breaking news
Family
-
నటి పరిణీతి ప్రెగ్నెన్సీ.. నో కోల్డ్వార్.. పెద్దమ్మ ఫుల్ హ్యాపీ
తన జీవితంలో ముఖ్యమైన శుభవార్తను ప్రకటించింది నటి పరిణీతి చోప్రా. త్వరలోనే తామెతొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నామని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దీంతో తన అభిమానుల అభినందనలు వెల్లువెత్తాయి. మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు కాబోయే పరిణీతి, రాఘవ్ చద్దాకు అటు రాజకీయ ప్రముఖులు, ఇటు సినీ,ఇండస్ట్రీ మొత్తం అభినందించింది. ఈ జంట ఆగస్టు 25 న ఇన్స్టాగ్రామ్లో “1 + 1 = 3”, కేక్ , చిన్న పాదముద్రలను కలిగి ఉన్న ఒక అందమైన పోస్ట్ను పంచుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు. దీంతో పరిణీతి చోప్రా గర్భవతి అని తెలియగానే నటు కియారా అద్వానీ , నేహా ధూపియా, సోనమ్ కపూర్, భూమి పెడ్నేకర్, హుమా ఖురేషి రకుల్ ప్రీత్ సింగ్ ఇలా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో పరిణీతి సోదరి 'మిమి దీదీ' ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తెగ సంతోషడిపోయింది. పరిణీతి పోస్ట్ను ప్రియాంక కూడా తిరిగి షేర్ చేసి, త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న వారిని అభినందించింది. దీంతో ప్రియాంక, పరిణీతి వివాహాన్ని మిస్ అయిన తర్వాత, ఇద్దరు సోదరీమణుల మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని పుకార్లను తోసి పుచ్చింది.ఇదీ చదవండి: Vinayaka Chavithi 2025 : ప్రపంచంలో కొలువైన ఈ గణపయ్యల గురించి తెలుసా?పరిణీతి చోప్రా రాఘవ్ చద్దాల ప్రేమకథ మే 13, 2023న న్యూఢిల్లీలో వారి నిశ్చితార్థం తరువాత వెలుగులోకి వచ్చింది. ఈ జంట సెప్టెంబర్ 24, 2023న ఉదయపూర్లోని విలాసవంతమైన లీలా ప్యాలెస్లో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.చదవండి: Yoga మైగ్రేన్తో భరించలేని బాధా? బెస్ట్ యోగాసనాలు -
పల్లె జీవనం అంత వీజీ కాదమ్మా
జిమ్కు వెళ్లడం .. పెద్ద పెద్ద బరువులు ఎత్తడం.. పుషప్స్ తీయడం.. డంబుల్స్ లేపడం.. ఇవన్నీ కష్టమే కావచ్చు.. కానీ పల్లె జీవనం ఇంకా కష్టం.. రోజూ నీళ్ళబిందెలు మోయాలి. పాడి పశువులకు గడ్డి కోసి తీసుకురావాలి.. ధాన్యం బస్తాలు.. నెత్తిన పెట్టుకుని మోయాలి.. ఇంటి పని .. వ్యవసాయపనులు చేయాలి.. ఇదంతా అంత వీజీ కాదు.. జిమ్ములో కోచ్ సారధ్యంలో ఆయన సలహాల మేరకు బరువులు ఎత్తాలి .. కానీ గ్రామీణులు ఎలాంటి శిక్షణ.. నిపుణుల పర్యవేక్షణ లేకుండానే పెద్దపెద్ద బరువులు ఎత్తుతూ జీవనాన్ని భారంగా సాగిస్తుంటారు. వారి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ కుమార్తె కృష్ణ ష్రాఫ్ ఒక మహిళకు పాదాభివందనం చేసారు.. పల్లె ప్రజల జీవన విధానం ఎంత కష్టమో తెలుసుకుని ఓ మహిళను అభినందించారు. వాస్తవానికి "పల్లెకు పోదాం" అనే ఒక రియాలిటీ షోలో భాగంగా 11 మంది బాలీవుడ్ మహిళా సెలబ్రిటీలు ఒక కుగ్రామంలో రెండు నెలలు ఉండాలి.. ఎలాంటి ఆధునిక సౌకర్యాలు లేకుండా కేవలం కనీస ప్రాథమిక సౌకర్యాల నడుమ రెండు నెలలు ఉండాలి. అందులో భాగంగా వారు గ్రామీణులతో మమేకమై వారు ఎలా జీవిస్తున్నారు.. వారి కష్ట నష్టాలూ ఏమిటి.. వారు జీవనం కోసం ఎలాంటి అవస్థలు.. ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకోవడమే కాకుండా ఈ సెలబ్రిటీలు కూడా వాటిలో పూర్తిగా పాలుపంచుకోవాలి. ఈ కార్యక్రమానికి రణ్ విజయ్ సింఘా హోస్ట్ గా వ్యవహరిస్తుండగా ఈ కార్యక్రమం జీ టీవీలో ప్రసారం అవుతోంది.ఈ కార్యక్రమంలో భాగంగా జాకీష్రాఫ్ కుమార్తె కృష్ణ ష్రాఫ్ కూడా మధ్యప్రదేశ్ లోని భములీయ గ్రామానికి వెళ్లారు. పల్లెవాసులతో కలగలిసి వ్యవసాయం.. పశుపోషణ ఇంకా పలురకాల పనుల్లో ఈ సెలబ్రిటీలు పాలుపంచుకోవడమే కాకుండా అక్కడ ఏదో ఒక పని చేయడం ద్వారా జీవన భృతిని సంపాదించుకోవాల్సి ఉంటుంది. అయితే కృష్ణ ష్రాఫ్ మాత్రం తనకోసం సెలూన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె పల్లెలో నడుస్తూ ఒక గ్రామీణ మహిళా నెత్తిన గడ్డిమోపు తీసుకువెళ్లడాన్ని చూసారు..Jackie Shroff’s daughterFunny as hell😂pic.twitter.com/YkwTCbcfe9— Kreately.in (@KreatelyMedia) August 24, 2025 తాను కూడా గడ్డిమోపును మోస్తానని చెబుతూ దాన్ని తన నెత్తిన పెట్టాలని కోరారు.. ఆ మహిళ ఆ మోపును కృష్ణ ష్రాఫ్ నెత్తిన పెడుతుంది. అయినా ఆ గడ్డిమోపు కృష్ణ ష్రాఫ్ నెత్తిన నిలవడం లేదు.. జారిపోతుంది.. రెండుసార్లు మళ్ళీ పెట్టినా అది జారిపోతూనే ఉంటుంది.. వెంటనే ఆ గడ్డిమోపును ఆ మహిళా అందుకుని తలపై పెట్టుకుని వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది.. ఆ క్షణంలో కృష్ణ ష్రాఫ్ ఆ మహిళకు ఎదురెళ్లి.. ఆమె కష్టానికి, గడ్డి మోపు జారిపోకుండా ఉండేలా మోసుకెళ్తున్న తీరుకు అబ్బురపడుతూ ఆమెకు అభివందనం చేస్తుంది.. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ ఐంది... నెటిజన్లు కామెంట్లు కూడా పెడుతూ కృష్ణ ను, ఆమె సంస్కారాన్ని అభినందిస్తున్నారు.-సిమ్మాదిరప్పన్న -
99 కిలోలు నుంచి 59 కిలోలుకు..! నో స్ట్రిక్ట్ డైట్ కానీ
ఎన్నో వెయిట్ లాస్ స్టోరీల్లో డైట్, జిమ్ వంటి వాటితో బరువు తగ్గడం చూశాం. కానీ ఈ మహిళ చివరి వరకు స్థిరంగా ఉంటూ..తినే ఆహారంలో ఎలాంటి మార్పులు చేయకుండానే తగ్గింది. తాను రెగ్యులర్గా తీసుకునే డైట్నే తీసుకుంటూ వెయిట్ లాస్ అయ్యింది. అది తనకు ఏవిధంగా సాధ్యమైందో ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. కొందరు క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, మరికొందరు ఓపికకు పెద్దపీటవేసి బరువు తగ్గడం జరుగుతుంది. కానీ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సాచిపై నెమ్మదిగా, స్థిరమైన ప్రయత్నంతో అసాధారణ ఫలితాలను అందుకుంది. ఎలాంటి షార్ట్కట్లు, తీవ్రమైన డైట్లు అనుసరించలేదు. కేవలం క్వాండిటీలో మార్పు చేసింది. తాను రోజు తినే ఆహారంలో మార్పులేమి లేవు. కేవలం తీసుకునే క్వాండిటీనే తగ్గించి తీసుకునేది. అలగే మొదట 20 నిమిషాల నడక నుంచి మొదలు పెట్టి 60 నిమిషాల వరకు నడిచేలా ప్లాన్ చేసింది. అలా పదివేల అడుగులు పైనే తీసుకుంది. ప్రోటీన్ జోడించడమే గాక అల్పాహారం తప్పనిసరి చేసుకుంది డైట్లో. అలాగే తరుచుగా బరువు తగ్గానా లేదా అని అద్దంలో చూసుకోవడం నివారించాల్సిందేనంటా. అప్పుడే బరువు తగ్గడంలో గణనీయమైన మార్పులు సంభవిస్తాయట. తీసుకునే ఆహారం..సాధారణంగా మొదట డబల్ఎక్స్ఎల్లో ఉన వ్యక్తి తన సైజుని ఎక్స్ఎస్ సైజుకి మార్చుకునేలా వ్యాయమాలు కూడా హెల్ప్ అయ్యాయి. మొదటి ఐదు నుంచి ఆరు నెలలు ఇంట్లో చేసే సాధారణ వ్యాయామాలు చేయగా, ఆమె స్టామినా పెరిగే కొద్దీ..భారీగా బరువులు ఎత్తేలా జిమ్కి వెళ్లటం, పైలేట్స్ వంటివి జోడించినట్లు పేర్కొంది. మార్షల్ ఆర్ట్స్తో కలగలసిన ఈత వ్యాయామాలు తన మెరుగైన శరీరాకృతి మార్పుకి దోహదపడిందని చెప్పుకొచ్చింది. అలాగే తినే ఆహారంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండకుండా చూసుకునేదట. ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్లో గుడ్డులోని తెల్లసొనతో అవకాడో, లెట్యూసక్ష, టమాటాలు, చికెన్ రోల్ చేసుకుని తినేదట. స్పైసీ రొయ్యల న్యూడిల్స్, హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకోవడం, ఉల్లిపాయలు, క్యారెట్లు, బెల్పిప్పర్, క్యాబేజీ వంటి రంగురంగు కూరగాయలతో చేసిన స్పైసి రైస్ లేదా న్యూడిల్స్ తీసుకునేదట. వీటి తోపాటు ఫిష్ ఫ్రై, సలాడ్, పప్పు అన్నం, తదితరాలు తీసుకునేదట. ఇవి తనకు ఆకలిని నియంత్రించేలా చేసి, ఎక్కువగా ఆకలి వేయకుండా కపాడేదని పేర్కొంది. తాను స్థిరత్వం, సమతుల్యమైన ఆహారంతో ఇంతలా విజయవంతంగా బరువు తగ్గాగలిగానంటోందామె.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Saachi | Pilates. Fat Loss. Real Talk. (@saachi.pai) (చదవండి: నటి తనిష్టా ఛటర్జీ ఎదుర్కొంటున్న ఒలిగోమెటాస్టాటిక్ కేన్సర్ అంటే..! ఎందువల్ల వస్తుందంటే..) -
ప్రపంచంలో కొలువైన ఈ గణపయ్యల గురించి తెలుసా?
విఘ్నాలను తొలగించే వినాయకుడిని అత్యంత భక్తి శ్రద్దలతో కొలిచేందుకు యావత్ భక్తజనం సంసిద్ధమవుతోంది. చిన్నా పెద్దా అంతా బొజ్జగణపయ్యను కొలిచేందుకు ఉవ్విళ్లూరుతారు. తొమ్మిది రోజుల పాటు దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.గణేష్ చతుర్థిని భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అపారమైన భక్తితో జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తప్పక సందర్శించాల్సిన అయిదు ప్రత్యేకమైన గణేష్ విగ్రహాల గురించి తెలుసుకుందాం.ప్రతి సంవత్సరం వినాయక చవితిని భాద్రపద శుక్ల చవితి తిథి నాడు జరుపుకుంటారు. కోరిన కోర్కెలు నేరవేర్చు స్వామీ అని ఆ గణనధుడుని వేడుకొని వినాయకవత్రకథను చదువుకొని అక్షితలు వేసుకొని చంద్రుడిని దర్శించుకుంటారు. అనేక మంటపాల్లో కొలువుదీరిన గణపతిని తనివితీరా దర్శిస్తారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా వంటి రాష్ట్రాలతోపాటు, మలేషియా, నేపాల్, సింగపూర్, మారిషస్ ,కెనడా లాంటి దేశాల్లో కూడా సంబరాలు జరుగుతాయి. ప్రపంచంలో కూడా గణేష్ విగ్రహాలకు ప్రత్యేకత ఉంది. థాయిలాండ్లోని ఎత్తైన విగ్రహంతోపాటు, జపాన్, మలేషియా,అమెరికా, బాలిలోని అద్భుతమైన గణపతి విగ్రహాలకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఇదీ చదవండి: Yoga మైగ్రేన్తో భరించలేని బాధా? బెస్ట్ యోగాసనాలుమహా గణపతి ఆలయం, ఫ్లషింగ్, న్యూయార్క్ (USA)ఉత్తర అమెరికాలోని అతిపెద్ద హిందూ దేవాలయాలలో ఒకటి, ఇది అద్భుతమైన గణేష్ విగ్రహాన్ని కలిగి ఉంది. గణేష్ చతుర్థి సందర్భంగా భక్తులు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు.గణేష్ విగ్రహం, చాచోఎంగ్సావో (థాయిలాండ్)థాయిలాండ్ ప్రపంచంలోనే ఎత్తైన గణేష్ విగ్రహాలలో ఒకటి. ఈ విగ్రహం 39 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ గులాబీ రంగు గణేష్ విగ్రహం, రిలాక్స్డ్ భంగిమలో కూర్చుని, జ్ఞానం , శ్రేయస్సును సూచిస్తుంది.గణేశ మందిరం, టోక్యో (జపాన్)టోక్యోలోని కన్నోన్-జి ఆలయంలోని గణేశ మందిరంలో జపాన్ బౌద్ధ మరియు హిందూ దేవతలతో సాంస్కృతిక సంబంధాలు ప్రతిబింబిస్తాయి. ఇక్కడి విగ్రహాన్ని సంపదకు, విజయానికి సంరక్షకుడిగా భావిస్తారు.బాటూ కేవ్స్, మురుగన్ కౌలాలంపూర్ (మలేషియా)మలేషియాలోని బాటు గుహల వద్ద కొలువుదీరని మురుగన్కు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఈ గుహల ప్రవేశ ద్వారం వద్ద ఒక అద్భుతమైన గణేశ విగ్రహం కొలువుదీరి ఉంటుంది. గణేశ చతుర్థి సందర్భంగా పర్యాటకులు, భక్తులకు ఇది ప్రధాన ఆకర్షణ.గణేశ విగ్రహం, బాలి (ఇండోనేషియా)బాలిలో,ఉబుద్లోని ఒక ప్రత్యేకమైన రాతితో చెక్కిన విగ్రహం అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో ఒకటిగా వెలుగొందుతోంది. ఇది రక్షణ జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. -
నటి తనిష్టా ఛటర్జీ ఎదుర్కొంటున్న ఒలిగోమెటాస్టాటిక్ కేన్సర్ అంటే..! ఎందువల్ల వస్తుందంటే..
అంతర్జాతీయ నటి తనిష్ట ఛటర్జీ దర్శకురాలు, మంచి యాక్టర్ కూడా. ఆమె ఎన్నో అంతర్జాతీయ అవార్డులు దక్కించుకుని..విమర్శకుల ప్రశంసలందుకున్న ప్రముఖ నటి. ఆమె ఇటీవల స్టేజ్ 4 ఒలిగోమెటాస్టాటిక్ కేన్సర్ బారిన పడినట్లు ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొంది. ఈ మహమ్మారితోనే తన తండ్రిని కోల్పోయింది. ఇప్పుడు అదే ప్రాణాంతక వ్యాధిబారిన పడి పోరాడుతోంది. తాను ప్రస్తుతం చికిత్స తీసుకునే కష్టతరమైన జర్నీలో ఉన్నానని వెల్లడించింది. ఇంతకీ అసలు ఏంటి ఈ కేన్సర్..? ఎందువల్ల వస్తుందంటే..ఒలిగోమెటాస్టాటిక్ కేన్సర్ అంటే..ఒలిగోమెటాస్టాటిక్ స్థితి అనేది కేన్సర్ వ్యాప్తి పరిమితంగా ఉన్న దశ. కేన్సర్ ఈ దశలో కొన్నిప్రాంతాలకు మాత్రమే వ్యాపించి ఉంటుంది. చెప్పాలంటే ఒకటి నుంచి ఐదు ప్రాంతాలకే వ్యాపింస్తుంది. అంటే ఇది పూర్తిగా ముందుగా కేన్సర్ని గుర్తించే పరిస్థితిగా పేర్కొనవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఈ స్థితిలో చికిత్సకు మంచి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. శస్త్రచికిత్స, రేడియేషన్, థెరపీ వంటి వాటితో నయం చేసే అవకాశం ఉంటుంది. చాలామటుకు బతికే ఛాన్స్లు ఉంటాయి. ఈ మెటాస్టాసిస్ అనే పదం గ్రీకు నుంచి ఉద్భవించింది. ఒలిగో అంటే మెటాస్టాసిస్. దీని అర్థం వలస. సాంప్రదాయకంగా మూడు కంటే తక్కువ సుదూర అవయవాలలో ఐదు కంటే తక్కువ కణితి గాయాలుగా పేర్కొంటారు వైద్యులు. సాంకేతిక సాయంతో త్వరితగతిని నయం చేయగల కేన్సర్గా పరిగణిస్తారు. ఎలా గుర్తిస్తారంటే..శరీరం పూర్తిగా స్కాన్ చేస్తారు, కాలి నుంచి తల వరకు ప్రతి చోట క్షుణ్ణంగా స్కాన్ చేసి..ఎక్కడైన కణితి గాయాలు ఉన్నాయా అని పరీక్షిస్తారు. ఒక వేళ FDG PET స్కాన్లో ఈ కణుతులు గుర్తించలేకపోతే పెట్ స్కాన్, కాంట్రాస్ట్ సీటీ స్కాన్ల సాయంతో గుర్తిస్తారు.మనుగడ రేటు అనేది స్కాన్లో మెటాస్టేజ్ల సంఖ్య, ఒలిగోమెటాస్టాసిస్ ప్రదేశం, స్థానిక చికిత్సలకు ప్రతిస్పందన, కణితి జీవశాస్త్రం, ఇమ్యునోథెరపీ, రోగి స్థితి ఆధారంగా నిర్ణయిస్తారని వైద్యులు చెబుతున్నారు. దీంతో భవిష్యత్తులో ఈ కణితి వచ్చే ప్రమాదం ఎంత ఉందనేది కూడా అంచనా వేయడం వంటివి కూడా ఉంటాయన్నారు. అయితే ఈ దశలో రోగి భయాందోళనలకు గురవ్వకుండా త్వరితగతిన నయం అయి బయటపడగలరని చెబుతున్నారు. ఎలా చికిత్స చేస్తారంటే..కణితి వ్యాపించిన పరిస్థితి ఆధారంగా శస్త్రచికిత్స, రేడియేషన్, ఎంబోలైజేషన్ వంటి చికిత్సలు అందిస్తారని చెబుతున్నారు. ఈ స్టేజ్ 4 ఒలిగోమెటాస్టాటిక్ దశ అనేది విజయవంతంగా వ్యాధికి చికిత్స అందించగల స్టేజ్ అని చెబుతున్నారు నిపుణులు. View this post on Instagram A post shared by Tannishtha Chatterjee (@tannishtha_c) (చదవండి: -
మైగ్రేన్తో బాధపడుతున్నారా? ఇవిగో బెస్ట్ యోగాసనాలు
తరచుగా తలనొప్పి , మైగ్రేన్ బాధపడుతున్నారా? మందులతో విసిగిపోయారా? ఆగండాగండి యోగా మీకు తప్పకుండా సాయపడుతుంది.. లోతైన శ్వాస వ్యాయామాలతో కలిపి మైండ్ఫుల్ ఆసనాలు, ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవడం, మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడం, రక్త ప్రసరణను మెరుగు పర్చుకోవడం ఉపశమనం పొందవచ్చు. ఇవాల్టీ టిప్ ఆప్ ది డేలో భాగంగా మైగ్రేన్ తలనొప్పిని తగ్గించుకునేందుకు ఉపయోగపడే కొన్నియోగాసనాల గురించి తెలుసుకుందాం.దీర్ఘకాలిక తలనొప్పిని తగ్గించడానికి నెమ్మదిగా కదిలే, విశ్రాంతినిచ్చే యోగా ఉత్తమం. తలనొప్పి లేదా మైగ్రేన్తో బాధపడే ఎవరైనా వయస్సు లేదా ఫిట్నెస్ స్థాయితో సంబంధం లేకుండా ఈ యోగాసనాలను ప్రయత్నించవచ్చు. మైగ్రేన్ నుండి ఉపశమనం పొందడానికి సున్నితమైన, నెమ్మదిగా చేసే యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయాలి. మైగ్రేన్ నొప్పిని ప్రేరేపించని లేదా తీవ్రతరం చేయని సున్నితమైన, విశ్రాంతినిచ్చే యోగా పద్ధతులను ఎంచుకోవాలి. ముఖ్యంగా బాలాసనం, సేతు బంధాసనం, శవాసనం వంటివి మేలు చేస్తాయి. వేగవంతమైన, శక్తివంతమైన యోగా, చేయకూడదు. ఎందుకంటే అవి మైగ్రేన్లను ప్రేరేపించగలవు. ప్రాణాయామం (శ్వాస వ్యాయామాలు):అనులోమ విలోమ (ముక్కు రంధ్రాలు మార్చి చేసే శ్వాస), బ్రహ్మరి (తేనెటీగ శబ్దం చేసే శ్వాస) వంటివి మనస్సును ప్రశాంతపరుస్తాయి .ఒత్తిడిని తగ్గిస్తాయి. ధ్యానం ద్వారా మనస్సును శాంతపర్చి, ఒత్తిడిని తగ్గిస్తుంది. మెడ, భుజాలు ,వెన్నెముకలో ఉద్రిక్తత తరచుగా తలనొప్పికి దోహదం చేస్తుంది. కనుక వీటిని “సున్నితంగా సాగదీయడం ఈ కండరాలను సడలిస్తుంది, లోతైన శ్వాస మెదడుకు ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి, హార్మోన్లను తగ్గిస్తుంది. అతి చురుకైన నరాలను శాంతపరుస్తుంది. మైండ్ఫుల్ అభ్యాసాలుబాలాసనం: యోగా మ్యాట్మీద మోకాళ్లపై కూర్చోవాలి. తరువాత పాదాలపై పిరుదులు ఆనేలా కూర్చోవాలి. తరువాత నుదురు భాగం మ్యాట్కు తగిలేలా మెల్లిగా ముందుకు వంగాలి. తర్వాత రెండు చేతులను ముందుకు పూర్తిగా చాపాలి. అలా ఉండి నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, వదలడం చేయాలి. శరీరం పూర్తిగా విశ్రాంతి తీసుకోనివ్వాలి. 30 సెకన్ల పాటు ఈ ఆసనం వేసినా చాలు. బాలాసనంతో ఒత్తిడిని తగ్గించి, శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మోకరిల్లి, ముందుకు మడిచి, మీ నుదిటిని నేలపై లేదా కుషన్పై ఉంచండి. ఇది భుజం, మెడ మరియు నుదిటి ఉద్రిక్తతను తక్షణమే తగ్గిస్తుంది.అధో ముఖ స్వనాసన: అధో ముఖ స్వనాసన అరచేతులు , పాదాలను నేలపై ఉంచి తుంటి భాగాన్ని (సూర్య నమస్కారంలో చేసినట్టుగా)పైకి లేపడం. వెన్నెముకను బలాన్నిస్తుంది. నడుము నొప్పిని తగ్గిస్తుంది. మెదడులో రక్త ప్రసరణను మెరుగుపరిచి దాని పనితీరును మెరుగుపరుస్తుంది. తలకు రక్త ప్రసరణను అందించి రిఫ్రెష్ చేస్తుంది.విపరీత కరణి: విపరీత కరణి అంటే "ప్రవాహానికి వ్యతిరేకం" అనే సంస్కృత అర్థాన్ని సూచించే యోగా భంగిమ. దీనిని "లెగ్స్ అప్ ది వాల్ పోజ్" అని కూడా పిలుస్తారు. వెల్లకిలా పడుకుని , కాళ్ళు , పాదాలను గోడకు ఆనించాలి. అరచేతులు క్రిందికి ఎదురుగా ఉండేలా చేతులను శరీరానికి దగ్గరగా ఉంచండి.ఆలోచనకు కళ్లెం వేసి, తలనొప్పి ఒత్తిడిని తగ్గిస్తుంది.సుప్త బద్ధ కోణాసన : ఇది పడుకుని చేసే సీతాకోకచిలుక భంగిమ. మనస్సును ప్రశాంతపరుస్తుంది. నేలపై వెల్లకిలా పడుకుని, పాదాల అరికాళ్ళను ఒకదానికొకటి తాకించి, మోకాళ్ళను పక్కలకు వంచండి. కావాలంటే వెన్నెముక కింద కుషన్ పెట్టుకోవచ్చు. ఈ భంగిమలో కొంత సమయం పాటు విశ్రాంతి తీసుకోండి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. హార్మోన్లను సమతుల్యం చేయడంలో, నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆందోళనతోవచ్చిన తలనొప్పిని తగ్గిస్తుంది.సేతు బంధాసనం: ఈ భంగిమ నొప్పి నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.శవాసన (శవ భంగిమ): రిలాక్స్డ్, ఫ్లాట్గా పడుకోండి. ఈ అంతిమ విశ్రాంతి భంగిమ మీ నాడీ వ్యవస్థను రీసెట్ చేస్తుంది. విశ్రాంతి కోసం ఈ ఆసనం చాలా ముఖ్యమైనది. ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసుకు ప్రశాతంతనిచ్చి, నొప్పులను తగ్గిస్తుంది.నోట్ : అవగాహనకోసం, తాత్కాలిక ఉపశమనం కోసం అందించిన చిట్కాలుమాత్రమే. మైగ్రేన్ మరింతగా బాధిస్తోంటే వైద్యుడిని సంప్రదించం మేలు, అలాగే యోగా నిపుణుని సలమా మేరకు యోగాను ప్రారంభించడం చాలా ముఖ్యం. -
ఎవరిది సంకల్పం? ఏది ముక్తికి మార్గం
అప్పుడప్పుడే మొలకెత్తుతున్న ఒక చిన్న విత్తనం, భూమి పైపొరలను పెళ్ళగించుకుంటూ పైకి పొడుచు కొచ్చే దృశ్యంలో ‘చిదిమేస్తే చితికిపోయేంత మెత్తని హరిత పదార్థానికి అంత మహత్తరమైన శక్తి ఎలా వచ్చింది?’ ఆలోచిస్తే, ప్రతి విత్తనంలో ప్రకృతి నిక్షిప్తం చేసి ఉంచే శక్తి అంత బలమైనది కాబోలు! కంటితో చూడటానికి, చేతితో తాకడానికి వీలు కానటువంటి ఆ ప్రాణశక్తి, అత్యంత ప్రాథమిక రూపంలో బలం లేనిదిగా, బహు శక్తిహీనమైనదిగా కనబడటంలోనే ప్రకృతి రహస్యం దాగి ఉందనిపిస్తుంది. పదార్థంలో అలా కంటికి కనిపించక నిక్షిప్తమై ఉండే జీవశక్తిని ఏదైతే మేలుకొలిపి చైతన్యవంతం చేస్తుందో దానిని ‘సంకల్పం’ అని ఆధ్యాత్మికవేత్తలు పిలిచారు. ‘ఎవరిది ఈ సంకల్పం?’ అనే ప్రశ్నకు ‘ప్రకృతిలోని ప్రతి వస్తువులోనూ నిండి ఉండే భగవంతుడిది!’ అని సమాధానంగా చెప్పారు. ‘బీజం బంకురం బయినట్లు, సంకల్పంబు ప్రపంచంబగు, నీ సంకల్పంబు తాన జనియించి, తాన వర్ధిల్లి, తాన యణంగుచుండు’ అనే మాటలలో మడికి సింగన ‘వాసిష్ఠ రామాయణము’ తృతీయాశ్వాసంలోని ఒక వచన భాగంలో ఈ సంగతినే చెప్పాడు. ఒక విత్తనం లోంచి మొక్క పుట్టినట్లుగా, పరమాత్ముడి సంకల్పం నుండి పుట్టిన ఈ ప్రపంచం తానే పుట్టి, తానుగా వర్ధిల్లి, తానే అదృశ్యమైపోతుంది అని ఆ మాటల భావం. భగవంతుడి సంకల్ప ఫలితం అలా ఉండగా, మానవుడికి సంకల్ప ఫలం బంధానికి దారి తీస్తుందని అదే వచన భాగంలో ఇలా చెప్పాడు మడికి సింగన.ఇదీ చదవండి: జలపాతం వద్ద రీల్స్ చేస్తూ కొట్టుకుపోయిన యంగ్ యూట్యూబర్‘దీన సుఖంబు లేదు. దుఃఖం బాపాదించుచుండు, నట్లు గావున సంకల్ప భావన లుడిగి శుభంబు నొందుము.’ బంధంలో మనిషికి సుఖం దక్కదు. పైపెచ్చు దుఃఖాన్ని మిగుల్చుతుంది. అందువలన ఆ దుఃఖం నుండి తప్పుకోవాలంటే మనస్సులో అంకురించే ‘సంకల్ప భావనలకు’ స్వస్తి పలకడం తప్పనిసరి. అలా సుఖవంతులు కావడమే శ్రేయస్కరం – అని పై మాటల తాత్పర్యం. భగవంతుడి, భగవంతుడి సృష్టియైన మానవుడి సంకల్ప ఫలాలలో గల ఈ భేదాన్ని గుర్తించి వర్తించడం ముక్తిని కలిగిస్తుంది. -భట్టు వెంకటరావు -
భాగ్యనగరంపై మనసు పారేసుకున్న రష్యన్ చిన్నది..!
మన హైదరాబాద్ ఎందరికో ఆతిథ్యం ఇవ్వడమే గాక వాహ్ భాగ్యనగరం అని అనిపించుకుంది. ఈ నగరం తన రుచులతో, సంస్కృతితో చాలామంది అభిమానులను సంపాదించుకుంది కూడా. అలాంటి మన భాగ్యనగరంలోని హైటెక్ సొగసులకు ఫిదా అవ్వుతూ..వావ్ అని నోరెళ్లబెట్టింది ఈ విదేశీ మోడల్. అంతేగాదు ఐ లవ్ హైదరాబాద్ అని అంటోంది కూడా.ఢిల్లీకి చెందిన రష్యా మోడల్ క్సేనియా మన హైదరాబాద్లోని ఆకాశ హర్మ్యాలు, మౌలిక సదుపాయాలను చూసి మంత్రముగ్దురాలైంది. హైటెక్ సిటీలోని టెక్ హబ్ని చూసి ఆశ్చర్యపోయింది. అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ..ఇది ముంబై అనుకుంటున్నారు కాదు హైదరాబాద్ అంటూ తాను చూసిన వాటిని అన్నింటిని చూపిస్తోంది వీడియోలో. ఆకాశాన్ని తాకేలా ఉన్న విలాసవంతమైన ఆ బిల్డింగ్లు కళ్లుతిప్పుకోనివ్వడం లేదని చెబుతూ..హైటెక్ నగరంపై ప్రశంసల జల్లు కురిపించింది. అంతేగాదు ఇక్కడ స్కైలైన్లు, ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దిన తీరు తదితరాలన్నింటిని అభినందించింది. అంతేగాదు ఆ వీడియోకి "హబీబీ, ఇది దుబాయ్ కాదు, హైదరాబాద్," అనే క్యాప్షన్ని జోడించి మరి పోస్ట్ చేసింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు కూడా..ఇక్కడ భాషా వివాదం ఉండదని, మంచి వాతవరణానికి నెలవు, అలాగే భారతదేశానికే ఈ నగరం గర్వకారణం. మాకు కూడా అత్యంత ఇష్టం అని కితాబిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by 𝙆𝙨𝙚𝙣𝙞𝙞𝙖✨ (@vegkseniia) (చదవండి: ఆమె మోడల్ కాదు..ఐపీఎస్ అధికారిణి..! సక్సెస్ని ఆస్వాదించేలోపే..) -
ఆమె మోడల్ కాదు..ఐపీఎస్ అధికారిణి..! సక్సెస్ని ఆస్వాదించేలోపే..
సివిల్స్ ఎగ్జామ్ ఎంత కఠినమైన ప్రతిష్టాత్మక ఎగ్జామ్ అనేది తెలిసిందే. ఐపీఎస్ కావాలంటే ఎన్నో క్లిష్టమైన ఎగ్జామ్లు దాటుకుంటూ చేరుకోవాలి. ఏ ప్రాసెస్లో ఫెయిలైనా అంతే సంగతులు. అలాంటి ప్రతిష్టాత్మక ఈ సివిల్స్ పరీక్షలో ఓ అందమైన యువతి మంచి మార్కులతో ఉత్తీర్ణురాలెంది. ఆ ఏడాది ఆమె ఫోటోలు నెట్టింట హల్చల్ కావడంతో ఆమె మోడల్ అని అనుకున్నారంతా..!. బాలీవుడ్ హీరోయిన్లను తలదన్నే అందం ఆమె సొంతం. అంతేగాదు ఆమె అపారమైన ప్రతిభ, ఆకర్షించే సౌందర్యం కలగలసిన బ్యూటిఫుల్ అధికారిణిగా గుర్తింపు తెచ్చుకోవడమే గాదు యువతకు ఆదర్శంగా నిలిచారామె. ఆమె పేరు పూరవ్ చౌదరి. 2024 సివిల్స్ ఎగ్జామ్లో 533 ర్యాంక్తో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్ఆఫీసర్ అయ్యారు. లక్షలాది మంది పోటీపడే ఈ ప్రతిష్టాత్మక ఎగ్జామ్ కొంతమంది సక్సెస్ని అందుకుంటారు. వారిలో ఒకరు ఈ పూరవ్ చౌదరి. అయితే ఆమె చదువులోనే కాదు అందంలోని బాలీవుడ్ నటీమణులకు తీసిపోని విధంగా అత్యంత ఆకర్షణీయంగా ఉంటారామె. ఆమెకు సోషల్ మీడియాలో కూడా చాలామంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రజాసేవే ధ్యేయంగా యూపీఎస్సీ ఎగ్జామ్ని ఎంచుకున్నారు. అదే ఏడాది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించింది ప్రయాగ్ రాజ్కు చెందిన శక్తి దూబే. ఆమె నేపథ్యం..పూరవ్ రాజస్థాన్కి చెందిన మహిళ. ఆమె తండ్రి ఓం ప్రకాశ్ రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (RAS)లో అధికారిగా కోట్పుట్లీలో అదనపు జిల్లా కలెక్టర్ పదవిని నిర్వహిస్తున్నారు. ఆమె చదువులో ఎప్పుడూ తెలివైన విద్యార్థిగా ఉండేది. సెయింట్ జేవియర్స్ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తిచేసి అనంతరం ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని లేడీ శ్రీరామ కాలేజ్ ఫర్ ఉమెన్ కళాశాలలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసింది. ఆ తర్వాత సివిల్స్ ప్రిపరేషన్కి పూర్తి సమయం కేటాయించింది. తొలి ప్రయత్నంలో ఐపీఎస్ కేడర్ రాగా, మరో ప్రయత్నంలో ఐఏఏస్ సాధించిందామె. చిక్కుకున్న వివాదం..యూపీఎస్సీ ఫలితాలు ప్రకటించగానే అధికారిక ఫలితాల్లో పూర్వ పేరు వద్ద ఓబీసీ నమోదు చేసింది. దీనితో వివాదం రాజుకుంది. ఆమె తండ్రి ఆ ఆరోపణలన్నింటిని తిప్పి కొట్టారు. 40 ఏళ్ల లోపు ప్రత్యక్ష ఆర్ఏఎస్ నియామకం విషయంలో OBC NCL ప్రయోజనం వర్తించదు. కానీ తాను 44 ఏళ్ల వయసులో ఆర్ఏఎస్ అధికారిని అయ్యాను కాబట్టి తన కుమార్తె సర్టిఫికేట్ దుర్వినియోగానికి పాల్పడిందనేది అవాస్తవం అని వివరణ ఇచ్చారు.(చదవండి: అందానికే అందం స్నేహ..! ఆమె ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్..!) -
జలపాతం వద్ద రీల్స్ చేస్తూ కొట్టుకుపోయిన యంగ్ యూట్యూబర్
సోషల్ మీడియా పిచ్చి, షేర్, లైక్స్ మోజులో పడి ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఒడిశాకు చెందిన యువ యూట్యూబర్ సాహసం విషాదకరంగా మారింది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని కోరాపుట్ జిల్లాలోని డుడుమా జలపాతం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ విషాద సంఘటన కెమెరాలో సంఘటన రికార్డైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల అవుతోంది. ఈ సంఘటన రీల్స్ కోసం, సోషల్ మీడియా కంటెంట్ కోసం చేస్తున్న ప్రమాదకర సాహసాలు, ప్రమాదాలపై చర్చలకు దారితీసింది.తన యూట్యూబ్ ఛానెల్ కంటెంట్ కోసం జలపాతం అందాలను కెమెరాలో బంధించాలన్న ఉద్దేశంతో చివరికి ప్రాణాలే కోల్పోయిన ఘటన బాధిత కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బాధితుడిని గంజాం జిల్లాలోని బెర్హంపూర్కు చెందిన 22 ఏళ్ల సాగర్ (సాగర్ టుడు)గా గుర్తించారు. సాగర్, అతని స్నేహితుడు అభిజిత్ బెహెరాతో కలిసి, పర్యాటక ప్రదేశాల వీడియోలు చేసేందుకు కోరాపుట్ వెళ్లాడు. అక్కడ మధ్యాహ్నం సాగర్ జలపాతం సమీపంలోని ఒక రాతిపై నిలబడి డ్రోన్ కెమెరాను ఉపయోగించి రీల్స్ తీస్తూ ప్రమాదానికి గురయ్యాడు. అలామ్తాపుట్ ప్రాంతంలో భారీ వర్షం కారణంగా మచ్చకుండ ఆనకట్ట అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు, దీనితో జలపాతం వద్ద నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగింది. ఇక్కడ సాగర్ వీడియో రికార్డ్ చేస్తూ ప్రవాహా ధాటికి ఒక రాతిపై చిక్కుకుపోయాడు. పర్యాటకులు ,స్థానికులు అతన్ని రక్షించడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, నీటి వేగం ముందువారి ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. తమ కళ్ల ముందే స్నేహితుడు కొట్టుకుపోవడంతో అతని ఫ్రెండ్స్ కన్నీటి పర్యంతమైనారు. మచకుండ పోలీసులు,అగ్నిమాపక దళం నుండి రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాలింపు చర్యలు చేపట్టాయి.సాగర్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. భారీ వర్షాల తర్వాత ఆనకట్ట నుండి సుమారు 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడానికి ముందు మచకుండ అధికారులు దిగువన ఉన్న నివాసితులను అప్రమత్తం చేశారుమరోవైపు వర్షాకాలంలో ప్రమాదకరమైన సహజ ప్రదేశాలలో. పర్యాటకులు , కంటెంట్ సృష్టికర్తలు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని , జలపాతాలు మరియు ఆనకట్టల దగ్గర జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరుతున్నారుఇదీ చదవండి: భర్తను కాపాడుకునేందుకు భార్య లివర్ దానం.. కానీ ఇద్దరూ! -
భర్తను కాపాడుకునేందుకు భార్య లివర్ దానం.. కానీ ఇద్దరూ!
శరీరంలో కీలకమైన ఏదైనా అవయవం పాడైపోయి.. ప్రాణాపాయస్థితిలో ఉన్నపుడు అవయవ మార్పిడి ఒక్కటే మార్గం. అలా దానం చేసే అవకాశం ఉన్న ఆవయవాల్లో ముఖ్యమైనవిగా కిడ్నీలు, లివర్. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు తమ అవయవాలను దానం చేయడంమంటే అవతలివ్యక్తికి ప్రాణ దానం చేయడమే. కానీ భర్తను కాపాడుకునేందుకు తన అవయవాన్ని దానం చేసిన సంతోషం.. అంతలోనే విషాదంగా మారింది. మహారాష్ట్ర ఆరోగ్య శాఖ పూణేలోనిఒక ప్రయివేటు ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.భర్తకు తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేసిన ఒక మహిళ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత కొన్ని రోజులకే మరణించింది. దీనితో మహారాష్ట్ర ఆరోగ్య శాఖ పూణేలోని సహ్యాద్రి ఆసుపత్రికి నోటీసు జారీ చేసింది. మార్పిడి ప్రక్రియకు సంబంధించిన అన్ని వివరాలను సమర్పించాలని ఆదేశించినట్లు ఆరోగ్య సేవల డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నాగనాథ్ యెంపల్లె ఆదివారం తెలిపారు. గ్రహీత, దాత వివరాలు, వారి వీడియో రికార్డింగ్లు, చికిత్స విధానం అన్నింటి వివరాలను అందించాలని ఆసుపత్రిని కోరామని చెప్పారు.ఈ కేసులో భర్త, రోగి బాపు కోమ్కర్, అతనికి లివర్ దానం చేసిన భార్య కామిని ఆగస్టు 15న ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. మార్పిడి శస్త్రచికిత్స తర్వాత బాపు కోమ్కర్ ఆరోగ్యం క్షీణించి, ఆగస్టు 17న మరణించాడు. మరోవైపు ఇన్ఫెక్షన్ కారణంగా కామిని ఆగస్టు 21న కన్నుమూసింది. దీనికి ఆస్పత్రి నిర్లక్ష్యమే కారణమని బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ బంధువులిద్దరి మరణాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.అయితే ప్రామాణిక వైద్య ప్రోటోకాల్ల ప్రకారం శస్త్రచికిత్సలు జరిగాయని ఆసుపత్రి పేర్కొంది. దర్యాప్తులో అధికారులతో పూర్తిగా సహకరిస్తున్నామని వివరించింది. అనేక సమస్యలతో బాపు కోమ్కర్ చాలా తీవ్రమైన పరిస్థితిలో తమ వద్దకు వచ్చాడని, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా క్లిష్టమైన ఆపరేషన్అని పేర్కొన్నారు. ఈ విషంలోవారికి పూర్తిగా అన్ని విషయాలు వివరించి కౌన్సెలింగ్ అందించామని ఆసుపత్రి పేర్కొంది. దురదృష్ట వశాత్తు, మార్పిడి తర్వాత గ్రహీతకు కార్డియోజెనిక్ షాక్ వచ్చిందని తెలిపింది. అలాగే కామిని తొలుత బాగా కోలుకున్నప్పటికీ, సెప్టిక్షాక్ కారణంగా చనిపోయిందని వెల్లడించింది. కానీ ఈ కష్టకాలంలో బాధిత కుటుంబంపై తమకు సానుభూతి ఉందని తెలిపింది. నోట్ : ప్రస్తుత సమాజంలో అవయవ దానం ఆవశ్యకత బాగా పెరుగుతోంది. ఎలాంటి భయాలు, ఆందోళనలు లేకుండా పూర్తి అవగాహనతో అవయదానం చేయాల్సిన అవసరం ఉంది. ఇందులోకు కుటుంబ సభ్యులు, ఇతర అర్హులైన వారు ముందుకు రావాలి. దాని కంటే ముందు అనారోగ్య పరిస్థితి మరింత ముదరకుండా జాగ్రత్త పడటం, చక్కటి జీవనశైలి అలవర్చుకోవడం చాలా ముఖ్యం. ఇదీ చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే! -
రామ్ భజనలకు లయబద్ధంగా ఆర్థికవేత్త స్టెప్పులు..!
ప్రధానమత్రి ఆర్థిక మండలి(EAC–PM) సభ్యుడు సంజీవ్ సన్యాల్ అయోధ్య రాముడి భక్తిగీతాలకు ఆయన ఉత్సాహంగా నృత్యం చేశారు. అది కూడా ఓ సాధారణ వ్యక్తిగా నవ్వతూ చిందులేశారు. ఆ నృత్యం అక్కడున్న వారందని ఆకర్షించడమే కాదు..ఒక్క క్షణం తన హోదాను మరిచిపోయి భక్తిపారవశ్యంతో చేస్తున్న ఆ నృత్యం అందరిని అలరించింది. న్యూఢిల్లీలో సంగమ్ టాక్స్ నిర్వహించిన స్వరాజ్య కాన్క్లేవ్ 2025 సందర్భంగా ఆర్థికవేత్త సన్యాల్ భజనల్లో పాల్గొన్నారు. ప్రముఖు వక్తల ఉపన్యాసం సెషన్ల జనసందోహలోనే సీనియర్ ఆర్థికవేత్త తన సాధారణ విధాన కేంద్రీకృత ఇమేజ్ను పక్కకు యువకుడి మాదిరిగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఆ వీడియోని ఒక సోషల్ మీడియా యూజర్ ఎక్స్లో పోస్ట్ చేస్తూ. ప్రధాని ఆర్థిక వ్యవస్థను నడపడానికి సహాయపడే వ్యక్తి పదివ శతాబ్దపు నౌకా నిర్మాణ వేత్తగా స్టెప్పులు వేస్తూ..చరిత్ర పాఠ్యపుస్తకాలను తిరగ రాసేలా రామభజనలకు బ్రేక్ డ్యాన్స్లు వేశాడు అని పేర్కొన్నారు. కాగా, ఆయన భారతదేశ సివిల్ సర్వీసెస్ పరీక్ష విధానంపై స్పష్టమైన అభిప్రాయల చర్చలో కూడా పాల్గొన్నారు. అలాగే చార్టడ్ అకౌంటెంట్ కంటెంట్ క్రియేటర్ కుశాల్ లోధా పాడ్కాస్ట్లో కూడా అతను వ్యవస్థపై పదునైన విమర్శలు ఎక్కుపెట్టాడు. చాలామంది ఈ సివిల్స్ ఎగ్జామ్ సుమారు 99% మంది వైఫల్యమవుతున్నారు. అయినా అన్నేళ్లు ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం వృధా చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు కూడా. అంతేగాక దేశం ఈ పరీక్ష విధానంలోని అసమాన ప్రాముఖ్యతను పునః పరిశీలించాలని భావించారు కూడా. Imagine being the guy who helps the PM run the economy, cosplays as a 10th-century shipbuilder, rewrites history textbooks… and then break dances on Ram bhajans.Yeah, that’s @sanjeevsanyal 🙇🏻 pic.twitter.com/RAQBdvioT4— Prateek (@poignantPrateek) August 22, 2025 (చదవండి: ఆ ప్రేమ లేఖ ఖరీదు ఎంతో తెలిస్తే..విస్తుపోతారు..!) -
దేశాన్ని కోల్పోయినవాడు!
ఆతిశ్ తాసీర్ (Aatish Taseer) ‘భారతదేశపు విదేశీ పౌర సత్వాన్ని’ భారత ప్రభుత్వం 2019 నవంబర్ 7న ఎత్తివేసింది. హోమ్ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ట్వీట్ ద్వారా ఆయనకు ఈ సంగతి మొదట తెలిసింది. అధికారిక లేఖ ఆ తర్వాత జారీ అయింది. తండ్రికి చెందిన పాకిస్తానీ మూలాలను ఆయన కప్పిపెట్టారనే సాకుతో ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. కానీ, సంపూర్ణ సత్యం అదేనా? ‘ఎ రిటర్న్ టు సెల్ఫ్: ఎక్స్కర్షన్ ఇన్ ఎక్సైల్’ పేరుతో ఆయన రాసిన పుస్తకం తాజాగా విడుదలైంది. అందులోని ముందు మాటలో, ‘‘అది వింతైన ఆరోపణ’’ అని ఆయన అభివర్ణించారు. ‘‘నేను ఇంతకుముందు కూడా ‘స్ట్రేంజర్ టు హిస్టరీ’ (2009) పుస్తకం రాశాను. నా జీవితంలో చాలా భాగం నేను నా తండ్రికి దూరంగానే ఉన్నప్పటికీ, అందులో మా నాన్న గురించిన వ్యాసాలు చాలానే చేర్చాను’’ అని కూడా పేర్కొన్నారు. సల్మాన్ తాసీర్ (పాకి స్తాన్ రాజకీయ నాయకుడు) ద్వారా తవ్లీన్ సింగ్(కాలమిస్ట్)కు పుట్టిన కుమారుడు ఆతిశ్ అన్న సంగతి రహస్యం ఏమీ కాదు. ఈ సంగతి ప్రభుత్వానికి తెలియ దనుకోవడానికి ఏమాత్రం వీలు లేదు.ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. ఆతిశ్ తరఫున తవ్లీన్ 1999లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కార్డు కోసం దరఖాస్తు చేసినప్పుడు (ఇదే ఆ తర్వాత 2005లో ‘ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా’గా మారింది), ఆయన తల్లితండ్రులలో ఒకరు పాకిస్తానీ అనే కారణం అడ్డురాలేదు. కానీ 2016లో, అది ప్రతిబంధకంగా మారింది. నిజానికి, ఆతిశ్ తండ్రి సల్మాన్ పాకిస్తానీ, బ్రిటిష్ పౌరుడురెండూ అవుతారు. సల్మాన్ తల్లి బ్రిటిష్ పౌరురాలు. జన్మతః ఆతిశ్ బ్రిటిష్ పౌరుడ నడానికి బహుశా ఇదే కారణమేమో. కానీ, ఆతిశ్ ‘ఓవర్సీస్ సిటిజన్షిప్’ను వేరే కారణంతో ఎత్తి వేశారనడంలో సందేహమే లేదు. మోదీని విమర్శించడమే ప్రస్తుత స్థితికి కారణం. ‘‘మోదీ ప్రభుత్వ దృష్టిలో నేను ‘పాకిస్తానీ’గా మారాను. అన్నింటి కన్నా ముఖ్యంగా ‘ముస్లిం’ అయ్యాను. భారతదేశంలో చాలా వరకు తండ్రి మతమే పిల్లలకు వర్తిస్తుంది. ‘భారతదేశపు ప్రధాన విభజనకర్త’ శీర్షికతో నేను ‘టైమ్ మ్యాగజైన్’కు ముఖచిత్ర కథనం రాయడం, మోదీకి కోపం తెప్పించింది... మా అమ్మ భారతీ యురాలైనా లెక్కలోకి రాలేదు. నేను బయట వ్యక్తిగా, పరాయి మనిషిగా, పాకిస్తానీగా ముద్రపడ్డాను’’ అని ఆయన రాసుకున్నారు. పౌరసత్వాన్ని కోల్పోయిన తర్వాత, ప్రభుత్వం ఆయనకు వీసా ఇచ్చేందుకూ కూడా తిరస్కరించింది. దాంతో అమ్మమ్మ చనిపోయినపుడు ఆమె అంత్యక్రియలకు కూడా తాసీర్ హాజరు కాలేకపోయారు. పౌరసత్వాన్ని కోల్పోవడంలోని బాధేమిటో ఆతిశ్ ముందు మాటలో వివరించారు. ‘‘ఒక దేశం దూరంపెట్టడం కంటే అవ మానం వేరే ఉండదు. ఒక తండ్రి తన బిడ్డను తన బిడ్డ కాదంటే ఎలా ఉంటుందో... ఇంటి నుంచి తరిమేస్తే ఎలా ఉంటుందో అలా! దేశం లేకపోతే గాలికెగిరే విస్తరాకు అయిపోతాం.’’ ఇదీ చదవండి: భర్తను కాపాడుకునేందుకు భార్య లివర్ దానం.. కానీ ఇద్దరూ! సత్యం ఏమంటే, అమెరికాలోని విశ్వవిద్యాలయం నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, ఒక ఉన్నత వర్గ మైనారిటీకి చెందిన వాడిననే స్పృహ ఆతిశ్లో ఉంది. అయినా హిందీ, ఉర్దూ, సంస్కృత భాషలు నేర్చుకునేందుకు పాటుపడ్డారు. మమేకమయ్యేందుకు దేశంలో విస్తృతంగా పర్యటించారు. భారతదేశంలో భాగమ య్యేందుకు, ఇక్కడి వాడినని అనిపించు కునేందుకు హృదయపూర్వకంగా చేసిన ప్రయత్నం అది. ‘‘భారతీయ జీవితంలో మెరుగ్గా ఇమిడిపోయేందుకు... నాలోని కొన్ని దృక్పథాలను దూరం చేసు కున్నాను’’ అని ఆయన రాసుకున్నారు. చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే!అందుకనే, మొహం మీద తలుపులు మూతపడినప్పుడు ఆయన ఇలా రాసుకోవడం ఆశ్చర్యం కలిగించదు: ‘‘నాకెందుకో విచి త్రంగా స్వేచ్ఛ లభించినట్లు అయింది. బంధ విముక్తుడిని అయ్యా ననిపించింది. ఇండియాలో ఇమిడేందుకు ప్రయత్నించాల్సిన కష్టం, నా స్వీయ పాశ్చాత్యీకరణకు మన్నించమన్నట్లు వ్యవహరించ వలసి రావడం నుంచి హఠాత్తుగా బయట పడేసినట్లయింది.’’ నేడు ఆయన భారతదేశం గురించి భూతకాలంలో ప్రస్తా విస్తున్నారు. ‘‘నాది ఒకప్పుడు భారతదేశం.’’ అలా రాయడం భరించలేని వేదన కలిగిస్తోందని ఆయన చెప్పుకొన్నారు. కానీ, దాన్ని ఆయనపై రుద్దారు. ఆతిశ్ 44 ఏళ్ళ వయసు వారే కాబట్టి, నిర్మించు కునేందుకు భవిష్యత్తు ఉంది. కానీ ప్రభుత్వం ఇండియాను ఆయనకు గతాన్ని చేసేసింది. పౌరసత్వాన్ని కోల్పోవడంలోని బాధేమిటో ఆతిశ్ తాసీర్ ముందుమాటలో వివరించారు. ‘‘ఒక దేశం దూరంపెట్టడం కంటే అవమానం మరొకటి ఉండదు. ఒక తండ్రి తన బిడ్డను తన బిడ్డ కాదంటే ఎలా ఉంటుందో అలా!’’దేశాన్ని కోల్పోయినవాడు!-కరణ్ థాపర్ , సీనియర్ జర్నలిస్ట్ -
బీడీ కంపెనీ నుండి.. ద్రావిడ భాషల వారధిగా!
నాలుగు ద్రావిడ భాషల పదాలను సేకరించి ఒక భారీ నిఘంటువును రూపొందించిన కేరళ వాసి జత్యేల శ్రీధరన్ తలస్సేరిలో తన నివాసంలో ఈ నెల 13న కన్ను మూశారు. ప్రభుత్వాలు, విశ్వ విద్యాలయాలు చేపట్టవలసిన నాలుగు భాషల పదాల ఈ తుల నాత్మక అధ్యయనాన్ని ఆయన ఒంటరిగా సాధించారు. ‘చతుర్ ద్రావిడ భాష పద పరిచయం’ పేరిట ఈ నిఘంటువు మలయాళంలో ముద్రింపబడింది.1934లో పేద కుటుంబంలో పుట్టిన శ్రీధరన్ నాల్గవ తరగతిలోనే చదువు వదిలేసి ఓ బీడీ కంపెనీలో పనికి కుదిరారు. బీడీ ప్యాకింగ్పై నాలుగు ద్రావిడ భాషల పదాలు ఉండేవి. ఒక మలయాళం పదాన్ని మిగతా మూడు భాషల్లో ఏమంటారో తెలుసుకోవాలన్న ఆసక్తి అక్కడే పుట్టి పెరిగింది. ఆ పని చేస్తూనే ఎనిమిదవ తరగతి పరీక్ష రాసి ఉత్తీర్ణుడై పీడబ్ల్యూడీ శాఖలో ఉద్యోగంలో చేరారు. తాను సేక రించిన మలయాళం పదాలకు తమిళ పదాలు తొందరగానే లభించేవి కానీ కన్నడ, తెలుగు పదాలు చెప్పేవారు దొరికేవారు కాదు. అందుకోసం తానే శ్రమించి తమిళ, కన్నడ, తెలుగు భాషలు నేర్చుకున్నారు. పుస్తకాల్లో దొరకని పదాల కోసం మూడు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించారు. ఇలా ఆయన అన్ని భాషల్లో కలిపి పన్నెండు లక్షల పదాలను సేకరించారు. 1972లో తొలి ప్రయత్నంగా ‘మలయాళం– తమిళ నిఘంటువు’ను తెచ్చారు. ఉద్యోగానికి వెళుతూ సేకరించిన నాలుగు భాషల పదాల కూర్పు కోసం 1984 నుండి పదేళ్ల పాటు శ్రమించారు. 1994 రిటైర్ అయ్యాక పూర్తి సమయాన్ని దీనికే కేటాయించారు.ఇదీ చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే!ఈ నిఘంటువు నవంబర్ 2020లో పుస్తకంగా వచ్చింది. అప్పటికి ఆయనకు 82 ఏండ్లు. ముదిమి వయసులో లక్షలాది పదాల, వేయి పేజీల సమాచారాన్ని పట్టుకొని ప్రచురణ సంస్థల చుట్టూ తిరిగారు. పత్రికల ద్వారా ఈయన కృషిని తెలుసుకున్న కేరళ సీనియర్ సిటిజన్స్ ఫోరమ్ దీని ముద్రణ బాధ్యతలు తీసుకుంది. ఈ నాలుగు భాషల పదాల నిఘంటువులో ముందుగా మలయాళ పదం దాని అర్థం, తర్వాత సమాన అర్థం గల తమిళ, కన్నడ, తెలుగు పదాలు, వివరణలు నాలుగు కాలమ్స్గా ఒకే వరుసగా ఉంటాయి. జత్యేల శ్రీధరన్ నిఘంటువు విశేషాలతో దర్శకుడు నందన్2021లో ‘డ్రీమింగ్ ఆఫ్ వర్డ్స్’ అనే డాక్యుమెంటరీని రూపొందించారు. భాషలను రక్షించడం అందరి బాధ్యతనే సందేశాన్ని అందించిన శ్రీధరన్ జీవితం సదా స్మరణీయం.– బద్రి నర్సన్, విశ్రాంత బ్యాంకు అధికారి -
స్మార్ట్గా సమయాన్ని, సామర్థ్యాన్ని మింగేస్తోంది..!
నగర అధునాతన సాంకేతిక జీవనశైలిలో వేగం పెరిగిన కొద్దీ యువత ‘స్క్రీన్ టైమ్–సెంట్రిక్’ దినచర్యగా, బానిసత్వంగా మారుతోందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇందులో భాగంగా తాజా సర్వేలు చెబుతున్న ఆందోళనకర విషయం ఏంటంటే.. నగరంతో పాటు రాష్ట్రంలోని 14 నుంచి 16 ఏళ్ల పిల్లల్లో 92 శాతం మందికి స్మార్ట్ఫోన్ వినియోగ పరిచయం ఉండటం. ఇందులో చదువుకోసం వాడుతున్నవారు 61 శాతం కాగా సోషల్ మీడియా బ్రౌజింగ్కి వెళ్తున్నవి 82.5 శాతం కావడం విశేషం. ఇది విద్యార్థుల చదువుపైనే కాకుండా దుష్పభావాలపై ఆందోళనల్ని పెంచుతోందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా టీనేజ్ పిల్లల్లో మొబైల్తో పాటు వివిధ సాంకేతిక మాధ్యమాల స్క్రీన్ టైం విపరీతంగా పెరిగిందని సూచిస్తున్నాయి. నెక్ట్స్ మ్యాచ్ నెక్ట్స్ర్యాంక్..ఎక్కువ సమయం స్క్రీన్కు అతుక్కుపోవడం ఒక్క చదువుకు మాత్రమే కాదు నిద్రపట్టలేని లక్షణాన్ని కూడా గందరగోళపరుస్తోంది. దేశవ్యాప్తంగా విద్యార్థుల మానసిక ఆనందంపై ‘స్టూడెంట్ వెల్బీయింగ్ పల్స్’ నివేదిక చెబుతున్న తాజా వివరాల ప్రకారం.. రాత్రివేళల సోషల్ మీడియా వాడకం నిద్రను తగ్గించి, జీవన సంతృప్తిని–ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. 12వ తరగతి విద్యార్థుల్లో దాదాపు 75 శాతం మందికి స్కూల్ డేస్లో 7 గంటల కన్నా తక్కువ నిద్రే వస్తోందట. ఇది ఆందోళనను పెంచుతూ మానసిక ఆరోగ్య సంక్షోభానికి దారి తీస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్క్రీన్టైమ్లో ల్యాప్టైమ్, మొబైల్, ట్యాబ్స్ తదితర మాధ్యమాల్లో ‘పది నిమిషాలే’ అని మొదలయ్యే రీల్స్–బింజ్, నిద్రపోయే బెడ్ టైంకు ముందు ఆ స్క్రీన్లకు కళ్లు పెనవేసుకుని ఉండటం వల్ల నిద్రను చెడగొట్టి, మరుసటి రోజు ఫోకస్, శక్తిని నిర్వీర్యం చేస్తున్నాయని కొత్త అధ్యయనం హెచ్చరిస్తోంది. 30 నిమిషాలకంటే ఎక్కువ స్క్రీన్ చూశాక నిద్ర నాణ్యత తక్కువగా ఉందని ఈ డేటా చెబుతోంది. అలాగే 41 వేల మందిపై నిర్వహించిన ఒక సర్వేలో ‘సోషల్ స్క్రోల్’ వల్ల నిద్ర ఆలస్యమవుతుందనే విషయం కూడా బయటపడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా యువతలో హెల్తీ ఆన్లైన్ అలవాట్ల అవసరాన్ని స్పష్టంగా తెలిపే నివేదికను విడుదల చేసింది. పరిష్కారం ఏంటి?ఈ స్క్రీన్ టైం బానిసత్వానికి గేమింగ్ మరో పెద్ద టైమ్సింక్. మల్టీప్లేయర్/ఈ–స్పోర్ట్స్ మోడ్లో ‘నెక్ట్స్ మ్యాచ్ నెక్ట్స్ ర్యాంక్’ లూప్ యువతను ముంచేస్తుంది. భారతీయ పరిశోధనల ప్రకారం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో గేమింగ్ అలవాట్లు.. ఫంక్షనాలిటీ, సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని సూచిస్తున్నాయి. అదే సమయంలో కాలేజీ విద్యార్థులపై చేసిన అధ్యయనాల్లో ‘నలుగురిలో ఒక్కడికి’ స్మార్ట్ఫోన్ అడిక్షన్ లక్షణాలు కనిపించాయని నివేదికలు వెల్లడించాయి. స్క్రీన్పై గడిపే సమయం పెరిగేకొద్దీ మార్కులపై వస్తున్న ఫలితాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. తక్కువ కాలంలోనే మువతలో వచ్చిన ఈ మార్పులతో పాటు డోపమైన్ హిట్స్ కోసం వేపింగ్/సబ్స్టెన్స్ ట్రయల్స్ వైపు అడుగులు కూడా ఆందోళనకరంగా మారాయి. తెలంగాణ యాంటీ–నార్కోటిక్స్ బ్యూరో ప్రణాళికలే ఈ విషయాలను చెబుతున్నాయి. హైదరాబాదు పరిసరాల్లో కుర్రాళ్లలో వీటి సరఫరా సులభంగా లభించడం వంటి కారణాలు అటు వైపు నెడుతున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పరిష్కార మార్గాలపై నిపుణులు, సామాజికవేత్తలు దృష్టి సారించారు. పాఠశాలలు–కాలేజీలు ‘డిజిటల్ హైజీన్, కెరీర్ గైడెన్స్, లైఫ్ స్కిల్స్’ను కాంబోగా ఇవ్వాలి సూచిస్తున్నారు. విద్యార్థులకు భవిష్యత్ సలహాలకంటే ఇలాంటి అంశాలపై అవగాహన కలి్పంచడం ప్రాథమిక బాధ్యత అని విన్నవిస్తున్నారు. ఇంట్లో కూడా ‘స్క్రీన్ కర్ఫ్యూ’ (బెడ్టైమ్కు 60–90 నిమిషాల ముందు స్క్రీన్ ఆఫ్), నప్లిమిట్ (మధ్యాహ్నం 20–30 నిమిషాలకే), ‘నో ఫోన్ ఇన్ డైనింగ్ టేబుల్’, ‘రీల్స్కు రూల్ ఆఫ్ 15’ (రోజు 15 నిమిషాలకే) వంటి మైక్రో రూల్స్ అమలు చేస్తే ఫోకస్, నిద్ర, మూడ్ మెరుగుపడతాయని, నిద్ర–మానసిక అంశాలకు చెందిన ఆరోగ్య డేటా సూచిస్తోంది. నగర జీవనశైలిలో యువతను నిరీ్వర్యం చేస్తున్న ‘మూడు ఎస్’లు.. స్క్రీన్, స్క్రోల్, సబ్స్టాన్స్. చదువు/కెరీర్ లక్ష్యాలకు ‘డీప్ వర్క్ విండోలు’, ఆఫ్లైన్ హాబీలు, క్రీడలు, కమ్యూనిటీ వాలంటీరింగ్ వంటి ‘డోపమైన్ ఆల్టర్నేటివ్లు’ అవసరం. లేదంటే రాత్రి స్క్రోలు ఉదయాన్ని అలసటగా మార్చడమే కాకుండా ‘డెడ్లైన్ డిజాస్టర్’గా తిరిగి వస్తూనే ఉంటుంది. (చదవండి: బొజ్జలు కాదు.. కండలు పెంచగలం..!) -
మిడిసిపాటు అంటే ఇదే!
ఒక ఊర్లో ఓ బలవంతుడైన యువకుడు ఉండేవాడు. తన శరీరాన్ని చూసి జనం భయపడుతుండటంతో అతడిలో గర్వం మొదలయ్యింది. దాంతో చిన్నాపెద్దా, ఆడామగా తేడా చూడకుండా ఊర్లోవాళ్ళని ఏడిపించడం ప్రాంరంభించాడు. తనకు అందరూ భయపడాల్సిందేనని, తను చేయలేని పని ఏదీ లేదని ఇష్టానుసారం వ్యవహరించేవాడు. ఒకరోజు వ్యవసాయం పని మీద పక్క ఊరికి వెళ్ళాడు. అతడు వస్తున్నది చూసి అందరూ వెళ్ళి ఇండ్లల్లో దాక్కొన్నారు.అదే ఊరి దగ్గర బిడ్డను గట్టుపైన పడుకోబెట్టి వర ఇపొలంలోని కలుపు మొక్కలను ఏరి పారేస్తోంది ఓ మహిళ. ఆ బలవంతుడి రాకను ఆమె గమనించలేదు. తన పనిలో తాను లీనమై ఉంది. లేత ఎండ గట్టు మీద ఉన్న బిడ్డపై పడటంతో ఆ బిడ్డ ఏడుపు లంకించుకున్నాడు. బిడ్డ ఏడుపు పట్టించుకోకుండా ఆ బలవంతుడు ‘‘నేనంటే నీకు భయం లేదా?’’ అని అడిగాడు ఆమెను. ఆ అహంభావి గురించి విని ఉన్న ఆమె అతడి పొగరు తగ్గించడానికి అదే అదనుగా భావించింది.‘‘నేను భయపడటం పక్కన పెట్టు. మొదట నా బిడ్డ ఏడుపు ఆపించు చాలు’’ అంది. ‘అదెంత పని’ అని అతడు ఆ బిడ్డ ముందర కెళ్ళి నిలబడ్డాడు. బిడ్డను భయపెడుతూ రకరకాల విన్యాసాలు చేశాడు. అయితే ఆ బిడ్డ ఏమాత్రం ఏడుపు ఆపలేదు.ఆశ్చర్యపోతూ అతడు ‘‘ఈ బిడ్డ నన్ను చూసి ఎందుకు భయపడటం లేదు? ఏడుపు ఎందుకు ఆపడం లేదు’’ అని అడిగాడు.ఆమె కొంచెం ధైర్యం తెచ్చుకుని ‘‘నువ్వు ఎవరో, నీ ప్రతాపం ఏమిటో ఈ బిడ్డకు తెలియదు. అందుకే ఈ బిడ్డ నీ బెదిరింపులను పట్టించుకోలేదు. మన గురించి ప్రపంచానికంతా తెలుసనుకుంటే ఎలా? నాలుగు ఊర్లు దాటి పెద్ద నగరాలకు వెళ్తే నువ్వెవరో జనానికి తెలియదు. కొందరు గుర్తించినా, అక్కడ నిన్ను ఢీ కొట్టేవాళ్ళు చాలామంది ఎదురవుతారు. మనం మంచి పనులు చేసి, మంచి పేరు తెచ్చుకుంటే ఇక్కడే కాదు, ఎక్కడైనా చెల్లుబాటవుతాము. చదవండి: Nhatyela Sreedharan బీడీ కార్మికుడిగా పుట్టి.. ద్రావిడ భాషల వారధిగా!ఇప్పటికైనా నీ కండలు చూసుకుని మురిసిపోవద్దు. వయసు ఎల్లకాలం ఉండదని గుర్తుపెట్టుకో.’’ అని హితవు పలికింది. ‘ఈ విశాల విశ్వంలో మనం సముద్రంలోని ఇసుక రేణువంత. మనకు ఎన్ని ఉన్నా... మిడిసిపాటు వద్దు, మంచితనం ముద్దు’ అని గుర్తించి ముందుకు నడిచాడు ఆ బలవంతుడు. ఆమె తన బిడ్డను ఎత్తుకుని ముద్దులాడటంతో ఆ బిడ్డ ఏడుపు ఆపింది.ఇదీ చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే!– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
బొజ్జలు కాదు.. కండలు పెంచగలం..!
‘మనం బొజ్జలనే కాదు.. అందమైన ఆకృతితో కూడిన కండలను పెంచగలం.. అయితే దీనికి సరైన సమయంలో సరైన మార్గనిర్దేశం అవసరం. అప్పుడే సాధన ఫలితాలనిస్తుంది.. కండలు పెంచేందుకు జెనిటిక్స్తో ఎలాంటి సంబంధం లేదు. బాడీ బిల్డింగ్పై ఉన్న అపోహలు, తెరలు తొలగిపోవాలి. అప్పుడే అంతర్జాతీయ స్థాయిలో మనం సత్తా చూపించగలం’ అని సినీనటుడు అల్లు శిరీష్ అన అభిప్రాయాన్ని వెల్లడించారు. శంషాబాద్ క్లాసిక్ కన్వెన్షన్లో ‘డెక్కన్ అప్రైజింగ్–2025 పేరిట ఐసీఎన్ (ఐ కాంపీట్ నేచురల్) సంస్థ నిర్వహించిన సహజసిద్ధ శరీర దృఢత్వ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను, నిర్వాహకులను ఆయన అభినందించారు. అనంతరం ఫిట్నెస్పై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. గుర్తింపు అవసరం.. ప్రపంచస్థాయిలో బాడీ బిల్డింగ్కి మంచి గుర్తింపు ఉంది. ఇందులో రాణించిన అథ్లెట్లు కోట్ల రూపాయలు సంపాదిస్తారు. మన దేశంలో మాత్రం బాడీ బిల్డర్లు కోచ్లుగా మాత్రమే మిగిలిపోతున్నారు. క్రికెట్, టేబుల్ టెన్నిస్ తదితర క్రీడలకు మన దేశంలో ఇచ్చిన ప్రాధాన్యత బాడీబిల్డింగ్కు కూడా దక్కేలా చర్యలు తీసుకోవాలి. అనేక అపోహలు.. శరీర దారుఢ్యానికి మందులు, స్టిరాయిడ్లు వాడతారనే అపోహల కారణంగా చాలా మంది దీనికి దూరంగా ఉంటున్నారు. అవేవీ అవసరం లేకుండా కూడా సరైన సమయంలో సరైన కోచ్ ద్వారా శిక్షణ తీసుకుని సాధన చేస్తే అంతర్జాతీయ అథ్లెట్లను తయారు చేసుకోవచ్చు.. ఐసీఎన్ లాంటి సంస్థలు ఆ దిశగానే కృషి చేస్తున్నాయి.. అందుకే ఎంతో ఇష్టంతో గత రెండేళ్లుగా ఇక్కడికి వచ్చి అథ్లెట్లను ప్రొత్సహిస్తున్నాను. రెండు రాష్ట్రాలకు చెందిన నాలుగు వందల మంది యువత ఈ పోటీల్లో పాల్గొన్న తీరు చూస్తుంటే మన వద్ద కూడా ఫిట్నెస్పై అవగాహన పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. నాకు తగ్గ కథ వస్తే..కండలు పెంచేందుకు జన్యుపరమైన సంబంధాలేవీ లేవు. ఫిట్నెస్కు రాంగ్రూట్, షార్ట్కట్స్ ఎంత మాత్రం సరైంది కాదు. శరీర తత్వం బట్టి బొజ్జలు వస్తాయనే ప్రచారం సరికాదు. సహజంగానే ఫిట్నెస్ అంటే నాకు ఎంతో ఇష్టం. నా ఎత్తు, బరువు, ఆకృతికి అనువైన మంచి స్పోర్ట్స్ కథ వస్తే అలాంటి సినీమా చేయడానికి ఉత్సాహంగా ఉన్నాను. ఇప్పటి వరకూ వచ్చిన క్రికెట్, రన్నింగ్, ఫుట్బాల్ వంటి కథలు కాకుండా కొత్తగా ఉంటే బాగుంటుంది. (చదవండి: ఉత్తర భారత్ హెరిటేజ్ టూర్..!) -
ఉత్తర భారత్ హెరిటేజ్ టూర్..!
భారతదేశం గర్వించే అమృత్సర్ గోల్డెన్ టెంపుల్... దేశం కోసం ప్రాణాలర్పించిన జలియన్వాలా బాగ్.సైనిక వందనంతో గౌరవించే వాఘా– అట్టారి సరిహద్దు... పంజాబ్ ప్రాణత్యాగాల నిలయం జంగ్ ఈ ఆజాదీ.వ్యర్థాలను అర్థవంతం చేసిన చండీగఢ్ రాక్ గార్డెన్... భగవద్గీత బోధనక్షేత్రం హరియాణా కురుక్షేత్రం.బహాయీ ధ్యానమందిరం ఢిల్లీ లోటస్ టెంపుల్... భారతీయ లోహ ప్రావీణ్యత చిహ్నం ఐరన్ పిల్లర్.కృష్ణుడు పుట్టిన మధుర... ఆడిపాడిన బృందావనం... భారతీయుల ప్రేమ పొందిన ప్రపంచవింత తాజ్మహల్. ఉత్తర భారత వారసత్వాన్ని వారంలో ఒడిసి పట్టుకోవచ్చు.1వ రోజు :హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం తర్వాత 3.50 గంటలకు 6ఈ 167 విమానం బయలుదేరి సాయంత్రం ఆరున్నరకు అమృత్సర్కు చేరుతుంది. ఎయిర్పోర్ట్లో నిర్వహకులు పికప్ చేసుకుంటారు. హోటల్లో చెక్ ఇన్ అవడం, విశ్రాంతి, రాత్రి బస.2వ రోజు :బ్రేక్ఫాస్ట్ తర్వాత అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్, జలియన్వాలా బాగ్ సందర్శనం. మధ్యాహ్నం తర్వాత వాఘా బోర్డర్ విజిట్, రాత్రి బస అమృత్సర్లోనే.బంగారు మందిరంగోల్డెన్ టెంపుల్ అనగానే గుర్తొచ్చే ప్రదేశం అమృత్ సర్. ఇటీవల తమిళనాడులో మరో గోల్డెన్ టెంపుల్ నిర్మాణం జరిగింది. కానీ ఇది 443 ఏళ్ల నాటి నిర్మాణం. దేశమెరిగిన బంగారపు మందిరం. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిన ఆలయం కూడా. సిక్కుల ప్రార్థనామందిరం రాజకీయ సంక్లిష్టతలకు నెలవైంది. ఉగ్రవాద కార్యకలాపాలను నిలువరించే ప్రయత్నంలో భాగంగా ప్రధాని ఇందిరాగాంధీ 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్కు ఆదేశాలిచ్చారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఆమె హత్యకు దారి తీశాయి. ఈ గురుద్వారాని రోజుకు లక్షా యాభై వేల మంది సందర్శిస్తారని అంచనా. గురుద్వారా కమిటీ నిర్వహించే లంగార్ (భోజనశాల)లో భోజనం చేయాలి. ఇక్కడో విషయం లంగార్లో అందరూ సమానమే. సహపంక్తి భోజనం చేయాలి. ఎంతమంచి వచ్చినా, కాదనకుండా వడ్డిస్తారు. ఎంత తిన్నా పెడతారు కానీ వడ్డించుకున్న పదార్థాన్ని వృథా చేస్తే ఒప్పుకోరు. పూర్తిగా తినేవరకు ఒకరు వచ్చి ఎదురుగా నిలుచుంటారు. భోజనాన్ని గౌరవించాలనేది వారి నియమం. భోజనంతోపాటు వారి నియమాన్ని కూడా గౌరవించడం పర్యాటకుల ధర్మం. బంగారు గోపురం ఉన్న ప్రధాన ఆలయం సరోవరం మధ్యలో ఉంటుంది. ఆలయం ప్రధాన ద్వారం నుంచి లోపలికి వంతెన మీద రావాలి. ఈ గురుద్వారా పేరు హర్మందిర్ సాహిబ్. ఈ మందిర నిర్మాణాల సమూహం వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు కోసం యునెస్కో పరిశీలనలో ఉంది. ఈ మందిరంలో జాతిరత్నాలు పొదిగిన పై కప్పును కూడా పరిశీలనగా చూడాలి.బుల్లెట్ గాయాల గోడబ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ కాల్పులు జరిపినప్పుడు బుల్లెట్లు తగిలి చిల్లులు పడిన గోడ ఉంటుంది. ఆ గోడకు 36 బుల్లెట్ గాయాలు ఇప్పటికీ కనిపిస్తాయి. 1919, ఏప్రిల్ నెల 13వ తేదీ, బైశాఖీ పండుగరోజు జరిగిందా దుర్ఘటన. డయ్యర్ భారతీయుల మీద కాల్పులు జరపడానికి ముందు బయటకు వెళ్లడానికి అనుమతించిన చిన్న ద్వారాన్ని కూడా చూడవచ్చు. ఆ కాల్పుల్లో మరణించిన వారి స్మారక నిర్మాణం, అమర జ్యోతి చుట్టూ దేశం కోసం ప్రాణాలొడ్డిన వారి ముఖాల అమరిక అద్భుతంగా ఉంటుంది. వారిని చూస్తుంటే గుండె బరువెక్కుతుంది. ఆ ఘటనలో మరణించిన వారిలో 120 మంది మృత దేహాలు ఒక బావిలో లభించాయి. ఏడు ఎకరాల ప్రదేశంలో అడుగడుగునా స్వాతంత్య్ర పోరాటంలో చోటు చేసుకున్న మౌనరోదనకు ఆనవాలుగా కనిపిస్తుంది.వాఘా– అట్టారి సరిహద్దు ద్వారంభారత్– పాకిస్థాన్ల మధ్య సరిహద్దు ఇది. అమృత్ సర్నుంచి 30 కిలోమీటర్ల దూరాన ఉంది. వాఘా బోర్డర్ అని వాడుకలో అంటుంటాం. కానీ దీని పేరు వాఘా– అట్టారి బోర్డర్. వాఘా అనే గ్రామం భారత్– పాక్ సరిహద్దు రేఖ రెడ్క్లిఫ్ లైన్కు ఆవల ఆరు వందల మీటర్ల దూరాన ఉంది. భారత సరిహద్దు గ్రామం అట్టారికి మూడు కిలోమీటర్ల దూరం. రోజూ సాయంత్రం ఇక్కడ వాఘా– అట్టారి బోర్డర్ సెరిమనీ జరుగుతుంది. 1959 నుంచి రోజూ జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వేలల్లో సందర్శకులు వస్తారు. ఇక్కడి నుంచి అర కిలోమీటరు దూరాన వాఘా రైల్వేస్టేషన్ ఉంది. భారత్– పాక్ మధ్య నడిచే రైలును చూడాలంటే వెళ్లవచ్చు.3వ రోజు :బ్రేక్ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్ చేసి జలంధర్కు ప్రయాణం. జంగ్ ఈ ఆజాదీ మెమోరియల్ సందర్శనం. మధ్యాహ్నం తర్వాత చండీగఢ్కు ప్రయాణం. రాక్ గార్డెన్ విజిట్ తర్వాత హోటల్ గదిలో చెక్ ఇన్, రాత్రి బస.సమర జ్ఞాపకంజంగ్ ఈ ఆజాదీ అనే ప్రదేశాన్ని చరిత్ర పాఠంలో చదివి మర్చిపోయి ఉంటాం. ఇది స్వాతంత్య్ర సమరంలో కీలకపాత్ర పోషించిన ప్రదేశం. ఈ స్మారక భవనం పంజాబ్ రాష్ట్రం, జలంధర్ నగరానికి సమీపంలో కర్తార్పూర్ పట్టణంలో ఉంది. భారత స్వాతంత్య్ర సమరంలో పంజాబ్ వాసులు నిర్వహించిన పాత్ర, వారి ప్రాణత్యాగాలకు గౌరవ చిహ్నంగా పదేళ్ల కిందట నిర్మించారు. చరిత్రకారులు, పాత్రికేయులు, మేధావులు సమగ్రంగా అధ్యయనం చేసి దీనికి రూపకల్పన చేశారు.రాకింగ్ రాక్స్వేస్ట్ మేనేజ్మెంట్ అవసరాన్ని తెలియచేసే ప్రదేశం ఇది. నలభై ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ గార్డెన్లో పరిశ్రమల వ్యర్థాలు, ఇంట్లో వాడి పారేసిన వస్తువులతో ఆకర్షణీయమైన కళారూపాలను తయారు చేశారు. ఇక్కడున్న వాటర్ ఫాల్స్ కూడా మానవ నిర్మితమే. సృజనాత్మకత, ఆచరణాత్మకత ఉంటే ఏ వస్తువూ వ్యర్థం కాదు, వృథాగా పారేయడం ఉండదు. అందమైన కళాఖండం అవుతుందనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది. ఈ గార్డెన్ అంతా తిరిగి చూసి ఇంటికి వచ్చిన తరవాత ఇంట్లో వాడకుండా అటకమీద పెట్టిన వస్తవులకు ఒక రూపమిచ్చే ఆలోచనలు మెదడులో పూస్తాయి.4వ రోజు :బ్రేక్ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్ చేసి కురుక్షేత్రకు ప్రయాణం. శ్రీ కృష్ణ మ్యూజియం సందర్శనం. మధ్యాహ్నం తర్వాత ఢిల్లీకి ప్రయాణం. హోటల్లో చెక్ ఇన్ కావడం, రాత్రి బస ఢిల్లీలో.గీత బడి కురుక్షేత్రంశ్రీకృష్ణుడు భగవద్గీత బోధించిన నేల ఇది. కురుక్షేత్ర అనగానే కురు– పాండవుల యుద్ధక్షేత్రంగానే గుర్తొస్తుంది. కురుక్షేత్రలో యుద్ధం జరిగిన ప్రదేశాన్ని స్థానికులు ధర్మక్షేత్రగా చెప్పుకుంటారు. అర్జునుడికి శ్రీకృష్ణుడు గీత బోధించిన ప్రదేశంలో ప్రస్తుతం మ్యూజియం ఉంది. కురుక్షేత్ర పట్టణం హరియాణ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ పర్యాటకులు చూడాల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. బ్రహ్మ సరోవర్, జ్యోతిసర్, కురుక్షేత్ర పనోరమ అండ్ సైన్స్ సెంటర్, శ్రీకృష్ణ మ్యూజియం, స్థానేశ్వర్ మహాదేవ్ ఆలయం, భీష్మకుండ్, కర్ణ లేక్, కల్పనా చావ్లా ప్లానిటేరియమ్, సూఫీ సన్యాసి షేక్ చిల్లీ టూంబ్ ముఖ్యమైనవి. ఇతడు మొఘల్ పాలకుడు ఔరంగజేబు సోదరుడు దారాషుకో గురువు. తన ఆధ్మాత్యిక గురువు గౌరవార్థం దారాషుకో దీనిని నిర్మించాడు. ఆగ్రాలోని తాజ్మహల్ను ΄ోలిన నిర్మాణం కావడంతో దీనిని హరియాణా తాజ్మహల్ అంటారు. 5వ రోజు :బ్రేక్ఫాస్ట్ తర్వాత లోటస్ టెంపుల్, కుతుబ్మినార్ విజిట్. సాయంత్రం అక్షరధామ్ దర్శనం. రాత్రి బస ఢిల్లీలోనే.లోటస్ టెంపుల్నిశ్శబ్దంమైన ఆలయం ఇది. టెంపుల్ అంటే ఇక్కడ ఏ దేవతా విగ్రహమూ ఉండదు. ధ్యానం చేసుకోవడమే ప్రధానంగా రూపొందిన బహాయీ ప్రార్థన మందిరం. సర్వమానవ సమానత్వం, మానవత్వమే మతం అనే గొప్ప ఆధ్యాత్మిక భావనతో ఏర్పడిన మతం ఇది. బహాఉలాహ్ అనే తత్వవేత్త ఇరాన్లో 19వ శతాబ్దంలో రూపొందించిన భావజాలం ఇది. అందుకే దీనికి బహాయి మతంగా పేరు వచ్చింది. అరవిరిసిన కలువపువ్వును తలపిస్తుంది. కాబట్టి లోటస్ టెంపుల్గా వ్యవహారంలోకి వచ్చింది. ఇది ఒక నిర్మాణ అద్భుతం. 2500 సీటింగ్ కె΄ాసిటీ ఉన్న విశాలమైన నిర్మాణం. ఎక్కడా పిల్లర్ ఉండదు. మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది. మతాలు, కులాలు, స్థాయీ బేధాలు లేకుండా అందరూ ఒకే వరుసలో వెళ్లాలి. ధ్యానం చేసుకుని బయటకు రావాలి. పర్యాటకులకు ధ్యానం చేసుకోగలిగినంత సమయం ఉండదు. కాబట్టి పది నిమిషాల సేపు కళ్లు మూసుకుని ఆ ఫీలింగ్ని ఎక్స్పీరియెన్స్ చేసి రావడమే జురుగుతుంది.ఢిల్లీ పేరిలా వచ్చింది!కుతుబ్ మినార్ను వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది యునెస్కో. ఢిల్లీ శివారులోని మెహ్రౌలీలో ఉంది. లాల్ కోట శిథిలాల మీద నిర్మించిన కట్టడం అని చెబుతారు. ఢిల్లీకి ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పే ఆధారాలు స్పష్టంగా లేవు. కానీ కుతుబ్ మినార్ ఉన్న ప్రదేశంలో లాల్ కోట ఉండేదని, అది ఢిల్లిక రాజ్య రాజధాని అని చెబుతారు. అదే దిల్లీగా వాడుకలోకి వచ్చింది. బ్రిటిష్ ఉచ్చారణలో డిల్లీగా మారింది. కుతుబ్మినార్ ప్రాంగణం అంతా తిరిగి చూస్తే ఒక భారీ కోట ఉండేదని నమ్మక తప్పదు. భారీ ప్రాకారాలు, గోడలు, వాటి నిర్మాణశైలి ప్రాచీనతకు అద్దం పడతాయి. కుతుబ్మినార్ కాంప్లెక్స్ ప్రాంగణంలో ఉన్న ఐరన్ పిల్లర్ చారిత్రక ప్రాధాన్యం కలిగినది మాత్రమే కాదు. మనదేశంలో ప్రాచీనకాలంలోనే లోహశాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందిందో తెలియచేసే ప్రత్యక్ష ఉదాహరణ. శతాబ్దాలపాటు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉన్నప్పటికీ ఆ ఐరన్ పిల్లర్కి తుప్పు పట్టలేదు. పేరుకు ఐరన్ పిల్లరే కానీ అనేక లోహాల మిశ్రమం. ఏ లోహాన్ని ఎంత మోతాదులో మిశ్రమం చేశారనేది పరిశోధకులకు, శాస్త్రవేత్తలకు కూడా అంతు పట్టడం లేదింకా. గుప్తుల కాలం నాటిది ఈ ఐరన్ పిల్లర్.అక్షరధామ్ఇది స్వామి నారాయణ్ ఆలయం. నిర్మాణ అద్భుతాల్లో ఇది కూడా ఒకటి. మొత్తం తిరిగి చూడాలంటే కనీసం మూడు గంటలు పడుతుంది. అభిషేక మండపంలో నీటి చెంబులు వరుసగా ఉంటాయి. టికెట్ తీసుకున్న వాళ్లు వరుసలో వెళ్లి విగ్రహానికి అభిషేకం చేయవచ్చు. ఇది ఢిల్లీలో యమునా నది తీరాన ΄ాండవ నగర్లో ఉంది. శిల్పసౌందర్యం చాలా గొప్పగా ఉంటుంది. ఇక్కడ ఇతర ధార్మిక క్రతువులేవీ ఉండవు. దర్శనం, ధ్యానం, ఉల్లాసంగా గడపడమే ప్రధానం. పిల్లలు ఊయలలూగుతూ ఆడుకోవడానికి ఆటస్థలం కూడా ఉంది. విస్తారమైన గార్డెన్లున్నాయి. భారత్ ఉ΄ావన్లో స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలున్నాయి. అక్షరధామ్లోపలకు స్మార్ట్ఫోన్లు, కెమెరాలను అనుమతించరు. అయితే బ్యాక్డ్రాప్లో ఆలయ గోపురం కనిపించేటట్లు ఫొటో పాయింట్ ఉంది. అక్కడ కెమెరామన్ ఉంటాడు. ఈ టూర్ జ్ఞాపకంగా ఒక ఫొటో తీయించుకోవడం మరిచిపోవద్దు. 6వ రోజు :బ్రేక్ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్ చేసి మధురకు ప్రయాణం. శ్రీ కృష్ణ జన్మభూమి సందర్శనం తర్వాత బృందావన వీక్షణం. సాయంత్రం ఆగ్రాకు ప్రయాణం. హోటల్ గదిలో చెక్ ఇన్, రాత్రి బస ఆగ్రాలో.మధుర మసీదుమధుర ప్రయాణం ఆసక్తిగా సాగుతుంది. కానీ మధురకు చేరిన తర్వాత కృష్ణుడు పుట్టిన ప్రదేశాన్ని ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదని, భక్తుల విశ్వాసాలకు తగినంత ప్రాధాన్యం పాలకులు ఇవ్వలేదనిపిస్తుంది. ఆలయం లోపల ఒక మందిరంలో రాధాకృష్ణుల పాలరాతి విగ్రహాలు ముచ్చటగా ఉంటాయి. దేవకీవసుదేవులను కంసుడు బంధించి ఉంచినట్లు చెప్పే చెరసాల కూడా ఇక్కడే ఉంది. భూగర్భంలో నిర్మించిన రాతి గోడల కట్టడంలోకి ఇరుకు మెట్లు దిగి లోపలికి వెళ్లాలి. కృష్ణుడు పుట్టిన ప్రదేశాన్ని కూడా చూడవచ్చు. క్రీస్తు పూర్వం నాటి నిర్మాణాలన్నీ ధ్వంసం అవుతూ, తవ్వకాల్లో బయటపడిన వస్తువులను నిక్షిప్తం చేసుకుంటూ పునర్నిర్మాణమవుతూ వచ్చింది. మొఘలు పాలకుడు ఔరంగజేబు శ్రీకృష్ణుడి జన్మస్థాన భవనాన్ని ఆనుకుని నిర్మించిన పెద్ద మసీదును కూడా చూడవచ్చు.యమునాతటిలో నల్లనయ్యబృందావనమది అందరిదీ! గోవిందుడు అందరివాడే... అని ఆడుకోవడానికి ఆడుకోవడానికి అందమైన ప్రదేశం బృందావనం. గోవిందుడు సంచరించిన నేల మీద పర్యటన అనే భావనలోనే ఓ గొప్ప గిలిగింత ఉంటుంది. యమునానది తీరాన విస్తరించిన ఈ నేల మీద ఐదు వేల ఏళ్ల కిందట శ్రీకృష్ణుడు, బలరాముడు అనే పుణ్య పురుషుల బాల్యం గడిచిందని భక్తుల విశ్వాసం. ఇస్కాన్ నిర్మించిన భారీ ఆలయాలలో పౌరాణిక కథనాల్లో చోటుచేసుకున్న నాటి జ్ఞాపకాలకు నేటి రూపాలను మనం చూడగలుగుతున్నాం. మధుర నుంచి బృందావనానికి 15 కిమీల దూరం. మరో పది కిలోమీటర్ల దూరాన గోకులం ఉంది. విశ్రాంత జీవితంలో ప్రశాంతత కోసం ఇక్కడ కొంత కాలం నివసించవచ్చు. స్థానికులు మాట్లాడేది హిందీయే అయినా ఆ డైలక్ట్ దక్షిణాది వాళ్లు పుస్తకాల్లో నేర్చుకున్న హిందీకి ఏ మాత్రం సరి΄ోలదు. మెల్లగా అలవాటు చేసుకోవాలి.7వ రోజు :బ్రేక్ఫాస్ట్ తర్వాత హోటల్ చెక్ అవుట్. తాజ్ వీక్షణం తర్వాత ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తారు. 16 తేదీ సాయంత్రం 4.40 గంటలకు 6ఈ 6478 విమానం ఆగ్రాలో బయలుదేరి 6. 45 గంటలకు హైదరాబాద్కు చేరడంతో టూర్ పూర్తవుతుంది.భారతీయుల ప్రేమకు చిహ్నంతాజ్మహల్ ను ఎన్నిసార్లు చూసినా మరోసారి చూడవచ్చనిపించే అద్భుతం. ఎంత చెప్పుకున్నా ఇంకా చెప్పుకోవడానికి కొన్ని వివరాలు మిగిలే ఉంటాయి. ఓ పాతికేళ్ల కిందట... ‘తాజ్మహల్ గొప్ప నిర్మాణమే కానీ ఫొటోలో కనిపించినంత అందంగా డైరెక్ట్గా చూసినప్పుడు కనిపించదు’ అనేవారు. అది నాటి మాట. యూపీలో యమునానది తీరాన ఫ్యాక్టరీలున్నప్పుడు వాటి కాలుష్యం కారణంగా తెల్లటి పాలరాయి పసుపు రంగులోకి మారింది. ఫ్యాక్టరీలను తొలగించిన తర్వాత ప్రమాదం తగ్గినప్పటికీ దశాబ్దంపాటు తాజ్మహల్ పసుపు వర్ణంలోనే ఉండింది. అలాగే ప్రపంచంలోని ఏడు అద్భుతాల్లో స్థానం పొందింది కూడా. యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ (తొలి దఫా) మనదేశంలో పర్యటించడానికి ముందు తాజ్మహల్ పాలరాయికి పాలిష్ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి తాజ్ మహల్ తెల్లగా మెరుస్తోంది. తాజ్ మహల్ 42 ఎకరాల్లో విస్తరించి ఉంది. నాలుగు వైపులా ఉన్న తోటలను పరిశీలనగా చూస్తే చార్బాగ్ ఏర్పాటులో మొఘలులు ఎంత నిశితంగా ఉండేవారో అర్థమవుతుంది. మొక్కలు, గుబుర్ల వరుస స్కేలు పెట్టి గీచినట్లు ఉంటుంది. మనకు తాజ్మహల్ అంటే ఎంత ప్రేమంటే... 2007లో జరిగిన న్యూ సెవెన్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ పోటీలో తాజ్మహల్కు ఓట్లేసి గెలిపించుకున్నాం. ఇది షాజహాన్ ప్రేమకు మాత్రమే కాదు, ఇది భారతీయుల ప్రేమకు కూడా చిహ్నమే. ఇరవై ఏళ్ల పాటు సాగిన ఈ నిర్మాణంలో ప్రతి అంగుళమూ ఓ అద్భుతం. అన్నట్లు ఫొటోలు తీసుకునేటప్పుడు తాజ్ మహల్ ముందు మాత్రమే కాదు, వెనుక వైపు యమునా నది బ్యాక్డ్రాప్లో ఫొటోలు తీసుకోవడం మరువద్దు. తాజ్మహల్తోపాటు ఆగ్రాలో చూడాల్సిన ప్రదేశం రెడ్ఫోర్ట్. దీనిని ఆగ్రాఫోర్ట్ అంటారు. అక్బర్ ఎక్కువకాలం రాజ్యపాలన చేసింది ఈ ఎర్ర కోట నుంచే.హైదరాబాద్ నుంచి మొదలయ్యే ఈ ఏడు రోజుల టూర్ పేరు ‘నేషనల్ హెరిటేజ్ ఆఫ్ నార్త్ ఇండియా’,టూర్ కోడ్ ఎస్హెచ్ఏ 52. సెప్టెంబర్ 10వ తేదీన మొదలయ్యే ఈ పర్యటనలో అమృతసర్, చండీగఢ్, ఢిల్లీ, మధుర, ఆగ్రా కవర్ అవుతాయి. ప్యాకేజ్ వివరాలకు..ఐఆర్సీటీసీ సికింద్రాబాద్ జోనల్ ఆఫీస్ కాంటాక్ట్ నంబరు: 91 97013 60701ప్యాకేజ్ ఇలా: సింగిల్ ఆక్యుపెన్సీలో 52,850 రూపాయలు, డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 39,800 అవుతుంది. ట్రిపుల్ ఆక్యుపెన్సీలో 37,300 రూపాయలు. (చదవండి: ఆ ప్రేమ లేఖ ఖరీదు ఎంతో తెలిస్తే..విస్తుపోతారు..!) -
ఆలకించడమూ ఓ కళే!
మానవ సంబంధాలలో, సమర్థవంతమైన సంభాషణకు పునాది శ్రద్ధగా వినడం. ఇది కేవలం మాటలను వినడం కాదు, మాట్లాడేవారి భావాలను, ఉద్దేశాలను, చెప్పదలచుకున్న అసలు విషయాన్ని అర్థం చేసుకునే అద్భుతమైన కళ. శ్రద్ధగా వినడం ద్వారానే అపార్థాలు తొలగిపోతాయి, బంధాలు బలపడతాయి. నిజమైన అవగాహన ఏర్పడుతుంది.శ్రోతుం తు యతతే నర్తకో గీయతే యదా ్ఢవక్తుం యతతే బాలస్తం న శృణ్వంతి పండితాః నాట్యం చేసేవారు పాటను శ్రద్ధగా వినడానికి ప్రయత్నిస్తారు. పండితులు మాట్లాడేటప్పుడు పిల్లలు వినడానికి ప్రయత్నించరు. ఈ శ్లోకం వినడంలోని ప్రాముఖ్యతను, విజ్ఞులు ఇతరుల మాటలను ఎంత శ్రద్ధగా వింటారో సూచిస్తుంది.శ్రద్ధగా వినడం అనేది ఒక గొప్ప నైపుణ్యం, దీనిని సాధన ద్వారా పెంపొందించుకోవచ్చు. సనాతన ధర్మంలో జ్ఞాన సముపార్జనకు ‘శ్రవణం’ (వినడం) మొదటి మెట్టుగా చెప్పబడింది. గురువుల నుండి, పెద్దల నుండి జ్ఞానాన్ని పొందడానికి శ్రద్ధగా వినడం అత్యవసరం. శ్రద్ధగా వినడం వ్యక్తిగత జీవితంలోనే కాకుండా, వృత్తిపరమైన రంగంలో కూడా అత్యంత కీలకమైనది. ఒక వ్యాపారవేత్త ఖాతాదారుల అవసరాలను శ్రద్ధగా వింటేనే సరైన సేవలను అందించగలడు. ఒక నాయకుడు తన బృంద సభ్యుల సమస్యలను విని, పరిష్కారాలు చూపడం ద్వారా విశ్వసనీయతను పొందుతాడు. కుటుంబంలో, స్నేహితుల మధ్య తలెత్తే అనేక చిన్నపాటి సమస్యలకు, అపార్థాలకు ప్రధాన కారణం ఒకరి మాటలను మరొకరు శ్రద్ధగా వినకపోవడమే. నిశ్శబ్దంగా ఉండి, ఎదుటి వ్యక్తిని మాట్లాడటానికి ప్రోత్సహించడం, వారి మాటలను మధ్యలో అడ్డుకోకుండా వినడం, కళ్ళలో కళ్ళు పెట్టి చూడటం – ఇవన్నీ శ్రద్ధగా వినే లక్షణాలు. ఇవి కేవలం సంభాషణను సులభతరం చేయడమే కాదు, వ్యక్తిగత ఎదుగుదలకు, సామరస్య పూర్వక సంబంధాలకు పునాదులు వేస్తాయి.ఆకర్ణనతో భవంతి లోకే జ్ఞానినః సాధువాదినః అశ్రద్ధయా చ మూర్ఖత్వం భవేత్ సర్వదా ఖలు శ్రద్ధగా వినడం వల్లనే లోకంలో జ్ఞానులు, మంచి మాటలు పలికేవారు అవుతారు. అశ్రద్ధగా వినడం వల్ల ఎల్లప్పుడూ మూర్ఖత్వం కలుగుతుంది. ఈ సూక్తి శ్రద్ధగా వినడం వల్ల కలిగే ప్రయోజనాలను, అశ్రద్ధ వల్ల కలిగే నష్టాలను వివరిస్తుంది.వినయం శోభయతే విద్వాంసం శ్రవణం జ్ఞానదాయకమ్ అవధానం హి సర్వత్ర సఫలతాం ప్రయచ్ఛతివినయం విద్వాంసుడికి శోభను ఇస్తుంది, వినడం జ్ఞానాన్ని ఇస్తుంది. ఏ విషయంలోనైనా శ్రద్ధే విజయానికి దారితీస్తుంది. ఈ శ్లోకం వినయం, వినడం, శ్రద్ధ అనే లక్షణాలు విజయానికి ఎలా దోహదపడతాయో స్పష్టం చేస్తుంది.శ్రద్ధగా వినడం అనేది కేవలం ఒక కమ్యూనికేషన్ టెక్నిక్ మాత్రమే కాదు, అది ఎదుటి వ్యక్తిని గౌరవించే, వారి పట్ల సానుభూతిని చూపించే ఒక గొప్ప మానవ లక్షణం. ఇది సంబంధాలకు బలాన్నిస్తుంది, వ్యక్తిగత ఎదుగుదలకు దోహదపడుతుంది, సంఘర్షణలను తగ్గిస్తుంది. ప్రతి సంభాషణను ఒక అభ్యాస అవకాశంగా భావించి, శ్రద్ధగా వినే కళను అలవరచుకోవడం ద్వారా మనం జీవితంలో మరింత విజయవంతంగా, సంతోషంగా జీవించగలం.మహాభారతంలో ధృతరాష్ట్రుడు సంజయుడి ద్వారా యుద్ధ వివరాలను విన్నప్పటికీ, తన పుత్ర ప్రేమ కారణంగా ఆయన మాటలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాడు. అదే విదురుడు, శ్రీకృష్ణుడి మాటలను శ్రద్ధగా విని, ధర్మ సూక్ష్మాలను గ్రహించాడు. ఈ ఉదాహరణలు కేవలం వినడం సరిపోదని, అర్థం చేసుకునే తత్వంతో వినాలని చాటిచెబుతాయి.– కె. భాస్కర్ గుప్తా -
ఆ ప్రేమ లేఖ ఖరీదు ఎంతో తెలిస్తే..విస్తుపోతారు..!
