breaking news
Cricket
-
అభిరత్, ప్రజ్ఞయ్ సెంచరీలు వృథా
రాజ్కోట్: ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. గత మూడు మ్యాచ్ల్లోనూ ఓడిన హైదరాబాద్... వరుసగా నాలుగో పోరులోనూ పరాజయం పాలైంది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా బుధవారం పరుగుల వరద పారిన పోరులో బరోడా 37 పరుగుల తేడాతో హైదరాబాద్పై గెలుపొందింది. మొదట బరోడ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 417 పరుగులు చేసింది. కెప్టెన్ కృనాల్ పాండ్యా (63 బంతుల్లో 109 నాటౌట్; 18 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకంతో విజృంభించగా... ఓపెనర్లు నిత్య పాండ్యా (110 బంతుల్లో 122; 12 ఫోర్లు, 1 సిక్స్), అమిత్ పసీ (93 బంతుల్లో 127; 12 ఫోర్లు, 7 సిక్స్లు) సెంచరీలతో కదం తొక్కారు. ఆఖర్లో భాను పనియా (27 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) వేగంగా ఆడాడు. హైదరాబాద్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో... బరోడా బ్యాటర్లు పరుగుల పండగ చేసుకున్నారు. ఎడాపెడా బౌండరీలు బాదిన బరోడా బ్యాటర్లు... ఈ మ్యాచ్లో 44 ఫోర్లు, 11 సిక్స్లు కొట్టడం విశేషం. మన బౌలర్లలో చామా మిలింద్ 2 వికెట్లు పడగొట్టగా... తనయ్ త్యాగరాజన్, వరుణ్ గౌడ్ చెరో వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో హైదరాబాద్ 49.5 ఓవర్లలో 380 పరుగులకు ఆలౌటైంది. అభిరత్ రెడ్డి (90 బంతుల్లో 130; 18 ఫోర్లు, 2 సిక్స్లు), ప్రజ్ఞయ్ రెడ్డి (98 బంతుల్లో 113; 11 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో పోరాడినా ఫలితం లేకపోయింది. అమన్ రావు (39; 6 ఫోర్లు, 1 సిక్స్), తన్మయ్ అగర్వాల్ (32; 5 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ రెడ్డి (33; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. బరోడా బౌలర్లలో అతిత్ సేత్, మహేశ్ పితియా చెరో 3 వికెట్లు పడగొట్టారు. అమిత్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. మొత్తంగా ఈ మ్యాచ్లో ఇరు జట్ల ఆటగాళ్లు కలిసి 5 సెంచరీలు నమోదు చేశారు. గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ ఓడిన హైదరాబాద్ పాయింట్ల ఖాతా తెరవలేక పట్టికలో ఏడో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్లో శనివారం చండీగఢ్తో హైదరాబాద్ తలపడనుంది. చండీగఢ్ కూడా ఆడిన నాలుగు మ్యాచ్లలోనూ ఓడింది. -
సర్ఫరాజ్ సునామీ
జైపూర్: భారత ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ (75 బంతుల్లో 157; 9 ఫోర్లు, 14 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫలితంగా దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘సి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు 87 పరుగుల తేడాతో గోవాపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 444 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సర్ఫరాజ్ భారీ సెంచరీతో కదం తొక్కగా... ముషీర్ ఖాన్ (60; 5 ఫోర్లు, 2 సిక్స్లు), హార్దిక్ తమోర్ (53; 6 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. యశస్వి జైస్వాల్ (46; 6 ఫోర్లు), కెప్టెన్ శార్దుల్ ఠాకూర్ (27; 2 ఫోర్లు, 3 సిక్స్లు), షమ్స్ ములానీ (22; 2 సిక్స్లు), తనుశ్ కొటియాన్ (23 నాటౌట్; 3 ఫోర్లు) కూడా బ్యాట్లకు పనిచెప్పారు. ఫలితంగా ముంబై జట్టు భారీ స్కోరు చేయగలిగింది. మొత్తంగా ముంబై బ్యాటర్లు ఈ మ్యాచ్లో 35 ఫోర్లు, 25 సిక్స్లు బాదారు. గోవా బౌలర్లలో దర్శన్ 3 వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో తుదికంటా పోరాడిన గోవా 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ (24; 5 ఫోర్లు), కశ్యప్ (21; 4 ఫోర్లు), స్నేహల్ (27; 3 ఫోర్లు, 1 సిక్స్), సుయాశ్ ప్రభుదేశాయ్ (31; 2 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేయగా... అభినవ్ (70 బంతుల్లో 100; 5 ఫోర్లు, 8 సిక్స్లు) సెంచరీ బాదగా... కెప్టెన్ దీప్రాజ్ (28 బంతుల్లో 70; 4 ఫోర్లు, 7 సిక్స్లు), లలిత్ యాదవ్ (64; 3 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్సెంచరీలు బాదారు. ముంబై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 3, యశస్వి జైస్వాల్ రెండు వికెట్లు పడగొట్టారు. గ్రూప్ ‘సి’లో ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచిన ముంబై జట్టు 16 పాయింట్లతో పట్టిక అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఇదే గ్రూప్లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్ల్లో ఛత్తీస్గఢ్ 229 పరుగుల తేడాతో సిక్కింపై... పంజాబ్ 6 వికెట్ల తేడాతో హిమాచల్ ప్రదేశ్పై... మహారాష్ట్ర 129 పరుగుల తేడాతో ఉత్తరాఖండ్పై గెలుపొందాయి. రిషబ్ పంత్ విఫలం త్వరలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు జట్టును ప్రకటించనున్న నేపథ్యంలో... మెరుగైన ప్రదర్శన చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్శింస్తాడనుకున్న వికెట్ కీపర్ రిషబ్ పంత్ నిరాశ పరిచాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ జట్టుకు సారథ్యం వహిస్తున్న పంత్... కీలక పోరులో బ్యాటింగ్లో ఆకట్టుకోలేకపోయాడు. ఫలితంగా ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు 79 పరుగుల తేడాతో ఒడిశా చేతిలో ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఒడిశా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కెపె్టన్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బిప్లబ్ సమంత్రాయ్ (72; 3 ఫోర్లు, 4 సిక్స్లు), హాఫ్ సెంచరీ సాధించగా... తక్కినవాళ్లంతా తలాకొన్ని పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో హృతిక్ షోకీన్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ తడబడింది. 42.3 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. పంత్ (28 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ రాణా (2), ప్రియాన్‡్ష ఆర్య (5), సార్థక్ రంజన్ (1) విఫలమవడంతో ఢిల్లీకి పరాజయం తప్పలేదు.ఒడిశా బౌలర్లలో దేబబ్రత ప్రధాన్, సంబిత బరల్ చెరో 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడింట గెలిచి ఒక దాంట్లో ఓడిన ఢిల్లీ 12 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇదే గ్రూప్లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్ల్లో రైల్వేస్ 4 వికెట్ల తేడాతో గుజరాత్పై... హర్యానా 7 వికెట్ల తేడాతో సర్వీసెస్పై గెలుపొందాయి.మయాంక్, దేవదత్ సెంచరీలుటీమిండియా ప్లేయర్లు మయాంక్ అగర్వాల్ (124 బంతుల్లో 132; 15 ఫోర్లు, 2 సిక్స్లు), దేవదత్ పడిక్కల్ (116 బంతుల్లో 113; 10 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీలతో కదంంతొక్కారు. ఫలితంగా ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో కర్ణాటక 67 పరుగుల తేడాతో పాండిచ్చేరిపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 363 పరుగులు చేసింది. పడిక్కల్తో కలిసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మయాంక్ అగర్వాల్ తొలి వికెట్కు 228 పరుగులు జోడించగా... కరుణ్ నాయర్ (34 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్లు), అభినవ్ మనోహర్ (21 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు. అనంతరం ఛేదనలో పాండిచ్చేరి 50 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌటైంది. నెయాన్ శ్యామ్ (68; 9 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... జయంత్ యాదవ్ (54), అజయ్ (32), కెప్టెన్ అమన్ ఖాన్ (34), మరిముత్తు (31), సిడాక్ సింగ్ (27) తలా కొన్ని పరుగులు చేశారు. కర్ణాటక బౌలర్లలో మన్వంత్ కుమార్ 3 వికెట్లు పడగొట్టగా... కరుణ్ నాయర్, విద్వత్ కవెరప్పా చెరో 2 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచిన కర్ణాటక జట్టు 16 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇదే గ్రూప్లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్ల్లో జార్ఖండ్ 9 వికెట్ల తేడాతో తమిళనాడుపై... కేరళ 2 వికెట్ల తేడాతో రాజస్తాన్పై... మధ్యప్రదేశ్ 4 వికెట్ల తేడాతో త్రిపురపై విజయాలు సాధించాయి. నిప్పులు చెరిగిన ముకేశ్, ఆకాశ్, షమీభారత పేసర్లు మొహమ్మద్ షమీ (2/14), ముకేశ్ కుమార్ (4/16), ఆకాశ్దీప్ (4/32) సమష్టిగా సత్తా చాటారు. ఫలితంగా బెంగాల్ జట్టు విజయ్ హాజారే ట్రోఫీలో భారీ విజయం ఖాతాలో వేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో బెంగాల్ 9 వికెట్ల తేడాతో జమ్మూకశ్మీర్పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన జమ్మూకశ్మీర్ జట్టు 20.4 ఓవర్లలో 63 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ పారస్ డోగ్రా (19), శుభమ్ ఖజురియా (12) రెండంకెల స్కోరు చేయగా... మిగిలినవాళ్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. అంతర్జాతీయ స్థాయి బౌలర్ల ముందు జమ్మూ ప్లేయర్లు నిలవలేకపోయారు. షమీ వికెట్ల వేట ప్రారంభించగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ముకేశ్, ఆకాశ్ దాన్ని కొనసాగించారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో బెంగాల్ 9.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 64 పరుగులు చేసి గెలిచింది. గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడింట గెలిచిన బెంగాల్ 12 పాయింట్లతో పట్టిక మూడో స్థానంలో ఉంది. ఇదే గ్రూప్లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్ల్లో ఉత్తరప్రదేశ్ 58 పరుగుల తేడాతో అస్సాంపై... విదర్భ 8 వికెట్ల తేడాతో చండీగఢ్పై నెగ్గాయి. -
ప్రపంచకప్లు... ప్రతిష్టాత్మక ఈవెంట్లు...
జూనియర్, సీనియర్, మహిళల వరల్డ్ కప్లతో పరుగుల లెక్కలు... మెస్సీ, రొనాల్డోల మెరుపులను చివరిసారి చూసేందుకు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూపులు... భిన్న క్రీడాంశాల్లో సత్తా చాటి అందరి దృష్టినీ ఆటగాళ్లు తమ వైపు తిప్పుకునేే కామన్వెల్త్, ఆసియా క్రీడల రూపంలో రెండు నెలల వ్యవధిలో రెండు చాన్స్లు... ఇక స్వదేశంలో మన షట్లర్ల స్థాయిని ప్రదర్శించేందుకు 17 ఏళ్ల తర్వాత వచ్చిన బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్ నిర్వహణావకాశం... ఇలా 2026లో పలు ప్రతిష్టాత్మక ఈవెంట్లు క్రీడాభిమానులను అలరించనున్నాయి. జనవరి నుంచి అక్టోబర్ వరకు నిరంతరాయంగా పది నెలల పాటు ఫుల్ స్పోర్ట్స్ జోష్ కనిపించడం ఖాయం.కామన్వెల్త్ క్రీడలు23 జులై–2 ఆగస్టు(వేదిక: గ్లాస్గో, స్కాట్లండ్)అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత ఆటగాళ్లు సత్తా చాటేందుకు కామన్వెల్త్ క్రీడలు సరైన వేదికగా నిలుస్తున్నాయి. పెద్ద సంఖ్యలో మన వర్ధమాన ఆటగాళ్లు ఈ క్రీడల ద్వారా గుర్తింపు దక్కించుకుంటున్నారు. 2022 క్రీడల్లో భారత్ 22 స్వర్ణాలు సహా మొత్తం 61 పతకాలు గెలిచి నాలుగో స్థానంతో ముగించింది. అయితే ఆర్థికపరమైన, నిర్వహణాపరమైన ఇతర సమస్యల కారణంగా 2026 పోటీలను కేవలం 10 క్రీడాంశాలకే పరిమితం చేశారు. భారత ఆటగాళ్లు కచ్చితంగా పతకం గెలిచే అవకాశం ఉన్న హాకీ, బ్యాడ్మింటన్, టి20 క్రికెట్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్లను తప్పించడంతో ఈ సారి భారత్ పతకాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అన్నీ కలిపి 215 ఈవెంట్లలో దాదాపు 3 వేల మంది ఆటగాళ్లు పాల్గొనే అవకాశం ఉంది. 2014లోనే కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన గ్లాస్గో తక్కువ వ్యవధిలో మరోసారి ఈ పోటీలకు వేదిక కానుండటం విశేషం. గతంలో బ్రిటీష్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న 74 దేశాలు తలపడే ఈ పోటీలు ఎలిజబెత్ మహరాణి–2 మరణించిన తర్వాత జరుగుతున్న తొలి గేమ్స్ కానున్నాయి. టి20 వరల్డ్ కప్7 ఫిబ్రవరి–8 మార్చి(వేదిక: భారత్, శ్రీలంక)బౌండరీ వద్ద సూర్యకుమార్ యాదవ్ అత్యద్భుత క్యాచ్... రోహిత్ శర్మ మెస్సీ స్టయిల్లో ట్రోఫీని అందుకున్న క్షణాలు ఇంకా మనసునుంచి చెరిగిపోక ముందే మరో టి20 వరల్డ్ కప్ వచ్చేసింది. ఈ సారి డిఫెండింగ్ చాంపియన్గా, అదీ సొంతగడ్డపై బరిలోకి దిగుతుండటం ఇప్పటికే బలంగా ఉన్న భారత జట్టు బలాన్ని రెట్టింపు చేసింది. ఈ ఏడాది క్రికెట్ అభిమానులను ఎక్కువగా అలరించే అవకాశం ఉన్న టి20 వరల్డ్ కప్కు భారత్తో పాటు శ్రీలంక ఆతిథ్యం ఇస్తోంది. గతంలో తరహాలోనే 20 జట్లు టోర్నీలో బరిలోకి దిగుతున్నాయి. ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్కతాలతో పాటు ఫైనల్ జరిగే అహ్మదాబాద్ కూడా మన దేశంలో వేదికలుగా ఉన్నాయి. 2024 వరల్డ్ కప్తో పోలిస్తే రోహిత్, కోహ్లిలాంటి స్టార్లు ఈ టోర్నీలో కనిపించరు కానీ అభిõÙక్, తిలక్లాంటి యువ ఆటగాళ్లు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. తొలిసారి ఇటలీ జట్టు వరల్డ్ కప్ ఆడే అవకాశం దక్కించుకోవడం విశేషం. ఇప్పటి వరకు జరిగిన 9 టి20 వరల్డ్ కప్లలో భారత్, వెస్టిండీస్, ఇంగ్లండ్ రెండేసి సార్లు విజేతలుగా నిలవగా... పాకిస్తాన్, శ్రీలంక, ఆ్రస్టేలియా ఒక్కో టైటిల్ గెలిచాయి. మహిళల టి20 వరల్డ్ కప్12 జూన్–5 జులై(వేదిక: ఇంగ్లండ్)తొలిసారి వన్డే వరల్డ్ కప్ గెలిచి శిఖరాన నిలిచిన ఉత్సాహంలో ఉన్న భారత మహిళల జట్టు ఈ సారి టి20 వరల్డ్ కప్పై గురి పెట్టింది. 2020లో జరిగిన టోర్నీలో అత్యుత్తమంగా రన్నరప్గా నిలిచిన భారత జట్టు మిగతా 8 ప్రయత్నాల్లోనూ పేలవ ప్రదర్శనతో విఫలమైంది. అయితే ఇటీవల జట్టులో వచ్చిన మార్పులు, టి20 స్పెషలిస్ట్ల ప్రదర్శన మన టీమ్లో ఆశలు పెంచుతున్నాయి. దానికి తగినట్లుగా ఇప్పటినుంచి వరల్డ్ కప్ కోసం జట్టు సన్నాహకాలు కొనసాగుతున్నాయి. 2009లో తొలి టోర్నీని నిర్వహించిన తర్వాత ఇప్పుడు మరోసారి ఇంగ్లండ్ ఈ మెగా ఈవెంట్కు ఆతిథ్యం ఇస్తోంది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఫైనల్ నిర్వహిస్తారు. టి20 వరల్డ్ కప్లో ఆ్రస్టేలియా ఏకంగా 6 సార్లు విజేతగా నిలవగా...ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ ఒక్కో సారి ట్రోఫీని అందుకున్నాయి. న్యూజిలాండ్ డిఫెండింగ్ చాంపియన్. పురుషుల అండర్–19 వరల్డ్ కప్ 15 జనవరి–6 ఫిబ్రవరి(వేదిక: జింబాబ్వే, నమీబియా)యువ క్రికెటర్లు చెలరేగి భవిష్యత్తులో సీనియర్ జట్టుకు ప్రమోట్ అయ్యేందుకు అండర్–19 ప్రపంచ కప్ చక్కటి అవకాశం కల్పిస్తోంది. భారత జట్టులో అలాంటి యువ ఆటగాళ్లకు కొదవ లేదు. తమ ప్రతిభతో ఐపీఎల్లో ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మాత్రే, భారత జట్టుకు వరల్డ్ కప్ అందించేందుకు అండర్–19 స్థాయిలో బరిలోకి దిగుతున్నారు. కొత్త ఏడాదిలో అన్నింటికంటే ముందుగా క్రికెట్ అభిమానులకు అలరించే సిద్ధమైన ఈ కుర్రాళ్ల పోరులో మొత్తం 16 టీమ్లు బరిలోకి దిగుతున్నాయి. 2024లో టైటిల్ సాధించిన ఆ్రస్టేలియా డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతుండగా... ఫైనల్లో ఓడిన భారత్ రన్నరప్గా నిలిచింది. అయితే మొత్తం 15 సార్లు జరిగిన అండర్–19 వరల్డ్ కప్లో 5 సార్లు కప్ గెలుచుకొని భారత్ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.ఆసియా క్రీడలు19 సెప్టెంబర్–4 అక్టోబర్(వేదిక: నగోయా, జపాన్)కామన్వెల్త్ గేమ్స్ ముగిసిన రెండు నెలల లోపే మన భారత క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఆసియా గేమ్స్ రూపంలో మరో అవకాశం దక్కుతోంది. ముఖ్యంగా అథ్లెటిక్స్ విభాగంలో ఆసియా క్రీడల్లో సుదీర్ఘ కాలంగా భారత్ బలమైన ముద్ర వేసింది. కోవిడ్ కారణంగా ఏడాది కాలం వాయిదా పడటంతో 2022లో జరగాల్సిన గేమ్స్ను 2023లో నిర్వహించారు. ఇప్పుడు మళ్లీ నాలుగేళ్ల ఈవెంట్గా షెడ్యూల్ ప్రకారం 2026లో నిర్వహిస్తున్నారు. జపాన్లోని నగోయా నగరం ప్రధాన వేదిక కాగా, ఐచి రాష్ట్రంలోని ఇతర వేదికల్లో కూడా పోటీలు జరుగుతాయి. 41 క్రీడాంశాల్లో కలిపి 45 దేశాల నుంచి సుమారు 15 వేల మంది అథ్లెట్లు పాల్గొనే అవకాశం ఉంది. ఆసియా క్రీడలను జపాన్ నిర్వహించడం ఇది మూడో సారి. 2023 ఏషియాడ్లో 28 స్వర్ణాలు సహా 106 పతకాలు నెగ్గిన భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.‘ఫిఫా’ వరల్డ్ కప్ 12 జూన్–20 జులై(వేదిక: అమెరికా, కెనడా, మెక్సికో)ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ అభిమానులను అలరించేందుకు ఈ ఏడాది వరల్డ్ కప్ వచ్చేసింది. మూడు దేశాలు కలిసి టోర్నీని నిర్వహిస్తుండటం ఇదే మొదటిసారి కాగా, మొత్తం 16 వేదికల్లో మ్యాచ్లు జరుగుతాయి. ‘ఫిఫా’ వరల్డ్ కప్ చరిత్రలో 2022 వరకు 32 జట్లతోనే టోర్నమెంట్ను నిర్వహించగా... తొలిసారి 48 జట్లు బరిలోకి దిగుతుండటం ఈ సారి అన్నింటికంటే పెద్ద విశేషం. కేప్ వెర్డె, క్యురాకో, జోర్డాన్, ఉజ్బెకిస్తాన్ తొలిసారి ప్రపంచ కప్ ఆడనున్నాయి. అర్జెంటీనా డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతోంది. ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో దిగ్గజ స్థాయి ఆటగాళ్లుగా గుర్తింపు పొందిన లయోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో చివరి సారిగా వరల్డ్ కప్ బరిలోకి దిగి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. 2026 వరల్డ్ కప్ మ్యాచ్లను మైదానంలో చూసేందుకు దాదాపు 70 లక్షల టికెట్లు అందుబాటులో ఉండగా...తొలి 15 రోజుల్లోనే 15 కోట్లకు పైగా టికెట్ దరఖాస్తులు రావడం ఈ టోర్నీ స్థాయికి చూపిస్తోంది. ఎప్పటిలాగే భారత్ మాత్రం ప్రపంచకప్ టోర్నీలో కనిపించదు. ఆసియా నుంచి క్వాలిఫై అయ్యేందుకు 9 జట్లకు అవకాశం ఉండగా... అతి పేలవమైన ఆటతో భారత్ అర్హతకు సుదూరంగా ఉండిపోయింది. వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ఆగస్టు 17–23(వేదిక: న్యూఢిల్లీ)బ్యాడ్మింటన్లో గత కొన్నేళ్లుగా తమదైన ముద్ర వేసిన భారత్ రెండో సారి వరల్డ్ చాంపియన్షిప్కు ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రపంచ టాప్ షట్లర్లంతా పాల్గొనే ఈ మెగా ఈవెంట్ ఢిల్లీలో జరుగుతుంది. గతంలో భారత్లో ఒకే ఒకసారి వరల్డ్ చాంపియన్షిప్ (2009లో హైదరాబాద్లో) జరిగింది. వాస్తవానికి 2023లో భారత్ సుదిర్మన్ కప్ను నిర్వహించాల్సి ఉండగా... కోవిడ్ కారణంగా ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో పలు వేదికల్లో మార్పులు జరిగాయి. ఈ క్రమంలో భారత్కు వరల్డ్ చాంపియన్షిప్ అవకాశం దక్కింది. 2025లో పారిస్లో జరిగిన ఈ ఈవెంట్లో భారత్ తరఫున సాత్విక్–చిరాగ్ కాంస్యపతకం గెలుచుకున్నారు. స్వదేశంలో మన ఆటగాళ్లు ఈ సారి మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చే అవకాశం ఉంది. -
2026లో టీమిండియా ఆడబోయే మ్యాచ్లు ఇవే..!
2025 సంవత్సరం మరి కొద్ది గంటల్లో ముగియనున్న నేపథ్యంలో వచ్చే ఏడాది భారత పురుషుల క్రికెట్ జట్టు ఆడబోయే మ్యాచ్లపై ఓ లుక్కేద్దాం. 2026లో టీమిండియా చాలా బిజీగా గడపనుంది. స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్లు మొదలుకొని, స్వదేశంలోనే జరిగే టీ20 ప్రపంచకప్, ఆతర్వాత ఇంగ్లండ్ పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్లు.. ఆతర్వాత స్వదేశంలోనే ఆఫ్ఘనిస్తాన్తో పరిమిత ఓవర్ల సిరీస్.. ఆతర్వాత స్వదేశంలోనే వెస్టిండీస్తో వన్డే సిరీస్, దాని తర్వాత న్యూజిలాండ్ పర్యటన.. సంవత్సరాంతంలో స్వదేశంలోనే శ్రీలంకతో సిరీస్.. ఇలా, ఈ ఏడాదంతా టీమిండియా బిజీబిజీగా గడపనుంది.వచ్చే ఏడాది టీమిండియా షెడ్యూల్ ఇదే...జనవరి, 2026: న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఇండియా3 వన్డేలు, 5 టీ20లుఫిబ్రవరి, మార్చి: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్మార్చి నుంచి మే మధ్యలో ఐపీఎల్ 2026జూన్లో ఆఫ్ఘనిస్తాన్ టూర్ ఆఫ్ ఇండియా1 టెస్టు, 3 వన్డేలుజూలైలో టీమిండియా టూర్ ఆఫ్ ఇంగ్లండ్5 టీ20లు, 3 వన్డేలుఆగస్టులో టీమిండియా టూర్ ఆఫ్ శ్రీలంక2 టెస్టులుసెప్టెంబర్లో టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (తటస్థ వేదిక)3 టీ20లుసెప్టెంబర్, అక్టోబర్లో వెస్టిండీస్ టూర్ ఆఫ్ ఇండియా3 వన్డేలు, 5 టీ20లుసెప్టెంబర్ 19-అక్టోబర్ 4: ఆసియా క్రీడలు 2026అక్టోబర్-నవంబర్లో టీమిండియా టూర్ ఆఫ్ న్యూజిలాండ్2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లుడిసెంబర్లో శ్రీలంక టూర్ ఆఫ్ ఇండియా3 వన్డేలు, 3 టీ20లు* పైన తెలిపిన షెడ్యూల్లో ఇంకా కొన్నింటికీ పూర్తి ఆమోదం లభించలేదు. -
దుమ్మురేపిన కిల్లర్ మిల్లర్.. బోణీ కొట్టిన రాయల్స్
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో పార్ల్ రాయల్స్ బోణీ కొట్టింది. సన్రైజర్స్ ఈస్ట్రన్కేప్తో ఇవాళ (డిసెంబర్ 31) జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత రాయల్స్ బౌలర్లు చేలరేగిపోయారు. ఆతర్వాత కెప్టెన్ డేవిడ్ మిల్లర్ సుడిగాలి ఇన్నింగ్స్ (38 బంతుల్లో 71 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడి రాయల్స్ను గెలిపించాడు. ప్రస్తుత ఎడిషన్లో రాయల్స్కు ఇది విజయం కాగా.. ఈస్ట్రన్కేప్కు తొలి పరాజయం.పూర్తి వివరాల్లోకి వెళితే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్రన్కేప్కు రాయల్స్ బౌలర్లు చుక్కలు చూపించారు. మొకొయెనా (4-0-34-4), ఓట్నీల్ బార్ట్మన్ (4-0-36-3), ఫోర్టుయిన్ (4-0-16-0), ముజీబ్ రెహ్మాన్ (4-0-30-1), డెలానో పొట్గెటర్ (2-0-15-1) ధాటికి ఈస్ట్రన్కేప్ 149 పరుగులకే చాపచుట్టేసింది.ఈస్ట్రన్కేప్ ఇన్నింగ్స్లో జోర్డన్ హెర్మన్ (47) టాప్ స్కోరర్గా నిలువగా..బెయిర్స్టో (33) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. మిగతా బ్యాటర్లలో కెప్టెన్ స్టబ్స్, మార్కో జన్సెన్ తలో 17, బ్రీట్జ్కీ 13, డికాక్ 7, గ్రెగరి 5, ముత్తుసామి 2, నోర్జే 4, రత్నాయకే 1 (నాటౌట్) పరుగులు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో రాయల్స్ కూడా తడబడింది. మిల్నే (4-0-22-0), జన్సెన్ (4-0-25-2), నోర్జే (4-0-21-2) పొదుపుగా బౌలింగ్ చేశారు. అయితే డేవిడ్ మిల్లర్.. కీగన్ లయన్ (45) సాయంతో రాయల్స్ను విజయతీరాలకు చేర్చాడు. రాయల్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. రాయల్స్ ఇన్నింగ్స్లో ప్రిటోరియస్ (11), ట్రైబ్ (7), హెర్మన్ (9), వెర్రిన్ (3) విఫలమయ్యారు. -
చరిత్ర సృష్టించిన క్రిస్ లిన్
ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ క్రిస్ లిన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. బిగ్ బాష్ లీగ్లో 4000 పరుగుల మైలురాయిని తాకిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 2025-26 ఎడిషన్లో భాగంగా బ్రిస్బేన్ హీట్తో ఇవాళ (డిసెంబర్ 31) జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు (అడిలైడ్ స్ట్రైకర్స్కు ఆడుతూ).ఈ మ్యాచ్లో 41 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 79 పరుగులు చేసిన లిన్.. చారిత్రక మైలురాయిని తాకడంతో పాటు తన జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు. బిగ్ బాష్ లీగ్ కెరీర్లో 129 ఇన్నింగ్స్లు ఆడిన లిన్ 149.77 స్ట్రయిక్రేట్తో 32 అర్ద సెంచరీలు, సెంచరీ సాయంతో 4065 పరుగులు చేశాడు.మొత్తం టీ20 కెరీర్లో 300 మ్యాచ్లు ఆడిన లిన్.. 57 అర్ద శతకాలు, 6 శతకాల సాయంతో 8636 పరుగులు చేశాడు. పవర్ హిట్టర్గా పేరున్న లిన్ ఐపీఎల్లోనూ మెరుపులు మెరిపించాడు. 2012-21 మధ్యలో 42 మ్యాచ్లు ఆడి 140.6 స్ట్రయిక్రేట్తో 10 అర్ద సెంచరీల సాయంతో 1329 పరుగులు చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. లిన్ చెలరేగడంతో బ్రిస్బేన్ హీట్పై అడిలైడ్ స్ట్రయికర్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ చేసిన హీట్.. జేమీ ఓవర్టన్ (4-0-19-3), లియామ్ స్కాట్ (4-0-12-2), హసన్ అలీ (4-0-29-2), లూక్ వుడ్ (4-0-19-1), మాథ్యూ షార్ట్ (0.4-0-1-1) దెబ్బకు 19.4 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌటైంది. హీట్ ఇన్నింగ్స్లో తొమ్మిదో నంబర్ ఆటగాడు కుహ్నేమన్ (31 నాటౌట) టాప్ స్కోరర్గా నిలువగా.. మరో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అడిలైడ్ 14.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. క్రిస్ లిన్ (79 నాటౌట్) మెరుపు అర్ద శతకంతో అడిలైడ్ను ఒంటిచేత్తో గెలిపించాడు. -
జింబాబ్వే కెప్టెన్ ఇంట తీవ్ర విషాదం
జింబాబ్వే స్టార్ క్రికెటర్, ఆ దేశ టీ20 జట్టు కెప్టెన్ సికందర్ రజా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతని 13 ఏళ్ల చిన్న తమ్ముడు మహ్మద్ మహ్ది అరుదైన హీమోఫీలియా వ్యాధి బాధపడుతూ మృతి చెందాడు. హీమోఫీలియా కారణంగా మహ్ది శరీరంలో రక్తం గడ్డకట్టే సామర్థ్యం తగ్గిపోయింది. దీని వల్ల ఇటీవల ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. డిసెంబర్ 29 మహ్ది హరారేలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఆ మరుసటి రోజే (డిసెంబర్ 30) మహ్ది అంత్యక్రియలు హరారేలోని వారెన్ హిల్స్ స్మశానవాటికలో జరిగాయి. చిన్న వయసులోనే తమ్ముడిని కోల్పోవడంతో సికందర్ రజా బాధ వర్ణణాతీతంగా ఉంది. రజా కుటుంబానికి జింబాబ్వే క్రికెట్ బోర్డు సానుభూతి తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్ సమాజం నుంచి కూడా రజాకు సానుభూతి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. 39 ఏళ్ల సికందర్ రజా పాకిస్తాన్లోని సియాల్కోట్లో జన్మించి, ఆతర్వాత కుటుంబంతో సహా జింబాబ్వేకు వలస వచ్చాడు. కుటి చేతి వాటం స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన రజా.. తన ప్రతిభతో జింబాబ్వే క్రికెట్కు వన్నె తెచ్చాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో రజా ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి ఆల్రౌండర్లతో పోటీపడ్డాడు. జింబాబ్వే తరఫున తొలి టీ20 శతకం చేసిన బ్యాటర్గా రజా గుర్తింపు కలిగి ఉన్నాడు.2013 అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రజా, జింబాబ్వే తరఫున 21 టెస్ట్లు, 153 వన్డేలు, 109 టీ20లు ఆడాడు. ఇందులో 9 సెంచరీలు, 49 హాఫ్ సెంచరీల సాయంతో 8000 పైచిలుకు పరుగులు చేశాడు. అలాగే మూడు ఫార్మాట్లలో 215 వికెట్లు తీశాడు. పాకిస్తాన్లో జన్మించినప్పటికీ.. రజా 2023, 2024 ఐపీఎల్ సీజన్లలో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాడు. అప్పటికి పాక్ ఆటగాళ్లకు ఐపీఎల్లో ప్రవేశం లేదు. రజా ఇటీవలే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో నంబర్ వన్ ఆల్రౌండర్గా అవతరించాడు. -
సంవత్సరాంతంలోనూ ప్రపంచ రికార్డు నెలకొల్పిన విరాట్
టీమిండియా దిగ్గజ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి 2025వ సంవత్సరం చివరి రోజు కూడా ఓ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది చివరి రోజు విడుదలైన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో రెండు స్థానాలు మెరుగుపర్చుకొని, రెండో స్థానానికి ఎగబాకిన విరాట్.. చరిత్రలో అత్యధిక సార్లు (10) టాప్-2లో (ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో) సంవత్సరాన్ని ముగించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.నేటికి ముందు ఈ రికార్డును విరాట్ మరో దిగ్గజ బ్యాటర్, విండీస్ యోధుడు వివ్ రిచర్డ్స్ (9), సౌతాఫ్రికా లెజండరీ ఆల్రౌండర్ షాన్ పొల్లాక్తో (9) కలిసి షేర్ చేసుకున్నాడు. తాజాగా సింగిల్గా ఈ ప్రపంచ రికార్డును కబ్జా చేశాడు.ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో వరుసగా 2017, 2018, 2019, 2020 సంవత్సరాలను టాప్-1 బ్యాటర్గా ముగించిన విరాట్.. 2013, 2014, 2015, 2016, 2021, 2025 సంవత్సరాలను రెండో నంబర్ బ్యాటర్గా ముగించాడు. డిసెంబర్ నెలలో సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో రెండు శతకాలు, ఓ అర్ధశతకం సాయంతో 302 పరుగులు చేసిన విరాట్.. ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి ఎగబాకాడు. 2025ను నంబర్ వన్ బ్యాటర్గా ముగించిన ఆటగాడు మరో భారత దిగ్గజం రోహిత్ శర్మ కావడం మరో విశేషం. రోహిత్కు విరాట్కు రేటింగ్ పాయింట్ల పరంగా కేవలం 8 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. రోహిత్ ఖాతాలో 781 పాయింట్లు ఉండగా.. విరాట్ ఖాతాలో 773 పాయింట్లు ఉన్నాయి.ఈ ఏడాదే టెస్ట్లకు, అంతకుముందు ఏడాది టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విరాట్.. వన్డేల్లో ఈ ఏడాది అద్భుత ప్రదర్శనలు కనబర్చాడు. 13 మ్యాచ్ల్లో 3 శతకాల సాయంతో 651 పరుగులు చేశాడు. ఇందులో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్పై శతకం ప్రత్యేకంగా నిలిచిపోతుంది. -
‘ఆర్సీబీ’కి దెబ్బే.. ఆ ప్లేయర్కు ఎవరూ సాటిరారు!
వుమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి చిక్కులు తప్పవని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఎలిస్ పెర్రీ లేనిలోటును ఎవరూ భర్తీ చేయలేరని పేర్కొన్నాడు. కాగా డబ్ల్యూపీఎల్ తాజా సీజన్ ఆరంభానికి ముందే ఆర్సీబీ కీలక ప్లేయర్ సేవలు కోల్పోయింది. వ్యక్తిగత కారణాలతో ఈ ఎడిషన్ నుంచి పూర్తిగా తప్పుకొంటున్న ఆస్ట్రేలియా స్టార్ పెర్రీ ప్రకటించింది.అత్యధిక పరుగులుగత మూడు సీజన్లుగా తమతోనే కొనసాగుతున్న పెర్రీని ఆర్సీబీ.. ఈ ఏడాది రూ.2 కోట్లతో జట్టు అట్టి పెట్టుకుంది. గతేడాది (2024) జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆమె (972)...లీగ్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో రెండో స్థానంలో ఉంది. అయితే, తాజా ఎడిషన్కు ఆమె దూరం కావడంతో.. భారత యువ క్రీడాకారిణి సయాలీ సత్గరేను ఆర్సీబీ జట్టులోకి తీసుకుంది.ఇక గతంలో గుజరాత్ జెయింట్స్ తరఫున రెండు సీజన్లలో కలిపి 4 మ్యాచ్లు ఆడిన సయాలీ.. 20 పరుగులు చేయగలిగింది. తాజాగా పెర్రీ స్థానంలో.. కనీస ధర రూ.30 లక్షలకు సయాలీని ఈసారి ఆర్సీబీ ఎంచుకుంది. సదర్లాండ్ కూడామరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్, ఆస్ట్రేలియాకే చెందిన అనాబెల్ సదర్లాండ్ కూడా వ్యక్తిగత కారణాలతోనే లీగ్కు దూరమైంది. ఒక ఏడాది గుజరాత్ జట్టు తరఫున ఆడిన సదర్లాండ్ గత రెండు సీజన్లుగా ఢిల్లీతోనే ఉంది.ఈ ఏడాది రూ.2.20 కోట్లకు ఆమెను ఢిల్లీ కొనసాగించింది. సదర్లాండ్ స్థానంలో ఆసీస్ లెగ్స్పిన్నర్ అలానా కింగ్ను క్యాపిటల్స్ తీసుకుంది. కింగ్ గత ఏడాది యూపీ వారియర్స్ తరఫున ఒకే ఒక డబ్ల్యూపీఎల్ మ్యాచ్ ఆడింది. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఆ ప్లేయర్కు ఎవరూ సాటిరారు!‘‘ఈసారి ఎలిస్ పెర్రీ రావడం లేదు. అనాబెల్ సదర్లాండ్ కూడా ఈ సీజన్ ఆడటం లేదు. దీంతో ఆర్సీబీ, ఢిల్లీలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆర్సీబీ ఈసారి ఫేవరెట్గా ఉంది.కానీ ఎలిస్ పెర్రీ లేకపోవడం వారి గెలుపు అవకాశాలపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. పెర్రీ స్థానంలో ఆర్సీబీ సయాలీ సత్గరేను తీసుకువచ్చింది. వీరి స్కిల్ సెట్ ఒకటే కావొచ్చు.. కానీ సయాలీ.. పెర్రీ స్థానాన్ని భర్తీ చేయలేదు. నైపుణ్యాల పరంగా ఎలిస్ పెర్రీకి సయాలీ దరిదాపుల్లోకి కూడా రాలేదు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.అదే విధంగా.. అనాబెల్ స్థానంలో అలనా సరైన ప్లేయర్ కాదని ఈ మాజీ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు. అనాబెల్ మీడియం పేస్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్ చేయగలదన్న ఆకాశ్ చోప్రా.. అలనా మంచి స్పిన్నర్ మాత్రమే అని.. బ్యాటింగ్ పరంగా ఆమె పెద్దగా ఆకట్టుకోలేదని పేర్కొన్నాడు.తారా నోరిస్ దూరంఇదిలా ఉంటే.. యూపీ వారియర్స్ జట్టు సభ్యురాలు తారా నోరిస్ కూడా లీగ్కు దూరమైంది. టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్లో తన జట్టు అమెరికా తరఫున బరిలోకి దిగేందుకు నోరిస్ ఈ నిర్ణయం తీసుకుంది. నోరిస్ స్థానంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ చార్లీ నాట్ను వారియర్స్ జట్టులోకి ఎంచుకుంది. నాట్ గతంలో ఎప్పుడూ డబ్ల్యూపీఎల్ ఆడలేదు. చదవండి: బీసీసీఐ యూటర్న్!.. షమీకి గోల్డెన్ ఛాన్స్! -
విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన కృనాల్ పాండ్యా
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీకి గ్రేట్ న్యూస్ అందుతుంది. ఆ ఫ్రాంచైజీ స్టార్ ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో అరివీర భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. బ్యాట్తో పోలిస్తే బంతితో మెరుగ్గా రాణించే కృనాల్.. విజయ్ హజారే ట్రోఫీలో బ్యాట్తోనూ చెలరేగుతున్నాడు. ఈ టోర్నీలో వరుసగా బెంగాల్ (63 బంతుల్లో 57), ఉత్తర్ప్రదేశ్పై (77 బంతుల్లో 82) అర్ద సెంచరీలు చేసిన అతను.. ఇవాళ (డిసెంబర్ 31) హైదరాబాద్పై మరింత రెచ్చిపోయి విధ్వంసకర శతకం బాదాడు.కేవలం 63 బంతుల్లోనే 18 ఫోర్లు, సిక్సర్ సాయంతో అజేయమైన 109 పరుగులు చేశాడు. కృనాల్కు ఓపెనర్లు నిత్యా పాండ్యా (122), అమిత్ పాసి (127) సెంచరీలు కూడా తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కృనాల్ జట్టు బరోడా భారీ స్కోర్ (417-4) చేసింది. ఇదే బరోడా జట్టులో సభ్యుడైన టీమిండియా వికెట్కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ ఈ మ్యాచ్లో నిరాశపరిచాడు. 6 బంతులు ఎదుర్కొని ఖాతా కూడా తెరవలేకపోయాడు. నిత్యా, పాసి, కృనాల్ మెరుపు శతకాలతో కదంతొక్కడంతో హైదరాబాద్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కెప్టెన్ మిలింద్ 2, త్యాగరాజన్, వరుణ్ గౌడ్ తలో వికెట్ తీశారు. -
2026 టీ20 ప్రపంచకప్కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటన
వచ్చే ఏడాది (2026) ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యుల ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఇవాళ (డిసెంబర్ 31) ప్రకటించారు. ఈ జట్టును స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ముందుండి నడిపించనున్నాడు. స్టార్ ఆటగాళ్లు గుల్బదిన్ నైబ్, నవీన్ ఉల్ హక్ రీఎంట్రీ ఇచ్చారు. 20 ఏళ్ల వికెట్కీపర్ బ్యాటర్ మహ్మద్ ఇషాక్ కొత్తగా జట్టులోకి వచ్చాడు.తాజాగా జింబాబ్వే సిరీస్లో ఆడిన షరాఫుద్దీన్ అష్రఫ్, ఫరీద్ అహ్మద్ మాలిక్, బషీర్ అహ్మద్, ఇజాజ్ అహ్మద్, అహ్మద్జాయ్కు ఈ జట్టులో చోటు దక్కలేదు. మొత్తంగా ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన ఈ ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఛాంపియన్ జట్లకు సైతం వణుకు పుట్టిస్తుంది. ఈ జట్టులో రషీద్ ఖాన్ సహా చాలామంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. నూర్ అహ్మద్, సెదిఖుల్లా అటల్, ఫజల్ హక్ ఫారూఖీ, రహ్మానుల్లా గుర్బాజ్, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఇబ్రహీం జద్రాన్ లాంటి ప్లేయర్లు ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల సత్తా ఉన్న ఆటగాళ్లు. పైగా వీరికి భారత్, శ్రీలంకలో పరిస్థితులపై సరైన అవగాహన కూడా ఉంది. అందుకే ఈ ఆఫ్ఘనిస్తాన్ జట్టును చూసి భారత్ సహా మిగతా జట్లన్నీ అప్రమత్తం అవుతున్నాయి.2026 టీ20 ప్రపంచకప్కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు..రషీద్ ఖాన్ (కెప్టెన్), నూర్ అహ్మద్, అబ్దుల్లా అహ్మద్జాయ్, సదిఖుల్లా అటల్, ఫజల్ హక్ ఫారూకీ, రహ్మానుల్లా గుర్బాజ్, నవీన్-ఉల్-హక్, మహ్మద్ ఇషాక్, షాహిదుల్లా కమాల్, మహ్మద్ నబీ, గుల్బదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రహ్మాన్, దర్వీష్ రసూలీ, ఇబ్రహీం జద్రాన్రిజర్వ్ ఆటగాళ్లు: అల్లా ఘజన్ఫర్, ఇజాజ్ అహ్మద్జాయ్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ. ఇదిలా ఉంటే, ఈ ప్రపంచకప్లో ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్-డిలో పోటీపడనుంది. ఈ గ్రూప్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, యూఏఈ, కెనడా జట్లు కూడా ఉన్నాయి. ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 8న న్యూజిలాండ్తో చెన్నైలో ఆడనుంది. ప్రపంచకప్కు ముందు (జనవరి 19 నుంచి) ఇదే ఆఫ్ఘనిస్తాన్ జట్టు యూఏఈ వేదికగా వెస్టిండీస్తో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కూడా ఆడనుంది. -
వరుస శతకాలతో దూసుకుపోతున్న పడిక్కల్, రుతురాజ్
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో టీమిండియా యువ బ్యాటర్, కర్ణాటక స్టార్ ప్లేయర్ దేవ్దత్ పడిక్కల్ అరివీర భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. 4 మ్యాచ్ల్లో 3 శతకాలతో శతక మోత మోగించాడు. తాజాగా పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్లో 116 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేసిన అతను.. జార్ఖండ్ (118 బంతుల్లో 147; 10 ఫోర్లు, 7 సిక్సర్లు), కేరళపై (137 బంతుల్లో 124; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా శతకాలు బాదాడుతాజా శతకంతో లిస్ట్-ఏ క్రికెట్లో పడిక్కల్ శతకాల సంఖ్య 12కి చేరింది. పడిక్కల్ కేవలం 36 ఇన్నింగ్స్ల్లోనే 12 శతకాలు, 12 అర్ద శతకాలతో 80కిపైగా సగటుతో 2300 పైచిలుకు పరుగులు చేశాడు.పుదుచ్చేరితో మ్యాచ్లో పడిక్కల్తో పాటు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (124 బంతుల్లో 132; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా సెంచరీలతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 363 పరుగుల భారీ స్కోర్ చేసింది. కర్ణాటక ఇన్నింగ్స్లో పడిక్కల్, మయాంక్ సెంచరీలకు కరుణ్ నాయర్ (34 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీ కూడా తోడైంది.సూపర్ సెంచరీతో అదరగొట్టిన రుతురాజ్ఇవాళే (డిసెంబర్ 31) జరిగిన మరో మ్యాచ్లో మరో టీమిండియా యువ బ్యాటర్, మహారాష్ట్ర స్టార్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ (113 బంతుల్లో 124; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా అద్భుత శతకంతో కదంతొక్కాడు. ఉత్తరాఖండ్తో జరిగిన మ్యాచ్లో రుతురాజ్ ఈ శతకం బాదాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (50-3) రుతురాజ్ బ్యాట్ నుంచి ఈ క్లాసిక్ సెంచరీ వచ్చింది. రుతురాజ్ శతకం కారణంగా తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర భారీ స్కోర్ (331-7) చేసింది.ఈ సెంచరీతో రుతురాజ్ తన లిస్ట్-ఏ శతకాల సంఖ్యను 19కి పెంచుకున్నాడు. రుతురాజ్ ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలోనూ సెంచరీ చేశాడు. ఈ ఏడాది రుతురాజ్ ఫార్మాట్లకతీతంగా చెలరేగిపోతున్నాడు. బుచ్చిబాబు ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, రంజీ ట్రోఫీ, ఇండియా-ఏ, ఇండియా, తాజాగా విజయ్ హజారే ట్రోఫీ.. ఇలా ఆడిన ప్రతి ఫార్మాట్లోనూ సెంచరీలు చేసి, విరాట్ కోహ్లి తర్వాత టీమిండియా ఆశాకిరణంగా మారాడు. -
సూర్యతో రొమాంటిక్ రిలేషన్షిప్?.. మాట మార్చిన ‘బ్యూటీ’!
వరుస విజయాలతో జోరు మీదున్నాడు టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ద్వైపాక్షిక సిరీస్లలో విజయవంతమైన సారథిగా కొనసాగుతున్న ఈ ముంబైకర్.. తదుపరి సొంతగడ్డపై న్యూజిలాండ్తో సిరీస్తో బిజీ కానున్నాడు.టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకంగా సాగే ఈ సిరీస్లో బ్యాటర్గానూ సత్తా చాటి విమర్శలకు చెక్ పెట్టాలని సూర్యకుమార్ పట్టుదలగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ తన భార్య దేవిశా శెట్టితో కలిసి మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు.అదే సమయంలో సూర్య వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త వైరల్ అయింది. బాలీవుడ్, టీవీ నటి ఖుషి ముఖర్జీ.. సూర్యకుమార్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘చాలా మంది క్రికెటర్లు నా వెంట పడ్డారు. కానీ నాకు క్రికెటర్తో డేటింగ్ చేసే ఉద్దేశం లేదు.సూర్యకుమార్ యాదవ్ తరచూ మెసేజ్లు చేసేవాడు. అయితే, మా ఇద్దరి మధ్య ఎక్కువగా సంభాషణ జరుగలేదు. నా పేరు వేరొకరితో ముడిపడటం నాకు అస్సలు ఇష్టం ఉండదు’’ అని ఖుషి ముఖర్జీ పేర్కొంది. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో సూర్యపై కొంతమంది నెటిజన్లు ట్రోలింగ్కు దిగారు. భార్య దేవిశానే ప్రపంచంగా బతికినట్లు కనిపించే సూర్య ఇలాంటి వాడని అనుకోలేదంటూ కామెంట్లు చేశారు.తన వ్యాఖ్యలు వివాదానికి దారితీయడంతో ఖుషి ముఖర్జీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. తాజాగా ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. సూర్యకుమార్ యాదవ్తో తనకు ఎలాంటి రొమాంటిక్ రిలేషన్షిప్ లేదని స్పష్టం చేసింది. తన మాటల్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని.. తమకు నచ్చిన రీతిలో వాటిని వ్యాప్తి చేశారని పేర్కొంది. అంతేకాదు.. తన ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయ్యిందన్న ఖుషి.. సూర్యతో తాను ఓ ఫ్రెండ్గా మాట్లాడి ఉంటే తప్పేంటని ఎదురు ప్రశ్నించింది. గతంలో తమ మధ్య స్నేహ బంధం ఉండేదని.. అయితే ఇప్పుడు టచ్లో లేమని తెలిపింది. -
జైసూ జస్ట్ మిస్.. సర్ఫరాజ్ విధ్వంసకర, భారీ శతకం
టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. అనారోగ్యం నుంచి కోలుకున్న జైసూ.. సొంత జట్టు ముంబై తరఫున దేశీ క్రికెట్ బరిలో దిగాడు. విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నీ 2025-26లో భాగంగా గోవాతో మ్యాచ్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చాడు.జైపూర్ వేదికగా గోవాతో మ్యాచ్లో టాస్ ఓడిన ముంబై తొలుత బ్యాటింగ్కు దిగింది. ఈ క్రమంలో ఓపెనర్లలో అంగ్క్రిష్ రఘువన్షి (11) త్వరగానే పెవిలియన్ చేరగా.. వన్డౌన్ బ్యాటర్ ముషీర్ ఖాన్తో కలిసి యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) నిలకడగా ఆడాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్కు 70 పరుగులు జోడించారు.జైసూ జస్ట్ మిస్.. అయితే, అర్ధ శతకానికి నాలుగు పరుగుల దూరంలో ఉన్న వేళ.. జైసూ దర్శన్ మిసాల్ (Darshan Misal) బౌలింగ్లో స్నేహల్ కౌతంకర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. గోవాతో మ్యాచ్లో మొత్తంగా 64 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్.. ఆరు ఫోర్ల సాయంతో 46 పరుగులు చేశాడు. మరోవైపు.. ముషీర్ ఖాన్కు తోడైన.. అతడి అన్న, టీమిండియా ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ దుమ్ములేపాడు.సర్ఫరాజ్ విధ్వంసకర, భారీ శతకంతమ్ముడు ముషీర్ (60)తో కలిసి మూడో వికెట్కు 93 పరుగులు జోడించిన సర్ఫరాజ్ ఖాన్.. విధ్వంసకర శతకంతో చెలరేగాడు. కేవలం 56 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు.మొత్తంగా 75 బంతుల్లో 9 ఫోర్లు, 14 సిక్సర్లు బాదిన సర్ఫరాజ్ ఖాన్.. 157 పరుగులు చేసి దర్శన్ మిసాల్ బౌలింగ్లో వెనుదిరిగాడు. మిగిలిన వారిలో హార్దిక్ తామోర్ హాఫ్ సెంచరీ (28 బంతుల్లో 53)తో మెరవగా.. కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ (8 బంతుల్లో 27) మెరుపులు మెరిపించాడు.ముంబై భారీ స్కోరుఇక సిద్దేశ్ లాడ్ 17, షామ్స్ ములాని 22 పరుగులు చేయగా.. ఆఖర్లో తనుశ్ కొటియాన్ (12 బంతుల్లో 23), తుషార్ దేశ్పాండే (3 బంతుల్లో 7) ధనాధన్ దంచికొట్టి అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ముంబై ఎనిమిది వికెట్ల నష్టానికి 444 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. గోవా బౌలర్లలో దర్శన్ మిసాల్ మూడు వికెట్లు కూల్చగా.. వాసుకి కౌశిక్, లలిత్ యాదవ్ చెరో రెండు, దీప్రాజ్ గవోంకర్ ఒక వికెట్ కూల్చారు. చదవండి: బీసీసీఐ యూటర్న్!.. షమీకి గోల్డెన్ ఛాన్స్! -
ప్రాణాపాయ స్థితిలో ఆసీస్ బ్యాటింగ్ దిగ్గజం
ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ డామియన్ మార్టిన్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. మెనింజైటిస్ కారణంగా తీవ్ర అనార్యోగానికి గురైన అతడు ప్రస్తుతం క్వీన్స్లాండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న మార్టిన్కు వైద్యులు మత్తు మందు ఇచ్చి.. తాత్కాలికంగా కోమాలోకి వెళ్లేలా చేశారు.తాత్కాలికంగా కోమాలోకి పంపిమెనింజైటిస్ వల్ల మార్టిన్ మెదడు, ఇతర అవయవాలు పూర్తిగా చెడిపోకుండా ఉండేందుకు వైద్య ప్రక్రియలో భాగంగా డాక్టర్లు ఈ మేరకు చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోగిని తాత్కాలికంగా కోమాలోకి పంపడం ద్వారా కార్డియాక్ అరెస్ట్ వంటి విపత్కర పరిస్థితుల నుంచి తప్పించే అవకాశం ఉంటుంది.పదివేలకు పైగా పరుగులుకాగా 1992 నుంచి 2006 మధ్యకాలంలో డామియన్ మార్టిన్ ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. తన కెరీర్లో మొత్తంగా 67 టెస్టులు, 208 వన్డేలు, 4 టీ20లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో 4406, 5346, 120 పరుగులు సాధించాడు.ఇక ఇటీవల ఆసీస్- ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్లో భాగంగా బాక్సింగ్ డే టెస్టుకు ముందు మార్టిన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఆ తర్వాత కాసేపటికే అతడి ఆరోగ్య పరిస్థితిలో మార్పు రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మార్టిన్ ఐసీయూలో ఉన్నాడన్న వార్తతో క్రికెట్ ఆస్ట్రేలియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.త్వరగా తిరిగి రావాలిఆస్ట్రేలియా మాజీ కోచ్ డారెన్ లెహమాన్ స్పందిస్తూ.. ‘‘డామియన్ మార్టిన్.. ఓ యోధుడు. త్వరలోనే అతడు పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలి’’ అని ఆకాంక్షించాడు. మరోవైపు.. మార్టిన్ ప్రాణ స్నేహితుడు ఆడం గిల్క్రిస్ట్ న్యూస్ కార్ప్తో మాట్లాడుతూ.. ‘‘అతడికి అత్యుత్తమ చికిత్స అందిస్తున్నారు. అతడి కుటుంబానికి అందరమూ అండగా ఉందాము. అతడి ఆరోగ్యం కోసం ప్రార్థించండి’’ అని పిలుపునిచ్చాడు.కాగా మెదడు, వెన్నుపాము చుట్టూ ఉండే రక్షిత పొరలు మెనింజెస్లో వాపు వస్తే.. ఆ పరిస్థితిని మెనింజైటిస్ అంటారు. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఇందుకు ప్రధాన కారణం. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వికారం, మెడ బిగుసుకుపోవడం వంటివి దీని ప్రధాన లక్షణాలు. ఒక్కోసారి ఇది ప్రాణాంతకం కావొచ్చు కూడా!.. అందుకే లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. చదవండి: బీసీసీఐ యూటర్న్!.. షమీకి గోల్డెన్ ఛాన్స్! -
చెలరేగిన ‘టీమిండియా’ స్టార్లు.. 63 పరుగులకే ఆలౌట్!
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా జమ్మూ కశ్మీర్తో మ్యాచ్లో బెంగాల్ పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ప్రత్యర్థి జట్టును 63 పరుగులకే ఆలౌట్ చేశారు. దేశీ వన్డే టోర్నీ గ్రూప్-బిలో భాగంగా జమ్మూ కశ్మీర్తో బుధవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.శుభారంభం అందించిన షమీకెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ నమ్మకాన్ని నిలబెడుతూ బెంగాల్ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. జమ్మూ కశ్మీర్ టాపార్డర్లో ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ (0)ను డకౌట్ చేసి.. టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీ శుభారంభం అందించాడు.షమీకి తోడుగా టీమిండియా స్టార్లు ఆకాశ్ దీప్, ముకేశ్ కుమార్ నిప్పులు చెరుగుతూ జమ్మూ కశ్మీర్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. వన్డౌన్లో వచ్చిన మురుగన్ అశ్విన్ (0)ను ఆకాశ్ దీప్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా.. ఓపెనర్ శుభం ఖజూరియా (12)ను ముకేశ్ వెనక్కి పంపాడు.చెలరేగిన ముకేశ్, ఆకాశ్ఇక యావర్ హసన్ (1) రూపంలో షమీ తన రెండో వికెట్ తీయగా.. కెప్టెన్ పారస్ డోగ్రా (19) సహా అబ్దుల్ సమద్ (8), యుధ్వీర్ సింగ్ చరక్ (7) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు.. ముకేశ్ కుమార్.. రిధమ్ శర్మ (7), అబిద్ ముస్తాక్ (2), అకిబ్ నబీ దార్ (0)లను పెవిలియన్కు పంపాడు.మొత్తంగా షమీ రెండు వికెట్లు తీయగా.. ఆకాశ్ దీప్, ముకేశ్ కుమార్ చెరో నాలుగు వికెట్లతో చెలరేగి.. జమ్మూ కశ్మీర్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. ఫలితంగా 20.4 ఓవర్లలో కేవలం 63 పరుగులు చేసి జమ్మూ కశ్మీర్ ఆలౌట్ అయింది. కాగా బెంగాల్కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ, ముకేశ్ కుమార్ చాన్నాళ్లుగా టీమిండియాకు దూరం కాగా.. ఆకాశ్ దీప్ ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా జూలైలో చివరగా భారత జట్టుకు ఆడాడు. చదవండి: బీసీసీఐ యూటర్న్!.. షమీకి గోల్డెన్ ఛాన్స్! -
పీసీబీ కీలక నిర్ణయం.. మరోసారి..
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో మెరుగైన ఫలితాలు సాధించాలని ఆశిస్తున్న పాకిస్తాన్ జట్టు... కాంట్రాక్టు ముగియడానికి మూడు నెలల ముందే అజహర్ మహమూద్ను టెస్టు హెడ్ కోచ్ నుంచి తప్పించనున్నట్లు సమాచారం. గత రెండేళ్లుగా జాతీయ జట్టుకు వివిధ రూపాల్లో సేవలు అందిస్తున్న అజహర్ స్థానంలో కొత్త కోచ్ను నియమించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ప్రయత్నాలు ప్రారంభించింది.మరోసారి ‘హెడ్కోచ్’పై వేటుడబ్ల్యూటీసీ 2025–27లో భాగంగా రెండు మ్యాచ్లు ఆడిన పాకిస్తాన్ ఒక దాంట్లో గెలిచి మరో దాంట్లో ఓడి 50 పాయింట్ల శాతంతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. గతేడాది టెస్టు ఫార్మాట్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన అజహర్ (Azhar Mahmood) కాంట్రాక్టు వచ్చే ఏడాది మార్చి వరకు ఉంది. అయితే అంతకుముందే అతడిని తొలగించేందుకు సిద్ధమైంది.ప్రధాన కోచ్తో పాటు‘మార్చితో అజహర్ మహమూద్ కాంట్రాక్ట్ ముగియనుంది. ఆ తర్వాత పాకిస్తాన్ జట్టు టెస్టు సిరీస్లు ఆడనుంది. అయితే మ్యాచ్ల ఆరంభానికి ముందే కొత్త కోచ్ను నియమించేందుకు బోర్డు ప్రయత్నాలు చేస్తోంది’ అని ఓ అధికారి తెలిపారు. ప్రధాన కోచ్తో పాటు మొత్తం శిక్షణ బృందం కోసం పీసీబీ ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఏడాది పాకిస్తాన్ జట్టు... బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఇంగ్లండ్లో పర్యటించనుంది.జట్టు ఎంపిక విషయంలో పొరపొచ్చాలు రావడంతో ఆస్ట్రేలియా మాజీ పేసర్ జాసెన్ గిలెస్పీ గతేడాది టెస్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి అర్ధాంతరంగా తప్పుకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదట ఆఖిబ్ జావేద్, ఆ తర్వాత అజహర్ మహమూద్ ఆ బాధ్యతలు చేపట్టారు. మరోవైపు.. మహిళల జట్టు కోసం కూడా కొత్త కోచింగ్ సిబ్బంది కోసం పాకిస్తాన్ బోర్డు ప్రయత్నాలు ప్రారంభించింది.చదవండి: బీసీసీఐ యూటర్న్!.. షమీకి గోల్డెన్ ఛాన్స్! -
IND vs NZ: షమీకి గోల్డెన్ ఛాన్స్!
టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీకి మంచి రోజులు వచ్చాయా? త్వరలోనే అతడు భారత జట్టులో పునరాగమనం చేయనున్నాడా? అంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సన్నిహిత వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది.వాగ్యుద్ధంఆస్ట్రేలియా పర్యటనకు ముందు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar).. షమీ ఫిట్నెస్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడు పూర్తి ఫిట్గా లేడని.. అందుకే ఈ టూర్కు ఎంపిక చేయలేదని తెలిపాడు. ఇందుకు షమీ గట్టిగానే బదులిచ్చాడు. తనకు ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు లేవని.. రంజీల్లో ఆడుతున్న వాడిని వన్డేల్లో ఆడలేనా? అంటూ కౌంటర్ ఇచ్చాడు.ఇందుకు ప్రతిగా అగార్కర్.. మరోసారి తన మాటకు కట్టుబడే ఉన్నానంటూ.. షమీ పూర్తి ఫిట్గా లేడని పునరుద్ఘాటించాడు. అయితే, షమీ (Mohammed Shami) కూడా తగ్గేదేలే అన్నట్లు మాటలతో పాటు.. ఆటతోనూ సమాధానం ఇచ్చాడు. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియాలో అతడి రీఎంట్రీ కష్టమనే సంకేతాలు వచ్చాయి.అయితే, తాజాగా బీసీసీఐ (BCCI) వర్గాలు ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. షమీ గురించి సానుకూలంగా స్పందించాయి. వన్డే వరల్డ్కప్-2027 టోర్నమెంట్కు ఎక్కువ సమయం లేదు కాబట్టి.. షమీని తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నాయి.ఇంకా పోటీలోనే ఉన్నాడుఈ మేరకు.. ‘‘సెలక్షన్ సమయంలో మొహమ్మద్ షమీ గురించి తరచూ చర్చ నడుస్తుంది. అతడు ఇంకా పోటీలోనే ఉన్నాడు. అయితే, అతడి ఫిట్నెస్ గురించే బోర్డుకు ఆందోళనగా ఉంది. వికెట్లు తీయగల సత్తా ఉన్న బౌలర్ అతడు.కివీస్తో సిరీస్కు.. వరల్డ్కప్కూ ఎంపిక కావొచ్చు!అలాంటి ఆటగాడు సెలక్షన్ రాడార్లో లేకపోవడం అనే మాటే ఉండదు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ముందు అతడి ఆట మెరుగ్గా సాగుతోంది. ఒకవేళ ఈ సిరీస్కు అతడిని ఎంపిక చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.షమీ అనుభవజ్ఞుడైన బౌలర్. కీలక సమయాల్లో ఒత్తిడిని అధిగమించి వికెట్లు తీయగలడు. 2027 వరల్డ్కప్ జట్టుకూ అతడు ఎంపికయ్యే అవకాశం లేకపోలేదు’’ అని బీసీసీఐ వర్గాలు ఎన్డీటీవీతో పేర్కొన్నాయి. కాగా వన్డే వరల్డ్కప్-2023లో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన షమీ.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ సత్తా చాటాడు.మెరుగైన ప్రదర్శనఈ మెగా టోర్నీలో భారత్ విజేతగా నిలవడంలో షమీది కీలక పాత్ర. ఈ ఈవెంట్లో తొమ్మిది వికెట్లు తీసిన ఈ రైటార్మ్ పేసర్.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తితో కలిసి సంయుక్తంగా టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఆ తర్వాత బెంగాల్ తరఫున దేశీ క్రికెట్లో రంజీల్లో కేవలం నాలుగు మ్యాచ్లలోనే 20 వికెట్లు తీసి సత్తా చాటాడు.ప్రస్తుతం దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో బెంగాల్కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. మెరుగ్గా రాణిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. జనవరి 11 నుంచి టీమిండియా- న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ మొదలుకానుంది. జనవరి 11, 14, 18 తేదీల్లో ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు జరుగుతాయి.చదవండి: సెలక్టర్లు వద్దన్నా!... హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం -
భారత ఆల్రౌండర్ ప్రపంచ రికార్డు
శ్రీలంకతో టీ20 సిరీస్లో భారత మహిళా జట్టు పరిపూర్ణ విజయం సాధించింది. తిరువనంతపురం వేదికగా ఆఖరి టీ20లో పదిహేను పరుగుల తేడాతో నెగ్గి మరోసారి ఆధిపత్యం కనబరిచింది. సిరీస్ ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో రాణించి 5-0తో క్లీన్స్వీప్ చేసింది.గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా భారత ఆల్రౌండర్ దీప్తి శర్మ ప్రపంచ రికార్డు సాధించింది. శ్రీలంక బ్యాటర్ నీలాక్షిక సిల్వాను లెగ్ బిఫోర్ వికెట్గా వెనక్కి పంపిన ఈ రైటార్మ్ బ్రేక్ స్పిన్నర్.. అంతర్జాతీయ టీ20లలో 152వ వికెట్ను తన ఖాతాలో వేసుకుంది.𝗟𝗕𝗪 ☝️🎥 The moment Deepti Sharma became the most successful bowler in women's T20Is 😎Updates ▶️ https://t.co/E8eUdWSQXs#TeamIndia | #INDvSL | @Deepti_Sharma06 | @IDFCFIRSTBank pic.twitter.com/zelk7cRLiw— BCCI Women (@BCCIWomen) December 30, 2025 తద్వారా మహిళల ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా దీప్తి శర్మ నిలిచింది. ఇంతకు ముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్ మేగన్ షట్ (151) పేరిట ఉండేది.హర్మన్, అమన్, అరుంధతి మెరుపులుకాగా లంకతో ఐదో టీ20లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (5), జి.కమలిని (12).. వన్డౌన్లో వచ్చిన హర్లిన్ డియోల్ (13) తీవ్రంగా నిరాశపరిచారు.మిగతా వారిలో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ (5), దీప్తి శర్మ (7) విఫలమయ్యారు. ఇలాంటి క్లిష్ట దశలో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (43 బంతుల్లో 68) బాధ్యతాయుతంగా ఆడింది. ఆమెకు తోడుగా అమన్జోత్ కౌర్ (18 బంతుల్లో 21), అరుంధతి రెడ్డి (11 బంతుల్లో 27 నాటౌట్) రాణించారు.సమిష్టిగా రాణించిన భారత బౌలర్లుఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి భారత్ 175 పరుగులు స్కోరు చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనలో శ్రీలంక 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 160 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ హాసిని పెరీరా (65), వన్డౌన్ బ్యాటర్ ఇమేషా దులాని (50) అర్ధ శతకాలు వృథా అయ్యాయి.భారత బౌలర్లలో దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, స్నేహ్ రాణా, వైష్ణవి శర్మ, శ్రీచరణి, అమన్జోత్ కౌర్.. తలా ఒక వికెట్ తీసి సమిష్టిగా రాణించారు.నంబర్ వన్ ర్యాంకులోనే దీప్తి శర్మఅంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజా మహిళల టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. శ్రీలంకతో స్వదేశంలో జరుగుతున్న టీ20 సిరీస్లో సమష్టిగా చెలరేగడంతో భారత ప్లేయర్ల ర్యాంకింగ్లు మెరుగయ్యాయి. 738 రేటింగ్ పాయింట్లతో దీప్తి నంబర్వన్గా కొనసాగుతుండగా, భారత పేసర్ రేణుకా సింగ్ ఏకంగా ఎనిమిది స్థానాలు మెరుగుపర్చుకుంది.705 పాయింట్లతో రేణుక...ఎంలాబా (దక్షిణాఫ్రికా)తో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచింది. టీ20 ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో వెస్టిండీస్ క్రీడాకారిణి హేలీ మాథ్యూస్ (505 ర్యాంకింగ్ పాయింట్లు) తన టాప్ ర్యాంక్ను నిలబెట్టుకుంది. బ్యాటర్ల ర్యాంకింగ్స్లో షఫాలీ వర్మ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుంది. ఇప్పటి వరకు పదో స్థానంలో ఉన్న ఆమె 736 రేటింగ్ పాయింట్లతో ఆరో స్థానానికి చేరుకుంది. ఒక స్థానం కోల్పోయిన జెమీమా రోడ్రిగ్స్ పదో ర్యాంక్కు పరిమితం అయింది. చదవండి: సచిన్ ఆల్టైమ్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన కోహ్లి.. ఇంకో 25 పరుగులే!5⃣ matches5⃣ victories 👏#TeamIndia complete an emphatic series sweep with a 15-run win in Trivandrum 🥳Scorecard ▶️ https://t.co/E8eUdWSQXs#INDvSL | @IDFCFIRSTBank pic.twitter.com/tV5VlXq5GB— BCCI Women (@BCCIWomen) December 30, 2025 -
వేలానికి బ్రాడ్మన్ ‘బ్యాగీ గ్రీన్’
సిడ్నీ: క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్మన్కు చెందిన మరో ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్ అభిమానుల కోసం వేలానికి అందుబాటులోకి వచ్చింది. 1947–48 సీజన్లో ఆస్ట్రేలియా గడ్డపై భారత్తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్లో బ్రాడ్మన్ ఈ క్యాప్ ధరించాడు. ఈ సిరీస్లో 6 ఇన్నింగ్స్లలో కలిపి 178.75 సగటుతో బ్రాడ్మన్ 715 పరుగులు (ఇందులో ఒక డబుల్ సెంచరీ, 3 సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి) సాధించాడు. బ్రాడ్మన్ తన కెరీర్లో భారత్తో ఆడిన ఏకైక సిరీస్ ఇదే కాగా...స్వాతంత్య్రం లభించిన తర్వాత భారత క్రికెట్ జట్టు తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం.ఈతరంలో ఆ్రస్టేలియా క్రికెటర్లకు ఒక సారి అరంగేట్ర సమయంలో బ్యాగీ గ్రీన్ ఇస్తే కెరీర్ చివరి వరకు దానినే వాడటం ఆనవాయితీగా వస్తోంది. అయితే నాటి రోజుల్లో ప్రతీ సిరీస్కు ఆ్రస్టేలియా ఆటగాళ్లకు కొత్త బ్యాగీ గ్రీన్ క్యాప్ను అందించేవారు. అందు వల్లే బ్రాడ్మన్కు చెందిన పలు క్యాప్లు వేర్వేరు మ్యూజియంలలో ఉండగా, ఇతర క్యాప్లు, జ్ఞాపికలను పలువురు ప్రైవేట్ వ్యక్తులు వేలం ద్వారా సొంతం చేసుకున్నారు. 1947–48 సిరీస్లో భాగంగా బ్రిస్బేన్లో జరిగిన తొలి టెస్టులో భారత జట్టుకు శ్రీరంగ వాసుదేవ్ సొహొని ప్రాతినిధ్యం వహించాడు. సిరీస్ ముగిసిన అనంతరం వాసుదేవ్కు బ్రాడ్మన్ తన క్యాప్ను కానుకగా అందించాడు. గత 78 ఏళ్లుగా ఈ క్యాప్ వాసుదేవ్ కుటుంబం వద్దే ఉంది. ఇప్పుడు దీనిని ప్రముఖ ఆక్షనర్ లీ హేమ్స్ వేలం వేస్తున్నాడు. జనవరి 26 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి భారీ మొత్తం పలికే అవకాశం ఉంది. గత ఏడాది ఇదే సిరీస్లో బ్రాడ్మన్ ధరించిన మరో క్యాప్ను వేలం వేస్తే దానికి రూ.2.63 కోట్లు లభించాయి. -
భారత్ 5.. శ్రీలంక 0
ఫార్మాటే మారింది. కానీ జోరు ఏమాత్రం మారలేదు. తొలిసారి వన్డే ప్రపంచకప్ సాధించిన ఊపుమీదున్న భారత మహిళల జట్టు ఇదే ఉత్సాహంతో పొట్టి ఫార్మాట్లో శ్రీలంకను గట్టిదెబ్బ కొట్టింది. ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ను హర్మన్ప్రీత్ సారథ్యంలోని భారత్ 5–0తో వైట్వాష్ చేసింది. ఆడినవన్నీ ఓడిన చమరి ఆటపట్టు సేన నిరాశగా వెనుదిరుగుతోంది.తిరువనంతపురం: ఆఖరి పోరులోనూ భారత అమ్మాయిలే హోరెత్తించారు. ఫలితంగా ఐదు టి20ల సిరీస్ను 5–0తో హర్మన్ సేన చేజిక్కించుకుంది. మంగళవారం జరిగిన చివరి సమరంలో భారత్ 15 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (43 బంతుల్లో 68; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేసింది. హైదరాబాదీ ఆల్రౌండర్ అరుంధతి రెడ్డి (11 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) డెత్ ఓవర్లలో దంచేసింది. ప్రత్యర్థి బౌలర్లలో కవీశా దిల్హరి, రష్మిక, చమరి తలా 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక అమ్మాయిల జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 160 పరుగులు చేసి ఓడింది. హాసిని (42 బంతుల్లో 65; 8 ఫోర్లు, 1 సిక్స్), ఇమిషా దులాని (39 బంతుల్లో 50; 8 ఫోర్లు) రాణించారు. ఈ టోర్నీలో నిలకడగా రాణించి 241 పరుగులు చేసిన షఫాలీ వర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది.ఆదుకున్న హర్మన్ మొదట బ్యాటింగ్కు దిగగానే భారత్ దెబ్బమీద దెబ్బతో కుదేలైంది. షఫాలీ (5), తొలి మ్యాచ్ ఆడుతుతన్న కమలిని (12), హర్లీన్ డియోల్ (13), రిచా ఘోష్ (5), దీప్తిశర్మ (7) ఇలా ప్రధాన బ్యాటింగ్ బలగాన్ని కోల్పోయి 77/5 స్కోరు వద్ద కష్టాల్లో పడింది. ఈ దశలో హర్మన్ప్రీత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. అమన్జోత్ (21)తో కలిసి వికెట్ కాపాడుకుంటూనే పరుగుల వేగం పెంచింది. దీంతో 14.2 ఓవర్లో భారత్ స్కోరు 100కు చేరింది. హర్మన్ 35 బంతుల్లో ఫిఫ్టీని పూర్తిచేసుకుంది. సిక్స్, ఫోర్ కొట్టిన ఉత్సాహంలో ఉన్న అమన్ను రష్మిక అవుట్ చేయడంతో ఆరో వికెట్కు 61 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 4 పరుగుల వ్యవధిలో 142 స్కోరు వద్ద హర్మన్ ఏడో వికెట్గా వెనుదిరిగింది. హాసిని, ఇమిషా ఫిఫ్టీ–ఫిఫ్టీ లంక లక్ష్యఛేదన ఆరంభంలోనే చమరి (2) వికెట్ను కోల్పోయినప్పటికీ హాసిని, ఇమిషా రాణించడంతో 11 ఓవర్ల వరకు మరో వికెట్ను కోల్పోలేదు. 86/1 స్కోరు వద్ద శ్రీలంక గెలిచేలా కనిపించింది. కానీ అర్ధసెంచరీ పూర్తయిన వెంటనే ఇమిషా అవుటయ్యాక లంక తిరోగమించింది. నీలాక్షిక (3), కవీశా (5), హర్షిత (8), కౌశిని (1) విఫలమయ్యారు. దీంతో శ్రీలంక లక్ష్యానికి దూరమైంది. 89వ మ్యాచ్ ఆడుతున్న ఓపెనర్ హాసిని ఎట్టకేలకు ఒక ఫిఫ్టీని ఈ మ్యాచ్ ద్వారా సాధించగలిగింది. దీప్తి, అరుంధతీ, స్నేహ్, వైష్ణవి, శ్రీచరణి, అమన్జోత్లు తలా ఒక వికెట్ తీశారు. తమిళనాడుకు చెందిన గుణాలన్ కమలిని ఈ మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది. భారత్ తరఫున టి20 మ్యాచ్లు ఆడిన 90వ క్రీడాకారిణిగా కమలిని గుర్తింపు పొందింది. 17 ఏళ్ల కమలిని ఈ ఏడాది ఆరంభంలో అండర్–19 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యురాలిగా ఉంది. సీనియర్ మహిళల టి20 టోర్నీలో తమిళనాడు తరఫున టాప్స్కోరర్ (297 పరుగులు)గా నిలవడంతో ఆమెకు భారత జట్టులో అవకాశం లభించింది. చివరి టి20లో కమలిని, రేణుకా ఠాకూర్లను తుది జట్టులోకి తీసుకున్న టీమ్ మేనేజ్మెంట్...స్మృతి మంధానకు విశ్రాంతినిచ్చి స్నేహ్ రాణాను తప్పించింది.20వ ఓవర్లో 20హైదరాబాదీ క్రికెటర్ అరుంధతీ డెత్ ఓవర్లలో చేసిన పరుగులే మ్యాచ్ విజయంలో కీలకమయ్యాయి. హర్మన్ అవుటయ్యే సమయానికి జట్టు స్కోరు 150ని కూడా చేరుకోలేదు. ఈ దశలో స్నేహ్ రాణా అండతో అరుంధతి ఆఖర్లో చెలరేగింది. 19వ ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 155/7 కాగా... మదర వేసిన ఆఖరి ఓవర్లో అరుంధతి విరుచుకుపడింది. మొదటి 5 బంతులాడిన ఆమె వరుసగా 4, 1(వైడ్), 6, 4, 4, 1లతో 19 పరుగులు పిండుకుంది. చివరి బంతికి స్నేహ్ రాణా పరుగు చేయలేదు. వైడ్ సహా 20వ ఓవర్లో 20 పరుగులొచ్చాయి.152 భారత బౌలర్ దీప్తిశర్మ తీసిన వికెట్లు. అంతర్జాతీయ టి20లో అత్యధిక వికెట్లు (152) తీసిన బౌలర్గా రికార్డులకెక్కింది.స్కోరు వివరాలు భారత మహిళల ఇన్నింగ్స్: షఫాలీ (సి) ఇమిషా (బి) నిమషా 5; కమలిని (ఎల్బీడబ్ల్యూ) (బి) కవీశా 12; హర్లీన్ (బి) రష్మిక 13; హర్మన్ప్రీత్ (బి) కవీశా 68; రిచా ఘోష్ (సి) కౌశిని (బి) చమరి 5; దీప్తిశర్మ (సి) నిమషా (బి) చమరి 7; అమన్జోత్ (సి) కవీశా (బి) రష్మిక 21; అరుంధతీ (నాటౌట్) 27; స్నేహ్ రాణా (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–5, 2–27, 3–41, 4–64, 5–77, 6–138, 7–142. బౌలింగ్: మాల్కి మదర 4–0–37–0, నిమషా మీపగె 3–0–25–1, కవీశా దిల్హరి 2–0–11–2, ఇనొక 4–0–39–0, రష్మిక 4–0–42–2, చమరి 3–0–21–2. శ్రీలంక మహిళల ఇన్నింగ్స్: హాసిని (బి) శ్రీచరణి 65; చమరి (సి) వైష్ణవి (బి) అరుంధతీ 2; ఇమిషా (సి) షఫాలీ (బి) అమన్జోత్ 50; నీలాక్షిక (ఎల్బీడబ్ల్యూ) (బి) దీప్తి 3; కవీశా (బి) వైష్ణవి 5; హర్షిత (సి) హర్లీన్ (బి) స్నేహ్ రాణా 8; కౌశిని రనౌట్ 1; రష్మిక (నాటౌట్) 14; మదర (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–7, 2–86, 3–100, 4–107, 5–132, 6–140, 7–140. బౌలింగ్: దీప్తి శర్మ 4–0–28–1, అరుంధతీ 2–0–16–1, స్నేహ్ రాణా 4–0–31–1, వైష్ణవి 4–0–33–1, శ్రీచరణి 4–0–31–1, అమన్జోత్ 2–0–17–1. -
టీమిండియా క్లీన్స్వీప్
శ్రీలంకతో జరిగిన ఐదు మ్యాచ్ల సిరీస్ను టీమిండియా క్లీన్స్వీప్ చేసింది. చివరిదైన ఐదో టీ20లో గెలిచి టీమిండియా తన జైత్ర యత్రను కొనసాగించింది. ఐదో మ్యాచ్లో భారత మహిళల జట్టు 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 160 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. శ్రీలంక బ్యాటర్లలో హాసిని పెరీరా(65), ఇమేషా దులాని(50)లు రాణించినా జట్టుకు విజయం చేకూర్చలేకపోయారు. భారత మహిళా బౌలర్లలో దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, స్నేహ్ రానా, వైష్ణవి శర్మ, శ్రీచరణి, అమన్ జ్యోత్ కౌర్లు తలో వికెట్ తీసి విజయానికి సహకరించారు.ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరిగిన చివరి టీ20లో టీమిండియా ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ చేసింది. తిరువనంతపురం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగి, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మెరుపు అర్ద సెంచరీతో (43 బంతుల్లో 68; 9 ఫోర్లు, సిక్స్) చెలరేగగా.. ఆఖర్లో అమన్జోత్ కౌర్ (18 బంతుల్లో 21; ఫోర్, సిక్స్), అరుంధతి రెడ్డి (11 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) బ్యాట్ ఝులిపించారు.మిగతా బ్యాటర్లలో షఫాలీ వర్మ 5, అరంగేట్రం ప్లేయర్ కమలిని 12, హర్లీన్ డియోల్ 13, రిచా ఘోష్ 5, దీప్తి శర్మ 7, స్నేహ్ రాణా (8 నాటౌట్) పరుగులు చేశారు. లంక బౌలర్లలో కవిష దిల్హరి, రష్మిక సెవ్వండి, కెప్టెన్ ఆటపట్టు తలో 2 వికెట్లు తీయగా.. నిమిష మదుషని ఓ వికెట్ పడగొట్టింది. -
హర్మన్ప్రీత్ మెరుపులు.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే..?
ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న చివరి టీ20లో టీమిండియా ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ చేసింది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగి, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మెరుపు అర్ద సెంచరీతో (43 బంతుల్లో 68; 9 ఫోర్లు, సిక్స్) చెలరేగగా.. ఆఖర్లో అమన్జోత్ కౌర్ (18 బంతుల్లో 21; ఫోర్, సిక్స్), అరుంధతి రెడ్డి (11 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) బ్యాట్ ఝులిపించారు.మిగతా బ్యాటర్లలో షఫాలీ వర్మ 5, అరంగేట్రం ప్లేయర్ కమలిని 12, హర్లీన్ డియోల్ 13, రిచా ఘోష్ 5, దీప్తి శర్మ 7, స్నేహ్ రాణా (8 నాటౌట్) పరుగులు చేశారు. లంక బౌలర్లలో కవిష దిల్హరి, రష్మిక సెవ్వండి, కెప్టెన్ ఆటపట్టు తలో 2 వికెట్లు తీయగా.. నిమిష మదుషని ఓ వికెట్ పడగొట్టింది.కాగా, స్వదేశంలో భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు పూర్తి కాగా.. నాలుగింట టీమిండియానే గెలిచింది. తద్వారా 4-0తో ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకొని, క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేస్తుంది. -
శ్రీలంక క్రికెటర్ కన్నుమూత
శ్రీలంక మాజీ అండర్-19 క్రికెటర్ అక్షు ఫెర్నాండో కన్నుమూశాడు. 2018 డిసెంబర్లో జరిగిన రైల్వే ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆయన.. ఏడేళ్లు అపస్మారక స్థితిలో ఉండి ఇవాళ (డిసెంబర్ 30) ఉదయం తుదిశ్వాస విడిచాడు. కొలొంబోకు సమీపంలో గల మౌంట్ లవినియా బీచ్ వద్ద రక్షణలేని ట్రాక్ దాటుతుండగా ఆక్షుని రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. శరీరంలో చాలా చోట్ల ఫ్రాక్చర్లు కావడంతో లైఫ్ సపోర్ట్పై ఉంచారు. ప్రమాదం జరిగిన నాటికి అక్షు వయసు 27 ఏళ్లు. ప్రమాదానికి కొన్ని రోజుల ముందు అక్షు ఓ స్థానిక టోర్నీ ఆడాడు. అందులో రగామా క్రికెట్ క్లబ్కు ప్రాతినిథ్యం వహించాడు. అక్షు మరణం శ్రీలంక క్రికెట్ అభిమానులను తీవ్రంగా కలచివేసింది. బంగారు భవిష్యత్తు కలిగిన అక్షు దురదృష్టకర రీతిలో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడం యావత్ క్రికెట్ ప్రపంచాన్నే బాధిస్తుంది.అక్షు న్యూజిలాండ్లో జరిగిన 2010 అండర్-19 వరల్డ్కప్లో శ్రీలంక జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ టోర్నీలో కెనడాతో జరిగిన గ్రూప్ మ్యాచ్లో కీలక పరుగులు చేశాడు. అనంతరం దక్షిణాఫ్రికాపై క్వార్టర్ ఫైనల్లో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆతర్వాత ఆస్ట్రేలియాపై సెమీఫైనల్లో 52 పరుగులు (88 బంతుల్లో) చేశాడు. ఆ టోర్నీలో అక్షు వ్యక్తిగతంగా రాణించినా, శ్రీలంక నాలుగో స్థానంలో ముగించింది. -
శ్రీలంకతో చివరి టీ20.. టీమిండియా బ్యాటింగ్.. స్టార్ ప్లేయర్కు రెస్ట్
స్వదేశంలో భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు పూర్తి కాగా.. నాలుగింట టీమిండియానే గెలిచింది. తద్వారా 4-0తో ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకొని, క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేస్తుంది.ఈ క్రమంలో ఇవాళ (డిసెంబర్ 30) నామమాత్రపు ఐదో మ్యాచ్ జరుగనుంది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో రెండు మార్పులు చేశాయి. భారత్ తరఫున స్టార్ ప్లేయర్ స్మృతి మంధన, రేణుక సింగ్కు విశ్రాంతినిచ్చారు. వీరి స్థానాల్లో స్నేహ్ రాణా, కమిలిని జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్తోనే కమిలిని అరంగేట్రం చేస్తుంది.శ్రీలంక విషయానికొస్తే.. మల్షా శేషని, కావ్యా కవిండి స్థానాల్లో ఇనోకా రణవీరా, మల్కి మదారా తుది జట్టులోకి వచ్చారు.తుది జట్లు..శ్రీలంక: హాసిని పెరెరా, చమరి అతపత్తు(సి), హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, ఇమేషా దులానీ, నీలక్షికా సిల్వా, కౌషని న్యూత్యాంగన(w), ఇనోకా రణవీరా, మల్కి మదారా, రష్మిక సెవ్వంది, నిమేషా మదుషానిభారత్: షఫాలీ వర్మ, స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్, హర్మన్ప్రీత్ కౌర్(సి), రిచా ఘోష్(w), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, కమిలిని, శ్రీ చరణి -
న్యూ ఇయర్కి ముందు టీమిండియాకు ఊహించని షాక్..!
మరి కొద్ది గంటల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుండగా.. భారత క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. స్టార్ మిడిలార్డర్ బ్యాటర్, వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ రీఎంట్రీ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది. అక్టోబర్లో ఆస్ట్రేలియా సిరీస్ సందర్భంగా తీవ్రంగా గాయపడిన శ్రేయస్.. న్యూజిలాండ్ వన్డే సిరీస్తో రీఎంట్రీ ఇస్తాడని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే శ్రేయస్ కూడా ఫిట్నెస్ సాధించి, ప్రాక్టీస్ ముమ్మరం చేశాడు.ముందుగా జరిగిన ప్రచారం ప్రకారం ఇవాళ (డిసెంబర్ 30) శ్రేయస్కు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) నుంచి ఫిట్నెస్ క్లియెరెన్స్ లభించాల్సి ఉండింది. అయితే శ్రేయస్ అనూహ్యంగా 6 కిలోలు బరువు తగ్గినట్లు CoE వైద్య బృందం గుర్తించింది. దీని వల్ల శ్రేయస్కు బ్యాటింగ్ చేయడంలో ఎలాంటి సమస్య లేకపోయినా, మసిల్ మాస్ బాగా క్షీణించి, శక్తి స్థాయిలు తగ్గాయని వైద్యులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో శ్రేయస్కు రిటర్న్ టు ప్లే (RTP) సర్టిఫికేట్ ఇవ్వలేమని పరోక్షంగా చెప్పారు. దీంతో శ్రేయస్ రీఎంట్రీ మరో వారం వాయిదా పడనుంది.ఒకవేళ శ్రేయస్కు ఇవాళ RTP సర్టిఫికేట్ లభించి ఉంటే జనవరి 3, 6 తేదీల్లో ముంబై తరఫున విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లు ఆడేవాడు. తాజా పరిస్థితి ప్రకారం.. శ్రేయస్ న్యూజిలాండ్ సిరీస్కు కూడా దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈ సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. జట్టును 2 లేదా 3 తేదీల్లోగా ప్రకటించే అవకాశం ఉంది.ఆ సమయానికి శ్రేయస్కు ఫిట్నెస్ క్లియరెన్స్ లభించడం అసాధ్యంగా కనిపిస్తుంది. వన్డే జట్టులో కీలకమైన శ్రేయస్ విషయంలో CoE అధికారులు ఎలాంటి రిస్క్ తీసుకునే సాహసం చేయలేరు. ఒకవేళ శ్రేయస్ న్యూజిలాండ్ వన్డే సిరీస్ను మిస్ అయితే, విజయ్ హజారే ట్రోఫీలో నాకౌట్ మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది. -
నిజాన్ని మీరే బయటపెట్టాలి: రోహిత్, కోహ్లికి మాజీ క్రికెటర్ విజ్ఞప్తి
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వారం వ్యవధిలోనే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఏడాది మే నెలలో తొలుత రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడించగా.. కోహ్లి కూడా అదే బాటలో నడిచాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో వీరిద్దరు పరుగులు రాబట్టలేక ఇబ్బందిపడ్డారు.రోహిత్ మధ్యలో విరామం తీసుకుంటూ మ్యాచ్లు ఆడగా.. కోహ్లి పదే పదే ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతిని ఆడే క్రమంలో దాదాపుగా ఎనిమిది సార్లు వికెట్లు పారేసుకున్నాడు. ఈ నేపథ్యంలో రో- కో ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. రోహిత్ టెస్టులకు స్వస్తి పలికితే బాగుంటుందనే డిమాండ్లు పెరగగా.. మేటి టెస్టు బ్యాటర్ అయిన కోహ్లి తప్పులను సరిదిద్దుకుంటే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అనూహ్య రీతిలోఈ క్రమంలో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో భాగంగా తొలుత ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో టీమిండియాలో రో- కో ఆడతారని ముందుగా సంకేతాలు వచ్చాయి. అయితే, అనూహ్య రీతిలో వీరిద్దరు టెస్టులకు గుడ్బై చెప్పేశారు. రోహిత్ శర్మ స్థానంలో టెస్టు పగ్గాలు చేపట్టిన శుబ్మన్ గిల్.. బ్యాటింగ్ ఆర్డర్లో కీలకమైన కోహ్లి నాలుగో స్థానాన్నీ భర్తీ చేశాడు.ఒత్తిడి చేశారుఅయితే, రోహిత్- కోహ్లి ఆకస్మిక రిటైర్మెంట్లపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇదైతే సహజమైన రిటైర్మెంట్లా అనిపించలేదు. ఈ విషయంలో వాళ్లు మాత్రమే నిజమేంటో చెప్పగలరు. నాకైతే ఇదేదో బలవంతంగా చేయించినట్లు అనిపిస్తోంది.నిజాన్ని మీరే బయటపెట్టాలిరోహిత్ శర్మ ఆరు నెలల పాటు విరామం తీసుకుని.. ఫిట్నెస్ సాధించి తిరిగి వస్తే బాగుండేది. అదే జరిగితే తిరిగి అతడు ఫామ్ను అందుకునేవాడు. అతడిలో ఇంకా క్రికెట్ మిగిలే ఉంది. రోహిత్తో పాటు కోహ్లి కూడా కొన్నాళ్ల విరామం తర్వాత తిరిగి వస్తే బాగుండేది. ఏదేమైనా టెస్టు రిటైర్మెంట్ విషయమై వాళ్లు నోరు విప్పితేనే నిజం తెలుస్తుంది’’ అని రాబిన్ ఊతప్ప పేర్కొన్నాడు.ఇద్దరూ సిద్ధంఅదే విధంగా.. రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి ప్రస్తుత ఫామ్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘సౌతాఫ్రికాతో వన్డేల్లో ఇద్దరూ అదరగొట్టారు. రోహిత్ అద్భుతమైన హాఫ్ సెంచరీలు సాధిస్తే.. కోహ్లి వరుసగా రెండు శతకాలు బాదాడు. ఇద్దరూ ప్రపంచకప్ టోర్నీకి సిద్ధంగా ఉన్నారు.ఇటీవలే రోహిత్ను కలిశాను. అతడు ప్రస్తుతం రిలాక్సింగ్ మోడ్లో ఉన్నాడు. ఆట పట్ల సంతృప్తిగా ఉన్నాడు. రోహిత్- విరాట్ పరుగుల దాహం ఇంకా తీరలేదు. ఇప్పటికే ఇద్దరూ దిగ్గజాలుగా పేరు తెచ్చుకున్నారు. అయినా సరే ఇంకా ఇంకా ఆడాలనే పట్టుదల వారిని మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది’’ అని రాబిన్ ఊతప్ప చెప్పుకొచ్చాడు.చదవండి: సెలక్టర్లు వద్దన్నా!... హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం -
ఆర్సీబీకి భారీ షాకిచ్చిన ఆస్ట్రేలియా ఆల్రౌండర్
వచ్చే ఏడాది (2026) జనవరి 9 నుంచి ప్రారంభం కాబోయే మహిళల ఐపీఎల్ 2026కు ముందు 2024 ఎడిషన్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్, ఆస్ట్రేలియా ప్లేయర్ ఎల్లిస్ పెర్రీ వ్యక్తిగత కారణాల చేత సీజన్ మొత్తానికి దూరం కానుంది. పెర్రీ స్థానాన్ని ఆర్సీబీ యాజమాన్యం దేశీయ ఆల్రౌండర్ సయాలీ సత్ఘరేతో భర్తీ చేసింది.సత్ఘరే గతంలో గుజరాత్ జెయింట్స్ తరఫున ఆడింది. ఈ సీజన్ వేలంలో సత్ఘరేను (30 లక్షలు) ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. తాజాగా ఎల్లిస్ లీగ్ నుంచి తప్పుకోవడంతో సత్ఘరేను అదృష్టం వరించింది. ఎల్లిస్ వైదొలిగిన తర్వాత ఆర్సీబీలో నడినే డి క్లెర్క్ మాత్రమే నాణ్యమైన విదేశీ ఆల్రౌండర్గా ఉంది.ఎల్లిస్ ఆర్సీబీ 2024లో టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించింది. ఎల్లిస్కు డబ్ల్యూపీఎల్ మొత్తంలోనూ మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ లీగ్లో 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి బౌలర్ ఎల్లిసే. ఈ లీగ్లో ఇప్పటివరకు 25 మ్యాచ్లు ఆడిన ఈ వెటరన్ ఆల్రౌండర్.. 8 హాఫ్ సెంచరీల సాయంతో 972 పరుగులు చేసి, 8.25 ఎకానమీతో 14 వికెట్లు తీసింది.ఢిల్లీ క్యాపిటల్స్కు కూడా..!డబ్ల్యూపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్కు కూడా భారీ షాక్ తగిలింది. స్టార్ ఆల్రౌండర్, ఆసీస్ ప్లేయరే అయిన అన్నాబెల్ సదర్ల్యాండ్ కూడా వ్యక్తిగత కారణాల చేత సీజన్ మొత్తానికే దూరం కానుంది. సదర్ల్యాండ్ స్థానాన్ని డీసీ యాజమాన్యం అలానా కింగ్తో భర్తీ చేసింది. -
ఒమన్ వరల్డ్కప్ జట్టు కెప్టెన్గా భారత సంతతి ఆటగాడు
వచ్చే ఏడాది (2026) ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 వరల్డ్కప్ కోసం 15 మంది సభ్యుల ఒమన్ జట్టును ఇవాళ (డిసెంబర్ 30) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా భారత సంతతి ఆటగాడు జతిందర్ సింగ్ ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్ కూడా భారత సంతతి ఆటగాడే (వినాయక్ శుక్లా) కావడం మరో విశేషం. ఈ జట్టులో వీరే కాక మరో నలుగురు భారత సంతతి ఆటగాళ్లు కూడా ఉన్నారు. కరణ్ సోనావాలే, జయ్ ఒడేడ్రా, ఆశిష్ ఓడేడ్రా, జితేన్ రామనంది భారత్లో జన్మించిన వారే.ఈ జట్టుకు డిప్యూటీ కోచ్ కూడా భారతీయుడే. ముంబై మాజీ హెడ్ కోచ్గా పని చేసిన సులక్షన్ కులకర్ణి ప్రపంచకప్లో ఒమన్ డిప్యూటీ కోచ్గా వ్యవహరిస్తాడు. మొత్తంగా చూస్తే ప్రపంచకప్ బరిలోకి దిగబోయే ఒమన్ బృందం భారతీయులతో నిండుకొని ఉంది.2026 టీ20 వరల్డ్కప్ కోసం ఒమన్ జట్టు..జతిందర్ సింగ్ (c), వినాయక్ శుక్లా (vc), మహ్మద్ నదీమ్, షకీల్ అహ్మద్, హమ్మద్ మిర్జా, వసీమ్ అలీ, కరణ్ సోనావాలే, షా ఫైసల్, నదీమ్ ఖాన్, సుఫ్యాన్ మెహ్మూద్, జయ్ ఓడేడ్రా, షఫీక్ జాన్, ఆశిష్ ఓడేడ్రా, జితేన్ రమనంది, హస్నైన్ అలీ షా కాగా, ఒమన్ జట్టు ఆసియా క్వాలిఫయర్ టోర్నీలో రెండో స్థానంలో నిలవడం ద్వారా ప్రపంచకప్కు అర్హత సాధించింది. కరీబియన్ దీవులు, యూఎస్ఏ వేదికలుగా జరిగిన 2024 వరల్డ్కప్కు కూడా ఒమన్ క్వాలిఫై అయ్యింది. ఈసారి ప్రపంచకప్లో ఒమన్ గ్రూప్-బిలో ఉంది. ఈ గ్రూప్లో ఆస్ట్రేలియా, ఐర్లాండ్, శ్రీలంక, జింబాబ్వే జట్లు కూడా ఉన్నాయి. ఈ మెగా టోర్నీలో ఒమన్ ఫిబ్రవరి 9న తమ తొలి మ్యాచ్లో ఆడనుంది. కొలొంబో వేదికగా జరిగే ఆ మ్యాచ్లో జింబాబ్వేను ఢీకొట్టనుంది. పొట్టి ప్రపంచకప్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. -
హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం
టీమిండియా సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం తీసుకున్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదేశాల మేరకు మరోసారి దేశీ క్రికెట్ బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. ఆసియా టీ20 కప్-2025 సందర్భంగా గాయపడిన హార్దిక్ పాండ్యా.. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో కాంపిటేటివ్ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు.సొంతజట్టు బరోడా తరఫున దేశీ టీ20లు ఆడాడు హార్దిక్ పాండ్యా (Hardik Pandya). తాజాగా దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో అతడు భాగం కానున్నాడు. జనవరి 3, 8వ తేదీల్లో బరోడా.. విదర్భ, చండీగఢ్ జట్లతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్లలో హార్దిక్ పాండ్యా ఆడేందుకు నిర్ణయించుకున్నట్లు అతడి సన్నిహిత వర్గాలు IANSకు తెలిపాయి.అయితే, ఈ రెండు మ్యాచ్లకు మధ్య బరోడా.. జమ్మూ కశ్మీర్తో జనవరి 6న తలపడనుంది. ఈ మ్యాచ్కు మాత్రం హార్దిక్ పాండ్యా దూరంగా ఉండనున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల దృష్ట్యా ఈ మేరకు విశ్రాంతి తీసుకుంటూ.. తదుపరి మ్యాచ్లలో ఆడనున్నాడు.విశ్రాంతి తీసుకోమన్నా వినడే!టీమిండియా తదుపరి న్యూజిలాండ్తో స్వదేశంలో వన్డే సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. అయితే, మేనేజ్మెంట్ మాత్రం ఈ సిరీస్ నుంచి హార్దిక్కు విశ్రాంతినివ్వాలని భావిస్తోంది. కివీస్తో ఐదు టీ20లు సహా వరల్డ్కప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, పాండ్యా మ్యాచ్ ఫిట్నెస్ కోసం బరోడా తరఫున బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా హార్దిక్ పాండ్యా ఈ ఏడాది మార్చిలో చివరగా వన్డే మ్యాచ్ ఆడాడు.రో-కో ఆడేశారుకాగా బీసీసీఐ ఆదేశాల మేరకు ఇప్పటికే భారత బ్యాటింగ్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి.. తమ సొంత జట్లు ముంబై, ఢిల్లీ తరఫున రెండేసి విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లు ఆడారు. టీమిండియా యంగ్ స్టార్లు రిషభ్ పంత్ ఢిల్లీ కెప్టెన్, నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్ర సారథిగా ఈ టోర్నీలో భాగం కాగా.. అభిషేక్ శర్మ కూడా పంజాబ్ తరఫున బరిలోకి దిగాడు. ఇక శుబ్మన్ గిల్, అర్ష్దీప్ సింగ్ తదుపరి మ్యాచ్లలో పంజాబ్కు ఆడతారు. సంజూ శాంసన్ కేరళ తరఫున, రవీంద్ర జడేజా సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగనున్నారు.చదవండి: టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే? -
Virat Kohli: చరిత్రకు పాతిక పరుగుల దూరంలో..
భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇటీవల సొంతగడ్డపై సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో వరుస శతకాలు బాది.. యాభై ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక సెంచరీల వీరుడి (53)గా తన రికార్డును తానే సవరించుకున్నాడు.ఈ సిరీస్ తర్వాత దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 బరిలో దిగాడు కోహ్లి. సొంతజట్టు ఢిల్లీ తరఫున వన్డౌన్ బ్యాటర్గా వచ్చి ఆంధ్రతో మ్యాచ్లో శతక్కొట్టాడు. కేవలం 101 బంతుల్లోనే 131 పరుగులతో అలరించాడు.29 బంతుల్లోనే హాఫ్ సెంచరీఆ తర్వాత గుజరాత్తో మ్యాచ్లోనూ కోహ్లి అదరగొట్టాడు. కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మొత్తంగా 61 బంతుల్లో 77 పరుగులు చేసి అవుటయ్యాడు. బీసీసీఐ ఆదేశాల మేరకు ఢిల్లీ తరఫున దేశీ క్రికెట్లో రెండు మ్యాచ్లు పూర్తి చేసుకున్న కోహ్లి.. మరో మ్యాచ్ ఆడేందుకు కూడా సుముఖంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.స్వదేశంలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు సన్నాహకంగా జనవరి 6న రైల్వేస్తో జరిగే మ్యాచ్లో కోహ్లి ఆడే అవకాశం ఉంది. కాగా జనవరి 11 నుంచి భారత్- కివీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. కొటాంబి, ఖంధేరి, ఇండోర్ వేదికగా ఇరుజట్లు మూడు మ్యాచ్లు ఆడతాయి.సచిన్ ఆల్టైమ్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన కోహ్లిఈ సిరీస్ నేపథ్యంలో కోహ్లి.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న ఆల్టైమ్ ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. టీమిండియా తరఫున కోహ్లి ఇప్పటికి 123 టెస్టుల్లో 9230, 308 వన్డేల్లో 14557 పరుగులు, 125 టీ20లలో 4188 పరుగులు సాధించాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో 632 ఇన్నింగ్స్లో.. 27,975 పరుగులు పూర్తి చేసుకున్నాడు.ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి.. కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కివీస్తో తొలి వన్డే సందర్భంగా కోహ్లి గనుక పాతిక పరుగులు చేస్తే.. 28 వేల పరుగుల క్లబ్లో చేరతాడు.సచిన్ టెండుల్కర్ 644 ఇన్నింగ్స్లో ఈ మైలురాయిని తాకగా.. శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర 666 ఇన్నింగ్స్లో ఈ ఫీట్ను అందుకున్నాడు. కోహ్లి ఒకవేళ కివీస్తో తొలి వన్డేలోనే ఈ మైలురాయిని చేరుకుంటే.. అత్యంత వేగంగా అంతర్జాతీయ క్రికెట్లో 28 వేల పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్గా.. సచిన్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డు బద్దలుకొడతాడు. తొలి వన్డేలో మిస్ అయినా.. మిగిలిన రెండు వన్డేల్లో రాణించినా సరే.. కోహ్లి ఈ రికార్డును కొల్లగొట్టడం ఖాయం. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా కోహ్లి తొలి వన్డేలోనే ఈ ఘనత సాధించే అవకాశం ఉంది. చదవండి: టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే? -
సూర్యకుమార్ యాదవ్పై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై బాలీవుడ్ నటి ఖుషి ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో సూర్యకుమార్ యాదవ్ తనకు తరచూ మెసేజ్లు చేసేవాడని బాంబు పేల్చింది. ప్రస్తుతం తమ మధ్య ఎలాంటి సంభాషణ జరగడం లేదని తెలిపింది.ఓ ఈవెంట్ సందర్భంగా ఎవరైనా క్రికెటర్తో డేటింగ్ చేయాలనుకుంటున్నారా అని రిపోర్టర్ అడగగా ఖుషి ఇలా బదులిచ్చింది. "నేను ఎలాంటి క్రికెటర్తో డేట్ చేయాలనుకోవడం లేదు. చాలా మంది క్రికెటర్లు నన్ను ఫాలో అవుతున్నారు. గతంలో సూర్యకుమార్ యాదవ్ తురుచూ మెసేజ్లు చేసేవాడు. ఇప్పుడు మేము మాట్లాడుకోవడం లేదు. నాకు లింక్ అప్స్ అస్సలు నచ్చవు" అని స్పషం చేసింది. సూర్యకుమార్ యాదవ్ గురించి ఖుషి బయటపెట్టిన ఈ సంచలన విషయాలు ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారాయి. తరుచూ భార్యతో కలిసి దైవ దర్శనాలకు వెళ్లే సూర్యకుమార్ యాదవ్లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.ఇవాళే సూర్యకుమార్ యాదవ్ తన భార్య దేవీషా శెట్టితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారికి పూజలు చేశాడు. స్కై సతీసమేతంగా స్వామి వారిని దర్శించుకున్న ఫోటోలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుండగానే, ఖుషి వ్యాఖ్యలు బయటికి రావడం ఆసక్తికరంగా మారింది.కోల్కతాలో జన్మించిన ఖుషి ఎంటీవీలో ప్రసారమయ్యే Splitsvilla రియాలిటీ షో ద్వారా బాగా పాపులరైంది. మోడల్ కూడా అయిన ఖుషి బాలీవుడ్ సినిమాలతో పాటు పలు తెలుగు సినిమాల్లో కూడా నటించింది. నితిన్తో కలిసి హార్ట్ అటాక్.. ఆకాశ్తో కలిసి దొంగ ప్రేమ తదితర సినిమాల్లో లీడ్ రోల్లో యాక్ట్ చేసింది.సూర్యకుమార్ యాదవ్ విషయానికొస్తే.. అతని సారథ్యంలో భారత టీ20 జట్టు ఇటీవలే స్వదేశంలో దక్షిణాఫ్రికాపై 5 మ్యాచ్ల సిరీస్లో 3-1 తేడాతో విజయం సాధించింది. త్వరలో స్కై నేతృత్వంలోని టీమిండియా స్వదేశంలోనే న్యూజిలాండ్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. వచ్చే ఏడాది జరుగబోయే టీ20 ప్రపంచకప్లో భారత జట్టుకు సూర్యకుమారే సారథ్యం వహించనున్నాడు. ఇటీవలే న్యూజిలాండ్ సిరీస్, టీ20 వరల్డ్కప్ల కోసం టీమిండియాను ప్రకటించారు. పొట్టి ఫార్మాట్లో టీమిండియాను తిరుగులేని జట్టుగా నడిపిస్తున్న సూర్యకుమార్.. వ్యక్తిగతంగా ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాడు. -
Viral Video: మరోసారి సహనం కోల్పోయిన మాగ్నస్ కార్ల్సన్
ప్రపంచ నంబర్ 1, ఐదు సార్లు వరల్డ్ చెస్ ఛాంపియన్ అయిన మాగ్నస్ కార్ల్సన్ మరోసారి భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయాడు. వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్లో భారత గ్రాండ్మాస్టర్ అర్జున్ ఎరిగైసి చేతిలో ఓటమిని జీర్ణించుకోలేక, అన్ ప్రొఫెషనల్గా ప్రవర్తించాడు. నిరాశతో టేబుల్ను బలంగా కొట్టి తన అసహనాన్ని ప్రదర్శించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. Arjun Erigaisi wins and Magnus Carlsen slams the table 💥!https://t.co/9kA44nR1gV pic.twitter.com/fPeZmggftd— chess24 (@chess24com) December 29, 2025కార్ల్సన్కు ఇలా ప్రవర్తించడం కొత్తేమీ కాదు. ఇదే ఏడాది నార్వేలో జరిగిన ఓ టోర్నీలో కూడా భారత యువ గ్రాండ్మాస్టర్ గుకేశ్ చేతిలో ఓటమి తర్వాత ఇలానే టేబుల్ను బలంగా కొట్టాడు.ప్రస్తుత టోర్నీలోనే రష్యా గ్రాండ్మాస్టర్ ఆర్టెమియేవ్ చేతిలో ఓటమి తర్వాత కూడా కోపంతో ఊగిపోయి, కెమెరాను తోసేశాడు.కార్ల్సన్ తరుచూ ఇలా ప్రవర్తించడం ప్రస్తుతం చెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కార్ల్సన్పై చర్యలు తీసుకోవాలని అభిమానులు ప్రపంచ చెస్ ఫెడరేషన్ను డిమాండ్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే, కార్ల్సన్పై విజయంతో వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్లో ఎరిగైసి పాయింట్ల సంఖ్య 7.5కు చేరింది. తద్వారా ఎరిగైసి ఉజ్బెకిస్తాన్కి చెందిన నోడిర్బెక్ అబ్దుసత్తోరోవ్తో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు. -
శుభ్మన్ గిల్ వరల్డ్ రికార్డుకు చేరువలో మంధాన
భారత మహిళ క్రికెట్ జట్టు ఈ ఏడాది ఆఖరి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. మంగళవారం తిరువనంతపురం వేదికగా శ్రీలంక మహిళలతో ఐదో టీ20లో భారత్ తలపడనుంది. చివరి పోరులో కూడా గెలిచి సిరీస్ను 5-0 క్లీన్ స్వీప్ చేయాలని మన అమ్మాయిల జట్టు పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్కు ముందు భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, ఆల్ రౌండర్ దీప్తి శర్మలను అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి.గిల్ రికార్డుపై కన్ను..స్మృతి మంధాన మంధాన ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉంది. ఈ ఏడాదిలో మంధాన అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 1703 పరుగులు చేసింది. మహిళల క్రికెట్లో ఒక క్యాలెండర్ ఈయర్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా స్మృతి కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఐదో టీ20లో ఆమె మరో 62 పరుగులు చేస్తే.. ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్(మెన్స్ అండ్ ఉమెన్స్)లో ఒక ఏడాదిలో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్గా వరల్డ్ రికార్డు సృష్టించనుంది. ప్రస్తుతం ఈ రికార్డు టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ పేరిట ఉంది. గిల్ 2025 ఏడాదిలో మూడు ఫార్మాట్లు కలిపి 1764 పరుగులు చేశాడు. మరి ఈ మ్యాచ్లో గిల్ రికార్డు బ్రేక్ అవుతుందో లేదో వేచి చూడాలి. నాలుగో టీ20లో మాత్రం మంధాన విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. 48 బంతుల్లోనే 11 ఫోర్లు, 3 సిక్స్లతో 80 పరుగులు చేసింది.ఒకే ఒక వికెట్..మరోవైపు భారత స్పిన్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ టీ20ల్లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉంది. ఈ మ్యాచ్లో దీప్తీ ఒక్క వికెట్ సాధిస్తే టీ20ల్లో లీడింగ్ వికెట్ టేకర్గా నిలుస్తోంది. దీప్తి ప్రస్తుతం 151 వికెట్లతో ఆస్ట్రేలియా ప్లేయర్ మేగాన్ షుట్తో కలిసి జాయింట్ లీడింగ్ వికెట్ టేకర్గా ఉంది.మహిళల టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు1 - మేగాన్ షుట్: 122 ఇన్నింగ్స్లలో 151 వికెట్లు2 - దీప్తి శర్మ: 129 ఇన్నింగ్స్లలో 151 వికెట్లు3 - హెన్రియెట్ ఇషిమ్వే: 111 ఇన్నింగ్స్లలో 144 వికెట్లు4 - నిదా దార్: 152 ఇన్నింగ్స్లలో 144 వికెట్లు5 - సోఫీ ఎక్లెస్టోన్: 100 ఇన్నింగ్స్లలో 142 వికెట్లు -
‘నా భర్తపై వేరొకరి కన్ను.. అందుకే నాకు విడాకులు’
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమాద్ వసీం విడాకులు తీసుకున్నాడు. భార్య సానియా అష్ఫక్తో వైవాహిక బంధం నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని ఇమాద్ వసీం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ నేపథ్యంలో సానియా అష్ఫక్ సంచలన ఆరోపణలతో ముందుకు వచ్చింది.నా ముగ్గురు పిల్లలకు తల్లి మాత్రమే ఉందితన భర్తను వేరొకరు పెళ్లి చేసుకోవాలనుకున్నారని.. అందుకే తమకు విడాకులు అయ్యాయని సానియా ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘తీవ్ర దుఃఖంలో మునిగిపోయి నేను ఈ నోట్ రాస్తున్నాను. నా కాపురం కూలిపోయింది. నా పిల్లలు తండ్రి లేనివాళ్లు అయ్యారు. వాళ్ల నాన్న వారిని విడిచిపెట్టాడు. నా ముగ్గురు పిల్లలకు ఇప్పుడు తల్లి మాత్రమే ఉంది.ఐదు నెలల పసిబిడ్డ.. ఇంత వరకు తండ్రి ఆ పసికందును ఎత్తుకోనేలేదు. ఈ విషయాలన్నీ పంచుకోకూడదు అనే అనుకున్నాను. అయితే, నేను నిశ్శబ్దంగా ఉంటే.. దానిని నా బలహీనత అనుకుంటున్నారు.ప్రతీ ఇంట్లో మాదిరే భార్యాభర్తలుగా మా మధ్య కొన్ని విభేదాలు ఉన్న మాట వాస్తవం. అయినప్పటికీ బంధాన్ని నిలబెట్టుకోవాలని నేను భావించాను. భార్యగా, తల్లిగా నా వంతు పాత్రను చక్కగా పోషించాను. నా కాపురాన్ని నిలబెట్టుకునేందుకు వంద శాతం ప్రయత్నించాను.నా భర్తను వేరొకరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారుకానీ మూడో వ్యక్తి రాకతో నా ఇల్లు ముక్కలైంది. ఆమె నా భర్తను పెళ్లి చేసుకోవాలని భావించింది. అందుకే.. అంతంత మాత్రంగా ఉన్న మా బంధం విచ్ఛిన్నమై విడాకులకు దారితీసింది’’ అని సానియా అష్ఫక్ సోషల్ మీడియా వేదికగా తన బాధను పంచుకుంది.చట్టపరంగా చర్యలు తీసుకుంటాఇందుకు బదులుగా.. ‘‘ప్రతీసారి ఘర్షణ పడేకంటే కూడా విడాకులు తీసుకోవడమే ఉత్తమమని భావించి.. డివోర్స్ కోసం అప్లై చేశాను. ఇక నా పిల్లలు.. నేను ఎప్పటికీ తండ్రినే. వారి బాధ్యత మొత్తం నాదే. ఇలాంటి సమయంలో నా గౌరవం, గోప్యతకు భంగం కలగకుండా సహకరిస్తారని ఆశిస్తున్నా.కొంతమంది తప్పుడు ప్రచారం చేసే పనిలో ఉన్నారు. దయచేసి వారిని నమ్మకండి. నా పరువు, ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎవరైనా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాను’’ అని ఇమాద్ వసీం పేర్కొన్నాడు. కాగా 37 ఏళ్ల ఇమాద్ వసీం బౌలింగ్ ఆల్రౌండర్.పాకిస్తాన్ తరఫున 55 వన్డేలు, 75 టీ20 మ్యాచ్లు ఆడిన ఇమాద్ వసీం.. వన్డేల్లో 986, టీ20లలో 554 పరుగులు చేశాడు. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఖాతాలో వన్డేల్లో 44, టీ20లలో 73 వికెట్లు ఉన్నాయి. ఇక 2023లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఇమాద్ వసీం.. ప్రస్తుతం ఫ్రాంఛైజీ క్రికెట్లో కొనసాగుతున్నాడు.చదవండి: అలా ప్రేమ పుట్టింది.. ఆస్తి భర్త కంటే వంద రెట్లు ఎక్కువే!.. అయితేనేం.. -
టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
భారత్, శ్రీలంక వేదికలగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2026 కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్గా హ్యారీ బ్రూక్ వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో యువ పేసర్ జోష్ టంగ్కు చోటు దక్కింది. టంగ్ ఇప్పటివరకు ఇంగ్లండ్ తరపున ఒక్క వైట్బాల్ మ్యాచ్ కూడా ఆడలేదు.యాషెస్ సిరీస్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో టంగ్ను వైట్బాల్ జట్టులోకి తీసుకున్నారు. అదేవిధంగా గాయం కారణంగా యాషెస్ సిరీస్ మధ్యలోనే వైదొలిగిన స్పీడ్ స్టార్ జోఫ్రా ఆర్చర్ను కూడా వరల్డ్కప్ జట్టుకు సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే ఈ మెగా టోర్నీకి ఆర్చర్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు.ఈ జట్టులో జోస్ బట్లర్, సామ్ కుర్రాన్, ఫిల్ సాల్ట్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. అయితే విధ్వంసకర ఆల్రౌండర్ లియమ్ లివింగ్స్టోన్ను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ఆల్రౌండర్లగా కుర్రాన్, డాసన్, విల్ జాక్స్కు అవకాశం దక్కింది. ఇక ఈ పొట్టి ప్రపంచకప్నకు ముందు ఇంగ్లండ్.. శ్రీలంకతో మూడు మ్యాచ్లు టీ20, వన్డే సిరీస్లలో తలపడనుంది.ఈ వైట్బాల్ సిరీస్లకు కూడా ఇంగ్లండ్ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. వరల్డ్కప్ టోర్నీకి ఎంపిక చేసిన జట్టునే దాదాపుగా లంకతో టీ20లకూ కొనసాగించారు. ఆర్చర్ ఒక్కడే అందుబాటులో లేడు. అయితే వన్డే జట్టులో మాత్రం మార్పులు చోటు చేసుకున్నాయి. బెన్ డకెట్, జో రూట్, జాక్ క్రాలీ వంటి సీనియర్ ప్లేయర్లు జట్టులోకి వచ్చారు. జనవరి 22 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఇక ఫిబ్రవరి 7 నుంచి వరల్డ్కప్ షూరూ కానుంది.ఇంగ్లండ్ టీ20 ప్రపంచ కప్ జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, బ్రైడాన్ కార్స్, సామ్ కుర్రాన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్.శ్రీలంకతో టీ20లకు ఇంగ్లండ్ జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, బ్రిడన్ కార్స్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, సామ్ కరన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్.శ్రీలంకతో వన్డేలకు ఇంగ్లండ్ జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, బ్రిడన్ కార్స్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, జాక్ క్రాలీ, సామ్ కరన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, జో రూట్, ల్యూక్ వుడ్. -
పంత్ కాదు!.. వన్డే వరల్డ్కప్ జట్టులోనూ అతడే!
