breaking news
Cricket
-
మిచెల్, ఫిలిప్స్ సెంచరీలు.. భారత్ ముందు భారీ టార్గెట్
ఇండోర్ వేదికగా భారత్తో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో న్యూజిలాండ్ బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. కివీస్ స్టార్ బ్యాటర్లు డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ సెంచరీలతో చెలరేగారు. మొదట బ్యాటింగ్కు దిగిన కివీస్ ఆరంభంలోనే ఓపెనర్లు డెవాన్ కాన్వే(5), హెన్రీ నికోల్స్(0) వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డారిల్ మిచిల్.. విల్ యంగ్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. యంగ్(30) ఔటయ్యాక అసలు కథ మొదలైంది. అతడి స్ధానంలో క్రీజులోకి వచ్చిన ఫిలిప్స్, మిచెల్ కలిసి భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు ఏకంగా 219 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని అర్ష్దీప్ సింగ్ బ్రేక్ చేశాడు. మిచెల్ 131 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్లతో 137 పరుగులు చేయగా.. ఫిలిప్స్ కేవలం 88 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్స్లతో 106 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆఖరిలో బ్రేస్వెల్(28) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, అర్ష్దీప్ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, కుల్దీప్ తలా వికెట్ సాధించారు. రవీంద్ర జడేజా మరోసారి కనీసం ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. కాగా డారిల్ మిచెల్కు ఈ సిరీస్లో ఇది వరుసగా రెండో సెంచరీ కావడం గమనార్హం.చదవండి: IND vs NZ: టీమిండియాపై సెంచరీల మోత.. మైమరిపిస్తున్న మిచెల్ -
టీమిండియాపై సెంచరీల మోత.. మైమరిపిస్తున్న మిచెల్
సనత్ జయసూర్య, రికీ పాంటింగ్, కుమార సంగ్కకర, మహేలా జయవర్దనే, ఏబీ డివిలియర్స్.. వీరంతా ఒకప్పుడు భారత జట్టుపై ఆధిపత్యం చెలాయించిన దిగ్గజ బ్యాటర్లు. ముఖ్యంగా వీరిందరికి వన్డేల్లో భారత్పై అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పుడు వారి బాటలోనే అడుగులు వేస్తున్నాడు న్యూజిలాండ్ స్టార్ డారిల్ మిచెల్. ఈ మిడిలార్డర్ బ్యాటర్ ప్రస్తుతం టీమిండియాకు కొరకరాని కొయ్యలా మారుతున్నాడు. ఆసీస్ స్టార్ ట్రావిస్ హెడ్ కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్కు తలనొప్పిగా మారితే.. మిచెల్ మాత్రం దాదాపు ప్రతీ మ్యాచ్లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతడికి ప్రత్యర్ధి భారత్ అయితే చాలు చెలరేగిపోతాడు.మిచెల్ సెంచరీల మోత..మిచెల్ కాస్త లేటుగా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టినప్పటికి.. అతి తక్కువ సమయంలోనే మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) తనదైన ముద్రవేసుకున్నాడు. ముఖ్యంగా అతడికి భారత్పై అసాధరణ వన్డే రికార్డు ఉంది. స్పిన్ను సమర్ధవంతంగా ఆడే మిచెల్ ఉపఖండ పిచ్లపై సత్తాచాటుతున్నాడు.వన్డే ప్రపంచకప్-2023లో కూడా ఆతిథ్య టీమిండియాను మిచెల్ గడగడలాడించాడు. సెమీఫైనల్ అయితే తన విరోచిత సెంచరీతో భారత్ను ఓడించే అంతపనిచేశాడు. అంతకుముందు లీగ్ మ్యాచ్లో కూడా భారత్పై సెంచరీ సాధించాడు. దీంతో వన్డే ప్రపంచకప్లో భారత్పై రెండు సెంచరీలు చేసిన ఏకైక విదేశీ బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు అదే ఫామ్ను తాజా పర్యటనలో అతడు కొనసాగిస్తున్నాడు.ప్రస్తుతం భారత్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో అతడు పరుగులు వరద పారిస్తున్నాడు. తొలి వన్డేలో 84 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన మిచెల్.. ఆ తర్వాత రాజ్కోట్లో విరోచిత సెంచరీతో చెలరేగాడు. మళ్లీ ఇప్పుడు సిరీస్ డిసైడర్ మూడో వన్డేలోనూ శతక్కొట్టాడు. మిచెల్ భారత్లో తను ఆడిన చివరి ఐదు ఇన్నింగ్స్ ల్లో ఏకంగా నాలుగుల సెంచరీలు బాదేశాడు. భారత్పై వన్డేల్లో అతడి సగటు దాదాపు 70గా ఉంది. ఇది చాలా మంది దిగ్గజ ఆటగాళ్లకు కూడా సాధ్యం కాలేదు.రెండో ప్లేయర్గా..భారత్పై వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా మిచెల్ నిలిచాడు. మిచెల్ ఇప్పటివరకు 4 సెంచరీలు సాధించాడు. ఈ సెంచరీలు మొత్తం భారత్లోనే రావడం గమనార్హం. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో నాథన్ ఆస్టిల్(5) అగ్రస్ధానంలో ఉన్నాడు. మరో సెంచరీ చేస్తే ఆస్టిల్ను మిచెల్ అధిగమిస్తాడు.చదవండి: T20 WC 2026: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మరో షాక్.. -
గంభీర్ చూశావా? తొలి ఓవర్లోనే వికెట్! వీడియో వైరల్
రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో భారత తుది జట్టులోకి వచ్చిన పేసర్ అర్ష్దీప్ సింగ్.. తొలి ఓవర్లోనే తన మార్క్ చూపించాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే కివీస్ ఓపెనర్ హెన్రీ నికోల్స్ను పెవిలియన్ పంపి భారత్కు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో గిల్ బౌలింగ్ ఎటాక్ను ప్రారంభించేందుకు కొత్త బంతిని అర్ష్దీప్ చేతికి ఇచ్చాడు. కెప్టెన్ నమ్మకాన్ని ఈ పంజాబ్ పేసర్ వమ్ముచేయలేదు. తన వేసిన తొలి ఓవర్ రెండో బంతికి డెవాన్ కాన్వే ఫోర్ బాదినా.. అర్ష్దీప్ ఏమాత్రం తన ఏకాగ్రతను కోల్పోలేదు.అదే ఓవర్ ఐదో బంతికి అద్భుతమైన ఇన్స్వింగర్తో నికోల్స్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో అతడు గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ క్రమంలో తొలి రెండు వన్డేల్లో అర్ష్దీప్కు అవకాశమివ్వని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు. ఇటువంటి బౌలర్ను ఎలా పక్కన పెట్టావు? అంటూ పోస్ట్లు పెడుతున్నారు.మొదటి రెండు వన్డేల్లో అర్ష్దీప్ బెంచ్కే పరిమితమయ్యాడు. దీంతో అశ్విన్ మాజీలు గంభీర్పై విమర్శల వర్షం కురిపించారు. దీంతో ఎట్టకేలకు సిరీస్ డిసైడర్ మ్యాచ్లో అర్ష్దీప్కు అవకాశం దక్కింది. ఈ పంజాబ్ స్పీడ్ స్టార్ ప్రసిద్ద్ కృష్ణ స్దానంలో తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్వెల్(కెప్టెన్), జకారీ ఫౌల్క్స్, కైల్ జామిసన్, క్రిస్టియన్ క్లార్క్, జేడెన్ లెన్నాక్స్టీమిండియా: రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్Arshdeep Singh has always been a wicket taker for India in every format.Still Gautam Gambhir used to bench him in most of the games. Jasprit Bumrah and Arshdeep will be the key in the T20 World Cup and the 2027 WC if Gambhir does not play politics 🔥🙇pic.twitter.com/tBcjoU9R2v— Tejash (@Tejashyyyyy) January 18, 2026 -
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మరో షాక్..
టీ20 ప్రపంచకప్-2026లో పాల్గోనేందుకు తమ జట్టును భారత్కు పంపబోమని మొండి పట్టుతో ఉన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మరో భారీ షాక్ తగిలింది. బీసీబీ తాజాగా చేసిన 'గ్రూప్ స్వాపింగ్' ప్రతిపాదనను క్రికెట్ ఐర్లాండ్ నిర్మొహమాటంగా తిరస్కరించింది. తమ లీగ్ మ్యాచ్లను శ్రీలంకలోనే ఆడుతామని ఐరీష్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.ఈ మెగా టోర్నీలో బంగ్లాదేశ్ గ్రూపు-సిలో ఉంది. షెడ్యూల్ ప్రకారం బంగ్లా జట్టు తమ గ్రూపు మ్యాచ్లను కోల్కతా, ముంబై వేదికలగా ఆడాల్సి ఉంది. అయితే భద్రతా కారణాలను సాకుగా చూపిస్తూ ఈ మెగా టోర్నీ కోసం భారత్కు రాబోమని బంగ్లాదేశ్ పట్టుబడుతోంది. తాజాగా శనివారం ఢాకాలో ఐసీసీ ప్రతినిధి బృందం, బీసీబీ అధికారుల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. భారత్లో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని ఐసీసీ హామీ ఇచ్చినా, బంగ్లాదేశ్ ప్రభుత్వం, బోర్డు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ భేటిలో బంగ్లా క్రికెట్ బోర్డు ఐసీసీ ముందు మరో సరికొత్త ప్రతిపాదనను ఉంచింది. గ్రూప్-బిలో ఉన్న ఐర్లాండ్తో తమ గ్రూపును మార్పు చేయాలంటూ ఐసీసీని బీసీబీ కోరింది. ఐర్లాండ్తో గ్రూప్ స్వాపింగ్ చేసుకుంటే లీగ్ దశ మ్యాచ్లన్నింటినీ శ్రీలంకలో ఆడవచ్చని బంగ్లాదేశ్ భావించింది. కానీ అందుకు ఐర్లాండ్ నో చెప్పడంతో కథ మళ్లీ మొదటికే వచ్చింది. ఇదే విషయంపై ఐర్లాండ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు మాట్లాడుతూ.. "మేము మొదట నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఆడతాం. గ్రూప్ స్టేజ్ మొత్తం శ్రీలంకలోనే జరుగుతుంది” అని చెప్పుకొచ్చారు. కాగా ముస్తాఫిజుర్ రెహ్మన్ను ఐపీఎల్ నుంచి విడుదల చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఒకవేళ టోర్నీలో పాల్గోనేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత్కు రాకపోతే పాయింట్లను కోల్పోవల్సి ఉంటుంది.చదవండి: ఇటలీ ప్రపంచకప్ జట్టులో సౌతాఫ్రికా ఆటగాడు -
న్యూజిలాండ్తో మూడో వన్డే.. టాస్ గెలిచిన టీమిండియా
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇండోర్లోని హోల్కర్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (జనవరి 18) జరుగునున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కీలకమైన ఈ మ్యాచ్ కోసం భారత జట్టు ఓ మార్పు చేసింది. తొలి రెండు మ్యాచ్ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ప్రసిద్ద్ కృష్ణ స్థానంలో స్టార్ పేసర్ అర్షదీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు న్యూజిలాండ్ ఈ మ్యాచ్ల్లో ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతుంది. కాగా, ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో భారత్, రెండో మ్యాచ్లో న్యూజిలాండ్ గెలుపొందాయి. మూడో మ్యాచ్లో గెలిచే జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్వెల్(c), జకారీ ఫౌల్క్స్, కైల్ జామిసన్, క్రిస్టియన్ క్లార్క్, జేడెన్ లెన్నాక్స్టీమిండియా: రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ -
ఇటలీ ప్రపంచకప్ జట్టులో సౌతాఫ్రికా ఆటగాడు
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ 2026కు ఇటలీ అర్హత సాధించింది. ఈ మెగా టోర్నీకి ఆ జట్టు తొలిసారి క్వాలిఫై అయ్యింది. ఈ టోర్నీ కోసం 15 మంది సభ్యుల జట్టును నిన్న (జనవరి 17) ప్రకటించారు. వేన్ మ్యాడ్సన్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు.ఈ జట్టులో ఓ ఆసక్తికర ఎంపిక జరిగింది. 2017-21 మధ్యలో సౌతాఫ్రికా జాతీయ జట్టుకు ఆడిన 37 ఏళ్ల జేజే స్మట్స్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్మట్స్ సౌతాఫ్రికా తరఫున 6 వన్డేలు, 13 టీ20లు ఆడాడు. స్మట్స్ ఇటీవల జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2025లో (WCL) సౌతాఫ్రికా లెజెండ్స్కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ టోర్నీలోని ఓ మ్యాచ్లో అతను ఏబీ డివిలియర్స్తో కలిసి విధ్వంసం సృష్టించాడు. 53 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేశాడు.కుడి చేతి వాటం ఓపెనింగ్ బ్యాటర్, స్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ అయిన స్మట్స్.. ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్లో డర్బన్ సూపర్ జెయింట్స్ తరఫున కూడా ఆడుతున్నాడు. స్మట్స్ ఇటలీ పౌరసత్వం తన భార్య నుంచి సంక్రమించుకున్నాడు.కాగా, ఇటలీ వరల్డ్కప్ యూరప్ క్వాలిఫయర్స్లో రెండో స్థానంలో నిలవడం ద్వారా ప్రపంచకప్కు అర్హత సాధించింది. ఈ విభాగం నుంచి మరో జట్టుగా నెదర్లాండ్స్ ఉంది. ప్రపంచకప్ 2026లో ఇటలీ.. టు టైమ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్తో పాటు గ్రూప్-సిలో ఉంది.ఇటలీ జట్టు ఫిబ్రవరి 9న బంగ్లాదేశ్ మ్యాచ్తో టీ20 వరల్డ్కప్ అరంగేట్రం చేయనుంది. కోల్కతా వేదికగా ఈ మ్యాచ్ జరునుంది. అనంతరం ఈ జట్టు ఫిబ్రవరి 12న ముంబైలో నేపాల్తో తలపడుతుంది.టీ20 ప్రపంచకప్ 2026కు ఇటలీ జట్టు..వేన్ మాడ్సెన్ (కెప్టెన్), మార్కస్ కాంపోపియానో, జియాన్ పియరో మీడే, జైన్ అలీ, అలీ హసన్, క్రిషన్ జార్జ్, హ్యారీ మానెంటి, ఆంథోనీ మోస్కా, జస్టిన్ మోస్కా, సయ్యద్ నఖ్వీ, బెంజమిన్ మానెంటి, జస్ప్రీత్ సింగ్, జేజే స్మట్స్, గ్రాంట్ స్టీవర్ట్, థామస్ డ్రాకా. -
ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత జట్టు ప్రకటన
ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరుగనున్న ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత పరిమిత ఓవర్ల క్రికెట్ జట్లను నిన్న (జనవరి 17) ప్రకటించారు. ఈ పర్యటనలో టీమిండియా-ఆస్ట్రేలియా 3 టీ20లు, ఓ టెస్ట్, 3 వన్డేలు ఆడతాయి. వీటిలోని పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం భారత జట్టును ప్రకటించారు.గాయాల నుంచి కోలుకున్న స్టార్ ఆల్రౌండర్ శ్రేయంక పటిల్ టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చింది. 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం జరుగుతున్న డబ్ల్యూపీఎల్లో సత్తా చాటడంతో (ఆర్సీబీ తరఫున 5 వికెట్ల ప్రదర్శన) శ్రేయంకకు మరోసారి అవకాశం వచ్చింది. టీ20 జట్టులో మరో ఆసక్తికర ఎంపిక భారతి ఫుల్మాలి. ఈమె చివరిగా 2019లో భారత్ తరఫున టీ20 ఆడింది. ఆతర్వాత పేలవ ఫామ్ కారణంగా కనుమరుగైంది. గతేడాది డబ్ల్యూపీఎల్లో ఓ మోస్తరు ప్రదర్శనలతో తిరిగి లైన్లోకి వచ్చింది. ప్రస్తుత సీజన్లో కూడా అదే ఫామ్ను కొనసాగిస్తుండటంతో ఆరేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చింది.హర్లీన్ డియోల్పై వేటుగత సిరీస్లో టీమిండియాలో భాగమైన హర్లీన్ డియోల్కు ఈ జట్టులో చోటు దక్కలేదు. ప్రస్తుతం జరుగుతున్న డబ్ల్యూపీఎల్లో రాణిస్తున్నా, సెలెక్టర్లు ఆమెపై వేటు వేశారు. పై మార్పులు మినహా టీ20 జట్టులో పెద్దగా గమనించదగ్గ విషయాలేమీ లేవు. కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్గా స్మృతి మంధన కొనసాగారు.ఆసీస్తో టీ20 సిరీస్కు భారత జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (C), స్మృతి మంధన (VC), షఫాలి వర్మ, రేణుకా ఠాకూర్, శ్రీ చరణి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, స్నేహ రాణా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (WK), జి కమలిని (WK), అరుంధతి రెడ్డి, అమంజోత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలి, శ్రేయంక పటిల్షఫాలీ స్థానం పదిలంవన్డే సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో పలు ఆసక్తికర ఎంపికలు జరిగాయి. వరల్డ్కప్లో ఓపెనర్ ప్రతికా రావల్ గాయపడటంతో జట్టులోకి వచ్చిన షఫాలీ వర్మ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. షఫాలీ వరల్డ్కప్లో చిరస్మరణీయ ఇన్నింగ్స్లు ఆడి టీమిండియా ఛాంపియన్గా నిలవడంలో కీలకపాత్ర పోషించింది. ప్రపంచకప్ సందర్భంగా గాయపడిన ప్రతికా మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. వికెట్కీపర్ యస్తికా భాటియా కూడా శస్త్రచికిత్స తర్వాత రీహాబ్లో ఉండటంతో ఈ సిరీస్కు దూరమైంది. జి కమలినికి వికెట్కీపింగ్ చేసే సామర్థ్యం కూడా ఉండటంతో వన్డే జట్టులోకి కూడా వచ్చింది. ఈ జట్టులో రాధా యాదవ్, అరుంధతి రెడ్డికి చోటు దక్కలేదు. కశ్వీ గౌతమ్ కొత్తగా జట్టులోకి వచ్చింది. ఆసీస్తో వన్డే సిరీస్కు భారత జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (C), స్మృతి మంధన (VC), షఫాలి వర్మ, రేణుకా ఠాకూర్, శ్రీ చరణి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, స్నేహ రాణా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (WK), జి కమలిని (WK), కశ్వీ గౌతమ్, అమంజోత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్ఆసీస్ పర్యటన షెడ్యూల్ టీ20 సిరీస్: - ఫిబ్రవరి 15 – సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ - ఫిబ్రవరి 19 – మానుకా ఓవల్ - ఫిబ్రవరి 21 – అడిలైడ్ ఓవల్ వన్డే సిరీస్: - ఫిబ్రవరి 24 – బ్రిస్బేన్ (అల్లన్ బోర్డర్ ఫీల్డ్) - ఫిబ్రవరి 27 & మార్చి 1 – హోబార్ట్ (బెల్లెరివ్ ఓవల్) ఏకైక టెస్ట్: - మార్చి 6- పెర్త్ (పెర్త్ స్టేడియం)* టెస్ట్ జట్టును ప్రకటించాల్సి ఉంది. -
క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టడం ఎంత వరకు సబబు..?
ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్కప్ 2026లో భాగంగా నిన్న (జనవరి 17) భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆసక్తికర సమరం జరిగింది. ఈ మ్యాచ్ టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోకుండా, గతంలో జరిగిన భారత్-పాక్ వివాదాస్పద 'నో హ్యాండ్ షేక్' ఉదంతాన్ని గుర్తు చేశారు.తాజా ఎపిసోడ్ తర్వాత క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టడం ఎంత వరకు సబబు అన్న ప్రశ్న మరోసారి ఉత్పన్నమైంది. క్రికెట్ సర్కిల్స్లో ఈ అంశంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. మెజార్టీ శాతం క్రీడల్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదని అభిప్రాయపడుతున్నారు. కొందరేమో ఈ అంశానికి మద్దతిస్తున్నారు. ఒక దేశం పట్ల మరో దేశం క్రూరంగా ప్రవర్తిస్తే ఇలాగే బుద్ది చెప్పాలని అంటున్నారు.ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా, క్రీడలను రాజకీయాలతో ముడి పెట్టి, నో షేక్ హ్యాండ్ లాంటి ఉదంతాలకు తావిస్తే, దేశాల మధ్య ఉద్రిక్తతల మరింత పెరుగుతాయి కానీ, ఎలాంటి ప్రజాప్రయోజనాలు ఉండవు. వాస్తవానికి క్రీడలు దేశాల మధ్య స్నేహ వారుధులుగా ఉంటాయి. అలాంటి వాటిని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోకూడదు.ఆటగాళ్లు సైతం ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ప్రవర్తించాలి. క్రీడలకు సంబంధం లేని విషయాలు మాకెందుకులే అనుకోవాలి. రాజకీయాలు చూసుకునే బాధ్యత నాయకులకు వదిలి పెట్టి, మైదానంలో క్రీడాస్పూర్తితో వ్యవహరించాలి. నో హ్యాండ్ షేక్ లాంటి ఉదంతాలకు తావివ్వకుండా హుందాగా ప్రవర్తించాలి.క్రీడల్లో హ్యాండ్షేక్ ఇవ్వడమనేది కేవలం ఫార్మాలిటీ మాత్రమే కాదు. ఇది ఆటగాళ్ల మధ్య పరస్పర గౌరవం. దేశాల మధ్య పోటీ జరిగేటప్పుడు సామరస్యతను ప్రతిబింబించే సంకేతం. ఇలాంటి వాటిలో రాజకీయాలకు అస్సలు తావివ్వకూడదు. ఈ విషయాన్ని ఆటగాళ్లు గమనించాలి. ప్రత్యర్దికి హ్యాండ్ షేక్ నిరాకరిస్తే.. అంతర్జాతీయ సమాజంలో వాళ్లే చిన్నచూపుకు గురవుతారు. అప్పటిదాకా వారిపై దేశాలకతీతంగా ఉండే అభిమానం పలచనవుతుంది.క్రికెట్కు జెంటిలెమన్ గేమ్ అనే పేరుంది. కాబట్టి క్రికెటర్లు జెంటిల్మెన్లలా ప్రవర్తించి క్రీడ గౌరవాన్ని పెంచాలి. దేశాల మధ్య సమస్యలు ఉన్నప్పుడు పరిణితి ప్రదర్శించవచ్చు. గతంలో ఏదైనా సమస్య కాని, అసంతృప్తి కాని ఉంటే, ఆటగాళ్లు ఆర్మ్ బ్యాండ్లు ధరించే వారు. దేశాల మధ్య ఉద్రిక్తతల విషయంలోనూ ఆటగాళ్లు ఇలా ప్రవర్తించవచ్చు. తమ దేశం పట్ల ప్రత్యర్ది దేశం అమానవీయంగా ప్రవర్తిస్తుందని అనుకున్నప్పుడు ఆర్మ్ బ్యాండ్లు ధరించి నిరసన వ్యక్తం చేయవచ్చు.కానీ హ్యాండ్ షేక్ ఇవ్వకుండా ఒకరినొకరు అవమానించుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఇలా చేయడం వల్ల అభిమానుల్లోనే కాకుండా సహచర ఆటగాళ్లలోనూ అసహనం పెరుగుతుంది. ఇటీవల ఓ విండీస్ టీ20 దిగ్గజం భారత్-పాక్ మధ్య నో హ్యాండ్ షేక్ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇందుకు అతను భారత ఆటగాళ్లనే బాధ్యులుగా భావిస్తున్నాడు.ఇందులో అతని తప్పేమీ లేదు. ఎందుకంటే, భారత్-పాక్ మధ్య నో హ్యాండ్ షేక్ ఉదంతాన్ని గమనించిన ఎవరికైనా ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది. గతేడాది ఆసియా కప్ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ సమయంలో పాక్ కెప్టెన్ సల్మాన్ అఘాకు హ్యాండ్ షేక్ నిరాకరించాడు. మ్యాచ్ అనంతరం కూడా ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. ఈ ఉదంతం తర్వాత భారతీయుల్లో సూర్యకుమార్పై రెస్పెక్ట్ మరింత పెరిగింది. కానీ, ఓ క్రీడాకారుడిగా అంతర్జాతీయ సమాజంలో తన మర్యాదను పలచన చేసుకున్నాడు. ఏది ఏమైనా నో హ్యాండ్ షేక్ లాంటి ఉదంతాలు క్రీడల ప్రతిష్టను దిగజారుస్తాయే కానీ, గౌరవాన్ని పెంచవు. ఈ విషయాన్ని క్రీడాలోకమంతా గుర్తు పెట్టుకోవాలి. -
7 పరుగులకే 5 వికెట్లు.. కట్ చేస్తే స్కోర్ ఎంతంటే..?
సౌతాఫ్రికా టీ20 లీగ్ చరిత్రలో అత్యుత్తమ కమ్బ్యాక్ ఇచ్చిన జట్టుగా ప్రిటోరియా క్యాపిటల్స్ నిలిచిపోనుంది. కఠినమైన పిచ్పై ఆ జట్టు 7 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశ నుంచి అనూహ్య రీతిలో పుంజుకొని గౌరవప్రదమైన స్కోర్ చేసింది. అంతేకాకుండా ఆ స్కోర్ను విజయవంతంగా డిఫెండ్ చేసుకొని, 21 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జోహనెస్బర్గ్ వేదికగా నిన్న (జనవరి 17) ప్రిటోరియా క్యాపిటల్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్ మధ్య కీలకమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్కు ఉపయోగించిన పిచ్ బ్యాటర్లకు చాలా కఠినంగా ఉండింది. ఈ పిచ్పై తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ 7 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.ఈ దశలో డెవాల్డ్ బ్రెవిస్ (47 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు)–షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (50 బంతుల్లో 74 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) జోడీ అనూహ్య పోరాటం చేసి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించింది. వీరిద్దరు ఆరో వికెట్కు 103 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఫలితంగా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. బ్రెవిస్-రూథర్ఫోర్డ్ భాగస్వామ్యానికి ముందు ప్రిటోరియా ఇన్నింగ్స్లో నలుగురు డకౌట్లయ్యారు.జోబర్గ్ బౌలర్లలో డేనియల్ వారెల్ (4-1-12-2), వియాన్ ముల్దర్ (4-1-34-2), డుయాన్ జన్సెన్ (4-0-27-1), బర్గర్ (4-0-32-1) అద్బుతంగా బౌలింగ్ చేశారు. వీరి ధాటికి క్యాపిటల్స్ టాపార్డర్ కకావికలమైంది.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ప్రిటోరియా బౌలర్లు అద్భుతంగా డిఫెండ్ చేసుకున్నారు. లిజాడ్ విలియమ్స్ (4-0-25-3), కేశవ్ మహారాజ్ (4-0-15-3), రోస్టన్ ఛేజ్ (4-0-11-1), గిడ్యోన్ పీటర్స్ (3-0-25-1) ధాటికి సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 122 పరుగులకే పరిమితమైంది. ఈ గెలుపుతో సంబంధం లేకుండా క్యాపిటల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించగా.. సూపర్ కింగ్స్ మినుకుమినుకుమంటున్న అవకాశాలను మరింత క్లిష్టతరం చేసుకుంది. -
శివాలెత్తిన మార్క్రమ్.. విధ్వంసకర శతకం
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో డర్బన్ సూపర్ జెయింట్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ చెలరేగిపోయాడు. పార్ల్ రాయల్స్తో నిన్న (జనవరి 17) జరిగిన కీలక మ్యాచ్లో విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా సూపర్ జెయింట్స్ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.శివాలెత్తిన మార్క్రమ్తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ జెయింట్స్.. మార్క్రమ్ శతక్కొట్టుడుతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. మార్క్రమ్ 58 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేసి సౌతాఫ్రికా టీ20 లీగ్లో తన రెండో శతకాన్ని నమోదు చేశాడు.సికందర్ రజా వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో మార్క్రమ్ శివాలెత్తిపోయాడు. 3 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 28 పరుగులు పిండుకున్నాడు. సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్లో మార్క్రమ్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. సునీల్ నరైన్ 4, జోస్ బట్లర్ 1, కేన్ విలియమ్సన్ 22, హెన్రిచ్ క్లాసెన్ 29, లియామ్ లివింగ్స్టోన్ 19 పరుగులకు ఔటయ్యారు.రాయల్స్ బౌలర్లలో హర్దస్ విల్యోన్ 4 వికెట్లతో సత్తా చాటాడు. ఫోర్టుయిన్, బార్ట్మన్, పోట్గెటర్ తలో వికెట్ తీశారు.అనంతరం 190 పరుగుల లక్ష్య ఛేదనలో రాయల్స్ తడబడింది. సునీల్ నరైన్ (4-0-18-2), సైమన్ హార్మర్ (4-1-13-1), మార్క్రమ్ (2-0-9-1), లివింగ్స్టోన్ (3-0-25-1), కొయెట్జీ (3-0-31-2), మపాకా (2-0-10-1) వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేయడంతో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది.రాయల్స్ ఇన్నింగ్స్లో ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేదు. వెర్రిన్ (23), హెర్మన్ (18), సికందర్ రజా (21), ఫోర్టుయిన్ (35 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.కాగా, ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే రాయల్స్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. ఈ జట్టుతో పాటు ప్రిటోరియా క్యాపిటల్స్, సన్రైజర్స్ ఈస్ట్రన్కేప్ కూడా ప్లే ఆఫ్స్ బెర్త్లు కన్ఫర్మ్ చేసుకున్నాయి. నాలుగో బెర్త్ కోసం డర్బన్ సూపర్ జెయింట్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్, ఎంఐ కేప్టౌన్ మధ్య పోటీ జరుగుతుంది. -
విహాన్ విజృంభణ
బులావాయో (జింబాబ్వే): అండర్–19 ప్రపంచకప్లో భారత్ జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్లో అమెరికాపై అలవోక విజయం సాధించిన ఆయుశ్ మాత్రే సారథ్యంలోని యువ భారత జట్టు... రెండో మ్యాచ్లో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. గ్రూప్ ‘బి’లో భాగంగా శనివారం జరిగిన పోరులో భారత్ 18 పరుగుల తేడాతో (డక్వర్త్–లూయీస్ పద్ధతిలో) బంగ్లాదేశ్పై గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత జట్టు 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఆయుశ్ మాత్రే (6), వేదాంత్ త్రివేది (0), విహాన్ మల్హోత్రా (7), హర్వంశ్ పంగలియా (2) విఫలమైనా... యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (67 బంతుల్లో 72; 6 ఫోర్లు, 3 సిక్స్లు), అభిజ్ఞాన్ కుందు (112 బంతుల్లో 80; 4 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. ఒకవైపు వరుస వికెట్లు పడుతున్నా... వైభవ్ సూర్యవంశీ, అభిజ్ఞాన్ చక్కటి పోరాటం కనబర్చారు. ఫలితంగా యంగ్ ఇండియా ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. గంటకు పైగా మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించడంతో తొలుత భారత ఇన్నింగ్స్ను 49 ఓవర్లకు కుదించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో అల్ ఫహద్ 5 వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సమయంలో మ్యాచ్కు మరోసారి వర్షం అడ్డుపడింది. దీంతో బంగ్లా లక్ష్యాన్ని 29 ఓవర్లలో 165గా నిర్ణయించారు. ఛేదనలో బంగ్లా 28.3 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ అజీజుల్ హకీమ్ (72 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో పోరాడగా... మిగిలినవాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఒక దశలో 106/2తో పటిష్ట స్థితిలో ఉన్న బంగ్లాదేశ్... భారత బౌలర్ల జోరుతో మరో 40 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విహాన్ మల్హోత్రా 4 వికెట్లతో సత్తా చాటాడు. తదుపరి మ్యాచ్లో ఈ నెల 26న న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది.స్కోరు వివరాలు భారత అండర్–19 ఇన్నింగ్స్: ఆయుశ్ (సి) కలామ్ (బి) ఫహద్ 6; వైభవ్ (సి) ఫహద్ (బి) ఇక్బాల్ 72; వేదాంత్ (సి) రిఫత్ (బి) ఫహద్ 0; విహాన్ (సి) అబ్రార్ (బి) అజీజుల్ 7; అభిజ్ఞాన్ (సి) ఫరీద్ (బి) ఫహద్ 80; హర్వంశ్ (సి) రిఫత్ (బి) ఇక్బాల్ 2; కనిష్క్ (సి) (సబ్) అబ్దుల్లా (బి) అజీజుల్ 28; అంబరీష్ (సి) ఫరీద్ (బి) పర్వేజ్ 5; ఖిలాన్ (సి) ఫరీద్ (బి) ఫహద్ 8; హెనిల్ (నాటౌట్) 7; దీపేశ్ (సి) రిజాన్ (బి) ఫహద్ 11; ఎక్స్ట్రాలు 12; మొత్తం (48.4 ఓవర్లలో ఆలౌట్) 238. వికెట్ల పతనం: 1–12, 2–12, 3–53, 4–115, 5–119, 6–173, 7–194, 8–208, 9–224, 10–238. బౌలింగ్: అల్ ఫహద్ 9.2–1–38–5; ఇక్బాల్ 8–1–45–2; పర్వేజ్ 10–1–46–1; అజీజుల్ 10–1–42–2; రిజాన్ 8–0–43–0; సాద్ ఇస్లామ్ 2.2–0–18–0; బషీర్ 1–0–6–0. బంగ్లాదేశ్ అండర్–19 ఇన్నింగ్స్: జవాద్ అబ్రార్ (సి) హెనిల్ (బి) దీపేశ్ 5; రిఫత్ (సి) అభిజ్ఞాన్ (బి) కనిష్క్ 37; అజీజుల్ (సి) కనిష్క్ (బి) ఖిలాన్ 51; కలామ్ (సి అండ్ బి) విహాన్ 15; పర్వేజ్ (సి) కనిష్క్ (బి) విహాన్ 7; రిజాన్ (సి) హెనిల్ (బి) విహాన్ 15; బషీర్ (సి) వైభవ్ (బి) విహాన్ 2; ఫరీద్ (సి) దీపేశ్ (బి) ఖిలాన్ 1; ఫహద్ (రనౌట్) 0; ఇక్బాల్ (సి) ఆయుశ్ (బి) హెనిల్ 2; ఇస్లామ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 10; మొత్తం (28.3 ఓవర్లలో ఆలౌట్) 146. వికెట్ల పతనం: 1–6, 2–62, 3–106, 4–124, 5–126, 6–129, 7–138, 8–143, 9–144, 10–146. బౌలింగ్: దీపేశ్ 4–0–27–1; హెనిల్ 4.3–1–17–1; అంబరీష్ 3–0–18–0; కనిష్క్ 6–0–22–1; ఖిలాన్ 6–0–35–2; ఆయుశ్ 1–0–7–0; విహాన్ 4–0–14–4. -
స్మృతి చేజారిన సెంచరీ
నవీ ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అజేయంగా దూసుకెళుతోంది. జోరు మీదున్న జట్టు వరుసగా నాలుగో విజయాన్ని సాధించింది. శనివారం జరిగిన పోరులో బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై గెలిచింది. మొదట బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిరీ్ణత 20 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ షఫాలీ వర్మ (41 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్స్లు) చెలరేగింది. 10 పరుగులకే జట్టు 4 వికెట్లు కోల్పోయిన దశలో లూసీ హామిల్టన్ (19 బంతుల్లో 36; 3 ఫోర్లు, 3 సిక్స్లు), స్నేహ్ రాణా (22; 3 ఫోర్లు)లతో కలిసి క్యాపిటల్స్ ఇన్నింగ్స్ను నిలబెట్టింది. బెల్, సయాలీ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరు 18.2 ఓవర్లలో 2 వికెట్లకు 169 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతి మంధాన (61 బంతుల్లో 96; 13 ఫోర్లు, 3 సిక్స్లు) దంచేసింది. త్రుటిలో సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్న ఆమె... జార్జియా వోల్ (42 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్లు)తో కలిసి రెండో వికెట్కు 142 పరుగుల్ని జోడించింది.స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: షఫాలీ (సి) రావత్ (బి) బెల్ 62; లిజెల్లీ (బి) బెల్ 4; వోల్వార్ట్ (బి) బెల్ 0; జెమీమా (బి) సయాలీ 4; మరిజాన్ (బి) సయాలీ 0; నికీ (ఎల్బీ) (బి) రావత్ 12; మిన్ను మణి (సి) మంధాన (బి) డిక్లెర్క్ 5; స్నేహ్ రాణా (బి) రావత్ 22; హామిల్టన్ (సి) రాధ (బి) సయాలీ 36; శ్రీచరణి నాటౌట్ 11; నందిని రనౌట్ 1; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 166. వికెట్ల పతనం: 1–5, 2–5, 3–10, 4–10, 5–69, 6–74, 7–108, 8–130, 9–164, 10–166. బౌలింగ్: బెల్ 4–0–26–3, సయాలీ 3–0–27–3, శ్రేయాంక 3–0–44–0, డిక్లెర్క్ 4–0–31–1, ప్రేమ రావత్ 3–0–16–2, రాధా యాదవ్ 3–0–21–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గ్రేస్ హారిస్ (సి) షఫాలీ (బి) మరిజాన్ 1; స్మృతి (సి) హామిల్టన్ (బి) నందిని 96; జార్జియా వోల్ నాటౌట్ 54; రిచా ఘోష్ నాటౌట్ 7; ఎక్స్ట్రాలు 11; మొత్తం (18.2 ఓవర్లలో 2 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–14, 2–156. బౌలింగ్: మరిజాన్ కాప్ 4–0–21–1, లూసీ హామిల్టన్ 3.2–0–37–0, నందిని శర్మ 4–0–34–1, శ్రీచరణి 3–0–26–0, స్నేహ్ రాణా 1–0–13–0, షఫాలీ 1–0–14–0, మిన్ను మణి 2–0–20–0. -
సిరీస్ విజయంపై గురి
దాదాపు ఏడాదిన్నర క్రితం భారత గడ్డపై న్యూజిలాండ్ తొలి సారి టెస్టు సిరీస్ను గెలుచుకుంది. అంతకు ముందు చరిత్రలో ఎప్పుడూ అలాంటి ఘనత సాధించని కివీస్ అనూహ్యంగా భారత్ను చిత్తు చేసింది. ఇప్పుడు వన్డేల్లో చరిత్ర చూస్తే భారత్లో న్యూజిలాండ్ ఎప్పుడూ వన్డే సిరీస్ నెగ్గలేదు. కానీ గత మ్యాచ్లో ఆ జట్టు ప్రదర్శన చూస్తే అలాంటి అవకాశం ఇక్కడా కనిపిస్తోంది. గతంలో మూడు సార్లు ఆ జట్టు సిరీస్ గెలిచేందుకు చేరువగా వచ్చినా అది సాధ్యం కాలేదు. ఇలాంటి సవాల్ మధ్య స్వదేశంలో తమ రికార్డును నిలబెట్టుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. 2019 మార్చి తర్వాత సొంతగడ్డపై ద్వైపాక్షిక వన్డే సిరీస్ కోల్పోని రికార్డును భారత్ కొనసాగిస్తుందా లేక సంచలనం నమోదవుతుందా చూడాలి. ఇండోర్: భారత్, న్యూజిలాండ్ మధ్య సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి పోరుకు రంగం సిద్ధమైంది. హోల్కర్ స్టేడియంలో నేడు జరిగే మూడో వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి. తొలి వన్డేలో భారత్ ఆధిపత్యం సాగగా, రెండో వన్డేలో న్యూజిలాండ్ అలవోక విజయాన్ని అందుకుంది. ప్రత్యరి్థతో పోలిస్తే సొంతగడ్డపై భారత్ అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తుండగా...పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లతో ఇక్కడ అడుగు పెట్టిన కివీస్ కూడా తమ ఆటతో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆఖరి ఆట ఆసక్తికరంగా సాగవచ్చు. అర్ష్ దీప్కు చాన్స్! భారత బ్యాటింగ్ టాప్–5 విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. రోహిత్, గిల్ జట్టుకు కావాల్సిన శుభారంభాన్ని అందిస్తున్నారు. అయితే రోహిత్ తన జోరును భారీ స్కోరుగా మార్చాల్సి ఉంది. గత మ్యాచ్లో తక్కువ పరుగులే చేసినా...కోహ్లి ప్రస్తుతం అద్భుత ఫామ్లో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ కూడా తన స్థాయిలో రాణిస్తుండగా... రాహుల్ రాజ్కోట్లో సెంచరీతో తానేమిటో చూపించాడు. ఈ ఐదుగురిలో ఏ ఇద్దరు చెలరేగినా భారత్ భారీ స్కోరు సాధించడం ఖాయం. ఆరో స్థానంలో నితీశ్ రెడ్డిని కొనసాగిస్తారా లేక స్పిన్నర్ ఆయుశ్ బదోనికి అరంగేట్రం చేసే అవకాశం వస్తుందా చూడాలి. నితీశ్ను పూర్తి స్థాయి ఆల్రౌండర్గా జట్టు ఉపయోగించుకోవడం లేదు. స్పిన్నర్గా కుల్దీప్ ప్రదర్శన కీలకం కానుంది. జడేజా బౌలింగ్ ప్రదర్శనను చూస్తూ అతని బ్యాటింగ్ను ఎవరూ పట్టించుకోలేదు. సుదీర్ఘ కాలంగా అతను వన్డేల్లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఓవరాల్గా భారత్లోనైతే 2013 తర్వాత అతను కనీసం హాఫ్ సెంచరీ సాధించలేదు. పేసర్లుగా సిరాజ్, హర్షిత్ ఖాయం. మూడో పేసర్గా వైవిధ్యం కోసం ప్రసిధ్ స్థానంలో అర్ష్ దీప్ను ప్రయతి్నంచవచ్చు. తొలి రెండు వన్డేల్లో ప్రసిధ్ పెద్దగా ఆకట్టుకోలేదు. కుర్రాళ్లు సమష్టిగా... ‘న్యూజిలాండ్ ఇంత సులువుగా విజయం సాధించడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది’...అంటూ రెండో వన్డే తర్వాత దిగ్గజం సునీల్ గావస్కర్ చేసిన వ్యాఖ్య భారత్ వైఫల్యాన్ని స్పష్టంగా చూపించింది. మిచెల్, యంగ్లను నిలువరించడంలో మన బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. కాన్వే, నికోల్స్ కూడా ఓపెనర్లుగా రాణిస్తే కివీస్ కూడా మంచి స్కోరుపై దృష్టి పెట్టవచ్చు. ఫిలిప్స్లాంటి హిట్టర్తో పాటు మంచి బ్యాటింగ్ పదును ఉన్న కెప్టెన్ బ్రేస్వెల్ మిడిలార్డర్లో కీలకం కానున్నారు. పేసర్ జేమీసన్ మొదటినుంచీ భారత్ను ఇబ్బంది పెడుతున్నాడు. క్లార్క్, ఫోక్స్లతో జట్టు బౌలింగ్ ఆధారపడి ఉంది. ఆఫ్ స్పిన్నర్గా బ్రేస్వెల్ ఉన్నాడు కాబట్టి తొలి వన్డే తరహాలోనే లెనాక్స్ స్థానంలో లెగ్స్పిన్నర్ ఆదిత్య అశోక్కు చోటు దక్కవచ్చు. ఎనిమిది మంది తొలిసారి భారత గడ్డపై ఆడుతున్న ఆటగాళ్లతో పర్యటనకు వచ్చి వన్డే సిరీస్ గెలవగలిగితే న్యూజిలాండ్కు ఇది పెద్ద ఘనత అవుతుంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: గిల్ (కెప్టెన్), రోహిత్, కోహ్లి, అయ్యర్, రాహుల్, నితీశ్/బదోని, జడేజా, హర్షిత్, కుల్దీప్, అర్ష్ దీప్, సిరాజ్. న్యూజిలాండ్: బ్రేస్వెల్ (కెప్టెన్), కాన్వే, నికోల్స్, యంగ్, మిచెల్, హే, ఫిలిప్స్, క్లార్క్, జేమీసన్, ఫోక్స్, ఆదిత్య. -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచ రికార్డు బ్రేక్
అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలోనే కెప్టెన్ ఆయూశ్ మాత్రే(6), అయుష్ మాత్రే (6), వేదాంత్ త్రివేది (0), విహాన్ మల్హోత్రా (7) వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది.ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ తన సహచర ఆటగాడు అభిజ్ఞాన్ కుండు(80)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. వైభవ్ మొత్తంగా 67 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 72 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో 14 ఏళ్ల సూర్యవంశీ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.తొలి ప్లేయర్గా..అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో హాఫ్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయష్కుడిగా వైభవ్ నిలిచాడు. సూర్యవంశీ కేవలం 14 ఏళ్ల 296 రోజుల వయస్సులో ఈ ఫీట్ సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు అఫ్గానిస్థాన్ క్రికెటర్ షాహిదుల్లా కమల్ పేరిట ఉంది. 2014 అండర్-19 ప్రపంచకప్లో కమల్ 15 ఏళ్ల 19 రోజుల వయస్సులో ఈ ఘనత సాధించాడు. తాజా మ్యాచ్తో కమల్ ఆల్టైమ్ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు.అదేవిధంగా యూత్ వన్డేల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో వైభవ్ సూర్యవంశీ.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని అధిగమించాడు. కోహ్లి 28 మ్యాచ్లలో 978 పరుగులు చేయగా.. సూర్యవంశీ 20 మ్యాచ్ల్లోనే 1,047 పరుగులు సాధించాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో విజయ్ జోల్ (1,404 పరుగులు) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఓవరాల్గా అయితే బంగ్లాదేశ్ స్టార్ నజ్ముల్ హుస్సేన్ శాంటో (1,820 పరుగులు) టాప్లో కొనసాగుతున్నాడు.కాగా మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో వైభవ్, కుండు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. బంగ్లాదేశ్ బౌలర్లలో అల్ ఫహాద్ 5 వికెట్లతో సత్తాచాటగా.. ఇక్బాల్, ఎండి అజీజుల్ హకీం తమీమ్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: IND vs NZ: న్యూజిలాండ్తో మూడో వన్డే.. భారత జట్టులో కీలక మార్పులు! -
IPL 2026: ఆర్సీబీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
ఐపీఎల్-2026 సీజన్కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్కు గుడ్ న్యూస్. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్లతో పాటు ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహించేందుకు కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది.ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) ధ్రువీకరించింది. ప్రభుత్వం కొన్ని కఠిన నిబంధనలతో కూడిన అనుమతిని మంజూరు చేసినట్లు కేఎస్సీఏ తెలిపింది. "ప్రభుత్వం విధించిన అన్ని భద్రతా ప్రమాణాలను అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చిన్నస్వామి స్టేడియం మళ్లీ క్రికెట్ పోటీలతో కళకళలాడనుంది" అని కేఎస్సీఏ ప్రతినిధి వినయ్ మృత్యుంజయ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.సర్కార్ నిబంధనలు ఇవే..స్టేడియం లోపల, వెలుపల రద్దీని పర్యవేక్షించడానికి ఆర్సీబీ మేనేజ్మెంట్ సుమారు రూ.4.5 కోట్ల ఖర్చుతో అత్యాధునిక ఏఐ కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేయాలని కర్ణాటక సర్కార్ ప్రతిపాదించింది. అభిమానులు ఎంట్రీ, ఎగ్జిట్ ప్లాన్లను పూర్తిగా మార్చాలని ప్రభుత్వం సూచించింది. కాగా ఐపీఎల్-2025 ఆర్సీబీ ఛాంపియన్గా నిలిచిన అనంతరం.. చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ తొక్కిసలాట జరిగింది. జూన్ 4న జరిగిన ఈ విషాద ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. దీంతో అప్పటి నుంచి చిన్నస్వామి మైదానంలో ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. మహిళల ప్రపంచకప్ 2025, మెన్స్ టీ20 ప్రపంచకప్-2026 వేదికల జాబితా నుండి కూడా ఈ వేదికను తొలిగించారు. అయితే తిరిగి మళ్లీ చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ కళ సంతరించుకోనుండడంలో కొత్తగా ఎన్నికైన కేఎస్సీఏ అధ్యక్షుడు వెంకటేష్ ప్రసాద్ది కీలక పాత్ర.చదవండి: WPL 2026: ముంబైపై యూపీ వారియర్స్ ఘన విజయం -
ముంబైపై యూపీ వారియర్స్ ఘన విజయం
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో ముంబై ఇండియన్స్ మూడో ఓటమి చవిచూసింది. శనివారం నవీ ముంబై వేదికగా యూపీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో 22 పరుగుల తేడాతో ముంబై ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.యూపీ కెప్టెన్ మెగ్ లానింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. లానింగ్ కేవలం 45 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేసింది. ఆమెతో పాటు యువ బ్యాటర్ ఫోబ్ లిచ్ఫీల్డ్ సైతం దుమ్ములేపింది. లిచ్ఫీల్డ్ 37 బంతుల్లో 61 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో అమేలియా కెర్ 3 వికెట్లు పడగొట్టగా.. స్కివర్ బ్రంట్ రెండు, నికోలా కారీ,మాథ్యూస్, అమన్జ్యోత్ కౌర్ తలా వికెట్ సాధించారు.పోరాడిన ఓడిన ముంబై..అనంతరం లక్ష్య చేధనలో ముంబై ఘనమైన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు హేలీ మథ్యూస్(13), సజన(10) వెంటవెంటనే పెవిలియన్కు చేరారు. ఆ తర్వాత స్టార్ ప్లేయర్లు హర్మన్ప్రీత్ కౌర్ (15), నాట్ స్కివర్-బ్రంట్ (15) నిరాశపరిచారు.చివర్లో అమేలియా కెర్(49 నాటౌట్) అమంజోత్ కౌర్(41) పోరాడినప్పటికీ జట్టును మాత్రం విజయ తీరాలకు చేర్చలేకపోయారు. యూపీ బౌలర్లలో శిఖా పాండే రెండు వికెట్లు పడగొట్టగా.. క్రాంతి గౌడ్, ఎకిలిస్టోన్, దీప్తీ శర్మ తలా వికెట్ సాధించారు. కాగా ఈ టోర్నీలో యూపీతో ఆడిన రెండు మ్యాచ్లలోనూ ముంబై ఓటమి పాలైంది.చదవండి: కివీస్తో మ్యాచ్ వరల్డ్ ఫైనల్ లాంటిది: మహ్మద్ సిరాజ్ -
వైభవ్, అభిజ్ఞాన్ హాఫ్ సెంచరీలు.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే?
అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 49 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యువ భారత జట్టు 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది.ప్రారంభంలోనే కెప్టెన్ ఆయుష్ మాత్రే (6), వేదాంత్ త్రివేది (0), విహాన్ మల్హోత్రా (7) వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లోపడింది. ఈ క్రమంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (67 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 72), అభిజ్ఞాన్ కుండు(80 పరుగులు) బాధ్యతాయుతంగా ఆడి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు.అయితే వీరిద్దరూ క్రీజులో ఉన్నప్పుడు భారీ స్కోర్ చేసేలా కన్పించిన భారత్.. వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ప్రత్యర్ధిముందు మెరుగైన లక్ష్యాన్ని ఉంచలేకపోయింది. బంగ్లాదేశ్ బౌలర్లలో అల్ ఫహాద్ 5 వికెట్లతో సత్తాచాటగా.. ఇక్బాల్, ఎండి అజీజుల్ హకీం తమీమ్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ప్రస్తుతం బంగ్లా-భారత్ మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు జట్లు కెప్టెన్లు టాస్ సందర్భంగా కరచాలనం చేసుకునేందుకు నిరాకరించారు.చదవండి: U19 World Cup 2026: భారత్- బంగ్లా మ్యాచ్లో 'నో హ్యాండ్ షేక్' -
కివీస్తో మ్యాచ్ వరల్డ్ ఫైనల్ లాంటిది: మహ్మద్ సిరాజ్
న్యూజిలాండ్తో ఆదివారం ఇండోర్ వేదికగా సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో తాడో పేడో తెల్చుకోవడానికి భారత్ సిద్దమైంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తుంటే.. మరోవైపు కివీస్ కూడా భారత గడ్డపై మరోసారి చరిత్ర సృష్టించాలని పట్టుదలతో ఉంది.ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ను వరల్డ్కప్ ఫైనల్లా భావిస్తున్నామని సిరాజ్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ సిరీస్లో రెండు జట్లు సమవుజ్జీలగా ఉన్నాయి. గత పర్యటన మాదిరిగానే భారత జట్టుకు కివీస్ గట్టీ పోటీ ఇస్తుంది. అందుకే సిరాజ్ ఆఖరి వన్డేను ప్రపంచకప్ ఫైనల్తో పోల్చాడు.భారత్లో మాకు ఇటువంటి పరిస్థితులు చాలా అరుదుగా ఎదురవుతుంటాయి. మొన్న సౌతాఫ్రికా, నేడు న్యూజిలాండ్. చివరి మ్యాచ్లో గెలిచి సిరీస్ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తాము. ఈ మ్యాచ్ మాకు దాదాపు ప్రపంచ కప్ ఫైనల్ లాంటిది. జట్టులోని సీనియర్లు యువ ఆటగాళ్లకు చాలా మద్దతుగా ఉన్నారు. వారు నుంచి మాకు సలహాలు, సూచనలు అందుతున్నాయి.దీంతో డ్రెసింగ్ రూమ్ వాతావరణం చాలా బాగుంది. మేము మొదటి మ్యాచ్ గెలిచాం. దురదృష్టవశాత్తూ రెండో వన్డేలో ఓడిపోయాం. కాబట్టి ఇప్పుడు మాపై కాస్త ఒత్తిడి ఉంది. రాజ్కోట్ వన్డేలో డారిల్ మిచెల్ అవుట్ చేసేందుకు అన్ని విధాలంగా ప్రయాత్నించాము. కానీ ఒక క్యాచ్ డ్రాప్ కావడం వల్ల మ్యాచ్ పరిస్థితి మారిపోయింది.అతడు స్పిన్ను ఎదుర్కొనే తీరు, సింగిల్స్ తీస్తూ బౌలర్లపై ఒత్తిడి పెంచే విధానం నిజంగా అద్భుతం. మా బౌలింగ్ గురుంచి ఎలాంటి ఆందోళన లేదు. జట్టులో ప్రతీ ఒక్కరు పాజిటివ్ మైండ్తో ఉన్నారు. సిరీస్ డిసైడర్లో తప్పక గెలుస్తాము" అని సిరాజ్ ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు. కాగా రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.చదవండి: IND vs NZ: న్యూజిలాండ్తో మూడో వన్డే.. భారత జట్టులో కీలక మార్పులు! -
లానింగ్, లిచ్ఫీల్డ్ మెరుపులు.. ముంబై ముందు భారీ టార్గెట్
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026లో భాగంగా నవీ ముంబై వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో యూపీవారియర్స్ బ్యాటర్లు మెరిశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ముఖ్యంగా యూపీ కెప్టెన్ మెగ్ లానింగ్ విధ్వంసం సృష్టించింది.ఈ ఆసీస్ లెజెండ్ ముంబై బౌలర్లను ఉతికారేసింది. కేవలం 45 బంతులు మాత్రమే ఎదుర్కొన్న లానింగ్ 11 ఫోర్లు, 2 సిక్స్లతో 70 పరుగులు చేసింది. ఆమెతో పాటు ఫీభీ లిచ్ఫీల్డ్ మెరుపులు మెరిపించింది. 37 బంతుల్లో7 ఫోర్లు, 3 సిక్స్లతో 61 పరుగులు చేసింది. ఆఖరిలో హర్లీన్ డియోల్(25), ట్రయాన్(21) రాణించారు. ముంబై బౌలర్లలో అమీలియా కేర్ మూడు వికెట్లు పడగొట్టగా.. ట్ స్కివర్ బ్రంట్ రెండు, హీలీ మాథ్యూస్, అమన్జ్యోత్ కౌర్ తలా వికెట్ సాధించారు.తుది జట్లుయుపీ వారియర్జ్: కిరణ్ నవ్గిరే, మెగ్ లానింగ్ (కెప్టెన్), ఫోబ్ లిచ్ఫీల్డ్, హర్లీన్ డియోల్, శ్వేతా సెహ్రావత్ (వికెట్ కీపర్), క్లో ట్రయాన్, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, ఆశా శోభనా జాయ్, శిఖా పాండే, క్రాంతి గౌడ్ముంబై ఇండియన్స్: హేలీ మాథ్యూస్, గుణాలన్ కమలిని(వికెట్ కీపర్), అమేలియా కెర్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), అమంజోత్ కౌర్, నికోలా కారీ, సజీవన్ సజన, సంస్కృతి గుప్తా, నల్లా క్రాంతి రెడ్డి, త్రివేణి వశిష్ట -
భారత్- బంగ్లా మ్యాచ్లో 'నో హ్యాండ్ షేక్'
నో హ్యాండ్ షేక్.. ఈ వివాదం గతేడాది క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఆసియాకప్-2025 సందర్భంగా భారత జట్టు ఆటగాళ్లు పాకిస్తాన్ ప్లేయర్లతో కరచాలనం చేసేందుకు నిరాకరించారు. పెహల్గమ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ ఆదేశాల మేరకు టీమిండియా ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.ఆ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ ఫిర్యాదు చేయడం, పీసీబీ చీఫ్ మోహ్షిన్ నఖ్వీ చేతుల మీదగా భారత్ విన్నింగ్ ట్రోఫీని తీసుకోకపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా మరోసారి ఇప్పుడు అదే సీన్ రీపీట్ అయింది. కానీ ఈసారి ప్రత్యర్ధి మారింది.ఏమి జరిగిందంటే?అండర్-19 ప్రపంచకప్ 2026లో బులవాయో క్రికెట్ క్లబ్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. అయితే టాస్ భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే, బంగ్లాదేశ్ వైస్ కెప్టెన్ జవాద్ అబ్రార్ ఒకరికొకరు కనీసం చూసుకోలేదు. టాస్ గెలిచి బౌలింగ్ బంగ్లా బౌలింగ్ ఎంచుకున్న తర్వాత ఇద్దరు కెప్టెన్లు కరచాలనం చేసుకోకుండా ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా భారత్-బంగ్లాదేశ్ మధ్య గత కొంత కాలంగా దౌత్యపర్యమైన ఉద్రిక్తలు నెలకొన్నాయి.మానవతా వ్యతిరేక నేరాలకు పాల్పడ్డారని బంగ్లాదేశ్ కోర్టు మరణశిక్ష విధించిన మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడంపై అక్కడి ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు భారత్లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుంటామని వ్యాఖ్యానించడం తీవ్ర దూమారం రేపింది. అంతేకాకుండా బంగ్లాలో హిందువలపై దాడులు రోజు రోజుకు పెరిగిపోతుండంతో రెండు పొరుగు దేశాల మధ్య వైర్యం తీవ్రస్థాయికి చేరుకుంది.అయితే ఈ రాజకీయ విభేదాల ప్రభావం క్రీడలపై కూడా పడింది. ఈ ఉద్రిక్తల నేపథ్యంలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ను ఐపీఎల్ నుంచి బీసీసీఐ తప్పించింది. అంతేకాకుండా 2026లో భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనను కూడా బీసీసీఐ వాయిదా వేసింది.దీంతో ఘోర అవమానంగా భావించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. భద్రత కారణాల దృష్ట్యా తమ జట్టును టీ20 ప్రపంచకప్ కోసం భారత్కు పంపబోమని మొండి పట్టుతో ఉంది. బంగ్లాదేశ్లో ఐపీఎల్ ప్రసారాలను అక్కడి ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఈ పరిస్థితుల కారణంగానే ఇరు జట్ల కెప్టెన్లు కరాచలానికి నిరాకరించారు.చదవండి: IND vs NZ: న్యూజిలాండ్తో మూడో వన్డే.. భారత జట్టులో కీలక మార్పులు! -
న్యూజిలాండ్తో మూడో వన్డే.. భారత జట్టులో కీలక మార్పులు!
