలు అందిస్తున్నాయి. ఇప్పటికి ఈ సేవలు అందుబాటులో లేని నగరాలు, పట్టణాలకు సేవలను విస్తరించడానికి ఈ సంస్థలకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. పెద్ద పెద్ద రెస్టరెంట్లకు దీటుగా నగరాలు, పట్టణాల్లో క్లౌడ్ కిచెన్లు పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ దేశంలో గణనీయంగా విస్తరించగలదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
వృద్ధాప్యంలో డిప్రెషన్: మెరుగు పడేది ప్రేమతో
గత కొంతకాలం కిందట రిటైర్ అయిన పరంధామయ్య మొదట్లో బాగానే ఉండేవారుగానీ ఈ మధ్య అంత చురుగ్గా లేకపోవడంతో పాటు ఎంతో విచారంగా కనిపిస్తున్నారు. పిల్లలిద్దరూ యూఎస్లో ఉండటంతో పరంధామయ్య దంపతులిద్దరూ ఒంటరిగానే ఉండాల్సి వస్తోంది. గతంలోలా ఎక్కడికీ వెళ్లడం లేదు. కాస్త మతిమరపు వచ్చినట్టుగా ఫీలవుతున్నారు కూడా. బాగా సన్నిహితులైన ఒకరిద్దరు కనిపించి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లమంటే... ‘తానేమైనా పిచ్చివాడిని అయిపోతున్నానా?’ అనే దిగులు ఆయన్ను మరింత కుంగదీస్తోంది. ఎట్టకేలకు కొందరు ఫ్రెండ్స్ ఆయనను సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే తేలిందేమిటంటే... ఆయన ‘వృద్ధాప్యం తాలూకు డిప్రెషన్’తో బాధపడుతున్నట్లు తేలింది. ఇంట్లో కనీసం మనవలూ, మనవరాళ్లూ ఉండి ఉంటే గ్రాండ్స్ పేరెంట్స్కు ఈ పరిస్థితి వచ్చేది కాదేమోనని చెప్పడంతో ఈ వృద్ధాప్యపు డిప్రెషన్ గురించి నలుగురికీ తెలియడం మంచిదని ఫీలయ్యారు పరంధామయ్య ఫ్రెండ్స్. వృద్ధాప్యంలో వచ్చే ఆ ‘ఓల్డ్ ఏజ్ డిప్రెషన్’ తాలూకు వివరాలివి...ఆల్కహాల్తోనూ డిప్రెషన్...కొందరు పెద్దవయసు వారు ఆ వయసులో బాగా నిద్రపట్టేందుకూ లేదా హాయిగా సాయంత్రాలు గడిపేందుకూ మద్యం ఒక సాధనమని అనుకుంటుంటారు. అయితే ఆ వయసులో అతిగా తాగే మద్యం వల్ల కూడా డిప్రెషన్ వస్తుంది. ఆల్కహాల్ వల్ల తేలిగ్గా కోపం, చిరాకు వంటి ఉద్వేగాలకు గురికావడం (ఇరిటబిలిటీ), యాంగై్జటీకి లోనుకావడం, మెదడులోని జీవక్రియలు అస్తవ్యస్తం కావడం జరగవచ్చు. ఆల్కహాల్ కారణంగా వృద్ధులకు ఇచ్చే యాంటీ డిప్రెసెంట్ మందులు అంత ప్రభావపూర్వకంగా పనిచేయకపోవడం వంటివీ జరగవచ్చు. మద్యం నిద్ర నాణ్యతను దెబ్బతీసే ముప్పు ఉంటుంది. పైగా మద్యం మత్తులో పడిపోవడం జరిగి, ఆ వయసులో పూర్తిగా మరొకరిపై ఆధారపడాల్సి రావడం కూడా ఒక నిస్సహాయతతో పాటు... అలా ఆధారపడాల్సి రావడమనే భావన కూడా డిప్రెషన్కు దారితీయవచ్చు.