వన్డేల్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్గా కేఎల్ రాహుల్ కొనసాగుతున్నాడు. తాత్కాలిక సారథిగానూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇటీవల స్వదేశంలో భారత జట్టు కెప్టెన్ హోదాలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ను 2-1తో కేఎల్ రాహుల్ గెలిచాడు.పంత్ స్థానానికి ఎసరు!ఈ సిరీస్లో రాహుల్కు బ్యాకప్ వికెట్ కీపర్గా రిషభ్ పంత్ (Rishabh Pant)ను ఎంపిక చేసిన యాజమాన్యం.. అతడిని ఒక్క మ్యాచ్లోనూ ఆడించలేదు. ఈ నేపథ్యంలో.. గత కొన్నిరోజులుగా భారత దేశీ క్రికెట్లోని అద్భుత ప్రదర్శనల కారణంగా బ్యాకప్గానూ వన్డేల్లో పంత్ స్థానం గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడింది.ప్రపంచకప్-2026 టోర్నీ ఆడే జట్టులో చోటుదేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో సత్తా చాటిన జార్ఖండ్ డైనమైట్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) రేసులోకి దూసుకువచ్చాడు. ఈ సీజన్లో 500కు పైగా పరుగులతో సత్తా చాటి.. కెప్టెన్గా జార్ఖండ్కు తొలి టైటిల్ అందించి టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. విధ్వంసకర ఆట తీరుతో ఇటు ఓపెనర్గా, అటు వికెట్ కీపర్గా రాణించగల ఇషాన్ను ఏకంగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి సెలక్టర్లు ఎంపిక చేశారు.సంజూ శాంసన్ (Sanju Samson)కు బ్యాకప్గా ఇషాన్కు వరల్డ్కప్ జట్టులో చోటిచ్చారు. ఇదిలా ఉంటే.. దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ ఇషాన్ కిషన్ సత్తా చాటుతున్నాడు. కర్ణాటకతో మ్యాచ్లో 39 బంతుల్లోనే 125 పరుగులు చేసిన ఈ ఎడమచేతివాటం బ్యాటర్.. ఆరో స్థానంలో వచ్చి ఈ మేరకు చెలరేగడం విశేషం.వన్డే వరల్డ్కప్ జట్టులోనూ అతడే ఉండే ఛాన్స్!ఇప్పటికి టీమిండియా తరఫున 27 వన్డేలు ఆడిన ఇషాన్ కిషన్.. 42.40 సగటుతో ఏకంగా 933 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో ఓ వన్డే డబుల్ సెంచరీ కూడా ఉంది. చివరగా 2023 వరల్డ్కప్ టోర్నీలో భాగంగా ఈ జార్ఖండ్ ప్లేయర్ వన్డేల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డ కారణంగా 2023లో ఆఖరిగా టీమిండియాకు ఆడిన ఇషాన్ కిషన్.. దాదాపు రెండేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు. టీ20లలో ఆడే అవకాశం వచ్చి తనను తాను నిరూపించుకోవడం సహా.. వన్డేల్లోనూ ఫామ్ను కొనసాగిస్తే ప్రపంచకప్-2027 జట్టులోనూ అతడికి స్థానం దక్కే అవకాశం ఉంది.ఎడమచేతి వాటం బ్యాటర్ కావడం వల్ల లెఫ్ట్-రైట్ కాంబినేషన్ ఓపెనింగ్ జోడీ కోసం బ్యాకప్గా ఇషాన్ ఉపయోగపడతాడు. అంతేకాదు మిడిలార్డర్లోనూ రాణించగల సత్తా అతడికి ఉంది. ఇక వికెట్ కీపర్గానూ సేవలు అందించగలడు. కాబట్టి ప్రస్తుత ఫామ్ దృష్ట్యా టీమిండియా వన్డే బ్యాకప్ వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్ సరైన ఆప్షన్ అని చెప్పవచ్చు.రేసులోకి ధ్రువ్ జురెల్మరోవైపు.. ధ్రువ్ జురెల్ సైతం రేసులోకి వచ్చాడు. దేశీ క్రికెట్లో అతడు రెడ్హాట్ ఫామ్లో ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీ తాజా సీజన్లో ఈ ఉత్తరప్రదేశ్ స్టార్ ఇప్పటికి మూడు మ్యాచ్లలో కలిపి ఏకంగా 307 పరుగులు సాధించాడు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ వచ్చి చితక్కొట్టగలనని నిరూపించాడు.ఇప్పటికే భారత టెస్టు జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకుంటున్న ధ్రువ్ జురెల్.. లిస్ట్-ఎ క్రికెట్లోనూ సత్తా చాటుతున్నాడు. తద్వారా వన్డే జట్టులోకి వచ్చేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నాడు. భారత్- ఎ టూర్లలో వన్డే బ్యాకప్ వికెట్ కీపర్గా అతడిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ తర్వాత ధ్రువ్ జురెల్ అత్యుత్తమ ఆప్షన్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు.పంత్ ఇలాగే ఉంటే కష్టమే!వీరిద్దరు ఇలా సత్తా చాటుతుండగా.. మరోవైపు రిషభ్ పంత్ మాత్రం స్థాయికి తగ్గట్లు ఆకట్టుకోలేకపోతున్నాడు. వన్డేల్లో అతడి రికార్డు కూడా అంతంత మాత్రమే. ఇప్పటికి 31 మ్యాచ్లలో కలిపి సగటు 33తో 871 పరుగులు చేశాడు. అయితే, గత కొంతకాలంగా వన్డే తుదిజట్టులో అతడికి చోటే కష్టమైంది.ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో గుజరాత్పై 70 పరుగులు సాధించడం మినహా.. మిగతా రెండు మ్యాచ్లలో అతడు విఫలమయ్యాడు. మేనేజ్మెంట్ నుంచి మద్దతు ఉంది కాబట్టి.. కేఎల్ రాహుల్ స్థానాన్ని పంత్ భర్తీ చేయవచ్చు. అయితే, వన్డేల్లో అతడి గణాంకాలు మాత్రం ఇందుకు దోహదం చేస్తాయని చెప్పలేము. ఈ రేసులో పంత్, జురెల్లను దాటి ఇషాన్ కిషన్ ముందుకు దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా తదుపరి న్యూజిలాండ్తో వన్డే సిరీస్తో టీమిండియా బిజీ కానుంది. చదవండి: ‘టీ20లలో బెస్ట్.. అతడిని వన్డేల్లోనూ ఆడించాలి’ -
'బవుమా' ది గ్రేట్.. తిరుగులేని శక్తిగా సౌతాఫ్రికా
2025..టెస్టు క్రికెట్లో మరుపురాని ఏడాదిగా మిగిలిపోనుంది. సౌతాఫ్రికా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ గెలవడం నుంచి.. ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ విజయం వరకు ఎన్నో అద్భుతాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది టెస్టు క్రికెట్లో సౌతాఫ్రికా అసాధారణ ప్రదర్శన కనబరిచింది. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించడంతో పాటు టీమిండియాను వారి సొంత గడ్డపైనే 2-0తో వైట్వాష్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. టెంబా బావుమా నాయకత్వంలో సౌతాఫ్రికా జట్టు తిరుగులేని జట్టుగా అవతరించింది.27 ఏళ్ల నిరీక్షణకు తెర..వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ సైకిల్ 2023-25లో సౌతాఫ్రికా వరుస సిరీస్ విజయాలతో ఫైనల్కు అర్హత సాధించింది. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్టు ఉండడంతో సఫారీలకు ఓటమి తప్పదని భావించారు. కానీ టెంబా బవుమా నాయకత్వంలోని దక్షిణాఫ్రికా అందరి అంచనాలను తారుమారు చేసింది. లార్డ్స్ వేదికగా జరిగిన తుదిపోరులో కంగారులను చిత్తు చేసిన సౌతాఫ్రికా జట్టు.. తాము చోకర్స్ కాదు టైగర్స్ అని నిరూపించుకుంది. ఈ విజయంతో తమ 27 ఏళ్ల నిరీక్షణకు సఫారీలు తెరదించారు. 1996 తర్వాత సౌతాఫ్రికా ఐసీసీ టైటిల్ సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి. ఐడెన్ మార్క్రామ్ (136) వీరోచిత శతకంతో జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించాడు.టీమిండియాకు ఘోర పరాభవం..అనంతరం ఈ ఏడాది నవంబర్లో భారత పర్యటనకు వచ్చిన సఫారీలు సరికొత్త చరిత్ర సృష్టించారు. టీమిండియాతో జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను సౌతాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. ఉపఖండంలో తిరుగులేని జట్టుగా ఉన్న భారత్కు ప్రోటీస్ ఊహించని షాకిచ్చింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పోరాడి 30 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన భారత్.. గౌహతి టెస్టులో అయితే ఏకంగా 408 పరుగుల భారీ తేడాతో ఘోర పరాభావన్ని మూట కట్టకుంది. 25 ఏళ్ల తర్వాత భారత గడ్డపై దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. సౌతాఫ్రికా జట్టులో కెప్టెన్ బవుమాతో పాటు మార్కో జాన్సెన్, మార్క్రమ్, కేశవ్ మహారాజ్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు.బవుమా ది గ్రేట్..సౌతాఫ్రికా జైత్ర యాత్ర వెనక కెప్టెన్ బవుమాది కీలక పాత్ర. బవుమా తన అద్భుత కెప్టెన్సీతో దశాబ్దాలుగా వెంటాడుతున్న 'చోకర్స్' ముద్రను చెరిపేస్తూ.. ప్రపంచ క్రికెట్కు సౌతాఫ్రికా సత్తా చూపించాడు. 2022లో సౌతాఫ్రికా టెస్టు జట్టు బాధ్యతలు చేపట్టిన బవుమా.. ఓటమి ఎరుగని నాయకుడిగా కొనసాగుతున్నాడు. అతడి కెప్టెన్సీలో సౌతాఫ్రికా ఇప్పటివరకు ఒక్క టెస్టు మ్యాచ్లో కూడా ఓడిపోలేదు. టెంబా బవుమా కెప్టెన్సీలో సౌతాఫ్రికా 12 టెస్టు మ్యాచ్లు ఆడింది. అందులో 11విజయాలు, ఒక్క డ్రా ఉంది. అదేవిధంగా ఈ ఏడాదిలో 8 టెస్టులు ఆడిన సౌతాఫ్రికా ఆరింట విజయం సాధించింది. ఒక మ్యాచ్ డ్రా కాగా.. మరో మ్యాచ్లో ప్రోటీస్ ఓటమి పాలైంది. అయితే ఆ మ్యాచ్లో సౌతాఫ్రికా కెప్టెన్గా మార్క్రమ్ వ్యవహరించాడు.బెస్ట్ టీమ్ కెప్టెన్గా..అందుకే బవుమాకి క్రికెట్ ఆస్ట్రేలియా అరుదైన గౌరవమిచ్చింది. ఈ ఏడాది ముగింపు సందర్భంగా క్రికెట్ ఆస్ట్రేలియా (CA) తమ 'బెస్ట్ టెస్ట్ ప్లెయింగ్ ఎలెవన్' ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా బవుమాను సీఎ ఎంపిక చేసింది. తమ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ను కాకుండా బవుమాను ఎంపిక చేయడం గమనార్హం. అదేవిధంగా ఈ జట్టులో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ ఉన్నారు. ఇంగ్లండ్ నుంచి జో రూట్, బెన్ స్టోక్స్.. సౌతాఫ్రికా నుంచి బవుమాతో పాటు సైమన్ హర్మర్కు చోటు దక్కింది. ఆసీస్ నుంచి అలెక్స్ కారీ, స్కాట్ బోలాండ్ను ఎంపిక చేశారు.క్రికెట్ ఆస్ట్రేలియా అత్యుత్తమ టెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్: కెఎల్ రాహుల్, ట్రావిస్ హెడ్, జో రూట్, శుభ్మాన్ గిల్, టెంబా బావుమా (కెప్టెన్), అలెక్స్ కారీ (వికెట్ కీపర్), బెన్ స్టోక్స్, మిచెల్ స్టార్క్, జస్ప్రీత్ బుమ్రా, స్కాట్ బోలాండ్, సైమన్ హార్మర్, రవీంద్ర జడేజా (12వ ఆటగాడు) -
‘టీ20లలో బెస్ట్.. అతడిని వన్డేల్లోనూ ఆడించాలి’
టీమిండియా టీ20 స్టార్ అభిషేక్ శర్మ 2025లో అదరగొట్టాడు. ఈ ఏడాది అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారత్ తరఫున ఈ సంవత్సరంలో 21 టీ20 మ్యాచ్లు ఆడిన అభిషేక్ శర్మ.. 193కు పైగా స్ట్రైక్రేటుతో 859 పరుగులు స్కోరు చేశాడు.అశూ ప్రశంసలుతద్వారా ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న అభిషేక్ శర్మ (Abhishek Sharma).. టీమిండియా టాప్ రన్స్కోరర్గానూ నిలిచాడు. ఈ నేపథ్యంలో ఈ విధ్వంసకర ఓపెనర్పై టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఏడాది ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న అభిషేక్ను.. ‘మెన్స్ టీమ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’గా అభివర్ణించాడు.వన్డేలలోనూ ఆడించాలిఅదే విధంగా.. వన్డేల్లోనూ అభిషేక్ శర్మను ఆడిస్తే బాగుంటుందని అశూ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ‘అశ్ కీ బాత్’లో మాట్లాడుతూ.. ‘‘ఇది అభిషేక్ శర్మ ఆగమనం మాత్రమే కాదు. టీమిండియా నవతరంలోని ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ ఆగమనం ఇది. 2025లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాడు అతడే.ముఖ్యంగా పవర్ ప్లేలో అతడి బ్యాటింగ్ అద్భుతం. వన్డేల్లోనూ అతడి ఆటను చూడాలని ఉంది. ఈ ఏడాది పురుషుల క్రికెట్లో అత్యుత్తమ ప్లేయర్ అతడే’’ అని అభిషేక్ శర్మను అశూ కొనియాడాడు. కాగా ఐపీఎల్లో సన్రైజర్స్ తరఫున సత్తా చాటిన అభిషేక్ శర్మ.. 2024లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 33 టీ20 మ్యాచ్లు ఆడిన అభిషేక్ శర్మ 1115 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, తొమ్మిది అర్ధ శతకాలు ఉన్నాయి. తదుపరి టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో సత్తా చాటేందుకు అభిషేక్ శర్మ సిద్ధంగా ఉన్నాడు. చదవండి: ఇంగ్లండ్, పాక్ కాదు.. టీ20 వరల్డ్కప్ సెమీస్ చేరే జట్లు ఇవే! -
'అతడు రీ ఎంట్రీ ఇస్తే టీమిండియా కష్టాలు తీరిపోతాయి'
2025 ఏడాది.. టీమిండియాకు మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. ముఖ్యంగా టెస్టుల్లో అయితే భారత్ ఘోరంగా విఫలమైంది. ఈ ఏడాది ఆరంభంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయిన భారత్.. ఆ తర్వాత ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ను సమం చేసింది. అనంతరం స్వదేశంలో వెస్టిండీస్తో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసినప్పటికి.. సౌతాఫ్రికాపై ఘోర పరాభావాన్ని మూట కట్టుకుంది.రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో గిల్ సేన వైట్ వాష్కు గురైంది. దీంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆశలను భారత్ సంక్లిష్టం చేసుకుంది. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే మిగిలిన మ్యాచ్లన్నింటిలోనూ తప్పనిసారిగా గెలవాలి. ఈ నేపథ్యంలో భారత మాజీ ప్లేయర్ రాబిన్ ఉతప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా టెస్టు క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వాలని ఉతప్ప అభిఫ్రాయపడ్డాడు. పాండ్యా ప్రస్తుతం కేవలం వైట్ బాల్ క్రికెట్లో మాత్రమే ఆడుతున్నాడు. 2017లో శ్రీలంకపై టెస్టు అరంగేట్రం చేసిన పాండ్యా.. ఇప్పటివరకు కేవలం 11 టెస్టులు మాత్రమే ఆడాడు. చివరసారిగా పాండ్యా టెస్టుల్లో 2018లో ఇంగ్లండ్పై ఆడాడు. వెన్ను గాయం కారణంగా అతడు టెస్టు క్రికెట్కు దూరంగా ఉంటున్నాడు. 11 టెస్టుల్లో 532 పరుగులతో పాటు 17 వికెట్లు పడగొట్టాడు."హార్దిక్ పాండ్యాను తిరిగి వైట్ బాల్ జెర్సీలో చూడాలనుకుంటున్నాను. పాండ్యా టెస్టు క్రికెట్లోకి తిరిగి వస్తే.. అతడికి ఏడో స్ధానం సరిగ్గా సరిపోతుంది. భారత్ లోయార్డర్ బ్యాటింగ్ కష్టాలు తీరిపోతాడు. అతడొక అద్భుతమైన ఆటగాడు. ఒకవేళ పాండ్యా టెస్టుల్లో తిరిగి ఆడేందుకు సముఖత చూపిస్తే.. సెలక్టర్లు గానీ, బోర్డు పెద్దలు గానీ నో చెప్పరు. ఎందుకంటే అతడు సూపర్ ఫామ్తో పాటు పూర్తి ఫిట్గా ఉన్నాడు. ఒక ఇన్నింగ్స్లో 12 నుండి 15 ఓవర్ల వరకు సులభంగా బౌలింగ్ చేయగలడు. ప్రస్తుతం జట్టులోని మిగితా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లు ఎవరూ కూడా 20 ఓవర్లకు మించి బౌల్ చేయడం లేదు కాదు. నితీశ్ కుమార్ రెడ్డి కేవలం 12 ఓవర్ల లోపే బౌలింగ్ చేస్తున్నాడు. హార్దిక్ అంతకుమించి ఒకట్రెండు ఓవర్లు ఎక్కువగా బౌలింగ్ చేయగలడు. అతడు రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది. కానీ ఇది పూర్తిగా అతడి వ్యక్తిగత నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని" తన యూట్యూబ్ ఛానల్లో ఉతప్ప పేర్కొన్నాడు.చదవండి: ఇంగ్లండ్, పాక్ కాదు.. టీ20 వరల్డ్కప్ సెమీస్ చేరే జట్లు ఇవే! -
ఒక్క మ్యాచ్లో ‘హిట్’.. రెండింటిలో ఫ్లాప్ షో!
విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీలో ఆంధ్ర జట్టుకు రెండో పరాజయం ఎదురైంది. గ్రూప్ ‘డి’లో భాగంగా సోమవారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్లో ఆంధ్ర ఆరు వికెట్ల తేడాతో ఒడిశా జట్టు చేతిలో ఓటమి పాలైంది. ఆలూర్ వేదికగా తొలుత బ్యాటింగ్కు దిగిన ఆంధ్ర జట్టు 49.2 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. కోన శ్రీకర్ భరత్ (58 బంతుల్లో 32; 3 ఫోర్లు), షేక్ రషీద్ (35 బంతుల్లో 20; 1 ఫోర్) క్రీజులో నిలదొక్కుకుంటున్న దశలో అవుటయ్యారు. కెప్టెన్ నితీశ్ కుమార్ రెడ్డి (11 బంతుల్లో 6; 1 ఫోర్) నిరాశపరిచాడు. 43.4 ఓవర్లలోనేఎస్డీఎన్వీ ప్రసాద్ (64 బంతుల్లో 66; 6 ఫోర్లు, 2 సిక్స్లు), చివర్లో సౌరభ్ కుమార్ (26 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్స్లు) రాణించడంతో ఆంధ్ర స్కోరు 200 దాటింది. ఒడిశా బౌలర్లలో బిప్లాబ్ సామంత్రే, గోవింద పొద్దార్ 3 వికెట్ల చొప్పున తీశారు. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒడిశా జట్టు 43.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్ స్వస్తిక్ సామల్ (0) ఆడిన తొలి బంతికే అవుటైనా... ఓం ముండే (111 బంతుల్లో 91; 7 ఫోర్లు), గోవింద పొద్దార్ (105 బంతుల్లో 89; 9 ఫోర్లు) ఒడిశా విజయాన్ని ఖాయం చేశారు. వీరిద్దరు మూడో వికెట్కు 166 పరుగులు జోడించారు. ఆడిన మూడు మ్యాచ్ల్లో ఒక దాంట్లో నెగ్గిన ఆంధ్ర జట్టు గ్రూప్ ‘డి’లో నాలుగు పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ఈనెల 31న జరిగే నాలుగో లీగ్ మ్యాచ్లో సౌరాష్ట్ర జట్టుతో తలపడుతుంది. ఒక్క మ్యాచ్లో ‘హిట్’.. రెండింటిలో ఫ్లాప్ షో!ఆంధ్ర కెప్టెన్, టీమిండియా స్టార్ నితీశ్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు విజయ్ హజారే ట్రోఫీ తాజా సీజన్లో మూడు మ్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. తొలుత ఢిల్లీతో మ్యాచ్లో 23 పరుగులు చేసిన నితీశ్ రెడ్డి.. ఒకే ఒక్క వికెట్ తీశాడు.ఈ మ్యాచ్లో ఆంధ్ర ఢిల్లీ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక రైల్వేస్తో మ్యాచ్లో మాత్రం నితీశ్ రెడ్డి బ్యాట్తో అదరగొట్టాడు. ఐదో నంబర్ బ్యాటర్గా వచ్చి 41 బంతుల్లో 55 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో ఓ వికెట్ కూడా పడగొట్టాడు.ఇక తాజాగా సోమవారం ఒడిషాతో మ్యాచ్లో మాత్రం నితీశ్ రెడ్డి నిరాశపరిచాడు. కేవలం ఆరు పరుగులే చేసి నిష్క్రమించాడు. అదే విధంగా ఒకే ఒక వికెట్ తీయగలిగాడు. ఇప్పటి వరకు ఇలా అతడి ప్రదర్శన మిశ్రమంగా ఉంది.చదవండి: ఇంగ్లండ్, పాక్ కాదు.. టీ20 వరల్డ్కప్ సెమీస్ చేరే జట్లు ఇవే! -
హైదరాబాద్ క్రికెటర్ రామ్చరణ్పై బీసీసీఐ వేటు.. కారణమిదే?
వయస్సును తక్కువగా చూపించి దేశవాళీ క్రికెట్ మ్యాచ్లో ఆడిన హైదరాబాద్ క్రికెటర్పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రెండేళ్ల నిషేధం విధించింది. బోర్డు అధికారిక అండర్–16 టోర్నీ విజయ్ మర్చంట్ ట్రోఫీలో మర్కట్ట రామ్చరణ్ హైదరాబాద్ జట్టు తరఫున బరిలోకి దిగాడు.లీగ్ దశలో హైదరాబాద్ నాలుగు మ్యాచ్లు ఆడగా ఢిల్లీ, హరియాణా, మహారాష్ట్రలపై రామ్చరణ్ మూడు సెంచరీలు నమోదు చేశాడు. అయితే రామ్చరణ్ వయసుకు సంబంధించిన సందేహం కారణంగా వచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) విచారణ జరిపింది. విచారణలో రామ్చరణ్కు రెండు వేర్వేరు తేదీలతో ‘బర్త్ సర్టిఫికెట్ ’లు ఉన్నట్లు, అతను తన వయసును తక్కువగా చూపించి అండర్–16 టోర్నీలో ఆడినట్లు తేలింది. దాంతో బీసీసీఐ అతడిని రెండేళ్ల పాటు అన్ని రకాల క్రికెట్ నుంచి నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. రెండేళ్ల తర్వాత రామ్చరణ్ మళ్లీ ఆడవచ్చని...అయితే ఎలాంటి వయో విభాగంతో సంబంధం లేకుండా కేవలం సీనియర్ స్థాయిలోనే బరిలోకి దిగాల్సి ఉంటుందని కూడా బీసీసీఐ స్పష్టం చేసింది. -
డికాక్ మెరుపులు.. సన్రైజర్స్ వరుసగా రెండో విజయం
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ లీగ్లో భాగంగా సోమవారం ప్రిటోరియా క్యాపిటల్స్లో జరిగిన మ్యాచ్లో 48 పరుగుల తేడాతో సన్రైజర్స్ గెలుపొందింది. ఈ విజయంతో సన్రైజర్స్ జట్టుకు అదనంగా ఒక బోనస్ పాయింట్ కూడా లభించింది. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ మరోసారి చెలరేగాడు. 47 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 5 ఫోర్లు, 6 సిక్సకర్లతో 77 పరుగులు చేశాడు. అతడితో పాటు మాథ్యూ బ్రీట్జ్కే(33 బంతుల్లో 52 పరుగులు), జోర్డాన్ హెర్మాన్(20 బంతుల్లో 37) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ప్రిటోరియా క్యాపిటల్స్ బౌలర్లలో టైమల్ మిల్స్ రెండు వికెట్లు పడగొట్టగా.. లుంగి ఎంగిడీ, లుబ్బే తలా వికెట్ సాధించారు. అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రిటోరియా క్యాపిటల్స్ 18 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. సన్రైజర్స్ స్పీడ్ స్టార్ ఆడమ్ మిల్నే 4 వికెట్లు పడగొట్టగా.. రత్నాయకే రెండు, మార్కో జాన్సెన్, ముత్తుసామి తలా వికెట్ సాధించారు.ప్రిటోరియా ఇన్నింగ్స్లో షాయ్ హోప్(36) టాప్ స్కోరర్గా నిలవగా.. స్మిడ్(35), రుథర్ ఫర్డ్(25) ఫర్వాలేదన్పించారు. కాగా ప్రిటోరియా క్యాపిటల్స్ హెడ్ కోచ్గా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వ్యవహరిస్తున్నాడు. ప్రధాన కోచ్గా అతడికి వరుసగా రెండో మ్యాచ్లోనూ ఓటమి ఎదురైంది.చదవండి: ఇంగ్లండ్, పాక్ కాదు.. టీ20 వరల్డ్కప్ సెమీస్ చేరే జట్లు ఇవే! -
10 ఓవర్లలో 123 పరుగులు.. సీఎస్కే బౌలర్ అత్యంత చెత్త రికార్డు
దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పుదుచ్చేరి కెప్టెన్, ఆల్రౌండర్ అమాన్ ఖాన్ కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అయితే ఇది దురదృష్టవశాత్తూ చెప్పుకోవడానికి ఇష్టపడని అవమానకరమైన రికార్డు కావడం గమనార్హం. జార్ఖండ్తో సోమవారం జరిగిన మ్యాచ్లో అమాన్ 10 ఓవర్లలో ఏకంగా 123 పరుగులు సమర్పించుకున్నాడు. దేశవాళీ, అంతర్జాతీయ వన్డేలు కలిపి (లిస్ట్–ఎ క్రికెట్)లో ఒక మ్యాచ్లో బౌలర్ ఇచ్చిన అత్యధిక పరుగులు ఇవే కావడం విశేషం. ఇదే టోర్నీలో ఈ నెల 24న బిహార్తో జరిగిన మ్యాచ్లో అరుణాచల్ప్రదేశ్ బౌలర్ మిబోమ్ మోసూ 9 ఓవర్లల ఇచ్చిన 116 పరుగుల రికార్డు ఇప్పుడు తెరమరుగైంది.ఐపీఎల్లో రెండు సీజన్ల పాటు కోల్కతా, ఢిల్లీ జట్లకు కలిపి 12 మ్యాచ్లలో ఆడినా ఒకే ఒక ఓవర్ బౌలింగ్ చేసే అవకాశం వచ్చిన అమాన్ ఖాన్ ఇటీవల జరిగిన 2026 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ.40 లక్షలకు సొంతం చేసుకుంది. పుదుచ్చేరితో మ్యాచ్లో 50 ఓవర్లలో 7 వికెట్లకు 368 పరుగులు చేసిన జార్ఖండ్...ఆ తర్వాత పుదుచ్చేరిని 235 పరుగులకే ఆలౌట్ చేసి 133 పరుగులతో విజయాన్నందుకుంది.చదవండి: ఇంగ్లండ్, పాక్ కాదు.. టీ20 వరల్డ్కప్ సెమీస్ చేరే జట్లు ఇవే! -
ఇంగ్లండ్, పాక్ కాదు.. టీ20 వరల్డ్కప్ సెమీస్ చేరే జట్లు ఇవే!
టీ20 ప్రపంచకప్-2026కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 40 రోజుల్లో భారత్, శ్రీలంక వేదికలగా ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ మెగా ఈవెంట్లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనుంది. తిరిగి టైటిల్ను రిటైన్ చేసుకోవాలని మెన్ ఇన్ బ్లూ పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు ఛాంపియన్స్గా నిలస్తుందని భజ్జీ జోస్యం చెప్పాడు."టీ20 ప్రపంచకప్ గెలిచే అవకాశాలు టీమిండియాకు ఎక్కువగా ఉన్నాయి. మన ఆటగాళ్లకు ఉపఖండ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. ఇది భారత జట్టుకు బాగా కలిసొస్తోంది. అయితే టోర్నీలో ఎదురయ్యే ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవడం చాలా ముఖ్యం. అదేవిధంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా నుంచి కూడా భారత్కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముంది. ఏ ఐసీసీ టోర్నమెంట్లోనైనా ఆస్ట్రేలియా కచ్చితంగా టైటిల్ రేసులో ఉంటుంది. కాబట్టి కంగారూలను తక్కువగా అంచనా వేయకూడదు. సౌతాఫ్రికా కూడా గత కొంత కాలంగా అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. అఫ్గానిస్తాన్ జట్టు కూడా చాలా పటిష్టంగా కన్పిస్తోంది. అఫ్గాన్ జట్టులో అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు.భారత్ వంటి ఉపఖండ పిచ్లలో వారు ఎవరినైనా ఓడించగలరు. నా వరకు అయితే .. భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గాన్ జట్లు సెమీఫైనల్స్కు చేరుతాయని అనుకుంటున్నాను"అని లెజెండ్స్ లీగ్ క్రికెట్ (LLC) సీజన్ 4 ప్రారంభోత్సవంలో భజ్జీ పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్-2026కు భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ సింగ్ పటేల్, వాషింగ్టన్ పటేల్, వాషింగ్టన్ సందర్.చదవండి: రెండు రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్.. మెల్బోర్న్ పిచ్పై ఐసీసీ ఆగ్రహం -
రెండు రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్.. ఐసీసీ ఆగ్రహం
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మెల్బోర్న్ పిచ్పై అసంతృప్తి వెలిబుచ్చింది. ఆ్రస్టేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక ‘యాషెస్’ సిరీస్లో నాలుగో టెస్టుకు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికైంది. కేవలం రెండు రోజుల్లోనే ముగిసిన ఈ పిచ్ పేలవమని ప్రకటించింది. మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో ‘ఏకపక్షంగా బౌలర్లకు మాత్రమే సహకరించిన వికెట్’ అని ఐసీసీకి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. దీన్నిబట్టి ఐసీసీ ఎంసీజీ అసంతృప్తిపరిచిన వేదిక అని... ఒక డిమెరిట్ పాయింట్ విధించింది.ఏదైనా వేదికకు 6 డిమెరిట్ పాయింట్లు జమ అయితే ఆ స్టేడియాన్ని 12 నెలల పాటు నిషేధిస్తారు. 26న మొదలైన ఈ ‘బాక్సింగ్ డే’ టెస్టు అత్యంత నిరుత్సాహకరంగా మరునాడే ముగిసింది. ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో గెలిచిన ఈ మ్యాచ్లో మొదటి రోజే ఇరు జట్లు ఆలౌటయ్యాయి. 20 వికెట్లు నేలకూలాయి. తర్వాతి రోజు 16 వికెట్లు పడ్డాయి. ఆ్రస్టేలియాలో ‘బాక్సింగ్ డే’ టెస్టుకున్న ప్రత్యేకతే వేరు.ఏకంగా 90 వేలకు పైగానే ప్రేక్షకులు పోటెత్తిన ఈ మ్యాచ్ అనూహ్యంగా రెండే రోజుల్లో ముగియడం క్రికెట్ అభిమానుల్ని సైతం నిరాశపరిచింది. ఈ టెస్టుకు ముందే యాషెస్ను గెలుచుకున్న ఆతిథ్య ఆ్రస్టేలియా... ప్రస్తుతం 3–1తో ఇంగ్లండ్పై పైచేయిని కొనసాగిస్తోంది. ఇరు జట్ల మధ్య ఆఖరి టెస్టు వచ్చే నెల 4 నుంచి సిడ్నీలో జరుగుతుంది.చదవండి: క్లీన్స్వీప్పై భారత్ గురి... నేడు శ్రీలంకతో ఐదో టి20 మ్యాచ్ -
క్లీన్స్వీప్పై భారత్ గురి... నేడు శ్రీలంకతో ఐదో టి20 మ్యాచ్
తిరువనంతపురం: ఈ ఏడాదిని క్లీన్స్వీప్తో ముగించేందుకు భారత మహిళల టి20 క్రికెట్ జట్టు విజయం దూరంలో ఉంది. శ్రీలంక జట్టుతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా చివరి టి20 మ్యాచ్ ఈరోజు జరగనుంది. అటు బౌలింగ్లో, ఇటు బ్యాటింగ్లో పూర్తి ఆధిపత్యం చలాయిస్తున్న హర్మన్ప్రీత్ కౌర్ బృందం వరుసగా నాలుగు మ్యాచ్ల్లో గెలిచి జోరు మీదుంది. మరోవైపు క్లీన్స్వీప్ తప్పించుకోవాలని, ఒక్క విజయంతోనైనా పరువు దక్కించుకోవాలని శ్రీలంక భావిస్తోంది. అయితే అన్ని రంగాల్లో విఫలమవుతున్న చమరి ఆటపట్టు సారథ్యంలోని శ్రీలంక ఆఖరి మ్యాచ్లో ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో వేచి చూడాలి. వచ్చే ఏడాది జూన్–జూలైలో ఇంగ్లండ్ వేదికగా జరిగే టి20 ప్రపంచకప్ టోరీ్నకి ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టిన టీమిండియా త్వరలో మరో రెండు టి20 సిరీస్లు (ఆ్రస్టేలియా, ఇంగ్లండ్లతో) ఆడనుంది. -
న్యూజిలాండ్తో వన్డే సిరీస్.. ఈ ఐదుగురు ఔట్..?
వచ్చే ఏడాదిని భారత క్రికెట్ జట్టు స్వదేశంలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్తో మొదలు పెడుతుంది. ఈ సిరీస్ కోసం టీమిండియాను జనవరి 3 లేదా 4 తేదీల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎవరెవరు ఈ జట్టుకు ఎంపికవుతారు.. ఎవరిపై వేటు పడే అవకాశం ఉందనే దానిపై ఓ లుక్కేద్దాం. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ సిరీస్ కోసం వేర్వేరు కారణాల వల్ల ఐదుగురు ఆటగాళ్లకు అవకాశం దక్కకపోవచ్చని తెలుస్తుంది. ఆ ఐదుగురు ఎవరంటే..హార్దిక్ పాండ్యాక్వాడ్రిసెప్స్ గాయం కారణంగా తాజాగా ముగిసిన సౌతాఫ్రికా సిరీస్కు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా న్యూజిలాండ్ సిరీస్కు కూడా ఎంపికయ్యే అవకాశం లేదని తెలుస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే టీ20 వరల్డ్కప్ దృష్ట్యా మేనేజ్మెంట్ ఇతనికి విశ్రాంతినివ్వవచ్చు. హార్దిక్ స్థానంలో ఈ సిరీస్కు నితీష్ కుమార్ రెడ్డి ఎంపికయ్యే అవకాశం ఉంది.జస్ప్రీత్ బుమ్రాఇటీవలే బ్యాక్ ఇంజ్యూరీ నుంచి కోలుకున్న బుమ్రాను కూడా టీ20 వరల్డ్కప్ దృష్ట్యా న్యూజిలాండ్ వన్డే సిరీస్కు ఎంపిక చేయకపోవచ్చని తెలుస్తుంది. వరల్డ్కప్ నేపథ్యంలో బుమ్రాపై వర్క్ లోడ్ పడటం మేనేజ్మెంట్కు అస్సలు ఇష్టం లేదని సమాచారం. దీంతో బుమ్రాకు విశ్రాంతి అనివార్యం కావచ్చు. అతని స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాను ఎంపిక చేయవచ్చు.వాషింగ్టన్ సుందర్సౌతాఫ్రికా సిరీస్లో 2 మ్యాచ్ల్లో 14 పరుగులు మాత్రమే చేసి, ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన సుందర్పై వేటు పడే అవకాశం ఉంది. అతడి స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి రావచ్చు.తిలక్ వర్మతిలక్ సౌతాఫ్రికా సిరీస్లో జట్టులో ఉన్నా, ఫస్ట్ ఛాయిస్ XIలో చోటు దక్కలేదు. ఇదే సిరీస్లో రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో కదంతొక్కి తిలక్ స్థానాన్ని ప్రశ్నార్థకంగా మార్చాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ కూడా గాయం నుంచి పూర్తిగా కోలుకోని రీఎంట్రీకి సిద్దంగా ఉండటంతో తిలక్ వన్డే జట్టులో చోటుపై ఆశలు వదులుకున్నాడు.రిషబ్ పంత్గత కొంతకాలంగా ఒక్క వన్డే కూడా ఆడని రిషబ్ పంత్ను న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు కూడా పరిగణలోకి తీసుకోకపోవచ్చు. కేఎల్ రాహుల్ ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్గా అద్భుతంగా రాణిస్తుండటంతో పంత్ కూడా వన్డే బెర్త్పై ఆశలు వదులుకున్నాడు. ఒకవేళ ఏదైనా అవకాశం ఉన్నా, ఇషాన్ కిషన్ రూపంలో పంత్కు మరో ప్రమాదం పొంచి ఉంది.న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు అవకాశాలు లేని ఆటగాళ్లు వీళ్లైతే.. శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రుతురాజ్, రవీంద్ర జడేజా, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ ఎంపిక దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది.జనవరి 11న వడోదర వేదికగా తొలి వన్డే జరుగనుంది. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో రెండో వన్డే జనవరి 14న రాజ్కోట్లో.. మూడో వన్డే జనవరి 18న ఇండోర్లో జరుగనుంది. అనంతరం ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ కోసం జట్టును ఇదివరకే ప్రకటించారు. టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టే ఈ సిరీస్లో యధాతథంగా కొనసాగుతుంది.కివీస్తో వన్డేలకు భారత జట్టు (అంచనా)..శుభ్మన్ గిల్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ , రుతురాజ్ గైక్వాడ్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా -
చరిత్ర సృష్టించిన జేసన్ హోల్డర్
విండీస్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ (Jason Holder) చరిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్లో ఓ క్యాలెండర్ ఇయర్లో (2025) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. హోల్డర్ ఈ ఏడాది 69 మ్యాచ్ల్లో 97 వికెట్లు తీశాడు. ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో భాగంగా గల్ఫ్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో హోల్డర్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో హోల్డర్ (అబుదాబీ నైట్రైడర్స్) 2 వికెట్లు తీసి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.హోల్డర్కు ముందు ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 వికెట్లు తీసిన రికార్డు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ పేరిట ఉండేది. రషీద్ 2018లో 61 మ్యాచ్ల్లో 96 వికెట్లు తీశాడు. ఈ విభాగంలో హోల్డర్, రషీద్ ఖాన్ తర్వాతి స్థానాల్లో డ్వేన్ బ్రావో, నూర్ అహ్మద్ ఉన్నారు.బ్రావో 2016లో 72 మ్యాచ్ల్లో 87 వికెట్లు తీయగా.. నూర్ అహ్మద్ ఇదే ఏడాది 64 మ్యాచ్ల్లో 85 వికెట్లు తీశాడు.డెత్ ఓవర్ల స్పెషలిస్ట్హోల్డర్ ఇటీవలికాలంలో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా రాటుదేలాడు. ఈ ఏడాది అతను తీసిన 97 వికెట్లలో 45 వికెట్లు డెత్ ఓవర్లలో తీసినవే. 2022లో 59 వికెట్లు తీసిన హోల్డర్.. ఈ ఏడాది తన వికెట్ల శాతాన్ని భారీగా మెరుగుపర్చుకున్నాడు. టీ20 స్పెషలిస్ట్ అయిన హోల్డర్ను ఐపీఎల్ 2026 వేలంలో గుజరాత్ టైటాన్స్ రూ. 7 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకుంది.హోల్డర్ ఈ ఏడాది తన జాతీయ జట్టుతో (విండీస్) పాటు ఐదు వేర్వేరు ఫ్రాంచైజీలకు ఆడాడు. ఈ ఏడాది అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో హోల్డర్ తర్వాతి స్థానాల్లో నూర్ అహ్మద్ (85), హసన్ అలీ (71), హారిస్ రౌఫ్ (66) ఉన్నారు. రషీద్ ఖాన్ ఈ ఏడాది గాయాల కారణంగా కేవలం 63 వికెట్లకే పరిమితమయ్యాడు.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెటర్ బ్రేస్వెల్ -
సిరీస్కు ఒకరు.. నామమాత్రంగా మారిన టీమిండియా "వైస్ కెప్టెన్"
క్రీడ ఏదైనా అందులో కెప్టెన్ పాత్ర ఎంత ఉంటుందో, వైస్ కెప్టెన్ పాత్ర కూడా ఇంచుమించు అంతే ఉంటుంది. మైదానంలో అప్పటికప్పుడు తీసుకునే ఏ నిర్ణయంలో అయినా ఈ ఇద్దరి పాత్ర చాలా కీలకం. తుది నిర్ణయం కెప్టెన్దే అయినా, వైస్ కెప్టెన్ అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు.అయితే ఇటీవలికాలంలో క్రికెట్ లాంటి క్రీడల్లో వైస్ కెప్టెన్ల పాత్ర నామమాత్రంగా మారింది. పేరుకే వైస్ కెప్టెన్ను ప్రకటిస్తున్నారు కానీ, మైదానంలో వ్యూహాలు అమలు చేయడంలో పెత్తనం మొత్తం కెప్టెన్దే. మేనేజ్మెంట్ కెప్టెన్లకు అతి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల వైస్ కెప్టెన్లు కూడా పట్టీపట్టనట్లు ఉంటున్నారు.భారత క్రికెట్లో ఈ పోకడ మరీ విపరీతంగా ఉంది. వైస్ కెప్టెన్లు పేరుకే పరిమితమవుతున్నారు. మైదానంలో వ్యూహాలు అమలు చేయడంలో వీరి పాత్ర సున్నా. వైస్ కెప్టెన్లు ఇలా పవర్ లేకుండా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో మొదటిది జట్టులో వీరి స్థానానికి భరోసా ఉండకపోవడం.ఓ సిరీస్కు వైస్ కెప్టెన్గా ఎంపిక చేసి, ఆ సిరీస్లో విఫలమైతే మరుసటి సిరీస్ అతను జట్టులో ఉండడు. తమ స్థానానికే గ్యారెంటీ లేనప్పుడు ఏ ఆటగాడు కూడా జట్టు వ్యూహాల్లో తలదూర్చడానికి ఇష్టడడు.వైస్ కెప్టెన్లు పవర్లెస్గా మారిపోవడానికి సిరీస్కు ఒకరిని మార్చడం మరో కారణం. భారత క్రికెట్లో ఇటీవలికాలంలో ఇలా తరుచూ జరుగుతుంది. వ్యక్తిగతంగా రాణిస్తున్నా, సిరీస్కు ఓ వైస్ కెప్టెన్ను ఎంపిక చేస్తున్నారు. మూడు ఫార్మాట్లకు వేర్వేరు జట్లు, కెప్టెన్ల సంప్రదాయం ఎప్పుడు మొదలైందో, అప్పటి నుంచి వైస్ కెప్టెన్లను తరుచూ మారుస్తున్నారు.భారత టీ20 జట్టును తీసుకుంటే, ఇటీవలికాలంలో చాలామంది వైస్ కెప్టెన్లు మారారు. తాజాగా ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టుకు అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్గా ఎంపిక చేయబడగా.. అంతకుముందు సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్కు శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు.దీనికి ముందు కొన్నాళ్లు హార్దిక్ పాండ్యా.. కొన్నాళ్లు శ్రేయస్ అయ్యర్, ఓ సిరీస్కు (సౌతాఫ్రికా) రవీంద్ర జడేజా, ఓ సిరీస్కు (జింబాబ్వే) సంజూ శాంసన్ ఉప సారథులుగా వ్యవహరించారు.టీ20ల పరిస్థితి ఇలా ఉంటే.. టెస్ట్ల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. సిరీస్కు ఒకరు.. కొన్ని సందర్భాల్లో సిరీస్ ఇద్దరు, ముగ్గురు కూడా వైస్ కెప్టెన్లుగా వ్యవహరించారు. 2022 నుంచి చూసుకుంటే.. శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, బుమ్రా, పంత్, జడేజా, పుజారా, రహానే వైస్ కెప్టెన్లుగా వ్యవహరించారు.టెస్ట్లు, టీ20లతో పోల్చుకుంటే, వన్డేల్లో పరిస్థితి కాస్త బెటర్గా ఉంది. మొన్నటి వరకు రోహిత్ శర్మ కెప్టెన్గా ఉండగా.. అతనికి డిప్యూటీగా శుభ్మన్ గిల్, పంత్, కేఎల్ రాహుల్ లాంటి వారు వ్యవహరించారు. ప్రస్తుతం గిల్ వన్డే జట్టు కెప్టెన్గా ఉండగా.. డిప్యూటీ పోస్ట్ శ్రేయస్ అయ్యర్ కోసం కేటాయించబడింది. టెస్ట్ జట్టుకు కూడా గిల్ కెప్టెన్గా ఉండగా.. అతనికి డిప్యూటీగా రిషబ్ పంత్ వ్యవహరిస్తున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో పంత్ గైర్హాజరీలో రవీంద్ర జడేజా ఓ మ్యాచ్లో వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు.సాధారణంగా ఏ క్రీడలో అయినా భవిష్యత్త్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వైస్ కెప్టెన్లను ఎంపిక చేస్తుంటారు. కెప్టెన్ అండలో వైస్ కెప్టెన్ పాఠాలు నేర్చుకొని కెప్టెన్ స్థాయికి ఎదుగుతాడని అలా చేస్తారు. ఆనవాయితీగా ఇలాగే జరుగుతూ వచ్చింది. భారత క్రికెట్లో ఇటీవలికాలంలో చూసుకుంటే.. గంగూలీ తర్వాత ధోని.. ధోని తర్వాత విరాట్ కోహ్లి వైస్ కెప్టెన్లుగా ఉండి కెప్టెన్లుగా అవతరించారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఆటగాళ్లకు వైస్ కెప్టెన్గా అనుభవం లేకుండానే కెప్టెన్లుగా ఎంపిక చేస్తున్నారు. భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎంపిక ఇందుకు ప్రధాన ఉదాహరణ. ఈ పరిస్థితి భారత క్రికెట్కు మాత్రమే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని జట్లలో పరిస్థితి ఇలాగే ఉంది. వైస్ కెప్టెన్ల పాత్ర నామమాత్రంగా మారింది. కెప్టెన్ల పెత్తనం మాత్రమే నడుస్తుంది. -
రిటైర్మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెటర్ బ్రేస్వెల్
న్యూజిలాండ్ ఆల్రౌండర్ డౌగ్ బ్రేస్వెల్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 18 ఏళ్ల ప్రొఫెషనల్ కెరీర్కు ముగింపు పలుకుతన్నట్లు స్పష్టం చేశాడు. 35 ఏళ్ల బ్రేస్వెల్ న్యూజిలాండ్ తరఫున 2011-23 మధ్యలో 28 టెస్ట్లు, 21 వన్డేలు, 20 టీ20లు ఆడాడు. కుడి చేతి వాటం బ్యాటర్, మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన బ్రేస్వెల్ బ్యాటింగ్తో పోలిస్తే బౌలింగ్లో మెరుగ్గా రాణించాడు. టెస్ట్ల్లో 74 వికెట్లు, వన్డేల్లో 26, టీ20ల్లో 20 వికెట్లు తీశాడు. బ్యాటింగ్లో బ్రేస్వెల్ ఒకే ఒక హాఫ్ సెంచరీ (వన్డేల్లో) చేశాడు.2008లో అండర్-19 విభాగం నుంచి జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్రేస్వెల్.. అన్ని విభాగాల్లో ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బ్రేస్వెల్ ఐపీఎల్లోనూ ఆడాడు. 2012 డ్రాఫ్ట్లో అతన్ని ఢిల్లీ డేర్ డెవిల్స్ ఎంపిక చేసుకుంది. ఐపీఎల్ కెరీర్ మొత్తంలో ఒకే ఒక మ్యాచ్ ఆడిన బ్రేస్వెల్ 3 వికెట్లు తీశాడు. తొలి మ్యాచ్లో 3 వికెట్లు తీసినా అతనికి ఎందుకో అవకాశాలు రాలేదు.డౌగ్ బ్రేస్వెల్ కుటుంబంలో చాలామంది క్రికెటర్లు ఉన్నారు. అతని తండ్రి (బ్రెండన్ బ్రేస్వెల్), అంకుల్ (జాన్ బ్రేస్వెల్) కూడా న్యూజిలాండ్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం డౌగ్ బ్రేస్వెల్ కజిన్స్ మైఖేల్ బ్రేస్వెల్, మెలానీ బ్రేస్వెల్ న్యూజిలాండ్ సీనియర్ పురుష, మహిళల జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.డౌగ్ బ్రేస్వెల్ కెరీర్లో గుర్తుండిపోయే ఘట్టం: 2011లో హోబార్ట్లో ఆస్ట్రేలియాపై టెస్టులో ఆరు వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శన కారణంగా ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ ఏడు పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది. చదవండి: పొట్టి క్రికెట్లో పెను సంచలనం -
పొట్టి క్రికెట్లో పెను సంచలనం
పొట్టి క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. ఈ ఫార్మాట్ చరిత్రలో తొలిసారి ఓ బౌలర్ 8 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఇప్పటివరకు ఈ ఫార్మాట్లో అత్యుత్తమంగా 7 వికెట్ల ప్రదర్శనలు మాత్రమే నమోదయ్యాయి.తాజాగా మయన్మార్తో జరిగిన అంతర్జాతీయ టీ20లో భూటాన్ బౌలర్ సోనమ్ ఎషే (22 ఏళ్ల లెఫ్డ్ ఆర్మ్ స్పిన్నర్) 8 వికెట్ల చారిత్రక ఫీట్ను సాధించాడు. ఈ మ్యాచ్లో సోనమ్ 4 ఓవర్లలో కేవలం 7 పరుగులిచ్చి (ఓ మెయిడిన్) ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు. సోనమ్ నమోదు చేసిన ఈ గణాంకాలు యుగయుగాలు గుర్తుండిపోతాయి.ఎషే చారిత్రక ప్రదర్శన కారణంగా ఈ మ్యాచ్లో మయన్మార్పై భూటాన్ 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భూటాన్ 127 పరుగులు చేసింది. అనంతరం 128 పరుగుల ఛేదనలో మయన్మార్ 9.2 ఓవర్లలో 45 పరుగులకే ఆలౌటైంది. ఈ గెలుపుతో భూటాన్ 5 మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది.పొట్టి క్రికెట్లో అత్యుత్తమ గణాంకాలు..సోనమ్ ఎషే (భూటాన్)- మయన్మార్పై 4-1-7-8శ్యాజ్రుల్ ఇద్రుస్ (మలేషినా)- చైనాపై 4-1-8-7అలీ దావూద్ (బహ్రెయిన్)- భూటాన్పై 4-0-19-7హర్ష భరద్వాజ్ (సింగపూర్)- మంగోలియాపై 4-2-3-6పీటర్ అహో (నైజీరియా)- సియెర్రా లియోన్పై 3.4-1-5-6దీపక్ చాహర్ (భారత్)- బంగ్లాదేశ్పై 3.2-0-7-6చదవండి: న్యూజిలాండ్ సిరీస్కు ముందే 'మరోసారి' రంగంలోకి దిగనున్న విరాట్ కోహ్లి -
ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన పాకిస్తాన్ కెప్టెన్
పాకిస్తాన్ టెస్ట్ జట్టు కెప్టెన్ షాన్ మసూద్ (Shan Masood) స్వదేశీ ఫస్ట్ క్లాస్ ఫార్మాట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ప్రెసిడెంట్స్ కప్ 2025-26లో భాగంగా సహారా అసోసియేట్తో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. సూయ్ నార్త్రన్ గ్యాస్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న షాన్.. 177 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. గతంలో పాకిస్తాన్ ఫస్ట్ క్లాస్ ఫార్మాట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు ఆ దేశ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హాక్ పేరిట ఉండేది. ఇంజమామ్ 1992లో ఇంగ్లండ్పై 188 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు. 33 ఏళ్ల తర్వాత షాన్ ఇంజమామ్ పేరిట ఉండిన రికార్డును బద్దలు కొట్టాడు.అయితే, పాకిస్తాన్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన విదేశీ ఆటగాడి రికార్డు మాత్రం నేటికీ భారత మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఖాతాలో ఉంది. సెహ్వాగ్ 2006లో జరిగిన లాహోర్ టెస్టులో 182 బంతుల్లో డబుల్ సెంచరీ కొట్టాడు.కాగా, యావత్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు షఫీకుల్లా షిన్వారి ఖాతాలో ఉంది. షిన్వారి ఆఫ్ఘనిస్తాన్ దేశవాలీ టోర్నీలో 89 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. షిన్వారి తర్వాత ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు ఇంగ్లండ్ ఆటగాడు కే కింబర్ పేరిట ఉంది. ఇంగ్లండ్ కౌంట్లీ అతను 100 బంతుల్లో ఈ ఫీట్ను సాధించాడు. షిన్వారి, కింబర్ తర్వాత ఈ రికార్డు భారత ఆటగాడు తన్మయ్ అగర్వాల్ పేరిట ఉంది. హైదరాబాద్కు చెందిన తన్మయ్ అరుణాచల్ ప్రదేశ్పై 119 బంతుల్లో డబుల్ పూర్తి చేశాడు. ఈ జాబితాలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి నాలుగో స్థానంలో ఉన్నాడు. రవి రంజీ ట్రోఫీలో భాగంగా బరోడాతో జరిగిన మ్యాచ్లో 123 బంతుల్లోనే డబుల్ పూర్తి చేశాడు. -
న్యూజిలాండ్ సిరీస్కు ముందే 'మరోసారి' రంగంలోకి దిగనున్న విరాట్
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) న్యూజిలాండ్ సిరీస్కు ముందే మరోసారి రంగంలోకి దిగనున్నాడు. ఇటీవలే విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరఫున రెండు మ్యాచ్లు ఆడిన విరాట్, ఇదే టోర్నీలో మరో మ్యాచ్ ఆడేందుకు సిద్దంగా ఉన్నాడు. జనవరి 6న ఆలుర్లో రైల్వేస్తో జరుగబోయే మ్యాచ్లో విరాట్ బరిలో ఉంటాడని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అత్యున్నత అధికారి ఒకరు క్రిక్బజ్కు లీక్ ఇచ్చారు. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే విరాట్ న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం జనవరి 7న భారత జట్టుతో పాటు బరోడాలో కలుస్తాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును అతి త్వరలో ప్రకటిస్తారు. ఈ జట్టులో విరాట్ ఉండటం లాంఛనమే. టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ ఫార్మాట్లో విరాట్ ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడు. గత ఆరు ఇన్నింగ్స్ల్లో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు చేసి పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్లు ఆడిన విరాట్.. ఓ సెంచరీ (ఆంధ్రపై 131), ఓ హాఫ్ సెంచరీ (గుజరాత్పై 77) చేశాడు. విరాట్ రైల్వేస్తో జరుగబోయే మ్యాచ్లోనూ సత్తా చాటితే న్యూజిలాండ్ సిరీస్కు ముందు టీమిండియాకు అదనపు ధైర్యం వస్తుంది.విరాట్ తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో వరుసగా రెండు సెంచరీలు (135, 102), ఓ హాఫ్ సెంచరీ (65 నాటౌట్) చేశాడు. అంతకుముందు ఆస్ట్రేలియా పర్యటనలో తొలి రెండు మ్యాచ్ల్లో డకౌటైన విరాట్.. చివరి మ్యాచ్లో హాఫ్ సెంచరీ (74 నాటౌట్) చేసి ఫామ్లోకి వచ్చాడు. విరాట్ ఢిల్లీ జట్టులో ఉండటం వల్ల విజయ్ హజారే ట్రోఫీలో ఆ జట్టుకు కూడా అదనపు బలం చేకూరుతుంది.చదవండి: మహ్మద్ షమీకి బీసీసీఐ భారీ షాక్..! -
7 వికెట్లతో చెలరేగిన సీఎస్కే ఫాస్ట్ బౌలర్
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా హిమాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో మహారాష్ట్ర బౌలర్ రామకృష్ణ ఘోష్ చెలరేగిపోయాడు. 9.4 ఓవర్లలో 30 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 7 వికెట్లు తీశాడు. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో ఇది పదో అత్యుత్తమ ప్రదర్శన. ఈ టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఇద్దరు 8 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేయగా.. ఘోష్తో పాటు 10 మంది 7 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు.తాజా మ్యాచ్లో ఘోష్ చెలరేగడంతో హిమాచల్ ప్రదేశ్ 49.4 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటైంది. పుఖ్రాజ్ మన్ (110) సెంచరీ చేయడంతో హెచ్పీ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. హెచ్పీ ఇన్నింగ్స్లో మన్కు వైభవ్ అరోరా (40), అమన్ప్రీత్ సింగ్ (30), నితిన్ శర్మ (21) ఓ మోస్తరుగా సహకరించారు.అనంతరం ఛేదనలో మహారాష్ట్ర కూడా తడబడుతుంది. 11.3 ఓవర్లలో 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, అంకిత్ బావ్వే (4) ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. వైభవ్ అరోరా, ధలివాల్ తలో వికెట్ తీశారు.కాగా, ఈ మ్యాచ్లో బంతితో చెలరేగిన రామకృష్ణ ఘోష్ను చెన్నై సూపర్ కింగ్స్ 2026 వేలానికి ముందు రీటైన్ చేసుకుంది. ఘెష్ను సీఎస్కే 2025 వేలంలో 30 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. కుడి చేతి వాటం ఫాస్ట్ మీడియం బౌలర్ అయిన 28 ఏళ్ల ఘోష్ గత సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయినా సీఎస్కే యాజమాన్యం అతనిపై నమ్మకం పెట్టుకొని తిరిగి రీటైన్ చేసుకుంది. ఘోష్ లోయర్ ఆర్డర్లో ఉపయోగకరమైన బ్యాటర్ కూడా. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతను 11 మ్యాచ్ల్లో 2 హాఫ్ సెంచరీల సాయంతో 443 పరుగులు చేశాడు. లిస్ట్-ఏ ఫార్మాట్లోనూ అతను ఓ మోస్తరుగా రాణించాడు. 4 ఇన్నింగ్స్ల్లో ఓ హాఫ్ సెంచరీ చేశాడు. -
సెలక్టర్లకు వార్నింగ్.. భారీ సెంచరీతో చెలరేగిన ధ్రువ్ జురెల్
న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మరో నాలుగు రోజుల్లో ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో సెలక్టర్లకు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ సూపర్ సెంచరీతో సవాల్ విసిరాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఉత్తరప్రదేశ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ధ్రువ్ జురెల్.. రాజ్కోట్లో బరోడా జరుగుతున్న మ్యాచ్లో భారీ సెంచరీతో చెలరేగాడు.మూడో స్దానంలో బ్యాటింగ్కు వచ్చిన ధ్రువ్.. టీ20 తరహాలో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓ వైపు వికెట్లు పడతున్నప్పటికి అతడు మాత్రం తన జోరును తగ్గించలేదు. యూపీ కెప్టెన్ రింకూ సింగ్తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో జురెల్ కేవలం 78 బంతుల్లోనే తన తొలి లిస్ట్-ఎ క్రికెట్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు.ఓవరాల్గా ఓవరాల్గా 101 బంతులు ఎదుర్కొన్న జురెల్.. 15 ఫోర్లు, 8 బంతుల్లో 160 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు రింకూ సింగ్ 67 బంతుల్లో 63 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 369 పరుగుల భారీ స్కోర్ సాధించింది. బరోడా బౌలర్లలో యువ పేసర్ రాజ్ లింబానీ నాలుగు వికెట్లతో చెలరేగాడు.రేసులో కిషన్-డిజేకాగా న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు భారత జట్టులో సెకెండ్ వికెట్ కీపర్ బ్యాటర్గా ఎవరికి చోటు దక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. కేఎల్ రాహుల్ మెయిన్ వికెట్ కీపర్ బ్యాటర్గా ఉండగా.. అతడికి బ్యాకప్గా కిషన్-పంత్-జురెల్ మధ్య పోటీ నెలకొంది. అయితే పంత్ను వన్డే జట్టు నుంచి తప్పించనున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో కిషన్-జురెల్లో ఎవరికో ఒకరికి చోటు దక్కే అవకాశముంది. ఇద్దరూ కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. జురెల్ గత కొన్ని సిరీస్లకు వన్డే జట్టులో ఉన్నప్పటికి.. ఇప్పటివరకు మాత్రం ఇంకా డెబ్యూ చేయలేదు. కిషన్ కూడా ఈ దేశవాళీ వన్డే టోర్నీ తొలి మ్యాచ్లోనే శతక్కొట్టాడు. దీంతో సెలక్టర్లు మరి ఎవరి వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి.చదవండి: ఆస్ట్రేలియా బ్యాటర్ విధ్వంసం.. టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిప్టీ! -
ఆస్ట్రేలియా బ్యాటర్ విధ్వంసం.. టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిప్టీ!
మహిళల టీ20 క్రికెట్లో మరో వేగవంతమైన అర్ధసెంచరీ నమోదైంది. ఆస్ట్రేలియాకు చెందిన లౌరా హారిస్ న్యూజిలాండ్లో జరుగుతున్న టి20 లీగ్లో ఈ ఘనత సాధించింది. కేవలం 15 బంతుల్లో ఆమె ఫిఫ్టీ బాదింది. కివీస్ లీగ్ టోర్నీ ఉమెన్ సూపర్ స్మాష్ (డబ్ల్యూఎస్ఎస్)లో ఒటాగో జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె ఆదివారం కాంటర్బరీతో జరిగిన మ్యాచ్లో చెలరేగింది.అలెగ్జాండ్రాలోని మోలినెక్స్ పార్క్లో జరిగిన ఈ మ్యాచ్లో లౌరా (15 బంతుల్లో 52; 6 ఫోర్లు, 4 సిక్స్లు) దంచేసింది. తద్వారా 2022లో వారి్వక్షైర్ తరఫున మేరి కెల్లీ చేసిన (15 బంతుల్లో ఫిఫ్టీ) రికార్డును సమం చేసింది. లౌరా వీరబాదుడుతో 146 పరుగుల లక్ష్యాన్ని 15వ ఓవర్లోనే ఛేదించిన ఒటాగో ఈ మ్యాచ్లో బోనస్ పాయింట్తో గెలిచింది.ఈ సీజన్ మహిళల బిగ్బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్)లో నిరాశపరిచిన లౌరా.. న్యూజిలాండ్లో మెరుపులు మెరిపించింది. అయితే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ ఆమెకిదే మొదటిది కాదు. ఓవరాల్ టి20 లీగ్లలోనే ఆరుసార్లు 50 పైచిలుకు (ఫిఫ్టీలు) పరుగులు చకచకా చేసిన ఘనత ఆమెకు ఒక్కరికే దక్కుతుంది.మూడుసార్లు 18 బంతుల్లో, ఒకసారి 19 బంతుల్లో, ఇంకోసారి 17 బంతుల్లో, ఇప్పుడేమో 15 బంతుల్లో ధనాధన్ అర్ధశతకాల్ని బాదింది. ప్రత్యేకించి మహిళల టి20 క్రికెట్, లీగ్లలో ఆమె తప్ప ఇంకెవరూ ఒకసారి మించి వేగవంతమైన అర్ధసెంచరీల్ని బాదలేకపోయారు. చదవండి: మహ్మద్ షమీకి బీసీసీఐ భారీ షాక్..! -
న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు టీమిండియా స్టార్లు దూరం!
న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ముందు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్కు భారత స్టార్ ప్లేయర్లు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. టీ20 వరల్డ్ కప్ 2026 దృష్ట్యా సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.వన్డేలకు దూరంగా ఉండనున్న హార్దిక్-బుమ్రా.. తిరిగి జనవరి 21 నుండి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో మాత్రం ఆడనున్నాడు. ఈ టీ20 సిరీస్ ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జరగనుంది. మొత్తం ఐదు మ్యాచ్లలోనూ వారిద్దరూ ఆడనున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్కు కూడా వర్క్ లోడ్ మెనెజ్మెంట్లో భాగంగా వీరిద్దరి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. సఫారీలతో టీ20 సిరీస్లో మాత్రం ఆడారు. ఇప్పుడు అదే జరగనుంది. హార్దిక్ పాండ్యా ఈ ఏడాది మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత ఇప్పటివరకు ఒక్క వన్డే కూడా ఆడలేదు. అదే విధంగా జస్ప్రీత్ బుమ్రా 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత వన్డే ఫార్మాట్కు దూరంగా ఉండనున్నాడు.బుమ్రా టెస్టుల్లో దుమ్ములేపుతుంటే.. పాండ్యా టీ20ల్లో అదరగొడుతున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన టీ 20 సిరీస్లో పాండ్యా ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు. ఒకవేళ కివీస్తో జరిగే వన్డే సిరీస్కు పాండ్యా దూరమైతే ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి జట్టులో దక్కనుంది. ఈ వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. కెప్టెన్ శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సైతం తిరిగి జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది.కివీస్తో వన్డేలకు భారత జట్టు (అంచనా)శుభ్మన్ గిల్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ /ఇషాన్ కిషన్ , రుతురాజ్ గైక్వాడ్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్చదవండి: మహ్మద్ షమీకి బీసీసీఐ భారీ షాక్..! -
ఐదో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ఇదే.. స్టార్ ప్లేయర్ అవుట్
యాషెస్ సిరీస్ 2025-26 తుది అంకానికి చేరుకుంది. ఈ ప్రతిష్టాతక సిరీస్లో ఆఖరి టెస్టు జనవరి 4 నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు ఇంగ్లండ్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ గస్ అట్కిన్సన్ తొడ కండరాల గాయం కారణంగా ఐదో టెస్టుకు దూరమయ్యాడు.బాక్సింగ్ డే టెస్ట్ రెండో రోజు ఆట సందర్భంగా బౌలింగ్ చేసే క్రమంలో అట్కిన్సన్ తొడ వెనక కండరాలు పట్టేశాయి. అనంతరం స్కాన్ రిపోర్ట్లో గాయం తీవ్రత గ్రేడ్-1గా ఉన్నట్లు తేలింది. దీంతో అతడికి దాదాపు మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్ సేవలను కోల్పోయిన ఇంగ్లండ్ జట్టుకు నిజంగా ఇది భారీ షాక్ అని చెప్పాలి. అయితే ఈ సిరీస్లో అట్కిన్సన్ తన స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.అట్కిన్సన్ తొలి టెస్టులో ఒక్క వికెట్ కూడా సాధించికపోయినప్పటికి.. బ్రిస్బేన్లో మాత్రం 3 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం అడిలైడ్ టెస్టు నుంచి తప్పించారు. ఆ తర్వాత ఆర్చర్ గాయపడడంతో అట్కిన్సన్ తిరిగి బాక్సింగ్ డే టెస్టు కోసం తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్లో మూడు కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ చారిత్రత్మక విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా ఈ సిరీస్లో అతడు మూడు మ్యాచ్లు ఆడి 6 వికెట్లు పడగొట్టాడు.పాట్స్ ఎంట్రీ?ఇక ఐదో టెస్టులో అట్కిన్సన్ స్థానంలో మాథ్యూ పాట్స్ ప్లేయింగ్ ఎలెవన్లో రానున్నట్లు తెలుస్తోంది. బ్రైడన్ కార్స్, జోష్ టంగ్తో కలిసి మాథ్యూ పాట్స్ బౌలింగ్ బాధ్యతలు పంచుకునే అవకాశముంది. ఒక వేళ సిడ్నీ పిచ్ కండీషన్స్ బట్టి స్పిన్నర్ ఆడించాలనుకుంటే షోయబ్ బషీర్ను తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ యాషెస్ సిరీస్ను ఇంగ్లండ్ ఇప్పటికే 3-1 తేడాతో కోల్పోయింది. ఆఖరి మ్యాచ్లో గెలిచి తమ పరువు నిలబెట్టుకోవాలని స్టోక్స్ సేన భావిస్తోంది.సిడ్నీ టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు:బెన్ స్టోక్స్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్స్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, మాథ్యూ ఫిషర్, విల్ జాక్స్, ఓలీ పోప్, మాథ్యూ పాట్స్, జో రూట్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), జోష్ టంగ్. -
నీకు బీర్ కావాలా? అదిరిపోయే సమాధానమిచ్చిన ఇంగ్లండ్ స్టార్
యాషెస్ నాలుగో టెస్టుకు ముందు ఇంగ్లండ్ జట్టుపై తీవ్ర స్ధాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక సిరీస్లో వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లు.. రిలాక్స్ అవ్వడానికి క్వీన్స్ల్యాండ్లోని నూసాకు వెళ్లారు. అయితే ఈ బ్రేక్లో ఇంగ్లీష్ ఆటగాళ్లు మితిమీరి మద్యం సేవించినట్లు వార్తలు వచ్చాయి.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ మద్యం మత్తులో రోడ్డుపై తిరుగుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. రోడ్డుపై ఎటు వెళ్లాలో కూడా తెలియని పరిస్థితిలో డకెట్ కన్పించాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సీరియస్గా తీసుకుంది. ఈ ఘటనపై ఇంగ్లండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ విచారణకు ఆయన ఆదేశించారు.ఈ నేపథ్యంలో మెల్బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో బెన్ డకెట్ను ఆస్ట్రేలియా ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. రెండో రోజు ఆటలో డకెట్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా.. ఓ అభిమాని అతడిని ఎగతాళి చేస్తూ "నీకు ఒక బీర్ కావాలా?" అని గట్టిగా అరిచాడు. వెంటనే అభిమానుల వైపు చూస్తూ, డకెట్ నవ్వుతూ.. "సరే, తీసుకురండి చూద్దాం!" అన్నట్లుగా బీరు తాగే సైగలు చేశాడు.అతడి సమాధానం విన్న ప్రేక్షకులందరూ ఫిదా అయిపోయి చప్పట్లతో అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 15 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లండ్ తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది. అయితే ఇప్పటికే 3-1 తేడాతో ఇంగ్లండ్ సిరీస్ను కోల్పోయింది.చదవండి: మహ్మద్ షమీకి బీసీసీఐ భారీ షాక్..! -
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కన్ను మూత
ఇంగ్లండ్ క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు మాజీ క్రికెటర్ హ్యూగ్ మోరిస్ (62) కన్నుముశారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్న మోరిస్ ఆదివారం మృతి చెందారు. మోరిస్ సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించిన గ్లామోర్గాన్ కౌంటీ జట్టు ఒక ప్రకటనలో సంతాపం తెలిపింది. ఆటగాడిగానే కాకుండా... సీఈఓ గానూ క్లిష్ట పరిస్థితుల్లో క్లబ్ను ఆర్ధిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించినట్లు అందులో పేర్కొంది. (Hugh Morris Death)ఇంగ్లండ్ తరఫున 3 టెస్టులు ఆడిన మోరిస్... ఫస్ట్క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారించారు. ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు సీఈఓగాను మోరిస్ బాధ్యతలు నిర్వర్తించారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 314 మ్యాచ్లాడిన ఈ ఓపెనర్... 19,785 పరుగులు చేశారు. అందులో 53 సెంచరీలు, 98 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో 274 మ్యాచ్ల్లో 8606 పరుగులు చేశారు. -
మహ్మద్ షమీకి బీసీసీఐ భారీ షాక్..!