భారత్-న్యూజిలాండ్ మధ్య సిరీస్ డిసైడర్ మూడో వన్డే ఆదివారం ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. అయితే ఈ నిర్ణయాత్మక మ్యాచ్ భారత తుది జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.తొలి రెండు మ్యాచ్లకు బెంచ్కే పరిమితమైన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ను మూడో వన్డేలో ఆడించాలని టీమ్మేనెజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ సిరీస్లో ఇప్పటివరకు అర్ష్దీప్కు అవకాశమివ్వకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన మనసు మార్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పేసర్ ప్రసిద్ద్ కృష్ణ స్ధానంలో అర్ష్దీప్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది.బదోని అరంగేట్రంఇక వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా అనుహ్యంగా జట్టులోకి వచ్చిన యువ ఆటగాడు అయూశ్ బదోని.. ఇండోర్లో అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. గత మ్యాచ్లో తుది జట్టులోకి వచ్చిన ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.దీంతో అతడిపై వేటు వేసి బదోనికి ఛాన్స్ ఇవ్వాలని గంభీర్ అండ్ కో ఫిక్స్ అయినట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అయితే తొలి రెండు వన్డేల్లో విఫలమైన సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు మరో అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. జడ్డూ వన్డేల్లో గత కొంతకాలంగా దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. దీంతో అతడిని పక్కన పెట్టాలని పలువరు మాజీలు టీమ్మెనెజ్మెంట్ను సూచిస్తున్నారు.పిచ్ రిపోర్ట్:ఇండోర్లోని హోల్కర్ స్టేడియం బ్యాటింగ్కు స్వర్గధామం. ఇక్కడ బౌండరీ లైన్స్ చాలా చిన్నవిగా ఉండటం వల్ల పరుగుల వరద పారే అవకాశం ఉంది. ఈ మైదానంలో టీమిండియాకు అద్భుతమైన రికార్డు ఉంది. ఇండోర్లో టీమిండియా ఇప్పటివరకు 7 వన్డేలు ఆడగా, అన్నింటిలోనూ విజయం సాధించింది. 2011లో వెస్టిండీస్పై భారత్ ఏకంగా 418 పరుగులు చేసింది. ఆ మ్యాచ్లో భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ (219 పరుగులు) డబుల్ సెంచరీతో మెరిశాడు.మూడో వన్డేకు భారత తుది జట్టు(అంచనా)శుభ్మన్ గిల్(కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అయూష్ బదోని, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్ -
యూపీతో మ్యాచ్.. ముంబై తరపున తెలుగు అమ్మాయి అరంగేట్రం
మహిళల ప్రీమియర్ లీగ్-2026లో హైవోల్టేజ్ మ్యాచ్కు రంగం సిద్దమైంది. ఈ టోర్నీలో భాగంగా నవీ ముంబై వేదికగా ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ అమ్మాయి నల్లా క్రాంతి రెడ్డి ముంబై ఇండియన్స్ తరపున అరంగేట్రం చేసింది. అదేవిధంగా స్టార్ పేసర్ ఇస్మాయిల్కు ముంబై విశ్రాంతి ఇచ్చింది. ఆమె స్ధానంలో హేలీ మాథ్యూస్ తుది జట్టులోకి వచ్చింది. యూపీ మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు.కాగా యూపీ వారియర్స్ తమ చివరి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇప్పుడు అదే జోరును ఈ మ్యాచ్లో కూడా కొనసాగించాలని లానింగ్ సేన ఉవ్విళ్లూరుతోంది.తుది జట్లుయుపీ వారియర్జ్: కిరణ్ నవ్గిరే, మెగ్ లానింగ్ (కెప్టెన్), ఫోబ్ లిచ్ఫీల్డ్, హర్లీన్ డియోల్, శ్వేతా సెహ్రావత్ (వికెట్ కీపర్), క్లో ట్రయాన్, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, ఆశా శోభనా జాయ్, శిఖా పాండే, క్రాంతి గౌడ్ముంబై ఇండియన్స్: హేలీ మాథ్యూస్, గుణాలన్ కమలిని(వికెట్ కీపర్), అమేలియా కెర్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), అమంజోత్ కౌర్, నికోలా కారీ, సజీవన్ సజన, సంస్కృతి గుప్తా, నల్లా క్రాంతి రెడ్డి, త్రివేణి వశిష్ట -
పోలార్డ్ రాక.. మారిన ముంబై ఇండియన్స్ ఫేట్
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగి అనూహ్య పరాజయాలు ఎదుర్కొని ఎలిమినేషన్ అంచున ఉన్న ముంబై ఇండియన్స్ కేప్టౌన్కు (MI Cape town) దిగ్గజ టీ20 ఆటగాడు కీరన్ పోలార్డ్ జీవం పోశాడు. రెగ్యులర్ కెప్టెన్ రషీద్ ఖాన్ జాతీయ విధుల కోసం జట్టును వీడటంతో, అతని స్థానాన్ని భర్తీ చేసిన పోలీ.. నిన్న (జనవరి 16) సన్రైజర్స్ ఈస్ట్రన్కేప్పై ఎంఐ గెలుపులో తనవంతు పాత్ర పోషించాడు.అప్పటికి 8 మ్యాచ్ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండిన కేప్టౌన్.. పోలార్డ్ రాకతో తిరిగి గెలుపు ట్రాక్ ఎక్కింది. ఈ గెలుపుతో ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. పార్ల్ రాయల్స్, సన్రైజర్స్ ఈస్ట్రన్కేప్, ప్రిటోరియా క్యాపిటల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్లు ఖరారు చేసుకోగా.. చివరి బెర్త్ కోసం ఎం కేప్టౌన్, జోబర్గ్ సూపర్ కింగ్స్, డర్బన్ సూపర్ జెయింట్స్ పోటీపడుతున్నాయి.సన్రైజర్స్పై పోలార్డ్ తొలుత బంతితో (2-0-9-0), ఆతర్వాత బ్యాట్తో (14 బంతుల్లో 20; 2 ఫోర్లు) పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్లో కేప్టౌన్ ఈస్ట్రన్కేప్పై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్రన్కేప్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేయగా.. కేప్టౌన్ మరో నాలుగు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. నాలుగు వికెట్లతో సత్తా చాటిన కేప్టౌన్ ఆల్రౌండర్ కార్బిన్ బాష్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.బాష్తో పాటు ట్రెంట్ బౌల్ట్ (4-0-28-3), రబాడ (3-0-20-1), జార్జ్ లిండే (4-0-34-1) సత్తా చాటడంతో ఈస్ట్రన్కేప్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ఆఖర్లో మార్కో జన్సెన్ (42) రాణించడంతో ఆ జట్టు ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఈస్ట్రన్కేప్లో స్టార్ బ్యాటర్లు డికాక్ (0), బెయిర్స్టో (15), స్టబ్స్ (4) విఫలయ్యారు.ఛేదనలో కేప్టౌన్ కూడా తడబడింది. జన్సెన్ (4-0-23-2), ముత్తుసామి (3.2-0-25-2), నోర్జే (4-0-29-1), మిల్నే (3-0-26-1), కోల్స్ (2-0-13-1) సత్తా చాటి కేప్టౌన్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. అయితే కీలక దశలో లిండే (31), పోలార్డ్ (20) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడి కేప్టౌన్ను గెలిపించారు. అంతకుముందు రిజా హెండ్రిక్స్ (41) రాణించాడు. ఫలితంగా కేప్టౌన్ అతికష్టం మీద గట్టెక్కింది. -
రోహిత్ శర్మ కెప్టెన్సీ తొలగింపుపై టీమిండియా మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
భారత క్రికెట్లో రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీ తొలగింపు చర్చలు మళ్లీ వేడెక్కాయి. మాజీ క్రికెటర్ మనోజ్ తివారి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని కొత్త మలుపు తిప్పాయి. తివారి ఆరోపణల ప్రకారం.. రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీ కోల్పోవడానికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ప్రధాన సెలెక్టర్ అజిత్ ఆగార్కర్ కారణం. అగార్కర్ తీసుకున్న నిర్ణయంపై గంభీర్ ప్రభావం చూపాడు. అగార్కర్ బలమైన వ్యక్తిత్వం కలిగినవాడు. కానీ ఇలాంటి పెద్ద నిర్ణయాలు ఒంటరిగా తీసుకోలేడు. ఈ సమయంలోనే గంభీర్ ప్రభావం చూపాడు. సాధారణంగానే ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో చీఫ్ సెలెక్టర్ కోచ్ సూచనలు తీసుకుంటాడు. రోహిత్ వన్డే కెప్టెన్సీ తొలగింపులో ఇదే జరిగింది. రోహిత్కు జరిగిన అన్యాయానికి గంభీర్, అగార్కర్ బాధ్యత వహించాలి. రోహిత్ను తొలగించిన తీరు తనకు అభిమానిగా, మాజీ సహచరుడిగా చాలా బాధ పెట్టింది. అప్పుడే ఛాంపియన్స్ ట్రోఫీని, అంతకుముందే టీ20 ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్ను ఇలా తొలగించడం సబబు కాదు. రోహిత్ నుండి శుభ్మన్ గిల్కు వన్డే కెప్టెన్సీ బదిలీ చేసే ప్రక్రియ సాఫీగా జరగాల్సింది. ప్రస్తుత న్యూజిలాండ్ సిరీస్ వరకు రోహిత్ను కెప్టెన్సీలో కొనసాగించి, ఆతర్వాత గిల్కు బాధ్యతలు అప్పగించాల్సింది. 2027 ప్రపంచకప్ దృష్ట్యా రోహిత్ భవిష్యత్తుపై అనుమానం వ్యక్తం చేయడం తగదని తివారి అభిప్రాయపడ్డాడు. తివారి చేసిన ఈ వ్యాఖ్యలతో గంభీర్–అగార్కర్ జంటపై మళ్లీ దృష్టి పడింది. నాయకత్వ మార్పులు ఎలా జరుగుతున్నాయి.. అవి సరైన రీతిలో కమ్యూనికేట్ అవుతున్నాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించిన కొన్ని నెలలకే కెప్టెన్సీ తొలగించబడ్డాడు. ఈ విషయంలో భారత క్రికెట్ అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రోహిత్ శర్మ వంటి విజయవంతమైన కెప్టెన్కు గౌరవప్రదంగా మార్చి ఉండాల్సిందనే వాదన బలపడుతుంది. గిల్ నియామకం భవిష్యత్తుకు సంకేతం అయినప్పటికీ, రోహిత్ను తొలగించిన తీరు గౌరవప్రదంగా ఉండాల్సిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. -
లేటు వయసులోనూ ఇరగదీస్తున్న స్టార్ వెటరన్లు
దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జో రూట్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లేటు వయసులోనూ అదిరిపోయే ప్రదర్శనలతో చెలరేగిపోతున్నారు. వీరిలో వార్నర్ అయితే మరీనూ. ఈ ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినా ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న బిగ్బాష్ లీగ్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. గడిచిన నాలుగు ఇన్నింగ్స్ల్లో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో (130 నాటౌట్, 67 నాటౌట్, 82, 110 నాటౌట్) పట్టపగ్గాల్లేకుండా ఉన్నాడు. తాజా సెంచరీతో వార్నర్ భాయ్ టీ20ల్లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు. క్రిస్ గేల్ (22), బాబర్ ఆజమ్ (11) తర్వాత రెండంకెల సెంచరీ మార్కును (10) తాకిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.మరో ఆసీస్ వెటరన్, టెస్ట్ ప్లేయర్గా ముద్ర పడిన స్టీవ్ స్మిత్ అయితే ఫార్మాట్లకతీతంగా రెచ్చిపోతున్నాడు. ఇటీవల యాషెస్ సిరీస్లో అద్భుత శతకం బాదిన అతను.. తాజాగా బిగ్బాష్ లీగ్లో అదిరిపోయే విధ్వంసకర శతకం బాదాడు. వార్నర్ తాజా సెంచరీ చేసిన మ్యాచ్లోనే స్టీవ్ కూడా శతక్కొట్టాడు. ఈ మ్యాచ్లో స్టీవ్ కేవలం 41 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి బిగ్బాష్ లీగ్ చరిత్రలో రెండో వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు.ఇంగ్లండ్ బ్యాటింగ్ దిగ్గజం జో రూట్ గురించి అయితే అంతర్జాతీయ క్రికెట్లో ఎవరికీ సాటిరాని విధంగా టెస్ట్ల్లో వరుస సెంచరీలతో దూసుకుపోతున్నాడు. గత ఐదేళ్లలో అతను టెస్ట్ల్లో ఏకంగా 24 సెంచరీలు బాదాడు. వన్డేల్లోనూ మూడు శతకాలు చేశాడు. తాజాగా అతను ఆస్ట్రేలియా గడ్డపై రెండు సెంచరీలతో సత్తా చాటాడు.టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సైతం లేటు వయసులో ఇరగదీస్తున్నారు. టీ20, టెస్ట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు.. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్ల్లో చెలరేగిపోయారు. ముఖ్యంగా విరాట్ కోహ్లి వయసుతో సంబంధం లేకుండా ఆడుతున్న ప్రతి మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ సహా విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీ చేసిన రోహిత్.. సౌతాఫ్రికాపై 2, ఆస్ట్రేలియాపై మరో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.విరాట్ కోహ్లి విషయానికొస్తే.. గతేడాది ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఇతను, ఆస్ట్రేలియా పర్యటనలో తొలి రెండు మ్యాచ్ల్లో డకౌటై అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. చాలామంది విరాట్ పని అయిపోయిందని కూడా అనుకున్నారు. ఈ దశలో విరాట్ అనూహ్యంగా పుంజుకొని సెంచరీల మీద సెంచరీలు బాదుతూ కెరీర్ పీక్స్లో ఉన్నప్పటి విరాట్ను గుర్తు చేస్తున్నాడు. విరాట్ గత 8 ఇన్నింగ్స్ల్లో 3 సెంచరీలు, 4 అర్ద సెంచరీలు చేసి అత్యుత్తమ ఫామ్లో కొనసాగుతున్నాడు.వీరే కాకుండా ఫాబ్ ఫోర్లోని మరో వెటరన్ స్టార్ కేన్ విలియమ్సన్ కూడా అడపాదడపా సెంచరీలతో సత్తా చాటుతున్నాడు. బ్యాటింగ్ విభాగంలో వీరంతా సత్తా చాటుతుంటే, బౌలింగ్లో ఒక్కరు మాత్రం ఊహకందని విధంగా చెలరేగిపోతున్నారు. ఆ స్టార్ వెటరన్ బౌలర్ పేరు మిచెల్ స్టార్క్. స్టార్క్ తాజాగా ముగిసిన యాషెస్ 2025-26లో 5 మ్యాచ్ల్లో 31 వికెట్లు పడగొట్టి, కుర్ర పేసర్లు కూడా సాధ్యం కాని ప్రదర్శనలు చేశాడు. ఈ సిరీస్లో అతను బ్యాట్తోనూ ఆకట్టుకోవడం మరో విశేషం.ప్రస్తుతం జో రూట్ వయసు 35, మిచెల్ స్టార్క్ వయసు 35, స్టీవ్ స్మిత్ వయసు 36, విరాట్ కోహ్లి వయసు 37, రోహిత్ శర్మ వయసు 38, డేవిడ్ వార్నర్ వయసు 39. వీరంతా మహా అయితే కెరీర్ను మరో రెండేళ్లు కొనసాగించగలరు. ఇలాంటి దశలో సాధారణ ఆటగాళ్లైతే అడపాదడపా ప్రదర్శనలతో మమ అనిపించే వాళ్లు. కానీ వీళ్లు మాత్రం అలా కాదు. వైన్ వయసు పెరిగే కొద్ది మత్తు ఎక్కువగా ఇస్తుందన్నట్టు సత్తా చాటుతున్నారు. -
టీమిండియా స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్..?
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇండోర్ వేదికగా న్యూజిలాండ్తో రేపు (జనవరి 18) జరుగబోయే నిర్ణయాత్మక మూడో వన్డే తర్వాత టీమిండియాకు అతి భారీ షాక్ తగలనుందని తెలుస్తుంది. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఈ మ్యాచ్ తర్వాత వన్డే ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని సమాచారం. ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన జడేజా వన్డే కెరీర్ భవితవ్యంపై గత కొద్ది రోజులుగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటన్నిటికి మరి కొద్ది గంటల్లో అధికారికంగా తెరపడే అవకాశం ఉంది.వరుసగా రెండు మ్యాచ్ల్లో విఫలంప్రస్తుత న్యూజిలాండ్ సిరీస్లో జడేజా తొలి రెండు మ్యాచ్ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. తొలి మ్యాచ్లో 9 ఓవర్లు వేసి వికెట్ లేకుండా 56 పరుగులు సమర్పించుకొని, ఆతర్వాత బ్యాటింగ్లో పూర్తిగా తేలిపోయాడు (4 పరుగులు). రెండో వన్డేలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి కొనసాగింది. బ్యాటింగ్లో (44 బంతుల్లో 27) కాస్త పర్వాలేదనిపించినా, బౌలింగ్లో (8-0-44-0) సీన్ రిపీటయ్యింది. అంతకుముందు సౌతాఫ్రికా సిరీస్లోనూ జడ్డూ గడ్డు పరిస్థితులనే ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా బంతితో బాగా ఇబ్బంది పడ్డాడు.ఈ నేపథ్యంలో జడేజాకు వన్డే రిటైర్మెంట్పై ఒత్తిడి పెరిగి ఉంటుంది. అతను టెస్ట్ల్లో సత్తా చాటుతున్నా వన్డేల్లో సామర్థ్యం మేరకు రాణించలేకపోతున్నాడు. వాస్తవానికి న్యూజిలాండ్తో రెండో వన్డేనే జడ్డూకు చివరిదని టాక్ నడిచింది. ఎందుకంటే ఆ మ్యాచ్కు వేదిక అయిన రాజ్కోట్ జడేజాకు హోం గ్రౌండ్. కానీ, ఆ మ్యాచ్ తర్వాత జడేజా ఎలాంటి ప్రకటన చేయలేదు. మూడో వన్డేకు ముందు మరోసారి అతని వన్డే రిటైర్మెంట్పై ఊహాగానాలు ఊపందుకున్నాయి.జడేజా ఫిట్గా ఉన్నాడు, ఆటను ఆస్వాదిస్తున్నంతకాలం భారత జట్టుకు ఉపయోగపడతాడని టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ తాజాగా కామెంట్ చేసినప్పటికీ.. జడేజా వన్డే రిటైర్మెంట్పై ఆల్రెడీ డిసైడైపోయాడని ప్రచారం జరుగుతుంది. 37 ఏళ్ల జడేజా ఇప్పటిరకు 209 వన్డేలు ఆడి 2893 పరుగులు చేసి, 232 వికెట్లు తీశాడు. వన్డేల్లో జడేజా స్థానంపై అక్షర్ పటేల్ ఇదివరకే కర్చీఫ్ వేసి ఉంచాడు. జడ్డూ రిటైర్మెంట్ తర్వాత అతను వన్డేల్లో రెగ్యులర్ సభ్యుడిగా మారిపోయే అవకాశం ఉంది. -
భారీ సెంచరీతో కదం తొక్కిన జడేజా
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో సౌరాష్ట్ర ఫైనల్స్కు చేరింది. నిన్న (జనవరి 16) జరిగిన రెండో సెమీఫైనల్లో పంజాబ్పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, జనవరి 18న జరిగే ఫైనల్లో విదర్భతో అమీతుమీకి సిద్దమైంది.ఓపెనర్ విశ్వరాజ్ జడేజా అజేయ శతకంతో చెలరేగి సౌరాష్ట్రను ఒంటిచేత్తో గెలిపించాడు. 127 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 165 పరుగులు చేసి తన జట్టును ఫైనల్కు చేర్చాడు. జడేజాకు గత మూడు మ్యాచ్ల్లో ఇది రెండో శతకం. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 50 ఓవర్లలో 291 పరుగులకు ఆలౌటైంది. ప్రభ్సిమ్రన్ సింగ్ (87) పవర్ప్లేలోనే విధ్వంసం (9 ఫోర్లు, 3 సిక్సర్లు) సృష్టించాడు. అనంతరం అన్మోల్ప్రీత్ సింగ్ (105 బంతుల్లో 100) అద్భుతమైన శతకం సాధించాడు. అయితే మధ్యలో నమన్ ధీర్, నేహల్ వాధేరా వరుసగా ఔట్ కావడంతో పంజాబ్ రన్రేట్ దెబ్బతింది. చివర్లో రమన్దీప్ సింగ్తో కలిసి అన్మోల్ప్రీత్ కొన్ని బౌండరీలు సాధించినా, చేతన్ సకారియా (4/60) ధాటికి దిగువ వరుస కూలిపోయింది. అనంతరం 292 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన సౌరాష్ట్రకు ఓపెనర్లు జడేజా, హర్విక్ దేశాయ్ (64) శుభారంభాన్ని అందించారు. పవర్ప్లేలోనే వీరు 92 పరుగులు సాధించి పంజాబ్ బౌలర్లపై ఒత్తిడి తెచ్చారు. 20 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు స్కోరు 151/0కి చేరింది. అప్పటికే మ్యాచ్ దాదాపు సౌరాష్ట్ర వైపు మళ్లింది. దేశాయ్ ఔటైన తర్వాత కూడా జడేజా తన దూకుడు కొనసాగించాడు. కేవలం 74 బంతుల్లో శతకం పూర్తి చేసి, తర్వాత మరింత వేగంగా ఆడాడు. హార్విక్ ఔటయ్యాక వచ్చిన ప్రేరక్ మాంకడ్ (52*) కూడా జడేజాకు తోడుగా బౌండరీల వర్షం కురిపించాడు. ఫలితంగా సౌరాష్ట్ర 39.3 ఓవర్లలోనే వికెట్ మాత్రమే కోల్పోయి గెలుపు తీరాలు చేరింది. -
సౌతాఫ్రికాకు షాకిచ్చిన ఆఫ్ఘనిస్తాన్
అండర్-19 ప్రపంచకప్ 2026లో ఆఫ్ఘనిస్తాన్ బోణీ కొట్టింది. నిన్న (జనవరి 16) జరిగిన తమ తొలి మ్యాచ్లో తమ కంటే మెరుగైన సౌతాఫ్రికాకు ఊహించని షాకిచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 266 పరుగులు (8 వికెట్ల నష్టానికి) చేసిన ఆ జట్టు.. ఆతర్వాత సౌతాఫ్రికాను 238 పరుగులకే ఆలౌట్ చేసి, 28 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత ఖలీద్ అహ్మద్ (74), ఫైసల్ షినోజాదా (81), ఉజైరుల్లా నియాజాయ్ (51 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించి ఆఫ్ఘనిస్తాన్కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. ఆతర్వాత అబ్దుల్ అజీజ్, ఖటిర్ స్టానిక్జాయ్ తలో 2, నూరిస్తానీ ఒమర్జాయ్, హఫీజ్ జద్రాన్ చెరో వికెట్ తీసి సౌతాఫ్రికాను దెబ్బేశారు. ఈ మ్యాచ్లో ఆఫ్ఘన్ ఫీలర్డు మైదానంలో పదరసంలా కదిలారు. ఏకంగా నలుగురు సౌతాఫ్రికా ఆటగాళ్లను రనౌట్ చేశారు.సౌతాఫ్రికా విషయానికొస్తే.. తొలుత బౌలింగ్లో బుయండా మజోలా, కోర్నే బోథా తలో 3, జేజే బస్సన్ ఓ వికెట్ తీసి రాణించారు. ఆతర్వాత బ్యాటింగ్లో జేసన్ రోల్స్ (98) అద్భుతంగా రాణించినా సౌతాఫ్రికాను గట్టెక్కించలేకపోయాడు. రోల్స్ సెంచరీకి ముందు రనౌట్ కావడంతో సౌతాఫ్రికా పరిస్థితి తారుమారయ్యింది. చివర్లో సౌతాఫ్రికా ఆటగాళ్లు ఒత్తిడికి లోనై అనవసరపు రనౌట్లయ్యారు. ఫలితంగా మ్యాచ్ను కోల్పోయారు. ఈ గెలుపు క్రెడిట్ ఆఫ్ఘనిస్తాన్ ఫీల్డర్లకే దక్కుతుంది.కాగా, ప్రపంచకప్లో భాగంగా నిన్ననే జరిగిన మరో రెండు మ్యాచ్ల్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు కూడా బోణీ కొట్టాయి. ఇంగ్లండ్ పాకిస్తాన్ను.. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఐర్లాండ్ను చిత్తుగా ఓడించాయి. ఇవాళ (జనవరి 17) బంగ్లాదేశ్ భారత్తో తలపడుతుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమవుతుంది. ఈ మెగా టోర్నీలో భారత్ ఇదివరకే బోణీ కొట్టింది. తొలి మ్యాచ్లో యూఎస్ఏపై ఘన విజయం సాధించింది. -
శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్కు ఊహించని అవకాశం
భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఐపీఎల్కు మాత్రమే పరిమితమైన రవి బిష్ణోయ్కు ఊహించని ఆఫర్ వచ్చింది. న్యూజిలాండ్ టీ20 సిరీస్కు ఎంపికైన తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ గాయాల బారిన పడటంతో వారి స్థానాలు భర్తీ చేసే సువర్ణావకాశం వీరికి దక్కింది. శ్రేయస్, బిష్ణోయ్ను న్యూజిలాండ్ సిరీస్కు ఎంపిక చేసినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.జనవరి 21, 23, 25 తేదీల్లో జరగబోయే తొలి మూడు మ్యాచ్ల్లో శ్రేయస్ తిలక్ వర్మ స్థానంలో ఆడనున్నారు. తిలక్ ఐదు మ్యాచ్ల న్యూజిలాండ్ సిరీస్లో మొదటి మూడు మ్యాచ్లకు మాత్రమే దూరమైన విషయం తెలిసిందే. బిష్ణోయ్ మాత్రం సిరీస్ మొత్తానికి సుందర్కు రీప్లేస్మెంట్గా ఉంటాడు. వన్డే సిరీస్ సందర్భంగా గాయపడిన సుందర్ న్యూజిలాండ్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. సుందర్ ప్రపంచకప్లో పాల్గొనేది కూడా అనుమానమేనని తెలుస్తుంది.సుందర్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో చికిత్స పొందుతున్నాడు. సుందర్కు స్కాన్స్లో సైడ్ స్ట్రెయిన్ ఇంజ్యూరీ అని తేలింది. దీంతో అతనికి దాదాపు మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఒకవేళ అతను త్వరగా కోలుకుంటే ప్రపంచకప్కు ఎంపికయ్యే అవకాశం ఉంది.శ్రేయస్ భారత్ తరఫున తన చివరి టీ20ని 2023 డిసెంబర్లో ఆస్ట్రేలియాతో ఆడారు. ఆతర్వాత అతను క్రమంగా టీమిండియా టీ20 సర్కిల్స్ నుంచి మాయమయ్యాడు. అయితే 2025 ఐపీఎల్లో అత్యుత్తమంగా రాణించడంతో శ్రేయస్కు భారత టీ20 జట్టులో స్థానం కల్పించాలని సర్వత్రా డిమాండ్లు వినిపించాయి. ఇప్పుడు తిలక్ గాయపడటంతో అతనికి ఊహించని విధంగా భారత టీ20 బెర్త్ దక్కింది. ఒకవేళ శ్రేయస్ న్యూజిలాండ్తో మొదటి మూడు టీ20ల్లో రాణిస్తే, ఆ సిరీస్ మొత్తానికి కొనసాగించడంతో పాటు ప్రపంచకప్కు కూడా ఎంపికయ్యే అవకాశం ఉంది. శ్రేయస్ గత ఐపీఎల్లో 175.07 స్ట్రయిక్రేట్తో 604 పరుగులతో సత్తా చాటడంతో, తన జట్టు పంజాబ్ కింగ్స్కు కెప్టెన్గా ఫైనల్స్కు కూడా చేర్చాడు.రవి బిష్ణోయ్ విషయానికి వస్తే.. ఈ కుడి చేతి వాటం లెగ్ స్పిన్ బౌలర్ చివరిగా 2025 జనవరిలో ఇంగ్లండ్తో జరిగిన టీ20లో భారత్కు ప్రాతినిథ్యం వహించాడు. ఆతర్వాత వరుణ్ చక్రవర్తి కారణంగా అతనికి అవకాశాలు రాలేదు. వరుణ్ దాదాపు ప్రతి మ్యాచ్లో రాణిస్తూ భారత స్పెషలిస్ట్ స్పిన్నర్ స్థానాన్ని కబ్జా చేశాడు. దీంతో బిష్ణోయ్కు అవకాశాలు రాలేదు. తాజాగా వాషింగ్టన్ సుందర్ గాయపడటంతో బిష్ణోయ్కు ఊహించని అవకాశం దక్కింది. తొలుత సుందర్ స్థానాన్ని మరో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్తో భర్తీ చేస్తారని అంతా అనుకున్నారు. రియాన్ పరాగ్ పేరు పరిశీలనలో కూడా ఉండింది. అయితే ఊహించని విధంగా భారత సెలెక్టర్లు స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన బిష్ణోయ్కు అవకాశం కల్పించారు. బిష్ణోయ్ ఇప్పటివరకు భారత్ తరఫున 42 టీ20ల్లో 61 వికెట్లు తీశాడు.న్యూజిలాండ్ టీ20 సిరీస్కు టీమిండియా (అప్డేటెడ్): సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్యర్ (మొదటి మూడు మ్యాచ్లు), రవి బిష్ణోయ్ -
జోరు మీదున్న భారత కుర్రాళ్లు
బులవాయో: అండర్–19 వరల్డ్ కప్లో ఐదు సార్లు చాంపియన్ భారత జట్టు మరో టైటిల్ వేటలో తమ జోరు కొనసాగించేందుకు రెండో మ్యాచ్ బరిలోకి దిగుతోంది. నేడు (శనివారం) జరిగే గ్రూప్ ‘బి’ పోరులో బంగ్లాదేశ్ అండర్–19తో భారత కుర్రాళ్లు తలపడతారు. అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న భారత్ను నిలువరించడం బంగ్లాకు కూడా కష్టమే. కెపె్టన్ ఆయుశ్ మాత్రే, విధ్వంసక బ్యాటర్ వైభవ్ సూర్యవంశీలతో ఓపెనింగ్ బలంగా ఉండగా వేదాంత్, విహాన్ మల్హోత్రాలు కీలక బ్యాటర్లు. మెరుపు బ్యాటింగ్తో ఆకట్టుకునే అభిజ్ఞాన్ కుందు మిడిలార్డర్లో జట్టు బలం. దీపేశ్, హెనిల్, ఖిలాన్, అంబరీశ్లతో జట్టు బౌలింగ్ కూడా పదునుగా ఉంది. గత ఏడాది కాలంగా మన అండర్–19 టీమ్ అద్భుత ఫామ్లో ఉంది. ఇంగ్లండ్, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికాలపై సిరీస్లు నెగ్గడంతో పాటు ఆసియా కప్లో కూడా జట్టు ఫైనల్ చేరింది. గత 17 మ్యాచ్లలో భారత్ 14 గెలిచింది. తొలి మ్యాచ్లో అమెరికాను భారత్ చిత్తు చేయగా...టోర్నీలో బంగ్లాకు ఇదే తొలి మ్యాచ్. బంగ్లా టీమ్లో కెపె్టన్ అజీజుల్ హకీమ్ మినహా మిగతావారికి పెద్దగా అనుభవం లేదు. హకీమ్తో పాటు రెండేళ్ల క్రితం వరల్డ్ కప్లోనూ రాణించిన జవాద్ అబ్రార్ల, కలీమ్ సిద్దిఖీలపై బ్యాటింగ్ భారం ఉండగా... జింబాబ్వేలో పేస్కు అనుకూలించే పిచ్లపై తమ బౌలర్లు ఇక్బాల్ హుస్సేన్, అల్ ఫహద్ రాణిస్తారని బంగ్లా ఆశిస్తోంది. సమీయుల్ బషర్ ప్రధాన స్పిన్నర్. భారత్ గెలుపు బోణీ... అండర్–19 వరల్డ్ కప్ను భారత్ ఘన విజయంతో ప్రారంభించింది. గురువారం జరిగిన పోరులో భారత్ 6 వికెట్ల తేడాతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ)ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన అమెరికా 35.2 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. నితీశ్ సూదిని (52 బంతుల్లో 36; 4 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలవగా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెనిల్ పటేల్ (5/16) ఐదు వికెట్లు తీశాడు. అనంతరం పదే పదే వాన అంతరాయం కలిగించడంతో భారత్ ల్యన్ని డక్వర్త్ – లూయీస్ ప్రకారం 37 ఓవర్లలో 96 పరుగులుగా నిర్దేశించారు. భారత్ 17.2 ఓవర్లలో 4 వికెట్లకు 99 పరుగులు చేసింది. ఆయుశ్ మాత్రే (19), వైభవ్ సూర్యవంశీ (2) విఫలమైనా... అభిజ్ఞాన్ కుందు (41 బంతుల్లో 42 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) జట్టును గెలిపించాడు. -
బెంగళూరు ‘హ్యాట్రిక్’
నవీ ముంబై: మాజీ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా ఆడిన మూడు మ్యాచ్లు గెలిచి ‘హ్యాట్రిక్’ సాధించింది. మహిళల ప్రీమియర్ లీగ్లో శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 32 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్పై నెగ్గింది. మొదట బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 182 పరుగులు చేసింది. రాధా యాదవ్ (47 బంతుల్లో 66; 6 ఫోర్లు, 3 సిక్స్లు), రిచా ఘోష్ (28 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్స్లు) మెరిపించారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ 18.5 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది. భారతి (20 బంతుల్లో 39; 3 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించింది. శ్రేయాంక పాటిల్ (5/23) ఐదు వికెట్లు తీయడం విశేషం. లీగ్లో నేడు ముంబైతో యూపీ తలపడనుంది.43 పరుగులకే 4 వికెట్లు! ఆరంభంలో గుజరాత్ కట్టుదిట్టమైన బౌలింగ్, చురుకైన ఫీల్డింగ్తో బెంగళూరును కష్టాల్లోకి నెట్టింది. గ్రేస్ హారిస్ (17), హేమలత (4)లను వరుస ఓవర్లలో కాశ్వీ గౌతమ్ అవుట్ చేసింది. తర్వాత స్మృతి మంధాన (5)ను రేణుక, గౌతమి (9)ని సోఫీ డివైన్ పెవిలియన్ చేర్చడంతో 5.3 ఓవర్లలో 43 పరుగులకే టాప్–4 వికెట్లను కోల్పోయింది. ‘పవర్ ప్లే’లోనే పనైపోయిన బెంగళూరుకు బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా వచ్చిన రాధా కొత్త ఊపిరి పోసింది. రిచా ఘోష్తో కలిసి సులువుగా పరుగులు చక్కబెట్టింది. రిచా తన సహజశైలిలో చెలరేగగా, రాధ కూడా బౌండరీలు బాదింది. దీంతో 50 స్కోరుకు ముందే 4 వికెట్లను కోల్పోయిన బెంగళూరు మరో వికెట్ కోల్పోకుండానే 12.3 ఓవర్లలో వంద దాటేసింది. రాధ 36 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. చివర్లో నదైన్ డిక్లెర్క్ (12 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపులతో జట్టు భారీ స్కోరు చేసింది. ధాటిగా మొదలై... జెయింట్స్ లక్ష్యఛేదన ధాటిగా మొదలైంది. ఫోర్లు, భారీ సిక్సర్తో విరుచుకుపడిన బెత్ మూనీ (14 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత సోఫీ (8), కెప్టెన్ గార్డ్నర్ (3), కనిక (16), జార్జియా వేర్హమ్ (13) వరుసగా విఫలం కావడంతో 70/5 స్కోరు వద్ద జట్టు ఓటమి దిశగా పయనించింది. భారతి, తనూజ (21) చేసిన పరుగులతో ఓటమి అంతరం మాత్రమే తగ్గింది. గురువారం జరిగిన మ్యాచ్లో యూపీ వారియర్స్ 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్పై గెలిచింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గ్రేస్ (ఎల్బీ) (బి) కాశ్వీ 17; స్మృతి (సి) రాజేశ్వరి (బి) రేణుక 5; హేమలత (సి) శివాని (బి) కాశ్వీ 4; గౌతమి (ఎల్బీ) (బి) డివైన్ 9; రాధ (సి) వేర్హమ్ (బి) డివైన్ 66; రిచా (సి) గార్డ్నర్ (బి) వేర్హమ్ 44; డిక్లెర్క్ (సి) రాజేశ్వరి (బి) డివైన్ 26; అరుంధతి (నాటౌట్) 2; శ్రేయాంక (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–26, 2–33, 3–39, 4–43, 5–148, 6–179, 7–180. బౌలింగ్: రేణుక 4–0–41–1, కాశ్వీ 4–0–42–2, గార్డ్నర్ 4–0–32–0, డివైన్ 4–0–31–3, వేర్హమ్ 4–0–35–1. గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: మూనీ (ఎల్బీ) (బి) శ్రేయాంక 27; డివైన్ (సి) అండ్ (బి) అరుంధతి 8; కనిక (ఎల్బీ) (బి) శ్రేయాంక 16; గార్డ్నర్ (సి) రిచా (బి) బెల్ 3; వేర్హమ్ (సి) రాధ (బి) డిక్లెర్క్ 13; భారతి (సి) గ్రేస్ (బి) బెల్ 39; కాశ్వీ (సి) గ్రేస్ (బి) శ్రేయాంక 18; తనూజ (సి) స్మృతి (బి) శ్రేయాంక 21; శివాని (సి) అరుంధతి (బి) బెల్ 0; రాజేశ్వరి నాటౌట్ 0; రేణుక (సి) అరుంధతి (బి) శ్రేయాంక 2; ఎక్స్ట్రాలు 3; మొత్తం (18.5 ఓవర్లలో ఆలౌట్) 150. వికెట్ల పతనం: 1–34, 2–38, 3–46, 4–63, 5–70, 6–126, 7–139, 8–139, 9–148, 10–150. బౌలింగ్: లారెన్ బెల్ 4–0–29–3, లిన్సీ స్మిత్ 2–0–27–0, అరుంధతి 4–0–31–1, శ్రేయాంక 3.5–0– 23–5, డిక్లెర్క్ 3–0–30–1, రాధ 2–0–9–0. -
‘సీఎం కప్-2025 సెకండ్ ఎడిషన్’కు సర్వం సిద్దం
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సీఎం కప్-2025 సెకండ్ ఎడిషన్’ పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి 17 నుంచి ఫిబ్రవరి 26 వరకు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో మొత్తం 44 విభాగాల్లో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. మొట్టమొదటిసారిగా నియోజకవర్గ స్థాయిలో పోటీలు జరగనుండడం విశేషం.పోటీల షెడ్యూల్ ఇలా:గ్రామపంచాయతీ స్థాయి: జనవరి 17 నుంచి 22 వరకుమండల/మున్సిపాలిటీ స్థాయి: జనవరి 28 నుంచి 31 వరకుఅసెంబ్లీ నియోజకవర్గ స్థాయి: ఫిబ్రవరి 3 నుంచి 5 వరకుజిల్లా స్థాయి: ఫిబ్రవరి 9 నుంచి 12 వరకురాష్ట్ర స్థాయి: ఫిబ్రవరి 20 నుంచి 23 వరకుగ్రామ స్థాయిలో విజేతలను మండల స్థాయికి, అక్కడి నుంచి అసెంబ్లీ నియోజకవర్గం, జిల్లా, చివరకు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు.గత ఏడాది గ్రాండ్ సక్సెస్2024లో నిర్వహించిన సీఎం కప్ పోటీల్లో దాదాపు మూడు లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈసారి అసెంబ్లీ స్థాయి చేర్చడంతో పాల్గొనే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు లక్షల మంది క్రీడాకారులు ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు.క్రీడాజ్యోతి ర్యాలీలతో అవగాహన యువతలో క్రీడలపై అవగాహన పెంచేందుకు రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో క్రీడాజ్యోతి ర్యాలీలు నిర్వహించారు. యువ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పల్లె ప్రతిభను గుర్తించడమే లక్ష్యం గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే సీఎం కప్ లక్ష్యమని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.2036 ఒలింపిక్స్లో తెలంగాణకు గర్వకారణంగా నిలిచే క్రీడాకారులను తయారు చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. గత ఏడాది సీఎం కప్ ఘన విజయాన్ని సాధించిందని, అదే స్ఫూర్తితో రెండో విడత నిర్వహిస్తున్నామని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు. గ్రామీణ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.క్రీడా సంఘాలు, పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు, క్రీడాభిమానుల సమన్వయంతో పోటీలు విజయవంతమవుతాయని రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి తెలిపారు.ఆధునిక సాంకేతిక సహకారంసీఎం కప్–2025కు ఏఐ కాల్ సెంటర్, వాట్సాప్ బాట్, వెబ్సైట్, ఏఐ చాట్బాట్ ద్వారా సమగ్ర సమాచారం అందించనున్నట్లు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఎండీ డా. సోనీ బాలాదేవి తెలిపారు. పాల్గొనే ప్రతి క్రీడాకారి వివరాలను కంప్యూటరీకరించి భద్రపరిచే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. -
వరల్డ్కప్ తొలి మ్యాచ్లోనే 5 వికెట్లు.. ఎవరీ హెనిల్ పటేల్?
ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ 2026ను ఐదుసార్లు ఛాంపియన్ భారత్ ఘనంగా ఆరంభించింది. గురువారం బులవాయో వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో యువ భారత జట్టు విజయం సాధించింది. ఈ విజయంలో పేసర్ హెనిల్ పటేల్ కీలక పాత్ర. ఈ మ్యాచ్లో హెనిల్ పటేల్ తన సంచలన బౌలింగ్తో అమెరికాను బెంబేలెత్తించాడు.ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా కేవలం 107 పరుగులకే కుప్పకూలింది. హెనిల్ పటేల్ తన మొదటి ఓవర్లోనే ఓపెనర్ అమ్రీందర్ గిల్ను ఔట్ చేసి తన వికెట్ల వేటను మొదలు పెట్టాడు. మొత్తంగా హెనిల్ 7 ఓవర్లలో కేవలం 16 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ మెగా టోర్నీ చరిత్రలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన మూడో భారత బౌలర్గా హెనిల్ నిలిచాడు. దీంతో ఈ యువ సంచలనం గురుంచి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.ఎవరీ హెనిల్ పటేల్?హెనిల్ పటేల్.. ఫిబ్రవరి 28, 2007 న గుజరాత్లోని వల్సాద్లో జన్మించాడు. తండ్రి ప్రోత్సాహంతో చిన్నతనంలోనే క్రికెట్ వైపు అడుగులు వేశాడు. అతడు అహ్మదాబాద్లోని ఓ క్రికెట్లో ఆకాడమీలో క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత హెనిల్ స్దానిక టోర్నీల్లో రాణించి గుజరాత్ అండర్-19 సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.గుజరాత్ అండర్-19, అండర్-23 జట్ల తరపున నిలకడడంతో రాణించడంతో ఇండియా-ఎ అండర్ 19 జట్టుకు అతడు ఎంపికయ్యాడు. అక్కడ కూడా మెరుగైన ప్రదర్శన చేయడంతో అండర్-19 ప్రపంచకప్ ప్రధాన జట్టులో చోటు దక్కించుకున్నాడు. తన తొలి వరల్డ్కప్ మ్యాచ్లోనే హెనిల్ సత్తాచాటాడు.బంతిని లేట్ స్వింగ్ చేయడం హెనిల్కు వెన్నతో పెట్టిన విద్య. అంతేకాకుండా బ్యాటర్లను ఇబ్బంది పెట్టే విధంగా బౌన్సర్లు కూడా సంధించగలడు. కేవలం 18 ఏళ్ల వయసులోనే బుమ్రా వంటి దిగ్గజాల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నట్లు కనిపిస్తున్న ఈ యువ సంచలనం త్వరలోనే సీనియర్ జట్టుకు ఆడుతాడని క్రికెట్ నిపుణులు జోస్యం చెబుతున్నారు.బుమ్రా వంటి స్పీడ్ స్టార్ కూడా గుజరాత్ నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. హెనిన్ ఇప్పటివరకు భారత్ తరపున 3 యూత్ టెస్టులు, 12 యూత్ వన్డేలు ఆడి మొత్తం 28 వికెట్లు పడగొట్టాడు. గత నెలలో జరిగిన అండర్-19 ఆసియా కప్లోనూ 4 మ్యాచ్ల్లో 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. -
భారత వరల్డ్కప్ జట్టులోకి ఓవరాక్షన్ స్టార్?
టీ20 ప్రపంచకప్-2026కు భారత్, శ్రీలంక వేదికలగా మరో 20 రోజుల్లో తెరలేవనుంది. అయితే ఈ మెగా టోర్నీకి ముందు టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. రిషబ్ పంత్ ప్రస్తుతం టీ20 ప్రణాళికల్లో లేకపోయినప్పటికి.. స్క్వాడ్లో ఉన్న తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ గాయాలు ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారాయి.ప్రపంచకప్ ఆరంభ సమయానికి తిలక్ కోలుకునే అవకాశమున్నప్పటికి.. వాషింగ్టన్ అందుబాటుపై మాత్రం సందిగ్ధం నెలకొంది. సుందర్ ప్రస్తుతం ప్రక్కటెముకల గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అతడు కివీస్తో టీ20 సిరీస్కు కూడా దూరమయ్యాడు.వాషీ కోలుకోవడానికి దాదాపు ఐదు వారాల సమయం పట్టనునున్నట్లు తెలుస్తోంది. అతడు పొట్టి ప్రపంచకప్కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. సుందర్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఉన్నాడు. అతడి అందుబాటుపై బీసీసీఐ సెలక్షన్ కమిటీ త్వరలోనే ఓ ప్రకటన చేసే అవకాశముంది.వరల్డ్కప్ జట్టులోకి పరాగ్..మరోవైపు వాషింగ్టన్ సుందర్కు ప్రత్యామ్నాయంగా ఎవరిని తీసుకోవాలన్నదానిపై సెలెక్టర్లు కసరత్తలు మొదలు పెట్టినట్లు సమాచారం. అస్సాం స్టార్ ప్లేయర్ రియాన్ పరాగ్ను వరల్డ్కప్ జట్టులోకి తీసుకోవాలని అజిత్ అగార్కర్ భావిస్తున్నట్లు సమాచారం.హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ మద్దతు కూడా పరాగ్కు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శనల కారణంగా పరాగ్ భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. శ్రీలంక పర్యటనలో పరాగ్ ఆల్రౌండర్గా మెప్పించాడు. బ్యాట్తో పాటు బంతితో కూడా రాణించాడు.లంకతో ఓ టీ20 మ్యాచ్లో కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం వన్డే మ్యాచ్లో కూడా 9 ఓవర్లు బౌలింగ్ చేసి మూడు కీలక వికెట్లు సాధించాడు. ఈ పర్యటన ద్వారా రియాన్ కేవలం బ్యాటర్ మాత్రమే కాదు, కీలక సమయాల్లో వికెట్లు తీయగలే సత్తా ఉంది అని నిరూపించుకున్నాడు. అయితే ఆ తర్వాత భుజం గాయం కారణంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. రియాన్ ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో ఉన్నాడు. అతడు దాదాపు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు సమాచారం. పరాగ్ బ్యాట్తో మెరుపులు మెరిపించగలడు.. బంతితో అద్భుతాలు కూడా చేయగలడు. కాబట్టి చాలా మంది మాజీలు వాషీకి సరైన ప్రత్యామ్నాయం రియాన్ అని అభిప్రాయపడుతున్నారు.చదవండి: కనీసం మూడో మ్యాచ్లోనైనా ఆడించండి: అశ్విన్ -
విరాట్ కోహ్లీ, అనుష్క ఫెస్టివ్ వైబ్ : రూ. 38 కోట్ల ఆస్తి కొనుగోలు
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కు సంబంధించిన ఒక శుభవార్త ప్రస్తుతం నెట్టింట సందడిగామారింది. అలీబాగ్లోని రాయ్గఢ్ జిల్లాలో ఐదు ఎకరాలకు పైగా భూమిని కొనుగోలు చేశారు. సీఆర్ఈ (CRE) మ్యాట్రిక్స్ ఆస్తి పత్రాల ప్రకారం, దీని విలువ 37.86 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.మహరాష్ట్రలోని రాయ్గడ్ జిల్లా (402201)లోని అలీబాగ్లోని గాట్ నంబర్లు 157 158లోని విలేజ్ జిరాద్లో ఈ భూమి ఉంది. రిజిస్టర్డ్ సేల్ డీడ్ ప్రకారం, మొత్తం భూమి 21,010 చదరపు మీటర్లు లేదా దాదాపు 5.19 ఎకరాలు ఉంటుంది. ఈ లావాదేవీ జనవరి 13, 2026న రిజిస్టర్ చేశారు. సోనాలి అమిత్ రాజ్పుత్ నుంచి అనుష్క, విరాట్ దంపతులు ఈ భూమిని కొనుగోలు చేసినట్టు CRE మ్యాట్రిక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అభిషేక్ కిరణ్ గుప్తా వెల్లడించారు. నిబంధనల ప్రకారం విరాట్, అనుష్క రూ.2.27 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30,000, డాక్యుమెంట్ హ్యాండ్లింగ్ ఛార్జీలు రూ.1,000గా నమోదయ్యాయి. ఇదీ చదవండి: పండగవేళ విషాదం : చేపలకోసం ఎగబడ్డ జనంమరోవైపు సెలబ్రిటీ జంట విరుష్క అలీబాగ్లో ఇదే తొలి రియల్ ఎస్టేట్ పెట్టుబడి కాదు. 2022లో, ఈ జంట 2022లో అలీబాగ్లో 19.24 కోట్ల రూపాయలకు దాదాపు 8 ఎకరాలు కొనుగోలు చేశారు. తరువాత ఈ జంట సంపాదించిన ప్లాట్లలో ఒక విలాసవంతమైన వెకేషన్ హోమ్ను నిర్మించారు. ఇదే ప్రాంతంలో ల్యాండ్ను కొనుగోలు చేసినవారిలో ప్రముఖ కొనుగోలుదారులలో బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ కూడా ఉన్నారు. గత ఏడాది సెప్టెంబర్ 2025లో చాటౌ డి అలీబాగ్లో సుమారు రూ. 2 కోట్ల విలువైన 2,000 చదరపు అడుగుల ప్లాట్ను కొనుగోలు చేశారు. అలాగే బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ఈ ప్రాంతంలో భారీగా పెట్టుబడి పెట్టారు. 2024 ఏప్రిల్లో రూ. 10 కోట్లకు 10,000 చదరపు అడుగుల భూమిని కొనుగోలు చేశారు, ఆ తర్వాత అక్టోబర్ 2025లో రూ. 6.6 కోట్లకు మొత్తం 9,557 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మూడు ఆనుకుని ఉన్న ప్లాట్లను కొనుగోలు చేశారు. షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కూడా అలీబాగ్లో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన ప్రముఖులలో ఉండటం విశేషం.ఇదీ చదవండి: కన్నకూతుళ్లపై తండ్రి అఘాయిత్యం, 6 ఏళ్ల వయసు నుంచి -
అతడి కారణంగానే రాజ్కోట్లో ఓడిపోయాం: ఇర్ఫాన్ పఠాన్
రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. 285 పరుగుల లక్ష్యాన్ని భారత బౌలర్లు కాపాడుకోలేకపోయారు. ఫాస్ట్ బౌలర్లతో పాటు స్పిన్నర్లు కూడా దారుణంగా విఫలమయ్యారు.భారత బౌలర్లు కేవలం మూడు వికెట్లు మాత్రమే పడగొట్టారు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాట్తో పాటు బంతితో విఫలమైన ఆల్రౌండర్ రవీంద్ర జడేజాపై పఠాన్ విమర్శలు గుప్పించాడు. జడేజా నెమ్మదిగా ఆడడమే వల్లే భారత్ 300 పరుగులు దాటలేకపోయిందని పఠాన్ అభిప్రాయపడ్డాడు.రాజ్కోట్ వన్డేలో భారత్ స్కోర్ సునాయసంగా 300 పరుగుల మార్క్ దాటి ఉండేది. ఎల్ రాహుల్ అద్భుతంగా ఆడి 90 స్ట్రైక్ రేట్తో సెంచరీ చేస్తే.. జడేజా మాత్రం తన సొంత మైదానంలో 60 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. కనీసం 80 స్ట్రైక్ రేట్తో ఆడి ఉంటే భారత్ అదనంగా మరో 20-30 పరుగులు వచ్చేవి. జడేజా అద్భుతమైన ఆల్రౌండర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.టెస్ట్ క్రికెట్లో కపిల్ దేవ్ తర్వాత అంత పేరు తెచ్చుకున్న ఆల్రౌండర్గా జడ్డూ నిలిచాడు. కానీ వన్డేల్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోతున్నాడు. కనీసం స్ట్రైక్ రొటేట్ చేయడానికి కూడా అతడు కష్టపడుతున్నాడు.2020 తర్వాత జడేజా వన్డేల్లో ఇప్పటివరకు కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయాడు. గత ఐదు మ్యాచ్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఒక సీనియర్ ఆటగాడి నుంచి ఇలాంటి ప్రదర్శనలు జట్టుకు అస్సలు మంచిది కాదు. జడేజా స్థానంలో అక్షర్ పటేల్ను ఆడించడం బెటర్ అని తన యూట్యూబ్ ఛానల్లో పఠాన్ పేర్కొన్నాడు.చదవండి: అతడొక అద్భుతం.. కనీసం మూడో మ్యాచ్లోనైనా ఆడించండి: అశ్విన్ -
స్టీవ్ స్మిత్ విధ్వంసకర సెంచరీ.. వణికిపోయిన బౌలర్లు! వీడియో
బిగ్ బాష్ లీగ్-2025లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో సిడ్నీ సిక్సర్సకు ప్రాతినిథ్యం వహిస్తున్న స్మిత్.. శుక్రవారం సిడ్నీ థండర్తో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 190 పరుగుల లక్ష్య చేధనలో స్మిత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన స్మిత్.. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు.సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో బౌండరీల వర్షం కురిపించాడు. ముఖ్యంగా సిడ్నీ థండర్ బౌలర్ రైన్ హాడ్లీని స్మిత్ టార్గెట్ చేశాడు. రైన్ హాడ్లీ వేసిన 12వ ఓవర్లో స్మిత్ వరుసగా నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్తో ఏకంగా 32 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో కేవలం 41 బంతుల్లో తన నాలుగో బీబీఎల్ సెంచరీ మార్క్ను స్మిత్ అందుకున్నాడు.స్మిత్ 5 ఫోర్లు, 9 సిక్స్లతో సరిగ్గా వంద పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు బాబర్ ఆజం(39 బంతుల్లో 47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో సిడ్నీ సిక్సర్ లక్ష్యాన్ని 17.2 ఓవర్లలో కేవలం 5 వికెట్లు కోల్పోయి చేధించింది. సిడ్నీకి ఇది వరుసగా నాలుగో విజయం.వార్నర్ సెంచరీ వృథా..ఇక ఇదే మ్యాచ్లో ఆసీస్ మాజీ ఓపెనర్, సిడ్నీ థండర్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా శతక్కొట్టాడు. 65 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో 110 పరుగులు చేసి వార్నర్ అజేయంగా నిలిచాడు. మిగితా ప్లేయర్ల నుంచి పెద్దంగా సహకరం లేకపోవడంతో సిడ్నీ 200 పరుగుల మార్క్ను దాటలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. సిడ్నీ సిక్సర్స్ బౌలర్లలో సామ్కుర్రాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఎడ్వర్డ్స్, స్టార్క్, బెన్ మనేంటి తలా వికెట్ సాధించారు. కాగా వార్నర్కు ఈ ఏడాది సీజన్లో ఇది రెండో సెంచరీ.స్మిత్ సరికొత్త చరిత్రఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన స్మిత్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. బిగ్ బాష్ లీగ్ చరిత్రలో అత్యంతవేగవంతమైన సెంచరీ చేసిన రెండో ప్లేయర్గా స్మిత్ నిలిచాడు. ఈ జాబితాలో మిచెల్ ఓవెన్, క్రెయిగ్ సిమన్స్ అగ్రస్దానంలో ఉన్నారు. వీరిద్దరూ కేవలం 39 బంతుల్లోనే సెంచరీ మార్క్ను అందుకున్నారు.అంతేకాకుండా బిగ్ బాష్ లీగ్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా స్మిత్(4) రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు డేవిడ్ వార్నర్, బెన్ మెక్డెర్మాట్ల పేరిట ఉండేది. వారిద్దరూ తమ బీబీఎల్ కెరీర్లో మూడు సెంచరీలు చేశాడు. తాజా సెంచరీతో వీరిద్దరిని స్మిత్ వెనక్కి నెట్టాడు.చదవండి: అతడొక అద్భుతం.. కనీసం మూడో మ్యాచ్లోనైనా ఆడించండి: అశ్విన్32 RUNS OFF ONE OVER!Steve Smith hit four sixes in a row in this wild over at the SCG. #BBL15 pic.twitter.com/fSPEaw3Xoo— KFC Big Bash League (@BBL) January 16, 2026 -
కనీసం మూడో మ్యాచ్లోనైనా ఆడించండి: అశ్విన్
రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియాకు ఘోర పరభావం ఎదురైన సంగతి తెలిసిందే. భారత్ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన కివీస్.. మూడు వన్డేల సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య సిరీస్ డిసైడర్ ఆదివారం(జనవరి 18) ఇండోర్ స్టేడియం వేదికగా జరగనుంది.అయితే తొలి రెండు వన్డేల్లో భారత స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ను బెంచ్కే పరిమితం చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. అర్ష్దీప్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నప్పటికి అతడికి తుది జట్టులో మాత్రం చోటు దక్కడం లేదు. హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణల వైపు టీమ్ మెనెజ్మెంట్ మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో అర్ష్దీప్ను కనీసం మూడో వన్డేలోనైనా తుది జట్టులోకి తీసుకోవాలని హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ను భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు."బౌలర్ల మధ్య తీవ్ర పోటీ ఉంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లకు అయితే హిట్-ది-డెక్ బౌలర్ అవసరం. కానీ న్యూజిలాండ్తో అటువంటి బౌలర్లు అవసరం లేదు. హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ వంటి బౌలర్లకు మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఈ విషయాన్ని నేను ఆర్ధం చేసుకోగలను. కానీ అర్ష్దీప్ గురుంచి ఎవరూ ఆలోచించడం లేదు.అతడు ఎంతో కష్టపడి ఈ స్ధాయికి చేరుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనలతో జట్టు విజయాల్లో భాగమయ్యాడు. అయినా ఇప్పటికీ అతడు జట్టులో స్థానం కోసం పోరాడుతున్నాడు. బ్యాటర్ల విషయంలో ఇలా ఎప్పుడూ జరగదు. ప్రతీసారి బౌలర్లే బలి అవుతున్నారు.అత్యుత్తమంగా రాణించినా బౌలర్లు కూడా తమ చోటును కాపాడుకోవడానికి నిరంతరం పోరాడాల్సి వస్తోంది. ఎక్కువ కాలం మ్యాచ్లు ఆడకుండా బెంచ్పై కూర్చోబెడితే, ఎంతటి గొప్ప బౌలర్ అయినా తన రిథమ్ను కోల్పోవాల్సి వస్తుంది. కనీసం మూడో వన్డేలోనైనా అతడికి ఛాన్స్ ఇవ్వండి" అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: T20 WC 2026: అతడి కోసం బీసీసీఐ 'ప్లాన్ బి'.. రేసులో స్టార్ ప్లేయర్లు -
అఫ్గానిస్తాన్కు భారీ షాక్..