ఈ రోజుల్లో ప్రేమ అనే పదం కనుమరుగైపోతోంది. పచ్చని సంసారాలు చిన్న చిన్న అపార్థాలతో భగ్గుమంటున్నాయి. అలాంటి తరుణంలో కొన్ని ప్రేమకథలు వింటుంటే..అలాంటి ప్రేమలు ఇప్పుడెందుకు ఉండటం లేదు అనిపిస్తోంది. అలాంటి భావోద్వేగభరిత లవ్స్టోరీ నెట్టింట వైరల్గా మారింది.అదేంటంటే..భారత మాజీ ఆర్మీ అదికారి కెప్టెన్ ధర్మవీర్ సింగ్ తన ప్రియురాలు రాసిన లేఖను పంచుకున్నారు. ప్రస్తుతం ఆమె అతడి అర్థాంగి. తాను 2001 ఆ టైంలో చెన్నైలో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో చేరినప్పుడు రాసిన లవ్లెటర్ అని చెప్పుకొచ్చారు. తన స్నేహితురాలైన ఠాకురైన్ ఆ ప్రేమలేఖ రాసినట్లు వివరించారు. అయితే సైనిక అకాడమీలో లెటర్లు మావద్దకు చేరాలంటే సీనియర్లు పెట్టే షరతులను, టెస్ట్లను అంగీకరించాల్సి వచ్చేది. అయితే తనకు వచ్చిన లేఖ చాలా బరువుగా ఉందంటూ తన సీనియర్లు తన చేత ఏకంగా 500 పుష్అప్లు చేయాలని బలవంతం పెట్టారట. దాంతో చేసేదేమి లేఖ అన్ని పుష్అప్లు చేయక తప్పలేదని చెప్పుకొచ్చారు. తాను అకాడమీలో ఉండగా అందుకున్న మొదటి లేఖ అదేనట. రాయడానికి ఎంత టైం పట్టిందో గానీ, ఆ భావాలు తన మనసులో ఇంకా అలానే పదిలంగా ఉన్నాయంటూ ఆ లేఖ తాలుకా వీడియోని జత చేస్తూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. నెటిజన్లు ఆ వీడియోని చూసి ఆమెది చాలా అందమైన చేతిరాత, మీ ప్రేమ కథ హృదయాన్నిదోచే గొప్ప ప్రేమకథ అని ప్రశంసిస్తూ పోస్టుల పెట్టారు. View this post on Instagram A post shared by Capt. Dharmveer Singh (@capt_dvs) (చదవండి: ఆమె చిరునవ్వులో ఏదో మాయజాలం..!) -
ఆమె చిరునవ్వులో ఏదో మాయజాలం..!
ఒక్క చిరునవ్వు సంభాషణతో పనిలేకుండా చేస్తుంది. అదే వెయ్యి మాటలకు సమానం అని చెప్పొచ్చు. కొందరు ప్రతి మాటకు చిన్న చిరునవ్వుతో సమాధానం చెప్పి..అవతలి వారి మనసులో గొప్ప స్థానాన్ని సంపాదించుకుంటారు. అలాంటి హృదయపూర్వక సంఘటనే ఇక్కడ చోటుచేసుకుంది. ఆమె ఆ ఒక్క సంజ్ఞతో సంభాషణకు తావివ్వకుండా మాట్లాడింది.అందుకు సంబంధించిన వీడియోనెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సంచిత అగర్వాల్ అనే కంటెంట్ క్రియేటర్ ఒక వృద్ధురాలికి లిఫ్ట్ ఇస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది అచ్చం సినిమాలో కనిపించే సన్నివేశంలా ఉంటుంది. ఆ వృద్ధ మహిల కృజ్ఞత చూపిస్తూ..ఆమె సాయం తీసుకుంటుంది. ఆ కారు ఎక్కగానే ఆమె ముఖం వెలిగిపోతుంది. ఎక్కడకి వెళ్లున్నావని సంచిత ప్రశ్నించగా ఆమె "జీవన్ భారతి" అని సమాధానం ఇస్తుంది. గమ్యస్థానంకి చేరుకోగానే కంటెంట్ క్రియేటర్ జాగ్రత్తలు చెబుతూ నిష్క్రమిస్తుంది. అయితే ఆమె మాత్రం మారుమాట్లాడకుండా ఒక్క చిరునవ్వుతో సమాధానమిస్తుంది. చిన్న స్మైల్తో తన భావన అంతా చెబుతున్నట్లుగా ఉంది ఆ వృద్ధురాలి నవ్వు. ఆ నవ్వులో ఏదో మాయ జాలం ఉంది అంటూ ఇన్స్టాలో ఆ విషయాన్ని షేర్ చేసుకుంది కంటెంట్ క్రియేటర్. అంతేగాదు కొన్నిసార్లు జీవితంలో సినిమాలోని సన్నివేశాలు చోటుచేసుకుంటాయి అనే క్యాప్షన్తో ఈ వీడియోని పంచుకున్నారామె. ఈ వీడియోకి ఏకంగా రెండు మిలియన్ల వ్యూస్, లైక్లు వచ్చాయి. ఇంకెందుకు మీరు ఓ లుక్కేయండి మరి.. View this post on Instagram A post shared by Sanchita Agarwal (@littlesweet_family) (చదవండి: వద్దనుకున్న బిడ్డ నవ్వుల రాణి అయింది) -
విభీషణుడికి వినాయకుడి పరీక్ష
రామ రావణ యుద్ధంలో చివరకు రావణుడు హతమయ్యాడు. రావణుడి అంత్యక్రియల తర్వాత రాముడు విభీషణుడిని లంకకు రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. ఆ తర్వాత యుద్ధంలో తనకు సాయం చేసిన సుగ్రీవ ఆంజనేయ, అంగదాది వానర ప్రముఖులను, విభీషణుడిని వెంటబెట్టుకుని సీతా లక్ష్మణ సమేతంగా పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడు.అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా జరిగింది.పట్టాభిషేకం పూర్తయిన తర్వాత కొన్నాళ్లు రాముడి ఆతిథ్యం స్వీకరించిన వారంతా తమ తమ నెలవులకు తిరిగి బయలుదేరడానికి సిద్ధపడ్డారు. యుద్ధంలో తనకు సహకరించిన వానర ప్రముఖులందరికీ రాముడు స్వర్ణాభరణాలు సహా అనేక విలువైన కానుకలను ఇచ్చి సాగనంపాడు.రావణుడికి సోదరుడై ఉన్నప్పటికీ, యుద్ధంలో తన పక్షాన నిలిచిన విభీషణుడికి సాగనంపేటప్పుడు ప్రత్యేకమైన కానుక ఇవ్వాలనుకున్నాడు. అందుకని తమ ఇలవేల్పు అయిన శ్రీరంగనాథుడి విగ్రహాన్ని విభీషణుడికి ఇచ్చాడు.విభీషణుడికి శ్రీరంగనాథుడి విగ్రహాన్ని అందిస్తూ, ‘విభీషణా! ఇది మా ఇలవేల్పు శ్రీరంగనాథుడి విగ్రహం. నీ రాజ్యానికి శ్రీరంగనాథుడి అనుగ్రహం ఉండాలని దీనిని నీకు ఇస్తున్నాను. నీ ప్రయాణంలో ఈ విగ్రహాన్ని ఎక్కడా నేల మీద విడిచిపెట్టకు. అలా విడిచిపెడితే, ఈ విగ్రహం అక్కడికక్కడే పాతుకుపోతుంది. దీనిని తిరిగి తరలించడం అసాధ్యం’ అని చెప్పాడు.‘సరే’నని చెప్పి, రాముడి వద్ద వీడ్కోలు తీసుకుని, విభీషణుడు లంకకు తిరుగు ప్రయాణమయ్యాడు. దక్షిణ దిశగా లంక వైపు సాగించిన ప్రయాణంలో కావేరీ తీరానికి చేరుకున్నాడు.దారిలో ఎదురైన పవిత్ర కావేరీ నదిలో స్నానం చేయాలని తలచాడు విభీషణుడు. అయితే, విగ్రహాన్ని నేలపై ఉంచరాదని రాముడు చెప్పిన మాట అతడికి గుర్తుకు వచ్చింది. స్నానం చేసి వచ్చేంత వరకు ఎవరైనా విగ్రహాన్ని పట్టుకునేవారు దొరుకుతారేమోనని వెదకసాగాడు.విభీషణుడు అలా కావేరీ తీరం వెంబడి వెదుకుతూ నడుస్తుండగా, కొంత దూరంలో ఒక బాల బ్రహ్మచారి కనిపించాడు.విభీషణుడు ఆ బాల బ్రహ్మచారిని పిలిచాడు.అతడు విభీషణుడి దగ్గరకు వచ్చి నిలిచాడు.‘బాలకా! నేను ఈ పవిత్ర కావేరీ జలాలలో స్నానం చేసి, సంధ్య వార్చుకోవాలనుకుంటున్నాను. నా చేతనున్న ఈ విగ్రహాన్ని నేల మీద పెట్టకూడదని నియమం ఉంది. అందువల్ల నేను స్నానం చేసి తిరిగి వచ్చేంత వరకు దీనిని పట్టుకోగలవా?’ అభ్యర్థనగా అడిగాడు విభీషణుడు.‘విగ్రహాన్ని పట్టుకుంటాను గాని, ఒక షరతు’ అన్నాడా బాల బ్రహ్మచారి దర్పంగా విభీషణుడికేసి చూస్తూ.‘ఏమిటా షరతు’ అడిగాడు విభీషణుడు.‘నాకు బోలెడు పనులు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ సేపు ఉండలేను. నువ్వు త్వరగా స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని వచ్చేయాలి. నాకు కాలాతీతమైతే నిన్ను మూడుసార్లు పిలుస్తాను. నేను మూడోసారి పిలిచే సరికి నువ్వు వచ్చి, విగ్రహాన్ని తీసుకోవాలి. లేకుంటే, ఇక్కడ ఆ విగ్రహాన్ని ఉంచి వెళ్లిపోతాను’ చెప్పాడు బాలబ్రహ్మచారి.‘సరే’నంటూ విభీషణుడు విగ్రహాన్ని ఆ బాలకుడికి అప్పగించి, స్నాన సంధ్యల కోసం నదికి వెళ్లాడు.విభీషణుడు నదిలోకి ఇలా దిగాడో లేదో, ‘ఇదిగో, పెద్దమనిషీ! తొందరగా వచ్చేసేయ్. నాకు సమయం మించిపోతోంది’ అంటూ కేకవేశాడు.విభీషణుడు స్నానం ముగించుకునే లోపునే రెండోసారి కేక వేశాడు.సంధ్యవార్చుకుంటూ ఉండగా, మూడోసారి కేక వేశాడు. విభీషణుడు పరుగు పరుగున వచ్చేలోగానే ఆ బాల బ్రహ్మచారి విగ్రహాన్ని నేల మీద ఉంచి, చక చకా నడుచుకుంటూ ముందుకు సాగాడు. శ్రీరంగనాథుడి విగ్రహం అక్కడే నేలలోకి పాతుకుపోయింది.విగ్రహాన్ని పైకెత్తడానికి విభీషణుడు తన బలమంతా ఉపయోగించి ప్రయత్నించాడు. అతడి ప్రయత్నం విఫలమైంది.రాముడు ఇచ్చిన విగ్రహాన్ని లంకకు తీసుకుపోలేని తన నిస్సహాయతకు అతడికి అంతులేని ఆవేదన ముంచుకొచ్చింది. అంతలోనే విగ్రహాన్ని నిర్లక్ష్యంగా ఉంచేసి వెళ్లిపోతున్న బాలబ్రహ్మచారి మీద పట్టరాని కోపం తన్నుకొచ్చింది. అతడిని నెత్తి మీద ఒక్కటిచ్చుకుని బుద్ధి చెప్పాలనుకుని, వడి వడిగా బాల బ్రహ్మచారిని అనుసరించాడు. అది గమనించిన బాల బ్రహ్మచారి పరుగందుకున్నాడు. విభీషణుడు కూడా పరుగున వెంబడించాడు. బాల బ్రహ్మచారి రూపంలో ఉన్న వినాయకుడు సమీపంలోని పర్వత శిఖరానికి చేరుకుని, తన నిజరూపాన్ని ప్రదర్శించాడు. ‘విభీషణా! చింతించకు. విష్ణువు విగ్రహాన్ని దక్షిణంగా ఉంచే ఆచారం ఎక్కడా లేకున్నా, నీ లంకా రాజ్యానికి తన ఆశీస్సులు కురిపించేలా నేను విగ్రహాన్ని దక్షిణం వైపు ఉంచాను’ అని పలికాడు. విభీషణుడు తన ప్రాప్తమింతేననుకుని లంకకు బయలుదేరాడు.∙సాంఖ్యాయన -
ఊపందుకుంటున్న సోలో డేట్ కల్చర్..!
నాలో నేనేనా.. ఏదో అన్నానా.. నాతో నే లేని మైమరపున.. ఏమో అన్నానేమో..నువ్వు విన్నావేమో..విన్న మాటేదో నిన్నడగనా.. అలా సాగిపోతున్న నాలోన.. ఇదేంటిలా కొత్త ఆలోచన.. అవును కాదు తడబాటుని.. అంతో ఇంతో గడి దాటనీ.. విడి విడిపోని పరదాని.. పలుకై రాని ప్రాణాన్ని.. అని బాణం చిత్రంలో రామజోగ్య శాస్తి రాసిన పాట మనందరికీ సుపరిచితమే.. ఇదే పాటను అనుకరిస్తూ.. పలువురు నగర వాసులు సోలో డేట్కు సై అంటున్నారు. కొందరు పర్సనల్ స్పేస్ వెతుక్కుంటూ.. లాంగ్ డ్రైవ్స్, టూర్స్కు వెళ్తున్నారు.. మరికొందరు తమకు నచి్చన ఆహారంతో.. ఇంకొందరు పుస్తకాలు, మ్యూజిక్తో సావాసం చేస్తున్నారు.. నేనూ నా నీడ.. ఇద్దరమే చాలంటూ పలువురు నగరవాసులు పాశ్చాత్య దేశాల నుంచి విస్తరిస్తున్న ట్రెండ్కు ఊతమిస్తున్నారు. ‘డేట్కి వెళదామా? అని ప్రశ్నిస్తే.. ఏ ఆన్సర్ వస్తుందో అనే ఆందోళన ఉండదు. ‘డేటింగ్’ కోసం మరొకరిని మెప్పించాలనే తాపత్రయమూ ఉండదు. నచ్చని పనులు చేయాల్సిన అవసరమూ ఉండదు.. నచి్చన పనులు మానాల్సిన అవసరం అస్సలే ఉండదు. అంత అద్భుతమైన అనుభవమా? అదెక్కడ? అది ఎలా? అనే ప్రశ్నలకు నగర యువత ఇప్పుడు కనుగొన్న సమాధానమే సోలో డేటింగ్. ‘సారీ రేపు ఎవరినీ కలవదలచుకోలేదు. ఏకాంతంగా రోజంతా గడపదలచుకున్నాను...’ ఇలాంటి మాటలు ఇప్పుడు నగరంలో తరచూ వినబడుతున్నాయి. ‘సోలో డేటింగ్’ అనే అనుభవం పట్ల ప్రతి ఒక్కరిలోనూ పెరుగుతున్న ఆసక్తే దీనికి కారణం. అలా పుట్టింది.. పొద్దున్న లేస్తే.. ఎవరికి కాల్ చేయాలి? ఎవరిని కలవాలి? ఎవరితో చర్చించాలి.. ఏ మీటింగ్కి అటెండవ్వాలి? ఎవరికి పనులు అప్పజెప్పాలి.. ఎవరు చెప్పిన పనులు చేయాలి? ఎవరిని ప్రేమించాలి? ఎవరిని మెప్పించాలి?.. బయటకు వెళ్లడం మాత్రమే కాదు కమ్యూనికేషన్ పుణ్యమాని ఇంట్లో ఉన్నా ఇదే పరిస్థితి.. రోజువారీ షెడ్యూల్ మొత్తం ఇలాగే మరొకరితో ముడిపడిపోతున్న నగర వాసంలో.. తనను తాను కోల్పోతున్నామనే భావన చాలా మందిలో పెరుగుతోంది. దాన్ని పూడ్చుకోవాలనే ఆలోచనల నుంచి పుట్టిందే సోలో డేటింగ్ సంస్కృతి. ఇలా విస్తరించింది.. తొలుత అమెరికా, యూరప్ దేశాల్లో అంకురించిన సోలో డేటింగ్ పెద్ద ట్రెండ్గా మారింది. మీ టైమ్, సోలో డేట్, సెల్ఫ్ లవ్ అనే హాష్ట్యాగ్స్ మిలియన్ల పోస్టులతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జపాన్లో అయితే ‘ఒంటరి డైనింగ్’ (సోలో డైనింగ్) అనేది రెస్టారెంట్లలో ప్రత్యేక కాన్సెప్ట్గా ప్రవేశపెట్టారు. ఒంటరిగా వచ్చిన వారికోసం ప్రత్యేక టేబుల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ‘సోలో ట్రావెల్ – డేటింగ్’ ప్యాకేజీలు అందిస్తున్న ట్రావెల్ ఏజెన్సీలు పెరుగుతున్నాయి. మన దేశంలో కూడా యువత, ముఖ్యంగా హైదరాబాద్ తదితర మెట్రో నగరాల్లో, వీకెండ్ సోలో డేట్స్ని ట్రెండ్గా మార్చుకుంటున్నారు. ఇప్పటి బిజీ జీవితంలో ‘సెల్ఫ్ కేర్’ అనే భావనకు కొత్త రూపంగా దీన్ని పేర్కొంటున్నారు. సోలో డేటింగ్.. ఇలా! ఇది మనం మనకోసమే ప్లాన్ చేసుకునే ఒక ప్రత్యేక సమయం. సోలోగా గడపడం అంటే ఏదో ఒంటరిగా ఉండటం మాత్రమే కాదు. ఒక రొమాంటిక్ పార్ట్నర్తో కలిసి వెళ్లినట్టు అలా వెళ్లినప్పుడు వారి ఆనందం కోసం మనం ఏవైతే చేస్తామో, చేద్దాం అనుకుంటామో.. అలా మనకోసమే మనం వెళ్లడం.. ఒక డేట్ ప్లాన్ చేసుకోవడం. ఆ రోజు మొత్తం మనకు నచ్చిన పనులు చేస్తూ గడిపేయడం. మనకు నచి్చన టైమ్కి నిద్ర లేవడం మొదలుకుని ఏదైనా కాఫీ షాప్లోనో కల్చరల్ స్పేస్ లోనో కాసేపు గడపడం, సినిమానో, నాటకమో, స్టాండప్ కామెడీయో.. ఏది చూడాలనుకుంటే అది చూడటం, పార్కులో వాకింగ్ లేదా పర్వతాల్లో ట్రెక్కింగ్ ఇలా ఏదైనా సరే.. రోజంతా మనం ఎంజాయ్ చేయాలనుకున్నా చేయలేకపోతున్నవి చేస్తూ గడిపేయడం.. కొన్ని సూచనలు.. దీని వల్ల ఒంటరిగా ఆనందించగలం అని మన మీద మనకు నమ్మకం పెరుగుతుంది. దీంతో ఆనందం కోసం ఇతరులపై ఆధారపడడం తగ్గుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. రోజూ తప్పక చేసే పనులకు ఒక్కరోజు పూర్తిగా వీడ్కోలు పలకాలి. సోలో డేటింగ్ అంటే ఏదో ఒంటరిగా స్తబ్ధుగా గడిపేయడం కాదు. ప్రణాళికా బద్దంగా, రాజీ పడకుండా మనం కోరుకున్నట్టుగా ఎంజాయ్ చేయడం. ఒత్తిడి నుంచి సామాజిక బాధ్యతల నుంచి కూడా విరామం లభిస్తుంది. ఆ డేట్ గురించి ఎవరికీ చెప్పక్కర్లేదు.. ఎవరు చెప్పిందీ ఫాలో అవ్వాల్సిన పని అంతకన్నా లేదు. కేవలం మనసు మాట మాత్రమే వినాలి. నిజంగా మనకు ఏం కావాలో మనకు నచ్చింది ఏంటో తెలుసుకునే సెల్ఫ్ అవేర్నెస్ కలుగుతుంది.(చదవండి: వాన వెలిసినా... ముసిరే వ్యాధులు) -
వాన వెలిసినా... ముసిరే వ్యాధులు
ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్లలో ఇటీవల కురినిన భారీ భారీ వర్షాల తర్వాత ఇరు రాష్ట్రాలు జలమయం కావడం, రోడ్లు మునిగిపోవడంతోపాటు అవి ప్రజల ఆరోగ్యానికీ ముప్పు తెచ్చిపెడుతున్నాయి. ఈ వర్షాల తర్వాత చాలా ఆసుపత్రులూ, క్లినిక్స్లో నిమోనియా, ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. సాధారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటప్పుడు, కురిశాక ఉండే తేమతో కూడిన వాతావరణంలో ఈ కేసులు పెరగడం సాధారణం. ఇలాంటి సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయించాల్సిన చికిత్స వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. వర్షాల అనంతరం నిమోనియా, ఇన్ఫ్లూయెంజా (ఫ్లూ) కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో అంతటా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇవి అన్నిరకాలుగా ఆరోగ్యంగా ఉండే యువతతో పోలిస్తే... వ్యాధి నిరోధక శక్తి కాస్త తక్కువగా ఉండే వయోవృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణుల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాగే అప్పటికే అనారోగ్యాలతో బాధపడేవారిలో రోగనిరోధకత తక్కువగా ఉండటంతో వాళ్లు నిమోనియా, ఫ్లూ వంటి వర్షాకాలపు సమస్య ల బారిన వేగంగా పడే అవకాశముంది. అంతేకాదు... వ్యాధి నిరోధకత తక్కువ గా ఉండే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వ్యక్తుల్లో ఇది ఒక్కోసారి ప్రాణాపాయం లాంటి తీవ్రమైన ముప్పునకూ దారితీసే ప్రమాదం లేకపోలేదు.వర్షాకాలంలో ముప్పుఎందుకు ఎక్కువంటే... వర్షాకాలంలో ఉండే అధిక తేమ, తడి వాతావరణం వంటివి ఫంగస్ పెరుగుదలకు తోడ్పడతాయి. దాంతో ఆ పెరుగుదల వల్ల అవి శ్వాసనాళాల్లోకి ప్రవేశించినప్పుడు ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులకు అవకాశం పెరుగుతుంది. క్రౌడింగ్ : వర్షాల కారణంగా ప్రజలు గుంపులు గుంపులుగా చాలా దగ్గరి దగ్గరిగా ఉంటారు. అదీగాక ఇక లోతట్టు ప్రాంతాల వాళ్లనందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి ఒకేచోట గుంపులుగా ఉంచడంతో ప్రజలు మరింత దగ్గరిదగ్గరిగా ఉండాల్సి వస్తుంది. పైగా మూసినట్టుగా ఉన్న గదుల్లో (క్లోజ్డ్ ఇన్–డోర్స్ మధ్యన, వెంటిలేషన్ సరిగా లేని చోట్లలో) ఉండటం వల్ల వైరస్లు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశాలెక్కువ. ఉపరితలాలను తాకడం వల్ల : తలుపులు తీసేటప్పుడు డోర్స్ హ్యాండిల్స్ను తప్పక తాకుతూ తీయాల్సి వస్తుంది. ఒకరి చేతులనుంచి డోర్స్ నాబ్స్, డోర్ హ్యాండిల్స్పై చేరుకున్న వైరస్లు మరొకరు వాటిని ముట్టుకోగానే వారికీ అంటుతాయి. పైగా వర్షాకాలం లాంటి చల్లటి తడి వాతావరణంలో డోర్నాబ్స్పై ఉండే సూక్ష్మజీవులు మరింత ఎక్కువ కాలం జీవించి ఉంటాయి. ఇలా ఈ మార్గంలో వైరస్లూ, బ్యాక్టీరియా వ్యాపించడాన్ని ‘ఫొమైట్ ట్రాన్స్మిషన్’ అని కూడా అంటారు. రొటీన్ దెబ్బతినడం వల్ల (డిస్రప్టెడ్ రొటీన్): బయట వర్షం కురుస్తుండటం వల్ల తాము వెళ్లాల్సిన పనులకు వెళ్లలేకపోవడంతో రొటీన్ దెబ్బతింటుంది. దీనివల్ల రోజులో తినేవేళలూ, నిద్రవేళలూ ఇవన్నీ క్రమం తప్పుతాయి. దాంతో కొత్త వైరస్లు రూపొందే ముప్పు: వానాకాలం లాంటి సీజన్లలో ప్రజలు దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు వైరస్ల తాలూకు కొత్త స్టెయిన్లూ, బ్యాక్టీరియల్, ఫంగల్ తాలూకు దుష్ప్రభావాలు పెరుగుతాయి. సాధారణంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే పెద్దవయసు వారిలో, చిన్న పిల్లల్లో ఈ స్ట్రెయిన్స్ వ్యాపించాక... వారి నుంచి ఇంకొన్ని స్టెయిన్స్ రూపొందడం... ఇలా సరికొత్తగా రూపొందిన వైరస్లు చాలా చురుగ్గా (విరులెంట్గా) ఉండటం వల్ల అవి వేగంగా వ్యాపిస్తూ మరింత నష్టం కలగజేస్తాయి.ఎవరెవరిలో ముప్పు ఎక్కువంటే... వయోవృద్ధులు (65+), చిన్నపిల్లలు, గర్భిణులు. గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు, డయాబెటిస్, హైబీపీ లేదా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తడి వాతావరణంలో, గదుల్లో గుంపులుగా ఉండేవాళ్లూ / తాత్కాలిక ఆశ్రయాల్లో ఉన్నవారు ∙వ్యాక్సిన్ తీసుకోని పెద్దవయసు వాళ్లలో... ఈ సీజన్ అనంతర వ్యాధుల ముప్పు ఎక్కువ. ఫ్లూ/న్యుమోనియాలను గుర్తించడమెలా? ఫ్లూ లక్షణాలు: ఇది వైరస్లో వచ్చే సమస్య కాబట్టి ఆకస్మికంగా తీవ్ర జ్వరం (హైఫీవర్); ఒళ్లు నొప్పులు; గొంతు నొప్పి; తీవ్రమైన అలసట / నీరసం / నిస్సత్తువ; ఎడతెరిపి లేకుండా దగ్గు. అయితే కొన్ని కేసుల్లో ఇది నిమోనియా వంటి సెకండరీ ఇన్ఫెక్షన్కు దారితీసే అవకాశం. నిమోనియా లక్షణాలు: విపరీతంగా దగ్గు వస్తూ కళ్లె (మ్యూకస్) పడుతూ ఉండటం; ఛాతీలో నొప్పి, ఆయాసంతో ఎగ శ్వాస తీసుకుంటూ ఉండటం; తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ; పెద్దవయసు వారిలో పరిస్థితులు మరింత తీవ్రమవుతుండటం; అయోమయానికి గురికావడం; ఆకలిలేకపోవడంతక్షణం వైద్యుడిని సంప్రదించాల్సిన పరిస్థితులు..శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది; పెదవులు నీలంగా మారడం, ఛాతీ లేదా కడుపులో తీవ్రమైన నొప్పి, అయోమయం, నీళ్లు తాగలేక΄ోవడం / ద్రవపదార్థాలు తీసుకోలేక΄ోవడం. ∙కొన్ని వైద్య పరీక్షలు : వ్యక్తిగతంగా పరీక్షించడం (క్లినికల్ ఎగ్జామినేషన్స్), కొన్ని రక్తపరీక్షలు, ఛాతీ ఎక్స్రే లేదా అవసరమైతే కొన్ని ఇమేజింగ్ పరీక్షలు.వానాకాలపు జాగ్రత్తలు / నివారణలు...వ్యాక్సిన్: ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవడం; వయోవృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా న్యుమోకోకల్ వ్యాక్సిన్ తీసుకోవడం. హైజీన్ : వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, ఇల్లు, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, కిటికీలు, తలుపులు తెరచి గదులు తేమ లేకుండా పొడిగా ఉంచుకోవడం, ఇళ్లలో (ఆ మాటకొస్తే బయట కూడా) పొగతాగకుండా/ ఇల్లు ΄÷గచూరకుండా చూసుకోవడం ∙తరచూ చేతులు కడుక్కోవడం, ఇంట్లో ఎవరు అనారోగ్యంగా ఉన్నా అందరూ మాస్కులు వాడటం.చికిత్స...వయోవృద్ధులు, పెద్దవాళ్లు, గర్భిణులు, చిన్నారులు... వీళ్లు ఎవరైనా జబ్బుపడితే వెంటనే డాక్టర్ను సంప్రదించడం. పోషకాహారం తీసుకోవడం; తగినంత నీరు తాగుతూ ఒంటిని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం; తగినంత విశ్రాంతి; కంటినిండా నిద్ర, డాక్టరు సూచించిన మందుల్ని (యాంటీ వైరల్, యాంటీ బయాటిక్స్ వంటివి) క్రమం తప్పకుండా వాడటం. అవసరాన్ని బట్టి ఆక్సిజన్ మాస్క్ లేదా నెబ్యులైజేషన్ పెట్టడం. పై జాగ్రత్తలతో ఈ వానాకాలంలో ఫ్లూ, నిమోనియా, సెకండరీ నిమోనియా రిస్కులను విజయవంతంగా ఎదుర్కోవడమే కాకుండా, నివారణ పద్ధతులు అనుసరిస్తూ, ముందుజాగ్రత్తలు తీసుకుంటూ ఇంటిల్లిపాదీ వ్యాధులకు దూరంగా కూడా ఉండవచ్చు. డాక్టర్లను ప్రజలు ఎక్కువగా అడుగుతుండే ప్రశ్నలు...ప్రశ్న : మా అబ్బాయికి జలుబు చేసి (ఫ్లూ వచ్చి) తగ్గినప్పటికీ దగ్గు ఎందుకిలా వారాల తరబడి ఉంటోంది? డాక్టర్ జవాబు : వైరస్ వచ్చి తగ్గాయ (పోస్ట్–వైరల్ సెన్సిటివిటీ) లేదా నిమోనియాలాంటి ఇన్ఫెక్షన్ వల్ల ఇలా జరుగుతుండవచ్చు.ప్రశ్న : అల్లం కలిపిన గోరువెచ్చని నీళ్లు తాగడం లాంటి చిట్కాల వల్ల ప్రయోజనం ఉంటుందా? డాక్టర్ జవాబు : ఇలాంటి ఇంటి చిట్కాలు లక్షణాలను కొంతవరకు తగ్గించవచ్చు. కానీ వ్యాక్సిన్ వేయించుకోవడం / వైద్య చికిత్స తీసుకోవడమే పూర్తి రక్షణ ఇస్తాయి.ప్రశ్న : మాస్కులు తొడగడం తప్పనిసరా? డాక్టర్ జవాబు మాస్కులు తొడుక్కోవడం, చేతులు కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా అనుసరించాలి.డాక్టర్ గంగాధర్ రెడ్డి మల్లు, సీనియర్ పల్మనాలజిస్ట్, స్లీప్ మెడిసిన్ స్పెషలిస్ట్ (చదవండి: మేని కాంతికి మెరుగైన చికిత్స..!) -
వద్దనుకున్న బిడ్డ నవ్వుల రాణి అయింది
భారతీ సింగ్.. హాస్యప్రియులకు సుపరిచితమైన పేరు! దేశంలోని తొలి తరం మహిళా స్టాండప్ కమేడియన్లలో ఒకరు.. ద గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ చాలెంజ్ ఫేమ్, రియాలిటీ షోస్ పార్టిసిపెంట్ అండ్ హోస్ట్.. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... తన పేరుకు ముందు ఇన్ని విశేషణాలున్న భారతీ సింగ్ వాళ్లింట్లో అన్వాంటెడ్ చైల్డ్ అట. ఆమెకు ఇద్దరు తోబుట్టువులు. అన్న, అక్క తర్వాత ఆమె. మనసులో మాట విన్నట్టుగా దేవుడు ఒక కొడుకు, కూతురుని ఇచ్చాడు.. ఇంక సంతానం చాలు అనుకుందట భారతీ వాళ్లమ్మ. కానీ మూడోసారీ గర్భం దాల్చింది. మూడో నెల వచ్చేదాకా ఆమెకు తెలీలేదు. తెలియగానే గాభరా పడిందట. ఎందుకంటే భారతీ సింగ్ తండ్రి ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో చిరుద్యోగి. ముగ్గురు పిల్లలను పెంచేంత ఆర్థిక స్థోమత లేదని ఇద్దరు పిల్లలే చాలనుకుంది భారతీ సింగ్ వాళ్లమ్మ. అందుకే మూడో బిడ్డ కడుపులో పడిందని తెలియగానే గర్భస్రావం కోసం చెట్ల మందుల నుంచి, బొప్పాయి, ఖర్జూర పళ్లను తెగ తిన్నదట. బరువైన పనులు చేస్తే గర్భస్రావం అవుతుందని ఉదయం నుంచి రాత్రి దాకా వంచిన నడుము ఎత్తకుండా పనిచేసిందట. అయినా గట్టి పిండం.. భూమ్మీద పడింది. ఆసుపత్రికి వెళితే ఖర్చని.. ఇంట్లోనే కన్నదట. బొడ్డుతాడు కత్తిరించడానికి మంత్రసానిని మాత్రం పిలిపించిందట. అందుకు ఆ మంత్రసాని అరవైరూపాయలు తీసుకుందట అంతే! అందుకే భారతీ సింగ్ అంటుంది ‘కేవలం అరవై రూపాయల ఖర్చుతో నేను పుట్టాను’ అని... రానీయకుండా చేద్దామనుకుంది కానీ.. పుట్టాక నన్నే ఎక్కువ గారంగా చూసింది. నా రెండో ఏటనే నాన్న చనిపోయాడు. అయినా మా ముగ్గురికీ ఏ లోటూ తెలియనివ్వలేదు. తల్లీతండ్రీ తానై కష్టపడి పెంచింది. అందుకే అమ్మంటే నాకు చాలా ఇష్టం’ అని చెబుతుంది భారతీ సింగ్. ప్రముఖ పాడ్కాస్టర్ రాజ్ శమానీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ పంచుకుంది అమృత్సర్ వాసి భారతీ. ‘మూడో సంతానం వద్దనుకున్న అమ్మ .. అబార్షన్తో నన్ను భూమ్మీదకు రాకుండా చేద్దామనుకుంది. నా జోకులతో జనాలను చావగొట్టే రాత రాసుంది కాబట్టి.. వచ్చాను. వద్దనుకున్న బిడ్డకు ఆసుపత్రి ప్రసవం ఎందుకని కేవలం 60 రూపాయల ఖర్చుతో నాకు జన్మనిచ్చింది. కానీ నేను అమ్మకు ఇప్పుడు కోటీ అరవై లక్షల రూపాయల ఖరీదు చేసే ఇల్లును గిఫ్ట్గా ఇచ్చాను.. నన్ను కన్నందుకు కృతజ్ఞత గా... అని సగర్వంగా చెబుతుంది. (చదవండి: అందానికే అందం స్నేహ..! ఆమె ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్..!) -
చవితి రుచులు చవిచూడాల్సిందే!
వినాయక చవితి అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేవి కమ్మని వంటకాలు! ఉండ్రాళ్ళు, పులిహోరా, తాలికలు ఇలా గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన రుచులతో వేడుక మొదలవుతుంది. మరి మన బొజ్జగణపయ్యకు ఇష్టమయ్యే రుచులను సులభంగా ఇలా చేసుకుందామా?బెల్లం తాలికలుకావలసినవి: చిక్కటి పాలు– ఒక లీటరు, బియ్యప్పిండి– అర కప్పు, నీళ్ళు– ఒకటిన్నర కప్పులుబెల్లం తురుము– ఒక కప్పు (కావాలంటే పెంచుకోవచ్చు), ఏలకుల పొడి– అర టీస్పూన్నెయ్యి– 2 టీస్పూన్లు, గోధుమపిండి– ఒక టీస్పూన్, బాదం, జీడిపప్పు –కొద్దికొద్దిగాతయారీ: ఒక గిన్నెలో నీళ్ళు మరిగించి, బియ్యప్పిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి ముద్దలా అయ్యాక, చల్లారనివ్వాలి. చల్లారిన పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి, చేతితో సన్నని తాలికల్లా చుట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో పాలు పోసి, అవి మరుగుతున్నప్పుడు తాలికలను కొద్దికొద్దిగా వేసుకోవాలి. తాలికలు విరిగిపోకుండా సున్నితంగా గరిటెతో కలపాలి. తాలికలు పాలలో ఉడికిన తర్వాత, చిన్న గిన్నెలో గోధుమపిండిని కొద్దిగా నీటితో కలిపి, పాలలో వేసి గరిటెతో కలుపుకోవాలి. అనంతరం బెల్లం తురుము, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి. బెల్లం కరిగిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసుకుని నేతిలో వేయించిన బాదం, జీడిపప్పులను కలుపుకుంటే చాలు.పులిహోరకావలసినవి: అన్నం– 2 కప్పులు (మరీ మెత్తగా కాకుండా ఉడికించుకోవాలి)చింతపండు గుజ్జు– 2 టేబుల్ స్పూన్లు (నిమ్మరసం కూడా వాడుకోవచ్చు)పల్లీలు– పావు కప్పుశనగపప్పు– ఒక టేబుల్ స్పూన్మినపప్పు, ఆవాలు– ఒక టీస్పూన్ చొప్పున, జీలకర్ర– అర టీస్పూన్ఎండుమిర్చి– 3 (ముక్కలుగా కట్ చేసుకోవాలి), పచ్చిమిర్చి– 3 (సన్నగా చీల్చినవి), కరివేపాకు– కొద్దిగాపసుపు– అర టీస్పూన్ఇంగువ– చిటికెడు (అభిరుచిని బట్టి)నూనె– తగినంత, ఉప్పు– రుచికి సరిపడాతయారీ: ముందుగా పెద్ద పాత్ర తీసుకుని అన్నంలో కొద్దిగా నూనె, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకుని చల్లారనివ్వాలి. ఈలోపు మరో చిన్న గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసి వేయించాలి. పల్లీలు వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఇంగువ వేసి వేగించాలి. చింతపండుతో అయితే, వేగిన పోపులో చింతపండు గుజ్జు, ఉప్పు, పసుపు వేసి గుజ్జు దగ్గర పడే వరకు ఉడికించాలి. ఆ మిశ్రమాన్ని అన్నంలో కలుపుకోవాల్సి ఉంటుంది. అదే నిమ్మకాయ పులిహోర అయితే, పోపు వేగిన తర్వాత స్టవ్ ఆపేసి, అందులో నిమ్మకాయ రసం కలుపుకుని, ఆ పోపు మిశ్రమాన్ని చల్లారిన అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి.దద్ధోజనంకావలసినవి: అన్నం– రెండున్నర కప్పులుగడ్డ పెరుగు– రెండు కప్పులు, పాలు– అర కప్పు(కాచి చల్లార్చినవి)ఉప్పు– సరిపడా, నూనె– ఒక టేబుల్ స్పూన్ఆవాలు– ఒక టీస్పూన్, కరివేపాకు– కొద్దిగాకొత్తిమీర తురుము– కొద్దికొద్దిగాఅల్లం తురుము– అర టీస్పూన్తయారీ: ముందుగా అన్నం వండి, చల్లారనివ్వాలి. చల్లారిన అన్నంలో పాలు, పెరుగు, ఉప్పు వేసి మెత్తగా కలిపి పెట్టుకోవాలి. ఒక చిన్న గిన్నెలో నూనె వేడి చేసి, ఆవాలు, కరివేపాకు దోరగా వేగించాలి.అభిరుచిని బట్టి పప్పులు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము వేసుకుని వేయించుకోవచ్చు ఇప్పుడు ఆ పోపును పెరుగు అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. అనంతరం కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది.ఉండ్రాళ్ళుకావలసినవి: బియ్యప్పిండి–ఒక కప్పునీళ్ళు– ఒకటిన్నర కప్పులుఉప్పు– సరిపడానూనె– 2 టీ స్పూన్లు, జీలకర్ర, ఆవాలు, కొబ్బరి తురుము, అల్లం తురుము, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు– కొద్దికొద్దిగాతయారీ: ఒక పాత్రలో నీళ్ళు, ఉప్పు, నూనె వేసి మరిగించాలి. నీళ్ళు మరుగుతున్నప్పుడు, బియ్యప్పిండిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. పిండి ముద్దలా తయారయ్యాక, స్టవ్ ఆపేసి మూత పెట్టి ఐదు నిమిషాలుంచాలి. పిండి కొద్దిగా చల్లారాక, చేతికి నూనె రాసుకుని చిన్న చిన్న ఉండ్రాళ్ళలా చుట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రలో ఈ ఉండ్రాళ్ళను పెట్టి, ఆవిరిపై ఉడికించి ప్రసాదంగా పెట్టొచ్చు. అభిరుచి బట్టి ఈ ఉండ్రాళ్ళకు తాలింపు కూడా వేసుకోవచ్చు. అదెలా అంటే, స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో కొద్దిగా నూనె వేడి చేసుకుని ఆవాలు, జీలకర్ర, అల్లం తురుము, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. వేగిన పోపులో ఈ ఉడికించిన ఉండ్రాళ్ళను వేసి సున్నితంగా కలుపుకుని, కొబ్బరితురుమును కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. (చదవండి: గణేశుడే అలంకరణ) -
గణేశుడే అలంకరణ
ప్రకృతిని కొలువు తీర్చి, పెద్దలు కూడా పిల్లలుగా మారిపోయేలా చేసే ఉత్సవం గణేశ్ చతుర్థి. ఇంట్లోనూ.. వీథుల్లోనూ గణేశ్ మూర్తుల నుంచి అలంకరణ వరకు ప్రతిదీ గ్రాండ్ గా తీర్చిదిద్దుతారు. అయితే, గణేశుడు అంటేనే ప్రకృతి కాబట్టి పండగలోని ఆంతర్యం తెలుసుకొని, పర్యావరణానికి ప్రాముఖ్యం ఇచ్చేలా అలంకరణ చేద్దాం.ఆకర్షణీయమైన మండపం అవసరమైనవిపాలవెల్లి తయారీకి వెదురు బద్దలు, బ్యాక్డ్రాప్ కోసం జ్యూట్ ఫాబ్రిక్ లేదా పువ్వుల ప్రింట్లు ఉన్న ఫ్యాబ్రిక్, మామిడి, అరటి ఆకులు, స్టేజ్ చుట్టూ వెలిగించడానికి మట్టి ప్రమిదలు, తాజా పువ్వులు ప్రధానంగా కావాల్సినవి. ఇంట్లో కూడా వేదిక అవసరం కాబట్టి వెదురు బద్దలతో మండపాన్ని ఏర్పాటు చేయవచ్చు. సెంటర్ టేబుల్ లేదా టేబుల్ లేదా పీట వంటిది ఒకటి తీసుకొని, నాలుగు వైపుల వెదురు బద్దలను ఏర్పాటు చేసి, వేదిక సిద్ధం చేసుకోవాలి. బ్యాక్డ్రాప్గా జ్యూట్ లేదా పెయింట్ చేసిన ఫాబ్రిక్ కట్టి, ఇరువైపులా పూలమాలలను, మామిడాకులను వేలాడదీయాలి. వేదిక చుట్టూ మట్టి ప్రమిదలు వెలిగించి, లోపల మట్టి గణేశుని ఉంచాలి.ఫెయిరీ లైట్స్ తోరణాన్ని వెదురు బద్దలకు అమర్చాలి. రాత్రిళ్ళు ఈ దీపాలు వెలిగితే చాలా క్లాసీగా, కలర్ ఫుల్గా కనిపిస్తుంది.ఇల్లంతా వెలుగుఇంటి ప్రవేశ ద్వారం, ద్వారాలు, గోడలతో పాటు గణేశుడి ప్రధాన మండపాన్ని అందమైన పూలు, తీగలతో అలంకరింవచ్చు. ఎరుపు, పసుపు, పచ్చ రంగు కాంబినేషన్లో ఫ్యాబ్రిక్ తోరణాలు మరింత ప్రత్యేకతను ఇస్తాయి. రంగోలీలో బియ్యం పిండి, పసుపు, కుంకుమ, పూల రేకలు, వివిధ మోడల్స్లో ఉన్న ప్రమిదలను వెలిగించవచ్చు. పేపర్ లాంతర్లను ఎవరికి వారు తయారు చేసుకోవచ్చు. వీటికి అందమైన మోటిఫ్లను అతికించి, తమదైన సృజనాత్మకతను జోడించవచ్చు. (చదవండి: గణపయ్యకు టెక్నో హారం!) -
సరదా కొట్లాట..! అక్కడ వాటితో కొట్టుకోవడం ఆట..
సాధారణంగా టమాటోలు మీదకు విసిరితే అదో అవమానం అన్నట్లుగా అనిపిస్తుంది. కాని, స్పెయిన్లో టమాటాలతో కొట్టుకోవడమే అహ్లాదకరమైన ఆట! వారికి అదో పండుగ! ‘లా టమాటినా’ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ ఉత్సవం స్పెయిన్లోని బునోల్ పట్టణంలో ప్రతి ఏటా ఆగస్టు చివరి బుధవారం నిర్వహిస్తారు. ఆ ప్రకారం, ఈ ఏడాది అది ఆగస్టు 27న రానుంది. ఈ ఉత్సవంలో పాల్గొనేవారు టన్నుల కొద్దీ టమాటోలను ఒకరిపై ఒకరు విసురుకుంటూ ఆనందిస్తారు. అక్కడ ప్రతి సంవత్సరం సుమారుగా 120 నుంచి 150 టన్నుల వరకూ టమాటోలను ఉపయోగిస్తున్నారు.ఈ టమాటో ఉత్సవం 1945లో అనుకోకుండా ప్రారంభమైందని అక్కడివారు చెబుతారు. ఆ ఏడాది జరిగిన ఒక పండుగ ఊరేగింపులో, కొందరు యువకులు ఒకరిపై ఒకరు టమాటోలు విసురుకున్నారట. ఈ ఘటన తరువాత ప్రతి సంవత్సరం టమాటోలతో సరదాగా ఈ పోరాటం చేసేవారట. క్రమంగా దీనిని అధికారిక ఉత్సవంగా ప్రకటించారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఈ వేడుకను ప్రత్యేక ఆకర్షణగా మార్చింది స్పెయిన్ ప్రభుత్వం!ఈ వేడుక ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. సుమారు గంటపాటు జరిగే ఈ టమాటో పోరాటంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటారు. తర్వాత, పట్టణ వీధులను శుభ్రం చేస్తారు. ఈ పండుగలో సుమారు 20 వేల మందికి అనుమతి లభిస్తుంది. అందుకు ముందుగానే టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది ఈ వేడుక.ఈ ఫెస్టివల్ స్ఫూర్తితో ప్రస్తుతం ప్రపంచవాప్తంగా పలు చోట్ల నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే గత మార్చి 11న మన హైదరాబాద్లోని ఎక్స్పీరియం ఎకో పార్క్లో ఈ వేడుకను ‘టోమా టెర్రా’ అనే పేరుతో ఘనంగా నిర్వహించారు. అయితే అమ్మకానికి పనికిరాని, మిగిలిపోయిన టమాటోలను నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసి ఈ వేడుక చేశారు. దీనితో రైతులకు ఆర్థికంగా లబ్ధి చేకూరడంతో పాటు ఈ ఫెస్టివల్లో ఉపయోగించిన టమాటో వ్యర్థాలను వృథా కాకుండా సేంద్రియ ఎరువుగా మార్చి, ఆ పార్క్ మొక్కలకే వాడారట. దీనితో ఈ గ్లోబల్ ట్రెండీ ఫెస్టివల్ ‘జీరో–వేస్ట్’ ఈవెంట్గా మారింది.ద్వీపాల్లోనే రాజా!పశ్చిమ న్యూ గినీకి తూర్పునున్న ఇండోనేషియాలోని పశ్చిమ పాపువా ప్రావిన్స్లో ఉన్న ఒక ద్వీపసమూహమే ఈ రాజా ఆంపత్. దీన్ని ‘ఫోర్ కింగ్స్’ అని కూడా పిలుస్తారు. ఈ పేరు అక్కడి నాలుగు ప్రధాన దీవులైన వాయ్గెయో, బాటంట, సాలావటి, మీసూల్ నుంచి వచ్చింది. ఈ రాజా ఆంపత్ ప్రపంచంలో అత్యంత గొప్ప సముద్ర జీవవైవిధ్యానికి కేంద్రంగా నిలిచింది. ఇక్కడ 1,500లకు పైగా చేపల జాతులు, 500లకు పైగా రకరకాల పగడపు కీటకాలతో పాటు అనేక ప్రత్యేకమైన జీవులున్నాయి. రాజా ఆంపత్లో సుమారు 1,500 చిన్న దీవులు, ద్వీపకల్పాలున్నాయి. సున్నపురాయితో ఏర్పడిన ఈ దీవులు నీలి రంగు సముద్రంలో రమ్యమైన దృశ్యాలను కళ్లకు కడతాయి. పచ్చని అడవులు, ఎత్తైన కొండలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. పియానేమో అనే వ్యూ పాయింట్ నుంచి చూస్తే నీలి సముద్రంలో అక్కడక్కడా చిన్న దీవులు తేలుతున్నట్లు కనిపిస్తాయి. అక్కడికి వెళ్తే తిరిగి రావాలనే అనిపించదట! -
బ్యాటరీ బీస్ట్!
మంచి డ్రెస్, సూపర్ హెయిర్ స్టయిల్, బ్రైట్ మేకప్ ఇలా టాప్ టు బాటమ్ ఫుల్గా రెడీ అయ్యి, ఫేవరెట్ లొకేషన్లో ఫొటోషూట్కి స్టెప్పులేస్తూ చేరుకున్నారు. అప్పుడు వెంటనే, మీ ఫోన్ లేదా కెమెరా ‘బంగారం, నా బ్యాటరీ అయిపోయింది!’ అంటే ఎలా ఉంటుంది? ఊహించుకోండి. అప్పటిదాక అవార్డు విన్నర్లా మెరిసిన మీ ముఖం, ఒక్కసారిగా లోబ్యాటరీ లైట్లా డిమ్గా మారుతుంది. ఇలా ఇంకెప్పుడు జరగకుండా ఉండాలనే, చాలా త్వరగా చార్జ్ చేసి, ఎక్కువ కాలం ఉండే ‘ఫాస్ట్ అండ్ ఫరెవర్’ అనే ఒక సూపర్ బ్యాటరీని జపాన్ ఇంజినీర్లు తయారు చేశారు. కేవలం మూడు నిమిషాల్లోనే ఈ బ్యాటరీ ఏ ఎలక్ట్రానిక్ డివైజ్నైనా పూర్తిగా చార్జ్ చేసేస్తుంది. దీనిని గాజు సిరామిక్ ఎలక్ట్రోలైట్, లిథియం వంటి ఇతర లోహాల మిశ్రమంతో తయారు చేశారు. అందుకే, అధిక ఉష్ణోగ్రత, అధిక ఒత్తిడి వంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనూ పనిచేస్తుంది. ఇప్పటి వరకు చేసిన పరిశోధనల్లో పదిహేనువేల సార్లు ఈ బ్యాటరీని ఉపయోగించి చార్జ్ చేసినా, ఇంకా తొంభై శాతం కెపాసిటీతో యథాతథంగా పనిచేస్తోంది. మొబైల్, ల్యాప్టాప్, కారు ఏదైనా సరే చిటికెలో చార్జ్ చేస్తుంది. దీంతో, ఈ బాటరీపై ఇప్పుడు భారీ క్రేజ్ ఉంది. డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని దీనిని విభిన్న పరిమాణాల్లో తయారు చేస్తున్నారు. త్వరలోనే ఇది మార్కెట్లోకి రానుంది.(చదవండి: పసిడి దేశాలు..!) -
పసిడి దేశాలు..!
డబ్బుతో దేశాన్ని కొనలేం. కాని, డబ్బు పెట్టి మనకు ఇష్టమైన దేశంలో శాశ్వతంగా ఉండిపోగలం. చేతిలో ‘గోల్డెన్ వీసా’ ఉంటే చాలు, కుటుంబంతో సహా వెళ్లి ఏ దేశంలోనైనా స్థిరపడొచ్చు. ఆ దేశ పౌరసత్వం తీసుకోవచ్చు. గోల్డెన్ వీసా ఇవ్వని దేశాలకు సైతం ఆ దేశాలు ఇచ్చే ‘గోల్డెన్ చాన్స్’తో బంగారు రెక్కలు కట్టుకుని ఎగిరిపోవచ్చు. ప్రస్తుతమైతే అందరి చూపూ, ముఖ్యంగా భారతీయుల మనసు అమెరికా మీద ఉంది. ట్రంప్ ఇస్తానంటున్న గోల్డ్ కార్డ్ మీద ఉంది. బుకింగ్స్ ఓపన్ కాలేదు!ట్రంప్ ప్రకటించిన 5 మిలియన్ డాలర్ల (43.5 కోట్ల రూపాయలు) ‘గోల్డ్ కార్డ్’ కోసం ఇప్పటి వరకు 80 వేల మందికి పైగా సంపన్న భారతీయులు క్యూలో నిలబడి ఉన్నారు. ఈ ఏడాది జూన్ నెలలోనే అమెరికాగోల్డ్ కార్డ్ అధికారిక వెబ్ సైట్ మొదలైంది. నిజానికి ఈ సైట్లో రిజిస్ట్రేషన్కు ఇంతవరకు (ఈ కథనం రాసే నాటికి) చట్టబద్ధమైన ఉత్తర్వులు జారీ కాలేదు. ఈ ఎనభై వేల మంది ఎవరంటే, రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి రిజిస్టర్ చేసుకున్నవారు. సైట్ తెరవగానే మొదట – ‘ది ట్రంప్ కార్డ్ ఈజ్ కమింగ్’ అని కనిపిస్తుంది. దాని కింద, ‘నోటిఫికేషన్ రాగానే మీకు తెలియబరుస్తాం. మీ పేరు, మీ దేశం, మీ ఈమెయిల్ పొందుపరచండి’ అని ఉంటుంది. ఇప్పటి వరకు అలా పొందుపరచినవారే ఈ ఎనభై వేల మంది. వీరి సంఖ్య ఇంతకింతా పెరగవచ్చని ఇమిగ్రేషన్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.ఫస్ట్ లుక్ అదిరిపోయిందిప్రధానంగా టెక్నాలజీ, ఫైనాన్స్, హెల్త్ కేర్ రంగాలకు చెందిన 28–45 సంవత్సరాల వయస్సు గల భారతీయ నిపుణులు అమెరికన్ గోల్డ్ కార్డ్ వీసాపై ఆసక్తి చూపుతున్నారు. ఈబీ–5 ఇన్వెస్టర్ వీసాలకు ప్రత్యామ్నాయంగా ట్రంప్ ఈ గోల్డ్ కార్టును తెస్తున్నారు. ఈబీ–5లో మోసాలు జరుగుతుండటంతో ఈ కొత్త గోల్డ్ కార్డ్ను ప్రవేశపెడుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు కూడా. గోల్డ్ కార్డ్ వెబ్ సైట్ పని ప్రారంభం అయితే పూర్తి వివరాలు, విధి విధానాలు వెల్లడవుతాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ట్రంప్ గోల్డ్ కార్డ్ ‘ఫస్ట్ లుక్’ విడుదల చేసినప్పటికీ, ఇందుకొక చట్టం వచ్చేవరకు యూఎస్ గోల్డ్ కార్డ్ కేవలం ఒక ఆశా దీపం. ఫస్ట్ లుక్ మాత్రం అదిరిపోయింది.డబ్బున్నవాళ్లకే గోల్డెన్ వీసాలుఅత్యంత ధనికులు, పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలు, వృత్తి నిపుణులు గోల్డెన్ వీసాలకు అర్హులు. అందుకు వారు భారీ మొత్తంలో రుసుము చెల్సించాల్సి ఉంటుంది. ప్రతిఫలంగా ఆ దేశ పౌరసత్వం, లేదా శాశ్వత నివాసానికి అనుమతి లభిస్తుంది.గోల్డెన్ వీసాలు ఇస్తున్న దేశాలుప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కనీసం పదిహేనుకు పైగా దేశాలు గోల్డెన్ వీసాలు అందిస్తున్నాయి. వాటిలో కొన్ని : సింగపూర్, హాంకాంగ్, కెనడా, స్పెయిన్, స్విట్జర్లండ్, ఇటలీ, న్యూజీలండ్, గ్రీస్, ఆస్ట్రియా, టర్కీ, యూఏఈ, కరీబియన్ తదితర దేశాలు. ఇక అగ్రరాజ్యాలైన రష్యా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ వంటివి గోల్డెన్ వీసాలు ఇవ్వటం లేదు!కలకలం రేపిన యూఏఈ ‘గోల్డ్’ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) 2019 నుండి ఇన్వెస్టర్లకు, పారిశ్రామిక వేత్తలకు, వృత్తి నిపుణులకు గోల్డెన్ వీసాను జారీ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల కొత్త రకం గోల్డెన్ వీసాలను యూఏఈ మంజూరు చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి ఆ సమాచారం మేరకు – ‘‘యూఏఈ మొదట ప్రయోగాత్మకంగా భారత్, బంగ్లాదేశ్ పౌరులకు గోల్డెన్ వీసాలు ఇస్తుంది. వీసా రుసుము లక్ష దిర్హామ్లు (దాదాపు రూ.23.30 లక్షలు) ఉంటుంది. క్రిమినల్ రికార్డులు, సోషల్ మీడియా తనిఖీల అనంతరమే అర్హులైన దరఖాస్తు దారులకు కార్డును మంజూరు చేస్తారు’’. అయితే యూఏఈ ‘ఫెడరల్ అధారిటీ’ ఈ గోల్డెన్ వీసా వార్తల్ని వట్టి వదంతులుగా కొట్టిపడేసింది. థాయ్లండ్ ఎలీట్ లాంగ్–టెర్మ్ రెసిడెన్సీ వీసా (5 ఏళ్లకు రూ.5 లక్షలు, తాత్కాలిక నివాసం)పోర్చుగల్ డి7 పాసివ్ ఇన్కం వీసా(రూ.9 లక్షలు, 5–6 ఏళ్ల పౌరసత్వం) మాల్టా పర్మినెంట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్(రూ. 90 లక్షల నుంచి రూ. 1 కోటీ 35 లక్షలు. శాశ్వత నివాసం. పౌరసత్వం ఉండదు.)లాట్వియా రెసిడెన్సీ బై ఇవ్వెస్ట్మెంట్ (రూ. 54 లక్షలు, 10 ఏళ్ల పౌరసత్వం) నార్త్ మాసిడోనియా సిటిజెన్ షిప్ బై ఇన్వెస్ట్మెంట్ (రూ. 1.8 కోట్లు, 120 దేశాలకు వీసా లేని ప్రయాణ సదుపాయం)వానువాటు సిటిజెన్షిప్ బై డొనేషన్ (రూ. 1 కోటి 10 లక్షలు, పౌరసత్వం)డొమినికా సిటిజెన్షిప్ బై డొనేషన్(రూ.83 లక్షలు, పౌరసత్వం)సెయింట్ లూసియా సిటిజెన్షిప్ బై డొనేషన్ (రూ.83 లక్షలు, పౌరసత్వం) (చదవండి: ఈ చేప భూకంపాలను అంచనా వేయగలదట..!) -
మేని కాంతికి మెరుగైన చికిత్స..!
చాలామంది ఆడవారు తన చర్మానికి లోషన్స్, క్రీమ్స్, మాయిశ్చరైజర్స్ రాసుకుంటూ మచ్చలు లేని మృదువైన చర్మాన్ని సంరక్షించుకోవడం కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయితే వయసు పెరిగే కొద్ది ట్రెండ్కి తగ్గట్టుగా ఎన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ అందుబాటులోకి వచ్చినా, ఎన్ని తాత్కాలిక చిట్కాలు పాటించినా కాంతిమంతమైన, మృదువైన చర్మం కావాలంటే టెక్నాలజీని నమ్ముకోవాల్సిందే! అందులో భాగమే ఈ గాడ్జెట్! దీని పేరు ‘ఆర్ అండ్ ఎఫ్ స్కిన్ టైటెనింగ్ రిజువనేషన్ మెషిన్!’ ఈ చిత్రంలోని రింకిల్ రిమూవల్ మెషిన్తో ముడతలను తొలగించుకోవడంతో పాటు చర్మాన్ని బిగుతుగా మార్చుకోవచ్చు. డబుల్ చిన్, ఐ బ్యాగ్స్ వంటి వయసుతో వచ్చే ఎన్నో సమస్యలను తొలగించుకోవచ్చు. ఈ స్కిన్ కేర్ డివైస్తో ట్రీట్మెంట్ పొందితే వయసును దాచేయవచ్చు. యవ్వనంగా కనిపించొచ్చు.స్మూత్ రింకిల్స్, లిఫ్ట్ ఐ కాంటౌర్, కాంపాక్ట్ పోర్స్, వి–షేప్డ్ ఫేస్, సబ్ట్రాక్టివ్ డబుల్ చిన్, గో ఐ బ్యాగ్స్ అండ్ డార్క్ సర్కిల్స్, రోజీ ఫేస్ కలర్ వంటి 11 ఆప్షన్స్ ఈ డివైస్లో ఉంటాయి. అందుకు తగ్గ హెడ్స్ కూడా లభిస్తాయి. వాటిని వినియోగించుకుని చర్మాన్ని నిగనిగలాడేలా మార్చుకోవచ్చు. దీని ధర సుమారుగా 110 డాలర్లు. అంటే 9,634 రూపాయలన్న మాట! ఇందులో అదనపు టెక్నాలజీని బట్టి ఆప్షన్స్ని బట్టి ధరల్లో మార్పు ఉంటుంది.సౌందర్య చికిత్స..మెరుగైన చర్మ సౌందర్యానికి ఎక్స్ఫోలియేషన్ చికిత్స చక్కని మార్గం. ఈ చికిత్స ముఖ్యమైన ప్రక్రియ చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచడమే! ఇది చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను, మురికిని తొలగించి, కొత్త చర్మ కణాలు పునరుజ్జీవం పొందేందుకు దోహదపడుతుంది. ఈ ట్రీట్మెంట్తో చర్మం మరింత కాంతిమంతంగా, మృదువుగా మారుతుంది. అయితే ఈ ట్రీట్మెంట్లో రెండు రకాలున్నాయి. ఒకటి ఫిజికల్ ఎక్స్ఫోలియేషన్! ఇందులో స్క్రబ్లు, బ్రష్లు లేదా గ్లోవ్స్ వంటి వాటిని ఉపయోగించి చర్మాన్ని బాగా రుద్దుతారు. ఈ పద్ధతి సాధారణంగా ఇంట్లోనే చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. ఓట్ మీల్ లేదా షుగర్ స్క్రబ్లను ఉపయోగించవచ్చు. ఇక రెండవ రకం కెమికల్ ఎక్స్ఫోలియేషన్! ఈ పద్ధతిలో ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ లేదా బీటా హైడ్రాక్సీ యాసిడ్స్ వంటి రసాయన పీలింగ్లను ఉపయోగిస్తారు. వీటివల్ల మృతకణాలు, జిడ్డు వంటి సమస్యలు సులభంగా తొలగిపోయి, ప్రత్యేకమైన కాంతి వస్తుంది. ఈ ట్రీట్మెంట్లను సాధారణంగా నిపుణుల పర్యవేక్షణలో పొందడమే ఉత్తమం. (చదవండి: అందానికే అందం స్నేహ..! ఆమె ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్..!) -
అందానికే అందం స్నేహ..! ఆమె ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్..!
స్నేహ అంటే సంప్రదాయంలో పుట్టిన సౌందర్య కవిత లాంటిది. దాదాపు చాలావరకు పట్టుచీర, జడలో మల్లెలు, నుదుటిన బొట్టు అన్నీ కలిసి కనిపిస్తూ ఉండే ఆమె అందం ఎప్పుడూ పండుగ వాతావరణంలా మెరిసిపోతుంది. ఆ అందాన్ని కూడా స్నేహ ఒక్క చిరునవ్వుతోనే రెట్టింపు చే స్తుంది. ప్రతిసారీ కొత్తగా, ప్రత్యేకంగా కనిపించడం అంటే చాలా ఇష్టం. ప్రింటెడ్ కాంచీపురం నుంచి మోనోటోన్ బనారసీ, ఫ్లోరల్ నుంచి బ్రోకేడ్ వరకు, ఏ చీర అయినా సరే రంగులతో మ్యాజిక్ చేస్తాను. అందుకే, చీరలంటే చాలా ఇష్టం అని చెబుతోంది స్నేహ.ఆభరణాల పండుగ! పండుగ రోజు ఉదయం చీర కట్టుకుంటూ అద్దం ముందు నిలబడి ఏ ఆభరణం వేసుకోవాలి అనుకుంటే, అది తప్పకుండా ఫెస్టివల్ జ్యువెలరీ అయి ఉండాలి. బంగారం మెరుపులో రంగురంగుల రత్నాలు, ముత్యాల గుత్తులు, చెక్కిన సున్నితమైన ఆకృతులు – ఇవన్నీ కలిసినప్పుడు వచ్చే వైభవం పండుగ వాతావరణాన్ని రెట్టింపు చేస్తుంది. ఇది కేవలం అలంకారం మాత్రమే కాదు, ప్రతి పండుగను ఒక జ్ఞాపకంగా మార్చే మ్యాజిక్. ఆ ఆభరణాలను వేసుకున్నప్పుడల్లా మనం కేవలం ఆ రోజుకే కాదు, మన పూర్వీకుల సంప్రదాయానికి, వారసత్వానికి కూడా గౌరవం ఇస్తున్నట్లే అనిపిస్తుంది. లేత రంగుల కంచీపురం చీరలపై ఈ ఆభరణాలను వేసుకుంటే రత్నాల మెరుపు ఇంకా హైలైట్ అవుతుంది. జుట్టును పొడవైన జడగా వేసి మల్లెపూలు, కనీసం రెండు పొడవైన హారాలు జుంకీలు, వంకీలు – ఇలా లేయరింగ్ చేస్తే ఆకర్షణ వస్తుంది. మార్కెట్లో ప్రస్తుతం లభిస్తున్న డిజైన్లను చూస్తే, లక్ష్మీదేవి, గణేశ్ మోటిఫ్స్తో వచ్చే టెంపుల్ హారాలకు బాగా డిమాండ్ ఉంది.చీర బ్రాండ్: స్నేహాలయ సిల్క్స్, ధర: రూ. 25,000, జ్యూలరీ బ్రాండ్ : ఇతిహాస జ్యూలర్స్ ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. (చదవండి: డ్రెస్ స్టైల్నూ మార్చేయచ్చు..!) -
గణపయ్యకు టెక్నో హారం!
ఈసారి గణపయ్యకు టెక్ టచ్తో స్వాగతం చెప్పారంటే, ఇక మీ పండుగ వాతావరణం భక్తి ప్లస్ టెక్ కాంబోలో డబుల్ ఆనందంతో మెరిసిపోతుంది.వీఆర్ గణపయ్యతో రద్దీకి గుడ్బై!వినాయక చతుర్థి రాగానే ముంబయి లాల్బాగ్చా రాజా ముందు కనిపించే రద్దీ మాటల్లో చెప్పలేనిది. కాని, ఇప్పుడు బయట అడుగు పెట్టకుండానే, మీ లివింగ్రూమ్లో కూర్చొని ఆ భవ్య దర్శనాన్ని ఆస్వాదించవచ్చు. అదే ఈ ‘లాల్బాగ్ 360’ వీఆర్ దర్శనం. ఒక్క యాప్తో మీ హాల్లో కూర్చునే పూజా గంటలు, పూజారుల మంత్రోచ్ఛారణ, మండప అలంకారాలు అన్నీ కళ్లముందే ప్రత్యక్షం అవుతాయి. ఎడమ వైపు తిప్పితే పూలతో అలంకరించిన మండపం, కుడివైపు తిప్పితే గణపయ్య పాదాల వద్ద నమస్కరిస్తున్న భక్తులు అన్నీ నిజంగానే అక్కడ ఉన్నట్టు అనిపిస్తాయి. ఇదే విధంగా ‘గణేశ్ వీఆర్’, ‘విజయవిధి వర్చువల్ దర్శనం’ లాంటి యాప్లు కూడా 360 డిగ్రీల వీడియోలతో పండుగ వాతావరణాన్ని ఇంటికే తీసుకొస్తున్నాయి. వాడటం కూడా చాలా సులభం. మీ ఫోన్ లేదా స్మార్ట్ టీవీలో యాప్ డౌన్ లోడ్ చేసి, హెడ్సెట్ లేదా ఫుల్స్క్రీన్లో ఆన్ చేస్తే సరిపోతుంది. లైవ్ టైమింగ్స్, లింకులు అధికారిక వెబ్సైట్లో దొరుకుతాయి.ఒకే టచ్తో భక్తి ప్లస్డీజే మోడ్!గణేష్ మండపం అంటే వెలుగుల వేదిక! అయితే, ఇప్పుడు తీగలు, ప్లగ్లు, స్విచ్లతో ఇబ్బంది పడే రోజులు పోయాయి. ఒక వైఫై ఎల్ఈడీ బల్బు పెట్టేస్తే చాలు. మీ మండపం క్షణాల్లో ‘సినిమా సెట్’లా మెరిసిపోతుంది. ఉదయం పూజ సమయానికి పసుపు వెలుగు, మధ్యాహ్నం భక్తులు రాగానే ప్రకాశించే తెలుపు వెలుగు, రాత్రి డీజే బీట్ పడగానే గ్రీన్ , బ్లూ, రెడ్ ఫ్లాష్లతో మండపం ఫుల్ పార్టీ మూడ్లోకి మారిపోతుంది. ఇవన్నీ కేవలం ఫోన్ టచ్తోనే! ‘అలెక్సా, డివోషనల్ మోడ్ ఆన్ ’ అంటే పసుపు, ఎరుపు కాంబినేషన్ రెడీ. వాడటం కూడా సింపుల్. బల్బు పెట్టి, యాప్ డౌన్లోడ్ చేసి, వైఫై కనెక్ట్ చేస్తే సరిపోతుంది. టైమింగ్ సెట్ చేసి, పూజ సమయానికి ఆటోమేటిక్గా వెలుగులు వెలిగేలా చేసుకోవచ్చు. విప్రో, ఫిలిప్స్, హెవెల్స్ లాంటి బ్రాండ్లు మంచి ఆప్షన్లు ఇస్తున్నాయి. ఒక్క బల్బు ధర రూ. 600 నుంచి మొదలవుతుంది.ఒక్క బాక్స్లో మొత్తం పండుగ! వినాయక చవితి దగ్గర పడుతుంటే, ఇంట్లో అందరికీ ఒకటే టెన్షన్ , పూజ సామగ్రిని సర్దుకోవాలి, పత్రి తెప్పించాలి, విగ్రహం తీసుకురావాలి. వీటన్నిటికీ చివరి నిమిషంలో టెన్షన్.. టెన్షన్! కాని, ఈసారి అంతా ఈజీ! ‘ఆరాధ్య గణేశ్ చతుర్థి సంపూర్ణ పూజా కిట్’ చేతిలో ఉంటే చాలు, మీ పండుగ ఏ లోటు లేకుండా చక్కగా పూర్తవుతుంది. ఒక్క బాక్స్లోనే పన్నెండు అంగుళాల మట్టి గణపయ్య, ఇరవైఒక్క రకాల పవిత్ర పత్రి, ఒక చెక్క పాలవెల్లి సహా పూజకు కావాల్సినవన్నీ సిద్ధంగా లభిస్తాయి. కేవలం పూలు, పండ్లు, నైవేద్యం బాధ్యత మాత్రమే మీది! ఎవరైనా పూజ విధానం మరచిపోయారా? టెన్షన్ లేదు, చిన్న పుస్తకంతోపాటు, వీడియో గైడ్ కూడా వెబ్సైట్లో రెడీగా ఉంటుంది. పైగా ప్యాకేజింగ్ నుంచి విగ్రహం వరకు అంతా ప్రకృతికి నష్టం లేకుండా పర్యావరణహితంగా ఉంటుంది. ధర కేవలం రూ.1500 మాత్రమే! .(చదవండి: బాబోయ్..బనానా చిప్స్ తింటే... ఆరోగ్యం ఆటలో అరటిపండే...) -
బాబోయ్..బనానా చిప్స్ తింటే... ఆరోగ్యం ఆటలో అరటిపండే...
అరటి పండు చిప్స్.. వీటి గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఓ రకంగా హాట్ చిప్స్ అనే ఒక పూర్తి స్థాయి చిరుతిళ్ల దుకాణాలు అన్ని నగరాల్లో పాగా వేయడానికి కూడా ఈ బనానా చిప్స్ పై జనంలో పెరిగిన క్రేజ్ బాటలు వేసిందని చెప్పొచ్చు. సాయంత్రం వేళ స్నాక్స్ నుంచి రాత్రి వేళల్లో ఛీర్స్ దాకా కాస్త ఆరోగ్య స్పృహ ఉన్నవారు ఎంచుకునే చిరు తిండి అదే. ముఖ్యంగా కేరళ రాష్ట్రాన్ని అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఇష్టపడే చాలా మంది పర్యాటకులు తప్పకుండా చేసే పనులలో ఒకటి అక్కడ నుంచి తాజా తాజా బనానా చిప్స్ను కొనుగోలు చేసి తమ స్వస్థలాలకు తీసుకురావడం.. ఎవరైనా సన్నిహితులు కేరళ వెళుతుంటే కూడా వచ్చేటప్పుడు బనానా చిప్స్ తీసుకురా అంటూ అభ్యర్ధించే తెలుగువారికీ కొదవలేదు.ఈ నేపథ్యంలో గత ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 మధ్య కేరళ ఆహార భద్రతా కమిషనరేట్ ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఆహార పదార్ధాలలో కల్తీపై తనిఖీలు నిర్వహించింది. ఆ సందర్భంగా సేకరించిన నమూనాలపై జరిపిన పరీక్షలలో, విభ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. గాడ్స్ ఓన్ కంట్రీగా పేరొందిన కేరళ లో రాష్ట్రవ్యాప్తంగా విక్రయించే ఆహారాలలో నిషేధిత రంగులు, నిల్వకారక రసాయనాలు, పురుగుమందుల మిశ్రమాలు బయటపడ్డాయి. అవి అనుమతించదగిన పరిమితి కంటే దాదాపు 3,500% వరకూ ఎక్కువగా ఉండడం అందర్నీ షాక్కి గురి చేసింది.అధికారులు తమ నివేదికను సిద్ధం చేయడానికి రాష్ట్రంలో విక్రయించే 650 పైగా ఆహార పదార్ధాల నమూనాలను పరీక్షించారు. వారి పరిశోధన ఫలితాల ప్రకారం... స్వల్ప స్థాయిలో కూడా ఏదైనా ఆహారాన్ని విషపూరితంగా మార్చే పారిశ్రామిక రంగు అయిన రోడమైన్ బి, పామ్ షుగర్ బెల్లంలలో కనపడింది. క్యాన్సర్ కారక రసాయనమైన అమరాంత్, రోజ్బెర్రీ, బీఫ్ చిల్లి, డ్రైడ్ ప్లమ్లలో, మరొక హానికరమైన రసాయనం, ఆరెంజ్ 2, రెడ్ గ్రామ్ నిమ్మకాయ ఊరగాయలలో లభ్యమైంది. స్థానికంగా ఉత్పత్తి చేసిన బ్రాండెడ్ మిరపకాయ పొడులలో సుడాన్ 1, 2, 3, 4 అనే పేరు కలిగిన క్యాన్సర్–సంబంధిత పదార్థాల జాడ దొరికింది.ఈ తరహా హానికారక ఉత్పత్తులు మేళవించిన వివిధ రకాల మిశ్రమాలు, ప్లం కేక్తో పాటు బనానా చిప్స్లో కూడా బయటపడడం అరటి పండు చిప్స్ ని ఇష్టంగా తినేవారిని భయాందోళనలకు గురి చేసింది. ఈ మిశ్రమం..అరటి పండు చిప్స్ తినేవారిలో కలిగించే అనారోగ్యాలు సాధారణ అజీర్ణం నుంచి ప్రాణాంతక క్యాన్సర్ల వరకూ ఉండవచ్చునని వెల్లడి కావడం మింగుడు పడని విషయంగా మారింది. ఈ నేపధ్యంలో కేరళ నుంచి తరలివచ్చే వాటితో పాటు తెలుగు రాష్ట్రాల్లో తయారవుతున్న బనానా చిప్స్ ను వినియోగించే విషయంలో సైతం ఆరోగ్యార్ధులు ఆచితూచి వ్యవహరించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అదే విధంగా కేరళ రాష్ట్రంలో అధికారులు చేసినట్టుగా తెలుగు రాష్ట్రాల్లో కూడా అధికారులు తినుబండారాలపై తనిఖీలు చేపట్టాలని, వారు విడుదల చేసినట్టుగానే హానికారక పదార్ధాలను కొలతలతో సహా జాబితాగా విడుదల చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.(చదవండి: 16 వేల అడుగుల ఎత్తులో పూతరేకులు తిన్నారా..?) -
రుతుక్రమం వాయిదా వేసే మాత్రలు వాడొచ్చా..?
నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు. పెళ్లి నిశ్చయమైంది. త్వరలో ఒక కుటుంబ కార్యక్రమం ఉంది. ఆ సమయానికి రుతుక్రమం రాకుండా వాయిదా వేసే మాత్రలు వాడాలని మా ఇంట్లో అందరూ చెబుతున్నారు. కాని, వాటి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయో, భవిష్యత్తులో గర్భధారణకు ఇబ్బందులు కలుగుతాయో తెలుసుకోవాలని ఉంది.– ప్రియాంక, హైదరాబాద్మీ వయసు, శరీర పరిస్థితి, రుతుక్రమం సక్రమంగా జరుగుతుందా లేదా అన్న విషయాలను ముందుగా పరిశీలించడం అవసరం. రుతుక్రమం వాయిదా వేసే మాత్రలు సాధారణంగా అధిక మోతాదు ప్రొజెస్టెరాన్ హార్మోన్లు కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో సహజంగా ఏర్పడే హార్మోన్ల సమతుల్యాన్ని మార్చి, గర్భాశయంలో ఏర్పడిన పొర ఊడిపోకుండా అడ్డుకుంటాయి. మాత్రలు వాడుతున్నంత కాలం రుతుక్రమం రాదు. కాని, ఆపిన తరువాత గర్భాశయ పొర ఒకేసారి ఊడిపోవడం వల్ల ఎక్కువ రక్తస్రావం జరగవచ్చు. తరచుగా వాడితే రుతుక్రమం అసాధారణంగా మారడం, గర్భసంబంధిత సమస్యలు రావచ్చు. గతంలో ఇలాంటి మాత్రలు వాడిన మహిళల్లో అండాల ఉత్పత్తి తగ్గిపోవడం, ఆరోగ్యకరమైన అండాల లభ్యత తగ్గడం వలన గర్భధారణలో ఇబ్బందులు ఎదురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ సమస్య సర్దుకోవడానికి కొంతమందికి నెలల తరబడి లేదా సంవత్సరాల పాటు సమయం పడుతుంది. తాత్కాలిక దుష్ప్రభావాలలో మానసిక భావప్రకటన మార్పులు, అజీర్ణం, వాంతులు, మైగ్రేన్ తలనొప్పి, స్తనాల నొప్పి, బరువు పెరగడం ఉంటాయి. అధిక బరువున్నవారు వాడితే రక్తం గడ్డకట్టడం, గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు, మెదడులో రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఎక్కువ. కుటుంబంలో క్యాన్సర్, అధిక రక్తపోటు, గుండె సమస్యల చరిత్ర ఉన్నవారు లేదా ఇప్పటికే రక్తపోటు ఉన్నవారు ఈ మాత్రలు వాడకూడదు. దీర్ఘకాలంగా వాడితే శాశ్వత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి రుతుక్రమం వాయిదా వేసే ముందు తప్పనిసరిగా డాక్టర్ని కలసి, శరీర పరిస్థితి అంచనా వేయించు కోవాలి. తక్కువ మోతాదులో ఉండే మాత్రలను, కార్యక్రమానికి ఒకటి రెండు నెలల ముందు ప్రారంభిస్తే కొంత సురక్షితంగా వాడవచ్చు. భవిష్యత్తులో గర్భధారణకు సిద్ధమవుతున్న వారు అనవసరంగా ఈ మాత్రలను వాడకూడదు. ఎందుకంటే ఇవి గర్భంలో శిశువు అభివృద్ధికి అవసరమైన హార్మోన్లపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి మీ వయసు, ఆరోగ్య చరిత్ర, ప్రస్తుత రుతుక్రమ స్థితి ఇవన్నీ పరిశీలించి, వైద్యుని సలహా తీసుకుని మాత్రమే నిర్ణయం తీసుకోవాలి.నా వయసు పద్దెనిమిదేళ్లు. మొదటి నుంచే నాకు పీరియడ్స్ రెగ్యులర్గా రావు. ఈ అక్టోబర్ నెలలో దసరా పండుగకు మేము ఇంట్లో దేవుడికి పెద్దగా పూజ చేద్దామని అనుకుంటున్నాం. కాబట్టి, ఆ సమయంలో పీరియడ్స్ రాకుండా పోస్ట్పోన్ లేదా ప్రీపోన్ టాబ్లెట్లు వాడవచ్చా?– స్వాతి, విజయవాడమీ పీరియడ్స్ రెగ్యులర్గా లేనందున, వచ్చే నెలలో పీరియడ్స్ ఏ తేదీన వస్తాయో ముందుగా చెప్పడం కష్టం. అందుకే ఆ తేదీని ముందుకు తేవడం లేదా వెనక్కు మార్చడం ఈ పరిస్థితిలో కష్టమైన పని. సాధారణంగా, పీరియడ్స్ సరిగ్గా వచ్చే వాళ్లకి, తేదీకి కొన్ని రోజులు ముందు హైడోస్ హార్మోన్ మాత్రలు ఇస్తే పీరియడ్స్ వాయిదా వేయవచ్చు. కాని, మీలా నెలసరి క్రమం తప్పి ఉన్నవాళ్లకి ఇది సురక్షితం కాదు. ఈ మాత్రలు వాడితే వికారం, వాంతులు, తలనొప్పి, పొత్తికడుపు నొప్పి, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో రక్తం గడ్డకట్టడం, కాలేయానికి నష్టం వంటి తీవ్రమైన సమస్యలు కూడా రావచ్చు. వీటిని తరచుగా వాడితే పీరియడ్స్ ఇంకా అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంది. మీ వయసులో పీరియడ్స్ రెగ్యులర్గా కాకపోవడం సహజం. ఎందుకంటే ఈ వయసులో శరీరం ఇంకా మార్పులు పొందుతూ ఉంటుంది. చాలా అమ్మాయిల్లో ఇది ఇరవై ఏళ్ల వరకు క్రమంగా సర్దుకుంటుంది. కాని, పీరియడ్స్ ఎప్పుడూ రెగ్యులర్ కాకపోతే, పీసీఓఎస్ (పాలీసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్), థైరాయిడ్ సమస్యలు, అధిక బరువు, తక్కువ బరువు, ఒత్తిడి, నిద్రలేమి, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాలు కూడా ఉండవచ్చు. నా సలహా ఏమిటంటే, కేవలం పూజల కోసమే హార్మోన్ మందులు వాడడం కంటే, ముందుగా మీ సమస్యకు గల అసలు కారణాన్ని గుర్తించి చికిత్స చేయించుకోవడం ఉత్తమం. ఇలా చేస్తే మీ సైకిల్ సరిగా వచ్చి, భవిష్యత్తులో గర్భధారణ సామర్థ్యం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఫార్మసీ నుంచి ఇలాంటి మందులను స్వయంగా అసలు కొనకండి.డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: అనాథశ్రమంలో పెరిగి ఐఏఎస్ అయ్యాడు..! ట్విస్ట్ ఏంటంటే..) -
విలక్షణ వినాయకుడు..!
ఆదిపూజలు అందుకునే వినాయకుడికి దేశ విదేశాల్లో అనేక ఆలయాలు ఉన్నాయి. పురాతన ఆలయాల్లో విలక్షణమైన వినాయక విగ్రహాలు ఉన్నాయి. వీటిలో కొన్ని అత్యంత అరుదైన ఆలయాలు, విలక్షణమైన విగ్రహాలు ఉన్నాయి. అలాంటి అరుదైన ఆలయాలు, విగ్రహాల విశేషాలు మీ కోసం...వినాయకుడిని భక్తులు గజాననుడిగానే ఆరాధిస్తారు. వినాయకుడు మానవ ముఖంతో కనిపించే ఏకైక ఆలయం తమిళనాడులోని తిలతర్పణపురిలో ఉంది. పార్వతీదేవి నలుగుపిండితో రూపొందించిన వినాయకుడు లక్షణంగా మానవముఖంతోనే ఉండేవాడు. తనను అడ్డగించినందుకు శివుడు కోపగించి, అతడి తలను నరికేసి, ఆ తర్వాత జరిగిన పొరపాటుకు చింతించి గజముఖాన్ని అతికించిన పురాణ కథ అందరికీ తెలిసినదే! గజాననుడిగా మారక ముందు బాలవినాయకుడి రూపంలో కొలువుతీరిన ఆలయం ఇది. వినాయకుడి తొలి రూపం ఇదే గనుక దీనికి ఆదివినాయక ఆలయంగా పేరు వచ్చింది. ఈ ఆలయం తిలతర్పణపురిలోని ముక్తీశ్వర ఆలయ ప్రాంగణంలో ఉంది. ఇది క్రీస్తుశకం ఏడో శతాబ్ది నాటిది. శ్రీరాముడు ఇదేచోట తన తండ్రి దశరథుడికి పితృశ్రాద్ధం నిర్వహించి, తిల తర్పణాలు సమర్పించాడనే కథనం కూడా ఉంది. అందువల్ల ఇది కాశీ, రామేశ్వరాలతో సమానమైన పుణ్యక్షేత్రంగా భక్తులు విశ్వసిస్తారు. ఐశ్వర్య గణపతికలువా వినాయకుడుఅత్యంత భారీ ఏకశిలా విగ్రహం ఇది. ఆరుబయట పంట పొలాల మధ్య ఉన్న ఈ విగ్రహానికి ఆలయమేదీ లేదు. భక్తులు ఈ విగ్రహాన్ని దర్శించుకుని పూజలు చేస్తుంటారు. ఐశ్వర్య గణపతిగా కొలువు తీరిన ఈ ఏకశిలా విగ్రహం తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లా ఆవంచ గ్రామంలో ఉంది. ఈ విగ్రహం ఎత్తు 7.62 మీటర్లు. పీఠంతో కలుపుకొంటే, దీని ఎత్తు 9.14 మీటర్లు. ఈ విగ్రహం పశ్చిమ చాళుక్యుల కాలం నాటిది. సుమారు క్రీస్తుశకం పన్నెండో శతాబ్దిలో ఈ విగ్రహాన్ని రూపొందించి ఉంటారని అంచనా.అడవీయ గణపతిపురాతనమైన ఈ ఏకశిలా గణపతి విగ్రహం శ్రీలంకలోని ఉడుదుంబరలో ఉంది. అడవులకు రక్షణగా ఉంటాడని భావించి, ఈ విగ్రహాన్ని నెలకొల్పడం వల్ల ఈ గణపతికి ‘అడవీయ గణపతి’ అనే పేరు వచ్చింది. ఇది సుమారు పన్నెండో శతాబ్ది నాటిదని అంచనా.స్థానిక గిరిజన తెగ నాయకుడికి వినాయకుడు కలలో కనిపించడంతో ఆయన ఈ విగ్రహాన్ని నెలకొల్పాడని స్థానికుల కథనం. దీని ఎత్తు 6 మీటర్లు. ఇది ప్రపంచంలోని అతి ఎత్తయిన వినాయక విగ్రహాలలో మూడవ స్థానంలో నిలుస్తుంది. శ్రీలంకలోని హిందువులే కాకుండా, విదేశీ పర్యాటకులు కూడా ఈ విగ్రహాన్ని సందర్శించుకుంటూ ఉంటారు.త్రినేత్ర గణపతివినాయకుడి తండ్రి పరమశివుడు ముక్కంటి అని అందరికీ తెలుసు. మూడు కన్నులతో వినాయకుడు కొలువుదీరిన అరుదైన ఆలయం రాజస్థాన్లో ఉంది. రణథాంబోర్ కోట ప్రాంగణంలో ఉన్న ఈ త్రినేత్ర గణపతి ఆలయం క్రీస్తుశకం పన్నెండో శతాబ్ది నాటిది. రణథాంబోర్ కోటను కేంద్రంగా చేసుకుని పాలించిన రాజు హమీర్ వినాయకుడికి వీరభక్తుడు. ఆయన యుద్ధాలకు వెళ్లేటప్పుడల్లా ముందుగా ఈ త్రినేత్ర గణపతికి ప్రత్యేక పూజలు జరిపించి మరీ బయలుదేరేవాడట! ఈ ఆలయానికి చేరుకోవాలంటే, కోటలో నిర్మించిన రెండువందల యాభై మెట్ల మీదుగా మెట్ల మార్గం ఉంది. కోట లోపలి వైపునే అర కిలోమీటరు కాలిబాట కూడా ఉంది. ఈ ఆలయంలో ఇక్కడి త్రినేత్ర గణపతి తన భార్యలు సిద్ధి, వృద్ధి; కొడుకులు శుభ లాభాలతో కలసి కొలువుదీరడం విశేషం. వినాయకుడు ఇలా సకుటుంబంగా కొలువుదీరిన ఏకైక ఆలయం ఇదొక్కటే!కలువా వినాయకుడుఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వినాయక ఆలయం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వత ప్రాంతంలో రూప్కుండ్– నందాదేవి పర్వతారోహక యాత్రకు వెళ్లే మార్గంలో ఈ ఆలయం ఉంది. ‘కలువా’ వినాయక ఆలయం లేదా ‘కేల్వా’ వినాయక ఆలయంగా పేరుపొందిన ఈ ఆలయం సముద్ర మట్టానికి 14,500 అడుగుల ఎత్తున ఉంది. మంచుకొండల్లో ఒక కొండ మీద ఉన్న ఈ ఆలయం చాలా చిన్నది. దీని ఎత్తు కేవలం అరడుగులు. ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరిక కోరికలు ఈడేరుతాయని భక్తులు నమ్ముతారు. పర్వతారోహకులు తప్ప సామాన్యులు ఈ ఆలయాన్ని సందర్శించడం దుస్సాధ్యం.(చదవండి: గిన్నిస్లో గణపయ్య..) బ్రొమో గణపతిపురాతనమైన ఈ గణపతి విగ్రహం ఇండోనేసియాలో ఉంది. తూర్పు జావాలోని టెంగెర్ పర్వతాలకు చెందిన ‘బొమో’ అగ్నిపర్వత శిఖరంపై కొలువైన ఈ విగ్రహం ఏడు శతాబ్దాల నాటిది. ‘బ్రహ్మ’ను జావా హిందువులు స్థానిక భాషలో ‘బ్రొమో’ అంటారు. బ్రహ్మదేవుడి పేరిట ఈ అగ్నిపర్వతాన్ని ‘బ్రొమో’ అని పిలుచుకుంటారు. జావాలోని టెంగెరీ తెగకు చెందిన వారు ఇక్కడ వినాయక విగ్రహాన్ని నెలకొల్పినట్లు చెబుతుంటారు. సముద్ర మట్టానికి ఏడువేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ విగ్రహానికి పూజలు చేసేందుకు జావా ప్రజలు పర్వతారోహణ చేస్తుంటారు. ఈ వినాయకుడు తమను అగ్నిపర్వతాల పేలుడు నుంచి, ప్రకృతి విపత్తుల నుంచి కాపాడతాడని జావా ప్రజల నమ్మకం. (చదవండి: గిన్నిస్లో గణపయ్య..!) -
సామాన్యుడు విసిరిన సవాల్!
ప్రముఖ కంపెనీలు తమ వెబ్సైట్లు, డేటాబేస్ పరిరక్షణ కోసం ప్రత్యేక విభాగాలకు ఏర్పాటు చేసుకుంటాయి. వీటిలో నిపుణులను నియమించుకుని రూ.లక్షల్లో వేతనాలు చెల్లిస్తుంటాయి. ఆయా వెబ్సైట్లలో ఉన్న లోపాలను, హ్యాకింగ్కు ఆస్కారాలను ఎప్పటికప్పుడు గుర్తించి, సరిదిద్దేందుకు ఈ సైబర్ సెక్యూరిటీ టీమ్స్ పని చేస్తుంటాయి. అలాంటిది ఏకంగా విదేశాంగ శాఖ అధీనంలోని ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం వెబ్సైట్ను ఒక డిప్లొమా హోల్డర్ హ్యాక్ చేసి, సవాలు విసిరారు. సికింద్రాబాద్లోని ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం 2010లో అత్యవసరంగా పాస్పోర్టులు పొందాలనుకునే వారి కోసం తత్కాల్ స్కీమ్ను ప్రవేశపెట్టింది. దీని కింద దరఖాస్తుదార్లు కేవలం ఆన్లైన్లోనే స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉండేది. పెద్ద సంఖ్యలో స్లాట్స్ ఇస్తుండటంతో పనిభారం పెరిగిన పాస్పోర్ట్ కార్యాలయం ఆ ఏడాది ఫిబ్రవరిలో వాటి సంఖ్యను 350కి పరిమితం చేయడంతో తత్కాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని భావించిన చాలామందికి నిరాశే ఎదురయ్యేది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి కొందరు దళారులు ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేటకు చెందిన లతాధర్రావు ద్వారా హ్యాకింగ్ కథ నడిపారు. కంప్యూటర్ అప్లికేషన్స్లో పీజీ డిప్లొమా పూర్తి చేసిన గోరంట్ల లతాధర్రావు అప్పట్లో నరసరావుపేటలో లలితా ఫ్యాన్సీ అండ్ కూల్ డ్రింక్స్ దుకాణం నిర్వహించేవాడు. ఇతడు టీపీ వర్క్ కూడా చేస్తుండటంతో ఆ పనిలో భాగంగా అక్కడి గాంధీచౌక్లో ఆకాశ్ ట్రావెల్స్ నిర్వహించే షేక్ సుభానీతో పరిచయం ఏర్పడింది. లతాధర్కు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండటంతో తన వద్దకు వచ్చే పాస్పోర్ట్ అప్లికేషన్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి సుభానీ ఇతని సాయం తీసుకునేవాడు. ప్రతిఫలంగా ఒక్కో అప్లికేషన్కు రూ.100 చొప్పున చెల్లించేవాడు. అప్పట్లో పాస్పోర్ట్ కార్యాలయం వెబ్సైట్ నిర్వహణ బాధ్యతలను న్యూ ఢిల్లీ కేంద్రంగా పని చేసే నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ చేపట్టేది. తత్కాల్ పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి అవసరమైన ఆన్లైన్ స్లాట్స్ను 2010 ఫిబ్రవరి నుంచి తగ్గించారు. దీంతో ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవాలని భావించిన వారు దళారులను ఆశ్రయించడం ప్రారంభించారు. త్వరగా ఆన్లైన్ స్లాట్ ఇప్పిస్తే భారీ మొత్తాలను చెల్లించడానికి ముందుకు వచ్చేవారు. దీంతో పాస్పోర్ట్ వెబ్సైట్ను హ్యాక్ చేసి స్లాట్స్ బ్లాక్ చేయాలన్న ఆలోచన లతాధర్, సుభానీలకు వచ్చింది. తన కంప్యూటర్ పరిజ్ఞానంతో లతాధర్ ఈ పని చేశాడు. వెబ్సైట్లోకి హ్యాకింగ్ ద్వారా ఎంటర్ అయిన లతాధర్ దాని నుంచి నేరుగా ఎన్ఐసీ సర్వర్కు కనెక్ట్ అయ్యేవాడు. రోజూ స్లాట్స్ విడుదల చేసే సమయంలో ఇతరుల లాగాన్లో మార్పులు చేసేవాడు. తమను ఆశ్రయించిన వారి అప్లికేషన్స్ అప్లోడ్ చేశాకనే మిగిలిన స్లాట్స్ను ఫ్రీ చేసేవాడు. నరసరావుపేటకు చెందిన సుభానీ, లతాధర్ల ద్వారా ఆన్లైన్ స్లాట్స్ వేగంగా దొరుకుతుండటం, పాస్పోర్ట్ అపాయింట్మెంట్స్ వస్తుండటంతో హైదరాబాద్కు చెందిన పాస్పోర్ట్ ఏజెంట్లు మహ్మద్ జహంగీర్, భూమా శ్రీహరి, గిడ్డా చిన్నా, సయ్యద్ వలీయుద్దీన్, కె.పెంచల్రెడ్డి, ఖలీమ్, శ్రీనివాస్లు వీరికి సబ్–ఏజెంట్స్గా మారిపోయారు. తత్కాల్ పాస్పోర్ట్స్ కోసం తమను ఆశ్రయించే వారి దరఖాస్తులను ఈ–మెయిల్ ద్వారా వారిద్దరికీ పంపడం ప్రారంభించారు. ఈ వ్యవహారాన్నే వ్యాపారంగా చేసుకున్న ‘లతాధర్ అండ్ కో’ దరఖాస్తుదారుల నుంచి భారీగా వసూలు చేసింది. సాధారణంగా తత్కాల్ దరఖాస్తుకు అప్పట్లో రూ.2 వేలు చెల్లిస్తే సరిపోయేది. అయితే ఈ ముఠా సభ్యులు మాత్రం అదనంగా రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేసేవారు. ఈ మొత్తంలో రూ.1000 నుంచి రూ.2000 వరకు సుభానీకి ఇచ్చే వారు. అతను ముఠా సూత్రధారి అయిన లతాధర్కు రూ.500 నుంచి రూ.1000 వరకు కమిషన్ అందించే వాడు. ఈ రకంగా లతాధర్ గ్యాంగ్ కేవలం రెండు నెల్లలో మూడువేల తత్కాల్ పాస్పోర్ట్ దరఖాస్తులు అప్లోడ్ చేశారు. అప్పట్లో సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయం చుట్టూ దాదాపు 20 మంది ఏజెంట్లు ఉండేవారు. ఆన్లైన్ బుకింగ్ స్లాట్స్ సంఖ్య తగ్గించినప్పటి నుంచి వీరిలో కేవలం జహంగీర్, శ్రీహరి, చిన్నా, వలీయుద్దీన్, పెంచల్రెడ్డిలకు మాత్రమే స్లాట్స్ దొరుకుతున్నాయని టాస్క్ఫోర్స్ పోలీసులు గుర్తించారు. వరుసగా ఇలాగే జరుగుతుండటంతో విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వీరిపై నిఘా పెంచిన టాస్క్ఫోర్స్ పోలీసులు జహంగీర్కు చెందిన కంప్యూటర్ను సైబర్ నైపుణ్యం కలిగిన పోలీసులతో తనిఖీ చేయించారు. ఈ కంప్యూటర్ను ఇంటర్నెట్ ప్రొటోకాల్ (ఐపీ) అడ్రస్లు గుర్తించేందుకు వీలు లేకుండా ప్రాక్సీ ఐపీలతో వాడుతున్నట్లు గుర్తించారు. మరోపక్క అనేక పాస్పోర్ట్ ఆన్లైన్ దరఖాస్తులు ఫార్వర్డ్ చేయకుండా ఫిల్ చేసి సిద్ధంగా ఉంచడాన్ని కూడా గుర్తించారు. దీంతో జహంగీర్ను అదుపులోకి తీసుకుని విచారించారు.పాస్పోర్ట్ దరఖాస్తులను ఈ–మెయిల్ ద్వారా నరసరావుపేటకు చెందిన సుభానీకి పంపుతున్నట్లు జహంగీర్ చెప్పడంతో అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం సుభానీని విచారించగా, లతాధర్రావు సహాయంతో చేస్తున్న పనిని బయటపెట్టాడు. లతాధర్రావును అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు విచారించగా ఆన్లైన్ స్లాట్స్ కేటాయింపునకు ఉపయోగపడే పాస్పోర్ట్ వెబ్సైట్కు చెందిన సోర్స్ కోడ్ను హ్యాక్ చేయడం ద్వారా స్లాట్స్ బ్లాక్ చేసి, వాటిని తమ ఏజెంట్ల ద్వారా ఫిల్ చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు లతాధర్రావు, సుభానీ, జహంగీర్లతో సహా ఏడుగురు నిందితులకు 2010 జూన్ 4న అరెస్టు చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఉలిక్కిపడిన పాస్పోర్ట్ కార్యాలయం అధికారులు వెబ్సైట్లో లోపాలు లేకుండా సరిచేసి పకడ్బందీగా తయారు చేశారు.· -
ఈ వారం కథ: ఓ కాయ కాస్తోంది!