2025-26 సీజన్కు గాను భారత పురుషల క్రికెట్ జట్టు సెంట్రల్ కాంట్రాక్టులను ప్రకటించేందుకు బీసీసీఐ సిద్దమైంది. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ముందు ఈ జాబితా వెలువడే అవకాశముంది. అయితే ఈసారి సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో పలు మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను డిమోట్ చేయనున్నట్లు సమాచారం. రో-కో ప్రస్తుతం గ్రేడ్ 'ఎ' ప్లస్లో ఉన్నారు. అయితే వీరిద్దరూ ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతుండడంతో కాంట్రాక్ట్లో మార్పు చోటు చేసుకునే అవకాశముంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం మూడు ఫార్మాట్లలో ఆడేవారికే గ్రేడ్ ఎ ప్లస్ దక్కుతుంది. మరోవైపు వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్మన్ గిల్కు ప్రమోషన్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తుందంట. గిల్ గ్రేడ్ ఎ నుంచి ఎ ప్లస్కు వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి.షమీపై వేటు..ఇక స్టార్ పేసర్ మహ్మద్ షమీకి భారీ షాక్ తగిలే అవకాశముంది. గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న షమీని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించే యోచనలో బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. షమీ చివరగా భారత్ తరపున ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడాడు.బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కాలంటే సదరు ఆటగాడు ఒక ఏడాదిలో నిర్ణీత సంఖ్యలో మ్యాచ్లు ఆడాలి లేదా జట్టు ఎంపికకు అందుబాటులో ఉండాలి. కానీ షమీ ఈ ఏడాది మార్చి నుంచి ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ క్రమంలోనే అతడిపై వేటు వేసేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.షమీ ప్రస్తుతం గ్రేడ్-ఎలో ఉన్నాడు. అందుకు గాను ఏడాదికి రూ.5 కోట్లు వేతనం అందుకుంటున్నాడు. షమీకి ఒకవేళ ఇప్పుడు కాంట్రాక్ట్ దక్కకపోయినా.. ఏడాది మధ్యలో జట్టులోకి వచ్చి 3 టెస్టులు లేదా 8 వన్డేలు లేదా 10 టీ20లు ఆడితే ఆటోమేటిక్గా ప్రో-రాటా పద్ధతిలో కాంట్రాక్ట్ దక్కుతుంది.షమీ ప్రస్తుతం దేశవాళీ టోర్నీల్లో క్రమం తప్పకుండా ఆడుతున్నాడు. అతడు పూర్తి ఫిట్నెస్తో కన్పిస్తున్నాడు. అంతేకాకుండా సూపర్ ఫామ్లో ఉన్నాడు. అయినప్పటికి సెలక్టర్లు అతడిని జాతీయ జట్టులోకి తీసుకోవడం లేదు. అదేవిధంగా షమీతో పాటు మరో బెంగాల్ స్పీడ్ స్టార్ కూడా తన కాంట్రాక్ట్ను కోల్పోయే అవకాశముంది.తిలక్ వర్మ, అర్ష్దీప్కు ప్రమోషన్..ఇక టీ20 క్రికెట్లో దుమ్ములేపుతున్న హైదరాబాదీ తిలక్ వర్మకు ప్రమోషన్ దక్కే అవకాశముంది. తిలక్ ప్రస్తుతం గ్రేడ్ సిలో ఉన్నాడు. అతడు గ్రేడ్-సి నుంచి గ్రేడ్-బికి వెళ్లనున్నట్లు సమాచారం. అదేవిధంగా పేసర్ అర్ష్దీప్ సింగ్ కాంట్రాక్ట్ కూడా మారనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అర్ష్దీప్ టీ20లతో పాటు వన్డే జట్టులోనూ కీలక సభ్యునిగా ఉన్నాడు. తిలక్తో పాటు అర్ష్దీప్ సైతం గ్రేడ్-సి నుంచి బికి వెళ్లే సూచనలు కన్పిస్తున్నాయి.బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా 2024-2025..గ్రేడ్ ప్లస్: విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాగ్రేడ్ ఎ: రిషబ్ పంత్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభమన్ గిల్, హార్దిక్ పాండ్యగ్రేడ్ బి: సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, శ్రేయాస్ అయ్యర్, యశస్వి జైస్వాల్గ్రేడ్ సి: రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ రాశి వరుణ్, అభిషేక్ దీప్వర్త్ శర్మబీసీసీఐ A+ గ్రేడ్లో ఉన్న ఆటగాళ్లకు ఏడాదికి రూ. 7 కోట్లు, A గ్రేడ్లో ఉన్నవారికి రూ. 5 కోట్లు, B గ్రేడ్లో ఉన్నవారికి రూ. 3 కోట్లు, C గ్రేడ్లో ఉన్నవారికి రూ. కోటి వార్షిక జీతంగా ఇస్తుంది.చదవండి: భారత్ తరపున ఆడాడు.. కట్ చేస్తే! ఊహించని షాక్చిన పాకిస్తాన్ -
క్రికెట్ ఆ్రస్టేలియాకు రూ. 60 కోట్ల నష్టం!
మెల్బోర్న్: సొంతగడ్డపై జరుగుతున్న ‘యాషెస్’ సిరీస్కు అభిమానుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తున్నా... ఆర్థికంగా మాత్రం క్రికెట్ ఆ్రస్టేలియాకు నష్టాలు తప్పేలా లేవు. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన నాలుగు టెస్టుల్లో మూడింట గెలిచిన ఆతిథ్య ఆసీస్ సిరీస్ నిలబెట్టుకుంది. అయితే వీటిలో రెండు టెస్టు మ్యాచ్లు రెండు రోజుల్లోనే ముగిశాయి. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రెండు రోజుల్లోనే ఫలితం రాగా... మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరిగిన నాలుగోదైన ‘బాక్సింగ్ డే’ టెస్టు మ్యాచ్ కూడా రెండు రోజుల్లోనే ముగిసింది. చివరి మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు శుక్రవారం తొలి రోజు రికార్డు స్థాయిలో 94,199 మంది అభిమానులు మైదానానికి తరలిరాగా... శనివారం రెండో రోజు 92,045 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. మూడో రోజు కోసం కూడా 90 వేల మందికి పైగా టికెట్లు కొనుగోలు చేసుకున్నారు. అయితే పిచ్ పేసర్లకు ఇతోధిక సాయం చేయడంతో ఈ మ్యాచ్లో తొలి రోజే 20 వికెట్లు నేలకూలాయి. ఇక రెండో రోజు 16 వికెట్లు పడగా... ఆరు సెషన్లలోపే ఫలితం తేలింది. దీంతో మూడో రోజు టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులకు నిరాశ తప్పలేదు. ఇలా సిరీస్లో రెండు మ్యాచ్లు రెండు రోజుల్లోనే ముగియడంతో క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ)కు 10 మిలియన్ ఆ్రస్టేలియా డాలర్లు (రూ. 60.22 కోట్లు) నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఎంసీజీ పిచ్పై దుమారం ‘బాక్సింగ్ డే’ టెస్టు రెండు రోజుల్లోనే ముగియడంతో క్రీడాభిమానులతో పాటు విశ్లేషకులు, మాజీ ప్లేయర్లు సైతం అసహనం వ్యక్తం చేస్తునున్నారు. ఆస్ట్రేలియాలో కాకుండా మరెక్కడైనా ఇలా రెండు మ్యాచ్లు రెండు రోజుల్లోనే ముగిసిఉంటే పెద్దఎత్తున చర్చ జరిగేదని ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ నిప్పు రాజేయగా... దీనిపై తీవ్ర చర్చ సాగుతోంది. ఎంసీజీ పిచ్పై 10 మిల్లీ మీటర్ల కన్నా ఎక్కువ పచ్చికను సిద్ధం చేశారని... ఇలా అయితే ఆటలో సమతుల్యత దెబ్బతింటుందని పలువురు మాజీ ఆటగాళ్లు అభిప్రాయ పడుతున్నారు. ‘మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగియడం అసంతృప్తినిచి్చంది. తొలి రోజు పిచ్ అనూహ్యంగా స్పందించి పేసర్లకు సాయం చేసింది. ఇందులో మా ప్రమేయం లేదు. మంచి స్పోర్టింగ్ వికెట్ తయారు చేయాలనుకున్నాం. ఇలాంటి తప్పులు మళ్లీ జరగకుండా చూసుకుంటాం’ అని ఎంసీజీ క్యూరేటర్ మాథ్యూ పేజ్ పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్లో ఇరు జట్ల తరఫున అత్యధిక స్కోరర్గా నిలిచిన ఆసీస్ ఓపెనర్ హెడ్ మాట్లాడుతూ... ‘మ్యాచ్ అన్నాక ఎవరో ఒకరు విజయం సాధించడం ఖాయం. బంతికి, బ్యాట్కు మధ్య పోరాటాన్ని అభిమానులు ఆస్వాదిస్తారు. అడిలైడ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇది కనిపించింది. ఎంసీజీలో మాత్రం ఇలా జరగలేదు’ అని అన్నాడు. -
అదే జోరు... అదే ఫలితం
తిరువనంతపురం: బౌలింగ్ ప్రతాపం... ‘హ్యాట్రిక్’ విజయాలతో ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు... తాజాగా బ్యాటింగ్ విధ్వంసంతో ఆధిక్యాన్ని 4–0కు పెంచుకుంది. ఆదివారం జరిగిన నాలుగో టి20లో హర్మన్ప్రీత్ బృందం 30 పరుగుల తేడాతో శ్రీలంకపై నెగ్గింది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతి మంధాన (48 బంతుల్లో 80; 11 ఫోర్లు, 3 సిక్స్లు), షఫాలీ వర్మ (46 బంతుల్లో 79; 12 ఫోర్లు, 1 సిక్స్)లతో పాటు ఆఖర్లో రిచా ఘోష్ (16 బంతుల్లో 40 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్లు) దంచేశారు. అనంతరం కష్టమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసి పోరాడి ఓడింది. భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. జెమీమా రోడ్రిగ్స్ అస్వస్థత కారణంగా హర్లీన్ డియోల్, క్రాంతి గౌడ్ స్థానంలో అరుంధతి రెడ్డి తుది జట్టుకు ఆడారు. మంగళవారం ఇదే వేదికపై ఆఖరి పోరు జరుగుతుంది. సెంచరీ భాగస్వామ్యం ఈ సిరీస్లో ఆశించిన దూకుడు కనబర్చలేకపోయిన స్మృతి మంధాన ఈ మ్యాచ్లో తన శైలీ ఆటతీరుతో అలరించింది. ఓ వైపు షఫాలీ, మరోవైపు మంధాన లంక బౌలర్ల భరతం పట్టారు. దీంతో పవర్ప్లేలో 61/0 స్కోరు చేసింది. దూకుడు అంతకంతకూ పెరగడంతో 10.5 ఓవర్లలోనే భారత్ స్కోరు 100కు చేరింది. షఫాలీ 30 బంతుల్లో, మంధాన 35 బంతుల్లో అర్ధసెంచరీలను పూర్తి చేసుకున్నారు. వీరిద్దరి ధనాధన్ కొనసాగడంతో 14.2 ఓవర్లలోనే భారత్ 150 మార్క్ దాటింది. ఈ క్రమంలో 2019లో వెస్టిండీస్పై చేసిన 143 పరుగుల భాగస్వామ్యాన్ని మెరుగుపర్చుకున్నారు. తర్వాత 162 స్కోరు వద్ద షఫాలీ, 6 పరుగుల వ్యవధిలో స్మృతి అవుటయ్యారు. తర్వాత వచ్చిన రిచా ఘోష్ భారీ సిక్స్లు, ఫోర్లతో విరుచుకుపడింది. రిచా, హర్మన్ప్రీత్ (16 నాటౌట్) అబేధ్యమైన మూడో వికెట్కు 23 బంతుల్లోనే 53 పరుగులు జోడించారు. రిచా మెరుపుల వల్లే భారత్ టి20 ఫార్మాట్లో తమ అత్యధిక స్కోరు (221/2) నమోదు చేసింది. ఈసారి పోరాడి... గత మూడు మ్యాచ్లతో పోలిస్తే లంక బ్యాటింగ్ తీరు పూర్తిగా మారింది. పెద్ద లక్ష్యం ముందు మోకరిల్లుతుందనుకుంటే ఆఖరి దాకా పోరాడి ఓడింది. కెపె్టన్ చమరి ఆటపట్టు (37 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్స్లు), హాసిని (33; 7 ఫోర్లు) తొలి వికెట్కు 59 పరుగులు జోడించారు. తర్వాత ఇమిషా దులాని (29; 3 ఫోర్లు), హర్షిత (20; 1 ఫోర్, 1 సిక్స్), నీలాక్షిక (11 బంతుల్లో 23 నాటౌట్; 4 ఫోర్లు) భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడంతో లంక ఓటమి అంతరాన్ని తగ్గించింది. స్కోరు వివరాలు భారత ఇన్నింగ్స్: స్మృతి మంధాన (సి) దులానీ (బి) శెహని 80; షఫాలీ (సి అండ్ బి) నిమషా 79; రిచా ఘోష్ (నాటౌట్) 40; హర్మన్ప్రీత్ (నాటౌట్) 16; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 221. వికెట్ల పతనం: 1–162, 2–168. బౌలింగ్: మల్షా శెహని 4–0–32–1, కావ్య 4–0–43–0, కవిషా 4–0–47–0, రష్మిక 2–0–25–0, చమరి 2–0–30–0, నిమష 4–0–40–1. శ్రీలంక ఇన్నింగ్స్: హాసిని (సి) హర్మన్ (బి) అరుంధతి 33; చమరి (సి) స్మృతి (బి) వైష్ణవి 52; ఇమిషా (రనౌట్) 29; హర్షిత (స్టంప్డ్) రిచా (బి) వైష్ణవి 20; కవిషా (సి) సబ్–కమలిని (బి) అరుంధతి 13; నీలాక్షిక (నాటౌట్) 23; రష్మిక (బి) శ్రీచరణి 5; కౌశిని (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 191. వికెట్ల పతనం: 1–59, 2–116, 3–140, 4–147, 5–170, 6–185. బౌలింగ్: రేణుక 3–0–32–0, అరుంధతి 4–0–42–2, దీప్తి 4–0–31–0, వైష్ణవి 4–0–24–2, అమన్జోత్ 1–0–10–0, శ్రీచరణి 4–0–46–1. 1 శ్రీలంక తరఫున 150 అంతర్జాతీయ టి20 మ్యాచ్లు ఆడిన తొలి మహిళా క్రికెటర్గా చమరి ఆటపట్టు నిలిచింది. నీలాక్షిక సిల్వా (107), ఉదేíÙక ప్రబోధిని (106) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్గా మహిళల క్రికెట్లో 150 టి20లు ఎనిమిదో ప్లేయర్గా చమరి గుర్తింపు పొందింది.80 మహిళల అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక సిక్స్లు కొట్టిన భారత బ్యాటర్గా స్మృతి గుర్తింపు పొందింది. 78 సిక్స్లతో హర్మన్ప్రీత్ పేరిట ఉన్న రికార్డును స్మృతి సవరించింది.1703 ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో స్మృతి చేసిన పరుగులు. ఒకే ఏడాది అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా తన పేరిటే ఉన్న రికార్డును స్మృతి (2024లో 1659 పరుగులు) బద్దలు కొట్టింది.4 తొలి వికెట్కు స్మృతి, షఫాలీ 100 కంటే ఎక్కువ పరుగులు జత చేయడం ఇది నాలుగోసారి.221 టి20ల్లో భారత జట్టు తమ అత్యధిక స్కోరు సాధించింది. గత ఏడాది వెస్టిండీస్పై సాధించిన 217/4 స్కోరును భారత్ అధిగమించింది. టి20ల్లో భారత్ 200 అంతకంటే ఎక్కువ పరుగులు చేయడం ఇది నాలుగోసారి.162 ఓపెనర్లు స్మృతి, షఫాలీ తొలి వికెట్కు జోడించిన పరుగులు. టి20ల్లో ఏ వికెట్కైనా భారత్కిదే అతిపెద్ద భాగస్వామ్యం.4 మహిళా క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 10 వేల పరుగుల క్లబ్లో చేరిన నాలుగో బ్యాటర్ స్మృతి. ఈమె కంటే ముందు మిథాలీ, సుజీ బేట్స్ (న్యూజిలాండ్), చార్లోటి ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్) ఈ ఘనత సాధించారు. -
చరిత్ర సృష్టించిన స్మృతి మంధన.. టీమిండియా భారీ స్కోర్
రికార్డుల రారాణి, టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన మరో భారీ రికార్డు నెలకొల్పింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 10000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్గా ప్రపంచ రికార్డు సాధించింది. ఈ మైలురాయిని తాకేందుకు మంధనకు కేవలం 281 ఇన్నింగ్స్లే అవసరమయ్యాయి. గతంలో ఈ రికార్డు టీమిండియాకే చెందిన మిథాలీ రాజ్ పేరిట ఉండేది.మిథాలీ ఈ మైలురాయిని తన 291 ఇన్నింగ్స్లో తాకింది. తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో ఇవాళ (డిసెంబర్ 28) జరుగుతున్న నాలుగో టీ20లో మంధన ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్లో 48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసిన మంధన.. 28 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 10000 పరుగుల మైలురాయిని తాకింది.చరిత్రలో కేవలం నాలుగో ప్లేయర్మహిళల అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు నలుగురు మాత్రమే 10000 పరుగులు పూర్తి చేసుకున్నారు. వీరిలో మంధన నాలుగో క్రికెటర్గా నిలిచింది. ఈమెకు ముందు టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ (10868), న్యూజిలాండ్కు చెందిన సూజీ బేట్స్ (10652), ఇంగ్లండ్కు చెందిన చార్లోట్ ఎడ్వర్డ్స్ (10273) మాత్రమే ఈ ఘనత సాధించారు.టీమిండియా భారీ స్కోర్తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న నాలుగో టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు స్మృతి మంధన (48 బంతుల్లో 80; 11 ఫోర్లు, 3 సిక్సర్లు), షఫాలీ వర్మ (46 బంతుల్లో 79; 12 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఆఖర్లో రిచా ఘోష్ (16 బంతుల్లో 40 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా తుఫాన్ ఇన్నింగ్స్ ఆడింది.సిరీస్ ఇదివరకే కైవసం కాగా, టీమిండియా స్వదేశంలో శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు పూర్తి కాగా.. మూడింట టీమిండియానే గెలిచింది. తద్వారా మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. -
45 సిక్సర్లతో భయోత్పాతం సృష్టించిన అభిషేక్ శర్మ
టీమిండియా విధ్వంసకర బ్యాటర్, వరల్డ్ నంబర్ వన్ టీ20 ప్లేయర్ అభిషేక్ శర్మ వచ్చే ఏడాది జరుగబోయే టీ20 వరల్డ్కప్కు ముందు తన ఉద్దేశాలను మరోసారి స్పష్టం చేశాడు. ఎదుర్కొన్న ప్రతి బంతిని సిక్సర్గా మలచడమే లక్ష్యంగా పెట్టుకున్న అభిషేక్.. తన తాజా ప్రదర్శనతో క్రికెట్ సర్కిల్స్లో భయోత్పాతం సృష్టించాడు.ప్రస్తుతం పంజాబ్ కెప్టెన్గా విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్న ఈ సిక్సర్ల వీరుడు.. ఇవాళ (డిసెంబర్ 28) జైపూర్లోని అనంతం గ్రౌండ్లో జరిగిన ప్రాక్టీస్ సెషన్లో సిక్సర్ల సునామీ సృష్టించాడు. ఏకంగా 45 సిక్సర్లు బాది, అక్కడున్న వారిలో (ట్రిబ్యూన్ రిపోర్టర్ల కథనం) భయాందోళనలు పుట్టించాడు. ఈ విషయాన్ని ట్రిబ్యూన్ మీడియాకు చెందిన రిపోర్టర్లు నివేదించారు.వారి నివేదిక ప్రకారం.. పంజాబ్ రేపు జరుగబోయే విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లో (జైపూర్లోని అనంతం క్రికెట్ గ్రౌండ్) ఉత్తరాఖండ్తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్లో అభిషేక్ శర్మ శివాలెత్తిపోయాడు. ఎదుర్కొన్న ప్రతి బంతిని భారీ షాట్ ఆడి, ఏకంగా 45 సిక్సర్లు బాదాడు. ఇది చూసి రిపోర్టర్లు సహా అక్కడున్న వారంతా నిర్ఘాంతపోయారు.ఈ స్థాయి విధ్వంసమేంటంటూ నోరెళ్లబెట్టారు. ప్రతి బంతిని బాదడమే ధ్యేయంగా పెట్టుకొన్న అభిషేక్.. స్పిన్నర్ల బౌలింగ్ను ఊచకోత కోశాడు. ఆఫ్ బ్రేక్, లెగ్ బ్రేక్, స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. దాదాపు ప్రతి బంతిని కవర్స్ మీదుగా సిక్సర్గా మలిచాడు. అభిషేక్ వీరంగం చూసి పంజాబ్ కోచ్ సందీప్ శర్మ అవాక్కైపోయాడు. ట్రిబ్యూన్ రిపోర్టర్లు నివేదించిన ఈ కథనం చూసి ప్రపంచ బౌలర్లంతా భయాందోళనలకు గురవుతుంటారు.వాస్తవానికి అభిషేక్ సిక్సర్ల వీరంగం గతేడాది ఆరంభం నుంచే మొదలైంది. ఈ ఏడాది చివర్లో అది తారాస్థాయికి చేరినట్లుంది. 2024 ఐపీఎల్తో మెరుపులు ప్రారంభించిన అభిషేక్ అప్పటినుంచి తానెదుర్కొన్న ప్రతి బౌలర్ను షేక్ చేస్తూనే వస్తున్నాడు. ఈ ఏడాది అతని సిక్సర్ల ప్రదర్శన శృతి మించింది. ఇప్పటివరకు ఆడిన 41 టీ20ల్లో ఏకంగా 108 సిక్సర్లు బాది, ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. కరణ్బీర్ సింగ్ (ఆస్ట్రియా), నికోలస్ పూరన్ (వెస్టిండీస్) మాత్రమే అభిషేక్ కంటే ముందున్నారు. -
శ్రీలంకతో నాలుగో టీ20.. తొలిసారి టీమిండియాకు చేదు అనుభవం
స్వదేశంలో భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు పూర్తి కాగా.. మూడింట టీమిండియానే గెలిచింది. తద్వారా మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది.ఈ క్రమంలో ఇవాళ (డిసెంబర్ 28) నాలుగో మ్యాచ్ జరుగనుంది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్లో భారత్ టాస్ కోల్పోవడం ఇదే తొలిసారి.ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో రెండు మార్పులు చేశాయి. భారత్ తరఫున జెమీమా రోడ్రిగ్స్, క్రాంతి గౌడ్ స్థానాల్లో హర్లీన్ డియోల్, అరంధతి రెడ్డి తుది జట్టులోకి వచ్చారు. శ్రీలంక తరఫున ఇనోకా, మదరా స్థానాల్లో కావ్య కవింది, రష్మిక సెవ్వంది ప్లేయింగ్ ఎలెవెన్లోకి వచ్చారు.తుది జట్లు..శ్రీలంక: హాసిని పెరెరా, చమరి అతపత్తు(సి), హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, ఇమేషా దులానీ, నీలక్షికా సిల్వా, కౌషని న్యూత్యాంగన(w), మల్షా షెహానీ, రష్మిక సెవ్వంది, కావ్య కవింది, నిమేషా మదుషానిభారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్ప్రీత్ కౌర్(సి), రిచా ఘోష్(w), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, రేణుకా సింగ్ ఠాకూర్, శ్రీ చరణి -
టీమిండియాకు గుడ్ న్యూస్.. స్టార్ ప్లేయర్ వచ్చేస్తున్నాడు..!
స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగబోయే వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. స్టార్ ప్లేయర్, వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి పూర్తిగా కోలుకొని రీఎంట్రీకి సిద్దంగా ఉన్నాడు. గత కొద్ది రోజులుగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో గడిపిన శ్రేయస్.. తాజాగా ఫిట్నెస్ టెస్ట్లన్నీ పూర్తి చేసుకొని, రీఎంట్రీకి అనుమతి పొందాడు. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ కీలక అధికారి మీడియాకు వెల్లడించారు.CoE నుంచి తుది క్లియరెన్స్ ఆధారంగా శ్రేయస్ షెడ్యూల్ నిర్ణయించబడుతుందని సదరు అధికారి తెలిపారు. ప్రస్తుతం శ్రేయస్ నెట్స్లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడని.. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని అన్నారు.సదరు అధికారి చెప్పిన విషయాల మేరకు.. శ్రేయస్ న్యూజిలాండ్తో వన్డే సిరీస్తో టీమిండియా తరఫున రీఎంట్రీ ఇస్తాడు. అంతకంటే ముందే ముంబై తరఫున విజయ్ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్లు ఆడతాడు. జనవరి 3న మహారాష్ట్రతో, 6న హిమాచల్ప్రదేశ్తో జరిగే మ్యాచ్ల్లో శ్రేయస్ బరిలోకి దిగుతాడు. ఆతర్వాత భారత వన్డే జట్టుతో కలుస్తాడు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ కోసం జనవరి 3 లేదా 4 తేదీల్లో భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జనవరి 11 (వడోదర), 14 (రాజ్కోట్), 18 (ఇండోర్) తేదీల్లో జరుగనుంది.కాగా, అక్టోబర్ 25న సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్లో శ్రేయస్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో క్యాచ్ అందుకునే ప్రయత్నంలో శ్రేయస్ పొత్తికడుపు భాగంలో తీవ్ర గాయమైంది. దీంతో అతడి స్ప్లీన్ (ప్లీహం) చీలికకు గురై, అంతర్గత రక్తస్రావం జరిగింది. వెంటనే అతడిని సిడ్నీలోని ఆసుపత్రికి తీసుకువెళ్లి ఐసీయూలో చికిత్స అందించారు.మూడు రోజుల తర్వాత శ్రేయస్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అనంతరం ముంబైకు తిరిగొచ్చిన అయ్యర్.. డాక్టర్ దిన్షా పార్దివాలా పర్యవేక్షణలో చికిత్స పొందాడు. -
మ్యాక్స్వెల్ ఖాతాలో భారీ సిక్సర్ల రికార్డు
ఆసీస్ విధ్వంసకర వీరుడు గ్లెన్ మ్యాక్స్వెల్ భారీ సిక్సర్ల రికార్డు చేరింది. బిగ్ బాష్ లీగ్ 2025-26 ఎడిషన్లో భాగంగా సిడ్నీ థండర్తో ఇవాళ (డిసెంబర్ 28) జరిగిన మ్యాచ్లో 2 సిక్సర్లు బాదిన మ్యాక్సీ.. బీబీఎల్ కెరీర్లో 150 సిక్సర్ల మార్కును దాటాడు. తద్వారా లీగ్ చరిత్రలో 150 సిక్సర్లు పూర్తి చేసుకున్న రెండో బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. మ్యాక్సీకి ముందు క్రిస్ లిన్ మాత్రమే 150 సిక్సర్ల మార్కును తాకాడు. లిన్ ఖాతాలో ప్రస్తుతం 220 సిక్సర్లు ఉన్నాయి.బీబీఎల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల టాప్-5 జాబితాలో లిన్, మ్యాక్సీ తర్వాతి స్థానాల్లో బెన్ మెక్డెర్మాట్ (140), ఆరోన్ ఫించ్ (118), మార్కస్ స్టోయినిస్ (111) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. సిడ్నీ థండర్పై మ్యాక్స్వెల్ ప్రాతినిథ్యం వహిస్తున్న మెల్బోర్న్ స్టార్స్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన థండర్.. హరీస్ రౌఫ్ (4-0-29-3), టామ్ కర్రన్ (4-0-22-2), స్టోయినిస్ (3-0-25-2), మిచెల్ స్వెప్సన్ (4-0-18-2), పీటర్ సిడిల్ (4-0-22-1) దెబ్బకు 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి 128 పరుగులకు ఆలౌటైంది. థండర్ ఇన్నింగ్స్లో షాదాబ్ ఖాన్ (25) టాప్ స్కోరర్ కాగా.. మాథ్యూ గిల్క్స్ (24), సామ్ బిల్లింగ్స్ (23) మాత్రమే 20కి పైగా స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లలో కొన్స్టాస్ 11, డేవిడ్ వార్నర్ 10, బాన్క్రాఫ్ట్ 10, డేనియల్ సామ్స్ 3, క్రిస్ గ్రీన్ 1, తన్వీర్ సంఘా 1, ర్యాన్ హ్యాడ్లీ 1 పరుగు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని మెల్బోర్న్ ఒకే వికెట్ కోల్పోయి 14 ఓవర్లలోనే ఛేదించింది. జో క్లార్క్ (37 బంతుల్లో 60; 8 ఫోర్లు, సిక్స్) మెరుపు అర్ద సెంచరీతో మెల్బోర్న్ను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లాడు. అనంతరం సామ్ హార్పర్ (29 నాటౌట్), మ్యాక్స్వెల్ (39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మిగతా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. -
ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజానికి అరుదైన గౌరవం
ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం బ్రెట్ లీకి (Brett Lee) అరుదైన గౌరవం దక్కింది. తాజాగా ఈ స్పీడ్గన్ స్వదేశీ (Australia) హాల్ ఆఫ్ ఫేమర్ల (Hall Of Fame) జాబితాలోకి ప్రవేశించాడు. అత్యంత అరుదైన ఈ జాబితాలో లీ 66వ ఆటగాడిగా చేరాడు. లీకి ముందు చాలామంది ఆసీస్ దిగ్గజాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.లీకి ముందు ఇదే ఏడాది (2025) మైఖేల్ క్లార్క్, మైఖేల్ బెవాన్, క్రిస్టినా మాథ్యూస్ ఆసీస్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ప్రవేశించారు. ఈ జాబితాలో డాన్ బ్రాడ్మన్, అలెన్ బోర్డర్, షేన్ వార్న్, రికీ పాంటింగ్ లాంటి దిగ్గజాలు ఉన్నారు.49 ఏళ్ల లీ దశాబ్దానికిపైగా (1999-2012) తన ఫాస్ట్ బౌలింగ్లో ప్రపంచ బ్యాటర్లను గడగడలాడించాడు. ప్రపంచ క్రికెట్లో ఆసీస్ ఆధిపత్యం కొనసాగించడంలో కీలకపాత్ర పోషించాడు. వికెట్లు తీయడం కంటే వేగానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన లీ.. కెరీర్లో ఎన్నో సార్లు స్పీడో మీటర్లు (బౌలింగ్ వేగాన్ని కోలిచే యంత్రం) బద్దలు కొట్టాడు.అత్యుత్తమంగా లీ గంటకు 161.1 కిమీ వేగంతో బంతిని సంధించాడు. క్రికెట్ చరిత్రలో ఇది రెండో వేగవంతమైన బంతిగా నేటికీ చలామణి అవుతుంది. లీ కంటే పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కేవలం 0.2 వేగాన్ని అధికంగా సాధించాడు.తనకు ఈ ప్రతిష్టాత్మక గౌరవం (ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేమ్) దక్కడం పట్ల లీ సంతోషం వ్యక్తం చేశాడు. తాను ఈ స్థాయికి రావడానికి కారణం పేస్ దిగ్గజం డెన్నిస్ లిల్లీ అని చెప్పాడు. తొమ్మిదేళ్ల వయసు నుంచి గంటకు 160 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయాలని కలలు కన్నట్లు తెలిపాడు. -
సొంత దేశ క్రికెట్ బోర్డునే కోర్టుకు లాగిన సౌతాఫ్రికా ప్లేయర్
సౌతాఫ్రికా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తబ్రేజ్ షంషి సొంత దేశ క్రికెట్ బోర్డునే (Cricket South Africa) కోర్టుకు లాగాడు. న్యాయపోరాటంలో విజయం కూడా సాధించాడు. జోహన్నెస్బర్గ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో క్రికెట్ సౌతాఫ్రికాకు షాక్ తగిలినట్లైంది. కోర్టు తీర్పు మేరకు షంషికి భారీ ఊరట లభించింది.అసలేం జరిగిందంటే..?SA20 వేలంలో షంషిని ఎం కేప్టౌన్ ఫ్రాంఛైజీ 5 లక్షల ర్యాండ్లకు సొంతం చేసుకుంది. అయితే ఈ డీల్కు షంషి నో చెప్పాడు. సమాంతరంగా ఇతర లీగ్లతో (ILT20, BBL) ఒప్పందాలు చేసుకున్నాడు. ఈ లీగ్ల్లో ఆడేందుకు షంషికి సొంత దేశ క్రికెట్ బోర్డు (CSA) అనుమతి తప్పనిసరి. ఇక్కడే షంషికి, క్రికెట్ సౌతాఫ్రికాకు వివాదం మొదలైంది.సొంత దేశ క్రికెట్ బోర్డు ఆథ్వర్యంలో జరిగే లీగ్ను కాదని, పరాయి దేశ లీగ్లు ఆడాలనుకున్న షంషికి CSA అనుమతి నిరాకరించింది. NOC ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. దీంతో షంషి జోహన్నెస్బర్గ్ హైకోర్టును ఆశ్రయించాడు. షంషి పిటీషన్పై విచారణ జరిపిన కోర్టు అతనికి అనుకూలంగానే తీర్పునిచ్చింది. షంషి విదేశీ లీగ్ల్లో పాల్గొంనేందుకు వీలుగా NOC జారీ చేయాలని క్రికెట్ సౌతాఫ్రికాను ఆదేశించింది. కోర్డు తీర్పు మేరకు షంషి ఇకపై ఏ విదేశీ లీగ్ల్లో అయినా ఆడుకోవచ్చు.ఈ కేసులో క్రికెట్ సౌతాఫ్రికా కూడా తమ వాదనలు వినిపించింది. బోర్డు నిబంధనల ప్రకారం.. SA20 వేలంలో కొనుగోలు చేయబడిన ఏ ఆటగాడైనా తప్పనిసరిగా లీగ్లో ఆడాలి. అయితే షంషి ఈ నిబంధనను ఉల్లంఘించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే NOC ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని కోర్టును తెలిపింది.అయితే క్రికెట్ సౌతాఫ్రికా వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఆటగాడి జీవనోపాధిని అడ్డుకోకూడదని మందలించింది. షంషి 2024 అక్టోబర్లోనే CSA సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్ల్లో ఆడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయినా, సౌతాఫ్రికా తరఫున ఐసీసీ టోర్నీల్లో ఆడేందుకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. -
గౌతమ్ గంభీర్పై వేటు.. తుది నిర్ణయం ప్రకటించిన బీసీసీఐ
టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ ప్రయాణం మిశ్రమ ఫలితాలతో కూడుకొని ఉంది. అతని మార్గదర్శకత్వంలో భారత జట్టు పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో అదరగొడుతున్నా.. టెస్ట్ల్లో మాత్రం తేలిపోతుంది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలొ క్లీన్ స్వీప్తో (0-3)మొదలైన గంభీర్ టెస్ట్ ప్రస్తానం (టీమిండియా హెడ్ కోచ్గా).. తాజాగా స్వదేశంలోనే సౌతాఫ్రికా చేతిలో క్లీన్ స్వీప్ (0-2) వరకు సాగింది.ఈ మధ్యలో గంభీర్ మార్గదర్శకత్వంలో భారత జట్టు ఒక్క విండీస్పై మాత్రమే సానుకూల ఫలితం (2-0) సాధించింది. దీనికి ముందు ఆసీస్ పర్యటనలో 1-3తో సిరీస్ కోల్పోయి, ఇంగ్లండ్ పర్యటనలో డ్రాతో (2-2) గట్టెక్కింది.టెస్ట్ల్లో పేలవ ట్రాక్ రికార్డు కలిగి ఉండటంతో పాటు అనునిత్యం వివాదాలతో సావాసం చేసే గంభీర్ను టెస్ట్ జట్టు హెడ్ కోచ్ విధుల నుంచి తప్పించాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి. త్వరలో గంభీర్పై వేటు ఖాయమని గత కొన్ని రోజులుగా సోషల్మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.గంభీర్ స్థానంలో భారత టెస్ట్ జట్టు హెడ్ కోచ్గా వీవీఎస్ లక్షణ్ ఎంపిక ఖరారైందని పలు జాతీయ మీడియా సంస్థలు కూడా కథనాలు ప్రసారం చేశాయి.ఇదే అంశంపై తాజాగా బీసీసీఐ స్పందించింది. కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. గంభీర్పై వేటు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. టెస్ట్ జట్టు విధుల నుంచి గంభీర్ను తప్పించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై వస్తున్న పుకార్లను కొట్టిపారేశారు. గంభీర్ టెస్ట్ జట్టు కోచ్గా కొనసాగడానికి మద్దతు ప్రకటించారు. సైకియా చేసిన ఈ ప్రకటనతో గంభీర్ టెస్ట్ హెడ్కోచ్మెన్షిప్పై ఊహాగానాలు తొలగిపోయాయి.ముందుంది ముసళ్ల పండగప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో (2005-27) గంభీర్ మార్గదర్శకత్వంలో భారత టెస్ట్ జట్టు పరిస్థితి దయనీయంగా ఉంది. గంభీర్ రాకకు ముందు వరుసగా రెండు డబ్ల్యూటీసీ సైకిల్స్లో ఫైనల్స్కు చేరిన టీమిండియా.. గత ఎడిషన్లో ఫైనల్స్కు చేరుకుండానే ఇంటిదారి పట్టింది. తాజా సైకిల్లో కూడా పరిస్థితి అలాగే కొనసాగుతుంది. ఈ సైకిల్లో భారత్ ఇప్పటివరకు ఆడిన 9 టెస్ట్ మ్యాచ్ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. ఈ సైకిల్లో టీమిండియా ఫైనల్కు చేరాలంటే ఇంకా ఆడాల్సిన 9 టెస్టుల్లో కనీసం 6 విజయాలు సాధించాలి. అయితే ఇలా జరగడం అంత ఈజీగా కనిపించడం లేదు. భారత్ తదుపరి ఐదు ఆస్ట్రేలియాతో, రెండు న్యూజిలాండ్తో ఆడాల్సిన ఉంది. మిగిలిన రెండు శ్రీలంకతో ఆడాల్సి ఉంది. శ్రీలంకపై టీమిండియా పైచేయి సాధించినా.. ఆసీస్, కివీస్పై గెలవడం మాత్రం అంత ఈజీగా కాదు. -
పొలార్డ్ విధ్వంసం.. ప్లే ఆఫ్స్కు ముంబై ఇండియన్స్
ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ILT20)లో ఎంఐ ఎమిరేట్స్ విజయపరంపర కొనసాగుతోంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం దుబాయ్ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఎంఐ ఎమిరేట్స్ ఘన విజయం సాధించింది. ఎమిరేట్స్కు ఇది వరుసగా ఐదో విజయం. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ తమ ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది. డిసెంబర్ 30న జరగనున్న క్వాలిఫైయర్ 1లో 'డెజర్ట్ వైపర్స్' జట్టుతో ఎమిరేట్స్ తలపడనుంది.ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎమిరేట్స్ బౌలర్ల ఆరంభం నుంచే ప్రత్యర్ది బ్యాటర్లకు చుక్కలు చూపించారు. స్పిన్నర్ అల్లా గజన్ఫర్ మూడు వికెట్లతో సత్తాచాటగా.. షకీబ్, మౌస్లీ, ఫరూఖీ తలా వికెట్ సాధించారు. దుబాయ్ క్యాపిటల్స్ బ్యాటర్లలో కెప్టెన్ మహ్మద్ నబీ(22) టాప్ స్కోరర్గా నిలిచాడు.పొలార్డ్ విధ్వంసం.. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఎమిరేట్స్కు ఓపెనర్లు మహమ్మద్ వసీం (27), ఆండ్రీ ఫ్లెచర్ (21) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. అయితే ఫ్లెయర్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కిరాన్ పొలార్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు.అబుదాబి మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ముఖ్యంగా స్పిన్నర్ వకార్ సలాంఖైల్కు చుక్కలు చూపించాడు. 14 ఓవర్ వేసిన సలాంఖైల్ బౌలింగ్లో పొలార్డ్ ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. ఆ ఓవర్లో కిరాన్ నాలుగు సిక్స్లు, ఒక ఫోర్ బాదాడు.ఈ ఒక్క ఓవర్తోనే మ్యాచ్ను ఏకపక్షం చేసేశాడు. ఫలితంగా 123 పరుగుల లక్ష్యాన్ని ఎమిరేట్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.2 ఓవర్లలో చేధించింది. పొలార్డ్ మొత్తంగా 31 బంతులు ఎదుర్కొని 5 సిక్సర్లు, ఒక ఫోర్తో 44 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. -
క్యాచ్ పట్టాడు.. కోటీశ్వరుడు అయ్యాడు! వీడియో వైరల్
క్రికెట్ మ్యాచ్కు చూసేందుకు స్టేడియం వెళ్లిన ఓ అభిమానిని అదృష్టం వరించింది. ఒక్క క్యాచ్తో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అవును మీరు విన్నది నిజమే. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే. సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26 తొలి మ్యాచ్లో పరుగుల వరద పారింది.ఎంఐ కేప్ టౌన్, డర్బన్ సూపర్ జెయింట్స్ నువ్వానేనా అన్నట్లు పోటీపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 232 పరుగుల భారీ స్కోరు సాధించింది. డర్బన్ బ్యాటర్లలో డెవాన్ కాన్వే (64) టాప్ స్కోరర్గా నిలవగా.. కేన్ విలియమ్సన్ (40), మార్క్రమ్(35) రాణించారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో ర్యాన్ రికెల్టన్ అద్భుతసెంచరీతో మెరిశాడు. మిగిత బ్యాటర్లను పెద్దగా సహకరం లభించనప్పటికి రికెల్టన్ మాత్రం విధ్వంసం సృష్టించాడు.సూపర్ క్యాచ్..ఈ క్రమంలో 13వ ఓవర్ వేసిన మఫాక బౌలింగ్లో నాలుగో బంతికి రికెల్టన్ భారీ సిక్సర్ బాదాడు. ఆ బంతి నేరుగా స్టాండ్స్లోకి వెళ్లగా అక్కడే ఉన్న ఓ అభిమాని ఒంటి చేత్తో అద్బుతమైన క్యాచ్ను అందుకున్నాడు. దీంతో అతడు కోటీశ్వరుడయ్యాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్ నిబంధనల ప్రకారం.. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు ఎవరైనా సిక్స్ కొట్టినప్పుడు 2 మిలియన్ రాండ్లు(భారత కరెన్సీలో రూ. 1.08 కోట్లు) బహుమతిగా ఇవ్వనున్నారు. ఈ సీజన్లో ఈ భారీ నగదు బహుమతిని గెలుచుకున్న మొదటి వ్యక్తి అతడే. ఒకవేళ టోర్నమెంట్ మొత్తం మీద మరికొంతమంది కూడా ఇలాంటి క్యాచ్లు పడితే, ఈ 2 మిలియన్ రాండ్ల మొత్తాన్ని వారందరికీ సమానంగా పంచుతారు. కాగా ఈ మ్యాచ్లో ఎంఐ కేప్ టౌన్పై 15 పరుగుల తేడాతో డర్బన్ సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది.చదవండి: IND vs NZ: రిషబ్ పంత్కు భారీ షాక్.. జట్టులోకి డబుల్ సెంచరీ వీరుడు!First match, first #BetwayCatch2Million catch 👌💯#BetwaySA20 #MICTvDSG #WelcomeToIncredible pic.twitter.com/ftDVL1CtWy— Betway SA20 (@SA20_League) December 26, 2025 -
పాకిస్తాన్ జట్టు ప్రకటన.. బాబర్ ఆజం, షాహిన్కు నో ఛాన్స్
శ్రీలంకతో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ప్రకటించింది. ఈ జట్టుకు సల్మాన్ అలీ అఘా నాయకత్వం వహించనున్నాడు. టీ20 వరల్డ్కప్-2026కు ముందు సల్మాన్ పీసీబీ వేటు వేయనున్నట్లు వార్తలు వచ్చాయి.కానీ పాక్ క్రికెట్ బోర్డు అతడిపై మరోసారి నమ్మకం ఉచింది. కాగా ఈ సిరీస్కు స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్లు దూరమయ్యారు. వీరు ముగ్గురు ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్లో ఆడుతుండడంతో సెలక్టర్లు పక్కన పెట్టారు. ఈ సీనియర్ త్రయం బిగ్ బాష్ పూర్తి సీజన్కు అందుబాటులో ఉండనున్నారు.ఇక భుజం సర్జరీ కారణంగా ఈ ఏడాది జూన్ నుంచి జట్టుకు దూరంగా స్టార్ ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ రీఎంట్రీ ఇచ్చాడు. ప్రపంచకప్ ముందు అతడి రాక జట్టుకు పెద్ద బలంగా మారనుంది. మరోవైపు డొమాస్టిక్ క్రికెట్లో దుమ్ములేపుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ ఖవాజా నఫాయ్కు తొలిసారిగా జాతీయ జట్టులో చోటు దక్కింది. ఈ సిరీస్ జనవరి 7 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం మూడు మ్యాచ్లు డంబుల్లా వేదికగానే జరగనుంది. టీ20 ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది.మ్యాచ్ల షెడ్యూల్ (దంబుల్లా):మొదటి టీ20: జనవరి 7రెండవ టీ20: జనవరి 9మూడవ టీ20: జనవరి 11శ్రీలంకతో టీ20లకు పాక్ జట్టు: సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా నఫాయ్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ సల్మాన్ మీర్జా, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్ (వికెట్ కీపర్), సైమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), ఉస్మాన్ తారిఖ్.చదవండి: IND vs NZ: రిషబ్ పంత్కు భారీ షాక్.. జట్టులోకి డబుల్ సెంచరీ వీరుడు! -
రిషబ్ పంత్కు భారీ షాక్.. జట్టులోకి డబుల్ సెంచరీ వీరుడు
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కేవలం టెస్టులకే పరిమితం కానున్నాడా? వన్డే జట్టులో కూడా చోటు కోల్పోనున్నాడా? అంటే అవునానే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. న్యూజిలాండ్తో 2026 జనవరిలో జరగనున్న వన్డే సిరీస్ కోసం భారత జట్టులో పలు మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా రిషబ్ పంత్పై సెలక్టర్లు వేటు వేసేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఢిల్లీ బాయ్ టెస్టుల్లో అద్భుతమైన రికార్డు కలిగి ఉన్నప్పటికి.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం ఆశించిన స్ధాయిలో రాణించలేకపోయాడు.టెస్టుల్లో హిట్.. వన్డేల్లో ఫట్ఇప్పటివరకు భారత తరపున 31 వన్డేలు ఆడిన రిషబ్.. 33.5 సగటుతో కేవలం 871 పరుగులు మాత్రమే చేశాడు. టీ20ల్లో కూడా 76 మ్యాచ్లు ఆడి 23.25 సగటుతో 1209 పరుగులు చేశాడు. దీంతో అతడిని ఇప్పటికే టీ20 జట్టు నుంచి తప్పించిన సెలక్టర్లు.. ఇప్పుడు వన్డే జట్టు నుంచి కూడా పక్కన పెట్టేందుకు సిద్దమయ్యారంట.పంత్ టీమిండియా తరపున చివరగా వన్డేల్లో గతేడాది ఆగస్టులో శ్రీలంకపై ఆడాడు. అప్పటి నుంచి అతడు ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. ఇటీవల జరిగిన సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు ఎంపికైనప్పటికి.. తుది జట్టులో మాత్రం అతడికి చోటు దక్కలేదు. మొత్తం మూడు మ్యాచ్లకు బెంచ్కే పరిమితమయ్యాడు. 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో ఉన్నప్పటికి పంత్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కె.ఎల్ రాహుల్కు బ్యాకప్గా మాత్రమే పంత్ ఉన్నాడు. కాగా పంత్ టెస్టు క్రికెట్లో మాత్రం 49 మ్యాచ్లు ఆడి 42.91 సగటుతో 3476 పరుగులు చేశాడు.జట్టులోకి కిషన్..ఇక దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపుతున్న జార్ఖండ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తిరిగి వన్డేల్లో కూడా రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీ20 వరల్డ్కప్ జట్టుకు ఎంపికైన కిషన్ను వన్డే జట్టులోకి కూడా తీసుకోవాలని అజిత్ అగార్కర్ అండ్ కో భావిస్తున్నట్లు సమాచారం.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన ఇషాన్.. అదే ఫామ్ను విజయ్ హజారే ట్రోఫీలోనూ కొనసాగిస్తున్నాడు. కర్ణాటకతో జరిగిన తొలి మ్యాచ్లో కిషన్ కేవలం 33 బంతుల్లోనే సెంచరీ బాదాడు. తద్వారా లిస్ట్-ఎ క్రికెట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన రెండో భారత క్రికెటర్గా కిషన్ నిలిచాడు.ఈ క్రమంలోనే అతడికి తిరిగి పిలుపునిచ్చేందుకు సెలక్టర్లు సిద్దమయ్యారు. కిషన్ చివరిసారిగా 2023 వన్డే ప్రపంచకప్లో భారత్ తరఫున ఆడాడు. కిషన్కు వన్డేల్లో అద్బుతమైన డబుల్ సెంచరీ కూడా ఉంది. ఇక కివీస్తో వన్డేలకు భారత జట్టును బీసీసీఐ జనవరి మొదటి వారంలో ప్రకటించనుంది. గాయం కారణంగా సౌతాఫ్రికాతో వన్డేలకు దూరంగా ఉన్న కెప్టెన్ శుభ్మన్ గిల్ తిరిగి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయమైంది. జనవరి 11 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.చదవండి: SA20: సౌరవ్ గంగూలీకు భారీ షాక్.. తొలి మ్యాచ్లోనే? -
సన్రైజర్స్ శుభారంభం..
దక్షిణాఫ్రికా టీ20 లీగ్ (SA20) 2025-26 సీజన్ను సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఘనంగా ఆరంభించింది. ఈ టోర్నీలో భాగంగా శనివారం బోలాండ్ పార్క్ వేదికగా పార్ల్ రాయల్స్లో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ 137 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పార్ల్ రాయల్స్.. 11.5 ఓవర్లలో కేవలం 42 పరుగులకే కుప్పకూలింది.సన్రైజర్స్ బౌలర్ల దాటికి పార్ల్ బ్యాటింగ్ ఆర్డర్ పేక మేడలా కుప్పకూలింది. ఒక్కరంటే ఒక్కరు పట్టుమని పది నిమిషాల కూడా క్రీజులో నిలవలేకపోయారు. మొత్తం తొమ్మిది మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు. కెప్టెన్ మిల్లర్(7) కూడా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. సన్రైజర్స్ స్పీడ్ స్టార్ అన్రిచ్ నోర్జే 4 వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించాడు. అతడితో పాటు ఆడమ్ మిల్నే, తరిందు రత్నాయకే తలా రెండు వికెట్లు సాధించారు.హెర్మన్ హాఫ్ సెంచరీ..అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 186 పరుగుల భారీ స్కోర్ సాధించింది. జోర్డాన్ హెర్మన్(5 ఫోర్లు, 4 సిక్స్లతో 62) టాప్ స్కోరర్గా నిలవగా.. క్వింటన్ డికాక్(42) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.పార్ల్ రాయల్స్ చెత్త రికార్డు..ఈ మ్యాచ్లో 49 పరుగులకే ఆలౌటైన పార్ల్ రాయల్స్ అత్యంత చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. సౌతాఫ్రికా టీ20 లీగ్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా రాయల్స్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇంతకుముందు ఈ రికార్డు ప్రిటోరియా క్యాపిటల్స్(52) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో ప్రిటోరియాను రాయల్స్ అధిగమించింది.చదవండి: వరల్డ్కప్ జట్టులో హైదరాబాద్ కుర్రాడు.. ఎవరీ ఆరోన్ జార్జ్? -
వరల్డ్కప్ జట్టులో హైదరాబాద్ కుర్రాడు.. ఎవరీ ఆరోన్ జార్జ్?
అండర్-19 ప్రపంచకప్ 2026కు భారత జట్టును బీసీసీఐ శనివారం రాత్రి ప్రకటించింది. 15 మందితో కూడిన ఈ జట్టుకు ఆయుశ్ మాత్రే సారథ్యం వహించనుండగా... విహాన్ మల్హోత్రా వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జింబాబ్వే, నమీబియా వేదికగా ఈ టోర్నీ జరగనుంది. ఈ మెగా ఈవెంట్కు ముందు భారత యువ జట్టు దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్కు రెగ్యూలర్ కెప్టెన్ మాత్రే, మల్హోత్రా గాయాల కారణంగా దూరమయ్యాడు. దీంతో మాత్రే స్ధానంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ జట్టు బాధ్యతలను చేపట్టనున్నాడు.కాగా వరల్డ్కప్ జట్టులో హైదరాబాద్ కుర్రాడు ఆరోన్ జార్జ్కు చోటు దక్కింది. ఆసియాకప్లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో ప్రపంచకప్ జట్టులోనూ సెలక్టర్లు కొనసాగించారు. సౌతాఫ్రికా పర్యటనలో సూర్యవంశీకి డిప్యూటీగా జార్జ్ వ్యవహరించాడు. దీంతో జార్జ్ గురుంచి తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ఆసక్తి చూపుతున్నారు.ఎవరీ ఆరోన్ జార్జ్..?19 ఏళ్ల ఆరోన్ జార్జ్ పుట్టింది కేరళలో అయినప్పటికీ.. జానియర్ స్దాయి క్రికెట్లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. జార్జ్కు అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఈ మిడిలార్డర్ ఆటగాడికి పరిస్థితులకు తగ్గట్టు ఆడే సత్తా ఉంది. ముఖ్యంగా జట్టు కష్టాల్లో ఉందంటే అందరి చూపు జార్జ్పైనే ఉంటుంది.అతడి బ్యాటింగ్ శైలి టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ను పోలి ఉంటుంది. అదేవిధంగా అతడికి మంచి కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. దాదాపు 38 ఏళ్ల తర్వాత కెప్టెన్గా హైదరాబాద్కు వినూ మాన్కడ్ ట్రోఫీని ఆరోన్ అందించాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీ( 2022-23)లో బీహార్పై ట్రిపుల్ సెంచరీ సాధించి తొలిసారిగా అందరి దృష్టిని జార్జ్ ఆకర్షించాడు. గత రెండు సీజన్లలో కలిపి 700 పైగా పరుగులు చేసి హైదబాద్ జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. అంతేకాకుండా గత నెలలో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జరిగిన అండర్-19 ట్రై-సిరీస్లో ఇండియా-బి జట్టుకు కెప్టెన్గా కూడా అతడు వ్యవహరించాడు.ఆసియాకప్ 2025లోనూ పాకిస్తాన్పై 85 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఐపీఎల్-2026 వేలంలో మాత్రం జార్జ్ అమ్ముడుపోలేదు. రూ.30 లక్షల బేస్ ప్రైస్తో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఒకవేళ ఎవరైనా గాయపడితే జార్జ్ను ప్రత్నమ్నాయంగా తీసుకునే అవకాశముంది. సీఎస్కే తరపున దుమ్ములేపుతున్న మాత్రే కూడా అలా వచ్చినవాడే.అండర్–19 వరల్డ్కప్నకు భారత జట్టు: ఆయుశ్ మాత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు, హర్వర్దన్ సింగ్, అంబ్రిష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, మొహమ్మద్ ఇనాన్, దీపేశ్, కిషన్ కుమార్ సింగ్, ఉధవ్ మోహన్. దక్షిణాఫ్రికా సిరీస్కు భారత అండర్–19 జట్టు: వైభవ్ సూర్యవంశీ (కెపె్టన్), ఆరోన్ జార్జ్ (వైస్ కెపె్టన్), వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుండు, హర్వర్దన్ సింగ్, అంబ్రిష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, మొహమ్మద్ ఇనాన్, దీపేశ్, కిషన్ కుమార్ సింగ్, ఉధవ్ మోహన్, యువరాజ్ గోహిల్, రాహుల్ కుమార్. -
సౌరవ్ గంగూలీకు భారీ షాక్.. తొలి మ్యాచ్లోనే?
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. హెడ్ కోచ్గా తన ప్రయాణాన్ని ఓటమితో ఆరంభించాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26 సీజన్లో ప్రిటోరియా క్యాపిటల్స్ హెడ్ కోచ్గా గంగూలీ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం జోబర్గ్ సూపర్ కింగ్స్తో జరిగిన తమ తొలి మ్యాచ్లో 22 పరుగుల తేడాతో ప్రిటోరియా క్యాపిటల్స్ పరాజయం పాలైంది.మొదట బ్యాటింగ్ చేసిన జోబర్గ్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్(2) విఫలమైనప్పటికి రైలీ రూసో (48), వియాన్ ముల్డర్ (43) కీలక ఇన్నింగ్స్లు ఆడడంతో సూపర్ కింగ్స్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది.ప్రిటోరియా బౌలర్లలో టైమల్ మిల్స్, కోడి యూసుఫ్ తలా రెండు వికెట్లతో సత్తాచాటారు. అనంతరం 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రిటోరియా జట్టుకు ఓపెనర్లు విల్ స్మీడ్ (34), బ్రైస్ పార్సన్స్ (41) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు.ఒక దశలో 71/1తో పటిష్టంగా ఉన్నప్పటికీ.. ప్రిటోరియా వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ప్రిటోరియా లక్ష్య చేధనలో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేసింది. సూపర్ కింగ్స్ బౌలర్లలో డువాన్ జాన్సెన్ 4 వికెట్లు పడగొట్టగా.. రిచర్డ్ గ్లీసన్ రెండు వికెట్లు సాధించాడు.కాగా గంగూలీ ఓ జట్టు హెడ్ కోచ్గా వ్యవహరిస్తుండడం ఇదే తొలిసారి. ప్రధాన కోచ్గా అరంగేట్రంలోనే ఓటమి ఎదురైంది. దాదా గతంలో ఢిల్లీ క్యాపిటల్స్, దుబాయ్ క్యాపిటల్స్ జట్లకు మెంటార్గా వ్యవహరించారు. ప్రిటోరియా క్యాపిటల్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ సిస్టర్ ఫ్రాంచైజీ కావడం గమనార్హం.చదవండి: టీమిండియా కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీ.. -
18 టెస్టుల తర్వాత...
మెల్బోర్న్: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఇంగ్లండ్ జట్టు అద్భుతం చేసింది. ఆ్రస్టేలియా గడ్డపై గత పదిహేనేళ్లుగా ఒక్క టెస్టు మ్యాచ్ కూడా నెగ్గలేకపోయిన ఇంగ్లండ్ జట్టు... ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. ‘యాషెస్’ సిరీస్లో భాగంగా రెండు రోజుల్లోనే ముగిసిన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ జట్టు 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో తొలి మూడు టెస్టులు గెలిచిన ఆతిథ్య ఆ్రస్టేలియా సిరీస్ హస్తగతం చేసుకోగా... ఈ విజయంతో ఇంగ్లండ్ 1–3తో నిలిచింది. ‘యాషెస్’ సిరీస్లో భాగంగా సొంతగడ్డపై వరుసగా 18 టెస్టుల్లో పరాజయం ఎరగని ఆ్రస్టేలియా జట్టు... మెల్బోర్న్ టెస్టులో ఓటమి చవిచూసింది. ఈ సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు రెండు రోజుల్లోనే విజయం సాధించగా... ఇప్పుడు అశేష అభిమానుల మధ్య సాగిన పోరులో ఇంగ్లండ్ కూడా రెండు రోజుల్లోనే గెలుపొందింది. ఒకే సిరీస్లో ఇలా రెండు మ్యాచ్లు రెండు రోజుల్లోనే ముగియడం 129 ఏళ్లలో ఇదే తొలిసారి. ఓవర్నైట్ స్కోరు 4/0తో శనివారం రెండో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ్రస్టేలియా చివరకు 34.3 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్ (67 బంతుల్లో 46; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... కెపె్టన్ స్టీవ్ స్మిత్ (39 బంతుల్లో 24 నాటౌట్; 1 ఫోర్) కాస్త పోరాడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 4, బెన్ స్టోక్స్ 3, జోష్ టంగ్ 2 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఇంగ్లండ్ ముందు 175 పరుగుల లక్ష్యం నిలవగా... చక్కటి పోరాటం కనబర్చిన పర్యాటక ఇంగ్లండ్ జట్టు 32.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. జాకబ్ బెథెల్ (46 బంతుల్లో 40; 5 ఫోర్లు), జాక్ క్రాలీ (48 బంతుల్లో 37; 3 ఫోర్లు, 1 సిక్స్), బెన్ డకెట్ (26 బంతుల్లో 34; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. బ్రూక్ (18 నాటౌట్), జేమీ స్మిత్ (3 నాటౌట్) అజేయంగా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, జే రిచర్డ్సన్, స్కాట్ బోలాండ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇంగ్లండ్ పేసర్ జోష్ టంగ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు జనవరి 4 నుంచి ప్రారంభం కానుంది. మళ్లీ అదే తంతు... పేసర్లు పండగ చేసుకున్న ఈ పోరులో... తొలి ఇన్నింగ్స్లో ఆకట్టుకోలేకపోయిన ఆ్రస్టేలియా... రెండో ఇన్నింగ్స్లోనూ అదే వైఫల్యం కొనసాగించింది. హెడ్, స్మిత్తో పాటు కామెరాన్ గ్రీన్ (19) మాత్రమే రెండంకెల స్కోరు చేయగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. నైట్ వాచ్మన్ స్కాట్ బోలాండ్ (6) ఏడో ఓవర్లో అవుట్ కాగా... కాసేపటికే వెదరాల్డ్ (5) అతడిని అనుసరించాడు. లబుషేన్ (8) విఫలం కాగా... ఉస్మాన్ ఖ్వాజా (0), అలెక్స్ కేరీ (4) ఇలా వచ్చి అలా వెళ్లారు. దీంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ఆసీస్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఇంగ్లండ్ ముందు 175 పరుగుల లక్ష్యమే ఉన్నా... పచ్చికతో కూడిన పిచ్పై కంగారూ పేసర్లను ఎదుర్కొంటూ ఆ మాత్రం స్కోరు చేయడం కూడా కష్టమే అనిపించింది. అయితే ఇప్పటికే సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు ‘పోరాడితే పోయేదేముంది’ అన్న తరహాలో చెలరేగింది. ఓపెనర్లు క్రాలీ, డకెట్ తొలి వికెట్కు 51 పరుగులు జోడించి జట్టుకు శుభారంభం అందించగా... బ్రైడన్ కార్స్ (6), జో రూట్ (15), కెపె్టన్ బెన్ స్టోక్స్ (2) ఎక్కువసేపు నిలవలేకపోయినా... బెథెల్ చక్కటి షాట్లతో జట్టును విజయం దిశగా తీసుకెళ్లాడు. ‘ఈ విజయానికి ముందు వరకు ఈ పర్యటన చాలా కష్టంగా సాగింది. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా జట్టుగా పోరాడం. ప్లేయర్లు చూపిన తెగింపు ఆకట్టుకుంది. అందుకు తగ్గ ఫలితం దక్కింది. ‘బాక్సింగ్ డే’ టెస్టు రెండు రోజుల్లో ముగియాలని ఎవరూ కోరుకోరు’ అని ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ అన్నాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 152 పరుగులు చేయగా... ఇంగ్లండ్ 110 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్ నాలుగు ఇన్నింగ్స్ల్లో కలిపి ఒక్క ఆటగాడు కూడా హాఫ్ సెంచరీ నమోదు చేయలేదు. రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ ఓపెనర్ హెడ్ చేసిన 46 పరుగులే అత్యధికం. ‘రెండు ఇన్నింగ్స్ల్లోనూ 50–60 పరుగులు తక్కువ చేశాం. అవి ఉంటే ఫలితం మరోలా ఉండేది’ అని ఆస్ట్రేలియా కెపె్టన్ స్మిత్ అన్నాడు. 17 మ్యాచ్ల తర్వాత ఆ్రస్టేలియా గడ్డపై రూట్ తొలి టెస్టు విజయం రుచి చూశాడు. న్యూజిలాండ్ మాజీ కెపె్టన్ డానియల్ వెటోరీ 1997 నుంచి 2011 మధ్య ఆ్రస్టేలియాలో 12 మ్యాచ్లాడి ఒక్క విజయం కూడా నమోదు చేయలేదు.92,045 బాక్సింగ్ డే టెస్టు రెండో రోజు ఆటను ప్రత్యక్షంగా తిలకించేందుకు మెల్బోర్న్ క్రికెట్ మైదానానికి వచ్చిన అభిమానుల సంఖ్య. 5468 రోజుల తర్వాత ఆ్రస్టేలియా గడ్డపై ఇంగ్లండ్ జట్టు టెస్టు మ్యాచ్ గెలిచింది. చివరగా 2011లో ఆసీస్లో టెస్టు నెగ్గిన ఇంగ్లండ్ జట్టు ఆ తర్వాత ఆడిన 18 టెస్టుల్లో 16 మ్యాచ్ల్లో ఓడి, రెండింటిని ‘డ్రా’ చేసుకుంది.479 ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఎదుర్కొన్న బంతులు. 1928 బ్రిస్బేన్ టెస్టు (457 బంతులు) తర్వాత ఇదే అత్యల్పం. -
టెస్టుల్లో తడబాటు... పరిమిత ఓవర్లలో పైచేయి...
