breaking news
Family
-
రిపోర్టింగ్... ఓ వార్!
అల్లికల నుంచి అంతరిక్షం దాకా అన్నిట్లో ఆడవాళ్ల జాడలు కనిపిస్తున్నా ఇదింకా పురుష ప్రపంచమే! అసలు ఆ జాడలు కూడా లేని కాలం ఎలా ఉండిందో! అలాంటి కాలంలో పురుషాధిపత్య రంగాల్లోకి స్త్రీలు ధైర్యంగా అడుగుపెట్టడమే ఓ సమరం! పెట్టాక బాధ్యతల కోసం ఒక పోరాటం! అలా పోరాడి.. పురుషులు సాధించలేని టాస్క్లను ఛేదించి.. తర్వాత తరాల అమ్మాయిలకు ఓ పాత్ను క్రియేట్ చేశారు కొందరు వనితలు! ఆషీరోస్ను పరిచయం చేసే శీర్షికే ‘ పాత్ మేకర్’. ఆక్రమంలో ఈ వారం.. దేశపు తొలి మహిళా వార్ జర్నలిస్ట్ ప్రభాదత్ గురించి...బిల్లా, రంగా పేరు వినే ఉంటారు. గీతా, సంజయ్ చోప్రా అనే ఇద్దరు స్కూల్ పిల్లలను ఎత్తుకెళ్లిపోయి, వాళ్లను హత్యచేసిన హంతకులు. మరణ శిక్షతో జైల్లో ఉన్న ఆ బిల్లా, రంగాలను ఇంటర్వ్యూ చేయడానికి ఒక జర్నలిస్ట్ .. జైల్ అధికారుల అనుమతి కోరారు. ‘నో’ అన్నారు అఫీషియల్స్. ఆ ‘నో’ను సవాలు చేస్తూ కోర్టుకు వెళ్లి, ఇంటర్వ్యూకు పర్మిషన్ తెచ్చుకుని.. ఆ ఇద్దరి మరణ శిక్ష అమలుకు ముందు వాళ్లను ఇంటర్వ్యూ చేశారు ఆ జర్నలిస్ట్. జైన్ శుద్ధ్ వనస్పతి లిమిటెడ్.. పేరు కూడా వినే ఉంటారు. ఈ సంస్థ అమ్మే నేతిలో పందికొవ్వు కలుస్తోందనే ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ చేశారు ఆ జర్నలిస్ట్. అంతేకాదు ఎయిమ్స్లోని మెడికల్ స్కామ్నూ బయటకు తీశారు. ఆ జర్నలిస్ట్ పేరే ప్రభాదత్! 1965లో జరిగిన ఇండియా– పాకిస్తాన్ యుద్ధాన్ని వార్ ఫీల్డ్లోంచి రిపోర్ట్ చేసిన వీరనారి! దేశపు ఫస్ట్ ఉమన్ వార్ కరెస్పాండెంట్గా చరిత్ర సృష్టించారు. బక్కపల్చటి దేహం.. కాటన్ చీర.. తలకు హెల్మెట్తో యుద్ధ ట్యాంక్ల వెనుక నుంచి యుద్ధాన్ని కలంతో కవర్ చేసిన ఆమె ఇమేజ్ తర్వాత తరాల జర్నలిస్ట్లు ఎందరికో ప్రేరణనిచ్చింది. అందుకే ఆమెను చమేలీ దేవీ జైన్ అవార్డ్ వరించింది. ప్రభాదత్ ఏం చేసినా సెన్సేషనే! ఆమె (మగాళ్ల రాజ్యం) జర్నలిజంలోకి అడుగుపెట్టడమే మహా సంచలనం! జర్నలిజం.. వార్ రిపోర్టింగ్ప్రభాదత్ ఇరవైల్లోనే జర్నలిజంలోకి వచ్చారు. ఇంటర్వ్యూలో ఫ్లవర్ ఎగ్జిబిషన్ను కవర్ చేసే డ్యూటీని సూచించాడట ఎడిటర్. అంతకన్నా గొప్ప విషయాలనే మహిళలు రిపోర్ట్ చేయగలరు అని అతనితో వాదించి.. మెప్పించి ఫ్లవర్ ఎగ్జిబిషన్ రిపోర్టింగ్ను తిరస్కరించి.. కీలకమైన అసైన్మెంట్స్కే ‘యెస్’ అనిపించుకున్నారు. అలాంటి ధీర ఇండియా– పాకిస్తాన్ వార్ రిపోర్టింగ్ను వదులుకుంటారా? అప్పుడు ఆమె హిందుస్థాన్ టైమ్స్కి పని చేస్తున్నారు. తనకు వార్ అసైన్మెంట్ ఇవ్వమని రిక్వెస్ట్ చేయలేదు. డిమాండ్ చేశారు. ఎడిటర్ దగ్గర్నుంచి ‘నో’ అనే జవాబే వచ్చింది. అప్పుడు ఆమె స్మార్ట్ స్టెప్ తీసుకున్నారు. పంజాబ్లో ఉన్న తన పేరెంట్స్ను చూడ్డానికి వెళ్తున్నానని సెలవుకు దరఖాస్తు పెట్టుకున్నారు. వెంటనే మంజూరైంది. పెట్టే బేడా సర్దుకుని నేరుగా ఖేమ్ – కరన్కి బయలుదేరారు ప్రభా. యుద్ధ రంగంలో నిలబడి ఏ రోజుకారోజు యుద్ధ విషయాల రిపోర్ట్ను పత్రికా ఆఫీస్కు పంపసాగారు. పట్టుదలకు పోయి మొదట్లో ఆ రిపోర్ట్ను పక్కన పెట్టినా.. తర్వాత తర్వాత ఆమె రిపోర్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవాళ్లు పత్రికా ఆఫీస్లో. ప్రభాదత్ కన్విక్షన్, పర్ఫెక్షన్ అలాంటిది మరి. రేడియోల ముందూ చెవులు రిక్కించుకుని మరీ కూర్చునేవారట శ్రోతలు.. ఆమె రిపోర్టింగ్ విషయాలను వినడానికి. మిడిమిడి జ్ఞానం ఆమె డిక్షనరీలోనే లేదు. సంపూర్ణ అవగాహన, స్పష్టతతోనే వెళ్లేవారు ఎక్కడికైనా. పనితోనే గానీ వ్యక్తిగత చరిష్మాకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదు. తన జీవితమే రిస్క్లో పడేంత ప్రమాదకరమైన రిపోర్టింగ్ చేశారు. బెదిరింపులు, భౌతిక దాడులను ఎదుర్కొన్న సందర్భాలూ ఉన్నాయి. అయినా ప్రభాదత్ వెనుకడుగు వేయలేదు. తను నమ్మినదానిపట్ల దృఢచిత్తంతో సాగిన ఆమె బ్రెయిన్ హ్యామరేజ్తో హఠన్మరణానికి గురయ్యారు. జర్నలిజంలో ఆమె చూపిన తెగువ, ధైర్యం మహిళా జర్నలిస్ట్లకే కాదు పురుషులకూ స్ఫూర్తే! ప్రముఖ జర్నలిస్ట్ బర్ఖాదత్ ఆమె కూతురే. -
ఐకానిక్ ఐఫిల్ టవర్ ఎన్ని సార్లు మూత పడిందో తెలుసా?
అపురూపమైన అద్భుతమైన పర్యాటక ప్రదేశాల్లో ఒకటి పారిస్ నగరంలో ఉన్న ఐఫిల్ టవర్. జీవితంలో ఒక్కసారైనా దీన్ని చూడాలని ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ఇక్కడికి తరలి వస్తారు. ముఖ్యంగా ప్రేమ పక్షులకు ఇది ఫ్యావరెట్ డెస్టినేషన్ అంటే అతిశయోక్తి కాదు. అందుకే దీనిని ప్రౌడ్ ఆఫ్ ఫ్రాన్స్ అని కూడా పిలుస్తారు. దశాబ్దాలుగా ఐఫెల్ టవర్ తన అందాలతో సందర్శకులను ఆకట్టుకుంటోంది.అయితే 136 సంవత్సరాల చరిత్రలో, ఈ స్మారక చిహ్నం అనేక సందర్భాల్లో మూతపడింది. సమ్మెలు , కార్మికుల నిరసనలు, భద్రతా ఆందోళనలు, 2024 ఒలింపిక్స్ సందర్బంగా, కోవిడ్ మహమ్మారి. 2015, పారిస్ ఉగ్ర దాడులు, కత్తిపోట్లు, సందర్భంగా ఐకానిక్ ఐఫిల్ టవర్ను మూసివేశారు.తాజగా ఫ్రాన్స్ అంతటా వేలాది మంది కార్మికుల ఆందోళన, ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ఐకానిక్ ఐఫిల్ టవర్ ప్రస్తుతం మూతపడింది. అక్టోబర్ 2న దీన్ని మూసివేశారు. ఎపుడెపుడు మూత పడిందంటే!2015, నవంబర్ పారిస్లో ఉగ్రదాడులనేపథ్యంలో మూసివేశారు.2017లో కత్తి దాడి: ఆగస్టు 2017లో, పర్యాటకులు , భద్రతా దళాల ముందు ఒక వ్యక్తి కత్తితో హల్చల్ చేయడంతో మూసివేశారు.ఆగస్టు 2018: సిబ్బంది వాకౌట్: ఆగస్టు 2018లో, సందర్శకుల నిర్వహణలో మార్పులకు వ్యతిరేకంగా కార్మికుల సమ్మె కారణంగా ఐఫెల్ టవర్ను రెండు రోజులు మూసి వేయాల్సి వచ్చింది. 2019, మేలో : ఒక వ్యక్తి ఐపిల్ టవర్పై ఎక్కుతున్నట్లు కనిపించిన తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా అధికారులుఐఫిల్ టవర్ను ఖాళీ చేయించారు.2020 కోవిడ్-19 మహమ్మారి: కోవిడ్-19 మహమ్మారివిస్తరణ, లాక్డౌన్ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా చేసే ప్రయత్నాల్లో భాగంగా దీన్ని మూసివేశారు.ఘోరమైన కత్తిపోట్లు : డిసెంబర్ 2023 డిసెంబరులో ఐఫెల్ టవర్ దగ్గర ఒక జర్మన్ పర్యాటకుడు కత్తిపోట్లకు గురయ్యాడు. ఈ సంఘటనలో మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. దీంతో దీన్ని ఉగ్రవాద దాడిగా భావించిన అధికారులు దీన్ని మూసివేశారు.2024, ఫిబ్రవరి: సిబ్బంది సమ్మె కారణంగా ఐఫెల్ టవర్ మరోసారి మూసివేతను ఎదుర్కొంది. ఈసారి, నిర్వహణ ,సిబ్బంది సంక్షేమంపై కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. SETE అనే ఆపరేటర్ నిర్వహణ బడ్జెట్ను రెట్టింపు చేస్తామని మరియు టిక్కెట్ ధరలను పెంచుతామని హామీ ఇచ్చినా సమ్మె కొనసాగడంతో, ఫిబ్రవరి 24 ఉదయం స్మారక చిహ్నాన్ని మూసివేశారు.చదవండి: 84 ఏళ్ల వయసులో తల్లి, కూతురి వయసు మాత్రం అడక్కండి: గుర్తుపట్టారా!ఆగస్టు 2024: ఒలింపిక్స్కు ముందు : వేసవి ఒలింపిక్స్ ముగింపు వేడుకకు కొన్ని గంటల ముందు, టవర్ ఎక్కుతూ ఒక దుండగుడు కనిపించడంతో ఐఫిల్ టవర్ను మళ్ళీ ఖాళీ చేయించారు. 3. ప్రపంచ ఆరోగ్య సంక్షోభాలు2024, సెప్టెంబర్లో: 2024 వేసవి ఒలింపిక్స్ తర్వాత, ఐఫెల్ టవర్ కొన్ని మార్పులకు గురైంది. ఈ క్రీడల కోసం30 టన్నుల ఒలింపిక్ రింగులను ఏర్పాటుచేశారు. వీటిని తొలగించేందుకు సెప్టెంబరులో ఒకసారి మూసివేశారు.కాగా పారిస్లోని చాంప్ డి మార్స్పై 330 మీటర్ల ఎత్తులో లా డామ్ డి ఫెర్ (ఫ్రెంచ్లో "ఐరన్ లేడీ") ఐఫిల్ టవర్ కొలువు దీరింది. ఈ టవర్ను 1889 లో నిర్మించారు. 330 మీటర్ల పొడవైన ఈ టవర్ నిర్మాణానికి 70 లక్షల కిలోల ఇనుమును ఉపయోగించారు. 300 మంది కార్మికులు అందమైన భవనాన్ని 2 సంవత్సరాల 2 నెలల 5 రోజుల్లో పూర్తి చేశారని చెబుతారు. చదవండి: రెండేళ్ల శ్రమ ఒక మినిట్లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్వీడియో -
క్రూయిజ్ జర్నీ, అమేజింగ్ అండమాన్
అండమాన్ టూర్... అమేజింగ్ టూర్. (Amazing Andaman) ఎందుకంటే... ఇది రోడ్డు టూర్ కాదు. అలాగని రైలు బండి పర్యటనా కాదు.గాల్లో విమాన విహారమూ కాదు.నీటి మీద క్రూయిజ్లో విహారం. ఇంకా... నగరం మధ్య వీధుల్లో విహారం కాదు.ఇది... సముద్రం మధ్య దీవుల్లో విహారం.ఎటు చూసినా సముద్రమే...ఎటు వెళ్లినా ప్రకృతి ఆహ్లాదమే. ఒకవైపు ఇంద్రధనసు సూర్యోదయం.మరో వైపు ప్రకృతి చెక్కిన రాతి వంతెన.ఇన్ని ప్రకృతి అద్భుతాల సుమహారం ఈ టూర్. 17వ తేదీ తెల్లవారు జామున 4. 35 గంటలకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో టూర్ నిర్వహకులకు రిపోర్ట్ చేయాలి. మీట్ అండ్ గ్రీట్ తర్వాత పర్యాటకులందరూ విమానం ఎక్కాలి. విమానం దాదాపు తొమ్మిది గంటలకు పోర్ట్బ్లెయిర్కు చేరుతుంది. ఎయిర్΄ోర్ట్ నుంచి బయలుదేరి హోటల్కు చేరి చెక్ ఇన్ చేయాలి. లంచ్ తర్వాత అండమాన్లోని సెల్యూలార్ జైలు మ్యూజియం వీక్షణం, కోర్బిన్స్ కోవ్ బీచ్ విహారం. సాయంత్రానికి తిరిగి సెల్యూలార్ జైలుకు చేరుకుని లైట్ అండ్ సౌండ్ షో కి హాజరుకావడం.శ్రీ విజయపురం!పోర్ట్ బ్లెయిర్ పట్టణం ఇప్పుడు భారతీయతను సంతరించుకుంది. దీని కొత్త పేరు శ్రీ విజయపురం. అండమాన్ దీవులంటే ఇప్పుడు మనకు పర్యాటక ప్రదేశంగా మాత్రమే గుర్తు వస్తోంది. కానీ మనదేశానికి స్వాతంత్య్రాన్ని అధికారికంగా ప్రకటించకముందే మన జాతీయ పతాకం ఎగిరిన నేల ఇది. అందుకే శ్రీ విజయపురం అనే పేరును ఖరారు చేసింది భారత ప్రభుత్వం. ఇక్కడ వీర సావర్కర్ ఎయిర్పోర్ట్లో దిగిన క్షణం నుంచి జాతీయోద్యమకాలంలోకి వెళ్తున్న భావన మొదలవుతుంది. సెల్యులార్ జైలు ్ర΄ాంగణంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి అసంకల్పితంగా గుండె బరువెక్కుతుంది. ఇది పోరాట యోధుల జీవించే హక్కునే కాలరాయడం కోసమే నిర్మించిన చెరసాల. బ్రిటిష్ దమన నీతికి నిదర్శనం. ప్రధాన భూభాగానికి దూరంగా విసిరేసినట్లున్న దీవుల్లో పెద్ద జైలు కట్టి జాతీయోద్యమకారులను బంధించేవారు. ఖైదీల చేత చేయించే పనుల నమూనా చిత్రాలతో మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. నాటి ΄ాలన దురాగతాలకు కళ్లకు కడుతుంది సాయంత్రం జరిగే సౌండ్ అండ్ లైట్ షో. రెండో రోజు పోర్ట్ బ్లెయిర్ నుంచి హావ్లాక్ (స్వరాజ్ ద్వీప్)కు ప్రయాణం. తెల్లవారు జామునే హోటల్ గది చెక్ అవుట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేసి ఇస్తారు. క్రూయిజ్ జర్నీ మొదలవుతుంది. హావ్లాక్ ఐలాండ్కి చేరిన తర్వాత హోటల్లో చెక్ ఇన్ చేయాలి. మధ్యాహ్న భోజనం తర్వాత రాధానగర్ బీచ్ విహారం. తిరిగి హోటల్కు వచ్చిన తర్వాత డిన్నర్. రాత్రి బస హావ్లాక్ దీవిలో.స్వరాజ్ ద్వీప్ విహారంఅండమాన్– నికోబార్ దీవుల్లో అనేక దీవులు, పట్టణాలు బ్రిటిష్ అధికారుల పేర్లతోనే ప్రాచుర్యంలోకి వచ్చాయి. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటిన తర్వాత మెల్లమెల్లగా కొత్త పేర్లతో వ్యవహారంలోకి వస్తున్నాయి. హావ్లాక్ కూడా బ్రిటిష్ అధికారి పేరే. అయితే దీనిని స్వరాజ్ ద్వీప్గా పేరు అధికారికంగా మారింది. ఇందుకు కారణం జాతీయోద్యమంలో భాగంగా అండమాన్ దీవుల్లో సుభాష్ చంద్రబోస్ భారత జాతీయపతాకాన్ని ఆవిష్కరించి బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందినట్లు ప్రకటన చేశాడు. ఆయన గౌరవార్థం పాత పేర్లను హావ్లాక్ ఐలాండ్– స్వరాజ్ ద్వీప్, రాస్ ఐలాండ్– నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్, నీయెల్ ఐలాండ్ – షాహీద్ ద్వీప్గా మార్చింది భారతప్రభుత్వం. ఈ దీవులు అచ్చమైన ప్రకృతి వరాలనే చెప్పాలి. చిరు అలల సవ్వడి వింటూ, మెత్తటి ఇసుకలో నడుస్తూ నీలిరంగు నీటికి– నీలాకాశానికి మధ్యనున్న గీత ఎక్కడో వెతుక్కుంటూ ఉంటే టైమ్ తెలియదు. ఇది ఎకో టూరిజమ్ జోన్. నియమాలను పాటించాలి. టైమ్ మ్యాగజైన్ 2004లో ఇక్కడి రాధానగర్ బీచ్కి టైమ్ ‘బెస్ట్ బీచ్ ఇన్ ఏషియా’ గుర్తింపు నిచ్చింది. ఈ టూర్లో ఎదురు చూసిన క్రూయిజ్ జర్నీని క్షణక్షణం ఆస్వాదించాలి. మూడో రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత వాటర్ స్పోర్ట్స్ కోసం ఎలిఫెంట్ బీచ్కు వెళ్లాలి. వాటర్ స్పోర్ట్స్ టికెట్లు పర్యాటకులే కొనుక్కోవాలి. హోటల్ చేరేది రాత్రికే. హోటల్కు భోజనం, బస హావ్లాక్ ఐలాండ్లోనే.పగడపు దీవుల విహారం!ఎలిఫెంట్ బీచ్ సముద్రంలో స్విమ్మింగ్, సన్బాత్కి బాగుంటుంది. వాటర్ స్కూబా డైవింగ్ వంటి స్పోర్ట్స్ ఆడుకోవచ్చు. మరకతాలు పరిచినట్లున్న సముద్రాన్ని ప్రశాంతం తీరాన కూర్చుని ఆస్వాదించడానికి వీలుగా రెల్లుగడ్డి గొడుగులతో పొడవాటి కుర్చీలుంటాయి. ఇక్కడ కూర్చుని సూర్యాస్తమయాలను వీక్షించడం మధురానుభూతి. స్కూబా డైవింగ్లో సముద్రగర్భంలోకి దూరిపోయి అక్కడ విస్తరించిన పగడపు దీవులను చుట్టి రావచ్చు. నాలుగో రోజు: హావ్లాక్ నుంచి నీల్కు ప్రయాణం. బ్రేక్ఫాస్ట్ తర్వాత కాలాపత్తర్ బీచ్ విహారం తర్వాత క్రూయిజ్లో నీల్ ఐలాండ్కు చేరాలి. హోటల్ గదిలో చెక్ ఇన్. సాయంత్రం సీతాపూర్ బీచ్, లక్ష్మణ్ పూర్ బీచ్లో సూర్యాస్తమయ వీక్షణం. రాత్రి బస నీయెల్ ఐలాండ్లో.సన్రైజ్ బీచ్షాహీద్ దీవి నుంచి సూర్యోదయ వీక్షణం ఓ మధురానుభూతి. చక్కటి వ్యూ పాయింట్ అని చెప్పవచ్చు. అందుకే దీనికి సన్రైజ్ బీచ్ అనే విశేషణం. ఫొటోగ్రఫీకి ది బెస్ట్ లొకేషన్. నవదంపతులు మంచి లొకేషన్లో ఫొటోలు తీసుకుంటే పర్యటన జ్ఞాపకాలు కూడా కలకాలం పదిలంగా ఉంటాయి.ప్రకృతి అద్భుతం– శిలావంతెనషాహీద్ (నీయెల్) దీవి ప్రకృతి చేసే చిత్రవిచిత్రాలకు, విన్యాసాల నిలయం. తిరుమల గిరుల్లో శిలాతోరణాన్ని చూస్తాం. కొండ రాళ్లు నీటి ప్రవాహ తాకిడికి అరిగి΄ోయి పై భాగంలో శిల అలాగే ఉండిపోవడంతో ఆ రూపం తోరణాన్ని తలపిస్తుంటుంది. ఈ దీవిలోని లక్ష్మణ్పూర్ బీచ్లో కూడా అలాంటి ప్రకృతి అద్భుతం ఉంది. దీనిని శిలా వంతెన, సహజ వంతెన అంటారు. ఈ బీచ్ సూర్యాస్తమయ వీక్షణానికి గొప్ప ప్రదేశం కావడంతో సన్సెట్ బీచ్ అంటారు. ఈ దీవిలో అరవై కిందటి వరకు ఇక్కడ మనుష సంచారం ఉండేది. ఇక్కడ ఉన్న స్థానికులు బంగ్లాదేశ్ నుంచి భారత్కు వచ్చిన హిందూ శరణార్థులే. (రెండేళ్ల శ్రమ ఒక మినిట్లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్వీడియో)అయిదో రోజు : బ్రేక్ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి భరత్పూర్ బీచ్ విహారానికి వెళ్లాలి. ఆ తర్వాత ΄ోర్ట్బ్లెయిర్కు ప్రయాణం. ఈ రోజు సాయంత్రం విశ్రాంతిగా గడపడమే. రాత్రి బస పోర్ట్ బ్లెయిర్లో. సప్తవర్ణమాలికసముద్రం మీద సూర్యోదయం అంటే మనకు గుర్తుకు వచ్చేది ఆరెంజ్కలర్లో బంతిలాగ నీటి నుంచి ఉద్భవిస్తున్న సూర్యుడి రూపమే. కానీ భరత్పూర్ బీచ్లో సూర్యోదయం సప్తవర్ణ సంగమం. సముద్రం ఈమద ఇంద్రధనసు విన్యాసాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ సముద్రపు నీరు తక్కువ లోతులో ఈదడానికి అనువుగా జెట్టీ నిర్మాణం ఉంది. అందులో వాటర్ స్పోర్ట్స్, కోరల్ రీవ్స్ విజిట్తోపాటు ప్రశాంతంగా నీటిలో సేదదీరవచ్చు.హైదరాబాద్కు ప్రయాణం. పోర్ట్బ్లెయిర్లో తెల్లవారు జామునే హోటల్ గది చెక్ అవుట్ చేసి ఎయిర్పోర్టుకు చేరాలి. టూర్ నిర్వహకులు పర్యాటకులను ఎనిమిది లోపు ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి, వీడ్కోలు చెబుతారు. విమానం 9.55కి బయలుదేరి 12.10 గంటలకు హైదరాబాద్కు చేరడంతో టూర్ పూర్తవుతుంది.ఇదీ చదవండి: 84 ఏళ్ల వయసులో తల్లి, కూతురి వయసు మాత్రం అడక్కండి: గుర్తుపట్టారా!ప్యాకేజ్ ఇలా:కంఫర్ట్ కేటగిరీలో సింగిల్ ఆక్యుపెన్సీ టికెట్ 74, 425 రూపాయలు. డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 56,625 రూపాయలు. ట్రిపుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 54, 925 రూపాయలు. పిల్లలకు (5–11 ఏళ్ల మధ్య) 48, 785 రూపాయలు. ఇందులో విడిగా బెడ్ ఉంటుంది. బెడ్ లేకుండా (2–11 ఏళ్ల మధ్య) 45, 485 రూపాయలు. రెండేళ్లలోపు పిల్లలకయితే టికెట్ బుక్ చేయాల్సిన అవసరం లేదు. కానీ విమానం ఎక్కే ముందు ఎయిర్΄ోర్ట్ కౌంటర్లో దాదాపుగా 1,750 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.బుకింగ్ ఎలా:సంప్రదించాల్సిన చిరునామా: ఐఆర్సీటీసీ, సౌత్సెంట్రల్ జోన్, ఐఆర్సీటీసీ 9–1–129/1/302, థర్డ్ ఫ్లోర్, ఆక్స్ఫర్డ్ ΄్లాజా, ఎస్డీ రోడ్, సికింద్రాబాద్, తెలంగాణ.ఫోన్ నంబరు: 040– 27702407విజయవాడ ఏరియా ఆఫీస్ : 92810 30714టూర్ కోడ్: SHA18 - AMAZING ANDAMAN OCT 17అమేజింగ్ అండమాన్ టూర్ అక్టోబర్ 17వ తేదీన హైదరాబాద్ నుంచి మొదలవుతుంది. 6ఈ– 6305 నంబర్ విమానం 17వ తేదీ ఉదయం ఆరు గంటల 25 నిమిషాలకు హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది. ఎనిమిది గంటల 55 నిమిషాలకు పోర్ట్బ్లెయిర్కు చేరుతుంది. – వాకా మంజులారెడ్డి,సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
వేలాదిగా బారులు తీరిన మోడల్స్, కేఆర్కే ట్వీట్ వైరల్
ప్రముఖ సినీ క్రిటిక్, నటుడు , నిర్మాత కమాల్ రషీద్ ఖాన్ (కమల్ ఆర్. ఖాన్.Kamaal R. Khan, KRK) వివాదాస్పద ట్వీట్లో వార్తల్లో నిలిచాడు. తాజాగా ఒక మెగా మోడల్ హంట్ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశాడు బిగ్బాస్ఫేమ్ కమల్ఆర్ఖాన్. ఈ లైన్ చూస్తే ప్రస్తుతం నిరుద్యోగం ఎంత ఉందో అర్థం అవుతుంది అంటూ అక్కడ వేలాదిగా బారులు తీరిన మోడల్స్ను ద్దేశించి కమెంట్ చేశాడు. దీంతో ఇది వైరల్గా మారింది. ఈ పోస్ట్కు 2.8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అంతేకాదు జెన్ జెడ్ పాపులర్ అవ్వాలని ఎంత పాకులాడుతున్నారో, ధనవంతులుకావాలిన కావాలని ఎంత తహతహ లాడుతున్నారో అనడానికి ఇది నిదర్శనం అంటూ కమెంట్ చేశాడు. దీంతో నెటిజన్లు కమల్ఆర్ఖాన్ను విమర్శిస్తూ, సమర్ధిస్తూ కమెంట్స్ చేశారు. మోడలింగ్ను కెరీర్గా ఎంచుకునే వారి సంఖ్యలో జెన్-జి యువతులుండటం సానుకూలమే కదా అని కొందరు కొనియాడగా, మరికొందరు ప్యాంటు కూడా కొనుక్కోలేనంత పేదవాళ్లు జెన్-జెడ్ అమ్మాయిలు అంటూమరికొందరు అనుచితంగా వ్యాఖ్యానించారు.This line is for Phoenix Mega Model Hunt. It’s proof, how much unemployment is right now. And it’s proof that how Gen~G are desperate to become famous and rich. pic.twitter.com/lsxwatCpVU— KRK (@kamaalrkhan) October 5, 2025 కాగా ఫీనిక్స్ మెగా మోడల్ హంట్ 2025 ( Phoenix Mega Model Hunt 2025) అనేది బెంగళూరులో జరిగే అతిపెద్ద ఫ్యాషన్ షో. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ ఫ్యాషన్ గురు ప్రసాద్ బిదపా నేతృత్వంలో జరుగుతుంది.ఫ్యాషన్, సంగీతం, కాక్టెయిల్స్ ఈవెంట్స్కి రిజిస్ట్రేషన్ చేసుకున్న జంటలకు, మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఔత్సాహికులైన యువతీ యువతులు ఈ ఈవెంట్లో పాల్గొని తమ టాలెంట్ను ప్రదర్శిస్తారు. -
84 ఏళ్ల వయసులో తల్లి, కూతురి వయసు మాత్రం అడక్కండి: గుర్తుపట్టారా!
ప్రముఖ యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఏళ్ల తరబడి టీవీ షోలలో తన యాంకరింగ్తో అలరిస్తోంది. ఒక్క చేత్తో టీవీ షోలు, మరో చేత్తో సినిమా ఈవెంట్లు, విదేశీ టూర్లతో నిరంతరం బిజీగానే ఉంటుంది. అందర్నీ మెప్పించే వాక్చాతుర్యం, ఛలోక్తులు, ఎక్కడలేని ఎనర్జీతో అభిమానుల విశేషాభిమానం, పాపులారిటీతో పాటు చేతి నిండా సంపాదనే. ఇది చాలదన్నట్టు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ అభిమానులకు ప్రేరణగా నిలుస్తూ ఉంటుంది.తాజాగా 84 ఏళ్ల తన మాతృమూర్తి వీడియోను ఇన్స్టాలోప్టె్ చేసింది. దీంతో ఇది అభిమానుల మనసు దోచుకుంటోంది.నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో సుమ తల్లి 84 వయస్సులో కూడా ఎక్సర్సైజ్లు చేస్తూ ఉండటం విశేషం. ‘84 ఏళ్ల మదర్, వెర్సస్ డాటర్’ అనే క్యాప్షన్తో సమ వీడియో పోస్ట్ చేసింది. అయితే 84 ఏళ్ల వయసులో తల్లి అంటూ తల్లి వయసు చెప్పింది గానీ, తన వయసు మాత్రం చెప్ప లేదు. పైగా మీకు తోచినంత అని చమత్కరించింది. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma)ఈ ఏజ్లో కూడా అమ్మ ఫిట్నెస్ గ్రేట్ అని నెటిజన్లు కామెంట్స్ చేయగా, మీ ఏజ్ 62, 28 ..48? అంటూ మరికొందరు ఫన్నీగా కమెంట్స్ చేశారు. -
మ్యాగీ పిచ్చి: ఎంగేజ్మెంట్ రింగ్ అమ్మి.. విషయం తెలిసి తల్లి భావోద్వేగం
టీనేజ్ పిల్లల చేష్టలు అమాయకంగా అనిపించినా, ఒక్కోసారి ప్రమాదకరంగా పరిణమిస్తాయి. అనుకున్నది దక్కించుకునేందుకు ఎలాంటి అకృత్యాలకైనా పాల్పడతారు. తాజాగా ఉత్తరప్రదేశ్లోని, కాన్పూర్లోని శాస్త్రి నగర్లో జరిగిన సంఘటన గురించి తెలుసుకుంటే షాక్ అవ్వకతప్పదు 13 ఏళ్ల బాలుడు తన సోదరి నిశ్చితార్థ ఉంగరాన్ని ఎత్తుకుపోయాడు. ఇది దురాశతోనో , డబ్బులతో కాదు.. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. పిల్లలకు ఫాస్ట్ ఫుడ్ వస్తువుల పట్ల ఉన్న వ్యామోహం అంతా ఇంతా కాదు. ఈనేపథ్యంలో కేవలం మ్యాగీ నూడుల్స్ కోసం తనసోదరి ఎంగేజ్మెంట్ను రింగ్ను అమ్మేయాలని చూశాడు. కానీ దుకాణ యజమాని , ఆ కుర్రోడి తల్లికి ఫోన్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.విషయం తెలుసుకున్న తల్లి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది.ఉంగరాన్ని కొట్టేసిన బాలుడు ఆభరణాల దుకాణానికి వెళ్లాడు. ఉంగరాన్ని తీసుకొని డబ్బులు ఇమ్మని అడిగాడు. దుకాణ యజమాని పుష్పేంద్ర జైస్వాల్ బాలుడి అమాయకత్వాన్ని చూసి అనుమానం వచ్చింది. కారణాలను ఆరాతీశాడు. మ్యాగీ కొనడానికి డబ్బుల్లేవని, అందుకే ఉంగరాన్ని తెచ్చానని ఆ బాలుడు అమాయకరంగా సమాధానం ఇచ్చాడు. చదవండి: ఈ 5 లక్షణాలుంటే చాలు! మీరిక ‘చిరంజీవే’వెంటనే ఆ ఆభరణాల వ్యాపారి వెంటనే ఆ బాలుడి తల్లికి సమాచారమిచ్చాడు. తన కుమార్తె నిశ్చితార్థం ఉంగరం చూసి తల్లి షాక్ అయ్యింది. వివాహం కొన్ని రోజుల్లోనే జరగాల్సి ఉందని, ఈ ఖరీదైన ఉంగరం పోయి ఉంటే చాలా సమస్యలెదుర్కోవాల్సి వచ్చేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. నిజాయతీగా ప్రవర్తించిన నగల వ్యాపారికి తల్లి కళ్ల నిండానీళ్లతో ధన్యవాదాలు తెలిపింది.చదవండి : కేఎఫ్సీలో కంపుకొట్టే చికెన్ బర్గర్? వీడియో చూస్తే వాంతులే!అయితే సరైన ధృవీకరణ లేకుండా మైనర్లు తెచ్చిన ఆభరణాలను తాము కొనుగోలుచేయమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆభరణాల వ్యాపారి నిజాయితీ ప్రశంసలు దక్కించుకుంది. -
ఈ 5 లక్షణాలుంటే చాలు! మీరిక ‘చిరంజీవే’!
ఎంత వయసు వచ్చినా.. ‘చావు’ అంటే అందరికీ భయమే. అలనాటి పురాణ పురుషుల నుంచి ఈనాటి సామాన్య మానవుల దాకా మృత్యువు నుంచి దూరంగా పారిపోయి దీర్ఘాయుష్షుతో చిరంజీవిగా జీవించాలన్నఆరాటం ఈనాటిది కాదు. ఇందుకోసం ఎన్నో ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ విషయంలో తాజా స్టడీ కీలక విషయాలను వెల్లడించింది. దాకా మృత్యువు నుంచి తప్పించుకొని, దీర్ఘాయుష్షుతో జీవించాలన్న ఆరాటం మామూలుది కాదు. ఈ క్రమంలో ఎక్కువ కాలం జీవించాలంటే ప్రోయాక్టివ్గా, హ్యాపీగా, థరోగా, రెస్పాన్సిబుల్గా, హెల్పింగ్ నేచర్తో ఉంటే చాలు.. దీర్ఘాయువు మీ సొంతం అంటోంది ఒక స్టడీ.జర్నల్ ఆఫ్ సైకోసోమాటిక్ రీసెర్చ్లో ప్రచురించబడిన ఈ అధ్యయనం ప్రకారం, చురుగ్గా ఉండటం, వ్యవస్థీకృతంగా ఉండటం బాధ్యతాయుతంగా ఉండటం వంటి నిర్దిష్ట వ్యక్తిత్వ లక్షణాలు అకాల మరణం ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ‘పర్సనాలిటీ న్యూయెన్స్ అండ్ మోర్టాలిటీ రిస్క్: ఫోర్ లాంగిట్యూడినల్ శాంపిల్స్ రిపోర్ట్ ’ అనే శీర్షికతో ఈ స్టడీ కొన్ని విషయాలను తెలిపింది. పై లక్షణాలు బహిర్ముఖం లేదా మనస్సాక్షి వంటి విస్తృత వ్యక్తిత్వ వర్గాల వివరణ కంటే దీర్ఘాయువును మరింత ఖచ్చితంగా అంచనా వేస్తాయని తెలిపింది.. కష్టపడి పనిచేయడం లేదా సంతోషంగా ఉండటం వంటి లక్షణాలు ఆయుర్దాయాన్ని పెంచడంలో చాలా పెద్దపాత్ర పోషిస్తాయని పరిశోధకులు అంటున్నారు.అధ్యయనంలో ఏముందంటే!ఈ అధ్యయనం నాలుగు దీర్ఘకాలిక అధ్యయనాలలో వ్యక్తిత్వ డేటాను విశ్లేషించింది . ఈ లక్షణాలు మరణ ప్రమాదానికి ఎలా సంబంధం కలిగి ఉన్నాయో ట్రాక్ చేసింది. వయస్సు, లింగం,వైద్య పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసిన తర్వాత కూడా, తమను తాము చురుకుగా వర్ణించుకున్న వ్యక్తులు 21 శాతం తక్కువ మరణ ప్రమాదాన్ని కలిగి ఉన్నారని ఇది వెల్లడించింది.ఉల్లాసంగా, బాధ్యతాయుతంగా, హార్డ్ వర్కింగ్, క్షుణ్ణంగా (thorough)సహాయకారిగా ఉండటం లాంటి లక్షణాలు మన ఆయువును నిర్దేశిస్తాయని వెల్లడించింది. మరోవైపు, తరచుగా ఒత్తిడి, ఆందోళన, ప్రతికూల భావోద్వేగాలున్నవారి జీవితకాలం తక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.చదవండి: రెండేళ్ల శ్రమ ఒక మినిట్లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్వీడియో సాంప్రదాయకంగా, మనస్తత్వవేత్తలు కల్మషం లేకుండా ఉండటం, మనస్సాక్షికి అనుగుణంగా ఉండటం, బహిర్ముఖత్వం, అంగీకారయోగ్యత, న్యూరోటిసిజం అనే ఐదు విస్తృత లక్షణాల ద్వారా వ్యక్తిత్వాన్ని కొలుస్తారు. కానీఈ స్టడీ సహ రచయిత రెనే మోటస్ ప్రకారం, ఈ "బిగ్ ఫైవ్" ముఖ్యమైన వివరాలను కోల్పోవచ్చు. బదులుగా, కష్టపడి పనిచేయడం లేదా సహాయకారిగా ఉండటం వంటి స్వీయ-వర్ణనలు ఆరోగ్యం, ఆయువు ప్రభావాలను కలిగి ఉన్న నిర్దిష్ట ప్రవర్తనలను సంగ్రహిస్తాయి. ఈ అధ్యయనంలో, సూక్ష్మ నైపుణ్యాలు పెద్ద వర్గాల కంటే ఎక్కువగా అంచనా వేసేవిగా మారాయి.వ్యక్తిత్వం ఆరోగ్య ప్రమాదాలను ఎలా అంచనా వేయగలదు?ఒక రోజు ఆరోగ్య ప్రమాదాలను బాగా అంచనా వేయడానికి రక్తపోటు లేదా కొలెస్ట్రాల్ పరీక్షలతో పాటు వ్యక్తిత్వ-ఆధారిత సాధనాలను ఉపయోగించవచ్చని ఈ పరిశోధన వైద్యులు సూచించారు. ఉదాహరణకు, ఆందోళన చెందుతున్న లేదా అస్తవ్యస్తంగా గుర్తించే వ్యక్తి లక్ష్య జీవనశైలి,మానసిక ఆరోగ్య మద్దతు నుండి ప్రయోజనం పొందవచ్చు. సహ రచయిత పారాయిక్ ఓ'సుయిల్లియాభైన్ ఏమంటారంటే..వ్యక్తిత్వం అనేది కేవలం ఒక సాధారణ ప్రభావం కాదు, ఇది దీర్ఘకాలిక ఆరోగ్య ఫలితాలను రూపొందించే రోజువారీ ప్రవర్తనలను కూడా ప్రతిబింబిస్తుంది.ఎక్కువ కాలం జీవించడానికి మీరు ఏ లక్షణాలను పెంపొందించుకోవాలి?అధ్యయనం ప్రకారం ఎంత ఎక్కువ చురుగ్గా ఉంటే అంత ఎక్కువ ఆయుష్షు ఉంటుంది. ఇది చాలా కీలకం. అలాగే అకాల మరణం నుంచి తప్పించుకోవచ్చు. ఇక లైవ్లీగా, ఒకరిగా సాయం చేసే గుణం, క్రమశిక్షణగా, బాధ్యతాయుతంగా ఉండటం అనేది తరువాత వరుసలో ఉంటాయి. లక్షణాలే ఆరోగ్యకరమైన అలవాట్లు, బలమైన సామాజిక సంబంధాలు, ఒత్తిడిని ఎదుర్కోవడానికి సాయపడతాయి. ఫలితంగా ఇవన్నీ దీర్ఘాయువును పెంచుతాయి. అలా కాకుండా తీవ్ర ఒత్తిడి, ఆందోళనలతో ఉంటే గుండె జబ్బులు, ఇన్ఫ్లమేషన్, అనారోగ్యకరమైన లక్షణాలను ప్రేరేపించడం ద్వారా మరణాల ప్రమాదాన్ని పెంచుతాయి.ఎక్కువ కాలం జీవించడానికి వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని, కానీ ఈ లక్షణాలతో ముడిపడి ఉన్న చిన్న రోజువారీ అలవాట్లను పెంపొందించుకోవడం సహాయపడుతుందని అధ్యయనం నొక్కి చెప్పింది. అంటే నిరంతరం చురుకుగా ఉండటం, నిబద్ధతగా ఉండటం, ఇతరులకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉండటం, శారీరక , మానసిక శ్రేయస్సుకు మద్దతు ఇచ్చే సరళమైన, సాధించగల దశలు.ఇదీ చదవండి: కేఎఫ్సీలో కంపుకొట్టే చికెన్ బర్గర్? వీడియో చూస్తే వాంతులే! -
తొలి మహిళా సైన్స్ లెక్చరర్
అది 1930. దేశ రాజధాని ఢిల్లీలో రాధ (Dr. Radha Pant ) బీఎస్సీ చదవాలని కలలు కంటోంది. అప్పటికి డిగ్రీ స్థాయిలో సైన్స్ చదివే అవకాశం మహిళ లకు ఏ కళాశాలలోనూ లేదు. తండ్రి కాలేజీల చుట్టూ తిరగడం, వెనక్కి రావడం... రెండేళ్లయ్యింది. కానీ ఆ అమ్మాయి మాత్రం వెనక్కి తగ్గడం లేదు; ‘అవసరమైతే గాంధీ మహాత్ముడిలా సత్యా గ్రహం చేస్తాను హిందూ కాలేజీ ఎదుట’ అనేదాకా వెళ్ళింది. అలా బీఎస్సీ సైన్స్ డిగ్రీలో హిందూ కళాశాలలో ప్రవేశం దొరికింది. కేరళలోని పాల్ఘాట్ ప్రాంతం కల్పతి గ్రామంలో 1916 సెప్టెంబర్ 5న రాధ జన్మించారు. బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి 1940లో పీహెచ్డీ సాధించారు. పీహెచ్డీ కొరకు 2, 4 డై మీతోక్సి ఐసోఫ్తలి కామ్లం; 2, 6 డై హైడ్రాక్సి ఐసోథాలికామ్లాలను తొలిసారి తయారు చేసిన శాస్త్రవేత్త రాధ. బొంబాయి హాఫ్కిన్ ఇనిస్టిట్యూట్ వారి న్యూట్రిషనల్ బయో కెమిస్ట్రీ విభాగంలో సీనియర్ రిసెర్చ్ ఫెలోగా పని చేస్తూ... ఎంతోకాలంగా ఉన్న నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ... ‘సోయా కన్నా శనగలే మేలైన పోషక విలువలు కలిగి ఉన్నాయని’ రుజువు చేశారు. 1945లో అలహాబాద్ విశ్వవిద్యాలయంలో తొలి మహిళా అధ్యాపకురాలిగా బయోకెమిస్ట్రీ నేపథ్యంతో చేరారు. అనతి కాలంలోనే అదే విశ్వవిద్యాలయంలో బోటనీ ప్రొఫెసర్గా పని చేస్తున్న దివ్య దర్శన్ పంత్ను వివాహం చేసుకున్నారు. 1954–56 మధ్యకాలంలో భార్యాభర్తలిద్దరూ యూని వర్సిటీ ఆఫ్ లండన్ వెళ్లి పోస్ట్ డాక్టోరల్ పట్టాలు పొందారు. ‘ఎవర్ ఎ ఫైటర్ ’ పేరుతో రాధా పంత్ తన జ్ఞాపకాలను రాసుకున్నారు. 1956లో అలహాబాద్ యూనివర్సిటీలో తను పరిశోధనను కొనసాగించాలను కున్నప్పుడు ఆ విభాగంలో కేవలం 6 గదులు మాత్రమే ఉన్నాయనీ; ఇక పరిశో ధనకు కావలసిన గ్రంథాలు, వసతులు ఏమాత్రం లేవనీ చెప్పారు. అటువంటి అలహాబాద్ యూనివర్సిటీలోనే 1968లో జీవరసాయన శాస్త్ర విభాగంలో ఎంఎస్సీ కోర్సును ప్రారంభించ గలిగారు. రాధా పంత్ బృందం హృదయ రోగాలు, పట్టుపురుగులు ఇలా అనేక విభిన్న అంశాల మీద విలువైన ఫలితాలు సాధించారని ‘ద బయో కెమిస్ట్’ జర్నల్లో కుసుమ్ పంత్ జోషి పేర్కొన్నారు. పట్టుపురుగులకు సంబంధించి రాధా పంత్ కృషి గురించి ఫ్రెంచ్ జర్నల్ ‘సెరికొలో జియా’ ఒక ప్రత్యేకమైన ప్రచురణని వెలవరించిందంటే ఆమె స్థాయి ఏమిటో గమనించవచ్చు. 2003 డిసెంబర్ 19న కన్నుమూసిన రాధ చిరస్మరణీయురాలు.– డా. నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి మాజీ ఉన్నతాధికారి -
సరికొత్త ట్రెండ్ క్యాండిల్ లైట్ ఈవెంట్స్... జెన్జీ సందడి
ఇటీవలి కాలంలో నగరం కేవలం ఐటీ హబ్గానే కాకుండా లైఫ్స్టైల్, కల్చరల్ ఈవెంట్స్కి అద్భుతమైన వేదికగా నిలుస్తోంది. ఈ నూతన ఒరవడిలో ఈ మధ్య ప్రధానంగా ఆదరణ పొందుతున్న సరికొత్త ట్రెండ్ క్యాండిల్ లైట్ ఈవెంట్స్. వాణిజ్య నగరంగా పేరుపొందిన హైదరాబాద్ ఇప్పుడు రాత్రి వేళల్లో మెరిసే మైనపు వెలుగుల్లో కొత్త మాయాజాలాన్ని సృష్టించిన అనుభూతిని కల్పిస్తుంది. చిమ్మ చీకటిలో చిరు వెలుగు అందించే క్యాండిల్ లైట్ ప్రత్యేక ఆకర్షణగా.. విభిన్నమైన వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా రొటీన్ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్స్కు భిన్నంగా క్యాండిల్ లైట్ మ్యూజిక్ కాన్సర్ట్స్ ఈ తరం ట్రెండ్గా నిలుస్తోంది. ట్రెండీ నైట్.. క్యాండిల్ లైట్ అన్న రీతిలో పలు ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ నగరవాసులను ఆకర్షిస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోప్రస్తుత అధునాతన జీవనశైలితో పాటు ట్రెండింగ్ ఈవెంట్స్కు హైదరాబాద్ నగరం కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. ఇందులో భాగంగానే క్యాడిల్ లైట్ ఈవెంట్స్ తెరపైకి వచ్చాయి. ఈ కొత్త ట్రెండ్ మన జీవనశైలి మార్పును మాత్రమే కాదు, మన మానసిక అవసరాలను కూడా ప్రతిబింబిస్తోంది. శాంతి, ప్రేమ, కళలకు వేదికగా ఈ ట్రెండ్ రూపాంతరం చెందుతోంది. ఈ క్యాండిల్ లైట్ ట్రెండ్కి నగరంలో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు మరింత క్రియేటివ్ ఐడియాలతో ముందుకు వస్తున్నాయి. క్యాండిల్ లైట్ మ్యూజిక్ కాన్సర్ట్స్, థీమ్ బేస్డ్ క్యాండిల్ లైట్ పోయెట్రీ ఈవెనింగ్స్, మెడిటేషన్ సెషన్లు, క్యాండిల్ లైట్ డిన్నర్, క్యాండిల్ లైట్ ఆర్ట్ షోస్ వంటి కాన్సెప్ట్లు సరికొత్త అనుభూతులను అందిస్తున్నాయి. డార్క్ బీట్స్.. ఒక వైపు మ్యూజిక్ లవర్స్కి క్లబ్ల శబ్దాలు, ఈడీఎం బీట్స్ విసుగుతెస్తుంటే, మరోవైపు క్యాండిల్ లైట్ మ్యూజిక్ కాన్సర్ట్స్ వారికి ఓ కొత్త అనుభూతి అందిస్తున్నాయి. పియానో, వయోలిన్, ఫ్లూట్ వంటి సాఫ్ట్ ఇన్స్ట్రుమెంట్స్తో ప్రశాంతంగా కొనసాగే ఈ లైవ్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఈవెంట్స్లో పాల్గొనడమంటే.. సంగీతంతో మనసు నిండిపోవడమే కాదు, ఆ మైనపు వెలుగుల్లో మన మనసు కూడా ప్రశాంతతను పొందుతుంది. ఇటీవల కూకట్పల్లి, బంజారాహిల్స్, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో జరిగే ఈవెంట్స్కి యువత నుంచి భారీ స్పందన లభిస్తోంది. హైదరాబాద్లోని క్యాండిల్లైట్ సంగీత కచేరీలలో బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్, తారామతి బరాదరి రిసార్ట్స్ వంటి వేదికల్లో శాస్త్రీయ, ఆధునిక సంగీతంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు సీసం కొవ్వొత్తులతో అలంకరించబడి సంగీతకారులు వాయించే సంగీతంతో ఒక ప్రత్యేక అనుభవాన్ని అందిస్తాయి. ఈ కచేరీల్లో అర్జిత్ సింగ్, ఏఆర్ రెహమాన్ వంటి ప్రముఖ మ్యూజిక్ సెలబ్రిటీలు భాగం కావడం విశేషం. ఉత్తమ మూవీ సౌండ్ట్రాక్స్, కోల్డ్ప్లే, ఎడ్ షీరాన్ మిక్స్ వంటి థీమ్లు ఇందులో ఉంటాయి. చదవండి: కేఎఫ్సీలో కంపుకొట్టే చికెన్ బర్గర్? వీడియో చూస్తే వాంతులే!నగరంలో సరికొత్త ట్రెండ్గా క్యాండిల్ లైట్ ఈవెంట్స్చీకటి వెలుగుల సందడి.. : గోల గోలతో హంగామా చేసే పార్టీలు కాకుండా.. బంధువులు, స్నేహితులతో ఒక మధురమైన వేడుక జరుపుకోవాల నుకుంటున్నవారికి క్యాండిల్ లైట్ బర్త్డే పార్టీలు సరైన ఎంపికగా మారుతున్నాయి. చిన్న చిన్న డెకరేషన్, ఫెయిరీ లైట్స్, సున్నితమైన మ్యూజిక్, సొగసైన కేక్ కటింగ్.. ఇవన్నీ కలిపి ఒక వింత అనుభూతిని కలిగిస్తాయి. ముఖ్యంగా మహిళలు, టీనేజ్ యువత ఈ స్టైల్కి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.క్యాండిల్ నైట్ డిన్నర్.. : ప్రేమికుల్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్న మరో ట్రెండ్.. క్యాండిల్ నైట్ డిన్నర్. ఒక టేబుల్, రెండు హృదయాలు, నెమ్మదిగా వెలిగే మైనపు వెలుగు, వెనకనుంచి వినిపించే ఓ మెలోడీ పాట.. ఇది కేవలం డిన్నర్ కాదు, ఒక జ్ఞాపకం. హైదరాబాద్లోని పలు హై ఎండ్ రెస్టారెంట్లు, రూఫ్టాప్ కెఫేలు, ప్రైవేట్ విల్లాస్, రిసార్టులు ఈ రకమైన డిన్నర్ అనుభూతికి ప్రత్యేక ప్యాకేజీలతో అందిస్తున్నాయి. పుట్టినరోజులు, వెడ్డింగ్ యానివర్సరీ వంటి సందర్భాల్లో ఈ డిన్నర్లు మరింత ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి.మెంటల్ పీస్: ఉరుకుల పరుగుల బీజీ నగర జీవనశైలిలో కాసింత ప్రశాంతత కోసం వినూత్నమైన అనుభూతి కోసం ఈ క్యాండిల్ లైట్ ఈవెంట్స్ అద్భుతమైన వేదికలుగా నిలుస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్: ఈ జెన్జీ బ్యాచ్ సోషల్ మీడియా యాప్స్లో తమను ప్రత్యేకంగా ప్రదర్శించు కోవడం ఇష్టపడుతుంటారు. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో పోస్ట్ చేయదగిన అందమైన ఫొటోలు తీసుకోవాలంటే క్యాండిల్ లైట్ సెట్టింగ్స్ వైరల్గా నిలుస్తున్నాయి. అరుదైనఅనుభూతి: ప్రతి ఈవెంట్ వ్యక్తిగతంగా ప్లాన్ చేయబడటం ఈ క్యాండిల్ లైట్ ఈవెంట్స్ ప్రత్యేకత. ఇష్టమైన వారి కోసం, వారికి నచ్చే సెట్టింగ్స్తో ఈ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. చదవండి: రెండేళ్ల శ్రమ ఒక మినిట్లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్వీడియో -
డెక్కన్ డెర్బీ–2025 : యురేకా... మలైకా!
సాక్షి, సిటీబ్యూర : రేస్–2 విన్ ఫౌండేషన్ (Race2Win Foundation ) ఆధ్వర్యంలో హైదరాబాద్ రేస్ క్లబ్లో డెక్కన్ డెర్బీ– 2025 (Deccan Derby 2025 ) లో ఫ్యాషన్, రేసింగ్, సేవల మేలు కలయికగా ఘనంగా నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది. ఇందులో ప్రముఖ డిజైనర్ ద్వయం రోహిత్ గాంధీ – రాహుల్ ఖన్నా రూపొందించిన ‘ఫ్యాషన్ ఇన్ ఇట్స్ ప్యూరెస్ట్ ఫార్మ్’ కలెక్షన్ ప్రదర్శనలో బాలీవుడ్ నటి మలైకా అరోరా (Malaika Arora) షోస్టాపర్గా ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్జున్ బాజ్వా, రెజినా కసాండ్రా, అవంతిక మిశ్రా, నైరా బెనర్జీ తదితర సినీ ప్రముఖులు పాల్గొని వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆనందంగా వుంది.. మలైకా అరోరా మాట్లాడుతూ.. ‘హైదరాబాద్లో జరిగిన ఈ వేడుకలో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉంది. రోహిత్ గాం«దీ, రాహుల్ ఖన్నా డిజైన్ కలెక్షన్ ఆకట్టుకుంది. రేస్–2 విన్ ఫౌండేషన్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయం’ అని అభినందించారు. రేస్–2 విన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వై.గోపీరావు మాట్లాడుతూ, ‘డెక్కన్ డెర్బీ 2025 ఘన విజయం సాధించింది. ఈ కార్యక్రమం ద్వారా రేసింగ్, ఫ్యాషన్, సేవా కార్యక్రమాల సమ్మేళనం అనే వెవిధ్యం సాకారమైంది’ అన్నారు. ఇదీ చదవండి: Director Sukumar టీ కోసం క్యూ కట్టడం చూశా.. -
టీ కోసంక్యూ కట్టడం చూశా..
సాక్షి, సిటీ బ్యూరో: విదేశాల్లో బోబా టీ కోసం చిన్నా, పెద్దా క్యూ కట్టడం గమనించానని ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ (Director Sukumar) చెప్పారు. తైవాన్కు చెందిన పాపులర్ బ్రాండ్ బోబా టీ (Taiwanese bubble tea)కి ‘షేర్ టీ’ పేరిట దేశపు మొదటి అవుట్లెట్ సైబరాబాద్లోని ఇనార్బిట్ మాల్లో ఏర్పాటు చేశారు. దీనిని ప్రారంభించిన సందర్భంగా సుకుమార్ మాట్లాడారు. అమెరికా వంటి ‘విదేశాల్లో ఎంతో ఇష్టపడే బోబా టీని తైవాన్కు చెందిన నిపుణుల ద్వారా సిటీకి అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సంస్థకు చెందిన ప్రవీణ్ వికాస్ తదితరులు పాల్గొన్నారు. బోబీ టీ లేదా బబుల్ టీ బోబా టీ, లేదా బబుల్ టీ. తైవాన్లో పుట్టి ప్రపంచవ్యాప్తంగా యువతను ఆకట్టుకుంటోంది. బోబా టీ షాప్స్ క్రేజ్ ముంబయి, బెంగళూరు వంటి నగరాలతో పాటు హైదరాబాద్కు కూడా చేరింది. చదవండి: Director Sukumar టీ కోసం క్యూ కట్టడం చూశా.. -
వేణు గానం
అదొక నదీ తీరం. అక్కడి పచ్చటి చెట్ల నడుమ అందమైన శ్రీ కృష్ణుడి విగ్రహం ఉంది. ఆ దారిన పోతున్న ఓ నాస్తికుడైన రాజు కొద్దిసేపు కూర్చుని వెళ్దామని అక్కడ ఆగాడు. వేణువు ఊదే శ్రీ కృష్ణుడి విగ్రహం పక్కనే ఒక యువ సంగీతకారుడు కూర్చుని సాధన చేస్తూ ఉన్నాడు. అతడి ధ్యాస అంతా సాధన మీదే ఉంది. రాజు రాకను అతడు పట్టించుకోలేదు. రాజు సంగీతకారుడి దగ్గరికి వెళ్ళి భుజం తట్టాడు. రాజును చూసి ఉలిక్కిపడ్డాడు సంగీతకారుడు.‘‘శ్రీ కృష్ణుడు వేణువు ఊదితే ఆవులు పాలిచ్చేవట కదా’’ అని వెటకారంగా అన్నాడు రాజు . ‘స్వామి వేణుగానానికి ప్రకృతే పరవశించిపోతుందని’ చెప్పాలనుకున్నాడు సంగీతకారుడు. ‘రాజు తలిస్తే దెబ్బలకు కొదువా?’ సామెత గుర్తుకొచ్చి గమ్మున తల వంచుకుని ఉండిపోయాడు. అలసి ఉన్న రాజు విగ్రహం ముందున్న మెట్ల మీద కూర్చున్నాడు. అంత చక్కటి వాతావరణంలో మంచిగా నిద్రపోతే బాగుంటుందని భావించాడు. ఎంత ప్రయత్నించినా కళ్ళు మూత పడలేదు. కొద్దిసేపు గడిచింది. చల్లటి గాలి తెరలు తెరలుగా వీస్తోంది. ఆ సంగీతకారుడు సాధన ప్రారంభించాడు. జల తరంగిణి మీద ఓ రాగాన్ని వాయించసాగాడు. ఆ రాగం వింటూ రాజు ‘సంగీతానికి చింతకాయలే రాలవు, నాకు నిద్ర ఎలా వస్తుంది?’ అని నవ్వుకున్నాడు. అయితే చక్కటి ఆ రాగానికి రాజుకు చిన్నచిన్నగా నిద్ర పట్టసాగింది. అలాగే మెట్ల మీద పడుకుని గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు.గంట తర్వాత లేచి కూర్చున్నాడు రాజు. కళ్ళు తడి అయి ఉన్నాయి. మంచి నిద్ర వచ్చినట్లు గ్రహించాడు. ఆ ఆలోచనారహిత స్థితికి సంగీతం కారణమని గుర్తించాడు. కళ్ళు తుడుచుకుంటూ ‘చాన్నాళ్ళయ్యింది ఇంత ప్రశాంతంగా నిద్రపోయి’ అనుకున్నాడు. సంగీత విద్యకు హద్దు లేదు, యుద్ధభూమికి కొలతలేదన్న విషయం గుర్తుకు వచ్చింది. ‘‘సంగీతంలో ఎంతో మహత్తు ఉంది. అందుకే శ్రీ కృష్ణుడి వేణు గానానికి ఆవులు తప్పక పాలు ఇచ్చి ఉంటాయి’’ అని గట్టిగా అన్నాడు. అవునన్నట్లుగా చిన్నగా తల ఊపాడు సంగీతకారుడు.రాజు గబగబా లేచి వెళ్ళి శ్రీ కృష్ణుడి పాదాలకు నమస్కరించాడు. రాజధానిలో చక్కటి సంగీత పాఠశాల ఏర్పాటు చేస్తానని అక్కడినుంచి కదిలాడు. శ్రీ కృష్ణుడు ముసిముసినవ్వులు నవ్వుతున్నట్లుగా అనిపించింది సంగీతకారుడికి.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
ఆదికవికి అనేక ప్రణతులు
భారతీయ సాహిత్యంలో ఆదికావ్యం శ్రీమద్రామాయణం. మానవ వికాసం కోసం, మానవుడు పరిపూర్ణత్వాన్ని పొందడం కోసం వేదాల్లో చెప్పిన అంశాలనే సామాన్య మానవులకు కూడా అర్ధమయ్యేలా రామకథను ఆధారంగా చేసుకుని వాల్మీకి రామాయణాన్ని వ్రాశాడు. రామాయణాన్ని పరమ పవిత్ర భక్తి వేదంగా పఠిస్తూ పారాయణ చేసేవారు కొందరైతే, మహోత్కృష్ట్ట కావ్యంగా చదువుతూ ఆనందించేవారు కొందరు, మరికొందరు అందులోని కౌశల్యానికి ముగ్ధులైతే, ఇంకొందరు అందులోని మానవీయ విలువలను గ్రహించేవారు. రామాయణం భారతీయుల ఆత్మ... అయితే, యావత్ మానవజాతికి చుక్కాని వంటిదని చెప్పొచ్చు. నిత్యజీవితంలో నీతి నియమాలకు కట్టుబడకుండా, ధర్మనిరతితో ప్రవర్తించకుండా భగవంతుడికి దగ్గర కావాలనుకోవడం అవివేకం. ఆ విశ్వంభరుడికి విలువలతో కూడిన మానవ జీవన ప్రయాణమే ప్రామాణికం కాని కులగోత్రాలు, కాసులు, కిరీటాలు కాదు. అగ్రకులాన జన్మించినా అడ్డదారులు తొక్కితే ఆయన క్షమించడు. అణగారిన కులాలలో పుట్టినా విలువలతో.. పవిత్రంగా జీవన పయనం సాగించే వారిని చేయి పట్టుకుని నడిపించక మానడు. అంటే ఆ దైవానికి మన గుణగణాలు ప్రధానం కాని కుల మతాలు ప్రమాణం కాదు. ఇందుకు మన ముందున్న చక్కని ఉదాహరణ వాల్మీకి మహర్షి.రామాయణంలో హృదయాన్ని ద్రవింపజేసే చక్కని కథ ద్వారా మనవాళికి మార్గదర్శనం చేసే సుభాషితాలెన్నో చెప్పాడు వాల్మీకి. మానవుడి జీవితాన్ని సుఖమయం చేసే ధర్మమాలను ధర్మసూత్రాలను తాను విరచించిన రామాయణ కావ్యం విశదీకరించాడాయన. జగదానంద కారకుడు, శరణాగతవత్సలుడు, సకల గుణాభిరాముడు అయిన శ్రీరాముని దివ్య చరిత్రను, శ్రీరామనామ మాధుర్యాన్ని మనకందించిన కవికోకిల ఆదికవి వాల్మీకి మహర్షికి మానవాళి యావత్తు రుణపడి ఉంటుందంటే అతిశయోక్తి కాదు.అర్థవంతమైన చక్కని పదాలతో, శాస్త్ర అనుకూలమైన సమాసాలు, సంధులు, మధురమైన, ఆర్ద్రత కలిగించే వాక్యాలతో కూడిన శ్రీరామాయణ మహా కావ్యాన్ని మనకందించాడు వాల్మీకి మహర్షి. రామాయణంలో అంశాలన్నీ సత్యాలే. రామాయణంలో మానవ ధర్మాలైన శిష్య ధర్మం, భ్రాతృధర్మం, రాజ ధర్మం, పుత్రధర్మం, మిత్రధర్మం, పతివ్రతా ధర్మాలతోపాటు ప్రేమలు, బంధాలు, శరణాగత వత్సలత, యుద్ధనీతి, రాజనీతి, ప్రజాభ్యుదయం, సత్యవాక్పరిపాలన, ఉపాసన రహస్యాలు, సంభాషణా చతురత, జీవిత విలువలు, ధర్మాచరణ వంటి అనేక రకాల ఉపదేశాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రామాయణ కావ్యంలో మంచి చెడుల గురించి చెప్పనిదంటూ ఏది లేదు.ఇంత విలువైన సత్యాలను చెప్పి, ఇంతటి మహత్తర కావ్యాన్ని అందించిన కవి వాల్మీకి మహర్షికి ప్రతి ఒక్కరూ చేతులెత్తి నమస్కరించాలి. ప్రతివారు రామాయణ కావ్యం చదివి, చక్కని గుణవంతులైతే వాల్మీకి ఋణం తీర్చుకున్నట్టే.– డి.వి.ఆర్. -
రెండేళ్ల శ్రమ ఒక మినిట్లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్వీడియో
అధిక బరువుతో బాధపడే వాళ్లు తీవ్రమైన క సరత్తు చేయాల్సిందే. గుట్టలకొద్దీ పేరుకు పోయిన కొవ్వు కరగాలంటే చెమట చిందించాల్సిందే. దీనికి కొందరికి రోజులు, నెలలు సరిపోవు. సంవత్సరాల తరబడి కృషి చేయాలి. ఏదో నాలుగు రోజులో, నెలలో చేసి నావల్ల కాదు చేతులెత్తేయకూడదు. ఓపిగ్గా ప్రయత్నించాలి. అప్పుడు అనుకున్న శరీరాకృతి సాధ్యమవుతుంది. ఇదే నిరూపించిందో యువతి. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్లో వైరల్గా మారింది. ఈ వెయిట్ లాస్ జర్నీ వీడియో ఎక్స్లో సుమారు 60లక్షల వ్యూస్ను సాధించింది. అద్భుతం, అమోఘం అంటూ చాలా మంది ఆమెను అభినందించగా, అయితే దీనిపై కొంతమంది అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. వీడియో చివర్లో ఆమె స్మార్ట్లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అంత భారీగా బరువు తగ్గినపుడు, చర్మం వేలాడుతూ ఉంటుంది.అలా లేదేమిటి? అని కొందరు, బహుశా శస్త్రచికిత్స చేయించుకొని ఉండవచ్చు అని కొందరు అభిప్రాయపడ్డారు. దాదాపు నేను కూడా సుమారు 200 పౌండ్లు బరుదు తగ్గాను. చర్మంఅలాగే ఉండిపోయింది. చాలా శస్త్రచికిత్సలు జరగకుండా ఆమె అలా అయ్యే అవకాశం లేదు. అది సాధ్యం కాదని నేను చెప్పడం లేదు, అది ఆమెదేనా అని అనుమానం అని మరో యూజర్ సందేహం వ్యక్తం చేయడం గమనార్హం. Two years of hard work in 1 minute.Impressive!!! pic.twitter.com/QP5QubvmwJ— MALEEK 1.0 (@Maleekoyibo) October 4, 2025 -
ఇండియన్ ఇంగ్లిష్ స్థితి ఎలా ఉంటుంది?
ఇంగ్లిష్ దేశాలతో మన దేశ సంబంధాలు గందరగోళంలో ఉన్న రోజులివి. ఒకవైపు ఇండి యన్ యువకుల అమెరికన్ డ్రీమ్లపై అమెరికా మట్టికొ డుతున్న రోజులు. మరోపక్క కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్లు కూడా ఇమ్మిగ్రే షన్ (వలస)పై తిరుగుబాటు చేస్తున్న రోజులు. ఇందుకు రష్యన్ ఆయిల్ను ఇండియా కొనడం ఒక కారణమైతే, ప్రపంచ దేశాలన్నిటిలో మన దేశం ‘ఫస్ట్’ అనే సంకుచిత జాతీయ భావన పెరిగిపోవడం మరొకటి. ప్రపంచీకరణ ఆచరణలో ఉన్న గత ముప్పయి ఏండ్లలో ‘నా దేశం ఫస్ట్’ అనే నినాదం మన దేశ బీజేపీ ప్రభుత్వమే మొదట ఇచ్చింది. దీనితో పాటు భారతదేశంలో ‘హిందీ ఫస్ట్’ అనే ప్రచారం కూడా మొదలైంది. క్రమంగా వివిధ రంగాలలో ఇంగ్లిష్ భాషను వెనక్కి నెట్టే ప్రక్రియ నడుస్తున్నది. 2025 అక్టోబర్ 5 నాటికి ఇండియాకు ఇంగ్లిష్ భాష ఒక బోధనా భాషగా వచ్చి 208 ఏళ్ళు అవుతుంది. గత కొంతకాలంగా మనం ఆ రోజును ‘ఇండియన్ ఇంగ్లిష్ దినం’గా జరుపుకొంటున్నాం. ఈ భాష ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల్లో; సివిల్ సర్వీస్ పరీక్షలలో చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ మధ్య ఇంగ్లిష్ దేశాలుగా ఉన్న అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా ఇండియన్ ఇమ్మిగ్రేషన్ మీద తీసుకుంటున్న కఠినమైన నిర్ణయాలు ఇక్కడి ఇంజినీరింగ్ విద్యారంగాన్ని ఏం చెయ్యబోతున్నాయన్న అనుమానం కలుగుతోంది.గత 30 ఏళ్లుగా ఈ దేశంలో ఐఐటీ, ఎన్ఐటీ, వివిధ రాష్ట్రాల్లో పబ్లిక్, ప్రైవేట్ యూనివర్సిటీల్లో, ఇంజినీరింగ్ కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు కేవలం అమెరికాకో, మరో ఇంగ్లిష్ భాష మాట్లాడే దేశానికో పోవడం కోసమే చదవడం జరిగింది. కానీ ఇకముందు అన్ని రకాల కోర్సులను మన దేశంలో ఉండి ఏదో ఒక పనిచేసి కుటుంబం, దేశం అభివృద్ధి కావడం కోసం చదవాల్సి ఉంటుంది. ఈ స్థితిలో ఈ దేశంలో ఇంగ్లిష్ ప్రాధాన్యం తగ్గుతుందా? తగ్గించే వైపునకు పయనించాలా అనే ప్రశ్న ఎదురౌతుంది.ఇండియన్ ఇంగ్లిష్ ఇండియా అభివృద్ధికే!ఇతర ఇంగ్లిష్ దేశాలు భారతదేశం నుండి మొత్తం వలసలను ఆపినా సరే... ఇండియన్ ఇంగ్లిష్ను బాగా అభివృద్ధి చేసుకోవలసిందే. భవిష్యత్తులో అన్ని రంగాల్లో రీసర్చి ఇంగ్లిష్ భాష అభివృద్ధి అయిన దేశాల్లోనే పెరుగుతుంది. ఇంగ్లిష్ భాషకు ఉన్న కాన్సెప్ట్యువల్ క్లారిటీ ప్రపంచంలోని ఏ ఇతర భాషల్లో రాలేదు. పరిశోధనలో కొత్త ఆవిష్కరణలు జరగాలంటే భూమి మీద ఉన్న పదార్థాలను మానవులు చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలగాలి. అందుకు దోహదపడే భాష చాలా అవసరం. మన దేశంలోని ప్రాంతీయ భాషల్ని అటుంచండి; చైనా, జపాన్ వంటి సైన్సులో అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆ దేశ భాషలకు ఆ పట్టు లేక వాళ్ళు రీసర్చిలో, ఉన్నత చదువుల్లో ఇంగ్లిష్ను అభివృద్ధి చేసుకుంటున్నారు. అందుకే చైనా అతిశక్తిమంతమైన సెర్చ్ ఇంజిన్కు ‘డీప్ సీక్’ అని ఇంగ్లిష్ పేరు పెట్టింది. ఈ మధ్యకాలంలో అమెరికా హెచ్ వన్ బీ వీసా ఆంక్షలు విధించగా టాలెంట్ ఉన్నవారికి తాము స్వాగతం పలుకుతామని ఓ కొత్త వీసా ఇవ్వడానికి సిద్ధమయ్యింది చైనా. దానికి ‘కె–వీసా’ అని ఇంగ్లిష్ పేరే పెట్టింది. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం అన్ని స్కీములకూ హిందీ పేర్లు పెడుతున్నది. హిందీలో పెట్టిన ఆ పేర్లన్నీ ఈ దేశంలోని దక్షిణ, ఈశాన్య ప్రాంత పౌరులకు అర్థం కావు. అంతేకాక ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రంలో ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రభుత్వ స్కూళ్లలో తీసెయ్యడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది.యూఎన్ 80 ఏండ్ల చరిత్రలో ఇంగ్లిష్ పాత్రఈ మధ్యకాలంలో ఐక్యరాజ్యసమితి (యూఎన్) తన 80 ఏండ్ల సంబరాలు జరుపుకున్నది. ప్రపంచ దేశాల అధినేతలు అందులో పాల్గొని మాట్లాడారు. దాదాపు 80 శాతం ప్రపంచ దేశ నాయకులు తమ ఉపన్యాసాలు ఇంగ్లిష్లోనే ఇచ్చారు. కొద్దిమంది నాయకులు తమ దేశాల భాషల్లో మాట్లాడారు. కానీ వినే వారికి వారి పెదవుల కదలిక మాత్రమే కనిపించింది.ఇంగ్లిష్ అనువాదకుల మాట మాత్రమే వినిపించింది. అంటే 1945 నుండి 2025 నాటికి ఇంగ్లిష్ భాష ప్రపంచమంతటికీ పాకిందన్నమాట. చాలా దేశాల్లో భాషా సంకుచిత భావం బాగా తగ్గింది. మన దేశంలో భాషా ప్రాతిపదికన ప్రాంతాల మధ్య కొట్లాటలు తగ్గాయి. ఇప్పుడు హిందీని రాష్ట్రాలపై రుద్దుతున్నందువల్ల మళ్ళీ కొన్ని నిరసన ప్రదర్శనలు మొదలవుతున్నాయి. ప్రపంచ దేశాల్లో సైన్సు అభివృద్ధి కీలకమైంది. ఈ స్థితిలో భారతదేశం వెనుకబడకుండా ఉండాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లిష్ భాషను అభివృద్ధి పర్చి శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధి చెయ్యడం తప్ప మరో మార్గం లేదు.భారత్లో ఇంగ్లిష్ ప్రాముఖ్యంపైన పేర్కొన్న అన్ని రకాల కారణాల వల్ల అక్టోబర్ 5 నాడు దేశం మొత్తంగా ఇండియన్ ఇంగ్లిష్ డే జరపడం చాలా ముఖ్యం. గ్రామీణ ప్రాంతాల పిల్లలకు వారి తల్లిదండ్రులకు ఇంగ్లిష్ ప్రాముఖ్యాన్ని చర్చించేందుకు అదొక సందర్భం అవుతుంది. ఇంగ్లిష్ దేశాల్లోకి యువత ఇమ్మిగ్రేషన్కు ఆటంకాలు ఏర్పడతున్నాయి కదా అని మన విద్యారంగాన్ని ప్రాంతీయ భాషల్లోకి జార్చితే సైన్సు, టెక్నాలజీ అభివృద్ధి సాధ్యం కాదు. ఈ సందర్భంలో చాలా తీవ్రంగా చర్చించాల్సిన అంశం: ‘అసలు మన చదువులు విదేశాల కోసమా, మన దేశం కోసమా?’ ‘మన చదువులు మన దేశంలో మన జీవితాలను, నిర్మించుకునేటందుకు’ అనే ఆలోచన కీలకమైంది. నేను జీవితాంతం ఇంగ్లిష్లో రాసింది, చదివింది విదేశాల్లో మార్పు, అభివృద్ధి కోసం కాదు కదా! ‘నా అభివృద్ధి నా దేశంతోనే ముడివడి ఉంది’ అనే ఆలోచనతో. ఈ ఆలోచనతోనే అంబేడ్కర్ విదేశాల్లో చదువుకొని ఇక్కడ ఇంగ్లిష్లో రాశారు, మాట్లాడారు. ఆ రోజుల్లో తన కమ్యూనిటీలో గానీ, తన వర్గంలో గానీ ఇంగ్లిష్ అర్థం చేసుకునే వారు గానీ, చదివేవారు గానీ లేరు. ఆ స్థితి ఇప్పుడు కొంతైనా మారింది కదా! అందుకే ఇంగ్లిష్ నేర్చుకోవాలనే పట్టుదలను దేశం వదలకూడదు.వ్యాసకర్త ప్రొ. కంచ ఐలయ్య షెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు(నేడు ‘ఇండియన్ ఇంగ్లిష్ డే’) -
కేఎఫ్సీలో కంపుకొట్టే చికెన్ బర్గర్? వీడియో చూస్తే వాంతులే!
ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ చెయిన్ కేఎప్సీ (KFC)మరోసారి చిక్కుల్లో పడింది. బెంగళూరు ఔట్లెట్లో కుళ్లిపోయినచికెన్ వడ్డించారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనికి సంబంధించి ఒక పోస్ట్ ఎక్స్లో వైరల్గా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి..బెంగళూరుకు చెందిన ఒక కస్టమర్ కేఎఫ్సీపై విమర్శలు గుప్పిస్తూ పోస్ట్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీని ప్రకారం బెంగళూరు(Bangalore) కోరమంగళ అవుట్లెట్లో ఉన్న KFCలో ఒక మహిళా కస్టమర్ హాట్ & స్పైసీ చికెన్ జింజిర్ బర్గర్ ఆర్డర్ చేశారు. దాంట్లోని మాంసం కుళ్లి భరించలేని వాసన వచ్చింది. దీంతో దాన్ని రీప్లేస్ చేయమని అడిగారు. కానీ రెండోసారి కూడా దుర్వాసనతో చెడిపోయిన బర్గర్ ఇవ్వడంతో షాక్ అవ్వడం ఆమె వంతైంది.దీంతో ఆమె సిబ్బందిని గట్టి నిలదీయంతో "ఇది కేవలం సాస్ వాసన" తోసిపుచ్చారని తన పోస్ట్లో పేర్కొన్నారు. అంతేకాదు ఈ సమస్యను పరిష్కరించడానికి బదులుగా, సిబ్బంది తన చికెన్ బర్గర్ను వెజిటేరియన్తో భర్తీ చేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. కోరమంగళ కేఎఫ్సీ అవుట్లెట్లో తాను క్రమం తప్పకుండా అదే బర్గర్ను ఆర్డర్ చేస్తానని , ఇంతకు ముందెపుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని ఆమె వెల్లడించించింది. అంతేకాదు ఈ వివాదంతో కస్టమర్లు వంటగదిని చూడాలని డిమాండ్ చేశాడు. దీనికి మొదట అంగీకరించని సిబ్బంది, రాత్రి 10 గంటల తర్వాత ప్రవేశం లేదని, మేనేజర్ అందుబాటులో లేరని సిబ్బంది అనేక సాకులు చెప్పారు.చివరికి అనుమతించారు. దీంతో అక్కడి దృశ్యాల్నిచూసి జనం షాకయ్యారని తన పోస్ట్లో ఆరోపించింది.అంతా కలుషితం, మురికి వాసన, కోల్డ్ స్టోరేజ్ ప్రాంతంలో దుర్వాసన వెదజల్లే మాంసం, బూజు పట్టిన, తుప్పు పట్టిన షీట్లు, మరకలు ఉమ్మి గుర్తులు ఉన్నాయంటూ పేర్కొంది. (పబ్లిక్ టాయిలెట్స్లో హ్యాండ్ డ్రైయర్ వాడుతున్నారా?)🚨 WARNING: HSR KFC, Bangalore Extremely Unsafe Food 🚨One of our followers has shared a shocking and disturbing experience at the KFC outlet in HSR Layout, Bangalore. She had ordered a Hot & Spicy Chicken Zinger Burger, but the moment she opened it, the stench was unbearable.… pic.twitter.com/yFpIcblaAA— Karnataka Portfolio (@karnatakaportf) October 4, 2025దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు వచ్చిన తర్వాత సిబ్బంది దాదాపు అరగంట పాటు వంటగదిని తాళం వేసి ఉంచారని, ఆ సమయంలో స్విగ్గీ , జొమాటో ఆర్డర్లు పంపడం కొనసాగిందని పోస్ట్ పేర్కొంది. "30-40 డెలివరీలు ఒకే చెడిపోయిన మాంసాన్ని ఉపయోగించి పంపించారని కూడా ఆరోపించారు. మేనేజ్మెంట్ షాకింగ్ రియాక్షన్ఇదిలా ఉంటే మేనేజ్మెంట్ స్పందన అత్యంత షాకింగ్గా ఉంది. తన సొంత కుటుంబానికి అలాంటి ఆహారాన్ని అందిందని అని ఒప్పుకుంటూనే, ఈఫుడ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని అవుట్లెట్ మేనేజర్ వాదించడం విడ్డూరంగా నిలిచింది.ఈ సంఘటన నెట్టింట విమర్శలకు తావిచ్చింది. పిల్లలతో సహా వెళ్లే కుటుంబాలకు ఇలాంటి ఆహారం వడ్డించడంపై చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘అక్కడ ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. ఈ సమస్యను చాలాసార్లు ఎదుర్కొన్నా.. అందుకే ఆ అవుట్లెట్కు వెళ్లడం పూర్తిగా మానేశాను. వీలైతే, మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే అక్కడి నుండి తినకండి" అని మరొకరు కామెంట్ చేశారు. "ప్రతి రెస్టారెంట్ ఏ సమయంలోనైనా కస్టమర్లు వంటగదిని సందర్శించడానికి అనుమతించాలి. సరైన పరిశుభ్రత పాటించని రెస్టారెంట్లను ఆహార లైసెన్స్ రద్దు చేయడంతో వెంటనే మూసివేయాలి. అని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాపులర్ ఆహార డెలివరీ యాప్ల ద్వారా అందించే క్లౌడ్ కిచెన్ల పరిస్థితి ఏంటి ఒకయూజర్ ఆందోళనవ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ఎంగేజ్మెంట్ : దేవ కన్యలా అన్షులా కపూర్, అమ్మకోసం అలా..!ఈ సంఘటన నిజమని నిరూపితమైతే, అవుట్లెట్లో పరిశుభ్రత ,ఆహార భద్రత ఆందోళన కలిగించే అంశమే. ఇలాంటి ఆహారం తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్, ఇన్ఫెక్షన్లతో సహా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావడం ఖాయం. మరి ఈ వివాదం, వీడియోలోని ఆరోపణలపై కేఎఫ్సీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. -
అంబర్ పేట బిడ్డకు అమెరికాకు చెందిన యూనివర్సిటీ డాక్టరేట్
అంబర్ పటేల్ నగర్కు చెందిన ప్రముఖ భరతనాట్య గురువు శ్రీమతి కూన ప్రియదర్శిని కి ఆగ్రా లోని రాడిసన్ హోటలో అమెరికాకు చెందిన జార్జియా డిజిటల్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ మరియు ప్రభుత్వ రంగ సంస్థ నీతి ఆయోగ్ ద్వార భరతనాట్య విభాగంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందించారు. సినీ నటి మరియు విఖ్యాత భరతనాట్య కళాకారిణి సుధా చంద్రన్ చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రధానం చేయడం జరిగింది. ఈ పురస్కారాలు తీసుకున్నందుకు కారకులైన తన గురువులకు మరియు తల్లిదండ్రులకు డాక్టర్ కూన ప్రియదర్శిని కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాన్స్ మాస్టర్ సిరాజ్, రత్నాకర్, తదితరులు పాల్గొన్నారు. -
వెయ్యేళ్లు ఆదివాసీల చరిత్ర నిలిచేలా సరికొత్తగా అమ్మవార్ల గద్దెల ప్రాంగణం
కోయల పూర్వ మూలాలు, పడిగ బొమ్మలు, పూర్వ కోయ రాజ్యాల చరిత్ర, గొట్టు గోత్రాలు (పూర్వం ప్రకృతి సమతుల్య సిద్ధాంతంలో భాగంగా ఆదివాసీలు తమ వంశవృక్షాలను 3 నుంచి 7 గొట్లుగా ఏర్పాటు చేసుకుని ప్రకృతిలోని జంతువులు, చెట్లు, పక్షులు, రాజ్య వ్యవస్థ సింబల్ను దైవాలుగా పంచుకున్నారు)... వీటిని మేడారం అమ్మవార్ల గద్దెలు, సాలహారం, నూతన ఆర్చీ ద్వారాలపై తీర్చిదిద్దనున్నారు. ఆలయం మొత్తం కొండ గుహల్లో దొరికిన పూర్వ కోయ రాజ్యాలు నడిచిన క్రమంలో రాసిన తాళపత్ర గ్రంథాల ఆధారంగా వాస్తుప్రకారం రూపుదిద్దుకోనుంది. వెయ్యేళ్లు ఆదివాసీల చరిత్ర నిలిచేలా అమ్మవార్ల గద్దెల ప్రాంగణాన్ని అభివృద్ధి చేయనున్నారు. మేడారం పునర్నిర్మాణంలో ఏయే అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు.. ఆలయంలో రానున్న ఆర్చీలు, సాలహారంపై ఆదివాసీ చరిత్ర, ప్రకృతితో వారికున్న అనుబంధం తెలిపే బొమ్మల విశేషాలే ఈ వారం సండే స్పెషల్ కథనం. – ఎస్ఎస్తాడ్వాయి ఆదివాసీ మూలాలు, సంస్కృతీసంప్రదాయ చిత్రాలతో ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణం ఆధునికీకరణకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. మొత్తంగా 8 ఆర్చీలు, గద్దెల ప్రాంగణం చుట్టూ ప్రహరీపై 700 ఆదివాసీ చిత్రాలను ఏర్పాటుచేయనున్నారు. అమ్మవార్ల గద్దెలను కదిలించకుండా కోయ మూలాలతో అభివృద్ధి పనులను చేపట్టారు. వనదేవతల వరుస క్రమంలో సమ్మక్క–సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను ఏర్పాటు చేయనున్నారు. 300 ఫీట్ల వెడల్పు, 1000 ఫీట్ల మేర చుట్టూ ప్రహరీ నిర్మించనున్నారు. అమ్మవార్ల గద్దెల పక్కన 8 పిల్లర్లుఇది దేశ పురోగమన చరిత్ర సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసీ సంస్కృతి సజీవంగా నిలిచేలా ఆదివాసీ మూలాలతో అమ్మవార్ల గద్దెల ప్రాంగణం అభివృద్ధి చేయడం మా అదృష్టం. ఇది దేశ పురోగమన చరిత్ర. ఆలయ ప్రాంగణం విస్తీర్ణంలో ఆదిమ మూలం బొమ్మలు లిఖించే అవకాశం దక్కడం మంత్రి సీతక్క, సమ్మక్క– సారలమ్మ పూజారులకు, ఆదివాసీలకు మరువలేని జ్ఞాపకం. ఆదివాసీల ఆత్మగౌరవానికి అండగా ఉంటామని ప్రకటించడం చాలా సంతోషకరం. – డాక్టర్ మైపతి అరుణ్కుమార్ సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసీ సంస్కృతి సజీవంగా నిలిచేలా ఆదివాసీ మూలాలతో అమ్మవార్ల గద్దెల ప్రాంగణం అభివృద్ధి చేయడం మా అదృష్టం. ఇది దేశ పురోగమన చరిత్ర. ఆలయ ప్రాంగణం విస్తీర్ణంలో ఆదిమ మూలం బొమ్మలు లిఖించే అవకాశం దక్కడం మంత్రి సీతక్క, సమ్మక్క– సారలమ్మ పూజారులకు, ఆదివాసీలకు మరువలేని జ్ఞాపకం. ఆదివాసీల ఆత్మగౌరవానికి అండగా ఉంటామని ప్రకటించడం చాలా సంతోషకరం. – డాక్టర్ మైపతి అరుణ్కుమార్జంపన్న ప్రత్యేకం పగిడిద్దరాజు – నాగులమ్మ కొడుకు జంపన్న గద్దె జంపన్న వాగు ఒడ్డున ఉంది. అక్కడే ఈ గద్దెను అభివృద్ధి చేయాలని పూజారులు నిర్ణయించారు. జంపన్న తమ్ముడైన ముయాన్న గద్దె ఏర్పాటు, వనం పోతురాజు ఇంకా కాపలాగా ఉండే పొలిమేర దేవతల ఏర్పాటును శాస్త్రీయబద్ధంగా పూజారులు తీసుకున్నారు. ప్రధాన ఆర్చీ ద్వారం 40 ఫీట్ల ఎత్తుతో నిర్మించనున్నారు. దీనిపై బండానీ వంశం సమ్మక్క తల్లి 5వ గొట్టు వంశస్తుల పూజిత జంతువు ఒంటికొమ్ము దుప్పి, అటు ఇటు చివరన అడవిదున్న కొమ్ములు, నెమలి ఈకలు ఏర్పాటుచేస్తారు. ఇవి ఆదివాసీల అస్థిత్వానికి రూపాలు. పక్కన రెండు వైపులా నాగులమ్మ (సమ్మక్క చెల్లెలు) పాము రూపంలో ఉంటుంది. వరుసగా కోయ సమాజంలో 6వ గొట్టు ఏనుగు, 3వ గొట్టు ఎద్దు, 4వ గొట్టు ఖడ్గమృగం, 5వ గొట్టు ఒంటి కొమ్ము దుప్పి, 7వ గొట్టు మనుబోతు, 8వ గొట్టు సమ్మక్క తల్లిని చిలకలగట్టు నుంచి తీసుకువచ్చే సిద్ధబోయిన వారి సింహాలు వరుసగా ఏర్పాటు చేస్తారు. ఇందులో మూర్తి అక్కుమ్ (తూత కొమ్ము) ప్రత్యేకం. దేవత ఈ శబ్దం ద్వారానే వస్తుంది అనేది సంకేతం. కింద పిల్లర్లపై కుడి వైపు 5వ గొట్టు తెలిపేలా 5 నిలువు గీతలు, పూజిత పక్షి పావురం, నెమలి పూజిత వృక్షం వెదురు చెట్టు, బండారి చెట్టు, 4వ గొట్టు సమ్మక్క భర్త మూలం తెలిపే 4 నిలువు గీతలు, పూజిత పక్షి సోనోడి పిట్ట, పాలపిట్ట, వృక్షం బూరుగు చెట్టు, తాబేలు ఏర్పాటు చేయనున్నారు. 40 ఫీట్ల ఎత్తుతో ప్రధాన ద్వారం ఎడమ వైపు పిల్లర్లపై మూడవ గొట్టు మూలం 3 నిలువు బొట్లు, త్రిభుజం రాజ్య సింబల్, సారలమ్మ కోసం స్వయంవరంలో బాణంతో కాకిని కొట్టి కాక అడమరాజు సారలమ్మను పెళ్లి చేసుకున్న మనిషితో కూడిన బాణం ఉంటుంది. కాకి బొమ్మ, సిద్ధబోయిన వంశస్తుల వడ్డే గోత్రం వృక్షం ఇప్పచెట్టు, చిలకలగట్టునుంచి దేవతను తీసుకొచ్చే సందర్భం బొమ్మలు.. ఇలా ప్రకృతిలోని జంతువులు, పక్షులు, చెట్ల చిత్రాలను ఈ ఆర్చీలో చేర్చి మేడారం జాతర అంటే ప్రకృతి జాతర అనేలా రూపుదిద్దుతారు. ఆలయంలోని తూర్పు ఈశాన్యం ద్వారం ద్వారా భక్తులు వెళ్తారు. ప్రధాన ద్వారం పూర్తిగా 5వ గొట్టు మూలం బొమ్మలు 25 రకాలు ఉంటాయి. వారి వంశ వృక్షం ఉంటుంది. పక్కన ద్వారం సిద్ధబోయిన కొక్కెర వారి మూల వంశవృక్షం 25 బొమ్మలతో ఉంటుంది. మరో ద్వారం తూర్పు ఆగ్నేయంలో ఉంటుంది. ఇది పగిడిద్దరాజుది. దీనిలో 4వ గొట్టు మూలం పూర్తిగా 25 బొమ్మలతో ఉంటుంది. తాబేలు బొమ్మపై ఉన్న నలుగురు పగిడిద్దరాజు, గోవిందరాజు, నాగుల బండడు, ముల్లూరుడిని తెలుపుతుంది. సమ్మక్క భర్త కావడంతో పగిడిద్దరాజు కుడివైపున ఉంటాడు. మధ్యలో వీరి పెళ్లి చేసిన సిద్ధబోయిన వంశం వారు ఉండేలా రూపొందించారు. వెనుక భాగంలో గోవిందరాజు ద్వారం కూడా 4వ గొట్టు మూలాన్ని తెలుపుతుంది. ప్రధాన ద్వారం వెనుక వైపు సారలమ్మది. దీనిపై పూర్తిగా 3వ గొట్టు మూలం జంతువులు, పక్షులు వేస్తూ కాక అడమ రాజు, సారలమ్మ మూలం తీసుకున్నారు. సమ్మక్క చెల్లెలు నాగులమ్మకి పుట్ట పోసేందుకు 5 మీటర్ల ఖాళీ స్థలం వదిలేశారు. మిగతా ద్వారాలను సాధారణ కోయ మూలాలతో ఏర్పాటు చేస్తున్నారు. చదవండి: పబ్లిక్ టాయిలెట్స్లో హ్యాండ్ డ్రైయర్ వాడుతున్నారా? -
అవగాహనే ఆయుధం : ఇవిగో కొన్ని లైఫ్స్టైల్ టిప్స్
ప్రపంచవ్యాప్తంగా మహిళలను ఆందోళనకు గురి చేస్తున్న వ్యాధుల్లో రొమ్ముక్యాన్సర్ ఒకటి. మనదేశంలో మహిళల్లో వ్యాప్తి చెందుతున్న క్యాన్సర్లలో, అలాగే మహిళల మరణాలకు కారణమవుతున్న క్యాన్సర్లలోనూ దానిదే అగ్రస్థానం. ఈ క్యాన్సర్ను ఎంత త్వరగా కనుక్కుంటే మహిళల్లో సమర్థ చికిత్స ద్వారా దాన్నుంచి నూటికి నూరు పాళ్లూ పూర్తిగా విముక్తి పొందే అవకాశముంది. ఈ అక్టోబరు నెల ‘రొమ్ముక్యాన్సర్ అవగాహన మాసం’(Breast Cancer Awareness Month 2025). ఈ నేపథ్యంలో రొమ్ముక్యాన్సర్కు కారణాలూ, స్క్రీనింగ్ ప్రాధాన్యం, అందుబాటులో ఉన్న చికిత్స ప్రక్రియల వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. రొమ్ముక్యాన్సర్ (Breast Cancer) ప్రధానంగా మహిళల రొమ్ముల్లో ఉండే పాలు ఉత్పత్తి చేసే ‘లోబ్యూల్స్’ అనే గ్రంథుల్లో లేదా ఆపాలను నిపుల్ వరకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడే ట్యూబుల్లో గానీ పెరిగే అవకాశం ఎక్కువ. ఆ హానికరమైన ట్యూమర్ నుంచి క్యాన్సర్ కణాలు పక్కనే ఉండే లింఫ్ నోడ్స్లోకి ప్రవేశించేందుకు అవకాశముంటుంది. ఒకసారి క్యాన్సర్ కణం లింఫ్ నోడ్స్ లోకి గానీ ప్రవేశిస్తే... అక్కడి నుంచి అది దేహంలోని ఏ ్ర΄ాంతానికైనా విస్తరించే ముప్పు ఉంటుంది. అందుకే ఆలోపే దాన్ని కనుక్కోగలిగితే చికిత్సతో రొమ్ముక్యాన్సర్ను పూర్తిగా నయం చేసే అవకాశముంటుంది. అందుకే రొమ్ముక్యాన్సర్పై అవగాహన పెంచుకునే అవకాశం తప్పనిసరి.రొమ్ముక్యాన్సర్ విస్తృతి ఇది సాధారణంగా మహిళల్లోనే ఎక్కువగా వచ్చే ప్రధానమైన క్యాన్సర్. మహిళల్లోనే వస్తుందన్నంత మాత్రాన పురుషుల్లో దీని ముప్పు ఉండదని కాదు. అయితే పురుషుల్లో ఇది కాస్తంత అరుదు. స్త్రీ పురుష నిష్పత్తి ప్రకారం... ప్రతి 135 మంది మహిళలకు ఒక పురుషుడిలో ఇది కనిపిస్తుంది. పైగా గతంలో ΄ోలిస్తే ఇటీవల పురుషుల్లోనూ ఇది కాస్తంత ఎక్కువగానే కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఇది పూర్తిగా మహిళలకే పరిమితమని చెప్పడానికి వీల్లేదు.కారణాలూ... ముప్పును పెంచే అంశాలు ఇదమిత్థంగా ఇవే కారణాలంటూ స్పష్టంగా చెప్పలేకపోయినప్పటికీ... రొమ్ముక్యాన్సర్ను అనేక అంశాలు తెచ్చిపెడతాయి. వాటిల్లో కొన్ని... కుటుంబం చరిత్ర : కుటుంబంలో దగ్గరి వారికి రొమ్ము క్యాన్సర్ వచ్చిన దాఖలాలు ఉండటం, అందునా తల్లి, తల్లి సోదరి లాంటి మరీ దగ్గరి బంధువుల్లో రొమ్ముక్యాన్సర్ దాఖలా ఉన్నవాళ్లలో దీని ముప్పు మరింత ఎక్కువ.జన్యుపరమైన ముప్పు : జన్యుపరంగా బీఆర్సీఏ 1, బీఆర్సీఏ 2 అనే జన్యుపరమైన మ్యుటేషన్ జరిగినవాళ్లలో రొమ్ముక్యాన్సర్ తప్పక వచ్చే అవకాశం.త్వరగా రుతుస్రావం రావడం : బాలికలు చాలా త్వరగా రుతుస్రావం కావడం (అంటే 12 ఏళ్ల లోపే బాలికలు రుతుస్రావం మొదలుకావడం) అలాగే రుతుక్రమం ఆగడం చాలా ఆలస్యంగా జరిగినవాళ్లలో రొమ్ముక్యాన్సర్ ముప్పు (రిస్క్) ఎక్కువ. సంతానలేమి / ఆలస్యంగా సంతానం : సంతానం లేని మహిళలూ, అలాగే చాలా ఆలస్యంగా గర్భవతులైన వాళ్లలో. అస్తవ్యస్తమైన జీవనశైలి / దురలవాట్లు : అంతగా క్రమశిక్షణ లేకుండా అనారోగ్యకరమైన జీవనశైలితో ఉండేవాళ్లకూ, అలాగే పొగతాగడం, మద్యం వంటి అలవాట్లు ఉన్నవాళ్లలో (ప్రధానంగా విదేశీ మహిళల్లో ఈ తరహా అలవాట్లు ఎక్కువ). రేడియేషన్కు గురైన మహిళల్లో : తాము యువతులుగా ఉన్నప్పుడు ఏవైనా కారణాలతో రేడియేషన్కు చాలా ఎక్కువగా ఎక్స్పోజ్ అయిన మహిళల్లో.కుటుంబ చరిత్ర, ఇతర అంశాలూ పూర్తి కారణాలు కాదు... అయితే ఈ సందర్భంగా ఒక ప్రధానమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పైన పేర్కొన్న అంశాలనే ప్రామాణికంగా తీసుకోవడమూ పూర్తిగా సాధ్యం కాదు. ఎందుకంటే వ్యాధి నిర్ధారణ జరిగిన కేసుల్లో దాదాపు 70శాతం మందిలో వాళ్ల కుటుంబంలో రొమ్ముక్యాన్సర్ ఉన్న దాఖలాలు లేకపోవడం ఒక వైరుధ్యం. అలాగే నిర్దిష్టంగా ఫలానా అంశమే రొమ్ముక్యాన్సర్కు కారణమవుతుందని లేదు. చాలా సందర్భాల్లో ఎలాంటి రిస్క్ఫ్యాక్టర్స్ లేనివాళ్లలోనూ ఇది కనిపించడమూ మామూలే. చివరగా... గత మూడు దశాబ్దాల్లో రొమ్ముక్యాన్సర్ చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. దాంతో త్వరగా కనుగొంటే రొమ్ముక్యాన్సర్ను పూర్తిగా నయం చేయడం ఇప్పుడు సాధ్యమవుతోంది. అయితే రొమ్ముక్యాన్సర్ చికిత్స వరకూ వెళ్లకుండానే తమ సొంత దేహంపై పూర్తి అవగాహనతోనూ, ఆరోగ్యకరమైన జీవనశైలిలోనూ దాన్ని నివారించుకోవడం చాలా మేలు అనేది వైద్య నిపుణుల సూచన.అపోహలూ ఎక్కువేరొమ్ముక్యాన్సర్ విషయంలో అపోహలూ ఎక్కువే. ఉదాహరణకు రొమ్ముల్లో గడ్డలు, నీటితిత్తులు ఉన్నప్పుడు అది క్యాన్సరే అని చాలామంది అ΄ోహ పడుతుంటారు. రొమ్ముల్లో గడ్డలూ, నీటితిత్తులూ కనిపించడం చాలా సాధారణం. ఇలాంటివారిలో 80 శాతం కేసుల్లో అది హానికరం కానివే. వాటినే ‘బినైన్’ గడ్డలుగా చెబుతారు. కేవలం 20 శాతం కేసుల్లోనే అవి హానికరమైన (మేలిగ్నెంట్) క్యాన్సర్గా బయటపడతాయి. అందుకే రొమ్ముల్లో గడ్డలు కనిపించగానే అది తప్పనిసరిగా క్యాన్సర్ అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలా కనిపించేవాటిల్లో చాలావరకు అంటే దాదాపు 80 శాతం ఎలాంటి హానీ కలిగించనివే. కాకపోతే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... రొమ్ముల్లో అలాంటి గడ్డలు కనిపించగానే వీలైనంత త్వరగా ఒకసారి డాక్టర్కు చూపించి, అవి హానికరం కాదని వారు నిశ్చయంగా చె΄్పాక ఇక నిశ్చింతగా ఉండవచ్చు. అలాగే పెద్దసైజు రొమ్ములు ఉన్నవారికి ఈ ముప్పు ఎక్కువ అనేది మరో అపోహ. రొమ్ము పెద్దగా ఉండటానికీ, క్యాన్సర్కూ ఎలాంటి సంబంధమూ ఉండదు.చదవండి: స్వయం కృషితో ఎదిగి చరిత్ర సృష్టించారు : టాప్ టెన్ రిచెస్ట్ విమెన్ స్క్రీనింగ్ పరీక్షలు అన్నిటికంటే ప్రధానం...రొమ్ము క్యాన్సర్ను ఎంత త్వరగా కనుక్కుంటే దాన్నుంచి అంత పూర్తిగా విముక్తం కావడం సాధ్యమనే విషయాన్ని బట్టి బ్రెస్ట్క్యాన్సర్ విషయంలో స్క్రీనింగ్ పరీక్షలకు ఉన్న ప్రాధాన్యమేమిటన్నది వివరించవచ్చు. దాదాపు 35 ఏళ్లు దాటిన ప్రతి మహిళా, అలాగే కుటుంబంలో రొమ్ముక్యాన్సర్ ఉన్న మహిళలతో పాటు రిస్క్ఫ్యాక్టర్స్ ఉన్న స్త్రీలు ఏడాదికోమారు లేదా తమ డాక్టర్ చెప్పిన విధంగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. అలాగే ప్రతి మహిళా తమ రొమ్ములను పరీక్షించుకునే ‘సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్’ వివరాలు తెలుసుకుంటూ స్నానం సమయంలో వాటిని పరీక్షించుకుంటూ ఉండాలి. అందువల్ల తొలిదశలోనే రొమ్ముక్యాన్సర్ను కనుక్కోవడం సాధ్యం... తద్వారా దాన్నుంచి పూర్తిగా విముక్తం కావడమూ సాధ్యమే. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు... ఈ కింద పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పుడు వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. అవేమిటంటే... రొమ్ము లేదా చంకల్లో నొప్పిలేని గడ్డ (లంప్) కనిపించడం. రొమ్ము సైజు లేదా ఆకృతిలో మార్పు రావడం. నిపుల్ నుంచి ఏదైనా ద్రవం స్రవిస్తుండటం. రొమ్ము చర్మంపై ఏవైనా మార్పులు అంటే గుంటపడటం లేదా చర్మం మందంగా మారడం వంటివి. చాలా అరుదుగా రొమ్ముక్యాన్సర్ వచ్చినవాళ్లలో రొమ్ములో లంప్, ఒకవేళ లంప్ లేకుండానే రొమ్ముపై చర్మం పొరలు పొరలుగా ఊడుతూ ఉండటం, రొమ్ము ఎర్రబారడం, వాపు వంటి లక్షణాలు చాలా అరుదుగా కనిపించవచ్చు. నివారణ/చికిత్స...క్యాన్సర్కు కారణమయ్యే కొన్ని అంశాల్లో మానవ నియంత్రణ సాధ్యం కాదు. ఉదాహరణకు పెరుగుతుండే వయసు. అయితే మన ప్రమేయంతో రొమ్ముక్యాన్సర్ను చాలావరకు నివారించవచ్చు. ఉదాహరణకు అన్ని పోషకాలు ఉండే సమతులాహారాన్ని తీసుకోవడం; క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం; ప్రసవం తర్వాత పిల్లలకు చనుబాలు పట్టించడం; ఆల్కహాల్, పొగతాగడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం, బరువును నియంత్రణలో ఉంచుకోవడం వంటి జాగ్రత్తలతో రొమ్ము క్యాన్సర్ను చాలావరకు నివారించవచ్చు. అయితే ఇప్పుడు కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, శస్త్రచికిత్సలతోపాటు అనేక ఇతరత్రా ప్రక్రియలతో రొమ్ముక్యాన్సర్కు సమర్థమైన చికిత్స సాధ్యం.నిర్వహణ: యాసీన్ -
ఏఆర్ రెహ్మాన్ను సైతం ఆకట్టుకున్న ఫాతిమా ఫ్యామిలీ
తిరువనంతపురంలోని ఆ ఇంట్లోకి అడుగు పెడితే సంగీత కళాశాలలోకి అడుగు పెట్టినట్లుగా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ కుటుంబ సంగీత కచేరి వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోను చూసి ముచ్చటపడిన సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ ఆ కుటుంబానికి అభినందనలు తెలిపారు.ఫాతిమా వయోలిన్ వాయిస్తుంది. ఆమె చెల్లి గిటార్ వాయిస్తుంది. ఆమె తండ్రి తబలా వాయిస్తూ గానం చేస్తాడు. వీరందరూ కలిసి రెహమాన్ ట్యూన్ చేసిన ‘గురు’ సినిమాలోని ‘తెరే బినా’పాటను అద్భుతంగా ఆలాపించారు. ‘హార్ట్’ ‘క్లాప్’ ఇమోజీలతో కామెంట్ సెక్షన్ నిండిపోయింది. View this post on Instagram A post shared by Fathima Shadha (@fathimashadhav) కనుల, వీనుల విందు చేసే ఈ వీడియో చూస్తూ.... ‘ఆ ఇల్లు ఎంత అదృష్టం చేసుకుందో!’ అని స్పందించారు నెటిజనులు.కన్నుల.. వీనుల విందు -
బ్యాక్ పెయిన్ ఉంటే...స్వీట్ తిన్నా, టీ తాగినా తంటాలే!