‘తుంటిమీద కొడితే మూతి పళ్ళు రాల్తాయా?’ అని ఎవరైనా అడిగితే, ఇదివరకైతే అందరిలాగే ‘‘అలా ఎలా రాలతాయండీ’’ అంటూ దబాయించేసేది ముద్రిక. ఇప్పుడడిగితే, అనుమానంగా చూసి, ‘రాలినా రాలవచ్చు’ అంటోంది! అనుభవం అలాగుంది మరి!కాకపోతే, పుట్టింట్లో ఆమె అక్క పురుడు జరిగితే, అదే సమయంలో మెట్టినిల్లు పీలికల పందిరి అయిపోవటం ఏమిటి?అదేమని ఎవర్ని అడగటానికి ఏముందీ, వాళ్ళాయన నిర్వాకమే అలా ఉన్నప్పుడు?తల పట్టుకు కూర్చుంది ముద్రిక, తన విభుడితో తలపడేదెలాగో, తగవు తెగేదెలాగో తోచక!‘‘నాకు ఆరోగ్యం బాగుండటంలేదే. ఓ రోజు లేస్తే, రెండు రోజులు పడకేస్తున్నాను. ఇటు మీ అక్కనేమో డెలివరీ అయ్యేదాకా బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్లు. చిన్నవాళ్ళు, మిమ్మల్ని విడదీయటం భావ్యం కాదు గాని, తప్పటం లేదు. అల్లుడుగారు ఒప్పుకుంటే, ఈ నాలుగు నెలలూ ఇక్కడికి వచ్చి, అక్క ఓ పాపని ఎత్తుకునే దాకా సాయం చేయగలవా?’’ అని నాలుగు నెలల క్రితం అడిగింది ముద్రిక తల్లి.ముద్రికకి అక్క అంటే చాలా ప్రేమ. పసివయసు నుంచి ఒక్క క్షణం విడిచి ఉండేవాళ్లు కాదు. అక్కకు పెళ్ళై, వెళ్లిపోతున్నప్పుడు ఇద్దరూ గుండెలవిసేలా ఏడ్చారు.‘‘మూడేళ్ల నుంచి, పిల్లలు కలగటంలేదని చింతలో మునిగిపోయిన అక్కకి, ఇన్నాళ్ళకి శుభ ఘడియలు వస్తుంటే, సాయం చేయకుండా ఎలా ఉంటాను? మనం కాస్త ఇబ్బంది పడదాం సుబ్బూ!’’ అంది బెంగ పడుతున్న భర్తతో.శుభప్రదమైన కార్యం కోసం వెళ్తున్నాననుకుంది గానీ, ఉపద్రవం ముంచుతుందని ఆమె కలలో కూడా అనుకోలేదు.విధి విధానం అదే కదా!ఈ నాలుగూ నెలలలోనూ, రెండుసార్లు వచ్చివెళ్ళాడు సుబ్బారావు. వచ్చిన ప్రతిసారీ ఒక్క రోజు మాత్రమే ఉండి వెళ్ళాడు. ఇంకొక్క రోజయినా ఉండమని బ్రతిమాలినా, ‘అమ్మో– నీళ్ళు–నీళ్ళు’ అంటూ కాళ్ళు చెప్పుల్లో దూర్చుకుని పారిపోయేవాడు.‘‘ఎలా ఉంటున్నావ్ సుబ్బూ’’ అని శయ్యా గృహంలో గుండెల మీద తలపెట్టుకుని ముద్రిక బెంగగా అడిగితే, ‘తలపెట్టుకున్న కార్యంలో తల మునకలవుతున్నానని’ చెప్పేవాడు. ఆ మాటలు అర్థం చేసుకునే ప్రయత్నంచేసే తీరికలేక, దొరికిన ఆ కాస్త సమయాన్నీ సద్వినియోగం చేసుకునే కార్యంలో మునిగిపోయేది ముద్రిక.కార్య నిర్వహణానంతరం, నిద్రలో కూరుకుపోయి ఏవేవో కలవరించేవాడు సుబ్రావు.‘అదిగదిగో చిగురింత’ అనేవాడు.‘బుజ్జిముండలు లుకలుకలాడుతున్నాయి’ అని నిద్రలోనే నవ్వుకునేవాడు.‘అంత బావుందా పానీయం? లొట్టలు వేస్తున్నారు?’ అనేవాడు.సగం సగం వినబడే ఈ కొత్తరకం పలవరింతలు అర్థమయ్యేవి కావు ముద్రికకి. ఆమె సీరియస్గా తీసుకోలేదు.కష్టకాలం ముంచుకొస్తుంటే, ఇష్ట సఖుడి మాటలైనా సరే, అర్థంకావు కదా!అక్కకి పండంటి కొడుకు పుట్టాక, ఘనంగా జరిగిన బాలసారెకి వచ్చిన మొగుడితో కలిసి వెనక్కు బయల్దేరింది ముద్రిక. ఇంట్లోకి అడుగు పెడుతూనే ఏదో తేడా కొట్టింది. కిచెన్లోకి వెడుతూనే స్పష్టంగా తెలిసింది.కిచెన్ కమ్ డైనింగ్ రూమ్ సగానికి సగం కుంచించుకుపోయి దర్శనమిచ్చింది. ఆనుకుని ఉండే బాల్కనీ ‘సుబ్బ’రంగా రెట్టింపయి కనిపించింది. పెరిగిన బాల్కనీలో కాలు పెట్టే చోటు కూడా లేకుండా చిన్నవీ, పెద్దవీ మట్టికుండీలు!‘‘ఏమిటిది సుబ్బూ, ఏమిటిదంతా?’’ అయోమయంగా అడిగింది.‘‘కనిపిస్తోందిగా, కిచెన్ గోడ ఇవతలికి జరిపించి, బాల్కనీ వైశాల్యం పెంచేశాను. ఆరోగ్య మహాభాగ్యానికై పెరటి కూరల పెంపకం.’’‘‘ఇదేమిటీ కొత్త వెర్రి?’’ కోపంగా అడిగింది.‘‘నువ్వు వెళ్ళాక, నా మానాన నేను మాడిపోయిన వంట తింటున్నానా, అది చూసి జాలిపడ్డ మా కొలీగ్ మిరియాల్రావ్ నన్ను ఓ ఆదివారం లంచ్కి పిలిచాడు. భోజనంలో వాళ్ళావిడ వడ్డించిన కూరలు నా జిహ్వను గిచ్చి లేపాయి. గుత్తి వంకాయలు నోట్లో కరిగిపోయాయి. కూరలోని బెండకాయలు అంత వేపినా, ‘తగ్గేదిలే’ అంటూ ఆకుపచ్చగా నవనవలాడుతూనే ఉన్నాయి. మడిలోంచి నేరుగా పులుసులో పడితే, కొత్తిమీర ఘుమ ఘుమ అంతగా పెరిగిపోతుందని అవాళే తెలిసొచ్చింది.‘చెల్లెమ్మ వంట అదుర్స్’ అన్నాను తిని లేస్తూ.‘నాదేముంది అన్నయ్యగారూ, రుచి అంతా కూరగాయల్లోనే ఉంది’ అంది చెల్లెమ్మ చిరుగర్వానికి, వినయం చొక్కా తగిలిస్తూ. అప్పుడు తీసుకెళ్ళి చూపించాడు మిరియాల్రావ్ – పెరటి తోట వైభవం. వంగ, బెండ మొక్కలు, దొండ, బీర పాదులు! ఇంకా ఆకుకూరలు– మైక్రో గ్రీ¯Œ ్స అనబడే బుల్లి మొలకలు– ఆహా... అలాగే కోసుకుని, నోట్లో వేసుకోవాలనిపించింది! ఇలా మొత్తం లిస్టు చదివితే, కూరగాయల బండి వాడి కేక గుర్తుకు వస్తుంది నీకు. అపుడు అర్థమయింది నాకు, నా వంట ఎందుకలా అఘోరిస్తోందో! నేరం నాది కాదు – కూరలది! బజార్లో దొరికే కూరల్లో రుచి ఉండట్లేదు, పురుగులు, పుచ్చులు తప్ప. ఆకు కూరలు కొంటే వాటినిండా మచ్చలు, చిల్లులు. మిరియాల్రావ్ ఒక్క పూటే భోజనం పెట్టినా, జీవితకాల భోజనానికి తగ్గ హితబోధ చేసిపారేశాడు.‘శ్రీమతి పుట్టింటికి వెళ్ళినా, ఏ సుబ్బయ్యనీ ఆశ్రయించలేదు నువ్వు. సుబ్బరంగా వొండుకు తింటూ ‘సుబ్బ’రావనే పేరుని సార్థకం చేసుకున్నావు. అంటే, నీకు ఆరోగ్య స్పృహ నిండుగా ఉందన్నమాట. ఇంత స్పృహ ఉన్న నువ్వు ఇక రెండో స్టెప్పు తీసుకోవాలి. బయటి వంటలకే కాదు, బయటి కూరగాయలకి కూడా నీ కిచెన్లో ప్రవేశించే అవకాశం లేకుండా చేయాలి. అప్పుడే, నీ ఆరోగ్యం వంద సంవత్సరాల పాటు వర్ధిల్లుతుంది. పెరటి తోట కోసం పడే శ్రమ, మానసికంగా కూడా ఉల్లాసం ఇస్తుంది. మెంటల్ హెల్త్ అన్నమాట. ఇన్ని లాభాలూ అతి తక్కువ ఖర్చుతోనే! పనికిరావని పారేసే వ్యర్థాలు, మనం మెలకువగా పట్టుకుంటే, పని తీరు ప్రదర్శిస్తాయి! అమలు చేయి నేడు, అనుభవించి చూడు.’మిరియాల్రావ్ సలహాకి పడిపోయాను. మనకి పెరడు లేదు గనుక, బాల్కనీని డిసైడ్ చేసేశాను.ఒంటి రాతి పార్టిషన్ గోడ పడగొట్టి ఇవతలికి జరపటానికి, నాలుగు రోజులు కూడా పట్టలేదు. వెంటనే కుండీలు, మొక్కలు, విత్తనాలు సమస్తం సమకూర్చేశాను – మన వంటింటి తోట రెడీ!’చెప్పటం ఆపాడు సుబ్రావు. ముద్రిక పరిశీలనగా చూసింది. కుండీలన్నిటిలోనూ ఏవేవో మొక్కలు. కొన్ని ఎండిపోతూ, కొన్ని వంగిపోయీ!.‘‘ఇదేమిటీ? ఏ మొక్కకీ పిందెలన్నా లేవు?’’పగలబడి నవ్వాడు సుబ్రావు.‘‘వెనకటికి ఓ అమ్మాయి అశ్వత్థ ప్రదక్షిణం చేస్తూ, అడుగడుక్కీ కడుపు తడిమి చూసుకుందట! అలా ఉందినీ హడావిడి. కాస్తాయ్, కాస్తాయ్. తొందర పడితే అవుతాయా పనులు. ఎంతటి మహర్షి అయినా, తపస్సులో కూర్చోగానే వరం పొందలేడు. పుట్టలు కట్టాలి– జడలు పెరగాలి– ఎన్ని సినిమాలలో చూళ్ళేదూ?’’అతడి ధోరణి సాగిపోతూనే ఉంది.‘‘మొక్కలన్నాక తెగుళ్ళుంటాయ్. పోషణ చూసుకోవాలి. పిచ్చి మొహాలు– ఒక్క పూట నీరు పెట్టకపోతే, దిగాలు పడి చూస్తాయ్. వేళ్ళ కింది నేల గట్టిపడిపోతే, లోపలికి పాకలేక విలవిల్లాడిపోతాయి. పురుగులు పట్టుకుంటే, గిలగిల్లాడతాయి. ఎన్ని ఉంటాయి వాటికి బాధలు! అన్నీ మనమే చూసుకోవాలి.’’అతడిని అతడి ధోరణికి వదిలి లోపలికి వెళ్ళిపోయింది ముద్రిక.మర్నాడు తెల్లవారకముందే గుప్పున వస్తున్న దుర్వాసనకి మెలకువొచ్చిన ముద్రికకి.ప్రక్కనే ఉండే సుబ్రావ్ కనిపించలేదు. ముక్కుకి చున్నీ అడ్డంపెట్టుకుని వాసన వస్తున్నవైపు నడిచింది.అది బాల్కనీలోకి దారితీసింది. అక్కడ సుబ్రావు మూతికి, ముక్కుకీ కలిపి ఓ గుడ్డ చుట్టుకుని, రెండు లీటర్ల ప్లాస్టిక్ సీసాలోంచి, సదరు దుర్వాసనకి హక్కుదారు అయిన నల్లటి ద్రావకం బయటకు తీస్తున్నాడు.‘‘యాక్. ఏమిటిదీ?’’ అనడిగింది ముఖం వికారంగా పెట్టిన ముద్రిక.‘‘అయ్యో, అలా అసయ్యించుకోకూడదు. ఇదేం పరాయి పదార్థం కాదు. మన పళ్ల తొక్కులు, కూరగాయల తొక్కులు, మిగిలిపోయిన కూరముక్కలు, మనం పూజ చేసి తీసేసిన పూలు... వీటన్నిటిని ఇలా ఓ రెండువారాలు ఈ బాటిల్లో బంధించి ఉంచితే, మన మొక్కలకి ప్రియాతి ప్రియమైన పానీయం తయారవుతుంది. అదే ఇది. ఇవిగివిగో చూశావా, ఈ బాటిల్లో... లుకలుకలాడుతున్నాయి బుజ్జి ముండలు... ఇవి రైతు నేస్తం పురుగులు. ఇవి వొచ్చేశాయంటే, ఇంక మన ద్రావకం ముదిరినట్టే. నేలలోకి చొచ్చుకుపోయి, గుల్లబారుస్తూ, మొక్కల వేళ్ళకి దారి చేస్తాయి ఇవి. ఒక లీటరు నీళ్ళలో వంద గ్రాముల పానీయాన్ని గనక కలిపి, మొక్కలకి తాగించామంటే ...’’ముక్కుతో పాటు చెవులు కూడా మూసుకుని లోపలికి పరుగెత్తింది ముద్రిక. తల తిప్పుకుని, తన పనిలో పడిపోయాడు సుబ్రావు.మర్నాడు మధ్యాహ్నం కునుకు తీస్తున్న ముద్రికని బెల్లు కొట్టి లేపాడు అమెజాన్ వీరుడు.‘ఏం తెప్పించాడబ్బా ఈ మహానుభావుడు?’ అనుకుంటూ వెళ్లి సుబ్రావు పేరుమీదున్న పార్సిల్ అందుకుంది.తొమ్మిదొందల డెబ్భై రూపాయలు వసూలు చేసుకుపోయాడు వాడు. తెరిచి చూసిన ముద్రిక తెల్లబోయింది.పాకెట్లో వేపాకులు!‘వేపాకులు అమెజాన్ నుంచి? ఏం చేసుకుంటారు? ఇవీ మొక్కలకేనా?’‘‘అవును. వీటిని మిక్సీలో గ్రైండ్ చేసి, వేపాకు ముద్ద నీళ్ళలో కలిపి, ఒక రాత్రి నిద్ర చేయిస్తే, మహత్తరమైన పురుగుల మందు తయారవుతుంది. నిద్ర చేసిన వేపరసాన్ని వడగట్టి, ఆ పసరు నిలవ చేసుకోవచ్చు. వారానికి ఒకసారి వంద గ్రాముల వేప పసరు ఒక లీటరు నీళ్ళలో కలిపి...’’సాయంత్రం రాగానే, ప్యాకెట్ విషయం చెప్పిన అర్ధాంగికి వివరించబోయిన సుబ్రావు ముద్రిక సగంలోనే నిష్క్రమించిన వైనం గమనించి నిట్టూర్చాడు –‘దీనికి మొక్కలమీద ఎప్పటికి ప్రేమ ఏర్పడేనో... ఏమో..’నాలుగు రోజుల తరవాత పొద్దునే వచ్చింది రావమ్మ ,‘‘తెచ్చావా రావమ్మా’’ అన్నాడు సుబ్రావు తలుపు తీసి.‘‘ఆయ్...’’ అంటూ ఒక పెద్ద ప్లాస్టిక్ సంచిలో తెచ్చిన ఆవుపేడ అందించింది రావమ్మ. మరో బాటిల్ విడిగా ఇస్తూ, ‘‘మూత్రవండి’’ అంది.బెడ్రూమ్లోంచి వచ్చిన ముద్రికకి చెప్పాడు సుబ్రావ్,‘‘ఏం లేదు. తాజా గోమయం, గోమూత్రం తెప్పించాను. ఈ రెండింటినీ కలిపి తొట్టెలో పోసి, ఆరారగా కర్రతో కలియతిప్పుతూ మూడు నిద్రలు చేయిస్తే, భేషయిన ఫెర్టిలైజర్ తయారౌతుంది. దాన్ని నాలుగింతల నీటిలో కలిపి....’’‘‘మనమేమైనా ఓ ఎకరం పొలం కొంటున్నామా? ఎందుకింత హడావిడి? ఒక్క మొక్క అయినా పైకి వచ్చి, కాయ కాయలేదు.’’‘‘చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నారు పెద్దలు. పెరటి తోటే కదా అని అశ్రద్ధ చేస్తే, ఫలసాయమూ అలాగే ఉంటుంది. శ్రద్ధ తీసుకోవటానికి ఎకరాలే అక్కర్లేదు. శ్రద్ధగా పెంచాలన్న మనసుంటే చాలు.’’‘‘కావచ్చు. కానీ, మన టూ బెడ్ రూమ్ ఫ్లాట్లో ఎరువుల తయారీ పెడితే, ఫ్లాటంతా కంపు కొడుతోంది కదా!’’అనునయంగా చెప్పాలని చూసింది.‘‘చూడు ముద్రీ, మన రైతన్నలు ఇలాగే కంపుకి జడిసి, దూరంగా ఉంటే, మన నాలుగు వేళ్ళూ నోట్లోకి వెళ్ళేవా? మనం ఈ మాత్రమైనా చేసి, వారి బాట మనకి పూబాట అని చాటనవసరం లేదా?’’భర్త అంత హెవీ డైలాగులు చెప్తుంటే, భరించలేక సీన్లోంచి నిష్క్రమించింది ముద్రిక.అంతటితో ఆగలేదు. ఆ ఆదివారం పెద్ద దుకాణమే పెట్టుక్కూర్చున్నాడు సుబ్రావ్.ముద్రిక కన్నా ముందే కిచెన్లోకి దూరాడు. అల్లం, వెల్లుల్లి, పచ్చి మిరపకాయలు కలిపి, నీళ్ళు పోస్తూ మిక్సీలో మెత్తగా రుబ్బాడు. ఆ మిశ్రమాన్ని ఒక పెద్ద బాటిల్లో నింపి, 3ఎ సొల్యూషన్ అని రాసి పెట్టుకున్నాడు.ఆ ఘాటుకి కళ్ళు మండి, ముక్కులోంచి, చెవులలోంచి పొగలు వచ్చి, ఫ్రేమ్లోంచి పారిపోయింది ముద్రిక.తరవాత ఒక గిన్నెలో ముందే సిద్ధంగా ఉంచుకున్న అరటికాయ, పండు తొక్కల్ని, ఉల్లి పొట్టుని వేసి, నీళ్ళు పోసి, అరగంట సేపు బాగా ఉడకబెట్టాడు.మధ్యలో వచ్చింది ముద్రిక, ‘‘ ఏమిటి సుబ్బూ, ఇవేళ బ్రేక్ఫాస్ట్ నువ్వే తయారు చేస్తున్నావా?’’‘‘బ్రేక్ఫాస్ట్ కాదు, లంచ్. మనక్కాదు, మొక్కలకి. ఇవేళ్టికి కాదు, పై వారానికి.’’ సీరియస్గా చెప్పాడు సుబ్రావ్, తల తిప్పకుండా.తల కొట్టుకు వెళ్లిపోయింది ముద్రిక, స్విగ్గీకి ఫలహారాల ఆర్డరు పెట్టటానికి.అదేం పట్టించుకోకుండా, మరిగిన నీళ్ళని వడగట్టి మరో బాటిల్లో నింపాడు. ఉత్సాహంగా హాల్లోకి వచ్చి చెప్పాడు,‘‘మొక్కలకి ఊరగాయలు రెడీ! ఈ ద్రావకాలు ఏటికేడాదీ నిలవ వుంటాయి. రెండు వారాల కొకసారి లీటరు నీళ్ళలో వంద గ్రాముల ద్రావకం కలిపి, మొక్కలకి పోశామనుకో, లొట్టలేసుకుంటూ తాగుతాయి. దిట్టంగా పెరుగుతాయి.’’జవాబు చెప్పలేదు ముద్రిక – ఆ తరవాత కూడా, చాలా రోజుల దాకా! సుబ్రావు కిచెన్ తోట పెంపకం సాగుతూనే ఉంది – కిచెన్లోంచి రకరకాల పోషకాలు వెళ్తూనే ఉన్నాయి. ఇంకా తోటలోంచి వంటలోకి దిగుబడులు మాత్రం మొదలు కాలేదు, ఎప్పుడన్నా ఓ కొత్తిమీర ఆకు, నాలుగు మెంతి ఆకులు తప్ప. ఒక వంగ చెట్టు తాడెత్తున పెరిగింది గాని, అది పోతు మొక్క అన్నారు. దానికి విగ్రహపుష్టి తప్ప, ఒక్క పువ్వు కూడా పూయలేదు, ఒక్క కొమ్మక్కూడా కడుపు పండలేదు! బెండ మొక్కలు పెరిగాయి గానీ, వాటి కాయలు కంచంలోకి వచ్చే ముందే, పురుగులు ఎగరేసుకు పోయాయి – ముక్కలు గిల్లుకుంటూ. వేసిన సేంద్రియ ఎరువులు ఎటు పోయాయో తెలియదు.‘ఇలా కాదు – ఇలా కాదు’ అనుకున్నాడు సుబ్రావు, ‘ఇంకా ఏదో చేయాలి’ అని గొణుక్కున్నాడు.‘ఏదో చేయాలి’ అన్న విషయంతో ముద్రిక కూడా ఏకీభవించింది.‘పెరటి తోట పెంపకం– హరిత విప్లవం– పర్యావరణ పరిరక్షణ – ఆలోచనలన్నీ మంచివే. అయితే, వంద అడుగుల చదరంలో వెయ్యి మొక్కలు పెంచటం, లీటర్ల కొద్దీ ద్రావకాలు పొయ్యటం, ఉన్న రెండు గదుల్లోనూ కంపు కొట్టే సంచులు నింపటం... మొక్కలతో పాటు మన ఆరోగ్యం కూడా కాస్త చూసుకోవాలి కదా! కన్ను సైజుని బట్టే కదా కాటుక పెట్టుకోవాలి!’ అనుకుంది.‘తిన్నంత తేలిక కాదు కూరలు వండటం – కొన్నంత తేలిక కాదు వాటిని పెంచడం’ అన్న విషయం ఇతగాడికి ఎలా తెలియచెప్పాలబ్బా?’ఏం చేయాలో ఓ క్లారిటీ వచ్చేసరికి, కాలమూ కలిసొచ్చింది – బహు విధాలా!వారం రోజుల కోసం హెడ్డాఫీసుకి టూరు వెళ్ళిన సుబ్రావు తిరిగి వచ్చేసరికి సీను మారిపోయింది.బాల్కనీలో ఒక్క కుండీ లేదు. అంతా చదునుగా విశాలంగా ఉంది. మట్టి కొట్టుకు మాసిపోయిన పాలరాతి పలకలు బయటపడి మెరుస్తూ కనుపించాయి.‘‘మై గాడ్! నా కుండీలు, నా మొక్కలు...’’ అంటూ చిందులు తొక్కబోయాడు సుబ్రావు.గోముగా అతడి భుజంమీద తలపెట్టి, తలపెట్టిన పథకం చెప్పేసింది ముద్రిక.‘‘ఇదీ ఆరోగ్య ప్రణాళికే సుబ్బూ! రేపు వచ్చే బుల్లి సుబ్బారావు ఈ బాల్కనీలోనే పాకుతూ పెరగాలి. ఈ మట్టిలోనూ, కుండీల మధ్య ఎలా.. అందుకే నేను వీటిని తీయించేసి, బాల్కనీ కడిగించేశాను.’’ఒక్క క్షణం ఒళ్ళు మండిపోయింది– ఆనక ఆమె మాటలు స్లో మోషన్లో బుర్రలోకి చొరబడ్డాయి. కొండలమాటు చంద్రబింబంలా సుబ్రావు ముఖం మీదికి నెమ్మది నెమ్మదిగా విస్మయంతో కూడిన చిరునవ్వు ఎక్కి వచ్చింది.‘‘అహ్హో .. ఒహ్హో .. అంటే... మనకో బుల్లి సుబ్రావు...’’‘‘మరో ఏడు నెలల్లో...’’ జవాబు చెప్తూ గబుక్కున సిగ్గుపడి, సుబ్రావు ఎదనే ముఖానికి కప్పేసుకుంది ముద్రిక. సుబ్రావు ఉత్తేజితుడైపోయాడు– ‘ఓ కాయ కాస్తోంది!’ఒక వంగ చెట్టు తాడెత్తున పెరిగింది గాని, అది పోతు మొక్క అన్నారు. దానికి విగ్రహ పుష్టి తప్ప, ఒక్క పువ్వు కూడా పూయలేదు, ఒక్క కొమ్మక్కూడా కడుపు పండలేదు! బెండ మొక్కలు పెరిగాయి గానీ, వాటి కాయలు కంచంలోకి వచ్చే ముందే, పురుగులు ఎగరేసుకు పోయాయి.నాదేముంది అన్నయ్యగారూ, రుచి అంతా కూరగాయల్లోనే ఉంది’ అంది చెల్లెమ్మ చిరుగర్వానికి, వినయం చొక్కా తగిలిస్తూ. అప్పుడు తీసుకెళ్ళి చూపించాడు మిరియాల్రావ్ – పెరటి తోట వైభవం. -
జపానీ జిందగీ
మనిషై పుట్టాక ఊహించని ఉత్పాతాలు, ఉలిదెబ్బలు, ఉలికిపాటులు తప్పవు! అందుకే ‘మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే/ మనసున్న మనిషికి సుఖము లేదంతే’ అన్నారు ఆత్రేయ! అయితే ‘మనసు ఉండాలే కాని, సుఖశాంతులను మనంతట మనమే సొంతం చేసుకోవచ్చు’ అంటున్నారు జపనీయులు.‘మదిలో ఎంత అనురాగం నిండితే అంత వైరాగ్యం’ ఇది మనిషిని స్థిరచిత్తుడిగా మార్చగలిగే గొప్ప మంత్రం! కానీ రాగద్వేషాల నియంత్రణలో ఓటమి లేని కథలు చాలా అరుదు! కాలంతో పరుగులు తీయడం, కాలం రాయని రాతల కోసం తహతహలాడటం, గడచిపోయిన గతాన్ని పదేపదే విశ్లేషించుకోవడం, మిగిలి ఉన్న వయసుని లెక్కలేసుకోవడం ఇవే, ఇవే మనిషికి తీరని వేదనలు. వాటికి తోడు మరణ భయం! ఆ భయం ఊహ తెలిసినప్పటి నుంచి వేధించే మనోగతం! అదెప్పటికీ తప్పని, తప్పించుకోలేని జీవన చక్రం! మనిషిని, మనసునీ అతలాకుతలం చేసే ఆ నిర్వేదం నుంచి బయటపడటానికే ఇప్పుడు ప్రపంచమంతా జపనీయుల వైపు చూస్తోంది. వారు అవలంబించే కొన్ని జీవన విధానాలు మనసుని కుదుటపరుస్తాయట. మనిషిని ఆనందకేళిలో విహరింపజేస్తాయట! అసలేంటా జపాన్ సిద్ధాంతాలు? అవి అంత గొప్పవా?సంతృప్తికరమైన జీవితాన్ని పొందడానికి జపాన్ లో చాలా సిద్ధాంతాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రస్తుతం ప్రపంచవాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. ఇంచుమించు ఒకేలాంటి భావాలతో, లోతైన అర్థాలతో రూపొందిన వారి జీవిన విధానం గొప్ప తాత్వికతకు నిదర్శనం! వాటిలో కొన్ని, శతాబ్దాల నాటి సంస్కృతిలో ముడిపడినవి కాగా, మరికొన్ని ఆధునిక జీవనశైలితో తలపడేవి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి, జీవిత పరమార్థం తెలుసుకోవడానికి ఆ జీవన విధానాలు వేస్తున్న బాటలేంటీ?జీవితంలో అహ్లాదాన్ని నింపుకోవడానికి జపనీస్ తత్త్వశాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోవాలంటే.. ముందుగా అక్కడ అత్యంత ప్రాచుర్యం పొందిన ‘ఇకిగాయ్’ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. ఇకిగాయ్లో ‘ఇకి’ అంటే జీవితం, ‘గాయ్’ అంటే విలువ లేదా ప్రయోజనం. ఇది జీవితానికి ఒక కారణాన్ని, ఉద్దేశ్యాన్ని ముందుగానే నిర్ధేశించుకోమని చెబుతుంది. రోజు మొదలయ్యేందుకు ఒక కారణాన్ని ఏర్పరచుకుని ప్రయాణించడం ఉత్తమమని బోధిస్తుంది. ఇందులో ప్రధానంగా నాలుగు అంశాలున్నాయి. ఆ నాలుగింటినీ ఒకదానితో ఒకటి మిళితం చేసుకోగలిగినప్పుడు మనం ఇకిగాయ్ అనే లక్ష్యాన్ని సాధించినట్లే. అందుకు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ నాలుగు ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.‘మీరు దేనిని ప్రేమిస్తారు?’ అనేది మొదటి ప్రశ్న. దానికి అనుబంధంగా మీ అభిరుచులు, హాబీలు, ఏ పని చేసినప్పుడు మీరు సమయం గురించి మర్చిపోగలరు? సంతోషంగా ఉండగలరు? అనే అంశాలన్నీ ఆ ప్రశ్నతో పాటే ఉద్భవిస్తాయి. ‘మీ నుంచి ప్రపంచానికి ఏం అవసరం?’ అనేది రెండవ ప్రశ్న. దానిలో భాగంగా ‘మీ చుట్టూ ఉన్న సమాజానికి లేదా ప్రపంచానికి మీరు ఎలా సహాయపడగలరు? ఏ సమస్యలను పరిష్కరించగలరు? సమాజంలో దేన్ని సరిచేయగలరు?’ అనే అంశాలు తోడవుతాయి. ‘మీరు దేనిలో సమర్థులు?’ ఇది మూడవ ప్రశ్న. దానికి అనుబంధంగా మీ నైపుణ్యాలు, ప్రతిభ, మీకు సహజంగా వచ్చే పనులు అన్నీ లెక్కలోకి వస్తాయి.‘దేని నుంచి మీరు డబ్బు పొందగలరు? లేదా సంపాదించుకోగలరు’ ఇది నాలుగవ ప్రశ్న. ఈ ప్రశ్నతో ఇకిగాయ్ సంపూర్ణమవుతుంది. దీనిలో మీ నైపుణ్యాలు, ప్రతిభలను ఉపయోగించి మీరు జీవనోపాధిని ఎలా పొందగలరు?’ అనేది నిర్థారించుకోవచ్చు. ‘ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానాలు దొరికి, ఒకదానితో ఒకటి కలిసే చోట, మీ ఇకిగాయ్ ఏర్పడుతుందని జపనీస్ సంస్కృతి చెబుతుంది.జపాన్ లో, ముఖ్యంగా ఒకినావా వంటి ప్రాంతాలలో ఎక్కువ మంది ప్రజలు నూరేళ్లకు పైగా, సంతోషంగా జీవిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఇకిగాయ్ అని అక్కడి వారు చెబుతున్నారు. తమ జీవితానికి ఒక స్పష్టమైన ఉద్దేశ్యం ఉండటం వల్లే, వారు రోజూ ఉత్సాహంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవిస్తారట.మా అనేది రెండు వస్తువుల మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని లేదా రెండు సంఘటనల మధ్య ఉన్న విరామాన్ని సూచిస్తుంది. ఆ ఖాళీకి కూడా విలువ ఉంటుందని, ఇది కేవలం శూన్యం కాదని జపనీయులు నమ్ముతారు. సంగీతంలో రెండు స్వరాల మధ్య ఉండే నిశ్శబ్దం, మాటల మధ్య ఏర్పడే చిన్నపాటి విరామం.. ఇవన్నీ ఇందుకు ఉదాహరణలుగా ఈ సిద్ధాంతం చెబుతుంది. మా అనేది ఆలోచించడానికి, ప్రతిబింబించడానికి, అర్థాన్ని కనుగొనడానికి కొంత శూన్యాన్ని సృష్టిస్తుంది. ఆ శూన్యమే మనసుని తేలిక పరుస్తుందని ఈ సిద్ధాంత సారాంశం. జీవితంలో తొందరపడకుండా, ప్రతి క్షణాన్ని ఆస్వాదించమని చెప్పడమే మా ఉద్దేశం.నూరేళ్ల జీవనంప్రపంచ ఆరోగ్య లెక్కల ప్రకారం భారతీయుల సగటు ఆయుర్ధాయం 69 నుంచి 70 సంవత్సరాలు. 80 నుంచి 100 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జీవిస్తున్న వారి దేశాల జాబితాలో జపాన్ ముందువరసలో ఉంది! అయితే మలిదశలో కూడా జపనీయులు చాలా సంతోషంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తున్నారట! అందుకు వారి జీవన విధానమే ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు.జపనీయులు ఎల్లప్పుడూ బెస్ట్ హెల్త్ కేర్ సిస్టమ్ని పాటిస్తారు. ఎప్పటికప్పుడు ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకునేందుకు ఆరోగ్య సంస్థలు పనిచేస్తుంటాయి. అవి ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాయి.చాలామంది జపనీయులు ఎంత రుచికరమైన ఆహారాన్ని తింటున్నా 80 శాతం కడుపు నిండాక ఆపేస్తారు. అలా చేస్తే దీర్ఘాయువు కలిగి ఉంటామని అక్కడి ప్రజలు నమ్ముతారు.జపాన్ ప్రజలు వయసు పైబడిన తమ కుటుంబ సభ్యులను ఒల్డ్ ఏజ్ హోమ్లకు పంపించరు. కుటుంబ సభ్యుల సంరక్షణ బాధ్యతను చూసుకోవడం వారి సంప్రదాయంగా భావిస్తారు. వృద్ధాప్యంలో కుటుంబంతో కలిసి జీవిస్తే మానసికంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయని, సంతోషంగా జీవిస్తారని, పెద్దలతో కలిసి జీవనం సాగిస్తే భవిష్యత్తుకి ఉపయోగకరమని అక్కడి వారు నమ్ముతారు.నిజానికి జపనీయులు అధిక పరిశుభ్రతను పాటిస్తారు. అక్కడ చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యానవనాలు, రోడ్లు, పబ్లిక్ ప్రదేశాలు కూడా చాలా పరిశుభ్రంగా ఉంటాయి.జపాన్ ప్రజలు నెమ్మదిగా, నమిలి నమిలి తినే శైలిని ఇష్టపడతారు. ఒకే పెద్ద ప్లేట్లో కాకుండా చిన్నచిన్న ప్లేట్లలో లేదా చిన్నచిన్న బౌల్స్లో ఆహారాన్ని తినడానికి ప్రాధాన్యమిస్తారు.అక్కడివారు ఎక్కువగా తినే సమయంలో టీవీ చూడటం, సెల్ ఫోన్ వాడటం వంటివి చేయకుండా కుటుంబ సభ్యులంతా కలిసి తింటుంటారు, పైగా చాలామంది డైనింగ్ టేబుల్స్, కుర్చీలు వాడకుండా నేలపై కూర్చుని భోజనం చేయడానికి ఇష్టపడతారు.జపనీస్ ప్రజలు సమతుల ఆహారాన్ని తీసుకుంటారు. పండ్లు, తృణధాన్యాలు, సోయా, ఆకు కూరలు ఎక్కువగా తీసుకుంటారు. వారు తీసుకునే ఆహారాలన్నీ తక్కువ మొత్తంలో కొవ్వులు, చక్కెరలను కలిగి ఉంటాయి. వీటిలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. దాంతో గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి బయటపడవచ్చు. వారు తీసుకునే ఆహారం వల్లే జపాన్ లో ఊబకాయం రేటు చాలా తక్కువగా ఉందని తేలింది.జపాన్లో అన్ని వయసుల వారు నడవడానికే ఇష్టపడతారు. సమీపంలోని ఉన్న గమ్యస్థానాలకు నడిచి వెళ్లిపోతుంటారు. లేదంటే సైకిల్ వాడతారు. అలాగే బాతాఖానీ వేసేటప్పుడు ఎక్కువగా నేలపైనే కూర్చుంటారు. ఈ పద్ధతుల వల్ల పేగులకు, కండరాలకు మంచి వ్యాయామం అవుతుంది. వారి ఆయుర్దాయం పెరగడానికి అవి కూడా దోహదం చేస్తున్నాయి.మొత్తానికి జపనీయులు– సమతుల ఆహారాన్ని తీసుకోవడంతో పాటు ఇతరులకు సహాయం చేయడం, ప్రతి దానిపట్ల కృతజ్ఞతతో ఉండటం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రేమగా కలిసి జీవించడం ఇలా ఎన్నో అంశాలు వారి ఆయుర్దాయాన్ని రెట్టింపు చేస్తున్నాయి.సమస్యల వలయంలో జపాన్ లో జననాల రేటు చాలా తక్కువగా ఉంది, అదే సమయంలో, వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీనివల్ల పని చేసేవారి సంఖ్య తగ్గి, సామాజిక భద్రత, ఆర్థిక వ్యవస్థపై భారీ భారం పడుతోంది. 2060 నాటికి జపాన్ జనాభా 8.67 కోట్లకు పడిపోవచ్చని అంచనా!మరోవైపు వివిధ నివేదికల ప్రకారం, జపాన్లో 15 సంవత్సరాల లోపు పిల్లల సంఖ్య సుమారు 13.7 మిలియన్లు ఉండగా.. ఆ దేశప్రజలు పెంచుకుంటున్న కుక్కలు, పిల్లుల సంఖ్య కలిపి 15.9 మిలియన్లకు పైగా ఉంది. జపాన్ సమాజంలో ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి పెంపుడు జంతువులను ఆశ్రయిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఈ సమస్యలను పక్కన పెడితే, ఎక్కువ కాలం సంతోషంగా జీవిస్తున్న వారి సంఖ్య జపాన్లో ఎక్కువగా ఉండటంతో ప్రపంచ దేశాలు వారి జీవన విధానంపై దృష్టిపెడుతున్నాయి.యుటోరిఇది జపాన్ లో ఒక విశిష్టమైన భావన. దీనిని తెలుగులో ‘మనసుకి విశ్రాంతినివ్వడం’ లేదా ‘సమయం కేటాయించడం’ అని చెప్పవచ్చు. ఆధునిక ప్రపంచంలో మనం నిరంతరం పరుగులెత్తుతూ, పనిఒత్తిడిలో మునిగిపోతూ, మనసుకి అవసరమైన విరామాన్ని ఇవ్వాలని ఈ సిద్ధాంతం చెబుతోంది.యుటోరి అంటే కేవలం విశ్రాంతి తీసుకోవడమే కాదు, ఇది జీవితంలోని ఆనందాన్ని గుర్తించడానికి ఉద్దేశపూర్వకంగా సమయం కేటాయించుకోవడం కూడా! మరి అందుకేం చెయ్యాలి?వేగాన్ని తగ్గించుకోవాలి – ప్రతి పనిని తొందరగా పూర్తి చేయాలనే ఒత్తిడిని పక్కన పెట్టి, నెమ్మదిగా చేయడం అలవరచుకోవాలి.చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించుకోవాలి– మన చుట్టూ ఉన్న ప్రకృతిని, జీవితంలోని చిన్న చిన్న అద్భుతాలను గమనించడానికి మనసుకు కాస్త సమయం ఇవ్వాలి. ఉదాహరణకు, ఉదయం సూర్యోదయాన్ని చూడడం, ఒక పూలమొక్కను పరిశీలించడం, పక్షుల కిలకిలరావాలు వినడం ఇవన్నీ మనసుని ఉత్తేజపరుస్తాయి.సహజంగా శ్వాస తీసుకోవాలి– నిజానికి ఉరుకుల పరుగుల జీవనంలో కొన్ని రోజుల పాటు మనం ఊపిరి పీల్చుకునే విధాన్ని కూడా గమనించకుండా గడిపేస్తాం. ఒక్క క్షణం ఆగి ఆ పక్రియను గమనిస్తుండాలి. శ్వాస తీసుకోవడాన్ని గమనిస్తే, మనసుకు ఎనలేని హాయి కలుగుతుంది. ధ్యానం, ప్రాణాయామం ఈ తరహాకు చెందినవే!మానసిక విరామం పొందాలి– పనికి, ఆలోచనలకు ఒక విరామమిచ్చి, మనసును ఖాళీగా ఉంచడం నేర్చుకోవాలి.వీటన్నింటినీ పాటిస్తూ మన జీవితాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రశాంతంగా మార్చుకోవడమే యుటోరీ లక్ష్యం. ఇది మనస్సుకి ప్రశాంతతను అందించి, జీవితాన్ని మరింత అర్థవంతంగా మారుస్తుంది.మోటైని మోటైని అంటే ‘వృథా చేయవద్దు’ లేదా ‘విలువను గుర్తించు’ అని అర్థం. ఏదైనా వస్తువు, సమయం, శక్తి లేదా వనరులను వృథా చేయకుండా, వాటిని పూర్తిగా వినియోగించుకోమని ఈ సిద్ధాంతం చెబుతుంది. సృష్టిలో ప్రతిదానిపైనా కృతజ్ఞత కలిగి ఉండాలని, ప్రతిదానికీ విలువను, గౌరవాన్ని ఇవ్వాలని ఇది చెబుతుంది. ఉదాహరణకు మిగిలిపోయిన ఆహారాన్ని పారవేయకుండా తినడం, పాత వస్తువులను, వస్త్రాలను తిరిగి ఏదో ఒక రూపంలో వినియోగించడం వంటి ఎన్నో విలువలను ఇది నేర్పిస్తుంది.షిన్–రిన్ యోకు ఇది జపనీయుల మానసిక చికిత్సా విధానంలో ఒక పద్ధతి. షిన్–రిన్ యోకు అంటే ‘ప్రకృతిలో లీనం కావడం’ అని అర్థం. ఇది ప్రకృతిలో, ముఖ్యంగా సురక్షితమైన అటవీ ప్రాంతాల్లో గడిపే ఒకరకమైన వైద్య విధానం. ఇది అడవిలోని ప్రశాంతతను, శబ్దాలను, సువాసనలను, దృశ్యాలను మనసారా పంచుకోమని చెబుతుంది. చెట్ల సువాసనలను పీల్చడం, పక్షుల కిలకిలరావాలు వినడం, ప్రకృతి అందాలను తాకడం, ప్రకృతితో మమేకం కావడం ఇలా ప్రతి అనుభూతిని మన పంచేంద్రియాలతో పూర్తిగా ఆస్వాదించడమే దీని ముఖ్య ఉద్దేశం. అడవుల్లోని ప్రశాంత వాతావరణం, మొక్కల నుంచి వెలువడే కొన్ని రకాల సుగంధాలు ఒత్తిడిని తగ్గించి, మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. రక్తపోటును తగ్గించడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఈ విధానం ఎంతగానో తోడ్పడుతుంది. ప్రకృతిలో గడిపినప్పుడు మనసు తేలికపడి, ఏకాగ్రత పెరుగుతుంది. ఇది ఆధునిక జీవితంలో ఏర్పడే ఒత్తిడి, ఆందోళనల నుంచి బయటపడటానికి ఒక సహజమైన, ప్రభావవంతమైన మార్గంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది.వాబీ– సాబీ అసంపూర్ణతలోనూ అందం ఉంటుందని చెప్పే గొప్ప తాత్త్వికత ఇది. ప్రతి వస్తువు, ప్రతి మనిషి అసంపూర్ణమేనని చెప్పడంతో పాటు, అందులో కూడా ఒక ప్రత్యేకమైన సౌందర్యం ఉందని, దాన్ని చూడటం నేర్చుకోమని ఈ సిద్ధాంతం చెబుతుంది. నిజానికి దీని ప్రకారం పరిపూర్ణత అనేది ఒక భ్రమ. ఉదాహరణకు పాతబడిన చెక్క బల్లలోనూ, పగిలిన కప్పులోనూ అందాన్ని వెతకగలిగినప్పుడే జీవితాన్ని ఆస్వాదించగలమట. ‘కాలంతో పాటు వచ్చే మార్పులు, పగుళ్లు, లోపాలు, ముడతలు ఇవన్నీ చాలా కథలను చెబుతాయి. వినగలిగితే అవెంతో అద్భుతంగా ఉంటాయి’ అని చెబుతుంది ఈ సిద్ధాంతం. దీని ప్రకారం, లోపాలను లోపాలుగా చూడకుండా వాటిని జీవితంలో ఒక భాగంగా స్వీకరించడంతో, జీవితం పట్ల ఒక కొత్త దృక్పథం ఏర్పడుతుందని వివరిస్తుంది. ఈ విధానాన్ని అనుసరిస్తే మనకు జీవితంలోని మార్పులను, వృద్ధాప్యాన్ని కూడా అంగీకరించగలిగేంత ఓర్పు, నేర్పు అలవడుతుంది.షోషిన్ షోషిన్ అనే సిద్ధాంతం ‘ఎంతటి జ్ఞాని అయినా ఎల్లప్పుడూ జిజ్ఞాసతో జీవించాలి’ అని చెబుతుంది. అంటే ఎంత జ్ఞానమున్నా, ఎంత తెలుసుకున్నా, ‘నాకు అన్నీ తెలుసు’ అని భావించకుండా, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలట. నిత్యం కుతూహలంతో, పూర్వపు ఆలోచనల ప్రభావం మనసుపై లేకుండా ప్రతిదాన్ని స్పష్టంగా చూడమని, తెలుసుకోమని ఈ విధానం ప్రోత్సహిస్తుంది. దాంతో సృజనాత్మకత పెరుగుతుంది. అలాగే భయం లేకుండా కొత్తకొత్త ప్రయోగాలు చేయగలిగే సత్తా ఏర్పడుతుంది. దాని వల్ల కూడా ఒక సంతృప్తి ఏర్పడుతుంది.నిజానికి ఎంత గొప్ప నియమమైనా, ఎంత గొప్ప విధివిధానమైనా వివరించి, విశ్లేషించి, అనుభవపూర్వకంగా తెలుసుకుని సిద్ధాంతాలుగా మార్చడమే గొప్ప అనుకుంటే పొరబాటు! దాన్ని తు.చ. తప్పకుండా పాటించి, తాము పాటించిన తత్త్వాన్ని తర్వాత తరాలకు అందించడమే అసలైన గొప్పతనం! అదే చేస్తున్నారు జపనీయులు! గమాన్గమాన్ అంటే సహనం లేదా ఆత్మనిగ్రహం అని అర్థం. సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు కూడా నిశ్చలంగా, గౌరవంగా ఉండమని ఈ భావన సూచిస్తుంది. సమస్యలకు కష్టాలకు నిరాశ చెందకుండా, ఎవరితో చర్చించకుండా, ఫిర్యాదులు చేయకుండా, నిశ్శబ్దంగా పరిస్థితులను ఎదుర్కోమని చెబుతుంది. జపనీస్ సంస్కృతిలో, గమాన్ అనేది ఒక బలమైన లక్షణం. ఇది వ్యక్తిగత కష్టాలను ఎదుర్కోవడానికి, సంఘంలో సామరస్యాన్ని కొనసాగించడానికి ఎంతగానో సహాయపడుతుంది. -
గిన్నిస్లో గణపయ్య..!
గిన్నిస్లో గణపయ్యవినాయకుడు దేశ విదేశాల్లో కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవం. పురాతన కాలం నుంచి వినాయకుడి ఆలయాలు పలు దేశాల్లో ఉన్నాయి. గుజ్జు రూపంలో ఉండే బొజ్జ గణపయ్యను పిల్లలు అమితంగా ఇష్టపడతారు. విలక్షణంగా కనిపించే వినాయకుని విగ్రహాలు జనాలను అమితంగా ఆకట్టుకుంటాయి. వీథుల్లో వెలిసే మండపాల్లో కనిపించేవిగ్రహాల సంగతి సరే సరి, ‘గిన్నిస్’కెక్కిన వినాయకుడి విగ్రహాల గురించి తెలుసుకుందాం.అత్యధిక వినాయక విగ్రహాల సేకరణఅత్యధిక సంఖ్యలో వినాయక విగ్రహాలను సేకరించిన ముంబై మహిళ రమా షా గిన్నిస్ రికార్డు సాధించారు. ముంబైలోని సాయన్ భగినీ సమాజ్ భవనంలో 2014 నవంబర్14న ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఆమె తాను సేకరించిన 18,181 వినాయక విగ్రహాలను ప్రదర్శించారు. వీటిలో రకరకాల పరిణామాలకు చెందినవి ఉన్నాయి. రకరకాల ముడిపదార్థాలతో తయారు చేసిన విగ్రహాలు ఉన్నాయి. గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఈ ప్రదర్శనను సందర్శించి, ఆమెకు సర్టిఫికెట్ను బహూకరించారు. ఆ తర్వాత రెండేళ్లకు 2016 ఆగస్టు 23న ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఆమె ఏకంగా 1.50 లక్షల వినాయక విగ్రహాలను ప్రదర్శించి, తన రికార్డును తానే బద్దలు కొట్టారు. గిన్నిస్బుక్ ఈ రికార్డును కూడా గుర్తించి, రమా షాకు సర్టిఫికెట్ ఇచ్చింది. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఈ రికార్డును నమోదు చేసుకుంది. పదకొండేళ్ల వ్యవధిలో ఆమె ఈ విగ్రహాలను సేకరించారు. కళ్లకు గంతలు కట్టుకుని...చిన్ననాటి నుంచి కళలపై మక్కువ ఉన్న రమా షా చిత్ర, శిల్ప కళలలో సాధన చేశారు. తన పదిహేడేళ్ల వయసు నుంచి ఆమె మట్టితో వినాయకుడి విగ్రహాలను స్వయంగా తయారు చేయడం మొదలుపెట్టారు. మట్టితో వినాయకుడి విగ్రహాలను తయారు చేయడంలో ఆమె సాధన ఎంతటిదంటే, కళ్లు మూసుకుని కూడా సునాయాసంగా విగ్రహాలను తయారు చేయగలరు. కళ్లకు గంతలు కట్టుకుని మరీ వినాయక విగ్రహాల తయారీని ప్రదర్శించి, ముంబై జనాలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇప్పటి వరకు ఆమె 3.78 లక్షల వినాయక విగ్రహాలను స్వయంగా తయారు చేశారు. ఆమె పేరిట ఇప్పటికి ఆరు ప్రపంచ రికార్డులు, పదహారు జాతీయ రికార్డులు ఉన్నాయి.(చదవండి: ఈ చేప భూకంపాలను అంచనా వేయగలదట..!) -
అవును.. దయ్యాలు ఉన్నాయి... ఇవిగో...
దయ్యం కనపడినా భయపడతారు. దయ్యం ఎవరి ఒంటి మీదకు వచ్చినా భయపడతారు. అసలు దయ్యం మాటెత్తితేనే భయం. ఉన్నాయేమోనని భయం. ఉండే ఉంటాయని భయం. దయ్యాన్ని ఎవరైనా చూశారా? చూసినవారు లేరు. అయినా భయమే. అన్నట్టు దెయ్యాలు ఉన్నాయా? ఏమో... చూద్దాం...పల్లెటూళ్లలో దెయ్యాల పుకార్లు మామూలే. కర్నాటకలోని ఆ పల్లెలో కూడా హఠాత్తుగా దయ్యాల గోల మొదలయ్యింది. నేను చూశానని ఒకరంటే అటు పోయింది అని మరొకరంటారు. దెయ్యాలు లేవు.. కాని ఒంటరి స్త్రీ కనిపిస్తే చాలు ఆమెను వేధించే మగాళ్లు దెయ్యాలు కాకపోతే మరెవరు అని ప్రశ్నిస్తూ తీసిన చిన్న సినిమా ‘సు ఫ్రమ్ సో’ కన్నడ నాట సూపర్హిట్ అయ్యింది. 5 కోట్లతో తీస్తే 125 కోట్లు సంపాదించింది. స్త్రీలను గౌరవించమని చెప్పిన మెసేజే కారణం.కర్నాటక తీరప్రాంతంలో మంగళూరుకు దగ్గరగా ఉన్న చిన్న పల్లె ‘మర్లూరు’. ఈ ఊళ్లో అందరూ చిన్న చిన్న పనులు చేసుకు బతికేవారే. పెళ్ళిళ్లు, దినకర్మలు ఆర్భాటంగా చేస్తూ డాబుసరికి తగ్గని మనుషులే అందరూ. సరే... ఊరన్నాక వయసొచ్చిన అమ్మాయిలు, అబ్బాయిలు ఉండకుండా ఉంటారా. పెయింట్ పని చేసుకు బతికే ఒక కుర్రాడికి ఆ ఊళ్లో ఒకమ్మాయి తో మనసవుతుంది. ఇద్దరూ ప్రేమలో ఉండగా ఒక అర్ధరాత్రి ఆ అమ్మాయి ఇంటి గోడ దూకి దొరికిపోయే ప్రమాదానికి చేసుకుంటాడు పెయింటర్. దొరికితే తోలు వొలిచేస్తారు. పైగా పరువు పోతుంది. అందుకే అతడు తప్పించుకోవడానికి ఒంటి మీదకు దెయ్యం వచ్చినట్టుగా నటిస్తాడు. ఒంటి మీదకు దెయ్యం రావడం వల్లే అర్ధరాత్రి ఊళ్లో తిరుగుతున్నాడని అనుకునేలా చేస్తాడు. ఇంకేముంది. ఊళ్లోకి దయ్యం వచ్చేసినట్టే.మనుషులకు రకరకాల నమ్మకాలు. బొట్టు పెడితే దయ్యాలు పోతాయని, కొరివి చూపిస్తే పోతాయని,... మామూలు దయ్యాలైతే పారిపోవచ్చు గాని నటించే దయ్యాలు ఎక్కడికి పోతాయి?పెయింటర్కు దయ్యం పట్టిన సంగతి ఊరంతా తెలుస్తుంది. అతణ్ణి చూస్తే చాలు ఊరంతా పరుగే. పాపం ఆ పెయింటర్ తల్లిదండ్రులు ఇంట్లో ఉండలేక బయటకు పోలేక నానా బాధలు పడుతుంటారు. ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టు అప్పడం కర్ర్మన్నా, టైరు తుస్సుమన్నా దయ్యమేమోనని దడుచుకోవడమే. ఊళ్లోకి దయ్యం వస్తే దయ్యాన్ని వదలగొట్టే మంత్రగాడు రావడం ఆనవాయితీ. వచ్చి ‘నువ్వెవరు?’ అని అడుగుతాడు పెయింటర్ వొంటి మీదున్న దయ్యాన్ని. పెయింటర్కు ఏం చెప్పాలో అర్థం కాదు. ‘కాంచన’ సినిమా పోస్టర్ కనిపిస్తే ‘కాంచన’ అంటాడు. తలుపు బయట ఉన్నవారికి ‘సులోచన’ అని వినిపిస్తుంది. ‘ఎక్కణ్ణుంచి వచ్చావు’ అని అడుగుతాడు మంత్రగాడు. పెయింటర్ ఏమీ చెప్పకముందే ‘సోమేశ్వరం నుంచి అట’ అని జనమే అనుకుంటారు. ఊళ్లోకి వచ్చిన దెయ్యం ‘సోమేశ్వరం సులోచన... సు ఫ్రం సో’... అదే సినిమా టైటిల్ ‘సు ఫ్రమ్ సో’...ఇక ఊళ్లో వాళ్లంతా ‘సోమేశ్వరం నుంచి వచ్చిన సులోచన’ ఏం చేస్తే పెయింటర్ను వదిలి వెళుతుందో అనే అన్వేషణ సాగిస్తారు. ఆ ఊరికి దాపునే ఉన్న సోమేశ్వరంలో సులోచన అనే పేరున్న ఆమె ఎవరైనా మరణించిందేమోనని కనుక్కుంటారు. ఇటీవల ఆ పేరుతో ఉన్న ఒక పెద్దామె మరణించిందని తెలుస్తుంది. ఆ ఇంటికి వెళితే ఆమె ఒక్కగానొక్క కూతురు కటిక పేదరికంలో ఉంటుంది. వయసొచ్చిన అమ్మాయి. ఇంకా పెళ్లి కాలేదు. ఒక్కత్తే నివసిస్తోంది. ఈ కూతురి ద్వారా తల్లి ఆత్మకి ఏం కావాలో తెలుసుకుందామని ఊరివాళ్లు ప్రయత్నిస్తారు. తల్లి ఆత్మను ఎలా శాంతింపచేయాలో ఆ అమ్మాయినే కనుక్కుని చెప్పమంటారు. కాని ఈప్రాసెస్లో ఆ అమ్మాయి కష్టాలు తెలిసేకొద్దీ అసలు దయ్యాలు ఎక్కడ ఉన్నాయో అందరికీ తెలుస్తుంది. ఆ అమ్మాయిని ఆమె బాబాయి చెరబట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. తల్లి చనిపోయాక అతని ఆగడాలు మరీ శ్రుతి మించితే తలుపుకు అడ్డాలు పెట్టి రాత్రిళ్లు నిద్ర కాస్తూ ఉంటుంది. ఆ బాధ ఒకటైతే ఊళ్లోని పోరంబోకు కుర్రాళ్లు రాత్రిళ్లు గోడ దూకి తలుపు కొడుతుంటారు. ఒంటరి స్త్రీ మర్యాదగా బతుకుదామంటే దయ్యాల్లా మగాళ్లు పీక్కుతింటున్నారని ఆ అమ్మాయి కష్టాలు వింటే తెలుస్తుంది. పెయింటర్కు పట్టిన దయ్యం కంటే ఈ అమ్మాయి చుట్టూ ఉన్న దయ్యాలను ఒదిలించడమే ముఖ్యమని భావించిన ఊరు ఆ దుర్మార్గులకు దేహశుద్ధి చేయడంతో ‘సు ఫ్రం సో’ సినిమా ముగుస్తుంది. దుర్మార్గులకు బుద్ధి చెప్పడం వల్ల పెయింటర్కు పట్టిన సోమేశ్వరం సుశీల అనే అబద్ధపు దయ్యం కూడా నిష్క్రమిస్తుంది. ఊరంతా హాయిగా ఊపిరి పీల్చుకోడమే కాదు ఆ ఒంటరి అమ్మాయిని తమ ఊరికి కోడలి గా తెచ్చుకుంటుంది. రాజ్ బి.శెట్టి నిర్మాతగా కొత్త దర్శకుడు జె.పి.తుమినాడ్ తీసిన కన్నడ చిత్రం ‘సు ఫ్రమ్ సో’ బలమైన సందేశాన్ని విపరీతమైన హాస్యంతో, జనం సెంటిమెంట్లతో, మూఢత్వాన్ని తెలివినీ మానవత్వాన్ని జోడించి చెప్పడం వల్ల ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. జూలై 25న విడుదలై ఇప్పటికి 125 కోట్లు సంపాదించింది. ఖర్చు పెట్టింది 5 కోట్లే! ఒంటరిగా ఉన్న స్త్రీ అంటే మగాడికి ఎందుకు లోకువ. వితంతువు, పెళ్లి కాని స్త్రీ, విడాకులు పొందిన స్త్రీ, పెళ్లి వద్దనుకున్న స్త్రీ... ఈమె తన మానాన తాను బతుకుదామనుకుంటే ఆమెను వేధించడానికి దయ్యాల్లా ఎందుకు వెంటపడతారు. ఆమె లోబరుచుకోవడానికి ఎంత పాశవికంగానైనా ఎందుకు ప్రయత్నిస్తారు? మానవత్వం లేని ఇలాంటి మగాళ్లు దయ్యాల కంటే భయానకమైన వాళ్లు అని దర్శకుడు చెప్పడం జనానికి బాగా నచ్చింది. మగాళ్లు దయ్యాలుగా మారవద్దని, సంస్కారమనే రక్షను వాళ్లు కట్టుకుని ఉండాలని కోరుకుందాం. ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ తెలుగులో కూడా ఉంది. ఒంటరి స్త్రీ మర్యాదగా బతుకుదామంటే దయ్యాల్లా మగాళ్లు పీక్కుతింటున్నారని ఆ అమ్మాయి కష్టాలు వింటే తెలుస్తుంది. పెయింటర్కు పట్టిన దయ్యం కంటే ఈ అమ్మాయి చుట్టూ ఉన్న దయ్యాలను ఒదిలించడమే ముఖ్యమని భావించింది ఆ ఊరు. -
పోర్టు నుంచి పర్వతారోహణకు
ఆయనో పోర్ట్ అధికారి.. ఎవరెస్ట్ సహా ప్రపంచంలోని ఏడు ఖండాల్లోని ఎత్తయిన పర్వత శిఖరాలను అధిరోహించాలనుకున్నాడు.. దీనిని సెవెన్ సమ్మిట్ ఛాలెంజ్ మిషన్ అని కూడా అంటారు.. ఇందులో తొలి మిషన్గా మౌంట్ ఎల్బ్రూస్ అధిరోహణను పరిగణిస్తారు.. ఈ నెల 7న ముంబై నుంచి ఈ సాహస యాత్రకు బయలుదేరాడు. ఆయనే నగరానికి చెందిన ప్రణయ్. దాదాపు పదేళ్లుగా ముంబై పోర్ట్ అథారిటీలో సీనియర్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్గా పనిచేస్తున్నారు. దీన్దయాళ్ పోర్ట్ అథారిటీ చైర్మన్ సుశీల్ కుమార్ సింగ్ 79 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో పాటు పోర్టు జెండాను అధికారికంగా ప్రణయ్కు అందించారు. ఈ విషయాన్ని ఫోన్ ద్వారా ‘సాక్షి’తో పంచుకున్నారు. – సాక్షి, సిటీబ్యూరో ముంబై పోర్టులో ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న హైదరాబాదీ బి.ప్రణయ్ రెడ్డి పోర్టు సెక్టార్లోనే అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. రష్యాలో అత్యంత ఎత్తైన మౌంట్ ఎల్బ్రూస్ శిఖరాన్ని అధిరోహించి ఆ సెక్టార్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కారు. రష్యన్ కాలమానం ప్రకారం ఈ నెల 16 ఉదయం 5.50 గంటలకు శిఖరాగ్రానికి (5,642 మీటర్లు) చేరుకున్న ఆయన 79వ స్వాతంత్ర దినోత్సవానికి గుర్తుగా తన బృందంతో కలిసి 79 మీటర్ల జాతీయ జెండాలను ఎగరేశారు. దీంతో పాటు దీన్దయాళ్ పోర్టు అథారిటీ జెండాను అక్కడ ఎగరేశారు. ఈ మేరకు ప్రణయ్ రెడ్డికి రష్యా ప్రభుత్వం గునిసెస్ ప్రపంచ రికార్డుకు అవసరమైన సర్టిఫికెట్ జారీ చేసింది. View this post on Instagram A post shared by Anand Bansode (@ianandbansode) వారి సహకారం కీలకం..‘దీన్దయాళ్ పోర్ట్ అథారిటీ, ముంబై పోర్ట్ అథారిటీలతో పాటు నా తల్లిదండ్రులు బి.కృష్ణారెడ్డి, బి.నాగమణి, నా భార్య బి.అపర్ణ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలపాలి. వారందరి సహకారం లేకుంటే ఈ విజయం సాధించలేకపోయే వాడిని.’ రష్యా– జార్జియా సరిహద్దు సమీపంలో కాకసస్ పర్వతాల్లోని ఎ్రల్బస్ సముద్ర మట్టానికి 18,510 అడుగుల (5,642 మీటర్లు) ఎత్తులో ఉంటుంది. ఇది రష్యాలోనే కాదు.. యూరప్లోనే ఎత్తైన అగ్నిపర్వతం. – ప్రణయ్ రెడ్డి∙ -
ఇలా చేస్తే వారం రోజుల్లో 6 కేజీల వరకూ తగ్గే అవకాశం!
నగరం బరువెక్కుతోంది.. స్థూలకాయంతో బాధపడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఓవైపు పని ఒత్తిడి, మరోవైపు డిప్రెషన్ దీనికి తోడు పోషకాహార లోపం ఇవన్నీ క్రమంగా నగరవాసులను రోగాలవైపు నెడుతున్నాయి. ఫలితంగా నగరవాసుల శరీరాకృతుల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయని, తద్వారా ఒబెసిటీతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ పోషకాహార లోపం మరీ ఎక్కువగా ఉంది. దీంతో అలసట, కీళ్ల నొప్పులు, చిరాకు వంటి సమస్యలతో బాధపడుతున్నారని ఇటీవల నగరంలో నిర్వహించిన వెయిట్ గెయిన్ ట్రెండ్స్ సర్వే వెల్లడిస్తోంది. ఈ కారణంగా బీపీ, షుగర్ వంటి ఇతర రోగాలు చుట్టుముడుతున్నాయని, ఆహారపు అలవాట్లు కూడా దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.. – సాక్షి, సిటీబ్యూరో చుట్టూ ఎత్తయిన భవనాలు.. అద్దాల మేడలు.. ఖరీదైన కార్లు.. అత్యాధునిక వసతులు. చూడ్డానికి విలాసవంతమైన జీవితం.. అంతా బానే ఉందిగా!.. ఇది నాణేనికి ఓ వైపు మాత్రమే.. వాస్తవానికి అవతలవైపు చూస్తే.. ఉరుకుల పరుగుల జీవనం, నిత్యం పని ఒత్తిడి, తీరికలేని జీవితం, ఆందోళన, డిప్రెషన్, ఉద్యోగ భద్రత గురించిన ఆలోచన, లోన్లు, ఈఎంఐల భయాలు, నెలవారీ ఖర్చులు, లక్షల్లో పిల్లల ఫీజులు, నెలాఖరుకు జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఇది సగటున నగర జీవిని వేధిస్తోన్న ప్రధాన సమస్య.. ఫలితంగా ఒత్తిడికి లోనై కంటికి కనిపించని రోగాలైన బీపీ, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలతో నిత్యం యుద్ధం చేస్తున్నాడు. సర్వే చెబుతోందేంటి? హైదరాబాద్ టెక్ రంగంలో ప్రపంచ దేశాలకు సేవలందిస్తోంది. ఐటీ కారిడార్, చుట్టూ పరిసర ప్రాంతాలు పది కిలో మీటర్ల పరిధిలో కిమ్స్ ఆస్పత్రి నిర్వహించిన వెయిట్ గెయిన్ ట్రెండ్స్ సర్వేలో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూశాయి. 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వయసు గల 6 వేల మంది ఆరోగ్య సమాచారాన్ని పరిశీలించగా అందులో ఉద్యోగుల్లో 45 శాతం మంది డిప్రెషన్లో ఉంటున్నారట. ఆందోళన, భయం, యాంగ్జైటీతో బాధపడుతున్నారని తేలింది. మరో వైపు ఇంటి పట్టునే ఉంటున్న వ్యక్తులు మధుమేహం, రక్త పోటుతో నిత్యం ఇబ్బంది పడుతున్నారట. ఆపై ఉబకాయం, డయాబెటిస్, రక్తపోటు, లివర్ సమ్యలు, థైరాయిడ్, పీసీఓడీ వంటి రోగాలతో నిత్యం సతమతమవుతున్నారని స్పష్టమవుతోంది. మహిళల్లో అత్యధికంగా ఉబకాయం, కీళ్ల నొప్పులు, ఇల్నెస్ వంటి సమస్యలు వేధిస్తున్నాయి. 35 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసు్కల్లో ఎక్కువ మంది ఉపవాసం (ఫాస్టింగ్) చేస్తున్నారు. మరికొంత మంది సిక్స్ప్యాక్, జీరోప్యాక్, స్లిమ్ అంటూ ఎక్కువ సమయం జిమ్లో కాలం గడుపుతున్నారు. ఆహారానికి బదులుగా ప్రొటీన్, ఇతర సప్లిమెంట్స్ తీసుకుటున్నారు. దీంతో అనర్థాలు తలెత్తుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇదీ చదవండి: రెండు నెలల బిడ్డను కాపాడేందుకు నర్సు సాహసం వీడియో వైరల్వ్యాయామం అవసరం.. ఇటీవల కాలంలో కార్డియాక్ అరెస్ట్ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని అవసరం మేరకు మాత్రమే వ్యాయామం చేయడం మంచిదని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పులు అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ఊబకాయంతో బాధపడుతున్న వ్యక్తులు వారం రోజుల్లో 6 కేజీల వరకూ తగ్గే అవకాశం ఉంది. అయితే ఒకే సారి మొత్తం బరువు తగ్గిపోవాలని అనుకోవడం మంచిది కాదు. వెయిట్ లాస్ కోసం వ్యాయామంతో పాటే వివిధ రకాల శస్త్రచికిత్సలు, అధునాతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయని, ఇవి దీర్ఘకాలంలో సత్ఫలితాలను అందిస్తాయంటున్నారు. లైఫ్ స్టైల్లో మార్పులు.. టెక్ కంపెనీలు, అనుబంధంగా పనిచేస్తున్న రంగాల్లో ఎక్కువ మంది ఉద్యోగులు మిడ్ షిఫ్ట్, పూర్తిగా నైట్ షిఫ్ట్ పద్ధతుల్లో రాత్రి విధుల్లో ఉంటున్నారు. దీనికి తోడు నిత్యం టార్గెట్లతో విపరీతమైన ఒత్తిడిలో విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు గ్యాడ్జెట్స్కు అతుక్కుపోతున్నారు. కొంత మంది పగలు నిద్ర పోదామన్నా పరిస్థితులు అనుకూలించడం లేదని అంటున్నారు. కనీసం 7 గంటలు నిద్రపోవాల్సి ఉన్నా డీప్ స్లీప్ రెండు నుంచి మూడు గంటలే ఉంటుందని చెబుతున్నారు. సరైన నిద్ర లేకపోవడం మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. తీసుకునే ఆహారంలోనూ పాశ్చాత్య రుచులకు అలవాటుపడి పౌష్టికాహారానికి దూరమవు తున్నారు. చైనీస్, కొరియన్, అమెరికన్ స్టైల్ ఆహారానికి ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నారు. పోషకాల లోటును భర్తీ చేయడం కోసం వివిధ రకాల ప్రొటీన్, ఇతర పౌడర్లను తీసుకుంటున్నారు. ఫలితంగా శరీరంలోని కెమికల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే! -
రెండు నెలల బిడ్డను కాపాడేందుకు నర్సు సాహసం వీడియో వైరల్
ఆపద సమయంలో, విధి నిర్వహణలో ధైర్య సాహసాలను ప్రదర్శించిన వారే అసలైన హీరోలు. ఒక పసిబిడ్డను కాపాడేందుకు షీరోనర్స్ చేసిన సాహసం, ధైర్యం విశేషంగా నిలిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. మీ ధైర్యానికి సెల్యూట్! అంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపించారు.టిక్కర్ గ్రామానికి చెందిన స్టాఫ్ నర్సు కమల అనారోగ్యంతో ఉన్న పసిపాపకు ఇంజెక్షన్ ఇచ్చేందుకు హురాంగ్ గ్రామానికి చేరుకోవాల్సి ఉంది. అయితే ఇటీవలి భారీ వర్షాల కారణంగా విస్తృతంగా విధ్వంసం సంభవించింది. సిల్బుధాని , తార్స్వాన్ పంచాయతీలలో రోడ్లు , ఫుట్బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. ఆ గ్రామానికి వెళ్లే మార్గం కష్టంగా మారింది. పద్దర్ సబ్ డివిజన్ పరిధిలోని చౌహార్ లోయ మండిలోని అత్యంత ప్రభావిత ప్రాంతాలలో ఒకటి. అటు చూస్తే కాలువ పొంగిపొర్లుతోంది నీరు చాలా వేగంగా ప్రవహిస్తోంది ఏ మాత్రం స్లిప్ అయినా ప్రాణాలకే ముప్పు. అయినా సరే వృత్తి ధర్మం నెరవేర్చాలనే ఆశయంతో రాళ్లపై ఒక్క ఉదుటున దూకి జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ కాలువ దాటింది. Meet Staff Nurse Kamla, who risked her life to ensure a two-month-old baby received a crucial injection. With the bridge in her area swept away, she crossed the river to reach the child. She is From Paddhar's Chauharghati, Mandi. @CMOFFICEHP @mansukhmandviya @nhmhimachalp @WHO pic.twitter.com/o9JFmIHskx— Vinod Katwal (@Katwal_Vinod) August 23, 2025> అద్భుత సాహసానికి సంబంధించిన ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలోని సుధార్ పంచాయతీలోని చౌహర్ఘాటిలో చోటు చేసుకుంది. నర్సు ధైర్యానికి అందరూ ముగ్ధులయ్యారు. అదే సమయంలో, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఫ్రంట్లైన్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రమాదాలపై ఆందోళన కూడా వ్యక్తమైంది. ఇదీ చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే! -
కూకట్పల్లిలో దారుణం.. ఈ పాపం ఎవరిది?
సాక్షి, హైదరాబాద్: పాఠశాల చదువు కూడా ఇంకా పూర్తి కాని ఓ బాలుడు.. పక్కింట్లో ఉన్న ఓ అమాయక బాలికను అత్యంత దారుణంగా హత్య చేశాడు. తనకు కావాల్సిన ఓ చిన్న క్రికెట్ బ్యాట్ (Cricket Bat) దొంగతనం చేయాలనుకునే క్రమంలో అభమూ శుభమూ తెలియని చిన్నారిని బలిగొన్నాడు. హైదరాబాద్ రాజధాని నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ అమానుష ఘటనలో నివ్వెరపోయే నిజాలు వెలుగు చూశాయి. పదో తరగతి చదువుతున్న బాలుడు ఇంతటి దారుణానికి ఒడిగట్టడమేంటి? అదీ నడిబొడ్డున జరగడం ఏమిటి? రేపటి పౌరులను రేపటి నేరగాళ్లుగా మారుస్తున్న ఈ పాపం ఎవరిది? అనే ప్రశ్నలు అందరి మదిలోనూ తలెత్తుతున్నాయి.దొంగతనానికి వెళ్లే ముందు తాను పక్కాగా ప్లాన్ చేసుకున్నానని.. అవసరమైతే హత్య ఎలా చేయాలి? అనేది కూడా ముందే ఆలోచించానని కూకట్పల్లిలో (Kukatpally) బాలిక హత్య కేసు నిందితుడైన బాలుడు చెబుతున్నాడు. ఆ బాలుడికి క్రైమ్ సిరీస్ చూసే అలవాటు కూడా ఉందనీ వెల్లడైంది. దీంతో ఈ తరహా క్రైమ్ నేపథ్య సినిమా/సిరీస్ల ప్రభావంపై చర్చ మొదలైంది. మోగుతున్నాయ్.. డేంజర్ బెల్స్ కోవిడ్ 19, లాక్ డౌన్ ప్రభావంతో పిల్లలతో సహా ప్రతి ఒక్కరికీ స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, టాబ్లెట్లు.. ఇలా ఇంటర్నెట్కు అనుసంధానిత పరికరాల వాడకం పెరిగింది. ఓటీటీ ప్లాట్ఫామ్లను కూడా సులభంగా యాక్సెస్ చేయడం వల్ల వెబ్ సిరీస్లు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అవి చాలా మందికి ఒక రకమైన వ్యసనంలా మారిపోయాయి. వెబ్సిరీస్తో సమస్య ఏమిటంటే.. సిరీస్ నచ్చితే వీక్షకులు ఒక ఎపిసోడ్ చూసి ఆపడం సాధ్యం కాక మొత్తం సిరీస్ను చూస్తున్నారు. పరిశోధనలు చెబుతోందదే.. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్కు చెందిన క్రిమినాలజీ రిసెర్చర్స్ చేసిన పరిశోధనలో కేవలం వెబ్ సిరీస్ చూడడం వల్ల 34 శాతం మంది పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారని, భయాందోళనలకు రాత్రివేళ పీడ కలలకు గురవుతున్నారని తేల్చారు. క్రైమ్ కంటెంట్ చూసిన ప్రతీ నలుగురు టీనేజర్లలో ఒకరు అభద్రతకు లోనవుతున్నారని, క్రిమినల్స్ను హీరోలుగా అపోహపడే ప్రమాదం పెరుగుతోందని స్పష్టం చేసింది. ఈ తరహా క్రైమ్ కంటెంట్ పెద్దలకు మాత్రమే అనే హెచ్చరికలతో వస్తున్నప్పటికీ చిన్నారులు (Kids) మాత్రం సులభంగానే చూడగలుగుతున్నారని వెల్లడించింది. చదవండి: కూకట్పల్లి కేసు.. పోలీసులు ఏం చెప్పారంటే..? పర్యవేక్షణే శరణ్యం.. ఈ నేపథ్యంలో కొందరు పిల్లల్లో అభద్రతా భావం పెరుగుతుంటే.. మరికొందరిలో నేర పూరిత మనస్తత్వం విజృంభిస్తోంది. ఈ పరిస్థితుల్లో చిన్నారులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ మరింత పెరగాల్సిన అవసరం కనిపిస్తోంది. వారిని స్క్రీన్ వీక్షణ నుంచి మళ్లించి ఆరోగ్యకరమైన ఆటలు, హాబీల వైపు దృష్టి నిలిపేలా చేయడం, అలాగే క్రైమ్ కంటెంట్ను చిన్నారులు చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. అదీ ఒక కారణమే.. కాని అదే కారణం కాదు... హింసాత్మక ప్రవృత్తికి కేవలం సోషల్ మీడియా (Social Media) మాత్రమే కారణం అని చెప్పలేం. అయితే.. అదీ ఒక కారణమే. సాధారణంగా వంశపారంపర్యంగా వచ్చే కొన్ని లక్షణాలకు ఇవి ప్రేరకంగా పనిచేస్తాయని అనొచ్చు. అలాగే తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఎదుర్కొన్న కొన్ని పరిస్థితులు కూడా అగ్రెసివ్ నెస్ను పెంచుతాయి. ఏదేమైనా ఈ స్వభావాన్ని ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. – డా.చరణ్ తేజ్, న్యూరో సైక్రియాట్రిస్ట్ -
కిటికీ ఇనుప కడ్డీల్లో ఇరుక్కున్న బాలిక...స్కూల్లో రాత్రంతా నరకం!
భువనేశ్వర్ : ఒడిశాలోని కియోంజార్ జిల్లాలో జరిగిన ఘటన నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచింది. రెండో తరగతి రాత్రంతా స్కూల్లోనే బిక్కు బిక్కు మంటూ గడిపిన వైనం కలకలం రేపింది. బన్స్పాల్ బ్లాక్ పరిధిలోని అంజార్లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం ఈ సంఘటన జరిగింది.8 ఏళ్ల జ్యోత్స్న దేహూరి రెండో తరగతి చదువుతోంది. స్కూలు ముగిసిన తరువాత జ్యోత్న కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు రాత్రంతా తమ కుమార్తె కోసం వెతికినా ఫలితం కనపించలేదు. అసలేం జరిగిందంటే..సాయంత్రం 4 గంటలకు పాఠశాల సమయం ముగియడంతో, 8 ఏళ్ల జ్యోత్స్న లోపల ఉందో లేదోచెక్ చేయకుండానేఉపాధ్యాయులు, సిబ్బంది పాఠశాలకు తాళం వేసి వెళ్లిపోయారు. అయితే తాళం వేసిఉన్నట్టు గుర్తించిన జ్యోత్న కిటికీ గుండా పాఠశాల నుండి బయటకు రావడానికి చాలా తీవ్రంగా ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఆమె కిటికీ ఊచల మధ్య ఇరుక్కు పోయింది. రాత్రంతా అలానే నరక యాతన అనుభవించింది.ఇదీ చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే!శుక్రవారం ఉదయం 9 గంటలకు గేటు తెరిచిన తర్వాత ఆమె ఇరుక్కుపోయి ఉండటం చూసి పాఠశాల వంటమనిషి షాక్ అయ్యాడు. వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించాడు. వారు ఇనుప రాడ్లను వంచి జ్యోత్స్నరక్షించారు. అనంతరం ముందు జాగ్రత్త చర్యగా ఆస్పత్రికి తరలించారు. అయితే అదృష్టవశాత్తూ చిన్నారికి ఎలాంటి ప్రాణపాయం లేదని డాక్టర్లు చెప్పారు. దీంతో జ్యోత్న్స తల్లిదండ్రులు, స్థానికులు, టీచర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారులు తీవ్రంగా స్పందించారు. తాత్కాలిక ప్రధానోపాధ్యాయుడు గౌరహరి మహంతను సస్పెండ్ చేశారు.చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లు -
ఆమె బొమ్మలు గీస్తే డబ్బే డబ్బు.. ఒక్కోటి రూ. 40లక్షలకు పైమాటే..
ఖాళీ కాగితాలు కనిపిస్తే చిన్నపిల్లల వాటిపై బొమ్మలు గీస్తూ ఉంటారు. పెద్దలు వాటిని చూసి మురిసి΄ోతూ ఉంటారు. ఇదంతా చిన్నారులకు ఆనందం, పెద్దలకు మురిపెం. అయితే చిన్నారి గీసిన చిత్రాలకు రూ.కోట్లలో ధర పలికితే? అది సాధ్యమేనా? సాధ్యమే అని నిరూపించింది ఆస్ట్రేలియాకు చెందిన ఎలిటా ఆండ్రీ (Aelita Andre). రెండేళ్లకే చిత్రలేఖనం మొదలుపెట్టిన ఈ అమ్మాయి గీసిన చిత్రాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోతున్నాయి. ఎలిటా ఆండ్రీ 2007లో జన్మించింది. ఆమెది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్. రెండేళ్ల వయస్సులోనే బొమ్మలు గీయడం మొదలుపెట్టింది. అందరు చిన్నారులు వేసేలాంటి చిత్రాలు కాకుండా కొత్త రకమైన చిత్రకళను సాధన చేసింది. అబ్స్స్ట్రాక్ట్ ఆర్ట్ (నైరూప్య కళ) ద్వారా తాను అనుకున్న భావాలను చిత్రాలుగా గీసేది. అందుకోసం తను ఎంచుకునే థీమ్స్, తీసుకునే రంగులు విభిన్నంగా ఉండేవి. దీంతో అతి చిన్నవయసులో అబ్స్స్ట్రాక్ట్ ఆర్ట్లో కృషి చేస్తున్న కళాకారిణిగా తన గురించి అందరికీ తెలిసింది. మెల్లగా తన చిత్రాలు అందరికీ పరిచయమయ్యాయి. ఎలిటా గీసే ఒక్కో చిత్రం సుమారు 50,000 యూఎస్ డాలర్ల (దాదాపు రూ.43 లక్షల) వరకు అమ్ముడవుతాయి. సెయింట్ పీటర్స్బర్గ్లోని రష్యన్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మ్యూజియం, మయామిలోని ఆర్ట్ బాసెల్తో సహా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన అనేక మ్యూజియంలలో ఎలిటా తన చిత్రాలను ప్రదర్శించింది. ప్రస్తుతం ఎలిటాకు 18 ఏళ్లు. చిత్రకళను మరింత సాధన చేస్తూ, తన సొంత వెబ్సైట్ ద్వారా చిత్రాలను అమ్ముతోంది. చిత్రకారిణిగా మరింత పేరు తెచ్చుకోవడమే తన ధ్యేయం అని వివరిస్తోంది. View this post on Instagram A post shared by Aelita Andre (@aelitaandre) -
అంతరిక్ష పరిశోధనలో నవ శకం
భారత్ నూతన అంతరిక్ష సాంకేతికతతో విశ్వ రహస్యాల అన్వే షణకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో నేడు రెండవ జాతీయ అంత రిక్ష దినోత్సవాన్ని (National Space Day) జరుపుకొంటోంది. 2023 ఆగస్టు 23న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్–3లోని విక్రమ్ ల్యాండర్ ‘శివశక్తి’ అనే ప్రదేశంలో సురక్షితంగా దిగింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ఆగస్టు 23ను జాతీయ అంత రిక్ష దినోత్సవంగా నిర్ణయించింది. ఈ దినోత్సవం అంతరిక్ష పరిశోధన ప్రాము ఖ్యతపై అవగాహన, విద్యను ప్రోత్సహించడానికి ఒక వేదిక కానుంది. సైన్స్ , టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితంలోవృత్తిని కొనసాగించడానికి భవిష్యత్తు తరాలకు ప్రేరణ ఇవ్వనుంది. ఈ యేడు ‘ఆర్యభట్ట నుండి గగన్యాన్ వరకు: ప్రాచీన జ్ఞానం నుంచి అనంతమైన అవకాశాలు’ అనే ఇతివృత్తంతో అంతరిక్ష దినోత్సవం నిర్వహించుకొంటున్నాం. 🚀 From Chandrayaan to #Mangalyaan, every launchpad in India is a gateway to history, and every mission a leap into shaping the future of space exploration! 🌌✨ On this #NationalSpaceDay, let’s celebrate India's trailblazing space missions, our growing space economy, and the… pic.twitter.com/vKmoZJ12qR— PIB India (@PIB_India) August 23, 2025 2040 నాటికి భారతీయ వ్యోమగామిని చంద్రుడిపైకి పంపాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యాన్ని ఇస్రో నిర్దేశించు కున్నది. ఈ లక్ష్య సాధన దిశగా ప్రయాణించ డానికి గగన్యాన్ మిషన్ కీలకం కానుంది. వ్యోమగాములను భూమికి దగ్గ రగా 400 కిలోమీటర్ల దూరంలో భూ కక్ష్యలోకి పంపి, వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడం ఈ మిషన్ తొలి లక్ష్యం. ఇందులో భాగంగా మొదట 2026 నాటికి ‘వ్యోమమిత్ర’ అనే రోబోను అంతరిక్షంలోకి పంపనున్నారు. అనంతరం 2027లో మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ మిషన్ చేపట్టనున్నారు. మరోవైపు మానవ సహిత చంద్రుడి యాత్రకు ముందు ఇస్రో 2035 నాటికి సొంతంగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అనంతరం మానవ సహిత చంద్రుడి యాత్రకు సిద్ధం కానుంది.ఇదీ చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే!చంద్రయాన్–4లో చంద్రుడి ఉపరితలం నుంచి నమూనాలను సేకరించి భూమికి తిరిగి తీసుకురావడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఎల్విఎం అనే పెద్ద రాకెట్లతో డాకింగ్ ద్వారా ఈ ప్రయోగం నిర్వహించనున్నారు. అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా భారత్ అంతరిక్ష ప్రయోగాలు కొన సాగుతున్నప్పటికీ... భారతదేశం ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో కేవలం 2 శాతం మాత్రమే కలిగి ఉంది. దీన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది.అంతరిక్ష ప్రయోగాల పట్ల పిల్లలు, యువతలో ఆసక్తిని పెంచాలి. ఇప్పటికే ఈ రంగంలో మక్కువ ఉన్న విద్యార్థులను ప్రొత్సాహించేందుకు ఇస్రో ‘యువిక (యుంగ్ సైంటిస్ట్)– 2025’ కార్యక్రమం నిర్వహిస్తున్నది.– సంపతి రమేష్ మహారాజ్ ‘ జన విజ్ఞాన వేదిక -
స్టడీ..రెడీ.. స్టార్ట్ అప్
అక్షరం అంటే ఆమెకు ఆరాధన. పుస్తక పఠనమంటే ప్రీతి. దాంతో అందరూ ఆమెను పుస్తకాల పురుగు అని పిలిచేవారు. పుస్తకాలు చదువుతూనే ఆమె మార్కెటింగ్లో ఎం.బి.ఎ. పూర్తి చేసింది. అయితే ఆ చదువును ఆమె కార్పొరేట్ సంస్థలలో లక్షలు సంపాదించి పెట్టే ఉద్యోగం చేయడానికి ఉపయోగించుకోదలచుకోలేదు. సెల్ఫోన్లతో... రకరకాల గ్యాడ్జెట్స్తో... కంప్యూటర్ గేమ్స్తో బిజీ బిజీగా ఉంటున్న నేటి తరంతో కూడా పుస్తకాలను చదివించాలనుకుంది. ముందు తన కూతురు చదవడం కోసం ఆమెను ఆకట్టుకునే పుస్తకాల కోసం వెతుకుతూ, తనకు కావలసిన పుస్తకాలేవీ కనిపించకపోయేసరికి తానే ఒక పుస్తకాలు అమ్మే వ్యాపారాన్ని ఎందుకు ప్రారంభించకూడదు.. అన్న ఆలోచన కలిగింది. అదే బిబ్లియోఫైల్స్ అనే స్టార్టప్కు పునాదిగా మారింది. ఆమే ముంబయ్కి చెందిన అపూర్వ మాత్రే. ప్రారంభించిన 6 నెలల్లో 10 వేలకు పైగా కస్టమర్లు 150+ ప్రేరణాత్మక సమీక్షలు వచ్చాయి. ఎందుకంటే బిబ్లియోఫైల్స్ నినాదమే చదవడాన్ని ఒక జీవనశైలిగా మార్చుకోవడం. ఈ ఆలోచనతోనే, అపూర్వ మాత్రే 2020లో పిల్లల పుస్తకాలు అమ్మే స్టార్టప్ను స్థాపించింది. ఒక ఆలోచన నుంచి పుట్టిందిస్టార్టప్ పర్యావరణ వ్యవస్థలో అనుభవజ్ఞురాలైన అపూర్వ మాత్రే, గొప్ప కార్పొరేట్ నేపథ్యం కలిగిన వ్యూహాత్మక సలహాదారు అద్న్యేష్ దళపతిని తన జీవితంలోనే కాదు... వ్యాపారంలో కూడా భాగస్వామిని చేసుకుంది. వారి భాగస్వామ్యం బిబ్లియోఫైల్స్కు మూలస్తంభం. విభిన్న నైపుణ్యాలతో కలబోసుకున్న కలలు అద్భుతమైన ఒక ఆలోచనను ఎలా సృష్టించగలవో ఇది రుజువు చేస్తుంది, ‘‘ఒక పుస్తక ప్రియురాలిగా నా బిడ్డకు బాల్యం నుంచే చదవడం పరిచయం చేయాలన్నది నా ఆలోచన. అయితే అది ఒక పనిగా అనిపించకూడదు – దానిని ఆనందదాయకంగా మార్చాలనుకున్నాను. నా కుమార్తె అభిరుచులకు సరిపోయే వయస్సుకు తగిన పుస్తకాలను నేను జాగ్రత్తగా పరిశోధించి ఎంచుకున్నాను. ఫలితంగా, ఆమె పుస్తకంతో ప్రేమలో పడింది. స్క్రీన్ సమయాన్ని తగ్గించేసింది. త్వరలోనే ఆమె తన స్నేహితులు, కుటుంబ సభ్యులకు వయస్సుకు తగిన పుస్తకాలను సిఫార్సు చేయడం, అమ్మడం ప్రారంభించింది. పిల్లలు ఈ పుస్తకాలను ఇష్టపడ్డారు. చదవడం ఒక ఆహ్లాదకరమైన అనుభవంగా మారింది. పుస్తకాలతోపాటు...ప్రారంభంలో పుస్తకాలను మాత్రమే అమ్మే ఈ కంపెనీ చాలా దూరం వచ్చింది. ఇప్పుడు విద్యార్థుల కోసం వివిధ రకాల ఉత్పత్తులను అందుబాటు ధరలలో అందిస్తోంది. ఇందులో లంచ్బాక్స్లు, బాటిళ్లు, అందమైన స్టిక్కర్ ట్యాగ్లు ఇలాంటి అనేక ఇతర వస్తువులు ఉన్నాయి. పిల్లల పుస్తకాల విషయానికి వస్తే అనేక ఎంపికలు ఉన్నాయి. అసలు చదవడం ఒక జీవనశైలిగా మార్చుకోవాలంటుంది అపూర్వ. దీనిని సాధించాలంటే... మనం మన పిల్లలకు ప్రినేటల్ దశ నుంచే అంటే గర్భంలో ఉన్నప్పటి నుంచే పుస్తకాలు చదివి వినిపించాలన్నది ఆమె ఆలోచన. ఇందుకోసం ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది; అది కొత్తపుస్తకం మార్కెట్లోకి ప్రవేశించిన క్షణం నుంచి సిఫార్సులు పంచుకునే స్థలం. బిబ్లియోఫైల్స్ అంతిమ లక్ష్యం భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉన్న... సంతోషంగా, బాగా అభివృద్ధి చెందిన పిల్లలను పెంచడం. ఆమె లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం. సోషల్ మీడియా, అధిక స్క్రీన్ సమయం ఉన్న సమకాలీన కాలంలో బిబ్లియోఫైల్స్ వంటి స్టార్టప్లు మనలోని సృజనాత్మక, ఊహాత్మక స్వభావాన్ని గ్రహించడంలో, దానితో కనెక్ట్ అవ్వడంలో కీలక పాత్రపోషిస్తాయి. ఇది ముఖ్యంగా మన ఆత్మను సజీవంగా ఉంచుతుంది. యువ హృదయాలలో ప్రేమ, కరుణ, సానుభూతిని పెంపొందించడం చాలా అవసరం, బిబ్లియోఫైల్స్ విలువలు, సూత్రాల ద్వారా దానిని సాధ్యం చేస్తోంది అవును... నేనే ఓ బిబ్లియోఫైల్‘‘నేను బిబ్లియోఫైల్స్ను ప్రారంభించినప్పుడు, దానిని ఎలా పెంచుకోవాలో నాకు తెలియదు. నా కుమార్తె జీవితాంతం చదవ గలిగేందుకు సరిపడా పుస్తకాలు కొన్నప్పటికీ, నేను ఖర్చు చేసినంత సంపాదించలేదనే అపరాధ భావనలోకి నాకు తెలియకుండానే వెళ్లి పోయాను. ఈ ఆలోచన నిప్పురవ్వలా నా అభిరుచిని రగిలించింది, అది నా వృత్తిగా మారింది. అవును... బిబ్లియోఫైల్స్ పుట్టింది, ఎందుకంటే నేనే ఓ బిబ్లియోఫైల్ కాబట్టి. అందుకే నేను దీని ద్వారా ఎంత సంపాదించ గలిగాన్న దానికంటే ఏం సాధించానన్నదే నాకు సంతృప్తినిస్తుంది.’’ – అపూర్వ మాత్రే -
ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నారా? మహిళలూ ఈ చిక్కులు రావొచ్చు!
బరువు తగ్గేందుకు చాలామంది చేస్తున్న రకరకాల ప్రయత్నాలలో ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన మాట ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ (Intermittent fasting (IF). అయితే స్త్రీలకు మాత్రం ఈ పద్ధతి అంత మంచిది కాదంటున్నారు వైద్యనిపుణులు. ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది తినే సమయానికి, ఉపవాసానికీ మధ్య నిర్దేశించు కున్న వ్యవధులను పాటించే పద్ధతి. ఉదాహరణకు ఆహారం తీసుకోవడం ఉదయం పది నుంచి సాయంత్రం ఆరుగంటల లోగా ముగించేయాలి. ఆ తర్వాత ఏమీ తినకూడదు. దీనివల్ల బరువు తగ్గడం, మెరుగైన జీవక్రియలు, మంచి జీవన నాణ్యత వంటి ప్రయోజనాలున్నాయి. ఈ ఐఎఫ్ అనేది మీరు ఎప్పుడు తింటారు అనే దానిపై దృష్టి పెట్టాలని చెబుతుంది. ఇదీ చదవండి: KBC-17లో రూ. 25 లక్షల ప్రశ్నఈ క్రికెటర్ గురించే.. ఇంట్రస్టింగ్!స్త్రీలకు జాగ్రత్త ఎందుకు ?అధిక ఉపవాసం మహిళల హార్మోన్లలో అసమతుల్యతకు దారితీస్తుంది - ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ – ఋతు చక్రాలు, అండోత్సర్గం, థైరాయిడ్ స్థాయులు, పీసీఓస్, సంతానోత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది. ఇది పునరుత్పత్తి పనితీరును నియంత్రిస్తుంది. అంతేకాదు.. ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ను ప్రేరేపించడం వల్ల ఆందోళన, చిరాకు నిద్రపోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఈ తరహా ఉపవాసానికి దూరంగా ఉండటం ఉత్తమం. నెమ్మదిగా ప్రారంభించండి, నెమ్మదిగా వెళ్లండి16 గంటలు ఉపవాసం ఉండి మిగిలిన 8 గంటల వ్యవధిలోపు తినడం మంచిది. అంటే 12/12 మోడ్లో, ఉపవాసం రాత్రి 8 నుండి ఉదయం 8 గంటల వరకు, తినే సమయం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఉండాలంటున్నారు. రాత్రి ఆలస్యంగా భోజనం చేసే అలవాటున్న వారికిది ప్రయోజనకరం. చదవండి: పెట్రోల్ పంపు, 210 ఎకరాలు, 3 కిలోల వెండి.. రూ.15 కోట్ల కట్నం : వైరల్ వీడియోసమృద్ధిగా తినండి... హైడ్రేటెడ్ గా ఉండండిఈ పద్ధతి పాటించేవారు కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు – ఫైబర్ వంటి అన్ని సూక్ష్మ పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, బయోఫ్లేవనాయిడ్స్ వంటి ఇతర పోషకాలను తగినంత పరిమాణంలో అందేలా చూసుకోవాలి. ఇందుకోసం కూరగాయలు, పండ్లు, గింజలు, విత్తనాలు, తృణధాన్యాలు, లీన్ మాంసాలు, చేపలు, గుడ్లు, చిక్కుళ్ళు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలకు ప్రాధాన్యత ఇస్తూనే, పెరుగు, పెరుగు వంటి ప్రోబయోటిక్స్, ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు వంటి ప్రీ బయోటిక్ వనరులను చేర్చడం కూడా ముఖ్యం. ఉపవాస సమయాల్లో హైడ్రేటెడ్ గా ఉండటం కూడా ముఖ్యం. ఇంటి పని, వంట పని, ఆఫీసు పని తదితర పనుల ఒత్తిడిలో ఉండే స్త్రీలకు ఇన్ని జాగ్రత్తలను పాటించడం కష్టం కాబట్టి దీనికి దూరంగా ఉండటమే ఉత్తమం అంటున్నారు డైటీషియన్లు. చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే! -
స్వీట్ కార్న్: వెరైటీ వంటకాలు ఒక్కసారి ట్రై చేసారంటే..!
