breaking news
Cricket
-
చరిత్ర సృష్టించిన బవుమా.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే
టెస్టు క్రికెట్లో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తన జైత్ర యాత్రను కొనసాగిస్తున్నాడు. బవుమా తన అద్భుత కెప్టెన్సీతో 13 ఏళ్ల తర్వాత ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్లో భారత్కు ఓటమి రుచిని చూపించాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. ఆతిథ్య జట్టును ఓడించడంలో సఫారీ బౌలర్లు ఎంత కీలక పాత్ర పోషించారో.. బవుమా ఆడిన ఇన్నింగ్స్ కూడా అంతే విలువైనది. బ్యాటింగ్కు కష్టతరమైన పిచ్పై బవుమా.. బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఓవైపు వికెట్లు పడతున్నప్పటికి బవుమా మాత్రం తన ఏకాగ్రాతను కోల్పోకుండా స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. కెప్టెన్ అంటే బవుమాలా ఉండాలని అందరితో ప్రశంసలు అందుకుంటున్నాడు. ఆఖరికి భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా బవుమా ఆడిన ఇన్నింగ్స్కు ఫిదా అయిపోయాడు.కెప్టెన్సీ రికార్డు అదుర్స్..2021 మార్చిలో క్వింటన్ డికాక్ నుంచి సౌతాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్గా బవుమమా బాధ్యతలు స్వీకరించాడు. తద్వారా దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ఫుల్టైమ్ కెప్టెన్గా నియమితులైన మొదటి నల్లజాతి ఆఫ్రికన్ ఆటగాడిగా టెంబా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత 2022లో ప్రోటీస్ టెస్టు కెప్టెన్గా ఎంపికయ్యాడు.వైట్ బాల్ క్రికెట్లో కెప్టెన్గా బవుమా పర్వాలేదన్పించినప్పటికి.. రెడ్ బాల్ క్రికెట్లో మాత్రం ఓటమి ఎరుగని నాయకుడిగా కొనసాగుతున్నాడు. అతడి కెప్టెన్సీలో సౌతాఫ్రికా ఇప్పటివరకు ఒక్క టెస్టు మ్యాచ్లో కూడా ఓడిపోలేదు. అతడి కెప్టెన్సీలోనే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025ను సౌతాఫ్రికా సొంతం చేసుకుంది. 27 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా గెలుచుకున్న తొలి ఐసీసీ ట్రోఫీవరల్డ్ రికార్డు..టెంబా బవుమా కెప్టెన్సీలో సౌతాఫ్రికా 11 టెస్టు మ్యాచ్లు ఆడింది. అందులో 10 విజయాలు, ఒక్క డ్రా ఉంది. తద్వారా 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి 11 టెస్టుల్లో పది విజయాలు సాధించిన ఏకైక కెప్టెన్గా టెంబా వరల్డ్ రికార్డు సృష్టించాడు.చదవండి: గంభీర్.. ఇప్పటికైనా అతడిని జట్టులోకి తీసుకో: గంగూలీ -
రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్గా కుమార సంగక్కర
ఐపీఎల్-2026 సీజన్కు ముందు రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తమ కోచింగ్ స్టాప్లో కీలక మార్పులు చేసింది. తమ జట్టు హెడ్కోచ్గా శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కరను రాజస్తాన్ నియమించింది. గత సీజన్లో రాయల్స్ ప్రధాన కోచ్గా పనిచేసిన రాహుల్ ద్రవిడ్ స్దానాన్ని సంగక్కర భర్తీ చేయనున్నాడు.హెడ్కోచ్తో పాటు రాజస్తాన్ రాయల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా కూడా అతడు తన సేవలను అందించాడు. సంగక్కర గతంలో కూడా ఇదే పదవుల్లో కొనసాగాడు. ఈ శ్రీలంక మాజీ కెప్టెన్ 2021లో రాజస్థాన్ ఫ్రాంచైజీలో చేరాడు. డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా కెరీర్ ప్రారంభించిన అతడు కోచ్గా నియమితులయ్యాడు. అతడి దిశానిర్దేశనంలో రాజస్తాన్ నాలుగు పర్యాయాలు ప్లే ఆఫ్స్ ఆడింది. అయితే ఐపీఎల్-2025 సీజన్కు ముందు రాహుల్ ద్రవిడ్ రాకతో సంగాను రాజస్తాన్ పక్కన పెట్టింది. ఇప్పుడు ద్రవిడ్ తన పదవి నుంచి వైదొలగడంతో సంగక్కర మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ విషయాన్ని రాయల్స్ యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరిచింది. రాజస్తాన్ రాయల్స్కు రెండో ఐపీఎల్ టైటిల్ను అందించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాను అని అతడు పేర్కొన్నాడు.అదేవిధంగా బ్యాటింగ్ కోచ్గా ఉన్న విక్రమ్ రాథోడ్ను లీడ్ అసిస్టెంట్ కోచ్గా రాజస్తాన్ ప్రమోట్ చేసింది. మాజీ న్యూజిలాండ్ స్టార్ షేన్ బాండ్ బౌలింగ్ కోచ్గా కొనసాగనున్నాడు. ఇంగ్లండ్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ ట్రెవర్ పెన్నీ తిరిగి అసిస్టెంట్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు.రాజస్తాన్కు కొత్త కెప్టెన్..ఇక ఐపీఎల్-2026 సీజన్లో రాజస్తాన్కు కొత్త కెప్టెన్ రానున్నాడు. మినీ వేలానికి ముందు రాజస్తాన్ ఫ్రాంచైజీ తమ కెప్టెన్ సంజూ శాంసన్ను చెన్నై సూపర్ కింగ్స్ను ట్రేడ్ చేసింది. సీఎస్కే నుంచి రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్ వంటి స్టార్ ఆల్రౌండర్లను రాజస్తాన్ సొంతం చేసుకుంది. అయితే రాబోయో సీజన్లో రియాన్ పరాగ్ రాజస్తాన్ కెప్టెన్గా ఎంపికయ్యే అవకాశముంది.చదవండి: IND vs SA: తొలి టెస్టులో ఓటమి.. గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం -
తొలి టెస్టులో ఓటమి.. గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం
కోల్కతా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఘోర ఓటమి చవిచూసిన భారత జట్టు.. తమ తప్పిదాలను సరిదిద్దుకునేందుకు సిద్ధమైంది. నవంబర్ 22 నుంచి గౌహతిలో ప్రోటీస్తో ప్రారంభం కానున్న రెండో టెస్టు కోసం టీమిండియా తమ ప్రాక్టీస్ను మొదలు పెట్టనుంది.అయితే భారత జట్టు గౌహతిలో కాకుండా ఈడెన్ గార్డెన్స్లోనే మొదటి ట్రైనింగ్ సెషన్ను మంగళవారం(నవంబర్ 18) నిర్వహించనుంది. ఈడెన్ లాంటి కఠినమైన వికెట్పై తమ ప్లేయర్లను ప్రాక్టీస్ చేయించాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.మ్యాచ్ అనంతరం మాట్లాడిన గంభీర్ ఈడెన్గార్డెన్స్ పిచ్పై కీలక వ్యాఖ్యలు చేశాడు. పిచ్లో ఎటువంటి భూతాలు లేవని, మంచి డిఫెన్స్ టెక్నిక్ ఉంటే ఇటువంటి వికెట్పై పరుగులు సాధించవచ్చు అని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తొలి మ్యాచ్ జరిగిన పిచ్పై భారత బ్యాటర్లు ప్రాక్టీస్ చేసే అవకాశముంది.గౌహతికి ఎప్పుడంటే?కాగా బుధవారం మెన్ ఇన్ బ్లూ గౌహతికి పయనం కానుంది. అయితే తొలి ప్రాక్టీస్ సెషన్కు టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ దూరం కానున్నాడు. మెడ నొప్పి గాయం నుంచి గిల్ కోలుకుంటున్నాడు.ఆస్ప్రత్రి నుంచి డిశ్చార్జ్ అయిన గిల్ ప్రస్తుతం టీమ్ హోటల్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. తొలి టెస్టులో రెండో రోజు ఆట సందర్భంగా గిల్ మెడ నొప్పితో బాధపడ్డాడు. స్వీప్ షాట్ ఆడే క్రమంలో గిల్ మెడపట్టేసింది. దీంతో కేవలం మూడు బంతులు మాత్రమే ఆడి గిల్ రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత అతడిని ఆస్ప్రత్రికి తరలించారు. 24 గంటల పర్యవేక్షణ తర్వాత గిల్ ఆస్ప్రత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అతడు మెడ అటు ఇటు కదపుతున్నప్పటికి వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం. దీంతో శుభ్మన్ గౌహతి టెస్టుకు దూరమయ్యే అవకాశముంది. ఒకవేళ గిల్ అందుబాటులో లేకపోతే అతడి స్దానంలో సాయిసుదర్శన్ తుది జట్టులోకి రానున్నాడు. కాగా తొలి టెస్టులో భారత్ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. కేవలం 124 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక టీమిండియా పరాజయం పాలైంది.చదవండి: గంభీర్.. ఇప్పటికైనా అతడిని జట్టులోకి తీసుకో: గంగూలీ -
భారత్తో మ్యాచ్.. పాక్ ఆటగాడి ఓవరాక్షన్! వీడియో
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్–2025లో భారత్-ఎకు తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం దోహాలోని వెస్ట్ ఎండ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా పాకిస్తాన్ షాహీన్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. భారత్ నిర్ధేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని పాక్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి 13.2 ఓవర్లలో ఊదిపడేసింది. ఓపెనర్ మాజ్ సదాఖత్ (75) ఆజేయంగా నిలిచి టార్గెట్ను ఫినిష్ చేశాడు.మసూద్ చీప్ టాక్టిక్స్..అయితే ఈ మ్యాచ్లో భారత ఇన్నింగ్స్ సందర్భంగా పాక్ స్పిన్నర్ సాద్ మసూద్ ఓవరాక్షన్ చేశాడు. ఇండియా-ఎ వైస్ కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ నమన్ ధీర్ కేవలం మంచి టచ్లో కన్పించాడు. దీంతో అతడిని ఔట్ చేసేందుకు పాక్ కెప్టెన్ను సాద్ మసూద్ను ఎటాక్లో తీసుకొచ్చాడు. దీంతో 8 ఓవర్ వేసిన మసూద్ బౌలింగ్లో నమన్ భారీ షాట్కు ప్రయత్నించి తన వికెట్ను కోల్పోయాడు.ఈ క్రమంలో మసూద్ సెలబ్రేషన్స్ శ్రుతుమించాయి. నమన్ వైపు చూస్తూ ఇక ఆడింది చాలు అన్నట్లు సీరియస్గా సెండ్-ఆఫ్ ఇచ్చాడు. నమన్ మాత్రం అతడితో ఎటువంటి వాగ్వాదానికి దిగకుండా డగౌట్కు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు పాక్ ప్లేయర్ల తీరు అంతేనాని కామెంట్లు పెడుతున్నారు. కచ్చితంగా మసూద్కు భారత్ ప్లేయర్లు వడ్డీతో సహా రిటర్న్ గిప్ట్ ఇచ్చేస్తారని ఓ యూజర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. అయితే ఇరు జట్లు మరోసారి ఫైనల్లో తలపడే అవకాశముంది. కాగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 79-1 తో ఉన్న మెన్ ఇన్ బ్లూ.. 57 పరుగుల వ్యవధిలో మొత్తం 9 వికెట్లు కోల్పోయింది. భారత బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ(45) టాప్ స్కోరర్గా నిలిచాడు.చదవండి: గంభీర్.. ఇప్పటికైనా అతడిని జట్టులోకి తీసుకో: గంగూలీSaad Masood with a wicket 👏🏽 #PAKvIND pic.twitter.com/G3Qh0RhTRp— Usman (@jamilmusman_) November 16, 2025 -
గంభీర్.. ఇప్పటికైనా అతడిని జట్టులోకి తీసుకో: గంగూలీ
కోల్కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్లో తాము కోరుకున్న పిచ్పై టీమిండియా దారుణ ప్రదర్శన కనబరిచింది. బౌలర్లు రాణించినప్పటికి బ్యాటర్లు మాత్రం పూర్తిగా తేలిపోయారు.కేవలం 124 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక భారత్ ఘోర పరాభావాన్ని మూట కట్టుకుంది. ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్లో టీమిండియాకు 12 ఏళ్ల తర్వాత ఇదే తొలి ఓటమి. ఈ నేపథ్యంలో భారత జట్టు హెడ్కోచ్ గౌతమ్ గంభీర్కు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) అధ్యక్షుడు కీలక సూచనలు చేశాడు. స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని తిరిగి టెస్టు జట్టులోకి తీసుకోవాలని దాదా కోరాడు.అతడొక మ్యాచ్ విన్నర్.."భారత టెస్టు జట్టులోకి తిరిగి రీఎంట్రీ ఇచ్చేందుకు షమీ అన్నిరకాలగా అర్హుడు. అతడొక మ్యాచ్ విన్నర్. షమీతో పాటు మంచి స్పిన్నర్లు జట్టులో ఉంటే టీమిండియాకు తిరిగుండదు. నాకు గౌతమ్ గంభీర్ అంటే చాలా ఇష్టం. అతడు 2007, 2011 టీ20 ప్రపంచకప్లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు. అతడికి చాలా అనుభవం ఉంది. గౌతమ్ హెడ్ కోచ్ పదవిలో కొన్నాళ్ల పాటు కొనసాగుతాడన్న నమ్మకం నాకుంది. కానీ సొంతగడ్డపై ఆడుతున్నప్పడు బ్యాటింగ్, బౌలింగ్కు అనుకూలంగా ఉండే పిచ్లను ఎంచుకోవాలి. పేస్ త్రయం బుమ్రా, సిరాజ్, షమీలు ముగ్గురు జట్టులో ఉండాలి. వీరిపై గంభీర్ నమ్మకం ఉంచాలి" అని స్పోర్ట్స్ టాక్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దాదా పేర్కొన్నాడు. కాగా షమీ చివరగా భారత తరపున టెస్టుల్లో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్-2023 ఫైనల్లో ఆడాడు.ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా సిరీస్లకు షమీ ఎంపిక చేయలేదు. ఫిట్నెస్ సమస్యల కారణంగానే షమీని పక్కన పెట్టినట్లు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేశాడు. కానీ షమీ మాత్రం తను ఫిట్గా ఉన్నప్పటికి ఎంపిక చేయడం లేదని సెలక్టర్ల తీరును తప్పుబడుతున్నారు.చదవండి: IND vs SA: ఆస్పత్రి నుంచి గిల్ డిశ్చార్జ్.. రెండో టెస్టుకు డౌటే -
ఉత్కంఠ పోరు.. విండీస్పై న్యూజిలాండ్ గెలుపు
వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. ఆదివారం క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో విండీస్పై 7 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది.బ్లాక్ క్యాప్స్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ (118 బంతుల్లో 119; 12 ఫోర్లు, 2 సిక్స్లు) అద్భుత సెంచరీతో చెలరేగగా.. డెవాన్ కాన్వే (58 బంతుల్లో 49; 7 ఫోర్లు, 1 సిక్స్) ఆర్ధ శతకంతో రాణించాడు. టాపార్డర్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర (4), విల్ యంగ్ (0) విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో జేడెన్ సీల్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. మాథ్యూ ఫోర్డ్ రెండు, గ్రీవ్స్, చేజ్ తలా వికెట్ సాధించారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 262 పరుగులే చేయగలిగింది. షెర్ఫాన్ రూథర్ఫర్డ్ (61 బంతుల్లో 55; 3 ఫోర్లు, 3 సిక్స్లు), గ్రీవ్స్ (24 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), కెపె్టన్ షై హోప్ (37; 2 ఫోర్లు, 1 సిక్స్), కీసీ కార్టి (32; 2 ఫోర్లు), అతానెజ్ (29; 2 ఫోర్లు, 1 సిక్స్), రొమారియో షెఫర్డ్ (26 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) సమష్టిగా రాణించడంతో గెలిచే స్థితిలో నిలిచింది. కానీ ఆఖరి 12 బంతుల్లో 32 పరుగుల సమీకరణాన్ని సాధించలేకపోయింది. చివరి రెండు ఓవర్లలో కరేబియన్ జట్టు 24 పరుగులు సాధించి ఓటమి పాలైంది. జేమీసన్ కీలక వికెట్లు పడగొట్టగా, హెన్రీ, ఫౌక్స్, సాన్ట్నర్ తలా ఒక వికెట్ తీశారు.చదవండి: IND vs SA: ఆస్పత్రి నుంచి గిల్ డిశ్చార్జ్.. రెండో టెస్టుకు డౌటే -
ఆస్పత్రి నుంచి గిల్ డిశ్చార్జ్.. రెండో టెస్టుకు డౌటే
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో మెడకు గాయమైన భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ క్రమంగా కోలుకుంటున్నాడు. ఆస్ప్రత్రి నుంచి ఆదివారం గిల్ డిశ్చార్జ్ అయ్యాడు. అతడు ప్రస్తుతం టీమ్ హోటల్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. మెడ గాయం నుంచి కోలుకుంటున్నందున గిల్కు విమాన ప్రయాణం చేయవద్దని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. అతడికి కనీసం వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. టీమ్ హోటల్లో ఉన్న గిల్ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తుంది.అయితే ప్రస్తుతం అతడు మెడను ఈజీగా అటూ ఇటూ కదపగలుగుతున్నాడు. కానీ గౌహతి వేదికగా జరిగే రెండో టెస్టులో అతడు ఆడుతాడా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. కాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే ముందు గిల్ను మాజీ భారత కెప్టెన్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పరామర్శించాడు.గిల్ ఎలా గాయపడ్డాంటే?తొలి టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా సైమన్ హార్మర్ బౌలింగ్లో స్లాగ్ స్వీప్ షాట్ ప్రయత్నంలో గిల్ మెడపట్టేసింది. ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి నొప్పి మాత్రం తగ్గలేదు. దీంతో అతడు మూడు బంతులు ఆడిన తర్వాత రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. అయితే అతడి గాయం తీవ్రతరం కావడంతో రెండో రోజు ఆట ముగిసిన తర్వాత కోల్కతాలోని వుడ్ల్యాండ్స్ ఆసుపత్రికి తరలించారు. గిల్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందించినట్లు వార్తలు వచ్చాయి. 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాక అతడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. గిల్ రెండు ఇన్నింగ్స్లకు దూరం కావడం టీమిండియా కొంపముంచింది. గిల్ లేకపోవడంతో భారత జట్టును వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ముందుండి నడిపించాడు. ఈ మ్యాచ్లో 30 పరుగుల తేడాతో భారత్ అనుహ్య ఓటమిని చవిచూసింది. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక భారత్ చతికలపడింది.చదవండి: PAK vs SL 3rd Odi: శ్రీలంకను చిత్తు చేసిన పాకిస్తాన్.. -
శ్రీలంకను చిత్తు చేసిన పాకిస్తాన్..
సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను పాకిస్తాన్ 3–0తో క్లీన్స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్లో పాక్ 6 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 45.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. సదీరా సమరవిక్రమ (65 బంతుల్లో 48; 2 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలవగా... కెప్టెన్ కుశాల్ మెండిస్ (34), పవన్ రత్నాయకే (32), కామిల్ మిశారా (29), పతుమ్ నిసాంక (24) ఫర్వాలేదనిపించారు.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ వసీమ్ (3/47) లంకను దెబ్బ తీయగా...హారిస్ రవూఫ్, ఫైసల్ అక్రమ్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం పాకిస్తాన్ 44.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. మొహమ్మద్ రిజ్వాన్ (92 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు), ఫఖర్ జమాన్ (45 బంతుల్లో 55; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించగా...హుస్సేన్ తలత్ (42 నాటౌట్), బాబర్ ఆజమ్ (34) రాణించారు.జెఫ్రీ వాండర్సే 3 వికెట్లు పడగొట్టాడు. 3 మ్యాచ్లలో కలిపి 9 వికెట్లు పడగొట్టిన హారిస్ రవూఫ్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. రేపటి నుంచి రావాల్పిండి ముక్కోణపు టోర్నీ జరుగుతుంది. ఈ టోరీ్నలో పాక్, శ్రీలంకతో పాటు జింబాబ్వే బరిలో నిలిచింది.చదవండి: IND vs PAK: పాక్తో మ్యాచ్.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసం -
వన్డే సిరీస్ భారత్ ‘ఎ’ సొంతం
రాజ్కోట్: దక్షిణాఫ్రికా ‘ఎ’పై వరుస విజయాలతో భారత్ ‘ఎ’ అనధికారిక వన్డే సిరీస్ను సొంతం చేసుకుంది. భారత బౌలర్ల సత్తాతో ఆదివారం ఇక్కడ జరిగిన రెండో మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ‘ఎ’ను చిత్తు చేసింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ ‘ఎ’ జట్టు 2–0తో సిరీస్ను కైవసం చేసుకుంది. 19న ఇదే వేదికపై ఆఖరి మ్యాచ్ జరుగుతుంది. రెండో అనధికారిక వన్డేలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నిశాంత్ సింధు (4/16), హర్షిత్ రాణా (3/21), ప్రసిధ్ కృష్ణ (2/21) సమష్టిగా దక్షిణాఫ్రికాను కట్టడి చేశారు. దీంతో ముందుగా బ్యాటింగ్కు దిగిన సఫారీ ‘ఎ’ జట్టు 30.3 ఓవర్లలోనే 132 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ రివాల్డో మూన్సామి (34 బంతుల్లో 33; 7 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, ప్రిటోరియస్ (21; ఫోర్లు), డియాన్ ఫారెస్టర్ (22; 3 ఫోర్లు), డెలానో పాట్జియేటర్ (23; 1 ఫోర్) ఫర్వాలేదనిపించారు. మిగతా ఆరుగురు బ్యాటర్లయితే సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. కెప్టెన్ తిలక్ వర్మకు ఒక వికెట్ దక్కింది. రుతురాజ్ గైక్వాడ్ అర్ధ సెంచరీ... సులువైన లక్ష్యఛేదనకు దిగిన భారత ‘ఎ’ జట్టు 27.5 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 135 పరుగులు చేసి గెలిచింది. తొలి వన్డేలో విరోచిత సెంచరీతో భారత్ను గెలిపించిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (83 బంతుల్లో 68 నాటౌట్; 9 ఫోర్లు) ఈ మ్యాచ్లోనూ రాణించాడు. అజేయ అర్ధ సెంచరీతో ఆఖరిదాకా క్రీజులో నిలిచాడు. ముందుగా అభిషేక్ శర్మ (22 బంతుల్లో 32; 6 ఫోర్లు)తో కలిసి తొలి వికెట్కు 8.1 ఓవర్లలో 53 పరుగులతో శుభారంభం ఇచ్చాడు. తర్వాత కెప్టెన్ ఠాకూర్ తిలక్ వర్మ (62 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు)తో కలిసి అబేధ్యమైన రెండో వికెట్కు 82 పరుగులు జతచేశాడు. సఫారీ బౌలర్లలో లూథో సిపామ్లాకు ఒక వికెట్ దక్కింది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ‘ఎ’ ఇన్నింగ్స్: ప్రిటోరియస్ (సి) ప్రసి«ద్కృష్న (బి) హర్షిత్ 21; రివాల్డో (సి) బదోని (బి) నిశాంత్ 33; జోర్డాన్ (సి) బదోని (బి) హర్షిత్ 4; అకెర్మన్ (సి) ఇషాన్ కిషన్ (బి) హర్షిత్ 7; సినెతెంబా (సి) అండ్ (బి) నిశాంత్ 3; ఫారెస్టర్ (సి) విప్రాజ్ (బి) తిలక్ వర్మ 22; పాట్టియేటర్ (సి) ఇషాన్ కిషన్ (బి) ప్రసిధ్ కృష్ణ 23; సుబ్రయెన్ (బి) ప్రసిధ్ కృష్ణ 15; పీటర్ (సి) నితీశ్ రెడ్డి (బి) నిశాంత్ 0; సిపామ్లా (సి) అర్ష్దీప్ (బి) నిశాంత్ 0; బార్ట్మన్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 4; మొత్తం (30.3 ఓవర్లలో ఆలౌట్) 132. వికెట్ల పతనం: 1–39, 2–59, 3–66, 4–71, 5–73, 6–107, 7–127, 8–128, 9–128, 10–132. బౌలింగ్: అర్ష్దీప్ 4–0–33–0, ప్రసిధ్ కృష్ణ 4.3–0–21–2, నిశాంత్ సింధు 7–1–16–4, హర్షిత్ 5–1–21–3, తిలక్వర్మ 4–0–12–1, ఆయుశ్ బదోని 4–0–15–0, విప్రాజ్ నిగమ్ 2–0–10–0. భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్: రుతురాజ్ నాటౌట్ 68; అభిõÙక్ (సి) ప్రిటోరియస్ (బి) సిపామ్లా 32; తిలక్ నాటౌట్ 29; ఎక్స్ట్రాలు 6; మొత్తం (27.5 ఓవర్లలో వికెట్ నష్టానికి) 135. వికెట్ల పతనం: 1–53. బౌలింగ్: సిపామ్లా 5–0–33–1, సుబ్రయెన్ 4.5–0–35–0, బార్ట్మన్ 4–0–15–0, పీటర్ 9–0–35–0, ఫారెస్టర్ 5–1–13–0. -
సొంతగడ్డపై ఘోర పరాభవం
విజయానికి 124 పరుగులు కావాలి...గతంలో సొంతగడ్డపై ఇంత తక్కువ లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ ఎప్పుడూ విఫలం కాలేదు...గిల్ లేకపోయినా బ్యాటింగ్ చేయగల సమర్థులు ఏడుగురు ఉన్నారు... పిచ్ ఎలాంటిదైనా కాస్త పట్టుదల కనబరిస్తే సునాయాసంగా ఛేదించగల స్కోరే... కానీ టీమిండియా ఒక్కసారిగా కుప్పకూలింది...రెండో ఇన్నింగ్స్ ఆరంభంలో పేస్కు, ఆ తర్వాత ప్రత్యర్థి స్పిన్ ముందు బ్యాటర్లు తలవంచారు. మనకు అనుకూలిస్తుందనుకున్న స్పిన్ పిచ్ సఫారీలకు అంది వచ్చింది. సరిగ్గా ఏడాది క్రితం న్యూజిలాండ్ చేతిలో చిత్తయిన తీరును గుర్తుకు చేస్తూ భారత్ స్వదేశంలో మరో పరాభవాన్ని మూటగట్టుకోగా, వరల్డ్ టెస్టు చాంపియన్ దక్షిణాఫ్రికా పదిహేనేళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు గెలిచి సంబరాలు చేసుకుంది. పదేళ్ల క్రితం అనామకుడిగా ఇక్కడ అడుగు పెట్టి భారత బ్యాటర్ల చేతిలో చావు దెబ్బ తిన్న ఆఫ్స్పిన్నర్ సైమన్ హార్మర్ దశాబ్దం తర్వాత ఒక అరుదైన విజయాన్ని రచించడం విశేషం. కోల్కతా: భారత టెస్టు జట్టుకు స్వదేశంలో అనూహ్య షాక్...ఈడెన్ గార్డెన్లో స్పిన్ పిచ్ కోరుకొని నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన జట్టు చివరకు ప్రత్యర్థి స్పిన్ దెబ్బకే తలవంచింది. ఆదివారం మూడో రోజే ముగిసిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 30 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. 124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 35 ఓవర్లలో 93 పరుగులకే ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ (92 బంతుల్లో 31; 2 ఫోర్లు)దే అత్యధిక స్కోరు. సఫారీ బౌలర్లలో సైమన్ హార్మర్ 4, కేశవ్ మహరాజ్, మార్కో యాన్సెన్ చెరో 2 వికెట్లు తీశారు. అంతకు ముందు ఓవర్నైట్ స్కోరు 93/7తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్లో 54 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ తెంబా బవుమా (136 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు) కీలక అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. జడేజాకు 4 వికెట్లు దక్కాయి. మ్యాచ్లో మొత్తం 8 వికెట్లు పడగొట్టిన హార్మర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. రెండు మ్యాచ్లో సిరీస్లో దక్షిణాఫ్రికా 1–0తో ముందంజ వేయగా, నవంబర్ 22 నుంచి గువహటిలో రెండో టెస్టు జరుగుతుంది. రెండో రోజు మెడకు గాయం కావడంతో ఆట నుంచి తప్పుకొని ఆస్పత్రిలో చేరిన భారత కెపె్టన్ శుబ్మన్ గిల్ ఆదివారం వైద్యుల పర్యవేక్షణలో ఉండటంతో రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు రాలేకపోయాడు. కోలుకున్న గిల్ ఆదివారం సాయంత్రం ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఆదుకున్న బవుమా... ఆదివారం మైదానంలోకి వచ్చే సమయానికి భారత్ విజయంపై ధీమాగా ఉంది. మిగిలిన 3 వికెట్లు తీసేందుకు ఎక్కువ సమయం పట్టదనిపించింది. అయితే మన స్పిన్నర్లు ప్రభావం చూపలేకపోగా, పదునైన డిఫెన్స్తో పట్టుదలగా నిలిచిన బవుమా సింగిల్స్తో పరుగులు జోడిస్తూ పోయాడు. కొద్ది సేపు దూకుడుగా ఆడిన కార్బిన్ బాష్ (37 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్), బవుమా కలిసి ఎనిమిదో వికెట్కు 44 పరుగులు జోడించారు. చివరకు బాష్ను బుమ్రా బౌల్డ్ చేయగా...సిరాజ్ ఒకే ఓవర్లో చివరి రెండు వికెట్లు పడగొట్టాడు. సుందర్ మినహా... ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే జైస్వాల్ (0)ను అవుట్ చేసిన యాన్సెన్, తన రెండో ఓవర్లో రాహుల్ (1)ను పెవిలియన్కు పంపి దెబ్బ కొట్టాడు. ఈ దశలో 32 పరుగులు జత చేసి సుందర్, జురేల్ (13) జట్టును ముందుకు నడిపించారు. అయితే జురేల్, పంత్ (2) చెత్త షాట్లతో వెనుదిరిగారు. ఇలాంటి స్థితిలోనూ సుందర్, రవీంద్ర జడేజా (18) భాగస్వామ్యంతో జట్టు గెలుపుపై ఆశలు చిగురించాయి. కానీ సఫారీ స్పిన్నర్లు మళ్లీ పైచేయి సాధించారు. వీరిద్దరు 8 పరుగుల తేడాతో అవుట్ కాగా, కుల్దీప్ (1) వారిని అనుసరించాడు. గెలుపునకు మరో 47 పరుగులు చేయాల్సిన స్థితిలో అక్షర్ పటేల్ (17 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్లు) కాస్త సాహసం ప్రదర్శించాడు. మహరాజ్ ఓవర్లో తొలి నాలుగు బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్స్లు బాది 16 పరుగులు రాబట్టాడు. చివరకు మహరాజ్దే పైచేయి అయింది. ఐదో బంతికి మరో భారీ షాట్కు ప్రయతి్నంచి అక్షర్ వెనుదిరగ్గా, తర్వాతి బంతికే సిరాజ్ (0) అవుట్ కావడంలో దక్షిణాఫ్రికా శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 159; భారత్ తొలి ఇన్నింగ్స్ 189; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 153; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 0; రాహుల్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 1; సుందర్ (సి) హార్మర్ (బి) మార్క్రమ్ 31; జురేల్ (సి) బాష్ (బి) హార్మర్ 13; పంత్ (సి) అండ్ (బి) హార్మర్ 2; జడేజా (ఎల్బీ) (బి) హార్మర్ 18; అక్షర్ (సి) బవుమా (బి) మహరాజ్ 26; కుల్దీప్ (ఎల్బీ) (బి) హార్మర్ 1; బుమ్రా (నాటౌట్) 0; సిరాజ్ (సి) మార్క్రమ్ (బి) మహరాజ్ 0; గిల్ (ఆబ్సెంట్ హర్ట్); ఎక్స్ట్రాలు 1; మొత్తం (35 ఓవర్లలో ఆలౌట్) 93. వికెట్ల పతనం: 1–0, 2–1, 3–33, 4–38, 5–64, 6–72, 7–77, 8–93, 9–93. బౌలింగ్: యాన్సెన్ 7–3–15–2, హార్మర్ 14–4–21–4, మహరాజ్ 9–1–37–2, బాష్ 2–0–14–0, మార్క్రమ్ 3–0–5–1. బ్యాటింగ్ చేయలేనంత ఇబ్బందికరంగా పిచ్ ఏమీ లేదు. మేం సరిగ్గా ఇలాంటి పిచ్నే కోరుకున్నాం. తొలి రోజు నుంచే స్పిన్నర్లకు అనుకూలిస్తే టాస్ ప్రభావం తగ్గించవచ్చని భావించాం. క్యురేటర్ కూడా అదే ఇచ్చారు. మేం మ్యాచ్ గెలిచి ఉంటే పిచ్పై ఇంత చర్చ జరిగేది కాదు. మంచి డిఫెన్స్ ఉంటే పరుగులు సాధించవచ్చు. మీరు మానసికగా ఎంత దృఢంగా ఉన్నారో ఇక్కడ తెలుస్తుంది. బవుమా, అక్షర్, సుందర్ పరుగులు రాబట్టారు కదా’ –గౌతమ్ గంభీర్, భారత కోచ్ -
IND vs PAK: 8 వికెట్ల తేడాతో టీమిండియాపై పాక్ విజయం
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్–2025లో భారత్–పాక్ మధ్య జరిగిన హై–వోల్టేజ్ పోరులో పాకిస్థాన్ యువ జట్టు ఆధిపత్యం చాటుకుంది. టీమిండియాను 8 వికెట్ల తేడాతో ఓడించి పాక్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో మరో విలువైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్–2025 టోర్నమెంట్లో అత్యంత ఆసక్తికరమైన పోరు జరిగింది. యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీలో నేడు (ఆదివారం) భారత్–పాకిస్థాన్ జట్లు పరస్పరం తలపడ్డాయి కానీ ఈ కీలక మ్యాచ్ను గెలిచి పాకిస్థాన్ జట్టు సెమీఫైనల్ సమీకరణలను సులభం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు భారీ స్కోరు దిశగా సాగుతుందనిపించినా మధ్య ఓవర్లలో వరుస వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడికి లోనైంది. దాంతో నిర్ణీత 19 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగా ఈ చిన్న లక్ష్యాన్ని ఛేదించడానికి వచ్చిన పాకిస్తాన్ బ్యాట్స్మెన్స్ ధాటిగా ఆడి మ్యాచ్ను వేగంగా తమ వైపుకు తిప్పుకున్నారు. ఫలితంగా పాకిస్థాన్ జట్టు కేవలం 13.2 ఓవర్లలోనే నిర్ణీత లక్ష్యాన్ని చేధించింది.పాక్ A జట్టు ఓపెనర్ మాజ్ సదాఖత్ (79*) పరుగులతో పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత బౌలర్లలో యశ్ ఠాకూర్, సుయాశ్ శర్మ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో పాకిస్థాన్ సెమీస్కు క్వాలిఫై అయింది. రెండో బెర్తు కోసం భారత్ Aతో పాటు ఒమన్ A బరిలో ఉంది. ఈ నెల 18న తదుపరి మ్యాచ్లో ఒమన్తోనే భారత్ A తలపడనుంది. ఆ మ్యాచ్లో గెలిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా భారత్ సెమీస్కు వెళ్లిపోతుంది. -
పాక్తో మ్యాచ్.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నీలో భారత యువ సంచలనం వైభవ్ సూర్య వంశీ అదరగొడుతున్నాడు. యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్లో దుమ్ములేపిన వైభవ్.. ఇప్పుడు పాకిస్తాన్పై కూడా తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 45 పరుగులు చేశాడు.ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన వైభవ్, క్రీజులో సెటిల్ అయ్యాక ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడితో పాటు నమన్ ధీర్(20 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో 35) రాణించాడు. వీరిద్దరి మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్-ఎ జట్టు 19 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌటైంది.10 ఓవర్లలో భారత్ స్కోర్ 93-3 ఉండగా 43 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కోల్పోయింది. పాక్ బౌలర్లలో షాహిద్ అజీజ్ మూడు వికెట్లు పడగొట్టగా.. మాజ్ సదఖత్, షాహిద్ అజీజ్ తలా రెండు వికెట్లు సాధించారు. -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
సౌతాఫ్రికా క్రికెట్ జట్టు భారత పర్యటనను అద్భుతమైన విజయంతో ఆరంభించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్లో 30 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపొందింది. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సఫారీ బౌలర్లు డిఫెండ్ చేసి అద్భుతం చేశారు.లక్ష్య చేధనలో భారత్ కేవలం 93 పరుగులకే ఆలౌటైంది. ప్రోటీస్ స్పిన్నర్ సైమన్ హార్మర్ నాలుగు వికెట్ల పడగొట్టి టీమిండియాను దెబ్బ తీశాడు. అతడితో కేశవ్ మహారాజ్, జానెసన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో సంచలన విజయం సాధించిన సౌతాఫ్రికా ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది.తొలి జట్టుగా రికార్డు..👉ఈడెన్ గార్డెన్స్ మైదానంలో టెస్టుల్లో లోయోస్ట్ టోటల్ డిఫెండ్ చేసిన జట్టుగా ప్రోటీస్ నిలిచింది. ఇంతకుముందు రికార్డు భారత జట్టు పేరిట ఉండేది. ఈ వేదికలో 1973లో ఇంగ్లండ్తో జరిగిన ఓ టెస్టు మ్యాచ్లో 192 పరుగులను టీమిండియా కాపాడుకుంది. తాజా మ్యాచ్లో 124 పరుగులను డిఫెండ్ చేసుకున్న సౌతాఫ్రికా.. భారత్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేసింది.👉అదేవిధంగా సౌతాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ కూడా ఓ రికార్డు సాధించాడు. భారత్పై ఒక టెస్టు మ్యాచ్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన సఫారీ ప్పిన్నర్గా హార్మర్ నిలిచాడు.ఈ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లు కలిపి అతడు 51 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు పాల్ ఆడమ్స్ పేరిట ఉండేది. 1996లో కాన్పూర్ వేదికగా భారత్తో జరిగిన టెస్టు మ్యాచ్లో ఆడమ్స్ 139 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు.చదవండి: IND vs SA: బవుమాకు క్షమాపణలు చెప్పిన బుమ్రా..! వైరల్ -
సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్
రాజ్కోట్ వేదికగా దక్షిణాఫ్రికా 'ఎ' తో జరిగిన రెండో అనధికారిక వన్డేలో 9 వికెట్ల తేడాతో భారత్ 'ఎ' ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 30.3 ఓవర్లలో కేవలం 132 పరుగులకే కుప్పకూలింది.భారత బౌలర్ల ధాటికి సఫారీ బ్యాటర్లు విలవిల్లాడారు. స్పిన్నర్ నిశాంత్ సింధు 4 వికెట్లు పడగొట్టగా.. పేసర్లు హర్షిత్ రాణా 3, ప్రసిద్ద్ కృష్ణ రెండు వికెట్లు సాధించారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో మూన్స్వామి(33) టాప్ స్కోరర్గా నిలవగా.. పొటిగిటర్(23), ప్రిటోరియస్(21) రాణించారు.రుతురాజ్ మెరుపులు.. అనంతరం 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇండియా జట్టు కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 27.5 ఓవర్లలో చేధించింది. స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (83 బంతుల్లో 9 ఫోర్లతో 68) అజేయ హాఫ్ సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(22 బంతుల్లో 6 ఫోర్లతో 33) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో లుథో సిపామ్లా ఒక్కడే వికెట్ సాధించాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడో అనధికారిక వన్డే రాజ్కోట్ వేదికగానే నవంబర్ 19న జరగనుంది.చదవండి: IND vs SA: బవుమాకు క్షమాపణలు చెప్పిన బుమ్రా..! వైరల్ -
బవుమాకు క్షమాపణలు చెప్పిన బుమ్రా..! వైరల్
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా- సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మధ్య నెలకొన్న 'బౌనా'(మరగుజ్జు) వివాదం సద్దమణుగింది. ఈడెన్ గార్డెన్ వేదికగా తొలి టెస్టు ముగిసిన అనతరం బుమ్రా.. బవుమా వద్దకు వెళ్లి అప్యాయంగా మాట్లాడు.ఈ సందర్భంగా ఉద్దేశపూర్వకంగా ఆ పదం వాడలేదని బవుమాకు బుమ్రా క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. దీంతో వెంటనే ప్రోటీస్ కెప్టెన్ కూడా బుమ్రాను అలింగనం చేసుకుంటా నవ్వుతూ కన్పించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.అసలేమి జరిగిందంటే?సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన బుమ్రా ఆఖరి బంతిని బవుమాకు గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ డెలివరీని బవుమా ఆడే ప్రయత్నం చేయగా బంతి అతడి ప్యాడ్కు తాకింది. దీంతో వెంటనే బౌలర్తో పాటు ఫీల్డర్లు ఎల్బీకి అప్పీల్ చేశారు. అంపైర్ మాత్రం నో అంటూ తల ఊపాడు. దీంతో ఆర్ఎస్ తీసుకోవాలా వద్దా అని బుమ్రా, వికెట్ కీపర్ రిషభ్ పంత్తో చర్చించాడు. బంతి ప్యాడ్స్కు ఎత్తుగా తగిలిందని పంత్ చెప్పినప్పుడు అందుకు బుమ్రా "బౌనా భీ హై" అని సమాధనమిచ్చాడు. 'బౌనా' అనేది హిందీలో మరగుజ్జు అని అర్థం. బవుమా పొట్టిగా ఉండటం వల్ల బంతి స్టంప్స్ను మిస్ అయ్యే అవకాశం ఉందని చెప్పడానికి జస్ప్రీత్ ఈ పదం ఉపయోగించాడు. కానీ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవడంతో నెటిజన్లు బుమ్రాపై ఫైరయ్యారు. ఈ ఘటనపై సౌతాఫ్రికా బ్యాటింగ్ కోచ్ యాష్వెల్ ప్రిన్స్ సైతం స్పందించాడు. ఇలా జరగడం ఇదే తొలిసారి. కానీ ఇప్పటివరకు డ్రెస్సింగ్ రూమ్లో ఎలాంటి చర్చా రాలేదు. ఇక్కడ జరిగిన దాని వల్ల ఎవరికీ పెద్దగా ఇబ్బంది కలగలేదనే అనుకుంటున్నా’’ ప్రిన్స్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు బుమ్రా సారీ చెప్పడంతో ఈ వివాదానికి ఫుల్స్టాప్ పడింది. ఇక ఈ మ్యాచ్లో 30 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది.చదవండి: WTC 2025-27 Points Table: టాప్-2కు సౌతాఫ్రికా.. మరి భారత్ ఏ ప్లేస్లో ఉందంటే?Bumrah explaining the Bauna controversy to Bavuma crying 😭😭 pic.twitter.com/l9WTsYcCkZ— tweeting from my grave. (@kalhonahoooooo) November 16, 2025 -
టాప్-2కు సౌతాఫ్రికా.. మరి భారత్ ఏ స్ధానంలో ఉందంటే?
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. పర్యాటక జట్టు నిర్ధేశించిన 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ చేధించలేకపోయింది. 35 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ నాలుగు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు. అతడితో కేశవ్ మహారాజ్, జానెసన్ తలా రెండు వికెట్లు సాధించారు. భారత బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్(31) టాప్ స్కోరర్గా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో గాయపడి రిటైర్డ్ ఔట్గా వెనుదిరిగిన కెప్టెన్ శుభ్మన్ గిల్.. రెండో ఇన్నింగ్స్లో కూడా బ్యాటింగ్కు రాలేదు. గిల్ లేకపోవడం కూడా భారత జట్టుకు చాలా నష్టాన్ని కలిగించిందే అని చెప్పాలి.నాలుగో స్ధానానికి పడిపోయిన భారత్..ఇక భారత్-సౌతాఫ్రికా తొలి టెస్టు ఫలితంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఓటమితో టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మూడో స్ధానం నుంచి నాలుగో స్ధానానికి పడిపోయింది. భారత్ పాయింట్ల శాతం 54.17గా ఉంది.ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో భారత జట్టు 8 మ్యాచ్లు ఆడి నాలుగింట గెలుపొందగా.. మూడింట ఓటమి చవిచూసింది. మరోవైపు ఈ విజయంతో దక్షిణాఫ్రికా(66.7 శాతం) రెండో స్ధానానికి దూసుకెళ్లింది. అయితే పీసీటీ పరంగా సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు సమంగా ఉన్నాయి.కానీ పాయింట్లు పరంగా మాత్రం లంక(16) కంటే సౌతాఫ్రికా(24) ముందుంజలో ఉంది. అందుకే శ్రీలంక మూడో స్ధానంలో కొనసాగుతోంది. ఇక ఆస్ట్రేలియా(100.00) అగ్రస్ధానంలో ఉంది. ఈ సైకిల్లో ఆస్ట్రేలియా ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లలోనూ విజయం సాధించింది. సౌతాఫ్రికా ఆడిన 3 మ్యాచ్లలో 2 విజయాలు, ఒక్క ఓటమి చవిచూసింది.చదవండి: సంతోషంగా ఉన్నాను.. మా ఓటమికి కారణం వారే: గంభీర్ -
చెలరేగిన భారత బౌలర్లు.. 132 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్
రాజ్కోట్ వేదికగా సౌతాఫ్రికా-ఎతో జరుగుతున్న రెండో అనధికారిక వన్డేలో భారత్-ఎ బౌలర్లు నిప్పలు చెరిగారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా-ఎ జట్టు.. భారత బౌలర్ల ధాటికి 30.3 ఓవర్లలో కేవలం 132 పరుగులకే కుప్పకూలింది. యువ ఆల్రౌండర్ నిశాంత్ సింధు అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. సింధు తన స్పిన్ బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. ఈ హర్యానా ఆటగాడు 7 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు హర్షిత్ రాణా మూడు, ప్రసిద్ద్ కృష్ణ రెండు వికెట్లు సాధించారు.సౌతాఫ్రికా బ్యాటర్లలో మూన్స్వామి(33) టాప్ స్కోరర్గా నిలవగా.. పొటిగిటర్(23), ప్రిటోరియస్(21) రాణించారు. మొత్తం ఐదుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు. కాగా తొలి మ్యాచ్లో సౌతాఫ్రికా-ఎ జట్టును 4 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. ప్రస్తుతం మూడు మ్యాచ్ల సిరీస్ మెన్ ఇన్ బ్లూ 1-0 ఆధిక్యంలో ఉంది.తుది జట్లుభారత్రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, తిలక్ వర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి,నిశాంత్ సింధు,హర్షిత్ రాణా, విప్రజ్ నిగమ్,అర్ష్దీప్ సింగ్,ప్రసిద్ కృష్ణసౌతాఫ్రికారివాల్డో మూన్సామి(వికెట్ కీపర్), లువాన్-డ్రే ప్రిటోరియస్, జోర్డాన్ హెర్మాన్, మార్క్వెస్ అకెర్మాన్(కెప్టెన్), సినెథెంబ క్వెషిలే, డయాన్ ఫారెస్టర్, ప్రెనెలన్ సుబ్రాయెన్, లూథో సిపమ్లా, డెలానో పోట్గీటర్, న్కాబయోమ్జి పీటర్, ఒట్నీల్ బార్ట్మన్ -
సంతోషంగా ఉన్నాను.. మా ఓటమికి కారణం వారే: గంభీర్
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్టు ఫలితం కేవలం రెండున్నర రోజుల్లోనే తేలిపోయింది. ఈ మ్యాచ్లో 30 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. టీమిండియా 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక ఘోర పరభావాన్ని మూటకట్టుకుంది.పిచ్ పూర్తిగా బౌలర్లకు సహకరించడంతో భారత బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. ఒక్క వాషింగ్టన్ సుందర్(92 బంతుల్లో 31) మినహా మిగితా ఏ ప్లేయర్ కూడా క్రీజులో నిలదొక్కకోలేకపోయారు. తొలి రోజు మొదటి సెషన్ నుంచే పిచ్పై బౌన్స్ కనిపించింది. ఆ తర్వాత రెండో రోజు ఆటలో పిచ్పై పగుళ్లు ఏర్పడి, స్పిన్నర్లకు అనుకూలంగా మారింది. దీంతో స్పిన్నర్లు బంతి గింగిరాలు తప్పారు. సౌతాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ నాలుగు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు. అతడితో పాటు కేశవ్ మహారాజ్ రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు సఫారీల రెండో ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా సైతం నాలుగు వికెట్లు సాధించాడు. ఈ మొదటి టెస్టులో నాలుగు ఇన్నింగ్స్లు కలిపి 594 పరుగులు మాత్రమే నమోదయ్యాయి అంటే పిచ్ ఎలా ఉందో ఆర్ధం చేసుకోవచ్చు.ఈడెన్ గార్డెన్స్ పిచ్పై సర్వాత్ర విమర్శల వర్షం కురిపిస్తోంది. ఇటుంటి పిచ్ల వల్ల టెస్ట్ క్రికెట్ అంతరించిపోతుందని మాజీ భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ మండిపడ్డాడు. కాగా ఈ పిచ్ను భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచన మేరకే ఈడెన్ గార్డెన్స్ క్యూరేటర్ తాయారు చేశాడు. దీంతో గంభీర్ను కూడా నెటిజన్లు టార్గెట్ చేశాడు. సోషల్ మీడియాలో గంభీర్ను ట్రోల్ చేస్తున్నారు. కోచ్గా అతడిని తీసేయండి కామెంట్స్ చేస్తున్నారు.బ్యాటర్లే కొంప ముంచారు..ఇక ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం గంభీర్ స్పందించాడు. తామే ఇటువంటి పిచ్ను కోరుకున్నట్లు గంభీర్ ధ్రువీకరించాడు. "మేము అడిగిన పిచ్ను తయారు చేసి ఇచ్చినందుకు సంతోషంగా ఉన్నాము. మేము ఎప్పటి నుంచో ఇటువంటి పిచ్ కోసమే ఎదురు చూస్తున్నాము. క్యూరేటర్ మాకు అన్ని విధాల సహకరించారు. అయితే ఈ వికెట్పై మేము మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన చేయలేకపోయాము. అందుకే ఓడిపోయాము. పిచ్లో ఎలాంటి భూతాలు లేవు. ఇదే వికెట్పై టెంబా బవుమా హాఫ్ సెంచరీ సాధించాడు. అక్షర్, వాషింగ్టన్ కూడా రన్స్ చేశారు. కాబట్టి ఇక్క పిచ్ సమస్య కాదు. ఎక్కువ వికెట్లు ఫాస్ట్ బౌలర్లకే వచ్చాయి. కాబట్టి ఇది బ్యాటింగ్కు మరి అంత కష్టమైన వికెట్ కాదు. ఇటువంటి పిచ్లు మీ టెక్నిక్, సహనాన్ని పరీక్షిస్తాయి. మంచి డిఫెన్స్ టెక్నిక్ ఉంటే, ఇలాంటి వికెట్పై కూడా పరుగులు సాధించవచ్చు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో గంభీర్ పేర్కొన్నాడు.సంక్షిప్త స్కోర్లుసౌతాఫ్రికా- 159 &153భారత్- 189 &93.చదవండి: వాళ్లిద్దరు అద్భుతం.. మా ఓటమికి కారణం అదే: పంత్ -
వాళ్లిద్దరు అద్భుతం.. మా ఓటమికి కారణం అదే: పంత్
సౌతాఫ్రికాతో స్వదేశంలో టెస్టు సిరీస్ను టీమిండియా ఓటమి (IND vs SA)తో ఆరంభించింది. కోల్కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్లో సఫారీల చేతిలో 30 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో రెండు మ్యాచ్ల సిరీస్లో బవుమా బృందం 1-0తో ఆధిక్యంలోకి వెళ్లగా.. రెండో టెస్టులో తప్పక గెలవాల్సిన పరిస్థితిలో టీమిండియా నిలిచింది.అందుకే ఓడిపోయాంఈ నేపథ్యంలో భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్ (Risbah Pant) ఓటమిపై స్పందించాడు. ఒత్తిడిలో తాము చిత్తయ్యామని పేర్కొన్నాడు. ఇంకాస్త మెరుగ్గా ఆడి ఉంటే లక్ష్యాన్ని ఛేదించే వాళ్లమని తమ వైఫల్యాన్ని అంగీకరించాడు.వాళ్లిద్దరు అద్భుతంఈ మేరకు.. ‘‘124 పరుగుల టార్గెట్ను మేము ఛేదించి ఉండాల్సింది. రెండో ఇన్నింగ్స్లో మాపై ఒత్తిడి బాగా పెరిగింది. అయితే, మేము దానిని అధిగమించలేకపోయాము. తెంబా, బాష్.. అద్భుతంగా బ్యాటింగ్ చేసి.. తమ భాగస్వామ్యంతో మ్యాచ్ను తమ వైపునకు తిప్పేసుకున్నారు.ఇలాంటి పిచ్పై 120 పరుగులు చేయడం అంత తేలికేమీ కాదు. అయితే, మేము మాత్రం ఈ విషయంలో సఫలం కాలేకపోయాము. మ్యాచ్ ఇప్పుడే ముగిసింది. ఫలితాన్ని విశ్లేషించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటాం. తిరిగి పుంజుకుంటామనే నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నాడు.బవుమా ఫిఫ్టీ.. నిలబడిన బాష్కాగా భారత్- సౌతాఫ్రికా మధ్య శుక్రవారం మొదలైన తొలి టెస్టు మూడురోజుల్లోనే ముగిసిపోయింది. 93/7 ఓవర్నైట్ స్కోరుతో ఆదివారం నాటి ఆట మొదలుపెట్టిన సఫారీ జట్టుకు కెప్టెన్ తెంబా బవుమా, టెయిలెండర్ కార్బిన్ బాష్ అద్భుత బ్యాటింగ్తో మెరుగైన స్కోరు అందించారు.తొలి ఇన్నింగ్స్(3)లో విఫలమైన బవుమా.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం విలువైన అజేయ అర్ధ శతకం (136 బంతుల్లో 55) బాదాడు. మరోవైపు.. బాష్ 37 బంతుల్లో 25 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ ఇద్దరు కలిసి 79 బంతుల్లో 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఫలితంగా సౌతాఫ్రికా 153 పరుగులు చేయగలిగింది. ఆది నుంచే తడబాటుఇక తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 30 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించినందున.. విజయ లక్ష్యం 124 పరుగులుగా మారింది. అయితే, లక్ష్యఛేదనలో ఆరంభం నుంచే టీమిండియా బ్యాటర్లు తేలిపోయారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (1), యశస్వి జైస్వాల్ (0) పూర్తిగా విఫలం కాగా.. ధ్రువ్ జురెల్ (13), రిషభ్ పంత్ (2) నిరాశపరిచారు.ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్ (31) ఓ మోస్తరుగా రాణించగా.. రవీంద్ర జడేజా (18), అక్షర్ పటేల్ (17 బంతుల్లో 26) వేగంగా ఆడే ప్రయత్నం చేశారు. ఆఖర్లో కుల్దీప్ యాదవ్ (1), సిరాజ్ (0) చేతులెత్తేయగా.. కెప్టెన్ శుబ్మన్ గిల్ అబ్సెంట్ హర్ట్ కావడంతో టీమిండియా ఆలౌట్ అయింది. కాగా మెడనొప్పి వల్ల తొలి ఇన్నింగ్స్ మధ్యలోనే నిష్క్రమించిన గిల్.. మళ్లీ బ్యాటింగ్కు రాలేదు. అతడి స్థానంలో వైస్ కెప్టెన్ పంత్.. తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు.చదవండి: పంత్ ఫెయిల్.. గంభీర్ ప్లాన్ అట్టర్ఫ్లాప్.. టీమిండియా ఓటమి -
'అదొక చెత్త పిచ్.. సచిన్, కోహ్లిలు ఆడినా'
సొంతగడ్డపై టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక మెన్ ఇన్ బ్లూ చతికలపడింది. 35 ఓవర్లు ఎదుర్కొని కేవలం 90 పరుగులకే భారత్ కుప్పకూలింది. బౌలర్లకు స్వర్గధామంగా మారిన ఈడెన్ గార్డెన్స్ వికెట్పై భారత బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. సౌతాఫ్రికా స్పిన్నర్లు సైమర్ హార్మర్, కేశవ్ మహారాజ్ బంతితో మ్యాజిక్ చేశారు. భారత బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్(31) టాప్ స్కోరర్గా నిలిచారు. ఈ ఈడెన్ గార్డెన్స్ పిచ్పై సౌతాఫ్రికా బ్యాటర్లు కూడా రాణించలేకపోయారు. వారు కూడా భారత బౌలర్ల ధాటికి విల్లవిల్లాడారు. ఈ మ్యాచ్లో ఒక్క ఇన్నింగ్స్లో కూడా స్కోర్ 200 పరుగుల మార్క్ దాటలేదంటే పిచ్ ఎలా ఉందో ఆర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ పిచ్పై భారత మాజీ స్పిన్నర్ హార్భజన్ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు."టెస్టు మ్యాచ్ చూడటానికి ఈడెన్ గార్డెన్స్కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు రావడం చూసి నేను నేను చాలా సంతోషించాను. కానీ పిచ్ ప్రవర్తించిన తీరు నన్ను షాక్కు గురిచేసింది. తొలుత టాస్ గెలిచి దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్లో 159 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత భారత్ బాగా ఆడుతుందని నేను అనుకున్నాను. కానీ మన జట్టు కూడా అదే తీరును కనబరిచి 189 పరుగులకే ఆలౌట్ అయింది. 30 పరుగుల ఆధిక్యం లభించింది. అయితే ఇటువంటి పిచ్పై 30 పరుగుల లీడ్ 300 పరుగులగా పరిగణించాలి. అనంతరం సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్లో రెండో రోజు ఆట ముగిసే సరికి 93 పరుగులతో ఉంది. దీంతో భారత్ సునాయసంగా గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ మూడో రోజు వికెట్ మరి వింతగా ప్రవర్తించింది.ఇటువంటి పిచ్లు టెస్టు క్రికెట్ ఉనికిని నాశనం చేస్తున్నాయి. ఈ ఏడాది జూన్లో భారత జట్టు ఇంగ్లండ్లో టెస్టు సిరీస్ ఆడనుంది. అక్కడ ఇరు జట్లు కూడా అద్భుతంగా పోరాడాయి. ప్రేక్షకులకు అసలైన టెస్టు క్రికెట్ మజాను అందించాయి. ఐదు రోజుల వరకు మ్యాచ్ జరిగేది. కానీ ఇక్కడ మాత్రం పిచ్ భయంకరంగా ఉంది. బంతి ఎక్కడ పడుతుందో, ఎలా టర్న్ అవుతోంది బ్యాటర్ అస్సలు అంచనా వేయలేకపోయాడు.మీకు ఎంత మంచి బ్యాటింగ్ టెక్నిక్ ఉన్న కూడా ఈ వికెట్పై ఆడలేరు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి లాంటి గొప్ప క్రికెటరైనా ఈ పిచ్పై ఫెయిల్ అయ్యే వారు. ఓ బంతి ఎక్కువ ఎత్తులో పడి ఒక్కసారిగా టర్న్ అవుతోంది. మరొకొన్ని సార్లు తక్కువ ఎత్తులో ఉండి స్పిన్ అవుతుంది. ఈడెన్లో ఇంతకుముందు చాలా టెస్టులు జరిగాయి. ఇప్పటివరకు మాత్రం ఇలాంటి కండీషన్స్ను చూడలేదు. టెస్టు క్రికెట్ పరువు తీస్తున్నారు" అని తన యూట్యూబ్ ఛానల్ పేర్కొన్నాడు. కాగా కెప్టెన్ గిల్ గాయపడడం కూడా భారత ఓటమికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మెడ నొప్పి కారణంగా మ్యాచ్ మధ్యలోనే గిల్ వైదొలిగాడు.చదవండి: పంత్ ఫెయిల్.. గంభీర్ ప్లాన్ అట్టర్ఫ్లాప్.. టీమిండియా ఓటమి -
పంత్ ఫెయిల్.. గంభీర్ ప్లాన్ అట్టర్ఫ్లాప్.. టీమిండియా ఓటమి
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా (IND vs SA)కు చేదు అనుభవం ఎదురైంది. సఫారీలు విధించిన 124 స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో భారత జట్టు విఫలమైంది. ఫలితంగా 30 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.గంభీర్ ప్రయోగాలుకోల్కతా వేదికగా సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా తమ బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు చేసింది. ఇంగ్లండ్ పర్యటన, వెస్టిండీస్తో స్వదేశంలో టెస్టుల్లో మూడో స్థానంలో ఆడించిన సాయి సుదర్శన్ను తుదిజట్టు నుంచి తప్పించింది.సాయికి బదులుగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను టాపార్డర్కు ప్రమోట్ చేసింది. వన్డౌన్లో అతడిని ఆడించింది. తొలి ఇన్నింగ్స్లో 82 బంతులు ఎదుర్కొని.. రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాది వాషీ 29 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. తద్వారా భారత్ తొలి ఇన్నింగ్స్లో 189 పరుగులు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు.వాషీ పర్లేదుఇక రెండో ఇన్నింగ్స్లో కూడా వాషీ కాస్త మెరుగ్గా రాణించాడు. సౌతాఫ్రికా విధించిన 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (0), కేఎల్ రాహుల్ (1) పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ వాషీ.. 92 బంతులు ఎదుర్కొని 31 పరుగులు చేశాడు. అయితే, మార్క్రమ్ బౌలింగ్లో హార్మర్కు క్యాచ్ ఇవ్వడంతో వాషీ ఇన్నింగ్స్ ముగిసిపోయింది.గిల్ స్థానంలో జురెల్ఈ మ్యాచ్లో మరో ప్రయోగం... ధ్రువ్ జురెల్ను నాలుగో స్థానంలో ఆడించడం. కెప్టెన్ శుబ్మన్ గిల్ మెడనొప్పి కారణంగా మ్యాచ్కు దూరం కాగా.. అతడి స్థానంలో జురెల్ను ప్రమోట్ చేశాడు హెడ్కోచ్ గౌతం గంభీర్. అయితే, కాసేపు క్రీజులో నిలబడ్డా జురెల్.. వాషీ మాదిరి పరుగులు చేయలేకపోయాడు. 34 బంతులు ఎదుర్కొని 13 పరుగులే చేసి నిష్క్రమించాడు.ఇక ఐదో నంబర్ బ్యాటర్ రిషభ్ పంత్ 13 బంతుల్లో కేవలం రెండు పరుగులు చేసి.. అవుటయ్యాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. 26 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 18 పరుగులు చేసిన జడ్డూ.. హార్మర్కు వికెట్ల ముందు దొరికిపోయాడు.గెలుపు ఆశలు రేపిన అక్షర్మరోవైపు టెయిలెండర్ కుల్దీప్ యాదవ్ 13 బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేసి హార్మర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ కాగా.. అక్షర్ పటేల్ గెలుపు ఆశలు రేపాడు. కేవలం 17 బంతుల్లోనే 26 పరుగులతో సత్తా చాటాడు. Pressure? What pressure? 🔥#AxarPatel takes the attack to the South African bowlers! 🏏👏#INDvSA | 1st Test, Day 3, LIVE NOW 👉 https://t.co/19cUrY4aXc pic.twitter.com/zpiIumJibl— Star Sports (@StarSportsIndia) November 16, 2025అయితే, కేశవ్ మహరాజ్ బౌలింగ్లో సిక్సర్ బాదిన అతడు.. ఆఖరికి అతడి బౌలింగ్లో (34.5)నే బవుమాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 93 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్.. మరుసటి బంతికే సిరాజ్ అవుట్ కావడంతో తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఇక గిల్ ఆబ్సెంట్ హర్ట్ (0) కావడంతో.. ఆలౌట్ అయిన భారత్ ఓటమి ఖరారైంది.టాస్ గెలిచిన.. తొలుత బ్యాటింగ్రెండు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్- సౌతాఫ్రికా మధ్య శుక్రవారం మొదలైన తొలి టెస్టులో టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. సిరాజ్ రెండు, కుల్దీప్ యాదవ్ రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్తో సత్తా చాటారు. ఫలితంగా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకే కుప్పకూలింది.ఇందుకు బదులుగా టీమిండియా 189 పరుగులతో సమాధానం ఇచ్చింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (39) టాప్ రన్ స్కోరర్గా నిలవగా.. సుందర్ 29, పంత్ 27, జడేజా 27 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో సైమన్ హార్మర్ నాలుగు వికెట్లు తీయగా.. మార్కో యాన్సెన్ మూడు వికెట్లు పడగొట్టాడు. కేశవ్ మహరాజ్, కార్బిన్ బాష్ చెరో వికెట్ దక్కించుకున్నారు.తెంబా బవుమా హాఫ్ సెంచరీఅనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా 153 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ తెంబా బవుమా హాఫ్ సెంచరీ (55 నాటౌట్) చేయడంతో ప్రొటిస్ జట్టు ఈ మేరకు మెరుగైన స్కోరు సాధించింది. ఫలితంగా 124 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచగలిగింది.తప్పని ఓటమిఅయితే, ఈ టార్గెట్ను ఛేదించే క్రమంలో టీమిండియా ఆది నుంచే తడ‘బ్యాటు’కు లోనైంది. ఆఖరికి 93 పరుగులకు కుప్పకూలి.. 30 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ప్రొటిస్ బౌలర్లలో స్పిన్నర్లు హార్మర్ నాలుగు, కేశవ్ మహరాజ్ రెండు వికెట్లతో సత్తా చాటగా.. మార్క్రమ్ ఒక వికెట్ తీశాడు. ఓపెనర్లను అవుట్ చేసి యాన్సెన్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. హార్మర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.సంక్షిప్త స్కోర్లుసౌతాఫ్రికా- 159 &153భారత్- 189 &93.చదవండి: తప్పు మీరు చేసి.. మమ్మల్ని అంటారా?: గంభీర్పై గంగూలీ ఫైర్ -
తప్పు మీరు చేసి.. మమ్మల్ని అంటారా?: గంభీర్పై గంగూలీ ఫైర్
టీమిండియా- సౌతాఫ్రికా (IND vs SA 1st Test) మధ్య కోల్కతా వేదికగా తొలి టెస్టు నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ పిచ్ చర్చనీయాంశమైంది. బౌలర్ల విజృంభణతో బ్యాటర్లు విలవిల్లాడుతున్నారు. పరుగులు రాబట్టేందుకు ఎంత ప్రయత్నించినా సఫలం కాలేకపోతున్నారు.సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ 31 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలిస్తే.. టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul- 39) టాప్. ఇటు స్పిన్.. అటు పూర్తి బౌన్సీగా కాకుండా ఉన్న ఈడెన్ గార్డెన్స్ పిచ్ వల్ల ఇప్పటికి మూడు ఇన్నింగ్స్లో కలిపి రెండు జట్లు ఒక్కసారి కూడా కనీసం రెండు వందల మార్కు చేరుకోలేకపోయాయి.మూడో రోజు హాఫ్ సెంచరీఅయితే, ఆదివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా (Temba Bavuma) తమ రెండో ఇన్నింగ్స్లో 55 పరుగులతో సత్తా చాటడం ప్రేక్షకులకు కనువిందు చేసింది. ఈ మ్యాచ్లో మూడో రోజైనా కనీసం హాఫ్ సెంచరీ చూసే భాగ్యం దక్కిందని బ్యాటింగ్ అభిమానులు సంబరపడుతున్నారు.టెస్టు క్రికెట్ను చంపేస్తారా?ఇదిలా ఉంటే.. ఈడెన్ గార్డెన్స్ పిచ్పై మాజీ క్రికెటర్లు మైకేల్ వాన్, హర్భజన్ సింగ్ తదితరులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. భజ్జీ అయితే.. ‘‘టెస్టు క్రికెట్ను చంపేస్తారా? మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగిసిపోతుందా?’’ అంటూ క్యూరేటర్ తీరును తప్పుబట్టాడు. అస్సలు ఊహించలేదుమరోవైపు.. రెండు రోజుల్లోనే ఏకంగా పదహారు వికెట్లు కూలడంతో టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా క్యూరేటర్ పనితీరును విమర్శించాడు. ‘‘తొలిరోజు వికెట్ కాసేపు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత చెత్తగా మారిపోయింది. ఇది మేము అస్సలు ఊహించలేదు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.తప్పు మీరు చేసి.. మమ్మల్ని అంటారా?ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భారత జట్టు యాజమాన్యానికి దిమ్మదిరిగేలా కౌంటర్ ఇచ్చాడు. ‘‘టీమిండియా కోరుకున్న పిచ్ ఇదే. వాళ్లే ఇలా కావాలని అడిగారు.నాలుగు రోజుల పాటు పిచ్పై నీళ్లు చల్లకుంటే ఇలాగే ఉంటుంది. ఇందులో క్యూరేటర్ సుజన్ ముఖర్జీని తప్పుబట్టడానికి ఏమీ లేదు. వాళ్లు కోరిందే ఇది’’ అని దాదా.. పరోక్షంగా హెడ్కోచ్ గౌతం గంభీర్దే తప్పంతా అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు.టీమిండియా ఓటమిసౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. పర్యాటక ప్రొటిస్ జట్టు చేతిలో 30 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. 124 పరుగుల లక్ష్యాన్నిఛేదించే క్రమంలో భారత్ 93 పరుగులకే కుప్పకూలింది.చదవండి: ఈడెన్ గార్డెన్స్లో అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా? -
ఈడెన్ గార్డెన్స్లో అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా?