సాక్షి క్రీడా విభాగం : ఇంగ్లండ్లో యువ జట్టుతో ఓటమి లేకుండా తిరిగొచ్చామని సంబరం ఒకవైపు, సొంతగడ్డపై పాతికేళ్ల తర్వాత సఫారీలకు సిరీస్ కోల్పోయిన పరాభవం మరోవైపు.... వన్డేల్లో పుష్కర కాలం తర్వాత ఐసీసీ ట్రోఫీ ఆనందాన్ని పంచితే... టి20ల్లో అజేయ ఆటతో ఆసియా కప్ గెలుచుకొని ఈ ఫార్మాట్లో మన స్థాయి కనిపించింది. మొత్తంగా 2025లో భారత క్రికెట్ జట్టు మిశ్రమ ఫలితాలు సాధించింది. టెస్టుల్లో ప్రదర్శన కాస్త అసంతృప్తిని మిగల్చగా... పరిమిత ఓవర్ల క్రికెట్లో వరుస విజయాలతో ప్రత్యర్థులపై పైచేయి చూపించింది. మరోవైపు పురుషులకు ఏమాత్రం తగ్గని రీతిలో భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే వరల్డ్ కప్ టైటిల్ సాధించడం అన్నింటికంటే చిరస్మరణీయ ఘట్టం. కెప్టెన్ శుబ్మన్ గిల్ ముద్ర... సిడ్నీలో ఆ్రస్టేలియాతో ఐదో టెస్టుతో ఈ ఏడాది మొదలైంది. ఈ మ్యాచ్లో ఓటమితో సిరీస్ 1–3తో చేజారింది. అయితే 32 వికెట్లతో బుమ్రా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. పేలవ బ్యాటింగ్తో జట్టుకు భారం కాలేనంటూ రోహిత్ శర్మ స్వయంగా మ్యాచ్కు ముందు తప్పుకోవడం చర్చకు దారి తీసింది. చివరకు ఇదే అతని ఆఖరి టెస్టుగా మారగా, కొన్నాళ్ల తర్వాత సరిగ్గా ఇంగ్లండ్తో సిరీస్కు ముందు మరో స్టార్ కోహ్లి కూడా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కొత్త కెప్టెన్గా శుబ్మన్ గిల్ నాయకత్వంలో సీనియర్లు లేకుండా అంచనాలు లేకుండా ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టిన భారత జట్టు అద్భుతమే చేసింది. నాలుగు టెస్టుల తర్వాత 1–2తో వెనుకబడి సిరీస్ కోల్పోయే స్థితిలో పడిన జట్టు ఓవల్లో జరిగిన ఆఖరి టెస్టులో మొహమ్మద్ సిరాజ్ అసాధారణ బౌలింగ్తో అనూహ్యంగా 6 పరుగులతో నెగ్గి సంతృప్తిగా 2–2తో ముగించింది. బ్యాటర్గా 4 సెంచరీలు సహా ఏకంగా 754 పరుగులు చేసిన గిల్, ఇటు కెప్టెన్గా తొలి సిరీస్ను ఘనంగా ముగించాడు. ఆ తర్వాత స్వదేశంలో బలహీన వెస్టిండీస్పై 2–0 సిరీస్ గెలుచుకోవడం ఎవరినీ ఆశ్చర్యపర్చలేదు. అయితే ఇంగ్లండ్ గడ్డపై వచి్చన పేరు కాస్తా సొంతగడ్డపై భారత జట్టు చేజార్చుకుంది. స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో 0–2తో టెస్టు సిరీస్ను కోల్పోవడం ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. మన గడ్డపై సఫారీల చేతిలో పాతికేళ్ల తర్వాత జట్టు సిరీస్ ఓడింది. ఏడాది క్రితం న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఇదే తరహా 0–3 పరాజయాన్ని గుర్తుకు తెచి్చన టీమ్ మేనేజ్మెంట్ తీవ్ర విమర్శలకు గురైంది. కోచ్ గౌతమ్ గంభీర్ జట్టును నడిపిస్తున్న శైలిపై చర్చకు దారి తీసింది. మొత్తంగా ఈ ఏడాది 4 టెస్టులు గెలిచిన జట్టు 5 ఓడింది. రోహిత్ ఖాతాలో మరో ఐసీసీ టైటిల్... వన్డేల్లో భారత్ గుర్తుంచుకోదగ్గ ఏడాదిగా 2025 నిలిచింది. ముందుగా స్వదేశంలో ఇంగ్లండ్పై 3–0తో సిరీస్ గెలుచుకున్న టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటింది. వరుసగాఆడిన ఐదు మ్యాచ్లలోనూ (బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్లపై) నెగ్గి విజేతగా నిలిచింది. 2013 తర్వాత భారత్ గెలుచుకున్న ఐసీసీ వన్డే టోర్నీ ఇదే కావడం విశేషం. 2024 టి20 వరల్డ్ కప్లో భారత్ను విజేతగా నిలిపిన రోహిత్ ఏడాది తిరిగేలోగా మరో ఐసీసీ ట్రోఫీని అందించి తన ఘనతను ప్రదర్శించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన సిరీస్లో అనూహ్యంగా రోహిత్ను తప్పించిన సెలక్టర్లు గిల్ను కెప్టెన్గా ఎంపిక చేశారు. ఈ సిరీస్ను జట్టు 1–2తో కోల్పోయింది. అయితే సరిగ్గా ఇక్కడి నుంచే రోహిత్, కోహ్లిల భవిష్యత్తుపై చర్చ మొదలైంది. కోహ్లి రెండు డకౌట్ల తర్వాత అర్ధసెంచరీ సాధించగా, రోహిత్ ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీతో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచి తన విలువను చూపించాడు. అనంతరం స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగి వన్డే సిరీస్ను జట్టు 2–1తో గెలుచుకుంది. అయితే ఈ సారి కోహ్లి వంతు వచ్చింది. 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీలతో 302 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలవడంతో కోహ్లి, రోహిత్ల గురించి చర్చకు ఫుల్స్టాప్ పడింది. మొత్తంగా 11 మ్యాచ్లు గెలిచిన టీమ్ 3 ఓడింది. అభిషేక్ శర్మ అదరహో... టి20 ఫార్మాట్లో 2024లో వరల్డ్ కప్ గెలుచుకున్న భారత జట్టు అదే జోరును ఈ ఏడాదీ కొనసాగించింది. సొంతగడ్డపై ఇంగ్లండ్పై 4–1తో సిరీస్, ఆ్రస్టేలియా గడ్డపై 2–1తో సిరీస్, మళ్లీ స్వదేశంలో దక్షిణాఫ్రికాతో 3–1 సిరీస్... ఇలా ఆడిన మూడు సిరీస్లూ జట్టు గెలుచుకుంది. వీటిలో రెండింటిలో వరుణ్ చక్రవర్తి, మరో దాంట్లో అభిషేక్ శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’లుగా నిలిచారు. అయితే 2025లో హైలైట్గా నిలిచిన అంశం భారత జట్టు ఆసియా కప్ గెలుచుకోవడం. ఆడిన 7 మ్యాచ్లలో ఓటమి లేకుండా (వరుసగా యూఏఈ, పాకిస్తాన్, ఒమన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్లపై) అజేయంగా నిలిచి భారత్ టైటిల్ సాధించింది. 314 పరుగులతో అభిషేక్ శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచాడు. ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ 53 బంతుల్లో అజేయంగా 69 పరుగులతో జట్టును గెలిపించి హీరోగా అవతరించాడు. పహల్గాం దాడి తర్వాత జరిగిన ఈ టోర్నీలో పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు భారత క్రికెటర్లు నిరాకరించడం, చివరకు ఆసియా కప్ ట్రోఫీని మన జట్టుకు అందించకుండా ఏసీసీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ తన వద్దే ఉంచుకోవడం టోర్నీని వివాదాస్పదంగా మార్చాయి. మొత్తంగా 16 మ్యాచ్లు గెలిచిన జట్టు 3 మాత్రమే ఓడింది. ఈ ఏడాది అభిషేక్ శర్మ ఓపెనర్గా చెలరేగి కొత్త స్టార్గా నిలిచాడు. 21 మ్యాచ్లు ఆడి 444 బంతులు ఎదుర్కొన్న అతను ఏకంగా 193.46 స్ట్రయిక్రేట్తో 859 పరుగులు చేసి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. హర్మన్ బృందానికి హ్యాట్సాఫ్... ప్రపంచ కప్లో పది ప్రయత్నాల తర్వాత రెండుసార్లు రన్నరప్కే పరిమితమై, ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవకుండా సుదీర్ఘ కాలం ఎదురు చూసిన భారత మహిళల క్రికెట్ జట్టు చిరకాల స్వప్నం 2025లో నెరవేరింది. ఈ ఏడాది స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్లో తొలిసారి చాంపియన్గా సగర్వంగా శిఖరాన నిలిచింది. లీగ్ దశలో ఆడిన 7 మ్యాచ్లలో 3 విజయాలు, 3 పరాజయాలతో శ్రమించి జట్టు సెమీస్ చేరింది. వరుసగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ చేతుల్లో పరాజయాల తర్వాత ఇక నిష్క్రమణ ఖాయమనిపించిన దశలో హర్మన్ బృందం కోలుకున్న తీరు స్ఫూర్తిదాయకం. ఆపై సెమీఫైనల్లో అసాధారణ ఆటతో ఆస్ట్రేలియాను చిత్తు చేయడంతోనే ట్రోఫీపై ఆశలు చిగురించగా... నవంబర్ 2న జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగులతో గెలవడం భారత క్రికెట్ అభిమానులెవరూ మర్చిపోలేని ఘట్టం. హర్మన్, స్మృతి, జెమీమా, ప్రతీక, షఫాలీ, దీప్తి, శ్రీచరణి, క్రాంతి... ఇలా ప్రతీ ఒక్కరూ చేయి వేసి వరల్డ్ కప్ను భారత్కు అందించారు. అండర్–19 వరల్డ్ కప్ కూడా మనదే... ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరిలో మలేసియా వేదికగా జరిగిన అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు టైటిల్ నిలబెట్టుకుంది. ఈ ఫార్మాట్లో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది.దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో షఫాలీ వర్మ సారథ్యంలోని భారత జట్టు 9 వికెట్లతో గెలిచింది. తెలంగాణకు చెందిన గొంగడి త్రిష 7 మ్యాచ్లు ఆడి 309 పరుగులతో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును గెల్చుకుంది. భారత్కే చెందిన వైష్ణవి శర్మ (17 వికెట్లు) టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచింది. -
నేడు శ్రీలంకతో భారత మహిళల జట్టు నాలుగో టి20
సొంతగడ్డపై ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న భారత మహిళల క్రికెట్ జట్టు... తిరువనంతపురం వేదికగా ఆదివారం శ్రీలంకతో నాలుగో టి20 ఆడనుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ నెగ్గి 3–0తో సిరీస్ చేజిక్కించుకున్న హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా... అదే జోరు కొనసాగిస్తూ నాలుగో మ్యాచ్లోనూ నెగ్గాలని భావిస్తోంది. గత మ్యాచ్ల్లో భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు శ్రీలంక స్వల్ప స్కోర్లకే పరిమితమైంది. టాపార్డర్ ఫుల్ ఫామ్లో ఉండటంతో... టీమిండియా సునాయాసంగా లక్ష్యాలను ఛేదించింది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్, రిచా ఘోష్, దీప్తి శర్మతో భారత బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. బౌలింగ్లో ఏపీ అమ్మాయి శ్రీచరణి నిలకడ కొనసాగిస్తుండగా... రేణుక, క్రాంతి, దీప్తి, వైష్ణవి, అమన్జ్యోత్ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే సిరీస్ దక్కడంతో ఈ మ్యాచ్లో రిజర్వ్ బెంచ్ బలాన్ని పరీక్షించే అవకాశం ఉంది. రాత్రి గం. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్లో ప్రత్యక్షప్రసారం -
టీమిండియా కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీ..
జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న అండర్-19 ప్రపంచకప్-2026 భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా ఆయూష్ మాత్రే ఎంపికయ్యాడు. అతడి డిప్యూటీగా విహాన్ మల్హోత్రా వ్యవహరించనున్నాడు. అదేవిధంగా ఈ జట్టులో వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు.అయితే అండర్-19 ఆసియా కప్ 2025 జట్టులో భాగమైన యువరాజ్ హోగిల్, నమన్ పుష్పక్లపై సెలక్టర్లు వేటు వేశారు. వారిద్దరి స్ధానంలో మహ్మద్ ఎనాన్, ఆర్.ఎస్. అంబ్రిష్లకు చోటు దక్కింది. ఈ టోర్నమెంట్ జనవరి 15 నుండి ఫిబ్రవరి 6 వరకు జరగనుంది. ఈ మెగా ఈవెంట్లో యువ భారత జట్టు తమ తొలి మ్యాచ్లో జనవరి 15న అమెరికాతో తలపడనుంది.కెప్టెన్గా వైభవ్..ఇక ఈ టోర్నీ ఆరంభానికి ముందు భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అయితే ఈ టూర్కు రెగ్యూలర్ కెప్టెన్ మాత్రే, వైస్ కెప్టెన్ మల్హోత్రా గాయాల కారణంగా దూరమయ్యారు. దీంతో మాత్రే స్ధానంలో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ జట్టును నడిపించనున్నాడు. మాత్రే, మల్హోత్రా నేరుగా ప్రపంచకప్ జట్టులో చేరనున్నారు. సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది.అండర్-19 ప్రపంచ కప్ 2026 కోసం భారత జట్టు:ఆయుష్ మాత్రే (కెప్టెన్), ఆర్.ఎస్. అంబరీష్, కనిష్క్ చౌహాన్, డి. దీపేష్, మొహమ్మద్ ఈనాన్, ఆరోన్ జార్జ్, అభిజ్ఞాన్ కుందు, కిషన్ కుమార్ సింగ్, విహాన్ మల్హోత్రా, ఉదవ్ మోహన్, హెనిల్ పటేల్, ఖిలాన్ ఎ. పటేల్, హర్వాన్ష్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది.సౌతాఫ్రికా టూర్కు భారత జట్టువైభవ్ సూర్యవంశీ(కెప్టెన్), ఆర్.ఎస్. అంబరీష్, కనిష్క్ చౌహాన్, డి. దీపేష్, మొహమ్మద్ ఈనాన్, ఆరోన్ జార్జ్, అభిజ్ఞాన్ కుందు, కిషన్ కుమార్ సింగ్, ఉదవ్ మోహన్, హెనిల్ పటేల్, ఖిలాన్ ఎ. పటేల్, హర్వాన్ష్ సింగ్, వేదాంత్ త్రివేది. -
టీమిండియాలోకి ఉహించని ప్లేయర్.. ఎవరంటే?
భారత పురుషల క్రికెట్ జట్టు.. కొత్త ఏడాదిని సొంతగడ్డపై న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్తో ప్రారంభించనుంది. జనవరి 11 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అనంతరం ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో కివీస్-భారత జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే టీ20 సిరీస్కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. మరో నాలుగైదు రోజుల్లో వన్డే జట్టును కూడా ఖరారు చేయనుంది. టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ తిరిగి జట్టులోకి రానున్నాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికా వన్డే సిరీస్కు దూరమైన గిల్.. తిరిగి టీ20 సిరీస్కు అందుబాటులోకి వచ్చాడు. ఆ తర్వాత మళ్లీ గాయపడడంతో సిరీస్ మధ్యలోనే వైదొలిగాడు. అయితే గిల్ ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ సాధించాడు. దీంతో కివీస్తో వన్డే సిరీస్లో జట్టును గిల్ నడిపించనున్నాడు.శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీ?ఇక ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడ్డ భారత మిడిలార్డర్ శ్రేయస్ అయ్యర్ కూడి తిరిగి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయ్యర్ ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో ఉన్నాడు.అతడు తన ప్రాక్టీస్ను కూడా మొదలు పెట్టాడు. అతడికి రెండు మూడు రోజుల్లో ఫిట్నెస్ పరీక్షను నిర్వహించనున్నారు. అందులో అతడు ఉత్తీర్ణ సాధిస్తే కివీస్తో సిరీస్కు ఎంపిక కానున్నాడు.పడిక్కల్కు చోటు..!ఒకవేళ అయ్యర్ ఫిట్నెస్ సాధించకపోతే అతడి స్ధానంలో కర్ణాటక ఆటగాడు దేవ్దత్త్ పడిక్కల్ను సెలక్టర్లు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. పడిక్కల్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీ-2025లో పడిక్కల్ దుమ్ములేపుతున్నాడు. వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ పడిక్కల్ శతక్కొట్టాడు. లిస్ట్-ఎ క్రికెట్లో పడిక్కల్ సగటు దాదాపు 83. 64గా ఉంది. దీంతో అతడిని వన్డే జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. మరోవైపు 2026 టీ20 వరల్డ్ కప్ దృష్ట్యా కివీస్తో వన్డేలకు స్టార్ ప్లేయర్లు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది.న్యూజిలాండ్తో వన్డేలకు భారత జట్టు(అంచనా)శుభ్మన్ గిల్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్)/ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ , రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్ -
ఇది ఔటా? అంపైర్పై లబుషేన్ సీరియస్! వీడియో
యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ చేధించింది. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లీష్ జట్టుకు 15 ఏళ్ల తర్వాత ఇదే తొలి టెస్టు విజయం. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్ రెండో రోజు ఆటలో ఆసీస్ ఆటగాడు లబుషేన్ ఔట్ విషయంలో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదస్పదమైంది.అసలేం జరిగిందంటే?ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 18 ఓవర్లో ఇంగ్లండ్ పేసర్ జోష్ టంగ్ తొలి బంతిని.. లబుషేన్కు గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని లబుషేన్ డిఫెండ్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో ఫస్ట్ స్లిప్లో ఉన్న జో రూట్ ఆ బంతిని అందుకున్నాడు.వెంటనే ఇంగ్లండ్ ఆటగాళ్లు సెలబ్రేట్ చేసుకోగా.. లబుషేన్ మాత్రం బంతి నేలకు తగిలి చేతిలోకి వచ్చిందా లేదా నేరుగా రూట్ అందుకున్నాడా సందేహంతో క్రీజులో ఉండిపోయాడు. ఈ క్రమంలో ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్కు రిఫర్ చేశారు.థర్డ్ అంపైర్ పలు కోణాల్లో రీప్లేలను పరిశీలించిన తర్వాత, రూట్ వేళ్లు బంతి కింద ఉన్నాయని చెబుతూ లబుషేన్ను ఔట్గా ప్రకటించాడు. దీంతో ఈ ఆసీస్ షాకయ్యాడు. ఎందుకంటే ఓ కోణంలో బంతి నేలకు తాకినట్లు అన్పించింది. థర్డ్ అంపైర్ అసహనం వ్యక్తం చేస్తూ లబుషేన్ మైదానాన్ని వీడాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అది క్లియర్గా నాటౌట్ అంటూ కామెంట్లు చేస్తున్నాయి. ఇప్పటికే మూడో టెస్టులో స్నికో లోపాలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.చదవండి: గంభీర్కు పదవీ గండం!.. అతడితో చర్చలు జరిపిన బీసీసీఐ?What did you make of this catch? Out or not out?#Ashes | #DRSChallenge | @Westpac pic.twitter.com/pnWo2qt6qc— cricket.com.au (@cricketcomau) December 27, 2025 -
గంభీర్కు పదవీ గండం!.. అతడితో చర్చలు జరిపిన బీసీసీఐ?
టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో విజయవంతమైనప్పటికి.. రెడ్ బాల్ క్రికెట్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోయాడు. గంభీర్ పర్యవేక్షణలో సేనా(సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా) దేశాలపై భారత్ ఇప్పటివరకు 10 టెస్టుల్లో ఓటమి చవిచూసింది. ముఖ్యంగా గత నెలలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్లో భారత్ ఘోర పరాజయం పాలవ్వడంతో గంభీర్పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.అతడిని వెంటనే ప్రధాన కోచ్గా తప్పించాలని చాలా మంది మాజీ క్రికెటర్లు డిమాండ్ చేశారు. దీంతో బీసీసీఐ కూడా హెడ్ కోచ్ మార్పుపై ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. టెస్టు జట్టు కోసం ప్రత్యేకంగా కోచ్ను నియమించాలన్న యోచనలో బోర్డు ఉన్నట్లు సమాచారం.ఈ క్రమంలో హెడ్ కోచ్ పదవి కోసం లెజెండరీ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ను బోర్డు ప్రతినిధులు సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే బీసీసీఐ ఆఫర్ను లక్ష్మణ్ను తిరష్కరించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. లక్ష్మణ్ ప్రస్తుతం బెంగళూరులోని 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' (CoE) హెడ్గా ఉన్నాడు. అయితే ప్రస్తుత బాధ్యతలతోనే తను సంతోషంగా ఉన్నానని, సీనియర్ జట్టు కోచింగ్పై ఆసక్తి లేదని బోర్డుకు తెలియజేశాడంట. కానీ మరోసారి లక్ష్మణ్తో చర్చలు జరిపేందుకు బోర్డు పెద్దలు సిద్దమైనట్లు సమాచారం. గంభీర్ మెడపై కత్తి..కాగా వన్డే ప్రపంచకప్-2027 ముగిసే వరకు బీసీసీఐతో గంభీర్ కాంట్రాక్ట్ ఉంది. కానీ మరి కొద్ది రోజుల్లో జరగనున్న టీ20 ప్రపంచకప్లో భారత ప్రదర్శన బట్టి అతడి కాంట్రాక్ట్ను బోర్డు పునః సమీక్షించే అవకాశముంది. గంభీర్ కోచింగ్లో భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆసియాకప్ను సొంతం చేసుకుంది.గంభీర్ ముందు పొట్టి ప్రపంచకప్తో పాటు చాలా సవాళ్లు ఉన్నాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ 2025-27లో టీమిండియా ఇంకా 9 టెస్టులు ఆడాల్సి ఉంది. శ్రీలంక, న్యూజిలాండ్ పర్యటనలతో పాటు ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ అత్యంత కీలకం. మిగిలిన మ్యాచ్లలో గెలిస్తేనే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుకుంటుంది. భారత క్రికెట్ జట్టుకు మరో ఎనిమిది నెలల వరకు ఎటువంటి టెస్టు సిరీస్లు లేవు.చదవండి: న్యూజిలాండ్తో వన్డే సిరీస్.. శుభ్మన్ గిల్ కీలక నిర్ణయం -
ఈ విజయం మాకెంతో ప్రత్యేకం.. క్రెడిట్ వారికి దక్కాల్సిందే: స్టోక్స్
యాషెస్ సిరీస్ 2025-26లో ఇంగ్లండ్ జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. మెల్బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ జయం సాధించింది. తద్వారా ఆస్ట్రేలియా గడ్డపై 14 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ తొలి యాషెస్ టెస్టు విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ ప్రతిష్టాత్మక బాక్సింగ్ డే టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసిపోయింది.మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ పిచ్పై ఇరు జట్లు బౌలర్లు నిప్పులు చెరిగారు. మొత్తం నాలుగు ఇన్నింగ్స్లలోనూ ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు. దీని బట్టి ఎంసీజీ వికెట్ బ్యాటర్లకు ఎంతకష్టతరంగా మారిందో ఆర్ధం చేసుకోవచ్చు. కేవలం రెండు రోజుల్లోనే మొత్తం 36 వికెట్లు నేలకూలాయి.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆసీస్.. తమ మొదటి ఇన్నింగ్స్లో కేవలం 152 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత ఇంగ్లండ్ కూడా తమ తొలి ఇన్నింగ్స్లో కేవలం 110 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్లో 42 పరుగుల ఆధిక్యం సంపాదించిన స్మిత్ సేన.. రెండో ఇన్నింగ్స్లో కూడా బ్యాటింగ్లో విఫలమైంది.ఇంగ్లండ్ బౌలర్లు నిప్పులు చెరగడంతో కేవలం 132 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యాన్ని జోడించి ఇంగ్లండ్ ముందు 175 పరుగుల లక్ష్యాన్ని ఉంచిగల్గింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఆరు వికెట్లు కోల్పోయి చేధించింది.ఇక ఈ చారిత్రత్మక విజయంపై మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించాడు. తమ జట్టుపై స్టోక్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. అదేవిధంగా ఇటువంటి పిచ్ను తను ఇప్పటివరకు చూడలేదని అతడు చెప్పుకొచ్చాడు.చాలా సంతోషంగా ఉన్నా.."ఆస్ట్రేలియాలో సుదీర్ఘ కాలం తర్వాత విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. మేము ఇప్పటికే సిరీస్ కోల్పోయినప్పటికి ఎట్టకేలకు సరైన ట్రాక్లో పడ్డాము. చివరి మ్యాచ్లో కూడా ఇదే జోరును కొనసాగిస్తాము. ఈ మ్యాచ్లో మా కుర్రాళ్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. కేవలం జట్టు కోసమో, మా కోసమో ఆడటం లేదు. ప్రపంచవ్యాప్తంగా మా వెన్నంటి ఉండి ప్రోత్సహించే లక్షలాది మంది అభిమానుల కోసం ఆడుతున్నాం. ఎక్కడికి వెళ్లినా మాకు లభించే మద్దుతు మాలో కొత్త ఉత్సహాన్ని నింపుతోంది. ఈ విజయం మా అభిమానులందరికీ ఎంతో సంతోషాన్నిస్తుందని భావిస్తున్నాను. గత కొన్ని రోజులగా మా జట్టుపై ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ ఆటగాళ్లు, మా కోచింగ్ స్టాప్ ఏకాగ్రతను కోల్పోకుండా కేవలం ఆటపై దృష్టి పెట్టారు. ఇంత ఒత్తిడిలో కూడా అద్భుత ప్రదర్శన చేసినందుకు ఆటగాళ్లకు, సపోర్ట్ స్టాప్కు కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే.ఈ పిచ్పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టమైంది. మెల్బోర్న్ వికెట్ పూర్తిగా బౌలర్లకు అనుకూలంగా ఉంది. అందుకే మా బ్యాటర్లను పాజిటివ్గా ఆడమని, బౌలర్లపై ఒత్తిడి తీసుకురావాలని సూచించాను. మా బ్యాటర్లు ఎంతో ధైర్యంగా ఆడి లక్ష్యాన్ని అందుకున్నారు. మా బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా జోష్ టంగ్ అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. బాక్సింగ్ డే రోజుల వేలాది మంది ప్రేక్షకుల ముందు 5 వికెట్లు తీయడం చిన్న విషయం కాదని స్టోక్స్ పేర్కొన్నాడు.అదేవిధంగా ఎంసీజీ పిచ్పై కూడా స్టోక్స్ ఘాటుగా స్పందించాడు. ఇటువంటి పిచ్ను నేను ఇప్పటివరకు చూడలేదు. ప్రపంచంలో మరెక్కడైనా ఇలాంటి పిచ్ను తాయారు చేసి ఉంటే పెద్ద రచ్చ జరిగి ఉండేది. బాక్సింగ్ డే టెస్టు కోసం లక్షలాది మంది అభిమానులు ఎదుచూస్తుంటారు. అటువంటి మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసి పోవడం చాలా బాధాకరం అని స్టోక్స్ అన్నాడు.చదవండి: Ashes: ఇదేంటో ఇలా ఉంది.. స్టీవ్ స్మిత్ విమర్శలు -
IND vs NZ: ‘మనోడి’తో పాటు మరో ముగ్గురు.. గోల్డెన్ ఛాన్స్!
టీమిండియాతో వన్డే, టీ20 సిరీస్లకు న్యూజిలాండ్ క్రికెట్ ఇప్పటికే తమ జట్లను ప్రకటించింది. వన్డే సిరీస్కు రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ దూరంగా ఉండగా.. అతడి స్థానంలో మైకేల్ బ్రేస్వెల్ సారథ్యం వహించనున్నాడు.అయితే, టీ20 సిరీస్ సందర్భంగా సాంట్నర్ తిరిగి జట్టుతో చేరనున్నాడు. ఇక జనవరి 11- 31 వరకు కివీస్ జట్టు భారత పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడుతుంది. ఈ నేపథ్యంలో టీ20 జట్టు స్టార్లతో నిండి ఉండగా.. వన్డే జట్టులో కొత్త ముఖాలే ఎక్కువగా ఉన్నాయి. ఆది అశోక్, క్రిస్టియన్ క్లార్క్, జోష్ కార్ల్సన్, జేడన్ లెనాక్స్ ఈసారి ఇండియా టూర్కు రానున్నారు.ఆది అశోక్భారత సంతికి చెందిన కివీస్ క్రికెటర్ ఆదిత్య అశోక్. తమిళనాడులో 2002, సెప్టెంబరు 5న జన్మించాడు. అశోక్ లెగ్ స్పిన్నర్. వైవిధ్య భరితమైన బంతులు వేయడంలో దిట్ట.భారత సంతతికే చెందిన ఇష్ సోధి కెరీర్ చరమాంకానికి చేరుకుంటున్నాడు. వైట్బాల్ క్రికెట్లో అతడి వారసుడిగా కివీస్ బోర్డు అశోక్ను తీర్చిదిద్దుతోంది. ఇప్పటికి న్యూజిలాండ్ తరఫున అశోక్ రెండు వన్డేలు, ఒక టీ20 ఆడి.. మొత్తంగా రెండు వికెట్లు తీశాడు.క్రిస్టియన్ క్లార్క్దేశీ క్రికెట్లో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న క్రిస్టియన్ క్లార్క్ రైటార్మ్ ఫాస్ట్బౌలర్. ఇప్పటి వరకు అతడు కివీస్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే, టీమిండియాతో వన్డే సిరీస్ సందర్భంగా అతడు అరంగేట్రం చేసే అవకాశం ఉంది.లిస్ట్-ఎ క్రికెట్లో 34 మ్యాచ్లు ఆడిన క్లార్క్ 52 వికెట్లు తీశాడు. అయితే, అతడి ఖాతాలో ఓ శతకం కూడా ఉండటం విశేషం. 23 ఇన్నింగ్స్లో కలిపి అతడు 373 పరుగులు సాధించాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటర్గానూ రాణించగల సత్తా ఉన్న క్లార్క్ వైపు కివీస్ మొగ్గుచూపవచ్చు.జోష్ క్లార్క్సన్ఆరడుగుల మూడు అంగుళాల ఎత్తు ఉండే సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ జోష్ క్లార్క్సన్. లోయర్ ఆర్డర్లో ఫినిషర్గా రాణించగల సత్తా కూడా ఉంది. ఇప్పటికి 11 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన క్లార్క్సన్.. 92 పరుగులు చేశాడు. లిస్ట్-ఎ క్రికెట్లో 98 మ్యాచ్లలో అతడి పేరిట 2214 పరుగులు ఉన్నాయి.జేడన్ లెనాక్స్భారత పర్యటనలో భాగంగా ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. 31 ఏళ్ల లెనాక్స్.. లిస్ట్-ఎ క్రికెట్లో 54 మ్యాచ్లలో కలిపి 69 వికెట్లు కూల్చాడు. ఎకానమీ 4.86. అతడి బౌలింగ్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదే నిదర్శనం. సాంట్నర్కు వన్డే సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు కాబట్టి.. లెనాక్స్ స్పిన్ విభాగంలో కీలకమయ్యే ఛాన్స్ ఉంది.చదవండి: IND vs NZ: కివీస్ జట్ల ప్రకటన.. గాయాల వల్ల కీలక ప్లేయర్లు దూరం -
మా ఓటమికి కారణం అదే: స్టీవ్ స్మిత్ విమర్శలు
హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. బాక్సింగ్ డే టెస్టులో ఇంగ్లండ్ చేతిలో ఆసీస్కు ఓటమి ఎదురైంది. సొంతగడ్డపై ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ను కంగారూలు ఇప్పటికే సొంతం చేసుకున్నారు.3-0తో సిరీస్ సొంతంపెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్ టెస్టుల్లో గెలుపొంది.. ఇంగ్లండ్పై మరోసారి ఆధిపత్యం చాటుతూ.. మరో రెండు టెస్టులు మిగిలి ఉండగానే వరుసగా రెండోసారి యాషెస్ సిరీస్ గెలుచుకుంది. తొలి రెండు టెస్టులకు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరం కాగా.. స్టీవ్ స్మిత్ సారథ్యం వహించాడు.మూడో టెస్టుకు కమిన్స్ తిరిగి వచ్చి జట్టుకు గెలుపు అందించగా.. అనారోగ్యం వల్ల స్మిత్ ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం మొదలైన నాలుగో టెస్టు నుంచి కమిన్స్ విశ్రాంతి తీసుకోగా.. స్మిత్ తిరిగి పగ్గాలు చేపట్టాడు.అయితే, ఈ మ్యాచ్లోనూ ఆది నుంచి ఆధిపత్యం కనబరిచిన ఆసీస్... శనివారం నాటి రెండో రోజు ఆటలో బోల్తా పడింది. ఫలితంగా నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై ఇంగ్లండ్ తొలి టెస్టు విజయాన్ని అందుకుంది.ఇదిలా ఉంటే.. మెల్బోర్న్ టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తొలిరోజే ఇరవై వికెట్లు కూలి ఇరుజట్లు ఆలౌట్ అయ్యాయి. రెండో రోజు సైతం పదహారు వికెట్లు పడ్డాయి. ఇక ఈ విషయంపై స్మిత్ స్పందించాడు. ఇంగ్లండ్ చేతిలో ఓటమి అనంతరం మాట్లాడుతూ..మా ఓటమికి కారణం అదే‘‘కష్టతరమైన మ్యాచ్. తొందరంగా ముగిసిపోయింది. మేము అదనంగా కనీసం 50- 60 పరుగులు చేసి ఉంటే మంచి పోటీ ఉండేది. ఏదేమైనా చివరి వరకు మేము పట్టువీడలేదు.ఇదేంటో ఇలా ఉందివికెట్ ముందుగా ఊహించినట్లుగానే ఉంది. అయితే, బంతి పాతబడే కొద్ది పూర్వపు రూపాన్ని కోల్పోయింది. వాళ్లు బ్యాటింగ్కు వచ్చినపుడు కొన్ని ఓవర్లు దూకుడుగానే ఆడారు. ఏదేమైనా ఈ పిచ్ బౌలర్లకు అతిగా సహకరించింది.రెండు రోజుల్లోనే 36 వికెట్లు పడ్డాయంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పచ్చికను కాస్త మెరుగుపరిచి ఉంటే బాగుండేది. అయితే, వికెట్ ఎలా ఉన్నా అందుకు తగ్గట్లుగా మేము ఆడాల్సింది’’ అని స్మిత్ చెప్పుకొచ్చాడు. పరోక్షంగా పిచ్పై విమర్శలు గుప్పించాడు.ఆసీస్- ఇంగ్లండ్ యాషెస్ బాక్సింగ్ డే టెస్టు సంక్షిప్త స్కోర్లు👉ఆస్ట్రేలియా: 152 &132👉ఇంగ్లండ్: 110 &178/6👉ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలుపు -
శుభ్మన్ గిల్ కీలక నిర్ణయం..!
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో ఆఖరి రెండు మ్యాచ్లకు గాయం కారణంగా దూరమైన టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్.. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. దీంతో న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో భారత జట్టును ముందుండి నడిపించేందుకు గిల్ సిద్దంగా ఉన్నాడు. అంతకంటే ముందు విజయ్ హజారే ట్రోఫీ-2025లో గిల్ ఆడనున్నాడు.టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ మాదిరిగానే కేవలం రెండు మ్యాచ్లకు మాత్రమే గిల్ అందుబాటులో ఉండనున్నాడు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన 18 మంది సభ్యుల జట్టులో గిల్ ముందే చోటు దక్కించుకున్నాడు. అయితే ఈ టోర్నీలో పంజాబ్ ఆడిన తొలి రెండు మ్యాచ్లకు గిల్ దూరంగా ఉన్నాడు.దీంతో అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని, నేరుగా కివీస్ సిరీస్లోనే ఆడనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ గిల్ మాత్రం ఈ దేశవాళీ వన్డేలో టోర్నీలో ఆడేందుకు సిద్దమయ్యాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. జనవరి 3న సిక్కిం, జనవరి 6న గోవాతో పంజాబ్ ఆడనున్న మ్యాచ్లలో గిల్ బరిలోకి దిగనున్నాడు. ప్రస్తుతం మొహాలీలో ఉన్న శుభ్మన్.. జనవరి 1న జైపూర్లో పంజాబ్ జట్టుతో కలవనున్నట్లు సమాచారం. అదేవిధంగా ముంబైతో జరిగే ఫైనల్ గ్రూపు లీగ్ మ్యాచ్ ఆడేందుకు కూడా గిల్ ఆసక్తిచూపుతున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. జనవరి 8న పంజాబ్ తమ చివరి లీగ్ మ్యాచ్లో ముంబైతో తలపడనుంది.అయితే అక్కడికి రెండు రోజుల తర్వాత భారత్-న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ క్యాంపును ఏర్పాటు చేసే అవకాశముంది. ఒకవేళ అదే జరిగితే ముంబైతో మ్యాచ్కు గిల్ దూరం కానున్నాడు. కాగా గిల్ ప్రస్తుతం పేలవ ఫామ్తో సతమతవుతున్నాడు. దీంతో అతడికి టీ20 వరల్డ్కప్-2026 జట్టులో చోటు దక్కలేదు. అతడి స్ధానంలో ఇషాన్ కిషన్ను జట్టులోకి తీసుకున్నారు.చదవండి: రికెల్టన్ సుడిగాలి శతకం వృథా.. మార్క్రమ్ మెరుపులతో బోణీ -
రికెల్టన్ సుడిగాలి శతకం వృథా
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26 సీజన్కు తెరలేచింది. కేప్టౌన్ వేదికగా డర్బన్ సూపర్ జెయింట్స్- ఎంఐ కేప్టౌన్ మధ్య శుక్రవారం రాత్రి తొలి మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన సూపర్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో డెవాన్ కాన్వే మెరుపు అర్ధ శతకం (33 బంతుల్లో 64) సాధించగా.. కేన్ విలియమ్సన్ ధనాధన్ (25 బంతుల్లో 40) దంచికొట్టాడు.వన్డౌన్లో వచ్చిన జోస్ బట్లర్ (12 బంతుల్లో 22), వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (14 బంతుల్లో 22) ఆకట్టుకోగా.. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (17 బంతుల్లో 35), ఇవాన్ జోన్స్ (14 బంతుల్లో 33 నాటౌట్) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడారు. ఆఖర్లో డేవిడ్ వీస్ (5 బంతుల్లో 9) మెరపులు మెరిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో డర్బన్ సూపర్ జెయింట్స్ ఐదు వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది.కేప్టౌన్ బౌలర్లలో జార్జ్ లిండే రెండు వికెట్లు తీయగా.. కార్బిన్ బాష్, ట్రిస్టన్ లూస్, ట్రెంట్ బౌల్ట్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక భారీ లక్ష్య ఛేదనలో కేప్టౌన్ ఆదిలోనే ఓపెనర్ రాసీ వాన్ డెర్ డసెన్ (2) వికెట్ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ విధ్వంసకర శతకంతో దుమ్ములేపాడు. 𝗧𝗵𝗮𝘁 𝗛𝘂𝗻𝗱𝗿𝗲𝗱 𝘁𝗵𝗼𝘂𝗴𝗵!#MICTvDSG #BetwaySA20 #WelcomeToIncredible pic.twitter.com/MnE3BizcLO— Betway SA20 (@SA20_League) December 27, 2025 కేవలం 63 బంతుల్లోనే ఐదు ఫోర్లతో పాటు ఏకంగా 11 సిక్సర్లు బాదిన రికెల్టన్ 113 పరుగులు సాధించాడు. మిగతా వారిలో రీజా హెండ్రిక్స్ (28) ఫర్వాలేదనిపించగా.. జేసన్ స్మిత్ సుడిగాలి ఇన్నింగ్స్ (14 బంతుల్లో 41)తో మెరిశాడు. 𝗔𝗯𝗼𝘂𝘁 𝗹𝗮𝘀𝘁 𝗻𝗶𝗴𝗵𝘁 #MICTvDSGThis Season is going to be 🔥Tickets are going fast, don’t miss your chance to be part of the action: https://t.co/VuPOMrokgY#BetwaySA20 #WelcomeToIncredible pic.twitter.com/R3X4Jdj9m1— Betway SA20 (@SA20_League) December 27, 2025అయితే, మిగిలిన వారి నుంచి అతడికి సహకారం లభించలేదు. నికోలస్ పూరన్ (15) నిరాశపరచగా.. డ్వేన్ ప్రిటోరియస్ (5) తేలిపోయాడు. జార్జ్ లిండే డకౌట్ కాగా.. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి కెప్టెన్ రషీద్ ఖాన్ 1, కార్బిన్ బాష్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. ఏడు వికెట్లు నష్టపోయిన కేప్టౌన్ 217 పరుగులకు పరిమితమై.. 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.డేవిడ్ వీస్, సైమన్ హార్మర్, క్వెనా మఫాకా తలా ఒక వికెట్ పడగొట్టగా.. ఎథాన్ బాష్ నాలుగు వికెట్లతో చెలరేగి కేప్టౌన్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. దీంతో సౌతాఫ్రికా టీ20 లీగ్లో తొలి శతకం బాదిన రికెల్టన్ ఇన్నింగ్స్ వృథాగా పోయింది. -
కొద్ది నిమిషాల్లో మ్యాచ్.. గ్రౌండ్లోనే ప్రాణాలు విడిచిన కోచ్
బంగ్లాదేశ్ క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) ఫ్రాంచైజీ ఢాకా క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ మహబూబ్ అలీ జాకీ (59) ఆకస్మికంగా మరణించారు. శనివారం సిల్హెట్ వేదికగా రాజ్షాహి రాయల్స్తో జరగాల్సిన మ్యాచ్కు కొద్ది నిమిషాల ముందు మహబూబ్ అలీ మైదానంలోనే కుప్పకూలారు.వెంటనే స్పందించిన ఫిజియోలు ఆయనకు సీపీఆర్ (CPR) నిర్వహించి అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మహబూబ్ ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఫిజిషీయన్ దేబాశిష్ చౌదరి ధృవీకరించారు. ఈ విషాద ఘటన మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సందర్భంగా చోటు చేసుకుంది. అయితే మహబూబ్ అలీ జాకీ మరణానికి గల ఖచ్చితమైన కారణాన్ని ఇంకా వెల్లడించలేదు. అయితే ఆయనకు గుండెపోటు (Cardiac Arrest) వచ్చినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. అంతకుముందు వరకు ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, ఫిట్గానే ఉన్నారని సహచరులు తెలిపారు. ఈ వార్త తెలియగానే మైదానంలో ఉన్న ఆటగాళ్లు, అధికారులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. వెంటనే సిల్హెట్ టైటాన్స్, నోవాఖాలీ ఎక్స్ప్రెస్, చట్టోగ్రామ్ రాయల్స్ జట్లకు చెందిన ప్లేయర్లు, కోచ్లు తమ ప్రాక్టీస్ ఆపేసి ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన మృతి పట్ల బంగ్లాదేశ్ క్రికెట్ ఎక్స్ వేదికగా సంతాపం వ్యక్తం చేసింది.ఒక దిగ్గజ కోచ్గా..బంగ్లాదేశ్ పేస్ బౌలింగ్ విభాగంలో జాకీ ఒక లెజెండరీ కోచ్గా గుర్తింపు తెచ్చుకున్నారు. అండర్-19 వరల్డ్ కప్(2020)ను బంగ్లాదేశ్ సొంతం చేసుకోవడంలో బౌలింగ్ కోచ్గా ఆయనది కీలక పాత్ర. అదేవిధంగా టాస్కిన్ అహ్మద్, షోర్ఫుల్ ఇస్లాం వంటి స్టార్ పేసర్లు జాకీ కోచింగ్లోనే రాటుదేలారు. ఆయన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు స్పెషలిస్ట్ బౌలింగ్ కోచ్గా, బౌలింగ్ యాక్షన్ రివ్యూ కమిటీ సభ్యుడిగా సేవలందించారు.చదవండి: టీమిండియా కెప్టెన్ ప్రపంచ రికార్డు -
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఆసీస్ గడ్డపై తొలిసారి ఇలా..
ఆస్ట్రేలియా గడ్డపై దాదాపు దశాబ్దన్నరం తర్వాత ఇంగ్లండ్ తొలిసారి టెస్టు మ్యాచ్ గెలిచింది. పదిహేనేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మొదటిసారి గెలుపు జెండా ఎగురవేసింది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో భాగంగా బాక్సింగ్ డే టెస్టులో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.గెలుపు బోణీఆతిథ్య ఆసీస్ విధించిన 175 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించి.. గెలుపు బోణీ కొట్టింది. యాషెస్ సిరీస్లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియాకు వచ్చిన ఇంగ్లండ్ హ్యాట్రిక్ పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అయింది. వరుసగా మూడు మ్యాచ్లు గెలిచిన కంగారూలు యాషెస్ సిరీస్ను మరోసారి కైవసం చేసుకోగా.. స్టోక్స్ బృందం తీవ్ర విమర్శలపాలైంది.ముఖ్యంగా.. బజ్బాల్ అంటూ దూకుడైన ఆటతో మూల్యం చెల్లించేలా చేసిన హెడ్కోచ్ బ్రెండన్ మెకల్లమ్ పదవి నుంచి దిగిపోవాలనే డిమాండ్లు పెరిగాయి. ఇలాంటి ఒత్తిళ్ల నడుమ ప్రసిద్ధ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో నాలుగో టెస్టులో బరిలో దిగింది ఇంగ్లండ్.బౌలర్లదే పైచేయిశుక్రవారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుని.. ఆసీస్ను తొలి ఇన్నింగ్స్లో 152 పరుగులకు ఆలౌట్ చేసింది. అయితే, పచ్చటి పిచ్ పేసర్లకు అనుకూలించిన తరుణంలో ఆసీస్ బౌలర్లు సైతం చెలరేగిపోయారు. ఇంగ్లండ్ను 110 పరుగులకే కుప్పకూల్చారు.ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో 42 పరుగుల ఆధిక్యం సంపాదించిన కంగారూలు.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం తేలిపోయారు. ఈసారి 132 పరుగులకే ఆలౌట్ అయ్యారు. తద్వారా ఇంగ్లండ్కు 175 పరుగుల లక్ష్యాన్ని విధించగలిగారు. అయితే, లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ పొరపాట్లకు తావివ్వలేదు.ఆచితూచి ఆడుతూనే తమదైన శైలిలో టార్గెట్ పూర్తి చేసింది. ఆరు వికెట్లు నష్టపోపయి 178 పరుగులు చేసి.. నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఇంగ్లండ్ చివరగా 2010లో టెస్టు మ్యాచ్ గెలిచింది. ఆసీస్ గడ్డపై తొలిసారి ఇలా..ఇక ఇంగ్లండ్ టెస్టు దిగ్గజం జో రూట్, కెప్టెన్ బెన్ స్టోక్స్కు ఆస్ట్రేలియాలో ఇదే యాషెస్ తొలి టెస్టు విజయం కావడం విశేషం. ఇంతటి ప్రత్యేక మ్యాచ్లో మొత్తంగా ఏడు వికెట్లతో చెలరేగిన జోష్ టంగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.చదవండి: Ro-Ko: అక్కడేమో రూ. లక్షలు.. మరి ఇక్కడ సంపాదించేది ఎంత? -
టీమిండియా కెప్టెన్ ప్రపంచ రికార్డు
ఐసీసీ వన్డే ప్రపంచకప్-2025లో చాంపియన్గా నిలిచిన తర్వాత తమ తొలి సిరీస్లో భారత మహిళా క్రికెట్ జట్టు అదరగొట్టింది. సొంతగడ్డపై శ్రీలంకతో టీ20 సిరీస్ను కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా హ్యాట్రిక్ విజయాలు సాధించి.. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే ఈ ట్రోఫీని గెలిచింది.తిరువనంతపురం వేదికగా శుక్రవారం రాత్రి నాటి మ్యాచ్లో శ్రీలంక మహిళా జట్టును ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించిన హర్మన్ సేన.. విజయాల పరంపరను కొనసాగించింది. గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ హర్మన్ నమ్మకాన్ని నిలబెట్టే రీతిలో భారత బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. 112 పరుగులకే పరిమితంనిర్ణీత 20 ఓవర్లలో లంకను కేవలం 112 పరుగులకే పరిమితం చేశారు. రేణుకా సింగ్ ఠాకూర్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. దీప్తి శర్మ మూడు వికెట్లు పడగొట్టింది. లంక బ్యాటర్లలో ఓపెనర్ హాసిని పెరీరా (18 బంతుల్లో 25), ఇమేషా దులాని (32 బంతుల్లో 27), కవిశా దిల్హారి (13 బంతుల్లో 20), వికెట్ కీపర్ బ్యాటర్ కౌశాని నుతయంగన (16 బంతుల్లో 19 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. లంక బౌలర్ కవిశా దిల్హారి బౌలింగ్లో స్మృతి మంధాన (1) లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగింది. వన్డౌన్లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ (9)ను కవిశా వెనక్కి పంపింది.షఫాలీ, హర్మన్ ధనాధన్ఇలాంటి దశలో మరో ఓపెనర్ షఫాలీ వర్మ, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ధనాధన్ ఇన్నింగ్స్తో లంక బౌలర్లకు చుక్కలు చూపించారు. షఫాలీ 42 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్లు బాది 79 పరుగులు చేయగా.. హర్మన్ (18 బంతుల్లో 21) షఫాలీతో కలిసి అజేయంగా నిలిచింది. 13.2వ ఓవర్లో ఫోర్ బాది షఫాలీ జట్టును గెలుపు తీరాలు దాటించింది.ఇక ఇంతకుముందు విశాఖపట్నంలో తొలి రెండు టీ20లలోనూ గెలిచిన భారత్ 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే.. భారత జట్టు కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్కు ఇది 77వ విజయం. తద్వారా అంతర్జాతీయ మహిళల పొట్టి క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన సారథిగా హర్మన్ చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ మెగ్ లానింగ్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టి.. ఈ జాబితాలో తొలి స్థానానికి ఎగబాకింది.మహిళల అంతర్జాతీయ టీ20లలో కెప్టెన్గా అత్యధిక విజయాలు (సూపర్ ఓవర్ సహా)👉హర్మన్ప్రీత్ కౌర్ (ఇండియా)- 130 మ్యాచ్లలో 77 విజయాలు👉మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా)- 100 మ్యాచ్లలో 76 విజయాలు👉హీదర్ నైట్ (ఇంగ్లండ్)- 96 మ్యాచ్లలో 72 విజయాలు👉చార్లెట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్)- 93 మ్యాచ్లలో 68 విజయాలు👉ఎన్ చైవాయి (థాయ్లాండ్)- 79 మ్యాచ్లలో 55 విజయాలు.చదవండి: Ro-Ko: అక్కడేమో రూ. లక్షలు.. మరి ఇక్కడ సంపాదించేది ఎంత? -
Ashes: ఎట్టకేలకు...
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ తాజా ఎడిషన్లో ఇంగ్లండ్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో స్టోక్స్ బృందం విజయం సాధించింది. ఆతిథ్య జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించి.. సిరీస్లో కంగారూల సిరీస్ ఆధిక్యాన్ని తగ్గించింది.యాషెస్ సిరీస్ (Ashes)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్ ఆస్ట్రేలియా (Aus vs Eng) పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్ టెస్టుల్లో ఆసీస్ చేతిలో ఇంగ్లిష్ జట్టు చిత్తుగా ఓడింది. దీంతో 3-0తో కంగారూలు సిరీస్ మరోసారి కైవసం చేసుకోగా.. ఇంగ్లండ్ జట్టు తీవ్ర విమర్శలు మూటగట్టుకుంది.రెండు రోజుల్లోనే..ఇలాంటి తరుణంలో ప్రధాన పేసర్ జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) గాయపడటంతో మరో ఎదురుదెబ్బ తగిలింది. అతడు లేకుండానే బాక్సింగ్ డే టెస్టు బరిలో దిగింది. అయితే, మెల్బోర్న్ వేదికగా శుక్రవారం మొదలైన ఈ నాలుగో టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ చేసింది. యువ పేసర్ జోష్ టంగ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. ఆసీస్ను తొలి ఇన్నింగ్స్లో 152 పరుగులకు ఆలౌట్ చేసింది. అయితే, ఆ సంతోషం ఇంగ్లండ్కు ఎక్కువ సేపు నిలవలేదు. తొలి రోజే తమ మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన స్టోక్స్ బృందం.. 110 పరుగులకే కుప్పకూలింది.నిప్పులు చెరిగిన ఆసీస్ పేసర్లుహ్యారీ బ్రూక్ 41 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలవగా.. ఆసీస్ పేసర్లు నాసర్ 4, బోలాండ్ 3, స్టార్క్ 2 వికెట్లు తీసి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసే సరికి రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆసీస్.. వికెట్ నష్టపోకుండా నాలుగు పరుగులు చేసింది. ఇక 4/0 ఓవర్నైట్ స్కోరుతో శనివారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఆసీస్.. మరో 128 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. ఓపెనర్ ట్రవిస్ హెడ్ (46), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (24 నాటౌట్) మాత్రమే మెరుగ్గా రాణించగా.. మిగతా వారంతా చేతులెత్తేశారు.విజృంభించిన ఇంగ్లండ్ బౌలర్లుఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. కెప్టెన్ స్టోక్స్ మూడు, జోష్ టంగ్ రెండు, గస్ అట్కిన్సన్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఆది నుంచే నిప్పులు చెరుగుతూ 34.3 ఓవర్లలో ఆసీస్ను 132 పరుగులకు ఆలౌట్ చేశారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 42 పరుగులు కలుపుకొని ఆసీస్.. ఇంగ్లండ్కు 175 (42+132) పరుగుల లక్ష్యాన్ని విధించింది.ఎట్టకేలకు తొలి విజయంపేసర్లకు అనుకూలిస్తున్న పిచ్పై ఈ మేరకు ‘భారీ’ స్కోరును ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ సఫలమైంది. టాపార్డర్లో ఓపెనర్లు జాక్ క్రాలీ (37), బెన్ డకెట్ (34) రాణించగా.. వన్డౌన్లో వచ్చిన ‘పేసర్’ బ్రైడన్ కార్స్ (6) విఫలమయ్యాడు.ఈ క్రమంలో జేకబ్ బెతెల్ (40) బాధ్యతాయుతంగా ఆడగా.. జో రూట్ 15 పరుగులు చేయగలిగాడు. ఇక కెప్టెన్ స్టోక్స్ (2) నిరాశపరచగా.. జేమీ స్మిత్ (3)తో కలిసి అజేయంగా నిలిచిన హ్యారీ బ్రూక్ (18) ఇంగ్లండ్ను విజయతీరాలకు చేర్చాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, జే రిచర్డ్సన్, స్కాట్ బోలాండ్ తలా రెండు వికెట్లు తీయగా.. ఇంగ్లండ్ 32.2 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసి గెలుపు అందుకుంది.బాక్సింగ్ డే టెస్టు సంక్షిప్త స్కోర్లుఆస్ట్రేలియా: 152 &132ఇంగ్లండ్: 110 &178/6.చదవండి: నవతరం క్రికెట్లో.. మూడు ఫార్మాట్లు ఆడగల టాప్-5 ప్లేయర్లు వీరే! -
అక్కడేమో రూ. లక్షలు.. మరి ఇక్కడ సంపాదించేది ఎంత?
ప్రతి ఏడాది మాదిరే ఈసారీ దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ మొదలైంది. అయితే, ఈసారి భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల రాకతో ఈ సీజన్కు పండుగ కళ వచ్చింది. ఢిల్లీ తరఫున కోహ్లి.. ముంబైకి ఆడుతూ రోహిత్ బుధవారం నాటి తొలి మ్యాచ్లలో శతక్కొట్టారు.రెండో రౌండ్లో భాగంగా శుక్రవారం నాటి మ్యాచ్లో కోహ్లి మరోసారి అద్భుత ప్రదర్శన కనబరచగా.. రోహిత్ మాత్రం ఈసారి గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగి నిరాశపరిచాడు. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రో-కో బీసీసీఐ ఆదేశాల మేరకు ఇలా దేశీ క్రికెట్ బరిలో దిగారు. వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి తాము సిద్ధంగా ఉన్నామని మరోసారి సంకేతాలు ఇచ్చారు.రూ. వెయ్యి కోట్లకు పైగానేఇక ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో దిగ్గజ బ్యాటర్లుగా పేరు తెచ్చుకున్న రోహిత్- కోహ్లి.. సంపాదన ఏ స్థాయిలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా కోహ్లి నెట్వర్త్ రూ. వెయ్యి కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు, ఐపీఎల్లో ఆడటం ద్వారా కూడా రో-కో భారీ స్థాయిలో వేతనం పొందుతున్నారు. మరి విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఇప్పటికి రెండు మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఈ దిగ్గజాలకు లభించే మ్యాచ్ ఫీజు ఎంతో తెలుసా?!..విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో లిస్ట్-ఎ మ్యాచ్లలో భాగమయ్యే ఆటగాళ్లను వారు ఆడిన మ్యాచ్ల సంఖ్య ఆధారంగా మూడు కేటగిరీలుగా విభజించి.. తదనుగుణంగా ఫీజును చెల్లిస్తారు. ఆ వివరాలు ఇవీ..సీనియర్ కేటగిరీ (40కి పైగా లిస్టు-ఎ మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లు)తుదిజట్టులో ఉన్నవారికి: మ్యాచ్కు రూ. 60 వేల చొప్పున ఫీజురిజర్వు ప్లేయర్లకు: మ్యాచ్కు రూ. 30 వేల చొప్పున ఫీజుమిడ్-లెవల్ కేటగిరీ (21 నుంచి 40 లిస్టు-ఎ మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లు)తుదిజట్టులో ఉన్నవారికి: మ్యాచ్కు రూ. 50 వేల చొప్పున ఫీజురిజర్వు ప్లేయర్లకు: మ్యాచ్కు రూ. 25 వేల చొప్పున ఫీజుజూనియర్ కేటగిరీ (0- 20 లిస్టు-ఎ మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లు)తుదిజట్టులో ఉన్నవారికి: మ్యాచ్కు రూ. 40 వేల చొప్పున ఫీజురిజర్వు ప్లేయర్లకు: మ్యాచ్కు రూ. 20 వేల చొప్పున ఫీజు.రోజువారీ అలవెన్సులురవాణా, భోజనం ఖర్చులు.. వసతి ఏర్పాటుప్రదర్శన ఆధారంగా బోనస్లుమ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన ఆటగాడికి రూ. 10 వేల ప్రైజ్మనీప్రైజ్మనీనాకౌట్ దశకు చేరిన, ఫైనల్ ఆడిన జట్లకు ప్రైజ్పూల్ ఆధారంగా నజరానా ఇస్తారు.అక్కడేమో రూ. లక్షలు.. మరి ఇక్కడ వచ్చేది ఎంత?ఇక బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లుగా రోహిత్- కోహ్లి ఒక్కో వన్డేకు రూ. 6 లక్షల చొప్పున మ్యాచ్ ఫీజు అందుకుంటారు. అయితే, విజయ్ హజారే ట్రోఫీలో సీనియర్ కేటగిరీలో ఉన్నందుకు గానూ రూ. 60 వేలతో పాటు బోనస్, అలవెన్సులు కూడా దక్కుతాయి. ఫీజులో వ్యత్యాసం ఉన్నా.. ఆట ఒక్కటే.ఈ దేశీ టోర్నీ ద్వారానే తమను తాము నిరూపించుకున్న రో- కో వంటి ఎంతో మంది ఆటగాళ్లు ఉన్నత స్థాయికి చేరారు. ఏదేమైనా బీసీసీఐ నిబంధనల పుణ్యమా అని రోహిత్- కోహ్లిలను మరోసారి తమ సొంత దేశీ జట్ల తరఫున ఆడుతుంటే చూసే భాగ్యం అభిమానులకు దక్కింది. -
వరుసగా ఐదో సెంచరీ!.. మళ్లీ ఓడిన హైదరాబాద్
రాజ్కోట్: విజయ్ హజారే ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. విదర్భ జట్టుతో శుక్రవారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘బి’ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 89 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట విదర్భ 50 ఓవర్లలో 5 వికెట్లకు 365 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ధ్రువ్ షొరే (77 బంతుల్లో 109 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్స్లు) అజేయ సెంచరీ సాధించాడు. లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో ధ్రువ్కిది వరుసగా ఐదో సెంచరీ. నారాయణ్ జగదీశన్ పేరిట ఉన్న రికార్డును ధ్రువ్ సమం చేశాడు. అమన్ మోఖడె (82; 7 ఫోర్లు, 3 సిక్స్లు), యశ్ రాథోడ్ (68; 6 ఫోర్లు), సమర్థ్ (63; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో కార్తికేయ 3 వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో హైదరాబాద్ 49.2 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ గౌడ్ (68 బంతుల్లో 85; 4 ఫోర్లు, 4 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... అభిరథ్ రెడ్డి (43; 8 ఫోర్లు), కెపె్టన్ రాహుల్ సింగ్ (37; 4 ఫోర్లు) తలాకొన్ని పరుగులు చేసినా ఫలితం లేకపోయింది. -
కోహ్లి 77 రోహిత్ 0
బెంగళూరు: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (61 బంతుల్లో 77; 13 ఫోర్లు, 1 సిక్స్) దేశవాళీల్లో కూడా అద్భుత ఫామ్ కొనసాగిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ తొలి మ్యాచ్లో ఆంధ్ర జట్టుపై శతకంతో కదంతొక్కిన కోహ్లి... గుజరాత్తో శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్లో హాఫ్ సెంచరీతో రాణించాడు. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన ఈ పోరులో రిషభ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు 7 పరుగుల తేడాతో గుజరాత్పై విజయం సాధించింది. మొదట ఢిల్లీ నిరీ్ణత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కోహ్లి చక్కటి షాట్లతో అర్ధశతకంతో ఆకట్టుకోగా... రిషభ్ పంత్ (70; 8 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అనంతరం ఛేదనలో గుజరాత్ 47.4 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ ‘డకౌట్’ జైపూర్: సిక్కింతో జరిగిన తొలి మ్యాచ్లో భారీ సెంచరీతో చెలరేగిన ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ (0) ఉత్తరాఖండ్తో మ్యాచ్లో ‘గోల్డెన్ డకౌట్’ అయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగి నిరాశ పరిచాడు. అయినా శుక్రవారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘సి’ మ్యాచ్లో ముంబై జట్టు 51 పరుగుల తేడాతో ఉత్తరాఖండ్పై గెలిచింది. మొదట ముంబై 50 ఓవర్లలో 7 వికెట్లకు 331 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ తమోర్ (93 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... సర్ఫరాజ్ ఖాన్ (55; 5 ఫోర్లు, 1 సిక్స్), ముషీర్ ఖాన్ (55; 7 ఫోర్లు), షమ్స్ ములానీ (48; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఛేదనలో ఉత్తరాఖండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 280 పరుగులకు పరిమితమైంది. -
మీ వెంటే మేము...