మార్కెట్లో ఎక్కడ చూసినా స్వీట్ కార్న్ విరివిగా కనిపిస్తోంది. కాస్త చవగ్గా మనకు లభించినపుడు వీటిల్లోని రుచిని ఆస్వాదించాలి. అందుకే ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో స్వీట్ కార్న్ వెరైటీ వంటకాలను చేసేద్దేమా!ఉడికించిన స్వీట్కార్న్ రుచే వేరే లెవల్! ఉప్పూ కారం జోడించి, కాసింత నిమ్మరసం తగిలిస్తే అహో అద్భుతం అనాల్సిందే. అలాంటి స్వీట్కార్న్తో వెరైటీ వంటకాలంటే నోరూరుతుంది కదూ! మరింకెందుకు ఆలస్యం ఇలా ట్రై చేసి చూడండి!స్వీట్ కార్న్ హల్వాకావలసినవి: స్వీట్ కార్న్ – 2 కప్పులు (నీళ్లు పోసి మెత్తగా గుజ్జులా చేసుకోవాలి); బాదం పాలు – ఒక కప్పు; కస్టర్డ్ మిల్క్ -పావు కప్పు; పంచదార – 4 లేదా 6 టేబుల్ స్పూన్లు (పెంచుకోవచ్చు); ఏలకుల ΄పొడి – ఒక టీ స్పూన్; నెయ్యి – 4 టేబుల్ స్పూన్లపైనే; కుంకుమ పువ్వు – చిటికెడు(అభిరుచిని బట్టి); వెనీలా ఎసెన్స్ – ఒక టీ స్పూన్; బాదపప్పు – 2 టేబుల్ స్పూన్లు (దోరగా నేతిలో వేయించాలి, అభిరుచిని బట్టి జీడిపప్పు, కిస్మిస్ వంటివి జోడించుకోవచ్చు)తయారీ: ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో కస్టర్డ్ మిల్క్, బాదంపాలు, పంచదార, ఏలకుల పొడి, స్వీట్కార్న్ గుజ్జు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మరోసారి కలుపుకోవాలి. అనంతరం స్టవ్ ఆన్ చేసుకుని.. పాన్ బౌల్లో సగం నెయ్యి వేసుకుని, వేడి చేసుకుని.. అందులో ఈ మిశ్రమం మొత్తం వేసుకుని చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఆ సమయంలో గరిటెతో తిప్పుతూనే ఉండాలి. మధ్యలో మిగిలిన నెయ్యి వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి. కాస్త దగ్గర పడుతున్నప్పుడు వెనీలా ఎసెన్స్ వేసుకుని మరోసారి కలపాలి. ఆ మిశ్రమం మరింత దగ్గర పడుతున్న సమయంలో నేతిలో వేయించిన బాదం పప్పు వంటి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు.స్వీట్కార్న్ కేక్కావలసినవి: స్వీట్ కార్న్- 5 కప్పులు (ఉడికించి, గుజ్జులా చేసుకోవాలి), పిస్తా, వాల్నట్స్, బాదం -అర కప్పు చొప్పున, వెన్న -పావు కప్పు, బేకింగ్ పౌడర్ - టీ స్పూన్, పంచదార పొడి - సరిపడా, మైదాపిండి - పావు కప్పు, ఉప్పు- అర టీ స్పూన్, నెయ్యి -కొద్దిగా.తయారీ: ముందుగా చిన్నబౌల్ తీసుకుని.. అందులో మైదా పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాల్నట్స్, బాదం, పిస్తాలను నేతిలో వేయించుకుని, చల్లారిన తర్వాత, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని.. అందులో వెన్న, స్వీట్కార్న్ గుజ్జు వేసుకుని బాగా కలుపుకోవాలి. అవసరం అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో, పంచదార పొడి, మైదాపిండి మిశ్రమాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. చివరిగా వాల్నట్, బాదం, పిస్తా ముక్కలు వేసుకుని, ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గుండ్రటి బేకింగ్ టిన్కి నెయ్యి రాసి.. అందులో ఈ మిశ్రమాన్ని మొత్తం వేసుకుని సమాంతరంగా చేసుకోవాలి. తర్వాత ఓవెన్లో బేక్ చేసుకుంటే సరిపోతుంది. కేక్ బేక్ అయిన తర్వాత క్రీమ్తో డెకరేట్ చేసి.. నచ్చిన విధంగా అలంకరించుకుని నచ్చిన విధంగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లుస్వీట్కార్న్ ఇడియాప్పం కావలసినవి: స్వీట్ కార్న్ గుజ్జు – 3 కప్పులు; బియ్యప్పిండి – 2 కప్పులు; ఓట్స్ పౌడర్, మైదా లేదా గోధుమ పిండి –పావు కప్పు చొప్పున; జీలకర్ర పొడి – పావు టీ స్పూన్; చిక్కటి పాలు – పావు కప్పు (కాచి చల్లార్చినవి); నీళ్లు – కొద్దిగా, నెయ్యి – టీ స్పూన్; ఎల్లో ఫుడ్ కలర్ – (అభిరుచి బట్టి).తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బియ్యప్పిండి, ఓట్స్ పౌడర్, మైదా లేదా గోధుమ పిండి, జీలకర్ర పొడి, స్వీట్కార్న్ గుజ్జు,పాలు వేసుకుని కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి నీళ్లు పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకుని.. మరోసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇడ్లీ పాన్కి బ్రష్తో నెయ్యి పూసుకుని, మురుకుల మేకర్కి సన్నని హోల్స్ ఉండే ప్లేట్ని అమర్చి, అందులో ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా నింపుకుని, ఇడ్లీ పాన్లో నూడుల్స్లా ఒత్తుకోవాలి. అనంతరం ఆవిరిపై ఉడికించాలి. అభిరుచిని బట్టి ఆవాలు, కరివేపాకు, కొత్తిమీరలతో తాలింపు వేసి, కలుపుకుని.. సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది.చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే! -
ఈ జబ్బుకి మందు కనిపెట్టండి ప్లీజ్!
భార్యను బాడీ షేమింగ్ చేయడంఎప్పటి నుంచో ఉంది. శరీర ఆకృతిని బట్టి పేర్లు పెట్టి పిలుస్తూ వేధిస్తారు భర్తలు. తాజాగా ఒక భర్త మరీ శృతి మించాడు. భార్యను నోరా ఫతేహీలా మారమని రోజుకు మూడు గంటలు జిమ్ చేయిస్తున్నాడు. జిమ్ చేయలేని రోజు పస్తు పెడుతున్నాడు. గర్భం వస్తే అబార్షన్కూ వెనుకాడటం లేదు. ఘజియాబాద్లో ఆ భార్య పోలీస్ స్టేషన్కు వచ్చి ‘ఈ భర్త నాకు వద్దు’ అని ఫిర్యాదు చేసింది.అంతా నచ్చి, అన్నీ చూసి వివాహం చేసుకున్నాక భర్తలకు వస్తున్న ఈ పాడు జబ్బుకు మందు వెతకాలి. భార్య పొట్టిగా ఉంటే ఒక నిక్నేమ్, సన్నగా ఉంటే మరొకటి, నల్లగా ఉంటే... లావుగా ఉంటే... పొడవుగా ఉంటే... పలు వరుస సరిగా లేకపోతే... జుట్టు పలుచగా ఉంటే... శరీర అంగాలు పెద్దవో చిన్నవో ఉంటే... భర్తలు వాటిని కేంద్రంగా చేసుకుని నిక్నేమ్స్తో పిలుస్తూ ఇంట్లో, పిల్లల ఎదుట, బంధువుల సమక్షంలో ఆట పట్టించడం ఆనవాయితీ. దీనికి అంగీకారం ఉండటం మన సంప్రదాయం. ఆ నిక్నేమ్స్ ఏదో సరదాగా పెట్టినట్టు అనిపించినా, భర్త అలా పిలవడంలో ఏదో గారాబం కనిపించినా, ఆ పేర్లన్నీ భార్యను బాడీ షేమింగ్ చేసేవే. భార్య తన భర్తకు నిక్నేమ్ పెట్టదు. పెట్టలేదు. పెట్టి నలుగురిలో పిలిస్తే పర్యవసానాలు మనకు తెలుసు. కాని భర్తలు మాత్రం భార్యలను బాడీ షేమింగ్ చేయడం తమ హక్కుగా భావిస్తూ ఉంటారు.ఫిట్నెస్ వేరు... అందం వేరుభార్యాభర్తలు ఆరోగ్యంగా, ఫిట్గా ఉండాల్సిందే. పిల్లలు పెరిగి ఒక వయసు వచ్చాక శారీరక మార్పులు స్త్రీ, పురుషుల్లో వస్తాయి. ఫిట్నెస్ కోసం కనీస వ్యాయామం, వాకింగ్, ఆహార జాగ్రత్తలు తీసుకోవడం ఇరువురూ పాటించాల్సిందే. భార్య ఫిట్నెస్ కోసం భర్తలు సూచనలు చేయడం, వ్యాయామం కోసం ప్రోత్సహించడం మంచి విషయం. కాని సౌందర్యాభిలాషతో, ఇతర స్త్రీలతో పోలుస్తూ... ఈ విధంగా ఉంటే నువ్వు బాగుంటావు... లేకుంటే నచ్చవు అనే సందేశం ఇస్తున్నట్టుగా మాట్లాడటం ఆమెను హింసించడమే. జన్యువుల వల్ల, శరీర తత్వం వల్ల కొందరు స్త్రీల శరీరంలో వ్యాయామంతో తగ్గని బరువు ఉండొచ్చు. లేదా కాన్పుల వల్ల, మెనోపాజ్ వల్ల కూడా తీవ్రమైన మార్పులు రావచ్చు. వాటిని అర్థం చేసుకుని, భార్య ఆరోగ్యం కోసం ప్రయత్నించాలి తప్ప అనునిత్యం కించ పరుస్తూ ఉంటే తప్పు,.. నేరం కూడా. కాని భర్తలు ఈ విషయంలో మారడం లేదు. సొంత పిల్లల ఎదుట కూడా భార్యను గేలి చేస్తూ పిల్లలు ఆమెను తేలిగ్గా తీసుకునేలా చూస్తున్నారు.నోరా ఫతేహీలా ఉండుకాని ఆగస్టు 20వ తేదీన ఒక భార్య ఆవేదన ఇలాంటి భర్తల స్వభావాన్ని మరోసారి బట్టబయలు చేసింది. ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన ఒక వివాహిత అక్కడి మహిళా పోలీస్ స్టేషన్కు వచ్చి భర్త మీద కేసు పెట్టింది. ఆమె తన ఫిర్యాదులో– ‘నేను ఈ సంవత్సరం మార్చి నెలలో వివాహం చేసుకున్నాను. నా భర్త ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. పెళ్లిలో మా వాళ్లు 6 లక్షల బంగారం, 24 లక్షల స్కార్పియో, 10 లక్షల రొక్కం ఇచ్చారు. కాని పెళ్లయి వచ్చినప్పటి నుంచి నన్ను నా భర్త నోరా ఫతేహీ ఫిగర్లాంటిది సాధించాలని వేధిస్తున్నాడు. ఇందుకోసం నాకు రోజుకు 3 గంటల వర్కవుట్ చెప్పి చేయిస్తున్నాడు. ఆ వర్కవుట్లు చేసి అలసి ఏ రోజైనా చేయకపోతే ఆ రోజు నాకు అన్నం పెట్టడం లేదు. అత్తామామలు కూడా అతనికి వంత పాడుతున్నారు. నేను చూడటానికి బాగానే ఉంటాను. కాని అతను అది చాలదని, పిల్లలు కూడా ఇప్పుడే వద్దని, గర్భం వస్తే అబార్షన్ చేయించుకోవాలని చెబుతూ నన్ను భయభ్రాంతం చేస్తున్నాడు. ఈ భర్త వద్దు’ అని ఫిర్యాదు చేసింది.చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లుఆరోగ్యం, అనురాగంభార్యాభర్తల మధ్య ఉండాల్సింది అనుబంధం, అనురాగం, గౌరవం. వారిరువురూ తమ బంధాన్ని బలపరుచుకుంటూ పరస్పరం ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటూ సంతోషంగా జీవిస్తే రూపం సమస్య కాబోదు. రూపదోషాల నిర్వచనం ఒకరి సొత్తు కాదు. కొలతలతో ఉండేదే ఆకృతి కాదు. సంతోషకర దాంపత్యమే అందం, ఆనందం. ఇదీ చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే! -
ఈ స్పేస్ మాది..!
‘ఆకాశంలో సగం’ అనే మాట మనకు సుపరిచితం. అయితే ఆరోజుల్లో ‘స్పేస్ సైన్స్’కు సంబంధించి మహిళా శాస్త్రవేత్తల సంఖ్య చాలా తక్కువ. గతంతో పోల్చితే ఇప్పుడు ఉమెన్ స్పేస్ సైంటిస్ట్ల సంఖ్య బాగా పెరిగింది. ‘ఇస్రో’ మంగళ్యాన్ మిషన్ నుంచి చంద్రయాన్ మిషన్ వరకు ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్లలో కీలక పాత్ర పోషించారు. శాస్త్ర సాంకేతిక రంగంలో అడుగు పెట్టడానికి ఈతరం అమ్మాయిలకు స్ఫూర్తిని ఇస్తున్నారు...ఆకాశమే అపూర్వ పాఠశాలఉత్తర్ప్రదేశ్లోని లక్నోకు చెందిన రీతూ కరిధాల్కు ఆకాశం ఎప్పుడూ వింతగా అనిపించేది. అంత పెద్దగా కనిపించిన చంద్రుడు ఎందుకు తగ్గుకుంటూ వెళతాడు? పగటి పూట చుక్కలు ఎందుకు కనిపించవు? ఇలాంటి సందేహాలెన్నో ఆ చిట్టి బుర్రకు వచ్చేవి. ఆకాశంపై అమితమైన ఆసక్తే రీతూను సైన్స్ వైపు నడిపించింది. స్కూల్ రోజుల్లో నాసా, ఇస్రోకు సంబంధించిన ప్రాజెక్ట్ల సమాచారం గురించి దినపత్రికలలో వెదికేది. కనిపిస్తే వాటిని కట్ చేసి దాచుకునేది.పోస్ట్గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత ఇస్రోలో స్పేస్ సైంటిస్ట్గా ప్రస్థానం ప్రారంభించింది. ప్రతిష్ఠాత్మకమైన మంగళ్యాన్ మిషన్తో పాటు ఇస్రోలోని ఎన్నో ప్రాజెక్ట్లలో కీలక బాధ్యతలు నిర్వహించింది రీతూ కరిధాల్.‘మంగళ్యాన్ మిషన్ కోసం పనిచేయడం అపూర్వ అనుభవం. నిరంతర మేధోమథనం జరుగుతుండేది. సెలవు అంటూ లేకుండా పనిచేశాం. వృత్తి, కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకోవడం అంత తేలిక కాదు. అయితే నా భర్త, కుటుంబ సభ్యుల సహకారం వల్ల అది సాధ్యం అయింది’ అంటుంది రీతూ కరిధాల్.రీతూ కరిధాల్వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఇస్రోఒకప్పుడు ఇస్రోలో పనిచేసిన మహిళలు రిటైర్ అయిన తరువాత ఇంటికే పరిమితం కావచ్చుగాక, అయితే వారు ఎక్కడ ఉంటే అక్కడ ఇస్రో కొలువుదీరుతుంది. ఆనాటి శాస్త్రసాంకేతిక విషయాల గురించి చందమామ కథల్లా ఈతరం పిల్లలకు చెబుతుంటారు. అలాంటి వారిలో ఇస్రోలో తొలి మహిళా కెమికల్ ఇంజనీర్ లలితా రామచంద్రన్ ఒకరు. 1969లో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (విఎస్ఎస్సి)లో టెక్నికల్ అసిస్టెంట్గా చేరినప్పుడు ఆమె వయసు 22 సంవత్సరాలు. తిరువనంతపురంలో క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆమె రిటైర్ అయ్యారు. ‘ఆరోజుల్లో పెద్దగా సౌకర్యాలు లేకపోవచ్చు. అయితే ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసే అదృష్టం దక్కింది’ అంటారు లలిత.1972లో ఇస్రోలో చేరారు జె.గీత. ‘ఆరోజుల్లో నెట్ లేదు. డేటా సేకరణ అనేది ప్రధాన సవాలుగా ఉండేది. రిసెర్చ్, రిఫరెన్స్ కోసం లైబ్రరీలకు వెళ్లి గంటల కొద్ది సమయం గడిపేవాళ్లం’ అంటున్న గీత... సతీష్ధావన్, వసంత్ ఆర్ గోవరికర్లాంటి స్టాల్వాల్ట్స్ మార్శదర్శకత్వంలో పనిచేశారు.ప్రాజెక్ట్లకు సంబంధించిన చర్చల్లో చురుగ్గా పాల్గొనేవాళ్లం. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా తమ అభిప్రాయలను నిస్సంకోచంగా చెప్పే స్చేచ్ఛ ఉండేది. జూనియర్ చెప్పినా సరే, ఆ అభిప్రాయం నచ్చితే ఆమోదించేవారు’ అంటున్న రాధిక రామచంద్రన్ ‘కేరళ యూనివర్శిటీ’లో పోస్ట్ గ్రాడ్య్రుయేషన్ పూర్తయిన తరువాత 1984లో ఇస్రోలో చేరారు.లలితా రామచంద్రన్సైన్స్ ఫిక్షన్టుఇస్రో సైంటిస్ట్తన చిన్నప్పుడు టెలివిజన్లో వచ్చే స్టార్ ట్రెక్, సైన్స్ ఫిక్షన్ అంటే నందిని హరినాథ్కు చాలా ఇష్టం. టీవిలో వచ్చే సైన్స్ ప్రోగ్రామ్స్పై అమిత ఆసక్తి ప్రదర్శించే నందిని తాను స్పేస్ సైంటిస్ట్ అవుతానని అనుకోలేదు. ‘జస్ట్ అలా జరిగింది అంతే!’ అని స్పేస్ సైంటిస్ట్ గా తన ప్రయాణం గురించి నవ్వుతూ చెబుతుంది నందిని. ఉద్యోగంలో చేరిన కొత్తలో రోజుకు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు పనిచేసిన రోజులు ఉన్నాయి. భోజనం చేయడం కూడా మరిచి పనిచేసిన రోజులు ఉన్నాయి.‘ఇస్రో సైంటిస్ట్ అని పరిచయం చేసినప్పుడు ప్రజలు గౌరవించే తీరు వృత్తిపట్ల బాధ్యతను మరింత పెంచుతుంది. మంగళ్యాన్ ప్రాజెక్ట్లో భాగం కావడం గర్వంగా భావిస్తున్నాను. ఆ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నప్పుడు నిద్ర, తిండి గురించి పట్టించుకునేవాళ్లం కాదు. ఇంట్లో తక్కువ సమయం మాత్రమే గడిపేవాళ్లం. ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం’ అంటుంది నందిని హరినాథ్.నందిని హరినాద్వివక్ష లేదు... ప్రతిభే ప్రమాణం‘నేను ఇస్రోలో 1982లో చేరినప్పుడు అక్కడ కొద్ది మంది మహిళా ఉద్యోగులు మాత్రమే కనిపించేవారు. ఊహకు అందని రీతిలో ఇప్పుడు ఎంతోమంది పనిచేస్తున్నారు’ అంటుంది అనురాధ టికె. ఇస్రో శాటిలైట్ సెంటర్లో జియోశాట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ అయిన అనురాధ ఎంతోమంది అమ్మాయిలకు రోల్ మోడల్. ‘తొమ్మిది సంవత్సరాల వయసులోనే ఆకాశంపై ఆసక్తి మొదలైంది’ అని తన బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటుంది అనురాధ. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగు పెట్టడం గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ద్వారా విన్న అనురాధ సంభ్రమాశ్చర్యాలకు గురైంది. ‘చంద్రుడిపై మానవుడు’ అనే అంశంపై తన మాతృభాష కన్నడంలో కవిత రాసింది.‘ఇస్రోలో స్త్రీ, పురుషులు అనే భేదం ఉండదు. ప్రతిభ, అంకితభావం మాత్రమే ప్రమాణం. స్పేస్ ప్రోగ్రామ్స్లో ఎంతమంది మహిళలు పనిచేస్తే అంత మంచిది. అది ఎంతో అమ్మాయిలకు స్ఫూర్తినిస్తుంది. వారు చేస్తున్నారు. మేము కూడా చేయగలం అనే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది’ అంటుంది అనురాధ.అనురాధ టికెభూదేవి అంత ఓపిక... ఆకాశమంత ప్రతిభప్రతిష్ఠాత్మకమైన మంగళ్యాన్ మిషన్ ప్రతిభావంతులైన మహిళా శాస్త్రవేత్తలను లోకానికి పరిచయం చేసింది. ఆ మహిళా శాస్త్రవేత్తలపై ‘ఇస్రో’స్ మాగ్నిఫిసియెంట్ ఉమెన్ అండ్ దెయిర్ ఫ్లైయింగ్ మెషిన్స్’ పేరుతో పుస్తకం రాసింది మిన్నీ వేద్. నందిని, రీతూ కరిధాల్, మౌమిత దత్తా, మినై సంపత్... మొదలైనవారి గురించి ఈ పుస్తకంలో రాసింది. ‘స్పేస్’ను కెరీర్గా ఎంచుకోవడానికి కారణం ఏమిటి? రకరకాల ఒత్తిళ్లను తట్టుకొని ఎలా ముందుకు వెళ్లారు? వృత్తి, కుటుంబ జీవితాన్ని ఎలా సమన్వయం చేసుకున్నారు?.... ఇలాంటి ప్రశ్నలకు ఈ పుస్తకం సమాధానం చెబుతుంది. మన దేశంలో ఫస్ట్ ఇండిజినస్ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ రిసాట్–1 ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసిన వలర్మతి వ్యక్తిగత, ఉద్యోగ జీవిత అనుభవాలు కూడా ఈ పుస్తకంలో కనిపిస్తాయి. మంగళ్యాన్ మిషన్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఇన్చార్జిగా పనిచేసిన మినాల్ సంపత్ స్పేస్క్రాఫ్ట్ టెస్టింగ్ పనుల్లో భాగంగా బెంగళూరు, అహ్మదాబాద్ల మధ్య తరచు ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఆ సమయంలో మూడు సంవత్సరాల తన కుమారుడు గుర్తుకు వచ్చేవాడు. ‘మా బాబు గుర్తుకు వచ్చిన సమయంలో పేలోడ్స్ కూడా నా బిడ్డలే కదా అనుకునేదాన్ని’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది మినాల్ సంపత్. ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఈ పుస్తకంలో కనిపిస్తాయి. -
అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే!
రచయిత్రి,సామాజిక కార్యకర్త,ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి ఆసక్తికరమైన విషయాలను ఇన్స్టాలో పంచుకున్నారు. రెండు పురాతన వస్తువుల గురించి షేర్ చేశారు. దీంతో ఆమెకు అభినందించడంతోపాటు,పనిలో పనిగా పుట్టిన రోజు శుభాకాంక్షఅందించారు అభిమానులు సుధామూర్తి షేర్ చేసినవి పురాతన సింధులోయ నాగరికతలోని ప్రముఖ నగరమైన లోథల్ నుండి తవ్వబడిన ఐకానిక్ కళాఖండాలు.ఇందులో మొదటిది అద్భుతమైన బంగారు హారం. దీన్ని అతిసూక్ష్మమైన బీడ్స్ వేల సంవత్సరాల క్రితం రూపొందించారట. View this post on Instagram A post shared by Sudha Murty (@smtsudhamurty)y"> ఇదీ చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లురెండోది ఒక సాధారణ మట్టి కుండ. దాహం వేసిన కాకి రాళ్లు వేసి నీళ్లను పైకి తీసుకొచ్చిన కథలోని కూజాను పోలి ఉంది. లోథల్ నుండి వచ్చిన ఈ కళా ఖండాలు అద్భుతమైన హస్తకళ, కళాకారుల నైపుణ్యానికి అద్దం పడతాయి. పురాతన వారసత్వం, నైపుణ్యం, మోడ్రన్ ఇండియా మేళివింపునకు సూచించే అద్భుతమైన క్షణాలు అని ఆమె వ్యాఖ్యానించారు.కాగా ప్రముఖ భారతీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణ మూర్తి భార్య. సుధా మూర్తి రచయితగా, సామాజిక సమస్యలపై స్పందించడంతోపాటు దాతగా భారతీయులకు ఆమె సుపరిచితం. కర్ణాటకలోని షిగ్గావ్లో 1950 ఆగస్టు 19న జన్మించారు. దీంతో ఆమెకు సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ అందించారు ఫ్యాన్స్.ఇదీ చదవండి: PCOS Belly తగ్గేదెలా? ఇవిగో అమోఘమైన టిప్స్ -
ఈ చేప భూకంపాలను అంచనా వేయగలదట..!
ప్రకృతి విపత్తులను ఉపగ్రహాల సాయంతో ముందుగానే తెలుసుకుని ప్రజలను అలర్ట్ చేస్తుంటారు అధికారులు. వాతావరణ శాఖ కూడా ఎక్కడెక్కడ ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉందో తెలిపి అలర్ట్లు జారీ చేస్తుంది. అయితే దీన్ని ఓ సాధారణ చేప ముందుగానే గుర్తిస్తోందట. అందుకే దాన్ని ప్రళయానికి సంకేతంగా పిలుస్తుంటారట కూడా. ఇంతకీ అది ఏ చేప..?. దాని కథా దకమామీషు ఏంటో చూద్దామా..!.ఆ చేప పేరే ఓర్ఫిష్(oarfish). దీన్ని "డూమ్స్డే ఫిష్" అని పిలుస్తుంటారు. ఎందుకంటే ప్రళయానికి సంకేతం అన్న భావనలో ఈ చేపకు ఆ పేరు వచ్చిందట. ఇది సిల్వర్ రంగులో మెరిసిపోతూ ఉంటుంది. సముద్రంలో 200 నుంచి దగ్గర దగ్గర వెయ్యి అడుగుల లోతుల్లో నివశిస్తుందట. చాలా నెమ్మదిగా కదులుతుంది. ప్రపంచంలోనే అతి పొడవైన ఎముకలతో కూడిన చేప కావడంతో అస్థి చేప అని కూడా పిలుస్తారు. ఇది నీటిలో ఒక క్రమబద్ధతిలో వెళ్తుందట. అందుకే దీనికి ఓర్ అనే పేరొచ్చిందట. జపాన్ వాళ్లు దీన్ని సముద్ర దేవుడి దూతగా పేర్కొంటారట. ఈ ఓర్ఫిష్ గనుక సముద్ర ఉపరితలం వద్దకు వచ్చిందంటే రాబోయే భూకంపం, సునామీకి సంకేతం అట. అది నిజం అని చెప్పేలా 2010లో, 2011 భూకంప, సునామీ రావడానికి కొన్ని నెలల ముందు ఈ ఓర్ఫిష్లు సముద్రం ఒడ్డుకి కొట్టుకొచ్చాయట. అంతేగాదు 2017లో ఫిలిప్పీన్స్లో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించే ముందు సముద్రంలో అనేక ఓర్ఫిష్లు కనిపించాయట. అయితే శాస్త్రవేత్తలు ఈ చేపను విపత్తులను ముందుగా గుర్తించగలదని కచ్చితంగా చెప్పలేమని చెబుతున్నారు. సముద్ర ఉష్ణోగ్రతల్లోని మార్పుల వల్లో లేక అనారోగ్యం కారణంగానో చనిపోయి ఇలా సముద్రం ఒడ్డున కనిపించి ఉండొచ్చని చెబుతున్నారు. ఎందుకంటే ఇవి సాధారణంగా సముద్ర ఉపరితలంపై కనిపించనే కనిపించవు. సముద్రంలో అత్యంత లోతుల్లోనే ఇది నివశిస్తుందట. ఒక్కొసారి సంతానోత్పత్తికై కూడా ఉపరితలం వద్దకు వస్తుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మే 2025 నుంచి, భారతదేశం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కాలిఫోర్నియాలో ఈ ఓర్ ఫిష్ కనిపించాయట కూడా. ఇవి మానవులకు హానికరం కాదని చెబుతున్నారు. ఈ చేపలు ప్లాంక్టన్, క్రిల్, చిన్న చేపలు, స్క్విడ్, జెల్లీ ఫిష్ వంటి వాటిని తిని జీవిస్తుందట. విచిత్రం ఏంటంటే దీన్ని ప్రళయానికి సంకేతం కాదని శాస్త్రవేత్తలు నొక్కి చెబుతున్నా..ఇంకా పలుచోట్ల ఈ చేప కనిపించగానే హడలిపోతారట. అది రుజువు చేసేలా విపత్తులు రావడం కూడా ఈ నమ్మకాలకు మరింత బలం చేకూరినట్లు అయ్యిందని నిపుణలు వాపోతున్నారు. (చదవండి: అనాథశ్రమంలో పెరిగి ఐఏఎస్ అయ్యాడు..! ట్విస్ట్ ఏంటంటే..) -
కేబీసీ-17లో రూ. 25 లక్షల ప్రశ్న ఈ క్రికెటర్ గురించే.. ఇంట్రస్టింగ్!
బహుళ ప్రజాదరణ పొందిన రియాల్టి షో ‘కౌన్ బనేగా కరోడ్పతి 17 (KBC-17)’ ప్రేక్షకులను టీవీలకు కట్టి పడేస్తోంది. ఈ షోకు సుదీర్ఘకాలంగా హోస్ట్గా వ్యవహరిస్తున్నబిగ్ బీ అమితాబ్ బచ్చన్ వాక్చాతుర్యంతో పాటు, పార్టిసిపెంట్ల ప్రతిభాపాటవాలు కూడా వీక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజా ఎసిసోడ్లోని ఒక ప్రశ్న ఆసక్తికరంగా మారింది.మహారాష్ట్రలోని జల్గావ్కు చెందిన పోటీదారు సాకేత్ నంద్కుమార్ ఒక ప్రశ్న దగ్గర ఇరకాటంలో పడిపోయాడు. అప్పటివరకు వరుసగా సమాధానాలు చెప్పి, కొన్నింటికి లైఫ్లైన్లను వాడుకొని సరిగ్గా రూ. 25 లక్షల ప్రైజ్మనీ దగ్గర ఆగిపోయాడు. రోల్ఓవర్ కంటెస్టెంట్గా హాట్ సీట్లో కూర్చున్న సాకేత్ నందకుమార్ ఏకంగా ఆరు భాషలు మాట్లాడకలగడంపై బిగ్ బీ ప్రశంసలు కురిపించారు. దీంతో గెస్ట్ని జర్మన్లో స్వాగతించమని అడిగి కాసేపు సందడి చేశారు. ఇక షోలోని ప్రశ్నల విషయానికి వస్తే రూ. 25 లక్షల ప్రశ్నకు సమాధానం చెప్పలేక సోనార్ హాట్ సీట్ తీసుకొని రూ. 12,50,000 ప్రైజ్ మనీతో నిష్క్రమించాడు.రూ. 25 లక్షల ప్రశ్న ఏంటి అంటే"1932లో తన టెస్ట్ అరంగేట్రంలో, ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ ఇంగ్లాండ్ తరపున ఏ మైదానంలో సెంచరీ చేశాడు?" అనేది ప్రశ్న.ఎ) ది ఓవల్ బి) మెల్బోర్న్ సి) సిడ్నీ డి) ఓల్డ్ ట్రాఫోర్డ్ అనే అప్షన్లు ఇచ్చారు.సమాధానం తెలియక పోవడంతో సాకేత్ చివరి లైఫ్లైన్ను ఎంచుకున్నాడు కానీ సమాధానం లభించలేదు. చివరికి ఆప్షన్ ఏ ది ఓవల్ అనే తప్పు సమాధానం చెప్పాడు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి) సిడ్నీ క్రికెట్ గ్రౌండ్.ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ (1910-1952)కాగా పంజాబ్కు చెందిన నవాబ్ మొహమ్మద్ ఇఫ్తికార్ అలీ ఖాన్ సిద్ధిఖీ పటౌడీ అలియాస్ ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ తన టెస్ట్ అరంగేట్రం చేశాడు 1932–33లో ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG)లో జరిగిన యాషెస్ సిరీస్లో ఇంగ్లాండ్ తరపున ఆడాడు. బిల్ వుడ్ఫుల్ నేతృత్వంలోని బలమైన ఆస్ట్రేలియన్ జట్టును ఎదుర్కొంటూ ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో అతను అద్భుతమైన 102 పరుగులు చేశాడు. డాన్ బ్రాడ్మాన్తో టెస్ట్ అరంగేట్రంలో సెంచరీ చేసిన కొద్దిమంది క్రికెటర్లలో ఒకరిగా నిలిచాడు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్న ఇబ్రహీం అలీ ఖాన్ తన ముత్తాత నవాబ్ మొహమ్మద్ ఇఫ్తికార్ అలీ ఖాన్ సిద్ధిఖీ పటౌడీలా ఉంటాడని భావిస్తారు.చదవండి: కేబీసీ 17లో కోటి గెల్చుకున్న తొలి వ్యక్తి..కానీ 7 కోట్ల ప్రశ్న ఏంటో తెలుసా? క్విజ్ మాస్టర్ అమితాబ్ బచ్చన్ను ఆకట్టుకున్న సాకేత్ నందకుమార్ తాను గెల్చుకున్న ప్రైజ్ మనీతో ఏమి చేయాలని అనుకుంటున్నాడో తెలుసా. బిర్యానీ లవర్ : తాను బిర్యానీ ప్రేమికుడిని కాబట్టి,గెల్చుకున్న డబ్బుతో భారతదేశం అంతటా పర్యటించి దేశంలో లభించే వివిధ రకాల బిర్యానీలను రుచి చూస్తాడట. అంతేకాదు తన తల్లికి బహుమతిగా సొంత రెస్టారెంట్ కూడా ఓపెన్ చేయాలని భావిస్తున్నట్టు చెప్పాడు.ఇదీ చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లు -
అనాథశ్రమంలో పెరిగి ఐఏఎస్ అయ్యాడు..! ట్విస్ట్ ఏంటంటే..
ఐఏఎస్ అయ్యేందుకు యువత ఎంతగా పరితపిస్తుందో తెలియనిది కాదు. కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ.. ఏళ్లుగా ప్రిపేర్ అవ్వతూ ఐఏఎస్ అవ్వాలని తపిస్తుంటారు. అలాంటి కలను ఇక్కడొక వ్యక్తి ఎలా సాకారం చేసుకున్నాడో వింటే విస్తుపోతారు. ఈ స్ఫూర్తిదాయకమైన స్టోరీ వింటే..నిజాయితీగా లభించిన ఉద్యోగం మంచిగా చేసుకుంటూ..అధికారుల మన్ననలను పొందుతూ ఊహించని విధంగా తన కలను సాకారం చేసుకున్నాడు. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన సక్సెస్ స్టోరీ ఇది.ఈయన్ని మరో అబ్దుల్ కలాం అనొచ్చు. అతడే కేరళకు చెందిన అబ్దుల్ నాజర్. అతడి బాల్యం కష్టాలతో ప్రారంభమైంది. ఐదేళ్ల ప్రాయంలోనే తండ్రిని దూరం చేసింది. పాపం తల్లి కుటుంబాన్ని పోషించుకునేందుకు పనిమనిషిగా మారి జీవనం సాగించాల్సి వచ్చింది. రాను రాను పరిస్థితి కడు దయనీయంగా మారడంతో నాసర్ అతని తోబుట్టువులు అనాథశ్రమంలో పెరగాల్సి వచ్చింది. అంతేగాదు పదేళ్ల వయసులో కుటుంబాన్ని పోషించుకునేందుకు డెలివరీ బాయ్గా..ఇతర విద్యార్థులకు ట్యూషన్లు చెప్పడం, ఫోన్ ఆపరేటర్గా ఇలా చిన్నాచితక పనులు చేసుకుంటూ చదువుని సాగించేవాడు. ఇన్ని కష్టాల మధ్యలో ఎక్కడ చదువుని మాత్రం వదిలేయలేదు నాజర్. అలా రాష్ట్ర ఆరోగ్య శాఖలో క్లర్క్ ఉద్యోగం సంపాదించాడు. ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలామందికి ఇష్టమైన డ్రీమ్. అయితే అదరిలా నాసర్కి కూడా యూపీఎస్సీకి ప్రిపరై, సివిల్స్ రాయాలని ఉండేది. కానీ తనకున్న బాధ్యత రీత్యా అది సాధ్యపడదు. అదీగాక అంత డబ్బు ఖర్చుపెట్టి కోచింగ్ తీసుకోవడం అనేది సాధ్యమై పని కాదు. అందుకని అతడు ఎంచుకున్న మార్గం వింటే వావ్..అని మెచ్చకోకుండా ఉండలేరు. ఎందుకుంటే తనకు లభించిన ఉద్యోగాన్నే అధికారుల మన్ననలను పొందేలా వర్క్ చేయాలని భావించాడు. అతడి కష్టానికి తగ్గా ప్రతిఫలం ప్రమోషన్ల రూపంలో వస్తూనే ఉండేది. అలా మొత్తం 20 ఏళ్ల అంకితభావంతో పనిచేసి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత స్థానానికి ఎదిగాడు. అతని అత్యుత్తమ ట్రాక్ రికార్డు కారణంగా 2017లో సివిల్స్ ఎగ్జామ్ రాయకుండానే ఐఏఎస్ ఆఫీసర్గా పదోన్నతి పొందాడు. చెప్పాలంటే తన అచంచలమైన కృషితో అత్యున్నత అధికారి అయ్యాడు. ఈ కథ ఆలోచింప చేసేలా ఉన్నా..బహుశా అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. ఇక్కడ నాసర్ ఈ అత్యున్నత స్థాయికి చేరుకునేందుకు దశాబ్దాల ఓపిక, అచంచలమైన కృషి, కష్టపడేతత్వం వంటివి ఆయుధాలుగా మలుచుకున్నాడనేది గుర్తురెగాలి. ఈ స్టోరీ కలను సాకారం చేసుకోలేకపోయామని కృశించి పోకూడదు..శక్తివంతమైన ఆలోచనా దృక్పథంతో సాధ్యమయ్యేలా చేసుకోవచ్చని తెలుపుతోంది. ఓపికతో నిశబ్ధంగా తన పని తాను చేసుకుంటూపోతే..ఏదో ఒకనాటికి లక్ష్యానికి చేరకుంటాం అనేది జగమెరిగిన సత్యం. అంతేగాదు పట్టుదలతో అడియాశగా మిగిలిన కలను సైతం ఆశాకిరణంగా మార్చుకోవచ్చని అబ్దుల్ నాసర్ కథే చెబుతోంది కదూ..!.(చదవండి: 16 వేల అడుగుల ఎత్తులో పూతరేకులు తిన్నారా..?) -
బంగారు శంఖం అంటూ రూ. 10 లక్షలు కుచ్చు టోపీ
ఒడిశా, జయపురం: జయపురంలో నకిలీ బంగారు శంఖాల మోసం జరిగింది. ఒక నకిలీ బంగారంతో తయారు చేసిన శంఖాన్ని ఒక వ్యాపారికి ఇచ్చి రూ.10 లక్షలు మోసం చేసిన సంఘటన వెలుగు చూసింది. జగత్సింగపూర్ జిల్లా కుజంగ పోలీసు స్టేషన్ గండకిపూర్ వ్యాపారి నిత్యానంద మహాపాత్రోకి బంగారు శంఖం ఇస్తామని కొందరు మోసగాళ్లు నమ్మించి రూ.10 లక్షలు తీసుకుని మోసం చేశారు. దీంతో జయపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారని పట్టణ పోలీసు అధికారి ఉల్లాస్ చంద్ర రౌత్ వెల్లడించారు. ఇదీ చదవండి: MegaStar Chiranjeevi Birthday70 ఏళ్లలోనూ షాకింగ్ ఫిట్నెస్, డైట్ సీక్రెట్స్పోలీసు అధికారి వివరణ ప్రకారం నిత్యానంద మహాపాత్రో భువనేశ్వర్లో వ్యాపారం చేస్తున్నారు. అతడికి జయపురంలో బంగారు శంఖం ఇస్తానని ఓ వ్యక్తి తెలిపాడు. ఈ నెల 16న స్థానిక ఒక హొటల్కు ఆ వ్యక్తి అతడి అనుచరులు వచ్చారు. మహాపాత్రోకు బంగారంలా కనిపించే ఒక శంఖం ఇచ్చి రూ.10 లక్షల నగదు తీసుకున్నారు. వ్యాపారికి దుండగులుఇచ్చిన నకిలీ బంగారు శంఖంతర్వాత మహాపాత్రో బంగారు శంఖాన్ని పరీక్షించగా అది ఇత్తడి అని బయట పడింది. వారికి ఫోన్ చేస్తే స్విచాఫ్ అని వచ్చింది. దీంతో ఆ వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. ఎస్ఐ రాజేంద్ర పంగి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి : ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లు -
అరుదైన ఊసరవెల్లి
ఒడిశా, కొరాపుట్: అరుదైన ఊరసవెల్లిని గిరిజనులు స్వాదీనం చేసుకున్నారు. గురువారం నబరంగ్పూర్ జిల్లా చందాహండి సమితి పటకలియా పంచాయితీ బడకనా గ్రామంలో ఊసరవెల్లిని గిరిజనులు గమనించారు. దీన్ని చూడడం అరిష్టమని వారు భావిస్తారు. విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్తలు గ్రామానికి చేరుకుని ఊసరవెల్లిని రక్షించి అటవీ శాఖాధికారులకు అప్పగించారు. వారు దాన్ని అడవిలోకి విడిచిపెట్టారు. ఇదీ చదవండి : పెట్రోల్ పంపు, 210 ఎకరాలు, 3 కిలోల వెండి.. రూ.15 కోట్ల కట్నం : వైరల్ వీడియో దసరా ఉత్సవాలకు భూమిపూజ రాయగడ: సదరు సమితి పరిధిలోని జేకేపూర్లో ఉన్న జేకే పేపర్ మిల్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న దసరా ఉత్సవాలకు గురువారం భూమిపూజ కార్యక్రమం జరిగింది. జేకేపేపర్ మిల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వినయ్ ద్వివేది ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రతీ ఏడాది అత్యంత ఘనంగా జరిగే దసరా ఉత్సవాలను తిలకించేందుకు వేల సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు శ్రీకారం చుట్టినట్లు ద్వివేది తెలియజేశారు. పూజా కార్యక్రమాల్లో మిల్ సీనియర్ ఉద్యోగులు బిశ్వజీత్ ద్వివేది, రాఘవేంద్ర హర్బర్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: MegaStar Chiranjeevi Birthday70 ఏళ్లలోనూ షాకింగ్ ఫిట్నెస్, డైట్ సీక్రెట్స్ -
16 వేల అడుగుల ఎత్తులో పూతరేకులు తిన్నారా..?
ఆంధ్రప్రదేశ్లోని ఆత్రేయపురం గ్రామం ఫేమస్ వంటకం పూతరేకులు. జీఐ ట్యాగ్ దక్కించుకున్న ఈ స్వీట్ వివాహాలు, పండుగల్లో భాగమై అందరు ఇష్టపడే వంటకంగా పేరుతెచ్చుకుంది. అలాంటి ఫేమస్ స్వీట్ని నచ్చిన పర్యాటనలకు వెళ్లినప్పుడూ కూడా వెంట తీసుకువెళ్తాం. అది కామన్. కానీ ఎత్తైన పర్వతాలను ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడూ లేదా ఎముకలు కొరికే చలిప్రాంతాల్లో దీన్ని ఆస్వాదించే ప్రయత్నం చేశారా.!. ఇదంతా ఎందుకంటే 16 వేల అడుగుల ఎత్తులో హిమగిరులను చూస్తూ.. తెల్లటి కాగితం పొరల్లా ఉండే ఈ పూతరేకులను తింటే ఎలా ఉంటుందో ఆలోచించారా..? ఇంకెందుకు ఆలస్యం తింటే ఎలా ఉంటుందో తెలుసుకుందాం రండి మరి..ఆధ్యాత్మిక గురు సద్గురు జగ్గీ వాసుదేవ్,ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆ ప్రయత్నం చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆయన తన కైలస యాత్రలో భాగంగా..16,400 అడుగుల ఎత్తులో ఉన్న హిమాలయాలను చూస్తూ..ఈ స్వీట్ని ఆస్వాదించారు. ఎతైన, కొండలు, మంచు పర్వతాల వద్ద కొన్ని వంటకాలు రుచి మారుతుంది. ఒక్కోసారి పాడైపోతాయి కూడా. బ్రెడ్, ఎనర్జీ బార్లు, చాక్లెట్లు సూప్ లాంటివి అక్కడ చలికి బాగా గట్టిగా మారిపోతాయి. తినేందుకు అంత బాగోవు కూడా. మరి ఈ వంటకం రుచి కూడా అలానే ఉంటుందా..! అన్నట్లుగా సద్గురు ఆ ప్రదేశంలో ఈ గ్రామీణ వంటకాన్ని తింటూ..చిన్నపిల్లాడి మాదిరిగా ఎంజాయ్ చేశారు. బహుశా నాలా ఎవ్వరూ ఈ ప్రాంతంలో ఈ టేస్టీ.. టేస్టీ.. వంటకాన్ని తిని ఉండరు.. హ్హ..హ్హ.. అంటూ ఆనందంగా తినేశారు. ఈ ఎత్తైన హిమాలయాలు భక్తికి నియంగానే కాదు ప్రముఖ వంటకాలను ఆస్వాదించేందుకు వేదికగా మారిందా అన్నట్లుంది కదూ..!. ఆంధ్రప్రదేశ్లోని ఆత్రేయపురంకి చెందిన ఈ గ్రామీణ వంటకం హిమాలయాల వద్ద కూడా దాని రుచిని, రంగుని కోల్పోలేదు. ఇది గ్రామీణ వంటకం గొప్పతనానికి నిదర్శనం కాబోలు. పొరలు పొరలుగా చక్కెర లేదా బెల్లం యాలకులు, డ్రైప్రూట్స్, నెయ్యితో చేసే వంటకం నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతుంది. అబ్బా..! తలుచుకుంటేనే నోరూరిపోతుంటుంది. View this post on Instagram A post shared by Sadhguru (@sadhguru) (చదవండి: శునకాలనే దైవంగా ఆరాధించే క్షేత్రం..! ఎక్కడుందంటే..) -
మెగాస్టార్ చిరంజీవి 7 పదుల వయస్సులోనూ షాకింగ్ ఫిట్నెస్, డైట్ సీక్రెట్స్
మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టిన రోజు. ఈ మాట వినిగానే చిరంజీవికి డెబ్భై ఏళ్లా? అని ఆశ్చర్యపోతారు. నటనలోనే కాదు, అందం, ఆరోగ్యం విషయంలోనూ ఫ్యాన్స్ను మెస్మరైజ్ చేసే ఫిట్ నెస్ చిరంజీవి సొంతం. 70 ఏళ్ల వయస్సులో చాలా చురుగ్గా ఉంటూ డ్యాన్సులైనా, ఫైట్లైనా నేను ఎవర్ రెడీ అన్నట్టు ఉంటారాయన. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అన్నట్టుంటే ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం.తాము అనుకున్న రంగంలో విజయం సాధించి స్టార్గా నిలవడం ఎంత అవసరమో, ముఖ్యంగా ఎంటర్టైన్ మెంట్ రంగంలో నిలదొక్కుకోవాలంటే.. అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే అవసరం. కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకొని, ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించుకొని, ఇప్పటికీ చిరు అన్నయ్యగా పిలిపించుకునే ఘనత ఆయనది. ఎన్నో విభిన్నమైన చిత్రాలు, మరెన్నో విభిన్న పాత్రలతో ఎందరో యువ హీరోలకు సైతం స్ఫూర్తినిచ్చే చిరంజీవి ఆరోగ్యం రహస్యం వెనుకాల గొప్ప శ్రమే ఉంది. జీవితంలో ఒడిదుకులు, ఒత్తిడిని తట్టుకుంటూ, చక్కని జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహార నియమావళి క్రమ తప్పనివ్యాయామం ఇవే ఆయన సీక్రెట్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా చిరంజీవి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారట. ఇంటి ఫుడ్కే ప్రాధాన్యత, తక్కువ నూనె, తక్కువ చక్కర, ప్రాసెస్డ్ ఫుడ్ పూర్తిగా దూరం. ఆరోగ్య నిపుణుడిపర్యవేక్షణలో ఆహార ప్రణాళికలో ప్రోటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు సమపాళ్లలో ఉండేలా జాగ్రత్త పడతారు.చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లుఒకసారి స్వయంగా ఆయనే చెప్పినట్టు రోజువారీ ఆహారంలో తేలికపాటి, పోషకాలతో కూడిన అల్పాహారంతో ప్రారంభిస్తారు. ఎక్కువగా ఆవిరి మీద ఉడికించిన ఇడ్లీ, దోశ లేదా గుడ్డులోని తెల్లసొనతో చేసిన ఆమ్లెట్ను తీసుకుంటారు. మధ్యాహ్న భోజనంలో ఒక బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్స్ తో పాటు, కూరలు ఎక్కువ ఉండేలా జాగ్రత్తపడతారు. ప్రోటీన్ కోసం పప్పు లేదా గ్రిల్ చేసిన చికెన్, చేపలు, బాయిల్డ్ ఎగ్స్ తింటారు. డిన్నర్ చాలా లైట్గా ఉండేలా చూసుకుంటారు.ఇదీ చదవండి: పెట్రోల్ పంపు, 210 ఎకరాలు, 3 కిలోల వెండి.. రూ.15 కోట్ల కట్నం : వైరల్ వీడియోకసరత్తులుసాధారణంగా వయసు పెరిగే కొద్ది శక్తి తగ్గుతుంది. ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. చర్మ ఆరోగ్యంలో కూడా తేడాలొస్తాయి. వీటినుంచి బయటపడాలంటే ఖచ్చితంగా డైలీ రొటీన వ్యాయామంతోపాటు, బాడీ స్ట్రెంత్, మజిల్ బిల్డింగ్,కార్డియో, కసరత్తు అవసరం. ఇవి శరీరం బరువు పెరగకుండా మెటబాలీజం పెంచి, కలకలం ఆరోగ్యంగా చురుగ్గా ఉండేందుకు తోడ్పడతాయి. సరిగ్గి చిరంజీవికూడా ఇదే ఫాలో అవుతున్నారు. దీనికి విశ్వంభర సినిమా కోసం జిమ్లో కసరత్తు చేస్తున్న వీడియో ఒకటి బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో బెంచ్ ప్రెస్, డంబెల్ కర్ల్స్, స్క్వాడ్స్, కార్డియో ఎక్స్ర్ సైజ్లు చేయడం మనం చూశాం. సో ఏజ్ ఈజ్ నంబర్ మాత్రమే. ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా, ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే ఒత్తిడిలేని జీవితం, మంచినిద్ర, చక్కటి జీవనశైలి, ఆరోగ్య కరమైన ఆహారం, కనీస వ్యాయామం, అప్పుడప్పుడు కొన్ని ఆరోగ్య పరీక్షలు చేసుకుంటే ఫిట్ నెస్ సొంతం చేసుకోవచ్చు అని నిరూపించిన చిరంజీవికి హ్యాపీ బర్తడే చెప్పేద్దామా! -
శునకాలనే దైవంగా ఆరాధించే క్షేత్రం..! ఎక్కడుందంటే..
దేశ రాజధాని ప్రాంతం నుంచి వీధి కుక్కలన్నింటినీ తొలగించాలంటూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పును చాలామంది సమర్థించగా పలు వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ధర్మాసనం పునః పరిశీలించి.. తుది తీర్పును తాజాగా వెల్లడించింది. వీధి కుక్కలను శాశ్వతంగా షెల్టర్లలో ఉంచరాదని.. కరిచే కుక్కలను మాత్రమే షెల్టర్లో ఉంచాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అదే విధంగా.. బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారం పెడితే కఠిన చర్యలు తప్పవని సుప్రీం కోర్టు హెచ్చరించింది. దేశ రాజధానిలో శునకాల పరిస్థితి ఇలా ఉంటే.. కొన్ని చోట్ల కుక్కలు దాడి చేయడం గానీ, కుక్క గాటుకి గురైన దాఖలు లేని ప్రదేశాలు ఉన్నాయంటే నమ్ముతారా..!. అంతేగాదు అక్కడ శునకాన్ని ఆరాధ్య దైవంగా పూజలు చేస్తారట. ఆ శునక దేవుడిని భక్తులు కొలిచే విధానం నుంచి సమర్పించే నైవేద్యం వరకు ప్రతీది అత్యంత ప్రత్యేకమే. మరి ఆ విశేషాలేంటో సవివరంగా తెలుసుకుందామా..!.ఆ ప్రదేశమే కేరళలోని పరస్సిని మడప్పుర ఆలయం. కేరళలో అత్యంత ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి. ప్రకృతి సహజ సౌందర్యానికి ఆలవాలమైన ఈ కేరళలోని పరస్సిన మడప్పురలో కొలువైన శ్రీ మతుత్తప్పన్ ఆలయం కుక్కలకు స్వాగతం పలుకుతుంది. అక్కడ వాటిని దైవంగా పూజిస్తారు భక్తులు. విశ్వాసానికి పేరుగాంచిన శునకమే దైవం, పైగా కోరికలు తీర్చే కల్పవల్లిగా అక్కడ ప్రజలు కొలుస్తుండటం మరింత విశేషం. ఆ శునకాన్ని విష్ణు, శివుడి అంశంగా భావించి కొలుస్తారట కేరళ వాసులు. ఇది కేరళలోని కన్నూర్ నుంచి 20 కిలోమీటర్లు దూరంలో ఈ ఆలయం ఉంది. పురాణ కథనం ప్రకారం..ముత్తప్పన్ అనే పిల్లవాడు నిబంధనలు ధిక్కరించి స్వేచ్ఛయుతంగా జీవించే మనస్తత్వం కలవాడు. అతనికి వేటాడటం, కల్లు తాగడం, పేదలకు సహాయం చేయడం వంటి మంచి సద్గుణాలు కూడా ఉన్నాయి. ఎవ్వరికి తలవంచిన ఆ ముత్తప్పన్ వ్యక్తిత్వం కారణంగా అతని కుటుంబం బహిష్కరణకు గురైంది. దాంతో అతడు ఉన్నటుండి అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత గ్రామాస్తులు అతడు దైవాంశ సంభూతడని భావించి..అతని గౌరవార్థం ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయం ప్రవేశ ద్వారం వద్ద ఉండే కాంస్య కుక్క విగ్రహాలు తమ ఊరికి రక్షగా అక్కడి ప్రజలు భావిస్తారు. ఆ ఆలయంలో అత్యంత ఆసక్తి రేకెత్తించే అంశం నివేదించే ప్రసాదం.నాయూట్టు ఆచారం..కుక్కలకు పెట్టే ఆహారాన్ని కేరళలో నాయూట్టు ఆచారం అంటారు. ఆ ఆలయంలో కుక్కే దైవం కాబట్టి..ఆ స్వామికి ఎండు చేపలు, ఉడికించిన నల్లబీన్స్, టీ నేవేద్యంగా సమర్పిస్తారట. ఆ తర్వాత ఆ ఆలయంలో స్వేచ్ఛగా తిరిగే శునకానికి ఆ ప్రసాదం పెట్టాక..భక్తులకు వితరణ చేస్తారట. ఆలయంలో సుందరి అనే శునకం, దాని పిల్లలను ఆలయ సిబ్బంది ఎంతో ప్రేమగా చూసుకుంటారట.ఆశ్చర్యకరమైన విషయం..ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..ఇక్కడ కుక్క కాటు లేదా దాడి చేయడం వంటి ఘటనలు జరిగిన దాఖలాలు కూడా లేవట. ఇది అక్కడ భక్తుల నమ్మకానికి నిదర్శనంగా ఉంటుంది.రెండు రకాల తెయ్యంలు..తెయ్యం (Theyyam) అనేది కేరళ రాష్ట్రంలోని ఉత్తర మలబార్ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఒక ప్రాచీన జానపద నృత్యం. ఇది దైవాన్ని ప్రసన్నం చేసుకునే నృత్యం. ఇక్కడ “తెయ్యం” అంటే దైవం అని అర్థం. వన్నన్ తెగ సభ్యులు దీన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ముత్తప్పన్లా వేషాధారణ వేసుకున్న వ్యక్తి కల్లు తాగడం అనే ఆచారం ఉంటుంది. దీని ఉద్దేశ్యం ఆ వ్యక్తిగత స్ప్రుహను మరిచిపోయేలా చేసి, ఆ వ్యక్తిని దైవంలా ప్రవర్తించేలా చేస్తుందట. ఈ తెయ్యంలో ప్రతి ఒక్క భక్తుడు పాల్గొనవచ్చు..ఆ తంతును వీక్షించి ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందచ్చు.ఆలయ నిర్మాణం ఆలయం మూడు అంతస్తుల తెల్లటి నిర్మాణం. సాంప్రదాయ కేరళ ఆలయ రూపకల్పనకు నిలువెత్తు నిదర్శనం. ఫోటోగ్రఫీకి కూడా అనుమతిస్తారు. అయితే కొన్ని ఆచారాలను చిత్రించడం నిషిద్ధం.ఆలయ వేళలు: ప్రతిరోజూ ఉదయం 6:30 నుండి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంటుంది. ప్రత్యేక పూజలు కూడా జరిపించుకోవచ్చు.చేరుకునే మార్గం..రోడ్డు మార్గంకన్నూర్, తాలిపరంభ, సమీప పట్టణాల నుంచి సాధారణ బస్సులు మరియు టాక్సీలు ద్వారా చేరుకోవచ్చు.రైలు ద్వారాసమీప రైల్వే స్టేషన్లు కన్నూర్, పయ్యనూర్. రెండు స్టేషన్ల నుంచి, స్థానిక బస్సులు, ఆటో-రిక్షాలు అందుబాటులో ఉంటాయి. అయితే మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కోసం టాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి. కన్నూర్ స్టేషన్ నుంచి దాదాపు 45 నిమిషాలు పడుతుంది.విమాన మార్గంకన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆలయం నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. దిగిన తర్వాత టాక్సీ లేదా బస్సు సాయంతో చేరుకోవచ్చు. చివరగా ఎలాగో కేరళ వస్తున్నారు కాబట్టి ఈ ఆలమం సమీపంలో ఉండే ప్రసిద్ధ పరస్సినికాడవు తాలిపరంబాలోని రాజరాజేశ్వర ఆలయం, పయ్యనూర్లోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం సందర్శించేలా టూర్ ప్లాన్ చేసుకుంటే కేరళ సహజ అందాలను వీక్షించే అవకాశం దక్కుతుందట.(చదవండి: మేఘాలయ టూర్..! అంబరాన్నంటే అద్భుతం!) -
పెట్రోల్ పంపు, 210 ఎకరాలు, 3 కిలోల వెండి.. రూ.15 కోట్ల కట్నం : షాకింగ్ వీడియో
అంగరంగ వైభవంగా పెళ్లి.... వేల మంది అతిథులు వేల కోట్ల రూపాయల ఖర్చు ఇలా మన దేశంలో ముఖేష్ అంబానీ ,అదానీ లాంటి కుబేరుల ఇళ్లల్లో జరిగే పెళ్లిళ్ల గురించి తెలుసు. భారీ కట్నాలు, కానుకల గురించి మరీ బహిరంగంగా కాకపోయినాఅప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్గా మారింది. మనదేశంలో వరుడుకిచ్చిన షాకింగ్ కట్నం చర్చనీయాంశంగా మారింది.ఇండియా వరకట్నం చట్టపరంగా నేరం. కానీ కట్న కానుకలివ్వడం లోపాయికారీగా జరిపోతూనే ఉంది. కానీ ఈ వీడియోలో వరుడికిచ్చిన కట్నం గురించి తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. ఏకంగా ఒక పెట్రోల్ పంపు, 210 ఎకరాల భూమి, 3 కిలోల వెండి.. రూ.15 కోట్ల నగదును కట్నంగా ఇచ్చారు ఈ వివరాలన్నీ ఈ వీడియోలో ప్రస్తావించడం విశేషం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగినట్టు తెలుస్తోంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. Wednesday @Shizukahuji అనే ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారుఇదీ చదవండి: PCOS Belly తగ్గేదెలా? ఇవిగో అమోఘమైన టిప్స్ Love marriage vo kya hota hai 💀 pic.twitter.com/otmFucQnep— Wednesday (@Shizukahuji) August 20, 2025 దీనిపై స్పందించిన కొంతమంది నెటిజన్లు ఆదాయ పన్ను శాఖ, ఈడీ ఎక్కడ ఉన్నాయి అంటూ ఫన్నీగా ప్రశ్నించారు. ఇంత బహిరంగంగా కట్నం తీసుకుంటోంటే పోలీసులు స్పందించరా అంటూ మరికొంతమంది కమెంట్ చేశారు.ఇదీ చదవండి: MegaStar Chiranjeevi Birthday70 ఏళ్లలోనూ షాకింగ్ ఫిట్నెస్, డైట్ సీక్రెట్స్ -
ఆంధ్రకేసరి టంగుటూరి.. ప్రజల మనిషి
మహోన్నత స్వాతంత్య్రోద్యమ నాయకుల్లో తెలుగు బిడ్డ, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు (1872–1957) ఒకరు. పదవుల కోసం ఆయన ఎన్నడూ పాకులాడలేదు. పదవులే ఆయనను వరించాయి. ఆయన దేనిని నమ్మారో దానినే త్రికరణ శుద్ధిగా ఆచరించారు. లక్షలాది రూపాయలు సంపాదించి, అంతా ప్రజల కోసమే ఖర్చు చేశారు. తన కోసం ఆయన పైసా కూడా మిగుల్చుకోలేదు. నాటి లోక్సభ స్పీకర్ అనంతశయనం అయ్యంగార్ ఆయన ధైర్యాన్నీ, నిస్వార్థపరత్వాన్నీ కొనియాడిన విధానాన్ని చూస్తే ప్రకాశం వ్యక్తిత్వం అర్థమవుతుంది– ‘మనం 1928లో సైమన్ కమిషన్ను బాయికాట్ చేసిన సమయంలో చెన్నపట్నంలో గల ఇతర నాయకులు సైమన్ రాకను ఎదిరించలేక చెన్నపట్నం వదిలి వెళ్ళి పోయారు. ప్రకాశంగారు మాత్రం మిలిటరీ పోలీ సులు అడ్డుకోబోయి నప్పుడు చొక్కా విప్పి కాల్చమని తన ఛాతీని చూపించిన సాహసి అయ్యారు. ఆయన తన సర్వస్వం దేశ స్వాతంత్య్ర సమరంలో త్యాగంచేసిన మహావ్యక్తి, మరణించే నాటికి ఒక రాగి పాత్ర అయినా మిగుల్చుకోలేదు’.ప్రకాశం మరణించినప్పుడు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆయన విశిష్టతను ఇలా ప్రశంసించారు: ‘స్వాతంత్య్ర జ్యోతిని సాహసంతో వెలిగించిన దేశభక్తుల్లో అగ్రశ్రేణికి చెందిన వారు ప్రకాశంగారు. ముందువెనుకలు చూడని ధైర్యం, దాతృత్వం వలన ఆయన ఒక పురాణ పురుషులయ్యారు. ఆయన ఉత్తేజం వల్లనే వందలాది అనుయాయులు దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ జనకుడే కాదు, ఆయన భారత జాతీయోద్యమ నాయక శ్రేణిలో అగ్రశ్రేణికి చెందిన నాయకుడు’. ఇదీ చదవండి: అప్పుడే... ఏఐకి సార్థకతనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ... ‘నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు 1920 సంవత్సరం నుండి 1935 వరకు పంతులు గారితో నాకు పరిచయం, సాహచర్యం ఉన్నాయి. ఒకప్పుడు సంపూర్ణంగా మేమిద్దరం ఏకీభ వించకపోయినా ఆయన గుణసంపత్తిని నేను ఎప్పుడూ ప్రశంసా భావంతోనే చూసేవాడిన’ని అన్నారు. ఈనాటి రాజకీయ నాయకులు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. – డా‘‘ పి. మోహన్ రావుచైర్మన్, ప్రకాశం ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ చదవండి: PCOS Belly తగ్గేదెలా? ఇవిగో అమోఘమైన టిప్స్ -
అప్పుడే... ఏఐకి సార్థకత
కృత్రిమ మేధ, డీప్ టెక్, క్వాంటమ్ కంప్యూటింగ్, గ్రీన్ హైడ్రోజన్, డిజిటల్ ఇండియా వంటి వాటి గురించి తరచూ మన రాజకీయ నాయకులూ, ప్రభుత్వ పెద్దలూ ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ ఆ యా టెక్నాలజీలను భారత్ ఇంకా పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో వెనుకబడే ఉందన్నది గమనించాలి. అలా అని ప్రభుత్వం ఏమీ చేయడం లేదని అర్థం కాదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏఐ మిషన్ కోసం పదివేల కోట్లనూ, జాతీయ క్వాంటమ్ మిషన్ కోసం ఆరు వేల కోట్లనూ కేటాయించింది. మౌలిక సదుపాయాలకు, డేటా వేదికల రూపకల్పనకు, నైపుణ్య శిక్షణా తరగతుల నిర్వహణకు, ఇతర సాధనాలను అందుబాటులోకి తేవటానికి సన్నాహాలు చేస్తోంది. అయితే కేవలం అధు నాతన టెక్నాలజీలను సమాజానికి పరిచయం చేయటం, పైపై మెరుగుల కోసం, అవసరాల కోసం వీటిని వాడుకోవటం వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. ఆధునిక సాంకేతికతలను ఉప యోగించి సామాన్య మానవుని జీవనాన్ని సులభతరం చేయడంతో పాటు, అనేక రంగాల్లో సమూల మార్పులు చేసినప్పుడు మాత్రమే ఈ సాంకేతికతలను సరిగా ఉపయోగించుకున్నట్లు లెక్క. ఎన్నికల అవకతవకలపై ఎన్నో ఆరోపణలూ, విమర్శలూ వినిపిస్తున్నాయి. వీటికి తావు లేకుండా చేయాలంటే ప్రతి ఓటునూ ఆధార్ కార్డ్తో అనుసంధానం చెయ్యడమే కాక, ఫేక్ ఓటర్లను గుర్తు పట్టడానికి డీప్ టెక్ను వినియోగించుకోవాలి. అపుడు అత్యంత పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించవచ్చు. అమెరికా, చైనా వంటి దేశాలు తమ వ్యవస్థలను కృత్రిమ మేధ వినియోగించి పునః రూపకల్పన చేస్తున్నాయి. విద్య, వైద్యం, వ్యవ సాయం, భద్రతా రంగాలను కృత్రిమ మేధతో అనుసంధానం చేస్తు న్నాయి. స్మార్ట్ నగరాల రూపకల్పన, డిజిటల్ పరిపాలన, వ్యవ సాయ ప్రణాళికలు, సామాజిక మౌలిక వసతులు వంటి రంగాలకు చైనా కృత్రిమ మేధను అనుసంధానం చేస్తోంది. కేవలం ఏఐ ఆధా రిత ఉపకరణాలను వినియోగించుకుంటూ వివిధ వ్యవస్థల పని తీరును సమూలంగా పునర్నిర్వచిస్తున్నాయి. మనదేశంలో ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్వంటి ఆధునిక అంశాలను పాఠ్యాంశాలుగా విద్యార్థుల నెత్తిమీద రుద్దుతున్నారు తప్ప, ప్రతి విద్యార్థికీ తాను కోరుకున్నట్టు చదువుకోవడానికి కావలసిన స్వీయ అభ్యాసనా వాతావరణాన్ని అందుబాటులోకి తేవడానికి ప్రయత్నం చెయ్యడం లేదు. ఏఐ ఉపకరణాలు ఉపయోగించి ప్రతి విద్యార్థి పురోగతినీ అంచనా వేసి, వారి స్వీయ అభ్యసనా సామర్థ్యాలకు అనుగుణంగా బోధనా పద్ధతులను మార్పు చేయవచ్చు.అదే విధంగా వ్యవసాయంలో రైతులకు, స్వర/వాక్ ఆధారిత ఏఐ ద్వారా, ఆ యా ప్రాంతాలకు అనుకూలమైన వ్యవసాయ పద్ధ తుల గురించి, పంటల గురించి సలహాలను అందించవచ్చు. గిట్టుబాటు ధరలు, మార్కెట్ పరిస్థితులు, ప్రభుత్వ రుణాలు వంటి వాటి గురించి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తూ రైతులు నష్టపోకుండా చూడవచ్చు.మన దగ్గర అనితర సాధ్యమైన మేధా సంపత్తి ఉంది. కానీ ఆ మేధను కృత్రిమ మేధ, డీప్టెక్ తదితర రంగాల వైపు మళ్ళించి దేశీయ వ్యవస్థలను పునః రూపకల్పన చెయ్యటానికి పటిష్ఠమైన ప్రణాళికలు రచించడం లేదు. ఈ పని జరిగినప్పుడే ఆధునిక టెక్నా లజీ దన్నుతో దేశం అభివృద్ధి పథంలోకి దూసుకుపోగలదు.మన దగ్గర అనితర సాధ్యమైన మేధా సంపత్తి ఉంది. ఆ మేధను కృత్రిమ మేధవైపు మళ్లించి వ్యవస్థలను పునఃరూపకల్పన చెయ్యటానికి ప్రణాళికలను రచించినపుడు టెక్నాలజీ దన్నుతో దేశం అభివృద్ధి చెందుతుంది. – శ్రీవిద్య శ్రీనివాస్, కృత్రిమ మేధ నిపుణులు -
అర్జున్ చక్రవర్తి కోసం ముప్పై కేజీలు తగ్గాను
విజయ రామరాజు టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘అర్జున్ చక్రవర్తి’. ఈ చిత్రంలో సిజా రోజ్ హీరోయిన్. విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో శ్రీని గుబ్బల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో విజయ రామరాజు మాట్లాడుతూ –‘‘ఈ సినిమా కోసం దాదాపు 30 కేజీల బరువు తగ్గాను. ఆ తర్వాత బరువు పెరిగాను. నేను సిక్స్ ప్యాక్తో ఉన్న సీన్స్ తీసినప్పుడు రెండు రోజులు ఏమీ తినలేదు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను. అయితే ట్రైలర్ విజువల్స్ చూసివారు పెద్ద సినిమాలా ఉందని అంటుంటే సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా నా తొమ్మిదేళ్ల కల. ఆరేళ్ల మా టీమ్ కష్టం. విజయ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడు. బడ్జెట్ పెరిగినా మా నిర్మాత నన్ను స΄ోర్ట్ చేశారు’’ అని చె΄్పారు విక్రాంత్ రుద్ర. ‘‘ఆగస్టు 29న నేషనల్ స్పోర్ట్స్ డే. కబడ్డీ బ్యాక్డ్రాప్లో రూపొందిన మా సినిమా అదే రోజు రిలీజ్ అవుతోంది’’ అని చెప్పారు శ్రీని గుబ్బల. – విజయ రామరాజు ఇదీ చదవండి: PCOS Belly తగ్గేదెలా? ఇవిగో అమోఘమైన టిప్స్ -
పర్యాటక ప్రాంతాలకు 'పరుగో పరుగు'
ఉరుకు పరుగుల జీవితాల నుంచి ఉరుకుల పోటీల వైపు దృష్టి సారిస్తున్నారు పలువురు నగరవాసులు. నగరంలో రెగ్యులర్గా నిర్వహించే ఏదో ఒక మారథాన్లో భాగస్వాములు అవుతుంటారు కొందరు.. ఇది క్రమంగా నగరం నుంచి విదేశాలకూ వ్యాపించింది.. పలువురు ఔత్సాహికులు వెకేషన్తో పాటు మారథాన్ కూడా చేస్తున్నారు.. అంతర్జాతీయ స్థాయిలో జరిగే మారథాన్లలోనూ పాలుపంచుకుంటున్నారు. మరికొందరు ఏకంగా రికార్డులవైపు పరుగు పెడుతున్నారు.. ఈ క్రమంలోనే రన్కేషన్ అనే కొత్త ట్రెండ్ నడుస్తోంది.. మారథాన్ పరుగునే క్రమంగా వెకేషన్తో కలగలిపి రన్కేషన్ అని పిలుస్తున్నారు.. ఈ ట్రెండ్ టూరిజానికి కూడా భారీగా ఊపునిస్తోందని పలువురు నిపుణులు చెబుతున్నమాట. అనుభవజ్ఞులైన రన్నర్లకు, అంతర్జాతీయ రేసులు అంటే కేవలం ఒక ప్రధాన మారథాన్కు అర్హత సాధించడం లేదా మరో వ్యక్తిగత పరుగు పందెం వేయడం మాత్రమే కాదు.. అవి కొత్త పర్యాటక గమ్యస్థానాలను అన్వేషించడానికి ఒక అవకాశం కూడా. ‘సెలవులు ఇప్పుడు రన్ కేషన్లుగా మారాయి’ అని ప్రముఖ మారథాన్ రన్నర్లు ఈ ట్రెండ్ను నిర్వచిస్తున్నారుఈవెంట్ల కోసమే..‘మారథాన్ టూర్లో పాల్గొనేవారిలో ఎక్కువ మంది పేరున్న అథ్లెట్లు కాదు, ఈవెంట్ల కోసం మాత్రమే శిక్షణ పొందే అమెచ్యూర్ రన్నర్లు. అందుకే మారథాన్ టూరిజం ఊపందుకుంటోంది’ అని మారథాన్ టూర్లను నిర్వహించే గౌరీ జయరామ్ అంటున్నారు. నగరం నుంచి పర్యాటక పరుగుల కోసం ఎంచుకుంటున్న వాటిలో దేశీయంగా ముంబైలో జరిగే టాటా ముంబై మారథాన్, అలాగే న్యూఢిల్లీ, చెన్నైలలో జరిగే రన్స్, అదే విధంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన సిడ్నీ మారథాన్, రియో మారథాన్, అంటార్కిటికా మారథాన్, లండన్, టొరంటో, న్యూయార్క్.. వంటివెన్నో ఉన్నాయి. మారథాన్ టూరిజం అంటే..మారథాన్ అంటే అత్యంత సుదీర్ఘ దూరంలో పాల్గొనే పరుగు పందెం పోటీలు. రోజు రోజుకూ ఆదరణ పెంచుకుంటున్న ఈ మారథాన్ ఈవెంట్స్ దేశంలోని ప్రతి ప్రధాన నగరానికీ ఒక అలంకారంగా మారాయి. అంతర్జాతీయంగానూ అనేక నగరాల్లో విందు, వినోదాల సమ్మేళనంగా సాగే ఈ మోడ‘రన్’ ఫెస్టివల్స్.. రాను రానూ పర్యాటక ఆకర్షణగా కూడా స్థిరపడుతున్నాయి. ఒకసారి స్థానికంగా జరిగే పరుగు పోటీలో పాల్గొని మారథాన్ రన్నర్గా మారిన తర్వాత కాలక్రమంలో.. ఇతర నగరాల్లోని మారథాన్స్లో పాల్గొనడంపై నగరవాసుల్లో ఆసక్తి పెరుగుతోంది. అదే మారథాన్ టూరిజంకు ఊపునిస్తోంది. ఏటా మారథాన్ టూరిజంలో పాల్గొనే భారతీయ రన్నర్లలో ఐదు రెట్లు పెరుగుదల ఉందని నిపుణులు చెబుతున్న మాట. నిపుణుల సూచనలు.. మారథాన్ పర్యాటకులకు నగరానికి చెందిన నిపుణులు పలు సూచలను చేస్తున్నారు.. అవగాన లేకుండా, శిక్షణ లేకుండా మారథాన్లలో పాల్గొంటే ఆరోగ్య సమస్యలు తప్పవని చెబుతున్నారు. ప్రయాణించే ముందు తగినంత శిక్షణ పొందాలి. మారథాన్ పర్యటనలలో పేరొందిన మారథాన్ ప్రయాణ సంస్థలను ఎంచుకోవాలి. స్థానిక వాతావరణ పరిస్థితులకుసంపూర్ణంగా సిద్ధం అవ్వాలి. హ్యాండ్ లగేజీలో రేస్ డే పరికరాలను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఆతిథ్య దేశంలో అత్యవసర కాంటాక్ట్స్ అందుబాటులో ఉంచుకోవాలి. మారథాన్ టూరిజం కోసం ప్రణాళిక సాధారణంగా ఆరు నెలల ముందుగానే ప్రారంభించాల్సిన అవసరం ఉంది. సకుటుంబ సమేతంగా ‘రన్’డి.. రన్నర్లు క్రీడ పట్ల తమ మక్కువను పెంచుకుంటూనే కొత్త నగరాలు సంస్కృతీ, సంప్రదాయాలను అన్వేషించేందుకు ఈ ట్రెండ్ వీలు కలి్పస్తోంది. స్థానిక సంప్రదాయాలు హృదయపూర్వక ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తూ సుందరమైన ప్రకృతి దృశ్యాల మీదుగా పరుగు తీసే అవకాశాన్ని మారథాన్ టూరిజం అందిస్తోంది. ‘పని ఒత్తిడి కారణంగా, నేను నా కొడుకుతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను. మారథాన్ల కోసం ప్రయాణించే సమయాన్ని పాఠశాల సెలవులతో మేళవింపు చేయడం ద్వారా రన్కేషన్లో ఆ లోటు పూడ్చగలుగుతున్నా’ అని కొన్ని సంవత్సరాలుగా మారథాన్ రన్నర్గా ఉన్న నగరవాసి డాక్టర్ కునాల్ అంటున్నారు. తాము పాల్గొనే మారథాన్ ఈవెంట్స్ కోసం కుటుంబాన్ని తీసుకెళ్లడం అనేది కుటుంబంతో ఒక వెకేషన్ను గడపడం వంటి ప్రయోజనాలతో పాటు స్ఫూర్తిని నింపుతోంది. ‘ఇది నా భార్యను మారథాన్ రన్నర్గా మార్చింది. ఇప్పుడు నా 14 ఏళ్ల కొడుకు 5 కె రన్నర్గా శిక్షణ పొందుతున్నాడు.’ అని కునాల్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ తరహా రన్కేషన్స్ నిర్వహించేందుకు ప్రత్యేక ఈవెంట్ ప్లానర్లు కూడా పుట్టుకొచ్చేశారు. (చదవండి: నమితకు వీజీ మిసెస్ ఇండియా టైటిల్) -
నమితకు వీజీ మిసెస్ ఇండియా టైటిల్
ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకూ ఢిల్లీలో నిర్వహించిన వీజీ మిసెస్ ఇండియా–2025 పోటీల్లో హైదరాబాద్ సిటీ బేగంపేటకు చెందిన నమిత కుల్ శ్రేష్ట మిసెస్ ఇండియా–2025 టైటిల్ దక్కించుకున్నారు. ఈ మేరకు బేగంపేటలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో నమిత కుల్ శ్రేష్ట కుటుంబ సభ్యులు పోటీల వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా 700 మంది మహిళలు మిసెస్ ఇండియా పోటీల కోసం దరఖాస్తు చేసుకోగా చివరి నాలుగు రోజుల వ్యవధిలో జరిగిన ఫైనల్స్కు 56 మంది ఎంపికైనట్లు తెలిపారు. ఇందులో కఠినమైన రౌండ్లు, సవాళ్లతో కూడిన పోటీలో జడ్జ్లు అడిగిన ప్రశ్నలకు ఆకట్టుకునే రీతిలో సమాధానాలు చెప్పిన నమితకు మిసెస్ సౌత్ జోన్ టైటిల్తో పాటు వయోవర్గంలో మిసెస్ ఇండియా–2025 టైటిల్ అందజేసినట్లు తెలిపారు. దీంతో పాటు మిసెస్ ఇండియా ఎలిగెన్స్, మిసెస్ ఇండియా గ్రేస్ఫుల్ సోల్, మిసెస్ ఇండియా చారిటీ క్వీన్ టైటిళ్లు కూడా దక్కాయని తెలిపారు. (చదవండి: డ్రెస్ స్టైల్నూ మార్చేయచ్చు..!) -
భక్తుడు భగవంతునితో ఎలా మమేకం కావాలి?
నిర్మల మనస్కుడైన భక్తుడు భగవంతునితో ఎలా మమేకం కావాలో నారాయణ భట్టాత్రి ‘శ్రీమన్నారాయణీయం’లో చెబుతున్నారు. గురువాయూరు శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ ‘నాపై నీ కరుణ ప్రసరించే వరకూ శోకిస్తూ నీ పాదాల వద్దే నా రోజులు గడుపుతాను. నీ ఘనతను ప్రశంసిస్తూ నీ సేవలోనే జీవితం గడుపుతాను’ అంటాడు కవి. ‘నిన్ను వ్యతిరేకించే వారంతా సుఖంగా జీవితాన్ని గడుపుతుంటే నీ భక్తుడనైన నేను నానా బాధలు పొందుతున్నానెందుకు? ఇది నీకు కీర్తినిస్తుందా’ అంటాడు. ఇది చాలా సహజమైన ప్రశ్న. కవిదే కాదు, మనందరి ప్రశ్న కూడా! కష్టాలలో, సమస్యలలో నిండా కూరుకుపోయి ఉన్న భక్త జనులు, భగవంతునిపై నమ్మిక లేని వారు సుఖంగా ఉంటే తమకెందుకు ఈ బాధలు అనుకుంటారు. అయితే, వారి సుఖం తాత్కాలికం. క్షణికం. కష్టాల భారం మోసే కొద్దీ భగవంతునిపై భక్తి, విశ్వాసాలు బలపడి, ఆత్మలో భగవానుని దర్శన మయ్యాక ఆ ఆనందం వర్ణనాతీతమని పెద్దలు చెబుతారు. ఈ పడుతున్న కష్టాలు, బాధలు అల్పంగా అనిపిస్తాయి. ఇదీ చదవండి: PCOS Belly తగ్గేదెలా? ఇవిగో అమోఘమైన టిప్స్ కవి! తన వ్యాధి బాధ తగ్గించమని ప్రార్థించటం సుఖ జీవనం గడపటానికి కాదు. భగవంతుణ్ణి ఉపాసన చేయటానికి. ‘స్థిరమైన ధ్యానం కుదరటానికి పవిత్రమైన ఓంకారాన్ని ఎడతెగక జపిస్తూనే ఉంటాను. శ్వాసను బంధిస్తూ ప్రాణాయామం పాటిస్తాను. ప్రయత్నపూర్వకంగా నా బుద్ధిని పదే పదే నీ శారీరక ఆకృతిపై, నీ పాద పద్మాలపై నిలపటానికి ప్రయత్నిస్తాను’ అంటాడు. అలా తదేక దృష్టి దేవునిపై నిలిపినపుడు అన్య విషయాలపైకి బుద్ధి వెళ్లక, భక్తిరస పానంచే తన్మయత్వం కలిగి మనసులో ఆర్ద్ర భావం కలుగుతుంది. క్రమంగా లౌకిక విషయాలపై ఆసక్తి తరిగి, భగవంతునిపై దృష్టి నిలుస్తుంది.– డా. చెంగల్వ రామలక్ష్మి -
ఆరోగ్యమే.. అందం.. ఆనందం
జీవితంలో ఎంత ఎదిగినా, ఏం సాధించినా.. ఆరోగ్యం, మానసిక ప్రశాంతత ఎంతో ప్రధానమైనవని, ఇంటర్నల్ వెల్నెస్, ఎక్స్టర్నల్ కేర్ప్రతి ఒక్కరి వ్యక్తిత్వాన్నీ ప్రదర్శిస్తాయని ప్రముఖ సినీతార శ్రియా శరణ్ తెలిపారు. చాలా రోజుల తరువాత ఈ పాన్ ఇండియా నటి నగరంలో సందడి చేశారు. నగరంలోని కొండాపూర్ వేదికగా వెల్నెస్, చర్మ సంరక్షణ, అధునాతన సౌందర్య సేవలందించే ‘జెన్నారా క్లినిక్స్’ను శ్రియా శరణ్ ప్రారంభించారు. ఈసందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. అందమైన జీవితం, ఆరోగ్యకరమైనప్రయాణంతో పాటు తన తదుపరి సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. ఆ రోజులు ఎంత మధురమో.. చాలా మంది నన్ను కలిసినప్పుడు అప్పుడూ.. ఇప్పుడూ ఒకేలా ఎలా ఉండగలుగుతున్నారని అడుగుతున్నారు.., దానంతటికీ కారణం ‘ఎల్లప్పుడూ నాకు మానసిక సంతోషాన్నందిస్తున్న అభిమానుల ప్రేమ, రెండోది ఆరోగ్యం పట్ల నా జాగ్రత్త. సినిమా రంగంలో ఉన్నాను కాబట్టి ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా సంరక్షించుకోవాలి. దీని కోసం నేను సాధారణ పద్ధతులను కొనసాగిస్తాను. ఇంట్లో తయారు చేసిన ఫేస్ప్యాక్లు వాడతాను, కొబ్బరి నూనె, ఆల్మండ్ ఆయిల్ వినియోగించడంతో పాటు ఆయుర్వేదిక్ పద్ధతులను పాటిస్తాను. మన సంస్కృతిలో ఇలాంటి ఎన్నో మంచి అలవాట్లు ఉన్నాయి. అప్పటి రోజులు ఎంత మంచివో.., అమ్మమ్మలు, నానమ్మల కాలంలో ఎలాంటి కాలుష్యం ఉండేదికాదు. రసాయనాలు లేని ఆహారం తినేవారు. అందుకే వారి మోములో సహాజ సౌందర్యం ఉట్టిపడేది. ఆ గ్లో నాకు చాలా ఇష్టం. ప్రస్తుత ఫాస్ట్ ఫుడ్ కల్చర్లో అలా బతకడం కాస్త కష్టమే కానీ ఎవరికి వారు వారి ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి. ఈ తరాన్ని నేను వేడుకునేది కూడా ఇదే, మైండ్ మెడిటేషన్, యోగా చేయండి. పాజిటివ్ లైఫ్ పై అవగాహన పెంచుకోండి. నాలాగే మినరల్స్, విటమిన్స్ ఉన్నటువంటి ఆహారాన్ని స్వీకరించండి. హైదరాబాద్లో సౌందర్య రంగం, సినిమా రంగం గ్లోబల్ స్థాయిని చేరుకుంది. మోడ్రన్ లైఫ్స్టైల్ హబ్గా మారింది. దానిని ఆస్వాదిస్తూనే విభిన్న విధాలుగా మనల్ని మనం సంరక్షించుకోవడం చాలా ముఖ్యం. ఆల్ టైం ఫేవరెట్.. హైదరాబాద్ ఎప్పటికీ నా ఫేవరెట్ సిటీ. ఎన్నెన్నో మధురమైన అనుభవాలు, ఆనందాలు నగరంతో పెనవేసుకుని ఉన్నాయి. 17 ఏళ్లప్పుడు అనుకుంటా మొదటిసారి ఇక్కడికి వచ్చాను. సినీ ప్రయాణంలో భాగంగా ఈ నగరాన్ని నాకు కుటుంబంలా మార్చేసింది. ఇప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్స్ను కలవడానికే ఇక్కడికి వస్తుంటాను. నా తదుపరి సినిమాలతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను చేరుకుంటున్నాను. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మిరాయ్ సినిమాలో నటించాను. ఇందులో నా పాత్ర అందరికీ నచ్చుతుంది. మరో అద్భుతమైన ప్రాజెక్ట్ చంద్రయాన్. ఈ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. వినూత్నమైన సబ్జెక్ట్ ఇది. ఎంతో వైవిధ్యమున్న ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. (చదవండి: ఓపెన్గా మాట్లాడేస్తా.. అంటే కుదరదు..! నటి శ్రుతి హాసన్ ఎదుర్కొన్న చేదు అనుభవం..) -
డ్రెస్ స్టైల్నూ మార్చేయచ్చు..!