టీ20 ప్రపంచకప్-2026కు ముందు అఫ్గానిస్తాన్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ నవీన్ ఉల్ హక్ గాయం కారణగా ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకొన్నాడు. నవీన్ గత కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్నాడు.అయితే వరల్డ్కప్ సమయానికి అతడు కోలుకుంటాడని జట్టులో సెలెక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. కానీ అతడి గాయం తీవ్రత మరింత ఎక్కువైనట్లు తెలుస్తోంది. దీంతో అతడు నెలాఖరులో తన గాయానికి శస్త్రచికిత్స చేయించుకోనున్నట్లు సమాచారం.ఈ కారణంతోనే వరల్డ్కప్తో పాటు వెస్టిండీస్తో టీ20 సిరీస్కు అతడు దూరమయ్యాడు. అతడు పూర్తిగా కోలుకోవడానికి మరి కొన్ని నెలల పట్టనున్నట్లు అఫ్గాన్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ రైట్ ఆర్మ్ పేసర్ దాదాపు ఏడాది నుంచి జాతీయ జట్టు తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆసియాకప్-2025కు కూడా దూరంగా ఉన్నాడు. కాగా నవీన్ స్దానంలో ఇంకా అధికారికంగా ఎవరినీ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించలేదు. రిజర్వ్ ఆటగాళ్లుగా ఉన్న జియా ఉర్ రెహ్మాన్ షరీఫీ, అల్లా గజన్ఫర్ లేదా ఇజాజ్ అహ్మద్జాయ్లలో ఒకరు ప్రధాన జట్టులోకి వచ్చే అవకాశముంది.టీ20 ప్రపంచ కప్ 2026కు అఫ్గాన్ జట్టు:రషీద్ ఖాన్ (కెప్టెన్), నూర్ అహ్మద్, అబ్దుల్లా అహ్మద్జాయ్, సెడిఖుల్లా అటల్, ఫజల్హాక్ ఫరూఖీ, రహ్మానుల్లా గుర్బాజ్, మహ్మద్ ఇషాక్, షాహిదుల్లా కమల్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, అజ్మతుల్లా, రమ్మానులీ, రమ్మతుల్లా, ఉమర్జాయి, జద్రాన్. రిజర్వ్లు: అల్లా ఘజన్ఫర్, ఇజాజ్ అహ్మద్జాయ్ మరియు జియా ఉర్ రెహ్మాన్ షరీఫీచదవండి: T20 WC 2026: అతడి కోసం బీసీసీఐ 'ప్లాన్ బి'.. రేసులో స్టార్ ప్లేయర్లు -
అతడి కోసం బీసీసీఐ 'ప్లాన్ బి'.. రేసులో స్టార్ ప్లేయర్లు
టీ20 ప్రపంచకప్-2026కు ముందు టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ గాయం బారిన పడగా.. తాజాగా ఈ జాబితాలోకి ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా చేరాడు. న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో సుందర్ గాయపడ్డాడు.దీంతో ఆఖరి రెండు వన్డేలతో పాటు టీ20 సిరీస్కు కూడా దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడు టీ20 వరల్డ్కప్లో కూడా పాల్గోనడం కూడా అనుమానంగా మారింది. సుందర్ ప్రస్తుతం పక్కటెముకల గాయంతో బాధపడుతున్నాడు. తొలుత అతడిది సాధారణ వెన్ను నొప్పి అని వైద్యులు భావించారు. కానీ తర్వాత స్కాన్లలో అతడి గాయం తీవ్రమైనది తేలింది.దీంతో వాషింగ్టన్ మరో రెండు మూడు రోజుల్లో పునరావాసం పొందేందుకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు వెళ్లనున్నాడు. అక్కడి వైద్య బృందం సుందర్ పూర్తిగా కోలుకోవడానికి పట్టే సమయంపై స్పష్టత ఇవ్వనున్నారు. అయితే సుందర్ విషయంలో బీసీసీఐ ప్లాన్ బితో ఉన్నట్లు తెలుస్తోంది."వాషింగ్టన్ సుందర్ వరల్డ్కప్ లీగ్ దశ మ్యాచ్లకు అందుబాటులో ఉండే సూచనలు కన్పించడం లేదు. కాబట్టి సెలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ బ్యాకప్ ప్లాన్ గురుంచి కచ్చితంగా ఆలోచించాలి. మెడికల్ టీమ్ నుంచి పూర్తి రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారు.భారత్ తమ మొదటి రౌండ్ మ్యాచ్లు ఎక్కువగా అసోసియేట్ జట్లతో ఆడాల్సింది. కాబట్టి ప్రస్తుతానికి సుందర్ స్ధానంలో ఎవరినీ భర్తీ చేసే ఆలోచనలో సెలెక్టర్లు ఉండకపోవచ్చు. అతడు కోలుకోవడానికి తగినంత సమయం దొరికే అవకాశముంది. సుందర్ జట్టుతో పాటు కొనసాగే అవకాశముంది.ఒకవేళ అతడు టోర్నీ కీలక దశ సమయానికి కోలుకుంటే నేరుగా ప్లేయింగ్ ఎలెవన్లో రానున్నాడని" బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా జనవరి 31 లోపు జట్లలో మార్పులు చేసుకునే అవకాశముంది. ఒకవేళ సుందర్ గ్రూప్ దశ దాటాక కూడా కోలుకోలేడని తేలితే, అతడి స్ధానంలో మరొక ఆటగాడిని బీసీసీఐ తీసుకుంటుంది. సుందర్ స్ధానాన్ని భర్తీ చేసేందుకు రియాన్ పరాగ్, అయూశ్ బదోని, షాబాజ్ అహ్మద్ వంటి వారు రేసులో ఉన్నారు.చదవండి: The Hundred 2026: స్మృతి మంధాన కీలక నిర్ణయం -
కష్టాల్లో ఉన్న జట్టును వదిలేసిన రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్ సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఎంఐ కేప్టౌన్ జట్టుకు సారధిగా వ్యవహరిస్తున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ సీజన్ బరిలోకి దిగిన ఆ జట్టు.. అనూహ్య పరాజయాలు (8 మ్యాచ్ల్లో 5) ఎదుర్కొని పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది. ఎలిమినేషన్ అంచును ఆ జట్టును తాజాగా రషీద్ ఖాన్ వీడి వెళ్లాడు. జాతీయ విధులకు (వెస్టిండీస్తో టీ20 సిరీస్ కోసం) హాజరయ్యేందుకు రషీద్ సౌతాఫ్రికా టీ20 లీగ్ నుంచి తప్పుకున్నాడు.కష్ట సమయాల్లో రషీద్ వెళ్లిపోవడం మినుకుమినుకుమంటున్న ఎం కేప్టౌన్ ప్లే ఆఫ్స్ బెర్త్ అవకాశాలను దాదాపుగా గల్లంతు చేసింది. రషీద్ స్థానంలో యాజమాన్యం పొట్టి క్రికెట్ దిగ్గజం కీరన్ పోలార్డ్ను జట్టులో చేర్చుకుంది. పోలార్డ్ జట్టులో చేరినా ఎంఐ ఫేట్ మారే అవకాశం లేదు. ఎందుకంటే ఆ జట్టుకు మరో రెండు అవకాశాలు (మ్యాచ్లు) మాత్రమే ఉన్నాయి.ఈ రెండు మ్యాచ్ల్లో భారీ విజయాలు సాధిస్తే.. ఎం కేప్టౌన్ ఫేట్ మారే అవకాశాలు లేకపోలేదు. ఈ సీజన్లో ఆ జట్టు అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమవుతుంది. బ్యాటింగ్లో నికోలస్ పూరన్, రస్సీ వాన్ డర్ డసెన్, జేసన్ స్మిత్ లాంటి కీలక ఆటగాళ్లు స్థిరంగా పరుగులు చేయలేకపోతున్నారు. బౌలింగ్లో స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఫామ్లో లేడు. ఫీల్డింగ్లో క్యాచ్లు వదిలేయడం, లేని పరుగులను సమర్పించుకోవడం లాంటి పొరపాట్లు చేస్తున్నారు. తదుపరి మ్యాచ్ల్లో ఈ లోపాలను అధిగమించగలిగితే ఎంఐ కేప్టౌన్ విజయాల బాట పట్టవచ్చు. పోలార్డ్ తన పవర్ హిట్టింగ్, ఫీల్డింగ్, మీడియం పేస్ బౌలింగ్తో కేప్టౌన్లో ప్లే ఆఫ్స్ దిశగా నడిపించాలని ఆ ఫ్రాంచైజీ అభిమానులు కోరుకుంటున్నారు. పోలార్డ్ 2024 ఎడిషన్లో రషీద్ ఖాన్ గాయపడినప్పుడు కేప్టౌన్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించాడు. ఆ సీజన్లో అతను 188 స్ట్రయిక్రేట్తో పరుగులు చేసి, 4 వికెట్లు తీశాడు. పోలార్డ్ మరో 101 పరుగులు చేస్తే పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొడతాడు.కాగా, ప్రస్తుత ఎడిషన్లో పార్ల్ రాయల్స్, సన్రైజర్స్ ఈస్ట్రన్కేప్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్లు ఖరారు చేసుకున్నాయి. మిగతా బెర్త్ల కోసం ప్రిటోరియా క్యాపిటల్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్, డర్బన్ సూపర్ జెయింట్స్, ఎంఐ కేప్టౌన్ పోటపడుతున్నాయి. -
ఫిన్ అలెన్ విధ్వంసకర శతకం.. జోష్లో కేకేఆర్ ఫ్యాన్స్
బిగ్బాష్ లీగ్ 2025-26లో పెర్త్ స్కార్చర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న కేకేఆర్ ఆటగాడు ఫిన్ అలెన్ విధ్వంసకర శతకంతో చెలరేగిపోయాడు. మెల్బోర్న్ రెనెగేడ్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 51 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఫలితంగా స్కార్చర్స్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పొట్టి ఫార్మాట్లో అలెన్కు ఇది ఐదో శతకం. బీబీఎల్లో మొదటిది. ఈ సెంచరీ స్కార్చర్స్ అభిమానులతో పాటు కేకేఆర్ ఫ్యాన్స్లోనూ జోష్ నింపింది. అలెన్కు కేకేఆర్ 2026 సీజన్ వేలంలో రూ. 2 కోట్లకు దక్కించుకుంది. రెనెగేడ్స్తో మ్యాచ్లో తొలుత నిదానంగా ఆడిన అలెన్.. హాఫ్ సెంచరీ తర్వాత గేర్ మార్చాడు. కేవలం 17 బంతుల్లోనే రెండో అర్ద సెంచరీని పూర్తి చేశాడు. మొత్తంగా 53 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. గురిందర్ సంధు వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో అలెన్ వరుసగా మూడు సిక్సర్లు బాదడం మ్యాచ్ మొత్తానికి హైలైట్గా నిలిచింది.ప్లే ఆఫ్స్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో అలెన్ ఊచకోత కోయడంతో స్కార్చర్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కార్చర్స్.. అలెన్ శతక్కొట్టుడుతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్కార్చర్స్ ఇన్నింగ్స్లో అలెన్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. మిచెల్ మార్ష్ 20, కూపర్ కన్నోలీ 18, ఆరోన్ హార్డీ 22, ఆస్టన్ టర్నర్ 13, లారీ ఈవాన్స్ 21, నిక్ హాబ్సన్ 3 పరుగులకు ఔటయ్యారు. రెనెగేడ్స్ బౌలర్లలో సామ్ ఇలియట్ 4 వికెట్లతో సత్తా చాటాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో రెనెగేడ్స్ తడబడింది. టిమ్ సీఫర్ట్ (66), జేక్ ఫ్రేజర్ (42) మాత్రమే రాణించారు. మిగతా వారంతా ఇలా వచ్చి అలా ఔటైపోయారు. స్కార్చర్స్ బౌలర్లు కన్నోలీ, బియర్డ్మన్ తలో 2, లూక్ హాల్ట్, ఆరోన్ హార్డీ చెరో వికెట్ తీసి రెనెగేడ్స్ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టారు. వీరి ధాటికి రెనెగేడ్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులకే పరిమితమైంది. -
రెండు రోజుల్లో ఇద్దరు.. క్రికెట్లో ఈ 'రిటైర్డ్ ఔట్' అంటే ఏంటి..?
పొట్టి క్రికెట్లో ఇటీవలికాలంలో 'రిటైర్డ్ ఔట్' అనే పదం తరుచూ వినిపిస్తుంది. రిటైర్డ్ ఔట్ అంటే ఆటగాడు ఇన్నింగ్స్ మధ్యలో గాయం కాని, అనారోగ్యానికి కాని గురి కాకుండానే పెవిలియన్కు చేరడం. సాధారణంగా ఎవరైనా ఆటగాడు గాయం లేదా అనారోగ్యానికి గురైతే రిటైర్డ్ హర్ట్ లేదా రిటైర్డ్ నాటౌట్గా పెవిలియన్కు చేరతారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యర్థి కెప్టెన్ అనుమతిస్తే, ఆ ఆటగాడు తిరిగి బ్యాటింగ్ కొనసాగించవచ్చు.కానీ, రిటైర్డ్ ఔట్ విషయంలో అలా కాదు. ఒక్కసారి ఆటగాడు ఈ కారణంగా క్రీజ్ వదిలితే తిరిగి బ్యాటింగ్కు దిగటానికి వీలుండదు. పొట్టి ఫార్మాట్లో కీలక సమయాల్లో బ్యాటర్లు నిదానంగా ఆడుతున్నప్పుడు రిటైర్డ్ ఔట్ అస్త్రాన్ని ప్రయోగిస్తుంటారు. వూహ్యాల్లో భాగంగా ఇలా జరుగుతుంటుంది.అంతర్జాతీయ క్రికెట్లో రిటైర్డ్ ఔట్లు చాలా తక్కువగా నమోదైనప్పటికీ.. పొట్టి క్రికెట్లో, ముఖ్యంగా ఇటీవలికాలంలో ఈ తరహా ఔట్లు ఎక్కువుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న మహిళల ఐపీఎల్ (WPL) 2026 ఎడిషన్లో రెండు రోజుల వ్యవధిలో ఇద్దర్లు బ్యాటర్లు రిటైర్డె్ ఔట్గా వెనుదిరిగారు.గుజరాత్ జెయింట్స్ తరఫున అరంగేట్రం ప్లేయర్ ఆయుశ్ సోని, యూపీ వారియర్జ్ తరఫున హర్లీన్ డియోల్ గంటల వ్యవధిలో రిటైర్డ్ ఔట్గా పెవిలియన్కు చేరారు. ఈ ఇద్దరు నిదానంగా ఆడుతున్నారన్న కారణంగా వారి జట్టు మేనేజ్మెంట్ ఇలా చేసింది. రిటైర్డ్ ఔట్పై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నప్పటికీ.. పొట్టి క్రికెట్లో ఇది చాలా ఉపయోగపడుతుంది.ఎవరైనా బ్యాటర్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుంటే ఈ అస్త్రాన్ని ప్రయోగించి అతన్ని తప్పించి మరొకరికి అవకాశం ఇవ్వవచ్చు. మహిళల ఐపీఎల్లో రిటైర్డ్ ఔటైన తొలి ప్లేయర్ ఆయుశ్ సోని అయితే.. ఐపీఎల్లో ఈ తరహాలో ఔటైన తొలి ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ రికార్డుల్లోకెక్కాడు.యాష్ 2022 ఎడిషన్లో లక్నోతో జరిగిన మ్యాచ్లో నిదానంగా ఆడుతున్నందుకు మేనేజ్మెంట్ అతన్ని రిటైర్డ్ ఔట్గా పెవిలియన్కు పిలిపించింది. ఇలాంటి ఉదంతాలే ఐపీఎల్లో మరో మూడు సందర్భాల్లో చోటు చేసుకున్నాయి.2023 ఎడిషన్లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్, అదే ఎడిషన్లో పంజాబ్ ఆటగాడు అథర్వ తైడే, 2025 ఎడిషన్లో ముంబై ఇండియన్స్ ఆటగాడు తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్గా వెనుదిరిగారు. ఐపీఎల్లో రిటైర్డ్ ఔట్గా వెనుదిరిగిన ఆటగాళ్లు కేవలం నలుగురే అయినప్పటికీ.. ప్రపంచవాప్తంగా జరిగే వేర్వేరు లీగ్ల్లో ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.అంతర్జాతీయ క్రికెట్లోనూ పలువురు ఆటగాళ్లు ఈ తరహాలో ఔటయ్యారు. శ్రీలంకకు చెందిన మర్వన్ ఆటపట్టు, మహేళ జయవర్దనే (2001), భూటాన్కు చెందిన సోనం టోబ్గే (2019), నమీబియాకు చెందిన నికోలాస్ డావిన్ (2014) రిటైర్డ్ ఔట్గా పెవిలియన్కు చేరారు. వీరిలో ఆటపట్టు, జయవర్దనే టెస్ట్ ఫార్మాట్లో, అదీ ఒకే మ్యాచ్లో (బంగ్లాదేశ్పై) రిటైర్డ్ ఔట్ కావడం విశేషం. ఆటపట్టు డబుల్ సెంచరీ పూర్తి చేశాక, జయర్దనే 150 పరుగులు పూర్తి చేశాక రిటైర్డ్ ఔటయ్యారు.అంతర్జాతీయ టీ20ల్లో రిటైర్డ్ ఔటైన తొలి ఆటగాడు టోబ్గే అయితే.. టీ20 ప్రపంచకప్లో ఈ తరహా ఔటైన తొలి ఆటగాడిగా నికోలాస్ డావిన్ రికార్డుల్లోకెక్కాడు. -
మరో సూపర్ జెయింట్.. పేరు మార్చుకున్న మరో ఫ్రాంచైజీ
ఫ్రాంచైజీ క్రికెట్లోకి మరో సూపర్ జెయింట్ వచ్చింది. హండ్రెడ్ లీగ్లో మాంచెస్టర్ ఒరిజినల్స్ మాంచెస్టర్ సూపర్ జెయింట్స్గా మారింది. ఫ్రాంచైజీ క్రికెట్లో ఇప్పటికే రెండు సూపర్ జెయింట్స్ ఉన్నాయి. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్, సౌతాఫ్రికా టీ20 లీగ్లో డర్బన్ సూపర్ జెయింట్స్. ఈ రెండు సహా మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఆర్పీఎస్జీ గ్రూప్ ఆధినేత సంజీవ్ గొయెంకా చేతుల్లో ఉన్నాయి.మాంచెస్టర్ ఒరిజినల్స్ మాంచెస్టర్ సూపర్ జెయింట్స్గా రూపాంతరం చెందిన తర్వాత కొత్త లోగోను గురువారం ఆవిష్కరించారు. ఇదే సందర్భంలో ఇంగ్లండ్ స్టార్ వికెట్కీపర్ జోస్ బట్లర్ (పురుషుల హండ్రెడ్), అదే దేశానికి చెందిన స్పిన్ బౌలర్ సోఫీ ఎక్ల్స్టోన్ (మహిళల హండ్రెడ్)ను రిటైన్ చేసుకుంటున్నట్లు ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రకటించింది. బట్లర్ మరో సూపర్ జెయింట్లోనూ (డర్బన్ సూపర్ జెయింట్స్) భాగంగా ఉన్నాడు.లక్నో, డర్బన్ సూపర్ జెయింట్స్ లోగోల్లోని బ్రాండింగ్కి భిన్నంగా మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ లోగోలో ఏనుగు ప్రతీక ఉండటం గమనించదగ్గ విషయం. మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ లోగో ఆవిష్కరణ సందర్భంగా ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయంకా మాట్లాడుతూ.. మాంచెస్టర్ ఒక గొప్ప క్రీడా నగరం. సూపర్ జెయింట్స్ కుటుంబంలో భాగమవ్వడం గర్వకారణం. జోస్ బట్లర్ వంటి ఆటగాళ్లు మా జట్టులో ఉండటం ఆనందదాయకమిని పేర్కొన్నారు. మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ బట్లర్, ఎక్లెస్టోన్తో పాటు మరికొంత మందిని కూడా రీటైన్ చేసుకుంది. పురుషుల విభాగంలో హెన్రిచ్ క్లాసెన్, నూర్ అహ్మద్ను తిరిగి దక్కించుకుంది. కొత్తగా పురుషుల విభాగంలో లియామ్ డాసన్.. మహిళల విభాగంలో మెగ్ లాన్నింగ్, స్మృతి మంధనను జట్టులోకి తీసుకుంది.కాగా, మాంచెస్టర్ ఒరిజినల్స్ మాంచెస్టర్ సూపర్ జెయింట్స్గా రూపాంతరం చెందక ముందు మరో రెండు హండ్రెడ్ లీగ్ ఫ్రాంచైజీల పేర్లు మారాయి. ముంబై ఇండియన్స్ ఓనర్షిప్లో నడిచే ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఎంఐ లండన్గా, సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్షిప్లో నడిచే నార్తర్న్ సూపర్చార్జర్స్ సన్రైజర్స్ లీడ్స్గా రూపాంతరం చెందాయి.జులై 21 నుంచి ప్రారంభం ది హండ్రెడ్ లీగ్ 2026 పురుషులు, మహిళల విభాగాల్లో జులై 21 నుంచి ప్రారంభం కానుంది. అన్ని ఫ్రాంచైజీలకు జనవరి చివరి వరకు నాలుగు ప్రీ-ఆక్షన్ సైనింగ్లకు అవకాశం ఉంది. ప్రధాన ఆక్షన్ మార్చిలో జరగనుంది. -
సౌతాఫ్రికా టీ20 లీగ్లో సంచలనం.. రాయల్స్ బౌలర్ హ్యాట్రిక్
సౌతాఫ్రికా టీ20 లీగ్లో రెండో హ్యాట్రిక్ నమోదైంది. 2025-26 ఎడిషన్లో భాగంగా నిన్న (జనవరి 15) ప్రిటోరియా క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో పార్ల్ రాయల్స్ బౌలర్ ఓట్నీల్ బార్ట్మన్ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. ఇదే ఎడిషన్లో కొద్ది రోజుల కిందట ప్రిటోరియా క్యాపిటల్స్ బౌలర్ లుంగి ఎంగిడి సౌతాఫ్రికా టీ20 లీగ్ తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు. తాజాగా ప్రిటోరియాతో జరిగిన మ్యాచ్లో బార్ట్మన్ హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లు తీసి రాయల్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. బార్ట్మన్ (4-1-16-5) ధాటికి 19.1 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. హర్డస్ విల్యోన్, సికందర్ రజా తలో 2, ఫోర్టుయిన్ ఓ వికెట్ తీశారు. ప్రిటోరియా ఇన్నింగ్స్లో షాయ్ హోప్ (25), డెవాల్డ్ బ్రెవిస్ (21), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (29), ఆండ్రీ రసెల్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. జోర్డన్ కాక్స్, లిజాడ్ విలియమ్స్, లుంగి ఎంగిడి డకౌటయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని రాయల్స్ 15.1 ఓవర్లలో ఛేదించింది. రూబిన్ హెర్మన్ (46), డాన్ లారెన్స్ (41), డేవిడ్ మిల్లర్ (28 నాటౌట్) ఆ జట్టును గెలిపించారు. ప్రిటోరియా బౌలర్లలో లిజాడ్ విలియమ్స్ 2, ఎంగిడి, పీటర్స్ తలో వికెట్ తీశారు.కాగా, ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా పార్ల్ రాయల్స్ ఈ ఎడిషన్ ప్లే ఆఫ్స్కు చేరింది. రాయల్స్తో పాటు సన్రైజర్స్ ఈస్ట్రన్కేప్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. మిగతా బెర్త్ల కోసం ప్రిటోరియా క్యాపిటల్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్ పోటీపడుతున్నాయి. -
స్టార్లతో నిండిన కర్ణాటకకు షాక్.. విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో విదర్భ
నిన్న (జనవరి 15) జరిగిన విజయ్ హజారే ట్రోఫీ 2025-26 తొలి సెమీ ఫైనల్లో స్టార్లతో నిండిన కర్ణాటకకు విదర్భ జట్టు ఊహించని షాక్ ఇచ్చింది. అమన్ మోఖడే (138) అద్భుతమైన సెంచరీతో ఆ జట్టును గెలిపించాడు. తద్వారా గత ఎడిషన్ ఫైనల్లో కర్ణాటక చేతిలో ఎదురైన పరాభవానికి విదర్భ ప్రతీకారం తీర్చుకుంది. ఇవాళ (జనవరి 16) జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో విదర్భ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది.పడిక్కల్ విఫలం.. రాణించిన కరుణ్ నాయర్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక.. విదర్భ పేసర్ దర్శన్ నల్కండే (10-0-48-5) దెబ్బకు 49.4 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటైంది. కరుణ్ నాయర్ (76), కృషణ్ శ్రీజిత్ (54) అర్ద సెంచరీలతో రాణించడంతో కర్ణాటక ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఈ ఎడిషన్లో దేవదత్ పడిక్కల్ (4) తొలిసారి విఫలమయ్యాడు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (9) కూడా డు ఆర్ డై మ్యాచ్లో హ్యాండిచ్చాడు. ధృవ్ ప్రభాకర్ (28), శ్రేయస్ గోపాల్ (36), అభినవ్ మనోహర్ (26), విజయ్ కుమార్ వైశాక్ (17) రెండంకెల స్కోర్లు చేశారు. విదర్భ బౌలర్లలో నల్కండే 5, యశ్ ఠాకూర్ 2, నచికేత్, యశ్ కదమ్ తలో వికెట్ తీశారు.అమన్ అద్భుత శతకం281 పరుగుల ఛేదనలో విదర్భ ఆదిలోనే అథర్వ తైడే (6) వికెట్ కోల్పోయినప్పటికీ.. మరో ఓపెనర్ అమన్ మోఖడే (138) అద్బుత శతకంతో కదం తొక్కడంతో 46.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. అమన్కు జతగా రవికుమార్ సమర్థ్ (76 నాటౌట్) రాణించాడు. ధృవ్ షోరే (47) పర్వాలేదనిపించాడు. కర్ణాటక బౌలర్లలో అభిలాశ్ షెట్టి (10-0-48-3) కాస్త ప్రభావం చూపినప్పటికీ, మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. -
24 గంటల్లో సీన్ రివర్స్.. యూపీ వారియర్జ్ ప్లేయర్ అద్భుతం
మహిళల ప్రీమియర్ లీగ్-2026లో యూపీ వారియర్జ్ తొలి విజయం నమోదు చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్తో నిన్న (జనవరి 15) జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. గత మ్యాచ్లో నిదానంగా ఆడుతుందని రిటైర్డ్ ఔట్గా వెనక్కు పలిపించిన హర్లీన్ డియోల్ ఈ మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్తో వారియర్జ్ను గెలిపించింది. 24 గంటల్లోనే హర్లీన్ నుంచి ఈ కమ్ బ్యాక్ చూసి అభిమానులు ఔరా అంటున్నారు.పూర్తి వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. నాట్ సీవర్ బ్రంట్ (65) అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. అమన్జోత్ కౌర్ (38), నికోలా క్యారీ (32 నాటౌట్) ఓ మోస్తరు ఇన్నింగ్స్లు ఆడారు. ఈ ఎడిషన్లో అద్భుతంగా రాణిస్తున్న కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (16) ఈ మ్యాచ్లో తక్కువ స్కోర్కే ఔటైంది. వారియర్జ్ బౌలర్లలో శిఖా పాండే, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, ఆశా శోభన తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో ఆది నుంచే నిలకడగా ఆడిన వారియర్జ్ 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి గెలుపు తీరాలు చేరింది. ఒత్తిడిలో హర్లీన్ డియోల్ (39 బంతుల్లో 64 నాటౌట్; 12 ఫోర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి వారియర్జ్ను గెలిపించింది. ఆమెకు మెగ్ లాన్నింగ్ (25), లిచ్ఫీల్డ్ (25), క్లో ట్రాయాన్ (27 నాటౌట్) సహకరించారు. ముంబై బౌలర్లలో నాట్ సీవర్ బ్రంట్ 2, అమేలియా కెర్ ఓ వికెట్ తీశారు. -
స్మృతి మంధాన కీలక నిర్ణయం
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లండ్లో జరిగే 'ద హండ్రెడ్' (The Hundred) 2026 సీజన్ కోసం మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీతో మంధాన ఒప్పందం కుదుర్చుకుంది.ఈ విషయాన్ని సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ అధికారికంగా గురువారం ప్రకటించింది. గత సీజన్కు వరకు మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ మాంచెస్టర్ ఒరిజినల్స్గా ఉండేది. అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా..మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టులో 70% వాటాను కొనుగొలు చేశారు. దీంతో మాంచెస్టర్ ఒరిజినల్స్ పేరును లక్నో సూపర్ జెయింట్స్గా మార్చారు. మాంచెస్టర్ జట్టులో మెగ్ లానింగ్, సోఫీ ఎకిల్స్టోన్ వంటి స్టార్ ప్లేయర్లు కూడా ఉన్నారు. స్మృతికి 'ది హండ్రెడ్' టోర్నీలో ఆడిన అనుభవం ఉంది. గతంలో ఆమె సదరన్ బ్రేవ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించింది 2022 సీజన్లో సదరన్ బ్రేవ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా మంధాన నిలిచింది. ఇక మాంచెస్టర్ పురుషల జట్టులో జోస్ బట్లర్, హెన్రిచ్ క్లాసెన్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. ఇక ఈ ఏడాది సీజన్ జూలై 21 నుంచి ఆరంభం కానుంది.చదవండి: BCB: ఆటగాళ్ల తిరుగు బాటు..! కీలక అధికారిపై వేటు వేసిన బీసీబీ -
Under 19 World Cup 2026: భారత్ శుభారంభం
ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ 2026లో భారత్ శుభారంభం చేసింది. గురువారం బులవాయో వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో యువ భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండ్షోతో అదరగొట్టింది.తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా భారత బౌలర్లు చెలరేగడంతో 35.2 ఓవర్లలో కేవలం 107 పరుగులకే కుప్పకూలింది. పేసర్ హేనిల్ పటేల్ అద్భుతమైన ప్రదర్శనతో ప్రత్యర్ధి పతనాన్ని శాసించాడు. హెనిల్ 7 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.అతడితో పాటు దీపేష్, అబ్రిష్, ఖిలాన్ పటేల్, వైభవ్ సూర్యవంశీ తలా వికెట్ సాధించారు. అమెరికా బ్యాటర్లలో నితీష్ సుదిని (36) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో భారత్ లక్ష్యాన్ని 37 ఓవర్లలో 96 పరుగులుగా నిర్ణయించారు.ఈ టార్గెట్ను భారత్ 17.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. వైభవ్ సూర్యవంశీ(2), అయూశ్ మాత్రే(19), త్రివేది(2) నిరాశపరిచినప్పటికి.. వికెట్ కీపర్ అభిజ్ఞాన్ కుండు (42) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అమెరికా బౌలర్లలో రిత్విక్ రెండు వికెట్లు పడగొట్టగా.. రిషబ్ షింపి ఒక్క వికెట్ సాధించాడు. భారత్ తమ తదుపరి మ్యాచ్లో జనవరి 17న బంగ్లాదేశ్తో తలపడనుంది.చదవండి: BCB: ఆటగాళ్ల తిరుగు బాటు..! కీలక అధికారిపై వేటు వేసిన బీసీబీ -
ఆటగాళ్ల తిరుగు బాటు..! కీలక అధికారిపై వేటు వేసిన బీసీబీ
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. క్రికెటర్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన బోర్డు ఫైనాన్స్ కమిటీ ఛైర్మన్, డైరెక్టర్ నజ్ముల్ ఇస్లాంను తన పదవి నుంచి బీసీబీ తొలగించింది. అతడి స్ధానంలో బీసీబీ చైర్మెన్ అమీనుల్ ఇస్లాం తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారు. దీంతో బోర్డుకు, ఆటగాళ్లకు మధ్య చెలరేగిన వివాదం ఓ కొలిక్కి వచ్చినట్లే.వివాదానికి కారణం ఏంటంటే?ఐపీఎల్-2026 నుంచి బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ను బీసీసీఐ ఆదేశాలతో కేకేఆర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో భారత్లో తమ జట్టుకు భద్రత లేదని, తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి బంగ్లా క్రికెట్ బోర్డు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఈ విషయంపై ఐసీసీ-బీసీబీ మధ్య ఇంకా చర్చలు నడుస్తున్నాయి.అయితే ఈ వివాదంపై బంగ్లా మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ స్పందిస్తూ భావోద్వేగాలకు పోకుండా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించాడు. తమీమ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీబీ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ నజ్ముల్ ఇస్లాం.. సోషల్ మీడియా వేదికగా తమీమ్ ఇక్బాల్ను ‘ఇండియన్ ఏజెంట్’ అని సంబోధించాడు.ఈ క్రమంలో 16 ఏళ్ల పాటు దేశానికి సేవలందించిన ఆటగాడిపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల క్రికెటర్ల సంక్షేమ సంఘం (CWAB) మండిపడింది. చాలా మంది క్రికెటర్లు కూడా అతడి వ్యాఖ్యలను ఖండించారు. ఆ తర్వాత మరోసారి నజ్ముల్ ఇస్లాం వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు."ఒకవేళ బంగ్లా క్రికెట్ జట్టు వరల్డ్ కప్లో ఆడకపోయినా బోర్డుకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఐసీసీ నుంచి రావాల్సిన రూ. 290 కోట్ల రెవెన్యూ ఎలాగూ వస్తుంది. కానీ ఆటగాళ్లే నష్టపోతారు. వారు ఈ అవకాశాన్ని కోల్పోతే ఎలాంటి పరిహారం ఉండదు. బోర్డు ఆటగాళ్లపై కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తోంది.కానీ ప్రతీ ఐసీసీ టోర్నీలో జట్టు విఫలమవుతోంది. అటువంటి సందర్భాల్లో బోర్డు వారిపై ఖర్చు చేసే డబ్బులను తిరిగి చెల్లించమని మేము అడగడం లేదు కదా?" అని నజ్ముల్ పేర్కొన్నాడు. దీంతో అతడి కామెంట్స్పై క్రికెటర్ల సంక్షేమ సంఘం మరోసారి అగ్రహం వ్యక్తం చేసింది.చదవండి: IND vs USA: వైభవ్ సూర్యవంశీ అట్టర్ ప్లాప్..నజ్ముల్ ఇస్లాం తన పదవికి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) మ్యాచులతో పాటు అంతర్జాతీయ మ్యాచులను కూడా ఆడబోమని ఆటగాళ్లు స్పష్టం చేశారు. నజ్ముల్ ఇస్లాంకు షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పటికి బంగ్లా ప్లేయర్లు వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో గురువారం జరగాల్సిన రెండు బీపీఎల్ మ్యాచ్లు వాయిదా పడ్డాయి. దీంతో బోర్డు పెద్దలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి నజ్ముల్ ఇస్లాంపై వేటు వేశారు. -
వైభవ్ సూర్యవంశీ అట్టర్ ప్లాప్..
అండర్-19 ప్రపంచకప్ తొలి మ్యాచ్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తీవ్ర నిరాశపరిచాడు. ఈ టోర్నీలో భాగంగా అమెరికాతో జరుగుతున్న మ్యాచ్లో సూర్యవంశీ తన మార్క్ చూపించలేకపోయాడు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా.. భారత బౌలర్లు చెలరేగడంతో 35.2 ఓవర్లలో కేవలం 107 పరుగులకే కుప్పకూలింది.దీంతో స్వల్ప లక్ష్య చేధనలో వైభవ్ తనదైన శైలిలో విరుచుకుపడతాడని అంతా భావించారు. కానీ 14 ఏళ్ల వైభవ్ మాత్రం తుస్సుమన్పించాడు. 2 పరుగులు చేసిన సూర్యవంశీ.. రిత్విక్ అప్పిడి బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో ప్రత్యర్ధి జట్టు సంబరాల్లో మునిగితేలిపోయింది. బౌలింగ్లో మాత్రం వైభవ్ ఓ వికెట్ పడగొట్టాడు.వర్షం అటంకి..కాగా భారత్ లక్ష్య చేధనకు వరుణుడు అడ్డంకిగా మారాడు. 4 ఓవర్లలో భారత్ స్కోర్ 21/1 వద్ద ఉండగా.. వర్షం అంతరాయం కలిగించింది. క్రీజులో అయూశ్ మాత్రే(15), త్రివేది(2) ఉన్నారు. అంతకుముందు భారత బౌలర్లలో హెనిల్ పటేల్ 5 వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు దీపేష్, అబ్రిష్, ఖిలాన్ పటేల్ తలా వికెట్ సాధించారు. అమెరికా బ్యాటర్లలో నితీష్ సుదిని (36) టాప్ స్కోరర్గా నిలివగా.. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు.చదవండి: IND vs NZ: జడేజా కథ ముగిసినట్లేనా? అతడే సరైన ప్రత్యామ్నాయం -
మిచెల్ స్టార్క్కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. డిసెంబర్ 2025 నెలకు గాను 'ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా స్టార్క్ ఎంపికయ్యాడు. ఇటీవల ముగిసిన యాషెస్ సిరీస్లో స్టార్క్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. యాషెస్ను ఆస్ట్రేలియా 4-1 తేడాతో సొంతం చేసుకోవడంలో స్టార్క్ది కీలక పాత్ర.ఈ ఐదు టెస్టుల సిరీస్లో స్టార్క్ ఏకంగా 31 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ రెగ్యూలర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్, హాజిల్వుడ్ గాయాల కారణంగా దూరం కవడంతో.. పేస్ దళాన్ని స్టార్క్ ముందుండి నడిపించాడు. కేవలం బౌలింగ్లోనే కాకుండా, బ్యాటింగ్లోనూ అతడు సత్తాచాటాడు.బ్రిస్బేన్, ఆడిలైడ్ టెస్టుల్లో అతడు హాఫ్ సెంచరీలతో మెరిశాడు. ఈ కారణంగానే అతడికి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ఈ అవార్డు కోసం వెస్టిండీస్కు ఆల్రౌండర్ జస్టిన్ గ్రీవ్స్, న్యూజిలాండ్ బౌలర్ జాకబ్ డఫీ పోటీపడ్డారు. కానీ వారిద్దరికంటే స్టార్క్ ప్రదర్శనలు మెరుగ్గా ఉండడంతో అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డు దక్కడంపై స్టార్క్ స్పందించాడు."ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఎంపికవ్వడం చాలా గర్వంగా ఉంది. సొంతగడ్డపై జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ విజయంలో భాగం కావడం మరింత సంతోషాన్ని ఇచ్చింది. మా దృష్టి ఇప్పుడు 'ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్' ఫైనల్పై ఉంది" అని స్టార్క్ పేర్కొన్నాడు. కాగా ఈ అవార్డును ఓ ఆస్ట్రేలియా ప్లేయర్ గెలుచుకోవడం రెండేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. చివరిసారిగా డిసెంబర్ 2023లో పాట్ కమిన్స్ సొంతం చేసుకున్నాడు.చదవండి: IND vs NZ: జడేజా కథ ముగిసినట్లేనా? అతడే సరైన ప్రత్యామ్నాయం -
చెలరేగిన భారత బౌలర్లు.. 107 పరుగులకే అమెరికా ఆలౌట్
అండర్-19 ప్రపంచకప్లో భాగంగా బులవాయో వేదికగా అమెరికాతో జరగుతున్న మ్యాచ్లో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా జట్టు యువ భారత బౌలర్ల ధాటికి 35.2 ఓవర్లలో కేవలం 107 పరుగులకే కుప్పకూలింది. ముఖ్యంగా టీమిండియా పేసర్ హెనిల్ పటేల్ అద్భుతమైన బౌలింగ్తో అమెరికా నడ్డి విరిచాడు.హెనిల్ 7 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను పడగొట్టాడు. అమరీందర్ గిల్, అర్జున్ మహేష్ వంటి కీలక వికెట్లను హెనిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో పాటు దీపేష్, అబ్రిష్, ఖిలాన్ పటేల్, వైభవ్ సూర్యవంశీ తలా వికెట్ సాధించారు. అమెరికా బ్యాటర్లలో నితీష్ సుదిని (36) టాప్ స్కోరర్గా నిలివగా.. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు.తుది జట్ల వివరాలు:భారత్: ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, హెనిల్ పటేల్, అభిజ్ఞాన్ కుందు (కీపర్), హర్వాన్ష్ పంగాలియా, ఆర్ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, దీపేష్ దేవేంద్రన్, ఖిలాన్ పటేల్అమెరికా: సాహిల్ గార్గ్,అమరీందర్ గిల్, అర్జున్ మహేష్,ఉత్కర్ష్ శ్రీవాస్తవ,అద్నిత్ జంబ్, అమోఘ్ ఆరేపల్లి, నితీష్ సుదిని, ఆదిత్ కప్పా, శబరీష్ ప్రసాద్, రిషబ్ షింపీ, రిత్విక్ అప్సిడి -
జడేజా కథ ముగిసినట్లేనా? అతడే సరైన ప్రత్యామ్నాయం
టీమిండియా వెటరన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వన్డేలకు వీడ్కోలు చెప్పాల్సిన సమయం అసన్నమైందా? అంటే అవునానే సమాధనం ఎక్కువగా వినిపిస్తోంది. జడేజా టెస్టు క్రికెట్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నప్పటికి.. వన్డేల్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోతున్నాడు.ప్రస్తుతం న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లోనూ అతడి ఆట తీరు ఏ మాత్రం మారలేదు. తొలి వన్డేలో కూడా ఘోరంగా విఫలమైన జడేజా బుధవారం జరిగిన రెండో వన్డేలోనూ అదే తీరును కనబరిచాడు. ఈ మ్యాచ్లో జడేజా 8 ఓవర్లు వేసి వికెట్లేమీ తీయకుండా 44 పరుగులు సమర్పించుకున్నాడు.బ్యాటింగ్లోనూ కేవలం 27 పరుగులు చేశాడు. వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా సిరీస్ మధ్యలోనే వైదొలిగడంతో జడేజా ఒక్కడే సీనియర్ స్పిన్ ఆల్రౌండర్గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అక్షర్ పటేల్ను ఎందుకు వన్డే జట్టులోకి తీసుకోవడం లేదని సెలెక్టర్లను శ్రీకాంత్ ప్రశ్నించాడు. జడేజా పేలవ ఫామ్ గురుంచి కూడా అతడు మాట్లాడాడు."నాకు ఇష్టమైన ఆటగాళ్లలో జడేజా ఒకరు. కానీ అతడు ప్రస్తుతం పేలవ ఫామ్తో సతమతమవుతున్నాడు. బంతితో పాటు బ్యాట్తో కూడా రాణించలేకపోతున్నాడు. బంతిని అటాకింగ్గా వేయాలా లేక ఫ్లైట్ ఇచ్చి బ్యాటర్ను ట్రాప్ చేయాలా అనే విషయంలో అతడు కాస్త గందరగోళంగా ఉన్నాడు.ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో ఎందుకు ఆడకూడదు? ఆల్రౌండర్ అంటే మీడియం పేసరే ఉండాలనే రూల్ ఏమైనా ఉందా? రాజ్కోట్ వన్డేలో భారత్కు అదనపు స్పిన్నర్ లేని లోటు స్పష్టంగా కన్పించింది. అక్షర్ పటేల్ ఉండి ఉంటే బాగుండేది. అక్షర్ను ఎందుకు జట్టులోకి తీసుకోవడం లేదు? అతడొక అద్భుతమైన ఆల్రౌండర్. చాలా మ్యాచ్లలో జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. హార్దిక్ పాండ్యాకు సాటి వచ్చే ఆటగాడు దొరకడం కష్టం. కాబట్టి అత్యుత్తమ ఫామ్లో ఉన్న అక్షర్ పటేల్ను జట్టులోకి తీసుకోవడం బెటర్" అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. కాగా వాషీ స్దానంలో తుది జట్టులోకి పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.దీంతో మరోసారి భారత జట్టులో ఆల్రౌండర్ల కొరత కన్పిస్తోంది. ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలికిన జడేజా.. ఇదే ఫామ్ కొనసాగితే వన్డేల నుంచి కూడా తప్పుకొనే అవకాశముంది. ఈ క్రమంలో జడేజాకు ప్రత్యామ్నాయంగా అక్షర్ పటేల్ పేరును చాలా మంది మాజీలు సూచిస్తున్నారు.చదవండి: ఇరగదీసిన అరంగేట్రం ఆటగాడు.. ప్లే ఆఫ్స్కు సన్రైజర్స్జడేజా తరహాలోనే ఎడమచేతి వాటం స్పిన్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం అక్షర్కు ఉంది. 2027 వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకుని, సెలక్టర్లు అక్షర్ పటేల్కే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. అక్షర్ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లోనూ సత్తాచాటాడు. అంతేకాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టులోనూ అతడు భాగంగా ఉన్నాడు. -
ఇరగదీసిన అరంగేట్రం ఆటగాడు.. ప్లే ఆఫ్స్కు సన్రైజర్స్
సౌతాఫ్రికా టీ20 లీగ్లో సన్రైజర్స్ ఈస్ట్రన్కేప్ జట్టు వరుసగా నాలుగో ఎడిషన్లో ప్లే ఆఫ్స్కు చేరింది. 2025-26 ఎడిషన్లో భాగంగా నిన్న (జనవరి 14) జోబర్గ్ సూపర్ కింగ్స్పై గెలుపుతో ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్లో అరంగేట్రం ఆటగాడు జేమ్స్ కోల్స్ అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శనతో సన్రైజర్స్కు గెలిపించాడు.తొలుత బ్యాటింగ్లో (34 బంతుల్లో 61; 10 ఫోర్లు) ఇరగదీసి, ఆతర్వాత బౌలింగ్లోనూ (4-0-34-2) సత్తా చాటాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్.. కోల్స్, డికాక్ (54) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. మిగతా ఆటగాళ్లలో జానీ బెయిర్స్టో 18, మాథ్యూ బ్రీట్జ్కీ 3, జోర్డన్ హెర్మన్ 13, ట్రిస్టన్ స్టబ్స్ 23 (నాటౌట్) పరుగులు చేశారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో డొనొవన్ ఫెరియెరా 2, నండ్రే బర్గర్, అకీల్ హొసేన్, వియన్ ముల్దర్ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో.. ముత్తుసామి (4-0-26-3), కోల్స్ (4-0-34-2), మార్కో జన్సెన్ (3.1-0-33-2), నోర్జే (4-0-13-1), ఆడమ్ మిల్నే (3-0-10-1) ధాటికి సూపర్ కింగ్స్ 18.1 ఓవర్లలో 117 పరుగులకే చాప చుట్టేసింది. ఆ జట్టు తరఫున 30 పరుగులు చేసిన జేమ్స్ విన్స్ టాప్ స్కోరర్గా నిలిచాడు. మరో ఐదు మంది రెండంకెల స్కోర్లు చేయగలగినా, ఒక్కరే 20 పరుగుల మార్కును దాటారు. ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కు చేరిన తొలి జట్టు సన్రైజర్స్. పార్ల్ రాయల్స్, ప్రిటోరియా క్యాపిటల్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్ మిగతా ప్లే ఆఫ్స్ బెర్త్లక కోసం పోటీ పడుతున్నాయి. -
టీ20 ప్రపంచకప్కు ముందు పాకిస్తాన్కు ఆస్ట్రేలియా
టీ20 ప్రపంచకప్-2026కు ముందు ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఆసీస్-పాక్ మూడు టీ20లు ఆడనున్నాయి. ప్రపంచకప్కు సన్నాహకంగా ఇరు జట్లకు ఈ సిరీస్ ఉపయోగపడుతుంది. ఈ సిరీస్లోని మూడు మ్యాచ్లకు లాహోర్లోని గడాఫీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు జనవరి 28న లాహోర్కు చేరుకుంటుంది. జనవరి 29, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. ప్రపంచకప్లో పాల్గొనే ఆసీస్ జట్టే ఈ సిరీస్లోనూ కొనసాగనుంది. ప్రపంచకప్ కోసం పాక్ జట్టును ప్రకటించాల్సి ఉంది.ఆస్ట్రేలియా జట్టు 2022 మార్చిలో చివరిసారిగా పాకిస్తాన్లో పర్యటించింది. ఆ పర్యటనలో టెస్ట్, టీ20 సిరీస్లను ఆసీస్ గెలుచుకోగా.. వన్డే సిరీస్ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది.కాగా, టీ20 ప్రపంచకప్ 2026 భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. మార్చి 8 వరకు సాగే ఈ మెగా టోర్నీలో 20 జట్లు పోటీపడుతున్నాయి. పాకిస్తాన్.. టీమిండియాతో పాటు గ్రూప్-ఏలో ఉండగా.. ఆ జట్టు ఆడే మ్యాచ్లన్నీ శ్రీలంకలో జరుగుతాయి. ఆస్ట్రేలియా గ్రూప్-బిలో ఉంది. పాకిస్తాన్-నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్తో ఈ మెగా టోర్నీ ప్రారంభమవుతుంది. -
T20 World cup 2026: మరో విదేశీ జట్టుకు కెప్టెన్గా భారతీయుడు
ఇటీవలికాలంలో ఇతర దేశాల క్రికెట్ జట్లలో భారతీయ మూలాలున్న ఆటగాళ్ల ప్రాతినిథ్యం ఎక్కువైంది. దాదాపు అన్ని ఐసీసీ సభ్య దేశాలు, అసోసియేట్ దేశాల జట్లలో భారతీయులు ఉంటున్నారు. ఆస్ట్రేలియా లాంటి జట్లలో సైతం భారతీయులు అవకాశాల కోసం పోటీపడుతున్నారు.న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లలో చాలాకాలం నుంచే భారతీయులకు ప్రాతినిథ్యం లభిస్తూ వస్తుంది. కనీసం ఒక్క భారత మూలాలున్న ఆటగాడైనా ఈ జట్లలో ఉంటూ వస్తున్నాడు. ఇటీవలికాలంలో సౌతాఫ్రికాలో సైతం భారతీయులు అవకాశాలు దక్కించుకుంటున్నారు. నెదర్లాండ్స్, యూఎస్ఏ, ఒమన్, కెనడా దేశాల జట్లలో అయితే సగానికి పైగా భారతీయులే ఉంటున్నారు.తాజాగా ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. టీ20 ప్రపంచకప్-2026 కోసం ఎంపిక రెండు విదేశీ జట్లకు భారత మూలాలున్న ఆటగాళ్లు కెప్టెన్లుగా నియమితులయ్యారు. ఒమన్ జట్టు కెప్టెన్గా జతిందర్ సింగ్.. కెనడా జట్టు కెప్టెన్గా దిల్ప్రీత్ బజ్వా ఎంపికయ్యారు. వీరి జట్లలో భారతీయుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఒమన్ జట్టులో సగానికి పైగా భారత మూలాలున్న ఆటగాళ్లే కాగా.. తాజాగా ప్రకటించిన కెనడా జట్టులో సైతం అదే స్థాయిలో భారతీయులు ఉన్నారు. వీరే కాక ప్రపంచకప్ కోసం ఇప్పటివరకు ప్రకటించిన జట్లలో మరికొంత మంది భారతీయ మూలాలున్న ఆటగాళ్లు ఉన్నారు. న్యూజిలాండ్ జట్టులో ఐష్ సోధి, రచిన్ రవీంద్ర, నెదర్లాండ్ జట్టులో ఆర్యన్ దత్, సౌతాఫ్రికా జట్టులో కేశవ్ మహారాజ్ లాంటి భారత మూలాలున్న ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు.ఓవరాల్గా చూస్తే.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారతీయ మూలాలున్న ఆటగాళ్లకు ప్రాతినిథ్యం లభిస్తుంది. ఈ మెగా టోర్నీ కోసం యూఎస్ఏ జట్టును ప్రకటించాల్సి ఉంది. ఈ జట్టుకు సైతం భారత మూలాలున్న మిలింద్ కుమార్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. ఈ జట్టులో సైతం చాలామంది భారతీయులు ఉన్నారు.ఇదిలా ఉంటే, భారత్, శ్రీలంక వేదికలుగా జరుగనున్న టీ20 ప్రపంచకప్-2026 కోసం 15 మంది సభ్యుల కెనడా జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా దిల్ప్రీత్ బజ్వా ఎంపికయ్యాడు. ఈ జట్టులో చాలామంది భారత మూలాలున్న ఆటగాళ్లు ఉన్నారు. మెగా టోర్నీలో కెనడా ప్రయాణం ఫిబ్రవరి 9న సౌతాఫ్రికా మ్యాచ్తో మొదలవుతుంది. ఈ టోర్నీలో కెనడా యూఏఈ, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్తో పాటు గ్రూప్-డిలో ఉంది. మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది.కెనడా టీ20 ప్రపంచ కప్ 2026 జట్టు: దిల్ప్రీత్ బజ్వా (C), అజయ్వీర్ హుందాల్, అన్ష్ పటేల్, దిలోన్ హేలిగర్, హర్ష్ ఠాకర్, జస్కరన్దీప్ బుట్టార్, కలీమ్ సనా, కన్వర్పాల్ తత్గూర్, నవనీత్ ధాలివాల్, నికోలస్ కిర్టన్, రవీందర్పాల్ సింగ్, సాద్ బిన్ జాఫర్, శివమ్ శర్మ, శ్రేయస్ మొవ్వ, యువరాజ్ సమ్రా -
న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు కీలక ప్లేయర్ దూరం
త్వరలో న్యూజిలాండ్తో జరుగబోయే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. న్యూజిలాండ్తో తొలి వన్డే సందర్భంగా గాయపడిన కీలక ఆటగాడు వాషింగ్టన్ సుందర్.. టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. సుందర్ ప్రపంచకప్లో పాల్గొనేది కూడా అనుమానంగా మారింది. న్యూజిలాండ్ టీ20 సిరీస్కు వరల్డ్కప్కు ఒకే జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే.సుందర్కు ఏమైంది..?జనవరి 11న వడోదరలో జరిగిన తొలి వన్డేలో బౌలింగ్ చేస్తుండగా సుందర్ ఎడమ వైపు పక్కటెముకల ప్రాంతంలో తీవ్రమైన నొప్పి వచ్చింది. దీంతో అతను ఉన్నపళంగా మైదానం వదిలి వెళ్లాడు. అయితే, ఛేదనలో అతని బ్యాటింగ్ సేవలు జట్టుకు అవసరం కావడంతో రిస్క్ చేసి బరిలోకి దిగాడు. ఈ ప్రయత్నమే సుందర్ గాయాన్ని మరింత పెంచిందని వైద్యులు భావిస్తున్నారు. ఆ మ్యాచ్లో సుందర్ తనవంతుగా 7 పరుగులు చేసి జట్టు విజయంలో భాగమయ్యాడు. అనివార్యం కావడంతో బ్యాటింగ్ చేసిన సుందర్, ఆతర్వాత వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతని స్థానాన్ని ఆయుశ్ బదోనితో భర్తీ చేశాడు. సుందర్ గాయం తీవ్రత అధికంగా ఉండటంతో తాజాగా అతన్ని టీ20 సిరీస్ నుంచి కూడా తప్పించారు. టీ20లకు సుందర్ ప్రత్యామ్నాయాన్ని ఇంకా ప్రకటించలేదు. పరిస్థితలు చూస్తుంటే సుందర్ టీ20 వరల్డ్కప్కు కూడా అనుమానమేనని తెలుస్తుంది. పొట్టి ఫార్మాట్లో సుందర్ లాంటి కీలకమైన మిడిలార్డర్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ లేకపోవడం టీమిండియా విజయావాకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది. సుందర్ ఇటీవలికాలంలో పొట్టి ఫార్మాట్లో నమ్మదగిన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఏ సమయంలో అయినా బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉండటంతో పాటు 6,7 స్థానాల్లో సైతం సమర్దవంతంగా బ్యాటింగ్ చేయగలడు.రియాన్ పరాగ్ వస్తాడా..?న్యూజిలాండ్ టీ20 సిరీస్కు సుందర్కు ప్రత్యామ్నాయంగా రియాన్ పరాగ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. పరాగ్ ఐపీఎల్ 2025లో ఓ మోస్తరుకు మించి రాణించాడు. 32.75 సగటున 393 పరుగులు చేశాడు. ఒకవేళ పరాగ్కు న్యూజిలాండ్ సిరీస్లో అవకాశం వచ్చి రాణిస్తే.. ప్రపంచకప్కు కూడా ఎంపికయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఉపఖండంలో పిచ్లపై స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు చాలా కీలకం. మరోవైపు వన్డేల్లో సుందర్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఆయుశ్ బదోనీనే టీ20 సిరీస్కు కూడా కొనసాగించే అవకాశాలు కూడా లేకపోలేదు. -
మరో అరుదైన మైలురాయిని తాకిన రోహిత్ శర్మ
భారత దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ తన కెరీర్లో మరో అరుదైన మైలురాయిని తాకాడు. ఆసియా ఖండంలో 7000 వన్డే పరుగులు పూర్తి చేసుకున్న ఏడో బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో నిన్న (జనవరి 14) జరిగిన రెండో వన్డేలో ఈ ఫీట్ను సాధించాడు. రోహిత్కు ముందు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, కుమార సంగక్కర, సనత్ జయసూర్య, మహేళ జయవర్దనే ఆసియాలో 7000 వన్డే పరుగుల మైలురాయిని తాకారు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలి వన్డేలో అద్బుత విజయం సాధించిన టీమిండియాకు రెండో మ్యాచ్లో చుక్కెదురైంది. పర్యాటక న్యూజిలాండ్ చేతిలో 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా.. కేఎల్ రాహుల్ (112 నాటౌట్) సూపర్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ (56) అర్ద సెంచరీతో రాణించాడు. మిగతా ఆటగాళ్లలో రోహిత్ శర్మ 24, విరాట్ కోహ్లి 23, శ్రేయస్ అయ్యర్ 8, రవీంద్ర జడేజా 27, నితీశ్ కుమార్ రెడ్డి 20, హర్షిత్ రాణా 2 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్ 3, జేమీసన్, ఫౌల్క్స్, లెన్నాక్స్, బ్రేస్వెల్ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. డారిల్ మిచెల్ (131 నాటౌట్) అద్భుతమైన సెంచరీతో కదంతొక్కడంతో 47.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మిచెల్కు విల్ యంగ్ (87) సహకరించాడు. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ క్యామియో (మెరుపు ఇన్నింగ్స్) ఆడాడు. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు ఎంత శ్రమించినా మిచెల్, యంగ్ను నిలువరించలేకపోయారు. కుల్దీప్ యాదవ్ అయితే ఒక్క వికెట్ తీసి, ఏకంగా 82 పరుగులు సమర్పించుకున్నాడు. మిగతా బౌలర్లది కూడా అదే పరిస్థితి. హర్షిత్, ప్రసిద్ద్ తలో వికెట్ తీసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కాగా, ఈ సిరీస్లో నిర్ణయాత్మక మూడో వన్డే ఇండోర్ వేదికగా జనవరి 18న జరుగనుంది. -
అందుకు మూల్యం చెల్లించుకున్నాం.. రెండో వన్డేలో ఓటమిపై గిల్ కామెంట్స్
రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో నిన్న (జనవరి 14) జరిగిన రెండో వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా.. మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (112 నాటౌట్) సూపర్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ (56) అర్ద సెంచరీతో రాణించాడు. మిగతా ఆటగాళ్లలో రోహిత్ శర్మ 24, విరాట్ కోహ్లి 23, శ్రేయస్ అయ్యర్ 8, రవీంద్ర జడేజా 27, నితీశ్ కుమార్ రెడ్డి 20, హర్షిత్ రాణా 2 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్ 3, జేమీసన్, ఫౌల్క్స్, లెన్నాక్స్, బ్రేస్వెల్ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. డారిల్ మిచెల్ (131 నాటౌట్) అద్భుతమైన సెంచరీతో కదంతొక్కడంతో 47.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మిచెల్కు విల్ యంగ్ (87) సహకరించాడు. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ క్యామియో (మెరుపు ఇన్నింగ్స్) ఆడాడు. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు ఎంత శ్రమించినా మిచెల్, యంగ్ను నిలువరించలేకపోయారు. కుల్దీప్ యాదవ్ అయితే ఒక్క వికెట్ తీసి, ఏకంగా 82 పరుగులు సమర్పించుకున్నాడు. మిగతా బౌలర్లది కూడా అదే పరిస్థితి. హర్షిత్, ప్రసిద్ద్ తలో వికెట్ తీసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ సైతం తమ బౌలింగ్ ప్రదర్శనపై పెదవి విరిచాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోవడం వల్ల మూల్యం చెల్లించుకున్నామని అన్నాడు. అదనంగా 15-20 పరుగులు చేసినా ఫలితం ఇలాగే ఉండేదని అభిప్రాయపడ్డాడు. బోర్డుపై మంచి స్కోర్ ఉంచినా, మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోవడమే మ్యాచ్ను తమ చేతి నుంచి లాగేసుకుందని తెలిపాడు.మరిన్ని విషయాలు గిల్ మాటల్లో.. 10–15 ఓవర్లలో బంతి కాస్త కదిలి బౌలర్లకు సహకరించింది. కానీ 20–25 ఓవర్ల తర్వాత పిచ్ స్థిరపడింది. మధ్య ఓవర్లలో మేము మరింత ధైర్యంగా బౌలింగ్ చేసి, రిస్క్ తీసుకొని ఉండాల్సింది. అలా చేసుంటే ఫలితం వేరుగా ఉండేది.ఫీల్డింగ్ లోపాలు కూడా జట్టును ఇబ్బందుల్లోకి నెట్టాయి. గత మ్యాచ్లో కూడా కొన్ని అవకాశాలు వదిలేశాం. ఫీల్డింగ్లో మెరుగుపడటానికి ప్రయత్నిస్తాం. అవకాశాలు వదిలేస్తే మాత్రం ఈ ఫార్మాట్లో ఓటమి తప్పదని గిల్ అభిప్రాయపడ్డాడు. మొత్తంగా గిల్ బౌలింగ్పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి మ్యాచ్ గెలవగా.. తాజాగా న్యూజిలాండ్ రెండో వన్డే గెలిచింది. ఈ సిరీస్లో నిర్ణయాత్మక మూడో వన్డే ఇండోర్ వేదికగా జనవరి 18న జరుగనుంది. -
అండర్-19 ప్రపంచకప్లో నేడు తొలి మ్యాచ్.. అందరి చూపు వైభవ్వైపే..!