మెల్బోర్న్: ఆ్రస్టేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ‘యాషెస్’ సిరీస్ నాలుగో టెస్టులో బౌలర్ల జోరు కొనసాగుతోంది. పచ్చికతో కూడిన పిచ్పై ఆట తొలి రోజే 20 వికెట్లు నేలకూలి రెండు జట్ల తొలి ఇన్నింగ్స్లు ముగిశాయి. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ దాదాపు లక్ష మంది అభిమానుల సమక్షంలో జరిగిన పోరులో... ఇరు జట్ల బౌలర్లు బంతితో నిప్పులు చెరిగారు. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇప్పటికే ఆడిన తొలి మూడు టెస్టుల్లో నెగ్గిన ఆ్రస్టేలియా సిరీస్ను 3–0తో సొంతం చేసుకుంది. శుక్రవారం ప్రారంభమైన ‘బాక్సింగ్ డే’ టెస్టులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఆతిథ్య ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్లో 45.2 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. నెసెర్ (49 బంతుల్లో 35; 7 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... ఉస్మాన్ ఖ్వాజా (29), అలెక్స్ కేరీ (20) తలా కొన్ని పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు పడగొట్టగా... అట్కిన్సన్ 2 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ కూడా ప్రత్యర్థి పేస్కు దాసోహమైంది. 29.5 ఓవర్లలోనే 110 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (34 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ఒక్కడే కాస్త పోరాడగా... అట్కిన్సన్ (28), కెపె్టన్ బెన్ స్టోక్స్ (16) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఆసీస్ బౌలర్లలో నెసెర్ 4 వికెట్లు పడగొట్టగా... బోలాండ్ 3, స్టార్క్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఒక ఓవర్లో వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. స్కాట్ బోలాండ్ (4 బ్యాటింగ్), ట్రావిస్ హెడ్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న ఆ్రస్టేలియా... ఓవరాల్గా 46 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఒకరి వెంట ఒకరు... గత మూడు మ్యాచ్ల్లో గెలిచి ఫుల్ జోష్లో ఉన్న ఆ్రస్టేలియాకు... ఈ మ్యాచ్లో శుభారంభం దక్కలేదు. ట్రావిస్ హెడ్ (12), జేక్ వెదరాల్డ్ (10) పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. లబుషేన్ (6) విఫలం కాగా... కెపె్టన్ స్టీవ్ స్మిత్ (31 బంతుల్లో 9) క్రీజులో నిలిచే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆసీస్ 51 పరుగులకే 4 ప్రధాన వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఖ్వాజా, కేరీ కాస్త ప్రతిఘటన కనబర్చారు. క్రీజులో పాతుకుపోయి పరుగులు రాబట్టే ప్రయత్నం చేశారు. అయితే పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని వినియోగించుకున్న ఇంగ్లండ్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతూ... కంగారూలపై ఒత్తిడి పెంచారు. ఇటీవల ఐపీఎల్ వేలంలో రికార్డు ధర దక్కించుకున్న కామెరాన్ గ్రీన్ (17) కూడా ప్రభావం చూపలేకపోగా... ఆఖర్లో నెసెర్ ధాటిగా ఆడాడు. గ్రీన్, నేసెర్ ఏడో వికెట్కు 52 పరుగులు జోడించడంతో ఆసీస్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ పేసర్ జోష్ టంగ్ కెరీర్ అత్యుత్తమ గణాంకాలు (5/45) నమోదు చేసుకున్నాడు. తీరు మారని ఇంగ్లండ్... చక్కటి బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టడి చేసి సిరీస్లో తొలిసారి ఆధిపత్యం కనబర్చే అవకాశాన్ని ఇంగ్లండ్ వినియోగించుకోలేకపోయింది. జాక్ క్రాలీ (5), బెన్ డకెట్ (2), జాకబ్ బెథెల్ (1), జో రూట్ (0) ఇలా ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ బాట పట్టడంతో ఇంగ్లండ్ జట్టు 16 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో డకెట్ను అవుట్ చేసిన స్టార్క్... తన తదుపరి ఓవర్లో క్రాలీని బుట్టులో వేసుకున్నాడు. ఈ మధ్య డకెట్ను నెసెర్ అవుట్ చేయగా... 15 బంతులాడి ఖాతా తెరవలేకపోయిన రూట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో బ్రూక్ కౌంటర్ ఎటాక్కు ప్రయత్నించి కొంత ఫలితం సాధించాడు. కెపె్టన్ స్టోక్స్తో కలిసి చక్కటి షాట్లతో ఐదో వికెట్కు 50 పరుగులు జోడించాడు. బోలాండ్ బౌలింగ్లో బ్రూక్ వికెట్ల ముందు దొరికిపోగా... తక్కినవాళ్లు అతడిని అనుసరించారు. ఆఖర్లో అట్కిన్సన్ కొన్ని షాట్స్ ఆడి జట్టు స్కోరును వంద పరుగులు దాటించాడు. దీంతో ఆసీస్కు 42 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. 94,199 ఈ మ్యాచ్కు తొలి రోజు ప్రత్యక్షంగా వీక్షించిన అభిమానుల సంఖ్య. మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో ఇదే అత్యధికం. ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ మధ్య 2015 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్కు 93,013 మంది హాజరయ్యారు. తాజాగా ఆ రికార్డు బద్దలైంది. 3468 టెస్టు క్రికెట్లో 3000 వేల పరుగులు పూర్తి చేసుకునేందుకు హ్యారీ బ్రూక్కు అవసరమైన బంతులు. ఆ్రస్టేలియా మాజీ ప్లేయర్ గిల్క్రిస్ట్ 3610 బంతుల్లో ఈ మార్క్ అందుకున్నాడు. 4 మెల్బోర్న్ మైదానంలో ఇప్పటి వరకు జరిగిన టెస్టుల్లో తొలి రోజే 20 అంతకంటే ఎక్కువ వికెట్లు నేలకూలడం ఇది నాలుగోసారి. 1894లో ఆ్రస్టేలియా–ఇంగ్లండ్ టెస్టు తొలి రోజు 20 వికెట్లు... 1902లో ఆ్రస్టేలియా–ఇంగ్లండ్ టెస్టు తొలి రోజు 25 వికెట్లు...1932లో ఆస్ట్రేలియా–దక్షిణాఫ్రికా టెస్టు తొలి రోజు 20 వికెట్లు పడ్డాయి. -
ఆంధ్ర గెలుపు బోణీ
బెంగళూరు: విజయ్ హజారే ట్రోఫీ తొలి మ్యాచ్లో ఓడిన ఆంధ్ర జట్టు... రెండో పోరులో గెలుపుబాట పట్టింది. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన పోరులో ఆంధ్ర 6 వికెట్ల తేడాతో రైల్వేస్ను ఓడించింది. మొదట రైల్వేస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 266 పరుగులు చేసింది. రవి సింగ్ (76; 11 ఫోర్లు, 2 సిక్స్లు), అన్ష్ యాదవ్ (59; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలు సాధించారు. ఆంధ్ర బౌలర్లలో సత్యనారాయణ రాజు, కలిదిండి రాజు చెరో 3 వికెట్లు పడగొట్టగా... హేమంత్ రెడ్డి 2 వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో ఆంధ్ర జట్టు 44.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసి గెలిచింది. రికీ భుయ్ (74 బంతుల్లో 76; 7 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ నితీశ్ కుమార్ రెడ్డి (41 బంతుల్లో 55 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపులు మెరిపించాడు. మారంరెడ్డి హేమంత్ రెడ్డి (35 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు), షేక్ రషీద్ (53 బంతుల్లో 40; 6 ఫోర్లు, 2 సిక్స్లు), అశ్విన్ హెబ్బర్ (42 బంతుల్లో 30; 3 ఫోర్లు), శ్రీకర్ భరత్ (23 బంతుల్లో 25; 5 ఫోర్లు) కూడా తలా కొన్ని పరుగులు చేశారు. ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన హేమంత్ రెడ్డికి ‘ప్లేయర్ ఆప్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సోమవారం జరిగే మూడో లీగ్ మ్యాచ్లో ఒడిశా జట్టుతో ఆంధ్ర తలపడుతుంది. మళ్లీ ఓడిన హైదరాబాద్రాజ్కోట్: విజయ్ హజారే ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. విదర్భ జట్టుతో శుక్రవారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘బి’ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 89 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట విదర్భ 50 ఓవర్లలో 5 వికెట్లకు 365 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ధ్రువ్ షొరే (77 బంతుల్లో 109 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్స్లు) అజేయ సెంచరీ సాధించాడు. లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో ధ్రువ్కిది వరుసగా ఐదో సెంచరీ. నారాయణ్ జగదీశన్ పేరిట ఉన్న రికార్డును ధ్రువ్ సమం చేశాడు. అమన్ మోఖడె (82; 7 ఫోర్లు, 3 సిక్స్లు), యశ్ రాథోడ్ (68; 6 ఫోర్లు), సమర్థ్ (63; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో కార్తికేయ 3 వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో హైదరాబాద్ 49.2 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ గౌడ్ (68 బంతుల్లో 85; 4 ఫోర్లు, 4 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... అభిరథ్ రెడ్డి (43; 8 ఫోర్లు), కెపె్టన్ రాహుల్ సింగ్ (37; 4 ఫోర్లు) తలాకొన్ని పరుగులు చేసినా ఫలితం లేకపోయింది. -
రఫ్ఫాడించిన రింకూ సింగ్
రాజ్కోట్: భారత ఆటగాడు రింకూ సింగ్ (60 బంతుల్లో 106 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్స్లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టి20 ప్రపంచకప్ కోసం ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కించుకున్న రింకూ సింగ్... మిడిలార్డర్లో మెరుపులు మెరిపించాడు. ఫలితంగా ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా జరిగిన పోరులో ఉత్తర ప్రదేశ్ జట్టు 227 పరుగుల భారీ తేడాతో చండీగఢ్ను చిత్తు చేసింది. మొదట ఉత్తర ప్రదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 367 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆర్యన్ జుయల్ (118 బంతుల్లో 134; 7 ఫోర్లు, 8 సిక్స్లు) సెంచరీతో జట్టుకు గట్టి పునాది వేయగా... దానిపై రింకూ సింగ్ భారీ స్కోరు నిలబెట్టాడు. ధ్రువ్ జురేల్ (57 బంతుల్లో 67; 11 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం లక్ష్యఛేదనలో చండీగఢ్ 29.3 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మనన్ వోహ్రా (32; 4 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లంతా విఫలమయ్యారు. ఉత్తరప్రదేశ్ బౌలర్లలో జీషాన్ అన్సారీ 4 వికెట్లు పడగొట్టాడు. ఇదే గ్రూప్లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్ల్లో జమ్మూ కశీ్మర్ 142 పరుగుల తేడాతో అస్సాంపై... బరోడా 4 వికెట్ల తేడాతో బెంగాల్పై విజయాలు సాధించాయి. కరుణ్ నాయర్, పడిక్కల్ సెంచరీలు భారత ఆటగాళ్లు కరుణ్ నాయర్ (130 బంతుల్లో 130 నాటౌట్; 14 ఫోర్లు), దేవదత్ పడిక్కల్ (137 బంతుల్లో 124; 12 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీలతో కదంతొక్కడంతో విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్లో కర్ణాటక జట్టు వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక 8 వికెట్ల తేడాతో కేరళపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కేరళ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. మొహమ్మద్ అజహారుద్దీన్ (58 బంతుల్లో 84; 3 ఫోర్లు, 4 సిక్స్లు), బాబా అపరాజిత్ (62 బంతుల్లో 71; 8 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్ సెంచరీలు సాధించారు. అనంతరం లక్ష్యఛేదనలో కర్ణాటక జట్టు 48.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కరుణ్ నాయర్, దేవదత్ పడిక్కల్ ఆడుతూ పాడుతూ పరుగులు రాబట్టారు. ఇదే గ్రూప్లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్ల్లో మధ్యప్రదేశ్ జట్టు 2 వికెట్ల తేడాతో తమిళనాడుపై, జార్ఖండ్ 73 పరుగుల తేడాతో రాజస్తాన్పై... త్రిపుర 7 వికెట్ల తేడాతో పుదుచ్చేరిపై గెలుపొందాయి. అన్మోల్, హర్నూర్ శతకాలు ఎలైట్ గ్రూప్ ‘సి’లో పంజాబ్ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో పంజాబ్ 9 వికెట్ల తేడాతో ఛత్తీస్గఢ్పై నెగ్గింది. మొదట ఛత్తీస్గఢ్ 48.4 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ అమన్దీప్ ఖరే (76; 4 ఫోర్లు, 1 సిక్స్), మయాంక్ వర్మ (64; 8 ఫోర్లు) హాఫ్ సెంచరీలు సాధించారు. అనంతరం పంజాబ్ 42.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 254 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆప్ ద మ్యాచ్’ హర్నూర్ సింగ్ (114 బంతుల్లో 115 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్స్లు), అన్మోల్ప్రీత్ సింగ్ (96 బంతుల్లో 105 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్లు) అజేయ శతకాలతో జట్టును గెలిపించారు. ఇదే గ్రూప్లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్ల్లో మహారాష్ట్ర 8 వికెట్ల తేడాతో సిక్కింపై... గోవా 8 పరుగుల తేడాతో హిమాచల్ ప్రదేశ్పై విజయాలు సాధించాయి. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన మ్యాచ్ల్లో హరియాణా 6 వికెట్ల తేడాతో సౌరాష్ట్ర పై... ఒడిశా 4 వికెట్ల తేడాతో సర్వీసెస్పై గెలుపొందాయి. ప్లేట్ గ్రూప్లో బిహార్ జట్టు 15 పరుగుల తేడాతో మణిపూర్పై నెగ్గింది. బిహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ అందుకోవడానికి ఢిల్లీ వెళ్లడంతో ఈ మ్యాచ్లో ఆడలేదు. -
రేణుక నిప్పులు షఫాలీ మెరుపులు
121/6... 128/9... 112/7... ఇప్పటివరకు జరిగిన మూడు టి20ల్లోనూ శ్రీలంక మహిళల జట్టు స్కోర్లివి... భారత బౌలింగ్ ప్రతాపానికి మచ్చుతునకలు. ప్రతీ మ్యాచ్లోనూ మనమ్మాయిలు ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడేస్తున్నారు. దీంతో 20 ఓవర్ల కోటా పూర్తి చేసినా... ఆలౌట్ కాకపోయినా కూడా కనీసం 130 పరుగులైనా చేయకుండా శ్రీలంకనుతమ బౌలింగ్ బంధనాలతో కట్టడి చేస్తున్నారు. దీంతో హర్మన్ప్రీత్ బృందం రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ను 3–0తో వశం చేసుకుంది. తిరువనంతపురం: భారత్, శ్రీలంకల మధ్య ఈ వేదికపై ఇంకా రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. కానీ ఇక్కడ ఆడిన తొలి (మూడో టి20) మ్యాచ్తోనే భారత మహిళల జట్టు ఐదు టి20ల సిరీస్ను 3–0తో కైవసం చేసుకుంది. భారత పేసర్ రేణుక సింగ్ (4/21), సీనియర్ స్పిన్నర్ దీప్తి శర్మ (3/18) కోలుకోలేని దెబ్బతీయడంతో... మొదట శ్రీలంక మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 112 పరుగులే చేసింది. ఆతిథ్య బౌలింగ్ ధాటికి సింహళ బ్యాటర్లలో ఏ ఒక్కరు కనీసం 30 పరుగులైనా చేయలేకపోయారు. ఇమిషా దులానీ (32 బంతుల్లో 27; 4 ఫోర్లు) టాప్స్కోరర్! అనంతరం సులువైన లక్ష్యాన్ని హర్మన్ప్రీత్ సేన 13.2 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ షఫాలీ వర్మ (42 బంతుల్లో 79 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్తో గెలిపించింది. ఆమె దూకుడు వల్లే ఇంకా 6.4 ఓవర్లకు ముందే భారత్ లక్ష్యాన్ని చేరుకుంది. ఇదే వేదికపై రేపు నాలుగో టి20 మ్యాచ్ జరుగుతుంది. షఫాలీ మళ్లీ ధనాధన్ ‘షో’ తొలుత లంక ఇన్నింగ్స్ రేణుక, దీప్తి చావుదెబ్బ తీశారు. దీంతో 45/4 స్కోరు వద్దే ప్రధాన బ్యాటింగ్ బలగాన్ని కోల్పోయింది. హాసిని (25), మిడిలార్డర్లో కవిషా దిల్హరి (20), కౌషిని (19) చేసిన పరుగులతో కష్టంగా జట్టు స్కోరు వంద దాటింది. తర్వాత గత మ్యాచ్ల కంటే తక్కువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత జట్టులో షఫాలీ వర్మ మళ్లీ ధనాధన్ షో రెచ్చిపోయింది. చూడచక్కని బౌండరీలు, భారీ సిక్సర్లతో లంక బౌలర్లపై విరుచుకుపడింది. 24 బంతుల్లోనే ఫిఫ్టీని పూర్తి చేసుకుంది. దీంతో స్మృతి మంధాన (1), జెమీమా (9)లు సింగిల్ డిజిట్లకు అవుటైనా... రవ్వంత ప్రభావం లేకుండానే లక్ష్యంవైపు భారత్ నడించింది. హర్మన్ప్రీత్ (21 నాటౌట్; 2 ఫోర్లు), షఫాలీ అబేధ్యమైన మూడో వికెట్కు 48 పరుగులు జోడించి మ్యాచ్ను ముగించారు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: హాసిని (సి) దీప్తి శర్మ (బి) రేణుక 25; చమరి (సి) హర్మన్ప్రీత్ (బి) దీప్తిశర్మ 3; హర్షిత (సి అండ్ బి) రేణుక 2; ఇమిషా దులానీ (సి) జెమీమా (బి) రేణుక 27; నీలాక్షిక (ఎల్బీడబ్ల్యూ) (బి) రేణుక 4; కవీషా (సి) అమన్జోత్ (బి) దీప్తిశర్మ 20; కౌషని (నాటౌట్) 19; శేషని (బి) దీప్తిశర్మ 5; మాల్కి మదర (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 112. వికెట్ల పతనం: 1–25, 2–31, 3–32, 4–45, 5–85, 6–90, 7–98. బౌలింగ్: రేణుక 4–1–21–4, క్రాంతి 4–0–22–0, దీప్తిశర్మ 4–0– 18–3, వైష్ణవి 3–0–14–0, అమన్జోత్ 4–0– 23–0, శ్రీచరణి 1–0–11–0. భారత ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (నాటౌట్) 79; స్మృతి (ఎల్బీడబ్ల్యూ) (బి) కవిషా 1; జెమీమా (బి) కవిషా 9; హర్మన్ప్రీత్ (నాటౌట్) 21; ఎక్స్ట్రాలు 5; మొత్తం (13.2 ఓవర్లలో 2 వికెట్లకు) 115. వికెట్ల పతనం: 1–27, 2–67. బౌలింగ్: శేహాని 2.2–0–28–0, మాల్కి మదర 2–0–11–0, నిమష మీపగె 2–0–29–0, కవిషా దిల్హరి 3–0–18–2, ఇనోక 4–0–28–0.151 అంతర్జాతీయ మహిళల టి20ల్లో దీప్తి శర్మ తీసిన వికెట్లు. ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా మేగన్ షుట్ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న రికార్డును దీప్తి సమం చేసింది. -
షెఫాలీ మెరుపులు.. మూడో టీ20లో భారత్ ఘన విజయం
తిరువనంతపురం వేదికగా శ్రీలంక మహిళలతో జరిగిన మూడో టీ20లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఉమెన్ ఇన్ బ్లూ.. మరో రెండు మ్యాచ్ల మిగులూండగానే 3-0 తేడాతో సిరీస్ను సొంతం చేసుకుంది. 113 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 13.2 ఓవర్లలో చేధించింది.లక్ష్య చేధనలో ఓపెనర్ షెఫాలీ వర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 40 బంతుల్లో 11 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది. ఆమెతో పాటు హర్మన్ ప్రీత్ కౌర్(21) రాణించింది. అయితే స్టార్ ప్లేయర్లు స్మృతి మంధాన(1), రోడ్రిగ్స్(9) మాత్రం విఫలమయ్యారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 112 పరుగులకే పరిమితమైంది. భారత పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ నాలుగు వికెట్లు పడగొట్టి లంక టాపార్డర్ను దెబ్బతీయగా.. దీప్తీ శర్మ మూడు వికెట్లతో సత్తాచాటింది. శ్రీలంక బ్యాటర్లలో ఇమేషా దులాని 27 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. కవిషా దిల్హారి(20), హాసిని పెరీరా(25) ఫర్వాలేదన్పించారు. ఇక నాలుగో టీ20 ఇదే వేదికగా డిసెంబర్ 28న జరగనుంది.చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో టీమిండియా స్టార్, ఢిల్లీ బాయ్ విరాట్ కోహ్లి అదరగొడుతున్నాడు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ దేశవాళీ వన్డే టోర్నీలో ఆడుతున్న కోహ్లి.. అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు. తొలి మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్పై విధ్వంసకర సెంచరీతో చెలరేగిన కోహ్లి.. ఇప్పుడు రెండో మ్యాచ్లో గుజరాత్పై మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. 61 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 77 పరుగులు చేశాడు.ఈ క్రమంలో కింగ్ కోహ్లి ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. లిస్ట్-ఎ క్రికెట్లో అత్యధిక యావరేజ్ కలిగిన బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో కోహ్లి ఇప్పటివరకు 57.87 సగటుతో 16,207 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ వరల్డ్ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం మైఖేల్ బెవాన్ పేరిట ఉండేది. బెవాన్ తన లిస్ట్-ఎ కెరీర్లో 57.86 సగటుతో 15,103 పరుగులు చేశాడు. తాజా హాఫ్ సెంచరీ బెవాన్ ఆల్టైమ్ రికార్డును కింగ్ బ్రేక్ చేశాడు.లిస్ట్ ఎ క్రికెట్లో అత్యధిక సగటు సాధించిన బ్యాటర్లు వీరే1. విరాట్ కోహ్లి (భారత్): 57.87- 16,207 పరుగులు2. మైఖేల్ బెవాన్ (ఆస్ట్రేలియా): 57.86- 15,103 పరుగులు3. సామ్ హైన్ (ఇంగ్లండ్): 57.76- 3004 పరుగులు4. ఛతేశ్వర్ పుజారా (భారత్): 57.01-5759 పరుగులు5. రుతురాజ్ గైక్వాడ్ (భారత్): 56.68- 4648 పరుగులుఇక మ్యాచ్ విషయానికి వస్తే.. గుజరాత్పై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కోహ్లితో పాటు కెప్టెన్ రిషబ్ పంత్(70) హాఫ్ సెంచరీతో మెరిశాడు. గుజరాత్ బౌలర్లలో విశాల్ జైశ్వాల్ 4 వికెట్లు పడగొట్టగా..రవి బిష్ణోయ్ రెండు వికెట్లు సాధించాడు. అనంతరం 255 పరుగుల లక్ష్య చేధనలో గుజరాత్ 47.4 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్ బ్యాటర్లలో ఆర్య దేశాయ్(57) టాప్ స్కోరర్గా నిలవగా.. సౌరవ్ చౌహన్(49), ఉర్విల్ పటేల్(31) ఫర్వాలేదన్పించారు. ఢిల్లీ బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ మూడు, ఇషాంత్ శర్మ, అర్పిత్ రాణా తలా రెండు వికెట్లు సాధించాడు. హాఫ్ సెంచరీతో సత్తాచాటిన విరాట్ కోహ్లికి ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది. -
IND vs SL: 4 వికెట్లతో చెలరేగిన రేణుకా.. భారత్ టార్గెట్ ఎంతంటే?
తిరువనంతపురం వేదికగా శ్రీలంక మహిళలతో జరుగుతున్న మూడో టీ20లోనూ భారత బౌలర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 112 పరుగులకే పరిమితమైంది. ఇండియన్ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ నాలుగు వికెట్లు పడగొట్టి లంక టాపార్డర్ను దెబ్బకొట్టింది.ఆమెతో పాటు స్పిన్నర్ దీప్తీ శర్మ కూడా మూడు వికెట్లు పడగొట్టి పర్యాటక జట్టును నామమాత్రపు స్కోర్కే పరిమితం చేసింది. అయితే మిగితా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికి వికెట్ మాత్రం సాధించలేకపోయారు. శ్రీలంక బ్యాటర్లలో ఇమేషా దులాని 27 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. కవిషా దిల్హారి(20), హాసిని పెరీరా(25) ఫర్వాలేదన్పించారు.కెప్టెన్ ఆతపట్టు కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచింది. అయితే భారత బ్యాటర్లు ఉన్న జోరు ముందు ఈ స్పల్ప లక్ష్యాన్ని లంక బౌలర్లు ఎలా కాపాడుకుంటారో చూడాలి. ఇప్పటికే తొలి రెండు టీ20ల్లో విజయం సాధించిన భారత్.. మూడో మ్యాచ్లో కూడా ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే భారత్ మరో రెండు టీ20ల మిగిలూండగానే 3-0 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంటుంది.తుది జట్లు..శ్రీలంక: చమరి అతపత్తు(కెప్టెన్), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నిమేషా మదుషాని, కవిషా దిల్హరి, నీలక్షికా సిల్వా, ఇమేషా దులాని, కౌషని నుత్యంగన(వికెట్ కీపర్), మల్షా షెహాని, ఇనోకా రణవీర, మల్కీ మదరభారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్, శ్రీ చరణి -
ఆస్ట్రేలియాకు భారీ షాక్.. ఇక కష్టమే?
టీ20 ప్రపంచకప్-2026కు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర బ్యాటర్ టిమ్ డేవిడ్ తొడ కండరాల (హ్యామ్స్ట్రింగ్ ) గాయం బారిన పడ్డాడు. బిగ్ బాష్ లీగ్ (BBL) 2025-26 సీజన్లో భాగంగా పెర్త్ స్కార్చర్స్తో జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తుండగా డేవిడ్(హోబర్ట్ హరికేన్స్) తొడ కండరాలు పట్టేశాయి.151 పరుగుల లక్ష్య చేధనలో హోబర్ట్ హరికేన్స్ ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన డేవిడ్.. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 26 బంతుల్లోనే 41 పరుగులు చేసి దూకుడుగా ఆడుతున్న సమయంలో అతడు అనుహ్యంగా గాయపడ్డాడు.సింగిల్ తీసే క్రమంలో అతడి కుడి తొడ వెనుక కండరాలు పట్టేశాయి. దీంతో అతడు నొప్పితో విలవిలాడాడు. ఫిజియో వచ్చి పరీక్షించిన తర్వాత, నొప్పితోనే డేవిడ్ మైదానాన్ని వీడాడు. అయితే అతడి పరిస్థితిని చూస్తుంటే గాయం తీవ్రమైనది అనిపిస్తోంది. స్కాన్ రిపోర్ట్ల తర్వాత అతడి గాయం తీవ్రత తేలనుంది. ఏదేమైనప్పటికి డేవిడ్ వంటి కీలక ఆటగాడు ప్రపంచకప్నకు ముందు గాయపడటం ఆస్ట్రేలియాను కలవరపెడుతోంది.ఒకవేళ అతడి గాయం తీవ్రత గ్రేడ్-1గా ఉంటే కోలుకోవడానికి సుమారు మూడు వారాల సమయం పడుతోంది. అదే గ్రేడ్-2 అయితే రెండు నుంచి మూడు నెలలు.. గ్రేడ్ 3 అయితే 3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు.డేవిడ్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అతడు త్వరగా కోలుకోవాలని ఆర్సీబీ అభిమానులు కోరుకుంటున్నారు. అదేవిధంగా టీ20 ప్రపంచకప్-2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: ఐపీఎల్ వద్దంది.. కట్ చేస్తే! అక్కడ చుక్కలు చూపిస్తున్నాడు -
ఐపీఎల్ వద్దంది.. కట్ చేస్తే! అక్కడ చుక్కలు చూపిస్తున్నాడు
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఓ యువ పేస్ బౌలర్ దుమ్ములేపుతున్నాడు. తన ఫాస్ట్ బౌలింగ్తో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. వెటరన్ భువనేశ్వర్ కుమార్ను తలపించే స్వింగ్ బౌలింగ్తో దూసుకుపోతున్నాడు. తన సంచలన బౌలింగ్తో పవర్ ప్లే స్పెషలిస్టుగా ప్రశంసలు అందుకుంటున్నాడు. అతడే బరోడాకు చెందిన యువ పేస్ సంచలనం రాజ్ లింబానీ.బెంగాల్పై అదుర్స్..దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ప్రస్తుత సీజన్లో లింబానీ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అస్సాంతో జరిగిన తొలి మ్యాచ్లో 3 వికెట్లతో సత్తాచాటిన రాజ్.. ఇప్పుడు శుక్రవారం బెంగాల్పై 5 వికెట్ల హాల్తో మెరిశాడు. అతడి బౌలింగ్ ధాటికి బెంగాల్ జట్టు కేవలం 205 పరుగులకే కుప్పకూలింది.ఆరంభంలో బెంగాల్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ను అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించిన లింబానీ.. ఆ తర్వాత షాబాజ్ ఆహ్మద్ వంటి కీలక ప్లేయర్లను ఔట్ చేశాడు. మొత్తంగా తన పది ఓవర్ల కోటాలో 65 పరుగులిచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనకు గాను లింబానీకి ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ టోర్నీలో లింబాని(8) సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. దీంతో ఎవరీ రాజ్ లింబానీ అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.ఎవరీ రాజ్ లింబాని?20 ఏళ్ల రాజ్ లింబాని.. గుజరాత్లోని కచ్లో జన్మించాడు. దేశవాళీ క్రికెట్లో బరోడాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. రాజ్ రైట్ ఆర్మ్ పేస్ బౌలర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అండర్-19 ప్రపంచకప్ 2024లో భారత జట్టు తరపున ఆడి తన అద్భుతమైన 'ఇన్స్వింగర్ల'తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆసియాకప్లోనూ భారత అండర్-19 జట్టకు ప్రాతినిథ్యం వహించాడు. ఆసియా కప్లో నేపాల్పై కేవలం 13 పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు.తన స్వింగ్ బౌలింగ్తో జానియర్ భువీగా అతడు పేరు సంపాదించుకున్నాడు. అయితే ఐపీఎల్-2026 వేలంలో మాత్రం రాజ్ లింబానికి నిరాశే ఎదురైంది. రూ. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో అతడు అన్సోల్డ్గా మిగిలిపోయాడు.అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న లింబానిని ఏ ఫ్రాంచైజీ తీసుకోకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే ఎవరైనా గాయపడితే అతడిని రిప్లేస్మెంట్గా తీసుకునే అవకాశముంది. ఐపీఎల్-2025లో లింబాని గుజరాత్ టైటాన్స్ నెట్బౌలర్గా తన సేవలు అందించాడు. అతడు ఇప్పటివరకు డొమాస్టిక్ క్రికెట్లో 25 మ్యాచ్లు 39 వికెట్లు పడగొట్టాడు.చదవండి: VHT 2025-26: సచిన్ కొడుకు అట్టర్ ప్లాప్.. ఉతికారేశారు -
శ్రీలంకతో మూడో టీ20.. రీఎంట్రీ ఇచ్చిన స్టార్ ప్లేయర్లు
స్వదేశంలో భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో ఇప్పటివరకు రెండు మ్యాచ్లు పూర్తి కాగా.. రెంటిలో టీమిండియానే గెలిచింది. విశాఖ వేదికగా జరిగిన ఆ మ్యాచ్ల్లో భారత్ ఏకపక్ష విజయాలు సాధించింది. తొలి టీ20లో 8 వికెట్లు, రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో భారత జట్టు ఘన విజయాలు నమోదు చేసింది.సిరీస్లో భాగంగా ఇవాళ (డిసెంబర్ 26) మూడో టీ20 జరుగనుంది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి రెండు మ్యాచ్ల్లోనూ భారత జట్టే టాస్ గెలిచింది. మూడో టీ20 కోసం భారత జట్టు రెండు మార్పులు చేసింది. స్టార్ ప్లేయర్లు రేణుకా సింగ్, దీప్తి శర్మ రీఎంట్రీ ఇచ్చారు. దీంతో స్నేహ్ రాణా, అరుంధతి రెడ్డి బెంచ్కు పరిమితమయ్యారు. మరోవైపు ఈ మ్యాచ్ కోసం శ్రీలంక ఏకంగా మూడు మార్పులు చేసింది. 0-2తో వెనుకపడిపోయిన శ్రీలంక సిరీస్లో సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్లో తప్పక గెలవాలి. ఒకవేళ ఈ మ్యాచ్లో కూడా భారతే గెలిస్తే, మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ వశమవుతుంది.తుది జట్లు..శ్రీలంక: చమరి అతపత్తు(సి), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నిమేషా మదుషాని, కవిషా దిల్హరి, నీలక్షికా సిల్వా, ఇమేషా దులాని, కౌషని నుత్యంగన(w), మల్షా షెహాని, ఇనోకా రణవీర, మల్కీ మదరభారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (సి), రిచా ఘోష్ (w), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్, శ్రీ చరణి -
చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. ప్రపంచ రికార్డు బద్దలు
ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (Harry Brook) చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్లో అతి తక్కువ బంతుల్లో 3000 పరుగుల మైలురాయిని తాకిన బ్యాటర్గా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో ఆడమ్ గిల్క్రిస్ట్ పేరిట ఉండిన వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు.గిల్క్రిస్ట్కు 3000 పరుగులు పూర్తి చేసేందుకు 3610 బంతులు అవసరం కాగా.. బ్రూక్ కేవలం 3468 బంతుల్లోనే ఈ మైలురాయిని తాకాడు. ఈ విభాగంలో బ్రూక్, గిల్క్రిస్ట్ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్ (4047), రిషబ్ పంత్ (4095), వీరేంద్ర సెహ్వాగ్ (4129) ఉన్నారు. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో యాషెస్ టెస్ట్ తొలి రోజు బ్రూక్ ఈ ఘనత సాధించాడు.ఇన్నింగ్స్ల పరంగా చూస్తే.. టెస్ట్ల్లో అత్యంత వేగంగా 3000 పరుగుల మైలురాయిని తాకిన ఆటగాళ్ల జాబితాలో బ్రూక్ తన దేశానికే చెందిన డెన్నిస్ కాంప్టన్తో కలిసి సంయుక్తంగా 11వ స్థానంలో నిలిచాడు. బ్రూక్, కాంప్టన్ ఇద్దరూ 57వ ఇన్నింగ్స్లోనే ఈ మైలురాయిని తాకారు. ఈ విభాగంలో డాన్ బ్రాడ్మన్ టాప్ ప్లేస్లో ఉన్నాడు. ఈ దిగ్గజం కేవలం 33 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించాడు.ఇప్పటివరకు 34 టెస్ట్లు ఆడిన బ్రూక్ 54.18 సగటున, 10 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీల సాయంతో 3034 పరుగులు చేశాడు. ఇందులో డబుల్, ట్రిపుల్ సెంచరీలు కూడా ఉన్నాయి.మ్యాచ్ విషయానికొస్తే.. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ఇవాళ (డిసెంబర్ 26) యాషెస్ సిరీస్ 2025-26 నాలుగో టెస్ట్ (బాక్సింగ్ డే టెస్ట్) ప్రారంభమైంది. ఈ మ్యాచ్ తొలి రోజే 20 వికెట్లు కుప్పకూలాయి. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాను 152 పరుగులకే ఆలౌట్ చేసింది. జోష్ టంగ్ (11.2-2-45-5), అట్కిన్సన్ (14-4-28-2), బ్రైడన్ కార్స్ (12-3-42-1), స్టోక్స్ (8-1-25-1) ఆసీస్ను దెబ్బకొట్టారు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఎనిమిదో నంబర్ ఆటగాడు మైఖేల్ నెసర్ (35) టాప్ స్కోరర్ కాగా.. హెడ్ (12), జేక్ వెదరాల్డ్ (10), ఉస్మాన్ ఖ్వాజా (29), అలెక్స్ క్యారీ (20), కెమరూన్ గ్రీన్ (17) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. లబూషేన్ (6), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (9), స్టార్క్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితం కాగా.. బోలాండ్ డకౌటయ్యాడు.అనంతరం ఇంగ్లండ్ సైతం ప్రత్యర్థి బౌలర్ల ధాటికి స్వల్ప స్కోర్కే కుప్పకూలింది. నెసర్ 4, బోలాండ్ 3, స్టార్క్ 2, గ్రీన్ ఓ వికెట్ తీసి ఇంగ్లండ్ను 110 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో హ్యారీ బ్రూక్ (41), అట్కిన్సన్ (28), స్టోక్స్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. జాక్ క్రాలే (5), డకెట్ (2), బేతెల్ (1), జేమీ స్మిత్ (2), విల్ జాక్స్ (5), కార్స్ (4) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. రూట్ డకౌటయ్యాడు.కీలకమైన 42 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసి, 46 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.కాగా, ఐదు మ్యాచ్ల ఈ యాషెస్ సిరీస్ను ఆస్ట్రేలియా ఇదివరకే కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి మూడు టెస్ట్ల్లో గెలిచిన ఆ జట్టు ప్రస్తుతం 3-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన నితీశ్ కుమార్ రెడ్డి
ఐపీఎల్ 2026కి ముందు సన్రైజర్స్ హైదరాబాద్కు శుభవార్త అందింది. స్టార్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఫామ్లోకి వచ్చాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా రైల్వేస్తో ఇవాళ (డిసెంబర్ 26) జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు. ఫలితంగా అతని జట్టు ఆంధ్రప్రదేశ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. అలూర్ వేదికగా ఆంధ్ర, రైల్వేస్ జట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆంధ్ర జట్టు ప్రత్యర్ధిని 266 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. సత్యనారాయణ రాజు (10-1-41-3), కేఎస్ నరసింహ రాజు (10-0-68-3), హేమంత్ రెడ్డి (6-0-34-2), నితీశ్ కుమార్ రెడ్డి (10-0-34-1) అద్బుతంగా బౌలింగ్ చేసి రైల్వేస్కు భారీ స్కోర్ చేయనివ్వలేదు. అయినా ఆన్ష్ యాదవ్ (59), రవి సింగ్ (76) అర్ద సెంచరీలతో పోరాడటంతో రైల్వేస్ ఓ మోస్తరుకు మించిన స్కోర్ అయితే చేయగలిగింది. ఆ జట్టు తరఫున జుబైర్ అలీ (48), రాజ్ చౌదరి (22 నాటౌట్) కూడా పోరాడారు. మిగతా బ్యాటర్లలలో సూరజ్ అహూజా 7, ప్రథమ్ సింగ్ 6, ఉపేంద్ర యాదవ్ 7, అశుతోష్ శర్మ 8, కర్ణ్ శర్మ 7, రాహుల్ శర్మ 12 పరుగులు చేశారు.అనంతరం 267 పరుగుల లక్ష్య ఛేదనలో ఆంధ్ర సునాయాస విజయం సాధించింది. బంతితో రాణించిన నితీశ్ కుమార్ రెడ్డి, హేమంత్ రెడ్డి బ్యాట్తో కూడా సత్తా చాటారు. నితీశ్ 41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 55 పరుగులు చేయగా.. హేమంత్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 41 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరికి ముందు రికీ భుయ్ (76) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీ చేసి గెలుపుకు పునాది వేశాడు. ఓపెనర్లు అశ్విన్ హెబ్బర్ (30), శ్రీకర్ భరత్ (25), వన్డౌన్ బ్యాటర్ షేక్ రషీద్ (40) పర్వాలేదనిపించారు. జట్టులో ప్రతి ఒక్కరు తలో చేయి వేయడంతో ఆంధ్ర జట్టు 44.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
సచిన్ కొడుకు అట్టర్ ప్లాప్.. ఉతికారేశారు
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో గోవా జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జైపూర్ వేదికగా హిమాచల్ ప్రదేశ్తో జరిగిన ఉత్కంఠ పోరులో 8 పరుగుల తేడాతో గోవా గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గోవా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది.గోవా బ్యాటర్లలో లలిత్ యాదవ్ (104) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ దీపరాజ్ గాంకర్(71) హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. హిమాచల్ బౌలర్లలో రోహిత్ కుమార్ ఐదు వికెట్లు పడగొట్టగా.. మిర్దుల్ రెండు వికెట్లు సాధించాడు. అనంతరం లక్ష్య చేధనలో హిమాచల్ ప్రదేశ్ 49.3 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌటైంది.మిడిలార్డర్ బ్యాటర్లు పి. రాజ్మన్(126) తన అద్భుతపోరాటంతో జట్టును విజయతీరాల దాకా తీసుకెళ్లినప్పటికి.. ఆఖరిలో వికెట్లు కోల్పోవడంతో హిమాచల్ ఓటమిచవిచూడాల్సి వచ్చింది. గోవా బౌలర్లలో దీపరాజ్ గాంకర్ 5 వికెట్లతో సత్తాచాటాడు. బ్యాటింగ్ బౌలింగ్లో దుమ్ములేపిన దీపరాజ్ ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు.అర్జున్ అట్టర్ ప్లాప్..అయితే ఈ మ్యాచ్లో గోవా ఆల్రౌండర్, సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ దారుణంగా విఫలమయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఓపెనర్గా బరిలోకి దిగిన అర్జున్.. విజయ్ హజారే ట్రోఫీలో మాత్రం లోయార్డర్లో బ్యాటింగ్కు వచ్చాడు. బ్యాటింగ్లో అతడికి కేవలం ఒక్క బంతి మాత్రమే ఆడే అవకాశం దక్కింది. కానీ బౌలింగ్లో మాత్రం తన మార్క్ చూపించలేకపోయాడు. 6 ఓవర్లు బౌలింగ్ చేసిన అర్జున్.. 9.70 ఏకానమి రేటుతో ఏకంగా 58 పరుగులు సమర్పించుకున్నాడు. భారీగా పరుగులు ఇవ్వడంతో అర్జున్తో తన పూర్తి కోటాను కెప్టెన్ పూర్తి చేయించలేదు. తొలి మ్యాచ్కే బెంచ్కే పరిమితమైన అర్జున్కు హిమాచల్పై ఆడే అవకాశం లభించింది. కానీ తనకు దక్కిన అవకాశాన్ని ఈ జూనియర్ టెండూల్కర్ అందిపుచ్చుకోలేకపోయాడు. అంతకుముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అర్జున్ ఫర్వాలేదన్పించాడు. కాగా ఐపీఎల్-2026లో అర్జున్ లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ముంబై ఇండియన్స్ నుంచి అతడిని లక్నో ట్రేడ్ చేసుకుంది.చదవండి: IND vs NZ: న్యూజిలాండ్తో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్ ఎవరంటే? -
వరుసగా రెండో మ్యాచ్లోనూ శతక్కొట్టిన పడిక్కల్
లిస్ట్-ఏ క్రికెట్లో కర్ణాటక ఆటగాడు దేవదత్ పడిక్కల్ (Devdutt Padikkal) హవా కొనసాగుతోంది. 34 ఇన్నింగ్స్ల స్వల్ప కెరీర్లో 11వ శతకం (12 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి) నమోదు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఈ ఆర్సీబీ బ్యాటర్ వరుసగా రెండో మ్యాచ్లోనూ సెంచరీ చేసి ఔరా అనిపించాడు. తొలి మ్యాచ్లో జార్ఖండ్పై వీరోచిత శతకం (118 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 147 పరుగులు) బాదిన పడిక్కల్.. తాజాగా కేరళతో జరుగుతున్న మ్యాచ్లోనూ అదే తరహా ప్రదర్శన రిపీట్ చేశాడు. తన జట్టు 285 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్న క్రమంలో సెంచరీ పూర్తి చేసుకొని ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు (135 బంతుల్లో 123 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు). అతనికి జతగా మరో టీమిండియా ఆటగాడు కరుణ్ నాయర్ క్రీజ్లో ఉన్నాడు. కరుణ్ (98 బంతుల్లో 93 నాటౌట్; 10 ఫోర్లు) కూడా సెంచరీకి చేరువగా ఉన్నాడు. ఈ మ్యాచ్లో కర్ణాటక గెలవాలంటే 60 బంతుల్లో మరో 65 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. 40 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 220/1గా ఉంది. కర్ణాటక కోల్పోయిన ఒకే ఒక వికెట్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ది (1).అంతకుముందు బాబా అపరాజిత్ (71), అజారుద్దీన్ (84 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించడంతో కేరళ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. కేరళ ఇన్నింగ్స్లో కెప్టెన్ రోహన్ కున్నుమ్మల్ 12, అభిషేక్ నాయర్ 7, అహ్మద్ ఇమ్రాన్ డకౌట్, అకిల్ స్కారియా 27, విష్ణు వినోద్ 35, అంకిత్ శర్మ 2, నిధీశ్ 34 (నాటౌట్) పరుగులు చేశారు. కర్ణాటక బౌలర్లలో అభిలాశ్ షెట్టి 3 వికెట్లు పడగొట్టగా.. శ్రేయస్ గోపాల్ 2, విధ్వత్ కావేరప్ప, విద్యాదర్ పాటిల్ తలో వికెట్ తీశారు.జార్ఖండ్పై వీరోచిత శతకంపడిక్కల్ ఈ సీజన్లో తన తొలి మ్యాచ్లో జార్ఖండ్పై వీరోచిత శతకం బాదాడు. 413 పరుగుల అతి భారీ లక్ష్య ఛేదనలో ఈ భారీ సెంచరీ చేసి తన జట్టు గెలుపుకు గట్టి పునాది వేశాడు.లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో ఇది రెండో భారీ లక్ష్య ఛేదనగా.. విజయ్ హజారే టోర్నీ చరిత్రలో భారీ లక్ష్య ఛేదనగా రికార్డైంది. లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో అతి భారీ లక్ష్య ఛేదన రికార్డు సౌతాఫ్రికా పేరిట ఉంది. 2006లో జోహన్నెస్బర్గ్లో ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా 435 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదించింది. -
కేకేఆర్ స్టార్కు తీవ్ర గాయం.. స్ట్రెచర్పై ఆస్పత్రికి తరలింపు!
విజయ్ హజారే ట్రోఫీ-2025లో ముంబై బ్యాటర్, కేకేఆర్ స్టార్ అంగ్క్రిష్ రఘువంశీ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ టోర్నీలో భాగంగా జైపూర్ వేదికగా ఉత్తరాఖండ్తో జరుగుతున్న మ్యాచ్లో రఘువంశీ తలకు గాయమైంది. అంగ్క్రిష్ ఒక కష్టతరమైన క్యాచ్ను అందుకునే క్రమంలో బ్యాలెన్స్ కోల్పోయి నేలపై పడిపోయాడు.దీంతో అతడి తలకు, భుజానికి తీవ్రమైన గాయమైంది. రఘువంశీ విపరీతమైన నొప్పితో విలవిలలాడాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చిన ఫిజియోలు అతడిని స్ట్రెచర్పై మైదానం నుంచి బయటకు తెసుకెళ్లారు. అనంతరం అతడిని జైపూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.గాయం తీవ్రతను అంచనా వేయడానికి వైద్యులు స్కాన్లు నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే అతడి గాయంపై ముంబై క్రికెట్ అసోసియేషన్ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ పలు రిపోర్ట్ల ప్రకారం.. రఘువంశీ గాయం తీవ్రమైనదిగా తెలుస్తోంది. అతడు కొన్ని నెలల పాటు ఆటకు దూరంగా ఉండాల్సి వస్తుందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అదే జరిగితే ముంబై జట్టుకే కాకుండా కేకేఆర్కు కూడా పెద్ద ఎదురుదెబ్బే. రఘువంశీ కేకేఆర్ జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2025లో కేకేఆర్ 8వ స్థానంలో నిలిచినప్పటికీ.. రఘువంశీ మాత్రం దుమ్ములేపాడు. 11 ఇన్నింగ్స్లలో 300 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అతడు గాయపడడం కేకేఆర్ మెనెజ్మెంట్ను కలవరపెడుతోంది.ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. రోహిత్ శర్మ గోల్డెన్ డక్గా వెనుదిరిగినప్పటికి.. హార్దిక్ తమోర్ (93*), ముషీర్ ఖాన్ (55), సర్ఫరాజ్ ఖాన్ (55) రాణించారు. అనంతరం లక్ష్య చేధనలో ఉత్తరాఖండ్ తడబడుతోంది. 42 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. అయితే రఘువంశీ మాత్రం కేవలం 11 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. -
న్యూజిలాండ్తో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్ ఎవరంటే?
స్వదేశంలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు భారత జట్టును జనవరి మొదటి వారంలో బీసీసీఐ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ జనవరి 3 లేదా 4న వర్చువల్గా సమావేశం కానుంది. ఈ మీటింగ్లో కివీస్తో వన్డేల కోసం కోసం భారత జట్టును ఖరారు చేయనుంది. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు దూరమైన కెప్టెన్ శుభ్మన్ గిల్ తిరిగి రీ ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమైంది. కివీస్తో వన్డే సిరీస్లో జట్టును నడిపించేందుకు గిల్ సిద్దమైనట్లు తెలుస్తోంది. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ మధ్యలో మెడ గాయం కారణంగా వైదొలిగిన గిల్.. వన్డేలకు దూరమయ్యాడు. దీంతో అతడి స్ధానంలో కేఎల్ రాహుల్ జట్టు పగ్గాలను చేపట్టాడు. అనంతరం గిల్ తిరిగి తిరిగి టీ20 సిరీస్కు అందుబాటులోకి వచ్చాడు. అయితే నాలుగో టీ20కు ముందు గిల్ కాలి మడమ గాయం బారిన పడ్డాడు.దీంతో ఆఖరి రెండు టీ20లకు కూడా అతడు దూరమయ్యాడు. అనంతరం టీ20 వరల్డ్కప్-2026 జట్టులో గిల్ చోటు దక్కించుకోలేకపోయాడు. కానీ గిల్ మాత్రం ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ సాధించాడు. విజయ్ హజారే ట్రోఫీ కోసం మొహాలీలోని పీసీఏ స్టేడియంలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే వన్డే జట్టు పగ్గాలను చేపట్టాక గిల్ పెద్దగా రాణించలేకపోయాడు. ఆసీస్తో వన్డే సిరీస్లో గిల్ విఫలమయ్యాడు. దీంతో తన రీఎంట్రీలో న్యూజిలాండ్పై సత్తాచాటాలని శుభ్మన్ ఉవ్విళ్లూరుతున్నాడు. మరోవైపు ఆసీస్ పర్యటనలో గాయపడ్డ శ్రేయస్ అయ్యర్ కూడా పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. అతడు ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో (CoE) తన ప్రాక్టీస్ను మొదలు పెట్టాడు. త్వరలోనే అతడికి వైద్య బృందం ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో ఉత్తీర్ణత సాధిస్తే అతడు కివీస్తో వన్డేలకు అందుబాటులోకి రానున్నాడు. జనవరి 11 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.కివీస్తో వన్డేలకు భారత జట్టు(అంచనా)శుభమన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, తిలక్ వర్మచదవండి: నవతరం క్రికెట్లో.. మూడు ఫార్మాట్లు ఆడగల టాప్-5 ప్లేయర్లు వీరే! -
విరాట్ కోహ్లి, రాహుల్ ద్రవిడ్ రికార్డులు బద్దలు కొట్టిన స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ (Steve Smith) ప్రస్తుత తరం ఫీల్డర్లలో అత్యుత్తముడనడంలో ఎలాంటి సందేహం లేదు. స్టీవ్ మైదానంలో ఏ ప్రాంతంలో ఫీల్డింగ్ చేసినా పాదరసంలా కదులుతూ, కళ్లు చెదిరే క్యాచ్లు పడుతూ, ప్రత్యర్ధి జట్టు పరుగుల ప్రవాహానికి అడ్డుకట్టలా ఉంటాడు. ఫార్మాట్ ఏదైనా స్టీవ్ మైదానంలో ఉన్నాడంటే జరిగేది ఇదే. అలాంటి స్టీవ్ తాజాగా ఫీల్డింగ్కు సంబంధించి ఓ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ల్లో అత్యధిక క్యాచ్లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో భారత దిగ్గజ ఫీల్డర్ రాహుల్ ద్రవిడ్ను అధిగమించి రెండో స్థానానికి ఎగబాకాడు. ద్రవిడ్ 301 టెస్ట్ ఇన్నింగ్స్ల్లో 210 క్యాచ్లు పట్టగా.. స్టీవ్ 232 ఇన్నింగ్స్ల్లోనే ద్రవిడ్ మార్కును దాటి 212 క్యాచ్లకు చేరాడు. ఇక స్టీవ్ ముందున్నది జో రూట్ మాత్రమే. ప్రస్తుతం రూట్ ఖాతాలో 214 క్యాచ్లు ఉన్నాయి. రూట్కు స్టీవ్కు మధ్య కేవలం రెండు క్యాచ్ల వ్యత్యాసం మాత్రమే ఉంది.టెస్ట్ల్లో అత్యధిక క్యాచ్లు పట్టిన ఆటగాళ్లు (టాప్-5)..రూట్-214స్టీవ్ స్మిత్-212ద్రవిడ్-210జయవర్దనే-205కల్లిస్-200కోహ్లిని వెనక్కు నెట్టి..అన్ని ఫార్మాట్ల వారీగా చూస్తే.. స్టీవ్ స్మిత్ టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లిని అధిగమించి అన్ని ఫార్మాట్లలో అత్యధిక క్యాచ్లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. విరాట్ ఖాతాలో 342 క్యాచ్లు ఉండగా.. స్టీవ్ అన్ని ఫార్మాట్ల క్యాచ్ల సంఖ్య 344కు చేరింది. ఈ జాబితాలో జయవర్దనే (440) అందరి కంటే చాలా ముందున్నాడు. అతని తర్వాత పాంటింగ్ (364), రాస్ టేలర్ (354) ఉన్నారు. ఇంగ్లండ్తో ఇవాళ (డిసెంబర్ 26) ప్రారంభమైన యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్లో స్టీవ్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో తొలి రోజే ఇరు జట్లు ఆలౌటయ్యాయి. ఆసీస్ 152, ఇంగ్లండ్ 110 పరుగులకే చాపచుట్టేశాయి. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను ఆసీస్ ఇదివరకే కైవసం చేసుకుంది. తొలి మూడు టెస్ట్లు నెగ్గిన ఆ జట్టు 3-0 క్లీన్ స్వీప్ దిశగా వెళ్తుంది. -
మూడు ఫార్మాట్లు ఆడగల టాప్-5 క్రికెటర్లు వీరే!