పెద్ద సైజులో బీడ్స్, స్టోన్స్ లేదా సిల్వర్, గోల్డ్, బ్రాస్ మెటల్తో తయారు చేసిన ఆకర్షణీయంగా కనిపించే స్టేట్మెంట్ జ్యువెలరీని ధరించడం ఈ రోజుల్లో మరింత ఫ్యాషనబుల్గా ఆకట్టుకుంటోంది. యువతరం సాధారణంగా లైట్, సన్నని జ్యువెలరీకి బదులు బోల్డ్ డిజైన్స్ని పెద్ద సైజులో ఎంపిక చేసుకుంటోంది. ట్రైబల్ జ్యువెలరీకి అతి దగ్గరగా ఉంటోన్న ఈ ఫ్యాషన్ ఆభరణాలు డ్రెస్ స్టైల్ను మార్చేసే ‘హైలైట్ యాక్ససరీస్’గా నిలుస్తున్నాయి. ఇయర్ హ్యాంగింగ్స్హూప్స్, జుమ్కీలు, డ్రాప్ ఇయర్ రింగ్స్, షెల్స్ లేదా జియోమెట్రిక్ షేప్స్.వన్ పీస్ డ్రెస్ లేదా సింపుల్ కుర్తీకి బాగా సెట్ అవుతాయి.నెక్లస్, గాజులుమొత్తం మెడ కవర్ చేసే హారాలు లేదా మొత్తం చేతిని కవర్ చేసే గాజులు లభిస్తున్నాయి. వీటిని మెటల్, బీడ్స్, ముత్యాలు, స్టోన్స్తో తయారు చేస్తారు. ప్లెయిన్ టాప్స్, చీరల మీదకు బాగా నప్పుతాయి. మెటల్, వుడ్, ఆర్ట్ వర్క్ ఉన్నవి. వెస్ట్రన్ – ట్రెడిషనల్ రెండింటికీ సెట్ అవుతాయి.క్యాజువల్ లుక్ డైలీ వేర్ / ఫ్రెండ్స్ అవుటింగ్షర్ట్ స్టైల్స్కి ఓవర్సైజ్డ్ ఆక్సిడైజ్డ్ సిల్వర్ నెక్పీస్ + పెద్ద హూప్ ఇయర్ రింగ్స్. బోహో మ్యాక్సీ డ్రెస్ పైకి కలర్ఫుల్ బీడ్స్, షెల్ జ్యువెలరీ, బ్రాడ్ బ్యాంగిల్స్. కుర్తీ లెగ్గింగ్స్ పైకి ఆక్సిడైజ్డ్ జుమ్కీలు లేదా చెవులు మొత్తం కవర్ చేసే లాంగ్ ఇయరింగ్స్.ఆఫీస్ లేదా ఫార్మల్ లుక్ఆఫీస్ వేర్ పైకి సింపుల్ ఓవర్సైజ్డ్ రింగ్ + చిన్న హూప్స్ బాగుంటాయి. ఒకే రింగ్ పెద్దగా వేసుకుంటే చేతి మీదే ఫోకస్ ఉంటుంది. కాక్టెయిల్ రింగ్స్ ఇప్పుడు ట్రెండింగ్. బ్లేజర్, ట్రౌజర్స్ పైకి పెద్ద చెయిన్ లేదా మందపాటి నెక్ పీస్ సెట్ అవుతుంది. కాటన్ లేదా లినెన్ శారీస్ పైకి పొడవాటి ముత్యాల దండ, స్టడ్స్ లేదా ఆక్సిడైజ్డ్ లాంగ్ ఇయర్ రింగ్స్.పార్టీ ఈవెనింగ్ లుక్ బ్లాక్ డ్రెస్పైకి గోల్డెన్ చంకీ నెక్పీస్, పెద్ద స్టేట్మెంట్ రింగ్ బాగా నప్పుతుంది. గౌన్ పైకి షైనీ స్టోన్ ఓవర్సైజ్డ్ ఇయర్ రింగ్స్ సరి΄ోతాయి. నెక్లెస్ అవసరం లేదు.కాక్టెయిల్ పార్టీమినిమలిస్టిక్ గౌన్కి ఓవర్సైజ్డ్ బ్రేస్లెట్ హైలెట్ అవుతుంది. సింపుల్ డ్రెస్కి హెవీ జ్యువెలరీ పర్ఫెక్ట్ లుక్. వెస్ట్రన్ అవుట్ఫిట్కి బోల్డ్ మెటల్, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ బాగుంటుంది. శారీస్, లెహంగాస్కి స్టోన్స్, పెరల్స్, కుంకుమపువ్వు కలర్స్తో ఉన్నవి బాగా మెరిసి΄ోతాయి. ఆఫీస్ లుక్కి – చిన్న ఓవర్సైజ్డ్ రింగ్స్ లేదా లైట్ కలర్ హూప్స్. పార్టీ లుక్కి – షైనీ, గ్లిట్టర్, బోల్డ్ నెక్పీసులు అందంగా ఉంటాయి. సంప్రదాయ వేడుకలైన పండగలు /పెళ్లిళ్లకు పట్టు చీరల మీదకు ఓవర్సైజ్డ్ కుందన్ లేదా టెంపుల్ జ్యువెలరీ నెక్లెస్, హ్యాంగింగ్స్ బాగుంటాయి. లెహంగా మీదకు నెక్లెస్ లేకుండా హెవీగా ఉండే చాంద్బాల్ ఇయర్ రింగ్స్ సెట అవుతాయి. అనార్కలీ లేదా కుర్తీస్ మీదకు లేయర్డ్ పెరల్ నెక్లెస్, చేతికి పెద్ద కఫ్స్ అందంగా కనిపిస్తాయి.మోడర్న్ ఫ్యూజన్ లుక్క్రాప్ టాప్, స్కర్ట్ మీదకు ఓవర్సైజ్డ్ నెక్లెస్, లాంగ్ ఫెదర్ ఇయర్ రింగ్స్ అందంగా ఉంటాయి. ఇండోవెస్ట్రన్ ఔట్ఫిట్స్కి ఆక్సిడైజ్జ్ సిల్వర్ ఓవర్సైజ్డ్ ఇయర్ రింగ్స్ బాగుంటాయి. ప్లెయిన్ జంప్సూట్ మీదకు బోల్డ్ జియోమెట్రిక్ నెక్లెస్ చుంకీ బ్రేస్లెట్ బాగా నప్పుతుంది.ప్రకృతి నుంచి స్ఫూర్తిజీన్స్, కుర్తీస్ కి పెర్ఫెక్ట్ లుక్ ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ అయితే బోహో లుక్ కోసం కలర్ఫుల్ బీడెడ్ హారాలు బాగుంటాయి. ఈవెనింగ్ పార్టీ లుక్స్ కోసం యంగ్ జనరేషనల్లో బాగా పాపులర్గా ఉన్నది లేయర్డ్ నెక్పీస్, ప్రకృతి నుంచి స్ఫూర్తి పొందినవి ఫ్లవర్, లీఫ్ షేప్ ఎకో ఫ్రెండ్లీ జ్యువెలరీ. జాగ్రత్తలుఔట్ఫిట్ కలర్కి మ్యాచ్ అయ్యే జ్యువెలరీని ఎంచుకోవాలి. ఆభరణాలు చాలా హెవీ వాడితే నెక్ లేదా ఇయర్ మీద బరువు పడొచ్చు, సౌకర్యంగా ఉండేవి చూసుకోవాలి. ఒకేసారి హెవీ మేకప్, హెవీ జ్యువెలరీ కాకుండా బ్యాలెన్స్ చేయాలి. ఓవర్సైజ్డ్ నగల ధరించేటప్పుడు అన్నీ ఓవర్గా వేసుకోకూడదు. హెవీ ఇయర్ రింగ్స్ ధరించినప్పుడు హెవీ నెక్లెస్ వాడద్దు. సింపుల్ డ్రెస్ ధరించినప్పుడు ఓవర్ సైజ్డ్ జ్యువెలరీ అట్రాక్టివ్గా ఉంటుంది. క్లచ్ లేదా హ్యాండ్ బ్యాగ్ కూడా జ్యువెలరీ షైన్ కి మ్యాచ్ అయ్యేలా చేసుకోవాలి. (చదవండి: ఇండియన్ స్పైసీ రెస్టారెంట్ ఇన్ జపాన్) -
మంచి రుచిగల ఉదయం
ఏంటో... ఈతరం పిల్లలకు బరువు, బాధ్యత అంటూ ఉండదు... తిన్నామా... తిరిగామా అన్న ధ్యాస తప్ప!ప్రతి తరమూ తమ తర్వాత తరాన్ని ఇలా ఆడిపోసుకోవడం పరిపాటే!కానీ ఈ తరాన్ని అంటే జన్ జీ (జనరేషన్–జెడ్)ని అలా తిట్టిపోయడానికి లేదు!ఎందుకంటే వాళ్లు తమ లైఫ్ స్టయిల్లోంచి ఆల్కహాల్ హ్యాంగవుట్స్ని డిలీట్ చేశారు! అంటే నో పార్టీయింగా? అయ్యో పార్టీ ఫ్రీక్సే! కాక΄ోతే ఆల్కహాల్కి బదులు కాఫీ సేవిస్తున్నారు. రాత్రిళ్లకు బదులు ఉదయాలను ఆస్వాదిస్తున్నారు... వాటినే కాఫీ రేవ్స్ అని పిలుచుకుంటున్నారు!క్లబ్బులు, పబ్బుల పట్ల జన్ జీ అట్టే ఆసక్తి చూపట్లేదు. అసలామాటకొస్తే మందు తాగడాన్నే ఇష్టపడట్లేదు. కానీ సోషలైజ్ అవడానికి ఆత్రంగానే ఉన్నారు. మసక చీకట్లో మందు కొడుతూ హోరెత్తే మ్యూజిక్తో అడుగులేస్తూ అర్ధరాత్రి దాకా జోగిపోవడం, తెల్లవారి హ్యాంగోవర్తో కళ్లు తెరవలేక΄ోవడమే వాళ్లకు నచ్చలేదు. లైక్ మైండ్ పీపుల్తో కాలక్షే΄ానికి ఒక కూడలి అయితే కావాలనుకున్నారు. ఊరికే కూర్చొని మాట్లాడే బదులు, నచ్చిన కాఫీతో ముచ్చట్లు చెప్పుకుంటే బాగుంటుందని ఆలోచించారు. రోజంతా ఆఫీసుల్లో మగ్గి, ఆ నీరసంతో చిట్చాట్ ఏం చేస్తాం? అందుకే పొద్దునైతే చక్కటి కాఫీ, కాసిన్ని కబుర్లతో మంచి ఉదయానికి స్వాగతం పలకొచ్చు, ఆ మూడ్తో రోజంతా ఉల్లాసంగా గడపొచ్చు అనుకున్నారు.కెఫేలలో కలవడం మొదలుపెట్టారు. ఈ హాంగవుట్స్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే కూడా బాగుంటుంది కదా అనిపించింది. మేమున్నాం అంటూ డీజేలు ముందుకొచ్చారు. అయితే పబ్బుల ఫాస్ట్ బీట్ కాకుండా కాఫీ క్లబ్కి సరి΄ోయే బాణీని ట్యూన్ చేశారు. దాన్నే కాఫీ రేవ్స్గా పిలవడం మొదలుపెట్టారు. ఇప్పుడదే జన్ జీ ట్రెండ్... ప్రపంచవ్యాప్తంగా!ఎక్కడ మొదలైందంటే...లండన్ బేకరీల్లో మొదలై ఆమ్స్టర్డామ్ ఓపెన్ కిచెన్స్ నుంచి వయా న్యూయార్క్ ఇండియా చేరుకున్నాయి. మన దగ్గర ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, బెంగళూరు, కోల్కతా లాంటి మెట్రో సిటీస్లోనే కాదు లక్నో, సూరత్, నాగ్పూర్, ఇండోర్, ఆగ్రా లాంటి పట్టణాల్లోనూ ఈ ట్రెండ్ హల్చల్ చేస్తోంది. ఇంకోమాట..కాఫీ రేవ్స్ని కేవలం జన్ జీలే కాదు అన్ని వయసుల వాళ్లూ ఆస్వాదిస్తున్నారు. నలుగురితో కలవడానికి పెద్దగా ఇష్టపడని ఇంట్రావర్ట్స్ కూడా కాఫీ రేవ్స్ అంటే ఉత్సాహం చూపుతున్నారు. సంగీత సరిగమల మధ్య కాఫీ కమ్మదనాన్ని చవిచూపించే ఉషోదయాల కోసం ఎదురుచూస్తున్నారు.ఇదీ చదవండి: PCOS Belly తగ్గేదెలా? ఇవిగో అమోఘమైన టిప్స్న్యూ క్రియేషన్స్డ్రంక్ అండ్ డ్రైవ్ భయాలు, హ్యాంగోవర్ బాధలు లేని ఈ కాఫీ రేవ్స్ కోసమే ప్రత్యేకంగా ఇంట్రడ్యూస్ అవుతున్న కాఫీలూ ఉన్నాయి. మాచాషాట్స్, మైలో షాట్స్, కోల్డ్ బ్రూ షాట్స్ ఆ జాబితాలోనివే. అవేకాక యాకుల్ట్ మాచా, స్పానిష్ అండ్ క్యోటో లాటేస్, డర్టీ మాచా లాటే లాంటివీ ఇష్టపడుతున్నారు కాఫీ రేవ్స్ ప్రియులు. చలికాలంలో హాట్ చాకోలేట్స్ను ఎక్కువగా సేవిస్తున్నారట. సాధారణంగా అయితే కోల్డ్ కాఫీ, ఐస్డ్ లాటేస్, మాచా లాటేస్, అమెరికానోస్, ఎస్ప్రెసో షాట్స్, క్రాన్బెర్రీ, ఐస్డ్ కాఫీలను కోరుకుంటున్నారు. ఇలా అన్ని వయసుల వాళ్లను రిఫ్రెష్ చేసి వాళ్ల ఎనర్జీని పెంచుతున్న ఈ కాఫీ రేవ్స్.. కాఫీ లవర్స్, మ్యూజిక్ లవర్స్, పార్టీ లవర్స్కి ఓ వారధిలా ఉంటున్నాయని చెబుతున్నారు వీటిని హోస్ట్ చేస్తున్న కాఫీ క్లబ్ ఓనర్స్. మెట్రో సిటీస్లో కాఫీ డే, బారిస్టాలు కూడా కాఫీ రేవ్స్కి ఆతిథ్యమిస్తున్నాయి. ఈ ΄ార్టీల్లో డీజేలకూ డిమాండ్ పెరిగింది. పబ్బుల్లో పనిచేసిన డీజేలు ఎంతోమంది తమ దారి మార్చుకుని ఉదయం పూట కాఫీ క్లబ్స్ కోసం మీటర్ సవరించుకుంటున్నారట. ΄ార్టీలకు చంద్రోదయాలే కాదు ఉషోదయాలూ చక్కటి సమయాలే అని నిరూపిస్తున్న ఈ కాఫీ రేవ్స్ ట్రెండ్ ఎంతకాలం ఉంటుందో తెలియదు కానీ..ఉన్నంత కాలమైతే అన్ని వయసుల వారినీ అలరించగలదన్నది మాత్రం వాస్తవం. కొత్తకొత్త ఫార్మాట్స్తో ప్రయోగాలు చేస్తున్న ఈతరం ఈ ఒరవడిని ఓ కల్చర్గా స్థిరపరుస్తుందన్న గ్యారెంటీ కూడా కనిపిస్తోంది. వీటివల్ల ఇండియాలో కాఫీ బిజినెస్ పెరగడమే కాదు రానున్న అయిదేళ్లలో రెండింతలవుతుందని బిజినెస్ అనలిస్ట్లు అంచనాలూ వేస్తున్నారు.– సరస్వతి రమ -
ఇండియన్ స్పైసీ రెస్టారెంట్ ఇన్ జపాన్
జపనీస్ దంపతులు నకయమ–సాన్, సచికో–సాన్ జపాన్లోని కసుగలో ‘ఇండియన్ స్పైసీ ఫ్యాక్టరీ’ పేరుతో ఒక రెస్టారెంట్ నడుపుతున్నారు. ఈ దంపతులకు ఇండియా అంటే ఇష్టం. ఇండియాలోని రుచికరమైన వంటలు అంటే బోలెడు ఇష్టం. ఆ ఇష్టంతోనే ‘ఇండియన్ స్పైసీ ఫ్యాక్టరీ’ని ప్రారంభించారు.బెంగాలీ సంప్రదాయ వంటకాల నుంచి దక్షిణాది వంటకాల వరకు ఈ రెస్టారెంట్లో వడ్డిస్తారు.మరో విశేషం ఏమిటంటే ఈ రెస్టారెంట్ యజమాని సచికో ఎప్పుడూ చీరలోనే కనిపిస్తుంది. ఆమె కొంతకాలం టు కోల్కత్తాలో జపానీ రెస్టారెంట్ నిర్వహించింది. దిల్లీ, చెన్నైలలో కూడా రెస్టారెంట్లు నిర్వహించింది.‘ఇండియన్ స్పైసీ రెస్టారెంట్’లో భారతీయ సంగీత పరికరాలు, కళాకృతులు దర్శనమిస్తాయి. ఈ రెస్టారెంట్కు వెళ్లడానికి ఇండియన్స్ మాత్రమే కాదు ప్రపంచ నలుమూలల నుంచి జ΄ాన్కు వచ్చే భోజనప్రియులందరూ ఇష్టపడతారు. View this post on Instagram A post shared by Sonam Midha (@sonammidhax) (చదవండి: భార్యభర్తల కేసు..! నవ్వు ఆపుకోవడం జడ్జి తరం కాలేదు..) -
మనసును ‘స్కాన్’ చేసి వైద్యం నడిపిద్దాం
ఓ టీనేజీ అమ్మాయి అప్పటివరకూ అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంది. కానీ అకస్మాత్తుగా కాళ్లు రెండూ చచ్చుబడ్డాయి. ఏమాత్రం కదల్లేకపోవడంతో వీల్చైర్కు పరిమితమైంది. కారణం తెలుసుకోడానికి చేయని పరీక్ష లేదూ... తీయని స్కాన్ లేదు. కానీ ఎందులోనూ ఏమీ కనిపించలేదు. ఎట్టకేలకు తెలిసిన విషయం డాక్టర్లనే అబ్బురపరచింది. ఆ మెడికల్ సీక్రెట్ ఏమిటో చూద్దాం. ఈ కథ ఓ మెడికల్ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎంతకూ క్లూయే దొరకని పరిశోధనాత్మకమైన సస్పెన్స్ స్టోరీని గుర్తుచేస్తుంది. రియా (పేరు మార్చాం) అనే ఓ పదిహేనేళ్ల చురుకైన అమ్మాయికి అకస్మాత్తుగా ఓ క్షణాన రెండు కాళ్లూ పడిపోయాయి. ఎంతకీ చలనం కలగలేదు. దాంతో అమ్మాయి వీల్ చైర్కే పరిమితం కావాల్సివచ్చింది. రియాను హాస్పిటల్కు తరలించారు. అపరాధ పరిశోధనల్లో నేరస్తుని జాడల కోసం వెతికినట్టుగా డాక్టర్లు ఓ అమ్మాయి జబ్బుకు కారణమైన ఆ అంశం కోసం పరిశోధనలు చేశారు... చేస్తూ పోయారు. రక్తపరీక్షలు చేశారు, ఎమ్మారైలు తీశారు. వాటి ద్వారా కండరాలను పరీక్షించారు. నరాలల్లోకి పరికించి చూశారు. ఇంకా ఇంకా అడ్వాన్స్డ్ పరీక్షలతో మెదడూ, వెన్నుముల్లోకి తరచి చూశారు. ఊహూ... కారణమెంతకూ దొరకలేదు. రియా చదువుల్లో సరస్వతి. స్కూలు వక్తృత్వపు పోటీల్లో మంచి వక్త. అంతేకాదు... మంచి మంచి పెయింటింగ్స్ కూడా వేసేది. అలాంటి అమ్మాయిని పేరు తెలియని జబ్బు హైజాక్ చేసేసింది. కాళ్లనొప్పితో ఎలాగో కుంటుతూ స్కూలు దాకా వెళ్లిన ఆ అమ్మాయి స్కూలు నుంచి తిరిగి వచ్చేసరికి ఆమె రెండు కాళ్లూ చచ్చుబడ్డాయి. రక్త పరీక్షలు చేశారు. ఏమీలేదు. ఇలా ఎన్ని పరీక్షలు చేసినా జబ్బు ఆచూకీ అంతు చిక్కలేదు. విటమిన్ లెవెల్స్, ఎలక్ట్రోలైట్స్ ఇలా ఎన్ని చికిత్సలు చేసినా ఫలితమూ దక్కలేదు. అప్పటివరకూ అక్షరాలా ‘తన కాళ్ల మీద తాను నిలబడ్డ’ ఆ అమ్మాయి తన స్వతంత్రతను కోల్పోయి మరొకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో లంబార్ పంక్చర్ అనే వెన్నుముక గాటు పెట్టి అందులో నీరు తీసి చూసే చిట్టచివరి పరీక్షకు డాక్టర్లు సిఫార్సు చేశారు.రెండో ఒపీనియన్ కోసం... దేహానికి గాటు పెట్టి చేసి మరింత తీవ్రమైన పరీక్షలతో ఆమెను బాధించడానికి పూనుకునే ముందర ఎందుకోగానీ... రియా తల్లిదండ్రులు రెండో ఓపీనియన్ కోసం హైదరాబాద్లోని సుధీర్కుమార్ అనే న్యూరాలజిస్టును సంప్రదించారు. ఇతరత్రా పరీక్షలతో పాటు రిపోర్టుల్లో విటమిన్–బి12, విటమిన్ డీతోపాటు మెదడూ, వెన్నెముకా, నర్వ్ కండక్షన్ స్టడీస్... ఇలాంటివన్నీ పరిశీలిస్తున్న డాక్టర్గారికి ఎందుకో అనుమానం వచ్చి ‘హూవర్స్ సైన్’ అనే ఓ సునిశిత పరిశీలన చేశారు.ఏమిటీ హూవర్స్ సైన్ ? బాధితులను పడుకోబెట్టాక రెండు కాళ్ల మడమల కింద రెండు చేతులూ పెట్టి, బలహీనంగా ఉన్న ఓ కాలిని ప్రయత్నపూర్వకంగా ఎంతోకొంత పైకెత్తమని డాక్టర్లు అడుగుతారు. వాస్తవంగా కాళ్లలో పూర్తిగా చచ్చుబడిపోయిన వ్యక్తుల్లో ఓ కాలు కాస్త ఎత్తడానికి ప్రయత్నించినా రెండోకాలిలో ఎలాంటి చలనమూ ఉండదు. కానీ అది వాస్తవంగా చచ్చుబడిన కేసు కానప్పుడు బాధితులు ఓ కాలు ఎత్తడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మరో కాలిమీద బరువు/ఒత్తిడి పెరుగుతుంది. అంటే... కాలిని ఎత్తే ప్రయత్నంలో మరోకాలు వెనక్కెళ్తుండటంతో ఇలా జరుగుతుంది. (ఈ హూవర్స్ సైన్ (గుర్తు) అన్నది కాలు చచ్చుబడిపోయిన సందర్భంలో నిర్ధారణ కోసం చేసేది. ఇలాంటి హూవర్స్ సైన్స్ (గుర్తులు) ఊపిరితిత్తుల విషయంలో మరో రకంగా ఉంటాయి). దాంతో ఇది వాస్తవంగా కాళ్లు చచ్చుబడిపోయిన కేసు కాదనీ, ఆ కండిషన్ను అనుకరిస్తున్న (మిమిక్ చేస్తున్న కేసు) అని డాక్టర్కు అర్థమైంది. అంతా బాగున్నప్పటికీ ఆమె కాళ్లను కదలించలేకపోతోందంటే ఏదో మతలబు ఉంది.అది నటన కాదు... బాధితురాలు నటించడం లేదు... అయితే ఇక్కడ బాధితురాలు రియా నటిస్తోందని అనుకోడానికి వీల్లేదు. కాళ్లు పడిపోవడం జరగనప్పటికీ... మానసిక కారణాలతో కాళ్లను కదలించలేకపోతోంది. తన మానసిక సమస్య కారణంగా నిజంగానే ఆమె కాళ్లు కదిలించలేకపోతోంది. దీన్ని వైద్యపరిభాషలో ‘ఫంక్షనల్ న్యూరలాజికల్ డిజార్డర్ – ఎఫ్ఎన్డీ’ అంటారు. దీనికి కౌన్సెలింగ్ అవసరమని గ్రహించిన డాక్టర్ సుధీర్కుమార్ ఆమెతో ఏకాంతంగా మాట్లాడారు.అసలు కారణమిది... రియా కాస్త బొద్దుగా ఉండటంతో తోటి విద్యార్థినీ, విద్యార్థులు ఆమెను వెక్కిరిస్తుండేవాళ్లు. ఆమె బరువును చూసి గేలి చేస్తుండేవాళ్లు. దాంతో తీవ్రమైన వ్యాకులతకూ, మనఃక్లేశానికీ లోనైన ఆమె తనకు తెలియకుండానే ఇలాంటి కండిషన్కు గురైంది. అన్నీ నార్మల్గా ఉన్నా అనారోగ్యానికి గురయ్యే మానసిక సమస్య అని తేల్చారు డాక్టర్ సుధీర్కుమార్. ఇందులో నరాలకు సంబంధించిన అంశంతో పాటు మానసిక నిపుణులతో మల్టీ డిసిప్లినరీగా ప్రయత్నించాల్సిన సంక్లిష్టమైన కేసు. ఇది అర్థమయ్యాక ఆమెలో మానసిక స్థైర్యం నింపేలా అనేక స్పెషాలిటీలకు సంబంధించిన డాక్టర్లు సంయుక్తంగా చికిత్స మొదలుపెట్టారు.ఆర్నెల్ల తర్వాత... అన్ని చికిత్సలూ ఫలించడంతో రియా మామూలుగా మారింది. ఇప్పుడు తన కాళ్ల మీద తాను మళ్లీ నిలబడటంతో పాటు తన చేతుల్లోని కుంచెను కదిలించి అందమైన బొమ్మలు వేయడం మొదలుపెట్టింది. ఇప్పుడామె టీనేజ్ లైఫ్ తాను వేస్తున్న పెయింటింగ్స్ అందంగా అందులోని కలర్సంతగా రంగులమయంగా మళ్లీ మారిపోయింది. చివరగా... అందించాల్సిన ట్రీట్మెంట్ ఒక్కటే డాక్టర్ల బాధ్యత కాదు... సంక్లిష్ట సమయాల్లో అందించాల్సినవి... చికిత్సా, మందులతో పాటు అక్కడ నిజంగా అందాల్సినదీ, అవసరమైనదేమిటంటే... చక్కటి సానుభూతీ, చిక్కటి సహానుభూతి. – యాసీన్డాక్టర్లూ... ఇది వినండిఈ కేసు ద్వారా డాక్టర్లకూ ఓ సందేశమిస్తున్నారు డాక్టర్ సుధీర్కుమార్. అదేమిటంటే... కేవలం రిపోర్టులు చూసే ఓ నిర్ధారణకు రాకండి. బాధితులు చెప్పేది పూర్తిగా సానుభూతితో, సహానుభూతితో వినండి. అప్పుడు కొన్ని వాస్తవాలు తెలుస్తాయి.ఫంక్షనల్ డిజార్డర్లలో పేషెంట్స్ చేసేది నటించడం కానే కాదు. వాళ్ల బాధలు పూర్తిగా జెన్యూన్. వాళ్లు చెప్పేది పచ్చి వాస్తవం. క్లినికల్ పరీక్షల తర్వాత కూడా ఏ కారణాలూ తెలియకపోతే... వారిని కోసి చేసే పరీక్షలకూ, పొడిచి నిర్వహించాల్సిన ప్రోసీజర్లకు వెంటనే గురిచేయకండి. కాస్త చురుగ్గా, నిశితంగా ఆలోచించి ‘హూవర్స్ సైన్స్’ లాంటి వాటి గురించి మీ పరిధి దాటి (ఔట్ ఆఫ్ ద బాక్స్) ఆలోచించేలా ప్రయత్నించండి. దాంతో పేషెంట్స్ను బాధించి చేసే ఇన్వేజివ్ ఇన్వెస్టిగేషన్స్కు ముందే జబ్బు నిర్ధారణకు అవకాశం దొరుకుతుంది. ఒక వ్యక్తికి స్వస్థత చేకూర్చడం మీ ఒక్కరివల్లనే కుదరనప్పుడు టీమ్తో కలిసి... అంటే సైకాలజిస్టులూ, ఫిజీషియన్లూ, ఫిజియోథెరపిస్టుల తోపాటు అవసరమైతే టీచర్లూ, కుటుంబ సభ్యులందరూ బృందంగా టీమ్వర్క్తో తగిన చికిత్స అందించి, బాధితులు హాయిగా కోలుకునేలా చేయండి. డాక్టర్ సుధీర్కుమార్, సీనియర్ న్యూరో ఫిజీషియన్ (చదవండి: 'శంఖారావం' చేస్తే..ఆ వ్యాధి తగ్గిపోతుందట..! అధ్యయనంలో వెల్లడి) -
చంపా... చరిత్ర సృష్టించింది
అడుగడుగునా ఆర్థిక కష్టాలు. ‘అమ్మాయికి ఈ మాత్రం చదువు చాలు’ అనే ఇరుగు పొరుగు వెటకారాలు. అయినా సరే, చదువు విషయంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ‘పదవ తరగతి అయినా పూర్తి చేయగలనా’ అనుకున్న అమ్మాయి ఇప్పుడు ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది. దిదై అనేది ఒడిశాలోని ఒక గిరిజన తెగ. ఈ తెగ నుంచి జాతీయ వైద్య ప్రవేశ పరీక్ష నీట్లో ఉత్తీర్ణత సాధించిన తొలి విద్యార్థిగా చంపా రాస్పెడా చరిత్ర సృష్టించింది.ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలోని అమ్లిబెడ గ్రామానికి చెందిన చంపా రాస్పెడా తల్లి గృహిణి. తండ్రి ఓ పేద రైతు. ఆర్థిక కష్టాల వల్ల ఒకానొక దశలో చంపాకు చదువు కొనసాగించడం కష్టమైంది. అయినా సరే, ఎలాగో ఒకలా ఆర్థిక కష్టాలను అధిగమించి ముందడుగు వేసింది.చిత్రకొండలో హైస్కూల్ చదువు పూర్తయిన తరువాత గోవింద్పల్లిలోని ఎస్ఎస్డీ హైయర్ సెకండరీ స్కూల్లో ఇంటర్ పూర్తి చేసింది. ఆ తరువాత ఆర్థిక కష్టాలతో బీఎస్సీ చదువు మధ్యలోనే ఆగిపోయింది. అయితే హైస్కూల్ రోజుల్లో చంపాకు సైన్స్ పాఠాలు చెప్పిన టీచర్ ధైర్యం చెప్పడమే కాదు బాలసోర్లోని నీట్ ఉచిత శిక్షణ తరగతులలో చేర్పించారు.ఆ క్లాస్లలో చేరిన క్షణం నుంచే ‘ఎలాగైనా డాక్టర్ కావాల్సిందే’ అనే లక్ష్యాన్ని ఏర్పర్చుకుంది. తన కలను నిజం చేసుకుంది చంపా. బాలసోర్లోని ఫకీర్ మోహన్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో అడ్మిషన్ పొందింది.మల్కన్గిరి జిల్లాలో మారుమూల అటవీ ప్రాంతంలో నివసించే దిదై తెగ ప్రజలకు వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు ప్రధాన జీవనాధారం. చదువు వారికి చాలా దూరంగా ఉండేది. ఇప్పుడిప్పుడే వారు చదువుకు దగ్గరవుతున్నారు. ఈ దశలో చంపా సాధించిన విజయం ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తినిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు.‘వైద్యురాలిగా పేదప్రజలకు సేవ చేయాలనేది నా లక్ష్యం. మనం ఒక లక్ష్యం ఏర్పర్చుకున్నప్పుడు ఆర్థిక కష్టాలు అడ్డంకి కాదు... అనే విషయాన్ని విద్యార్థులలో విస్తృతంగా ప్రచారం చేయాలనుకుంటున్నాను’ అంటుంది చంపా రాస్పెడా.‘ఈ విజయానికి మూలం ఆమె పడిన కష్టం. అంకితభావం. ఆమె విజయం ఒడిశాలోని యువతకు స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాను. వైద్యురాలిగా పేదప్రజలకు సేవ చేయాలని ఆశిస్తున్నాను. ఆమె భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని చంపా రాస్పెడా గురించి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి.ఈ ఇంట్లోనే...‘రకరకాల మూఢనమ్మకాల వల్ల మా కమ్యూనిటీలో ఆడపిల్లల చదువుకు పెద్దగాప్రాధాన్యత ఇవ్వరు’ అంటున్న చంపా రాస్పెడా తన తల్లిదండ్రులను ఒప్పించి, ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ చదువు దారిలో ముందుకు వెళ్లింది. పెద్దగా సౌకర్యాలు లేని ఇంట్లో పెరిగింది చంప. ఇప్పుడు సాధారణ దృశ్యంగా కనిపిస్తున్న ఆమె ఇంటి చిత్రం భవిష్యత్లో స్ఫూర్తిదాయక చిత్రంగా నిలవనుంది. ‘ఈ ఇంట్లోనే చదివి చంప డాక్టర్ అయింది’ అనే ఒక్కమాట చాలదా ఎంతోమంది అమ్మాయిలలో ధైర్యం నింపడానికి, ‘మేము కూడా సాధించాలి’ అని వారిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి! -
ఆన్లైన్లో పాడిగేదెలు : లక్షల్లో మోసపోయిన డైరెక్టర్
ఆన్లైన్ షాపింగ్ అంటే ఆచి తూచి వ్యవహరించాల్సిందే. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, అత్యాశకు పోయినా భారీ మూల్యం చెల్లించక తప్పదు. శాండల్వుడ్ దర్శకుడు ప్రేమ్ మోసపోయిన తీరు ఈ విషయాన్నే మరోసారి గుర్తు చేస్తుంది. ఏం జరిగిందంటే...శాండల్వుడ్ దర్శకుడు ప్రేమ్ గుజరాత్కు చెందిన పశువుల వ్యాపారి చేతిలో రూ. 4.5 లక్షలు మేర దారుణంగా మోస పోయాడు. బ్రహ్మాండమైన రెండు గేదెలను డెలివరీ చేస్తానని హామీ ఇచ్చిన స్థానిక వ్యాపారి, తీరా డబ్బులు తీసుకొని పత్తా లేకుండా పోయాడు.టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ప్రేమ్, పాడి వ్యవసాయాన్ని చేద్దామనుకున్నాడు. ఇందుకోసం పాడిగేదెల్ని కొనేందుకు ఆన్లైన్ వెదికాడు. ఈ క్రమంలో గుజరాత్లోని భావ్నగర్కు చెందిన వాఘేలా వనరాజ్భాయ్ శాంతిభాయ్ను సంప్రదించాడు. అధిక పాల దిగుబడి కోసం పెంచిన గేదెలు అంటూ మెరిసే ఫోటోలనను షేర్ చేశాడు. ఫోటోలు చూసి పడిపోయిన ప్రేమ్, రూ.25,000 అడ్వాన్స్గా చెల్లించాడు. జంతువులను ట్రక్కులో ఎక్కించి బెంగళూరుకు వెళ్తున్నట్లు వాఘేలా నమ్మబలికాడు. ఇది చూసి మరింత మురిసి పోయిన ప్రేమ్ మరో విడతలవారీగా మొత్తం డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు. కానీ గేదెల డెలివరీ మాత్రం రాలేదు. అటు వాఘేలా కాల్స్ ఎత్తడం మానేశాడు. దీంతో మోస పోయానని గ్రహించి చంద్ర లేఅవుట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లునిందితుడిఇంటికి తాళం వేసి అదృశ్యమైనట్లు అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం కూపీలాగుతున్నారు. గేదెలు కాదుకదా, దాని తోక వెంట్రుకలు కూడా రాలేదు అంటూ ప్రేమ్ వాపోయాడు. "ఆ ఫోటోలు నిజమైనవనుకుని నమ్మాం. ట్రక్ వారంలోపు వస్తుందని నిందితుడు చెప్పాడు" అని ప్రేమ్ మేనేజర్ దశవర్ చంద్రు అన్నారు. ఇదీ చదవండి: PCOS Belly తగ్గేదెలా? ఇవిగో అమోఘమైన టిప్స్ -
బరువు పెరగాలనుకుంటే ఇలా తినండి..! 45 కిలోలు నుంచి 87 కిలోలు..
కొందరు ఎత్తుకి తగ్గ బరువు లేక బాధపడుతుంటారు. చాలామటుకు అధిక బరువుతో బాధపడుతంటే..ఈ వ్యక్తులు మాత్రం ఎంత తిన్నా.. పీలగానే ఉంటారు. ఏదైనా అనారోగ్యం వచ్చిందా.. మరింత బక్కచిక్కిపోతారు. చూసేందుకు కూడా బాగోదు వారి ఆహార్యం. అలాంటి వాళ్లు ఆరోగ్యంగా లావు అవ్వాలనుకుంటే.. ఇలా తినండని చెబుతున్నారు కంటెంట్ క్రియేటర్ సుజీత్ చౌరాసియా. సోషల్ మీడియా వేదికగా అత్యంత బలహీనంగా ఉండే తను ఎలా ఆరోగ్యకరమైన రీతీలో బరువు పెరిగాడో వీడియో రూపంలో షేర్ చేసుకున్నాడు. మరి అదెలాగో తెలుసుకుందామా..!. కంటెంట్ క్రియేటర్ 46 కిలోలు బరువుతో బక్కపలచగా ఉండేవాడు. తన ఎత్తుకి బరువుకి వ్యత్యాసమే లేనట్లు గాలిస్తే ఎగిరిపోయేలా ఉండేవాడు. అలాంటి వాడు మంచి ఫిజిక్తో ఏకంగా 85 కిలోల ఆరోగ్యకరమైన బరువుతో ఉన్నాడు. అందుకోసం అతడు డైట్ ఎలా సెట్ చేశాడంటే ఉదయం శరీరాన్ని హైడ్రేట్ చేసేలా ఒక లీటర్ నీటితో రోజుని ప్రారంభించేవాడట. ప్రోటీన్ రిచ్ స్టార్ కోసం 70 గ్రా బ్లాక్ చనా + 60 గ్రా పెరుగు తీసుకునేవాడు. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్గా నెమ్మదిగా జీర్ణమయ్యే 100 గ్రా ఓట్స్, రెండు అరటిపండ్లు, ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం ఒక టేబుల్ స్పూన్ పీనట్ బటర్, ప్రోటీన్ బూస్ట్ కోసం బ్రెడ్ లేదా ఆమ్లెట్తో 4 బ్రెడ్, మిల్క్షేక్ రెసిపీ తీసుకునేవాడినని తెలిపాడు. అది కూడా పాలు, అరటి పండ్లు, డ్రైఫ్రూట్స్తో చేసిన మిల్క్ షేక్. లంచ్ టైంలో వందగ్రాముల బియ్యం, 80 గ్రాముల నెయ్యి,ఫైబర్, విటమిన్ల కోసం సలాడ్ తీసుకున్నట్లు చెప్పాడు. సాయంత్రం వ్యాయమానికి ముందు 80 గ్రా ఓట్స్ + 2 అరటిపండ్లు. వ్యాయమం చేసిన తర్వాత శక్తిని నింపడానికి, కోలుకోవడానికి 100 గ్రా బంగాళాదుంపలు లేదా మిల్క్ షేక్. ఇక రాత్రి డిన్నర్కి సముతల్యమైన ఆహారం కోసం మూడు రోటీలు, సబ్జి, వందగ్రాముల పన్నీర్ తీసుకునేవాడిని అంటూ తన డైటింగ్ విధానాన్ని పోస్ట్లో వివరించాడు. మెరుగైన ఫలితాల కోసం..భోజనం పరిమాణం పెంచుకోవడంహైడ్రేట్గా ఉండేలా ప్రతిరోజూ మూడు నుంచి 4 లీటర్ల నీటిని తీసుకోండిఏడు నుంచి ఎనిమిది గంటల నిద్రవ్యాయామాలను 1.5 గంటల కంటే తక్కువగా ఉండాలి. View this post on Instagram A post shared by Sujeet Chaurasia l Content Creator (@fearlesshimm)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం (చదవండి: శంఖారావం' చేస్తే..ఆ వ్యాధి తగ్గిపోతుందట..! అధ్యయనంలో వెల్లడి) -
పీసీఓఎస్ బెల్లీ తగ్గేదెలా? ఇవిగో అమోఘమైన టిప్స్
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలను వేధిస్తున్న సమస్య. హార్మోన్ల అసమతుల్యత, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, జీవక్రియ సమస్యలతోపాటు,పీసీఓఎస్వల్ల బరువు పెరగడం, మొటిమలు, అవాంఛితరోమాలు, జుట్టు రాలడంలాంటి సమస్యలుంటాయి. ముఖ్యంగా పొత్తికడుపు (బొడ్డు చుట్టూ) కొవ్వు పేరుకుపోవడం ముఖ్య లక్షణాల్లో ఒకటి. ఇది బరువుపెరగడమే కాదు, బరువు తగ్గడం కూడా కష్టమే. అందుకే దీన్ని "PCOS బెల్లీ" (క్లినికల్గా కాదు) అంటారు. PCOS ఉన్నవారిలో దాదాపు 20శాతం మంది ఈ లక్షణాలు కనిపిస్తాయి. పీసీఓఎఎస్ బెల్లీ ఎందుకు వస్తుంది?ఇన్సులిన్ నిరోధకత: ఇన్సులిన్ నిరోధకత PCOS ముఖ్య లక్షణాలలో ఒకటి. ఇది శరీరంలో ఇన్సులిన్ ప్రభావవంతమైన వాడకాన్ని పరిమితం చేయడమే కాకుండా టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఇదే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోయేలా చేస్తుందిఇన్ఫ్లమేషన్ పీసీఓఎఎస్ మహిళలు దీర్ఘకాలిక మంటను అనుభవించే అవకాశం కూడా ఎక్కువే. ఇది కూడా ఇది బరువు పెరగడానికి, ఇతర అనారోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుంది.హార్మోన్ల అసమతుల్యత: PCOSను తరచుగా హార్మోన్ల అసమతుల్యత.. ఆండ్రోజెన్ల (పురుష హార్మోన్లు) పెరిగిన స్థాయిలు కొవ్వు పేరుకుపోవడానికి దోహదం చేస్తాయి. దీంతో బరువు తగ్గడం ఒక చాలెంజ్గా మారుస్తాయి.ఒత్తిడి: ఇలాంటి మహిళల్లో ఒత్తిడి హార్మోన్గా పిలిచే కార్టిసాల్ స్థాయి ఎక్కువగా ఉంటుందని పరిశోధనల ద్వారా తెలుస్తోంది. బెల్లీ ఫ్యాట్కు ఇదొక ప్రధాన కారణం.బరువు తగ్గడం నిజంగా కష్టమా?హార్మోన్ల అసమతుల్య , ఇన్సులిన్ నిరోధకత కలయిక బరువు పెరగడానికి అనుకూలమైన జీవక్రియ వాతావరణాన్ని సృష్టిస్తుంది. అలాగే బొడ్డుచుట్టూ కొవ్వును చాలా గట్టిగా మార్చేస్తుంది. అంతేకాదు PCOS నిర్వహణతో సంబంధం ఉన్న ఒత్తిడి, దాని లక్షణాల కారణంగా మానసిక ఆరోగ్యం దెబ్బతిని కార్టిసాల్ స్థాయిలు పెరగడానికి దారితీస్తుంది. PCOS ఉన్న చాలా మంది మహిళలు చాలా ఎనర్జీ లెవల్స్ తక్కువగా ఉంటాయి. దీని కారణంగా ఎక్కువగా వ్యాయామం చేయలేరు.PCOS బెల్లీ తగ్గడానికి చిట్కాలుపీసీఓఎస్తో బాధపడేవారు నిజంగా బరువు తగ్గడం అసాధ్యమా అంటే కానే కాదు. కొంచెం చాలెంజింగే అయినప్పటికీ అసాధ్యం కాదు. కొన్ని చిట్కాలు చూద్దాం.ఇదీ చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లు సమతుల్య ఆహారం: సంపూర్ణ ఆహారాలు, కూరగాయలు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన తీసుకోవాలి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.తద్వారా బరువు పెరగకుండా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ: ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించడం వల్ల బరువు తగ్గడంతోపాటు, పీసీఓఎస్ దుష్ప్రభావాలలో ఒకటైన టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. స్పైక్లను నివారించడానికి తక్కువ గ్లైసేమిక్ ఇండెక్స్ ఆహారాలను ఎంచుకోండి. క్రమం తప్పని వ్యాయామం: బరువు తగ్గాలంటే వ్యాయామానిది చాలా కీలక పాత్రం. ముఖ్యంగా పీసీఓఎస్ బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే కార్డియో ,బల శిక్షణ వ్యాయామాల కలయికతో కూడిన రెగ్యులర్ వ్యాయామం చాలా అవసరం.చదవండి: Wedding Anniversary: మాజీ మంత్రి ఆర్కే రోజా ఇంట్రస్టింగ్ పోస్ట్చక్కటి నిద్ర: హార్మోన్ నియంత్రణకు నాణ్యమైన నిద్ర చాలా ముఖ్యం. ఒత్తిడిని నిర్వహించడానికి మరియు సమతుల్య హార్మోన్ స్థాయిలను నిర్వహించడానికి ప్రతి రాత్రి 7-9 గంటల నిరంతరాయ నిద్ర కావాలి.ఒత్తిడిని ఎదుర్కోవడం : ఒత్తిడి లేని జీవనశైలిని ఎంచుకోవాలి. మైండ్ఫుల్నెస్, ధ్యానం లేదా ప్రాణాయామ శ్వాస వ్యాయామాలు ఒత్తిడిని అదుపులో ఉంచుతాయి. ఒత్తిడి లేని జీవితం సగం సమసల్ని నివారిస్తుంది. అవసరమైన సప్లిమెంట్లు: కొన్ని సందర్భాల్లో, ఇనోసిటాల్ లేదా ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు వంటి సప్లిమెంట్లు హార్మోన్ సమతుల్యతకు మద్దతు ఇవ్వడంలో ,జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అయితే, వీటిని వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి.పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) అంటే ఏమిటి?PCOS అనేది స్త్రీ పునరుత్పత్తి అవయవాలు ఉన్నవారిని ప్రభావితం చేసే హార్మోన్ల రుగ్మత. ఈ అవయవాలు ఉన్నవారిలో సాధారణంగా ఆండ్రోజెన్ హార్మోన్ల స్థాయిలు తక్కువగా ఉంటాయి. PCOS ఉన్నవారిలో తరచుగా సాధారణం కంటే ఎక్కువ ఆండ్రోజెన్ స్థాయిలు ఉంటాయి. PCOS ఉన్నవారిలో కనీసం 50శాతం మందికి మందికి టైప్ 2 డయాబెటిస్ వస్తుంది.ఉదర బరువు పెరగడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుంది. అందుకే వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు, సరియైన వ్యాయామం, చికిత్స తీసుకోవడం ఉత్తమం. -
'శంఖారావం' చేస్తే..ఆ వ్యాధి తగ్గిపోతుందట..! అధ్యయనంలో వెల్లడి
శంఖం (Conch) అనేది భారతీయ సంస్కృతిలో పవిత్రత, శుభం, విజయానికి ప్రతీకగా భావిస్తారు. ఇది క్షీరసాగర మథనంలో ఉద్భవించిన 14 రత్నాలలో ఒకటిగా పేర్కొంటారు. అలాంటి శంఖాన్ని ఊదితే ఆ వ్యాధి నయమైపోతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. తాజా అధ్యయనంలో ఇది వెల్లడైందని తెలిపారు. ఈ శంఖరావం ప్రయోజనాన్ని హైలెట్ చేసేలా పరిశోధనలో చాలా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఇటీవల చాలామంది అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియాతో బాధపడుతున్నారు. అందుకు మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లే ప్రధాన కారణం అని చెబతున్నారు నిపుణులు. ఈ సమస్య ఉన్నవారికి నిద్రలో శ్వాస కొద్దిసేపు ఆగిపోతుంది. దాంతో మధ్యలో మెలుకవ వచ్చేస్తుంటుంది. కొన్నిసార్లు శ్వాసాగిపోయి గురకపెడుతుంటారు. దీని కారణంగా మధుమేహం, గుండుపోటు, రక్తపోటు వంటి దీర్ఘకాలిక జబ్బుల బారినపడతారని చెబుతున్నారు వెద్యులు. ఈ స్లీప్ ఆప్నియా కారణంగా చాలామంది కంటిపై కునుకనేది సరిగా ఉండదు. అందువల్ల ఉదయం చాలా అలసట, ఒక విధమైన నిద్ర ఆవరించడం వంటి సమస్యలు ఎదుర్కొంటారని చెబుతున్నారు. అయితే ఈసమస్యకు మందుల కంటే శంఖం చక్కగా చెక్పెడుతుందంట. శంఖారావంతో అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు పరిశోధకులు. గాలి వాయిద్యాలను వాయించడం మెరుగైన శ్వాసకు ఎలా సహాయపడుతుంది అనే దిశగా అధ్యయనం చేయగా..ఈ విషయం వెల్లడైందని తెలిపారు. అందుకోసం అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియాతో బాధపడుతున్న సుమారు 30 వ్యక్తులను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక సముహం శఖం ఊదే సాంప్రదాయ భారతీయ శ్వాస వ్యాయమాన్ని అభ్యసించింది. అంటే శంఖం పూరించడం లాంటిది. మరొక సముహం లోతైన శ్వాస వాయామాలు చేశారు. అందులో శంఖం ఊదిన బృదం నిద్ర నాణ్యతలో గణనీయమైన మెరుగదల కనిపించిడాన్ని పరిశోధకులు గుర్తించారు. వాస్తవానికి ఈ స్లీప్ ఆప్నియాతో ఇబ్బంది పడేవాళ్లకి నిరంతర సానుకూల వాయుమార్గ పీడన యంత్రం లేదా CPAP వంటి ప్రామాణిక చికిత్సను అందిస్తారు. ఇందులో ఫేస్మాస్క్ ద్వారా గాలిని ఊదుతూ ఉండాల్సి ఉంటుంది. తద్వారా వాయుమార్గం తెరచుకుని ఈ సమస్య తగ్గుతుంది. అయితే దీన్ని చాలామంది రోగులు అసౌకర్యంగా భావించడమే కాకుండా ఇలా నిరంతరం చేయడంలో ఇబ్బంది పడుతున్నారట. అలాగాక ఈ శంఖ ఊదడం అనే సాంప్రదాయ యోగ శ్వాస వ్యాయామం ప్రకారం.. ఉచ్ఛ్వాసాన్ని వదులుతూ..సాధన చేస్తారు కాబట్టి చక్కటి విశ్రాంతితో కూడిన నిద్రపడుతుందట. ఈ పురాతన అభ్యాసం ఈ సమస్యకు చక్కని పరిష్కారమని వెల్లడించారు. అంతేగాదు శంఖ ఊదడం అనే వ్యాయామాలు శ్వాసకోశ కండరాలను బలోపేతం చేయగలవని, నిద్రలో వాయుమార్గాలను స్పష్టంగా తెరుచుకునేలా చేస్తుందని చెప్పుకొచ్చారు. స్లీప్ అప్నియా లక్షణాలను నిర్వహించడానికి ఈ శంఖారావం అనేది చక్కటి నివారిణి అని పేర్కొన్నారు పరిశోధకులు. ఈ అధ్యయనాన్ని భారతదేశంలోని జైపూర్లోని ఎటర్నల్ హార్ట్ కేర్ సెంటర్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించింది.(చదవండి: ఓపెన్గా మాట్లాడేస్తా.. అంటే కుదరదు..! నటి శ్రుతి హాసన్ ఎదుర్కొన్న చేదు అనుభవం..) -
వంశధార చెంత.. తాగునీటికి చింత..!
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు: తరాలు మారుతున్నా ఆ గ్రామ ప్రజల తలరాత మారడం లేదు. వంశధార నది నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉద్దానం ప్రాంత గ్రామాలకు తాగునీటిని తరలిస్తున్న ఈరోజుల్లో, నది చెంతనే ఉన్నా గొంతెండుతున్న పరిస్థితి వారిది. పాలకుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో గుక్కెడు నీటికోసం చెలమ వైపు చూస్తున్నారు మండలంలోని ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో ఉన్నటువంటి కడుము గ్రామం ప్రజలు. ఈ గ్రామంలో సుమారు 2,500 మంది జనాభా నివసిస్తున్నారు. ఇక్కడ కుళాయిలు ఏర్పాటు చేయకపోవడంతో ఎన్నో ఏళ్లుగా మహిళలు వంశధార నది వద్దకు వెళ్లి చెలమ నీటిని బిందెల్లో తోడుకొని ఇళ్లకు తీసుకొని వెళ్తుంటారు. నదికి వరదలు వచ్చినట్లయితే చెలమ నీటికి సైతం అవకాశం ఉండదు. అటువంటి సమయంలో గ్రామానికి రెండు కి.మీ దూరంలో ఉండే ఒడిశా రాష్ట్రంలోని కిడిగాం గ్రామం బోరు నుంచి తాగునీటిని తీసుకు రావాల్సిన పరిస్థితి నెలకొంటుంది. గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ బోర్లు నుంచి వచ్చే నీరు తాగేందుకు ఉపయోగపడడం లేదని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెలమ నీటినే తాగడం వలన అనారోగ్యాల బారిన పడుతున్నామని వాపోతున్నా రు. తమ గ్రామానికి సుజల ధార పథకంలో భాగంగా పైప్లైన్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం: కడుము గ్రామంలో ఇంటింటా కుళాయిలు వేసేందుకు ఉద్దానం ఫేజ్–2 పథకం నుంచి ని«ధులు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్తో మాట్లాడి పనులు త్వరలో చేయించేందుకు చర్యలు తీసుకుంటాం. – సాగర్, ఆర్డబ్ల్యూఎస్ జేఈఈ, కొత్తూరు మండలం రెండు కి.మీ నడుస్తున్నాం : గ్రామంలో ఉన్న బోర్లు నుంచి వస్తున్న నీరు తాగేందుకు పనికి రావడం లేదు. దీంతో రానుపోను రెండు కి.మీ నడిచి నది వద్దకు నీటికోసం వస్తాము. వర్షాలు కురుస్తున్నా తాగునీటి కోసం నదికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. – కొల్లారి శ్రీదేవి, కడుము గ్రామం, కొత్తూరు మండలంపట్టించుకోవడం లేదు : మా గ్రామానికి తాగునీటి కోసం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఊట నీరు కలుషితమైనప్పటికీ తప్పనిసరి పరిస్థితిలో ఆ నీరే తాగుతున్నాం. గ్రామంలో ఉన్న బోర్లు నుంచి వస్తున్న నీరు బాగులేకపోవడంతో ఊట నీరే మాకు దిక్కవుతోంది. అధికారులు స్పందించి తాగునీటి ఏర్పాట్లు చేయాలి.– లంక పార్వతి, కడుము గ్రామం, కొత్తూరు మండలం ఇదీ చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లువరదలు వస్తే ఒడిశా వెళ్లాలి{ వర్షాకాలంలో వంశధార నదికి వరద వచ్చినట్లయితే ఊట నీరు ఉండదు. అప్పుడు మా గ్రామం నుంచి ఒడిశా రాష్ట్రం కిడిగాం గ్రామం సమీపంలో ఉన్న బోరు నుంచి తాగునీరు తీసుకొస్తాము. మేము తాగునీటి కోసం పడుతున్న కష్టాలు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా మాకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. – బూరాడ స్వాతి, కడుము గ్రామం -
ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లు
మహిళలు అనుకోవాలేగానీ ఏదైనా సాధించి తీరతారు. అది వ్యవసాయం, వ్యాపారం అయిన పట్టుబట్టి విజయం సాధించాడంలో మహిళలు ముందంజలో ఉంటారు. అనేకమంది మహిళల విజయ గాథలే దీనికి అక్షర సత్యాలు. వారి సంకల్ప బలం అలాంటిది. అలా చిన్న వయసులోనే సక్సెస్ ఫుల్ మహిళలలో ఒకరిగా తన స్థానాన్ని నిలుపుకున్నారు పూణేకు చెందిన మహిళా రైతు. క్యాప్సికం (Capsicum ) సాగుతో ఏకంగా ఏడాది రూ. 4 కోట్ల టర్నోవర్ను సాధించింది. పదండి ఆమె సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం.మహారాష్ట్రలోని పుణె జిల్లాలోని కల్వాడి గ్రామానికి చెందిన విద్యావంతురాలు ప్రణిత వామన్. పుణెలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ కాలేజీ నుంచి ఎంబీఏ అగ్రిబిజినెస్ మేనేజ్మెంట్లో పట్టా పుచ్చుకుంది. ఎంబీఏ ఇంటర్న్షిప్లో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీతో పనిచేసిన నేపథ్యంలో తనకెంతో ఇష్టమైన వ్యవసాయం వైపే మొగ్గు చూపింది. తనకంటూ సొంతంగా ఎదగాలని, తద్వారా మరో పదిమందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుగా సాగింది. తన తమకున్న పొలంలో క్యాప్సికం సాగు ప్రారంభించింది. ఆమె ఆశయానికి ఉపాధ్యాయుడిగా పనిచేసి, రిటైరయ్యి, వ్యవసాయం చేసుకుంటున్న తండ్రి ప్రోత్సాహం కూడా లభించింది.చదవండి: కేబీసీ 17లో కోటి గెల్చుకున్న తొలి వ్యక్తి..కానీ 7 కోట్ల ప్రశ్న ఏంటో తెలుసా?తండ్రి ప్రోత్సాహం రూ. 20 లక్షల పెట్టుబడి2020లో తనకున్న కొద్దిపాటి భూమిలో క్యాప్సికం సాగు ప్రారంభించింది. తనకున్న పాలిహౌజ్ నైపుణ్యానికి తోడుగా ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ లభించింది. పాలీహౌస్ సాగు అంటూ వ్యవసాయంలో లేటెస్ట్ హైటెక్ వ్యవసాయం అని చెప్పవచ్చు. తీవ్రమైన వాతావరణ మార్పులను ఎదుర్కొంటూ, ఉష్ణోగ్రత, తేమ , ఇతర పారామితులను నిర్వహించడం ద్వారా ఏడాది పొడవునా లాభదాయకమైన సాగు చేయడం.అలా రూ. 20 లక్షలు పెట్టుబడితో తన సాగుకు డ్రిప్ ఇరిగేషన్ పద్దతిని ఎంచుకుంది. ఒక్కో మొక్క ధర రూ. 10. చొప్పున బారామతి నుంచి నారును తీసుకొచ్చి నాటింది. మూడు నాలుగు నెలలకే క్యాప్సికం పంట చేతికి అందింది. దాదాపు 40 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. కానీ కరోనా వైరస్,లాక్ డౌన్ సంక్షోభం ముంచుకొచ్చింది. అయినా అధైర్య పడకుండా ఆన్లైన్ మార్కెటింగ్ ఎంచుకుంది.ప్రస్తుతం పాతిక ఎకరాలు, ఏడాదికి రూ. 4 కోట్లుమొదటి పంటలో 40 టన్నుల ఎరుపు, పసుపు ,ఆకుపచ్చ బెల్ పెప్పర్స్ దిగుబడి వచ్చింది. వాటిని కిలోకు రూ. 80 చొప్పున అమ్మింది. ఫలితంగా రూ. 32 లక్షల టర్నోవర్తో, తొలి ఏడాదిలోనే రూ. 20 లక్షల పెట్టుబడిని తిరిగి వచ్చేసిందని ప్రణీత స్వయంగా తెలిపింది. తొలి ఏడాదిలోనే రూ. 20 లక్షల పెట్టుబడిగాను సుమారు రూ. 12 లక్షలు లాభం వచ్చింది. ఈ ఉత్సాహంతో మరింత ధైర్యంగా అడుగులు వేసింది. 2021లో 25 ఎకరాలకు తన పరిధిని విస్తరించుకుంది. పాలిహౌస్ విధానంలో క్యాప్సికం పంటను సాగు కొనసాగిస్తోంది. ఇందులో 10 ఎకరాలు సొంత పొలం కాగా, మరో 15 ఎకరాలు లీజుకు తీసుకుంది అలా ఖర్చులు పోను ఏడాదికి రూ. 2.25 కోట్ల లాభంతో విజయవంతమైన యువమహిళా రైతుగా నలుగురికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఇదీ చదవండి: ప్రాజెక్టులు తగ్గినా, క్వాలిటీ తగ్గలేదు : గ్రాజియా కవర్పేజీపై మెరిసిన సమంత -
కేబీసీ 17లో కోటి గెల్చుకున్న తొలి వ్యక్తి..కానీ 7 కోట్ల ప్రశ్న ఏంటో తెలుసా?
కౌన్ బనేగా కరోడ్పతి టీవీ షో గురించి ప్రత్యేక పరిచయం అవసరం. బాలీవుడ్ సీనియర్ నటుడు, బిగ్బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్గా సాగుతున్న కౌన్ బనేగా కరోడ్పతి-17 సిరీస్లో కోటి రూపాయలు గెలుచుకున్న మొదటి పోటీదారుగా ఉత్తరాఖండ్కు చెందిన ఆదిత్య కుమార్ నిలిచారు. అలవోకగా వరుస ప్రశ్నలకు సమాధానమిస్తూ రూ. 7 కోట్ల విలువైన ప్రైజ్ మనీ సాధించే చివరి రౌండ్కు చేరుకున్నాడు. చివరి రౌండ్ వరకూ ఎలాంటి లైఫ్లైన్లను వాడకుండా ఆటను కొనసాగించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అలా కోటి ప్రశ్నకు సరైన సమాధానం సీజన్కి తొలి కోటీశ్వరుడిగా ఆదిత్య నిలవడం ప్రత్యేకంగా నిలిచింది. ఆదిత్య మేధస్సు, పట్టుదలపై అమితాబ్ ప్రశంసలు కురిపించారు. అయితే రూ. 7 కోట్ల ప్రశ్నగా చివరి ప్రశ్న "1930లలో భారతదేశాన్ని సందర్శించిన జపనీస్ కళాకారుడు ఎవరు?తాజ్ మహల్, సాంచి స్థూపం , ఎల్లోరా గుహల నమూనాలను ప్రసిద్ధ సిరీస్ను చిత్రించాడు?" అనే ప్రశ్న.ఇదీ చదవండి: ప్రాజెక్టులు తగ్గినా, క్వాలిటీ తగ్గలేదు : గ్రాజియా కవర్పేజీపై మెరిసిన సమంతసరైన సమాధానం తెలియక, అప్పటికే గెలుచుకున్న ప్రైజ్మనీతో షో నుండి నిష్క్రమించేందుకు నిర్ణయించు కున్నాడు కేబీసీ 17లో కోటి గెల్చుకున్న తొలి వ్యక్తి..కానీ 7 కోట్ల ప్రశ్న ఏంటో తెలుసా? అయితే రూల/ ప్రకారం నిష్క్రమించే ముందు అతను సమాధానాన్ని గెస్ చేయాల్సి ఉంటుంది. అలా అతను హిరోషి నకాజిమాను సమాధానంగా ఊహించాడు. అదృష్టవశాత్తూ అతన షోనుంచి వైదొలిగేందుకు తీసుకున్న నిర్ణయం కరెక్ట్. ఎందుకంటే కానీ ఆదిత్య గెస్ చేసిన సమాధానం తప్పు. సరైన సమాధానం ప్రసిద్ధ జపనీస్ చిత్రకారుడు హిరోషి యోషిడా. దీంతో ఆదిత్య రూ. 1 కోటి , కారుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య ఆదిత్య షోనుంచి నిష్ర్కమించాడు.మరోవైపు తన విజయంపై ఆదిత్య సంతోషం వ్యక్తం చేశాడు. నిజానికి తన టార్గెట్ కోటి రూపాయలు గెల్చుకోవడం కాదని కోటి ఒక రూ.7 కోట్లు. అయితే కేవలం డబ్బు కోసమే ఈ షోలో పాల్గొనలేదని, సంసిద్ధత, ప్రశాంతత, నమ్మకం మనల్ని ఎంత దూరమైనా తీసుకెళ్తాయని నిరూపించాలనుకున్నానని చెప్పాడు. ఈ ప్రయాణమే అసలైన విజయమని వ్యాఖ్యానించాడు.చదవండి: ఇండియన్ వయాగ్రా రైస్ తెలుసా? దేశీ వరి ఔషధ గుణాలు ఎవరీ హిరోషి యోషిడా.జపనీస్ చిత్రకారుడు హిరోషి యోషిడా ల్యాండ్స్కేప్ ఆర్ట్కు ప్రసిద్ధి చెందారు. 20వ శతాబ్దానికి చెందిన ఆర్టిస్ట్, వుడ్బ్లాక్ ప్రింట్మేకర్ షిన్-హాంగా కళా ఉద్యమంలో ప్రముఖంగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రముఖచిత్రాలను గీశారు. అలాంటి వాటిల్లో ప్రదానమైనవి తాజ్ మహల్, స్విస్ ఆల్ప్స్ అండ్ గ్రాండ్ కాన్యన్ ఉన్నాయి. ఇవి సాంప్రదాయ జపనీస్ శైలిలో రూపొందించారు. నిర్మలమైన, వివరణాత్మక సౌందర్య మరియు క్రాస్-కల్చరల్ కళాత్మక వ్యక్తీకరణలు ఆదరణ పొందాయి.ప్రకృతితో లోతుగా అనుసంధానించబడిన కళాకారుడిగా పేరు గాంచారు.44 ఏళ్ల వయస్సులో, హిరోషి యోషిడా డ్రాయింగ్లను వుడ్బ్లాక్ ప్రింట్లుగా ప్రచురించడం ప్రారంభించాడు. 49 సంవత్సరాల వయస్సులో తన మొదటి సేకరణను విడుదల చేశాడు. యూరోపియన్ వాస్తవికతను సాంప్రదాయ జపనీస్ వుడ్బ్లాక్ పద్ధతులతో మేళవించి విలక్షణమైన కళాత్మక శైలిని సృష్టించిందని జపనీస్ MOA మ్యూజియం ఆఫ్ ఆర్ట్ ఆయనను ప్రశంసించింది.1876లో ఫుకుయోకాలోని కురుమే నగరంలో జన్మించిన ఆయన 1887లో ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి ఫుకుయోకా నగరానికి వెళ్లారు. చిన్నతనంలో ఆయనకు కళ పట్ల అతని అభిరుచిని చూసిన తర్వాత, లేడీ ఆర్ట్ టీచర్ యోషిడా కసాబురో ఆయనను దత్తత తీసుకున్నారు. తరువాత ఆయన క్యోటో మరియు టోక్యోలలో పాశ్చాత్య శైలి చిత్రలేఖనాన్ని అభ్యసించారు. 23 సంవత్సరాల వయస్సులో, ఆయన ఉత్తర అమెరికాకు వెళ్లి డెట్రాయిట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ , ఇతర గ్యాలరీలలో కళాకృతులను అమ్మడం ద్వారా విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన యూరప్ అంతటా పర్యటించి రెండు సంవత్సరాల తర్వాత జపాన్కు తిరిగి వచ్చారు.యోషిడా కళా ప్రచురణకర్త వటనాబే షోజాబురోను కలిసి 'ది సేక్రెడ్ గార్డెన్ ఇన్ మీజీ ష్రైన్' పేరుతో తన మొదటి వుడ్బ్లాక్ ముద్రణను ప్రచురించారు. 1923లో, గ్రేట్ కాంటో భూకంపం తర్వాత ఆయన మళ్ళీ అమెరికాకు వెళ్లారు. -
భార్యభర్తల కేసు..! నవ్వు ఆపుకోవడం జడ్జి తరం కాలేదు..
ప్రపంచంలో అత్యంత దయగల న్యాయమూర్తిగా పేరుగాంచిన అమెరికన్ న్యాయమూర్తి ఫ్రాంక్ కాప్రియో ఇక లేరు. ప్యాంక్రియాటిక్ కేన్సర్తో పోరాడుతూ 88 ఏళ్ల వయసులో మరణించారు. ఆయన పలు కేసుల విషయంలో వ్యవహరించిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది. ఆయన కోర్టు గదిని దయతో న్యాయం అందించే పవిత్ర ప్రదేశంగా మార్చారు. ఆయన పలు తీర్పుల్లో నిందితులను దయతో క్షమించి మార్పు వచ్చేలా చేయడమే గాక బాధితుడికి న్యాయం అందేలా చేసేవారు కూడా. ఆయన తీర్పులందించిన పలు కేసులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వాటిలో ఒకటి ఈ భార్యభర్తల కేసు. ఇది కోర్టులో అంత్యంత నవ్వులు పూయించిన కేసు. భర్తను డామినేట్ చేస్తూ తానే మాట్లాడుతూ ఉండటం చూసి జడ్డి కాప్రియో సైతం నవ్వు ఆపుకోలేకపోయారు. ఏంటంటే..భార్యభర్తలిద్దరూ ఒక కేసులో ఇరుకుంటారు. దాని విచారణ నిమిత్తం కోర్టుకి హాజరవుతారు. అయితే భార్య లిండా ఫీల్డ్స్ తన భర్తను మాట్లాడనివ్వకుండా జరిమాన విధించిన చలానా తీసుకుని స్పీడ్గా కోర్టులోకి వచ్చి నాన్స్టాప్గా మాట్లాడేస్తూ ఉంటుంది. మధ్యలో భర్త జోక్యం చేసుకోవాలని ప్రయత్నించినా..అవకాశం ఇవ్వకుండా. ఆ కారు తనదేనని, అయితే నడిపింది తన భర్తేనని చెబుతుంది. దోషిని తాను కానంటూ టకటక చెప్పేస్తుంది. ఆమె మాట్లకు ఆ కోర్టు హాలులో ఉన్నవాళ్లంతా పడి పడి నవ్వుతారు. ఆమె తీరు చూసి న్యాయమూర్తి కాప్రియో కూడా నవ్వు ఆపుకోలేకపోతారు. అయితే మీరు భర్తను ఈ కేసులోకి పూర్తిగా ఇరికించేయాలనుకుంటున్నారు కదా అని అడగ్గా..మరి నేనెందుకు బలవ్వాలి అంటూ బదులిస్తుంది. అంతా విన్నాక కాప్రియో అసలు ఎందుకు అంత వేగంగా వాహనాన్ని పోనిచ్చారని ఆమె భర్తను ప్రశ్నించగా దానికి కూడా ఆమెనే బదులిస్తుంది. తమకొడుకు ఘోరమైన ప్రమాదానికి గురై ఆస్పత్రిలో ఉన్నాడని. అతడి పర్యవేక్షణ నిమిత్తం తన భర్త రోజుకు రెండు మూడు సార్లు అక్కడకు వెళ్తున్నారని లిండా ఫీల్డ్స్ వివరిస్తుంది. ఆ హృదయపూర్వకమైన సంభాషణ అనంతరం ఆయన విశాల హృదయంతో ఆ కేసును కొట్టేస్తాడు. ట్విస్ట్ ఏంటంటే.. పసుపు లైట్ వెళ్లినప్పుడూ కారు నడిపినందుకే జరిమానా పడిందని అనుకుంటారు ఆ భార్యభర్తలు, కానీ రెడ్లైట్ పడినప్పుడే కారు నడిపామని సీసీఫుటేజ్ ద్వారా తెలుసుకుని కంగుతింటారు.ఇక్కడ ఈ కేసులో తన భర్తదే తప్పన్నట్లు..భార్య మాట్లాడటం, తన భర్తకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం..వంటి భార్య అమాయత్వం తీరు అందర్నీ ఆకట్టుకుంది. చివర్లో తన భర్త కావాలని వేగంగా వెళ్లలేదంటూ చెప్పి న్యాయమూర్తి మనసుని గెలుచుకుంది. ఇది న్యాయమూర్తి కాప్రియా విచారించిన కేసుల్లో అత్యంత నవ్వు తెప్పించిన హాస్యస్పదమైన భార్యభర్తల కేసుగా నిలిచిపోయింది. న్యాయమూర్తి కాప్రియో నేపథ్యం..కాప్రియో సఫోల్క్ విశ్వవిద్యాలయ లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేన్ పూర్తి చేశారు. అతను రోడ్ ఐలాండ్ ఆర్మీ నేషనల్ గార్డ్లో పనిచేశాడు. అతను 1962లో ప్రావిడెన్స్ సిటీ కౌన్సిపట్టల్కు ఎన్నికయ్యాడు. కాప్రియో 1985 నుంచి 2023లో పదవీ విరమణ చేసే వరకు ప్రావిడెన్స్లో మునిసిపల్ జడ్జిగా పనిచేశారు. ఆయన 2018 నుంచి 2020 వరకు టెలివిజన్ సిరీస్ కాట్ ఇన్ ప్రావిడెన్స్లో దయగల న్యాయమూర్తిగా నటించిన తీరు అందరిని బాగా ఆకట్టుకుంది. అదీగాక ఈ సిరీస్ జాతీయ స్థాయిలో ప్రశారం కావడంతో కాప్రియో మరింత ఫేమస్ అయిపోయారు. న్యాయం ఎల్లప్పుడూ దయను కలిగి ఉండాలనే ఆయన ఆ కాంక్షే ఈ సిరీస్ ప్రధాన ఉద్దేశ్యం కావడం విశేషం. అందువల్లే ఈ షో మరింత హైలెట్గా నిలిచి ఆయన పేరు దశదిశలా మారుమ్రోగిపోయింది. (చదవండి: ఓపెన్గా మాట్లాడేస్తా.. అంటే కుదరదు..! నటి శ్రుతి హాసన్ ఎదుర్కొన్న చేదు అనుభవం..) -
నిజాయితీకి మూల్యం చెల్లించాల్సిందే..! శ్రుతి హాసన్
సినీ సెలబ్రిటీలు గ్లామర్ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే..అందం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక్కోసారి కాస్మెటిక్ సర్జరీలు తప్పవు కూడా. అది అందరికీ తెలిసిందే. చాలామంది ప్రముఖులు తాము చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీలు గురించి బయటకు గమ్మున చెప్పరు. కానీ కొందరు ధైర్యంగా చెబుతారు. పాపం అదే వారిని ఇక్కట్లు పాలు చేస్తుంది.నిజాయితీగా మాట్లాడారని మెచ్చుకోకపోయినా పర్లేదు..ఏకంగా తీసిపడేసినట్లుగా కామెంట్లు, సోషల్ మీడియా ట్రోలింగ్తో మానసికంగా చంపేస్తుంటారు. అలాంటి పరిస్థితినే తాను ఎదుర్కొన్నానంటూ టాలీవుడ్ నటి శ్రుతి హాసన్ తన గోడును వెళ్లబోసుకున్నారు.ఏం జరిగిందంటే..గాయని, ప్రముఖ నటి శ్రుతిహాసన్(Shruti Haasan) తన మనసులోని మాటను మొహమాటం లేకుండా ధైర్యంగా చెప్పేస్తారామె. అలానే తాను చేయించుకున్న కాస్మెటిక్ విధానాల గురించి చాలా ఓపెన్గా చెప్పింది. అలా చెప్పడంతో ఒక్కసారిగా అంతా ఆశ్యర్యపోయారు, ఆమె ధైర్యానికి మెచ్చుకున్నారు కూడా. అంత వరకు బాగానే ఉంది. ఆ తర్వాత నుంచి మొదలైన కష్టాలు అంతా ఇంత కాదు. ఓహో ప్లాస్టిక్ సర్జరీ బేబీ అని మాట. ఆమె శరీరం అంతా ప్లాస్టిక్నే అంటు కామెంట్లతో ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. ఇది నిజాయితికి లభించిన మూల్యం అని ఆవేదన వ్యక్తం చేశారామె. ఇతర నటి నటులు కూడా తాను చేయించుకున్న వాటికంటే ఎక్కువ చేయించుకుని ఉండొచ్చు. అయినా అది వారి వ్యక్తిగత విషయం. అందం, దాని ప్రామాణికత పరంగా ఒక్కొక్కరిది ఒక్కో విధానంలో ప్రాముఖ్యత ఇస్తారు. అలా అని దాన్ని అందరూ అనుసరించాలని తామేమి సందేశం ఇవ్వడం లేదు. ఇవన్నీ కూడా వ్యక్తిగతమైనవి, వారి వారి ఇష్టాలకు సంబంధించినవి. అయినా ఒకరి ఇష్టాన్ని ఎవ్వరూ జడ్జ్ చేయలేం అనేది నర్మగర్భంగా అంగీకరించాల్సిన విషయం. అలాగే తాను చేస్తున్న పని, జీవితం, ప్రేమ వంటి వాటికి సంబంధించిన వాటి గురించి చాలా ఓపెన్గా మాట్లాడేస్తుంటాని అన్నారామె. కానీ ఇప్పుడే తెలుస్తుంది ఆ నిజాయితీ అస్సలు పనికి రాదని, అలా చెప్పిన తత్క్షణమే వేళ్లన్నీ నా వైపు చూపించడం మొదలవుతుందని అంటూ తాను ఎదుర్కొన్న చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చారు. నిపుణులు ఏమంటున్నారంటే..ఇది అందరికి వర్తిస్తుందని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఒకప్పుడూ చాలా ఓపెన్గా మన మనసులో విషయాలను స్వచ్ఛంగా మాట్లాడేవాళ్లం. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యామా అని ట్రోలింగ్ రాయుళ్లను దృష్టిలో పెట్టుకుని ఆచితూచి మాట్లాడాల్సిందే. ఇక్కడ అందరూ ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ముఖ్యంగా సొంత విషయాలు లేదా వ్యక్తిగత విషయాల ప్రస్తావించక పోవటమే మేలు అనే సూత్రాన్ని అవలంభించాలి అదే నేటి కాలంలో శ్రీరామ రక్ష అని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: 'మంజుమ్మెల్ గర్ల్'..! ధైర్యానికి కేరాఫ్ అడ్రస్ ఆమె..) -
ఉత్తరాయణం, దక్షిణాయనం ఏది ఉత్తమం, వర్జ్యం అంటే?
సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే సమయం ఉత్తరాయణ పుణ్య కాలం ఇక దక్షిణాయనం అంటే సూర్యుడు కర్కాటకంలో ప్రవేశించే సమయం ఉత్తరాయణాన్ని మాత్రమే పుణ్యకాలం అంటారు అలాగని దక్షిణాయనం పాప కాలమేమీ కాదు. అదీ పుణ్యప్రదమైనదే. ఎందుకంటే మన ప్రధాన పండుగలన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి.శుభకార్యాలను ఉత్తరాయణంలోనే నిర్వహించే మనం... శక్త్యారాధన, రుద్రారాధన, పితృదేవతారాధన వ్రతం దక్షిణాయనంలోనే చేస్తాం.అయితే దక్షిణాయనం అనేది దేవతలకు రాత్రికాలం కాబట్టి దేవతారాధనకు ఉత్తరాయణం, పితృదేవతా రాధనకు దక్షిణాయనం ప్రశస్తమైనదని పెద్దలు చెబుతారు. వినాయక చవితి, దసరా, దీపావళి వంటి పండుగలు దక్షిణా యనంలోనే వస్తాయి.శ్రీమహావిష్ణువు శయనించేది దక్షిణాయనంలోనే, రుద్రారాధన, గణనాయకుడైన వినాయకుని ఆరాధనతో΄ాటు పితృపక్షాలు, విశేషమైన దసరా, దీపావళి పంటి పండుగలన్నీ దక్షిణాయనంలో వస్తాయి. ప్రస్తుతం మనం దక్షిణాయనంలోనే ఉన్నాం. వర్జ్యం అంటే ఏమిటి? ఈ కాలంలో ఏ పనులూ చేయకూడదా?ఉత్తరాయణం... దక్షిణాయనం ఏది ఉత్తమ కాలం?జ్యోతిష్యంలో వర్జ్యాన్ని నక్షత్రాన్ని బట్టి నిర్ణయిస్తారు. ప్రతి నక్షత్ర సమయంలో వర్జ్య కాలం ఉంటుంది. ఇంతకీ వర్జ్యం అంటే ఏమిటీ అంటే విడువ తగిన కాలం. వర్జ్యంలో ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించడంగానీ, శుభకార్యాలకి బయలు దేరడం కాని చేయకూడదు. ఈ కారణంగానే పెద్దలు ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ వుంటారు. ప్రతి నక్షత్రానికి వర్జ్యం 4 ఘడియలు లేదా 96 నిమిషాలు ఉంటుంది. వర్జ్యకాలంలో దైవారాధనకి సంబంధించిన అన్ని పనులతోపాటు, శక్తి కొద్దీ దానం దానాలు చేయడం వలన అనేక దోషాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. అంతే కాకుండా దేవుడి సేవకి సంబంధించిన వివిధ రకాల ఏర్పాట్లను చేసుకోవడం వల్ల ఆయా దోషాలు తొలగి కార్యానుకూలత కలుగుతుంది. -
దేవుడు ఎలా ఉంటాడో తెలుసా?
ఒకసారి బాగ్దాదు నగరంలో గొప్ప ధార్మిక సభ జరుగుతోంది. వేలాది మంది ప్రజలు ఆ సభలో పాల్గొన్నారు. అనేకమంది పండితులు ప్రజలను ఉద్దేశించి ప్రవచనం చేస్తున్నారు. అంతలో ఒక వ్యక్తి సభలోకి ప్రవేశించి, పండితులకు ఒక సవాలు విసిరాడు. ‘మీరు చెబుతున్న ప్రకారం, ఈ సృష్టి మొత్తానికి ఒక కర్త ఉన్నాడు. అయన అల్లాహ్, అంటే సృష్టికర్త. మరి ఆయనే సమస్తాన్ని సృష్టించినప్పుడు ’ఆయన్ని’ ఎవరు సృష్టించారు? ఆయనకు ముందు ఎవరున్నారు?. ’అని ప్రశ్నించాడు.సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. పండితులు అతని ప్రశ్నకు సమాధానం చెప్పారు. కాని అతను సంతృప్తి చెందలేదు. పండితులు తల పట్టుకున్నారు. అతనికి అర్ధమయ్యేలా సంతృప్తికరమైన సమాధానం ఎలా చె΄్పాలో వారికి అర్ధం కాలేదు. ఆ వ్యక్తి గర్వంగా సభికుల వైపు చూశాడు. అంతలో సభికుల్లోంచి ఓ పదకొండేళ్ళ బాలుడు సమాధానం చెబుతానని ముందుకొచ్చాడు. ఆ వ్యక్తి బాలుణ్ణి చూసి,’నువ్వు సమాధానం చెబుతావా?’ అంటూ వెటకారంగా నవ్వాడు. ఆ బాలుడు ఏమాత్రం తొణక్కుండా, ‘అవును నేనే.. మీప్రశ్న మరోసారి వినిపించండి’ అన్నాడు.‘అన్నిటికీ అల్లాయే అంటున్నారు గదా.. మరి అల్లాకు ముందు ఎవరున్నారు? ’అని ప్రశ్నించాడు. అప్పుడా బాలుడు, ‘మీకు ఒకటి, రెండు ఒంట్లు వచ్చుగదా..? ఒకటి నుండి పది వరకు లెక్కించండి’. అన్నాడు.ఇదీ చదవండి: ఉత్తరాయణం, దక్షిణాయనం ఏది ఉత్తమం, వర్జ్యం అంటే?‘ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఇదేమి పిచ్చి ప్రశ్న’ అంటూనే ఒకటి నుండి పది వరకు లెక్కించాడు. ’పది తరువాత..?’ అన్నాడా బాలుడు. ‘పదకొండు..పన్నెండు..’ ఇలా ఎంతవరకైనా వెళ్ళవచ్చు.’ అన్నాడా వ్యక్తి. ‘అవును కదా..! అలాగే పది నుండి వెనక్కి లెక్కించండి.’ అన్నాడా బాలుడు. ‘పది..తొమ్మిది.. ఎనిమిది.. ఇలా .. ఒకటి వరకు వచ్చి ఆగి ΄÷య్యాడు. ‘తరువాత..? లెక్కించండి..’ అన్నాడు బాలుడు. ‘తరువాత ఇంకేముంటుంది. ఏమీలేదు.. సున్నా.. శూన్యం.’ అన్నాడా వ్యక్తి. ‘..కదా..? అల్లాహ్కు ముందు కూడా ఏమీ లేదు.. అంతా శూన్యం. అన్నిటికీ కర్త ఆయనే..’ అన్నాడు బాలుడు. సభలో కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ప్రశ్నించిన వ్యక్తి ముఖం వాడిపోయింది. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ మంచి మాటలు మనిషి మంచివాడు కావాలంట, మంచి పనులు చేయక్కరలేదు, ఎదుటివారి గురించి ముందొక మాట, వెనుకొక మాట మాట్లాడకుంటే చాలు.!మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదం... నమ్మకం ఎంత బలపడితే నమ్మకద్రోహం అంత గట్టిగా తగులుతుంది.!!కష్టాలు కన్నీళ్ళనే కాదు నిజాలను బయటకు రప్పిస్తుంది, దాపరికాల ముసుగును తొలగిస్తుంది... వాస్తవాలను వెలుగు చూసేలా చేస్తుంది... కష్టం కూడా ఒక మంచి స్నేహితుడే... మనలో ధైర్యాన్ని... మన సామర్థ్యాన్ని మనకు తెలియజేస్తుంది... మన భవిష్యత్తుకు... గమ్యాన్ని వెతికేలా చేస్తుంది.!!జీవితంలో ఎప్పుడూ మంచివాళ్ళను నొప్పించకు ఎందుకంటే... వాళ్ళు వజ్రం లాంటి వాళ్ళు... చేజారితే పగిలి΄ోరు... నీ జీవితం నుండి జారిపోతారు.!!కంటికి నచ్చే ఎన్నో విషయాల గురించి... పరుగులు తీస్తూ ఉంటాం... కానీ గుండెకు నచ్చే విషయం గురించి వెతకండి... నయనానందం క్షణికం... హృదయానందం శాశ్వతం... -
మనసుంటే భూపంపిణీ చేయొచ్చు!
భారతదేశంలో నూటికి 65 శాతం పైగా ప్రజలు గ్రామీణప్రాంతంలో నివసిస్తున్నారు. భూమిని కలిగి ఉండటం రైతు కుటుంబానికి సామాజిక హోదాను కల్పిస్తుంది. కానీ 78 సంవత్సరాల ‘స్వాతంత్య్రం’ తర్వాత కూడా గ్రామీణ ప్రాంతంలో భూమి లేని నిరుపేదలు అత్యధికంగా ఉన్నారు. గ్రామాల్లోని సుమారు 10 కోట్ల కుటుంబాలకు, అంటే గ్రామాల్లోని దాదాపు 56 శాతం కుటుంబాలకు సాగు భూమి అనేది లేదు. 1970 దశకంలో ప్రజల, ముఖ్యంగా గిరిజన ప్రజల పోరాటం ఫలితంగా భూమి సమస్య ప్రధాన ఎజెండాగా ముందుకు వచ్చింది. రాష్ట్రాల వారీగా భూసంస్కరణల చట్టాలు వచ్చాయి. 1972లో జరి గిన ముఖ్యమంత్రుల సమావేశంలో జాతీయ స్థాయిలో ఒకే సీలింగ్ విధానాన్ని రూపొందించారు. ఈ సీలింగ్ ద్వారా 67 లక్షల ఎకరాల మిగులు తేలింది. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటం ఫలితంగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో 1972లో భూ సంస్కరణల చట్టం చేయబడి 1973లో అమల్లోకి వచ్చింది. భూ సంస్కరణల చట్ట ప్రకారం మొదట 18 లక్షల ఎకరాలను మిగులు భూమిగా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ప్రక టించింది. సవరణలతో కుదిస్తూ చివరికి 7.9 లక్షల ఎకరాల మిగులు భూమి ప్రకటించి, అందులో 6.47 లక్షల ఎకరాలను స్వాధీనం చేసుకుని, 5.82 లక్షల ఎకరాలను లక్షా 79 వేల మందికి పంపిణీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. చట్టంలో ఉన్న లొసుగు లను ఉపయోగించుకొని భూస్వాములు, ధనిక రైతులు సీలింగ్లోకి రాకుండా తమ భూములను కాపాడుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ సుమారు 51 లక్షల ఎకరాలను మాత్రమే 57.8 లక్షల పేద రైతులకు పంపిణీ చేయడం జరిగింది. భూ సంస్కరణల చట్టాల వల్ల భూ సంబంధాల్లో మౌలికమైన మార్పులు జరగలేదు. కొద్ది మంది వద్దే భూమి ఇంకా కేంద్రీకరించ బడి ఉంది. 2020 జాతీయ శాంపిల్ సర్వే ప్రకారం, 84%గా ఉన్న చిన్న, సన్నకారు రైతులు హెక్టార్ కన్నా తక్కువ భూమిని కలిగి ఉన్నారు. కేవలం 4.9% ఉన్న భూస్వాముల వద్ద 32% సాగు భూమి ఉంది. రాష్ట్రాల వారిగా కూడా భూకేంద్రీకరణలో వ్యత్యాసాలు ఉన్నాయి. పంజాబ్, బిహార్ రాష్ట్రాల్లో 10%గా ఉన్న భూస్వాముల వద్ద 80 శాతం భూమి ఉంది. తెలంగాణ, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లో 55% భూమి 10%గా ఉన్న భూస్వాముల వద్ద ఉంది. భారతదేశంలో ఒక పెద్ద భూ కామందు ఒక సన్నకారు రైతు కన్నా 45 రెట్లు ఎక్కువ భూమిని కలిగి ఉన్నారు. దేశంలో భూ సంస్కరణలు అమలు జరిపారనీ, భూస్వామ్య విధానం లేదనీ, దాని అవశేషాలు మాత్రమే ఉన్నాయనీ, పంచ టానికి ఇంకా భూములు లేవనీ కొందరు చేస్తున్న వాదనలు వాస్తవ విరుద్ధం. భూ కామందుల వద్దే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థల వద్ద, మత సంస్థల వద్ద లక్షలాది ఎకరాల భూమి ఉంది. ఆ భూము లను ప్రభుత్వం పంపిణీ చేయగలిగినప్పుడే పేదలందరికీ భూమి లభిస్తుంది. 10 నుండి 12 ఎకరాల సీలింగ్ విధించి భూ సంస్కర ణలు అమలు జరిపితే లక్షల కొద్ది భూములను పేదలకు పంపిణీ చేయవచ్చు. పాలకుల విధానాలకు వ్యతిరేకంగా గ్రామీణ పేదలు భూమి కోసం సంఘటితం కావాలి. – బొల్లిముంత సాంబశివరావురైతు కూలీ సంఘం (ఆం.ప్ర.) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు -
'మంజుమ్మెల్ గర్ల్'..! ధైర్యానికి కేరాఫ్ అడ్రస్ ఆమె..
కొచ్చిలో రద్దీగా ఉండే వీధిలోకి ఓ ఆటో రిక్షా రయ్.. మని వచ్చి ఆగింది. అప్పుడే ఓ పోలీస్ వ్యాన్ కూడా అదే మలుపు వద్ద ఆగింది. అందులో నుంచి కానిస్టేబుల్ ఆటోలోకి చూస్తూ ‘ఏయ్ అబ్బాయి, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా?’ అని అడిగాడు. ‘సర్, నేను అబ్బాయి కాదు, అమ్మాయిని...’ అంటూ తన వద్ద ఉన్న లైసెన్స్ చూపించింది.ఆమె కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని మంజుమ్మెల్కు చెందిన అలీషా జిన్సన్. ఆమె వయసు 18. ‘మంజుమ్మెల్ గర్ల్’గా ఆ ఏరియాలో ఎలక్ట్రిక్ ఆటోరిక్షా నడుపుతోంది. ఆమె ఎర్నాకుళంలోనే కాదు కేరళ మొత్తంలో ఆటో నడిపే అతి పిన్న వయస్కురాలిగా పేరొందింది. ఆమె ఆటో నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కేరళ విద్యామంత్రి శివన్ కుట్టి దృష్టికి వచ్చింది. దీంతో ఆయన రాష్ట్ర టాక్సీ, ఆటో బుకింగ్ యాప్ అయిన కేరళ సవారీకి అలీషాను బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. అలీషా డ్రైవర్ సీట్లో కూర్చోవడానికి చాలానే కష్టపడింది. 16 ఏళ్ల వయసులో కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పుడు స్కూల్ చదువు మానేసింది. అదే సంవత్సరంలో క్లీనింగ్ సర్వీసెస్ కంపెనీ యజమాని అయిన ఆమె తండ్రి గిన్సన్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. కొన్ని నెలల తేడాతో తల్లి షిజా నిమోనియాతో ఆసుపత్రి పాలైంది, అది క్షయవ్యాధిగా మారింది. దీంతో ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గిపోయింది. ఉన్న ఏకైక ఆస్తి క్లీనింగ్ సిబ్బందిని తీసుకెళ్లడానికి ఉంచిన ఆటోరిక్షా. ‘నాన్నకు ప్రమాదం జరిగి, మంచం పట్టడం, అమ్మ ఆసుపత్రి పాలవడంతో నేను ఈ డ్రైవింగ్నే ఎంపిక చేసుకున్నాను. ఆటోయే నాకు జీవనాధారం అయ్యింది. మొదట్లో పనివాళ్లను చేరవేయడానికి ఆటో ఉపయోగపడింది. కొత్త భవనాలు, ఫర్నీచర్ క్లీనింగ్ వంటి పనుల్లో పాల్గొన్నాను. ఒకరోజు పొరుగున ఉండే వ్యక్తి తన సరుకులను చేరవేయడానికి ఆటో కావాలని అడిగాడు. నా తండ్రి నన్ను ఆటో తీసుకెళ్లమన్నాడు. ఆ రోజు నేను ఛార్జీల రూపంలో రూ.700 సంపాదించాను. అది నేను ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తం. దీంతో నా పూర్తి సమయం ఆటో నడపడానికే నిశ్చయించుకున్నాను.రాత్రి డ్రైవింగ్... నెలవారీ వాయిదా కట్టడానికి రూ.13,000 అవసరం అవడంతో సాయంత్రం ఊబర్లోకి లాగిన్ అయ్యేది. దీంతో రాత్రి డ్రైవింగ్ మొదలయ్యింది. కొన్నిసార్లు తెల్లవారుజాము 2 గంటల వరకు ఆటో నడుపుతూనే ఉండేది. ఏ టైమ్ అయినా సంకోచం లేకుండా నడపడం చేస్తూనే ఉంది. కట్ చేసిన జుట్టు, డ్రెస్సింగ్ చూసేవాళ్లకు ఆమె టీనేజ్ అబ్బాయిలా కనిపిస్తుంది. ‘ఒకసారి ఒక వ్యక్తి ఆటో ఆపి, నాకు ఆటో డ్రైవింగ్ చేయడానికి ఇచ్చినందుకు మా నాన్నను తిట్టాడు. నా లైసెన్స్ వారికి చూపించాల్సి వచ్చింది’ అని నవ్వుతూ చెబుతుంది అలీషా. తన సోదరుడి ఖాకీ చొక్కాను యూనిఫామ్గా మార్చుకుంది. తెలియని వ్యక్తులు ఎవరైనా సరే వారితో మాటలకు దూరంగా ఉంటుంది.చదువుకు అంతరాయం... అలీషా రోజూ తన ఇల్లు మంజుమ్మెల్ నుండి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలియం వరకు సైకిల్పై వెళ్లి, చదువుకునేది. రోజూ ఈ ప్రయాణం చేయలేక స్కూల్కు రెగ్యులర్గా వెళ్లలేకపోయేది. దీంతో పదవ తరగతితోనే చదువు ఆగిపోయింది. ఓ ప్రైవేట్ కాలేజీలో పన్నెండవ తరగతి వరకు చదివింది. ఫ్యాషన్ టెక్నాలజీలో డిప్లొమా పూర్తిచేసి, టెక్స్టైల్ వ్యాపారాన్ని నడిపింది. ఇప్పుడు ఈ రంగంలోనే ఇగ్నో ద్వారా బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తోంది.గుర్తించిన ప్రభుత్వం... కేరళ సవారీ యాప్ బ్రాండ్ అంబాసిడర్గా ప్రభుత్వం ఆమెకు ఒక జ్ఞాపికను బహూకరించింది. మంజుమ్మెల్ గర్ల్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా కొంత ఆదాయాన్ని పొందుతోంది. తన ఆటోకు కూడా అదే పేరు పెట్టుకుంది. ఆమె సోదరుడు జాషువా తన తండ్రి ప్రమాదం తర్వాత బెంగళూరులో తన చదువును వదిలేసి క్లీనింగ్ కంపెనీని నడుపుతున్నాడు. ఇప్పుడు తల్లిదండ్రులిద్దరూ కోలుకోవడంతో కుటుంబం కొత్త వెంచర్ కోసం ప్లాన్ చేస్తోంది. పద్దెనిమిదేళ్ల వయసులో అలీషా తన తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవడానికి, అప్పులను తీర్చడానికి సొంత జీవితాన్ని సరిదిద్దుకోవడానికి ఒక మార్గాన్ని వెతుక్కుంది. విదేశాలలో భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటోంది. -
పెళ్లి రోజు: మాజీ మంత్రి ఆర్కే రోజా ఇంట్రస్టింగ్ పోస్ట్
మాజీ మంత్రి, వైసీపీనేత ఆర్కే రోజా (R K Roja) తమ వివాహ వార్షికోత్సవం సందర్బంగా విశాఖ పట్టణంలోని సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. భర్త రోజా ఆర్కే సెల్వమణి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా తన వివాహ బంధంపై సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ను షేర్ చేశారు. రోజా ఇన్స్టా పోస్ట్ ❝మణి ఎదలో…రోజా పూదోట…అదే నింగి, అదే నేల…అదే దివి, అదే భువి…అదే నీరు, అదే గాలి…నింగిలో మార్పు, నేలలో మార్పు జరిగినా...పంచభూతాల సాక్షిగా,మనువాడిన మణి నీఎదమది తోటలో ప్రతీ రోజూవికసించే రోజానైనీ వెంట…నీ జంటగానిలిచాను...!!మన 34 ఏళ్ళ ప్రయాణంనా జీవితానికి అందమైన కానుక...ప్రతీ క్షణం తోడుగా, బలంగా,ప్రేమగా నన్ను నిలిపినమీకెప్పటికీ రుణపడిఉంటాను..❜దీంతో వైసీపీ శ్రేణులు, అభిమానులు ఈ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఆగస్టు 21న రోజా, దర్శకుడు సెల్వమణి వివాహం జరిగింది. వీరికి ఇరువురు సంతానం, ఒక కొడుకు, ఒక కూతురు.ఇదీ చదవండి: ప్రాజెక్టులు తగ్గినా, క్వాలిటీ తగ్గలేదు : గ్రాజియా కవర్పేజీపై మెరిసిన సమంత -
డిజైన్ డెమోక్రసీ..!
ఆర్కిటెక్చర్, ఇంటీరియర్స్ ఉత్పత్తులకు సంబంధించిన పాపులర్ ప్రదర్శన డిజైన్ డెమోక్రసీ వచ్చేనెల 5న నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనుంది. బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన ఓ సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించిన నిర్వాహకులు ఎక్స్పో వివరాలను వెల్లడించారు. ఇందులో 120కి పైగా ప్రముఖ బ్రాండ్లు, 80పైగా పేరొందిన స్పీకర్లు పాల్గొంటారని, 15 వేలకుపైగా సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. 3 రోజుల ప్రదర్శనలో చర్చలు, ఆవిష్కరణలు.. వంటివి ఉంటాయన్నారు. ఫర్నిచర్, లైటింగ్, ఫ్లోరింగ్, గృహోపకరణాలు, వంటగది, బాత్, డెకర్ ఉపకరణాలు ఫైన్ఆర్ట్, క్రాఫ్ట్ వంటి వాటి ఎంపికలో నగర వినియోగదారుల అభిరుచులను కొత్తస్థాయికి ఇవి చేరుస్తాయన్నారు. సమావేశంలో సహ వ్యవస్థాపకులు శైలజా పట్వావరీ, మల్లికా శ్రీవాస్తవ్, క్యూరేటర్ అర్జున్ రతి పాల్గొని మాట్లాడారు.విద్యార్థి ప్రతిభ..ఎఫ్డీడీఐ–హైదరాబాద్ విద్యార్థులు చదువుతోపాటు తమ సృజనాత్మకతకు పదును పెడుతూ వినూత్న ఆలోచనలతో వివిధ వస్తువుల తయారీకి శ్రీకారం చుడుతున్నారు. తాజాగా ఎఫ్డీడీఐలోని ఎల్ఎల్పీడీకి చెందిన ద్వితీయ సంవత్సరం విద్యార్థి జీవా ప్రోటోటైప్ ఉత్పత్తిగా కుట్టులేని నాణెం పౌచ్కు రూపకల్పన చేశారు. రావి(పీపాల్) ఆకు రూపం, ఆకృతి నుంచి ప్రేరణ పొంది ఆకుపచ్చ రంగులో కృత్రిమ తోలు, గుండు సూది, షూలేస్ను ఉపయోగించి కుట్లు లేకుండా ఈ పౌచ్ను తయారు చేశాడు. జీవాను ఎఫ్డీడీఐ –హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ తేజ్లోహిత్రెడ్డి, ఫ్యాకల్టీ ప్రతినిధులు వేణుగోపాల్, గోఫ్రాన్, రుచిసింగ్, హుస్సేన్, రాంబాబు అభినందించారు. – రాయదుర్గం (చదవండి: నయా ట్రెండ్.. గణేశుడికి గ్రాండ్ వెల్కమ్!) -
నయా ట్రెండ్.. గణేశుడికి గ్రాండ్ వెల్కమ్!
హైదరాబాద్ నగరంలో ప్రతీ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించే గణేష్ పండగ సందడి మొదలైంది. ఇందులో భాగంగా నగరవ్యాప్తంగా గణేష్ మండపాలను నిర్మిస్తున్నారు. మరోవైపు నిర్వాహకులు భారీ గణనాథులను ఆగమనం పేరుతో గ్రాండ్గా మండపాలకు తీసుకొస్తున్నారు. వినాయక నిమజ్జనానికి భారీ ఉత్సాహంతో బ్యాండ్ బాజాతో వెళ్లడం విధితమే. అయితే ఈసారి నగరంలో మండపాలకు వినాయకులకు గ్రాండ్ వెల్కమ్ పలుకుతున్నారు. ఈ కొత్త సంస్కృతి నగరంలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఇందులో భాగంగా మూసారాంబాగ్ జేజీవైఏ అసోసియేషన్ నిర్వాహకులు 22 ఫీట్ల భారీ గణేష్ విగ్రహాన్ని గ్రాండ్ సెలబ్రేషన్స్తో మండపానికి తరలించారు. గణేశుడి రాక, గణేశోత్సవ వేడుకలలో మహారాష్ట్ర బ్యాండ్ ఆట పాటలు, కలర్ఫుల్ ఫైర్ క్రాకర్స్ కాలుస్తూ ఆగమన కార్యక్రమం నిర్వహించారు. గణేష్ నిమజ్జనం కాకుండా, ఆగమనం కార్యక్రమాలను భారీ సెటప్స్తో మండపాలకు తీసుకొస్తున్న ట్రెండ్ అందరినీ ఆకట్టుకుంది.(చదవండి: Fake Wedding: పెళ్లి థీమ్..పార్టీ జూమ్..! ఇది పెళ్లిళ్లకు పేరడి..) -
పెళ్లి థీమ్..పార్టీ జూమ్..
మిరుమిట్లు గొలిపే లైట్లు, మెరిసే డిజైనర్ దుస్తులు, చెవుల్లో హోరెత్తించే మ్యూజిక్, నోరూరించే ఆహారం.. ఉత్సాహభరిత వాతావరణం.. ప్రతిదీ విలాసమే, విశేషమే.. వేదికను చూడగానే చెప్పేయవచ్చు అది ఖరీదైన వివాహ వేడుక అని. అవును నిజమే.. అక్కడ పెళ్లి జరుగుతున్న ఆనవాళ్లన్నీ ఉన్నాయి కానీ.. అగ్నిగుండాలు, వధూవరులు మాత్రం లేరు. బంధువులు లేరు, కన్నీటి వీడ్కోలు లేవు. అదేమిటి? అంటే అదే ఫేక్ వెడ్డింగ్ థీమ్. ఇప్పుడు హైదరాబాద్ సిటీ పార్టీలను సరికొత్తగా మారుస్తున్న ట్రెండ్. హోటళ్లు, క్లబ్బులు ఈవెంట్ కంపెనీలు వరుసగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్న ఈ ఈవెంట్లు పూర్తిగా వినోదం కోసం రూపుదిద్దుతున్నారు. ఎటువంటి ఒత్తిడి, ఆచారాలు లేదా బాధ్యతలు లేకుండా వివాహ విందుకు సంబంధించిన పూర్తి అనుభవాన్ని అందిస్తాయివి. సింపుల్గా చెప్పాలంటే, ఇది వివాహ నేపథ్య నైట్ పార్టీ. వెస్ట్రన్ నుంచి వెల్కమ్.. కొన్ని నెలలుగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో మోడల్ పెళ్లిళ్లు సందడి చేస్తున్నాయి. నగరంలో మాత్రం ఇటీవలే ప్రవేశించాయి. ఈ పార్టీలకు స్నేహితులతో కలిసి హాజరైన వారు, సంప్రదాయ భారతీయ వివాహ వేడుకల్లోని అనేక భాగాలను నాటకీయతతో మేళవించి విందు వినోదం ఆస్వాదిస్తారు. ‘సిటీలో ఫేక్ వెడ్డింగ్లో భాగంగా ఒక ఖరీదైన క్లబ్లో సంగీత్ నిర్వహించారు. అక్కడ వాతావరణం ఉల్లాసంగా ఉంది. సీక్విన్డ్ చీరలు లెహంగాలు (పొడవాటి స్కర్టులు బ్లౌజులు) ధరించిన మహిళలు, టైలర్డ్ కుర్తాలు జాకెట్లలో పురుషులు కనిపించారు. ఒక సంప్రదాయ ధోల్ డ్రమ్మర్ జనాన్ని డ్యాన్స్ ఫ్లోర్కు నడిపించాడు..’ అంటూ ఈ కార్యక్రమానికి హాజరైన శివాంగి దీనిని ఓ ఆసక్తికర పార్టీగా అభివర్ణించారు. ‘సంప్రదాయ వివాహాలలో ఒత్తిడి ఉంటుంది. దుస్తులు ధరించడం చుట్టూ నియమాలు, బంధువుల ఆక్షేపణలు, కానీ ఇక్కడ అవేవీ ఉండవు.. సో సరదాగా ఉంటుంది.’ అని ఆమె చెప్పారు.రూ.1500తో పెళ్లిలోకి ఎంట్రీ.. ఈ పార్టీ టిక్కెట్ ధరలు సాధారణంగా దాదాపు రూ.1,500 నుంచి ప్రారంభమవుతాయి. సౌకర్యాలను బట్టి రూ.15 వేలు లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు. శివాంగి ఆమె స్నేహితులు హాజరు కావడానికి ప్రతి జంటకు రూ.10 వేలు చెల్లించారు. ‘నెలకు ఒకసారి ఆ మాత్రం ఖర్చు చేయడానికి నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే.. ఈ అనుభవం అంతకు మించి విలువైనది.‘ అంటున్నారామె. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రెస్టారెంట్ యజమాని శరద్ మాట్లాడుతూ.. కొత్త కొత్త అనుభవాలను అతిథులకు అందివ్వడం ఆతిథ్య రంగంలో కీలకమన్నారు. విదేశాల్లో మనోళ్లే.. క్లాప్ కొట్టారుగత నెలలో బెంగళూరులో 2,000 మంది హాజరైన ఫేక్ వివాహ విందుకు ఆతిథ్యం ఇచ్చిన 8 క్లబ్ ఈవెంట్స్ సహ వ్యవస్థాపకుడు కౌశల్ చనాని, నకిలీ వివాహ వేడుకలకు ప్రేరణ విదేశాలలో నివసిస్తున్న యువ భారతీయుల నుంచి వచ్చిందని చెప్పారు. వారు అక్కడ ఉండి మన పెళ్లిళ్లు మిస్ అవుతున్నారు. అదే వీటిని డిజైన్ చేయించింది అన్నారాయన. ‘అన్ని పారీ్టల్లాగే ఇక్కడా జన సమూహం ఉంటుంది. వారంతా బాలీవుడ్ సంగీతానికి నృత్యం చేస్తారు.. సంప్రదాయ దుస్తులు ధరిస్తారు.. సరికొత్త సాయంత్రాన్ని ఆనందిస్తారు’అని ఆయన అన్నారు. ట్రెండీగా మారింది.. ఫేక్ వెడ్డింగ్ పార్టీస్ ఇప్పుడు సిటీలో ఫ్రెష్గా ట్రెండీగా మారాయి. కార్పొరేట్ ఉద్యోగులు, స్టూడెంట్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో పబ్స్, క్లబ్స్లో కూడా ఈ తరహా పార్టీస్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లలో భాగమైన సంగీత్ను పార్టీ పీపుల్ బాగా కోరుకుంటున్నారు. ఒక డీజెగా ఇది నాకు కూడా భిన్నమైన ఎంజాయ్మెంట్ను అందిస్తోంది. – డీజె పీయూష్ పెళ్లి సందడిని రుచి చూపిస్తున్నాం..ఆన్లైన్ ప్లాట్ఫార్మ్ ద్వారా ఆఫ్లైన్ ఈవెంట్స్ డిజైన్ చేసే సంస్థగా అండర్ గ్రౌండ్ ఫెరారి, పూల్ పారీ్ట.. వంటివి నిర్వహిస్తున్నాం. ఈ ఫేక్ వెడ్డింగ్ పారీ్టలు పాశ్చాత్య దేశాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. తరచూ పెళ్లి వేడుకల్ని మిస్ అవుతున్నవారి కోసం వీటిని డిజైన్ చేశారు. ప్రస్తుతం మన దేశంలో కూడా కార్పొరేట్ వర్క్ కల్చర్ వల్ల దగ్గరి బంధువులు, సొంత ఊర్లో పెళ్లిళ్లకు కూడా హాజరు కాలేకపోతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఫేక్ షాదీ కాన్సెప్ట్ను మేం తొలుత బెంగళూర్కి తీసుకొచ్చాం. ఆ తర్వాత ఢిల్లీ, ముంబైలకు తీసుకెళ్లాం. హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది సంప్రదిస్తున్నారు. త్వరలోనే నగరంలో కూడా నిర్వహించే అవకాశం ఉంది. – మాథుర్, సహ వ్యవస్థాపకులు, 8 క్లబ్ ఈవెంట్, బెంగళూర్ (చదవండి: 'పారాచూట్ వెడ్డింగ్ గౌను'..! వెనుక ఇంత అద్భుతమైన లవ్ స్టోరీనా..) -
అభీష్ట... ఐశ్వర్య ప్రదాయిని కోట సత్తెమ్మ: సంతాన వృక్షానికి ఆదరణ
శంఖ చక్రగద అభయ హస్తయజ్ఞోపవీతధారిణిగా ఏకశిలా స్వయంభూ విగ్రహంతో త్రిశక్తి స్వరూపిణిగా వెలిసిన అమ్మవారిని సందర్శించటానికి రెండుకళ్లూ చాలవేమోననిపిస్తుంది. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు పంచముఖ ఆంజనేయస్వామి. అమ్మవారి దర్శనం కోసం ఏటా సుమారు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు వస్తుంటారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తుల సౌకర్యార్ధం ఇక్కడ 65 గదులు ఉన్నాయి. ఆలయానికి ప్రతి ఆది, మంగళవారాలలో భక్తులు విశేషంగా తరలివచ్చి తమ మెక్కుబడులు తీర్చుకుంటారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజు΄ాలెం గ్రామంలో వేంచేసిన శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి దేవస్థానంలో భక్తుల పాలిట కొంగు బంగారం కోట సత్తెమ్మ అమ్మవారు విరజిల్లుతున్నారు. కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లిగా ప్రసిద్ధి చెందింది. శ్రీకోట సత్తెమ్మ అమ్మవారి దేవస్ధానానికి పురాతన చరిత్ర ఉంది. అమ్మవారి విగ్రహం 11వ శతాబ్దంలోని తూర్పు చాళుక్యుల కాలానికి చెందినదని పరిశోధనలు చెబుతున్నాయి. అప్పట్లో నిడదవోలును నిరవధ్యపురంగా పిలిచేవారు. నిరవధ్యపురాన్ని పాలించిన వీరభద్రుని కోటలోని అమ్మవారు శక్తిస్వరూపిణిగా పూజలందుకున్నారు. కాలక్రమేణా కనుమరుగై, 1934లో తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన దేవులపల్లి రామసుబ్బరాయ శాస్త్రి పొలంలో వ్యవసాయ పనుల కోసం పొలం దున్నుతుండగా అమ్మవారి విగ్రహం బయటపడింది. భూమి యజమాని రామమూర్తి శాస్త్రికి వచ్చిన కలను అనుసరించి కోటసత్తెమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆనాటి నుంచి నేటి వరకు భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా, వరాలిచ్చే చల్లని తల్లిగా పేరుగాంచారు. ఈ ఆలయానికి ఎక్కువగా ఉభయగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరం, గుంటూరు, కృష్ణ, జిల్లాల భక్తులు అధికంగా విచ్చేస్తుంటారు. ఆలయంలో ఏటా దసరా ఉత్సవాలతో పాటు అమ్మవారి తిరునాళ్ళను వైభవంగా నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలలో ప్రతి కుటుంబంలోనూ కోటసత్యనారాయణ, కోటసత్తెమ్మ అనే పేర్లు తప్పనిసరిగా పెట్టుకుంటారు. ఏటా శ్రావణమాసంలో చివరి శుక్రవారం నాడు సుమారు 1000 మంది ముతైదువలతో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ వ్రతాలకు నిడదవోలు పట్టణంతోపాటు వివిధ గ్రామాల నుండి మహిళలు తరలిరావడంతో సందడి నెలకొంటుంది. దేవస్ధానం ఆధ్వర్యంలో మహిళలలకు ఉచితంగా పసు పు, కుంకుమ, గాజులు, తమల΄ాకులు, లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు రోజుకి సుమారు 100 మందికి శాశ్వత అన్నదాన ట్రస్టు ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు.సంతాన లక్ష్మీ చెట్టుకు ఊయలు కడుతున్న మహిళా భక్తులు సంతాన వృక్షానికి పెరుగుతున్న భక్తుల తాకిడిశ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి దేవస్థానంలో గర్భాలయానికి నైరుతి వైపున ఉన్న సంతాన వృక్షానికి రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతుంది. సంతానం లేని దంపతులు ఈ వృక్షానికి ఊయల కట్టడం సాంప్రదాయం. సంతానం లేని దంపతులు ఈ వృక్షం దగ్గరకు చేరుకుని ఎర్రటి వస్త్రం, రెండు పూర్తిగా పండిన అరటి పండ్లను అమ్మవారికి సమర్పిస్తారు. అనంతరం ఒక అరటి పండును ఎర్రవస్త్రాన్ని తీసుకుని దంపతులు సంతాన వృక్షానికి ఊయల కట్టి, ఆ ఊయలలో పండును ఉంచి, ‘అమ్మా... పండు కడుతున్నాను పండంటి బిడ్డను ప్రసాదించు తల్లీ’ అంటూ వేడుకుంటారు. బిడ్డ పుట్టిన తరువాత అమ్మవారి సన్నిధికి తీసుకువచ్చి పేరుపెట్టుకోవడంతోపాటు బిడ్డ ఎత్తు నగదు, నాణేల రూపంలో, పటిక బెల్లం కాని తూకం సమర్పించుకుని, మొక్కుబడి తీర్చుకుంటారు.చురుగ్గా సాగుతున్న 9 అంతస్ధుల రాజగోపురం నిర్మాణం ఇదీ చదవండి: ఇండియన్ వయాగ్రా రైస్ తెలుసా? దేశీ వరి ఔషధ గుణాలుఆలయానికి వచ్చే మార్గం...అమ్మవారి ఆలయానికి నిడదవోలు రైల్వేస్టేషన్ నుండి బస్టాండ్ మీదుగా గణపతిసెంటర్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో చేరుకోవచ్చు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుండి 26 కిలో మీటర్లు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుండి 25 కిలో మీటర్ల దూరం ప్రయాణించి ఆలయానికి చేరుకోవచ్చు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ముందుగా నిడదవోలు పట్టణం చేరుకోవాలి. అక్కడ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో అమ్మవారి ఆలయానికి చేరుకోవచ్చును. ఇదీ చదవండి: ప్రాజెక్టులు తగ్గినా, క్వాలిటీ తగ్గలేదు : గ్రాజియా కవర్పేజీపై మెరిసిన సమంత -
దాన వీర శూర... మిస్టర్ బీస్ట్
అమెరికన్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్, వీర శూర సాహస వైరల్ స్టంట్స్ ద్వారా మాత్రమే కాదు దాతృత్వ కార్యక్రమాల ద్వారా కూడా ప్రసిద్ధి పొందాడు. తాజాగా... పదిహేను గంటల నలభై నిమిషాల΄ాటు మారథాన్ లైవ్స్ట్రీమ్ చేసి రికార్డ్ సృష్టించాడు. మారథాన్ లైవ్స్ట్రీమ్ ముగిసే సమయానికి వందకోట్లు సేకరించాడు. ఈ నిధులను ‘టీమ్వాటర్’ అనే స్వచ్ఛంద సంస్థ కోసం ఉపయోగిస్తారు. సురక్షితమైన తాగునీటి కోసం పనిచేస్తోంది టీమ్ వాటర్. లైవ్స్ట్రీమ్ ద్వారా అధిక నిధులు సేకరించిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో చోటుసాధించాడు మిస్టర్ బీస్ట్. ‘ఈ స్ట్రీమ్ ద్వారా ఎంతోమంది జీవితాలు మారుతాయి’ అని తన ఆనందాన్ని పంచుకున్నాడు. ‘మిస్టర్ బీస్ట్’గా సుపరిచితుడైన జేమ్స్ జిమ్మీ డోనల్డ్సన్ ప్రపంచంలోని యూట్యూబర్లలో అగ్రగామి. ఈ మోస్ట్ పాపులర్ యూట్యూబర్కు ప్రపంచవ్యాప్తంగా 422 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. ‘ఫోర్బ్స్’ జాబితాలో చోటు సాధించిన ఈ సంపన్నుడికి యూట్యూబ్ స్ట్రీమింగ్ షోలతో పాటు ఫాస్ట్ఫుడ్ చైన్లు కూడా ఆదాయ మార్గాలు. ‘రింగ్మాస్టర్ ఆఫ్ స్టంట్స్ అండ్ ఛాలెంజెస్’ అని ఈ సోషల్ మీడియా మెగా స్టార్ను ఆకాశానికెత్తింది ఫోర్బ్స్. ‘థ్రెడ్’లో ఒక మిలియన్ ఫాలోవర్స్ను సాధించిన తొలి వ్యక్తిగా కూడా తన ప్రత్యేకతను నిలుపుకున్నాడు మిస్టర్ బీస్ట్. (చదవండి: సలాం సఫురా..! నెటిజన్ల మనసు గెలుచుకున్న మహిళా డ్రైవర్..) -
పూనకాలు నిజమేనా?