జింబాబ్వే, నమీబియా వేదికలుగా నేటి నుంచి (జనవరి 15) అండర్-19 క్రికెట్ వరల్డ్కప్-2026 ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 6 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో 16 జట్లు పోటీపడుతున్నాయి. భారత్–యూఎస్ఏ మ్యాచ్తో ఈ టోర్నీ ప్రారంభమవుతుంది. ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతుండగా, టాంజానియా తొలిసారి అండర్-19 వరల్డ్కప్లో అడుగుపెట్టింది.23 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో మొత్తం 41 మ్యాచ్లు జరుగనున్నాయి. 16 జట్లు 4 గ్రూప్లుగా (గ్రూప్కు 4) విభజించబడి పోటీపడతాయి. అనంతరం సూపర్-6, సెమీస్, ఫైనల్ జరుగుతాయి. గ్రూప్ల వివరాలు- గ్రూప్ A: ఆస్ట్రేలియా, ఐర్లాండ్, శ్రీలంక, జపాన్ - గ్రూప్ B: భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అమెరికా - గ్రూప్ C: జింబాబ్వే, స్కాట్లాండ్, ఇంగ్లాండ్, పాకిస్తాన్ - గ్రూప్ D: వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్, టాంజానియా ఈ టోర్నీలో భారత్కు అద్భుతమైన రికార్డు ఉంది. మొత్తం ఐదు సార్లు టైటిల్ గెలిచింది. గత ఎడిషన్ (2024) ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఈ టోర్నీలో భారత్కు ఆయుశ్ మాత్రే కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ప్రత్యేక ఆకర్శనగా నిలువనున్నాడు. యువ భారత జట్టులో మరి కొంతమంది గమనించదగ్గ ఆటగాళ్లు ఉన్నారు. ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిగ్యాన్ కుందు, దీపేశ్ దేవేంద్రన్, హెనిల్ పటేల్, అంబ్రిష్ లాంటి వారు అద్భుత ప్రదర్శనలు చేస్తున్నారు. దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, రోహిత్ శర్మ లాంటి వారు అండర్-19 ప్రపంచకప్లో మెరిసి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. అందుకే ఈ టోర్నీకి చాలా ప్రత్యేకత ఉంది.ఈ టోర్నీలో అత్యంత విజయంవంతమైన జట్టు భారత్ (5) కాగా.. ఆస్ట్రేలియా 4, పాకిస్తాన్ 2, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ తలో సారి టైటిళ్లు గెలిచాయి. ఈ మెగా టోర్నీ భారత అభిమానుల కోసం JioHotstar యాప్, వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇవాళ జరిగే భారత్-యూఎస్ఏ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభం కానుంది. బులవాయోలోని క్వీన్స్ క్లబ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. -
ఢిల్లీ తొలి గెలుపు
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు బోణీ కొట్టింది. బుధవారం యూపీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట యూపీ వారియర్స్ నిరీ్ణత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కెపె్టన్ మెగ్లానింగ్ (38 బంతుల్లో 54; 9 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్సెంచరీతో సత్తా చాటగా... హర్లీన్ డియోల్ (36 బంతుల్లో 47; 7 ఫోర్లు), లిచ్ఫీల్డ్ (20 బంతుల్లో 27; 5 ఫోర్లు) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో షఫాలీ వర్మ, మరిజానే కాప్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. తెలుగమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి, స్నేహ్ రాణా, నందిని శర్మ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 158 పరుగులు చేసింది. లిజెల్లీ లీ (44 బంతుల్లో 67; 8 ఫోర్లు, 3 సిక్స్లు) దంచికొట్టగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షఫాలీ వర్మ (32 బంతుల్లో 36; 6 ఫోర్లు) రాణించింది. వీరిద్దరూ తొలి వికెట్కు 11.3 ఓవర్లలో 93 పరుగులు జోడించి జట్టుకు గట్టి పునాది వేయగా... వోల్వార్ట్ (25 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా (21; 3 ఫోర్లు) మిగిలిన పని పూర్తిచేశారు. ఇన్నింగ్స్ చివరి బంతికి వోల్వార్ట్ ఫోర్ కొట్టి గెలిపించింది. నేడు జరిగే మ్యాచ్లో ముంబైతో యూపీ వారియర్స్ ఆడుతుంది. స్కోరు వివరాలు యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: కిరణ్ నవగిరె (సి) షఫాలీ (బి) కాప్ 0; లానింగ్ (సి) హెన్రీ (బి) నందిని 54; లిచ్ఫీల్డ్ (స్టంప్డ్) లిజెల్లి (బి)స్నేహ్ రాణా 27; హర్లీన్ (రిటైర్డ్ అవుట్) 47; శ్వేత (సి) శ్రీచరణి (బి) షఫాలీ 11; ట్రియాన్ (సి) నికీ (బి) శ్రీచరణి 1; ఎకిల్స్టోన్ (ఎల్బీ) (బి) కాప్ 3; శోభన (నాటౌట్) 1; దీప్తి (సి) స్నేహ్ రాణా (బి) షఫాలీ 2; శిఖా (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–0, 2–47, 3–132, 4–141, 5–143, 6–148, 7–150, 8–152. బౌలింగ్: కాప్ 4–1–24–2; మిన్ను మణి 1–0–16–0; చినెల్లి 2–0–20–0; నందిని 3–0–29–1; స్నేహ్ రాణా 2–0–20–1; శ్రీచరణి 4–0–29–1; షఫాలీ 4–0–16–2. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: షఫాలీ (సి) దీప్తి (బి) శోభన 36; లిజెల్లీ (సి) కిరణ్ (బి) దీప్తి 67; వోల్వార్ట్ (నాటౌట్) 25; జెమీమా (సి) హర్లీన్ (బి) దీప్తి 21; కాప్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1–94, 2–114, 3–148. బౌలింగ్: క్రాంతి 2–0–10–0; శిఖ 4–0–22–0; ఎకిల్స్టోన్ 4–0– 44–0; ట్రియాన్ 3–0–35–0; శోభన 4–0–20–1; దీప్తి 3–0–26–2. -
న్యూజిలాండ్దే పైచేయి...
భారత్ వరుసగా గత ఎనిమిది వన్డేల్లో న్యూజిలాండ్ను ఓడిస్తూ వచ్చి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఎట్టకేలకు ఈ జోరును కివీస్ ముగించగలిగింది. ముందుగా సమష్టి బౌలింగ్తో భారత్కు 300 పరుగులు కూడా దాటనీయకుండా నిలువరించిన జట్టు... ఆ తర్వాత మిచెల్, విల్ యంగ్ పదునైన బ్యాటింగ్తో విజయాన్ని సొంతం చేసుకుంది. మన బౌలర్లంతా విఫలం కాగా, అంతకుముందు కేఎల్ రాహుల్ చేసిన అజేయ సెంచరీ వృథా అయింది. రాజ్కోట్: భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ 1–1తో సమమైంది. బుధవారం జరిగిన రెండో మ్యాచ్లో కివీస్ 7 వికెట్ల తేడాతో భారత్పై గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (92 బంతుల్లో 112 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకం సాధించాడు. కెపె్టన్ శుబ్మన్ గిల్ (53 బంతుల్లో 56; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ నమోదు చేశాడు. అనంతరం న్యూజిలాండ్ 47.3 ఓవర్లలో 3 వికెట్లకు 286 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డరైల్ మిచెల్ (117 బంతుల్లో 131 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్లు), విల్ యంగ్ (98 బంతుల్లో 87; 7 ఫోర్లు) మూడో వికెట్కు 25.2 ఓవర్లలో 162 పరుగులు జోడించి జట్టు గెలుపును సులువు చేశారు. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డే ఆదివారం ఇండోర్లో జరుగుతుంది. కీలక భాగస్వామ్యాలు... భారత్ ఇన్నింగ్స్ను రోహిత్ శర్మ (38 బంతుల్లో 24; 4 ఫోర్లు), గిల్ నెమ్మదిగా ప్రారంభించారు. ఫలితంగా తొలి 5 ఓవర్లలో 10 పరుగులే వచ్చాయి. అయితే తాను ఆడిన తర్వాతి 10 బంతుల్లో రోహిత్ 4 ఫోర్లు కొట్టగా, ఫోక్స్ ఓవర్లో గిల్ వరుసగా 4, 6 కొట్టడంతో 3 ఓవర్లలో భారత్ 33 పరుగులు రాబట్టింది. 10 ఓవర్లలో జట్టు స్కోరు 57 పరుగులకు చేరింది. 70 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం తర్వాత రోహిత్ వెనుదిరగ్గా, 47 బంతుల్లో గిల్ అర్ధసెంచరీ పూర్తయింది. ఈసారి విరాట్ కోహ్లి (29 బంతుల్లో 23; 2 ఫోర్లు) ఎక్కువ ప్రభావం చూపలేకపోయాడు. గత ఐదు ఇన్నింగ్స్లలో వరుసగా 74, 135, 102, 65, 93 చేసిన అతను ఈ మ్యాచ్లో అర్ధసెంచరీ అందుకోలేకపోయాడు. కివీస్ మెరుగైన బౌలింగ్ ప్రదర్శనతో 19 పరుగుల వ్యవధిలో భారత్ గిల్, శ్రేయస్ అయ్యర్ (8), కోహ్లి వికెట్లు కోల్పోయింది. మధ్య ఓవర్లలో న్యూజిలాండ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఒక దశలో 62 బంతుల పాటు ఒక్క ఫోర్ కూడా రాలేదు! ఇలాంటి స్థితిలో రాహుల్ రెండు కీలక భాగస్వామ్యాలతో జట్టును ఆదుకున్నాడు. ముందుగా జడేజా (44 బంతుల్లో 27; 1 ఫోర్)తో ఐదో వికెట్కు 73 పరుగులు జోడించిన రాహుల్... ఆ తర్వాత ఆరో వికెట్కు నితీశ్ కుమార్ రెడ్డి (21 బంతుల్లో 20; 1 సిక్స్)తో 57 పరుగులు జత చేశాడు. హర్షిత్ రాణా (2) విఫలం కాగా 48 ఓవర్లు ముగిసేసరికి రాహుల్ 88 పరుగులతో ఉన్నాడు. జేమీసన్ వేసిన 49వ ఓవర్లో తొలి 5 బంతుల్లో 8 పరుగులు రాబట్టిన అతను... ఆఖరి బంతిని లాంగాన్ మీదుగా భారీ సిక్సర్గా మలచి 87 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బౌలర్లు విఫలం... లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ కూడా ఆరంభంలో తడబడింది. పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో భారత్ పేస్ బౌలింగ్నే ఎక్కువసేపు కొనసాగించింది. పేసర్లే వేసిన తొలి 15 ఓవర్లలో కివీస్ 64 పరుగులు మాత్రమే చేసి కాన్వే (16), నికోల్స్ (10) వికెట్లు కోల్పోయింది. అయితే మిచెల్, యంగ్ పట్టుదలగా క్రీజ్లో నిలబడి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముందుగా నిలదొక్కుకోవడంపై దృష్టి పెట్టిన వీరిద్దరు ఆ తర్వాత స్వేచ్ఛగా ఆడుతూ పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో ముందుగా మిచెల్ 52 బంతుల్లో, ఆ తర్వాత యంగ్ 68 బంతుల్లో హాఫ్ సెంచరీలను అందుకున్నారు. ఈ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. కుల్దీప్ బౌలింగ్లో 80 పరుగుల వద్ద మిచెల్ ఇచ్చిన క్యాచ్ను బౌండరీ వద్ద ప్రసిధ్ వదిలేయడం కూడా జట్టుకు కలిసొచి్చంది. ఎట్టకేలకు కుల్దీప్ తర్వాతి ఓవర్లో యంగ్ వెనుదిరగడం భారత్కు కాస్త ఊరటనిచి్చంది. అయితే మిచెల్ మాత్రం తగ్గలేదు. 96 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న అతను... గ్లెన్ ఫిలిప్స్ (25 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు 1 సిక్స్)తో కలిసి మరో 15 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ను ముగించాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) యంగ్ (బి) క్లార్క్ 24; గిల్ (సి) మిచెల్ (బి) జేమీసన్ 56; కోహ్లి (బి) క్లార్క్ 23; అయ్యర్ (సి) బ్రేస్వెల్ (బి) క్లార్క్ 8; రాహుల్ (నాటౌట్) 112; జడేజా (సి అండ్ బి) బ్రేస్వెల్ 27; నితీశ్ రెడ్డి (సి) ఫిలిప్స్ (బి) ఫోక్స్ 20; హర్షిత్ (సి) బ్రేస్వెల్ (బి) లెనాక్స్ 2; సిరాజ్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 10; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 284. వికెట్ల పతనం: 1–70, 2–99, 3–115, 4–118, 5–191, 6–248, 7–256. బౌలింగ్: జేమీసన్ 10–2–70–1, ఫోక్స్ 9–0–67–1, క్లార్క్ 8–0–56–3, లెనాక్స్ 10–0–42–1, బ్రేస్వెల్ 10–1–34–1, ఫిలిప్స్ 3–0–13–0. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (బి) హర్షిత్ 16; నికోల్స్ (బి) ప్రసిధ్ 10; యంగ్ (సి) నితీశ్ (బి) కుల్దీప్ 87; మిచెల్ (నాటౌట్) 131; ఫిలిప్స్ (నాటౌట్) 32; ఎక్స్ట్రాలు 10; మొత్తం (47.3 ఓవర్లలో 3 వికెట్లకు) 286. వికెట్ల పతనం: 1–22, 2–46, 3–208. బౌలింగ్: సిరాజ్ 9–0–41–0, హర్షిత్ 9.3–1–52–1, ప్రసిధ్ 9–0–49–1, నితీశ్ రెడ్డి 2–0–13–0, జడేజా 8–0–44–0, కుల్దీప్ 10–0–82–1. -
రాహుల్ సెంచరీ వృథా.. రాజ్కోట్ వన్డేలో టీమిండియా ఓటమి
రాజ్కోట్ వేదికగా భారత్తో జరిగిన రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను 1-1తో బ్లాక్ క్యాప్స్ జట్టు సమం చేసింది. 285 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ఆడుతూ పడుతూ 47.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. మిడిలార్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మిచెల్ అజేయ శతకంతో చెలరేగాడు.117 బంతులు ఎదుర్కొన్న మిచెల్.. 11 ఫోర్లు, 2 సిక్స్లతో 131 పరుగులు చేశాడు. అతడితో విల్ యంగ్ కూడా కీలక నాక్ ఆడాడు. యంగ్ 98 బంతుల్లో 87 పరుగులు చేసి ఔటయ్యాడు. చివరిలో గ్లెన్ ఫిలిప్స్ (25 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్తో 32) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. కుల్దీప్ యాదవ్, ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ రాణా తలా వికెట్ సాధించారు.రాహుల్ సెంచరీ వృథా..అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(12) విరోచిత శతకంతో చెలరేగగా.. కెప్టెన్ శుభ్మన్ గిల్(56) హాఫ్ సెంచరీతో రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టేన్ క్లార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. జేమీసన్, పౌల్క్స్, బ్రెస్వెల్ తలా వికెట్ సాధించారు. ఇక సిరీస్ డిసైడర్ మూడో వన్డే ఇండోర్ వేదికగా జనవరి 18న జరగనుంది. -
కెప్టెన్గా మహ్మద్ సిరాజ్.. అధికారిక ప్రకటన
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ సెకెండ్ లెగ్ మ్యాచ్లు జనవరి 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మిగిలిన రెండు లీగ్ మ్యాచ్లకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. జనవరి 22న ముంబై, 29న ఛత్తీస్గఢ్తో హైదరాబాద్ తలపడనుంది.ఈ సమయంలో జాతీయ విధులు లేకపోవడంతో సిరాజ్ రంజీల్లో ఆడనున్నాడు. ఈ క్రమంలోనే సెలెక్టర్లు అతడికి జట్టు పగ్గాలను అప్పగించారు. సిరాజ్ డిప్యూటీగా రాహుల్ సింగ్ వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో తనయ్ త్యాగరాజన్, కె రోహిత్ రాయుడు వంటి సీనియర్ ప్లేయర్లకు చోటు దక్కింది. విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీతో చెలరేగిన అమన్రావ్ పేరాల కూడా ఉన్నాడు.హైదరాబాద్ జట్టుమహ్మద్ సిరాజ్, రాహుల్ సింగ్, సీవీ మిలింద్, తనయ్ త్యాగరాజన్, కె రోహిత్ రాయుడు,కె హిమతేజ, వరుణ్ గౌడ్,ఎం అభిరత్ రెడ్డి, రాహుల్ రాధేష్, అమన్ రావ్, రక్షణ్ రెడ్డి, నితిన్ సాయి యాదవ్, నితీశ్ రెడ్డి, సాయి ప్రగ్నయ్ రెడ్డి,బి పున్నయ్యచదవండి: IND vs NZ: వారెవ్వా హర్షిత్.. దెబ్బకు ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది! వీడియో -
వారెవ్వా హర్షిత్.. దెబ్బకు ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది! వీడియో
టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా మరోసారి బంతితో అద్భుతం చేశాడు. న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వేను సంచలన బంతితో రాణా క్లీన్ బౌల్డ్ చేశాడు. 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్కు ఓపెనర్లు కాన్వే, హెన్రీ నికోల్స్ ఘనమైన ఆరంభాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించారు.కానీ భారత పేసర్లు రాణా, సిరాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ఓపెనర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఈ క్రమంలో కివీస్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో రాణా వేసిన అద్భుతమైన డెలివరీకి కాన్వే దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఈ ఢిల్లీ పేసర్ కాన్వేకు గుడ్ లెంగ్త్ బాల్గా సంధించాడు.బంతి ఆఫ్ స్టంప్ దగ్గర పిచ్ అయ్యి లోపలికి దూసుకొచ్చింది. కాన్వే ఆ బంతిని అంచనా వేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో బంతి నేరుగా వెళ్లి ఆఫ్ స్టంప్ను గిరాటేసింది. వెంటనే హర్షిత్ రాణా తనదైన శైలిలో దూకుడుగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు.కెప్టెన్ శుభ్మన్ గిల్ వైపు వేలు చూపిస్తూ చెప్పా కాదా అంటూ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అంతకుముందు తొలి వన్డేలో రాణా రెండు వికెట్లతో పాటు 29 పరుగులు చేశాడు. తనపై విమర్శలు చేస్తున్నవారికి తన ప్రదర్శనలతో రాణా సమాధనమిస్తున్నాడు. కాగా ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్(112) అజేయ సెంచరీతో మెరిశాడు.చదవండి: క్రికెట్కు వీడ్కోలు పలికిన మిస్టరీ స్పిన్నర్Off stump out of the ground 🔥🔥Harshit Rana gets the opening wicket in fine fashion! ⚡️Updates ▶️ https://t.co/x1fEenI0xl#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/mYvTSD273W— BCCI (@BCCI) January 14, 2026 -
క్రికెట్కు వీడ్కోలు పలికిన మిస్టరీ స్పిన్నర్
కర్ణాటక మిస్టరీ స్పిన్నర్ కేసీ కరియప్ప సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కేవలం 31 ఏళ్ల వయస్సులోనే భారత క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి కరియప్ప షాకిచ్చాడు. అతడు సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు."స్ట్రీట్ క్రికెట్ నుంచి స్టేడియంలో ఫ్లడ్ లైట్లలో ఆడడం వరకు నా ప్రయాణం ఒక్క అద్భుతం. గర్వంగా జెర్సీ ధరించి, ఒకప్పుడు నేను కన్న కలలను నిజం చేసుకున్నాను. అయితే ఈ రోజు భారత క్రికెట్ నుంచి నేను వైదొలుగుతున్నా. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. విజయాలు చిరునవ్వును ఇస్తే, ఓటములు నన్ను రాటుదేల్చాయి. నా ఈ జర్నీలో మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు" తన రిటైర్మెంట్ నోట్లో పేర్కొన్నాడు.కాగా బీసీసీఐతో పూర్తిగా తెగదింపులు చేసుకున్న కరియప్ప విదేశీ ఫ్రాంచైజీ లీగ్లలో ఆడే అవకాశముంది. కరియప్ప తన డొమెస్టిక్ కెరీర్లో కర్ణాటక, మిజోరం జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 157 వికెట్లు పడగొట్టారు. అయితే ఐపీఎల్ 2015 వేలంతో కరియప్ప వెలుగులోకి వచ్చాడు.ఏ మాత్రం అనుభవం లేనిప్పటికి కోల్కతా నైట్రైడర్స్ అతడిని రూ.2.40 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేయడం అప్పటిలో పెద్ద సంచలనంగా మారింది. ఆ తర్వాతి సీజన్లలో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు గతకొంతకాలంగా అతడికి దేశవాళీ క్రికెట్లో ఆడేందుకు కూడా ఛాన్స్లు రావడం లేదు. ఈ క్రమంలోనే భారత క్రికెట్కు కరియప్ప విడ్కోలు పలికాడు. -
'గంభీర్ సపోర్ట్తో అతడిని సెలెక్ట్ చేశారు'.. క్లారిటీ ఇచ్చిన బ్యాటింగ్ కోచ్
న్యూజిలాండ్తో ఆఖరి రెండు వన్డేలకు భారత జట్టులో ఢిల్లీ బ్యాటర్ అయూశ్ బదోనికి చోటు దక్కిన సంగతి తెలిసిందే. స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా సిరీస్ మధ్యలోనే వైదొలగడంతో బదోనికి సెలక్టర్లు పిలుపునిచ్చారు.అయితే సెలెక్టర్ల నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫామ్లో ఉన్న రియాన్ పరాగ్, రింకూ సింగ్ వంటి ఆటగాళ్లని కాదని బదోనిని తీసుకోవడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. గంభీర్ సపోర్ట్ వల్లే అతడిని అనుహ్యంగా జట్టులోకి తీసుకున్నారని మరికొంతమంది విమర్శిస్తున్నారు.కాగా బదోని ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడతున్నాడు. గతంలో లక్నో మెంటార్గా గౌతీ పనిచేశాడు. అతడి గైడెన్స్లో బదోని మరింత రాటుదేలాడు. అంతేకాకుండా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో బదోని ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.గంభీర్ కూడా ఢిల్లీ నుంచే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన విషయం విధితమే. ఈ కారణాలతో అయూశ్ వైపు మొగ్గు చూపాడని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. ఇక తాజాగా ఇదే విషయంపై భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కేవలం అతడిని టాలెంట్ ఆధారంగానే జట్టులోకి తీసుకున్నామని తెలిపాడు."అయూశ్ దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నాడు. భారత్-ఎ జట్టు తరపున కూడా అతడు వన్డే మ్యాచ్లు ఆడాడు. బదోని బ్యాటింగ్తో పాటు ఆఫ్ బ్రేక్ బౌలింగ్ కూడా చేయగలడు. కేవలం ఐదుగురు బౌలర్లతో మాత్రమే ఆడడం సరైన నిర్ణయం కాదు.ఒకవేళ ప్రధాన బౌలర్లలో ఎవరైనా మ్యాచ్ మధ్యలో గాయపడితే, ఆ ఓవర్లను భర్తీ చేయడానికి ఆరో బౌలింగ్ ఆప్షన్ ఖచ్చితంగా ఉండాలి. బదోని అవసరమైతే 3 నుండి 5 ఓవర్ల వరకు బౌలింగ్ చేయగలడు. అందుకే అతడిని జట్టులోకి తీసుకున్నాము" అని రెండో వన్డేకు ముందు విలేకరుల సమావేశంలో కోటక్ పేర్కొన్నాడు.చదవండి: BBL: పాక్ ప్లేయర్కు ఘోర అవమానం.. బ్యాటింగ్ మధ్యలోనే పిలిచేశారు -
కేఎల్ రాహుల్ సెంచరీ.. భారత్ స్కోరెంతంటే?
రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో జరగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 120 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును రాహుల్ తన సెంచరీతో ఆదుకున్నాడు.టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్కు వీరిద్దరూ 70 పరుగుల భాగస్వామమ్యం నెలకొల్పారు. రోహిత్(24) ఔటయ్యాక గిల్(56), శ్రేయస్ అయ్యర్(8), విరాట్ కోహ్లి(23) వెంటవెంటనే పెవిలియన్కు చేరారు.ఈ క్రమంలో రాహుల్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(27)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. జడేజా ఔటైనప్పటికి రాహుల్ మాత్రం తన ఏకాగ్రతను కోల్పోలేదు. ఆచితూచి ఆడుతూ 87 బంతుల్లో తన ఎనిమిదివ వన్డే సెంచరీ మార్క్ను కేఎల్ అందుకున్నాడు.ఫలితంగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. మొత్తంగా రాహుల్ 92 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, ఒక సిక్సర్తో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టేన్ క్లార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. జేమీసన్, పౌల్క్స్చ, బ్రెస్వెల్ తలా వికెట్ సాధించారు.చదవండి: BBL: పాక్ ప్లేయర్కు ఘోర అవమానం.. బ్యాటింగ్ మధ్యలోనే పిలిచేశారు -
పాక్ ప్లేయర్కు ఘోర అవమానం.. బ్యాటింగ్ మధ్యలోనే పిలిచేశారు
బిగ్బాష్ లీగ్ 2025-26 సీజన్లో పాకిస్తాన్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ టోర్నీలో మెల్బోర్న్ రెనెగేడ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న రిజ్వాన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు.ఈ క్రమంలో సిడ్నీ థండర్స్తో జరిగిన మ్యాచ్లో రిజ్వాన్కు చేదు అనుభవం ఎదురైంది. ఈ మ్యాచ్లో జిడ్డు బ్యాటింగ్తో విసిగించిన రిజ్వాన్ను మెల్బోర్న్ రెనెగేడ్స్ మెనెజ్మెంట్ బలవంతంగా మైదానం నుంచి వెనక్కి పిలిచింది. దీంతో అతడు రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగాడు.నాలుగో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన రిజ్వాన్ నెమ్మదిగా ఆడుతూ టెస్టు క్రికెట్ను తలపించాడు. ఆఖరికి డెత్ ఓవర్లలో కూడా అతడి ఆట తీరులో ఏ మాత్రం మార్పు రాలేదు. ఈ క్రమంలో చివరి రెండు ఓవర్ల ముందు అతడిని వెనక్కి రమ్మని బౌండరీ రోప్ వద్ద నుంచి కెప్టెన్ విల్ సదర్లాండ్ సైగలు చేశాడు.దీంతో రిజ్వాన్ తీవ్ర నిరాశతో మైదానాన్ని వీడాడు. తద్వారా బిగ్ బాష్ లీగ్ చరిత్రలో రిటైర్డ్ అవుట్ అయిన తొలి ఓవర్సీస్ ప్లేయర్గా రిజ్వాన్ ఆప్రతిష్టతను మూటకట్టుకున్నాడు. రిటైర్డ్ అవుట్గా వెనదిరిగే ముందు రిజ్వాన్ స్ట్రైక్ రేట్ 113తో 23 బంతుల్లో కేవలం 26 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రిజ్వాన్ వంటి స్టార్ ప్లేయర్కు ఇది 'అవమానకరం' అని అక్మల్ అన్నాడు."లీగ్ క్రికెట్ ప్రస్తుతం చాలా మారిపోయింది. ఆధునిక టీ20 క్రికెట్ అవసరాలకు తగ్గట్టుగా రిజ్వాన్ తన స్ట్రైక్ రేట్ను మెరుగుపరుచుకోకపోతే చాలా కష్టం. రిజ్వాన్తో పాటు బాబర్ ఆజంను కూడా తమ స్ట్రైక్ రేట్ను పెంచుకోవాలని గత మూడేళ్లుగా పదే పదే చెబుతున్నాను.పాకిస్తాన్ జట్టు కెప్టెన్గా పనిచేసిన ఆటగాడిగా ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా ఘోర అవమానమే. కానీ రిజ్వాన్ తన స్వయంకృత అపరాధం వల్ల ఈ పరిస్థితి తెచ్చుకున్నాడుఐపీఎల్-2025 సీజన్లో తిలక్ వర్మ వంటి కీలక ఆటగాడిని సైతం ముంబై ఇండియన్స్ తిరిగి డగౌట్లోకి పిలిచారు. మ్యాచ్ పరిస్థితిని బట్టి జట్లు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇందులో ఎలాంటి వ్యక్తిగత ద్వేషం ఉండదని" ఆక్మల్ పేర్కొన్నాడు.అయితే రిజ్వాన్ వంటి స్టార్ ప్లేయ్ర్ను అర్ధాంతరంగా వెనక్కి పిలవడాన్ని పాక్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని డిబేట్ హోస్ట్ తెలిపారు. రిజ్వాన్ వెంటనే బిగ్ బాష్ లీగ్ నుంచి తప్పుకొని తిరిగి స్వదేశానికి రావాలని చాలా మంది అభిప్రాయపడుతున్నట్లు పాక్ జాతీయ మీడియాలలో కథనాలు వెలువడుతున్నాయి. రిజ్వాన్ ప్రస్తుతం పాక్ వన్డే, టెస్టు జట్టులో మాత్రమే కొనసాగుతున్నాడు.Muhammad Rizwan has been retired out by the Melbourne Renegades 👀 #BBL15 pic.twitter.com/AuTGoTIHqb— KFC Big Bash League (@BBL) January 12, 2026 -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ ఆల్టైమ్ రికార్డు బ్రేక్
రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తన మార్క్ చూపించలేకపోయాడు. తొలి వన్డేలో 93 పరుగులతో సత్తాచాటిన కోహ్లి.. రెండో వన్డేలో మాత్రం నామమాత్రపు స్కోర్కే పరిమితమయ్యాడు.29 బంతుల్లో 23 పరుగులు చేసి క్లార్క్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. అయితే ఈ మ్యాచ్లో విరాట్ భారీ ఇన్నింగ్స్ ఆడనప్పటికి ఓ అరుదైన రికార్డు మాత్రం తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా కింగ్ కోహ్లి చరిత్ర సృష్టించాడు.4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతడు ఈ ఫీట్ సాధించాడు. కోహ్లి ఇప్పటివరకు కివీస్పై వన్డేల్లో 1770 పరుగులుచ చేశాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(1750)ను కోహ్లి అధిగమించాడు. ఓవరాల్గా ఈ ఫీట్ సాధించిన జాబితాలో కోహ్లి రెండో స్ధానంలో నిలిచాడు.అగ్రస్ధానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(1,971) కొనసాగుతున్నాడు. తొలి వన్డేలో కోహ్లి కూడా పలు అరుదైన రికార్డులు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంతవేగంగా 28,000 పరుగులు మైలు రాయిని అందుకున్న ప్లేయర్గా సచిన్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు.అదేవిధంగా ఇంటర్ననేషనల్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లి రెండో స్ధానానికి ఎగబాకాడు. కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. వన్డే వరల్డ్కప్-2027 లక్ష్యంగా దూసుకుపోతున్నాడు.చదవండి: రోహిత్ శర్మను కిందికి దించి అగ్రపీఠాన్ని అధిరోహించిన విరాట్ కోహ్లి -
రోహిత్ శర్మను కిందికి దించి అగ్రపీఠాన్ని అధిరోహించిన విరాట్ కోహ్లి
ఐసీసీ ఇవాళ (జనవరి 14) విడుదల చేసిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా ఫ్యాన్స్కు మిశ్రమ అనుభవాలు ఎదురయ్యాయి. దిగ్గజ బ్యాటర్లలో ఒకరు టాప్ ర్యాంక్కు చేరుకొని సొంత అభిమానుల్లో ఆనందం నింపగా.. అప్పటికే టాప్ ప్లేస్లో ఉన్న మరో ఆటగాడు రెండు స్థానాలు కోల్పోయి, పర్సనల్ ఫ్యాన్స్ను నిరాశకు గురి చేశాడు. ఇంతకీ ఆ దిగ్గజ బ్యాటర్లు ఎవరంటే..?విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ. విరాట్ తాజాగా న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో 93 పరుగులు చేయడంతో ర్యాంకింగ్స్లో ఓ స్థానం మెరుగుపర్చుకొని టాప్ ర్యాంక్కు చేరాడు. అప్పటికే టాప్ ప్లేస్లో ఉండిన రోహిత్ శర్మ న్యూజిలాండ్పై కేవలం 26 పరుగులకే పరిమితం కావడంతో రెండు స్థానాలు కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు. అదే మ్యాచ్లో 84 పరుగులతో సత్తా చాటిన న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ ఓ స్థానం మెరుగపర్చుకొని రెండో స్థానానికి ఎగబాకాడు. అదే మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ (29 నాటౌట్) ఆడిన కేఎల్ రాహుల్ ఓ స్థానం మెరుగుపర్చుకొని, 11వ స్థానానికి చేరాడు. టాప్-10లో భారత్ తరఫున మరో ఇద్దరు ఆటగాళ్లు కూడా ఉన్నారు. శుభ్మన్ గిల్ 5, శ్రేయస్ అయ్యర్ 10 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇవి మినహా ఈ వారం ర్యాంకింగ్స్లో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు.బౌలర్ల విషయానికొస్తే.. టాప్-10లో ఒక్క మార్పు కూడా లేదు. రషీద్ ఖాన్, జోఫ్రా ఆర్చర్, కుల్దీప్ యాదవ్ టాప్-3గా కొనసాగుతున్నారు. భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఈ వారం ర్యాంకింగ్స్లో గణనీయంగా లబ్ది పొందాడు. న్యూజిలాండ్పై తొలి వన్డేలో 2 వికెట్లు తీయడంతో ఐదు స్థానాలు మెరుగుపర్చుకొని 16వ స్థానానికి చేరాడు. అదే మ్యాచ్లో ఘోరంగా విఫలమైన మరో టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా ఐదు స్థానాలు కోల్పోయి 21వ ప్లేస్కు పడిపోయాడు.ఆల్రౌండర్ల విషయానికొస్తే.. ఒమర్జాయ్, సికందర్, మొహమ్మద్ నబీ టాప్-3లో కొనసాగుతుండగా.. భారత్ తరఫున అక్షర్ పటేల్ పదో స్థానంలో నిలిచాడు. -
న్యూజిలాండ్తో రెండో వన్డే.. టీమిండియా బ్యాటింగ్
రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (జనవరి 14) జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాస్ ఓడింది. ప్రత్యర్థి ఆహ్వానం మేరకు భారత్ తొలుత బ్యాటింగ్కు దిగనుంది. ఈ మ్యాచ్లో భారత్ ఓ మార్పుతో బరిలోకి దిగుతుంది. తొలి వన్డే సందర్భంగా గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు న్యూజిలాండ్ కూడా ఓ మార్పు చేసింది. ఆ జట్టు తరఫున జేడన్ లెన్నాక్స్ (ఆదిత్య అశోక్ స్థానంలో) అరంగేట్రం చేయనున్నాడు. కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి వన్డే గెలిచి 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్వెల్(c), జకారీ ఫౌల్క్స్, జేడెన్ లెన్నాక్స్, కైల్ జామిసన్, క్రిస్టియన్ క్లార్క్భారత్: రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ -
ఇంగ్లండ్ క్రికెట్ మొగల్ కన్నుమూత
ఇంగ్లండ్ క్రికెట్ మొగల్గా పేరొందిన, ఆ దేశ క్రికెట్ బోర్డు (ECB) మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ కాలియర్ (70) మంగళవారం కన్నుమూశారు. ఆయన మరణాన్ని ECB ధృవీకరించి, అధికారిక నివాళి అర్పించింది. ప్రస్తుత ECB చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గోల్డ్ మాట్లాడుతూ.. డేవిడ్ కాలియర్ క్రికెట్కు విశిష్ట సేవలు అందించాని అన్నారు. ఆయన కాలంలో ఆట విస్తృతంగా అభివృద్ధి చెందిందని గుర్తు చేసుకున్నారు. కాలియర్ నిజమైన జెంటిల్మన్, అంకితభావంతో పనిచేసిన వ్యక్తి అని పేర్కొన్నారు. డేవిడ్ కాలియర్ 2004 అక్టోబర్లో ECB రెండో చీఫ్ ఎగ్జిక్యూటివ్గా బాధ్యతలు చేపట్టారు. ఆయన 2014 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆయన జమానాలో ఇంగ్లండ్ మహిళల జట్టు ప్రపంచకప్ డబుల్ (2009లో టీ20 మరియు వన్డే వరల్డ్కప్) సాధించింది.అలాగే పురుషుల జట్టు 2010 టీ20 వరల్డ్కప్ సాధించి, తమ ఖాతాలో తొలి ఐసీసీ ట్రోఫీ జమ చేసింది. వీటితో పాటు కాలియర్ హయాంలో ఇంగ్లండ్ పురుషులు, మహిళల జట్లు తొమ్మిది సార్లు (పురుషులు 4, మహిళలు 5) ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లను కైవసం చేసుకున్నాయి. ECBలో చేరకముందు కాలియర్ ఇంగ్లండ్ దేశీయ క్రికెట్లో ప్రముఖ పాత్ర పోషించారు. ఎస్సెక్స్ కౌంటీలో అసిస్టెంట్ సెక్రటరీగా.. గ్లోస్టర్షైర్, లీసెస్టర్షైర్, నాటింగ్హామ్షైర్లో (1980–2004) చీఫ్ ఎగ్జిక్యూటివ్గా సేవలందించారు. కాలియర్ ECB పదవిలో ఉన్న సమయంలో ఇంగ్లండ్ క్రికెట్ జట్లు కోల్పోయిన ప్రభను తిరిగి దక్కించుకున్నాయి. అతని మరణం ఇంగ్లండ్ క్రికెట్కు పెద్ద లోటుగా భావించబడుతుంది. -
చరిత్ర సృష్టించిన హర్మన్
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. లీగ్ చరిత్రలో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత ప్లేయర్గా రికార్డుల్లోకెక్కింది. నిన్న (జనవరి 13) గుజరాత్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్లో హర్మన్ అద్భుతమైన ఇన్నింగ్స్ (43 బంతుల్ల 71 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడి, తన జట్టును ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చింది. ఈ ఇన్నింగ్స్ తర్వాత WPLలో హర్మన్ పరుగుల సంఖ్య 1016కు (29 ఇన్నింగ్స్ల్లో 46.18 సగటు, 146.18 స్ట్రైక్ రేట్) చేరింది.ఈ ఇన్నింగ్స్తో హర్మన్ మరో రికార్డు కూడా సాధించింది. WPL చరిత్రలో అత్యధిక హాఫ్ సెంచరీలు (10) చేసిన బ్యాటర్గానూ రికార్డు నెలకొల్పింది. గుజరాత్తో మ్యాచ్లో అద్భుత ప్రదర్శనకు గానూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న హర్మన్, ఈ విభాగంలో తన రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. WPLలో హర్మన్కు ఇది తొమ్మిదో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. WPL చరిత్రలో ఏ ప్లేయర్ కూడా ఐదుకు మించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకోలేదు. గత మ్యాచ్లోనూ (ఢిల్లీ క్యాపిటల్స్పై) హర్మన్ అజేయమైన అర్ద సెంచరీ చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకుంది.ఓవరాల్గా చూసినా WPL చరిత్రలో హర్మన్ కాకుండా ఒకే ఒకరు 1000 పరుగుల మైలురాయిని తాకారు. హర్మన్కు ముందు ముంబై ఇండియన్స్కే చెందిన నాట్ సీవర్ బ్రంట్ 1000 పరుగుల మైలురాయిని తాకింది. బ్రంట్ ప్రస్తుతం 1101 పరుగులతో కొనసాగుతుంది. భారతీయులకు సంబంధించి హర్మన్ తర్వాత అత్యధిక WPL పరుగులు చేసిన ప్లేయర్లుగా షఫాలీ వర్మ (887), స్మృతి మంధన (711) ఉన్నారు. హాఫ్ సెంచరీల రికార్డుకు సంబంధించి హర్మన్ తర్వాత అత్యధికంగా బ్రంట్, లాన్నింగ్ తలో 9 హాఫ్ సెంచరీలు చేశారు. భారతీయులకు సంబంధించి షఫాలీ 6, మంధన 4 అర్ద సెంచరీలు చేశారు. -
రో-కో ఫ్యాన్స్కు గ్రేట్ న్యూస్
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికు సంబంధించి బిగ్ న్యూస్ అందుతుంది. గత కొద్ది రోజులుగా ఈ ఇద్దరి కెరీర్ భవితవ్యంపై రకరకాల ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో.. టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాంషు కోటక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రో-కో టీమిండియా 2027 వరల్డ్కప్ ప్రణాళికల్లో కీలక భాగమని అధికారికంగా ధృవీకరించాడు. ఈ ప్రకటనతో రో-కో భవితవ్యంపై స్పష్టత వచ్చింది. వారి ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. తమ ఆరాధ్య ఆటగాళ్లు 2027 వరకు తమకు అలరిస్తారని తెలిసి ఉబ్బితబ్బిబవుతున్నారు.ఇంతకీ కోటక్ ఏమన్నాడంటే.. మేనేజ్మెంట్, రో-కో మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేదు. కోచ్ గౌతమ్ గంభీర్తో వీరిద్దరూ తరచూ చర్చలు జరుపుతున్నారు. 2027 వరల్డ్కప్ ప్రణాళికలపై వీరి అనుభవం జట్టుకు మార్గదర్శకంగా ఉంటుంది.వీరిద్దరూ చాలా ప్రొఫెషనల్. ప్రాక్టీస్, ఫిట్నెస్, ప్రణాళికల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. అవసరమైతే ముందుగానే వేదికకు వెళ్లి ప్రాక్టీస్ చేస్తారు. జట్టులోని ఇతర ఆటగాళ్లతో తమ అనుభవాన్ని పంచుకుంటారు. వీరికి చెప్పాల్సిన అవసరం లేదు. వారు స్వయంగా ప్రణాళికలు రూపొందిస్తారని కోటక్ అన్నాడు. కోటక్ చేసిన ఈ వ్యాఖ్యలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కెరీర్ భవితవ్యంపై పూర్తి క్లారిటీ ఇచ్చాయి. రో-కో ప్రస్తుతం స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో బిజీగా ఉన్నారు. వీరిద్దరు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లి ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. మొదటి వన్డేలో అతను 93 పరుగులు చేసి, తృటిలో మరో శతకాన్ని మిస్ అయ్యాడు. ఆ మ్యాచ్లో రోహిత్ 26 పరుగులే చేసినా, క్రీజ్లో ఉన్నంత సేపు తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడు.ఇవాళ రాజ్కోట్ వేదికగా రెండో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్లోనూ రో-కో తమ అద్భుత ఫామ్ను కొనసాగిస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
మహిళల పట్ల అసభ్య ప్రవర్తన.. వివాదాల్లో చిక్కుకున్న అంతర్జాతీయ క్రికెటర్లు వీరే..!