క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం పొట్టి ఫార్మాట్దే హవా. ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్కు ఉన్న ఆదరణ రోజురోజుకీ పెరుగిపోతోంది. న్యూజిలాండ్, సౌతాఫ్రికాకు చెందిన పలువురు కీలక ఆటగాళ్లు సైతం ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడేందుకు వీలుగా సెంట్రల్ కాంట్రాక్టు వదులుకుని.. జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నారు.ఇలాంటి తరుణంలో మూడు ఫార్మాట్లలో ఆడగల క్రికెటర్ల సంఖ్య తగ్గిపోవడం సహజమే. అయితే, నవతరంలో టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్కు సరిగ్గా సరిపోయే ఆటగాళ్లకు సైతం కొదువలేదు. ఈ జాబితాలో టాప్-5లో ఉన్న ప్లేయర్లపై ఓ లుక్కేద్దామా?హ్యారీ బ్రూక్మూడు ఫార్మాట్లలో ఇంగ్లండ్ పతనావస్థకు చేరిన వేళ హ్యారీ బ్రూక్ రూపంలో ఓ యువ ఆటగాడు జట్టుకు ఊపిరిలూదాడు. టెస్టు, వన్డే, టీ20లలో అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అతడి రాకతో ఇంగ్లండ్ మిడిలార్డర్ సమస్య తీరిపోయింది. అంతేకాదు నాయకత్వ లక్షణాలు పుష్కలంగా కలిగి ఉన్న 26 ఏళ్ల బ్రూక్.. వన్డే, టీ20 జట్లకు కెప్టెన్ కూడా అయ్యాడు.ఇప్పటి వరకు అంతర్జాతీయ కెరీర్లో 34 టెస్టులు, 35 వన్డేలు, 52 టీ20లు ఆడిన హ్యారీ బ్రూక్.. ఆయా ఫార్మాట్లలో 3034, 1170, 1012 పరుగులు సాధించాడు. టెస్టుల్లో పది సెంచరీలు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. వన్డేల్లో ఇప్పటికి రెండుసార్లు శతక్కొట్టాడు.యశస్వి జైస్వాల్రెండున్నరేళ్ల క్రితం టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ముంబై బ్యాటర్ యశస్వి జైస్వాల్. టెస్టుల్లో అడుగుపెట్టగానే సెంచరీలు, డబుల్ సెంచరీతో సత్తా చాటిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఓపెనర్గా జట్టులో స్థిరపడిపోయాడు.అయితే, వన్డే, టీ20లలో ఆడే సత్తా ఉన్నా.. టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్ కారణంగా ఈ ఓపెనింగ్ బ్యాటర్కు జట్టులో చోటు కరువైంది. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 23 ఏళ్ల జైసూ 28 టెస్టుల్లో.. ఏడు శతకాలు, రెండు డబుల్ సెంచరీలు బాది 2511 పరుగులు సాధించాడు. ఇక నాలుగు వన్డేల్లో 171, 23 టీ20 మ్యాచ్లలో 723 పరుగులు చేశాడు. ఇటీవల సౌతాఫ్రికాతో సిరీస్ సందర్భంగా తన తొలి వన్డే శతకాన్ని నమోదు చేశాడు.మార్కో యాన్సెన్సౌతాఫ్రికా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మార్కో యాన్సెన్. దిగ్గజ జాక్వెస్ కలిస్ వారసుడిగా జట్టులో అతడు లేని లోటును పూడుస్తున్నాడు. ఆరడుగుల ఎనిమిది ఇంచుల ఎత్తు ఉండే మార్కో.. మూడు ఫార్మాట్లలోనూ దుమ్ములేపుతున్నాడు.ఇప్పటికి సౌతాఫ్రికా తరఫున 25 ఏళ్ల రైట్ హ్యాండర్ బ్యాటర్.. 21 టెస్టుల్లో 624, 32 వన్డేల్లో 553, 23 టీ20లలో 195 పరుగులు చేశాడు. ఇక లెఫ్టార్మ్ పేసర్ ఖాతాలో టెస్టుల్లో 89, వన్డేల్లో 49, టీ20లలో 21 వికెట్లు ఉన్నాయి.జేకబ్ డఫీ31 ఏళ్ల జేకబ్ డఫీ న్యూజిలాండ్ తరఫున ఆల్ ఫార్మాట్ పేసర్గా సత్తా చాటుతున్నాడు. ఈ ఏడాదే టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి వాటం బౌలర్ ఇప్పటికి 4 మ్యాచ్లు ఆడి ఏకంగా 25 వికెట్లు కూల్చాడు.అదే విధంగా.. 19 వన్డేల్లో 35, 38 టీ20 మ్యాచ్లలో కలిపి 53 వికెట్లు కూల్చిన డఫీ.. ప్రపంచ బ్యాటర్లకు సరికొత్త ముప్పుగా అవతరించాడు.కామెరాన్ గ్రీన్ఆస్ట్రేలియా యువ ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 26 ఏళ్ల ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్.. ఇటీవల ఐపీఎల్ మినీ వేలం-2026లో సరికొత్త చరిత్ర సృష్టించాడు.కోల్కతా నైట్ రైడర్స్ ఇతడి కోసం ఏకంగా 25.20 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా.. వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ నిలిచాడు. టీ20 ఫార్మాట్తో పాటు వన్డే, టెస్టుల్లో కూడా గ్రీన్ రాణిస్తున్నాడు.ఇప్పటికి ఆస్ట్రేలియా తరఫున 36 టెస్టులు, 31 వన్డేలు, 21 టీ20లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 1658, 782, 521 పరుగులు సాధించాడు. అదే విధంగా ఈ రైటార్మ్ పేసర్ ఖాతాలో 38 టెస్టు, 20 వన్డే, 12 టీ20 వికెట్లు ఉన్నాయి.చదవండి: వైభవ్ సూర్యవంశీకి అత్యున్నత పురస్కారం -
రింకూ సింగ్ విధ్వంసకర శతకం
టీమిండియా సెలక్టర్ల నమ్మకాన్ని రింకూ సింగ్ నిజం చేస్తున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు తన ఎంపిక సరైందేనని నిరూపిస్తున్నాడు. తాజాగా వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఫామ్ను కొనసాగిస్తున్న తీరు ఇందుకు నిదర్శనం.ఈ టోర్నమెంట్లో ఉత్తరప్రదేశ్ కెప్టెన్గా బరిలోకి దిగిన రింకూ సింగ్ (Rinku Singh).. బుధవారం నాటి తొలి మ్యాచ్లో హైదరాబాద్పై 48 బంతుల్లో 67 పరుగులు సాధించాడు. ఇతడికి తోడు ధ్రువ్ జురెల్ (61 బంతుల్లో 80; 4 ఫోర్లు, 4 సిక్స్లు), ఆర్యన్ జుయల్ (96 బంతుల్లో 80; 9 ఫోర్లు, 1 సిక్స్), అభిషేక్ గోస్వామి (81 బంతుల్లో 81; 10 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నారు. ఫలితంగా యూపీ 84 పరుగుల తేడాతో గెలిచి శుభారంభం అందుకుంది.ఆర్యన్ జుయల్ సెంచరీగ్రూప్-బిలో భాగంగా తాజాగా చండీగఢ్తో శుక్రవారం నాటి రెండో మ్యాచ్లో రాజ్కోట్ వేదికగా టాస్ ఓడిన యూపీ తొలుత బ్యాటింగ్కు దిగింది. గత మ్యాచ్లో అదరగొట్టిన ఓపెనర్ అభిషేక్ గోస్వామి (1) ఈసారి విఫలం కాగా.. ఆర్యన్ జుయల్ మాత్రం మరోసారి బ్యాట్ ఝులిపించాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ 118 బంతుల్లో ఏడు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 134 పరుగులు సాధించాడు.రింకూ సింగ్ విధ్వంసకర శతకంఇక వన్డౌన్లో వచ్చిన ధ్రువ్ జురెల్ (57 బంతుల్లో 67) మరోసారి హాఫ్ సెంచరీతో మెరవగా.. సమీర్ రిజ్వి (32) ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో ఐదో స్థానంలో బరిలో దిగిన కెప్టెన్ రింకూ సింగ్ విధ్వంసకర శతకంతో చండీగఢ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.కేవలం 56 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్న రింకూ.. మొత్తంగా 60 బంతుల్లో 106 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అతడి శతక ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఇటీవల ఐపీఎల్ మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14.20 కోట్లు పెట్టి కొన్న ప్రశాంత్ వీర్ (14 బంతుల్లో 12).. రింకూతో కలిసి నాటౌట్గా నిలిచాడు.367 పరుగులుఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో యూపీ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 367 పరుగులు చేశాడు. చండీగఢ్ బౌలర్లలో తరణ్ప్రీత్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, నిషుంక్ బిర్లా చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఎంపిక చేసిన పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టులో రింకూకు చోటు దక్కిన విషయం తెలిసిందే.చదవండి: Virat Kohli: మళ్లీ సెంచరీ చేస్తాడనుకుంటే.. -
Ashes 4th Test: చెలరేగిన ఇరు జట్ల బౌలర్లు.. తొలి రోజే 20 వికెట్లు
మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ఇవాళ (డిసెంబర్ 26) యాషెస్ సిరీస్ 2025-26 నాలుగో టెస్ట్ (బాక్సింగ్ డే టెస్ట్) ప్రారంభమైంది. ఈ మ్యాచ్ తొలి రోజే 20 వికెట్లు కుప్పకూలాయి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తొలుత ఆస్ట్రేలియాను ఆలౌట్ చేసింది. ఆతర్వాత ఆసీస్ బౌలర్లు కూడా అదే పని చేశారు. మొత్తంగా ఇరు జట్ల బౌలర్లు చెలరేగడంతో తొలి రోజే 20 వికెట్లు పడ్డాయి. ఆసీస్-ఇంగ్లండ్ మధ్య టెస్ట్ల్లో తొలి రోజే 20 వికెట్లు పడటం 1909 తర్వాత ఇదే తొలిసారి. చెలరేగిన టంగ్జోష్ టంగ్ (11.2-2-45-5) చెలరేగడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 152 పరుగులకే ఆలౌటైంది. టంగ్కు అట్కిన్సన్ (14-4-28-2), బ్రైడన్ కార్స్ (12-3-42-1), స్టోక్స్ (8-1-25-1) సహకరించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఎనిమిదో నంబర్ ఆటగాడు మైఖేల్ నెసర్ (35) టాప్ స్కోరర్ కాగా.. హెడ్ (12), జేక్ వెదరాల్డ్ (10), ఉస్మాన్ ఖ్వాజా (29), అలెక్స్ క్యారీ (20), కెమరూన్ గ్రీన్ (17) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. లబూషేన్ (6), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (9), స్టార్క్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితం కాగా.. బోలాండ్ డకౌటయ్యాడు.ఇంగ్లండ్ ఇంకా ఘోరంఅనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ సైతం ప్రత్యర్థి బౌలర్ల ధాటికి కుప్పకూలింగి. నెసర్ 4, బోలాండ్ 3, స్టార్క్ 2, గ్రీన్ ఓ వికెట్ తీసి ఇంగ్లండ్ను 110 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో హ్యారీ బ్రూక్ (41), అట్కిన్సన్ (28), స్టోక్స్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. జాక్ క్రాలే (5), డకెట్ (2), బేతెల్ (1), జేమీ స్మిత్ (2), విల్ జాక్స్ (5), కార్స్ (4) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. రూట్ డకౌటయ్యాడు.కీలకమైన 42 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసి, 46 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.కాగా, ఐదు మ్యాచ్ల ఈ యాషెస్ సిరీస్ను ఆస్ట్రేలియా ఇదివరకే కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి మూడు టెస్ట్ల్లో గెలిచిన ఆ జట్టు ప్రస్తుతం 3-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
చరిత్ర సృష్టించిన జోష్ టంగ్
ఇంగ్లండ్ యువ పేసర్ జోష్ టంగ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో ఐదు వికెట్లతో చెలరేగిన ఈ కుడిచేతి వాటం బౌలర్.. అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ప్రసిద్ధ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో 21వ శతాబ్దంలో టెస్టులలో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఇంగ్లండ్ తొలి బౌలర్గా 28 ఏళ్ల టంగ్ నిలిచాడు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (Ashes 2025-26)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.3-0తో సిరీస్ సొంతం చేసుకున్న ఆసీస్ ఇందులో భాగంగా పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్ టెస్టుల్లో ఆసీస్ చేతిలో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్.. ఇప్పటికే సిరీస్ను కోల్పోయింది. ఈ క్రమంలో శుక్రవారం మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన కంగారూ జట్టు.. తొలి ఇన్నింగ్స్లో 45.2 ఓవర్లలో 152 పరుగులు చేసి ఆలౌట్ అయింది.ఆసీస్ను నామమాత్రపు స్కోరుకు పరిమితం చేయడంలో జోష్ టంగ్దే ముఖ్య భూమిక. టాపార్డర్లో ఓపెనర్ జేక్ వెదరాల్డ్ (10), వన్డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ (6) రూపంలో కీలక వికెట్లు తీసిన టంగ్... అద్బుతమైన డెలివరీతో కెప్టెన్ స్టీవ్ స్మిత్ (9) రూపంలో మరో డేంజరస్ బ్యాటర్ను కూడా పెవిలియన్కు పంపాడు.WHAT A DELIVERY!Steve Smith looks on puzzled after this peach from Josh Tongue.#Ashes | #PlayoftheDay | @nrmainsurance pic.twitter.com/NpkEgGxOQR— cricket.com.au (@cricketcomau) December 26, 2025తొలి ఇంగ్లండ్ బౌలర్గా అదే విధంగా లోయర్ ఆర్డర్లో పట్టుదలగా నిలబడ్డ ఆసీస్ పేసర్ మైకేల్ నాసర్ (35)ను కూడా అవుట్ చేసిన టంగ్.. ఆఖరిగా స్కాట్ బోలాండ్ను డకౌట్ చేసి తన ఖాతాలో ఐదో వికెట్ జమచేసుకున్నాడు. తద్వారా ఎంసీజీలో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసి.. 21వ శతాబ్దంలో ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లండ్ బౌలర్గా చరిత్రకెక్కాడు.ఇంగ్లండ్ ఇతర బౌలర్లలో గస్ అట్కిన్సన్ రెండు, బ్రైడన్ కార్స్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు ఆసీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఫలితంగా 29.5 ఓవర్లలో కేవలం 110 పరుగులు చేసిన ఇంగ్లండ ఆలౌట్ అయింది. దీంతో ఆసీస్కు తొలి ఇన్నింగ్స్లో 42 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ బౌలర్లలో నాసర్ నాలుగు, బోలాండ్ మూడు, స్టార్క్ రెండు, గ్రీన్ ఒక వికెట్ పడగొట్టారు.చదవండి: Virat Kohli: మళ్లీ సెంచరీ చేస్తాడనుకుంటే.. -
కోహ్లి, పంత్ మెరుపులు
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో టీమిండియా స్టార్లు, ఢిల్లీ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ మెరుపులు మెరిపించారు. గుజరాత్తో ఇవాళ (డిషెంబర్ 26) జరుగుతున్న మ్యాచ్లో అర్ద సెంచరీలతో సత్తా చాటారు. విరాట్ 61 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్ సాయంతో 77 పరుగులు చేయగా.. పంత్ 79 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేశాడు. క్లిష్టమైన పిచ్పై విరాట్, పంత్ చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. విరాట్, పంత్ ఔటయ్యాక హర్ష్ త్యాగి (40) కాస్త నిలకడగా ఆడాడు. చివర్లో సిమర్జీత్ సింగ్ (15 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు.గుజరాత్ బౌలర్లలో స్పిన్నర్లు విశాల్ జేస్వాల్ (10-0-42-4), రవి బిష్ణోయ్ (10-0-50-2) ఢిల్లీ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. అర్జన్ నగస్వల్లా, కెప్టెన్ చింతన్ గజా తలో వికెట్ తీశారు. మిగతా ఢిల్లీ బ్యాటర్లలో ప్రియాంశ్ ఆర్య 1, అర్పిత్ రాణా 10, నితీశ్ రాణా 12, ఆయుశ్ బదోని 12, నవ్దీప్ సైనీ 6, ఇషాంత్ శర్మ 5 (నాటౌట్) పరుగులు చేయగా.. ప్రిన్స్ యాదవ్ డకౌటయ్యాడు.3 సెంచరీలు, 3 అర్ద సెంచరీలులిస్ట్-ఏ ఫార్మాట్ అంటేనే పునకాలు తెప్పించే విరాట్ కోహ్లి గత కొంతకాలంలో ఈ ఫార్మాట్లో పీక్స్లో ఉన్నాడు. గత ఆరు ఇన్నింగ్స్ల్లో అతని ప్రదర్శనలు చెప్పనశక్యంగా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు.. దేశవాలీ స్థాయిలో (VHT 2025-26) సెంచరీ, హాఫ్ సెంచరీతో పట్టపగ్గాల్లేకుండా ఉన్నాడు. గత 6 లిస్ట్-ఏ ఇన్నింగ్స్ల్లో విరాట్ స్కోర్లు..- 74*(81)- 135(120)- 102(93)- 65*(45)- 131(101)- 77(61) -
వైభవ్ సూర్యవంశీకి అత్యున్నత పురస్కారం
భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అరుదైన గౌరవం లభించింది. పద్నాలుగేళ్లకే ప్రపంచ రికార్డులు సృష్టిస్తున్న ఈ చిచ్చరపిడుగును.. ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ (Pradhan Mantri Rashtriya Bal Puraskar) వరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అతడు శుక్రవారం ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నాడు.బిహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. పద్నాలుగేళ్ల వయసులోనే క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. తొలుత దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. రంజీల్లో అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడి (12)గా రికార్డు సాధించాడు.ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీఅనంతరం ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025లో రాజస్తాన్ రాయల్స్ తరఫు ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేయడం ద్వారా మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ వంటి పటిష్ట బౌలింగ్ విభాగం ఉన్న జట్టుపై కేవలం 35 బంతుల్లోనే శతకం బాది.. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో చిన్న వయసులో ఈ ఘనత సాధించిన భారత తొలి బ్యాటర్గా నిలిచాడు.భారత అండర్-19 జట్టు తరఫున మెరుపులుప్రస్తుతం భారత అండర్-19 జట్టు తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లలోనూ యూత్ వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు నమోదు చేశాడు. ఇటీవల అండర్-19 ఆసియా కప్-2025లోనూ విధ్వంసకర శతకంతో దుమ్ములేపాడు. తాజాగా దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో బిహార్ వైస్ కెప్టెన్గా బరిలో దిగిన వైభవ్.. మరోసారి దుమ్ములేపాడు.అరుణాచల్ ప్రదేశ్తో బుధవారం మ్యాచ్లో కేవలం 36 బంతుల్లోనే శతక్కొట్టిన వైభవ్ సూర్యవంశీ.. మొత్తంగా 84 బంతుల్లో 190 పరుగులు సాధించాడు. తద్వారా లిస్ట్-ఎ క్రికెట్లో అత్యంత వేగంగా 150 పరుగుల మార్కు దాటిన బ్యాటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.అత్యున్నత పురస్కారంఇలా చిన్న వయసులోనే క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీని.. పిల్లలకు అందించే అత్యున్నత పురస్కారంతో ప్రభుత్వం సత్కరించింది. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్న వైభవ్.. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అవుతాడు. VIDEO | Delhi: Young cricketer Vaibhav Suryavanshi conferred with Pradhan Mantri Rashtriya Bal Puraskar.(Source: Third Party)#VaibhavSuryavanshi (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/JrKqy7ziTN— Press Trust of India (@PTI_News) December 26, 2025కాగా 5-18 ఏళ్ల మధ్య వయసు గల పిల్లలకు సాహసం, సంస్కృతి, వాతావరణం, నవకల్పనలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, సామాజిక సేవ, క్రీడలు తదితర విభాగాల్లో ప్రధాన్ మంత్రి బాల్ పురస్కార్ అందజేస్తారు.టోర్నీ నుంచి అవుట్భారత అండర్-19 జట్టు తదుపరి జింబాబ్వే పర్యటనతో బిజీ కానుంది. ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జనవరి 15 నుంచి జింబాబ్వేతో మ్యాచ్లు ఆడనుంది. ఈ నేపథ్యంలో విజయ్ హజారే ట్రోఫీ 2025-26 మిగిలిన మ్యాచ్లకు వైభవ్ సూర్యవంశీ దూరం కానున్నాడు.చదవండి: Virat Kohli: మళ్లీ సెంచరీ చేస్తాడనుకుంటే.. -
Virat Kohli: మళ్లీ సెంచరీ చేస్తాడనుకుంటే..
టీమిండియా దిగ్గజ బ్యాటర్, ఢిల్లీ స్టార్ విరాట్ కోహ్లి శతకం చేజార్చుకున్నాడు. మెరుపు హాఫ్ సెంచరీతో అలరించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్... సెంచరీకి ఇరవై మూడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. కాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశాల మేరకు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో కలిసి కోహ్లి దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 బరిలో దిగిన విషయం తెలిసిందే. రోహిత్ తన సొంత జట్టు ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తుండగా.. కోహ్లి సైతం తన జట్టు ఢిల్లీకి ఆడుతున్నాడు.ఆంధ్రపై శతక్కొట్టిన కోహ్లి..ఇందులో భాగంగా బుధవారం నాటి తొలి మ్యాచ్లో ఆంధ్రపై శతక్కొట్టిన (101 బంతుల్లో 131) కోహ్లి.. తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్లోనూ ఫామ్ను కొనసాగించాడు. ఎలైట్ గ్రూప్-డిలో భాగంగా బెంగళూరు వేదికగా గుజరాత్తో మ్యాచ్లో ఢిల్లీ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగింది.𝐕𝐢𝐫𝐚𝐭 𝐊𝐨𝐡𝐥𝐢 𝐒𝐩𝐞𝐜𝐢𝐚𝐥 😎1️⃣3️⃣1️⃣ runs 1️⃣0️⃣1️⃣ balls 1️⃣4️⃣ fours 3️⃣ sixes A terrific knock from Virat Kohli as he guided Delhi to a 4️⃣-wicket victory against Andhra 👏 He also completed 1️⃣6️⃣0️⃣0️⃣0️⃣ runs in Men’s List A cricket 🫡 @IDFCFIRSTBank | @imVkohli |… pic.twitter.com/kCfdl3yux1— BCCI Domestic (@BCCIdomestic) December 24, 202529 బంతుల్లోనేఅయితే, ఆదిలోనే గుజరాత్ బౌలర్లు ఢిల్లీని దెబ్బకొట్టారు. ప్రియాన్ష్ ఆర్య (7 బంతుల్లో 1)ను కెప్టెన్ చింతన్ గజా వెనక్కి పంపగా.. కోహ్లి క్రీజులోకి వచ్చాడు. కాసేపటికే మరో ఓపెనర్ అర్పిత్ రాణా (31 బంతుల్లో 10)ను విశాల్ జైస్వాల్ అవుట్ చేయగా.. కోహ్లి బాధ్యతాయుతంగా ఆడుతూనే మెరుపులు మెరిపించాడు.మళ్లీ సెంచరీ చేస్తాడనుకుంటే..కేవలం 29 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న కోహ్లి.. తర్వాత కూడా అదే జోరును కొనసాగించాడు. మొత్తంగా 61 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 77 పరుగులు సాధించాడు. అయితే, విశాల్ జైస్వాల్ బౌలింగ్లో వికెట్ కీపర్ ఉర్విల్ పటేల్కు క్యాచ్ ఇవ్వడంతో కోహ్లి ఇన్నింగ్స్కు తెరపడింది.మిగతా వారిలో నితీశ్ రాణా (12) తేలిపోగా.. కెప్టెన్ రిషభ్ పంత్, ఆయుశ్ బదోనిలపై భారం పడింది. 27 ఓవర్ల ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి ఢిల్లీ 129 పరుగులు చేయగలిగింది. ఇదిలా ఉంటే.. గత ఐదు మ్యాచ్లలో కోహ్లి మూడు సెంచరీలు చేసిన విషయం తెలిసిందే.పిచ్చెక్కిస్తున్నావు భయ్యా!సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో తొలి, రెండో మ్యాచ్లలో శతక్కొట్టిన కోహ్లి.. ఢిల్లీ తరఫు పునరాగమనంలోనూ సెంచరీతో అలరించాడు. కింగ్ ఫామ్ చూసి అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. తాజాగా మెరుపు హాఫ్ సెంచరీ బాదడంతో.. ‘‘సంతోషం పట్టలేకపోతున్నాం.. పిచ్చెక్కిస్తున్నావు భయ్యా!’’ అంటూ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.కాగా బెంగళూరులో కోహ్లి ఆటను చూసేందుకు ఫ్యాన్స్ చెట్లెక్కి మరీ విన్యాసాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన కోహ్లి.. వన్డేల్లో మాత్రం కొనసాగుతున్న విషయం తెలిసిందే. UPDATE: కోహ్లి, పంత్ మెరుపులు.. ఢిల్లీ స్కోరెంతంటే?చదవండి: మొన్న శతక్కొట్టాడు.. ఇప్పుడు గోల్డెన్ డక్! -
Ashes: కుప్పకూలిన ఆసీస్.. ఆలౌట్
ఇంగ్లండ్తో నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి తాళలేక స్వల్ప స్కోరుకే చాపచుట్టేశారు. సొంతగడ్డపై ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ను కంగారూలు ఇప్పటికే సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఐదు టెస్టులలో భాగంగా తొలి మూడు గెలిచి ఆసీస్ 3-0తో ఆధిక్యంలో ఉంది.ఈ క్రమంలో ఆసీస్- ఇంగ్లండ్ (Aus vs Eng) మధ్య మెల్బోర్న్ వేదికగా శుక్రవారం నాలుగో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఆతిథ్య జట్టు బ్యాటింగ్కు దిగింది. అయితే, ఆది నుంచే ఇంగ్లండ్ పేసర్లు గస్ అట్కిన్సన్, జోష్ టంగ్ కంగారూ బ్యాటర్లకు చుక్కలు చూపించారు.చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్లుడేంజరస్ ఓపెనర్ ట్రవిస్ హెడ్ (12)ను అట్కిన్సన్ బౌల్డ్ చేయగా.. మరో ఓపెనర్ జేక్ వెదరాల్డ్ (10)ను టంగ్ వెనక్కి పంపాడు. ఇక వన్డౌన్లో వచ్చిన మార్నస్ లబుషేన్ (6)తో పాటు కెప్టెన్ స్టీవ్ స్మిత్ (9) వికెట్ను కూడా తన ఖాతాలో వేసుకున్న టంగ్.. ఆసీస్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు.ఇక ఉస్మాన్ ఖవాజా (29)ను అట్కిన్సన్ వెనక్కి పంపగా.. అలెక్స్ క్యారీ (20) బెన్ స్టోక్స్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ (17) రనౌట్ కాగా.. టెయిలెండర్లలో మైకేల్ నాసర్ (35) కాసేపు పోరాడగా.. టంగ్ అతడిని బౌల్డ్ చేశాడు. ఐదేసిన టంగ్.. ఆసీస్ ఆలౌట్ఆఖర్లో మిచెల్ స్టార్క్ (1) రూపంలో బ్రైడన్ కార్స్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకోగా.. స్కాట్ బోలాండ్ (0)ను అవుట్ చేసిన టంగ్ ఐదో వికెట్ తీశాడు. జే రిచర్డ్సన్ (0) నాటౌట్గా నిలవగా.. ఆసీస్ 45.2 ఓవర్లలో కేవలం 152 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లిష్ జట్టు బౌలర్లలో జోష్ టంగ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. అట్కిన్సన్కు రెండు, బ్రైడన్ కార్స్, స్టోక్స్లకు చెరో వికెట్ దక్కాయి. చదవండి: టీమిండియా కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రా! -
మొన్న శతక్కొట్టాడు.. ఇప్పుడు గోల్డెన్ డక్!
టీమిండియా మాజీ కెప్టెన్, ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ తాజా మ్యాచ్లో ‘హిట్మ్యాన్’ గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశాల మేరకు టీమిండియా విధుల్లో లేని స్టార్లంతా దేశవాళీ క్రికెట్ బాట పట్టిన విషయం తెలిసిందే.దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా ఈ జాబితాలో ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్లో తమకు తిరుగులేదని నిరూపించుకున్న ఈ ఇద్దరు.. సొంత జట్ల తరఫున విజయ్ హజారే ట్రోఫీ 2025-26 బరిలో దిగారు. ముంబై ఓపెనర్గా రోహిత్ శర్మ.. పదిహేనేళ్ల తర్వాత ఢిల్లీ జట్టు వన్డౌన్ బ్యాటర్గా కోహ్లి బుధవారం దర్శనమిచ్చారు.62 బంతుల్లోనే శతక్కొట్టి..ఇక తమ తొలి మ్యాచ్లో ముంబై సిక్కిం వంటి పసికూనతో తలపడగా.. రోహిత్ శర్మ కేవలం 62 బంతుల్లోనే శతక్కొట్టి.. తన లిస్ట్-ఎ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. సిక్కిం విధించిన 237 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. మొత్తంగా 94 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 18 ఫోర్లు, 9 సిక్స్ల సాయంతో 155 పరుగులు సాధించి జట్టును గెలిపించాడు.ఇప్పుడు గోల్డెన్ డక్!తాజాగా గ్రూప్-సిలో భాగంగా ఉత్తరాఖండ్తో శుక్రవారం నాటి మ్యాచ్లో టాస్ ఓడిన ముంబై తొలుత బ్యాటింగ్కు దిగింది. ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఓపెనర్ రోహిత్ శర్మ అవుటయ్యాడు. దేవేంద్ర సింగ్ బోరా బౌలింగ్లో జగ్మోహన్ నాగర్కోటికి క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌట్గా పెవిలియన్ చేరాడు. దీంతో జైపూర్లో మొన్న (బుధవారం) రోహిత్ శర్మ సెంచరీ చూసిన అభిమానులు.. ఇప్పుడు అదే వేదికపై అతడు ఇలా తేలిపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇదిలా ఉంటే.. బుధవారం ఆంధ్రతో మ్యాచ్లో కోహ్లి సైతం శతక్కొట్టిన విషయం తెలిసిందే. చదవండి: IND vs NZ: టీమిండియాకు గుడ్ న్యూస్#VijayHazareTrophy Golden duck for rohit sharma pic.twitter.com/mwsH4O7aRt— vaibhav dhakad (@Pkmbk123) December 26, 2025 -
BCCI: తగ్గిన ఐసీసీ వాటా
ముంబై: టీమ్ ప్రధాన స్పాన్సర్గా డ్రీమ్ ఎలెవన్ అర్ధాంతరంగా తప్పుకొన్న తర్వాత కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదాయానికి ఎలాంటి సమస్యా ఎదురు కాలేదు. ఎక్కువ మొత్తానికి అపోలో టైర్స్తో స్పాన్సర్షిప్ ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు కిట్ స్పాన్సర్ అడిడాస్ ద్వారా బోర్డు ఆ లోటును పూరించుకుంది. రూ. 3,358 కోట్లు పెరుగుదలబోర్డు సంయుక్త కార్యదర్శి (గత కోశాధికారి) ప్రభ్తేజ్ భాటియా రాబోయే 2025–26 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐ (BCCI) ఆదాయ అంచనాల గురించి వివరిస్తూ గత ఏడాది 2024–25కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. దీని ప్రకారం గత ఏడాది బోర్డు ప్రాథమిక నిధిలో రూ. 3,358 కోట్లు పెరుగుదల కనిపిస్తూ మొత్తం రూ.11,346 కోట్లకు చేరింది. అపోలో టైర్స్తో రూ. 358 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్న బీసీసీఐ... జెర్సీ స్పాన్సర్ అడిడాస్ నుంచి కూడా పెద్ద మొత్తాన్ని పొందినట్లు సమాచారం. తగ్గిన ఐసీసీ వాటాఅయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నుంచి ప్రతీ ఏటా వచ్చే ఆదాయంలో మాత్రం కోత పడిందని ఈ నివేదికలో పేర్కొన్నారు. ప్రతీ ఏడాది ఐసీసీ తమ ఆదాయం నుంచి భారత బోర్డుకు 38.5 శాతం అందిస్తుంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐకి రూ.8,963 కోట్ల ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నారు. చదవండి: టీమిండియా కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రా!? -
మరో విజయం లక్ష్యంగా...
మెల్బోర్న్: సొంతగడ్డపై సమష్టి ప్రదర్శనతో అదరగొట్టి ప్రతిష్టాత్మక ‘యాషెస్’ సిరీస్ చేజిక్కించుకున్న ఆస్ట్రేలియా జట్టు నేటి నుంచి నాలుగో టెస్టు ‘బాక్సింగ్ డే’ మ్యాచ్లో బరిలోకి దిగనుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్ల్లోనూ సంపూర్ణ ఆధిపత్యం చలాయించి నెగ్గిన ఆసీస్ 3–0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక మిగిలిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచి ‘క్లీన్స్వీప్’ చేయాలని కంగారూలు భావిస్తుండగా... ‘పోరాడితే పోయేదేమీ లేదు’ అన్న తరహాలో తెగించి ఆడేందుకు ఇంగ్లండ్ సిద్ధమైంది. గాయం కారణంగా జట్టుకు దూరమైన నాథన్ లయన్ స్థానంలో మరో స్పిన్నర్ టాడ్ మర్ఫీకి బదులుగా ఆ్రస్టేలియా జట్టు అదనపు పేసర్కు అవకాశమివ్వనుంది. ‘బాక్సింగ్ డే’ టెస్టు కోసం మెల్బోర్న్ స్టేడియం ముస్తాబవగా... పచి్చకతో కూడిన పిచ్ ఆరంభంలో పేసర్లకు సహకారం అందించనుంది. అయితే కాస్త సంయమనం పాటిస్తే ఇక్కడ బ్యాటింగ్ చేయడం పెద్ద కష్టం కాదని రికార్డులు చెబుతున్నాయి. కమిన్స్కు విశ్రాంతినివ్వడంతో మరోసారి స్టీవ్ స్మిత్ ఆసీస్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఈ సిరీస్ తొలి రెండు మ్యాచ్ల్లోనూ జట్టును నడిపించిన ఈ స్టార్ బ్యాటర్... రెండింట్లోనూ విజయాలు కట్టబెట్టాడు. ట్రావిస్ హెడ్ మంచి జోరు మీదుండగా... గత మ్యాచ్లో అలెక్స్ కేరీ గొప్ప ఇన్నింగ్స్లతో ఆకట్టుకున్నాడు. స్మిత్, లబుషేన్, ఉస్మాన్ ఖ్వాజా, వెదరాల్డ్తో ఆసీస్ బ్యాటింగ్ బలంగా ఉంది. ఏడో స్థానంలో పేస్ ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ బ్యాటింగ్కు దిగనున్నాడు. పచ్చికతో కూడిన పిచ్పై కంగారూలు ఐదుగురు పేసర్లతో బరిలోకి దిగుతున్నారు. ఈ సిరీస్ తొలి రెండు మ్యాచ్ల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు దక్కించుకున్న మిచెల్ స్టార్క్ మరోసారి బౌలింగ్ దళాన్ని నడిపించనున్నాడు. మికెల్ నెసెర్, బోలాండ్, డగెట్ అతడికి సహకరించనున్నారు. సమష్టిగా రాణిస్తేనే... మరోవైపు ఇంగ్లండ్ విషయానికి వస్తే... ఇప్పటికే సిరీస్ కోల్పోయిన ఆ జట్టు... చివరి రెండు మ్యాచ్ల్లోనైనా పోరాడాలని భావిస్తోంది. ‘ఆ్రస్టేలియా నుంచి సానుకూల దృక్పథంతో తిరిగి వెళ్లాలనుకుంటున్నాం. సిరీస్ కోల్పోయినప్పటికీ ఇక మిగిలిన రెండు మ్యాచ్ల్లో మెరుగైన ప్రదర్శన చేస్తాం’ అని ఇంగ్లండ్ కెపె్టన్ బెన్ స్టోక్స్ అన్నాడు. ‘బాజ్బాల్’ ఆటతీరు పెద్దగా ఫలితాన్నివ్వని నేపథ్యంలో మెల్బోర్న్లో ఇంగ్లండ్ ఎలాంటి ప్రణాళికతో బరిలోకి దిగుతుందో చూడాలి. మూడో టెస్టుకు ముందు లభించిన విరామంలో బీచ్ రిసార్ట్కు వెళ్లిన ఇంగ్లండ్ ఆటగాళ్లు నియంత్రణ కోల్పోయే రీతిలో మద్యం సేవించి వార్తల్లోకెక్కగా... అందులో వైరల్గా మారిన బెన్ డకెట్పై టీమ్ మేనేజ్మెంట్ నమ్మకముంచింది. ఈ సిరీస్లో ఆడిన 6 ఇన్నింగ్స్లలో కలిపి డకెట్ 97 పరుగులే చేసినప్పటికీ... మరో మెరుగైన ప్రత్యామ్నాయం లేకపోవడంతో అతడినే కొనసాగించాల్సిన పరిస్థితి. ఇక ప్రధాన పేసర్ జోఫ్రా ఆర్చర్ గాయంతో సిరీస్కు దూరం కావడం ఇంగ్లండ్ జట్టును మరింత కష్టాల్లోకి నెట్టింది. అతడి స్థానంలో అట్కిన్సన్ బరిలోకి దిగనున్నాడు. సుదీర్ఘ కెరీర్లో ఈ సిరీస్లోనే ఆసీస్ గడ్డపై తొలి టెస్టు సెంచరీ నమోదు చేసుకున్న మాజీ కెప్టెన్ జో రూట్... ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమవడం సిరీస్ ఫలితంపై ప్రభావం చూపింది. మరి ఎలాంటి ఒత్తిడి లేని ఈ పోరులో క్రాలీ, డకెట్, బెథెల్, రూట్, బ్రూక్, స్టోక్స్, జేమీ స్మిత్తో కూడిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ ఏమాత్రం ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరం. బౌలింగ్లో కార్స్, జాక్స్ కీలకం కానున్నారు.4 మెల్బోర్న్ మైదానంలో ఆ్రస్టేలియా జట్టుకు స్టీవ్ స్మిత్ నాయకత్వం వహించిన టెస్టులు. స్మిత్ సారథ్యంలో ఈ వేదికపై ఆ్రస్టేలియా రెండు టెస్టుల్లో నెగ్గి, మరో రెండు టెస్టులను ‘డ్రా’గా ముగించి అజేయంగా ఉంది.57 మెల్బోర్న్ మైదానంలో ఆ్రస్టేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన టెస్టులు. 29 టెస్టుల్లో ఆ్రస్టేలియా నెగ్గగా... 20 టెస్టుల్లో ఇంగ్లండ్ గెలిచింది. 8 టెస్టులు ‘డ్రా’ అయ్యాయి.117 మెల్బోర్న్ మైదానంలో ఇప్పటి వరకు ఆ్రస్టేలియా ఆడిన టెస్టులు. ఈ వేదికపై ఆస్ట్రేలియా 68 టెస్టుల్లో గెలిచి, 32 టెస్టుల్లో ఓడిపోయింది. 17 టెస్టులు ‘డ్రా’గా ముగిశాయి. జట్ల వివరాలు ఆ్రస్టేలియా (అంచనా): స్మిత్ (కెప్టెన్), వెదరాల్డ్, హెడ్, లబుషేన్, ఖ్వాజా, కేరీ, గ్రీన్, నెసెర్, స్టార్క్, డగెట్/జే రిచర్డ్సన్, బోలాండ్. ఇంగ్లండ్: స్టోక్స్ (కెప్టెన్ ), క్రాలీ, డకెట్, బెథెల్, రూట్, బ్రూక్, జేమీ స్మిత్, విల్ జాక్స్, అట్కిన్సన్, కార్స్, టంగ్. -
విలియమ్సన్ లేకుండానే...
వెల్లింగ్టన్: విదేశీ లీగ్లు ఆడేందుకు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్... భారత్తో వన్డేసిరీస్కు దూరమయ్యాడు. వచ్చే ఏడాది ఆరంభంలో భారత్లో పర్యటించనున్న న్యూజిలాండ్ జట్టు.. ఈ టూర్లో భాగంగా మూడు వన్డేలు, 5 టి20లు ఆడనుంది. దీని కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వేర్వేరుగా జట్లను ప్రకటించింది. దక్షిణాఫ్రికా (ఎస్ఏ)20 లీగ్లో ఆడేందుకు గానూ విలియమ్సన్ ఈ సిరీస్కు దూరం కాగా... యువ ఆటగాళ్లకు న్యూజిలాండ్ బోర్డు పెద్దపీట వేసింది. వన్డేల్లో మైకేల్ బ్రేస్వెల్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. పేసర్ కైల్ జేమీసన్ రెండు జట్లలోనూ చోటు దక్కించుకున్నాడు. ఎడంచేతి వాటం స్పిన్నర్ జేడెన్ లెనాక్స్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చిన సాంట్నర్ టి20ల్లో న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. క్రిస్టియన్ క్లార్క్, ఆదిత్య అశోక్, జోష్ క్లార్క్సన్, నిక్ కెల్లీ, మిచెల్ రే వంటి పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లతో న్యూజిలాండ్ బరిలోకి దిగనుంది. జేడెన్ లెనాక్స్పై ఆ జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. ‘న్యూజిలాండ్ ‘ఎ’ జట్టు తరఫున లెనాక్స్ చక్కటి ప్రదర్శన కనబర్చాడు. దానివల్లే అతడికి ఈ అవకాశం దక్కింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో గత కొన్నాళ్లుగా అతడు నిలకడైన ప్రదర్శన చేస్తున్నాడు. దేశవాళీల్లో కనబర్చిన దూకుడే... అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగిస్తాడనే నమ్మకముంది’ అని న్యూజిలాండ్ కోచ్ రోబ్ వాల్టర్ అన్నాడు. త్వరలో టి20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో... గాయం నుంచి ఇప్పుడే కోలుకుంటున్న టామ్ లాథమ్ను ఈ సిరీస్కు ఎంపిక చేయలేదు. దేశవాళీల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన బెవాన్ జాక్స్, టిమ్ రాబిన్సన్ టి20 జట్టులో చోటు దక్కించుకున్నారు. జేమ్స్ నీషమ్, ఇష్ సోధి కూడా జట్టుకు ఎంపికయ్యారు. నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నెర్, మార్క్ చాప్మన్లను వన్డే జట్టు ఎంపికలో పరిగణనలోకి తీసుకోలేదు. టి20 జట్టులో మాత్రం చాప్మన్కు చోటు దక్కింది. న్యూజిలాండ్ వన్డే జట్టు: బ్రేస్వెల్ (కెప్టెన్ ), ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్, జోష్ క్లార్క్సన్, డెవాన్ కాన్వే, జాక్ ఫౌల్క్స్, మిచ్ హే, కైల్ జేమీసన్, నిక్ కెల్లీ, జేడెన్ లెనాక్స్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ రే, విల్ యంగ్. న్యూజిలాండ్ టి20 జట్టు: సాంట్నర్ (కెప్టెన్), బ్రేస్వెల్, చాప్మన్, కాన్వే, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, హెన్రీ, జేమీసన్, బెవాన్ జాకబ్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ రాబిన్సన్, ఇష్ సోధి. -
దేశవాళీ మహిళా క్రికెటర్లకు వేతనాలు పెంపు
న్యూఢిల్లీ: దేశవాళీ టోర్నీల్లో పాల్గొనే మహిళా క్రికెటర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీస్థాయిలో వేతనాలు పెంచింది. క్రికెటర్లతో పాటు మ్యాచ్ అఫీషియల్స్కు సైతం జీతభత్యాల్ని పెంచింది. ఇప్పుడు చెల్లిస్తున్న దానికి రెట్టింపును మించే విధంగా హెచ్చింపు చేసింది. ఈ మేరకు బోర్డు ఉన్నస్థాయి మండలి అమోదించడంతో పెరిగిన వేతనాల్ని మహిళా క్రికెటర్లు, అఫీషియల్స్ ఈ సీజన్ నుంచే అందుకోనున్నారు. ఇప్పటివరకు దేశవాళీ టోర్నీలు ఆడే సీనియర్ మహిళా క్రికెటర్లకు రోజుకి రూ. 20 వేలు (రిజర్వ్ ప్లేయర్లకి రూ. 10 వేలు) చొప్పున చెల్లిస్తున్నారు. తాజా వేతన సవరణతో ఏకంగా రూ. 50 వేల నుంచి రూ. 60 వేలు అందనున్నాయి. అంటే తుది జట్టులో ఆడితే రూ. 50 వేలు, రిజర్వ్ బెంచ్లో ఉంటే రూ. 25 వేలు ఇస్తారు. జాతీయ టి20 టోర్నీల్లో పాల్గొనే అమ్మాయిలకు మ్యాచ్కు రూ. 25 వేల చొప్పున (రిజర్వ్ రూ. 12,500) చెల్లించనున్నారు. దీంతో దేశవాళీ టోర్నీలకు సీజన్ ఆసాంతం అందుబాటులో ఉండే ఒక్కో సీనియర్ క్రికెటర్కు ఏడాదికి రూ. 12 లక్షల నుంచి 14 లక్షల చొప్పున వేతన భత్యాలు లభిస్తాయని బోర్డు అధికారులు వెల్లడించారు. జూనియర్లకు ఇలా... జూనియర్ మహిళా క్రికెటర్ల పంట కూడా పండింది. అండర్–23, అండర్–19 వయో విభాగాల టోర్నీలు ఆడే అమ్మాయిలు రోజుకి రూ. 25 వేలు (రిజర్వ్ రూ.12,500) చొప్పున పొందుతారు. దేశవాళీ మ్యాచ్లకు ఫీల్డ్ అంపైర్లు, రిఫరీలు, అఫీషియల్స్గా పనిచేసే వారికి రూ. 40 వేలు రోజుకు చెల్లిస్తారు. మ్యాచ్ ప్రాధాన్యతను బట్టి ఈ చెల్లింపు మొత్తం కూడా పెరగనుంది. అంటే నాకౌట్, సెమీఫైనల్స్, ఫైనల్ దశ మ్యాచ్ అధికారులకు రూ. 50 వేల నుంచి రూ. 60 వేలు చెల్లిస్తారు. దీనివల్ల రంజీ ట్రోఫీ మ్యాచ్కు ఒక్కో అఫీషియల్కు రూ. 1 లక్షా 60 వేలు, నాకౌట్ దశలో అయితే రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు మ్యాచ్ ఫీజుగా అందనుంది. -
సిరీస్ విజయంపై గురి
తిరువనంతపురం: భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య టి20 సమరం వేదిక మారుతూ తిరువనంతపురానికి చేరింది. తొలి రెండు మ్యాచ్లకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వగా... ఇప్పుడు తర్వాతి మూడు మ్యాచ్లు తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో జరగనున్నాయి. ఇప్పటికే 2–0తో ఆధిక్యంలో ఉన్న భారత్ మరో మ్యాచ్ గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య నేడు మూడో టి20 మ్యాచ్కు రంగం సిద్ధమైంది. తొలి రెండు మ్యాచ్లలో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన హర్మన్ప్రీత్ బృందం ఇక్కడా అదే జోరు కొనసాగించాలని భావిస్తుండగా... ఇక్కడైనా పోటీనిచ్చి సిరీస్ను కాపాడుకోవాలని లంక లక్ష్యంగా పెట్టుకుంది. దీప్తి శర్మ పునరాగమనం... శ్రీలంకపై ఆడిన గత 11 టి20ల్లో భారత్ 9 గెలిచింది. 2024 జులై తర్వాత మన జట్టుకు ఓటమి ఎదురు కాలేదు. బలమైన బ్యాటింగ్ లైనప్తో పాటు పదునైన బౌలింగ్తో రెండు మ్యాచ్లలో విజయం మన జట్టును వరించింది. జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ తమ బ్యాటింగ్తో కీలక పాత్ర పోషించారు. బౌలింగ్లో క్రాంతి గౌడ్, శ్రీచరణి, వైష్ణవి ఆకట్టుకోవడంతో లంక భారీ స్కోర్లు చేయడంలో విఫలమైంది. తొలి మ్యాచ్లో 121 పరుగులకే పరిమితమైన జట్టు రెండో టి20లో 128 పరుగులే చేయగలిగింది. రెండో మ్యాచ్కు అనారోగ్యం కారణంగా దీప్తి శర్మ దూరం కాగా, ఆమె స్థానంలో వచ్చిన స్నేహ్ రాణా కూడా 4 ఓవర్లలో 11 పరుగులే ఇచ్చి 1 వికెట్ తీసింది. ఇప్పుడు కోలుకున్న దీప్తి మూడో మ్యాచ్ బరిలోకి దిగనుంది. తొలి టి20లో ఫీల్డింగ్ పేలవంగా కనిపించినా... దాని నుంచి పాఠాలు నేర్చుకున్న జట్టు గత పోరులో ఆకట్టుకుంది. మూడు రనౌట్లతో ప్రత్యరి్థని పడగొట్టింది. స్మృతి, హర్మన్, రిచాలతో భారత బ్యాటింగ్ బలంగా ఉండగా.. పేస్ బౌలింగ్లో అమన్జోత్, అరుంధతి రెడ్డి మరోసారి ప్రధాన బాధ్యత తీసుకుంటారు. ఈ మ్యాచ్లో కొత్త ప్లేయర్ కమలినితో అరంగేట్రం చేయించే అవకాశాన్ని టీమ్ మేనేజ్మెంట్ పరిశీలిస్తోంది. సమష్టి వైఫల్యం... శ్రీలంక పరిస్థితి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. బలహీన బ్యాటింగ్తో కనిపిస్తున్న జట్టును విజయం దిశగా నడిపించడం కెపె్టన్ చమరి అటపట్టుకు కష్టంగా మారింది. కనీసం 150 పరుగులు కూడా చేయకుండా తాము గెలుపు గురించి ఆలోచించలేమని ఆమె వ్యాఖ్యానించింది. జట్టు లైనప్లో చెప్పుకోదగ్గ ప్లేయర్లు ఎవరూ లేరు. అటపట్టు రెండో టి20లో ఆకట్టుకోగా, ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. ముఖ్యంగా లంక ఎన్నో ఆశలు పెట్టుకొని వరుసగా అవకాశాలు ఇస్తున్న టాపార్డర్ బ్యాటర్ హాసిని పెరీరా తన సత్తాను నిరూపించుకోవడంలో విఫలమైంది. 86 అంతర్జాతీయ టి20లు ఆడినా ఆమె కనీసం ఒక్క అర్ధసెంచరీ కూడా సాధించలేకపోయింది. అయితే మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో శ్రీలంక గత మ్యాచ్లో ఆడిన తుది జట్టునే ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించే అవకాశం ఉంది. విష్మి గుణరత్నే, హర్షిత, కవీషా బ్యాటింగ్లో రాణిస్తేనే జట్టుకు అవకాశాలు ఉంటాయి. పిచ్, వాతావరణం ఇప్పటి వరకు ఈ మైదానంలో నాలుగు పురుషుల టి20 మ్యాచ్లు జరగ్గా, ఒక్క మహిళల మ్యాచ్ కూడా జరగలేదు. అయితే 2023లో జరిగిన చివరి మ్యాచ్ను బట్టి చూస్తే బ్యాటింగ్కు అనుకూల పిచ్. భారీ స్కోరుకు అవకాశం ఉంది. వర్షసూచన లేదు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: హర్మన్ప్రీత్ (కెప్టెన్), స్మృతి, షఫాలీ, జెమీమా, రిచా, దీప్తి, అమన్జోత్, అరుంధతి, క్రాంతి, వైష్ణవి, శ్రీచరణి. శ్రీలంక: చమరి అటపట్టు (కెప్టెన్), విష్మి, హాసిని, హర్షిత, నీలాక్షిక, కౌశిని, కవీషా, మల్కి, ఇనోక, కావ్య, శషిణి. -
షాకింగ్.. అలిగి ఆటోలో వెళ్లిపోయిన హెడ్ కోచ్
బంగ్లాదేశ్లో ఓ వైపు అల్లర్లు కొనసాగుతుంటే.. మరోవైపు క్రికెట్ అభిమానులను అలరించేందుకు బీపీఎల్ 12వ సీజన్ సిద్దమైంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2025-26 శుక్రవారం(డిసెంబర్ 26) నుంచి ప్రారంభం కానుంది. ఆరంభం రోజే రెండు మ్యాచ్లు జరగనున్నాయి. తొలి మ్యాచ్లో సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా సిల్హెట్ టైటాన్స్, రాజ్షాహి వారియర్స్ తలపడనున్నాయి.ఆ తర్వాతి మ్యాచ్లో నోఖాలి ఎక్స్ప్రెస్, చట్టోగ్రామ్ రాయల్స్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. నోఖాలి ఎక్స్ప్రెస్.. బీపీఎల్లో చేరిన కొత్త ఫ్రాంచైజీ. ఈ జట్టుకు ఇదే తొలి సీజన్. అయితే నోయాఖాలీ ఎక్స్ప్రెస్ జట్టు ప్రాక్టీస్ సెషన్లో అనుహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. నోయాఖాలీ ఎక్స్ప్రెస్.. ఛటోగ్రామ్ రాయల్స్తో తమ మొదటి మ్యాచ్కు సన్నద్దమయ్యేందుకు గురువారం సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి వెల్ళింది.అలిగిన కోచ్లు..అయితే ప్రాక్టీస్ మధ్యలోనే హెడ్ కోచ్ ఖలీద్ మహముద్, అసిస్టెంట్ కోచ్ తల్హా జుబేర్ బయటకు వచ్చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రాక్టీస్ సెషన్లో కనీసం సరిపడా క్రికెట్ బంతులు కూడా లేకపోవడంతో వారిద్దరూ అసహనం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ మాజీ పేసర్ అయిన ఖలీద్ మహముద్ గత సీజన్ వరకు ఢాకా క్యాపిటల్స్ హెడ్ కోచ్గా పనిచేశాడు. అయితే ఈ సీజన్లో ఫ్రాంచైజీ నోయాఖాలీ ఎక్స్ప్రెస్తో జత కట్టాడు.కానీ అతడికి ఆరంభంలోనే చేదు అనుభవం ఎదురైంది. ప్రాక్టీస్కు జట్టుతో పాటు వెళ్లిన ఖలీద్ మహముద్తో బీసీబీ అధికారి ఒకరు దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. దీంతో ఖలీద్,జుబేర్ ఇద్దరూ స్టేడియం బయటకు వచ్చి ఆటోలో వెళ్లిపోయారు. ఈ సందర్భంగా జుబేర్ మీడియాతో మాట్లాడుతూ.. నా కెరీర్లో ఎన్నో బీపీఎల్ సీజన్లను చూశాను. కానీ ఇప్పటివరకు ఎటువంటి పరిస్ధితి ఎప్పుడూ ఎదురు కాలేదు. మిగతా వారు గురుంచి నాకు అనవసరం. ఇలాంటి పరిస్థితుల్లో నేను కొనసాగలేను పేర్కొన్నారు.అదేవిధంగా హెడ్ కోచ్ ఖలీద్ మహముద్ స్పందిస్తూ.. నేను బీపీఎల్ నుంచి వైదొలగాలనుకుంటున్నాను. ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని చెప్పుకొచ్చారు. అయితే కొన్ని గంటల తర్వాత మహమూద్, జుబేర్ తిరిగి మైదానంకు వచ్చారు.ఇద్దరి సన్నిహితుడు ఒకరు జోక్యంతో వారు మనసు మార్చుకున్నారు. అదేవిధంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మరోషాక్ తగిలింది. ఛటోగ్రామ్ రాయల్స్ జట్టు యాజమాన్యం టోర్నీ ఆరంభానికి ముందు తప్పుకొంది. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఆ ఫ్రాంచైజీ బాధ్యతలను తీసుకోవాల్సి వచ్చింది.చదవండి: IND vs NZ: టీమిండియాకు గుడ్ న్యూస్.. -
టీమిండియా కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రా!
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్తో సతమవుతున్న సంగతి తెలిసిందే. కెప్టెన్గా జట్టును విజయ పథంలో నడిపిస్తున్నప్పటికి..వ్యక్తిగత ప్రదర్శనల పరంగా మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. 2025 ఏడాది అతడి కెరీర్లో ఒక పీడకలల మిగిలిపోనుంది. ఆసియాకప్ వంటి మేజర్ టైటిల్స్ సాధించినప్పటికి.. ఒక ఆటగాడిగా మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఈ ఏడాది కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా సూర్య సాధించలేకపోయాడు. ఈ ఏడాది మొత్తంగా 21 అంతర్జాతీయ టీ20లు ఆడిన సూర్యకుమార్.. 13.62 సగటుతో కేవలం 218 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 47గా ఉంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లో కూడా కేవలం 34 పరుగులు (12, 5, 12, 5) మాత్రమే చేశాడు. దీంతో టీ20 వరల్డ్కప్-2026 తర్వాత సూర్యను కెప్టెన్సీ నుంచి తప్పించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి ముందే సూర్యపై వేటు వేయాలని సెలక్టర్లు భావించినప్పటికి.. వరల్డ్కప్ వంటి మెగా టోర్నీకి ముందు ప్రయోగాలు ఎందకని తమ నిర్ణయాన్ని మార్చుకున్నారంట.కెప్టెన్గా బుమ్రా..!అయితే భారత టీ20 జట్టు కెప్టెన్సీ రేసులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నట్లు తెలుస్తోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా తదుపరి కెప్టెన్గా బుమ్రా పేరును సిఫార్సు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బుమ్రాకు కెప్టెన్గా పెద్దగా అనుభవం లేనప్పటికి.. నాయకత్వ లక్షణాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి.రోహిత్ శర్మ తరహాలోనే బుమ్రా మైదానంలో చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఒత్తిడి సమయాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో ఒక బౌలర్గా అతడికి బాగా తెలుసు. 2022లో ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టులో భారత జట్టుకు బుమ్రా నాయకత్వం వహించాడు. ఆ మ్యాచ్లో ఒకే ఓవర్లో 35 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు.టెస్టుల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా ప్రపంచ రికార్డు బుమ్రా నెలకొల్పాడు. ఆ తర్వాత 2023లో ఐర్లాండ్ పర్యటనలో భారత టీ20 జట్టు కెప్టెన్గా బుమ్రా వ్యవహరించాడు. గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన బుమ్రా.. ఆ సిరీస్లో కెప్టెన్గా, బౌలర్గా దుమ్ములేపాడు.అయితే రోహిత్ శర్మ రిటైర్మ్ తర్వాత బుమ్రా టెస్టు కెప్టెన్గా ఎంపిక అవుతాడని అంతా భావించారు. కానీ బుమ్రా మూడు ఫార్మాట్లు ఆడే కీలక బౌలర్ కావడంతో.. అతడికి కొన్ని సిరీస్లకు టీమ్ మేనేజ్మెంట్ విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా సుదీర్ఘ ఫార్మాట్లో అతడు అన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండడం లేదు. ఇంగ్లండ్ పర్యటనలో అతడు కేవలం మూడు టెస్టులు ఆడాడు. మిగితా రెండు మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. అందుకే అతడికి టెస్టుల్లో జట్టు పగ్గాలను అప్పగించలేదు. కానీ అతడు ఇప్పుడు దాదాపుగా అన్ని టీ20 మ్యాచ్లకు అందుబాటులో ఉంటున్నాడు. వన్డే, టెస్టులకు విశ్రాంతి తీసుకుంటున్నప్పటికి పొట్టి ఫార్మాట్లో మాత్రం ఆడేందుకు బుమ్రా సముఖత చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే టీ20 కెప్టెన్సీ అప్పగించాలని బీసీసీఐ సిద్దమైనట్లు ప్రచారం సాగుతోంది. ఇది నిజమో కాదో తెలియాలంటే టీ20 ప్రపంచకప్ ముగిసే వరకు అగాల్సిందే.చదవండి: IND vs NZ: టీమిండియాకు గుడ్ న్యూస్.. -
టీమిండియాకు గుడ్ న్యూస్..
న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు ఓ గుడ్ న్యూస్ అందింది. ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా గాయపడి గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్ బ్యాటర్, వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్.. తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమవుతున్నాడు.దాదాపు రెండు నెలల విరామం తర్వాత అయ్యర్ బుధవారం(డిసెంబర్ 24) తన మొదటి బ్యాటింగ్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గోన్నట్లు సమాచారం. సుమారు గంటసేపు నెట్స్లో గడిపిన శ్రేయస్.. ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.అతడు ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. శ్రేయస్ ఒకట్రెండు రోజుల్లో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఈ ముంబై ఆటగాడు 4 నుంచి 6 రోజుల పాటు ప్రత్యేక శిక్షణలో పాల్గోనున్నాడు.అనంతరం అతడికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వైద్య బృంది ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించింది. ఒకవేళ ఈ పరీక్షలో అయ్యర్ పాసైతే న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు అందుబాటులో ఉండే అవకాశముంది. కివీస్తో వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్కు భారత జట్టును ఇంకా బీసీసీఐ ప్రకటించలేదు.అయ్యర్కు ఏమైందంటే?అక్టోబర్ 25న సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో క్యాచ్ అందుకునే ప్రయత్నంలో అయ్యర్ పొత్తికడుపు భాగంలో తీవ్ర గాయమైంది. దీంతో అతడి స్ప్లీన్ (ప్లీహం) చీలికకు గురై, అంతర్గత రక్తస్రావం జరిగింది. వెంటనే అతడిని సిడ్నీలోని ఆసుపత్రికి తీసుకువెళ్లి ఐసీయూలో చికిత్స అందించారు. మూడు రోజుల తర్వాత అయ్యర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అనంతరం ముంబైకు తిరిగొచ్చిన అయ్యర్.. డాక్టర్ దిన్షా పార్దివాలా పర్యవేక్షణలో చికిత్స పొందాడు. అతడికి దాదాపు నాలుగు ఐదు వారాల పాటు విశ్రాంతి అవసరమని పార్దివాలా సూచించారు.ఇప్పుడు అతడు పూర్తిగా కోలుకోవడంతో తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఒకవేళ అయ్యర్ తన ఫిట్నెస్ను నిరూపించుకుంటే.. విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టు తరపున బరిలోకి దిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు.చదవండి: ఐపీఎల్ వద్దు పొమ్మంది.. కట్చేస్తే.. డబుల్ సెంచరీతో దుమ్ములేపాడు! -
ఐపీఎల్ వద్దు పొమ్మంది.. కట్చేస్తే.. డబుల్ సెంచరీతో దుమ్ములేపాడు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్.. యువ క్రికెటర్లు తమ టాలెంట్ను నిరూపించుకోవడానికి ఒక సరైన వేదిక. ఎంతో మంది ఆటగాళ్లు ఇదే వేదికపై సత్తాచాటి క్రికెట్ ప్రపంచానికి పరిచయమయ్యారు. ప్రపంచంలోని ప్రతీ ఒక్క ఆటగాడు కనీసం ఒక్కసారైనా ఐపీఎల్లో భాగం కావాలని భాగం కావాలని కలలు కంటాడు.అలా కలలు కంటున్న వారిలో ఒడిశాకు చెందిన స్వస్తిక్ సామల్ ఒకరు. 25 ఏళ్ల స్వస్తిక్ సామల్ ఐపీఎల్లో ఆడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాడు. కానీ ప్రతీసారి అతడికి నిరాశే ఎదురు అవుతోంది. ఐపీఎల్-2026 మినీ వేలంలో కూడా అతడు తన పేరును రూ.30 లక్షల బేస్ ప్రైస్తో రిజిస్టర్ చేసుకున్నాడు.అయితే దురదృష్టవశాత్తూ తుది వేలం జాబితాలో (369 మంది) అతడికి చోటు దక్కలేదు. కానీ అతడు కొంచెం కూడా దిగులు చెందలేదు. తన సత్తాను మైదానంలోనే చూపించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తగ్గట్టు ఏకంగా డబుల్ సెంచరీతో మెరిశాడు.డబుల్ సెంచరీతో వీర వీహారం..విజయ్ హాజారే ట్రోఫీ-2025లో భాగంగా అలూర్ వేదికగా సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్లో స్వస్తిక్ సామల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన సామల్.. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. అలూర్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 169 బంతుల్లో 21 ఫోర్లు, 8 సిక్సర్లతో ఏకంగా 212 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఒడిశా నిర్ణీత 50 ఓవర్లలో ఏకంగా 6 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది.అయితే ఈ లక్ష్యాన్ని సౌరాష్ట్ర 5 వికెట్లు కోల్పోయి చేధించేసింది. ఒడిశా ఓడిపోయినప్పటికి స్వస్తిక్ సామల్ ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. అంతేకాకుండా లిస్ట్-ఏ క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఒడిశా ప్లేయర్గా స్వస్తిక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఐదవ ఆటగాడిగా ఏకంగా సంజూ శాంసన్ (212*) రికార్డును సమం చేశాడు. దీంతో సామల్ గురుంచి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తిచూపుతున్నారు.ఎవరీ సమాల్?25 ఏళ్ల స్వస్తిక్ సామల్.. ఒడిశాలోని కోరాపుట్లో జన్మించాడు. అయితే అతడికి చిన్నతనం నుంచే క్రికెట్పై మక్కువ ఎక్కవ. 10 ఏళ్ల వయసు నుంచే క్రికెట్ వైపు అడుగులు వేశాడు. ఆ తర్వాత స్ధానికంగా ఓ క్రికెట్ అకాడమీలో అతడు చేరాడు.అనంతరం ఒడిశా అండర్-16, అండర్-19, అండర్-23 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. దీంతో అతడికి 2019లో ఒడిశా సీనియర్ జట్టు తరపున ఆడే అవకాశముంది. తొలుత అతడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మిజోరంపై టీ20 అరంగేట్రం చేశాడు. అదే ఏడాది లిస్ట్-ఎ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. టీ20, లిస్ట్-ఎలో అద్భుతంగా రాణించడంలో అతడు రెండేళ్ల కిందట ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. అతడు ఇప్పుడు ఒడిశా జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఓపెనర్గా వచ్చి దూకుడగా ఆడడం అతడి స్పెషాలిటి. ముఖ్యంగా టీ20 టీ20 ఫార్మాట్లో పవర్ ప్లే ఓవర్లను అద్భుతంగా ఉపయోగించుకునే సత్తా అతడికి ఉంది. గ్రౌండ్ నలుమూలలా కూడా అతడు షాట్లు ఆడగలడు. స్వస్తిక్ సామల్ అండర్-16, అండర్-19 ,అండర్-23 స్థాయిలలో ఒడిశా కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. అతడు ఇప్పటివరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 686 పరుగులతో పాటు లిస్ట్-ఎ క్రికెట్లో 521 రన్స్ నమోదు చేశాడు. అదేవిధంగా టీ20ల్లో 13 మ్యాచ్లు 362 పరుగులు చేశాడు. అయితే మూడు ఫార్మాట్లలోనూ అతడి పేరిట సెంచరీ ఉంది. -
'సెలక్టర్లు తప్పు చేశారు.. గిల్ స్ధానంలో అతడే సరైనోడు'
టీ20 వరల్డ్కప్-2026కు ఎంపిక చేసిన భారత జట్టులో వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్కు చోటు దక్కకపోవడం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. బీసీసీఐ సెలక్షన్ కమిటీ అనుహ్యంగా గిల్ స్ధానంలో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ను జట్టులోకి తీసుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో కిషన్ రెండేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి వచ్చాడు. అయితే సడన్గా కిషన్ను వరల్డ్కప్ జట్టులోకి తీసుకోవడాన్ని చాలా మంది మాజీలు తప్పుబడుతున్నారు. ఈ జాబితాలోకి బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్సర్కార్ చేరాడు. గిల్ స్ధానంలో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ను ఎంపిక చేసి ఉండాల్సిందని వెంగ్సర్కార్ అభిప్రాయపడ్డారు. కాగా సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల రిటైర్మెంట్ తర్వాత టీ20ల్లో జైశ్వాల్కు ఓపెనర్గా చోటు దక్కుతుందని అంతా భావించారు.కానీ అతడిని పూర్తిగా జట్టు నుంచే తప్పించారు. గౌతమ్ గంభీర్ హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టాక టీ20ల్లో భారత జట్టు ఓపెనింగ్ జోడీ సంజూ శాంసన్-అభిషేక్ శర్మలకు అవకాశం దక్కింది. ఆ తర్వాత గిల్ తిరిగి జట్టులోకి రావడంతో శాంసన్ బెంచ్కే పరిమితమవ్వాల్సి వచ్చింది. అయితే తన పునరాగమనంలో గిల్ విఫలం కావడంతో సెలక్టర్లు వేటు వేశారు.మళ్లీ అభిషేక్-సంజూనే భారత ఇన్నింగ్స్ను ప్రారంభిస్తున్నారు. అయితే జైశ్వాల్కు కూడా ఓపెనర్గా మంచి రికార్డు ఉంది. ఐపీఎల్తో పాటు టెస్టు క్రికెట్లో కూడా ఓపెనర్గా తన మార్క్ చూపించాడు."టీ20 ప్రపంచకప్ టోర్నీకి సెలక్టర్లు అత్యుత్తమ జట్టును ఎంపిక చేశారు. కానీ ఈ జట్టులో యశస్వి జైశ్వాల్ లేకపోవడం తీవ్ర నిరాశపరిచింది. అతడు అన్ని ఫార్మాట్లలోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. అయినప్పటికి అతడిని జట్టులోకి తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం.జైశూ టీ20 జట్టులోకి తిరిగి రావాలంటే ఇంకా ఏమి చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్, ఫిట్నెస్ను దృష్టిలో పెట్టుకుని వరల్డ్కప్ టోర్నీకి సెలక్టర్లు ఎంపిక చేశారు. గిల్ ఫామ్లో లేనందున పక్కన పెట్టడం సరైన నిర్ణయమే. ఈ విషయంలో నేను సెలక్షన్ కమిటీ నిర్ణయంతో ఏకీభవిస్తున్నాను. కానీ గిల్ స్ధానంలో జైశ్వాల్కు అవకాశమిచ్చి ఉంటే బాగుండేది. అతడికి ఓపెనర్గా అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. మెరుపు ఆరంభాలను అందించే సత్తా అతడికి ఉంది అని వెంగ్సర్కార్ పిటిఐతో పేర్కొన్నాడు.కాగా జైశ్వాల్ గత కొంత కాలంగా టెస్టు జట్టులో మాత్రం రెగ్యూలర్గా సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఇటీవల సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో తన దక్కిన అవకాశాన్ని జైశ్వాల్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. గిల్ గైర్హజరీలో జట్టులోకి వచ్చిన జైశూ అద్భుత సెంచరీతో అదరగొట్టాడు.చదవండి: 'అతడు సూపర్ ఫామ్లో ఉన్నాడు.. వరల్డ్కప్ టోర్నీకి రెడీ' -
'అతడు సూపర్ ఫామ్లో ఉన్నాడు.. వరల్డ్కప్ టోర్నీకి రెడీ'
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ తరపున విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగిన కోహ్లి.. తను ఆడిన తొలి మ్యాచ్లోనే సెంచరీతో చెలరేగాడు.బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆంధ్ర జట్టుతో జరిగిన మ్యాచ్లో కోహ్లి శతక్కొట్టాడు. 299 పరుగుల భారీ లక్ష్య చేధనలో కింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ ఢిల్లీ బాయ్ కేవలం 101 బంతుల్లోనే 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 131 పరుగులు చేశాడు. కోహ్లికి ఇది 58వ లిస్ట్-ఎ సెంచరీ. అదేవిధంగా ఇదే మ్యాచ్లో16,000 లిస్ట్-ఏ పరుగుల మైలురాయిని కూడా కోహ్లి అధిగమించాడు. ఇప్పటికే టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన కోహ్లి.. ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్లలో మాత్రమే కొనసాగుతున్నాడు. అయినప్పటికి తనలో ఏ మాత్రం జోరు తగ్గలేదని కింగ్ నిరూపించుకుంటున్నాడు. వన్డే వరల్డ్కప్-2027కు తాను సిద్దంగా ఉన్నానని తన ప్రదర్శనలతోనే సాటిచెబుతున్నాడు. 2025లో కోహ్లి 13 వన్డేల్లో 65.10 సగటుతో 651 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. "విరాట్ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్లో కనబరిన జోరునే విజయ్ హాజారే ట్రోఫీలోనూ కొనసాగిస్తున్నాడు.. తన అసాధారణ ప్రదర్శనతో ఢిల్లీకి విజయాన్ని అందించాడు. చాలా కాలం తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడినప్పటికి.. ఎక్కడా కూడా అతడిలో తడబాటు కన్పించలేదు. విరాట్ భారత జట్టులో అత్యంత నిలకడైన ఆటగాడు. అతడు వరల్డ్కప్ టోర్నీలో ఆడేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాడు" అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్కుమార్ పేర్కొన్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లోనూ కోహ్లి దుమ్ములేపాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో కోహ్లి 302 పరుగులు చేశాడు.చదవండి: అదరగొట్టిన రింకూ సింగ్, ధ్రువ్ జురెల్.. చెలరేగిన జీషన్ అన్సారీ -
అదరగొట్టిన రింకూ సింగ్, ధ్రువ్ జురెల్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ ఆడే భారత జట్టుకు ఎంపికైన రింకూ సింగ్ దేశీ వన్డే టోర్నీలో శుభారంభం అందుకున్నాడు. ఉత్తరప్రదేశ్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఈ నయా ఫినిషర్.. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ను విజయంతో ఆరంభించాడు.ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా రాజ్కోట్ వేదికగా జరిగిన పోరులో ఉత్తరప్రదేశ్ 84 పరుగుల తేడాతో హైదరాబాద్ (HYD vs UP)పై గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది ఉత్తరప్రదేశ్. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 324 పరుగులు సాధించింది. అదరగొట్టిన జురెల్, ఆర్యన్, రింకూధ్రువ్ జురేల్ (61 బంతుల్లో 80; 4 ఫోర్లు, 4 సిక్స్లు), ఆర్యన్ జుయల్ (96 బంతుల్లో 80; 9 ఫోర్లు, 1 సిక్స్), అభిషేక్ గోస్వామి (81 బంతుల్లో 81; 10 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ రింకూ సింగ్ (48 బంతుల్లో 67; 6 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్ సెంచరీలతో కదంతొక్కారు.ఇక హైదరాబాద్ బౌలర్లలో అర్ఫాజ్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టగా... రక్షణ్ రెడ్డి, తనయ్ త్యాగరాజన్, నితిన్ సాయి యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనలో హైదరాబాద్ 43 ఓవర్లలో 240 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా 84 పరుగుల తేడాతో ఉత్తరప్రదేశ్ జట్టు చేతిలో ఓటమిపాలైంది. హైదరాబాద్ బ్యాటర్లలో ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (53; 9 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్ సెంచరీ సాధించగా... రాహుల్ బుద్ధి (47; 2 ఫోర్లు, 2 సిక్స్లు), వరుణ్ గౌడ్ (45; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు.జీషాన్ అన్సారీకి 4 వికెట్లుఉత్తరప్రదేశ్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జీషాన్ అన్సారీ 4 వికెట్లు పడగొట్టాడు. ఇదే గ్రూప్లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్ల్లో జమ్మూకశ్మీర్ 10 వికెట్ల తేడాతో చండీగఢ్పై... బరోడా 5 వికెట్ల తేడాతో అస్సాంపై... బెంగాల్ 3 వికెట్ల తేడాతో విదర్భపై విజయాలు సాధించాయి. ఇక ఎలైట్ గ్రూప్ ‘సి’లో హిమాచల్ ప్రదేశ్ 95 పరుగుల తేడాతో ఉత్తరాఖండ్పై... గోవా 6 వికెట్ల తేడాతో ఛత్తీస్గఢ్పై... పంజాబ్ 51 పరుగుల తేడాతో మహారాష్ట్రపై గెలుపొందాయి.మరోవైపు.. గ్రూప్ ‘ఎ’లోనే భాగంగా జరిగిన ఇతర మ్యాచ్ల్లో కేరళ 145 పరుగుల తేడాతో త్రిపురపై... తమిళనాడు 101 పరుగుల తేడాతో పాండిచ్చేరిపై... మధ్యప్రదేశ్ 99 పరుగుల తేడాతో రాజస్తాన్పై విజయాలు సాధించాయి.చదవండి: ప్రపంచకప్ జట్టులో జైస్వాల్, రుతురాజ్కు చోటు.. షమీకీ ఛాన్స్! -
అలా ప్రేమ పుట్టింది.. ఆస్తి భర్త కంటే వంద రెట్లు ఎక్కువే!