నాకో సందేహం ఉంది డాక్టరు గారూ... గత 6 నెలలనుంచి మా ఇంటి పక్కన ఉండే ఆవిడకి దేవత పూనుతోంది. ఆ సమయంలో ఆమెకి అమ్మవారు పూని భవిష్యత్తు చెప్పడం, అలాగే ఇతరుల సమస్యలకి సమాధానం / పరిష్కారాలు చెబుతుంది. వారంలో 3 రోజులు ఇలా జరుగుతుంది. దాంతో మా ్ర΄ాంతం అంతా ఒక జాతరలా తయారైంది. ఆమెను అడిగితే తనకి ఏమీ గుర్తులేదు అని చెప్తుంది. వారంలో మిగిలిన రోజులు మామూలుగానే ఉంటుంది. భర్త తాగుబోతు, పిల్లలు ఏమీ పనిచేయరు. ఈమే కూలి పని చేసి వాళ్ళని పోషించాలి. భర్త తాగివచ్చి ప్రతిరోజు హింసించేవాడు. ఎప్పటినుంచి ఆమెకు పూనడం మొదలైందో, అప్పటినుండి అతను తాగడం మానేసి పనికి వెళ్తున్నాడు. పిల్లలు ఆమె మాట వింటున్నారు. భక్తులు ఇచ్చే కానుకలతో వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా కాస్త మెరుగైంది. అసలు పూనకాలనేవి నిజంగా ఉంటాయా? లేక ఆవిడ కావాలనే ఇలా చేస్తోందా? చాలా సందర్భాలలో పూనకాల గురించి విన్నాను కానీ ప్రత్యక్షంగా చూడటం ఇదే. దయచేసి నా సందేహాలకు సమాధానం చెప్పగలరు. – తిరుపతి, వరంగల్ ఎవరైనా ఒక వ్యక్తి విపరీతమైన ఒత్తిడికి, దీర్ఘకాలంగా అణిచివేతకు గురైనపుడు, లేదా మనసులో ఏదైనా తీరని కోర్కెలు, ఆలోచనలు ఉన్నప్పుడు. వారికి తెలియకుండానే ఇలా ఒక వేరే వ్యక్తిలా లేదా దేవత పూనినట్లు ప్రవర్తించే అవకాశం ఉంది. దీన్ని వైద్య పరిభాషలో ‘డిసోసియేటివ్ ట్రాన్స్‘ లేదా ΄పొసెషన్ స్టేట్‘ అంటారు. ఇలాంటి స్థితిలో ఆ వ్యక్తులు ఎలాంటి భయాలూ, ఒత్తిళ్లూ లేకుండా ఫ్రీగా మాట్లాడగలుగుతారు. ఆత్మన్యూనతా భావం ఉండే వారిలో కూడా, ఈ ‘΄పొసెషన్ స్టేట్’ ఎక్కువగా కనబడుతుంది. అయితే కొంతమంది తమ స్వార్థం లేదా లాభాపేక్ష కోసం, ఇలా పూనకం వచ్చినట్లు నటించొచ్చు, అయితే వాటిని ’ట్రాన్స్ స్టేట్’ కింద పరిగణించలేము. అలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇదీ చదవండి: ఇండియన్ వయాగ్రా రైస్ తెలుసా? దేశీ వరి ఔషధ గుణాలుమన సమాజంలో ఇలా దేవుడు ఆవహించిన వారిని ప్రత్యేకంగా గౌరవిస్తారు. హారతులు ఇవ్వడం, కొబ్బరి కాయలు కొట్టడం, దండలు వేయడం వంటి వాటితో వారిని ప్రత్యేకంగా కూడా చూస్తారు. దీనివల్ల ఆ వ్యక్తికి కొంతయినా ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వారిలో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అణిచివేతకు గురయిన వాళ్ళలో ఒక పవర్ వచ్చిన భావన కూడా కలుగుతుంది. ఎక్కువగా స్త్రీలు ఇలాంటి ఇబ్బందులకు గురవుతారు, ఓర్పు, సహనం వంటి వాటిని కూడా స్త్రీలలో ఎక్కువగా చూస్తుంటాము. రోజు తాగి వచ్చి కొట్టే ఆమె భర్త ఇప్పుడు ఆమెలోని దేవతకి, భక్తితోను, భయంతోనూ గౌరవిస్తూ మారాడు. పిల్లలు మారి తన మాట వింటున్నారు. నిజానికి ప్రతి స్త్రీ ఒక శక్తి స్వరూపిణి, సమాజంలో, కుటుంబంలో ఆమెకు గౌరవం స్థానం కల్పిస్తే వారిలో వచ్చే అనేక మానసిక సమస్యలను నివారించవచ్చు: మీ పక్కింటావిడకి దేవత రావడం వల్ల ఏదైనా ఇబ్బందిగా అన్పించినా, లేదా తన ఇష్టానికి వ్యతిరేకంగా పూనకం వచ్చినా వారు పరీక్షించి డిప్రెషన్ లేదా ఇతర మానసిక సమస్యలు ఏదైనా ఉండి ఆమెకి సహాయం కావాలని అన్పించినా వెంటనే సైకియాట్రిస్ట్ని కలిస్తే కౌన్సెలింగ్, తగిన చికిత్స అందిస్తారు. ఆల్ ది బెస్ట్డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.(మీ సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకి మెయిల్ చేయవచ్చు) -
బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహనే ఔషధం
బ్రెస్ట్ క్యాన్సర్... అంతర్జాతీయ స్థాయిలో మహిళల ఆరోగ్యానికి పెనుముప్పుగా మారిన మహమ్మారి. రొమ్ము క్యాన్సర్పైన ప్రతి ఒక్కరికీ అవగాహన పెరగాల్సిన అవసరముంది. ఈ నేపథ్యంలో సుధారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో రొమ్ము క్యాన్సర్పైన అవగాహన కల్పించడానికి సెప్టెంబర్ 28న పింక్ పవర్ రన్ 2.0ను నిర్వహిస్తున్నారు. కిందటేడాది మొదటిసారిగా నిర్వహించిన ఈ రన్ అంతర్జాతీయంగా అవగాహన కల్పించడంతో గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సైతం సొంతం చేసుకుంది. ఈ యేడాది నిర్వహించే పవర్ రన్కు సంబంధించిన ప్రారంభ కార్యక్రమాన్ని సంస్థ వ్యవస్థాపకులు సుధారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్రైడెంట్ వేదికగా నిర్వహించి, రన్ కు సంబంధించిన టీషర్ట్ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ – 2025 విజేత ఓపల్ సుచాత, మిస్ ఏషియా– 2025 క్రిష్ణా గ్రావిడెజ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ అవగాహనకు మరింత శక్తిని జోడించారు. ఓపల్ సుచాత క్యాన్సర్ సర్వైవర్ కావడం, అంతర్జాతీయ స్థాయిలో తన సొంత ప్రాజెక్టులో భాగంగా బ్రెస్ట్ క్యాన్సర్పైన అవగాహన కల్పించడం విశేషం. ఈ కార్యక్రమం సందర్భంగా వీరు ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ...ఇదొక ఉద్యమంమొదటి ఎడిషన్ అందించిన ప్రోత్సాహంతో 2 ఎడిషన్ పింక్ పవర్రన్ 2.0ను మరింత భారీ స్థాయిలో నిర్వహిస్తున్నాం. ఇది మారథాన్ రన్ మాత్రమే కాదు.. ఇదొక ఉద్యమం. మహిళల స్వీయ సంరక్షణ, ముందస్తు జాగ్రత్త, బ్రెస్క్యాన్సర్పై అవగాహన పొందడానికి అంతర్జాతీయ వేదిక. ఈ రన్ లో గ్లోబల్ రన్నర్స్, ప్రముఖ స్ఫూర్తిదాయక మహిళలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే మహిళలు పాల్గొంటున్నారు. రొమ్ము క్యాన్సర్ బారిన పడిన మహిళల అవస్థలు మాటల్లో వర్ణించలేం. అలాంటి వారికి మద్దతుగా నిలవడానికి సీఎస్ఆర్ బాధ్యతగా మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10కే, 5కే, 3కే విభాగాల్లో రన్ నిర్వహిస్తున్నాం.దీనికి మెయిల్ ఫౌండేషన్ భాగస్వామిగా మద్దతును అందిస్తోంది. మా ప్రయత్నానికి సమాజంలోని అన్నివర్గాల నుంచి ప్రోత్సాహం లభిస్తోంది. కిందటేడాది 18 ఏళ్ల నుంచి 89 ఏళ్ల మహిళల వరకు ఈ రన్లో పాల్గొనడం సంతోషాన్నిచ్చింది. ఇందులో పాల్గొనే వారికి ఉచిత ట్రాన్స్ పోర్ట్, రిజిస్ట్రేషన్ కల్పిస్తున్నాం. అంతేకాదు, వారికి మారథాన్ టెక్నిక్స్, బ్రీతింగ్ కంట్రోల్పై శిక్షణా అందిస్తున్నాం. పింక్ పవర్ రన్ 2.0 కోసం దాదాపు 150 మంది 6 నెలలుగా విశేష కృషి చేస్తున్నారు. రన్నింగ్ ఈవెంట్ రోజు ఎమర్జెన్సీ మెడికల్ సేవలూ అందుబాటులో ఉంటాయి.సోషల్ మీడియా వేదికగా టోల్ ఫ్రీ నంబర్లను సైతం అందుబాటులో ఉంచాం. మా ప్రయత్నానికి మద్దతుగా మిస్ వరల్డ్ విన్నర్ ఓపల్ సుచాత ముందుకు రావడం అభినందనీయం. తన ప్రయాణం ఈ తరానికి స్పూర్తి. ఈ వేదిక పైన ప్రముఖ బ్రెస్ట్ క్యాన్సర్ ఆంకాలజిస్ట్ డా.ప్రఙ్ఞ చిగురుపాటి పాల్గొని ముందస్తుగా రొమ్ము కేన్సర్ గుర్తించడం ప్రాముఖ్యతను తెలియజేయడం మా అందరిలో స్పూర్తి నింపింది.ప్రతి మహిళ ఈ మహమ్మారిని గుర్తించే మామోగ్రామ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం క్యాన్సర్ డిటెక్టింగ్ మొబైల్ బస్సులు సైతం అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలు వినియోగించుకోవాలి. నా ఈ ప్రయాణంలో నా భర్త మేఘా క్రిష్ణారెడ్డి, నా పిల్లలు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది. – సుధారెడ్డి, సుధారెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలుతమను తాము సంరక్షించుకోవడం అవసరంప్రపంచసుందరిగా నేను గుర్తింపు పొందింది ఈ నేలపైనే. మళ్లీ ఇదే నేలపైన రొమ్ము క్యాన్సర్ పైన అవగాహన కల్పించే మహోన్నత కార్యక్రమంలో భాగం కావడం సంతోషంగా ఉంది. ఇక్కడికి రావడం నా మరో ఇంటికి వచ్చినట్టే ఉంది. నా దేశంలో థాయ్లాండ్ లేదా భారత్లోనో కాదు యావత్ ప్రపంచమంతా ఈ రొమ్ము క్యాన్సర్ పెనుప్రమాదంగా మారుతోంది. 16 ఏళ్ల వయస్సులో నేనూ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన వ్యక్తినే. కానీ దానిని జయించి ఇప్పుడు ప్రపంచం ముందు మిస్ వరల్డ్గా నిలవగలిగాను. ఆ అవస్థలు, మానసిక వేదన ప్రస్తుత జీవితాన్ని ఎలా గడపాలో నేర్పింది.దీనిపైన అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. కుటుంబానికి, సమాజానికి జీవితాన్నే త్యాగం చేసే మహిళలకు తమను తాము సంరక్షించుకోవడం కూడా చాలా అవసరం. ముందస్తుగా దీనిని గుర్తించగలిగితే బయటపడగలమని చాలామంది మహిళలకు తెలియదు. ఈ వ్యాధి చూట్టూ ఎన్నో భయాలను పెంచుకున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ పైన అవగాహన కల్పించడం కోసం నేను మొదలు పెట్టిన ప్రాజెక్ట్లో భాగంగా థాయ్లాండ్లో మొదటి సారి కలిసిన ఒక మహిళ నాకెంతో స్ఫూర్తిని నింపింది. ఆమె నా కథను స్పూర్తిగా తీసుకున్నాను అని చెప్పడం ఎప్పటికీ మర్చి పోలేను.ఆత్మస్థైర్యంతో నెవర్ గివప్ అంటూ ఆమె క్యాన్సర్ను జయించి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉంది. మరొకరు నా అభిమాని తల్లి.. ఆమెకు గతంలో రొమ్ము క్యాన్సర్ వచ్చి నయమై కొన్నేళ్ల తరువాత మళ్లీ వచ్చింది. తానొక టీచర్... అందరి భవిష్యత్లు తీర్చిదిద్దిన ఆమె తన భవిష్యత్ ఏమవుతుందో అని భయపడలేదు. చికిత్స తీసుకునే పరిస్థిలేని రోజులను దాటుకుని ఇప్పుడు క్యాన్సర్ను జయించి ఆరోగ్యంగా ఉంది. చాలాసార్లు నా మాటలతో మానసిక తోడ్పాటునందించాను. తనను కలిసి మాట్లాడిన ప్రతిసారీ నాలో ఓ కొత్త స్ఫూర్తి నింపుకుంటున్నాను. మహిళలెవ్వరూ ఈ రొమ్ము క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోకుండా అవగాహన పెంచాల్సిన బాధ్యతను స్వచ్ఛందంగా స్వీకరించాను. – ఓపల్ సుచాత, మిస్ వరల్డ్– 2025మార్పు రావాలిప్రపంచంలోని ఏ మహిళా మొదటగా తనకు తాను ప్రాధాన్యతనిచ్చుకోదు. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో మార్పు రావాలి. 40 ఏళ్లు దాటిన ప్రతి మహిళా ప్రాథమిక పరీక్ష చేసుకోవాలి. దీనికి సంబంధించిన టెక్నిక్స్ తెలుసుకోవాలి. అంతర్జాతీయంగా ప్రభావితం చేసే బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు జరుగుతుండటం అభినందనీయం. ఇలాంటి ప్రయత్నంలో ప్రతి సెలిబ్రెటీ పాల్గొనాల్సిన అవసరం ఉంది. –క్రిష్ణా గ్రావిడెజ్, మిస్ ఏషియా– 2025 -
షకీరా పాటకు చీరతో డాన్స్.. భలే చేసింది!
టాలెంట్ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు. ప్రతిభ ఉండాలే గానీ ప్రపంచమంతా మనవైపు చూసేలా చేసుకోవచ్చు. టాలెంట్ ఉన్నా ఎక్కడ, ఎలా ప్రదర్శించాలనే మీమాంస ఇదివరటి రోజుల్లో ఉండేది. ఇప్పుడా సంశయం అక్కర్లేదు. సోషల్ మీడియా వేదికగా సామాన్యులు సైతం తమ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. తమ టాలెంట్తో జనాన్ని ఆకట్టుకున్న వారు సెలబ్రిటీలుగా, ఇన్ఫ్లుయెన్సర్లుగా మారుతున్నారు. కంటెంట్ (Content) బాగుంటే చాలు జనం ఆదరిస్తున్నారు.తాజాగా రాజస్థాన్లోని జోధ్పూర్కు చెందిన కాంచన్ అగర్వత్ అనే మహిళ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రాతో సహా ఎంతో మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియో క్లిప్కు ఇప్పటివరకు 3.8 మిలియన్లకు పైగా వ్యూస్, దాదాపు 2 లక్షల లైకులు వచ్చాయి.వీడియోలో ఏముందంటే..?కొలంబియా పాప్ సింగర్ షకీరా 2006 గ్లోబల్ హిట్ సాంగ్కు కాంచన్ అగర్వత్ చేసిన స్టెప్పులు వీక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సంప్రదాయ చీర కట్టుతో పాప్ సాంగ్కు తనదైన శైలిలో డాన్స్ (Dance) చేశారామె. చీర, ఘున్ఘాట్ను బ్యాలెన్స్ చేస్తూ.. షకీరా సిగ్నేచర్ హుక్ స్టెప్లను చూడముచ్చటగా ప్రదర్శించడంతో వీక్షకులు ఫిదా అవుతున్నారు.చదవండి: రిసెప్షన్లో డాన్స్ చేస్తూ ప్రాణాలు వదిలిన మహిళనెటిజనుల ప్రశంసలుకాంచన్ అగర్వత్ డాన్స్పై నెటిజనులు (Netizens) ప్రశంసలు కురిపించారు. ఆమె నృత్యం చేసే విధానం ఎంతో పద్ధతిగా ఉందని, డాన్స్తో పాటు చీరను బ్యాలెన్స్ చేసిన తీరు బాగుందని నెటిజనులు పొగిడారు. 'అలసటగా ఉన్నప్పుడు ఈ రీల్ చూశాను. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పటికే చాలాసార్లు చూశాన'ని ఒక నెటిజన్ వెల్లడించారు. View this post on Instagram A post shared by Kanchan Agrawat (@kanchan_agrawat) -
ఇంట్రస్టింగ్ అండ్ అమేజింగ్ టిప్స్ ..ఈజీగా!
వంటగదిని ఎంత శుభ్రం చేసినా ఎక్కడో ఒక మూల ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. సులభంగా శుభ్రం ఒకటే కాదు, ఈజీగా తెగేలా కత్తులను పదునుగా ఉంచుకోవడం, చాలా సులువుగా స్టవ్ను శుభ్రం చేసుకోవడం, ఈజీగా వంట చేయడం ఇవన్నీ పెద్ద టాస్క్లే. అందుకే ఇవాల్టీ టిప్ ఆఫ్ ది డేలో భాగంగా కొన్ని కిచెన్ టిప్స్ గురించి తెలుసుకుందాం. వంటగదిలో స్టవ్ మీద పాలుపొంగినా, సాంబారు లాంటి చిందిన వాటిని వెంటనే శుభ్రం చేసుకోవాలి. ముందే కూరగాలను కోయడం ద్వారా వంట కోసం సిద్ధం చేసుకుంటే వంట తొందరగా అవుతుంది. అలాగే చాకు పదునుగా ఉంటే కూరగాయలు కోయడానికి ఆసక్తిగా ఉంటుంది. ఎలక్ట్రిక్ లేదా మాన్యువల్ షార్పనర్లు సులభంగా చాకులను పదును పెట్టుకోవచ్చు. సానరాయిని ఉపయోగించి చాకును పదును చేయవచ్చు. ఇంట్లో సెరామిక్ కప్పు ఉంటే, దాని అంచుపై చాకును రుద్దడం ద్వారా కూడా పదును చేయవచ్చు. తడి చాకులనేఅలాగే వదిలేస్తే తుప్పు పట్టే అవకాశం ఉంది, కాబట్టి వాడిన వెంటనే కడిగి, తువ్వాలు లేదా పేపర్ టవల్ తో తుడిచి పొడిగా ఉంచండి. కూరగాయలు లేదా ఇతర ఆహార పదార్థాలను తయారుచేసేటప్పుడు చెత్త వేయడం కోసం కౌంటర్లో ఒక గిన్నె ఉంచుకుంటే శుభ్రం చేసుకోవడం ఈజీ అవుతుంది. మరికొన్నిబీట్రూట్ హల్వా చేసేటప్పుడు ముందుగా బీట్రూట్ను పాలలో ఉడికించుకుంటే మంచి రుచి వస్తుంది.దోసెపిండి త్వరగా పులియాలంటే కొంచెం కొబ్బరినీళ్లు కలపాలి.టొమాటోలు త్వరగా ఉడకాలంటే... ఉడికించేటప్పుడు చెంచాడు చక్కెర వేయాలి.కాకరకాయ వండేటప్పుడు రెండు పచ్చిమామిడి ముక్కలు వేస్తే చేదు లేకుండా ఉంటుంది.చపాతీ పిండిలో కాసింత ఉడికించిన బంగాళదుంప ముద్దను కలిపితే చపాతీలు మృదువుగా, రుచిగా ఉంటాయి.వంటగది దుర్వాసన.. వేస్తుంటే కమలాపండు తొక్కల్ని, లవంగాలతో కలిపి నీటిలో ఉడికిస్తే ఆ దుర్వాసన పోతుంది. -
జైలు శిక్ష తప్పించుకునేందుకు.. నాలుగేళ్లలో ముగ్గురు పిల్లలు, చివరికి
జైలు శిక్షను తప్పించుకునేందుకు ఒక మహిళ వింత నాటకానికి తెర తీసింది. దేశంలోని చట్టాలను ఉపయోగించుకొని మరీ జైలుకు వెళ్లకుండా తప్పించుకుంది. నాలుగేళ్లలో మూడు సార్లు గర్భం దాల్చిన ఘటన వార్తల్లో నిలిచింది. ఆలస్యంగా అసలు విషయం వెలుగు చూసింది. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) కథనం ప్రకారం 2020లో చెన్ హాంగ్ అనే మారుపేరుతో పిలువబడే మహిళ మోసం కేసులో దోషిగా తేలింది. ఇందుకుగాను ఆమెకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. కానీ జైలు శిక్ష అనుభవించకుండా చైనా చట్టంలో గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు జైలుకెళ్లకుండానే, తాత్కాలికంగా తమ శిక్షను అనుభవించే వెసులుబాటును ఉపయోగించుకుంది. ఇలాంటి ఖైదీలు జైల్లో కాకుండా సాధారణంగా ఇంట్లో లేదా ఆసుపత్రులలో కమ్యూనిటీ దిద్దుబాటు సెంటర్లలో వీరు ఉండవచ్చు. 2020 - 2024 మధ్య, చెన్ ఒకే పురుషుడితో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రతీ సారి జైలుకెళ్లడం వాయిదా పడుతూ వచ్చింది. అయితే చైనీస్ చట్టం ప్రకారం, అటువంటి పరిస్థితులలో దోషులు ప్రతి మూడు నెలలకు వైద్య నివేదికలను సమర్పించాలి . స్థానిక కరెక్షన్ సెంటర్లలో క్రమం తప్పకుండా చెకప్లకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడే చెన్ బండారం బైటపడింది.కానీ మే 2025లో జరిగిన ఒక సాధారణ తనిఖీలో, చెన్ బేబీ కనపించకపోవడంతోపాటు, పిల్లల రిజిస్ట్రేషన్ ఆమె మాజీ భర్త సోదరి పేరుతో నమోదై ఉన్నట్టు గుర్తించారు. అంతేకాదు ఆమె తొలి సంతానం కూడా తన మాజీ భర్తతో నివసిస్తున్నట్లు తేలింది. దీంతో అసలు విషయాన్ని ఒప్పుకుంది చెన్. భర్తకు విడాకులు ఇచ్చి, ముగ్గురు పిల్లలను ఆయనకే ఇచ్చానని ఒప్పుకుంది. జైలు శిక్ష నుండి తప్పించుకోవడానికి ఆమె ఉద్దేశపూర్వకంగా గర్భధారణను ఒక వ్యూహంగా ఉపయోగించుకుందని స్థానిక ప్రొక్యూరేటరేట్ కూడా నిర్ధారించింది. ఇదీ చదవండి: రిసెప్షన్లో డ్యాన్స్ చేస్తూనే ప్రాణాలొదిలేసింది: వైరల్ వీడియోఅయితే ఆమెకు నిర్దేశించిన శిక్షాకాలం ఇక ఏడాది కాలమే మిగిలి ఉండటంతో చెన్ను మిగిలిన కాలానికి నిర్బంధ కేంద్రానికి పంపారు. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట వైరల్ గామారింది. కొందరు నెటిజన్లు ఆమెపై జాలి చూపించగా మరికొందరు ఔరా అంటూ నో రెళ్ల బెట్టారు. తల్లి జైలు నుండి తప్పించు కోవాలనే కోరికతోనే జన్మించిన ముగ్గురు పిల్లలపైనా మరికొందరు జాలి చూపించారు. కోరుకున్నప్పుడు గర్భవతి కావడం నిజంగా షాకే అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: ప్రాజెక్టులు తగ్గినా, క్వాలిటీ తగ్గలేదు : గ్రాజియా కవర్పేజీపై మెరిసిన సమంత -
వీల్ఛైర్కే పరిమితం చేసే అరుదైన రుగ్మత..! కానీ ఇవాళ గిన్నిస్ రికార్డు..
ఆస్తిపాస్తిల్లా కొన్ని వ్యాధులు వంశాపారంపర్యంగా సంక్రమిస్తుంటాయి. మందులతో నయం కానీ ఆ జబ్బులతో సహవాసం నరకం అనే చెప్పాలి. అలాంటి రుగ్మతతో బతకడమే గాక..తనలా బాధుపడుతున్న వారిలో స్థ్యెర్యాన్ని నింపేలా రికార్డు సృష్టించే పనిలో ఉన్నాడు ఈ 31 ఏళ్ల వ్యక్తి.అహ్మదాబాద్లోని వదోదరకు చెందిన సాగర్ బ్రహ్మభట్ మార్షల్ ఆర్ట్స్ అభిమాని. అతడు పట్టుదలతో వీల్ఛైర్కే పరిమితం చేసే వంశాపారంపర్య వ్యాధిపై గెలిచి, సమర్థవంతంగా నిర్వహించి బతకొచ్చని నిరూపించాడు. బ్రహ్మభట్ స్పినోసెరెబెల్లార్ అటాక్సియా(SCA) అనే కండరాలను నాశనం చేసే వ్యాధి బారిన పడ్డాడు. ఈ వ్యాధి అతని తాత, నాన్నను వీల్ఛైర్కే పరిమితం చేసింది. ఇది అతడి కుటుంబంలో వారసత్వంగా వస్తున్న రుగ్మత. అదృష్టవశాత్తు తాను ఆ వ్యాధి బారినపడలేదని సంతోషించేలోపే అటాక్ అయ్యి భయపెట్టింది. అచ్చం తన తండ్రి అనారోగ్యం లాంటి లక్షణాలు సరిగ్గా కోవిడ్ టైంలో మొదలయ్యాయి. అయితే అతడుదాన్ని కొట్టిపరేసి మూడేళ్లు మొండిగా బతికేవాడు. అయితే సరిగ్గా 2023కి సరిగ్గా నడవలేకపోవడం, మాట ముద్దగా రావడం వంటి సమస్యలు రావడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా..స్పినోసెరెబెల్లార్ అటాక్సియా(SCA)నిర్థారణ అయ్యింది. స్పినోసెరెబెల్లార్ అటాక్సియా అంటే..ఇది జన్యు పరివర్తన వల్ల కలిగే రుగ్మత. తల్లిదండ్రుల నుంచి వారి పిల్లలకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి నాడీ కణాలు, ఫైబర్లను బలహీనపరిచి సెరెబెల్లమ్ క్షీణతకు దారితీస్తుంది. ఫలితంగా శరీర విధులపై ప్రభావం చూపి..తనంతట తాను పనులు చేసుకోని పరిస్థితి ఎదురవ్వుతుంది. సింపుల్గా చెప్పాలంటే చిన్న మెదడును ప్రభావితం చేసే అరుదైన జన్యుపరమైన న్యూరోడిజెనరేటివ్ డిజార్డర్.ఇక బ్రహ్మభట్ని న్యూరాలిజిస్ట్లు వీట్ఛైర్కే పరిమితం కాకతప్పదని..అందుకు మానసికంగా సిద్ధం అవ్వమని సూచించారు. అతడి తండ్రి ఇటీవలే మరణించడంతో ఇప్పుడు ఆ వ్యాధి తాను భారినపడ్డానంటే అమ్మ, చెల్లి తల్లడిల్లతారని ఆ వ్యాధిని కుటుంబసభ్యులకు చెప్పకుండా జాగ్రత్తపడ్డాడు. అమెరికాలో ఉండే దూరపు బంధువుతో మాట్లాడి ఈ వ్యాధిని విదేశాల్లో నయం చేయగలరే లేదా అనే విషయం గురించి చర్చించి తెలుసుకుంటుండేవాడు. అయితే అక్కడ కూడా ఈ వ్యాధికి నివారణ లేదని, మందులతో నిర్వహించాల్సిందేనని తెలుసుకుంటాడు. దాంతో ఫిజియోథెరపీస్టుతో మాట్లాడుతూ తన వ్యాధిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడు. దీన్ని తగ్గించుకునేలే ఏం చేయొచ్చు అనేదాని గురించి శాస్త్రీయ పరిశోధనలు కూడా చేశాడు. అయితే తండ్రి లేకపోవడంతో తన పరిస్థితిని మెరుగుపురుచుకునేందుకు ఆర్థికస్థితిని మెరుగుపరుచుకునేలా వ్యాపారంపై దృష్టి సారిస్తూ..అటాక్సియా రోగులు గురించి తెలుసుకుంటుండేవాడు. యూఎస్లో కొందరు ఈ వ్యాధి కోసం తాయ్చి శిక్షణ తీసుకుంటున్నారని తెలుసుకుంటాడు. తాను ఎలాగైనా వీల్చైర్కి పరిమితం కాకుండా బయటపడేలా ఏదైనా చేయాలని భావించి అస్సాంకి చెందిన తాయ్ చి మాస్టర్ బబ్లూ సావంత్ వద్ద శిక్షణ తీసుకుంటాడు. తాయ్ చి (Tai Chi) అంటే..చైనాలో పుట్టిన ఒక ప్రాచీన మార్షల్ ఆర్ట్. మనస్సు-శరీరాన్ని సమన్వయం చేసే ఒక అభ్యాసం(సాధన) ఇది శ్వాస నియంత్రణ, మైండ్ఫుల్నెస్, శరీర సమతుల్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే బ్రహ్మభట్కి ఈ వ్యాయామాలు శరీర కదలికలకు మంచి హెల్ప్ అయ్యాయి. అయితే నేరుగా నడవడం మాత్రం కష్టమయ్యేది. కానీ కారు నడపగలడు, వ్యాపారాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించగలడు. దీని సాయంతోనే బుద్ధిపూర్వకంగా కదలికలు, అవయవాల సమన్వయాన్ని తిరిగి క్రమాంకనం చేయగలిగాడు. ఇది ఒక యుద్ధ కళ మాత్రమే కాదు, మన శరీరాన్నే గాక, అంతర్గత అంశాలపై దృష్టి పెట్టి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మనస్సుపై నియంత్రణను సాదించగలుగడమే గాక ఈ భంగిమలు రక్తప్రసరణను మెరుగ్గా ఉంచుతాయి. ప్రస్తుతం బ్రహ్మ భట్ ఈ తాయ్చి సాయంతో స్పెషల్ పర్సన్స్ విభాగంలో 35 పుష్ అప్లు చేసి గిన్నిస్ రికార్డు సృష్టించాలని భావిస్తున్నాడు. ఎందుకంటే తనలాంటి వారిలో ఆశావాహ దృక్పథాన్ని అందించి ఈ వ్యాధితో జీవించడం ఎలాగో తెలియజేయాలనేది బ్రహ్మభట్ ఆకాంక్ష. అనారోగ్యంతో భయపడుతూ కూర్చోకూడదు, ధైర్యంగా పోరాడి జయించే మార్గం వెతకాలి అనే సందేశాన్ని ఇస్తోంది కదూ ఇతడి కథ..!.(చదవండి: ChatGPT Weight Loss: ఐస్క్రీం తింటూ పదికిలోలు తగ్గింది..! అదికూడా ఏఐ సాయంతో..!) -
రిసెప్షన్లో డ్యాన్స్ చేస్తూనే ప్రాణాలొదిలేసింది: వైరల్ వీడియో
అంతా పెళ్లి రిసెప్షన్ వేడుకల్లోఎంతో సంతోషంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆనందంగా నృత్యం చేస్తున్న మహిళ ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. ఏం జరిగిందో అర్థం అయ్యే లోపే అంతులేని విషాదం చోటు చేసుకుంది. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని మామల్లపురం మంగళవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. పలు మీడియా నివేదికల ప్రకారం తమిళనాడులోని జరిగిన వివాహ రిసెప్షన్కు హాజరయ్యారు కాంచీపురం నివాసితులు జీవా , ఆమె భర్త జ్ఞానం. తమ స్నేహితుడి కొడుకు వివాహ కార్యక్రమంలో ఎంతో ఆనందంగా పాలు పంచుకుంటున్నారు. ఈ వేడుకల్లో భాగంగా, ప్రముఖ తమిళ నేపథ్య గాయకుడు వేల్మురుగన్ పాల్గొన్న సంగీత కచేరీని నిర్వహించారు. ఈ సమయంలో, వేల్మురుగన్ ప్రేక్షకులను వేదికపైకి వచ్చి నృత్యం చేయమని ఆహ్వానించారు. అలా జీవా కూడా ఆమె వేదిక పైకి వెళ్లి నృత్యం చేయడం ప్రారంభించింది. అంతలోనే కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెకు వేదిక వద్దనే ప్రథమ చికిత్స అందించారు. అయినా స్పందించచకపోవడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. జీవా కుప్పకూలిపోయే ముందు నృత్యం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.Woman dies after collapsing while dancing on stage at wedding event in Mamallapuram, in Tamil Nadu’s Chengalpattu district.#TamilNadu #Tragedy #ITVideo #SoSouth #Chengalpattu @PramodMadhav6 pic.twitter.com/18SkHkx4X2— IndiaToday (@IndiaToday) August 20, 2025 -
సలాం సఫురా..! నెటిజన్ల మనసు గెలుచుకున్న మహిళా డ్రైవర్..
అమ్మాయిలు అన్ని రంగాల్లోకి రావాలని చెబుతుంటారు. గానీ ఇంట్లో వాళ్ల వల్లనో సమాజం ధోరణి కారణంగానే కొన్ని రంగాలవైపుకి అస్సలు రారు. పొరపాటున కన్నెత్తి కూడా అటువైపుగా చూడరు. కానీ ఈ అమ్మాయి తనకు డ్రైవింగ్ ఇష్టం అని చెప్పడమే కాదు ఏ వాహనమైనా సరే నడిపేస్తానని ధైర్యంగా చెబుతోంది. ఆమె ధైర్యానికి, ఆలోచన తీరుకి ఫిదా అవ్వుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తమన్నా తన్వీర్ అనే ప్రయాణికురాలు ఓలా లేదా రాపిడో బుక్ చేసుకోవడం కుదరకపోవడంతో..ఏదో ఒక ఆటోని పట్టుకని వెళ్లిపోదాం అనుకుంటుంది. సరిగ్గా ఆ సమయానికి ఒక మహిళ డ్రైవర్ నడుపుతున్న ఆటో ఎదురవుతుంది. మహిళ డ్రైవర్ నడుపుతున్న ఆటోని చూడటం ఇదే తోలిసారి అనుకుంటూ తమన్నా వెంటనే ఎక్కేయడమే గాక..ఆ రైడ్లో తనతో మాటలు కలుపుతుంది. అదంతా రికార్డు చేసి నెట్టింట షేర్ చేసింది. ఆ వీడియోలో సఫురా అనే మహిళా డ్రైవర్ ఆటో నడుపుతున్నట్లు చూడొచ్చు. తనకు డ్రైవింగ్ అంటే పాషన్ అని, ఏ వెహికల్ అయినా నడుపుతానని చెబుతోంది. అయితే తన వద్ద అంత బడ్డెట్ లేకపోవడంతో ఆటోతో ప్రారంభించానని, భవిష్యత్తులో స్విఫ్ట్ కారు కొనాలనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది. తనకు ఇలా డ్రైవింగ్ చేయడం ఇష్టమైన పని కాబట్టి, అలసట అనిపించిందని చెబుతోంది. ప్రతిరోజు అత్యంత ఉత్సాహంగా పనిచేస్తానని తెలిపింది. మరి తన కుటుబం ఈ వృత్తిని ఎంచుకుంటే ఏం అనలేదా అని ప్రయణికురాలు తమన్నా ప్రశ్నించగా..మొదట తన అమ్మ భయపడిందని, అయితే తన కూతురు ధైర్యవంతురాలని, ఏదైనా చేయగలదని ఆమెకు తెలుసని గర్వంగా చెప్పింది. రైడ్ ముగింపులో తమన్నాకు హైఫై ఇచ్చి చిరునవ్వులు చిందిస్తూ వెళ్లిపోయింది. సఫురా మూసధోరణలను బద్ధలు కొట్టి మహిళలకు స్ఫూర్తిని అందివ్వడమే కాకుండా మనసుకు నచ్చింది చేయడంలో ఉన్న ఆనందం ప్రాముఖ్యతను కూడా హైలెట్ చేసింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఆమె శక్తికి సలాం అంటున్నారు, ఏళ్లనాటి స్లీరియోటైప్ను బద్దలు కొట్టినందుకు హ్యాట్సాఫ్ అంటూ కీర్తిస్తున్నారు. View this post on Instagram A post shared by Tamanna Tanweer | Your Online Bestie (@tamannapasha_official) (చదవండి: పారాచూట్ వెడ్డింగ్ గౌను'..! వెనుక ఇంత అద్భుతమైన లవ్ స్టోరీనా..) -
బాల వినాయకులకు గిరాకీ..!
మనం చేసుకునే పండగలు వెనుక ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ ప్రకృతితో మమేకం అవ్వడం. కానీ ఆధునిక పోకడలు పర్యావరణ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా వినాయక చవితి ఉత్సవాల్లో ఉపయోగిస్తున్న ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్తో తయారు చేస్తున్న విగ్రహాలు పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నాయి. దీనివలన జీవకోటికి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. అందువలన ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే వినియోగించాలనే సంకల్పంతో అమలాభట్ట గ్రామస్తులు మట్టితో విగ్రహాలను తీర్చిదిద్దుతున్నారు. వీటిని ఉపయోగించడం వలన పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఇలా మట్టి మేలు తలపెడుతున్న వారిని ఒకసారి పలకరిస్తే... – రాయగడ ఒడిశా రాయగడ జిల్లా కేంద్రానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో అమలాభట్ట గ్రామం ఉంది. ఈ గ్రామంలోని సుమారు 100 కుటుంబాలు మట్టినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నాయి. వీరు ప్రకృతిహితంగా విగ్రహాలను తయారు చేస్తుంటారు. కేవలం మట్టినే ఉపయోగించి అందమైన విగ్రహాలను తయారు చేయడంలో అమలాభట్ట గ్రామానికి ప్రత్యేకత ఉంది. ప్రతీ ఏడాది వినాయక చవితి, నవరాత్రి ఉత్సవాలు వంటి ప్రత్యేక దినాల్లో విగ్రహాల తయారీలో ఇంటిళ్లపాది నిమగ్నమవుతుంటారు. ఈ ఏడాది కూడా వినాయక ఉత్సవాలకు సంబంధించి విగ్రహాల తయారీ ఊపందుకున్నాయి. మూడు నెలల ముందుగానే విగ్రహాలను రూపొందించడంలో నిమగ్నమైన యువతీ, యువకులు రేయింబవళ్లు కష్టించి విగ్రహాలను తయారీ చేస్తున్నారు. మూడు నెలల పాటు కష్టపడి పనిచేస్తే సుమారు రూ.50 వేల వరకు ఆదాయం ఒకొక్కరికీ లభిస్తుందని చెబుతున్నారు. అయితే గత మూడేళ్లుగా తమ వ్యాపారాలు చాలా మందకొడిగా కొనసాగు తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వినాయక విగ్రహాలకు సంబంధించి సహజ రంగులు ధరలు ఆకాశానంటుతుండడంతో పాటు ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్తో రూపొందించిన విగ్రహాల విక్రయాలు పెరుగుతున్న నేపథ్యంలో మట్టి విగ్రహాలకు గిరాకీ తగ్గుతోందని చెబుతున్నారు. బాల వినాయకులకు గిరాకీ ఈ ఏడాది ఆర్డర్లు ఇచ్చేవారు బాల వినాయకుల ప్రతిమలకు అత్యంత ప్రాధాన్యమివ్వడంతో పాటు ఆర్డర్లకు అనుకూలంగా విగ్రహాలను తయారు చేస్తుండడం విశేషం. మువ్వగోపాలుడు, బాల వినాయకుడు వంటి వేషధారణల్లో ఈ ఏడాది వినాయకుల విగ్రహాలు దర్శనం ఇవ్వనున్నాయి. రాయగడ జిల్లాలోని గుణుపూర్, గుడారి, మునిగుడ, పద్మపూర్ వంటి ప్రాంతాలతో పాటు గజపతి జిల్లా నుంచి అదేవిధంగా పొరుగు రాష్ట్రమైన మన్యం జిల్లా పార్వతీపురానికి చెందినవారు కూడా ఈసారి వినాయక విగ్రహాలకు ఆర్డర్లు ఇచ్చారు. డైలీ మార్కెట్లో విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాలను ఈ గ్రామానికి చెందిన యువతులు రూపొందిస్తున్నారు. వాటిని స్వయంగా తయారు చేసి రంగులు అద్ది, పూర్తయిన తర్వాత చవితికి మూడు రోజుల ముందుగానే రాయగడ పట్టణంలోని మార్కెట్లో విక్రయిస్తుంటారు. ప్రతీ ఏడాది మహిళలు వినాయక చవితి సందర్భంగా కష్టపడి విగ్రహాల తయారీతో పాటు వాటిని విక్రయించి కొంతమొత్తం ఆదాయం సంపాదించుకుని కుటుంబ పోషణకు అండగా నిలుస్తుంటారు. వినాయక చవితిని పురస్కరించుకుని ప్రతీ ఏడాది చిన్న చిన్న విగ్రహాలను మహిళలమే రూపొందిస్తుంటాం. తయారీ పూర్తయితే రంగులు అద్ది వాటిని మార్కెట్కు తీసుకెళ్లి విక్రయిస్తుంటాం. రూ.10ల నుంచి రూ.100ల వరకు విగ్రహాలను రూపొందిస్తుంటాం. అయితే కొనుగోలుదారులు మా కష్టానికి తగ్గ ఆలోచించకుండా బేరసారాలు అడుతుంటారు. విక్రయాలు మందకొడిగా ఉంటే ఒకొక్కసారి గిట్టుబాటు ధర లేకపోయినప్పటికీ విక్రయించాల్సి వస్తుంది. ఒకవేళ అలా విక్రయించకపోతే పెట్టుబడి కూడా నష్టపోతాం. – పొందూరు లక్ష్మి, అమలాభట్ట షెడ్డు నిర్మిస్తే ప్రయోజనం గ్రామంలో సుమారు వంద కుటుంబాలు మట్టినే నమ్ముకుని జీవనోపాధి పొందుతున్నాయి. వర్షం వస్తే నానా అవస్థలు పడాల్సి వస్తోంది. చేసిన విగ్రహాలు వర్షాలకు తడిచి పాడవుతున్నాయి. పాలిథిన్ ఖరీదు చేసి వర్షం కురిసే సమయంలో విగ్రహాలను కప్పుకోవాల్సి వస్తోంది. అదే గ్రామంలో అందరి కోసం షెడ్డు ఉంటే అంతా అక్కడే విగ్రహాలు తయారీ చేసుకునే అవకాశం ఉండేది. షెడ్డు లేకపోవడంతో ఎవరి ఇంట్లో వారే విగ్రహాలను తయారు చేసుకోవాల్సిన పరిస్థితి. భారీ వినాయకుల తయారీ కోసం బయట వేరొకరిపై ఆధారపడాల్సి వస్తోంది. – వంజరాపు రాజేష్, అమలాభట్ట ఇదీ చదవండి: జోరు జోరుగా జోగ్.. క్యూ కడుతున్న టూరిస్టులుఅధికారులు దృష్టి సారించాలి గత రెండేళ్లుగా వచ్చిన ఆర్డర్ల ప్రకారమే విగ్రహాలను రూపొందిస్తున్నాం. ఆర్డర్లు లేకుండా తయారు చేస్తే అవి విక్రయాలు జరగక నష్టపోవాల్సి వస్తోంది. ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్ విగ్రహాలు పర్యావరణానికి హాని కలిగిస్తున్నా, వాటి ఆదరణే అధికమవ్వడంతో మా వ్యాపారాలు §ð దెబ్బతింటున్నాయి. మట్టినే నమ్ముకున్న మా కుటుంబాలు ఉపాధి కోల్పోతున్నాయి. జిల్లా యంత్రాంగం వాటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.- పి.వెంకటరావు, అమలాభట్ట చదవండి: క్షణం ఆలస్యమైతే అంతే సంగతులు : వైరల్ వీడియో -
జోరు జోరుగా జోగ్.. క్యూ కడుతున్న టూరిస్టులు
కర్ణాటకలోని మల్నాడ్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు జోగ్ జలపాతం అద్భుత దృశ్యంతో అలరారుతోంది. భారీ వర్షాల తర్వాత జోగ్ జలపాతం అద్భుతంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని సాగర్ తాలూకాలోని షరావతి నదిపై నిర్మించిన లింగనమక్కి ఆనకట్ట గేట్లను ఆగస్టు 19న తెరిచారు. కర్ణాటక పశ్చిమ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల తర్వాత అదనపు నీటిని విడుదల చేశారు.ఈ ఉత్కంఠభరితమైన దృశ్యాలను చూడటానికి చుట్టు పక్కల గ్రామాలనుంచి ప్రజలు క్యూ కట్టారు. సోషల్ మీడియాలో జోగ్ అందాల వీడియోలు తెగ సందడి చేస్తున్నాయి.JOG Falls, India's 2nd highest , 830 ft Mega water fall, is at its peak now.Near Shivamogga, #Karnataka.pic.twitter.com/sMd2mBT8nq— Mahesh.BR (@Maheshbr4U) August 20, 2025 కర్ణాటకలోని జోగ్ జలపాతాన్ని పర్యాటకులు తరలివస్తున్నారు. పొగమంచులా కనిపిస్తున్న జలదృశ్యాన్ని చూసి ఉప్పొంగిపోతున్నారు. రిజర్వాయర్,ఆనకట్టను నిర్వహించే కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (కెపిసిఎల్) అధికారులు ఉదయం 10 గంటల ప్రాంతంలో గేట్లను తెరవడం ప్రారంభించారు. Time to visit #JogFalls !As linganamakki dam is filled & all crest gates are opened on Aug-19thVC: Madhu gowda pic.twitter.com/espIGjmQqY— Karnataka Development Index (@IndexKarnataka) August 20, 2025 మొత్తం 11 గేట్లను తెరిచారు. ఆనకట్టలో నీటి మట్టం ఇన్ఫ్లో పెరగడంతో పాటు 15,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆగస్టు 19 ఉదయం నాటికి, జలాశయం పూర్తి స్థాయి 1,819 అడుగుల నీటి మట్టం ఉండగా, నీటి మట్టం 1,816.2 అడుగులుగా ఉంది. -
క్షణం ఆలస్యమైతే అంతే సంగతులు : వైరల్ వీడియో
రైలు ప్రయాణాల్లో పిల్లలు, పెద్దలూ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా క్షణాల్లో ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ముఖ్యంగా రైలు ఎక్కేటపుడు, దిగేటపుడు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు అసలు పనికి రాదు. ప్రాణాలు ముఖ్యం అనే విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. తాజాగా కేరళలో జరిగిన ఒక ఘటన ఈ విషయాలను మరోసారి గుర్తు చేస్తుంది.కేరళలోని ఎర్నాకుళం నార్త్ రైల్వే స్టేషన్లో ఒక మహిళను ప్రాణాపాయం నుంచి కాపాడిన ఘటన విశేషంగా నిలిచింది. రైలు నుండి దిగడానికి ప్రయత్నించినప్పుడు ఆమె బ్యాలెన్స్ కోల్పోయింది. దాదాపు పట్టాలపై పడిపోయింది. అక్కడనే రైల్వే ఉద్యోగి రాఘవన్ ఉన్ని తక్షణమే స్పందించారు. ఆమెను ఒడుపుగా పట్టుకొని పక్కకు లాగారు. వెంటనే అలర్ట్ అయ్యి శరవేగంగా ఆయన స్పందించకపోతే ఆమె ప్రాణాలకే ముప్పు ఏర్పడేది. ఆసీసీ టీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డైనాయి. ఆగస్టు 9న జరిగిన ఈ సంఘటన నెట్టింట్ వైరల్గా మారింది. నెటిజన్లు రాఘవన్ చాకచక్యంపై ప్రశంసలు కురిపించారు. మరోవైపు రైల్వే సిబ్బంది అంకితభావాన్ని ప్రశంసిస్తూనే, మెరుగైన భద్రతా చర్యల అవసరాన్ని కూడా నొక్కి చెబుతుండటం గమనార్హం.ఇదీ చదవండి: ప్రాజెక్టులు తగ్గినా, క్వాలిటీ తగ్గలేదు : గ్రాజియా కవర్పేజీపై మెరిసిన సమంతKerala : ಚಲಿಸುವ ರೈಲಿನಿಂದ ಇಳಿಯಲು ಹೋದ ಮಹಿಳೆಗೆ ಏನಾಯಿತು ನೋಡಿ.? | Sanjevani News....#kerala #train #Ernakulam #NorthRailwayStation #viralvideo #ಕೇರಳ pic.twitter.com/LTd6J1YQmF— Sanjevani News (@sanjevaniNews) August 20, 2025కాగా 2022లో ఇలాంటి ఘటన ఒకటి రైలు ప్రమాదాల్లో సిబ్బంది అప్రమత్తతను గుర్తు చేస్తూ కేరళలోని తిరూర్ రైల్వే స్టేషన్లో సతీష్ అనే RPF హెడ్ కానిస్టేబుల్ కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ జారిపడిన మైనర్ బాలికను రక్షించాడు. దీనికి సంబంధించిన RPF ఇండియా విడుదల చేసింది. ఈ వీడియోలో లిప్తపాటులో స్పందించి కానిస్టేబుల్ అమ్మాయిని రక్షించాడు. -
'పారాచూట్ వెడ్డింగ్ గౌను'..! వెనుక ఇంత అద్భుతమైన లవ్ స్టోరీనా..
ఎంతో కష్టపడి నచ్చిన డ్రెస్ కొనుకున్నప్పుడు లేదా మన తల్లిదండ్రులు/ప్రియమైనవారో మనకెంతో ఇష్టమైన డ్రెస్ కొంటే.. ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. అదెంతో అపురూపం కూడా. ఆ దుస్తులు చూడగానే దాని తాలుకా జ్ఞాపకాలు కళ్లముందు కదలాడుతాయి. అయితే మన ప్రాణ సమానమైన వ్యక్తిని రక్షించిన వస్తువు లేదా మనిషి మనకు ఆప్తమిత్రుడు లేదా అత్యంత ఆత్మీయులు. అందుకు అర్థం పట్టేదే ఈ వెడ్డింగ్ గౌను. దీని వెనుకున్న కథ వింటే కళ్లు చెమరుస్తాయి. 'ప్రేమకు అర్థం ఏదంటే'.. అన్న పాట గుర్తొచ్చేలా ఉంటుంది ఈ జంట కథ. చరిత్రలో దాగున్న ఈ అందమైన స్టోరీ ఏంటో చదివేద్దామా..!ఇప్పుడు చెప్పుకోబోయే ఈ ఐకానిక్ వెడ్డింగ్ గౌను ఒక జంట ప్రేమకు గుర్తుగా మ్యూజియంలో భద్రంగా ఉంది. చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా ఉంది. అదే ఇవాళ స్టైలిష్ వెడ్డింగ్ గౌనుగా బ్రిటన్, అమెరికా, రష్యా వంటి దేశాల్లో ప్రాచుర్యం పొందుతోంది. ప్రతి నవ వధువు ఇష్టపడే ఆ వివాహ గౌను వెనుక కథ చూస్తే ప్రేమకు గుర్తుగా కనిపిస్తుంది. దీని గురించి సంస్కృతి, చరిత్రపై అమితాసక్తి కలిగిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మే షరీఫ్ ఇన్స్టాగ్రామ్లో వీడియో రూపంలో షేర్ చేశారు. దాంతో ఈ వెడ్డింగ్ గౌను వెనుకున్న లవ్స్టోరీ నెట్టింట హాట్టాపిక్గా మారింది. అంతేగాదు 'ప్రేమకు అర్థం ఎవరంటే?'..అన్న పాటను గుర్తుకుతెస్తోంది. ఆ వీడియోలో షరీఫి ప్రముఖులు ధరించిన ఎన్నో వెడ్డింగ్ గౌనులు చూసుంటారు గానీ ఈ పారాచూట్ వెడ్డింగ్ గౌను(parachute wedding dress) గురించి విన్నారా అంటూ ఆ స్టోరీ గురించి చెప్పడం ప్రారంభిస్తుంది. This wedding dress was made from a parachute that saved Maj. Claude Hensinger during WWII. In our @amhistorymuseum: https://t.co/0lf4659Pu0 pic.twitter.com/dSvRHwnvl7— Smithsonian (@smithsonian) June 16, 2017 వెడ్డింగ్ గౌను వెనుకున్న కథ..1947లో, ఒక మహిళ రెండవ ప్రపంచ యుద్ధం(World War II)లో తన భర్త ప్రాణాలను కాపాడిన పారాచూట్నే వెడ్డింగ్ గౌనుగా డిజైన్ చేసిందట. నైలాన్ ఫ్రాబ్రిక్ క్లాత్తో ఉండే పారాచూట్ని చాలా అందమైన వివాహ దుస్తులుగా మార్చిందామె. ఆ జంటే మేజర్ క్లాడ్ హెన్సింగర్, రూత్లు. 1947 రెండో ప్రపంచ యుద్ధం అనంతరం అమెరికన్ బీ 29 పైలట్ అయిన మేజర్ క్లాడ్ హెన్సింగర్ తన సిబ్బందితో తిరిగి వస్తుండగా విమానం ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. వెంటనే పారాచూట్ సాయంతో తన సిబ్బందిని, తనను రక్షించుకున్నారు. అంతేగాదు వారు ఆగిన నిర్మానుష్య ప్రదేశానికి అధికారులు వచ్చేంతవరకు వారికి ఆ పారాచూట్ రక్షణ కవచంలా వెచ్చదనాన్ని అందించింది. అతను సురక్షితంగా ఆ ప్రమాదం నుంచి బయపడిన వెంటనే తన స్నేహితురాలు రూత్ని నేరుగా కలసి జరిగినదంతా వివరించి ఆ పారాచూట్ని ఆమెకు ఇచ్చాడు. తన భర్త ప్రాణాలను కాపాడిన ఈ పారాచూట్ తనకెంతో అపురూపం అంటూ దాంతోనే వెడ్డింగ్ గౌనుని స్వయంగా రూపొందించుకుంది. అంతేగాదు దాన్ని ఆ దంపతులు ఎంత భద్రంగా ఉంచుకున్నారంటే..తన కూతురు, కోడలు కూడా వారి వివాహంలో ఆ గౌనునే ధరించారు. ఆ తర్వాత స్మిత్సోనియన్ మ్యూజియంలో ఆ గౌను నేటికి పదిలంగా ఉంది. View this post on Instagram A post shared by Mae Sharifi (@history_mae) (చదవండి: Smartphone Photography: కెమెరా క్లిక్.. అదిరే పిక్..! ట్రెండింగ్గా మారుతున్న మొబైల్ ఫోటోగ్రఫీ) -
ప్రాజెక్టులు తగ్గినా, క్వాలిటీ తగ్గలేదు : గ్రాజియా కవర్పేజీపై మెరిసిన సమంత
టాలీవుడ్ హీరోయిన్ సమంత మరో అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. పాపులర్ ఫ్యాషన్ మ్యాగజైన్ గ్రాజియా కవర్ పేజీపై సమంత తళుక్కున మెరిసారి . వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని దీన్ని రిలీజ్ చేసినట్టు గ్రాజియా ప్రకటించింది. ఈ సందర్భంగా 15 ఏళ్ల నట ప్రయాణంలో ఎన్నో విలువైన పాత్రలు పోషించారని ప్రశంసిస్తూ సమంతపై ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టింది.పదిహేను సంవత్సరాలు, లెక్కలేనన్ని పాత్రలు, ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం. యాక్టింగ్ నుంచి సినిమాలను నిర్మించడం,తన సొంత వ్యాపారాల స్థాపన వరకు, మొదటి చిత్రాన్ని నిర్మించడం, వెల్నెస్ వెంచర్లను ప్రారంభించడంతోపాటు ఆధునిక మహిళను ప్రతిబింబించే పాత్రలను ఎంచుకోవడం ద్వారా సమంత రూత్ ప్రభు తన సొంత మార్గాన్ని నిర్దేశించుకుంటోందని తెలిపింది. యూరోసెంట్రిక్ ఆదర్శాలను దాటి ఫ్యాషన్ ఇమేజరీని పునర్నిర్మిస్తున్న ఐదుగురు మహిళా ఫోటోగ్రాఫర్లతో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గ్రాజియా వెల్లడించింది. మ్యాగజైన్లో భాగమైన ఐదుగురు మహిళా ఫొటోగ్రాఫర్లు, ఆరుగురు డిజైనర్లతో ఫొటోగ్రఫీ డే సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు 'గ్రాజియా' పేర్కొంది. 22 క్యారెట్ల బంగారపు ఉంగరం, గాజులు, ఝుంకాలు, నెక్లెస్తో అద్బుతంగా కనిపిస్తున్న సమంత లుక్కు ఫిదా అవుతున్నారు View this post on Instagram A post shared by GRAZIA India (@graziaindia) తాను ఒకేసారి ఐదు సినిమాలు తీయనని, తన బాడీ, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని,పనిని తగ్గించానని గ్రాజియతో తెలిపింది. అయితే చేసే ప్రతీ పనిలో పూర్తి శక్తిని పెడుతున్నాననీ,పరిమాణం తగ్గి ఉండవచ్చు కానీ ప్రాజెక్టుల నాణ్యత ఖచ్చితంగా పెరిగిందని స్పష్టం చేసింది. జీవితంలో ప్రతిదీ నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం పైనే ఉంటుంది. నిద్ర, ఆహారం,మానసిక ఆరోగ్యం గురించి గతంలో కంటే కఠినంగా ఉంటున్నానని చెప్పింది. అలాగే చాలెంజింగ్ పాత్రలు, ముఖ్యంగా మహిళల కోసం ముఖ్యమైన చిత్రాలను తీసుకోవాలనుకుంటున్నాను. ఆధునిక స్త్రీని సూచించే పాత్రలను పోషించాలనుకుంటున్నా అవి రావడ కష్టంమే కానీ అదే లక్ష్యం అని పేర్కొంది. కాగా సమంత నిర్మాతగా వచ్చిన తొలి సినిమా శుభం'. మంచి టాక్ సంపాదించుకున్న ఈ సినిమాలోఅతిథి పాత్రతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: కేవలం రూ.3.5 లక్షలతో ఫ్యాషన్ బ్రాండ్..రూ. 500 కోట్ల దిశగా -
ఐస్క్రీం తింటూ పదికిలోలు తగ్గింది..! అదికూడా ఏఐ సాయంతో..!
వివిధ వ్యాధులకు మూలమైన అధిక బరువు ప్రస్తుతం అందర్నీ వేధించే పెనుసమస్యగా మారింది. బరువు తగ్గడం అనేది ఓ సవాలు. మాటల్లో చెప్పినంత సులవు కాదు తగ్గడం. స్ట్రాంగ్మైండ్ అచంచలమైన అంకితభావం ఉన్నవాళ్లే బరువు తగ్గడంలో విజయవంతమవ్వగలురు. అందుకోసం ఫిట్నెస్ నిపుణులు లేదా వ్యక్తిగత వైద్యులు సలహాలు సూచనలతో ప్రారంభించడం అనేది సర్వసాధారణం. కానీ ఇప్పుడు అరచేతిలో ప్రపంచాన్ని చూపించే ఏఐ సాంకేతికతను స్మార్ట్గా ఉపయోగించుకుంటూ ఆశ్చర్యపరిచేలా స్లిమ్గా అవుతున్నారు. సాంకేతికతను వాడోకవడం వస్తే..బరువు అనేది భారం కాదని ప్రూవ్ చేస్తున్నారు. ఇక్కడొక ఆరోగ్య నిపుణురాలు ఏఐ సాంకేతికను ఉపయోగించుకుంటూ.. తన కిష్టమైన ఐస్క్రింని త్యాగం చేయకుండానే బరువు తగ్గి చూపించింది. అది కూడా హాయిగా ఐస్క్రీంలు లాగించేస్తూనే ఎన్నికిలోలు తగ్గిందో వింటే నోరెళ్లబెడతారు.వెయిట్లాస్ జర్నీలో ఆహారాలు, వ్యాయామ షెడ్యూల్, జీవనశైలి తదితరాలు ఇతరులకు మార్గదర్శకంగా ఉంటాయి. కానీ ఈ మహిళ ఆరోగ్యకరంగా బరువు తగ్గేందుకు కృత్రిమ మేధ సాయాన్నితీసుకుంది. ఇది మనిషి సందేహాలను సత్వరమే నివృత్తిచేసి..గైడ్ చేయగలదని చాలామంది ప్రగాఢంగా నమ్ముతుండటం విశేషం. ఆ నేఫధ్యంలోనే ప్రముఖ ఆరోగ్యనిపుణురాలు సిమ్రాన్ వలేచా కూడా ఏఐ ఆధారిత చాట్జీపీటి సాయంతో తీసుకుని బరువు తగ్గేందుకు ప్రయత్నించింది. డిసెంబర్ 2024లో ఈ చాట్జీపీటీ(ChatGPT) సాయం తీసుకుని వెయిట్ లాస్ జర్నీని ప్రారంభించారామె. అయితే ఆమె తనకెంతో ఇష్టమైన ఐస్క్రీని అస్సలు త్యాగం చేయకుండా బరువు తగ్గానంటూ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. అంతేగాదు వెయిట్లాస్ కోసం చాట్జీపీటీతో మాట్లాడి ధైర్యంగా ముందడుగు వేయొచ్చని ధీమాగా చెప్పేస్తున్నారామె. ఇన్స్టా పోస్ట్లో సిమ్రాన్ ఇలా రాశారు. "ఐస్క్రీం తింటూనే పది కిలోలు తగ్గాను. అలాగే బరువు తగ్గాలనుకుంటే స్వంతంగా డైట్ని ఎంచుకోండి. అందుకోసం చాట్జీపీటీని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి". అంటూ సవివరంగా తన వెయిట్ లాస్ జర్నీ గురించి వివరించింది.చాట్జీపీటీలో ఎలా అడగాలంటే..చాట్జీపీటీలో సిమ్రాన్ తన ఎత్తు, బరువు వివరాలను వెల్లడించినట్లు తెలిపింది. ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనకుంటున్నా..అందుకోసం తీసుకోవాల్సిన ఆహారాలు, చిరుతిండ్లు వివరాలను ఇవ్వాల్సిందిగా కోరినట్లు పేర్కొంది. అలాగే తన పనిగంటలు, ఖాళీ సమయం వంటి వివరాలు కూడా ఏఐకి ఇచ్చినట్లు తెలిపింది. ఎన్నిగంటలు వ్యాయమానికి కేటాయించగలను అనేది కూడా ఇచ్చినట్లు తెలిపింది. అల్పాహారం దగ్గర నుంచి రాత్రి భోజనం వరకు ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తులు తీసుకోవాలో సవివరంగా తెలుసుకుని బరువు తగ్గానని పోస్ట్లో రాసుకొచ్చింది సిమ్రాన్. గమనిక: ఇక్కడ సాంకేతికత అనేది జస్ట్ ఆరోగ్యంపైన అవగాహన కల్పించగలదని, అదే కచ్చితమని భావించరాదని వైద్యలు హెచ్చరిస్తున్నారు. అది మనలను ఆరోగ్యంపై ఒక అవగాహన కల్పించే అప్లికేషన్ అని గుర్తించగలరు. వ్యక్తిగతంగా అనుసరించాలనుకుంటే వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Simran - Health, Wellness & Weight Loss Expert (@simvalecha) (చదవండి: 'బ్యూటిఫుల్ బామ్మ'..! ఫిట్నెస్లో సరిలేరు ఈమెకెవ్వరూ..) -
ఆదివారం వరకు రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు
ఈ నెల 20 నుంచి 24 తేదీల మధ్యకాలంలో తెలంగాణలోని రెండు జిల్లాల్లో అతిభారీ వర్షాలు, ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాజేంద్రనగర్లోని పీజేటీఏయూ ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ వాతావరణ పరిశోధన విభాగం అధిపతి డాక్టర్ పి.లీలా రాణి తెలిపారు. బుధవారం నుంచి వచ్చే ఆదివారం వరకు ఉపయోగపడే వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలను రైతాంగానికి ఆమె సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచనలున్నందున రైతులు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, చెరువులు, నీటికుంటలకు దూరంగా ఉండాలి. అధేవిధంగా రైతులు చెట్ల కింద నిలబడ కూడదు. పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచరాదని ఆమె సూచిస్తున్నారు. గత మూడు రోజుల వాతావరణం:గడిచిన మూడు రోజుల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల భారీ, అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 31 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 19 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. వచ్చే ఐదు రోజుల వాతావరణ విశ్లేషణ:హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం. 20, 21 తేదీల్లో రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. 21 నుంచి 24వ తేదీ ఉదయం వరకు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 24 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు.అత్యంత భారీ వర్షాల హెచ్చరిక:20వ తేదీ: కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూ΄ాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు తెలంగాణ అన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది.21వ తేదీ: జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది.22వ తేదీ: ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలలో అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది.23వ తేదీ: ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది.24వ తేదీ: ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది.పొలాల్లో మురుగు కాలువలు ముఖ్యంభారీవర్షాలు కురిసిన ప్రాంతాల్లో పొంలం నుండి మురుగునీటిని వీలైనంత వరకు త్వరగా పొలం నుండి తీసివేయాలి.వచ్చే ఐదు రోజుల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పంట పొలాల్లో మురుగు కాలువలు ఏర్పాటు చేసుకోవాలి.ఆరుతడి పంటల్లో ఆఖరి అంతర కృషి తరువాత ప్రతీ 2 మీటర్లకు ఒక గొడ్డు చాలు వేసుకోవాలి.నీటి ముంపునకు గురైన వర్షాధార పంటల్లో వర్షాలు ఆగిన తరువాత వీలైనంత త్వరగా అంతర కృషి చేసుకోవాలి. ఇదీ చదవండి: ఇండియన్ వయాగ్రా రైస్ తెలుసా? దేశీ వరి ఔషధ గుణాలుపశువులు జాగ్రత్తప్రస్తుత వాతావరణ పరిస్థితులు కోళ్ళలో కొక్కెర తెగులు సోకటానికి అనుకూలం. వీటి నివారణకు, టీకాలు వేయించాలి. గొర్రెల్లో చిటుకు, పీపీఆర్ సోకే వీలుంది ఆవులు, గేదేల్లో గొంతువాపు వ్యాధి సోకడానికి అనుకూలం. టీకాలు వేయించాలి ∙గొర్రెల్లో నట్టల నివారణకు డీవార్మింగ్ చెయ్యాలి. – నిర్వహణ: పంతంగి రాంబాబు సాక్షి సాగుబడి డెస్క్ ఇదీ చదవండి: కేవలం రూ.3.5 లక్షలతో ఫ్యాషన్ బ్రాండ్..రూ. 500 కోట్ల దిశగా -
ఇండియన్ వయాగ్రా రైస్ తెలుసా? దేశీ వరి ఔషధ గుణాలు
దేశీయ వరి రకాలు 23 జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ( GI) గుర్తింపును సాధించింది. మన దేశంలో వరి పంట ప్రధానమైన పంట. వరి రకాన్ని సంబంధిత ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. అలాంటి రైస్ లో కేరళ ప్రాంతంలో రైస్ ఒకటి నవరా రైస్. అందుకే దీన్ని కేరళ బియ్యం లేదా ఎర్ర బియ్యంగా అని కూడా పిలుస్తారు. ఈ బియ్యం త్రేతాయుగము నాటిదని నమ్ముతారు. అలాగే గంధసాలే పొడవైన ధాన్యం రకం. ఇది కర్ణాటక, పంజాబ్ & హర్యానా (మోగ్రా, బాస్మతి)లలో ఎక్కువగా పండిస్తారు. వివిధ రకాల వరి, వాటి ప్రయోజనాలను చూద్దాం. దేశీ వరి రకాల్లో ఔషధ గుణాలు!మైసూరులో సేవ్ అవర్ రైస్, సహజ సమృద్ధ తదితర స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన దేశీ వరి మేళాలో ఔషధ విలువలున్న చాలా రకాల బియ్యం రకాలను ప్రదర్శించారు. బియ్యాన్ని, విత్తనాలను కూడా విక్రయించారు. వారు చెప్పిన ఔషధ గుణాలు ఇవి...దయానా : తీవ్రమైన మధుమేహం ఉన్న వారికి ఉపయోగకరం.నవర : ‘ఇండియన్ వయాగ్రా’. నపుంసకత్వాన్ని అధిగమించడంలో సహాయపడుతుంది.మాపిళ్లై సాంబా : శక్తిని పెంచే గుణం కలిగినది. కొత్త అల్లుళ్లకు తినిపించే ప్రత్యేక రకం బియ్యం.గంధసాలే : బిర్యానీ, పులావు కోసం సువాసనగల బియ్యం.సిద్ధసన్న : రోజువారీగా అన్నం వండుకొని తినటానికి అనుకూలం.దొడ్డా బైరా నెల్లు : పెరుగన్నానికి బాగుంటాయి. కజ్జాయ (తీపి వడలు), దోసెలు, ఇడ్లీకు అనువైనవిరాజముడి : రోజువారీ భోజనం కోసం బాగుంటాయి.దొడ్డిగా : బియ్యపు పిండితో రొట్టె, పెరుగు అన్నం చేసుకోవటానికి ఉత్తమమైనది.బర్మా బ్లాక్ : పాయసానికి అనువైనదినిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్.చదవండి: మన దేశంలో 23 రకాల దేశీయ వరి వంగడాలకు జీఐకేవలం రూ.3.5 లక్షలతో ఫ్యాషన్ బ్రాండ్..రూ. 500 కోట్ల దిశగా -
మన దేశంలో 23 రకాల దేశీయ వరి వంగడాలకు జీఐ
పది వేల సంవత్సరాల నాటి సుసంపన్న వ్యవసాయ వారసత్వ సంపద గల ప్రపంచ జీవవైవిధ్య కేంద్రాల్లో ఒక ముఖ్యమైనది భారతదేశం. ఈ అపురూప పాత పంటలకు అవి పుట్టి పెరిగిన స్థానిక ప్రాంతంతో అవినాభావ సంబంధం ఉంటుంది. అక్కడి వాతావరణం, నేలల స్వభావం, ప్రజల ప్రాధాన్యతలు.. వీటన్నిటితో కూడిన ప్రత్యేక రుచి, రంగు, వాసన, పోషకాలు, ఔషధ గుణాలతో ఈ స్థానికత ముడిపడి ఉంటుంది. అటువంటి అద్భుతమైన దేశీ వరి వంగడాలను అనాదిగా ఏటేటా సాగు చేస్తూ, వాటిని పరిరక్షిస్తూ వస్తున్నది రైతులు, ఆదివాసులు. కొత్త వంగడాలు వెల్లువైన ఈ ఆధునిక కాలంలో వీటిని కాలగర్భంలో కలసిపోకుండా కాపాడుకునే పని కూడా పాత పంటల విలువ తెలిసిన వీరే తమ భుజస్కందాలపై వేసుకున్నారు. ఇటువంటి పాత పంటలను కాపాడుకోవటానికి ఒకానొక మార్గం వాటికి స్థానికతను ఆధారసహితంగా నిరూపించి తగిన చట్టపరమైన గుర్తింపు ఇవ్వటం. దాన్నే జాగ్రఫికల్ ఇండికేషన్(జీఐ) అంటాం. జీఐకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని గత వారం ఇదే సాగుబడి ప్లస్ పేజీలో చదువుకున్నాం. ఈ రోజు మన దేశంలో జీఐ గుర్తింపు పొందిన కొన్ని వారసత్వ దేశీ వరి రకాల విశిష్టతల గురించి తెలుసుకుందాం. ఈ విశిష్టమైన దేశీ వరి వంగడాల ఔషధ గుణాలు, పోషకాలు సమృద్ధిగా మనం అందుకోవాలంటే రసాయన రహిత పద్ధతుల్లో సాగు చెయ్యటం తప్పని సరి!దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పాత వరి రకాల ప్రత్యేకతను మరింతగా రక్షించడానికి, ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం మరిన్ని వరి రకాలకు జీఐ గుర్తింపు ఇవ్వటానికి ప్రయత్నిస్తోంది. రైతులకు ప్రయోజనం చేకూర్చడం, వ్యవసాయ సమాజపు పురాతన సాంప్రదాయ విజ్ఞానాన్ని కాపాడటం, ప్రపంచ వ్యవసాయ రంగంలో భారత్ స్థానాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. 1. టెక్కలి: జీఐ ట్యాగ్ ΄పొందిన మొట్టమొదటి ఆసియా వరి రకం. కేరళ తీర ప్రాంత జిల్లాల్లో నీటితో ఎక్కువ కాలం నిండి ఉండే చిత్తడి ప్రాంత పొలాల్లో పెరిగే సామర్థ్యం ΄ టెక్కలి రకానికి ఉంది. సేంద్రియ పద్ధతుల్లో దీన్ని సాగు చేస్తున్నారు.2. బాస్మతి: పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో రైతులు విస్తృతంగా పండిస్తున్న బాస్మతి వరి బియ్యాన్ని దేశ విదేశాల్లో ప్రజలు ఇష్టపడి తింటుంటారు. జీఐ ట్యాగ్ ΄÷ందిన వరి రకాల్లో ఎక్కువ ప్రజాదరణకు నోచుకుంటున్నది బాస్మతి మాత్రమే అని చెప్పచ్చు. సుగంధం వెదజల్లే ΄÷డవైన గింజ కలిగిన బియ్యం. వండినప్పుడు దాని సువాసన, పొడడవాటి మెత్తటి ఆకృతికి ప్రసిద్ధి చెందింది.3. కాలానమక్: ‘బుద్ధ బియ్యం‘ అని కూడా దీనికి మరో పేరుంది. ఈ పురాతన, సుగంధ రకం పుట్టిల్లు ఉత్తరప్రదేశ్. దీన్ని శతాబ్దాలుగా హిమాలయ తీర ప్రాంతంలో సాగు చేస్తున్నారనే నమ్మిక ఉంది. దీని ప్రత్యేక సువాసన బుద్ధుని బహుమతిగా చెబుతారు.4. గోవింద్భోగ్: పశ్చిమ బెంగాల్కు చెందిన అద్భుత వరి రకం. చిన్న గింజ. మీగడ–తీపి సుగంధ బియ్యం. ఖరీఫ్ సీజన్ లో పండిస్తారు. దీన్ని సాంప్రదాయకంగా శ్రీకృష్ణుడికి నైవేద్యం కోసం ఈ బియ్యాన్ని వాడతారు.5. జోహా: అస్సాంలో, ముఖ్యంగా గారో హిల్స్లో, పండించే జోహా బియ్యం తీపి వాసనకు, రుచికి, మృదువైన ఆకృతికి ప్రసిద్ధి. ఇందులో అమైనో ఆమ్లాలు, ్ర΄ోటీన్లు అధికంగా ఉంటాయి.6. చక్–హావో: మణిపూర్కు చెందిన సువాసనతో కూడిన నల్ల బియ్యం. జిగటగా ఉంటాయి. వండినప్పుడు ఊదా రంగులోకి మారతాయి. ఇది గ్లూటెన్, విటమిన్లు, ప్రొటీన్లు, ఖనిజాలతో సమృద్ధమై ఉంటుంది. మణిపురి ఇళ్లలో చక్–హావో బియ్యానికి లభించే సాంస్కృతిక ప్రాముఖ్యత దాని విశిష్టతను చాటుతుంది.7. నవర: కేరళకు చెందిన ప్రసిద్ధినొందిన సాంప్రదాయ వరి రకం. ఔషధ గుణాల పుట్ట. వండుకొని తినటంతో పాటు ఆయుర్వేద చికిత్సలలోనూ దీన్ని ఉపయోగిస్తున్నారు.8. వయనాడ్ జీరకశాల, వయనాడ్ గంధకశాల: ఇవి కేరళలోని వయనాడ్ ్ర΄ాంతం నుంచి వచ్చిన రెండు విభిన్న బియ్యం రకాలు. ప్రత్యేకమైన వాసన, రుచికి ప్రసిద్ధి చెందాయి.9. పాలక్కడన్ మట్ట: ‘రోజ్ మట్ట’ బియ్యం అని కూడా పిలుస్తారు. కేరళలోని పాలక్కడ్ ప్రాంతంలో పండిస్తారు. ఈ బియ్యానికి ఉండే ఒక రకమైన ‘మట్టి రుచి’ ప్రత్యేకమైనది. అలాగే, దాని పోషకాలతో పాటు అధిక పీచు పదార్థం వల్ల ప్రసిద్ధి చెందింది.10. అంబెమోహర్: మహారాష్ట్రలో పుట్టిన ఈ చిన్న బియ్యపు గింజలకు విలక్షణమైన మామిడి పువ్వుల మాదిరి సువాసన ఉంటుంది. సున్నితమైన ఆకృతి కూడా ఆకట్టుకుంటుంది.11. అజరా ఘన్సాల్: మహారాష్ట్రలో, ముఖ్యంగా అజరా జిల్లాలో, పండించే ఈ బియ్యం దాని తీపి వాసన, ప్రత్యేకమైన రుచికి ప్రసిద్ధి చెందాయి. సువాసన, అందమైన సన్నని తనానికి సూచికగా దీనికి ‘ఘన్సాల్‘ అని పేరొచ్చింది.12. కతర్ని: బీహార్కు చెందిన కతర్ని ధాన్యపు గింజ చాలా చిన్నది. వండిన అన్నం రుచి, వాసన ప్రత్యేకమైనవి. తీపి, మృదుత్వం, సువాసనతో కూడిన కతర్ని చెయురా (అటుకుల)కు కూడా ప్రసిద్ధి చెందింది.13. తులైపంజి: పశ్చిమ బెంగాల్కు చెందిన మరొక సుగంధ బియ్యం రకం తులైపంజి. జిగట లేని, ప్రకాశవంతమైన, సన్నని ధాన్యపు రకం ఇది. చాలా కాలంపాటు సువాసనను నిలుపుకుంటుంది.14. కైపాడ్ : కేరళకు చెందిన మరో వరి రకం. తీర ప్రాంతాల్లో ఉప్పునీటితో పండించడానికి అనుగుణంగా ఉండే రకం ఇది.15. బాలాఘాట్ చిన్నోర్: మధ్యప్రదేశ్కు చెందిన ఈ రకానికి జీఐ గుర్తింపు ఉంది.16. జీరాఫూల్: ఛత్తీస్గఢ్కు చెందిన సుగంధ బియ్యపు రకం.17. బోకా చౌల్: ఒక విలక్షణమైన అస్సాం వరి రకం. దీన్ని ఉడికించకుండానే నీటిలో నానబెట్టి తినవచ్చు. వేడి నీటిలో ఉడికిస్తే వెంటనే, చల్ల నీటిలో నానబెడితే కొంచెం ఆలస్యంగా తినటానికి సిద్ధమవుతుంది.18. అండమాన్ కరెన్ ముస్లీ: అండమాన్, నికోబార్ దీవులకు చెందిన ఈ వరి రకానికి ఇటీవలే జీఐ ట్యాగ్ పొందింది.19. కోరాపుట్ కలజీర: ఇటీవలే జీఐ ట్యాగ్ పొందిన ఒడిశా సుగంధ వరి రకం.20. కలోనునియా: ఇటీవలే జీఐ ట్యాగ్ పొందిన పశ్చిమ బెంగాల్ సుగంధ వరి రకం.21. మార్చా బియ్యం : బీహార్కు చెందిన సుగంధ వరి రకం. ఇటీవలే జీఐ ట్యాగ్ పొందింది.22. ఉత్తరాఖండ్ లాల్ చావల్: ఉత్తరాఖండ్కు చెందిన ఎర్ర బియ్యపు గింజ రకం.23. ఆడమ్చిని: ఉత్తరప్రదేశ్కు చెందిన చిన్న గింజ సుగంధ వరి రకం ఇది. ఇదీ చదవండి: 70 ఏళ్ల వయసులో 30 ఏళ్ల చిన్నదానితో నటుడి పెళ్లి.. ఇపుడిదే చర్చ!నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి,డెస్క్ -
కెమెరా క్లిక్.. అదిరే పిక్..! ట్రెండింగ్గా మారుతున్న మొబైల్ ఫోటోగ్రఫీ
ఒక్క ఫొటో అనేక భావాలను, అర్థాలను ప్రతిబింబిస్తుంది. చరిత్రలోని అనే సంఘటనలను, మధురానుభూతులకు కళ్లకు కట్టేది ఈ చిత్రమే.. అయితే ఒకప్పుడు ఇది సామాన్యునికి బహుదూరం.. కానీ అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానం కారణంగా నేడు ప్రతి ఒక్కరికీ చేరువయ్యింది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ అనేక మధురమైన జ్ఞాపకాలను పదిలపరుస్తోంది.. మరికొందరికి ప్రకృతిలోని ప్రతిదీ చిత్రీకరించే సాధనంగా మారుతోంది. మొబైల్ రాకతో ఇది మరింత చేరువయ్యింది.. ఈ నేపథ్యంలో మొబైల్ ఫొటోగ్రఫీ అనే హాబీ ట్రెండింగ్ అవుతోంది.. ప్రపంచ ఫొటో గ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు ఔత్సాహికులు వారు తీసిన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.సాధారణంగా సామాజిక మాధ్యమాల్లో రీల్, సినిమాలు, జోకులు, మీమ్స్ వైరల్ అవుతుంటాయి. దీనికి భిన్నంగా గత కొంతకాలంగా యువతకు సంబంధించిన క్రియేటివ్ వర్క్ కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొబైల్స్లో ఫొటోలు తీయడం హాబీగా మారిన కొందరి ఫొటోలు ఫేస్బుక్, ఇన్స్టా వంటి సామాజిక మాధ్యమాల్లో మంగళవారం పోస్టులుగా తెగ వైరల్ అయ్యాయి. వీటికి షేర్లు, లైకులు కొడుతూ పలువురు కామెంట్లు చేశారు. ఫొటో గ్రఫీపట్ల తమకున్న ప్యాషన్ని, తమలోని క్రియేటివిటీని సామాజిక మాధ్యమాల్లో ప్రదర్శించారు. ఒక్కో ఫొటోకూ.. ఒక్కో కథ.. ఈ ఏడాది ఫొటోగ్రఫీ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికలైన ఇన్స్టా, ఫేస్బుక్, ఎక్స్ (ట్విట్టర్), వాట్సాప్ వంటి వేదికలు విభిన్న, వినూత్న ఫొటోలతో నిండిపోయాయి. ప్రతి ఒక్కరు తమ కెమెరాలో బంధించిన ప్రత్యేక క్షణాలను షేర్ చేస్తూ ‘ఇదే నా స్టైల్, ఇదే నా ప్రత్యేకత’ అని తమ ప్రతిభను చాటుకున్నారు. కొందరు యువత ప్రకృతిని తమ కెమెరాలో బంధించగా, మరికొందరు నగర జీవన శైలిని, మరి కొందరు ట్రావెలింగ్, సంస్కృతి, ఆర్ట్, చరిత్ర, ఫుడ్ ఫొటోగ్రఫీ వంటి అంశాలను చిత్రాల రూపంలో ప్రదర్శించారు. ఫొటోగ్రఫీ డే అనేది కేవలం ఒక వేడుక కాదు, ఇది ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను చాటుకునే ఓ వేదిక. ప్రతి ఫొటో ఒక కొత్త కథ చెబుతోంది. అందుకే ఈ ఫొటోగ్రఫీ దినోత్సవం కేవలం ఫొటోల పండుగ మాత్రమే కాదు.. ఒక లైఫ్ స్టైల్ ఫెస్టివల్ అని చెప్పకనే చెబుతోంది. సోషల్ మీడియా పాత్ర.. ఫొటోగ్రఫీకి సోషల్ మీడియా ఒక ప్రధాన వేదికగా మారింది. ఒకప్పుడు ఔత్సాహికులు తీసిన ఫొటోలను ఇంట్లో, ఆల్బమ్స్లో చూసేవాళ్లు. ఇప్పుడు అదే ఫొటోలు నిమిషాల్లోనే ప్రపంచానికి చేరుతున్నాయి. ఇన్స్టా ‘ఫోటోగ్రఫీ డే హాష్ట్యాగ్’తో పోస్ట్ చేస్తే, అది వేల మందికి చేరుతుంది. ఫేస్బుక్లో షేర్ చేస్తే స్నేహితులు, బంధువులు లైక్స్తో ప్రోత్సహిస్తారు. ఎక్స్లో పోస్ట్ చేస్తే వెంటనే ట్రెండింగ్ అవుతుంది. వాట్సాప్ స్టేటస్ ద్వారా మన స్నేహితుల సర్కిల్లో హైలైట్ అవుతాయి. అంటే ప్రతి ఒక్కరి చేతిలో ఒక చిన్నపాటి ప్రచార సాధనం ఉన్నట్లు. ఇది కేవలం వ్యక్తిగత ప్రతిభను చూపించడానికే కాకుండా, నెట్వర్కింగ్లో కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఒక్క ఫొటో ఆధారంగా అనేక మంది కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. కొంతమంది తమ ఫొటోలు పోస్టు చేయడం ద్వారా ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ల దృష్టికి చేరుతున్నారు. మోడలింగ్, ఫొటో ఎగ్జిబిషన్, బ్రాండ్ ప్రమోషన్స్ వంటి అవకాశాలు పొందుతు న్నారు. జన్–జీ స్టైల్ అండ్ క్రియేటివిటీ.. ఫొటోగ్రఫీ డే నేపథ్యంలో సోషల్ మీడియాలో తమ ఫొటోలను కేవలం షేర్ చేయడమే కాదు.. వాటికి ప్రత్యేక ఎఫెక్ట్స్, ఫిల్టర్స్, క్రియేటివ్ క్యాప్షన్స్ జోడించడం ద్వారా కొత్త ట్రెండ్ సృష్టించారు. లైఫ్ స్టైల్ యాప్స్ ఫొటోగ్రఫీని కేవలం హాబీ స్థాయి నుంచి ప్రొఫెషనల్ స్థాయికి తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఒక మంచి ఫొటోతీసి, దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తే, అది స్ఫూర్తిగా మారుతుంది. నగరంలోని యువత తమ ఫొటోగ్రాఫిక్ స్కిల్స్ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. చారి్మనార్, హుస్సేన్ సాగర్, గోల్కొండ వంటి చారిత్రక కట్టడాలు కొత్త కోణంలో కెమెరా కంట పడగా, నగర ఆధునిక లైఫ్ స్టైల్ కూడా ఫ్రేమ్లో బంధీ అయ్యాయి. (చదవండి: లాస్ట్ మీల్ అంటే ఇదేనేమో..! పగోడికి కూడా ఇలాంటి అనుభవం వద్దు..) -
మొక్కిన చోటే 'మొలకెత్తి'..!
మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి గణేశ నవరాత్రి పూజలు చేయడం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. గ్రీన్ గణేశ పేరిటి రీ సస్టైనబిలిటీ, 92.7 బిగ్ ఎఫ్ఎమ్లు మరో ముందడుగు వేశాయి. పర్యావరణానికి ఎంతో మేలు చేసే సీడ్ గణేశ విగ్రహాల పంపిణీకి శ్రీకారం చుట్టాయి. రాయదుర్గంలోని నాలెడ్జీ సిటీలోని మై హోం భూజ గేటెడ్ కమ్యూనిటీలో సీడ్ గణేశ విగ్రహాల పంపిణీ వాహనాన్ని నటుడు, రచయిత తనికెళ్ల భరణి, నటి మధుషాలిని, రీ సస్టైనబిలిటీ ఎండీ మసూద్ మాలిక్ జెండా ఊపి మంగళవారం ప్రారంభించారు. నగరవ్యాప్తంగా మొత్తం 1500 ప్రతిమలను పంపిణీ చేయనున్నారు. పర్యావరణానికి మేలుచేసే ఆక్రీ యాప్ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఆక్రీ యాప్లో సంప్రదిస్తే శానిటరీ వేస్ట్, డైపర్స్, ప్లాస్టిక్, ఈ వేస్ట్, పేపర్ కార్డ్బోర్డ్, ఉడ్ అండ్ ఫర్నీచర్, క్లాత్స్, షూస్, మెటల్ స్క్రాప్ సేకరిస్తారని నిర్వాహకులు తెలిపారు. సేకరించే చెత్తకు కొంత డబ్బులు కూడా చెల్లించనున్నారు. ఈ కార్యక్రమంలో 92.7 ఎఫ్ఎం ఆర్జే శేఖర్ భాషా, ఆర్జే గ్రేస్, మై హోం భూజ అసొసియేషన్ ప్రతినిధులు రాజు మధనపల్లి, విద్యా రెడ్డి, డాక్టర్ కుమార్ పాల్గొన్నారు. (చదవండి: 82 ఏళ్ల వయసులోనూ ఫిట్గా అమితాబ్..! ఆ జాగ్రత్తలు తప్పనిసరి..) -
జగదీశ్వర తత్త్వం
బ్రహ్మ మానస పుత్రుడు అత్రి మహర్షి. మహా సాధ్వి అనసూయ ఆయన భార్య. యోగ్యులూ, ముల్లోకాలకూ పూజనీయులూ స్తుతిపాత్రులూ అయిన మహనీయులు తమకు సంతానంగా కలగాలని అత్రి మహర్షి నూరేళ్ళు తపస్సు చేశాడు. ప్రాణాయామం చేత మనసును నియంత్రించి, గాలి మాత్రమే ఆహారంగా, ఒంటి కాలి మీద నిలబడి తపస్సు చేశాడు. ‘ఈ జగత్తు అంతటికీ ప్రభువైన భగవంతుడెవరో, ఆయన తనతో సమానమైన ఘనులను నాకు సంతానంగా ప్రసాదించు గాక!’ అని తపస్సు చేశాడు. నూరేళ్ల తరవాత, కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతులతో, హంస, గరుడ, వృషభ వాహనాలను అధిష్ఠించి ఉన్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఏకకాలంలో ఆయన ముందు సాక్షాత్కరించారు. ‘‘త్రిమూర్తులారా! నేను తపస్సు చేసింది. జగదీశ్వరుడొక్కడి గురించి. ఆయన కాకుండా, నా తపఃఫలంగా, మీ ముగ్గురు మహనీయులూ నాముందు ప్రత్యక్షం కావటం, నా తపః సంకల్పానికి భిన్నంగా ఉంది!’’ అని. ‘‘సాటిలేని మహర్షివి నువ్వు తపస్సు చేస్తే, నీ సంకల్పమే సిద్ధిస్తుంది. అన్యదా జరగదు. ‘యథా కృతః తే సంకల్పః భావ్యం తేన ఏవ, న–అన్యధా!’ (భాగవతం) మా ముగ్గురి కలయికే నువ్వు ధ్యానించిన జగదీశ్వరుడు. కాబట్టి జగదీశ్వరుడిని నువ్వు ధ్యానించినప్పుడు, నువ్వు ధ్యానించింది మా ముగ్గురినీ! నువ్వు సంకల్పించినట్టే, మా ముగ్గురి అంశలతో, మాకు సములైన ముగ్గురు కుమారులు కలుగుతారు’’ అని వరమిచ్చి వెళ్ళారు. ఆ ప్రకారమే, అత్రి–అనసూయలకు బ్రహ్మ అంశతో చంద్రుడూ, విష్ణువు అంశతో దత్తాత్రేయుడూ, శివాంశతో దుర్వాసుడూ కుమారులుగా కలిగారు. అత్రి–అనసూయ పుణ్య దంపతుల గురించిన కథలు రామాయణ, భారత, భాగవతాలలోనూ, ఇతర పురాణాల్లోనూ కనిపిస్తాయి. జగదీశ్వర తత్త్వం గురించిన పై కథ భాగవతం నాలుగో స్కంధంలోనిది.– ఎం. మారుతి శాస్త్రి -
మలేరియా తగ్గితే జీడీపీ పెరిగింది!
ప్రపంచ వ్యాప్తంగా దోమల నివారణ పెద్ద సమస్యగా మారింది. దోమల వల్ల వచ్చే ముఖ్యమైన వ్యాధి మలేరియా. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నిమిషానికి ఒక మరణం సంభవిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా మలేరియా నియంత్రణలో కష్టించి సాధించిన ప్రగతి ఇప్పుడు ప్రమాదంలో పడి, ముందుకు సాగలేని పరి స్థితి వచ్చింది. వాతావరణం, సామాజిక సంఘర్షణలు, ఆర్థిక స్థితి గతులు, అత్యవసర పరిస్థితులు దీనికి అడ్డంకులుగా మారుతు న్నాయి. అందువలన మలేరియా నియంత్రణ ప్రాథమిక సూత్రాలైన గుర్తింపు, చికిత్స, నివారణ చర్యలు అందుబాటులో ఉండటం లేదు. నిరూపితమైన నివా రణ చర్యల కోసం తిరిగి పెట్టుబడి పెట్టడం, అడ్డంకులను తొలగించు వ్యూహా లను పన్నడం, కలసికట్టుగా తిరిగి అందరూ ఈ కొత్త ప్రయత్నాలను మొదలు పెట్టడం ద్వారా మలేరియాను అంతం చేయవచ్చు.2000 – 2017 మధ్య 180 దేశాల మలే రియా, స్థూల దేశీయోత్పత్తు (జీడీపీ)ల డేటాలను విశ్లేషించినప్పుడు... మలేరియా సంభవం 10% తగ్గినప్పుడు తలసరి జీడీపీలో సగటున 0.3% పెరుగుదల ఉందని తేలింది. ప్రతి దేశం మలేరి యాను నివారించడానికీ, గుర్తించడానికీ, చికిత్స చేయడానికీ ఒక కొంగొత్త సాంకేతికతను వాడుతున్నాయి. దోమల జీవిత కాలాన్నీ, అవి మలేరియాను వ్యాప్తి చేసే సామర్థ్యాన్నీ తగ్గించడానికి పురుగు మందులతో కూడిన దోమ తెరల సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. 2000లో ఈ సాంకేతికతను విస్తరించినప్పటి నుండి 68 శాతం మలేరియా కేసులను నివారించినట్లు అంచనా. ‘కాలానుగుణ మలేరియా చికిత్స’ పొందిన పిల్లలలో దాదాపు 75 శాతం మలేరియా బారి నుంచి బయటపడ్డారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు దీర్ఘకాలం ఉండే దోమ తెరలు, మోనోక్లోనల్ యాంటీ బాడీ చికిత్స, శక్తిమంతమైన కొత్త వాహక నియంత్రణ సాధనాలు, జన్యుపరంగా మార్పు చెందిన దోమలు, ప్రపంచంలోని మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ వంటి విప్లవాత్మక ఆవిష్కరణలపై పనిచేస్తున్నారు. ఇదీ చదవండి: కేవలం రూ.3.5 లక్షలతో ఫ్యాషన్ బ్రాండ్..రూ. 500 కోట్ల దిశగాEven mosquitoes are worried! 🦟With clean surroundings, covered tanks, and repellents in every home, they have nowhere to hide. This World Mosquito Day, let’s keep our communities safe and mosquito-free.#WorldMosquitoDay #FightTheBite pic.twitter.com/ydoux9ZrwO— Ministry of Health (@MoHFW_INDIA) August 20, 2025 అందువలన గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ దేశాలు మలేరియా నిర్మూ లనకు దగ్గరగా ఉన్నాయి. మన దేశంలో గత సంవత్సరం 2,57,383 మలే రియా కేసులు, 62 మరణాలు నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజన ఆవాసాలు, కొండ ప్రాంతాల్లో మలేరియా కేసులు ఎక్కువగా నమో దవుతూ ఉన్నాయి. అక్కడ జనాభా 20% మాత్రమే ఉన్నప్పటికీ, 80% కేసులు అక్కడే ఉన్నాయి. మనందరం కలిసి మలేరియాను సమూలంగా తొలగించేందుకు కంకణం కట్టుకుందాం. ఇది మన సమష్టి బాధ్యత.– తలతోటి రత్న జోసఫ్, మెడికల్ ఎంటమాలజిస్ట్ -
82 ఏళ్ల వయసులోనూ ఫిట్గా అమితాబ్..! ఆ జాగ్రత్తలు తప్పనిసరి..
‘వయసు పైబడడం అనేది సహజం... వచ్చే సమస్యలు కూడా సహజం’ అని ఆరోగ్యాన్ని గాలికి వదిలేసేవారు కొందరు. ‘వయసు పైబడడం అనేది సహజమే అయినా, తగిన జాగ్రత్తలు తీసుకోవడం, వ్యాయామాలు చేయడం తప్పనిసరి’ అని ముందుకు వెళ్లేవారు కొందరు. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ రెండో కోవకు చెందిన వ్యక్తి.తన ఆలోచనలను పర్సనల్ బ్లాగ్ ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు బిగ్ బి. 82 సంవత్సరాల అమితాబ్ తాజాగా వృద్ధాప్యానికి సంబంధించిన సవాళ్ల గురించి తన తాజా పోస్ట్లో రాశారు. ఇంట్లో ‘హ్యాండిల్ బార్స్’ అవసరం గురించి ప్రస్తావించారు.వృద్ధుల కోసం బాత్రూమ్లో, ఇంట్లోని కొన్ని చోట్ల హ్యాండిల్ బార్స్ లేదా గ్రాబ్ బార్స్ ఏర్పాటు చేస్తారు.‘మీట్–అండ్–గ్రీట్ విత్ ఫ్యాన్స్’లో భాగంగా అభిమానులను కలుసుకున్న తరువాత తన దినచర్య గురించి రాశారు బిగ్ బి.‘శరీరం క్రమేణా సమతుల్యత కోల్పోతోంది’ అని రాసిన బచ్చన్ తన ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెడుతున్నారు. యోగా, శ్వాస వ్యాయామాలు, మొబిలిటీ వ్యాయామాల ప్రాముఖ్యత గురించి తన పోస్ట్లో నొక్కి చెప్పారు.‘82 సంవత్సరాల వయసులోనూ ఇంత చురుగ్గా ఎలా ఉండగలుగుతున్నారు?’ అనే ప్రశ్నకు సోషల్ మీడియాలో ఆయన పోస్ట్లే సమాధానం చెబుతాయి. సందర్భానుసారంగా ఉన్నత జీవనశైలికి సంబంధించిన అలవాట్ల గుంచి ఎన్నో పోస్ట్లలో వివరించారు అమితాబ్.ఎన్నో అనారోగ్య సమస్యలను అధిగమించి ఉత్సాహంగా ముందుకు వెళుతున్న సూపర్ స్టార్ నిజమైన పోరాట యోధుడు. ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే వ్యక్తి. (చదవండి: 'బ్యూటిఫుల్ బామ్మ'..! ఫిట్నెస్లో సరిలేరు ఈమెకెవ్వరూ..) -
రెండవ భార్యకీ – తన పిల్లలకూ భర్త ఆస్తిలో, పెన్షన్లో హక్కు ఉంటుందా?