ఇప్పుడు అత్యధికులను వేధిస్తున్న నొప్పుల్లో బ్యాక్ పెయిన్ ఒకటి. ఎక్కువ సేపు కూర్చుని చేసే పనుల వల్ల కావచ్చు వాహనాల డ్రైవింగ్ వల్ల కావచ్చు అనేక మంది బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారు. మాత్రలు, ఫిజియోథెరపీలతో కూడా ఫలితం కనిపించక ఆవేదన చెందుతున్నారు. ఈ నేపధ్యంలో ... తీసుకునే ఆహారం కూడా ఈ సమస్య ఎదుర్కుంటున్న వారి వెన్ను నొప్పిపై ప్రభావం చూపిస్తుంది అనే విషయం తెలుసుకోవాలి అంటున్నారు వైద్యులు. వారు చెబుతున్న ప్రకారం.. డిస్క్ అనే పదం ’ఇంటర్ వెర్టెబ్రే’ కు సంక్షిప్త రూపం. , ఈ డిస్క్లు వెన్నెముక (వెన్నుపూస) ఎముకలను వేరు చేసే స్పాంజి కుషన్లు అని చెప్పొచ్చు. ఈ డిస్క్లు షాక్, శోషణను అందిస్తాయి, వెన్నెముకను స్థిరంగా ఉంచుతాయి వెన్నుపూస కదలికను అనుమతించడానికి ’పివోట్ పాయింట్లు’ ఇస్తాయి. వీటిలో ఏర్పడే ఇబ్బందులే వెన్నునొప్పికి దారి తీస్తాయి. అయితే చక్కెరతో పాటు అసమతుల్య ఆహారం డిస్క్ రికవరీకి ఆటంకం కలిగిస్తాయి, వెన్నునొప్పిని మరింత తీవ్రతరం చేస్తాయి కాబట్టి పోషకాహారం తప్పనిసరి అంటున్నారు హైదరాబాద్కి చెంఇన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఒబైదుర్ రెహమాన్, ఈ సందర్భంగా ఆహారం లో మార్పు చేర్పులు చేసుకోకపోతే వెన్నునొప్పి నుంచి కోలుకోవడం కష్టమని ఈ ఆర్థోపెడిక్ సర్జన్ విడుదల చేసిన ఓ వీడియోలో స్పష్టం చేశారు. ఈ అలవాట్లు వెన్నునొప్పిని ఎలా ప్రభావితం చేస్తాయో డిస్క్ సమస్య నయం కాకుండా చేసే ఆ 4 ఆహారపు అలవాట్లు... ఏమిటంటే...చక్కెర లేదా చక్కెరతో టీచక్కెర కలిపిన స్వీట్లు అధికంగా తీసుకోవడం బ్యాక్ పెయిన్ ఉన్నవారికి చేటు చేస్తుంది. అంతేకాదు చక్కెర కలిపిన టీ, కాఫీలు సైతం రోజువారీ పలు దఫాలుగా తాగడం వల్ల నడుము ప్రాంతం, శరీరంలో మంట వస్తుంది డిస్క్ సమస్య నయం కాకుండా నిరోధిస్తుంది.వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారాలువేపుళ్లు చాలా రకాలుగా ఆరోగ్యానికి హానికరం అని తెలిసిందే. అదే విధంగా వేయించిన లేదా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకున్నప్పుడు, అది కూడా నడుముకి దిగువ భాగంలో మంటను కలిగిస్తుంది, డిస్క్ సమస్య నయం కాకుండా నిరోధిస్తుంది,తక్కువ ప్రోటీన్ ఆహారంతక్కువ ప్రోటీన్ ఆహారం లేదా అధిక కార్బ్ లేదా అధిక కొవ్వులు ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు, డిస్క్ కోలుకునే సమయంలో తగినంత పోషకాహారాన్ని పొందదు. అధిక ప్రోటీన్ ఆహారం డిస్క్ సమస్యల పరిష్కారంలో చికిత్సకు మేలు చేస్తుంది. అధిక బెడ్ రెస్ట్చివరగా, ఎక్కువ సేపు పడుకోవడం కూడా మంచిది కాదు. అధిక బెడ్ రెస్ట్లో ఉంటూ, రోజువారీ నడకలకు సమయం కేటాయించకపోతే కూడా, డిస్క్ కోలుకునేందుకు అవసరమైన పోషకాహారాన్ని పొందలేదు. నేషనల్ స్పైన్ హెల్త్ ఫౌండేషన్ ప్రకారం, కాల్షియం విటమిన్ డి వంటి ముఖ్యమైన పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం వెన్నెముక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పోషకాలు ఎముక సాంద్రత, కండరాల పనితీరు మొత్తం కణజాల ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి బోలు ఎముకల వ్యాధి, క్షీణించిన డిస్క్ వ్యాధి దీర్ఘకాలిక వెన్నునొప్పి ప్రమాదాన్ని తగ్గిస్తాయి. -
అభాగ్యుల పాలిటి అన్నదాత
∙విఎస్ సాయిబాబాఅతనొక మధ్యతరగతి యువకుడు. బంధువుల ఇళ్లకు, ఇతర కార్యక్రమాలకు వెళ్లినపుడు వృద్ధులు, ఆస్తి ఉన్నా పట్టెడన్నం పెట్టే దిక్కులేని, కుటుంబసభ్యులు పట్టించుకోని అభాగ్యులు ఆకలితో అలమటిస్తున్న వైనం అతడిని ఎంతగానో బా«ధించింది. అలాంటి అభాగ్యుల కోసం తన వంతుగా ఏదైనా చేయాలని సంకల్పించుకున్నాడతను. అతడే మళ్ల తులసీరామ్ (రాంబాబు). అతడి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలంలోని పంజా వేమవరం.రాంబాబు ఆగర్భ శ్రీమంతుడేమీ కాదు. నాలుగెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చే సాదాసీదా యువరైతు. ఉన్న భూమిలోనే కొంత విస్తీర్ణంలో రొయ్యల సాగు చేపట్టి ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. క్రమంగా రియల్ ఎస్టేట్, రైస్మిల్లుల వ్యాపారాల్లోకి ప్రవేశించి, ఆర్థికంగా మరింత పుంజుకున్నారు. తులసీ కన్వెన్షన్ పేరుతో కల్యాణమండపం నిర్మించారు.ఆర్థికంగా బలపడటంతో అన్నార్తులు, అభాగ్యులైన వృద్ధుల కోసం ఏదైనా చేయాలనుకున్న సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి కార్యాచరణకు దిగారు. భార్య, కుమారుడు, కుమార్తె కూడా తన సంకల్పానికి ప్రోత్సాహం ఇవ్వడంతో 2019 అక్టోబర్ నుంచి ఇంటింటికీ భోజనం క్యారియర్స్ పంపడం ప్రారంభించారు.18 గ్రామాల్లోని 160 మందికివీరవాసరంలో తాను నిర్మించిన తులసీ కల్యాణ మండపంలోనే ప్రతి రోజు ఉదయం వంట తయారు చేసి పంజా వేమవరం పరిసర గ్రామాలైన చింతలకోటిగరువు, తోకలపూడి, తోలేరు, రాయకుదురు, కొణితివాడ, జొన్నలగరువు, నవుడూరు, అండలూరు, ఉత్తరపాలెం, బలుసుగొయ్యపాలెం తదితర 18 గ్రామాల్లోని 160 మందికి ప్రతిరోజూ ఇంటి వద్దకే భోజనం క్యారియర్స్ పంపడం మొదలుపెట్టారు.వివక్షకు తావు లేకుండా...కులమత ఆర్థిక తారతమ్యాలకు తావులేకుండా, వయోభేదం లేకుండా కడుపునిండా భోజనానికి నోచుకోని వారిని ఎంపిక చేసుకుని, వారికి ప్రతిరోజూ భోజనం క్యారియర్లు పంపుతున్నారు. ఆస్తిపాస్తులు, కుటుంబ సభ్యులు ఉండి, తల్లిదండ్రులను పట్టించుకోని కొందరికి రాంబాబు పంపే క్యారియర్ ఒక చెంపదెబ్బ! తమ తల్లిదండ్రులకు రాంబాంబు క్యారియర్ పంపడంతో, పరువుపోతుందని భయపడిన పిల్లలు తల్లిదండ్రులను శ్రద్ధగా చూసుకోవడం మొదలుపెట్టిన సంఘటనలు అనేకం!విరాళాలు నిరాకరిస్తూ..ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకే వంట తయారుచేసి క్యారియర్స్లో సర్ది, అన్నార్తుల ఇంటికి ఒక ఆటో బయలుదేరుతుంది. సుమారు ఉదయం 11 గంటల లోపుగానే రాంబాబు పంపించే భోజనం క్యారియర్ 160 మందికి చేరిపోతుంది. రోజూ ఒకే రకమైన వంటకం కాకుండా; ప్రతి సోమ, గురు, శనివారం రోజుల్లో పప్పు, మంగళ, శుక్రవారాలు కూరగాయలు, బు«ధ, ఆదివారాలు చేపలు లేదా మాంసం లేదా రొయ్యల కూరతో భోజనం కార్యియర్స్ సిద్ధం చేస్తారు. వారం రోజులపాటు రసం, మజ్జిగపులుసు, సాంబారు ఏదో ఒకటి తప్పనిసరి. మాంసాహారం తినని వారికి శాకాహార భోజనమే పంపిస్తారు. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా, వీరందరికీ క్రమం తప్పకుండా ప్రతిరోజూ భోజనం క్యారియర్లు వేళకు అందుతాయి. ఈ పని సజావుగా సాగడానికి ఆరుగురు పనిమనుషులను నియమించుకున్నారు. ఎప్పుడైనా వంటమనిషి రాకుంటే, రాంబాబే స్వయంగా వంట చేస్తారు. కుటుంబ సభ్యులు అతనికి సహకరిస్తారు. ఈ మహత్కార్యంలో తామూ భాగస్వాములం అవుతామని కొందరు విరాళాలు ఇస్తామంటూ ముందుకు వచ్చినా, రాంబాబు సున్నితంగా తిరస్కరిస్తారు. తన తదనంతరం కూడా ఈ కార్యక్రమాన్ని తన కుటుంబ సభ్యులు నిరంతరాయంగా కొనసాగించేందుకు వీలుగా తానే ఒక శాశ్వత నిధిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు రాంబాబు చెబుతున్నారు.అన్నం పెట్టి ఆదుకుంటున్నారుగత రెండేళ్లుగా రాంబాబు పెట్టే భోజనంతోనే బతుకుతున్నాను. నన్ను చూసుకునేవారు ఎవరూ లేరు. గ్రామస్థులు చెప్పిన మాటతో భోజనం క్యారియర్ పంపిస్తున్నారు. భోజనం చాలా బాగుంటుంది.వరహాలు,జొన్నలపాలెం, వీరవాసరం మండలం.రాంబాబే దిక్కునా భార్య చనిపోయింది. ఇద్దరు పిల్లలు ఉన్నా, వారు నన్ను పట్టించుకోరు. నాకు తిండిపెట్టే దిక్కులేని సమయంలో రాంబాబే నాకు దిక్కయ్యారు. ప్రతిరోజూ ఆయన పంపే భోజనం తింటున్నాను.వెంకటేశ్వరరావు, కొణితివాడ, వీరవాసరం మండలం.పదికాలాలు క్షేమంగా ఉండాలిరాంబాబు పంపించే భోజనం చాలా బాగుంటుంది. ప్రతిరోజూ ఒకే రకమైన భోజనం కాకుండా, పండుగ రోజుల్లో మరింత ప్రత్యేంగా భోజనం అందించడం చాలా సంతోషం. అడగకుండానే అన్నంపెట్టే రాంబాబులాంటి వ్యక్తి పదికాలాలపాటు క్షేమంగా ఉండాలి.అప్పారావు, కొణితివాడ.కడుపు నింపడంలోనే సంతృప్తిసంపాదించిన దానిలో కొంతమొత్తంతో కొందరి ఆకలి తీర్చడం కన్నా సంతృప్తి మరొకటి లేదు. ఈ పని తలపెట్టినప్పుడు ఎంతో ఆలోచించాను. నా కుటుంబ సభ్యులు అండగా నిలవడంతో ముందడుగు వేశాను. ‘కోవిడ్’ సమయంలో రెండు మూడు నెలలు మినహా ప్రారంభించిన నాటి నుంచి నిరంతరాయంగా ఈ భోజనం క్యారియర్ల పంపిణీ కొనసాగుతోంది. ఇన్నాళ్లుగా భోజనాలు పంపుతున్నా, రాంబాబు అనే పేరు తప్ప నేనెవరో క్యారియర్లు అందుకుంటున్న చాలామందికి ప్రత్యక్షంగా తెలియదు.మళ్ల తులసీరామ్(రాంబాబు), నిర్వాహకుడు, పంజా వేమవరం. -
పగలూరాత్రి తేడా లేకుండా బిర్యానీలు.. ఇలాగైతే కష్టమే!
ఒకప్పుడు వారంలో ఒకటి, రెండు రోజులు మాత్రమే మాంసాహారం తీసుకునే వాళ్లు. కొందరు ఏదైనా ప్రత్యేక సందర్భంగా మాత్రమే మాంసాహారం తినేవాళ్లు. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతిరోజూ మాంసాహారం తీసుకుంటున్న వారిని చూస్తున్నాం. అంతేకాదు అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత కూడా మాంసాహారం లాగించేస్తున్నారు. అలాంటి వాళ్లు జబ్బులను కూడా కొనితెచ్చుకుంటున్నట్లు వైద్యులు చెపుతున్నారు. మాంసాహారం అధికంగా తీసుకునే వారిలో జీర్ణకోశ వ్యాధులతో పాటు, గుండెజబ్బులు, అధిక కొల్రస్టాల్, ఒబెసిటీతో పాటు, కొన్ని రకాల క్యాన్సర్లు కూడా సోకుతున్నాయంటున్నారు. వారంలో ఒకటి, రెండుసార్లు మాత్రమే మాంసాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇవే నిదర్శనం లబ్బీపేటకు చెందిన రాజేష్ వారంలో ఐదు రోజులు స్నేహితులతో కలిసి అర్ధరాత్రి ఫుడ్కోర్టుల్లో బిర్యానీలు లాగించేస్తుంటాడు. ఇటీవల అర్ధరాత్రి బిర్యానీ తిని ఇంటికి వెళ్లిన తర్వాత కడుపులో తీవ్రమైన మంట రావడంతో ఆస్పత్రికి వెళ్లాడు. ఎండోస్కోపీ చేయగా అల్సర్స్ వచ్చినట్లు నిర్ధారించారు. పటమటకు చెందిన అన్వర్ ఎక్కువగా మటన్ తీసుకుంటుంటాడు. ఇటీవల ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరాడు. గుండె రక్తనాళంలో పూడికలు ఉన్నట్లు నిర్ధారించారు. కొల్రస్టాల్ స్థాయిలు కూడా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇలా వీరిద్దరే కాదు కడుపు ఉబ్బరం, వాంతులు, విరోచనాలు, కడుపులో మంట వంటి జీర్ణకోశ సమస్యలతో వైద్యుల వద్దకు ప్రజలు పరుగులు పెడుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారమిలా.. మాంసాహారాన్ని మితంగా తీసుకోవాలి. వారానికి ఒకటీ, రెండు సార్లు మాత్రమే తీసుకోవడం మంచిది. కొవ్వు తక్కువగా ఉండే స్కిన్లెస్ చికెన్, చేపలు వంటివి ఎంచుకోవాలి. పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మాంసాహారం వల్ల కలిగే దు్రష్పభావాలను తగ్గించవచ్చు. వేపుడు కంటే ఉడికించిన కూరలు తినడం మేలు. జంక్ఫుడ్స్కు దూరంగా ఉండాలి, లేట్ నైట్ మాంసాహారం తీసుకోకూడదు. ఆహారం తీసుకోవడానికి సమయపాలన పాటించాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. సమస్యలు ఇలా... మటన్, బీఫ్, ఫోర్క్ వంటి రెడ్మీట్లో జీర్ణకోశ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. రెడ్మీట్ తినేవారిలో జీర్ణం కావడానికి అధిక సమయం పట్టడంతో పాటు, పేగుపై వత్తిడి పెరుగుతుంది. నిల్వ ఆహారం తినడం వలన కడుపు ఉబ్బరం, వాంతులు, విరోచనాలు అయ్యే అవకాశం ఉంది. రంగు, రుచి కోసం మాంసాహారంలో కొన్ని రకాల రంగులు వాడుతుంటారు. వాటి కారణంగా క్యాన్సర్లు పెరుగుతున్నాయి. సమయ పాలన లేకుండా జంక్ఫుడ్స్ తీసుకోవడం వలన జీర్ణకోశ సమస్యలతో పాటు, క్యాన్సర్లకు దారి తీస్తున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 12 గంటలకు ఆహారం తీసుకోవడం మంచిది కాదు, ఆహారం తీసుకోవడంలో సమయపాలన పాటించాలి. మాంసాహారంలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలె్రస్టాల్ స్థాయిలను పెంచుతాయి, దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మాంసాహారంలో కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల, అధికంగా తింటే శరీర బరువు పెరుగుతుంది. జీర్ణకోశ సమస్యలు పెరిగాయి అధిక మాంసాహారం తీసుకునే వారిలో జీర్ణకోశ సమస్యలతో పాటు, గుండె జబ్బులు, ఒబెసిటీ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రెడ్మీట్ తినే వారిలో పేగులపై వత్తిడి పెరుగుతుంది. నిల్వ ఆహారం, జంక్ఫుడ్స్ తినే వారిలో అల్సర్స్, క్యాన్సర్లు సోకే అవకాశం ఉంది. కడుపు ఉబ్బరం, వాంతులు, విరోచనాలు, కడుపులో మంట వంటి సమస్యలతో మా వద్దకు ఎక్కువగా వస్తున్నారు. సమయపాలన లేని ఆహారపు అలవాట్లు జీర్ణ ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపుతాయి. పళ్లు, కూరగాయలు, చిరుధాన్యాలకు ఆహారంలో ప్రాధాన్యత ఇవ్వాలి. – డాక్టర్ వీర అభినవ్ చింతా, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, సెంటినీ విజయవాడ -
దుర్వాసుడి నరక సందర్శనం
దుర్వాసుడు ఒకసారి పితృలోకానికి వెళ్లాడు. శరీరం నిండా విభూతిని అలంకరించుకుని, రుద్రాక్షమాలలు ధరించి, ‘శివా! శంకరా! పరమేశ్వరా! జగన్మాతా! జగదంబికా!’ అంటూ పార్వతీ పరమేశ్వరులను స్మరిస్తూ అడుగుపెట్టిన దుర్వాసుడిని కవ్యవాలాదులైన పితృదేవతలు ఎదురేగి స్వాగతించారు. దుర్వాసుడిని వారు ఉన్నతాసనంపై కూర్చుండబెట్టి, అతిథి మర్యాదలు చేశారు. కుశల ప్రశ్నలు వేశారు. కబుర్లతో వారు కాలక్షేపం చేస్తుండగా, ఎక్కడి నుంచో ఆర్తనాదాలు, హాహాకారాలు వినిపించసాగాయి.ఆ ఆర్తనాదాలకు, హాహాకారాలకు దుర్వాసుడు కలత చెందాడు. ‘హృదయవిదారకంగా ఉన్న ఈ రోదనలు, హాహాకారాలు ఎక్కడివి?’ అని అడిగాడు.‘మునీశ్వరా! ఇక్కడికి సమీపంలోనే యమలోకం ఉంది. అక్కడ పాపులను శిక్షించడానికి యమధర్మరాజు ఉన్నాడు. అతడి అధీనంలో వేలాదిగా యమదూతలు ఉన్నారు. యమలోకంలో ఎనభైఆరు నరకకూపాలు ఉన్నాయి. వాటిలో భయంకరమైనది కుంభీపాక కూపం. మహాపాపులను తెచ్చి, అందులో పడవేసి, వారిని యమదూతలు ఘోరంగా శిక్షిస్తుంటారు. వారి శిక్షల యాతనను వర్ణించడం అసాధ్యం. శిక్షలు అనుభవిస్తున్న పాపుల ఆర్తనాదాలు, రోదనలు ఇక్కడి వరకు వినిపిస్తూ ఉంటాయి. దైవనింద, గురునింద, పరపీడన, నారీపీడన, మాతృ పితృనింద, మిత్రద్రోహం, స్వామిద్రోహం వంటి మహాపాపాలు చేసి వచ్చిన వారికి శిక్షలు అత్యంత దారుణంగా ఉంటాయి. శిక్షల బాధ తాళలేక ఆ పాపులు చేసే ఆర్తనాదాలు మేము రోజూ వింటూనే ఉంటాం. వారి ఆర్తనాదాలు వింటే చాలు ఎవరికైనా వైరాగ్యం పుడుతుంది’ అని చెప్పారు.నరకం నుంచి వినిపించే పాపుల ఆర్తనాదాలు వింటూ దుర్వాసుడు పితృలోకంలో ఉండలేకపోయాడు. చటుక్కున లేచి, వడివడిగా అడుగులు వేస్తూ నరకం వైపు బయలుదేరాడు. కొద్దిసేపటికే అతడు నరకానికి చేరుకున్నాడు. పెద్దపెట్టున ఆర్తనాదాలు వినిపిస్తున్న కుంభీపాక కూపం వద్దకు వెళ్లాడు. గట్టున నిలబడి లోనికి చూశాడు. అప్పటి వరకు మిన్నుముట్టిన ఆర్తనాదాలు ఆగిపోయి, కేరింతలు మొదలయ్యాయి. కుంభీపాక కూపంలో ఉన్న పాపులు ఉల్లాసంగా, ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఆనంద కేళీ విలాసాలు సాగిస్తూ కనిపించారు. యమలోకం గురించి పితృలోకంలో తాను విన్నదొకటి, తాను స్వయంగా చూస్తున్నది వేరొకటిగా ఉండటంతో దుర్వాసుడు ఆశ్చర్యపోయాడు.దుర్వాసుడు మాత్రమే కాదు, పాపులకు శిక్షలు అమలు చేస్తున్న యమదూతలు కూడా ఈ ఆకస్మిక పరిణామానికి నివ్వెరపోయారు. కఠిన శిక్షలకు యాతనలు అనుభవిస్తూ హాహాకారాలు చేయవలసిన పాపులందరూ కేరింతలు కొడుతూ ఆనందకేళీ నృత్యాలు చేస్తుండటం వారిని అయోమయంలో పడేసింది. కుంభీపాకంలోని మహాపాపులందరూ స్వర్గసౌఖ్యాలు అనుభవిస్తున్నంత ఆనందంగా ఉండటం విడ్డూరంగా తోచింది. ఎంతగా తరచి చూసినా ఈ పరిస్థితికి కారణమేమిటో కనిపించలేదు. ఇదేదో మాయలా ఉందని తలచి యమదూతలు హుటాహుటిన యమధర్మరాజు వద్దకు వెళ్లారు. ‘స్వామీ! కుంభీపాకంలోని మహాపాపులందరూ స్వర్గసౌఖ్యాలు అనుభవిస్తున్నంత ఆనందంగా ఉన్నారు. కొద్దినిమిషాల కిందటి వరకు హాహాకారాలు చేసిన వారే ఇప్పుడు ఉల్లాసంగా కేరింతలు కొడుతున్నారు. దీనికి కారణమేమిటో మాకు ఏమాత్రం అంతుచిక్కకుంది. మీరే ఒకసారి స్వయంగా వచ్చి పరిశీలించండి’ అని చెప్పారు.యమదూతల మాటలకు యమధర్మరాజు ఉలిక్కిపడ్డాడు. కుంభీపాకంలో ఏం జరుగుతోందో చూడటానికి వెంటనే మహిష వాహనాన్ని అధిరోహించాడు. ఎందుకైనా మంచిదని ఇంద్రుడు సహా ఇతర దిక్పాలకులకు, బ్రహ్మ విష్ణువులకు కబురు పెట్టాడు.యముడు, ఇంద్రాది దిక్పాలకులు, బ్రహ్మ విష్ణువులు దాదాపు ఒకేసారి కుంభీపాక కూపం వద్దకు చేరుకున్నారు. లోపల ఉన్న పాపులు ఆనంద పరవశులై కేరింతలు కొడుతున్న దృశ్యాన్ని కళ్లారా చూశారు. ఇది నరకకూపం కాదు, పాపుల కోసం ఏర్పాటు చేసిన భోగకూపంలా ఉందని వారంతా నివ్వెరపోయారు. ఈ విడ్డూరానికి కారణమేమిటో వారెవరికీ అంతుచిక్కలేదు.బ్రహ్మ విష్ణువులు ఇంద్ర యమధర్మరాజులతో తర్జనభర్జనలు జరిపారు. ఎంతగా ఆలోచించినా ఈ వింతకు కారణమేమిటో వారికి తోచలేదు. పరమశివుడిని అడిగితే దీనికి కారణమేమిటో చెప్పగలడని వారంతా ఏకగ్రీవంగా అనుకున్నారు. దిక్పాలకులను, ఇంద్రుడిని, యముడిని వెంటబెట్టుకుని బ్రహ్మ విష్ణువులు నేరుగా కైలాసానికి వెళ్లారు. వారంతా శివుడికి నమస్కరించారు. యమలోకపు వింతను వివరించారు. ‘మహేశ్వరా! ఎంతగా ఆలోచించినా ఈ వింతకు కారణమేమిటో మాకు తోచకున్నది. నువ్వు సర్వజ్ఞుడివి. దీనికి కారణమేమిటో నువ్వే చెప్పాలి’ అన్నాడు విష్ణువు.‘మహావిష్ణూ! ఇందులో వింతా లేదు, విడ్డూరమూ లేదు. ఇదంతా విభూతి మహిమ. కుంభీపాకం వద్దకు దుర్వాసుడు వచ్చాడు కదా! నా భక్తుడైన దుర్వాసుడు విభూతిని ధరించాడు. కుంభీపాకం వద్ద అతడు నిలిచి, తలవంచి లోనికి చూశాడు. అప్పుడు అతడి నుంచి విభూతి రేణువులు రాలి ఆ పాపుల మీద పడ్డాయి. అవి పడిన వెంటనే పాపుల యాతనలు మటుమాయమైపోయాయి. కుంభీపాక కూపం స్వర్గతుల్యంగా మారింది. ఇకపై అది పితృలోక వాసులకు పవిత్ర తీర్థమవుతుంది. అందులో స్నానమాచరించిన పితృదేవతలు సుఖపడతారు. అక్కడ ఆలయం నిర్మించి, మా దంపతులను ప్రతిష్ఠించండి. ప్రీతీశ్వరి, ప్రీతీశ్వరులుగా అందులో కొలువుదీరుతాం. పితృలోక వాసుల పూజలు అందుకుంటాం. ముల్లోకాలలోనూ ఉన్న తీర్థాలన్నింటిలోనూ ఇదే పవిత్ర తీర్థమవుతుంది’ అని ప్రకటించాడు శంకరుడు. దేవతలందరూ శివుడి వద్ద సెలవు పుచ్చుకుని బయలుదేరారు. పరమశివుడు చెప్పినట్లుగానే కుంభీపాకం వద్ద తీర్థాన్ని, ఆలయాన్ని నిర్మించారు. అప్పటి వరకు కుంభీపాకంలో ఉన్నవారంతా దివ్యవిమానాల్లో కైలాసానికి చేరుకున్నారు.∙సాంఖ్యాయన -
శాంతి కోసం యుద్ధం చేశారు!
మహిళలు శాంతి దూతలు. శాంతి కోసం అవసరం అయితే వారు వీధి పోరాట యోధులు కూడా కాగలరు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. కళ్లెదుటి వర్తమానం. నోబెల్ బహుమతులు మొదలయ్యాక ఈ 125 ఏళ్లలో ఇప్పటి వరకు 19 మంది మహిళలు శాంతి విజేతలయ్యారు. ఇది చిన్న సంఖ్యలా అనిపించినా, శాంతి సాధనలో మహిళల సంకల్ప బలానికి ఆకాశమంత సాక్ష్యం. 20 వ మహిళా శాంతి బహుమతి విజేత ఎవరన్నది (ఒకవేళ మహిళే విజేత అయితే) ఈ నెల 10 న నోబెల్ కమిటీ ప్రకటిస్తుంది. ఈసారి ‘శాంతి’ బహుమతికి 224 మంది వ్యక్తులు, 94 సంస్థలు పోటీలో ఉండగా... వాళ్లలో కొందరు మహిళలూ ఉన్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇప్పటి వరకు నోబెల్ శాంతి బహుమతిని పొందిన పందొమ్మిది మంది మహిళల వివరాలు.. మీ కోసం, క్లుప్తంగా.1905 బెర్తా వాన్ సట్నర్ (1843–1914) ఆస్ట్రియా యుద్ధాన్ని వ్యతిరేకించటంలో చూపిన తెగువకు బెర్తాకు ‘నోబెల్ శాంతి’ లభించింది. 19వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన పుస్తకాలలో ఒకటైన యుద్ధ వ్యతిరేక నవల ‘లే డౌన్ యువర్ ఆర్మ్స్’ (1889) బెర్తా రాసిందే. ఈ నవల పేరు అప్పట్లో చాలామందికి రెచ్చగొట్టేదిగా అనిపించింది. బెర్తా అంతర్జాతీయ శాంతి ఉద్యమ నాయకులలో ఒకరు. 1891లో ఆస్ట్రియన్ శాంతి సమాజాన్ని స్థాపించారు. పురుషాధిక్య శాంతి సమావేశాలలో శక్తిమంతమైన నాయకురాలిగా నిలిచారు.1931జేన్ ఆడమ్స్ (1860–1935), అమెరికామానవాళిలో శాంతి స్ఫూర్తిని రగిలించడానికి చేసిన నిరంతర కృషికి జేన్కు నోబెల్ శాంతి బహుమతి లభించింది. జేన్ 1915లో ‘విమెన్స్ ్స ఇంటర్నేషనల్ లీగ్ ఫర్ పీస్ అండ్ ఫ్రీడమ్’ను స్థాపించారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో నెదర్లండ్స్లోని హేగ్లో జరిగిన మహిళల శాంతి సమావేశానికి జేన్ అధ్యక్షత వహించారు. అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్స్ అమెరికాను యుద్ధంలోకి దింపినందుకు వ్యతిరేకంగా జేన్ చాలా బిగ్గరగా నిరసన తెలిపారు. 1946ఎమిలీ గ్రీన్ బాల్చ్ (1867–1961), అమెరికానిరాయుధీకరణ, శాంతి స్థాపనల కోసం ఎమిలీ జీవితాంతం చేసిన కృషికి నోబెల్ శాంతి బహుమతి లభించింది. కానీ ఆమెకు అమెరికా ప్రభుత్వం నుండి ఎటువంటి అభినందనలూ అందలేదు! మొదటి ప్రపంచ యుద్ధంలో ఆమె 1931 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత జేన్ ఆడమ్స్తో కలిసి, యుద్ధాన్ని ఆపడానికి జోక్యం చేసుకోవాలని తటస్థ దేశాల దేశాధినేతలను ఒప్పించారు. 1935లో ఎమిలీ ‘విమెన్స్ ఇంటర్నేషనల్ లీగ్ ఫర్ పీస్ అండ్ ఫ్రీడమ్’ కు నాయకత్వం వహించారు.1976 బెట్టీ విలియమ్స్ (1943–2020), యు.కె.ఉత్తర ఐర్లండ్లో ప్రొటెస్టెంట్లకు, కేథలిక్కులకు మధ్య రగులుతున్న హింసాత్మక సంఘర్షణలకు ముగింపు పలికేందుకు చేసిన కృషికి, మైరీడ్ కొరిగన్ అనే మహిళతో పాటుగా బెట్టి విలియమ్స్కు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 1976 ఆగస్టులో, బెల్ఫాస్ట్లో (ఉత్తర ఐర్లండ్) జరిగిన కాల్పుల ఘటనలో అమాయకులైన ముగ్గురు చిన్నారులు మరణించారు. గృహిణి అయిన బెట్టీ విలియమ్స్ ఆ విషాదాన్ని చూసి, ఉత్తర ఐర్లండ్లో ఘర్షణలు ఆపాలని నిర్ణయించుకుని, శాంతి పునరుద్ధరణకు పాటు పడ్డారు. 1976 మైరీడ్ కొరిగన్ (1944 –), యు.కె.మైరీడ్ బెల్ఫాస్ట్లో ఒక పేద కుటుంబంలో పెరిగారు. యువతిగా ‘లెజియన్ ఆఫ్ మేరీ’ అనే కాథలిక్ సంస్థలో సేవలందించారు. 1976, 1977లలో ఉత్తర ఐర్లండ్లో ఘర్షణలు, హింసకు వ్యతిరేకంగా అట్టడుగు వర్గాలలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు వేలాది మందిని ఒకచోట చేర్చారు. బెట్టీ విలియమ్స్తో కలిసి పని చేశారు. ఆమెతో నోబెల్ శాంతిని పంచుకున్నారు. 1979మదర్ థెరిసా (1910 – 1997), ఇండియామానవాళికి అసమాన సేవలను అందించినందుకు మదర్ థెరిసాకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. అల్బేనియా కేథలిక్ బాలిక అయిన ఆగ్నెస్ గోంక్షా బోజాక్షియు తన పన్నెండేళ్ల వయసులోనే మానవాళి సేవకు అంకితం అయ్యారు. తదనంతర కాలంలో ఇండియాకు వచ్చి థెరిస్సాగా మారిపోయారు. పేదలను ఆదుకునేందుకు ఆమె స్థాపించిన ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ కలకత్తాలో అనాథల కోసం ఇళ్లు, కుష్ఠురోగులకు నర్సింగ్ హోమ్లు, ప్రాణాంతక వ్యాధిగ్రస్తుల కోసం ఆశ్రమాలను నిర్మించింది.1982అల్వా మిర్డాల్ (1902–1986), స్వీడన్1962లో స్వీడిష్ పార్లమెంటుకు ఎన్నికవటానికి ముందే అల్వా మిర్డాల్ ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలుసు. యుద్ధానంత కాలంలో సోషల్ డెమోక్రాట్ పార్టీ ద్వారా కార్మికవర్గ పరిస్థితులను మెరుగుపరచడానికి ఆమె తన జీవితాన్ని అంకితం చేశారు. మహిళల హక్కుల ప్రచారకర్తగా ప్రసిద్ధి చెందారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితిలో ప్రముఖ పదవులను నిర్వహించారు. ఆమె చేసిన నిరాయుధీకరణ ప్రయత్నాలకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 1991ఆంగ్ సాన్ సూకీ (1945–) బర్మాబర్మాలో పౌర ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించాలని సైనిక నాయకులతో పోరాడారు. 1990లో ఆమె పార్టీ ఎన్.ఎల్.డి. స్పష్టమైన విజయం సాధించినా, అప్పటికే గృహ నిర్బంధంలో ఉన్న సూకీని విడుదల చేయటానికి సైన్యం నిరాకరించింది. 21 సంవత్సరాలలో దాదాపు 15 సంవత్సరాలు ఆమె గృహ నిర్బంధంలోనే ఉన్నారు. 2021 ఫిబ్రవరి 1న సైనిక దళాలు తిరుగుబాటు చేసి, సూకీకి మళ్లీ 8 సంవత్సరాల జైలు శిక్ష విధించాయి. ఆమె అహింసాయుత ప్రజా పోరాటం ఆమెకు నోబెల్ శాంతిని తెచ్చిపెట్టింది.1992రిగోబెర్టా మెంచు తుమ్ (1959–) గ్వాటెమాలారిగోబెర్టా మెంచు తుమ్ స్థానిక ఆదివాసీల హక్కుల కోసం కృషి చేసినందుకు గాను నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులను వేటాడుతున్న సైన్యం ఆమె సొంత కుటుంబంలోని అనేక మందిని చంపింది. దాంతో ఆమె 1980ల ప్రారంభంలో మెక్సికోలో తలదాచుకున్నారు. అక్కడ మానవ హక్కుల కోసం పనిచేస్తున్న యూరోపియన్ సమూహాలతో ఆమెకు పరిచయం ఏర్పడింది. గ్వాటెమాలా తిరిగి వచ్చిన తర్వాత ప్రభుత్వం – గెరిల్లా సంస్థల మధ్య చర్చలలో మధ్యవర్తిగా పని చేశారు. 1997జోడీ విలియమ్స్ (1950 –) అమెరికాజోడీ మందు పాతరల వ్యతిరేక ఉద్యమ నాయకురాలు. 1980లలో యుద్ధంలో దెబ్బతిన్న ఎల్ సాల్వడార్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ కాలంలో మందు పాతరలు పౌర జనాభాకు నిరంతరం ముప్పుగా ఉండేవి. వాటి వల్ల చేతులు, కాళ్లు కోల్పోయిన పిల్లలకు కృత్రిమ అవయవాలను అందించే బాధ్యతను ఆమె తీసుకున్నారు. 1991 నుండి మందుపాతరలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రచారాన్ని ప్రారంభించడంలో ముందు నిలిచారు. నోబెల్ విజేత అయ్యారు.2003షిరిన్ ఎబాది (1947–), ఇరాన్ఇస్లామిక్ ప్రపంచం నుంచి తొలి మహిళా శాంతి బహుమతి గ్రహీత. ఇరాన్ తొలి మహిళా న్యాయమూర్తులలో ఒకరు. బ్యూరోక్రసీ పీడనను వ్యతిరేకించారు. పై అధికారులను విమర్శించినందుకు జైలుపాలు అయ్యారు. కనీస మానవ హక్కుల కోసం; ముఖ్యంగా మహిళలు, పిల్లల హక్కుల కోసం పోరాటాన్ని చేపట్టారు. ఇందుకే ఆమెకు నోబెల్ లభించింది. మతం నుండి రాజకీయాలను వేరుచేయాలనే వాదనకు ఎబాది మద్దతుగా నిలిచారు. 2004వంగారి మాతై (1940–2011), కెన్యానోబెల్ శాంతి బహుమతిని అందుకున్న తొలి ఆఫ్రికన్ మహిళ. తూర్పు, మధ్య ఆఫ్రికా నుండి డాక్టరేట్ (జీవశాస్త్రంలో) పొందిన తొలి మహిళ. స్వదేశమైన కెన్యాలో తొలి మహిళా ప్రొఫెసర్ కూడా. కెన్యా ప్రజాస్వామ్య పోరాటంలో చురుకైన పాత్ర వహించారు. 1977లో అడవుల సంరక్షణకు ఉద్యమం ప్రారంభించారు. ‘గ్రీన్ బెల్ట్’ అనే ఆ ఉద్యమం ఇతర ఆఫ్రికన్ దేశాలకు వ్యాపించింది, మూడు కోట్లకు పైగా చెట్లను నాటడానికి దోహదపడింది. సుస్థిరాభివృద్ధి కోసం ఆమె చేసిన కృషికి నోబెల్ దక్కింది. 2011ఎల్లెన్ జాన్సన్ సర్లీఫ్ (1938 –), లైబీరియాఆఫ్రికాలో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన తొలి మహిళా దేశాధినేత. శాంతిని ప్రోత్సహించ డానికి, మహిళల హక్కుల కోసం పోరాడారు. 2005లో అధికారంలోకి వచ్చి, దేశంలో శాంతి సుస్థిరతకు, ఆర్థిక పురోగతికి, మహిళల హక్కుల కోసం పాటుపడ్డారు. ఇందుకే నోబెల్ పొందారు. ఇతర ఆఫ్రికన్ నాయకులకు ఆదర్శంగా నిలిచారు. ఎల్లెన్ జాన్సన్ సర్లీఫ్ అమెరికాలో చదువుకున్నారు. అక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. స్వదేశానికి తిరిగి వచ్చాక రాజకీయ ఉద్యమబాట పట్టారు. 2011లేమా బోవీ (1972–), లైబీరియాశాంతిని నెలకొల్పటానికి, మహిళల హక్కుల కోసం పోరాటం చేశారు. 1990లో లైబీరియాలో అంతర్యుద్ధంలో గాయపడిన బాల సైనికుల సంరక్షణ కోసం ట్రామా థెరపీలో శిక్షణ పొందారు. లేమా నేతృత్వంలోని ‘విమెన్ మాస్ యాక్షన్ ఫర్ పీస్’.. క్రైస్తవ, ముస్లిం మహిళల సంయుక్త ఆధ్వర్యంలో శాంతి, అహింసల సందేశాన్ని అందించే సమావేశాలను నిర్వహించారు. 2008లో, లైబీరియన్ అంతర్యుద్ధంలో మహిళల పోరాటంపై వచ్చిన అవార్డు డాక్యుమెంటరీ చిత్రం ‘ప్రే ది డెవిల్ బ్యాక్ టు హెల్‘లో లేమా కీలక పాత్ర పోషించారు. 2011తవక్కోల్ కర్మాన్ (1979–), యెమెన్జర్నలిస్ట్. యెమెన్స్ లో భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాల కోసం కృషి చేశారు. అధ్యక్షుడు సలేహ్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా అనేక నిరసనలకు నాయకత్వం వహించారు. ‘విమెన్ జర్నలిస్ట్స్ వితౌట్ చైన్స్ ్స’ అనే సంస్థను స్థాపించారు. ఉద్యమశీలిగా జైలు శిక్ష అనుభవించారు. హింసలకు గురయ్యారు. 2011లో షియా– సున్నీ ముస్లింల మధ్య; ఇస్లాం–ఇతర మతాల మధ్య సయోధ్యను ప్రోత్సహించడానికి ఆమె చేసిన ప్రయత్నాలు ప్రశంసలు అందుకున్నాయి. 2014 మలాలా యూసఫ్జాయ్ (1997–), యు.కె.ప్రతి చిన్నారికీ చదువుకునే హక్కు ఉందని పోరాడినందుకు మలాలాకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఆమె పాకిస్తాన్స్ లోని స్వాత్ లోయలో జన్మించారు. 2012లో తాలిబాన్లు పాఠశాల బస్సుపై కాల్పులు జరిపినప్పుడు మలాలా తలపై గాయమైంది. ఆమెకు వ్యతిరేకంగా ఫత్వా జారీ అవటంతో ఆమె బ్రిటన్లో ప్రవాసంలో నివసించాల్సి వచ్చింది. ఆమె తన 16వ పుట్టినరోజున ఐక్యరాజ్యసమితిలో ప్రసంగిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలికల విద్యకు సమాన హక్కుల కోసం పిలుపునిచ్చారు. 2018నాదియా మురాద్ (1993–), ఇరాక్లైంగిక హింసను యుద్ధాలలో ఆయుధంగా ఉపయోగించటంపై పోరాటం చేశారు. ఇరవై ఒక్క ఏళ్ల నాదియాను, ఇతర యువతులను ‘ఐ.ఎస్.’ ఉగ్రవాదులు అపహరించి లైంగిక బానిసలుగా చేసుకున్నారు. కొన్ని నెలల తర్వాత, నాదియా తప్పించుకుని 2015లో జర్మనీ చేరుకున్నారు. ‘ది లాస్ట్ గర్ల్‘ అనే పేరుతో ఆత్మకథను రాశారు. తనపై జరిగిన దురాగతాలను అందులో వివరించడం ద్వారా, భవిష్యత్ తరాల బాలికలు, యువతులు యుద్ధంలో లైంగిక హింసకు బాధితులుగా మారకుండా ఉంటారని ఆకాంక్షించారు.2021మరియా రెస్సా (1963–), ఫిలిప్పీన్స్పత్రికా స్వేచ్ఛ కోసం పోరాడారు. ఫిలిప్పీన్స్ ్స డిలిమాన్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ చేసిన రెస్సా, సీఎన్ఎన్ స్థానిక కరస్పాండెంట్గా పనిచేశారు. ప్రధానంగా ఆగ్నేయాసియాలో ఉగ్రవాదం విస్తరించడంపై ప్రత్యేక వార్తా కథనాలు రాశారు. అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే పాలనాధికార దుర్వినియోగాన్ని, హింసాత్మకమైన నిరంకుశత్వాన్ని బహిర్గతం చేశారు. నకిలీ వార్తలను వ్యాప్తి చేయడానికి, ప్రత్యర్థులను వేధించడానికి డూటెర్టే సోషల్ మీడియాను ఎలా ఉపయోగిస్తున్నారో బయటపెట్టారు.∙∙ 2023నర్గేస్ మొహమ్మది (1972–), ఇరాన్ఇరాన్స్ లో మహిళలపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా 20 ఏళ్లకు పైగా పోరాడారు. మరణశిక్షలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ప్రభుత్వం ఆమెను 13 సార్లు అరెస్టు చేసి 31 సంవత్సరాల జైలు శిక్ష, 154 కొరడా దెబ్బలు విధించింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీతగా ఎంపిక జరిగినప్పుడు ఆమె టెహ్రాన్స్ లోని ఎవిన్ జైలులో బందీగా ఉన్నారు. నర్గేస్ తన శాంతి బహుమతి గురించి మాట్లాడుతూ.. ‘‘ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వాల కోసం కృషి చేయటాన్ని నేను ఎన్నటికీ ఆపను..’’ అని వ్యాఖ్యానించారు. · సాక్షి, స్పెషల్ డెస్క్ -
శోకగర్భ
నుదుటి మీద అరచేయి అడ్డుపెట్టి, కళ్ళు విప్పార్చి, ఆకాశంలో ఎగిరే గెద్ద వేపు చూసే పిల్లల కోడిలా దూరంగా కన్పించే వ్యక్తులను ఆందోళనగా చూడసాగేడు మజ్జి సూరపు నాయుడు...వారం రోజులుగా యేదో వేళ, యెవరెవరో వస్తున్నారు. పొలాలను పరిశీలిస్తున్నారు, వెళ్తున్నారు. ఎవరితోనూ ఏమీ మాటాడడం లేదు. ‘వాళ్ళెవరు?’ ప్రశ్నార్థకంగా చూస్తున్న సూరపు నాయుడి చొక్కా జేబులోని సెల్ మోగింది. నుదుటి మీది అరచేయి తీసి, చొక్కా జేబులోని సెల్ తీసి పట్టుకొని... ‘‘అలో...ఎవుళూ’’ అని ప్రశ్నించాడు. అవతలి వ్యక్తి తాను ఎవరో చెప్పాడు. ‘‘నువ్వా?’’ అన్నాడు సూరపు నాయుడు. అవతలి వ్యక్తి యేమేమో చెప్తున్నాడు. నాయుడు అన్యమనస్కంగా వింటూ, దూరంగా కన్పించే వ్యక్తుల కదలికలు గమనిస్తున్నాడు.‘‘ఇంటన్నవా నా మాటలు? ఉలకవూ పలకవు. ఏటి చేస్తన్నావ్ బావా?’’ అని ప్రశ్నించాడు అవతలి వ్యక్తి.‘‘వోయ్... వోరమ్ రోజుల నించి పొలాలంట ఎవులెవులో తిరగతన్నారోయ్. ఏటో అనుమానంగా వుందోయ్. పొలాలకి గాలి వొచ్చీటట్టుగా వుందోయ్’’ – అని భయాన్ని వ్యక్తం చేశాడు నాయుడు.‘‘ఏనుగులో, ఎలుగుబంట్లో, జెంతువులేవో పొలాలంట తిరిగితే బయపడాల గాని మనుషులు తిరిగితే బయపడతావేటి బావా?’’ ‘‘జెంతువులయితే పంటల్ని తిని ఎలిపోతాయి, మనుషులు గాని అలికిడి అయితే పారిపోతాయి’’... అని బదులు చెప్తున్నాడు నాయుడు.‘‘అయితేటి ఆలెవులో పొలాల్ని వొట్టుకుపోతారా?’’‘‘వొట్టుకుపోరు, తీసీసుకుంటారు.’’‘‘ఇచ్చీ బావా, మంచి ధర గాని ఇస్తే ఇచ్చీబావా. ఏల ఏటా అప్పుల్ని పండిస్తావు? పిల్లల బతుకులు పాడు చేస్తావు. ఇచ్చీ, ఆ డబ్బు వొట్టుకొని ఇక్కడికి వొచ్చీ.’’సూరపు నాయుడిని వొచ్చేయమని పిలిచిన అవతలి వ్యక్తి సూరపు నాయుడి మేనమామ కొడుకు, పసరాపల్లి వూరివాడు.మేనమామకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఫోనులో మాటాడే అవతలి వ్యక్తి మేనమామ చిన్నకొడుకు, సూరపు నాయుడి కంటే నాలుగేళ్ళు పెద్ద. మేనమామ చనిపోయాక అతని ఇద్దరు కొడుకులు ఆస్తి వాటాలు వేసుకుని, వేరు కాపురాలు అయిపోయారు. పసరాపల్లి ప్రాంతాన థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రతిపాదన రావడం, ఆ ప్రాంత భూములను సేకరించడానికి ప్రభుత్వం పూనుకోవడం, రైతులు ప్రతిఘటించడం, పోలీసు కాల్పుల్లో తన అన్న చనిపోవడం, కేసులు, కోర్టులతో విసిగి, రెండు కుటుంబాలతో హైదరాబాద్ వలస వచ్చేశాడాయన. రెండు కుటుంబాలు కూలీ, నాలీ చేసుకు బతుకుతున్నాయి. తిప్పలెన్ని పడినా, తిండికీ, గుడ్డకీ లోటు లేకుండా గడిచిపోతున్నాయి రోజులు. అందుకే ఆయన సూరపునాయుడ్ని వొచ్చేయమన్నాడు. సూరపు నాయుడు ఆ వ్యక్తితో మాటాడుతూనే పొలం నుంచి వూరి గోర్జీ తోవలోకి నడిచాడు. నడుస్తున్న వాడు ఆగి – ‘‘ఏటివోయ్? పొలం అమ్మీసి, పట్నమొచ్చి ఆ డబ్బులు తిని కూకోమంటావా?’’ అని ప్రశ్నించాడు. ‘‘తిని కూకోడం ఏల బావా? పట్నంల వొవ్వో... బోల్డు పనులు... అపార్ట్మెంట్లల్ల వాచ్మెన్, పెద్ద పెద్దోల్ల బంగ్లాల గేటు కాపలా, యేదో చిన్నా చితకా ఫేక్టరీలల్ల లేబర్ ... ఇలాటివి దొరకవా?’’ అనన్నాడు. ‘‘దొరకవా అని నన్నడుగుతావు? నాకేటి తెలుసు?’’ ప్రశ్నించాడు సూరపు నాయుడు.అవతలి వ్యక్తి, ఆ ప్రశ్నను పట్టించుకోకుండా – ‘‘కాదంటావా... తాపీ పనికో, కళాసీ పనికో యెళ్తే డయిలీ ఇన్కమ్ బావా’’ – అని ఇంగ్లీషులో చెప్పాడు సూరపు నాయుడులో ఆశలు రగిలించడానికి.‘‘వోయ్... రైతోడు చేపలాంటోడువోయ్. పొలమొదిలేస్తే వొడ్డున పడ్డ చేప అయిపోతాడు’’... అన్నాడు నాయుడు. ‘‘వోస్... నీను మరి రైతుని కానేటి? భూమి పోయినపుడు వొచ్చీలేదేటి? వొచ్చిన తొలినాళ్ళు కసింత బెంగగా వుంటాది. ఏదో పని దొరికిన తరాత అలవాటయి పోతాది – వొచ్చీవోయ్. ఒచ్చీ. భూమి ఇచ్చీవోయ్ ఇచ్చీ, పరిహారం అందుకో. అందల కొంత సొమ్ముతో, కూతురుకి పెళ్లిచేసి, అత్తోరింటికి తోలీ. మిగిలిన సొమ్ము తీసుకొని, కొడుకుని తీసుకొని వొచ్చీ. ఆడికి ఆటో ఒకటి కొనీసి ఇచ్చీ. ఇక్కడ ఆటోకి మంచి గిరాకీ. ఇంకోపక్క నువ్వు ఏదో పనికి కుదిరి పోనావనుకో, ఇంక మరి సూడక్కర్లేదు మీకు’’... అని భవిష్యత్ ఆశాజనకంగా చెప్పాడు అవతలి వ్యక్తి. రాజకీయ నాయకులు, అధికారులు కూడా ఆశాజనకంగా చెప్తున్నారు. కంపెనీలు వొస్తే, ఉజ్జోగాలొస్తాయి. హోటళ్ళు, లాడ్జింగులు, బిల్డింగ్లు, రోడ్లుతో ప్రాంతం రూపురేఖలే మారిపోతాయ్ అంటన్నారు. సూరపు నాయుడికే ఏమీ తోచడం లేదు. నిలబడినవాడు, నడుస్తూ – ‘‘నాకు రైత్వారీ పని తప్ప, ఇంకొక పని రాదుగదా’’... అన్నాడు దిగాలుగా. ∙∙∙కొద్ది రోజులకు సూరపునాయుడు భయపడ్డట్టుగానే పొలాలను పరిశీలించిన వారు పొలాలను ఏదో కర్మాగారం కోసం తీసుకున్నారు. రైతులు కొన్నాళ్లు వ్యతిరేకించారు. పోరాడేరు గాని, కొసకు భూములు ఇవ్వక తప్పలేదు. మేనమామ చిన్న కొడుకు చెప్పినట్టే సూరపు నాయుడు ఆడపిల్ల పెళ్లి చేసి, తరవాత కొడుకుని పట్టుకొని హైదారాబాద్ వెళిపోయాడు. మిగిలిన సొమ్ము ఆటో కొనడానికి చాలలేదు, కొంత ఫైనా¯Œ ్స వాడేడు. కొడుకు ఆటో తిప్పుతూ ఫైనా ్స నక్షత్రకుడికి కిస్తీలు కడుతున్నాడు. సూరపు నాయుడు రకరకాల కూలిపనులు చేస్తూ చివరికి ఒక కోటీశ్వరుని ఇంటనున్న రెండు కుక్కల ఆలనా పాలనా చూడడానికి కుదురుకున్నాడు. పొద్దున్న ఏడో గంటకి ఆ కోటీశ్వరుని ఇంటికి చేరితే, రెండు కుక్కలూ రెడీగా ఉంటాయి షికారుకి. షికారుకి వెళ్ళినపుడే అవి ఒంటికీ, రెంటికీ కానిస్తాయి. సూరపు నాయుడే వాటిని శుభ్రం చేయాలి. రెండూ నాయుడి భుజాల దగ్గరకు ఉంటాయి. నాయుడి కంటే బలంగా ఉంటాయి. ఉండవా మరి? అవి తినేవో? మన్లాగా అంబలీ, గెంజీ తాగుతాయేటి? అనుకున్నాడు నాయుడు. తొలినాళ్ళల్లో నాయుడు వాటిని తిప్పడానికి నానా అవస్థలు పడ్డాడు. వాట్ని చూసి భయపడ్డాడు. ‘బేపుల్లాగా లేవివి, బెమ్మ రాచ్చసుల్లాగ వున్నాయి’ అనుకునీవోడు. రాన్రాను మచ్చికయినాయి. కోటీశ్వరుని ఇంటిలో విని నేర్చుకున్న ఇంగ్లీషు పదాలతో... ‘కమాన్, గో,గో, వెయిట్, వెయిట్’ వంటి ఆర్డర్లు వేస్తున్నాడు. షికారుకి కుక్కల్ని తీసుకు వెళ్ళే సమయంలో ఆపుడపుడూ వాటితో ఊసులాడుతుంటాడు. అవి కూడా సూరపు నాయుడి ‘ఊరు ఎలా ఉంటుంది? నగరంలా బాగుంటుందా? అన్నీ పూరిపాకలేనా,పెద్ద,పెద్ద భవంతులుంటాయా? అక్కడ మాలాంటి డాగ్స్ ఉంటాయా?’ అని ప్రశ్నించేవి. సూరపు నాయుడికి ఆ ప్రశ్నలకు జవాబులు చెప్తుంటే పల్లెకూ, నగరానికీ మధ్య అంతరం తెలిసొచ్చేది. దాంతో విచారంగా మౌనంగా నడిచేవాడు. మౌనంగా నడిచే నాయుడిని – ‘మీ ఊరిలో మాలాటి డాగ్స్ లేవుకదా’, ఉండబోవన్న ధీమాగా ప్రశ్నించేవి ఆ కుక్కలు.అప్పుడు... ‘మా ఊరిలో మిమ్మల్ని డాగ్స్ అనరు. బేపులు అంటారు’... అని చెప్పి, తమ ఊరి బేపులెలాగుంటాయో, ఎంత మంచివో, ఇళ్లనీ, ఊరినీ ఎలాగ కాపలా కాస్తాయో చెప్పేవాడు. వాటిని మనుషులు ఎవులో తిప్పక్కర లేదనీ, అవే తిరగతాయనీ, తిండీ ఒకలెవులో తెచ్చి పెట్టక్కర లేదనీ, అవే సంపాయిస్తాయనీ... చెప్పేవాడు. అపుడు ఆ కుక్కలు నిసాకారంగా సూరపు నాయుడి వేపు చూసి – ‘మీ వూరి వాళ్ళు వాటికి తిండీ, తిప్పలు చూడరా? ఏం మనుషులోయ్’ అననేవి. ‘మా వూళ్ళంట బేపులకి మెడలకి బెల్టులు, గొలుసులూ కట్టరు. ఫ్రీగా వొదిలేస్తారు. ఆటి ఇష్టం ఇళ్ళల్లోకి దూరతాయి, వీధుల్లో తిరగతాయి, ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎళ్తాయి, కట్టడి వుండదాటికి. సిత్త కార్తే వొచ్చిందంటే ... సూడాల ఆటి బాగోతం’ అననేవాడు. ఆ కుక్కలకు ఆ బాగోతం ఏమిటో తెలీలేదు గానీ, ఈ నాయుడోడు వాడి వూరి బేపులు తమ కంటే గొప్పవి సుమా అని తమకు చెప్తున్నాడని భావించి, చిరాకెత్తి, కోపగించి, భౌభౌభౌ అని అరచి తమ నిరసన తెలియ జేసేవి. ∙∙∙కొన్నాళ్ళకు నగరంలో బతకటానికి అలవాటుపడ్డాడు సూరపు నాయుడు. నగరం భయపెట్టటం లేదు. భద్రం కొడుకో అని హెచ్చరిక చేస్తోంది. కిక్కిరిసిన జన సమూహంలో ఒంటరివే సుమా అన్న ఎరుకను కలిగించింది. ఒంటరితనం పోగొట్టుకోడానికి అపుడపుడూ తన మేనమామ చిన్నకొడుకుని కలుస్తుంటాడు. ఇద్దరూ కాసేపు తమ గత జీవనాన్ని, తమ తాత, ముత్తాతల తరతరాల జీవనాన్ని ఎరిగిన మేరకు కలబోసుకుంటారు. తామే కాక తమ ప్రాంత జనులంతా శాపగ్రస్తులనీ, ఒడ్డు కనిపించని ప్రవాహంలో ఈదులాడే వాళ్ళనీ... తమ ప్రాంతం చిరకాల శోకగర్భ ప్రాంతమని చింతిస్తారు.కడుపులు కెరలిపోతాయి. ఊరట కోసం సారా కొట్టు చేరుతారు. అపుడపుడూ వీరికి తోడు వీరిలాగే వలస వచ్చిన వాళ్ళు ఎవరో తోడవుతారు. వాళ్లూ లోపలి శోకాన్ని వెళ్లగక్కుతారు... అవెంతో గొప్ప అడివిలున్నాయి. సాగరతీరమా ఎక్కవే వుంది, సారవంత బూములున్నాయి... ఎందుకు మనం ఇలగ వొలసలు రావలసొచ్చింది? ఎందుకు? అక్కరకు రాని కంపెనీల బదులు నదులకి ఆనకట్టలు, పంటలకి కిట్టుబాటు ధరలందితే, జనప, చెరకు వంటి పంటల మీద మిల్లులెడితే మనకీ దుర్గతి రాదుగదా – అని విలపిస్తారు.మద్యపాన దుకాణాల్లో కడుపుల్లోకి మద్యం వెళ్తుంది, గానీ, లోపలి దుఖం బయటకు వెళ్ళదు. మత్తు ఎక్కినా, నొప్పి ఏదో మోస్తూ, తూలుతూ ఇళ్ళు చేరుతారు.అయిదేళ్లు గడిచిపోయాయి. ఎన్నికల ప్రకటన వచ్చింది. తమలాగా నగరానికి వలస వచ్చిన వారికోసం పోటీ చేసిన ప్రధాన పార్టీల వారు బస్సులు వేశారు. వోట్ల కోసం సరఫరా చేయాల్సినవన్నీ చేశారు. ఆ బస్సుల్లో సూరపు నాయుడి కుటుంబమే కాక, ఆ ప్రాంతపు కుటుంబాలు మరికొన్ని ప్రయాణించాయి. ఆ కుటుంబాలు చీపురుపల్లి, రణస్థలం, భోగాపురం తదితర ప్రాంతాల నుండి వలస వచ్చినవి. ప్రయాణం మధ్యలో భోజనాలకు ఆగినపుడు మరికొన్ని బస్సుల్లో మరికొన్ని కుటుంబాలు కలిశాయి. అవి అటు పార్వతీపురం పరిసరాల నుండి ఇటు అనకాపల్లి, చోడవరం, అరకు ప్రాంతాల నుండి వచ్చినవి. కళింగం అంతా దాదాపు వలసలు పోయిందా ఏటి అన్పించింది సూరపు నాయుడికి. ఓటు వేశాక వెంటనే బయల్దేరలేదు. రెండు రోజులు వుండిపోయాడు. ఫ్రీ బస్సులు వెలిపోయాయి. స్వంత వూరిలో ఒకరోజు వున్నారు..స్వంత వూరు రూపు రేఖలు మారిపోయాయి, ఊరినిండా ఏవేవో బిల్డింగులు, దుకాణాలు, ఆఫీసులు... ఒంటినిండా పచ్చబొట్లు పొడుచుకున్న అమ్మవారిలా వుంది ఊరు. పరాయి ఊరులా అన్పించీ, మరసటి రోజే కూతురి వూరు వెళిపోయారు.కూతురి ఊరు ఉద్దాన ప్రాంతం. అరటి, కొబ్బరి, పనస, జీడి తోటలతో ఆకుపచ్చగా ఉంటుంది. కూతురి అత్తవారికి ఒక ఎకరా తోట వుంది. అత్త, మామలు ఉన్నారు. రెండు గదుల ఇల్లుంది. అల్లుడు కష్టజీవి. తోట మీద ఫలసాయంతో ఇబ్బందులు లేకుండా బతుకుతున్నారు. కూతురికి మూడేళ్ళ కొడుకు. ఇపుడు గర్భిణీ. పలాసలో ఏవో స్వీట్స్, పళ్ళు కొని తీసుకు వెళ్లారు. రాత్రివేళ భోజనాలయ్యాక కూతురి కాపురం బాగుందని సంతోషించిన సూరపు నాయుడు – ‘‘ఎంతయినా మీ ఉద్దానం మా మడక కంటే శ్రేష్టమైనిది’’ అనన్నాడు. ‘‘నిజిమే గాని, ఇక్కడి బతుకులూ గాలిలో దీపాలే మామా, చేతులు అడ్డుబెట్టి దీపాలు ఆరకుండా సూస్తన్నాం’’ అని బదులిచ్చాడు అల్లుడు. కలుక్కుమన్నాది సూరపునాయుడి గుండె. ‘‘తుఫానులు, మార్కెట్లూ దెబ్బగొడతన్నా కాసుకుంటన్నాంలే’’ అనన్నాడు అల్లుడు. ఆ మాటతో కాస్త ఊరట చెందాడు నాయుడు.ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. మరో ఏడాది గడిచింది. రోజు పొద్దుటి పూట. కోటీశ్వరుని కుక్కలకు ఫుడ్ పెడుతుండగా సూరపు నాయుడికి ఫోన్ వచ్చింది.జేబులో ఫోన్ తీసి – అలో అన్నాడు ‘..నీను మామా...’ అన్నాడు అల్లుడు అవతల నుంచి ‘... నువ్వా? బాగున్నావా నాయినా? మాయమ్మీ,పిల్లలూ బాగున్నారా? ‘...ఆ, ఆ, అంతా బాగున్నాం, గానీ...’‘...ఆ..కానీ..?’ఆందోళనగా అడిగాడు సూరపునాయుడు. ‘మేమూ అక్కడకి వలస వొచ్చేస్తాము. మీకు తెలిసిన వోరి దగ్గిర ఏదేనా పని చూడు మామా, వొచ్చేస్తాము...’ ‘...వొచ్చెత్తారా? ఏమీ? మీ తోటలూ, దొడ్లూ ఏటి చేస్తారు?’ ‘...ఏదో పెద్ద కంపెనీ వొస్తందట, ఇంకోపక్క విమానాశ్రయం కడతారట... ఆటికి భూమి కావాలగదా? దగ్గిర, దగ్గిర మా మడకల నాలుగైదు ఊళ్లు ఖాళీ అయిపోతాయి... తొందరగా ఏదేనా పని చూడు మామా...’ ఎలుగుగొడ్డు ఏదో గోళ్ళతో తన గుండెను రక్కినట్టన్పించింది సూరపునాయుడికి. అల్లుడికి ఏమి చెప్పాలో తెలీక, మౌనంగా ఉండిపోయాడు. ఆ సమయంలోనే యజమాని వచ్చి, ఏదో పేకెట్ చేత్తో పరిశీలిస్తూ – ‘‘ఓయ్, నాయుడూ, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన పేకెట్ తెచ్చీసావోయ్. ఇది డాగ్స్కి పెట్టకు సుమీ. షాప్ వాడికి రిటనిచ్చేయి’’ అనన్నాడు. నాయుడికి అర్థం కాలేదు. అవతల ఫోన్లో అల్లుడు ఏదో చెప్తున్నాడు, అయోమయంగా చూశాడు యజమాని వేపు. ‘‘...ప్రతీ దానికీ కొన్నాళ్లే గడువు వుంటుంది..’’ అని యజమాని పేకెట్లో తేదీని చూపి – ‘‘ఈ తేదీ దాటినాక ఇది వాడకూడదు... వాడితే డేంజర్’’ అని విడమరిచాడు.యజమాని వివరణ, అల్లుడి సంభాషణ, నాయుడి మనసులో ప్రశ్నలు రేపాయి. –‘ఈ ఎక్స్పైరీ డేట్ అనేది మాకూ, మా వలస బతుకులకీ ఉండదా?’ నిజానికి సూరపు నాయుడు మనసులో ఆ ప్రశ్న అనుకున్నాడు కాని, అసంకల్పితంగా నోటి నుండి బయటకి వచ్చేసింది. ఆ యజమానికి ఏమీ అర్థం కాలేదు. ‘‘ఏమిటోయ్ నాయుడూ? ఏమంటున్నావ్?’’ అని ప్రశ్నించాడు.శోకంతో పూడుకు పోయిన సూరపు నాయుడి గొంతు పెగలలేదు, మౌనంగా ఉండిపోయాడు. కొన్నాళ్ళకు నగరంలో బతకటానికి అలవాటుపడ్డాడు సూరపు నాయుడు. నగరం భయపెట్టటం లేదు. భద్రం కొడుకో అని హెచ్చరిక చేస్తోంది. కిక్కిరిసిన జన సమూహంలో ఒంటరివే సుమా అన్న ఎరుకను కలిగించింది. -
తరం తడబాటు
ఈ లెక్కలన్నీ ఏం చెప్తున్నాయి?. యువత, విద్యార్థుల మానసిక ఆరోగ్యం ప్రజా సమస్యగా మారుతోందని. ఇవి ఏవో కాకి లెక్కలు కాదు, ప్రతిష్ఠాత్మక జాతీయ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వెల్లడైన విస్తుగొల్పే వాస్తవాలు. విద్యాపరమైన ఒత్తిడి, తల్లిదండ్రుల ఆశలు, అధిక పోటీతో కూడిన విద్యా వ్యవస్థ విద్యార్థుల్లో ఆందోళన, నిస్ప ృహ, ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ సంక్షోభం తీవ్రమైన పరిణామాలకు దారితీస్తోంది, ముఖ్యంగా యువతలో ఆత్మహత్యల రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.విద్యార్థుల మానసిక ఆరోగ్య సంక్షోభంపై గణాంకాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ప్రకారం భారతదేశంలో ఆత్మహత్యల రేటు విద్యార్థుల్లో స్థిరంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 2022 సంవత్సరంలో 13,000 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, అంటే ప్రతిరోజూ సగటున 35 మంది విద్యార్థులు ప్రాణాలను తీసుకున్నారు. 2022లో దేశంలో జరిగిన మొత్తం ఆత్మహత్యలలో విద్యార్థుల ఆత్మహత్యలు 7.6%. గత పదేళ్లలో (2013–2022) విద్యార్థుల ఆత్మహత్యలు 64% పెరిగాయి. ఈ సంఖ్య 6,654 నుండి 13,044కు చేరింది. భారతదేశంలోని 30 విశ్వవిద్యాలయాలలో 2024లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, ప్రతి పదిమంది విద్యార్థులలో ఒకరికి గత సంవత్సరంలో ఆత్మహత్య ఆలోచనలు వచ్చాయి. వీరిలో మూడింట ఒక వంతు మంది ఆత్మహత్యకు ప్రయత్నించారు.నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం పరీక్షల్లో వైఫల్యం ఆత్మహత్యలకు ఒక కారణం. రాజస్థాన్లోని కోటా సహా కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి పొందిన నగరాల్లో ఈ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి.పాఠశాల పిల్లల్లో కూడా.. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (ఎన్ఐఎంహెచ్ఏఎన్) నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం భారతదేశంలోని 23% మంది పాఠశాల విద్యార్థులు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ‘నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్’, సీబీఎస్ఈ సంస్థలు పాఠశాలల్లో నిర్వహించిన ఒక సర్వేలో 13–17 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులలో 81% మందికి పరీక్షల ఒత్తిడి ప్రధాన సమస్యగా ఉందని వెల్లడైంది. యూనిసెఫ్ 2021 నివేదిక ప్రకారం, భారతదేశంలో 15–24 సంవత్సరాల వయస్సు గల యువతలో 14% మంది తరచుగా ఆందోళన లేదా డిప్రెషన్ వంటి వాటితో బాధపడుతున్నారు.విద్యార్థుల్లో మానసిక అనారోగ్య లక్షణాలు ఇలా ఉంటాయి. వీటిలో కొన్ని దీర్ఘ కాలం కనిపిస్తే వారిలో మానసిక సమస్య ఉందని అంచనా వేయవచ్చు. నిపుణుల సాయం తీసుకునేలా ప్రోత్సహించవచ్చు. భావోద్వేగ ప్రవర్తన మార్పులునిరంతర విచారం, నిస్సహాయత భావన. ఎక్కువగా చిరాకు పడడం, కోపం లేదా మూడ్ స్వింగ్స్. · ఒకప్పుడు ఆనందించిన కార్యకలాపాల పట్ల ఆసక్తి కోల్పోవడం. · స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండడం. ·సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండడం. · విపరీతమైన భయం, ఆందోళన లేదా ఆందోళనతో కూడిన దాడులు.మానసిక, శారీరక లక్షణాలునిద్ర, ఆకలిలో మార్పులు (ఎక్కువ నిద్ర పోవడం లేదా నిద్రలేమి, తక్కువ లేదా ఎక్కువ తినడం). ·ఏకాగ్రత, జ్ఞాపకశక్తి సమస్యలు.గతంలో సులభంగా చేసిన పనులను పూర్తి చేయడంలో ఇబ్బంది.·తీవ్రమైన తలనొప్పి లేదా కడుపు నొప్పులు వంటి వివరించలేని శారీరక నొప్పులు. ఆత్మ గౌరవం కోల్పోవడం లేదా నిస్సహాయత భావన. ·ఆత్మహత్య ఆలోచనలు లేదా మరణం గురించి ఆలోచించడం.అకడమిక్, ప్రొఫెషనల్ లక్షణాలుచదువులో గణనీయమైన క్షీణత.పాఠశాల పని పట్ల ఆసక్తి తగ్గడం.తరగతులకు హాజరు కాకపోవడం.పాఠశాల పనితీరులో ఆకస్మిక మార్పులు.అవగాహన అంతంత మాత్రమే! ఓ పక్కన మానసిక ఆరోగ్య సమస్యలు యువతను కారుమబ్బుల్లా కమ్మి వేస్తుంటే, మానసిక ఆరోగ్య సేవలపై అవగాహన రాహిత్యం కనిపిస్తోంది. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ నిర్వహించిన 2023 సర్వే ప్రకారం, దాదాపు 70 శాతం మంది విద్యార్థులు మానసిక ఆరోగ్య సహాయం కోరితే తోటివారి నుండి ప్రతికూలతను ఎదుర్కొంటారని భయపడుతున్నారు.‘ది జర్నల్ ఆఫ్ అమెరికన్ కాలేజ్ హెల్త్’ నివేదిక ప్రకారం, కేవలం 50 శాతం మంది విద్యార్థులకు మాత్రమే తమ క్యాంపస్లో కౌన్సెలింగ్ సేవలు ఉన్నట్లు తెలుసు. ఇది కౌన్సెలింగ్ సేవల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరానికి నిదర్శనంగా నిలుస్తోంది.అసలు శత్రువు అదే! యువత, విద్యార్థుల్లో మానసిక ఆరోగ్య సమస్యలు పెచ్చరిల్లడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ సోషల్ మీడియా వ్యసనం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ‘ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ’ నిర్వహించిన సర్వే ప్రకారం యువతలో 70 శాతం రోజుకు మూడు నుంచి నాలుగు గంటలకు మించి ఫోన్ వాడుతున్నారు. అందులో ఎక్కువగా సోషల్ మీడియాను చూస్తున్నారు. దీనితో ప్రతి ఐదుగురులో ఒకరు డిప్రెషన్ లేదా ఆందోళన బారిన పడుతున్నారు. వ్యసనంగా ఇలా.. మొబైల్ ఫోన్ల వాడకం పెరగడంతో సోషల్ మీడియా వ్యసనం తీవ్రమైన సమస్యగా మారుతోంది. ఈ వ్యసనం కేవలం ఒక అలవాటు కాదు, ఇది మెదడు పనితీరును మార్చే ఒక న్యూరోసై¯Œ ్స ప్రక్రియ. సోషల్ మీడియా వ్యసనానికి ప్రధాన కారణం మన మెదడులోని డోపమైన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్. డోపమైన్ ఆనందం, సంతృప్తి, ప్రోత్సాహంతో ముడిపడి ఉన్న ఒక రసాయనం. మనం ఏదైనా సంతోషకరమైన పని చేసినప్పుడు, ఇష్టమైన ఆహారం తిన్నప్పుడు లేదా ప్రశంసలు పొందినప్పుడు, మెదడులోని రివార్డ్ సిస్టమ్ డోపమై¯Œ ను విడుదల చేస్తుంది. సోషల్ మీడియాలో ప్రతి లైక్, కామెంట్, షేర్, కొత్త నోటిఫికేషన్ చిన్నపాటి రివార్డ్గా పనిచేస్తుంది. ఈ రివార్డ్లు డోపమైన్ విడుదలను ప్రేరేపిస్తాయి. యువత మెదడు ఎక్కువ డోపమైన్ పొందడం కోసం నిరంతరం సోషల్ మీడియాను చెక్ చేసుకునేలా అలవాటు పడుతుంది. ఈ నిరంతర ప్రేరణతో మెదడులో డోపమైన్ రిసెప్టర్లు సున్నితత్వాన్ని కోల్పోతాయి, దాంతో మరింత ఎక్కువ డోపమైన్ కోసం మెదడు ఆరాటపడుతుంది. ఇదే వ్యసనానికి దారి తీస్తుంది.మానసిక ఆరోగ్యం మటాష్!సోషల్ మీడియా మన జీవితాల్లో అంతర్భాగంగా మారింది. యువతపై దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇది సమాచారాన్ని పంచుకోవడానికి, స్నేహితులతో కనెక్ట్ కావడానికి ఒక వేదికగా ఉన్నప్పటికీ, దాని ప్రతికూల ప్రభావాలు మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన సవాళ్లను సృష్టిస్తున్నాయి. వివిధ సర్వేలు, అధ్యయనాలు యువతపై సోషల్ మీడియా ప్రభావం ఎంత ప్రమాదకరంగా ఉందో తెలియజేస్తున్నాయి.ఒక సర్వే ప్రకారం, భారతదేశంలోని ప్రతి ఇద్దరు పిల్లల్లో ఒకరు సోషల్ మీడియాకు బానిసలు అవుతున్నారు. దాదాపు 46 కోట్ల మంది సోషల్ మీడియా వినియోగదారులు ఉన్న భారతదేశంలో ఇది ఒక ప్రధాన సమస్యగా మారింది.యువతలో 27% మంది సోషల్ మీడియాపై ఆధారపడే లక్షణాలను చూపిస్తున్నారని అధ్యయనాలు వెల్లడించాయి. సోషల్ మీడియాను రోజుకు 3 గంటలకన్నా ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.సోషల్ మీడియాలో ఇతరుల ‘పరిపూర్ణమైన‘ జీవితాలను చూసి తమను తాము పోల్చుకోవడంతో యువతలో ఆత్మన్యూనత భావన పెరుగుతోంది. ఇది అసూయ, అసంతృప్తి, ఒత్తిడికి కారణమవుతోంది. ఆన్లైన్ వేధింపులు, బెదిరింపులు యువతలో తీవ్రమైన మానసిక క్షోభను కలిగిస్తున్నాయి. వీటి వల్ల వారు నిస్పృహకు, ఆందోళనకు గురవుతున్నారు. ఇన్ స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్స్లో చూసే అందమైన ఫోటోలు, వీడియోల వల్ల యువత ముఖ్యంగా మహిళలు, తమ శరీర రూపాన్ని గురించి ఆందోళన చెందుతున్నారు. భారత యువతుల్లో 36 శాతం మంది బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్తో బాధపడుతున్నారని ఒక సర్వే వెల్లడించింది. ఇది బులీమియా, అనోరెక్సియా నెర్వోసా లాంటి ఈటింగ్ డిజార్డర్స్కు దారి తీస్తోంది.యువతలో 27% మంది సోషల్ మీడియాపై ఆధారపడే లక్షణాలను చూపిస్తున్నారని అధ్యయనాలు వెల్లడించాయి. సోషల్ మీడియాను రోజుకు 3 గంటలకన్నా ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.మెదడులో మార్పులుసోషల్ మీడియా వ్యసనం మెదడులోని వివిధ భాగాలపై ప్రభావం చూపుతుంది.ప్రీఫ్రంటల్ కార్టెక్స్ భాగం నిర్ణయాలు తీసుకోవడం, ఆలోచనా శక్తి, ప్రేరణ నియంత్రణ వంటి కీలకమైన విధులను నిర్వహిస్తుంది. సోషల్ మీడియాకు ఎక్కువగా అలవాటుపడిన వారిలో ఈ భాగం బలహీనపడుతుంది. దీనివల్ల వారు తమ ఫో¯Œ ను వాడటాన్ని నియంత్రించుకోలేరు, త్వరగా నిర్ణయాలు తీసుకోలేరు, ఏకాగ్రతను కోల్పోతారు.అమిగ్డాలా భావోద్వేగాలను నియంత్రించే మెదడు భాగం. సోషల్ మీడియాలో చూసే ప్రతికూల విషయాలు అమిగ్డాలాను నిరంతరం ప్రేరేపిస్తాయి. ఇది ఆందోళనకు, డిప్రెష¯Œ కు దారితీస్తుంది.హిప్పోకాంపస్ భాగం జ్ఞాపకశక్తికి, నేర్చుకోవడానికి సహాయపడుతుంది. సోషల్ మీడియాకు ఎక్కువ సమయం కేటాయించడం వల్ల హిప్పోకాంపస్ పనితీరు తగ్గుతుంది, ఇది చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.సుప్రీం కోర్టు దిశానిర్దేశంయువత మానసిక ఆరోగ్య సమస్యలకు సోషల్ మీడియాతో పాటు మారిన జీవనశైలి, సామాజిక పరిస్థితులు కూడా కారణం. దీనికి తోడు నిపుణుల కొరత, నిధుల కొరత కూడా వారికి సరైన వైద్య సేవలు అందకుండా చేస్తున్నాయి. దేశంలో మానసిక ఆరోగ్య నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. ‘నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే’ ప్రకారం ప్రతి లక్ష జనాభాకు కేవలం సరాసరిన 0.7 శాతం మంది మానసిక వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారు. సైక్రియాట్రిస్ట్లు 0.75 శాతం, క్లినికల్ సైకాలజిస్టులు 0.07 శాతం వరకు అందుబాటులో ఉన్నారు. మన దేశంలో సైకాలజిస్టులకు ఇప్పటి వరకు చట్టపరమైన గుర్తింపు ప్రక్రియ లేకపోవడంతో వారికి సంబంధించిన లెక్కలు లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం లక్ష మందికి కనీసం ముగ్గురు ఉండాలి. ప్రపంచ సగటుతో పోలిస్తే మానసిక సేవలు మన దేశంలో చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయి. మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో లేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. సైకియాట్రీ, సైకాలజీ కోర్సులకు తగినంత ప్రోత్సాహం లేకపోవడం, శిక్షణ పొందిన నిపుణులు అందుబాటులో లేకపోవడం ప్రధాన కారణం. ఆరోగ్య సంరక్షణలో మానసిక ఆరోగ్యానికి చాలా తక్కువ నిధులు కేటాయిస్తున్నారు. 2025 కేంద్ర బడ్జెట్లో మానసిక ఆరోగ్య సేవలకు కేవలం 1,004 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది మొత్తం ఆరోగ్య రంగానికి కేటాయించిన బడ్జెట్లో ఒక శాతం. ఇందులో కూడా 860 కోట్లు బెంగుళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్)కు, రూ. 80 కోట్లు ‘టెలిమానస్’కు కేటాయించడంతో మానసిక ఆరోగ్య సేవలు యువతకు చేరడం సాధ్యపడటం లేదు.నానాటికీ పెరిగిపోతున్న యువత, విద్యార్థుల ఆత్మహత్యలు, వారి మానసిక క్షేమంపై ఇటీవల సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విద్యా సంస్థలు తీసుకోవాల్సిన చర్యలను నిర్దేశించింది.ప్రతి వందమంది విద్యార్థులకు ఒక కౌన్సెలర్ను నియమించాలి. ఏడాదిలో రెండుసార్లు టీచర్స్కు, ఇతర సిబ్బందికి విద్యార్థుల మానసిక ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించాలి. విద్యా సంస్థల్లో సైకలాజికల్ కౌన్సెలింగ్ సేవలను అందుబాటు ఉంచాలి, ఆ విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలి. విద్యార్థులపై అకడమిక్ విషయంలో ఎలాంటి లేబుల్స్ వేయకూడదు. విద్యేతర విషయాల్లో ప్రోత్సహించాలి. ర్యాగింగ్, లైంగిక వేధింపులు వంటి వాటిపై సత్వరమే స్పందించే వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. హెల్ప్ లైన్ నంబర్స్ అందరికీ కనిపించేటట్లు బోర్డులు ఏర్పాటు చేయాలి. పేరెంట్స్తో తరచుగా సమావేశాలు నిర్వహించి విద్యార్థుల్లో మానసిక అనారోగ్య లక్షణాలు గుర్తించే విధంగా అవగాహన కల్పించాలి. సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలతో పాటు విద్యార్థుల్లో, టీచర్స్లో మానసిక ఆరోగ్య సేవలపై ఉన్న అపోహలను పోగొట్టగలిగితే స్వామి వివేకానంద చెప్పినట్లుగా వజ్ర సంకల్పం, ఉక్కు నరాలు ఉన్న యువ భారతాన్ని చూడొచ్చు. రచయిత: జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, అడ్వాన్స్డ్ సైకలాజికల్ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఏ ఇండియా) -
చింపాంజీల ప్రాణహిత
‘చింపాంజీల నుంచి మనిషి నేర్చుకోవాల్సింది చాలా ఉంది’.... ఈ మాట అనడంతో జేన్ గుడ్ ఆల్ ‘కోతి నుంచి మానవుడు పుట్టాడు’ అనే సిద్ధాంతాన్ని ఒక విధంగా ప్రశ్నార్థకం చేసింది. ‘మానవులకు అతి సమీపంగా నివసించే చింపాంజీల గురించి నేను పరిశోధన చేసే వరకూ లోకానికి ఏమీ తెలియదు’ అంటుంది జేన్ గుడ్ఆల్. ఈ బ్రిటిష్ పర్యావరణవేత్త ఆఫ్రికాలో చింపాంజీల గురించి ‘సుదీర్ఘమైన’ ఫీల్డ్వర్క్ చేసింది. 91 సంవత్సరాల వయసులో అక్టోబర్ 1న కన్ను మూసిన జేన్ గుడ్ఆల్ ఎందరో పర్యావరణ ప్రియులకు స్ఫూర్తి.‘చింపాంజీలను చూసి బిడ్డకు తల్లి ఇవ్వాల్సిన భరోసాను నేర్చుకోవచ్చు. చింపాంజీలలో తల్లి తన బిడ్డను ఎప్పటికీ వదలదు... అది పెద్దయ్యి రెండు మూడు నమ్మదగ్గ స్నేహితులను సం పాదించుకునే వరకు. అలాగే తగువులాడి తిరిగి కలిసి పోవడంలో చింపాంజీలు చాలా పెద్ద మనసు చూపుతాయి. మనుషులు కొట్లాడుకుంటే తిరిగి కలిసే విషయంలో చాలా భేషజం చూపుతారు’ అంటారు జేన్ గుడ్ ఆల్. టాంజానియాలో 1960 నుంచి 30 ఏళ్లకు పైగా చింపాంజీల గురించి పరిశోధన చేసిన జేన్ గుడ్ ఆల్ ఇంగ్లాండ్లోని బోర్మెత్ అనే పట్టణంలో జీవిస్తూ అమెరికా పర్యటనలో అక్కడే కన్నుమూశారు.ఎవరు జేన్ గుడ్ ఆల్?జేన్ గుడ్ ఆల్ పూర్తి పేరు వాలెరీ జేన్ మోరిస్–గుడ్ ఆల్. 1934 ఏప్రిల్ 3న లండ న్ లో జన్మించారు. తండ్రి హార్బర్ట్ మారిస్ వ్యా పారి. తల్లి మార్గరెట్ జోసెఫ్ నవలా రచయిత్రి. సంపన్న కుటుంబంలో పుట్టిన గుడ్ ఆల్ కోసం ఓసారి ఆమె తండ్రి ‘జూబ్లీ’ అనే చింపాంజీ బొమ్మను కానుకగా ఇచ్చాడు. దాన్ని చూసి తోటివాళ్లు భయపడి అసహ్యించుకున్నా గుడ్ ఆల్ మాత్రం ఆ΄్యాయంగా హత్తుకుంది. తనకు చింపాంజీల మీద ప్రేమ కలిగేందుకు కారణమైన తొలి సంఘటన అదే అంటారామె. 1957లో కెన్యాలో తన స్నేహితురాలి పొలానికి వెళ్లడం జేన్ గుడ్ ఆల్ జీవితంలో మేలి మలుపు. అక్కడ కెన్యా పురావస్తు శాస్త్రవేత్త, పాలియెంటాలజిస్ట్ (శిలాజాల అధ్యయనవేత్త) అయిన లూయిస్ లీకీని ఆమె కలుసుకున్నారు. ఆ సమయంలో ఆయన కోతులపై అధ్యయనం చేస్తున్నారు. తన అధ్యయానికి గుడ్ఆల్ సహకారం అందించగలదని ఆయన భావించారు. అలా ఆయన వద్ద ఆమె సెక్రటరీగా చేరారు. ఆయన వద్ద పని చేస్తున్న సమయంలో ఆమె ఓర్పు, నేర్పులను పరిశీలించిన ఆమెను టాంగన్యికా (ప్రస్తుతం టాంజానియా) కు పం పారు లూయీస్ లీకీ.అదే ఆమె కార్యక్షేత్రం1960 జూలై 14న గుడ్ ఆల్ తొలిసారి టాంజానియాలోని గోంబే స్ట్రీమ్ నేషనల్ పార్క్కు వెళ్లారు. అది ఆమె జీవితానికి కీలకమైన ఘట్టం. ఆ సమయంలో ఆమె తల్లి కూడా వెంట ఉండి, ఆమెను తన కెరీర్లో ప్రోత్సహించడం చెప్పుకోదగ్గ విషయం. అడవుల్లో తిరుగుతూ, జంతువులను మచ్చిక చేసుకుని, వాటిపై పరిశోధన చేయడం మగవాళ్ల పని అని భావించే కాలంలో తల్లి తనకు అందించిన సహకారానికి కృతజ్ఞత తెలిపేవారు. గోంబే స్ట్రీమ్ నేషనల్ పార్క్లోని ‘కసకేలా చింపాంజీ కమ్యూనిటీ’తో ప్రారంభించి చింపాంజీ సామాజిక, కుటుంబ జీవితాన్ని అధ్యయనం చేశారు గుడ్ఆల్. చింపాంజీలు కేవలం జంతువులు అన్న ధోరణిని కాదని, ‘వాటికి కూడా వ్యక్తిత్వం ఉంది. చింపాంజీలకూ ఆనందం, దుఃఖం వంటి భావోద్వేగాలు ఉంటాయి’ అని ఆమె కనుగొన్నారు. మానవ చర్యలుగా భావించే కౌగిలింతలు, ముద్దులు, వీపుమీద తట్టడం, చక్కిలిగింతలు చిం పాజీల్లోనూ ఉంటాయని గమనించారు. ఇదంతా ఒక్క రోజులో సాధ్యపడ్డ సంగతి కాదు. ఎన్నో రోజుల పాటు వాటి మధ్య మెలిగి, వాటిని గమనిస్తూ తెలుసుకున్న సంగతులు.ఆమె పరిశోధనలుగుడ్ఆల్ చేసిన పరిశోధనల కారణంగా అప్పటి దాకా చింపాంజీల గురించి ప్రపంచం నమ్మిన రెండు విషయాలు అబద్ధాలని తేలింది. ఒకటి చింపాంజీలు శాకాహారులు అనుకోవడం, మరొకటి చింపాంజీలు ఏ సాధనాలనూ తయారు చేయలేవు అని భావించడం. అయితే చింపాంజీలు చెదపురుగులను తినడాన్ని ఆమె గమనించారు. చింపాంజీలు చెట్ల నుండి కొమ్మలను తీసుకొని ఆకులను తీసేసి, వాటిని తమ కోసం వాడుకోవడం గుర్తించారు. మనుషులు మాత్రమే ఒక వస్తువు నుంచి మరో వస్తువు తయారు చేయగలరన్న విషయం అబద్ధమని, చింపాంజీలకూ ఆ శక్తి ఉందని నిరూపించారు. చింపాంజీ దళాల్లో దూకుడు, హింస, అడవిలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఇతర ఆడపిల్లల పిల్లలను ఉద్దేశపూర్వకంగా చంపడం వంటివన్నీ గుడ్ఆల్ చేసిన పరిశోధనల ద్వారానే ప్రపంచానికి తెలిశాయి. 1990లో ఆమె రాసిన ‘త్రూ ఎ విండో: మై థర్టీ ఇయర్స్ విత్ ది చింపాంజీస్ ఆఫ్ గోంబే’లో ఆ అనుభవాలన్నీ ఆమె పొందుపరిచారు.చింపాంజీల ఫ్రెండ్చింపాంజీలు మనుషుల్ని అంత సులభంగా తమతో కలుపుకోవు. అయితే గుడ్ఆల్ని మాత్రం తమ తోటి ప్రాణిగానే భావించాయి. ఏళ్ల తరబడి వాటితో మమేకమై పోయిన ఆమె వాటి కోసం ఎంతో తపన పడేవారు. ’ఖీజ్ఛి ౌn y జిuఝ్చn ్ఛఠ్ఛిట ్చఛిఛ్ఛిp్ట్ఛఛీ జీn్టౌ ఛిజిజీఝp్చn్డ్ఛ్ఛ టౌఛిజ్ఛ్టీy’ అంటూ అందరూ ఆమెను పొగిడేవారు. చింపాంజీలకు పేర్లు పెట్టడం, వారి మధ్య గొడవలు వస్తే తీర్చడం, వాటి భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, వాటి మూడ్ని బట్టి వాటికి ఇష్టమైన పనులు చేయడం, వాటితో కలిసి షికారుకు వెళ్లడం వంటివన్నీ ఆమె చేసేవారు. చింపాంజీల మీద జరిగే పరిశోధనల కోసం ‘జెన్ గుడ్ఆల్ ఇ న్ స్టిట్యూట్’ను స్థాపించిన ఆమె రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో చింపూగా చింపాంజీ రిహాబిలిటేషన్ కేంద్రం ప్రారంభించారు. ఇందులో వందలాది చింపాంజీలను సంరక్షిస్తున్నారు. అడవుల నరికివేత కారణంగా తిండి, నివాసం కోల్పోయిన చింపాంజీలను గుర్తించేందుకు, వాటి పట్ల జనానికి అవగాహన కల్పించేందుకూ గుడ్ ఆల్ చర్యలు చేపట్టారు. దేశవిదేశాల్లో అనేక సదస్సులు నిర్వహించి పర్యావరణ పరిరక్షణ గురించి, చింపాంజీల జీవన విధానం గురించి వివరించారు. ఆమె కృషికి ఫలితంగా అనేక అంతర్జాతీయ పురస్కారాలు ఆమెను వరించాయి. ‘సృష్టిలో ప్రాణులన్నీ సమానమే. ఇందులో మనిషి అధికుడు, జంతువులు తక్కువ అన్న భావన సరికాదు. మనం ప్రేమ పంచగలిగితే అందుకునేందుకు మూగజీవులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి’ అనేది ఆమె మాట. -
ఆహ్వానించి అపహరణ!