వయసు పైబడిన వారు ముందుగా గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... తమ మనసుకు వచ్చిన సమస్యనూ లేదా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితిని చాలా సహజమని గుర్తించాలి. తల్లిదండ్రులు కాస్తా గ్రాండ్ పేరెంట్స్గా మారే టైముకు పిల్లలు తమ పిల్లలతో (గ్రాండ్ చిల్డ్రెన్తో) కలిసి వాళ్ల కెరియర్ కోసం విదేశాలకు లేదా దూర్రపాంతాలకు వెళ్లడం చాలా సహజం. ఇటీవలి సామాజిక ధోరణి కారణంగా... తమ రిటైర్మెంట్ నాటికి పెద్దలు డిప్రెషన్కు లోనుకోవడం చాలా సాధారమవుతోంది. పైగా ఈ తరహా డిప్రెషన్ ఇటీవల చాలామందిలో విపరీతంగా విస్తరిస్తోంది. దురదృష్టవశాత్తు త వైద్యులను సంప్రదించేవారి సంఖ్య చాలా తక్కువగా ఉండటం ఆందోళన గొలిపే అంశం.వృద్ధాప్య డిప్రెషన్కు కారణాలు...నిజానికి డిప్రెషన్ ఏ వయసులోనైనా రావచ్చు. కానీ వృద్ధాప్యంలో డిప్రెషన్కు లోనయ్యేందుకు అవకాశాలు ఎక్కువ. అందుకు కారణాలివి... → ఒంటరితనం: ముందుగా చెప్పుకున్నట్టు తాము స్థిరపడటానికి పిల్లలు దూర్రపాంతాల్లో ఉంటారు. పెద్దలు తామంతట తాము కదల్లేని స్థితిలో ఉండి, ఇతరుల మీద ఆధారపడాల్సి రావడం డిప్రెషన్కు దారితీయవచ్చు. → ఆరోగ్య సమస్యలు: వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలు చాలా సాధారణం. దీర్ఘకాలిక వ్యాధులు, జ్ఞాపకశక్తి, శారీరక దృఢత్వం, వ్యాధి నిరోధకశక్తి తగ్గడం, శస్త్రచికిత్స చేయించాల్సిన జబ్బులకూ వృద్ధాప్యం కారణంగా చికిత్స తీసుకునే పరిస్థితి ఉండకపోవడం వంటి కారణాలతో డిప్రెస్ అవుతుంటారు. → అర్థం లేని భయాలు: ఎవరూ దగ్గరగా లేని సమయంలో తాము చనిపోతామేమో, అలాగైతే తాము చనిపోయిన విషయం పిల్లలకు ఎలా తెలుస్తుంది... లాంటి అర్థం లేని భయాలు వేధిస్తుంటాయి. → ఏ ప్రయోజనాల కోసం బతకాలనే భావన: ఇకపై ఎవరి ప్రయోజనాలకోసం, ఏం సాధించడానికి బతికి ఉండాలనే నిరాశాపూర్వకమైన భావనతో ప్రతికూల ఆలోచనలు వెంటాడటం. → ఇటీవల చూస్తున్న తమ తోటివారి మరణాలు: తమ బంధువుల్లో, తెలిసినవారిలో తమ వయసువారు చనిపోతుండటంతో కలిగే కుంగుబాటు. ఒకవేళ అలా మరణించిన వారిలో తమ జీవిత భాగస్వామి ఉండటం డిప్రెష¯Œ కు దారితీస్తుంది. వైద్య ఆరోగ్య అంశాలతో కలిగే డిప్రెషన్...వృద్ధాప్యంలో వచ్చే కొన్ని రకాల వ్యాధుల వల్ల అంటే ఉదాహరణకు... డయాబెటిస్తో పాటు దాని వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు, హైబీపీ, గుండెజబ్బులు, పక్షవాతం, క్యాన్సర్, థైరాయిడ్ సమస్యలు, విటమిన్ బి–12 లోపం, మతిమరపు, అలై్జమర్స్ వ్యాధి, లూపస్, మల్టిపుల్ స్కి›్లరోసిస్ వంటి కారణంగా డిప్రెషన్కు లోనయ్యే అవకాశాలెక్కువ.కొన్ని రకాల మందులతోనూ డిప్రెషన్... కొన్ని సందర్భాల్లో ఆ వయసులో వాడే కొన్ని రకాల మందుల వల్ల కూడా డిప్రెషన్ రావచ్చు. ఉదాహరణకు మామూలుగా రక్తపోటుకు వాడే కొన్ని మందులు, బీటా బ్లాకర్లు, కొన్ని రకాల నిద్రమాత్రలు, క్యాల్షియమ్ ఛానెల్ బ్లాకర్లు, పార్కిన్సన్ డిసీజ్ తాలూకు మందులు, అల్సర్ మందులు, గుండెజబ్బుల మందులు, కొన్నిరకాల స్టెరాయిడ్స్, హైకొలెస్ట్రాల్ ఉన్నవారు వాడే మందులు, నొప్పినివారణ మందులు, ఆర్థరైటిస్ ఔషధాలు, ఈస్ట్రోజెన్ హార్మోన్ వంటివి పెద్దవయసు వారిలో డిప్రెషన్కు కారణం కావచ్చు.