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా లక్ష్య ఛేదనకు దిగింది. అయితే, ప్రొటిస్ జట్టు విధించిన 124 పరుగుల టార్గెట్ను పూర్తి చేసే క్రమంలో ఆదిలోనే భారత్కు షాకులు తగిలాయి.ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించగా.. కేఎల్ రాహుల్ (KL Rahul) ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. తొలి ఓవర్లోనే జైసూను అవుట్ చేసిన ప్రొటిస్ పేసర్ మార్కో యాన్సెన్.. మూడో ఓవర్ ఆరంభంలోనే రాహుల్ను కూడా వెనక్కి పంపి టీమిండియాకు షాకిచ్చాడు.ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar), నాలుగో స్థానంలో వచ్చిన ధ్రువ్ జురెల్ ఇన్నింగ్స్చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. ఆచితూచి, ఓపికగా ఆడుతూ విజయానికి పునాది వేసే పనిలో ఉన్నారు. ఆచితూచి ఆడకపోతే..ఆదివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా 10 ఓవర్లు ముగిసే సరికి వాషీ 27 బంతుల్లో 12, జురెల్ 23 బంతుల్లో 13 పరుగులతో ఉన్నారు. ఫలితంగా విజయానికి టీమిండియా కేవలం 98 పరుగుల దూరంలో నిలిచింది.అయితే, శుక్రవారం నాటి తొలి రోజు ఆట నుంచే ఈడెన్ గార్డెన్స్ పిచ్ భిన్నంగా ఉంది. మొదటి రోజు పేసర్లు విజృంభించగా.. రెండో రోజు స్పిన్నర్లకు బాగా అనుకూలించింది. తాజాగా ఆదివారం నాటి మూడో ఆటలో మరోసారి పేసర్లు ప్రభావం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో లక్ష్యం చిన్నదిగా కనిపిస్తున్నా.. వికెట్ స్వభావం దృష్ట్యా టీమిండియా ఆచితూచి ఆడకపోతే భారీ మూల్యం చెల్లించకతప్పదు.మరి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఇప్పటి వరకు టెస్టుల్లో అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా?భారత్ వర్సెస్ సౌతాఫ్రికా- 2004లో టీమిండియా 117 పరుగుల లక్ష్య ఛేదనభారత్ వర్సెస్ ఇంగ్లండ్- 1993లో టీమిండియా 79 పరుగుల లక్ష్య ఛేదనభారత్ వర్సెస్ ఇంగ్లండ్- 2012లో ఇంగ్లండ్ 41 పరుగుల లక్ష్య ఛేదనభారత్ వర్సెస్ ఆస్ట్రేలియా- 1969లో ఆస్ట్రేలియా 39 పరుగుల లక్ష్య ఛేదనభారత్ వర్సెస్ ఇంగ్లండ్- 1977లో ఇంగ్లండ్ 16 పరుగుల లక్ష్య ఛేదన.చదవండి: సన్రైజర్స్ వ్యూహం.. వాళ్లంతా జట్టుతోనే.. పర్సులో ఇంకెంత? -
ఆదిలోనే భారీ షాకులు.. టీమిండియా చెత్త రికార్డు
సౌతాఫ్రికాతో తొలి టెస్టు లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆదిలోనే భారీ షాకులు తలిగాయి. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) డకౌట్ కాగా.. కేఎల్ రాహుల్ (KL Rahul)ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండు టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.టార్గెట్ 124ఇందులో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో శుక్రవారం ఇరుజట్ల మధ్య తొలి టెస్టు (IND vs SA 1st Test) మొదలైంది. తొలిరోజు పేసర్లు సత్తా చాటగా.. సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకే భారత్ ఆలౌట్ చేసింది. అనంతరం తమ మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా 189 పరుగులకు ఆలౌట్ అయి.. ముప్పై పరుగుల ఆధిక్యం సంపాదించింది.అనంతరం ఆదివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా.. 93/7 ఓవర్నైట్ స్కోరుతో ఆట మొదలుపెట్టిన సౌతాఫ్రికాను.. 153 పరుగులకు టీమిండియా ఆలౌట్ చేసింది. ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా.. భారత జట్టు లక్ష్యం 124 పరుగులుగా మారింది. దీంతో టార్గెట్ చిన్నదే కదా అని సంబరపడిన అభిమానులకు సఫారీ పేసర్ మార్కో యాన్సెన్ ఆదిలోనే షాకులు ఇచ్చారు.చెలరేగిన సఫారీ పేసర్మొత్తంగా నాలుగు బంతులు ఎదుర్కొన్న జైస్వాల్.. మార్కో యాన్సెన్ బౌలింగ్లో కైలీ వెరెన్నెకు క్యాచ్ ఇచ్చి.. పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో 39 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలిచిన కేఎల్ రాహుల్.. ఈసారి ఆరు బంతులు ఎదుర్కొని యాన్సెన్ బౌలింగ్లో వెరెన్నెకు క్యాచ్ ఇవ్వడంతో నిష్క్రమించాడు. కేవలం ఒకే ఒక్క పరుగు చేసి రాహుల్ అవుటయ్యాడు.తొలి ఓవర్లో జైసూను.. మూడో ఓవర్ తొలి బంతికి రాహుల్ను వెనక్కి పంపి యాన్సెన్ టీమిండియాను దెబ్బకొట్టాడు. దీంతో కేవలం ఒకే ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయింది టీమిండియా. అయితే, వన్డౌన్లో వాషింగ్టన్ సుందర్ రాగా.. నాలుగో స్థానంలో మరో ప్రయోగానికి టీమిండియా తెరలేపింది. జురెల్ ముందుగానేకెప్టెన్ గిల్ గాయం కారణంగా దూరం కాగా.. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ను టాప్కి ప్రమోట్ చేసింది. నిజానికి ఐదో నంబర్ బ్యాటర్ పంత్ బ్యాటింగ్కు వస్తాడనుకుంటే అనూహ్యంగా జురెల్ ముందుగా వచ్చాడు.ఇక భోజన విరామ సమయానికి ఏడు ఓవర్లలో టీమిండియా రెండు వికెట్ల నష్టానికి పది పరుగులే చేసింది. వాషీ 20 బంతుల్లో 5, జురెల్ 12 బంతుల్లో 4 పరుగులతో క్రీజులో నిలిచారు.టీమిండియా చెత్త రికార్డుజైసూ, రాహుల్ పూర్తిగా విఫలం కావడంతో సొంతగడ్డపై టెస్టుల్లో టీమిండియా చెత్త రికార్డును మూటగట్టుకుంది. నాలుగోసారి అత్యల్ప స్కోరుకే రెండు వికెట్లు కోల్పోయింది.సొంతగడ్డపై టెస్టుల్లో టీమిండియా ఓపెనర్లు సంయుక్తంగా సాధించిన అత్యల్ప స్కోర్లు👉1964లో ఆస్ట్రేలియాతో చెన్నై మ్యాచ్లో- 0 (ఎంఎల్ జైసింహ 0, ఇంద్రజిత్సిన్హ్జీ 0)👉1999లో న్యూజిలాండ్తో మొహాలీ మ్యాచ్లో- 0 (దేవాంగ్ గాంధీ 0, సదగోపన్ రమేశ్ 0)👉2010లో న్యూజిలాండ్తో అహ్మదాబాద్ మ్యాచ్లో- 1 (గంభీర్ 0, సెహ్వాగ్ 1)👉2025లో సౌతాఫ్రికాతో కోల్కతాలో మ్యాచ్లో- 1 (జైస్వాల్0, కేఎల్ రాహుల్ 1).చదవండి: ఐసీయూలో శుబ్మన్ గిల్ -
సౌతాఫ్రికా ఆలౌట్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
టీమిండియాతో తొలి టెస్టులో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా (Temba Bavuma) అర్ధ శతకంతో మెరిశాడు. మొదటి ఇన్నింగ్స్లో పూర్తిగా విఫలమైన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం నిలకడగా ఆడుతూ యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. టెస్టుల్లో తన 26వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.రెండు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్- సౌతాఫ్రికా (IND vs SA 1st Test) మధ్య శుక్రవారం తొలి మ్యాచ్ మొదలైంది. కోల్కతాలో టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి.. తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఐదు వికెట్లతో రాణించి.. సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ను కుదేలు చేశాడు.31, 39.. తొలి ఇన్నింగ్స్లో టాప్ స్కోర్లు ఇవేఇక తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ 31 పరుగులతో సఫారీ టాప్ రన్ స్కోరర్గా నిలవగా.. బవుమా పదకొండు బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులే చేసి నిష్క్రమించాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ధ్రువ్ జురెల్కు క్యాచ్ ఇచ్చి బవుమా పెవిలియన్ చేరాడు.అనంతరం భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 189 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 39 పరుగులతో టీమిండియా టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఈ క్రమంలో శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా.. ఆట పూర్తయ్యేసరికి ఏడు వికెట్లు నష్టపోయి 93 పరుగులే చేసింది. కెప్టెన్ బవుమా 29, కార్బిన్ బాష్ ఒక పరుగులో క్రీజులో నిలిచారు.జోడీని విడదీసిన బుమ్రాఈ క్రమంలో 93/7 ఓవర్నైట్ స్కోరుతో ఆదివారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన సౌతాఫ్రికా కాసేపటికే ఎనిమిదో వికెట్ కోల్పోయింది. బవుమాతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేసిన టెయిలెండర్ బాష్ను బుమ్రా అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు. బవుమా- బాష్ (25) జోడీని విడదీసి భారత్కు బ్రేక్ ఇచ్చాడు.ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన సిరాజ్అయితే, బవుమా మాత్రం జిడ్డు బ్యాటింగ్తో క్రీజులో పాతుకుపోయాడు. బుమ్రా బౌలింగ్లో ఫోర్ బాది.. 122 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక ప్రొటిస్ ఇన్నింగ్స్ 54వ ఓవర్ మూడో బంతికి సిరాజ్ సైమన్ హార్మర్ (20 బంతుల్లో 7)ను బౌల్డ్ చేయడంతో సౌతాఫ్రికా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. సఫారీ జట్టు ఆలౌట్అదే ఓవర్లో ఆఖరి బంతికి సిరాజ్ మియా కేశవ్ మహరాజ్ (0)ను పదో వికెట్గా వెనక్కి పంపడంతో సఫారీ జట్టు ఆలౌట్ అయింది. మొత్తంగా 54 ఓవర్ల ఆటలో 153 పరుగులు చేసింది. ఈ క్రమంలో 123 పరుగుల ఆధిక్యం సంపాదించిన సౌతాఫ్రికా.. టీమిండియాకు 124 పరుగుల లక్ష్యాన్ని విధించింది. కాగా తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు ముప్పై పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కిన విషయం తెలిసిందే. దీంతో టార్గెట్ 124 (153-30=123) పరుగులుగా మారింది. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో స్పిన్నర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. కుల్దీప్ యాదవ్ రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు. మూడోరోజు బుమ్రా ఒక వికెట్ పడగొట్టగా.. సిరాజ్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.చదవండి: సౌతాఫ్రికా బ్యాటర్లకు చుక్కలు చూపించిన జడ్డూ -
IPL 2026: వేలానికి సిద్ధం.. ఎవరి పర్సులో ఎంత?.. ఎన్ని ఖాళీలు?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2026 వేలానికి ఫ్రాంఛైజీలు సిద్ధమయ్యాయి. తమకు కావాల్సిన ఆటగాళ్లను అట్టిపెట్టుకున్న యాజమాన్యాలు.. భారం అనుకున్న ప్లేయర్లను వదిలించుకున్నాయి. ఇందులో ముఖ్యంగా కోల్కతా నైట్ రైడర్స్ వెంకటేశ్ అయ్యర్ (రూ. 23.75 కోట్లు) వదిలేయడం హైలైట్గా నిలిచింది.వేలంలోకి వదిలేశాయిమరోవైపు సన్రైజర్స్ హైదరాబాద్ టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami)ని రూ. 10 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్కు ట్రేడ్ చేసింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ రూ. 13 కోట్ల ఆటగాడు శ్రీలంక పేసర్ మతీశ పతిరణను జట్టు నుంచి రిలీజ్ చేయగా.. లక్నో సూపర్ జెయింట్స్ భారత స్పిన్నర్ రవి బిష్ణోయి (రూ. 11 కోట్లు)ని వేలంలోకి వదిలింది.ఇక తాజా సీజన్లో చెత్త ప్రదర్శన కనబరిచిన ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ (Glenn Maxwell- రూ. 4.2 కోట్లు)ను పంజాబ్ కింగ్స్ వదలించుకుంది. కాగా నిబంధనల ప్రకారం ఒక్కో ఫ్రాంఛైజీ పర్సు వాల్యూ రూ. 110 కోట్లు. మరి తాజాగా అట్టిపెట్టుకున్న, వదిలేసిన ఆటగాళ్ల జాబితా విడుదల చేసిన తర్వాత ఏ జట్టు పర్సులో ఎంత ఉంది? ఆయా జట్లలో ఉన్న ఖాళీలు ఎన్ని? తదితర వివరాలు చూద్దాం.పది ఫ్రాంఛైజీల పర్సులో వేలం కోసం అందుబాటులో ఉన్న డబ్బు💰గుజరాత్ టైటాన్స్- రూ. 12.9 కోట్లు💰సన్రైజర్స్ హైదరాబాద్- రూ. 25.5 కోట్లు💰లక్నో సూపర్ జెయింట్స్- రూ. 22.95 కోట్లు💰పంజాబ్ కింగ్స్- రూ. 22.95 కోట్లు💰రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- రూ. 16.4 కోట్లు💰ఢిల్లీ క్యాపిటల్స్- రూ. 21.8 కోట్లు💰ముంబై ఇండియన్స్- రూ. 2.75 కోట్లు💰కోల్కతా నైట్ రైడర్స్- రూ. 64.3 కోట్లు💰రాజస్తాన్ రాయల్స్- రూ. 16.05 కోట్లు💰చెన్నై సూపర్ కింగ్స్- రూ. 43.4 కోట్లు👉కాగా వెంకటేశ్ అయ్యర్తో పాటు రూ. 12 కోట్ల విలువైన వెస్టిండీస్ దిగ్గజ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ను వదులుకోవడంతో కోల్కతా ఖాతాలో అన్ని ఫ్రాంఛైజీల కంటే ఎక్కువ సొమ్ము ఉంది.ఏ జట్టులో ఎన్ని ఖాళీలు?🏏గుజరాత్ టైటాన్స్- 5 (✈️నలుగురు విదేశీ ప్లేయర్లకు చోటు)🏏సన్రైజర్స్ హైదరాబాద్- 10 (✈️ఇద్దరు విదేశీ ప్లేయర్లకు చోటు)🏏లక్నో సూపర్ జెయింట్స్- 6 (✈️నలుగురు విదేశీ ప్లేయర్లకు చోటు)🏏పంజాబ్ కింగ్స్- 4 (✈️ఇద్దరు విదేశీ ప్లేయర్లకు చోటు)🏏రాయల్ చాలెంజర్స్ బెంగళూరు - 8 (✈️ఇద్దరు విదేశీ ప్లేయర్లకు చోటు)🏏ఢిల్లీ క్యాపిటల్స్- 8 (✈️ఐదుగురు విదేశీ ప్లేయర్లకు చోటు)🏏ముంబై ఇండియన్స్- 5 (✈️ఒక విదేశీ ప్లేయర్కు చోటు)🏏కోల్కతా నైట్ రైడర్స్- 13 (✈️ఆరుగురు విదేశీ ప్లేయర్లకు చోటు)🏏రాజస్తాన్ రాయల్స్- 9 (✈️ఒక విదేశీ ప్లేయర్కు చోటు)🏏చెన్నై సూపర్ కింగ్స్- 9 (✈️నలుగురు విదేశీ ప్లేయర్లకు చోటు). చదవండి: IPL 2026: పది ఫ్రాంఛైజీలు విడిచిపెట్టిన ఆటగాళ్లు వీరేIPL 2026: రిటెన్షన్ జాబితా విడుదల చేసిన ఫ్రాంఛైజీలు -
ఐసీయూలో శుబ్మన్ గిల్!.. టీమిండియాకు ఊహించని షాక్!
టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) గాయం తీవ్రతరమైనట్లు తెలుస్తోంది. దీంతో అతడు తొలి టెస్టులో మిగిలిన ఆటకు.. రెండో టెస్టుకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.బిజీబిజీకాగా టెస్టు, వన్డే సారథి గిల్ విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. ఆసియా టీ20 కప్ టోర్నీ ముగిసిన వెంటనే.. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్. తాజాగా స్వదేశంలో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ (IND vs SA)లో భారత జట్టును ముందుకు నడిపిస్తున్నాడు.కోల్కతాలో సఫారీ జట్టుతో శుక్రవారం మొదలైన టెస్టులో రెండో రోజు ఆట ముగిసేసరికి టీమిండియా పటిష్టస్థితిలో నిలిచింది. అయితే, శనివారం నాటి ఆట సందర్భంగా కెప్టెన్ గిల్ మెడకు గాయమైంది. నాలుగో నంబర్ బ్యాటర్గా క్రీజులోకి వచ్చిన గిల్ మూడు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ బాది రిటైర్డ్ హర్ట్ అయ్యాడు.నొప్పి ఎక్కువగా ఉండటంతోప్రొటిస్ స్పిన్నర్ సైమన్ హార్మర్ బౌలింగ్లో స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన గిల్కు మెడపట్టేసింది. వెంటనే ఫిజియో వచ్చి గిల్ను పరిశీలించాడు. నొప్పి ఎక్కువగా ఉండటంతో గిల్ను డ్రెసింగ్రూమ్కు తీసుకువెళ్లారు. ఆ తర్వాత గాయం తీవ్రత దృష్ట్యా అతడిని కోల్కతాలోని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.ఐసీయూలో చికిత్సఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. గిల్ ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతున్నట్లు తెలిపాయి. అయితే, ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా ముందుజాగ్రత్త చర్యగానే వైద్యుల సమక్షంలో ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ చేయిస్తున్నట్లు వెల్లడించాయి.ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానేగిల్ కోసం ప్రత్యేకంగా డాక్టర్స్ ప్యానెల్ ఏర్పాటైందని.. క్రిటికల్ కేర్ స్పెషలిస్టు, న్యూరోసర్జన్, న్యూరాలజిస్ట్, కార్డియాలజిస్ట్ అతడిని పరిశీలిస్తున్నారని తెలిపాయి. ప్రస్తుతం గిల్ వుడ్లాండ్స్ ఆస్పత్రిలో ఉన్నాడని.. పెద్దగా సమస్య లేకపోయినా.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ మేరకు కేర్ తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. ఏదేమైనా వైద్య పరీక్షలు పూర్తైన తర్వాతే అతడు మళ్లీ మైదానంలో దిగుతాడా? లేదా? అన్నది తేలుతుందని తెలిపాయి.కాగా తొలి ఇన్నింగ్స్లో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన గిల్.. ఆ తర్వాత కూడా మళ్లీ బ్యాటింగ్కు రాలేదు. దీంతో అతడిని రిటైర్డ్ అవుట్గా ప్రకటించారు. ఈ మ్యాచ్లో భారత్ 189 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకు ముందు సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకే కుప్పకూల్చింది. దీంతో ముప్పై పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. ఇక రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో కేవలం 93 పరుగులు చేసి ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.బీసీసీఐ అప్డేట్గిల్ తొలి టెస్టుకు దూరమయ్యాడని బీసీసీఐ తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికి త్స పొందుతున్నాడని తెలిపింది. వైద్యులు నిరంతరం అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని పేర్కొంది.చదవండి: IPL 2026: కెప్టెన్ పేరును ప్రకటించిన సీఎస్కే -
IPL 2026: జడేజా జెర్సీ మారింది
ముంబై: ఐపీఎల్ ‘ఫైవ్ స్టార్’ చాంపియన్లలో ఒకటైన చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే) పెనుమార్పే చేసింది. గత రెండు సీజన్లుగా చెత్త ప్రదర్శనతో చతికిలబడిన ఈ జట్టు వచ్చే సీజన్కు ముందు పతాక శీర్షికలకెక్కే నిర్ణయం తీసుకుంది. అనుభవజ్ఞుడైన ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను అనూహ్యంగా బదిలీ చేసేసింది. సీఎస్కే దిగ్గజ కెప్టెన్ ధోని స్వయంగా ‘సర్ రవీంద్ర జడేజా’ అంటూ నెత్తిన పెట్టుకున్న సహచరుణ్ని... టాపార్డర్ డాషింగ్ బ్యాటర్ సంజూ సామ్సన్ కోసం రాజస్తాన్ రాయల్స్కు ట్రేడ్ ట్రాన్స్ఫర్ చేసింది. రాయల్స్ జడేజాను తీసుకోగా, సామ్సన్ చెన్నై చెంత చేరాడు. మాజీ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) తమ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ను విడుదల చేసింది. రెండుసార్లు రిటెయిన్ చేసుకున్న ఫ్రాంచైజీ ఎట్టకేలకు కరీబియన్ ఆల్రౌండర్తో 11 ఏళ్ల బంధాన్ని తెంచుకుంది. రూ.23.75 కోట్లు వేలంలో పాడి మరీ కొనుక్కొన్న వెంకటేశ్ అయ్యర్ను వెంటనే ఒక సీజన్కే సాగనంపింది. సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) వెటరన్ సీమర్ మొహహ్మద్ షమీని లక్నో సూపర్ జెయంట్స్ ట్రేడ్లో తీసుకుంది. మొత్తం పది ఫ్రాంచైజీల్లో అత్యధిక పర్స్ మొత్తం కోల్కతా వద్దే ఉంది. కేకేఆర్ పర్స్లో రూ. 64.30 కోట్లుండగా, 6 విదేశీ ఆటగాళ్లు సహా 13 మందిని వేలంలో కొనాలి. అత్యల్ప పర్స్ ముంబై జట్టులో ఉంది. ముంబై ఇండియన్స్ వద్ద కనీసం మూడు కోట్లయినా లేవు. చేతిలో ఉన్న రూ.2.75 కోట్లతో ఒక విదేశీ ప్లేయర్ సహా ఐదు మందిని కొనుగోలు చేయాలి. చెప్పుకోదగ్గ మార్పులు చెన్నై ఒక్క జడేజాతో సరిపెట్టలేదు. విదేశీ స్టార్లు డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, స్యామ్ కరన్లాంటి హిట్టర్లతో పాటు ‘యార్కర్ స్పెషలిస్ట్’ పతిరణను వదులుకుంది. కేకేఆర్ రసెల్, అయ్యర్, డికాక్, మొయిన్ అలీలాంటి బ్యాటర్లతో పాటు సఫారీ పేసర్ నోర్జేని సాగనంపింది. పంజాబ్ కింగ్స్ మేటి విదేశీ హిట్టర్లను విడుదల చేసింది. మ్యాక్స్వెల్, ఇన్గ్లిస్లను వదిలేసుకుంది. తొలి సీజన్ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్ తమ తురుపుముక్క, నాలుగు సీజన్లు జట్టును నడిపించిన సంజూ సామ్సన్నే కాదు హసరంగ, తీక్షణ, నితీశ్ రాణాలను వద్దనుకుంది. భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ను వేలంలో ఏ జట్టు కన్నెత్తి చూడకపోయినా ప్రాథమిక ధరకే కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్ ఈసారి అర్జున్ను లక్నో సూపర్ జెయింట్స్ ట్రేడింగ్లో కొనేందుకు సమ్మతించింది.పాత గూటికి... సీఎస్కేతో జడేజా బంధం సుదీర్ఘమైందే కానీ... మొదలైంది మాత్రం రాజస్తాన్ రాయల్స్తోనే! లీగ్ మొదలైన ఏడాదే (2008) తొలి చాంపియన్గా నిలిచిన రాయల్స్ జట్టు సభ్యుడు జడేజా ఆ మరుసటి ఏడాది కూడా రాజస్తాన్తోనే ఉన్నాడు. కానీ కాంట్రాక్టు ఒప్పందం ఉల్లంఘన కారణంతో 2010లో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అతనిపై ఏడాది నిషేధం విధించింది. 2011లో కొత్తగా వచ్చిన ఫ్రాంచైజీ కొచ్చి టస్కర్స్ కేరళ (ఇప్పుడు లేదు)కు ఆడాడు. 2012 నుంచి ఈ సీజన్ వరకు మధ్యలో రెండేళ్లు (2016, 2017లో సీఎస్కేపై నిషేధం కారణంగా గుజరాత్ లయన్స్) తప్ప సూపర్కింగ్స్లో విజయవంతమైన ఆల్రౌండర్గా ఉన్నాడు.ఫ్రాంచైజీలు విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాచెన్నై: రవీంద్ర జడేజా, ఆండ్రీ సిద్ధార్్థ, దీపక్ హుడా, కాన్వే, రచిన్ రవీంద్ర, పతిరణ, స్యామ్ కరన్, కమలేశ్ నాగర్కోటి, రాహుల్ త్రిపాఠి, షేక్ రషీద్, వంశ్ బేడీ, విజయ్ శంకర్. ఢిల్లీ: డొనోవాన్ ఫెరీరా, దర్శన్, డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్, మన్వంత్, మోహిత్ శర్మ, సిద్దీఖుల్లా. గుజరాత్: రూథర్ఫర్డ్, షనక, కొయెట్జీ, కరీమ్, కుల్వంత్, మహిపాల్ లామ్రోర్. కోల్కతా: రసెల్, వెంకటేశ్ అయ్యర్, నోర్జే, చేతన్ సకారియా, సిసోడియా, మొయిన్ అలీ, డికాక్, గుర్బాజ్, జాన్సన్. లక్నో: శార్దుల్ ఠాకూర్, డేవిడ్ మిల్లర్, రవి బిష్ణోయ్, ఆకాశ్దీప్, షామర్ జోసెఫ్, ఆర్యన్, యువరాజ్, రాజ్యవర్ధన్. ముంబై: అర్జున్ టెండూల్కర్, జాకబ్స్, కరణ్ శర్మ, లిజాద్, ముజీబుర్ రహ్మాన్, టోప్లీ, శ్రీజిత్, సత్యనారాయణ రాజు, విఘ్నేశ్. పంజాబ్: మ్యాక్స్వెల్, ఇన్గ్లిస్, ఆరోన్, జేమీసన్, కుల్దీప్ సేన్, ప్రవీణ్ దూబే. రాజస్తాన్: సామ్సన్, నితీశ్ రాణా, ఆకాశ్, అశోక్, ఫజల్హక్, కార్తీకేయ, కునాల్ రాథోడ్, తీక్షణ, హసరంగ. బెంగళూరు: లివింగ్స్టోన్, ఇన్గిడి, మయాంక్ అగర్వాల్, మనోజ్, స్వస్తిక్ చికారా, మోహిత్ రాఠి. హైదరాబాద్: షమీ, అథర్వ, సచిన్ బేబీ, అభినవ్ మనోహర్, ముల్డర్, ఆడమ్ జంపా, సిమర్జీత్, రాహుల్ చహర్. -
శుభం కార్డు నేడే?
ఔరా... క్రికెట్! ఇదేం వికెట్! బ్యాటింగ్ ఫ్రెండ్లీ క్రికెట్లో గేమ్ ఛేంజర్లంతా బ్యాటర్లే! మెరుపులైనా, సునామీలైనా బ్యాట్లతోనే చూశాం. కానీ ఈడెన్ గార్డెన్స్ టెస్టు చూస్తే మాత్రం ‘ఇది గతం... బౌలర్లు ఘనం’ అనక తప్పదు! ఎందుకంటే బౌలింగ్ జోరు ఒక సెషన్కే సరిపెట్టుకోలేదు... ఓ రోజుకే పరిమితం కాలేదు. వరుసగా ఆరు సెషన్లు బ్యాట్లు డీలా... బ్యాటర్లు విలవిలలాడేలా బౌలర్లు భళా అనిపించారు. సంప్రదాయ క్రికెట్కే కొత్త ఉత్తేజాన్నిచ్చేలా... మూడు రోజుల్లోనే ఫలితం వచ్చేలా ఇరు జట్ల బౌలర్లు గ్రే‘టెస్టు’ క్రికెట్ ఆడుతున్నారు. కోల్కతా: మార్క్రమ్ 31... కేఎల్ రాహుల్ 39... తొలి రెండు రోజుల్లో దక్షిణాఫ్రికా, భారత్ ఓపెనర్లు చేసిన పరుగులివి! రెండు జట్ల ఇన్నింగ్స్ల్లో టాప్ స్కోర్లు కూడా ఇవే! టెస్టులో రెండు సెషన్లు ఆడితే సెంచరీ... రెండో రోజు నిలబడితే డబుల్ సెంచరీ, ఆ రోజంతా అజేయంగా నిలిస్తే ట్రిపుల్ సెంచరీ... జెంటిల్మెన్ క్రికెట్లో సర్వసాధారణమిది. కానీ రెండు రోజుల్లో మూడో ఇన్నింగ్స్ (ఒక జట్టు రెండో ఇన్నింగ్స్)లైనా కూడా ఫిఫ్టీ కాదు కదా కనీసం 40 పరుగులైనా చేయకపోతే అది ముమ్మాటికీ బౌలింగ్ సత్తానే కాక మరేమిటి! ధనాధన్ షో చూసిన వారికి ఫటాఫట్ వికెట్లు, ఆలౌట్ మీద ఆలౌట్లు కనబడుతున్నాయి. ఎంత పటిష్ట బ్యాటింగ్ లైనప్లతో దిగినా... స్పిన్ బౌలింగ్–బ్యాటింగ్ ఆల్రౌండర్లను మోహరించినా... బంతి శాసిస్తోంది ఈ టెస్టుని! క్రీజులోని బ్యాటర్లకు ప్రతీ బంతికి పెడుతోంది అగ్నిపరీక్షని! రెండో సెషన్లోనే భారత్ కూలింది! భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఈడెన్గార్డెన్స్లో మొదలైన మొదటి టెస్టులో బంతి సవాల్ విసురుతోంది. ఓవర్నైట్ స్కోరు 37/1తో శనివారం రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ రెండో సెషన్ అయినా పూర్తిగా ఆడలేక 62.2 ఓవర్లలోనే తొలి ఇన్నింగ్స్లో 189 పరుగులకే కుప్పకూలింది. దీంతో మొదటి రోజే టెస్టుపై పట్టుబిగించిందనుకున్న ఆతిథ్య జట్టుకు... పట్టుబిగించింది మన జట్టు కాదు... బౌలర్లు అన్న విషయం రెండో రోజు రెండో సెషన్లోనే అర్థమైంది. రాహుల్ (39; 4 ఫోర్లు, 1 సిక్స్), వాషింగ్టన్ సుందర్ (29; 2 ఫోర్లు, 1 సిక్స్) ఈ ఓవర్నైట్ బ్యాటింగ్ జోడీ చేసిన 57 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యమే అతి పెద్ద పార్ట్నర్షిప్! రిషభ్ పంత్ (27; 2 ఫోర్లు, 2 సిక్స్లు), జడేజా (27; 3 ఫోర్లు)లు రెండు పదుల స్కోర్లు దాటారు. ఇక పర్యాటక బౌలర్లలో హార్మర్ 4, యాన్సెన్ 3 వికెట్లు తీశారు. జడేజా ఉచ్చులో పడి... భారత్కు తొలి ఇన్నింగ్స్లో 30 పరుగుల ఆధిక్యం లభించగా... రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా మెడకు జడేజా స్పిన్ ఉచ్చు బిగించాడు. తొలిరోజు బుమ్రా, సిరాజ్ల పేస్ అదిరిపోవడంతో వెనుకబడిన జడేజా... స్పిన్, తన విశేషానుభవాన్ని వినియోగించి సఫారీ బ్యాటర్లను క్రీజులో నిలువనీయలేదు. దీంతో ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 93/7 స్కోరు చేసిన దక్షిణాఫ్రికా ఆలౌటయ్యేందుకు సిద్ధమైపోయింది. కెప్టెన్ బవుమా (29 బ్యాటింగ్, 3 ఫోర్లు) తప్ప ఇంకెవరూ 20 పరుగులైనా చేయలేకపోయారు. కెపె్టన్తో పాటు బాష్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. జడేజా 4 వికెట్లు పడగొట్టగా, కుల్దీప్కు 2, అక్షర్కు ఒక వికెట్ దక్కాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 63 పరుగుల ఆధిక్యంలో ఉంది.92 టెస్టుల్లో రిషభ్ పంత్ కొట్టిన సిక్స్లు. ఈ ఫార్మాట్లో అత్యధిక సిక్స్లు కొట్టిన భారతీయ బ్యాటర్గా రిషభ్ పంత్ గుర్తింపు పొందాడు. 91 సిక్స్లతో వీరేంద్ర సెహ్వాగ్ (103 టెస్టుల్లో) పేరిట ఉన్న రికార్డును పంత్ బద్దలు కొట్టాడు. పంత్ 48 టెస్టుల్లోనే సెహ్వాగ్ను దాటేశాడు.2 తొలి ఇన్నింగ్స్లో 27 పరుగులు చేసిన క్రమంలో రవీంద్ర జడేజా టెస్టుల్లో 4000 పరుగుల మైలురాయిని దాటాడు. తద్వారా కపిల్ దేవ్ తర్వాత టెస్టుల్లో 4000 పరుగులు చేయడంతోపాటు 300 వికెట్లు పడగొట్టిన రెండో భారతీయ క్రికెటర్గా, ఓవరాల్గా నాలుగో క్రికెటర్గా జడేజా గుర్తింపు పొందాడు.స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 159; భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) యాన్సెన్ 12; రాహుల్ (సి) మార్క్రమ్ (బి) కేశవ్ 39; సుందర్ (సి) మార్క్రమ్ (బి) హార్మర్ 29; గిల్ (రిటైర్డ్హర్ట్) 4; పంత్ (సి) వెరీన్ (బి) బాష్ 27; జడేజా (ఎల్బీడబ్ల్యూ) (బి) హార్మర్ 27; ధ్రువ్ జురేల్ (సి అండ్ బి) హార్మర్ 14; అక్షర్ (సి) యాన్సెన్ (బి) హార్మర్ 16; కుల్దీప్ యాదవ్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 1; సిరాజ్ (బి) యాన్సెన్ 1; బుమ్రా (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 18; మొత్తం (62.2 ఓవర్లలో ఆలౌట్) 189. వికెట్ల పతనం: 1–18, 2–75, 3–109, 4–132, 5–153, 6–171, 7–172, 8–187, 9–189. బౌలింగ్: యాన్సెన్ 15–4–35–3, ముల్డర్ 5–1–15–0, కేశవ్ మహరాజ్ 16–1–66–1, కార్బిన్ బాష్ 11–4–32–1, సైమన్ హార్మర్ 15.2– 4–30–4. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: రికెల్టన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 11; మార్క్రమ్ (సి) జురేల్ (బి) జడేజా 4; ముల్డర్ (సి) పంత్ (బి) జడేజా 11; తెంబా బవుమా (బ్యాటింగ్) 29; డి జోర్జి (సి) జురేల్ (బి) జడేజా 2; స్టబ్స్ (బి) జడేజా 5; కైల్ వెరీన్ (బి) అక్షర్ పటేల్ 9; మార్కో యాన్సెన్ (సి) రాహుల్ (బి) కుల్దీప్ 13; కార్బిన్ బాష్ (బ్యాటింగ్) 1; ఎక్స్ట్రాలు 8; మొత్తం (35 ఓవర్లలో 7 వికెట్లకు) 93. వికెట్ల పతనం: 1–18, 2–25, 3–38, 4–40, 5–60–, 6–75, 7–91. బౌలింగ్: బుమ్రా 6–1–14–0, అక్షర్ 11–0–30–1, కుల్దీప్ 5–1–12–2, రవీంద్ర జడేజా 13–3–29–4. -
భారత్ ‘ఎ X పాక్ ‘ఎ’
దోహా: భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మరోసారి పోరుకు రంగం సిద్ధమైంది. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీలో భాగంగా నేడు భారత్ ‘ఎ’, పాకిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరగనుంది. యూఏఈతో జరిగిన మ్యాచ్లో 42 బంతుల్లో 11 ఫోర్లు, 15 సిక్స్లతో 144 పరుగులు చేసిన భారత టీనేజ్ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే అందరి దృష్టి ఉంది. సెప్టెంబర్ లో యూఏఈలో జరిగిన ఆసియా కప్ టి20 టోర్నీలో పాకిస్తాన్, భారత ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకోలేదు. మరి ఈ మ్యాచ్లో జితేశ్ శర్మ నాయకత్వంలోని భారత ‘ఎ’ జట్టు సభ్యులు కూడా పాకిస్తాన్ ‘ఎ’ ఆటగాళ్లతో కరచాలనం చేసే అవకాశం కనిపించడంలేదు. -
సన్రైజర్స్ వ్యూహం.. అతడు జట్టుతోనే.. పర్సులో ఇంకెంత?
ఐపీఎల్-2026 వేలం నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంఛైజీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami)ని.. లక్నో సూపర్ జెయింట్స్కు ట్రేడ్ చేసింది ఎస్ఆర్హెచ్. తాజాగా వచ్చే సీజన్కు గానూ అట్టిపెట్టుకునే, వదిలేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది.రాహుల్ చహర్, అభినవ్ మనోహర్, ఆడం జంపా (Adam Zampa), సిమర్జీత్ సింగ్ వంటి ఆటగాళ్లను వదిలించుకుని పర్సును నింపుకొంది. షమీని ట్రేడ్ చేయడం ద్వారా రూ. 10 కోట్లను ఖాతాలో వేసుకుంది. అయితే, ముందు నుంచి ప్రచారం జరిగినట్లుగా సౌతాఫ్రికా స్టార్ హెన్రిచ్ క్లాసెన్ను సన్రైజర్స్ వేలంలోకి వదల్లేదు.అతడు జట్టుతోనే.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, ట్రవిస్ హెడ్ వంటి స్టార్ ప్లేయర్లతో పాటు.. క్లాసెన్ను అట్టిపెట్టుకుంది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఐపీఎల్-2025లో సన్రైజర్స్ టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. 13 ఇన్నింగ్స్లో కలిపి 487 పరుగులు సాధించాడు. ఇందులో ఓ అజేయ శతకం (105) ఉండటం విశేషం.ఈ సీజన్లో సన్రైజర్స్ పద్నాలుగింట కనీసం ఆరైనా గెలిచిందంటే అందుకు కారణమైన వాళ్లలో క్లాసెన్ ముఖ్యుడు. అయితే, అతడి ప్రైజ్ ట్యాగ్ (రూ. 23 కోట్లు) కారణంగానే వేలంలోకి వదులుతారనే ఊహాగానాలు వచ్చినా.. ఫ్రాంఛైజీ మాత్రం ఆ పని చేయలేదు.పర్సులో వేలం కోసం రూ. 25.50 కోట్లురాబోయే సీజన్కు ముందు మొత్తానికి సన్రైజర్స్ ఎనిమిది మంది ఆటగాళ్లను వదిలేసింది. ఇందులో ఇద్దరు విదేశీ ప్లేయర్లు ఉండగా.. ఆరుగురు భారత క్రికెటర్లు ఉన్నారు. వీరిని రిలీజ్ చేయడం ద్వారా సన్రైజర్స్ పర్సులో వేలం కోసం రూ. 25.50 కోట్లు మిగిలాయి. మొత్తంగా పది స్లాట్లు ఖాళీ ఉండగా.. ఇందులో ఇద్దరు విదేశీ ఆటగాళ్లకు చోటు ఉంటుంది.సన్రైజర్స్ హైదరాబాద్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాప్యాట్ కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్, స్మరణ్ రవిచంద్రన్, అనికేత్ వర్మ, జీషన్ అన్సారీ, హర్ష్ దూబే, కమిందు మెండిస్, ఇషాన్ మలింగ, బ్రైడన్ కార్స్. సన్రైజర్స్ విడుదల చేసిన ఆటగాళ్లు వీరేరాహుల్ చహర్ (రూ. 3.20 కోట్లు), అభినవ్ మనోహర్ (రూ. 3.20 కోట్లు), ఆడం జంపా (రూ. 2.40 కోట్లు), ఆడం జంపా (రూ. 2.40 కోట్లు), సిమర్జీత్ సింగ్ (రూ. 1.50 కోట్లు), వియాన్ ముల్దర్ (రూ. 70 లక్షలు), అథర్వ టైడే (రూ. 30 లక్షలు), సచిన్ బేబి (రూ. 30 లక్షలు), మొహమ్మద్ షమీ (రూ. 10 కోట్లు- ట్రేడింగ్).చదవండి: వెంకటేశ్ అయ్యర్కు భారీ షాక్.. పది ఫ్రాంఛైజీలు విడిచిపెట్టిన ఆటగాళ్లు వీరే -
IPL 2026: కెప్టెన్ పేరును ప్రకటించిన సీఎస్కే
ఐపీఎల్-2026 మినీ వేలానికి (IPL 2026 Auction) ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కీలక నిర్ణయం తీసుకుంది. పదమూడేళ్లుగా తమతో ఉన్న రవీంద్ర జడేజాను రాజస్తాన్ రాయల్స్కు ట్రేడ్ చేసింది. జడ్డూకు బదులుగా రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson)ను జట్టులోకి చేర్చుకుంది.ఏకంగా రూ. 18 కోట్లుసంజూ కోసం సీఎస్కే ఏకంగా రూ. 18 కోట్లు చెల్లించగా.. రాయల్స్ మాత్రం జడ్డూ ధరను రూ. 18 కోట్ల నుంచి రూ. 14 కోట్లకు తగ్గించింది. జడేజాతో పాటు సామ్ కర్రాన్ను సీఎస్కే నుంచి ట్రేడ్ చేసుకుంది. ఇక కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్కు సీఎస్కే ఇంతటి ప్రాధాన్యం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.కెప్టెన్ పేరును ప్రకటించిన సీఎస్కేఈ నేపథ్యంలోనే సంజూకు సీఎస్కే కెప్టెన్సీ అప్పగిస్తారనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. అయితే, ఈ ఊహాగానాలకు సీఎస్కే ఫ్రాంఛైజీ స్వయంగా తెరదించింది. రుతురాజ్ గైక్వాడ్నే తమ కెప్టెన్గా కొనసాగిస్తామని శనివారం స్పష్టం చేసింది. ‘‘ముందుకు నడిపించే సారథి.. మా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్’’ అంటూ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ధ్రువీకరించింది.వైస్ కెప్టెన్గా?అంతేకాదు.. సంజూను వికెట్ కీపర్గానూ ఉపయోగించుకునేందుకు సీఎస్కే సిద్ధంగా లేనట్లే. దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని ఉండగా.. కీపింగ్ సేవలు వేరే ఎవరి చేతికి ఇచ్చేందుకు ఫ్రాంఛైజీ ఆసక్తి చూపదన్నది బహిరంగ రహస్యమే. కాబట్టి సంజూ సీఎస్కేలో ఓ సాధారణ క్రికెటర్గా మాత్రమే ఉంటాడు. అయితే, టాపార్డర్లో అతడు కీలక ఆటగాడు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రుతుకు డిప్యూటీగా వైస్ కెప్టెన్గా నియమితుడైనా ఆశ్చర్యం లేదు.కేవలం నాలుగే గెలిచికాగా గత నాలుగు సీజన్లుగా రాజస్తాన్ రాయల్స్ సారథిగా ఉన్న సంజూ.. 2022లో జట్టును ఫైనల్కు చేర్చాడు. ఇదిలా ఉంటే.. 2024 సీజన్లో ధోని నుంచి పగ్గాలు అందుకున్న రుతురాజ్ కెప్టెన్గా ఇంత వరకు తనదైన ముద్ర వేయలేదు. తాజా ఎడిషన్లో గాయం కారణంగా అతడు మధ్యలోనే నిష్క్రమించగా.. మళ్లీ ధోనినే జట్టును ముందుకు నడిపించాడు.అయితే, ఈసారి సీఎస్కే ప్రదర్శన మరీ దారుణంగా ఉంది. పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి పాయింట్ల పట్టికలో చిట్టచివరన పదోస్థానంలో నిలిచింది. అందుకే ఐపీఎల్-2026కు ముందే చాలా మంది ఆటగాళ్లను వదిలించుకున్న సీఎస్కే.. వేలంలో మెరికల్లాంటి ప్లేయర్లను కొనుగోలు చేయాలనే వ్యూహంతో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు (CSK Retention List)రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, ఎంఎస్ ధోనీ, ఉర్విల్ పటేల్, సంజు శాంసన్ (RR నుంచి ట్రేడింగ్), శివమ్ దూబే, జామీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జన్ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, శ్రేయాష్ గోపాల్, ముకేశ్ చౌదరి.చెన్నై సూపర్ కింగ్స్ విడిచిపెట్టిన ఆటగాళ్లుమతీశ పతిరణ, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, దీపక్ హుడా, వన్ష్ బేడి, సి ఆండ్రీ సిద్దార్థ్, షేక్ రషీద్, కమ్లేశ్ నాగర్కోటి, రవీంద్ర జడేజా (ట్రేడింగ్), సామ్ కర్రాన్ (ట్రేడింగ్).చదవండి: వెంకటేశ్ అయ్యర్కు భారీ షాక్.. పది ఫ్రాంఛైజీలు విడిచిపెట్టిన ఆటగాళ్లు వీరే -
చరిత్ర సృష్టించిన జడేజా.. భారత తొలి క్రికెటర్గా..