వీరారెడ్డి పేరుతో ఇల్లు, ఇల్లాలు, వాహనం, జైల్లో పరిచయమైన అనుచరులను సిద్ధం చేసుకున్న గౌరు సురేష్– ఆ తర్వాత ఎవరిని కిడ్నాప్ చేసి డబ్బు గుంజాలనేది ఆలోచించాడు. ఏమాత్రం ఇబ్బంది, హడావుడి లేకుండా పని జరగాలంటే, హైదరాబాద్కు చెందిన వారు కాకపోతేనే ఉత్తమమని భావించాడు. తన ‘భార్య’తో తిరుమలకు వెళ్లిన గౌరు సురేష్ అక్కడి నుంచి తిరిగి వస్తూ తిరుపతికి చెందిన వ్యాపారి గంగయ్యను టార్గెట్గా చేసుకున్నాడు. హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత ఓ డ్రైఫ్రూట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి దానికి అతడే వైస్ ప్రెసిడెంట్గా మారి, విజిటింగ్ కార్డులు సిద్ధం చేసుకున్నాడు. మరోసారి తిరుపతి వెళ్లిన సురేష్– గంగయ్యను కలిసి తనను తాను పరిచయం చేసుకున్నాడు. త్వరలో హైదరాబాద్లో డ్రైఫ్రూట్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నానని, తప్పకుండా రావాలని చెప్పి ఆహ్వానపత్రం అందించాడు. ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోని గంగయ్య దీనిని మరచిపోయాడు. కిడ్నాప్ పథకాన్ని అమలులో పెట్టడానికి సురేష్– గంగయ్య పేరుతో తిరుపతి నుంచి హైదరాబాద్కు విమానం టిక్కెట్, తాజ్ కృష్ణలో ఓ గదిని బుక్ చేశాడు. ఎగ్జిబిషన్ పేరుతో ఆహ్వానపత్రిక ముద్రించి, ఇవన్నీ కొరియర్ ద్వారా గంగయ్యకు పంపాడు. గంగయ్యకు సురేష్ ఫోన్ చేసి, తప్పకుండా రావాలని, ఎయిర్పోర్టుకు కారు పంపిస్తానని చెప్పాడు. దీంతో గంగయ్య తాను హైదరాబాద్ వచ్చేటప్పుడు వీరారెడ్డి అవతారంలో ఉన్న సురేష్కు చెప్పాడు. గంగయ్య వచ్చేరోజు వెంకటరెడ్డి వద్దకు వెళ్లిన సురేష్, భార్యతో కలసి బయటకు వెళ్లడానికంటూ కారు తీసుకున్నాడు. ఆ కారులో విమానాశ్రయానికి వెళ్లి, గంగయ్యను రిసీవ్ చేసుకున్నాడు. ఎగ్జిబిషన్ పనుల్లో తలమునకలై ఉన్నానని, ఉప్పల్లో చిన్న పని చూసుకుని వెళ్దామని సురేష్ నమ్మబలికాడు. అలా అతడిని వారాసిగూడలోని మల్లారెడ్డి ఫ్లాట్కు తీసుకెళ్లాడు. అక్కడ ఉన్న గ్యాంగ్కు గంగయ్యను అప్పగించి, తాను చెప్పే వరకు జాగ్రత్తగా చూసుకోవాలంటూ తన ఫ్లాట్కు వెళ్లిపోతూ వెంకట్రెడ్డికి కారు అప్పగించేశాడు. గంగయ్య నుంచి అతడి సోదరుడి ఫోన్ నెంబర్ తీసుకున్న సురేష్, ‘మీ అన్నను కిడ్నాప్ చేశామని, విడిచిపెట్టాలంటే రూ.30 లక్షలు ఇవ్వాల’ని డిమాండ్ చేశాడు. విషయం ఏమాత్రం బయటకు వచ్చినా హైదరాబాద్ శివార్లలో గంగయ్య శవం పడి ఉంటుందని భయపెట్టాడు.ఈ ఫోన్ కాల్తో భయపడిన గంగయ్య సోదరుడు విషయం పోలీసులకు చెప్పకుండా, డబ్బు కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. డబ్బు సిద్ధం చేసుకోవడానికి అతడు రెండుమూడు రోజుల పాటు పలువురిని సంప్రదించాడు. ఇలా విషయం బయటకు రావడంతో చిత్తూరు పోలీసులు రంగంలోకి దిగి, గంగయ్య సోదరుడి నుంచి వివరాలు తెలుసుకోవాలని ప్రయత్నించారు. అయితే తన సోదరుడికి హాని జరుగుతుందనే భయంతో విషయం పోలీసులకు చెప్పడానికి గంగయ్య సోదరుడు వెనుకాడాడు. దీంతో అతడి కదలికలపై పోలీసులు నిఘా వేసి ఉంచారు.తన అన్నను విడిపించుకోవడానికి రూ.30 లక్షలు సిద్ధం చేసిన గంగయ్య సోదరుడు ఫోన్ చేసి సురేష్కు విషయం చెప్పాడు. ఎవరికీ చెప్పకుండా ఒక్కడివే బయలుదేరి రావాలని, భారత్ ట్రావెల్స్ బస్సులో సీట్ నెం.17 బుక్ చేసుకోవాలని, జడ్చర్ల వద్ద బస్సు దిగిపోవాలని సూచనలు ఇచ్చాడు. ఏమాత్రం తేడా వచ్చినా గంగయ్య ప్రాణాలతో ఉండడని బెదిరించాడు. గంగయ్య సోదరుడు అదే బస్సులో అదే సీటు టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. విషయం తెలిసిన చిత్తూరు పోలీసులు– అదే బస్సులో వెళ్లి, కిడ్నాపర్లను పట్టుకోవడానికి ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లకు టికెట్లు బుక్ చేశారు. గంగయ్య సోదరుడు, ఈ ముగ్గురు పోలీసులు ఒకే బస్సులో బయలుదేరారు. తనను అనుసరిస్తూ పోలీసులు వస్తున్న విషయం గంగయ్య సోదరుడికి తెలీదు. అదే రోజు రాత్రి మరోసారి వెంకట్రెడ్డి వద్దకు వెళ్లే సురేష్ మళ్లీ భార్యతో ట్రిప్ అంటూ ఇండికా కారు తీసుకున్నాడు. గంగయ్య సోదరుడు ప్రయాణిస్తున్న భారత్ ట్రావెల్స్ బస్సు జడ్చర్లకు చేరుకునే సమయానికి సురేష్ కారుతో సçహా అక్కడ సిద్ధంగా ఉన్నాడు. బస్సు అక్కడకు చేరుకున్నాక గంగయ్య సోదరుడు బ్యాగ్ పట్టుకుని దిగడంతో, అది గమనించిన ఎస్సై కూడా అతడితో పాటు కిందికి దిగారు. అతడిని చూడగానే పోలీసు అని గుర్తించిన సురేష్, దృష్టి మళ్లించడానికి క్షణాల్లో మరో పథకం వేశాడు. ఆ పోలీసుని ఉద్దేశించి ‘మీరూ హైదరాబాద్ వెళ్లాలా..? లగేజీ తెచ్చుకోండి’ అని చెప్పాడు. ఎదుటి వారికి తనపై అనుమానం రాకూడదని భావించిన సదరు ఎస్సై తన బ్యాగ్ తీసుకువచ్చి కారు ఎక్కాలని భావించారు. బ్యాగ్ కోసం బస్సు ఎక్కగా, అప్పటికే కింద ఉన్న గంగయ్య సోదరుడిని కారులో ఎక్కించుకున్న సురేష్ రాంగ్ రూట్లో ఉడాయించాడు. ఈ పరిణామంతో కంగుతిన్న చిత్తూరు పోలీసులు విషయాన్ని తమ ఉన్నతాధికారులకు చెప్పారు. చిత్తూరు పోలీసుల నుంచి సమాచారం అందుకున్న హైదరాబాద్ టాస్క్ఫోర్స్ వెంటనే రంగంలోకి దిగింది. అయితే అప్పటికే గంగయ్య సోదరుడి నుంచి డబ్బు తీసుకుని, అతడిని శంషాబాద్ వద్ద వదిలేసిన సురేష్ నేరుగా వనస్థలిపురం వెళ్లిపోయాడు. కారు వెంకట్రెడ్డికి అప్పగించిన తర్వాత ‘తన భార్య’కు పేమెంట్ సెటిల్ చేసి పంపించేశాడు. డీసీఎం వ్యాన్లో ఫ్లాట్లోని సామాను మొత్తం సర్దుకుని, మల్లారెడ్డిని సంప్రదించి, ‘ప్యాకేజ్’ని వదిలేసి నాంపల్లికి రావాలని చెప్పాడు. గంగయ్యను తీసుకుని బయలుదేరే మల్లారెడ్డి గ్యాంగ్ అతడిని ఎంజీబీఎస్ వద్ద వదిలేసి, ఖర్చుల కోసం రూ.10 వేలు ఇచ్చింది. వీళ్లు నాంపల్లికి చేరుకునేసరికి సురేష్ డీసీఎంలోని ఇంటి సామాను మొత్తం సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్మేసి, సిద్ధంగా ఉన్నాడు. మల్లారెడ్డి గ్యాంగ్కు కొంత మొత్తం ముట్టజెప్పి, అక్కడ నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. గంగయ్య, అతడి సోదరుడు బతుకు జీవుడా అనుకుంటూ తిరుపతి చేరుకున్నారు. ఈ కేసులో హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు మల్లారెడ్డితో పాటు మిగిలిన గ్యాంగ్ను పట్టుకుని చిత్తూరు పోలీసులకు అప్పగించారు. అయితే సురేష్ మాత్రం చిక్కలేదు. తన నేర పరంపరను కొనసాగిస్తూ 2006 సెప్టెంబర్ 13న జూబ్లీహిల్స్కు చెందిన వ్యాపారవేత్త జి.కృష్ణంరాజును ఆయన పెంపుడు శునకంతో సహా కిడ్నాప్ చేశాడు. ఈ కేసులో అరెస్టు అయినప్పుడే, గంగయ్య కిడ్నాప్ స్కెచ్ బయటకు వచ్చింది. ఇలాంటి అనేక నేరాలు చేసిన గౌరు సురేష్ 2008 జూలై 18న బేగంపేటలోకి ఎయిర్ కార్గో కాంప్లెక్స్ వద్ద పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో చనిపోయాడు. (సమాప్తం) -
త్వరలో... మీ అభిమాన థియేటర్లలో ఏఐ హీరోయిన్
‘ఆ హీరోయిన్డేట్లు దొరకడం చాలా కష్టం’‘ఆ హీరోయిన్ ఎక్కువ టేకులు తీసుకుంటుంది’‘బాగానే నటిస్తుంది గానీ టైమ్కు లొకేషన్కు రాదు. నిర్మాతలను ఏడిపిస్తుంది’... ఇలాంటి మాటలు టిల్లీ నార్వుడ్ విషయంలో వర్తించవు. టిల్లీ నార్వుడ్ హాలీవుడ్లో తొలి ఏఐ జనరేటెడ్ నటిగా చరిత్ర సృష్టించనుంది...లండన్లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘ పార్టికల్ 6’ డిజిటల్ స్టార్ టిల్లీ నార్వుడ్ను సృష్టించింది. తమ డిజిటల్ స్టార్ను జ్యూరిచ్ సదస్సులో పరిచయం చేశారు. ఆమె నటనైపుణ్యాన్ని పరిచయం చేసే డెమో వీడియోలు రూ పొందించారు. ఈ అందాల సుందరిని తెరంగేట్రం చేయించడానికి హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్, ఏజెంట్లతో చర్చలు మొదలయ్యాయి.చర్చలు ఫలప్రదం అయితే ఫస్ట్ ఏఐ–జనరేటెడ్ స్టార్గా టిల్లీ నార్వుడ్ చరిత్ర సృష్టించనుంది. ‘భవిష్యత్లో టెలివిజన్ అభివృద్ధి’ అనే అంశంపై తీసిన ‘ఏఐ కమిషనర్’ అనే కామెడీ స్కెచ్లో తొలిసారిగా కనిపించింది టిల్లీ. ‘నా మొట్టమొదటి పాత్ర ప్రత్యక్షప్రసారం అయింది. నిజంగా ఇది నమ్మలేక పోతున్నాను!’ అని తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసింది టిల్లీ నార్వుడ్.ఈ ఏఐ స్టార్ గురించి ‘ఆహా’ అనేవాళ్లతో పాటు ‘అయ్యయ్యో’ అంటున్నవాళ్లు కూడా ఉన్నారు. నిర్మాణసంస్థల ఆసక్తి విషయం ఎలా ఉన్నా హాలీవుడ్ తారలు మాత్రం ఏఐ స్టార్పై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ‘ఇన్ ది హైట్స్’ స్టార్ మెలిసా బరెరా ‘ఎంత దారుణం ఇది’ అని ఇన్స్టాగ్రామ్ వేదికగా నిరసన తెలి పారు. ‘ఆమెకు అందమైన రూపం తీసుకురావడానికి ఎంతోమంది నిజజీవిత అందగత్తెల ముఖాలను రెఫరెన్స్గా తీసుకొని ఉంటారు. ఇంత శ్రమ ఎందుకు? ఆ సహజ అందాల సుందరులనే హాలీవుడ్కు పరిచయం చేయవచ్చు కదా!’ అని హలీవుడ్ నటుడు ఒకరు స్పందించారు.ఘాటైన విమర్శల నేపథ్యంలో ‘ పార్టికల్6’ వ్యవస్థాపకురాలు, సీయీవో ఎలిన్ వాన్ ఇలా స్పందించారు... ‘మా ఏఐ క్యారెక్టర్ టిల్లీ నార్వుడ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నవారికి చెప్పేదేమిటంటే.., నిజమైన నటులకు ఇది ప్రత్యామ్నాయం కాదు. ఎన్నో సృజనాత్మక అంశాలలో ఇది కూడా ఒకటి. సృజనాత్మక శక్తిని తెలియజేసేది. యానిమేషన్, తోలుబొమ్మలాట, సిజీఐ వలన తెరపై కొత్తదనం వచ్చిందే తప్ప నటులు కనిపించకుండా పోలేదు. ఇప్పుడు కూడా అంతే. సరికొత్త ఏఐ క్యారెక్టర్ వలన కొత్త ఆలోచనకు ఆస్కారం ఏర్పడుతుంది. ఆ క్యారెక్టర్లకు తగినట్లు కొత్తకథలు తయారవుతాయి. నేను స్వతహాగా నటిని, ఏఐ క్యారెక్టర్ మనిషి సహజ నటనైపుణ్యాన్ని దూరం చేయదు’.నిజానికి సినీరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ను ఏదో ఒక రకంగా ఉపయోగిస్తూనే ఉన్నారు. ఉదా: నటుల వయసు తగ్గించడానికి, దివంగత నటుల గొంతును తిరిగి తీసుకురావడానికి, సినిమా ట్రైలర్లు ఆకట్టుకునేలా రూ పొందించడానికి... మొదలైనవి. అయితే ఏఐ నటి మెయిన్ స్ట్రీమ్లోకి రావడం అనేది టిల్లీ నార్వుడ్తోనే మొదలు కానుంది. హాలీవుడ్ టు టాలీవుడ్... తప్పదేమో!అక్కడెక్కడో ఆవిష్కృతమైన సాంకేతిక అద్భుతం గురించి తెలుసుకొని ‘ఆహా వోహో’ అనుకునేలోపే ఆ సాంకేతికత మనల్ని కూడా పలకరించి లోకలైజ్ అయి పోతుంది. ‘గుండమ్మ కథ రీమేక్ చేస్తే బానే ఉంటుందిగానీ గుండమ్మ పాత్రను అంత అద్భుతంగా ఎవరు చేయగలరండి!’‘సావిత్రి లాంటి మహానటి నటనను మళ్లీ చూడలేమా?’... ఇలాంటి మాటలు సినీప్రియుల నోటి నుంచి వినిపిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ‘ పార్టికల్6’ టాలీవుడ్కు చేరువ అయితే... ‘ఆ లోటును ఎవరు భర్తీ చేయగలరు’ అనే మాట వినిపించక పోవచ్చు. ఎందుకంటే ‘ పార్టికల్6’ ఏఐ అవతార్తో వారినే స్వయంగా నటింపజేయవచ్చు! -
గురి తప్పని బాణం
స్ఫూర్తిదాయకమైన విజేతలు, సామాన్యులలో అసామాన్యుల గురించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్లు పెట్టే పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఈసారి పారాలింపిక్ అథ్లెట్ శీతల్దేవిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్స్లో శీతల్దేవి చారిత్రాత్మకమైన బంగారు పతకాన్ని సాధించిన విషయం తెలిసిందే.పుట్టుకతోనే రెండు చేతులు లేక పోయినా సంకల్పబలాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు శీతల్. ఆ బలమే తనను స్ఫూర్తిదాయకమైన విజేతను చేసింది. ‘శీతల్, నువ్వెప్పుడూ వరల్డ్ ఛాంపియన్వే. ప్రజల మనసులను గెలుచుకోవడంలో కూడా నువ్వు ఛాంపియన్వి’ అని శీతల్దేవిని ఆకాశానికెత్తారు మహీంద్రా. గత సంవత్సరం ఒక బాణాన్ని ఆనంద్కు బహూకరించింది శీతల్. ‘నువ్వు నాకు బహుమతిగా ఇచ్చిన బాణం నా కుటుంబంలో విలువైన వారసత్వ సంపదగా నిలిచి పోతుంది. నీలాగే ధైర్యంగా ఉండడానికి మాకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తుంది’ అని రాశారు. శీతల్దేవితో తాను ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. -
స్వయం కృషితో ఎదిగి చరిత్ర సృష్టించారు : టాప్ టెన్ రిచెస్ట్ విమెన్
ప్రముఖ టెక్ దిగ్గజం హెచ్సీఎల్ అధినేత్రి రోష్నీ నాడార్ మల్హోత్రా సరికొత్త రికార్డులు సృష్టించారు. ఎం3ఎం హురున్ ఇండియా రిచ్లిస్ట్-2025 దేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో తొలిసారి చోటు దక్కించుకున్నారు. రూ.2.84 లక్షల కోట్లతో సంపదతో మూడో స్థానం కైవసం చేకున్నారు. రూ.9.55 లక్షల కోట్ల నికర విలువతో ముకేష్ అంబానీ అగ్రస్థానంలో ఉండగా.. గౌతమ్ అదానీ రూ.8.15 లక్షల కోట్ల నికర విలువతో రెండో స్థానంలో నిలిచారు. ఎం3ఎం ఇండియా, హురున్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సంయుక్తంగా ఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 14వ ఎడిషన్ను విడుదల చేశాయి. ఆ జాబితాలో దేశంలోని ధనవంతుల జాబితాలో మూడో స్థానం దక్కించుకుని సరికొత్త మైలురాయిని చేరుకున్నారు. హురున్ ధనవంతుల జాబితాలో టాప్ -10లో నిలిచిన పిన్న వయస్కురాలు ఆమే కావడం గమనార్హం. హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో రోష్నీ నాడార్ మల్హోత్రా రూ.2.84 లక్షల కోట్ల సంపదతో మూడవ స్థానంలో ఉన్నా.. ఆమె సంపద వారసత్వంగా వచ్చింది. కాబట్టి ఆమె సెల్ఫ్మేడ్ విమెన్ జాబితాలో ఆమె లేరు. అయినప్పటికీ హెచ్సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ నాడార్ కుమార్తె రోష్నీ నాడార్. తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకుని, తనదైన శైలిలో నాయకత్వాన్ని ప్రదర్శిస్తూ సంస్థను లాభాల బాట పట్టిస్తున్నారు. సామాజిక సేవా రంగంలోనూ విశేష కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎం3ఎం హురున్ ఇండియా రిచ్లిస్ట్-2025లో చోటు దక్కించుకున్న సెల్ఫ్ మేడ్ విమెన్ ఆంత్రపప్రెన్యూర్ల జాబితా వివరాలు ఇలా ఉన్నాయి. 1.జయశ్రీ ఉల్లాల్ (Jayshree Ullal)భారతదేశంలో స్వయం- నిర్మిత మహిళా మిలియనీర్ల జాబితాలో అరిస్టా నెట్వర్క్స్ సీఈవో జయశ్రీ ఉల్లాల్ (Jayshree Ullal)ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. సంపద రూ. 50,170 కోట్లు. అరిస్టా నెట్వర్క్స్ అధ్యక్షురాలు సీఈవో జయశ్రీ ఉల్లాల్ 2008 నుండి దేశంలోనే ప్రముఖ కంప్యూటర్ నెట్వర్కింగ్ సంస్థలలో ఒకటైన అరిస్టా నెట్వర్క్స్ను నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీ గత సంవత్సరం 7 బిలియన్ డాలర్ల భారీ ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది గత సంవత్సరం కంటే 20 శాతం పెరిగింది.2. రాధా వెంబు (Radha Vembu)జోహో కార్ప్లో మెజారిటీ వాటాను కలిగి ఉన్న రాధా వెంబు రెండవ స్థానంలో ఉన్నారు. రూ. ఆమె సంపద రూ. 46,580 కోట్లు. జోహోను ఆమె అన్నయ్య శ్రీధర్ వెంబుతో కలిసి స్థాపించారు. ఆయన 1996లో అడ్వెంట్నెట్గా వ్యాపారాన్ని ప్రారంభించారు.3. ఫల్గుణి నాయర్ (Falguni Nayar)సౌందర్య ఉత్పత్తుల దిగ్గజ రిటైలర్ అయిన నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు. ఆమె సంపద రూ. 39,810 కోట్లు.4. కిరణ్ మజుందార్-షా ( Kiran Mazumdar-Shaw)బయోకాన్కు చెందిన కిరణ్ మజుందార్-షా రూ. 29,330 కోట్లతో నాల్గవ స్థానాన్ని దక్కించుకున్నారు. భారతదేశ బయోటెక్, హెల్త్కేర్ రంగాలలో మార్గదర్శకురాలిగా తన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. బయోటెక్నాలజీలో 4 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న తొలి తరం వ్యవస్థాపకురాలు, గ్లోబల్ బిజినెస్ లీడర్గా సత్తా చాటిన మహిళ. 1978లో భారతదేశంలోని తన గ్యారేజ్ నుండి బయోటెక్ ప్రయాణాన్ని ప్రారంభించారు.5. రుచి కల్రా (Ruchi Kalra)B2B కామర్స్ ప్లాట్ఫామ్ అయిన ఆఫ్బిజినెస్ సహ వ్యవస్థాపకురాలు, సీఈవో రుచి కల్రా అయిదో స్థానంలో ఉన్నారు. ఆఫ్బిజినెస్ను సహ-స్థాపించడానికి మెకిన్సేలో కన్సల్టెంట్గా పనిచేశారు. ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలైంది. తరువాత హైదరాబాద్లోని ఐఎస్బి నుండి ఎంబీఏ సంపాదించారు. ప్రస్తుతం ఆమె నికర ఆస్తుల విలువ రూ. 9,130 కోట్లు.6. జూహి చావ్లా (Juhi Chawla)90లలో బాలీవుడ్ నేలిన స్టార్ హీరోయిన్ జూహి చావ్లా నేడు వ్యాపార సంస్థలు, రియల్ ఎస్టేట్ వ్యూహాత్మక పెట్టుబడులతో వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా చావ్లా నికర ఆస్తుల విలువ రూ. 7,790 కోట్లు. గత సంవత్సరంతో పోలిస్తే ఆమె సంపదలో 69 శాతం పెరుగుదలను చూసింది. ఆమె సంపాదనలో ఎక్కువ భాగం నైట్ రైడర్స్ స్పోర్ట్స్ నుండి వస్తుంది. 7. నేహా బన్సాల్ (Neha Bansal)లెన్స్కార్ట్ సహ వ్యవస్థాపకురాలు నేహా బన్సాల్ ప్రస్తుతం కంపెనీలో వర్తకం, చట్టపరమైన విధులకు నాయకత్వం వహిస్తున్నారు. రూ. 5,640 కోట్ల నికర విలువతో ఏడో స్థానంలో ఉన్నారు. లెన్స్కార్ట్ను ప్రారంభించడానికి ముందు, బన్సాల్ 2010 నుండి 2014 వరకు DNS అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు డైరెక్టర్గా పనిచేశారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన నేహా, BCom ఆనర్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.8. ఇంద్రా నూయి (Indra Nooyi) పెప్సికోలో 24 సంవత్సరాలు సేవలందించిన తర్వాత, కంపెనీ మాజీ చైర్పర్సన్ సీఈవో ఇంద్రా నూయి రూ. 5,130 కోట్ల నికర విలువను కలిగి ఉన్నారు. 2019లో పదవీ విరమణ చేశారు. CEOగా, తన పదవీకాలంలో అమ్మకాలను దాదాపు రెట్టింపు చేశారు. ఆరోగ్యకరమైన ఉత్పత్తులు, పర్యావరణ అనుకూల పద్ధతులను ప్రవేశపెట్టారు. పెప్సికో నుండి పదవీ విరమణ చేసిన తర్వాత, నూయి 2019లో అమెజాన్ బోర్డు, డ్యూయిష్ బ్యాంక్ యొక్క గ్లోబల్ అడ్వైజరీ బోర్డులో చేరారు. 2023లో AI-ఆధారిత డేటా భద్రత, నిర్వహణ స్టార్టప్ కోహెసిటీ CEO అడ్వైజరీ కౌన్సిల్లో చేరారు. నూయి భారతదేశంలో పెరిగారు. యేల్ నుండి MBA పట్టా పొందారు. 9. నేహా నార్ఖేడే ( Neha Narkhede)స్ట్రీమింగ్ డేటా టెక్నాలజీ సంస్థ కాన్ఫ్లూయెంట్ కోఫౌండర్,మాజీ సీటీవో నేహా నికర ఆస్తుల విలువ రూ. 4,160 కోట్లు. మహారాష్ట్రలోని పూణేకు చోందిన నేహా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ అపాచీ కాఫ్కాను సహ-సృష్టించారు. ప్రస్తుతం ఆమె కాన్ఫ్లూయెంట్ బోర్డు సభ్యురాలిగా పనిచేస్తున్నారు. దీనికి ముందు 2021లో రిస్క్ డిటెక్షన్ ప్లాట్ఫామ్ డెవలపర్ ఓస్సిలార్ను సహ-స్థాపించారు. అంతేకాదు గత ఏడాది ఆమె ఫోర్బ్స్ అమెరికా యొక్క స్వీయ-నిర్మిత మహిళలలో ఒకరిగా జాబితాలో చోటు సంపాదించారు.10. కవిత సుబ్రమణియన్ (Kavitha Subramanian)భారతీయ ఆన్లైన్ పెట్టుబడి వేదిక, అప్స్టాక్స్ సహ వ్యవస్థాపకురాలు కవిత భారతదేశంలోని టాప్ 10 ధనిక మహిళా వ్యవస్థాపకుల జాబితాలో చివరి స్థానంలో ఉన్నారు. ఆమె నికర విలువ రూ. 3,840 కోట్లు. అప్స్టాక్స్ను ప్రారంభించడానికి ముందు ఆమె 2015-2016 వరకు లీప్ఫ్రాగ్ ఇన్వెస్ట్మెంట్స్కు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. SKS మైక్రోఫైనాన్స్ లిమిటెడ్లోని యాక్టిస్లో పనిచేశారు. IIT బాంబే పూర్వ విద్యార్థిని, ది వార్టన్ స్కూల్ MBA గ్రాడ్యుయేట్. -
బ్యూటీ విత్ ట్రెండ్ : డీఎన్ఏ ఆధారిత చికిత్సలు, కచ్చిత ఫలితాలు
టీనేజ్ మొదలు పండు ముసలి వరకూ నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలని, నిత్య యవ్వనంగా ఉండాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ పెరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగం, వ్యాపారం, ఒత్తిళ్లు, రాత్రి షిఫ్ట్లలో విధులు, ఆహారం, లైఫ్ స్టైయిల్, వాతావరణ పరిస్థితుల్లో అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. ఖరీదైన బట్టలు, ఫ్యాషన్లుక్ ఉండే ఆభరణాలు ధరించినా ముఖ సౌందర్యం చాలా ముఖ్యం. మగవారిని ప్రధానంగా వేధిస్తున్న జుట్టు సమస్య, మహిళల్లో మొటిమలు, హార్మోన్ సమస్యలు కుంగదీస్తున్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఇటువంటి వారి కోసం ఇప్పటికే మార్కెట్లో పలు రకాల చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా డీఎన్ఏ ఆధారిత చికిత్సలకు భాగ్యనగరం వేదికగా మారింది. డీఎన్ఏ అనాలసిస్తో సమస్యకు కచి్చతమైన కారణాలను అన్వేషించడంతో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. – సాక్షి, సిటీ బ్యూరో ప్రతి వ్యక్తికీ డీఎన్ఏ యూనిక్గా ఉంటుంది. జీన్ అనాలసిస్ చేసి, ఆ ఫలితాల ఆధారంగా చికిత్సలు తీసుకునే కొత్త పద్దతులు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకే రకమైన సమస్యకు అందరికీ ఒకే రకమైన చికిత్సలు అందించడం మంచిది కాదు. ఫలితాల్లోనూ తేడాలు ఉండే అవకాశం ఉంటుంది. సామాజిక మాధ్యమాలకు ప్రభావితం కావొద్దు. సౌందర్య రంగంలో అధునాతన పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయి. జీన్స్ ఆధారంగా చికిత్సలు తీసుకోవడం ఉత్తమం. ఖచ్చితత్వంతో పనిచేసే అవకాశం ఉంటుంది. – డా.రేఖా సింగ్, చర్మ సౌందర్య నిపుణురాలుహైదరాబాద్ వాసులు సౌందర్యంపై ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నారు. అందుకు తగ్గట్లే నగరంలో గల్లీకో బ్యూటీ పార్లర్, స్కిన్ కేర్, ఏస్తటిక్స్ వంటివి అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా డీఎన్ఏ ఆధారిత సౌందర్య కేంద్రాలు వెలుస్తున్నాయి. పురుషుల్లో అత్యధికంగా జుట్టు రాలే సమస్యలు కనిపిస్తున్నాయి. రెండు పదుల వయసులోనే జుట్టు రాలడం మొదలైపోతోంది. వివిధ రకాల నూనెలు, ఇతర థెరఫీలను ఆశ్రయిస్తున్నారు. మహిళల్లో ముఖంపై పింపుల్స్, మచ్చలు రావడం, చర్మ సమస్యలు వస్తున్నాయి. చదవండి: ఎంగేజ్మెంట్ : దేవ కన్యలా అన్షులా కపూర్, అమ్మకోసం అలా..!బరువు పెరగడం, నిద్రలేమి, ఆహారం, వయసులో మార్పులు, హార్మోన్ సమస్యలు కారణాలుగా కనిపిస్తున్నాయి. దీని వల్ల వ్యక్తుల్లో కాన్ఫిడెన్స్ లెవల్స్ దెబ్బతింటున్నాయని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. డీఎన్ఏ ఆధారిత చికిత్సల్లో వ్యక్తుల లాలాజలం నుంచి నమూనా సేకరించి డీఎన్ఏ పరీక్షకు పంపిస్తాం. నివేదికలు రావడానికి సుమారు నాలుగు వారాలు పడుతుంది. బాడీకాంపొజిషన్ అనాలసిస్ (బీసీఏ) చేపట్టి, వ్యక్తి ఎత్తు, వయసు ఆధారంగా ఏ పరిమాణంలో ఉండాలి, ప్రస్తుతం ఎంత ఉందనేది నిర్ధారించుకుని, ఆపై నిపుణులైన డెర్మటాలజీ, న్యూట్రిషిన్లు పరంగా చికిత్సలు అందిస్తారు. -
ఎంగేజ్మెంట్ : దేవ కన్యలా అన్షులా కపూర్, అమ్మకోసం అలా..!
బాలీవుడ్ నిర్మాత, అందాల నటి దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ కుమార్తె అన్షులా కపూర్ (Anshula Kapoor) గోర్ ధన (నిశ్చితార్థం) వేడుకలో తన దివంగత తల్లి మోనా శౌరీ (Mona Shourie)పై చూపిన ప్రేమ నెట్టింట విశేషంగా నిలుస్తోంది.బోనీ కపూర్ మొదటి భార్య దివంగత మోనా శౌరీ కుమార్తె అన్షులా కపూర్ తన చిరకాల ప్రియుడు రోహన్ ఠక్కర్ను త్వరలోనే పెళ్లాడనుంది. దీనికి సంబంధించి కపూర్ కుటుంబం గోర్ ధన వేడుకను నిర్వహించింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్మీడియాలో పంచుకుంది అన్షులా. ఈ క్రమంలో తన దివంగత తల్లి మోనా శౌరీ కోసం అన్షులా కపూర్ ఒక సీటును ఖాళీగా ఉంచడం, అందులో తనతోపాటు తల్లి ఉన్న ఫోటోను ఉంచడం అందరి హృదయాలను కరిగించింది. తన జీవితంలో ముఖ్యమైన రోజున తన తల్లి మిస్ అవుతున్న వైనాన్ని చెప్పకనే చెప్పింది. అమ్మ ప్రేమ.. అప్పటికీ... ఎప్పటికీ తమ చుట్టూనే ఉంటుంది. ఆమె మాట, ఆమె మాటల్లో పువ్వుల్లో ఆమె సీటులో, మా గుండెల్లో ఆమె ఎప్పుడూ శాశ్వతమే అని పోస్ట్ చేసింది. పర్పుల్ లెహంగాలో దేవకన్యలాఈ వేడుక కోసం అర్పితా మెహతా రూపొందించిన పర్పుల్ కరల్ లెహంగా, దానికి మ్యాచింగ్ చోళీ, దుప్పట్టాలో అన్షులా ఒక దేవకన్యలా కనిపించింది. ఆమె అందమైన మేకప్ జడతో తన లుక్ను అందంగా అమిరాయి. మరోవైపు, రోహన్ నల్లటి షేర్వానీలో అందంగా కనిపించాడు. అంతేకాదు జాన్వీ కపూర్ , ఖుషీ కపూర్ (బోనీ కపూర్ రెండో భార్య శ్రీదేవి పిల్లలు) తమ సోదరి అన్షులా గోర్ ధన వేడుకకు హాజరై సందడి చేశారు. కాబోయే బావగారితో ఫోటోలకు పోజులిచ్చారు. అన్షులా-రోహన్ పెళ్లి ఈ ఏడాది డిసెంబర్లో జరగనున్నట్లు సమాచారం.కాగా బోనీ కపూర్ మొదటి భార్య మోనాకు విడాకులిచ్చి, 1996లో హీరోయిన్ శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు.అర్జున్ కపూర్, అన్షులా కపూర్ మొదటి భార్య మోనా పిల్లలు కాగా జాన్వీ, ఖుషి కపూర్ శ్రీదేవి పిల్లలు. -
చేతిరాతతో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా!
అంతా చేతిరాతలోనే ఉంది.. విషయ పరిజ్ఞానం నుంచి ఆరోగ్యం దాకా! మరి ఈ డిజిటల్ యుగంలో హ్యాండ్రైటింగ్ ప్రస్తావన? ఎలక్ట్రానిక్ వర్డ్స్తోనే అక్షరాభ్యాసం ప్రారంభించిన ఈ తరం హ్యాండ్ రైటింగ్కి అర్థాన్ని పర్ప్లెక్సిటీలో పరికిస్తుందేమో! ఆ పరిస్థితి రాకుండా పిల్లలు పెన్ను పట్టేలా చూడాల్సిన పని పెద్దలదే! దస్తూరి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఏంటీ? అసలా రాతకు ఎందుకంత ప్రాధాన్యమివ్వాలి అనే అంశాల మీద ప్రముఖ హ్యాండ్రైటింగ్ ఎనలిస్ట్ అండ్ గ్రాఫోథెరపిస్ట్, విశ్రాంత ఆచార్యులు (సెస్, హైదరాబాద్) డాక్టర్ సి. రామచంద్రయ్య ఏమంటున్నారో తెలుసుకుందాం...చేతిరాతను మరచిపోతున్నామా? డిజిటల్ యుగంలో రాతకు కీ బోర్డ్ ప్రత్యామ్నాయమైంది. సెర్చింగ్ దగ్గర్నుంచి సందేశాలను చేరవేయడం దాకా అన్నిటికీ డిజిటల్ మాధ్యమమే! వ్యయప్రయాసల్లేని ఈ సౌకర్యం చెంతనుండగా చేతిరాతతో పనేముంటుంది? స్కూళ్లలో, కాలేజీల్లో విద్యార్థులకూ టాబ్లెట్లు, లాప్టాప్లు అందుబాటులోకి వచ్చాక పరీక్షల్లో మాత్రమే చేతిరాత అవసరమవుతోంది. ఆన్లైన్ పరీక్షలకు అదీ అనవసరమే అయింది. మన వ్యక్తిత్వం, అలవాట్లు ముఖ్యంగా మైండ్ – బాడీ కోఆర్డినేషన్ (సమన్వయం)కి సంబంధించి చేతిరాత ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నారు.ఎందుకంటే చేతిరాత అనేది నాడీ – కండరాల చర్య. మెదడు పంపే సందేశాలను బట్టే రాసే వేళ్లు కదులుతాయి. మరైతే ఒకే భాషలో ఒకే అంశాన్ని రాసేవాళ్లందరి చేతిరాత ఒకేరకంగా ఉండాలి కదా? అంటే ఏ ఇద్దరి చేతిరాత ఒకటిగా ఉండే అవకాశం లేదు. కారణం.. వాళ్ల సబ్కాన్షస్ మైండ్లోని ఆలోచన, సంఘర్షణలు. అందుకే చేతిరాతను మెదడు రాతగా అభివర్ణిస్తారు. మనిషి వయసుతోపాటు ఆలోచనలు, మానసిక స్థితిలో కలిగే మార్పులను బట్టి చేతిరాతా మారుతూంటుంది.విద్య, వైద్యం.. నేరపరిశోధన, వైవాహిక బంధాలు ఇలా చేతిరాతను విశ్లేషించే శాస్త్రాన్ని గ్రాఫాలజీ అంటారు. చేతితో రాసే, గీసే అంటే అక్షరాలు, అసంపూర్తి గీతలు– డూడుల్స్, బొమ్మలు, సంఖ్యలు వగైరా అన్నీ ఈ శాస్త్రం పరిధిలోకి వస్తాయి. వీటి ఆధారంగా మనిషి వ్యక్తిత్వాన్ని గుర్తించే ప్రక్రియ అనాదిగా పలు నాగరికతల్లో ఉంది. ఒక నిర్దిష్ట అంశంగా గ్రాఫాలజీకి నాలుగువందల ఏళ్ల చరిత్ర ఉంది. గ్రాఫాలజీ (graphology) మీద తొలిసారిగా 1622లో ఇటాలియన్ డాక్టర్, తత్వవేత్త కామిలో బాల్డి ఒక పుస్తకం రాశారు. చేతిరాతతో మనస్తత్వాన్ని విశ్లేషించడానికి లాటిన్ స్క్రిప్ట్నే సౌకర్యంగా భావిస్తారు. గ్రాఫాలజీ ఒక అకడమిక్ సబ్టెక్ట్గా ప్రవర్తనా శాస్త్రం కోవలోకి వస్తుంది. ఇది ఎక్కువగా మనస్తత్వశాస్త్రం, నాడీమండల శాస్త్ర విశ్లేషణలను గ్రహిస్తుంది. యూరప్, అమెరికాలోని కొన్ని యూనివర్సిటీల్లో గ్రాఫాలజీ కోర్సులున్నాయి. గ్రాఫాలజీ సంఘాలూ ఉన్నాయి. ఈ సబ్టెక్ట్ను సూడోసైన్స్ అని విమర్శించేవాళ్లూ లేక΄ోలేరు. అయినా రోజురోజుకూ దీని ప్రాముఖ్యం పెరుగుతూనే ఉంది. అమెరికాతో పాటు మన దగ్గరా పెద్ద పెద్ద కంపెనీలు కొన్నిరకాల పదవులకు అభ్యర్థుల చేతిరాతనూ పరిశీలనలోకి తీసుకుంటున్నాయి. సంబంధిత రంగంలో అభ్యర్థికి పూర్వ అనుభవం ఉన్నప్పటికీ కొన్ని లక్షణాలను బేరీజు వేయడం కోసం అలా చేతిరాతనూ పరిగణిస్తున్నారు. ఇంకా విద్య, వైద్యం, వ్యాపారం, నేరపరిశోధన, వైవాహికబంధాలు వంటి విషయాల్లోనూ చేతిరాతను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆరోగ్య రాత.. వివిధరకాల వ్యక్తిత్వ లక్షణాలతో పాటు మెదడులో ఉద్భవించి నెమ్మదిగా భౌతికంగా వ్యక్తమయ్యే కొన్నిరకాల ఆరోగ్యసమస్యలనూ చేతిరాతతో గుర్తించవచ్చు. ఉదాహరణకు.. ఆత్మవిశ్వాసం/ఆత్మన్యూనత, అభద్రత, చికాకుపడటం, మొండితనం, సేవాతత్పరత, పట్టుదల, భావాలను వ్యక్తీకరించలేక΄ోవడం, ఏకాగ్రత లోపం, గతం గురించిన ఆందోళన, ఆధిపత్య ధోరణి, ఎవరో ఏదో అనుకుంటారని చేయాల్సిన పనులు చేయలేక΄ోవడం, ఆరోగ్య సమస్యలైన బీపీ, థైరాయిడ్, మైగ్రైన్, ప్రొస్టేట్, శ్వాసకోశ ఇబ్బందులు వగైరా దాదాపు వందకు పైగా లక్షణాలను చేతిరాతతో గుర్తించవచ్చు.గ్రాఫోథెరపీ.. గ్రాఫాలజీ ద్వారా గుర్తించిన సమస్యలను గ్రాఫోథెరపీతో నెమ్మదిగా సరిచేసుకోవచ్చు. ఈ థెరపీ రాసే వేలును ఒక పద్ధతి ప్రకారం కదిలించడం ద్వారా నాడీ సంకేతాలను మెదడుకు పంపి తద్వారా ఉపచేతన మనస్సును ప్రభావితం చేస్తుంది. అయితే ఈ ప్రక్రియ సర్వరోగ నివారణి కాదు. అలాగని వైద్యచికిత్సకు ప్రత్యామ్నాయమూ కాదు. చేయించుకుంటున్న చికిత్సకు ఒక సపోర్ట్గా మాత్రమే ఈ గ్రాఫోథెరపీ (graphotherapy) పనిచేస్తుంది. ఆధునిక జీవనశైలి సైడ్ ఎఫెక్ట్స్ అయిన మానసిక ఒత్తిడి, ఆందోళనలు నెమ్మదిగా అనేక శారీరక సమస్యలుగా మారుతాయి. ఉదాహరణకు హైపర్టెన్షన్, థైరాయిడ్, మైగ్రేన్, నిద్రలేమి, ప్రిడయాబెటిక్ మొదలైనవి. కాగితం మీద రాయడం ద్వారా మన ఆలోచనలకు ఒక స్థిరత్వం వస్తుంది. మనసు నెమ్మదిస్తుంది. గ్రాఫోథెరపీ ‘నాడీ మార్పిడి’ అనే సూత్రీకరణపై పనిచేస్తుంది. అంటే మెదడుకున్న సామర్థ్యం – కొత్తనాడీ మార్గాలను ఏర్పరచుకునే, పాతవాటిని మార్చుకునే వాటిపై ఆధారపడింది కాబట్టి చేతిరాత (Hand Writing) అనేది కేవలం కాగితం, కలానికి మాత్రమే పరిమితమైనది కాదు. అది మెదడుకు సంబంధించిన, స్వస్థత కలిగించే ప్రక్రియ. పిల్లలకు.. చేతిరాత విషయంలో పిల్లలకు సంబంధించి పరిశీలిస్తే.. పిల్లల మెదడు బాల్యదశలో పరిణతి క్రమంలో ఉంటుంది కాబట్టి పదహారేళ్లు నిండేవరకు వాళ్ల చేతిరాతను విశ్లేషించరు. కానీ పిల్లలు ఒకవేళ అభద్రతకు, డిప్రెషన్కు గురవుతున్నా, తమలో తాము చిరాకు పడుతున్నా చేతిరాతతో గుర్తించవచ్చు. వాళ్ల చేతిరాతను శాస్త్రీయబద్ధంగా మలచడం ద్వారా ఆ సమస్యలనూ అధిగమించవచ్చు. స్వీడన్లో 2009లో స్కూళ్లలో పెద్ద ఎత్తున డిజిటలైజేషన్ను ప్రవేశపెట్టింది. పుస్తకాల్లో చదవడం, రాయడం చాలావరకు తగ్గిపోయాయి. దానివల్ల జరిగిన నష్టాన్ని పదిహేనేళ్ల తర్వాత కానీ గుర్తించలేకపోయారు. పుస్తకాలను, చేతిరాతను తిరిగి ప్రవేశపెట్టాలని ఇటీవలే నిర్ణయించారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లలో పలుపద్ధతుల్లో రాయిస్తున్నారు. ఇది ఆరోగ్యకరమైన పరిణామం కాదు. అక్షరాలను కలిపి రాయడమే ఉత్తమమైనది. కలిపి రాయడం వలన మెదడులోని వివిధ భాగాలు ప్రేరేపితమవుతాయని, నేర్చుకోవడానికి ఈ ప్రక్రియ చాలా ఉపయుక్తమైనదని, టైపింగ్లో అలాంటి ప్రేరణ జరగలేదని తేలింది. నార్వే యూనివర్సిటీ 2020లో పన్నెండేళ్లు నిండిన పిల్లలపై ఈ అధ్యయనం చేసింది. స్వీడన్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లోని స్కూళ్లలో చేతిరాతను తప్పనిసరి చేయాలన్న నిర్ణయాలకు ఆ అధ్యయనం తోడ్పడింది. మాడ్యూల్.. చేతిరాతలో.. లెటర్ ఫార్మేషన్, కనెక్టివిటీ, జోనింగ్, స్పేసింగ్, వేగం.. అనే అయిదు ప్రధానాంశాలుండాలి. గ్రాఫోథెరపిస్ట్ (graphotherapist) పర్యవేక్షణలో ఒక క్రమపద్ధతిలో వీటిని నేర్చుకునేందుకు గ్లోబల్ పెన్మాన్షిప్ అకాడమీలో పిల్లల కోసం ఒక మాడ్యూల్ను రూపొందించింది. ఈ డిజిటల్ యుగంలో మన వ్యక్తిత్వాన్ని, భావోద్వేగాలను వ్యక్తపరచడానికి వీలున్న ఒకే ఒక మార్గం చేతిరాత. అందుకే దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
పరిశోధనా రంగంలో స్ఫూర్తి పతాకం
సంధ్యా షెనాయ్ (Dr Sandhya Shenoy ) సైన్స్ రంగంలో రాణించాలనుకునే భారత యువతకు ఒక స్ఫూర్తిపతాకం. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ డచ్ అకడెమిక్ పబ్లిషర్ ఎల్స్వియర్తో కలిసిప్రతి ఏటా వెలువరించే అత్యంత ప్రతిభావంతులైన సైంటిస్ట్లజాబితాలో ఆమె వరుసగా మూడుసార్లు నిలిచింది. తాజాగా వెలువడిన 2025 జాబితాలో ఆమెకు మూడోసారి స్థానం దక్కడంతో భారత పరిశోధనా రంగంలో హర్షాతిరేకాలు వెలువెత్తుతున్నాయి. సంధ్యా షెనాయ్ పరిచయం.సంధ్యా షెనాయ్కు విద్యా రంగంలో, పరిశోధన రంగంలో సంచలనాలు సృష్టించడం కొత్త కాదు. 2010లో మొదటిసారి ఆమె ఘనత వార్తపత్రికల ద్వారా లోకానికి తెలిసింది. దానికి కారణం బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎం.ఎస్సీ కెమిస్ట్రీలో ఆమె సెంట్ పర్సెంట్ సాధించడం. ఇలా ఎం.ఎస్సీ కెమిస్ట్రీలో నూరు శాతం మార్కులు సాధించడం అసాధ్యం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అంతవరకూ ఆ ఘనత సాధించిన వారు ఒక్కరూ లేరు. మొదటిసారి సంధ్యా షెనాయ్ ఆ మార్కులు సాధించింది. ‘స్టూడెంట్ అంటే ఇలా ఉండాలి’ అని అందరి చేతా అనిపించుకుందామె.హాజరు.. చదువు...కొంకిణి మాతృభాష కలిగిన సంధ్యా షెనాయ్ సొంత ప్రాంతం ఉడిపి. అక్కడే బి.ఎస్సీ. వరకూ చదివి కాలేజీలో గోల్డ్ మెడల్ సాధించింది. ఆ తర్వాత కుటుంబం బెంగళూరులో స్థిరపడటంతో అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో నూరు శాతం మార్కులు సాధించి నానో కెమిస్ట్రీలో పీహెచ్డీ కొనసాగించింది. ‘నా చదువులో ఎప్పుడూ కాలేజీ ఎగ్గొట్టలేదు. నూరు శాతం అటెండెన్స్తో ఉంటాను. అలాగే క్లాసుల్లో రన్నింగ్ నోట్స్ మిస్ కాను. పరీక్షలకు అదే చదువుకుంటాను. అలాగే మార్కులు తెచ్చుకున్నాను’ అంటుందామె. కెమిస్ట్రీలో విశేషమైన అభిరుచి ఉన్న షెనాయ్ మొదట అధ్యాపక వృత్తిలో ఉంటూనే తన పరిశోధనను కొనసాగించి ఉత్తమ సైంటిస్ట్ అవ్వాలని నిశ్చయించుకుంది.చదవండి: Shoaib Malik సానియా మాజీ భర్త మూడో పెళ్లి పెటాకులే..?! వీడియో వైరల్వేస్ట్ హీట్ను విద్యుత్గా...మంగళూరు శ్రీనివాస యూనివర్సిటీలో ప్రొఫెసర్, ప్రిన్సిపల్ రీసెర్చ్ సైంటిస్ట్గా పని చేస్తున్న సంధ్యా షెనాయ్ థెర్మో ఎలక్ట్రిక్ మెటీరియల్స్లో విశేషమైన పరిశోధన కొనసాగిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన పత్రాలు ప్రచురించడం ద్వారా గుర్తింపు పొందింది. లండన్లోని ‘రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ’ (ఆర్.ఎస్.సి.) ఆమెను లీడింగ్ ఫిమేల్ రీసెర్చర్గా గుర్తించింది. ఈ గుర్తింపు పొందడం అంత సులువు కాదు. పర్యావరణ రంగానికి చేటు చేస్తున్న వేస్ట్ హీట్ (కర్మాగారాలు, ఇతర యంత్ర పరికరాల వల్ల వెలువడే ఉష్ణం) వృథా అవడమే కాకుండా పర్యావరణానికి చేటు చేస్తుండటం వల్ల ఆ వేస్ట్ హీట్ను విద్యుత్తుగా ఎలా మార్చవచ్చో పరిశోధనలు చేస్తూ, వాటి ఫలితాలను ప్రతిపాదిస్తూ సంధ్యా షెనాయ్ ప్రపంచవ్యాప్తంగా సైంటిస్ట్ల దృష్టిని ఆకర్షించింది. అందుకే ఆమెకు 2021లో ‘యంగ్ సైంటిస్ట్’ అవార్డ్, 2024లో ‘కెమిస్ట్రీ మెడల్’ లభించాయి.చదవండి: Nita Amabni క్వీన్ ఆఫ్ దాండియాతో గార్బా స్టెప్పులు : ఉర్రూతలూగిన వేదికప్రపంచ సైంటిస్టుల జాబితాలో...ప్రపంచంలో అత్యుత్తమ సైంటిస్టుల 2 శాతం పట్టికను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రతి ఏటా ప్రకటిస్తూ ఉంటుంది. ఆగస్టు 30 నాటికి ఆ సంవత్సరంలో వివిధ అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురించిన పరిశోధన పత్రాల ఆధారంగా, వాటికి అందిన ఆదరణను బేరీజు వేసుకుని సెప్టెంబర్లో ఈ జాబితాను విడుదల చేస్తారు. 2023 నుంచి సంధ్యా షెనాయ్ ఈ పట్టికలో నిలుస్తోంది. తాజాగా సెప్టెంబర్ 19న విడుదల చేసిన 2025 జాబితాలో మూడవసారి కూడా సంధ్యా షెనాయ్కు చోటు దక్కింది. ప్రపంచవ్యాప్త సైంటిస్టులకు సమఉజ్జీగా మన దేశం నుంచి ఒక మహిళా పరిశోధకురాలు ఈ స్థాయి గుర్తింపు ΄పొందుతుండటం మన సైన్సు రంగానికి గర్వకారణం. అందుకే ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలి నేటి యువతరం. -
డైపర్.. సైజ్ గురించి పట్టించుకుంటున్నారా?
బిడ్డ పుట్టిన తర్వాత తల్లిదండ్రులు తీసుకుంటున్న జాగ్రత్తలలో చిన్నారికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఎలాంటి బట్టలు కొనాలి, వాళ్లని ఎలా చూసుకోవాలి.. వంటి వాటితోపాటు వారికి వాడవలసిన డైపర్ల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చిందిప్పుడు. ఎందుకంటే పిల్లల సంరక్షణలో డైపర్ల సైజు కూడా చాలా ముఖ్యం.తల్లిదండ్రుల తమ పిల్లలకు వేసే డైపర్లను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. టేప్–స్టైల్ లేదా ప్యాంట్–స్టైల్లో తమ బిడ్డకు ఏ స్టైల్ డైపర్ సరైనదో అని తెలుసుకోవాలి. ఎందుకంటే, పిల్లలకు సరైన డైపర్ వేయక΄ోతే.. అది వారి కోమలమైన చర్మంపై ప్రభావం చూపిస్తుంది. డైపర్లలోనూ ఎన్నో రసాయనాలుంటాయి. ఇవి ఎక్కువ సేపు చర్మాన్ని అంటిపెట్టుకుని ఉండటం వల్ల బిడ్డకు హాని కలిగే ప్రమాదం ఉంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని.. డైపర్ ఎంపికలో జాగ్రత్త వహించాలి.క్లాత్ న్యాపీలు పిల్లలకు చాలా సౌకర్యంగా ఉంటాయి, కానీ వాటిని పదే పదే ఉతకడం తల్లిదండ్రులకు లేదా వారి సంరక్షకులకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అంతే కాకుండా క్లాత్ న్యాపీలను తyì సిన వెంటనే మార్చక΄ోతే పిల్లలకు అసౌకర్యంగా ఉంటుంది. సరైన డైపర్ ఎంపికఅన్ని విషయాల కంటే వారికి వేసే డైపర్ బ్రాండ్ ముఖ్యమైనది. సాధ్యమైనంత వరకు డైపర్ తయారీలో లోకల్ గా దొరికేవి, తెలియని బ్రాండ్ డైపర్లకు బదులు మెరుగైన ఫీచర్లతో తయారు చేసిన బ్రాండెడ్ డైపర్లు వాడటం చిన్నారికి కంఫర్ట్నిస్తుంది.తడి పీల్చుకునేలా... ఎక్కువ సేపుపొడిగా ఉండేలా...పిల్లల మూత్రం, మలం త్వరగా... ఎక్కువ శాతం పీల్చుకునే డైపర్లు ఎంచుకోవాలి. లీక్ అయ్యే డైపర్లకు దూరంగా ఉండండి. లీక్ అయ్యే డైపర్ల వల్ల.. పిల్లల శరీరానికి తేమ అంటుతుంది. పిల్లల చర్మానికి తడి అంటితే వారికి చికాకుగా ఉంటుంది. అంతేకాదు చిన్నారుల చర్మం సున్నితంగా ఉంటుంది. తడి కారణంగా త్వరగా దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది. పిల్లలకు రాత్రి సమయంలోనూ ఎక్కువ సేపు పొడిగా ఉండే డైపర్లు వేస్తే.. హాయిగా నిద్రపోతారు. వారి చర్మానికి తడి తగిలితే మధ్య రాత్రి ఏడవటం ్ర΄ారంభిస్తారు. దీని దృష్టిలో ఉంచుకుని పొడిగా ఉండే డైపర్లు వేయండి.(Shoaib Malik సానియా మాజీ భర్త మూడో పెళ్లి పెటాకులే..?! వీడియో వైరల్)సరైన సైజ్పిల్లల బరువును బట్టి డైపర్ సైజులు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి డైపర్ కొనడానికి ముందు మీ బిడ్డ బరువు, సైజ్ ను చూసి కొనండి. వారి డైపర్ సైజ్ ప్రతి నెల మారుతుందని గుర్తు పెట్టుకోవడం అవసరం. అందుకే ఒకే సైజ్ డైపర్లు ఇంట్లో నిల్వ ఉంచుకోకండి. డైపర్ లూజ్గా ఉన్నా, బిగువుగా ఉన్న చిన్నారి ఇబ్బంది పడుతుంది. అవి వేసుకోవడానికి ఇష్టపడరు. పిల్లల కోమలమైన చర్మానికి సరిపోయేలా ఉండే సున్నితమైన ఉండే డైపర్లు మాత్రమే ఎంచుకోవాలి -
కొరియన్ మెరుపు : కె–బ్యూటీ హవా
నిన్న, మొన్నటి వరకు స్కిన్ గ్లో కోసం లోషన్లు, క్రీములు, ఫౌండేషన్లు ఉపయోగించేవారు. ఇప్పుడు ఇండియన్ జెన్ జెడ్, మిలీనియల్స్ తరం వివిధ ఆన్లైన్ ప్లాట్ఫారమ్లలో కె–బ్యూటీ ఉత్పత్తులను విరివిగా కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే ఈ కొరియన్ బేస్డ్ బ్యూటీ ఉత్పత్తుల మార్కెట్ పదకొండు లక్షల కోట్ల మార్క్ను తాకింది. కొరియన్ చర్మ సంరక్షణ ఉత్పత్తులకు పెరుగుతున్న ప్రజాదరణను కె–బ్యూటీ అని పిలుస్తున్నారు. చర్మ సంరక్షణ అంటే అందంగా కనిపించడానికి మాత్రమే కాదు. స్వీయ సంరక్షణ, దీర్ఘకాలిక పోషణ కూడా. నిజానికి భారత్ ఫ్రాన్స్ యుఎస్ ..వంటి సొంత ప్రాచీన సౌందర్య ఉత్పాదనల గల దేశాలు కూడా ఈ కె.బ్యూటీ అలల్లో మునిగిపోతున్నాయి. భారతీయ స్త్రీ, పురుషుల చర్మ తత్త్వం ప్రత్యేకమైనది. మన వాతావరణంలో ఎలాంటి సౌందర్య ఉత్పాదనలు పనిచేస్తాయో తెలిసినప్పటికీ కొరియన్ల చర్మం మరింత గ్లాసీ లుక్తో మెరవడమే దీనికి గల కారణంగా కనిపిస్తోంది. హైడ్రేషన్, ఎక్స్ఫోలియేషన్, ఉత్పత్తులను పొరలుగా వేయడం వంటి విధానాల ద్వారా ‘గ్లాస్ స్కిన్’ను సాధించడానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ పదం చాలా మంది భారతీయ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా భారతీయ యువత కె–బ్యూటీ, గ్లో–అప్ను బాగా ఇష్టపడుతోంది. దీంతో ఆన్లైన్ వేదికగా ఈ ఉత్పత్తులు ఇంటి ముందుకే డెలివరీ అవుతున్నాయి.ఇంట్లో స్పా అనుభూతిభారతదేశంలో వేడి, తేమతో కూడిన వాతావరణం, విభిన్న చర్మ రకాలు, కాలుష్య స్థాయిలు మన చర్మ సంరక్షణను సవాల్ చేస్తుంటాయి. స్మైల్ మ్యూసిన్, జిన్సెంగ్, గ్రీన్ టీ.. వంటి పదార్థాలతో కూడిన కొరియర్ ఉత్పత్తులు చర్మానికి చికాకు కలిగించక పోవడం కూడా బహుళ ఆదరణ పొందుతున్నాయి. వివిధ దశలలో చర్మ సంరక్షణ విధానం, క్లెన్సింగ్, టోనింగ్, సీరమ్స్, ఎసెన్స్లు, మాయిశ్చరైజర్లు, ఎస్పీఎఫ్ లు అందానికి మరింత ప్రయోజనాన్ని చేకూరుస్తున్నాయి. కె–బ్యూటీ ఉత్పత్తులలో ఇంట్లో స్పా అనుభూతిని సొంతం చేసే విధంగా వివిధ దశల అప్లికేషన్స్ ఉంటున్నాయి. కె–బ్యూటీ దృష్టి కూడా భారతీయ యువతలో పెరుగుతున్న స్వీయ సౌందర్యానికి పూర్తి అనుగుణంగా ఉంటుంది.చదవండి: Shoaib Malik సానియా మాజీ భర్త మూడో పెళ్లి పెటాకులే..?! వీడియో వైరల్చర్మ సంరక్షణ తత్త్వాలకు అనుగుణంగా!కె–బ్యూటీ కొరియన్ బ్రాండ్లకు మాత్రమే పరిమితం కావడం లేదు. జర్మనీ, ఫ్రాన్స్, యుఎస్ కంపెనీలు కొరియన్ చర్మ సంరక్షణ తత్త్వాలను స్వీకరించి, దక్షిణ కొరియాలో కూడా ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. భారతదేశంలో కె–బ్యూటీ భవిష్యత్తును గుర్తించి దక్షిణ కొరియాలోని అతిపెద్ద బ్యూటీ రిటైలర్ ఆలివ్ యంగ్ అమెరికాలో తన కంపెనీని ఏర్పాటు చేయాలనుకుంటోంది. దీంతో కె–బ్యూటీ గేమ్ మరింత పోటీతత్వాన్ని పొందబోతోందనేది అర్ధం అవుతోంది. దీని వల్ల భారతీయ యువతకు మరిన్ని ఎంపికలు, మెరుగైన ఉత్పత్తులు, సమీప భవిష్యత్తులో కొన్ని స్వదేశీ కె–బ్యూటీ ప్రేరేపిత బ్రాండ్లు కూడా లభించనున్నాయి. ఇదంతా చూస్తుంటే కె–బ్యూటీ ప్రపంచవ్యాప్తంగా తన హవాను కొనసాగిస్తుందని అర్ధం అవుతోంది. కొరియన్ చర్మ సంరక్షణ ఉత్పత్తులకు పెరుగుతున్న ప్రజాదరణను కె–బ్యూటీ అని పిలుస్తున్నారు. చర్మ సంరక్షణ అంటే అందంగా కనిపించడానికి మాత్రమే కాదు. స్వీయ సంరక్షణ, దీర్ఘకాలిక పోషణ కూడా. నిజానికి భారత్ ఫ్రాన్స్ యుఎస్ .. వంటి సొంత ప్రాచీన సౌందర్య ఉత్పాదనల గల దేశాలు కూడా ఈ కె.బ్యూటీ అలల్లో మునిగిపోతున్నాయి. భారతీయ స్త్రీ, పురుషుల చర్మ తత్త్వం ప్రత్యేకమైనది. మన వాతావరణంలో ఎలాంటి సౌందర్య ఉత్పాదనలు పనిచేస్తాయో తెలిసినప్పటికీ కొరియన్ల చర్మం మరింత గ్లాసీ లుక్తో మెరవడమే దీనికి గల కారణంగా కనిపిస్తోంది. హైడ్రేషన్, ఎక్స్ఫోలియేషన్, ఉత్పత్తులను పొరలుగా వేయడం వంటి విధానాల ద్వారా ‘గ్లాస్ స్కిన్’ను సాధించడానికి ప్రాధాన్యత ఇస్తుంది.ఈ పదం చాలామంది భారతీయ వినియోగదారులను ఆకట్టు కుంటోంది. ముఖ్యంగా భారతీయ యువత కె–బ్యూటీ, గ్లో–అప్ను బాగా ఇష్టపడుతోంది. దీంతో ఆన్లైన్ వేదికగా ఈ ఉత్పత్తులు ఇంటి ముందుకే డెలివరీ అవుతున్నాయి. (ఈ తప్పు మీరూ చేస్తే.. మీ ఆయుష్షు మూడినట్టే!)ఇంట్లో స్పా అనుభూతిభారతదేశంలో వేడి, తేమతో కూడిన వాతావరణం, విభిన్న చర్మ రకాలు, కాలుష్య స్థాయిలు మన చర్మ సంరక్షణను సవాల్ చేస్తుంటాయి. స్మైల్ మ్యూసిన్, జిన్సెంగ్, గ్రీన్ టీ.. వంటి పదార్థాలతో కూడిన కొరియర్ ఉత్పత్తులు చర్మానికి చికాకు కలిగించక పోవడం కూడా బహుళ ఆదరణ పొదదుతున్నాయి. వివిధ దశలలో చర్మ సంరక్షణ విధానం, క్లెన్సింగ్, టోనింగ్, సీరమ్స్, ఎసెన్స్లు, మాయిశ్చరైజర్లు, ఎస్పీఎఫ్ లు అందానికి మరింత ప్రయోజనాన్ని చేకూరుస్తున్నాయి. కె–బ్యూటీ ఉత్పత్తులలో ఇంట్లో స్పా అనుభూతిని సొంతం చేసే విధంగా వివిధ దశల అప్లికేషన్స్ ఉంటున్నాయి. కె–బ్యూటీ దృష్టి కూడా భారతీయ యువతలో పెరుగుతున్న స్వీయ సౌందర్యానికి పూర్తి అనుగుణంగా ఉంటుంది.చర్మ సంరక్షణ తత్త్వాలకు అనుగుణంగా!కె–బ్యూటీ కొరియన్ బ్రాండ్లకు మాత్రమే పరిమితం కావడం లేదు. జర్మనీ, ఫ్రాన్స్, యుఎస్ కంపెనీలు కొరియన్ చర్మ సంరక్షణ తత్త్వాలను స్వీకరించి, దక్షిణ కొరియాలో కూడా ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. భారతదేశంలో కె–బ్యూటీ భవిష్యత్తును గుర్తించి దక్షిణ కొరియాలోని అతిపెద్ద బ్యూటీ రిటైలర్ ఆలివ్ యంగ్ అమెరికాలో తన కంపెనీని ఏర్పాటు చేయాలనుకుంటోంది. దీంతో కె–బ్యూటీ గేమ్ మరింత పోటీతత్వాన్ని పొందబోతోందనేది అర్ధం అవుతోంది. దీని వల్ల భారతీయ యువతకు మరిన్ని ఎంపికలు, మెరుగైన ఉత్పత్తులు, సమీప భవిష్యత్తులో కొన్ని స్వదేశీ కె–బ్యూటీ ప్రేరేపిత బ్రాండ్లు కూడా లభించ నున్నాయి. ఇదంతా చూస్తుంటే కె–బ్యూటీ ప్రపంచవ్యాప్తంగా తన హవాను కొనసాగిస్తుందని అర్ధం అవుతోంది. -
పబ్లిక్ టాయిలెట్స్లో హ్యాండ్ డ్రైయర్ వాడుతున్నారా?
చాలామంది రెస్టారెంట్లు లేదా సినిమాలకు వెళ్లినప్పుడు అక్కడి టాయిలెట్లలో చేతులు కడుకున్న తర్వాత హ్యాండ్ డ్రైయర్స్ వాడటం మామూలే. కానీ అలా పబ్లిక్ టాయిలెట్లలోని వాష్ బేసిన్లలో హ్యాండ్ వాష్ తర్వాత... అక్కడి డ్రైయర్లు ఉపయోగించి చేతుల్ని ΄పొడిగా చేసుకోవడం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొందరు వైద్యుల సలహా ఏమిటంటే... టాయిటెట్లలో హ్యాండ్వాష్ లేదా లిక్విడ్ సోప్తో చేతులు కడుక్కున్న తర్వాత అవి ఎంతోకొంత శుభ్రమవుతాయి. కానీ అలా శుభ్రమైన చేతుల్ని కాస్తా అక్కడ హ్యాండ్ డ్రైయర్ కింద పెట్టడం వల్ల మళ్లీ అవి కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువన్నది ఆరోగ్యనిపుణుల మాట. ఎందుకంటే అది టాయిలెట్ కావడం వల్ల ఎంత లేదన్నా అక్కడి పరిసరాల్లో సూక్ష్మజీవులు, జెర్మ్స్ వంటివి ఉండనే ఉంటాయి. ఇలా మనం డ్రైయర్ కింద చేతులు పెట్టినప్పుడు ఆ డ్రైయర్ తాలూకు ఉష్ణోగ్రత పెద్ద ఎక్కువగా ఏమీ ఉండదు. కేవలం చేతుల్ని పొడిబార్చేందుకు ఉద్దేశించినంతే ఉంటుంది. అంతటి గోరువెచ్చటి ఉష్ణోగ్రతలో సూక్ష్మజీవులు అంతరించి΄ోవనీ, దానికి బదులు అక్కడి గాలిలో ఉండే సూక్ష్మక్రిములు, జెర్మ్స్ మళ్లీ చేతులకు అంటుకు΄ోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. డ్రైయర్కు బదులుగా వ్యక్తిగత హ్యాండ్కర్చిఫ్ వాడటం లేదా అలా స్వతహాగా అరి΄ోయేదాకా వేచిచూడటమే మంచిదని అంటున్నారు. అలాగే కొందరు నిపుణులు చెబుతున్నదేమిటంటే... టాయిలెట్లలోని వాష్బేసిన్ల దగ్గర ఒకసారి సబ్బుతో చేతులు కడుక్కున్న తర్వాత మళ్లీ అక్కడి ఏ ఉపరితలాన్నీ (సర్ఫేస్నూ) తాకకూడదని సూచిస్తున్నారు. చదవండి : ఈ తప్పు మీరూ చేస్తే.. మీ ఆయుష్షు మూడినట్టే! -
ఎడమ వైపు తిరిగి పడుకుంటున్నారా? ఈ విషయం తెలుసా?
ఎడమ వైపు తిరిగి నిద్రపోయే అలవాటు కొందరికి ఉంటుంది. అయితే..ఇప్పటికే గుండె జబ్బులు ఉన్న వారు ఎడమ వైపు తిరిగి అసలు నిద్రపోకూడదు.ఇలా నిద్రపోవడం వల్ల అసిడిటీ రిఫ్లక్స్ తగ్గిపోతుందని కొందరు చెబుతుంటారు. అయితే..హార్ట్ పేషెంట్స్ మాత్రం ఇలా పడుకోవడం మంచిది కాదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎటువైపు తిరిగి పడుకుంటే మంచిదో తెలుసుకుందాం...ఎప్పుడైతే ఎడమ వైపు తిరిగి నిద్రపోతారో అప్పుడు గుండెపైన ఒత్తిడిపడుతుంది. ఈ ఒత్తిడి కారణంగా గుండె కాస్తంత పక్కకు జరిగినట్టుగా అవుతుంది. అదే సమయంలో గ్రావిటీ కారణంగా కిందకు లాగినట్టుగా అవుతుంది. ఈ రెండింటి మధ్య రాపిడి కారణంగా హృదయ స్పందనలో మార్పు వస్తుంది. అందుకే..గుండె జబ్బులు ఉన్న వారు వీలైనంత వరకూ ఎడమ వైపు తిరిగి నిద్రపోవడాన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే గుండె జబ్బు లక్షణాలు ఇంకా తీవ్రమవుతాయి. ఇక కుడి వైపునకు తిరిగి నిద్రపోవడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో కూడా తెలుసుకుందాం. ఎప్పుడైతే కుడి వైపు తిరిగి పడుకుంటారో అప్పుడు గుండెపైన ప్రెజర్ ఎక్కువగా పడదు. ఈసీజీలోనూ ఎలాంటి మార్పులు కనిపించవు. అంటే..హార్ట్ రేట్ నార్మల్ గానే ఉన్నట్టు లెక్క. అందుకే హార్ట్ పేషెంట్స్ కుడి వైపునకు తిరిగి నిద్రపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: Shoaib Malik సానియా మాజీ భర్త మూడో పెళ్లి పెటాకులే..?! వీడియో వైరల్మీరు ఏ పొజిషన్ లో నిద్రపోతున్నారనే విషయంతో పాటు ఎన్ని గంటల పాటు క్వాలిటీ స్లీప్ ఉంటోందన్నదీ ముఖ్యమే. కుడి వైపు తిరిగి పడుకున్నంత మాత్రాన స్లీప్ క్వాలిటీ ఉన్నట్టే అని అనుకోడానికి వీలులేదు. చాలా మంది 5 గంటల పాటు మాత్రమే నిద్రపోతున్నారు. రాత్రంతా మొబైల్ చూసుకుంటూ కూర్చుంటున్నారు. ఉదమయే ఆఫీస్ హడావుడి కారణంగా త్వరగా నిద్రలేవాల్సి వస్తోంది. ఇలా చేయడం వల్ల మెటబాలిజం దెబ్బ తింటుంది. అప్పటి నుంచి సమస్యలన్నీ మొదలవుతాయి. అందుకే..సరైన విధంగా నిద్ర పట్టేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: Nita Amabni క్వీన్ ఆఫ్ దాండియాతో గార్బా స్టెప్పులు : ఉర్రూతలూగిన వేదిక -
దసరా తర్వాతే పెద్దబతుకమ్మ
నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంతోపాటు చాలా మండలాల్లో దసరా తర్వాత మహిళలు సద్దుల బతుకమ్మ ఆడడం ఆనవాయితీగా వస్తోంది. ఓ వైపు భైంసాలో మహాలయ అమావాస్య మరుసటి రోజు సద్దుల బతుకమ్మ ఆడడం ప్రత్యేకత కాగా.. నిర్మల్ ప్రాంతంలో పండుగ తర్వాత సద్దుల సందడి కొనసాగుతూ ఉండడం ఇక్కడి స్పెషల్. పూలను పూ జించే ఈ పండుగలో ఇక్కడ కాగితంతో బతుకమ్మలను చేయడం మరో ప్రత్యేకత. దసరా సెలవులు పూర్తవుతున్నా.. చాలామంది యువతులు, విద్యార్థినులు సద్దుల బతుకమ్మ కోసం ఆగడం విశేషం.పౌర్ణమి దాకా ఆటపాటలే...తెలంగాణ వ్యాప్తంగా దసరాకు ముందే బతుకమ్మ పండుగ ముగుస్తుంది. కానీ.. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న జిల్లా మాత్రం ఎన్నో ప్రత్యేకతలను చాటుకుంటోంది. ఒక్కో గ్రామంలో ఒక్కోరోజు పండుగలా సద్దులబతుకమ్మను తీసుకెళ్తుంటారు. నిర్మల్ ప్రాంతంలో దసరా తర్వాత మొదలయ్యే సద్దుల బతుకమ్మల సందడి ఒక్కో ఊళ్లో ఒక్కోరోజు ఉంటుంది. ఈ రోజు(శనివారం) నుంచి ఇలా పౌర్ణమి వరకు రోజూ బతుకమ్మల ఆటపాటలు సాగుతూనే ఉంటాయి. ప్రతీసాయంత్రం గ్రామాలతో పాటు జిల్లాకేంద్రంలోనూ పండుగ వాతావరణం కనిపిస్తుంటుంది. కాగితంతో బతుకమ్మ..జిల్లాలో బతుకమ్మకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఎక్కడా లేనివిధంగా ఇక్కడ రంగురంగుల కాగితాలతో బతుకమ్మలను తయారు చేస్తారు. పూలను పూజించే ప్రకృతి పండుగలతో ఇలా కాగితాలతో బతుకమ్మలను చేసి ఆడడం ఏంటని చాలామంది ప్రశ్నిస్తుంటారు. గతంలో కరువు పరిస్థితులు ఉన్నప్పుడు నిమజ్జనానికి నీళ్లు లేకపోవడం, అలాగే పువ్వులు లభించకపోవడం తదితర కారణాలతో కాగితపు బతుకమ్మలతో ఆడడం ప్రారంభమై ఉండొచ్చన్న అభిప్రాయం ఉంది.మనదిక్కు పండుగైనంకనే..‘ఓ.. నా చిన్నప్పటి సంది సూస్తున్న. కరీంనగర్, వరంగల్ దిక్కు దసరా పండుక్కు ముందురోజే సద్దుల బతుకమ్మ ఆడుతరు. మనక్కడ మాత్రం పండుగైనంకనే ఆడుతం. ముందటి సంది బొడ్డెమ్మ పండుగ అట్లనే అస్తున్నది..’ అని నిర్మల్కు చెందిన 80ఏళ్ల రాం ముత్తమ్మ చెబుతోంది.మానాయి ఉన్నందునే...కరీంనగర్, వరంగల్ వైపు దసరాకు ముందురోజే సద్దుల బతుకమ్మ ఆడుతారు. కానీ.. మాదిక్కు మానాయి(మహర్నవమి) పెద్దపండుగగా చేసుకుంటాం. ఆ రోజు ఇంట్లో నుంచి పసుపుకుంకుమలు, మంగళహారతి సహా ఏ వస్తువునూ బయటకు తీసుకెళ్లం. అందుకే సద్దుల బతుకమ్మను దసరా తర్వాతనే చేసుకుంటాం.–ఏనుగుల విమల, నిర్మల్బతుకమ్మ కోసమే...దసరా పండుగంటే చాలా ఇష్టం. అందులోనూ బతుకమ్మ అంటే ఇంకా ఇష్టం. రోజూ అమ్మవాళ్లతో కలిసి పాడుతూ ఆడుతూ నేర్చుకుంటాం. ఇక దసరా తర్వాత సద్దుల బతుకమ్మ కోసమే హైదరాబాద్ వెళ్లకుండా నిర్మల్లోనే ఉంటా.– అనన్య, సాఫ్ట్వేర్ ఇంజినీర్, నిర్మల్ -
మెలోని గారి మన్ కీ బాత్
బాగా ఇష్టమైన ఇల్లు కాలి బూడిదైతే... ఆ బూడిదను చూస్తూ ఏడుస్తూ కూర్చోలేము. ఒక్కో ఇటుక పేరుస్తూ కొత్త ఇంటికి సిద్ధం అవుతాము. జార్జియా మెలోని అలాగే చేసింది. కుటుంబ కల్లోలాన్ని మనసుపైకి రానివ్వకుండా తిరుగులేని నాయకురాలిగా ఎదిగింది. ఇటలీ తొలి మహిళా ప్రధాని అయింది. ఆమె ఆత్మకథ ‘ఐయామ్ జార్జియా – మై రూట్స్, మై ప్రిన్సిపుల్స్ (ఇండియన్ ఎడిషన్)కు ప్రధాని నరేంద్ర మోదీ ముందుమాట రాశారు.కొన్ని నెలల క్రితం అల్బేనియాలో జరిగిన ఒక సదస్సులో వివిధ దేశాల నేతలు హాజరయ్యారు. ఈ సదస్సుకు హాజరైన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి అల్బేనియా అధ్యక్షుడు స్వాగతం పలికిన తీరు వైరల్ అయింది. కారు దిగి వస్తున్న మెలోనికి వర్షంలో మోకాళ్లపై కూర్చొని నమస్కారం చెబుతూ ఆయన స్వాగతం పలికిన తీరు ప్రపంచాన్ని ఆకట్టుకుంది.న్యూయార్క్లో జరిగిన ఒక అవార్డ్ల కార్యక్రమంలో... ‘మెలోని నిజాయితీపరురాలు. ఆమె మనసు అందమైనది’ అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించాడు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ఇటలీలో జరిగిన జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మోదీని ‘నమస్తే’ అంటూ మెలోని స్వాగతం పలకడం వైరల్గా మారింది.ఒక్క మాటలో చె ప్పాలంటే... జార్జియా మెలోని అనేది ‘ప్రధాన ఆకర్షణ’కు మరో పేరు.అయితే ఆమె ప్రస్థానం నల్లేరు మీద నడక కాదు. ఒక్కో అడుగు వేస్తూ ప్రయాణం ప్రారంభించింది. ఆ ప్రయాణంలో ఎన్నో ప్రతికూలతలను అధిగమించి ముందుకు వెళ్లింది.‘ఐయామ్ జార్జియా–మై రూట్స్, మై ప్రిన్సిపుల్స్’ను ఒక అధ్యక్షురాలి ఆత్మకథగా మాత్రమే చూడనక్కర్లేదు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ఇటలీ తొలి మహిళా అధ్యక్షురాలి స్థాయికి ఎదగడం అనేది సామాన్య విషయమేమీ కాదు. ధైర్యంలో, ఆత్మవిశ్వాసంలో, సానుకూల శక్తి విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మహిళలకు స్ఫూర్తినిస్తోంది మెలోని.రోమ్లో పుట్టి గార్బటెల్లా జిల్లాలో పెరిగింది మెలోని. చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే మెలోని తండ్రి, కుటుంబాన్ని విడిచి కానరీ దీవులకు వెళ్లాడు. అక్కడ మరో వివాహం చేసుకున్నాడు. మెలోనికి పదిహేడేళ్లు ఉన్నప్పుడు ఆమె తండ్రి మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో తొమ్మిది సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు.తండ్రి దూరం అయ్యాడు. తమకు ఇష్టమైన ఇల్లు అగ్నిప్రమాదంలో నాశనం అయింది. బాల్యం, కుటుంబ విచ్ఛిన్నం తన రాజకీయ దృక్పథాన్ని ప్రభావితం చేశాయని తన ఆత్మకథలో రాసుకుంది మెలోని. పొలిటికల్ పార్టీ ఇటాలియన్ సోషల్ మూమెంట్ (ఎంఎస్ఐ) యువ విభాగం ‘యూత్ ఫ్రంట్’లో చేరడంతో మెలోని రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తరువాత కాలంలో ‘స్టూడెంట్ మూవ్మెంట్’ నేషనల్ లీడర్గా ఎదిగింది. ప్రావిన్స్ ఆఫ్ రోమ్’ కౌన్సిలర్గా పనిచేసింది. ‘యూత్ యాక్షన్’ అధ్యక్షురాలిగా ఎంపికైంది... ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇటలీ తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించింది.మోదీ ముందుమాట‘దేశభక్తి ఉట్టిపడే అత్యత్తమ నాయకురాలు’ అని ‘ఐయామ్ జార్జియా – మై రూట్స్, మై ప్రిన్సిపుల్స్’ పుస్తకానికి రాసిన ముందు మాటలో మన ప్రధాని నరేంద్ర మోదీ మెలోనిని కొనియాడారు. ఆమె వ్యక్తిగత, రాజకీయ ప్రయాణం గురించి వివరించారు. మెలోని ఆత్మకథను ‘మన్కీ బాత్’లో చె ప్పారు. ‘‘ఇటలీ ప్రధాన మంత్రి మెలోనిపై అభిమానం, స్నేహంతో ఈ ముందుమాట రాశాను. దీన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఆమె స్ఫూర్తిదాయకమైన, చారిత్రక ప్రయాణం భారత్లో ఎంతోమందిని ప్రభావితం చేస్తుంది’’ అని తన ముందు మాటలో రాశారు మోదీ. గతంలో రెండు పుస్తకాలకు మాత్రమే మోదీ ముందు మాట రాశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆనందీబెన్ పటేల్కు అంకితం ఇచ్చిన పుస్తకానికీ, ప్రముఖ బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు హేమమాలిని ఆత్మకథకు గతంలో ముందుమాట రాశారు. -
కాంచన, ప్రియ.. ఎవరీ యువ నేతలు!
టీవీ చర్చల్లో అర్నాబ్ గోస్వామి ఎలా మాట్లాడతారో చాలా మందికి తెలుసు. ఓ చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని వ్యంగ్యంగా "రాహుల్ బాబా" అని పదేపదే సంబోధించారు. అదే కార్యక్రమంలో పాల్గొన్న ఓ యువతి అర్నాబ్ బాబా అంటూ కౌంటర్ ఇవ్వడంతో అర్నాబ్ వెనక్కి తగ్గారు. ఆ యువతిపేరు కాంచనా యాదవ్. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించిన ఆమె 2018లో విద్యార్థి రాజకీయాల్లో చేరి, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) భావజాలం ప్రభావంతో ఆ పార్టీలో కొనసాగుతున్నారు.మరొక టీవీ చర్చా కార్యక్రమంలో అర్నాబ్ గోస్వామి మాట్లాడుతూ.. 'నేను ఉన్నత కులానికి చెందిన బ్రాహ్మణుడి'ని అంటూ వ్యాఖ్యానించారు. అక్కడే ఉన్న ప్రియాంక భారతి (Priyanka Bharti) ఈ వ్యాఖ్యలపై దీటుగా స్పందించారు. మీది ఉన్నత కులం కాదు. పుట్టకతోనే ఎవరూ ఉన్నతులు, తక్కువ వారు కాదు. మీ మాటలు వివక్షపూరితంగా ఉన్నాయని కౌంటర్ ఇచ్చారు. దీంతో గోస్వామి కామ్ అయిపోయారు.కాంచన, ప్రియాంక ఇద్దరూ ఆర్జేడీ జాతీయ అధికార ప్రతినిధులు. ఈ ఇద్దరు యువతులు తమ పోరాట శైలితో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా టీవీ చర్చల్లో తమ పార్టీ గళాన్ని బలంగా పనిచేస్తూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. ఇద్దరూ 2018లో JNUలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆర్జేడీ విద్యార్థి విభాగం ఛత్ర రాష్ట్రీయ జనతాదళ్ (CRJD)లో చేరారు. విశ్వవిద్యాలయ విద్యార్థి రాజకీయాల్లో తన ఉనికిని బలోపేతం చేసుకోవాలని భావించిన ఆర్జేడీ.. 2019 విద్యార్థి సంఘాల ఎన్నికల్లో పోటీ చేసింది.''జేఎన్యూలో ప్రతిభావంతులైన వారిని గుర్తించి, పార్టీలో ప్రోత్సహించాలనేది ఎంపీలు మనోజ్ ఝా, సంజయ్ యాదవ్ (Sanjay Yadav) ఆలోచన. సీఆర్జేడీ ఏర్పడినప్పటి నుంచి ప్రొఫెసర్ నవల్ కిషోర్ దీనికి ఇన్ఛార్జ్గా ఉన్నారు. దాని అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు" అని పార్టీ కార్యకర్త ఒకరు తెలిపారు. కాంచన, ప్రియాంక.. సీఆర్జేడీ ద్వారానే వెలుగులోకి వచ్చారు. కంప్యూటేషనల్, ఇంటిగ్రేటివ్ సైన్సెస్లో కాంచన పీహెచ్డీ చేశారు. జర్మన్ స్టడీస్లో ప్రియాంక పీహెచ్డీ చేస్తున్నారు. 2023, అక్టోబర్లో ఆర్జేడీ జాతీయ అధికార ప్రతినిధులుగా వీరిద్దరూ నియమితులయ్యారు.లాలూ స్ఫూర్తితోనే.. లాలూ ప్రసాద్ యాదవ్ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు కాంచన వెల్లడించారు. తన రాజకీయ ప్రవేశంపై 'ది ప్రింట్'తో ఆమె మాట్లాడుతూ.. ''2018లో నేను విద్యార్థి రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. నాకు ఇతర ఎంపికలు కూడా ఉన్నాయి. కానీ నేను RJD భావజాలంతో బాగా ప్రభావితమయ్యాను. (పార్టీ చీఫ్) లాలూ ప్రసాద్ జీ సిద్ధాంతాలపై ఎప్పుడూ రాజీపడలేదు. JNUలోని చాలా మంది విద్యార్థులు సాధారణంగా వామపక్ష విద్యార్థి సంఘాల వైపు ఆకర్షితులవుతారు. కానీ లాలూజీ భావజాలం నన్ను ఆకట్టుకుంద''ని తెలిపారు. విద్యార్థి నేతగా ఫీజు పెంపుదల, హాస్టల్ సంబంధిత సమస్యలతో పాటు అంశాలపై పోరాటం చేసినట్టు వెల్లడించారు.పోలీసులు దారుణంగా కొట్టారుతన రాజకీయ ప్రయాణం గురించి ప్రియాంక మాట్లాడుతూ.. ''నేను గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే ఆర్జేడీ విద్యార్థి విభాగంలో చేరాను. ఆ సమయంలో జేఎన్యూలో అనేక నిరసనలు జరుగుతున్నాయి. వామపక్ష గ్రూపులలో చేరడం వంటి ఇతర ఎంపికలు కూడా నాకు ఉన్నాయి, కానీ అవి కుల సమస్యలపై తగినంతగా గళం విప్పడం లేదని నేను భావించాను. నేనేమీ అకస్మాత్తుగా రాజకీయాల్లోకి రాలేదు. ఫీజుల పెంపుదలకు వ్యతిరేకంగా ఉద్యమానికి నాయకత్వం వహించాను. పోలీసులు నన్ను దారుణంగా కొట్టారు. నా చర్మంపై పిన్నులు గుచ్చారు. దాని వల్ల నా మోకాలిలో కణితి వచ్చింది. మా విద్యార్థి విభాగం కోసం కరపత్రాలు పంపిణీ చేస్తున్నప్పుడు సీఆర్జేడీ తరపున ఎందుకు ప్రచారం చేస్తున్నావని సీనియర్ ఒకరు అడిగారు. సామాజిక న్యాయం, లాలూజీ సిద్ధాంతాన్ని నమ్ముతానని చెప్పాను. అలా నాకు సీఆర్జేడీలో సభ్యత్వం వచ్చింద''ని తెలిపారు.ఎవరీ కాంచన?ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలో కాంచన జన్మించింది. ఆమె పూర్వీకులు బిహార్లోని ససారాంకు చెందినవారు. కాంచనతాత ప్రభుత్వ ఉద్యోగి కాగా, తండ్రి ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత 2017లో లైఫ్ సైన్సెస్లో ఎంఎస్సీ చేయడానికి జేఎన్యూలో చేరారు. సీఎస్ఐఆర్ ఫెలోషిప్ సాధించడంతో బెంగళూరులో సైంటిస్ట్ ఉద్యోగ అవకాశం వచ్చింది. రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఉద్దేశంతో ఢిల్లీలోనే ఉండిపోయారు. త్వరలో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల తమకెంతో కీలకమని, ఈ ఎన్నికల తర్వాతే ఉద్యోగం గురించి ఆలోచిస్తానని కాంచన 'ది ప్రింట్'తో చెప్పారు.ప్రియాంక ప్రస్థానంపట్నా జిల్లా తూర్పు శివార్లలోని ఫతుహా పట్టణానికి చెందిన ప్రియాంక 2019లో జరిగిన జేఎన్యూ స్టూడెంట్ యూనియన్ అధ్యక్ష ఎన్నికల్లో సీఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆమె తండ్రి రైతుగా పనిచేస్తున్నారు. తమ కుటుంబానికి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదని ప్రియాంక చెప్పారు. జేఎన్యూలో పీహెచ్డీ కొనసాగుతోందన్నారు. టీవీ చర్చా కార్యక్రమాల్లో ఆర్జేడీ (RJD) పార్టీ వైఖరిని బలంగా వినిపించడంపై ప్రస్తుతం దృష్టి సారించినట్టు వెల్లడించారు.చదవండి: 'మా ఆయన అస్సలు మంచోడు కాదు'మీడియాలో వివక్షమీడియాలో ప్రతిపక్ష నాయకుల పట్ల వివక్ష కొనసాగుతోందని కాంచన, ప్రియాంక ఆరోపించారు. కొంత మంది న్యూస్ యాంకర్లు అధికార పార్టీ ప్రతినిధుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అధికార బీజేపీ, గోడి మీడియా యాంకర్లకు సరైన సమాధానం ఎలా ఇవ్వాలో తమకు తెలుసునని.. భయపడేది లేదని వారిద్దరూ ముక్తకంఠంతో చెప్పారు. చర్చల్లో పాల్గొనకుండా తమను గోడి మీడియా బాన్ చేసినప్పుడు ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్ (Tejashwi yadav) తమకు అండగా నిలబడ్డారని తెలిపారు. -
జాతర కోసం వచ్చి..రైల్వే ట్రాక్పై రీల్స్? స్పాట్లోనే నలుగురూ!
ప్రమాదమని రైళ్లలో ప్రయాణిస్తూ, కొందరు, రైలు పట్టాలపై కొందరు ప్రమాదకర స్టంట్స్ చేస్తూ రీల్స్ తీసుకుంటున్నారు. అతి ప్రమాదకరమైన ఈ స్టంట్స్తో ప్రాణాలు పోతున్నా, అస్సలు పట్టించుకోవడం లేదు. తాజాగా వందే భారత్ రైలు వచ్చే ట్రాక్ పై రీల్స్ చేస్తూ నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. బీహార్లోని పూర్నియాలోని రైల్వే బూత్ సమీపంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దుర్గా పూజ ఉత్సవానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.ఈ విషాద సంఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.బీహార్లోని పూర్ణియాలో రైల్వే ట్రాక్పై ఇన్స్టాగ్రామ్ రీల్స్ షూట్ చేస్తున్న నలుగురు యువకులు ప్రమాదానికి గురైన ఘటన ఇలాంటిదే. రైలు పట్టాలపై రీల్స్ షూట్ చేస్తుండగా జోగ్బాని-దానాపూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందారు. ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు రైల్వే పోలీసులు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. మృతులందరూ 14 నుండి 15 సంవత్సరాల వయస్సు గలవారు. మృతుడు మాధేపురలోని మురళీగంజ్కు చెందినవారు.శుక్రవారం తెల్లవారుజామున 4.54 గంటలకు పూర్నియా , కస్బా రైల్వే స్టేషన్ల మధ్య జోగ్బాని-దానపూర్బ్26301 (వందే భారత్ ఎక్స్ప్రెస్) రన్ఓవర్ గురించి మాకు సమాచారం అందింది, కొంతమంది యువకులు, ఇతరులు రైల్వే ట్రాక్పై రీల్స్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని అనుమానిస్తున్నామని రైల్వే అధికారి తెలిపారు. దురదృష్టవశాత్తు, పనికోసం వచ్చి, జాతర చూడటానికి వచ్చిన వారు ప్రాణాలు కోల్పోయారు. చాలా విషాదం అంటూ బీజేపీ ఎమ్మెల్యే కృష్ణ కుమార్ రిషి విచారం వ్యక్తం చేశారు. బాధుతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.మరోవైపు ఈ సంఘటనపై పూర్నియా ఎంపి పప్పు యాదవ్ స్పందించారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం. బీహార్లోని అనేక చోట్ల రైల్వే అండర్పాస్, ఓవర్బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది, కానీ అది జరగడం లేదని విమర్శించారు. తమ ప్రాంతానికి చెందిన బాధితులు, దళిత కుటుంబానికి చెందిన యువకులని తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ. 20 లక్షల పరిహారం ఇవ్వాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాండ్ చేశారు.నోట్: ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించనప్పటికీ, ఈ సంఘటన అటువంటి విషాదాల వెనకున్న కారణాల గురించి అప్రమత్తం చేస్తుంది. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి, ప్రజలు తమ పరిసరాల గురించి అప్రమత్తంగా ఉండాలి .రీల్స్ లేదా వీడియోలను షూట్ చేసేటప్పుడు తమను తాము ప్రమాదంలో పడేయకుండా ఉండాలి. రైల్వే ట్రాక్లు, కొండచరియలు ,పర్వత అంచులు వంటి సున్నితమైన ప్రదేశాలకు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. -
సానియా మాజీ భర్త మూడో పెళ్లి పెటాకులే..?! వీడియో వైరల్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ (Shoaib Malik) వివాహం గురించి మరోసారి వార్తల్లో నిలిచాడు. ముచ్చటగా చేసుకున్న మూడో పెళ్లి కూడా ముక్కలు కానుందా? తాజా వార్తలు ఈ ఊహాగానాలనే బలపరుస్తున్నాయి. భార్య, నటి సనా జావేద్ (Sana Javed)తో విభేదాల కారణంగా విడాకుల బాట పట్టినట్టు వార్తలొస్తున్నాయి.భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza)తో 14 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికి సనా జావేద్ను వివాహం చేసున్నాడు షోయబ్. అప్పటినుంచి చెట్టాపట్టా లేసుకుని తిరిగిన వీరిద్దరూ ఇటీవలదూరంగా ఉంటున్నారట. తాజా మీడియా నివేదిక ప్రకారం, మనస్పర్థలతో షోయబ్-సనా జంట విడాకులకు సిద్దమవుతోంది. View this post on Instagram A post shared by Voice Of Netizens (@voiceofnetizens) ఇటవలి ఒక సందర్భంగా షోయబ్ ఆటోగ్రాఫ్లు ఇస్తుండగా సనా మొఖం తిప్పుకోవడం, ఒకరికొకరు మాట్లాడుకోకుండా సీరియస్గా ఉండటం ఒకే సోఫాలో కూర్చున్నప్పటికీ దూరం దూరంగా ఉన్న వీడియో వైరల్ అయింది. దీంతో మూడో పెళ్లి ముచ్చట కూడా మూణ్నాళ్లే.. ఇద్దరి మధ్య మాటల్లేవా అంటూ కొందరు, భార్యభర్తల మధ్య ఇలాంటివి మామూలే అని కొందరు నెటిజన్లు కమెంట్స్ చేశారు. అయితే, అటు షోయబ్ గానీ, ఇటు సనా గానీ ఈ విషయంపై ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు కాగా షోయబ్ మాలిక్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను 2010 ఏప్రిల్ 12న, హైదరాబాద్లో రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి కొడుకు (ఇజాన్) పుట్టాడు. విభేదాల కారణంగా 2023లో విడిపోయిన సంగతి తెలిసిందే. -
ఈ తప్పు మీరూ చేస్తే.. మీ ఆయుష్షు మూడినట్టే!
ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించాలంటే అనేక అంశాలు పనిచేస్తాయి. సమతులం ఆహారం, ఒత్తిడి లేని జీవితం, సరియైన నిద్ర చాలా అవసరం. దీంతోపాటు మన శరీరంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని అవయవం ఒకటి ఉంది. ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ డేనియల్ అమెన్ దీనికి సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు.మానసిక వైద్యుడు డాక్టర్ డేనియల్ అమెన్ ప్రకారం, ఆరోగ్యం విషయంలో చాలామంది చేసే అతి పెద్ద తప్పు వారి బ్రెయిన్ గురించి పట్టుకోకవడం. మెదడు ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యంగా ఉండటం మనిషి ఆయుష్షుమీద ప్రభావం చూపుతుంది. జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, నిర్ణయాలు , దీర్ఘాయువును కూడా నియంత్రించే అవయవం అయినా , మెదడు ఆరోగ్యం తరచుగా రోజువారీ జీవితంలో దాని గురించి విస్మరిస్తున్నారు అంటారాయన. తాజాగా దీర్ఘాయువు పరిశోధకుడు డాన్ బ్యూట్నర్తో ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ పాడ్కాస్ట్ లైవ్ టు 100 లో మాట్లాడుతూ తన అనుభవాన్ని పంచుకున్నారు. తన కెరీర్లో 2 లక్షలకు పైగా మెదడు స్కాన్లను అధ్యయనం చేసిన డాక్టర్ అమెన్, మెదడుతో సంబంధాన్ని పెంచుకోవడం దాని కనుగుణంగా మలుచుకోవడం చాలా ముఖ్యం అన్నారు.తన సొంత మెదడు స్కాన్ నుండి మేల్కొలుపు కాల్డాక్టర్ అమెన్ ఒక అగ్రశ్రేణి న్యూరోసైన్స్ విద్యార్థిగా మరియు బోర్డు-సర్టిఫైడ్ మనోరోగ వైద్యుడిగా కూడా, 1990ల ప్రారంభం వరకు తాను మెదడు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశానని ఒప్పుకున్నారు. తన క్లినిక్లలో బ్రెయిన్ ఇమేజింగ్ను ప్రవేశపెట్టి, 1991లో తన సొంత మెదడును స్కాన్ చేసినప్పుడు, దిగ్భ్రాంతికర ఫలితాలు చూశానని చెప్పుకొచ్చారు.1990 కి ముందు తనకు అధిక బరువు రాత్రిపూట నాలుగు గంటలు మాత్రమే నిద్రపోవడం లాంటి చెడు అలవాట్లు ఉండేవని , తన బ్రెయన్ హెల్త్ గురించి ఎపుడూ ఆలోచించలేదని గుర్తు చేసుకున్నారు. కానీ పరిశోధనలకు ఒక మేల్కొలుపుగా పనిచేశాయని, తన జీవనశైలిని కరెక్ట్ నిద్ర, ఆహారం,రోజువారీ అలవాట్లను మార్చుకున్నట్టు వెల్లడించారు.మెదడు ఆరోగ్యం- దీర్ఘాయువు, "బ్లూ జోన్స్" (ప్రజలు అసాధారణంగా ఎక్కువ కాలం జీవించే ప్రాంతాలు) ఆలోచనను ప్రాచుర్యంలోకి తెచ్చిన డాన్ బ్యూట్నర్, మంచి జీవనశైలి అనేది గుండె, మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసినట్టుగానే, మెదడు ఆరోగ్యం అనేది దీర్ఘాయువులో ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. రోజువారీ అలవాట్లు అభిజ్ఞా క్షీణత, చిత్తవైకల్యం,మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి, అలాగే మెదడును ముందుగానే రక్షించడం అనేది దీర్ఘకాలిక శ్రేయస్సులో చాలా కీలకమన్నారు. దీనికి సంబంధించి డాక్టర్ అమెన్ రాసిన "చేంజ్ యువర్ బ్రెయిన్, చేంజ్ యువర్ పెయిన్" అనే పుస్తకంలో మరిన్ని విషయాలను పొందుపర్చారు.మెదడు ఆరోగ్యం, డా. అమెన్ సలహాలుక్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది మెదడుకు రక్త ప్రవాహాన్ని, ఆక్సిజన్ను సరఫరాను పెంచుతుంది. వ్యాయామంలో పట్టిన చెమట హానికరమైన సమ్మేళనాలను తొలగించడంలో సహాయపడుతుందిమెదడు చురుగ్గా ఉండేలా, చాలెంజింగ్ ఫజిల్స్ పరిష్కరించాలి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి.ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారాలు, వాల్నట్లు, అవిసె గింజలు . కొవ్వు చేపలు మెదడు కణాలకు మేలు ఇస్తాయిచక్కెర , ప్రాసెస్ చేసిన ఆహారాలు మెదడు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. వీటికి దూరంగా ఉండాలి. కుటుంబంలో అల్జీమర్స్ వంటి పరిస్థితులు ఉంటే ముందుగానే అప్రమత్తం కావాలి.7–8 గంటలు ల నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలి. మెదడు తనను తాను శుభ్రపరుచుకునే సమయం నిద్ర.తల గాయాల నుండి రక్షించుకోవడం.మద్యం ,మాదకద్రవ్యాలకు దూరండా ఉండాలి.ఘీ టాక్సిన్స్ న్యూరాన్లను దెబ్బతీస్తాయినెగిటివ్ ఆలోచనలు మెడదుకు హాని చేస్తాయి. విటమిన్ డి , హార్మోన్ స్థాయిలను సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. మెదడు పట్ల లవ్ అండ్ కేర్ గా ఉండాలి. దానికి కీడు చేసే పనులు మానుకోవాలి అంటారు డా. అమెన్. -
క్వీన్ ఆఫ్ దాండియాతో నీతా అంబానీ గార్బా స్టెప్పులు : ఉర్రూతలూగిన వేదిక
రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ తన నృత్యంతో మరోసారి ఆడియెన్స్ను అలరించారు. అమ్మవారి పూజలు, ప్రార్థనలు మొదలు గర్బా స్టెప్పుల దాకా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా దసరా నవరాత్రులు తన చిన్న నాటి అనుభవాలను నెమరు వేసుకున్నారు. ముఖ్యంగా ఫల్గుణి పాఠక్తో కలిసి స్టెప్పులు వేసిన వీడియో వైరల్గా మారింది.నీతా అంబానీ నేతృత్వంలో ముంబై జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో దాండియా నైట్ అత్యంత ఉత్సాహంగా నడిచింది. ఈ వేడుకల్లో ఫల్గుణి పాఠక్ భక్తి, పాటలు పాడి భక్తులను ఉర్రూతలూగించారు. ముఖ్యంగా నీతా అంబానీతో కలిసి వేసిన దాండియా విశేషంగా నిలిచింది. View this post on Instagram A post shared by Jio World Convention Centre (@jioworldconventioncentre)ముఖ్యంగా నీతా అంబానీ తన బాల్య జ్ఞాపకాలతో పాటు, పాఠక్తో గత పాతికేళ్లుగా తనకున్న సుదీర్ఘ అనుబంధం గురించి మాట్లాడారు. తాను చిన్నప్పుడు, నవరాత్రి తొమ్మిది రాత్రులు నృత్యం చేసేదాన్నని గుర్తు చేసుకున్నారు. దసరా, నవరాత్రి పండుగలు ఎపుడూ తనకు భక్తి ,ఐక్యత, రాత్రి భారతదేశ సాంస్కృతిక గొప్పతనాన్ని గుర్తు చేస్తుందన్నారు. కాగా గుజరాత్లోని సంగీత కుటుంబంలో పుట్టిన ఫల్గుణి పాఠక్ గర్బా , దాండియా డ్యాన్స్లకు పెట్టింది. అందుకే "దాండియా రాణి" అని పేరొందింది. ఎన్నో పాప్గీతాలను ఆలిపించిన ఫల్గుణి తన మధురమైన స్వరంతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానుల హృదయాలను గెల్చుకుంది. ఇదీ చదవండి: ఈ తప్పు మీరూ చేస్తే.. మీ ఆయుష్షు మూడినట్టే! -
డీఎస్పీగా గృహిణి..! ఆమె కలను వివాహం ఆపలేదు..