క్రీడల్లో ఆన్ ఫీల్డ్ ప్రదర్శన ఎంత ముఖ్యమో, ఆఫ్ ద ఫీల్డ్ ప్రవర్తన కూడా అంతే కీలకం. రెండిటిలో ఏది సరిగ్గా లేకపోయినా, ఆటగాళ్ల కెరీర్లు అర్దంతరంగా ముగిసిపోతాయి. తాజాగా ఓ భారత యువ క్రికెటర్ పెద్దగా పరిచయం లేని యువతితో సోషల్మీడియాలో అసభ్యకరమైన సంభాషణ చేసి వార్తల్లోకెక్కాడంతో ఈ ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి మూల్యం చెల్లించుకున్న అంతర్జాతీయ క్రికెటర్లపై ఓ లుక్కేద్దాం.ఈ జాబితాతో ముందుగా వచ్చేది టీమిండియా ఆటగాడు పృథ్వీ షా. అద్భుతమైన టాలెంట్ కలిగి, క్రమశిక్షణ లేకపోవడం వల్ల కెరీర్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఈ మహారాష్ట్ర ఆటగాడు.. 2023లో ఓ మహిళా ఇన్ఫ్లుయెన్సర్తో పబ్లిక్లో ఘర్షణకు దిగి అప్పటికే పతనమైన కెరీర్ను అదఃపాతాళానికి పడేసుకున్నాడు. ఈ ఎడిసోడ్ కారణంగా షా ఎలాంటి క్రమశిక్షణా చర్యలు ఎదుర్కోనప్పటికీ.. కెరీర్లో నిలదొక్కుకునే అవకాశాలు కోల్పోయాడు.ఈ జాబితాలో రెండో పేరు లూక్ పోమర్స్బాచ్. ఆ మాజీ ఆసీస్ ఆటగాడు 2013 ఐపీఎల్ సందర్భంగా ఢిల్లీలో ఓ మహిళపై దాడి చేసి కటకటాలపాలయ్యాడు. ఆ తర్వాత ఆ కేసు సెటిల్మెంట్కు వచ్చినప్పటికీ.. పోమర్స్బాచ్ కెరీర్ పెద్దగా ముందుకు సాలేదు.రుబెల్ హొసైన్ఈ బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ 2015లో నటి నజ్నిన్ ఆక్టర్ హ్యాపీపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. సరైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు నిలబడనప్పటికీ.. రుబెల్ కెరీర్లో ఇది మాయని మచ్చగా మిగిలిపోయింది. ఈ ఉదంతం తర్వాత అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు.మొహమ్మద్ షహ్జాద్ ఈ ఆఫ్ఘనిస్తాన్ విధ్వంసకర బ్యాటర్ 2018లో ఓ మహిళను వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఉదంతం తర్వాత షహ్జాద్ క్రికెట్ సర్కిల్స్ నుంచి కనుమరుగయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు విచారణలో షహ్జాద్ తప్పుచేసినట్లు తేలిందని ప్రచారం జరిగింది.దనుష్క గుణతిలక శ్రీలంకకు చెందిన ఈ మాజీ ఆటగాడు 2018లో ఇంగ్లండ్లో ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. ఇతగాడు 2022లో ఆస్ట్రేలియాలో కూడా ఓ మహిళపై లైంగిక దాడి చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ కేసులో గుణతిలక అరెస్టు కూడా అయ్యాడు. ఈ రెండు ఉదంతాల కారణంగా అతని కెరీర్ పట్టాలెక్కకుండానే గాడి తప్పింది. గుణతిలక చెడుకు శ్రీలంక క్రికట్ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాడు.అంతర్జాతీయ క్రికెటర్లు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉదంతాలు ఇవే కాక ఇంకా చాలా ఉన్నాయి. తాజాగా ఆర్సీబీ మాజీ ఆటగాడు స్వస్తిక్ చికారా ఓ మహిళతో సోషల్మీడియా వేదికగా అసభ్యంగా సంభాషిస్తూ వార్తల్లోకెక్కాడు. తనతో చికారా చేసిన అభ్యంతరకరమైన చాట్ను సదరు యువతి సోషల్మీడియాలో షేర్ చేసింది. అదే యువతి తాజాగా మరో ఐపీఎల్ ఆటగాడు (డీసీకి చెందిన అభిషేక్ పోరెల్) కూడా తనతో చాట్ చేశాడని పోస్ట్ పెట్టింది. -
ముంబై ఇండియన్స్లోకి కొత్తగా ఇంగ్లండ్ స్టార్.. కెప్టెన్ కూడా అతడే..!
ముంబై ఇండియన్స్ ఫ్యామిలీలోకి కొత్తగా మరో ముగ్గురు చేరారు. ది హండ్రెడ్ లీగ్ 2026 ఎడిషన్ కోసం ఎంఐ లండన్ ఫ్రాంచైజీ (మునుపటి ఓవల్ ఇన్విన్సిబుల్స్) ఇంగ్లండ్ ప్లేయర్లు సామ్ కర్రన్ , విల్ జాక్స్, డ్యానీ వ్యాట్-హాడ్జ్ (మహిళ)ను ప్రీ-ఆక్షన్ సైనింగ్స్గా ఎంపిక చేసుకుంది. వీరిలో సామ్ కర్రన్ను ఎంఐ లండన్ పురుషుల జట్టు కెప్టెన్గానూ ప్రకటించింది. గత సీజన్ వరకు ఈ ఫ్రాంచైజీకి సామ్ బిల్లంగ్స్ సారథ్యం వహించాడు. బిల్లంగ్స్ నాయకత్వంలో నాటి ఓవల్ ఇన్విన్సిబుల్స్ (ప్రస్తుత ఎంఐ లండన్) 2023–2025 మధ్యలో వరుసగా మూడు టైటిళ్లు గెలిచించి. అయినా యాజమాన్యం బిల్లింగ్స్ను మార్చి సామ్ కర్రన్కు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది. ఎంఐ లండన్ ఫ్రాంచైజీ అంబానీల (ముకేశ్, నీతా) యాజమాన్యంలో నడిచే ముంబై ఇండియన్స్కు (ఐపీఎల్) సిస్టర్ ఫ్రాంచైజీ. ప్రపంచవాప్తంగా చాలా లీగ్ల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఐపీఎల్, WPLలో ముంబై ఇండియన్స్ కాగా.. సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఎంఐ కేప్టౌన్, ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ఎంఐ ఎమిరేట్స్, మేజర్ లీగ్ క్రికెట్లో ఎంఐ న్యూయార్క్, హండ్రెడ్ లీగ్లో ఎంఐ లండన్ ఫ్రాంచైజీలు ముంబై ఇండియన్స్ ఫ్యామిలీలో భాగంగా ఉన్నాయి. హండ్రెడ్ లీగ్లో కొత్తగా ఎంపికైన తమ కెప్టెన్ సామ్ కర్రన్ను ముంబై ఇండియన్స్ సాదరంగా తమ ఫ్యామిలీలోకి ఆహ్వానించింది. అలాగే జాక్స్, డానీకి కూడా వెల్కమ్ చెప్పింది. హండ్రెడ్ లీగ్లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ (ప్రస్తుతం ఎంఐ లండన్) మొత్తంగా ఐదు టైటిళ్లు సాధించింది. ఇందులో పురుషుల విభాగంలో 3.. మహిళల విభాగంలో 2 టైటిళ్లు ఉన్నాయి.కాగా, హండ్రెడ్ లీగ్ 2026 ఎడిషన్ జులై 21 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఆగస్ట్ 16 వరకు సాగే ఈ టోర్నీ కోసం జనవరి చివరి వరకు నాలుగు ముందస్తు వేలం ఒప్పందాలు (అన్ని ఫ్రాంచైజీలకు) అనుమతించబడతాయి. వీటిలో గరిష్టంగా మూడు ప్రత్యక్ష ఒప్పందాలు కావచ్చు. వీరిలో ఒకరు వారివారి జాతీయ జట్లతో సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగి ఉండాలి. కనీసం ఒకరిని (ఎవరైనా) రిటెన్షన్ చేసుకునే అవకాశం ఉంది. ఎంఐ లండన్ లాగే హండ్రెడ్ లీగ్లోని మిగతా ఫ్రాంచైజీలు (బర్మింగ్హామ్ ఫీనిక్స్, లండన్ స్పిరిట్, మాంచెస్టర్ ఒరిజినల్స్, సన్రైజర్స్ లీడ్స్, ట్రెంట్ రాకెట్స్, సదరన్ బ్రేవ్, వెల్ష్ ఫైర్) కూడా ప్రీ-ఆక్షన్ సైనింగ్స్ చేసుకుంటున్నాయి. -
సంచలన ప్రదర్శన.. గర్జించిన సికందర్ రజా
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో నిన్న (జనవరి 13) ఓ రసవతర్త సమరం జరిగింది. పార్ల్ రాయల్స్ ఆల్రౌండర్, జింబాబ్వే టీ20 జట్టు కెప్టెన్ సికందర్ రజా చివరి బంతికి సిక్సర్ బాది తన జట్టును గెలిపించాడు. 2 పరుగులు అవసరమైన తరుణంలో రజా ఊహించని విధంగా బౌలర్ డర్బన్ సూపర్ జెయింట్స్ బౌలర్ డేవిడ్ వీస్పై ఎదురుదాడి చేశాడు. డీప్ మిడ్ వికెట్ మీదుగా ఫ్లాట్ సిక్సర్ బాదాడు. అనంతరం సింహగర్జన చేస్తూ విజయోత్సవ సంబరాలు చేసుకున్నాడు. మరో ఎండ్లో ఉన్న రూబిన్ హెర్మన్ను హత్తుకొని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. హెర్మన్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి రాయల్స్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.SIKANDAR RAZA, THE FINISHER OF PAARL ROYALS 🥶- He smashed an iconic six when they needed 2 from the final ball. pic.twitter.com/SrjGLFL31e— Johns. (@CricCrazyJohns) January 14, 2026వాస్తవానికి చివరి ఓవర్కు ముందు రాయల్స్ గెలుపుకు కేవలం 6 పరుగులు మాత్రమే కావాలి. అయితే వీస్ అద్భుతమైన బౌలింగ్తో రాయల్స్ గెలుపును చివరి బంతి వరకు అడ్డుకున్నాడు. వీస్ తొలి 5 బంతుల్లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి రాయల్స్ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఓ దశలో వీస్ రాయల్స్ గెలుపును అడ్డుకునేలా కనిపించాడు. అయితే రజా సంచలన ప్రదర్శనతో రాయల్స్కు అపురూపమైన విజయాన్నందించాడు. ఈ గెలుపుతో రాయల్స్ పాయింట్ల పట్టికలో సన్రైజర్స్ ఈస్ట్రన్కేప్తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది. టాప్ ప్లేస్లో ప్రిటోరియా క్యాపిటల్స్ ఉంది. జోబర్గ్ సూపర్ కింగ్స, డర్బన్ సూపర్ జెయింట్స్, ఎంఐ కేప్టౌన్ నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి.స్కోర్ను పరిశీలిస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్.. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (66), లియామ్ లివింగ్స్టోన్ (32 నాటౌట్) రాణించడంతో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. రాయల్స్ బౌలర్లలో ముజీబ్ 2 వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేసి సత్తా చాటాడు.అనంతరం డాన్ లారెన్స్ (63), రూబిన్ హెర్మన్ (65 నాటౌట్) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలు చేసి, రాయల్స్ గెలుపుకు దోహదపడ్డారు. ఆఖర్లో సికందర్ రజా (27 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్తో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. -
హర్మన్ప్రీత్ తడాఖా
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ రెండో విజయం అందుకుంది. మంగళవారం జరిగిన పోరులో ముంబై ఏడు వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్పై నెగ్గింది. గత రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించిన గుజరాత్కు లీగ్లో తొలి పరాజయం ఎదురైంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. జార్జియా వేర్హమ్ (33 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్.బెత్ మూనీ (26 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్), కనిక (18 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. భారతి (15 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) ఆఖర్లో మెరిపించింది. తొలి రెండు మ్యాచ్ల్లో దంచికొట్టిన సోఫీ డివైన్ (8) ఈసారి విఫలమైంది. జార్జియా, భారతి అబేధ్యమైన ఆరో వికెట్కు 24 బంతుల్లోనే 56 పరుగులు జోడించారు. ఈ జోడీ చివరి రెండు ఓవర్లలో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 39 పరుగులు రాబట్టడం విశేషం. ముంబై బౌలర్లలో షబ్నమ్, హేలీ మాథ్యూస్, నికోలా కేరీ, అమెలియా కెర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం ముంబై ఇండియన్స్ 19.2 ఓవర్లలో 3 వికెట్లకు 193 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (43 బంతుల్లో 71 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ అర్ధశతకంతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా... అమన్జ్యోత్ కౌర్ (26 బంతుల్లో 40; 7 ఫోర్లు), నికోలా కేరీ (23 బంతుల్లో 38 నాటౌట్; 6 ఫోర్లు) ఆమెకు అండగా నిలిచారు. గుజరాత్ జెయింట్స్ బౌలర్లలో రేణుక, కాశ్వీ, సోఫీ డివైన్ తలా ఒక వికెట్ పడగొట్టారు. కెప్టెన్ ఇన్నింగ్స్ భారీ లక్ష్యం ఎదురుగా ఉన్నా... ముంబై జట్టు అదరక బెదరక ఎదురు నిలిచింది. ఓపెనర్లు కమలిని (13), హేలీ మాథ్యూస్ (22) ఎక్కువసేపు నిలవలేకపోయినా... హర్మన్ జట్టును ముందుండి నడిపించింది. అమన్జ్యోత్తో కలిసి మూడో వికెట్కు 44 బంతుల్లో 72 పరుగులు... నాలుగో వికెట్కు నికోలాతో 43 బంతుల్లోనే 84 పరుగులు జత చేసి జట్టును విజయతీరాలకు చేర్చింది. చివరి ఓవర్ రెండో బంతికి ఫోర్ కొట్టి జట్టును గెలిపించింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్కు ఇదే అతిపెద్ద లక్ష్యఛేదన కాగా... ఈ మ్యాచ్ ద్వారా హర్మన్ లీగ్లో 1000 పరుగులు పూర్తి చేసుకుంది. స్కోరు వివరాలు గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: మూనీ (సి అండ్ బి) కెర్ 33; సోఫీ డివైన్ (సి) కమిలిని (బి) షబ్నిమ్ 8; కనిక (సి) నికోలా (బి) హేలీ 35; గార్డ్నర్ (ఎల్బీ) (బి) నికోలా 20; జార్జియా (నాటౌట్) 43; ఆయుషి (రిటైర్డ్ అవుట్) 11; భారతి (నాటౌట్) 36; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు)192. వికెట్ల పతనం: 1–22, 2–64, 3–97, 4–99, 5–136.బౌలింగ్: షబ్నమ్ 4–0–25–1; హేలీ మాథ్యూస్ 3–0–34–1; నికోలా కేరీ 4–0–36–1; అమెలియా కెర్ 4–0–40–1; అమన్జ్యోత్ కౌర్ 4–0–48–0; సంస్కృతి 1–0–5–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: కమలిని (స్టంప్డ్) మూనీ (బి) రేణుక 13; హేలీ (సి) డివైన్ (బి) కాశ్వి 22; అమన్జ్యోత్ (సి) గార్డ్నర్ (బి) డివైన్ 40; హర్మన్ప్రీత్ (నాటౌట్) 71; నికోలా కేరీ (నాటౌట్) 38; ఎక్స్ట్రాలు 9; మొత్తం (19.2 ఓవర్లలో 3 వికెట్లకు) 193. వికెట్ల పతనం: 1–20, 2–37, 3–109. బౌలింగ్: రేణుక 4–0–39–1; కాశ్వి 4–0–33–1; రాజేశ్వరి 2–0–22–0; సోఫీ డివైన్ 3.2–0–29–1; జార్జియా 2–0–23–0; తనూజ 3–0–29–0, గార్డ్నర్ 1–0–10–0. -
సిరీస్ సొంతం చేసుకోవాలని...
రాజ్కోట్: సొంతగడ్డపై సమష్టి ప్రదర్శనతో సత్తా చాటుతున్న భారత క్రికెట్ జట్టు... నేడు న్యూజిలాండ్తో రెండో వన్డేకు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో గెలిచిన టీమిండియా... ఈ మ్యాచ్లోనూ నెగ్గి సిరీస్ చేజిక్కించుకోవాలని భావిస్తోంది. టీమిండియాను గాయాల బెడద వెంటాడుతున్నా... విరాట్ కోహ్లి సూపర్ ఫామ్ జట్టుకు కలిసి రానుంది. సిరీస్ ప్రారంభానికి ముందే రిషభ్ పంత్ గాయపడగా... తొలి మ్యాచ్ సందర్భంగా వాషింగ్టన్ సుందర్కు పక్కటెముకల గాయమైంది. దీంతో ఈ ఇద్దరూ సిరీస్ మొత్తానికి దూరమయ్యారు.సుందర్ స్థానంలో ఆయుశ్ బదోనీ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే తుది జట్టులో స్థానం కోసం అతడు ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డితో పోటీ పడాల్సి ఉంది. స్టార్ పేసర్ బుమ్రా అందుబాటులో లేకపోయినా... గత మ్యాచ్లో మన పేసర్లు ఆకట్టుకున్నారు. కానీ స్పిన్నర్లే స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. మరి ఈ మ్యాచ్లో మన స్పిన్ బలగం ఆ లోటును పూడుస్తుందా చూడాలి. మరోవైపు తొలి వన్డేలో కొన్నిసార్లు ఆధిక్యంలో ఉన్నప్పటికీ దాన్ని చివరి వరకు కొనసాగించడంలో విఫలమైన న్యూజిలాండ్ జట్టు... తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని సిరీస్ను సమం చేయాలని కృతనిశ్చయంతో ఉంది. పిచ్ అటు బ్యాటింగ్కు, ఇటు బౌలింగ్కు సమానంగా సహకరించనుంది. ఆ ఇద్దరే అసలు బలం... టి20, టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న రోహిత్ శర్మ, కోహ్లినే టీమిండియాకు ప్రధాన బలం. గత మ్యాచ్లో విరాట్ త్రుటిలో శతకం చేజార్చుకోగా... రోహిత్ శర్మ క్రీజులో ఉన్నంతసేపు తన షాట్లతో మెరిపించాడు. ఈ జోడీ మరోసారి చెలరేగితే... కివీస్కు కష్టాలు తప్పకపోవచ్చు. ఇక కెప్టెన్ శుబ్మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా తొలి వన్డేలో చక్కటి ఇన్నింగ్స్లతో కదంతొక్కారు.టీమిండియా ఆడిన గత సిరీస్కు గాయం కారణంగా దూరమైన గిల్... హాఫ్సెంచరీతో ఆకట్టుకోగా... స్పిన్ బౌలింగ్ను బాగా ఆడగల శ్రేయస్ ఒక పరుగుతో అర్ధశతకానికి దూరమయ్యాడు. ఐదో స్థానంలో కుదురైన బ్యాటర్ కనిపించడం లేదు. సుందర్ స్థానంలో బదోనీ, నితీశ్లో ఒకరికి స్థానం దక్కుతుందా లేక ధ్రువ్ జురేల్ను స్పెషలిస్ట్ బ్యాటర్గా ఆడిస్తారా చూడాలి. హైదరాబాదీ సిరాజ్తో కలిసి అర్‡్షదీప్ సింగ్, హర్షిత్ రాణా పేస్ భారాన్ని మోయనుండగా... రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. సమం చేయాలని... గత మ్యాచ్లో తొలి వికెట్కు వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేసినప్పటికీ... ప్రత్యర్థికి భారీ లక్ష్యం నిర్దేశించడంలో కివీస్ విఫలమైంది. కాన్వే, నికోల్స్ జట్టుకు శుభారంభాన్ని అందించినా... ఆ తర్వాత క్రీజులోకి వచ్చినవాళ్లు దాన్ని కొనసాగించలేకపోయారు. మిచెల్ మంచి ఫామ్లో ఉన్నాడు. సీనియర్ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో న్యూజిలాండ్ జట్టులో అనుభవరాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. విల్ యంగ్, గ్లెన్ ఫిలిప్స్, హే, బ్రేస్వెల్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సిన అవసరముంది. బౌలింగ్లో ఆరున్నర అడుగుల పొడగరి జేమీసన్ సత్తా చాటుతుండగా... ఫోల్్క్స, క్లార్క్ కీలకం కానున్నారు. గత మ్యాచ్లో ఆకట్టుకున్న భారత సంతతి లెగ్ స్పిన్నర్ ఆదిత్య అశోక్పై ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. తుది జట్లు (అంచనా) భారత్: గిల్ (కెప్టెన్), రోహిత్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, నితీశ్ రెడ్డి/ఆయుశ్ బదోనీ, జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్, అర్‡్షదీప్, సిరాజ్. న్యూజిలాండ్: బ్రేస్వెల్ (కెప్టెన్), కాన్వే, నికోల్స్, యంగ్, మిచెల్, హే, ఫిలిప్స్, క్లార్క్, జెమీసన్, ఫోల్్క్స, ఆదిత్య అశోక్.1. రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియంలో భారత జట్టు ఇప్పటి వరకు నాలుగు వన్డేలు ఆడింది. ఒక మ్యాచ్లో గెలిచింది (2020లో ఆ్రస్టేలియాపై). మూడింటిలో (2013లో ఇంగ్లండ్ చేతిలో; 2015లో ఆ్రస్టేలియా చేతిలో; 2023లో ఆస్ట్రేలియా చేతిలో) ఓడిపోయింది. -
గుజరాత్ బ్యాటర్లు విధ్వంసం.. ముంబై మందు భారీ టార్గెట్
మహిళల ప్రీమియర్ లీగ్-2026 సీజన్లో గుజరాత్ జెయింట్స్ బ్యాటర్లు తమ సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నారు. ఈ టోర్నీలో భాగంగా నవీ ముంబై వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు సాధించింది. గత రెండు మ్యాచ్లలో మెరుపులు మెరిపించిన సోఫీ డివైన్.. ముంబైపై మాత్రం నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి డివైన్ ఔటైంది.అయితే జార్జియా వేర్హామ్(33 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్తో 43), భారతి ఫుల్మాలి(15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 36) మెరుపులు మెరిపించారు. వీరిద్దరితో పాటు మూనీ(33), కనిక అహుజా(35) రాణించారు. ముంబై బౌలర్లలో ఇస్మాయిల్, హీలీ మాథ్యూస్, అమీలియా కేర్, కారీ తలా వికెట్ సాధించారు.చదవండి: T20 World Cup: ఆస్ట్రేలియాకు మరో భారీ షాక్.. -
ఆస్ట్రేలియాకు మరో భారీ షాక్..
టీ20 ప్రపంచకప్-2026కు ముందు ఆస్ట్రేలియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ ప్లేయర్లు జోష్ హాజిల్వుడ్, ప్యాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్ గాయాలతో బాధపడుతుండగా.. ఇప్పుడు ఈ జాబితాలో స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిష్ చేరాడు. బిగ్ బాష్ లీగ్ 2025-26లో భాగంగా మంగళవారం అడిలైడ్ స్ట్రైకర్స్తో జరిగిన మ్యాచ్లో స్టోయినిష్( మెల్బోర్న్ స్టార్స్) గాయపడ్డాడు.ఏమి జరిగిందంటే?ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ కేవలం 83 పరుగులకే కుప్పకూలింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన మెల్బోర్న్ 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన స్టోయినిస్ 20 బంతుల్లో 23 పరుగులు చేసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు.అయితే విజయానికి కేవలం 2 పరుగులు మాత్రమే అవసరమైన సమయంలో.. జేమీ ఓవర్టన్ వేసిన ఓ రకాసి బౌన్సర్ స్టోయినిస్ కుడి చేతి బొటనవేలుకు బలంగా తగిలింది. తీవ్రమైన నొప్పితో విలవిలలాడిన మార్కస్.. ఫిజియో సూచనతో 'రిటైర్డ్ అవుట్'గా వెనుదిరిగాడు.అతడిని మ్యాచ్ అనంతరం స్కాన్కు తరలించారు. అతడి గాయంపై అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికి మెగా టోర్నీకి ముందు స్టార్ ప్లేయర్లు గాయపడడం ఆసీస్ మెనెజ్మెంట్ను కలవరపెడుతోంది. పొట్టి ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది.టీ20 ప్రపంచకప్-2026కు ఆసీస్ జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపాచదవండి: 'భారత్లో ఆడే ప్రసక్తే లేదు'.. మారని బంగ్లాదేశ్ వైఖరి -
'భారత్లో ఆడే ప్రసక్తే లేదు'.. మారని బంగ్లాదేశ్ వైఖరి
టీ20 ప్రపంచకప్-2026లో భారత్లో మ్యాచ్లు ఆడే విషయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తన పట్టు వీడటం లేదు. మంగళవారం ఐసీసీతో జరిగిన సమావేశంలోనూ టోర్నమెంట్ కోసం భారత్కు వెళ్లకూడదని తమ నిర్ణయాన్ని బీసీబీ పునరుద్ఘాటించింది.భద్రతా కారణాలను సాకుగా చూపుతూ తమ జట్టును భారత్కు పంపబోమని, తమ మ్యాచ్లను శ్రీలంక లేదా మరేదైనా ఇతర వేదికకు మార్చాలని మరోసారి బీసీబీ డిమాండ్ చేసింది. అయితే షెడ్యూల్ ఇప్పటికే ఖరారు కావగడంతో ఆఖరి నిమిషంలో వేదికలను మార్చడం అసాధ్యమని, బీసీబీ తన వైఖరి పునఃపరిశీలించుకోవాలని ఐసీసీ విజ్ఞప్తి చేసింది. కానీ బంగ్లా క్రికెట్ బోర్డు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆఖరి నిమిషం వరకు తమ చర్చలు జరుపుతామని, ఆటగాళ్లు భద్రత తమకు ముఖ్యమని బీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది.కాగా భారత్-బంగ్లాదేశ్ మధ్య గత కొంత కాలంగా దౌత్యపరమైన ఉద్రిక్తలు నెలకొన్నాయి. అయితే బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ను ఐపీఎల్ నుంచి రిలీజ్ చేయడంతో మరింత పెరిగాయి. ఐపీఎల్-2026 వేలంలో ముస్తాఫిజుర్ను రూ.9.20 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది.అయితే బంగ్లాలో హిందువులపై దాడులు రోజు రోజుకు పెరిగిపోతుండడంతో ముస్తాఫిజుర్ను ఐపీఎల్ నుంచి తప్పించాలని చాలామంది డిమాండ్ చేశారు. దీంతో అతడిని జట్టు నుంచి రిలీజ్ చేయాలని కేకేఆర్ను బీసీసీఐ ఆదేశించింది. దీంతో అతడిని కేకేఆర్ విడుదల చేసింది.ఈ క్రమంలో తమ జట్టు ఆటగాడిని రిలీజ్ చేయడాన్ని బంగ్లా క్రికెట్ బోర్డు ఘోర అవమానంగా భావించింది. దీంతో వరల్డ్కప్ మ్యాచ్లను ఆడేందుకు భారత్కు తమ జట్టును పంపబోమని, వేదికలను మార్చాలని ఐసీసీని బీసీబీ డిమాండ్ చేసుకుంది. అంతేకాకుండా ఐపీఎల్ ప్రసారాలను తమ దేశంలో బంగ్లాదేశ్ బ్యాన్ చేసింది. ఒకవేళ బంగ్లాదేశ్ భారత్లో ఆడేందుకు నిరాకరిస్తే, టోర్నమెంట్ రూల్స్ ప్రకారం వారు పాయింట్లు కోల్పోయే అవకాశం ఉందిచదవండి: IND vs NZ: భారత జట్టులోకి అనూహ్య ఎంట్రీ.. బదోని ఎంపికకు గల కారణాలివే? -
భారత జట్టులోకి అనూహ్య ఎంట్రీ.. బదోని ఎంపికకు గల కారణాలివే?
ఢిల్లీ స్టార్ బ్యాటర్ అయూశ్ బదోని తన చిరకాల స్వప్నాన్ని నేరవేర్చుకునేందుకు అడుగు దూరంలో నిలిచాడు. 26 ఏళ్ల బదోని భారత తరపున అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమైంది. న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్ నుంచి స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా వైదొలగడంతో అనుహ్యంగా బదోనికి సెలెక్టర్లు పిలుపునిచ్చారు.అయితే బుధవారం రాజ్కోట్ వేదికగా జరగనున్న రెండో వన్డేలో బదోని డెబ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. వాషీ స్ధానంలో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్గా అతడిని తుది జట్టులోకి తీసుకోనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. నితీశ్ కుమార్ రెడ్డి మరో ఆల్రౌండర్గా ఉన్నప్పటికి.. బదోని వైపే టీమ్ మెనెజ్మెంట్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఎందుకంటే ఫాస్ట్ బౌలర్లగా సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ ఎలాగో తుది జట్టులో ఉంటారు. స్పిన్నర్లగా కుల్దీప్ యాదవ్, జడేజా ఇద్దరు మాత్రమే ఉన్నారు. బ్యాకప్గా మరొక స్పిన్ అప్షన్(బదోని) ఉంటే బెటర్ అని గంభీర్ అండ్ కో భావిస్తుందంట.బదోని సెలక్షన్ వెనుక కారణాలు ఇవే..అయితే అనుహ్యంగా బదోనిని జట్టులోకి తీసుకోవడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. కానీ టీమ్ మేనెజ్మెంట్, సెలక్టర్లు అతడిపై నమ్మకం ఉంచడానికి బలమైన కారణాలు ఉన్నాయి. బదోనికి దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన రికార్డు ఉంది. ముఖ్యంగా మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసే సత్తా అతడికి ఉంది.ఢిల్లీ తరపున నాలుగు లేదా ఐదో స్ధానంలో బ్యాటింగ్కు వస్తుంటాడు. శ్రేయస్ అయ్యర్ తర్వాత జట్టుకు సరైన మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అవసరమని భావించిన గంభీర్.. బదోనిని రికమెండ్ చేశాడు. అంతేకాకుండా సుందర్ లాగే బదోని కూడా ఆఫ్-బ్రేక్ బౌలింగ్ చేయగలడు. డొమాస్టిక్ క్రికెట్ టోర్నీలో అతడు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తున్నాడు. ఆల్రౌండర్గా అతడికి మంచి స్కిల్స్ ఉన్నాయి.క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిని తట్టుకుని ఆడటంలో బదోని దిట్ట. పరిస్థితులకు తగ్గట్టు అతడు బ్యాటింగ్ చేయగలడు. లిస్ట్-ఎ క్రికెట్లో బదోని ఇప్పటివరకు 27 మ్యాచ్లు ఆడి 693 పరుగులతో పాటు పది వికెట్లు పడగొట్టాడు. అతడిని ఫినిషర్గా కూడా ఉపయోగించుకోవచ్చు.ఐపీఎల్లో కూడా అతడు లక్నో తరపున ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలోనూ ఆల్రౌండర్గా బదోని సత్తాచాటాడు. అయితే క్వార్టర్ ఫైనల్కు అతడు దూరం కావడంతో విదర్భ చేతిలో ఢిల్లీ ఓటమి పాలైంది.పంత్ స్దానంలో జురెల్..అదేవిధగా కివీస్తో వన్డే సిరీస్ నుంచి స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కూడా గాయం కారణంగా తప్పుకొన్నాడు. అతడి స్ధానంలో ధ్రువ్ జురెల్ను జట్టులోకి తీసుకున్నారు. ఇషాన్ కిషన్ను ఎంపిక చేస్తారని ప్రచారం జరిగినప్పటికి జురెల్ వైపే సెలక్టర్లు మొగ్గు చూపారు. విజయ్ హజారే ట్రోఫీలో జురెల్ సెంచరీల మోత మ్రోగించాడు.చదవండి: IND vs NZ: చరిత్రకు అడుగు దూరంలో శ్రేయస్ అయ్యర్ -
సెమీస్లో అడుగుపెట్టిన పంజాబ్, విదర్భ.. షెడ్యూల్ ఇదే
విజయ్ హజారే ట్రోఫీ 2025-26 టోర్నీ తుది దశకు చేరుకుంది. మంగళవారంతో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు ముగిశాయి. బెంగళూరు వేదికగా జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్ 183 పరుగుల తేడాతో పంజాబ్ ఘన విజయం సాధించింది. దీంతో పంజాబ్ జట్టు తమ సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకుంది.ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్సిమ్రాన్ సింగ్ 88 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. అన్మోల్ప్రీత్ సింగ్(70),నేహల్ వధేరా(56 ), హర్నూర్ సింగ్(51) హాఫ్ సెంచరీలతో రాణించారు.ఎంపీ బౌలర్లలో వెంకటేశ్ అయ్యర్, త్రిపురేష్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో మధ్యప్రదేశ్ 31.2 ఓవర్లలో 162 పరుగులకు కుప్పకూలింది. పంజాబ్ బ్యాటర్లలో పాటిదార్(38) టాప్ స్కోరర్గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో సంవీర్ సింగ్ మూడు, గుర్నూర్ బ్రార్, రమణ్దీప్ సింగ్,కృష్ భగత్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.ఢిల్లీ చిత్తు..మరోవైపు నాలుగో క్వార్టర్ ఫైనల్లో ఢిల్లీని 76 పరుగుల తేడాతో విదర్భ చిత్తు చేసింది. దీంతో విదర్భ వరుసగా రెండో ఏడాది సెమీఫైనల్కు అర్హత సాధించింది. 301 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో ఢిల్లీ చతికల పడింది. 45.1 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌటైంది. నచికేత్ భూటే 4 వికెట్లు పడగొట్టి ఢిల్లీ పతనాన్ని శాసించారు. ఇక తొలి రెండు క్వార్టర్ ఫైనల్లో కర్ణాటక, సౌరాష్ట్ర విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో కర్ణాటక, సౌరాష్ట్ర, విదర్భ, పంజాబ్ జట్లు సెమీఫైనల్లో అడుగుపెట్టాయి.సెమీఫైనల్ షెడ్యూల్తొలి సెమీఫైనల్- కర్ణాటక vs విదర్భ- జనవరి 15రెండో సెమీఫైనల్-సౌరాష్ట్ర vs పంజాబ్- జనవరి 16చదవండి: IND vs NZ: చరిత్రకు అడుగు దూరంలో శ్రేయస్ అయ్యర్ -
సూపర్ కింగ్స్కు భారీ షాక్.. టోర్నీ నుంచి కెప్టెన్ ఔట్
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26 సీజన్లో జోబర్గ్ సూపర్ కింగ్స్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ గాయం కారణంగా మిగిలిన సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ టోర్నీలో భాగంగా జనవరి 10న ఎంఐ కేప్టౌన్తో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా డుప్లెసిస్ కుడి చేతి బొటనవేలికి తీవ్రమైన గాయమైంది.దీంతో ఆ మ్యాచ్లో అతడు బ్యాటింగ్కు రాలేదు. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించి స్కాన్ నిర్వహించగా.. బొటనవేలి లిగమెంట్ తెగిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ క్రమంలో ఫాప్ త్వరలోనే తన గాయానికి శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు.ఈ విషయంపై జేఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. ఫాఫ్ కనీసం బ్యాట్ కూడా పట్టుకోలేని స్థితిలో ఉన్నాడని, అందుకే టోర్నీ నుండి వైదొలిగాల్సి వచ్చిందని తెలిపాడు. 41 ఏళ్ల డుప్లెసిస్ ఈ టోర్నీలో 5 మ్యాచ్లు ఆడి 135 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 151.69 గా ఉంది.డుప్లెసిస్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు జేఎస్కే సైతం ఎక్స్ వేదికగా రాసుకొచ్చింది. కాగా ప్రస్తుతం సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో మూడువ స్థానంలో ఉంది. మిగిలిన మ్యాచ్లకు జేమ్స్ విన్స్ జేఎస్కే సారథిగా వ్యవహరించే అవకాశముంది.జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్టు ఇదేజేమ్స్ విన్స్, మాథ్యూ డి విలియర్స్, వియాన్ ముల్డర్, మైఖేల్-కైల్ పెప్పర్ (కీపర్), డోనవన్ ఫెరీరా, ప్రెనెలన్ సుబ్రాయన్, డయాన్ ఫారెస్టర్, అకీల్ హోసేన్, నాండ్రే బర్గర్, డేనియల్ వోరల్, శుభమ్ రంజనే, రిచర్డ్ గ్లీసన్, జారెన్ బాచర్, నీల్ టిమ్మర్స్, జాంకో స్మిత్, స్టీవ్ స్టోల్క్, దువాన్ జాన్సెన్, రివాల్డో మూన్సామి. -
డబ్బులిచ్చైనా న్యూజిలాండ్ క్యాంప్లో చేరుతా: అశ్విన్
వడోదర వేదికగా టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ పోరాడి ఓడిన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆతిథ్య జట్టుకు కివీస్ గట్టి పోటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టుపై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.సీనియర్లు లేనప్పటికి పర్యాటక జట్టు పోరాట పటిమను అశ్విన్ కొనియాడాడు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకురేందుకు కివీస్ బౌలర్లు ఆఖరి వరకు శ్రమించారు. కానీ దురదృష్టవశాత్తు 4 వికెట్ల తేడాతో బ్లాక్క్యాప్స్ జట్టు ఓటమి పాలైంది."చాలా అగ్రశ్రేణి జట్లు డేటా లేదా అనలిటిక్స్ మీద ఆధారపడవు. కానీ న్యూజిలాండ్ మాత్రం అందుకు భిన్నం. ప్రత్యర్ధి జట్టుకు సంబంధించి ప్రతీ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. వ్యూహాలు రచించడం, వాటిని విజయవంతంగా అమలు చేయడంలో కివీస్ దిట్ట. బ్లాక్ క్యాప్స్ తమ ప్రణాళికలను ఎలా అమలు చేస్తారో తెలుసుకోవడానికి, వారి టీమ్ మీటింగ్లలో పాల్గోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను.అవసరమైతే దానికోసం డబ్బులు చెల్లించడానికైనా నాకు అభ్యంతరం లేదు" అని అశ్విన్ పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్కు కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్, రచిన్ రవీంద్ర, మాట్ హెన్రీ, శాంట్నర్ వంటి కివీ స్టార్ ప్లేయర్లు దూరమయ్యారు. దీంతో బ్లాక్ క్యాప్స్ జట్టు కెప్టెన్గా మైఖల్ బ్రెస్వేల్ వ్యవహరిస్తున్నాడు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే బుధవారం రాజ్కోట్ వేదికగా జరగనుంది.చదవండి: IND vs NZ: చరిత్రకు అడుగు దూరంలో శ్రేయస్ అయ్యర్ -
చరిత్రకు అడుగు దూరంలో శ్రేయస్ అయ్యర్
టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన రీఎంట్రీలో సత్తాచాటిన సంగతి తెలిసిందే. వడోదర వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతుల్లో 49 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఇప్పుడు రాజ్కోట్ వేదికగా జరగనున్న రెండో వన్డేలోనూ అదే జోరును కొనసాగించాలని ఈ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ఉవ్విళ్లురుతున్నాడు. అయితే ఈ మ్యాచ్కు ముందు అయ్యర్కు ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. శ్రేయస్ తన వన్డే కెరీర్లో 3000 పరుగుల మార్కును చేరుకోవడానికి కేవలం 34 పరుగుల దూరంలో ఉన్నాడు.రాజ్కోట్ వన్డేలో శ్రేయస్ మరో 34 పరుగులు చేస్తే.. అత్యంతవేగంగా(ఇన్నింగ్స్లు పరంగా) ఈ ఫీట్ అందుకున్న భారత ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఈ ముంబైకర్ ఇప్పటివరకు 68 వన్డే ఇన్నింగ్స్లలో 2966 పరుగులు చేశాడు.ప్రస్తుతం ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్(72 ఇన్నింగ్స్లు) తొలి స్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్ధానాల్లో విరాట్ కోహ్లి(75), కేఎల్ రాహుల్(78) ఉన్నారు. ఇప్పుడు వీరిందరిని అధిగమించేందుకు సర్పంచ్ సాబ్ సిద్దమయ్యాడు.శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం భారత వన్డే జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా నాలుగో స్ధానంలో అయ్యర్ను మించిన ఆటగాడు కన్పించడం లేదు. 2017 నుండి 2021 మధ్య కాలంలో టీమిండియా మెనెజ్మెంట్ దాదాపు నాలుగవ స్దానం కోసం దాదాపు 13 మంది ఆటగాళ్లను మార్చింది. ఒక్కరు కూడా 500 పరుగుల మార్కును కూడా దాటలేదు. కానీ అయ్యర్ మాత్రం ఆ లోటును భర్తీ చేశాడు. ఈ స్ధానంలో అయ్యర్ 54.77 సగటుతో 1479 పరుగులు సాధించాడు.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఆసీస్ క్రికెట్ దిగ్గజం -
‘సన్రైజర్స్’ కీలక ప్రకటన
సన్రైజర్స్ యాజమాన్యం తమ జట్టు హెడ్కోచ్ పేరును ప్రకటించింది. డానియెల్ వెటోరికి స్వాగతం పలుకుతున్నట్లు వెల్లడించింది. ఆండ్రూ ఫ్లింటాఫ్ స్థానంలో వెటోరిని నియమించినట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది.2023 సీజన్ నుంచి కన్ఫ్యూజ్ అయ్యారా?... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఆటగాడిగా సత్తా చాటిన న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానియెల్ వెటోరి చాన్నాళ్లక్రితమే కోచ్ అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. గతంలో ఆర్సీబీతో మమేకం అయిన వెటోరి.. 2023 సీజన్ నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు హెడ్కోచ్గా కొనసాగుతున్నాడు.వెటోరి మార్గదర్శనంలో SRH ఐపీఎల్-2024లో ఫైనల్కు కూడా చేరింది. ఈ క్రమంలో యాజమాన్యం అతడినే హెడ్కోచ్గా కొనసాగిస్తోంది. 2026లోనూ SRH కోచ్గా వెటోరీనే మార్గదర్శనం చేయనున్నాడు. తాజాగా.. సన్రైజర్స్ లీడ్స్ జట్టుకు కూడా హెడ్కోచ్గా మేనేజ్మెంట్ అతడిని నియమించింది.భారీ ధరకు కొనుగోలుఇంగ్లండ్లో జరిగే ది హండ్రెడ్ లీగ్లో భాగమైన నార్తర్న్ సూపర్చార్జర్స్ను సన్ గ్రూపు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దాదాపు రూ. 1100 కోట్ల భారీ ధరకు ఈ ఫ్రాంఛైజీని దక్కించుకుని.. సన్రైజర్స్ లీడ్స్గా పేరు మార్చింది. ఈ జట్టుకు ఆండ్రూ ఫ్లింటాఫ్ హెడ్కోచ్గా ఉండగా.. ఇప్పుడు ఆ స్థానాన్ని డానియెల్ వెటోరీతో భర్తీ చేసింది.ఫ్లింటాఫ్నకు వీడ్కోలుకాగా గత రెండు సీజన్లుగా ‘నార్తర్న్ సూపర్చార్జర్స్’కు కోచ్గా వ్యవహరించాడు ఫ్లింటాఫ్. అతడి శిక్షణలో 2024లో నాలుగో స్థానంతో సీజన్ ముగించిన జట్టు.. 2025లో ఎలిమినేటర్ వరకు చేరుకుంది. అయితే, వెటోరీపై నమ్మకంతో ఫ్లింటాఫ్నకు వీడ్కోలు పలికి.. అతడిని తమ హెడ్కోచ్గా నియమించింది సన్ గ్రూపు.ఫ్లింటాఫ్నకు గుడ్బై కాగా లీగ్లోని అన్ని ఫ్రాంఛైజీల కంటే తనకు తక్కువ జీతం చెల్లించేందుకు సన్రైజర్స్ సిద్ధపడిందని ఫ్లింటాఫ్ బహిరంగంగానే ఆరోపించాడు. అయితే, యాజమాన్యం మాత్రం.. తాము భారీగానే ఆఫర్ చేసినా.. తన స్థాయికి అది తగదంటూ అతడే బంధం తెంచుకున్నాడని పేర్కొంది. కాగా సన్ గ్రూప్ ఐపీఎల్లో హైదరాబాద్, సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఈస్టర్న్కేప్ ఫ్రాంఛైజీలను కలిగి ఉన్న విషయం తెలిసిందే. కావ్యా మారన్ ఈ జట్ల వ్యవహారాలు చూసుకుంటారు.చదవండి: ఐసీసీపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు -
రిటైర్మెంట్ ప్రకటించిన ఆసీస్ క్రికెట్ దిగ్గజం
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ అలిసా హేలీ కీలక ప్రకటన చేసింది. స్వదేశంలో భారత్తో ఆడబోయే సిరీస్ తన కెరీర్లో చివరిదని పేర్కొంది. తద్వారా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు స్పష్టం చేసింది.నా కెరీర్లో చివరిదిఈ మేరకు.. ‘‘మిశ్రమ భావోద్వేగాలు చుట్టుముడుతున్నాయి. ఆస్ట్రేలియా తరఫున భారత్తో ఆడబోయే సిరీస్ నా కెరీర్లో చివరిది. ఆసీస్ తరఫున ఇంకా ఇంకా ఆడాలనే ఉంది. అయితే, నాలో పోటీతత్వం కొరవడిందని అనిపిస్తోంది.అందుకే రిటైర్మెంట్కు ఇదే సరైన సమయం అని భావిస్తున్నా. ఈసారి టీ20 ప్రపంచకప్ ఆడేందుకు నేను వెళ్లడం లేదని తెలుసు. ఈ మెగా టోర్నీ సన్నాహకాలకు చాలా తక్కువ సమయం ఉంది. టీమిండియాతో టీ20లలోనూ నేను ఆడలేను.ఇండియాతో వీడ్కోలు మ్యాచ్ ప్రత్యేకంఅయితే, సొంతగడ్డపై భారత్తో మ్యాచ్లో వన్డే, టెస్టు కెప్టెన్గా కెరీర్ ముగించడం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. నాకు దక్కిన గొప్ప అవకాశం ఇది. మాకు క్యాలెండర్ ఇయర్లో వచ్చే అతిపెద్ద సిరీస్ ఇదే’’ అంటూ అలిసా హేలీ ‘ది విల్లో టాక్’ పాడ్కాస్ట్లో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించింది. దిగ్గజ క్రికెటర్గాకాగా 2010లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేసింది వికెట్ కీపర్ బ్యాటర్ అలిసా హేలీ. ఆమె నాయకత్వంలో అన్ని ఫార్మాట్లలోనూ ఆసీస్ మహిళా క్రికెట్ జట్టు పటిష్ట జట్టుగా మారింది. 2010, 2012, 2014, 2018, 2020, 2023 టీ20 టోర్నీ గెలిచిన జట్లలో అలిసా సభ్యురాలు. అంతేకాదు.. 2013, 2022లో వన్డే వరల్డ్కప్ గెలిచిన జట్టులోనూ అలిసా ఉంది.ఇక 2018, 2019 ఇయర్లకు గానూ ‘ఐసీసీ టీ20 క్రికెర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును 35 ఏళ్ల అలిసా హేలీ అందుకుంది. కాగా అలిసా నిష్క్రమణ తర్వాత తహీలా మెగ్రాత్ ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది. భారత్తో, టీ20 ప్రపంచకప్-2026లో ఆసీస్ను ఆమె ముందుకు నడుపనున్నట్లు తెలుస్తోంది.స్టార్క్ జీవిత భాగస్వామికాగా ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ మిచెల్ స్టార్క్- అలిసా హేలీ భార్యాభర్తలు అన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 6 వరకు భారత మహిళా క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు, ఒక టెస్టు ఆడనుంది.చదవండి: T20 WC 2026: నెదర్లాండ్స్ జట్టు ప్రకటన.. ‘మనోళ్ల’పై వేటు! -
ఐసీసీపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సయీద్ అజ్మల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్వతహాగా నిర్ణయాలు తీసుకోలేని ఐసీసీ ఉనికిలో ఉండి లాభం లేదన్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఐసీసీపై ఆధిపత్యం చెలాయిస్తోందని ఆరోపించాడు.అతిపెద్ద మార్కెట్ క్రికెట్ ప్రయోజనాలకు పెద్ద పీట వేయలేని ఐసీసీ తన కార్యకలాపాలు ఆపేస్తే మంచిదంటూ సయీద్ అజ్మల్ (Saeed Ajmal) అతి చేశాడు. కాగా ప్రపంచంలోని క్రికెట్ బోర్డులన్నింటిలో బీసీసీఐ సంపన్న బోర్డు అన్న విషయం తెలిసిందే. భారత్లో మతంగా భావించే క్రికెట్కు ఉన్న ఆదరణే ఇందుకు కారణం.ఐపీఎల్ ప్రవేశపెట్టిన తర్వాత బీసీసీఐ ఆదాయం గణనీయంగా పెరిగింది. భారత్లో క్రికెట్కు ఉన్న మార్కెట్ దృష్ట్యా బీసీసీఐకి ఐసీసీ నుంచి రెవెన్యూ భారీ మొత్తంలో అందుతుంది. ఇక ప్రస్తుతం ఐసీసీ చైర్మన్గా బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా ఉన్నారు.శ్రీలంక క్రికెట్ జట్టుపై గతంలో ఉగ్రదాడిఇదిలా ఉంటే.. పాకిస్తాన్లో ఇప్పటికే క్రికెటర్లపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. 2009లో గడాఫీ స్టేడియం నుంచి శ్రీలంక క్రికెట్ జట్టు బస్సులో వెళ్తున్న వేళ 12 మంది ఉగ్రవాదులు బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో కొంతమంది అధికారులు మరణించగా.. ఆరుగురు శ్రీలంక క్రికెటర్లు గాయాలపాలయ్యారు. కెప్టెన్ మహేళ జయవర్ధనే సహా కుమార్ సంగక్కర ఈ జాబితాలో ఉన్నారు.పాకిస్తాన్కు చెందిన అహ్సాన్ రజా అనే అంపైర్ చచ్చిబతికాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లోని పరిస్థితుల దృష్ట్యా చాలాకాలం వరకు విదేశీ జట్లు అక్కడ పర్యటించలేదు. కొంతకాలం క్రితం నుంచే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, శ్రీలంక వంటి జట్లు మళ్లీ పాక్ పర్యటన మొదలుపెట్టాయి.భద్రతా కారణాల దృష్ట్యాఇక దాయాది దేశంలో ఉగ్రదాడుల భయంతో భద్రతా కారణాల దృష్ట్యా భారత్ టీమిండియాను అక్కడికి పంపడం లేదు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు కూడా నిలిచిపోయాయి. కేవలం ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే దాయాదులు తలపడుతున్నాయి. ఈ క్రమంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి పాక్ ఆతిథ్యం ఇవ్వగా.. టీమిండియా అక్కడికి వెళ్లలేదు.ఐసీసీ నిర్ణయంతో తటస్థ వేదికైన దుబాయ్లో తమ మ్యాచ్లు ఆడి ట్రోఫీ గెలుచుకుంది. మరోవైపు ఆతిథ్య పాక్ చెత్త ప్రదర్శనతో లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఇక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆసియా కప్ టోర్నీలో పాక్ ఆటగాళ్లతో కరచాలనానికీ టీమిండియా నిరాకరించింది.ఇదిలా ఉంటే.. తాజాగా బంగ్లాదేశ్ కూడా భారత్తో కయ్యానికి కాలుదువ్వడం.. మైనారిటీలపై దాడులు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి బంగ్లా ప్లేయర్ ముస్తాఫిజుర్ను తొలగించగా.. టీ20 ప్రపంచకప్-2026 ఆడేందుకు తాము భారత్కు రాలేమని బంగ్లాదేశ్ అంటోంది. భద్రతా కారణాలు అంటూ ఓవరాక్షన్ చేస్తోంది. ఈ పరిణామాల క్రమంలో పాక్ మాజీ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ బీసీసీఐపై అక్కసు వెళ్లగక్కాడు.ఎలాంటి లాజిక్ లేదు.. కొంచమైనా బుద్ధి ఉందా?‘‘ఐసీసీ నిర్ణయాలు తీసుకునేందుకు ఇండియన్ బోర్డుపై ఆధారపడితే.. దాని ఉనికి ఉండి కూడా వృథానే. పాకిస్తాన్లో ఆడేందుకు భారత జట్టును పంపకపోవడంలో ఎలాంటి లాజిక్ లేదు.ఐసీసీ మాత్రం ఈ విషయంలో నిస్సహాయతను వ్యక్తం చేసింది. భారతీయులు ఐసీసీపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు’’ అని సయీద్ అజ్మల్ అన్నాడు. గతంలో శ్రీలంక జట్టుపై దాడి... తాజాగా భారత్లో పహల్గామ్ ఉగ్రదాడి వంటి ఘటనల తర్వాత కూడా అజ్మల్ టీమిండియా తమ దేశానికి రాకపోవడాన్ని ప్రస్తావించడాన్ని భారత జట్టు అభిమానులు తప్పుబడుతున్నారు. ‘కొంచమైనా బుద్ధి ఉందా?’’ అంటూ చురకలు అంటిస్తున్నారు.చదవండి: భారత్పై నిందలు!.. బంగ్లాదేశ్కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ! -
అచ్చం నాలాగే..: రోహిత్తో కోహ్లి ఏం చెప్పాడంటే..