డిప్రెషన్ నుంచి దూరమవ్వాలంటే... తమ పట్ల తాము కాస్తంత శ్రద్ధ తీసుకోవడం ద్వారా ఎంతగా వయసు పైబడినప్పటికీ డిప్రెషన్ను దరిచేరనివ్వకుండా చూడవచ్చు. వృద్ధాప్యంలో డిప్రెషన్ను నివారించే చర్యలివే... → నలుగురినీ కలవడం : వృద్ధాప్యంలో కలిగే తీరికతో నలుగురినీ కలుస్తుండటం.(డిప్రెషన్ నివారణకూ లేదా అధిగమించడానికి ఇది బాగా పనిచేస్తుంది). → వ్యాయామం : తమకు శారీరక శ్రమ కలిగించని రీతిలో వాకింగ్ వంటి వ్యాయామల వల్ల డిప్రెషన్ దరిచేరదు. → కంటి నిండా నిద్ర: కంటినిండా నిద్రపోవడం డిప్రెషన్కు మంచి మందు. అయితే మితిమీర కూడదు. అంటే... నిద్రసమయం 7–9 గంటలు మించనివ్వవద్దు. → సమతుల ఆహారం : అన్ని పోషకాలు అందేలా తేలిగ్గా జీర్ణమయ్యే సమతులా ఆహారం తీసుకోవాలి. జంక్ఫుడ్ వద్దు. → హాబీలు : మనకు ఆసక్తి కలిగించే హాబీలను కొనసాగించవచ్చు. యుక్తవయసులో పనిఒత్తిడి, తీరిక లేని కారణంగా మానేసిన హాబీలను ఈ సమయంలో పునరుద్ధరించుకోవడం డిప్రెషన్ నివారణకు చాలా మేలు చేస్తుంది. → పెంపుడు జంతువులు : పెట్స్ ఆలనా–పాలనా డిప్రెషన్ను దరిచేరనివ్వవు.→ కొత్త విద్యలు/ నైపుణ్యాలు : వీటిని నేర్చుకోవడం డిప్రెషన్ను అధిగమించడానికి చాలా మేలు చేస్తుంది. ఆసక్తి ఉంటే ఏ వయసులోనైనా, ఏ విషయాన్నైనా నేర్చుకోవచ్చు. పైగా వృద్ధాప్యంలో వేరే వ్యాపకాలేవీ ఉండవు కాబట్టి ఆ టైమ్లో నేర్చుకోవడం సులభం కూడా.→ హాస్యం : ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ, హాస్యప్రియత్వం కలిగి ఉండటం. వృద్ధాప్య డిప్రెషన్ లక్షణాలు → ఎప్పుడూ తీవ్రమైన నిరాశ, విచారం ∙నిత్యం అలసట ∙గతంతో తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిన హాబీలూ లేదా వ్యాపకాలపైనా ఆసక్తి కోల్పోవడం ∙ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం ∙్రఆకలి తగ్గడం ∙బరువు తగ్గం ∙తరచూ నిద్రాభంగం లేదా ఒక్కోసారి మితిమీరి నిద్రపోతుండటం ∙తనతో ఏ ప్రయోజనమూ లేదనీ, తాను సమాజానికి భారమనే భావన ∙మద్యం/డ్రగ్స్కు బానిస కావడం ∙త్వరగా మరణించాలనే భావన లేదా ఆత్మహత్యా ధోరణి/ ఆలోచనలూ/ యత్నాలు.చికిత్సపై నివారణ చర్యల తర్వాత కూడా డిప్రెషన్కు లోనైన వారికి సైకియాట్రిస్ట్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ఆర్ మందులు, యాంటీడిప్రెసెంట్స్తో చికిత్స చేయాల్సి ఉంటుంది. కొందరిలో కేవలం కౌన్సెలింగ్తోనే సమస్య తీరవచ్చు. కొందరికి కౌన్సెలింగ్తో పాటు మందులూ అవసరం పడవచ్చు.అది బాధా... డిప్రెషనా?కొందరిలో డిప్రెషన్ కాకుండా తీవ్రమైన బాధ కూడా ఉండవచ్చు. కాస్త శ్రద్ధగా పరిశీలించుకుంటే అది డిప్రెషనా లేక బాధనా అన్నది గుర్తుపట్టడమూ కాస్తంత తేలికే. ఉదాహరణకు బాధలో ఉన్నవారికి అప్పుడప్పుడైనా సంతోష భావన కలుగుతుంది. అలాంటి సంతోష భావనలూ, ఆనందాలూ, ఇతరత్రా ఉద్వేగాలేవీ లేకుండా ఎప్పుడూ విచారం, బాధ, నిరాశ, నిస్పృహలతో ఉంటే అది డిప్రెషన్గా పరిగణించవచ్చు.