‘‘ఇచ్చంత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా.. మనసొక్కటె జన్మస్థానమంటూ.. కొత్త కథలాగా మొదలైతదమ్మా’’.. ఇటీవలి కాలంలో ప్రేమికులను బాగా ఆకట్టుకున్న ఈ సినిమా పాటలోని పంక్తులు అమెరికా టెన్నిస్ దిగ్గజం వీనస్ విలియమ్స్- ఇటలీ నటుడు ఆండ్రియా ప్రెటీకి సరిగ్గా సరిపోతాయి.వేర్వేరు దేశాలకు చెందిన వీనస్- ఆండ్రియా రంగాలూ, పైకి కనిపించే సోకాల్డ్ ‘రంగు’లూ భిన్నమైనవే. సంపాదనలోనూ భూమ్యాకాశాల మధ్య ఉన్నంత తేడా. వయసులోనూ ఎనిమిదేళ్ల వ్యత్యాసం. అయితేనేం వారి హృదయాంతరాల్లో ఉన్న స్వచ్చమైన ప్రేమకు ఈ అంతరాలు అడ్డంకి కాలేదు. ఏడాదిన్నర కాలంలో ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న ఈ జోడీ.. ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకుంది.ఇటలీలో ఈ సెప్టెంబరులోనే వీనస్- ఆండ్రియా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అయితే, ఇటలీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. వీనస్ విదేశీయురాలు కాబట్టి ఈ వివాహం అధికార ముద్ర పొందేందుకు ఎనిమిది నెలల సమయం పట్టింది. అందుకే తాజాగా తన స్వస్థలం ఫ్లోరిడాలోని బీచ్లో వీనస్ మరోసారి తన భర్తతో పెళ్లినాటి ప్రమాణాలు చేసింది.ఇంతకీ ఈ ఆండ్రియా ప్రెటీ ఎవరు?డానిష్ సంతతికి చెందిన ఆండ్రియా ఇటలీలో పెరిగాడు.మోడల్గా కెరీర్ ఆరంభించి.. నటుడిగా, నిర్మాతగా కొనసాగుతన్నాడు. సినిమాలు, టీవీ షోలు, రియాల్టీ షోలతో బోలెడంత పాపులారిటీ సంపాదించిన ఆండ్రియా.. విలక్షణ రీతిలో కెరీర్ను కొనసాగిస్తున్నాడు.చక్కటి అందగాడు మాత్రమే కాదు.. నిరాడంబరంగా జీవించేందుకే ఆండ్రియా ఇష్టపడతాడని అతడి సన్నిహితులు చెబుతుంటారు. వీనస్తో డేటింగ్ మొదలుపెట్టిన కొద్దికాలంలోనే ఆమె కుటుంబంతో చక్కగా కలిసిపోయాడు ఆండ్రియా.ప్రేమకథ అలా మొదలైందికెరీర్కు ప్రాధాన్యం ఇచ్చే వీనస్ విలియమ్స్ నాలుగు పదుల వయసు దాటినా పెళ్లి మాట ఎత్తలేదు. స్వాతంత్ర్యంగా జీవించేందుకు ఇష్టపడే వీనస్... గతేడాది వరకూ సింగిలే. అయితే, 2024లో మిలాన్లో జరిగిన ఫ్యాషన్ వీక్.. ఆమె జీవితంలోని నవ వసంతానికి నాంది పలికింది.అక్కడే తన కంటే ఎనిమిదేళ్లు చిన్నవాడైన 37 ఏళ్ల ఆండ్రియా ప్రెటీ తొలి చూపులోనే వీనస్ దృష్టిని ఆకర్షించాడు. అతడిది కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. మాటలు కలిశాయి. మనసులు ఒక్కటయ్యాయి. స్నేహం ప్రేమగా మారి పరిణయానికి దారి తీసింది.ఎవరి నెట్వర్త్ ఎంత?మహిళల సింగిల్స్లో ఏడుసార్లు గ్రాండ్స్లామ్ టైటిల్స్ గెలుచుకున్న వీనస్ విలియమ్స్.. డబుల్స్, మిక్స్డ్ డబుల్స్లో కలిపి మరో పదహారు గ్రాండ్స్లామ్ టైటిల్స్ తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల వాషింగ్టన్ డీసీ ఓపెన్లో గెలిచిన 45 ఏళ్ల వీనస్.. ఈ టైటిల్ గెలుచుకున్న రెండో అతిపెద్ద వయస్కురాలిగా చరిత్రకెక్కింది.చిన్ననాటి నుంచే ఆటపై మక్కువ పెంచుకుని దిగ్గజంగా ఎదిగిన వీనస్ విలియమ్స్.. ఇటు టెన్నిస్ టైటిళ్ల ద్వారా వచ్చే ప్రైజ్మనీ.. అటు ఎండార్స్మెంట్ల ద్వారా భారీ మొత్తమే కూడబెట్టింది. అంతేకాదు ఇంటీరియర్ రంగంలో అడుగుపెట్టిన వీనస్కు ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి.వంద రెట్లు ఎక్కువఇలా రెండు చేతులా సంపాదిస్తున్న వీనస్ విలియమ్స్ నికర ఆస్తుల విలువ తొంభై ఐదు మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. భారత కరెన్సీలో దాదాపు 851 కోట్ల రూపాయలకు పైమాటే.మరోవైపు.. వీనస్ భర్త ఆండ్రియా ప్రెటీ.. మోడలింగ్, నటన, సినిమా ప్రొడక్షన్ ద్వారా సుమారుగా 1- 2 మిలియన్ డాలర్లు సంపాదించినట్లు అంచనా (భారత కరెన్సీలో దాదాపు రూ. 8- 17 కోట్లు). దీనర్థం భర్త కంటే వీనస్ ఆస్తుల విలువ రమారమి వంద రెట్లు ఎక్కువ. అందుకే మరి అనేది.. ఇచ్చంత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా.. మనసొక్కటె జన్మస్థానమంటూ.. కొత్త కథలాగా మొదలైతదమ్మా!!చదవండి: David Beckham: భార్యే సర్వస్వం.. చీలిన కుటుంబం -
Ashes: ప్లేయింగ్ XII ప్రకటించిన ఆస్ట్రేలియా
సొంతగడ్డపై ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ను సొంతం చేసుకుని జోష్లో ఉంది ఆస్ట్రేలియా. పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్ టెస్టుల్లో ఇంగ్లండ్ను చిత్తుగా ఓడించి.. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో నామమాత్రపు నాలుగో, ఐదు టెస్టులలోనూ సత్తా చాటి వైట్వాష్ చేయాలని పట్టుదలగా ఉంది.మరోసారి స్మిత్ సారథ్యంలో కాగా ఆసీస్- ఇంగ్లండ్ మధ్య మెల్బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్టు (Aus Vs Eng Boxing Day Test) జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ నుంచి రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins)కు విశ్రాంతినివ్వగా.. మరోసారి స్టీవ్ స్మిత్ (Steve Smith) సారథిగా వ్యవహరించనున్నాడు. తొలి రెండు టెస్టుల మాదిరే ఈసారీ గెలుపు రుచి చూడాలని స్మిత్ భావిస్తున్నాడు.ఆ ముగ్గురి మధ్య పోటీఅయితే, కమిన్స్తో పాటు వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ సైతం నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పుపై కెప్టెన్ స్మిత్ అంచనాకు రాలేకపోయాడు. దీంతో పన్నెండు మంది సభ్యులతో కూడిన జట్టును గురువారం ప్రకటించారు. ప్లేయింగ్ ఎలెవన్లో రెండు స్థానాల కోసం పేసర్లు బ్రెండాన్ డాగెట్, మైకేల్ నాసర్, జే రిచర్డ్సన్ మధ్య పోటీ ఉందని స్మిత్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.పిచ్కు అనుగుణంగాపచ్చగా ఉన్న మెల్బోర్న్ పిచ్ను నిశితంగా పరిశీలించిన తర్వాతే తాము తుదిజట్టును ఎంపిక చేసుకుంటామని స్మిత్ స్పష్టం చేశాడు. తద్వారా స్పిన్నర్ టాడ్ మర్ఫీకి మరోసారి మొండిచేయి తప్పదని సంకేతాలు ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. మూడో టెస్టులో 82, 40 పరుగులతో ఆకట్టుకున్న ఉస్మాన్ ఖవాజా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అయితే, వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్కు మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు.బాక్సింగ్ డే టెస్టు (డిసెంబరు 26-30)కు ఆస్ట్రేలియా ప్లేయింగ్ XIIట్రవిస్ హెడ్, జేక్ వెదరాల్డ్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా , అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్, బ్రెండాన్ డాగెట్, మైకేల్ నాసర్, జే రిచర్డ్సన్.బాక్సింగ్ డే టెస్టుకు ఆస్ట్రేలియా జట్టుస్టీవ్ స్మిత్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, బ్రెండాన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, టాడ్ మర్ఫీ, మైకేల్ నాసర్, జే రిచర్డ్సన్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్స్టర్.మరోవైపు ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టుకు ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. జోఫ్రా ఆర్చర్ పక్కటెముకల నొప్పితో దూరం కాగా.. ఓలీ పోప్ను తప్పించింది. వీరి స్థానాల్లో గస్ అట్కిన్సన్, జేకబ్ బెతెల్ వచ్చారు.ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టుజాక్ క్రాలే, బెన్ డకెట్, జేకబ్ బెతెల్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్.చదవండి: ప్రపంచకప్ జట్టులో జైస్వాల్, రుతురాజ్కు చోటు.. షమీకీ ఛాన్స్! -
ఎక్కడున్నావు?.. కళ్లప్పగించి చూడు గంభీర్!
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ ఆరంభమైన రోజే (బుధవారం) పరుగుల వరద పారింది. ఈ ఎడిషన్లోని తొలి మ్యాచ్.. దాదాపు ప్రతీ బౌలర్కూ ఓ పీడకలను మిగిల్చింది. రికార్డు స్థాయిలో ఒకేరోజు ఏకంగా 22 శతకాలు నమోదు కావడం.. ఇందులో ఫాస్టెస్ట్ సెంచరీలు ఉండటం ఇందుకు నిదర్శనం.అయితే, ఇందులో రెండు శతకాలు మాత్రం అత్యంత ప్రత్యేకం. సుమారుగా పదిహేనేళ్ల తర్వాత ఢిల్లీ తరఫున భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli) ఈ దేశీ టోర్నీ బరిలో దిగగా.. ముంబై రాజా, టీమిండియా లెజెండరీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా సొంత జట్టు తరఫున రంగంలోకి దిగాడు.62 బంతుల్లోనే జైపూర్ వేదికగా సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో సిక్కింతో మ్యాచ్లో రోహిత్ శర్మ శతక్కొట్టాడు. కేవలం 62 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని.. తన లిస్-ఎ క్రికెట్ కెరీర్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ (Fastest Century) నమోదు చేశాడు. మొత్తంగా 94 బంతుల్లో 155 పరుగులు సాధించాడు. ఇందులో 18 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి.ఇక రోహిత్ అద్భుత ప్రదర్శన కారణంగా సిక్కిం విధించిన 237 పరుగుల లక్ష్యాన్ని.. ముంబై కేవలం 30.3 ఓవర్లలోనే ఛేదించి విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మను చూసేందుకు వేలాది మంది అభిమానులు జైపూర్ స్టేడియానికి వచ్చారు.కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ జరుగుతున్న వేళ కొంతమంది.. టీమిండియా సెలక్టర్ ఆర్పీ సింగ్ స్టేడియంలో ఉండటాన్ని గమనించారు. ఈ నేపథ్యంలో.. లక్ష్య ఛేదనలో రోహిత్ మెరుపు శతకంతో చెలరేగడంతో.. టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎక్కడున్నావు?.. కళ్లప్పగించి చూడు గంభీర్!‘‘గంభీర్ నువ్వు ఎక్కడున్నావు? మాకైతే కనిపించడం లేదు.. నువ్వేతై కళ్లప్పగించి రోహిత్ ఇన్నింగ్స్ చూడు’’ అంటూ గట్టిగట్టిగా అరిచారు. కాగా వన్డే ప్రపంచకప్-2027 ఆడటంపై స్పష్టత లేదంటూ.. ఇటీవలే రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది బీసీసీఐ. చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన సారథిపై వేటు వేసింది. మరోవైపు.. టీమిండియా యువ ఆటగాళ్లతో పాటు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలు కూడా దేశీ టోర్నీల్లో ఆడాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో రో-కోలను కావాలనే టార్గెట్ చేస్తున్నారంటూ వారి అభిమానులు.. సందర్భం వచ్చినపుడల్లా గంభీర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఇటీవల సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో ఈ ఇద్దరు అదరగొట్టడం.. విజయ్ హజారే ట్రోఫీలోనూ శతకాలు బాదడంతో మరోసారి గంభీర్ ట్రోల్ అవుతున్నాడు. శతక్కొట్టిన కోహ్లికాగా ఆంధ్రతో మ్యాచ్లో కోహ్లి 131 పరుగులు సాధించాడు. కోహ్లితో పాటు ప్రియాన్ష్ ఆర్య (74), నితీశ్ రాణా (77) రాణించడంతో ఆంధ్ర విధించిన 299 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం 37.4 ఓవర్లలో ఛేదించింది. నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది.. ఈ సీజన్ను విజయంతో ఆరంభించింది. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20, టెస్టులకు గుడ్బై చెప్పిన రో-కో కేవలం వన్డేలలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.చదవండి: ప్రపంచకప్ జట్టులో జైస్వాల్, రుతురాజ్కు చోటు.. షమీకీ ఛాన్స్! -
ఇంగ్లండ్ హెడ్కోచ్గా రవిశాస్త్రి!
ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో ఇంగ్లండ్ వైఫల్యాల నేపథ్యంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐదు టెస్టుల ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ను ఇంగ్లండ్ ఇప్పటికే కోల్పోయింది. తమ దేశంలో ‘బజ్బాల్’ ఆటలు చెల్లవనే రీతిలో కంగారూలు.. స్టోక్స్ బృందానికి చెక్ పెట్టి మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే ట్రోఫీని తమ సొంతం చేసుకున్నారు.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ హెడ్కోచ్ బ్రెండన్ మెకల్లమ్ (Brendon McCullum)ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లూ ఎక్కువవుతున్నాయి. ఈ విషయంపై ఇంగ్లిష్ జట్టు మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. మెకల్లమ్ స్థానాన్ని భారత మాజీ క్రికెటర్, మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri)తో భర్తీ చేయాలని ఇంగ్లండ్ బోర్డుకు సూచించాడు.రవిశాస్త్రి సరైన ఆప్షన్ఈ మేరకు.. ‘‘ఆస్ట్రేలియాను ఓడించగలిగే వ్యూహాలు రచించగల వ్యక్తి ఎవరో మీరు తెలుసుకోవాలి. ఆస్ట్రేలియా జట్టు బలహీనతలు, మానసికంగా, శారీరకంగా వారిని ఎదుర్కోవాలో తెలిసి ఉండాలి. వ్యూహాత్మకంగా వారిని దెబ్బకొట్టగలగాలి. నా అభిప్రాయం ప్రకారం.. ఇంగ్లండ్ జట్టు తదుపరి హెడ్కోచ్గా రవిశాస్త్రి సరైన ఆప్షన్’’ అని మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ అభిప్రాయపడ్డాడు.ఆసీస్ గడ్డపై అద్భుతాలుకాగా టీమిండియా హెడ్కోచ్గా రవిశాస్త్రి టెస్టు జట్టును విజయపథంలో నడిపించాడు. అతడి మార్గదర్శనంలో భారత జట్టు ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి, వరుసగా టెస్టు సిరీస్లు గెలిచింది. 2018-19, 2020-21 మధ్య కాలంలో ఆసీస్ను చిత్తు చేసి.. రెండుసార్లు బోర్డర్- గావస్కర్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకుంది.ఇక యాషెస్ సిరీస్లో భాగంగా.. పెర్త్ వేదికగా తొలి టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది ఇంగ్లండ్. బ్రిస్బేన్లో జరిగిన పింక్ బాల్ టెస్టులోనూ ఇదే చేదు ఫలితాన్ని చవిచూసింది. తాజాగా అడిలైడ్ వేదికగా ముగిసిన మూడో టెస్టులో కంగారూల చేతిలో 82 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి.. వరుసగా రెండోసారి సిరీస్ను కోల్పోయింది. ఇరుజట్ల మధ్య బాక్సింగ్ డే టెస్టు (డిసెంబరు 26-30)కు మెల్బోర్న్ వేదిక. ‘బజ్బాల్’ అంటూకాగా న్యూజిలాండ్ మాజీ బ్యాటర్ బ్రెండన్ మెకల్లమ్ 2022లో ఇంగ్లండ్ టెస్టు జట్టు హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. ‘బజ్బాల్’ అంటూ దూకుడైన విధానంతో స్టోక్స్ బృందంతో మొదట్లో మెరుగైన ఫలితాలు రాబట్టాడు. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ స్థాయికి తగ్గ ప్రదర్శనలు ఇవ్వడంలో మునుపటి జోరు కొనసాగించలేకపోతోంది.తాజాగా ప్రతిష్టాత్మక యాషెన్ సిరీస్ను కోల్పోయి విమర్శలపాలైంది. ఇదిలా ఉంటే.. 2025లో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ హెడ్కోచ్గానూ మెకల్లమ్ బాధ్యతలు చేపట్టాడు. 2027 వరకు అతడికి కాంట్రాక్టు ఉంది. అయితే, ఇంగ్లండ్ జట్టు వరుస వైఫల్యాల నేపథ్యంలో 44 ఏళ్ల మెకల్లమ్ను పదవి నుంచి దించేయాలనే డిమాండ్లు వస్తున్నాయి.చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా ఘనత క్రికెటర్ల ‘మద్యపానం’పై విచారణ: ఇంగ్లండ్ బోర్డు -
ప్రపంచకప్ జట్టులో జైస్వాల్, రుతురాజ్కు చోటు!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో టీమిండియా డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది. 2024లో కరేబియన్ దీవుల్లో ట్రోఫీని ముద్దాడిన భారత జట్టు.. ఈసారి సొంతగడ్డపై అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. గతేడాది కాలంగా నిలకడైన ప్రదర్శనతో.. వరుస విజయాలతో సూర్య సేన మరోసారి హాట్ ఫేవరెట్గా మారింది.ఇక ఈ మెగా ఈవెంట్కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ఈ ఐసీసీ టోర్నీకి ఎంపిక చేసింది. వైస్ కెప్టెన్గా ఉన్న శుబ్మన్ గిల్పై వేటు వేయడంతో పాటు.. వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ (Jitesh Sharma)ను కూడా జట్టు నుంచి తప్పించింది. వీరి స్థానాల్లో రింకూ సింగ్ (Rinku Singh), ఇషాన్ కిషన్లకు చోటిచ్చింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.. బీసీసీఐ ఎంపిక చేసిన జట్టుకు ప్రత్యామ్నాయ జట్టుతో ముందుకు వచ్చాడు. మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నా.. చాన్నాళ్లుగా భారత టీ20 జట్టుకు దూరమైన ఆటగాళ్లతో ఆకాశ్ చోప్రా తన టీమ్ను ప్రకటించాడు. జైస్వాల్, రుతురాజ్కు చోటుఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్లను ఎంచుకున్న ఈ మాజీ ఓపెనింగ్ బ్యాటర్... శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, జితేశ్ శర్మలకు కూడా స్థానం ఇచ్చాడు.భువీ, షమీలకూ ఛాన్స్అదే విధంగా.. పేసర్ల విభాగంలో స్వింగ్ సుల్తాన్, జట్టుకు ఏనాడో దూరమైన భువనేశ్వర్ కుమార్కు చోటిచ్చిన ఆకాశ్ చోప్రా.. ఇటీవలి కాలంలో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నా సెలక్టర్లు పక్కనపెడుతున్న మొహమ్మద్ షమీని కూడా తన జట్టుకు ఎంపిక చేశాడు. వీరికి తోడుగా మొహమ్మద్ సిరాజ్, దీపక్ చహర్లకు కూడా స్థానం కల్పించాడు.ఇక ఆల్రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, కృనాల్ పాండ్యా, మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్లను కూడా ఆకాశ్ చోప్రా తన జట్టులో చేర్చుకున్నాడు. కాగా భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్-2026 ఫిబ్రవరి 7న మొదలై.. మార్చి 8న ఫైనల్తో ముగుస్తుంది.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టుఅభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్.టీ20 ప్రపంచకప్-2026 ఎడిషన్కు ఆకాశ్ చోప్రా ఎంచుకున్న జట్టురుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, కృనాల్ పాండ్యా, దీపక్ చహర్, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీ, యజువేంద్ర చహల్, మొహమ్మద్ సిరాజ్.చదవండి: టీమిండియావైపు దూసుకొస్తున్న సరికొత్త పేస్ సంచలనం -
ఇషాన్ కిషన్ వరల్డ్ రికార్డు
భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇటీవల దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో 500కు పైచిలుకు పరుగులతో సత్తా చాటిన జార్ఖండ్ డైనమైట్.. జట్టుకు తొలి టైటిల్ అందించాడు. కెప్టెన్గా, బ్యాటర్గా అదరగొట్టి.. ఏకంగా టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించున్నాడు.టీమిండియా సెలక్టర్ల నమ్మకాన్ని నిజం చేస్తూ.. తాజాగా దేశీ వన్డే విజయ్ హజారే వన్డే టోర్నమెంట్ తొలి మ్యాచ్లోనూ ఇషాన్ కిషన్ (Ishan Kishan) సెంచరీతో కదంతొక్కాడు. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా కర్ణాటక (Karnataka vs Jharkhand)తో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ ఇషాన్ 39 బంతుల్లో 7 ఫోర్లు, 14 సిక్స్ల సాయంతో 125 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ వరల్డ్ రికార్డుఈ క్రమంలో అతడు 33 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకొని లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో భారత్ తరఫున రెండో వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్గా నిలిచాడు. అదే విధంగా ఓ ప్రపంచ రికార్డును కూడా ఇషాన్ కిషన్ ఈ సందర్భంగా తన ఖాతాలో వేసుకున్నాడు. లిస్ట్-ఎ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్గా ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. గతంలో శ్రీలంక వికెట్ కీపర్ బ్యాటర్ సందున్ వీరక్కడి 39 బంతుల్లో శతక్కొట్టగా.. తాజాగా ఈ రికార్డును ఇషాన్ సవరించాడు. తద్వారా ప్రపంచంలోనే లిస్ట్-ఎ క్రికెట్లో వేగవంతమైన సెంచరీ సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్గా నిలిచాడు.లిస్ట్-ఎ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీలు నమోదు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్లు👉ఇషాన్ కిషన్- 33 బంతుల్లో- 2025లో జార్ఖండ్ తరఫున కర్ణాటక మీద👉సందున్ వీరక్కడి- 39 బంతుల్లో- 2019లో సిన్హలీస్ స్పోర్ట్స్ క్లబ్ తరఫున బదురేలియా స్పోర్ట్స్ క్లబ్ మీద👉ఉర్విల్ పటేల్- 41 బంతుల్లో- 2023లో గుజరాత్ తరఫున అరుణాచల్ ప్రదేశ్ మీద👉మార్క్ బౌచర్- 44 బంతుల్లో- 2006లో సౌతాఫ్రికా తరఫున జింబాబ్వే మీద.ఇషాన్ దంచి కొట్టినాఇదిలా ఉంటే.. కర్ణాటకతో మ్యాచ్లో ఇషాన్ దంచి కొట్టినా ఈ మ్యాచ్లో జార్ఖండ్ పరాజయం పాలైంది. డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక 5 వికెట్ల తేడాతో జార్ఖండ్ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 412 పరుగులు చేసింది. విరాట్ సింగ్ (68 బంతుల్లో 88; 8 ఫోర్లు, 4 సిక్స్లు), కుమార్ కుషాగ్ర (47 బంతుల్లో 63; 3 ఫోర్లు, 5 సిక్స్లు) హాఫ్సెంచరీలతో ఆకట్టుకున్నారు. కర్ణాటక బౌలర్లు ఏకంగా 47 ఎక్స్ట్రాలు సమర్పించుకోవడంతో జార్ఖండ్ జట్టు భారీ స్కోరు చేయగలిగింది. అభిలాష్ శెట్టి 4 వికెట్లు పడగొట్టాడు.పడిక్కల్ భారీ సెంచరీతోఅనంతరం లక్ష్యఛేదనలో కర్ణాటక 47.3 ఓవర్లలో 5 వికెట్లకు 413 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దేవదత్ పడిక్కల్ (118 బంతుల్లో 147; 10 ఫోర్లు, 7 సిక్స్లు) భారీ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (34 బంతుల్లో 54; 10 ఫోర్లు), అభినవ్ మనోహర్ (32 బంతుల్లో 56 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలు సాధించగా... ధ్రువ్ ప్రభాకర్ (22 బంతుల్లో 40 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), క్రిష్ణన్ శ్రీజిత్ (38), కరుణ్ నాయర్ (29), రవిచంద్రన్ స్మరణ్ (27) తలా కొన్ని పరుగులు చేశారు. జార్ఖండ్ బౌలర్లలో సౌరభ్ శేఖర్, ఉత్కర్ష్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. -
క్రికెటర్ల ‘మద్యపానం’పై విచారణ: ఇంగ్లండ్ బోర్డు
మెల్బోర్న్: యాషెస్ సిరీస్ను ఇప్పటికే 0–3తో కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు సంబంధించి కొత్త వివాదం వెలుగులోకి వచ్చింది. మూడో టెస్టుకు ముందు లభించిన విరామంలో బీచ్ రిసార్ట్కు వెళ్లిన ఆటగాళ్లు నియంత్రణ కోల్పోయే రీతిలో మద్యం సేవించినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ ప్రకటించారు. ముఖ్యంగా ఓపెనర్ బెన్ డకెట్కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చాలా ఎక్కువగా తాగేసిన అతను దారి తప్పినట్లుగా ఇందులో కనిపిస్తోంది. తిరిగి ఎలా వెళ్లాలో తెలుసా అంటూ ఒక మహిళ ప్రశ్నించగా ‘తెలీదు’ అంటూ డకెట్ జవాబిచ్చాడు. దీంతో పాటు మరో ఆటగాడు జాకబ్ బెెతెల్ క్లబ్లో డ్యాన్స్ చేస్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది. రెండో టెస్టులో పరాజయం తర్వాత మళ్లీ కొత్తగా ఉత్తేజం పొంది సిద్ధం అయ్యేందుకు వీలుగా అంటూ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ నాలుగు రోజుల పాటు ఈ రిసార్ట్ ప్రణాళికను రూపొందించాడు. ఈ సెలవు తర్వాత జట్టుపై ఎలాంటి విమర్శలు రాలేదు కానీ మూడో టెస్టులో ఓడి యాషెస్ కోల్పోవడంతో వారి షికారుపై చర్చ మొదలైంది. రిసార్ట్లో అంతా బాగా ప్రవర్తించారు అంటూ మొదట్లో ప్రకటించిన రాబ్ కీ...కారణాలు ఏమైనా అంతర్జాతీయ క్రికెటర్లు పరిమితికి మించి మద్యం తీసుకోవడం మంచిది కాదని, ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని చెప్పాడు. యాషెస్ ఆడిన 6 ఇన్నింగ్స్లలో కలిపి డకెట్ మొత్తం 97 పరుగులే చేశాడు. 2017లో ఆ్రస్టేలియాలో జరిగిన యాషెస్ సిరీస్ సందర్భంగా సీనియర్ ప్లేయర్ జిమ్మీ అండర్సన్పై మద్యం ఒలకబోయడంతో డకెట్ను సస్పెండ్ చేసిన ఈసీబీ వెంటనే స్వదేశానికి పంపించేసింది. ఆర్చర్ అవుట్... యాషెస్ కోల్పోయి మిగతా మ్యాచ్లలో పరువు నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్న ఇంగ్లండ్ జట్టుపై మరో దెబ్బ పడింది. టీమ్ ప్రధాన పేసర్ జోఫ్రా ఆర్చర్ పక్కటెముకల గాయంతో సిరీస్లోని మిగిలిన రెండు టెస్టులకు దూరమయ్యాడు. శుక్రవారం జరిగే నాలుగో టెస్టు కోసం ప్రకటించిన జట్టులో ఆర్చర్ స్థానంలో గస్ అట్కిన్సన్కు చోటు దక్కింది. ప్రధాన బ్యాటర్ ఒలీ పోప్పై కూడా ఈ మ్యాచ్లో వేటు పడింది. తాజా యాషెస్లో 6 ఇన్నింగ్స్లలో కలిపి 125 పరుగులే చేసిన పోప్ గత 16 ఇన్నింగ్స్లలో ఒక్క అర్ధ సెంచరీ కూడా నమోదు చేయలేదు. పోప్ స్థానంలో జాకబ్ బెతెల్ను టీమ్లోకి ఎంపిక చేశారు. ఇంగ్లండ్ తరఫున బెతెల్ ఇప్పటి వరకు 4 టెస్టులు ఆడాడు. -
బుమ్రా, పంత్ క్షమాపణ చెప్పారు
జొహన్నెస్బర్గ్: భారత్తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్లో తన ఎత్తు విషయంలో ఎదుర్కొన్న వ్యాఖ్య గురించి దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా స్పందించాడు. కోల్కతాలో జరిగిన తొలి టెస్టులో భారత పేసర్ బుమ్రా, కీపర్ రిషభ్ పంత్ ఎల్బీడబ్ల్యూ అప్పీల్ విషయంలో చర్చించుకుంటూ బవుమా గురించి ‘మరుగుజ్జు’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కొంత వివాదం రేగింది. అయితే ఆ తర్వాత వారిద్దరు తనకు క్షమాపణలు చెప్పారని బవుమా స్పష్టం చేశాడు. నిజానికి ఆ సమయంలో సరిగ్గా ఏం జరిగిందో కూడా తనకు తెలీదని అతను వెల్లడించాడు. ‘నిజానికి బుమ్రా, పంత్ నన్ను క్షమాపణలు కోరినప్పుడు అసలు ఎందుకు చెబుతున్నారో కూడా అర్థం కాలేదు. మా మీడియా మేనేజర్ను అడిగి వివరాలు తెలుసుకోవాల్సి వచ్చింది. వారి భాషలో నా గురించి ఏదోలా మాట్లాడుకున్నారని అర్థమైంది. ఆ రోజు ఆట ముగిసిన తర్వాత నా వద్దకు వచ్చి వారు సారీ చెప్పారు. మైదానంలో జరిగిన విషయాలు అక్కడే ముగిసిపోతాయి. కానీ ఏం అన్నారో మర్చిపోలేం కదా. అవి మరింత బాగా ఆడేందుకు ప్రేరణ అందిస్తాయి. అయితే నాకు ఎలాంటి విద్వేషభావం లేదు’ అని బవుమా వివరించాడు. మరోవైపు గువాహటిలో జరిగిన రెండో టెస్టు సమయంలో భారత ఆటగాళ్లను ‘మోకాళ్లపై కూర్చోబెడతాను’ అంటూ దక్షిణాఫ్రికా కోచ్ షుక్రి కాన్రాడ్ అనడం కూడా తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ విషయంలో షుక్రిని తప్పుబట్టిన బవుమా... అతను మరింత మెరుగైన భాషను వాడాల్సిందని అభిప్రాయపడ్డాడు. భారత గడ్డపై కఠిన పరిస్థితులు ఎదురవుతాయని ఊహించానని...వాటిని అధిగమించి 25 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ గెలవడం చాలా గొప్పగా అనిపించిందని బవుమా తన ఆనందాన్ని వ్యక్తపర్చాడు. -
ఒకే రోజు 22 సెంచరీలు
బంతి మీద పగబట్టినట్లు... బౌలర్లతో ఆజన్మ విరోధం ఉన్నట్లు... సింగిల్స్ తీయడమే తెలియదన్నట్లు... బిహార్ బ్యాటర్లు బౌండరీలతో చెలరేగిపోయారు. బంతి ఎక్కడపడ్డా దాన్ని గీత దాటించడమే లక్ష్యంగా అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫలితంగా విజయ్ హజారే వన్డే టోర్నీలో బిహార్ జట్టు ప్రపంచ రికార్డు స్కోరు నమోదు చేసింది. 14 ఏళ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ రికార్డులు తిరగరాస్తూ త్రుటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకోగా... సకీబుల్ గనీ లిస్ట్ ‘ఎ’క్రికెట్లో భారత్ తరఫున ‘ఫాస్టెస్ట్ సెంచరీ’ తన పేరిట రాసుకున్నాడు. ఆయుశ్ లొహారుక కూడా శతకంతో విజృంభించడంతో బిహార్ కొండంత స్కోరు చేసింది. ఛేదనలో అరుణాచల్ ప్రదేశ్ 177 పరుగులకు ఆలౌటై 397 పరుగుల తేడాతో పరాజయం మూటగట్టుకుంది. భారత దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారింది. టోర్నీ తొలి రోజు బుధవారం రికార్డు స్థాయిలో 22 సెంచరీలు నమోదయ్యాయి. సుదీర్ఘ విరామం అనంతరం దేశవాళీల్లో ఆడుతున్న స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి (ఢిల్లీ), రోహిత్ శర్మ (ముంబై) శతకాల మోత మోగిస్తే... బిహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ త్రుటిలో డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు. టి20 ప్రపంచకప్నకు ఎంపికైన ఇషాన్ కిషన్ (జార్ఖండ్) మెరుపు సెంచరీతో కదంతొక్కితే... అదే మ్యాచ్లో దేవదత్ పడిక్కల్ (కర్ణాటక) భారీ శతకంతో చెలరేగాడు. ఒడిశా ప్లేయర్ స్వస్తిక్ సమల్ ఈ టోర్నీ చరిత్రలో ఎనిమిదో డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్గా రికార్డుల్లోకి ఎక్కితే... 32 బంతుల్లోనే సెంచరీ చేసిన బిహార్ కెప్టెన్ సకీబుల్ గనీ లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో వేగవంతమైన సెంచరీ చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. రాంచీ: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతం ఆవిష్కృతమైంది. ప్లేట్ గ్రూప్లో భాగంగా బుధవారం జరిగిన పోరులో బిహార్ జట్టు రికార్డుల దుమ్ము దులిపింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (84 బంతుల్లో 190; 16 ఫోర్లు, 15 సిక్స్లు), కెప్టెన్ సకీబుల్ గనీ (40 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 12 సిక్స్లు), ఆయుశ్ లొహారుక (56 బంతుల్లో 116; 11 ఫోర్లు, 8 సిక్స్లు) సెంచరీలతో కదంతొక్కడంతో మొదట బ్యాటింగ్ చేసిన బిహార్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 574 పరుగులు చేసింది. లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో ఇదే అత్యధిక స్కోరు. అనంతరం లక్ష్యఛేదనలో అరుణాచల్ ప్రదేశ్ 42.1 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటైంది. బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి 397 పరుగుల తేడాతో బిహార్కు విజయాన్ని అందించారు. దంచుడే దంచుడు... మెరుపులా మొదలైన బిహార్ ఇన్నింగ్స్... ఉరుములా ప్రత్యర్థులను భయపెట్టి... తుపానులా చుట్టేసి... చివరకు సునామీలా రికార్డులన్నింటినీ తిరగరాసింది. ఇప్పటికే సీనియర్ స్థాయిలో భారీ సెంచరీలతో ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న బిహార్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ... అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వరుస బౌండరీలతో బెంబేలెత్తించాడు. ఈ క్రమంలో 25 బంతుల్లో హాఫ్సెంచరీ పూర్తి చేసుకున్న వైభవ్... ఆ తర్వాత మరింతగా రెచ్చిపోయాడు. మరో 11 బంతుల్లోనే 50 పరుగులు జోడించి 36 బంతుల్లో శతకం నమోదు చేసుకున్నాడు. తద్వారా లిస్ట్ ‘ఎ’క్రికెట్లో శతకం బాదిన అత్యంత పిన్నవయసు్కడిగా రికార్డు సృష్టించాడు. తొలి వికెట్కు 14.3 ఓవర్లలో 158 పరుగులు జతచేసిన వైభవ్... 59 బంతుల్లోనే 150 పరుగుల మార్క్ అందుకొని... డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. డబుల్ సెంచరీకి 10 పరుగుల దూరంలో వైభవ్ అవుటయ్యాడు. సకీబుల్ విధ్వంసం... వైభవ్ వెనుదిరగడంతో ఊపిరి పీల్చుకుందాం అనుకున్న అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లకు బిహార్ సారథి సకీబుల్ గనీ పట్టపగలే చుక్కలు చూపించాడు. ప్రతి బంతిని బౌండరీకి తలరించడమే లక్ష్యంగా భారీ షాట్లతో పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలో అతడు 32 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకొని లిస్ట్ ‘ఎ’క్రికెట్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ మ్యాచ్లో 128 పరుగులు చేసి సకీబుల్ బౌండరీల ద్వారానే 112 పరుగులు రాబట్టాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో బిహార్ ప్లేయర్లు 49 ఫోర్లు, 38 సిక్స్లు బాదారు. 574/6పురుషుల లిస్ట్ ‘ఎ’ (దేశవాళీ+అంతర్జాతీయ వన్డేలు) క్రికెట్లో ఇదే అత్యధిక స్కోరు. 2022–23 విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్పైనే తమిళనాడు చేసిన స్కోరు (506/2) రెండో స్థానానికి చేరింది. 1 పురుషుల లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో వేగంగా 150 పరుగులు చేసిన ప్లేయర్గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. తాజా మ్యాచ్లో అతడు 59 బంతుల్లో ఈ మార్క్ అందుకున్నాడు. 2015లో వెస్టిండీస్పై దక్షిణాఫ్రికా స్టార్ ఏబీ డివిలియర్స్ 64 బంతుల్లో 150 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు.32 ఈ మ్యాచ్లో సకీబుల్ సెంచరీకి తీసుకున్న బంతులు. లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో భారత్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. ఓవరాల్గా లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో వేగవంతమైన సెంచరీల జాబితాలో మెక్ గుర్క్ (29 బంతుల్లో), డివిలియర్స్ (31 బంతుల్లో) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 38 ఈ మ్యాచ్లో సకీబుల్ సెంచరీకి తీసుకున్న బంతులు. లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో భారత్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. ఓవరాల్గా లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో వేగవంతమైన సెంచరీల జాబితాలో మెక్ గుర్క్ (29 బంతుల్లో), డివిలియర్స్ (31 బంతుల్లో) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 1 విజయ్ హజారే టోర్నీలో ఒకే జట్టు తరఫున మూడు సెంచరీలు నమోదవడం ఇదే తొలిసారి. ఓవరాల్గా లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో 1995లో హైదరాబాద్తో మ్యాచ్లో విల్స్ ఎలెవన్ జట్టు తరఫున సచిన్ టెండూల్కర్, గగన్ ఖోడా,సంజయ్ మంజ్రేకర్ శతకాలు చేశారు.1 లిస్ట్ ‘ఎ’ క్రికెట్ చరిత్రలో సెంచరీ చేసిన అతిపిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ (14 సంవత్సరాల 272 రోజులు) రికార్డు నెలకొల్పాడు. జహూర్ ఇలాహీ (15 ఏళ్ల 209 రోజులు; 1986లో పాక్ ఆటోమొబైల్స్ కార్పొరేషన్) పేరిట ఉన్న రికార్డును వైభవ్ తిరగరాశాడు.ఇటు కోహ్లి... అటు రోహిత్‘శత’క్కొట్టిన సీనియర్ ప్లేయర్లు ఆంధ్రపై ఢిల్లీ; సిక్కింపై ముంబై గెలుపు బెంగళూరు: స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ సెంచరీలతో కదంతొక్కారు. సుదీర్ఘ విరామం అనంతరం విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన ఈ ఇద్దరూ... అది్వతీయ ఫామ్ కొనసాగిస్తూ తమ జట్లను గెలిపించారు. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన పోరులో కోహ్లి ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ జట్టు 4 వికెట్ల తేడాతో ఆంధ్ర జట్టుపై గెలిచింది. మొదట ఆంధ్ర 50 ఓవర్లలో 8 వికెట్లకు 298 పరుగులు చేసింది. రికీ భుయ్ (122; 11 ఫోర్లు, 7 సిక్స్లు) సెంచరీ సాధించాడు. అనంతరం ఢిల్లీ 37.4 ఓవర్లలో 6 వికెట్లకు 300 పరుగులు చేసి నెగ్గింది. కోహ్లి (101 బంతుల్లో 131; 14 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీ చేశాడు. లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో కోహ్లికిది 58వ శతకం. ఈ క్రమంలో విరాట్ లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో వేగంగా 16,000 పరుగులు పూర్తి చేసిన ప్లేయర్గా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ 391 ఇన్నింగ్స్ల్లో ఈ మార్క్ అందుకోగా... కోహ్లి 330 ఇన్నింగ్స్లో 16 వేల పరుగుల మైలురాయి దాటాడు. రోహిత్ తగ్గేదేలే! ఎలైట్ గ్రూప్ ‘సి’లో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు 8 వికెట్ల తేడాతో సిక్కింపై నెగ్గింది. మొదట సిక్కిం 7 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. అనంతరం ముంబై 30.3 ఓవర్లలో 2 వికెటకు 237 పరుగులు చేసి గెలిచింది. రోహిత్ శర్మ (94 బంతుల్లో 155; 18 ఫోర్లు, 9 సిక్స్లు) వీరవిహారం చేశాడు. జాతీయ జట్టుకు ఆడాలంటే దేశవాళీల్లోనూ ఆడాలని బీసీసీఐ స్పష్టం చేయడంతో చాన్నాళ్ల తర్వాత కోహ్లి, రోహిత్ విజయ్ హజారే టోర్నీలో బరిలోకి దిగారు. -
జాతీయ క్రీడా పురస్కారాల సిఫారసుల జాబితా విడుదల
2025 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాల కోసం సిఫారసుల జాబితాను కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ఇవాళ (డిసెంబర్ 24) ప్రకటించింది. ఈ జాబితాలో ఆసక్తికరంగా ఒక్క క్రికెటర్కు కూడా చోటు దక్కలేదు. భారత హాకీ జట్టు వైస్ కెప్టెన్ హార్దిక్ సింగ్ ఒక్కడే మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు కోసం సిఫారసు చేయబడ్డాడు. మరో 24 మంది క్రీడాకారుల పేర్లు అర్జున అవార్డుల కోసం సిఫారసు చేయబడ్డాయి.మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు: హార్దిక్ సింగ్ (హాకీ)అర్జున అవార్డు:- అథ్లెటిక్స్: తేజస్విన్ శంకర్, ప్రియాంక, మహ్మద్ అఫ్సల్, ఏక్తా భ్యాన్ (పారా)- చెస్: దివ్య దేశ్ముఖ్, విదిత్ గుజరాతి - బ్యాడ్మింటన్: త్రీసా జోలీ, గాయత్రి గోపిచంద్ - షూటింగ్: మెహులీ ఘోష్, అఖిల్ శెరాన్, ధనుష్ శ్రీకాంత్ (డెఫ్), రుద్రాంశ్ ఖండేల్వాల్ (పారా)- హాకీ: రాజ్కుమార్ పాల్, లాల్రెంసియామి - జిమ్నాస్టిక్స్: ప్రణతి నాయక్ - కబడ్డీ: సుర్జీత్, పూజా - ఇతర విభాగాలు: నరేందర్ (బాక్సింగ్), నిర్మల భాటి (ఖోఖో), పద్మనాభ్ సింగ్ (పోలో), అర్వింద్ సింగ్ (రోయింగ్), సుతిర్థా ముఖర్జీ (టేబుల్ టెన్నిస్), సోనం మాలిక్ (రెజ్లింగ్), ఆర్తి పాల్ (యోగా, ఈ విభాగంలో తొలి సిఫారసు) -
VHT.. విరాట్, రోహిత్ లాంటి దిగ్గజాలను వెలుగులోకి తెచ్చిన వేదిక
విజయ్ హజారే ట్రోఫీ (VHT).. భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 50 ఓవర్ల దేశవాలీ టోర్నీ. ఈ టోర్నీని అంతర్జాతీయ వన్డేలతో కలిపి లిస్ట్-ఏ ఫార్మాట్గా పరిగణిస్తారు. 1993–94లో జోనల్ స్థాయిలో ప్రారంభమైన ఈ టోర్నీ.. 2002–03 నుంచి అన్ని రాష్ట్ర జట్లు పాల్గొనేలా జాతీయ స్థాయికి విస్తరించింది.తొలినాళ్లలో ఈ టోర్నీని రంజీ వన్డే ట్రోఫీగా పిలిచే వారు. 2004లో భారత క్రికెట్ దిగ్గజం విజయ్ హజారే మరణం తర్వాత విజయ్ హజారే ట్రోఫీగా నామకరణం చేశాడు. 2007-08 ఎడిషన్ నుంచి ఇదే పేరుతో ఈ టోర్నీ కొనసాగుతుంది.ప్రస్తుతం ఈ టోర్నీలో 38 రాష్ట్ర జట్లు పాల్గొంటున్నాయి. రౌండ్ రాబిన్, నాకౌట్ పద్దతిలో జరిగే ఈ టోర్నీలో కర్ణాటక, తమిళనాడు అత్యంత విజయవంతమైన జట్లుగా ఉన్నాయి. ఈ రెండు జట్లు చెరో 5 టైటిళ్లు సాధించాయి. ఈ టోర్నీ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లాంటి అనేక మంది స్టార్ ఆటగాళ్లను వెలుగులోకి తెచ్చింది.ఇవాల్టి నుంచి (డిసెంబర్ 24) 2025-26 ఎడిషన్ ప్రారంభమైన నేపథ్యంలో ఈ టోర్నీలో అత్యుత్తమ రికార్డులు, విశేషాల గురించి తెలుసుకుందాం. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా మహారాష్ట్రకు చెందిన అంకిత్ బావ్నే (4010 పరుగులు) కొనసాగుతున్నాడు. ఈ టోర్నీలో అత్యధిక సెంచరీల రికార్డు (15) కూడా బావ్నే పేరిటే ఉంది. అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు ఇషాన్ కిషన్ (273) ఖాతాలో ఉంది.ఫాస్టెస్ట్ సెంచరీ ఇవాళే (బిహార్ ఆటగాడు సకీబుల్ గనీ-32 బంతుల్లో) నమోదైంది. టోర్నీ చరిత్రలో యంగెస్ట్ సెంచూరియన్ రికార్డు కూడా ఇవాళే నమోదైంది. బిహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్ల వయసులో ఈ రికార్డు సాధించాడు. ఈ సెంచరీ లిస్ట్-ఏ చరిత్రలో ఎనిమిదో వేగవంతమైన శతకంగానూ (36 బంతుల్లో) రికార్డైంది.ఈ టోర్నీలో అత్యంత విజయవంతమైన బౌలర్గా సిద్ధార్థ్ కౌల్ (155 వికెట్లు, పంజాబ్) ఉన్నాడు. అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు షాబాజ్ నదీమ్ (జార్ఖండ్, 8/10) పేరిట ఉన్నాయి. ఓ సింగిల్ సీజన్లో అత్యధిక వికెట్ల రికార్డు జయదేవ్ ఉనద్కత్ (2012–13 ఎడిషన్లో 19 వికెట్లు) పేరిట ఉంది.జట్టు రికార్డుల విషయానికొస్తే.. అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు కూడా ఇదే సీజన్లో నమోదైంది. అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో బిహార్ రికార్డు స్థాయిలో 574 పరుగులు చేసింది. లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ స్కోర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అత్యల్ప స్కోర్ అస్సాం (36 పరుగులు vs ముంబై, 2012) పేరిట ఉంది.ఈ టోర్నీ విరాట్ కోహ్లి (2006-07 సీజన్లో), రోహిత్ శర్మ (2005-06 సీజన్లో) లాంటి దిగ్గజాలను వెలుగులోకి తేవడంతో పాటు రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, పృథ్వీ షా, ఇషాన్ కిషన్, సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్, అభిషేక్ శర్మ, రజత్ పాటిదార్, శుభ్మన్ గిల్ లాంటి టీమిండియా స్టార్లకు తమ సత్తా చాటేందుకు వేదికగా ఉపయోగపడింది. -
పడిక్కల్ వీరోచిత పోరాటం.. ఇషాన్ కిషన్ సుడిగాలి శతకం వృధా
విజయ్ హజారే వన్డే ట్రోఫీ 2025-26లో తొలి రోజే అద్భుతాలు జరిగాయి. ఇవాళ ఒక్క రోజు లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో టాప్-8లోని మూడు ఫాస్టెస్ట్ సెంచరీలు నమోదయ్యాయి. బిహార్ ఆటగాడు సకీబుల్ గనీ 32 బంతుల్లో శతక్కొట్టి, లిస్ట్-ఏలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా అవతరించగా.. ఝార్ఖండ్ ఆటగాడు ఇషాన్ కిషన్ 33 బంతుల్లో, వైభవ్ సూర్యవంశీ 36 బంతుల్లో సెంచరీలు పూర్తి చేసి లిస్ట్-ఏ క్రికెట్లో నాలుగు, ఎనిమిదో ఫాస్టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్లుగా రికార్డుల్లోకెక్కారు.వీరు మాత్రమే కాక ఇవాళే మరో ముగ్గురు స్టార్ బ్యాటర్లు కూడా సెంచరీలు చేశారు. టీమిండియా వెటరన్ స్టార్లు రోహిత్ శర్మ (ముంబై), విరాట్ కోహ్లి (ఢిల్లీ).. అప్కమింగ్ స్టార్ దేవ్దత్ పడిక్కల్ (కర్ణాటక) శతక్కొట్టుడు కొట్టారు. ఇవాళే ఓ అనామక ఆటగాడు డబుల్ సెంచరీ కూడా చేశాడు. ఒడిషాకు చెందిన స్వస్తిక్ సమల్ సౌరాష్ట్రపై ఈ ఫీట్ సాధించాడు. మొత్తంగా విజయ్ హజారే ట్రోఫీ 2025-25 ఎడిషన్ తొలి రోజు శతకాల మోత (22) మోగింది. పడిక్కల్ వీరోచిత పోరాటం.. ఇషాన్ కిషన్ 33 బంతుల శతకం వృధాఇదిలా ఉంటే, ఇవాళ కర్ణాటకపై ఇషాన్ కిషన్ చేసిన 33 బంతుల శతకం వృధా అయ్యింది. ఇషాన్ కిషన్ శతక్కొట్టుడు కారణంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఝార్ఖండ్ నిర్ణీత 50 ఓవర్లలో 412 పరుగుల అతి భారీ స్కోర్ చేసినా దాన్ని కాపాడుకోలేకపోయింది. దేవదత్ పడిక్కల్ వీరోచితంగా పోరాడి కర్ణాటకకు చారిత్రక విజయాన్ని అందించాడు. భారీ లక్ష్య ఛేదనలో పడిక్కల్ 118 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 147 పరుగులు చేసి కర్ణాటకను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లాడు. ఆతర్వాత అభినవ్ మనోహర్ (56 నాటౌట్), ధృవ్ ప్రభాకర్ (40 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి కర్ణాటకను గెలుపు తీరాలు దాటించారు. లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో ఇది రెండో భారీ లక్ష్య ఛేదనగా.. విజయ్ హజారే టోర్నీ చరిత్రలో భారీ లక్ష్య ఛేదనగా రికార్డైంది. లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో అతి భారీ లక్ష్య ఛేదన రికార్డు సౌతాఫ్రికా పేరిట ఉంది. 2006లో జోహన్నెస్బర్గ్లో ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా 435 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇంగ్లండ్కు మరో భారీ ఎదురుదెబ్బ
మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే 0-3 తేడాతో యాషెస్ సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎడమ తొడ కండరాల గాయం చివరి రెండు టెస్ట్లకు స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అధికారికంగా ప్రకటించింది.ఇప్పటికే ఇంగ్లండ్ మరో స్టార్ బౌలర్ మార్క్ వుడ్ సేవలను కూడా కోల్పోయింది. వుడ్ మోకాలి గాయం కారణంగా రెండో టెస్ట్కు ముందే తప్పుకున్నాడు. తాజాగా ఆర్చర్ కూడా వైదొలగ డంతో ఇంగ్లండ్ పేస్ విభాగం మరింత బలహీనపడింది. ఆర్చర్ స్థానంలో గస్ అట్కిన్సన్ను నాలుగో టెస్ట్కు తుది జట్టులోకి తీసుకుంటున్నట్లు ఈసీబీ ప్రకటించింది.పోప్ ఔట్గాయం కారణంగా ఆర్చర్ సిరీస్ మొత్తానికే దూరం కాగా.. పేలవ ఫామ్తో సతమతమవుతున్న వన్డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ను ఈసీబీ నాలుగో టెస్ట్ నుంచి తప్పించింది. పోప్ గత మూడు టెస్ట్ల్లో కేవలం 125 పరుగులే చేశాడు. పోప్ స్థానంలో నాలుగో టెస్ట్లో జేకబ్ బేతెల్ను ఆడించనున్నట్లు ఈసీబీ తెలిపింది.ఈ రెండు మార్పులు మినహా ఇంగ్లండ్ తుది యాధాతథంగా కొనసాగనుంది. రేపటి నుంచి (డిసెంబర్ 26) మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో నాలుగో యాషెస్ టెస్ట్ ప్రారంభం కానుంది. 5 మ్యాచ్ల సిరీస్ను ఇప్పటికే కోల్పోయిన ఇంగ్లండ్ చివరి రెండు టెస్ట్లైనా గెలిచి పరువు కాపాడుకోవాలని పట్టుదలగా ఉంది. అయితే, ఇలాంటి సమయంలో ఆర్చర్ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరం కావడం ఇంగ్లండ్ కష్టాలను మరింత తీవ్రం చేసింది.యాషెస్ నాలుగో టెస్ట్కు ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, జేకబ్ బేతెల్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్కీపర్), విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్ -
టీమిండియావైపు దూసుకొస్తున్న సరికొత్త పేస్ సంచలనం
టీమిండియావైపు మరో పేస్ గన్ దూసుకొస్తున్నాడు. అతడి పేరు దీపేశ్ దేవేంద్రన్. తమిళనాడుకు చెందిన ఈ కుర్రాడి వయసు 17 ఏళ్లు. కుడి చేతి వాటం మీడియం ఫాస్ట్ బౌలింగ్ చేసే దీపేశ్.. తాజాగా ముగిసిన అండర్-19 ఆసియా కప్ ద్వారా వెలుగులోకి వచ్చాడు.ఈ టోర్నీలో దీపేశ్ అంచనాలను మించి రాణించాడు. దాదాపు ప్రతి మ్యాచ్లో వికెట్లు తీసి యంగ్ ఇండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ టోర్నీలో మొత్తం 5 మ్యాచ్లు ఆడి 4.77 ఎకానమీతో 14 వికెట్లు తీశాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. మలేషియాతో జరిగిన మ్యాచ్లో దీపేశ్ ఈ ప్రదర్శన నమోదు చేశాడు.సౌతాఫ్రికా పేస్ దిగ్గజం డేల్ స్టెయిన్ను ఆదర్శనంగా తీసుకొనే దీపేశ్.. అతనిలాగే పేస్ను ఆయుధంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దీపేశ్కు వేగంతో పాటు లైన్ అండ్ లెంగ్త్ మెయింటైన్ చేసే కంటిస్టెన్సీ ఉంది. అలాగే కీలక సమయాల్లో బ్యాటర్లను ఒత్తిడిలోని నెట్టి, వికెట్లు తీసే సత్తా కూడా ఉంది. ఆదిలోనే వికెట్లు తీసే సామర్థ్యం దీపేశ్ సొంతం. పైన ప్రస్తావించిన విషయాలన్నీ తాజాగా జరిగిన ఆసియా కప్లో దీపేశ్ చేసి చూపించాడు.దీపేశ్.. తమిళనాడు ప్రీమియర్ లీగ్లో మధురై పాంథర్స్ తరఫున సత్తా చాటడం ద్వారా తొలిసారి వెలుగులోకి వచ్చాడు. ఆ ప్రదర్శనల కారణంగానే దీపేశ్కు ఆసియా కప్ అండర్-19 జట్టులో చోటు దక్కింది.వేగం, కచ్చితత్వం, దూకుడుతో పాటు లైన్ ఆండ్ లెంగ్త్ కంట్రోల్తో టాపార్డర్ను కూలదోసే సామర్థ్యం దీపేశ్ను మిగతా వారితో పోలిస్తే ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. సాధారణంగా వీటన్నిటి కలయిక ఒకే బౌలర్లో ఉండటం చాలా అరుదు. ఈ అసాధారణ ప్రతిభే దీపేశ్ను భావి భారత ఫాస్ట్ బౌలర్గా చిత్రీకరిస్తుంది.ప్రస్తుతం గంటకు 140 కిమీ వేగానికి దగ్గరగా బౌలింగ్ చేస్తున్న దీపేశ్.. సరైన శిక్షణ ఇస్తే మరింత పేస్ను రాబట్టగలడని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీపేశ్లో పేస్ వేరియేషన్ కూడా ఉంది. స్ట్రైక్ బౌలర్గానే కాకుండా ఫస్ట్ ఛేంజ్ బౌలర్గా కూడా ఉపయోగపడగలడు. 17 ఏళ్ల వయసులోనే ఖండాంతర టోర్నీలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచిన దీపేశ్ ఫిట్నెస్ మేనేజ్మెంట్పై కూడా దృష్టి పెట్టగలిగితే త్వరలోనే టీమిండియా తలుపులు తట్టే అవకాశం ఉంది. ఆసియా కప్లో ఫైనల్ మినహా దీపేశ్ ప్రతి మ్యాచ్లో చాలా పొదుపుగా కూడా బౌలింగ్ చేశాడు. దీపేశ్బ్యాటింగ్లోనూ అడపాదడపా మెరుపులు మెరిపించగలడు. పాక్తో జరిగిన ఫైనల్లో ఇది కూడా నిరూపితమైంది. ఆ మ్యాచ్ లో భారత ఓటమి ఖరారైనా దీపేశ్ బ్యాట్ ఝలిపించాడు. ఈ ఆల్రౌండ్ లక్షణం దీపేశ్ను టీమిండియా అవకాశానికి మరింత చేరువ చేస్తుంది. తాజాగా ముగిసిన అండర్-19 ఆసియా కప్లో దీపేశ్ ప్రదర్శనలు.. పాకిస్తాన్పై 3/16మలేషియాపై 5/22శ్రీలంకపై 1/25యూఏఈపై 2/21పాకిస్తాన్పై 3/83