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లికి ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెద్దోళ్లే కాదు చిన్న పిల్లలూ అతడి ఫ్యాన్స్ జాబితాలో ఉంటారు. ఇటీవల న్యూజిలాండ్తో తొలి వన్డేకు ముందు ఓ ‘బుల్లి’ అభిమాని కోహ్లిని కలిశాడు.ఇందులో ప్రత్యేకత ఏముంది అంటారా?.. ఆ చోటా ఫ్యాన్ కోహ్లి బాల్యంలో ఎలా ఉండేవాడో అచ్చం అలాగే ఉండటం ఇక్కడ విశేషం. ఈ విషయాన్ని కోహ్లి (Virat Kohli)నే స్వయంగా అంగీకరించాడు. అంతేకాదు రోహిత్ శర్మ (Rohit Sharma)తోనూ ఇదే విషయం చెప్పాడు. స్వదేశంలో కివీస్తో వన్డే సిరీస్తో టీమిండియా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా వడోదరలో ఇరుజట్ల మధ్య ఆదివారం తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్కు ముందు కోహ్లిని ఓ పిల్లాడు కలిశాడు. ఈ క్రమంలో కోహ్లి తనను చూసి ఎలా స్పందించాడో తాజాగా చెప్పుకొచ్చాడు. ‘‘కోహ్లి అని పిలిచి.. హాయ్ చెప్పాను.నా డూప్లికేట్ అక్కడ కూర్చున్నాడుఒక్క నిమిషంలో వస్తాను అని కోహ్లి నాతో అన్నాడు. అంతలోనే రోహిత్ శర్మవైపు తిరిగి.. ‘నా డూప్లికేట్ (Young Virat Kohli Doppelganger) అక్కడ కూర్చున్నాడు చూడు’ అని చెప్పాడు. అక్కడున్న వాళ్లంతా నన్ను చోటా చీకూ అని పిలిచారు’’ అంటూ ఆ బుడ్డోడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.93 పరుగులుకాగా కోహ్లి ముద్దుపేరు చీకూ అన్న విషయం తెలిసిందే. తనలాగే ఉన్న ఆ పిల్లాడిని కలిసి.. అతడికి ఫొటోగ్రాఫ్ కూడా ఇచ్చి ఖుషీ చేశాడు కోహ్లి. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి వన్డేలో భారత్ న్యూజిలాండ్పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది.కివీస్ విధించిన 301 పరుగుల లక్ష్యాన్ని 49 ఓవర్లలోనే భారత్ ఛేదించింది. కోహ్లి సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ 93 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా 45వ సారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మరోవైపు.. రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో 26 పరుగులు చేయగలిగాడు. ఇక భారత్- కివీస్ మధ్య బుధవారం నాటి రెండో వన్డేకు రాజ్కోట్ వేదిక.చదవండి: T20 WC 2026: నెదర్లాండ్స్ జట్టు ప్రకటన.. ‘మనోళ్ల’పై వేటు! Virat Kohli said to Rohit Sharma, "Wha dekh Mera duplicate betha hai (Look, my duplicate is sitting there)".- Virat Kohli called him a Chota Cheeku 😭❤️ pic.twitter.com/b4r1DopMUa— Virat Kohli Fan Club (@Trend_VKohli) January 12, 2026 -
వైభవ్ విఫలం.. ఇంగ్లండ్ చేతిలో తప్పని ఓటమి
ఐసీసీ అండర్-19 ప్రపంచకప్-2026 వార్మప్ మ్యాచ్లో యువ భారత జట్టుకు పరాభవం ఎదురైంది. సన్నాహక మ్యాచ్లో స్కాట్లాండ్పై ఘన విజయం సాధించిన మాత్రే సేన.. ఇంగ్లండ్తో మ్యాచ్లో మాత్రం ఓటమి పాలైంది. మెరుగైన స్కోరు సాధించినా.. లక్ష్యాన్ని కాపాడుకోలేక చతికిలపడింది.జింబాబ్వే వేదికగా జనవరి 15 నుంచి అండర్-19 ప్రపంచకప్ టోర్నీ మొదలుకానుంది. ఇందుకోసం భారత్- ఇంగ్లండ్ అండర్-19 జట్ల మధ్య సోమవారం బులవాయో వేదికగా సన్నాహక మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.అభిజ్ఞాన్ కుందు హాఫ్ సెంచరీఓపెనర్లలో కెప్టెన్ ఆయుశ్ మాత్రే (49) మెరుగ్గా రాణించగా.. వైభవ్ సూర్యవంశీ (1) మాత్రం విఫలమయ్యాడు. వన్డౌన్లో వచ్చిన వేదాంత్ త్రివేది (14).. మిడిలార్డర్లో విహాన్ మల్హోత్రా (10) నిరాశపరిచారు.ఇలాంటి పరిస్థితుల్లో వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను తలకెత్తుకున్నాడు. ఐదో స్థానంలో వచ్చిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 99 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 82 పరుగులు సాధించాడు.రాణించిన బౌలింగ్ ఆల్రౌండర్లుఅభిజ్ఞాన్కు తోడుగా బౌలింగ్ ఆల్రౌండర్లు ఆర్ఎస్ అంబరీష్ (48), కనిష్క్ చౌహాన్ (45 నాటౌట్) రాణించారు. మిగిలిన వారిలో హర్వన్ష్ పంగాలియా (19) విఫలం కాగా.. ఖిలాన్ పటేల్ 11 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయిన భారత అండర్-19 జట్టు 295 పరుగులు సాధించింది.ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ మింటో ఐదు వికెట్లు తీసి భారత బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. సెబాస్టియన్ మోర్గాన్ రెండు, మ్యానీ లమ్స్డన్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో హెనిల్ పటేల్ ఆదిలోనే ఇంగ్లండ్కు షాకిచ్చాడు. ఓపెనర్ బెన్ డాకిన్స్ (8)ను స్వల్ప స్కోరుకే పెవిలియన్కు పంపాడు.థామస్ ధనాధన్ఇక ఖిలాన్ పటేల్.. మరో ఓపెనర్ జోసఫ్ మూర్స్ (46), వన్డౌన్ బ్యాటర్ బెన్ మేయస్ (34) వికెట్లు తీసుకున్నాడు. అయితే, నాలుగో నంబర్ బ్యాటర్ థామస్ ర్యూ మాత్రం పట్టుదలగా నిలబడ్డాడు. 66 బంతుల్లోనే ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 71 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇంగ్లండ్ గెలుపుమరో ఎండ్ నుంచి కెలెబ్ ఫాల్కనర్ (29 నాటౌట్) థామస్కు సహకారం అందించాడు. అయితే, ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించిన కారణంగా డక్వర్త్ లూయీస్ పద్ధతి (DLS) ప్రకారం ఇంగ్లండ్ లక్ష్యాన్ని 177 పరుగులుగా నిర్ణయించగా.. 34.3 ఓవర్లలోనే 196 పరుగులు సాధించింది. ఫలితంగా 20 పరుగుల తేడాతో భారత అండర్-19 జట్టుపై ఇంగ్లండ్ గెలుపొందింది. చదవండి: చరిత్ర సృష్టించిన పడిక్కల్.. తొలి ప్లేయర్గా అరుదైన రికార్డు -
T20 WC: నెదర్లాండ్స్ జట్టు ప్రకటన.. ‘మనోళ్ల’పై వేటు!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు నెదర్లాండ్స్ తమ జట్టును ప్రకటించింది. భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్ కోసం పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు తెలిపింది. సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ స్కాట్ ఎడ్వర్డ్స్ ప్రపంచకప్ టోర్నీలో తమ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తాడని తెలిపింది.విక్రమ్జిత్పై వేటు.. ఇక ఈ జట్టు నుంచి భారత సంతతికి చెందిన విక్రమ్జిత్ సింగ్ (Vikramjit Singh)ను తప్పించారు. ఇటీవల బంగ్లాదేశ్- స్కాట్లాండ్తో జరిగిన టీ20 ట్రై సిరీస్లో విఫలమైన అతడిపై యాజమాన్యం వేటు వేసింది. తేజ కూడా లేడువిజయవాడకు చెందిన తేజ నిడమనూరు సైతం ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, ఆర్యన్ దత్కు మాత్రం సెలక్టర్లు చోటిచ్చారు. మాక్స్ ఒడౌడ్ జట్టులో స్థానం నిలుపుకోగా.. బాస్ డి లీడేకు కూడా చోటు దక్కింది.పాక్తో మ్యాచ్తో మొదలుకాగా ఈసారి ఇరవై జట్లు ప్రపంచకప్ టోర్నీలో భాగం కాగా.. నెదర్లాండ్స్ గ్రూప్-ఎలో ఉంది. గ్రూప్ దశలో ఫిబ్రవరి 7న పాకిస్తాన్తో కొలంబోలో.. ఫిబ్రవరి 10న ఢిల్లీలో నమీబియాతో.. ఫిబ్రవరి 13న యూఎస్ఏతో చెన్నై వేదికగా.. ఫిబ్రవరి 18న అహ్మదాబాద్లో టీమిండియాతో నెదర్లాండ్స్ జట్టు తలపడనుంది. కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్-2026 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి నెదర్లాండ్స్ జట్టుస్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్, వికెట్ కీపర్), నోహ్ క్రోస్ (వికెట్ కీపర్), మాక్స్ ఒ డౌడ్, సాకిబ్ జుల్ఫికర్, ఆర్యన్ దత్, కైల్ క్లైన్, పాల్ వాన్ మీకెరెన్, ఫ్రెడ్ క్లాసెన్, కోలిన్ అకెర్మాన్, బాస్ డి లీడే, మైకేల్ లెవిట్, జాక్ లయన్ కాచెట్, లోగన్ వాన్ బీక్, రొలొఫ్ వాన్ డెన్ మెర్వె, టిమ్ వాన్ డెర్ గుటెన్.చదవండి: చరిత్ర సృష్టించిన పడిక్కల్.. తొలి ప్లేయర్గా అరుదైన రికార్డు -
రింకూ విఫలం.. సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్న జట్లు ఇవే
దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో సౌరాష్ట్ర సెమీ ఫైనల్కు దూసుకువెళ్లింది. ఉత్తరప్రదేశ్ జట్టుతో జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్లో వీజేడీ పద్ధతిలో 17 పరుగుల తేడాతో గెలిచి సెమీస్ ఖరారు చేసుకుంది. రింకూ విఫలంబెంగళూరు వేదికగా ముందుగా ఉత్తరప్రదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 310 పరుగులు చేసింది. అభిషేక్ గోస్వామి (82 బంతుల్లో 88; 12 ఫోర్లు), సమీర్ రిజ్వీ (77 బంతుల్లో 88 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్లు) మెరిపించారు. కెప్టెన్ రింకూ సింగ్ (20 బంతుల్లో 13)మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు.హార్విక్ దేశాయ్ సెంచరీతోసౌరాష్ట్ర బౌలర్లలో చేతన్ సకారియా 3 వికెట్లు... అంకుర్ పన్వర్, ప్రేరక్ మన్కడ్ 2 వికెట్లు తీశారు. 311 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్ర 40.1 ఓవర్లలో 3 వికెట్లకు 238 పరుగులు సాధించింది. ఓపెనర్ హార్విక్ దేశాయ్ (116 బంతుల్లో 100 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ సెంచరీ చేశాడు.ప్రేరక్ మన్కడ్ (66 బంతుల్లో 67; 7 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించాడు. చిరాగ్ జానీ (31 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడాడు. సౌరాష్ట్ర స్కోరు 238/3 వద్ద భారీ వర్షం రావడం, ఆ తర్వాత తగ్గకపోవడంతో వీజేడీ పద్ధతిని అనుసరించి విజేతను నిర్ణయించారు. ఆట నిలిచిపోయే సమయానికి సౌరాష్ట్ర విజయసమీకరణం కంటే 17 పరుగులు ముందంజలో ఉండటంతో ఆ జట్టుకు విజయం దక్కింది.పడిక్కల్ జోరు.. కర్ణాటక నాలుగోసారిడిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక జట్టు వరుసగా నాలుగోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బెంగళూరులో ముంబై జట్టుతో సోమవారం జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో కర్ణాటక జట్టు వీజేడీ పద్ధతిలో 54 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 254 పరుగులు సాధించింది. షమ్స్ ములానీ (91 బంతుల్లో 86; 8 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు.కెప్టెన్ సిద్దేశ్ లాడ్ (58 బంతుల్లో 38; 4 ఫోర్లు), సాయిరాజ్ పాటిల్ (25 బంతుల్లో 33 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. ముంబై స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ గాయం కారణంగా ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. కర్ణాటక బౌలర్లలో విద్యాధర్ పాటిల్ (3/42), అభిలాశ్ శెట్టి (2/59), విద్వత్ కావేరప్ప (2/43) రాణించారు. అనంతరం 255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కర్ణాటక 33 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 187 పరుగులు చేసింది.కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (12) తక్కువ స్కోరుకే అవుటవ్వగా... దేవ్దత్ పడిక్కల్ (95 బంతుల్లో 81 నాటౌట్; 11 ఫోర్లు), కరుణ్ నాయర్ (80 బంతుల్లో 74 నాటౌట్; 11 ఫోర్లు) రెండో వికెట్కు 143 పరుగులు జోడించారు. కర్ణాటక విజయం దిశగా సాగుతున్న దశలో భారీ వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది. వర్షం తగ్గకపోవడంతో వీజేడీ పద్ధతిని అనుసరించి విజేతను నిర్ణయించారు. వీజేడీ పద్ధతి ప్రకారం 33 ఓవర్లకు కర్ణాటక విజయసమీకరణం 132 పరుగులు. కర్ణాటక 55 పరుగులు ముందుండటంతో ఆ జట్టును గెలుపు వరించింది.చదవండి: భారత్పై నిందలు!.. బంగ్లాదేశ్కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ! -
వహ్వా హారిస్...
ముంబై: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో మాజీ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ముందుగా చక్కటి బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టడి చేసిన జట్టు... ఆ తర్వాత మెరుపు బ్యాటింగ్తో మరో 47 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ను సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన ఈ పోరులో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన యూపీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. దీప్తి శర్మ (35 బంతుల్లో 45 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), డియాండ్రా డాటిన్ (37 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. వీరిద్దరు ఆరో వికెట్కు 72 బంతుల్లో అభేద్యంగా 93 పరుగులు జోడించారు. అనంతరం బెంగళూరు 12.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 145 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గ్రేస్ హారిస్ (40 బంతుల్లో 85; 10 ఫోర్లు, 5 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా...కెప్టెన్ స్మృతి మంధాన (32 బంతుల్లో 47 నాటౌట్; 9 ఫోర్లు) రాణించింది. వీరిద్దరు తొలి వికెట్కు 71 బంతుల్లోనే 137 పరుగులు జోడించి జట్టు విజయాన్ని సులువు చేశారు. యూపీ జట్టుకు ఇది వరుసగా రెండో ఓటమి. నేడు జరిగే మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో గుజరాత్ జెయింట్స్ తలపడుతుంది. రాత్రి గం. 7:30 నుంచి జరిగే ఈ మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. కీలక భాగస్వామ్యం... యూపీకి ఓపెనర్లు మెగ్ లానింగ్ (14), హర్లీన్ డియోల్ (11) శుభారంభం అందించలేకపోయారు. పరుగులు చేయలేకపోవడంతో పాటు వీరిద్దరు నెమ్మదిగా ఆడి బంతులను కూడా వృథా చేశారు. ఆ తర్వాత బరిలోకి దిగిన బ్యాటర్లూ కూడా పూర్తిగా తడబడ్డారు. దాంతో ఒకే స్కోరు వద్ద జట్టు 3 వికెట్లు కోల్పోయింది. లిచ్ఫీల్డ్ (11 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్), కిరణ్ నవ్గిరే (5), శ్వేత సెహ్రావత్ (0)లను ఆర్సీబీ బౌలర్లు వెనక్కి పంపించారు. ఫలితంగా 50/5తో యూపీ కష్టాల్లో పడింది. ఈ దశలో దీప్తి, డాటిన్ కలిసి జట్టును ఆదుకున్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి జట్టు స్కోరు 56 పరుగులకు చేరింది. తర్వాతి పది ఓవర్లలో మరో వికెట్ కోల్పోకుండా దీప్తి, డాటిన్ పరుగులు జోడించారు. శ్రేయాంక ఓవర్లో డాటిన్ వరుసగా 4, 6 కొట్టగా, డిక్లెర్క్ బౌలింగ్లో దీప్తి భారీ సిక్స్ బాదింది. శ్రేయాంక వేసిన ఆఖరి ఓవర్లోనూ వీరిద్దరు మూడు ఫోర్లు కొట్టడంతో మొత్తం 15 పరుగులు వచ్చాయి. ఓపెనర్ల దూకుడు... ఛేదనలో ఆర్సీబీ అలవోకగా దూసుకుపోయింది. దీప్తి వేసిన తొలి ఓవర్లోనే హారిస్ రెండు ఫోర్లు కొట్టగా, శిఖా ఓవర్లో స్మృతి రెండు ఫోర్లు సాధించింది. ఆ తర్వాత క్రాంతి ఓవర్లో వీరిద్దరు 3 ఫోర్లతో 13 పరుగులు రాబట్టారు. ఈ దశలో డాటిన్ ఓవర్తో మ్యాచ్ పూర్తిగా ఆర్సీబీ వైపు మళ్లింది. శోభన ఓవర్లోనూ హారిస్ వరుసగా 6, 4 బాదింది. 10 ఓవర్లలోనే 121 పరుగులు సాధించిన బెంగళూరుకు ఆటను ముగించేందుకు మరో 13 బంతులు సరిపోయాయి. స్కోరు వివరాలు యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: లానింగ్ (సి) రాధ (బి) శ్రేయాంక 14; హర్లీన్ (సి) స్మృతి (బి) బెల్ 11; లిచ్ఫీల్డ్ (సి) స్మృతి (బి) శ్రేయాంక 20; కిరణ్ (సి) స్మిత్ (బి) డిక్లెర్క్ 5; దీప్తి (నాటౌట్) 45; శ్వేత (సి) అరుంధతి (బి) డిక్లెర్క్ 0; డాటిన్ (నాటౌట్) 40; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–21, 2–39, 3–50, 4–50, 5–50. బౌలింగ్: లారెన్ బెల్ 4–0–16–1, లిన్సీ స్మిత్ 4–0–30–0, శ్రేయాంక పాటిల్ 4–0–50–2, అరుంధతి రెడ్డి 4–0–18–0, నదైన్ డిక్లెర్క్ 4–0–28–2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గ్రేస్ హారిస్ (సి) లానింగ్ (బి) శిఖా 85; స్మృతి (నాటౌట్) 47; రిచా (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 9; మొత్తం (12.1 ఓవర్లలో వికెట్ నష్టానికి) 145. వికెట్ల పతనం: 1–137. బౌలింగ్: దీప్తి శర్మ 3.1–0–25–0, క్రాంతి గౌడ్ 2–0–18–0, శిఖా పాండే 3–0–28–1, డియాండ్రా డాటిన్ 1–0–32–0, సోఫీ ఎకెల్స్టోన్ 2–0–20–0, శోభన 1–0–17–0. డాటిన్ ఓవర్లో 32 పరుగులు! యూపీ బౌలర్ డియాండ్రా డాటిన్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో ఆర్సీబీ ఓపెనర్ గ్రేస్ హారిస్ మెరుపులా చెలరేగిపోయింది. ఈ ఓవర్లో ఆమె వరుసగా 4, 6, 4, 6, 6 బాదింది. వీటిలో తొలి బంతి నోబాల్ కూడా కావడంతో స్కోరు బోర్డులో అదనపు పరుగు చేరింది. అనంతం డాటిన్ వైడ్ కూడా వేసి మరో పరుగు ఇచి్చంది. తర్వాతి బంతిని హారిస్ మళ్లీ బౌండరీకి తరలించింది. ఎట్టకేలకు చివరి బంతికి పరుగు రాకుండా నిరోధించడంతో డాటిన్ సఫలమైంది. మొత్తంగా హారిస్ 30 పరుగులు కొట్టగా, అదనపు పరుగులు కలిపి ఓవర్లో 32 పరుగులు లభించాయి. ఈ క్రమంలో 22 బంతుల్లోనే హారిస్ అర్ధ సెంచరీ పూర్తయింది. -
RCB vs UPW: రాణించిన ఆల్రౌండర్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో మ్యాచ్లో యూపీ వారియర్స్ నామమాత్రపు స్కోరు సాధించింది. నవీ ముంబై వేదికగా సోమవారం నాటి మ్యాచ్లో యూపీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేయగలింది.మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026లో భాగంగా డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా యూపీతో మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన యూపీకి ఆదిలోనే షాకులు తగిలాయి.ఓపెనర్లలో హర్లిన్ డియోల్ (14 బంతుల్లో 11)ను స్వల్ప స్కోరుకే లారెన్ బెల్ పెవిలియన్కు పంపగా.. కెప్టెన్ మెగ్ లానింగ్ (14), వన్డౌన్ బ్యాటర్ ఫోబీ లిచిఫీల్డ్ (20)ల వికెట్లు శ్రేయాంక పాటిల్ తన ఖాతాలో వేసుకుంది.రాణించిన దీప్తి, డియాండ్రాఇక కిరన్ నవగిరె (5)తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ శ్వేతా సెహ్రావత్ (0)లను నదైన్ డిక్లెర్క్ అవుట్ చేసింది. దీంతో కష్టాల్లో కూరుకుపోయిన యూపీ జట్టును ఆల్రౌండర్లు దీప్తి శర్మ, డియాండ్రా డాటిన్ ఆదుకున్నారు. ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన టీమిండియా స్టార్ దీప్తి... 35 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 45 పరుగులతో అజేయంగా నిలిచింది.వెస్టిండీస్ వెటరన్ స్టార్ డియాండ్ర డాటిన్ సైతం 37 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 40 పరుగులు చేసింది. ఆఖరి వరకు దీప్తి, డాటిన్ ధనాధన్ దంచికొట్టడంతో యూపీ 140 పరుగుల మార్కు దాటగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్, డిక్లెర్క్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. లారెన్ బెల్ ఒక వికెట్ దక్కించుకుంది. ఇక యూపీ విధించిన 144 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలని ఆర్సీబీ పట్టుదలగా ఉంది.కాగా ఈ సీజన్లో ఆర్సీబీ తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను ఓడించి గెలుపు నమోదు చేసింది. మరోవైపు.. యూపీ తమ తొలి మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓటమిపాలైంది.ఆర్సీబీ వర్సెస్ యూపీ తుదిజట్లుఆర్సీబీగ్రేస్ హారిస్, స్మృతి మంధాన (కెప్టెన్), దయాళన్ హేమలత, గౌతమి నాయక్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), రాధా యాదవ్, నదైన్ డిక్లెర్క్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, లిన్సే స్మిత్, లారెన్ బెల్యూపీకిరణ్ నవ్గిరే, మెగ్ లానింగ్ (కెప్టెన్), ఫోబ్ లిచ్ఫీల్డ్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, శ్వేతా సెహ్రావత్ (వికెట్ కీపర్), డియాండ్రా డాటిన్, సోఫీ ఎక్లెస్టోన్, ఆశా శోభన, శిఖా పాండే, క్రాంతి గౌడ్. -
బంగ్లాదేశ్కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నేపథ్యంలో బంగ్లాదేశ్ భారత్పై మరోసారి నిందలు వేసింది. భద్రతా కారణాల దృష్ట్యా మెగా ఈవెంట్లో ఆడేందుకు తమ ఆటగాళ్లను భారత్కు పంపలేమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ మ్యాచ్ల వేదికలను మార్చాలంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి విజ్ఞప్తి కూడా చేసింది.ఐసీసీ చెప్పింది.. ఈ మూడు జరిగితే దాడులు!అయితే, ఈ విషయంపై ఐసీసీ స్పందించిందంటూ బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘‘వేదికల మార్పు గురించి ఐసీసీకి మేము రెండు లేఖలు పంపించాము. ఇందుకు సమాధానం ఇంకా రాలేదు. అయితే, ఐసీసీ భద్రతా బృందం నుంచి మాకు లేఖ వచ్చింది.సెక్యూరిటీ టీమ్ ఇంఛార్జి మాకు రాసిన లేఖలో మూడు విషయాలు చెప్పారు. ఒకటి.. ఒకవేళ ముస్తాఫిజుర్ రహమాన్ బంగ్లాదేశ్ జట్టులో ఉంటే భద్రతా ముప్పు పెరుగుతుందని చెప్పారు. రెండోది.. ఒకవేళ బంగ్లాదేశ్కు మద్దతు ఇచ్చే ఆటగాళ్లు మా దేశ జెర్సీ వేసుకుని మైదానంలోకి వస్తే దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పారు.ఎన్నికలు సమీపిస్తున్నందున అది కూడా బంగ్లాదేశ్ జట్టుకు ముప్పును పెంచే అవకాశం ఉందని చెప్పారు. ఐసీసీ సెక్యూరిటీ టీమ్ హెడ్ ఇచ్చిన వివరాలను బట్టి.. టీ20 ప్రపంచకప్ ఆడేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత్కు వెళ్లడం ఎంతమాత్రం సరికాదని అర్థమవుతోంది’’ అని నజ్రుల్ ఒక రకంగా నిందలు వేశాడు.దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఐసీసీఅయితే, నజ్రుల్ వ్యాఖ్యలకు ఐసీసీ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ఐసీసీ వర్గాలు ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘పబ్లిక్గా కొంతమంది చేస్తున్న కామెంట్లు ఐసీసీ దృష్టికి వచ్చాయి. టీ20 ప్రపంచకప్లో బంగ్లాదేశ్ ఆడే విషయంలో కొంతమంది తమకు నచ్చినట్లుగా ఐసీసీ సెక్యూరిటీ రిస్క్ గురించి చెప్పిందని మాట్లాడుతున్నారు.అంతర్జాతీయ స్థాయి భద్రతా నిపుణులతో ఐసీసీ చర్చిస్తుంది. దీనర్థం భారత్లో బంగ్లాదేశ్ మ్యాచ్లు ఆడకూడదని కాదు. భారత్లో ఎలాంటి భద్రతా ముప్పు లేదు. ఒకవేళ సెక్యూరిటీ రిస్క్ ఉంటుందని భావించినా.. అది తక్కువ నుంచి అతి తక్కువగా ఉంది.భారత్లో ఇప్పటికే ఎన్నో ఐసీసీ, మెగా టోర్నీలు జరిగాయి. మా భద్రతా విభాగం ప్రత్యక్షంగా బంగ్లాదేశ్ ప్లేయర్లపై దాడులు జరుగుతుందని అస్సలు చెప్పలేదు’’ అని నజ్ముల్ వ్యాఖ్యలను ఖండించాయి. పచ్చి అబద్ధంఇక PTI అందించిన వివరాల ప్రకారం.. ‘‘భారత్లో భద్రత గురించి ఐసీసీ- బీసీబీ మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఆసిఫ్ నజ్రుల్ చెప్పింది పచ్చి అబద్ధం. ముస్తాఫిజుర్ సెలక్షన్ వల్ల బంగ్లాదేశ్ జట్టుకు ముప్పు ఉంటుందని చెప్పిందన్నదాంట్లో ఎంత మాత్రం నిజం లేదు. ఇలాంటి ఒక విషయాన్ని లేఖలో అధికారికంగా రాయనేలేదు’’ అని ఐసీసీ వర్గాలు తెలిపాయి.కాగా బంగ్లాదేశ్లో కొన్నాళ్లుగా మైనారిటీలపై దాడులు పెరిగాయి. అందుకు తోడు భారత్పై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో బంగ్లా కవ్వింపులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2026లో ఉన్న ఒకే ఒక్క బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రహమాన్ను తొలగించాలనే డిమాండ్లు రాగా.. బీసీసీఐ అందుకు అంగీకరించింది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2026 ఆడేందుకు తాము భారత్కు రాలేమని.. తమ ఆటగాళ్ల భద్రతకు ముప్పు ఉందంటూ బీసీబీ రాగం ఎత్తుకుంది.చదవండి: U19 WC 2026 IND vs ENG: వైభవ్ సూర్యవంశీ ఫెయిల్ -
‘నిశ్చితార్థం చేసుకున్నాం’
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ శుభవార్త చెప్పాడు. ప్రియురాలు సోఫీ షైన్తో వివాహ నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలిపాడు. ‘‘చిరునవ్వుల నుంచి కలల దాకా అన్నీ పంచుకున్నాం. ప్రేమ మమ్మల్ని దీవించింది.చిరకాల ప్రయాణానికి నాందిగా మేము ఎంగేజ్మెంట్ చేసుకున్నాము’’ అని శిఖర్- సోఫీ పేరిట సోషల్ మీడియా వేదికగా నోట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా బాల్కనీలో ఎర్ర గులాబీలతో అందంగా అలంకరించిన హృదయాకారం ముందుకు శిఖర్ చేయి చాచగా.. సోఫీ తన వజ్రపు ఉంగరాన్ని చూపిస్తూ అతడి చేతి మీద చేయి వేసిన ఫొటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్గా మారింది.శుభాకాంక్షల వెల్లువకాబోయే వధూవరులు శిఖర్ ధావన్- సోఫీ షైన్లకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ఫిబ్రవరి మూడోవారంలో వీరి పెళ్లి వేడుక ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కాగా టీమిండియా ఓపెనర్గా సత్తా చాటిన శిఖర్ ధావన్ గతంలో.. ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషా ముఖర్జీ అనే డివోర్సీని 2011లో పెళ్లి చేసుకున్నాడు.కుమారుడికీ దూరంఅన్యోన్యంగా కనిపించిన ఈ జంటకు కుమారుడు జొరావర్ ధావన్ సంతానం. అంతకుముందు పెళ్లి ద్వారా ఆయేషాకు ఇద్దరు కుమార్తెలు ఉండగా.. ధావన్ వాళ్లు కూడా తన సొంత కూతుళ్లలాంటి వారే అని పలు సందర్భాల్లో చెప్పాడు. అయితే, కొన్నాళ్లకు శిఖర్- ఆయేషా మధ్య విభేదాలు తలెత్తి తీవ్రరూపం దాల్చాయి.ఈ క్రమంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించగా 2023లో వీరికి విడాకులు మంజూరయ్యాయి. కొడుకు కూడా ధావన్కు దూరమయ్యాడు. దీంతో కొన్నాళ్లపాటు ఒంటరిగానే ఉన్న ధావన్.. కొంతకాలం క్రితం ఐర్లాండ్ భామ సోఫీ షైన్తో ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు తమ ప్రేమను పెళ్లిదాకా తీసుకువచ్చేందుకు సిద్ధపడ్డారు ఈ జంట. కాగా సోఫీ మార్కెటింగ్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేట్ అని సమాచారం. అబుదాబిలోని ఓ కంపెనీకి ఆమె వైస్ ప్రెసిడెంట్ అని తెలుస్తోంది.చదవండి: బంగ్లాదేశ్ మ్యాచ్ల వేదికలు మార్చండి!.. స్పందించిన బీసీసీఐ -
చరిత్ర సృష్టించిన పడిక్కల్.. తొలి ప్లేయర్గా..
దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో కర్ణాటక బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్ అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ముంబైతో క్వార్టర్ ఫైనల్లోనూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ దుమ్ములేపాడు. సెంచరీ మిస్ చేసుకున్నా సూపర్ ఇన్నింగ్స్తో జట్టుకు విజయం అందించాడు.బెంగళూరు వేదికగా తొలి క్వార్టర్ ఫైనల్లో కర్ణాటక- ముంబై (Karnataka vs Mumbai) జట్లు సోమవారం తలపడ్డాయి. టాస్ గెలిచిన కర్ణాటక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ముంబై నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది.షామ్స్ ములాని అర్ధ శతకంఓపెనర్లు అంగ్క్రిష్ రఘువన్షి (27), ఇషాన్ ముల్చందాని (20) ఓ మోస్తరుగా ఆడగా.. వన్డౌన్లో వచ్చిన ముషీర్ ఖాన్ (9) ఈసారి విఫలమయ్యాడు. కెప్టెన్ సిద్దేశ్ లాడ్ 38 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ హార్దిక్ తామోర్ (1) నిరాశపరిచాడు.ఇలాంటి దశలో ఆల్రౌండర్ షామ్స్ ములాని అద్భుత అర్ధ శతకం (86)తో జట్టును ఆదుకున్నాడు. మిగిలిన వారిలో సాయిరాజ్ పాటిల్ (25 బంతుల్లో 33 నాటౌట్) రాణించడంతో ముంబై చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. కర్ణాటక బౌలర్లలో విద్యాధర్ పాటిల్ మూడు వికెట్లు తీయగా.. విధ్వత్ కావేరప్ప, అభిలాష్ శెట్టి చెరో రెండు.. విజయ్కుమార్ వైశాఖ్ ఒక వికెట్ పడగొట్టారు.రాణించిన పడిక్కల్.. కరుణ్ నాయర్ఇక లక్ష్య ఛేదనలో కర్ణాటకకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (12)ను మోహిత్ అవస్థి పెవిలియన్కు పంపాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్ 81 పరుగులతో రాణించగా.. కరుణ్ నాయర్ 74 పరుగులతో అతడితో కలిసి అజేయంగా నిలిచాడు.అయితే, ఈ మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించిన కారణంగా VJD (వి.జయదేవన్) మెథడ్లో.. 33 ఓవర్లలో వికెట్ నష్టానికి 187 పరుగులు చేసిన కర్ణాటక.. 55 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో సెమీస్కు దూసుకువెళ్లింది.చరిత్ర సృష్టించిన పడిక్కల్ఈ సీజన్లో పడిక్కల్ ఇప్పటికే 721 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ దేశీ వన్డే టోర్నీలో అత్యధికసార్లు 700 పరుగుల మార్కు దాటిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2021-22 సీజన్లో దేవదత్ పడిక్కల్ ఏడు ఇన్నింగ్స్ ఆడి 737 పరుగులు సాధించాడు.ఇక ఈ టోర్నీలో ఓవరాల్గా ఒక సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా నారాయణ్ జగదీశన్ (2022-23లో 8 ఇన్నింగ్స్లో 830 పరుగులు) కొనసాగుతున్నాడు. ముంబై తరఫున 2021-22 సీజన్లో పృథ్వీ షా 827 పరుగులు చేసి రెండో స్థానాన్ని ఆక్రమించాడు. చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్.. జట్టులోకి ఊహించని ఆటగాడు -
IND vs NZ: రిపోర్టర్పై మండిపడ్డ టీమిండియా స్టార్
స్వదేశంలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో టీమిండియా శుభారంభం అందుకుంది. వడోదర వేదికగా ఆదివారం కివీస్పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి 1-0తో ముందంజ వేసింది. విరాట్ కోహ్లి (Virat Kohli- 93) అద్భుత ఇన్నింగ్స్తో మరోసారి సత్తా చాటి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.ఇక ఈ మ్యాచ్లో టీమిండియా యువ క్రికెటర్ హర్షిత్ రాణా (Harshit Rana) సైతం మెరుగ్గా రాణించాడు. అర్ధ శతకాలతో అదరగొట్టిన న్యూజిలాండ్ ఓపెనర్లు డెవాన్ కాన్వే (Devon Conway- 56), హెన్రీ నికోల్స్ (62) రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చాడు ఈ రైటార్మ్ పేసర్.ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిఅదే విధంగా.. న్యూజిలాండ్ విధించిన 301 పరుగుల లక్ష్య ఛేదనలో ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన హర్షిత్ రాణా.. 23 బంతులు ఎదుర్కొని 29 పరుగులు సాధించాడు. జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.బుమ్రా గైర్హాజరీలోఈ క్రమంలో కివీస్పై టీమిండియా గెలుపు అనంతరం హర్షిత్ రాణా మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్.. ‘‘జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాము. భారత బౌలింగ్లో తడబాటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.కొత్త బంతితో మనవాళ్లు అంత తేలికగా వికెట్లు తీయలేకపోతున్నారు. ఇందుకు గల కారణం ఏమిటి?’’ అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తీవ్ర అసహనానికి లోనైన హర్షిత్ రాణా.. ‘‘మీరు అసలు ఎలాంటి క్రికెట్ చూశారో నాకైతే అర్థం కావడం లేదు.మండిపడ్డ టీమిండియా హర్షిత్ రాణాఈరోజు సిరాజ్ వికెట్లు తీయలేకపోయినా మెరుగ్గా బౌలింగ్ చేశాడు. కొత్త బంతితో మేము మరీ ఎక్కువగా పరుగులు కూడా ఇచ్చుకోలేదు. అయినా కొత్త బంతితో వికెట్లు తీయడం కుదరలేదంటే.. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేమని కాదు కదా!.. మేము మధ్య ఓవర్లలో వికెట్లు తీశాము’’ అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు న్యూజిలాండ్తో వన్డేల నుంచి విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త బంతితో వికెట్లు తీయడంలో టీమిండియా తడబడిన మాట వాస్తవమే. కాన్వే, నికోల్స్ కలిసి తొలి వికెట్కు ఏకంగా 117 పరుగులు జోడించడం ఇందుకు నిదర్శనం.ఆల్రౌండర్గా ఇక టీమిండియా మేనేజ్మెంట్ తనను ఆల్రౌండర్గా చూడాలని భావిస్తోందని హర్షిత్ రాణా ఈ సందర్భంగా వెల్లడించాడు. ఇందుకు తగినట్లుగానే తాను నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపాడు. కాగా భారత్- న్యూజిలాండ్ మధ్య బుధవారం నాటి రెండో వన్డేకు రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియం వేదిక. చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్.. జట్టులోకి ఊహించని ఆటగాడు -
వైభవ్ సూర్యవంశీ ఫెయిల్
ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో మ్యాచ్లో భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ దారుణంగా విఫలమయ్యాడు. పట్టుమని పది పరుగులు కూడా చేయలేక చతికిలపడ్డాడు. ఇటీవల సౌతాఫ్రికా గడ్డపై వైభవ్ పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే.భారత్ అండర్-19 జట్టు కెప్టెన్గా, బ్యాటర్గా అదరగొట్టి.. సౌతాఫ్రికాతో మూడు యూత్ వన్డేల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేశాడు వైభవ్. అండర్-19 వరల్డ్కప్-2026 టోర్నీకి ముందు అతడు ఫామ్లోకి రావడంతో భారత శిబిరంలో ఆత్మవిశ్వాసం పెరిగింది.స్కాట్లాండ్తో మ్యాచ్లోనూ అదరగొట్టిఅదే జోరును కొనసాగిస్తూ స్కాట్లాండ్తో అండర్-19 వరల్డ్కప్-2026 వార్మప్ మ్యాచ్లోనూ వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. జింబాబ్వే వేదికగా.. స్కాట్లాండ్ జట్టుపై ఈ ఓపెనింగ్ బ్యాటర్ 50 బంతుల్లోనే 96 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్లో డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం భారత్.. పసికూన స్కాట్లాండ్పై 121 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.ఒకే ఒక్క పరుగుజట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన వైభవ్ సూర్యవంశీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. అయితే, జింబాబ్వేలో ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో సోమవారం నాటి వార్మప్ మ్యాచ్లో మాత్రం వైభవ్ పూర్తిగా నిరాశపరిచాడు. కెప్టెన్ ఆయుశ్ మాత్రే (49)తో కలిసి ఓపెనర్గా వచ్చిన ఈ పద్నాలుగేళ్ల చిచ్చర పిడుగు.. నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేశాడు.ఇంగ్లిష్ పేసర్ సెబాస్టియన్ మోర్గాన్ బౌలింగ్లో షాట్ ఆడే క్రమంలో థామస్ ర్యూకి క్యాచ్ ఇచ్చి వైభవ్ పెవిలియన్ చేరాడు. పసికూన స్కాట్లాండ్పై చితక్కొట్టిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. తాజాగా పటిష్ట ఇంగ్లండ్తో మ్యాచ్లో తేలిపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. భారత్ మెరుగైన స్కోరుఇక ఈ మ్యాచ్లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 295 పరుగులు సాధించింది. వైభవ్తో పాటు వేదాంత్ త్రివేది (14), విహాన్ మల్హోత్రా (10) విఫలమైనా.. వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. 99 బంతుల్లో 82 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.మిగిలిన వారిలో ఆర్ఎస్ అంబరీశ్ 48, కనిష్క్ చౌహాన్ 45 (నాటౌట్) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ మింటో ఐదు వికెట్లతో చెలరేగగా.. సెబాస్టియన్ మోర్గాన్ రెండు, మ్యానీ లమ్స్డన్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా జింబాబ్వే వేదికగా జనవరి 15 నుంచి అండర్-19 వరల్డ్కప్ మొదలుకానుంది.చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్.. జట్టులోకి ఊహించని ఆటగాడు -
బంగ్లా మ్యాచ్ల వేదికలు మార్పు!.. స్పందించిన బీసీసీఐ
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో బంగ్లాదేశ్ ఆడే వేదికల మార్పు అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పందించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని స్పష్టం చేసింది. కాగా బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడుల నేపథ్యంలో భారత్తో దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.భద్రత విషయంలో.. ఈ క్రమంలో ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ఫాస్ట్బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ (Mustafizur Rahman)ను బీసీసీఐ తొలగించిది. ఈ నేపథ్యంలో తమ ఆటగాళ్ల భద్రత దృష్ట్యా భారత్లో తాము టీ20 వరల్డ్కప్ మ్యాచ్లు ఆడబోమంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) పంతానికి పోయింది. తమ జట్టు ఆడే వేదికలను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాల్సిందిగా ఐసీసీకి విజ్ఞప్తి చేసింది.అయితే, టోర్నీ ఆరంభానికి కొద్ది రోజుల (ఫిబ్రవరి 7) సమయమే ఉన్నందున ఐసీసీ ఇందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ వేదికలను కోల్కతా, ముంబై నుంచి చెన్నై, తిరునవంతపురానికి మార్చినట్లు సోమవారం వార్తలు వచ్చాయి.స్పందించిన బీసీసీఐఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్వయంగా స్పందించారు. IANSతో మాట్లాడుతూ.. ‘‘బంగ్లాదేశ్ మ్యాచ్ల వేదికలను చెన్నై లేదంటే మరో చోటికి మార్చాలంటూ ఐసీసీ నుంచి బీసీసీఐకి ఎలాంటి సందేశమూ రాలేదు. అయినా ఈ విషయం మా ఆధీనంలో లేదు.బీసీబీ, ఐసీసీ మధ్య వ్యవహారం ఇది. ఐసీసీ పాలక మండలికే అన్ని అధికారాలు ఉంటాయి. ఒకవేళ వేదికలను మార్చాలని గనుక ఐసీసీ ఆదేశిస్తే.. ఆతిథ్య దేశంగా అందుకు తగ్గట్లుగా చర్యలు చేపడతాము. ఇప్పటికైతే ఈ అంశంలో మాకు ఎలాంటి సమాచారమూ లేదు’’ అని దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.టీ20 ప్రపంచకప్-2026లో బంగ్లాదేశ్ షెడ్యూల్ఫిబ్రవరి 7- వెస్టిండీస్తో- కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగాఫిబ్రవరి 9- ఇటలీతో- కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగాఫిబ్రవరి 14- ఇంగ్లండ్తో- కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగాఫిబ్రవరి 17- నేపాల్తో- ముంబైలోని వాంఖడే వేదికగా.చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్.. జట్టులోకి ఊహించని ఆటగాడు -
IND vs NZ: టీమిండియాకు భారీ షాక్!.. ప్రకటన విడుదల
న్యూజిలాండ్తో వన్డే సిరీస్ నేపథ్యంలో టీమిండియాకు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే రిషభ్ పంత్ గాయం కారణంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా మరో ఆటగాడు సైతం గాయపడ్డాడు.వడోదర వేదికగా తొలి వన్డే సందర్భంగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar)కు గాయమైంది. పక్కటెముకల్లో నొప్పితో అతడు విలవిల్లాడాడు. ఈ క్రమంలో అతడిని స్కానింగ్కు పంపించారు. ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్న వాషీ.. తదుపరి రిపోర్టు వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది.ఊహించని ఆటగాడుఈ నేపథ్యంలో వాషింగ్టన్ సుందర్ మిగిలిన రెండు వన్డేలకు దూరమయ్యాడు. మెన్స్ సెలక్షన్ కమిటీ వాషీ స్థానంలో యువ ఆటగాడు ఆయుశ్ బదోని (Ayush Badoni)ని జట్టుకు ఎంపిక చేసింది. రాజ్కోట్లో రెండో వన్డే కోసం బదోని టీమిండియాతో చేరతాడు. ఈ మేరకు బీసీసీఐ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా బదోని జాతీయ జట్టుకు ఎంపిక కావడం ఇదే తొలిసారి. ఢిల్లీకి చెందిన ఆయుశ్ బదోని బ్యాటింగ్ ఆల్రౌండర్. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన బదోని.. రైటార్మ్ ఆఫ్బ్రేక్ స్పిన్నర్ కూడా!.. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న 26 ఏళ్ల బదోని.. ఇప్పటికి 56 మ్యాచ్లలో కలిపి 963 పరుగులు చేశాడు.ఫామ్లో లేడుఇక లిస్ట్-ఎ క్రికెట్లో 27 మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఆయుశ్ బదోని ఖాతాలో 693 పరుగులు ఉన్నాయి. ఇందులో ఓ శతకం, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే, ఇటీవల దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో మాత్రం గత మూడు మ్యాచ్ల (1, 12, 3 నాటౌట్)లో బదోని తీవ్రంగా నిరాశపరిచాడు. అయినప్పటికీ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషీ దూరం కావడంతో అతడి స్థానంలో తొలిసారి టీమిండియాలోకి వచ్చాడు. కాగా న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇరుజట్ల మధ్య బుధవారం నాటి రెండో వన్డేకు రాజ్కోట్ వేదిక. ఇదిలా ఉంటే పంత్ స్థానంలోధ్రువ్ జురెల్ జట్టులో చేరిన విషయం తెలిసిందే.న్యూజిలాండ్తో రెండు, మూడో వన్డేకు భారత జట్టు (అప్డేటెడ్)శుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), ఆయుశ్ బదోని.చదవండి: ఈ అవార్డులన్నీ ఆమెకే.. అమ్మకు ఇష్టం: విరాట్ కోహ్లి -
ఈ అవార్డులన్నీ ఆమెకే.. అమ్మకు ఇష్టం: విరాట్ కోహ్లి
వన్డే క్రికెట్లో తాను ఛేజింగ్ ‘కింగ్’నని టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి మరోసారి నిరూపించుకున్నాడు. సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ న్యూజిలాండ్తో తొలి వన్డేలోనూ అదరగొట్టాడు. తృటిలో సెంచరీ చేజార్చుకున్నా జట్టును గెలిపించి.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’(POTM)గా నిలిచాడు. కాగా కోహ్లి కెరీర్లో ఈ అవార్డు అందుకోవడం ఇది 45వ సారి కావడం విశేషం.మా అమ్మకు పంపిస్తానుఈ నేపథ్యంలో కోహ్లి (Virat Kohli) మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘‘నిజం చెప్పాలంటే నా కెరీర్లో ఈ అవార్డు అందుకోవడం ఎన్నోసారో ఐడియా కూడా లేదు. నాకు దక్కిన ట్రోఫీలన్నీ మా అమ్మకు పంపిస్తాను.గుర్గావ్లోని మా ఇంట్లో ఈ ట్రోఫీలను ఉంచి.. వాటిని చూస్తూ మురిసిపోవడం అమ్మకు అత్యంత ఇష్టమైన పని. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. నా ప్రయాణం ఇంత గొప్పగా సాగడం నిజంగా ఓ కలలా ఉంది.దేవుడు నాకు అన్నీ ఇచ్చాడునా శక్తిసామర్థ్యాలపై నాకు నమ్మకం ఉంది. అయితే, కఠినంగా శ్రమించినిదే ఏదీ లభించదని నాకు తెలుసు. ఆ దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. నిజం చెప్పాలంటే.. మైలురాళ్ల గురించి నేను ఆలోచించడం లేదు. తొలుత బ్యాటింగ్ చేస్తే నాకు కాస్త కష్టంగానే అనిపిస్తుంది.ఛేదనలో లక్ష్యం ఎంతో తెలుసు కాబట్టి సులువుగా ముందుకు సాగిపోతూ ఉంటాను’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్- కివీస్ వడోదర వేదికగా ఆదివారం తొలి మ్యాచ్ ఆడాయి. 93 పరుగులుటాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కెప్టెన్ శుబ్మన్ గిల్ అర్ధ శతకం (56)తో రాణించగా.. కోహ్లి నిలకడగా ఆడుతూ 91 బంతుల్లో 93 పరుగులు సాధించాడు. తృటిలో వన్డేల్లో 54వ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.మిగిలిన వారిలో శ్రేయస్ అయ్యర్ (49) మెరుగ్గా ఆడగా.. 49 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి టీమిండియా.. నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అతి తక్కువ (624) ఇన్నింగ్స్లోనే 28 వేల పరుగుల మైలురాయిని తాకిన క్రికెటర్గా కోహ్లి ప్రపంచ రికార్డు సాధించాడు.చదవండి: క్రికెట్ చరిత్రలో అద్భుతం🗣️ If I look back at my whole journey, it's nothing short of a dream come true. ✨🎥 Virat Kohli reflects on his incredible career after becoming the 2⃣nd highest run-getter in men's international cricket🙌👏#TeamIndia | #INDvNZ | @imVkohli | @idfcfirstbank pic.twitter.com/87BgcZlx4b— BCCI (@BCCI) January 11, 2026 -
భారత్-న్యూజిలాండ్ తొలి వన్డేలో ఆసక్తికర పరిణామం
భారత్–న్యూజిలాండ్ మధ్య వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్కు థర్డ్ అంపైర్గా బంగ్లాదేశ్కు చెందిన షరఫుద్దౌలా సైకత్ వ్యవహరించారు. భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సైకత్ టీమిండియా మ్యాచ్కు అంపైర్గా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. టీ20 ప్రపంచకప్లో భాగంగా భారత్లో జరుగబోయే మ్యాచ్లకు తమ అంపైర్లను పంపబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఇలా జరగడం ఆసక్తికర పరిణామం.భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంబంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో బంగ్లా స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ను ఐపీఎల్ నుంచి తొలగించారు. 2026 వేలంలో ముస్తాఫిజుర్ను కేకేఆర్ రూ. 9.20 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకుంది.ముస్తాఫిజుర్ను ఐపీఎల్ నుంచి తొలిగించడాన్ని అవమానంగా భావించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం స్వదేశంలో ఐపీఎల్ను బ్యాన్ చేసింది. భారత్లో తాము ఆడాల్సిన టీ20 ప్రపంచకప్-2026 గ్రూప్ స్టేజీ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది.ఐసీసీ నుంచి సరైన స్పందన లేకపోవడంతో తమ దేశానికి చెందిన అంపైర్లను ప్రపంచకప్ విధుల నిమిత్తం భారత్కు పంపించబోమని నిర్ణయించింది. ప్రపంచకప్లో బంగ్లాదేశ్ భవితవ్యంపై మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ముందస్తు షెడ్యూల్ ప్రకారం ప్రపంచకప్లో బంగ్లాదేశ్ గ్రూప్ స్టేజీ మ్యాచ్లు కోల్కతా, ముంబై నగరాల్లో జరగాల్సి ఉంది. అయితే బీసీబీ విన్నపాన్ని పరిశీలిస్తున్న ఐసీసీ వేదికలను చెన్నై, తిరువనంతపురంకు మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.బోణీ కొట్టిన టీమిండియాతొలి వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. డెవాన్ కాన్వే (56), హెన్రీ నికోల్స్ (62), డారిల్ మిచెల్ (84) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. భారత బౌలర్లలో సిరాజ్, హర్షిత్, ప్రసిద్ద్ కృష్ణ తలో 2 వికెట్లు, కుల్దీప్ ఓ వికెట్ తీశారు.అనంతరం భారత్ విరాట్ కోహ్లి (91 బంతుల్లో 93; 8 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ శుభ్మన్ గిల్ (56), వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (49), ఆఖర్లో ఎల్ రాహుల్ (29 నాటౌట్) హర్షిత్ రాణా (29) రాణించడంతో 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్ 4, ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్ తలో వికెట్ తీశారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే రాజ్కోట్ వేదికగా జనవరి 14న జరుగనుంది. -
విరాట్ కోహ్లి కోసం రంగంలోకి దిగిన వికాస్ కోహ్లి
లిస్ట్-ఏ ఫార్మాట్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అరివీర భయంకరమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. గత 7 మ్యాచ్ల్లో 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలతో తిరుగులేని ప్రదర్శనలు చేస్తున్నాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో నిన్న (జనవరి 11) జరిగిన తొలి వన్డేలో తృటిలో సెంచరీ (93) అవకాశాన్ని కోల్పోయాడు. విరాట్ సత్తా చాటడంతో న్యూజిలాండ్పై భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ ప్రదర్శనగానూ విరాట్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. ఈ ఇన్నింగ్స్తో విరాట్ పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం విరాట్కు ముందు సచిన్ మాత్రమే ఉన్నాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా 28000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగానూ విరాట్ రికార్డుల్లోకెక్కాడు.ఇదిలా ఉంటే, తొలి వన్డే అనంతరం విరాట్ సోదరుడు వికాస్ కోహ్లి సోషల్మీడియాలో షేర్ చేసిన ఓ సందేశం వైరలవుతుంది. విరాట్పై ఇటీవల చులకన వ్యాఖ్యలు చేసిన భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్కు వికాస్ పరోక్షంగా చురకలించాడు.విరాట్ టెస్ట్ల నుంచి తప్పుకొని, కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగడంపై మంజ్రేకర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వన్డేలు టాపార్డర్ బ్యాటర్లకు సులభమైన ఫార్మాట్ అని వ్యాఖ్యానించాడు. జో రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్లను ఉదాహరణగా చూపిస్తూ, వారు టెస్ట్ల్లో గొప్ప వారసత్వాన్ని నిర్మిస్తున్నారంటూ విరాట్ను నేరుగా టార్గెట్ చేశాడు.ఈ వ్యాఖ్యలకు కౌంటర్గానే వికాస్ సోదరుడు విరాట్ తరఫున రంగంలోకి దిగాడు. మంజ్రేకర్ పేరు ప్రస్తావించకుండానే “ఇది ఎంత సులభమైన ఫార్మాట్ కదా... కొద్ది రోజుల క్రితం ఎవరో తమ జ్ఞానాన్ని పంచుకున్నారు.. చెప్పడం సులభం, చేయడం కష్టం” అంటూ ఓ మెసేజ్ షేర్ చేశాడు.ఈ సందేశాన్ని అభిమానులు మాజీ క్రికెటర్–కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా భావిస్తున్నారు. కాగా, విరాట్పై ఈగ కూడా వాలనివ్వని వికాస్ గతంలో కూడా చాలా సందర్భాల్లో విరాట్పై వ్యతిరేక కామెంట్లు చేసే వారికి ఇలాగే చురకలంటించాడు. విరాట్ జనవరి 14న న్యూజిలాండ్తో జరిగే రెండో వన్డేలో తిరిగి బరిలోకి దిగుతాడు. ఈ మ్యాచ్ రాజ్ కోట్ వేదికగా జరుగనుంది. -
ప్రపంచ నంబర్ 1 జట్టును ఒత్తిడిలోకి నెట్టాం: న్యూజిలాండ్ కెప్టెన్
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా వడోదర వేదికగా టీమిండియాతో నిన్న (జనవరి 11) జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ సిరీస్కు న్యూజిలాండ్ ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగినా, తొలి మ్యాచ్లోనే అద్భుతం చేసింది. ఫీల్డింగ్ మినహా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియాను భయపెట్టింది. తొలుత బ్యాటింగ్లో ఆకట్టుకునే ప్రదర్శన చేసి, ఆతర్వాత బౌలింగ్లో అద్వితియమైన పోరాటపటిమ కనబర్చింది. సునాయాసంగా గెలుపు దిశగా సాగుతున్న భారత జట్టుకు ఓ దశలో గెలుపు భయం చూపించింది. బౌలింగ్ విభాగంలో ఏకైక అనుభవజ్ఞుడు కైల్ జేమీసన్తో భారత బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చింది.మ్యాచ్ అనంతరం కెప్టెన్ మైఖేల్ బ్రేస్వెల్ తన జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. 4 వికెట్లు తీసి టీమిండియాను ఇబ్బంది పెట్టిన జేమీసన్పై ప్రశంసల వర్షం కురిపించాడు. అద్భుతమైన బ్యాటింగ్తో ఇన్నింగ్స్కు జీవం పోసిన డారిల్ మిచెల్ను కొనియాడాడు. తమ జట్టు పోరాటపటిమను ఆకాశానికెత్తాడు.బ్రేస్వెల్ మాటల్లో.. ఓడినా, గర్వంగా ఉంది. ప్రపంచ నంబర్ 1 జట్టును ఒత్తిడిలోకి నెట్టాం. మరో 20-30 పరుగులు చేసుంటే ఫలితం వేరేలా ఉండేది. గాయం నుంచి తిరిగొచ్చిన జేమీసన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బ్యాటర్లు.. ముఖ్యంగా డారిల్ మిచెల్ తన అనుభవాన్నంతా రంగరించి మంచి స్కోర్ చేసేందుకు దోహదపడ్డాడు. అయినా మరో 20-30 పరుగులు చేసుండాల్సింది. మ్యాచ్ గతి మార్చే క్షణాలను సృష్టించుకోవడం గురించి మేమెప్పుడూ మాట్లాడుకుంటాం. ఈ రోజు కొన్ని విషయాల్లో బాగా పని చేశాం. కొన్ని కీలక అవకాశాలు కోల్పోయాం. భారత్లో లైట్ల వెలుతురులో ఆడటం సులభం కాదని మరోసారి నిరూపితమైంది. ఓడినా మా జట్టు ఎల్లప్పుడూ ఉన్నత ప్రమాణాలను పాటించేందుకు కృషి చేస్తుంది. బ్రేస్వెల్ చేసిన ఈ వ్యాఖ్యలు వారి జట్టు పోరాట స్పూర్తిని సూచిస్తున్నాయి.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. డెవాన్ కాన్వే (56), హెన్రీ నికోల్స్ (62), డారిల్ మిచెల్ (84) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. భారత బౌలర్లలో సిరాజ్, హర్షిత్, ప్రసిద్ద్ కృష్ణ తలో 2 వికెట్లు, కుల్దీప్ ఓ వికెట్ తీశారు.అనంతరం విరాట్ కోహ్లి (91 బంతుల్లో 93; 8 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ శుభ్మన్ గిల్ (56), వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (49), ఆఖర్లో ఎల్ రాహుల్ (29 నాటౌట్) హర్షిత్ రాణా (29) రాణించడంతో భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్ 4, ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్ తలో వికెట్ తీశారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే రాజ్కోట్ వేదికగా జనవరి 14న జరుగనుంది. -
మరో మైలురాయిని తాకిన రోహిత్ శర్మ
టీమిండియా వెటరన్ స్టార్ రోహిత్ శర్మ మరో మైలురాయిని తాకాడు. వడోదరలో న్యూజిలాండ్తో నిన్న (జనవరి 11) జరిగిన వన్డే మ్యాచ్లో 2 సిక్సర్లు బాదడంతో అంతర్జాతీయ క్రికెట్లో 650 సిక్సర్ల మైలురాయిని (539 ఇన్నింగ్స్ల్లో) చేరుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో రోహిత్ ఇప్పటికే అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చలామణి అవుతున్నాడు. తాజాగా మరో మైలురాయిని తాకి, తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. ఈ విభాగంలో రోహిత్ తర్వాతి స్థానంలో విండీస్ విధ్వంసకర యోధుడు క్రిస్ గేల్ (551 ఇన్నింగ్స్ల్లో 553 సిక్సర్లు) ఉన్నాడు.ROHIT SHARMA - 650 SIXES IN INTERNATIONAL CRICKET. ONE & ONLY HITMAN 🥶pic.twitter.com/ENstT40dz6— Johns. (@CricCrazyJohns) January 11, 2026మ్యాచ్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. డెవాన్ కాన్వే (56), హెన్రీ నికోల్స్ (62), డారిల్ మిచెల్ (84) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. భారత బౌలర్లలో సిరాజ్, హర్షిత్, ప్రసిద్ద్ కృష్ణ తలో 2 వికెట్లు, కుల్దీప్ ఓ వికెట్ తీశారు.అనంతరం 301 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ ఆదిలో సునాయాస విజయం దిశగా సాగినప్పటికీ.. విరాట్ కోహ్లి ఔటయ్యాక తడబాటుకు లోనైంది. అయితే కేఎల్ రాహుల్ (29 నాటౌట్) హర్షిత్ రాణా (29) సహకారంతో భారత్ను విజయతీరాలకు చేర్చాడు. అంతకుముందు కోహ్లి (91 బంతుల్లో 93; 8 ఫోర్లు, సిక్స్) మరో సెంచరీని తృటిలో చేజార్చుకున్నాడు. భారత ఇన్నింగ్స్లో కెప్టెన్ శుభ్మన్ గిల్ (56), వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (49) కూడా రాణించారు. రోహిత్ శర్మ (29 బంతుల్లో 26; 3 ఫోరు, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించాడు. మొత్తంగా అందరూ తలో చేయి వేయడంతో భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్ 4, ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్ తలో వికెట్ తీశారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే రాజ్కోట్ వేదికగా జనవరి 14న జరుగనుంది.కాగా, ఈ సిరీస్కు న్యూజిలాండ్ ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగింది. అయినా తొలి వన్డేలో అద్భుతంగా రాణించి, ప్రపంచ నంబర్ వన్ జట్టు టీమిండియాకు ఊహించని పోటీనిచ్చింది. ఫీల్డింగ్లో కాస్త తడబడినా.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తా చాటి ఆకట్టుకుంది. -
12 ఏళ్ల తర్వాత భారత్కు ఫిఫా ప్రపంచకప్
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ 12 ఏళ్ల తర్వాత భారత్లోకి అడుగుపెట్టింది. కోకా-కోలా భాగస్వామ్యంతో జరుగుతున్న ట్రోఫీ టూర్ ఫుట్బాల్ ప్రపంచకప్ను భారత అభిమానులకు దగ్గర చేసింది. ప్రతిష్టాత్మకమైన ఈ ట్రోఫీని న్యూఢిల్లీలోని తాజ్ మహల్ హోటల్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర యువజన, క్రీడా శాఖ మంత్రి డా. మాన్సుఖ్ మాండవియా, బ్రెజిల్ మాజీ వరల్డ్ కప్ విజేత గిల్బర్టో డి’సిల్వా, క్రీడా చరిత్రకారుడు బోరియా మజుందార్, అలాగే కోకా-కోలా ఇండియా నాయకత్వం హాజరయ్యారు.మంత్రి మాండవియా మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో క్రీడలు జాతీయ ప్రాధాన్యతగా మారాయి. 2047 నాటికి భారత్ను ప్రపంచంలోని టాప్ 5 క్రీడా దేశాల్లో ఒకటిగా నిలపడం మా లక్ష్యం అని అన్నారు. కోకా-కోలా ఇండియా అధ్యక్షుడు సంకేత్ రే మాట్లాడుతూ.. భారత క్రీడలు విస్తృత భాగస్వామ్యం, బలమైన మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ అనుసంధానం ద్వారా కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయి. FIFAతో మా దీర్ఘకాలిక భాగస్వామ్యం వల్ల ఇలాంటి చారిత్రాత్మక క్షణాలను భారత అభిమానులకు చేరువ చేస్తున్నామని అన్నారు. ట్రోఫీ విశేషాలు ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ 18 క్యారెట్ల బంగారంతో తయారు చేయబడింది. దీని బరువు 6.175 కిలోలు. ఈ ట్రోఫీ రెండు మానవ ఆకృతులు ప్రపంచ గోళాన్ని పైకి ఎత్తిన రూపకల్పనతో 1974లో రూపొందించబడింది. ఈ ట్రోఫీ టూర్ 30 దేశాల్లో, 75 స్టాప్లతో 150 రోజుల పాటు సాగుతుంది. -
క్రికెట్ చరిత్రలో అద్భుతం
క్రికెట్ చరిత్రలో అద్భుతం జరిగింది. తండ్రి-కొడుకులు ఒకే జట్టులో కలిసి ఆడి చరిత్ర సృష్టించారు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2025-26లో ఈ చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ వెటరన్ ఆల్రౌండర్ మొహమ్మద్ నబీ, అతని కొడుకు హసన్ ఐసాఖిల్ నోఖాలి ఎక్స్ప్రెస్ అనే ఫ్రాంచైజీకి కలిసి ప్రాతినిథ్యం వహించారు.క్రికెట్ చరిత్రలో ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో గతేడాదే తొలిసారి ఓ తండ్రి-కొడుకుల జోడీ (సుహైల్ సత్తార్ (50)-యాహ్యా సుహైల్ (17), తిమోర్-లెస్టే అనే దేశం తరఫున కలిసి టీ20 మ్యాచ్ ఆడింది.విండీస్ దిగ్గజ బ్యాటర్ శివ్నరైన్ చంద్రపాల్ సైతం తన కొడుకు తేజ్నరైన్ చంద్రపాల్తో కలిసి ఓ క్లబ్ మ్యాచ్ ఆడాడు. తాజాగా మొహమ్మద్ నబీ-హసన్ ఐసాఖిల్ కలిసి ఓ టీ20 లీగ్ మ్యాచ్ ఆడి అత్యంత అరుదైన జాబితాలో చోటు దక్కించకున్నారు.ప్రస్తుతం నబీ వయసు 41 సంవత్సరాలు కాగా.. హసన్ వయసు 19. 2007లో నబీ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టినప్పుడు హసన్ 11 నెలల పసికందు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత, ఈ తండ్రి–కొడుకు ఒకే జట్టులో ఆడటం చారిత్రక ఘట్టంగా నిలిచింది. నబీ కెరీర్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ చరిత్రలో ఇతనో దిగ్గజం. ప్రపంచ క్రికెట్లోనూ మేటి స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. ఆఫ్ఘనిస్తాన్ తరఫున సుదీర్ఘ అనుభవం కలిగిన నబీకి కొడుకు హసన్తో కలిసి జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలని కల ఉంది. ఈ కల త్వరలోనే నెరవేరే అవకాశం ఉంది.హసన్ ఫస్ట్ క్లాస్ మరియు లిస్ట్–ఏ క్రికెట్లో నిలకడగా రాణిస్తూ జాతీయ జట్టు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు. ఓపెనింగ్ బ్యాటర్ అయిన హసన్ పై రెండు ఫార్మాట్లలో సగటు 50కు చేరువగా పరుగులు సాధించాడు. పొట్టి క్రికెట్లో మాత్రం హసన్కు అనుభవం కాస్త తక్కువగా ఉంది. ఇప్పటివరకు 30 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ హసన్కు తొలి విదేశీ అసైన్మెంట్. నోఖాలి ఎక్స్ప్రెస్ తరఫున మూడు వారాల పాటు బెంచ్లో కూర్చున్న హసన్.. తాజాగా ఢాకా క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్తో బీపీఎల్ అరంగేట్రం చేశాడు.అరంగేట్రంలోనే విధ్వంసంఅరంగేట్రంలోనే హసన్ చెలరేగిపోయాడు. 60 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు సాయంతో 92 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. కేవలం 8 పరుగులతో సెంచరీ చేసే సుదర్ణావకాశాన్ని కోల్పోయాడు. కొడుకు చెలరేగిపోగా, తండి నబీ మాత్రం 17 పరుగులు (2 ఫోర్లు) మాత్రమే చేసి నిరాశపరిచాడు. అయితే నబీ బౌలింగ్లో సత్తా చాటి 4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. తండ్రి-కొడుకులు సత్తా చాటడంతో ఈ మ్యాచ్లో ఢాకా క్యాపిటల్స్పై నోఖాలి ఎక్స్ప్రెస్ 41 పరుగుల తేడాతో గెలుపొందింది. అరంగేట్రంలోనే విధ్వంసం సృష్టించిన హసన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
గెలుపు తలుపు తీసే క్రికెటర్లకు...