భార్య లేదా భర్త బతికి ఉండగా, చట్టరీత్యా విడాకులు తీసుకోకుండా చేసుకున్న రెండవ పెళ్లి చెల్లదు. ప్రస్తుతం ఉన్న చట్టాలలో (ముస్లింలకు, కొన్ని ప్రత్యేక మతాచారాలు వున్నవారికి తప్ప) అది నేరం కూడా. అందుకనే రెండవ భార్యకి భర్త ఆస్తిలో ఎటువంటి హక్కు ఉండదు. మొదటి భార్య సంతానానికి, రెండవ భార్య సంతానానికి మాత్రం ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది. అయితే మొదటి భార్య చని΄ోయిన తర్వాత, లేదా విడాకులు తీసుకున్న తర్వాత రెండోపెళ్లి చేసుకుంటే, ఆ రెండవ భార్యకి కూడా మొదటి భార్య సంతానం – రెండవ భార్య సంతానంతోపాటు ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది. ఉదాహరణకు: చనిపోయిన మొదటి భార్యకి భర్తకి కలిపి ఇద్దరు సంతానం ఉన్నారు. అలాగే రెండవ భార్యకి ఇద్దరు సంతానం ఉన్నారు. ఎటువంటి వీలునామా రాయకుండా చని΄ోయిన భర్త స్వార్జితంలో – పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తిలో 5 భాగాలు అవుతాయి. అందులో నాలుగు భాగాలు మొదటి – రెండవ భార్య సంతానానికి, ఒక భాగం రెండవ భార్యకి చెందుతాయి.అయితే ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ – పదోన్నతి తర్వాత సంక్రమించే సర్వీస్ బెనిఫిట్స్ కి సంబంధించి మాత్రం చట్టం కొంత వేరుగా ఉంటుంది. సాధారణ పరిస్థితులలో, పైన తెలిపిన విధంగా చెల్లుబాటు కానీ పెళ్లి చేసుకున్న రెండవ భార్యకి పెన్షన్, సర్వీస్ బెనిఫిట్స్లో ఎటువంటి హక్కూ ఉండదు. అయితే అన్ని వేళలా అలా వుండదు. ఇటీవలే 2023లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పులో మొదటి భార్య బతికి ఉన్నప్పటికీ, చట్టరీత్యా విడాకులు తీసుకోనప్పటికీ రెండవ భార్యకి కూడా పెన్షన్ – సర్వీస్ బెనిఫిట్స్లో సమాన హక్కు కల్పించింది. మొదటి భార్య నుంచి విడాకులు కావాలంటూ చని΄ోయిన ప్రభుత్వ ఉద్యోగి డైవర్స్ కేసు ఫైల్ చేసి ఉండడం ఆ కేసులో గమనించదగ్గ అంశం. అంతేకాక ఫ్యామిలీ పెన్షన్ ఉద్దేశానికీ, మెయింటెన్స్ చట్టం వెనుక ఉన్న ఉద్దేశానికీ తేడా ఏమీ లేదని అంటూ, భర్త బతికివుండగా మొదటి భార్యకు రావలసివున్న మెయింటెనెన్స్ బకాయిలు కూడా తనకు ఇవ్వాలి అని కోర్టు పేర్కొంది. మొదటి భార్యకి, రెండవ భార్యకి పెన్షన్ సమానంగా రెండు భాగాలుగా పంచాలి అని కోర్టు తీర్పు వెలువరించింది. రైల్వే విభాగంలో మాత్రం పెన్షన్ రూల్స్లోని సెక్షన్ 75 ప్రకారం, మొదటి భార్యకి – రెండవ భార్యకి కూడా పెన్షన్లో సమాన హక్కు ఉంటుందని గతంలో పలు హైకోర్టులు పేర్కొన్నాయి కాబట్టి కేసు పూర్వాపరాలను బట్టి కొన్ని హక్కులు రెండవ భార్యకూ వర్తిస్తాయా లేదా అన్నది పూర్తిగా ఆయా కేసులోని ప్రత్యేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనేవారు చట్టాన్ని ఆశ్రయిస్తే తగిన ఉపశమనం దొరికే ఆస్కారం ఉంది. శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకి మెయిల్ చేయవచ్చు)(చదవండి: Pregnant Women: బీకేర్ఫుల్.. మార్నింగ్ సిక్నెస్ని లైట్ తీసుకోవద్దు!) -
సీమంతానికి సిద్ధమవుతున్న ప్రెగ్నెంట్ ‘రోబో’లు!!
‘‘ఇనుములో ఓ హృదయం మొలిచెనే’’ అన్నది రోబో సినిమాలో ఓ పాట. అదే పాట పదాలను కాస్త మారిస్తే ‘నర రూప రోబో’ ఒకటి పాడే పాటల్లో పదాలిలా ఉండొచ్చు... అవి... ‘‘ఐ యామ్ ఏ సూపర్ గాళ్. ‘కనిపెంచే’ రోబో గాళ్... కడుపున మోసే ప్రెగ్నెంట్ గాళ్!! ’’ ఈ పాటలూ, మాటలూ... అందులోని పదాల ప్రస్తావననే ఇప్పుడెందుకంటే మహిళలు తమ గర్భాన మొయ్యాల్సిన ప్రెగ్నెన్సీ బరువును ఇకపై రోబోలే కడుపున మోసే రోజులు త్వరలో రానున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా చైనా ఒక రోబోను రూపొందించింది. అవును... ఇనుములో హృదయానికి బదులు ఇప్పుడో గర్భసంచి నిజంగానే రూపొందింది. వచ్చే ఏడాదికి అందులో బిడ్డ ప్రసవమూ జరగనుందంటోంది చైనా. ఆ వివరాలేమిటో చూద్దాం. గ్వాంగ్ఝూ నగరంలోని కైవా టెక్నాలజీస్ సంస్థ ఓ హ్యూమనాయిడ్ రోబోను రూపొందించింది. ఆ రోబో ప్రత్యేకత ఏమిటంటే... దాని కడుపున బిడ్డను మోసేలా ఓ కృత్రిమ గర్భసంచిని ఏర్పాటు చేశారు అక్కడి శాస్త్రవేత్తలు. ఇప్పుడీ ‘ఆర్టిఫిషియల్ ఊంబ్’ అమరి ఉన్న ఆ రోబో వచ్చే ఏడాదికి మార్కెట్లోకి రానుందని చెబుతున్నారు ‘కైవా టెక్నాలజీస్’ సంస్థ వ్యవస్థాపకుడు ఝాంగ్ క్వి ఫెంగ్. ఆయన చెబుతున్న ప్రకారం ఆ రోబో ధర దాదాపు లక్ష యువాన్ల కంటే తక్కువే. డాలర్లలో చె΄్పాలంటే 13,900 డాలర్లు. అంటే మన భారత కరెన్సీలో అటు ఇటుగా దాదాపు రూ. 12 లక్షలు!అదెలాగంటే... ఇదెలా సాధ్యమని అనుకోడానికి ఇప్పుడు వీల్లేదు. మనకు అర్థమయ్యే భాషలో చె΄్పాలంటే... ఇక్కడ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలను కృత్రిమ గర్భంలాంటి ఇంక్యుబేటర్లో పెట్టి సాకినట్టే... ఆ రోబోకు ఓ కృత్రిమ ఇంక్యుబేటర్ అమరి ఉంటుంది. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో రూపొందే ఆ ఇంక్యుబేటర్... బిడ్డ పెరుగుదలను బట్టి సమకూర్చాల్సిన సౌకర్యాలూ, అందించాల్సినపోషకాలూ ఇవన్నీ అందిస్తుంది.అంతేకాదు... స్వాభావికంగా రూపొందించిన పిండాన్ని కృత్రిమంగా ఏర్పాటు చేసిన ఉమ్మనీటిలో (ఆమ్నియాటిక్ ఫ్లుయిడ్లో) ఉంచుతూ, ఓ పైపు ద్వారా కృత్రిమపోషకాలతో పెంచుతూ... నెలలు నిండి బిడ్డ పూర్తి రూపం సంతరించుకోవడం (జెస్టేషన్) పూర్తయ్యాక ప్రసవం పూర్తి చేసి ఆ గడుసుపిండాన్ని మానవ మాతృమూర్తి చేతుల్లో పెడుతుందా రోబో గట్టి‘పిండం’. అలా తన గర్భాన పెంచి తన కడుపు పంటను మానవ మహిళ చేతుల్లో ఉంచుతుందా ‘యంత్రమాత’!! ఈ విధంగా సరోగసీలో అమ్మల అవసరాల్ని తీర్చడమే కాదు... కడుపున బిడ్డ భారం మోయలేని అమ్మలకూ ఓ వరప్రసాదంలా మారనుందంటున్నారు ఝాంగ్ క్విఫెంగ్. ఈ కాన్సెప్టును ఈ ఏడాది బీజింగ్లో నిర్వహించిన ఓ కాన్ఫరెన్స్లోనే వెల్లడించారాయన. ‘‘ఈ రోబో కేవలం ఓ లైఫ్సైజ్ ఇంక్యుబేటర్ మాత్రమే కాదు. ఇది కేవలం హ్యూమనాయిడ్ రోబో మాత్రమే కాదు... కడుపున పెంచడం మొదలుకొని, కనేవరకూ... యంత్రగర్భంలోంచి ప్రసవం వరకు కడుపున పెరిగే సమయంలో ఏయే కార్యకలా పాలు జరుగుతాయో వాటన్నింటినీ నెరవేరుస్తూ చిన్నారి బిడ్డను పెంచే ఓ యాంత్రిక మమకారాల ‘గర్భ’కోశం’’ అంటూ వివరించారు ఝాంగ్ క్విఫెంగ్. ఇలా ఆయన తన కాన్సెప్టును వివరించారో లేదో ఈ తరహా రోబోల గర్భధారణల తాలూకు నైతిక అంశాలపై ప్రస్తుతం అక్కడ తీవ్ర చర్చ మొదలయ్యింది. అయితే ప్రస్తుతానికి జవాబు దొరకాల్సిన అంశాలు ఇంకా కొన్ని ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేమిటంటే... పిండాన్ని పెంచే కృత్రిమ గర్భమైతే రూపొందింది గానీ, వీర్యకణం, అండం తాలూకు ఫలదీకరణమంతా ఈ కృత్రిమ గర్భంలో జరుగుతుందా లేక టెస్ట్ట్యూబ్ బేబీలోలా బయట ఫలదీకరణ జరి పాక అందులో ప్రవేశపెడతారా, ప్రసవం తాలూకు తీరుతెన్నులేమిటి, ఈ తరహా గర్భం తాలూకు చట్టబద్ధత, నైతికత లాంటి అనేక అంశాలపై హాట్ హాట్ డిబేట్లు జరుగుతున్నాయి. – యాసీన్అటు అమెరికాలోనూ...చైనాలోని గర్భవతులైన యాంత్రిక రోబోల తీరుతెన్నులిలా ఉంటే... ప్రపంచపు మరో పక్కన అమెరికాలోని న్యూయార్క్ సిటీ మిడ్టౌన్లో ‘కాయిడ్ (కే ఓ ఐ డీ)’ అనే బ్రాండెడ్ రోబో వీధుల్లో తిరుగుతూ బర్గర్లూ, హ్యాంబర్గర్లు కొంటూ యంత్రమానవుల్లా సంచరిస్తోంది. దాన్ని చూస్తూ, నవ్వుతూ, భయపడుతూ, ఫొటోలూ తీసుకుంటున్న కొందరు రకరకాల కామెంట్లు చేస్తూ ఉన్నారు. ‘‘దేవుడు చెప్పినట్టుగా సాతాన్ స్వైరవిహారాలు చేసే కాలం వచ్చేసిందనీ’’, ‘‘మొదటి లైట్ బల్బ్నూ, మొదటి కారునూ నేను చూళ్లేదు గానీ... మొట్టమొదటి మానవ రోబోను చూస్తున్న అనుభూతిని నాకు సొంతం చేసిందీ కాయిడ్’’ అంటూ పలుపలు విధాల కామెంట్స్ వినవస్తున్నాయి. దీనికి భిన్నంగా పాజిటివ్ కామెంట్సూ వినవస్తున్నాయి. అవేమిటంటే... ‘‘ఇదో అద్భుతం’’ అని కొందరూ; ‘‘కుక్కల బొచ్చు వల్ల అలర్జీలతో బాధపడేవారికి ఇవి వాచ్డాగ్స్లా, అసిస్టెంట్లుగా పనిచేస్తాయి’’ అంటూ ఇంకొందరూ, ‘‘మా ఇంట్లో పనిమనిషిలా వాడుకుంటా’’ అంటూ మరికొందరు మరో వైపున మరో తరహా కామెంట్లూ స్వైరవిహారం చేస్తున్నాయి. అన్నట్టు ఈ కాయిడ్ రోబో కూడా ‘యూనీ ట్రీ’ అనే చైనీస్ రోబోటిక్ సంస్థ రూపొందించగా లాంగ్ ఐలాండ్ బేస్డ్ రోబో స్టోర్ అనే స్టాన్ఫార్డ్ సాఫ్ట్వేర్ ఆధారంగా ఇది రూపొందిందంటున్నారు అక్కడి నిపుణులు. -
మిస్ యూనివర్స్ వేదికపై అందాల ‘మణి’క
నవంబర్లో థాయ్లాండ్లో జరగనున్న మిస్ యూనివర్స్ 2025పోటీలో పాల్గొనబోతున్న భారతీయ సుందరిగా మనికా విశ్వకర్మ(Manika Vishwakarma) ఎంపికైంది.రాజస్తాన్కు చెందిన మనిక విశ్వకర్మ ప్రస్తుతం పోలిటికల్ సైన్స్ చదువుతోంది. క్లాసికల్ డాన్సర్గా ప్రతిభ చూపడమే కాదు ‘న్యూరోనోవా’ అనే సంస్థను స్థాపించి పుట్టుకతోనే న్యూరో సమస్యలతో బాధపడే చిన్నారులకు సాయం చేస్తోంది మనిక. ఆమె పరిచయం.దాదాపు 100కు పైగా దేశాల సుందరీమణులు పాల్గొనే ‘మిస్ యూనివర్స్’పోటీలలో 2025 సంవత్సరానికి భారతదేశం తరఫున పాల్గొనే ప్రతినిధిగా 22 సంవత్సరాల మనిక విశ్వకర్మ ఎంపికైంది. జైపూర్లో మంగళవారం తెల్లవారుజాము వరకూ సాగిన తుది ఎంపిక వేడుకలో మనిక విశ్వకర్మ ‘మిస్ యూనివర్స్ ఇండియా 2025’ కిరీటం దక్కించుకుంది. గత సంవత్సరం ఈ టైటిల్ గెలుచుకున్న రియా సిన్హా ఆమెకు కిరీటం తొడిగింది. ఉత్తర ప్రదేశ్కు చెందిన తాన్యా శర్మ ఫస్ట్ రన్నర్ అప్గా, హర్యాణకు చెందిన మెహక్ ధింగ్రా రెండవ రన్నర్ అప్గా ఈపోటీలో నిలిచారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల అందగత్తెలు ఈపోటీలో పాల్గొనగా రాజస్తాన్కు చెందిన మనిక విజేతగా నిలిచింది. నవంబర్లో థాయ్లాండ్లో జరగనున్న 74వ ‘మిస్ యూనివర్స్’పోటీలలో మనిక తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గతంలో మిస్ యూనివర్స్ కిరీటాన్ని మన దేశం నుంచి సుస్మితాసేన్ (1994), లారా దత్తా (2000), హర్నాజ్ సంధు (2021) గెలుచుకున్నారు.స్త్రీ విద్య ముఖ్యమైనదిమిస్ యూనివర్స్ ఇండియా 2025 విజేత తుది ఎంపికలో జ్యూరీ అడిగిన ప్రశ్నకు మనిక ఇచ్చిన జవాబు అందరినీ ఆకట్టుకుంది. ‘స్త్రీలకు విద్య అందించే అవకాశం ఒకవైపు, పేద కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన అందించే అవకాశం మరోవైపు నీకు ఉంటే దేనిని ఎంచుకుంటావ్’ అనే ప్రశ్నకు మనిక ‘నేను స్త్రీ విద్యనే ఎంచుకుంటాను. ఎందుకంటే స్త్రీలకు విద్య నేర్పించడం వల్ల ఆమె మాత్రమే మారదు... కుటుంబాలు... తద్వారా భవిష్యత్ తరాలు మారుతాయి’ అని సమాధానం ఇచ్చింది.డాన్సర్, పెయింటర్రాజస్తాన్లోని గంగానగర్ అనే చిన్న పట్టణానికి చెందిన మనిక విశ్వకర్మ బాల్యం నుంచి క్లాసికల్ డాన్సర్. పెయింటర్ కూడా. ఆమెను లలిత కళా అకాడెమీ, జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్ సత్కరించాయి కూడా. పోలిటికల్ సైన్స్ స్టూడెంట్గా ఢిల్లీలో ఉంటూపోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూనే అందాలపోటీలో పాల్గొంది మనిక. ఒక సాధారణ నేపథ్యం నుంచి విజేతగా నిలిచింది. ‘అందరూ ఈ సమయంలో తాము పడ్డ కష్టాల గురించి చెబుతారు. కాని నేను నాకు దొరికిన సపోర్ట్ గురించి చెబుతాను. మా అమ్మా నాన్నలు నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. నాకు చదువు నేర్పిన గురువులది తర్వాతి స్థానం. నా స్నేహితులు ఎంతో ్రపోత్సహించారు. వీరందరూ లేకుంటే నేను ఇక్కడి వరకూ రాను’ అని చెప్పిందామె.సామాజిక సేవలో...పుట్టుకతోనే న్యూరో సంబంధ సమస్యలతో పాల్గొనే చిన్నారుల కోసం ‘న్యూరోనోవా’ అనే సంస్థను స్థాపించింది మనిక. డౌన్ సిండ్రోమ్, ఏడీహెచ్డీ వంటి సమస్యలతో బాధ పడే చిన్నారులకు తగిన కౌన్సెలింగ్, సపోర్ట్ ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉంది. ‘మిస్ యూనివర్స్ వంటిపోటీలు గుర్తింపును ఇవ్వడం మాత్రమే కాదు వ్యక్తిత్వాన్ని కూడా తీర్చిదిద్దుతాయి. ఈపోటీలలో సవాళ్లను ఎదుర్కొంటూ విజేత అయ్యాను. ఈ గుర్తింపుతో నా సామాజిక సేవను విస్తరిస్తాను. సమాజానికి ఏదో ఒకటి చేయడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత’ అంది మనిక. -
భారతదేశపు తొలి మహిళా ఫోటో జర్నలిస్ట్ ఎవరో మీకు తెలుసా?
ధైర్యవంతురాలు, స్వతంత్రురాలు , అసాధారణమైన మహిళ హోమై వ్యారవల్లా(Homai vyarawalla) భారతదేశపు మొట్టమొదటి మహిళా ఫోటో జర్నలిస్ట్గా ప్రసిద్ధి చెందారు. 1947 ఆగస్టు 16న ఎర్రకోటలో జరిగిన మొట్టమొదటి జెండా ఎగురవేత కార్యక్రమం నుండి మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ వంటి ప్రముఖుల దహన సంస్కారాల వరకు - భారత చరిత్రలో అత్యంత చిరస్మరణీయమైన , అద్భుతమైన క్షణాలను బంధించిన ఘనత ఆమెకే దక్కింది. ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఆమె గురించిన కొన్ని విశేషాలు.భారతదేశం ఇంకా బ్రిటిష్ పాలనలో ఉన్న కాలంలో,చాలా తక్కువ మంది భారతీయ మహిళలు మాత్రమే విద్యను పొందే అవకాశం ఉన్న సమయంలో ఆమె ఫోటోగ్రఫీపై మక్కువ పెంచుకున్నారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం ఉధృతంగా ఉన్న సమయంలో మొత్తం దేశం రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో, పేద పార్సీ కుటుంబానికి చెందిన హోమై వ్యారవల్లా అనే యువతి ఫోటో జర్నలిస్ట్గా తన కెరీర్ను ప్రారంభించింది. కానీ అప్పుడు ఆమె ఊహించి ఉండదు తన పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించి ఉంటుందని.ఆమె తొలి ఛాయాచిత్రం బొంబాయిలోని ఉమెన్స్ క్లబ్ పిక్నిక్ పార్టీలో మహిళల క్లిక్. ఈ ఛాయాచిత్రం 1930లో బాంబే క్రానికల్స్ మ్యాగజైన్లో ప్రచురించారు. దీనికి హోమై ఫోటోకు ఒక రూపాయి చొప్పున అందుకున్నారు.హోమై వ్యారవల్లా 1913లో గుజరాత్లోని నవ్సరి అనే చిన్న గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి ఉర్దూ-పార్సీ థియేటర్ కంపెనీలో నటుడు. హోమై తన ప్రాథమిక విద్యను సూరత్కు సమీపంలోని వ్యారాలో పూర్తి చేశారు. తరువాత ఆమె కుటుంబం ముంబైకి వెళ్లి అక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కళాశాలలో క్లాస్మేట్ మరియు ఫోటోగ్రఫీలో తన టీచర్ అయిన మానెక్షాను కలిసింది, తరువాత ఆమె వివాహం చేసుకున్నారు.ఆమె ఢిల్లీకి వెళ్లి బ్రిటిష్ హై కమిషన్లో చేరారు, అక్కడ ఆమె ఫోటో జర్నలిస్ట్గా తన కెరీర్ను ప్రారంభించి ఎన్నో మరపురాని, చరిత్రలో నిలిచిపోయే ఫోటోలను అందించారు. హోమై వ్యారవల్లా జవహర్లాల్ నెహ్రూను తనకు ఇష్టమైన సబ్జెక్ట్గా భావించేవారట. ఆయన అత్యంత ఫోటోజెనిక్ వ్యక్తి అని పొగిడేవారట. 1969లో ఆమె భర్త మరణం తర్వాత ఫోటోగ్రఫీని శాశ్వతంగా వదిలేసి కుమారుడు ఫరూఖ్ దగ్గరికి వెళ్లిపోయారు. 2012లో 98 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచింది. హోమై 2010లో భారతదేశపు మొట్టమొదటి జీవిత సాఫల్య జాతీయ ఫోటో అవార్డును అందుకున్నారు . అలాగే 2011లో పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు. -
'బ్యూటిఫుల్ బామ్మ'..! ఫిట్నెస్లో సరిలేరు ఈమెకెవ్వరూ..
సుదీర్ఘకాలం ఆయురారోగ్యాలతో జీవించిన ఎందరో బామ్మలు, ముత్తాతల స్టోరీలను చూశాం. ఒక్కొక్కరిది ఒక్కో కథ. వివిధ కారణాల రీత్యా వారంతా తమ ఆరోగ్యంపై ఫోకస్ పెట్టారు. కానీ వందేళ్లకు చేరువయ్యేటప్పటికీ.. అంత చురుగ్గా లేరు. కానీ వృద్ధాప్యాన్ని ఆరోగ్యవంతంగా మార్చుకోవడంలో స్ఫూర్తిని కలిగించారు. కానీ ఈ బామ్మ వందేళ్లుంటాయా..! అని ఆశ్చర్యపోయేలా ఆమె ఆహార్యం ఉంటుంది. అచ్చం సంతూర్ యాడ్ తలపించేలా భలే యాక్టివ్గా యంగ్ విమెన్లా ఉంటుంది. అంతేకాదండోయ్ చూడటానికి మంచి అందంగా కూడా ఉంటుంది ఈ బామ్మ. ఆఖరికి ఫిట్నెస్లో కూడా ఆమెకు సరిరావెవ్వరూ..!.. అన్నట్లుగా కసరత్తులు చేస్తుంది ఈ బామ్మ. ఆ బామ్మ పేరు హోస్ట్ ర్యాన్ జేమ్స్ రూత్. ఆమెకు వందేళ్లు. ఆమె స్వయంగా తన దీర్ఘాయువు రహస్యాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ..తన వర్కౌట్లకు సంబంధించిన వీడియోని పంచుకుంది. ఆ వీడియో క్లిప్లో జిమ్లో రకరకాల మిషన్లపై ఎలాంటి వ్యాయామాలు చేయగలదో చూపించడమే గాక..ప్రతిరోజూ తప్పకుండా 4 మైళ్లు దూరం నడుస్తానని అంటోంది. అదే తనను ఇన్నాళ్లు ఆయురారోగ్యాలతో జీవించేలా చేసిందని చెబుతోంది. తాను పదవీవిరణమణ చేసినప్పటి నుంచి నాలుగు మైళ్లు దూరం నడుస్తున్నట్లు తెలిపింది. చక్కటి వ్యాయామాలు, 9.30 కల్లా కంటినిండా నిద్రపోవడం తదితరాలే తన ఆరోగ్య రహస్యమని అంటోంది. ఎక్కువగా కూరగాయలే తీసుకుంటాను, పైగా ఆరోగ్యంగా ఉండేలా శ్రద్ధ తీసుకుంటానంటోంది. చివరగా తాను అత్యంత ధనవంతురాలిగా పేర్కొంది. అంటే ఆయురారోగ్యాలకు మించిన ఐశ్వర్యం లేదని పరోక్షంగా ఇలా చెప్పింది ఆ బామ్మ. ఇదిలా ఉండగా, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం..వృద్ధాప్యంలో చక్కగా వ్యాయామాలు చేస్తే రక్తపోటు, బ్రెయిన్-గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటాయట. అలాగే కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు దరిచేరవని చెబుతున్నారు. పైగా బరువుని నిర్వహించగలమని, ఎముకలు కూడా దృఢంగా ఉంటాయని చెబుతున్నారు. కాగా, నెటిజన్లు ఆ బామ్మ దీర్ఘాయువు రహస్యం విని విస్తుపోవడమే కాదు..ఆమె ఈ వయసులో ఏకంగా నాలుగు మైళ్ల దూరం నడుస్తోందంటే..ఈమె సూపర్ బామ్మ. ఫిట్నెస్లో ఈమెకు సరిరెవ్వరూ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by evry.day club (@evrydayclub) (చదవండి: Pregnant Women: బీకేర్ఫుల్.. మార్నింగ్ సిక్నెస్ని లైట్ తీసుకోవద్దు!) -
400 లగ్జరీ బ్యాగ్స్, ఈ పిచ్చిలేకపోతే ముంబైలో పెంట్ హౌస్ కొనేదాన్ని: నటి
సెలబ్రిటీ విమెన్ అంటే లగ్జరీ బ్యాగులు, లగ్జరీ కార్లు కామన్. లగ్జరీ వస్తువుల కలెక్షన్ అనగానే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య, ఫ్యాషన్ ఐకాన్ నీతా అంబానీ గుర్తు వస్తారు. కానీ ఈ విషయంలో నేనేమీ తక్కువ కాదంటోంది బాలీవుడ్ అందాలభామ అమీషా పటేల్.అమీషా పటేల్ వద్ద వందల సంఖ్యలో లగ్జరీ బ్యాగులున్నాయి. దీంట్లో ఒక బ్యాగు ఖరీదు రూ. 70 లక్షలు. ఈ బ్యాగులు కొనకపోతే ఆ డబ్బులతో ముంబైలో పెంట్ హౌస్ కొనేదాన్ని అని స్వయంగా అమీషానే జోక్ చేసిందంటే వాటి విలువను అర్థం చేసుకోవచ్చు.ఫరా ఖాన్ ప్రముఖుల ఇళ్లను సందర్శించే యూట్యూబ్ షో తాజా ఎపిసోడ్లో దక్షిణ ముంబైలోని నటి అమీషా పటేల్ (ఆగస్టు 18 సోమవారం) ఇంటిని సందర్శించిన వీడియోను పంచుకుంది, దీనిలో ఆమె రెడ్ చికెన్ థాయ్ కర్రీని కూడా వండింది, కహో నా... ప్యార్ హై షూటింగ్ ,థాయిలాండ్లో ప్రతి రాత్రి ఆ వంటకం తినడం గురించి గుర్తుచేసుకుంది.ఇంకా ఈ వీడియోలో తన ఇంటితోపాటు ,స్పెషల్ ఎడిషన్ బ్యాగులు , విలాసవంతమైన షూ కలెక్షన్లతో నిండిన బహుళ అల్మారాలను కూడా చూపించింది.400 బ్యాగులు, రూ. 70 లక్షల బ్యాగు కూడాఅమీషా అల్మారాలో బ్యాగుల ధర 5 లక్షల నుండి ప్రారంభమవుతాయనీ, డిజైన్ సేకరణను బట్టి పది లక్షల వరకు ఉంటుందని తెలిపింది. డియోర్ , బొట్టెగా వెనెటా నుండి బిర్కిన్స్ అండ్ YSL టోట్ల వరకు తన దగ్గర ఉన్న ప్రతీవిలువైన వస్తువును పరిచయం చేసింది. తన దగ్గర ‘300-400’ వరకు బ్యాగులు ఉంటాయని వెల్లడించింది. అమీషా పటేల్కు లగ్జరీ బ్యాగ్స్ అంటేచిన్నప్పటినుంచీ చాలి ఇష్టమట. తాజాగా తన దగ్గర ఉన్న బ్యాగ్స్ కలెక్షన్స్, ఖరీదైన బ్యాగ్ గురించి చెప్పుకొచ్చింది. తన దగ్గర ఉన్న ఖరీదైన బ్యాగ్ బిర్కిన్ బ్యాగ్ ధర రూ. 70 లక్షలు ఉంటుందని బయటపెట్టింది. వీటితోపాటు 365 క్లచ్లు బెల్ట్ బ్యాగులు కూడా ఉన్నాయి. అంతేకాతు తనకెంతో ఇష్టమైన పింక క్రోక్ బిర్కిన్ లెదర్ బ్యాగు గురించి ప్రత్యేకంగా చెప్పింది. దాదాపు 15 సంవత్సరాల క్రితం కొన్నప్పుడు, లేత గులాబీ రంగులో ఉండేదట. క్రమంగా తోలు రంగు మరింత అందంగామారుతోందని చెప్పుకొచ్చింది.ఇక అమీషా షూ కలెక్షన్ విషయానికి వస్తే ఒక్కో షూ ధర రూ. 80,000 నుండి లక్ష వరకు ఉంటుంది. అలాంటివి వందల జతలు ఆమె అల్మారాలో ఉన్నాయి. అమీషా పటేల్ ముంబై ఇల్లుఆమె వ్యక్తిగతంగా తీర్చిదిద్దుకున్న అమీషా ముంబై ఇంటిలో సౌకర్యం లగ్జరీ అభిరుచి కలగలిపి దర్శనమిస్తాయి. పచ్చదనం, వెలుతురు ప్రాధాన్యతనిచ్చింది. అంతేకాదు గోడలనిండి ఫోటోలు, అరుదైన MF హుస్సేన్ పెయింటింగ్లతో తన కళాభిమానాన్ని చాటుకుంది. అమీషా చివరిగా 2023లో హిట్ మూవీ గదర్ 2లో నటించింది. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా లో సన్నీ డియోల్ ఉత్కర్ష్ శర్మ కూడా నటించారు. ఈ చిత్రం గదర్: ఏక్ ప్రేమ్ కథ (2001) కి సీక్వెల్. -
బీకేర్ఫుల్..! కాబోయే తల్లులూ..మార్నింగ్ సిక్నెస్ని లైట్ తీసుకోవద్దు!
ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడూ కాస్త నలతగా ఉండటం అనేది సహజం. పైగా చాలామందికి మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది. ప్రతి ఉదయం మూడ్ స్వింగ్స్ మారుతూ ఒక విధమైన అలసటగా ఉంటుంది. వైద్యులు, పెద్దవాళ్లు కూడా ఈ సమయంలో ఇది అత్యంత సహజం అని చెబుతుంటారు. అలా అని లైట్ తీసుకుంటే ఒక్కోసారి ప్రాణాంతంకంగా మారిపోయి క్రిటికల్గా పరిణమిస్తుంది. అచ్చం అలానే జరిగింది ఈ బ్రిటన్కు చెందిన ఈ మహిళకు. పాపం ఆ కారణంగా ఆమె అమ్మ అను భాగ్యాన్ని కూడా దూరం చేసుకోవాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే..బ్రిటన్కి చెందిన 29 ఏళ్ల సోఫియా యాసిన్ పెళ్లైన రెండు సంవత్సరాలకు గర్భం దాల్చింది. ఆ విషయ తెలుసుకున్నప్పటి నుంచి ఆ దంపతులిద్దరి ఆనందానికి అవధులు లేవు. అయితే ప్రతి ఉదయం అలసిపోతూ, నీరసంగా ఉండేది. అదే విషయం వైద్యులకు తెలిపినా..ఇది కామన్ అని సర్ది చెప్పారు. ఇది రాను రాను మరింత ఎక్కువ అవుతుందే గానీ తగ్గేది కాదు. ఆఖరికి రాత్రుళ్లు, చెమటలు, దురద వంటి సమస్యలు కూడా ఉత్ఫన్నమయ్యేవి. ఆ తర్వాత 14 వారాల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడూ ఉన్నట్టుండి హఠాత్తు కుప్పకూలిపోయింది. దాంతో ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించగా.. బహశా ఆమెకు న్యూమోనియా ఉందేమోనని భావించారు వైద్యులు. అయితే పలు వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఆమెకు గుండెపై కణితి ఉందని, నాన్-హాడ్కిన్కు సంబంధించిన ప్రాణంతక బ్లడ్ కేన్సర్తో బాధపడుతున్నట్లు వివరించారు. ఒక్కసారిగా కాళ్ల కింద భూమి కదిలిపోయినంత పనైంది. ఏం చేయాలో తెలియని దిగ్బ్రాంతికి గురయ్యారు. అంతేగాదు గర్భాన్ని కూడా కొనసాగించడం సాధ్యం కాదని, ఒకవేళ కొనసాగించినా..ఆ చిన్నారి కూడా ఈ సమస్య బారినపడే అవకాశం ఉందని హెచ్చరించారు. దాంతో ఆ దంపతులు ఒక్కరోజుతో తమ సంతోషమంతా దుఃఖంగా మారిపోయిందని భోరుమని విలపించారు. తప్పనిసరి పరిస్థితుల్లో 15 వారాల ప్రెగ్నెన్సీని తొలగించుకుని ఆరు రౌండ్ల కీమోథెరపీ ట్రీటెమంట్లు తీసుకుంది సోఫియా. ఈ ఏడాది ప్రారంభంలో సోఫియా పూర్తిగా కోలుకుని యథావిధిగా ఆరోగ్యవంతురాలైంది. అంతేగాదు తనలా మరెవ్వరూ బాధపడకూడదని, లింఫోమా(బ్లడ్ కేన్సర్ చెంది)తో పోరాడి గెలిచేలా నిధులు సేకరిస్తోందామె.నాన్-హాడ్కిన్ లింఫోమా అంటే ఏమిటి?నాన్-హాడ్కిన్ లింఫోమా అనేది శోషరస వ్యవస్థను ప్రభావితం చేసే ఒక రకమైన కేన్సర్. ఇది అవయవాలు, గ్రంథులు, ట్యూబ్ లాంటి నాళాలు, శోషరస నోడ్స్ వంటి కణాల సముహాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఒక భాగమైన జెర్మ్-ఫైటింగ్ కణాలు శరీరం అంతటా నియంత్రణ లేకుండా పెరిగి, కణితులనే ఏర్పరిస్తే..దాన్నినాన్-హాడ్కిన్ లింఫోమాగా నిర్థారిస్తారు వైద్యులు. సంకేతాలు-లక్షణాలు.. మెడ, చంకలు లేదా గజ్జల్లో వాపు శోషరస గ్రంథులుబొడ్డు నొప్పి లేదా వాపుఛాతీ నొప్పి, దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిచాలా అలసటగా అనిపించడంజ్వరంరాత్రిపూట చెమటలు పట్టడంఆకస్మికంగా బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అయితే చాలామటుకు దీన్ని అంత సులభంగా గుర్తించలేమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కానీ పైన చెప్పిన మార్పుల్లో ఏదో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు కనిపిస్తుంటే..తక్షణమే వైద్యుడిని సంప్రదించడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: -
పీరియడ్స్ ఆలస్యానికి పిల్స్ వాడితే ప్రాణాలే పోయాయ్, తస్మాత్ జాగ్రత్త!
పుణ్యకార్యాలు, శుభకార్యాలు, ఆచారాలు, ప్రయాణాలు ఇలా అనేక కారణాలతో పీరియడ్స్ లేదా నెలసరిని వాయిదా (delay period pills) వేయడానికి కొన్ని మందులు వాడతారు. అయితే ఋతుచక్రాన్ని వాయిదా వేసే మాత్రలవల్ల ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు ఏర్పడవచ్చు. అందుకే పీరియడ్స్ సురక్షితంగా ఆపడం ఎలాగో తెలుసుకోవాలి. వీటివల్ల తలెత్తే ప్రమాదాలను కూడా ముందు అర్థం చేసుకోవాలి.రీబూటింగ్ ద బ్రెయిన్ అనే ఇనస్టా పేజ్లో డాక్టర్ వివేకానంద్,డాక్టర్ శరణ్ శ్రీనివాసన్తో ఇటీవల ఒక హృదయ విదారకమైన కథను పంచుకున్నారు. దీని ప్రకారం 18 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి పీరియడ్ ఆలస్యానికి మందులు వాడి ప్రాణాలు కోల్పోయింది. ఒక పూజ కోసం మాత్రలు తీసుకోవడం ప్రారంభించిన మూడు రోజుల తర్వాత ఆమె పూజ అయితే పూర్తి చేసింది కానీ కాళ్ళు ,తొడ నొప్పి, తీవ్రమైన అసౌకర్యం లాంటి లక్షణాలతో ఆమె పరిస్థితి తీవ్రంగా మారింది. అస్పత్రిలో అడ్మిట్ చేయాలని వైద్యులు పట్టుబట్టినప్పటికీ, తల్లి మరుసటి రోజు ఉదయం వస్తానని చెప్పి ఇంటికి తీసుకెళ్లి పోయింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆయువతి ప్రాణాలు కోల్పోయింది. క్లిష్టమైన క్షణాల్లో జాప్యం కోలుకోలేని నష్టాన్ని మిగులుస్తుందంటూ బాధాకరమైన జ్ఞాపకాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. అసలేంటీ పిల్స్మెన్స్ట్రువల్ సైకిల్ను ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్లు నియంత్రిస్తాయి. నెలసరిని వాయిదా వేసే మాత్రలు హార్మోన్ ప్రొజెస్టెరాన్ యొక్క సింథటిక్ రూపమైన నోరెథిస్టెరాన్ను కలిగి ఉంటాయి. View this post on Instagram A post shared by Rebooting The Brain (@rebootingthebrain)వీటి వల్ల వచ్చే కొన్ని దుష్ప్రభావాలువికారం లేదా జీర్ణ సమస్యలు: తేలికపాటి కడుపు నొప్పి లేదా ఉబ్బరంరొమ్ములో నొప్పి,హార్మోన్ల మార్పులు వాపు లేదా అసౌకర్యానికి కారణం కావచ్చుతలనొప్పి , తలతిరగడం: తరచుగా హార్మోన్ల హెచ్చుతగ్గుల కారణంగా ఇలా జరగవచ్చు.చిరాకు, ఆందోళన లేదా తేలికపాటి నిరాశలాంటి మానసిక స్థితిలో మార్పులు సంభవించవచ్చుఎక్కువ కాలం తీసుకుంటే అధిక రక్తస్రావం. అరుదైన తీవ్రమైన ప్రభావాలురక్తం గడ్డకట్టే ముప్పు రావచ్చు. ముఖ్యంగా గడ్డకట్టే రుగ్మతలు, ఊబకాయం లేదా ధూమపాన అలవాట్లు ఉన్నవారిలో ఈ అవకాశం ఎక్కువ.దద్దుర్లు, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి అలెర్జీ సమస్యలు రావచ్చు. ఇలాంటివి సంభవిస్తే వైద్య సహాయం తీసుకోవడం చాలా అవసరం.ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలివైద్య పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి. వైద్యుల సలహా లేకుండా ఎక్కువ కాలం వాడటం ప్రమాదకరం కావచ్చు.ఈ మాత్రలను గర్భనిరోధకంగా ఉపయోగించకూడదు. ఇవి గర్భధారణను నిరోధించవు.సుదీర్ఘ కాలం..సాధారణంగా 5–14 రోజుల కంటే ఎక్కువ రోజులు వాడకూడదు.సాధారణం ఈ మందు వాడటం అపివేసిన తరువాత ఈ ప్రభావాలు తగ్గిపోతాయి. అలాగే సాధారణంగా ఋతుస్రావం 2–4 రోజుల్లో తిరిగి ప్రారంభమవుతుంది. కానీ పక్షంలో వైద్యులను సంప్రదించడం ఉత్తమం ఇదీ చదవండి: కేవలం రూ.3.5 లక్షలతో ఫ్యాషన్ బ్రాండ్..రూ. 500 కోట్ల దిశగాప్రసూతి వైద్యురాలు, గైనకాలజిస్టు, లాపరోస్కోపిక్ సర్జన్ డా. పూజిత సురానేని ఏమంటారంటే..ప్రిమోలుట్ఎన్ (నోరెథిస్టెరాన్ అధిక రక్తస్రావం, బాధాకరమైన పీరియడ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ , ఎండోమెట్రియోసిస్ వంటి ఋతు రుగ్మతల చికిత్సలో వాడతారు. ఈ ఔషధం కృత్రిమంగా పెరిగిన ప్రొజెస్టెరాన్ స్థాయిలను నిర్వహించడం ద్వారా ఋతుస్రావాలను వాయిదా వేస్తుంది. అయితే దీన్ని ఋతుస్రావాన్ని ఆలస్యం చేయడానికి తరచుగా లేదా సాధారణం ఉపయోగించడం మంచిది కాదు ఎందుకంటే ఇది సహజ హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. భవిష్యత్తులో పీరియడ్ సైకిల్ను ప్రభావితం చేస్తుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, లేదా అధిక రక్తస్రావానికి దారి తీస్తుంది. అంతేకాకుండా, పదేపదే వాయిదా వేయడం వల్ల తలనొప్పి, రొమ్ము నొప్పి, వికారం వంటి ప్రతికూల ప్రభావాల ప్రమాదం పెరుగుతుంది. దీర్ఘకాలిక వాడకంతో, రక్తం గడ్డకట్టడం, కాలేయ సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుంది. ఇది ముఖ్యంగా థ్రాంబోసిస్, కాలేయ వ్యాధి లేదా తీవ్ర రక్తస్రావం చరిత్ర ఉన్న మహిళల్లో విరుద్ధంగా ఉంటుంది. అందుకే వీటిని వాడేముందు నిపుణులైన గైనకాలజిస్ట్ని సంప్రదించాలని కోరుతున్నారు.చదవండి: 70 ఏళ్ల వయసులో 30 ఏళ్ల చిన్నదానితో నటుడి పెళ్లి.. ఇపుడిదే చర్చ! -
సువర్ణావకాశం...పొందూరు ఖాదీ...శిక్షణతో ఖ్యాతి..!
శ్రీకాకుళం, పొందూరు: వేసవిలో చల్లదనం.. శీతాకాలంలో వెచ్చదనం ఇవ్వడం పొందూరు ఖాదీ వ్రస్తాల ప్రత్యేకత. ఈ దుస్తులు ఎంతో సౌకర్యవంతంగా, హుందాగా ఉంటాయి. అతి సామాన్యుల నుంచి ఉన్నతవర్గాల వరకూ ప్రతి ఒక్కరూ ధరించేందుకు వీలుగా అందుబాటు ధరల్లో లభిస్తాయి. మహాత్మాగాంధీ నుంచి ప్రస్తుత రాజకీయ నాయకుల వరకు ఎంతోమంది పొందూరు ఖాదీకి అభిమానులు ఉన్నారు. ఈ ఫైన్ ఖాదీ(సన్నఖాదీ) తయారీకి ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే పండించే కొండ పత్తిని ఇక్కడ ఉపయోగిస్తారు. దశాబ్ధాల కాలం నుంచి పొందూరు ఏఎఫ్కేకే సంఘం అనేది ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్(కేవీఐసీ) ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ సంఘాన్ని కేవీఐసీ సౌత్జోన్ డిప్యూటీ సీఈవో మదన్కుమార్ రెడ్డి ఇటీవల సందర్శించారు. దీనిలో భాగంగా సంప్రదాయ ఖాదీ వ్రస్తాల తయారీ కేంద్రం మరిన్ని కాలాలు విరజిల్లాలని ఆకాంక్షిస్తూ తన పరిధిలో హామీలనిచ్చారు. ఖాదీ ప్రమోషనల్ గ్రాంట్ నుంచి అవసరమైన పరికరాల కొనుగోలుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. వర్క్òÙడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నామని, పొందూరు ఏఎఫ్కేకే సంఘంతో కేవీఐసీ కలిసి కొత్తగా నైపుణ్యాలపై శిక్షణా కేంద్రం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కేవీఐసీ, జీఎంఆర్ సంయుక్తంగా విలేజ్ ఇండస్ట్రీస్ కింద శిక్షణ ఇస్తున్నారని చెప్పారు. ఖాదీని ముందు తరాలకు అందించేందుకు ఆ అవకాశాన్ని పొందూరు ఏఎఫ్కేకే సంఘం దక్కించుకోవాలని సూచించారు. శిక్షణతో ఉపాధి చేనేత వస్త్ర తయారీలో శిక్షణ ఇవ్వడం వలన నిరుద్యోగులకు ఉపాధి చేకూరుతుంది. నెలకు దాదాపు రూ.15 వేలు నుంచి రూ.25 వేలు వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. స్పిన్నింగ్, వీవింగ్లో శిక్షణ పొందిన వారంతా సంఘాలకు, సొసైటీలకు దుస్తులు నేస్తూ ఉపాధి పొందుతారు. వాస్తవానికి స్పిన్నర్లు, వీవర్లు, సంఘం ఉద్యోగులకు ఆదాయం పెంచుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. కేవీఐసీ ఎండీఏ సిస్టంలో ఉత్పత్తిపై 35 శాతం మొత్తాన్నిప్రతీ మూడు నెలలకు ఒకసారి స్పిన్నర్లు, వీవర్లు, ఉద్యోగులకు అందిస్తుంది. ఇదేకాకుండా సంఘాలు మజూరీని అందజేస్తున్నాయి. కొత్త కార్మికులు సంఘంలో చేరి దుస్తులు నేస్తే మరింత ఆదాయం పొందే అవకాశం మెండుగా ఉంది. సొసైటీలకు సహకారం అందాలి అయితే వాస్తవానికి సొసైటీలు, సంఘాలకు దుస్తులు నేసే వారికంటే మాస్టర్ వీవర్స్ దగ్గర ఎక్కువ కార్మికులు ఉండడం గమనార్హం. మాస్టర్ వీవర్స్ నేసే వారికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉంది. సొసైటీలు, సంఘాలకు నేసేవారికి ప్రభుత్వ సహకారం అందించాలి. ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలి. ఉచిత విద్యుత్, ఆరోగ్య బీమా, ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటివి సౌసైటీలు, సంఘాలకు నేసే కారి్మకులకు వర్తింపజేయాలి. దుస్తులు నేసే వారికి షరతులు ఉండకూడదు. ఉదాహరణకు పొందూరు ఏఎఫ్కేకే సంఘంలో ఏఎంసీ, ఎన్ఎంసీ వ్రస్తాలు మాత్రమే లభిస్తున్నాయి. సీమనూలుతో నేసే వ్రస్తాల తయారీ ఇక్కడ లేదు. అందువలన ఏరకమైన నూలుతోనైనా వ్రస్తాలు తయారు చేయోచ్చన్న అనుమతి కేవీఐసీ నుంచి రావాలి. తద్వారా ఉత్పత్తి పెరుగుతుంది. కారి్మకులకు ఆదాయం పెరుగుతుంది. కొత్తవారు ఈ రంగంలోకి వచ్చేందుకు మొగ్గు చూపుతారు. సమయం ఆసన్నమైంది.అంతరించిపోతున్న ప్రాచీన, సంప్రదాయ వస్త్ర తయారీ ప్రక్రియను బతికించేందుకు ఏఎఫ్కేకే సంఘం వడుకు, నేత ప్రక్రియలను నేర్పే శిక్షణా సంస్థగా అవతరించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఆ మేరకు ఏఎఫ్కేకే సంఘం త్వరగా కేవీఐసీ సాయంతో శిక్షణలు ఇచ్చేందుకు భాగస్వామ్యం కోసం అడుగులు వేయాలి. పొందూరులో గతంలో 1,200 మంది స్పిన్నర్లు ఉండేవారు. ప్రస్తుతం వారి సంఖ్య 520 మందికి చేరింది. గతంలో 300 మంది నేత కార్మికులు ఉండేవారు. ప్రస్తుతం కేవలం 80 కుటుంబాలు మాత్రమే నేత కారి్మకులుగా మిగిలారు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ కార్మికులు తగ్గిపోతున్న నేపథ్యంలో కొత్తవారు ఈ రంగంలోకి రావాల్సిన అవసరం ఏర్పడింది. దీనికోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.శిక్షణ ఇచ్చేందుకు సిద్ధం కేవీఐసీ డిప్యూటీ సీఈవో మదన్మోహన్రెడ్డి పొందూరు ఏఎఫ్కేకే సంఘాన్ని సందర్శించి హామీలివ్వడం వాస్తవమే. కొత్తవారికి వడుకు, నేత ప్రక్రియలపై శిక్షణలు ఇచ్చేందుకు కేవీఐసీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణలిచ్చేందుకు ఏఎఫ్కేకే సంఘం సిద్ధంగా ఉంది. – దండా వెంకటరమణ, సెక్రటరీ,ఏఎఫ్కేకే సంఘం, పొందూరు అనుమతులిస్తాం ఖాదీ వ్రస్తాలు తయారు చేసేందుకు పొందూరు ఏఎఫ్కేకే సంఘాన్ని కేవీఐసీతో ట్రైనింగ్ పార్టనర్గా ఉండమని సూచించాం. పొందూరు ఖాదీని ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దీనివలన కొత్తతరం వారు ఈ వృత్తిలో కొనసాగేందుకు అవకాశం ఉంటుంది. కొత్తగా వడుకు, నేత ప్రక్రియలో శిక్షణ ఇచ్చేందుకు పొందూరు ఖాదీ సంస్థకు దరఖాస్తు చేయమని చెప్పాను. శిక్షణ ముగించుకున్న వారికి సరి్టఫికెట్లు సైతం అందజేస్తాం. ఏ జిల్లా నుంచైనా శిక్షణలకు పొందూరుకు రావచ్చు. వడుకు, నేత పని నేర్చుకోవచ్చు. – మదన్కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఈవో,బెంగుళూరు, కేవీఐసీ -
కృత్రిమ మేధస్సుతో వినూత్నంగా కథలు, వార్తలు..!
నగరంలో ట్రెండ్స్ వేగంగా మారిపోతున్నాయి. ప్రజల జీవనశైలితో పాటు ఆలోచనా విధానం, సమాచారాన్ని స్వీకరించే పద్ధతుల్లో సైతం కొత్త పోకడలు కనిపిస్తున్నాయి. రీల్స్ మాదిరిగా వార్తలు కూడా వినోదంగా మారుతున్నాయి. తాజా ఉదాహరణగా కొన్ని వినూత్న తెలుగు వెబ్ అప్లికేషన్స్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఇది సాధారణ న్యూస్ పోర్టల్లా కాకుండా పూర్తిగా కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత తెలుగు వెబ్సైట్, వార్తలను కథలుగా మార్చే విశేష వేదికలుగా నిలుస్తున్నాయి. సాధారణంగా వార్తలు మనకు పాఠ్యరూపంలో, ఫొటోలు లేదా వీడియోలతో వస్తాయి. కానీ ఈ కొత్త అప్లికేషన్లో రీల్స్ (వీటినే కొందరు ట్రీల్స్ అని అంటున్నారు) రూపంలో అందుతాయి. నిజమైన సంఘటనలు, నిజంగా ఆ బాధను అనుభవించినవారి స్వరంలోనే, చిన్న భావోద్వేగ కథలుగా అందిస్తున్నారు. ఇవి ఒకవైపు సినిమా ట్రైలర్స్ని తలపిస్తున్నాయి. మరోవైపు ఓటీటీ ప్లాట్ఫారమ్, సోషల్ మీడియా స్క్రోల్ అనుభూతినీ అందిస్తున్నాయి. భావాలను పంచేలా.. ఒక రీల్లో ఒక ప్రభుత్వ అధికారి తానే కథానాయకుడవుతాడు. ఎప్పుడో అనుమతి లభించిన ప్రాజెక్ట్ కాగితం మీదే మిగిలిపోతుంది. అలా ఎందుకు జరిగిందో తన అనుభవాన్ని మనముందు ప్రదర్శిస్తాడు. మరో రీల్లో మహిళ తన బాధను మాటల్లో కాకుండా ముఖ కవళికలతో తన నిస్సహాయను తెలియజేస్తుంది. అనేక అనేక రంగాలు, అనేక సంఘటనలను రీల్స్, వార్తలు, సమాచారం, కథల రూపంలో ఏఐ ద్వారా తెలియజెప్పడం ప్రస్తుతం ట్రెండ్. ఇవన్నీ 24 గంటల్లోపే ఏఐ సాయంతో సిద్ధం చేయడం ఇందులోని ప్రత్యేకత. రీల్స్, షార్ట్స్, పాడ్కాస్ట్ వంటివి కొత్త అలవాట్లుగా మారాయి. ఇలాంటి సమయంలో ఈ కొత్త ఫార్మాట్ స్థానిక భాషలో ప్రజలకు చేరుతోంది. తెలుగులోనూ వినూత్నంగా.. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వివిధ రకాల వేదికలు రూపుదాల్చుతున్నాయి. ఇలాంటి వేదికలు నగరంలో వేళ్లూనుకుంటున్నాయి. ప్రపంచంలో తొలి పూర్తిస్థాయి యాంత్రిక మేధస్సుతో (కృత్రిమ మేధస్సు) పనిచేసే తెలుగు వెబ్ అప్లికేషన్లు సైతం అందుబాటులోకి వచ్చాయి. ఈ మధ్య కాలంలో టైమ్ కృష్ణ అనే వెబ్సైట్లో కొత్త వేదిక మెల్లిగా వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ చానళ్లలో చక్కర్లు కొడుతోంది. ఇది వార్తలా కాకుండా సినిమాను తలపిస్తుంది. మొబైల్లో స్క్రోల్ చేసే సామాజిక మాధ్యమాల అనుభూతి ఇస్తుంది. సాధారణ వార్తా సైట్లా కాకుండా భావోద్వేగాలతో నిండిన చిట్టి కథలుగా ‘సత్య రీల్స్’గా మారుతున్నాయి. ఇలాంటి తెలుగు వేదికలు దేశమంతటా ప్రజలే స్వయంగా తమ కథలను పది భారతీయ భాషల్లో రూపొందించుకునే అవకాశం కల్పించబోతోంది. 4 శాతం నుంచి 21 శాతానికి... టైమ్స్ ట్రెండ్ నివేదిక ప్రకారం.. 5 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసు గల చిన్నారుల్లో 1999 నాటికి 4% నుంచి 2019 వచ్చేసరికి 21% నికి మయోపియా పెరిగింది. ఈ పెరుగుదల ఇలాగే కొనసాగితే, విద్య, ఏకాగ్రత ఇతర భావోద్వేగ స్థితిగతులను కూడా ప్రభావితం చేసేలా పెరుగుదల ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. రాజ్కోట్లో, సౌరాష్ట్ర విశ్వవిద్యాలయంలోని సైకాలజీ విభాగం నిర్వహించిన సర్వేలో, 10 ఏళ్లలోపు పిల్లల్లో 81% మంది భోజన సమయంలో క్రమం తప్పకుండా స్క్రీన్లను ఉపయోగిస్తున్నారని, ఎక్కువగా కార్టూన్ చూడటానికి ఉపయోగిస్తున్నారని తేలింది. తినడం, నేర్చుకోవడం, నిద్రపోవడం వంటి దినచర్యలో డిజిటల్ పరికరాలు ఎలా చొచ్చుకుపోయాయో ఈ అధ్యయనం వెల్లడిస్తోంది. -
లాస్ట్ మీల్ అంటే ఇదేనేమో..!
చక్కగా ఫుడ్ని ఆస్వాదించి ఎలా ఉందో చెప్పే ఫీల్ భలే ఉంటుంది. మన ఇంట్లో మనం చెప్పేస్తాం. గానీ బయట రెస్టారెంట్లో టేస్ట్ చూసి చెప్పే సోషల్మీడియా ఔత్సాహికులను చూస్తే..ఆహా ఈ పేరుతో భలే అన్ని వంటకాలు రుచి చూస్తేస్తున్నారుగా అనిపిస్తుంది కదూ..!. అలానే ఇద్దరు ఫుడ్ బ్లాగర్లు ఒక రెస్టారెంట్లో ఫుడ్ని రుచి చూసి రివ్యూ ఇచ్చేలోపు చావు పరిచయమైంది. పాపం ఆ ఇద్దరు బాబోయ్ ఇలాంటి అనుభవం ఎవ్వరికి వద్దు అని దండం పెట్టేస్తున్నారు. ఏం జరిగిందంటే..హుస్టన్కి చెందిన ఇన్ఫ్లుయెన్సర్ నినా శాంటియాగో, తన తోటి కంటెంట్ క్రియేటర్ పాట్రిక్ బాలివుడ్తో కలిసి ఒక రెస్టారెంట్కి వచ్చారు. అక్కడ ఫుడ్ రివ్యూ ఇచ్చే ఒక వీడియోని రికార్డు చేస్తున్నారు ఇద్దరు. అందులో భాగంగా ఆ రెస్టారెంట్లోని శాండ్విచ్ శాంపిల్ని టేస్ట్ చేసి రేట్ ఇవ్వబోయే సమయానికి ఊహించని హఠాత్పరిణామం చోటు చేసుకుంది. సరిగ్గా అదే సమయానికి ఓ ఎస్యూవీ కారు రెస్టారెంట్లోకి దూసుకొచ్చి వారి ఫుడ్ టేబుల్ని స్ట్రాంగ్గా ఢీ కొట్టింది. ఆ షాకింగ్ ఘటనకు శాంటియోగా కిందపడిపోగా, మరొకరు నిలదొక్కుకుని అక్కడ నుంచి నెమ్మదిగా వెళ్లిపోయారు. చెప్పాలంటే త్రుటిలో పెను ప్రమాదం తప్పింది ఆ ఫుడ్ బ్లాగర్లకి. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేస్తూ..ఆ ఘటనలో తమకు ఎలాంటి గాయాలు అయ్యాయో కూడా పోస్ట్లో వివరించారు. ఇదేదో పగ, కోపంతో చేసినట్లుగా అనిపించింది. చెప్పాలంటే అదే మాకు చివరి భోజనం ఏమో అనిపించేలా చావుని పరిచయం చేశారు. కానీ దేవుడి దయ వల్ల ఆ భయానక ఆపద నుంచి సునాయాసంగా బయటపడ్డాం అని చెబుతున్నారు ఆ ఫుడ్ బ్లాగర్లు. View this post on Instagram A post shared by @NINAUNRATED (@ninaunrated) (చదవండి: టమాటాలతో 'బయోలెదర్'..! పర్యావరణ హితం, ఆ సమస్యకు చెక్ కూడా..) -
కేవలం రూ.3.5 లక్షలతో ఫ్యాషన్ బ్రాండ్..రూ. 500 కోట్ల దిశగా
ఇంటినీ, కుటుంబాన్ని చక్కదిద్దడంలో మాత్రమే కాదు.. అడుగు పెట్టిన రంగం ఏదైనా పట్టుదలగా ఎదిగి, తమ ఆసక్తిని,కలలను నెరవేర్చుకున్న ధీరవనితలు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా పురుషులకే సాధ్యం అనుకునే వ్యాపార రంగంలో అడుగు పెట్టి విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు. ఫల్గుణి నాయర్, వినితా సింగ్, ఇందిరా పూరి ఇషా అంబానీ కార్పొరేట్ సీఈవోలుగా ఎదుగుతున్నారు. మరికొంతమంది మహిళలు తమ కృషి ఆధారంగా స్టార్టప్లలో కూడా తామేంటో నిరూపించు కున్నారు. అంతేకాదు తక్కువ పెట్టుబడితోనే అద్భుతాలు చేస్తూ తనలాంటి ఎందరో ఔత్సాహికులకు ప్రేరణగా నిలుస్తున్నవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అలాంటి వారిలో ఒకరు నిధి యాదవ్. ఆమె సాధించిన విజయం ఏమిటో తెలుసుకుందామా!ఇండోర్లో జన్మించిన నిధికి ఫ్యాషన్ రంగం అంటే చాలా ఇష్టం. కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివిన నిధి డెలాయిట్లో పనిచేసేది. ఐదంకెల జీతం. కానీ అది సంతృప్తి నివ్వలేదు. తన అభిరుచిని కెరీర్గా మార్చుకోవడానికి, నిధి కూడా ఫ్లోరెన్స్లోని పోలిమోడా ఫ్యాషన్ స్కూల్లో ఒక సంవత్సరం కోర్సు చేసింది. అలా సొంత వ్యాపారం మొదలు పెట్టాలనే కోరికతోపాటు,కుటుంబానికి దగ్గరగా ఉండేందుకు భారతదేశానికి తిరిగి రావాలనే పెద్ద ముందడుగు వేసింది. తన సొంత బ్రాండ్ను సృష్టించాలని నిర్ణయించుకుంది. అప్పటికే వివాహం, ఏడు నెలల పసిబిడ్డ ఉన్నా కూడా తన ఆశయానికి కట్టుబడి ఉంది. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, డెలాయిట్లో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాలని ధైర్యంగా నిర్ణయం తీసుకుంది. 23 ఏళ్ల వయస్సులో ఉద్యోగాన్ని వదిలివేసి భర్తతోకలిసి తన సొంత దుస్తుల బ్రాండ్ను ప్రారంభించింది. 2014లో గురుగ్రామ్లోని తన 2BHK ఇంట్లో రూ.3.5 లక్షల ప్రారంభ పెట్టుబడితో ఆక్స్ క్లోతింగ్ను ప్రారంభించింది.స్టైలిష్ ఎథ్నిక్ వేర్ను సరసమైన ధరల్లో అందించాలి, ముఖ్యంగా 18-35 సంవత్సరాల వయస్సు గల యువతులను లక్ష్యంగా చేసుకుంది. అనుకున్నట్టుగానే ఆమె వెంచర్ త్వరగా ఆదరణ పొందింది.2021 నాటికి రూ.200 కోట్ల ఆదాయాన్ని సాధించింది. చాలా తక్కువ సమయంలో ఆక్స్ ప్రజాదరణ పొందింది. కంపెనీ కేవలం ఒక సంవత్సరంలో రూ. 8.50 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది 2018లో, కంపెనీ ఆదాయం రూ. 48 కోట్లకు పెరిగింది. ఐదేళ్లలోనే కంపెనీ ఒక రేంజ్కి చేరింది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో రూ. 100 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది.అంటే 2014లో రూ. 1.60 కోట్లుగా ఉన్న ఆదాయం 2015లో రూ. 8.50 కోట్లకు, ఆ తర్వాత 2018 నాటికి రూ. 48 కోట్లకు పెరిగింది. 2021 నాటికి, ఆక్స్ ఎటువంటి బాహ్య నిధులు లేకుండానే రూ. 200 కోట్ల ఆదాయాన్ని అధిగమించింది.రూ. 500 కోట్ల టర్నోవర్తోపాటు గ్లోబల్ విస్తరణ లక్ష్యంగా ముందుకు సాగుతోంది నిధియాదవ్.చదవండి: ఉద్యోగాన్ని వదిలేసిన ఇంజనీర్ కపుల్.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలుబ్రాండ్ ప్రారంభ రోజుల్లో, నిధి ఆమె భర్త తమ పసికందుతో కలిసి గురుగ్రామ్,జైపూర్ మధ్య వారాంతపు తిరుగుతూ సామాగ్రిని సేకరించేవారు. ఈ కష్టాల మధ్య కోవిడ్ మహమ్మారి మరో సవాల్ విసిరింది. దీంతో పాటు కొత్త అవకాశాల్ని కూడా తెచ్చిపెట్టింది. క్లోతింగ్ ఉత్పత్తి సంక్షోభం తరుణంలో ఆక్స్ మాస్క్లు , PPE కిట్లను తయారు చేయడంలో పై చేయి సాధించింది. అలా కోవిడ్ కాలంలో బ్రాండ్ వృద్ధి 25 శాతం పెరిగిందంటే ఆమె కృషిని అర్థం చేసుకోవచ్చు. మిగిలిపోయిన బట్టను ఉపయోగించి పిల్లల దుస్తుల శ్రేణిని కూడా ప్రారంభించింది.ఇదీ చదవండి: 70 ఏళ్ల వయసులో 30 ఏళ్ల చిన్నదానితో నటుడి పెళ్లి.. ఇపుడిదే చర్చ! -
టమాటాలతో 'బయోలెదర్'..! పర్యావరణం మెచ్చే ఫ్యాషన్ ప్రొడక్ట్స్..
ప్యాషన్ యాక్ససరీల్లో లెదర్ బ్రాండెడ్ వస్తువులది ఒక ప్రత్యేక స్థానం. అలాంటి లెదర్ కారణంగా ఎన్నో జంతువులు చనిపోతున్నాయనే విషయం తెలిసిందే. పైగా ఇది పర్యావరణ అనుకూలమైంది కూడా కాదు. దీనికి చెక్పెట్టేలా పర్యావరణ హితంగా ఆహార వ్యర్థాలను నివారించే దిశగా ఒక సరికొత్త లెదర్ని తీసుకొచ్చారు ప్రితేష్ మిస్త్రీ. ఈ సరికొత్త ఆవిష్కరణతో లెదర్ ప్లేస్లో బయోలెదర్ని తీసుకొచ్చి..జంతువులకు హాని కలగకుండా కాపాడటమే గాక పర్యావరణ హిత ఫ్యాషన్ ఉపకరణాలకు నాంది పలికారు. ఆయనకు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే..ముంబైకి చెందిన ప్రితేష్ మిస్త్రీకి కాలేజ్లో ఇంజనీరింగ్ చదివే సమయంలో ఈ ఆలోచన తట్టింది. అయితే తన చివరి సంవత్సరం ప్రాజెక్టులో భాగంగా ఈ దిశగా ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాడు. ఆ ఆవిష్కరణ అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఆయన బయోలెదర్ కోసం టమాటా వ్యర్థాలనులను వినియోగించారు. దాని నుంచి తయారు చేసిన లెదర్తో బూట్లు, బ్యాగ్లు వంటివి కూడా రూపొందించారు. వీటిని టీబీసీ బ్రాండ్ ఉత్పత్తులుగా మార్కెట్లోకి రిలీజ్ చేశారు. వాటికి అత్యంత ఆదరణ లభించడమే గాక అందరి ప్రశంసలందుకుంది. అంతేగాదు 2021 పెటా వేగన్ ఫ్యాషన్ అవార్డుల్లో కూడా ఈ టీబీసీ బయోకంపెని ఉత్పత్తులు ఉత్తమ ఆవిష్కరణగా నిలిచాయి. టమాటాలే ఎందుకు..టమాటాలను ప్రాథమిక ముడి పదార్థంగా ఉపయోగించి పాలియురేతేన్, పాలీ వినైల్ క్లోరైడ్ వంటి ప్లాస్టిక్ చోటివ్వకుండా బయోలెదర్ సృష్టించాలన్నది మిస్త్రి లక్ష్యం. జంతువులకు కూడా హాని కలిగించకుండా చేయాలన్నది ప్రధాన అజెండా. ఇక అందుకోసం ఈ టమాటాలనే ఎందుకు ఎంచుకున్నారంటే..భారతదేశం ఏడాదికి 44 మిలయన్ల టన్నుల టమాటాలను ఉత్పత్తి చేస్తున్న రెండో అతిపెద్ద దేశం కావడంతో ఈ కూరగాయను ఎంచుకున్నాడు మిస్త్రీ. అదీగాక ఏటా వాటిలో 30 నుంచి 35% వరకు టమాటాలు వృధా అయిపోతున్నాయి. కాబట్టి ఆ సమస్యకు చెక్పెట్టి..పర్యావరణ హితంగా బయోలెదర్ తయారు చేయాలని భావించాడు. అందులోనూ టమాటాలో స్కిన్, విత్తనాలు, పెక్టిన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇది లెదర్ తయారీకీ అత్యంత అనుకూలం అని తెలిపారు మిస్త్రీ. అలాగే జంతువుల చర్మం నుంచి చేసే లెదర్ తయారీ ఫ్యాక్టీరీల నుంచే వచ్చే కాలుష్యాన్ని కూడా ప్రత్యక్షంగా చూడటంతో ఇలా పర్యావరణ హితంగా, ఆహార వ్యర్థాలను నివారించే బయో లెదర్ తయారు చేయాలనుకున్నట్లు తెలిపారు. అయితే తాము లెదర్ తయారు చేయగలిగాం కానీ, దాని, ఆకృతి, మనిక పరంగా నెలల తరబడి శ్రమిస్తే గానీ మంచి నాణ్యమైన బయో లెదర్కి బీజం పడలేదని వివరించారు. అలాగే సహజ రంగులనే ఉపయోగించేలా కేర్ తీసుకుంటామని చెప్పారు. తమ టీబీసీ కంపెనీ టమాటాలు బాగా పండే గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాలలోని ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల సాయంతో పొలాల నుంచి నేరుగా టమాటా వ్యర్థాలను సేకరిస్తారట. దాన్ని లెదర్ తయారీకి వీలుగా ఉండే వనరుగా మారుస్తారట. ఆ తర్వాత మొక్కల ఆధారిత బైండర్లు, సహజ ఫైబర్ల సాయంతో మన్నికైన బయోలెదర్ని తయారు చేస్తామని తెలిపారు. ఆకృతి కోసం విషరహిత క్యూరింగ్ చేస్తామని చెప్పారు. అలా 2024 మే నాటికి బయోలెదర్తో తయారు చేసిన వాణిజ్య ఉత్పత్తులను ప్రారంభించామని తెలిపారు. ఇంటీరియర్ డిజైన్, ఆటోమెటివ్ పరిశ్రమలకు పనికొచ్చేలా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. పైగా ఈ లెదర్ ఆహ్లాదకరమైన వాసనను వెదజల్లుతుందని చెప్పారు. నిజంగా ఇది అలాంటి ఇలాంటి ఆవిష్కరణ కాదు కదా..పర్యావరణం మెచ్చే లెదర్ ఉత్పత్తులు కదూ..!. View this post on Instagram A post shared by Bioleather (@bioleather) (చదవండి: డిజిటల్ డ్యామేజ్..! అంతకంతకు మయోఫియా వ్యాధులు..) -
70 ఏళ్ల వయసులో 30 ఏళ్ల చిన్నదానితో నటుడి పెళ్లి.. ఇపుడిదే చర్చ!
బాలీవుడ్, హాలీవుడ్ రంగం ఏదైనాలబ్రిటీల పెళ్లిళ్లు, వయస్సు-అంతరాయాలు చర్చ సర్వ సాధారణం. తాజాగా స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ తనకంటే పెద్దదైన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడం, 51 ఏళ్ల బాలీవుడ్ నటి మలైకా అరోరా కూడా విడాకులు , మళ్లి పెళ్లి వార్తల నడుమ 70 ఏళ్ల వయసులో కబీర్ బేడి నాలుగో పెళ్లి అదీ తన కూతురువయసున్న అమ్మాయిని చేసుకున్న వార్త చర్చల్లో నిలుస్తోంది. వయసులో తనకంటే చిన్నవాళ్లను వివాహం చేసుకోవడంపై చర్చను మళ్ళీ లేవనెత్తింది: ప్రేమలో వయస్సు నిజంగా ముఖ్యమా, లేదా పరస్పర అవగాహన ముఖ్యమైనదా? అనే హాట్ టాపిక్గా మారింది.కబీర్ బేడి ప్రేమకథప్రముఖ నటుడు కబీర్ బేడీ తనదైన నటనతో ప్రేక్షకుల మెప్పు పొందిన గొప్ప నటుడు. వ్యక్తిగత జీవితంలో ఇప్పటి వరకు నాలుగు పెళ్లిళ్లు చేసుకుని విమర్శలనెదుర్కొన్నాడు. 2016లో తన 70 పుట్టి రోజు సందర్భంగా తనకంటే దాదాపు 30 ఏళ్లు చిన్నదైన పర్వీన్ దుసాంజ్ను వివాహమాడటం ఆయన కుటుంబంలో కూడా విమర్శలకు తావిచ్చింది. అయితే పదేళ్ల పరిచయం, ప్రేమ తరువాత తామీ నిర్ణయం తీసుకున్నామని పర్వీన్ తన జీవితంలోకి రావడంఎంతో సంతషాన్నిచ్చిందనీ అందుకే పెళ్లి చేసుకున్నామని స్పష్టం చేశాడు. 2005లో వీరు తొలిసారి కలుసుకున్నారు. వారి స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. దాదాపు ఒక దశాబ్దం పాటు కలిసి గడిపిన తర్వాత, కబీర్ బేడి 2011లో రోమ్ పర్యటన సందర్భంగా ప్రపోజ్ చేశారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులు సమక్షంలో 2016, జనవరి 15న ముంబై సమీపంలోని అలీబాగ్లో ఒక ప్రైవేట్ వేడుకలో వారు వివాహం చేసుకున్నారు. నటి , కబీర్ బేడీ కుమార్తె పూజా బేడి కంటే పర్వీన్ ఐదేళ్లు చిన్నది.ఇదీ చదవండి: ఉద్యోగాన్ని వదిలేసిన ఇంజనీర్ కపుల్.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలుప్రేమకు నిజంగా వయసు అవసరమా?ప్రేమ ఏ వయసులోనైనా వస్తుందనీ, ప్రేమకు హద్దులు లేవు; సామాజిక అంచనాలు లేదా వయస్సు తేడాలు దానిని పరిమితం చేయలేవని నిపుణులు చెబుతున్న మాట. ఇదే విషయాన్ని నటి మలైకా అరోరా ఇటీవల స్పష్టం చేసింది. పెళ్లి విషయంలో తానేమీ తలుపులు మూసుకోలేదని, జీవితం ఏ దశలోనైనా కొత్త అవకాశాం రావచ్చని స్పష్టం చేసింది.నిపుణుల ప్రకారం వయస్సు వ్యత్యాసాలు అంతర్గతంగా సమస్యాత్మకమైనవి కావు. ఒక జంట కావాల్సింది ముఖ్యమైన భావోద్వేగ, మానసిక అనుకూలత. పరస్పర అవగాహన. ఇవి లేనపుడు మాత్రమే సమస్యలు సవాళ్లు వస్తాయనేది వారు చెబుతున్న మాట. ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ జంట, మిలింద్ సోమన్- అంకితా కోన్వర్ లాంటి సెలబ్రిటీల నిజమైన ప్రేమ బంధానికి ఇదే కారణమని ఉదాహరిస్తున్నారు.పెళ్లి ఈ పునాదులపైఇద్దరి మధ్యా స్పష్టమైన కమ్యూనికేషన్నమ్మకం, పరస్పర గౌరవం భావోద్వేగ మద్దతు (emotional support)ఈ ప్రధానమైన అంశాలు, విలువల ఆధారంగా చాలా జంటలు వారి వయస్సు అంతరంతో సంబంధం లేకుండా బలమైన బంధాన్ని కొనసాగించ గలుగుతారని, ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్.. అవగాహనే ముఖ్యమని రిలేషన్షిప్ కౌన్సెలర్లు, సామాజిక, మానసిక నిపుణులు చెబుతున్నామాట. -
ఇది సాకారమైతే ఇండో–పసిఫిక్ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యానికి చెక్!
భారత ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్ను శాసించాలి. అధిక నాణ్యత, తక్కువ ధరే మన బలం’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై నుంచి పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై విధించిన ట్యారిఫ్లను దృష్టిలో పెట్టుకుని ప్రధాని ఈ పిలుపునిచ్చారని వేరే చెప్పాల్సిన అవ సరం లేదు. ఏ దేశమైనా వేరే దేశం నుంచి వస్తు సేవలను దిగుమతి చేసుకుంటుందంటే అర్థం అవి దానికి అవసరమనే కదా! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదో భారత్ తన మీద ఆధారపడి ఉందన్నట్లుగా వ్యవహ రిస్తున్నారు. భారతదేశ ఉత్పత్తుల్ని దయతలిచి దిగుమతి చేసుకుంటున్నట్లుగా సుంకాలను విధిస్తున్నారు. అమెరికాకు భారత్ ఎగు మతి చేసే వస్తువులు, సేవల మొత్తం సుమారు 87 బిలియన్ డాలర్లు. ఇది భారత్ మొత్తం ఎగుమతులలో 18% వాటా. ఈ ఏడాది చివరి నాటికి సుమారు 90–100 బిలియన్ డాలర్ల విలువైన వస్తు సేవల ఎగుమతి ఉండవచ్చనేది విశ్లేషకుల అంచనా. సుంకాల వల్ల ఈ ఎగుమతులన్నీ ఆగిపోతాయా అంటే కాదనే చెప్పవచ్చు. భారత్ అతి తక్కువ ధరలకు, నాణ్యమైన వస్తువుల్ని సరఫరాచేస్తోంది. ఉదాహరణకు ఫార్మాస్యూటికల్ రంగం దాదాపు 8 బిలి యన్ డాలర్ల విలువైన పేటెంట్ లేని ఔషధ ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. ఫార్మా ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి కాక పోతే అక్కడి ప్రజలే ఇబ్బంది పడతారు. అలాగని పూర్తిగా మనకు ఇబ్బంది ఉండదా అంటే... ట్యారిఫ్ల వల్ల అమెరికా ప్రజలు వస్తువులు కొనలేక వినియోగం తగ్గించుకుంటారు. ఆ ప్రభావం మన మీద పడుతుంది. ఇదీచదవండి : బంగారం కాదు..కానీ కిలో కోటి రూపాయలు భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో పైపైకి ఎగబాకుతుండటాన్ని ప్రపంచం గుర్తిస్తోంది. ఇప్పటివరకూ ఇండో – పసిఫిక్ ప్రాంతంలో అమెరికా, దాని మిత్ర దేశాలు గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉన్నాయి. అయితే ప్రస్తుతం భారత్ తన చర్యల ద్వారా స్వీయ ముద్ర వేస్తోంది. తైవాన్తో వాణిజ్య ఒప్పందం, ఫిలిప్పీన్స్తో మిసైల్స్ సరఫరా ఒప్పందం, జపాన్తో టెక్నాలజీ సరఫరాకుసంబంధించిన ఒడంబడిక, వియత్నాంతో సైనిక సహకారం, ఇండో నేషియాతో సముద్ర భద్రత వంటి వాటిపై ఒప్పందాలు కుదుర్చు కుంది. అంతటితో ఆగడం లేదు. రష్యా ప్రతిపాదించిన రష్యా–ఇండియా–చైనా (ఆర్ఐసీ) ప్రతిపాదన మరోసారి తెరమీదికివచ్చింది. ఇది సాకారమైతే ఇండో–పసిఫిక్ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యానికి పూర్తిగా గండికొట్టేయ వచ్చు. నిజానికి ట్రంప్ సుంకాలు విధించింది భారత్పై కాదు. అమెరికా ప్రజలపై! 2025లో అన్ని సుంకాల వల్ల సగటు అమెరికా కుటుంబానికి సంవత్సరానికి 3,800 డాలర్ల నష్టం ఏర్పడుతుందని అంటున్నారు. ట్రంప్ లాంటి వాళ్లు ట్యారిఫ్లు ఎంత ఎక్కువ వేసినా భారత్కు ఇబ్బంది తాత్కాలికమే అవుతుంది. కొత్త మార్కెట్లు భారతీయ వ్యాపారులకు అందుబాటులోకి వస్తాయి. ఈ సవాళ్లు భారతదేశానికి ఎగుమతులను మెరుగుపరచడానికీ, భౌగోళికంగా వైవిధ్యభరితమైన మార్కెట్లను అన్వేషించడానికీ అవకాశం ఇస్తాయని మార్కెట్ వర్గాలంటున్నాయి. ట్రంప్ ట్యారిఫ్లు స్వదేశీ ఉత్పత్తులపై దృష్టి పెట్టేందుకు భారతదేశానికి అవకాశం కల్పిస్తాయి. చదవండి: రూ.13వేల కోట్లను విరాళమిచ్చేసిన బిలియనీర్, కారణం ఏంటో తెలుసా?-ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి, ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు -
డిజిటల్ డ్యామేజ్..! స్క్రీన్ టైం తగ్గించాల్సిందే..
ప్రస్తుత స్క్రీన్ వినియోగ దోరణులు ఇలాగే కొనసాగితే 2050 నాటికి దాదాపు 50% మంది పిల్లలు మయోపియాకు ప్రభావితమవుతారని ఆప్తాల్మిక్ – ఫిజియోలాజికల్ ఆప్టిక్స్ అంచనా. వినోదం నుంచి విద్య వరకూ డిజిటల్ స్క్రీన్లు వినియోగించడం అనేది నగర రోజువారీ జీవితంలో భాగమవుతోంది. దీంతో చిన్నారుల్లో కంటి సంబంధిత మయోపియా నుంచి డిజిటల్ కంటి ఒత్తిడి, నిద్రలోపాలు, ప్రవర్తనా మార్పుల వరకూ పలు అనారోగ్య సమస్యలు భారీగా పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు, క్యూరియస్ జర్నల్ పరిశోధన ఫలితాలను ఉటంకిస్తూ ఇటీవల ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో 50% కంటే ఎక్కువ మంది డిజిటల్ కంటి ఒత్తిడి లక్షణాలను కలిగి ఉన్నారు. వీటిలో అలసట, తలనొప్పి, నిద్ర ఆటంకాలు, మానసిక పరమైన ప్రవర్తనా సమస్యలు ఉన్నాయి. ఇవి దీర్ఘకాలిక ఆరోగ్యంపై చూపే ప్రభావం గురించిన ఆందోళనలు పెంచుతున్నాయి.కఠిన పరిమితులు అవసరం.. ‘ప్రారంభంలోనే ఆరోగ్యకరమైన స్క్రీన్ అలవాట్లను పెంపొందించడం పిల్లల కంటి ఆరోగ్యాన్ని కాపాడటానికి కీలకం’ అని వైద్యులు చెబుతున్నారు. ‘కఠినమైన స్క్రీన్ సమయ పరిమితిని నిర్ణయించడం అనే అంశానికి తల్లిదండ్రులు కూడా మద్దతు ఇవ్వగలగడం ఆరోగ్యకరమైన మార్పుకు ఒక మార్గం. విద్యావేత్తలకు స్క్రీన్లు అవసరమైనప్పుడు, 20–20–20 నియమాన్ని అనుసరించండి. ప్రతి ఇరవై నిమిషాలకు, ఇరవై సెకన్ల విరామం తీసుకోండి. డిజిటల్ కంటి ఒత్తిడిని తగ్గించడానికి 20 అడుగుల దూరంలో ఉన్న దేనినైనా చూడండి. బ్లూ లైట్ ఫిల్టర్ మోడ్ ఉపయోగించడం కూడా కంటి ఆరోగ్యానికి సహాయపడుతుంది’ అంటూ సూచిస్తున్నారు. స్క్రీన్ టైం ప్రభావం.. ‘ఎక్కువసేపు స్క్రీన్ టైం వాడటం వల్ల పాఠశాల వయసు పిల్లలకు మయోపియా లేదా సమీప దృష్టి లోపం కలుగుతోంది. ఈ మయోపియా వేగంగా అభివృద్ధి చెందడం వల్ల మెల్లకన్ను, పొడి కంటి వ్యాధి, కంటి డిజిటల్ ఒత్తిడి ప్రమాదం ఎక్కువవుతుంది’ అని కంటి వైద్య నిపుణులు అంటున్నారు. ‘స్క్రీన్ నుంచి వెలువడే నీలి కాంతి విభిన్న రకాల ముప్పును కలిగిస్తుంది. ఫ్రీ రాడికల్స్ కారణంగా రెటీనాకు నష్టం కలిగించడం, మెలటోనిన్ను అణచివేయడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. తద్వారా మొత్తం ఆరోగ్యం ప్రభావితం అవుతుందని వివరిస్తున్నారు. (చదవండి: వ్యాధులు.. ప్రభావాలు! కంటిపై 'కన్నేస్తాయి'..) -
మానవత్వమే దైవత్వం
మానవ సేవే మాధవ సేవ అంటారు. నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసిన వారిని, ముఖ్యంగా ప్రకృతి విపత్తులు, యుద్ధాలు,అంటువ్యాధుల వంటి ప్రమాదకరమైన పరిస్థితులలో మానవ సేవలో ధన్యులయిన వారిని స్మరించుకోవడం కోసం 2009 నుండి ఆగస్టు 19 నాడు ‘ప్రపంచ మానవత్వ దినోత్సవా’ (world humanitarian day )న్ని జరుపుకొంటున్నాం. ఈ కార్యక్రమానికి ఈ తేదీనే ఎంచుకోడానికి కారణం... బ్రెజిల్ దేశానికి చెందిన సెర్గియోడిమెల్లో. ఆయన దాదాపు మూడున్నర దశాబ్దాల పాటూ ఐక్యరాజ్య సమితి (యూఎన్ఓ) మానవతా వాద సహాయ కార్యక్రమాల్లో అంకితభావంతో పనిచేశారు. చాలా దేశాల్లో యుద్ధాల మధ్య యూఎన్ఓ సహాయ కార్యక్రమాలు చేపట్టిన ఆయన... 2003 ఆగస్టు 19న ఇరాక్లోని ఒక బాంబు పేలుడులో 21 మంది సహచరులతో సహా ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి యూఎన్ఓ ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాది ‘ప్రపంచ ఐక్యతను బలోపేతం చేయడం, స్థానిక సమాజాలకు సాధికారత కల్పించడం’ అనే ఇతివృత్తంతో ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఇజ్రాయెల్– పాలస్తీనా మధ్య జరుగుతున్న ఘర్షణలో వందలాది మంది చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. రష్యా–ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల నిత్యం అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆఫ్రికా ఖండంలోని సోమాలియా వంటి దేశాల్లో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితుల వల్ల ఎందరో ఊపిరి వదులుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో మానవత్వంతో, సహనంతో వ్యవహరించాలి. దయనీయ స్థితిలో కూరుకుపోయిన వారికి సహాయం అందించి ఆదుకోవాలి. ఏ సమాజంలోనైనా భిన్న నమ్మ కాలు, విభిన్న తాత్విక దృక్పథాలు ఉంటాయి. వాటిమధ్య సహజీవన సౌగంధాన్ని సాధించినప్పుడే శాంతి సౌభాగ్యాలు విలసిల్లుతాయి. సహనం సామా జిక శాంతికి కారణమవుతుంది. మనిషిలోని అసహనం సమాజంలోని అల్ల కల్లోలాకు కారణమవుతుంది. శాంతియుత నైతిక జీవనం సంఘంలో ప్రభవించడానికి సహనం తప్పనిసరి.ఇదీ చదవండి: బంగారం కాదు..కానీ కిలో కోటి రూపాయలు– ఎం. రాం ప్రదీప్ ‘ జన విజ్ఞాన వేదిక, తిరువూరు -
కబూతర్..! ఖానా కహానీ..
ప్రేమ చిహ్నాలుగా వర్థిల్లిన పావురాలే పలు రకాల వైరస్ వ్యాప్తికి కారకాలుగా మారుతున్నాయి. నగరాల్లోనూ వీటి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న నేపథ్యంలో అనారోగ్య సమస్యలూ, ఊపిరితిత్తుల సమస్యలు అధికమవుతున్నాయి. దీంతో వాటికి ఆహారాన్ని అందించడాన్ని ఇటీవలే ముంబయి, పుణె వంటి నగరాలు నిషేధించాయి. నగరంలో కూడా పావురాల సంఖ్య, వాటికి ఆహారం అందించే అలవాటు పెరుగుతున్న నేపథ్యంలో నగరంలో పావురాల ఫీడింగ్ అంశం చర్చనీయాంశంగా మారింది. గతంలో ముంబైలోని ఒక అపార్టుమెంట్లో చోటు చేసుకున్న పావురాల సమస్య రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. అనంతరం ఆ సమస్య ఏకంగా కోర్టు గడప కూడా తొక్కింది. అయితే ఆ స్థాయికి చేరకున్నా.. మన నగరంలోనూ నిత్యం ఇదే అంశంపై నగరవాసుల్లో వాదోపవాదాలు నడుస్తూనే ఉన్నాయి. పావురాల వల్ల మనుషులకు కలిగే అనారోగ్యాలపై అవగాహన పెరగడమే దీనికి కారణం. నగరంలో అలవాటుగా.. హాబీగా పావురాలకు ఆహారం వేసేవారితో పాటు మతపరమైన లేదా మరే ఇతర కారణాల వల్ల కూడా నగరంలో పావురాల ఫీడింగ్ సర్వసాధారణంగా మారింది. బహిరంగ ప్రదేశాల్లో వందలాది పావురాలు గుంపులుగా వస్తాయి. ప్రతి రోజూ ఉదయం వేళల్లో ప్రజలు ఈ పావురాలకు ఆహారం ఇవ్వడం సర్వసాధారణం. ట్యాంక్ బండ్, నాంపల్లి, సికింద్రాబాద్లోని క్లాక్ టవర్.. ఇలా పలు చోట్ల పావురాల ఫీడింగ్ నిత్యం కనిపించే అంశాలు. ఇలా ఫీడింగ్ చేసేవారి కోసం గింజలు, ఇతర ఆహార ఉత్పత్తులు విక్రయించే వారు కూడా పుట్టుకొచ్చారంటే అర్థం చేసుకోవచ్చు ఫీడింగ్ ఏ విధంగా జరుగుతుందో. అవగాహన పెరగాలి.. ‘పావురాల విసర్జన ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందనే విషయం తెలియక చాలా మంది పక్షులకు ఆహారం ఇస్తారు’ అని నగరానికి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సబా క్వాద్రి అంటున్నారు. అంతేకాదు పావురాలు, ఇతర పక్షులకు కూడా ఇది శాపంగా మారుతోంది. ‘ఇతర పక్షులను ఆకర్షించడానికి కొన్ని గింజలను బయట పెడుతాం. కానీ పావురాలు ఆ ప్రాంతాలను హైజాక్ చేసి ఇతర పక్షులకు ఉద్దేశించిన ఆహారాన్ని దక్కించుకుంటాయి’ అని సబా వెల్లడించారు. ముంబై వంటి నగరాల్లో చేసినట్లుగానే, పావురాలకు ఇష్టారాజ్యంగా ఆహారం అందించడాన్ని నివారించేందుకు జరిమానా విధించడమే మంచిదని ఆమె సూచిస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం వంటి ప్రాంతాల్లో గణనీయమైన సంఖ్యలో పావురాలు ఉంటున్నాయి. ‘విశ్వవిద్యాలయ వీధులను శుభ్రం చేసే స్వీపర్ల నుంచి భవనాల్లో నివసించే విద్యార్థుల వరకు, చాలా మంది పావురాల బిందువుల ద్వారా సంక్రమించే వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది’ అని వర్సిటీ ఉద్యోగి ఒకరు చెప్పారు. ఉదయం వేళల్లో పావురాలకు ఆహారం ఇవ్వొద్దని చెప్పేందుకే ఓయు ప్రత్యేకంగా ఒక భద్రతా అధికారిని నియమించిందని సదరు ఉద్యోగి వివరించారు. అంతేకాక వర్సిటీ భవనాల వెలుపల పావురాలకు ఆహారం ఇవ్వడం వల్ల కలిగే ప్రమాదాల గురించి తెలియజేసే బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. విసర్జన.. విషమౌతోంది.. పావురాల ప్రభావానికి ముఖ్యంగా విసర్జనకు ఎక్కువ కాలం గురికావడం వల్ల వివిధ రకాల హానికరమైన శిలీంధ్రాలు, బ్యాక్టీరియా పరాన్నజీవులు ఉత్పత్తి అవుతాయని, ఫలితంగా ఇన్ఫెక్షన్లు, పలు రకాల వైరస్లు వ్యాప్తి చెందుతాయని వైద్యులు చెబుతున్నారు. విసర్జనాలు ఎండిపోయినప్పుడు, అవి దుమ్ము రూపంలో గాలిలోకి ఎగిరి, ఊపిరి తీసుకునే సమయంలో గాలి ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశించి ఊపిరితిత్తులను చేరతాయి. ఈ క్రమంలోనే హైపర్సెన్సిటివిటీ న్యుమోనైటిస్కు కారణమవుతోంది. ఇది కొన్ని పరిస్థితుల్లో ప్రాణాంతకం కావచ్చు. ఈ ఇన్ఫెక్షన్లు పెంపుడు కుక్కలు, పిల్లుల వెంట్రుకల ద్వారా వచ్చే అలెర్జీల కంటే కూడా ప్రమాదకరంగా ఉంటాయి. పావురాల విసర్జన ఊపిరితిత్తుల వాపుకు కారణమవుతాయి. ఒక్కోసారి అవయవాలకు శాశ్వత నష్టాన్ని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్.. ఎలా గుర్తించాలి? పావురాల విసర్జన వల్ల సోకే ఇన్ఫెక్షన్ తీవ్రత అధికంగా ఉంటుంది. ప్రారంభ దశలో నిరంతరం పొడి దగ్గు వస్తుంది. దీనికి యాంటీబయాటిక్స్, బ్రోంకోడైలేటర్లను ఉపయోగించినా ఉపశమనం దొరకదు. దగ్గు రెండు నుంచి మూడు వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగిన క్రమంలో తదుపరి పరీక్షల కోసం పల్మనాలజిస్ట్ను సంప్రదించాల్సి ఉంటుంది.పలు దేశాల్లోనూ.. వెనిస్ నగరంలోని చారిత్రాత్మక చతురస్రాల్లో పావురాలకు ఆహారం నిషేధించారు. ఈ ఫీడింగ్కు సింగపూర్ భారీ జరిమానాలు విధిస్తోంది. అలాగే న్యూయార్క్, లండన్ కూడా దాణా ప్రదేశాలను నియంత్రించాయి. మన దేశంలో ముంబై, థానె, పుణెలో కేసులు నమోదు చేస్తున్నారు. ఢిల్లీలో కూడా పావురాల ఫీడింగ్ను నియంత్రించే దిశగా చర్యలు తీసుకోనుందని తెలుస్తున్న నేపథ్యంలో మన నగర పరిస్థితి ఏమిటని పలువురు నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. -
సమయం ఆసన్నమైతే...
‘కమలజ ఘటనా సమయంబైన, నసంభావ్యములైనను సంభవించు’ నన్నాడు ‘సింహాసన ద్వాత్రింశిక’ కావ్యకర్త కొఱవి గోపరాజు. ఆదిదేవుడైన శ్రీహరి నాభికమలం నుండి పుట్టిన బ్రహ్మ దేవుడి తలపుల నుంచి ఉద్భవించినవే స్థావర జంగమాత్మకమైనట్టి ఈ సృష్టిలోని సకల చరాచర వస్తు సంచయమంతా! బ్రహ్మదేవుడు అనుకోవాలేగాని, ఇదెలా సాధ్యం అనిపించేవి కూడా జరుగుతాయి. ప్రహ్లాదుడు హరిభక్తుడు. ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు హరిద్వేషి. హిరణ్యకశిపుడంటే ముల్లోకాల జనులకు భయమే. దేవతలచే, దేవతల సంతతిచే, దైత్యులచే, గ్రహములచే, తారకలచే, మునుల చేత, అగ్ని, వాయువు, యముడు, నరులు, గిరులు, తరులు, పశు పక్ష్య మృగ కీటకాదుల చేతిలో, ఏరకమైన ఆయుధముల వలన, అవని పైన, అంతరిక్షంలోను, పగటియందు, రాత్రియందు తనకు మరణం కలగకుండా బ్రహ్మ దేవుడి నుండి పొందిన వరంతో హిరణ్యకశిపుడి ఆగడాలకు అంతం లేకుండాపోయింది. అందరూ సుఖంగా ఉండాలంటే హిరణ్యకశిపుడి మరణం ఒక్కటే మార్గం కాగా, ఆ మరణం ఇలా సంభవమైందని ఈ కింది పద్యంలో చెప్పాడు కొఱవి గోపరాజు. కం. ఇది మానిసి యిది సింగం / బిది దేవత యను వివేక మెడలగ బలసంపద నుక్కుగంబమున హరి / యుదయింపడె దైత్యవరుని నుక్కడగింపన్.‘ఇది మనిషి, ఇది సింహము, ఇది దేవత అని గుర్తించి, విడదీసి చెప్పడానికి వీలు లేని విధంగా... అటు భూమి మీద గాని, ఇటు ఆకాశం గాని కాకుండా, మహోగ్ర రూపంలో ఉక్కు స్తంభం నుండి నృసింహావతారంలో హిరణ్య కశ్యపుడిని పరిమార్చడానికి ఉదయించాడు కదా శ్రీహరి’ అని పై పద్యం భావం. కనుక బ్రహ్మదేవుడి వినూత్న సృష్టికి సమయం ఆసన్నమైతే సంభవం కాదనుకున్నది కూడా సంభవమై కనపడుతుంది.ఇదీ చదవండి : బంగారం కాదు..కానీ కిలో కోటి రూపాయలు– భట్టు వెంకటరావు -
వ్యాధులు.. ప్రభావాలు! కంటిపై 'కన్నేస్తాయి'..