వృద్ధుల్లో డిప్రెషన్ను గుర్తించడమిలా...→ తమలో అంతకు మునుపు లేని నొప్పులను ఏకరవు పెడుతుండటం ∙తాము ఏపనీ చేయలేకపోతున్న విషయాలను తరచూ ప్రస్తావిస్తూ ఉండటం ∙యాంగై్జటీకి గురికావడం / వేదన, బాధలను వ్యక్తపరుస్తుంటం ∙త్వరగా భావోద్వేగాలకు గురికావడం ∙వ్యక్తిగత విషయాలపై తగిన శ్రద్ధ చూపకపోవడం.విచారం/బాధలూ లేకున్నా డిప్రెషన్! సాధారణంగా డిప్రెషన్లో తీవ్రమైన విచారం, బాధ ఉండటం చాలా సాధారణం. కొందరిలో ఇలాంటి లక్షణాలేమీ కనిపించకుండానే డిప్రెషన్లోకి వెళ్లే అవకాశాలుంటాయి. ఏ పనిపైనా వాళ్లకు ఆసక్తిలేకపోవడం; ఏదైనా చేయాలంటే ఉత్సాహం లేకపోవడం (లో మోటివేషన్); ఏదైనా పని చేయడానికి తగిన శక్తి/సామర్థ్యం తమలో లేదనే భావన వంటి ఫీలింగ్స్తో ఈ డిప్రెషన్ కనిపిస్తుంది. కొందరిలో ఎప్పటికీ తగ్గని ఒంటి నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలతో కూడా వృద్ధాప్యపు డిప్రెషన్ వ్యక్తం కావచ్చు.డాక్టర్ శ్రీనివాస్ ఎస్ఆర్ఆర్వై హెచ్వోడీ ఆఫ్ సైకియాట్రీ –సీనియర్ సైకియాట్రిస్ట్ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రి, వరంగల్– యాసీన్ -
ఓల్డ్ is గోల్డ్: కొత్త తరానికి వారధులు
వయసైపోయి, శక్తి ఉడిగిందని గ్రాండ్ పేరెంట్స్ని చులకనగా చూడకండి. ఈ యుగపు వేగంతో నత్త వారసులేం పోటీపడగలరు అనుకోకండి. వాట్సాప్లు, స్నాప్చాట్లు, ట్విటర్లు, ఇన్స్టా హ్యాండిల్స్లో వాళ్లు యమ యాక్టివ్. ఫేస్టైమ్.. స్కైపుల్లో భలే షార్ప్. షాట్స్, రీల్స్లో సూపర్ ఫాస్ట్. జెన్ జీ జార్గాన్నూ జీర్ణించుకుంటున్నారు. ఆధ్యాత్మికతనూ ఆస్వాదిస్తున్నారు. సాఫ్ట్వేర్ అప్డేట్స్ పట్లా అవగాహనతో ఉంటున్నారు. టూర్స్ అండ్ ట్రావెల్స్కీ రెడీ అవుతున్నారు. ఇంటి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ దాకా కావల్సినంత ఇన్ఫో ఇస్తున్నారు. అన్నింటిలోనూ గ్రాండ్నెస్ను చవిచూపిస్తున్న వాళ్లే గ్రాండ్ పేరెంట్స్. వారితో కనెక్టివిటీని పెంచే ఉద్దేశంతోనే ‘గ్రాండ్పేరెంట్స్ డే’ సెలబ్రేషన్ మొదలైంది.ఆకాశంలోని చుక్కల్ని పరిచయం చేయడం దగ్గర్నుంచి కథలతో ఊహలను ఉసిగొల్పడం వరకు మన జీవితాల్లో అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు పోషించిన పాత్రను వర్ణించగలమా? అందుకు వాళ్లు నేర్పిన మాటలతోపాటు మనం నేర్చుకున్న భాషల్లోని వొకాబులరీని అరువు తెచ్చుకున్నా సరిపోదు. రామాయణంలో రాముడి వ్యక్తిత్వాన్ని, భాగవతంలోని కృష్ణుడి లీలలను, భారతంలోని యుద్ధనీతిని.. పురాణ స్త్రీల ఔన్నత్యాన్ని, చరిత్రలోని పరాక్రమాన్ని.. వెండితెర అద్భుతాలను తమదైన బాణి, వాణితో బుజ్జి మెదళ్లలో నింపే గుర్తులు మరుపుకొచ్చేవా! ఆ కాలానికీ ఈ కాలానికీ వారధులైన గ్రాండ్పేరెంట్స్ మనల్ని నడిపించే గురువులు. బడులు బోధించలేని ఎన్నో