వడోదర: ప్రస్తుత టీమిండియా దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు బరోడా క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) వినూత్నంగా ఆత్మీయ సత్కారాన్ని ఏర్పాటు చేసింది. ఏళ్ల తరబడి ‘టన్’లకొద్దీ పరుగులతో భారత క్రికెట్ జట్టు గెలుపు తలుపుల్ని తీస్తున్న ‘హిట్మ్యాన్’ రోహిత్, ‘కింగ్’ కోహ్లిలను తొలి వన్డే సందర్భంగా అదే రీతిన గౌరవించింది. రెండు తలుపులతో ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేసిన బీసీఏ ఇద్దరినీ అందులో ఉంచింది. ఇద్దరి క్రికెటర్ల నిలువెత్తు పోస్టర్లు అంటించిన చెరో తలుపు తీయగానే కోహ్లి, రోహిత్లు బయటికి వచ్చారు. వారి పోస్టర్లపై ఆటోగ్రాఫ్లు చేశారు. ఈ వేడుక మైదానంలోని వేలమంది క్రికెట్ అభిమానుల్ని విశేషంగా అలరించింది. వాళ్లు రావడం, పోస్టర్లపై సంతకాలు చేయడంతో ప్రేక్షకులంతా కరతాళధ్వనులతో జేజేలు పలికారు. ఇందులో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ జై షా, బీసీఏ అధ్యక్షుడు ప్రణవ్ అమీన్, బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తదితరులు పాల్గొన్నారు. -
తిప్పేసిన హసరంగ.. బెంబేలెత్తిపోయిన పాక్
స్వదేశంలో పాకిస్తాన్తో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను శ్రీలంక 1-1తో డ్రా చేసుకుంది. డంబుల్లా వేదికగా నిన్న (జనవరి 11) జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్లో పాక్ను 14 పరుగుల తేడాతో చిత్తు చేసింది. వర్షం కారణంగా 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు 6 వికెట్ల నష్టానికి 160 పరుగుల భారీ స్కోర్ చేసింది. లంక బ్యాటర్లు తలో చేయి వేసి ఈ స్కోర్ను అందించారు. కమిల్ మిషారా 20, కుసాల్ మెండిస్ 30, ధనంజయ డిసిల్వ 22, చరిత్ అసలంక 21, దసున్ షనక 34, జనిత్ లియనాగే 22 (నాటౌట్) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ వసీం జూనియర్ 3 వికెట్లు పడగొట్టగా.. నసీం షా, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రాఫ్ తలో వికెట్ పడగొట్టారు.తిప్పేసిన హసరంగఅనంతరం భారీ లక్ష్య ఛేదనలో హసరంగ ధాటికి పాక్ బెంబేలెత్తిపోయింది. 12 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులకు మాత్రమే పరిమితమైంది. హసరంగ 3 ఓవర్లలో 35 పరుగులకు 4 వికెట్లు తీసి పాక్ను దెబ్బకొట్టాడు. మతీష పతిరణ (3-0-34-2) రాణించాడు. ఎషాన్ మలింగకు ఓ వికెట్ దక్కింది. పాక్ ఇన్నింగ్స్లో కెప్టెన్ సల్మాన్ అఘా (45) టాప్ స్కోరర్గా నిలువగా.. మరో ఇద్దరు (నవాజ్ (28), ఖ్వాజా నఫే (26)) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కాగా, ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో పాక్ గెలువగా.. రెండో మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. -
సూపర్ సోఫీ
ముంబై: ఆధిక్యం చేతులు మారుతూ సాగిన మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ను విజయం వరించింది. మహిళల ప్రీమియర్ లీగ్లో భాగంగా ఆదివారం పరుగుల వరద పారిన పోరులో గుజరాత్ 4 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది. మొదట గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ సోఫీ డివైన్ (42 బంతుల్లో 95; 7 ఫోర్లు, 8 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... కెపె్టన్ ఆష్లే గార్డ్నర్ (26 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్స్లు) కూడా దంచికొట్టింది. ఢిల్లీ బౌలర్లలో నందిని శర్మ (5/33) ‘హ్యాట్రిక్’తో సహా 5 వికెట్లుపడగొట్టగా... తెలుగమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి (2/42), చినెల్లి హెన్రీ (2/43) చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులకు పరిమితమై వరుసగా రెండో ఓటమి చవిచూసింది. లిజెల్లి లీ (54 బంతుల్లో 86; 12 ఫోర్లు, 3 సిక్స్లు), లారా వోల్వార్ట్ (38 బంతుల్లో 77; 9 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నారు. ఆరంభంలో లిజెల్లి చెలరేగిపోగా... విజయానికి 24 బంతుల్లో 60 పరుగులు అవసరమైన దశలో వోల్వార్ట్ కదంతొక్కింది. వోల్వార్ట్ 17వ ఓవర్లో 2 ఫోర్లు... 18వ ఓవర్లో 4, 4, 4, 6 కొట్టింది. దీంతో సమీకరణం 12 బంతుల్లో 29కి చేరింది. 19వ ఓవర్లో వోల్వార్ట్ 6, 4, జెమీమా ఫోర్తో 22 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 7 పరుగులు అవసరం కాగా... 2 పరుగులే ఇచి్చన సోఫీ డివైన్ 2 వికెట్లు తీసి గుజరాత్కు వరుసగా రెండో విజయం కట్టబెట్టింది. ఒకే ఓవర్లో 4,4,6,6,6,6 గుజరాత్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో సోఫీ డివైన్ విజృంభించింది. స్నేహ్ రాణా వేసిన ఆ ఓవర్ తొలి రెండు బంతులకు ఫోర్లు బాదిన డివైన్... ఆ తర్వాత వరుసగా నాలుగు సిక్స్లు కొట్టింది. దీంతో ఒక్క ఓవర్లోనే 32 పరుగులు వచ్చాయి. డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్లో లభించిన అత్యధిక పరుగులు ఇవే. క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించిన డివైన్... శ్రీచరణి ఓవర్లో సైతం మూడు సిక్స్లు బాదింది. మరో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో సెంచరీకి ఐదు పరుగుల దూరంలో అవుటైంది. నందిని ‘హ్యాట్రిక్’ ఫుల్ఫామ్లో ఉన్న డివైన్ను అవుట్ చేసిన నందిని శర్మ... ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ‘హ్యాట్రిక్’తో సహా నాలుగు వికెట్లు పడగొట్టింది. రెండో బంతికి కాశ్వీ గౌతమ్ (14) అవుట్ కాగా... నాలుగో బంతికి కనిక (4) స్టంపౌటైంది. చివరి రెండు బంతులకు రాజేశ్వరి (0), రేణుక (0) క్లీన్»ౌల్డ్ అయ్యారు. తద్వారా ఇసీ వాంగ్(2023), దీప్తి శర్మ (2024), గ్రేస్ హారిస్ (2025) తర్వాత డబ్ల్యూపీఎల్లో ‘హ్యాట్రిక్’ తీసిన నాలుగో బౌలర్గా నందిని నిలిచింది. -
కోహ్లి పరుగుల బాటతో...
అనుభవం లేని ఆటగాళ్లతో వచ్చిన న్యూజిలాండ్ అదరగొట్టింది. గెలిచేందుకు అవసరమైన లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. కానీ ఛేదనలో మొనగాడు, ‘కింగ్ కోహ్లి’ కుదురుకొని ఆడటంతో పెద్ద లక్ష్యం కూడా దిగివచ్చింది. ఒకదశలో జేమీసన్ వణికించినా... 8 పరుగుల వ్యవధిలోనే కోహ్లి, జడేజా, అయ్యర్ల వికెట్లు కోల్పోయినా... కేఎల్ రాహుల్ చేసిన విలువైన పరుగులతో టీమిండియా తొలి వన్డేలో గెలిచింది. మూడు మ్యాచ్ల సిరీస్లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. వడోదర: భారత బ్యాటింగ్ ‘కింగ్’ కోహ్లి మరోసారి ఛేజింగ్లో తన విలువ ఏంటో నిరూపించుకున్నాడు. కోహ్లి సాధికారిక ఆటతీరు కారణంగా... తొలి వన్డేలో న్యూజిలాండ్ 300 పరుగులు చేసినా ఓటమిని తప్పించుకోలేకపోయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో శుబ్మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ఫై గెలిచింది. టాస్ నెగ్గిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా, ముందుగా బ్యాటింగ్ చేపట్టిన కివీస్ నిరీ్ణత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగుల భారీస్కోరు చేసింది. డారిల్ మిచెల్ (71 బంతుల్లో 84; 5 ఫోర్లు, 3 సిక్స్లు), డెవాన్ కాన్వే (67 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్స్), హెన్రీ నికోల్స్ (69 బంతుల్లో 62; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. ‘హైదరాబాద్ ఎక్స్ప్రెస్’ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కోహ్లి (91 బంతుల్లో 93; 8 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీని చేజార్చుకోగా... గిల్ (71 బంతుల్లో 56; 3 ఫోర్లు, 2 సిక్స్లు), శ్రేయస్ అయ్యర్ (47 బంతుల్లో 49; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. జేమీసన్కు 4 వికెట్లు దక్కాయి. రెండో వన్డే 14న రాజ్కోట్లో జరుగుతుంది. అదిరే ఆరంభం ఓపెనర్లు కాన్వే, నికోల్స్ చూడచక్కని అర్ధసెంచరీలతో కివీస్కు శుభారంభమిచ్చారు. 21 ఓవర్ల వరకు భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. ఈ క్రమంలో తొలి వికెట్కు 117 పరుగులు జోడించారు. హర్షిత్ రెండో స్పెల్ 2–0–13–2తో విలువైన వికెట్లు పడగొట్టడంతో న్యూజిలాండ్ తడబడింది. 117/0 స్కోరుతో పటిష్టంగా ఉన్న న్యూజిలాండ్ 38వ ఓవర్ వచ్చేసరికి 198/5తో కష్టాల్లో పడింది. ఇలాంటి దశలో మిచెల్ మెరుపులతో కివీస్ ఇన్నింగ్స్ను మళ్లీ నిలబెట్టాడు. æ కోహ్లి నడిపించడంతో... భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ధాటిగా ఆడే క్రమంలో రోహిత్ శర్మ (26; 3 ఫోర్లు, 2 సిక్స్లు) అవుటయ్యాడు. కెప్టెన్ గిల్కు జతయిన కోహ్లి చకచకా పరుగులు రాబట్టారు. రెండో వికెట్కు 118 పరుగులు జోడించాక గిల్ అవుటయ్యాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్తో కలిసి విరాట్ జట్టు స్కోరును 200 దాటించాడు. సెంచరీకి చేరువవుతున్న దశలో కోహ్లిని జేమీసన్ అవుట్ చేశాడు. అప్పుడు భారత్ స్కోరు 234/3. ఇక చేయాల్సింది 67 పరుగులే కాగా చేతిలో 7 వికెట్లున్నాయి. కానీ జేమీసన్ ధాటికి అయ్యర్, జడేజా (4) పెవిలియన్ చేరారు. అయితే హర్షిత్ రాణా (23 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ (21 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఒక ఓవర్ మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (బి) రాణా 56; నికోల్స్ (సి) రాహుల్ (బి) రాణా 62; యంగ్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 12; మిచెల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ప్రసిధ్ 84; ఫిలిప్స్ (సి) అయ్యర్ (బి) కుల్దీప్ 12; మిచెల్ హే (బి) ప్రసిధ్ 18; బ్రేస్వెల్ రనౌట్ 16; ఫోక్స్ (బి) సిరాజ్ 1; క్లార్క్ (నాటౌట్) 24; జేమీసన్ (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 7; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 300. వికెట్ల పతనం: 1–117, 2–126, 3–146, 4–170, 5–198, 6–237, 7–239, 8–281. బౌలింగ్: సిరాజ్ 8–0–40–2, హర్షిత్ రాణా 10–0–65–2, సుందర్ 5–0–27–0, ప్రసిధ్ కృష్ణ 9–0–60–2, కుల్దీప్ 9–0–52–1, జడేజా 9–0–56–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) బ్రేస్వెల్ (బి) జేమీసన్ 26; గిల్ (సి) ఫిలిప్స్ (బి) అశోక్ 56; కోహ్లి (సి) బ్రేస్వెల్ (బి) జేమీసన్ 93; శ్రేయస్ (బి) జేమీసన్ 49; జడేజా (సి) క్లార్క్ (బి) జేమీసన్ 4; రాహుల్ (నాటౌట్) 29; హర్షిత్ (సి) హే (బి) క్లార్క్ 29; సుందర్ (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 13; మొత్తం (49 ఓవర్లలో 6 వికెట్లకు) 306. వికెట్ల పతనం: 1–39, 2–157, 3–234, 4–239, 5–242, 6–279. బౌలింగ్: జేమీసన్ 10–1–41–4, ఫోక్స్ 10–0–49–0, ఆదిత్య అశోక్ 6–0–55–1, క్లార్క్ 10–0–73–1, బ్రేస్వెల్ 8–0–56–0, ఫిలిప్స్ 4–0–21–0, మిచెల్ 1–0–7–0.2: మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) కలిపి అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లి రెండో స్థానానికి ఎగబాకాడు. 557 మ్యాచ్లు ఆడిన కోహ్లి 28,068 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (664 మ్యాచ్ల్లో 34,357 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు. శ్రీలంక ప్లేయర్ కుమార సంగక్కర (594 మ్యాచ్ల్లో 28,016 పరుగులు) మూడో స్థానానికి పడిపోయాడు.1: అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా 28 వేల పరుగులు పూర్తి చేసిన క్రికెటర్గా కోహ్లి ఘనత వహించాడు. సచిన్ టెండూల్కర్ (644 ఇన్నింగ్స్) పేరిట ఉన్న రికార్డును కోహ్లి (624 ఇన్నింగ్స్) బద్దలు కొట్టాడు.45: వన్డేల్లో కోహ్లికి లభించిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు. ఈ జాబితాలో సచిన్ (62), సనత్ జయసూర్య (48) ముందున్నారు. -
విరాట్ విశ్వరూపం.. తొలి వన్డేలో భారత్ ఘన విజయం
భారత పురుషల క్రికెట్ జట్టు కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించింది. ఆదివారం వడోదర వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 301 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 6 వికెట్లు కోల్పోయి 49 ఓవర్లలో చేధించింది.దీంతో మూడు వన్డే సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డార్లీ మిచెల్(71 బంతుల్లో 84), డెవాన్ కాన్వే(56), హెన్రీ నికోల్స్(62) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ రానా తలా రెండు వికెట్లు సాధించారు. కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టాడు.విరాట్ విధ్వంసం..అనంతరం భారీ లక్ష్య చేధనలో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ తన విశ్వరూపాన్ని చూపించాడు. తనదైన శైలిలో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓ దశలో సునాయసంగా సెంచరీ మార్క్ను అందుకునేలా కన్పించిన కోహ్లి.. ఓ భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు.కేవలం 7 పరుగుల దూరంలో సెంచరీ చేసే అవకాశాన్ని కింగ్ కోల్పోయాడు. కోహ్లి మొత్తంగా 91 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 8 ఫోర్లు, ఒక సిక్సర్తో 93 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ శుభ్మన్ గిల్(56), వైస్ కెప్టెన శ్రేయస్ అయ్యర్(49) కీలక ఇన్నింగ్స్లు ఆడారు.అయితే కోహ్లి ఔటయ్యాక భారత్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. దీంతో భారత డగౌట్లో కాస్త టెన్షన్ నెలకొంది. కానీ కేఎల్ రాహుల్(21 బంతుల్లో 29) ప్రశాంతంగా ఆడుతూ మ్యాచ్ను ఫినిష్ చేశాడు. హర్షిత్ రాణా(23 బంతుల్లో 29) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాడ్ బౌలర్లలో కైల్ జేమీసన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఆశోక్, క్లార్క్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య మూడో వన్డే బుధవారం రాజ్కోట్ వేదికగా జరగనుంది.చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్ -
సోఫీ డివైన్ విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్
డబ్ల్యూపీఎల్ 2026లో భాగంగా నవీ ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ బ్యాటర్లు జూలు విధిల్చారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ సోఫీ డివైన్ విధ్వంసం సృష్టించింది. తొలి ఓవర్ నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడింది. ఆమెను ఆపడం ఢిల్లీ బౌలర్ల తరం కాలేదు. 6 ఓవర్ వేసిన స్నేహ రాణా బౌలింగ్లో అయితే సోఫీ 2 ఫోర్లు, 4 సిక్స్లతో ఏకంగా 32 పరుగులు పిండుకుంది. ఓవరాల్గా కేవలం 42 బంతులు మాత్రమే ఎదుర్కొన్న డివైన్..7 ఫోర్లు, 8 సిక్స్లతో 95 పరుగులు చేశాడు. ఆమెతో పాటు కెప్టెన్ గార్డనర్ 49 పరుగులతో రాణించింది.నందినీ శర్మ హ్యాట్రిక్..ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీ పేసర్ నందిని శర్మ హ్యాట్రిక్ వికెట్లతో మెరిశాడు. గుజరాత్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన నందిని బౌలింగ్లో రెండో బంతికి కశ్వి గౌతమ్ పెవిలియన్కు చేరింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన తనుజా సింగిల్ తీసి స్ట్రైక్ కనిక అహుజకు ఇచ్చింది. అయితే నాలుగో బంతికి కనిక స్టంపౌట్ కాగా.. ఐదో బంతికి గైక్వాడ్, ఆరో బంతికి రేణుకా సింగ్ క్లీన్ బౌల్డయ్యారు. దీంతో తొలి హ్యాట్రిక్ నందిని ఖాతాలో చేరింది. ఓవరాల్గా నందిని తన నాలుగు ఓవర్ల కోటాలో 33 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. ఆమెతో పాటు శ్రీచరణి రెండు వికెట్లు సాధించింది.చదవండి: T20 World Cup 2026: టీమిండియాకు భారీ షాక్.. -
టీమిండియాకు భారీ షాక్..
టీ20 వరల్డ్కప్-2026కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. వడోదర వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. కివీస్ ఇన్నింగ్స్ సందర్భంగా 20 ఓవర్ వేస్తున్న సమయంలో సుందర్కు వెన్నునొప్పి తలెత్తింది. దీంతో అతడు వెంటనే మైదానాన్ని వీడియాడు.వాషీ స్ధానంలో నితీష్ కుమార్ రెడ్డి సబ్స్ట్యూట్ ఫీల్డర్గా మైదానంలో వచ్చాడు. సుందర్ తిరిగి ఫీల్డింగ్కు కూడా రాలేదు. అతడి గాయంపై ఈ మ్యాచ్లో కామెంటేటర్గా వ్యవహరిస్తున్న హర్షా భోగ్లే అప్డేట్ ఇచ్చాడు. సుందర్ వెన్నునొప్పితో బాధపడుతున్నాడని, మెడికల్ టీమ్ అతడిని పర్యవేక్షిస్తోందని భోగ్లే తెలిపాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సుందర్ బ్యాటింగ్కు కూడా వచ్చే సూచనలు కన్పించడం లేదు.అయితే తొలుత సుందర్ పక్కటెముకుల నొప్పితో బాధపడుతున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అది కేవలం వెన్ను నొప్పి అనే తెలియడంతో టీమ్ మెనెజ్మెంట్ ఊపిరి పీల్చుకుంది. ఎందుకంటే సైడ్ స్ట్రెయిన్ అయితే కోలుకోవడానికి కనీసం 3 నుండి 4 నెలల సమయం పడుతుంది.అటువంటి సందర్భంలో వచ్చే నెలలో జరగాల్సిన దూరంగా ఉండక తప్పుదు. అతడి గాయంపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మ్యాచ్లో 5 ఓవర్లు బౌలింగ్ చేసిన సుందర్ 27 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు.టీ20 ప్రపంచకప్నకు భారత జట్టుఅభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజుశాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్ ( వైస్ కెప్టెన్), రింకు సింగ్, బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్ -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో దుమ్ములేపిన విరాట్.. ఇప్పుడు కివీస్తో వన్డేల్లో కూడా అదే తీరును కనబరుస్తున్నాడు. వడోదర వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మొదటి వన్డేలో కోహ్లి దూకుడుగా ఆడుతున్నాడు.క్రీజులోకి వచ్చినప్పటి నుంచే భారీ షాట్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ఈ క్రమంలో కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో 28,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. తద్వారా అత్యంతవేగంగా ఈ ఫీట్ సాధించిన ప్లేయర్గా విరాట్ వరల్డ్ రికార్డు సృష్టించాడు.కింగ్ కోహ్లి కేవలం 624 ఇన్నింగ్స్లలోనే అందుకున్నాడు. ఇంతకుముందు ఈ ఫీట్ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(644) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో సచిన్ ఆల్టైమ్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో ముగ్గురే ముగ్గురు 28,000 పరుగులు సాధించారు. కోహ్లి కంటే ముందు కుమార సంగక్కర(28,016), సచిన్ టెండూల్కర్(34,357) ఈ ఘనత సాధించారు.సంగక్కర రికార్డు బ్రేక్..అదేవిధంగా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో కోహ్లి రెండో స్ధానానికి చేరాడు. ఈ మ్యాచ్లోనే 42 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతడు ఈ ఫీట్ సాధించాడు. ఇంతకుముందు ఈ స్ధానంలో సంగక్కర ఉండేవాడు. తాజా మ్యాచ్తో అతడిని కోహ్లి అధిగమించాడు. కోహ్లి కంటే ముందు సచిన్ ఒక్కడే ఉన్నాడు. అయితే కోహ్లి కేవలం ఒక్క ఫార్మాట్లో మాత్రమే ఆడుతుండడంతో సచిన్ రికార్డు బ్రేక్ చేయడం కష్టమనే చెప్పాలి.చదవండి: IND vs NZ: 'అతడికి మరోసారి అన్యాయం.. కావాలనే ఎదగనివ్వడం లేదు' -
విరాట్ కోహ్లి నాగిన్ డ్యాన్స్.. వీడియో వైరల్
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి మైదానంలో ఎంత యాక్టివ్గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కింగ్ కోహ్లి కేవలం బ్యాటింగ్తోనే కాకుండా తన చేష్టలతో కూడా అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా మరోసారి కోహ్లి తనలోని ఫన్నీ యాంగిల్ను బయటపెట్టాడు.వడోదర వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో కోహ్లి నగిన్ డ్యాన్స్ చేశాడు. కివీస్ ఇన్నింగ్స్ 34వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో డేంజరస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్.. శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఇండియన్ టీమ్ మొత్తం సంబరాల్లో మునిగితేలిపోయింది. కోహ్లి మాత్రం ఫ్లూట్ వూదుతున్నట్లుగా చేతులతో సైగ చేస్తూ స్పెషల్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డార్లీ మిచెల్(71 బంతుల్లో 84), డెవాన్ కాన్వే(56), హెన్రీ నికోల్స్(62) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ రానా తలా రెండు వికెట్లు సాధించారు. కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టాడు.చదవండి: IND vs NZ: 'అతడికి మరోసారి అన్యాయం.. కావాలనే ఎదగనివ్వడం లేదు'pic.twitter.com/LZrkrdDVtq— crictalk (@crictalk7) January 11, 2026 -
రాణించిన కివీస్ బ్యాటర్లు.. భారత్ ముందు భారీ టార్గెట్
రాజ్కోట్ వేదికగా వడోదర వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగుల భారీ స్కోర్ సాధించింది. బ్లాక్ క్యాప్స్ జట్టుకు ఓపెనర్లు హెన్రీ నికోల్స్ (62), డెవాన్ కాన్వే (56) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ మొదటి వికెట్కు 117 పరుగులు జోడించి భారత బౌలర్లపై ఒత్తిడి పెంచారు. నికోలస్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విల్ యంగ్(12) ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. డెవాన్ కాన్వే కూడా వెంటనే పెవిలియన్కు చేరాడు. అయితే మిడిలార్డర్లో సీనియర్ బ్యాటర్ డారిల్ మిచెల్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.మిచెల్ 71 బంతుల్లో 5 ఫోర్లు, 33 సిక్స్లతో 84 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆఖరిలో అరంగేట్ర ఆటగాడు క్లార్క్(24) రాణించాడు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ రానా తలా రెండు వికెట్లు సాధించారు. కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టాడు.తుది జట్లుభారత్: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్(కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణన్యూజిలాండ్: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్వెల్(కెప్టెన్), జకారీ ఫౌల్క్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఆదిత్య అశోక్ -
Ind vs NZ 1st ODI: 27 ఏళ్ల రికార్డు బద్దలు
వడోదర వేదికగా భారత్తో ఇవాళ (జనవరి 11) జరుగుతున్న వన్డే మ్యాచ్లో న్యూజిలాండ్ ఓపెనర్లు హెన్రీ నికోల్స్ (62), డెవాన్ కాన్వే (56) చెలరేగిపోయారు. తొలి వికెట్కు 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి 27 ఏళ్ల కిందటి రికార్డు బద్దలు కొట్టారు. భారత్లో న్యూజిలాండ్ ఓపెనర్ల అత్యధిక భాగస్వామ్యం విభాగంలో నికోల్స్-కాన్వే తాజా భాగస్వామ్యం రెండో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్కు ముందు వరకు ఈ రికార్డు నాథన్ ఆస్టల్-క్రెయిగ్ స్పియర్మన్ పేరిట ఉండేది. 1999లో రాజ్కోట్లో ఈ న్యూజిలాండ్ ఓపెనింగ్ జోడీ భారత్పై 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ విభాగంలో టాప్ ప్లేస్లో ఆండ్రూ జోన్స్-జాన్ రైట్ జోడీ ఉంది. 1988లో ఈ కివీ ఓపెనింగ్ పెయిర్ ఇదే వడోదరలో తొలి వికెట్కు 140 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ 43.3 ఓవర్ల అనంతరం 7 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసి శుభారంభం అందించినా, ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో కివీస్ స్వల్ప స్కోర్కే పరిమితమయ్యేలా ఉంది. డారిల్ మిచెల్ (56 నాటౌట్) గౌరవప్రదమైన స్కోర్ను అందించే ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి జతగా క్రిస్టియన్ క్లార్క్ (1) క్రీజ్లో ఉన్నాడు. భారత బౌలర్లలో సిరాజ్, హర్షిత్ తలో 2.. ప్రసిద్ద్, కుల్దీప్ చెరో వికెట్ తీసి న్యూజిలాండ్ను ఇబ్బందుల్లోకి నెట్టారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో విల్ యంగ్ (12), గ్లెన్ ఫిలిప్ (12), మిచెల్ హే (18), కెప్టెన్ మైఖేల్ బ్రేస్వెల్ (16) మంచి ఆరంభాలు లభించినా, పెద్ద స్కోర్లుగా మలచలేకపోయారు. జకరీ ఫౌల్క్స్ 1 పరుగుకే ఔటయ్యాడు.కాగా, న్యూజిలాండ్ జట్టు 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ల కోసం భారత్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ తొలి వన్డే జరుగుతుంది.తుది జట్లు..న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్వెల్(c), జకారీ ఫౌల్క్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఆదిత్య అశోక్భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ -
'అతడికి మరోసారి అన్యాయం.. కావాలనే ఎదగనివ్వడం లేదు'
నితీశ్ కుమార్ రెడ్డి.. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా గతేడాది భారత్ తరపున మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే అతడిని సరిగ్గా ఉపయోగించుకోవడంలో టీమ్ మెనెజ్మెంట్ విఫలమైందనే చెప్పుకోవాలి. ఒక సిరీస్కు ఎంపిక చేస్తే మరొక సిరీస్కు పక్కన పెట్టడం, ఒకవేళ ఎంపికైనా తుది జట్టులో చోటు ఇవ్వకపోవడం వంటివి అతడి కెరీర్ను వెనుక్కి నెట్టిస్తున్నాయి. అంతేకాకుండా అతడిని ఆల్రౌండర్గా ప్లేయింగ్ ఎలెవన్లోకి తీసుకుని కేవలం బ్యాటింగ్కు పరిమితం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆల్రౌండర్గా గుర్తింపు పొందిన నితీశ్.. ఇప్పటివరకు 20 ఇన్నింగ్స్ల్లో కేవలం 100.1 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఇప్పుడు మరోసారి ఈ ఆంధ్ర ఆల్రౌండర్ పట్ల టీమ్ మెనెజ్మెంట్ కఠినంగా వ్యవహరించింది.న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వడంతో నితీశ్ కుమార్ రెడ్డిని జట్టులోకి తీసుకున్నారు. కానీ వడోదర వేదికగా జరుగుతున్న తొలి వన్డే తుది జట్టులో మాత్రం నితీశ్కు చోటు దక్కలేదు.అతడిని కాదని స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు అవకాశమిచ్చారు. ఈ నేపథ్యంలో టీమ్ మెనెజ్మెంట్పై భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు గుప్పించాడు. అతడికి అవకాశమివ్వనప్పుడు ఎందుకు ఎంపిక చేస్తున్నారని పఠాన్ మండిపడ్డాడు."నితీశ్కు ప్లేయింగ్ ఎలెవన్లో ఛాన్స్ ఇవ్వనప్పుడు, అతడిని ప్రధాన జట్టుకు ఎందుకు ఎంపిక చేస్తున్నారు? టీమ్తో పాటు ఉంటాడు.. కానీ తుది జట్టులో కన్పించడు. అతడిని పక్కన పెట్టడానికి ఏదో సరైన కారణముంది. ఒకవేళ తుది జట్టులో చోటు ఇచ్చినా.. ఒకట్రెండు ఓవర్లు బౌలింగ్, 8 స్ధానంలో బ్యాటింగ్కు పంపుతారు. ఇది సరైన విధానం కాదు. రెగ్యూలర్గా అవకాశమివ్వకపోతే ఎప్పటికీ అతడిని ఒక మంచి ఆల్రౌండర్గా తీర్చిదిద్దలేరు. హార్దిక్ పాండ్యాకు సరైన ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే నితీశ్కు వరుస అవకాశాలు ఇవ్వాలి. హార్దిక్ కూడా కెరీర్ ఆరంభంలో వరుస అవకాశాలు పొందడం వల్లే స్టార్గా ఎదిగాడన్న విషయం మర్చిపోవద్దు" అని స్టార్ స్పోర్ట్స్ షోలో పఠాన్ పేర్కొన్నాడు.చదవండి: IND vs NZ: కోహ్లి అరుదైన ఘనత.. సౌరవ్ గంగూలీ రికార్డు బ్రేక్ -
వివాదంలో విరాట్ కోహ్లి భక్తుడు
విరాట్ కోహ్లి భక్తుడు, గత సీజన్లో ఆర్సీబీ టైటిల్ గెలిచిన జట్టులో భాగమైన స్వస్తిక్ చికారా వివాదంలో చిక్కుకున్నాడు. రాధికా శర్మ అనే యువతితో అతను చేసిన అభ్యంతరకర సంభాషణ సోషల్మీడియాలో లీకైంది. ఇందులో చికారా రాధికాను కేఫ్ లేదా రెస్టారెంట్లో కలవాలని ఒత్తిడి చేశాడు. చికారా రాధికాను కన్పూర్లోని ఓ మాల్లో కలిశాడు. ఆ పరిచయంతో ఆమెను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. విసిగిపోయిన రాధికా చికారా వేధింపులను బయటపెట్టింది. చికారా తనను సోషల్ మీడియాలో స్టాక్ చేసి, ఫ్లర్ట్ మెసేజ్లు పంపాడని ఆధారాలతో (చాట్ స్క్రీన్షాట్లు) సహా సోషల్మీడియాలో షేర్ చేసింది. లీకైన ఈ చాట్ల వల్ల చికారా వ్యక్తిగత ఇమేజ్ దెబ్బతినడంతో పాటు అతని మాజీ జట్టు, డిఫెండింగ్ ఐపీఎల్ ఛాంపియన్ అయిన ఆర్సీబీ బ్రాండ్కు భంగం వాటిల్లుతుంది. క్రికెటేతర విషయాల కారణంగా ఆర్సీబీ పరువు పోవడం ఇది తొలిసారి కాదు. గతంలో వేర్వేరు ఘటనల్లో అమ్మాయిలను వేధించి, ఇబ్బంది పెట్టాడన్న కారణంగా ప్రస్తుత ఆర్సీబీ బౌలర్ యశ్ దయాల్పై ఘాజియాబాద్, జైపూర్లో కేసులు నమోదయ్యాయి. యశ్ దయాల్ ఉదంతంతోనే ఆర్సీబీ పరువు గంగలో కలిసింది. తాజాగా చికారా ఎపిసోడ్ ఆ ఫ్రాంచైజీ పరువును మరింత దిగజార్చింది. 17 సీజన్ల పాటు టైటిల్ గెలవలేకపోయినా, ఫ్రాంచైజీగా క్లీన్ ఇమేజ్ కలిగిన ఆర్సీబీ దయాల్, చికారా కారణంగా బజారుకెక్కింది. దయాల్ను ఆర్సీబీ 2026 మినీ వేలానికి ముందు అట్టిపెట్టుకోగా.. చికారాను విడుదల చేసింది. చికారాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. అతను ఆర్సీబీలో ఉండగా కూడా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. యూపీలో జన్మించిన 20 ఏళ్ల చికారాను ఆర్సీబీ 2024 సీజన్లో కొనుగోలు చేసింది. కుడి చేతి వాటం ఓపెనింగ్ బ్యాటర్ అయిన చికారా విరాట్ కోహ్లిని దేవుడి కంటే ఎక్కువగా కొలుస్తాడు. ఆర్సీబీలో ఉండగా అతనెప్పుడూ విరాట్ వెంటే ఉండేవాడు. కొన్ని సందర్భాల్లో విరాట్ చికారా అతి వినయానికి తట్టుకోలేక కోపడ్డాడని కూడా వార్తలు వచ్చాయి. చికారా విరాట్ను బాగా విసిగించేవాడని ప్రచారం ఉంది.మొత్తంగా యశ్ దయాల్, చికారా ఉదంతాలు ఆర్సీబీ ప్రతిష్ట దెబ్బ తీశాయి. దీనిపై ఆ ఫ్రాంచైజీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆటగాళ్లను ఎంపిక చేసుకునేప్పుడు వారి బ్యాక్ గ్రౌండ్ కూడా చెక్ చేసుకోవాలని ఫ్రాంచైజీ యాజమాన్యానికి సూచిస్తున్నారు.కాగా, ఆర్సీబీ 17 సీజన్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం గత సీజన్లోనే తమ తొలి ఐపీఎల్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఫైనల్లో పంజాబ్పై జయకేతనం ఎగురవేసి ఛాంపియన్గా నిలిచింది. ఈ గెలుపును ఆర్సీబీ ఆటగాళ్లు దిగ్గజ ప్లేయర్ విరాట్ కోహ్లికి అంకితమిచ్చారు. ఈ గెలుపుతో విరాట్ కోహ్లి పాత్ర కూడా చాలా ఉంది. సీజన్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించి టైటిల్ కలను నెరవేర్చుకున్నాడు. అయితే ఈ సంతోషం ఆర్సీబీకి కానీ విరాట్ కోహ్లికి కానీ ఎన్నో గంటలు మిగల్లేదు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడయంలో జరిగిన విజయోత్సవ వేడుకలో తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఈ కారణంగా బెంగళూరు ఇప్పుడు ఆర్సీబీకి హోం గ్రౌండ్ అయ్యే అర్హత కూడా కోల్పోనుందని తెలుస్తుంది. ఈ ఘటనపై విరాట్ కోహ్లి చాలా విచారం వ్యక్తం చేశాడు. -
కోహ్లి అరుదైన ఘనత.. సౌరవ్ గంగూలీ రికార్డు బ్రేక్
టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరపున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానానికి కోహ్లి చేరుకున్నాడు. వడోదర వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో కోహ్లి ఈ ఫీట్ నమోదు చేశాడు.కోహ్లికి ఇది 309వ వన్డే మ్యాచ్. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరిట ఉండేది. గంగూలీ తన కెరీర్లో 308 మ్యాచ్లు ఆడి 11221 పరుగులు చేశాడు. ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(463) అగ్రస్ధానంలో ఉన్నారు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలోనూ సచిన్(18426) టాప్లో కొనసాగుతున్నారు.భారత్ తరపున అత్యధిక వన్డేలు ఆడిన ప్లేయర్లు వీరే..సచిన్ టెండూల్కర్-463ఎంఎస్ ధోని-347రాహుల్ ద్రవిడ్-340అజారుద్దీన్-334విరాట్ కోహ్లి-309సౌరవ్ గంగూలీ-308వన్డే కింగ్..ఇక ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లి కూడా తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా కోహ్లి కొనసాగుతున్నాడు. కోహ్లి ఇప్పటివరకు 53 సెంచరీలు నమోదు చేశాడు. అదేవిధంగా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లి(14557) రెండో స్ధానంలో ఉన్నాడు. కోహ్లి దారిదాపుల్లో ఎవరూ లేరు. -
భారీ రికార్డులపై కన్నేసిన రోహిత్, కోహ్లి
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా వడోదర వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (జనవరి 11) జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి భారీ రికార్డులపై కన్నేశారు. కోహ్లి 42 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించనుండగా.. రోహిత్ 67 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్గా 16000 పరుగుల అత్యంత అరుదైన మైలురాయిని తాకుతాడు.రో-కో ప్రస్తుతమున్న ఫామ్ను బట్టి చూస్తే ఇదే మ్యాచ్లో ఈ రెండు రికార్డులు బద్దలవడం ఖాయంగా తెలుస్తుంది. రోహిత్ గత ఆరు వన్డే ఇన్నింగ్స్ల్లో సెంచరీ, మూడు అర్ద సెంచరీలు చేసి సూపర్ ఫామ్లో ఉన్నాడు. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో సిక్కింపై భారీ శతకంతో (155) అదే ఫామ్ను కొనసాగిస్తున్నాడు.కోహ్లి విషయానికొస్తే.. రోహిత్తో పోలిస్తే ఇంకా మెరుగైన ఫామ్లో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో గత 4 ఇన్నింగ్స్ల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు చేసి మరో భారీ ఇన్నింగ్స్ కోసం గర్జిస్తున్నాడు. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలోనూ ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన రో-కో ప్రస్తుతం వన్డేలపైనే పూర్తి ఫోకస్ పెట్టారు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి భారత ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ ఆచితూచి ఆడుతుంది. 16 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 79 పరుగులు చేసింది. ఓపెనర్లు హెన్రీ నికోల్స్ (42), డెవాన్ కాన్వే (35) భారత బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొంటున్నారు. నికోల్స్కు 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లైఫ్ లభించింది. కుల్దీప్ యాదవ్ సునాయాసమైన క్యాచ్ను జారవిడిచాడు. ఈ మ్యాచ్లో భారత్ ఆరుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగింది.తుది జట్లు..న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్వెల్(c), జకారీ ఫౌల్క్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఆదిత్య అశోక్భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ -
టీమిండియాతో తొలి వన్డే.. న్యూజిలాండ్ జట్టులో భారత మూలాలున్న ఆటగాడు
స్వదేశంలో ఇవాల్టి నుంచి (జనవరి 11) భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. వడోదర వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా భారీ ప్రయోగం చేస్తుంది. రొటీన్కు భిన్నంగా ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగుతుంది. స్పిన్నర్లుగా సుందర్, జడేజా, కుల్దీప్.. పేసర్లుగా సిరాజ్, ప్రసిద్ద్, హర్షిత్ బరిలో దిగుతున్నారు.న్యూజిలాండ్ తరఫున క్రిస్టియన్ క్లార్క్ ఈ మ్యాచ్తో అరంగేట్రం చేస్తున్నాడు. భారత మూలాలున్న ఆదిత్య అశోక్ ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ప్రధాన బౌలర్గా బరిలో దిగనున్నాడు. అశోక్ రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలర్. గూగ్లీలు వేయడంలో దిట్ట.ఎవరీ ఆదిత్య అశోక్..?ఆదిత్య అశోక్ తమిళనాడులోని వేలూర్లో 2002 సెప్టెంబర్ 5న జన్మించాడు. అతనికి నాలుగేళ్ల వయసు ఉండగా అతని న్యూజిలాండ్కు వలస వెళ్లి ఆక్లాండ్లో స్థిరపడింది. అశోక్ ఆక్లాండ్లోని మౌంట్ ఆల్బర్ట్ గ్రామర్ స్కూల్లో చదువుకున్నాడు.అశోక్ 2020 అండర్-19 వరల్డ్ కప్తో న్యూజిలాండ్ తరఫున జూనియర్ విభాగంలో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత దేశీయ క్రికెట్లో ఆక్లాండ్ తరఫున మెరిసాడు. - 2021 డిసెంబర్లో Super Smash టోర్నీతో టీ20 అరంగేట్రం చేశాడు. - 2022 జనవరిలో Ford Trophyతో లిస్ట్ A అరంగేట్రం చేశాడు. - 2022–23 Plunket Shieldతో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్లోనే 5 వికెట్లతో సత్తా చాటాడు. అశోక్కు న్యూజిలాండ్ సీనియర్ జట్టు నుంచి 2023 మార్చిలో తొలిసారి పిలుపు వచ్చింది. తొలుత అతను ఏ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2023 ఆగస్టులో UAEపై అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశాడు. 2023 డిసెంబర్లో బంగ్లాదేశ్పై వన్డే అరంగేట్రం చేశాడు. అశోక్ న్యూజిలాండ్ తరఫున ఇప్పటివరకు 2 వన్డేలు, ఓ టీ20 మాత్రమే ఆడాడు. అతన్ని న్యూజిలాండ్ స్పిన్ భవిష్యత్తుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇప్పటివరకు భారత మూలాలున్న చాలామంది క్రికెటర్లు న్యూజిలాండ్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. వీరిలో టామ్ పునా ప్రథముడు కాగా.. దీపక్ పటేల్, జీత్ రావల్, ఐష్ సోధి, ఎజాజ్ పటేల్, రచిన్ రవీంద్ర వంటి వారు బాగా పాపులయ్యారు. తాజాగా ఆదిత్య అశోక్ కూడా వీరి బాటలోనే పయనించేందుకు కృషి చేస్తున్నాడు. -
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
స్వదేశంలో ఇవాల్టి నుంచి (జనవరి 11) భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది. వడోదర వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా భారీ ప్రయోగం చేస్తుంది. రొటీన్కు భిన్నంగా ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగుతుంది. స్పిన్నర్లుగా సుందర్, జడేజా, కుల్దీప్.. పేసర్లుగా సిరాజ్, ప్రసిద్ద్, హర్షిత్ బరిలో దిగుతున్నారు. న్యూజిలాండ్ తరఫున క్రిస్టియన్ క్లార్క్ ఈ మ్యాచ్తో అరంగేట్రం చేస్తున్నాడు. భారత మూలాలున్న ఆదిత్య అశోక్ ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ప్రధాన స్పిన్నర్గా బరిలో దిగనున్నాడు. అశోక్ కుటుంబం అతని చిన్నప్పుడే తమిళనాడులోని వేలూర్ నుంచి వెళ్లి న్యూజిలాండ్లో స్థిరపడింది. తుది జట్లు..న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్వెల్(c), జకారీ ఫౌల్క్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఆదిత్య అశోక్భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ -
ఇవాల్టి నుంచి భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్
స్వదేశంలో ఇవాల్టి నుంచి (జనవరి 11) భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. వడోదర వేదికగా తొలి మ్యాచ్ జరుగనుంది. సిరీస్ ప్రారంభ నేపథ్యంలో ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య జరిగిన ద్వైపాక్షిక సిరీస్లపై ఓ లుక్కేద్దాం. భారత్-న్యూజిలాండ్ ఇప్పటివరకు 17 ద్వైపాక్షిక సిరీస్ల్లో ఎదురెదురుపడగా.. న్యూజిలాండ్ 6, భారత్ 9 సిరీస్ల్లో విజయాలు సాధించాయి. 2 సిరీస్లు డ్రా అయ్యాయి.వీటిలో భారత్లో జరిగిన సిరీస్లను ప్రత్యేకంగా తీసుకుంటే.. భారత్ ఇప్పటివరకు స్వదేశంలో న్యూజిలాండ్తో ఏడు వన్డే సిరీస్లు అడగా ఒక్కదాంట్లో కూడా ఓడిపోలేదు. ఏడు సిరీస్ల్లోనూ జయకేతనం ఎగురవేసి, స్వదేశంలో తిరుగులేని రికార్డు కలిగి ఉంది. చివరి సారిగా (2022-23) స్వదేశంలో జరిగిన సిరీస్లో టీమిండియా 3-0తో కివీస్ను క్లీన్ స్వీప్ చేసింది.భారత్-న్యూజిలాండ్ మధ్య ఇప్పటివరకు జరిగిన ద్వైపాక్షిక సిరీస్లు..న్యూజిలాండ్లో జరిగినవి.. 1975/76- 2-0 (న్యూజిలాండ్)1980-81- 2-0 (న్యూజిలాండ్)1993-94- 2-2 (డ్రా)1998-99- 2-2 (డ్రా)2002-03- 5-2 (న్యూజిలాండ్)2008-09- 3-1 (5) (భారత్)2013-14- 4-0 (5) (న్యూజిలాండ్)2018-19- 4-1 (భారత్)2019-20- 3-0 (న్యూజిలాండ్)2022-23- 1-0 (3) (న్యూజిలాండ్)భారత్లో జరిగిన సిరీస్లు..1988/89- 4-01995-96- 3-21999-00- 3-22010-11- 5-02016-17- 3-22017-18- 2-12022-23- 3-0* అన్నింటిలో భారత్దే విజయంహెడ్ టు హెడ్ రికార్డులుభారత్-న్యూజిలాండ్ ఇప్పటివరకు 120 వన్డేల్లో ఎదురెదురుపడ్డాయి. ఇందులో భారత్ 62, న్యూజిలాండ్ 50 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. 7 మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు. ఓ మ్యాచ్ టై అయ్యింది. వీటిలో భారత్ స్వదేశంలో గెలిచిన మ్యాచ్లు 31 కాగా.. న్యూజిలాండ్ వారి స్వదేశంలో గెలిచిన మ్యాచ్లు 26.చివరిగా తలపడిన మ్యాచ్లోనూ పరాభవమేభారత్-న్యూజిలాండ్ చివరిగా వన్డే ఫార్మాట్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.స్వదేశంలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు భారత జట్టు..శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్) భారత్తో వన్డే సిరీస్కు న్యూజిలాండ్ జట్టు..డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్వెల్ (కెప్టెన్), విల్ యంగ్, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, జాకరీ ఫౌల్క్స్, నిక్ కెల్లీ, జోష్ క్లార్క్సన్, మైఖేల్ రే, కైల్ జేమీసన్, మిచెల్ హే, ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్, జేడెన్ లెనాక్స్ -
న్యూజిలాండ్ వన్డే సిరీస్ నుంచి పంత్ ఔట్
అనుకున్నదే జరిగింది. న్యూజిలాండ్ వన్డే సిరీస్ నుంచి టీమిండియా వికెట్కీపింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ వైదొలిగాడు. శనివారం (జనవరి 10) మధ్యాహ్నం వడోదరలోని BCA స్టేడియంలో నెట్స్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పంత్కు కుడి పక్క భాగంలో తీవ్రమైన నొప్పి వచ్చింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించి ఎంఆర్ఐ స్కాన్ తీయించగా.. Oblique Muscle Tear అని తేలింది. దీంతో రంగంలోకి దిగిన BCCI మెడికల్ టీమ్, డాక్టర్లతో చర్చించి పంత్ను న్యూజిలాండ్ వన్డే సిరీస్ నుంచి తప్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 🚨 PRESS RELEASE FROM BCCI ON RISHABH PANT 🚨 pic.twitter.com/z3l3jPKFCi— Johns. (@CricCrazyJohns) January 11, 2026ఈ మేరకు బోర్డు మీడియా అడ్వైజరీ కమిటీ ఓ లేఖను విడుదల చేసింది. పంత్ స్థానాన్ని ధృవ్ జురెల్తో భర్తీ చేస్తున్నట్లు అదే లేఖలో పేర్కొంది. జురెల్ ఇప్పటికే జట్టుతో కలిశాడు. కాగా, న్యూజిలాండ్ సిరీస్కు రిషబ్ పంత్ కేఎల్ రాహుల్కు బ్యాకప్గా ఎంపికయ్యాడు. ఇటీవలికాలంలో పంత్ టెస్ట్లకు మాత్రమే పరిమితమయ్యాడు. వన్డేల్లో అడపాదడపా అవకాశాలు మాత్రమే వస్తున్నాయి. వన్డేల్లో కేఎల్ రాహుల్ టీమిండియాకు ఫస్ట్ ఛాయిస్ వికెట్కీపర్గా ఉన్నాడు. తాజాగా పంత్ గాయపడిన తర్వాత ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఇషాన్ కిషన్ను ఎంపిక చేశారని ప్రచారం జరిగింది. అయితే ఎవరూ ఊహించని విధంగా జురెల్ ఎంపికయ్యాడు. న్యూజిలాండ్తో తొలి వన్డే వడోదర వేదికగా ఇవాళ (జనవరి 11) మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది.అప్ డేటెడ్ భారత జట్టు.. శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్) -
విధ్వంసకర శతకం.. చరిత్ర సృష్టించిన రికెల్టన్
సౌతాఫ్రికా టీ20లో ఎంఐ కేప్టౌన్ ఆటగాడు ర్యాన్ రికెల్టన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. లీగ్ చరిత్రలో రెండు వ్యక్తిగత సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. రికెల్టన్ కాకుండా SA20లో మరో ఎనిమిది మంది (డుప్లెసిస్, క్లాసెన్, మార్క్రమ్, డస్సెన్, హెర్మన్, విల్ జాక్స్, వెర్రిన్, హోప్) మాత్రమే తలో సెంచరీ చేశారు. రికెల్టన్ తలో రెండో సెంచరీని 2025-26 ఎడిషన్లో భాగంగా జోబర్గ్ సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో నమోదు చేశాడు. రికెల్టన్ తన తొలి సెంచరీని డర్బన్ సూపర్ జెయింట్స్పై చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. రికెల్టన్ విధ్వంసకర శతకంతో (60 బంతుల్లో 113 నాటౌట్; 8 ఫోర్లు, 9 సిక్సర్లు) విరుచుకుపడటంతో సూపర్ కింగ్స్పై ఎంఐ కేప్ టౌన్ 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేయగా.. ఛేదనలో పోరాడిన సూపర్ కింగ్స్ లక్ష్యానికి 37 పరుగుల దూరంలో నిలిచిపోయింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేయగలిగింది. సూపర్ కింగ్స్ తరఫున డియాన్ ఫెరియెరా (80 నాటౌట్) అద్భుతమైన పోరాటపటిమ కనబర్చినా, తన జట్టును గెలుపు తీరాలు దాటించలేకపోయాడు. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్లో ఓపెనర్ జేమ్స్ విన్స్ (77) కూడా మెరుపు అర్ద సెంచరీతో రాణించాడు.ఎంఐ బౌలర్ల జోరు ముందు వీరి మెరుపులు సరిపోలేదు. జార్జ్ లిండే, రబాడ తలో 2, కార్బిన్ బాష్ ఓ వికెట్ తీయగా.. రషీద్ ఖాన్ పొదుపుగా బౌలింగ్ చేసి సూపర్ కింగ్స్ను కట్టడి చేశారు. అంతకుముందు ఎంఐ ఇన్నింగ్స్లో రికెల్టన్తో పాటు మరో ఓపెనర్ డస్సెన్ (65) కూడా రాణించాడు. మిగతా బ్యాటర్లలో పూరన్ 14, జేసన్ స్మిత్ 2, కరీం జనత్ 20 (నాటౌట్) పరుగులు చేశారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో డేనియల్ వార్రల్ 2, ఫెరియెరి తలో వికెట్ తీశారు. -
భారత్ X న్యూజిలాండ్