‘కన్ను లేనిదే కలికాలమే లేద’ని సామెత. అయితే వ్యాధుల్లేకుండా కూడా ఈ కలికాలం లేదు. పైగా ఈ వ్యాధులన్నీ అంతటి కీలకమైన కంటిని దెబ్బతీసే అవకాశం లేకపపోలేదు. డయాబెటిస్, రక్తపోటు వంటివి కనిపించినప్పుడు ఇంకేవైనా అవయవాలు దెబ్బతిన్నాయో చూడటంతోపాటు డాక్టర్లు కంటి పరీక్షలూ విధిగా నిర్వహిస్తారు. అలాగే మైగ్రేన్ మొదలుకొని థైరాయిడ్, రక్తహీనత (అనీమియా) వరకు ఎన్నో రకాల వ్యాధులు కంటి చూపుపై తమ దుష్ప్రభావాన్ని చూపే అవకాశముంది. అందుకే నేరుగా కంటికి వచ్చే ఆరోగ్య సమస్యలతోపాటు ఇతర వ్యాధుల వల్ల కంటిపై పడే దుష్ప్రభావాలు ఎలా ఉంటాయో, వాటి వల్ల కంటికి వచ్చే సమస్యలేమిటో తెలుసుకుందాం...ఎవరిలోనైనా ఏదైనా వ్యాధి వచ్చిందంటే చాలా సందర్భాల్లో అది ఆ అవయవానికో లేదా ఆ అవయవం ఏ వ్యవస్థదైతే ఆ వ్యవస్థకు మాత్రమే పరిమితమని అపోహ పడుతుంటాం. ఉదాహరణకు రక్తహీనత ఏర్పడిందంటే... అది రక్తం సరఫరా అయ్యే అన్ని అవయవాలతో పాటు కంటిపైనా తన దుష్ప్రభావాన్ని చూపవచ్చు. ఇక థైరాయిడ్కు ఏదైనా జబ్బు వస్తే అది థైరాయిడ్కు మాత్రమే పరిమితం కాక΄ోవచ్చు. అలా కంటిపై ప్రభావం చూపేందుకు అవకాశమున్న కొన్ని ఆరోగ్య సమస్యలూ, వ్యాధులు, కండిషన్స్ తాలూకు ఉదాహరణలు... డయాబెటిస్ రక్తపోటు థైరాయిడ్రక్తహీనత (అనీమియా) ∙కొలాజెన్ వాస్క్యులార్ డిసీజ్ ∙ఆటోఇమ్యూన్ డిసీజెస్ ∙కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కొన్ని ట్యూమర్లు (గడ్డలు) ∙వంశపారంపర్యంగా వచ్చే కొన్ని రకాల (హెరిడిటరీ) వ్యాధులు. ఇవి మాత్రమే కాదు... మనం వాడే కొన్ని రకాల మందులు, మన హార్మోన్లలో చోటుచేసుకునే అసమతౌల్యతలు... ఇవి కూడా కంటిపైన దుష్ప్రభావాలను చూపవచ్చు. అందుకే కొన్ని వ్యాధులు ఉన్నవారు, కొన్ని మందులు తీసుకునేవారు విధిగా వాటి వల్ల తమ కంటిపై ఏదైనా చెడు ప్రభావాలు కనిపిస్తాయా అని తెలుసుకోవాలి. అలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టరును సంప్రదించాలి. కొన్ని జబ్బులూ... కంటిపై అవి చూపే దుష్ప్రభావాలు...డయాబెటిస్ఈరోజుల్లో ఇంటికి ఒకరికైనా ఉండే లైఫ్స్టైల్ వ్యాధి ఇది. ఈ సమస్య వచ్చినవారిలోని కనీసం 20 శాతం మందిలో దాని దుష్ప్రభావాలు కంటిపైనా పడే అవకాశాలుంటాయి. డయాబెటిస్ వల్ల కంటికి వచ్చే వ్యాధులివే...డయాబెటిక్ రెటినోపతి : కంటివెనక ఉండే రెటీనా అనే తెరపై పడే ప్రతిబంబం నుంచి మెదడుకు సిగ్నల్స్ అందడం వల్లనే మనం చూడగలం. డయాబెటిస్ కారణంగా రక్తనాళాలు మొద్దుబారడంతో రెటినాకు అందాల్సిన పోషకాలు, ఆక్సిజన్ అందకపోవడంతో రెటీనా పనితీరు క్రమక్రమంగా తగ్గే అవకాశముంటుంది. ఫలితంగా దృష్టిలోపం వచ్చే ముప్పు ఉంటుంది. అందుకే డయాబెటిస్తో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా కంటి పరీక్షలూ, కంటి నరాలు మొద్దుబారుతున్నాయా అన్న విషయాన్ని క్రమం తప్పకుండా పరీక్షించుకుంటూ ఉండాలి. గ్లకోమా : డయాబెటిస్ ఉన్నవారికి కంట్లో నల్లముత్యం లేదా నీటికాసులు అనే గ్లకోమా బారిన పడే ముప్పు ఉంటుంది. గ్లకోమా ఉన్నవాళ్లలో కంట్లో ఉండే ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్ అనే ఒత్తిడి పెరిగి మనం చూసే దృష్టి విస్తృతి (ఫీల్డ్ ఆఫ్ విజన్) క్రమంగా తగ్గి΄ోతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు గ్లకోమా కండిషన్ ఏమైనా వచ్చిందా అని తరచూ కంటి డాక్టర్ చేత పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. క్యాటకార్ట్ : కంట్లోని లెన్స్ తన పారదర్శకతను కోల్పోయే కండిషన్ను కాటకార్ట్ అంటారన్న విషయం తెలిసిందే. వయసు పెరగడమే (ఏజింగ్ మాత్రమే) కాకుండా డయాబెటిస్ వల్ల కూడా కాటకార్ట్ వచ్చే అవకాశమున్నందువల్ల చక్కెర వ్యాధితో బాధపడేవారు క్యాటరాక్ట్కు సంబంధించిన పరీక్షలూ చేయించుకోవాలి. ఎందుకంటే సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే డయాబెటిస్ ఉన్నవాళ్లకు క్యాటరాక్ట్ పదేళ్లు ముందుగానే వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఆప్టిక్ న్యూరోపతీ : డయాబెటస్ వల్ల నరాలు మొద్దుబారి తమ చైతన్యాన్ని కోల్పోతాయన్న విషయం తెలిసిందే. అన్ని నరాలతో పాటు ఆప్టిక్ నర్వ్కు కూడా ఈ ముప్పు పొంచి ఉంటుంది. మిగతా నరాల విషయం ఎలా ఉన్నా చూపునిచ్చే ఆప్టిక్ నర్వ్ దెబ్బతింటే జీవితమంతా చీకటయ్యే ముప్పు ఉన్నందున డయాబెటిస్ ఉన్నవారు తప్పనిసరిగా క్రమం తప్పకుండా కంటిపరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు...డయాబెటిస్ ఉన్నవారు క్రమం తప్పకుండా మందులు వాడుతూ, వ్యాయామం చేస్తూ రక్తంలో చక్కెర మోతాదులను ఎప్పుడూ అదుపులో పెట్టుకుంటూ ఉండటం క్రమం తప్పకుండా తమ వ్యక్తిగత వైద్యులతో పాటు కంటి డాక్టర్ ఫాలో అప్లో ఉండటం.రక్తపోటు (హైపర్టెన్షన్)రక్తపోటు ఉన్నవారిలో కొందరికి అకస్మాత్తుగా చూపు కొంత మసకబారవచ్చు. లేదా దాదాపుగా చూపు కనిపించకపోవచ్చు. దీనికి అనేక కారణాలుంటాయి. రక్తపోటు కారణంగా... రెటీనాకు సంబంధించిన ప్రధాన రక్తనాళం (సిర)లోగానీ లేదా ఇతరత్రా ఏదైనా చిన్న రక్తనాళం (బ్రాంచ్ ఆఫ్ బ్లడ్ వెసెల్)లోగానీ రక్తం గడ్డకట్టి క్లాట్ ఏర్పడి అది అడ్డుపడే ముప్పు ఉండవచ్చు. రెటీనాకు సంబంధించిన ప్రధాన ధమని లేదా ధమని శాఖలో రక్తం గడ్డకట్టి రక్తప్రవాహానికి ఆ క్లాట్ అడ్డుపడవచ్చు. ఆప్టిక్ న్యూరోపతి అనే నరాలకు సంబంధించిన సమస్య రావచ్చు.కన్నులోని ఒక భాగమైన విట్రియల్ ఛేంబర్లో రక్తస్రావం కావచ్చు. గ్లకోమా వచ్చే ముప్పు కూడా ఉంటుంది.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు...రక్తపోటు ఉన్నవారు బీపీని అదుపులో ఉంచే ప్రయత్నాలు చేస్తుండాలి ఉప్పు, నూనె పదార్థాలు చాలా తక్కువగా తీసుకోవాలి కంటికి సంబంధించిన సమస్య వస్తే మందులు వాడటం లేదా లేజర్ చికిత్స లేదా శస్త్రచికిత్స చేయించుకోవాలి. డిస్లిపిడేమియారక్తంలో ఉండే కొన్ని రకాల కొవ్వు పదార్థాలు (ఉదా: కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్స్ వంటివి) ఉండాల్సిన మోతాదుల్లో కాకుండా హెచ్చుతగ్గులతో ఉన్నప్పుడు కంటి సమస్యలు రావచ్చు. అవి చూపును ప్రభావితం చేసే అవకాశం ఉంది.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు... కొవ్వులు తక్కువగానూ, పీచు ఎక్కువగానూ ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి తాము తీసుకున్న కొవ్వులు దహనమయ్యేలా (బర్న్) అయ్యేలా వ్యాయాయం చేయాలి డాక్టర్లు కొవ్వుల మోతాదులను తగ్గించే మందులు సూచిస్తే వాటిని తప్పక వాడాలి. రక్తహీనత (అనీమియా)మన రక్తంలో ఉండే ఎర్ర రక్తకణాలే దేహంలోని అన్ని కణాలకూ అవసరమైన ఆక్సిజన్నూ, పోషకాలను మోసుకెళ్తుంటాయన్న విషయం తెలిసిందే. అనేక రకాల కారణాలతో కొంతమందిలో ఈ ఎర్రరక్తకణాల సంఖ్య (ఆర్బీసీ) తక్కువగా ఉండే కండిషన్ను రక్తహీనత (అనీమియా) అంటారు. మరికొందరిలో రరక్తకణాల సంఖ్య తగినంతగా ఉన్నా ఆక్సిజన్ను మోసుకు΄ోయే హిమోగ్లోబిన్ తక్కువగా ఉండవచ్చు. ఇలా రక్తహీనత ఉన్నవారిలో ఈ కింది లక్షణాలు కనిపిస్తాయి. రెటీనాపై రక్తస్రావం (రెటినల్ హేమరేజ్) కంటిలోని లెన్స్ తన పారదర్శకత కోల్పోవడం నరాల సమస్య వంటివి.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు... అనీమియాను తగ్గించే ఐరన్ టాబ్లెట్లు / ఐరన్ సప్లిమెంట్లు ఉన్న మందులు వాడటం ∙ఐరన్, ఇతరత్రా విటమిన్లు, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాలు తీసుకోవడం. మైగ్రేన్ఇది ఒక రకం తలనొప్పి. తరచూ వస్తూ పోతూ... చాలా తీవ్రంగా బాధించే ఈ తలనొప్పి చాలామందిలో నుదుటికి ఒకవైపే రావచ్చు. అందుకే కొందరు దీన్ని పార్శ్వపు నొప్పి అని కూడా పిలుస్తారు. టీనేజ్ పిల్లల్లో తీవ్రంగా వచ్చి వాళ్ల చదువుపై కూడా ప్రభావం చూపే ఈ నొప్పిలో కన్ను కూడా చాలా నొప్పిగా ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. దాంతో పాటు కంటికి సంబంధించిన ఈ కింద లక్షణాలూ కనిపిస్తాయి. అవి... చూపు సరిగా కనిపించకుండా మసకమసగ్గా కనిపించడం నుదుటి మీద ఒకవైపున లేదా ఒక పక్క కన్నుగుడ్డులో తీవ్రమైన నొప్పి ఉండటం తాత్కాలికంగా చూపు తగ్గడం లేదా తాత్కాలికంగా ఏమీ కనిపించకపోవడం కంటి కండరాలకూ, కనురెప్పలకూ తాత్కాలికంగా పక్షవాతం రావడం. పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు...కొన్ని అంశాలు మైగ్రేన్ తలనొప్పిని తక్షణం ప్రేరేపిస్తాయి. ఉదాహరణకు కొన్ని రకాల సుగంధద్రవ్యాల వాసనా లేదా అగరుబత్తీల వాసనలు మైగ్రేన్ను ప్రేరేపించి వెంటనే తలనొప్పి వచ్చేలా చేస్తాయి. ఇలా మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించే అంశాలను ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. తమకు తలనొప్పి ఏ అంశం వల్ల వస్తుందో గుర్తించి దాని నుంచి దూరంగా ఉండటం వల్ల దీన్ని చాలావరకు నివారించవచ్చు. ఇక మైగ్రేన్కు సంబంధించి డాక్టర్లు రెండురకాల చికిత్సలు చేస్తారు. మొదటిది... నొప్పి తక్షణమే తగ్గేందుకు చేసే చికిత్స, రెండోది దీర్ఘకాలంలో ఈ నొప్పి మళ్లీ మళ్లీ రాకుండా నివారించేందుకు ఇచ్చే ప్రివెంటివ్ చికిత్స. ఈ రెండు రకాల ఈ మందులను బాధితులు తప్పనిసరిగా వాడాలి. గుండెజబ్బులుకొన్ని రకాల గుండెజబ్బులు (కార్డియోవాస్క్యులార్ డిసీజెస్) కూడా కంటిపై దుష్ప్రభావాన్ని చూపవచ్చు. గుండెజబ్బుల కారణంగా కొందరిలో ఈ లక్షణాలు కనిపించవచ్చు. ఉదాహరణకు... అకస్మాత్తుగా చూపు మందగించడం తాత్కాలికంగా చూపు కోల్పోవడం కంటి చూపునకు / దృష్టిజ్ఞానానికి సహాయపడే నరానికి (ఆప్టిక్ నర్వ్కు) సంబంధించిన సమస్యలు.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు...అసలు సమస్యకు (అండర్లైయింగ్ హార్ట్ ప్రాబ్లమ్కు) చికిత్స తీసుకోవడం వల్ల దాని కారణంగా వచ్చే కంటి సమస్యలూ తగ్గుతాయి. అలాగే తరచూ కంటి పరీక్షలూ చేయించుకుంటూ ఉండాలి. సోరియాసిస్సోరియాసిస్ వ్యాధిలో చర్మం పొడిబారి పట్టు రాలుతున్నట్లుగా ఉంటుంది. సొంత రోగ నిరోధకశక్తి బాధితులపై ప్రతికూలంగా పనిచేయడంతో పాటు మరికొన్ని కారణాలతో వచ్చే ఈ జబ్బులో కన్ను కూడా ప్రభావితమయ్యే అవకాశాలుంటాయి. ఈ జబ్బు ఉన్నవాళ్లలో...రెటీనాకూ, తెల్లగుడ్డులో భాగమైన స్క్లెరాలరా ΄÷రకు మధ్య ఇన్ఫ్లమేషన్ రావడం (యువైటిస్) కార్నియాకు ఇన్ఫ్లమేషన్ రావడం (కెరటైటిస్), కంటిలో ఉండే కంజెంక్టివా అనే పొరకు ఇన్ఫెక్షన్ రావడం (కంజెక్టివైటిస్), కన్ను పొడిబారడం (డ్రై ఐ) వంటి లక్షణాలు కనిపించవచ్చు.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు...సోరియాసిస్కు ఇప్పుడు గతంలో కంటే అధునాతనమైన చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు పూవా, గతంలో మాదిరిగా అల్ట్రావయొలెట్ రేడియేషన్ కిరణాలతో ఇచ్చే చికిత్సలు, ఇమ్యూనోమాడ్యులేటర్స్ అనే ఆధునిక తరహా చికిత్సలు. వీటిని తీసుకుంటూనే ఒకసారి కంటి వైద్యుడిని కూడా సంప్రదించాలి.కొలాజెన్ వ్యాస్క్యులార్ డిసీజెస్ కొలాజెన్ అనేది శరీరంలోని ఒకరకం ప్రోటీన్లతో కూడిన కణజాలం. మన రోగనిరోధక శక్తి మన కణజాలాన్నే శత్రువుగా పరిగణించి మన కొలాజెన్ ప్రోటీన్లపై దాడి చేయడం వల్ల కొన్ని వ్యాధులు కనిపిస్తాయి. వాటన్నింటినీ కలిపి కొలాజెన్ వ్యాస్క్యులార్ డిసీజెస్గా చెబుతారు. ఆ వ్యాధులేమిటంటే... సిస్టమిక్ లూపస్ అరిథమెటోసిస్ (ఎస్ఎల్ఈ) ∙కీళ్లనొప్పులు (జాయింట్పెయిన్స్) రుమటాయిడ్ ఆర్థరైటిస్ వెజెనెర్స్ గ్రాన్యులొమాటోసిస్ వంటి వ్యాధులు. ఎస్ఎల్ఈ (లూపస్) : లూపస్ అంటే వుల్ఫ్ (తోడేలు) అని అర్థం. ముఖం మీద ముక్కుకు ఇరువైపులా మచ్చతో కనిపించే వ్యాధి తాలూకు ఒక లక్షణం. ఇది శారీరక వ్యవస్థలపై ప్రభావం చూపుతుంది కాబట్టి దీన్ని సిస్టమిక్ లూపస్ అరిథమెటోసస్ (ఎస్ఎల్ఈ) అని చెబుతారు. లక్షణాలు... ముక్కుపై నుంచి చెంపలపైన ఇరువైపులా మచ్చల్లా కనిపించే దద్దుర్లలా (ర్యాష్) వస్తుంది. సూర్యకాంతి (ఫోటోసెన్సిటివిటీతో) వల్ల ఈ ర్యాష్ మరింత పెరగవచ్చు. పాలిపోయినట్లుగా ఉండే చర్మం ∙కొందరిలో వెంట్రుకల మూలాలు మూసుకుపోవడం (లూపస్లో ఇది ఒక రకం). దీన్ని డిస్కాయిడ్ లూపస్ అంటారు. ఇది వచ్చిన వారిలో ర్యాష్ చేతులు, ముఖం మీద వస్తుంది. కొన్నిసార్లు ఒళ్లంతా ర్యాష్ కూడా రావచ్చు కారణం తెలియని జ్వరం ∙బరువు తగ్గడం కాళ్లూ చేతులకు సంబంధించిన రెండు మూడు జాయింట్స్లో వాపు; రుమటాయిడ్ జబ్బుల్లోలా లూపస్లో జాయింట్స్ వాపు వచ్చి జాయింట్స్ ఒంగిపోతాయి. అయితే... రుమటిజంలోలా ఈ ఒంపు వల్ల శాశ్వత అంగవైకల్యం రాదు. ఇది కేవలం తాత్కాలికం. కొందరు డిప్రెషన్తో ఉద్వేగాలకు లోనవుతుంటారు. వీళ్ల సమస్యను మానసికమైన లేదా నరాలకు సంబంధించినదిగా పొరపాటు పడే అవకాశం ఉంది. ఇలాంటి వాళ్లలో ఏఎన్ఏ పరీక్ష నిర్వహించి– లూపస్ వల్ల మెదడుపై ఏదైనా దుష్ప్రభావం పడిందేమోనని పరీక్షించాలి. కొందరిలో ఫిట్స్ కొందరిలో జుట్టు రాలడం మరికొందరిలో నోటిలో, ముక్కులో పుండ్లు (అల్సర్స్) కూడా రావచ్చు. ఈ అల్సర్స్ వల్ల నొప్పి ఉండదు. ఇక ఈ వ్యాధుల వల్ల కంటిపై పడే దుష్పరిణామమేమిటంటే... అరుదుగా కొందరిలో కళ్లలో రక్త΄ోటు పెరిగి (హేమరేజిక్ రెటినైటిస్) అంధత్వానికి దారితీయవచ్చు. కొందరిలో కంటి చూపు క్రమంగా తగ్గుతూ ఉండవచ్చు. వీటన్నింటితో పాటు కళ్లకు సంబంధించి కన్ను పొడిబారడం (డ్రై ఐ); రెటీనాకూ, తెల్లగుడ్డులో భాగమైన స్క్లెరా పొరకు మధ్య ఇన్ఫ్లమేషన్ రావడం (యువైటిస్); స్క్లెరా పొరకు ఇన్ఫ్లమేషన్; కార్నియాకు ఇన్ఫ్లమేషన్ రావడం (కెరటైటిస్) వంటి సమస్యలు రావచ్చు.పిల్లల్లోనూ... పిల్లల్లోనూ లూపస్ రావచ్చు. దీన్ని జువెనైల్ సిస్టమిక్ లూపస్ అని అంటారు. పిల్లల్లో జ్వరం వచ్చి రెండు మూడు కీళ్లలో వాపు రావడం ద్వారా ఇది కనిపిస్తుంది. ఎండను చూడలేక బాధపడుతుండే పిల్లల విషయంలో జువెనైల్ లూపస్ ఉందేమోనని అనుమానించి పరీక్షలు చేయించడం ముఖ్యం. పిల్లల్లో వచ్చినప్పుడు (నియోనేటల్ లూపస్)–పుట్టుకతోనే గుండె కవాటాలలో లోపం (కంజెనిటల్ హార్ట్ బ్లాక్) రావచ్చు. ఇలా పిల్లల్లో లూపస్ వస్తే అది కళ్లపై దుష్ప్రభావం చూపుతుంది కాబట్టి స్కూళ్లకు వెళ్లే వయసు పిల్లల్లో ప్రతి ఆర్నెల్లకు ఓమారు వైద్యపరీక్షలు, కంటి పరీక్షలు (మాక్యులార్ టెస్ట్) చేయించడం మంచిది.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు : ప్రధానమైన సమస్యలైన సిస్టమిక్ లూపర్ అరిథమెటోసిస్ (ఎస్ఎల్ఈ), కీళ్లనొప్పులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలకు చికిత్స తీసుకోవడంతో పాటు కంటికి సంబంధించిన సమస్యలకూ తగిన చికిత్స తీసుకోవాలి. ఇక పిల్లల్లో జువెనైల్ సిస్టమిక్ లూపస్ను గుర్తించడం సాధ్యం కాదు కాబట్టి స్కూల్ పిల్లలందరికీ కంటివైద్యుల ద్వారా ప్రతి ఆర్నెల్లకోమారు పరీక్షలు చేయించడం అవసరం. డాక్టర్ రవికుమార్ రెడ్డి, సీనియర్ కంటి వైద్య నిపుణులు (చదవండి: కుంభకర్ణుడిని తలదన్నేలా.. ఆమె ఏకంగా 32 ఏళ్లు నిద్రపోయింది!) -
‘తల్లి’డిల్లిన మనసు
ద్వారకాతిరుమల: సృష్టిలో తల్లి ప్రేమకు మించింది మరొకటి లేదు. అది మనుషుల్లో అయినా.. జంతువుల్లో అయినా ఒక్కటే అనడానికి ఈ దృశ్యం అద్దంపడుతోంది. ద్వారకాతిరుమల శివారు లక్ష్మీపురంలోని ఆర్చిగేటు సమీపంలో రోడ్డుపై సోమవారం ఉదయం ఓ కుక్క పిల్లను కారు ఢీకొట్టడంతో, అది అక్కడే చనిపోయింది. దీంతో తన మరో పిల్లతో కలిసి అక్కడికి చేరుకున్న తల్లి శునకం చనిపోయిన పిల్లకు కాపలా కాసిన తీరు కంటతడి పెట్టించింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రోడ్డుపై పిల్లతో కూర్చుని, చనిపోయిన పిల్లను మరే వాహనం తొక్కకుండా ఒక పూటంతా కాపలా కాసింది. రోడ్డుపై వెళుతున్న వారి వైపు దీనంగా చూస్తూ తల్లడిల్లిపోయింది. చివరికి ఓ వ్యక్తి చనిపోయిన కుక్క పిల్లను దూరంగా తీసుకెళ్లి పడేయడంతో తల్లి శునకం, దాని పిల్ల అక్కడి నుంచి వెళ్లిపోయాయి.ఇదీ చదవండి: బంగారం కాదు..కానీ కిలో కోటి రూపాయలు -
ఫోటోగ్రఫీతో సత్తా చాటుతున్న వనితలు..!
కేరళలోని కోజికోడ్కు చెందిన కీర్తన కున్నాత్ లండన్లో స్థిరపడింది. జెండర్ నుంచి మెంటల్ హెల్త్ వరకు ఎన్నో అంశాలపై ఫొటోసిరీస్ చేస్తుంటుంది కీర్తన. ఆమె తాజా ఫొటోసిరీస్... నాట్ వాట్ యూ సా. దక్షిణ భారత మహిళా బాడీబిల్డర్లపై చేసిన ఫొటోసిరీస్ ఇది. ఈ సిరీస్కు ‘అండర్ 30’ విభాగంలో ది రాయల్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్స్ ఇంటర్నేషనల్ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్ అవార్డ్ గెలుచుకుంది. ‘ఆత్మవిశ్వాసం మూర్తీభవించేలా ఈ మహిళలను చూపాలనుకున్నాను’ అని తన ఫొటో ప్రాజెక్ట్ గురించి చెబుతుంది కీర్తన. ‘నాట్ వాట్ యూ సా’ ఫొటో ప్రాజెక్ట్ కోసం అనలాగ్ మీడియం ఫార్మట్ కెమెరా మమియ 67 ఉపయోగించి కేరళ, కర్ణాటకలోని వివిధ ప్రాంతాలలో ఫొటో షూట్ చేసింది. డాటర్ ఆఫ్ రఘు రాయ్చిన్నప్పుడు గిఫ్ట్గా కెమెరా అందుకున్న అవనీ రాయ్ అప్పటి నుంచి కెమెరాతో సుదీర్ఘ స్నేహం చేస్తూనే ఉంది. ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ రఘు రాయ్ కుమార్తెగా ఆమె ‘ఫొటోగ్రఫీ’ అనే ప్రపంచంలో పెరిగింది. ఎంతోమంది ఛాయాచిత్రకారుల నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుంది. ‘తండ్రి స్టైల్లోనే’ అని అనిపించుకోవాలని అవనికి ఉండేది కాదు. అందుకే తనదైన దృశ్యభాషను రూపొందించుకుంది. కశ్మీర్ సమస్య నుంచి చెన్నై ప్రజల తాగునీటి కష్టాల వరకు ఎన్నో సామాజిక సమస్యలను డాక్యుమెంట్ చేసింది. కశ్మీర్కు సంబంధించి సబ్జెక్ట్, ఎమోషన్లను ‘ఉమెన్ ఆఫ్ కశ్మీర్’ ఫొటోసీరిస్లో హైలెట్ చేయడానికి బ్లాక్ అండ్ వైట్ ఫొటోగ్రఫీని ఉపయోగించుకుంది. (చదవండి: అమ్మాయిలు చిన్న వయసు అబ్బాయిలనే ఇష్టపడటానికి రీజనే అదే..! సర్వేలో షాకింగ్ విషయాలు..) -
Sagubadi: 6 నెలల్లోనే ‘నేచురల్’ ధ్రువీకరణ!
ప్రకృతి వ్యవసాయ ఆహారోత్పత్తులపై వినియోగదారులకు నమ్మకం కలిగించటం ద్వారా ఆ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మార్కెట్ అవకాశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలో కేంద్ర వ్యవసాయ– రైతుల సంక్షేమ శాఖ ప్రత్యేక ‘నేచురల్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ సిస్టమ్’ (ఎన్ఎఫ్సీఎస్)ను ఏర్పాటు చేస్తోంది. ‘ఆర్గానిక్’ ధ్రువీకరణ కోసం ఇప్పుడున్న ‘ఎన్పీఓపీ’, ‘పీజీఎస్ ఇండియా’ సర్టిఫికేషన్ వ్యవస్థలకు అదనంగా.. దేశీ మార్కెట్ల కోసం ‘నేచురల్’ ధ్రువీకరణ వ్యవస్థ ప్రారంభమవుతోంది. సేంద్రియ ధ్రువీకరణ కోసం ఎన్పీఓపీ లేదా పీజీఎస్ సర్టిఫికేషన్ పొందడానికి అవసరమయ్యే పరివర్తన కాలం 3 ఏళ్లు. అయితే, ప్రకృతి వ్యవసాయదారులకు రిజిస్టర్ చేసుకున్న 6 నెలల్లోనే ‘నేచురల్’ సర్టిఫికేషన్ ఇవ్వనున్నారు. వెబ్పోర్టల్ లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా ఒంటరి రైతు లేదా కనీసం ఐదుగురు రైతులు కలిసి బృందంగా నమోదు చేసుకోవచ్చు..మన దేశంలో ‘సేంద్రియ ఆహారోత్పత్తుల’ ధ్రువీకరణకు ఇప్పటికే రెండు (ఎన్పీఓపీ, పీజీఎస్ ఇండియా) ధ్రువీకరణ వ్యవస్థలు పనిచేస్తుండగా.. ఈ పరిధిలోకి రాని ‘ప్రకృతి వ్యవసాయోత్పత్తుల’ ధ్రువీకరణ కోసం మూడో ధ్రువీకరణ పద్ధతిని కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఆహార భద్రత మరియు ప్రమాణాలు (సేంద్రీయ ఆహారాలు) నిబంధనలు, 2017 ప్రకారం చట్టబద్ధంగా గుర్తింపు కలిగిన రెండు రకాలు ఉన్నాయి.. దేశ విదేశాల్లో తమ ఆర్గానిక్ ఉత్పత్తులను అమ్మాలనుకునే రైతుల కోసం నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్పీఓపీ) మొదటిది. దీన్ని ‘థర్డ్ పార్టీ సర్టిఫికేషన్’ అని కూడా అంటారు. ఇది అధిక ఖర్చుతో కూడి ఉంటుంది. రెండోది: తక్కువ ఖర్చుతో ధ్రువీకరణను రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి 2011లో పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ (పీజీఎస్)–ఇండియా ఆర్గానిక్ సర్టిఫికేషన్ వ్యవస్థ ఏర్పాటైంది. కొత్తది మూడోది: ‘నేచురల్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ సిస్టమ్’(ఎన్ఎఫ్సీఎస్) పేరిట కేంద్ర వ్యవసాయ– రైతుల సంక్షేమ శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తోంది. ఇది దేశీ మార్కెట్లలో ప్రకృతి వ్యవసాయోత్పత్తుల అమ్మకానికి రైతులకు ఉపయోగపడుతుంది. గత కొన్ని నెలలుగా సంబంధిత వర్గాల వారిని సంప్రదించి, సలహాలు సూచనలు తీసుకొని మార్గదర్శకాలను రూపొందించారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు రసాయనిక వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయానికి మారే పరివర్తన కాలం కేవలం 6 నెలలే కావటం విశేషం. ‘నేచురల్’ «ధ్రువీకరణలో ముఖ్యాంశాలు:1. ‘నేచురల్ ఫార్మింగ్’ ధ్రువీకరణ పొందాలంటే ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించాలి. ఈ పద్ధతుల్లో పంటలు పండించటం.. వ్యవసాయోత్పత్తులను పొలంలో గాని లేదా మరోచోటకు తీసుకెళ్లి గాని వ్యక్తిగత రైతులు/ రైతుల బృందాలు ప్రాథమిక స్థాయిలో శుద్ధి చేయటం.. విలువను జోడించటం.. ఈ మూడింటికీ ‘నేచురల్’ ధ్రువీకరణ ఇస్తారు. 2. నేచురల్ ఉత్పత్తులను ప్యాకెట్లలో నింపి, సీల్ చేసి.. ట్రేసబిలిటీ వివరాలతో కూడిన సమాచారాన్ని, లోగోను కవర్పై ముద్రించి అమ్మాలి. దీని లోగో పీజీఎస్ ఇండియా లోగోకు దగ్గరిగానే ‘పీజీఎస్–ఇండియా నేచురల్’ అని ఉంటుంది. తాజా పాలు, పెరుగు, మజ్జిగ వంటివి లూజుగా కూడా అమ్ముకోవచ్చు. 3. ప్రకృతి వ్యవసాయం పశువులతో (ప్రధానంగా స్థానిక పశుజాతులతో) అనుసంధానమై ఉంటుంది. బీజామృతం, జీవామృతం, ఘన జీవామృతం, నీమాస్త్రం, దశపర్ణి కషాయం లేదా ఏదైనా ఇతర సాంప్రదాయ లేదా వినూత్న రసాయన రహిత ఉత్పాదకాలను మాత్రమే ఉపయోగించాలి. 4. ఒకటి కన్నా ఎక్కువ పంటలు కలిపి పండించటం, వర్షాకాలం ముందే పొడి మట్టిలోనే మట్టి పొరతో లేపనం చేసిన విత్తనాలను విత్తటం, పంట వ్యర్థాలతో ఆచ్ఛాదన, సాంప్రదాయ రకాల విత్తనాలు (జన్యుమార్పిడి విత్తనాలకు అనుమతి లేదు) వాడటం, పక్క పొలానికి ప్రకృతి సేద్య పొలానికి మధ్య కొన్ని ఎత్తయిన చెట్లను పెంచటం ద్వారా రసాయన పురుగుమందుల తుంపర్లు ఈ పొలంలోని పంటలపై పడకుండా అడ్డుకోవటానికి బఫర్ జోన్లలో చెట్లు పెంచటం.. మొదలైనవి.5. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు నేల నిర్మాణాన్ని, పోషకాల స్థాయిని మెరుగుపరుస్తాయి. మట్టిలో సేంద్రియ కర్బనాన్ని మెరుగుపరుస్తాయి. తేమ నిలుపుదల, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతాయి. పంటల వైవిధ్యతను ప్రోత్సహిస్తాయి. స్థానిక రైతుల విజ్ఞానానికి, స్థానికంగా అమల్లో ఉన్న నిర్దిష్ట సాంకేతికతల్లోని స్థానిక వ్యవసాయ–పర్యావరణ సూత్రాలను ప్రకృతి వ్యవసాయం తనలో ఇముడ్చుకుంది. 6. ఖరీఫ్, రబీ పంటల మధ్య విరామ కాలంలో కూడా పొలాన్ని ఖాళీగా ఉంచకూడదు. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) పద్ధతిలో 12–25 రకాల స్థానిక విత్తనాలతో నవధాన్య పంటలు సాగు చెయ్యటం ముఖ్య విషయం. 7. పొలంలో పంటలకు ముందు పలు జాతుల పచ్చి ఎరువు పంటలను పెంచటం, సాధ్యమైనంత వరకు పొలంలోనే తయారు చేసుకున్న ఎరువులు వాడటం ముఖ్యం. 8. ప్రకృతి వ్యవసాయ ధ్రువీకరణ వ్యవస్థను ఎన్ఎఫ్సిఎస్ సర్టిఫికేషన్ కమ్ ట్రేసబిలిటీ పోర్టల్ ద్వారా నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్ (ఎన్సీఓఎన్ఎఫ్) నిర్వహిస్తుంది. ఎన్సీఓఎన్ఎఫ్ కేంద్ర కార్యాలయం ఘజియాబాద్లో ఉండగా, ప్రాంతీయ కార్యాలయం నాగపూర్లో ఉంది. దీని పరిధిలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. 9. ‘నేచురల్’ ధ్రువీకరణ ఇచ్చే క్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయ ప్రమాణాల అమలు, పారదర్శకత, ఏ ఉత్పత్తిని ఏ రైతు పండించారు? ఎవరు శుద్ధి చేసి ప్యాకెట్లు తయారు చేశారు? అనే విషయాలను కేంద్ర వ్యవసాయ–రైతు సంక్షేమశాఖ పర్యవేక్షణలో ఎన్సీఓఎన్ఎఫ్ నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. ధ్రువీకరణ సేవల కోసం ఆన్లైన్, ఆఫ్లైన్ తనిఖీలను రీజినల్ కౌన్సెళ్ల (ఆర్సీల) ద్వారా నిర్వహిస్తుంది. 11. పీజీఎస్ ఇండియా సర్టిఫికేషన్ కోసం దేశవ్యాప్తంగా 76 రీజినల్ కౌన్సెల్స్ (ఆర్సీలు) పనిచేస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, స్థానిక బృందాలు, కేవీకేలు, యూనివర్సిటీలు, గుర్తింపు పొందిన ప్రకృతి వ్యవసాయ సంస్థలు ఆర్సీలుగా వ్యవహరిస్తున్నాయి. వీటి ద్వారానే నేచురల్ సర్టిఫికేషన్ సంబంధిత పోర్టల్, యాప్లు రైతులు, బృందాలకు అందుబాటులోకి వస్తాయి. డాక్యుమెంటేషన్, ఆన్లైన్, ఆఫ్లైన్ తనిఖీలు కూడా వీటి ఆధ్వర్యంలోనే జరుగుతాయి. 12. నేచురల్ సర్టిఫికేషన్ క్షేత్ర స్థాయిలో తనిఖీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామపంచాయతీ/ గ్రామస్థాయిలో కనీసం 5గురితో ‘లోకల్ గ్రూప్’లను ఏర్పాటు చెయ్యాలి. వారిలో ఒకర్ని నాయకుడిగా నియమించాలి. 13, వ్యవసాయం చేస్తున్న పొలం మొత్తంలో కొంత భాగంలో మాత్రమే ప్రకృతి వ్యవసాయం చేస్తుంటే.. ఉత్పాదకాలు, పంట దిగుబడులు కలసిపోకుండా గోదాములను రసాయనిక వ్యవసాయానికి, ప్రకృతి వ్యవసాయానికి వేర్వేరుగా ఏర్పాటు చేసుకోవాలి. యంత్ర పరికరాలను శుభ్రం చేసి వాడాలి. 14. నేచురల్ సర్టిఫికేషన్ కోసం పోర్టల్/మొబైల్ ద్వారా తమ పేరు నమోదు చేసుకునేటప్పుడు రైతు స్వీయధ్రువీకరణ సమర్పించాలి. రసాయనాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా వాడబోనని ప్రమాణం చెయ్యాలి. పశువులు వున్నాయా? అవి స్థానిక జాతులవా కాదా? జీవామృతం వంటి తానే పొలంలో తయారు చేసుకుంటున్నారా లేదా? దేశీ విత్తనాలే వాడుతున్నారా? ఎంతకాలం నుంచి అనుసరిస్తున్నారు? ఏ పంటలు పండిస్తున్నారు? వంటి విషయాలు పేర్కొనాలి. ద్రావణాలు, కషాయాలు 90% సొంతంగా తయారు చేసుకునే రైతుకు వెరీ గుడ్ రేటింగ్ ఇస్తారు. కౌలు రైతులు కౌలు ఒప్పంద పత్రాన్ని సమర్పించాలి.సేంద్రియ vs ప్రకృతి సేద్యంసేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు రెండూ రసాయనేతర వ్యవసాయ పద్ధతులే. ఈ రెండిటి మధ్య సారూప్యాలు ఉన్నప్పటికీ వ్యత్యాసాలు కూడా ఉన్నాయి.సారూప్యాలు: ఎక్కువ రకాల పంటలు సాగు చేయటం, పొలంలో పంట వ్యర్థాలను తిరిగి భూమిలో కలిపే పనులు చెయ్యటం, ప్రకృతి సహజమైన పోషక చక్రాన్ని పునరుజ్జీవింపజేయటం, పంటల మార్పిడి, బహుళ పంటల సాగు, సమర్థవంతంగా వనరుల పునర్వినియోగం.వ్యత్యాసాలు: సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో బయటి వ్యాపారుల నుంచి కొనుగోలు చేసి తెచ్చిన సేంద్రియ, జీవసంబంధమైన ఎరువులు, ద్రావణాలు, ఖనిజాలు ఉత్పాదకాలను వాడతారు. వర్మీకంపోస్టు, దిబ్బ ఎరువు, జీవన ఎరువులు, పురుగుమందులు వంటివి వాడతారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాధ్యమైనంత వరకు పొలంలోనే తయారు చేసుకుంటారు. సాధ్యమైనంత వరకు స్థానిక జాతుల పశువుల (ముఖ్యంగా దేశీ ఆవుల) పేడ, మూత్రంతో స్వయంగా తయారు చేసుకున్న ఘనజీవామృతం, ద్రవజీవామృతం, కషాయాలు, ద్రావణాలు వాడతారు. మరీ అవసరమైతే గ్రామంలోని బయో రిసోర్స్ సెంటర్(బీఆర్సీ) నుంచి వీటిని కొనుగోలు చేస్తారు. ఏడాది పొడవునా భూమిని వత్తుగా విత్తిన పంటలతో లేదా పంట వ్యర్థాల ఆచ్ఛాదనతో కప్పి ఉంచుతారు. ఖరీఫ్, రబీ, వేసవి పంటలు పూర్తయ్యాక కూడా భూమిని ఎండబెట్టకుండా నవధాన్య పంటలు విధిగా సాగు చేస్తూ నేలకు నిరంతరం సజీవ ఆచ్ఛాదన (లైవ్ మల్చింగ్) కల్పిస్తారు. తద్వారా భూమిలోని పోషక చక్రాన్ని పునరుద్ధరిస్తారు. ‘నేచురల్’ యాప్, పోర్టల్లు ఖరీఫ్ ఆఖరి నాటికి సిద్ధం– ‘సాక్షి సాగుబడి’తో ఎన్సీఓఎన్ఎఫ్ డైరెక్టర్ డా. గగనేశ్ శర్మప్రకృతి వ్యవసాయోత్పత్తుల నాణ్యతా ధ్రువీకరణ కోసం ‘పీజీఎస్–ఇండియా నేచురల్’ పేరిట ప్రత్యేక సర్టిఫికేషన్ వ్యవస్థను త్వరలో ప్రారంభిస్తున్నామని నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్ (ఎన్సీఓఎన్ఎఫ్) డైరెక్టర్ డా. గగనేశ్ శర్మ తెలిపారు. ప్రకృతి వ్యవసాయదారులు పేర్లు నమోదు చేసుకున్న 6 నెలల్లో సర్టిఫికేషన్ ఇస్తామని, సీనియర్ రైతులకు వెంటనే ధ్రువీకరణ ఇస్తామన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ పంట కాలం చివరి నాటికి ప్రత్యేక పోర్టల్, మొబైల్ యాప్లు అందుబాటులోకి వస్తాయన్నారు. డా. గగనేశ్ శర్మ ‘సాక్షి సాగుబడి’తో టెలిఫోన్ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖకు అనుబంధంగా ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ కేంద్రంగా ఎన్సీఓఎన్ఎఫ్ దేశంలోని సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి కృషి చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర దక్షిణాది రాష్ట్రాలు దీని నాగపూర్ ప్రాంతీయ కేంద్రం పరిధిలోకి వస్తాయి. సీనియర్ రైతులకు వెంటనే ధ్రువీకరణడా. గగనేశ్ శర్మ ఇంకా ఏమన్నారంటే: ‘వినియోగదారులకు సౌలభ్యకరంగా ఉండేవిధంగా నేచురల్ ఫార్మింగ్ పోర్టల్, మొబైల్ యాప్లను రూపొందిస్తున్నాం. ఈ ఖరీఫ్ పంట కాలం ముగిసే నాటికి ఇవి అందుబాటులోకి తేవటానికి ప్రయత్నిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయదారులు సులువుగా నేరుగా ఆన్లైన్లో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేయమని రాష్ట్రప్రభుత్వాలను ఇప్పటికే కోరాం. ప్రస్తుతానికి ఆఫ్లైన్లో రైతుల పేర్ల నమోదు జరుగుతోంది. ఇప్పటికి 1,15,000 మంది రైతులు రిజిస్టర్ చేసుకున్నారు. సేంద్రియ వ్యవసాయ ధ్రువీకరణ ‘పీజీఎస్ ఇండియా’కు ఉన్న నిబంధనలే దీనికీ వర్తిస్తాయి. అయితే, దీని ప్రమాణాలు వేరుగా ఉంటాయి. ఒక ఏడాది నుంచి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు తమ పేరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత 6 నెలల్లో నేచురల్ ధ్రువీకరణ ఇస్తాం. అయితే, 4 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు ఈ 6 నెలల పరిమితిని సడలిస్తాం. వారు ఎన్నేళ్లుగా ప్రకృతి సేద్యం చేస్తున్నారు? పశువులు ఏమి ఉన్నాయి? ఎరువులు కషాయాలు వారే తయారు చేసుకుంటున్నారా? పంటల జీవవైవిధ్యాన్ని ఎంత మేరకు పాటిస్తున్నారు? వంటి విషయాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి వారికి గ్రేడింగ్ ఇస్తాం. అన్నీ సంతృప్తికరంగా ఉంటే వెంటనే ధ్రువీకరణ ఇస్తాం..’ నేచురల్ ఉత్పత్తులను ఎన్సీఓఎల్ కొంటుంది‘దేశంలో 80% మంది రైతులు చిన్న కమతాలలో ప్రకృతి వ్యవసాయం చేసే వారే. వీరు పండించే పంటలో వారే చాలా వరకు వారి కుటుంబమే తింటారు. 20–30% పంటను అమ్ముతారు. ఈ మిగులు ఉత్పత్తులను కేంద్ర సహకార శాఖ ఏర్పాటు చేసిన జాతీయ సహకార సేంద్రియ లిమిటెడ్ (ఎన్సీఓఎల్) కొనుగోలు చేసి, ప్రాసెస్ చేసి, దేశ ప్రజలకు విక్రయిస్తుంది. అమూల్ పాల ఉత్పత్తులను విక్రయించిన పద్ధతిలో ఇది జరుగుతుంది. మేం ఇచ్చే పీజీఎస్ నేచురల్ సర్టిఫికేషన్ ప్రాసెస్ సర్టిఫికేషన్ మాత్రమే. ప్రకృతి రైతుల ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించేందుకు బ్యాచ్ల వారీగా ఎన్సీఓఎల్ పరీక్షలు చేస్తుంది’ అని వివరించారు డా. గగనేశ్ శర్మ. -
సై‘లెన్స్’ సాహసం
మనిషి మూడో కన్ను కెమెరా. రెండు కళ్లు చూడలేని దృశ్యాలను కెమెరా కన్ను చూస్తుంది. ఛాయాచిత్ర ప్రపంచంలో మహిళా ఫొటోగ్రాఫర్లు తమదైన ముద్ర వేసారు. ప్రకృతి అందాలు మాత్రమే కాదు సామాన్యుల జీవితాలు, అణగారిన వర్గాల పోరాటాలు, భిన్నమైన సాంస్కృతిక అంశాలను ఫొటోగ్రఫీలోకి తీసుకువస్తున్నారు.ఆ కెమెరా... అణగారిన వర్గాల గొంతుక-భూమిక సరస్వతిప్రకృతి అందాలు మాత్రమే కాదు సామాన్యుల జీవితాలను, అణగారిన వర్గాల ఉద్యమాలను, దళిత, ఆదివాసీ జీవితాలను తన కెమెరా కంటితో చిత్రిస్తోంది భూమిక సరస్వతి. పర్యావరణ సంరక్షణపై దళిత, ఆదివాసీలు చేస్తున్న పోరాటాన్ని ‘అన్ ఈక్వల్ హీట్’ టైటిల్తో ఫొటో డాక్యుమెంటేషన్ చేసింది. భూమిక తన ప్రాజెక్ట్కు సంబంధించిన ఫొటోలను ఎక్కువగా చత్తీస్ఘడ్, ఉత్తర్ప్రదేశ్లాంటి రాష్ట్రాల్లో తీసింది. ‘అన్ ఈక్వల్ హీట్’ ప్రాజెక్ట్కు సంబంధించిన పనుల్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. అదే పనిగా ప్రయాణాలు చేయడం వల్ల అనారోగ్యానికి గురైన రోజులు ఉన్నాయి. అక్రమ మైనింగ్ జరిగే ప్రాంతాల్లో కెమెరాతో వెళ్లడం అంటే ప్రమాదమే. వాటిని లెక్క చేయకుండా ముందుకు వెళ్లింది.అదర్ సైడ్కేరళలోని కోజికోడ్కు చెందిన కీర్తన కున్నాత్ లండన్లో స్థిరపడింది. జెండర్ నుంచి మెంటల్ హెల్త్ వరకు ఎన్నో అంశాలపై ఫొటోసిరీస్ చేస్తుంటుంది కీర్తన. ఆమె తాజా ఫొటోసిరీస్... నాట్ వాట్ యూ సా. దక్షిణ భారత మహిళా బాడీబిల్డర్లపై చేసిన ఫొటోసిరీస్ ఇది. ఈ సిరీస్కు ‘అండర్ 30’ విభాగంలో ది రాయల్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్స్ ఇంటర్నేషనల్ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్ అవార్డ్ గెలుచుకుంది. ‘ఆత్మవిశ్వాసం మూర్తీభవించేలా ఈ మహిళలను చూపాలనుకున్నాను’ అని తన ఫొటో ప్రాజెక్ట్ గురించి చెబుతుంది కీర్తన. ‘నాట్ వాట్ యూ సా’ ఫొటో ప్రాజెక్ట్ కోసం అనలాగ్ మీడియం ఫార్మట్ కెమెరా మమియ 67 ఉపయోగించి కేరళ, కర్ణాటకలోని వివిధ ప్రాంతాలలో ఫొటో షూట్ చేసింది.-కీర్తన కున్నాత్డాటర్ ఆఫ్ రఘు రాయ్చిన్నప్పుడు గిఫ్ట్గా కెమెరా అందుకున్న అవనీ రాయ్ అప్పటి నుంచి కెమెరాతో సుదీర్ఘ స్నేహం చేస్తూనే ఉంది. ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ రఘు రాయ్ కుమార్తెగా ఆమె ‘ఫొటోగ్రఫీ’ అనే ప్రపంచంలో పెరిగింది. ఎంతోమంది ఛాయాచిత్రకారుల నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుంది. ‘తండ్రి స్టైల్లోనే’ అని అనిపించుకోవాలని అవనికి ఉండేది కాదు. అందుకే తనదైన దృశ్యభాషను రూపొందించుకుంది. కశ్మీర్ సమస్య నుంచి చెన్నై ప్రజల తాగునీటి కష్టాల వరకు ఎన్నో సామాజిక సమస్యలను డాక్యుమెంట్ చేసింది. కశ్మీర్కు సంబంధించి సబ్జెక్ట్, ఎమోషన్లను ‘ఉమెన్ ఆఫ్ కశ్మీర్’ ఫొటోసీరిస్లో హైలెట్ చేయడానికి బ్లాక్ అండ్ వైట్ ఫొటోగ్రఫీని ఉపయోగించుకుంది.అవనీ రాయ్ -
అలా పుట్టిందే చిట్టి చిలకమ్మ పాట
అమ్మమ్మ తన చిట్టి మనవరాలిని బుజ్జగిస్తూ ... ‘చిట్టి చిలకమ్మా / అమ్మ కొట్టిందా..! ’అని చెబుతుంటే మనవరాలు కళ్లు విప్పార్చి వింటున్న అందమైన దృశ్యం మన కళ్ల ముందు నిలుస్తుంది. అమ్మ తన కూతురితో ‘పండు తెచ్చావా.. గూట్లో పెట్టావా.. గుటుక్కున మింగావా..’ అనగానే చిన్నారి కూతురు కిల కిల నవ్వే నవ్వులు తలపునకు వస్తాయి. చిలకమ్మ వచ్చేసింది.. పండు తెచ్చింది అని చిన్నారులంతా సంబరపడిపోయి పాడుకునే ఆ పాట అరవై ఏళ్లుగా తెలుగు ముంగిళ్లలో పిల్లలున్న ప్రతి ఇంట్లో వినపడుతూనే ఉంది. ఈ గేయం ఎనిమిది పదుల బల్ల సరస్వతి నోట పుట్టింది అనగానే ఆశ్చర్యంగా అందరి చూపులూ ఆమె వైపుకు మరలకుండా ఉండవు. ఎనిమిది పదుల వయసున్న బల్ల సరస్వతి స్వస్థలం జనగాం జిల్లా, బచ్చన్నపేట్ మండలం, కట్కూరు గ్రామం. ఈ పాట ఆమె నోట ఎలా పుట్టింది?! ఇదే విషయం అడిగితే ... ఆమె తన ఏడుతరాల ముచ్చటను మన ముందుంచారు.‘‘ఏడు తరాల ముచ్చట్లు చెప్పాలంటే ఒక్కజాములో అయ్యేది కాదు. నెక్కొండ బ్లాక్లో గురజాల అనే గ్రామం కింద గుంటూరుపల్లె అని ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరుకు ప్రైమరీ స్కూల్కి సింగిల్ టీచర్గా 1962లో వెళ్లాను. ఆ స్కూల్ ఒక గుడిసె. అందులోకి 50 మంది పిల్లలు వచ్చేవారు. ఆ పిల్లలకు చదువు చెప్పడానికి ఏ పుస్తకాలూ లేవు. అక్షరాలు దిద్దించడం, అంకెలు చెప్పడం.. ఎంతసేపూ ఇవే చెబితే పిల్లలు వినరు. రోజంతా వారిని ఎంగేజ్ చేయాలంటే ఎట్లా అని ఆలోచించేదాన్ని. నా చిన్ననాటి నుంచి విన్న పాటలు, కథలు చెప్పాలనుకున్నా. మా అమ్మ నా చిన్నతనంలో చెప్పిన గేయాలు, పద్యాలు, కథలు మాత్రమే కాదు అప్పటికప్పుడు నేనే స్వయంగా పాటలు అల్లి పిల్లలకు చెబుతుండేదాన్ని. అన్నీ పిల్లల మెదళ్లకు చేరేవి కావు. ఇంకా వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నా. ఆ ప్రాంతమంతా చుట్టూ చెట్లు, చేమలు. నేను ఇలా చటుక్కున చెబితే పిల్లలు లటుక్కున అందుకునేలా ఉండాలి. చిన్నారులు తాము రోజూ చూసేవాటి మీద పాట గట్టి చెప్పాలి. అలా అప్పటికప్పుడు చిలుకల మీద అల్లిన పాటే ఇది... అని చెబితే.. పిల్లలు ఆ పదాలను సులువుగా పట్టేసుకున్నారు. ఆ పాట ఆ నోటా ఈ నోటా.. అలా అలా ఎగురుతూ చాలాకాలం కిందటే ఎల్లలు దాటి అమెరికా దాకా పోయింది. ఇప్పటికీ ఎగురుతూనే ఉంది. సముద్రాలు, పర్వతాల గురించి చెబితే వారికి అర్థమయ్యేది కాదు. సరైన దృష్టి పెట్టేవారు కాదు. అందుకని ఏది చెప్పినా గేయాల రూపంలోనే. టీచర్గా రావడానికి ముందు మాకు బేసిక్ ట్రైనింగ్ ఇచ్చారు. అది కూడా నాకు ఉపయోగపడింది. వినోదంగా, అర్థమయ్యే విధంగా, ఆసక్తి కలిగే ప్రయత్నాలు అన్నీ చేసేదాన్ని. ఊరూరూ ప్రయాణం..1957లో అప్పటి 7వ తరగతి పాసయ్యాను. 14 ఏళ్ల వయసులో పెళ్లయ్యింది. మా వారు పీయూసీ చదివారు. ఇద్దరం బేసిక్ టీచర్ ట్రైనింగ్ చేశాం. మా ఇద్దరికీ నెల రోజుల తేడాతో టీచర్ ఉద్యోగాలు వచ్చాయి. నాకు, మావారికి పక్క పక్క ఊళ్లకు పోస్టింగులు. మూడేళ్లు చేశాక మా సొంత ఊరు కట్కూరుకి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇక్కడ ఐదేళ్లు చేశాక, ఆలిన్పుర్లో రెండేళ్లు, ఆ తర్వాత మా పుట్టిన ఊరు లద్దునూరుకు ఇద్దరికీ ట్రాన్స్ఫర్ అయ్యింది. అక్కడ 17 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత మళ్లీ కట్కూరుకు.. ఇలా మొత్తం 37 ఏళ్లపాటు టీచర్గా చేసి, హెచ్.ఎం.గా రిటైరయ్యాను. ఏడుతరాల తలపోత... ఎనిమిది పదుల జీవితంలో ఎన్నో అనుభవాలు. ఏడుతరాలు చూసిన అనుభవం. నేత కార్మికుల ఇంట పుట్టి పెరిగాను. పెద్ద కుటుంబం. ఐదుగురు అక్కచెల్లెళ్లు, ముగ్గురు అన్నదమ్ములు. మా వారి తోడబుట్టినవాళ్లు ఏడుగురు. పెళ్లికి ముందు మా అక్కాబావ హైదరాబాద్లో ఉంటే కొన్నాళ్లు అక్కడే ఉండి, హిందీ నేర్చుకున్నా. మా బంధువు, మామ సుద్దాల హన్మంతు. పెళ్లి తర్వాతే డిగ్రీ చేశాను. నాకు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. ఎంతోమంది జీవితాలు అతి దగ్గరగా ఉండి చూసిన, ఎన్నో వెతలు విన్నా. ఏ కష్టమైనా, ఆనందమైనా అంతా ఒకే కుటుంబంగా కలిసి పంచుకున్నాం. అవన్నీ కలిపి ‘కలెనేత’ అని ఏడుతరాల తలపోతగా ఆత్మకథ రాస్తే.. పిల్లలు దానిని పుసక్తంగా తీసుకువచ్చారు.శిశిర ధ్వనిపుట్టిల్లు, అత్తిల్లు.. పిల్లల పనులు, స్కూల్ పనులు.. ఎక్కడా తీరిక ఉండేది కాదు. సమావేశం అయినా, సంబరం అయినా అప్పటికప్పుడు ఓ గేయం రాయడం, పాడటం, వదిలేయడం.. అలా రోజులు వెళ్లిపోయాయి. ఆ గేయాలను భద్రపరుచుకోవాలి అనే అలోచన అప్పట్లో లేదు. 2001లో మా వారు చనిపోయారు. ఊళ్లో ఒంటరిగా ఉండలేక పిల్లల దగ్గరకు హైదరాబాద్కు వచ్చిన. మలిదశ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అవన్నీ వింటూ.. చూస్తూ చలించిపోయి, నాకు కలిగిన ఆవేశాన్ని, భావాలను రాసుకుంటూ ఉండేదాన్ని.‘ఒట్టు పెట్టి చెపుతున్నా ఒస్తది మన తెలంగాణ.. అదరకురా తమ్ముడా తెలంగాణ మనదేరా..’ అని తెలంగాణ గురించి.. ‘రంగు రంగులు నింపి ఇంద్రధనుస్సును మైమరపిస్తవు / అచ్చులతికి అతికి అతికి, నేత నేసి నేసి, పడగు పేకల కలయిక నీవు, కష్ట సుఖాల వారధి నీవు...’ అని నేతన్నల కష్టాల గురించి.. ‘అవిశ్రాంతంగా పోరు బాటలో పయనిస్తూ, జీవనసమరాన్నీ ఛేదిస్తూ సాగిపోతాను ముందుకు, మున్ముందుకు... ’ అంటూ విశ్రాంత ఉపాధ్యాయుల కోసం.. రాశాను. ఇలాంటివి దాదాపు ఓ యాభై కవితలను కలిపి ‘శిశిరధ్వని’ పుస్తక రూపంగా మీ ముందుకు తీసుకువచ్చాం’’ అంటూ తన గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు ఈ అనుభవాల విజ్ఞానగని. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటోలు: మోహనాచారి(రచయిత్రి 1962లో తన విద్యార్థుల కోసం అల్లిన పాట... ఆమె చేతివ్రాతతో..)కుటుంబ సభ్యులతో బల్ల సరస్వతి -
క్యూఆర్ కోడ్తో క్యూలైన్లకు చెల్లు
సికింద్రాబాద్కు చెందిన వెంకటేశం తీవ్ర జ్వరంతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాడు. ఓపీ చిట్టీ కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడ్డాడు. బీపీ ఎక్కువై మరింత అస్వస్థతకు గురయ్యాడు. నిజామాబాద్కు చెందిన భూక్యానాయక్ నగరంలో పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. తరచూ మూర్ఛ వ్యాధికి గురవుతుంటాడు. ఓ రోజు హఠాత్తుగా కిందపడి కాళ్లు, చేతులు కొట్టుకోవడంతో అంబులెన్స్లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అభా నంబరు ద్వారా మెరుగైన వైద్యసేవలు అందించడంతో కొద్దిసేపటికే కోలుకున్నాడు. ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగికి ‘ఆయుష్మాన్ భారత్’ అభయహస్తం అందిస్తోంది. ఓపీ చిట్టీ కోసం గంటల తరబడి క్యూలో నిల్చొని అవస్థలు పడే పరిస్థితికి క్యూఆర్ కోడ్తో ఫుల్స్టాప్ పెట్టింది. తక్షణం వైద్యసేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్(ఏబీడీఎం) ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే క్షణాల వ్యవధిలో ఓపీ చిట్టీ మీ చేతుల్లో ఉంటుంది. కౌంటర్లో అభా నంబరు ఎంటర్ చేస్తే అప్పటివరకు మీకు అందించిన వైద్యసేవలు, మందులతోపాటు సమగ్ర వివరాలను దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. పౌరులందరికీ డిజిటల్ హెల్త్ ఐడీ... ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలను త్వరితగతిన అందించేందుకు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా డిజిటల్ హెల్త్ ఐడీని అందించాలని 2021లో నిర్ణయించింది. దీనిని నేషనల్ హెల్త్ అథారిటీ(ఎన్హెచ్ఏ) అమలు చేస్తోంది. ప్రతిఒక్కరికీ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ఏబీహెచ్ఏ–అభా) (Ayushman Bharat Health Account) ద్వారా ఆధార్ నంబర్ను అనుసంధానం చేస్తూ 14 అంకెల యూనిక్ నంబర్ కేటాయిస్తుంది. అభా నంబర్ను ఇలా క్రియేట్ చేసుకోండి... గూగుల్ ప్లేస్టోర్ నుంచి అభా యాప్ను డౌన్లోడ్ చేసుకుని మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే వన్టైమ్ పాస్వర్డ్ వస్తుంది. పేరు, చిరునామా, ఆధార్, ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీ తదితర వివరాలతో సబ్మిట్ చేయాలి. క్రియేట్ న్యూ అభా అడ్రస్ ద్వారా సొంత ఐడీని క్రియేట్ చేసుకుని పాస్వర్డ్ పెట్టుకుని, అభా యాప్ ద్వారా లాగిన్ అవ్వాలి. abdm.gov.in ద్వారా కూడా అభా నంబరు పొందవచ్చు. ఆయా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే టోకెన్ నంబరు వస్తుంది. కౌంటర్ వద్దకు వెళ్లి టోకెన్ నంబరు చూపిస్తే అస్వస్థత, అనారోగ్య వివరాలు తెలుసుకుని సంబంధిత విభాగానికి రిఫర్ చేస్తూ ఓపీ చిట్టీ అందిస్తారు.14 అంకెల నంబరుతో లాభాలు ఎన్నో... క్యూలైన్లలో గంటల తరబడి నిల్చోకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్షణాల వ్యవధిలో సులభంగా అవుట్ పేషెంట్(ఓపీ) చిట్టీ పొందవచ్చు. వైద్యుడు అందించే వైద్యసేవలు డిజిటలైజేషన్ అవుతాయి. దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా ఒక్క క్లిక్తో పూర్తి వివరాలు పొందవచ్చు. గతంలో అందించిన వైద్యవివరాలను మరో డాక్టర్ చూసి మరింత మెరుగైన వైద్యం అందించే వెసులుబాటు కలుగుతుంది. ప్రతిఒక్కరూ నమోదు చేసుకోవాలి ప్రతిఒక్కరు అబా యాప్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ పథకం అమలవుతోంది. గాందీఆస్పత్రిలో ఇప్పటివరకు సుమారు 3 లక్షల వరకు రోగుల వివరాలు ఆబా యాప్లో పొందుపర్చాం. ఈఎన్టీ, ఆప్తమాలజీ విభాగాల్లో జరిగే వైద్యపరీక్షల పూర్తి వివరాలు యాప్ ద్వారా పీడీఎఫ్ ఫైల్ రూపంలో రోగులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇతర విభాగాలకు త్వరలోనే వర్తింపజేస్తాం. – డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, గాంధీ అభా నోడల్ ఆఫీసర్ -
లగ్జరీ కారులో పేరెంట్స్ను సర్ప్రైజ్ చేసిన భారతీయ యువతి
బాగా చదువుకోవాలి..మంచి ఉద్యోగం సంపాదించాలి అమ్మానాన్నల్నికారులో తీసుకెళ్లి సర్ప్రైజ్ చేయాలి. లేదంటే.. తొలిసారి వాళ్లని విమానం ఎక్కించాలనే కలను సాకారం చేసుకోవాలి. ఇలాంటి కలలు విదేశాల్లో ఉద్యోగాలు చేసే సగటు భారతీయ ఉద్యోగులకు సర్వ సాధారణం. అలా ఒక భారతీయ యువతి ఖరీదైన కారులో తల్లిదండ్రులను షికారుకు తీసుకెళ్లిన వీడియో ఒకటి నెట్టింట్ పలువుర్ని ఆకట్టుకుంటోంది.ఇండియాకు చెందిన అపూర్వ బింద్రే తన తల్లిదండ్రులను డ్రైవర్ లేని కారులో శాన్ ఫ్రాన్సిస్కోలో డ్రైవ్కు తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోతో పాటు తన సంతోషాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో నెటిజన్ల ఆమెను, ఆమె తల్లిదండ్రులను అభినందనల్లో ముంచెత్తారు. సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేస్తూ, బింద్రే “నా తల్లిదండ్రులను శాన్ ఫ్రాన్సిస్కోలో డ్రైవర్ లెస్ కారు వేమోలో తీసుకెళ్లా.. వావ్, నైస్ ఫీలింగ్! ఇది మాన్యువల్ డ్రైవర్ కంటే సురక్షితంగా, స్మూత్గా అనిపించింది. అందుకే వెంటనే ఇంకో రైడ్ కూడా బుక్ చేసుకున్నాం. మా అమ్మా నాన్న చెప్పాల్సింది చాలా ఉంది అది త్వరలోనే’’ అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియోకు ఇప్పటికే 94 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.ఇదీ చదవండి: బంగారం కాదు..కానీ కిలో కోటి రూపాయలు View this post on Instagram A post shared by Apurva Bendre (@apurva_bendre)‘‘ఈ రైడ్తో మీ పేరెంట్స్ పూర్తిగా థ్రిల్ అయి ఉండాలి!” అని ఒకరు, “చాలా సరదాగా ఉంది! వారి స్పందన ఏమిటి?” అని మరొకరు దీనిని “ఒక తరాల ప్రయాణం” అని ఇంకొకరు అభివర్ణించారు. చాలా గర్వంగా ఉంది. మీరు మీ తల్లిదండ్రుల కలను నెరవేర్చడం సంతోషంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది అనే కమెంట్లు కూడా చూడొచ్చు.చదవండి: ఉద్యోగాన్ని వదిలేసిన ఇంజనీర్ కపుల్.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు -
అమ్మాయిలు చిన్న వయసు అబ్బాయిలనే ఇష్టపడటానికి రీజనే అదే..!
అబ్బాయి వయసు కంటే అమ్మాయి వయసు తక్కువగా ఉండాలనేది మన శాస్త్రాలు, పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆచారాన్నే మనం తరతరాలుగా అనుసరిస్తున్నాం కూడా. అలాంటిది ఇటీవల కాలంలో అబ్బాయి-అమ్మాయి వయసు అంతరాలు ఎంతలా ఉన్నాయంటే..అమ్మాయి వయసే ఎక్కువగా ఉంటోంది. అలానే పెళ్లి చేసుకుంటున్నారు. అభిషేక్ ఐశ్వర్యరాయ్, ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్, కత్రినా-విక్కీ కౌశల్, సచిన్ టెండుల్కర్ అంజిలి వంటి ప్రముఖులంతా తమ భార్యల వయసు కంటే చిన్నవారే. దాంపత్య జీవితానికి వయసుతో సంబంధ లేదంటూ ఎంతో హాయిగా వైవాహిక బంధాన్ని లీడ్ చేస్తున్నారు వారంతా. తాజాగా ఆ కోవలోకి సచిన్ తనయుడు అర్జున్ టెండుల్కర్ కూడా చేరిపోయాడు. అసలు అమ్మాయిలంతా ఇలా వయసులో తమ కంటే చిన్నవారితో ప్రేమలో పడిపోవడానికి రీజన్ ఏంటీ..?. అసలు ఎందుకిలా ఇదొక ట్రెండ్లా మారిపోయింది..?ఇవాళ అమ్మాయిలు వయసులో తమ కంటే చిన్నవారినే ఇష్టపడుతున్నారు. వారినే వరిస్తున్నారు కూడా. గతానికి మరింత భిన్నంగా ఇవాళ ఇలాంటి ట్రెండ్ ఎక్కువగా ఎందుకు సాగుతుందనే దానిపై పలు అధ్యనాలు కూడా జరిగాయి. అసలు మహిళలు తమ కంటే చిన్న వయసు అబ్బాయిలనే ఎందుకు ఇష్టపడుతున్నారని సర్వే కూడా చేశారు. అందులో చాలా షాకింగ్ విషయాలే వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే..పెద్ద వయసు మహిళలంతా తమ కంటే ఏజ్లో చిన్నగా ఉండే పురుషులతో బంధం ఏర్పుచుకోవాలని కోరుకుంటున్నారట. వారిని వివాహం చేసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారట. చిన్నవయసు అబ్బాయితో డేటింగ్ చేస్తే..వాళ్లు ఎంతో కంఫర్ట్గా ఫీలవుతారట. తమ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందట. పైగా వాళ్లు ఎవ్వరినైన సమ్మోహనంలోకి దింపగలం అనే భావన కలుగుతుందట. శారీరక సంబంధం పరంగా కూడా చిన్న వయసు వారైతేనే బెటర్ అటఅంతేగాదు దీనిపై ఇటీవల డేటింగ్ యాప్ 'బంబుల్' ఒక సర్వే కూడా నిర్వహించింది. అందులో దాదాపు 60% మంది అమ్మాయిలు తమ కంటే చిన్నవారినే భాగస్వాములుగా కోరుకుంటున్నారట. మరోవైపు అబ్బాయి అమ్మాయిలు ఆలోచనల పరంగా సర్వే చేస్తే కూడా..సుమారు 63% మంది ప్రేమలో వయసు పట్టింపు లేదని విశ్వసిస్తున్నారట. ఈ వ్యక్తులు తమ కంటే పెద్దవారు లేదా చిన్నవారు ఇలా ఎవ్వరితోనైనా డేటింగ్ చేసేందుకు రెడీ అంటున్నారట. అన్నింట్ల కంటే ఆసక్తిని రేకెత్తించే అంశం ఏంటంటే సుమారు 35% మంది అమ్మాయిలు శారీరక సంబంధం కంటే భావోద్వేగ అనుబంధానికే ప్రాధాన్యత ఇవ్వడం. ఇదిలా ఉండగా..బాలీవుడ్ నటి, ఎంటర్ప్రెన్యూర్ పారుల్ గులాటి ఒక పాడ్కాస్ట్లో సంబంధ బాంధవ్యాలపై మారుతున్న యువత ఆలోచనతీరు అనే అంశంపై ఓపెన్గా మాట్లాడారు. ఇటీవల సెలబ్రిటీలు, ప్రముఖులు కూడా తమ కంటే వయసులో చిన్న వారైన పురుషులనే పెళ్లిచేసుకుంటున్నారంటూ మాట్లాడటంతో ఈ విషయం మరోసారి హాట్టాపిక్గా మారింది. బహుశా చిన్నవాళ్లైతే తమకు నచ్చినట్లుగా నడుచుకుంటారు, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారనే అభిప్రాయం కావొచ్చని పేర్కొంది. పైగా వారితో మాట్లాడటం సులభంగా ఉంటుందట. స్త్రీ సహజంగా తన మాట వినేవాళ్లను ఇష్టపడుతుంది ఆ కోణంలో ఇలా తన కంటే చిన్నవాళ్లని ఇష్టపడుతున్నట్లుగా పారుల్ చెప్పుకొచ్చింది. అలాగే బ్రేకప్ అవ్వడానికి గల కారణాల గురించి కూడా మాట్లాడింది. పురుషులు మారిపోయారని మహిళలు భావస్తారు, అలాగే పురుషులు మహిళలు తమను ఎప్పుడు వదిలి వెళ్లరని ప్రగాఢంగా నమ్మడం వంటి అంచనాల వల్లే బంధం విచ్ఛిన్నమవుతుందని చెప్పింది. అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్న సందేహం రాగానే.. మారేందుకు ప్రయత్నించపోవడం, బహిరంగా మాట్లాడనప్పుడూ.. పెను సమస్యగా మారి విడిపోయేందుకు దారితీస్తుందని పేర్కొంది. కానీ ఈ జనరేషన్ యువకులు మునుపటికంటే భావోద్వేగ పరంగా తెలివిగా ఉంటున్నారు, అందుకే వారు వయసు అంతరానికి ప్రాధ్యానత్య ఇవ్వడం లేదని వివరించింది. (చదవండి: కుంభకర్ణుడిని తలదన్నేలా.. ఆమె ఏకంగా 32 ఏళ్లు నిద్రపోయింది!) -
19 ఏళ్లకు వెదుక్కుంటూ వచ్చిన అదృష్టం, వేలమందికి విందు
హర్యానా ఇటీవలి సంవత్సరాలలో గణనీయమైన పురోగతి ఉన్నప్పటికీ, లింగ నిష్పత్తితో చాలా వెనుకబడి ఉన్న రాష్ట్రం. ఈ ప్రాంతంలో లింగ నిష్పత్తి చాలా కాలంగా సామాజిక సవాలుగా ఉంది; 2024లో 1,000 మంది పురుషులకు 910 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో 'బేటీ బచావో, బేటీ పఢావో' ప్రచారంతో సహా అనేక కార్యక్రమాల అమలుపై ఎక్కువ దృష్టిపెట్టారు. అయితే ఇటీవల అక్కడ ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. హర్యానాలోని జింద్లోని తువా గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రెండు దశాబ్దాల తర్వాత ఆడబిడ్డ పుట్టడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది.చుట్టుపక్కల 21 గ్రామాల నుండి 8 వేల మందితో గొప్ప విందును ఏర్పాటు చేశారు.సురేంద్ర , కృష్ణ దంపతులకు పెళ్లైన 19 ఏళ్లకు ఆడబిడ్డకు జన్మనించారు. పాపాయి భూమి దేవి అని పేరు పెట్టుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తరువాత తమ ఇంట్లో పాపాయి పారాడటంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.ఇదీ చదవండి: బంగారం కాదు..కానీ కిలో కోటి రూపాయలు ఇక తమకు పిల్లలు పుట్టరని భావించి, భర్త మేనల్లుడిని దత్తత తీసుకున్నారు. ఆ వేళా విశేషమో ఏమో కానీ కానీ జూలైలో, ఎలాంటి వైద్య చికిత్స తీసుకోకుండానే అద్భుతం జరిగింది. సాధారణంగా అబ్బాయి పుట్టినపుడు నిర్వహించే బావిపూజను ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు, బంధువులు, చుట్టు పక్కల 8 వేలమందికి విందును ఏర్పాటు చేశారు. తువా, తపా ఖాప్లతో సహా 25 ఖాప్ల నుండి సర్పంచ్లు నవజాత శిశువును ఆశీర్వదించడం విశేషం. హర్యానా గ్రామీణ ప్రాంతంలో ఆలోచనలను మార్చే దిశగా ఒక అడుగుగా ఈ కార్యక్రమాన్ని చాలా మంది ప్రశంసించారు. "మా కుమార్తె ఒక వరం, కొడుకు పొందే ప్రతి గౌరవానికి ఆమె అర్హురాలు ఈ సందేశాన్ని చాటాలనుకున్నాం అందుకే ఈ విందు" అని తండ్రి సంతోషంగా చెప్పారు. మా సొంత బిడ్డ పుట్టడం మా జీవితాల్లో వర్ణించలేని ఆనందం.. అలాగని దత్తత కొడుకు మీద ప్రేమ ఏ మాత్రం తగ్గదు అంటూ తల్లి చెప్పింది.ఇదీ చదవండి: ఉద్యోగాన్ని వదిలేసిన ఇంజనీర్ కపుల్.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు -
బంగారం కాదు..కానీ కిలో కోటి రూపాయలు
విలువైన వస్తువు అనగానే బంగారం, ప్లాటినం, డైమండ్లు, వెండి తదితరాలు గుర్తుకొస్తాయి. బంగారం, డైమండ్లను మించి ఖరీదు చేసే చెట్టు ఒకటి ఉంది అదేంటో తెలుసా? ఖరీదైన చెట్టు అనగానే చందనమో, ఎర్రచందనం అనుకునేరు.. వాటికంటే ఎంతో విలువైన కలప గురించి తెలుసుకుందాం పదండి.పుత్తడి రేటు ఆకాశాన్నంటి అందనంత దూరంలో ఊరిస్తోంది. అలాంటి కోవలోదే ఇది కూడా చాలా ఖరీదైన అరుదైన కలప. పేరు అగర్వుడ్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కలపలలో ఒకటి. దీన్నేఅగర్వుడ్, అలోస్వుడ్ లేదా ఈగిల్వుడ్ అని కూడా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా పెర్ఫ్యూమ్ పరిశ్రమలో బాగా ప్రాచుర్యం పొందింది. కానీ సహజంగా దీని తయారీ ప్రక్రియకు 15-20 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ కలప చాలా అరుదైనదీ, ఖరీదైనదిగా పేరుగాంచింది. ఇది ఆసియాలోని అక్విలేరియా చెట్ల నుండి వస్తుంది. ఈ చెట్లు ఫంగస్ బారిన పడినప్పుడు రెసిన్ (జిగురు లాంటి పదార్థం)ను ఉత్పత్తి చేస్తాయి. ఇలా సేకరించిన నూనెను లగ్జరీ పెర్ఫ్యూమ్లలో ఉపయోగిస్తారు. దీనికి అనేక ఔషధ ఉపయోగాలు కూడా మెండుగా ఉన్నాయని చెబుతారు. దీని ధర కిలోకు రూ. కోటి రూపాయలకు మాటే. ఒక గ్రాము ధర లక్ష రూపాయలు పలుకుతుంది. హిమాలయాల నుండి ఆగ్నేయాసియాలోని పాపువా న్యూ గినియా వరకు విస్తరించి ఉన్న భౌగోళిక ప్రాంతంలో కనిపిస్తాయి. ఈ ఆక్విలారియా చెట్లు చాలా వేగంగా పెరుగుతాయి. ఈ చెట్టులోని రెసిన్ ఒక శిలీంధ్ర సంక్రమణ ద్వారా ఏర్పడుతుంది. ఈ ప్రక్రియకు అంటే రెసిన్ నిర్మాణం చాలా నెమ్మదిగా ఉంటుంది. సుమారు 10 నుండి 20 సంవత్సరాలు పడుతుంది. ఇవి చాలా సాధారణంగా కనిపిస్తాయి. కానీ అవి ఒక నిర్దిష్ట రకమైన ఫంగస్ ద్వారా సంక్రమించినప్పుడు, అవి తమను తాము రక్షించుకోవడానికి ముదురు, సువాసనగల రెసిన్ను ఉత్పత్తి చేస్తాయి. కాలక్రమేణా, ఈ రెసిన్ కలపగుండా వ్యాపించి, దానిని అగర్వుడ్గా మారుస్తుంది. మరో విషయం ఏమిటంటే ఇది ప్రతి చెట్టుకు జరగదు. చాలా తక్కువ చెట్లలో మాత్రమే ఇలా జరుగుతుంది.అగర్వుడ్ దాని సువాసనకు మాత్రమే ప్రసిద్ధి చెందలేదు. సాంస్కృతిక ,ఆధ్యాత్మిక విలువ కూడా ఉంది. శతాబ్దాలుగా, ఆసియా , మధ్యప్రాచ్యం అంతటా ప్రజలు దీనిని దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ,ఇళ్లలో ఉపయోగిస్తున్నారు. దీని సువాసన గాలిని శుభ్రపరుస్తుందని, మనస్సుకు విశ్రాంతి నిస్తుందని, ధ్యానం లేదా ప్రార్థనకు సహాయపడుతుందని నమ్ముతారు. ఒత్తిడి, నిద్రలేమి, జీర్ణ సమస్యలకు చికిత్స చేయడానికి ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. అరబ్ దేశాలలో, వివాహాలు, మతపరమైన ఆచారాలు, రాజవంశాల సంప్రదాయంలో దీని పెర్ఫ్యూమ్ విస్తృతంగా ఉపయోగిస్తారు. భారతదేశం, మలేషియా, థాయిలాండ్, లావోస్ , ఇండోనేషియాలో అగర్వుడ్ చాలా అరుదుగా కనిపిస్తుంది. అందుకే దాని పరిరక్షణ ఒక పెద్ద సవాలు అనడంలో సందేహం లేదు. చెట్లను చట్టవిరుద్ధంగా నరికివేయడం వలన, ఈ చెట్లు పతనం అంచున ఉన్నాయి. దీని కారణంగా, ప్రభుత్వం , పర్యావరణ సంస్థలు దీన్ని రక్షించేందుకు ప్రత్యేక ప్రచారాలను అమలు చేస్తున్నాయి.ఇదీ చదవండి: ఉద్యోగాన్ని వదలేసిన ఇంజనీర్ కపుల్.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు -
కుంభకర్ణుడిని తలదన్నేలా.. ఆమె ఏకంగా 32 ఏళ్లు నిద్రపోయింది!
కుంభకర్ణుడిని తలదన్నేలా నిద్రపోయింది ఈ అమ్మాయి. అన్నేళ్లు నిద్ర అని ఆశ్చర్యపోకండి. ఆమెను మేల్కొలిపేందుకు ఎలక్ట్రిక్ షాక్, అగ్నితో కాల్చడం, సూదితో గుచ్చడం వంటి ప్రయత్రాలు కూడా ఉన్నాయట. అయినా ఆ ఆమ్మాయి లేవలేదు. పైగా 32 ఏళ్లు తర్వాత మేల్కొని నాటి సంగతులన్నీ వివరంగా చెప్పి ఆశ్చర్యపరిచింది. ఆమె స్టోరీ శాస్త్రవేత్తలకే ఓ పట్టాన అంతుపట్టని మిస్టరీలా అనిపించిందట. పోనీ ఏదైనా నిద్రకు సంబంధించిన జబ్బుగా నిర్ధారిద్దాం అనుకున్నా..దాన్ని కూడా మించిపోయేలా ఏకంగా మూడు దశాబ్దాల నిద్ర అని అంతా విస్తుపోతూ తలలు పట్టుకున్నారు. ఈ వింత ఘటన ఎక్కడ జరిగిందంటే..ఈ ఘటన బాలిస్టిక్ ద్వీపం స్వీడిష్లోని ఓక్నోలో చోటుచేసుకుంది. ఇది 19వ శతాబ్దంలో రియల్గా జరిగిన ఘటన. దాని గురించి ఇప్పటికీ కథకథలుగా చెప్పుకుంటారట. మనం కథల్లో వింటుంటాం స్లీపింగ్ బ్యూటీ అంటూ అన్నేళ్లు నిద్రపోయిందట అని..కానీ ఇది రియల్ స్లీపింగ్ బ్యూటీ స్టోరీ. ఆ అమ్మాయి పేరు ఓల్సన్. ఆమె అక్టోబర్ 29, 1861న జన్మించింది. ఆమె తండ్రి మత్స్యకారుడు, తల్లి గృహిణి. ఆమెకు ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. ఇంటి పరిస్థితి అంతమాత్రమే కావడంతో ఆమెను పాఠశాలకు పంపించేవారు కాదు. అయితే ఓల్సన్కు చదువంటే మహా ఇష్టం కావడంతో అతికష్టంపై పంపించేవారు తల్లిదండ్రులు. అలా 14 ఏళ్ల వరకు క్రైస్తవ పాఠశాలలో చదువు కొనసాగించింది. ఫిబ్రవరి 18, 1876న శీతాకాలంలో ఎప్పటిలానే స్కూల్కి తిరిగి వస్తుంది.. అయితే తొందరగా వెళ్లాలన్న ఆత్రుతలో గడకట్టుకుపోయిన నదిని దాటే ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో జారిపడి తలకు గట్టిగా గాయలయ్యాయి. అలానే ఇంటకి చేరుకుంది. అయితే పేదరికం కారణంగా తల్లిదండ్రులు ఆమెను వైద్యులకు చూపించలేకపోతారు. విశ్రాంతి తీసుకుంటే అదే సర్దుకుంటుందేలే అనుకున్నారు తల్లిదండ్రులు. అలా ఆ రోజు పడుకుంది ఇక లేవనే లేదు. అయితే ఆమె తల్లి మాత్రం కూతుర్ని కంటికిరెప్పలా కాచుకునేది. ఏ రోజుకైనా లేగుస్తుందని ఆశగా అలానే చూసుకునేది. రియల్ స్లీపింగ్ బ్యూటీ అంటూ ఆమె కథ ఆ గ్రామమంతా దావనంలా వ్యాపించింది. చాలామంది ఆమెను చూసేందుకు వచ్చేవారు కూడా. అంతేగాదు ఆమెను ఎలాగైనా నిద్ర నుంచి లేపాలని..సూదులతో గుచ్చడం, కరెంట్షాక్, కాల్చడం వంటివి ఎన్నో చేశారు. మొదట్లో వైద్యులు కోమా, హిస్టీరియా వంటివేమో అనుకున్నారు గానీ..వైద్య పరీక్షల్లో అవేమి కాదని తేలింది. దాంతో వాళ్లు కూడా చిక్కిత్స అందించలేమని చేతులెత్తేశారు. అలా ఓల్సన్ మూడు దశాబ్దలుగా గదిలో నిద్రపోతూనే ఉంది. ఆమె తల్లి 1904 మరణించింది. అప్పటి వరకు ఓల్సన్ బాధ్యతను ఆమెనే దగ్గరుండి చూసుకుంది. ఆ తర్వాత తండ్రి ఒక పనిమనిషిని నియమించి ఆమె బాధ్యతలను దగ్గరుండి చూసుకున్నాడు. అయితే పనిమనిషి ఆహారం అదృశ్యమైపోతుందంటూ ఫిర్యాదు చేస్తుండేది. నిజానికి ఓల్సన్ నిద్రలోనే ఉన్నా..వాస్తవిక జీవితాన్ని దగ్గరగా గమినిస్తున్నట్టుగా ఉండేది ఆమె తీరు. ఆమె సోదరుడు మరణించిన సమయంలో కూడా ఏడుస్తున్నట్లు మూలుగు వినిపించిందట. ఆమె తన కలకు, వాస్తవికతకు దగ్గరగా ఉన్నట్లు చుట్టూ ఉన్నవారికి అనిపించేదట.సరిగ్గా 32 ఏళ్ల తర్వాత మేల్కొలుపు..అలా గాఢ నిద్రలోనే ఉండిపోయిన ఓల్సన్ 1908లో అప్పుడే నిద్రలోంచి మేల్కొన్నట్లుగా మేల్కొంది. ఒక పెద్ద ఏడుపు శబ్బం రావడంతో పనిమనిషి గదిలోకి రాగా ఓల్సన్ మేల్కొని ఏడుస్తూ కనపించింది. 14 సంవత్సరాల ప్రాయంలో పడుకున్న ఆమె మళ్లీ తిరిగి 46 ఏళ్ల వయసుకి మేల్కొంది. అత్యంత బలహీనంగా అయోమయంగా కుటుంబసభ్యులందర్నీ చూసింది. తన సోదరులను గుర్తించలేకపోయింది. అత్యంత దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏంటంటే..1876 ఫిబ్రవరిలో జరిగిన ప్రతి సంఘటన ఆమెకు స్పష్టంగా గుర్తుంది. ఆ తర్వాత సంత్సారాల గురించి ఆమెకు తెలియదు. ఓల్సన్ స్టోరీ విలేకరులనూ, వైద్యులనూ ఆకర్షించడమే కాదు అత్యంత వింతగా అనిపించింది. ఆమె శరీరం అంతగా వృద్ధాప్యం చెందలేదు కూడా. శారీరకంగా ఆరోగ్యంగా తెలివిగానే ఉంది. అయితే కాంతికి బహిర్గతం కావడంలో ఇబ్బంది పడింది. కొందరు వైద్యులు ఆమెకు జరిగిన మానసిక గాయం వల్ల ఇలా గాఢ నిద్రలోకి చేరుకుందని, తల్లి నిరంతర పర్యవేక్షణ ఫలితంగా మెరుగపడిందని అన్నారు. శాస్త్రవేత్తలకు కూడా ఆమె స్టోరీ అంతుచిక్కని మిస్టరీలా తోచింది. ఎందుకంటే ఆమె నిద్రను స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్గా నిర్థారిద్దాం అనుకున్నా..ఓల్సన్ కేసు అందుకు విరుద్ధం. ఎందుకుంటే అంత సుదీర్ఠ నిద్ర ఈ వ్యాధి లక్షణం కాదు. టీనేజ్ వయసులో పడుకుని మద్య వయసులో మేల్కోన్న ఈ అమ్మాయి కథ నేటికి అక్కడొక మిస్టరీ, ఆసక్తిని రేకెత్తించే కథ. ఓల్సన్ 1950 88 ఏళ్ల వయసులో మరణించిందట. అయితే ఇంతవరకు ఆమె అంత సుదీర్ఘ నిద్రలోకి ఎందుకు జారుకుందనేది ఎవ్వరూ నిర్థారించలేకపోయారట.(చదవండి: సుదీర్ఘ దాంపత్యానికి బ్రేకప్ చెబితే ఫలితం ఇలా ఉంటుందా..? పాపం ఆ 60 ఏళ్ల వ్యక్తి..) -
ఉద్యోగాన్ని వదిలేసిన ఇంజనీర్ కపుల్.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు
ఐదెంకల వేతనమిచ్చే ఐటీ ఉద్యోగం. సౌకర్యవంతమైన జీవితం. అయినా సొంతంగా బిజినెస్ ప్రారంభించాలనే ఆ జంట కోరిక, చేసిన సాహసం వారిని విజయవంతమైన వ్యాపారవేత్తలుగా మలిచింది. ఎవరా జంట? ఎలాంటి వ్యాపారాన్ని చేపట్టారు? వారు సాధించిన విజయంఏంటి? తెలుసుకుందాం రండి.మహారాష్ట్ర(Maharashtra) లోని కొంకణ్ఖు కు చెందిన గౌరి, దిలీప్ పరబ్ దంపతులు. వృత్తి రీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగలలైన వీరు ముంబైలోని ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ కంపెనీలో పనిచేసేవారు.. జీతం, జీవితం సంతోషంగానే సాగిపోతున్నాయి. ఎలాగైనా మహారాష్ట్రలోని కొంకణ్కు తిరిగి వచ్చి, ఏదైనా సొంతంగా అదీ వ్యవసాయాన్ని ప్రారంభించాలనే కోరిక రోజు రోజుకు పెరగసాగింది. దీంతో ఇద్దరు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి కొంకణ్ తిరిగొచ్చారు.కొంకణ్లోని కల్చర్, అందమైన తీరప్రాంతం, బీచ్లు, వ్యవసాయ ప్రకృతి దృశ్యం ఇవన్నీ తమను ఎల్లప్పుడూ మమ్మల్ని ఇంటికి రారమ్మని పిలుస్తూ ఉండేవని అందుకే తిరిగి సొంతూరికి వచ్చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపింది గౌరి. 2021లో సేంద్రీయ ఉత్పత్తుల ద్వారా అటు వ్యాపారాన్ని, ఇటు స్థానిక ఉపాధిని కల్పించాలని నిర్ణయించుకున్నారు. సింధుదుర్గ్ జిల్లాలోని తితావ్లి గ్రామంలో ఆరు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. మార్కెట్ను స్టడీ చేసి తరువాత ఆ భూమిలో నిమ్మ గడ్డిని సాగు( lemongrass Farming ) చేయాలని భావించారు. నిమ్మగడ్డి పెంపకం లాభదాయమనీ, దీన్ని సౌందర్య సాధనాలు, ఔషధాలు, ఆహారం మరియు పానీయాలతో సహా వివిధ పరిశ్రమలలో ఉపయోగిస్తారు, దీని వలన డిమాండ్ బాగా పెరుగుతోంది. డిమాండ్తో పాటు కొంకణ్ ఏరియాలో ఉన్న వాతావరణ పరిస్థితులు కూడా నిమ్మగడ్డి సాగుకు అనుకూమని గ్రహించామని అందుకే దీన్ని ప్రారంభించామని దిలీప్ వెల్లడించాడు. పైగా నిమ్మగడ్డిని సంవత్సరానికి మూడు -నాలుగు సార్లు పండించవచ్చు, దిగుబడిని పెంచుతుంది . ఏడాది పొడవునా ఆదాయ అవకాశాలను సృష్టిస్తుందని దిలీప్ వివరించాడు. View this post on Instagram A post shared by Diilip Parab (@houseofsugandhaofficial)సేంద్రీయ వ్యవసాయం నుండి ప్రాసెసింగ్ వరకుఒక ఎకరంలో నిమ్మగడ్డి సాగు ప్రారంభించారు. హైదరాబాద్లోని ఓ నర్సరీలో కొనుగోలు చేసినట్లు దిలీప్ తెలిపాడు. ఒక్క ఎకరా పొలంలో 25 వేల వరకు మొక్కలు నాటారు. ప్రతి వరుసకు ఒక అడుగు దూరం ఉండేలా ప్లాన్ చేశారు. ఇక మొక్కకు మొక్క మధ్యలో 1.5 అడుగుల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం ఎనిమిది ఎకరాలలో సేంద్రీయ నిమ్మకాయ గడ్డిని పండిస్తున్నారు. అందులో ఆరు ఎకరాలు వారి సొంతం, మిగిలినది లీజుకు తీసుకున్న భూమి.వర్మీకంపోస్ట్, ఆవు పేడ ,నిమ్మకాయ గడ్డి బయో వ్యర్థాలను వేస్తాము. పంట కోసేటప్పుడు మీరు వేర్లను కత్తిరించాల్సిన అవసరం లేదు కాబట్టి నిమ్మకాయ గడ్డి పెరుగుతూనే ఉంటుంది. మొదటి పంట నాలుగు నెలల్లో సిద్ధంగా ఉంటుంది. ప్రతి 80 నుండి 90 రోజులకు ఒకసారి లెమన్ గ్రాస్ను కోయవచ్చు. మొదట ఎకరా పొలంలో ప్రారంభించిన ఈ సాగు.. ఇప్పుడు ఎనిమిది ఎకరాలకు చేరుకుంది. ఇందులో ఆరు ఎకరాలు సొంతం కాగా, మరో రెండు ఎకరాలను లీజుకు తీసుకున్నట్లు గౌరి తెలిపింది. లెమన్గ్రాస్ ఆయిల్ (Lemongrass Oil)ఒక ఎకరంలో దాదాపు 18 టన్నుల నిమ్మగడ్డి దిగుబడి వస్తుంది. ఒక టన్ను లెమన్గ్రాస్ నుండి 7 నుండి 8 లీటర్ల సుగంధ నూనెను పొందవచ్చు. వేసవిలో 1 టన్ను లెమన్గ్రాస్ నుండి నూనె ఉత్పత్తి 10 లీటర్లకు చేరుకోగలిగినప్పటికీ, వర్షాకాలంలో ఇది కేవలం 2.5 లీటర్లు శీతాకాలంలో 5 నుండి 6 లీటర్లకు తగ్గుతుంది, సగటున 7 లీటర్లు వస్తుందనీ, ఎకరా పొలంలో నిమ్మగడ్డితో 126 లీటర్ల ఆయిల్ను తయారు చేయొచ్చు.లెమన్గ్రాస్ ఆయిల్ను రిటైల్ , బల్క్లో ఫార్మాస్యూటికల్ , కాస్మెటిక్ కంపెనీలకు విక్రయిస్తారు. మార్కెట్ డిమాండ్ను బట్టి ధరలు లీటరుకు రూ.850 నుండి రూ.1500 వరకు ఉంటుంది. సగటు లీటరుకు రూ.1200, అనిఇలా ఏడాదికి రూ. 30 లక్షలు సంపాదిస్తున్నట్లు దీలీప్ గౌరి జంట వెల్లడించారు.కాగా భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే ఔషధ మొక్కలలో నిమ్మగడ్డి ఒకటి. CSIR-CIMAP (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్) ప్రకారం, 2020లో ప్రపంచ నిమ్మగడ్డి మార్కెట్ 38.02 మిలియన్ డాలర్లు . 2028 నాటికి రెట్టింపు కంటే ఎక్కువగా 81.43 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. లెమన్ గ్రాస్ నూనె మార్కెట్లో భారతదేశం ప్రధాన పాత్ర పోషిస్తోంది, దీనిని 80 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేస్తుంది. ప్రధానంగా ఉత్తర అమెరికా, యూరప్ , ఆసియా పసిఫిక్ ఖండాలు ఇందులో ఉన్నాయి. -
దైవం నీడ ఎల్లప్పుడూ మన వెంటే...!
నలభై రోజుల అయ్యప్ప దీక్ష అనంతరం గురుస్వామితో కలిసి ఒక యువకుడు శబరిమలై బయలుదేరాడు. వారు పంబా నదిలో స్నానం చేసి కొండ ఎక్కే సమయంలో భోరున వర్షం ప్రారంభమయ్యింది. ‘‘ఈ వానకి నేను కొండ ఎక్కగలనా గురూజీ?’’ అని అడిగాడు ఆ యువకుడు. గురుస్వామి నవ్వి ‘‘అంతా అయ్యప్ప చూసుకుంటాడు’’ అని బదులిచ్చాడు. మరికొంత దూరం నడిచిన యువకుడు ‘‘నావల్ల కావడం లేదు, డబ్బులిచ్చి డోలీలో వెళ్దాము’’ అన్నాడు. ‘‘వయసులో ఉన్నవాడివి. ఈ కొండ ఎక్కడం నీకు సాధ్యమవుతుంది. నువ్వు నడవడం కొనసాగిస్తే అంతా అయ్యప్ప చూసుకుంటాడు’’ అని ధైర్యం చెప్పాడు గురుస్వామి.నడిచే ఓపికల్లేక ఆ యువకుడు ఓ చెట్టు కింద నిలబడి ‘‘దేవుడిని ఎవ్వరూ చూడలేదు కదా. అసలు దేవుడున్నాడా?’’ అని అడిగాడు యువకుడు. గురుస్వామి నవ్వి ‘‘కుడి కన్ను ఎడమ కన్నును చూడగలదా? ఎడమ కన్ను కుడి కన్నును చూడగలదా?’’ అని అడిగాడు. ‘‘అది సాధ్యం కాదు!’ అని గంట కొట్టినట్లు చెప్పాడు యువకుడు.‘‘అలా చూడటం కుదరక, కుడి కన్ను లేదని ఎడమ కన్ను, ఎడమ కన్ను లేదని కుడి కన్ను అనుకోవడం సమంజసమా?’’ అని ప్రశ్నించాడు గురుస్వామి. ‘ఎలాంటి పరిస్థితుల్లోనూ కాదు!’’ అన్నాడు యువకుడు.ఇంతలో వాన ఆగింది. సూర్యుడు ఆకాశంలోకి వచ్చాడు. ఆకాశంలో ఇంద్ర ధనుస్సు కనుల విందు చేసింది. మారు మాట్లాడకుండా యువకుడు గురుస్వామితో పాటు ‘స్వామీ శరణం, అయ్యప్ప శరణం’ అంటూ కొండ ఎక్కాడు. ఇద్దరూ పద్దెనిమిది మెట్లు ఎక్కి అయ్యప్ప దర్శనం చేసుకుని గుడి ముందరున్న రావిచెట్టు కింద చేరారు. ఇరుముడి సంచిలోని నెయ్యిని అయ్యప్ప అభిషేకానికి సమర్పించాలని సంచులు తెరిచారు. అందులోని బియ్యాన్ని, నెయ్యిని వేరు చేసే సమయంలో గురుస్వామి ‘‘అయ్యప్ప ఆదరణ దొరికిందా? అయ్యప్ప స్వామి నీకు కనిపించి తోడు వచ్చాడా?’’ అని అడిగాడు.యువకుడు నవ్వి బియ్యంలో భక్తులు వేసి ఉన్న నాణేన్ని చూపిస్తూ ‘‘బొమ్మ లేదని బొరుసు, బొరుసు లేదని బొమ్మా అనుకుంటే కుదురుతుందా? రెండూ ఉంటేనే నాణెమవుతుంది. ఒక్కటే ఉంటే అది చెల్లని కాసు అవుతుంది. అలాగే, దైవం నీడ ఎల్లప్పుడూ మన వెంటే ఉంటుంది. కంటికి కనిపించకుండానే ఆపదల్లో సహాయం చేస్తుంది. అదేవిధంగా అయ్యప్ప నాతోనే ఉండి నన్ను కొండ ఎక్కించాడు’’ అని సమాధాన మిచ్చాడు. శిష్యుడు దారిలో పడ్డాడని గ్రహించి సంతోషించాడు గురుస్వామి. ఇద్దరూ అయ్యప్ప అభిషేకానికి నెయ్యి సమర్పించి శరణాలు పలుకుతూ కొండ దిగడం ప్రారంభించారు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు -
సోలో లేఫే బెటర్ అనుకుని దెబ్బైపోయాడు! చివరికి..
మనతో ఉన్న వస్తువులు లేదా మనుషుల విలువ ఉన్నంత వరకు తెలియదు అని పెద్దలు పదేపదే నొక్కి చెబుతుంటారు. అదెందుకో ఈ కథ చదువుతుంటే తెలుస్తుంది. అన్నిసార్లు డబ్బు మన అవసరాలను తీర్చదు. అదొక్కటే చాలు అనుకున్న వాళ్లంతా అధోగతిపాలయ్యారు. తెలిసి కూడా అదే తప్పు చేస్తూ..ఒంటిరిగా మిగిలిపోయి కుమిలిపోతుంటారు ఈ వ్యక్తిలా..అసలేం జరిగిందంటే..జపాన్కి చెందిన టెట్సు యమడ, కైకో దంపతులు సుదీర్ఘకాలం కలిసిమెలిసి ఉన్నారు. వారికిద్దరు కుమారులు కూడా. వాళ్లు కూడా సెటిల్ అయిపోయారు. అయితే ఏమైందో గానీ వెర్రిగా ఆలోచించి మొదటికే మోసం తెచ్చుకున్నాడు. అతడు ఇటీవల రూ. 3 కోట్ల పెన్షన్తో రిటైరయ్యాడు. దాంతో ఇక ఇన్నాళ్లు సంసారాన్ని మోసింది చాలు ఇకనైనా ఫ్రీడం కావాలంటూ..తన భార్యను పుట్టింటికి వెళ్లిపో విడిగా బతుకుదాం ఇకనుంచి.. అని మనసులో మాట చెప్పేశాడు యమడ. అయితే ఇన్నాళ్లు తనతో కలిసి జీవించి ఇదేంటి అనుకుందామె. నిజానికి ఆ దంపతులకు గత కొన్నేళ్లుగా కొన్ని విషయాల్లో పొసగటం లేదు. ఎలాగో రిటైరవ్వతున్నాకదా..ఆమెను వదిలించేసుకుని రిటైర్మెంట్ డబ్బుతో హాయిగా జీవించొచ్చనేది అతడి ఆలోచన. అయితే అన్నేళ్లుగా పట్టణంలో కుమారులు, భర్తతో కలిసి జీవించి ఉన్న ఆమెకు ఉన్న పళంగా తన సొంతూరు పల్లెటూరికి వెళ్లి బతకడం అనేది కష్టంగా అనిపించిందామెకు. ఆ విషయాన్నే నర్మగర్భంగా చెప్పేసింది యమడకి. అలాగే అతడి కొడుకులు కూడా ఈ ప్రతిపాదనను అంగీకరించలేదు. దాంతో అతడు 'సోట్సుకోన్' ట్రెండ్ని అనుసరిద్దామని చెప్పాడు. ఏంటంటే ఇది..జపాన్ మహిళ రచియిత్ర రచించిన పుస్తకం కారణంగా ఈ ట్రెండ్ అక్కడ యువతలో బాగా ఊపందుకుంది. ఈ ట్రెండ్ ప్రకారం..భార్యభర్తలు ప్రెండ్లీగా విడిపోతారు..ఒకే ఇంట్లో ఉన్నా..ఎవరికి వారు హాయిగా ఉండటం లాంటి కాన్సెప్ట్ అన్నమాట. ఈ పద్ధతిలో ఫ్రెండ్లీగా విడిపోదామని చెప్పి యమడనే తన సొంత గ్రామానికి వెళ్లిపోయి జీవించాలని నిర్ణియించుకున్నాడు. ఇక అతడి భార్య, కుమారులు అక్కడే పట్టణంలో నివశించడానికి మక్కువ చూపించారు.పాపం పశ్చాత్తాపంతో ఆ వ్యక్తి..ఇక యమడ గ్రామీణ ప్రాంతానికి వెళ్లిన అక్కడ తన పెన్షన్ డబ్బుతో ఇంటిని పునరుద్ధరించాడు. ప్రశాంతమైన జీవితాన్ని గడిపేద్దామనుకుంటే..అక్కడి నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఇన్నాళ్లు భార్య అమర్చి పెడితే కష్టం తెలియకుండా పోయింది యమడకి. ఇక ఎప్పుడైతే ఒంటిరిగా జీవించడం మొదలుపెట్టాడో..రోజువారీ పనులు నిర్వహించుకోవడం చాలా కష్టమైంది. వంట చేసుకుని తినలేక తిప్పలు పడ్డాడు. ఇక రెడీమేడ్ న్యూడిల్స్, పచ్చి కూరగాయలపై ఆధారపడాల్సిన స్థితికి వచ్చేశాడు. కానీ అతడి భార్య విడిపోయాక సొంతంగా చేతి వృత్తికి సంబంధించిన వర్క్షాప్ ప్రారంభించి లాభాలు అందుకుంటూ సంతోషంగా జీవిస్తుంటే ఇక్కడ యమడ..ఒంటరి జీవితంతో నరకం అనుభవిస్తున్నాడు. అంతేగాదు తాను తీసుకున్న ఈ తెలివి తక్కువ పనికి చింతిస్తూ లబోదిబోమంటున్నాడు. అయితే తాము అప్పడప్పుడూ ఆన్లైన్ మాట్లాడుకుంటున్నట్లు తెలిపాడు యమడ. అయితే తన కొడుకులతో సంబంధం పూర్తిగా తొలిగిపోయిందని అంటున్నాడు. పాపం యమడ తన కుటుంబంతో మళ్లీ తిరిగి కలసే అవకాశం కోసం ఆశగా చూస్తున్నాడు. ప్రస్తుతం అతడి కథ నెట్టింట వైరల్గా మారి విడిపోతే నష్టం ఎవరికీ అంటూ చర్చలు ప్రారంభించారు. అంతేగాదు స్వేచ్ఛ అనేది ఎలా ఉన్నా ఆ వయసులో మాత్రం కొన్ని ఇబ్బందులు, చిక్కులు మాత్రం తప్పవనేది జగమెరిగిన సత్యం అంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. 🚨 LONELY NOODLES AND A NEW LIFE: JAPAN’S ‘MARRIAGE GRADUATION’ TREND SPARKS DEBATETetsu Yamada thought he was stepping into a peaceful retirement when he embraced “sotsukon”—Japan’s rising trend of “marriage graduation.” Armed with a hefty 50-million-yen pension, he moved to… pic.twitter.com/0KVXZwRFzP— The Tradesman (@The_Tradesman1) August 17, 2025 (చదవండి: భారత్ వ్యక్తిని పెళ్లాడిన బ్రెజిలియన్ ముద్దుగుమ్మ..!)