పాఠాలను వాళ్ల అనుభవ జ్ఞానం బోధిస్తుంది. అందుకే.. ముసలాళ్లని వాళ్లను మూలకు తోసేయొద్దు. మనకన్నా ముందు ప్రపంచాన్ని చూసినవాళ్లని.. ఔపోసనపట్టిన పెద్దవాళ్లని గౌరవిద్దాం. రోజూ కుదరకపోయినా.. వారాంతాల్లోనైనా వాళ్లతో కాస్త సమయాన్ని వెచ్చిద్దాం. కనీసం గ్రాండ్పేరెంట్స్ డే అయినా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం! హ్యాపీ గ్రాండ్పేరెంట్స్ డే!మెరియన్ మెక్వేడ్ అనే గృహిణి.. పెద్దలను గౌరవించాలని, వారి అనుభవజ్ఞానానికి విలువివ్వాలని.. దాన్నో సంస్కృతిగా మార్చాలనే తలంపుతో గ్రాండ్పేరెంట్స్ డే అనే కాన్సెప్ట్ని క్రియేట్ చేసి.. దాన్నో వేడుకగా మలచింది. అప్పటి నుంచి ప్రపంచంలోని పలు దేశాలు వాళ్లకు అనువైన నెలల్లో ఈ గ్రాండ్ పేరెంట్స్ డేను నిర్వహించుకుంటున్నాయి. అలా మనం ప్రతి ఏడు సెప్టెంబర్లోని మొదటి ఆదివారం నాడు గ్రాండ్పేరెంట్స్ డేని జరుపుకుంటున్నాం!ఈరోజు నేనీ స్థాయిలో ఉండటానికి కారణం మా తాతయ్యే (పీవీ గోపాలన్). చదువు దగ్గర్నుంచి మహిళా హక్కులు, ప్రజా సేవ వరకు నా మీద ఆయన ప్రభావం చాలా ఉంటుంది. ఆయన చాలా ప్రొగ్రెసివ్. అమ్మాయిల చదువుకు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఎన్నో విషయాలను తాతయ్య దగ్గరే నేర్చుకున్నాను. – కమలా హ్యారిస్మా నాన్న, చిన్నాన్న యాక్టర్స్ అయినా నాతోపాటు అక్క (కరిష్మా కపూర్), తమ్ముడు (రిషీ కపూర్) అందరం ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇన్స్పైర్ అయింది మాత్రం మా తాతగారు రాజ్కపూర్ వల్లనే! ఫ్యామిలీ యూనిటీ నుంచి సినిమాల దాకా చాలా విషయాల్లో ఆయన చెప్పిన మాటలు, చూపిన దారినే అనుసరిస్తాం! – కరీనా కపూర్క్రమశిక్షణ, బాధ్యత వంటి విషయాలను మా తాతయ్య (లెఫ్టినెంట్ కల్నల్ రామేశ్వర్నాథ్ డియోల్) నుంచే నేర్చుకున్నాను. ఏ పని చేసినా నిబద్ధత ముఖ్యమనే ఆయన మాటలనే జీవన విలువగా పాటిస్తున్నాను. – అభయ్ డియోల్ -
మెరుగైన లివర్ పనితీరుకు
మన శరీరం నుంచి వ్యర్థాలను తొలగించే లివర్ను డిటాక్స్ చేయడం చాలా ముఖ్యం. అప్పుడే అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. కాలేయ శుభ్రతకు ఉపయోగపడే యోగాసనాలు... ధనురాసనం.. ఎలా చేయాలి..?బోర్లా పడుకుని తలను కొంచె పైకి ఎత్తాలి. వెనుక నుంచి పాదాలను పట్టుకొని, విల్లు లాంటి ఆకారాన్ని ఏర్పాటు చేయాలి. 5 దీర్ఘ శ్వాసల వరకు ఈ పొజిషన్లోనే ఉండాలి. మెల్లగా యధాస్థితికి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి.అర్థ మత్సే్యంద్రాసనం..