వడోదర: అంతర్జాతీయ క్రికెట్లో ఒక వైపు వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ సాగుతుండగా...మరో వైపు కొద్ది రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఇలాంటి స్థితిలో ప్రస్తుతం వన్డే సిరీస్లకు చెప్పుకోదగ్గ ప్రాధాన్యత లేదు. కానీ కేవలం ఇద్దరు బ్యాటర్లు భారత వన్డే మ్యాచ్లను ఆసక్తికరంగా మారుస్తున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇటీవలి ప్రదర్శన అభిమానులకు ఆనందం పంచింది. ఆ్రస్టేలియాలో రోహిత్ చెలరేగిపోగా, దక్షిణాఫ్రికాపై కోహ్లి సత్తా చాటాడు. కెపె్టన్గా శుబ్మన్ గిల్ మళ్లీ వన్డే సిరీస్లో జట్టును నడిపించేందుకు సిద్ధమయ్యాడు. న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా నేడు జరిగే తొలి పోరులో ఇరు జట్లు తలపడనున్నాయి. స్వదేశంలో దక్షిణాఫ్రికాపై సిరీస్ గెలిచి టీమిండియా ఫామ్లో ఉండగా... న్యూజిలాండ్ టీమ్లో అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తోంది. కొటాంబి స్టేడియంలో ఇదే తొలి పురుషుల క్రికెట్ మ్యాచ్ కావడం విశేషం. ఇప్పటి వరకు ఈ మైదానంలో రెండు మహిళల వన్డేలు జరగ్గా, రెండు సార్లూ పేస్ బౌలింగ్కు పిచ్ అనుకూలించింది. ఈ సారి అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్కు సమంగా అనుకూలించే చక్కటి పిచ్ కనిపిస్తోంది. మ్యాచ్ రోజు వర్ష సూచన లేదు. అయ్యర్ పునరాగమనం... దక్షిణాఫ్రికాతో సిరీస్కు గాయంతో దూరమైన గిల్ మళ్లీ సారథిగా బరిలోకి దిగుతుండటంతో జైస్వాల్కు తుది జట్టులో చోటు లేదు. ఆ్రస్టేలియా గడ్డపై ఫీల్డింగ్లో గాయపడి కోలుకున్న అనంతరం శ్రేయస్ అయ్యర్ ఇప్పుడే మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నాడు. ఇక విజయ్ హజారే టోర్నీలో రెండేసి వన్డేలు ఆడిన కోహ్లి, రోహిత్ దూకుడు మీదున్నారు. మరో సారి సిరీస్కు వీరిద్దరే ప్రధాన ఆకర్షణ కానున్నారు. ఆల్రౌండర్లుగా జడేజా, సుందర్ ఖాయం కాగా...ప్రధాన స్పిన్నర్గా కుల్దీప్దే బాధ్యత. రాహుల్ కీపర్గా ఉంటాడు కాబట్టి మరోసారి పంత్కు నిరాశే. సిరాజ్ జట్టులోకి రావడంతో ప్రసిధ్ స్థానంలో అతను ఆడటం లాంఛనమే. మొత్తంగా ఎప్పటిలాగే మన జట్టు అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. అనుభవలేమితో... న్యూజిలాండ్ జట్టులోని 15 మంది సభ్యుల బృందంలో 8 మంది ఇప్పటి వరకు భారత గడ్డపై ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు! ఇద్దరు అసలు అంతర్జాతీయ మ్యాచ్లే ఆడలేదు. ఒకరు కేవలం టి20ల్లోనే ఆడగా, ఐదుగురు పది లోపు వన్డేలే ఆడారు. వేర్వేరు కారణాలతో అనుభవజు్ఞలైన శాంట్నర్, హెన్రీ, చాప్మన్, రూరీ్క, లాథమ్, విలియమ్సన్ జట్టుకు దూరమయ్యారు. ఇలాంటి టీమ్ భారత్కు ఏమాత్రం పోటీనిస్తుందనేది సందేహమే. టీమ్ కెపె్టన్గా ఉన్న బ్రేస్వెల్ రెండేళ్ల క్రితం హైదరాబాద్లో 350 పరుగుల ఛేదనలో 78 బంతుల్లో 140 పరుగులు చేసి చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. నాటి ఇన్నింగ్స్నుంచి అతనితో పాటు జట్టు ఏమైనా స్ఫూర్తి పొందుతుందేమో చూడాలి. 2024లో టెస్టుల్లో భారత్ కోట బద్దలు కొట్టిన న్యూజిలాండ్ ఇప్పటి వరకు ఇక్కడ వన్డే సిరీస్ గెలవలేదు. నాకు ఏం రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది. నేను ప్రస్తుతం ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నా. నేను వర్తమానంలో జీవించేవాడిని. అప్పుడు అంతా బాగానే అనిపిస్తుంది. ఏ ఆటగాడైనా దేశం తరఫున అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే భావిస్తాడు. సెలక్టర్లు వారి నిర్ణయం వారు తీసుకున్నారు.టి20 వరల్డ్ కప్లో చోటు కోల్పోవడంపై గిల్ వ్యాఖ్య -
డబ్ల్యూపీఎల్లో బోణి కొట్టిన ముంబయి.. ఢిల్లీపై ఘన విజయం
ఇవాళ జరిగిన డబ్ల్యూపీఎల్ మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ బోణి కొట్టింది. తొలి మ్యాచ్లో ఓటమిపాలైన ముంబయి ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది.ముంబయి నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. దీంతో ముంబయి ఇండియన్స్ 50 పరుగుల తేడాతో నెగ్గింది. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్లో చినెల్లీ హెన్రీ(33 బంతుల్లో 56) పరుగులతో మాత్రమే రాణించింది. మిగిలిన బ్యాటర్లు అంతా విఫలం కావడంతో లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.కాగా.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ ఇన్నింగ్స్లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, నాట్ సీవర్ బ్రంట్ అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. 42 బంతులు ఎదుర్కొన్న హర్మన్ 8 ఫోర్లు, 3 సిక్స్లతో 74 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా.. స్కీవర్ 46 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 70 పరుగులు చేసింది. వీరిద్దరూ కలిసి మూడో వికెట్కు వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.ఇక ఢిల్లీ బౌలర్లలో అరంగేట్ర పేసర్ నందిని శర్మ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆమె 3 ఓవర్లలో 26 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టింది. శ్రీచరణి ఒక వికెట్ తీసినప్పటికి తన 4 ఓవర్ల కోటాలో 45 పరుగులు సమర్పించుకుంది. -
హర్మన్ ప్రీత్ విధ్వంసం.. ముంబై ఇండియన్స్ భారీ స్కోర్
డబ్ల్యూపీఎల్-2026లో భాగంగా డివై పాటిల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది.ముంబై ఇన్నింగ్స్లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, నాట్ సీవర్ బ్రంట్ అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. 42 బంతులు ఎదుర్కొన్న హర్మన్ 8 ఫోర్లు, 3 సిక్స్లతో 74 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా.. స్కీవర్ 46 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 70 పరుగులు చేసింది. వీరిద్దరూ కలిసి మూడో వికెట్కు వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.ఇక ఢిల్లీ బౌలర్లలో అరంగేట్ర పేసర్ నందిని శర్మ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆమె 3 ఓవర్లలో 26 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టింది. శ్రీచరణి ఒక వికెట్ తీసినప్పటికి తన 4 ఓవర్ల కోటాలో 45 పరుగులు సమర్పించుకుంది.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్: షఫాలీ వర్మ, లిజెల్ లీ(వికెట్కీపర్), లారా వోల్వార్డ్ట్, జెమిమా రోడ్రిగ్స్(కెప్టెన్), మారిజాన్ కాప్, నికి ప్రసాద్, చినెల్లే హెన్రీ, స్నేహ రాణా, మిన్ను మణి, శ్రీ చరణి, నందనీ శర్మముంబై ఇండియన్స్: అమేలియా కెర్, జి కమలిని(వికెట్ కీపర్), నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), నికోలా కారీ, సజీవన్ సజన, అమన్జోత్ కౌర్, పూనమ్ ఖేమ్నార్, త్రివేణి వశిష్ట, షబ్నిమ్ ఇస్మాయిల్, సంస్కృతి -
టీమిండియాకు ఊహించని షాక్
భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే ఆదివారం (జనవరి 11) జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ప్రాక్టీస్ సెషన్లో గాయపడ్డాడు. మొదటి వన్డే కోసం భారత జట్టు వడోదరలోని బీసీఏ (BCA) స్టేడియంలో శనివారం తమ చివరి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోంది.అయితే త్రోడౌన్ స్పెషలిస్టుల ఎదుర్కొంటున్న సమయంలో ఓ బంతి పంత్ నడుము పైభాగంలో బలంగా తగిలింది. దీంతో అతడు నొప్పితో విలవిలాడాడు. వెంటనే జట్టు ఫిజియో పరిగెత్తుకుంటూ వచ్చి అతడికి చికిత్స అందించాడు. అయినప్పటికీ నొప్పి తగ్గకపోవడంతో రిషబ్ ప్రాక్టీస్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు.ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పంత్ గాయపడిన సమయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా అక్కడే ఉన్నాడు. కాగా విజయ్ హజారే ట్రోఫీలో బిజీబీజీగా గడిపిన పంత్ శుక్రవారం భారత జట్టుతో చేరాడు. అంతలోనే పంత్ గాయపడడం టీమ్ మెనెజ్మెంట్ను కలవరపెడుతోంది.అయితే పంత్ గాయంపై బీసీసీఐ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. పంత్ ప్రస్తుతం జట్టులో కేఎల్ రాహుల్కు బ్యాకప్గా ఉన్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ మొత్తానికి అతడు బెంచ్కే పరిమితమయ్యాడు. కివీస్తో వన్డే సిరీస్కు పంత్ను పక్కన పెట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. అతడి స్ధానంలో ఇషాన్ కిషన్ను జట్టులోకి తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ సెలెక్టర్లు మాత్రం పంత్ వైపే మొగ్గు చూపారు.కివీస్తో వన్డేలకు భారత జట్టుశుభ్మన్ గిల్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్ (వైస్-కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, నితీష్ కుమార్ రెడ్డి, రిషబ్ పంత్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, వాషింగ్టన్ సుందర్.చదవండి: WPL 2026: అరంగేట్రంలోనే అదరగొట్టిన అనుష్క శర్మ -
అరంగేట్రంలోనే అదరగొట్టిన అనుష్క శర్మ
మహిళల ప్రీమియర్ లీగ్ నుంచి మరో యువ సంచలనం క్రికెట్ ప్రపంచానికి పరిచయమైంది. డబ్ల్యూపీఎల్-2026 సీజన్లో శనివారం యూపీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ తరపున బరిలోకి దిగిన అనుష్క శర్మ.. తన అరంగేట్ర మ్యాచ్లోనే అదరగొట్టింది.బెత్ మూనీ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన 22 ఏళ్ల అనుష్క తన సంచలన బ్యాటింగ్తో అందరిని ఆశ్చర్యపరిచింది. శిఖా పాండే, డాటిన్ వంటి అంతర్జాతీయ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ఆమె ఔరా అన్పించింది. అస్సలు తొలి మ్యాచ్ ఆడుతున్నాన్న ఒత్తడి కొంచెం కూడా ఆమెలో కన్పించలేదు. కెప్టెన్ యాష్లీ గార్డరన్తో కలిసి 103 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అనుష్క నెలకొల్పింది. గుజరాత్ 207 పరుగుల భారీ స్కోర్ సాధించడంలో ఈ భాగస్వామ్యం కీలకంగా మారింది. అనుష్క 30 బంతులు ఎదుర్కొని 7 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసింది. ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన అనుష్క గురుంచి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.ఎవరీ అనుష్క శర్మ..?ఆమె అసలు పేరు అనుష్క బ్రిజ్మోహన్ శర్మ. అనుష్క దేశవాళీ క్రికెట్లో మధ్యప్రదేశ్కు ప్రాతినిథ్యం వహించింది. ఆమెకు చిన్నతనం నుంచి క్రికెట్పై మక్కువ ఎక్కువ. అనుష్క తన అన్నయ్య ఆయుష్ శర్మను చూసి క్రికెట్ను కెరీర్గా ఎంచుకుంది. ఆయుష్ కూడా ప్రొఫెషనల్ క్రికెటర్ కావడం గమనార్హం.అతడు తన బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం తన సోదరితో బౌలింగ్ చేయించేవాడంట. అనుష్క కుడిచేతి వాటం బ్యాటర్ మాత్రమే కాదు, రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగలదు. దేశవాళీ క్రికెట్లో ఆమె ఇప్పటివరకు 620 పరుగులతో పాటు 22 వికెట్లు పడగొట్టింది. అనుష్క మధ్యప్రదేశ్ జట్టుతో పాటు ఇండియా-బి, ఇండియా-సి, సెంట్రల్ జోన్ వంటి జట్లకు కూడా ప్రాతినిథ్యం వహించింది. అనుష్క సీనియర్ ఉమెన్స్ టీ20 ట్రోఫీ-2025లో 207 పరుగులు చేయడంతో పాటు 9 వికెట్లు తీసి సత్తాచాటింది.వేలంలో రికార్డు ధర..ఈ క్రమంలోనే గతేడాది నవంబర్లో జరిగిన మెగా వేలంలో అనుష్కపై కాసుల వర్షం కురిసింది. ఆమెను గుజరాత్ జెయింట్స్ రూ. 45 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది. తద్వారా ఈ ఏడాది సీజన్ వేలంలో అత్యధిక పలికిన అన్క్యాప్డ్ ప్లేయర్గా ఆమె నిలిచింది. ఇదే తరహా ప్రదర్శలు చేస్తే అనుష్క త్వరలోనే భారత సీనియర్ జట్టులోకి వచ్చే అవకాశముంది.చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 9 ఫోర్లు, 7 సిక్స్లతో -
గుజరాత్ జెయింట్స్ బోణీ.. పోరాడి ఓడిన యూపీ
మహిళల ప్రీమియర్ లీగ్-2026లో గుజరాత్ జెయింట్స్ శుభారంభం చేసింది. శనివారం డివై పాటిల్ స్టేడియం వేదికగా యూపీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు సాధించింది.గుజరాత్ ఇన్నింగ్స్లో కెప్టెన్ యాష్లీ గార్డనర్ విధ్వంసం సృష్టించింది. కేవలం 41 బంతుల్లో 65 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఆమెతో పాటు అరంగేట్ర ప్లేయర్ అనుష్క శర్మ (44), సీనియర్ సోఫీ డివైన్(38) రాణించారు. యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్స్టోన్ 2 వికెట్లు తీయగా, శిఖా పాండే, డియాండ్రా డాటిన్ తలో వికెట్ పడగొట్టారు.దుమ్ములేపిన ఫీబీ..అనంతరం భారీ లక్ష్య చేధనలో యూపీ వారియర్స్ ఆఖరి వరకు పోరాడింది. ఓ దశలో గెలిచేలా కన్పించిన యూపీ జట్టు.. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. యూపీ యువ బ్యాటర్ ఫీబీ లిచ్ఫీల్డ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది.లిచ్ఫీల్డ్ 40 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 78 పరుగులు చేసింది. దూకుడుగా ఆడుతున్న లిఛ్ఫీల్డ్.. సోఫీ డివైన్ బౌలింగ్లో ఔట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. కెప్టెన్ మెగ్ లానింగ్(30), ఆశా శోభన(27) పర్వాలేదన్పించారు. భారత స్టార్ ప్లేయర్లు హర్లీన్ డియోల్(0), దీప్తీ శర్మ(1) మాత్రం తీవ్ర నిరాశపరిచారు. గుజరాత్ బౌలర్లలో రేణుకా సింగ్, సోఫీ డివైన్, జార్జియా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. గైక్వాడ్, గార్డనర్ తలా వికెట్ సాధించారు.చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 9 ఫోర్లు, 7 సిక్స్లతో -
IND vs NZ: 'ఈసారి కూడా వైట్ వాష్ చేస్తాము'
భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ఆదివారం(జనవరి 11) నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో మొదటి వన్డేకు వడోదరలోని బీసీఎ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. అయితే ఏడాదిన్నర కిందట స్వదేశంలో భారత్ను టెస్టుల్లో వైట్వాష్ చేసిన కివీస్.. ఇప్పుడు అదే ఫలితాన్ని వన్డేల్లో కూడా పునరావృతం చేయాలని పట్టుదలతో ఉంది.ఇదే విషయాన్ని తొలి వన్డేకు ముందు మీడియా సమావేశంలో మాట్లాడిన న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ విల్ యంగ్ స్పష్టం చేశాడు. కివీస్ జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని, భారత్ను ఓడించగలమని యంగ్ థీమా వ్యక్తం చేశాడు. కాగా 2024 ఆఖరిలో భారత్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ సంచలనం సృష్టించింది.మూడు టెస్టుల సిరీస్ను కివీస్ వైట్ వాష్ చేసింది. బ్లాక్ క్యాప్స్ జట్టు 1955 తర్వాత భారత గడ్డపై టెస్టు సిరీస్ నెగ్గడం ఇదే తొలిసారి. ఈ చారిత్రాత్మక సిరీస్ విజయంలో యంగ్ది కీలక పాత్ర. యంగ్ ప్లేయర్ ఆఫ్ది సిరీస్గా నిలిచాడు. ఇప్పుడు వన్డేల్లో కూడా సత్తాచాటాలని అతడు ఉవ్విళ్లూరుతున్నాడు."ఈసారి భిన్నమైన ఫార్మాట్లో క్రికెట్ ఆడేందుకు భారత్ పర్యటనకు వచ్చాము. మా జట్టు ప్రస్తుతం వన్డేల్లో అద్భుతంగా రాణిస్తోంది. సీనియర్ ప్లేయర్లు దూరంగా ఉన్నప్పటికి మేము మెరుగైన ప్రదర్శన చేస్తామన్న నమ్మకం నాకు ఉంది. ఈ సిరీస్కు ముందు మేము స్వదేశంలో ఇంగ్లండ్, వెస్టిండీస్తో వన్డేల్లో విజయం సాధించాము.గత భారత పర్యటనలో మేము సాధించిన విజయం మాకు ఎంతో నమ్మకాన్ని ఇచ్చింది. ఈసారి కూడా గెలిచేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాము. భారత్లో మరొక సిరీస్ గెలవడమే మా లక్ష్యం. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో చివరి మెట్టుపై బోల్తా పడ్డాము. కానీ ఆ ఓటమిని మేము ఎప్పుడో మర్చిపోయాము.ఇప్పుడు మా దృష్టి కేవలం ఈ ద్వైపాక్షిక సిరీస్ పైనే ఉంది" అని పేర్కొన్నాడు. కాగా గతేడాది మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ చేతిలో కివీస్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక ఈ సిరీస్ భారత పర్యటకు కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్,రచిన్ రవీంద్ర వంటి స్టార్ ప్లేయర్లు దూరమయ్యారు. వన్డే సిరీస్కు కివీస్ కెప్టెన్గా మైఖల్ బ్రెస్వెల్ వ్యవహరించనున్నాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 9 ఫోర్లు, 7 సిక్స్లతో -
ఈ ఐదుగురిపైనే కళ్లన్నీ.. త్రిషకు మంచి రోజులు వచ్చినట్లేనా?
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2026 టోర్నమెంట్కు శుక్రవారం తెరలేచింది. సీజన్ ఆరంభ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ముంబై ఇండియన్స్పై గెలుపొంది శుభారంభం అందుకుంది.ఆర్సీబీ తరఫున అరంగేట్రంనవీ ముంబైలో జరిగిన ఈ మ్యాచ్ ద్వారా ఆర్సీబీ తరఫున ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లు లారెన్ బెల్, లిన్సీ స్మిత్ అరంగేట్రం చేశారు. ఫాస్ట్ బౌలర్ బెల్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 14 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీసింది. తద్వారా డబ్ల్యూపీఎల్లో తన ఆగమనాన్ని ఘనంగా చాటింది.మరోవైపు.. లెఫ్టార్మ్ పేసర్ లిన్సీ స్మిత్ మాత్రం రెండు ఓవర్లలో ఏకంగా 23 పరుగులు ఇచ్చి నిరాశపరిచింది. అయితే, అంతర్జాతీయ టీ20లలో సత్తా చాటిన ఈ ఇద్దరు ఎవరికి ఎవరూ తక్కువకారు. తొలి మ్యాచ్లో విఫలమైనా లిన్సీ తిరిగి పుంజుకోగలదు. ఇందుకు గణాంకాలే కారణం.ఎన్ని వికెట్లు తీశారంటేబెల్ ఇప్పటికి 36 అంతర్జాతీయత టీ20లలో 50 వికెట్లు కూల్చగా.. లిన్సీ 22 మ్యాచ్లు ఆడి 6.6 ఎకానమీతో 22 వికెట్లు తీసింది. వుమెన్స్ 100లో బెల్ ఖాతాలో 60 (41 మ్యాచ్లలో), లిన్సీ ఖాతాలో 42 (37 మ్యాచ్లలో) వికెట్లు ఉన్నాయిఇక బెల్, లిన్సీలతో పాటు మరో ముగ్గురు ప్లేయర్లు కూడా ఈసారి అరంగేట్రం చేసే అవకాశం ఉంది. వారు మరెవరో కాదు లిజెలి లీ, గొంగడి త్రిష, దీయా యాదవ్.లిజెలి లీసౌతాఫ్రికా ఓపెనింగ్ బ్యాటర్ లిజెలి లీ అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికి 82 మ్యాచ్లు ఆడింది. 33 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఖాతాలో 1896 పరుగులు ఉన్నాయి.ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి వైదొలిగినా.. తన విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా గత దశాబ్దకాలంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. గతేడాది వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ లిజెలిని రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. మహిళల బిగ్బాష్ లీగ్లో ఇప్పటికి 104 మ్యాచ్లు ఆడి ఐదు సెంచరీలు బాది.. 2770 పరుగులు చేసిన లిజెలి డబ్ల్యూపీఎల్నూ వాచౌట్ ప్లేయర్.గొంగడి త్రిషతెలంగాణ ఆల్రౌండర్, టీమిండియా అండర్-19 స్టార్ గొంగడి త్రిష. అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో మొట్టమొదటి సెంచరీ చేసిన మహిళా క్రికెటర్గా ఆమె చరిత్రకెక్కింది.టాపార్డర్లో బ్యాటింగ్ చేయడంతో పాటు.. పార్ట్టైమ్ లెగ్ స్పిన్నర్గా రాణించడం ఆమెకు ఉన్న అదనపు బలం. అయితే, గత రెండు సీజన్లలో వేలంలో పేరు నమోదు చేసుకున్నా ఫ్రాంఛైజీలు ఆమెను పట్టించుకోలేదు.ఈసారి యూపీ వారియర్స్ మాత్రం రూ. 10 లక్షల కనీస ధరకు 20 ఏళ్ల త్రిషను కొనుగోలు చేసింది. కీలక మ్యాచ్లలో ఫియర్లెస్ క్రికెట్ ఆడగల సత్తా ఉన్న త్రిషకు ఒక్క అవకాశం వచ్చినా తనను తాను నిరూపించుకోగలదు. ఇప్పటి వరకు 33 టీ20 మ్యాచ్లు ఆడిన త్రిష 583 పరుగులు సాధించింది.దీయా యాదవ్పదహారేళ్ల దీయా యాదవ్ను రూ. 10 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. తద్వారా అత్యంత పిన్న వయసులో డబ్ల్యూపీఎల్ కాంట్రాక్టు పొందిన ప్లేయర్గా ఆమె చరిత్ర సృష్టించింది. అండర్ 15 వన్డే కప్లో డబుల్ సెంచరీ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన దీయా.. దేశీ టీ20 క్రికెట్లోనూ నిలకడైన ఆటతో ఆకట్టుకుంటోంది. ఈమె కూడా ఈసారి అరంగేట్రం చేసే అవకాశం ఉంది.చదవండి: T20 WC: వేటు వేసిన సెలక్టర్లు.. తొలిసారి స్పందించిన శుబ్మన్ గిల్ -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 9 ఫోర్లు, 7 సిక్స్లతో
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. అండర్-19 ప్రపంచకప్ 2026 సన్నాహకాల్లో భాగంగా స్కాట్లాండ్తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో వైభవ్ విధ్వంసం సృష్టించాడు. 14 ఏళ్ల సూర్యవంశీ స్కాట్లాండ్ బౌలర్లను ఉతికారేశాడు. దాదాపు 192 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి టీమిండియాకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు.ఈ క్రమంలో కేవలం 27 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 50 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 9 ఫోర్లు, 7 సిక్స్లతో 96 పరుగులు చేశాడు. కేవలం 4 పరుగుల దూరంలో సెంచరీని చేజార్చుకున్నాడు. అతడు సాధించిన స్కోర్లో 78 పరుగులు కేవలం బౌండరీల ద్వారానే రావడం గమనార్హం. అతడితో పాటు ఆరోన్ జార్జ్ 61 పరుగులతో రాణించారు. 33 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. క్రీజులో ప్రస్తుతం అభిజ్ఞాన్ కుండు(10), విహాన్ మల్హోత్రా(46) ఉన్నారు. అయితే గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన కెప్టెన్ అయూష్ మాత్రం తీవ్ర నిరాశపరిచాడు. మాత్రే కేవలం 22 పరుగులు చేసి ఔటయ్యాడు.కాగా వార్మాప్ మ్యాచ్లకు ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన యూత్ వన్డే సిరీస్లోనూ వైభవ్ అద్భుతాలు చేశాడు. రెండో వన్డేలో కేవలం 74 బంతుల్లో 127 పరుగులు చేసిన వైభవ్.. మూడో వన్డేలో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. ఇక వరల్డ్కప్ ప్రధాన టోర్నీ జనవరి 15 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో భారత్, అమెరికా జట్లు తలపడనున్నాయి.చదవండి: WPL 2026: ఈ ఐదుగురు ప్లేయర్లపైనే కళ్లన్నీ.. గొంగడి త్రిషకు మంచి రోజులు వచ్చినట్లేనా? -
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న యూపీ.. అనుష్క అరంగేట్రం
డబ్ల్యూపీఎల్-2026లో భాగంగా నవీ ముంబై వేదికగా జరగుతున్న రెండో మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన యూపీ కెప్టెన్ మెగ్ లానింగ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. లానింగ్ యూపీ తరపున ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం. ఇంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్కు లానింగ్ సారథ్యం వహించింది.కానీ డబ్ల్యూపీఎల్-2026 వేలానికి ముందు ఢిల్లీ ఆమెను విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన లానింగ్ను యూపీ వారియర్స్ సొంతం చేసుకుని తమ జట్టు బాధ్యతలు అప్పగించింది. ఇక ఈ మ్యాచ్లో స్టార్ ప్లేయర్లు సోఫీ డివైన్, జార్జియా వేర్హామ్ గుజరాత్ జెయింట్స్ తరపున అరంగేట్రం చేశారు. వీరిద్దరూ గత సీజన్ వరకు ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించారు. వీరితో పాటు అనుష్క శర్మ కూడా గుజరాత్ తరపున డెబ్యూ చేసింది.తుది జట్లుగుజరాత్ జెయింట్స్: బెత్ మూనీ (వికెట్ కీపర్), సోఫీ డివైన్, ఆష్లీ గార్డనర్ (కెప్టెన్), జార్జియా వేర్హామ్, అనుష్క శర్మ, కనికా అహుజా, భారతీ ఫుల్మాలి, కష్వీ గౌతమ్, తనూజా కన్వర్, రాజేశ్వరి గయక్వాడ్, రేణుకా సింగ్ ఠాకూర్యుపీ వారియర్జ్: మెగ్ లానింగ్ (కెప్టెన్), ఫోబ్ లిచ్ఫీల్డ్, హర్లీన్ డియోల్, డియాండ్రా డాటిన్, కిరణ్ ప్రభు నవ్గిరే, దీప్తి శర్మ, శ్వేతా సెహ్రావత్ (వికెట్ కీపర్), సోఫీ ఎక్లెస్టోన్, ఆశా శోబన, క్రాంతి గౌడ్, శిఖా పాండే -
T20 WC: వేటు వేసిన సెలక్టర్లు.. తొలిసారి స్పందించిన గిల్
టీ20 ప్రపంచకప్-2026లో పాల్గొనే భారత జట్టు నుంచి తనను తప్పించడంపై.. టీమిండియా వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్ స్పందించాడు. తనపై వేటు వేస్తూ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తానని పేర్కొన్నాడు. కాగా ఆసియా టీ20 కప్-2025 ద్వారా గిల్ అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో అభిషేక్ శర్మకు విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా ఉన్న సంజూ శాంసన్ (Sanju Samson)ను తప్పించి.. అతడి స్థానంలో గిల్ను ఓపెనర్గా పంపారు. అయితే, వరుస మ్యాచ్లలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ విఫలమయ్యాడు. గత ఇరవై ఇన్నింగ్స్లో అతడి ఖాతాలో ఒక్క టీ20 హాఫ్ సెంచరీ కూడా లేకపోవడం ఇందుకు నిదర్శనం.అయినప్పటికీ సౌతాఫ్రికాతో ఇటీవల స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్లోనూ గిల్ (Shubman Gill).. తొలి మూడు మ్యాచ్లలో కొనసాగించారు. ఇక్కడా అతడు విఫలమయ్యాడు. అనంతరం పాదం నొప్పి కారణంగా సఫారీ జట్టుతో నాలుగు (వర్షం వల్ల రద్దు), ఐదో టీ20కి గిల్ దూరమయ్యాడు. ఈ క్రమంలో ప్రొటిస్తో ఐదో టీ20లో ఓపెనర్గా తిరిగి వచ్చి సంజూ మరోసారి సత్తా చాటాడు.అనూహ్య రీతిలో వేటుఫలితంగా.. గిల్కు పెద్ద పీట వేస్తూ.. సంజూకు అన్యాయం చేశారన్న విమర్శలు మరోసారి తెరమీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. టెస్టు, వన్డే జట్ల కెప్టెన్.. టీ20 జట్టు వైస్ కెప్టెన్ అయిన గిల్ను ప్రపంచకప్ జట్టు నుంచి తప్పించింది. ఊహించని రీతిలో భవిష్య కెప్టెన్పై వేటు వేసి.. అక్షర్ పటేల్ను సూర్యకుమార్ యాదవ్ డిప్యూటీగా నియమించింది.ఇక భారత జట్టు ప్రస్తుతం సొంతగడ్డపై న్యూజిలాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్తో బిజీ కానుంది. జనవరి 11 నుంచి ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్ మొదలుకానుండగా.. టీమిండియా వన్డే కెప్టెన్ గిల్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా టీ20 జట్టులో చోటు కోల్పోవడంపై ప్రశ్న ఎదురైంది.అలా అయితే నన్నెవరూ ఆపలేరు కదా!ఇందుకు స్పందిస్తూ.. ‘‘సెలక్టర్ల నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టుకు ఆల్ ది బెస్ట్. నా తలరాతలో రాసి ఉన్నదాన్ని బట్టే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను.నాకు దక్కాల్సిన వాటి గురించి నుదిటిరాతలో రాసి ఉంటే.. నా నుంచి దానిని ఎవరూ దూరం చేయలేరు. నన్నెవరూ ఆపలేరు. ప్రతి ఒక్క ఆటగాడు ఎల్లప్పుడూ దేశం కోసం ఆడుతూ.. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే కోరుకుంటాడు. నేను కూడా అంతే. అయితే, సెలక్టర్లే అంతిమ నిర్ణయం తీసుకుంటారు’’ అని శుబ్మన్ గిల్ పేర్కొన్నాడు.చదవండి: T20 WC 2026: ‘ఈసారి ఫైనల్లో టీమిండియాపై గెలుస్తాం’ -
సంజూ శాంసన్ కోసం రంగంలోకి యువీ!
టీమిండియా దిగ్గజ ఆల్రౌండర్గా యువరాజ్ సింగ్కు పేరుంది. టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్కప్-2011 టోర్నీల్లో భారత్ చాంపియన్గా నిలవడంలో అతడిది కీలక పాత్ర. పదిహేడేళ్లకుపైగా అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగిన యువీ.. తన కెరీర్లో 40 టెస్టులు, 58 టీ20 మ్యాచ్లు.. అత్యధికంగా 304 వన్డేలు ఆడాడు.టెస్టుల్లో 1900, టీ20లలో 1177 పరుగులు చేసిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. వన్డేల్లో 14 శతకాల సాయంతో 8701 పరుగులు సాధించాడు. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఖాతాలో 9 టెస్టు, 111 వన్డే, 28 టీ20 వికెట్లు ఉన్నాయి. ఐపీఎల్లోనూ 132 మ్యాచ్లు ఆడిన యువీ.. 2750 పరుగులు చేయడంతో పాటు.. 36 వికెట్లు కూడా తీశాడు.ఇంతటి అనుభవం గల యువీ దగ్గర పంజాబీ బ్యాటర్లు, టీమిండియా స్టార్లు శుబ్మన్ గిల్, అభిషేక్ శర్మ శిక్షణ తీసుకున్నారు. అతడి మార్గదర్శనంలో వీరిద్దరు రాటుదేలారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ టీమిండియా విధ్వంసకర ఓపెనర్గా, ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్గా ఎదగడంలో యువీది కీలక పాత్ర.మరోవైపు.. గిల్ ఏకంగా టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. ఇక యువీ శిష్యుల జాబితాలోకి తాజాగా సంజూ శాంసన్ కూడా చేరిపోయినట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్తో స్వదేశంలో టీ20 సిరీస్కు ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సన్నద్ధమవుతున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి సన్నాహకంగా సాగే ఈ సిరీస్లో సత్తా చాటి.. మెగా ఈవెంట్లోనూ మెరవాలని సంజూ పట్టుదలగా ఉన్నాడు.ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ మార్గదర్శనంలో నెట్స్లో సంజూ శ్రమిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇందులో యువీ.. సంజూకు బ్యాటింగ్ పొజిషన్, టెక్నిక్స్ గురించి సలహాలు ఇస్తుండగా.. అతడు శ్రద్ధగా వింటున్నట్లు కనిపించిది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘క్రేజీ కాంబినేషన్.. సూపర్ భయ్యా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సంజూ శాంసన్ ఫ్యాన్స్ పేజీ నుంచి వచ్చిన ఈ వీడియోపై మరికొందరు మాత్రం.. ‘‘AI’’ కాదు కదా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.కాగా న్యూజిలాండ్తో తొలుత మూడు వన్డేలు ఆడిన తర్వాత.. టీమిండియా ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. జనవరి 11- 31 వరకు ఈ సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఆ తర్వాత ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్-2026తో భారత జట్టు బిజీ అవుతుంది. Sanju Samson training session with Yuvraj Singh ❤️🔥@YUVSTRONG12 @IamSanjuSamson pic.twitter.com/gBc04dbKXs— Sanju Samson Fans Page (@SanjuSamsonFP) January 10, 2026 -
T20 WC 2026: ‘ఫైనల్లో టీమిండియాపై గెలుస్తాం’
డిఫెండింగ్ చాంపియన్ హోదాలో టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు శ్రీలంకతో కలిసి ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధమైంది. ఈ ఐసీసీ ఈవెంట్ను ఫిబ్రవరి 7 -మార్చి 8 మధ్య నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.ఈసారి కూడా టీమిండియా హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. సొంతగడ్డపై టోర్నీ జరుగనుండటం భారత జట్టుకు మరో సానుకూలాంశం. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.వరల్డ్కప్ ఫైనల్లో గెలుస్తాంఐడెన్ మార్క్రమ్ కెప్టెన్సీలోని సౌతాఫ్రికా ఈసారి తప్పకుండా చాంపియన్గా అవతరిస్తుందని అంచనా వేశాడు. వరల్డ్కప్ ఫైనల్లో సూర్యకుమార్ సేనను ఓడించి ఈసారి ట్రోఫీని ముద్దాడుతుందని గ్రేమ్ స్మిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఇటీవల టెస్టు సిరీస్లో సౌతాఫ్రికా టీమిండియాను 2-0తో వైట్వాష్ చేయడాన్ని ప్రస్తావించాడు.‘‘భారత్లో ఆ టెస్టు సిరీస్ అద్భుతం. టీమిండియాను సొంతగడ్డపై ఓడించి.. మా జట్టు పూర్తి ఆధిపత్యం కొనసాగించడం నాకు నిజంగా ఆశ్చర్యం కలిగించింది. గత ఏడాదిన్నరకాలంగా మా టెస్టు జట్టు అద్భుతంగా ఆడుతోంది.సౌతాఫ్రికా క్రికెట్ను సరికొత్తగా మార్చింది. ఇక ఈసారి భారత్లో జరిగే వరల్డ్కప్ ఫైనల్లోనూ టీమిండియాను ఓడించి మేము టైటిల్ గెలుస్తాం’’ అని గ్రేమ్ స్మిత్ పీటీఐతో పేర్కొన్నాడు.మార్పు అవశ్యంఅదే విధంగా.. ‘‘ఈసారి కూడా టీమిండియా పటిష్టంగా కనిపిస్తోంది. వారి గెలుపు అవకాశాలను కొట్టివేయలేము. పైగా స్వదేశంలో టోర్నీ జరుగడం వారికి అదనపు బలం.ముఖ్యంగా సీనియర్ల నిష్క్రమణ (రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి), హెడ్కోచ్గా గౌతం గంభీర్ రావడం వంటి పరిణామాలతో భారత క్రికెట్లో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్పును కూడా మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.టీమిండియాదే పైచేయిఏదేమైనా ఈసారి టీమిండియా గనుక సెమీ ఫైనల్కు చేరకపోతే అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం మరొకటి ఉండదు’’ అని గ్రేమ్ స్మిత్ అన్నాడు. కాగా రోహిత్ శర్మ సారథ్యంలో టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో భారత్.. సౌతాఫ్రికాను ఓడించి టైటిల్ గెలుచుకుంది.బార్బడోస్ వేదికగా ఉత్కంఠ రేపిన మ్యాచ్లో సఫారీ జట్టుపై ఏడు పరుగుల తేడాతో గెలిచి.. తన ఖాతాలో రెండో టీ20 ట్రోఫీని జమచేసుకుంది. ఇక ఈ టోర్నీ తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించగా.. సూర్యకుమార్ యాదవ్ పగ్గాలు చేపట్టాడు.గత పద్దెనిమిది నెలల కాలంలో సూర్య సారథ్యంలో ఆడిన టీమిండియా కేవలం ఐదు మ్యాచ్లు మాత్రమే ఓడిపోవడం.. జట్టు ఏ మేర పటిష్టంగా ఉందో చెప్పేందుకు నిదర్శనం. చివరగా ఇటీవల సొంతగడ్డపై సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 3-1తో గెలిచింది. మరోవైపు.. సౌతాఫ్రికాకు మాత్రం గతేడాది అంత గొప్పగా ఏమీ సాగలేదు. చదవండి: మేము నటిస్తున్నామని మాకూ తెలుసు: బీసీబీపై బంగ్లా కెప్టెన్ విమర్శలు -
ఆర్సీబీకి భారీ షాక్!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మహిళా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్, పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ పూజా వస్త్రాకర్ మరో రెండు వారాల పాటు ఆటకు దూరం కానుంది. ఈ విషయాన్ని ఆర్సీబీ వుమెన్ హెడ్కోచ్ మలోలన్ రంగరాజన్ ధ్రువీకరించాడు.తొలుత భుజం నొప్పి.. ఇపుడు‘‘బెంగళూరులో ఉన్న బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)నుంచి పూజా వస్త్రాకర్ (Pooja Vastrakar) విడుదల కావడానికి మరో రెండు వారాలు పట్టవచ్చు. తొలుత ఆమె భుజం నొప్పితో CoEలో చేరింది.అయితే, దురదృష్టవశాత్తూ తొడకండరాలు పట్టేయంతో మరికొన్నాళ్ల పాటు ఆమెకు విశ్రాంతి అవసరమైంది. కోలుకోవడానికి పదిహేనుల రోజుల దాకా పట్టవచ్చు. ఆమె ఎప్పుడు తిరిగి వస్తుందో వేచి చూడాల్సిందే’’ అని మలోలన్ రంగరాజన్ తెలిపాడు.‘భారీ’ ధరకు కొనుగోలుకాగా 26 ఏళ్ల పూజా వస్త్రాకర్ టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా చివరగా కాంపిటేటివ్ క్రికెట్ ఆడింది. అయితే, ఆమెకు ఉన్న అరుదైన నైపుణ్యాల కారణంగా మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2025 వేలంలో ఆర్సీబీ ఏకంగా రూ. 85 లక్షలు వచ్చించి పూజాను కొనుగోలు చేసింది. డబ్ల్యూపీఎల్తో ఆమె తిరిగి కాంపిటేటివ్ క్రికెట్లో రీఎంట్రీ ఇవ్వాల్సింది.అయితే, తొడ కండరాల గాయం కారణంగా పూజా వస్త్రాకర్ ఆటకు దూరం కాగా.. ఆర్సీబీ రెండు వారాల పాటు ఆమె సేవలు కోల్పోనుంది. ఇదిలా ఉంటే.. డబ్ల్యూపీఎల్-2026 ఆరంభ మ్యాచ్లో ఆర్సీబీ.. ముంబై ఇండియన్స్ను చిత్తు చేసింది.నదినె డి క్లెర్క్ అద్భుత ప్రదర్శనచివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో డిఫెండింగ్ చాంపియన్ను మూడు వికెట్ల తేడాతో ఓడించిన ఆర్సీబీ.. ఈ సీజన్లో శుభారంభం అందుకుంది. సౌతాఫ్రికా ఆల్రౌండర్ నదినె డి క్లెర్క్ అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించింది. చివరి బంతికి ఫోర్ బాది ఆర్సీబీని విజయతీరాలకు చేర్చింది.నవీ ముంబై వేదికగా శుక్రవారం టాస్ గెలిచిన ఆర్సీబీ.. ముంబైని తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో హర్మన్ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. సజీవన్ సజన 25 బంతుల్లో 45 పరుగులు చేసి ముంబై టాప్ రన్ స్కోరర్గా నిలిచింది.63 పరుగులతో అజేయంగాఇక లక్ష్య ఛేదనలో ఆర్సీబీ ఆదిలో తడబడింది. అయితే, ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన డి క్లెర్క్ 44 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 63 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమెకు తోడుగా ప్రేమా రావత్ నాలుగు బంతుల్లో రెండు ఫోర్లు బాది జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించింది. కాగా అంతకు ముందు డి క్లెర్క్ నాలుగు వికెట్లతో సత్తా చాటింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచింది.చదవండి: మేము నటిస్తున్నామని మాకూ తెలుసు: బీసీబీపై బంగ్లా కెప్టెన్ విమర్శలు -
ఇక్కడ కూడా వదలరా?.. స్మృతి రియాక్షన్ వైరల్
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2026ను విజయంతో ఆరంభించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ). డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్తో శుక్రవారం నాటి మ్యాచ్లో మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన WPL ఓపెనర్లో ఆర్సీబీ జయకేతనం ఎగురవేసింది.సౌతాఫ్రికాకు చెందిన నదినె డి క్లెర్క్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆర్సీబీకి సంచలన విజయం అందించింది. దీంతో ఆర్సీబీ ఖాతాలో తొలి గెలుపు నమోదైంది. ఈ మ్యాచ్లో ఓపెనర్గా స్మృతి మంధాన (13 బంతుల్లో 18) విఫలమైనా.. కెప్టెన్గా మాత్రం హిట్టయ్యింది.ఇక ఆటకు తోడు అందంతో మెరిసే స్మృతి మంధానకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విరాట్ కోహ్లి మాదిరే స్మృతి పట్ల కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ వీరాభిమానం చూపిస్తారు. అందుకే కెమెరామెన్ సైతం మైదానంలోపలా, వెలుపలా ఆమెపైనే ఎక్కువగా దృష్టి పెడతాడు.ఇక్కడ కూడా వదలరా?ఈ నేపథ్యంలో మ్యాచ్కు ముందు మైదానంలో బ్యాట్తో స్మృతి ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఓ కెమెరామెన్ ఆమెకు దగ్గరగా వచ్చి ఫొటోలు తీసే ప్రయత్నం చేశాడు. దీంతో కాస్త చిరాకుపడిన స్మృతి.. ‘‘ఇక్కడ కూడా వదలరా? ఏంటి భయ్యా ఇది?’’ అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్గా మారింది.మాకు అలవాటేఇక తొలి మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించడం పట్ల స్మృతి హర్షం వ్యక్తం చేసింది. ఉత్కంఠ పోరులో గెలవడం తమకు అలవాటేనని.. నదినె వల్లే ఈ గెలుపు సాధ్యమైందని ప్రశంసించింది. జట్టులోని ప్రతి ఒక్కరు సానుకూల దృక్పథంతో ముందుకు సాగారని కొనియాడింది.కాగా స్మృతి వ్యక్తిగత జీవితంలో ఇటీవల ఓ చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న పలాష్ ముచ్చల్తో పెళ్లి పీటలు ఎక్కే కొన్ని గంటలకు ముందు.. హఠాత్తుగా వివాహం ఆగిపోయింది. పలాష్ ఆమెను మోసం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.డబ్ల్యూపీఎల్-2026: ముంబై వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు👉ముంబై: 154/6(20)👉ఆర్సీబీ: 157/7(20)👉ఫలితం: మూడు వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: నదినె డి క్లెర్క్ (4/26, 44 బంతుల్లో 63 నాటౌట్).చదవండి: మేము నటిస్తున్నామని మాకూ తెలుసు: బీసీబీపై బంగ్లా కెప్టెన్ విమర్శలుCameraman not leaving Smrithi alone to practice and see Smrithi’s reaction 😂 pic.twitter.com/QVF8q4WTzw— RCB (@RCBtweetzz) January 9, 2026 -
మేము నటిస్తున్నామని మాకూ తెలుసు: బంగ్లాదేశ్ కెప్టెన్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో బంగ్లాదేశ్ ఆడుతుందా?.. బంగ్లా డిమాండ్పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది?.. ఈ ఐసీసీ ఈవెంట్కు ఆతిథ్యమిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వైఖరి ఎలా ఉండబోతోంది?.. క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఈ అంశాల గురించే ప్రధానంగా చర్చ నడుస్తోంది.బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై దాడుల నేపథ్యంలో భారత్తో దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రహమాన్ను బీసీసీఐ తొలగించింది. ఈ క్రమంలో భద్రతా కారణాలు చూపుతూ వరల్డ్కప్ ఆడేందుకు తాము భారత్కు రాలేమని.. శ్రీలంకలో తమ మ్యాచ్లు నిర్వహించాలని బంగ్లా బోర్డు.. ఐసీసీకి విజ్ఞప్తి చేసింది.గందరగోళంలో ఆటగాళ్లుఅయితే, టోర్నీ ఆరంభానికి నెలరోజుల సమయం కూడా లేనందున ఈ మార్పు కుదరకపోవచ్చని ఐసీసీ బంగ్లా క్రికెట్ బోర్డు(BCB)కు సంకేతాలు ఇచ్చింది. అయినప్పటికీ బీసీబీ తమ పట్టువీడటం లేదు. దీంతో బంగ్లాదేశ్ లేకుండానే టోర్నీ నిర్వహించే పరిస్థితులు రావొచ్చనే ఆందోళనలు ఆ దేశ ఆటగాళ్లలో నెలకొన్నాయి.ఐసీసీతో పంచాయతీ వద్దని, తెగేదాక లాగవద్దంటూ బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ హితవు పలికితే.. బీసీబీ అధికారి అతడిని ‘ఇండియన్ ఏజెంట్’ అంటూ ఆరోపణలు చేశాడు. మరోవైపు.. బంగ్లా కీలక ఆటగాళ్ల బ్యాట్ స్పాన్సర్లుగా ఉన్న భారత కంపెనీలు తప్పుకొనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఆటగాళ్లు తీవ్ర స్థాయిలో నష్టపోతారు.అంగారక గ్రహంపైకి పంపించినాఅయినా సరే బీసీబీ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్ టీ20 వరల్డ్కప్ జట్టులో భాగమైన మెహదీ హసన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘ప్రపంచకప్ ఆడే విషయంలో యాజమాన్యం తరఫు నుంచి సందిగ్దం నెలకొంది. అధికారులే ఈ సమస్యను పరిష్కరించాలి.ప్లేయర్లుగా కేవలం ఆడటం మాత్రమే మా బాధ్యత. ఒకవేళ బోర్డు మమ్మల్ని అంగారక గ్రహంపైకి పంపించినా మేము ఆడి తీరాల్సిందే. ఈ విషయంలో ఆటగాళ్లు ఎక్కడా వెనక్కి తగ్గరు’’ అని పేర్కొన్నాడు.మేము నటిస్తున్నామని మాకూ తెలుసుఇక బంగ్లాదేశ్ టెస్టు జట్టు కెప్టెన్, గత టీ20 వరల్డ్కప్లో సారథిగా వ్యవహరించిన నజ్ముల్ హుసేన్ షాంటో సైతం బంగ్లా బోర్డు తీరును పరోక్షంగా తప్పుబట్టాడు. ‘‘ప్రతి ప్రపంచకప్ టోర్నీకి ముందు మాకు ఇలాంటి సమస్య ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది.వరల్డ్కప్ ఈవెంట్లలో ఆడిన ఆటగాడిగా నా అనుభవం గురించి చెబుతున్నా. ఇలాంటి పరిణామాలు కచ్చితంగా ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం చూపుతాయి. మాపై ఎలాంటి ఒత్తిడీ లేదు. ఎలాంటి ప్రభావం లేదన్నట్లు పైకి చెబుతూ ఉంటాము.నిజానికి ఆ సమయంలో మేమంతా నటిస్తున్నామన్న మాట. ఆ విషయం మాకూ తెలుసు. అయితే, ఇదేమీ తేలికైన విషయం కాదు. ఇలాంటి పరిస్థితులు రానేకూడదు. ఒకవేళ వచ్చినా ఆటగాళ్లుగా మేము చేసేదేమీ లేదు’’ అంటూ బీసీబీ వ్యవహారశైలిని విమర్శించాడు.చదవండి: T20 WC 2026: భారత్లో ఆడబోము..! బంగ్లా డిమాండ్పై స్పందించిన బీసీసీఐ -
శ్రీలంక, పాక్ మ్యాచ్ రద్దు
శ్రీలంక- పాకిస్తాన్ జట్ల మధ్య శుక్రవారం జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 సన్నాహాల్లో భాగంగా పాకిస్తాన్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తోంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన తొలి టీ20లో ఆతిథ్య లంకపై పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో దంబుల్లా వేదికగా రెండో పోరులోనైనా గెలిచి సిరీస్ సమం చేయాలనుకున్న లంకకు చుక్కెదురైంది. మైదానం చిత్తడిగా ఉన్న కారణంగా సమయానికి మ్యాచ్ ప్రారంభం కాకపోగా... ఆ తర్వాత వర్షం దంచికొట్టడంతో ఆట సాధ్యపడలేదు. ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దు అయింది. ఇరు జట్ల మధ్య ఆదివారం ఇక్కడే మూడో మ్యాచ్ జరగనుంది. శ్రీలంక జట్టుపాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, జనిత్ లియానగే, వనిందు హసరంగ, దసున్ షనక(కెప్టెన్), దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, నువాన్ తుషార, ఇషాన్ మలింగ, త్రవీన్ మాథ్యూ, మతీశ పతిరణ, దునిత్ వెల్లలగే, కమిందు మెండిస్, కుశాల్ పెరీరా.పాకిస్తాన్ జట్టుసాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ అఘా(కెప్టెన్), ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, మహ్మద్ వసీం జూనియర్, సల్మాన్ మీర్జా జూనియర్, అబ్రార్ అహ్మద్, నసీమ్ షా, ఖవాజా నఫే, ఉస్మాన్ తారిఖ్, అబ్దుల్ సమద్చదవండి: T20 WC 2026: భారత్లో ఆడబోము..! బంగ్లా డిమాండ్పై స్పందించిన బీసీసీఐ -
ప్రాక్టీస్లో టీమిండియా
వడోదర: న్యూజిలాండ్తో వన్డే సిరీస్ కోసం టీమిండియా సమాయత్తమవుతోంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం తొలి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ప్రాక్టీస్లో నిమగ్నమయ్యారు. శుక్రవారం జరిగిన సెషన్లో కోహ్లి, రోహిత్ మంచి టచ్లో కనిపించారు. నెట్స్లో వీరిద్దరూ గంటన్నర పాటు పేసర్లు, స్పిన్నర్లను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత త్రోడౌన్ స్పెషలిస్ట్ బంతులను ప్రాక్టీస్ చేశారు. టి20, టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరూ... ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో రెండు సెంచరీలు బాదిన కోహ్లి న్యూజిలాండ్పై కూడా అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో వీరిద్దరూ చెరో రెండు మ్యాచ్లు ఆడి ఫామ్ చాటుకున్నారు. కెపె్టన్ శుబ్మన్ గిల్ కూడా నెట్స్లో చమటోడ్చాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో చివరి రెండు టి20లకు దూరమైన అతడు... ఇప్పుడు పూర్తిగా కోలుకొని ప్రాక్టీస్లో పాల్గొన్నాడు. గురువారం తమ రాష్ట్ర జట్ల తరఫున విజయ్ హజారే మ్యాచ్లు ఆడిన శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్ శుక్రవారం ప్రాక్టీస్లో పాల్గొనలేదు. వన్డే సిరీస్ అనంతరం భారత జట్టు న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ కూడా ఆడనుంది. ఆ వెంటనే ఐసీసీ టి20 ప్రపంచకప్ జరగనుంది.