వివాహం ఏ అమ్మాయికైనా తన కలలను కనడమే మరిచిపోయేలా బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సపోర్టు ఉంటే తనను తాను ప్రూవ్ చేసుకునేలా ఎదుగుతుంది. లేదంటే వంటిటికే పరిమితమవ్వాల్సిందే. కానీ అలాంటి మూసపద్ధతులన్నింటిని బద్దలుకొట్టుకుంటూ దూసుకొచ్చింది ఈ మహిళ. ఓ పక్క పేదరికం, మరోవైపు ఇంటి బాధ్యతలు అయినా.. తన కలలు కల్లలుగా మారనివ్వ లేదు. తాను అనుకున్నది సాధించడం కోసం గుక్కపెట్టి ఏడిపించేలా చేస్తున్న కష్టాలన్నింటిని ధైర్యంగా ఎదుర్కొని..గృహిణులు కూడా ఉన్నతాధికారుల కాగలరని చాటి చెప్పిందిఆ ధీర వనితే అంజు యాదవ్(Anju Yadav). 1988లో హర్యానాలోని నార్నాల్ జిల్లాలోని చోటే అనే గ్రామంలో జన్మించింది. ఆమెది వ్యవసాయ కుటుంబం. తండ్రి లాల్రామ్ వ్యవసాయం, పార్చున్ దుకాణం సాయంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. తల్లి సుశీలా దేవి గృహిణి. ఆమెకు ముగ్గురు సోదరీమణులు. బీఏ వరకు తన గ్రామంలోనే చదువుకున్న అంజు 21 ఏళ్లకే పెళ్లి చేసుకుంది. 22 ఏళ్లకే తల్లి అయ్యి ముకుల్దీప్ అనే మగబిడ్డకు జన్మనిచ్చింది. అయినా సరే తన డ్రీమ్ ఆగిపోకూడదనుకుంది. తల్లిగా, భార్యగా ఇంటి బాధ్యతలు నిర్వరిస్తూ సతమతమైంది. తన లక్ష్యానికి నెరవేర్చుకునేందుకు అత్తమామలు ముందుకు రాకపోవడంతో తల్లి సాయం తీసుకుంది. ఆమెకు తన కొడుకు బాధ్యతను అప్పగించి తన కెరీర్పై దృష్టిసారించింది. అలా ఎలాంటి కోచింగ్ లేకుండా బీఈడీ సీటు సంపాదించి ఏకంగా మూడుసార్లు పలు చోట్ల ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించింది. ఇక ఆ సమయంలో తల్లి ఆమెకు మద్దతిచ్చి..కొడుకు ముకుల్దేవ్ బాధ్యతను తీసుకుంది. సమాజంలో తనకంటూ ఓ గుర్తింపు ఉండాలన్న ఆరాటంతో సాగిపోతున్న అంజుకి భర్త అనారోగ్యం ఆమెను మరింత దుఃఖంలోకి నెట్టేసింది. సరిగ్గా ఆ సమయంలో రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (RAS) రిక్రూట్మెంట్ వచ్చింది. ఆ బాధను దిగమింగుకుని మరీ ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకుంది. ఆ డీఎస్పీ ఎగ్జామ్కి సన్నద్ధమవుతుండగా భర్త నిత్యానంద్రావు అనారోగ్యంతో మరణించడంతో ఒంటరి తల్లిగా నానా ఇబ్బందులు పడింది. ఆ కష్ట సమయంలో తల్లిదండ్రులు మద్దతివ్వడంతో..ఆహర్నిశలు కష్టపడి ప్రిపేరయ్యింది. అలా 2023లో 1725 ర్యాంకు సాధించి డీఎస్సీ అయ్యింది. చివరికి సెప్టెంబర్ 2025కి విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసుకుని రాజస్తాన్ పోలీస్ సర్వీస్లో డీఎస్పీ(Deputy Superintendent of Police )గా విధులు నిర్వర్తిస్తోంది. ఓ మారుమూల గ్రామంలో వివాహితురాలిగా మారిన తర్వాత కూడా అంజు కలలు కనడం ఆపలేదు. ఎన్ని రకాలుగా తనను అణిచివేసేలా ఇబ్బందులు వచ్చి పడినా అధైర్యపడలేదు. ఏదో ఒక నాటికి తను అనుకున్న గుర్తింపు సాధించగలుగుతానన్న నమ్మకంతో ముందుకు సాగింది. చివరకు సుదీర్ఘ పోరాటం అనతరం తన కలను నెరవేర్చుకుంది .కష్టపడేతత్వం ఉంటే కల ఎప్పటికైనా నెరవేరి తీరుతుంది అనేందుకు ఉదాహరణగా నిలిచి.. 'దటీజ్ అంజు యాదవ్' అని అనిపంచుకుంది . View this post on Instagram A post shared by Anju Yadav (@anjuyadav_dsp) (చదవండి: అందాలపోటీలకు అంతరాయం కలిగించిన భూకంపం..! వీడియో వైరల్) -
అదిరిపోవాల్సిన అందాల పోటీలు..భయం..భయంగా..!
ఫిలిప్పీన్స్లోని సెబులో మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ 2025 గాలా ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. సాయంత్రం ఎంతో ఆకర్షణీయంగా జరుగుతున్న వేడుక ఒక్కసారిగా భయాందోళనలతో గందరగోళంగా మారిపోయింది. అందాల భామలు రన్వేపే హోయలు ఒలికిస్తున్న సమయంలోనే 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఒక్కసారిగా పోటీదారులు భయంతో వేదిక నుంచి దూరంగా పారిపోతున్న దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి.ఫిలిప్పీన్స్ భూకంపంభూకంప కేంద్రం సెబు నుంచి 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోగో నగరం వరకు భూకంపం సంభవిస్తుందని గుర్తించి ప్రజలకు అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఇక ఈ ప్రమాదంలో సుమారు 60 మందికి పైగా మరణించగా, 150 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఈ ఆకస్మిక ప్రకృతి విపత్తు అంతర్జాతీయ అందాల పోటీకి అంతరాయ కలిగించిందని అందాల పోటీ నిర్వాకులు తెలిపారు. అయితే మిస్ ఆసియా-పసిఫిక్ ఇంటర్నేషనల్ (MAPI) ఆర్గనైజేషన్ ప్రతినిధులు, సిబ్బంది అంతా క్షేమంగానే ఉన్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. పైగా అక్టోబర్ 1న జరగాల్సిన అందాలపోటీలకు సంబంధించిన అన్ని ఈవెంట్లను రద్దుచేస్తున్నట్లు కూడా ప్రకటించారు నిర్వాహకులు. అంతేగాక మిస్ యూనివర్స్ ఫిలిప్పీన్స్ (MUPH) ఆర్గనైజేషన్ సోషల్మీడియా పోస్ట్లో ఈ ఘోర విపత్తుకు సంఘీభావం తెలుపుతున్నట్లు పేర్కొంది. "ఈ ప్రకృతి విలయం నుంచి కోలుకునేలా తమ సోదరీసోదరీమణులకు అండంగా నిలబడతాం. ఈ విషాద సమయంలో ఫిలిప్పీన్స్ బలం, స్ఫూర్తి, స్థితిస్థాపకత కొనసాగేలా మనవంతుగా కృషి చేద్దాం." అని పోస్ట్లో పిలుపునిచ్చింది. కాగా, సెబులో 6.9 తీవ్రతతో ఘోర భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఈ విపత్తులో చిక్కుకున్న క్షతగాత్రులను సంరక్షించే పనులను వేగవంతం చేసినట్లు ఫిలిప్పీన్స్ భద్రతా అధికారులు తెలిపారు. View this post on Instagram A post shared by 𝐏𝐚𝐠𝐞𝐚𝐧𝐭 𝐄𝐦𝐩𝐫𝐞𝐬𝐬 (@pageantempress) (చదవండి: మచ్చలేని చర్మం, నిగనిగలాడే జుట్టు కోసం డీఎన్ఏ డీకోడ్..!) -
సౌందర్య సంరక్షణకు 'డీఎన్ఏ డీకోడ్'..!
అందం కోసం మగువలు ఎంతలా డబ్బుని వెచ్చిస్తారో తెలియంది కాదు. అందుకు తగ్గట్టుగానే మార్కెట్లో రకరకాల సౌందర్య ఉత్పత్తులు అతివలను ఆకర్షించేలా వస్తున్నాయి. అయితే అవి అందరికీ సరిపోడవు. కొందరు సరిపోయినట్లు మరికొందరిలో మంచి పలితాలు రావు. ఇలాంటి సమస్య లేకుండా..నిగనిగలాడే అందం కోసం మన డీఎన్ఏతోనే సరిచేసుకుందాం అంటున్నారు ఒలివా క్లినిక్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి.ఎన్.రేఖా సింగ్. మీ డీఎన్ఏలోని ప్రత్యేక అంశాల ఆధారంగా కూడా అందమైన చర్మం, కేశ సౌందర్యం పొందవచ్చునని చెప్పారు. అదెలాగో సవివరంగా తెలుసుకుందాం.అందం కోసం మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు, ఫేస్వాష్లు వాడి ఇబ్బంది పడాల్సిన పనిలేదంటున్నారు శాస్త్రవేత్తలు. మన డీఎన్ఏని డీ కోడ్ చేస్తే చాలు..అపురూపమైన సౌందర్యాన్ని సొంత చేసుకోవచ్చని చెబుతున్నారు. మన డీఎన్ఏని డీకోడ్ చేస్తే..మన శరీరం, జుట్లు, బాడీ తత్వం ఎలా ఉంటుందన్నది ఇట్టే తెలిసుకోవచ్చు. మన శరీర డీఎన్ఏలో ముఖంపై పిగ్మెంటేషన్తోపాటు వెంట్రుకల కుదుళ్లు పోషకాలను సక్రమంగా అందుకుంటున్నాయా లేదా? చర్మం తనంతట తాను మరమ్మతు చేసుకునేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుందా? అన్న అనేక విషయాలు తెలుసుకోవచ్చునని తెలిపారు. జీన్-ఐక్యూ వంటి ప్రోగ్రామ్స్లో కేవలం లాలాజల నమూనా ద్వారా ఈ డీఎన్ఏ వివరాలను తెలుసుకుని తదనుగుణంగా చికిత్స ప్రారంభిస్తామని వివరించారు. అత్యాధునిక మైక్రో అరే టెక్నాలజీ ద్వారా చర్మం, వెంట్రుకలు, జీవక్రియలు, జీవనశైలి వంటి విషయాలకు సంబంధించి130 జన్యువులు, 150 లక్షణాలను పరిశీలిస్తారు. ఇవన్నీ వెంట్రుకలు రాలిపోవడం, కొలెజన్కు జరుగుతున్న నష్టం, పోషకాలు వంటి వివరాలు అందిస్తాయి. పరిష్కార మార్గాలను గుర్తించడంలో సహాయపడతాయి. ఆక్నేనే తీసుకుంటే.. ఒత్తిడి, కాలుష్యం తదితరాలు కారణమని అనుకుంటాం కానీ.. డీఎన్ఏ పరీక్షల ద్వారా శరీరంలో మంట/వాపు వచ్చిన తరువాత మీకు హైపర్ పిగ్మెంటేషన్ వచ్చే అవకాశం ఉందా? లేదా? అన్నది తెలుస్తుంది. ఇంకోలా చెప్పాలంటే చిన్న చిన్న విషయాలకే మీ చర్మం వేగంగా స్పందిస్తుందా? అన్నది తెలుస్తుందన్నమాట. అలాగే.. అతినీల లోహిత కిరణాలు, కాలుష్యాలను తట్టుకునే సామర్థ్యం మీ చర్మానికి ఎక్కువగా లేదా? అన్న విషయం డీఎన్ఏ పరీక్షల ద్వారానే తెలుస్తుంది. వెంట్రుకల విషయంలోనూ ఇలాంటి వివరాలు బోలెడన్ని తెలుస్తాయని డాక్టర్ రేఖా సింగ్ తెలిపారు. ఈ వివరాల ద్వారా ఒకొక్కరికి ఒక్కో రకమైన, సమర్థ పరిష్కార మార్గాలు సూచించవచ్చునని వివరించారు. దాంతో ఎలాంటి సౌందర్య చికిత్సలు తీసుకుంటే చాలు అన్నది అర్థం అవుతుంది. తదనుగుణంగా అనుసరిస్తే..అందమైన చర్మం, నిగనిగలాడే జుట్టుని సులభంగా పొందవచ్చట. అంటే మన జన్యువుల ఆధారంగా చర్మాన్ని రిపేర్ చేసుకోవడం. సమస్య ఎక్కడుందన్నది తెలిస్తే..పరిష్కరించడం మరింత సులభవుతుంది. ఆ నేపథ్యంలోనే ఈ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. డీఎన్ఏ డీకోడ్ అంటే..జన్యు సమాచారం (genetic information)ను అర్థం చేసుకోవడం అనే ప్రక్రియ. ఇది జీవుల శరీరంలో ఉన్న డియోక్సిరిబోన్యూక్లిక్ ఆమ్లం (DNA)లోని న్యూక్లియోటైడ్ క్రమాన్ని శాస్త్రవేత్తలు చదివి అర్థ చేసుకుంటారన్నమాట. దాంతో జీవి శరీర లక్షణాలను ఈజీగా అంచనా వేస్తారు పరిశోధకులు. అంటే ఉదాహరణకు, ఎత్తు, చర్మ రంగు, తెలివి, ఆరోగ్యం మొదలైనవి. డీఎన్ఏతో ముందుగా ఎలాంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందన్నది అంచనా వేయడమే కాదు, అందానికి మెరుగులు కూడా పెట్టుకోవచ్చని చెబుతున్నారు పరిశోధకులు.ఈ డీఓన్ఏ డీకోడ్తో శరీర లక్షణాలను అంచనా వేసి తగిన విధంగా డెర్మటాలజిస్టులకు సలహాలు సూచనలు ఇస్తారు. దీని సాయంతో వ్యద్ధాప్య ఛాయలను సైతం నివారించొచ్చుని కూడా చెబుతున్నారు. అంతేగాదు ఎలాంటి పోషకాహారం మన శరీరానికి అవసరం, ఎలాంటి జీవనశైలి మనకు సరిపోతుందనేది నిర్థారిస్తారట. ఫలితంగా అందరూ ఆశించే కలల సౌందర్యాన్ని చాలా ఈజీగా సొంత చేసుకోగలుగుతారని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ముందు ముందు ఈ డీన్ఏ డీకోడ్ సౌందర్య సంరక్షణలో అద్భుతమైన పాత్ర పోషిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. (చదవండి: తాగునీరు అంత విలువైనదా..?) -
పెళ్లిలో బ్రహ్మ ముడి ఎందుకు వేస్తారంటే..
పెళ్లిలో వరుడి ఉత్తరీయాన్ని వధువు చీర కొంగు చివర అంచును కలిపి ముడి వేస్తారు. దానిలో ఏమైనా విశేషార్థం ఉందా? – సంకా పవన్ కుమార్, హైదరాబాద్మనకు వివాహంలో తలంబ్రాల అనంతరం జరిగే ప్రక్రియ బ్రహ్మముడి. ఈ బ్రహ్మముడి వేసేటప్పుడు వరుడి ఉత్తరీయాన్ని వధువు చీర కొంగు చివర అంచును కలిపి ముడి వేస్తారు. వారి బంధాన్ని పటిష్ఠపరిచే చర్య ఇది. ఇప్పటికీ ఏదైనా విడదీయరాని బంధం ఏర్పడితే బ్రహ్మముడి పడిందిరా అని అంటూ ఉంటారు. దీనినే బ్రహ్మగ్రంథి, కొంగులు ముడివెయ్యడం అని కూడా అంటారు. ఇద్దర్ని కలిపి కొత్త వ్యక్తిని సృష్టించడం. రెండు శరీరాలు, రెండు మనస్సులు ఏకమవ్వడమన్నది ఇక్కడ పరమార్థం. ఇది కేవలం రెండు వస్త్రాలని కలపటం కాదు. ఇంటి ఇల్లాలిగా అన్నీ తీర్చిదిద్దడానికి నా ఇంటికి రా. ఒక యజమానురాలిగా గృహస్థ ధర్మాన్ని నిర్వహించు అని అర్థం.ఇద్దరు వ్యక్తులను కలిపి కొంగొత్త ఆకారాన్ని సృష్టించడమే దీని లక్ష్యం. నీది అని ఏమీ లేదు. ఎవరు సంపాదించినా దాని మీద అధికారం ఇద్దరికీ ఉంటుంది. ఆదాయం, ఖర్చు, ప్రణాళిక కలిపి ఉమ్మడిగా చెయ్యవలసిన పనులని భావం. (చదవండి: ఉగ్ర తాండవం..అనిర్వచనీయం..) -
తాగునీరు అంత విలువైనదా..?
ఉదయం బ్రష్ చేయడం మొదలు రాత్రి వరకు ఒక్కొక్కరు ఎంతో నీటిని వృథా చేస్తున్నాం.. అవసరం ఉన్నంత వరకు మాత్రమే భోజనం చేసే మనం.. నీటి పొదుపునకు మాత్రం ఏ మాత్రం విలువనివ్వడం లేదు. నిత్యం లక్షల లీటర్ల నీటిని డ్రైనేజీలో కలిపేస్తున్నాం. సింగపూర్ దేశం పేరు చెబితే వావ్.. అనే మనం అక్కడి తాగునీటి పరిస్థితి గురించి తెలిస్తే మాత్రం వామ్మో.. అనాల్సిందే.. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కు చెందిన 6వ తరగతి చదువుతున్న చిన్నారి అక్కడి పరిస్థితులను వివరిస్తుంటే.. ఆలోచనలో పడాల్సిందే.. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్పీఎస్)కు చెందిన 43 మంది విద్యార్థులు ఇటీవల సింగపూర్లో పర్యటించి వచ్చారు. ఆ బృందంలో ఆరో తరగతి చదువుతున్న అనమల నేహాశ్రిత కూడా ఉన్నారు. ఆ పర్యటన తనకు తాగునీటి విలువ తెలిసేలా చేసిందని, ఇకపై నీరు వృథా చేయకూడదని నిర్ణయించుకున్నానని చెబుతోంది. ఈ సందర్భంగా చిన్నారి నేహా బుధవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడింది. ఆ వివరాలు ఇలా.. ‘నాలుగు రోజుల పర్యటనలో యూనివర్సల్ స్టూడియో, మెర్లైన్ పార్క్ సహా అనేక ప్రాంతాలు తిరిగాం. అన్నింటికంటే మరీనా బరాజ్ ఎన్నో విషయాలు నేర్పింది. సింగపూర్లో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. నదులు లేకపోవడంతో పాటు భూగర్భ జలాలు చాలా తక్కువ. ఈ బరేజ్లో వర్షపు నీటిని నిల్వ చేయడంతో పాటు సముద్ర జలాలను తాగునీరుగా మారుస్తున్నారు. తాగునీటి సమస్యను అధిగమించడానికి సింగపూర్ ప్రభుత్వం మలేషియా నుంచి కొనుగోలు చేస్తోంది. సీవేజ్, వేస్ట్ వాటర్ను రీసైకిల్ చేసి వాడుకుంటోంది. ఈ నీరు తాగడం ఇష్టం లేక బాటిల్ కొనుక్కోవాలంటే 2.8 సింగపూర్ డాలర్లు(రూ.193) వెచి్చంచాలి. అక్కడ ఉన్న పరిస్థితులు, నీటి భద్రతను జాతీయ భద్రతగా భావిస్తున్న ఆ ప్రభుత్వం.. ఇలా అన్నీ చూసిన తర్వాత తాగునీటి విలువ ఏంటో తెలిసింది. మనకు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే కాలుష్య, నీటి వృథా ఉండకూడదని తెలుసుకున్నా. ఇవి పాటించడంతో పాటు నాకు తెలిసిన వారికీ వివరిస్తూ పాటించాలని సూచిస్తా. దీనికోసం ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్(పీపీటీ) తయారు చేస్తున్నా. నాలో మార్పు తీసుకువచ్చిన ఈ సింగపూర్ పర్యటనకు అవకాశం ఇచ్చిన స్కూల్, మాతో వచ్చి కొత్త విషయాలు నేర్పించిన టీచర్స్కు ధన్యవాదాలు’. -
ఉగ్ర తాండవం..అనిర్వచనీయం..
‘దసరా అంటేనే మహిళల అపూర్వ శక్తికి పట్టం కట్టే అద్భుతమైన పండుగ. అందుకే ప్రతీ మహిళా ఈ పండుగతో మనసారా మమేకమవుతుంది’ అంటున్నారు ప్రముఖ సినీనటి అర్చన. దసరా పండుగ నేపథ్యంలో ‘సాక్షి’తో తన మనోభావాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. నాకు అమ్మవారి పట్ల ఉన్న ఎనలేని భక్తి ఇప్పటిది కాదు. ముఖ్యంగా దుర్గామాత, సరస్వతీ దేవి రూపాలు అంటే చాలా ఇష్టం. సినిమాల్లో దేవీ పాత్రలు చేసిన అనుభవం ఉన్నప్పటికీ.. ఈ దసరా నాకెందుకు ప్రత్యేకం అంటే ప్రస్తుతం నేను చేస్తున్న కర్మస్థలం అనే సినిమా. ఈ సినిమా కోసం నేను గతంలో ఎన్నడూ చేయని విధంగా అమ్మవారి ఉగ్రరూపం ధరించి తాండవం చేశాను. మహిషాసుర మరి్ధని మూర్తి ఎదురుగా చేసిన ఆ నాట్యం మరిచిపోలేని అనుభూతి అందించింది. మాతా తుల్జాభవాని తాకిన చీరను నాకు ఆ సన్నివేశంలో ధరింపజేశామని ఆ సినిమా యూనిట్ ఆ తర్వాత నాకు చెప్పారు. (చదవండి: శక్తిరూపం అభినయ'దీపం'..! అమ్మవారిలా మెప్పించడం..) -
తెలంగాణ సాంస్కృతికోత్సవం.. అలయ్ బలయ్
అలయ్ బలయ్.. ఒక ఆలింగన వేడుక.. అందరం బాగుండాలనే ఆకాంక్ష.. కులమతాలకు అతీతంగా, పారీ్టలు, సిద్ధాంతాలు, భావజాల సంఘర్షణలను పక్కన పెట్టి ‘మనమంతా ఒక్కటే’ననే సమైక్యత భావన స్ఫూర్తిని అందజేసే పండుగ.. ఆనందోత్సాహాలతో చేసుకొనే దసరా ఉత్సవాలకు ముగింపు వేడుక.. సద్దుల బతుకమ్మ, దసరా వేడుకల మాదిరే అలయ్ బలయ్ కూడా తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచింది. తెలంగాణకే ప్రత్యేకమైన వంటకాలతో, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు తెలంగాణ జన జీవితాన్ని ప్రతిబింబించే కళారూపాలకు వేదికగా నిలుస్తోంది. రెండు దశాబ్దాలుగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈనెల 3వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 20వ సంవత్సర అలయ్బలయ్ ఉత్సవాలు జరుగుతాయి. ప్రస్తుత హర్యానా మాజీ గవర్నర్, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ఈ వేడుకలను 2005లో ప్రారంభించారు. ప్రతి సంవత్సరం దసరా మరుసటి రోజు ఘనంగా నిర్వహించే అలయ్ బలయ్ ఉత్సవాలకు ఆయన కూతురు బండారు విజయలక్ష్మి ఆరేళ్లుగా సారథ్యం వహిస్తున్నారు.తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది..ఈ ఉత్సవం ‘మాయమైపోతున్న మనిషిని’ నిలబెట్టింది. ఆ మనిషి చుట్టూ అల్లుకున్న సామాజిక బంధాలకు, అనుబంధాలకు విలువనిచ్చింది. తెలంగాణ ఆత్మగౌరవానికి పట్టం కట్టింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు, ఉద్యమకారులు, రాజకీయ పారీ్టలు, నాయకులందరినీ ఒక్కతాటి మీదకు తెచ్చేందుకు అలయ్బలయ్ ఎంతో దోహదం చేసింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, భారతీయ జనతా పార్టీ క్రియాశీలమైన నేతగా సుదీర్ఘమైన అనుభవం ఉన్న బండారు దత్తాత్రేయ పారీ్టలకు, సిద్ధాంతాలకు అతీతంగా అందరికీ ‘దత్తన్న’గా చేరువయ్యారు. ఆ సమైక్యతాభావాన్ని సంఘటితం చేయాలనేదే దత్తన్న ఆకాంక్ష కూడా.. అందుకే ప్రతి సంవత్సరం అలయ్ బలయ్ వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానిస్తూ కనీసం 10 వేల మందిని ఆయన సాధరంగా ఆహ్వానిస్తారు. మాన్యుల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరినీ ఆయన స్వయంగా స్వాగతిస్తారు.600 మందికి పైగా కళాకారులు.. అలయ్బలయ్ 20 ఏళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు బండారు విజయలక్ష్మి తెలిపారు. ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఆలయ్బలయ్ కార్యనిర్వాహక కమిటీ నెల రోజులుగా ఈ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఈ వేడుకలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన సుమారు 600 మందికి పైగా కళాకారులు తరలి వస్తారు. బతుకమ్మ, బోనాలు, పోతరాజులు, సదర్ ఉత్సవాలతో పాటు ఆదివాసీ, గిరిజన సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించనున్నారు. ఈసారి వేడుకల్లో అతిథులకు వడ్డించేందుకు 85 రకాల తెలంగాణ ప్రత్యేక వంటకాలను సిద్ధం చేశాం. వెజ్, నాన్ వెజ్ వంటలతో పాటు వివిధ రకాల పిండివంటలు, స్వీట్లు వడ్డించనున్నాం. తెలంగాణకే ప్రత్యేకమైన అంబలి, జొన్న గట్క, సర్వపిండి, మలీదముద్దలు, తలకాయ, బోటి, మటన్, చికెన్లలో రకరకాల వెరైటీలతో పాటు పచ్చిపులుసు, రకరకాల ఆకుకూరలు, కూరగాయలతో చేసిన శాఖాహార వంటలను కూడా వడ్డించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. – బండారు విజయలక్ష్మి (చదవండి: శక్తిరూపం అభినయ'దీపం'..! అమ్మవారిలా మెప్పించడం..) -
శక్తిరూపం అభినయ'దీపం'..! అమ్మవారిలా మెప్పించడం..
దేశవ్యాప్తంగా నాటక సమాజంలో దుర్గాదేవి పాత్రలో అనేక మంది ప్రాచుర్యం పొందారు. ముఖ్యంగా ‘మహిషాసుర మర్దిని’ నాటకంలో బుచ్చి లక్ష్మి చేసిన అభినయం, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అదేవిధంగా సురభి కమలాబాయి, సురభి రమణ వంటివారు దేవి శక్తిరూపాన్ని రంగస్థలంపై జీవంతో నింపారు. గ్రామీణ జాతర, యక్షగానం, బుర్రకథలు, హరిదాసు పాటల్లోనూ దుర్గమాత రూపాన్ని అనేక మంది మహిళలు అత్యంత భక్తితో ప్రదర్శించారు. సినీమాల్లోనూ పెద్ద హీరోయిన్లు అమ్మవారి పాత్రలను పోషించి పాత్రలో జీవించారు. నాట్యకళల్లో (కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ) పలువురు మహిళా నర్తకీమణులు దుర్గమ్మ ప్రతిరూపాలుగా మెరిశారు. కూచిపూడిలో ‘మహిషాసుర మర్థిని’ తారంగములో దుర్గాదేవి ఆవిష్కరణ చేశారు. దేవి శక్తిరూపాన్ని శిల్పసుందరంగా, ఆధ్యాత్మికంగా ప్రదర్శించిన వారిలో శోభానాయుడు, అలేఖ్య పుంజల, యామిని కృష్ణమూర్తి తదితరులు ఎందరో దుర్గామాత శక్తి, వీరత్వాన్ని ఆవిష్కరించిన గొప్ప నర్తకీమణులుగా పేరొందారు. వెండితెర ‘వేల్పులు’.. ‘మాయాబజార్’ ‘చూడామణి’ ‘శకుంతల’ వంటి చిత్రాల్లో భక్తిపాత్రలు పోషించిన అంజలీదేవి దేవి, శక్తి రూపంలో కూడా తెరపై జీవించారు. అదేవిధంగా బి.సరోజాదేవి, జమున, కాంచనమాల పురాణ గాధా చిత్రాలలో దుర్గాదేవి పాత్రలు ధరించారు. ఆ తర్వాతి తరంలో శ్రీవిద్య, జయసుధ, జయప్రద, రమ్యకృష్ణ, రాధ, భానుప్రియ వంటి హీరోయిన్లు అమ్మవారిలా భక్తుల మనసులు గెలుచుకున్నారు. సౌందర్య, మీనాక్షి శేషాద్రి కూడా నవరాత్రి, మహిషాసుర మర్దిని అంశాలతో రూపొందిన పాటలు, సన్నివేశాలలో శక్తిమాత రూపాన్ని ఆవిష్కరించారు.అమ్మవారు పూనినట్టే.. సురభి కళాకారిణిగా పాతాళభైరవి అనే నాటకంలో అమ్మవారి పాత్ర పోషించడం మరుపురాని జ్ఞాపకం. ఆ పాత్ర అభినయం అయిపోయిన తర్వాత చాలాసేపు అదే భావనలో ఉండిపోయా.. అంతగా లీనమవ్వడం మరే పాత్రలోనూ జరిగేది కాదు. – నిర్మల, సురభి నాట్యకళాకారిణి.ఆ అనుభూతి సాటిలేనిది... నర్తనశాల, భక్త ప్రహ్లాద, మహిషాసుర మర్దిని.. ఇలా ఎన్నో నాటకాల్లో అమ్మవారి పాత్రలు పోషించాను. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రదర్శనల్లో పాల్గొన్నాను. ముఖ్యంగా దేవీ నవరాత్రుల సమయంలో నా ప్రదర్శనలు ఎక్కువగా ఉంటాయి. దాదాపుగా 100కిపైగా నాటకాల్లో అమ్మ రూపాలను అభినయించాను. ఎన్నిసార్లు ఆ పాత్ర పోషించినా, తనివి తీరదు ఆ అనుభూతిని వర్ణించలేం. – వెంగమాంబ, రంగస్థల నటి (చదవండి: శ్రీ శారదాంబికా నమోస్తుతే!) -
శ్రీ శారదాంబికా నమోస్తుతే!
భారతదేశంలో ఉన్న అపురూపమైన సరస్వతీ దేవి ఆలయాల్లో ఒకటి శృంగేరీ శారదాదేవి ఆలయం. కర్ణాటక రాష్ట్రంలో తుంగానదీ తీరంలో ఆదిశంకరులు స్థాపించిన దక్షిణామ్నాయపీఠం శృంగేరి. ఈ పీఠాధిష్ఠాత్రి కూడా ఆమే. శారదాదేవి ఇక్కడ నెలకొని ఉండటానికి ఒక వృత్తాంతం ఉంది. ఒక శాపవశాత్తూ బ్రహ్మా సరస్వతులిద్దరూ మండనమిశ్ర, ఉభయభారతులై భూమిపై జన్మించారు. ఆదిశంకరులతో జరిగిన వాదంలో మండనమిశ్రులవారు ఓడిపోయి సన్యాసం స్వీకరించి సురేశ్వరాచార్యులనే పేరిట శృంగేరీ పీఠాధిపతిగా ఆదిశంకరులవారిచే నియమితులయ్యారు. ఉభయభారతీదేవి సాక్షాత్తు సరస్వతీస్వరూపమని తెలిసి ఉన్న శంకరులవారు ఆమెను అక్కడే కొలువై ఉండమని ప్రార్థించారు.శంకరుల విన్నపంతో ఉభయభారతీదేవి శారదాదేవిగా శృంగేరీలో కొలువు తీరింది. నిజానికి ఈ అమ్మవారి మూలరూపం చందనవిగ్రహం. అయితే ఈ విగ్రహాన్ని విద్యాశంకరుల ఆలయంలో ప్రతిష్ఠించి, తరువాతి కాలంలో ఇక్కడ స్వర్ణవిగ్రహరూపంలో పూజలందుకుంటోంది. శారదాదేవి రూపం స్వస్తికాసనంలో కూర్చుని కుడిచేతితో చిన్ముద్ర (జ్ఞానముద్ర)ను చూపుతూ, ఎడమచేతిలో పుస్తకం ధరించి ఉంటుంది.వెనుక కుడిచేత్తో జపమాలను, ఎడమచేత్తో అమృతకలశాన్ని ధరించి దర్శనమిస్తుంది. అమ్మవారికి వెనుక చిలుక కూడా ఉంటుంది. అఖండ విద్యాప్రదాయిని అయిన ఈ దేవి దర్శనంతో మనలోని అజ్ఞానపు మాలిన్యాలు తొలగి విజ్ఞానపు కాంతులు వెలుగొందుతాయి. చిన్ముద్ర, పుస్తకం, జపమాల, అమృత కలశం మొదలైనవన్నీ క్షయం లేనివనీ అవిద్యను రూపుమాపే విజ్ఞానపు సాధనాలనీ తెలుసుకోవాలి.– డాక్టర్ ఛాయా కామాక్షీదేవి (చదవండి: పైడితల్లికి ప్రణమిల్లి..!) -
పైడితల్లికి ప్రణమిల్లి..!
విజయనగరం రైల్వేస్టేషన్కి సమీపం లో పైడిమాంబ అమ్మవారి ఆలయం వనంగుడి ఉంది. వనం అంటే అడవి కనుక దీన్ని వనంగుడి అన్నారు. దీన్ని అమ్మపుట్టినిల్లుగా భావిస్తారు. ఊరి మధ్యలో ఉన్న చదురుగుడిని అమ్మవారి మెట్టినిల్లుగా పిలుస్తున్నారు. చదురుగుడిలో అమ్మవారికి ఇరువైపులా ఘటాలు (బిందెలు, కుండలు) ఉంటాయి. వీటిలో నీటిని అమ్మవారి తీర్ధంగా భక్తులు పుచ్చుకుంటారు. ఈ గుడిలోనే రావి, వేప చెట్ల సంగమ వృక్షం ఉంది. దాని కిందనే అమ్మవారి సోదరుడిగా భావించే పోతురాజు పూజలందుకుంటున్నాడు.అమ్మే దారి చూపిస్తుంది...ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి కీలకమైన సిరిమాను చెట్టును పూజారికి పైడిమాంబ కలలో కనిపించి చూపిస్తుందని ఒక నమ్మకం. ఇది తప్పనిసరిగా చింతచెట్టు అయి ఉంటుంది. అమ్మ చూపిన దిక్కుగా వెతుక్కుంటూ వెళ్లిన పూజారి చెట్టును గుర్తించి భక్తులు, అధికారుల సమక్షంలో సేకరిస్తారు. ఈ ఏడాది సిరిమాను చెట్టు గంట్యాడ మండలం కొండతామరాపల్లి గ్రామంలో పైడితల్లి సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావుకు సాక్షాత్కరించింది. అదే గ్రామంలో ఇరుసుమానును గుర్తించారు. అత్యంత పవిత్రమైనదిగా భావించే ఈ చెట్లకు వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి విజయనగరం పట్టణంలోని హుకుంపేటకు తరలించారు. అక్కడ చెక్కి, నునుపైన మానుగా తీర్చిదిద్ది ఉత్సవానికి సిద్దం చేస్తున్నారు. ఆలయం నుంచి కోట వరకూ సిరిమాను మూడుసార్లు తిరుగుతుంది. అనేక జానపద వేష ధారణలు సిరిమాను ముందు నడువగా, సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకుంటాయి.సందడంతా తొలేళ్ల సంబరానిదే...సిరిమానోత్సవం ముందురోజు రాత్రి చదురుగుడి వద్ద నుంచి అమ్మవారి ఘటాలను మేళతాళాలతో కోటలోనికి తీసుకువెళతారు. కోటలో ఉన్న రౌండ్ మహల్ వద్దకు వెళ్లిన తర్వాత పూజారికి బోనాలు వాళ్లు అమ్మవారి చరిత్రను స్తుతిస్తూ రాగయుక్తంగా గానం చేస్తారు. అక్కడ పూజల అనంతరం ఘటాలు చదురుగుడి వద్దకు తరలిస్తారు. ఆ గుడి ఎదురుగా ఒక బడ్డీని ఏర్పాటుచేసి అక్కడ ఘటాలను ఉంచుతారు. తెలంగాణా ప్రాంతంలో అంగరంగ వైభవంగా జరిగే బోనాల ఉత్సవంలో వినిపించే భవిష్యవాణì మాదిరిగానే ఇక్కడ కూడా పైడిమాంబ మాటగా పూజారి భవిష్యవాణిని వినిపిస్తారు. అప్పటికే పూజారిపై ఆవహించిన పైడిమాంబ తన మాటగా భక్తులకు భవిష్యవాణి వివరిస్తుంది.రాబోయే ఏడాదికాలంలో జరిగే మంచి ,చెడులను అమ్మపలుకుతుంది. పంటల విషయంలోనూ, పాడి సంపదల్లోనూ ఈ ప్రాంతం అభివృద్ది ఎలా ఉంటుందనేది కళ్లకు కట్టినట్లు అమ్మ పలికిస్తుంది. ఉపద్రవాలు వచ్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా సూచిస్తుంది. అందరికీ ఉపయోగపడే ఆ భవిష్యత్ వాణిని వినేందుకు రైతులు అక్కడకుచేరుకుంటారు. ఆ తర్వాత పూజారి ధాన్యపు గింజలను రైతులకు అందజేస్తారు. వాటిని తమ పొలాల్లో తొలివేరుగా విత్తుకుంటే ఆ ఏడాది పంటలు సమృద్ధిగా పండుతాయనేది రైతుల నమ్మకం. తొలేళ్ల ఉత్సవం సందర్భంగా వివిధ వేషధారణలతో పట్టణం కళకళలాడుతుంది. ఈ రాత్రంతా భక్తులు జాగారం మాదిరిగా పట్టణంలో కలియదిరుగుతారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన చిరు వ్యాపారులు వందలాది దుకాణాలు ఏర్పాటు చేస్తారు. రంగుల రాట్నం దగ్గర్నుంచి అనేక ఆట΄ాటలను అందుబాటులోకి తెస్తారు.ఏటా విజయదశమి తర్వాతే సిరిమానోత్సవం...పెద్దచెరువులో ఆత్మార్పణ చేసుకున్న పైడిమాంబను విగ్రహరూపంలో చెరువు నుంచి బయటకు తీసి గుడిలో ప్రతిష్టించినది విజయదశమి తర్వాత వచ్చిన మంగళవారం రోజున అని ప్రతీతి. అందుకే ప్రతీ ఏటా విజయదశమి వెళ్లిన తర్వాత వచ్చే తొలి మంగళవారం రోజున అమ్మవారికి సిరిమానోత్సవం నిర్వహిస్తారు. ఇలాంటి ఉత్సవం దేశంలో మరెక్కడా ఉండదు. దాదాపు 40 నుంచి 60 అడుగుల పొడవుండే సిరిమాను (చింతమాను)కు ఆసనం అమర్చి ఆ ఆసనంలో పూజారిని అమ్మవారి ప్రతిరూపంగా కూర్చోబెట్టి చదురుగుడి వద్ద ఉన్న ఆలయం నుంచి కోట వరకూ మూడుసార్లు ఊరేగిస్తారు. సిరిమాను ఊరేగింపు సాగినంత మేర భక్తులు పారవశ్యంతో అరటిపండ్లు, పూలు, ఇతర ప్రసాదాలను సిరిమాను మీదకు విసురుతూ అమ్మదీవెనలు అందుకుంటారు. ఈ ఉత్సవానికి పూసపాటి వంశస్తులు తరలివచ్చి తమ ఇంటి ఆడపడుచుకు లాంఛనాలు సమర్పించుకుంటారు.అద్భుతాలెన్నో....సిరిమాను బయలుదేరుతుందనగా సిరిమానుకు ముందు అమ్మ విగ్రహాన్ని వెలికి తీసిన వలకు గుర్తుగా బెస్తవారి వలను నడిపిస్తారు. సంబరం ప్రారంభానికి ముందు పలువురు ఈటెలను ధరించి పాలధారగా అమ్మ ఆలయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి డప్పు వాయిద్యాలతో మహారాజ కోట పశ్చిమ భాగంవైపు వెళ్లి, కోటశక్తికి నమస్కరిస్తారు. వీరంతా సైనికులుగా ఆ సమయంలో పనిచేస్తారు. సిరిమాను జాతరలో అంజలి రథానిది ఓ విలక్షణమైన స్థానం. సిరిమాను కు అంజలి ఘటిస్తూ ముందుకు సాగే రథంపై ఐదుగురు పురుషులు స్త్రీల వేషాలను వేసుకుని కూర్చొంటారు. వీరంతా ఆరుమూరల నారచీరను, చేతికి వెండి ఆభరణాలను ధరించి సంబరంలో పాల్గొంటారు. స్త్రీ వేషధారణలో ఉన్న వీరంతా అమ్మవారి పరిచారకులకు ప్రతీకలుగా వ్యవహరిస్తారు. వీరంతా అక్షింతలు పట్టుకుని సంబరం జరుగుతున్నంతసేపూ భక్తులపై విసురుతూ ఉంటారు. దానికి ప్రతిగా భక్తులు భక్తిభావంతో అరటిపళ్లను వారిపై విసురుతూ ఉంటారు. స్థానిక ప్రజాప్రతినిధులతో ΄ాటు సిరిమానోత్సవానికి భక్తులు విశేషంగా తరలి వస్తారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా, కొలిచిన భక్తుల కొంగుబంగారమై ఉత్తరాంధ్ర ప్రజలను చల్లగా కాపాడుతోంది శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారు. విజయనగరంలో వెలిసిన ఆ తల్లి ఖ్యాతి రాష్ట్రాలు, ఖండాలు దాటి వ్యాపించింది. ఏటా నెలరోజుల పాటు నిర్వహించే పైడితల్లి అమ్మవారి జాతర ఆంధ్రప్రదేశ్లోనే ప్రత్యేక పండగగా ప్రసిద్థి చెందింది. పండగే ఓ ప్రత్యేకతైతే ఆ పండుగలో సిరిమానోత్సవం నభూతో నభవిష్యత్ అనిపించేలా జరుగుతుంది. విజయనగరంలో అమ్మవారు వెలిసిన నాటి నుంచి ఇక్కడి ప్రజలు కష్టాలే ఎరుగలేదన్న విశ్వాసం గట్టిగా ఉంది. ఏ ఊరిని తుఫాను ముంచెత్తినా, ఏ ఊళ్లో కల్లోలాలు జరిగినా విజయనగరం మాత్రం ప్రశాంతంగా ఉండటాన్ని అమ్మవారి అ΄ార కరుణకు నిదర్శనంగా ఇక్కడి ప్రజలు నమ్ముతుంటారు.సిరిమానుకు దారిలాపైడితల్లి అ్మమవారి కృపాకటాక్షాలు దక్కించుకోవడానికి హైదరాబాద్ నుంచి విజయనగరానికి నేరుగా రైళ్ల ద్వారా చేరుకోవచ్చు. దేశ, విదేశాల నుంచి విమానయానం ద్వారా రావాలనుకున్న వారు విశాఖపట్నం ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి కేవలం గంటన్నర వ్యవధిలోనే విజయనగరం చేరుకోవచ్చు. అదేవిధంగా ఆర్టీసీ ద్వారా ప్రత్యేక సర్వీసులు నడుస్తున్నాయి. వీటితో పాటు ప్రైవేటు ట్రావెల్ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇక పక్కనే ఉన్న ఒడిశా నుంచి ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వీరంతా వాహనాలు, రైళ్లు ద్వారా నేరుగా విజయనగరం చేరుకోవచ్చు. ఒడిశా ఆర్టీసీ బస్సు సేవలు అందుబాటులో ఉన్నాయి. విజయనగరం రైల్వేస్టేషన్లో అడుగు పెట్టగానే ఎదురుగా పైడితల్లి అమ్మవారు వెలిసిన వనంగుడి భక్తులకు కనబడుతుంది. అమ్మవారిని దర్శించిన భక్తులు అక్కడ నుంచి ఆటో, కారు, ఇతర వాహనాల ద్వారా కేవలం 10 నిమషాల వ్యవధిలోనే కిలోమీటరున్నర దూరంలో ఉన్న కోట ప్రాంతానికి చేరుకోవచ్చు. కోట సమీపంలోని మూడులాంతర్లు వద్ద ఉన్న చదురుగుడిలో పైడితల్లిని దర్శించుకుని తరించి అమ్మవారి కృప పొందవచ్చు.ఈ ఏడాది అమ్మవారి ఉత్సవాలకు సెప్టెంబరు 12న పందిరిరాటతో శ్రీకారం చుట్టారు. ఆ రోజు చదురగుడి, వనం గుడి వద్ద పందిరి రాట వేశారు. అదేరోజు అమ్మవారి మండల దీక్షలను చదురగుడి వద్ద ప్రారంభించారు. అక్టోబరు 2న అర్ధమండల దీక్ష మొదలుపెట్టారు. అక్టోబర్ 6, సోమవారం తొలేళ్ల ఉత్సవం, 7, మంగళవారం సిరిమానోత్సవం జరుగుతుంది. పెద్ద చెరువులో 14న తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. 19వ తేదీ ఆదివారం వనం గుడి నుంచి కలశజ్యోతి ఊరేగింపు, 21వ తేదీన ఉయ్యాల కంబాల ఉత్సవం, 22న చండీహోమం, పూర్ణాహుతితో పైడిమాంబ ఉత్సవాలు ముగుస్తాయి. – బోణం గణేష్, సాక్షి ప్రతినిధి, అమరావతి, ఫొటోలు: డి. సత్యనారాయణ మూర్తి -
సంకల్పమే శక్తి స్వరూపం..!
పల్లెటూరి అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలనుకుంటుంది. కానీ ఎన్నో అడ్డంకులు. ఆటంకాలు. ఆడపిల్లకు అవసరమా అని ప్రశ్నలు. అయితే సంకల్పమే శక్తిగా ఆ అమ్మాయి అనుకున్నది సాధిస్తుంది. ఓటీటీలో విశేష ఆదరణ పొందుతున్న ‘కన్యాకుమారి’లో హీరోయిన్ గీత్ షైనీతన సంకల్పాల గురించి దసరా దాండియా గురించి చెబుతున్న విశేషాలు. ‘నేను చిన్నప్పటి నుంచి ఎంతో బాగా చదువుకున్నాను. స్కూలు ఫస్ట్ వచ్చాను. కాలేజీ ఫస్ట్ వచ్చాను. ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకున్నాను. అయినా సరే నా కోరికలు ఏవీ మీరు పట్టించుకోలేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతానంటే డిగ్రీలో చేర్పించారు. ఇంత తెలివి పెట్టుకుని చీరల కొట్టులో సేల్స్గర్ల్లా చీరలు అమ్ముకుంటున్నాను’ అని తల్లిదండ్రులను, అన్నయ్యను నిలదీసి తన వేదనను చెప్పుకుంటుంది కన్యాకుమారి అనే అమ్మాయి ‘కన్యాకుమారి’ సినిమాలో.కన్యాకుమారిది ఒకటే కల. సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలనేది. కాని ఇంటి పరిస్థితులు, అమ్మాయి అనే కారణంతో చదివించక΄ోవడం... ఇవన్నీ ఆమె కలలను సగంలోనే తుంచేస్తాయి. కాని కన్యాకుమారి తన కలను లోలోపల సజీవంగా ఉంచుకుంటుంది. తను ప్రేమించిన వ్యక్తి ప్రేమను గౌరవిస్తూనే, రైతుగా ఉండాలనే అతని అభిలాషను గౌరవిస్తూనే తన లక్ష్యం తీవ్రతను అందరికీ తెలియచేసి హైదరాబాద్కు వెళ్లి సాఫ్ట్వేర్ కోర్సులు చేయడమే కాదు పెద్ద కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుని అమెరికాకు కూడా వెళ్లి వచ్చి అప్పుడు పెళ్లి చేసుకుంటుంది.ఇటీవల ఇలాంటి పట్టుదల ఉన్న అమ్మాయి కథ తెలుగులో లేదు. అందుకే ఓటీటీలో ‘కన్యాకుమారి’ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. ఆ పాత్ర పోషించిన గీత్ సైనీకి ప్రేక్షకులు ఫుల్మార్కులు వేస్తున్నారు. గీత్తో సంభాషణ:మీ పేరు తెలుగు పేరనిపించడం లేదు.గీత్ సైనీ: మా పూర్వికులది రాజస్థాన్. మా తాతల కాలంలోనే అదిలాబాద్కు వచ్చి స్థిరపడ్డారు. అదిలాబాద్లో నేను పుట్టి పెరిగాను. ఆ తర్వాత హైదరాబాద్లో మా కుటుంబం సెటిల్ అయ్యింది. మా నాన్న టీచర్. అమ్మ హౌస్ వైఫ్. యాక్టింగ్ మీద ఆసక్తి ఎలా?జ: స్కూల్లో బాగా అల్లరి చేసేదాన్ని. టీచర్లను ఇమిటేట్ చేసి ఫ్రెండ్స్ను నవ్వించేదాన్ని. డాన్సర్ కావాలనుకున్నాను. అయితే టెన్త్ క్లాస్ అయ్యాక అందరు ఫ్రెండ్స్ నా ఆటోగ్రాఫ్ బుక్లో ‘నువ్వు మంచి నటివి అవుతావు’ అని రాశారు. వారు రాసింది చూశాక నేను నటిని కావాలనుకునే కోరిక నాలో నా చుట్టూ ఉందనిపించింది. తొలి అవకాశం ఎలా వచ్చింది?జ: నేను ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివాను. థర్డ్ ఇయర్లో ఉండగా కాలేజీ ఈవెంట్లో డాన్స్ చేస్తే ఒక సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ చూసి ‘అల’ అనే షార్ట్ఫిల్మ్ కోసం నన్ను సంప్రదించారు. అయితే ఈ అవకాశం వచ్చినట్టు నాన్నకు చెప్పే ధైర్యం లేక మెసేజ్ చేశాను– ఇలా చాన్స్ వచ్చింది... నో చెప్పేశాను అని. నాన్న కాసేపటికి ఫోన్ చేసి ‘మంచి డైరెక్టర్ అంటున్నావు కదా బేటా చేయి’ అన్నారు. చాలా ఆశ్చర్యపోయాను.తొలి సినిమా అవకాశం?జ: సృజన్ అట్టాడ తన ‘పుష్పక విమానం’ కోసం కాస్టింగ్ కాల్ ప్రకటన ఇస్తే నా ఫ్రెండ్ నా ఫొటోలు పంపింది. అలా ఆ సినిమాలోని రెండు ఫిమేల్ లీడ్ క్యారెక్టర్లలో ఒకటిగా చేశాను. అయితే సృజన్ తీయబోతున్న ‘కన్యాకుమారి’ లో నాకు హీరోయిన్ చాన్స్ వస్తుందనుకోలేదు. శ్రీకాకుళం అమ్మాయిగా మారి ఆడిషన్ ఇచ్చాక ఆయన సంతృప్తి చెంది ఈ అవకాశం ఇచ్చారు. కన్యాకుమారి పాత్రను ఎలా ఓన్ చేసుకున్నారు?జ: నేను బయట మామూలుగా చాలా కామ్గా ఉంటాను. ఎవరైనా బాగా పరిచయమైతే ఇక నా వాగుడు తట్టుకోవడం కష్టం. ఆ లోపలి మనిషిని ఈ పాత్ర కోసం బయటకు తెచ్చాను. ఆడపిల్లలు తమ రెక్కలను పూర్తిగా సాచాలి. సీతాకోక చిలుకల్లా ఎగరాలి. అందుకే పోస్టర్లో సీతాకోక చిలుక ఉంటుంది. అలాంటి గట్టి పాత్ర చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. అందులో చీరల పేర్లన్నీ చెప్పే క్లిప్ బాగా వైరల్ అవుతోంది. చిన్నపుడు మీరు దసరా ఎలా జరుపుకునేవారు?జ: ఆదిలాబాద్లో మిక్స్డ్ కల్చర్ ఉంటుంది. సరిహద్దు ప్రాంతం కాబట్టి. దసరా వస్తే బాగా దాండియా ఆడేవాళ్లం. బతుకమ్మ కూడా ఆడేదాన్ని. కన్యాకుమారి షూట్ సమయంలో శ్రీకాకుళంలో ఉన్నప్పుడు దసరా వచ్చింది. అక్కడ దసరా సందడి వేరేగా అనిపించింది. వీధి వీధికి దుర్గ మంటపాలు, కోలాటం... చాలా సందడి చేశాం అందరం.నేటి అమ్మాయిలకు ఏం చెబుతారు?జ: ఏ సందర్భంలోనూ ఓటమి ఒప్పుకోవద్దు. కల ముగిసిపోయిందని అనుకోవద్దు. మరుగున పడ్డ లక్ష్యాలను తిరిగి సజీవం చేసుకుని పోరాడాలి. ఏదో ఒకరోజుకు గెలుస్తాం.– సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి (చదవండి: Vijayadashami: స్త్రీ శక్తే విజయ దశమి..) -
స్త్రీ శక్తే విజయ దశమి..
అమ్మవారిని తొమ్మిది రోజులు పూజిస్తే, ఏడాదంతా శుభప్రదంగా... జయకరంగా ఉంటుందని శాస్త్రోక్తి. బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు త్రిమూర్తులనీ, వారికి సృష్టిస్థితి లయకారులనీ పేరు. వీరు ముగ్గురూ తామే ఆ కార్యక్రమాలని నిరాటంకంగా చేసేస్తున్నారా అంటే వారికి విలువ, అస్తిత్వం ఆధిక్యమనేవి తమ తమ భార్యల వల్లనే కలుగుతున్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకంటే బ్రహ్మకి గుడి, పూజలు లేకపోయినా, ఆయన నోట దాగిన ఆ సరస్వతి కారణంగానే ఆయనను పూజిస్తారు.అదేతీరుగా శ్రీహరికి గుర్తింపూ విలువా లక్ష్మీదేవి వల్లనే. శ్రీవేంకటేశ్వరుడు కన్పించేది కూడా ఎనలేని విలువైన ఐశ్వర్యం వెనుకనే. ఆయన్ని భక్తజనం కొలిచేది కూడా ఐశ్వర్యం కోసమే. అంటే కేవలం ధనం కోసమే కాదు... అది పదవి, అధికారం, జీవితానికి సంబంధించి లేదా ధనానికి సంబంధించిన వాటికోసం అదేవిధంగా శక్తి లేని శివుడు ఏ ప్రయోజనాన్నీ చేకూర్చలేడట. అందుకే అర్ధనారీశ్వర రూపంలో ఆయన ఉన్నాడు. కేవలం తమ తమ భార్యల ద్వారా గుర్తింపు ఈ త్రిమూర్తులకీ ఉండడమే కాదు– తమ తమ భర్తలకు కష్టం వచ్చినప్పుడు రక్షించి ఒడ్డెక్కించింది కూడా తమ తమ భార్యలే. అందుకే వీరికి త్రిశక్తులని పేరు. ఈ త్రి శక్తి దేవతల సమష్టి పండగే విజయ దశమి.జమ్మిచెట్టును ఎందుకు పూజిస్తారు? శ్లోకం: శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియ దర్శనంజమ్మి చెట్టును సంస్కృతంలో శమీవృక్షం అంటారు. త్రేతాయుగంలో శ్రీరాముడు శమీ పూజ చేసి లంకకు వెళ్లి విజయం సాధించాడని రామాయణ గాథ చె΄్తోంది. అలాగే మహాభారతంలో పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్లేటపుడు తమ ఆయుధాలను, ధనుర్బాణాలను శవాకారంలో మూటలా కట్టి ఆ మూటను శమీవృక్షం పై ఉంచి తాము అజ్ఞాత వాసం వీడే వరకు వాటిని జాగ్రత్తగా కాపాడాలని జమ్మి చెట్టుకు నమస్కరించి వెళ్ళారట. తిరిగి అజ్ఞాత వాసం వీడిన అనంతరం జమ్మిచెట్టుకు పూజలు చేసి చెట్టు పై నుండి ఆయుధాలు తీసుకుని యుద్ధంలో కౌరవులను ఓడించారని మహా భారతకథ చెపుతోంది. నాటి నుండి నేటి వరకు విజయ దశమి రోజున శమీ వృక్షాన్ని పూజిస్తే అపజయం ఉండదని అందరి నమ్మకం. విజయ దశమి రోజున నక్షత్ర దర్శన సమయాన జమ్మిచెట్టు వద్ద అపరాజితా దేవిని పూజించి పైన పేర్కొన్న శ్లోకం చదివి చెట్టుకు ప్రదక్షిణ చేసిన తరువాత ఆ చెట్టు ఆకులు తెంపుకుని పెద్ద వారికి ఇచ్చి దండం పెట్టి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఇది నేటికీ ఆనవాయితీగా కొనసాగుతోంది.ఆయుధ పూజలోని ఆంతర్యం?అజ్ఞాతవాస ముగింపులో విజయ దశమి నాడు పాండవ మధ్యముడు విజయుడు జమ్మిచెట్టు మీదున్న ఆయుధాలను బయటికి తీసి పూజచేసి ఉత్తర గోగ్రహణ యుద్ధాన్ని చేసి దిగ్విజయుడైనాడు. కనుక ఆశ్వీయుజ శుద్ధ దశమి విజయదశమి అయింది. ఆరోజున దుర్గాదేవి, అర్జునుడు విజయం సాధించారు కనుక ప్రజలు తమకు జీవనాధారమైన పనిముట్లకు కృతజ్ఞతా పూర్వకంగా పూజలు చేసి తమ జీవితం విజయవంతం కావాలని అమ్మవారిని వేడుకుంటారు. ఇదే ఆయుధపూజ. విద్యార్థులు పాఠ్య పుస్తకాలను, ఇతరులు తమ వృత్తికి సంబంధించిన పుస్తకాలను పూజలో పెట్టడం ఆనవాయితీ. ఉత్తరాయణంలో అక్షరాభ్యాసం కాని పిల్లలకు ఈ రోజున అక్షరాభ్యాసం చేయడం, ఏదైనా కొత్త అంశాలను ఆరంభించడం ఈనాటి ఆచారాలలో ఒకటి. పాలపిట్ట దర్శనం ఎందుకు?పురాణ గాథల్లోకి వెళితే పాండవులు అరణ్య, అజ్ఞాత వాసాలను ముగించుకుని తిరుగు ప్రయాణమై తమ రాజ్యానికి వెళుతున్న సమయంలో వారికి పాలపిట్ట దర్శనం కావడం జరిగిందని, నాటి నుండి వారి కష్టాలు తొలగిపోయి కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించడంతోపాటు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందారట. అందుకే పాండవులకు కలిగిన శుభాలు పాలపిట్టను చూస్తే అందరికి కలుగుతాయని ప్రజల నమ్మకం. అందుకే విజయ దశమి రోజు లపిట్ట దర్శనం కోసం గ్రామాల్లో సాయంత్రం వేళ జమ్మి పూజ అనంతరం పంట పొలాల వైపు ప్రజలు ఆడ, మగ తండోపతండాలుగా వెళతారు. పాలపిట్ట దర్శనం చేసుకుని ఆనందంగా ఇళ్లకు చేరుకుంటారు. – డి.వి.ఆర్.(చదవండి: వెయ్యేళ్ల నాటి ఆలయం..! ఇక్కడ దుర్గమ్మకు రక్తం చిందించని బలి..) -
అమ్మవారిలా... ఐరన్ నారిలా...
‘‘మనలో లక్ష్మి, పార్వతి, దుర్గ... ఈ అమ్మవార్లు అందరూ ఉన్నారు. అయితే వాళ్లు ఉన్న సంగతి మనం గ్రహించాలి. మనలోని ఆ శక్తిని ఉపయోగించుకుని అనుకున్నది సాధించాలి. అమ్మాయిలు అనుకోవాలే కానీ సాధించలేనిదంటూ ఏదీ లేదు’’ అని రాశీ ఖన్నా అన్నారు. సౌత్లో స్టార్ హీరోయిన్గా దూసుకెళుతున్న ఈ నార్త్ బ్యూటీ ‘దసరా’ సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు.→ ఢిల్లీలో ఉన్నప్పుడు మా ఫ్యామిలీ అందరం కలిసి ‘రామ్లీలా’కి వెళ్లేవాళ్లం. అక్కడ రావణ దహనం చూసేవాళ్లం. చెడు అంతం అవుతుంటే చూడ్డానికి చాలా బాగుంటుంది. దసరా అంటే చెడు పై మంచి గెలవడం. అది నాకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే మంచి గెలవాలి. → హీరోయిన్ అయిన తర్వాత ఇంతకు ముందులా స్వేచ్ఛగా పబ్లిక్లోకి రావడం కుదరదు కాబట్టి, ఇంట్లోనే ఉండి పూజ చేస్తున్నాను. మాకు నార్త్లో నవరాత్రికి చిన్న పిల్లలను అమ్మవారిలా భావించి, పూజించడం అలవాటు. చిన్న చిన్న అమ్మాయిలు అమ్మవారిలా డ్రెసప్ అయి, వేరే వాళ్ల ఇంటికి వెళతారు. అక్కడ వాళ్లు ఈ పిల్లలను అమ్మవారిలా భావించి, పూజ చేస్తారు. నా చిన్నప్పుడు నేను అలా వేరేవాళ్ల ఇంటికి వెళ్లేదాన్ని. అలా అలంకరించుకుని వెళ్లడం నాకు ఇప్పటికీ ఓ తీపి గుర్తులా మిగిలి పోయింది. ఈ నవరాత్రికి నా బ్రదర్వాళ్లు మా ఇంటికి వచ్చారు. నేను మా ట్రెడిషన్ని ఫాలో అయి, నా మేనకోడలిని అమ్మవారిలా అలంకరించి, పూజ చేశాను. అందుకే ఈ నవరాత్రి నాకు స్పెషల్.→ పూరీ, హల్వా మాకు పండగ స్పెషల్. ఉడకబెట్టిన శెనగలను కూడా ప్రసాదంగా పెడతాం. హల్వా చేయడం కష్టం అంటారు కానీ నాకు చాలా ఈజీ. పండగకి నేను హల్వా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.∙మహిళలు ఒకరినొకరు స పోర్ట్ చేసుకోవాలి. అయితే కొందరు అమ్మాయిలు వేరే అమ్మాయిలను స పోర్ట్ చేయరు. సినిమా ఇండస్ట్రీలోనే కాదు... బయట కూడా స పోర్ట్ చేయనివాళ్లు ఉన్నారు. చాలామంది ‘స్త్రీవాదం’ అని అమ్మాయిలకు ఏదో న్యాయం చేసేట్లు మాట్లాడతారు. కానీ ‘ఫేక్ ఫెమినిజమ్’ని కూడా చూశాను. అమ్మాయిలే ఇలా ఉంటే.. మగవాళ్లు స పోర్ట్ చేయాలని ఎలా ఆశిస్తాం. మహిళలందరం ఒకరినొకరు స పోర్ట్ చేసుకుని, ఎదగాలి. → జీవితంలో ధైర్యంగా ఉండే అమ్మాయిలను, పిరికివాళ్లను చూస్తాం. అయితే పిరికిగా ఉన్నారని తప్పుబట్టను. ఎందుకంటే మనం ఎలా ఉండాలనేది మన ఇంటి పెంపకం కూడా నిర్ణయిస్తుందని నా అభి ప్రాయం. ఒకవేళ వాళ్ల అమ్మ అలా పిరికిగా ఉండి ఉంటారు. ఆమెని చూసి వాళ్లు అలా ఉంటారేమో. కానీ నా జీవితంలో చాలామంది పవర్ఫుల్ ఉమెన్ ఉన్నారు. మా అమ్మ, బామ్మ, నా ఫ్రెండ్స్... ఇలా నా చుట్టూ ఉన్నవాళ్లందరూ శక్తిమంతులే. అందుకే నేనూ వాళ్లలా స్ట్రాంగ్ లేడీలా ఉంటున్నా. లక్ష్మి, దుర్గా, పార్వతి... ఈ అమ్మవార్లందరూ మనలోనే ఉన్నారు. అయితే మనం తెలుసుకోగలగాలి. ‘నా వల్ల ఏమీ కాదు’ అని కొందరు ఫిక్స్ అయి పోతారు. మన పవర్ని తక్కువ అంచనా వేసుకోకూడదు. → 50 ఏళ్ల క్రితం స్త్రీలు ఇంటికే పరిమితం అయ్యే పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితుల్లోనూ కొందరు స్త్రీలు ఎందరికో ఆదర్శంగా నిలిచే పనులు చేశారు. కానీ ఇప్పుడు అనుకున్నది సాధించే పరిస్థితులు ఉన్నాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అఫ్కోర్స్ అమ్మాయిలు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు వెనక్కి లాగడానికి ప్రయత్నించేవాళ్లు ఉంటారు. వాళ్లని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్లడమే. → స్కూల్లో ఫంక్షన్స్ కోసం నేను దుర్గా మాతలా అలంకరించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఘాగ్రా వేసుకుని, పెద్ద బొట్టు పెట్టుకుని, జుట్టు విరబోసుకుని... మొత్తం అలంకరణ అయ్యాక అద్దంలో చూసుకున్నప్పుడు తెలియని ఫీలింగ్ కలిగేది. ఆ గెటప్లో ఉన్నప్పుడు పవర్ఫుల్గా అనిపించేది.→ సినిమాల్లో అమ్మవారి క్యారెక్టర్ చేయాలని ఉంది. అయితే అమ్మవారి గెటప్ అంటే ఆషామాషీ కాదు. ఆ గెటప్లో ఉన్నంతవరకూ నిష్ఠగా ఉండాలి. భక్తితో ఉండాలి. అమ్మవారి క్యారెక్టర్ చేయాలనే నా కల నెరవేరే అవకాశం వస్తే మాత్రం శ్రద్ధాభక్తులతో చేస్తాను. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. మనలో మంచి ఉంటే మనకు అదే వస్తుందని నా నమ్మకం. నా లైఫ్లో నాకు చాలాసార్లు ఇది అనుభవమైంది. దసరా సందేశంలానే... చెడుపై మంచి గెలవడం అనేది జరిగే తీరుతుంది. నేను దేవుణ్ణి బాగా నమ్ముతాను. దేవుడు ఉన్నప్పుడు న్యాయానికి స్థానం ఉంటుంది.– డి.జి. భవాని -
పాలపిట్టలు.. ప్రాకృతిక శోభలు
దసరా అంటే ఆయుధాల పూజ మాత్రమే కాదు బంతి పూల సింగడీ పూజ. లేఎండ తగిలిన పచ్చగడ్డి భూతల్లికి వేసే ఆవిరి ధూపం. మెట్ట ప్రాంతాల సౌరభం. స్త్రీలు ఎర్రమట్టితో అలికే ఇంటి ముంగిలి కళ. చెరువులు నిండి, వాగులు పొంగే కాలం. ప్రతి ఊరిలో పట్టనలవిగాని సంబరం... ‘దసరా’ గురించి వాగ్గేయకారుడు గోరటి వెంకన్న చెబుతున్న విశేషాలు.దసరా పండుగ మా దక్షిణ తెలంగాణ లో గొప్పగా జరుపుకుంటాం. దుందుభి, కృష్ణ నదుల నడిమధ్యన ఉండే ప్రాంతం మాది. చిన్నప్పుడు దసరా వస్తే ఊళ్లో ‘అమ్మా వినవే జామి’... అని జమ్మిచెట్టు మీద కట్టిన జానపద పాటలు స్త్రీల నోటి నుంచి వినిపించేవి. జమ్మి చెట్టు మీద పాండవులు ఆయుధాలు దాచడం, వాటిని కిందకు దించాక అర్జునుడు యుద్ధం చేసి గెలవడం ఈ విరాట పర్వం అంతా ప్రజలకు ఇష్టంగా మారిన గాథ. అందుకే దసరాకు పాడుకుంటారు. దసరా సమయంలో యక్షగానం ఊరూరా ఉంటుంది. కొన్ని చోట్ల శశిరేఖా పరిణయం ఆడతారు. దసరా పండుగ ప్రాకృతిక శోభ నిండి ఉన్నప్పుడు వస్తుంది. భూమాత వానకు తడిసి, ఎండ తగలడం వల్ల అంత తడిగా, పొడిగా కాకుండా మెత్తగా ఉంటుంది. వేరుశనగ బుడ్డలు అప్పుడప్పుడే గింజ గట్టి పడుతూ ఉంటాయి. జొన్న, సజ్జ, రాగి, కంది పొలాలు పంటతో మురిసి పోతూ ఉంటాయి. అలసందలు ఆ సమయంలోనే కోతకు వస్తాయి. పెసర, బీర తీగలు, కాకర పాదులు, చిక్కుడు చెట్లు కళకళలాడుతుంటాయి. నా చిన్నప్పుడు మాకున్నది మూడు నాలుగు ఎకరాలే అయినా మా చేనులో చిన్న గుడిసె ఉంటే అక్కడే ఉండేవాణ్ణి. పంటలు పండిన పొలాల మీదకు గువ్వలు వస్తాయి. వాటిలో పాలపిట్టను చూసి సంతోషపడేది. పండగ రోజు మాత్రమే కాదు.. ఆ సీజన్లో ఎప్పుడు పాల పిట్ట కనపడినా ఎంతో సంతోషం కలుగుతుంది. దానిని చూడటం శుభకరం అని భావిస్తారు. దసరా నాటికి వానలు పడి చెరువులు నిండి ఉంటాయి. వాగులు పారుతుంటాయి. చేపలు ఎదురెక్కుతుంటాయి. నల్ల తుమ్మలు నిండుగా గాలికి ఊగుతుంటాయి. వలస పక్షులు వాలుతాయి. పండగ సమయంలో దేవతలు, యక్షులు పక్షుల రూపంలో వచ్చి వాలుతాయని అనుకునేది. అందుకే ‘తిప్ప తీగల వీణ మీటుతూ రాగమాలికలు పాడే పిట్టలు’ అని రాశాను. తెలంగాణలో దసరా పండగకు తప్పనిసరిగా ఆడబిడ్డలను పదిరోజుల ముందే తీసుకు వస్తారు. స్త్రీలు ఎర్రమట్టి తెచ్చి ఇల్లంతా సుందరంగా అలుక్కుంటారు. ఆ ఎర్రమన్ను తెచ్చుకునే సమయంలో స్త్రీలు కదిలి వస్తుంటే చూసి పిల్లలందరం పండగ కళ రాబోతున్నదని కేరింతలు కొట్టేవాళ్లం. దసరా సమయానికే సీతాఫలం చెట్లు విరగకాసి ఉంటాయి. మా చిన్నప్పుడు వాటిని కాల్చుకుని తినడం గొప్ప ఆహారం. ఎన్ని తినేవారమో లెక్కే లేదు. దసరా అంటే పూల పండగ. సమయంలో ఊరిలో, ఇళ్లలో, పొలాల గట్ల మీద బంతి పూలు పూస్తాయి. వాటిని తెచ్చి మామిడాకులు, పోక పూలు అన్ని కలిపి ప్రతి ఇంటి దర్వాజాలకు, ద్వారబంధాలకు కళాత్మకంగా కట్టి శోభను తీసుకు వస్తారు. దసరా అంటే బరిలో గెలిచిన ఆయుధ పూజ మాత్రమే కాదు బంతిపూల సింగడి పూజ. దసరా సమయంలో నేలంతా రకరకాల గడ్డి మొలిచి ఉంటుంది. ఎండ తగిలినప్పుడు సూర్యకిరణాల తాపంతో వీటి నుంచి సన్నటి ఆవిరి లేచి భూతల్లికి ధూపం వేసినట్టు ఉంటుంది. ఆ గడ్డి మీదుగా వీచే గాలిలోని వాసన ఎంతో అద్భుతంగా ఉంటుంది. పండగ రోజు జమ్మి కోసం వెళ్లడం... దానికి బండ్లు కట్టడం అదో ఉత్సవం. నా చిన్నప్పుడు నా స్నేహితులు నాగయ్య, మల్లయ్య, బుచ్చయ్య, అంజయ్య, కూర్మయ్య మా మేనమామ నరసింహయ్య మేమందరం తప్పనిసరిగా కలిసేవాళ్లం. మేం మాత్రమే కట్టుగా ఉండి పొలాల వెంట తిరిగేవాళ్లం. ఈ కాలంలోనే ఈత కల్లు మొదలవుతుంది. నురగ పడుతది. దసరా పండగలో తినడం, సంతోషంగా గడపడం ప్రజలకు కొత్త ఉత్సాహం ఇస్తుంది. దసరా దశ దిశలా సంతోషాలు తెచ్చే పండుగ. -
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 బిలియనీర్లు.. కళ్లు చెదిరే విషయాలు
2025లో భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య 358కి పెరిగింది. M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 తాజా నివేదిక ప్రకారం గత సంవత్సరంతో పోలిస్తే 24మంది కొత్త బిలియనీర్లు జాబితాలో చేరారు. 13 ఏళ్ల క్రితం హురున్లిస్ట్ మొదలైనప్పటి నుండి భారతదేశ బిలియనీర్ల సంఖ్య ఆరు రెట్లు పెరిగి 350కి చేరుకుంది. ఈ జాబితాలోని మరికొన్ని ముఖ్యమైన అంశాలుM3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 లిస్టలో చోటు సంపాదించుకున్న వారు ధనవంతులు రోజుకు 1,991 కోట్ల సంపదను ఆర్జించారు.2025లో టాప్ 10 మంది మొత్తం సంపద జాబితాలోని మిగిలిన జాబితాలో 28 శాతానికి సమానం. ఒక్క ముఖేష్ అంబానీ , గౌతమ్ అదానీ సంపదే మొత్తం సంపదలో 12శాతం ఉందని ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది. M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. రూ.9.55 లక్షల కోట్ల (USD 105 బిలియన్లు) సంపదతో, ముఖేష్ అంబానీ & కుటుంబం అత్యంత ధనవంతులైన భారతీయుడిగా నిలిచారు. గౌతమ్ అదానీ & కుటుంబం రూ.8.15 లక్షల కోట్ల సంపదతో రెండో స్థానంలో ఉంది.M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 సంచిత సంపద INR 167 లక్షల కోట్లు. ఇది వార్షిక ప్రాతికపదికన ఇది 5 శాతం పెరుగుదల. ఇది స్పెయిన్ GDP కంటే ఎక్కువ . భారతదేశ GDPలో దాదాపు సగానికి సమానం.సుంకాల ఎదురుదెబ్బ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో M3M హురున్ ఇండియా రిచ్ లిస్టర్ల సగటు సంపద 10,320 కోట్ల 9,850 కోట్లకు తగ్గింది.నీరాజ్ బజాజ్ & కుటుంబం సంపద రూ. 2.33 లక్షల కోట్లు పెరిగి, నాలుగు స్థానాలు ఎగబాకి 6వ స్థానానికి చేరుకుంది.మరో విధంగా చెప్పాలంటే, బజాజ్ గ్రూప్కు చెందిన నీరాజ్ బజాజ్ & కుటుంబం ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు, 69,875 కోట్లు పెరిగి వారి సంపద 2.33 లక్షల కోట్లకు చేరుకుంది.చెన్నైలో జన్మించిన పెర్ప్లెక్సిటీ వ్యవస్థాపకుడు అరవింద్ శ్రీనివాస్, INR 21,190 కోట్ల సంపదతో 2025 M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్లో బిలియనీర్గా అరంగేట్రం చేశారు. జాబితాలో అతి పిన్న వయస్కుడైన బిలియనీర్ కూడా ఆయనే.రోష్ని నాడార్ మల్హోత్రా & కుటుంబం రూ. 2.84 లక్షల కోట్ల సంపదతో టాప్ 3లో అడుగుపెట్టారు, భారతదేశంలో అత్యంత ధనవంతురాలైన మహిళగా నిలిచారు. రోష్ని నాడార్ టాప్ 10లో అతి పిన్న వయస్కురాలు కూడా.జాబితాలో ఉన్న పద్దెనిమిది మంది లక్ష కోట్లకు పైగా ఆస్తులను కలిగి ఉన్నారు. గత సంవత్సరం కంటే ఆరుగురు ఎక్కువ. పదేళ్ల క్రితం దశాబ్దం ఇద్దరు మాత్రమే ఉన్నారు.హురున్ ఇండియా యునికార్న్ & ఫ్యూచర్ యునికార్న్ లిస్ట్ 2025 నుండి అరవై ఐదు మంది యునికార్న్ వ్యవస్థాపకులు—13 మంది గజెల్( Gazelle founders) వ్యవస్థాపకులు , 5 మంది చీతా వ్యవస్థాపకులు (Cheetah founders)M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో చోటు సంపాదించారు. -
పండుగ పూట పెట్టెతో సహా గోల్డ్ కొట్టేసింది..! వీడియో వైరల్
బంగారం ధరలు రోజురోజుకి ఆకాశాన్నంటుతున్నాయి.కనీవినీ ఎరుగని రీతిలో పెరుగుతూ సామాన్యుడికి అందని ద్రాక్షగా మిగిలిపోతోంది పసిడి. గ్రాము బంగారం కొనాలంటే జనం బెంబేలెత్తుతున్న పరిస్ఙతి. ఈ క్రమంలో ట్విటర్లో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది.ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లోని ఒక జ్యుయల్లరీ దుకాణంలో ఒక మహిళ తన చేతివాటి చూపించింది. బంగారం షాపింగ్ చేస్తున్నట్టుగానే నటిస్తూ లక్షలు విలువ చేసే నగను పెట్టెతో సహా దాచేసింది. కానీ విషయం షాపులోనే ఉన్న కెమెరానుంచి మాత్రం తప్పించు కోలేక పోయింది. ఒక ట్విటర్ యూజర్ దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. బంగారం ధరలు గ్రాముకు రూ 12 వేలు దాటేసింది. ఇలాంటి దొంగతనాలు బాగా పెరిగే అవకాశం ఉంది... ఆభరణాలు కొనుగోలు చేసేవారు ఎప్పుడూ లేనంతగా అప్రమత్తంగా ఉండాలి! అనే క్యాప్షన్తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. 🚨 With gold prices soaring past ₹12k/gram, theft cases are bound to spike...Jewellers must stay more alert than ever!#UttarPradesh | Bulandshahr: Woman caught on camera stealing..stuffs an entire jewellery box inside her saree 👇 pic.twitter.com/5FRxWAQrA0— Nabila Jamal (@nabilajamal_) October 1, 2025 -
సమోసాలు అమ్మి..పిల్లలను డాక్టర్లుగా చేసిన తండ్రి..! ఏడు సార్లు ఫెయిలైనా..
ఉన్నత చదువులు చదివించడం సాధ్యం కాదని ప్రతి మధ్యతరగతి తలిదండ్రులు అనుకుంటుంటారు. తమ తాహతకు మించి చదువులు అనవసరం అనే భావన చాలామంది పేరెంట్స్లో ఉంటుంది. కానీ ఇక్కడొక వ్యక్తి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా..ఇద్దరి పిల్లల్ని డాక్టర్లుగా చేశాడు. ఏడు సార్లు ఫెయిలైనా..తన పిల్లలు ఏనాటికైనా సాధిస్తారనే భావించాడు. కొడుకులు కూడా అతడి నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు. స్ఫూర్తిదాయకమై కథ, పేరెంటింగ్కి గొప్ప నిర్వచనం కూడా.27 ఏళ్ల జినాల్, అతడి తమ్మడు 22 ఏళ్ల పారిన్ ష్రాఫ్లు వైద్యులుగా తీర్చిదిద్దడానికి తమ తల్లిదండ్రులు ఎంతలా కష్టపడ్డారో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. డాక్టర్లు కానున్నా ఇద్దరు సోదరులు తమ ప్రస్థానం అంత ఈజీగా సాగాలేదన్నారు. తమ తాత గుండెపోటుతో ఆకస్మికంగా చనిపోవడంతోనే డాక్టర్ కావాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు. తమ తల్లిదండ్రుల జీవనాధారం సమోసాల దుకాణం. దాని మీద వచ్చే ఆదాయంతోనే కష్టపడి చదింవించారని తెలిపారు. అయితే నిట్ ఎగ్జామ్ ప్రిపేరవ్వతున్నప్పుడూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారో కూడా చెప్పారు. జినాల్ నీట్ కల దాదాపు సాధ్యం కాదనే పరిస్థితుల్లో ఉన్నట్లు నాటి పరిస్థితిని గుర్తుచేసుకున్నాడు. వరుసగా మూడుసార్లు ఫెయిలై ఇబ్బంది పడుతున్న తరుణంలో మరో ప్రయత్నంలో అనారోగ్యం బారినపడి ఎంతలా ఇబ్బంది పడ్డాడో వివరించాడు జినాల్. అలా ఏడుసార్లు ఫెయిలైనా తల్లిదండ్రులు ఏం పర్లేదు అంటూ ప్రోత్సహిస్తూనే ఉన్నారని చెప్పుకొచ్చాడు. తల్లిదండ్రలు చూపిస్తున్న అపారమైన ప్రేమ తనలో కసిని పెంచి ఏడో ప్రయత్నంలో విజయం సాధించడమే కాదు మంచి కాలేజ్లో ఎంబీబీఎస్ సీటు సంపాదించాడు పెద్దవాడు జినాల్. ఇక సోదరుడు పారిన్ ష్రాఫ్ రెండో ప్రయత్నంలోనే విజయ కేతనం ఎగరవేశాడు. అంత బాగానే సాగింది అనుకునేలోపు ఆ సోదరులు కాలేజ్లో సీట్లు పొందడానికి 20 లక్షల బాండ్లను సమర్పించాల్సి ఉంది. తనఖా పెట్టడానికి ఎలాంటి ఆస్తి లేని ఆ నిరుపేద కుటుంబం మళ్లీ కుదేలు అయిపోంది. ఆ ఆపదను గట్టెక్కించడానికి తండ్రి స్నేహితులు మందుకు రావడం విశేషం. అంతేగాదు ఈ రోజు ఈ స్థాయికి చేరుకోవడంలో తమ గురువు రామానంద్ సార్ పాత్ర ఎంతో ఉందని చెప్పుకొచ్చారు. ఆయన తమ ఆర్థిక పరిస్థితి గమనించి.. పలు స్కాలర్షిప్లు, మెంటర్షిప్లు, వంటి వాటి గురించి తెలియజేసి ప్రోత్సహించారని తెలిపారు. ఆ ఇరు సోదరులు వైద్య విద్య మూడో ఏడాది చదువుతున్నారు. ఇక తమ చదువు పూర్తి అయ్యిన వెంటనే పేద రోగులకు ఉచిత వైద్య అందించేలా చేయడమే తమ లక్ష్యం అని నమ్మకంగా చెబుతున్నారు. మరి ఆ సరస్వతి పుత్రులకు ఆల్ ద బెస్ట్ చెబుదామా మరి..(చదవండి: భారత్ జిమ్ సంస్కృతి బాగుంటుంది..! ఉక్రెయిన్ మహిళ మనోగతం..) -
అంబానీ, అదానీ తరువాత.. మరోసారి టాప్లో రోష్నీ నాడార్
ప్రముఖ టెక్ సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీస్ (HCL) చైర్పర్సన్ రోష్ని నాదర్ మల్హోత్రా (Roshni Nadar Malhotra) ధనవంతులైన వ్యాపారవేత్తగా మరోసారి తన ఘనతను చాటుకున్నారు. భారతదేశంలో అత్యంత ధనవంతు రాలైన మహిళగా చరిత్ర సృష్టించారు. M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో రూ.2.84 లక్షల కోట్ల సంపదతో మూడవ స్థానంలో నిలిచారు. తద్వారా భారతదేశ సంపదలో పెరుగుతున్న కొత్త తరం మహిళా నాయకుల ప్రతిభను చాటి చెప్పారు.హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 (Hurun Rich List) ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు, రోష్ని నాదర్ మల్హోత్రా అత్యంత ధనవంతురాలైన మహిళగా ఎంపికయ్యారు. హురున్ ప్రకారం రిలయన్స్ అధినేతముఖేష్ అంబానీ మరోసారి తన టాప్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అంబానీ ఫ్యామిలీ భారతదేశంలో అత్యంత ధనవంతుడిగ ఆనిలిచారు. మొత్తం ఆస్తి .రూ.9.55 కోట్లు. ఇక రూ. రూ.8.15 లక్షల కోట్ల కోట్ల సంపదతో అదానీ గౌతమ్ అదానీని అధిగమించారు.భారతదేశంలోని సంపన్న వర్గం గణనీయంగా పెరిగింది. దేశం ఇప్పుడు 350 మందికి పైగా బిలియనీర్లు ఉండగా. ఈజాబితా ప్రకారం గత 13 ఏళ్లుగా వీరి సంఖ్య గణనీనయంగా పెరుగుతూ వస్తోంది. జాబితా వీరి మొత్తం సంపద మొత్తం రూ.167 లక్షల కోట్లు.ఇది భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు సగం.కాగా హెచ్సీఎల్ వ్యవస్థాపకుడు శివ నాడార్ కుమార్తె రోష్ని నాడార్ మల్హోత్రా. ప్రస్తుతం హెచ్సీఎల్ టెక్ చైర్పర్సన్. HCL గ్రూప్లో అధిక వాటాను స్వీకరించిన తర్వాత భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ. కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు రోష్నీ. -
భారత్లోని జిమ్లే బాగుంటాయ్..! ఉక్రెయిన్ మహిళ మనోగతం..
విదేశీయులు మనదేశంలోని సంస్కృతి, సంప్రదాయాలను ఇష్టపడటం కొత్తేం కాదు, గానీ తాజాగా జిమ్ పరంగా కూడా భారత్నే మేటి అనే కితాబిచ్చేసింది ఓ విదేశీ మహిళ. వాస్తవానికి మనకంటే అత్యాధునిక టెక్నాలజీని అనుసరించే పాశ్చాత్య దేశాలు..ఫిట్నెస్ విషయంలో మనకంటే ముందుంటారు. అలాంటిది భారత్లోని జిమ్ సౌకర్యమే బాగుటుందని చెబుతోంది. ఇక్కడ ట్రైనర్స్ శిక్షణే బాగుంటుందని, ఈ విషయంలో యూరప్ దేశాలు భారత్ని నేర్చుకోవాలంటూ చురకలంటిస్తోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హాట్టాపిక్గా మారింది. ఎనిమిదేళ్లకుపైగా భారత్లోనే నివశిస్తున్న విక్టోరియా చక్రవర్తి భారత్ జిమ్లో వ్యాయామాలు చేస్తున్నట్లు పేర్కొంది. యూరోపియన్ ఫిట్నెస్ ఇండస్ట్రీ భారతీయ జిమ్ సౌకర్యం నుంచి చాలా నేర్చుకోవాలని అంటుంది. రూల్స్, సేవలు, వెసులబాటు వరకు అంతా సామాజిక వాతావరణం ఉంటుంది. ఆ పరంగా ఇరు దేశాల మధ్య జిమ్ సంస్కృతిలో చాలా తేడాలున్నాయి. ముఖ్యంగా ఈ నాలుగు పాఠాలను తప్పక నేర్చుకోవాలని అంటోంది. ఆ నాలుగు పాఠాలు.సరసమైన ధరలో జిమ్ సౌకర్యం దొరుకుతుంది. అధికంగా ఖర్చు చేయాల్సిన పనిలేదు. అలాగే తక్కువ ధరకే పూర్తి సౌకర్యాలందించే జిమ్లు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చిందికమ్యూనిటీ వెబ్: భారతీయ జిమ్లు సామాజికంగా కనిపిస్తాయి. ప్రజలు మాట్లాడుకుంటారు, చిట్కాలు పంచుకుంటారు, ఒకరినొకరు గుర్తిస్తారు, ట్రైనర్ పేరును కూడా తెలుసుకుంటారు. యూరప్లోలా ఎవరికివారుగా ఉండరు. జిమ్లు సాధ్యమైనంత త్వరితగతిన తెరుచుకుంటాయి. నెల ఇట్టే గడిచిపోతుంది. విద్యార్థులు, కొత్తగా నేర్చుకునేవారికి ప్రత్యేక నిపుణుల సూచనతో కూడిన శిక్షణా సౌకర్యం ఉంటుంది. ఈ విషయంలో యూరప్ జిమ్లో వార్షిక ఒప్పందాలు ఉంటాయి. అవి కూడా కఠిన నిబంధనలని అంటోంది విక్టోరియా. అలాగే భారత్లో ట్రైనర్ల సలహాలు సూచనలకు అధనంగా సొమ్ము చెల్లించాల్సిన పని ఉండదు. భారత్లో ఫిట్నెస్ ట్రైనర్లు తమ శిక్షకులకు స్వయంగా మార్గనిర్దేశం చేస్తారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు కూడా. ఇలాంటి వ్యక్తిగత శ్రద్ధ కొరకు యూరప్లో అదనంగా చెల్లించాలని అంటోంది. ఫిట్నెస్ పరంగా భారత్ నుంచి యూరప్ చాలా నేర్చుకోవాలని, భారత్లా ఉండాలని అంటోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఆమెతో ఏకభవించడమే కాదు, భారతీయ సంస్కృతిని ఇంతలా ఇష్టపడుతున్నందుకు ధన్యావాదాలు చెప్పారు పోస్టులyో. కాగా, సదరు ఇన్ఫ్లుయెన్సర్ విక్టోరియా గతంలో తనను చాలామంది భారత్కు వెళ్లవద్దని సూచించినట్లు వెల్లడించింది. అయితే ఆమె ఇక్కడకి రావడమే గాక ప్రేమలో పడటమేగాక ఇక్కడే వ్యాపారాన్ని కూడా నిర్మించిన తన విజయవంతమైన ప్రస్థానాన్ని అంతకుమునుపే పంచుకుంది కూడా. View this post on Instagram A post shared by Foreigner In India | Influencer | Kolkata | UGC (@viktoriia.chakraborty)(చదవండి: నలభై ఏళ్ల తల్లి వెయిట్లాస్ స్టోరీ..! 136 కిలోలు నుంచి 68 కిలోలకు..) -
వెజ్ అండ్ నాన్ వెజ్ కాంబో.. ఈ దసరా అదిరిపోవాలంతే!
పండగ అంటేనే ఇంటిల్లి΄ాదీ కలిసి నచ్చిన ఆహారాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా జరుపుకోవడం. ఆ ఆనందాన్ని ఈ దసరా సందర్భంగాప్రత్యేకమైన దమ్ బిర్యానీ, మటన్ కర్రీ, స్వీట్తో ఆస్వాదిద్దాం. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డే భాగంగా స్పెషల్ వంటకాల తయారీ గురించి చెఫ్ గోవర్ధన్ మనకు వంటిల్లులో వివరిస్తున్నారు. కద్దూ కా ఖీర్ (సొరకాయ పాయసం)ఈ పాయసం ఒక రిచ్, క్రీమీ డెజర్ట్. ప్రత్యేక పండుగ సందర్భాల్లో, విందుల్లో వడ్డించడానికి అద్భుతంగా ఉంటుంది. కావలసినవి: సొరకాయ తురుము (గింజలు లేకుండా) – 500 గ్రా.లు; నీళ్లు – 500 మి.లీ; పాలు – 500 మి.లీ; యాలకుల పొడి – బీ టీ స్పూన్; వెనిల్లా ఎసెన్స్ – 10 మి.లీ; పంచదార – 250 గ్రా.లు (లేదా రుచికి తగినంత); పిస్తా – 50 గ్రా.లు; బాదం – 50 గ్రాములు; మిల్క్మేడ్ – 400 మి.లీ; కోవా – 250 గ్రా.లు; ఆకుపచ్చ ఫుడ్ కలర్ – 5 గ్రా.లు; బాస్మతి బియ్యం (నానబెట్టి, మెత్తగా రుబ్బినది) – 200 గ్రా.లు; నెయ్యి – 100 గ్రా.లు; రోజ్వాటర్ – 15 మి.లీ + 30 మి.లీ నీళ్లు; జీడిపప్పు – 50 గ్రా.లు;తయారీ: ∙తురిమిన సొరకాయను 500 మి.లీ నీళ్లలో ఉడికించాలి. అవసరమైతే నీళ్లు వడకట్టాలి; ∙ఒక మదపాటి పాన్లో ఉడికిన సొరకాయ తరుగు, పాలు, మిల్క్మేడ్, కోవా వేసి సన్నని మంటపై ఉడికించాలి; ∙నానబెట్టి, రుబ్బిన బాస్మతి బియ్యప్పిండి వేసి, మిశ్రమం చిక్కబడే వరకు ఉడికించాలి; ∙యాలకుల పొడి, వెనిల్లా ఎసెన్స్ చక్కెర, పిస్తా, బాదం, జీడిపప్పు వేసి బాగా కలపాలి; ∙నెయ్యి, రోజ్వాటర్ (నీటితో కలిపినది) వేసి కలపాలి; ∙గ్రీన్ ఫుడ్ కలర్ని రెండు టేబుల్ స్పూన్ల నీటిలో కలిపి, మిశ్రమంలో వేసి కలపాలి ∙ఈ కద్దూ క ఖీర్ ను వేడిగా లేదా చల్లగా సర్వ్ చేయవచ్చు.చంపారణ్ మటన్ కర్రీ మాంసాహారులకు దసరా రోజున తప్పనిసరిగా మాంసాహార వంటకాలు తినడం ఆచారం. ఇది బీహార్లోని చంపారణ్ ప్రాంతానికి చెందిన సంప్రదాయ వంటకం. మసాలా రుచులు, సువాసనలు దీని ప్రత్యేకత. కావల్సినవి: మటన్ (బోన్తో) – 1 కేజీ; ఆవ నూనె – 30 మి.లీ; నెయ్యి – 50 గ్రా.లు; అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు; పెరుగు – 300 గ్రా.లు; ఉప్పు – తగినంత; కారం – 2 టేబుల్ స్పూన్లు; పసుపు – 2 టీ స్పూన్లు; ఉల్లి΄ాయ (సన్నగా తరిగినది) – 1; జీలకర్ర పొడి – 2 టీ స్పూన్లు; ధనియాల పొడి – 2 టీ స్పూన్లు; కాశ్మీరి మిర్చి పొడి – 2 టేబుల్ స్పూన్లు; నిమ్మరసం – అర నిమ్మకాయ; సోంపు పొడి – టీ స్పూన్; గరం మసాలా పొడి – 2 టీ స్పూన్లు; లవంగాలు – 12; మిరియాలు – 15; దాల్చిన చెక్క – 4 చిన్న ముక్కలు; బిరియానీ ఆకులు – 6; పుదీనా – కట్ట; కొత్తిమీర – కట్ట; పచ్చి మిర్చి (చీల్చినవి) – 4.తయారీ: ∙మ్యారినేట్ చేయడానికి ఒక గిన్నెలోకి మటన్ను తీసుకోవాలి ∙అందులో పెరుగు, టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, టేబుల్ స్పూన్ కారం, టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ జీలకర్ర ΄పొడి , టీ స్పూన్ ధనియాల ΄ పొడి వేసి బాగా కలిపి, అరగంట సేపు అలాగే ఉంచాలి ∙ఒక పాత్రలో ఆవనూనె వేసి వేడి చేయాలి ∙అందులో దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, బిరియానీ ఆకు వేసి వేయించాలి ∙మ్యారినేట్ చేసిన మటన్ వేసి ఉడికించాలి. అవసరమైతే నీళ్లు వేసుకోవచ్చు.(పారిస్ ఫ్యాషన్ వీక్ : ఐశ్వర్యా డాజ్లింగ్ లుక్ వెనుకున్న సీక్రెట్ ఇదే! )మసాలా కోసం... మరో పాత్రలో నెయ్యి వేడి చేసి, టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి ∙ఉడికిన మటన్ను ఈ మసాలా మిశ్రమంలో వేసి బాగా కలపాలి ∙తరువాత సోంపు పొడి, గరం మసాలా, కాశ్మీరీ మిర్చి పొడి, నిమ్మరసం వేసి కలపాలి ∙చివరగా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసి అలంకరించాలి ∙ఈ చంపారణ్ మటన్ కర్రీని వేడిగా అన్నం లేదా రోటీతో వడ్డించాలి. కాబూలీ బిర్యానీ ఈ కాబూలీ బిర్యానీ ప్రత్యేకత – శనగపప్పు, బాస్మతి బియ్యం, మసాలాల కలయికతో వచ్చే రుచిని ఆస్వాదించాల్సిందే!(ఈ టిప్స్ పాటిస్తే పండగ వేళ మెరిసిపోవడం ఖాయం!)కావల్సినవి: శనగపప్పు – 500 గ్రా.లు (నానబెట్టి ఉడికించాలి); బాస్మతి బియ్యం – 500 గ్రా.లుమ్యారినేట్కి... నూనె – 50 మి.లీ; అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు; వేయించిన ఉల్లిపాయ – 100 గ్రాములు; కారం – 2 టేబుల్ స్పూన్లు; పసుపు – టీ స్పూన్; ఉప్పు – తగినంత; జీలకర్ర పొడి – టీ స్పూన్; ధనియాల పొడి – టీ స్పూన్; గరం మసాలా పొడి – టీ స్పూన్; నెయ్యి – 50 గ్రా.లు; నిమ్మరసం – అర నిమ్మకాయ; పుదీనా (తరిగినది) – ఒక కట్ట; కొత్తిమీర (తరిగినది) – ఒక కట్ట; పచ్చిమిర్చి (చీల్చినవి) – 4; పెరుగు – 200 గ్రాములు;అన్నం వండటానికి... నీళ్లు – 3 లీటర్లు; బిరియానీ ఆకు – 3; షాజీరా – టీ స్పూన్; దాల్చిన చెక్క – 4 చిన్న ముక్కలు; యాలకులు – 6; లవంగాలు – 6; జాపత్రి – 2; పచ్చిమిర్చి (చీల్చినవి) – 4; పుదీనా (తరిగినది) – ఒక కట్ట; కొత్తిమీర (తరిగినది) – ఒక కట్ట; ఉప్పు – తగినంత;తయారీ: ∙ శనగపప్పు నానబెట్టి, ఉడికించాలి; ∙బియ్యాన్ని వేయించి పక్కన పెట్టాలి.మ్యారినేట్కి... ∙పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయించిన ఉల్లిపాయ, కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర΄ పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, నెయ్యి, నిమ్మరసం, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, చీల్చిన పచ్చిమిర్చి వేసి కలపాలి ∙ఈ మిశ్రమంలో ఉడికించిన శనగపప్పు వేసి కనీసం 30 నిమిషాల సేపు మ్యారినేట్ చేయాలి.బిర్యానీ తయారీ.. ∙3 లీటర్ల నీటిలో బిరియానీ ఆకులు, షాజీరా, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జాపత్రి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఉప్పు వేసి మరిగించాలి. అందులో వేయించిన బాస్మతి బియ్యం వేసి ముప్పావు వంతు వరకు ఉడికంచాలి అదనపు నీరు వడకట్టేయాలి.లేయరింగ్కి... ∙ఒక పాత్రలో అన్నం, మ్యారినేట్ చేసిన శనగపప్పు మిశ్రమాన్ని పొరలుగా వేసుకోవాలి ∙తక్కువ మంటపై (దమ్లో) 10–15 నిమిషాలు ఉంచాలి ∙కొత్తిమీర, పుదీనాతో అలంకరించి వేడి వేడిగా సర్వ్ చేయాలి. -
నలభై ఏళ్ల తల్లి వెయిట్లాస్ స్టోరీ..! 136 కిలోలు నుంచి 68 కిలోలకు..
అందరు బరువు తగ్గడంపై ఫోకస్ పెడుతున్నారు. రకరకాల మార్గాల్లో తగ్గడంపై దృష్టిపెట్టి మరి ఆరోగ్య స్ప్రుహ పెంచుకుంటున్నారు. అయితే హాయిగా ఉన్నప్పుడే మన బాడీ మీద ఫోకస్ పెట్టడం, ఆరోగ్యంపై ధ్యాస వంటివి చేయగలం. కానీ ఈ తల్లికి కూతురు అనారోగ్యమే బరువు తగ్గేందుకు దారితీసింది. డైట్పై ఉన్న దృక్పథాన్ని పూర్తిగా మర్చేసింది. అలాంటి కష్ట సమయాల్లో ఎవ్వరైనా..తమ ఉనికిని కోల్పోయేంతగా బాధలో ఉండిపోతారు..కానీ అదే ఆమెకు ఆరోగ్యంపై అటెన్షన్ పెట్టేలా చేసింది. పైగా కిలోల కొద్ది బరువు తగ్గి, స్ఫూర్తిగా నిలిచింది. మరి ఆమె వెయిట్లాస్ స్టోరీ గురించి తన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.ఆ అమ్మే 40 ఏళ్ల కింబర్లీ పావెల్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఆమె పీసీఓఎస్తో ఇబ్బంది పడుతుండేది. బిజీ జీవితం, వ్యక్తిగత సవాళ్లను సమతుల్యం చేసుకుంటూ సూమారు 68 కిలోలు మేర బరువు తగ్గింది. వాస్తవానికి కింబర్లీ దాదాపు 136 కిలోల అధిక బరువుతో బాధపడుతుండేది. తన సోషల్ మీడియా ఫాలోవర్లను ప్రేరేపించేలా బరువు తగ్గేందుకు శ్రీకారం చుట్టింది. అంతలో అనుహ్యంగా ఆరేళ్ల కూతురు కేన్సర్ బారిన పడటంతో డైట్పై ఉన్న దృక్పథం పూర్తిగా మారిపోయింది కింబర్లీకి. తాను ఆరోగ్య విషయంలో చేసిన తప్పిదాలను విశ్లేషించుకుని..సరైన మార్గంలో బరువు తగ్గాలని భావించింది. ఆ నేపథ్యంలో ఎక్కువగా చేసే సాధారణ తప్పిదాలపై ఫోకస్ పెట్టింది. అంతేగాదు ఆహారాన్ని ఆరోగ్యకరంగా తీసుకోకపోతే ఎలా విషంగా మారుతుందో అర్థం చేసుకుంది. తనకెదురైన సవాళ్లే పూర్తిగా ఆరోగ్యంపై ధ్యాస పెట్టేలా చేశాయని చెబుతోంది. అయితే తాను 68 కిలోల మేర బరువు తగ్గేందుకు కఠిన ఆహార నియమాలేమి పాటించలేదని, సింపుల్ చిట్కాలనే అనుసరించానని చెప్పుకొచ్చింది. బరువు తగ్గిన విధానం..నిలకడగా ఉండాలి...బరువు తగ్గాలనే ఫోకస్ని మధ్యలో వదిలేయకుండా స్ట్రాంగ్ ఉండే మనస్సుని డెవలప్ చేసుకోవడం. ఈ రోజు కంటే మరింతగా భిన్నంగా కనిపించాలనే లక్ష్యం ఏర్పరచుకోవడం వంటివి చేయాలి.పోషకాహారంపై ఫోకస్..ప్రోటీన్, ఫైబర్ ఉండేవి తీసుకుంటున్నామో లేదో కేర్ తీసుకోవాలి. రోజువారీగా 130 నుంచి 150 గ్రాముల ప్రోటీన్, ఫైబర్ ఉంటుందో లేదో చూసుకోవాలి. చురుకుగా ఉండటం..ప్రతి రోజు వర్కౌట్లపై దృష్టి పెట్టడం. కనీసం 40 నిమిషాలు వాకింగ్, వ్యాయమాలు చేసేలా చూసుకోవడం. అవి భారంగా కాకుండా ఎంజాయ్ చేస్తూ చేయడం అలవాటు చేసుకోవాలి.అతి ఆకలిని నివారించటంఎక్కువ ఆకలి వేసేంత వరకు కాకుండా..బ్యాలెన్స్గా తినేలా చూసుకోవాలి. బాగా ఆకలి వేసేంత వరకు ఉంటే అతిగా తినే ప్రమాదం ఉంది. ఆకలి అనిపించిన వెంటనే..సంతృప్తి కలిగేలా మంచి ఆహారం తీసుకోవాలి. చక్కెరకు దూరం..స్వీట్స్ తినాలనిపించినప్పుడూ తెలివిగా తినాలి. ఎలాగంటే ఈ రోజు స్వీట్స్ ఎక్కువ తింటే మిగతా సమయంలో తీసుకునే ఫుడ్ ఐటెమ్స్ తగ్గించి, వర్కౌట్ల సమయం పెంచాలి. ఫైబర్, కార్బోహైడ్రేట్లను మిస్ చేయొద్దు..ప్రోటీన్తోపాటు ఫైబర్, కార్బోహైడ్రేట్లను మిస్ చేయొద్దు. ఇన్సులిన్ నిరోధకతను నిర్వహించడానికి, ఎక్కువసే కడుపు నిండిన అనుభూతిని అందివ్వడాని ఇది ఎంతగానో హెల్ప్ అవుతుంది. సమతుల్యంగా తినేందుకు ప్రాముఖ్యత నివ్వడం.కాఫీ అలవాట్లను మానుకోవడం..కాఫీ తాగే అలవాటుని తగ్గించుకునేలా..ప్రత్యామ్నాయంగా ప్రోటీన్ షేక్లకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివి చేయాలి.మైండ్ఫుల్గా తినటం..మైండ్ఫుల్గా తినేలా చూసుకోవాలి. తగిన కేలరీలు, ప్రోటీన్లు శరీరానిక అందేలా చూసుకోవాలి. చివరగా మితిమీరిన వ్యాయామాలు, అతి కఠినమైన ఆహార నియమాలు మొదటికే ప్రమాదం తెచ్చిపెడతాయని, నిధానంగా ఆరోగ్యకరమైన విధానంలో బరువు తగ్గడమే అన్ని విధాల శ్రేయస్కరమని చెప్పుకొచ్చింది కింబర్లీ పావెల్. View this post on Instagram A post shared by Kimberly Powell (@loving_lessofme_more) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: ఆమె ఆస్తికి అత్తింటి వారే మొదటి హక్కుదారులు) -
15 రోజుల్లో ఆరుగురు చిన్నారులు మృతి, రెండు కాఫ్ సిరప్లు బ్యాన్!