ఈ ఆసనం లివర్ను క్లీన్ చేయడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి శక్తిమంతంగా పనిచేస్తుంది. పద్మాసనంలో కూర్చోవాలి. తర్వాత ఒక పాదాన్ని హిప్ కిందకు తేవాలి. కుడి తొడను అలాగే ఉంచి, ఎడమ కాలిని నేలమీద ఆనించాలి. కుడి మోకాలును వంచి, ఎడమ మోకాలును కుడి మోకాలుకు దగ్గరగా ఉంచాలి. కుడి చేతి బొటనవేలు, చూపుడు వేలు, మధ్య వేలుతో ఎడమ కాలివేలును పట్టి ఉంచాలి. శరీరాన్ని ఎడమవైపుకు మెల్లగా తి΄్పాలి. అంటే ఒకే సమయంలో భుజాలు, మెడ, తలను ఎడమవైపుకు తి΄్పాలి. గడ్డాన్ని ఎడమ భుజం వద్దకు తి΄్పాలి. ఈ ఆసనంలో మీ తలను, వెన్నెముకను స్థిరంగా ఉంచాలి. మెల్లగా ప్రారంభ స్థితికి తిరిగి రావాలి. ఈ ఆసనాన్ని కుడివైపున కూడా చేయాలి.భుజంగాసనం..భుజంగాసనం సాధన చేయడం వల్ల లివర్ పనితీరు మెరుగుపడుతుంది. దీనిని కోబ్రా పోజ్ అని కూడా అంటారు. రోజూ 5 నిమిషాల పాటు భుజంగాసనం వేస్తే లివర్ సిర్రోసిస్, ఫ్యాటీ లివర్ రిస్క్ తగ్గుతుంది.ఎలా వేయాలంటే...బోర్లా పడుకొని శరీరాన్ని స్ట్రెచ్ చేయాలి. రెండు పాదాల వేళ్లు, మడమలు తాకేలా చూసుకోవాలి. అరచేతులను ఛాతీ పక్కలకు తీసుకొచ్చి, నేలకు ఆనించాలి. ఆ తర్వాత శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా తల, ఛాతీని పైకి లేపాలి. మోచేతులు నేలకు ఆనించి, ఉంచాలి. కొంచెం సేపు తర్వాత శ్వాసను వదులుతూ.. తిరిగి సాధారణ స్థితికి రావాలి. -
పాతిక సంవత్సరాల తరువాత.... సొంత గొంతు!
లండన్కు చెందిన ఆర్టిస్ట్ సారా పాతిక సంవత్సరాల క్రితం మోటర్ న్యూరాన్ డిసీజ్ (ఎంఎన్డీ) వల్ల మాట్లాడే శక్తిని కోల్పోయింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇతరులతో కమ్యూనికేషన్ కోసం వాయిస్ జనరేటింగ్ టెక్నాలీజిని ఉపయోగిస్తూ ఆర్టిస్ట్గా తన కెరీర్ ను పునః్రపారంభించింది. ఈ టెక్నాలజీ ద్వారా వినిపించే గొంతు ఆమెది కాదు. దీనికి సంబంధించి ఆమె పిల్లల్లో చిన్న అసంతృప్తి ఉండేది. అమ్మ ఒరిజినల్ వాయిస్ వినాలనుకునేవారు. ఎందుకంటే వారు చిన్న వయసులో ఉన్నప్పుడే సారా మాట కోల్పోయింది. అమ్మ ఒరిజినల్ వాయిస్ వినడం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒక వ్యక్తి ఒరిజినల్ వాయిస్కు కంప్యూటరైజ్డ్ వెర్షన్ను క్రియేట్ చేయవచ్చు అని తెలుసుకున్నారు. దీనికి ఎక్కువ నిడివి, క్వాలిటీ రికార్డింగ్ ఉన్న వీడియో కావాలి.అయితే వారికి అమ్మ ఒరిజినల్ వాయిస్కు సంబం«ధించి ఒకే ఒక వీడియో క్లిప్ దొరికింది. అది కూడా తక్కువ నిడివి, శబ్ద నాణ్యత లేని వీడియో క్లిప్. ఈ నేపథ్యంలో సారా పిల్లలు న్యూయార్క్లోని ఏఐ వాయిస్కు ప్రసిద్ధి చెందిన ‘ఎలెవెన్ ల్యాబ్స్’ను సంప్రదించారు.సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఏఐ ల్యాబ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. సారా ఒరిజినల్ వాయిస్ను సృష్టించింది. ఆ వాయిస్ను పిల్లలు సారాకు వినిపించినప్పుడు ఆమె ఆనందం తట్టుకోలేక ఏడ్చింది. ‘నా గొంతు నాకు తిరిగి వచ్చింది’ అని ఆ వాయిస్ క్లిప్ను తన స్నేహితులకు పంపింది. ఇప్పుడు సారా తన లండన్ యాక్సెంట్తో, ఒరిజినల్ వాయిస్తోనే కమ్యూనికేట్ చేస్తోంది. -
ఎక్కడ... ఎంత సురక్షితం?
భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో, మహిళల భద్రత ఒక ప్రధాన ఆందోళనగా కొనసాగుతోంది. స్థానిక సంస్థల ప్రతిస్పందనను అలాగే వారి జీవిత అనుభవాల ఆధారంగా 31 నగరాల్లో 12,000 కంటే ఎక్కువమంది మహిళలను సర్వే చేసిన నారీ నేషనల్ యాన్యువల్ రి పోర్ట్ ఇండెక్స్ ఆన్ ఉమెన్స్ సేఫ్టీ ఒక నివేదికను వెలువరించింది. ఆ నివేదిక ప్రకారం 2025లో మహిళలకు అత్యంత సురక్షితమైన భారతీయ నగరాల జాబితా...1. కోహిమా (నాగాలాండ్): లింగ లింగ సమానత్వ భావనను సమర్థంగా అమలు చేయడం, చురుకైన కమ్యూనిటీ పోలీసింగ్కు ప్రసిద్ధి చెందిన నాగాలాండ్ రాజధాని కోహిమా, ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంటుంది. వ్యక్తిసంబంధాలు, మంచి ఇరుగు పొరుగు, పౌర కార్యక్రమాల్లో మహిళల చురుకైన భాగస్వామ్యం వల్ల భద్రతపై అధిక అవగాహన సాధ్యమైంది.2.విశాఖపట్నం: మెరుగైన మౌలిక సదుపాయాలు, ప్రజారవాణా పోలీసులు, స్థానిక అధికారులు, ప్రజల మధ్యఅవగాహన సమన్వయం కారణంగా ఈ నగరం మహిళల భద్రతకు రెండో సేఫెస్ట్ ప్లేస్ అయింది.3. భువనేశ్వర్: సమర్థవంతమైన పనితీరు, నేరాల విçషయమై తక్షణమే ప్రతిస్పందించే వ్యవస్థ, ఉమెన్ ఫ్రెండ్లీ పోలీసింగ్, వారి హక్కుల పట్ల సునిశిత, సున్నిత అవగాహన, సమగ్ర పట్టణ ప్రణాళిక, వీధి దీపాల నిర్వహణ కారణంగా భువనేశ్వర్ నారీ నివేదికలో మూడో స్థానం సంపాదించింది. ఇక ఐజ్వాల్, గ్యాంగ్టక్, ఇటానగర్, ముంబైలు వరుసగా ఆ తర్వాతి స్థానాలలో ఉన్నాయి. -
డ్రై బెగ్గింగ్ బ్యాచ్!
ఆన్లైన్లో పాపులర్ అయిన మాట డ్రై బెగ్గింగ్. సూటిగా, సుత్తి లేకుండా మనసులో ఉన్న విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం ఒక విధానం. అలా కాకుండా ఏవేవో మాట్లాడుతూ అసలు విషయాన్ని మసకపరచడం మరో విధానం. ఈ రెండో కోవకు చెందిన వారు ‘డ్రై బెగ్గింగ్’(Dry begging) బ్యాచ్ అని చెప్పుకోవచ్చు. పెద్దగా పట్టించుకోదగిన సమస్యగా అనిపించనప్పటికీ ‘ఎమోషనల్ ప్రెషర్’తో ఒక రేంజ్లో బాధించే సమస్య ఇది.. సుమన తన స్నేహితురాలితో అరగంటకు పైగా మాట్లాడింది.‘అందరూ ఆత్మీయులలాగే అనిపిస్తారు గానీ అవసరమైన సమయంలో ఉపయోగపడరు’ ‘బతకడానికి ఏ ఆశా కనిపించడం లేదు’.... ఇలాంటి నిరాశపూరితమైన మాటలే ఆమె నోటినుంచి వినిపించాయి. అసలు విషయం గురించి ఆమె ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. అసలు విషయం... ఆమెకు ఉన్న ఆర్థిక సమస్య. సుమనకు అర్జంటుగా అయిదు లక్షల రూపాయలు కావాల్సి వచ్చింది. ఆ విషయాన్ని స్నేహితురాలితో చెప్పకుండా ఏవేవో విషయాలు మాట్లాడుతూనే ఉంది. ఈ ధోరణినే ‘డ్రై బెగ్గింగ్’ అంటారు.