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) సత్తా చాటాడు. కోల్కతా వేదికగా శనివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా బ్యాట్తో, బాల్తో రాణించాడు.భారత తొలి ఇన్నింగ్స్లో 45 బంతులు ఎదుర్కొన్న జడ్డూ.. మూడు ఫోర్ల సాయంతో 27 పరుగులు చేశాడు. అయితే, సైమన్ హార్మర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ కావడంతో ఈ లెఫ్లాండర్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఏదేమైనా భారత్ 189 పరుగుల మెరుగైన స్కోరు చేయడంలో జడ్డూ తన వంతు పాత్రను పోషించాడని చెప్పవచ్చు.ఆకాశమే హద్దుగాఇక సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో ఎనిమిది ఓవర్ల బౌల్ చేసి పదమూడు పరుగులు మాత్రమే ఇచ్చిన జడ్డూ.. వికెట్ మాత్రం తీయలేకపోయాడు. అయితే, రెండో ఇన్నింగ్స్లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈడెన్ గార్డెన్స్లో శనివారం నాటి రెండో రోజు ఆటలో జడ్డూ 13 ఓవర్లు బౌలింగ్ చేసి 29 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.భారత తొలి క్రికెటర్గా రికార్డుప్రొటిస్ బ్యాటర్లు ఐడెన్ మార్క్రమ్ (4), వియాన్ ముల్దర్ (11), టోనీ డి జోర్జి (2) రూపంలో మూడు వికెట్ల తన ఖాతాలో వేసుకున్న జడ్డూ.. ట్రిస్టన్ స్టబ్స్ (5)ను కూడా వెనక్కి పంపించాడు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా సరికొత్త చరిత్ర సృష్టించాడు. సొంతగడ్డపై టెస్టుల్లో 2 వేల పరుగులు పూర్తి చేసుకోవడంతో పాటు 250 వికెట్ల క్లబ్లో చేరిన భారత తొలి క్రికెటర్గా రికార్డు సాధించాడు.ప్రపంచంలో రెండో ప్లేయర్గాఅంతేకాదు.. ఓవరాల్గా ప్రపంచంలో స్టువర్ట్ బ్రాడ్ తర్వాత ఈ ఘనత సాధించిన (స్వదేశంలో 2000+ 250 వికెట్లు) రెండో ఆటగాడిగా జడేజా నిలిచాడు. అదే విధంగా.. టెస్టుల్లో ఓవరాల్గా నాలుగు వేల పరుగుల మైలురాయిని చేరుకోవడంతో పాటు 300కి పైగా వికెట్లు తీసిన నాలుగో ప్లేయర్గా ఫీట్ నమోదు చేశాడు. ఈ జాబితాలో ఇయాన్ బోతమ్, కపిల్ దేవ్, డానియెల్ వెటోరి జడ్డూ కంటే ముందు వరుసలో ఉన్నారు.కాగా భారత్తో తొలి టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకు ఆలౌట్ అయింది. ఇందుకు బదులుగా టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్లో 189 పరుగులు సాధించింది. ముప్పై పరుగుల ఆధిక్యం సంపాదించింది.ఈ క్రమంలో శనివారం నాటి రెండో రోజు ఆటలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది సౌతాఫ్రికా. ఆట పూర్తయ్యేసమయానికి 35 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 93 పరుగులు చేసింది. తద్వారా టీమిండియా కంటే 63 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.చదవండి: అందుకే రాజస్తాన్ రాయల్స్ను వీడాను: సంజూ శాంసన్ పోస్ట్ వైరల్ -
వెంకటేశ్ అయ్యర్కు భారీ షాక్.. ఫ్రాంఛైజీలు విడిచిపెట్టిన ఆటగాళ్లు వీరే
ఐపీఎల్-2026 వేలానికి ముందు తాము విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా (IPL 2026 Release List)ను పది ఫ్రాంఛైజీలు శనివారం విడుదల చేశాయి. చెన్నై సూపర్ కింగ్స్ మతీశ పతిరణ (రూ. 13 కోట్లు)ను వదిలించుకోవడం.. ఢిల్లీ క్యాపిటల్స్ జేక్ ఫ్రేజర్ మెగర్క్ (రూ. 9 కోట్లు), లక్నో సూపర్ జెయింట్స్ రవి బిష్ణోయి (రూ. 11 కోట్లు), పంజాబ్ కింగ్స్ గ్లెన్ మాక్స్వెల్ (రూ. 4.2 కోట్లు) విడుదల చేయడం హైలైట్గా నిలిచాయి.ఇక కోల్కతా నైట్ రైడర్స్ తమ ఖరీదైన ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer- రూ. 23.75 కోట్లు)ను రిలీజ్ చేయడం వీటన్నింటికంటే ప్రాధాన్యం సంతరించుకుంది.చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ లిస్టుమతీశ పతిరణ, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, దీపక్ హుడా, వన్ష్ బేడి, సి ఆండ్రీ సిద్దార్థ్, షేక్ రషీద్, కమ్లేశ్ నాగర్కోటి, రవీంద్ర జడేజా (ట్రేడింగ్), సామ్ కర్రాన్ (ట్రేడింగ్).రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విడిచిపెట్టిన ఆటగాళ్లు వీరేలియామ్ లివింగ్స్టోన్, లుంగి ఎంగిడి, మయాంక్ అగర్వాల్, టిమ్ సీఫర్ట్, బ్లెస్సింగ్ ముజర్బానీ, మనోజ్ భండాగే, మోహిత్ రాఠీ, స్వస్తిక్ చికారా.ముంబై ఇండియన్స్ వదిలేసిన ఆటగాళ్లురీస్ టాప్లీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్, సత్యనారాయణ రాజు, లిజాడ్ విలియమ్స్, అర్జున్ టెండుల్కర్ (ట్రేడింగ్), కర్ణ్ శర్మ, బెవాన్ జేకబ్స్, కేఎల్ శ్రీజిత్.రాజస్తాన్ రాయల్స్ విడిచిపెట్టిన ఆటగాళ్లువనిందు హసరంగ, మహీశ్ తీక్షణ, ఫజల్హక్ ఫారూకీ, ఆకాశ్ మధ్వాల్, కుమార్ కార్తికేయ, కునాల్ రాథోడ్, అశోక్ శర్మ, సంజూ శాంసన్ (ట్రేడింగ్), నితీశ్ రాణాఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ లిస్టుఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్ మెగర్క్, మోహిత్ శర్మ, డొనొవాన్ ఫెరీరా, మన్వంత్ కుమార్, దర్శన్ నల్కాండే, హ్యారీ బ్రూక్.పంజాబ్ కింగ్స్ వదిలేసిన ప్లేయర్లుగ్లెన్ మాక్స్వెల్, ఆరోన్ హార్డీ, ప్రవీణ్ దూబే, కుల్దీప్ సేన్, జోష్ ఇంగ్లిస్గుజరాత్ టైటాన్స్ విడిచిపెట్టిన ఆటగాళ్లుకరీం జనత్, గెరాల్డ్ కోయెట్జి, దసున్ షనక, మహిపాల్ లామ్రోర్, కుల్వంత్ ఖెజ్రోలియా, షెర్ఫానే రూథర్ఫర్డ్ (ట్రేడింగ్)సన్రైజర్స్ హైదరాబాద్ విడిచిపెట్టిన ఆటగాళ్లురాహుల్ చహర్, అభినవ్ మనోహర్, ఆడం జంపా, సిమర్జీత్ సింగ్, వియాన్ ముల్దర్, అథర్వ టైడే, సచిన్ బేబి, మొహమ్మద్ షమీ (ట్రేడింగ్).లక్నో సూపర్ జెయింట్స్ రిలీజ్ లిస్టురవి బిష్ణోయి, డేవిడ్ మిల్లర్, ఆకాశ్ దీప్, షమార్ జోసెఫ్,ఆర్యన్ జుయాల్, యువరాజ్ చౌదరి, రాజ్వర్థన్ హంగ్రేర్కర్, శార్దూల్ ఠాకూర్ (ట్రేడింగ్)కోల్కతా నైట్ రైడర్స్ రిలీజ్ లిస్టువెంకటేశ్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, క్వింటన్ డికాక్, స్పెన్సర్ జాన్సన్, రహ్మానుల్లా గుర్బాజ్, అన్రిచ్ నోర్జే, మొయిన్ అలీ, చేతన్ సకారియా, లవనిత్ సిసోడియా, మయాంక్ మార్కండే.చదవండి: IPL 2026: రిటెన్షన్ జాబితా విడుదల చేసిన ఫ్రాంఛైజీలు -
IPL 2026: రిటెన్షన్ జాబితా విడుదల చేసిన ఫ్రాంఛైజీలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 మినీ వేలానికి ముందు తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను ఫ్రాంఛైజీలు విడుదల చేశాయి. ఇందుకు సంబంధించి శనివారం అధికారిక ప్రకటన చేశాయి.గుజరాత్ టైటాన్స్ రిటెన్షన్ జాబితా ఇదే (Gujarat Titans Retention List)శుబ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షారుఖ్ ఖాన్, కుమార్ కుశాగ్రా (వికెట్ కీపర్), అనూజ్ రావత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, నిషాంత్ సింధు, గ్లెన్ ఫిలిప్స్, అర్షద్ ఖాన్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, సాయి కిశోర్, కగిసో రబడ, ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్. చెన్నై సూపర్ కింగ్స్ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు (CSK Retention List)రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, ఎంఎస్ ధోనీ, ఉర్విల్ పటేల్, సంజు శాంసన్ (RR నుంచి ట్రేడింగ్), శివమ్ దూబే, జామీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జన్ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, శ్రేయాష్ గోపాల్, ముకేశ్ చౌదరి.సన్రైజర్స్ హైదరాబాద్ రిటెన్షన్ జాబితా (SRH Retention List)ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్, స్మరణ్ రవిచంద్రన్, అనికేత్ వర్మ, జీషన్ అన్సారీ, హర్ష్ దూబే, కమిందు మెండిస్, ఇషాన్ మలింగ, బ్రైడన్ కార్స్.ఢిల్లీ క్యాపిటల్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు (DC Retention List)అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, త్రిపురాణ విజయ్, అజయ్ మండల్, మాధవ్ తివారి, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోశ్ శర్మ, మిచెల్ స్టార్క్, విప్రజ్ నిగమ్, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్, దుష్మంత చమీర, నితీశ్ రాణా (రాజస్తాన్ నుంచి ట్రేడింగ్), కరుణ్ నాయర్, సమీర్ రిజ్వి, కేఎల్ రాహుల్, టి.నటరాజన్.కోల్కతా నైట్ రైడర్స్ రిటెన్షన్ జాబితా (KKR Retention List)అజింక్య రహానే, రోవ్మన్ పావెల్, అంగ్క్రిష్ రఘువన్షి, సునిల్ నరైన్, అనుకుల్ రాయ్, ఉమ్రాన్ మాలిక్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, మనీశ్ పాండే, వరుణ్ చక్రవర్తి, రమణ్దీప్ సింగ్, రింకూ సింగ్లక్నో సూపర్ జెయింట్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే (LSG Retention List)అబ్దుల్ సమద్, దిగ్వేశ్ రాఠీ, మొహ్సిన్ ఖాన్, ఐడెన్ మార్క్రమ్, హిమ్మత్ సింగ్, నికోలస్ పూరన్. ఆకాశ్ సింగ్, మణిమరన్ సిద్దార్థ్, ప్రిన్స్ యాదవ్. అర్జున్ టెండుల్కర్ (ముంబై నుంచి ట్రేడింగ్), మాథ్యూ బ్రిట్జ్జ్కే, రిషభ్ పంత్, అర్షిన్ కులకర్ణి, మయాంక్ యాదవ్, షాబాజ్ అహ్మద్, ఆవేశ్ ఖాన్, మొహమమ్మద్ షమీ (సన్రైజర్స్ నుంచి ట్రేడింగ్), ఆయుశ్ బదోని, మిచెల్ మార్ష్.ముంబై ఇండియన్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితా (MI Retention List)అల్లా ఘజన్ఫర్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్ (లక్నో నుంచి ట్రేడింగ్), అశ్వనీ కుమార్, నమన్ ధీర్, షెర్ఫానే రూథర్ఫర్డ్ (ట్రేడింగ్), కార్బిన్ బాష్, రఘు శర్మ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ చహర్, రాజ్ అంగద్బవా, తిలక్ వర్మ, హార్దిక్పాండ్యా, రాబిన్ మింజ్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, విల్ జాక్స్, మయాంక్ మార్కండే (ట్రేడింగ్), రియాన్ రికెల్టన్.పంజాబ్ కింగ్స్ రిటెన్షన్ లిస్టు (PBKS Retention List)అర్ష్దీప్ సింగ్, మిచెల్ ఓవెన్, శ్రేయస్ అయ్యర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముషీర్ ఖాన్. సూర్యాంశ్ షెడ్గే, హర్నూర్ పన్నూ, నేహాల్ వధేరా, విష్ణు వినోద్, హర్ప్రీత్ బ్రార్, ప్రభ్సిమ్రన్ సింగ్, వైశాక్ విజయ్కుమార్, లాకీ ఫెర్గూసన్, ప్రియాంశ్ ఆర్య, జేవియర్ బార్ట్లెట్, మార్కో యాన్సెన్, పైలా అవినాశ్, యశ్ ఠాకూర్, మార్కస్ స్టొయినిస్, శశాంక్ సింగ్, యజువేంద్ర చహల్.రాజస్తాన్ రాయల్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే (RR Retention List)ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్, డొనొవాన్ ఫెరీరా (ట్రేడింగ్), సామ్ కర్రాన్ (ట్రేడింగ్), యుధ్వీర్ చరక్, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, క్వెనా మఫాక, షిమ్రన్ హెట్మెయిర్, లువాన్ డ్రి ప్రిటోరియస్, శుభమ్ దూబే, నండ్రీ బర్గర్, తుషార్ దేశ్పాండే, రవీంద్ర జడేజా (ట్రేడింగ్), వైభవ్ సూర్యవంశీ.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అట్టిపెట్టుకున్న ప్లేయర్ల జాబితా (RCB Retention List)అభినందన్ సింగ్, నువాన్ తుషార, టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, దేవ్దత్ పడిక్కల్, రజత్ పాటిదార్, యశ్ దయాళ్, జేకబ్ బెతెల్, రసిఖ్ ధార్, జితేశ్ శర్మ, రొమారియో షెఫర్డ్, జోష్ హాజిల్వుడ్, సూయాంశ్ శర్మ, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్. -
తిప్పేసిన జడ్డూ.. పీకల్లోతు కష్టాల్లో సౌతాఫ్రికా
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో భారత బౌలర్లు మరోసారి సత్తా చాటారు. ప్రొటిస్ జట్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా పేసర్లు ప్రభావం చూపితే.. రెండో ఇన్నింగ్స్లో స్పిన్నర్లు తిప్పేశారు. ఫలితంగా అరవై పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా.. శనివారం ఆట ముగిసే సరికి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కాగా రెండు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్- సౌతాఫ్రికా (IND vs SA) మధ్య శుక్రవారం తొలి మ్యాచ్ మొదలైన విషయం తెలిసిందే. కోల్కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత్ బౌలింగ్ చేసింది. పర్యాటక జట్టును తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకే కుప్పకూల్చింది.తొలి ఇన్నింగ్స్లో టీమిండియా పేసర్ల సత్తాటీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఐదు వికెట్ల చెలరేగి ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. మొహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీశాడు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ రెండు, అక్షర్ పటేల్ (Axar Patel) ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్ (31), రియాన్ రికెల్టన్ (23).. వియాన్ ముల్దర్ (24), టోనీ డి జోర్జి (24) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.ఈ క్రమంలో తొలి రోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా.. శుక్రవారం ఆట పూర్తయ్యేసరికి వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. ఇక 37/1 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. మరో 152 పరుగులు జతచేసి ఆలౌట్ అయింది.ఓపెనర్ కేఎల్ రాహుల్ (39) టాప్ రన్ స్కోరర్గా నిలవగా.. వాషింగ్టన్ సుందర్ (29), రిషభ్ పంత్ (27), రవీంద్ర జడేజా (27) ఫర్వాలేదనిపించారు. ఫలితంగా 189 పరుగులు చేసిన టీమిండియా.. తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికాపై ముప్పై పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. ప్రొటిస్ బౌలర్లలో సైమన్ హార్మర్ నాలుగు వికెట్లు తీయగా.. మార్కో యాన్సెన్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. కేశవ్ మహరాజ్, కార్బిన్ బాష్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.భారత స్పిన్ దెబ్బకు సఫారీలు విలవిలఅనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికాకు ఆది నుంచే భారత స్పిన్నర్లు చుక్కలు చూపించారు. రియాన్ రికెల్టన్ (11)ను కుల్దీప్ యాదవ్ ఎల్బీడబ్ల్యూ చేసి వికెట్ల వేట మొదలుపెట్టగా... జడ్డూ ఐడెన్ మార్క్రమ్ (4), వియాన్ ముల్దర్ (11)లను వెనక్కి పంపి సఫారీలకు కోలుకోలేని షాకిచ్చాడు..@imkuldeep18 comes into the attack… and STRIKES instantly! 💥South Africa lose their first as Rickelton falls LBW to the Chinaman! 👌🏻Catch the LIVE action ⬇️#INDvSA 1st Test LIVE NOW 👉 https://t.co/uK1oWLgsfx pic.twitter.com/OOZQRsBLzl— Star Sports (@StarSportsIndia) November 15, 2025 అదే విధంగా.. టోనీ డి జోర్జి (2), ట్రిస్టన్ స్టబ్స్ (5) వికెట్లను కూడా జడ్డూ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక వికెట్ కీపర్ కైలీ వెరెన్నె (9)ను అక్షర్ పటేల్ అవుట్ చేయగా.. కుల్దీప్ యాదవ్.. మార్కో యాన్సెన్ (13)ను పెవిలియన్కు పంపించాడు. Spinning a web! 🕸️🌀Some gun bowling from the No.1 Test All-rounder #RavindraJadeja has South Africa 3 down!#INDvSA 1st Test LIVE NOW 👉 https://t.co/uK1oWLgsfx pic.twitter.com/qgrOk7lvGW— Star Sports (@StarSportsIndia) November 15, 2025నాలుగేసిన జడ్డూఫలితంగా శనివారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి సౌతాఫ్రికా 35 ఓవర్లలో ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 93 పరుగులు చేసింది. తద్వారా టీమిండియా కంటే కేవలం 63 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కెప్టెన్ బవుమా 29, కార్బిన్ బాష్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. ఇక మూడోరోజైన ఆదివారం ఆటలో ఆరంభంలోనే మిగిలిన మూడు వికెట్లను భారత బౌలర్లు పడగొట్టారంటే.. టీమిండియా ముందు స్వల్ప లక్ష్యమే ఉంటుందని చెప్పవచ్చు. స్పిన్నర్లు ఇదే జోరు కొనసాగిస్తే.. టార్గెట్ వంద కంటే తక్కువగానే ఉండొచ్చు.ఇదిలా ఉంటే.. సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్లో జడేజా నాలుగు వికెట్లతో చెలరేగగా.. కుల్దీప్ యాదవ్ రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నారు. బుమ్రా ఇంకా వికెట్ల ఖాతా తెరవలేదు. సిరాజ్ చేతికి ఇంకా బంతి రానేలేదు.చదవండి: ఒక్క ఛాన్స్ ప్లీజ్: గిల్ను బతిమిలాడిన సిరాజ్.. కట్ చేస్తే.. -
అందుకే రాజస్తాన్ను వీడాను: సంజూ శాంసన్ పోస్ట్ వైరల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 వేలం నేపథ్యంలో ఫ్రాంఛైజీ ట్రేడ్ డీల్స్ పూర్తి చేసుకున్నాయి. అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను విడుదల చేసేందుకు శనివారమే (నవంబరు 15) ఆఖరి తేదీ కావడంతో తాము ట్రేడ్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను వెల్లడిస్తున్నాయి.జడ్డూ అటు.. సంజూ ఇటుఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)- రాజస్తాన్ రాయల్స్ (RR) మధ్య జరిగిన భారీ ట్రేడ్ వార్తల్లో నిలిచింది. ముందుగా ఊహించినట్లే సీఎస్కే.. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను.. రాజస్తాన్కు ఇచ్చేసి.. ఆ జట్టు సారథి సంజూ శాంసన్ను తమ చెంతకు చేర్చుకుంది.ధరలో మార్పుఅయితే, ఈ ఒప్పందంలో భాగంగా సీఎస్కే సంజూకు రాజస్తాన్ గతంలో చెల్లించిన మొత్తాన్ని ఇచ్చి రూ. 18 కోట్లకు తీసుకోగా.. రాజస్తాన్ మాత్రం జడ్డూ ధరను రూ. 18 కోట్ల నుంచి రూ. 14 కోట్లకు తగ్గించింది. జడ్డూతో పాటు సామ్ కర్రన్ (రూ. 2.4 కోట్లు)ను కూడా సీఎస్కే నుంచి తీసుకుంది. ఇదిలా ఉంటే.. రాజస్తాన్ రాయల్స్ను వీడిన నేపథ్యంలో సంజూ శాంసన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. సమయం వచ్చింది గనుకే తాను జట్టును వీడానంటూ అతడు స్పష్టతనిచ్చాడు.నా సర్వస్వం ధారబోశానుఈ మేరకు.. ‘‘మనం ఇక్కడ (ప్రపంచంలో) కొన్నాళ్ల పాటే ఉంటాము. ఫ్రాంఛైజీ కోసం నా సర్వస్వం ధారబోశాను. క్రికెట్ను గొప్పగా ఆస్వాదించాను. జీవితానికి సరిపడా జ్ఞాపకాలు, బంధాలు పోగు చేసుకున్నాను. ఫ్రాంఛైజీలోని ప్రతి ఒక్కరిని నా కుటుంబ సభ్యుడిగానే భావించాను. ఇప్పుడు సమయం వచ్చింది.. అందుకే నేను ఈ జట్టును వీడి వెళ్తున్నా.నాకు ఇక్కడ లభించిన దానికి నేను ఎల్లప్పుడూ రుణపడే ఉంటాను’’ అంటూ సంజూ శాంసన్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా రాయల్స్తో చేరిన తొలి నాళ్లలో దిగిన ఫొటోను సంజూ షేర్ చేశాడు. కాగా 2013లో రాజస్తాన్ రాయల్స్ జట్టులో చేరిన కేరళ స్టార్ సంజూ.. 2016లో ఢిల్లీ క్యాపిటల్స్కు మారాడు. రెండేళ్లు అదే జట్టుకు ఆడాడు.ఫైనల్కు చేర్చిన సారథిఆ తర్వాత మళ్లీ 2018లో రాయల్స్లోకి తిరిగి వచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 2025 వరకు జట్టుతో కొనసాగాడు. కెప్టెన్గా రాజస్తాన్ను ముందుకు నడిపించిన సంజూ 2022 సీజన్లో ఫైనల్కు చేర్చాడు. అయితే, గుజరాత్ టైటాన్స్తో టైటిల్ పోరులో ఓడిన రాజస్తాన్ రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో ఇప్పటి వరకు 176 మ్యాచ్లు ఆడిన సంజూ.. 4704 పరుగులు సాధించాడు. ఇందులో మూడు శతకాలు ఉండటం విశేషం.చదవండి: IPL 2026: సచిన్ తనయుడికి ముంబై ఇండియన్స్ షాక్ -
ఒక్క ఛాన్స్ ప్లీజ్: గిల్ను బతిమిలాడిన సిరాజ్.. కట్ చేస్తే..
టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికా (IND vs SA)తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య శుక్రవారం తొలి టెస్టు మొదలైంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం ఇందుకు వేదిక.రాణించిన భారత బౌలర్లుఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత్.. సఫారీలను తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకే ఆలౌట్ చేసి సత్తా చాటింది. టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) చెరో రెండు.. అక్షర్ పటేల్ (Axar Patel) ఒక వికెట్ దక్కించుకున్నారు.అయితే, బుమ్రా ఆది నుంచే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకోగా.. హైదరాబాదీ పేసర్ సిరాజ్ మాత్రం ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు. తొమ్మిది ఓవర్ల బౌలింగ్లో అప్పటికే 43 పరుగులు ఇచ్చేసిన సిరాజ్ మియా చేతికి ఆ తర్వాత బంతి రావడానికి చాలా సమయమే పట్టింది.ఒకే ఓవర్లో రెండుఎట్టకేలకు తను వేసిన పదో ఓవర్లో సిరాజ్ అద్భుతం చేశాడు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 45వ ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన ఈ రైటార్మ్ పేసర్.. తొలి బంతికి కైల్ వెరెన్నె(16)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అదే ఓవర్లో నాలుగో బంతికి మార్కో యాన్సెన్(0)ను బౌల్డ్ చేసి తన ఖాతాలో రెండో వికెట్ జమచేసుకున్నాడు.ప్లీజ్.. ఒక్క ఓవర్ వేసే అవకాశం ఇవ్వుఈ నేపథ్యంలో శుక్రవారం నాటి తొలి రోజు ఆట తర్వాత సిరాజ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ప్లీజ్.. ఒక్క ఓవర్ వేసే అవకాశం ఇవ్వు అని గిల్ను అడిగాను. అదే ఓవర్లో ఏకంగా రెండు వికెట్లు తీశాను’’ అని సిరాజ్ తెలిపాడు.అదే విధంగా బుమ్రా గురించి ప్రస్తావిస్తూ.. ‘‘వికెట్ తీయడానికి నేను ఇబ్బంది పడుతున్న సమయంలో జస్సీ భాయ్ వచ్చి.. స్టంప్స్ మీదకు బౌల్ చేయమని చెప్పాడు. ఎల్బీడబ్ల్యూ కోసం ట్రై చేయమన్నాడు. బౌల్డ్ చేయడం.. క్యాచ్లు పట్టడం.. ఇలా వికెట్ తీయడానికి చాలా ఆప్షన్లు ఉన్నాయని.. నన్ను కేవలం బౌలింగ్ మీద మాత్రమే దృష్టి పెట్టమని చెప్పాడు’’ అని సిరాజ్ పేర్కొన్నాడు. తాను నిరాశకు గురైన వేళ బుమ్రా తనలో ఆత్మవిశ్వాసం నింపాడని తెలిపాడు. కాగా.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో సిరాజ్ మొత్తంగా 12 ఓవర్లు బౌల్ చేసి 47 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు కూల్చాడు.స్వల్ప ఆధిక్యంకాగా తొలిరోజు సౌతాఫ్రికాను 159 పరుగులకు ఆలౌట్ చేసిన టీమిండియా.. శుక్రవారం ఆట ముగిసేసరికి వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. ఈ క్రమంలో శనివారం నాటి రెండో ఆటలో భాగంగా 189 పరుగులకు ఆలౌట్ అయి.. ముప్పై పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 39 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.చదవండి: IPL 2026: సచిన్ తనయుడికి ముంబై ఇండియన్స్ షాక్ -
సౌతాఫ్రికాతో తొలి టెస్టు.. 189 పరుగులకు భారత్ ఆలౌట్
కోల్కతా వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు సైతం తీవ్ర నిరాశపరిచారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 189 పరుగులకు ఆలౌటైంది. 37/1 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ అదనంగా 152 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్ను ముగించింది.తొలి ఇన్నింగ్స్లో భారత్కు కేవలం 30 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే లభించింది. టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్ కేఎల్ రాహుల్(39) టాప్ స్కోరర్గా నిలవగా.. వాషింగ్టన్ సుందర్(29), రవీంద్ర జడేజా(27), రిషబ్ పంత్(27) కాసేపు క్రీజులో నిలబడ్డారు. సౌతాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ను ఎదుర్కొనేందుకు భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. హార్మర్ 4 వికెట్లతో గిల్ సేన పతనాన్ని శాసించాడు. అతడితో పాటు పేసర్ మార్కో జానెసన్ మూడు, మహారాజ్, బాష్ తలా వికెట్ సాధించారు. తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 159 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.గిల్ రిటైర్డ్ ఔట్..కాగా ఈ మ్యాచ్లో భారత్కు భారీ షాక్ తగిలింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయపడ్డాడు. హార్మర్ బౌలింగ్లో స్లాగ్ స్వీప్ షాట్ ఆడే క్రమంలో గిల్ మెడ పట్టేసింది. దీంతో ఫిజియో సాయంతో గిల్ మైదానాన్ని వీడాడు.ఆ తర్వాత అతడు తిరిగి బ్యాటింగ్కు రాలేదు. దీంతో అతడిని రిటైర్డ్ ఔట్గా పరిగణించారు. అయితే గిల్ తమ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. రెండో ఇన్నింగ్స్లో గిల్ బ్యాటింగ్కు వచ్చే అవకాశం ఉంది.చదవండి: IPL 2026: సచిన్ తనయుడికి ముంబై ఇండియన్స్ షాక్ -
సచిన్ తనయుడికి ముంబై ఇండియన్స్ షాక్
ఐపీఎల్-2026 సీజన్ వేలానికి ముందు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అర్జున్ టెండూల్కర్ను ముంబై ఇండియన్స్ విడిచిపెట్టింది. ముంబై ఇండియన్స్ నుంచి అర్జున్ను లక్నో సూపర్ జెయింట్స్ ట్రేడ్ చేసుకుంది. అతడి బేస్ ప్రెస్ రూ. 30 లక్షలకే లక్నో సొంతం చేసుకుంది.అర్జున్ ఐపీఎల్-2021 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్తో వున్నప్పటికి.. 2023లో ఈ క్యాష్ రిచ్ లీగ్లోకి అడుగుపెట్టాడు. ఈ జూనియర్ టెండూల్కర్ ఇప్పటివరకు ముంబై ఫ్రాంచైజీ తరపున కేవలం 5 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఇక అర్జున్ ట్రేడ్పై ముంబై ఎక్స్ వేదికగా స్పందించింది. "ముంబై ఇండియన్స్ కుటుంబంలో విలువైన సభ్యుడిగా కొనసాగినందుకు అర్జున్కు ధన్యవాదాలు. లక్నో సూపర్ జెయింట్స్తో నీ ప్రయాణం విజయవంతం కావాలి. నీ సత్తాను నిరూపించుకునేందుకు మరిన్ని అవకాశాలు దక్కాలని కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్ అర్జున్" అని ఎంఐ ఎక్స్లో రాసుకొచ్చింది.ఇక రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య భారీ స్వాప్ ట్రేడ్ డీల్ ముగిసింది. రాజస్తాన్ నుంచి సంజూ శాంసన్ను సీఎస్కే ట్రేడ్ చేసుకుంది. అందుకు బదులుగా సీఎస్కే సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజాలను రాయల్స్కు పంపించింది.ఐపీఎల్-2026 సీజన్ వేలానికి ముందు జరిగిన ట్రేడ్ డీల్స్ ఇవే..1.రవీంద్ర జడేజా- చెన్నై సూపర్ కింగ్స్ టూ రాజస్థాన్ రాయల్స్2. సంజూ శాంసన్- రాజస్థాన్ రాయల్స్ టూ చెన్నై సూపర్ కింగ్స్3. సామ్ కుర్రాన్ -చెన్నై సూపర్ కింగ్స్ టూ రాజస్థాన్ రాయల్స్4. మహ్మద్ షమీ- సన్రైజర్స్ హైదరాబాద్ టూ లక్నో సూపర్ జెయింట్స్5. నితీష్ రాణా- రాజస్థాన్ రాయల్స్ టూ ఢిల్లీ క్యాపిటల్స్6.అర్జున్ టెండూల్కర్- ముంబై ఇండియన్స్ టూ లక్నో సూపర్ జెయింట్స్7. మయాంక్ మార్కండే- కోల్కతా నైట్ రైడర్స్ టూ ముంబై ఇండియన్స్8. డోనోవన్ ఫెరీరా - ఢిల్లీ క్యాపిటల్స్ టూ రాజస్థాన్ రాయల్స్9. శార్దూల్ ఠాకూర్ - లక్నో సూపర్ జెయింట్స్ టూ ముంబై ఇండియన్స్చదవండి: IND vs SA: టీమిండియాకు ఊహించని షాక్.. ఆట మధ్యలోనే -
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్..
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన రీ ఎంట్రీలో అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా రిషబ్ నిలిచాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో పంత్ ఈ ఫీట్ను అందుకున్నాడు.ఇప్పటివరకు ఈ రికార్డు దిగ్గజ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (90) సిక్సర్లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో సెహ్వాగ్ ఆల్టైమ్ రికార్డును పంత్ బ్రేక్ చేశాడు. పంత్ ఇప్పటివరకు తన టెస్టు కెరీర్లో 92 సిక్స్లు బాదాడు. కాగా కెప్టెన్ శుభ్మన్ గిల్ రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాక క్రీజులోకి వచ్చిన పంత్ తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. 24 బంతులు ఎదుర్కొన్న రిషబ్.. 2 ఫోర్లు, 2 సిక్స్లతో 27 పరుగులు చేసి ఔటయ్యాడు. మంచి టచ్లో కనిపించిన పంత్.. బాష్ బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. 51 ఓవర్లు ముగిసే సరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. టీమిండియా 6 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా(24), అక్షర్ పటేల్(1) ఉన్నారు. రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగిన కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాటింగ్ వస్తాడో లేదో ఇంకా క్లారిటీ లేదు.భారత్ తరపున టెస్ట్లలో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్లు వీరేరిషబ్ పంత్-92వీరేంద్ర సెహ్వాగ్-90రోహిత్ శర్మ-88రవీంద్ర జడేజా-80ఎంఎస్ ధోని-70చదవండి: IND vs SA: టీమిండియాకు ఊహించని షాక్.. ఆట మధ్యలోనే -
IND vs SA: టీమిండియాకు ఊహించని షాక్..
కోల్కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. రెండో రోజు ఆటలో కెప్టెన్ శుభ్మన్ గిల్ మెడపట్టేయడం (Neck Sprain)తో రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. భారత ఇన్నింగ్స్ 35 ఓవర్ వేసిన సైమన్ హార్మర్ బౌలింగ్లో రెండో బంతిని సుందర్ ఔటయ్యాక గిల్ క్రీజులోకి వచ్చాడు. అదే ఓవర్లో ఐదో బంతికి స్లాగ్ స్వీప్ షాట్ ఆడాడు. ఈ షాట్ ఆడే ప్రయత్నంలో గిల్ మెడ పట్టేసింది. దీంతో గిల్ నొప్పితో విల్లవిల్లాడు. అతడు మెడను పూర్తిగా కదల్చలేని విధంగా కనిపించాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి గిల్ మాత్రం కాస్త ఆసౌకర్యంగానే కన్పించాడు.ఈ క్రమంలో ఫిజియో సాయంతో గిల్ మైదానాన్ని వీడాడు. గిల్ బ్యాటింగ్కు తిరిగి వస్తాడో లేదో ఇంకా క్లారిటీ లేదు. ఇక తొలి ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. టీమిండియా సఫారీల కంటే ఇంకా 21 పరుగుల వెనకంజలో ఉంది. కాగా అంతకుముందు పర్యాటక జట్టు తమ మొదటి ఇన్నింగ్స్లో 159 పరుగులకే కుప్పకూలింది. కాగా గిల్ గాయంపై బీసీసీఐ తాజాగా అప్డేట్ ఇచ్చింది. గిల్ మెడ నొప్పితో బాధపడుతున్నాడు. అతడు ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. గిల్ రికవరీ బట్టి ఈ రోజు ఆటలో పాల్గొనడంపై నిర్ణయం తీసుకోబడుతుంది అని బీసీసీఐ ఎక్స్లో రాసుకొచ్చింది.చదవండి: చరిత్ర సృష్టించిన బాబర్ ఆజామ్ -
తడబడుతున్న భారత బ్యాటర్లు.. లంచ్ బ్రేక్కు స్కోరెంతంటే?
కోల్కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు సైతం తడబడుతున్నారు. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. క్రీజులో ప్రస్తుతం రవీంద్ర జడేజా(11), ధ్రువ్ జురెల్(4) ఉన్నారు.37-1 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. 14 ఓవర్ల తర్వాత వాషింగ్టన్ సుందర్(29) వికెట్ కోల్పోయింది. ఆచితూచి ఆడిన సుందర్ సఫారీ స్పిన్నర్ హార్మర్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చి కెప్టెన్ శుభ్మన్ గిల్(4) మెడ పట్టేయడంతో రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులో నిలదొక్కుకున్న కేఎల్ రాహుల్(39), రిషబ్ పంత్(27) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇప్పటివరకు జానెసన్, బాష్, హార్మర్, మహారాజ్ తలా వికెట్ సాధించారు. కాగా అంతకుముందు సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో కేవలం 159 పరుగులకే కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో ప్రోటీస్ పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్ ఇంకా 21 పరుగుల వెనకంజలో ఉంది.తుది జట్లుదక్షిణాఫ్రికా : ఐడెన్ మార్క్రామ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బావుమా(కెప్టెన్), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్(వికెట్ కీపర్), సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్భారత్: యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ -
సీఎస్కేలోకి శాంసన్, రాజస్తాన్లోకి జడేజా..
ఐపీఎల్-2026 సీజన్ మినీ వేలానికి ముందు రాజస్తాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య స్వాప్ ట్రేడ్ డీల్ అధికారికంగా పూర్తి అయింది. రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ను సీఎస్కే ట్రేడ్ చేసుకుంది. అందుకు బదులుగా సీఎస్కే స్టార్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్లను రాజస్తాన్కు పంపింది.గత సీజన్కు ముందు జడేజాను రూ.18 కోట్ల భారీ వెచ్చించి సీఎస్కే రిటైన్ చేసుకుంది. ఇప్పుడు జడేజా ధరను రూ.14 కోట్లకు తగ్గించి రాజస్తాన్ ట్రేడ్ చేసుకుంది. ఐపీఎల్ 2026 సీజన్లో రవీంద్ర జడేజా రూ.14 కోట్లు అందుకోబోతున్నాడు. సామ్ కుర్రాన్ను మాత్రం రూ. 2.4 కోట్ల ప్రస్తుత ధరకే రాయల్స్ తమ జట్టులోకి తీసుకుంది. అయితే సంజూ శాంసన్ మాత్రం ధర మారలేదు. అతడు సీఎస్కే నుంచి రూ.18 కోట్లు అందుకోనున్నాడు. ఈ ట్రేడ్ డీల్ను సీఎస్కే సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది. తమ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహించినందుకు సీఎస్కే యాజమాన్యం ధన్యవాదాలు తెలిపింది. జడేజా 12 సీజన్ల పాటు సీఎస్కే తరపున ఆడాడు.లక్నోకి సచిన్ తనయుడు..ఐపీఎల్ 2026 వేలానికి ముందు ఫ్రాంఛైజీలు ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను సమర్పించడానికి నేడే ఆఖరి రోజు కావడంతో మరికొన్ని ముఖ్యమైన ట్రేడ్ డీల్స్ జరిగాయి. సన్రైజర్స్ హైదరాబాద్ నుంచి స్టార్ పేసర్ మహ్మద్ షమీని రూ.10 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ ట్రేడ్ చేసుకుంది.అదేవిధంగా లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేను కోల్కతా నైట్రైడర్స్ నుంచి ముంబై ఇండియన్స్ రూ.30 లక్షల బెస్ప్రైస్కు ట్రేడ్ చేసుకుంది. సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ను అతడి ధర రూ.30 లక్షలకు లక్నో ట్రేడ్ చేసుకుంది.Aaj rumour nahi, headline likhna. Ravindra 𝑻𝒉𝒂𝒍𝒂𝒑𝒂𝒕𝒉𝒚 Jadeja is coming home ⚔️🔥 pic.twitter.com/XJT5b5plCy— Rajasthan Royals (@rajasthanroyals) November 15, 2025ఇప్పటివరకు జరిగిన ట్రేడ్ డీల్స్ ఇవే..1.రవీంద్ర జడేజా- చెన్నై సూపర్ కింగ్స్ టూ రాజస్థాన్ రాయల్స్ 2. సంజూ శాంసన్- రాజస్థాన్ రాయల్స్ టూ చెన్నై సూపర్ కింగ్స్3. సామ్ కుర్రాన్ -చెన్నై సూపర్ కింగ్స్ టూ రాజస్థాన్ రాయల్స్4. మహ్మద్ షమీ- సన్రైజర్స్ హైదరాబాద్ టూ లక్నో సూపర్ జెయింట్స్5. నితీష్ రాణా- రాజస్థాన్ రాయల్స్ టూ ఢిల్లీ క్యాపిటల్స్ 6.అర్జున్ టెండూల్కర్- ముంబై ఇండియన్స్ టూ లక్నో సూపర్ జెయింట్స్ 7. మయాంక్ మార్కండే- కోల్కతా నైట్ రైడర్స్ టూ ముంబై ఇండియన్స్8. డోనోవన్ ఫెరీరా - ఢిల్లీ క్యాపిటల్స్ టూ రాజస్థాన్ రాయల్స్9. శార్దూల్ ఠాకూర్ - లక్నో సూపర్ జెయింట్స్ టూ ముంబై ఇండియన్స్ -
యాషెస్ తొలి టెస్టు.. ఆస్ట్రేలియాకు బిగ్ షాక్
ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్కు సమయం అసన్నమవుతోంది. నవంబర్ 21 నుంచి పెర్త్ వేదికగా ఈ ప్రతిష్టాత్మక సిరీస్ ప్రారంభం కానుంది. అయితే తొలి టెస్టుకు ముందుకు ఆతిథ్య ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హాజిల్వుడ్ గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమయ్యాడు.హాజిల్వుడ్ ప్రస్తుతం తొడ కండరాల(హ్యామ్స్ట్రింగ్) గాయంతో బాధపడుతున్నాడు. ఆసీస్ దేశవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్లో విక్టోరియాతో జరిగిన మ్యాచ్లో జోష్ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఆట మధ్యలోనే మైదానం నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత అతడిని స్కాన్ కోసం అస్పత్రి తరలించారు. అయితే అతడిది తీవ్రమైన గాయం కానప్పటికి కనీసం రెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మొదటి టెస్టుకు అతడు దూరంగా ఉండనున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ధ్రువీకరించింది. ఆసీస్ సెలక్టర్లు సీనియర్ ఫాస్ట్ బౌలర్ మైకేల్ నేసర్ జట్టులోకి చేర్చారు. హేజిల్వుడ్ గాయం కారణంగా, ఫాస్ట్ బౌలర్ బ్రెండన్ డాగెట్ ఆసీస్ తరపున టెస్టు అరంగేట్రం చేసే అవకాశముంది.తొలి టెస్టుకు ఆస్ట్రేలియా అప్డేటడ్ స్క్వాడ్స్టీవ్ స్మిత్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, బ్రెండన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, మైఖేల్ నేజర్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్స్టర్చదవండి: IPL 2026: కావ్య మారన్ సంచలన నిర్ణయం..? -
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజామ్
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ తన రెండున్నర ఏళ్ల సెంచరీ నిరీక్షణకు తెరదించాడు. శనివారం రావల్పిండి వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో బాబర్ అజేయ శతకంతో చెలరేగాడు. అంతర్జాతీయ క్రికెట్లో 807 రోజులు, 83 మ్యాచ్ల తర్వాత బాబర్ సాధించిన సెంచరీ ఇది. 289 పరుగుల లక్ష్య చేధనలో అజామ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 119 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 102 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. సైమ్ అయూబ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన బాబర్.. ఫఖర్ జమాన్ (78 పరుగులు)తో కలిసి రెండో వికెట్కు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.ఆ తర్వాత మహ్మద్ రిజ్వాన్ (51 నాటౌట్)తో కలిసి మూడో వికెట్కు 111 పరుగుల మ్యాచ్-విన్నింగ్ పార్టనర్షిప్ను నమోదు చేశాడు. దీంతో లంకపై 8 వికెట్ల తేడాతో పాక్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో సెంచరీతో సెంచరీతో సత్తాచాటిన బాబర్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.అన్వర్ రికార్డు సమం..అంతర్జాతీయ క్రికెట్లో పాక్ తరపున అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు సాధించిన నాలుగో ప్లేయర్గా బాబర్ నిలిచాడు. బాబర్కు ఇది ఇంటర్నేషనల్ క్రికెట్లో 32వ సెంచరీ. ఈ క్రమంలో జావేద్ మియాందాద్(31), సయీద్ అన్వర్(31)లను అధిగమించాడు. ఈ జాబితాలో యూనిస్ ఖాన్(41) అగ్రస్ధానంలో ఉన్నాడు.అదేవిధంగా పాక్ తరపున అత్యధిక వన్డే సెంచరీలు ఆటగాడిగా యీద్ అన్వర్ రికార్డును అజామ్ సమం చేశాడు. అన్వర్ తన వన్డే కెరీర్లో 20 సెంచరీలు చేయగా.. బాబర్ కూడా ఇప్పటివరకు సరిగ్గా 20 శతకాలు నమోదు చేశాడు. మరో సెంచరీ చేస్తే అన్వర్ను ఈ మాజీ కెప్టెన్ అధిగమిస్తాడు.అప్పుడు కోహ్లి.. ఇప్పుడు బాబర్బాబర్ ఆజం లానే టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి కూడా అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ కోసం 83 ఇన్నింగ్స్లు ఆగాల్సి వచ్చింది. సెంచరీలను మంచినీళ్లప్రాయంగా సాధించే కోహ్లి.. దాదాపు రెండేన్నరేళ్ల పాటు మూడెంకెల ఫిగర్ను అందుకునేందుకు తీవ్రంగా శ్రమించాడు. కోహ్లి 2019 నవంబర్ 23న సెంచరీ చేస్తే.. ఆ తర్వాత మళ్లీ 2022 సెప్టెంబర్ 8న మళ్లీ శతక్కొట్టాడు. ఇప్పుడు బాబర్ కూడా 2023 ఆగస్టు 30న చివరి సారిగా సెంచరీ చేయగా, మళ్లీ 807 రోజుల తర్వాత అంతర్జాతీయ సెంచరీ మార్క్ను అందుకున్నాడు.చదవండి: IPL 2026: కావ్య మారన్ సంచలన నిర్ణయం..? -
శతక్కొట్టిన బాబర్.. శ్రీలంకను చిత్తు చేసిన పాక్
వైట్బాల్ క్రికెట్లో పాకిస్తాన్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. శుక్రవారం రావల్పిండి వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో 8 వికెట్ల తేడాతో పాక్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో అఫ్రిది సేన సొంతం చేసుకుంది.ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్లో జనిత్ లియానగే (54 పరుగులు) టాప్ స్కోరర్గా నిలవగా.. కమిందు మెండిస్(44 పరుగులు), హసరంగా (37 నాటౌట్) , సమరవిక్రమ(42) రాణించారు. పాక్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్,హారిస్ రవూఫ్ తలా మూడేసి వికెట్లు పడగొట్టారు.బాబర్ సూపర్ సెంచరీ..అనంతరం 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 48.2 ఓవర్లలో చేధించింది. పాక్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం ఆజేయ సెంచరీతో చెలరేగాడు. సుమారు రెండున్నరేళ్ల తర్వాత బాబర్ అంతర్జాతయ సెంచరీ మార్క్ను అందుకున్నాడు.ఈ మాజీ కెప్టెన్ 119 బంతుల్లో, 8 ఫోర్ల సాయంతో 102 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ ఫఖర్ జమాన్ (78 పరుగులు), మహ్మద్ రిజ్వాన్ (51 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్లు మూడో వికెట్కు 103 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. లంక బౌలర్లలో చమీరా ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు.చదవండి: IPL 2026: కావ్య మారన్ సంచలన నిర్ణయం..? -
కావ్య మారన్ సంచలన నిర్ణయం!?
ఐపీఎల్-2026 సీజన్ మినీ వేలానికి ముందు భారీ ట్రేడ్ డీల్కు రంగం సిద్దమైంది. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీని సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) నుంచి లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ట్రేడ్ చేసుకోనున్నట్లు సమాచారం. ఎస్ఆర్హెచ్-ఎల్ఎస్జీ మధ్య రూ. 10 కోట్ల 'ఆల్-క్యాష్ డీల్' (నగదు రూపంలో మాత్రమే చెల్లించి) ఫైనల్ అయినట్లు క్రిక్బజ్ తమ కథనంలో పేర్కొంది.గత ఏడాది సీజన్ మెగా వేలంలో షమీని రూ. 10 కోట్ల భారీ ధరకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. అయితే ఈ రైట్ ఆర్మ్ పేసర్ మాత్రం తన స్ధాయికి తగ్గప్రదర్శన చేయలేకపోయాడు. 9 మ్యాచ్లలో 11.23 ఎకానమీ రేటుతో కేవలం 6 వికెట్లు మాత్రమే తీశాడు. ఇది అతడి ఐపీఎల్ కెరీర్లోనే అత్యంత దారుణమైన ప్రదర్శన.దీంతో అతడిని మినీ వేలంలో విడిచిపెట్టేందుకు సన్రైజర్స్ ఓనర్ కావ్యమారన్ సిద్దమైనట్లు ప్రచారం జరిగింది. అంతలోనే షమీని తమ జట్టులోకి తీసుకునేందుకు సన్రైజర్స్ యాజమాన్యంతో లక్నో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తమ జట్టులో సీనియర్ పేసర్ ఒక్కరు కూడా లేకపోవడంతో ఈ ట్రేడ్ డీల్ కోసం ఎల్ఎస్జీ ముందుకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. లక్నో జట్టులో మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, ఆవేశ్ ఖాన్ వంటి యువ పేసర్లు ఉన్నప్పటికి.. వారు ఫిట్నెస్ సమస్యలతో సతమవుతున్నారు. తాజాగా లక్నో చేసిన పోస్ట్ కూడా ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. వన్డే వరల్డ్కప్-2023లో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్ను షమీ క్లీన్ బౌల్డ్ చేసిన ఫోటోను లక్నో పోస్ట్ చేసింది. అయితే అందులో షమీ కన్పించకుండా ఎల్ఎస్జీ జాగ్రత్త పడింది.ఆ నలుగురికి టాటా బైబై..ఇక లక్నో సూపర్ జెయింట్స్ మినీ వేలంలో తమ పర్స్ విలువను పెంచుకోవడానికి నలుగురు ఆటగాళ్లను విడుదల చేయాలని నిర్ణయించుకుందంట. డేవిడ్ మిల్లర్, రవి బిష్ణోయ్, ఆకాష్ దీప్, షామర్ జోసెఫ్లను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో లక్నో పర్స్ విలువ రూ.27.25 కోట్లు పెరగనుంది. కాగా ఐపీఎల్-2026 సీజన్కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ లిస్ట్ను ఫ్రాంచైజీలు శనివారం (నవంబర్ 15)సాయంత్రం లోపు బీసీసీఐకి సమర్పించాలి.చదవండి: ‘అసలే అతడు మరుగుజ్జు కదా!’.. బుమ్రా వ్యాఖ్యలపై స్పందించిన సౌతాఫ్రికా కోచ్! -
హడలెత్తించిన బుమ్రా
కోల్కతా: పిచ్ ఎలా ఉన్నా... చక్కటి లైన్ అండ్ లెంగ్త్తో బంతులు వేస్తే... వికెట్లు రావడం కష్టమేమీ కాదని భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి నిరూపించాడు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని అంచనా వేసిన భారత కెప్టన్ శుబ్మన్ గిల్ ఏకంగా నలుగురు స్పిన్నర్లను తుది జట్టులోకి తీసుకున్నాడు. అయితే బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో దక్షిణాఫ్రికా బ్యాటర్లను హడలెత్తించాడు. తొలి ఇన్నింగ్స్లో భారత స్పిన్నర్లకు పెద్దగా పని లేకుండా చేశాడు. బుమ్రా పేస్కు తోడు మరో పేసర్ సిరాజ్ కూడా మెరిపించడం... ఎడంచేతి వాటం స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తమ వంతుగా రాణించడం... వెరసి భారత జట్టుతో శుక్రవారం మొదలైన తొలి టెస్టులో తొలి రోజే దక్షిణాఫ్రికాకు కష్టాలు మొదలయ్యాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 55 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు మార్క్రమ్ (48 బంతుల్లో 31; 5 ఫోర్లు, 1 సిక్స్), రికెల్టన్ (22 బంతుల్లో 23; 4 ఫోర్లు) తొలి వికెట్కు 57 పరుగులు జోడించడంతో దక్షిణాఫ్రికాకు శుభారంభం లభించినట్టే అనిపించింది. అయితే ఒక్కసారి బుమ్రా దెబ్బకు అంతా తారుమారైంది. ఐదు పరుగుల వ్యవధిలో మార్క్రమ్, రికెల్టన్లను బుమ్రా పెవిలియన్కు పంపించగా... కెపె్టన్ బవూమా (3)ను కుల్దీప్ అవుట్ చేశాడు. దాంతో 57/0తో పటిష్టంగా కనిపించిన దక్షిణాఫ్రికా 71/3తో కష్టాల్లో పడింది. ఆ తర్వాత ముల్డర్ (51 బంతుల్లో 24; 3 ఫోర్లు), టోనీ జోర్జి (55 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్స్) నింపాదిగా ఆడి వికెట్ల పతనాన్ని నిలువరించారు. నాలుగో వికెట్కు వీరిద్దరు 43 పరుగులు జోడించారు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ గాడిలో పడిందనుకున్న తరుణంలో కుల్దీప్, బుమ్రా మళ్లీ మెరిశారు. ముల్డర్ను కుల్దీప్... జోర్జిని బుమ్రా అవుట్ చేశారు. దాంతో దక్షిణాఫ్రికా 120 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ట్రిస్టన్ స్టబ్స్ (74 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్), వెరీన్ (36 బంతుల్లో 16; 2 ఫోర్లు) నిలదొక్కుకోవడానికి ప్రయత్నించినా... వెరీన్ను సిరాజ్ అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికాకు దెబ్బ పడింది. చివరి ఐదు వికెట్లను దక్షిణాఫ్రికా 13 పరుగుల వ్యవధిలో కోల్పోయి చివరకు 159 పరుగులకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేసిన భారత్ కూడా బ్యాటింగ్కు ఇబ్బంది పడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 20 ఓవర్లు ఆడి ఒక వికెట్ కోల్పోయి 37 పరుగులు సాధించింది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) పంత్ (బి) బుమ్రా 31; రికెల్టన్ (బి) బుమ్రా 23; ముల్డర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 24; బవుమా (సి) జురేల్ (బి) కుల్దీప్ 3; టోనీ జోర్జి (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 24; స్టబ్స్ (నాటౌట్) 15; వెరీన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 16; మార్కో యాన్సెన్ (బి) సిరాజ్ 0; కార్బిన్ బాష్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అక్షర్ పటేల్ 3; హార్మెర్ (బి) బుమ్రా 5; కేశవ్ మహరాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 0; ఎక్స్ట్రాలు 15; మొత్తం (55 ఓవర్లలో ఆలౌట్) 159; వికెట్ల పతనం: 1–57, 2–62, 3–71, 4–114, 5–120, 6–146, 7–147, 8–154, 9–159, 10–159. బౌలింగ్: బుమ్రా 14–5–27–5, సిరాజ్ 12–0–47–2, అక్షర్ పటేల్ 6–2–21–1, కుల్దీప్ యాదవ్ 14–1–36–2, రవీంద్ర జడేజా 8–2–13–0, వాషింగ్టన్ సుందర్ 1–0–3–0. భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (బి) మార్కో యాన్సెన్ 12; కేఎల్ రాహుల్ (బ్యాటింగ్) 13; వాషింగ్టన్ సుందర్ (బ్యాటింగ్) 6; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి) 37. వికెట్ల పతనం: 1–18, బౌలింగ్: మార్కో యాన్సెన్ 6–2–11–1, ముల్డర్ 5–1–15–0, కేశవ్ మహరాజ్ 5–1–8–0, కార్బిన్ బాష్ 3–2–1–0, హార్మెర్ 1–1–0–0. 2012భారత జట్టు చివరిసారి 2012లో ఒకే టెస్టులో నలుగురు స్పిన్నర్లను ఆడించింది. నాగ్పూర్ వేదికగా 2012 డిసెంబర్ 13 నుంచి 17 వరకు ఇంగ్లండ్తో ‘డ్రా’గా ముగిసిన మ్యాచ్లో భారత్ తరఫున నలుగురు స్పిన్నర్లు అశి్వన్, రవీంద్ర జడేజా, పీయూష్ చావ్లా, ప్రజ్ఞాన్ ఓజా బరిలోకి దిగారు. ఇదే మ్యాచ్తో జడేజా టెస్టుల్లో అరంగేట్రం చేయగా... ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్గా ఉన్న గౌతమ్ గంభీర్ ఆ మ్యాచ్లో రెండు ఓవర్లు వేయడం విశేషం. -
‘అసలే మరుగుజ్జు కదా!’.. స్పందించిన సౌతాఫ్రికా కోచ్!
భారత్- సౌతాఫ్రికా (IND vs SA) మధ్య రెండు టెస్టుల సిరీస్కు శుక్రవారం తెరలేచింది. కోల్కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్లో ఇరుజట్ల మధ్య తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. భారత్ను బౌలింగ్కు ఆహ్వానించింది.బంతితో అదరగొట్టిన బుమ్రాఈ క్రమంలో టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా ఆది నుంచే నిప్పులు చెరిగాడు. అద్భుతమైన బంతులతో సఫారీ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. వేగంగా ఆడుతూనే.. క్రీజులో పాతుకుపోవాలని ప్రయత్నించిన ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్ (48 బంతుల్లో 31), రియాన్ రికెల్టన్ (22 బంతుల్లో 23)లను త్వరగానే పెవిలియన్కు పంపాడు.అంతేకాదు.. టోనీ డి జోర్జి (55 బంతుల్లో 24), సైమన్ హార్మర్ (5), కేశవ్ మహరాజ్ (0)లను కూడా అవుట్ చేసిన బుమ్రా.. మొత్తంగా ఐదు వికెట్లతో మెరిశాడు. సఫారీలను తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఈ రైటార్మ్ పేసర్ ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.అదే సమయంలో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమాను ఉద్దేశించి.. బుమ్రా చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. సౌతాఫ్రికా స్కోరు 62/2 వద్ద ఉన్న వేళ.. బవుమా క్రీజులో ఉండగా.. బుమ్రా అద్భుతమైన బంతిని సంధించాడు. దీనిని ఎదుర్కొనే క్రమంలో బవుమా డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేయగా.. బాల్ అతడి ప్యాడ్కు తాకింది.బుమ్రా నోట ఊహించని మాటదీంతో బుమ్రాతో పాటు టీమిండియా ఫీల్డర్లు కూడా ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీలు చేయగా.. అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. అయితే, బుమ్రా మాత్రం కచ్చితంగా బంతి వికెట్లను గిరాటేస్తుందన్న నమ్మకంతో .. వికెట్ కీపర్ రిషభ్ పంత్తో చర్చించేందుకు వెళ్లాడు. బాల్ మరీ ఎత్తులో వెళ్లిందా? లేదా? అని చర్చించాడు. ఇందుకు పంత్.. బాల్ ఎత్తులోనే వెళ్తుందని అభిప్రాయపడ్డాడు.అసలే మరుగుజ్జు కదా!మరోవైపు.. బుమ్రా ఊహిస్తున్నట్లుగా ఇది అవుట్ కాదని భావించిన కెప్టెన్ శుబ్మన్ గిల్ కూడా రివ్యూ తీసుకునేందుకు నిరాకరించాడు. ఈ క్రమంలోనే బుమ్రా.. ‘క్రీజులో ఉన్నది అసలే మరుగుజ్జు కదా!’ అంటూ ఒక రకంగా బవుమాను ఎగతాళి చేస్తూ బౌలింగ్ చేసేందుకు వెళ్లాడు. దీంతో భారత ఆటగాళ్లంతా నవ్వుకోగా.. బుమ్రా మాటలు స్టంప్ మైకులో రికార్డయ్యాయి.నిజానికి బుమ్రా మైదానంలో ఇలా వ్యవహరించడం అరుదు. ప్రత్యర్థి జట్టు ఆటగాడి గురించి అతడు ఇలా మాట్లాడతాడని అభిమానులు కూడా అస్సలు ఊహించలేదు. ఈ నేపథ్యంలో నెటిజన్లు బుమ్రా తీరు సరికాదంటూ విమర్శల వర్షం కురిపించారు. మరికొందరు మాత్రం సరదాగా అన్న మాటలకు అపార్థాలు ఆపాదించవద్దని హితవు పలికారు.స్పందించిన సౌతాఫ్రికా కోచ్!ఈ ఘటనపై సౌతాఫ్రికా బ్యాటింగ్ కోచ్ యాష్వెల్ ప్రిన్స్ తాజాగా స్పందించాడు. తొలిరోజు ఆట ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ విషయం గురించి మా జట్టులో ఎలాంటి చర్చా రాలేదు. అవును.. ఇలా జరగడం ఇదే తొలిసారి.అందుకే త్వరగానే నా దృష్టికి కూడా వచ్చింది. అయితే, అక్కడ జరిగిన దాని వల్ల ఎవరికీ పెద్దగా ఇబ్బంది కలగలేదనే అనుకుంటున్నా’’ అంటూ మాట దాటేశాడు. ఏదేమైనా బుమ్రా తీరుకు బవుమా, అతడి అభిమానులు నొచ్చుకున్నారన్నది మాత్రం నిజమేనని తెలుస్తోంది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025 ఫైనల్లో.. బవుమా కెప్టెన్సీలోని సౌతాఫ్రికా టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్లో జరిగిన టైటిల్ పోరులో ఆస్ట్రేలియాను చిత్తు చేసి సఫారీలు ఐసీసీ గదను సొంతం చేసుకున్నారు. చదవండి: IND vs SA: ముందుగానే ముగిసిన తొలిరోజు ఆట.. భారత్దే పైచేయి!JB - "bauna hai yeh"RP- "bauna hai but laga yahape"JB - "bauna hai yeh BC"Review not taken for the appeal of LBW against Bavuma.#INDvsSA #Bumrah pic.twitter.com/r8UO8afR1J— The last dance (@26lastdance) November 14, 2025 -
శతక్కొట్టిన వైభవ్, జితేశ్ శర్మ మెరుపులు.. భారత్ ఘన విజయం
ఆసియా క్రికెట్ మండలి పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నమెంట్లో భారత్-‘ఎ’ జట్టు శుభారంభం అందుకుంది. దోహా వేదికగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో మ్యాచ్లో ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టును ఏకంగా 148 పరుగుల తేడాతో చిత్తు చేసి జయభేరి మోగించింది. Vaibhav Sooryavanshi is a superstar. Period. 🔥📹 | A statement century from our Boss Baby to set the tone 🤩 Watch #INDvUAE in the #DPWorldAsiaCupRisingStars2025, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV pic.twitter.com/K0RIoK4Fyv— Sony Sports Network (@SonySportsNetwk) November 14, 2025ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నీలో భాగంగా వెస్ట్ ఎండ్ పార్క్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్- యూఏఈ (IND A vs UAE) జట్లు శుక్రవారం తలపడ్డాయి. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి ఏకంగా 297 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.శతక్కొట్టిన వైభవ్, జితేశ్ శర్మ మెరుపులుఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) భారీ, విధ్వంసకర శతకం (42 బంతుల్లో 11 ఫోర్లు, 15 సిక్సర్లు- 144)తో విరుచుకుపడగా.. జితేశ్ శర్మ (Jitesh Sharma) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. నాలుగో నంబర్ బ్యాటర్గా వచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 32 బంతులు ఎదుర్కొని ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్స్లు బాది 83 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.With the captain joining the party, it only got better Watch #INDvUAE in the #DPWorldAsiaCupRisingStars2025, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV pic.twitter.com/7QNbpB0ecd— Sony Sports Network (@SonySportsNetwk) November 14, 2025మిగిలిన వాళ్లలో వన్డౌన్ బ్యాటర్ నమన్ ధీర్ (23 బంతుల్లో 34) ఫర్వాలేదనిపించాడు. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (10) రనౌట్ కాగా.. నేహాల్ వధేరా (14) నిరాశపరిచాడు. ఆఖర్లో రమణ్దీప్ సింగ్ (8 బంతుల్లో 6) జితేశ్తో కలిసి అజేయంగా నిలిచాడు. యూఏఈ బౌలర్లలో ముహమ్మద్ ఫరాజుద్దీన్, అయాన్ ఖాన్, ముహమ్మద్ అర్ఫాన్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.కుప్పకూలిన టాపార్డర్ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ ఆది నుంచే తడబడింది. భారత బౌలర్ల ధాటికి టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్లు మయాంక్ రాజేశ్ కుమార్ (18), కెప్టెన్ అలిషాన్ షరాఫు (3) నిరాశపరచగా.. వన్డౌన్ బ్యాటర్ అహ్మద్ తారిక్ డకౌట్ అయ్యాడు.Ramandeep Singh’s brilliance in the field sends the UAE skipper packing 🚶♂️ Watch #INDvUAE in the #DPWorldAsiaCupRisingStars2025, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV pic.twitter.com/PQ5jimFpFG— Sony Sports Network (@SonySportsNetwk) November 14, 2025సొహైబ్ మెరుపు అర్ధ శతకం వృథాఈ క్రమంలో నాలుగో నంబర్ బ్యాటర్ సొహైబ్ ఖాన్ మెరుపు అర్ధ శతకం (41 బంతుల్లో 63) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే, గుర్జప్నీత్ సింగ్ బౌలింగ్లో నమన్ ధీర్కు క్యాచ్ ఇవ్వడంతో సొహైబ్ మెరుపులకు తెరపడింది. ఆ తర్వాత వచ్చిన వాళ్లలో హర్షిత్ కౌశిక్ డకౌట్ కాగా.. వికెట్ కీపర్ సయీద్ హైదర్ (20), ముహమ్మద్ అర్ఫాన్ (26) ఫర్వాలేదనిపించారు. ఆఖర్లో అయాన్ ఖాన్ 2, ముహమ్మద్ ఫరాజుద్దీన్ 2 పరుగులతో అజేయంగా నిలిచారు.ఫలితంగా.. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి కేవలం 149 పరుగులు మాత్రమే చేసిన యూఏఈ.. భారత్-‘ఎ’ జట్టు చేతిలో భారీ ఓటమి చవిచూసింది. 148 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. గుర్జప్నీత్ సింగ్ మూడు వికెట్లుభారత బౌలర్లలో గుర్జప్నీత్ సింగ్కు మూడు వికెట్ల తో సత్తా చాటగా.. హర్ష్ దూబే రెండు, రమణ్దీప్ సింగ్ , యశ్ ఠాకూర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. సెంచరీ వీరుడు వైభవ్ సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఆదివారం నాటి తదుపరి మ్యాచ్లో భారత్- పాకిస్తాన్తో అమీతుమీ తేల్చుకుంటుంది.చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. -
భారత జట్టులో అతడికి అన్యాయం.. ఇంతవరకు రీప్లేస్మెంట్ లేదు!