మధ్యప్రదేశ్లో 15 రోజుల్లో 6 మంది పిల్లలు కిడ్నీ వైఫల్యంతో మరణించడం కలకలం రేపింది. మొదట అందరూ సీజనల్ ఫీవర్స్ వేవ్ అనుకున్నారు. కానీ ఆ తరువాత షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రెండు రకాల కాఫ్ సిరప్ను నిషేధించారు. ఏం జరిగిందంటే..మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాను కుదిపేసిన హృదయ విదారక విషాదంలో, గత 15 రోజుల్లో ఆరుగురు పిల్లలు మూత్రపిండాల వైఫల్యంతో మరణించారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన వారికి సీజనల్ జ్వరాలు అనుకొని చికిత్ర చేశారు. కానీ పరిశోధకులు మరో విషయాన్ని గమనించి దిగ్భ్రాంతికి లోనయ్యారు. విషపూరిత డైథిలిన్ గ్లైకాల్తో కలిపిన కలుషితమైన దగ్గు సిరప్ మరణాలకు కారణమని అనుమానిస్తున్నారు. దీంతో రెండు రకాల దగ్గు మందులను బ్యాన్ చేశారు.ఐదేళ్ల లోపు వయసున్న పిల్లలు మొదట జలుబు, తేలికపాటి జ్వరంతో వైద్యులను సంప్రదించారు. స్థానిక వైద్యులు దగ్గు సిరప్లతో సహా సాధారణ మందులను సూచించారు. ఆ తర్వాత పిల్లలు కోలుకున్నట్లు అనిపించింది. కానీ కొద్ది రోజులకే పరిస్థితి మారిపోయింది. జ్వరం తిరగ బెట్టింది. మూత్ర బంద్ అయిపోయింది. ఆ తరువాత పరిస్థిత మరింత తీవ్రమై మూత్రపిండాల ఇన్ఫెక్షన్గా మారింది. మహారాష్ట్రలోని నాగ్పూర్కు తరలించి మెరుగైన చికిత్స అందించినప్పటికీ, ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో బాధిత కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి."మా పిల్లలు ఇంతకుముందెప్పుడూ అనారోగ్యంతో బాధపడ లేదని, దగ్గు సిరప్ తీసుకున్న తరువాతే మూత్రం ఆగిపోయిందని’’ కన్నీరు మున్నీరుగా విలపించారు తల్లిదండ్రులు.(సెంటర్స్టోన్ డైమండ్రింగ్, లగ్జరీ గౌనులో ఇషా అంబానీ : ధర ఎంతో తెలుసా?)మృతుల కిడ్నీ బయాప్సీలలో విషపూరితమైన డైథిలిన్ గ్లైకాల్ కాలుష్యం ఉన్నట్లు వెల్లడైంది. చాలా మందికి బాధితులకు కోల్డ్రిఫ్ , నెక్స్ట్రో-డిఎస్ సిరప్లు ఇచ్చారు. చింద్వారా కలెక్టర్ షీలేంద్ర సింగ్ వెంటనే జిల్లా అంతటా రెండు సిరప్ల అమ్మకాలను నిషేధించారు. వైద్యులు, ఫార్మసీలు తల్లిదండ్రులకు అత్యవసరమైన కీలక సూచనలు జారీ చేశారు. మూత్రపిండాల వైఫల్యానికి కలుషితమైన ఔషధం కారణమని బయాప్సీ నివేదికలో తేలిందని ప్రభావిత గ్రామాల నుండి నీటి నమూనాలలో ఎటువంటి ఇన్ఫెక్షన్ కనిపించలేదని జిల్లా అధికారులు తెలిపారు. తీవ్రత దృష్ట్యా, జిల్లా యంత్రాంగం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నుండి ఒక బృందాన్ని పిలిపించి దర్యాప్తు చేస్తున్నామని సింగ్ అన్నారు. "సెప్టెంబర్ 20 నుండి, మూత్రం ఆగిపోవడం, మూత్రపిండాల సమస్యల కేసులు ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి. కానీ చాలా మంది పిల్లలలో అకస్మాత్తుగా మూత్రపిండాల వైఫల్యం చాలా ప్రమాదకరమైందని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరేష్ గోనారే వెల్లడించారు. ఆగస్టు 24న మొదటి అనుమానిత కేసు నమోదైందని, సెప్టెంబర్ 7న మొదటి మరణం సంభవించిందని తెలిపారు. -
ఆయన మార్గం నిత్యనూతనం
‘నువ్వు ఏం చేయాలి అని సందిగ్ధానికి లోనయినప్పుడు, జీవితంలో నీకు తారసపడ్డ అత్యంత నిరుపేద, నిస్సహాయుడి ముఖాన్ని గుర్తు తెచ్చుకొని, ఇప్పుడు నీవు తలపెట్టిన పని అతనికి ఏవిధంగా నైనా సాయపడుతుందా? తన బ్రతుకు తాను బ్రతకడానికీ, తన జీవితం సఫలం చేసుకోవడానికీ నువ్వు చేయబోయే పని అతని కేమైనా ఊతమిస్తుందా అని ఆత్మావలోకన చేసుకో, కర్తవ్యం నీకు బోధపడుతుంద’న్న గొప్ప జీవన సందేశాన్ని ఇచ్చినవారు మహాత్మా గాంధీజీ. గాంధీజీ ప్రత్యేకత ఏమిటంటే... తాను చెప్పిన విషయాన్ని తాను స్వయంగా ఆచరించిన తర్వాతనే చెప్పేవారు. ఇతరులు ఎలాంటి వారైనా, మన పట్ల ఎంతటి ద్వేషభావన కలిగి ఉన్నా... మన ప్రవర్తన ద్వారా ఎదుటివారిలో మానవతను కలిగించేలా నడుచుకోవాలని ఉద్బోధించారు. ఆ ప్రకారమే పాలకులలో పరి వర్తన తీసుకురావడానికి ‘సత్యాగ్రహం’, ‘అహింస’, ‘సత్యం’ అనే మూడు ప్రధాన ఆయుధాలను ఉపయోగించుకొని జాతీయో ద్యమాన్ని మరో మలుపు తిప్పారు.అహింసాయుతంగా, మౌనంగా పోలీసులు లాఠీలతో కొడుతున్నా భరిస్తూ తమ నిరసనను తెలియజేసే ‘సత్యాగ్రహం’ ఆయుధాన్ని గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ప్రయోగించి అనేక విజయాలు సాధించారు. గోపాలకృష్ణ గోఖలే కోరిక మేరకు దేశంలో అప్పటికే కొనసాగుతున్న జాతీయోద్యమంలో పాల్గొనడానికి భారత దేశానికి గాంధీజీ తిరుగు ప్రయాణం అయినప్పుడు దక్షిణాఫ్రికాకు చెందిన సైనికాధికారి జనరల్ ‘గిల్బల్ట్ ముర్రే’ బ్రిటీష్వారిని ఇలా హెచ్చరించాడు: ‘గాంధీకి సుఖాపేక్ష లేదు, ధనాపేక్ష లేదు; కామం, మోహం లేవు. తాను ధర్మం అని నమ్మిన దానిని ఆచరించడానికి ఎంత దూరమైనా వెళతాడు. అందువల్ల గాంధీ విషయంలో తగిన జాగ్రత్త వహించాలి. అటువంటి వ్యక్తి దేహంపై మీరు విజయం సాధించవచ్చునేమో గానీ, అతని వ్యక్తిత్వాన్ని జయించడం అసాధ్యం. గాంధీ మీకు ప్రమాదకరమైన చిక్కులు తెచ్చి పెట్టే శత్రువు అవుతాడు’. గిల్బర్ట్ చేసిన ఈ హెచ్చరిక ఎంత నిజమో ఆ తర్వాత కాలంలో భారతదేశంలోని బ్రిటిష్ పాలకులకు అనుభవంలోకి వచ్చింది.ఒక సందర్భంలో గాంధీ తన ‘యంగ్ ఇండియా’ పత్రికలో ఇలా రాశారు: ‘‘నా భావాలు మారుతూ ఉంటాయి. సత్యాన్వేషణలో నేను అనేక విశ్వాసాలను వదులుకొన్నాను. కొత్త విశేషాలు తెలుసు కొన్నాను. సత్యమే నా దేవుడు. అందువల్ల ‘వెనుక చెప్పిన వాటికి, ఇప్పుడు చెప్పేవాటికి పొంతన లేకుండా ఉన్నదే...’ అని నన్ను విమర్శించే బదులు, నేను ఇటీవల చెప్పిన మాటనే గ్రహించమని కోరుతున్నాను’ అంటూ వివరణ ఇచ్చారు. నిరాడంబరతకు చిహ్నంగా నిలిచారు గాంధీజీ. 1921 సెప్టెంబర్ 27న గాంధీజీ ఇతర దుస్తులన్నీ విసర్జించి భారతీయులుధరించే కొల్లాయిగుడ్డ, ఉత్తరీయానికి తన దుస్తుల్ని పరిమితం చేసుకొన్నారు. బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్తో చర్చలు జరప డానికి ఇంగ్లాండ్కు అదే వేషధారణతో వెళ్లిన గాంధీని బ్రిటీష్ పాలకులు ‘హాఫ్ నేక్డ్ ఫకీర్’ (అర్ధనగ్న సన్యాసి) అని అవహేళన చేసినప్పుడు గాంధీ చిరునవ్వు నవ్వి ‘మీరు చూడాల్సింది నా దుస్తులు కాదు... నేను మోసుకొచ్చిన కోట్లాది భారతీయుల ఆకాంక్ష’ అని చెప్పి, వారు సిగ్గుతో తలవంచుకొనేలా చేశారు. గాంధీజీ ప్రవచించి ఆచరించిన ఉన్నత మార్గాలలో ‘అహింసా మార్గం’ ఒక్కటే ‘ప్రపంచశాంతిని’ నెలకొల్పగలదని అన్ని సందర్భా లలో రుజువయ్యింది. గాంధీ బోధనలు, సత్యాన్వేషణకై ఆయన వేసిన మార్గాలు ఎప్పటికీ నిత్యనూతనం!– డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకేంద్ర మాజీ మంత్రి, ఏపీ శాసనమండలి సభ్యులు( అక్టోబరు 2- గాంధీ జయంతి) -
ఆకాశంలో... ఆదిదంపతులు
పూర్వం ఒకప్పుడు గ్రీష్మ ఋతువు ఆగమనాన్నిగమనించిన పార్వతి, శివుడిని ‘స్వామీ! గ్రీష్మ ఋతువు వచ్చేసింది. వేడి వాతావరణం అంతటా నిండిపోయింది. తలదాచుకుందుకు ఇల్లు లేకుండా వేసవిలో రోజులు ఎలా గడపగలం?’ అని అడిగింది. దాక్షాయణి మాటలను విన్న శివుడు ‘దేవీ! మొదటి నుండీ మనది వనవాసమే కదా! ఇప్పుడు కొత్తగా ఈ కంగారేమిటి?’ అన్నాడు. శంకరుడు అలా మాట్లాడేసరికి సతీదేవి మరేమీ ఎదురు చెప్పలేకపోయింది. గ్రీష్మ ఋతువు ఎలాగో గడిచిపోయింది. వర్ష ఋతువు వచ్చింది. అన్ని దిక్కులా నల్లని మేఘాలు ఆవరించి అంధకారం అలుముకుంది. పార్వతి పతిని సమీపించి ‘మేఘాలు గర్జిస్తున్నాయి. కనులు మిరుమిట్లు గొలుపుతూ మెరుపులు మెరుస్తున్నాయి. ఆకాశం నుండి కురుస్తున్న వర్షధారలు నేలను తాకి శబ్దం చేస్తున్నాయి. నీటితో నిండుతున్న జలాశయాలపై కొంగలు పంక్తులుగా ఎగురుతున్నాయి. రివ్వున వీస్తున్న గాలుల తాకిడికి కదంబ, కేతకి, అర్జున వృక్షాలు పుష్పాలను రాలుస్తున్నాయి. మేఘాల గర్జనకు భీతిల్లిన హంసలు జలాశయాలను వదిలి పోతున్నాయి. ఇటువంటి దుస్సహమైన వాతావరణంలో స్వామివారు కరుణించి ఈ మహత్తరమైన మందరగిరిపై ఒక ఇంటిని నిర్మిస్తే నా దిగులు తీరుతుంది!’ అంది. పార్వతి మాటలు విన్న ఫాలలోచనుడు ‘పార్వతీ! ఇల్లు నిర్మించుకుంటే బాగానే ఉంటుంది. కాని నా దగ్గర దానికి కావలసినంత ధనం లేదు. వ్యాఘ్రచర్మంతో శరీరాన్ని కప్పుకుని తిరిగేవాడిని నేను. సర్పములే నాకు భూషణములు కదా!’ అన్నాడు. ‘వేసవికాలంలో చెట్లనీడలలో కాలం గడిచి పోయింది. కానీ ఇప్పుడు, ఈ వర్షాకాలంలో అలా సాధ్యం కాదు కదా మహా దేవా!’ అని విన్నవించుకుంది పార్వతి. ‘మేఘమండలం పైకి చేరుకుంటే వర్షపు నీరు మీద పడి శరీరం తడిసే సమస్య ఉండదుగా దేవీ!’ అన్నాడు శంక రుడు పార్వతి విన్నపానికి సమాధానంగా! తతో హరస్తద్ఘనఖణ్డమున్నత మారూహ్య తస్థౌ సహ దక్షకన్యయాతతో భవన్నామ మహేశ్వరస్య జీమూతకేతుస్త్వితి విశ్రుతం దివి‘‘అలా చెప్పిన శంకరుడు పార్వతి తోడుగా ఆకాశంలో మేఘమండలాల స్థాయిని దాటి పైకి వెళ్ళి అక్కడ ఉండిపోయాడు. అప్పటి నుండి దేవలోకంలో శంకరుడు ‘జీమూతకేతు’ అనే పేరుతో విశ్రుతుడై నిలిచాడని ‘వామన పురాణం’లోని పై శ్లోకం చెప్పింది.– భట్టు వెంకటరావు -
కనకదుర్గమ్మ జనులను కాచుగాత!
విజయవాటిక యందు విజయదుర్గ నామమున నున్న జగదంబ కోమలాంగి సిరులు కురిపించు, భగవతిసింధుతనయ! కనకదుర్గమ్మ జనులను కాచుగాత!!హస్తముల పుష్పశరమును, అంకుశమ్ము, నెన్నుదుట కాంతి జిమ్మెడి నేత్రమొకటి, విశ్వజనని లలితగా వెలసినట్టి కనకదుర్గమ్మ జనులను కాచుగాత!!అష్టభుజములు ధరియించి దుష్టులైన రక్కసుల గర్వమణచిన రౌద్రమూర్తి! సర్వమంగళదాయిని జగము లేలు కనకదుర్గమ్మ జనులను కాచుగాత!!అక్షమాల అలరుచుండ హస్తమందు పుస్తకమును దాల్చి వేరొక హస్తమందు, కమలమందున కూర్చున్న కల్పవల్లి! కనకదుర్గమ్మ జనులను కాచుగాత !!పాయసాన్నంబు నిండిన పాత్రతోడ ‘అన్నపూర్ణ’వై కృపగాంచు కన్నతల్లి! భక్తులకు వరము లొసంగు భాగ్యరాశి కనకదుర్గమ్మ జనులను కాచుగాత !!– డా. జంధ్యాల పరదేశి బాబు, విశ్రాంత తెలుగు ఆచార్యులు ‘91219 85294 -
విజయాలను ఒసగే విజయదశమి అంతరార్థం ఇదే..!
ఈ విజయదశమికి ఆత్మజ్ఞానాన్ని మన జీవితాలలో ఉదయించన్నవ్విండి అని పిలుపునిచ్చారు గురుదేవ్ శ్రీశ్రీ రవిశింకర్. విజయదశమిని మనం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకింటున్నాం, నిజానికి ఈ యుద్ధం మంచికి, చెడుకి మధ్య కాదు. వేదాంత పరంగా చూసినప్పుడు, బయట ప్రపంచంలో కనిపించే ద్వైతభావనపై అనంత వ్యాప్తమై ఒకటిగా మాత్రమే ఉన్న సత్యం సాధించే విజయిం అది. శుద్ధచైతన్య స్వరూపమైన జగన్మాతే అన్ని రూపాలు, నామాలలో న్నిండి ఉంది. ఈ విధంగా అంతట నిండి ఉన్న ఒకే ఒక్క దైవత్వాన్ని అన్ని రూపాలలోనూ దర్శించగలగటమే ఈ పండుగ పరమార్థం. దైవీభావనకు, ఆసురీభావనకు జరిగే ఈ యుద్ధం బయట ప్రపంచంలో మాత్రమే కాదు, అది మన మనసులో ఎపుుడూ జరుగుతూనే ఉంది. విజయదశమినాడు రావణుడి బొమ్మను దహనం చేయటం మనం చాలాచోట్ల చూస్తున్నాం. రావణుడు అహంకారానికి చిహ్నం. అహం అంటే 'నేను వేరు' అనే తప్పుడు భావన. దాంతో వాళ్ల చుట్టూ వాళ్లే గోడలు కట్టుకుంటాం. ఆ అహంకారన్ని అణిచేందుకు వాళ్లకంటే వేరుగా మరొకరు (నేను వేరు, అతడు/ఆమె వేరు అనే భావన) కావాలి. ఆత్మవిశ్వాసానికి ఆ అవసరం లేదు. తాము ఇతరుల కంటే గొప్పవాళ్లమని అహంకారులు అనుకుంటారు. ఇక రాముడు ఆత్మజ్ఞానాన్నకి ప్రతీక. శ్రీరాముడు ఆత్మను, ఆత్మజ్ఞానాన్ని కూడా సూచిస్తాడు. వ్యక్తిలో ఆత్మజ్ఞానం (రాముడు) ఉదయించినపుడు, లోపల ఉన్న అహంకారం, చెడు భావన రూపంలో ఉన్న రావణుడు సంపూర్ణంగా నశించిపోతాడు. దీనికి సూచనగా ఈరోజు మనం మనలో ఉన్న చెడు భావనలను జ్ఞానం అనే అగ్నికి ఆహుతి ఇస్తాం (సమర్పిస్తాము). ఆ విధంగా సమర్పించటం వల్ల మన అంతరంగ వికాసం ఆరంభం అవుతుంది. మనలో అద్భుతమైన ఆనందం పెలులబుకతుంది, అది మనకే కాక సమాజమంతటికి మంచి చేస్తుంది. ఈ సంత్సర కాలమంతా సేకరించుకుపి మన మనసులో పేరుకున్న ఇష్టాఇష్టాలు, రాగద్వేషాలపై మనం విజయిం సాధించటాన్ని ఈ విజయదశమి రోజు సూచిస్తుంది. దైవీభావనల ఎఱుక మనలో కలిగినపుడు అది నిజమైన విజయం. అపుడు మన జీవితంలో శాంతి, ఆనందం, సౌభాగ్యం కలుగుతాయ. చెడు భావనలు మనలను ఆక్రమించుకున్నప్పుడు మనం దుుఃఖాన్ని, కష్టాలనును అనుభవిస్తాము. అందుకే వేదకాలంలో ప్రజలు ఒకర్నొకరు పలకరించుకనేటపుుడు “ఆరోగ్యమస్తు, తుష్టిరస్తు, పుష్టిరస్తు” (మీరు ఆరోగ్యంగా, తృప్తిగా ఉండాలి, మీ కార్యాలు శుభకరంగా జరగాలి) అన్న చెప్పేవారు. రావణ వినాశనం అనేది తిరుగులేని రామబాణంతో మాత్రమే జరుగగలదు. అదే విధంగా అన్నిరకాలైన చెడుభావనలు, మానసిక చాంచల్యాలపై ఆత్మజ్ఞానంతోనే విజయిం సాధించగలం. సరే, మరి ఈ ఆత్మజ్ఞానాన్ని పిందటిం ఎలా? (హిందీలో) విశ్రామ్ మే రామ్ హై (విశ్రాంతి లో రాముడు ఉన్నాడు) అన్న చెపునటులగా, ప్రగాఢమైన విశ్రాంతి ద్వారా మనం ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాము. ఈనాటి సమాజంలో మనం చూస్తున్న అలజడులన్నిటికీ ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మికత లేకపోవటమే కారణం. “నే నెవరు?” అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అంతే కాదు, మీరు ఎవరు కాదు అని కూడా అడగిండి. “నేను ఈ శరీరాన్ని కాదు, మనసును కాదు, బుద్ధిని కాదు...” ఇలా విచారించి చూసినపుడు చివరికి ఏం మిగులుతిందో గమన్నించిండి! ఈ విధంగా మన స్వస్వభావాన్ని గమనించుకోవటం అనేది మన ఆత్మను ఉత్తేజపరచి మనలో సింతృప్తిని పెంపొందిస్తుంది. ఒక మనిషి మనసులో ఈ ప్రశ్నలు రేకెత్తిన మరుక్షణమే అతని జీవితంలో కష్టాలు, చెడు భావనలు అంతరించిపోవట ఆరంభమవుతుంది. అయితే, ఎంత విచారించినా సరే మళ్ళీమళ్ళీ మన మనసు వేసే చిక్కుముళ్లలో మనం పడుతూనే ఉంటాం. ఇవి మనకు మనమే వేసుకుంటున్న బంధాలు. ఈవిధమైన గందరగోళ స్థితినే యోగులు మాయ అపి పిలిచారు. ఈ మాయ నుంచి బయటపడేందుకే మనక ధ్యానం అవసరం. అందుకే, ఈ ముసుగును తొలగించుకునేందుక అనేక మార్గాలు సూచించారు: మనం పండుగలు, ఉత్సావాల జరుపుకుంటాము, జగన్మాతను ఆరాదిస్తాం, దైవం మనలోపలే ఉన్నదని, అంతే కాక విశ్వమంతా స్వచ్ఛమైన చైతన్యంగా నిండి ఉన్నదని మనకు మనమే గుర్తుచేసుకుంటాం. ఈ సమస్త విశ్వం ఆ ఏకైక చైతన్యపు లీల. దీన్నే మనం పదేపదే తప్పక గుర్తు చేసుకోవాలి అని అన్నారు గురుదేవ్ రవిశంకర్.(చదవండి: నవరాత్రుల సమయంలో అరుదైన దృశ్యం..! దుర్గమ్మ ఆలయానికి కాపాలాగా..) -
మిరాకిల్ మునగ: కరువును తట్టుకుంటుంది..లాభాల సిరి!
కరువు వంటి ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోవటానికి మునగ సాగు దోహద పడుతుంది. మెట్ట ప్రాంతాల్లో పండించుకోవచ్చు. మునగ కాయలతో పాటు ఆకుల పొడి, గింజల ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవచ్చు. గొప్ప రోగ నిరోధక, ఔషధ లక్షణాల కారణంగా మునగ ఉత్పత్తులకు ఔషధ పరిశ్రమలో అధిక డిమాండ్ ఉంది. మునగ ఆకును పొడి రూపంలో లేదా గుళికలు లేదా మాత్రలుగా విక్రయిస్తారు. దీని గింజల నుండి తీసిన నూనెలను ఆహార పదార్థాలు, సౌందర్య సాధనాల తయారీకి, వివిధ యంత్ర నూనెల తయారీకి ఉపయోగిస్తారు. 3 సంవత్సరాలలోపు ఆయిల్΄ామ్ తోటల్లో అంతర పంటగా కూడా మునగను సాగు చేసుకోవచ్చు. తిరుపతి జిల్లాలోని రాస్ కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి, సీనియర్ శాస్త్రవేత్త డా. ఎస్. శ్రీనివాసులు మునగ సాగుపై అందించిన వివరాలు...మునగ (మోరింగ ఒలిఫెరా-Moringa oleifera) కరువును తట్టుకునే చెట్టు. మునగ కాయలు, ఆకులు, పువ్వులకు అధిక పోషక విలువలకు నిలయం . మునగ ఆకులు, గింజలు లేదా పండ్లు, పువ్వులు, వేర్లలో విటమిన్లు ఎ, సి, కాల్షియంతో పాటు మానవ ఆరోగ్యానికి ముఖ్యమైన అన్ని ఇతర ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. మునగ ఆకుల్లో నారింజలో లభించే విటమిన్ సి కంటే 7 రెట్లు ఎక్కువ,పాలలో లభించే కాల్షియం కంటే 4 రెట్లు, అరటి పండ్లలో లభించే ΄÷టాషియం కంటే 3 రెట్లుపాలలో లభించే ప్రోటీన్ కంటే 2 రెట్లు ఎక్కువ. నీరు నిలవని నేలలు అనుకూలం మునగ వేడి, ఉష్ణ మండల, సమశీతోష్ణ మండల ్ర΄ాంతాల్లో బాగా పెరుగుతుంది. 25–30 డిగ్రీల ఉష్ణోగ్రత మునగ పూత రావడానికి అనుకూలం. వేడి, ΄÷డి వాతావరణం దీనికి బాగా సరి΄ోతుంది. ఈ పంట వివిధ రకాల నేలలకు అనుగుణంగా ఉంటుంది. కానీ 6.5–8.0 పీహెచ్ కలిగిన, బాగా ఇసుక గల ఒండ్రు నేలల్లో మంచి పంటనిస్తుంది. నీరు నిలవని తేలికపాటి ఇసుక లేదా లోతైన ఒండ్రు నేలలు అనుకూలం. నీరు బాగా ఇంకే నేలలు అనుకూలం. నేలను చాలాసార్లు బాగా దున్నాలి. వార్షిక రకాలకు 45“45“45 సెం.మీ. కొలతలు గల గుంతలు తవ్వాలి. ప్రతి గుంతకు 10 కిలోల కంపోస్ట్ లేదా పశువుల ఎరువు వేసి, నాటడానికి ముందు పై మట్టితో కలిపి నింపుకోవాలి. హెక్టారు భూమికి దాదాపు 1200–1500 మొక్కలను పెంచవచ్చు. వర్షాకాలంలో మొక్కలు నాటాలి. విత్తడానికి ఇది సరైన సమయం.మన దేశంలో అనేక మునగ రకాలు ఉన్నాయి. చాలా రకాలు కాయల ఉత్పత్తికి అనుకూలంగా ఉంటాయి, కొన్ని కొన్ని మాత్రమే మంచి ఆకు ఉత్పత్తిని ఇస్తాయి. అధిక దిగుబడినిచ్చే వార్షిక రకాలు వాణిజ్య సాగు ఎంపిక అనుకూలం. మునగ మొక్కలను విత్తనాలు లేదా కాండపు కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేయవచ్చు. ఏక వార్షిక రకాలను విత్తన ప్రవర్ధనం చేయటం వలన బలమైన వేర్ల వ్యవస్థ అభివృద్ధి చెంది, మొక్కలు కరువును బాగా తట్టుకుంటాయి. అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంపిక చేసుకోవాలి. నాణ్యమైన విత్తనం కోసం విశ్వసనీయ నర్సరీలను (లేదా) వ్యవసాయ పరిశోధనా కేంద్రాలను సంప్రదించాలి. రాస్ – కేవీకే 2013–14 నుంచి అరెకరంలో అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేస్తున్న మునగ తోటలో విత్తనోత్పత్తి చేస్తోంది. రైతులకు మునగ విత్తనాలు, నారును అందిస్తోంది.రకాన్ని బట్టి నాటే దూరంజూలై–అక్టోబర్ మధ్య నాటవచ్చు. పూత సమయంలో వర్షాలు లేకుండా విత్తే సమయం నిర్ణయించుకోవాలి. హెక్టారుకు సుమారు 500–625 గ్రా. విత్తనాలు అవసరం. విత్తనాలను 2.5–3 సెం.మీ. లోతులో విత్తవచ్చు. మొక్కలు బాగా నిలదొక్కుకోవడం కోసం, నాటడానికి ముందు 35–40 రోజులు పాలీబ్యాగ్లలో 70–90 సెం.మీ. ఎత్తుకు పెంచి తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి. సాగుదారులు ఎకరానికి 1000–1250 విత్తనాలను ఒక గుంతలో 2 విత్తనాల చొప్పున ఉపయోగించవచ్చు. రకం, సాగు పద్ధతిని బట్టి నాటే దూరం మారుతూ ఉంటుంది. ఏక వార్షిక రకాల మొక్కలను 2.5“2.5 మీ. దూరంలో నాటవచ్చు. పి.కె.ఎం–1 వంటి రకం 1.5“1.0 మీ. దూరంతో అధిక సాంద్రత పద్ధతిలో నాటవచ్చు. బహువార్షిక రకాల మొక్కలను 6“6 మీటర్ల దూరంలో నాటుకోవాలి.రెండు నెలలు విధిగా నీరుముఖ్యంగా పొడి పరిస్థితులలో మొదటి రెండు నెలలు క్రమం తప్పకుండా నీరు పెట్టాలి. మునగ చెట్లు కరువును తట్టుకుంటాయి, కానీ, పొడి కాలంలో ప్రతి 10–15 రోజులకు నీరు పెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది. బిందు సేద్యం దిగుబడిని గణనీయంగా పెంచుతుంది. పూత రాలిపోకుండా ఉండాలంటే ఫిబ్రవరి–మార్చి నెలల్లో నీటిని తగ్గించాలి. కానీ, నీటి ఎద్దడిని నివారించడానికి తగినంత తేమను వుండేలా చూడాలి.ఇదీ చదవండి: Black Thrips నల్ల తామర డిజిటల్ అరెస్ట్!కొమ్మ చివర్లను తుంచాలిమునగ మొక్కలు 75 సెం.మీ. ఎత్తు ఉన్నప్పుడు పెరుగుతున్న చివర్లను తుంచి వేయాలి. తద్వారా పక్క కొమ్మలు పెరుగుతాయి. ఆ పక్క కొమ్మలు 40–60 సెం.మీ పొడవుకు చేరుకున్నప్పుడు, వాటి పైభాగాన్ని తుంచి వేయాలి. ఇలా చేయడం వల్ల మొక్కలు ఎక్కువ కొమ్మలతో గుబురుగా పెరుగుతాయి. ఎక్కువ కాయలతో దిగుబడి పెరుగుతుంది. బహువార్షిక రకాల్లో ప్రతి పంట తర్వాత కొమ్మలను కత్తిరించడం వలన కొత్త కొమ్మలు వచ్చి దిగుబడి పెరుగుతుంది. ఏక వార్షిక రకాల మొదటి పంట తర్వాత, కొత్త పంటను ప్రోత్సహించడానికి చెట్లను నేల నుండి ఒక మీటరు వరకు కత్తిరించాలి. ముఖ్యంగా మొక్కలు పెరిగే ్ర΄ారంభ దశల్లో క్రమం తప్పకుండా కలుపు తీయటం చాలా అవసరం. మొక్కలు పూర్తి స్థాయిలో పెరిగి దిగుబడినిచ్చే వరకు, తక్కువ కాలవ్యవధి గల కూరగాయలతో అంతర పంటలు వేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పద్ధతి కలుపు మొక్కల నియంత్రణలో కూడా సహాయపడుతుంది. (మిల్లెట్స్ స్నాక్స్ ..మఖానా.. మజాకా!)సస్యరక్షణ కాయ తొలిచే పురుగు లేత కాయలపై గుడ్లు పెట్టి కుళ్ళిపోయేలా చేస్తుంది. కాయలను తొలచి లోపలి గుజ్జును తినేస్తుంది. గొంగళి పురుగుల వల్ల పూత, మొగ్గలు ముందుగానే రాలిపోతాయి. సోకిన మొగ్గలను సేకరించి నాశనం చేయాలి. గొంగళి పురుగు లార్వా ఆకులను గుంపుగా తిని ఆకులు రాల్చుతాయి. బెరడు తొలచే పురుగు కాండం బెరడును తొలచి మొక్కను బలహీనపరుస్తుంది. ఆకు తినే పురుగు లార్వా మొక్కల ఆకులను తిని వాటి పెరుగుదలకు హాని కలిగిస్తుంది. తామర పురుగుల వల్ల కాయల మీద మచ్చలు ఏర్పడి నాణ్యత తగ్గుతుంది. వేరు, కాండం కుళ్లు వర్షాకాలంలో మురుగు నీరు ΄ోయే సౌకర్యం లేని నేలలో ఎక్కువగా ఆశిస్తుంది. వీటి నిర్వహణకు శాస్త్రవేత్తల సూచనల ప్రకారం పురుగుమందులను వాడాలి. రకం, నిర్వహణను బట్టి దిగుబడి సాధారణంగా మొక్కలు నాటిన 6–8 నెలల్లో మొదటి పంటను పొందవచ్చు. మొక్కలకు బదులు నేరుగా విత్తనాలు వేసుకుంటే తొలి పంటకు ఒక సంవత్సరం పడుతుంది. సంవత్సరానికి రెండుసార్లు రెండు పంటలు (జూలై–సెప్టెంబర్) మరియు (మార్చి–ఏప్రిల్) వస్తాయి ప్రారంభంలో మొదటి రెండు సంవత్సరాలలో, మొక్కలు 250–300 కాయలను దిగుబడినివ్వ గలవు. తర్వాత సంవత్సరాలలో 500 వరకు పెరుగుతుంది. సంవత్సరానికి హెక్టారుకు 31 టన్నుల కాయలను ఉత్పత్తి చేయవచ్చు. అనేక హైబ్రిడ్ జాతులు సంవత్సరానికి ఒక మొక్కకు 800–1000 కాయల దిగుబడిని అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. రకం, నిర్వహణ ఆధారంగా దిగుబడి గణనీయంగా మారుతుంది. వార్షిక రకాలు హెక్టారుకు 50–55 టన్నులను ఉత్పత్తి చేయగలవు. – డా. ఎస్. శ్రీనివాసులు (79810 70420),సీనియర్ సైంటిస్ట్–హెడ్, రాస్ కృషి విజ్ఞాన కేంద్రంతిరుపతి. rasskvk@gmail.comనిర్వహణ: పంతంగి రాంబాబుసాక్షి సాగుబడి డెస్క్ -
నల్ల తామర డిజిటల్ అరెస్ట్!
మిరప పంటకు నల్ల తామర పురుగుల బెడద చాలా ఎక్కువ. మిరపతోపాటు, పత్తి, మిర్చి, కంది,మినుములు, మామిడి, పుచ్చకాయ, తదితర పంటలను దెబ్బతీస్తుంది. అతి చిన్నగా ఉండే నల్ల తామర రైతులను విపరీతంగా నష్టాల ఇవీ డిజిటల్ సాధనాలు పాలు చేస్తోంది. అయితే,ఆధునిక డిజిటల్ ఉపకరణాల సహాయంతో రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ మిరప పంటను ఆశించే తామర పురుగును జీవన పురుగు మందులతో కట్టడి చేసే పద్ధతులపై యూనివర్సిటీలు, స్వచ్ఛంద సంస్థల నిపుణులు ప్రచారోద్యమం చేపట్టారు. విశేషం ఏమిటంటే... డిజిటల్ సమాచారం అంతా తెలుగులోనే అందించటం. సుస్థిర వ్యవసాయ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డా. జి. చంద్రశేఖర్ అందించిన సమగ్ర సమాచారం ఇక్కడ పొందుపరుస్తున్నాం...మరప ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో.. తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గుంటూరు మిర్చి యార్డ్ ఆసియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్. ఇది దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మిర్చి ధరలను ప్రభావితం చేస్తుంది. 2021లో ఆంధ్రప్రదేశ్లో మిరప పంటను తీవ్రంగా నష్టపరిచే కొత్త నల్ల తామర (బ్లాక్ త్రిప్స్-Black Thrips) జాతి పురుగులు వెలుగులోకి వచ్చాయి. దీని శాస్త్రీయనామం ‘త్రిప్స్ పార్విస్పినస్. దీన్ని సాధారణంగా ‘చిల్లీ బ్లాక్ త్రిప్స్’ అని పిలుస్తారు. అతి తక్కువ సంవత్సరాల్లోనే దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు ఇది విస్తరించింది. ఆగ్నేయాసియా నుంచి ఉద్భవించిన చీల్చి రసం పీల్చే పురుగు ఇది. 2015 నాటికి అనేక రాష్ట్రాలకు పాకింది. ఈ పురుగులు కణజాలాలను తినే ముందు లేత ఆకులు, పువ్వులను చీల్చివేస్తాయి. ముఖ్యంగా పువ్వు చీలికలు, పండ్ల నిర్మాణాన్ని దెబ్బతీస్తాయి. విషయానికి వస్తే, ఇది పాలిఫాగస్ పురుగు. అంటే, ఇది వివిధ రకాల వృక్ష జాతులను ఆహారంగా తీసుకోగలదు. మిరపతో పాటు, పత్తి, మిర్చి, కంది, మినుములు, మామిడి, పుచ్చకాయ, తదితర పంటలను దెబ్బతీస్తుంది.పంట నష్టం 85 నుంచి 100 వరకు!2022లో ఆరు దక్షిణాది రాష్ట్రాల్లో మిరప పంటను గణనీయంగా దెబ్బతీసింది. తీవ్రంగా ప్రభావితమైన ్ర΄ాంతాల్లో అంచనా నష్టాలు 85 నుండి 100% వరకు ఉన్నాయి. ఊహించని విధంగా నష్టాన్ని కలిగిస్తున్న కారణంగా రైతులు తమ పంటలను రక్షించుకోవడానికి రసాయన పురుగుమందులను ప్రయోగించడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ఇది ఖర్చుతో కూడుకున్నదే కాకుండా, తదనంతరం నిరుపయోగంగా మారింది. అదనంగా, నల్లతామర ఆశించిన మిరప కాయలకు మార్కెట్లో తక్కువ ధరలు రావటంతో చాలా మంది రైతులు నష్టాల పాలవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయంగా ప్రసిద్ధి గాంచిన సెంటర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ బయోసైన్సెస్ ఇంటర్నేషనల్ (సీఏబీఐ) అనే సంస్థ హైదరాబాద్లోని సుస్థిర వ్యవసాయ కేంద్రంతో కలిసి తెలంగాణలో మిరపని ఆశించే నల్ల తామర పురుగులపై సీఏబీఐ డిజిటల్ టూల్స్ ఉపయోగించడం ద్వారా మిరపలో నల్ల తామర పురుగును నివారించడానికి ఒక ప్రచారోద్యమం మొదలు పెట్టింది. జయశంకర్ భూమిరప పంటకు నల్ల తామర పురుగుల బెడదచాలా ఎక్కువ. మిరపతోపాటు, పత్తి, మిర్చి, కంది,మినుములు, మామిడి, పుచ్చకాయ, తదితర పంటలను దెబ్బతీస్తుంది. అతి చిన్నగా ఉండే నల్ల తామర రైతులను విపరీతంగా నష్టాల ఇవీ డిజిటల్ సాధనాలు పాలు చేస్తోంది. అయితే,ఆధునిక డిజిటల్ ఉపకరణాల సహాయంతో రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ మిరప పంటను ఆశించే తామర పురుగును జీవన పురుగు మందులతో కట్టడి చేసే పద్ధతులపై యూనివర్సిటీలు, స్వచ్ఛంద సంస్థల నిపుణులు ప్రచారోద్యమం చేపట్టారు. విశేషం ఏమిటంటే... డిజిటల్ సమాచారం అంతా తెలుగులోనే అందించటం. సుస్థిర వ్యవసాయ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డా. జి. చంద్రశేఖర్ అందించిన సమగ్ర సమాచారం ఇక్కడ పొందుపరుస్తున్నాం...లపల్లి, జోగుళాంబ గద్వాల్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మిరప పండించే కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకొని వేలాది మంది రైతులకు సేవలందించే లక్ష్యంతో ఈ ఖరీఫ్ కాలంలో ప్రచారోద్యమం జరుగుతోంది. దీనిలో భాగంగా జులై 9న హైదరాబాద్ హబ్సిగుడాలో మిరప పంట పండిస్తున్న రైతులు, శాస్త్రవేత్తలు, రైతు ఉత్పత్తి దారుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, స్పైసెస్ బోర్డు ప్రతినిధి, అపెడా ప్రతినిధి, నాబార్డ్ ప్రతినిధి, శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయం ప్రతినిధి, యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్– రాయచూరు ప్రతినిధి, డి డి ఎస్ కృషి విజ్ఞాన కేంద్రం– జహీరాబాద్ ప్రతినిధి, బయో పెస్టిసైడ్స్ తాయారీదారులు, ్ర΄÷ఫెసర్ జయశంకర్ తెలంగాణా విశ్వవిద్యాలయ బయో కంట్రోల్ యూనిట్ ప్రతినిధి, సీఏబీఐ ప్రతినిధులతో వర్క్షాప్ జరిగింది. గత సంవత్సరం రాయచూరులోని యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ శాస్త్రవేత్తలు గత సంవత్సరం మిరపలో నల్లతామరపై తాము నిర్వహించిన ప్రచారోద్యమంతో రైతులకు కలిగిన ప్రయోజనాలను వివరించారు. ఉద్యానవనశాఖ నిర్దేశకులు బాబు మాట్లాడుతూ నల్లతామరను నివారించే మార్గాలు వివరించారు. ఈ క్యాంపెయిన్కు ఉద్యాన శాఖ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.ప్రచారోద్యమం ఈ క్యాంపెయిన్ ద్వారా 1000 ఎకరాలలో మిర్చి పండించే 2000 మంది రైతులు ఈ పద్ధతులకు సలహాలు అందిస్తున్నారు. రైతుల ప్రదర్శన క్షేత్రాలను చూసే మిగతా రైతులు కూడా ఈ పద్ధతులు ΄ాటించే అవకాశం ఉంటుంది. అలాగే ΄ోస్టర్స్, మీడియా ద్వారా ఎక్కువ మందికి ఈ క్యాంపెయిన్ ద్వారా చైతన్యం కలిగిస్తున్నారు. చదవండి: సెంటర్స్టోన్ డైమండ్రింగ్, లగ్జరీ గౌనులో ఇషా అంబానీ : ధర ఎంతో తెలుసా?పంటలకు మేలు చేసేవి కూడా..!తామర పురుగులు (త్రిప్స్) రెక్కలు కలిగిన చిన్న కీటకాలు. తామర పురుగులలో అనేక జాతులు ఉన్నాయి. నల్ల తామర పురుగులు ఉల్లి, టమోటో, స్ట్రాబెర్రీ, ద్రాక్ష సహా వివిధ పంటలకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తాయి. మరికొన్ని త్రిప్స్ జాతులు ఇతర పురుగులను తినటం ద్వారా వ్యవసాయానికి ప్రయోజనం చేకూరుస్తాయి కూడా! తామర పురుగులు మొక్కల బయటి పొరను చీల్చుకుని అందులోని పదార్థాలను తినడం ద్వారా మొక్కలను దెబ్బతీస్తాయి. త్రిప్స్ జాతులు చూడటానికి భిన్నంగా ఉంటాయి. జాతిని బట్టి, జీవిత దశను బట్టి ఇవి వివిధ రంగుల్లో లభిస్తాయి. పిల్ల పురుగు(లార్వా)లు సాధారణంగా పారదర్శకంగా, పెద్దవాటి కంటే చిన్నవిగా ఉంటాయి. చాలావరకు పెద్ద తామర పురుగులు పొడవాటి, సన్నని రెక్కలతో, అంచులలో చిన్న వెంట్రుకలను కలిగి ఉంటాయి. గుడ్లు సాధారణంగా పొడుగ్గా ఉంటాయి. మూత్రపిండాల ఆకారంలో కనిపిస్తాయి. ఉష్ణమండలంలో నివసించే త్రిప్ జాతులు సాధారణంగా సమశీతోష్ణ వాతావరణంలో కంటే పెద్దవిగా పెరుగుతాయి. జాతిని, వాతావరణ అనుకూలతను బట్టి తామర పురుగులు వేగంగా సంతానోత్పత్తి చెయ్యగలవు. సంవత్సరానికి ఎనిమిది తరాల వరకు వీటి సంతతి పెరుగుతుంది. ఆడ త్రిప్స్ అతిథేయ (హోస్ట్) మొక్కల ఆకులపై గుడ్లు పెడతాయి. లార్వా పొదిగిన తర్వాత ఆహారం తీసుకోవడం ప్రారంభిస్తుంది. లార్వా పెద్దది పురుగు కావడానికి నాలుగు దశల్లో పురోగమిస్తుంది. వెచ్చని వాతావరణంలో యుక్త వయస్సు వరకు పురోగతి వేగంగా ఉంటుంది. శీతాకాలంలో వీటి సంఖ్య సాధారణంగా తగ్గుతుంది. మొక్కల లోపల ద్రవాలను పీల్చుకోడానికి లోపలికి చొచ్చుకుపోతాయి. పండ్లు, ఆకులు, రెమ్మలను ఆశిస్తాయి. త్రిప్స్ పెద్ద మొత్తంలో పంటని ఆశించినప్పుడు, పంట పెరుగుదల, దిగుబడి తగ్గి΄ోతుంది. ఇవి చాలా పెద్ద చెట్ల జాతులపై కూడా దాడి చేయగలవు. ఐతే సాధారణంగా పండ్లు, కూరగాయల చెట్లు వీటి తాకిడికి తట్టుకోలేవు. పెద్ద చెట్లు కొంత వరకు తట్టుకుంటాయి. తామరపురుగులు వేరుశనగలో మొవ్వు కుళ్ళు (బడ్ నెక్రోసిస్), టొమాటో–స్పాటెడ్ విల్ట్ కలిగించే వైరస్లను వ్యాపింపజేస్తాయి.ఇదీ చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్ : ఐశ్వర్యా డాజ్లింగ్ లుక్ వెనుకున్న సీక్రెట్ ఇదే!నల్లతామర యాజమాన్య పద్ధతులు:తామర పురుగులు నేలపై పడ్డ వ్యర్ధపదార్ధాల్లో జీవిస్తూ పంటలను ఆశిస్తుంటాయి. కాబట్టి పంట వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తీసేయడం మంచిది. సూర్యకాంతి పరావర్తనం చెందే మల్చింగ్ షీట్లను బెడ్స్ మీద వాడటం ఉపయోగకరం.నీలం రంగు జిగురు అట్టలను ఏకరానికి 20 వరకు ఏర్పాటు చేసుకోవాలి. ఇవి పురుగులతో నిండగానే ఎప్పటికప్పుడు మార్చుకోవాలి. సహజ శత్రువులైన అల్లిక రెక్కల పురుగు(లేస్ వింగ్ బగ్స్)లు, అతిచిన్న పైరేట్ బగ్స్, పరాన్న భుక్కు నల్లులు (ప్రిడేటరీ మైట్స్)ను రక్షించుకోవడం అవసరం.వేప నూనె 3% తామర పురుగులకు వికర్షణను కలిగిస్తుంది. పునరుత్పత్తి చక్రాలకు అంతరాయం కలిగిస్తుంది. బ్యువేరియా బ్యాసియానా, మెటార్హిజియం అనిసోప్లియె అనే శిలీంద్రాలు తామరపురుగులకు రోగాన్ని కలుగజేయటం ద్వారా పంటలను రక్షిస్తాయి. ఇవి బజారులో దొరుకుతున్నాయి.మొబైలు ఫోన్ ద్వారా సమాచారంఈ డిజిటల్ యుగంలో అనేక సంస్థలు డిజిటల్ సలహాలను, సమాచారాన్ని రైతులకు చేరవేస్తున్నాయి. వీటివల్ల రైతులకు సరైన సలహాలు సరైన సమయంలో మొబైల్ ఫోన్ ద్వారా అందుబాటులో ఉండటం వల్ల తన దైనందిన కార్యక్రమాలకు అంతరాయం లేకుండా రైతు సమాచారాన్ని పొందుతున్నారు. ఇటువంటి డిజిటల్ సాధనాల్లో అంతర్జాతీయంగా ప్రసిద్ధి గాంచిన సెంటర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ బయోసైన్సెస్ ఇంటర్నేషనల్ (సీఏబీఐ) అందుబాటులోకి తెచ్చిన డిజిటల్ సాధనాలు 27 దేశాలలో సేవలు అందిస్తున్నాయి. సీఏబీఐ అంతర్జాతీయ లాభాపేక్ష లేని, వంద సంవత్సరాలకు పైగా చీడపీడల యాజమాన్యంలో అనుభవమున్న సంస్థ. ఈ డిజిటల్ సాధనాలు మనదేశంలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది హైదరాబాద్ లో గల సుస్థిర వ్యవసాయ కేంద్రంతోపాటు అనేక వ్యవసాయ విశ్వ విద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఈ జ్ఞానాన్ని రైతులకు అందిస్తున్నారు. ఈ డిజిటల్ సాధనాలను రైతులు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. విజ్ఞాన పరంగా పరీక్షించి, నిరూపించబడిన, బజారులో లభ్యమౌతున్న ఉత్పత్తుల వివరాలు లభ్యమౌతాయి. ఇతర వివరాలకు... www.cabi.org ఇవీ డిజిటల్ సాధనాలుసీఏబీఐ వివిధ భాగస్వాములతో కలిసి పెస్ట్ మేనేజ్మెంట్ డెసిషన్ గైడ్ (పీఎండీజీ) అభివృద్ధి చేసింది, ఇది త్రిప్స్ పార్విస్పినస్ను గుర్తించడం, సురక్షితమైన యాజమాన్యంపై సలహాలను అందిస్తుంది. దేశంలో వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్న అనేక బయోపెస్టిసైడ్స్ను సూచిస్తున్నారు. పీఎండీజీ ఇప్పుడు తెలుగు, కన్నడ, తమిళం భాషలలో రైతులకు, విస్తరణ కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాయి. విస్తరణ అధికారులు, విద్యార్ధులు, శిక్షకులు, రైతులు, పరిశోధకులు ఈ కింది సీఏబీఐ డిజిటల్ సాధనాలను ఉపయోగించి డిజిటల్ సలహాలు తెలుసుకుంటున్నారు. వీటిని సమర్థవంతంగా, ఉపయోగించడం ద్వారా నల్ల తామర పురుగును అరికట్టే మార్గాలపై సమాచారాన్ని ఎవరైనా పొందదవచ్చు.బయో ప్రొటెక్షన్ పోర్టల్...: తెగులును నిర్వహించడానికి స్థానికంగా లభించే బయోపెస్టిసైడ్స్ గురించి సమాచారం కోసం ఇక్కడ స్కాన్ చేయండి.క్రాప్ స్ప్రేయర్ యాప్...: స్ప్రేయర్ పరిమాణాన్ని బట్టి పురుగు మందు/ బయోపెస్టిసైడ్ మోతాదు ఎంత వాడాలి అన్నది తెలుసుకోవడం కోసం ఇక్కడ స్కాన్ చేయండి .ఫ్యాక్ట్షీట్ యాప్/నాలెడ్జ్ బ్యాంక్... సమర్థవంతంగా చీడపీడల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి సమాచారాన్ని ఇక్కడ స్కాన్ చేసి డౌన్లోడ్ చేసుకోవటం ద్వారా తెలుగు తదితర భాషల్లోనూ ΄ పొందవచ్చు. నిర్వహణ: పంతంగి రాంబాబు సాక్షి సాగుబడి డెస్క్ -
ఆమె ఆస్తికి అత్తింటి వారే మొదటి హక్కుదారులు
మా కూతురికి పెళ్లి చేసి ఐదేళ్లవుతోంది. పెళ్లి చేసేటప్పుడు కట్నం కింద ఎకరా భూమి – ఒక ఇల్లు ఇచ్చాము. గిఫ్ట్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ కూడా చేశాము. ఇదేకాకుండా మా అమ్మాయి సొంత సంపాదన అయిన మరొక ఇంటి స్థలం కూడా ఉంది. మా అమ్మాయికి సంతానం లేరు. అయితే దురదృష్టవశాత్తూ మా కూతురు – అల్లుడు ఇటీవలే ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇప్పుడు తన సొంతగా సంపాదించుకున్న భూమితోపాటు మేము ఇచ్చిన భూమి, ఇల్లు కూడా తిరిగి ఇచ్చేది లేదు అంటూ మా అల్లుడు గారి తల్లి – అక్క పేచీ పెడుతున్నారు. ఒక లాయర్ను సంప్రదించగా హిందూ వారసత్వ చట్టం ప్రకారం మాకు ఏమీ రాదు అని చెబుతున్నారు. అది నిజమేనా?– రామ సుధ, సూర్యాపేటహిందూ వారసత్వ చట్టం, 1956 లోని సెక్షన్ 14 ప్రకారం ఒక హిందూ మహిళ వారసత్వం ద్వారా, వీలునామా ద్వారా, విభజన ద్వారా, మెయింటెనెన్స్లో (బకాయిలతో కలిపి) భాగంగా, మరొక వ్యక్తి నుంచి బహుమతిగా/గిఫ్ట్ ద్వారా ఆమె వివాహానికి ముందు, వివాహ సమయంలో లేదా వివాహం తరువాత, మరే ఇతర విధంగా సంక్రమించినప్పటికీ, స్వార్జితం ద్వారా లేదా ‘స్త్రీ ధనం’ రూపేణా వచ్చినప్పటికీ, అది ఆమె పూర్తి హక్కులు కలిగిన సొంత ఆస్తిగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా ఇదే చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం వీలునామా రాయకుండా మరణించిన హిందూ మహిళ ఆస్తి ఈ కింది పేర్కొన్న వారికి (వారసత్వంగా) క్రమ పద్ధతిలో చెందుతుంది: అంటే మొదటి క్రమంలో ఉన్నవారు ఉంటే కేవలం వారికి మాత్రమే చెందుతుంది. వారు లేని పక్షంలో రెండవ నిబంధనలో చూపించిన వారికి, వారు లేకపోతే మూడవ వారికి, అలా ఎవరూ లేకపోతే ఆఖరున చూపిన వారికి చెందుతుంది.1) మొదటగా: కొడుకులకు, కూతుళ్లకు (కొడుకు కూతురు మరణించి ఉంటే వారి సంతానానికి) – భర్తకు2) రెండు: భర్త వారసులకు3) మూడు: తల్లికి– తండ్రికి4) నాలుగు: తండ్రి వారసులకు5) ఆఖరున: తల్లి వారసులకుఇక మీ విషయానికి వస్తే, మీ అమ్మాయికి మీరు ఇచ్చింది గిఫ్ట్ డీడ్ అని చెప్పారు. అది వరకట్నంగా ఇప్పుడు రుజువు చేయటం సాధ్యపడకపోవచ్చు. ఈ లావాదేవిని స్త్రీ ధనం లాగానే పరిగణిస్తారు. ఒకవేళ మీరు సంపాదించి తనకి ఇచ్చినప్పటికీ ఆ ఆస్తి మీ కూతురి స్వంత ఆస్తి అయిపోయింది. మీ అల్లుడిగారి తల్లి – అక్క కూడా బతికే ఉన్నారు కాబట్టి, పైన చూపిన విధంగా తన భర్త వారసులైన వారికే మీ అమ్మాయి ఆస్తి చెందుతుంది. ఇటీవలే సుప్రీంకోర్టు కూడా ఇలాంటి ఒక కేసు పరిష్కరించే క్రమంలో ‘‘ఒక హిందూ మహిళకి పెళ్లి అయిన తర్వాత తన గోత్రం మారుతుంది. దానితో తన ఆస్తులు కూడా భర్తకి చెందుతాయి కానీ ఆమె తల్లిదండ్రులకు కాదు’’ అని పేర్కొంది. మీ అమ్మాయి భర్త, భర్త వారసులు లేని పక్షంలో మాత్రమే మీకు తన ఆస్తి వచ్చే అవకాశం ఉంది. అయితే మీ అమ్మాయికి ఇచ్చిన ఆస్తి ఒకవేళ తనకి వారసత్వంగా చెందినది అయితే మాత్రం, ఆ వారసత్వ మూలానికి తిరిగి వెళ్ళిపోతుంది. మీ వద్ద ఉన్న పత్రాలను తీసుకుని ఒకసారి లాయరు గారిని కలవండి. మీ కేసులో మీ పక్షాన ఏదైనా వీలు ఉంటే చూసి చెప్పవచ్చు. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com కుమెయిల్ చేయవచ్చు. )(చదవండి: క్యూట్ క్యాట్..ఒత్తిడి సెట్..! దేశంలోనే ప్రప్రథమం..) -
'పెయింట్ ది సిటీ పింక్'..
ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ రొమ్ము కేన్సర్ అవగాహనకు అక్టోబర్ నెలను గుర్తిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థ ఉషలక్ష్మి బ్రెస్ట్ కేన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘పెయింట్ ది సిటీ పింక్’ వార్షిక కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. దీనిలో భాగంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రసిద్ధ భవనాలను పింక్ లైటింగ్తో కాంతులీనేలా చేశారు. వీటిలో చార్మినార్, బుద్ధ విగ్రహం, టీ–హబ్, ప్రసాద్ ఐమ్యాక్స్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, కిమ్స్ హాస్పిటల్స్ వంటివి ఉన్నాయి. ప్రసిద్ధ భవనాలను గులాబీ రంగు లైట్లతో వెలిగించడం ద్వారా భాగ్యనగర నగరవాసుల దృష్టిని ఆకర్షించడం, రొమ్ము కేన్సర్ పై అవగాహన, ఆసక్తి కలిగించడం సంబంధిత లక్ష్యాలతో దీనిని గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నట్టు ఫౌండేషన్ సీఈఓ, డైరెక్టర్ డాక్టర్ పి.రఘురామ్ తెలిపారు. (చదవండి: టాయ్పప్పీ స్ఫూర్తితో.. లెదర్ ఫ్యాషన్ యుటిలిటీ ఆవిష్కరణ) -
టాయ్పప్పీ స్ఫూర్తితో.. లెదర్ ఫ్యాషన్ యుటిలిటీ ఆవిష్కరణ
టాయ్ పప్పీ స్ఫూర్తితో మినీ లెదర్ బ్యాగ్ రూపకల్పన చేసింది ఎఫ్డీడీఐ విద్యార్థిని స్నిగ్ధప్రియ. తనలోని నైపుణ్యానికి పదునుపెట్టి తనదైన శైలిలో నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. మినీబ్యాగ్, స్లింగ్బ్యాగ్, స్పెక్ట్స్హోల్డర్ను తయారుచేసి తన క్రియేటివిటీని చాటింది. వీటిని రాయదుర్గంలోని ఎఫ్డీడీఐ–హైదరాబాద్ క్యాంపస్లో మంగళవారం ప్రదర్శించారు. కాగా స్నిగ్ధప్రియ ఎఫ్డీడీఐలో బీ.డీఈఎస్ లైఫ్స్టైల్ యాక్సెసరీస్ డిజైనర్ కోర్సులో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఎఫ్డీడీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ తేజ్లోహిత్రెడ్డి, ఫ్యాకల్టీ ప్రోత్సాహంతో వీటిని ఆవిష్కరించినట్లు ఆమె తెలిపారు. ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలి.. భవిష్యత్తులో మంచి ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలన్నదే నా లక్ష్యం. ఆర్టిఫీషియల్ లెదర్తో ఈ మూడింటినీ తయారు చేశాను. టాయ్పప్పీ స్ఫూర్తితో వీటికి రూపకల్పన చేశాను. మినీ బ్యాగు తయారీకి ఆరు ఇంచుల లెదర్, ఒక బటన్ అవసరమైంది. దీనికి రూ.51 వ్యయం చేశాను. దీనికి స్పెక్ట్స్ హోల్డర్గా నామకరణం చేశాను. రాయదుర్గంలోని ఎఫ్డీడీఐ క్యాంపస్ నూతన ఆలోచనలను, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది.– స్నిగ్ధప్రియ, ఎఫ్డీడీఐ విద్యార్థి (చదవండి: మచుపిచ్చుపై..భాగ్యనగర వాసుల సాహసయాత్ర.!) -
మచుపిచ్చుపై..భాగ్యనగర వాసుల సాహసయాత్ర.!
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరానికి చెందిన 15 మంది బృందం పర్వతారోహణ చేసి విజయవంతంగా నగరానికి తిరిగొచ్చారు. 50 సంవత్సరాల పైబడ్డ వీరంతా రెండేళ్ల క్రితం ఎవరెస్టు బేస్ క్యాంప్ అధిరోహించి విజయవంతంగా తిరిగొచ్చారు. ఈ క్రమంలో రెండేళ్ల తర్వాత మచుపిచ్చు సాహసయాత్రకు శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 4న ఈ యాత్రకు వెళ్లిన బృందం సెప్టెంబర్ 16న తిరిగొచ్చింది. మచుపిచ్చు అనేది ప్రపంచంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. ఇది దక్షిణ అమెరికా దేశం పెరూలో ఉంది. మచు పిచ్చు సముద్ర మట్టానికి 2,430 మీటర్ల ఎత్తునున్న 15వ శతాబ్దపు ఇంకా సామ్రాజ్యం. ఇది పెరూలోని మచుపిచ్చు జిల్లా, ఉరుబంబా ఫ్రావిన్స్, కుస్కో ప్రాంతంలో ఉంది. 80 కిలోమీటర్ల దూరంలోని (50 మైళ్లు) కుస్కోకు వాయువ్యంగా పవిత్రలోయపై ఒక పర్వత శిఖరంపై ఉంది. దీని ద్వారా ఉరుబంబా నది ప్రవహిస్తోంది. ఎక్కువ మంది పురాతత్వ శాస్త్రవేత్తలు మచుపిచ్చు ఇంకా చక్రవర్తి పాచాకుటి (1438–1472) కోసం నిర్మించిన ఒక ఎస్టేట్ అని నమ్ముతారు. ఫిట్నెస్ ప్రతీకగా..ఈ సాహసయాత్రలో ఇక్ఫాయ్ డైరెక్టర్ సుధాకర్రావు, డాక్టర్ ప్రవీణ్మారెడ్డి, డాక్టర్ శశికాంత్ గోడె, డాక్టర్ నిఖిల్ ఎస్ గడియాల్పాటి, డాక్టర్ గుమ్మి శ్రీకాంత్, డాక్టర్ సల్లేష్ విఠల, డాక్టర్ సంజయ్, ఐటీ ప్రొఫెషనల్స్ విజయభాస్కర్, శివశంకర్, పురుషోత్తం, కృష్ణమోహన్, ప్రసన్నకుమార్, రవి మేడిశెట్టి, అడ్వకేట్ రమేష్ విశ్వనాథ్, కాంట్రాక్టర్ పృద్వీధర్ పాల్గొన్నారు. సౌత్ అమెరికా–భారత్ (సాంబ) 20 డిగ్రీస్ పేరుతో వీరు ఈ సంస్థను ఏర్పాటుచేసుకున్నారు. ఇక్ఫాయ్ డైరెక్టర్ సుధాకర్రావు వీరికి కెపె్టన్గా వ్యవహరించారు. మచుపిచ్చు పర్వతం ఆండీస్ పర్వతశ్రేణిలో ఒక భాగం. 48 గంటల పాటు నడక మార్గంలో ఈ పర్వతాన్ని అతికష్టంతో అధిరోహించాల్సి ఉంటుంది. ఫిట్నెస్ ప్రతీకగా తాము ఈ పర్వతారోహణ చేపట్టినట్లు వీరు తెలిపారు. ఇదే ఉత్సాహంతో ప్రపంచంలోని మరిన్ని పర్వతాల సాహసయాత్ర చేయనున్నట్లు తెలిపారు. (చదవండి: క్యూట్ క్యాట్..ఒత్తిడి సెట్..! దేశంలోనే ప్రప్రథమం..) -
క్యూట్ క్యాట్..ఒత్తిడి సెట్..!
ఫిజియోథెరపీ.. లాఫింగ్ థెరపీ.. ఫిష్ థెరపీ గురించి వినే ఉంటారు.. కానీ ‘క్యాట్ థెరపీ’ గురించి ఎప్పుడైనా విన్నారా..!? ఔను ప్రస్తుతం హైదరాబాద్ నగరవాసులు వినడమే కాదు ప్రత్యక్షంగా చూడబోతున్నారు. ఆ క్యాట్ థెరపీని ఆస్వాదించనున్నారు. ఉరుకులు పరుగుల నగర జీవితం.. తీవ్ర ఒత్తిళ్లతో అలసిపోయిన మనసుకు కాసేపు మానసిక ప్రశాంతత కోరుకోని వారెవరూ ఉండరంటే అతశయోక్తి కాదేమో? అయితే మానసిక ప్రశాంతతకు పెంపుడు జంతువుల మధ్య గడపడం ఓ చక్కని పరిష్కారమని, ఎటువంటి మందులూ నయం చేయలేని నిరాశ నిస్పృహలు, ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలను జంతువులు దూరం చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. క్యాట్ థెరపీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సులభమైన మార్గమని, దీనికోసం యజమానులు తమ పిల్లులకు శిక్షణ ఇచ్చి, పెట్ పార్ట్నర్స్ వంటి సంస్థల ద్వారా సేవలను అందిస్తారు. ఎన్నో జీవన వైవిధ్యాలకు వేదికైన మన నగరంలో క్యాట్ థెరపీలు సైతం హాయ్ చెప్పడం ఇక్కడి జీవనశైలికి నిదర్శనంగా నిలుస్తోంది. హైదరాబాద్లో రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇదే ఏడాది ప్రాయణీకుల ఒత్తిడిని తగ్గించేందుకు డాగ్ థెరపీ పేరుతో ప్యాసింజర్స్ లాంజ్లో క్యూట్ క్యూట్ పప్పీస్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో ప్రస్తుతం నగరంలో క్యాట్ థెరపీని అందుబాటులోకి తెస్తున్నారు క్యాట్స్ కంట్రీ నిర్వాహకులు. మానసిక సమస్యలకు జంతువుల థెరపీ చక్కని పరిష్కారమని పలు అధ్యయనాలు సైతం వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే వివిధ దేశాల్లో వినూత్నంగా క్యాట్ థెరపీ కేంద్రాలు ప్రారంభమవుతున్నాయి. మానసిక ప్రశాంతతకు దోహదం చేసే ఈ క్యాట్ థెరపీ కేంద్రాలు దేశంలో మొట్టమొదటి సెంటర్ హైదరాబాద్లో ఆవిష్కృతం కావడం విశేషం. క్యాట్స్ కంట్రీ.. దేశంలో ప్రథమం.. ఇప్పటివరకూ యుఎస్, జపాన్, కెనడా, థాయిలాండ్, ఇండోనేషియాలకే పరిమితమైన క్యాట్ థెరపీ సేవలు దేశంలో మొట్టమొదటిసారి హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చాయి. కుతుబ్షాహీ 7 టూమ్స్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ఇటీవల్లే అంతర్జాతీయ పిల్లుల దినోత్సవం (ఇంటర్నేషనల్ క్యాట్స్ డే–ఆగస్టు–8) రోజున ప్రారంభమైంది. కుక్కలు, పిల్లులు లాంటి పెంపుడు జంతువుల మధ్య గడపడం, వాటితో ఆడుకోవడం ఎంతో సంతోషాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. తీవ్ర ఒత్తిడి, మానసిక సమస్యలతో బాధపడే వారికి ఇది ఉపశమనం కలిగిస్తుంది. అంతర్జాతీయంగా ప్రముఖ అధ్యయన సంస్థలు సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. 50 రకాలకుపైగా పిల్లులు.. ప్రస్తుతం ఉరుకులు పరుగులతో కూడిన నగర జీవితంలో.. తమతో పాటు పెంపుడు జంతువులను పెంచుకునే వెసులుబాటు తక్కువే. అలాంటి వారు ఈ కేంద్రంలో సేవలు పొందవచ్చు. ఇక్కడ 50కి పైగా పర్షియన్ జాతికి చెందిన పిల్లులు ఉన్నాయి. ఇవన్నీ మానవులతో స్నేహంగా మెలుగుతాయి. మీతో ఆడుకుంటాయి.. గారాబం చేస్తాయి. వీటి మధ్య గడిపి నూతనోత్తేజాన్ని పొందవచ్చు. దీనినే క్యాట్ థెరపీ అంటారు. ఇవన్నీ వ్యాక్సినేషన్ చేసిన ఆరోగ్యవంతమైన పిల్లలు. కాబట్టి వీటితో ఎలాంటి ప్రమాదం ఉండదని నిర్వాహకులు చెబుతున్నారు. ఒక గంటకు అత్యధికంగా ఐదుగురికి మాత్రమే ప్రవేశం ఉండే ఈ సెంటర్లోకి వెళ్లాలంటే అధికారిక వెబ్సైట్లో ముందుగా.. స్లాట్ బుక్ చేసుకోవాలి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు.. స్లాట్ బుక్ చేసి ఈ కేంద్రాన్ని ఎప్పుడైనా సందర్శించవచ్చు. వృత్తిలో సంతృప్తితో.. వినూత్నంగా.. స్వార్థపరుల ప్రపంచంలో నుంచి.. నిస్వార్థ జంతువుల ప్రపంచంలోకి రండి. కాసేపు మా ఆత్మీయమైన పిల్లులతో గడపండి. వయసును మర్చిపోయి కాసేపు బాల్యంలోకి వెళ్లండి. మిమ్మల్ని నిస్వార్థంగా ప్రేమించేందుకు, అలసిపోయిన మనసుకు కాస్త ప్రశాంతత కలిగించేందుకు, ఆటలు ఆడుకునేందుకు మా పిల్లులు సిద్ధంగా ఉన్నాయి. 35 సంవత్సరాల పాటు పశు సంవర్ధక శాఖలో వైద్యుడిగా పని చేసిన అనుభవంతో.. ఉద్యోగ విరమణ అనంతరం దీనిని ప్రారంభించాను. జంతువులతో మమేకమైన మనసు వాటితోనే సహవాసం, ఆతీ్మయతను కోరుకుంటోంది అనడానికి నా ప్రయాణం ఒక ఉదాహరణ. మా వెబ్సైట్ www. CatsCountry. in లో దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. – ముహమ్మద్ యాకుబ్ షరీఫ్, క్యాట్స్ కంట్రీ వ్యవస్థాపకులు (చదవండి: ఇదేం పేరెంటింగ్..! వామ్మో ఈ రేంజ్లో డేరింగ్ పాఠాలా..? తిట్టిపోస్తున్న నెటిజన్లు) -
మహిళల్లోనే మహాశక్తి
‘‘మనందరిలో ఓ దుర్గా మాత ఉంది. ఆ శక్తిని మనం గ్రహించగలిగితే మనం ఏదైనా సాధించగలం. స్త్రీలు అనుకుంటే ఎలాంటి సవాల్ని అయినా అద్భుతంగా ఎదుర్కొంటారని నా నమ్మకం’’ అంటున్నారు పూజా హెగ్డే(Pooja Hegde). సౌత్–నార్త్లో స్టార్ హీరోయిన్గా దూసుకెళుతున్న ఆమె ‘దసరా’ సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్న విశేషాలు...ఈ నవరాత్రి రోజుల్లో మా కుటుంబం మొత్తం శాకాహారులుగా మారిపోతాం. ఈ పండగ అప్పుడు కుదిరితే గుడికి వెళతాను. లేకపోయినా నాకు తరచూ గుడికి వెళ్లడం అలవాటు. మన ఎనర్జీ లెవల్స్ బాగుండటానికి మనం గుడికి వెళ్లడం మంచిది అని నా అభిప్రాయం. గుడిలో కాలు పెట్టగానే తెలియకుండా ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. మనం క్షేమంగా ఉండటానికి ఆ ఎనర్జీ పనికొస్తుంది. అందుకే గుడికి వెళ్లడాన్ని నేను బాగా నమ్ముతాను. → నవరాత్రి టైమ్లో ఉపవాసం ఉండను కానీ నాకు ఫాస్టింగ్ అంటే నమ్మకం. ఫాస్టింగ్లో ఉన్నప్పుడు దేవుడికి దగ్గరగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. నా చిన్నప్పుడు మా నాన్నగారు ఉపవాసం ఉండేవారు. తొమ్మిది రోజులు కేవలం నీరు మాత్రమే తీసుకునేవారు. అంత కఠినమైన ఉపవాసం ఆచరించేవారు. కానీ నేనెప్పుడూ అలా చేయలేదు. నేను ఏడాదికి రెండుసార్లు ఉపవాసం ఉంటాను. ‘అంగారిక సంకష్ట చతుర్ది’ నాడు, మహా శివరాత్రికి తప్పకుండా ఫాస్టింగ్ చేస్తాను. → చాలా సంవత్సరాలుగా నేను దాండియా ఆడలేదు. ఓ పదేళ్ల క్రితం నా స్నేహితులతో కలిసి దాండియా ఆడటానికి వెళ్లాను. గర్బా డ్యాన్స్ పోటీ జరుగుతోందని అక్కడికి వెళ్లాక తెలిసింది. ఈ కాంపిటీషన్ కోసం కొన్నిగ్రూప్స్ సభ్యులు ఏళ్ల తరబడి ప్రాక్టీస్ చేసి మరీ పాల్గొంటారని తెలిసి, ఆశ్చర్యపోయాను. వాళ్ల డ్యాన్స్ నిజంగా అద్భుతం. నేను కూడా ఒక గ్రూపులోకి వెళ్లి, డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాను. కానీ అది అంత తేలికైన విషయం కాదని అర్థమైంది. → ప్రతి మహిళలోనూ ఓ శక్తి ఉంది. మనలో ఆ శక్తి స్వరూపిణి దుర్గా మాత ఉందని గ్రహించాలి. నవరాత్రి అంటే మనలో ఉన్న ఆ దేవిలోని పలు షేడ్స్ని సెలబ్రేట్ చేయడమే. మన లోపల ఉన్న దైవిక స్త్రీత్వాన్ని గుర్తించడమే. అయితే నేనిప్పటివరకూ గమనించినంతవరకూ స్త్రీలకు ఏదైనా సవాల్ ఎదురైతే అద్భుతంగా అధిగమించే నేర్పు వారికి ఉందని తెలుసుకున్నాను. కానీ మనకు మనంగా పరిష్కరించుకోగలుగుతాం అనే విషయం మనకు అర్థం కావాలి. లోపల దాగి ఉన్న ఆ శక్తిని గుర్తించి ముందుకెళితే మన వల్ల కానిది ఏదీ లేదు.→ నవరాత్రి సమయంలో నాకు బాగా నచ్చినది ‘హవన్’ (హోమం). హవన్లో బియ్యం, నువ్వులు, ధాన్యాలు, నెయ్యి వంటివి సమర్పించి, ఆ దుర్గా మాత ఆశీర్వాదాన్ని కోరతాం. హవన్ చుట్టూ తిరుగుతున్నప్పుడు వెచ్చగా ఉంటుంది. అది చాలా బాగుంటుంది. చాలా పవిత్రంగా అనిపిస్తుంది. మామూలుగా నవరాత్రి అప్పుడు బంధువులు ఇంటికి వస్తుంటారు. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా ‘హవన్’కి మాత్రం అందరూ హాజరవుతారు. అలాగే పసుపు ఆకు తింటాం. ఆ ఆకు నుంచి వచ్చే సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. నా చిన్నప్పటి తీపి గుర్తుల్లో ఇదొకటి.→ మా ఇంట్లో తొమ్మిది రోజులు పండగను చాలా శ్రద్ధగా చేస్తాం. ఇందాక నవరాత్రి సమయంలో ఆచరించేవాటిలో నాకు ‘హవన్’ ఇష్టం అని చె΄్పాను కదా. అష్టమి రోజున అది చేస్తాం. మేం లక్ష్మీ పూజ కూడా బాగా చేస్తాం. అలాగే ‘మాంజో లిరెట్టా గట్టి’ అని వంటకం చేస్తాం. కొబ్బరి తురుము, బెల్లం కలిపి ముద్దలా కలిపి, పసుపు ఆకులో పెట్టి ఉడికిస్తాం. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఓ పట్టు పడుతుంటాను. → దసరా అనగానే మనకు చెడుపై మంచి గెలుపు అనేది గుర్తొస్తుంది. నా వరకూ నా చుట్టూ ఉన్న చెడు గురించి, చెడు చేసేవాళ్ల గురించి అస్సలు పట్టించుకోను. ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయడంపైనే దృష్టి పెడతాను. వందకు వంద శాతం పని చేయడం... మంచి ఆలోచనలతో ముందుకు వెళ్లడం... ఈ రెంటినీ ఫాలో అవుతాను. అప్పుడు ఎన్నో రెట్లు రూపంలో మంచి మన వద్దకు వస్తుందని నమ్ముతాను. ఇక చెడు చేసిన వారి గురించి ఆలోచించకుండా... మానవులకు అతీతమైన ‘ఉన్నత శక్తి’కి వదిలేస్తాను.నవరాత్రి సమయంలో మా ఇంట్లో బాగా భజనలు చేస్తాం. నా చిన్నప్పట్నుంచి ఇప్పటివరకూ ఒకే పద్ధతిలోనే పండగ జరుపుకుంటూ వస్తున్నాం. ప్రపంచంలో ఏదైనా మారొచ్చు. కానీ మన ఆచారాలను మనం ఎప్పుడూ ఒకేలా పాటించాలి. ఇప్పుడు వర్క్ షెడ్యూల్స్ వల్ల నేను చాలా పండగలను మిస్సవుతున్నాను. అయితే ఏ మాత్రం వీలు కుదిరినా పండగలప్పుడు ఇంట్లోనే ఉండటానికి ప్రయత్నిస్తాను.– డి.జి. భవాని -
అన్నీ అమ్మ ఆకృతులే
‘అమ్మవారి తొమ్మిది అలంకారాలు, కృతులు స్త్రీ శక్తి గురించి తెలియజేసేవే. మనలోని శక్తిని ఎలా జాగృతం చేస్తామో అదే మనం’ అంటూ నవరాత్రుల సందర్భంగా చేస్తున్న సాధన, అమ్మవారి కృపతో మొదలైన తన ప్రయాణం గురించి తెలియజేశారు గాయని భమిడి పాటి శ్రీలలిత (Bhamidipati Srilalitha). విజయవాడ వాసి, గాయని, అమ్మవారి పాటలకు ప్రత్యేకంగా నిలిచిన శ్రీలలిత చెప్పిన విశేషాలు నవశక్తిలో.‘‘నవరాత్రి సిరీస్ ఆరేళ్లుగా చేస్తున్నాను. బెజవాడ కనకదుర్గమ్మ అలంకరణ ఎలా ఉంటుందో అలాంటి అలంకరణల సెట్ వేసి, షూట్ చేసి, వీడియో ద్వారా చూపించాం. ఈ నవరాత్రుల్లో కనకదుర్గమ్మను నేరుగా దర్శించుకోలేనివారు సోషల్ మీడియాలో తొమ్మిది పాటలుగా విడుదల చేసిన వీడియోలు చూడవచ్చు. అమ్మవారి ప్రతి అలంకరణకు తగ్గట్టుగా పాట ఎంపిక, విజువల్స్ డిజైన్ చేశాం. ప్రతియేటా కొత్తదనం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాం. అమ్మవారి కృతులు అందరిళ్లలో పాడుకునే విధంగా ఆడియోను తీసుకువచ్చాం. పరంపరంగా వచ్చిన కృతులనే తీసుకున్నాం. ఈసారి మాత్రం రెండు భజనలు కూడా వీడియోలో ఉండేలా ప్లాన్ చేశాం. ఈ నవరాత్రి వీడియోకు నెల రోజుల టైమ్ పట్టింది. రోజుకు మూడు అలంకారాల చొప్పున షూట్ చేశాం.కృతులను నేర్చుకుంటూ ..చిన్నప్పటి నుంచి ఇంట్లో భక్తి గీతాలు వింటూ ఉండేదాన్ని. మా ఇంట్లో అందరూ అమ్మవారి ఆరాధకులే. అమ్మవారి దీక్ష చేసేవారు. ఇంట్లో అందరూ ఆమె కృతులను పాడుతుంటారు. ఆ విధంగా అమ్మవారి కృతులు వినడం, నేర్చుకోవడం ప్రారంభించాను. మా అత్తింట్లోనూ అమ్మవారి ఆరాధకులే. మా మామగారు నలభై ఏళ్లుగా దుర్గమ్మవారి ఉత్సవాలు జరుపుతున్నారు. దీంతో నేనూ ఆ ఉత్సవాల్లో పాల్గొంటూ, ప్రదర్శన ఇస్తూ వస్తున్నాను. అన్ని పుణ్యక్షేత్రాలూ దర్శించి, అక్కడ ప్రదర్శనలో పాడే అవకాశమూ లభించింది.చదవండి: సెంటర్స్టోన్ డైమండ్రింగ్, లగ్జరీ గౌనులో ఇషా అంబానీ : ధర ఎంతో తెలుసా? పరీక్షలను తట్టుకుంటూ...అమ్మవారి ఉత్సవాలు, గ్రామదేవతా ఉత్సవాలు, మొన్న జరిగిన తిరుపతి బ్రహ్మోత్సవాల్లోనూ పాల్గొన్నాను. పాట ఎంపిక నుంచి అమ్మవారే ఈ కార్యక్రమం నా చేత చేయిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ కృతులు పాడుతున్నా, వింటున్నా ఒక ఆధ్యాత్మిక భావనకు లోనవుతుంటాను. ఉదాహరణకు.. ఒక కృతిలో 13 చరణాలు ఉంటే.. 9 లేదా 11 చరణాలు పాడుదాం, అంత సమయం ఉండడదు కదా అని ముందు అనుకుంటాను. కానీ, ప్రదర్శనలో నాకు తెలియకుండానే 13 చరణాలనూ పూర్తి చేస్తాను. ఇటువంటి అనుభూతులెన్నో.సినిమాలోనూ...ఇటీవలే ఒక సినిమాకు పాటలు పాడాను. ఆరేళ్ల వయసు నుంచి 20 వరకు రియాలిటీ షోలలో పాల్గొన్నాను. బయట మూడు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. మన దేశంలోనే కాకుండా విదేశాలలోనూ ప్రదర్శనలు ఇవ్వడం నిజంగా అదృష్టం. సంగీత కళానిధులైన బాలసుబ్రహ్మమణ్యం, చిత్ర, కోటి, ఉషా ఉతుప్.. వంటి పెద్దవారిని కలిశాను. వారితో కలిసి పాడుతూ, ప్రయాణించాను. ఒకసారి రియాలిటీ షో ఫైనల్స్లో పాడుతున్నప్పుడు బాలు గారు ‘నీ వెనక ఏదో దైవశక్తి ఉంది...’ అన్నారు. అదంతా అమ్మవారి ఆశీర్వాదంగా భావిస్తుంటాను.వదలని సాధన...ఈ సీరీస్లో నాకు చాలా ఇష్టమైనది మహాకవి కాళిదాసు ‘దేవీ అశ్వధాటి’ స్తోత్రం. ప్రవాహంలా సాగే ఆ స్తోత్రాన్ని అమ్మవారి మీద రాశారు. అశ్వధాటి అంటే.. ఒక గుర్రం పరుగెడుతూ ఉంటే ఆ వేగం, శబ్దం ఎలా ఉంటుందో .. ఆ స్తోత్రం కూడా అలాగే ఉంటుంది. 13 చరణాలు ఉండే ఆ స్తోత్రం పాడటం చాలా కష్టం. కానీ, నాకు అది చాలా ఇష్టమైనది. ఏదైనా స్తోత్రం మొదలుపెట్టినప్పుడు దోషాలు లేకుండా జాగ్రత్త పడుతూ, ప్రజల ముందుకు తీసుకువస్తాను. కరెక్ట్గా వచ్చేంతవరకు సాధన చేస్తూ ఉంటాను. ఇదీ చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్ : ఐశ్వర్యా డాజ్లింగ్ లుక్ వెనుకున్న సీక్రెట్ ఇదే!మహిళలు జన్మతః శక్తిమంతుఉ కాబటి వారు ఎక్కడినుంచో స్ఫూర్తి పొందడం ఏమీ ఉండదు. మనలోని శక్తి ఏ రూపంలో ఉందో దానిని వెలికి తీసి, ప్రయత్నించడమే. నా కార్యక్రమాలన్నింటా మా అమ్మానాన్నలు, అన్నయ్య, అత్తమామలు, మా వారు.. ఇలా అందరి సపోర్ట్ ఉంది. ఆడియో, వీడియో టీమ్ సంగతి సరే సరి! ’ అంటూ వివరించారు ఈ శాస్త్రీయ సంగీతకారిణి.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
తనిష్క్ మియా 'మానిఫెస్ట్' కలెక్షన్ లాంచ్
ప్రముఖ జ్యయల్లరీ సంస్థ తనిష్క్ కొత్త కలక్షన్ ఆవిష్కరించింది. పండుగ సీజన్ సందర్భంగా మియా 'మానిఫెస్ట్' కలెక్షన్ను లాంచ్ చేసింది. ఈసందర్బంగా ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది.ఆధునికత, ఆధ్యాత్మిక ,సమకాలీన డిజైన్తో రాజ సౌందర్యాన్ని మిళితం చేస్తూ సరికొత్త డిజైన్లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. మియా ప్యాలెస్ ఆర్చ్లు, పైస్లీ , బంగారంలో కమలం పువ్వు మరియు సహజ వజ్రాలు, ముత్యాలు, సహజ బహుళ-రంగు నీలమణిలు , ఆకుపచ్చ అవెంచురిన్లతో పాటు ఆధునిక డిజైన్లతో ఉత్పత్తులను అందిస్తోంది. చోకర్లు, నెక్లెస్లు, నవరత్నాలు, ఝుమ్కాలు , క్వార్ట్జ్ క్రిస్టల్ మాలాలను అందిస్తుంది, ఇవి పండుగ చక్కదనాన్ని సరసమైన ధరతో మిళితం చేయని కంపెనీ తెలిపింది. దీంతోపాటు వెండి ఆభరణాల కలెక్షన్ను కూడా పరిచయం చేస్తుంది. ఆధునిక ట్విస్ట్తో అపారమైన ధరించగలిగే డిజైన్లు ఉత్సాహభరితమైన దీపావళి వేడుకలు, నవరాత్రి ఉత్సవాలు లేదా ఆలోచనాత్మక బహుమతికి అనువుగా ఉంటాయని సంస్థ తెలిపింది. మియాస్ మానిఫెస్ట్ కలెక్షన్లో చెవిపోగులు, పెండెంట్లు, బ్రాస్లెట్లు, ఝుమ్కాలు, చోకర్, నెక్పీస్లు లాంటివి మరెన్నో మియా స్టోర్లలో లభ్యం.ఆధునిక మహిళల కోసం రూపొందించిన పండుగ గ్లామర్ నుండి ట్రెండ్-ఫార్వర్డ్, స్టైలిష్ డిజైన్లను అందిస్తోందని మియా బ్రాండ్ అంబాసిడర్ అనీత్ పడ్డా వెల్లడించారు. ఈ అద్భుతమైన చోకర్ను ధరించి కనిపించారు.సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 23 వరకు, నిబంధనల మేరకు కస్టమర్లు వజ్రాల ఆభరణాల తయారీ ఛార్జీలపై 100శాతం తగ్గింపు, సాదా బంగారం, రంగు రాతి ఆభరణాల తయారీ ఛార్జీలపై 20శాతం తగ్గింపు లభింస్తుంది నిబంధనలు వర్తిస్తాయి. -
స్కూలు ప్రిన్సిపాల్ ఇంగ్లిషుకి బ్యాంకు అధికారులే ‘బౌన్స్’.. మీరూ చూడండి!
విద్యాబుద్దులుచెప్పే గురువు గారంటే పిల్లలకు చాలా అభిమానం. ఆరు నూరు అయినా మా టీచర్ చెప్పిందే కరెక్ట్ అని వాదిస్తారు చదువుకునే పిల్లలు. అంత గురి నమ్మకం తమ టీచర్లంటే.. మరి అలాంటి టీచర్లే భయంకరమైన తప్పులు రాస్తే.. ఇక వారి వద్ద విద్యనభ్యసించే పిల్లల పరిస్థితి ఏంటి? తాజాగా ఇలాంటి ఘటన ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అసలు విషయం తెలిస్తే. ఎవరైనా అయ్యో.. రామ! అని నోరెళ్ల బెట్టాల్సిందే.హిమాచల్ ప్రదేశ్లోని (Himachal Pradesh) ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ రాసిచ్చిన చెక్కే ఇపుడు హాట్టాపిక్. ఈ చెక్ మీద ఉన్న ఇంగ్లిషు భాషను చూసి బ్యాంకు తిరస్కరించింది. సెప్టెంబర్ 25వ తేదీన ‘ద హిమాచల్ ప్రదేశ్ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్’ కు చెందిన చెక్కు ఇచ్చారు. అట్టర్ సింగ్ పేరుతో రూ.7,616కు ప్రిన్సిపాల్ సంతకం చేసి ఉందీ చెక్. సాధారణంగా చెక్ ఇచ్చేటపుడు అక్రమాలకు తావులేకుండా ఆ మొత్తాన్ని అక్షరాల్లో (Inwords) రాయాల్సి ఉంటుంది. అలా తానిచ్చిన రూ. 7,616 ఇంగ్లిషులో భయంకరమైన తప్పిదం చేశారు. ఒక వర్డ్ అంటే పొరబాటు అనుకోవచ్చు. ఇంగ్లీష్లో సెవెన్ ( Seven) రాయాల్సిన చోట సావెన్ (Saven)అని థౌజండ్ రాయాల్సిన చోట థర్స్ డే, హండ్రెడ్ (Hundred) కు బదులు హరేంద్ర (Harendra, సిక్స్ టీన్కు బదులు సిక్స్టీ అని రాశారు. తప్పుల తడక చెక్కు చూసి బ్యాంక్ అధికారులే విస్తుపోయారు. అందుకే వెనక్కి పంపించారు.₹7,616 ..…“ सेवन थर्सडे सिक्स हरेन्द्र सिक्सटी रूपीस ओनली ”📍 सिरमौर के रोनहाट स्थित सरकारी वरिष्ठ माध्यमिक विद्यालय के प्रधानाचार्य द्वारा जारी ₹7,616 का चेक सुर्खियों में है। ▪️ रकम से ज़्यादा यह चेक अपने शब्दों की वजह से वायरल हो गया है pic.twitter.com/Uhmz7mojDy— The Modern Himachal (@I_love_himachal) September 29, 2025ఈ ఘటనకు సంబంధించిన చెక్ సోషల్మీడియాలో వౌరల్ అవుతోంది. నెటిజన్ల ఛలోక్తులు, వ్యాఖ్యాలు వెల్లువెత్తాయి. "పెన్ ఆటోకరెక్ట్ సిస్టమ్లో లోపం.." ఒకరు చమత్కరించగా, స్వయంగా స్కూల్ ప్రిన్సిపల్ స్వయంగా ఇన్ని తప్పులు రాస్తే ఇక చదివే పిల్లల పరిస్థితేమిటని మరికొందరు వాపోయారు. -
ఇదేం పేరెంటింగ్..! వామ్మో ఈ రేంజ్లో డేరింగ్ పాఠాలా..?
కొన్ని విషయాలు పిల్లలకు అనుభవపూర్వకంగా చెప్పాల్సిందే. సరైనదే అయినా..ప్రాణాలను పణంగా పెట్టేంత డేరింగ్ నిర్ణయాలు గురించి చెప్పకపోవడమే మేలు. సురక్షితమైన చర్యలు తీసుకుంటే పర్లేదు. జరగరానీ నష్టం జరిగితే ఇక అంతే పరిస్థితులు. ఇక్కడ అలాంటి భయానక పేరెంటింగ్ టీచింగ్కి సంబంధించిన ఘటనే చోటుచేసుకుంది. ఆ వీడియో చూస్తే..మరీ ఈ రేంజ్లో ధైర్యం విలువ గురించి నేర్పించాలా? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు..ఆ వీడియోలో ఓ ప్రముఖ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ గారెట్ గీ తన కొడుకుని పెద్ద పర్వతం మీద నుంచి నదిలోకి దూకేయమని ప్రోత్సహిస్తాడు. మొదట ఆ పిల్లవాడు భయంతో వెనకడుగు వేస్తాడు. ఆ తర్వాత తండ్రి మాటలకు కాస్త ప్రేరేపించబడినా..దూకే సాహసం చేయలేకపోయాడు. దాంతో చివరికి తండ్రే అతడిని ఎత్తుకుని విసిరేస్తాడు. పాపం ఆ పిల్లవాడు భయంతో నాన్న అని అరవడం స్పష్టంగా వీడియోలో కనిపిస్తుండటం చూడొచ్చు. ఆ తర్వాత తండ్రి వెంటనే దూకేసి అతడిని పట్టుకుని ఒడ్డుకి వచ్చేస్తాడు. అందుకు సంబంధించిన వీడియోని చూసిన నెటిజన్లు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం ఎలాగో నేర్పడం మరీ ఈ రేంజ్లోనా అంటూ ఫైర్ అయ్యారు. పిల్లలందరూ ఒకేలా ఉండరని, కొందరూ చాలా పిరికిగా ఉంటారంటూ హితవు పలికారు. నెమ్మదిగా ధైర్యాన్ని నూరిపోస్తూ..స్వతహాగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించాలే తప్ప ప్రాణాలకే ముప్పు వాట్లిలే ఇలాంటి ప్రమాదకరమైన సాహసాలు తగదు అని సదరు ఇన్ఫ్లుయెన్సర్ గీకి హితవు పలికారు. అందుకు సంబంధించిన భయానక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేగా పిల్లలకు భయం పోగొట్టాలంటే మరి ఇంతలా నేర్పించాలా అని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. అయితే గీ మాత్రం తల్లిదండ్రులుగా తమ ఉద్దేశ్యాలు వేరని, తాము ప్రేమగా జాగ్రత్తగా పిల్లలను చూసుకోగలమని తనదైన శైలిలో కౌంటరిచ్చాడు ఇన్ఫ్లుయెన్సర్ గీ. View this post on Instagram A post shared by Garrett Gee (@garrettgee) (చదవండి: రుచికరమైన వంట కోసం '3-3-2-2 రూల్.'.!) -
సెంటర్స్టోన్ డైమండ్రింగ్, లగ్జరీ గౌనులో ఇషా అంబానీ : ధర ఎంతో తెలుసా?
యువ వ్యాపారవత్త, అంబానీ వారసురాలు ఇషా అంబానీ తన ఫ్రెండ్ పెళ్లిలో స్టైలిష్ దుస్తుల్లో అందరి దృష్టిని ఆకర్షించింది. అలెశాండ్రో మిచెల్ డెబ్యూ వాలెంటినో కలెక్షన్కు చెందిన డిజైనర్ వేర్లో తళుక్కుమంది. ఆత్మవిశ్వాసం, హుందాతనంతో కూడిన అద్భుతమైన అందంతో తన తల్లి నీతా అంబానీలాగానే లగ్జరీ అండ్ ఫ్యాషన్ స్టైల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇషా అంబానీ.క్రీమ్ కలర్, పాస్టెల్ గ్రీన్ కలర్లో, అల్లికలు ,లేయర్డ్ రఫ్ఫ్లే ఎంబ్రాయిడరీ, క్లాసిక్ లగ్జరీగా రూపొందించిన ఈ గౌను ఇషా సహజ సౌందర్యాన్ని హైలైట్ చేశాయి. ఇంకా అద్భుతమైన పూల ఆకారపు డైమండ్ చెవిపోగులు, అందమైన బంగారు బ్రాస్లెట్ , అద్భుతమై సెంటర్ స్టోన్తో డైమండ్ రింగ్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది.(పారిస్ ఫ్యాషన్ వీక్ : ఐశ్వర్యా డాజ్లింగ్ లుక్ వెనుకున్న సీక్రెట్ ఇదే!)ఫ్యాషన్ ఐకాన్ ఇషా అంబానీ తన సన్నిహితులతో వేడుకలకు హాజరైంది. దీని ధర దాదాపు రూ. 5 లక్షలు. అంబానీ ఫ్యామిలీ ఇన్స్టా పేజ్ ఇషా అంబానీ ఫోటోలను షేర్ చేసింది. ఈ వెడ్డింగ్లో ఆమె లుక్ మోడ్రన్ ఫ్యాషన్ అభిరుచిని ఆమె గ్లోబల్ స్టైల్ని సూచిస్తుందంటూ ఫ్యాన్స్ పొగిడేశారు. ఇటాలియన్ లగ్జరీ హౌస్ క్రియేటివ్ కలెక్షన్స్ సంచలనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. వాలెంటినో కలెక్షన్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.మరోవైపు ఇషా అంబానీకి వాలెంటినో కలెక్షన్ అంటే చాలా ప్రేమ. ఈ లగ్జరీ బ్రాండ్తో ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉంది. తన పెళ్లి రిసెప్షన్ వేడుకలో వాలెంటినో లెహంగానే ధరించింది. ఈ ఫ్యాషన్ హౌస్ రూపొందించిన మొదటి లెహంగా ధరించడం, అనేక సందర్భాల్లో ఈ కలెక్షన్ దుస్తులకే ఆమె ప్రాధాన్యత. చదవండి: స్కూలు ప్రిన్సిపాల్ ఇంగ్లీషుకి బ్యాంకు అధికారులే ‘బౌన్స్’.. మీరూ చూడండి! కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్-నీతా అంబానీల ఏకైక కుమార్తె ఇషా అంబానీ. ప్రస్తుతం రిలయన్స్రీటైల్ బాధ్యతల్లో విజయ పథంలో దూసుకుపోతోంది. 2018లో డిసెంబర్లో ఆనంద్ పిరమల్ను వివాహం చేసుకుంది ఇషా. ఈ జంటకు ఆదియా శక్తి, కృష్ణ కవల పిల్లలున్నారు. -
రుచికరమైన వంట కోసం '3-3-2-2 రూల్.'.!
వంటను రుచికరంగా వండటం కూడా ఓ ఆర్ట్. అయితే పోషకాలు కోల్పోకుండా, రుచికరంగా వండటం అంటే.. అది అందరికి సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ విటమిన్లు పోకూడదన్న ఆత్రుతలో తక్కువగా ఉడకిస్తే..టేస్ట్ లేదనిపిస్తుంది. అలా కాకుండా అన్ని సరిపడేలా టేస్ట్ ఏ మాత్రం తగ్గకుండా వండాలంటే ఈ టెక్నీక్ ఫాలో అవ్వాల్సిందే. ఇలా ఈ రూల్లో వంట చేస్తే..రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడాను. మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయలా చూసేద్దామా మరి..!.రుచికంగా రెస్టారెంట్లో కనిపించినట్లుగా కలర్ఫుల్గా వండాలంటే ఈ పద్ధతే మేలంటున్నారు నిపుణులు కూడా. పైగా ఈ విధానం ఎక్కువసేపు ఉడకించడాన్ని నివారించడం తోపాటు, విటమిన్లు కూడా పోవని చెబుతున్నారు. అందుకోసం వండేటప్పుడూ 3-3-2-2 రూల్ని అనుసరించడం మేలని చెబుతున్నారు నిపుణులు. ఆహార ప్రియులు రుచికరమైన భోజనంతోపాటు, పోషకాలని కూడా కోల్పోరట. మరి ఈ రూల్లో ఎలా వండాలంటే..ఆ రూల్లోని మ్యాజిక్..ఒక గిన్నెలో రెండు స్పూన్ల నూనెని పోసి వండాల్సిన కూరగాయలు లేదా నాన్వెజ్ని వేయాలి. ఆ తర్వాత ఒక వైపు మూడు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత ఒకసారి గరిటతో తిప్పి మరో మూడు నిమిషాలు ఉడికించాలి. ఇంకోసారి తిప్పి ఓ నిమిషాలు ఉడికించాలి. చివరగా ఇంకొక్కసారి తిప్పి మరో రెండు నిమిషాలు ఉడికిస్తే చాలట, రుచి కోల్పోకుండా పోషకవంతంగా ఉంటుందంట. అతిగా ఉడికించడాన్ని నిరోధించడం అనే సమస్య ఈ పద్ధతితో నివారించగలుగుతామట. ఇలా గ్రిల్ చేసేవాటికి, మంటపై గిన్ని పెట్టి కూర వండే వాటికి చాలా బాగా ఉపయోగపడుతుందట. పైగా రెస్టారెంట్లో కనిపించినట్లు ముక్కలనేవి వడలిపోవు, చూసేందుకు అందంగానూ, రుచికరంగానూ ఉంటుందట. ఇది మంచిదేనా..?ఈ పద్ధతిలో తక్కువ సమయంలోనే వంట పూర్తి అయిపోవడమే కాకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా వండేయొచ్చట. అలాగే ముక్కలు లేదా మాంసం ముక్కల్లోని మృదుత్వం పోకుండా రుచికరంగా ఉంటుందట. పైగా కొత్తగా వంట చేసేవారికి మరింత హెల్ప్ అవుతుందట. అదీగాక ఇలా వండితే సమయానికి సమయం, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండు సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: ఫస్ట్ డే డ్యూటీ హైరానా..! వైరల్గా బస్సు కండక్టర్ స్టోరీ.. -
మిల్లెట్స్ స్నాక్స్ ..మఖానా.. మజాకా!