తన మనసులో మాటను డైరెక్ట్గా కాకుండా, పరోక్షంగా చెప్పడాన్ని ప్రాథమికంగా ‘డ్రై బెగ్గింగ్’ అంటారు. ‘డ్రై బెగ్గింగ్’ అనేది మొదట చిన్న విషయంలాగే కనిపించినప్పటికీ ఆ తరువాత దాని తీవ్రత పెరుగుతూ పోతుంది. స్నేహం, కుటుంబ బంధాలలో అ పోహలను రేకెత్తిస్తుంది. దూరాన్ని పెంచుతుంది. మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. తెలిసి కొందరు, తెలియక కొందరు ‘డ్రై బెగ్గింగ్’ దారిలోకి వెళుతున్నారు. ‘ఒకవేళ నేను అడిగింది కాదంటే’ అనే భయంతో కొందరు....‘ఎమోషనల్ స పోర్ట్’ కోసం కొందరు... ‘డైరెక్ట్గా అడిగితే నలుగురి ముందు పలచనై పోతాం’ అని సమాజానికి భయపడి కొందరు... ‘డ్రై బెగ్గింగ్’ను ఆశ్రయిస్తుంటారు. నిజాయితీగా కాకుండా అకారణ ద్వేషంతో విషపూరితంగా, కించపరిచేలా, వేధించేలా మాట్లాడే స్వభావం కూడా ‘డ్రై బెగ్గింగ్’లో భాగమే. సైకాలజీ టెక్ట్బ్బుక్స్లో ‘డ్రై బెగ్గింగ్’ అనే మాట ఇంకా చేరనప్పటికీ ఆన్లైన్ సమాజంలో, థెరపీ సెషన్లలో ప్రాచుర్యంలో ఉంది. బ్రిటన్కు చెందిన కౌన్సెలర్ డరెన్ మాగీ ద్వారా బాగా పాపులర్ అయింది. మాగీ మాటల్లో చె΄్పాలంటే ‘డ్రై బెగ్గింగ్’ అనేది ఎమోషనల్ ప్రెషర్. ఓపెన్ కమ్యూనికేషన్ను ప్రోత్సహించడం ‘డ్రై బెగ్గింగ్’ నివారించడానికి ఒక మార్గం. ఇన్ డైరెక్ట్ రిక్వెస్ట్లు, మాటలు ఇబ్బందిగా ఉంటే వెంటనే అభ్యంతరం చెప్పాలి.బంధాలు బలంగా ఉండేలా...ఈ డ్రై బెగ్గింగ్ అనేది ఇటీవల సోషల్మీడియాలో తరచూ వింటున్నాం. ఈ డ్రై బెగ్గింగ్ బ్యాచ్ ఏం చేస్తుందంటే... అసలు సమస్య గురించి కాకుండా వేరేవన్నీ మాట్లాడుతుంటారు. తమది జాలిగుండె గా, ఎదుటివారంతా కఠినాత్ములుగా భావించి చెప్పడం చేస్తుంటారు. ఇలాంటి మాటల ద్వారా సహాయం, ప్రోత్సాహం, గిఫ్ట్, డబ్బు.. వంటివి కావాలని అర్థం వచ్చేలా మాట్లాడుతుంటారు. సోషల్ మీడియా పోస్టుల్లో ‘ఇవాళ నా పుట్టినరోజు, కానీ ఎవ్వరూ గుర్తించలేదు’ అని నిష్టూరంగా ఎదుటివారిదే తప్పు అయినట్టుగా పోస్ట్ పెడుతుంటారు.అంటే ‘నిన్న రాత్రి ఏమీ తినలేదు తెలుసా, నిద్ర పట్టలేదు’ అంటూ సమస్యను చెప్పకుండా సానుభూతిని కోరుతుంటారు. కొందరు తాము చాలా స్వతంత్రంగా ఉన్నట్టు కనిపిస్తూ, సహాయం కోరతారు. ఈ మాటలు ఎలా ఉంటాయంటే ఎదుటివారిలో గిల్ట్ను ప్రేరేపించేలా ఉంటుంది. కొందరికి ఇది సున్నితంగా తన అవసరాన్ని చెప్పే మార్గం కూడా. మరికొందరికి ఇది డైరెక్ట్గా లేకుండా సహాయం పొందేందుకు చేసే ఓ మానిప్యులేషన్. సందర్భాన్ని బట్టి ఇది సహజంగానూ ఉండొచ్చు, అలవాటుగా వాడితే అసహజంగానూ మారొచ్చు.తమకు, కుటుంబ సభ్యులకు మధ్య సరైన బంధం లేక పోయినా ఇలాంటి ప్రవర్తన బయటకు వస్తుంటుంది. ఇది వృద్ధులలో గమనిస్తుంటాం. ఇటీవల టీనేజ్, యుక్త వయసు, గృహిణుల్లోనూ ఇది ఎక్కువ కనిపిస్తోంది. ఇది వారిలో ఒక బలహీనతగా మారకుండా చూడాలి. తమను తాము శక్తిమంతులుగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. కుటుంబ బంధాలలో బీటలు వారకుండా చూసుకోవాలి. ఇలాంటి ప్రవర్తన తమలో లేదా ఎదుటివారిలో కనిపిస్తే నిపుణుల సాయం తీసుకోవాలి.– జ్యోతిరాజ,సైకాలజిస్ట్, లైఫ్ స్కిల్ ట్రైనర్