టీమిండియా పేస్ దళంలో ప్రధాన బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), మొహమ్మద్ సిరాజ్ కొనసాగుతున్నారు. వీరికి తోడుగా యువ పేసర్లు ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ఆకాశ్ దీప్ వరుస మ్యాచ్లలో అవకాశాలు దక్కించుకుంటున్నారు.పేస్ ఆల్రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) పరిమిత ఓవర్ల క్రికెట్లో మొదటి ప్రాధాన్య ఆటగాడిగా ఉండగా.. టెస్టుల్లో నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. ఇక వన్డేల్లో ఆడే అవకాశం వస్తున్నా.. గత రెండేళ్లుగా మొహమ్మద్ షమీ టెస్టులకు దూరమైపోయాడు. షమీకి బైబైఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో వన్డేలకూ షమీని ఎంపిక చేయని సెలక్టర్లు.. రంజీల్లో సత్తా చాటుతున్నా స్వదేశంలో సౌతాఫ్రికాతో టెస్టుల్లోనూ మొండిచేయి చూపారు.వీరి సంగతి ఇలా ఉంటే.. స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ 2022, నవంబరులోనే టీమిండియా తరఫున తన చివరి మ్యాచ్ ఆడేశాడు. ఆ తర్వాత మళ్లీ జాతీయ జట్టుకు ఎంపిక కాలేదు. దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్లో రాణిస్తున్నా సెలక్టర్లు అతడిని కనికరించలేదు.అయితే, టీమిండియాకు దూరమైనా ఐపీఎల్లో మాత్రం భువీ సత్తా చాటుతున్నాడు. ఈ ఏడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడిన ఈ యూపీ రైటార్మ్ పేసర్.. ఆర్సీబీ తమ తొలి టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్-2026 మినీ వేలానికి సమయం సమీపిస్తున్న విషయం తెలిసిందే.భువీకి అన్యాయంఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ భారత వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మేనేజ్మెంట్ భువీకి అన్యాయం చేసిందని.. ఇంతవరకు అతడికి సరైన ప్రత్యామ్నాయాన్ని కనుగొనలేకపోయిందని విమర్శించాడు. ఈ మేరకు..‘‘భారత జట్టులో భువీని సరైన విధంగా ట్రీట్ చేయలేదని నా అభిప్రాయం. ముందుగానే అతడిని జట్టు నుంచి తప్పించారు. ఇప్పుడు చూడండి.. అతడు ఆర్సీబీ తరఫున ఈ ఏడాది టైటిల్ గెలిచాడు. భువీ ఫిట్నెస్ గురించి చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తారు.భర్తీ చేయగల సరైన బౌలర్ లేడుఫాస్ట్బౌలర్ అన్నాక కెరీర్లో ఏదో ఒక సమయంలో గాయాల బెడద తప్పదు. అలాంటపుడే యాజమాన్యం నుంచి సరైన మద్దతు ఉండాలి. కానీ వాళ్లు భువీని కాదనుకుని ముందుకు సాగిపోయారు. ఇప్పటికీ టీమిండియాలో అతడి స్థానాన్ని భర్తీ చేయగల సరైన బౌలర్ లేడు’’ అని కైఫ్ అభిప్రాయపడ్డాడు.ఒకవేళ భువీని మళ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టుకు ఎంపిక చేస్తే.. అతడు తప్పక రాణిస్తాడని కైఫ్ పేర్కొన్నాడు. ఫిట్నెస్ దృష్ట్యా టెస్టులకు దూరంగా ఉన్నా.. యాభై, ఇరవై ఓవర్ల క్రికెట్లో రాణించడం ఇందుకు నిదర్శనమని అన్నాడు. ఏదేమైనా భువీ ఇప్పట్లో ఐపీఎల్ నుంచి మాత్రం రిటైర్ కాడని కైఫ్ అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్లో ఇప్పటికి 190 ఇన్నింగ్స్లో 198 వికెట్లు తీసిన 35 ఏళ్ల భువీ.. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.చదవండి: గంభీర్ ఊహించని ప్రయోగం.. భారత క్రికెట్ చరిత్రలోనే -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సరికొత్త చరిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్లో ఇంత వరకు ఏ బ్యాటర్కూ సాధ్యం కాని ఘనత సాధించాడు. అతి పిన్న వయసులో.. 35 కంటే తక్కువ బంతుల్లోనే రెండుసార్లు సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డులకెక్కాడు.ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నమెంట్లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో మ్యాచ్ సందర్భంగా వైభవ్ శుక్రవారం ఈ ఫీట్ నమోదు చేశాడు. దోహా వేదికగా జరుగుతున్న ఈ టీ20 ఈవెంట్లో భారత్-‘ఎ’ జట్టు.. యూఏఈతో మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది.వైభవ్ సూర్యవంశీ తుఫాన్ ఇన్నింగ్స్భారత ఓపెనర్లలో ప్రియాన్ష్ ఆర్య (10) విఫలం కాగా.. వైభవ్ సూర్యవంశీ తుఫాన్ ఇన్నింగ్స్తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 32 బంతుల్లోనే శతక్కొట్టిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. మొత్తంగా 42 బంతులు ఎదుర్కొని 144 పరుగులు సాధించాడు. వైభవ్ ఇన్నింగ్స్లో ఏకంగా 11 ఫోర్లు, 15 సిక్సర్లు ఉండటం విశేషం.Vaibhav Sooryavanshi is a superstar. Period. 🔥📹 | A statement century from our Boss Baby to set the tone 🤩 Watch #INDvUAE in the #DPWorldAsiaCupRisingStars2025, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV pic.twitter.com/K0RIoK4Fyv— Sony Sports Network (@SonySportsNetwk) November 14, 2025 అయితే, యూఏఈ బౌలర్ ముహమ్మద్ ఫరాజుద్దీన్ బౌలింగ్లో అహ్మద్ తారిక్కు క్యాచ్ ఇవ్వడంతో వైభవ్.. విధ్వంసకర ఇన్నింగ్స్ ముగిసిపోయింది. ఇదిలా ఉంటే.. వైభవ్ సూర్యవంశీకి పొట్టి ఫార్మాట్లో ఇది రెండో శతకం. అంతేకాదు రెండో ఫాస్టెస్ట్ సెంచరీ కూడా! ఈ క్రమంలోనే పద్నాలుగేళ్ల ఈ బిహారీ పిల్లాడు సరికొత్త చరిత్ర లిఖించాడు.Naye India ka Naya Superstar. 💙 Watch #INDvUAE in the #DPWorldAsiaCupRisingStars2025, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV pic.twitter.com/Ht7z25zMVs— Sony Sports Network (@SonySportsNetwk) November 14, 2025ఏకైక బ్యాటర్గా ప్రపంచ రికార్డుకాగా ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్కు ఆడిన వైభవ్ సూర్యవంశీ.. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో కేవలం 35 బంతుల్లోనే శతకం బాదిన విషయం తెలిసిందే. అప్పుడు అతడి వయసు పద్నాలుగేళ్ల 32 రోజులు మాత్రమే. ఇక తాజాగా ఆసియా కప్ రైజింగ్ స్టార్స్లో భాగంగా వైభవ్ 32 బంతుల్లోనే శతక్కొట్టి తన రికార్డును తానే సవరించాడు.పద్నాలుగేళ్ల 232 రోజుల వయసులో తన రెండో టీ20 సెంచరీ చేసిన వైభవ్.. అతి పిన్న వయసులో.. 35 కంటే తక్కువ బంతుల్లోనే రెండుసార్లు శతక్కొట్టిన ఏకైక బ్యాటర్గా ప్రపంచ రికార్డు సాధించాడు. అంతేకాదు.. భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్గా రిషభ్ పంత్ రికార్డు సవరించాడు.టీ20లలో ఫాస్టెస్ట్ సెంచరీలు చేసిన భారత బ్యాటర్లు వీరే🏏ఉర్విల్ పటేల్- 2024లో గుజరాత్ తరఫున త్రిపురతో మ్యాచ్లో 28 బంతుల్లో🏏అభిషేక్ శర్మ- 2024లో పంజాబ్ తరఫున మేఘాలయపై 28 బంతుల్లో🏏రిషభ్ పంత్- 2018లో ఢిల్లీ తరఫున హిమాచల్ ప్రదేశ్పై 32 బంతుల్లో🏏వైభవ్ సూర్యవంశీ- 2025లో భారత్ తరఫున యూఏఈపై 32 బంతుల్లో శతకంభారత్ భారీ స్కోరుఇదిలా ఉంటే.. యూఏఈతో మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ (144)తో పాటు కెప్టెన్ జితేశ్ శర్మ కూడా అదరగొట్టాడు. కేవలం 32 బంతుల్లోనే 83 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగిలిన వారిలో నమన్ ధీర్ (34) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి భారత్ 297 పరుగులు మేర భారీ స్కోరు సాధించింది. యూఏఈ బౌలర్లలో ముహమ్మద్ ఫరాజుద్దీన్, అయాన్ అఫ్జల్ ఖాన్, ముహమ్మద్ అర్ఫాన్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. చదవండి: IND vs SA: ముందుగానే ముగిసిన తొలిరోజు ఆట.. భారత్దే పైచేయి! -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 32 బంతుల్లోనే శతక్కొట్టి..
భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మరోసారి అద్బుత ప్రదర్శనతో దుమ్ములేపాడు. ఆసియా క్రికెట్ మండలి (ACC) పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నమెంట్లో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు.ఈ టీ20 ఈవెంట్లో భాగంగా భారత్-‘ఎ’ జట్టు తమ తొలి మ్యాచ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో తలపడుతోంది. దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఐపీఎల్ సెన్సేషన్ ప్రియాన్ష్ ఆర్య వేగంగా ఆడే (6 బంతుల్లో 10) ప్రయత్నంలో రనౌట్ అయ్యాడు.కేవలం పదహారు బంతుల్లోనేఈ క్రమంలో మరో ఓపెనర్, భారత చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. వన్డౌన్ బ్యాటర్ నమన్ ధీర్తో కలిసి.. స్కోరు బోర్డును పరుగులు తీయించాడు. కేవలం పదహారు బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న వైభవ్ సూర్యవంశీ.. ఆ తర్వాత జోరును మరింత పెంచాడు.Vaibhav Sooryavanshi is putting on a fireworks show 🎇 Watch #INDvUAE in the #DPWorldAsiaCupRisingStars2025, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV pic.twitter.com/1gNEz5UwHb— Sony Sports Network (@SonySportsNetwk) November 14, 2025 ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూప్రత్యర్థి జట్టు బౌలింగ్ను చితక్కొడుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్తో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఈ లెఫ్టాండర్ కేవలం 32 బంతుల్లోనే వంద పరుగులు మార్కు అందుకుని మరోసారి సత్తా చాటాడు. వైభవ్ శతక ఇన్నింగ్స్లో పది ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు ఉన్నాయి. టీ20 ఫార్మాట్లో అతడికి ఇది రెండో సెంచరీ కావడం విశేషం. Welcome to the Boss Baby’s world 🥵Vaibhav Sooryavanshi clears the boundary like it’s nothing 🤌 Watch #INDvUAE in the #DPWorldAsiaCupRisingStars2025, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV pic.twitter.com/8Qha1Edzab— Sony Sports Network (@SonySportsNetwk) November 14, 202510 ఓవర్లలోనేవైభవ్ సూర్యవంశీ సునామీ ఇన్నింగ్స్కు తోడు.. నమన్ ధీర్ కూడా మెరుపులు (21 బంతుల్లో 33) మెరిపించడంతో 10 ఓవర్లలోనే భారత్ కేవలం వికెట్ నష్టపోయి 149 పరుగులు చేయడం మరో విశేషం. ఇక 12వ ఓవర్ తొలి బంతికి ముహమ్మద్ ఆర్ఫాన్ బౌలింగ్లో ముహమ్మద్ రోహిద్ ఖాన్కు నమన్ క్యాచ్ ఇవ్వడంతో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. కాగా వైభవ్, నమన్ రెండో వికెట్కు 57 బంతుల్లో 163 పరుగులు జోడించడం విశేషం. నమన్ స్థానంలో కెప్టెన్ జితేశ్ శర్మ నాలుగో నంబర్ బ్యాటర్గా క్రీజులోకి వచ్చాడు. తుఫాన్ ఇన్నింగ్స్కు తెరకాగా 12.3 ఓవర్లో ముహమ్మద్ ఫరాజుద్దీన్ బౌలింగ్లో అహ్మద్ తారిక్కు క్యాచ్ ఇవ్వడంతో వైభవ్ సూర్యవంశీ సునామీ ఇన్నింగ్స్కు తెరపడింది. మొత్తంగా 41 బంతులు ఎదుర్కొన్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ 11 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 144 పరుగులు సాధించి.. మూడో వికెట్గా వెనుదిరిగాడు. ఫలితంగా 13 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 199 పరుగుల వద్ద నిలిచింది.చదవండి: గంభీర్ ఊహించని ప్రయోగం.. భారత క్రికెట్ చరిత్రలోనే -
బుమ్రా సూపర్ హిట్.. జైసూ విఫలం.. తొలిరోజు హైలైట్స్
భారత్- సౌతాఫ్రికా మధ్య తొలి టెస్టు (IND vs SA 1st Test) తొలి రోజు ఆట ముందుగానే ముగిసిపోయింది. వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బౌలర్ల విజృంభణ కారణంగా మొదటి రోజు ఆతిథ్య భారత్.. ప్రొటిస్ జట్టుపై పైచేయి సాధించింది.ఈడెన్ గార్డెన్స్ వేదికగారెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడేందుకు సౌతాఫ్రికా భారత పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య శుక్రవారం టెస్టు సిరీస్ మొదలైంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్టులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. భారత్ను బౌలింగ్కు ఆహ్వానించింది.159 పరుగులకే ఆలౌట్ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన బవుమా బృందం టీమిండియా బౌలర్ల విజృంభణ ముందు ఎక్కువ సేపు నిలవలేకపోయింది. తొలి ఇన్నింగ్స్లో 55 ఓవర్లు ఆడి 159 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్ (31), రియాన్ రికెల్టన్ (23) ఓ మోస్తరుగా రాణించగా.. వీరిద్దరని భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) వెనక్కి పంపించాడు.వన్డౌన్ బ్యాటర్ వియాన్ ముల్దర్ 51 బంతులు ఎదుర్కొని 24 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో అవుటయ్యాడు. ఇక కెప్టెన్ తెంబా బవుమా దారుణంగా విఫలమయ్యాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ధ్రువ్ జురెల్కు క్యాచ్ ఇచ్చి మూడు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు.ఒకే ఓవర్లోమరోవైపు.. టోనీ డి జోర్జి (55 బంతుల్లో 24) నిలబడే ప్రయత్నం చేయగా బుమ్రా.. అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. వికెట్ కీపర్ కైల్ వెరెన్నె(16)తో పాటు.. మార్కో యాన్సెన్ (0)ను ఒకే ఓవర్లో మొహమ్మద్ సిరాజ్ పెవిలియన్కు చేర్చాడు. కార్బిన్ బాష్ (3)ను అక్షర్ పటేల్ ఎల్బీడబ్ల్యూ చేయగా.. సైమన్ హార్మర్ (5), కేశవ్ మహరాజ్ (0)ల వికెట్లు కూల్చి.. బుమ్రా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్కు చరమగీతం పాడాడు. ట్రిస్టన్ స్టబ్స్ 74 బంతులు ఎదుర్కొని 15 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.భారత బౌలర్లలో పేసర్లు బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నారు. జైసూ విఫలంఅనంతరం బ్యాటింగ్కు దిగిన భారత జట్టుకు శుభారంభం లభించలేదు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన లభించిన లైఫ్లను దుర్వినియోగం చేసుకున్నాడు.మొత్తంగా 27 బంతులు ఎదుర్కొన్న జైసూ.. మూడు ఫోర్ల సాయంతో 12 పరుగులు చేసి.. మార్కో యాన్సెన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 59 బంతుల్లో 13, వన్డౌన్ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ 38 బంతుల్లో 6 పరుగులతో క్రీజులో నిలిచారు. ప్రత్యర్థిని తొలిరోజే ఆలౌట్ చేసి.. పైచేయిఫలితంగా శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్.. 20 ఓవర్ల ఆటలో వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. సౌతాఫ్రికా కంటే తొలి ఇన్నింగ్స్లో ఇంకా 122 పరుగులు వెనుకబడి ఉంది. అయితే, ఓవరాల్గా ప్రత్యర్థిని తొలిరోజే ఆలౌట్ చేసి గిల్ సేన ఆధిపత్యం కొనసాగించింది. చదవండి: IND vs SA: అతడిని ఎందుకు పక్కన పెట్టారు? గంభీర్పై కుంబ్లే ఫైర్ -
IPL 2026: కేకేఆర్ కీలక ప్రకటన
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందు కోల్కతా నైట్ రైడర్స్ (KKR) మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ శిక్షణా సిబ్బందిలో న్యూజిలాండ్ దిగ్గజ బౌలర్ను చేర్చుకుంది. కాగా అభిషేక్ నాయర్ను ఇప్పటికే హెడ్కోచ్గా ప్రమోట్ చేసిన కేకేఆర్.. ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ను అసిస్టెంట్ కోచ్గా నియమించుకున్నట్లు గురువారం వెల్లడించింది.‘వాట్సన్కు కేకేఆర్ కుటుంబం స్వాగతం పలుకుతోంది. ప్లేయర్గా, కోచ్గా ఈ ఆస్ట్రేలియన్కున్న విశేషానుభవం మా జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆటగాడిగా నిరూపించుకున్న అతడి కోచింగ్లో మా జట్టు సన్నాహాలు మరో స్థాయిలో ఉంటాయని ఆశిస్తున్నాం. అతడి సేవలతో మా జట్టు ఉన్నతశిఖరాలు అధిరోహిస్తుందనే నమ్మకంతో ఉన్నాం’ అని కోల్కతా ఫ్రాంచైజీ సీఈఓ వెంకీ మైసూర్ అన్నారు.ఇక తన నియామకం పట్ల ఆనందం వ్యక్తం చేసిన వాట్సన్... కేకేఆర్ బృందంలో చేరేందుకు ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. కోల్కతా మరోసారి టైటిల్ గెలిచేందుకు తనవంతు కృషి చేస్తానన్నాడు. కాగా ఈ మాజీ ఆల్రౌండర్ కంగారూ తరఫున 59 టెస్టులు, 190 వన్డేలు, 58 టి20ల0 ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 10వేల పైచిలుకు పరుగులు, 280 వికెట్లు తీశాడు. 2007, 2015 వన్డే ప్రపంచకప్ విజేత జట్టు సభ్యుడిగా ఉన్నాడు.ఐపీఎల్లోనూ వాట్సన్ది సుదీర్ఘమైన కెరీర్ అని చెప్పొచ్చు. ప్రారంభ ఐపీఎల్ సీజన్ 2008 నుంచి 2020 వరకు 12 ఏళ్ల పాటు లీగ్ క్రికెట్ ఆడాడు. రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్కింగ్స్ టైటిళ్లలోనూ భాగమయ్యాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు సైతం అతను ప్రాతినిధ్యం వహించాడు.ఇదిలా ఉంటే.. తాజాగా తమ కొత్త బౌలింగ్ కోచ్ పేరును కేకేఆర్ ప్రకటించింది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌతీని బౌలింగ్ కోచ్గా నియమించినట్లు తెలిపింది. కాగా ఇంతకు ముందు భరత్ అరుణ్ కేకేఆర్ బౌలింగ్ కోచ్గా ఉండగా.. అతడు లక్నో సూపర్ జెయింట్స్లో చేరేందుకు కోల్కతా ఫ్రాంఛైజీని వీడాడు. ఈ క్రమంలో సౌతీతో అరుణ్ భరత్ స్థానాన్ని కేకేఆర్ భర్తీ చేసింది. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఇక సౌతీ 2021, 2023 సీజన్లలో ఆటగాడిగా కేకేఆర్కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. చంద్రకాంత్ పండిట్ మార్గదర్శనంలో 2023లో టైటిల్ గెలిచిన జట్టులోనూ అతడు సభ్యుడు. కాగా.. గతంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు సౌతీ ఆడాడు.ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్లో న్యూజిలాండ్ తరఫున 2008- 2024 వరకు ఆడిన సౌతీ.. 107 టెస్టులు, 161 వన్డేలు, 126 టీ20లలో కలిపి 776 వికెట్లు కూల్చాడు. తద్వారా కివీస్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. ఐపీఎల్లో మొత్తంగా 54 మ్యాచ్లు ఆడిన ఈ రైటార్మ్ పేసర్.. 47 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.కేకేఆర్ బౌలింగ్ కోచ్గా నియమితుడు కావడం పట్ల 36 ఏళ్ల సౌతీ స్పందిస్తూ.. ‘‘కేకేఆర్ నా సొంత జట్టు లాంటిది. కొత్త పాత్రలో జట్టులోకి తిరిగి రావడం సంతోషంగా ఉంది. 2026లో జట్టు విజయం సాధించేందుకు నా వంతు కృషి చేస్తా’’ అని హర్షం వ్యక్తం చేశాడు. -
‘పసికూన’పై ప్రతాపం.. బోణీ కొట్టిన పాకిస్తాన్
ఆసియా క్రికెట్ మండలి నిర్వహిస్తున్న ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్- 2025 ( Asia Cup Rising Stars) టోర్నమెంట్ శుక్రవారం మొదలైంది. దోహా వేదికగా తొలి మ్యాచ్లో పాకిస్తాన్- ‘ఎ’- ఒమన్ జట్లు తలపడ్డాయి. వెస్ట్ఎండ్ పార్క్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో టాస్ గెలిచిన ఒమన్ తొలుత బౌలింగ్ చేసింది.పరుగుల విధ్వంసంఈ క్రమంలో ఆదిలోనే ఓపెనర్ మొహమ్మద్ నయీమ్ (6) వికెట్ కోల్పోయిన పాకిస్తాన్.. తర్వాత అనూహ్య రీతిలో పుంజుకుంది. మరో ఓపెనర్ మాజ్ సదాకత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 54 బంతుల్లోనే ఐదు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు బాది పరుగుల విధ్వంసం సృష్టించాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి 96 పరుగులు చేసిన సదాకత్ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.మిగతా వాళ్లలో యాసిర్ ఖాన్ (26 బంతుల్లో 26), మొహ్మద్ ఫైక్ (9 బంతుల్లో 19) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ ఇర్ఫాన్ ఖాన్ 21 బంతుల్లోనే 44 పరుగులతో సత్తా చాటాడు. ఆఖర్లో సాద్ మసూద్ మెరుపులు (6 బంతుల్లో 19 నాటౌట్) మెరిపించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో పాక్-ఎ జట్టు కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 220 పరుగులు సాధించింది.ఆది నుంచే కష్టాలుఒమన్ బౌలర్లలో షఫీక్ జాన్, ముజాహిర్ రజా, జే ఒడేడ్రా, వసీం అలీ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్ ఆరంభం నుంచే తడబడింది. ఓపెనర్ సూఫియాన్ యూసఫ్ (3) విఫలం కాగా.. మరో ఓపెనర్, కెప్టెన్ హమ్మద్ మీర్జా (27 బంతుల్లో 34) రనౌట్ అయి వికెట్ పారేసుకున్నాడు.వన్డౌన్లో వచ్చిన కరణ్ సోనావాలే (18 బంతుల్లో 26) ఫర్వాలేదనిపించగా.. మిడిలార్డర్లో వసీం అలీ (5), నారాయణ్ సాయిశివ్ (1), ఆర్యన్ బిస్త్ (2) పూర్తిగా నిరాశపరిచారు. జై ఒడేడ్రా డకౌట్ అయ్యాడు.ఘాఆఖర్లో మెరుపులు..ఇలాంటి దశలో జిక్రియా ఇస్లాం, ముజాహిర్ రజా ధనాధన్ దంచికొట్టి జట్టు విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేశారు. జిక్రియా ఇస్లాం మెరుపు అర్ధ శతకం (28 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు- 57 పరుగులు) సాధించగా.. రజా 24 బంతుల్లో 46 పరుగులతో సత్తా చాటాడు. అయితే, మిగిలిన వారి నుంచి వీరికి సహకారం లభించలేదు.బోణీ కొట్టిన పాక్ఫలితంగా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి.. ఒమన్ కేవలం 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా పాకిస్తాన్ ఒమన్పై 40 పరుగుల తేడాతో గెలిచింది. విజయంతో ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింట్ స్టార్స్ టీ20 టోర్నీని ఆరంభించింది. మాజ్ సదాకత్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: గంభీర్ ఊహించని ప్రయోగం.. భారత క్రికెట్ చరిత్రలోనే -
IND vs SA: చెలరేగిన బుమ్రా.. సౌతాఫ్రికా ఆలౌట్.. స్కోరెంతంటే?
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఐదు వికెట్లు కూల్చి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. అతడికి తోడుగా మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav), అక్షర్ పటేల్ రాణించడంతో ప్రొటిస్ జట్టు స్వల్ప స్కోరుకే కుప్పకూలింది.టాస్ గెలిచిన సౌతాఫ్రికాప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 (WTC )సీజన్లో భాగంగా రెండు టెస్టులు ఆడేందుకు సౌతాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం తొలి టెస్టు మొదలైంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో టాస్ గెలిచిన పర్యాటక సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభం నుంచే విజృంభించిబుమ్రా ఆరంభం నుంచే బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు. ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్ (31), రియాన్ రికెల్టన్ (23) వికెట్లు తీసి ఆదిలోనే సఫారీలకు షాకిచ్చాడు. ఇక చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. సౌతాఫ్రికా వన్డౌన్ బ్యాటర్ వియాన్ ముల్దర్ (24)తో పాటు కెప్టెన్ తెంబా బవుమా (3) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.సౌతాఫ్రికా ఆలౌట్.. స్కోరెంతంటే?ఆ తర్వాత బుమ్రా మరోసారి తన పేస్ పదునుతో టోనీ డి జోర్జి (24)ని బౌల్డ్ చేయగా.. వికెట్ కీపర్ వెరెన్నె (16)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న సిరాజ్.. మార్కో యాన్సెన్ (0)ను డకౌట్ చేశాడు. ఇక స్పిన్నర్ అక్షర్ పటేల్.. కార్బిన్ బాష్ (3)ను ఎల్బీడబ్ల్యూ చేసి ఒక వికెట్ దక్కించుకోగా.. సైమన్ హార్మర్ (5)ను తొమ్మిదో వికెట్గా బుమ్రా వెనక్కి పంపాడు.ఆ తర్వాత కేశవ్ మహరాజ్ (0)ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపిన బుమ్రా.. ఐదు వికెట్ల లాంఛనాన్ని పూర్తి చేసుకుని... సౌతాఫ్రికా కథను ముగించాడు. తొలి ఇన్నింగ్స్లో 55 ఓవర్లలో 159 పరుగులు చేసిన సౌతాఫ్రికా ఆలౌట్ అయింది.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా తొలి టెస్టు తుది జట్లుభారత్యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.దక్షిణాఫ్రికా ఐడెన్ మార్క్రమ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, తెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరెన్ని (వికెట్ కీపర్), సైమన్ హార్మర్, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్చదవండి: IND vs SA: అతడిని ఎందుకు పక్కన పెట్టారు? గంభీర్పై కుంబ్లే ఫైర్ -
గంభీర్ ఊహించని ప్రయోగం.. భారత క్రికెట్ చరిత్రలోనే
కోల్కతా వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు అరుదైన రికార్డుకు వేదికైంది. ఈ మ్యాచ్లో టీమిండియా ఆరుగురు ఎడమ చేతి వాటం ప్లేయర్లతో బరిలోకి దిగింది. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్లో ఆరుగురు లెఫ్ట్ హ్యాండ్ ఆటగాళ్లు ఆడడం ఇదే తొలిసారి.యశస్వి జైశ్వాల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, పంత్, కుల్దీప్ యాదవ్ వంటి ఆరుగురు ఎడమ చేతి వాటం ప్లేయర్లు ఉన్నారు. టాప్-8లో అయితే ఏకంగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఏకంగా ఐదుగురు ఉండడం గమనార్హం.అంతకముందు మూడు సందర్భాల్లో భారత్ ఐదుగురు లెఫ్ట్ హ్యాండర్లతో ఆడింది. కానీ ఆరు మంది ఆడడం ఇదే మొదటి సారి. అయితే హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్లు విమర్శలు కురిపిస్తున్నారు. ఆరుగురు అవసరమంటా అంటూ మండిపడుతున్నారు. అందులో నలుగురు స్పిన్నర్లే ఉన్నారు. ఈ మ్యాచ్లో కేవలం ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో మాత్రమే భారత్ ఆడుతోంది.భారత్ అత్యధిక లెఫ్ట్ హ్యాండర్లతో ఆడిన టెస్టులు ఇవే..6 vs సౌతాఫ్రికా-కోల్కతా 20255 vs ఇంగ్లండ్ - మాంచెస్టర్, 20255 vs వెస్టిండీస్- అహ్మదాబాద్, 20255 vs వెస్టిండీస్- ఢిల్లీ, 2025సౌతాఫ్రికాతో తొలి టెస్టుకు భారత ప్లేయింగ్ ఎలెవన్యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ -
అతడిని ఎందుకు పక్కన పెట్టారు? గంభీర్పై కుంబ్లే ఫైర్
కోల్కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టుకు భారత తుది జట్టు ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా యువ ఆటగాడు సాయి సుదర్శన్ను జట్టు నుంచి తప్పించడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో సుదర్శన్ విఫలమైనప్పటికి.. స్వదేశంలో వెస్టిండీస్తో సిరీస్లో మాత్రం సత్తాచాటాడు.దీంతో సౌతాఫ్రికా సిరీస్లో కూడా అతడు ఆడడం ఖాయమని అంతా భావించారు. కానీ హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం అతడిని బెంచ్కు పరిమితం చేశాడు. మూడో స్ధానంలో సుదర్శన్కు బదులుగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్కు పంపాలని టీమ్ మెనెజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఈ మ్యాచ్లో భారత్ ఆరుగురు ఎడమ చేతి వాటం ప్లేయర్లు (జైశ్వాల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, పంత్, కుల్దీప్ యాదవ్)తో బరిలోకి దిగింది.ఈ నేపథ్యంలో గంభీర్పై భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే విమర్శలు గుప్పించాడు. సౌతాఫ్రికాతో తొలి టెస్టుకు ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ చూసి ఆశ్చర్యపోయాను. ఈ మ్యాచ్లో సాయి సుదర్శన్ ఖచ్చితంగా ఆడుతాడని అనుకున్నాను. కానీ అతడిని పక్కన పెట్టారు. ఇప్పుడు నంబర్ 3లో ఎవరు బ్యాటింగ్ చేస్తారు? వాషింగ్టన్ సుందర్ నంబర్ 3లో ఆడుతాడా? అస్సలు మీ ప్రణాళిక ఎంటో ఆర్ధం కావడం లేదు. నలుగురు స్పిన్నర్లు, కేవలం ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో ఆడడం ఏంటి? తొలి రోజు బ్యాటింగ్కు కోల్కతా వికెట్ బాగుంది. కాబట్టి నలుగురు స్పిన్నర్లు అవసరం లేదు. కచ్చితంగా నలుగురులో ఎవరో ఒకరు తక్కువ ఓవర్లకే పరిమితమవుతారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ తనకు ఉన్న అప్షన్స్ను ఎలా ఉపయోగిస్తాడో వేచి చూడాలి అని సోనీ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుంబ్లే పేర్కొన్నాడు.సౌతాఫ్రికాతో తొలి టెస్టుకు భారత ప్లేయింగ్ ఎలెవన్యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ -
సౌతాఫ్రికా కెప్టెన్ను ఎగతాళి చేసిన బుమ్రా!
ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరుగుతున్నాడు. అద్బుతమైన యార్కర్లు, ఇన్స్వింగర్స్తో ప్రోటీస్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. సౌతాఫ్రికా ఓపెనర్లు రియాన్ రికెల్టన్, ఐడైన్ మార్క్రమ్ ఇద్దరిని బుమ్రా వరుస క్రమంలో పెవిలియన్కు పంపాడు. అయితే ప్రోటీస్ ఇన్నింగ్స్ 13 ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా, వికెట్ కీపర్ రిషబ్ పంత్ మధ్య సరదా సన్నివేశం చోటు చేసుకుంది.ఏమి జరిగిందంటే?13 ఓవర్లో మార్క్రమ్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా.. బుమ్రా బౌలింగ్ను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డాడు. ఆ ఓవర్లో ఆఖరి బంతిని జస్ప్రీత్ గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ డెలివరీని ప్రోటీస్ కెప్టెన్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు.కానీ బంతి మిస్స్ అయ్యి అతడి ప్యాడ్కు తాకింది. దీంతో బౌలర్తో పాటు భారత ఫీల్డర్లు ఎల్బీగా అప్పీల్ చేశారు. అంపైర్ మాత్రం నాటౌట్ అంటూ తల ఊపాడు. బుమ్రా మాత్రం ఖచ్చితంగా వికెట్లకు తాకుతుందన్న నమ్మకంగా కన్పించాడు.అయితే బంతి మరీ ఎత్తులో తాకిందా లేదా అని చర్చించడానికి రిషబ్ పంత్ వద్దకు బుమ్రా వెళ్లాడు. మిగితా ఆటగాళ్లంతా స్టంప్ల దగ్గర గుమిగూడారు. ఇదే విషయాన్ని పంత్ను బుమ్రా అడిగాడు. పంత్ కూడా కొంచెం పైకి వెళ్తుందని సూచించాడు. కెప్టెన్ గిల్ కూడా శుభ్మన్ గిల్ రివ్యూ తీసుకోవడానికి అంతగా సుముఖత చూపలేదు. దీంతో “క్రీజులో ఉన్నది బావుమా” కదా అంటూ బుమ్రా బౌలింగ్ చేసేందుకు తన ఎండ్కు వెళ్లిపోయాడు. ఈ సందర్భంగా ఓ అసభ్య పదాజాలన్ని కూడా వాడాడు. దీంతో అంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇదంతా స్టంప్ మైక్లో రికార్డు అయింది. కాగా దక్షిణాఫ్రికా కెప్టెన్ పొట్టిగా ఉంటాడని ఉద్దేశ్యంతో బుమ్రా ఈ కామెంట్స్ చేశాడు. అతడి హైట్ తక్కువగా ఉండడంతో బంతి మరీ ఎత్తులో వెళుతుందేమో అనే డౌట్తో బుమ్రా రివ్యూకు వెళ్లలేదు. బుమ్రా సందేహమే నిజమైంది. రిప్లేలో బంతి స్టంప్స్ మిస్ అవుతున్నట్లు తేలింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు బుమ్రా ప్రవర్తనపై సీరియస్ అవుతున్నారు. పొట్టిగా ఉన్న బవుమాను బుమ్రా ఎగతాళి చేశాడని, ఇది అస్సలు ఊహించలేదని కామెంట్లు పెడుతున్నారు. మరి కొంతమంది ఇది బుమ్రా సరదాగా అన్నాడని, సీరియస్ తీసుకోవాల్సిన అవసరములేదని మద్దతుగా నిలుస్తున్నారు. సాధారణంగా బుమ్రా మైదానంలో చాలా సైలెంట్గా ఉంటాడు. వికెట్ సెలబ్రేషన్స్ కూడా అతిగా చేసుకోడు. ప్రత్యర్ధి బ్యాటర్లను హేళన చేయడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు వంటివి బుమ్రా ఎప్పుడూ చేయలేదు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం తన సహజ ప్రవర్తనకు కాస్త భిన్నంగా బుమ్రా వ్యవహరించాడు.చదవండి: పాకిస్తాన్కు ఐసీసీ భారీ షాక్..pic.twitter.com/TEgjD33KZA— Pulga (@Lap_alt) November 14, 2025 -
కుల్దీప్ మ్యారేజ్ లీవ్.. రెండో టెస్టుకు దూరం!
టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఓ ఇంటివాడు కానున్నాడు. నవంబర్ చివరి వారంలో కుల్దీప్ వివాహం జరగనుంది. ఈ క్రమంలో టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. కుల్దీప్ తన పెళ్లికి సెలవు మంజారు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)ని కుల్దీప్ అభ్యర్ధించినట్లు తెలుస్తోంది. సఫారీలతో తొలి టెస్టు తర్వాత తనను జట్టు నుంచి కుల్దీప్ను రిలీజ్ చేసే అవకాశముంది."కుల్దీప్ వివాహం నవంబర్ చివరి వారంలో జరగనుంది. అతడు సెలవు మంజూరు చేయాలని బోర్డును అభ్యర్దించాడు. అయితే షెడ్యూల్ను పరిగణలోకి తీసుకుని అతడికి ఎన్ని రోజులు సెలవు ఇవ్వాలనేది టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయిస్తుంది బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.కాగా ఏడాది జూన్లో తన చిన్ననాటి స్నేహితురాలు వంశికతో కుల్దీప్ నిశ్చితార్థం జరిగింది. ఆ సమయంలో యాదవ్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటికి.. ఐపీఎల్ ముగింపు ఆలస్యం కావడంతో పెళ్లిని వాయిదా వేసుకున్నాడు.అతడికి బీసీసీఐ సెలవు మంజారు చేస్తే నవంబర్ 22 నుంచి జరగనున్న రెండో టెస్టుకు కుల్దీప్ దూరమయ్యే అవకాశముంది. అతడి తిరిగి వన్డే సిరీస్కు భారత జట్టులోకి వచ్చే అవకాశముంది. ప్రస్తుతం కుల్దీప్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టుకు భారత ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కించుకున్నాడు. క్విక్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే ఈడెన్ వికెట్పై కుల్దీప్ మ్యాజిక్ చేసే అవకాశముంది. అంతకుముందు విండీస్తో జరిగిన టెస్టు సిరీస్లోనూ కుల్దీప్ 12 వికెట్లు పడగొట్టాడు.చదవండి: పాకిస్తాన్కు ఐసీసీ భారీ షాక్.. -
పాకిస్తాన్కు ఐసీసీ భారీ షాక్..
రావల్పిండి వేదికగా శ్రీలంతో జరిగిన తొలి వన్డేలో గెలిచి జోష్ మీదున్న పాకిస్తాన్కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ భారీ షాకిచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్తాన్ జట్టుకు ఐసీసీ జరిమానా విధించింది. ఈ మ్యాచ్లో శ్రీలంక నిర్ణీత సమయంలో తమ కోటా 50 ఓవర్లు పూర్తి చేయలేకపోయింది (నాలుగు ఓవర్లు వెనుకపడింది).ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఇది ఆర్టికల్ 2.22 ఉల్లంఘణ కిందికి వస్తుంది. ఈ క్రమంలో పాక్ జట్టులో ప్రతీ ఆటగాడి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు. తమ తప్పును మెన్ ఇన్ గ్రీన్ కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది అంగీకరించాడు. దీంతో అతను తదుపరి విచారణ నుంచి మినహాయింపు పొందాడు.నేడు రెండో వన్డే..ఇక పాక్-శ్రీలంక మధ్య రెండో వన్డేను భద్రతా కారణాల దృష్ట్యా రీ షెడ్యూల్ చేశారు. వాస్తవానికి గురువారం (నవంబర్ 13)న జరగాల్సిన రెండో వన్డే శుక్రవారం జరగనుంది. ఇటీవలే ఇస్లామాబాద్లో జరిగిన ఆత్మాహుతి దాడితో లంక క్రికెటర్లు భయందోళనకు గురయ్యారు. దీంతో తొలి వన్డే తర్వాత లంక క్రికెటర్లలో సుమారు 8 మంది ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లిపోతామని జట్టు మేనేజ్మెంట్ను కోరారు. కానీ శ్రీలంక క్రికెట్ మాత్రం అందుకు అంగీకరించలేదు. వన్డే సిరీస్తో పాటు ముక్కోణపు సిరీస్నూ ముగించుకున్నాకే స్వదేశానికి రావాలని వారిని ఆదేశించింది. దీంతో లంక ఆటగాళ్లు పాక్లోనే ఉండనున్నారు.చదవండి: సెలక్టర్ల కీలక నిర్ణయం.. కెప్టెన్గా వరుణ్ చక్రవర్తి -
ముగిసిన తొలి రోజు ఆట
IND vs SA 1st Test Live Updates: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుతబ్యాటింగ్ చేసి.. తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సరికి 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. వెలుతురు లేమి వల్ల ముందుగానే ఆట ను ముగించారు. కేఎల్ రాహుల్ 13 , వాషింగ్టన్ సుందర్ ఆరు పరుగులతో క్రీజులో నిలిచారు.తొలి వికెట్ కోల్పోయిన భారత్మార్కో జాన్సెన్ బౌలింగ్లో జైస్వాల్ (12) బౌల్డ్. తొలి వికెట్ కోల్పోయిన భారత్. స్కోరు: 18-1(7). క్రీజులోకి వాషింగ్టన్ సుందర్. కేఎల్ రాహుల్ 17 బంతుల్లో రెండు పరుగులతో ఉన్నాడు.సౌతాఫ్రికా ఆలౌట్భారత్తో తొలి టెస్టులో తొలి రోజే సౌతాఫ్రికా ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్ల ధాటికి తాళలేక 159 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో మార్క్రమ్(31) టాప్ స్కోరర్గా నిలవగా.. ర్యాన్ రికెల్టన్(23), ముల్డర్(24) కాసేపు క్రీజులో నిబడ్డారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్ల హాల్తో చెలరేగాడు. అతడితో పాటు సిరాజ్, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెటలు తీశారు.పదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికాబుమ్రా బౌలింగ్ కేశవ్ మహరాజ్ (0) ఎల్బీడబ్ల్యూ కావడంతో సౌతాఫ్రికా ఆలౌట్ అయింది.తొమ్మిదో వికెట్ డౌన్బుమ్రా బౌలింగ్లో హార్మర్ (5) బౌల్డ్. తొమ్మిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా.ఆలౌట్ దిశగా సౌతాఫ్రికా..కార్బిన్ బాష్ రూపంలో సౌతాఫ్రికా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. మూడు పరుగులు చేసిన బాష్ అక్షర్ పటేల్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. టీ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. క్రీజులో ట్రిస్టన్ స్టబ్స్(15), హార్మర్(0) ఉన్నారు.సిరాజ్ ఆన్ ఫైర్..సౌతాఫ్రికా ఏడో వికెట్ కోల్పోయింది. మార్కో జానెసన్ను అద్భుతమైన బంతితో సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 48 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్: 151/7సౌతాఫ్రికా ఆరో వికెట్ డౌన్సౌతాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన వెర్రియిన్.. సిరాజ్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. క్రీజులోకి మార్కో జానెసన్ వచ్చాడు. 44.4 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 146/6సౌతాఫ్రికా ఐదో వికెట్ డౌన్..లంచ్ విరామం తర్వాత సౌతాఫ్రికా వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో వియాన్ ముల్డర్(24) వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత బుమ్రా బౌలింగ్లో డీజోరీ ఎల్బీగా వెనుదిరిగాడు. 33 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. క్రీజులో స్టబ్స్(2), కైల్ వెర్రియినే ఉన్నారు.లంచ్ బ్రేక్కు సౌతాఫ్రికా స్కోరెంతంటే?తొలి రోజు లంచ్ సమయానికి సౌతాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. క్రీజులో టోనీ డి జోర్జీ(15), ముల్డర్(22) ఉన్నాడు. భారత బౌలర్లలో ఇప్పటివరకు బుమ్రా రెండు, కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ సాధించాడు.సౌతాఫ్రికా మూడో వికెట్ డౌన్..టెంబా బావుమా రూపంలో సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. మూడు పరుగులు చేసిన బవుమా.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు.సౌతాఫ్రికా రెండో వికెట్ డౌన్..ఐడైన్ మార్క్రమ్ రూపంలో సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన మార్క్రమ్.. బుమ్రా బౌలింగ్లో పంత్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 16 ఓవర్లకు సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. క్రీజులో బావుమా(2), ముల్డర్(5) ఉన్నారు. సౌతాఫ్రికా తొలి వికెట్ డౌన్..57 పరుగుల వద్ద సౌతాఫ్రికా తొలి వికెట్ను కోల్పోయింది. 23 పరుగులు చేసిన ర్యాన్ రికెల్టన్..జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి వియాన్ ముల్డర్ వచ్చాడు.5 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోరెంతంటే?5 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్( మార్క్రమ్(0),భారత్-సౌతాఫ్రికా మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ సమరం షురూ అయింది. ఈ సిరీస్లో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.ఈ మ్యాచ్కు సఫారీ స్టార్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ దూరమయ్యాడు. అతడి స్ధానంలో బాష్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా ఇద్దరు స్పెషలిస్ట్ వికెట్ కీపర్లతో బరిలోకి దిగింది. స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రీఎంట్రీ ఇచ్చాడు.అదేవిధంగా సూపర్ ఫామ్లో ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్కు సైతం ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కింది. అక్షర్ పటేల్ కూడా కమ్బ్యాక్ ఇచ్చాడు. కాగా ఇరు జట్లు కూడా ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో మాత్రమే ఆడుతున్నాయి.తుది జట్లుదక్షిణాఫ్రికా : ఐడెన్ మార్క్రామ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బావుమా(కెప్టెన్), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్(వికెట్ కీపర్), సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్భారత్: యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ -
సెలక్టర్ల కీలక నిర్ణయం.. కెప్టెన్గా వరుణ్ చక్రవర్తి
దేశవాళీ క్రికెట్ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (Syed Mushtaq Ali Trophy)-2025 కోసం తమ జట్టును తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా భారత స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) ఎంపికయ్యాడు.ప్రొఫెషనల్ క్రికెట్లో వరుణ్ ఓ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనుండడం ఇదే తొలిసారి. ఇంతకుముందు పరిమిత ఓవర్ల క్రికెట్లో తమిళనాడు జట్టుకు స్టార్ ఆల్రౌండర్ షారుఖ్ ఖాన్ (M Shahrukh Khan) నాయకత్వం వహించాడు. ఇప్పుడు అతడి స్ధానాన్ని సీనియర్ వరుణ్తో సెలక్టర్లు భర్తీ చేశారు.సాయి కిషోర్, నారాయణ్ జగదీశన్ (Narayan Jagadeesan) ఉన్నప్పటికి వరుణ్కే జట్టు పగ్గాలను కట్టబెట్టారు. అయితే ఈ టోర్నీలో అతడి డిప్యూటీగా జగదీశన్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. వరుణ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ను సొంతం చేసుకోవడంలో వరుణ్ది కీలక పాత్ర. ఈ సిరీస్లో అతడు మూడు మ్యాచ్లలో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇప్పటికే వరుణ్ డొమాస్టిక్ క్రికెట్లో తమిళనాడు తరపున తనదైన ముద్ర వేసుకున్నాడు ఇక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నవంబర్ 26 ప్రారంభం కానుంది. తమిళనాడు తమ తొలి మ్యాచ్లో టోర్నీ ఆరంభం రోజునే రాజస్తాన్తో తలపడనుంది. కాగా ఈ టోర్నీకి స్టార్ ఆటగాడు సాయిసుదర్శన్ దూరమయ్యాడు. స్టార్ ఫాస్ట్ బౌలర్ నటరాజన్ మాత్రం అందుబాటులో ఉన్నాడు.SMAT 2025 కోసం తమిళనాడు స్క్వాడ్వరుణ్ చక్రవర్తి (కెప్టెన్), నారాయణ్ జగదీశన్ (వైస్ కెప్టెన్), తుషార్ రహేజా , అమిత్ సాథ్విక్, షారుఖ్ ఖాన్, ఆండ్రీ సిద్దార్థ్, ప్రదోష్ రంజన్ పాల్, శివమ్ సింగ్, సాయి కిషోర్, సిద్ధార్థ్, నటరాజన్, గురజప్నీత్ సింగ్, సోథు సిలంబరసన్, రితిక్ ఈశ్వరన్ (వికెట్ కీపర్)చదవండి: IPL 2026: ముంబై ఇండియన్స్లోకి విధ్వంసకర వీరుడు.. ఆరేళ్ల తర్వాత -
సఫారీ సవాల్కు సై
కోల్కతా: సొంతగడ్డపై బెబ్బులి అయిన టీమిండియాతో ప్రపంచ టెస్టు చాంపియన్ దక్షిణాఫ్రికా సవాల్కు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య నేటి నుంచి ఈడెన్ గార్డెన్స్లో తొలి టెస్టు జరగనుంది. ఇరుజట్లలోనూ నాణ్యమైన స్పిన్నర్లు ఉండటంతో స్పిన్ ఫ్రెండ్లీ వికెట్పై ఈ సంప్రదాయ క్రికెట్ సమరం ఆసక్తికరంగా జరుగుతుందని అంతా ఆశిస్తున్నారు. ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్ను సమం చేసుకున్న భారత్ అదే ఉత్సాహంతో సొంతగడ్డపై సఫారీని ఓడించాలనే లక్ష్యంతో ఉంది. బ్యాటింగ్ బలగం, స్పిన్, పేస్ల కలబోతతో పాటు అనుకూలించే ఆతిథ్య వేదిక టీమిండియాను పైచేయిగా నిలుపుతోంది. టీమిండియాకు పరీక్షే! ఆతిథ్య అనుకూలతలెన్ని ఉన్నా కూడా న్యూజిలాండ్తో భారత్లో జరిగిన టెస్టు సిరీస్లో టీమిండియా వైట్వాష్ అయ్యింది. కాబట్టి ఈసారి ఆదమరిస్తే అంతేసంగతి. తొలి రోజు తొలి సెషన్ నుంచే భారత ఆటగాళ్లు ఈ విషయాన్ని గుర్తుంచుకొని శ్రమిస్తేనే అనుకూలతలో సానుకూల ఫలితాల్ని ఆశించవచ్చు. బ్యాటింగ్ లైనప్ మునుపెన్నడూ లేనంత పటిష్టంగా ఉంది. ఏకంగా ఎనిమిది, తొమ్మిది మంది బ్యాటింగ్ చేసే ఆటగాళ్లు తుది జట్టులో ఉన్నారు. జైస్వాల్, రాహుల్, సాయిసుదర్శన్లతో టాపార్డర్, కెప్టెన్ గిల్, రిషభ్ పంత్, ధ్రువ్ జురేల్లతో కూడిన మిడిలార్డర్, జడేజా, సుందర్, అక్షర్లతో లోయర్ ఆర్డర్ కూడా పరుగులు రాబట్టగలదు. ఇంగ్లండ్ సిరీస్లో సుందర్, జడేజాల భాగస్వామ్యం, టెస్టును ‘డ్రా’ చేసిన వైనం ఇప్పుడప్పుడే ఎవరూ మర్చిపోరు. ఇంగ్లండ్ పర్యటనలో గాయపడిన రిషభ్ పంత్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటేందుకు సిద్ధం కాగా, ధ్రువ్ జురేల్ భీకర ఫామ్లో ఉన్నాడు. కాబట్టే టీమ్ మేనేజ్మెంట్ ఆంధ్ర పేస్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ను పక్కనబెట్టి మరీ ఇద్దరు స్పెషలిస్టు వికెట్ కీపర్లకు అవకాశమిచ్చింది. సఫారీ తక్కువేం కాదు... దక్షిణాఫ్రికా గట్టి ప్రత్యర్థి. గతంలో భారత పర్యటనలకు వచ్చినపుడు కంగుతిన్న సఫారీ జట్లకి... ప్రస్తుత బవుమా బృందానికి తేడా ఉంది. భారత్లాగే దక్షిణాఫ్రికా ఆయుధం కూడా స్పిన్నే! అనుభవజు్ఞడైన కేశవ్ మహరాజ్తో పాటు సైమన్ హార్మర్, సెనురాన్ ముత్తుసామి ఈ పర్యటనలో తప్పకుండా ఆతిథ్య బౌలర్లకు దీటుగా ప్రభావం చూపించగలరు. అచ్చూ భారత్లాగే సఫారీ బ్యాటింగ్ లైనప్ కూడా పటిష్టంగా ఉంది. మార్క్రమ్–రికెల్టన్ ఓపెనింగ్ జోడీ నుంచి ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు దిగే మార్కో యాన్సెన్ వరకు పరుగులు సాధిస్తారు. ట్రిస్టన్ స్టబ్స్, డి జార్జి, సారథి బవుమా, వికెట్ కీపర్ కైల్ వెరీన్లు స్పిన్, పేస్ను ఎంచక్కా ఎదుర్కోగలరు. పైగా ఇక్కడికి వచ్చే ముందు పాక్లో పర్యటించిన దక్షిణాఫ్రికా జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ (వన్డే, టి20)లు ఓడిందేమో కానీ టెస్టు సిరీస్ను మాత్రం కోల్పోలేదు. 1–1తో సమం చేసుకొని భారత ఉపఖండంపై సత్తాచాటేందుకు ‘సై’ అంటోంది. పిచ్, వాతావరణం ఈడెన్ గార్డెన్స్ పిచ్ తొలిరోజు బ్యాటింగ్కు అనుకూలం. పిచ్పై ఉన్న పచ్చికతో పేస్ బౌలర్లు కూడాఆరంభంలో ప్రభావం చూపొచ్చు. ఆఖరి సెషన్ లేదంటే మూడో రోజు నుంచి స్పిన్కు టర్న్ అవుతుంది. టాస్ నెగ్గిన జట్టు కచ్చితంగా బ్యాటింగే ఎంచుకుంటుంది. వర్షం ముప్పు లేదు.16 భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇప్పటి వరకు మొత్తం 44 టెస్టులు జరిగాయి. 16 టెస్టుల్లో భారత్, 18 టెస్టుల్లో దక్షిణాఫ్రికా గెలిచాయి. 10 టెస్టులు ‘డ్రా’గా ముగిశాయి. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో భారత్ 19 టెస్టులు ఆడింది. 11 టెస్టుల్లో నెగ్గి, ఐదింటిలో ఓడింది. మూడు టెస్టులు ‘డ్రా’ అయ్యాయి.13 ఈడెన్ గార్డెన్స్లో భారత జట్టు ఇప్పటి వరకు 42 టెస్టులు ఆడింది. 13 మ్యాచ్ల్లో నెగ్గి, 9 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 20 మ్యాచ్లు ‘డ్రా’గా ముగిశాయి. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈడెన్ గార్డెన్స్లో మూడు టెస్టులు జరిగాయి. రెండింటిలో భారత్, ఒక దాంట్లో దక్షిణాఫ్రికా గెలుపొందాయి. తుది జట్లు (అంచనా) భారత్: గిల్ (కెప్టెన్ ), జైస్వాల్, రాహుల్, సాయిసుదర్శన్, పంత్, జురేల్, జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్/కుల్దీప్, బుమ్రా, సిరాజ్. దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్ ), మార్క్రమ్, రికెల్టన్, స్టబ్స్, టోని డి జోర్జి, కైల్ వెరీన్, సెనురాన్ ముత్తుసామి, హార్మర్, యాన్సెన్, కేశవ్, రబడ. -
రుతురాజ్ సూపర్ సెంచరీ.. భారత్ ఘన విజయం
రాజ్కోట్ వేదికగా సౌతాఫ్రికా-ఎతో జరిగిన తొలి అనధికారిక వన్డేలో రుతురాజ్ గైక్వాడ్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 286 పరుగుల లక్ష్య చేధనలో రుతురాజ్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్ను ఆరంభించిన గైక్వాడ్ వికెట్కు 64 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.వరుస క్రమంలో అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ పెవిలియన్కు చేరినప్పటికి.. రుతురాజ్ మాత్రం తన ఏకాగ్రతను కోల్పోలేదు. ఈ మహారాష్ట్ర బ్యాటర్ ఆచితూచి ఆడుతూ 110 బంతుల్లో తన 16వ లిస్ట్-ఎ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 129 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్ 12 ఫోర్ల సాయంతో 117 పరుగులు చేసి ఔటయ్యాడు. సౌతాఫ్రికా చిత్తు..రుతురాజ్తో పాటు కెప్టెన్ తిలక్ వర్మ(39), నితీశ్ కుమార్ రెడ్డి(37), నిషాంత్ సింధు(29) రాణించారు. ఫలితంగా భారత-ఎ జట్టు ప్రోటీస్పై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 286 పరుగుల లక్ష్యాన్ని ఇండియా-ఎ జట్టు 6 వికెట్లు కోల్పోయి 49.3 ఓవర్లలో చేధించింది.అంతకముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా-ఎ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 285 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రోటిస్ పోట్గీటర్(88 పరుగులు; 103 బంతుల్లో), డెలనో పోట్గీటర్ (77 పరుగులు; 83 బంతుల్లో), బ్యోర్న్ ఫార్టూన్ (59 పరుగులు; 56 బంతుల్లో) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు.అభిషేక్ ఫెయిల్..కాగా 50 ఓవర్ల ఫార్మాట్లో స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. అభిషేక్ దూకుడుగా ఆడి కేవలం 25 బంతుల్లోనే 31 పరుగులు చేసి ఔటయ్యాడు. తనకు లభించిన ఆరంభాన్ని భారీ స్కోర్గా మలచడంలో అతడు విఫలమయ్యాడు. ఈ పంజాబ్ క్రికెటర్ వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
భారీ విజయం దిశగా బంగ్లాదేశ్
సిల్హెట్ వేదికగా ఐర్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఘన విజయం దిశగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఐర్లాండ్ తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. ఐరీష్ జట్టు బంగ్లా కంటే ఇంకా 215 పరుగులు వెనకబడి ఉంది.రెండో ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి ఐర్లాండ్ టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్(43) కాసేపు నిలకడగా ఆడాడు. మిగితా బ్యాటర్లంతా వచ్చినవారు వచ్చినట్లగానే పెవిలియన్కు క్యూ కట్టారు. బంగ్లా బౌలర్లలో ఇప్పటివరకు హసన్ మురాద్ రెండు వికెట్లు పడగొట్టగా.. నహిద్ రాణా, తైజుల్ ఇస్లాం తలా వికెట్ సాధించారు.స్టిర్లింగ్ రనౌటయ్యాడు. ఇక బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్ను 587/8 భారీ స్కోర్ వద్ద డిక్లేర్డ్ చేసింది. బంగ్లాదేశ్ ఓపెనర్ మహముదుల్ హసన్ జాయ్(171 పరుగులు), కెప్టెన్ నజ్ముల్ హోస్సేన్ షాంటో(100) శతకాలతో కదం తొక్కగా.. షాద్మన్ ఇస్లామ్( 80 పరుగులు), మోమినుల్ హక్(82) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఐర్లాండ్ యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మాథ్యూ హంఫ్రీస్ ఫైవ్ వికెట్ల హాల్తో సత్తాచాటాడు. అంతకుముందు ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 286 పరుగులకు ఆలౌటైంది. వెటరన్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (60), కేడ్ కార్మిచల్ (59) అర్ద సెంచరీలతో రాణించారు. కర్టిస్ క్యాంఫర్ (44), లోర్కాన్ టకర్ (41), జోర్డన్ నీల్ (30), బ్యారీ మెక్కార్తీ (31) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. ఈ మ్యాచ్లో ఐర్లాండ్ ఇన్నింగ్స్ తేడాతో ఓటమి నుంచి తప్పించుకోవాలంటే ఏదైనా అద్బుతం జరగాలి.చదవండి: ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీ.. భారత తుది జట్టు ఇదే -
ముంబై ఇండియన్స్లోకి విధ్వంసకర వీరుడు
ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందే ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తమ మార్క్ చూపిస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్ నుంచి శార్ధూల్ ఠాకూర్ను రూ.2 కోట్ల బెస్ ప్రెస్కు ట్రేడ్ చేసుకున్న ముంబై ఇండియన్స్.. ఇప్పుడు మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. గుజరాత్ టైటాన్స్ (GT) నుంచి వెస్టిండీస్ ఫినిషర్ షెర్ఫేన్ రూథర్ ఫర్డ్ను ముంబై ఇండియన్స్ ట్రేడ్ రూపంలో సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ముంబై ఫ్రాంచైజీ ఎక్స్ వేదికగా ధ్రువీకరించింది.కాగా గత సీజన్ వేలంలో రూథర్ ఫర్డ్ను రూ. 2.6 కోట్లకు గుజరాత్ కొనుగోలు చేసింది. ఈ కరేబియన్ ఆటగాడు ఇప్పుడు అదే ప్రైస్ ట్యాగ్తో ముంబైకి మారాడు. ఐపీఎల్-2025లో రూథర్ ఫర్డ్ అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికి గుజరాత్ అతడిని ట్రేడ్ చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే నమన్ ధీర్ వంటి సూపర్ ఫినిషర్ ఉండడంతో రూథర్ఫర్డ్ను మిడిల్ ఆర్డర్లో ఉపయోగించుకోవాలని ముంబై యోచిస్తున్నట్లు తెలుస్తోంది.Poore #CricketTwitter ko hila daala na? 😎🔥 pic.twitter.com/wuizRDyvwM— Mumbai Indians (@mipaltan) November 13, 202527 ఏళ్ల షెర్ఫేన్ రూథర్ఫర్డ్ విండీస్ తరపున ఇప్పటివరకు వెస్టిండీస్ తరపున 44 టీ20లు ఆడాడు. ఆండ్రీ రస్సెల్తో కలిసి టీ20ల్లో ఆరో వికెట్కు అత్యధిక భాగస్వామ్యం(139) నెలకొల్పిన రికార్డును అతడు కలిగి ఉన్నాడు. ఇక 2019 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఈ క్యాష్ రిచ్ లీగ్లో అడుగుపెట్టిన రూథర్ ఫర్డ్.. ఇప్పటివరకు 23 మ్యాచ్లు ఆడాడు. ఐపీఎల్-2020 సీజన్లో ముంబై ఇండియన్స్కు కూడా అతడు ప్రాతినిథ్యం వహించాడు. మళ్లీ ఇప్పుడు ఆరేళ్ల తర్వాత ముంబై తరపున మళ్లీ ఆడనున్నాడు. -
దక్షిణాఫ్రికా బ్యాటర్ల విరోచిత పోరాటం
రాజ్కోట్ వేదికగా భారత్-ఎ జట్టుతో జరుగుతున్న తొలి అనధికారిక వన్డేలో సౌతాఫ్రికా-ఎ లోయార్డర్ బ్యాటర్లు సత్తాచాటారు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసన ప్రోటీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 285 పరుగుల భారీ స్కోర్ చేసింది.అయితే టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన సఫారీలకు భారత స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ ఆరంభంలోనే షాక్ ఇచ్చాడు. అతడి బౌలింగ్ ధాటికి తొలి ఓవర్లోనే దక్షిణాఫ్రికా రెండు వికెట్లను కోల్పోయింది. రెండో ఓవర్లో ప్రసిద్ద్ కృష్ణ సైతం కెప్టెన్ మార్క్వెస్ అకెర్మాన్ను పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత అర్ష్దీప్, సింధు వరుస ఓవర్లలో మరో రెండు వికెట్లు సాధించారు. దీంతో ప్రోటీస్ జట్టు కేవలం 53 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో దిల్దానో పోట్గీటర్(88 పరుగులు; 103 బంతుల్లో), డెలనో పోట్గీటర్ (77 పరుగులు; 83 బంతుల్లో) విరోచిత పోరాటం కనబరిచారు.వీరిద్దరూ ఆరో వికెట్కు వందకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అదేవిధంగా స్పిన్నర్ బ్యోర్న్ ఫార్టూన్ (59 పరుగులు; 56 బంతుల్లో) బ్యాట్తో సత్తాచాటాడు. దీంతో భారత్కు ఫైటింగ్ టార్గెట్ను సౌతాఫ్రికా ఉంచింది. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ధ్ కృష్ణ, నిశాంత్ సింధు, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి తలో ఒక వికెట్ పడగొట్టారు. 286 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిలకడగా ఆడుతోంది. 20 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(31), రియాన్ పరాగ్(8) వికెట్లను మెన్ ఇన్ బ్లూ కోల్పోయింది.చదవండి: ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీ.. భారత తుది జట్టు ఇదే -
ముంబై ఇండియన్స్లోకి శార్థూల్ ఠాకూర్..
ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలానికి ముందు ఆటగాడిని ట్రేడ్ చేసిన మొదటి జట్టుగా లక్నో సూపర్ జెయింట్స్ నిలిచింది. లక్నో తమ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ను ముంబై ఇండియన్స్కు ట్రేడ్ చేసింది. ఇరు జట్ల మధ్య ఒప్పందం అధికారికంగా ఖరారైంది. ఈ మేరకు ఐపీఎల్ మెనెజ్మెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది."ఐపీఎల్-2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ ఆల్రౌండర్ శార్ధూల్ ఠాకూర్.. ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. రెండు ఫ్రాంచైజీ మధ్య ట్రేడ్ డీల్ విజయవంతమైంది. గత సీజన్లో గాయపడిన ఆటగాడి స్ధానంలో శార్ధూల్ను రూ.2 కోట్లకు లక్నో కొనుగోలు చేసింది. ఇప్పుడు అదే మొత్తాన్ని ముంబై చెల్లించేందుకు సిద్దమైంది" అని ఐపీఎల్ మెనెజ్మెంట్ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ డీల్ పూర్తిగా ఆల్ క్యాష్ డీల్ (All-Cash Deal) ద్వారా జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ డీల్కు ఒక్కరోజు ముందు శార్దూల్కు బదులుగా అర్జున్ టెండూల్కర్ను ఇచ్చిపుచ్చుకునేందుకు లక్నో, ముంబై ఇండియన్స్ సిద్దమయ్యాయి అని వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ వట్టి రూమర్సే తాజా ప్రకటనతో రుజువయ్యాయి. కాగా ఐపీఎల్-2025 వేలంలో ఠాకూర్ను ఏ జట్టు కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో అతడు అన్సోల్డ్గా మిగిలిపోయాడు. అయితే లక్నో పేసర్ మోహ్సిన్ ఖాన్ గాయం కారణంగా దూరం కావడంతో అతడి స్దానంలో శార్ధూల్కు ఆడే అవకాశం లభించింది.రూ. 2 కోట్ల బెస్ప్రైస్కు లక్నో అతడిని దక్కించుకుంది. ఐపీఎల్ 18వ సీజన్లో 10 మ్యాచ్లు ఆడిన శార్ధూల్.. 13 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక శార్ధూల్ ట్రేడ్ విషయాన్ని ముంబై ఇండియన్స్ కూడా ధ్రువీకరించింది. "డ్రీమ్స్ సిటీ అయిన ముంబైకి స్వాగతం అని ముంబై ఇండియన్స్ ఎక్స్లో పోస్ట్ పెట్టింది. కాగా ఠాకూర్ ముంబై నుంచి జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. శార్ధూల్ 2015లో పంజాబ్ కింగ్స్ తరపున అరంగేట్రం చేశాడు. అతడు ఎక్కువ సీజన్ల పాటు సీఎస్కేకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే శార్ధూల్ ముంబై ఇండియన్స్ తరపున ఆడనుండడం ఇదే తొలిసారి. ఇక ఐపీఎల్-2026 సీజన్ మినీ వేలానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను నవంబర్ 15లోపు బీసీసీఐకి సమర్పించాలి.చదవండి: ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీ.. భారత తుది జట్టు ఇదే -
సూర్యకుమార్ యాదవ్ కీలక నిర్ణయం
రంజీ ట్రోఫీ 2025-26 తదుపరి రౌండ్ మ్యాచ్ల నుంచి టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆల్రౌండర్ శివమ్ దూబే తప్పుకొన్నారు. వాస్తవానికి నవంబర్ 16 నుంచి శరద్ పవార్ అకాడమీ వేదికగా పాండిచ్చేరితో జరగనున్న మ్యాచ్లో ముంబై తరపున వీరద్దరూ ఆడాల్సింది.కానీ సౌతాఫ్రికాతో టీ20 సిరీప్కు సన్నదమయ్యేందుకు ఈ రెడ్ బాల్ క్రికెట్ మ్యాచ్కు దూరంగా ఉండాలని సూర్య, దూబే నిర్ణయించుకున్నారు. ఈ స్టార్ క్రికెటర్లు ఇప్పటికే తమ నిర్ణయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)కి తెలియజేశారు. వారిద్దిరి స్ధానంలో తనుష్ కొటియన్, మోహిత్ అవస్థిలను సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మాత్రం సూర్య ఆడనున్నాడు. ఈ విషయాన్ని ఎంసీఎ అధికారి ఒకరు ధ్రువీకరించారు. ఈ టోర్నీని టీ20 ప్రపంచకప్-2026 సన్నాహాకంగా ఉపయోగించుకోవాలని స్కై భావిస్తున్నడంట. అంతర్జాతీయ క్రికెట్లో ఈ ముంబై ఆటగాడు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన చేసినప్పటికి ఆ తర్వాత ఆసియాకప్, ఆస్ట్రేలియా పర్యటనలో నిరాశపరిచాడు. ఆస్ట్రేలియా సిరీస్లో నాలుగు ఇన్నింగ్స్లలో కేవలం 84 పరుగులు మాత్రమే సూర్య చేశాడు.దీంతో స్వదేశంలో సఫారీలతో జరగనున్న టీ20 సిరీస్లో తన ఫామ్ను తిరిగి అందిపుచ్చుకోవాలని సూర్య భావిస్తున్నాడు. ప్రోటీస్తో ఐదు మ్యాచ్ల సిరీస్ డిసెంబర్ 9 నుండి ప్రారంభం కానుంది.చదవండి: ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీ.. భారత తుది జట్టు ఇదే -
ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీ..
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నమెంట్కు సమయం అసన్నమైంది. దోహా వేదికగా ఈ మెగా ఈవెంట్ శుక్రవారం(నవంబర్ 14) నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో పాకిస్తాన్-ఎ, ఒమన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.ఆ తర్వాత అదే రోజున వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ వేదికగా భారత్-ఎ జట్టు, యూఏఈ జట్లు తలపడనున్నాయి. వికెట్ కీపర్ బ్యాటర్ జితీష్ కుమార్ సారథ్యంలో ఇండియా-ఎ జట్టు బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని మెన్ ఇన్ బ్లూ భావిస్తోంది.ఈ జట్టులో వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi), ప్రియాన్ష్ ఆర్య, ఆశుతోష్ శర్మ వంటి ఐపీఎల్ సంచలనాలు ఉన్నారు. ఈ టోర్నమెంట్లో యువ ఆటగాళ్లతో కూడిన భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. గ్రూపు-బిలో భారత్తో పాటు పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ జట్లు ఉన్నాయి. ఈ క్రమంలో యూఏఈతో మ్యాచ్లో భారత్ ఆడే ప్లేయింగ్ ఎలెవన్ను క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఓపెనర్లగా వైభవ్, ఆర్య..ఈ మ్యాచ్లో భారత ఇన్నింగ్స్ను యువ ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ష్ ఆర్య ప్రారంభించనున్నాడు. ఇప్పటికే ఈ ఇద్దరు చిచ్చరపిడుగులు దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్లో ఓపెనర్లగా తమ సత్తాను నిరూపించుకున్నారు. ఫస్ట్ డౌన్లో నమన్ ధీర్ బ్యాటింగ్కు వచ్చే ఛాన్స్ ఉంది. గత ఐపీఎల్ సీజన్లో నమన్ ముంబై ఇండియన్స్ తరపున సంచలన ప్రదర్శన కనబరిచారు. మిడిలార్డర్లో నేహాల్ వధేరా, కెప్టెన్ జితేశ్ శర్మ వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఫినిషర్గా ఆశుతోశ్ శర్మకు తుది జట్టులో దక్కనున్నట్లు తెలుస్తోంది.ఇక ఆల్రౌండర్ల కోటాలో రమణ్దీప్ సింగ్, హర్ష్ దూబేలకు మెనెజ్మెంట్ అవకాశమివ్వనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. తొలి మ్యాచ్లో భారత్ యష్ ఠాకూర్, గుర్జాప్నీత్ సింగ్, విజయ్కుమార్ వైశాఖ్ వంటి ముగ్గురు ఫాస్ట్ బౌలర్లలో బరిలోకి దిగనున్నట్లు సమాచారం.భారత-ఎ తుది జట్టుప్రియాంష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, నమన్ ధీర్, జితేష్ శర్మ(కెప్టెన్), అశుతోష్ శర్మ, రమణదీప్ సింగ్, హర్ష్ దూబే, యష్ ఠాకూర్,గుర్జప్నీత్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్చదవండి: IPL 2026: కేకేఆర్ జట్టులోకి షేన్ వాట్సన్.. -
కేకేఆర్ జట్టులోకి షేన్ వాట్సన్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్కు ముందు కోల్కతా నైట్ రైడర్స్ (KKR) ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు 'అసిస్టెంట్ కోచ్గా ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ను కేకేఆర్ నియమించింది. కోల్కతా హెడ్ కోచ్ అభిషేక్ నాయర్తో కలిసి వాట్సన్ పనిచేయనున్నాడు. ఈ విషయాన్ని కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ ధ్రువీకరించాడు.షేన్ వాట్సన్ను కేకేఆర్ కుటంబంలోకి స్వాగతిస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఆటగాడిగా, కోచ్గా అతడి అనుభవం మా జట్టు సన్నద్దతకు ఉపయోగపడుతోంది. టీ20 ఫార్మాట్పై అతడి అవగహన మా జట్టును మరో స్ధాయి తీసుకువెళ్తుందని ఆశిస్తున్నాము అని వెంకీ మైసూర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ట్రాక్ రికార్డు అదుర్స్కాగా ఐపీఎల్లో షేన్ వాట్సన్ ఆటగాడిగా, కోచ్గా తన సేవలను అందించాడు. ఐపీఎల్ ప్రారంభ సీజన్లో రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహించిన వాట్సన్.. 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచాడు. 2013 సీజన్లో కూడా మరోసారి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కించుకున్నాడు. ఐపీఎల్-2018 సీజన్లో సీఎస్కే ఛాంపియన్గా నిలవడంలో వాట్సన్ది కీలక పాత్ర. ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన సెంచరీతో షేన్ చెలరేగాడు. ఇకఐపీఎల్ రిటైర్మెంట్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్గా కూడా వాట్సన్ పనిచేశాడు. ఇప్పుడు తొలిసారి కేకేఆర్ కోచింగ్ స్టాప్లో ఈ ఆసీస్ దిగ్గజం భాగంకానున్నాడు. ఇక కేకేఆర్ అసిస్టెంట్ కోచ్గా ఎంపిక కావడం పట్ల షేన్ వాట్సన్ ఆనందం వ్యక్తం చేశాడు. కోల్కతా నైట్రైడర్స్ వంటి అద్భుత ఫ్రాంచైజీలో భాగం కావడం నాకు దక్కిన గొప్ప గౌరవం. కోల్కతాకు మరో టైటిల్ను అందించడానికి అన్ని విధాలగా కృషి చేస్తానని వాట్సన్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్-2024 ఛాంపియన్స్గా నిలిచిన కేకేఆర్.. గత సీజన్లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచింది. దీంతో హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిత్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్పై కేకేఆర్ వేటు వేసింది.చదవండి: నేపాల్ ప్రీమియర్ లీగ్ ఆడనున్న మరో భారత స్టార్ క్రికెటర్ -
నేపాల్ ప్రీమియర్ లీగ్ ఆడనున్న మరో భారత స్టార్ క్రికెటర్
నేపాల్ ప్రీమియర్ లీగ్లో (NPL) మరో భారత స్టార్ క్రికెటర్ అడుగు పెట్టబోతున్నాడు. తొలుత ఈ లీగ్లో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధవన్ (Shikhar Dhawan) ఆడాడు. తాజాగా దేశవాలీ స్టార్ ప్రియాంక్ పంచల్ (Priyank Panchal) ఎన్పీఎల్ ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న 2025 ఎడిషన్ కోసం పంచల్ కర్నాలి యాక్స్ ఫ్రాంచైజీతో చేతులు కలిపాడు. పంచల్ చేరికతో ఎన్పీఎల్లో విదేశీ క్రికెటర్ల సంఖ్య 5కు (శిఖర్ ధవన్, జేమ్స్ వాట్, జేమ్స్ ఓడౌడ్ (నెదర్లాండ్స్), విలియం బాసిస్టో (ఆస్ట్రేలియా)) చేరింది.గుజరాత్కు చెందిన 35 పంచల్కు దేశవాలీ సూపర్ స్టార్గా పేరుంది. 127 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 45.18 సగటు, 23 సెంచరీలతో 8856 పరుగులు సాధించాడు. అయినా అతనికి భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం రాలేదు. భారత సెలెక్టర్ల నుంచి పిలుపు కోసం కళ్లకు ఒత్తులు పెట్టుకొని ఎదురుచూసి, ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా జరిగిన హాంగ్కాంగ్ సిక్సస్ టోర్నీలో పంచల్ భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. రంజీ ట్రోఫీలో పంచల్కు 2016-17 సీజన్ డ్రీమ్ సీజన్. ఆ సీజన్లో అతను ట్రిపుల్ సెంచరీ సాయంతో 1310 పరుగులు చేశాడు.కాగా, ప్రస్తుతం పంచల్ ఒప్పందం చేసుకున్న కర్నాలి యాక్స్ ఫ్రాంచైజీకే శిఖర్ ధవన్ గత నేపాల్ ప్రీమియర్ లీగ్ సీజన్లో ఆడాడు. యాక్స్ తరఫున మార్కీ ప్లేయర్గా ఎంట్రీ ఇచ్చిన ధవన్ గత సీజన్లో ఓ మెరుపు అర్ద శతకం బాది ఆకట్టుకున్నాడు. ఈ సీజన్కు ధవన్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. చదవండి: రోహిత్ శర్మకు సంబంధించి బిగ్ న్యూస్ -
రోహిత్ శర్మకు సంబంధించి బిగ్ న్యూస్
టీమిండియా వెటరన్ ఓపెనర్ రోహిత్ శర్మకు (Rohit Sharma) సంబంధించిన ఓ వార్త సోషల్మీడియాలో వైరలవుతోంది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు సన్నాహకంగా రోహిత్ దేశవాలీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు (ముంబై తరఫున) సిద్దంగా ఉన్నాడని ప్రచారం జరుగుతుంది.ఈ టోర్నీలో పాల్గొనే విషయాన్ని రోహిత్ మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్కు తెలియజేశాడని, వారు కూడా సంతృప్తి వ్యక్తం చేశారని వార్తలు వస్తున్నాయి. విజయ్ హజారే ట్రోఫీతో పాటు కుదిరితే దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ రోహిత్ పాల్గొంటాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఈ విషయంపై తాజాగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సెలెక్టర్ సంజయ్ పాటిల్ స్పందించాడు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కొట్టి పారేశాడు. విజయ్ హజారే టోర్నీలో కానీ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కానీ ఆడాలనుకున్న విషయాన్ని రోహిత్ తమ దృష్టికి తేలేదని స్పష్టం చేశాడు.ప్రస్తుత పరిస్థితుల్లో రోహిత్ ముంబై తరఫున ఆడితే అది గొప్ప విషయని అన్నాడు. యువ ఆటగాళ్లకు ప్రేరణగా ఉంటుందని తెలిపాడు. ఆటగాళ్లు ఎంతటి వారైనా, జాతీయ జట్టు అవకాశాలు రావాలంటే దేశవాలీ క్రికెట్లో తప్పక ఆడాలని రూల్ పెట్టిన బీసీసీఐ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్, కోచ్ గౌతమ్ గంభీర్కు ధన్యవాదాలు తెలిపాడు.కాగా, ఇటీవలికాలంలో టీమిండియా వెటరన్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి భవిష్యత్పై చర్చలు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న ఈ ఇద్దరు.. 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆడాలని అనుకుంటున్నారు. ఇది జరగాలంటే రో-కో ఫిట్నెస్తో పాటు ఫామ్ను కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ రో-కోకు దేశవాలీ టోర్నీల్లో ఆడాలని సూచించినట్లు తెలుస్తుంది.ఆస్ట్రేలియా టూర్లో రోహిత్ మెరుపులుభవిష్యత్తుపై గందరగోళం నెలకొన్న తరుణంలో రోహిత్ ఆస్ట్రేలియా టూర్లో సత్తా చాటాడు. 3 వన్డేల్లో సెంచరీ, హాఫ్ సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సిరీస్లో రోహిత్ మునుపెన్నడూ కనబడని రీతిలో ఫిట్గా కనిపించాడు. ఇదే సిరీస్లో విరాట్ కోహ్లి తొలుత (తొలి 2 వన్డేల్లో డకౌట్) నిరాశపరిచినా.. ఆతర్వాత పర్వాలేదనిపించాడు (మూడో వన్డేలో హాఫ్ సెంచరీ). చదవండి: Viral Video: ఎంతుంటే ఏంటన్నయ్యా.. గెలిచానా లేదా..? -
నిప్పులు చెరిగిన డఫీ.. న్యూజిలాండ్దే టీ20 సిరీస్
స్వదేశంలో వెస్టిండీస్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను న్యూజిలాండ్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. డునెడిన్ వేదికగా ఇవాళ (నవంబర్ 13) జరిగిన చివరి మ్యాచ్లో ఆతిథ్య జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన న్యూజిలాండ్ విండీస్ను 140 పరుగులకే ఆలౌట్ (18.4 ఓవర్లలో) చేసింది. జేకబ్ డఫీ (Jacob Duffy) 4 వికెట్లు తీసి విండీస్ను దెబ్బకొట్టాడు. మరో పేసర్ జిమ్మీ నీషమ్ 2, జేమీసన్, బ్రేస్వెల్, సోధి, సాంట్నర్ తలో వికెట్ తీశారు. విండీస్ ఇన్నింగ్స్లో రోస్టన్ ఛేజ్ (38) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆఖర్లో రొమారియో షెపర్డ్ (36) బ్యాట్ ఝులిపించకపోయుంటే విండీస్ ఈ మాత్రం స్కోర్ కూడా చేయలేకపోయేది. వీరితో పాటు జేసన్ హోల్డర్ (20), రోవ్మన్ పావెల్ (11), షాయ్ హోప్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు టిమ్ రాబిన్సన్ (45), డెవాన్ కాన్వే (47 నాటౌట్) రాణించడంతో 15.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కివీస్ గెలుపులో రచిన్ రవీంద్ర (2), చాప్మన్ (21 నాటౌట్) కూడా తలో చేయి వేశారు. షెపర్డ్, స్ప్రింగర్కు తలో వికెట్ దక్కింది.ఈ సిరీస్లో విండీస్ తొలి మ్యాచ్లో గెలువగా.. న్యూజిలాండ్ 2, 3, 5 టీ20లు గెలిచింది. వర్షం కారణంగా నాలుగో టీ20 రద్దైంది. నవంబర్ 16 నుంచి ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అనంతరం డిసెంబర్ 2 నుంచి మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కూడా జరుగుతుంది. చదవండి: ఐపీఎల్లో జరిగిన ట్రేడ్ డీల్స్ ఇవే..! -
T20: చాంపియన్ కర్ణాటక.. ఫైనల్లో ఆంధ్ర జట్టుపై గెలుపు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అండర్–19 మహిళల టీ20 ట్రోఫీ ఎలైట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు రన్నరప్గా నిలిచింది. కోల్కతా వేదికగా బుధవారం జరిగిన ఫైనల్లో ఆంధ్ర జట్టు ఏడు వికెట్ల తేడాతో కర్ణాటక (Karnataka vs Andhra) జట్టు చేతిలో ఓడిపోయింది. మొహమ్మద్ మెహక్ సారథ్యంలోని ఆంధ్ర జట్టు మొదట బ్యాటింగ్కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 119 పరుగులు సాధించింది.ధాటిగా ఆడిన దీక్ష.. కానీఆంధ్ర ఓపెనర్ కాట్రగడ్డ దీక్ష (21 బంతుల్లో 36; 5 ఫోర్లు, 2 సిక్స్లు) క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడింది. సేతు సాయి (46 బంతుల్లో 45; 6 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచింది. గ్రీష్మ సైనీ (12 బంతుల్లో 11; 2 ఫోర్లు), అంజుమ్ (22 బంతుల్లో 14; 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. ఈ నలుగురు మినహా మిగతా బ్యాటర్లు రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు.కర్ణాటక బౌలర్లలో జె.దీక్ష 21 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా... వందిత రావు, వేద వర్షిణి 2 వికెట్ల చొప్పున తీశారు. అనంతరం 120 పరుగుల లక్ష్యాన్ని కర్ణాటక 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకొని చాంపియన్గా అవతరించింది. ఒకదశలో 55 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన కర్ణాటక జట్టును సీడీ దీక్ష (39 బంతుల్లో 47 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), కాష్వీ కందికుప్ప (20 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు) విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరు నాలుగో వికెట్కు అజేయంగా 65 పరుగులు జోడించారు.రెండో స్థానంలో నిలిచిఆంధ్ర బౌలర్లలో తమన్నా, బీఎస్ దీప్తి, అంజుమ్ ఒక్కో వికెట్ తీశారు. మొత్తం 30 జట్లు పాల్గొన్న ఈ టోరీ్నలో గ్రూప్ ‘ఎ’లో ఉన్న ఆంధ్ర జట్టు లీగ్ మ్యాచ్లు ముగిశాక రెండో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర 27 పరుగుల తేడాతో రాజస్తాన్ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గుజరాత్ జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర ఐదు వికెట్ల తేడాతో నెగ్గి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. బెంగాల్తో జరిగిన సెమీఫైనల్లో ఆంధ్ర ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి టైటిల్ పోరుకు చేరుకుంది.చదవండి: హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం -
ఐపీఎల్ చరిత్రలో అతి భారీ ట్రేడ్ డీల్స్ ఇవే..!
ఐపీఎల్ 2026కి సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్, ట్రేడ్ డీల్కు రేపే (నవంబర్ 15) చివరి తేదీ. ఈ నేపథ్యంలో పలానా ఫ్రాంచైజీ పలానా ఆటగాడిని ట్రేడ్ చేసుకుంటుంది, పలానా ఫ్రాంచైజీ పలానా ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటుందనే ప్రచారం జోరుగా సాగుతుంది.ట్రేడ్ డీల్స్కు సంబంధించి చాలా అంశాలు ప్రచారంలో ఉన్నా, ఓ విషయం మాత్రం కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. సుదీర్ఘ చర్చల అనంతరం రాజస్థాన్ రాయల్స్-సీఎస్కే ఓ డీల్ కుదుర్చుకున్నాయని సమాచారం. రాయల్స్ సంజూ శాంసన్ను సీఎస్కేకు ఇచ్చి, బదులుగా రవీంద్ర జడేజా, సామ్ కర్రన్ను ట్రేడింగ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ట్రేడ్ డీల్ ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో గతంలో జరిగిన ట్రేడ్ డీల్స్, అందులో భాగంగా జరిగిన భారీ క్యాష్ డీల్స్పై ఓ లుక్కేద్దాం. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు చాలా ట్రేడ్ డీల్స్ జరిగాయి. ట్రేడ్ డీల్ అంటే ఫ్రాంచైజీలు ఆటగాళ్లను మార్చుకోవడం ఓ పద్దతి. రెండోది వేలం బయట ఆటగాళ్లను కొనుగోలు చేయడం (క్యాష్ డీల్).ఈ ట్రేడింగ్ విండో తొలిసారి 2009 ఎడిషన్ ప్రవేశ పెట్టబడింది. ఆ ఎడిషన్లో ఆర్సీబీ నుంచి జహీర్ ఖాన్ ముంబై ఇండియన్స్కు మారాడు. ముంబై ఇండియన్స్ నుంచి రాబిన్ ఉతప్ప ఆర్సీబీకి ట్రేడ్ అయ్యాడు.అలాగే ఢిల్లీ డేర్ డెవిల్స్ నుంచి ఆశిష్ నెహ్రా ముంబై ఇండియన్స్కు మారగా.. ముంబై ఇండియన్స్ నుంచి శిఖర్ ధవన్ ఢిల్లీ డేర్ డెవిల్స్కు ట్రేడ్ అయ్యాడు.2012లో దినేశ్ కార్తీక్ క్యాష్ డీల్లో భాగంగా పంజాబ్ కింగ్స్ నుంచి ముంబై ఇండియన్స్కు మారాడు.2013లో రాస్ టేలర్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి పూణే వారియర్స్కు.. 2015లో పార్థివ్ పటేల్ ఆర్సీబీ నుంచి ముంబై ఇండియన్స్కు.. మన్విందర్ బిస్లా కేకేఆర్ నుంచి ఆర్సీబీకి క్యాష్ డీల్ ద్వారా బదిలి అయ్యారు. 2016లో కేదార్ జాదవ్ను ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి స్వాప్ చేసుకుంది.2019లో మన్దీప్ సింగ్, మార్కస్ స్టోయినిస్ విషయంలో ఆర్సీబీ-పంజాబ్ కింగ్స్ మధ్య స్వాపింగ్ జరిగింది.2019లో శిఖర్ ధవన్ను డీసీ ఎస్ఆర్హెచ్ నుంచి ట్రేడ్ చేసుకుంది. శిఖర్కు బదులుగా ఎస్ఆర్హెచ్ డీసీ నుంచి విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, నదీమ్ను పొందింది. 2019- అశ్విన్ (పంజాబ్ నుంచి ఢిల్లీకి, క్యాష్ డీల్, రూ. 7.6 కోట్లు)2019- రహానే (రాజస్థాన్ నుంచి ఢిల్లీకి,స్వాపింగ్, రహానేకు బదులుగా మయాంక్ మార్కండే, రాహుల్ తెవాటియా రాయల్స్కు ట్రేడ్ అయ్యారు)2019- ట్రెంట్ బౌల్ట్ (ఢిల్లీ నుంచి ముంబై ఇండియన్స్, క్యాష్ డీల్, రూ. 3.2 కోట్లు)2020- రాబిన్ ఉతప్ప (రాజస్థాన్ నుంచి సీఎస్కే, క్యాష్ డీల్)2020- డేవియల్ సామ్స్, హర్షల్ పటేల్ (డీసీ నుంచి ఆర్సీబీ, స్వాపింగ్)2022- శార్దూల్ ఠాకూర్ (డీసీ నుంచి కేకేఆర్, క్యాష్ డీల్, రూ. 10.75 కోట్లు)2023- ఆవేశ్ ఖాన్-దేవ్దత్ పడిక్కల్ (లక్నో నుంచి రాజస్థాన్, స్వాపింగ్)2024- హార్దిక్ పాండ్యా- గుజరాత్ నుంచి ముంబై ఇండియన్స్ (క్యాష్ డీల్, రూ. 15 కోట్లు)2024- కెమరాన్ గ్రీన్- ముంబై ఇండియన్స్ నుంచి ఆర్సీబీ (క్యాష్ డీల్, రూ. 17.5 కోట్లు)- ఐపీఎల్ చరిత్రలో ఇదే అతి భారీ క్యాష్ డీల్చదవండి: IPL 2026: రేపే 'డెడ్లైన్' -
IPL 2026: రేపే 'డెడ్లైన్'
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ఇంకా ఐదు నెలల సమయం ఉండగానే ఫ్రాంచైజీలన్నీ తీవ్ర కసరత్తు మొదలుపెట్టాయి. ఆటగాళ్ల రిటెన్షన్కు నవంబర్ 15 డెడ్లైన్ కావడంతో మార్పులు చేర్పుల విషయంలో తలమునకలై ఉన్నాయి. మరో పక్క ట్రేడ్ డీల్స్ విషయంలోనూ చర్చోపచర్చలు జోరుగా సాగుతున్నాయి.సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ను వీడి సీఎస్కేలో చేరడం.. రవీంద్ర జడేజా, సామ్ కర్రన్ సీఎస్కే నుంచి రాయల్స్కు ట్రేడ్ కావడం దాదాపుగా ఖరరాపోయింది. మరి కొంత మంది ఆటగాళ్ల విషయంలోనూ ట్రేడింగ్ జరిగే అవకాశం ఉందని ఐపీఎల్ వర్గాలు అంటున్నాయి.కేఎల్ రాహుల్ కోసం కేకేఆర్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కేకేఆర్ స్పిన్నర్ మయాంక్ మార్కండే, ఎస్ఆర్హెచ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ కోసం ముంబై ఇండియన్స్ ట్రై చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ సైతం ఓ కీలక ఆటగాడిని ట్రేడ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.రిటెన్షన్ ప్రక్రియ పూర్తయ్యాక, ఫ్రాంచైజీలు వేలంపై దృష్టి సారిస్తాయి. వేలంలో ఎవరెవరిని తీసుకోవాలో ఇప్పటి నుంచే ఓ ప్లాన్ వేసుకుంటున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ను ముంబై ఇండియన్స్ దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తుంది. అర్జున్ టెండూల్కర్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ యత్నిస్తున్నట్లు సమాచారం.ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడి కోసం ప్రయత్నించే అవకాశం ఉందన్న విషయంపై క్లారిటీ రావాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.కాగా, ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 15 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో మొత్తం 74 మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ మెగా టోర్నీ మే 31న జరిగే ఫైనల్తో ముగుస్తుంది. మినీ వేలం డిసెంబర్ 15 లేదా 16 తేదీల్లో జరిగే అవకాశం ఉంది.చదవండి: హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం -
హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం
త్వరలో సౌతాఫ్రికాతో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్లకు (India vs South Africa) ముందు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ సిరీస్లకు సన్నాహకంగా నవంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడనున్నాడు.ఈ టోర్నీలో హార్దిక్ తన హోం టీమ్ బరోడా తరఫున బరిలోకి దిగుతాడు.హర్దిక్ చివరిగా ఈ ఏడాది సెప్టెంబర్లో కాంపిటేటివ్ క్రికెట్ ఆడాడు. ఆసియా కప్లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో గాయపడిన అతను.. ఆతర్వాత పాకిస్తాన్తో జరిగిన ఫైనల్తో పాటు ఆస్ట్రేలియాలో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్లకు దూరమయ్యాడు. హార్దిక్ ఇటీవలే గాయం (ఎడమ క్వాడ్రిసెప్స్) నుంచి పూర్తిగా కోలుకొని, బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.ఫిట్నెస్ టెస్ట్లన్నీ క్లియర్ చేసి అధికారిక అనుమతి కోసం ఎదురుచూస్తున్నాడు. నవంబర్ 26న బెంగాల్తో జరిగే మ్యాచ్తో రీఎంట్రీకి సిద్దంగా ఉన్నాడు. ముస్తాక్ అలీ టోర్నీలో హార్దిక్ రెండు మ్యాచ్లకు (28న జరిగే మ్యాచ్కు కూడా) మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది.ఆ తర్వాత అతను భారత జట్టుతో కలవాల్సి ఉంటుంది. నవంబర్ 30 నుంచి సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్కు హార్దిక్ తప్పక ఎంపికయ్యే అవకాశం ఉంది. రాంచీ వేదికగా తొలి వన్డే జరుగనుంది. డిసెంబర్ 3న రాయ్పూర్, డిసెంబర్ 6న విశాఖపట్నంలో మిగిలిన రెండు వన్డేలు జరగనున్నాయి.ఆ తర్వాత సౌతాఫ్రికాతోనే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కటక్ వేదికగా డిసెంబర్ 9న ప్రారంభవుతుంది. ఈ సిరీస్లో కూడా హార్దిక్ బెర్త్ దాదాపుగా ఖరారైనట్టే. హార్దిక్ జట్టులో చేరితే భారత మిడిలార్డర్ మరింత బలోపేతమవుతుంది. హార్దిక్ గైర్హాజరీలో భారత్ ఆసియా కప్ ఫైనల్లో గెలిచి ఛాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే.ఆతర్వాత ఆస్ట్రేలియాలో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్లలో భారత్కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. వన్డే సిరీస్ను 1-2 తేడాతో కోల్పోయిన టీమిండియా.. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.చదవండి: రోహిత్ శర్మ అనుహ్య నిర్ణయం..! ఇక మిగిలింది కోహ్లినే? -
నితీశ్ స్థానంలో జురేల్
కోల్కతా: ఫామ్లో ఉన్న వికెట్ కీపర్, బ్యాటర్ ధ్రువ్ జురేల్ దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్టులో బరిలోకి దిగుతాడని భారత అసిస్టెంట్ కోచ్ రియాన్ టెన్ డస్కటే వెల్లడించారు. ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో జురేల్ను ఆడిస్తామని ఆయన చెప్పారు. 24 ఏళ్ల వికెట్ కీపర్ ఇప్పటివరకు టీమిండియా తరఫున ఏడు టెస్టులు ఆడాడు. దక్షిణాఫ్రికా ‘ఎ’ జరిగిన రెండు అనధికారిక టెస్టులు సహా గత ఐదు ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో జురేల్ నాలుగు సెంచరీలు చేశాడు. రెగ్యులర్ వికెట్ కీపర్, స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ గైర్హాజరీలో జురేల్ ఇంగ్లడ్ పర్యటనలో నాలుగో టెస్టు ఆడాడు. అయితే ఇప్పుడు పంత్ పునరాగమనం చేయనుండటంతో జురేల్ స్థానంపై నెలకొన్న సందేహాల్ని సహాయ కోచ్ డక్కటే ఒక్క మాటతో నివృత్తి చేశాడు. ఫామ్లో ఉన్న జురేల్, రెగ్యులర్ వికెట్ కీపర్ పంత్ ఇద్దరిని తొలి టెస్టులో ఆడిస్తామని స్పష్టం చేశారు. వ్యూహాలకు అనుగుణంగానే... ‘కాంబినేషన్పై పూర్తి స్పష్టతతో ఉన్నాం. ఇద్దరు వికెట్ కీపర్లలో ఏ ఒక్కరిని పక్కనబెట్టే ఉద్దేశం జట్టు మేనేజ్మెంట్కు లేదు’ అని డస్కటే వెల్లడించారు. గత ఆరు నెలలుగా నిలకడైన ఫామ్ను కొనసాగిస్తున్న ధ్రువ్ జురేల్ ఈడెన్ గార్డెన్స్లో శుక్రవారం మొదలయ్యే తొలి టెస్టులో ఆడతాడని చెప్పారు. నితీశ్ను పక్కనబెట్టడంపై స్పందిస్తూ... ‘అతను వెస్టిండీస్తో రెండు టెస్టులు ఆడాడు. ప్రతి మ్యాచ్లోనూ మెరుగవుతూనే ఉన్నాడు. కాబట్టి అతని భవిష్యత్తుకు ఎలాంటి ముప్పులేదు. అయితే ప్రస్తుత జట్టు వ్యూహాలకు అనుగుణంగానే అతను తుది జట్టుకు దూరం కానున్నాడు. బలమైన ప్రత్యర్థితో మ్యాచ్ గెలవాలంటే అందుబాటులో ఉన్న వనరుల్లో మరింత మెరుగైన బలగంతోనే బరిలోకి దిగుతాం. ఇప్పుడు ఇదే జరుగుతోంది. అంతేకానీ నితీశ్ను విస్మరించడం మాత్రం కాదు’ అని డస్కటే వివరించారు. పరుగులు చేసే స్పిన్నర్లు ఇక లోయర్ మిడిలార్డర్లో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాల రూపంలో భారత్ బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టంగా ఉందని అసిస్టెంట్ కోచ్ అన్నారు. వాళ్లు స్పిన్నర్లయి ఉండొచ్చు. కానీ బ్యాటింగ్ అవసరాల్ని తీరుస్తారని, కాబట్టి వారిపుడు బ్యాటర్లుగా పరిగణించవచ్చని చెప్పారు. తద్వారా కుల్దీప్ యాదవ్ స్థానంలో అక్షర్ పటేల్ తుది జట్టులో ఉంటాడనే విషయాన్ని డస్కటే చెప్పకనే చెప్పినట్లయ్యింది. దీంతో ఇద్దరు పేసర్లు ముగ్గురు స్పిన్నర్లతో కూడిన బౌలింగ్ దళాన్ని తొలి టెస్టులో దింపేందుకు భారత టీమ్ మేనేజ్మెంట్ సిద్ధమైంది. ముగ్గురు టాపార్డర్, ముగ్గురు మిడిలార్డర్ బ్యాటర్లతో స్పెషలిస్టు బ్యాటింగ్ విభాగానికి ముగ్గురు స్పిన్ ఆల్రౌండర్లు జట్టును నడిపించనున్నారు. కసరత్తు చేశాం... సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరిగిన సిరీస్ నుంచి టీమిండియా పాఠాలు నేర్చుకుందని డస్కటే పేర్కొన్నారు. గతేడాది భారత్ పర్యటనకు వచ్చిన కివీస్ 3–0తో ఆతిథ్య జట్టును వైట్వాష్ చేసింది. మన సిŠప్న్ పిచ్పై ప్రత్యర్థి స్పిన్నర్లు ఎజాజ్ పటేల్ (15 వికెట్లు), మిచెల్ సాన్ట్నర్ (13), ఫిలిప్స్ (8) పండగ చేసుకున్నారు. ఈ ముగ్గురు కలిసి 36 వికెట్లు తీయడమే భారత్ కొంపముంచింది. దీనిపై అసిస్టెంట్ కోచ్ మాట్లాడుతూ ‘స్పిన్నేయడమే కాదు... ప్రత్యర్థి స్పిన్ను ఎదుర్కోవడంపై కూడా కసరత్తు చేశాం. ఎందుకంటే సఫారీ జట్టులోనూ నాణ్యమైన స్పిన్నర్లే అందుబాటులో ఉన్నరు. కాబట్టి కివీస్ నేర్పిన గత పాఠాల అనుభవంతో జట్టు సిద్ధమైంది’ అని అన్నారు. -
బాబోయ్... మేమెళ్లిపోతాం!
కొలంబో: ప్రస్తుతం పాకిస్తాన్ పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెట్ జట్టును తాజా ఇస్లామాబాద్ ఆత్మాహుతి దాడి ఘటన కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మంగళవారం జరిగిన ఈ హేయమైన ఉగ్రదాడిలో 12 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఈ దాడి లంక జట్టులో భయాందోళనలు పెంచింది. ఏకంగా 8 మంది ఆటగాళ్లు తిరుగుముఖం పట్టాలని నిర్ణయించుకున్నారు. షెడ్యూల్ ప్రకారం మూడు వన్డేల సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్ గురువారం రావల్పిండిలో జరగాల్సి ఉంది. సింహళ క్రికెటర్లు స్వదేశానికి పయనమైతే నేటి వన్డే మ్యాచ్ రద్దయ్యే అవకాశాలున్నాయి. తొలి వన్డే నెగ్గిన పాక్ 1–0తో ఆధిక్యంలో ఉంది. ఇది మగిశాక జింబాబ్వే మూడో జట్టుగా పాల్గొనే ముక్కోణపు టి20 సిరీస్లోనూ లంక తలపడాల్సి ఉంది. దీంతో ఈ నెలాఖరుదాకా బిక్కుబిక్కుమంటూ పాక్లో ఉండలేమని లంక క్రికెటర్లు పేర్కొంటున్నారు. అయితే లంక బోర్డు (ఎస్ఎల్సీ) మాత్రం షెడ్యూల్ ప్రకారమే తమ జట్టు పాక్ పర్యటనను ముగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అవసరమైతే 8 మంది క్రికెటర్లను రిజర్వ్ బెంచ్తోనైనా భర్తీ చేసేందుకు సిద్ధమని లంక బోర్డు సూచనప్రాయంగా పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు అభయమిచ్చినట్లు తెలిసింది. సరిగ్గా 16 ఏళ్ల క్రితం పాక్ పర్యటనకు వెళ్లిన లంక బృందంపై పాక్ ఉగ్రమూక దాడిచేసింది. ఈ ఘటనలో పలువురు లంక క్రికెటర్లు తూటా గాయాలకు గురయ్యారు. -
సౌతాఫ్రికాతో తొలి టెస్ట్కు ముందు టీమిండియాలో కీలక మార్పు
కోల్కతా వేదికగా నవంబర్ 14 నుంచి సౌతాఫ్రికాతో జరుగబోయే తొలి టెస్ట్కు ముందు టీమిండియాలో కీలక మార్పు చోటు చేసుకుంది. యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని జట్టు నుంచి విడుదల చేశారు. నవంబర్ 13 నుంచి 19 మధ్యలో సౌతాఫ్రికా-ఏతో జరిగే 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో పాల్గొనాలని ఆదేశించారు. నవంబర్ 22 నుంచి సౌతాఫ్రికాతో జరిగే రెండో టెస్ట్ సమయానికి తిరిగి సీనియర్ జట్టులో చేరతాడని పేర్కొన్నారు.నితీశ్ను భవిష్యత్ విదేశీ పర్యటనల కోసం సిద్దం చేస్తున్నామని బీసీసీఐ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో నితీశ్ ఖంగుతిన్నాడు. నితీశ్కు ఈ పరిస్థితి రావడానికి సరైన అవకాశాలు రాకపోవడం ఓ కారణమైతే, ధృవ్ జురెల్ ఫామ్ మరో కారణం.పంత్ గైర్హాజరీలో జట్టులోకి వచ్చిన జురెల్ జట్టులో స్థిరపడిపోయాడు. ఇటీవల విండీస్పై సెంచరీతో పాటు తాజాగా సౌతాఫ్రికా-ఏపై ఒకే మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేశాడు. మరోపక్క గాయం నుంచి కోలుకున్న పంత్ జట్టులోకి వచ్చాడు. అతను కూడా పూర్వపు ఫామ్ను కొనసాగించాడు. దీంతో సౌతాఫ్రికాతో తొలి టెస్ట్లో పంత్, జురెల్ ఇద్దరిని ఆడించాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ పరిస్థితుల్లో ఎవరిపై వేటు వేయాలని ఆలోచిస్తే మేనేజ్మెంట్కు నితీశ్ కుమార్ రెడ్డి మొదటి ఆప్షన్ అయ్యాడు. నితీశ్ తాజాగా విండీస్తో జరిగిన సిరీస్లో రెండు మ్యాచ్ల్లో ఆడినా రెండు విభాగాల్లో (బ్యాటింగ్, బౌలింగ్) సరైన అవకాశాలు రాలేదు.తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో కేవలం నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. రెండో ఇన్నింగ్స్లో నితీశ్కు బంతినే ఇవ్వలేదు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ అవకాశం రాగా, దానికి నితీశ్ న్యాయం చేశాడు. అప్పటికే భారత్ భారీ స్కోర్ చేయగా.. నితీశ్ ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 43 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల్లో నితీశ్కు బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. విండీస్ స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించడంతో నితీశ్కు రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. చదవండి: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా ఎవరూ ఊహించని ఆటగాడు..! -
చరిత్ర సృష్టించిన సామ్రాట్ రాణా
ఈజిప్టు రాజధాని కైరోలో జరుగుతున్న ISSF వరల్డ్ చాంపియన్షిప్లో భారత షూటర్ సామ్రాట్ రాణా మరో గర్వకారణ విజయాన్ని నమోదు చేశాడు. 22 ఏళ్ల సామ్రాట్ రాణా పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 243.7 స్కోర్తో గోల్డ్ మెడల్ సాధించాడు. తద్వారా ఈ విభాగంలో ప్రపంచ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడుగా చరిత్ర సృష్టించాడు.ఫైనల్లో రాణా చైనా షూటర్ హూ కైపై 0.4 పాయింట్ల తేడాతో గెలుపొందాడు. ఇదే ఈవెంట్లో మరో భారత షూటర్ వరుణ్ తోమార్ కాంస్య పతకం సాధించాడు. తద్వారా ఈ ఈవెంట్లో భారత్కు డబుల్ పోడియం దక్కింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో రాణా.. వరుణ్ తోమార్, షర్వన్ కుమార్లతో కలిసి స్వర్ణ పతకం సాధించాడు.ఐదో భారతీయుడు10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించడంతో రాణా హేమాహేమీల సరసన చేరాడు. ఒలింపిక్ ఈవెంట్లో వరల్డ్ టైటిల్ గెలిచిన ఐదో భారతీయుడిగా అభినవ్ బింద్రా, రుద్రాంక్ష్ పాటిల్, తేజస్విని సావంత్, శివ నర్వాల్ – ఈషా సింగ్ (మిక్స్డ్ టీమ్) సరసన చేశాడు.నిరాశపరిచిన మను బాకర్స్టార్ షూటర్ మను బాకర్ వ్యక్తిగత విభాగంలో నిరాశపరిచినా, టీమ్ ఈవెంట్లో సిల్వర్ మెడల్ సాధించింది. ఈషా సింగ్, సురుచి సింగ్లతో కలిసి వుమెన్స్ టీమ్ సిల్వర్ గెలుచుకుంది.పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సింగిల్స్ విభాగంలో సామ్రాట్ రాణా గోల్డ్ మెడల్ గెలవడంతో ISSF వరల్డ్ చాంపియన్షిప్లో భారత పతకాల సంఖ్య 9కి (3 గోల్డ్, 3 సిల్వర్, 3 బ్రాంజ్) చేరింది. పతకాల పట్టికలో చైనా 12 మెడల్స్తో అగ్రస్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానంలో నిలిచింది. చదవండి: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా ఎవరూ ఊహించని ఆటగాడు..! -
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా ఎవరూ ఊహించని ఆటగాడు..!