దేశంలో ఆరోగ్య స్పృహ ఉన్న యువ జనాభా పెరుగుతోంది. 15-35 సంవత్సరాల వయసున్న వినియోగదారులు.. మామూలు భోజనమే కాదు, చిరుతిళ్ల విషయంలోనూ ఆరోగ్యక రమైనవేనా కాదా అని చూస్తున్నారు. ఆరోగ్యకరమైన చిరుతిళ్ల (స్నాక్స్) విపణి 2028 నాటికి 30 బిలియన్ డాలర్లకు పెరగవ చ్చని ఆర్థిక సలహా సంస్థ అవెండస్ గత ఏడాది ఓ నివేదిక విడుదల చేసింది.-సాక్షి, స్పెషల్ డెస్క్మనదేశంలో పట్టణాల్లో ఉంటున్నవారు క్రమంగా ఆరోగ్యకరమైన స్నాక్స్ వైపు మళ్లుతున్నారు. మఖానా వెంటపడ్డ కస్ట మర్లు ఇప్పుడు జొన్నలు, రాగులు, సజ్జులు, కొర్రలు, సామలు వంటి చిరుధాన్యాలతో తయారైన ఉత్పత్తులను ఎంచుకుంటున్నారు. స్థానిక ఔత్సాహిక వ్యాపారులే కాదు, ప్రముఖ బ్రాండ్స్ ఈ విభాగంలోకి ఎంట్రీ ఇస్తున్నాయి.మిల్లెట్స్ స్నాక్స్-ఒకదాని వెంట ఒకటి..మిల్లెట్స్ ఆధారిత ఉత్పత్తులు ఎక్కువగా అల్పా హారానికి పరిమితం అయ్యాయి. టాటా సోల్ ఫుల్.. పిల్లల కోసం రాగి ఆధారిత తృణ ధాన్యాలకు ప్రసిద్ధి. కాలక్రమేణా మిల్లెట్ మ్యూస్లీ రెడీ- టు-కుక్ ఓట్స్ ను విడుదల చేసింది. ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే పెద్దల కోసం రెడీ-టు-కుక్ మసాలా మిల్లెట్స్ సైతం మారికో విక్రయిస్తోంది. మనదేశం 2023ను 'అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం'గా ప్రకటించిన తర్వాత మిల్లెట్స్ ఆధారిత ఉత్పత్తులకు ప్రజాదరణ మరింత పెరిగింది. ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ విభాగం లెక్కల ప్రకారం... చిరుధాన్యాల రంగం లో భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ఉత్పత్తిదారు. 2023లో ప్రపంచ ఉత్పత్తిలో మనవాటా 38.4 శాతం. అలాగే రెండవ అతిపెద్ద ఎగుమతిదారుగా నిలిచిందని 2023-24 బడ్జెట్ ప్రకటన సందర్భంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అంతేకాదు, దేశవ్యాప్తంగా మిల్లెట్ ఆధారిత 151 అగ్రిస్టార్టప్ లు ఏర్పాటయ్యాయని ఇటీవల లోక్సభలో కేంద్రం వెల్లడించింది.చదవండి: ఈ టిప్స్ పాటిస్తే పండగ వేళ మెరిసిపోవడం ఖాయం!పెద్ద బ్రాండ్స్ వస్తే.. అయితే పెద్ద స్నాకింగ్ బ్రాండ్ల పోర్ట్ఫోలియోలో మిల్లెట్స్ ఇంకా విస్తరించలేదు. ప్రస్తుతానికి ఈ ఉత్పత్తులు ప్రీమి యం విభాగంలో ఉన్నాయి. చిరుధాన్యాలతో తయారైన ఉత్పత్తులు గ్లూటిన్, అలర్జీ రహితం. తక్కువ గ్లైసెమిక్ ఇం డెక్స్ కలిగినవి కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు మం చిది. ఈ విభాగం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. 10 సం వత్సరాల క్రితం సేంద్రియ ఉత్పత్తుల మాదిరిగా.. రాబో యే కాలంలో ఇవి ప్రధాన స్రవంతిలోకి వస్తాయని పరిశ్రమ అంటోంది. పెద్ద బ్రాండ్స్ ఈ రంగంలోకి ఎంట్రీ ఇస్తే విని యోగం గణనీయంగా పెరుగుతుందన్నది నిపుణుల మాట.మఖానా.. మజాకా...ఆరోగ్యకరమైన స్నాక్స్ మార్కెట్లో మార్పునకు మఖానా నాయకత్వం వహిస్తోందని ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ (ఐబీఈఎఫ్) చెబుతోం ది. ప్యాకేజ్డ్ మఖానా మార్కెట్ రాబోయే 2-3 ఏళ్లలో ఒక బిలియన్ డాలర్లకు చేరుతుందని వ్యాపా రుల అంచనా. ప్రస్తుతం దేశంలో 80,000 టన్నులమఖానా పండుతోందని సమాచారం. దీని విలువ హోల్ సేల్ మార్కెట్లో 700 మిలియన్ డాలర్లు. మఖానా పరిశ్రమను ప్రోత్సహించేందుకు 2025- 28 బడ్జెట్లో రూ.100 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.ముందున్న సవాల్...: ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో విని యోగదారులు చాక్లెట్లను ఇష్టపడతారు. భారత్లో ఎక్కువగా.. ఉప్పుతో చేసిన వేయించిన స్నాక్స్ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. మనదేశంలో ఈ విభాగంలో ఎక్కువగా అమ్ముడయ్యే ఉత్పాదన 'భుజియా', సింగపూర్కు చెందిన మాక్ ఈ ఏడాది మార్చిలో హల్దిరామ్ స్నాక్స్ ఫుడ్స్లో10% వాటాను దాదాపు 1 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. దీన్నిబట్టి స్నాక్స్క ఉన్న డిమాండ్ను అర్థం చేసుకోవచ్చు. ప్రధాన బ్రాండ్లు తమ ఉత్పత్తి శ్రేణిలో చిరుధాన్యాలను చేర్చడం ద్వారా ఎక్కువ మంది కస్టమర్లను చేరడానికి ప్రయత్నిస్తున్నాయి.మార్కెట్ విలువ రూ. 42 వేల కోట్లకు పైనే!కోవిడ్-19 సమయంలో అందరికీ ఆరోగ్య స్పృహ పెరగడంతో.. సంప్రదాయ ఆరోగ్య ఉత్పత్తులవైపు మళ్లారు. ఇది చిరు ధాన్యాల వినియోగాన్నిపెంచేందుకు దోహదపడింది.భారత స్నాక్స్ మార్కెట్ 2023 నాటికి రూ.42,695 కోట్లు, 2032 నాటికి ఇది రూ.95,522 కోట్లకు చేరుకుంటుందని అంచనా. > 2024-32 మధ్యకాలంలో 9.08% వార్షిక వృద్ధి రేటుతో ఆరోగ్యకరమైన స్నాక్స్ విపణి విస్తరిస్తుందని పరిశోధనా సంస్థ ఐఎంఏఆర్సి గ్రూప్ అంటోంది.చిరుతిళ్లు, ధాన్యాలు, పప్పుల వంటి వాటి విక్రయం లో ఉన్న 'ఫామ్' ఈ ఏడాది చేపట్టిన సర్వేలో 6,000 మంది భారతీయ వినియోగదారులు పాలుపంచుకున్నారు. అధిక ప్రొటీన్, శక్తి వంటి ప్రయోజనాలు అందించే ఆరోగ్యకరమైన స్నాక్స్ కోసం కస్టమర్లు ఎక్కువగా చూస్తున్నారని ఈ సర్వేలో తేలింది.రూకమ్ క్యాపిటల్' సంస్థ దేశంలోని 18 రాష్ట్రాల్లో 5,000 మందిపై నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో.. చిరుధాన్యాలు, డ్రైఫ్రూట్స్ వంటి వాటితో చేసిన ఆరో గ్యకరమైన స్నాక్స్ కావాలని సగానికిపైగా చెప్పారు. -
జోరు వర్షంలోనూ ఆగని గర్భా నృత్యం..!
దసరా వేడుక కొన్ని చోట్ల విశేషమైన ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఆ సంప్రదాయలకు అనుగుణంగా జరిగే పూజ ఆచారాల కారణంగానే అవి వార్తల్లో నిలుస్తాయి. కొన్ని చోట్ల గర్భా, దాండియా వంటి నృత్యాలతో జరుపుకుంటే..మరికొన్ని చోట్ల నైవేద్యాల పరంగా విశిష్టతను కలిగి ఉంటాయి. జనసందోహంతో ఘనంగా జరుపుకుంటున్న పండుగ సమయంలో అనుకోని అతిథిలా వర్షం వస్తే..అబ్బా ఎంత పనిచేసిందంటూ..తల తడవకుండా ఏదో ఒకటి అడ్డు పెట్టుకుని సమీపంలోని చెట్ల వద్దకు, లేదా ఇళ్లు/షెడ్డు వద్దకు వస్తాం. కానీ ఈ వ్యక్తి పండుగ సంబరం ఆగకూడదు..ఆ సరదా పోకూడదనుకున్నాడేమో అంతటి జోరు వర్షంలోనూ అలా గర్భా నృత్యం చేస్తూనే ఉన్నాడు. ఎంత అద్భుతంగా ఉందంటే దటీజ్ గర్భా పవర్ అన్నట్లుగా ఉంది. అందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారడమే కాదు, నెటిజన్లను తెగా ఆకర్షించింది. ఆ వీడియోలో చత్తీస్గఢ్కు చెందిన వ్యక్తి సంప్రదాయ బ్లాక్ కలర్ డ్రస్ ధరించి, కుండపోత వర్షంలో కూడా ఆగకుండా గర్భా నృత్యం చేస్తున్న కమనీయ దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా, గుజరాత్ నవరాత్రి వేడుకలకు పెట్టింది పేరు. పైగా ఇక్కడ జరిగే గర్భా రాత్రులు అత్యంత ప్రజాదరణ కలిగినవి. రంగురంగుల సంప్రదాయ దుస్తులతో చేసే గర్భా నృత్యాలు ప్రజలందర్నీ అమితంగా ఆకర్షిస్తాయి. అందులోనూ ఈ ఏడాది పదిరోజులు కాకుండా పదకొండు రోజుల కావడంతో మరింత వైభవోపేతంగా చాలాపెద్ద పెద్ద గర్భారాత్రులు నిర్వహిస్తున్నారు కొందరు. View this post on Instagram A post shared by Parth Suri (@parth_suri) (చదవండి: ఫస్ట్ డే డ్యూటీ హైరానా..! వైరల్గా బస్సు కండక్టర్ స్టోరీ..) -
ఫస్ట్ డే డ్యూటీ హైరానా..! వైరల్గా బస్సు కండక్టర్ స్టోరీ..
ఫస్ట్డే డ్యూటీ ఎవ్వరికైనా భయంగానే ఉంటుంది. ఆరోజు కొత్తగా విధుల్లోకి రావడం..ఎలా ప్రవర్తించాలి, ఉండాలి వంటి వాటి గురించి చాలా ఆందోళనగా ఉంటుంది. ఆ ఒత్తిడి మొత్తం.. అవతలి వ్యక్తి ఆ రెండు అక్షరాలకు కట్టుబడి స్పందించిన తీరుతోనే ఉఫ్మని ఎగిరిపోతుంది. అలాంటి సమయంలోనే ఆ పదం అర్థం, విలువ తెలుసొస్తుంది. నెట్టింట వైరల్గా మారిన కండక్టర్ ఫస్ట్ డే డ్యూటీ స్టోరీ..ఓ గొప్ప పాఠాన్ని నేర్పిస్తోంది. చూడటానికి మనకు సామాన్యంగా కనిపించే కొన్ని పదాలు, గొప్ప అర్థాన్ని, అమూల్యమైన పాఠాలను బోధిస్తాయి. అలాంటి ఘటనే బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరు బీఎంటీసీ వజ్ర బస్సులో కొత్తగా కండక్టుర్ జాయిన్ అయ్యాడు ఒక వ్యక్తి. తొలిరోజు డ్యూటీ కావడంతో చాలా ఆందోళనకు గురయ్యాడు. ఆ రూట్ వైపు టిక్కెట్లు ఇచ్చే విషయమై చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు. అయితే కొత్తగా వచ్చిన ఈ కండక్టర్కి మద్దతు తెలుపుతూ..సైలెంట్గా ప్రోత్సహించాడు ఆ బస్సు డ్రైవర్. ఎక్కిన జనాలందరికి టికెట్లు ఇచ్చేంతవరకు ఆపి..పోనిచ్చేవాడుడ డ్రైవర్. అలాగే ఎక్కిన ప్రయాణికులు కూడా అతడు ఆలస్యంగా టికెట్లు ఇస్తున్నాడని, ఓకింత అసహనానికి గురైనా..అతడి బాధను అర్థం చేసుకుని సహకరించారు. పైగా వచ్చే తదుపరి స్టాప్లలో జనం ఎక్కుతారని..ఇక్కడ నుంచి ఇంత ఖరీదంటూ కండెక్టర్కి సహాయం చేశారు కొందరు ప్రయాణికులు. నిశబ్దంగా వారంతా అందించిన ప్రోత్సాహం..అతడిలో నూతన ఉత్సాహాన్ని నింపి, మొత్తం టెన్షన్ ఉఫ్మని ఎగిరిపోయేలా చేశారు. ఏ వ్యక్తిలో అయినా ఆందోళన పోగొట్టాలంటే దయతో కూడిన సానుభూతి, ఓర్పుగా వ్యవహరించడమే అని ఆ ప్రయాణికులు, బస్సు డ్రైవర్ తమ చేతలతో తెలియ చెప్పారు. అక్కడకి ఓ ప్రయాణికుడు కొత్తగా డ్యూటీలోకి జాయిన్ అయ్యావా..? అని ప్రశాంతంగా అడిగిన తీరు కూడా అతనిలో ఆందోళన మొత్తం ఎగిరిపోయేలా చేసింది. పైగా ఆ వ్యాఖ్య కాస్త దయతో మిగతావారందరు సహాయం చేసేందుకు ఉపకరించింది. మనం నిశబ్దంగా అందించే ప్రోత్సాహం, ఓర్పు నుంచి కరుణ పుట్టుకొస్తుందని అవగతమయ్యేలా చేశారు. నిజానికి నటనతో కరుణను వ్యక్తపరచడం అనేది అసాధ్యమని ఈ ఘటన చెప్పకనే చెబుతోంది. అంతా క్షణాల్లో జరిగిపోవాలనే ఏఐ టెక్నాలజీ యుగంలో ప్రతి ఒక్కరికి అయ్యిందానికి, కానిదానికి కస్సుబుస్సులాడటం అలవాటైపోయింది. ఓపిక అనే పదం ఎగిరిపోయింది. తరుణంలో ఈ ఘటన అందరిని ఆలోచింపచేసేలా పాత రోజుల్లోకి తీసుకెళ్లిందంటూ నెటజన్లు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. ఒక ప్రముఖ సంస్థలో జాయిన్ అయ్యిన కొత్త ఉద్యోగైనా.. అతడికి నిశబ్దంగా ఇలాంటి ప్రోత్సాహం అందిస్తే..అద్భుతాలు చేస్తారు, వాళ్ల టాలెంట్ని వెలికితీయగలుగుతారు అనేందుకు నిదర్శనమే ఈ అరుదైన ఘటన. (చదవండి: ఆక్సిజన్ సిలిండర్ లేకుండా ఎవరెస్టుని అధిరోహించిన తొలి వ్యక్తి..! రెండుసార్లు ఫెయిలైనా..) -
ఫ్యామిలీ మొత్తం.. అక్కడే చదివారు!
ఉన్నతవిద్య అభ్యసించడానికి వారికి పరిస్థితులు అనుకూలించలేదు.. సంప్రదాయ విద్యను కొనసాగించే అవకాశమూ ఆ కుటుంబ సభ్యులకు కలగలేదు. కుటుంబ స్థితిగతుల నేపథ్యంలో చిరు ఉద్యోగంలో చేరి ఆ తర్వాత వివాహం, భార్య, పిల్లలు పోషణతో చదువుకు దూరమైన ఓ వ్యక్తి పట్టుదలగా అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నతవిద్యను అభ్యసించారు. అంతే కాకుండా భార్య, పిల్లలను కూడా అదే వర్సిటీలో ఉన్నత చదువులు చదివించారు. ఒకే కుటుంబంలోని (entire family) ఐదుగురి ఉన్నత విద్యకు అంబేడ్కర్ వర్సిటీ ఆలంబనగా నిలిచింది. ఇదీ ఓ సార్వత్రిక కుటుంబం కథ. వివరాలు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతికి చెందిన ఎస్.శ్రీధర్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో (TTD Board) చిరు ఉద్యోగి. కుటుంబ స్థితిగతులు కొంత మెరుగయ్యాక అంబేడ్కర్ సార్వత్రిక విద్యాలయంలో డిగ్రీలో చేరి ఉత్తీర్ణులయ్యారు. శ్రీధర్ బాటలో భార్య ఉమాదేవి కూడా పయనించి డిగ్రీ పట్టభద్రులయ్యారు. కుమారుడు కార్తీక్ కూడా అదే వర్సిటీ నుంచి ఎం.కామ్ పూర్తి చేసి అధ్యాపకుడిగా కొనసాగుతున్నారు. పెద్ద కుమార్తె ఎస్.విద్య కూడా సార్వత్రిక విద్యాలయం నుంచి ఎమ్మెస్సీ సైకాలజీ పూర్తి చేశారు. చిన్న కుమార్తె గాయత్రి కూడా ఈ వర్సిటీ నుంచే ఎం.కామ్ (M.Com) చదివి బంగారు పతకానికి ఎంపికైంది. కుటుంబ సభ్యులందరికీ అంబేడ్కర్ సార్వత్రిక విద్యాలయం బాసటగా నిలిచి వారి పురోగతికి దోహదపడింది. లక్ష్యసాధనలో వెనుకడుగు వేయొద్దు.. లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత వెనుకడుగు వేయవద్దని అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ బంగారు పతక గ్రహీత ఎస్.గాయత్రీ అన్నారు. వర్సిటీ తిరుపతి అధ్యయన కేంద్రంలో ఎం.కామ్లో అత్యధిక మార్కులు సాధించడంతో భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రయోజిత బంగారు పతకానికి (Gold Medal) ఆమె ఎంపికైంది. బుధవారం జూబ్లీహిల్స్లోని విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగిన స్నాతకోత్సవంలో ఆమెకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బంగారు పతకాన్ని అందించారు.చదవండి: గ్రూప్ 1 ఉద్యోగాల్లో 66 శాతం మంది వారే! -
ఆక్సిజన్ సిలిండర్ లేకుండా ఎవరెస్టుని అధిరోహించిన తొలి వ్యక్తి..!
ఎవరెస్టు శిఖరం అధిరోహించడం అనేది ఔత్సాహిక పర్వతారోహకులకు అపురూపమైన కల. ఆ క్రమంలో ప్రాణాలు కోల్పోయిన వారెందదో ఉన్నారు కూడా. అయినా ఆ పర్వతాన్ని అధిరోహించాలనే క్రేజ్ మాత్రం తగ్గదు పర్వతారోహకులకు. పైగా అక్కడి కఠినమైన వాతావరణ పరిస్థితులు అందుకు తగ్గట్టుగా ఉండే ఎముకల కొరికే చలి వంటి పరిస్థితులన్నింటినీ ఓర్చుకుంటూ అధిరోహించడం అంత ఈజీ కాదు. అలాంటిది ఆక్సిజన్ సిలిండర్ లేకుండానే అధిరోహించాడు ఈ 37 ఏళ్ల వ్యక్తి. పైగా అక్కడ స్కీయింగా కూడా చేయడం మరింత విశేషం.అతడే పోలాండ్ దేశానికి చెందిన ఆండ్రెజ్ బార్గియల్. గతంలో అతడికి రెండు మూడుసార్లు ఇదే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించే ప్రయత్నాలను మధ్యలోనే విరమించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. అయినా వెరవక మూడో ప్రయంత్నంలో దాదాపు 8,849 మీటర్లు (29,032 అడుగులు) ఎత్తులో ఉన్న ఈ ఎత్తైన ఎవరెస్టు పర్వతాన్ని ఆక్సిజన్ సపోర్టు కూడా లేకుండా విజయవంతంగా అధిరోహించి చరిత్ర సృష్టించాడు. శరదృతువులో మరింత క్లిష్టతరం ఉండే సమయంలో ఈ పర్వతాన్ని అధిరోహించి అందర్ని ఆశ్చర్యపోయేలా చేసే అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. ఈ మేరకు బార్గియల్ మాట్లాడుతూ.. ఈ సాహసాన్ని తన క్రీడా జీవితంలో అత్యంత ముఖ్యమైన మెలురాయిగా అభివర్ణించాడు. ఈ శిఖరాన్ని అధిరోహించే మార్గం ఎంత క్లిష్టతరమైందో కూడా వివరించాడు. ఏదేమైతేనేం..చివరికి అధిరోహించడమే గాక అంత ఎత్తులో చాలాసేపు గడిపాడు. పైగా అక్కడే స్కీయింగ్ చేయాలన్నది తన డ్రీమ్ అని, అది అనుకోకుండా ఇవాళ సాకారమైందని సంతోషం వ్యక్తం చేశాడు. అలాగే తాను కష్టతరమైన శరదృతువులో ఖంబు హిమనీనదం ద్వారా అవరోహణ రేఖ నుంచి అధిరోహించే ప్లాన్ చేయడమనేది ఎంత పెద్ద సవాలో కూడా తనకు తెలసునని చెప్పుకొచ్చాడు బార్గియల్ఎలా సాగిందంటే..ఆయన ఈ ఎవరెస్టు శిఖరాన్ని సెప్టెంబర్ 19న నేపాల్లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుంచి ప్రారంభించారు. అలా మొత్తం క్యాంప్లు I, II, III గుండా ఎక్కినట్లు తెలిపారు. ఇక సెప్టెంబర్ 21న క్యాంప్ IV నుంచి పర్వతం డెత్జోన్కి చేరుకున్నానని, ఇది సముద్ర మట్టానికి దాదాపు ఎనిమిది వేల మీటర్లు పైనే ఉంటుందని అన్నారు. అక్కడ ఆక్సిజన్ స్థాయిలు చాలా ప్రమాదకర స్థాయిలో ఉంటాయన్నారు. అక్కడ నుంచి సుమారు 16 గంటల అధిరోహణ అనంతరం సెప్టెంబర్ 22కి శిఖరాన్ని చేరుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత మంగళవారం తెల్లవారుజామున ఎవరెస్టు శిఖరం అత్యంత ప్రమాదకరమైన విభాగాలలో ఒకటిగా పేర్కొనే ఖంబు ఐస్ఫాల్ గుండా స్కీయింగ్ చేసి బేస్ క్యాంపుకు చేరుకున్నాడు. అక్కడ అతనికి తన సోదరడు బార్టెక్ ఎగరువేసిన డ్రోన్ మార్గనిర్దేశం చేసినట్లు చెప్పుకొచ్చారు. నిజంగా అత్యంత ఎత్తైన పర్వతంగా పిలిచే ఈ ఎవరెస్టుని అధిరోహించడమే గ్రేట్ అంటే బార్గియల్ ఆక్సిజన్ బాటిల్ లేకుండా అధిరోహించడమే కాకుండా స్కీయింగ్ కూడా చేసి సరికొత్త రికార్డుని నెలకొల్పారు. View this post on Instagram A post shared by Andrzej Bargiel (@andrzejbargiel) (చదవండి: నవరాత్రుల సమయంలో అరుదైన దృశ్యం..! దుర్గమ్మ ఆలయానికి కాపాలాగా..) -
పారిస్ ఫ్యాషన్ వీక్ : ఐశ్వర్యా డాజ్లింగ్ లుక్ వెనుకున్న సీక్రెట్ ఇదే!
అందాల ఐశ్వర్యం ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan ) పారిస్ ఫ్యాషన్ వీక్ (Paris Fashion Week) లో తళుక్కున మెరిసింది. ప్రముఖ భారతీయ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తుల్లో 51 ఏళ్ల వయసులో కూడా మెరిసిపోయింది .పారిస్ ఫ్యాషన్ వీక్ ఉమెన్స్ రెడీ-టు-వేర్ స్ప్రింగ్-సమ్మర్ 2026 కలెక్షన్లో భాగమైన "లిబర్టే, ఎగలైట్, సోరోరైట్ (లిబర్టీ, ఈక్వాలిటీ, సిస్టర్హుడ్)" షో కోసం గ్లోబల్ బ్రాండ్ లోరియల్ పారిస్ తరపున ఐశ్వర్య రాయ్ ర్యాంప్పై నడిచారు.భారతీయ హస్తకళను ప్రపంచ వేదికకు తీసుకెళ్లిన ఈ గ్లోబల్ ఐకాన్ మరోసారి భారతీయ దుస్తుల వైభవాన్ని చాటి చెప్పారు. View this post on Instagram A post shared by Manish Malhotra (@manishmalhotra05) ప్రముఖ భారతీయ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన (Manish Malhotra. )అద్భుతమైన బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఇండిగోలో కస్టమ్-మేడ్ ఇండియన్ షేర్వానీలో ఐష్ లుక్ అదిరిపోయింది. మనీష్ మల్హోత్రా తన ఇన్స్టాగ్రామ్లో ఈ దుస్తుల వివరాలను పంచుకున్నారు. ఇది పారిస్ ఫ్యాషన్ వీక్ గొప్పతనాన్ని అందిస్తుందన్నారు. ఈ డిజైనర్ ఈ దుస్తులలో "10-అంగుళాల డైమండ్-ఎంబ్రాయిడరీ కఫ్లు, విలాసవంతమైన నెక్లెస్ లాగా పొడవైన లేయర్డ్ డైమండ్ స్కాలోప్లు, డైమండ్ టాసెల్ డ్రాప్ మరియు డైమండ్-స్టడ్డ్ యానిమల్ బ్రోచెస్" ఉన్నాయి..నటి ధరించిన షేర్వానీలో వజ్రం-స్టడ్డ్ బటన్లతో స్ప్లిట్ నెక్లైన్తో కూడిన ఎత్తైన బంధ్గాలా కాలర్ ఉంది. ప్యాడెడ్ భుజాలు, పూర్తి-పొడవు స్లీవ్లు, సైడ్ మరియు ఫ్రంట్ స్లిట్లు , బాడీ-హగ్గింగ్ సిల్హౌట్ దుస్తులకు ఫ్లేర్డ్ ప్యాంటు ఫిట్ జత చేశారు. వీటితోపాటు ఐశ్వర్య రాయ్ హై హీల్స్, డైమండ్ ఇయర్ స్టడ్లు మరియు స్టేట్మెంట్ డైమండ్ రింగులను ధరించారు. ఆమె జుట్టును వదులుగా వదిలి, ఆమె సిగ్నేచర్ స్టైల్లో ఒక వైపున విడదీసి, తన దుస్తులకు ఆర్కిటెక్చరల్ బోల్డ్నెస్కు రొమాంటిక్ టచ్ను జోడించి మరింత గ్లామర్గా మెరిసారు. -
అక్షరాన్ని అందిస్తూ...
దేశంలో సంపన్నులకే పరిమితమైన విద్యను సామాన్యుల దరికి చేర్చిన ఘనత అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాలకే దక్కింది. దేశంలో తొలి సార్వత్రిక విశ్వవిద్యాలయంగా 1982లో ఏర్పాటైనప్పటి నుంచి విద్యకు దూరమైన వారిని అక్కున చేర్చుకుంది. మొత్తం విద్యార్థుల్లో సగటున 85 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినవారు ఉన్నారు. స్త్రీలు విద్యావంతులు కావడంలోనూ ఎంతో కృషి చేస్తోంది. మొత్తం మీద యూనివర్సిటీ విద్యార్థుల్లో సగటున ఏటా 48 శాతం మంది మహిళలుఉంటున్నారు.Dr B.R. Ambedkar Open University (BRAOU) యూనివర్సిటీ ఈ ఏడాది (2025–26) నుంచి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ‘చదువుతూ సంపాదించు’ విధానంపై దృష్టి సారించారు. విద్యార్థులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి పొందేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చేలా ‘శ్రీ రామానందతీర్థ రూరల్ ఇనిస్టిట్యూట్’తో ఒప్పందం కుదుర్చుకుంది. యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు ఉచిత భోజన, వసతితో వివిధ అంశాల్లో రెండు నుంచి మూడు నెలలు ఈసంస్థలో శిక్షణ ఇస్తారు. కంప్యూటర్, ఆటోమొబైల్, సోలార్ విద్యుత్తు నుంచి అనేక రంగాలకు సంబంధించి వివిధ పరిశ్రమల్లో పనిచేయడానికి లేదా స్వయం ఉపాధి పొందడానికి అవసరమైన మెలకువలు, నైపుణ్యం సాధించేలా శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. అదే తరహాలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (నాక్)తోనూ యూనివర్సిటీ సంప్రతింపులు జరిపింది. నిర్మాణరంగానికి సంబంధించిన వివిధ విభాగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చే కార్యక్ర మానికి శ్రీకారం చుట్టనుందిచదవండి: Gorati Venkanna: పాటతల్లికి పెద్దకొడుకుయూనివర్సిటీ మహిళా విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడానికి వీలుగా ‘వీ హబ్’తో ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలోని అంగన్వాడీల్లో పనిచేసే సిబ్బంది నైపుణ్యాల్ని పెంపొందించేందుకు సర్టిఫికెట్, డిప్లమో ప్రోగ్రామ్స్ రూపొందించింది. మహిళా, శిశు సంక్షేమశాఖతో ఒప్పందం కుదుర్చుకుని ఆ ప్రోగ్రామ్ను ప్రారంభించనున్నారు. ఈ విద్యా సంవత్సరం (2025– 26) నుంచి గిరిజన విద్యార్థులకు, వికలాంగులు, ట్రాన్స్ జెండర్స్కు ఉచిత విద్య అందించనున్నది. సైనికులకూ, ఖైదీలకూ ఇప్పటికే విద్యను అందుబాటులోకి తెచ్చింది. యూనివర్సిటీ మంగళవారం తన 26వ స్నాతకోత్సవం జరుపుకొంటోంది. రెండు విద్యాసంవత్సరాలకు (2023–24, 2024–25) సంబంధించిన 60,288 మందికి డిగ్రీలు అందిస్తోంది. 55 మందికి డాక్టరేట్ పట్టాలుఅందించనున్నారు. ఇద్దరు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేయ నున్నారు. అందులో ఒకరు వాగ్గేయకారుడు గోరటి వెంకన్న కాగా మరొకరు ప్రఖ్యాత శాంతి విద్యా ప్రచారకులు ప్రేమ్ రావత్!– డా.ఎల్వీకే అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్, హైదరాబాద్(నేడు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 26వ స్నాతకోత్సవం) -
పుడమితల్లికి నీరాజనం
మానవుడు పుడమి తల్లి ముద్దుబిడ్డ. ఆమె అతగాడికి కన్నతల్లి కంటె మిన్న. తల్లి తన బిడ్డలనందరినీ సమానంగానే ప్రేమిస్తుంది. కానీ ప్రతి బిడ్డతోనూ ఆమె అనుబంధం ప్రత్యేకం. తన బిడ్డలలో అందరికంటె ఎక్కువ చురుకుతనమూ, బుద్ధిబలమూ, కార్యకుశలతా, ప్రయోజకత్వమూ ఉన్న మానవుడిని చూస్తే, పుడమితల్లి గుండె ఒకింత గర్వంతో పొంగితే... అది సహజమే. తన మేధతో, కృషితో,సృజన శక్తితో తల్లి అందించిన వనరుల విలువను మరింత చేయగల మహత్తరమైన శక్తి మనిషికి ఉంది. ఆమె నీటినిస్తే, అతగాడు దానిని ఇంకని, తరగని, శోభాయమానమైన జలాశయాలుగా మారుస్తాడు. ఆమె పచ్చి దినుసులు ప్రసాదిస్తే, అతడు వాటిని పంచభక్ష్య పరమాన్నాలుగా మార్చగలడు. ఆమె పిట్టపాట వినిపిస్తే, అతడు ఆ జాడలో మరింత శోధించి... భావ, రాగ, లయలతో సమగ్రమైన సంగీత ప్రపంచం సమకూర్చుకోగలడు. ఆమె పువ్వులు ప్రసాదిస్తే, అతడు వాటితో అద్భుతమైన ‘బతుకమ్మ’ సంబరాలు సృష్టించగలడు! ఆమె ప్రసాదించిన పూలకు తన బహుముఖమైన కళాత్మకత జోడించి, పువ్వుల పండగ జరిపి, ఆమెకే తిరిగి కన్నుల పండుగనూ, వీనుల విందునూ అందిస్తాడు. పుడమి తల్లి మనసు పులకరింపజేసి రుణం తీర్చుకొంటాడు.బతుకమ్మ సంబరం అంటే సాధారణంగా లభించే వనరులతో అసాధారణమైన అందాల పుష్పాకృతులను అమర్చి చేసే నేత్రోత్సవం. నిసర్గ సౌందర్యం తొణికిసలాడే అమ్మలక్కల ఆటల నృత్యోత్సవం. కృత్రిమత లేని పల్లె పడతుల పాటల తీపిని శ్రవణపేయంగా చెవులకు చేర్చే కర్ణోత్సవం. ఆత్మీయతలతో అలరారే, ఆదర్శమైన, సౌహార్ద విలసితమైన, సామాజిక జీవన మాధుర్యానికి అద్దం పట్టే సందర్భం. వికసితమైన బుద్ధిగల మానవుడు, తన వికాసానికి అన్నివిధాలా ఆధారభూతమైన ప్రకృతి మాత పట్ల ప్రగాఢమైన కృతజ్ఞతను ప్రదర్శించే వార్షికోత్సవం. సౌందర్యోపాసనలోనూ, పర్యావరణం పట్ల బాధ్యతలోనూ, సామాజిక సామరస్యం పట్ల నిబద్ధతలోనూ, తన ప్రత్యేకత ప్రదర్శిస్తూ, మనిషి వినయంగా మట్టితల్లికి సమర్పించే సాష్టాంగ ప్రణామం.– ఎం. మారుతి శాస్త్రి -
నవరాత్రుల సమయంలో అరుదైన దృశ్యం..! దుర్గమ్మ ఆలయానికి కాపాలాగా..
ఇప్పుడు బనానా ఏఐ నయా ట్రెండ్తో ఏది రియల్, ఏది ఫేక్ పోటో/వీడియోనో గుర్తించడం కష్టంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో నెట్టింట వైరల్ అవుతున్న వీడియో నెటిజన్లు నమ్మశక్యం కానీ గందరగోళానికి గురిచేసింది. అందులోనూ శరన్నవరాత్రుల సమయంలో ఇలాంటి కమనీయ దృశ్యం కంటపడితే..దుర్గమ మహిమ లేక ఇది నమ్మదగినది కాదో అన్న సందేహాలను లేవనెత్తింది భక్తుల్లో. చివరికి అది ఫేక్ కాదని తేలాక..ఒక్కసారిగా 'మా దుర్గ' అన్న నామస్మరణతో భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఇంతకీ ఏంటా అపురూపమైన దృశ్యం అంటే..ఒక దుర్గమ్మ ఆలయం వెలుపల కాపలా కాస్తున్న సింహం వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. మొదట చూడగానే అందరూ ఏఐ మాయ అనుకున్నారు. కానీ దాని గురించి సాక్షాత్తు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ షేర్ చేయడంతో అది రియల్ అని నమ్మారు. ఆ దైవిక దృశ్యం చూడటం అదృష్టం అన్నంతగా బావించారు నెటిజన్లు. ఒక్కసారిగా నెట్టింట ఆ ఆలయానికి ఆ సింహం రక్షణగా ఉందేమో అనే చర్చలు లేవనెత్తాయి. అయితే ఇది గిర్ అడవిలోనిదని, అక్కడ చాలా దుర్గమ్మ ఆలయాలు ఉన్నాయని, వాటికి కాపలాగా ఈ సింహలు ఉంటాయని ఓ నెటిజన్ పోస్ట్లో పేర్కొన్నాడు. అంతేగాదు గిర్ అటవీ ప్రాంతంలో తిరిగే ఈ సింహాలు మానవులపై దాడి చేసిన సందర్భాలు చాలా తక్కువేనని అన్నారు. అవి గుజరాత్లోని సౌరాష్ట్రా ప్రాంతంలో కనిపించే అరుదైన సింహ జాతిగా అని పేర్కొనన్నారు నెటిజన్లు. ఇక ఆ ప్రాంతంలోని సాంస్కృతిక సంప్రదాయాలకు ఆ వన్య ప్రాణులకు మధ్య ఉన్న బలమైన సంబంధాన్ని ఆ వీడియో హైలెట్ చేస్తోందని అన్నారు. కాగా, భారతదేశంలో సింహాల జనాభా 2020లో 674 కాగా, 2025 కల్లా 891కి చేరుకుంది. అంటే 70 శాతంపైగా సింహాల సంఖ్య పెరిగిందని ఇటీవలే కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించారు.What a divine sight. Look like that lioness is guarding the temple !! pic.twitter.com/bBlxlmKD4m— Parveen Kaswan, IFS (@ParveenKaswan) September 28, 2025 (చదవండి: అక్కడ అమ్మవారి నైవేద్యాన్ని పీర్లకు ప్రసాదంగా..! మతసామరస్యాన్ని ప్రతీకగా..) -
ప్లాస్టిక్లో ఇన్ని రకాలు... నిర్లక్ష్యం చేస్తే ముప్పే!
ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వాడకం చాలా సాధారణంగా మారిపోయింది. దీని వల్ల కలిగే దుష్ర్పభావాలు అన్నీ ఇన్నీకావు. తాజా పరిశోధనల ప్రకారం రోజుకు రోజుకు ఇవి మరింత మానవుల ఆరోగ్యాన్ని, పర్యావరణానికి మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. మరికొన్ని రకాల ప్లాస్టిక్లు ఆరోగ్యంపై వాటి దుష్ప్రభావాల గురించి తెలుసుకుందాం. ప్లాస్టిక్లు ఆరోగ్యంపై వాటి దుష్ప్రభావాలు మనం అన్నింటినీ కలిపి (బ్రాడ్గా) ప్లాస్టిక్ అని పిలిచే వాటిల్లో ఎన్నో రకాలున్నాయి. ఉదాహరణకు... పాలీ ఇథిలీన్ టెరెథాలేట్ (పీఈటీ) ఈ పదార్థంతో తయారైన సీసాలను మనం ‘పెట్ బాటిల్స్’ అంటాం. వీటిల్లో సాఫ్ట్డ్రింక్స్, జ్యూస్లు, నీళ్లు, మౌత్వాష్లు వంటివి ప్యాక్ చేస్తుంటారు. దీనివల్ల దీర్ఘకాలంలో శ్వాస సమస్యలు, చర్మంపై ఇరిటేషన్, మహిళల్లో రుతుసంబంధ వ్యాధులు కనిపిస్తంటాయి. కొన్నిసార్లు గర్భస్రావాలూ జరగవచ్చు. వీటితో మనకు ఏర్పడే దుష్ప్రభావాలూ / సమస్యలపై పరిశోధనలింకా సాగుతూనే ఉన్నాయి. హై డెన్సిటీ పాలీ ఇథిలీన్ (హెచ్డీపీఈ) పాల సీసాలు, బ్లీచ్లు, షాంపూసీసాలు, వంటనూనెలు, కిటికీల్ని శుభ్రపరిచే ద్రవాలు (విండోక్లీనర్స్), కొన్ని రకాల మందులను ప్యాకింగ్ ట్యూబ్ల తయారీలో ‘హెచ్డీపీఈ’ ఉపయోగిస్తారు. వీటితో చాలామందిలో అలర్జీలు, ఆస్తమా సమస్యలు వస్తున్నట్లుగా గుర్తించారు. కొందరిలో కాలేయం, కిడ్నీలు, స్ల్పీన్, ఎముకలపై దుష్ప్రభావాన్ని చూపుతాయి. లో–డెన్సిటీ పాలీ ఇథిలీన్ (ఎల్డీపీఈ) చాలా రకాల కిరాణా వస్తువుల ప్యాకింగ్లలో, బ్రెడ్, ఫ్రోజెన్ ఫుడ్ ఐటమ్స్ నిల్వ కోసం ఈ పదార్థాన్ని ఉపయోగిస్తుంటారు. దీన్నే సాఫ్ట్ ప్లాస్టిక్’ అని కూడా అంటరు. దీంతో చేసిన ప్యాకింగ్లోని పదార్థాలను తొలగించగానే ఇవి తేలిగ్గా ముడుచుకు పోతాయి. పాలీస్టైరీన్ (పీఎస్) వీటిని గుడ్లను నిల్వచేసే కార్టన్లు, డిస్పోజబుల్ కప్పులు, ప్లాస్టిక్తో చేసే స్పూనులు, ఫోర్కులు (కట్లెరీ), కాంపాక్ట్ డిస్కుల వంటి వాటి తయారీలో వాడుతారు. వీటితో నాడీవ్యవస్థపై, ప్రత్యుత్పత్తి వ్యవస్థపై, ఎర్రరక్తకణాలపైన ప్రభావం పడుతుంది. పాలీ ప్రొపిలీన్ (పీపీ)కెచప్ సీసాలు, పెరుగు ప్యాకింగ్, మార్జరిన్ అనే వంటనూనెలు, మందులు, సిరప్లు, పరాదర్శకం కాని కొన్ని మందుల్ని నిల్వ చేసే సీసాల తయారీకి వీటిని ఉపయోగిస్తుంటారు. మిగతా ప్లాస్టిక్లతో పోలిస్తే దీన్ని చాలావరకు సురక్షితమని అంటారుగానీ... దీనివల్ల కలిగే దుష్ప్రభావాలపై ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతమాత్రాన ఇది పూర్తిగా సురక్షితమని చెప్పడానికి వీలు లేదు. చదవండి: బరువు తగ్గడం కష్టంగా ఉందా? షాకింగ్ రీజన్ ఇదే కావచ్చు!థాలేట్స్తో తయారయ్యే వాటిల్లో కొన్ని... ఆహారంలో కలిసేందుకు అవకాశం ఉన్న మరో ప్లాస్టిక్ ఉపకరణాలు థాలేట్స్. (ఇంగ్లిష్లో థాలేట్స్ స్పెల్లింగ్కు ముందర ఉండే ‘పీ’ అక్షరం సైలెంట్ కాగా... కొందరు దీన్నే ఫ్తాతలేట్స్’ అని కూడా ఉచ్చరిస్తుంటారు). ప్లాస్టిక్ను ఎటుపడితే అటు ఒంచేందుకు (ఫ్లెక్సిబిలిటీ కోసం) ఉపయోగించే ΄ పాలీ వినైల్ క్లోరైడ్ (పీవీసీ) ఆహారంలో కలిసి దుష్ప్రభావాలను చూపుతాయి.థాలేట్స్ను ఏయే తయారీల్లో ఉపయోగిస్తారంటే...? ఆహారాన్ని ΄ ప్యాక్ చేసేందుకు వాడే బాక్స్ల కోసం. కూల్డ్రింక్స్ లేదా మంచినీటి సీసాల తయారీలో. ∙వాటర్ప్రూఫ్ కోట్లు, జాకెట్స్ వంటి దుస్తుల తయారీలో నీళ్ల పైపుల తయారీలో. పైకి తోలులా కనిపించే కొన్ని రకాల దుస్తుల తయారీలో. విద్యుత్ వైర్లపై ఉండే ఇన్సులేటింగ్ పదార్థాలలోఎలక్ట్రానిక్ వస్తువుల్లో, వినైల్ ఫ్లోరింగ్స్లో వాటర్బెడ్స్, పిల్లల ఆటవస్తువుల్లోఆరోగ్యంపై థాలేట్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు బైస్ఫినాల్ ఏ (బీపీఏ) లాగే ధాలేట్స్ కూడా టెస్టోస్టెరాన్ వంటి పురుష సెక్స్ హార్మోన్పై దుష్ప్రభావం చూపుతాయి. వీటి వల్ల పురుషుల్లో వీర్యం నాణ్యత (స్పెర్మ్ క్వాలిటీ) కూడా దెబ్బతింటుంది. ప్లాస్టిక్తో కలిసిన ఆహారం వల్ల అలర్జీలు, ఆస్తమా, పిల్లికూతలు రావచ్చు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి లేదా ఒకవేళ వాడుతున్నప్పటికీ... చాలావరకు వాటిని సురక్షితంగా మలచుకోడానికి కొన్ని సూచనలివే... ప్లాస్టిక్ వస్తువుల తయారీలో బైస్ఫినాల్ ఏ లేనివి (బీపీఏ ఫ్రీ) అని రాసి ఉన్న వాటిని మాత్రమే వాడాలి. ఇదీ చదవండి: ఈ టిప్స్ పాటిస్తే పండగ వేళ మెరిసిపోవడం ఖాయం!నిర్వహణ : యాసీన్ -
విదేశీ పూలతో వింతగా..!
తెలంగాణలోనే అత్యంత ఖరీదైన బతుకమ్మను పేర్చి కూకట్పల్లికి చెందిన పలువురు అబ్బురపరుస్తున్నారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని కూకట్పల్లికి చెందిన గుండాల అర్చన విదేశాల నుంచి పూలను తెప్పించి గత మూడేళ్లుగా వింతగా బతుకమ్మను పేరుస్తున్నారు. మొదట తామర పువ్వు ఆకారంలోనూ, రెండో ఏడాది హంస ఆకారంలోనూ, ఈ ఏడాది ఏనుగు బొమ్మలతో కూడిన బతుకమ్మను పేర్చి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈసారి బతుకమ్మ కోసం థాయిలాండ్ ఆర్చిడ్స్, సింగపూర్ రోజెస్, బ్యాంకాక్ కాచెన్స్, బెంగళూరు బెజస్, హిమాచల్ప్రదేశ్, ఢిల్లీ నుంచి జిప్సోమియా పూలను తెప్పించినట్లు చెబుతున్నారు. ఆకట్టుకున్న ‘భక్తి శక్తి’ నవరాత్రుల అర్థాన్ని బెంగళూరుకు చెందిన కూచిపూడి కళాకారులు నృత్యరూపకంలో ప్రదర్శించి ఆకట్టుకున్నారు. రవీంద్ర భారతిలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న సంగీత నృత్యోత్సవాలు– బతుకమ్మ సంబరాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు నాట్య గురువు వీణా మూర్తి విజయ్ శిష్య బృందం భక్తి శక్తి పేరిట ప్రదర్శించిన కూచిపూడి దృశ్యాంశాలు వీక్షకులను సమ్మోహన పరిచాయి. పవిత్ర జలం, రంగోలి, ధూపం, దీపం, జాజ్రాలతో వేదికను శుద్ధి చేసే నృత్యం ఆసక్తికరంగా సాగింది. అదేవిధంగా నర్తకి శ్యామక్రిష్ణ, జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నవదుర్గ తోలుబొమ్మలాట ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ డాక్టర్ అలేఖ్య పుంజాల, ఆర్ వినోద్ కుమార్ పలువురు కళాకారులు పాల్గొన్నారు. (చదవండి: విరామ భోగ్‘: అక్కడ నైవేద్యాన్ని అమ్మవారే స్వయంగా..!) -
బరువు తగ్గడం కష్టంగా ఉందా? షాకింగ్ రీజన్ ఇదే కావచ్చు!
మనం ఉపయోగించే షాంపూ బాటిల్ సైతం మన బరువును పెంచే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. కేవలం షాంపూ బాటిల్ మాత్రమే కాదు... షవర్ జెల్, హెయిర్ కండిషనింగ్ క్రీమ్ లాంటి వాటిని ΄్యాక్ చేసే కొన్ని సీసాలతో పాటు తిరిగి మాటిమాటికీ భర్తీ చేసుకోడానికి అవకాశమున్న డ్రింకింగ్ బాటిళ్లలో ఉండే ప్లాస్టిక్ కూడా బరువు పెరగడానికి కారణమవుతోందన్న విషయాన్ని గత కొద్దిరోజుల ముందర నార్వేలోని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ నిర్వహించిన ఓ పరిశోధనతో తెలిసింది. ఈ అధ్యయనంలో భాగంగా 629 రకాల వివిధ ప్లాస్టిక్ వస్తువుల్లో ఉంచిన దాదాపు 55,000 రకాల రసాయనాలను పరీక్షించారు. వీటిల్లో పదకొండు రకాల రసాయనాలు బరువు పెరగడానికి కారణ మవుతాయని తేలిందని పరిశోధనకు నేతృత్వం వహించిన, ఆ సంస్థకు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ మార్టిన్ వేజ్నర్ తెలిపారు. ఆ ప్లాస్టిక్ సీసాలను ఉపయోగించినప్పుడు మన దేహంలోకి ప్రవేశించే ఆ పదకొండు రకాల రసాయనాల వల్ల బరువు పెరుగుతుండటంతో వాటిని ‘ఒబిసోజెన్స్’ (Obesogens) అని పేర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా బైస్ఫినాల్–ఏ వంటి ‘ఒబిసోజెన్స్’ మన దేహంలోని జీవరసాయన ప్రక్రియల్లో జోక్యం చేసుకోవడంతో పాటు కొవ్వు నిండి ఉండే ఫ్యాట్ సెల్స్ను పెరిగిపోయేలా చేయడం వల్ల దేహం బరువు అకస్మాత్తుగా పెరుగుతోందని ఈ అధ్యయనంలో పాల్గొన్న మరో పరిశోధకుడు జొహన్నేస్ వోకర్ తెలిపారు. అంటే ఇప్పటివరకూ ప్లాస్టిక్ పర్యావరణానికి హానికరమని, అలాగే బైస్ఫినాల్–ఏ, థ్యాలేట్స్ వంటి ప్లాస్టిక్స్ వల్ల అనేక నాడీ సంబంధమైనవి, వ్యాధినిరోధకతను తగ్గించేవి, ప్రత్యుత్పత్తి వ్యవస్థను దెబ్బతీసేలాంటి అనారోగ్యాలు కలగడమే కాదు... ఇప్పుడు తాజాగా బరువు పెరిగేలా చేయడం ద్వారా కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని స్పష్టమైంది. బరువు పెరగడం వల్ల... స్థూలకాయం కారణంగా ఆరోగ్యపరంగా అనేక అనర్థాలు వస్తాయనే విషయం తెలిసిందే. ఈ అధ్యయన వివరాలన్నీ‘ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ అనే ప్రముఖ జర్నల్ లో ప్రచురితమయ్యాయి.బరువు పెంచి ఒబేసిటీని కలిగిస్తోంది కాబట్టి ఆ ప్లాస్టిక్ పదార్థాలకు ‘ఒబిసోజెన్స్’ అని పేరు! ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి లేదా ఒకవేళ వాడుతున్నప్పటికీ... చాలావరకు వాటిని సురక్షితంగా మలచుకోడానికి కొన్ని సూచనలివే..ప్లాస్టిక్ వస్తువుల తయారీలో బైస్ఫినాల్ ఏ లేనివి (బీపీఏ ఫ్రీ) అని రాసి ఉన్న వాటిని మాత్రమే వాడాలి. ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించాల్సి వస్తే... వాటిపై ‘మైక్రోవేవ్ సేఫ్’ అని రాసి ఉన్నవే వాడాలి. అవి మైక్రోవేవ్ ఒవెన్లో పెట్టినా కరగవు. లేకపోతే ఆ ఉష్ణోగ్రత వద్ద ప్లాస్టిక్ ఎంతో కొంత కరిగి ఆహారంలో కలిసి ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని గుర్తుంచుకోవాలి. ప్లాస్టిక్ వస్తువులను కఠినమైన డిటర్జెంట్స్ మోతాదులు ఎక్కువగా ఉండే డిష్వాషర్స్లో ఎక్కువసేపు నానబెట్టి ఉంచడం సరికాదు. పిల్లల పాలకోసం గ్లాస్తో చేసిన ప్లాల సీసాలు ఉపయోగించడమే మంచిది. ప్లాస్టిక్ సీసాలు ఉపయోగించే ప్పుడు వాటిలో వేడి వేడి పాలు పోయకూడదు. ఆహారాన్ని ఉంచడం కోసం ప్లాస్టిక్ డబ్బాల కంటే స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు మంచివని గుర్తుంచుకోవాలి. కొన్ని లంచ్బాక్స్లు మూత సాగినట్లుగానూ, కింద ఉన్న కంటెయినర్ కాస్త సాగిపోయి షేప్ చెడిపోయినట్లు గానూ ఉంటాయి. ఇలా సాగి ఉన్నట్లుగా ఉన్న ఆహారపు డబ్బాలను ఏమాత్రం ఉపయోగించ కూడదు. చదవండి: ఈ టిప్స్ పాటిస్తే పండగ వేళ మెరిసిపోవడం ఖాయం!ఇక మనం రోజూ నీళ్లను నిల్వ చేసుకోడానికి ఉపయోగించే ప్లాస్టిక్ డ్రమ్ముల వంటి వాటిని కేవలం నీళ్ల నిల్వ కోసం తయారు చేసినవాటినే ఉపయోగించాలి. అయితే చాలామంది కొన్ని రకాల రసాయనాలను (కెమికల్స్) నిల్వ ఉంచడానికి వాడిన వాటిని కడిగి వాటిని నీళ్ల నిల్వ కోసం వాడుతుంటారు. ఇలాంటివి కూడా అంత మంచిది కాదు. -
ఐదేళ్ల వయసుకే చిన్నారి అవినా అరుదైన ఘనత..!
ఆ చిన్నారి వయసు ఐదేళ్లు.. అయితేనేం పనికిరాని వ్యర్థాలతో అద్భుతాలు సృష్టించింది.. బుజ్జి మెదడుకు పదునుపెట్టి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.. తల్లిదండ్రుల నుంచి వచ్చిన సేవాతత్పరత, సామాజిక బాధ్యతను ఒంటబట్టించుకుంది. అనాథ పిల్లల కోసం వారు చేస్తున్న సేవలో తన పాత్రను గుర్తించి వ్యర్థాలతో చిన్నారులకు బట్టలు తయారుచేసింది. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. కాప్రా సాకేత్కు చెందిన పొట్టపాటి ప్రవీణ్కుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. భార్య తేజస్విని సోషల్ వర్కర్గా పనిచేస్తున్నారు. వీరి ఐదేళ్ల కుమార్తె అవినా పొట్టపాటి బిల్లబాంగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో యూకేజీ చదువుతోంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే తల్లిదండ్రులతో పాటుగా అవినా కూడ తరచూ వారితో కలిసి వెళ్లేది. ఈ క్రమంలో తన వయసున్న తోటి పిల్లలకు సరైన దుస్తులు లేకపోవడం, చెప్పులు లేకపోవడం గమనించింది. వారికి తనవంతుగా ఎమైనా సాయం చేయాలనే తలంపుతో వ్యర్థాలతో దుస్తులు తయారు చేయడం మొదలుపెట్టింది. మూడేళ్ల వయసు నుంచే ఇంట్లో ఫ్లాసిక్ బ్యాగులు, ఫ్లాస్టిక్ కవర్లు, పేపర్ బ్యాగులతో దుస్తులు, చెప్పులు వంటి వస్తువులను తయారు చేయడం ప్రారంభించింది. కుమార్తె ఆసక్తిని గమనించి.. చిన్నారి ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు అవినాను ప్రోత్సహించారు. ఆమె మేధస్సుకు పదును పెట్టి ఫ్లాస్టిక్ వ్యర్థాలతో పలు రకాల దుస్తులను తయారు చేసింది. తమ కూతురు ప్రతిభకు గుర్తింపు ఇవ్వాలనే కోరిక వ్యర్థాలతో తయారు చేసిన దుస్తులను ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి పంపించారు. పలుమార్లు చేసిన ప్రయత్నం ఫలించి ఎట్టకేలకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ఆహా్వనం పొందారు. చిన్నారి అవినా అందరి సమక్షంలో ఫ్లాస్టిక్, పేపర్ వ్యర్థాలతో 7 రకాల అందమైన దుస్తులను తయారు ఆశ్చర్యపరించింది. అవినా సృజనను ప్రశంసిస్తూ ఆమెకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం కల్పించారు. చాలా గర్వంగా ఉంది.. అతి చిన్న వయసులో మా కుమార్తె ఇలాంటి రికార్డు దక్కించుకోవడం సంతోషంగా ఉంది. మూడేళ్ల వయసు నుంచే వ్యర్థాలతో ఏదో ఒకటి తయారు చేస్తూ ఉండేది. ఆ ఆసక్తిని గమనించి ప్రోత్సహించాం. తన ప్రతిభను గుర్తించి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం కల్పించారు. అవినా ప్రతిభ పర్యావరణ పరిరక్షణకు దోహదం చేయడం సంతోషం కలిగించింది. – పొట్టపాటి ప్రవీణ్కుమార్, తేజస్విని దంపతులు (తల్లిదండ్రులు) -
ఇకనైనా కళ్లు తెరవకపోతే....నిలువునా మింగేస్తుంది!
నిజం చెప్పాలంటే మనమిప్పుడు ప్లాస్టిక్ మహాసముద్రం మధ్యలో జీవిస్తున్నాం. ఇది అతిశయోక్తిగా అనిపించవచ్చుగానీ... మన రోజువారీ కార్యకలాపాల్లో చూసుకుంటే పొద్దున్నే బ్రష్, స్నానంలో మగ్, రుద్దుకునే సబ్బు తాలూకు సోప్కేస్ అన్నీ ప్లాస్టిక్వే. ఇక ఆఫీసుకు వచ్చాక తాగే మొదటిచాయ్ నుంచి బయటకువెళ్లినప్పుడు చాయ్ అమ్మే వ్యక్తి ఇచ్చే టీ వరకు చాలావరకు ప్లాస్టిక్కే. గతంలోని స్టీల్ క్యారియర్ స్థానంలో ఇప్పుడు చాలా లంచ్బాక్సులు ప్లాస్టిక్వే. ఇలా చూసుకుంటే మనం వాడే నిత్యజీవిత ఉపకరణాల్లో ప్రతి ఐదింటిలో కనీసం మూడైనా ప్లాస్టిక్వే ఉంటాయి. కానీ ఈ ప్లాస్టిక్ సముద్రమిప్పుడు సునామీగా మారి మన ఆరోగ్యాలను దెబ్బతీస్తోంది. అది ఏయే విధంగా మన ఆరోగ్యాలను కబళిస్తోందీ, ప్లాస్టిక్ను పూర్తిగా నిర్మూలించలేక పోయినా కనీసం దాన్ని రీ–సైకిల్ చేసేందుకు వీలుగా ఉండే వాటిని వాడాలనే అవగాహన కోసమే ఈ కథనం. మన ఇళ్లలో చెత్త ఊడ్చాక దాన్ని ఎత్తడానికీ ప్లాస్టిక్ చేటనే వాడతాం. అయితే ఇలాంటి ఉపకరణాలతో అప్పటికప్పుడు ఆరోగ్యానికి వచ్చే ప్రమాదమేమీ పెద్దగా లేకపోయినప్పటికీ... వేడి వేడి ఆహారాన్నినిల్వ చేయడానికి ఉపయోగించేప్లాస్టిక్ ఉపకరణాలతో మాత్రం ఆరోగ్యాలకు ఎంతో నష్టం చేకూరుతుంది. ఆ ప్లాస్టిక్ల కారణంగా ఆరోగ్యానికి జరిగే చేటు ఏమిటో, దాన్ని నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.ప్లాస్టిక్ ప్రభావం ముఖ్యంగా హార్మోన్లపై... అందునా మరీ ముఖ్యంగా మహిళల్లోని ఈస్ట్రోజెన్స్రావంపై ఉంటుందనీ, దీనివల్ల ప్రత్యుత్పత్తికి తోడ్పడే హార్మోన్ల సమతౌల్యంతో తేడాలు వచ్చి గర్భధారణ సమస్యలు రావచ్చని అధ్యయనాల్లో తేలింది. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, కదలికలు తగ్గడం, పురుష సంబంధ హార్మోన్ల స్రావం తగ్గడం జరుగుతాయి. అందువల్ల వీలైనంత మేరకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవడం మంచిది.ప్లాస్టిక్తో ఆరోగ్యానికి హాని ఎందుకు..? ఇందుకు ఓ ఉదాహరణగా... ఆహారం పెట్టుకోడానికి గతంలో వాడే స్టీలుకు బదులు ప్లాస్టిక్ ఉపకరణాలను వాడుతున్నప్పుడు మన ఆరోగ్యానికి కలిగే హాని ఏమిటో తెలుసుకుందాం. ఆహారం ప్లాస్టిక్ బాక్స్లలో నిల్వ ఉంచి తీసుకుంటున్నప్పుడు మనం దాన్ని తిన్నప్పుడల్లా బాక్స్ తాలూకు ΄్లాస్టిక్ పదార్థాలూ కొద్దికొద్ది మోతాదుల్లో ఆహారంతోపాటు మన దేహంలోకి వెళ్తుంటాయి. ఆహారంతో పాటు ప్లాస్టిక్ మన శరీరంలోకి వెళ్లి, మన దేహంలోకి ఇంకిపోయే ప్రక్రియను ‘లీచింగ్’ అంటారు. చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్ : ఐశ్వర్యా డాజ్లింగ్ లుక్ వెనుకున్న సీక్రెట్ ఇదే!ఈ ప్రక్రియ ఎక్కువగా ఉండేదెప్పుడు..? లీచింగ్ ఎక్కువగా జరిగేందుకు ఆస్కారం ఉన్న పరిస్థితులివే... ఆహారం ఎంత వేడిగా ఉంటే... అంతగా ప్లాస్టిక్ మన కడుపులోకి ప్రవేశిస్తుంది. ∙అదే ఆహారంలో కొవ్వులు, ఉప్పు ఉన్నప్పుడు లీచింగ్ మరింత పెరుగుతుంది. మనం తీసుకునే ఆహారంలో అసిడిక్ వస్తువులు అంటే చింతపండు, సాంబార్ వంటి పులుపు వస్తువులు ఉంటే... మన ప్లాస్టిక్ కంటెయినర్ నుంచి మన దేహంలోకి ప్లాస్టిక్ ఎక్కువ మోతాదుల్లో కలుస్తుంటుంది.ప్లాస్టిక్ బౌల్లో ఆహారాలు ఎందుకు పెట్టకూడదంటే...?! ఈ మధ్యకాలంలో మనం అందంగా కనిపించే ప్లాస్టిక్ బౌల్స్లో కూరలూ, వేడి వేడి పులుసు వంటి ఆహారాలను ఉంచి, వాటిని డైనింగ్ టేబుల్ మీద అలంకరించి వాటిల్లోంచే అన్నం, కూరలు వడ్డించడాన్ని చూస్తున్నాం.సాధారణంగా ఈ కూరలు పెట్టుకునే బౌల్స్ను ‘మెలమెన్’ అనే ప్లాస్టిక్ వంటి పదార్థంతో తమారు చేస్తారు. వేడి వేడి కూరలు, పులుసులు ఇందులోకి తీయగానే ఆ వేడికి ఆ ప్లాస్టిక్లోని మెలమైన్... ఆహారంతో పాటు కలిసి నోటి ద్వారా శరీరంలోకి వెళ్తుంది. ఇలా దేహంలోకి వెళ్లిన ఈ పదార్థం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో తేలింది. ఈ విషయం ‘జామా ఇంటర్నల్ మెడిసిన్’ జర్నల్లోనూ ప్రచురిత మైంది. ఈ అధ్యయనంలో భాగంగా కొంతమందికి మెలమైన్ బౌల్స్లో నూడుల్స్ ఇచ్చారు. మరికొందరికి పింగాణీ బౌల్స్లో ఇచ్చారు. ఈ రెండు గ్రూపుల వారికి నిర్వహించిన మూత్ర పరీక్షల్లో మెలమైన్ బౌల్స్లో తిన్నవారి మూత్రంలో మెలమైన్ మోతాదులు దాదాపు ఎనిమిది రెట్లు ఉన్నాయని తేలింది. దీంతో వారిలో కిడ్నీ ఫెయిల్యూర్ వంటి ముప్పుతో పాటు... క్యాన్సర్ ప్రమాదమూ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. మెలమైన్ బౌల్లో పెట్టి ఏ ఆహారాన్నీ మైక్రోవేవ్ ఒవెన్లోఉంచి వేడిచేయకూడదని అమెరికన్ సంస్థ ఎఫ్డీఏ కూడా గట్టిగా సిఫార్సు చేస్తోంది. ఈ ప్లాస్టిక్ ప్రభావం ముఖ్యంగా హార్మోన్లపై... మరీ ముఖ్యంగా మహిళల్లోని ఈస్ట్రోజెన్ స్రావంపై ఉంటుందనీ, దీనివల్ల ప్రత్యుత్పత్తికి తోడ్పడే హార్మోన్ల సమతౌల్యంలో తేడాలు వచ్చి గర్భధారణ సమస్యలు రావచ్చని తేలింది. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, కదలికలు తగ్గడం, పురుష సంబంధ హార్మోన్ల స్రావం తగ్గడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. చాలామందిలో డయాబెటిస్ రిస్క్ పెరుగుతున్నట్లుగా ఇలాంటిదే మరో అధ్యయనంలోనూ తేలింది.స్థూలకాయం వస్తున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. రొమ్ము క్యాన్సర్ వంటి క్యాన్సర్ రిస్క్లు చాలా ఎక్కువ. ప్లాస్టిక్ బౌల్స్లో వేడి వేడి ఆహారం పెట్టుకుని తీసుకునేవారిలో మెదడు కణాలు బలహీనమై జ్ఞాపకశక్తి తగ్గుతున్నట్లు, మూడ్స్ మారి΄ోవడం వంటి సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. అలై్జమర్స్ వంటివి కూడా ఎక్కువగా పెరుగుతున్నట్లు పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. ప్లాస్టిక్ ఉపయోగం కారణంగా ఇలా పలు రకాలుగా ఆరోగ్యంపై అనేక దుష్ప్రభావాలు పడుతున్నాయి. అందుకే కూరలు, పులుసులు నిల్వ చేసుకునేందుకు ప్లాస్టిక్ బౌల్స్లో కాకుండా పింగాణీ బౌల్స్ వాడటం మేలని నిపుణులు చెబుతున్నారు.మరో సరికొత్త అధ్యయన ఫలితమిలా... పిల్లలు పాలు తాగడానికి ఉపయోగించే పాలపీకలు మొదలుకొని, వాళ్లు ఆడుకునే ఆటవస్తువుల వరకు ప్లాస్టిక్తో తయారైనవి కాస్తా... చాలాకాలం తర్వాత... అంటే ఆ చిన్నారులే పెరిగి కాస్త పెద్దయ్యాక (అంటే పెద్దపిల్లలుగా ఉన్నప్పుడూ, వాళ్ల కౌమార ప్రాయంలో/అడాలసెంట్ వయసులో) వాళ్ల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపుతాయంటూ వేలాది తల్లులూ, పిల్లలపై నిర్వహించిన ఓ అధ్యయనం తెలుపుతోంది. అలా ఆ ప్లాస్టిక్ వస్తువులు వాడిన ఆ పిల్లల పాటు తల్లుల్లో సైతం మొదట స్థూలకాయం... దాని ప్రభావంతో గుండె జబ్బులు, ఆస్తమా, సంతానలేమి వంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయంటూ ఆ అధ్యయనం పేర్కొంటోంది. ఈ ఫలితాలు ప్రముఖ హెల్త్ జర్నల్ ‘ల్యాన్సెట్’లో ప్రచురితమయ్యాయి.ప్లాస్టిక్ బాటిలో ఉంచిన నీళ్లు తాగచ్చా..?మరో పరిశోధన తాలూకు ఫలితాలివి. ఇటీవల చాలామంది నీళ్లబాటిల్ కొని దాన్ని వాడుతూ ఉంటారు. ఇలా ఓ బాటిల్లో వారం పాటు ఉంచిన నీళ్లు తాగవచ్చా అనే అంశంపై ఇటీవల కొందరు పరిశోధకులు ఓ అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనంలో తేలిన అంశమేమిటంటే... ఇలా నీళ్లు నిల్వ ఉంచినప్పుడు ప్లాస్టిక్ కొద్దికొద్ది మోతాదుల్లో కలవడం (లీచ్ కావడం) వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుందనీ, అలాగే వారం పాటు ఉంచి నీళ్లలో బ్యాక్టీరియా పెరగడంతో కడుపులో ఇబ్బందిగా ఉండటం, కడుపు నొప్పి, డయేరియా వంటి సమస్యలు రావడమేగాక...కాస్త అరుదుగా అలాంటి కొందరిలో అది ప్రాణాపాయానికీ దారి తీయవచ్చంటూ పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇలా బ్యాక్టీరియా పెరగడమన్నది కేవలం నీళ్లలో జరిగినా, జరగకపోయినా... బాటిల్ తాలూకు మూతలో సైతం బ్యాక్టీరియా/మౌల్డ్ (నాచు వంటి పెరుగుదల) పెరగవచ్చంటూ వారు హెచ్చరిస్తున్నారు. అసలు ప్లాస్టిక్ అంటే ఏమిటంటే...? ప్లాస్టిక్ వస్తువులు, ఉపకరణాలు ప్రధానంగా బైస్ఫినాల్ ఏ (బీపీఏ) అనే పదార్థంతో తయారవుతాయి. ∙కొన్ని సందర్భాల్లో థాలేట్ అనే పదార్థంలోనూ ప్లాస్టిక్ ఉపకరణాలను తయారుచేస్తారు. మనం ఆహారం, తిను బండారాలూ, ఇతరత్రా ద్రవపదార్థాలను నిల్వ ఉంచేందుకు మనం రోజువారీ ఉపయోగించే ప్లాస్టిక్తో తయారైన ఉపకరణాలన్నీ (యుటెన్సిల్స్) ప్రధానంగా బైస్ఫినాల్ ఏ (బీపీఏ) లేదా థాలేట్తోనే తయారవుతాయి.చదవండి: ఈ టిప్స్ పాటిస్తే పండగ వేళ మెరిసిపోవడం ఖాయం!బీపీఏలతో ఆరోగ్యంపై దుష్ప్రభావాలు... ప్లాస్టిక్ బాక్స్లలో ఉంచే ఆహారం వల్ల మన ఆరోగ్యంపై చాలా రకాల దుష్ప్రభావాలు పడతాయి. వాటిలో కొన్ని... ప్లాస్టిక్ కలిసిన ఆహారంతో హార్మోన్లపై... మరీ ముఖ్యంగా మహిళల్లోని ఈస్ట్రోజెన్ హార్మోన్పై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా మహిళల్లో ప్రత్యుత్పత్తికి తోడ్పడే హార్మోన్ల సమతౌల్యంలో తేడాలు వచ్చిగర్భధారణ సమస్యలు వచ్చే అవకాశాలెక్కువ. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, కదలికలు తగ్గడం, పురుష సంబంధ హార్మోన్ల స్రావం తగ్గడం.వైద్యపరీక్షల్లో మూత్రంలో ప్లాస్టిక్ పాళ్లు పెరిగినట్లుగా రిపోర్టులు వచ్చిన చాలామందిలో డయాబెటిస్ కేసులు పెరుగుతున్నట్లుగా ఒక అధ్యయనంలో తేలింది. ప్లాస్టిక్ యుటెన్సిల్స్లో ఆహారం తీసుకునేవారిలో స్థూలకాయం వస్తున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. రొమ్ము క్యాన్సర్ వంటి క్యాన్సర్ ముప్పు చాలా ఎక్కువ. ప్లాస్టిక్ కంటెయినర్లలో వేడి వేడి ఆహారం పెట్టుకుని తీసుకునేవారిలో మెదడు కణాలు బలహీనమై జ్ఞాపకశక్తి తగ్గుతున్నట్లు, మూడ్స్ మారిపోవడం వంటి సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. అల్జైమర్స్ వ్యాధి వంటివి కూడా ఎక్కువగా పెరుగుతోంది.బీపీఏలతో తయారయ్యే ఉపకరణాలివి... పిల్లలకు ఉపయోగించే పాలపీకలు,వాటర్బాటిళ్లు, ∙లంచ్బాక్స్లు,సీడీలు, డీవీడీలు,కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు.ప్లాస్టిక్తో అనర్థాల నివారణకు కొన్ని సూచనల గురించి తెలుసుకోవాలంటే చదవండి బరువు తగ్గడం కష్టంగా ఉందా? షాకింగ్ రీజన్ ఇదే కావచ్చు!డాక్టర్ శివరాజు సీనియర్ ఫిజీషియన్ నిర్వహణ: యాసీన్ -
అక్కడ అమ్మవారి నైవేద్యాన్ని పీర్లకు ప్రసాదంగా..!
దుర్గా పూజ హిందూ పండుగ అని తెలిసిందే. అయితే, ఇక్కడ మాత్రం హిందూ–ముస్లిం మత సామరస్యంతో జరుపుకోవడంలో ప్రసిద్ధి చెందింది. పశ్చిమ బెంగాల్ తూర్పు మిడ్నాపూర్ జిల్లా కొంటైలోని కిషోర్నగర్ గర్ రాజ్బరి వద్ద జరుపుకుంటున్న స్వర్ణదుర్గాదేవి పూజలో అమ్మవారికి సమర్పించిన నైవేద్యాన్ని మొదటగా అక్కడి పీర్లకు ఇస్తారు. ఆ తర్వాతే రాజకుటుంబీకులు స్వీకరిస్తారు. భక్తులకు పంచిపెడతారు. ఇలా దాదాపు 300 సంవత్సరాలుగా జరుగుతోంది. ఈ పూజకు దూర్రప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. హిందూ–ముస్లిం సామరస్యం ఒక ప్రధాన లక్షణం, ఇక్కడ విగ్రహ నిమజ్జనానికి ముందు ముస్లిం పీర్లకు దేవత ప్రసాదాన్ని అందిస్తారు. ముందుగా పూజ సమయంలో ఒక ఉత్సవం జరుగుతుంది, ఈ ఉత్సవంలో కూడా స్థానిక హిందువులతోపాటు ముస్లింలు కూడా పాల్గొంటారు. వీరితోపాటు ఇతర మతాల వారు కూడా పూజలోపాలు పంచుకుంటారు, స్వర్ణదుర్గమ్మకు జీడిపప్పు భోగంపూజ సమయంలో అమ్మవారికి పండ్లు, తీపి పదార్థాలను నివేదిస్తారు. వీటితోపాటు వేయించిన జీడిపప్పు, ఇంట్లో తయారు చేసిన జున్ను, చక్కెరతో వండిన ప్రత్యేక భోగాన్ని నివేదిస్తారు.(చదవండి: ‘విరామ భోగ్‘: అక్కడ నైవేద్యాన్ని అమ్మవారే స్వయంగా..!) -
‘విరామ భోగ్‘: అక్కడ నైవేద్యాన్ని అమ్మవారే స్వయంగా..!
సాధారణంగా అమ్మవారికి భక్తులు రకరకాల నైవేద్యాలను వండి ప్రసాదాలను సిద్ధం చేయడం సంప్రదాయం. అయితే ఇక్కడ మాత్రం అమ్మవారు తన నైవేద్యాన్ని తనకు నచ్చిన విధంగా తానే వండుకుంటుంది. అందుకోసం నాణ్యమైన సరుకులు, మసాలా దినుసులు, వంట చెరకు, వంటపాత్రలు సమకూరిస్తే సరి΄ోతుంది. వినడానికి విచిత్రంగా ఉన్నా, పశ్చిమ బెంగాల్ ఝార్గ్రామ్లోని చిల్కిగఢ్ రాజభవనంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న సంప్రదాయం ఇది.స్థానికంగా ‘విరామ భోగ్‘ అని పిలుచుకునే అష్టమి రోజున అమ్మవారు తనకు సమర్పించిన నైవేద్యాన్ని తానే స్వయంగా వండుతుందని నమ్ముతారు. చిల్కిగఢ్ రాజభవనంలో, అష్టమి పూజ పూర్తయిన తర్వాత, ఆలయ ప్రధాన పూజారి ఒక కొత్త మట్టి కుండలో నీరు, బలి మాంసం, ఇతర పదార్థాలను నింపుతాడు. పూజారి మేక బలి మాంసంతో ఏకాంతంగా వంటగదిలోకి ప్రవేశిస్తాడు. సంప్రదాయం ప్రకారం, మాంసాన్ని కొత్త మట్టి కుండలో ఉంచుతారు. దానిలో వివిధ మసాలా దినుసులు కలుపుతారు. తరువాత, మూడు కట్టెలను పొయ్యిలో ఉంచుతారు. ఆ మట్టి కుండను సాల్ చెట్టు ఆకులతో కప్పి, గదిలో పొయ్యిపై పెట్టి, కుండ పక్కన ఒక కొయ్య గరిటె ఉంచుతారు. పొయ్యిలో మూడు కట్టెలు వెలిగించిన తర్వాత, గది బయటి నుండి తాళం వేస్తారు. నవమి రోజు ఉదయం, పూజారి రాజభవనం నుండి తాళం తీసుకుని వచ్చి, ఆ వంటగది తలుపు తెరిచి చూసి, అమ్మవారికి ‘భోగ్‘గా సమర్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతాడు. అమ్మవారే స్వయంగా వచ్చి ఈ భోగ్ను వండుకుంటుందని విశ్వాసం. ఈ విషయాన్ని చిల్కిగఢ్ రాజ్బరి ప్రస్తుత వారసుడు తేజసచంద్ర దేవ్ ధబల్దేవ్ స్వయంగా తెలియజేశారు. అమ్మవారు తమ పూర్వికులకిచ్చిన సూచనల మేరకు ఈ విధంగా చేస్తున్నట్లు తెలియజేశారు. (చదవండి: వెయ్యేళ్ల నాటి ఆలయం..! ఇక్కడ దుర్గమ్మకు రక్తం చిందించని బలి..) -
96 ఏళ్లుగా కళాప్రదర్శన
ముంబైలో జరిగే దుర్గా పూజ సాంస్కృతిక వైభవానికి, భక్తికి చిహ్నంగా నిలుస్తోంది. బొంబాయి దుర్గా బారి సమితి ప్రారంభం 1930ల నాటిది. అప్పట్లో బెంగాలీల చిన్న సమావేశంగా ప్రారంభమైన ఈ ఉత్సవం ఇప్పుడు గొప్ప కళా ప్రదర్శనగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఈసారి కూడా వారు మట్టి, ఎండుగడ్డితో చేసిన పర్యావరణ అనుకూలమైన విగ్రహాన్ని తయారు చేశారు. అక్టోబర్ 1చ మహానవమి నాడు కుమారీపూజ జరుగుతుంది. అదేరోజు సాయంత్రం ధునుచి నాచ్, 2న మహాదశమి నాడు సిందూర్ ఉత్సవ్ జరుగుతుంది, తరువాత గిర్గామ్ చౌపట్టిలో విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. ‘ఇది మతపరమైన వేడుక మాత్రమే కాదు, సాంస్కృృతిక కళా ప్రదర్శన కూడా‘ అని చైర్పర్సన్ మితాలి పోద్దార్ అన్నారు. ‘కోల్కతాకు చెందిన ప్రఖ్యాత కళాకారులు స్థానిక యువతతో కలిసి ప్రదర్శనలు ఇస్తారు. ఇది భవిష్యత్ తరాలకు కళాత్మక, సాంస్కృతిక వారసత్వాన్ని అందించడం కోసం కూడా. అందుకే మేం ప్రతి సంవత్సరం, పర్యావరణ అనుకూల విధానంతో సంప్రదాయాన్ని పాటిస్తాం–‘ అని చెబుతున్నారామె. వేడుకలతోపాటు పేదపిల్లలకు స్కాలర్షిప్లు, ఆసుపత్రులకు వైద్యపరికరాల విరాళాలు – వంటివి కూడా ఉంటాయి‘ అని మితాలి పేర్కొన్నారు.(చదవండి: వెయ్యేళ్ల నాటి ఆలయం..! ఇక్కడ దుర్గమ్మకు రక్తం చిందించని బలి..) -
రొయ్యలకు దేశంలోనే డిమాండ్ పెంచాలి!
ఆక్వాకల్చర్ ప్రపంచంలో రాణించిన అరుదైన భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ గుప్తా. 86 ఏళ్ల క్రితం బాపట్ల జిల్లాలో పుట్టారు. ఆక్వా కల్చర్ నిపుణుడిగా లావోస్ నుంచి బంగ్లాదేశ్ వరకు 22 ఆసియా, ఆఫ్రికా దేశాల్లో విశేష సేవలందించారు. సామాన్య ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తెచ్చారు. నిస్వార్థ సేవలకు గుర్తింపుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ప్రపంచ ఆహార పురస్కారం’ (2005), నోబెల్తో సరితూగే ‘సన్హాక్ శాంతి పురస్కారం ’(2015) అందుకున్నారు.పదవీ విరమణ అనంతరం హైదరాబాద్లో నివసిస్తున్న డా. విజయ్ గుప్తాను ‘సాక్షి సాగుబడి’ పలుకరించింది. ట్రంప్ సుంకాల నేపథ్యంలో అమెరికాయేతర మార్కెట్లను వెతకటంతో పాటు.. దేశీయ మార్కెట్లలో మౌలిక సదుపాయాలు కల్పించి చేపలు, రొయ్యలకు డిమాండ్ పెంచుకోవటానికి పుష్కలంగా ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యాంశాలు..86 ఏళ్ల వయసులో 66లా ఉన్నారు.. మీ ఆరోగ్య రహస్యం ఏమిటి?డా. విజయ్ గుప్తా: ఏమీ లేదు. కష్టపడి పనిచెయ్యటమే. పనితో వయసును జోడించి చూడకూడదండి.. మీరు చెయ్యగలిగినంత కాలం పని చేస్తూనే ఉండాలి. జీవితంలో మీరు ఏమి చెయ్యదలచుకున్నారో ఆ పనిలో సంతృప్తి కోసం పాటుపడాలి. చాలా మంది ధనంలోనే సంతృప్తిని వెదుక్కుంటూ ఉంటారు. కానీ, అది వాస్తవం కాదు. ధనార్జన ఇచ్చే సంతృప్తి పరిమితమైనది. మీరు ఎవరికైనా సహాయంతో అభివృద్ధి చెందిన వాళ్లు చూపే ఆదరణతో లభించే ఆత్మసంతృప్తి అనంతమైనది.2015లో దక్షిణ కొరియా ప్రభుత్వం సన్హాక్ శాంతి బహుమతి నాకు ఇచ్చింది.దానికి ముందు నేను గతంలో పనిచేసిన దేశాల్లో ప్రజల స్పందనను తెలుసుకునేందుకు నాతో పాటు పాత్రికేయులను పర్యటనకు పంపింది. బంగ్లాదేశ్లో ఆరేళ్లు పనిచేసిన నేను పదిహేనేళ్ల తర్వాత మళ్లీ అక్కడి గ్రామాల్లోకి వెళ్తే.. మహిళా రైతులు నన్ను గుర్తిపట్టి చాలా సంబరపడ్డారు. మీరు నేర్పిన ఆక్వా సాగు వల్ల మా పూరి గుడిసెలు ఇప్పుడు పక్కా భవనాలయ్యాయని చూపించి కృతజ్ఞతలు తెలిపారు. ఆ క్షణాల్లో వారి మొహాల్లో నవ్వును చూసినప్పుడు నాకు ఎంతో ఆత్మసంతృప్తి కలిగింది. అది ఏ బహుమతులతోనూ దొరకదు..!బంగ్లాదేశ్ ఆక్వా రైతు మిమ్మల్ని అంతగా గుర్తుపెట్టుకోవటానికి కారణం ఏమిటి?అక్కడ ఆరేళ్లు పనిచేశా. బంగ్లాదేశ్ అంతా లోతట్టు ప్రాంతం. స్థానికంగా ప్రజలు గుంతలు తవ్విన మట్టిని ఎత్తుగా పోసి, వాటిపైన గుడిసెలు వేసుకొని జీవిస్తుంటారు. ఆ గుంతల్లో గుర్రపుడెక్క, దోమలు పెరిగి సమస్యగా ఉండేది. తినటానికి జనానికి తిండి లేదు. అటువంటి స్థితిలో ఆ చిన్న గుంతల్లోనే పెంచుకొని తినే చిన్న సైజు చేపల సాగు సాంకేతికతలను అభివృద్ధి చేశాం. స్థానిక స్వచ్ఛంద సంస్థల ద్వారా రైతుల బృందాలను కూడగట్టాం. ఉమ్మడి బాధ్యతతో కూడిన బృంద రుణాలు ఇప్పించాం. తద్వారా పేద రైతులను అధిక వడ్డీల విషచక్రం నుంచి, ఆహార అభద్రత నుంచి బయటపడేశాం. యూఎన్ఎయిడ్ చరిత్రలోనే బెస్ట్ ప్రాజెక్ట్గా మాకు గుర్తింపు రావటం ఓ మధుర స్మృతి. ప్రభుత్వం అందుకు ఏం చెయ్యొచ్చు..?ఒక్క రొయ్యలకే కాదు, చేపలకు కూడా మన నగరాలు, పట్టణాల్లో అపారమైన మార్కెటింగ్ అవకాశాలున్నాయి. ప్రొటీన్ ఆహారానికి డిమాండ్ ఉన్నా చేపలు, రొయ్యలను చాలా మంది తినకపోవటానికి కారణం.. వాటిని విక్రయించే పద్ధతులు సరిగ్గా లేకపోవటమే. జూబ్లీహిల్స్లో ఇప్పటికీ చేపలను రోడ్డుపక్కన పెట్టి అపరిశుభ్ర పరిస్థితుల్లో అమ్ముతున్నారు. అసలు మెరుగైన మార్కెటింగ్ కల్పించాలన్న చైతన్యం లేదు. నగరాలు, పట్టణాల్లో ఆధునిక వసతులతో ప్రత్యేక దుకాణాలు తెరవాలి. విలువ జోడించి మార్కెటింగ్ గొలుసును నిర్మిస్తే.. చేపలు, రొయ్యలను ప్రజలు బాగా తింటారు. సబ్సిడీలివ్వటం కాదు, మౌలిక సదుపాయాలు కల్పించాలి. పోషకాల పరంగా అడ్వాంటేజ్ ఉందా?పోర్క్, బీఫ్, పౌల్ట్రీతో పోల్చితే చేపలు, రొయ్యల్లో పోషకాలు చాలా ఎక్కువ. కంపేరిటివ్ స్టడీస్ కూడా వచ్చాయి. పర్యావరణ పరంగా చూసినా ఆక్వా ఉత్పత్తులే మెరుగైనవి. ఒకటిన్నర కేజీల మేత వేస్తే కిలో చేపల్ని పెంచే సాంకేతికత అందుబాటులో ఉంది. ఇతర జంతువులకు 12 కిలోల మేత పెడితే గాని ఒక కిలో ఉత్పత్తి రాదు. పశువుల పెంపకం కోసం విస్తారంగా గడ్డి భూములు కావాలి. చేపలు, రొయ్యలు నీటిలో పెరుగుతాయే కానీ అవి నీరు తాగవు. మార్కెటింగ్, కోల్డ్ చెయిన్ సదుపాయాల కొరత, ఆరోగ్య ప్రయోజనాలపై ప్రచార లోపమే సమస్య. యూరోపియన్ యూనియన్ కఠిన నియమాలను అధిగమించేదెలా?ట్రేసబిలిటీ వంటి సదుపాయాలు అన్ని దేశాల్లోనూ అందుబాటులో ఉన్నాయి. అందువల్ల కెమికల్ రెసిడ్యూ లేని విధంగా సస్టయినబుల్ ఫిష్ ప్రొడక్షన్ పద్ధతులను ఆక్వా రైతులకు, పరిశ్రమదారులకు ప్రభుత్వం నేర్పించాలి. తెలిసో తెలియకో మందులు వాడుతున్న మన చిన్న, సన్నకారు రైతులకు లోతైన అవగాహన కల్పించాలి. టెక్నాలజీ ఇవ్వాలి. ఇలా చేస్తే అధిక ధర వచ్చే విదేశీ మార్కెట్లు ఉన్నాయి. ఆఫ్రికాలో ఇలా చేశారు. మన ప్రభుత్వాలు కూడా చెయ్యాలి. అమెరికాయేతర దేశాలతో కూడా ట్రేడ్ అగ్రిమెంట్లకు ప్రయత్నం చెయ్యాలి. ప్రపంచ ఆహార భద్రత భవిష్యత్తు ఎలా ఉంటుంది?రాబోయే 20–30 సంవత్సరాల్లో జంతువులను మాంసం కోసం పెంచటం చాలా ఇబ్బందుల్లో చిక్కుకుంటుంది. జనాభాతో పాటు వారి కొనుగోలు శక్తి పెరుగుతోంది. ఇది ఆసియా దేశాల్లో ఆక్వా అభివృద్ధికి చాలా మంచి అవకాశం. జలవనరులు ఎక్కువగా ఉన్న మన దేశానికి ఇది గొప్ప అవకాశం. అయితే, మన ఆక్వా రంగం ఉత్పాదకతను పెంచుకోవాలి. మన ఉత్పాదకత ఎందువల్ల తక్కువ?ఉప్పునీటి, మంచినీటి చేపలు, రొయ్యల సాగు రంగంలో మనకున్న వనరుల్లో 30–40% మాత్రమే ఇప్పటికి వాడుకుంటున్నాం. ఇంకా పెంచుకోవటానికి చాలా అవకాశం ఉంది. ఉత్పాదకత పెరగాలంటే దేశీయంగా వినియోగం పెరగాలి. మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు పెంపొందిస్తే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ డ్రైవెన్ ఎకానమీగా గుర్తించి ప్రభుత్వాలు ఆక్వా రంగంపై దృష్టి కేంద్రీకరిస్తే రైతులు అందుకుంటారు. – ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు ఫొటో: ఎస్.ఎస్. ఠాకూర్ఆక్వా ఉత్పత్తుల మార్కెటింగ్ పెరిగే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి?కోళ్ల పరిశ్రమతో సరిపోల్చి చూడండి.. 15–20 ఏళ్ల క్రితం కోడి మాంసం తినాలంటే కోడిని కొనుక్కొచ్చి ఇంటి దగ్గర కోసుకునే వాళ్లు. ఇప్పుడు ఎక్కడ చూసినా కోళ్లను కోసి మాంసం అమ్మే దుకాణాలొచ్చేశాయి. కాబట్టే వినియోగదారులు కోడి మాంసాన్ని ఇంత ఉత్సాహంగా వాడుతున్నారు. చేపలు, రొయ్యల అమ్మకానికి, పౌల్ట్రీ మాదిరిగా, మార్కెటింగ్ సదుపాయాలు, విలువ జోడింపు మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున కల్పించాలి. మార్కెట్ సృష్టిస్తే చేపలు, రొయ్యల ఉత్పత్తిని ఇంకా పెంచుకోవటానికి రైతులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. చేపలు, రొయ్యల పౌష్టికాహార విలువలు, ఆరోగ్య ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచార మాధ్యమాల్లో ఎగ్ క్యాంపెయిన్ మాదిరిగా ప్రచారోద్యమం చేపట్టాలి.దేశీయంగా రొయ్యలు ఎక్కువగా తినకపోవటానికి కారణం?ప్రపంచవ్యాప్తంగా ఆక్వా ఉత్పత్తులను ఏడాదికి తలసరి వినియోగం 22 కిలోలు. బంగ్లాదేశ్లో 30–40 కిలోల వరకు ఉంటుంది. మన దేశంలో 6 కిలోలంటారు. కచ్చితమైన గణాంకాలు లేవు. మనవాళ్లు రొయ్యలు ఎక్కువగా తినకపోవటానికి ధర ఎక్కువ కావటం ఒకటి. మరొక అపోహ ఏమిటంటే.. రొయ్యలు తింటే కొలెస్ట్రాల్ ఉంటుందని. అది అపోహే. చేపలతో కూడా ప్రాబ్లమ్ ఏమీ లేదు. నీట్గా ఉండే కోయిస్క్లను ఏర్పాటు చేస్తే వినియోగం పెంచవచ్చు. ప్రభుత్వం నగదు ఇన్సెంటివ్లు ఇవ్వటం కాదు. కోల్డ్చెయిన్, మౌలిక సదుపాయాలు కల్పించాలి. -
అపజయం వెనుకే విజయం
నార్త్లో దాండియా కల్చర్ బాగుంటుంది. చిన్నప్పుడు మేం ముంబైలో ఉండేవాళ్లం. దసరా టైమ్లో మా కమ్యూనిటీలో దాండియా ఆడేవాళ్లు. అలా మా అపార్ట్మెంట్వాళ్లతో కలిసి లైట్గా దాండియా చేసిన గుర్తు ఉంది. కానీ పెద్దయ్యాక దాండియా ఆడలేదు. అయితే చేయాలని ఉంది.పండగ అంటే ఫ్యామిలీ రీ యూనియన్ అని నా ఫీలింగ్. నా చిన్నప్పుడు మా బంధువులందరం కలిసి పండగ జరుపుకునేవాళ్లం. అందరూ కలిసి పండగ వంటలు చేయడం చాలా బాగుండేది. అయితే పై చదువులు, కెరీర్... వీటివల్ల రాను రాను ఆ సందడి తగ్గిపోయింది. ఇప్పుడైతే వర్క్లో బిజీ అయ్యాను కదా... షూటింగ్స్, ప్రమోషన్స్ ఉంటాయి కాబట్టి పండగ సమయంలో ఇంటి దగ్గర ఉండటం తగ్గిపోయింది. ఆ పాతరోజులను తలచుకుంటూ ఉంటాను.‘‘అపజయం ఎదురైనప్పుడు జీవితం ఆగిపోయింది అనుకుంటే మనం ఆగిపోతాం... ఆ అపజయాన్ని విజయానికి మెట్టుగా మార్చుకుంటే ముందుకు సాగిపోతాం’’ అంటున్నారు శ్రీనిధి శెట్టి. అందాల పాటీల్లో ‘మిస్ సుప్ర నేషనల్ ఇండియా’ కిరీటం దక్కించుకోవడం నుంచి, ‘మిస్ స్మైల్’... వరకు పలు టైటిల్స్ శ్రీనిధి సొంతం. తొలి చిత్రం ‘కేజీఎఫ్’తో హీరోయిన్గా విజయవంతంగా కెరీర్ మొదలుపెట్టిన శ్రీనిధి శెట్టి ఇప్పుడు ఫుల్ బిజీ. ‘‘ప్రతి స్త్రీ అమ్మవారిలా ఓ శక్తి స్వరూపిణి’’ అంటూ ‘దసరా’ సందర్భంగా ‘సాక్షి’తో శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) ప్రత్యేకంగా పంచుకున్న విశేషాలు.⇒ మా మంగళూరులో చాలా టెంపుల్స్ ఉన్నాయి. నవరాత్రి సమయంలో గుడిలో జరిగే పూజలు చాలా వైభవంగా ఉంటాయి. ఈ దసరా టైమ్లో వీలైనప్పుడల్లా గుడికి వెళుతుంటాను. మైసూర్లో నవరాత్రి పూజలను ఘనంగా చేస్తారు. మైసూర్ ప్యాలెస్ని బాగా డెకరేట్ చేస్తారు. జాతర జరుగుతుంది. స్టాల్స్ పెడతారు. ‘మైసూర్ దసరా’ చాలా పాపులర్. ఈ పండగ సమయంలో సిటీ మొత్తం జనాలతో కిటకిటలాడిపోతుంది.⇒ ‘ఫాస్టింగ్’ అనేది సైంటిఫికల్లీ, ట్రెడిషనల్లీ మంచిది అని నా అభి్రపాయం. అయితే నవరాత్రి టైమ్లో ఉపవాసం ఉండను. కానీ నాన్ వెజ్కి దూరంగా ఉంటాను. నెలలో రెండుసార్లు ఏకాదశి వస్తుంది కదా... అప్పుడు ఉపవాసం ఉంటాను. ఏకాదశి వస్తోందంటే చాలు... ‘నువ్వు ఫాస్టింగ్ ఉండాలి’ అని నా బాడీ నాకు గుర్తు చేస్తుంది. నా మైండ్ అలా ట్యూన్ అయిపోయింది. ⇒ చెడుపై మంచి గెలవడం అనేది దసరా థీమ్. ఒక చెడు ఉంటేనే మంచి జరుగుతుంది. అపజయాలను నేను ఇలానే భావిస్తాను. ఫెయిల్యూర్ ఎదురైతేనే కదా సక్సెస్ కోసం ప్రయత్నం చేస్తాం. సో... ఫెయిల్యూర్స్ని చెడుగా భావించను. చెడుని అంతం చేయడానికి అమ్మవారు ఏం చేసిందో మనందరికీ తెలుసు. అలాగే మనకు ఎదురయ్యే ఫెయిల్యూర్స్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. కొందరు మహిళలు సపోర్ట్ని ఆశిస్తారు. కానీ మనకు మనమే సపోర్ట్ సిస్టమ్ అవ్వాలి. మన శక్తిని మనం గుర్తించగలగాలి. నాకు ఏదైనా చెడు ఎదురైందనుకోండి అది నా ‘స్టెప్పింగ్ స్టోన్’ అని నమ్ముతాను. జీవితం లో ఎదురయ్యే సవాల్ని అలా అనుకుంటే సక్సెస్ అయిపోతాం.⇒ స్త్రీలు ఇంటిల్లిపాదినీ చూసుకోవాలి. అది చాలా పెద్ద బాధ్యత. అయితే అందరి బాగోగులు చూస్తూ చాలామంది మహిళలు తమ గురించి పట్టించుకోరు. కానీ మన గురించి కూడా మనం పట్టించుకోవాలి. ఇన్నర్గా మనం హ్యాపీగా ఉంటే చుట్టూ ఉన్నవాళ్లను మనం ఇంకా హ్యాపీగా ఉంచగలుగుతాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే... అందర్నీ హ్యాపీగా ఉంచడమే మన పని అని ఫిక్స్ అయిపోకండి. మనం హ్యాపీగా, హెల్తీగా ఉండటం కూడా ముఖ్యం.చదవండి: ఈ టిప్స్ పాటిస్తే పండగ వేళ మెరిసిపోవడం ఖాయం!⇒ జీవితంలో ‘పాజిటివిటీ’ చాలా ముఖ్యం. ఒక పని చేసే ముందు ‘ఇది మనవల్ల అవుతుంది. చేసి తీరతాం’ అని పాజిటివ్గా ఆలోచించాలి. ఆ పాజిటివిటీ మనల్ని చాలా దూరం తీసుకెళుతుంది. చదువుకునే అమ్మాయిలకు, ఉద్యోగం చేసుకునేవారికి నేను చెప్పేదేంటంటే... ఏ విషయంలోనూ ‘నా వల్ల కాదు’ అనుకోకండి. స్త్రీలు తలచుకుంటే చేయలేనిదేం ఉండదు. పాజిటివ్ గా ఆలోచించండి. అంతా మంచే జరుగుతుంది. చెడు ఆలోచనలను దూరం పెట్టండి. ఆటోమేటిక్గా మంచి దగ్గరవుతుంది. ఈ పద్ధతి ఫాలో అయితే జీవితం కష్టంగా ఉండదు... తేలికగా సాగిపోతుంది’’ అని చె΄్పారు. – డి.జి. భవాని -
ఘనంగా క్రియా యోగ మార్గదర్శి లాహిరి మహాశయులు జయంతి వేడుకలు
హైదరాబాద్: క్రియాయోగాన్ని ప్రపంచానికి అందించిన యోగావతారులు లాహిరీ మహాశయుల జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా కన్నులపండువగా జరుగుతున్నాయి. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రధాన ఆశ్రమాల్లో, ధ్యానకేంద్రాల్లో క్రియాయోగులు, భక్తులు లాహిరి మహాశయులను స్మరించుకున్నారు.“ధ్యానం ద్వారా మీ సమస్యల్ని పరిష్కరించుకోండి. లాభం లేని, మతసంబంధమైన ఊహలకు బదులు వాస్తవమైన దైవసంస్పర్శ మీద శ్రద్ధ నిలపండి.”-లాహిరీ మహాశయులు మనమధ్య అప్పుడప్పుడు, ప్రపంచం దృష్టికి కనిపించకుండా రాబోయే తరాలకు ప్రకాశమానమైన ఒక మార్గాన్ని సుగమం చేసే ఆధ్యాత్మిక మహనీయుడు నిశ్శబ్దంగా సంచరిస్తారు. అలాంటి మహనీయులలో సెప్టెంబర్ 30, 1828న బెంగాల్లోని ఘూర్ణిలో జన్మించిన లాహిరీ మహాశయులు ఒకరు.యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు పరమహంస యోగానంద రచించిన "ఒక యోగి ఆత్మకథ"లో వివరించినట్లుగా, వారి జీవితం ఆధ్యాత్మిక సాధన గురించిన మన అవగాహనలో ఒక మలుపును సూచించింది.యోగావతార్గా ప్రసిద్ధి చెందిన లాహిరీ మహాశయులు ఒక సన్యాసి లేదా ఏకాంతవాసి కాదు. ఆయన వారణాసిలో భార్య, పిల్లలతో ఒక సాధారణ జీవితాన్ని గడిపిన ఒక గృహస్థుడు—ప్రభుత్వ అకౌంటెంట్. కానీ 1861లో, రాణీఖేత్ సమీపంలో ఉన్నప్పుడు, వారి విధి మారింది. సాధారణ ప్రజానీకానికి కనపడని, అమర యోగి మహావతార్ బాబాజీచే హిమాలయ పర్వతపాదాల వద్దకు ఆకర్షితులై, అంతరించిపోయిన క్రియాయోగ విద్యలో దీక్ష పొందారు. క్రియాయోగం అనేది ఆధ్యాత్మిక వికాసాన్ని వేగవంతం చేయగల ఒక సాధనం, ఎందుకంటే కేవలం ఒక క్రియ సాధన ఒక సంవత్సర కాలపు సహజ ఆధ్యాత్మిక పురోగతికి సమానం.ఈ సంఘటన చారిత్రాత్మకమైనది. శతాబ్దాలుగా, అటువంటి బోధనలు రక్షించబడి, సన్యాసులకు మాత్రమే ఇవ్వబడేవి. కానీ లాహిరీ మహాశయుల అభ్యర్థన మేరకు, ఈ పద్ధతిని నిజమైన దైవాన్వేషకులందరికీ ప్రసాదించవచ్చని బాబాజీ అంగీకరించారు. లాహిరీ మహాశయుల కార్యసాధన ప్రారంభమైంది. కాషాయవస్త్రాలు ధరించిన గురువుగా కాకుండా, ప్రాచీన యోగం, ఆధునిక ప్రపంచానికి మధ్య ఒక జీవన వారధిగా.. వారణాసికి తిరిగి వచ్చిన తర్వాత, లాహిరీ మహాశయులు నిశ్శబ్దంగా నిజమైన అన్వేషకులకు క్రియాయోగం బోధించడం ప్రారంభించారు. బ్రాహ్మణులు, వ్యాపారులు, పండితులు, గృహస్థులు ఆయన విద్యార్థులయ్యారు. దేవుడు అందరివాడు అనే ఒక సాధారణ సందేశంతో ఆయన కుల భేదాలను, మత సిద్ధాంతాలను ఛేదించారు.వారి అనేక బోధనలలో, ఒక వాక్యం ప్రసిద్ధి చెందింది: “బనత్, బనత్, బన్ జాయ్” (“శ్రమిస్తూ, శ్రమిస్తూ, చూడు! అదిగో! దివ్యలక్ష్యం”). ఆధ్యాత్మిక మార్గంలో నెమ్మదిగా పురోగతి సాధిస్తున్నారని నిరుత్సాహపడిన వారికి ఇది వారి సమాధానం. నిలకడైన, నిజాయితీతో కూడిన సాధన ఖచ్చితంగా ఫలితాలను ఇస్తుందనే ఆయన ప్రధాన సందేశాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.లాహిరీ మహాశయుల ప్రముఖ శిష్యులలో ఒకరు స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి. ఆయన అపారమైన జ్ఞానం కలిగిన వారు. తరువాత కాలంలో పరమహంస యోగానందకు గురువు అయ్యారు. యోగానంద విధిలో లాహిరీ మహాశయులు ఒక కీలక పాత్ర పోషించారు. యోగానంద చిన్న శిశువుగా ఉన్నప్పుడు, వారి తల్లి ఆ మహర్షి వద్దకు ఆశీర్వాదం కోసం తీసుకువెళ్ళింది. లాహిరీ మహాశయులు ఆ శిశువు నుదుటిని తాకి.. "చిట్టి తల్లీ, నీ కొడుకు యోగి అవుతాడమ్మా. ఒక ఆధ్యాత్మికమైన రైలింజను మాదిరిగా ఇతను, ఎన్నో ఆత్మలను భగవత్ సాన్నిధ్యానికి చేరుస్తాడు" అని ప్రకటించారు.ఆ ప్రవచనం నిజమైంది. యోగానందజీ ప్రపంచంలోనే గొప్ప క్రియాయోగ సాధకులయ్యారు. లాస్ ఏంజిలిస్ లో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (ఎస్ ఆర్ ఎఫ్)ను, రాంచీలో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వైఎస్ఎస్)ను స్థాపించారు. ఈ సంస్థలు యోగావతారుల పరంపరలో, యోగానంద తన దివ్యగురువు పాదాల వద్ద నేర్చుకున్న బోధనలను ప్రచారం చేస్తాయి.అద్భుతమైన సామర్థ్యాలు ఉన్నప్పటికీ, లాహిరీ మహాశయులు వినయంగా నిగర్విగా ఉన్నారు. సేవా తత్వంతో కూడిన వారి ప్రశాంత జీవితం ఆధ్యాత్మిక జ్ఞానోదయం, లౌకిక బాధ్యతల నిర్వహణ పరస్పరం వైరుధ్యాలు కావని చూపింది. సెప్టెంబర్ 30న లాహిరీ మహాశయుల జయంతిని పురస్కరించుకొని, కీర్తిని కోరకుండా ఆధ్యాత్మిక చరిత్ర గమనాన్ని మార్చిన ఒక గురువును మనం స్మరించుకుంటాము. ఒకప్పుడు హిమాలయాలలో నిగూఢంగా ఉన్న క్రియాయోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభ్యసించబడుతోంది. లాహిరీ మహాశయులలో, మనం అంతిమ ఏకీకరణను చూస్తాము: దివ్యత్వం మానవునిలో పూర్తిగా జీవించడం, దైనిక జీవితంలో అమరత్వం వ్యక్తమవడం. -
కెనడాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ఒట్టావా: తెలంగాణా డెవలప్మెంట్ ఫోరమ్ (TDF), కెనడా ఆధ్వర్యంలో బ్రాంప్టన్ నగరంలో బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. భారీ సంఖ్యలో NRI లు కుటుంబ సమేతంగా హాజరై ఆట, పాటలతో బతుకమ్మ పండుగ ను జరుపుకున్నారు.తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా తెలంగాణా డెవలప్మెంట్ ఫోరమ్,కెనడా నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేసి, పసందైన తెలంగాణా వంటకాలతో భోజనాలు కూడా ఏర్పాటు చేసారు. కెనడాలోనే పుట్టిపెరిగిన తెలుగు పిల్లలు మన పండగల ప్రత్యేకత తెలుసుకోవటం ఇలాంటి కార్యక్రమాలతో సాధ్యమౌతుందని టీడీఎఫ్ ప్రతినిధులు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీఫ్ కెనడా ప్రెసిడెంట్ జితేందర్ రెడ్డి గార్లపాటి, ఫౌండేషన్ కమిటీ చైర్మన్ సురేందర్ పెద్ది, అమితా రెడ్డి, టీడీఫ్ కెనడా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా గంటా రెడ్డి మాణిక్ రెడ్డి స్మారక విశేష సేవా పురస్కారాన్ని మహేష్ మాదాడి, రజిని దంపతులకు టీడీఫ్ కెనడా కమిటీ తరపున అందజేశారు. 21 సంవత్సరాల నుండి కెనడాలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడానికి తోడ్పాడుతున్న ప్రతీ ఒక్కరికి టీడీఎఫ్ కెనడా కమిటీ ధన్యవాదములతో అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపింది. -
యూకేలో ఎల్టీఏ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
యూకేలోని లూటన్ లో నివసిస్తున్న తెలుగు ప్రజలు.. లూటన్ తెలుగు అసోసియేషన్ (ఎల్టీఏ) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించుకున్నారు. బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు. దాంతో అక్కడ దసరా వేడుక కనుల పండువలా సాగింది. బతుకమ్మలను పేర్చినవారందరికీ బహుమతులను అందజేశారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. -
ఈ టిప్స్ పాటిస్తే పండగ వేళ మెరిసిపోవడం ఖాయం!
పండగల సీజన్ వచ్చేసింది. బతుకమ్మ, దసరా సంబరాలతో త్వరలోనే దీపావళి పండుగ రానుంది. మరి ఫెస్టివ్ కళతో మహిళలు, ముద్దుగుమ్మలు తెగ ఆరాటపడతారు. అందంగా కనిపించడం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగకుండా సహజంగా, మెరిసే పోవాలంటే ఏం చేయాలి? చిన్న చిన్న చిట్కాలతో అందరిలోను ప్రత్యేకంగా కనిపించాలంటే కొన్ని అమేజింగ్ టిప్స్ పాటిస్తే చాలు. టిప్ ఆఫ్ ది డేలో భాగంగా అలాంటివి కొన్ని చూసేద్దామా.పండగ హడావుడి, ఇంటి పనులతో ఫేస్ నిర్జీవంగా మారిపోయిందా? డోంట్ వర్రీ.. సహజసిద్ధమైన ఫేస్ మాస్క్లు, స్ర్కబ్లతో అందమైన చందమామలా మారిపోవచ్చు.ముఖంపై బ్లాక్హెడ్స్ పోవాలంటే... క్యారట్ తురుములో పంచదార పొడి, ఉప్పు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని చేతి వేళ్ళతో ముఖంపై వలయాకారంలో మసాజ్ చేయాలి. ఇలా చేస్తే ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ మటుమాయమవుతాయి. ముఖంలో గ్లో వస్తుంది.పచ్చి పాలతో ముఖాన్ని క్లిన్సింగ్ చేసుకోండి. పెరుగు,శనగపిండిలో కొద్దిగా కలబందను జోడించి ముఖానికి అప్లయ్ చేసి, ఆరిన తరువాత సున్నితంగా కడిగేసుకోండి. ఇవి అత్యంత ప్రభావవంతమైన చర్మ సంరక్షణ పద్ధతులు.. సున్నితమైన క్లెన్సర్ లేదా ఫేస్ వాష్తో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సహజ గ్లో ఇస్తుంది. ఆ తరువాత చర్మం మెరుపుకోసం ఎక్స్ఫోలియేషన్ అవసరం. వోట్ మీల్, పాలు లేదా చిక్పా పిండితో పాటు తేనె మిశ్రమాన్ని ఎక్స్ఫోలియేటర్లుగా ఉపయోగించవచ్చు. ఇది డెడ్ స్కిన్ని తొలగించి కాంతిని ఇస్తుంది. కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నందున దీనిని కొన్నిసార్లు మాయిశ్చరైజర్గా ఉపయోగించవచ్చు. ముఖంపై కొద్ది మొత్తంలో కొబ్బరి నూనెను మసాజ్ చేసుకోవాలి. ఆ తరువాత సాధారణ క్లెన్సర్తో క్లీన్ చేసుకోవాలి. కొబ్బరి అలెర్జీ ఉంటే మాత్రం దీనిని నివారించాలి.15 లేదా అంతకంటే ఎక్కువ SPF ఉన్న సన్స్క్రీన్ వాడాలి.. హానికరమైన UV కిరణాల నుండి మీ చర్మాన్ని రక్షించడం వల్ల చర్మం వృద్ధాప్య ప్రక్రియ నుండి కూడా రక్షిస్తుంది.దుమ్ము, ధూళి వాతావరణానికి దూరంగా ఉండాలి. మరీ వేడి నీళ్లతో స్నానం చేయవద్దు. దీనివల్ల ముఖ్యం నేచురల్ ఆయిల్స్ నష్టపోతాం.సమతులం ఆహారం, ఎక్కువ నీరు,ప్రోబయోటిక్స్ ఫుడ్ తీసుకోవాలి పండ్లు , కూరగాయలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.శుద్ది చేసిన, ప్రాసెస్, ప్యాక్డ్ ఫుడ్, డీప్ ఫై చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉంటూ, నూనె, ఉప్పు, చక్కెర అధిక వినియోగం శరీరానికి హాని చేస్తాయని గుర్తుంచుకోవాలి.బచ్చలికూర, కాలే వంటి ఆకు కూరలు, దోసకాయ, పాలకూర, బీట్ రూట్, క్యారెట్, యాపిల్, అరటిపండు, స్ట్రాబెర్రీలతో కూడిన స్మూతీలను హెర్బల్ టీ తీసుకోవాలి. రోజంతా ఉత్సాహంగా ఉండేలా నిద్ర లేచిన కొద్దిసేపటికే నెగటివ్ థాట్స్, చేదు జ్ఞాపకాలు ఏమైనా ఉంటే వాటిని వెంటనే డిలీట్ చేయాలి. ఇష్టమైన సంగీతం వినాలి. వ్యాయమాలు, క్రియేటివ్ వర్క్పై దృష్టి పెట్టాలి. వీటన్నింటితో కనీస వ్యాయామం చేయడం చాలా అవసరం. -
తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు.. 66 శాతం మంది వారే!
తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. నోటిఫికేషన్ విడుదల చేసిన 14 నెలలోపే ఫలితాలను విడుదల చేసి రికార్డు నెలకొల్పింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. 562 మంది గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నాడు హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో నియామక పత్రాలు అందజేశారు. ఈసారి ఫలితాల్లో మహిళలు గణనీయమైన పురోగతి సాధించడం విశేషం. జనరల్ మెరిట్ టాప్ -10లో ఆరుగురు మహిళలు ఉన్నారు. ఇక టాప్-50లో 25 మంది, టాప్-100లో 41 మంది మహిళలు ఉన్నారు.గత కొన్నేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళా ప్రాతినిథ్యం పెరుగుతూ వస్తోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ వాణిజ్య పన్నుల విభాగంలో మహిళా అధికారుల సంఖ్య బాగా పెరుగుతోంది. తాజాగా వెల్లడైన గ్రూప్-1 ఫలితాల (Group 1 Results) ఆధారంగా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు కొత్తగా కేటాయించిన ఉద్యోగుల్లో 66 శాతం మంది మహిళలు ఉన్నారు. శిక్షణ పూర్తైన తర్వాత కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లుగా జీఎస్టీ (GST) సంబంధిత వ్యవహారాలను వీరు పర్యవేక్షిస్తారు.48 మందిలో 31 మంది వారే!తెలంగాణ వాణిజ్య పన్నుల విభాగంలో ప్రస్తుతం 8 మంది మహిళా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు (commercial tax officers) ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఈ డిపార్ట్మెంట్లో మహిళల ప్రాతినిథ్యం పెరుగుతోందని సీనియర్ అధికారి కె. హరిత తెలిపారు. 1990 ప్రాంతంలో తన బ్యాచ్లో తానొక్కరే మహిళా సీటీవోగా ఉన్నానని గుర్తు చేసుకున్నారామె. తాజాగా ప్రభుత్వం 48 మందిని సీటీవోలుగా నియమించగా, వీరిలో 31 మంది మహిళలు ఉండటం విశేషం.కీలక పోస్టుల్లో 24 మందికమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అదనపు కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్ల సహా 34 కీలక పోస్టులు ఉన్నాయి. వీటిల్లో 24 మహిళలు ఉన్నారు. 1996లో 8 మంది మహిళలు ఈ విభాగంలో చేరారు. అప్పటి నుంచి క్రమంగా మహిళా ఉన్నతోద్యోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత చాలా మంది అధికారులు ఆంధ్రప్రదేశ్కు వెళ్లిపోయారు. వీరిలో ఎక్కువ మంది పురుషులు ఉన్నారు. దీంతో తెలంగాణ వాణిజ్య విభాగంలో మహిళలు ఉన్నత స్థానాలకు చేరుకుని తమదైన ముద్ర వేయడానికి అవకాశాలు ఏర్పడ్డాయి.కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే వారికి మెరుగైన విశ్లేషణాత్మక నైపుణ్యాలు అవసరమని సీనియర్ మహిళా అధికారి ఒకరు అన్నారు. వాణిజ్య పన్నులకు సంబంధించిన నియమ నిబంధనలు తరచు మారుతుంటాయని, దానికి అనుగుణంగా ఉద్యోగులు అప్డేట్ కావాల్సి ఉంటుందని వివరించారు. ఉద్యోగ, వ్యక్తిగత జీవితాన్ని బాలెన్స్ చేసేవిధంగా ఉండడం వల్లే ఎక్కువ మంది మహిళలు ఈ వాతావరణంలో పనిచేయడానికి ఇష్టపడుతున్నారని వెల్లడించారు.చదవండి: ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన మహిళగతంలో వాణిజ్య పన్ను శాఖ కమిషనర్లుగా పనిచేసిన టికె శ్రీదేవి, నీతు ప్రసాద్ (Neetu Prasad) వంటి అధికారులు మహిళా శక్తిని చాటిచెప్పారు. సాంప్రదాయకంగా పురుషులు ఆధిపత్యం చెలాయించే ఉన్నత ఉద్యోగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారని చెప్పడానికి వాణిజ్య పన్నుల విభాగం నిదర్శనంగా నిలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
వెయ్యేళ్ల నాటి ఆలయం..! ఇక్కడ దుర్గమ్మకు రక్తం చిందించని బలి..
ఎన్నో దుర్గమాత ఆలయాలు చూసుంటారు. కచ్చితంగా అక్కడ ఇచ్చే బలులకు నేలంతా రక్తసికమై ఎర్రటి సింధూరలా మారిపోతుంది. కానీ ఇప్పుడు మీరు చదవబోయే ఈ ఆలయంలో రక్తమే చిందించని సాత్విక బలి సమర్పిస్తారు. అదే ఈ ఆలయం ప్రత్యేకత. ఈ ఆలయం ఎన్నేళ్ల నాటిదో తెలిస్తే విస్తుపోతారు. ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్న ఆ కట్టడం తీరు భక్తులను విస్మయానికి గురి చేస్తోంది. దసరా సదర్భంగా ఈ ఆలయ విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఈ దుర్గమాతా ఆలయం అత్యంత పురాతన చరిత్ర కలిగిన ఆలయం.. వెయ్యేళ్ల నాటి పురాతన ఆలయం. ఇది బీహార్ రాష్ట్రంలోని, కైమూర్ జిల్లా, కౌర అనే ప్రాంతంలో ఉంది. ఇక్కడ అమ్మవారు ముండేశ్వరి మాతగా భక్తుల నీరాజనాలు అందుకుంటోంది. దీనిని ముండేశ్వరి దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో విష్ణు భగవానుడు, శివుడు కూడా కొలువై ఉన్నారు. వారణాసికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయంఆ పేరు రావడానికి కారణం..ఈ ఆలయం ముండేశ్వరీ అనే పర్వతం మీద వుంటుంది. ఈ పర్వతం మీద ఉండటంతో ఈ ఆలయానికి ముండేశ్వరి ఆలయం అనే పేరు వచ్చింది. అయితే ముండేశ్వరి మాత చూడటానికి కొంత వరకు వారాహి మాతగా భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడ అమ్మవారి వాహనం మహిషి. అమ్మవారి దేవాలయం అష్టభుజి దేవాలయం. ఈ ఆలయాన్ని100ఏడి లో నిర్మించారు. విచిత్రమైన బలి ..ఇక అమ్మవారికి సమర్పించే బలి అత్యంత ప్రత్యేకతను కలిగి ఉంది. ఇలాంటి బలి ఏ ఆలయంలో కనిపించదు. ముందుగా అమ్మవారికి బలి ఇవ్వదలుచుకున్న మేకను ముండేశ్వరి మాత ముందుకు తీసుకువస్తారు. దాని మెడలో ఒక పూల దండ వేయగానే ఏదో మూర్చ వచ్చినట్లు పడిపోతుంది. కాసేపటికి పూజారి ఏవో మంత్రాలు చదువుతూ బియ్యం గింజలు వేయగానే తిరిగి ఆ మేక యథాస్థితిలోకి వస్తుంది. దాన్ని తిరిగి భక్తుడికి ఇచ్చేస్తాడు పూజారి. ఇక్కడ అమ్మవారికి రక్తం చిందించని, ప్రాణం తీయని సాత్విక పద్ధతిలో బలిని ఇవ్వడమే ఈ ఆలయం విశిష్టత. ఈ అమ్మవారు భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తులుచేత నీరాజనాలు అందుకుంటోంది.(చదవండి: శ్రీలంక టూర్..బౌద్ధ రామాయణం) -
ఎల్లలు దాటిన బతుకమ్మ, దేశ విదేశాల్లో ఘనంగా సంబరాలు
సాక్షి, హైదరాబాద్: ఆ్రస్టేలియా, అమెరికా, దుబాయ్ దేశాల్లో జరిగిన బతుకమ్మ వేడుకలకు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. గల్ఫ్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో శనివారం దుబాయిలో జరిగిన వేడుకలకు.. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ జి.వెన్నెల గద్దర్తోపాటు అడువాల జ్యోతి లక్ష్మణ్, అల్లూరి కృష్ణవేణి అతిథులుగా హాజరయ్యారు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో హారిస్బర్గ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ పండుగ సంబురాలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో హారిస్బర్గ్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు కాకర్ల శ్రీనివాస్, కార్యదర్శి మునికుమార్ గిల్లా తదితరులు పాల్గొన్నారు. ఆ్రస్టేలియాలో జరిగిన బతు కమ్మ సంబురాలకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు.ఇవీ చదవండి: సింగపూర్లో ఘనంగా బతుకమ్మ పండుగ వేడుకలుజర్మనీలో అంబరాన్నంటిన.. బతుకమ్మ సంబరాలుమలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలుఅబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు -
ఇది ఆమె "మన్ కీ బాత్"..! నారీ శక్తికి నిలువెత్తు నిదర్శనం..
భారత్, ఇటలీ ప్రధానులు నరేంద్రమోదీ, జార్జియా మెలోనీ మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలోనే ఆమె ఆత్మకతకు ముందు మాట రాశారు. అందులో ఇటలీ ప్రధాని మెలోని జీవితం ఎప్పుడూ రాజకీయాలు, అధికారం గురించి కాదు అంటూ పలు ఆసక్తి కర విషయాలు వెల్లండించారు. ఒకరి ఆత్మకథలో ముందుమాట ఇంత అద్భుతంగా ఉంటుందా అనేలా..మెలోని గురించి చాలా చక్కగా వివరించారు ప్రధాని మోదీ. మరి ఆ విశేషాలేంటో చూద్దామా..!‘ఐ యామ్ జార్జియా: మై రూట్స్, మై ప్రిన్సిపల్స్(I Am Giorgia — My Roots, My Principles)’ పేరిట రాసిన మెలోనీ ఆత్మకథ ఇండియన్ ఎడిషన్ను త్వరలో మార్కెట్లోకి తీసుకురానున్నారు. దీనిని ‘హర్ మన్కీ బాత్’ అని అభివర్ణించిన ప్రధాని మోదీ.. ముందుమాట రాశారు. అది తనకు దక్కిన గొప్ప గౌరవం అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘‘పీఎం మెలోనీ జీవితం, నాయకత్వం అధికారం గురించి కాదని అన్నారు. నిశితంగా చూస్తే అడగడుగున ధైర్యం దృఢనిశ్చయం ప్రజాసేవ పట్ల నిబద్ధత ప్రస్పుటంగా కనిపిస్తాయని చెప్పారు. నాయకురాలిగా ఆమె ప్రస్థానం స్ఫూర్తిదాయకం, చారిత్రాత్మకమైనదని అన్నారు. ఆమె ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడూ కూడా రాజకీయ విశ్లేషకులు సందేహాస్పదంగా ఉన్నారు. అయితే ఆమె నాయకురాలిగా తన బలం, స్థిరత్వాన్ని అందించారన్నారు. అంతేగాదు ఎల్లప్పుడూ ప్రపంచ వేదికపై ఇటలీ ప్రయోజనాలను అద్భుతమైన స్పష్టతతో వినిపించింది. ఆమె ఎదుగుదల, నాయకత్వాన్ని అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి చాలా మార్గాలు ఉన్నాయన్నారు. అయితే తాను భారతీయ సంప్రదాయంలో అనే రూపాల్లో గౌరవించబడుతున్న దైవిక స్త్రీ శక్తి, నారీ శక్తి భావనలతో సరిపోలుస్తానన్నారు. ప్రధాని మెలోనీ ప్రపంచం వేదికపై తన దేశాన్ని నడిపిస్తూ..తన మూలలను మరవలేదు. అందుకే ఆమె రాజకీయ ప్రస్థానం భారతదేశంతో లోతుగా ప్రతిధ్వనిస్తుందని అన్నారు. రోమ్లోని ఓ సాదాసీదా పొరుగు ప్రాంతం నుంచి ఇటలీ అత్యున్నత రాజకీయ పదవిని అధిరోహించేంత వరకు సాగిన రాజకీయ ప్రస్థానం...ఆమె శక్తిని హైలెట్ చేస్తోంది. అంతేగాదు మాతృత్వం, జాతీయ గుర్తింపు, సంప్రదాయాన్ని రక్షించాలనే ఉద్దేశ్యం తదితరాలు భారత పాఠకులతో ప్రతిధ్వనిస్తుందని చెప్పారు. అలాగే ప్రపంచంతో నిమగ్నమవుతూనే సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించుకోవడానికి పడుతున్న ఆరాటం, తపన.. ఆమె వ్యక్తిగత నమ్మకాలు, విలువలకు నిదర్శనమని అన్నారు. పైగా ఆమెకు ప్రజల పట్ల ఉన్న అపారమైన కరుణ, బాధ్యత తోపాటు శాంతిమార్గంలో నడిపించాలనే ఆలోచనలు ఈ పుస్తకం అంతటా ప్రతిధ్వనిస్తాయి అని రాసుకొచ్చారు మోదీ.వాస్తవానికి ఈ బుక్ అసలు వెర్షన్ 2021లోనే పబ్లిష్ అయి, బెస్ట్ సెల్లర్గా నిలిచింది. అప్పుడు మెలోనీ (Giorgia Meloni) విపక్షంలో ఉన్నారు. 2025, జూన్లో దీనిని అమెరికాలో విడుదల చేశారు. అప్పుడు దానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు ముందుమాట రాశారు. కాగా.. మోదీ, మెలోనీలు దిగిన ఫొటోలు ఎప్పుడూ నెట్టింట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్న సంగతి తెలిసిందే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ వేదికగా జరిగిన ‘కాప్ 28’ సదస్సు సందర్భంగా వీరిద్దరూ సెల్ఫీ తీసుకున్నారు. దీన్ని మెలోని ఎక్స్లో షేర్ చేశారు. దానికి మెలోడీ (ఇద్దరి పేర్లలోని అక్షరాలు కలిసేలా) అనే హ్యాష్ట్యాగ్ను జత చేశారు. అప్పటినుంచి ఈ #Melodi పదం ట్రెండ్ అయ్యింది.(చదవండి: వండర్ బామ్మ..! 93 ఏళ్ల వయసులో గోల్డ్ మెడల్) -
భోజనం తిన్న వెంటనే 30 నిమిషాలు చాలు.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా!
యుక్త వయసులోనే ఉన్నట్టుండి గుండెనొప్పితో కుప్పకూలి చనిపోతున్న ఘటనలు అనేకం చేస్తున్నాయి. ఆరోగ్యంగా, ఫిట్గా ఉన్నవారు కూడా ‘గుండె’ లయ తప్పుతున్న కారణంగా ఉన్న పళంగా ప్రాణాలు విడిస్తున్నారు. అయితే తిన్న వెంటనే వాకింగ్ చేస్తే గుండెపోటువచ్చే అవకాశాలు 40 శాతం వరకూ తగ్గుతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా అన్నం తిన్న వెంటనే నడకతో వచ్చే లాభాల గురించి తెలుసుకుందాం.25నుంచి 30 ఏళ్ల యువత కూడా గుండెపోటుకు గురవుతున్నారు. ఫాస్ట్ ఫుడ్, కనీస వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకర జీవనశైలి, తగినంత నిద్ర లేకపోవడం, ఊబకాయం, ఒత్తిడి వంటి అనేక కారణాలు గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. కానీ ఈ చిన్న అలవాటు గుండెపోటు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.నిజానికి భోజనం చేసిన వెంటనే నడవడం వల్ల అలసట, కడుపు నొప్పి , ఇతర రకాల అసౌకర్యాలు కలుగుతాయని ఒక అపోహ ఉంది. కానీ భోజనం చేసిన తర్వాత నడవడం బరువు తగ్గడానికి తిన్న తర్వాత ఒక గంట తర్వాత నడన కంటే, వెంటనే చేసే వాకింగ్ ఎక్కువ ప్రభావ వంతంగా ఉంటుందని అధ్యయనంలో కనుగొన్నారు. భోజనం చేసిన తర్వాత ఒక గంట తర్వాత ప్రారంభించి 30 నిమిషాలు నడవడం కంటే భోజనం తర్వాత కనీసం 30 నిమిషాలు నడక అలవాటు చేసుకుంటే,కండరాలు గ్లూకోజ్ను వెంటనే ఉపయోగించు కోవడంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. దీంతో ఇన్సులిన్ ఉత్పత్తి కూడా నియంత్రణలో ఉంటుంది. అందుకే భోజనం తర్వాత వీలైనంతత్వరగా నడకను అలవాటు చేసుకోవాలి.జిమ్కి వెళ్లడం, కఠినమైన వ్యాయామాలు చేయడం సాధ్యంకాని వారికి ఇది నిజంగా వరం లాంటిదని చెప్పవచ్చు. ప్రతిరోజూ భోజనం తర్వాత ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత వీలైనంత త్వరగా 30 నిమిషాలు వేగంగా నడవడం వల్ల ఎక్కువ బరువు తగ్గే అవకాశాలున్నాయి. లేదంటే ప్రతి ఆహారం గ్లూకోజ్గా మారి రక్తంలోకి వెళ్తుంది. ఆ సమయంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగడం వల్ల రక్తనాళాల్లో వాపు, ఒత్తిడి వస్తుంది. ఇది దీర్ఘకాలంలో రక్తనాళాల లైనింగ్ను దెబ్బతీసి గుండె జబ్బులకు దారి తీస్తుంది.భోజనం చేసిన వెంటనే కూర్చుండిపోవడం, మొబైల్ చూస్తూ అలా ఉండిపోవడం, లేదంటే వెంటనే మంచంమీద వాలిపోవడం లాంటివిఆరోగ్యానికి చాలా చేటు చేస్తాయి. అలా కాకుండా కేవలం 30 నిమిషాల పాటు నడక ఎన్నో రకాల అనారోగ్యాలనుంచి తప్పించుకోవచ్చు. రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా, ఆహారం శక్తిగా మారుతుంది. కండరాలు బలపడటతాయి. బరువు కూడా అదుపులో ఉంటుంది. -
రెస్టారెంట్లో పనిచేస్తూ రూ. 4 కోట్లు..! కానీ చివరికి..
ఆర్థిక భద్రత ముఖ్యమే. పొదుపుగా ఉండాలి. ఇవన్ని ఆర్థిక సూత్రాలే. కానీ వాటితోపాటు కాసింత సంతోషానికి, ఎంజాయ్మెంట్కి కూడా చోటివ్వాలి. లేదంటే ఈ జీవితం క్షణ భంగురం. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు. ఊహకందని భవిష్యత్తు కోసం మరింత ఆరాటం, పొదుపు ఎంత అనర్థదాయకమో ఈ వ్యక్తిని చూస్తే తప్పక తెలుస్తుంది. ఉన్నంతలో సంతోషంగా ఉండటం వేరు. ఎప్పటికైనా అతి పొదుపు చివరికి వ్యథనే మిగులుస్తుంది అనేందుకు ఇతడే ఉదాహారణ.జపాన్కి చెందిన సుజుకి అనే వ్యక్తి ఒక రెస్టారెంట్లో పనిచేస్తుండేవాడు. అతడు చిన్నతనం నుంచి కటిక పేదరికంలో పెరిగాడు. అందుకే పూర్తి సమయం ఉద్యోగానికే కేటాయించి, డబ్బులు ఆదా చేసేవాడు. చౌకగా లభించే అపార్టుమెంట్లో నివశించేవాడు. ఆఖరికి తన కాబోయే భార్యను కూడా తను పనిచేసే రెస్టారెంట్లోనే కలుసుకున్నాడు. అతడు చాలా పొదుపరి అని భార్యకు తెలుసు. వారికి ఒక కుమారుడు జన్మించాడు. అతడు పుట్టాక కాస్తా ఖర్చులకు వెనకడాకపోయినా..మిగతా అన్నింటి విషయంలో చాలా స్ట్రిక్ట్గా పొదుపుగా ఉండేవాడు. జీవితంలో ఒక్కసారి కూడా రెస్టారెంట్ భోజనం చేయలేదు. ఏసీ కూడా ఉపయోగించకుండా లైఫ్ని గడిపేశాడు. కనీసం బైక్ లేదా కారు వంటివే ఉపయోగించ లేదు. ఉద్యోగానికి సైకిల్పైనే వెళ్లేవాడు. మాటల్లో చెప్పలేనంత పిసినారిలా బతికాడు. ఎలాగైతేనేం అతలా పొదుపుగా ఉండి ఏకంగా రూ. 4 కోట్లు దాక ధనం కూడబెట్టాడు. అయితే ఆ డబ్బుతో భార్యతో సంతోషంగా ఉందాం అనుకునేలోపు ఆకస్మికంగా చనిపోయింది. "ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు. ప్రస్తుతం సుజుకి 65 ఏళ్లు. ఇన్నాళ్లు ఎంతలా కఠినంగా వ్యవహరించాను అని కుమిలిపోతున్నాడు. చిన్న చిన్న ఆనందాలు, కానీ సరదాలకు కానీ తావివ్వకుండా ఓ మర మనిషిలా బతికానే అంటూ రోదిస్తున్నాడు. ఎంతలా వెక్కి వెక్కి ఏడ్చినా..కాలాన్ని వెనక్కి తిప్పలేం. ఆ రోజులు మళ్లీ రావు. ఇప్పుడు ఈ డబ్బుని తానేం చేసుకోవాలి అని కన్నేరుమున్నీరుగా విలపిస్తున్నాడు." హాయిగా కడుపు ఆరగించుకునే సమయంలో మొలకలు, చిన్న చికెన్ ముక్కలతో కాలక్షేపం చేశాడు. ఇప్పుడు హాయిగా తిందామన్నా..శరీరం, వయసు రెండు సహకరించడం లేదు. పోనీ షికారు చేద్దామన్నా..రెండడుగులు వేస్తే..ఆయాసం, పైగా అక్కడి వాతావరణం పడక నానా ఇక్కట్లు పడుతున్నాడు. ఇతడిలాంటి వాళ్లెందరో జపాన్లో ఉన్నారట. గతంలో ఓ వ్యక్తి ఏకంగా పొదుపుకే జీవితాన్ని అంకితం చేసి రూ. 8 కోట్లు దాక కూడబెట్టి వార్తల్లో నిలిచాడట. ఈ ఘటనలు..డబ్బు సంపాదనే జీవితం కాదు. ధనం కూడబెట్టుకుంటే.నే.హాయిగా ఉంటాం అన్నది ఎన్నటికీ సరైనది కాదన్నది జగమెరిగిన సత్యం. ఖర్చు చేయాల్సిన చోట ఖర్చు పెట్టాలి, పొదుపుగా ఉండాల్సిన చోట ఖర్చుని అదుపులో ఉంచాలి. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసేవాడే మహనీయడని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. ఆర్థిక భధ్రత తోపాటు, ఆర్థిక స్వేచ్ఛకు ప్రాముఖ్యత ఇవ్వండి. అంతా అయిపోయాక ఏం చేద్దామన్నా..ఏం చేయలేం అని హెచ్చరిస్తున్నారు. (చదవండి: "మైక్ లేదు, వాయిద్యాలు లేవు" అద్భుతమైన గర్భా నృత్యం..! మాటల్లేవ్ అంతే..) -
మూడేళ్లు, మూడు అలవాట్లు : 30 కిలోలు తగ్గిన డాక్టర్ భావన
బరువు తగ్గడం పెద్ద టాస్క్. షార్ట్కట్లో, చిటికె వేసినట్టు బరువు తగ్గడం సాధ్యం కాదు. ఒక వేళ తగ్గినా అది ఆరోగ్యకరం కాదు కూడా. ఇదే విషయాన్ని బెంగళూరుకు మహిళా డాక్టర్ నిరూపించారు. నో మ్యాజిక్, నో టిప్స్.. నో ట్రెండింగ్ ఫ్యాషన్ అంటూ ఇద్దరు కుమార్తెల తల్లి భావన బరువు తగ్గిన తీరు విశేషంగా నిలుస్తోంది. బెంగళూరు డాక్టర్ భావన ఆనంద్ నెమ్మదిగా, స్థిరమైన . ఆచరణాత్మక విధానాన్ని స్వీకరించారు. ప్రతి భోజనంలో ఒక ముఖ్యమైన పోషకాన్ని తినడం ద్వారా మూడు సంవత్సరాలలో 30 కిలోల బరువు తగ్గారు.మూడేళ్లలో 30 కిలోలు ఎలా?2022 డిసెంబరులో భావన బరువు దాదాపు 84 కిలోలు ఉండేవారు. తాను అనుసరించిన పద్ధతి ద్వారా క్రమంగా 2025 నాటికి 56.6 కిలోలకు చేరుకున్నారు. ప్రతిరోజూ తనను తాను చెక్ చేసుకోవడం, సరిగ్గా తినడం ,క్రమం తప్పని వ్యాయామం ఈ మూడు అలవాట్లు తన జీవితాన్ని మార్చాయి అంటే తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. భావన బరువు తగ్గడాన్ని జీవనశైలి మార్పుగా భావించింది.సుదీర్ఘ ప్రణాళికతో క్రాష్ డైట్స్ లేదా డిటాక్స్ లాంటివేవీలేకుండా ప్రతీరోజు చిన్నగా నడవండిఅంటారామె. బరువు తగ్గడం అనేది దానిని తగ్గించడం కంటే చాలా సవాలుతో కూడుకున్నదే.కానీ దృష్టి దీర్ఘకాలిక ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా ఇది సాధ్యమే అనేది భావన సక్సెస్మంత్ర. View this post on Instagram A post shared by Dr Bhawana Anand (@dr.fitmum) గేమ్-ఛేంజర్: భావన ప్రకారం, ప్రతి భోజనంలో ప్రోటీన్ జోడించడమే పెద్ద మార్పు.ఈ ఒక్క అడుగు ఆమె ఫిట్నెస్ ప్రయాణానికి వెన్నెముకగా మారింది. "కండరాల బలానికి, పెరుగుదలకు భోజనాన్ని సమతుల్యంగా ఉంచడానికి చాలా కీలకం అని ఆమె పేర్కొంది. ప్రోటీన్ ఆమెకు ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగించింది, భోజనం మధ్య చిరుతిండి లేదా అతిగా తినాలనే కోరికను తగ్గించింది.ప్రోటీన్ ఎందుకు?బరువు తగ్గడానికి లేదా ఫిట్గా ఉండటానికి ప్రయత్నించే ఎవరికైనా ప్రోటీన్ అవసరమని పోషకాహార నిపుణులు అంగీకరిస్తున్నారు.కార్బోహైడ్రేట్లు, కొవ్వులతో పాటు శరీరంలోని మూడు ప్రధాన మాక్రో న్యూట్రియెంట్లలో ఒకటిది. ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. కేలరీల ఇన్టేక్ను తగ్గిస్తుంది.ఎంత ప్రోటీన్ తినాలి? ప్రపంచ ఆహార మార్గదర్శకాల ప్రకారం, వయోజన మహిళలు రోజుకు కనీసం 46 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి, పురుషులు కనీసం 56 గ్రాములు తీసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వ్యక్తులు వారి ఫిట్నెస్ లక్ష్యాలను బట్టి అధిక మొత్తంలో ప్రయోజనం పొందవచ్చు.ఆరోగ్యకరమైన ప్రోటీన్ మూలాలుగుడ్లు, చికెన్, చేపలు , లీన్ మాంసాలు, కాయధాన్యాలు , చిక్కుళ్ళుగ్రీకు యోగర్ట్ పనీర్, గింజలు , విత్తనాలుప్రోటీన్ షేక్స్ లేదా సప్లిమెంట్లు (అవసరమైనప్పుడు)తన వెయిట్లాస్ జర్నీ, తన ఫిట్నెస్ రొటీన్, పలు రకాల కసరత్తుల వీడియోలు, తన ప్రొటీన్ ఆహారం డా. ఫిట్మమ్ ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ, అభిమానులను ప్రేరేపించడం భావనకు అలవాటు. -
"మైక్ లేదు, వాయిద్యాలు లేవు": అద్భుతమైన గర్భా నృత్యం..!
ప్రస్తుతం విభిన్న సంస్కృతుల మేళవింపుగా ఆధునికతకు అద్ధం పట్టేలా దసరా వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఎక్కడ చూసిన డీజే మ్యూజిక్లు, అదిరిపోయ్ డ్రమ్స్ ధ్వనిలతో దద్ధిరిల్లిపోయేలా ధూం ధాంగా జరుపుతున్నారు. అలాంటిది అవేమి లేకుండా నాటి సంబరాన్ని గుర్తుకు చేసేలా అద్భుతంగా చేశారు. ఎంత లయబద్ధంగా ఉందంటే..ఇది గర్భా మ్యాజిక్ ఏమో అనొచ్చు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మహిళలంతా సాంప్రదాయ గర్భా నృత్యం చేస్తూ అలరించారు. ఎలాంటి మైక్, మ్యూజిక్ సౌండ్స్ లేకపోయినా అద్భుతంగా ఉంది. కేవలంగా వారి చేతి చప్పట్లు, లయబద్ధంగా పాడుతున్న పాట..సహజత్వాన్ని ఉట్టిపడేలా సాగింది. చెప్పాలంటే సౌండ్ పొల్యూషన్కి తావివ్వని విధంగా ఆహ్లాదకంరగా నాటి మన సంప్రదాయ సంస్కృతిని గుర్తుచేసింది..ఈ గర్భా నృత్యం. ఆ వీడియోలో మహిళలంతా "అంబే మా కీ జై" అంటూ వృత్తాకారంలో చేస్తున్న నృత్యం ఎక్కడ బీట్ మిస్కాకుండా అలల ప్రవాహంలా సాగిపోతోంది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షించింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు వాణిజ్యంతో ముడిపడిలేని గర్భా నృత్యమని కొనియాడారు. అంతేగాదు గర్బాను 'తరం' సమస్యగా మార్చాల్సిన అవసరం లేదని ఆ మహిళలు తమదైన శైలిలో చెప్పారంటూ ప్రశంసల వర్షం కురిపించారు. View this post on Instagram A post shared by Artistic Life with Preeti (@artisticlifewithpreeti) (చదవండి: కళ్లు బైర్లు కమ్మేలా బంగారం ధరలు.. అక్కడ మాత్రం 10 కేజీలతో డ్రెస్సు..!) -
పెళ్లి సందడి : మెహిందీ వేడుకలో అవికా గోర్ చేసిన పని వైరల్
చిన్నారి పెళ్లికూతురు సీరియల్తో గుర్తింపు తెచ్చుకున్న టీవీ నటి అవికా గోర్ (Avika Gor). 'ఆనంది' పాత్ర ద్వారా పాపులరైన అవికా తన చిరకాల ప్రియుడు, సామాజిక కార్యకర్త మిలింద్ చంద్వానీ (Milind Chandwani)ని పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే.అవికా గోర్ తన రోకా, నిశ్చితార్థాన్ని ప్రకటించినప్పటి నుండి చాలా వార్తల్లో నిలిచింది. ఇటీవల జంట 'పాటి పత్ని ఔర్ పంగా' షోలో వారి మెహందీ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా అవికా గౌర్ చేసిన పని ఇంటర్నెట్లో అందరి హృదయాలను గెలుచుకుంది. దీంతో అవికా గోర్ మెహందీ వేడుక వైరల్గా మారింది. ఈ సంప్రదాయంలో భాగంగా, అవికా తన కాబోయే భర్త మిలింద్ చాంద్వానీ పేరును తన అరచేతిపై అందంగా రాసుకుంది. అంతేకాదు తన అత్తమామల పేర్లను కూడా అదే అరచేతిలో పండించుకోవడం విశేషంగా నిలిచింది. దీనితో పాటు, ఆమె కుటుంబ సభ్యుల పేర్లను కూడా మరొక అరచేతిలో రాయించు కుంది. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల వైబ్స్లో మరింత జోష్ వచ్చింది. దీనిపై అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపించారు. మిలింద్ తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గౌరవంగా అభవర్ణిస్తున్నారు. అవికా అందమైన కలర్ఫుల్ లెహంగా, ఆభరణాల్లో కనిపించింది, మరోవైపు, మిలింద్ రాజస్థానీ శైలి తలపాగాను ధరించాడు. ఇద్దరూ ఎంతో సంతోసంగా డ్యాన్స్ చేశారు. View this post on Instagram A post shared by Maroof Mian (@maroofmian.sayyed) ప్రస్తుతం మునావర్ ఫరూఖీ అండ్ సోనాలి బింద్రే హోస్ట్ చేస్తున్న ప్రముఖ రియాలిటీ షో,పతీ పత్ని ఔర్ పంగా-జోడియోం కా రియాలిటీ చెక్లో కనిపించే అవికా గోర్ ,మిలింద్ చాంద్వానీ, ఇటీవల జాతీయ టెలివిజన్ ద్వారా లైవ్లో వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా సామాజిక కార్యకర్త అయిన మిలింద్ చంద్వానీతో 2020 నుంచి డేటింగ్ లో ఉన్న అవికా త్వరలోనే అతన్ని వివాహం చేసుకోబోతోంది. 2019లో ఒక ప్రోగ్రామ్ లో భాగంగా మిలింద్ ను కలిసింది అవికా. 2025 జూన్ లో అవికా గోర్ ఎంగేజ్మెంట్ ప్రక్టించచారు. సెప్టెంబర్ 30న పెళ్లి చేసుకోబోతున్నారు. View this post on Instagram A post shared by Maroof Mian (@maroofmian.sayyed) -
ఆనందమే ఆరోగ్యం..!
బ్రెస్ట్ కేన్సర్పై అవగాహన కల్పిస్తూ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వేదికగా పింక్ పవర్ రన్ ఆదివారం నిర్వహించారు. ఈ మారథాన్లో ప్రపంచ సుందరీమణులు, సినీ ప్రముఖులు, అధికారులు, వృద్ధులు, చిన్నారులు పాల్గొన్నారు. 10కే, 5కే, 3కే విభాగాల్లో రన్ నిర్వహించారు. రన్లో పాల్గొనే వారికి అంతర్జాతీయ ఫిట్నెస్ నిపుణులు మెళకువలు నేర్పించారు. గత సంవత్సరం 10వేల మంది పాల్గొనగా.. ఈ యేడాది 20వేల మంది పింక్ పవర్ రన్లో పాల్గొన్నారు. మూడు విభాగాల్లో నిర్వహించిన ఈ పింక్ పవర్ రన్ను మిస్ వరల్డ్ –2025 ఓపల్ సుచాత, మిస్ ఆసియా కృష్ణ, ఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మపర్సన్ సుధారెడ్డి పలువురు ప్రముఖులతో కలిసి జెండా ఊపి రన్ ప్రారంభించారు. కేన్సర్ మహమ్మారిపై అవగాహన కల్పించేందుకు రన్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. పది కిలోమీటర్ల పరుగును అతి తక్కువ సమయంలో పూర్తిచేసిన ముగ్గురు మహిళలకు ట్రోఫీలతో పాటు ప్రైజ్ మనీ అందజేశారు. బ్రెస్ట్ కేన్సర్ అవగాహన రన్లో పాల్గొన్న ఏడు సంవత్సరాల పార్వతి, ఐదు కిలోమీటర్ల విభాగంలో ఐదు సంవత్సరాల కబీర్ సింగ్, వీల్ చైర్తో పాల్గొన్న నంద కిషోర్ అనే యువకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రన్లో పాల్గొన్న వారితో నెక్లెస్ రోడ్డు గులాబీ వర్ణంతో నిండిపోయింది. ప్రముఖుల సందడి.. మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్పాస్ట్రక్చర్ లిమిటెడ్, సుధారెడ్డి ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన పింక్ మారథాన్లో అంతర్జాతీయ మాజీ టెన్నిస్ క్రీడాకరుడు లియాండర్ ఫేస్, ప్రముఖ సినీ నటుడు బ్రహా్మనందం, పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్, సీరియర్ ఐపీఎస్ అధికారి తరుణ్ జ్యోషి, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ జూలియా, పీవీ కృష్ణారెడ్డితో పాటు అధికారులు, ప్రముఖులు రన్లో పాల్గొన్నారు. (చదవండి: శ్రీలంక టూర్.. బౌద్ధ రామాయణం..) -
భాగ్యనగరంలో ఘనంగా శరన్నవరాత్రి వేడుకలు
శరన్నవరాత్రుల సందర్భంగా పూజ్య గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ఆశీస్సులతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇవాళ సోమవారం(సెప్టెంబర్ 29, 2025) నుంచి మూడు రోజుల పాటు నవరాత్రి హోమాలను నిర్వహిస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు స్వామి సూర్యపాద, స్వామి శ్రద్ధానందల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలలో తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది భక్తులు పాల్గొంటున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా 28వ తేదీ ఆదివారం ఉదయం గం. 8.30 ల నుంచి శ్రీ మహాగణపతి హోమం, నవగ్రహ హోమం, సుబ్రహ్మణ్య హోమం, వాస్తుహోమం అనంతరం ప్రసాద వితరణ తదితరాలను ఘనంగా జరిగాయి. కాగా, ఈ రోజు సాయంత్రం 5గం.ల నుంచి స్వామి సూర్యపాద గారిచే ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగం, సామూహిక లలితా సహస్రనామ పారాయణ, కుంకుమార్చన, మహాలక్ష్మి హోమం, శ్రీ సుదర్శన హోమం, అనంతరం ప్రసాద వితరణ ఉంటాయి. అలాగే ఈ వేడుకులో పాల్గొనదలిచని భక్తులందరికీ ఉచితప్రవేశం కల్పిస్తున్నారు నిర్వాహకులు. (చదవండి: చిత్తూ చిత్తుల బొమ్మ..శివుని ముద్దుల గుమ్మ) -
చిత్తూ చిత్తుల బొమ్మ.. శివుని ముద్దుల గుమ్మ
చిత్తూ చిత్తుల బొమ్మ.. శివుని ముద్దుల గుమ్మ.. బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన.. రాగిబింద తీసుక రమణి నీళ్లకు వోతే.. రాములోరు ఎదురయ్యే నమ్మో ఈ వాడలోన.. వెండి బింద తీసుక వెలది నీళ్లకు వోతే.. వెంకటేశుడెదురాయే నమ్మో.. అంటూ సాగే తెలంగాణ బతుకమ్మ పాటలు వింటే.. ఎన్ని తరాలు మారినా బతుకమ్మ పండుగ సంస్కృతిని ప్రతిబింబించడంలో తన ప్రశస్తిని చాటుకుంటూనే ఉంది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత వైభవంగా జరిగే బతుకమ్మ.. క్రమంగా భాగ్యనగరంలో తన ఘనతని చాటుకుంటూ.. ప్రకృతి పండుగ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటోంది. నగరంలో బతుకమ్మ అంటే ప్రతి పువ్వూ, ప్రతి ఆకూ.. ఊరి నుంచే తరలి రావాలి.. అంటే పల్లెకూ.. పట్నానికీ మధ్య సాంస్కృతిక వారధిగా మన బతుకమ్మ నిలుస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా నగరం బతుకమ్మ సంస్కృతిని తనలో ఇముడ్చుకుంది. ఇక్కడి విభిన్న సంస్కృతులు, ప్రాంతాలకు చెందిన వారు బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటూ బతుకమ్మ పాటలకు శృతి కలుపుతున్నారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ అధికారులే కాకుండా సినీతారలు, ఇతర రంగాల ప్రముఖులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈ సారి వేడుకల్లో మిస్ వరల్డ్ విజేత ఓపల్ సుచాత బతుకమ్మ ఆడడం విశేషం. ఈ పండుగ ముగింపుకు చేరడంతో సోషల్ మీడియా కూడా పూలు, పట్టు పరికిణి కట్టుకున్నట్టుగానే కలర్పుల్ సందడి కనిపిస్తోంది. బతుకమ్మ ఆటల వీడియోలు, రీల్స్ సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. గేటెడ్ కమ్యూనిటీల్లో, విల్లాల్లో అంగరంగ వైభవంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఒకప్పటిలా నగరం మూగబోకుండా సాంస్కృతిక సందడిని భవిష్యత్తు తరాలకు అందించడం ప్రపంచవ్యాప్తంగా ఆకర్షిస్తోంది. (చదవండి: శ్రీలంక టూర్.. బౌద్ధ రామాయణం..) -
చూసుకో పదిలంగా.. ‘హృదయాన్ని అద్దంలా..!
యుక్త వయసులోనే ‘గుండె’ లయ తప్పుతోంది. ‘గుండె నొప్పి’ కారణంగా ఉన్న ఫలంగా కుప్ప కూలిపోతున్నారు.. ప్రాణాలు విడిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలతో గుండెను పదిలంగా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నేడు ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా.. ప్రత్యేక కథనం.మానవ శరీరంలో అన్ని శరీర భాగాలు కీలకమే. ప్రధాన భాగమైన గుండె పోషించే పాత్ర ఎంతో ప్రత్యేకమెంది. ఏదైనా సంఘటనను తట్టుకొని నిలబడినప్పుడు వాడికి ‘గుండె నిబ్బరం’ ఎక్కువరా..! అంటారు. అంటే గుండె సంపూర్ణ ఆరోగ్యకంగా ఉందనడానికి నిదర్శనం. అది ఎప్పుడో 30ఏళ్ల మాట. ఇప్పుడు గుండె జబ్బులు సాధారణ వ్యాధుల్లా మారాయి. ఎప్పుడు ఏ గుండె ఆగిపోతుందో తెలియని విధంగా ఆరోగ్య పరిస్థితులు మారాయి. గుండె జబ్బులతో బాధపడుతున్న వారి సంఖ్య ప్రతియేటా గణనీయంగా పెరగడమే ఇందుకు కారణం. ఉచిత వైద్యసేవ ద్వారా యేటా వేలాది మంది బైపాస్సర్జరీలు చేయించుకున్నారు. స్టంట్లు వేయించుకుని, ఎన్సీడీ కార్యక్రమాల ద్వారా గుండె జబ్బుగల వారికి వైద్య సేవలంన్నారు. ఆరోగ్యశ్రీకి రెఫర్ చేశారు. ఇలా పలు పథకాలు, నివేదికల ద్వారా గుండె వ్యాధుల తీవ్రతను తెలియపరుస్తోంది. జాగ్రత్తలతో హృదయాన్ని కాపాడుకుంటే పదికాలాలపాటు జీవించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.జీవనశైలి మార్పులతోనే35 ఏళ్లకు ముందు ఏదైనా ఆహారం తినాలంటే నువ్వుల ఉండలు, వేరుశనగ ఉండలు, బఠానీలు, సంప్రదాయ పదార్థాలు లభించేవి. హోటళ్లలో కల్తీలేని ఆహార పదార్థాలు లభించేవి. నేడు ఆహారం విచ్చలవిడిగా లభిస్తూ మనిషి ప్రాణాల మీదకు తెస్తోంది. నూడుల్స్, బర్గర్లు, పిజ్జాల వంటి కార్పొరేట్ ఆహార పదార్థాల కారణంగా అనారోగ్యకరమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చిన్న వయస్సులోనే ఊబకాయం వస్తోంది. అందులో కీలకమైనది గుండె. ఈ భాగంలో మార్పులు సంభవించడం, రక్తనాళాలు గడ్డకట్టుకుపోవడంతో గుండె వ్యాధులు, హార్ట్ స్టోక్లు వస్తున్నాయి. (యంగ్ ఇండియా! ఒక్క బీట్ మిస్ అయినా.. బీ(ట్) కేర్ఫుల్)గుండె నొప్పి లక్షణాలుశ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుఛాతీలో మంట.. కొద్దిగా నడిచినా అయాసంజీర్ణాశయం పైభాగాన నొప్పిఎడమచేయి, రెండు చేతుల్లో నొప్పితీసుకోవాల్సిన జాగ్రత్తలుమద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి.సాధ్యమైనంత వరకు ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. బీపీ, షుగర్లను నియంత్రణలో ఉంచుకోవాలి.45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.మంచి పౌష్ఠికాహారాన్ని తీసుకోవాలి. కొవ్వు, నూనె, మసాల పదార్థాలకు దూరంగా ఉండాలి.ఒత్తిడిని జయించడానికి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలి.చదవండి: Karur stampede tragedy మొన్ననే ఎంగేజ్మెంట్..త్వరలో పెళ్లిగుండె వ్యాధులపై అవగాహన పెంచుకోవాలిప్రజలు గుండె వ్యాధులపై అవగాహన పెంచుకోవాలి. మంచి జీవనశైలి అలవాటు చేసుకోవాలి. ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చినపుడు తక్షణమే వైద్యులను సంప్రదించాలి. ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఉండాలి. దీర్గకాలిక వ్యాధులైన షుగర్, బీపీలను నియంత్రణలో ఉంచుకోవాలి. ప్రస్తుతం గుండె వైద్యానికి సంబంధించి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ ఎన్.శ్రావణ్కుమార్రెడ్డి, కార్డియాలజీ వ్యాధి నిపుణులు, కడప -
జంక్ ఫుడ్ మానేసి.. వ్యాయామం చేయండి..
జంక్ ఫుడ్ మానేయడంతో పాటు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం కోసం వ్యాయామం చేయాలని అర్జున అవార్డు గ్రహీత, పద్మభూషణ్, పద్మశ్రీ పుల్లెల గోపీచంద్ అన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కార్డియలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కేబీఆర్ పార్కు వద్ద ఆదివారం వాకథాన్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన గోపీచంద్ ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ప్రతి ఒక్కరూ నడకకు సమయం కేటాయించాలని సూచించారు. శరీరానికి అవసరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని, అవసరం లేని ఆహారం ఆరోగ్యానికి చేటు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు గోకల్రెడ్డి, రామకృష్ణ జనపాటి, సందీప్ పాల్గొన్నారు. రెయిన్ బో ఆస్పత్రిలో.. బంజారాహిల్స్ రెయిన్ బో ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన అథ్లెటిక్ హార్ట్ క్లినిక్ను పుల్లెల గోపీచంద్ ఆదివారం ప్రారంభించారు. ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తామని ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ దినేష్ చిర్ల తెలిపారు. అత్యాధునిక ప్రమాణాలతో, అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సెంటర్ కొనసాగుతుందని వారు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, అప్పుడే శరీరంలో ఏం జరుగుతుందనేది తెలుస్తుందని గోపీచంద్ అన్నారు. జాతీయ ఉత్తమ బాల పురస్కార గ్రహీత సుకృతి వేణి బండ్రెడ్డి పాల్గొన్నారు. -
పాటతల్లికి పెద్దకొడుకు
గోరటి వెంకన్న(GoratiVenkanna) సుప్రసిద్ధ వాగ్గేయకారుడు. పరిచయం అక్కర లేని పేరు. ఆట పాటలతో తెలుగువాళ్లందరినీ తన్మయీభూతంగా అలరిస్తున్న ప్రజాకవి. ‘హంస’ అవార్డు గ్రహీత. ‘కాళోజీ పురస్కార’ సన్మానితులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు గౌరవం ఇనుమడింపజేసిన లిటరరీ లెజెండ్. తెలుగుజాతి గర్వంగా చెప్పుకోదగిన పాటలు రాశారు, రాస్తున్నారు. ‘అల సెంద్రవంక’, ‘వల్లంకి తాళం’, ‘ఏకునాదం మోత’, ‘రేల పూతలు’, ‘పూసిన పున్నమి’ వంటి పాటల సంపుటాల్లో దేన్ని చదువుకున్నా గోరటి వెంకన్న పాటకళ, పాటకథ కాంతులీనుతూ రసరంజకంగా మన కళ్లముందు సాక్షాత్కరించగలవు. ముఖ్యంగా గ్లోబలైజేషన్ను తీవ్రస్వరంతో నిరసిస్తూ వెంకన్న రాసిన ‘పల్లె కన్నీరు పెడుతుందో’ పాట మాస్ పాపులారిటీ చెప్పనక్కర లేదు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఘోరంగా ఓడిపోయేలా తెలుగు ఓటర్లు తెలి విడిని ప్రదర్శించడానికి కారణభూతమైన ఒక హిస్టారికల్ సాంగ్ అది. ‘వాగు ఎండిపాయెరో’, ‘నల్లతుమ్మ’, ‘సంత’, ‘అద్దాల అంగడి’, ‘కంచెరేగి తీపివోలె’, ‘యలమంద’, ‘గల్లీ సిన్నది గరీబోల్ల కత పెద్దది’, ‘ఇద్దరం విడిపోతె’, ‘తరమెల్లిపోతున్నదో’... ఇత్యాది పాటలన్నీ ప్రతి శ్రోతకూ కంఠోపాఠం. ఆద్య కళలో పురుడు పోసు కుని తాత ముత్తాతల నుంచి వ్యాప్తమవుతూ తనదాకా వచ్చిన వాగ్గేయకార సంప్రదాయాన్ని సామాజికం చేసిన పాటల కథకుడు, పాటతల్లి పెద్దకొడుకు వెంకన్న! దళిత బహుజన స్పృహ, తెలంగాణ అస్తిత్వచైతన్యం, మార్క్స్ – అంబేడ్కర్ తాత్విక ధార, గ్రామీణ వాదం కలగలసిన శోభాయమాన గేయకవిత్వం వెంకన్నది. అమెరికన్ సంగీతవేత్త, పాటల కూర్పరి డేనియల్ జి. బ్రౌన్ వ్యాఖ్యానించినట్టు ఆయన పాటలు లాక్షణికత పాదపాదాన ఉట్టిపడుతూ కథాప్రధానం, సహజత్వం, జాను తెనుగు, నిర్దిష్ట వస్తువుతో కూడుకున్న విశిష్ట వస్తుగీతాలు. ‘ఎంత సల్లనిదమ్మ కానుగ నీడ/ ఎండ సెగనే ఆపె పందిరి చూడ/ తలపైన తడికోలె అల్లుకున్నాకులు/ తడిలేని వడగండ్ల తలపించు పూతలు/ నిలువు నాపరాయి తనువుల తనమాను/ ఇరిసిన విరగని పెళుసులేని మేను’ అంటూ వెంకన్న వర్ణించిన ‘కానుగ నీడ’ మనకో వైద్యోపనిషత్తు. ‘నోట మోదుగు సుట్ట నొసట నామంబొట్టు/ తలకు తుండు గుడ్డ మెడకు తులసి మాల/ ఏకుతారొక చేత సిరుతలింకొక చేత/ వేదాల చదువకున్న ఎరుక కలిగుండు/ రాగి బెత్తం లేని రాజయోగిలా ఉండు / ఆది చెన్నుడి అంశ మా నాయిన/ అపర దనుర్దాసు మా నాయన అంటూ పితృభక్తిని చాటుకున్న వెంకన్న పాట యువతకో జీవన నైపుణ్య పాఠం.తాను పుట్టి పెరిగిన పాలమూరు, దాపున్న దుందుభి, కాలు కొద్ది అలుపు సొలుపెరుగక తిరిగిన ప్రదేశాలు, ప్రాపంచికానుభవం నుండి ’క్వాట్రైన్స్ రూపుదిద్దుకుంటవి. ఇందుకు ‘ధరాంతమున ధ్వనించె నాదం/ దిగంతాలకే తాకిన వాదం/ తెలంగాణ జయశంఖారావం/ దాశరథి ఘన కవనపు యాగం/ ఎందరో వీరుల ఆశల స్వప్నం’ అంటూ ఎత్తుకున్న తెలంగాణ ‘వైభవ గీతిక’ ఒక ప్రబల సాక్ష్యం. కాళోజీ సాహిత్య వారసుడిగా వెంకన్న తెలుగువాళ్లకు తెలంగాణకు చాలినంత రాజకీయ ప్రబోధ చేశారు.అమెరికన్ పాటల సంప్రదాయంలో కొత్త కవితా వ్యక్తీకరణను సృష్టించినందుకు బాబ్ డిలన్కు స్వీడిష్ అకాడమీ నోబెల్ బహు మతినిచ్చింది. మరి, ఇంటా బయటా ఇరవై ఇరవై ఐదు కోట్లమంది ఆస్వాదించే తెలుగుపాటకు నూతన అభివ్యక్తితో పాటు సరికొత్త వస్తువునూ జోడించి, ఎపిక్ హోదా కల్పించిన వెంకన్నకు ఎన్ని నోబెల్స్ బాకీపడ్డాయో!– డా.బెల్లి యాదయ్య(గోరటి వెంకన్న రేపు అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుండి ‘గౌరవ డాక్టరేట్’ అందుకుంటున్న సందర్భంగా) -
శ్రీలంక టూర్.. బౌద్ధ రామాయణం..
మహా సముద్రంలో నీటిబొట్టంత దేశం. అందులో రాముడు కట్టిన శివాలయం. రాజుకు ఆశ్రయమిచ్చిన దంబుల్లా గుహలు. కశ్యపుని రాజ్రప్రసాదం సిగిరియా కోట. క్యాండీ బుద్ధుని దంతావశిష్ట ఆలయం. అశోకవాటిక నువారా సీతా ఎలియాలు. మూడు నిలువులెత్తు ధీర హనుమాన్. రథమెక్కిన పంచముఖ ఆంజనేయుడు. సీతమ్మ అగ్నిపరీక్ష సాక్షి దివురుంపోలా. విభీషణుడి పట్టం కట్టిన కెలానియ తీరం. ఇవన్నీ శ్రీలంక రామాయణ యాత్రలో. 1 వరోజుహైదరాబాద్ నుంచి శ్రీలంకకు ప్రయాణం. ఉదయం పదిన్నరకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్΄ోర్ట్కు చేరుకుని టూర్ ఆపరేటర్లకు రిపోర్ట్ చేయాలి. మధ్యాహ్నం 13.30 గంటలకు యుఎల్178 విమానం హైదరాబాద్ నుంచి బయలుదేరి, మధ్యాహ్నం 15.25 గంటలకు కొలంబోకు చేరుతుంది. ఫ్లయిట్ దిగిన తర్వాత చిలా లోని మునీశ్వర ఆలయ దర్శనం, ఆ తర్వాత మనవేరి ఆలయ దర్శనం చేసుకుని దంబుల్లాలో హోటల్ గదిలో చెక్ ఇన్ కావడం. రాత్రి బస. రాముడు మొక్కిన శివుడు మునీశ్వర ఆలయం ఉన్న ప్రదేశం పేరు చిలా. రామాయణం కథనం ప్రకారం రావణ సంహారం తర్వాత రాముడు తిరుగు ప్రయాణంలో ఉన్నప్పుడు ఈ ప్రదేశంలో ఆగి శివుడిని ప్రార్థించాడు. రాముడికి దీవెనలిచ్చిన శివుడు నాలుగు శివలింగాలను ప్రతిష్ఠించమని చెప్పాడని విశ్వాసం. ఆ మాట కోసం రాముడు నిర్మించిన ఆలయం 16వ శతాబ్దంలో పూర్తిగా ధ్వంసమైంది. అప్పుడు రాజు మొదటి రాజసింఘె పునర్నిర్మించాడు. దానిని 17వ శతాబ్దంలో ΄ోర్చుగీసు వాళ్లు ధ్వంసం చేశారు. ఇప్పుడు మనం చూసే అందమైన ఆలయాన్ని స్థానికులు నిర్మించుకున్నారు. ఈ ఆలయానికి సమీపంలోనే ఉన్న మనవెరి ఆలయం కూడా స్వయంగా రాముడు నిర్మించినదేనని అందుకే దీని పేరు రామలింగం అని స్థలపురాణం.2వ రోజుదంబుల్లా నుంచి క్యాండీకి ప్రయాణం. హోటల్లో బ్రేక్ఫాస్ట్ తర్వాత దంబుల్లా కేవ్ టెంపుల్, సిగిరియా ఫోర్ట్రెస్ వీక్షణం. మధ్యాహ్న భోజనం తర్వాత క్యాండీ ప్రవేశం. పెరడేనియాలోని రాయల్ బొటానికల్ గార్డెన్స్ సందర్శనం, సాయంత్రం క్యాండీ కల్చరల్ షో వీక్షణం, రాత్రి బస క్యాండీలో. రాజుకు ఆశ్రయమిచ్చిన గుహలు దంబుల్లా క్రీస్తుపూర్వం నుంచి నివాస ప్రదేశం. ఇందులోని భారీ కొండను బౌద్ధ భిక్షువులు తమకు నివాసం కోసం గుహలుగా తొలుచుకున్నారు. అనూరాధపురాను పాలించిన వత్తగామిని అభయ క్రీ.పూర్వంలో ఒకటవ శతాబ్దంలో 14 ఏళ్ల పాటు రాజ్య బహిష్కరణకు గురయిన సందర్భంలో అతడికి బౌద్ధ భిక్షువులు ఇక్కడే ఆశ్రయమిచ్చారు. తిరిగి అనూరాధపురకు వెళ్లి రాజ్య సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్న వత్తగామిని బౌద్ధభిక్షువుల పట్ల కృతజ్ఞతతో ఈ గుహలను మరింత చక్కగా మెరుగులు దిద్దించాడు. అద్భుతమైన ఈ గుహాలయాలను ఫొటో తీయడానికి అనుమతి ఉండదు. కాబట్టి మనోఫలకం మీద ముద్రించుకోవడమే. సిగిరియా దుర్గం సిగిరియా దుర్గం ప్రాచీనమైన రాతి కోట. దంబుల్లాకు సమీపాన ఉంది. ఈ నిర్మాణం యునెస్కో గుర్తించిన వరల్డ్ హెరిటేజ్ సైట్. కోట ఒక కొండ మీద ఉంటుంది. ఆశ్చర్యమేమిటంటే రాజస్థాన్ కోటలు కూడా ఎక్కువ భాగం కొండల మీదనే ఉన్నాయి. కానీ ఈ సిగిరియా కోట ఉన్న కొండ నిటారుగా ఉంటుంది. మొక్కలను రకరకాల ఆకారాల్లో ప్రూనింగ్ చేసినట్లు ఈ కొండను కోట నిర్మాణానికి తగినట్లు చెక్కినట్లు ఉంటుంది.శత్రుదుర్బేధ్యంగా నిర్మించడంలో ఇదొక పద్ధతి. శ్రీలంక రాజు కశ్యపుని కోసం నిర్మించిన రాజ్రప్రసాదం ఇది. శ్రీలంకలో బౌద్ధం విస్తరించిన నేపథ్యంలో కశ్యపుని తర్వాత ఈ రాజ్రప్రాసాదం బౌద్ధుల అధీనంలోకి వెళ్లింది. ప్రాచీన నగర నిర్మాణశైలికి నిదర్శనం ఈ రాజ్రప్రాసాదం. ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్కు ఒక పాఠ్యగ్రంథం వంటిది. రాయల్ బొటానికల్ గార్డెన్ ఈ గార్డెన్ క్యాండీ నగరం నుంచి ఆరు కిలోమీటర్ల దూరాన ఉంది. దాదాపుగా 150 ఎకరాల్లో విస్తరించిన ఈ గార్డెన్లో నాలుగు వేల రకాల మొక్కలున్నాయి. ఇక్కడ పర్యటిస్తుంటే మ్యాప్లో కనిపించే గోరంత దీవిలో చూడాల్సిన ప్రదేశాలు ఇన్ని ఉన్నాయా అని ఆశ్చర్యం కలుగుతుంది. నీటిబుగ్గ వంటి దీవి కావడంతో ఏడాదంతా పచ్చదనం పరిఢవిల్లుతుంటుంది. శ్రీలంక సాంస్కృతిక కళల ప్రదర్శన చూడకుండా వెనుదిరిగితే ఆ దేశం ఆత్మను అర్థం చేసుకోవడంలో విఫలమైనట్లే. క్యాండీ నగరంలోని లేక్ క్లబ్లో రోజూ సాయంత్రం ఐదు గంటల నుంచి శ్రీలంక సంస్కృతి సంప్రదాయాలను, ఆ దేశ చరిత్రను వ్యక్తీకరిస్తూ నాట్యప్రదర్శనలు, సంగీత ప్రదర్శనలు జరుగుతుంటాయి. మన దక్షిణ భారత కళారూ΄ాలకు కొనసాగింపుగా ఉంటాయి. వాటిని మనసు పెట్టి వీక్షించాలి. 3వరోజుక్యాండీ నుంచి నువారా ఎలియాకు ప్రయాణం. ఉదయం త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసుకుని హోటల్ గది చెక్ అవుట్ చేసి బయలుదేరాలి. క్యాండీలోని బుద్ధుడి దంతావశిష్టం ఆలయ దర్శనం తర్వాత రంబోదాలో భక్త హనుమాన్ టెంపుల్ దర్శనం, టీ ఫ్యాక్టరీ విజిట్. అశోక వాటిక సందర్శనం తర్వాత నువారా ఎలియాలో హోటల్లో చెక్ ఇన్. రాత్రి బస. క్యాండీ బౌద్ధ విశిష్టం శ్రీలంకలోని హెరిటేజ్ సైట్లలో కాండీ నగరం ఒకటి. సముద్ర మట్టానికి పదహారు వందల అడుగుల ఎత్తులో ఉందీ నగరం. క్యాండీలో బుద్ధుడి దంత ధాతువుని ప్రతిక్షేపించిన నిర్మించిన ఆలయం (టూత్ రిలిక్ టెంపుల్) ఉంది. ఇక్కడి నేషనల్ మ్యూజియం ప్రపంచదేశాల్లోని బౌద్ధం అంతటినీ ఒక చోట రాశిపోసినట్లు ఉంటుంది. మన తెలుగు రాష్ట్రం అమరావతి బౌద్ధ స్థూపం నమూనాల నుంచి చైనాలోని లాఫింగ్ బుద్ధ ప్రతిమలతోపాటు భవిష్యత్తులో పుట్టబోయే బుద్ధుడి ఊహాశిల్పం కూడా ఉంది. రిలిక్ టెంపుల్ చుట్టూ ప్రాచీన రాజకుటుంబాల ప్యలెస్లున్నాయి. ఆలయం, రాజ్రప్రాసాదాలు ఏటవాలు పై కప్పుతో మనదేశంలో కేరళలోని నిర్మాణాలను తలపిస్తాయి. శ్రీలంకలో తరచూ వర్షాలు కురుస్తుంటాయి, కాబట్టి నీరు సులువుగా జారి΄ోవడానికే ఇలాంటి ఏటవాలు కప్పు నిర్మాణాలు. ఈ నగరంలో పోర్చుగీసు, బ్రిటిష్ పరిపాలనలో ఉండడంతో కొన్ని ప్రదేశాలు గుర్రాలు నడవడానికి అనువైన నేలతో కలోనియల్ ఫీల్ను కలిగిస్తుంటాయి. యూరప్ నిర్మాణశైలిలో ఉన్న క్వీన్స్ హోటల్ను చూసి తీరాలి. ఇక బ్రిటిష్ వాళ్లు హిల్ స్టేషన్లను ఎంత చక్కగా వేసవి విడుదులుగా మలుచుకున్నారో చెప్పడానికి కాండీ నగరం ఒక నిదర్శనం. నిర్మాణ పరంగా, చారిత్రక ప్రాధాన్యతలెన్ని ఉన్నప్పటికీ ఈ నగరానికి ఇంతటి పర్యాటక ప్రాముఖ్యత ఏర్పడడానికి కారణం బుద్ధుడి అవశిష్టమే. కాండీ నగరం మొత్తం కనిపించే వ్యూ పాయింట్స్ చాలా ఉంటాయి. అక్కడ ఆగి నగరసౌందర్యాన్ని వీక్షించవచ్చు. ఇక్కడ ఒక సరస్సు ఒడ్డున ఉన్న ధవళ బుద్ధుడిని మిస్ కాకూడదు. కాండీ నగరంలోని ఈ సరస్సు... మనదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముసోరి సరస్సును తలపిస్తుంది. రంబోదా హనుమాన్ శ్రీలంక అనగానే మన భారతీయులకు గుర్తొచ్చే పేర్లలో రాముడు, సీత, రావణాసురుడి తర్వాత హనుమంతుడిదే. ఇంత గొప్ప పౌరాణిక గ్రంథంలో హనుమంతుడే లేక΄ోతే రామాయణమే లేదన్నంతగా శ్రీలంకకు హనుమంతుడితో బంధం ముడివడి ఉంది. సీతాన్వేషణలో భాగంగా శ్రీలంక మొత్తాన్ని చుట్టేసిన హనుమంతుడు అలసి΄ోయినప్పుడు రంబోదా అనే ప్రదేశంలో విశ్రమించాడని విశ్వాసం. ఆ ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలోని హనుమంతుడి విగ్రహం ఎత్తు 18 అడుగులు. శ్రీలంకలో ఉన్న హనుమంతుడి విగ్రహాల్లో పెద్ద విగ్రహం ఇదే. అన్నట్లు ఈ ఆలయంలో డ్రెస్ కోడ్ ఉంది. దుస్తులు భుజాలు కప్పుతుండాలి, మోకాళ్ల కిందకు ఉండి తీరాలి. క్యాండీ నుంచి నువారా ఎలియా వెళ్లే దారి మొత్తం దాదాపుగా టీ తోటలే. దమ్రో టీ ఫ్యాక్టరీ, సిలోన్ టీ ఫ్యాక్టరీ వంటి అనేక ఫ్యాక్టరీలున్నాయి. టీ తోట నుంచి సేకరించిన ఆకు కప్పులో టీ గా మారే ప్రక్రియను చూడవచ్చు. రకరకాల ఫ్లేవర్ టీలను రుచి చూసి, నచ్చిన టీ పొడులు కొనుక్కోవచ్చు. సీతా ఎలియా నువారా ఎలియా నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది సీతా ఎలియా. దీన్నే అశోకవాటిక అంటారు. సీతాదేవి వనవాసం చేసిన ప్రదేశం అని చెబుతారు. రావణాసురుడి రాజమందిరంలో నివసించడానికి సీతాదేవి ఇష్టపడక΄ోవడంతో ఆమె ప్రకృతి ప్రేమికురాలని గ్రహించి ఈ ఉద్యానవనంలో నివాసానికి ఏర్పాట్లు చేశాడని చెబుతారు. అశోకవాటిక మధ్యలో సెలయేరు నిరంతరం ప్రవహిస్తుంటుంది. సెలయేటి తీరాన సీతాదేవి స్నానం చేసేదని చెప్పడానికి ఆనవాలుగా సిమెంటు నిర్మాణం ఉంది. సీతాన్వేషణలో భాగంగా శ్రీలంకకు వచ్చిన హనుమంతుడు... సీతాదేవిని కలిసింది ఇక్కడే. ఆ ఘట్టాన్ని ప్రతిబింబిస్తూ సెలయేటి తీరాన శిల్పాలున్నాయి. ఆ శిల్పం నేపథ్యంలో ఫొటో తీసుకోవడం మర్చిపోవద్దు. సీతా అమ్మన్ ఆలయం దక్షిణాది ఆలయాల నిర్మాణశైలిలో ఉంటుంది. కానీ మనదేశంలో శిల్పాలతో పోలిస్తే ఈ శిల్పాలలో మానవ శరీర నిర్మాణం మరికొంత దృఢంగా కనిపిస్తుంది. 4వరోజు నువారా ఎలియా నుంచి కతరగామకు ప్రయాణం. బ్రేక్ఫాస్ట్ తర్వాత నువారా ఎలియా సైట్ సీయింగ్. దివురుం΄ోలా ఆలయం, గాయత్రిపీఠం, గ్రెగరీ లేక్ విహారం తర్వాత కతరగామ టెంపుల్ దర్శనం, కతరగామలో హోటల్ గది చెక్ ఇన్, రాత్రి బస. బ్రిటిష్ జ్ఞాపకాలు శ్రీలంకలో ఎత్తైన ప్రదేశం నువారా ఎలియా. ఆరువేల అడుగుల ఎత్తులో ఉంది. చలికాలంలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లో ఉంటాయి. వేసవిలో కూడా ఏసీ సిక్స్టీన్లో పెట్టి స్వింగ్ పెట్టినట్లు గాలి తెమ్మెరలు ఒంటిని తాకుతూ ఉంటాయి. ఇక్కడ ప్రయాణించేటప్పుడు రోడ్డు పక్కన పెట్టిన లోకల్ వెజిటబుల్, ఫ్రూట్ మార్కెట్ కనిపిస్తే కళ్లప్పగించి చూడండి. ఎందుకంటే ఇక్కడి క్యాబేజీ మూడు నుంచి నాలుగు కేజీలు తూగుతుంది. కూరగాయలు, పండ్లు అన్నీ కంటికి ఇంపుగా కనిపిస్తాయి. ప్రతి ఇంటి ముందు కూరగాయల తోట ఉంటుంది. సుమారు ఐదు వందల గజాల స్థలంలో మూడు వందల గజాలు కూరగాయల కోసం వదిలి మిగిలిన ప్రదేశంలో ఇల్లు కట్టుకుంటారు. బ్రిటిష్ పాలన ప్రభావం ఇక్కడి క్వీన్స్ కాటేజ్ వంటి కొన్ని నిర్మాణాల్లో కనిపిస్తుంది. అగ్ని ప్రవేశం ఇక్కడే దివురుంపోలా అంటే ఒట్టు పెట్టిన ప్రదేశం అని అర్థం. ఇది సీతాదేవి అగ్ని ప్రవేశం చేసిన ప్రదేశం అని చెబుతారు. ఇక్కడ కట్టిన ఆలయ ప్రాంగణంలో ఒక రాతి నిర్మాణం ఉంది. అరుగు మీద బౌద్ధ స్థూపం, అరుగుకు ముందు బుద్ధుడి చిన్న విగ్రహం ఉన్నాయి. ఆలయంలో రాముడు, సీత, హనుమంతుడి పాలరాతి విగ్రహాలు పూజలందుకుంటున్నాయి. మొత్తానికి ఇది రాయామణం, బౌద్ధం సమ్మేళనంగా కనిపిస్తుంది. ఇక గాయత్రి టెంపుల్ పరిశుభ్రంగా, ప్రశాంతతకు చిహ్నంగా ఉంటుంది. గ్రెగరీ లేక్లో పడవ విహారం జీవితకాలపు మధురానుభూతిగా మిగులుతుంది. ఇక కతరగామ టెంపుల్కి వస్తే... ఇది కుమారస్వామి –వల్లీ దేవిని కలిసిన ప్రదేశమని చెబుతారు. శ్రీలంలోని తమిళులు, సింహళీయుల ఐక్యత జీవించిన రోజులకు ప్రతిబింబం ఈ ఆలయం. అలాగే వర్తక వాణిజ్యాలకు, రాజ్య విస్తరణకు శ్రీలంకలో అడుగుపెట్టిన అనేక మతాలు కూడా ఈ ఆలయాన్ని తమదిగానే స్వీకరించాయి. దాంతో అనేక మతాల చిహ్నాల సమ్మేళనంగా మారింది. 5వరోజు కతరగామ నుంచి కొలంబోకు ప్రయాణం. బ్రేక్ఫాస్ట్ తరవాత హోటల్ గది చెక్ అవుట్ చేసి కొలంబోకు ప్రయాణం. కెలానియా బుద్ధ టెంపుల్, పంచముగ ఆంజనేయ టెంపుల్, కొలంబో సిటీ టూర్, హోటల్ గదిలో చెక్ ఇన్, రాత్రి బస కొలంబోలో. విభీషణుడి పట్టాభిషేకం ఇక్కడే! కేలనియా మహా విహారాయ కొలంబో నగరానికి పది కిలోమీటర్ల దూరంలో ‘కేలని గంగా నది’ తీరాన ఉంది. ఈ ఆలయం ప్రాచీన శిల్పకళ, అద్భుతమైన చిత్రకళా నైపున్యానికి ప్రతీక. గోడలు, పై కప్పు నిండా పెయింటింగ్సే. ఈ చిత్రాల్లో విభీషణుడి పట్టాభిషేకం ఘట్టం కూడా ఉంది. విభీషణుడి రాజభవనం కేలనియా నది తీరాన ఉన్నట్లు వాల్మీకి రామాయణంలో ఉందని చెబుతారు. ఈ ఆలయంలో విభీషణుడి విగ్రహం కూడా ఉంది. విభీషణుడిని సింహళీయులు విభీషణ్ దేవయా అని పిలుచుకుంటూ ప్రాచీనకాలంలో తమను పరిరక్షించిన దేవుడిగా కొలుస్తారు. విభీషణుడిని రాజుగా ప్రకటిస్తూ పట్టాభిషేకం చేసిన ప్రదేశం కేలనియా ఆలయ ప్రాంగణమేనని కూడా చెబుతారు. ప్రస్తుతం ఇది బౌద్ధ క్షేత్రం. బుద్ధుడు శ్రీలంకలో అడుగుపెట్టడం, త్రిపీటకాలను బోధించడం, అష్టాంగమార్గాలను విశదపరచి సమ్యక్ జీవనం దిశగా నడిపించడం, స్థానిక రాజులు బుద్ధుడికి అనుచరులుగా మారిపోవడం, సామాన్యులు బుద్ధుడిని చూడడానికి ఆతృత పడడం, బుద్ధుడి మాటలతో చైతన్యవంతమై వికసిత వదనాలతో సన్మార్గదారులవడం... వంటి దృశ్యాలన్నీ చిత్రాల్లో కనిపిస్తాయి. విశాలమైన ఆలయ ప్రాంగణంలో పెద్ద బోధివక్షం, ఆ వృక్షం మొదట్లో భారీ ధవళ బుద్ధుడి విగ్రహం ప్రధాన ఆకర్షణ. ఆంజనేయునికి రథం శ్రీలంకలో రాముడు, సీతతోపాటుగా ఆంజనేయ స్వామికి గౌరవం ఉంటుంది. ఆంజనేయుడికి ఆలయాలు కూడా ఉన్నాయి. కానీ పంచముఖ ఆంజనేయుని విగ్రహం ఇదొక్కటే. ఆంజనేయుడి కోసం ప్రత్యేకంగా రథం ఉండడం ఇక్కడి మరో విశేషం. ఇక కొలంబో సిటీని ఒక రౌండ్ చుట్టేస్తే యూకే, యూఎస్, చైనా, ఇండియాలో ముంబయి, చెన్నై నగరాలు ఒకదాని తర్వాత మరొకటి రీల్ కళ్ల ముందు తిరిగినట్లు ఉంటుంది. శ్రీలంక ఆర్థిక సంక్షోభం ఆనవాళ్లు కొలంబో నగరంలో ఎక్కడా కనిపించవు. ఇది చాలా సంపన్న నగరం. హిందూమహాసముద్ర తీరం గాలే బీచ్ పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్. ఇక్కడ ఎకరాల్లో విస్తరించిన గ్రీనరీ అందంగా ఉంటుంది. రొయ్యల వడలు ఇక్కడ రుచి చూడాల్సిన వంటకం. ఇక్కడ గాలే ఫేస్ హోటల్ బ్రిటిష్ పాలన కాలం నాటిది. సాయంత్రాలు ఓపెన్ రెస్టారెంట్లో కూర్చుని సముద్రపు అలలను చూస్తూ గడపడం గొప్ప అనుభూతి. పౌర్ణమి రాత్రి ఇక్కడి సీ వ్యూ టేబుల్కి డిమాండ్ ఎక్కువ. 6వరోజుశ్రీలంక నుంచి హైదరాబాద్కు ప్రయాణం. బ్రేక్ఫాస్ట్ తరవాత హోటల్ గది చెక్ అవుట్ చేసి ఎయిర్΄ోర్టుకు ప్రయాణం. 29వ తేదీ ఉదయం 07.25 గంటలకు యుఎల్ 177 విమానం కొలంబోలో బయలుదేరి 09.20 గంటలకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరడంతో టూర్ పూర్తవుతుంది. శ్రీలంక... పచ్చల పాపిడి బొట్టు! శ్రీలంక దీవి హిందూ మహా సముద్రంలో నీటిబొట్టును పోలి ఉన్న చిన్న భూభాగం. వధువు నుదుటన మెరిసే పచ్చల పాపిడి బొట్టులా ఉంటుంది. ఈ దీవిలో ఎత్తైన పర్వతశిఖరాలు, అగాధాలను తలపించే సరస్సులు కూడా ఉన్నాయి. ఇక్కడి రోడ్ల నిర్మాణం బాగుంటుంది. వాహనాల డ్రైవర్లు చక్కటి క్రమశిక్షణ పాటిస్తారు. రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడు వాహనం వేగం ఒక్కసారిగా ఇరవై కిలోమీటర్లకు తగ్గిపోయిందంటే అది స్కూల్ జోన్ అన్నమాటే. స్కూలు మొదలయ్యే సమయం, వదిలే సమయం కాక΄ోయినప్పటికీ ఈ నియమాన్ని పాటించి తీరుతారు. శ్రీలంకలో గొప్ప హిందూ ఆలయాలు, చర్చ్లు, మసీదులు, బౌద్ధ స్థూపాలు దేనికది గొప్ప శోభతో వెలుగొందుతూ ఉంటాయి. సముద్రంలో ఓ చిన్న దీవిలో ప్రతి అంగుళమూ పచ్చదనమే, ఏడాదంతా సస్యశ్యామలమే. కొబ్బరి తోటలు, పోక చెట్లు, మామిడి చెట్లు ఎక్కువ. అన్నట్లు ఇక్కడ మామిడి ఏడాదికి రెండు కాపులు కాస్తుంది. దేశం పరిశుభ్రంగా ఉంటుంది. మనుషులు సౌమ్యంగా ఉంటారు. చాలా దుకాణాల్లో మన భారతీయ రూపాయలు తీసుకుంటారు. శ్రీలంక కరెన్సీ కూడా రూపాయే. అయితే మూడు రూపాయిలు మన ఒక రూపాయికి దాదాపుగా సమానం. ఆ రోజు ఎక్సేంజ్ని బట్టి తీసుకుంటారు. మిగులు నాలుగైదు రూపాయలు వదిలేసినా కూడా చాలా సంతోషిస్తారు. శ్రీలంక ఆహార సంక్షోభం హోటళ్లలో కనిపిస్తుంది. ఫైవ్ స్టార్ హోటల్లో కూడా వెరైటీల సంఖ్య పరిమితంగా ఉంటుంది. ఆహారాన్ని వృథా చేయవద్దని సూచన బోర్డు ఉంటుంది. ఆహారం మన దక్షిణాది రుచిని కలిగి ఉంటాయి. కొబ్బరి వాడకం ఎక్కువగా ఉంటుంది. రామాయణ లంక శ్రీలంక రామాయణ యాత్ర ఎక్స్ హైదరాబాద్ టూర్. ఇది ఆరు రోజుల యాత్ర. అక్టోబర్ 24వ తేదీ మొదలవుతుంది. ప్యాకేజ్ కోడ్ ‘ఎస్హెచ్ఓ10’. ఇందులో కొలంబో, దంబుల్లా, క్యాండీ, నువారా ఎలియా, కతరగామ ప్రదేశాలు కవర్ అవుతాయి. ప్యాకేజ్ వివరాలివి సింగిల్ షేరింగ్లో ఒక్కొక్కరికి దాదాపు 90 వేల రూపాయలు (ఇండియన్ రూపీస్). డబుల్ షేరింగ్లో ఒక్కొక్కరికి దాదాపుగా 65 వేలు, ట్రిపుల్ షేరింగ్లో ఒక్కొక్కరికి 64 వేల వరకు ఉంటుంది. ఇవేవీ వర్తించవు! ఇంటి నుంచి ఎయిర్పోర్టుకు, ఎయిర్పోర్టు నుంచి ఇంటికి రవాణా ఖర్చులు. లాండ్రీ ఖర్చులు, మద్యం, మెనూలో లేని ఇతర ఆహారాల ఖర్జులు, డ్రైవర్లకు – గైడ్లకు టిప్లు. డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్లాలి! పాస్పోర్ట్ (ప్రయాణం చేసే నాటికి కనీసం ఆరు నెలల వ్యాలిడిటీ ఉండాలి) పాన్ కార్డు కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫొటో సాఫ్ట్కాపీ ఎవరిని సంప్రదించాలి? ఐఆర్సీటీసీ జోనల్ ఆఫీస్, 9–1–129 /1 /302, ఆక్స్ఫర్డ్ ΄్లాజా, ఎస్డీ రోడ్, సికింద్రాబాద్. ఫోన్ నంబర్ : 040– 27702407వాకా మంజులా రెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి(చదవండి: దశ విధాల అలంకరణతో ఇంటిని స్వర్గధామంలా మార్చేద్దామా..!) -
ఓం శ్రీ శారదాయై నమః
దుర్గాదేవి అలంకారాలన్నిటిలో మూలానక్షత్రం నాటి సరస్వతీదేవి అలంకారానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. చదువుల తల్లి సరస్వతీదేవిగా భక్తులు ఈమెను ఆరాధన చేస్తారు. వాక్కు, బుద్ధి, విజ్ఞానం, కళలు... అన్నిటికీ ఈమే అధిష్ఠాన దేవత. ఋగ్వేదం, దేవీభాగవతం, బ్రహ్మవైవర్త పురాణాల్లో సర్వసతీదేవి గురించిన అనేక గాథలు విస్తారంగా వర్ణితమై ఉన్నాయి. కచ్ఛపి అనే వీణ; పుస్తకం, అక్షమాల, ధవళ వస్త్రాలు ధరించి, హంసను అధిరోహించిన రూపంలో ఈ తల్లి దర్శనమిస్తుంది. సర్వశక్తి స్వరూపిణి, సర్వాంతర్యామిని, విజ్ఞానదేవత, వివేకధాత్రిగా శాస్త్రాలు, పురాణ, ఇతిహాసాలు సరస్వతీదేవిని వర్ణిస్తున్నాయి. సరస్వతీ ఉపాసనతో లౌకిక విద్యలతో పాటు అలౌకికమైన మోక్షవిద్య కూడా అవగతమవుతుంది. సకల చరాచరకోటిలో వాగ్రూపంలో ఉంటూ, వారిని చైతన్యవంతులుగా చేసే శక్తి ఈమెది.సరస్వతీ ఉపాసన ద్వారా సకల విద్యలూ కరతలామలకం అవుతాయని పెద్దలు చెబుతారు. తెల్లని వస్త్రాలు ధరించి, తెల్లని పూలతో అమ్మను పూజించాలి.శ్లోకం: యా కుందేందు తుషార హార ధవళా యాశుభ్ర వస్త్రాన్వితా, యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైస్సదా పూజితా, సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా.మంత్రం: ’ఓం శ్రీం హ్రీం క్లీం మహా సరస్వత్యై నమ:’ అనే మంత్రాన్ని ఉపాసన చేయాలి. సరస్వతీదేవి ప్రీతిగా ఈ రోజున పుస్తకదానం చేయాలి. సరస్వతీ ద్వాదశ నామాలు, స్తోత్రాలు పారాయణ చేయాలి. నైవేద్యం: దధ్యాన్నం అంటే పెరుగన్నం, చక్కెర పొంగలి నివేదన చేయాలి.విశేషం: బెజవాడ కనకదుర్గమ్మకు నేడు సర స్వతీ మహాసరస్వతీ దేవి -
మార్పు అనివార్యం.. అనవరతం
ఈ ప్రపంచంలో ఎప్పటికీ ఆగనిది ఒక్కటే: మార్పు. నిన్నటి సూర్యోదయం ఈ రోజు లేదు, ఈ రోజు విరిసిన పువ్వు రేపటికి ఉండదు. ప్రతి క్షణం విశ్వం తన రూపాన్ని మార్చుకుంటూనే ఉంటుంది. మనం పుట్టిన క్షణం నుండి, చివరి క్షణం వరకు, ప్రతి దశలోనూ మార్పు మనతోనే ప్రయాణిస్తుంది. నవశ్చలతి జీవనం, నవశ్చలతి విశ్వంనవం నవం నవాని నవాని నిత్యం చలతిజీవితం నిరంతరం కదులుతుంది, విశ్వం నిరంతరం కదులుతుంది. ప్రతి రోజు, ప్రతి క్షణం కొత్తదనంతో ముందుకు సాగుతూ ఉంటుంది. ఈ శ్లోకం మార్పు అనేది విశ్వంలో, జీవితంలో నిరంతరంగా జరిగే ప్రక్రియ అని సూచిస్తుంది. ఇది మార్పు నిత్యత్వాన్ని, దాని ద్వారా కొత్త అవకాశాలు, కొత్త ప్రారంభాలు ఎలా ఏర్పడతాయో తెలియజేస్తుంది. ఈ నిరంతర చలనం జీవితాన్ని సజీవంగా, శక్తిమంతంగా ఉంచుతుంది.మార్పు అంటే భయపడాల్సిన ఒక గాలివాన కాదు, అది జీవితాన్ని సజీవంగా ఉంచే ఒక అనివార్యమైన శక్తి. మార్పు లేని జీవితం నిలచిపోయిన సరస్సులా మురికిగా మారుతుంది. మార్పును స్వాగతించినప్పుడే జీవితం ప్రవహించే నదిలా పవిత్రంగా, ఉల్లాసంగా ఉంటుంది.ప్రకృతిలో చూస్తే, ప్రతిదీ మార్పుకు లోబడే ఉంటుంది. వసంతంలో చిగురించిన ఆకు, ఆ తర్వాత ఎండిపోయి, రాలిపోయి, తిరిగి కొత్త జీవితానికి దారి చూపిస్తుంది. భూమిలో ఉండే ఒక చిన్న విత్తనం తన రూపాన్ని మార్చుకోవడానికి భయపడితే, అది ఎప్పటికీ ఒక పెద్ద చెట్టుగా మారలేదు. అలాగే, ఒక చిన్న గొంగళి పురుగు తన రూపాన్ని పూర్తిగా మార్చుకొని, రెక్కలు విప్పుకున్న రంగుల సీతాకోకచిలుకగా మారే అద్భుతమైన మార్పు, మార్పులో ఉన్న శక్తిని తెలియజేస్తుంది. ఈ మార్పు కేవలం భూమిపై మాత్రమే కాదు, అనంతమైన విశ్వంలో కూడా జరుగుతుంది. మనం రోజూ చూసే చంద్రుడు కూడా పౌర్ణమి నుండి అమావాస్యకు, అమావాస్య నుండి పౌర్ణమికి తన ఆకారాన్ని మార్చుకుంటూనే ఉంటాడు. ప్రతి క్షణం గ్రహాలు తమ గమనాన్ని మార్చుకుంటూ ముందుకు కదులుతూ ఉంటాయి. ఈ విశ్వం కూడా నిరంతరం పెరుగుతూనే ఉంటుంది.యది మార్గం న చలతి, కథం గమ్యతే లక్ష్యం ్ఢ చలనం ఏవ జీవనం, చలనం ఏవ గతిఃమార్గం కదలకపోతే, గమ్యాన్ని ఎలా చేరుకోగలం? కదలడమే జీవితం, కదలడమే గమనం. ఈ శ్లోకం మార్పు అనేది కేవలం ఒక పరిస్థితి కాదు, అది జీవిత ప్రయాణమే అని చెబుతుంది. మార్పు లేకపోతే, మనం ఎక్కడికీ చేరుకోలేము. ఈ శ్లోకం మార్పును ఒక అవరోధంగా కాకుండా, మన గమ్యానికి చేర్చే ఒక మార్గంగా చూడాలని ప్రోత్సహిస్తుంది.జీవితం ఒక నిరంతర ప్రవాహం. అందులో మార్పులు రావడం సహజం. వాటిని ఆనందంగా, ధైర్యంగా స్వీకరించాలి. ప్రతి మార్పు ఒక కొత్త ప్రారంభం. అది మనలోని సుప్తంగా ఉన్న శక్తులను, గుణాలను మేల్కొల్పి, మనల్ని ఉన్నత శిఖరాలకు చేర్చే మార్గం. మార్పు అంటే భయపడటం కాదు, అది భవిష్యత్తు వైపు సాగే మన ప్రయాణంలో మనం నడిచే మార్గమే. ఆ మార్గాన్ని మనం ఉత్సాహంగా అన్వేషించినప్పుడు, జీవితం ఒక మహోన్నతమైన కళాఖండంగా మారుతుంది.ఈ సృష్టిలోని ప్రతి అణువు, ప్రతి కణం మార్పుతోనే పుట్టి, పెరుగుతూ, నశిస్తూ ఉంటుంది. మానవ జీవితంలో జరిగే మార్పు కూడా అంతే శక్తివంతమైనది. బాల్యం నుండి వృద్ధాప్యానికి మన శరీరం మారినా, మనసు ఎన్నో పాఠాలను నేర్చుకుంటూ ముందుకు సాగుతుంది. మన కష్టాలు, సవాళ్లు మనల్ని బలహీనపరచవు, అవి మనల్ని మరింత బలంగా తయారు చేస్తాయి. మన ఆలోచనలలో, మన అలవాట్లలో వచ్చే మార్పులు మనల్ని నిన్నటి కంటే ఈ రోజు మెరుగైన మనిషిగా తయారు చేస్తాయి.– కె. భాస్కర్ గుప్తా (వ్యక్తిత్వ వికాస నిపుణులు) -
ప్రతీ హృదయ స్పందనను కాపాడుకుందాం!
ప్రపంచ హృదయ దినోత్సవం (world heart day 2025) సందర్భంగా ఆలివ్ హాస్పటల్ ప్రజలకు ప్రత్యేక పిలుపునిచ్చింది. WHO ప్రపంచ హృదయ నివేదిక 2023 ప్రకారం 2021లో గుండె సంబంధిత వ్యాధులతో ప్రపంచ వ్యాప్తంగా 20.5 మిలియన్ల మంది మరణాలకు కారణమైందనీ, ఇది మొ త్తంమరణాలలో మూడో వంతుగా ఉందని వెల్లడించింది.ప్రతి హృదయ స్పందనను కాపాడుకోండి. వరల్డ్ హార్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం, హృదయ సంబంధ వ్యాధులు (CVDలు) 2021లో ప్రపంచవ్యాప్తంగా 20.5 మిలియన్ల మరణాలకు కారణమయ్యాయని అంచనా వేయబడింది, ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగే మరణాలలో దాదాపు మూడింట ఒక వంతు. గుండె వ్యాధులు, గుండె పోటు ప్రధాన కారణాలుగా ఉన్నాయని పేర్కొంది .“హృదయాన్ని ఉపయోగించు, హృదయాన్ని తెలుసుకో” అనే బ్యానర్ కింద, ఆలివ్ హాస్పిటల్ వ్యక్తులు, సంఘాలు, ప్రభుత్వ వాటాదారులను నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని కోరుతోంది. గుండె సంబంధిత వ్యాధులపై పోరాటం, పరిస్థితి ముదరకముందే ప్రారంభం కావాలని పిలుపునిచ్చింది.కేవలం గణాంకాలు మాత్ర మే కాదనీ జాగ్రత్త పరిచే హెచ్చరికలనీ ఆలివ్ హాస్పిటల్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జహీదుల్లా ఖాన్ తెలిపారు . ఈ వ్యాధి ఎక్కడో ఉండని, మన జీవనశైలి, ఆహార అలవాట్లు, ఒత్తిడి, సంరక్షణకు అందుబాటులో లేకపోవడం రూపంలోనే ఉంటాయన్నారు. ఈ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా “Use Heart, Know Heart”అనే నినాదంతో, ఆసుపత్రులు, పౌర సమాజం, ప్రభుత్వ భాగస్వామ్యంతో తక్షణ చర్యలు తీ సుకోవాలని కోరింది . "ఈ డేటా కేవలం సంఖ్యలు మాత్రమే కాదు - ఇది ఒక మేల్కొలుపు పిలుపు. ప్రతి జీవిత దశలో నివారణ మరియు ముందస్తు గుర్తింపును సమగ్రపరచడానికి ఇది మనల్ని ప్రోత్సహించాలి." అని తెలిపింది.ఆలివ్ హాస్పిటల్ గుండె సంబంధిత ఆరోగ్య సంరక్షణకు తగిన కార్యక్రమాలను చేపట్టనుందని ఉచిత స్క్రీనింగ్ శిబిరాలు , అవగాహన కార్యక్రమాలు, మొబౖల్ యూనిట్లు, స్థానిక క్లినిక్లతో భాగస్వామ్యం లాంటి వంటి కార్యకలాపాలను ప్రకటించింది . ప్రజారోగ్య సంస్థలు ప్రాథమిక హృదయ సంరక్షణ కార్యకలాపాలను విస్తరించాలని, అందరికీ సులభంగా, చవకగా స్క్రీనింగ్ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించింది . గుండెవ్యాధుల భారాన్ని భారాన్ని తగ్గిండచంలో నియంత్రణ చర్యలు, ఆరోగ్యకరమెన జీవనశైలి ప్రారంభ దశలో గుర్తింపు కీలకమని ఆసుపత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. జీవనశైలి-మార్పు మద్దతు (పోషకాహారం, వ్యాయామం, ధూమపాన విరమణ) కొనసాగింపును నిర్ధారించాలని ఆసుపత్రి ప్రజారోగ్య అధికారులను కోరుతోంది. -
హ్యాట్సాఫ్ మాష్టారు..! వైకల్యాన్ని బలంగా మార్చుకోవడం అంటే ఇదే..!