ఐపీఎల్ 2026కి ముందు సంచలన ట్రేడ్ డీల్ జరుగుతోంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ను దక్కించుకునేందుకు ఫైవ్ టైమ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజా, సామ్ కర్రన్ను వదులుకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఫార్మాలిటీస్ కూడా పూర్తైనట్లు సమాచారం. డీల్లో భాగంగా సంజూ సీఎస్కేలో చేరేందుకు.. జడేజా, కర్రన్ రాయల్స్లో తరఫున ఆడేందుకు సుముఖత వ్యక్తం చేశారట.అయితే చివరి నిమిషంలో రవీంద్ర జడేజా ఓ మెలిక పెట్టినట్లు ఐపీఎల్ వర్గాలు అంటున్నాయి. రాయల్స్లో చేరితే తనకు కెప్టెన్సీ ఇవ్వాలని జడ్డూ కండీషన్ పెట్టాడట. ఇందుకు రాయల్స్ యాజమాన్యంలోని కొందరు అంగీకరించినప్పటికీ.. ఓ కీలక వ్యక్తి అడ్డు పడినట్లు సమాచారం.సంజూ ఫ్రాంచైజీని వీడాలనుకున్నప్పుడు సదరు వ్యక్తి అప్పటికే జట్టులో ఉన్న ఇద్దరి పేర్లను కెప్టెన్సీ కోసం పరిశీలిస్తానని మాట ఇచ్చాడట. ఇప్పుడు కొత్తగా జడ్డూ కెప్టెన్సీ కోసం డిమాండ్ చేయడంతో యాజమాన్యంలో భేదాభిప్రాయాలు వచ్చాయని సమాచారం. ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోతే సీఎస్కేతో ట్రేడ్ డీల్ క్యాన్సల్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. కాగా, సంజూ రాయల్స్ను వీడే విషయం ఖరారైన తర్వాత యాజమాన్యం ధృవ్ జురెల్, యశస్వి జైస్వాల్ పేర్లను కెప్టెన్సీ కోసం పరిశీలిస్తుంది. గత సీజన్లో సంజూ గైర్హాజరీలో రియాన్ పరాగ్ నాయకుడిగా వ్యవహరించినా.. అతని పేరు ప్రస్తావనకు రాలేదు. కొత్తగా జడేజా పేరు తెరపైకి రావడంతో రాయల్స్ యాజమాన్యం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ఐపీఎల్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.జడ్డూ ప్రొఫైల్ని బట్టి చూస్తే.. రాయల్స్ కెప్టెన్గా నియమించే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే అతని ఐపీఎల్ కెరీర్ ఈ ఫ్రాంచైజీతోనే మొదలైంది. అతనికి ఐపీఎల్లో కెప్టెన్గా వ్యవహరించిన అనుభవం కూడా ఉంది. పైగా ఇటీవలికాలంలో అతను టీమిండియా విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషించాడు.సంజూ విషయానికొస్తే.. డీల్ కుదిరి అతను సీఎస్కేలో చేరినా కెప్టెన్సీ దక్కే అవకాశం మాత్రం లేదు. సీఎస్కేలో సంజూ సాధారణ ఆటగాడిగా కొనసాగాల్సి ఉంటుంది. రుతురాజ్ను కెప్టెన్సీ నుంచి తప్పించే యోచనలో సీఎస్కే యాజమాన్యం లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. పై విషయాలపై క్లారిటీ రావాలంటే నవంబర్ 15 వరకు వేచి చూడాల్సిందే. ఆ రోజులోపు ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించాల్సి ఉంది. చదవండి: ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకున్న దక్షిణాఫ్రికా కెప్టెన్ -
ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకున్న దక్షిణాఫ్రికా కెప్టెన్
దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (Laura Wolvaardt) ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డును దక్కించుకుంది. 2025, అక్టోబర్ నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును (ICC Player of the Month) కైవసం చేసుకుంది.అక్టోబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శనలకు గానూ లారాకు ఈ అవార్డు దక్కింది. తాజాగా ముగిసిన వన్డే ప్రపంచకప్-2025లో లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచిన ఆమె.. అక్టోబర్లో 8 మ్యాచ్లు ఆడి 470 పరుగులు చేసింది. గత నెలలో ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో భారీ సెంచరీ (169) చేసి తన జట్టును ఫైనల్కు చేర్చింది. ఈ నెలలో భారత్తో జరిగిన ఫైనల్లోనూ సెంచరీ చేసింది. లారా సెంచరీతో మెరిసినా సౌతాఫ్రికా ఫైనల్లో భారత్ చేతిలో ఓటమిపాలై, రన్నరప్తో సరిపెట్టుకుంది.ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్న తర్వాత లారా మాట్లాడుతూ.. ఈ అవార్డు రావడం చాలా గర్వంగా ఉంది. ప్రపంచకప్ టైటిల్ గెలవలేకపోయినా, మా పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని అంది. ఈ అవార్డు కోసం భారత స్టార్ బ్యాటర్, ప్రపంచకప్ సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్ స్మృతి మంధన, ఆసీస్ స్టార్ ఆల్రౌండర్ ఆష్లే గార్డ్నర్ పోటీపడినప్పటికీ.. లారానే అదృష్టం వరించింది.పురుషుల విభాగంలో ముత్తుసామిఅక్టోబర్ నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు పురుషుల విభాగంలోనూ సౌతాఫ్రికన్నే వరించింది. ఆ జట్టు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర సెనురన్ ముత్తుసామి (Senuran Muthusamy) ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. అక్టోబర్లో పాకిస్తాన్తో జరిగిన రెండు టెస్ట్ల్లో అతను విశేషంగా రాణించాడు. తొలి టెస్ట్లో 11 వికెట్లు, రెండో టెస్ట్లో 89 పరుగులు చేశాడు. ఈ సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. ఈ అవార్డు కోసం ముత్తసామితో పాటు పాకిస్తాన్ స్పిన్నర్ నౌమన్ అలీ, ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ పోటీపడ్డారు.ఐసీసీ వెబ్సైట్లో రిజిస్టర్ అయిన అభిమానులు, మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లు, మీడియా ప్రతినిధుల ఓట్ల ఆధారంగా ఈ అవార్డులు ప్రకటించబడతాయి.చదవండి: ధృవ్ జురెల్ ఆసక్తికర వ్యాఖ్యలు -
ధృవ్ జురెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
నవంబర్ 14 నుంచి సౌతాఫ్రికాతో జరుగబోయే తొలి టెస్ట్లో రిషబ్ పంత్ (Rishabh Pant), ధృవ్ జురెల్ (Dhruv Jurel) బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైపోయింది. ఈ విషయాన్ని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే ధృవీకరించాడు. జురెల్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడని, నితీశ్ కుమార్ రెడ్డి స్థానాన్ని పంత్ భర్తీ చేస్తాడని వెల్లడించాడు.డస్కటే ప్రకటనతో టీమిండియా తుది జట్టు కూర్పుపై క్లారిటీ వచ్చేసింది. ఓపెనర్లుగా జైస్వాల్, రాహుల్, వన్డౌన్లో సాయి సుదర్శన్, నాలుగో స్థానంలో కెప్టెన్ శుభ్మన్ గిల్, ఆతర్వాతి స్థానాల్లో జురెల్, పంత్, జడేజా, సుందర్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్ బరిలోకి దిగే అవకాశం ఉంది.ధృవ్ జురెల్ ఆసక్తికర వ్యాఖ్యలుతొలి టెస్ట్లో తనూ, పంత్ ఇద్దరూ బరిలోకి దిగడం ఖరారైన నేపథ్యంలో జురెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జియో హాట్స్టార్ "ఫాలో ద బ్లూస్"తో మాట్లాడుతూ పంత్తో పోటీ ఉంటుందా అన్న అంశంపై స్పందించాడు. పంత్తో పోటీ ఉండదని, ఇద్దరం టీమిండియాకు ఆడుతున్నామని అన్నాడు. ఇద్దరిలో ఎవరు బాగా ఆడినా, అంతిమంగా తమ లక్ష్యం భారత్ గెలుపేనని తెలిపాడు.పంత్ బాగా ఆడినా, నేను బాగా ఆడినా సంతోషిస్తానని అన్నాడు. ఇద్దరు బాగా ఆడితే అంతకు మించిన సంతోషం లేదని తెలిపాడు. అంతిమంగా జట్టు ఫోకస్ అంతా గెలుపుపైనే ఉంటుందని చెప్పుకొచ్చాడు.ఇదే సందర్భంగా సౌతాఫ్రికాతో పోటీపై కూడా స్పందించాడు. ఈ సిరీస్ హోరాహోరీగా ఉండబోతుందని అంచనా వేశాడు. ఇరు జట్లలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లు ఉన్నారని అన్నాడు. వారికి రబాడ, జన్సెన్ ఉంటే.. మాకు బుమ్రా, సిరాజ్ ఉన్నారని చెప్పుకొచ్చాడు.కాగా, పంత్ గైర్హాజరీలో టీమిండియాలోకి వచ్చిన జురెల్ అసాధారణ ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల అహ్మదాబాద్ టెస్ట్లో వెస్టిండీస్పై సూపర్ సెంచరీ చేసిన అతను.. తాజాగా సౌతాఫ్రికా-ఏతో జరిగిన రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ల్లో రెండు ఇన్నింగ్స్ల్లో అజేయ సెంచరీలు చేశాడు. జురెల్ ప్రస్తుత ఫామ్ టీమిండియాలో అతని స్థానాన్ని సుస్థిరం చేసేలా ఉంది.చదవండి: బాబర్ ఆజమ్ను వెనక్కు నెట్టిన విరాట్ కోహ్లి -
బాబర్ ఆజమ్ను వెనక్కు నెట్టిన విరాట్ కోహ్లి
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో (ICC ODI Rankings) టీమిండియా బ్యాటర్ల హవా కొనసాగింది. తాజా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. కెప్టెన్ శుభ్మన్ గిల్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. మరో స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి (Virat Kohli) పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్ను (Babar Azam) వెనక్కు నెట్టి టాప్-5లోకి చేరాడు.గత వారం ర్యాంకింగ్స్లో ఆరో స్థానంలో ఉండిన విరాట్ ఓ స్థానం మెరుగుపర్చుకొని ఐదో స్థానానికి ఎగబాకాడు. సౌతాఫ్రికా సిరీస్లో ఘెరంగా విఫలమైన బాబర్ రెండు స్థానాలు కోల్పోయి ఏడో స్థానానికి పడిపోయాడు. టాప్-10 మరో టీమిండియా స్టార్ ఆటగాడు కూడా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆసీస్ సిరీస్లో ఓ హాఫ్ సెంచరీతో రాణించిన శ్రేయస్ అయ్యర్ తొమ్మిదో స్థానాన్ని కాపాడుకున్నాడు.తాజాగా ర్యాంకింగ్స్లో ఇద్దరు పాక్ ఆటగాళ్లు భారీగా లబ్ది పొందారు. సౌతాఫ్రికా సిరీస్లో రాణించినందుకు యువ ఆల్రౌండర్ సైమ్ అయూబ్ ఏకంగా 18 స్థానాలు మెరుగుపర్చుకొని 36వ స్థానానికి ఎగబాకాడు. అదే సౌతాఫ్రికా సిరీస్లో పర్వాలేదనిపించి, నిన్న శ్రీలంకతో జరిగిన వన్డేలో శతక్కొట్టిన పాక్ టీ20 కెప్టెన్ సల్మాన్ అఘా 14 స్థానాలు మెరుగుపర్చుకొని 16వ స్థానానికి చేరాడు.పాక్తో సిరీస్లో సెంచరీ, హాఫ్ సెంచరీ చేసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచిన సౌతాఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని 15వ స్థానానికి చేరాడు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్ టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా.. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ 2 స్థానాలు మెరుగుపర్చుకొని మూడో ప్లేస్కు చేరాడు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భారత్ నుంచి టాప్-10లో కుల్దీప్ యాదవ్ (6) ఒక్కడే ఉన్నాడు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్జాయ్ టాప్ ప్లేస్ను కాపాడుకోగా.. భారత ఆటగాడు అక్షర్ పటేల్ ఎనిమిదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.చదవండి: IPL 2026: ఆర్సీబీ అభిమానులకు చేదు వార్త -
IPL 2026: ఆర్సీబీ అభిమానులకు చేదు వార్త
2025, జూన్ 3.. ఆర్సీబీ అభిమానుల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, ఆ రోజు ఆర్సీబీ (RCB) తమ తొలి ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది. అయితే ఆర్సీబీ ఆటగాళ్లకు, ముఖ్యంగా అభిమానులకు ఆ ఆనందం ఎంతో సేపు మిగల్లేదు. మరుసటి రోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెందరో గాయపడ్డారు. అభిమానుల ఉత్సాహం, అధికారుల నిర్లక్ష్యం కలిసినప్పుడు ఎంతటి విషాదం చోటు చేసుకుంటుందో ఈ ఘటన రుజువు చేసింది.సురక్షితం కాదుఈ ఘోర విషాదంపై కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రిటైర్డ్ జడ్జి జాన్ మైఖేల్ డికున్హా నేతృత్వంలో ఓ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ చిన్నస్వామి స్టేడియం మ్యాచ్ల నిర్వహణకు సురక్షితం కాదని తేల్చింది. ఈ స్టేడియం భారీ జనసమూహాలు గుమి కూడటానికి అనర్హంగా ప్రకటించింది. కమిషన్ నిర్ణయం వల్ల ఆర్సీబీ 2026 ఐపీఎల్ సీజన్లో తమ హోం మ్యాచ్లను చిన్నస్వామి స్టేడియంలో ఆడే అవకాశం కోల్పోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సమాచారం తెలిసింది. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఆర్సీబీ తమ తాత్కాలిక హోం గ్రౌండ్గా పూణేలోని గహున్జే స్టేడియాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.ఓ ప్రముఖ దినపత్రిక కథనం ప్రకారం.. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ పుణేలోని గహున్జే స్టేడియాన్ని ఆర్సీబీకి తాత్కాలిక హోం గ్రౌండ్గా ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ అంశంపై చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. కొన్ని సాంకేతిక అంశాలు పరిష్కారమైతే, ఆర్సీబీకి పుణే వేదికగా మారే అవకాశం ఉంది.ఆర్సీబీ అభిమానులకు చేదు వార్తఈ వార్త ఆర్సీబీ అభిమానులకు తీరని శోకాన్ని కలిగిస్తుంది. 17 ఏళ్ల తర్వాత తొలి టైటిల్ సాధిస్తే.. ఆ సంతోషాన్ని హోం గ్రౌండ్లో ఆస్వాదించలేమా అని వారు వాపోతున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో తాము హోం గ్రౌండ్లో మ్యాచ్లు ఆడలేమని తెలిసి తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అన్నీ కుదిరి హోం గ్రౌండ్ పూణేకి మారితే ఆర్సీబీకి సొంత అభిమానులు దూరమయ్యే ప్రమాదం ఉంది. కొత్త వాతావరణంలో ఆర్సీబీ ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో ఇమడటానికి చాలా సమయం పడుతుంది. ఈ విషయంపై బీసీసీఐ నుంచి కాని ఐపీఎల్ నుంచి కాని ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చదవండి: IND vs SA: భారత తుది జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లు.. క్లారిటీ ఇచ్చిన కోచ్ -
శతక్కొట్టిన హసన్ జాయ్.. భారీ స్కోర్ దిశగా బంగ్లాదేశ్
రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా ఐర్లాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో బంగ్లాదేశ్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. రెండో రోజు మూడో సెషన్ సమయానికి వికెట్ నష్టానికి 246 పరుగులు చేసింది. ఓపెనర్ మహ్ముదుల్ హసన్ జాయ్ (Mahmudul Hasan joy) సెంచరీతో (125 నాటౌట్) కదంతొక్కి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. మరో ఓపెనర్ షద్మాన్ ఇస్లాం (80) సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. హసన్ జాయ్కు జతగా మొమినుల్ హాక్ (38) క్రీజ్లో ఉన్నాడు. షద్మాన్ వికెట్ మాథ్యూ హంఫ్రేస్కు దక్కింది.అంతకుముందు ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 286 పరుగులకు ఆలౌటైంది. వెటరన్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (60), కేడ్ కార్మిచల్ (59) అర్ద సెంచరీలతో రాణించారు. కర్టిస్ క్యాంఫర్ (44), లోర్కాన్ టకర్ (41), జోర్డన్ నీల్ (30), బ్యారీ మెక్కార్తీ (31) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ మిరాజ్ 3, హసన్ మహమూద్, తైజుల్ ఇస్లాం, హసన్ మురద్ తలో 2, నహిద్ రాణా ఓ వికెట్ తీసి ఐర్లాండ్ను దెబ్బ కొట్టారు. బంగ్లాదేశ్ ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు దాటి 40 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.రెండు టెస్ట్లు, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న తొలి టెస్ట్ సిల్హెట్ వేదికగా నవంబర్ 11న మొదలు కాగా.. రెండో టెస్ట్ ఢాకా వేదికగా నవంబర్ 19 నుంచి జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనంతరం నవంబర్ 27, 29, డిసెంబర్ 2 తేదీల్లో మూడు టీ20లు జరుగుతాయి. తొలి రెండు మ్యాచ్లకు చట్టోగ్రామ్, మూడో టీ20కి ఢాకా ఆతిథ్యమివ్వనున్నాయి. చదవండి: IND vs SA: భారత తుది జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లు.. క్లారిటీ ఇచ్చిన కోచ్ -
భారత తుది జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లు.. క్లారిటీ ఇచ్చిన కోచ్
భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం (నవంబర్ 14) ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టు ఎంపిక టీమ్ మెనెజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా వికెట్ కీపర్ల విషయంలో ఎవరిని సెలక్ట్ చేయాలని గంభీర్ అండ్ కో తర్జనభర్జన పడుతున్నారు. ఎందుకంటే ఇంగ్లండ్ పర్యటనలో గాయపడ్డ రెగ్యూలర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తిరిగి జట్టులోకి వచ్చాడు. మరోవైపు పంత్ బ్యాకప్గా ఉన్న ధ్రువ్ జురెల్ సైతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. వెస్టిండీస్ సిరీస్తో పాటు రంజీ ట్రోఫీలోనూ జురెల్ సెంచరీలతో సత్తాచాటాడు. దీంతో అతడికి తుది జట్టులో చోటు ఇవ్వాలని చాలా మంది మాజీలు సూచిస్తున్నారు. ఈ క్రమంలో హెడ్ కోచ్ గంభీర్ కూడా ఇద్దరూ స్పెషలిస్టు వికెట్ కీపర్లకు ప్లేయింగ్ ఎలెవన్లో ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.తాజాగా భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెష్కాట్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇద్దరు వికెట్ కీపర్లను తుది జట్టులో ఉంచడం కష్టమైనప్పటికీ, ఈ సమస్యకు పరిష్కరం తమ వద్ద ఉందని డెష్కాట్ తెలిపాడు."కోల్కతా టెస్టు నుంచి ధ్రువ్ జురెల్ను మేము దూరంగా ఉంచలేము. కానీ ప్లేయింగ్ ఎలెవన్ను ఎంపిక చేయడం మెనెజ్మెంట్కు ఎల్లప్పుడూ బిగ్ ఛాలెంజ్నే. ఒకరికు ఛాన్స్ ఇవ్వాలంటే మరొకరు తప్పక తప్పుకోవాలి. అయితే తుది జట్టును ఎలా ఎంపిక చేయాలన్న విషయంపై మాకు ఒక క్లారిటీ ఉంది.ధ్రువ్ ఫామ్ గురుంచి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. బెంగళూరులో జరిగిన రంజీ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లలోనూ సెంచరీలు సాధించాడు. ఈ మ్యాచ్లో అతడు ఆడడం దాదాపు ఖాయమని ర్యాన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు. -
అవును నిజమే.. రెండో పెళ్లి చేసుకున్నా: రషీద్ ఖాన్
అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని రషీద్ ఖాన్ స్వయంగా వెల్లడించాడు. రషీద్ ఇటీవల ‘ఖాన్ ఛారిటీ ఫౌండేషన్’ ప్రారంభించాడు. ఈ కార్యక్రమానికి రషీద్ ఖాన్ ఓ అమ్మాయితో హాజరయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో ఎవరూ ఈ అమ్మాయి అన్న చర్చ నెట్టింట మొదలైంది. రషీద్ ఖాన్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడని.. రకరకాల ఊహాగానాలు వినిపించాయి. తాజాగా ఈ అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ తన రెండో పెళ్లి నిజమేనంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఊహాగానాలకు తెరదించాడు."2025 ఆగస్టు 2న నా జీవితంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. నన్ను ఎంతగానో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఆమె నా జీవిత భాగస్వామి అయినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇటీవల నా భార్యను ఒక ఛారిటీ ఈవెంట్కు తీసుకువెళ్లాను.కానీ దురదృష్టవశాత్తు దీని గురించి ప్రజలు రకరకాల ఊహాగానాలను ప్రచారం చేశారు. ఆమె నా భార్య, ఇందులో దాచుకోవడానికి ఏమి లేదు. నాకు సపోర్ట్గా నిలిచిన ప్రతీఒక్కరికి ధన్యవాదాలు" అని తన ఇన్స్టా ఖాతాలో రషీద్ పేర్కొన్నాడు.కాగా రషీద్ గతేడాది అక్టోబర్లో పష్తూన్ ఆచారాల ప్రకారం రషీద్ మొదటి పెళ్లి జరిగింది. రషీద్ వివాహ వేడుకకు అఫ్గానిస్తాన్ క్రికెటర్లంతా హాజరయ్యారు. కానీ ఏడాది తిరగకుముందే వ్యక్తిగత కారణాల చేత వారిద్దరూ విడిపోయినట్లు సమాచారం.చదవండి: రోహిత్ శర్మ అనుహ్య నిర్ణయం..! ఇక మిగిలింది కోహ్లినే? -
ఆస్ట్రేలియాకు మరో భారీ షాక్..
ప్రతిష్టాత్మక యాషెస్ (Ashes) సిరీస్కు ముందు ఆస్ట్రేలియాను గాయాల బెడద వెంటాడుతోంది.ఇప్పటికే తొలి టెస్టుకు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ సేవలను కోల్పోయిన ఆస్ట్రేలియా.. ఇప్పుడు మరో ఇద్దరు కీలక ప్లేయర్ల అందుబాటుపై అనుమానాలు నెలకొన్నాయి. షెఫీల్డ్ షీల్డ్ (Sheffield Shield)లో ఆ జట్టు స్టార్ ప్లేయర్లు జోష్ హేజిల్వుడ్ (Josh Hazlewood), సీన్ అబాట్ (Sean Abbott) గాయపడ్డారు. విక్టోరియాతో జరుగుతున్న మ్యాచ్లో న్యూ సౌత్ వేల్స్ తరఫున ఆడుతున్న వారిద్దరూ తొడ కండరాల గాయం బారిన పడ్డారు. దీంతో మూడో రోజు లంచ్ తర్వాత ఈ ఇద్దరూ మైదానంలోకి తిరిగి రాలేదు. అయితే వారి గాయాల తీవ్రతపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.ఏదేమైనప్పటికి హాజిల్వుడ్ లాంటి ప్రధాన ఫాస్ట్ బౌలర్కు గాయం కావడం ఆసీస్ టీమ్ మెనెజ్మెంట్ను కలవరపెడుతోంది. అబాట్ కూడా గత కొంతకాలంగా జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్లో అబాట్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మొదటి ఇన్నింగ్స్లో 9 ఓవర్లలో 18 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్లో మైదానం వీడే ముందు ఒక వికెట్ తీశాడు. హాజిల్వుడ్ మాత్రం ఒకే వికెట్ తీశాడు. కాగా నవంబర్ 21 నుంచి పెర్త్ వేదికగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య యాషెస్ తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. ప్యాట్ కమ్మిన్స్ గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ ఆసీస్ జట్టును నడిపించనున్నాడు. అదేవిధంగా దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించిన ఓపెనర్ జేక్ వెదరాల్డ్ అనూహ్యంగా తొలిసారి టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ప్యాట్ కమిన్స్కు ప్రత్యామ్నాయంగా రైట్ ఆర్మ్ పేసర్ స్కాట్ బోలాండ్ జట్టులోకి వచ్చాడు.తొలి టెస్టుకు ఆసీస్ జట్టుస్టీవెన్ స్మిత్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, జేక్ వెదరాల్డ్, కామెరాన్ గ్రీన్, బ్యూ వెబ్స్టర్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, బ్రెండన్ డాగెట్, జోష్ హాజిల్వుడ్, నాథన్ లియాన్, మిచెల్ స్టార్క్చదవండి: రోహిత్ శర్మ అనుహ్య నిర్ణయం..! ఇక మిగిలింది కోహ్లినే? -
భారత జట్టు కెప్టెన్గా హైదరాబాద్ కుర్రాడు
అఫ్గానిస్తాన్ అండర్-19 జట్టుతో జరిగే ముక్కోణపు సిరీస్కు బీసీసీఐ తమ జట్లను ప్రకటించింది. అండర్–19 భారత్ ‘ఎ’, భారత్ ‘బి’ జట్లు అఫ్గానిస్తాన్తో తలపడనున్నాయి. ఇండియా-ఎ జట్టుకు విహాన్ మల్హోత్రా సారథ్యం వహించనుండగా.. బి జట్టు కెప్టెన్గా హైదరాబాదీ ఆరోన్ జార్జ్ ఎంపికయ్యాడు. ఆరోన్ ఇటీవల ముగిసిన బీసీసీఐ అండర్–19 టోర్నీ ‘వినూ మన్కడ్ ట్రోఫీ’లో హైదరాబాద్ జట్టుకు నాయకత్వం వహించాడు. ఈ టోర్నీ విజేతగా హైదరాబాద్ జట్టు నిలిచింది.ఆరోన్ గత కొంతకాలంగా మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. వినూ మన్కడ్ ట్రోఫీలో గత మూడేళ్లుగా ఆరోన్ జార్జ్ టాప్ స్కోరర్గా నిలుస్తూ వచ్చాడు. ఈ సీజన్లో అతను 2 సెంచరీలు సహా 373 పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న అండర్–19 చాలెంజర్ ట్రోఫీలో కూడా అతను నిలకడగా రాణిస్తున్నాడు. స్కూల్ క్రికెట్లో మంచి ప్రదర్శనతో మూడేళ్ల క్రితం హైదరాబాద్ అండర్–16 టీమ్లోకి వచ్చిన అతను విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఆకట్టుకున్నాడు. ఇక 2022–23 సీజన్లో ఒక ట్రిపుల్ సెంచరీ సహా 511 పరుగులు సాధించడంతో ఆరోన్కు మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం అతను భవాన్స్ కాలేజీలో బీకామ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. భారత్కు ఆడటమే లక్ష్యం‘ఏ స్థాయిలోనైనా భారత జట్టు తరఫున ఆడాలనేది నా కల. ప్రస్తుత నా ప్రదర్శన, లభిస్తున్న అవకాశాలు ఆ దిశగా తొలి అడుగుగా భావిస్తున్నా. అండర్–19లోకి వస్తే ఐపీఎల్ ఆడే అవకాశాలు కూడా మెరుగవుతాయి’ అని కేరళ మూలాలు ఉన్న ఆరోన్ పేర్కొన్నాడు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఆరోన్ జార్జి వీలు చిక్కినపుడల్లా కొట్టాయంలో ఉంటున్న తన తాత, బామ్మ ఇళ్లకు వెళ్లి వస్తుంటాడు.చదవండి: రోహిత్ శర్మ అనుహ్య నిర్ణయం..! ఇక మిగిలింది కోహ్లినే? -
భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్టు.. గంభీర్ స్పెషల్ రిక్వెస్ట్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) సైకిల్లో భాగంగా భారత్-సౌతాఫ్రికా మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సమయం అసన్నమైంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా నవంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈడెన్ గార్డెన్స్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీకి పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా భారత జట్టు స్వదేశంలో ఆడే టెస్టులకు స్పిన్కు అనుకూలించే పిచ్లను కోరుకుంటుంది. కానీ ఈసారి మాత్రం ఫుల్ రాంక్ టర్నర్ పిచ్ వద్దని క్యూరేటర్కు గంభీర్ చెప్పాడంట. ఈ విషయాన్ని స్వయంగా మఖర్జీనే వెల్లడించాడు. టీమ్ మెనెజ్మెంట్ కొంచెం టర్న్ ఉండేలా పిచ్ తాయారు చేయమని సూచించినట్లు అతడు వెల్లడించాడు."తొలి టెస్టు కోసం మంచి పిచ్ను తాయారు చేశాము. బ్యాటర్లతోపాటు బౌలర్లకూ సహకారం లభిస్తుంది. ఆట సాగుతున్నా కొద్దీ స్పిన్నర్లకు మరింత అనుకూలంగా ఉంటుంది. ఈ వికెట్పై బౌన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ప్రతీ హోమ్ టీమ్ కూడా పిచ్ విషయంలో కొన్ని సూచనలు చేస్తారు. ఆస్ట్రేలియాలో అయితే ఆతిథ్య జట్టు ఎక్కువ బౌన్స్ ఉండే పిచ్లను తాయారు చేయమని అడుగుతారు. అదే భారత జట్టు అయితే టర్న్ ఉండేట్లు కోరుకుంటున్నారు. కానీ ఈసారి మాత్రం వారు ఫుల్ రాంక్ టర్నర్ పిచ్ను అడగలేదు. కొద్దిగా టర్న్ ఉండేలా తాయారు చేయమని చెప్పారు. అని మఖర్జీ ఇండియా టూడేతో పేర్కొన్నాడు. కాగా మంగళవారం నాడు భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్, కెప్టెన్ శుభ్మన్ గిల్, బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ పిచ్ను పరిశీలించారు. ఈ వికెట్పై వారు సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈడెన్ గార్డెన్స్ ఇటీవల రెండు రంజీ ట్రోఫీ మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చింది. ఈ మ్యాచ్లలో పేసర్లు కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచారు.చదవండి: రోహిత్ శర్మ అనుహ్య నిర్ణయం..! ఇక మిగిలింది కోహ్లినే? -
సంజూ, గిల్ కాదు!.. వాళ్లిద్దరే సరిజోడి
భారత టీ20 జట్టులో శుబ్మన్ గిల్ (Shubman Gill) అవసరమా?.. క్రికెట్ వర్గాల్లో చాన్నాళ్లుగా ఇదే చర్చ. టెస్టు, వన్డేల్లో సత్తా చాటుతూ ఏకంగా కెప్టెన్గా ఎదిగిన ఈ పంజాబీ బ్యాటర్.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో స్థాయికి తగ్గట్లు ఆడలేకపోవడం ఇందుకు కారణం.దాదాపు ఏడాది కాలం పాటు భారత టీ20 జట్టుకు దూరంగా ఉన్న గిల్ను.. సెలక్టర్లు ఆసియా కప్ సందర్భంగా వైస్ కెప్టెన్గా తిరిగి తీసుకువచ్చారు. దీంతో అప్పటిదాకా ఓపెనింగ్ జోడీగా పాతుకుపోయిన అభిషేక్ శర్మ (Abhishek Sharma)- సంజూ శాంసన్ (Sanju Samson) విడిపోయారు.అంతంత మాత్రమేగిల్ ఓపెనర్గా రీఎంట్రీ ఇవ్వగా.. సంజూకు బ్యాటింగ్ ఆర్డర్లో ప్రత్యేక స్థానం అంటూ లేకుండా పోయింది. ఇక ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలోనూ గిల్ మరోసారి టీ20 ఫార్మాట్లో తన బలహీనతను బయటపెట్టుకున్నాడు. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా కేవలం 132 పరుగులే చేశాడు.ఈ నేపథ్యంలో మరోసారి గిల్ విమర్శలు పాలయ్యాడు. అతడి కారణంగా సంజూ శాంసన్తో పాటు యశస్వి జైస్వాల్ కూడా మూల్యం చెల్లించాల్సి వస్తోందని మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భారత టీ20 ఓపెనింగ్ జోడీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.అశ్ కీ బాత్లో మాట్లాడుతూ.. ‘‘టెస్టు ఫార్మాట్కు.. టీ20లకు ఎలాంటి పోలికా ఉండదు. ప్రతి ఫార్మాట్ దేనికదే ప్రత్యేకం. ఏదేమైనా రెండు ఫార్మాట్లలో జైస్వాల్ ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నాడు.పవర్ ప్లేలో సూపర్టెస్టుల్లో పరుగులు చేయడం ద్వారా అతడు టీ20 జట్టులోకి రాలేడు. కానీ ఇప్పటికే పొట్టి క్రికెట్లో అతడికి మంచి రికార్డు ఉందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. 160కి పైగా స్ట్రైక్రేటుతో పరుగులు రాబట్టాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో సూపర్గా ఆడతాడు.అతడి సగటు కూడా బాగుంది. ప్రస్తుతం అభిషేక్ శర్మతో పాటు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగల సత్తా జైస్వాల్కే ఉంది. ఒకవేళ టీమిండియా అగ్రెసివ్ ఓపెనర్లను కోరుకుంటే వీళ్లిద్దరే సరిజోడి. అలా కాకుండా ఫైర్ అండ్ ఐస్ కాంబినేషన్ కావాలనుకుంటే అభిషేక్- గిల్ జోడీవైపు మొగ్గు చూపవచ్చు’’ అని అశ్విన్ పేర్కొన్నాడు.వాళ్లిద్దరే సరి జోడీఅభిషేక్ శర్మ దూకుడుగా ఆడితే.. గిల్ మాత్రం నెమ్మదిగా ఆడతాడనే ఉద్దేశంలో అశూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఇటీవల మరో మాజీ క్రికెటర్ రమేశ్ సదగోపన్ మాట్లాడుతూ.. అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్లో గిల్.. టేబుల్ ఫ్యాన్ను తలపిస్తున్నాడంటూ విమర్శించిన విషయం తెలిసిందే. తుఫాన్ ఉన్నంత వరకు టేబుల్ ఫ్యాన్పై దృష్టి పడదంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా ఆస్ట్రేలియా పర్యటన ముగించుకున్న టీమిండియా.. స్వదేశంలో టెస్టు, వన్డే, టీ20 సిరీస్లు ఆడేందుకు సిద్ధమైంది. చదవండి: భారత జట్టులో ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీలకు దక్కని చోటు.. కారణం ఇదే -
రోహిత్ శర్మ అనుహ్య నిర్ణయం..! ఇక మిగిలింది కోహ్లినే?
ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టిన టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma).. ఇప్పుడు స్వదేశంలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు సిద్దమవుతున్నాడు. రోహిత్ ప్రస్తుతం ముంబైలోని శరద్ పవార్ ఇండోర్ అకాడమీలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. 2027 ప్రపంచ కప్ ఆడాలనే లక్ష్యంతో ఉన్న హిట్మ్యాన్.. సౌతాఫ్రికాతో సిరీస్లో కూడా తన సత్తా చూపించాలని ఉవ్విళ్లురుతున్నాడు. ఈ క్రమంలో రోహిత్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్లో ప్రారంభం కానున్న దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హాజారే ట్రోఫీలో ఆడాలని రోహిత్ ఫిక్స్ అయినట్లు సమాచారం. అంతేకాకుండా సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్లో కూడా రోహిత్ ఆడనున్నాడంట. ఇప్పటికే తన నిర్ణయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)కి రోహిత్ తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా 50 ఓవర్ల ప్రపంచకప్కు ఇంకా రెండేళ్ల సమయం ఉండడంతో రోహిత్, విరాట్ కోహ్లిల ఎంపికపై బీసీసీఐ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ వన్డే జట్టుకు వారిద్దరూ ఎంపిక కావాలంటే తప్పనిసరిగా దేశీయ క్రికెట్ ఆడాలని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ విజయ్ హాజారే ట్రోఫీలో ఆడాలని నిర్ణయించుకున్నాడు. అయితే విరాట్ కోహ్లి(Virat Kohli) మాత్రం విజయ్ హాజారే ట్రోఫీ అందుబాటులో ఉంటాడో లేదో ఇంకా స్పష్టత రాలేదు. కోహ్లి ప్రస్తుతం లండన్లో ఉన్నాడు. ఈ నెలఖారున సౌతాఫ్రికాతో సిరీస్ కోసం స్వదేశానికి రానున్నాడు.ఇప్పటికే టెస్టులు, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్-కోహ్లిలు ప్రస్తుతం కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఈ లెజెండరీ క్రికెటర్లు ఇద్దరూ వరుసగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లలో భారత్కు ప్రాతినిథ్యం వహించనున్నారు.ఆ తర్వాత వచ్చే ఏడాది జూన్ వరకు భారత్కు వన్డే సిరీస్లు లేవు. దీంతో రో-కో తమ ఫిట్నెస్ను కోల్పోకుండా ఉండడానికి దేశవాళీ క్రికెట్లో ఆడాలని బీసీసీఐ సూచించింది. డిసెంబర్ 24 నుంచి విజయ్ హాజారే ట్రోఫీ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ చివరిసారిగా 2018లో విజయ్ హజారే ట్రోఫీలో ఆడాడు. ఈ టోర్నీలో ముంబై తరపున రెండు మ్యాచ్లు ఆడిన హిట్మ్యాన్ 50 పరుగులు చేశాడు.రోహిత్ శర్మ చివరిసారిగా 2018లో విజయ్ హజారే ట్రోఫీలో ఆడాడు. ఈ టోర్నీలో ముంబై తరపున రెండు మ్యాచ్లు ఆడిన హిట్మ్యాన్ 50 పరుగులు చేశాడు. కోహ్లి అయితే ఆఖరిగా 2010లో ఈ దేశవాళీ వన్డే టోర్నీలో ఢిల్లీ తరపున ఆడాడు.చదవండి: రోహిత్ శర్మ అనుహ్య నిర్ణయం..! ఇక మిగిలింది కోహ్లినే -
'గంభీర్ అతడికేమి మామ కాదు.. ఇకనైనా మారండి'
ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేసిన సంగతి తెలిసిందే. కంగారులతో వన్డే, టీ20 సిరీస్లకు రాణాను ఎంపిక చేయడాన్ని చాలా మంది తప్పుబట్టారు. కేవలం నెటిజన్లే కాదు కృష్ణమాచారి శ్రీకాంత్, అశ్విన్ వంటి దిగ్గజ క్రికెటర్లు సైతం హర్షిత్ను టార్గెట్ చేశారు. రాణాకు భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సపోర్ట్ ఉందని, అందుకే ప్రతీ సిరీస్లోనూ అతడికి చోటు దక్కుతుందని శ్రీకాంత్ ఆరోపించాడు. అయితే హర్షిత్ను ట్రోల్ చేస్తున్న వారిపై గంభీర్ మండిపడ్డాడు. అతడిని కేవలం మెరిట్ ఆధారంగానే ఎంపిక చేశామని, మీ యూట్యూబ్ ఛానల్స్ వ్యూస్ కోసం యువ ఆటగాడిని విమర్శించడం అపండి అంటూ గౌతీ ఫైరయ్యాడు.అయితే గంభీర్ నమ్మకాన్ని మాత్రం రాణా నిలబెట్టుకున్నాడు. తన అద్బుత ప్రదర్శనలతో విమర్శకుల నోళ్లు మూయించాడు. వన్డే, టీ20 సిరీస్లలో ఆల్రౌండ్ షోతో రాణా అదరగొట్టాడు. రాణా స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే వన్డే, టీ20 సిరీస్లకు ఎంపికయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. దీంతో మళ్లీ ట్రోలర్స్ అతడిని టార్గెట్ చేసే అవకాశముంది.ఈ నేపథ్యంలో హర్షిత్ రాణాకు కేకేఆర్ మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ మన్విందర్ బిస్లా సపోర్ట్గా నిలిచాడు. రాణా తన ప్రతిభ ఆధారంగానే జట్టులోకి వచ్చాడని, గంభీర్ ఏమి అతడికి బంధువు కాదని బిస్లా అన్నాడు. "హర్షిత్ రాణాను వ్యతిరేకిస్తున్న వారు కచ్చితంగా వారు కేకేఆర్ అభిమానులు కానివారై ఉండాలి. అవును గౌతమ్ గంభీర్కు కేకేఆర్తో మంచి అనుబంధం. అతడు గతంలో ప్లేయర్గా, కెప్టెన్గా, మెంటార్గా తన సేవలను అందించాడు. హర్షిత్ రాణా కూడా కేకేఆర్లో ఉన్నందున గంభీర్ సపోర్ట్ చేస్తున్నాడని అంతా అనుకుంటున్నారు. గౌతీ అతడికి మామ లేదా బాబాయ్ వంటి బంధువు కాదు కాదా. అవన్నీ వట్టి రూమర్సే. ఇకనైనా అతడిని ట్రోల్ చేయడం ఆపండి అని" బిస్లా ఇండియా క్రికెట్ క్యాంటీన్ పోడ్కాస్ట్లో పేర్కొన్నారు.చదవండి: భారత జట్టు ప్రకటన.. రాహుల్ ద్రవిడ్ తనయుడికి ఛాన్స్ -
ఐసీసీ సంచలన నిర్ణయం.. ఇకపై..
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) పరిధిని పెంచేందుకు ఐసీసీ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రెండంచెల విధానానికి స్వస్తి పలికి డబ్ల్యూటీసీ ఆడే జట్లను పెంచేందుకు నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కాగా 2019లో ఐసీసీ తొలిసారిగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ప్రవేశపెట్టింది. రెండేళ్ల వ్యవధిలో ఆడే మ్యాచ్లు, వాటి ఫలితాల ఆధారంగా జట్లు ఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఇందులో గెలిచిన జట్టుకు ఐసీసీ గద లభిస్తుంది.విజేతలు వీరేతొలి సీజన్లో భారత్- న్యూజిలాండ్ (2019-21) డబ్ల్యూటీసీ ఫైనల్ తలపడగా.. కేన్ విలియమ్సన్ బృందం విజేతగా నిలిచింది. విరాట్ కోహ్లి సేన రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇక రెండో సీజన్లో (2021-23)లోనూ టీమిండియా ఫైనల్ చేరగా.. ఈసారి ఆస్ట్రేలియా చేతిలో భంగపాటు ఎదురైంది.తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్-2025లో ఆస్ట్రేలియాను ఓడించి సౌతాఫ్రికా విజేతగా అవతరించింది. కాగా టెస్టు హోదా ఉన్న ఉన్న పన్నెండు జట్ల నుంచి తొమ్మిది జట్లు మాత్రమే ఇప్పటి వరకు డబ్ల్యూటీసీలో భాగమయ్యేవి. ఇందులో టాప్-8లో ఉన్న జట్లు టైటిల్ రేసులో ఉండేవి.ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్, ఐర్లాండ్, జింబాబ్వేలను కూడా డబ్ల్యూటీసీలో చేర్చాలనే ఉద్దేశంతో ఐసీసీ.. తొలుత రెండంచెల విధానాన్ని ప్రతిపాదించింది. ఒక అంచె నుంచి భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికాలతో ఓ జట్టు.. మిగిలిన జట్లను రెండో అంచెలో చేర్చాలని యోచించింది.తీవ్ర వ్యతిరేకతఅయితే, పాకిస్తాన్, శ్రీలంకలతో పాటు వెస్టిండీస్ బోర్డు ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి. ఇంగ్లండ్ సైతం టూ-టైర్ సిస్టమ్ను వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో దుబాయ్ వేదికగా తాజా ఐసీసీ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగినట్లు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో వెల్లడించింది.ఐసీసీ సంచలన నిర్ణయం.. ఇకపై..ఆ వివరాల ప్రకారం.. రెండంచెల వ్యవస్థ యోచనను ఐసీసీ విరమించుకుంది. ఇందుకు బదులుగా డబ్ల్యూటీసీలోని జట్ల సంఖ్యను తొమ్మిది నుంచి పన్నెండు పెంచాలని నిర్ణయించింది. అంటే.. వచ్చే సీజన్ (2027-29) నుంచి అఫ్గనిస్తాన్, ఐర్లాండ్, జింబాబ్వే జట్లు కూడా డబ్ల్యూటీసీలో చేరతాయి.ఈ మూడూ టెస్టు హోదా పొందినప్పటికీ ఇప్పటి వరకు డబ్ల్యూటీసీ సైకిల్లో లేవన్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి ఐసీసీ బోర్డు డైరెక్టర్ ఒకరు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్క జట్టు సంతృప్త స్థాయిలో టెస్టు క్రికెట్ ఆడేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుంది.కానీ ఓ ట్విస్ట్సంప్రదాయ ఫార్మాట్లో ఎక్కువ మ్యాచ్లు ఆడాలనుకునే వారికి ఇది సువర్ణావకాశం’’ అని పేర్కొన్నారు. కాగా టెస్టు మ్యాచ్ నిర్వహణ ఖర్చుతో కూడుకున్న పని. అయితే, చిన్న జట్లకు డబ్ల్యూటీసీ ఆడే అవకాశం ఇచ్చినా.. ఆర్థికంగా భరోసా ఇచ్చే అంశంపై ఐసీసీ స్పష్టతనివ్వలేదు.ఐర్లాండ్ వంటి పేద బోర్డులపై దీని ప్రభావం గట్టిగానే పడుతుంది. ఇప్పటికే ఖర్చును భరించే స్థోమత లేక సౌతాఫ్రికా, న్యూజిలాండ్ రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ల నిర్వహణకు మొగ్గుచూపుతున్న విషయం తెలిసిందే.చదవండి: భారత జట్టులో ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీలకు దక్కని చోటు.. కారణం ఇదే -
భారత జట్టు ప్రకటన.. రాహుల్ ద్రవిడ్ తనయుడికి ఛాన్స్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్వహించే అండర్–19 ముక్కోణపు సిరీస్లో పాల్గొనే జట్లను జూనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అండర్–19 భారత్ ‘ఎ’, భారత్ ‘బి’ జట్లతో పాటు అఫ్గానిస్తాన్ అండర్–19 టీమ్ ఈ సిరీస్లో మూడో జట్టుగా బరిలోకి దిగుతుంది.‘బి’ జట్టు కెప్టెన్గా హైదరాబాద్కు చెందిన ఆరోన్ జార్జ్ ఎంపికయ్యాడు. ‘ఎ’ టీమ్కు పంజాబ్కు చెందిన విహాన్ మల్హోత్రా సారథిగా వ్యవహరిస్తాడు. ఇటీవల ముగిసిన బీసీసీఐ అండర్–19 టోర్నీ ‘వినూ మన్కడ్ ట్రోఫీ’లో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది.దీనికి ఆరోన్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో ఈ టీమ్ నుంచి నలుగురు ప్లేయర్లకు ముక్కోణపు సిరీస్లో ఆడే అవకాశం లభించింది. ‘బి’ కెప్టెన్ ఆరోన్ జార్జ్తో పాటు అండర్–19 ‘ఎ’ టీమ్లోకి హైదరాబాద్కు చెందిన వాఫి కచ్చి, రాపోలు అలంకృత్ (వికెట్ కీపర్), మొహమ్మద్ మాలిక్ ఎంపికయ్యారు.ద్రవిడ్ తనయుడికి చోటు..ఇక బి’ టీమ్లో వికెట్ కీపర్గా భారత దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్(Anvay Dravid)కు అవకాశం దక్కింది. అన్వయ్ ప్రస్తుతం కర్ణాటక తరపున జూనియర్ క్రికెట్ ఆడుతున్నాడు. 16 ఏళ్ల అన్వయ్ ద్రవిడ్ ఇటీవల వినూ మాన్కడ్ ట్రోఫీలో కర్ణాటక జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు.అంతేకాకుండా ఈ నెలలో హైదరాబాద్ వేదికగా జరిగిన పురుషుల అండర్-19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీలో భారత్ సికి అతడు ప్రాతినిథ్యం వహించాడు. జూనియర్ ద్రవిడ్ అండర్-16 స్ధాయిలో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.విజయ్ మర్చంట్ ట్రోఫీ (అండర్-16) 2023-24 సీజన్ అన్వయ్ దుమ్ములేపాడు. ఈ టోర్నమెంట్లో అన్వయ్ కర్ణాటక తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు, 5 మ్యాచ్లలో 45 సగటుతో 357 పరుగులు సాధించాడు. అంతకుముందు ఒక అండర్-16 ఇంటర్-జోనల్ మ్యాచ్లో అజేయ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఇదే జోరును అన్వయ్ కొనసాగిస్తే త్వరలోనే భారత అండర్-19 జట్టులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశముంది.అఫ్గనిస్తాన్ అండర్-19 జట్టుతో తలపడే భారత అండర్-19 ‘ఎ’ జట్టు ఇదేవిహాన్ మల్హోత్రా (కెప్టెన్), అభిజ్ఞాన్ కుందు (వైస్ కెప్టెన్/వికెట్ కీపర్), వాఫీ కచ్చి, వంశ్ ఆచార్య, వినీత్ V.K), లక్ష్య రాయచందానీ, రాపోల్ (వికెట్ కీపర్), కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, అన్మోల్జీత్ సింగ్, మొహమ్మద్ ఇనాన్, హెనిల్ పటేల్, అశుతోష్ మహిదా, ఆదిత్య రావత్, మొహమ్మద్ మాలిక్.భారత్ అండర్-19 ‘బి’ జట్టుఆరోన్ జార్జ్ (కెప్టెన్), వేదాంత్ త్రివేది, యువరాజ్ గోహిల్, మౌల్యరాజాసిన్హ్ చావ్డా, రాహుల్ కుమార్, హర్వన్ష్ సింగ్ (వికెట్ కీపర్), అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), ఆర్ఎస్ అంబరీశ్, బీకే కిషోర్, నమన్ పుష్పక్, హేముచుందేషన్ జె, ఉద్ధవ్ మోహన్, ఇషాన్ సూద్, డి దీపేశ్, రోహిత్ కుమార్ దాస్.చదవండి: PAK vs SL: ఉత్కంఠ పోరు.. శ్రీలంకపై పాకిస్తాన్ గెలుపు -
అందుకే వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేయలేదు: బీసీసీఐ
అఫ్గనిస్తాన్ అండర్-19 జట్టుతో జరిగే ముక్కోణపు సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తమ జట్లను ప్రకటించింది. అండర్-19 స్థాయిలోని ‘ఎ’, ‘బి’ జట్లు సొంతగడ్డపై అఫ్గన్ జట్టుతో అమీతుమీ తేల్చుకోనున్నాయి. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో నవంబర్ 17 నుంచి 30 వరకు ఈ సిరీస్ జరుగుతుంది. కాగా తమ అండర్-19 జట్టు భారత్- ‘ఎ’, ‘బి’ జట్లతో యూత్ వన్డే ట్రై సిరీస్ ఆడనున్నట్లు ఇటీవలే అఫ్గనిస్తాన్ బోర్డు ప్రకటించింది. ఐసీసీ మెన్స్ అండర్-19 వరల్డ్కప్ టోర్నమెంట్ నేపథ్యంలో ఇరుజట్లకు ఈ సిరీస్ సన్నాహకంగా ఉంటుందని పేర్కొంది.ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీలకు దక్కని చోటుఈ నేపథ్యంలో అఫ్గన్తో సిరీస్కు తాజా తమ జట్లను ప్రకటించిన భారత్.. అనూహ్యంగా ఈ టీమ్ నుంచి సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi), కెప్టెన్ ఆయుశ్ మాత్రేలను తప్పించింది. కాగా పద్నాలుగేళ్ల వైభవ్ గత కొంతకాలంగా భారత్ తరఫున సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) సారథ్యంలోని భారత్ అండర్-19 జట్టులో భాగమైన ఈ బిహారీ పిల్లాడు.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో యూత్ వన్డేలు, యూత్ టెస్టుల్లో దుమ్మురేపే ప్రదర్శనలు ఇచ్చాడు.ఈ క్రమంలో అఫ్గనిస్తాన్తో ట్రై సిరీస్లోనూ వైభవ్ సూర్యవంశీ భాగం కావడం లాంఛనమేననే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి తరుణంలో ఈ సిరీస్ ఆడే రెండు భారత జట్లలోనూ వైభవ్ పేరు లేకపోవడం ఆశ్చర్యపరిచింది. అదే విధంగా.. కెప్టెన్ ఆయుశ్ మాత్రేను కూడా సిరీస్కు సెలక్టర్లు ఎంపిక చేయలేదు.అందుకే వైభవ్ను ఎంపిక చేయలేదుఇందుకు గల కారణాన్ని బీసీసీఐ తాజాగా వెల్లడించింది. ‘‘వైభవ్ సూర్యవంశీ పేరును ఈ సిరీస్కు పరిశీలించలేదు. అతడు ఇండియా- ‘ఎ’ తరఫున ఆసియా క్రికెట్ మండలి నిర్వహించే రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నీకి ఎంపికయ్యాడు కాబట్టి.. ఈ సిరీస్ నుంచి పక్కనపెట్టాల్సి వచ్చింది’’ అని స్పష్టం చేసింది.ఇక ముంబై తరఫున ప్రస్తుతం రంజీల్లో ఆడుతున్న కారణంగా ఆయుశ్ మాత్రేను కూడా పక్కనపెట్టినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే.. అఫ్గన్ అండర్-19తో తలపడే భారత ‘బి’ టీమ్లో వికెట్ కీపర్గా టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్కు చోటు దక్కడం విశేషం.అఫ్గనిస్తాన్ అండర్-19 జట్టుతో తలపడే భారత అండర్-19 ‘ఎ’ జట్టు ఇదేవిహాన్ మల్హోత్రా (కెప్టెన్), అభిజ్ఞాన్ కుందు (వైస్ కెప్టెన్/వికెట్ కీపర్), వాఫీ కచ్చి, వంశ్ ఆచార్య, వినీత్ V.K), లక్ష్య రాయచందానీ, A. రాపోల్ (వికెట్ కీపర్), కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, అన్మోల్జీత్ సింగ్, మొహమ్మద్ ఇనాన్, హెనిల్ పటేల్, అశుతోష్ మహిదా, ఆదిత్య రావత్, మొహమ్మద్ మాలిక్.భారత్ అండర్-19 ‘బి’ జట్టుఆరోన్ జార్జ్ (కెప్టెన్), వేదాంత్ త్రివేది, యువరాజ్ గోహిల్, మౌల్యరాజాసిన్హ్ చావ్డా, రాహుల్ కుమార్, హర్వన్ష్ సింగ్ (వికెట్ కీపర్), అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), ఆర్ఎస్ అంబరీశ్, బీకే కిషోర్, నమన్ పుష్పక్, హేముచుందేషన్ జె, ఉద్ధవ్ మోహన్, ఇషాన్ సూద్, డి దీపేశ్, రోహిత్ కుమార్ దాస్.రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ కోసం భారత ‘ఎ’ జట్టు ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, నేహల్ వధేరా, నమన్ ధిర్ (వైస్ కెప్టెన్), సూర్యాంశ్ షెడ్గే, జితేష్ శర్మ (కెప్టెన్, వికెట్ కీపర్), రమణదీప్ సింగ్, హర్ష్ దూబే, అశుతోష్ శర్మ, యశ్ ఠాకూర్, గుర్జప్నీత్ సింగ్, విజయ్కుమార్ వైశాక్, యుద్ద్వీర్ సింగ్ చరక్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సుయాష్ శర్మ. చదవండి: శభాష్ షహబాజ్ -
ఉత్కంఠ పోరు.. శ్రీలంకపై పాకిస్తాన్ గెలుపు
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి వన్డేలో పాకిస్తాన్ 6 పరుగుల తేడాతో లంకపై గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆతిథ్య పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది.టాప్–4 బ్యాటర్లలో ఫఖర్ జమాన్ (55 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్), బాబర్ ఆజమ్ (51 బంతుల్లో 29; 3 ఫోర్లు) కాస్త మెరుగ్గా ఆడారు. ఆయూబ్ (6), రిజ్వాన్ (5) విఫలమయ్యారు. 95 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన పాక్ను సల్మాన్ ఆగా (87 బంతుల్లో 105 నాటౌట్; 9 ఫోర్లు) అజేయ శతకంతో ఆదుకున్నాడు.హుస్సేన్ తలత్ (63 బంతుల్లో 62; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. సల్మాన్, హుస్సేన్ ఇద్దరు ఐదో వికెట్కు 138 పరుగులు చేశారు. లంక స్పిన్నర్ హసరంగ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం కష్టసాధ్యమైన 300 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు కడదాకా పోరాడిన లంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 293 పరుగులు చేసి ఓడింది. హసరంగ (52 బంతుల్లో 59; 7 ఫోర్లు) క్రీజులో ఉన్నంత సేపు గెలుపుపై ఆశలు రేపాడు. సమరవిక్రమ (39; 6 ఫోర్లు), కమిల్ మిషార (38; 5 ఫోర్లు, 1 సిక్స్), అసలంక (32; 2 ఫోర్లు) ఫర్వాలేదనపించారు. రవూఫ్ 4, నసీమ్ షా, అష్రఫ్ చెరో 2 వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే రావల్పిండి వేదికగానే గురువారం(నవంబర్ 13) జరగనుంది.చదవండి: IPL 2026 Auction: ఆరోజే ఐపీఎల్ వేలం.. వేదిక ఖరారు! -
ఆరోజే ఐపీఎల్ వేలం
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026 Auction)- 2026 సీజన్ వేలం వరుసగా మూడో ఏడాది విదేశీ గడ్డపైనే జరగనుంది. తాజా సీజన్ వేలం కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని అబుదాబి నగరాన్ని వేదికగా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఉన్నతాధికారి ఒకరు నిర్ధారించారు. కాగా 2023లో దుబాయ్, 2024లో జిద్దాలో ఐపీఎల్ లీగ్ వేలం నిర్వహించారు. అయితే, వేలంపాటకు సంబంధించిన తేదీ విషయంలో బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. డిసెంబర్ 15 లేదా 16 తేదీల్లో వేలం జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా పది ఫ్రాంఛైజీలు నవంబరు 15 నాటికి తాము అట్టిపెట్టుకునే, విడిచిపెట్టే ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసుకోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అత్యధికంగా ఐదేసి సార్లు ట్రోఫీ గెలవగా.. కోల్కతా నైట్ రైడర్స్ మూడు, సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ ఒక్కోసారి చాంపియన్గా నిలిచాయి. ఇక 2009లో డక్కన్ చార్జర్స్ టైటిల్ గెలుచుకుంది. ఈ ఏడాది ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడగా.. పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ల కల ఇంకా తీరలేదు.ఇదీ చదవండి: సరికొత్త చరిత్రజమ్మూ కశ్మీర్ జట్టు తమ రంజీ ట్రోఫీ చరిత్రలో ఘనతకెక్కే విజయాన్ని సాధించింది. గత 65 ఏళ్లుగా ఢిల్లీ చేతిలో ఇంటా బయటా ఓడిపోతూ వచ్చిన కశ్మీర్ ఇప్పుడు ఢిల్లీ గడ్డపై ఢిల్లీనే వణికించి గెలిచింది. గ్రూప్ ‘డి’లో జరిగిన ఈ మ్యాచ్లో జమ్మూ కశ్మీర్ జట్టు 7 వికెట్ల తేడాతో ఢిల్లీపై జయభేరి మోగించింది. ఇది గాలివాటం గెలుపు కానేకాదు. మ్యాచ్ మొదలైన మొదటి రోజు నుంచి ఢిల్లీ బ్యాటర్లను జమ్మూ బౌలర్లు ఆకిబ్ నబీ (5/35), వంశజ్ (2/57), ముస్తాక్ (2/50) సమష్టిగా దెబ్బకొట్టారు.తర్వాత బ్యాటింగ్లో కెప్టెన్ పారస్ డోగ్రా తొలి ఇన్నింగ్స్ శతకం, ఢిల్లీ రెండో ఇన్నింగ్స్ను వంశజ్ (6/68), సాహిల్ (3/73) ఇలా ప్రతి ఒక్కరు కశ్మీర్ను గెలిపించేందుకు ప్రతీ రోజు కష్టపడ్డారు. 1960 నుంచి ఇప్పటివరకు ఢిల్లీ, జమ్మూ కశీ్మర్ జట్లు 43 సార్లు తలపడితే ఇందులో 37 మ్యాచ్ల్లో ఢిల్లీదే గెలుపు. గత సీజన్ వరకు ఢిల్లీపై గెలుపన్నదే ఎరుగని కశీ్మర్ జట్టు ఎట్టకేలకు తాజా సీజన్లో అసాధారణ ప్రదర్శనతో ఘన విజయం సాధించింది. ఇక్బాల్ అజేయ శతకం మంగళవారం 179 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్నైట్ స్కోరు 55/2తో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన కశ్మీర్ 43.3 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ (147 బంతుల్లో 133 నాటౌట్; 20 ఫోర్లు, 3 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతను బాదుతున్న బౌండరీలు, భారీ సిక్స్లతో విరుచుకుపడుతున్న వైనం చూస్తే ఇది నాలుగు రోజుల ఫస్ట్క్లాస్ మ్యాచా లేదంటే వన్డేనా అన్న సందేహం కలుగకమానదు.ఒంటిచేత్తో గెలిపించడం అంటే ఇదేనేమో అనిపించేలా దంచేశాడు. అవుటైన ముగ్గురు శుభమ్ (8), వివ్రంత్ శర్మ (3), వంశజ్ (8)లు చేసిందేమీ లేదు. ఇక్బాల్తో పాటు అజేయంగా నిలిచిన సారథి పారస్ డోగ్రా (10 నాటౌట్) పెద్ద స్కోరేం కాదు. ఈ నలుగురి కంటే కూడా ఎక్స్ట్రాల (17) రెండో అత్యధిక స్కోరు కావడం గమనార్హం!.. ఎనిమిది జట్లున్న గ్రూప్ ‘డి’లో 7 పాయింట్లతో ఢిల్లీ ఆరో స్థానంలో ఉంది. సొంతగడ్డపై ఆడిన మూడు మ్యాచ్ల్లో గెలవకపోగా (రెండు డ్రా)... ఇప్పుడు కశ్మీర్ చేతిలో చిత్తుగా ఓడటంతో ఢిల్లీ నాకౌట్ అవకాశాల్ని క్లిష్టం చేసుకుంది.చదవండి: ఆర్సీబీ వాళ్లిద్దరిని వదిలేస్తే చాలు!.. మిగతా అందరూ ఉండాల్సిందే! -
శభాష్ షహబాజ్
సూరత్: బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శనతో బెంగాల్ ఇన్నింగ్స్ 120 పరుగుల తేడాతో రైల్వేస్పై ఘనవిజయం సాధించింది. రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మంగళవారం ముగిసిన ఈ మ్యాచ్లో బెంగాల్ స్పిన్నర్ షహబాజ్ అహ్మద్ (7/56) రైల్వేస్ రెండో ఇన్నింగ్స్ను కూల్చేశాడు. ఈ మ్యాచ్లో అతను (తొలి ఇన్నింగ్స్ వికెట్) మొత్తం 8 వికెట్లు తీశాడు. చివరి రోజు 90/5 ఓవర్నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన రైల్వేస్ జట్టు 55.5 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. షహబాజ్ స్పిన్ ఉచ్చు బిగించడంతో చేతిలో ఉన్న సగం వికెట్లతో ఆఖరి రోజు కనీసం ఒక సెషన్ను కూడా పూర్తిగా ఆడలేకపోయింది. క్రితం రోజు స్కోరుకు 42 పరుగులు మాత్రమే జోడించి 5 వికెట్లను కోల్పోయింది. ఈ ఐదు వికెట్లు షహబాజే పడగొట్టడం విశేషం!ఓవర్నైట్ బ్యాటర్లు భార్గవ్ (26; 2 ఫోర్లు), ఉపేంద్ర యాదవ్ (21; 2 ఫోర్లు) ఎంతోసేపు నిలువలేకపోయారు. వీళ్లిద్దరితో పాటు కరణ్ శర్మ (6), ఆకాశ్ పాండే (18; 2 సిక్స్లు), కునాల్ యాదవ్ (0)లను కూడా షహబాజ్ పెవిలియన్ చేర్చాడు. మధ్యప్రదేశ్ గెలుపు పొర్వొరిమ్: గ్రూప్ ‘బి’లో జరిగిన మ్యాచ్లో మధ్యప్రదేశ్ 3 వికెట్ల తేడాతో గోవాపై గెలుపొందింది. 328 పరుగుల లక్ష్యఛేదనలో భాగంగా ఆఖరి రోజు మంగళవారం 21/1 ఓవర్నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన మధ్య ప్రదేశ్ 94 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసి గెలిచింది. ఆట మొదలైన కాసేపటికే హిమాన్షు మంత్రి (22; 3 ఫోర్లు) నిష్క్రమించినప్పటికీ... మరో ఓవర్నైట్ బ్యాటర్ హర్‡్ష గావ్లీ (54; 6 ఫోర్లు), కెప్టెన్ శుభమ్ శర్మ (72; 7 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. ఇద్దరు కలిసి మూడో వికెట్కు 57 పరుగులు జోడించారు. తర్వాత హర్ప్రీత్ సింగ్ (35; 1 ఫోర్, 2 సిక్స్లు), సారాంశ్ జైన్ (82; 9 ఫోర్లు)లు సైతం విలువైన భాగస్వామ్యాలు జత చేయడంతో మధ్యప్రదేశ్ విజయం సాధించింది. గోవా బౌలర్లలో లలిత్ యాదవ్, దర్శన్ చెరో 2 వికెట్లు తీశారు. ఈ గెలుపుతో మధ్య ప్రదేశ్ జట్టుకు ఆరు పాయింట్లు లభించాయి. త్రిపుర, అస్సాం మ్యాచ్ డ్రాఅగర్తలా: గ్రూప్ ‘సి’లో త్రిపుర, అస్సాం జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా అయ్యింది. ఇన్నింగ్స్ పరాజయం తప్పించుకోవాలంటే చేతిలో ఉన్న 7 వికెట్లతో ఇంకా 286 పరుగులు చేయాల్సిన దశలో అస్సామ్ బ్యాటర్లు పోరాడారు. ఫాలోఆన్లో 78/3 ఓవర్నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన అస్సాం 117.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. కెప్టెన్ , ఓవర్నైట్ బ్యాటర్ దేనిశ్ దాస్ (103; 14 ఫోర్లు), సుమిత్ ఘడిగాంకర్ (54; 5 ఫోర్లు) నాలుగో వికెట్కు 150 పరుగులు జతచేశారు. ఈ క్రమంలో దాస్ సెంచరీ, సుమిత్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత శిబ్శంకర్ రాయ్ (101 నాటౌట్; 17 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా అజేయ శతకంతో అస్సాంను డ్రాతో గట్టెక్కించాడు. రోజంతా బౌలింగ్ చేసిన త్రిపుర బౌలర్లు కేవలం 4 వికెట్లే తీయగలిగారు. త్రిపుర తొలి ఇన్నింగ్స్లో 602/7 (డిక్లేర్డ్) స్కోరు చేసింది. హనుమ విహారి శతక్కొట్టాడు. ఈ సీజన్లో అతను వరుసగా రెండో సెంచరీ సాధించాడు. -
హైదరాబాద్కు 3 పాయింట్లు
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ గ్రూప్ ‘డి’లో హైదరాబాద్, రాజస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. సొంతగడ్డపై జరిగిన ఈ పోరులో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ద్వారా హైదరాబాద్ 3 పాయింట్లు తమ ఖాతాలో వేసుకోగా, రాజస్తాన్కు ఒక పాయింట్ దక్కింది. మంగళవారం 198/7 ఓవర్నైట్ స్కోరుతో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన హైదరాబాద్ 78 ఓవర్లలో 244/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. క్రితం రోజు బ్యాటర్లలో తనయ్ త్యాగరాజన్ (4) కేవలం పరుగు మాత్రమే జతచేసి నిష్క్రమించాడు. రోహిత్ రాయడు (42; 1 ఫోర్లు, 1 సిక్స్) కాసేపు కుదురుగా ఆడాడు. టెయిలెండర్ అనికేత్ రెడ్డి (21 నాటౌట్, 2 ఫోర్లు)తో కలిసి తొమ్మిదో వికెట్కు 31 పరుగులు జోడించాక రోహిత్ను మహిపాల్ అవుట్ చేశాడు. పున్నయ్య (0 నాటౌట్) క్రీజులోకి రాగా... మరో పది బంతులకే ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ 95 పరుగుల ఆధిక్యం కలుపుకొని ప్రత్యర్థి ముందు 340 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్తాన్ మ్యాచ్ ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 57 ఓవర్లలో 3 వికెట్లకు 207 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాటర్లు సచిన్ యాదవ్ (44; 5 ఫోర్లు, 1 సిక్స్), సల్మాన్ ఖాన్ (79; 4 ఫోర్లు, 2 సిక్స్లు), మహిపాల్ లొమ్రోర్ (40; 3 ఫోర్లు) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ 2, అనికేత్ ఒక వికెట్ తీశారు. ఈ సీజన్లో 4 మ్యాచ్లాడిన హైదరాబాద్ ఒకటి గెలిచి, మిగతా మూడు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకుంది. ‘డి’ పాయింట్ల పట్టికలో ముంబై (17), జమ్మూ కశ్మీర్ (14) తర్వాత హైదరాబాద్ 13 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఈ నెల 16 నుంచి జమ్మూ వేదికపై జరిగే తదుపరి మ్యాచ్లో హైదరాబాద్... జమ్మూ కశ్మీర్తో తలపడుతుంది. -
జోరుగా హుషారుగా...