పుట్టుకతో రెండు చేతులు లేవు. అయినా వెనుకడుగు వేయలేదు. అజేయంగా ముందుకు సాగి ఉన్నత చదువులు చదవడమే కాకుండా, పాఠాలు చెప్పే ఉపాధ్యాయ వృత్తినే ఎంచుకున్నాడు. అనుకున్నట్లుగానే టీచర్ అయ్యాడు. చేతులు లేకపోయినా..పిల్లలకు బోధించే విధానాన్ని చూస్తే.. ఎవ్వరి మనసైనా హత్తుకుంటుంది. ఓ గొప్ప స్ఫూర్తిని నింపుతుంది.జార్ఖండ్లోని దట్టమైన అడువుల మధ్యలో గుల్షన్ లోహార్ అనే ఉపాధ్యాయుడు ఆ యువ జీవితాలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు. పుట్టుకతోనే చేతులు లేని ఆ ఉపాధ్యాయుడు పిల్లలకు బ్లాక్బోర్డుపై రాస్తూ బోధిస్తున్న తీరు ఇట్టే ఆకర్షిస్తుంది. పైగా ఆ విద్యార్థుల్లో స్ఫూర్తిని కూడా నింపుతోంది. ఆయన ఎప్పుడు తన వైకల్యాన్ని అడ్డంకి కూడా చూడలేదు. చాలామంది ఇలా రెండు చేతులు లేకపోవడాన్ని శాపంగా చూస్తే..అదే తన బలంగా మార్చుకున్నాడాయన. అతడి ఎడ్యుకేషన్ జర్నీ దృఢ సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం. మధ్యతరగతి కుటుంబానికి చెందిన లోహార్ రోజు 74 కిలోమీటర్లు ప్రయాణించి కాలేజ్కి వెళ్లేవాడట. తల్లి, సోదరుడు, అడగడుగునా సాయం అందించేవారట. బీఈడీ డిగ్రీకి ముఖ్యమంత్రి ఆర్థిక సహాయంతో పూర్తి చేసినట్లు తెలిపారు. అలా టీచర్ ఉద్యోగం పొందాక..మారుమూల గ్రామాల్లో పనిచేసేందుకు అంతగా ఉపాధ్యాయులెవరు ఆసక్తి చూపరు కానీ లోహార్ అలాంటి పాఠశాలలనే ఎంచుకుంటారు. ఆయన పశ్చిమ సింగ్భూమ్లోని మారుమూల అడవులలో ఉన్న బరంగ గ్రామం పాఠశాల అనేక విద్యా సవాళ్లను ఎదుర్కొంటోంది. అలాంటి పాఠశాలకు టీచర్గా రావడమే కాకుండా పాఠాలు చెప్పే తీరు ఓ రేంజ్లో ఉంటుందిగణితాన్ని బోధించేందుకు తన కాలినే చేతిగా మార్చుకుని చెబుతున్న విధానం చూస్తే..చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది.ఎందుకంటే దాన్ని భోధించాలంటే నోటితో సాధ్యం కాదు తప్పనిసరిగా బ్లాక్బోర్డుపై రాయక తప్పదు. తన వైకల్యాన్నే సవాలు చేసేలా చిన్నారులకు చెబుతున్న తీరు చూస్తే..మాష్టారు మీరు గ్రేట్ అని ప్రశంసించకుండా ఉండలేరు. అందుకు అతడి భార్య అంజలి, కూతురు సాయం అందిస్తారుట. అంతేగాదు అతడి సేవలను జార్ఖండ్ విద్యా ప్రాజెక్ట్ కౌన్సిల్ గుర్తించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేందుకు అర్హుడని అభివర్ణించింది. అయితే లోహార్ మాత్రం వైకల్యం అనేది నేర్చుకోవడానికి, బోధనకు అడ్డంకి కాదు అని చెప్పాలనేదే తన ఆకాంక్ష అని చెబుతున్నాడు. (చదవండి: కళ్లు బైర్లు కమ్మేలా బంగారం ధరలు.. అక్కడ మాత్రం 10 కేజీలతో డ్రెస్సు..!) -
తల్లి కాబోతున్న సింగర్, మెటర్నిటీ ఫోటో షూట్ పిక్స్ వైరల్
ఇండియన్ ఐడల్ స్టార్ సాయిలి కాంబ్లే తల్లి కాబోతోంది. ఈ గుడ్ న్యూస్ను తన భర్త ధవాల్తో కలిసి అభిమానులతో పంచుకున్నారు. తమ జీవితాల్లోకి అద్భుతం రాబోతోందని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. అంతేకాదు దీనిక సంబంధించి బేబీ షవర్ ఫోటోలను కూడా పంచుకున్నారు. దీంతో ఇవి నెట్టింట సందడిగా మారాయి. త్వరలోనే ఈ స్టార్ సింగర్ లాలి పాటలు పాడబోతోందంటూ అభిమానులు, తోటి కళాకారులు ఆమెకు అభినందనలు అందించారు.మెటర్నిటీ ఫోటో షూట్లో సాయిలి సాంప్రదాయ మహారాష్ట్ర స్టైల్లో ఆకుపచ్చ. నారింజ రంగు చీరలో మెరుస్తూ కనిపించింది.లుక్ను పూర్తి అందమైన రాణిహార్, కమర్బంధ్, మాంగ్ టీక చెవిపోగులతో తన లుక్మరింత అందంగా మల్చుకుంది. భార్యకు తగ్గట్టుగా ధవల్ తనదైన శైలిలో ముస్తాబయ్యారు. View this post on Instagram A post shared by Sayli Kamble Patil (@saylikamble_music)"మా హృదయాలు ఆనందం మరియు నిరీక్షణతో ఉప్పొంగిపోతున్నాయి! మా చిన్న అద్భుతం రాబోతోంది. చాలా సంతోసం. జీవితంలో అత్యంత అద్భుతమైన సాహసయాత్రను ప్రారంభిస్తున్నాం. మరింత ద్విగుణీకృతమైన ఆనంద క్షణాలను అనుభవించేందుకు ఎదురు చూస్తున్నాం. 'కొంచెం స్టార్డస్ట్, కొంచెం స్వర్గం , జీవితానికి సరిడా ప్రేమ మా దారిలోకి వస్తున్నాయి.’ అంటూ పోస్ట్ చేశారు. కాగాఇండియన్ ఐడల్ సీజన్ 12లో తన అద్భుతమైన గాత్రంతో అభిమానులను సంపాదించుకున్న గాయని సాయిలీ. సాయిలీ తన చిరకాల ప్రియుడు ధవల్ను 2022, ఏప్రిల్లో వివాహం చేసుకుంది.చదవండి: దుర్గాపూజలో భక్తిపారవశ్యం, నటీమణులు ఎమోషనల్, వీడియో వైరల్ -
మెడిటరేనియన్ డైట్ అంటే...మెదడు చురుగ్గా!
మెడిటరేనియన్ డైట్ అంటే...పుష్కలంగా పండ్లు, కూరగాయలు, బ్రెడ్, ఇతర ధాన్యాలు, బంగాళదుంపలు, బీన్స్, గింజలు, ఆలివ్ నూనెనే ఎక్కువగా వాడతారు. పాల ఉత్పత్తులు, గుడ్లు, చేపలు వంటివి మెడిటరేనియన్ డైట్ లో మితంగా తీసుకుంటారు. ఈ ఆహారంలో రెడ్ మీట్ కంటే చేపలు, పౌల్ట్రీ ఉత్పత్తులు ఎక్కువగా ఉంటాయి. మొక్కల ఆధారిత ఆహారాలనే ఎక్కువగా తింటారు. మెదడుకు చురుకైన ఆహారం రోజువారీ ఆహారంలో కూరగాయలు, లీన్ ప్రొటీన్లు, మంచి కొవ్వు, మరిన్ని... దశాబ్దాలుగా, మెడిటేరియన్ డైట్ తీసుకోవడం వల్ల మెదడు వృద్ధాప్యాన్ని వాయిదా వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీ: ఇది మీ న్యూరాన్లకు శక్తినిస్తుంది: గ్రీన్ టీలో కాటెచిన్లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి వాపులను, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి కావలసిన శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఇవి న్యూరోడీజనరేషన్కు కీలకంగా పనిచేస్తాయి.మెదడు పనితీరును పెంచే మొక్క మన్కై: దీనిని ‘డక్ వీడ్‘ అని కూడా పిలుస్తారు, మన్కై అనేది పాలీఫెనాల్స్, బీ12, మొక్కల ఆధారిత ప్రోటీన్లతో నిండిన ఒక చిన్న వాటర్ ప్లాంట్. ఇది మెదడు వృద్ధాప్యంతో ముడిపడి ఉన్న కీలక ప్రొటీన్లను నియంత్రించడంలో సహాయ పడుతుంది. చెడును తొలగిస్తుంది, మంచిని జోడిస్తుంది: గ్రీన్–మెడ్ ప్రణాళిక ఆరోగ్యకరమైన పదార్థాలపై మాత్రమే కాదు, ఇది రెడ్ మీట్, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను కూడా తగ్గిస్తుంది, రెండూ వృద్ధాప్యంతో ముడిపడి ఉన్నాయి. -
సూపర్ సప్పర్.. నగరంలో కొత్త తరహా కల్చర్ హవా
ఓ ఆదివారం ఆహ్లాదకరమైన సాయంత్రపు వేళ, తరచూ వెళ్లే కేఫ్లకు బదులు, ఓ అపరిచిత వ్యక్తి ఇంటికి వెళ్లడం, ఎప్పుడూ కలవని మరికొందరితో కలిసి టేబుల్ పంచుకోవడం ఎలా ఉంటుంది?.. ఈ ఊహ నగరంలో వాస్తవరూపం దాలుస్తోంది.. ఇప్పటికే పలు మెట్రో నగరాల్లో ట్రెండ్గా మారి ఇప్పుడిప్పుడే నగరంలోనూ అంకురిస్తున్న సప్పర్ క్లబ్లు రేపటి అనుభవాలను మాత్రమే కాదు కొత్త స్నేహాలను తీర్చిదిద్దే వేదికలుగా అవతరిస్తున్నాయి. రుచికరమైన ఆహారం ప్రశాంతమైన సంభాషణ, కొత్త రుచులను కనుగొనడం, ఒత్తిడి లేకుండా ముచ్చట్లు.. వీటన్నింటినీ అపరిచితులతో పంచుకోవడమే సప్పర్ క్లబ్స్ ప్రత్యేకత. – సాక్షి, సిటీబ్యూరో నగరంలో విస్తరిస్తున్న కొత్త తరహా కల్చర్ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ఈ క్లబ్స్ ప్రత్యేకమైన అనుభవం కోసం అతిథులను ఆహ్వానిస్తున్నాయి. ‘సప్పర్ క్లబ్లు తరచూ ఇళ్లలో నిర్వహించే సన్నిహిత భోజన అనుభవాలు. ఇక్కడ ఆహారంతోపాటు సంభాషణలు, పరిచయాలే ప్రధానం. రెస్టారెంట్ల మాదిరిగా స్థిరమైన మెనూ ఉండదు. వ్యక్తులు తమ కథలు చెప్పడం, కాలానుగుణ రుచులతో కొత్త వ్యక్తులను కలవడంపై మాత్రమే దృష్టి పెడతారు. తద్వారా వారు వండిన వంటకాలను కలిసి తినడం, భాగస్వామ్య టేబుల్పై కనెక్ట్ అవ్వడంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తారు.’ అని సప్పర్ క్లబ్స్ నిర్వహించే జైపూర్కు చెందిన సీమా సేథి అంటున్నారు. ఈ కొత్త ట్రెండ్కు సోషల్ మీడియా ప్రధాన ప్రేరకంగా మారింది. ప్రతి ఒక్కరూ తాము పంచుకోగల ప్రత్యేకమైన అనుభవాన్ని కోరుకుంటుండడం సప్పర్ క్లబ్స్కు ఊపునిస్తోంది. ‘ఎప్పుడూ కలవని వ్యక్తులతో ఓ ఇంట్లో జరిగే విందు పార్టీలో ఉన్నట్లు ఊహించుకోండి.. సప్పర్ క్లబ్.. కేవలం విందు కాదు.. ఇది ఒక వైబ్.. ఆకర్షణ వ్యక్తిగతంగా లీనమయ్యేలా చేస్తుంది. సాధారణ విందు విహారయాత్రకు భిన్నంగా ఉంటుంది.’ అని ముంబైలో సప్పర్ క్లబ్ హౌస్ ఆఫ్ మాలా సహ వ్యవస్థాపకురాలు ప్రాచి గుప్తా అంటున్నారు. హోమ్లీగా.. జాలీగా.. ‘చెఫ్ తాజాగా క్యూరేట్ చేసిన ఆహారాన్ని తినాలనుకునే డైనర్లలో ఈ ఫార్మాట్ ఆదరణ పొందుతోంది. డైనర్లు ఒకే టేబుల్ వద్ద కూర్చునే కుటుంబ–శైలి విందు కావడం కూడా ఆకర్షణను పెంచుతుంది.’ అని పుణెకు చెందిన యాంపిల్ సప్పర్ క్లబ్ వ్యవస్థాపకురాలు చెఫ్ కౌసల్య పాటిల్ అన్నారు. నేటి తరం ప్రజలు కేవలం భోజనం కంటే ఎక్కువ కోరుకుంటున్నారని హౌస్ ఆఫ్ మాలా సహ వ్యవస్థాపకురాలు సలోని గుప్తా అభిప్రాయపడ్డారు. నిర్ణీత మెనూ లేకపోవడం లాంటి ప్రత్యేకతలు సప్పర్ క్లబ్ల వైపు ఆకర్షించే బలమైన కారకాలుగా సీమా సేథి అంగీకరిస్తున్నారు. ‘ఇది ఆ నిర్దిష్ట సాయంత్రం కోసం మాత్రమే రూపొందిన అనుభవం..వ్యక్తిగతమైనది’ అని ఆమె చెప్పారు. ‘కోవిడ్–19 టైమ్లో దాదాపు రెండేళ్లు ఒంటరిగా ఇంట్లోనే గడిపాము. దీంతో మానవ సంబంధాలను పెంచుకోవడంపై ఆసక్తి పెరిగింది.’ అని గురుగ్రామ్లో బెంగాలీ సప్పర్ క్లబ్ టూంటూనీస్ టేబుల్ వ్యవస్థాపకురాలు టూనికా గుహా అంటున్నారు. వలస యువతతో ఊపు.. చదువుకోడానికి లేదా పని చేయడానికి వలస వచి్చన యువత ఎక్కువగా ఉన్న హైదరాబాద్ లాంటి నగరాల్లో తమ ఇళ్లను కుటుంబాలను విడిచిపెట్టిన వారు.. కొత్త వ్యక్తులను పరిచయం చేసుకోడానికి సప్పర్ క్లబ్లు గొప్ప మార్గంగా మారాయి.. ‘ఇవి రెస్టారెంట్లు, బార్ల కంటే భిన్నమైన అనుభవాన్ని ఇస్తాయి. నగరాల్లోని ప్రజలు మంచి ఆహారం తినాలని, అలాగే మంచి స్నేహానుభవాన్ని పొందాలని కోరుకుంటారు’ అని నగరంలో సప్పర్ క్లబ్కు శ్రీకారం చుట్టిన ప్రణవి చెప్పారు. విభిన్న సంస్కృతులలో కమ్యూనల్ డైనింగ్ ఒక సంప్రదాయం. ప్రతి సమావేశం, దానితో ఆలోచనల మార్పిడి, విభిన్న ఆచారాలు, సంస్కృతులను మనకు పరిచయచేస్తాయి.’ అని మరో క్లబ్ నిర్వాహకులు కౌశల్య పాటిల్ అన్నారు. డిజిటల్ సంబంధాలపై ఆధారపడుతున్న యుగంలో సప్పర్ క్లబ్లు అవసరమైన పరస్పర సాన్నిహిత్యాన్ని అందిస్తున్నాయి. చదవండి: దుర్గాపూజలో భక్తిపారవశ్యం, నటీమణులు ఎమోషనల్, వీడియో వైరల్ఇలా ప్రారంభించి.. అలా లీనమై.. ఈ విందులో పాల్గొన్నప్పుడు తొలుత ప్రతి ఒక్కరూ కొంచెం ఇబ్బందికరంగా ప్రారంభిస్తారు. ఇక్కడికి చేరుకోడానికి వారు ఎంత ట్రాఫిక్ను ఎదుర్కొన్నారనే విషయాలనే మాట్లాడతారు. కానీ అలా అలా నగరంలో రుచికరమైన, ఉత్తమమైన మటన్ థాలీని ఎక్కడ దొరుకుతుందనే సంభాషణ నుంచి అలా అలా చర్చలు లోతుగా మారతాయి.. ‘దీనికి ఫ్యాన్సీ రెస్టారెంట్ అంత స్థలం అవసరం లేదు. ఇది సోషల్ మీడియా బజ్కు సరైనది. దీని ద్వారా నగరాల్లో హోస్ట్ల నెట్వర్క్ను నిర్మించవచ్చు. ‘ఆదాయాన్ని పొందడం కంటే మిన్నగా వ్యక్తిగత బ్రాండ్ కమ్యూనిటీని సప్పర్ క్లబ్లు నిర్మిస్తాయి’ అని సీమా సేథి అంటున్నారు. ఇదీ చదవండి : Karur stampede tragedy మొన్ననే ఎంగేజ్మెంట్..త్వరలో పెళ్లిప్రతి సమావేశం కంటెంట్ సోషల్ మీడియా ద్వారా పంచుకోగల కథగా మారుతుంది. సొంత నిబంధనల ప్రకారం ఆతిథ్యం ఇచ్చేందుకు వీలు కల్పిస్తుంది. మరింత ముఖ్యంగా, ఇది ఆహారం కోసం మాత్రమే కాకుండా పరిచయాల కోసం వచ్చే అతిథుల సర్కిల్ను సృష్టిస్తుంది, వర్క్షాప్లు, సహకారాలు, ప్రయాణ అనుభవాలు తదితర భవిష్యత్తు అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. (నో మెడిసిన్స్, నో ఫ్యాన్సీ సప్లిమెంట్స్.. నేహాధుపియా 21 డేస్ చాలెంజ్)కేర్ ఫుల్.. కమ్యూనిటీ చిల్.. అపరిచితులతో కాబట్టి నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకుంటారు. టేబుల్లో హద్దులను నిర్దేశిస్తారు. వస్తువులను సురక్షితంగా ఉంచుతారు. హాజరవుతున్నవారు ఎలాంటి ఆహారాన్ని ఇష్టపడుతున్నారో? సప్పర్ క్లబ్ డిన్నర్ టేబుల్ సీటు బుక్ చేసుకోవడానికి ఎందుకు ఆసక్తి చూపుతున్నారో? అర్థం చేసుకోవడానికి విందుకు ముందే అవసరమైన సంప్రదింపులు ఉంటాయి. -
10 కేజీల బంగారంతో డ్రెస్..! ఎక్కడంటే..
బంగారం రేటు ఏ రేంజ్లో ఉందో తెలిసిందే. కొనాలంటే.. గుండెల్లో గుబులు తెప్పించేలా ధర పలుకుతోంది. సామాన్యుడు సైతం బెంబేలేత్తెలా ఉంది. అలాంటిది అక్కడ ఏకంగా స్వచ్ఛమైన బంగారంతో దుస్తులు రూపొందించారట. పైగా దాని ధర వింటే కచ్చితంగా నోరెళ్లబెడతారు. మరి ఆ కథకమామీషు ఏంటో చకచక చదివేయండి మరి...సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ ఆభరణాల సంస్థ అల్ రోమైజాన్ గోల్డ్ అండ్ జ్యువెలరీ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తులను రూపొందించి సరి కొత్త చరిత్ర సృష్టించింది. 'దుబాయ్ డ్రెస్' పేరుతో రూపొందించిన ఈ gold dress గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది. పూర్తిగా 21 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు. దీని మొత్తం బరువు 10.0812 కిలోగ్రాములు కాగా, మార్కెట్ విలువ సుమారు రూ. 11 కోట్లు పైనే ఉంటుందని అంచనా. కేవలం బంగారం ధర కారణంగానే కాకుండా కళాత్మకంగా రూపొందించిన విధానం కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అల్ రోమైజాన్ గోల్డ్ జ్యువెలరీ కంపెనీ ఈ డ్రెస్ని బంగారు కిరీటం(398 గ్రాములు), నెక్లెస్ (8,810.60 గ్రాములు,) చెవిపోగులు (134.1 గ్రాములు), తల అలంకరణ (738.5 గ్రాములు) బంగారంతో భాగాలుగా రూపొందించింది. ఆ తర్వాత ఈ భాగాలను మొత్తం కలిపి దుస్తుల రూపంలో ప్రత్యేకంగా ధరించేలా డిజైన్ చేసింది. ఇందులో కేవలం బంగారమే కాకుండా రంగురంగుల విలువైన రత్నాలను కూడా ఉపయోగించింది జ్యువెలరీ కంపెనీ. క్లిష్టమైన ఈ డిజైన్ని అత్యంత నాజుగ్గానూ, ఎమిరేట్స్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించింది. ఇందులోని ప్రతి నమునా చరిత్రకు అర్థంబట్టేలా తీర్చిదిద్దారు నిర్వాహకులు. ఈ డ్రెస్ ఆధునికత, చరిత్ర తోపాటు సృజనాత్మకతను ప్రతిబింబిస్తోంది. ఈ దుస్తుల డిజైన్ ప్రధాన ఉద్ధేశ్యం బంగారం, ఆభరణాల వ్యాపారానికి ప్రపంచ గమ్యస్థానంగా ఉన్న దుబాయ్ను మరింతగా బలపరచడమేనని సదరు జ్యువెలరీ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ దుస్తులు షార్జాలో జరుగుతున్న 56వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్లో 500కిపైగా ప్రదర్శకులు పాల్గొంటారు. అందులో ఇటలీ, భారతదేశం, టర్కి, అమెరికా, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, జపాన్, చైనా, సింగపూర్, హాంకాంగ్, మలేషియా దేశాల జ్యువెలరీ డిజైన్లర్లు , తయారీదారులు పాల్గొంటారు. కాగా, ఈ షోలో తొలిసారిగా ఆస్ట్రేలియా, మయన్మార్, పాకిస్తాన్ దేశాల డిజైనర్లు, తయారీదార్లు కూడా పాల్గొనడం విశేషం.(చదవండి: అందరికీ ఒకటే రక్తం!) -
ఫెస్టివ్ ఫీవర్ : విక్రయాల జోరు
సాక్షి, సిటీబ్యూరో: పండుగ సీజన్ విక్రయాల్లో గృహోపకరణాలు, పురుషుల దుస్తులు, పాదరక్షలు ముందు వరుసలో ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఫ్యాషన్కే ఎక్కువ డిమాండ్ ఏర్పడిన విషయాన్ని ప్రముఖ ఆన్లైన్ విపణి ఫ్లిప్కార్ట్ షాప్సీ అధ్యయనం వెల్లడించింది. గృహావసర వస్తువులకు డిమాండ్ 108% పెరిగిందనీ, పురుషుల సాధారణ దుస్తులు, పాదరక్షల విక్రయాలు 95% పెరిగాయనీ తెలిపింది. మహిళల కుర్తా, ప్యాంట్ సెట్లు, ఇయర్బడ్స్, పురుషుల అనలాగ్ గడియారాలు అత్యధికంగా అమ్ముడైన ఉత్పత్తులుగా నిలిచాయని తేల్చింది.(చదివింది 12 th.. సంపాదన నెలకు రూ. 3 లక్షలకు పైనే) జెన్ జెడ్గా పేర్కొంటున్న నవ యువ తరం ప్రధానంగా గ్రూమింగ్, ఫ్యాషన్, దుస్తులపై దృష్టి పెట్టగా, మిలీనియల్స్ (నేటి తరం) గృహ అవసరాలు, ఫ్యాషన్కు ప్రాధాన్యత ఇవ్వడం 60% అమ్మకాలకు దోహదపడిందని, మొత్తం ఆర్డర్లలో 57%తో మహిళా కొనుగోలుదారులు టాప్లో నిలిచారని వెల్లడించింది. చదవండి: దుర్గాపూజలో భక్తిపారవశ్యం, నటీమణులు ఎమోషనల్, వీడియో వైరల్ -
యంగ్ ఇండియా! ఒక్క బీట్ మిస్ అయినా.. బీ(ట్) కేర్ఫుల్
ప్రపంచవ్యాప్తంగా గుండెజబ్బులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. అందునా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తన విశృంఖల ప్రతాపం చూపాక గుండెజబ్బుల కేసులు మరింత ఎక్కువయ్యాయి. అందుకే ప్రతి ఏడాదీ సెప్టెంబరు 29న నిర్వహించే వరల్డ్ హార్ట్ డే తాలూకు థీమ్ ఏమిటంటే... ‘‘ఒక్క స్పందననూ మిస్ కావద్దు’’ (డోంట్ మిస్ ఏ బీట్). దీని అర్థం ఏమిటంటే... ఒక్క గుండె కూడా తన స్పందనలను కోల్పోయే పరిస్థితి రాకూడదనే. గతంలో కనీసం 50, 40లలో కనిపించే ఈ గుండెజబ్బులు ఇప్పుడు ఎందుకిలా యుక్త వయసు లోనే వచ్చేస్తున్నాయో చెప్పే కారణాలూ, వాటిని నివారిస్తూ మన యువతను గుండెజబ్బుల నుంచి రక్షించుకునేందుకు తగిన అవగాహనను కల్పించేందుకే ఈ కథనం.గుండెజబ్బుల తీవ్రతనూ, విస్తృతినీ తెలిపే కొన్ని గణాంకాలను చూద్దాం. ఢీల్లీ, ముంబై, హైదరాబాద్లలోని కొన్ని పెద్ద హాస్పిటల్స్ తాలూకు ఎమర్జెన్సీ కేసులను పరిశీలిస్తే సగానికిపైగా కేసులు... అంటే 50% కేసుల్లో బాధితులు కేవలం 40 ఏళ్లలోపు వాళ్లే. మానసిక ఒత్తిడి, ఎటూ కదలకుండా (శారీరక శ్రమ లేకుండా) ఉండే వృత్తులూ పెరగడంతో గుండె జబ్బులతో బాధపడే యువత కూడా పెరుగుతోంది. అందుకే ఇటీవల కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ 45 ఏళ్ల లోపే అక్యూట్ కరోనరీ సిండ్రోమ్తో బాధపడేవారిపై పరిశోధనల కోసం ఓ అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇటీవలి పరిశీలనల ప్రకారం ప్రతి ఐదు గుండె΄ోటు కేసులను పరిశీలిస్తే అందులో ఒకరు తప్పనిసరిగా 40 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. గుండెజబ్బుల పరంగా ప్రపంచవ్యాప్తంగా 20 – 30 ఏళ్ల యువతలో ఏడాదికి 2% పెరుగుదల ఉండగా... మన దేశంలో సైతం గుండెజబ్బులకు లోనైన వాళ్లలో 40 ఏళ్ల లోపు వారు కనీసం 25% వరకు ఉండటం మరింతగా బెంబేలెత్తిస్తున్న అంశం. హైబీపీ, హైకొలెస్ట్రాల్ వంటివి యువతలో పెరుగుతుండటమే దీనికి కారణం. దాంతో క్రమంగా, నిశ్శబ్దంగా చాపకింద నీరులా గుండెజబ్బుల కేసులు భారత్లోనూ పెరుగుతున్నాయి.లక్షణాలు... సాధారణంగా చాలామందిలో ఛాతీనొప్పితో గుండె పోటు కనిపిస్తుంది. ఈ లక్షణం కనిపించే వారు 97.3 శాతం మంది, చెమటలు పట్టడం 11 శాతం మందిలో, వాంతులు లేదా వికారం 8.2 శాతం కేసుల్లో, శ్వాస ఆడకపోవడం 6.8 శాతం మందిలో కనిపిస్తాయి. ఈ వయసులో చాలా మందిలో వచ్చే గుండెపోటుకు కారణమైన నొప్పిని గ్యాస్, అజీర్ణం, అసిడిటీ కారణంగా భావిస్తుంటారు. ఈ అంశం కూడా చికిత్స ప్రారంభించడాన్ని ఆలస్యం చేస్తోంది.గుండె జబ్బుల పెరుగుదలకు కారణాలు...వయసు పెరుగుతుండటం: ఇది నివారించలేని అంశం. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ మృదువుగా ఉండాల్సిన రక్తనాళాలు గట్టిబారుతుంటాయి. దీన్నే అధెరో స్కి›్లరోసిస్ అంటారు. గతంలో సాధారణంగా 40 ఏళ్లకు పైబడ్డాక ఈ పరిణామం సంభవిస్తుండేది. ఇప్పుడు ఈ వయసు కంటే ముందే.. అంటే 20 నుంచి 30 ఏళ్లలోపే ఇలా రక్తనాళాలు గట్టిబారడం కనిపిస్తోంది.కొందరిలో కొలెస్ట్రాల్ నిల్వలు చాలా నెమ్మదిగా రక్తనాళాల్లోకి చేరుతుంటాయి. కానీ కొందరిలో చాలా వేగంగా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇలా పేరుకునే కొవ్వును ‘ప్లాక్’గా వ్యవహరి స్తుంటారు. ఈ ప్లాక్ రక్తనాళాల్లోకి ఎక్కువగా చేరడం వల్ల ధమనులు/రక్తనాళాలు సన్నబడి, గుండె కండరాలకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. ఈ ప్లాక్ ఎక్కువగా చీలిపోయి క్లాట్స్ (అడ్డంకులు) గా మారి ఆకస్మికంగా గుండెకు రక్తసరఫరా తగ్గవచ్చు. ఫలితంగా గుండెపోటు రావచ్చు.ఆహారపు అలవాట్లు: హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వంటి మారుతున్న ఆహారపు అలవాట్లు, ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు చిన్న వయసులోనే గుండెజబ్బులు / గుండెపోటుకు దారితీసే ముప్పును పెంచుతున్నాయి. మన దేశంలో దిగువ, మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా ఉండే దేశాల్లో పెరుగుతున్న పట్టణీకరణ / నగరీకరణ కారణంగా అన్ని పోషకాలు ఉండే మంచి ఆహారంతో పోలిస్తే అధిక క్యాలరీలు ఉండే ఆహారం చవగ్గా దొరుకుతుండటంతో గుండెజబ్బుల ముప్పు పెరుగుతోంది.తగినంత వ్యాయామం లేకపోవడం : కుదురుగా కూర్చుని చేసే వృత్తులు పెరగడం ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న అంశమే అయినప్పటికీ... మన దేశ యువతలో కూడా వ్యాయామం లేక΄ోవడమూ, పైగా మన దేశ సాంస్కృతిక, సామాజిక నేపథ్యం కారణంగా మహిళలు, అమ్మాయిల్లో వ్యాయామ సంస్కృతి తక్కువగా ఉండటం కూడా గుండెజబ్బులు / గుండెపోటు ముప్పునకు కారణమవుతోంది.పొగతాగడం : ఇటీవల భారత్, రష్యా, కొన్ని మధ్య ఆసియా దేశాల్లో పొగాకు వినియోగం బాగా పెరుగుతుండటం అథెరోస్కిర్లోసిస్కూ, గుండెపోటుకు మరో ప్రధాన కారణం. 60 ఏళ్ల వ్యక్తులతో పోలిస్తే 40 ఏళ్లలోపు వారికి పొగ దుష్ప్రభావం మరింత ఎక్కువ. అయితే ఏ వయసులోనైనా పొగతాగడం అంతే ప్రమాదకరం అని గుర్తించాలి. స్థూలకాయం కారణంగా : మన దేశవాసుల్లో ఊబకాయం ఎక్కువగా పొట్ట దగ్గర వస్తుంది. దీన్నే అబ్డామినల్ ఒబేసిటీ అంటారు. మన జీవనశైలి (లైఫ్ స్టైల్) కారణంగా ఇలా స్థూలకాయం రావడం, పొట్ట దగ్గర కొవ్వు పెరగడం కూడా గుండెజబ్బుల ముప్పును మరింత పెరిగేలా చేస్తోంది. హైబీపీ, డయాబెటిస్ : లైఫ్స్టైల్ జబ్బులైన హైబీపీ, డయాబెటిస్ వంటి అనారోగ్యాల విషయంలో అవగాహన అంతగా లేని మనలాంటి దేశాలలో నియంత్రణలో లేని హైబీపీ, మధుమేహం వంటివి గుండెపోటుకు కారణమవు తున్నాయి.జెండర్ అంశం : ఒక వయసు వరకు మహిళలతో పోలిస్తే గుండెప్లాక్టు వచ్చే అవకాశాలు పురుషుల్లో ఎక్కువ. రుతుస్రావం ఆగి΄ోయే వరకు మహిళల్లోని ఈస్ట్రోజెన్ వారికి ఒక రక్షణ కవచంగా ఉంటుంది. అయితే రుతుక్రమం ఆగాక మహిళలతో పాటు... ఏ జెండర్ వారికైనా గుండెపోటు అవకాశాలు సమానం. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలు: పై అంశాలకు తోడుగా ఒక సమాజం లోని విద్య, ఆదాయ వనరులు, ఆరోగ్య సంరక్షణకు గల అవకాశాలు, సాంస్కృతిక నేపథ్యాల వంటి అంశాలు కూడా గుండెజబ్బుల కేసులను ప్రభావితం చేస్తుంటాయి. ఫ్యామిలీ హిస్టరీ : మిగతావారితో పోలిస్తే గుండెజబ్బులు / గుండెపోటు లాంటివి వచ్చిన వారి కుటుంబాల తాలూకు కుటుంబ ఆరోగ్య చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ) కూడా గుండెజబ్బుల ముప్పునకు ఒక ప్రధాన కారణం. మిగతావాళ్లతో పోలిస్తే దాదాపు 25 శాతం మంది రోగుల్లో గుంపోటుకు ఈ ఫ్యామిలీ హిస్టరీనే కీలకాంశ మవుతుంది. చదవండి: దుర్గాపూజలో భక్తిపారవశ్యం, నటీమణులు ఎమోషనల్, వీడియో వైరల్లబ్... డబ్...లయ తప్పొద్దు!నివారణ ఇలా... కార్డియో వాస్క్యులార్ హెల్త్ స్కోరుకు దగ్గరగా ఉండే జీవనశైలి: సాధారణంగా పాశ్చాత్యదేశాల్లో... మరీ ముఖ్యంగా అమెరికా వంటి చోట్ల అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిర్దేశించిన కొన్ని జీవనశైలి మార్గదర్శకాలు ఉన్నాయి. వాటినే ‘లైఫ్ ఎసెన్షియల్స్ 8 (ఎల్ఈ 8); లైఫ్ ఎసెన్షియల్స్ 7 (ఎల్ఈ 7) గా వ్యవహరిస్తుంటారు. అంటే... ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా అనుసరించే మార్గదర్శకాలైన... రక్త΄ోటును (హైబీపీని) అదుపులో ఉంచుకోవడం; రక్తంలో చక్కెరమోతాదులనూ, కొలెస్ట్రాల్ను తగ్గించుకోవడం; ఆరోగ్యకరమైన ఆహారాన్ని,పోషకాహారాన్ని తీసుకోవడం; తగినంత వ్యాయామం చేయడం; ఎత్తుకు తగినంత బరువు ఉండేలా బాడీ మాస్ ఇండెక్స్– (బీఎమ్ఐ)ను మెయింటెయిన్ చేయడంస్మోకింగ్ / నికోటిన్కు దూరంగా ఉండటం; కంటినిండా నిద్రపోవడం... అలాంటి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడం ద్వారా ఈ లైఫ్ ఎసెన్షియల్ స్కోరును ఎంతగా పెంచుకుంటే గుండెజబ్బులను అంతగా నివారించుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అర్లీ వార్నింగ్ సిగ్నల్స్ ద్వారా : చాలామందిలో గుండెజబ్బులుగానీ లేదా గుండెపోటుగానీ ఆకస్మికంగా రాకముందే కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ పంపుతాయి. ఉదాహరణకు ఛాతీలో ఇబ్బందిగా ఉండటం, తీవ్రమైన నీరసం, నిస్సత్తువ, అలసట, గుండెదడ (పాల్పిటేషన్) వంటివి. వాటిని నిర్లక్ష్యం చేయకుండా తగిన సమయంలో గుర్తించి డాక్టర్లను సంప్రదించడం వల్ల. స్క్రీనింగ్ పరీక్షలతో : హైబీపీ, అధిక కొలెస్ట్రాల్, మధుమేహంతో బాదపడేవారు తగిన పరీక్షలు చేయించు కోవడం, ఏవైనా లక్షణాలు కనిపిస్తే కరోనరీ సీటీ యాంజియోగ్రామ్ వంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండెజబ్బులు నివారించవచ్చు. ఇదీ చదవండి:Karur stampede tragedy మొన్ననే ఎంగేజ్మెంట్..త్వరలో పెళ్లి-డాక్టర్ అంజని,ద్వారంపూడి, సీనియర్ కార్డియాలజిస్ట్ -
దుర్గాపూజలో భక్తిపారవశ్యం, నటీమణులు ఎమోషనల్, వీడియో వైరల్
ప్రతీ ఏడాది ముంబైలో జరిగి దసరా ఉత్సవాలు, దుర్గా పూజలో బాలీవుడ్ హీరోయిన్లు ఉత్సాహంగా పాల్గొనడం ఆనవాయితీ. ముఖ్యంగా కాజోల్ , రాణి ముఖర్జీ ఈ కార్యక్రమాల్లో ముందంజలో ఉంటూ బంధుజనంతో కలివిడిగా తిరుగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారు. అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కానీ ఏడాది ఉత్సవాల్లో వారిద్దరూ తీవ్ర భావోద్వాగానికి లోనయ్యారు. అటు తన తండ్రి తరువాత అయాన్ ముఖర్జీ దుర్గా పూజ ఉత్సవాల్లో తొలిసారి పాల్గొన్నారు. తమ సమీప బంధువు, అత్యంత ఆప్తుడైన నటుడు దేబ్ ముఖర్జీ ఈ ఏడాదితమ మధ్య లేకపోవడమే ఇందుకు కారణం. ఆయనను గుర్తు చేసుకుని ఆయన మేనకోడళ్ళు నటీమణులు కాజోల్ , తనీషా రాణీ ముఖర్జీ భావోద్వాగానికి లోనయ్యారు. ఈ దృశ్యలు ఆన్లైన్లో దర్శనిమిచ్చాయి. ప్రతి సంవత్సరం దుర్గా పూజ పండల్ ఘనంగా దేబ్ ముఖర్చీ ఈ ఏడాది లేరు. ప్రముఖ బాలీవుడ్ నటుడు చిత్రనిర్మాత,బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ తండ్రి దేబ్ ముఖర్జీ. ఫ్యామిలీ అంతా ప్రేమగా 'దేబు కాకా' అని పిల్చుకునే దేబ్ ముఖర్జీ మార్చి 14, 2025న కన్నుమూసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ ఏడాది తమ కుటుంబ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లి, ఉత్సవాలను కలిసి ప్రారంభించారు కాజోల్, రాణీ ముఖర్జీ తనీషా ముఖర్జీ తదితర కుటుంబ సభ్యులు నార్త్ బాంబే సర్బోజానిన్ దుర్గా పూజ పండల్ను ఆవిష్కరించారు.రాణి ముఖర్జీ కుటుంబం యొక్క దుర్గా పూజ 2025 కి సహ-నిర్వాహకురాలిగా ఉన్నారు.‘‘అయిగిరి నందిని’’అనే స్తోత్రం మధ్య కాజోల్, రాణి దుర్గా మాత విగ్రహాన్ని ఆవిష్కరించారు. అమ్మవారిని చూడగానే ఇద్దరూ భక్తితో చేతులో జోడించి నమస్కరించారు. అనంతర అటు అమ్మవారి రూపాన్ని చూసి, ఇటు దివంగత దేబ్ ముఖర్జీని స్మరించుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. VIDEO | Mumbai, Maharashtra: Actors Kajol and Rani Mukherjee witness the unveiling of the Goddess' idol at the North Bombay Sarbojanin Durga Puja Samiti. (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/EgP2o1xVOH— Press Trust of India (@PTI_News) September 27, 2025ఈ సందర్భంగా తనీషా మాట్లాడుతూ"మా కుటుంబానికి ఇది కొంచెం విచారకరమైన సమయం, కొంచెం ఉత్సాహంతో పాటు, ఈ సంవత్సరం మా కుటుంబంలో ముగ్గురు ఆప్తులను కోల్పోయాం. ప్రతి సంవత్సరం దుర్గా పూజను నిర్వహించే మా దేబు కాకా (దేబ్ ముఖర్జీ) ఇక లేరు, ఈసారి పూజకు హాజరు కావడం కొంచెం కష్టంగానే అనిపించింది. అయినా గానీ ఆయన కలను ముందుకు తీసుకెళ్తున్నందున చాలా ఆనందంగా కూడా ఉంది." అన్నారు. View this post on Instagram A post shared by Rohit Saraiya (@rohitsaraiya.official) -
ఉన్నత చదువులు చదివినా..తండ్రి స్ఫూర్తితో ఇలా..!
మనసుకు నచ్చిన పనిచేస్తే అందులో కలిగే తృప్తి, ఆనందం వేరు అంటున్నారు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని కూకట్పల్లి సర్కిల్ ఆల్విన్ కాలనీ సాయినగర్లో శ్రీ రాజేశ్వరి వృద్ధాశ్రమ నిర్వాహకురాలు. చిన్నప్పటి నుంచి సామాజిక స్పృహను అలవాటు చేసిన తండ్రి స్ఫూర్తితో 2012లో ఈ వృద్ధాశ్రమాన్ని నెలకొల్పారు. అప్పటి నుంచి అనేక మంది అభాగ్యులను చేరదీసి వారికి అండగా నిలుస్తున్నారు. ఈ వృద్ధాశ్రమంలో ప్రస్తుతం 65 మంది వృద్ధులను ఆదరిస్తున్నారు. వారినే తన తల్లిదండ్రులుగా భావిస్తూ నిరంతరం సేవలందిస్తున్నారు. జీహెచ్ఎంసీవారు, పోలీసు వారు తప్పిపోయిన అనాథలను తీసుకొచ్చి రాజేశ్వరి వృద్ధాశ్రమంలో చేర్పిస్తుంటారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో.. వృద్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో.. వృద్ధాశ్రమంలో పక్షులు, బాతులు, చిలుకలు, పచ్చదనం కోసం వివిధ రకాల మొక్కలను ఏర్పాటు చేశారు. నిత్యం ఆశ్రమ పరిసరాలను శానిటేషన్ చేయిస్తూ శుభ్రతను పాటిస్తుంటారు. పలు ఆస్పత్రుల నిర్వాహకులతో చర్చించి వైద్యు పరీక్షలు చేయిస్తుంటారు. వృద్ధులకు కాలక్షేపానికి కథలు చెబుతూ ఆట పాటలు నిర్వహిస్తుంటారు. సేవే లక్ష్యం.. ప్రేమే మార్గం అంటూ అనాథలకు అండగా నిలుస్తూ.. తండ్రి స్ఫూర్తితో వృద్ధులను ఆదుకుంటున్నారు.. వృద్ధాశ్రమ నిర్వాహకురాలు రాజేశ్వరి. ఎందరో అభాగ్యులను చేరదీసి వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు. నెల్లూరు జిల్లా తిమ్మారెడ్డి వాగు గ్రామంలో జన్మించి ఉన్నత చదువులు అభ్యసించినప్పటికీ సామాజిక స్పృహతో సమాజానికి తనవంతు సేవ చేస్తున్నారు. దివ్యాంగులకూ అండగా.. కూకట్పల్లి, బోయిన్పల్లిలోని ఆశ్రమాల్లో గత ఐదేళ్లుగా వయో వృద్ధులతో పాటు దివ్యాంగులైన మూగ, చెవిటి వారికి కూడా ఆశ్రయం కలి్పంచి ఉచితంగా సేవలు అందిస్తున్నారు. సేవే మహా భాగ్యంగా..నా చివరి మజిలీ వరకూ మాతృమూర్తులకు సేవ చేస్తూనే ఉంటా. ఆశ్రమానికి పలువురు దాతలు అందించే చేయూత ఎప్పటికీ మరువలేను. వారి సహకారంతోనే నా లక్ష్యాన్ని కొనసాగిస్తున్నాను. కష్టంలోనూ వయో వృద్ధులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నా. వారి ఆనందమే నా ఆనందం. – రాజేశ్వరి, వృద్ధాశ్రమ నిర్వాహకురాలు (చదవండి: World Rivers Day: హృదయ నదులు..! వాటి గొప్పదనాన్ని నాడు ఎలా చెప్పారంటే.) -
కరూర్ తొక్కిసలాట మొన్ననే ఎంగేజ్మెంట్..త్వరలో పెళ్లి
తమిళనాడులోని కరూర్లో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. ఈ దుర్ఘటనలో ఆప్తులను కోల్పోయిన వారి శోకం వర్ణనానీతం. విగతజీవులుగా మారిన తమ బిడ్డలను చూసి కన్నీరమున్నీరుగా విలవిస్తున్న దృశ్యాలు ఎవరికైనా కంట తడిపెట్టించక మానవు. ఈ క్రమంలో గుండె పగిలే మరోహదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కరూర్ తొక్కిసలాటల కాబోయే జంట కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని రేపింది. హీరో విజయ్ ఫ్యాన్గా భావిస్తున్న ఆకాశ్ (24) మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన ఉంది. కానీ అంతలోనే అనంత లోకాలకు చేరాడు. ఆకాశ్ కు ఇటీవల గోకులశ్రీ ( 24)తో ఇటివల ఎంగేజ్మెంట్ అయింది. త్వరలో ఇద్దరికీ వివాహం జరగనుంది. ఆకాశ్ తన కాబోయే భార్యతో కలిసి గోకులశ్రీ ఎంతో ఉత్సాహంగాతన అభిమాన హీరో సభకు వెళ్లాడు. కానీ విధి మరోలా ఉంది. శనివారం విజయ్ తన టీవీకే పార్టీ తరఫున నిర్వహించిన బహిరంగ సభ, అక్కడ జరిగిన తొక్కిసలాటలో చిక్కుకుని ఆకాశ్, గోకులశ్రీ ఇద్దరూ మృతి చెందారు. ఈ సంఘటన వారి కుటుంబాల్లో అంతులేని శోకాన్ని మిగిల్చింది.ఈ ఘోరం ప్రమాదం విజయ్ Xలో స్పందించారు: “నా హృదయం ముక్కలైంది, నేను భరించలేని, వివరించలేని బాధ దుఃఖంలో ఉన్నాను’’ అంటూ ట్వీట్ చేశారు. టీవీకే తరఫున మృతులకు రూ.20 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.2లక్షల సాయాన్ని ప్రకటించారు. ఈ విషాదంపై తమిళనాడు ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, గాయపడిన వారికి సాధ్యమైన అన్ని వైద్య సహాయం అందించాలని ఆదేశించారు, తొక్కిసలాటపై విచారణ కమిషన్ను ఆదేశించారు.A woman lost her 5-year-old child in the Karur tragedy. Disturbing video shows her crying inconsolably. #Karur #KarurVijaySpeech #KarurTragedy https://t.co/YRskL4GoDr pic.twitter.com/cVOLJcN4cX— Vani Mehrotra (@vani_mehrotra) September 28, 2025 > కాగా కాగా తమిళ హీరో విజయ్ తన టీవీకే పార్టీ తరఫున నిర్వహించిన బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వేలాది మంది ఆహారం లేదా నీరు లేకుండా ఎండలో గంటల తరబడి వేచి ఉండటంతో ఉద్రిక్తత్తకు దారి తీసింది. ఈ దుర్ఘటనలో 39 మంది చనిపోగా, మరో కొంతమంది మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో 10 మంది పిల్లలు, 17 మంది మహిళలు, 12 మంది పురుషులు ఉన్నారు. ఘటనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, సహాయక చర్యలపై పూర్తి వివరాలతో తక్షణమే నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
దసరాని ఈ పసందైన వంటకాలతో సెలబ్రేట్ చేసుకుందాం ఇలా..!
మిరియాల పులిహోరకావలసినవి: బియ్యం– ఒక కప్పు, నీళ్లు– 2 కప్పులుచింతపండు– పెద్ద నిమ్మకాయ సైజ్ తీసుకోవచ్చుపచ్చిమిర్చి– 3 (సన్నగా తరగాలి), ఎండుమిర్చి– 4 (ముక్కలు చేసుకోవాలి), మిరియాలు– ఒకటి లేదా ఒకటిన్నర టీ స్పూన్ (పొడి చేసుకోవాలి), ఆవాలు– ఒక టీ స్పూన్, మినపపప్పు, శనగపప్పు– ఒక టేబుల్ స్పూన్ చొప్పున, నూనె, పల్లీలు– 3 టేబుల్ స్పూన్లు చొప్పున, బెల్లం కోరు– ఒక టీ స్పూన్, పసుపు– అర టీ స్పూన్, ఇంగువ– చిటికెడు, కరివేపాకు– 2 రెమ్మలు, ఉప్పు– తగినంతతయారీ: ముందుగా బియ్యాన్ని కడిగి, రెండు కప్పుల నీళ్లు పోసి కుకర్లో ఉడికించుకోవాలి. అన్నం మరీ మెత్తగా అవ్వకూడదు. ఈలోపు చింతపండును నీటిలో 10 నిమిషాలు నానబెట్టి, గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. మిరియాలను నూనె లేకుండా వేయించి చల్లార్చి, మెత్తని పొడిలా చేసుకోవాలి. ఉడికించిన అన్నాన్ని ఒక వెడల్పాటి ప్లేట్లో వేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇంతలో ఒక పాన్లో నూనె వేడి చేసి, ఆవాలు, శనగపప్పు, మినపపప్పు, పల్లీలు వేసి వేగించాలి. అనంతరం అందులో తరిగిన పచ్చిమిర్చితో పాటు ఎండుమిర్చి ముక్కలు, ఇంగువ, కరివేపాకు వేసి కొద్దిసేపు వేగించాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు, బెల్లం తురుము, పసుపు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. నూనె పైకి తేలే వరకు ఈ మిశ్రమాన్ని ఉడికించి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నంలో తగినంత ఉప్పుతో పాటు ఈ చింతపండు మిశ్రమాన్ని వేసి బాగా కలిపితే సరిపోతుంది.పనీర్ జిలేబీకావలసినవి: పనీర్ తురుము– 250 గ్రాములు, మైదా పిండి– ఒక కప్పుఏలకుల పొడి– అర టీస్పూన్, బేకింగ్ పౌడర్– పావు టీస్పూన్పంచదార– 2 కప్పులు, నీళ్లు– ఒక కప్పు (పాకం కోసం), నెయ్యి– సరిపడాపిస్తా, జీడిపప్పు ముక్కలు– గార్నిష్కితయారీ: ముందుగా పనీర్ తురుమును బాగా మెత్తగా చేతితో నలుపుకోవాలి. ఇందులో ఎటువంటి గడ్డలు లేకుండా చూసుకోవాలి. అనంతరం ఒక గిన్నెలో ఈ మెత్తని పనీర్, మైదా పిండి, ఏలకుల పొడి, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ, జిలేబీ పిండి మాదిరిగా గట్టిగా, మందంగా ఉండేలా కలుపుకోవాలి. పిండి చాలా పల్చగా ఉండకూడదు. ఈ పిండిని 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఒక గిన్నెలో పంచదార, నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి. పంచదార కరిగి పాకం కొంచెం చిక్కబడిన తర్వాత, దానిని స్టవ్ నుంచి దింపెయ్యాలి. ఈలోపు ఒక వెడల్పాటి పా¯Œ లో నెయ్యి వేడి చేసుకోవాలి. జిలేబీ మేకర్లో మైదా మిశ్రమాన్ని నింపుకుని, నచ్చిన విధంగా నేతిలో జిలేబీలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. అవి వేడిగా ఉన్నçప్పుడే గోరువెచ్చగా ఉన్న పంచదార పాకంలో ముంచాలి. ఐదు లేదా పది నిమిషాలు పాకంలో జిలేబీలు మునిగేలా ఉంచి ఆ తర్వాత వాటిపైన జీడిపప్పు, పిస్తా ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి.కేసర్ పెడాకావలసినవి: పాల పొడి– 2 కప్పులు, నెయ్యి– 4 చెంచాలు, కండెన్స్డ్ మిల్క్– ఒక కప్పు, ఏలకుల పొడి– ఒక టీ స్పూన్, ఫుడ్ కలర్– కొద్దిగా, కొన్ని పిస్తా పప్పులు– గార్నిష్ కోసం, కుంకుమ పువ్వు– కొద్దిగా, (వెచ్చని పాలలో నానబెట్టుకోవాలి)తయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసి చిన్న మంట మీద, ఒక పాత్రలో నెయ్యి వేడి చేసి, గరిటెతో కలుపుతూనే పాల పొడి, కండెన్స్డ్ మిల్క్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత ఏలకుల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు కుంకుమ పువ్వు నానబెట్టిన పాలు వడకట్టి, వాటిని వేసి బాగా కలిపి మళ్ళీ ఒక నిమిషం పాటు స్టవ్ మీద గరిటెతో తిప్పుతూ ఉండాలి. కాసేపు స్టవ్ మీద నుంచి గిన్నె పక్కకు దించి గరిటెతో తిప్పుతూ ఉండాలి. అలా స్టవ్ మీద కాసేపు మామూలుగా కాసేపు గరిటెతో కలిపితే ఆ మిశ్రమం పాత్రకు అంటకుండా ముద్దలా మారుతుంది. అలా మారిన తర్వాత దాన్ని 15 నుంచి 20 నిమిషాలు చల్లారనివ్వాలి. అనంతరం 15 నిమిషాలు ఫ్రిజ్లో ఉంచాలి. చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని, ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి, దాన్ని మృదువుగా చేసుకోవాలి. అనంతరం పిస్తా పప్పు, కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. (చదవండి: రుచి.. శుచి... వెంకన్న నైవేద్యం) -
వర్గల్ శంభుని గుట్ట గుట్ట పరిసరాల్లో ‘రాక్షసగూళ్లు’
యుగాలు, తరాలు మారినా, శాస్త్ర సాంకేతిక పురోగతి రాకెట్ వేగంతో దూసుకెళుతున్నా.. ఆనాటి మానవుని మనోభావాలు, శిలా శాసనాలు ఏదో రూపంలో బయటపడుతూనే ఉన్నాయి. ఇలాంటి విశేషాలకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రాంతం నిలయంగా మారుతోంది. ఈ ఆధారాలు మానవ వికాస పరిణామక్రమానికి ఎల్లలు లేవనే విషయాన్ని చాటి చెబుతున్నాయి. గజ్వేల్ ప్రాంతంలోని ఆదిమానవుల చారిత్రక విశేషాలు, శిలాశాసనాల ప్రత్యేకతలపై ఈ వారం కథనం. – గజ్వేల్ /వర్గల్(గజ్వేల్)గజ్వేల్ నియోజకవర్గంలో రెండో బాసరగా విశేష ఆదరణ కలిగిన చదువుల తల్లి కొలువుదీరిన వర్గల్ శంభుని కొండ గుహలు, నాడు ఆదిమానవుల నెలవులుగా విలసిల్లిన ఆనవాళ్లు ఉన్నాయి. వర్గల్ గ్రామానికి ఆగ్నేయ దిశలో ఎత్తైన కొండల శిఖరాగ్రాన శ్రీవిద్యాసరస్వతి అమ్మవారి సన్నిధానం ఎడమ పక్కన పెద్ద బండరాయి ఉన్నది. ఈ రాయి అడుగున ఎరుపు రంగులో అర్థం కాని భాషలో నాడు ఇక్కడ ఆవాసమున్న ఆదిమానవులు లిఖించినట్లు చెప్పబడుతున్న అక్షరాలు నేటికీ కనిపిస్తున్నాయి. గుట్ట పరిసరాల్లో ‘రాక్షసగూళ్లు’ శంభుని కొండ పరిసరాల్లో బృహత్ శిలాయుగపు నాటి ఆది మానవుల సమాధులుగా చెప్పుకునే ‘రాక్షస గూళ్లు’ పెద్ద సంఖ్యలో ఉన్నాయి. మధ్యన సమాధి.. దాని చుట్టూ గుండ్రంగా, వృత్తాకారంలో పెద్ద పెద్ద బండలతో పేర్చినట్లు కని్పస్తాయి. వర్గల్కు నైరుతి దిశలో అటవీ ప్రాంతంతో కూడిన తుని్కఖాల్సా గ్రామ సమీపంలో పెద్ద సంఖ్యలో ‘రాక్షస గూళ్లు’ నాటి చరిత్రకు అద్దం పడుతున్నాయి.చదవండి: Karur stampede tragedy మొన్ననే ఎంగేజ్మెంట్..త్వరలో పెళ్లిపలు గ్రామాల్లో శిలా శాసనాలువర్గల్ మండలంలో రాజుల నాటి శాసనాలు కూడా ఉన్నాయి. వర్గల్లో మూల స్థాన ఆలయానికి క్రీస్తు శకం 970లో కొంత భూమిని అప్పటి రాజులు దానంగా ఇస్తున్నట్లు పేర్కొంటూ కన్నడ భాషలో దాన శిలా శాసనం చెక్కించారు. అలాగే సీతారాంపల్లిలో క్రీస్తు శకం 979 నాటి శిలాశాసనం ఉన్నది. దాదాపు 5 ఫీట్ల ఎత్తున్న శిలపై నాలుగు దిక్కులా కన్నడ భాషలో అక్షరాలు చెక్కించారు. వేలూరు గ్రామ పటేల్ చెరువు పూడిక తీత పనుల్లో బయటపడిన దీనిని గ్రామ కూడలిలో స్థాపించారు.గజ్వేల్ ప్రాంతంలోని కొండపాక రుద్రేశ్వరాలయ ప్రతిష్ట, ఆలయ నిర్వహణకు భూ దానం అంశాన్ని వివరిస్తూ నాడు కాకతీయ రుద్రదేవుడి కాలంలో క్రీ.శ.1194 వేయించిన శాసనమున్నది. అలాగే ఐతేశ్వర సోమనాథ ఆలయానికి సంబంధించి ఒకే శిలపై కాకతీయ గణపతిదేవ చక్రవర్తి కాలం నాటి రెండు శాసనాలున్నాయి.మర్కూక్ మండలం పాములపర్తి పటేల్చెరువు వద్ద క్రీ.శ.1148 నాటి దానశాసనంను గుర్తించారు. అదేవిధంగా ఇటిక్యాలలో మూడు పక్కల తెలుగు, ఒక వైపు సంస్కృత శ్లోకంతో కూడిన శాసనం కనపడుతుంది.చారిత్రక సంపదను సంరక్షించుకోవాలి పురాతన శాసనాలకు, చారిత్రక సంపదకు గజ్వేల్ నియోజకవర్గం నెలవు. అందుకు సంబంధించి అనేక ఆనవాళ్లు ఉన్నాయి. ప్రభుత్వం ఇక్కడి ప్రాచీన చారిత్రక, పురాతత్వ, శిల్ప కళాసంపదలు కాలగర్భంలో కలిసిపోకముందే పరిరక్షించి భావితరాలకు అందజేయడం కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి. – డాక్టర్ హరినాథ్శర్మ రిటైర్డ్ ప్రభుత్వ తెలుగు శాఖాధిపతి -
నల్లటి వలయాలు, పుట్టుమచ్చలను మాయం చేద్దాం ఇలా..!
సాధారణంగా ఒత్తిడి, అలసట, నిద్రలేమి, కంప్యూటర్స్ లేదా ఫోన్స్ ఎక్కువగా చూడటంతో కళ్ల కింద నల్లటి వలయాలు (డార్క్ సర్కిల్స్), వాపు, ముడతలు ఏర్పడుతుంటాయి. వాటిని తగ్గించుకోవాలంటే ప్రత్యేకమైన జాగ్రత్తలు తప్పవు. ఇందుకోసం ఈ మెటల్ టూల్ అయిన కళ్ళ మసాజర్ లేదా క్రీమ్ స్పూన్ ప్రత్యేకమైనదిగా నిలుస్తోంది. ఎందుకంటే ఈ టూల్కి ఒకవైపు బాల్ లాంటి భాగం మరోవైపు స్పూన్ లాంటి ఆకారం ఉంటాయి. క్రీమ్స్, సీరమ్స్ వంటివి వేళ్లతో కాకుండా ఈ టూల్తో అప్లై చేసుకుంటే చర్మంపై బాక్టీరియా చేరే అవకాశం తగ్గుతుంది. ఈ స్పూన్.. జింక్ అలాయ్తో తయారైంది. ఇది చాలాకాలం మన్నుతుంది. కళ్ళకు వాడే క్రీములు, ఫేస్కి వాడే క్రీమ్స్, డ్రై మాస్క్లు, లోషన్లు, ఇతర సౌందర్య ఉత్పత్తులు అప్లై చేయడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని స్నేహితులకు బహుమతిగా కూడా ఇవ్వచ్చు. ఈ మసాజర్తో సున్నితంగా మసాజ్ చేయడం వల్ల ముఖంపై ఉండే వాపు తగ్గుతుంది, డబుల్ చిన్ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. కళ్ళ కింద ఉండే నల్లటి వలయాలు, బ్యాగ్స్ కూడా తగ్గుతాయి. ముఖ కండరాలు రిలాక్స్ అవ్వడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఈ టూల్ చాలా తేలికైనది, చిన్నది కాబట్టి హ్యాండ్బ్యాగ్లో లేదా జేబులో సులభంగా పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. క్రమం తప్పకుండా దీనితో మసాజ్ చేయడంతో, ఇది చర్మాన్ని బిగుతుగా చేసి, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.బెస్ట్ బ్యూటీ ట్రీట్మెంట్!కొన్ని పుట్టుమచ్చలు అందాన్ని తెచ్చిపెడితే, మరికొన్ని పుట్టుమచ్చలు గడ్డల్లా కనిపిస్తూ, ఉన్న అందాన్ని చెడగొడుతుంటాయి. అలాంటి వాటిని తొలగించడానికి చాలా రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో షేవ్ ఎక్సిషన్ ట్రీట్మెంట్ ఒక సాధారణ వైద్య పద్ధతి. చర్మంపై ఉన్న పులిపిర్లు, పుట్టుమచ్చలు లేదా చిన్న చిన్న గడ్డలు తొలగించడానికి ఈ చికిత్స సహకరిస్తుంది. ఈ ప్రక్రియలో, ఒక పదునైన బ్లేడుతో చర్మం పైపొరలో ఉన్న పెరుగుదల భాగాన్ని జాగ్రత్తగా ‘షేవ్’ చేస్తారు. ఇది లోతైన కోత కాదు, కాబట్టి సాధారణంగా కుట్లు వేయాల్సిన అవసరం ఉండదు. ప్రక్రియ ఎలా జరుగుతుందంటే.. ముందుగా, ఆ ప్రాంతానికి మత్తు ఇంజెక్షన్ ఇస్తారు, కాబట్టి నొప్పి తెలియదు. అనంతరం ఒక ప్రత్యేకమైన బ్లేడుతో చర్మంపై ఉన్న గడ్డను జాగ్రత్తగా షేవ్ చేస్తారు. కొద్దిగా రక్తం కనిపించే అవకాశం ఉంటుంది, దాన్ని ఆపడానికి విద్యుత్తు లేదా రసాయనాలను ఉపయోగిస్తారు. చికిత్స తర్వాత ఆ ప్రాంతాన్ని పొడిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. చర్మ వైద్య నిపుణుడి సమక్షంలోనే ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం ఉత్తమం. (చదవండి: World Rivers Day: హృదయ నదులు..! వాటి గొప్పదనాన్ని నాడు ఎలా చెప్పారంటే..) -
హృదయ నదులు..! వాటి గొప్పదనాన్ని నాడు ఎలా చెప్పారంటే..
కొన్నిసార్లు సైన్స్ కన్నా, కవిత్వమే ఎక్కువ లాజికల్గా అనిపిస్తుంది! అందుకు ఒక ఉదాహరణ... బహుముఖసృజనశీలి అయిన ఇటాలియన్ చిత్రకారుడు, ఇంజినీరు లియోనార్డో డా విన్సీ నదుల్ని మానవ శరీరంలోని ధమనులు, సిరలతో పోల్చటం! నదులు, ఉపనదులు భూగోళానికిజీవ ప్రవాహ నాళాలు అని వాటి ప్రాముఖ్యాన్ని ఈ ఒక్కమాటతోచక్కగా అర్థం చేయించారు డా విన్సీ. 51 కోట్ల, 72 వేల చ.కి. మీ. విస్తీర్ణంలో ఉన్న మన భూమిపై లక్షన్నరకు పైగా నదులు ఉన్నాయని ఒకఅంచనా. ఈ నదుల ప్రాముఖ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉండేందుకని గత ఇరవై ఏళ్లుగా ఏటా మనం సెప్టెంబరు నాల్గవ ఆదివారాన్ని (నేడు)‘ప్రపంచనదుల దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా పురాణాల్లో, సాహిత్యంలో, సినీ గీతాల్లో ఉన్న నదుల మననాలు కొన్ని.. మీ కోసం! ప్రవాహమే నది రూపంనదుల గురించి అల మాత్రంగానైనా మాట్లాడుకోవటం అంటే మహా సముద్రంలో ఈత కొట్టటమే! మొదలు–తుది; అంతము– ఆరంభమూ లేని ప్రవాహం... సమస్త మానవాళి జీవితాన్ని పెనవేసుకుని ఉన్న ఈ నదీ ప్రస్థానం. గ్రీకు తత్వవేత్త హెరాహ్లిటస్ అన్న మాట ఈ నదీ ప్రస్థానానికి, నదీ ప్రస్తావనకు చక్కగా సరిపోతుంది. ‘‘ఒకే మనిషి ఒకే నదిలో రెండోసారి అడుగు పెట్టడు. ఎందుకంటే– ఆ నది ఒకేలా ఉండదు. ఆ మనిషీ ఒకేలా ఉండడు’’ అంటారాయన. అంటే ప్రవాహం ఎప్పుడూ ఒకేలా ఉండదు, మనిషి కూడా నదీ ప్రవాహంలా ఒకేలా ఉండడు అని అంతరార్థం.సాగిపోయే జీవిత నౌకనదుల పోలికతో పాశ్చాత్యులవే మరికొన్ని అద్భుతమైన జీవిత సత్యాలు ఉన్నాయి. లెబనీస్–అమెరికన్ కవి ఖలీల్ జిబ్రాన్ ఏమంటారో చూడండి, ‘‘నది వెళ్లి సముద్రంలో కలిసినట్లే జననం వెళ్లి మరణంలో కలుస్తుంద’’ట! ఇక దివంగత బ్రిటన్ రాజనీతిజ్ఞుడు ఎనోచ్ పావెల్, ‘‘నా ఓడ కనిపించకుండాపోతే, నా ప్రయాణం ముగిసిందని కాదు. నది వంపు తిరిగిందని..’’ అని అంటారు! ఎంత చక్కగా చెప్పారు. ‘కొండగాలి తిరిగింది’ అని ఆరుద్ర అన్నట్లు – కొండగాలి మాత్రమే కాదు, నది కూడా తిరుగుతుంది. ప్రాప్తమున్న తీరానికి జీవిత నౌక సాగిపోతుంది. ఇదీ ఆరుద్ర మాటే. వయ్యారి గోదారమ్మ..!ఒక అమ్మాయికి యుక్త వయస్సు అనేది విశాలమైన నది నుండి సముద్రంలోకి తేలుతున్నట్లుగా ఉంటుంది అంటారు జి.స్టాన్లీ హాల్. 19వ శతాబ్దపు మనో వైజ్ఞానిక నిపుణుడు ఈయన. నదిలా నూత్న యవ్వనం పరవళ్లు తొక్కుతుందని చెప్పటం స్టాన్లీ ఉద్దేశం. ‘వయ్యారి గోదారమ్మ ఒళ్లంత ఎందుకమ్మ కలవరం..’ అని వేటూరి అడిగిన ప్రశ్నకు స్టాన్లీ ఆల్రెడీ సమాధానం చెప్పేసే ఉంచారన్న మాట! అమెరికన్ సంగీతకారుడు జాన్ విలియమ్స్, నదిని సంగీతంలో పోల్చారు. ‘‘సంగీతంలో నేను ఎక్కువ తక్కువల్ని చూడను. సంగీతం అన్నది మనమందరం కప్పులతో ముంచుకుని తాగ గల అమృతవాహిని అయిన నది’’ అన్నారు విలియమ్స్. ఇళయ రాజా దృష్టిలో సంగీతం అంటే ఏ ఉద్దేశమూ లేనిది! ‘‘నది ప్రవాహంలా సంగీతం సహజంగా, ఉద్దేశరహితంగా ఉండాలి’’ అంటారు ఇళయరాజా.స్వర్గలోక వెండి ప్రవాహంప్రాచీన కాలపు చైనా దేశీయులు పాలపుంతను కూడా ఒక ప్రకాశవంతమైన నదిగానే ఊహించారు. ఆ నదిని స్వర్గంగా, ఆ ప్రవాహాన్ని వెండిగా భావించారు. బౌద్ధ దార్శనికుడైన ఆచార్య నాగార్జునుడు మానవ జీవితంలోని దుఃఖం గురించి మాట్లాడుతూ, ‘‘నదిలో కలిసి, కదిలే చెక్క దుంగలు ప్రతి అల చేత విడిపోతాయి. అనివార్యంగా అలా వేరు అవటం దుఃఖానికి కారణం కాకూడదు’’ అంటారు. ప్రసిద్ధ బ్రెజిల్ నవలా రచయిత పాలో కోయెలో మరికాస్త లోతుకు వెళ్లి, ‘‘మీరు నదిలో పడటం వల్ల మునిగిపోరు, కానీ దానిలో మునిగిపోవటం వల్ల మునిగిపోతారు’’ అంటారు. జీవితాన్ని భయంతో ఈదలేమని చెప్పటం కావచ్చు. ఇంగ్లిష్ నటి జూలీ ఆండ్రుస్ (89)కు నది వాసన అంటే ఇష్టం. నది సౌమ్యత ఇష్టం. ఆమె చిన్నతనం అంతా నదితోనే గడిచింది. నది ఆమెను ప్రశాంతపరచింది. ఆమెకు ఓదార్పునిచ్చింది. ఈ విషయాన్ని జూలీ అనేక ఇంటర్వ్యూలలో చెప్పారు. గంగా తీరాన రిషికేశ్హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్కు భారతదేశంలోని సాయంత్రాలు అంటే చాలా ఇష్టమట. ఎందుకు ఇష్టమో ఆయన మాటల్లోనే విందాం. ‘‘సూర్యుడు ప్రపంచం అంచుకు చేరుకుంటాడు. శబ్దాలు అస్తమిస్తుంటాయి. పది వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు సైకిళ్లపై నదీ ప్రవాహంలా ఇంటికి చేరుకుని, శ్రీకృష్ణుడి గురించి, జీవన వ్యయం గురించి ఆలోచిస్తూ ఉండే మాయా క్షణాలవి’’ అంటాడు కామెరాన్. సైకిళ్లపై ఒక ఒరవడిగా వెళ్లే శ్రామికులను ఆయన ఒక నదీ ప్రవాహంగా ఊహించుకున్నారు. మైకేల్ ఎడ్వర్డ్ లవ్ కూడా భారతదేశం గురించి గొప్పగా చెప్పారు. ఆ గొప్పకు కారణం గంగా నది. మైకేల్ అమెరికన్ సింగర్, సాంగ్రైటర్. ‘‘1968 వసంతకాలంలో, ‘ది బీటిల్స్’ బ్యాండ్కు, నాకు మహర్షి మహేష్ యోగి నుండి భారతదేశంలోని రిషికేశ్కు రమ్మని ఆహ్వానం అందింది. రిషికేశ్ అనేక సంవత్సరాలుగా లక్షలాది మందికి ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇది హిమాలయాల నుండి గంగా నది ప్రవహించే ప్రదేశంలో ఉంది. ఆ వాతావరణంలో ఉండటం చాలా ప్రత్యేకమైనది’’ అంటారు మైకేల్. పురుష నది.. బ్రహ్మపుత్ర!భారతీయ పురాణాలలో అనేక నదులు ప్రవహించాయి. అయితే అవి కేవలం భౌతిక ప్రవాహాలు కావు. దైవత్వం పొందినవి. దేవతలతో సమానంగా గౌరవాన్ని పొందినవి. పూజలను అందుకున్నవి. గంగా, యమునా, సరస్వతి, గోదావరి నదులను స్త్రీ దేవతలుగా పూజిస్తారు. ఆ పవిత్ర జలాలలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. మరి పురుష నదులే లేవా? లేనట్లున్నాయి. బ్రహ్మపుత్ర నదిని మాత్రం ‘పురుష నది’గా పరిగణిస్తారు. మన నదులన్నీ కూడా రుగ్వేదం, మహాభారతం, రామాయణం వంటి పురాణ, ఇతిహాసాలలో ముఖ్యమైన పాత్రను కలిగి ఉన్నాయి. ‘గంగావతరణ’ ఘట్టందశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసిందీ, శ్రీరాముడి అవతార పరిసమాప్తి అయిందీ ‘సరయూ’ సమీపంలోనే. రామాయణంలోని ‘గంగావతరణ’ ఘట్టం అయితే ఒక అద్భుతమైన చిత్రణ. సీతను వెదకి రమ్మని వానరులను పంపేటప్పుడు ఆమెను ఎక్కడెక్కడ వెతకాలో చెబుతూ శరావతి, కావేరి, తామ్రపర్ణి, నర్మద, కౌశికీ, యమునా నదులను ప్రస్తావిస్తాడు సుగ్రీవుడు. ఇక కవుల గురించి చెప్పక్కర్లేదు. నది ఊసు లేనిదే వారి కలాలు పరవళ్లు తొక్కవు. ‘కవుల కవిత్వంలో పొంగిన నదులు’ అంటూ రాజన్ పి.టి.ఎస్.కె. అనే రచయిత తెలుగులో ఒక పుస్తకమే రాశారు. కృష్ణవేణి.. విరిబోణి.. అలివేణినది పేరుతో అనేక తెలుగు నవలలు, కథలు వచ్చాయి. అదొక అంతే లేని జాబితా. అలాగే తెలుగు సినిమా పాటలు వందలు, వేలు! పూర్తిగా ఒక నదిపైనే వచ్చిన పాట మాత్రం బహుశా డాక్టర్ సి.నారాయణ రెడ్డి రాసిన ‘కృష్ణవేణి తెలుగింటి విరిబోణి / కృష్ణవేణి నా ఇంటి అలివేణి’ కావచ్చు. ఆ పాటలో కృష్ణానది విశేషాలన్నిటినీ సినారె పొందుపర1చారు. భక్తిగీతంలా మొదలై పరవళ్లు తొక్కుతూ వెళ్లి సాగర హృదయాన సంగమిస్తుంది. ఈ పాట ‘కృష్ణవేణి’ (1974) చిత్రం లోనిది.వేదంలా ఘోషించే గోదావరికృష్ణవేణికి దీటైన ఇంకో తెలుగు సినిమా పాట.. ‘వేదంలా ఘోషించే గోదావరి.. అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి’. 1983 నాటి ‘ఆంధ్ర కేసరి’ సినిమా కోసం ఆరుద్ర ఈ పాటను రాశారు. అయితే ఆ పాట పూర్తిగా గోదావరి విశేషాల మీద కాకుండా, గోదావరికి అనుసంధానమై ఉన్న సుందర నగరాలు, కవులు–కావ్యాలు, ఏలిన రాజులు మీద సాగుతుంది. గోదావరి మీదే వేటూరి గారు రాసిన పాట ‘గోదావరి’ చిత్రంలోని ‘ఉప్పొంగెలే గోదావరి’. ఇంకా.. ‘ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తుందీ’ (ఆత్రేయ–‘చక్రవాకం’), ‘నవ్వుల నదిలో పువ్వుల పడవ’ (ఆరుద్ర–‘మర్మయోగి’), ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ’ (శేషేంద్ర శర్మ–‘ముత్యాల ముగ్గు’) ‘చినుకులా రాలి.. నదులుగా సాగి’ (వేటూరి–నాలుగు స్తంభాలాట), ‘గోదారి గట్టుంది.. గట్టు మీద సెట్టుంది..’ (దాశరథి కృష్ణమాచార్య–‘మూగ మనసులు’)... వంటి పాటలు పూర్తిగా నది చుట్టూ తిరిగినవి కాకపోయినా, దోసెడు నది నీళ్లను పట్టి ప్రేక్షకుల తలపులపై చిలకరించినవి. నదులపై మంచి మంచి సినిమా పాటలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవి కొన్ని రేణువులు మాత్రమే. నదులు కేవలం నీళ్లు కాదు, కేవలం ప్రవాహాలు కాదు, కేవలం ప్రయాణ మార్గాలు అంతకన్నా కాదు. మనిషిని బతికించే సంజీవినులు మాత్రమే కాదు. డా విన్సీ అన్నట్లు – భూగోళానికే జీవాన్ని, చేవను ఇచ్చే సిరలు, ధమనులు.శ్రీశ్రీ అనుసంధానం!‘మరో ప్రపంచం’ (1970) సినిమాలో శ్రీశ్రీ ‘అణగారిన బ్రతుకులలో..’ అనే పాట రాశారు. అందులోని ఒక చరణంలో... ‘గంగా, కావేరీ – నదులను కలుపుదాం..’ అన్నారు ఆయన. ఆ చరణం ఇలా ఉంటుంది : ‘ఈ దేశం నీదీ నాదని / ఇది ఒక్కరికే సొంతం కాదని / గంగా, కావేరి నదులు కలుపుదాం / కలిపి, సరిహద్దు చెరిపి, చెలిమి నిలుపుదాం..’ అని. యాభై ఏళ్ల క్రితం తొలిసారి 1972లో అప్పటి కేంద్ర మంత్రి కె.ఎల్.రావు గంగ–కావేరి నదులను అనుసంధానించాలని ప్రతిపాదించారు. అంటే, శ్రీశ్రీ తన పాట ద్వారా అంతకు రెండేళ్లకు ముందే గంగ, కావేరీలను అనుసంధానించారు! అందుకే, సృజనశీలులను కాలజ్ఞానులు అని కూడా అంటారు. నదుల అనుసంధానం గురించి 1974లో కెప్టెన్ దిన్షా జె.దస్తూర్ మరో ప్రతిపాదన తెచ్చారు. హిమాలయ నదులైన గంగ, సింధు, బ్రహ్మపుత్రలను... ద్వీపకల్ప నదులైన గోదావరి, కృష్ణ, మహానది, కావేరి, నర్మద, తపతి, పంబ వంటి వాటితో కలపొచ్చని! ఆ తర్వాత కేంద్ర జల వనరుల శాఖ ఇంకో ప్రతిపాదన తెచ్చింది. ఇవేవీ ఆచరణకు రాలేదు. సాక్షి, స్పెషల్ డెస్క్ -
కలలు రుద్దితే కల్లోలమే..!
హైదరాబాద్కు చెందిన నిఖిల్కు డ్రాయింగ్ అంటే ఇష్టం. ఆర్కిటెక్చర్లో చేరాలనుకున్నా తల్లిదండ్రుల ఒత్తిడితో ఐటీలో చేరాడు. కాని, రెండో సంవత్సరంలో తీవ్రమైన డిప్రెషన్ వల్ల డ్రాపవుట్ అయ్యాడు. విజయవాడకు చెందిన నందినికి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే పిచ్చి. కాని, పేరెంట్స్ ఒత్తిడి చేసి ఎంబీబీఎస్లో చేర్పించారు. ఫైనలియర్లో బర్నవుట్తో సైకియాట్రిక్ ట్రీట్మెంట్ అవసరమైంది. ఇది నిఖిల్, నందినిల సమస్య మాత్రమే కాదు. వేలాదిమంది విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య. తల్లిదండ్రులు తమ ఆశలు, కలలను పిల్లలపై రుద్దడం వల్ల, నచ్చిన కోర్సు చదవలేని పిల్లలు మానసిక సమస్యల పాలవుతున్నారు. దీనికి కారణం పేరెంట్ ప్రొజెక్షన్ ట్రాప్. ఏమిటీ ఉచ్చు? ‘‘నేను ఐఏఎస్ కాలేకపోయా, నా కుమారుడు ఐఏఎస్ కావాలి.’’ ‘‘నాకు డాక్టర్ సీటు రాలేదు, నా కూతురు డాక్టర్ అవ్వాలి.’’ ‘‘నా బిజినెస్ ఫెయిల్ అయింది, నా పిల్లాడు దానిని మళ్లీ నిలబెట్టాలి.’’చాలామంది తల్లిదండ్రులు ఇలా ఆలోచిస్తుంటారు. తమ నెరవేరని కోరికలు, అసంపూర్ణ కలలు, గుదిబండలా లోపల మిగిలిన ఆశలను పిల్లలపై బలవంతంగా మోపుతుంటారు. దీన్నే సైకాలజీలో ప్రొజెక్షన్ అంటారు. ఇది ఇండియన్ పేరెంట్స్లో ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఏంటి నష్టం? తల్లిదండ్రులు తమ కలలను పిల్లల మీద మోపినప్పుడు, పిల్లల్లో ఆందోళన, డిప్రెషన్, సెల్ఫ్ వర్త్ సమస్యలు పెరిగినట్లు హార్వర్డ్ చైల్డ్ డెవలప్మెంట్ స్టడీలో వెల్లడైంది. భారతదేశంలో విద్యార్థుల్లో కనిపిస్తున్న అకడమిక్ బర్నవుట్కు ప్రధాణ కారణం తల్లిదండ్రుల అసాధారణ ఆశలు, కంపేరిజన్ ప్రెజర్ అని ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకాలజీ అధ్యయనంలో స్పష్టమైంది. 15–19 ఏళ్ల వయసులో ఆత్మహత్యలకు ప్రధాన కారణం విద్యాపరమైన ఒత్తిడేనని ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా 2022 నివేదికలో స్పష్టంగా పేర్కొంది.ఎలాంటి ప్రభావం పడుతుందంటే... పిల్లల్లో ‘‘నేను ఎవరు? నాకు కావలసింది ఏమిటి?’’ అనే గందరగోళం మొదలవుతుంది.తల్లిదండ్రుల కల కోసం బతికేవాడు తన సొంత అస్తిత్వాన్ని కోల్పోతాడు.‘‘నాన్న నిరాశ చెందకూడదు... అమ్మ మాట వినకపోతే తప్పవుతుంది’’ అనే అపరాధభావం, భయం పిల్లల్లో ఆందోళన పెంచుతుంది. అతి ఒత్తిడి ఏకాగ్రతను తగ్గిస్తుంది. అందుకే తల్లిదండ్రులు అధిక అంచనాలు పెడితే పిల్లల పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది. ‘‘నా పేరెంట్స్ నా మనసు వినరు. వాళ్లకేం కావాలో అదే ముఖ్యం’’ అనే భావన పిల్లల్లో ఏర్పడుతుంది. దీంతో తల్లిదండ్రులకు ఎమోషనల్గా దూరమవుతారు. కొందరు పిల్లలు తిరుగుబాటు చేసి చదువు మానేస్తారు. మరికొందరు పేరెంట్స్ చెప్పిన దారిలో నడుస్తారు, కానీ జీవితాంతం అసంతృప్తితో ఉంటారు.సరే, ఏం చేయమంటారు? నిర్ణయం తీసుకునే ముందు మీ బిడ్డ మనసు వినండి. ‘నీకు ఏది ఇష్టం’ అనే ప్రశ్నను జెన్యూన్గా అడగండి. మీ కల, మీ బిడ్డ సహజమైన టేలెంట్ తో మ్యాచ్ అవుతుందా? అనే విషయమై ఆలోచించండి. స్పోర్ట్స్, ఆర్ట్స్, కోడింగ్, మెకానిక్స్, మ్యూజిక్... ఏది సహజంగా సూటవుతుందో తెలుసుకునేందుకు పిల్లలను ప్రయత్నించనివ్వండి. మార్కులు, ర్యాంకుల కన్నా కూడా వెల్ బీయింగ్ ముఖ్యం. ఎమోషనల్గా ఆరోగ్యంగా ఉన్న బిడ్డే దీర్ఘకాలంలో విజయం సాధించగల వయోజనుడిగా ఎదుగుతాడు. మీ బిడ్డకు ఏ కెరీర్ సరిపడుతుందో తెలుసుకునేందుకు సైకలాజికల్ అసెస్మెంట్, ఆప్టిట్యూడ్ టెస్టింగ్ తో కెరీర్ కౌన్సెలింగ్ చేయించండి. పేరెంటింగ్ ఒక అద్దం లాంటిది. మీరు పిల్లలపై మీ ప్రతిబింబం మోపితే, వాళ్ల అసలు రూపం కనిపించదు. కానీ మీరు అద్దం శుభ్రం చేసి వాళ్లను వాళ్లుగానే చూసే ప్రయత్నం చేస్తే... మీ పిల్లల్లోని జీనియస్ ఆటోమేటిగ్గా వెలుగుతుంది.ప్రాక్టికల్ పేరెంటింగ్ టిప్స్రోజుకు 15 నిమిషాలైనా చదువుకు సంబంధంలేని విషయాలపై మాట్లాడండి. ‘‘నువ్వు ఫస్ట్ రాలేదు’’ అని చిన్నబుచ్చేకంటే, ‘‘నువ్వు ఎంత శ్రద్ధగా ప్రయత్నించావో చూశా, నాకు గర్వంగా ఉంది’’ అని చెప్పండి. ‘‘నీ కజిన్ ఎంత బాగా చదువుతున్నాడో చూడు’’ అని పోల్చవద్దు. అది ఆత్మన్యూనతను పెంచుతుంది. పిల్లల చిన్న చిన్న విజయాలను కూడా గుర్తించి ప్రశంసించండి. అది వారికి ప్రోత్సాహాన్నిస్తుంది. సైకాలజిస్ట్ విశేష్ www.psyvisesh.com(చదవండి: అందాల ఆషికా రంగనాథ్ స్టైలిష్ వేర్లు ఇవే..!) -
అందాల ఆషికా రంగనాథ్ స్టైలిష్ వేర్లు ఇవే..!
నేచురల్గా మెరిసే అందం ఆశికా రంగనాథ్ సొంతం! మినిమల్ స్టయిలింగ్ టిప్స్తోనే, ఒక కొత్త లుక్ని సింపుల్గా, క్లాసీగా, కంఫర్టబుల్గా చూపిస్తూ మ్యాజిక్ చేసేస్తోంది. ఆ విషయాలే మీకోసం! బయటకు వెళ్లేటప్పుడు నా ఫేవరెట్ హాక్ బ్రెయిడ్ వేసుకోవడం. బ్రెయిడ్ని ఓపెన్ చేస్తే వచ్చే సాఫ్ట్ వేవ్స్ నాకు బాగా ఇష్టం. బ్లాక్ డ్రెస్లు, క్రాప్టాప్స్ నా ఆల్టైమ్ ఫేవరెట్. యాక్సెసరీస్ విషయానికి వస్తే సింపుల్ జ్యూలరీనే ఎంచుకుంటాను. గ్లామర్ మొత్తం సింప్లిసిటీలోనే ఉంది ఆశికా రంగనాథ్. ఇక్కడ ఆమె ధరించే చీర..బ్రాండ్: సాయి తనార్య, ధర: రూ. 22,000, జ్యూలరీ బ్రాండ్: వివంత్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యూలరీ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. కనీ కనిపించని కనికట్టుమెడలో ఒక్కసారిగా స్టోన్స్ మాత్రమే మెరుస్తూ కనిపిస్తే అదే ఇన్విజిబుల్ చైన్ మ్యాజిక్. గొలుసు కనిపించకపోయినా, పెండెంట్ మాత్రం గ్లామర్తో మెరుస్తుంది. చీర మీద క్లాసీగా, గౌన్ మీద గ్లామరస్గా, డైలీ వేర్లో క్యూట్గా ఏ లుక్కైనా ఈ ఇన్విజిబుల్ చైన్ సెట్ అవుతుంది. చిన్న పెండెంట్ వేసుకుంటే సింపుల్గా, సాఫిస్టికేటెడ్ లుక్ ఇస్తుంది. పెద్ద స్టోన్ పెండెంట్ అయితే స్పాట్లైట్లో ఉండే జ్యూలరీ అవుతుంది. ఫొటోల్లో ఈ పెండెంట్ లైట్ని క్యాచ్ చేస్తూ అదిరిపోయే గ్లో ఇస్తుంది. హెవీ జ్యూలరీ మానేసి, ఈ ఇన్విజిబుల్ చైన్ విత్ పెండెంట్ని వేసుకుంటే, నేచురల్ బ్యూటీ ఇంకో లెవెల్కి హైలైట్ అవుతుంది. జుట్టు లూజ్ వేవ్స్గా వదిలేస్తే క్లాసీ లుక్, హై బన్ చేస్తే ఎలిగెంట్ లుక్ మీ సొంతం. మార్కెట్లో గోల్డ్, సిల్వర్, కలర్ఫుల్ డిజైన్స్ లైట్వెయిట్ ఆప్షన్లతో దొరుకుతున్నాయి. ఇదొక ఆభరణం మాత్రమే కాదు, అది న్యూ ఏజ్ ట్రెండ్, స్టయిల్ సీక్రెట్ కూడా! (చదవండి: దశ విధాల అలంకరణతో ఇంటిని స్వర్గధామంలా మార్చేద్దామా..!) -
దశ విధాల అలంకరణతో ఇంటిని స్వర్గధామంలా మార్చేద్దామా..!
మనలోని పది రకాల దుర్గుణాలను నాశనం చేసి, విజయానికి గుర్తుగా దసరా వేడుకను జరుపుకుంటారు. మన జీవితాల్లోని ప్రతికూలతను నాశనం చేయడానికి, మంచితనాన్ని స్వీకరించడానికి ఆహ్వానించే రోజు. అంతటి ప్రత్యేకతలు గల రోజులలో ఉత్సాహభరితమైన వాతావరణాన్ని సృష్టించడానికి, మన ఇంటిని స్వర్గధామంగా మార్చే కొన్ని సులువైన దసరా అలంకరణలివి..1. పూల తేరుఏ పండగలోనైనా అలంకరణలో ప్రధానంగా మన కళ్లకు కట్టేది పూల తోరణాలు. పూలనే తేరుగా చేసే బతుకమ్మ వేడుకలు కాబట్టి, ఇంట్లోనూ వివిధ రకాల పూల అమరిక వేడుక రోజులను హైలైట్ చేస్తుంది. 2. థీమ్ ప్రాజెక్ట్దసరా రోజుల్లో మనకు ప్రధానంగా కనిపించేది అమ్మవారి అలంకరణ. ఎరుపు, పసుపు, పచ్చ రంగులు వచ్చేలా సృజనాత్మకతను దశ విధాల థీమ్ ప్రాజెక్ట్తో గృహాలంకరణను చేపట్టవచ్చు. 3. జత చేసిన రంగుల ఫ్యాబ్రిక్ కాటన్, సిల్క్, బాందినీ, గోటా పట్టీ.. ఫ్యాబ్రిక్తో తయారుచేసిన హ్యాంగింగ్స్, బీడ్స్, కర్టెన్స్.. వంటివి అలంకరణలో ఉపయోగించవచ్చు. 4. అద్దాలుడైమండ్, స్క్వేర్, చిన్నా పెద్ద అద్దాలను అమర్చిన వాల్ హ్యాంగింగ్స్ను అలంకరించవచ్చు. అట్టముక్కలను కట్చేసి, రంగు కాగితాలను, అద్దాలను అతికించి, ఈ డిజైన్స్ ఏర్పాటు చేయవచ్చు. 5. ఫర్నిషింగ్ రాజస్థానీ, గుజరాతీ హస్తకళా వైభవాన్ని తలపించే ఫర్నిషింగ్ అంటే కుషన్ కవర్స్, టేబుల్ రన్నర్స్ను ఈ వేడుకకు సరైన కళను తీసుకువస్తాయి. 6. దాండియా కళ నవరాత్రి రోజుల్లో దాండియా వేడుకను తలపించేలా ప్లెయిన్ వాల్పైన కాగితంతో దాండియా బొమ్మలు, వుడెన్ స్టిక్స్తో అలంకరించవచ్చు. 7. కార్నర్ కళలివింగ్రూమ్ లేదా డైనింగ్ హాల్లో ఒక కార్నర్ ప్లేస్ను ఎంపిక చేసుకొని, ఆ ప్రాంతాన్ని బొమ్మల కొలువు, దేవతామూర్తుల విగ్రహాలు, పువ్వులు, దీపాలతో అలంకరణను ఏర్పాటు చేసుకున్నట్లయితే, ఇంటికి పండగ కళ ఇట్టే వస్తుంది.8. ఇత్తడి, రాగి పాత్రలుపండగ రోజుల్లో కుటుంబ వారసత్వంగా వచ్చిన ఇత్తడి, రాగి పాత్రలు, కలప వస్తువులను అలంకరణలో ఉపయోగించవచ్చు. 9. రంగోలీ మ్యాట్స్పండగ రోజుల్లో ఇంటి ముందు, లోపల అందమైన రంగోలీని తీర్చిదిద్దడం చూస్తుంటాం. రంగోలీని తీర్చిదిద్దేంత సమయం లేదనుకునేవారు ఫ్యాబ్రిక్తో డిజైన్ చేసిన రంగోలీ మ్యాట్స్ను ఇంటి లోపల, గోడల పక్కన అలంకరించవచ్చు. 10. టెర్రకోట బొమ్మ లేదా ఇండోర్ ప్లాంట్స్టెర్రకోటతో తయారైన అమ్మవారి తల ఉన్న బొమ్మలు తక్కువ ధరలో మార్కెట్లో లభిస్తాయి. వీటిని సెంటర్ టేబుల్ లేదా కార్నర్ టేబుల్పైన ఉంచి, పువ్వులను అలంకరించవచ్చు. ఇండోర్ ప్లాంట్స్తోనూ అలంకరణలో ప్రత్యేకత తీసుకు రావచ్చు. ఎన్నార్ (చదవండి: ఈ బామ్మ రూటే వేరు..! 93 ఏళ్ల వయసులో గోల్డ్ మెడల్) -
షహీద్ భగత్ సింగ్ : స్వాతంత్య్ర విప్లవ జ్వాల
మనుషులను చంపగలరేమో కానీ, వారి ఆశయాలను చంపలేరని చాటిచెప్పిన విప్లవ వీరుడు సర్దార్ భగత్సింగ్ (Bhagat Singh). ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదంతో స్వేచ్ఛాకాంక్షను రగిల్చి, స్వరాజ్య సాధన పోరాటంలో చిరు ప్రాయంలోనే ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన యోధుడు. ఆయన పేరు వింటే చాలు యావత్ భారతీయుల రక్తం గర్వంతో ఉప్పొంగుతుంది. 1907 సెప్టెంబర్ 28న నేడు పాకిస్తాన్లో ఉన్న లాహోర్ సమీపంలోని ఒక గ్రామంలో భగత్ సింగ్ జన్మించారు. రష్యాలో మాదిరిగా భారతదేశంలో కూడా సోష లిస్టు రాజ్యం, సమసమాజం ఏర్పడాలని భావించారు. జైలుకు వెళ్లడానికి ముందూ, జైల్లో ఉరిశిక్ష కోసం ఎదురు చూస్తున్నప్పుడు కూడా ఆయన విస్తృతంగా మార్క్సిస్టు సాహిత్యాన్ని అధ్యయనం చేసి... మారు పేర్లతో పత్రికలకు రహస్యంగా వ్యాసాలు రాశారు. తన వ్యాసాల్లో ఆయన మతతత్వ ప్రమాదం గురించి దూరదష్టితో కచ్చితమైన హెచ్చరిక చేశారు. మతవాదుల పట్ల ఉదాసీనత ప్రమాదకరం అని బోధించారు. తనకు గురు తుల్యుడు, తండ్రి సమానులైన లాలా లజపత్ రాయ్ ‘హిందూ మహాసభ’కు అనుకూలంగా మారినప్పుడు ఆయన ఘాటుగా విమర్శించారు. భగత్సింగ్ కార్య కలాపాలపై లాలా కూడా విరుచుకు పడ్డారు. నన్ను లెనిన్ లా మార్చడానికి భగత్సింగ్ ప్రయత్నిస్తున్నాడనీ, అతను రష్యన్ ఏజెంట్ అనీ నిందించారు. అయినప్పటికీ లాలాను బ్రిటీష్ పోలీసులు కొట్టి చంపడాన్ని భగత్సింగ్ సహించలేదు. ప్రతిగా బ్రిటిష్ పోలీస్ అధికారిని తుపాకీతో కాల్చి చంపారు. ‘విప్లవం అంటే బాంబులు, తుపాకుల సంస్కృతి కాదు. పరిస్థితుల్లో మార్పు తేవడమనే ఒక న్యాయమైన ప్రణాళికపై ఆధారపడి జరగాలి’ అంటూ వివరించారు. మతతత్వం పట్ల ఆనాడు కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల పట్ల భగత్ సింగ్ అసమ్మతి వ్యక్తం చేశారు. ఒక మతానికి చెందిన ప్రజలు పరస్పరం ఇతర మతస్థు లను శత్రువులుగా భావిస్తున్నారనీ, రాజకీయాల నుంచి మతాన్ని వేరుచేయడమే దీనికి పరిష్కారం అనీ, మతం వ్యక్తిగతమైన విషయం కాబట్టి దానిలో ఎవరూ జోక్యం చేసుకోకూడదనీ భగత్సింగ్ అన్నారు. మతతత్వాన్ని నిర్మూ లించడానికి ఏకైక మార్గం వర్గచైతన్యమే అని అన్నారు. ‘పెంపుడు కుక్కను ఒళ్లో కూర్చోబెట్టుకుంటాం. కానీ, సాటిమనిషిని ముట్టుకుంటే మైలపడిపోతాం. ఎంత సిగ్గుచేటు?’ అని ‘అఛూత్ కా సవాల్’ (అంటరానితనం సమస్య) అనే వ్యాసంలో భగత్ సింగ్ ప్రస్తావించారు. సంకుచిత స్వపక్ష దురభిమానులను భగత్సింగ్ ప్రజల శత్రువుగా చూశారు. నేడు దేశంలో వేళ్లూనుకుపోయిన కుల, మత మౌఢ్యాలు పోవాలంటే లౌకిక, ప్రజాస్వామిక శక్తులు భగత్సింగ్ స్ఫూర్తితో దేశ ప్రజలను చైతన్య పరచాలి.– నాదెండ్ల శ్రీనివాస్ మధిర -
వండర్ బామ్మ..! 93 ఏళ్ల వయసులో గోల్డ్ మెడల్
వయసు తొంభై ఏళ్లు దాటితే చాలామంది కూర్చుని మోకాలికి నూనె రాసుకోవడం, మనవరాళ్లకు కథలు చెప్పడం, రక్తపోటు–షుగర్ మందులు సరిగ్గా తీసుకున్నామా అని చెక్ చేసుకోవడం చేస్తుంటారు. కాని, ఈ అమ్మమ్మ మాత్రం అలా కాదు. ట్రాక్లోకి దూకి గోల్డ్ మెడల్ కొట్టేసింది. ఆమె తొంభై మూడేళ్ల పానీదేవి. పానీదేవి కథ సాధారణం కాదు. అమ్మాయిలకు చదువూ ఆటలూ దూరమైన కాలంలో పుట్టింది. పదిహేను ఏళ్లకే పెళ్లి, యాభై ఏళ్లకే భర్తను కోల్పోయింది. ఎనిమిది మంది పిల్లలకు తల్లి, తండ్రి తానే అయి పెంచింది. చిన్న వయసు నుంచే పొలాల్లో కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించింది. జీవితం అంతా బాధ్యతలతో నిండిపోయినా, ఆమె మనసులో ఎప్పుడూ ఒక కల మేల్కొని ఉండేది. ఆ కలను నిద్రపుచ్చాలా లేక సాకారం చేసుకోవాలా అనే ప్రశ్నకు సమాధానం ఆమె రెండేళ్ల క్రితం చెప్పింది. ఒకరోజు తన మనవడు జైకిషన్ పారా అథ్లెట్లకు శిక్షణ ఇస్తుండగా, పానీదేవి ఒక్కసారిగా ‘నేనూ చేస్తాను’ అని చెప్పింది. ఇంత వయసులో విశ్రాంతి తీసుకోమని కాకుండా, మనవడు ‘పరుగెత్తు’ అని ప్రోత్సహించాడు. అలా ఆ మనవడు, అమ్మమ్మ కాస్తా గురుశిష్యులుగా మారారు. కొత్త జీవితం! ఇంటి పనులు ముగించుకుని మైదానానికి వెళ్లడం, పాదాలు నొప్పితో వణికినా ఆగిపోకుండా శిక్షణ కొనసాగించడం, చుట్టుపక్కల వాళ్ల నవ్వులు వినిపించినా తన గమ్యం మర్చిపోకుండా పరిగెత్తడంతో ఆమె కొత్త జీవితం ఆరంభమైంది. ప్రేక్షకులు మొదట ‘ఈ వయసులోనా?’ అని ఆశ్చర్యపోయినా, ఘాఘ్రా–చోళీతో ట్రాక్లోకి దూకి కేవలం 45 సెకన్లలోనే 100 మీటర్లు పూర్తి చేసేసరికి చప్పట్లతో మైదానం మార్మోగిపోయింది. ఆ పోటీకి ముందు గుంతలో పడిపోయి ఆమె మోకాళ్లు గాయపడ్డాయి. డాక్టర్లు ‘విశ్రాంతి తీసుకోండి’ అన్నారు. కాని, పానీదేవి మాత్రం ‘మహా అయితే ఓడిపోతాను. కష్టానికి గౌరవం ఇవ్వకుండా ఆగిపోవడం మాత్రం అసలు చేయను’ అంటూ పట్టుదలతో ట్రాక్లోకి దిగింది. అలా 2023లో అల్వార్లో మొదటి మెడల్, 2024లో పుణేలో జాతీయ స్థాయి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆమె ఇవన్నీ ఇంట్లో అల్మారాలో దాచేసింది! మనవడు వీడియో పోస్ట్ చేయకపోతే, దేశం మొత్తం ఆమెను అసలు చూడకపోయేది. ఇప్పుడు ఆమె కల మరింత పెద్దది. త్వరలోనే ఇండోనేషియాలో జరగబోయే ఆసియన్ మాస్టర్స్ గేమ్స్లో భారత్ తరపున పతకం గెలవడానికి సిద్ధమవుతోంది. (చదవండి: అందరికీ ఒకటే రక్తం!)