కోల్కతా: భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టుకు మూడు రోజుల ముందు ఇరు జట్ల సన్నాహకం మొదలైంది. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆటగాళ్లు సుదీర్ఘ సమయం పాటు నెట్స్లో శ్రమించారు. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్లు కీలకం కావడంతో సిరీస్ ప్రతిష్టాత్మకంగా మారింది. సొంతగడ్డపై సత్తా చాటేందుకు భారత్ సన్నద్ధమవుతుండగా, డబ్ల్యూటీసీ డిఫెండింగ్ చాంపియన్గా సఫారీ బృందం తమ స్థాయిని ప్రదర్శించాలని భావిస్తోంది. ప్రధానంగా పిచ్కు సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. ప్రత్యర్థి టీమ్లోనూ మంచి స్పిన్నర్లు ఉండటంతో భారత మేనేజ్మెంట్ కూడా పూర్తిగా స్పిన్ పిచ్ గురించి ఆలోచన చేయడం లేదు. ఇటీవల పాకిస్తాన్ గడ్డపై కూడా దక్షిణాఫ్రికా ఆకట్టుకుంది. పిచ్ రూపకల్పన విషయంలో తమకు ఎలాంటి సూచనలు రాలేదని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇప్పటికే స్పష్టం చేశాడు. టాప్–3పై దృష్టి... టెస్టు జట్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ ఇటీవల ఆస్ట్రేలియాతో వన్డే, టి20ల్లో పెద్దగా రాణించలేదు. మంగళవారం నెట్స్లో గిల్ సుదీర్ఘ సమయం పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఎర్ర బంతితో మళ్లీ లయ అందుకోవాలని అతను పట్టుదలగా ఉన్నాడు. హెడ్ కోచ్ గంభీర్, అసిస్టెంట్ కోచ్ సితాన్షు కొటక్లతో కొద్ది సేపు చర్చించిన తర్వాత గిల్ నెట్స్లోకి వెళ్లాడు. ముందుగా జడేజా, సుందర్ స్పిన్ను ఎదుర్కొన్న అతను, ఆ తర్వాత ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి పేస్ బౌలింగ్లో సాధన చేశాడు. అనంతరం అదనపు బౌన్స్ను ఎదుర్కొనేందుకు అర గంట పాటు ‘త్రో డౌన్స్’తో ప్రాక్టీస్ చేశాడు. మరోవైపు యశస్వి జైస్వాల్ కూడా కెప్టెన్తో సమాంతరంగా పక్కనే ఉన్న మరో నెట్లో సాధన కొనసాగించాడు. అతను ఎలాంటి తడబాటు లేకుండా బౌలర్లను స్వేచ్ఛగా ఎదుర్కొన్నాడు. యువ బ్యాటర్ సాయి సుదర్శన్ ప్రాక్టీస్ను కూడా కోచ్ గంభీర్ పర్యవేక్షించాడు. పేసర్లలో బుమ్రా ఒక్కడే ప్రాక్టీస్కు వచ్చాడు. బ్యాటర్ లేకుండా కేవలం రెండు స్టంప్లు పెట్టి ఆఫ్ స్టంప్పై బంతులు విసరడంపైనే అతను దృష్టి పెట్టాడు. ఏడుగురు భారత ఆటగాళ్లు ప్రాక్టీస్కు రాగా... పంత్, జురేల్, రాహుల్, సిరాజ్, కుల్దీప్, ఆకాశ్దీప్, దేవదత్ పడిక్కల్, అక్షర్ పటేల్ మంగళవారం సాధనకు దూరంగా ఉన్నారు. అనంతరం గంభీర్ సహా టీమ్ మేనేజ్మెంట్ టెస్టు మ్యాచ్కు ఉపయోగించనున్న పిచ్ను పరిశీలించారు. అటాకింగ్ ఆటతో... దక్షిణాఫ్రికా జట్టు కూడా సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్ చేసింది. భారత్లో ఎదురయ్యే స్పిన్ పిచ్ను దృష్టిలో ఉంచుకుంటూ ఆటగాళ్లు సాధన చేశారు. స్పిన్ బౌలర్లనే ప్రత్యేకంగా ఎదుర్కొంటూ అటాకింగ్ ఆటను ప్రదర్శించారు. నెట్స్లో సఫారీలను చూస్తే స్పిన్ను తడబడకుండా ఎదురుదాడి చేయడమే వ్యూహంగా కనిపిస్తోంది. ఇటీవల పాకిస్తాన్లో స్పిన్కు అనుకూల పిచ్పై టెస్టు గెలవడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. గాయం నుంచి కోలుకొని వచ్చిన కెప్టెన్ తెంబా బవుమా ఎక్కువ సేపు నెట్స్లో తన బ్యాటింగ్కు పదును పెట్టాడు. తక్కువ దూరం నుంచి త్రో డౌన్స్ తీసుకుంటూ తన ఫిట్నెస్ చురుకుదనానికి అతను స్వయంగా పరీక్ష పెట్టుకున్నాడు. ఓపెనర్లు మార్క్రమ్, రికెల్టన్ కూడా స్పిన్నర్లతోనే చాలా సేపు సాధన చేశారు. భారత్ ‘ఎ’పై రెండో అనధికారిక టెస్టులో గెలిచిన దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టులోని సభ్యులు చాలా మంది సీనియర్ టీమ్లోనూ ఉన్నారు. వారంతా ఇక్కడి పిచ్కు అలవాటు పడినట్లుగా కనిపించింది. -
దక్షిణాఫ్రికాతో సవాల్కు సిద్ధంగా ఉన్నాను: సిరాజ్
ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్ను ‘డ్రా’ చేయడంలో కీలకపాత్ర పోషించిన భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఇప్పుడు స్వదేశంలో మరో పటిష్ట జట్టుపై చెలరేగాలని పట్టుదలగా ఉన్నాడు. శుక్రవారం నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్లో మన టీమ్ పైచేయి సాధిస్తుందని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘వరల్ట్ టెస్టు చాంపియన్షిప్ పాయింట్లపరంగా మనకు ఇది చాలా కీలక సిరీస్.పైగా దక్షిణాఫ్రికా చాంపియన్ కూడా. ఆ జట్టు ఇటీవల పాక్పై సిరీస్ 1–1తో ‘డ్రా’ చేసుకున్నది వాస్తవమే. అయితే మా జట్టు కూడా చాలా బలంగా ఉంది. ఇంగ్లండ్తో చాలా బాగా ఆడి ఇటీవల వెస్టిండీస్పై అలవోకగా గెలిచాం. ఈ ఫామ్ కారణంగా టీమ్లో ఆత్మవిశ్వాసం పెరిగి అంతా సానుకూల వాతావరణం ఉంది. వ్యక్తిగతంగా నా బౌలింగ్ మంచి లయతో సాగుతోంది. కాబట్టి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలనని నమ్ముతున్నా. పెద్ద జట్లను ఎదుర్కొనేటప్పుడు మన లోపాలు ఏమిటో తెలిసి వాటిని సరిదిద్దుకునే అవకాశం కలుగుతుంది. దక్షిణాఫ్రికాతో తలపడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’ అని సిరాజ్ చెప్పాడు. భారత్ తరఫున 43 టెస్టులు ఆడిన సిరాజ్ 133 వికెట్లు పడగొట్టాడు. -
గౌరవ పదవులు పొందిన భారత స్టార్ క్రికెటర్లు వీరే..!
క్రికెట్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి, భారత ఖ్యాతిని విశ్వానికి చాటిన పలువురు క్రికెటర్లు క్రికెటేతర గౌరవ పదవులు దక్కించుకున్నారు. ఈ అంశం ప్రస్తావనకు రాగానే ముందుగా గుర్తొచ్చే పేరు ఎంఎస్ ధోని. ఈ టీమిండియా మాజీ కెప్టెన్ భారత్కు రెండు ప్రపంచకప్లు (2007, 2011) అందించాడు. ఇందుకు గానూ ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ లెఫ్టినెంట్ కర్నల్ హోదా కల్పించింది.1983 భారత్కు తొలి ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్కు (2008) సైతం భారత ఆర్మీ లెఫ్టినెంట్ కర్నల్ హోదా కల్పించింది.భారత క్రికెట్కు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చిన సచిన్ టెండూల్కర్కు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ హెదాతో సత్కరించింది. విమానయాన అనుభవం లేకుండా IAF గ్రూప్ కెప్టెన్ గౌరవం దక్కించుకున్న తొలి వ్యక్తి సచిన్ టెండూల్కర్.వీరి తర్వాత పలువురు క్రికెటర్లకు పోలీస్ శాఖలో డీఎస్పీ హోదాలో ఉద్యోగాలు లభించాయి. 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన జోగిందర్ శర్మకు హర్యానా పోలీస్ శాఖ డీఎస్పీ హోదా కల్పించింది.ఆతర్వాత హర్భజన్ సింగ్ (2011 ప్రపంచకప్ విజేత), మహ్మద్ సిరాజ్లకు (2024 టీ20 ప్రపంచకప్ విజేత) పంజాబ్, తెలంగాణ ప్రభుత్వాలు డీఎస్పీ ఉద్యోగాలతో గౌరవించాయి.మహిళల విభాగంలో ప్రస్తుత టీమిండియా సభ్యులు, వన్డే ప్రపంచకప్ ఛాంపియన్లు అయిన హర్మన్ప్రీత్ కౌర్ (పంజాబ్), దీప్తి శర్మ (ఉత్తర్ప్రదేశ్), తాజాగా రిచా ఘోష్కు (పశ్చిమ బెంగాల్) ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు డీఎస్పీ హోదా కల్పించాయి. వీరే కాక మరో ముగ్గురు భారత క్రికెటర్లకు ఇతర ప్రభుత్వ శాఖల్లో కీలక ఉద్యోగాలు లభించాయి. ప్రస్తుత టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్కు 2018లో స్పోర్ట్స్ కోటాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం లభించింది.కొంతకాలం క్రితం భారత క్రికెట్లో ఓ వెలుగు వెలిగిన ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్కు కూడా RBIలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం లభించింది.టీమిండియా స్పిన్ మాంత్రికుడు యుజ్వేంద్ర చహల్కు ఆదాయపు పన్ను శాఖలో అధికారిగా ఉద్యోగం లభించింది. వీరు మాత్రమే కాక చాలామంది భారత క్రికెటర్లకు వేర్వేరు ప్రభుత్వ విభాగాల్లో మంచి ఉద్యోగాలు లభించాయి. చదవండి: విరాట్ కోహ్లి రికార్డు సమం చేసిన బాబర్ ఆజమ్ -
సల్మాన్ అఘా మెరుపు శతకం.. పాకిస్తాన్ భారీ స్కోర్
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శ్రీలంకతో ఇవాళ (నవంబర్ 11) జరుగుతున్న తొలి వన్డేలో పాకిస్తాన్ భారీ స్కోర్ చేసింది. టీ20 జట్టు కెప్టెన్ సల్మాన్ అఘా (87 బంతుల్లో 105 నాటౌట్; 9 ఫోర్లు) మెరుపు శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది.ఆల్రౌండర్ హుస్సేన్ తలాత్ (62) అర్ద సెంచరీతో రాణించగా.. ఓపెనర్ ఫకర్ జమాన్ (32), మొహమ్మద్ నవాజ్ (36 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. బాబర్ ఆజమ్ (29) మరోసారి మంచి ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. సైమ్ అయూబ్ (6), మొహమ్మద్ రిజ్వాన్ (5) నిరాశపరిచారు.శ్రీలంక బౌలర్లలో వనిందు హసరంగ (10-0-54-3), అషిత ఫెర్నాండో (10-2-42-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. తీక్షణ ఓ వికెట్ తీశాడు. రావల్పిండి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి పాకిస్తాన్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది.బాబర్ వైఫల్యాల పరంపరఅంతర్జాతీయ క్రికెట్లో బాబర్ ఆజమ్ వైఫల్యాల పరంపర కొనసాగుతుంది. మూడు ఫార్మాట్లలో అతను సెంచరీ చేసి ఏకంగా 799 రోజులవుతుంది. ఇన్నింగ్స్ల పరంగా (3 ఫార్మాట్లలో) ఇది 83కు పెరిగింది. బాబర్ చివరిగా 2023 ఆగస్ట్లో నేపాల్పై సెంచరీ చేశాడు. అప్పటి నుంచి అతని ఫామ్ అదఃపాతాళానికి పడిపోయింది. ఫామ్లేమి కారణంగా కెప్టెన్సీ కూడా కోల్పోయాడు.చదవండి: విరాట్ కోహ్లి రికార్డు సమం చేసిన బాబర్ ఆజమ్ -
విరాట్ కోహ్లి రికార్డు సమం చేసిన బాబర్ ఆజమ్
అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ (Babar Azam) వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఇవాళ (నవంబర్ 11) శ్రీలంకతో జరుగుతున్న వన్డేలో బాబర్ 29 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత బాబర్ మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.అంతర్జాతీయ క్రికెట్లో బాబర్ సెంచరీ చేసి నేటికి 799 రోజులవుతుంది. ఇన్నింగ్స్ల పరంగా (3 ఫార్మాట్లలో) ఇది 83కు పెరిగింది. దీంతో బాబర్ టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) పేరిట ఉన్న ఓ చెత్త రికార్డును సమం చేశాడు.అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కూడా ఓ దశలో సెంచరీ లేక 83 ఇన్నింగ్స్లు ఆడాడు. విరాట్ కెరీర్లో మాయని మచ్చగా ఉన్న ఈ అప్రతిష్టను తాజాగా బాబర్ సమం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ లేకుండా ఎక్కువ ఇన్నింగ్స్లు ఆడిన చెత్త రికార్డు శ్రీలంక బ్యాటింగ్ దిగ్గజం సనత్ జయసూర్య పేరిట ఉంది.జయసూర్య తన కెరీర్లో ఓ దశలో సెంచరీ లేకుండా 88 ఇన్నింగ్స్లు ఆడాడు. ఈ జాబితాలో బాబర్, విరాట్ రెండో స్థానంలో ఉన్నారు. విండీస్ దిగ్గజం శివ్నరైన్ చంద్రపాల్ (78) మూడో స్థానంలో నిలిచాడు.2023 ఆగస్ట్ నుంచి ఇదే తంతుమూడు, నాలుగేళ్ల కిందట ప్రపంచ క్రికెట్లో అత్యంత స్థిరమైన బ్యాటర్గా గుర్తింపు పొందిన బాబర్ ఆజమ్.. 2023 నుంచి పూర్తిగా ఫామ్ కోల్పోయాడు. ఆ ఏడాది ఆగస్ట్లో నేపాల్పై సెంచరీ చేసిన తర్వాత అతనిప్పటివరకు ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఇటీవలికాలంలో బాబర్ ఫామ్ అదఃపాతాళానికి పడిపోయింది. ఫామ్లేమి కారణంగా కెప్టెన్సీ కూడా కోల్పోయాడు.ఇదిలా ఉంటే, బాబర్ విఫలమైనా శ్రీలంకతో జరుగుతున్న వన్డేలో పాక్ ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ చేసేలా ఉంది. 47.1 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 261/5గా ఉంది. సల్మాన్ అఘా (95) సెంచరీ దిశగా సాగుతున్నాడు. అతనికి జతగా మహ్మద్ నవాజ్ (10) క్రీజ్లో ఉన్నాడు. చదవండి: మయాంక్ అగర్వాల్ సూపర్ సెంచరీ -
మయాంక్ అగర్వాల్ సూపర్ సెంచరీ
రంజీ ట్రోఫీ 2025-26లో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఈ ఎడిషన్లో ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు చేసిన అతను.. ఇవాళ (నవంబర్ 11) మహారాష్ట్రపై అద్భుతమైన శతకాన్ని (103) బాదాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో ఇది వచ్చింది. ఇదే మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లోనూ (80) మయాంక్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.తాజా సెంచరీ మయాంక్కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 20వది. ఈ ఇన్నింగ్స్తో అతను 8500 ఫస్ట్ క్లాస్ పరుగుల మార్కును (118 మ్యాచ్ల్లో 8533 పరుగులు) కూడా దాటాడు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక 313 పరుగులకే ఆలౌటైంది.మయాంక్, స్మరణ్ రవిచంద్రన్ (54), శ్రేయస్ గోపాల్ (71) అర్ద సెంచరీలతో రాణించారు. అభినవ్ మనోహర్ (47), అనీశ్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మహారాష్ట్ర బౌలర్లలో జలజ్ సక్సేనా 4, ముకేశ్ చౌదరీ 3, విక్కీ ఓత్సాల్ 2, రామకృష్ణ ఘోష్ ఓ వికెట్ తీశారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన మహారాష్ట్ర కర్ణాటక స్కోర్కు ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేసింది. పృథ్వీ షా (71), జలజ్ సక్సేనా (72) రాణించడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 300 పరుగులు చేసింది. కర్ణాటక బౌలర్లలో శ్రేయస్ గోపాల్ 4, మొహిసిన్ ఖాన్ 3, విధ్వత్ కావేరప్ప 2 వికెట్లు తీశారు.13 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక మ్యాచ్ ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. మయాంక్ సెంచరీతో సత్తా చాటగా.. అభినవ్ మనోహర్ (96) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మహారాష్ట్ర బౌలర్లలో ముకేశ్ చౌదరీ 3, విక్కీ ఓస్వాల్ 2, జలజ్, రజనీష్, సిద్దేశ్ వీర్ తలో వికెట్ తీశారు. చదవండి: రాణించిన బంగ్లా బౌలర్లు -
రాణించిన బంగ్లా బౌలర్లు
రెండు టెస్ట్లు, మూడు టీ20ల సిరీస్ల కోసం ఐర్లాండ్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (నవంబర్ 11) తొలి టెస్ట్ మొదలైంది. సిల్హెట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఐర్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. వెటరన్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (60), కేడ్ కార్మిచేల్ (59) అర్ద సెంచరీలతో రాణించగా.. కర్టిస్ క్యాంఫర్ (44), లోర్కన్ టకర్ (41), జోర్డన్ నీల్ (30) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు.బ్యారీ మెక్కార్తీ 21 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. తొలి రోజు ఆటలో చివరి బంతికి జోర్డన్ నీల్ ఔటయ్యాడు. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ డకౌట్ కాగా.. హ్యారీ టెక్టర్ 1, ఆండీ మెక్బ్రైన్ 5 పరుగులు చేసి ఔటయ్యారు.బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ మిరాజ్ 3 వికెట్లతో సత్తా చాటగా.. హసన్ మురద్ 2, హసన్ మహమూద్, నహిద్ రాణా, తైజుల్ ఇస్లాం తలో వికెట్ తీశారు. కాగా, ఈ పర్యటనలో రెండో టెస్ట్ నవంబర్ 19 నుంచి ఢాకాలో జరుగుతుంది. అనంతరం నవంబర్ 27, 29, డిసెంబర్ 2 తేదీల్లో మూడు టీ20లు జరుగుతాయి. చదవండి: శ్రేయస్ గాయం.. షాకింగ్ విషయాలు -
ధర రూ. 3 లక్షల నుంచి రూ. 30 కోట్లకు పెరిగింది!
మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni).. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టీమిండియాకు ఏకంగా మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన దిగ్గజ కెప్టెన్ అతడు. సీనియర్లను సైతం పక్కనపెట్టి సాహసోపేతమైన నిర్ణయాలతో భారత క్రికెట్ జట్టుకు మూడు ట్రోఫీలు అందించిన ఘనుడు.పొట్టి ఫార్మాట్లో తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్-2007ను గెలిచిన ధోని.. తర్వాత వన్డే వరల్డ్కప్-2011, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2013 టైటిళ్లను కూడా కెప్టెన్గా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా ధోని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.44 ఏళ్ల వయసులోనూ...ముఖ్యంగా ఐపీఎల్లో ఐదుసార్లు చెన్నై సూపర్ కింగ్స్ను చాంపియన్గా నిలిపిన ధోని.. 44 ఏళ్ల వయసులోనూ క్యాష్ రిచ్ లీగ్లో కొనసాగడం విశేషం. ఇక లెజెండరీ క్రికెటర్గానే కాదు మిస్టర్ కూల్గానూ ధక్షనికి పేరున్న విషయం తెలిసిందే. మైదానంలోనే కాదు.. బయట కూడా ధోని సరదాగా ఉంటూనే తన పనులు చక్కబెట్టుకుంటాడు.ఇక ధోనికి ఉన్న అభిమాన గణం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్కసారి తలాను నేరుగా చూస్తే చాలని పరితపించిపోయేవారు కోకొల్లలు. ఓ అభిమానికి ధోనిని కలవాలన్న కల నెరవేరడంతో పాటు.. అతడి ఆటోగ్రాఫ్ కూడా లభించడంతో అతడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.ముంజేయిపై కూడాఆటోగ్రాఫ్ ఇస్తేనే అంత ఆనందమా? అంటే.. అవును.. ఇదొక ప్రత్యేకమైన ఆటోగ్రాఫ్. అభిమానికి చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్.. డీజిల్ ట్యాంకుపై ధోని తన స్వహస్తాలతో సంతకం చేశాడు. అంతేకాదు.. అతడి ముంజేయిపై కూడా ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సదరు అభిమాని సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్గా మారింది.ధర రూ. 3 లక్షల నుంచి రూ. 30 కోట్లకు పెరిగిందిఈ నేపథ్యంలో.. ‘‘ఇప్పుడు నీ బైక్ ధర రూ. 3 లక్షల నుంచి రూ. 30 కోట్లకు పెరిగింది బ్రో. ఒకవేళ అంత మొత్తం చెల్లించినా నువ్వు ఈ బైక్ ఇస్తావనే నమ్మకమైతే లేదు. ఎంతైనా నువ్వు అదృష్టవంతుడివి’’ అంటూ ధోని ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.ఈ క్రమంలో సదరు అభిమాని ఓ ఫన్నీ మూమెంట్ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన బైక్పై సంతకం చేస్తున్న వేళ ఓ వ్యక్తి తన తలపై ఆటోగ్రాఫ్ ఇవ్వాలని కోరగా.. తాను డస్ట్బిన్పై సంతకం చేయనని తలా చెప్పినట్లు వివరించాడు. అంతేకాదు.. తాను ఆటోగ్రాఫ్ ఇచ్చిన తర్వాత బైక్ రైడ్ ఎలా సాగుతుందో కూడా తనకు చెప్పాలని ధోని అడిగినట్లు తెలిపాడు.కాగా ధోనికి బైకులు, కార్లు అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. రాంచిలోని ధోని నివాసంలో అతడి ఫేవరెట్ ఆటోమొబైల్స్తో కూడిన గ్యారేజీ అత్యంత ప్రత్యేకం. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026 సందర్భంగా మళ్లీ ధోనిని మైదానంలో చూసే అవకాశం ఉంది. చదవండి: శ్రేయస్ అయ్యర్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం! View this post on Instagram A post shared by Mayank Sharma (@vezzznar) -
శ్రేయస్ గాయం.. షాకింగ్ విషయాలు
భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా గాయపడి, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. శ్రేయస్ పూర్తిగా కోలుకోవడానికి ఇంకా నెల రోజులైనా పడుతుందని డాక్టర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 30 నుంచి సౌతాఫ్రికాతో జరుగబోయే వన్డే సిరీస్లో శ్రేయస్ ఆడటం కష్టమేనని తెలుస్తుంది. బీసీసీఐ శ్రేయస్ విషయంలో ఎలాంటి తొందరపాటుకు పోకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పూర్తిగా కోలుకొని, ప్రాక్టీస్ మొదలుపెట్టాకే అతనికి కబురు పెట్టే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తుంది.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా సిరీస్లో శ్రేయస్కు ప్రత్యామ్నాయం కోసం సెలెక్టర్లు వేట మొదలుపెట్టారు. గత కొంతకాలంగా శ్రేయస్ నాలుగో స్థానంలో అంచనాలకు మించి రాణిస్తూ, స్థిరపడ్డాడు. ఈ సిరీస్కు శ్రేయస్ దూరమైతే టీమిండియా భారీ ఎదురుదెబ్బ తగిలినట్లవతుంది. ఇటీవలికాలంలో ఛేదనల్లో శ్రేయస్ అత్యంత కీలకమైన ఇన్నింగ్స్లు ఆడుతూ టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడకముందు కూడా రాణించాడు. మొత్తంగా శ్రేయస్ గాయం భారత వన్డే జట్టు కూర్పును గందరగోళంలో పడేసింది.ఇదిలా ఉంటే, శ్రేయస్ గాయానికి సంబంధించి తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గాయపడిన వెంటనే శ్రేయస్ ఆక్సిజన్ లెవెల్స్ ప్రమాదకర స్థాయికి పడిపోయినట్లు నివేదికలు తెలిపాయి. స్ప్లీన్లో (ప్లీహం) చీలక వచ్చి, అంతర్గత రక్తస్రావం కావడంతో శ్రేయస్ అక్సిజన్ లెవెల్స్ 50కి పడిపోయినట్లు పేర్కొన్నాయి. ఆ సమయంలో శ్రేయస్ పది నిమిషాల పాటు నిలబడలేకపోయాడని, అతడి శరీరం పూర్తిగా బ్లాక్ అవుటయ్యిందని తెలిపాయి. ఈ విషయం వింటుంటే శ్రేయస్ చావుకు దగ్గరగా వెళ్లొచ్చాడని స్పష్టమవుతుంది.అక్టోబర్ 25న ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే సందర్భంగా అలెక్స్ క్యారీ క్యాచ్ పట్టే ప్రయత్నంలో శ్రేయస్ ప్రమాదకరంగా కిందపడ్డాడు. క్యాచ్ అయితే పట్టుకోగలిగాడు కాని, ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు. నొప్పితో విలవిలలాడిపోయిన శ్రేయస్ను హుటాహుటిన సిడ్నీలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు ఐసీయూలో పెట్టి చికిత్సనందించారు. తొలుత గాయం చిన్నదే అని అంతా అనుకున్నారు.అయితే డాక్టర్లు నెమ్మదిగా విషయాన్ని చెప్పారు. శ్రేయస్ స్ప్లీన్లో (ప్లీహం) చీలక వచ్చి, అంతర్గత రక్తస్రావమైందని తెలిపారు. ఒకటి, రెండు రోజుల వరకు ఏమీ చెప్పలేమని అన్నారు. ఈ విషయం తెలిశాక యావత్ క్రికెట్ సమాజం ఆందోళనకు గురైంది. శ్రేయస్కు ఏమీ కాకూడదని దేవుళ్లను మొక్కింది. దేవుడి దయ, డాక్టర్ల పనితనం వల్ల శ్రేయస్ మృత్యు కొరల్లో నుంచి బయటపడ్డాడు. కొన్ని రోజుల చికిత్స అనంతరం కోలుకున్నాడు. ప్రస్తుతం క్రికెట్కు దూరంగా ఉంటూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. చదవండి: చరిత్ర సృష్టించిన జమ్మూ అండ్ కశ్మీర్ క్రికెట్ టీమ్ -
ఆర్సీబీ వాళ్లిద్దరిని వదిలేస్తే చాలు!
ఐపీఎల్-2026 వేలం (IPL 2026 Auction) నేపథ్యంలో పది ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకోవాల్సిన, వదిలివేయాల్సిన ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసుకుంటున్నాయి. నవంబరు 15 నాటికి లిస్టును ఖరారు చేయాల్సి ఉండగా.. ఇందుకు సంబంధించిన కసరత్తు చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంఛైజీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. డిఫెండింగ్ చాంపియన్ తమ జట్టును కొనసాగించాలని సూచించాడు. అంతగా అవసరం అయితే.. ఓ ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే విడిచిపెట్టాలని అభిప్రాయపడ్డాడు.కాగా పదిహేడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే. ఐపీఎల్-2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్పై ఆరు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి చాంపియన్గా అవతరించింది. దీంతో అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. అదే సమయంలో విజయోత్సవం సందర్భంగా తొక్కిసిలాట జరిగి పలువురు ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది.అమ్మకానికి ఆర్సీబీఇదిలా ఉంటే.. ఆర్సీబీ ప్రస్తుతం అమ్మకానికి వచ్చింది. డియాజియో తాము ఆర్సీబీని విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. దీంతో జట్టుకు కొత్త యజమానులు రావడం ఖాయం కాగా.. రిటెన్షన్ లిస్టుపై ఆసక్తి నెలకొంది. ఐపీఎల్ ఆరంభం నుంచి.. అంటే 2008 నుంచి భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి ఒక్కడే జట్టుతో ఉన్న విషయం తెలిసిందే.ఆర్సీబీ వాళ్లిద్దరిని వదిలేస్తే చాలు!ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘ఆర్సీబీ ఈసారి ఇద్దరిని మాత్రమే విడుదల చేస్తే బాగుంటుంది. ప్రస్తుతం జట్టు కూర్పు బాగుంది. అలాంటపుడు మార్పులు చేయడం సరికాదనే చెప్పాలి.లియామ్ లివింగ్స్టోన్, రసిఖ్ దర్ సలామ్లను విడుదల చేసినా పెద్దగా నష్టం లేదు. అంతకు మించి మార్పులు వద్దు. మిగిలిన అందరినీ అట్టిపెట్టుకోవాలి. నిజానికి లివింగ్స్టోన్ ఖరీదైన ఆటగాడు. ఈ సీజన్లో అంత గొప్పగా కూడా ఆడలేదు.రజత్ పాటిదార్, విరాట్ కోహ్లి తర్వాత జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్ వస్తారు. కాబట్టి మిడిలార్డర్లో లివింగ్స్టోన్ను తీసేసి.. ఇంకా మెరుగ్గా ఆడగలిగే బ్యాటర్ను కొనుగోలు చేస్తే సరిపోతుంది.అతడికి అంత మొత్తం ఎక్కువేపేస్ విభాగంలో యశ్ దయాళ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్వుడ్, రొమారియో షెఫర్డ్, నువాన్ తుషార ఉన్నారు. వీరికి తోడుగా భారత ఫాస్ట్ బౌలర్ను తెచ్చుకుంటే సరి. రసిఖ్కు అంత మొత్తం ఎక్కువే. కాబట్టి అతడిని వదిలేసి మరొకరిని తీసుకుంటే మరో ప్లేయర్ కోసం డబ్బు కూడా మిగులుతుంది’’ అని ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా లివింగ్స్టోన్ను రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్సీబీ.. రసిఖ్ కోసం ఏకంగా రూ. 6 కోట్లు వెచ్చించింది. లివింగ్స్టోన్ ఈ సీజన్లో ఎనిమిది మ్యాచ్లు ఆడి కేవలం 112 పరుగులు చేయగా.. రసిఖ్ రెండు మ్యాచ్లలో కలిపి ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. చదవండి: శ్రేయస్ అయ్యర్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం! -
చరిత్ర సృష్టించిన జమ్మూ అండ్ కశ్మీర్ క్రికెట్ టీమ్
జమ్మూ అండ్ కశ్మీర్ క్రికెట్ జట్టు (Jammu & Kashmir Cricket Team) చరిత్ర సృష్టించింది. రంజీ ట్రోఫీలో (Ranji Trophy 2025-26) తొలిసారి ఢిల్లీని ఓడించింది (7 వికెట్ల తేడాతో). టోర్నీ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు 43 సార్లు తలపడగా జమ్మూ తొలిసారి విజయం సాధించింది. ఏడు సార్లు ఛాంపియన్ అయిన ఢిల్లీని జమ్మూ వారి సొంత మైదానంలో (అరుణ్ జైట్లీ స్టేడియం) ఓడించింది. 🚨 A HISTORIC DAY IN JAMMU & KASHMIR CRICKET 🚨- Jammu & Kashmir has defeated Delhi for the first time in Ranji Trophy history. 🔥🤯 pic.twitter.com/VxNFBOj7QW— Johns. (@CricCrazyJohns) November 11, 2025ఈ గెలుపుతో రంజీ ట్రోఫీలో జమ్మూ కశ్మీర్పై ఢిల్లీ ఆధిపత్యానికి తెర పడింది. యువకులు, అనుభవజ్ఞులతో కూడిన ప్రస్తుత జమ్మూ జట్టు ఆ ప్రాంత క్రికెట్ అభిమానుల దశాబ్దాల కలను నెరవేర్చింది. ఢిల్లీ లాంటి అగ్రశ్రేణి జట్టును, వారి సొంత మైదానంలో ఓడించడమంటే ఆషామాషీ విషయం కాదు. ఈ గెలుపుతో ప్రస్తుత జమ్మూ జట్టు వారి ప్రాంత యువ క్రికెటర్లకు స్పూర్తిదాయకంగా నిలిచింది. 179 పరుగుల లక్ష్య ఛేదనలో కమ్రాన్ ఇక్బాల్ చారిత్రక శతకం (133 నాటౌట్) సాధించి జమ్మూ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన జమ్మూ.. ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ను 211 పరుగులకే కుప్పకూల్చింది. సంచలన పేసర్ ఆకిబ్ నబీ 5 వికెట్ల ప్రదర్శనతో ఢిల్లీ పతనాన్ని శాసించాడు. వన్ష్రాజ్ శర్మ, ఆబిద్ ముస్తాక్ తలో 2 వికెట్లు తీసి ఢిల్లీ పతనంలో తమవంతు పాత్ర పోషించారు.అనంతరం బరిలోకి దిగిన జమ్మూ.. కెప్టెన్ పరాస్ డోగ్రా (106) సెంచరీతో కదంతొక్కడంతో 310 పరుగులు చేసింది. అబ్దుల్ సమద్ (85), కన్హయ్య (47) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో సిమర్జీత్ 6 వికెట్లు తీశాడు.99 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ.. ఈసారి కూడా తడబడింది. ఓ దశలో భారీ స్కోర్ చేసేలా కనిపించినా చివరికి 277 పరుగులకే పరిమితమై, జమ్మూ ముందు 179 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని జమ్మూ ఆడుతూపాడుతూ ఛేదించింది. ఓపెనర్ కమ్రాన్ అజేయ శతకంతో జమ్మూను గెలుపు తీరాలకు చేర్చాడు. ఈ గెలుపు జమ్మూ అండ్ కశ్మీర్ క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా మిగిలిపోతుంది.చదవండి: శ్రేయస్ అయ్యర్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం! -
రిజ్వాన్ తనంతట తానే తప్పుకొన్నాడు: షాహీన్ అఫ్రిది
పాకిస్తాన్ కొత్త వన్డే కెప్టెన్గా స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది ఎంపికైన సంగతి తెలిసిందే. మహ్మద్ రిజ్వాన్ నుంచి వన్డే జట్టు పగ్గాలను అఫ్రిది చేపట్టాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు మందు ఈ కెప్టెన్సీ మార్పు చోటు చేసుకుంది. రిజ్వాన్ సారథ్యంలో పాక్ జట్టు దారుణ ప్రదర్శన కనబరచడంతో పీసీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ పీసీబీ మాత్రం రిజ్వాన్తో సంప్రదించాకే కెప్టెన్సీ మార్పు చేసిందని షాహీన్ తాజాగా వెల్లడించాడు."పాకిస్తాన్ కెప్టెన్సీ తీసుకోవాలా వద్ద అన్న విషయం గురుంచి నేను చర్చించిన ఏకైక వ్యక్తి మహ్మద్ రిజ్వాన్. అతడితో అన్ని విషయాలు మాట్లాడాకే బాధ్యతలు చేపట్టేందుకు అంగీకరించాను. రిజ్వాన్ నిజంగా చాలా మంచివాడు. రిజ్వాన్ భాయ్ తనంతట తానే తప్పుకొని నాకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు" అని విలేకరుల సమావేశంలో షాహీన్ పేర్కొన్నాడు.కాగా 25 ఏళ్ల అఫ్రిది తన కెప్టెన్సీ అద్భుతంగా ఆరంభించాడు. స్వదేశంలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ను 2-1 తేడాతో పాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు శ్రీలంకతో వన్డేల్లో తలపడేందుకు మెన్ ఇన్ గ్రీన్ సిద్దమైంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా శ్రీలంక-పాక్ మధ్య తొలి మ్యాచ్ రావల్పిండి వేదికగా మంగళవారం జరగనుంది. ఇక ఇది ఉండగా..20 వన్డేల్లో పాక్ జట్టుకు రిజ్వాన్ సారథ్యం వహించాడు. ఇందులో 9 విజయాలు, 11 ఓటములు ఉన్నాయ. అతడి గెలుపు శాతం 45%గా ఉంది.చదవండి: శ్రేయస్ అయ్యర్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం! -
ఢిల్లీ పేలుడు ఘటనపై గౌతమ్ గంభీర్ దిగ్భ్రాంతి
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనను కలిగించింది. ఈ భయంకర పేలుడులో మొత్తం 13 మంది మృతి చెందగా..17 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఢిల్లీలో జరిగిన పేలుడు కారణంగా అమాయకుల ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరం.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని గంభీర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. గంబీర్ ప్రస్తుతం భారత జట్టుతో పాటు కోల్కతాలో ఉన్నాడు. నవంబర్ 14 నుంచి ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్టు ప్రారంభం కానుంది.భద్రతా వలయంలో ఈడెన్..కాగా ఢిల్లీ ఘటన నేపథ్యంలో కోల్కతా పోలీస్లు అలర్ట్ అయ్యారు. మ్యాచ్ జరిగే ఈడెన్ గార్డెన్స్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. తొలి టెస్టు కోసం ఇరు జట్లు ఇప్పటికే కోల్కతాకు చేరుకున్నాయి. దీంతో ఆటగాళ్లు బస చేసే హోటల్స్ వద్ద, స్టేడియంకి వెళ్లే మార్గంలో సెక్యూరిటీని మరింత పెంచారు. సోమవారం నుంచి ఈడెన్ గార్డెన్స్ చుట్టూ పోలీసులు ప్రత్యేక నాకా తనిఖీలు (NAKA checks) చేశారు. -
శ్రేయస్ అయ్యర్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం!
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దూరమయ్యే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడ్డ శ్రేయస్ అయ్యర్.. పూర్తి ఫిట్నెస్ సాధించడానికి మరింత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. అయ్యర్ తన ప్రక్కెటుమకల గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నాడు. అయితే అయ్యర్కు వైద్యులు దాదాపు ఐదు వారాల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో ఈ ముంబై ఆటగాడిని సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో ఆడించి రిస్క్ తీసుకోడదని బీసీసీఐ భావిస్తుందంట. శ్రేయస్ అయ్యర్ పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం పడుతోంది. అయ్యర్ విషయంలో బోర్డు, సెలక్షన్ కమిటీ ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోదు అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్ నవంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. అయ్యర్ స్దానంలో సెలక్టర్లు సాయిసుదర్శన్కు చోటు ఇచ్చే అవకాశముంది.అయ్యర్కు ఏమైందంటే?ఆసీస్తో జరిగిన మూడో వన్డేలో క్యారీ ఇచ్చిన క్యాచ్ను అందుకునే క్రమంలో బంతి అయ్యర్ పక్కటెముకలకు బలంగా తాకింది. ప్లీహానికి (Spleen Injury) తీవ్ర గాయమైంది. ఆ తర్వాత అంతర్గతంగా రక్తస్రావం జరిగినట్లు పరీక్షల్లో తేలింది. దీంతో అతడికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో ఉంచి చికిత్స అందించారు. దాదాపు నాలుగు రోజుల తర్వాత శ్రేయస్ అయ్యర్ అస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అయ్యర్ ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు.చదవండి: మహ్మద్ షమీ వర్సెస్ అగార్కర్.. ఎవరు గొప్ప బౌలర్? -
భారత్- ‘ఎ’ తరఫునా ఫెయిల్.. జట్టులోకి ఎలా వస్తారు?
సౌతాఫ్రికా- ‘ఎ’తో అనధికారిక టెస్టు సిరీస్లో భారత్- ‘ఎ’ (IND A vs SA A) జట్టు మిశ్రమ ఫలితం చవిచూసింది. బెంగళూరు వేదికగా జరిగిన రెండు మ్యాచ్ల సిరీస్ను భారత్ 1-1తో సమం చేసుకుంది. రెండో టెస్టులో పంత్ సేన విజయం ఖాయమని భావించగా.. ప్రొటిస్ జట్టు సంచలన రీతిలో గెలుపును తన్నుకుపోయింది.ఈ మ్యాచ్లో అదే పెద్ద హైలైట్!ఏకంగా 400 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ ‘ఎ’తో జరిగిన రెండో అనధికారిక టెస్టులో 5 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. 2 మ్యాచ్ల సిరీస్ను 1–1తో సమం చేసింది. భారత్లాంటి స్పిన్ వేదికలపై నాలుగో ఇన్నింగ్స్ (ఛేదించే జట్టు రెండో ఇన్నింగ్స్) అది కూడా చివరి రోజు చాలా కష్టం. అయినాసరే సఫారీ ‘ఎ’ జట్టు భారత రెగ్యులర్ టెస్టు బౌలర్లు సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్లను ఎదుర్కొని మరీ భారీ లక్ష్యాన్ని ఛేదించడమే ఈ మ్యాచ్లో పెద్ద హైలైట్! ఓవరాల్గా ‘ఎ’ జట్ల అనధికారిక నాలుగు రోజుల మ్యాచ్ల్లోనే ఇది అత్యధిక పరుగుల ఛేదనగా ఘనతకెక్కింది. ధ్రువ్ జురెల్ ఒక్కడే..ఇదిలా ఉంటే.. ఈ సిరీస్లో టీమిండియా స్టార్లలో ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) ఒక్కడే మెరుగ్గా రాణించాడు. రెండో టెస్టులో రెండుసార్లు శతక్కొట్టి సత్తా చాటాడు. తద్వారా టీమిండియా తరఫున టెస్టుల్లో కేవలం వికెట్ కీపర్ బ్యాకప్ ఆప్షన్గా కాకుండా.. స్పెషలిస్టు బ్యాటర్గా రాణించగలనని మరోసారి నిరూపించాడు.దారుణంగా విఫలంమరోవైపు.. తమిళనాడు ఆటగాడు సాయి సుదర్శన్ (Sai Sudharsan), కర్ణాటక క్రికెటర్ దేవదత్ పడిక్కల్ మాత్రం ఈ సిరీస్లో విఫలమయ్యారు. సాయి నాలుగు ఇన్నింగ్స్లో కలిపి 84 పరుగులు చేయగా.. పడిక్కల్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. నాలుగు ఇన్నింగ్స్లో అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 6,5,5,24.ఇక టీమిండియా తరఫున టెస్టుల్లో బ్యాకప్ ఓపెనర్గా ఎంపికవుతూ.. ఇప్పటికీ అరంగేట్రం చేయలేకపోయిన బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ పూర్తిగా ఫెయిలయ్యాడు. రెండో టెస్టుతో జట్టులో చేరిన అతడు డకౌట్ అయ్యాడు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సెలక్టర్ దేవాంగ్ గాంధీ సాయి, పడిక్కల్, అభిమన్యులపై విమర్శలు గుప్పించాడు. ‘‘విఫలమైనా... సాయి సుదర్శన్ ఇంకా యువకుడే కాబట్టి సెలక్టర్లు అతడికి మరిన్ని అవకాశాలు ఇవ్వవచ్చు. టెస్టు ఫార్మాట్లో బ్యాకప్ బ్యాటర్ల కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.భారత్- ‘ఎ’ తరఫునా పరుగులు చేయలేరు.. జట్టులో చోటెలా?పడిక్కల్ భారత్- ‘ఎ’ తరఫున కూడా పరుగులు రాబట్టలేకపోతున్నాడు. బ్యాకప్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ ఇలాగే కొనసాగితే అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. జట్టులోకి రావడం కలగానే మిగిలిపోతుంది.స్పష్టతకు రావాలి..ఏదేమైనా జురెల్ ఒక్కడే ప్రస్తుతం నిలకడగా రాణిస్తున్నాడు. అయితే, అతడిని కేవలం బ్యాకప్ వికెట్ కీపర్గా మాత్రమే వాడకుంటామంటే.. రిషభ్ పంత్ కారణంగా అతడికి తుదిజట్టులో చోటు దక్కదు. కాబట్టి అతడి పాత్రపై సెలక్టర్లు స్పష్టతకు రావాలి.అంతేకాదు.. వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లను సెలక్టర్లు కవర్ చేయాలి. సరైన ఆటగాళ్లను ఎంపిక చేసుకోవాలి. ఈ దేశీ సీజన్లో సెలక్టర్లు ఈ విషయంలో కఠినంగా శ్రమిస్తేనే మెరుగైన ఎంపికలు చేయగలరు’’ అని దేవాంగ్ గాంధీ టైమ్స్ ఆఫ్ ఇండియాతో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.చదవండి: వన్డే ఆల్టైమ్ జట్టు.. టీమిండియా నుంచి ముగ్గురు.. రోహిత్కు దక్కని చోటు -
మహ్మద్ షమీ వర్సెస్ అగార్కర్.. ఎవరు గొప్ప బౌలర్?
టీమిండియా స్పీడ్ స్టార్ మహ్మద్ షమీ అంతర్జాతీయ కెరీర్ తుది దశకు చేరుకుందా? జాతీయ జట్టులోకి అతడి రీ ఎంట్రీ అసాధ్యమేనా..? అంటే అవునానే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. షమీ గత ఎనిమిది నెలల నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు.ఈ ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత ఇప్పటివరకు ఒక్కసారి కూడా భారత జెర్సీలో షమీ కన్పించలేదు. టెస్టుల్లో అయితే అతడు చివరగా 2023లో ఆస్ట్రేలియాపై ఆడాడు. షమీ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నప్పటికి సెలక్టర్లు మాత్రం అతడిని పరిగణలోకి తీసుకోవడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన షమీ.. 91 ఓవర్లు బౌలింగ్ చేసి 15 వికెట్లు పడగొట్టాడు. లాంగ్ స్పెల్స్ బౌలింగ్ చేస్తూ తన ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. దీంతో సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్ల మ్యాచ్ల టెస్టు సిరీస్కు ఈ స్పీడ్ స్టార్ను సెలక్టర్లు ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం మరోసారి షమీకి నిరాశే మిగిల్చారు.షమీ× అగార్కర్అయితే తనను సెలెక్టర్లు పట్టించుకోవడం లేదని, కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని షమీ ఇటీవల బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. రంజీల్లో ఆడే వాడిని.. వన్డేలు ఆడలేనా? అని ప్రశ్నించాడు. షమీ వ్యాఖ్యలపై అగార్కర్ కూడా స్పందించాడు. షమీకి ఫిట్నెస్ ప్రధాన సమస్యగా ఉందని అందుకే అతడిని ఎంపిక చేయడం లేదని చీఫ్ సెలక్టర్ చెప్పుకొచ్చాడు. షమీ తన ముందు ఉండింటే సమాధనము చెప్పేవాడని అని అగార్కర్ అన్నాడు.అయితే తాజాగా బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు కూడా షమీ ఆరోపణలపై స్పందించారు. "సెలక్టర్లు, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ సపోర్ట్ స్టాఫ్ షమీతో నిరంతరం టచ్లోనే ఉన్నారు. ఇంగ్లండ్ టూర్లో కొన్ని మ్యాచ్ల్లో బుమ్రాకు విశ్రాంతి ఇచ్చినందున షమీ లాంటి సీనియర్ బౌలర్ను జట్టులోకి తీసుకోవాలని భావించాము.ఓ సీనియర్ సెలెక్టర్ అతడితో చర్చలు జరిపారు. ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో కాంటర్బరీ లేదా నార్తాంప్టన్లో జరిగే ఇండియా-ఎ మ్యాచ్ ఆడాలని కోరారు. షమీ సుదీర్ఘ స్పెల్స్ వేయగలడా లేడా అని సెలక్టర్లు పరీక్షించాలి అనుకున్నారు. కానీ షమీ మాత్రం సెలక్టర్ల ప్రతిపాదనను తిరష్కరించాడు. అగార్కర్ సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాడని "సదరు బోర్డు అధికారి పేర్కొన్నారు.ఎవరు గొప్ప..?ఈ నేపథ్యంలో షమీ, అగార్కర్లలో ఎవరూ గొప్ప బౌలర్ అన్న చర్చ క్రికెట్ వర్గాల్లో నడుస్తోంది. అగార్కర్ భారత క్రికెట్లో తనంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ రైట్ ఆర్మ్ పేసర్ ముఖ్యంగా వన్డేల్లో ఎన్నో మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్ బౌలింగ్ చేశాడు.ఈ ఢిల్లీ బాయ్ తన కెరీర్లో మొత్తంగా 191 వన్డేలు ఆడి 288 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో (అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్ తర్వాత) మూడో స్థానంలో అగార్కర్ ఉన్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 50 వికెట్ల మైలు రాయిని అందుకున్న బౌలర్గా కూడా అజిత్ చానాళ్లపాటు కొనసాగాడు. అతడు కేవలం 23 మ్యాచ్లలోనూ ఈ రికార్డును అందుకున్నాడు. చాలా మ్యాచ్లలో బ్యాట్తో కూడా అజిత్ సత్తాచాటాడు. వన్డేల్లో భారత్ తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ(కేవలం 21 బంతుల్లో) సాధించిన రికార్డు ఇప్పటికీ అగార్కర్ పేరిటే ఉంది.అదే విధంగా ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్పై అగార్కర్ సాధించిన టెస్టు సెంచరీ సగటు క్రికెట్ అభిమాని ఎప్పటికి మర్చిపోడు. దాదాపు 15 ఏళ్ల పాటు భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన అగార్కర్.. ఇప్పుడూ చీఫ్ సెలక్టర్గా తన సేవలను అందిస్తున్నాడు.ఇక షమీ విషయానికి వస్తే ఇప్పటివరకు 108 వన్డేలు ఆడాడు. షమీ పేరిట ప్రస్తుతం 206 వికెట్లు ఉన్నాయి. అదే అగర్కార్ 108 వన్డేల్లో 158 వికెట్లు మాత్రమే సాధించాడు. ఇద్దరూ మధ్య దాదాపుగా 48 వికెట్లు తేడా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే షమీ తిరిగి వన్డేల్లో ఆడుతాడన్నది అనుమానమే. ఒకవేళ రీ ఎంట్రీ ఇచ్చినా అగార్కర్ ఆడిన వన్డేలకు సంఖ్యకు దారిదాపుల్లోకి కూడా వెళ్లలేడు. షమీ ఇప్పటివరకు 108 వన్డేల మ్యాచ్ల ఆడగా అందులో భారత్ 69 విజయాలు సాధించిందంటే అతడి ట్రాక్ రికార్డు ఎలా ఉందో ఆర్ధం చేసుకోవచ్చు. ఈ 69 వన్డేల్లో అతడు 5.24 ఎకానమీ రేటుతో 150 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా ఐదు ఫైవ్ వికెట్ల హాల్స్, ఎనిమిది ఫోర్ వికెట్ల హాల్స్ను షమీ నమోదు చేశాడు.అదే భారత్ ఓడిపోయిన 33 మ్యాచ్లలో షమీ 6.12 ఎకానమీ రేటుతో 47 మాత్రమే వికెట్లు పడగొట్టాడు. అంటే షమీ మెరుగైన ప్రదర్శన కనబరిచిన ప్రతీసారి భారత్ దాదాపుగా విజయం సాధించింది. అతడు విఫలమైన చోట టీమిండియా ఓటమి పాలైంది. వన్డే వరల్డ్కప్-2023లోనూ షమీ సంచలన ప్రదర్శన కనబరిచాడు. షమీ పేరిట టెస్టుల్లో కూడా 229 వికెట్లు ఉన్నాయి. అదే అగర్కార్ టెస్టుల్లో కేవలం 58 వికెట్లు మాత్రమే సాధించాడు.చదవండి: అతడి రీ ఎంట్రీ తప్పనిసరి.. మూడు ఫార్మాట్లలోనూ ఆడించాలి: గంగూలీ -
102 ఎకరాల స్థలం.. అప్పుడు రూ.900 కోట్లతో..
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ స్టేడియాన్ని (Jawaharlal Nehru Stadium) పూర్తిగా కూల్చేసి పునర్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అత్యాధునిక వసతులతో సిద్ధం చేసి దానిని ‘స్పోర్ట్స్ సిటీ’గా మార్చనున్నారు. అన్ని రకాల ప్రధాన క్రీడలకు కేంద్రంగా దీనిని రూపుదిద్దాలనే ప్రణాళిక సిద్ధమైందని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.102 ఎకరాల స్థలంస్టేడియానికి సంబంధించి ప్రస్తుతం 102 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. పూర్తి ఖర్చు, ఎప్పటిలోగా పూర్తి చేయాలనే అంశంపై త్వరలోనే స్పష్టత రానుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సహా ఇప్పుడు స్టేడియంలోనే ఉన్న కార్యాలయాలన్నీ మరో చోటుకు తరలించనున్నారు.ఖతర్, ఆస్ట్రేలియాలలో ఉన్న స్పోర్ట్స్ సిటీ నమూనాలను నెహ్రూ స్టేడియం నిర్మాణం కోసం పరిశీలిస్తున్నారు. కాగా 1982లో ఆసియా క్రీడల సందర్భంగా నిర్మించిన ఈ స్టేడియాన్ని 2010లో కామన్వెల్త్ క్రీడల కోసం రూ.900 కోట్లతో ఆధునీకరించారు. 320 మంది అసిస్టెంట్ కోచ్ల ఎంపిక... దేశవ్యాప్తంగా 320 మంది అసిస్టెంట్ కోచ్లను ఎంపిక చేసేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. 25 రకాల క్రీడాంశాల్లో వీరిని నియమించేందుకు చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ‘సాయ్’ కేంద్రాల్లో వీరిని నియమిస్తారు. అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాలు సాధించే లక్ష్యంతో ‘మెడల్ స్ట్రాటజీ’ అంటూ రూపొందించిన ప్రణాళికల్లో భాగంగా ఈ కోచ్లను నియమిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ 320 మందిలో 50 శాతం మహిళలకు అవకాశం కల్పిస్తున్నారు.చదవండి: వన్డే ఆల్టైమ్ జట్టు.. టీమిండియా నుంచి ముగ్గురు.. రోహిత్కు దక్కని చోటు -
ప్రాక్టీస్కు వేళాయె...
వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా సొంతగడ్డపై టెస్టు సిరీస్కు భారత్ సన్నద్ధమవుతోంది. గురువారం నుంచి ఈడెన్ గార్డెన్స్లో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్టుకు ముందు వరుసగా మూడు రోజుల పాటు టీమ్ ప్రాక్టీస్లో పాల్గొంటుంది.ఆ్రస్టేలియాలో టి20 సిరీస్ ఆడిన టెస్టు జట్టు సభ్యులు గిల్, బుమ్రా, అక్షర్, సుందర్, కోచ్ గంభీర్ ఆదివారం రాత్రి కోల్కతాకు చేరుకున్నారు. ఇప్పటికే భారత్లో ఉన్న ఇతర సభ్యులు కూడా విడివిడిగా తమ స్వస్థలాల నుంచి వచ్చి జట్టు సభ్యులతో కలుస్తున్నారు.ఈ నేపథ్యంలో సోమవారం ఎలాంటి ప్రాక్టీస్ జరగలేదు. నేటినుంచి పూర్తి స్థాయి జట్టు సాధన చేస్తుంది. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టులో కీలక సభ్యులైన రబాడ, యాన్సెన్ తదితరులు పాకిస్తాన్తో వన్డే సిరీస్ అనంతరం ఆదివారం రాత్రే కోల్కతాలో అడుగు పెట్టగా, ఇప్పటికే ‘ఎ’ టీమ్ తరఫున మ్యాచ్లు ఆడుతూ బెంగళూరులోనే ఉన్న ఇతర ఆటగాళ్లు కూడా జట్టుతో చేరారు. ఈ బృందంలో కెప్టెన్ తెంబా బవుమా, జుబేర్ హమ్జా, అకెర్మన్ తదితరులు ఉన్నారు. సఫారీ టీమ్ కూడా సోమవారం సాధన చేయలేదు. 2025లో భారత్, దక్షిణాఫ్రికాలకు ఇదే చివరి టెస్టు సిరీస్ కానుంది. ఈ సిరీస్ తర్వాత వచ్చే జూన్లో గానీ (అఫ్గానిస్తాన్తో) భారత్కు టెస్టు మ్యాచ్ లేదు. -
'అతడి రీ ఎంట్రీ తప్పనిసరి.. మూడు ఫార్మాట్లలోనూ ఆడించాలి'
భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ జాతీయ జట్టుకు దాదాపు ఎనిమిది నెలలగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. షమీ దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మాత్రం మొండి చేయి చూపిస్తోంది.ఈ బెంగాల్ స్పీడ్ స్టార్ చివరసారిగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ తరపున ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ సిరీస్తో పాటు ఆసియాకప్, వెస్టిండీస్తో టెస్టులకు షమీని సెలక్టర్లు పక్కన పెట్టారు. కనీసం స్వదేశంలో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్కైనా షమీని ఎంపిక చేస్తారని భావించారు. కానీ మరోసారి అగార్కర్ అండ్ కో షమీకి మొండి చేయి చూపించారు. తను ఫిట్గా ఉన్నప్పటికి కావాలనే ఎంపిక చేయడం లేదని చీఫ్ సెలక్టర్ అగార్కర్ను షమీ పరోక్షంగా విమర్శించాడు. ఈ నేపథ్యంలో షమీకి భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలిచాడు. షమీ భారత జట్టు తరపున తిరిగి అన్ని ఫార్మాట్లలో ఆడాలని తన ఆశిస్తున్నట్లు దాదా తెలిపాడు."మహ్మద్ షమీ చాలా ఫిట్గా ఉన్నాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరుస్తున్నాడు. మూడు రంజీ ట్రోఫీ మ్యాచ్లలో బెంగాల్ను అతడు ఒంటి చేత్తో గెలిపించాడు. అతడి ప్రదర్శలను సెలక్టర్లు చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పటికే షమీతో సెలక్టర్లు మాట్లాడి ఉంటారు.ఫిట్నెస్ గానీ, స్కిల్ విషయంలో గానీ షమీ ఇప్పటికీ అదే స్థాయిలో ఉన్నాడు. కాబట్టి అతడిని టెస్ట్లు, వన్డేలు, టీ20లు అన్నింటిలోనూ భారత్ తరపున కొనసాగించాలి" అని ఓ కార్యక్రమంలో గంగూలీ పేర్కొన్నాడు. కాగా ప్రస్తుత రంజీ సీజన్లో షమీ 91 ఓవర్లు బౌలింగ్ చేసి 15 వికెట్లు సాధించాడు. కాగా భారత్-సౌతాఫ్రికా మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోల్కతా వేదికగా నవంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. -
స్టార్ క్రికెటర్ ఇంటిపై కాల్పులు..
పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ నషీమ్ షా ఇంటి వద్ద కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని మయూర్ ప్రాంతంలో ఉన్న నషీమ్ ఇంటిపై సోమవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇంటి ప్రధాన గేటు, కిటికీలు ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా అక్కడ పార్క్ చేసి ఉన్న కారు కూడా డేమజ్ అయ్యింది. అదృష్టవశాత్తూ ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. నసీమ్ షా ఇంటి ప్రధాన ద్వారంపై బుల్లెట్ గుర్తులు వీడియోలో స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ సంఘటనలో మయార్ పోలీసులు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా నసీమ్ షా ఇంటి వద్ద భద్రతను పెంచారు. కాగా ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ ఇటీవల కాలంలో ఇటువంటి సంఘటనలు తరుచుగా జరుగుతున్నాయి. తహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) వంటి తీవ్రవాద సంస్థల ప్రభావం కూడా ఎక్కువగా పెరిగిందని స్ధానిక మీడియా కథనాలు ప్రచరిస్తోంది.నషీమ్ షా ప్రస్తుతం జాతీయ విధుల్లో బీజీగా ఉన్నాడు. శ్రీలంకతో తొలి వన్డేకు షా సిద్దమవుతున్నాడు. అంతలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.చదవండి: అతడిని అందుకే పక్కనపెట్టాం!.. గంభీర్ తొలి స్పందన ఇదేShots Fired at Naseem Shah’s Residence Amid Cross-Border Infiltration ConcernsUnknown gunmen opened fire on national pacer Naseem Shah’s residence in Lower Dir last night, damaging the gate, windows, and a vehicle. Police arrived quickly, detaining five suspects and registering… pic.twitter.com/N67ee14g5Z— HTN World (@htnworld) November 10, 2025 -
ఒకే రోజు 20 వికెట్లు.. గుజరాత్ ఘన విజయం
రంజీ సీజన్ 2025-26 సీజన్లో గుజరాత్ ఎట్టకేలకు నాలుగో మ్యాచ్లో బోణీ కొట్టింది. గ్రూప్ ‘సి’లో సరీ్వసెస్తో జరిగిన పోరులో గుజరాత్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఒక్క మూడో రోజే మూడు ఇన్నింగ్స్లు జరిగాయి. 20 వికెట్లు కూలాయి. మ్యాచ్ ఫలితం కూడా ఓ రోజు ముందే వచ్చింది. సోమవారం 171/4 ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన గుజరాత్ 85.4 ఓవర్లలో 256 పరుగుల వద్ద ఆలౌటైంది. క్రితం రోజు బ్యాటర్లు క్షితిజ్ పటేల్ (56; 4 ఫోర్లు, 1 సిక్స్), ఉర్విల్ పటేల్ (48; 5 ఫోర్లు, 1 సిక్స్) ఆడినంత వరకే ఇన్నింగ్స్ సాగింది. తర్వాత వాళ్లిద్దరు అవుటయ్యాక మిగతా వికెట్లు కేవలం 20 పరుగుల వ్యవధిలోనే పడ్డాయి. పులకిత్ నారంగ్ 5, అమిత్ శుక్లా 4 వికెట్లు తీశారు. గుజరాత్కు తొలి ఇన్నింగ్స్లో 8 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన సర్వీసెస్ 37.3 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకూలింది. మోహిత్ అహ్లావత్ (56; 5 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే పోరాడాడు. మిగతా బ్యాటర్లెవరూ కనీసం 15 పరుగులను మించి చేయలేకపోయారు. విశాల్ 6, సిద్ధార్థ్ దేశాయ్ 4 వికెట్లు తీశారు. 118 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన గుజరాత్ 21.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసి గెలిచింది. క్షితిజ్ (36 నాటౌట్; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. ఆ 4 వికెట్లు అమిత్ శుక్లాకే దక్కాయి. -
తమిళనాడుపై ఆంధ్ర పైచేయి
సాక్షి, విశాఖపట్నం: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్లో పటిష్టమైన తమిళనాడు జట్టుపై తమ అజేయ రికార్డును ఆంధ్ర జట్టు నిలబెట్టుకుంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా తమిళనాడుతో జరిగిన జరిగిన మ్యాచ్లో ఆంధ్ర జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ సీజన్లో ఆంధ్ర జట్టుకిది వరుసగా రెండో విజయం కావడం విశేషం. రంజీ ట్రోఫీలో ఆంధ్ర, తమిళనాడు జట్లు ఎనిమిదిసార్లు ముఖా ముఖిగా తలపడ్డాయి. నాలుగు మ్యాచ్ల్లో ఆంధ్ర నెగ్గగా... మరో నాలుగు మ్యాచ్లు ‘డ్రా’గా ముగి శాయి. తమిళనాడుతో పోరులో మొదట ఆంధ్ర బౌలర్లు, లక్ష్యఛేదనలో బ్యాటర్లు సత్తా చాటారు. సోమవారం ఆటలో 7 వికెట్లు పడగొట్టిన ఆంధ్ర... బ్యాటింగ్లో 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి మూడే రోజుల్లో మ్యాచ్ను ముగించింది. ఓవర్నైట్ స్కోరు 102/3తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన తమిళనాడు 70.3 ఓవర్లలో 195 పరుగులకే కుప్పకూలింది. సౌరభ్ (4/46), విజయ్ (2/16), పృథీ్వరాజ్ (2/31) తమిళ నాడును దెబ్బ కొట్టారు. తొలి ఇన్నింగ్స్లో 5 పరుగుల ఆధిక్యం ఉన్న తమిళనాడు జట్టు... ఆంధ్ర ముందు 201 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించేందుకు రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆంధ్ర 41.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. అభిõÙక్ రెడ్డి (70; 11 ఫోర్లు), కరణ్ షిండే (51; 8 ఫోర్లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. ఆంధ్ర స్వల్ప వ్యవధిలో 4 వికెట్లను కోల్పోయినా... అశ్విన్ హెబ్బర్ (21 నాటౌట్; 2 ఫోర్లు), సత్యనారాయణ రాజు (20 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) మరో వికెట్ పడకుండా మ్యాచ్ను ముగించారు. ఈ నెల 16 నుంచి జంషెడ్పూర్లో జరిగే తదుపరి మ్యాచ్లో జార్ఖండ్తో ఆంధ్ర ఆడుతుంది. -
‘మన ఫిట్నెస్ ఇంకా మెరుగవ్వాలి’
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఫిట్నెస్ స్థాయి పరంగా చూస్తే భారత జట్టు ఇంకా ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉందని, మన టీమ్ ఈ విషయంలో అత్యుత్తమ స్థాయిని అందుకోలేదని భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. ‘టి20 ప్రపంచకప్లో ఇది చాలా కీలకంగా మారుతుంది. మనం చాలా చురుగ్గా ఉండాలి, ఇదే విషయాన్ని ఆటగాళ్లతో చర్చించాం కూడా. డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లంతా నిజాయితీగా తమ అభిప్రాయాలు చెప్పారు. ఎంత ఫిట్గా మానసికంగా అంతే చురుగ్గా ఉంటాం. ఎందుకంటే తీవ్ర ఒత్తిడి ఉండే మ్యాచ్లో మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండేందుకు ఇది కూడా అవసరం. వరల్డ్ కప్కు ముందు అలాంటి స్థాయిని అందుకునేందుకు మనకు ఇంకా మూడు నెలల సమయం ఉంది’ అని గంభీర్ అన్నాడు. ఆ్రస్టేలియా గడ్డపై టి20 సిరీస్ విజయం పట్ల కోచ్ సంతృప్తి వ్యక్తం చేశాడు. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ తాము కొన్ని కొత్త తరహాలో ప్రణాళికలు రచిస్తే, అవన్నీ సఫలమయ్యాయని గంభీర్ అన్నాడు. పవర్ప్లేలోనే బుమ్రాతో మూడు ఓవర్లు వేయించడం కూడా అలాంటిదేనని అతను చెప్పాడు. ‘తొలి ఆరు ఓవర్లలో మూడు బుమ్రావే కావడం మంచి ప్రణాళిక. ఇది చాలా బాగా పని చేసింది. ఆరంభంలోనే మూడు మంచి ఓవర్లు పడితే ప్రత్యరి్థపై ఒత్తిడి పెరుగుతుంది. ఆ తర్వాత ఎలాగూ స్పిన్నర్లు వస్తారు’ అని కోచ్ విశ్లేషించాడు. బౌలింగ్ విషయంలో మన జట్టుకు కనీసం 7–8 ప్రత్యామ్నాయాలు ఉంటే మంచిదన్నాడు. ‘దూబే, అక్షర్, సుందర్ లాంటి ఆల్రౌండర్లు టీమ్లో ఉండటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. గతంలో ఆరుకు మించి బౌలింగ్ ప్రత్యామ్నాయాలు ఉండకపోయేవి. ఇప్పుడు అంతకు మించి మనకు అవకాశం ఉంటోంది’ అని కోచ్ చెప్పాడు. మరో వైపు వ్యక్తిగత ప్రదర్శనలకంటే జట్టు విజయాలే తనకు ముఖ్యమని కోచ్ పునరుద్ఘాటించాడు. ‘మ్యాచ్ ఓడాక మన జట్టులో బాగా ఆడిన వారిని ప్రశంసించడంలో అర్థమే లేదు. నేను వ్యక్తిగత రికార్డులకంటే టీమ్ గెలవడం గురించే ఆలోచిస్తాను. ఎవరైనా బాగా ఆడితే మంచిదే కానీ జట్టు గెలిస్తేనే నాకు సంతోషం. అందుకే వన్డే సిరీస్లో ఓటమి నిరాశకు గురి చేసింది’ అని గంభీర్ అన్నాడు. -
ప్రపంచకప్ విజేతకు చారిత్రక గౌరవం
2025 మహిళల వన్డే ప్రపంచకప్ విజేత, ఛాంపియన్ జట్టు టీమిండియాలో కీలక సభ్యురాలైన రిచా ఘోష్కు (Richa Ghosh) చారిత్రక గౌరవం దక్కింది. రిచా పేరిట ఆమె సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్లో క్రికెట్ స్టేడియం నిర్మితం కానుంది. ఈ విషయాన్ని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా ప్రకటించారు.ఇవాళ (నవంబర్ 10) జరిగిన రిచా సన్మాన కార్యక్రమం సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. రిచా జన్మస్థలమైన సిలిగురి పట్టణానికి క్రికెట్ మైదానాన్ని కేటాయిస్తూ.. దానికి రిచా ఘోష్ పేరుతో నామకరణం చేయనున్నట్లు ప్రకటించారు. రిచా సన్మాన కార్యక్రమంలో బెంగాల్ క్రికెట్ దిగ్గజాలు సౌరవ్ గంగూలీ, ఝులన్ గోస్వామి పాల్గొన్నారు. రిచా పశ్చిమ బెంగాల్ నుంచి సీనియర్ ప్రపంచకప్ గెలిచిన తొలి క్రికెటర్గా చరిత్ర సృష్టించింది. ఫలితంగా ఆమెకు బెంగాల్ ప్రభుత్వం నుంచి భారీ నజరానాలు అందాయి. ఫైనల్లో సౌతాఫ్రికాపై చేసిన ప్రతి పరుగుకు (34 పరుగులు) రూ. లక్ష చొప్పున రూ. 34 లక్షల చెక్కును రిచాకు అందించారు.అంతకుముందు రోజే ప్రభుత్వం రిచాకు బంగ భూషణ్ బిరుదుతో పాటు రాష్ట్ర పోలీసు శాఖలో డీఎస్పీ ఉద్యోగాన్ని కేటాయించింది. పశ్చిమ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కూడా రిచాకు భారీ తాయిలాలు ప్రకటించింది. గోల్డెన్ బ్యాట్, గోల్డెన్ బాల్తో పాటు విలువైన బంగారు గొలుసును బహుకరించింది.కాగా, రిచా ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై అమూల్యమైన ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 24 బంతుల్లో 34 పరుగులు చేసి భారత్ 298 పరుగుల భారీ స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించింది. అంతకుముందు ఏడు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లోనూ రిచా మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఛేదనలో కీలక సమయంలో 16 బంతుల్లో 26 పరుగులు చేసి భారత విజయంలో తనవంతు పాత్ర పోషించింది.లీగ్ దశలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లోనూ రిచా చెలరేగింది. 77 బంతుల్లోనే 94 పరుగులు చేసింది. ప్రపంచకప్ మొత్తంలో రిచా మెరుపు ఇలాగే కొనసాగాయి. 8 ఇన్నింగ్స్ల్లో 133.52 స్ట్రయిక్రేట్తో 235 పరుగులు చేసింది. కాగా, నవంబర్ 2న జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో భారత్ సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. వికెట్ కీపర్-బ్యాటర్ అయిన రిచా ప్రపంచకప్లో మొత్తం 12 సిక్సర్లు బాది, టోర్నీ టాప్ టాప్ హిట్టర్గా నిలిచింది. -
అతడిని అందుకే పక్కనపెట్టాం!.. గంభీర్ తొలి స్పందన
ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా.. టీ20 సిరీస్లో గెలిచి బదులు తీర్చుకుంది. కంగారూ గడ్డపై ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-1తో గెలిచి సత్తా చాటింది. ఇక వర్షం కారణంగా తొలి, ఐదో టీ20 రద్దైన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో తొలి రెండు మ్యాచ్లకు టీమిండియా స్టార్ అర్ష్దీప్ సింగ్ (Arshdeep Singh)ను పక్కనపెట్టడం చర్చనీయాంశమైంది. పొట్టి ఫార్మాట్లో భారత్ తరఫున వందకు పైగా వికెట్లు తీసి హయ్యస్ట్ వికెట్ టేకర్గా కొనసాగుతున్న అర్ష్ను కాదని.. హర్షిత్ రాణా (Harshit Rana)ను ఆడించడం విమర్శలకు దారితీసింది.అందుకే ఆడించారా?హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)కు ప్రియ శిష్యుడైన కారణంగానే హర్షిత్కు తుదిజట్టులో చోటిచ్చి.. అర్ష్ను బలి చేస్తున్నారనే ట్రోల్స్ వచ్చాయి. అయితే, ఎట్టకేలకు మూడో టీ20 నుంచి హర్షిత్ను తప్పించి.. అర్ష్దీప్ను ఆడించగా.. అతడు సత్తా చాటాడు.మూడో టీ20లో హర్షిత్ను బెంచ్కు పరిమితం చేసి అర్ష్దీప్ను తీసుకురాగా.. అతడు మూడు వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. నాలుగో టీ20లోనూ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ నేపథ్యంలో గంభీర్ తాజాగా ఈ విషయాలపై స్పందించాడు.అన్నింటికంటే కష్టమైన పనిబీసీసీఐ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతుండగా.. కీలక ఆటగాళ్లను బెంచ్కే పరిమితం చేయాల్సి వచ్చినపుడు మీరెలా హ్యాండిల్ చేస్తారు అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘కోచ్గా నాకిదే అన్నింటికంటే కష్టమైన పని.నాణ్యమైన ఆటగాళ్లను బెంచ్ మీద కూర్చోబెట్టాల్సి వచ్చినపుడు వారితో ఆ విషయం చెప్పడం కఠినంగానే ఉంటుంది. ప్రతి ఒక్కరు తుదిజట్టులో ఆడేందుకు అర్హులే. కానీ కూర్పు దృష్ట్యా మేము మాకు కావాల్సిన పదకొండు మందినే ఎంచుకుంటాం.మ్యాచ్ పరిస్థితికి తగ్గట్లుగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాం. అయితే, ఓ ఆటగాడితో .. ‘నీకు ఈ మ్యాచ్లో అవకాశం లేదు’ అని చెప్పడం కష్టం. అయితే, కూడా అందుకు గల కారణాన్ని స్పష్టంగా వివరించడం వల్ల పెద్దగా సమస్యలు రావు.అతడిని అందుకే పక్కనపెట్టాంఆటగాళ్లు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు. కోచ్, ప్లేయర్.. ఇద్దరి మధ్య ఇలాంటి సంభాషణ ఇద్దరికీ కష్టంగానే ఉంటుంది. కానీ ఒక్కోసారి కఠినంగా ఉండక తప్పదు. అయితే, కోచ్ చెప్పే విషయంలో నిజం, నిజాయితీ, ముక్కుసూటితనం ఉందని ఆటగాడు తెలుసుకుంటే.. ఇక అతడికి ఎలాంటి అభ్యంతరం ఉండదు.చాలా మంది ప్లేయర్లు ఇలాంటి సమయంలో పరిణతితో వ్యవహరిస్తారు. ఏదేమైనా కమ్యూనికేషన్ అత్యంత ముఖ్యం. బయట చాలా మంది ఇష్టారీతిన మాట్లాడుతూ.. వివాదాలు సృష్టించేందుకు థియరీలు కనిపెడుతుంటారు.అయితే, జట్టులో సమన్వయం ఉన్నపుడు ఇలాంటి వాటి వల్ల పెద్దగా ప్రభావం పడదు. డ్రెసింగ్రూమ్లో పారదర్శకత, నిజాయితీ అవసరం. ప్రస్తుతం మేము అదే చేస్తున్నాం’’ అని గంభీర్ విమర్శలను కొట్టిపారేశాడు.చదవండి: కోచ్గా అలాంటి పని ఎప్పటికీ చేయను: కుండబద్దలు కొట్టిన గంభీర్ -
పాకిస్తాన్ ట్రై సిరీస్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్
నవంబర్ 17 నుంచి పాకిస్తాన్లో జరిగే ముక్కోణపు టీ20 సిరీస్ నుంచి జింబాబ్వే స్టార్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ వైదొలిగాడు. వెన్ను గాయం కారణంగా ముజరబానీ ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ముజరబానీ స్థానాన్ని న్యూమన్ న్యామ్హురితో భర్తీ చేస్తున్నట్లు జింబాబ్వే క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ టోర్నీలో జింబాబ్వే, ఆతిథ్య పాక్తో పాటు శ్రీలంక జట్టు పాల్గొంటుంది.ఈ టోర్నీలో జింబాబ్వే జట్టుకు సికందర్ రజా నాయకత్వం వహిస్తున్నాడు. టోర్నీలో ఓపెనర్లో పాకిస్తాన్, జింబాబ్వే తలపడతాయి. రావల్పిండి వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. నవంబర్ 19న జరిగే రెండో మ్యాచ్లో శ్రీలంక, జింబాబ్వే పోటీపడతాయి. ఈ మ్యాచ్కు కూడా రావాల్పిండేనే ఆతిథ్యమివ్వనుంది.అనంతరం నవంబర్ 22వ తేదీ పాకిస్తాన్-శ్రీలంక, 23న జింబాబ్వే-పాకిస్తాన్, 27న పాకిస్తాన్-శ్రీలంక పోటీపడతాయి. 29న లాహోర్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.పాకిస్తాన్ ట్రై సిరీస్ కోసం జింబాబ్వే జట్టు: సికందర్ రజా (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, గ్రేమ్ క్రీమర్, బ్రాడ్లీ ఎవాన్స్, క్లైవ్ మదాండే, టినోటెండా మపోసా, వెల్లింగ్టన్ మసకద్జా, తడివానాషే మారుమణి, టోనీ మున్యోంగా, తషింగా ముసెకివా, డియాన్ మేయర్స్, రిచర్డ్ నగరవ, న్యూమన్ న్యామ్హురి, బ్రెండన్ టేలర్చదవండి: వర్షార్పణం.. ఆధిక్యంలో న్యూజిలాండ్ -
నాకసలు ఇజ్జత్ ఉందా?.. ఏడుపు వచ్చింది: పాక్ క్రికెటర్
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ (Moin Khan) కుమారుడిగా ప్రేక్షకులకు పరిచయమైన క్రికెటర్ ఆజం ఖాన్ (Azam Khan). పాక్ తరఫున 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఆజం.. 14 మ్యాచ్లు ఆడి కేవలం 88 పరుగులే చేశాడు.ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024 టోర్నమెంట్ ముగిసిన తర్వాత.. తిరిగి జాతీయ జట్టులో ఆజం ఖాన్ స్థానం సంపాదించుకోలేకపోయాడు. చెత్త ప్రదర్శన కారణంగా జట్టులో అతడికి చోటు కరువైంది. ఆడిన పద్నాలుగు మ్యాచ్లలో కలిపి కనీసం వంద పరుగులు కూడా చేయకపోవడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.మీమ్ మెటీరియల్ అయ్యేవాడుఇందుకు తోడు ఆజం ఖాన్ భారీ కాయంపై కూడా విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. కనీస ఫిట్నెస్ లేని ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఫీల్డర్గానూ ఓ ఫెయిల్యూర్గా మిగిలిపోయాడు. పదే పదే క్యాచ్లు డ్రాప్ చేస్తూ మీమ్ మెటీరియల్ అయ్యేవాడు.ఈ విషయాల గురించి ఆజం ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. 2024లో ఇంగ్లండ్తో మ్యాచ్ సందర్భంగా తాను అవహేళనకు గురయ్యాయని.. తన జీవితంలో అతిగా బాధపడ్డ సందర్భం అదేనంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.అభ్యంతరకర భాషలో దూషించారు‘‘ఆరోజు మార్క్ వుడ్.. తొలుత నాకు బౌన్సర్ సంధించాడు. నేను దానిని వదిలేశాను. పాకిస్తాన్లో కూడా గంటకు నూటా యాభై కిలో మీటర్ల వేగంతో బంతులు సంధిస్తారు కాబట్టి.. నాకు అదేమీ కొత్తగా అనిపించలేదు.కానీ ఆ తర్వాత కూడా మార్క్ వుడ్ మళ్లీ బౌన్సర్ వేశాడు. నేను దానినీ ఎదుర్కోలేకపోయాను. అపుడు నా జీవితం స్తంభించిపోయినట్లుగా అనిపించింది. అసలు నాకేం అవుతుందో కూడా అర్థం కాలేదు.నా వేలికి గాయమైన తర్వాత.. నా పని అయిపోయిందని గ్రహించాను. అంతలోనే ఓవల్ స్టేడియంలోని ప్రేక్షకులు నన్ను అభ్యంతరకర భాషలో దూషించడం మొదలుపెట్టారు.నాకసలు ఇజ్జత్ ఉందా? అక్కడ ఒక పాకిస్తానీ రిపోర్టర్.. తాగి ఉన్న ఓ ఇంగ్లిష్ ప్రేక్షకుడిని.. ‘మీ అభిమాన పాకిస్తాన్ ఆటగాడు ఎవరు?’ అని అడిగారు. ఇందుకు బదులుగా అతడు.. ‘ఆజం ఖాన్.. అతడు బ్యాటింగ్ చేయలేడు. ఫీల్డింగ్ చేయలేడు’ అంటూ నాపై సెటైర్లు వేశారు.అది వినగానే నా హృదయం ముక్కలైంది. నాకసలు ఇజ్జత్ (గౌరవం) ఉందా? నా గురించి జనాలు ఇలా అనుకుంటున్నారా? అని బాధలో కూరుకుపోయా. సులువైన క్యాచ్లను కూడా జారవిడిచా.ఏడుపు తన్నుకొచ్చి కన్నీళ్లు కారాయి. అసలు నాకే ఇలా ఎందుకు అవుతోంది అనుకుంటూ ఏడ్చేశా’’ అని ఆజం ఖాన్ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెబుతూ ఉద్వేగానికి గురయ్యాడు. కాగా నాటి మ్యాచ్లో ఆజం ఖాన్ డకౌట్ కాగా.. పాకిస్తాన్ 19.5 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌట్ అయింది.లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 15.3 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. పాకిస్తాన్పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో డకౌట్ బ్యాటర్ ఆజం ఖాన్పై మరోసారి విమర్శల వర్షం కురిసింది.చదవండి: వన్డే ఆల్టైమ్ జట్టు.. టీమిండియా నుంచి ముగ్గురు.. రోహిత్కు దక్కని చోటు -
వర్షార్పణం.. ఆధిక్యంలో న్యూజిలాండ్
న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 10) జరగాల్సిన నాలుగో టీ20 వర్షార్పణమైంది. నెల్సన్లోని సాక్స్ట్న్ వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉండింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. 6.3 ఓవర్ల తర్వాత మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది.వరుణుడు ఎంతకీ శాంతించకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. ఆ సమయానికి విండీస్ స్కోర్ వికెట్ నష్టానికి 38 పరుగులుగా ఉంది. అలిక్ అథనాజ్ (21) ఔట్ కాగా.. ఆమిర్ జాంగూ (12), కెప్టెన్ షాయ్ హోప్ (3) క్రీజ్లో ఉన్నారు. అథనాజ్ వికెట్ నీషమ్కు దక్కింది.ఆధిక్యంలో న్యూజిలాండ్ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో న్యూజిలాండ్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. మొదటి మ్యాచ్లో విండీస్ గెలువగా.. న్యూజిలాండ్ వరుసగా రెండు, మూడు మ్యాచ్ల్లో గెలిచింది. సిరీస్ ఫలితాన్ని తేల్చే ఐదో టీ20 డునెడిన్ వేదికగా నవంబర్ 13న జరుగనుంది.కాగా, ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్తో పాటు 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్, 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు న్యూజిలాండ్లో పర్యటిస్తుంది. టీ20 సిరీస్ తర్వాత వన్డే సిరీస్, ఆతర్వాత టెస్ట్ సిరీస్ జరుగుతాయి. నవంబర్ 16, 19, 22 తేదీల్లో మూడు వన్డేలు జరుగనుండగా.. డిసెంబర్ 2, 10, 18 తేదీల్లో టెస్ట్ మ్యాచ్లు మొదలవుతాయి. చదవండి: ఐదేసిన ములానీ.. మావి ఆల్రౌండ్ షో -
ఐదేసిన ములానీ.. మావి ఆల్రౌండ్ షో
రంజీ ట్రోఫీలో ఇవాళ (నవంబర్ 10) ఏడు మ్యాచ్ల్లో ఫలితాలు వచ్చాయి. సౌరభ్ కుమార్ 4 వికెట్ల ఘనత.. అభిషేక్ రెడ్డి (70), కరణ్ షిండే (51) అర్ద శతకాలతో రాణించడంతో తమిళనాడుపై ఆంధ్రప్రదేశ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. మయాంక్ వర్మ సెంచరీ (121 నాటౌట్), ఆదిత్య సర్వటే 6, రవికిరణ్ 3 వికెట్లతో రాణించడంతో పుదుచ్చేరిపై ఛత్తీస్ఘడ్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.ముషీర్ ఖాన్ (112), సిద్దేశ్ లాడ్ (127) శతకాలు.. షమ్స్ ములానీ 7 వికెట్ల ప్రదర్శనతో చెలరేగడంతో హిమాచల్ ప్రదేశ్పై ముంబై ఇన్నింగ్స్ 120 పరుగుల తేడాతో గెలుపొందింది.శివమ్ మావి (101 నాటౌట్, 5 వికెట్లు) ఆల్రౌండ్ షోతో చెలరేగడంతో నాగాలాండ్ను ఉత్తర్ప్రదేశ్ ఇన్నింగ్స్ 265 పరుగుల తేడాతో చిత్తు చేసింది.జగదీశ్ సుచిత్ (11 వికెట్లు, హాఫ్ సెంచరీ) ఆల్రౌండ్ షోతో ఇరగదీయడంతో ఉత్తరాఖండ్పై హర్యానా ఇన్నింగ్స్ 28 పరుగుల తేడాతో గెలుపొందింది.సిద్దార్థ్ దేశాయ్ 10 వికెట్లు, విశాల్ జైస్వాల్ 8 వికెట్లు తీయడంతో సర్వీసెస్పై గుజరాత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఉదయ్ సహరన్ అజేయ సెంచరీతో (117) చెలరేగడంతో ఛండీఘడ్పై పంజాబ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఇవాల్టి బ్యాటింగ్ హైలైట్స్ఒడిషాతో జరుగుతున్న మ్యాచ్లో విదర్భ ఆటగాడు ధ్రువ్ షోరే రెండో ఇన్నింగ్స్లోనూ సెంచరీ చేశాడు. మరో విదర్భ ఆటగాడు అమన్ మోఖడే కూడా సెంచరీతో సత్తా చాటాడు.కేరళతో జరుగుతున్న మ్యాచ్లో సౌరాష్ట్ర ఆటగాడు చిరాగ్ జానీ (152) భారీ సెంచరీతో కదంతొక్కాడు.జార్ఖండ్తో జరుగుతున్న మ్యాచ్లో బరోడా ఆటగాడు శాశ్వత్ రావత్ సెంచరీతో సత్తా చాటాడు.బౌలింగ్ హైలైట్స్కర్ణాటక బౌలర్లు శ్రేయాస్ గోపాల్ (4), మోహ్సిన్ ఖాన్ (3) రాణించి మహారాష్ట్రను 300 పరుగులకే కట్టడి.మధ్యప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో గోవా బౌలర్ వాసుకి కౌశిక్ 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో జమ్మూ కశ్మీర్ బౌలర్ వంశ్రాజ్ శర్మ 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. చదవండి: నిప్పులు చెరిగిన స్టార్క్ -
అలాంటి పని అస్సలు చేయను: కుండబద్దలు కొట్టిన గంభీర్
టీమిండియా హెడ్కోచ్, భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ (Gautam Gambhir)కు ముక్కుసూటిగా మాట్లాడటం అలవాటు. దీనికి తోడు దూకుడు స్వభావం కారణంగా ఎన్నోసార్లు విమర్శలు మూటగట్టుకున్నాడు గౌతీ. అయినా.. కూడా తగ్గేదేలే అంటూ అలాగే ముందుకు సాగుతున్నాడు. అతడి తాజా వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.ఇటీవల గౌతీ మార్గదర్శనంలో ఆస్ట్రేలియా పర్యటన (IND vs AUS)లో వన్డే సిరీస్ను టీమిండియా 1-2తో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్కు ముందు వన్డే కెప్టెన్గా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న యాజమాన్యం.. టెస్టు సారథి శుబ్మన్ గిల్ (Shubman Gill)కే వన్డే పగ్గాలూ అప్పగించింది.చేదు అనుభవం ఇక వన్డే కెప్టెన్గా ఆసీస్ రూపంలో తొలి ప్రయత్నంలోనే కఠిన సవాలు ఎదుర్కొన్న గిల్.. ఇటు బ్యాటర్గా.. అటు కెప్టెన్గా చేదు అనుభవం చవిచూశాడు. తొలి రెండు వన్డేల్లో ఓడి భారత్ ముందుగానే సిరీస్ కోల్పోగా.. ఆఖరిదైన నామమాత్రపు మూడో వన్డేలో మాత్రం గెలిచి క్లీన్స్వీప్ నుంచి తప్పించుకుంది.‘రో-కో’దే కీలక పాత్రఈ విజయంలో రీఎంట్రీ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిదే కీలక పాత్ర. రోహిత్ అజేయ శతకం (121)తో దుమ్ములేపగా.. కోహ్లి 74 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. వీరిద్దరి విజృంభణ కారణంగా ఆసీస్ విధించిన 236 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో ఓటమి పట్ల గౌతం గంభీర్ తాజాగా స్పందించాడు. బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ.. సిరీస్ ఓడిపోవడం ఎంతమాత్రం ఉపేక్షించదగింది కాదని.. తాను అందుకే మూడో వన్డే గెలుపు సెలబ్రేట్ చేసుకోలేదంటూ కుండబద్దలు కొట్టాడు.వాటిని పట్టించుకోను‘‘వ్యక్తిగత ప్రదర్శనలను నేనెప్పుడూ పట్టించుకోను. అయితే, వారి ప్రదర్శన పట్ల సంతోషంగా ఉంటాను. ఏదేమైనా అంతిమంగా మనం సిరీస్ ఓడిపోయాం.అన్నింటికంటే అదే అతి ముఖ్యమైన విషయం. కోచ్గా నేను ఇలాంటి వాటిని ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకోను. ఓ ఆటగాడిగా.. వ్యక్తిగత ప్రదర్శనలను అభినందిస్తా. కానీ కోచ్గా ఇలాంటివి జీర్ణించుకోలేను.కోచ్గా అలాంటి పని ఎప్పటికీ చేయనుదేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నపుడు ఆటగాళ్లైనా, కోచ్ అయినా ఇలాంటి ఘోర ఓటమి తర్వాత వచ్చిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం సరికాదు కూడా!.. ఏదేమైనా మేము ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్ గెలిచాం. ఇదొక భిన్నమైన ఫార్మాట్. అయితే, ఈ సిరీస్లో సానుకూల అంశాలతో పాటు నేర్చుకోవాల్సిన గుణపాఠాలు కూడా ఉన్నాయి’’ అని గంభీర్ తన మనసులోని భావాలను కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పాడు.కాగా ఆసీస్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో.. మొదటి. ఆఖరి మ్యాచ్లు వర్షం వల్ల రద్దు అయ్యాయి. అయితే, రెండో టీ20లో ఓడిన సూర్యకుమార్ సేన వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది.చదవండి: వన్డే ఆల్టైమ్ జట్టు.. టీమిండియా నుంచి ముగ్గురు.. రోహిత్కు దక్కని చోటు -
నిప్పులు చెరిగిన స్టార్క్
యాషెస్ సిరీస్కు ముందు ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) ప్రత్యర్ధి ఇంగ్లండ్కు స్ట్రాంగ్ వార్నింగ్ మెసేజ్ పంపాడు. యాషెస్ సన్నాహకాల్లో భాగంగా షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ ఆడుతున్న అతడు (న్యూ సౌత్ వేట్స్).. విక్టోరియాపై 4 వికెట్ల ప్రదర్శనలతో చెలరేగాడు. తొలి రోజు ఆటలో ఇది జరిగింది.ఆట ప్రారంభం నుంచే నిప్పులు చెరిగిన స్టార్క్.. ఓపెనర్లు క్యాంప్బెల్ కెల్లావే (51), హ్యారీ డిక్సన్ (20) సహా కీలకమైన ఒలివర్ పీక్ (0), సామ్ హార్పర్ (54) వికెట్లు తీశాడు. స్టార్క్తో పాటు నాథన్ లియోన్ (22-1-65-2), సీన్ అబాట్ (18-1-70-1) కూడా రాణించడంతో న్యూ సౌత్ వేల్స్ తొలి రోజు ఆటలో 7 వికెట్లు తీసింది.ఆట ముగిసే సమయానికి విక్టోరియా 340 పరుగులు చేసింది. కెప్టెన్ విల్ సదర్ల్యాండ్ (36), సామ్ ఇలియట్ (4) క్రీజ్లో ఉన్నారు. పీటర్ హ్యాండ్స్కోంబ్ (104) సెంచరీ సాధించి, విక్టోరియా ఇన్నింగ్స్కు జీవం పోశాడు. న్యూ సౌత్ వేల్స్కే ఆడుతున్న మరో ఆసీస్ స్పీడ్స్టర్ జోష్ హాజిల్వుడ్ తొలి రోజు వికెట్ తీయలేకపోయాడు. హాజిల్వుడ్ ప్రత్యర్ది బ్యాటర్లను ఇబ్బంది పెట్టినా వికెట్ లేకుండా మిగిలాడు.షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో స్టార్క్, హాజిల్వుడ్, నాథన్ లియోన్ సహా ఆసీస్ జట్టు సభ్యులంతా పాల్గొంటున్నారు.ఇవాళే ప్రారంభమైన మరో మ్యాచ్లో సౌత్ ఆస్ట్రేలియా, టస్మానియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టస్మానియా.. బ్రెండన్ డాగ్గెట్ (19.2-4-66-5), లియామ్ స్కాట్ (18-5-46-3), మెక్ ఆండ్రూ (16-2-54-1), థార్న్టన్ (10-2-31-1) ధాటికి 209 పరుగులకే ఆలౌటైంది. టస్మానియా ఇన్నింగ్స్లో కెప్టెన్ సిల్క్ (64) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. యాషెస్ తొలి టెస్ట్ జట్టులో సభ్యుడైన బ్యూ వెబ్స్టర్ 13 పరుగులకే ఔటై నిరాశపరిచాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. మెక్స్వీని (2), జేసన్ సంఘా (12), ట్రవిస్ హెడ్ (9) ఔట్ కాగా.. హెన్రీ హంట్ (34), అలెక్స్ క్యారీ (25) క్రీజ్లో ఉన్నారు. చదవండి: బీసీసీఐ చారిత్రక నిర్ణయం..! -
రాజస్తాన్ రాయల్స్ కొత్త కెప్టెన్గా అతడే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్తో టీమిండియా స్టార్ సంజూ శాంసన్ (Sanju Samson) బంధం ముగిసినట్లు తెలుస్తోంది. పదకొండు సీజన్లుగా రాజస్తాన్ జట్టుతో కొనసాగిన ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్.. కెప్టెన్గానూ సేవలు అందించాడు.ఐపీఎల్లో మొట్టమొదటి విజేత అయిన రాజస్తాన్ను.. పద్నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తన సారథ్యంలో రెండోసారి ఫైనల్ (2022)కు చేర్చాడు సంజూ. అయితే దురదృష్టవశాత్తూ గుజరాత్ టైటాన్స్తో ఫైనల్లో ఓడిపోవడంతో రాజస్తాన్తో పాటు కెప్టెన్గా కప్పు గెలవాలన్న సంజూ ఆశలకు గండిపడింది.యాజమాన్యంతో విభేదాలుకాగా గత కొంతకాలంగా సంజూకు.. రాజస్తాన్ జట్టు యాజమాన్యంతో విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2026 వేలానికి ముందే ట్రేడింగ్ ద్వారా జట్టు మారేందుకు సంజూ నిశ్చియించుకున్నాడనే ప్రచారం తాజాగా జోరందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) సంజూను రాజస్తాన్ నుంచి ట్రేడింగ్ (స్వాప్ డీల్) ద్వారా దక్కించుకోవడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.రవీంద్ర జడేజా (Ravindra Jadeja)ను రాజస్తాన్కు ఇచ్చి.. అందుకు బదులుగా సంజూను సీఎస్కే దక్కించుకోనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే.. రాజస్తాన్ జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరనే చర్చ మొదలైంది. రియాన్ పరాగ్ కాదు!కాగా సంజూ గైర్హాజరీలో అస్సాం ఆటగాడు రియాన్ పరాగ్ జట్టును ముందుకు నడిపించాడు. ఐపీఎల్-2025లో సంజూ ఫిట్నెస్ సమస్యల వల్ల కెప్టెన్సీని దూరంగా ఉండగా.. పరాగ్ సారథిగా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు.ఈసారి రాజస్తాన్ మరీ దారుణంగా పద్నాలుగింట కేవలం నాలుగు మాత్రమే గెలిచి తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో పరాగ్కు కెప్టెన్సీ ఇవ్వకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతుండగా... టీమిండియా నయా సంచలనం ధ్రువ్ జురెల్ పేరు తెర మీదకు వచ్చింది.కెప్టెన్సీ రేసులో ఇద్దరురూ. 20 లక్షల కనీస ధరతో రాజస్తాన్ క్యాంపులోకి వచ్చిన జురెల్ అనతికాలంలోనే.. జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఈ క్రమంలోనే అతడిని ఫ్రాంఛైజీ రూ. 14 కోట్ల భారీ మొత్తానికి గతేడాది రిటైన్ చేసుకుంది. గత కొంతకాలంగా అతడు సూపర్ఫామ్లో ఉన్నాడు. టీమిండియాలోనూ కీలక సభ్యుడిగా మారాడు.అంతేకాదు.. అనధికారిక టెస్టు సిరీస్లో భారత్- ‘ఎ’ జట్టు కెప్టెన్గా పనిచేసిన అనుభవం కూడా జురెల్కు ఉంది. అదే విధంగా.. అండర్-19 స్థాయిలో 2020 వరల్డ్కప్లో భారత జట్టు వైస్ కెప్టెన్గానూ జురెల్ సేవలు అందించాడు. ఇక యూపీ టీ20 లీగ్లో గోరఖ్పూర్ లయన్స్ జట్టుకు సారథి కూడా జురెలే!ఈ నేపథ్యంలో పరాగ్ను కాదని.. మేనేజ్మెంట్ జురెల్ వైపే మొగ్గుచూపుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే, మరికొందరు విశ్లేషకులు మాత్రం టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్కే రాజస్తాన్ పగ్గాలు అప్పగిస్తారనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.కాగా 2020లో రాజస్తాన్ తరఫున అరంగేట్రం చేసిన జైస్వాల్.. ఇప్పటికి 66 మ్యాచ్లలో కలిపి 2166 పరుగులు సాధించాడు. ఈ లెఫ్టాండర్ ఖాతాలో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. అయితే, 23 ఏళ్ల జైసూకు ఏ స్థాయిలోనూ కెప్టెన్గా పనిచేసిన అనుభవం మాత్రం లేదు. అయితే, అతడి అవకాశాలను మాత్రం కొట్టిపడేయలేము.రాయల్స్ కొత్త కెప్టెన్గా అతడే!రాజస్తాన్ రాయల్స్ కొత్త హెడ్కోచ్ కుమార్ సంగక్కర.. జురెల్తో పాటు జైస్వాల్ కెప్టెన్సీ రేసులో ఉన్నాడని చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొనడం గమనార్హం. అయితే, ఇంపాక్ట్ రూల్ ప్రకారం ఓపెనర్గా జైసూకు ప్రత్యామ్నాయం ఉంటుంది. కానీ వికెట్ కీపర్గా 24 ఏళ్ల జురెల్ కొనసాగుతాడు! కాబట్టి ప్లేయింగ్ ఎలెవన్లో తప్పకుండా ఉంటాడు. అందుకే అతడికే కెప్టెన్సీ చేపట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.చదవండి: ‘ఆడమని బతిమిలాడినా పట్టించుకోలేదు... సెలక్టర్లు అడిగినా రాలేదు’ -
బీసీసీఐ చారిత్రక నిర్ణయం..!
మహిళల సీనియర్ క్రికెట్ జట్టు విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలిసారి ఓ విదేశీ వ్యక్తిని టీమిండియా స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్గా (Strength And Conditioning Coach) నియమించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం బంగ్లాదేశ్ పురుషుల జట్టుకు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్గా వ్యవహరిస్తున్న నాథన్ కైలీతో (Nathan Keilty) బీసీసీఐ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అన్ని ఫార్మాలిటీస్ పూర్తై కైలీ భారత మహిళా క్రికెట్ జట్టుకు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్గా ఎంపికైతే చరిత్ర అవుతుంది. భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్రలో తొలిసారి ఓ విదేశీ వ్యక్తి స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్గా ఎంపికైనట్లవుతుంది. ఇప్పటివరకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి చెందిన వారు మాత్రమే మహిళల జట్టుకు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్లుగా పనిచేశారు.ప్రస్తుతం భారత మహిళల జట్టుకు అల్ హర్షా స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్గా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో ఆయన అద్భుతంగా పనిచేశారు. కానీ త్వరలో అతనికి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. హర్షా స్థానాన్ని కైలీ భర్తీ చేస్తాడని బీసీసీఐకి చెందిన ఓ కీలక వ్యక్తి క్లూ ఇచ్చాడు.కాగా, ఇటీవలికాలంలో క్రికెట్ జట్ల సక్సెస్లో స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ల పాత్ర క్రియాశీలకంగా మారింది. ప్లేయర్లలో శారీరక సామర్థ్యం, ఫిట్నెస్, గాయాల నివారణ, మానసిక స్థైర్యం వంటి అంశాలను వీరు పర్యవేక్షిస్తారు. జట్టులో ప్రతి ప్లేయర్కు వీరు వేర్వురుగా ప్రణాళికలు రూపొందిస్తుంటారు. దేశీయ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ల పోలిస్తే విదేశీ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్లకు పని అనుభవం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరి సేవల కోసం దాదాపుగా అన్ని జట్లు ఎగబడుతుంటాయి. భారత పురుషుల జట్టు ఇటీవలే దక్షిణాఫ్రికాకు చెందిన అడ్రియన్ లె రూక్స్ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ నియమించుకుంది. చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్కు బెదిరింపులు -
వన్డే ఆల్టైమ్ జట్టు.. రోహిత్కు దక్కని చోటు
సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ హషీం ఆమ్లా (Hashim Amla) వన్డేల్లో తన ఆల్టైమ్ ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించాడు. ఈ జట్టులో టీమిండియా నుంచి ముగ్గురికి స్థానం కల్పించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. లెజెండరీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ను మాత్రం విస్మరించాడు.అంతర్జాతీయ కెరీర్లో సౌతాఫ్రికా తరఫున 124 టెస్టులు, 181 వన్డేలు, 44 టీ20 మ్యాచ్లు ఆడిన హషీం ఆమ్లా.. టెస్టుల్లో 9282, వన్డేల్లో 8113, టీ20లలో 1277 పరుగులు సాధించాడు. ఇక 2023 జనవరిలో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలిగాడు ఆమ్లా. తాజాగా శుభంకర్ మిశ్రా పాడ్కాస్ట్లో పాల్గొన్న ఈ దిగ్గజ బ్యాటర్.. తన ఆల్టైమ్ వన్డే జట్టును ఎంచుకున్నాడు.ఓపెనర్లుగా వారేఈ జట్టుకు ఓపెనర్లుగా టీమిండియా లెజెండ్ సచిన్ టెండుల్కర్, ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడం గిల్క్రిస్ట్లను ఆమ్లా ఎంపిక చేసుకున్నాడు. ఇక మూడో స్థానంలో భారత మరో బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli)కి స్థానమిచ్చాడు. వన్డే ఫార్మాట్లో 51 శతకాలతో ప్రపంచ రికార్డు సాధించినందుకు తాను కోహ్లికి ఓటు వేస్తున్నట్లు ఆమ్లా ఈ సందర్భంగా తెలిపాడు.ఏడో స్థానంలో ధోనిఇక నాలుగు, ఐదు స్థానాలకు వెస్టిండీస్ లెజెండ్ బ్రియన్ లారా, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ను ఆమ్లా ఎంపిక చేశాడు. ఆరో స్థానంలో దీర్ఘకాలం తనకు సహచర క్రికెటర్గా ఉన్న జాక్వెస్ కలిస్కు చోటిచ్చిన ఆమ్లా... ఏడో స్థానానికి భారత దిగ్గజ కెప్టెన్, మూడు ఐసీసీ టైటిళ్లు సాధించిన మహేంద్ర సింగ్ ధోనిని ఎంచుకున్నాడు.బౌలర్లుగా వీరికే ఛాన్స్బౌలింగ్ విభాగంలో ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లకు ఆమ్లా చోటిచ్చాడు. శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్, ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్కు తన జట్టులో స్థానం కల్పించిన ఆమ్లా.. పేసర్ల కోటాలో పాకిస్తాన్ ఫాస్ట్బౌలింగ్ దిగ్గజం వసీం అక్రం, సౌతాఫ్రికా డైనమైట్ బౌలర్ డేల్ స్టెయిన్లకు చోటిచ్చాడు.దిగ్గజ బ్యాటర్ అయితే, టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మకు మాత్రం ఆమ్లా తన జట్టులో స్థానం ఇవ్వకపోవడం గమనార్హం. వన్డేల్లో అత్యధికంగా మూడుసార్లు డబుల్ సెంచరీ చేసిన ఘనత రోహిత్ది. అంతేకాదు యాభై ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) కూడా అతడిదే.అంతేకాదు.. కెప్టెన్గా టీమిండియాను వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్కు చేర్చిన రోహిత్ శర్మ.. 2025లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (వన్డే) కూడా గెలిచాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో పర్యటనలో భాగంగా సిడ్నీలో జరిగిన ఆఖరి వన్డేలో శతక్కొట్టిన హిట్మ్యాన్.. ఐసీసీ వన్డే వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్గా నిలిచాడు. అదే విధంగా.. అతడి ఖాతాలో 33వ వన్డే శతకాన్ని జమ చేసుకున్నాడు.హషీం ఆమ్లా ఎంచుకున్న ఆల్టైమ్ వన్డే ప్లేయింగ్ ఎలెవన్సచిన్ టెండుల్కర్, ఆడం గిల్క్రిస్ట్, విరాట్ కోహ్లి, బ్రియాన్ లారా, ఏబీ డివిలియర్స్, జాక్వెస్ కలిస్, ఎంఎస్ ధోని, ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్, వసీం అక్రం, డేల్ స్టెయిన్.చదవండి: ‘ఆడమని బతిమిలాడినా పట్టించుకోలేదు... సెలక్టర్లు అడిగినా రాలేదు’ -
సిగ్గులేని వాళ్లుంటారు: వరల్డ్కప్ విజేతలకు గావస్కర్ వార్నింగ్
నాలుగున్నర దశాబ్దాల కలను నెరవేరుస్తూ భారత మహిళా క్రికెట్ జట్టు ఇటీవలే వన్డే ప్రపంచకప్ (ICC Women's ODI World Cup) విజేతగా నిలిచింది. సొంతగడ్డపై ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు మొదలు అభిమానుల దాకా.. యావత్ భారతావని ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది.భారీ నజరానాఢిల్లీ నుంచి గల్లీ దాకా హర్మన్ సేన గెలుపును ప్రస్తావిస్తూ మన ఆడబిడ్డలను ఆకాశానికెత్తింది. ఇక వరల్డ్కప్ గెలిచిన జట్టులోని సభ్యులైన క్రికెటర్లకు ఐసీసీ అందించే రూ. 40 కోట్ల ప్రైజ్మనీతో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించిన రూ. 51 కోట్ల నజరానా దక్కనుంది.క్యాష్ రివార్డులు అంతేకాదు.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం భారీ ఎత్తున రివార్డులు ప్రకటించాయి. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు ప్లేయర్లు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, రాధ యాదవ్లకు ఇప్పటికే ప్రభుత్వం తలా రూ.2.25 కోట్ల మేర చెక్కులు అందించింది. భారత జట్టులోని ఇతర సభ్యులు క్రాంతి గౌడ్ (మధ్యప్రదేశ్), అమన్జోత్ కౌర్, హర్లీన్ డియోల్ (పంజాబ్), రిచా ఘోష్ (బెంగాల్), అరుంధతి రెడ్డి (తెలంగాణ)లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఘన స్వాగతం పలికాయి.ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీచరణికి గ్రూప్-1 ఉద్యోగంతో పాటు.. రూ. 2.5 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. సొంత ఊరిలో ఇంటి స్థలం కూడా కేటాయించింది. ఈ నేపథ్యంలో వన్డే ప్రపంచకప్ విజేతలను ఉద్దేశించి టీమిండియా దిగ్గజ0, 1983 వరల్డ్కప్ విన్నర్ సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.అమ్మాయిలు జాగ్రత్తమిడ్-డేకు రాసిన కాలమ్లో.. ‘‘అమ్మాయిలు కాస్త జాగ్రత్త. మీకోసమే ఈ మాటలు.. అందరూ మాట ఇచ్చినట్లుగా మీకు అవార్డులు, రివార్డులు దక్కకపోతే అస్సలు బాధపడొద్దు. మన దేశంలో అడ్వర్టైజర్లు, బ్రాండ్లు, కొంతమంది వ్యక్తులు ఉచిత ప్రచారం కోసం విజేతలను తమ భుజాలపై మోస్తారు.జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫుల్పేజీ యాడ్లు, హోర్డింగ్లు పెట్టిస్తారు. జట్టు యాజమాన్యం, స్పాన్సర్లు తప్ప మిగతా వారంతా ఫ్రీ పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తారు. నిజానికి వారి ద్వారా భారత క్రికెట్కు ఒరిగేది ఏమీ ఉండదు.1983లో భారత్కు తొట్టతొలి వరల్డ్కప్ అందించిన విజేతలకు కూడా చాలా ప్రామిస్లు చేశారు. వీటి గురించి మీడియలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఈ విషయంలో మీడియాను తప్పుబట్టాల్సిన పనిలేదు.సిగ్గులేని వాళ్లుంటారువిజేతలకు వచ్చిన నజరానాల గురించి వారు పెద్ద పెద్ద హెడింగ్లు పెడతారంతే!.. అయితే, విజేతలతో పాటు మీడియాను కూడా కొంత మంది సిగ్గులేని వాళ్లు ఉపయోగించుకుంటారని వారికీ తెలిసి ఉండదు. కాబట్టి.. అమ్మాయిలూ.. ఇలాంటి సిగ్గులేని వ్యక్తులను ఉపేక్షించవద్దు.తమ ప్రచారం కోసం మీ పేరును వాడుకుంటారు. 1983 విజేతల తరఫు నుంచి మీకో మాట చెప్పదలచుకున్నా.. భారత క్రికెట్ అభిమానుల ప్రేమే అన్నింటికంటే గొప్ప సంపద. మీకూ ఇది వర్తిస్తుంది. మరోసారి విజేతలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశాన్ని గర్వపడేలా చేశారు. జై హింద్’’ అని గావస్కర్ రాసుకొచ్చాడు.కాగా వరల్డ్కప్లో భారత్ గెలవగానే గుజరాత్కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి.. మహిళా జట్టుకు డైమండ్ నెక్లెస్లు ఇస్తానని ప్రకటించాడు. మరో కార్ల కంపెనీ ఇంకా లాంచ్ చేయని వర్షన్ను విజేతలకు కానుకగా ఇస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో గావస్కర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.చదవండి: ‘ఆడమని బతిమిలాడినా పట్టించుకోలేదు... సెలక్టర్లు అడిగినా రాలేదు’ -
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్కు బెదిరింపులు
ఐపీఎల్లో (IPL) ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తరఫున మెరిసిన యువ ఆల్రౌండర్ విప్రాజ్ నిగమ్ (Vipraj Nigam) బెదిరింపులకు గురయ్యాడు. నవంబర్ 9న అతడికి ఓ అంతర్జాతీయ ఫోన్ నంబర్ నుంచి అనేక బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఓ మహిళ అతన్ని బ్లాక్మెయిల్ చేస్తూ, ఓ వీడియోను లీక్ చేస్తానని బెదిరించింది.తొలుత విప్రాజ్ దీన్ని ఫేక్ కాల్గా భావించి, నంబర్ను బ్లాక్ చేశాడు. అయినా సదరు మహిళ వేరే నంబర్ల నుంచి ఫోన్ చేసి విప్రాజ్ను పదేపదే ఇబ్బంది పెట్టింది. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన విప్రాజ్ వెంటనే పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తన పరువుకు భంగం కలిగించడం, మానసికంగా వేధించడం ద్వారా తన క్రికెట్ కెరీర్ను నాశనం చేయాలనే కుట్ర జరుగుతోందని అతను ఆరోపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి సదరు కాల్ వివరాలు, ఫోన్ నంబర్ల మూలాలను పరిశీలిస్తున్నారు. ఈ విషయంపై విప్రాజ్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న తమ కుమారుడిని బద్నాం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు.21 ఏళ్ల విప్రాజ్ గత సీజన్లోనే (2025) ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. కుడి చేతి వాటం లెగ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన విప్రాజ్ అరంగేట్రం సీజన్లోనే అదరగొట్టాడు. 14 మ్యాచ్ల్లో 11 వికెట్లు తీసి, 142 పరుగులు చేశాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు దిగి పలు మ్యాచ్లో మెరుపులు మెరిపించాడు.గతేడాదే విప్రాజ్ ఉత్తరప్రదేశ్ తరఫున దేశవాలీ అరంగేట్రం చేశాడు. 3 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 5 లిస్ట్-ఏ మ్యాచ్లు, 15 టీ20లు ఆడి మొత్తంగా 32 వికెట్లు తీశాడు. చదవండి: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్కు తీవ్ర అస్వస్థత -
ఆడమని బతిమిలాడినా పట్టించుకోలేదు!
టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami) పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వన్డే జట్టును ప్రకటించే సమయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) చేసిన వ్యాఖ్యలు.. బదులుగా షమీ కౌంటర్ ఇవ్వడం ఇందుకు కారణం.షమీ ఫిట్నెస్ గురించి అప్డేట్ లేదని అగార్కర్ తెలపగా.. రంజీలు ఆడే తాను వన్డేలు ఆడలేనా? అంటూ షమీ గట్టిగానే బదులిచ్చాడు. తాను పూర్తి ఫిట్గా ఉన్నానని.. అయితే, జట్టు ఎంపిక సమయంలో తనను సెలక్టర్లు ఎవరూ సంప్రదించలేదని బాంబు పేల్చాడు.మరో‘సారీ’ఇందుకు బదులిస్తూ.. షమీ ఫిట్గా లేనందువల్లే అతడిని ఆసీస్ టూర్కు ఎంపిక చేయలేదని అగార్కర్ పునరుద్ఘాటించాడు. ఈ క్రమంలో బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీ (Ranji Trophy) తాజా సీజన్లో ఒకే మ్యాచ్లో ఎనిమిది వికెట్లు కూల్చి ఆటతోనే బదులిచ్చాడు షమీ.ఈ పరిణామాల నేపథ్యంలో సౌతాఫ్రికాతో నవంబరులో సొంతగడ్డపై టెస్టు సిరీస్కు షమీని ఎంపిక చేస్తారనే విశ్లేషణలు రాగా.. మరోసారి సెలక్టర్లు అతడికి మొండిచేయి చూపారు. ఫలితంగా భారత జట్టు యాజమాన్యంపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఆడమని బతిమిలాడినా పట్టించుకోలేదు... ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సీనియర్ అధికారి ఒకరు షమీ గురించి సంచలన విషయాలు వెల్లడించారు. ఇంగ్లండ్ పర్యటనకు రావాల్సిందిగా షమీని సెలక్టర్లు కోరినా.. అతడు మాత్రం రాలేనని చెప్పాడంటూ ఆరోపించారు.ఈ మేరకు PTIతో మాట్లాడుతూ.. ‘‘జాతీయ జట్టు సెలక్టర్లు.. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు చెందిన సహాయక సిబ్బంది చాలాసార్లు షమీ ఫిట్నెస్ చెక్ చేయాలని కాల్ చేశారు. ఇంగ్లండ్లో జస్ప్రీత్ బుమ్రా వర్క్లోడ్ మేనేజ్మెంట్ నేపథ్యంలో షమీ సేవలను ఉపయోగించుకోవాలని ఎంతగానో తపించిపోయారు.ఇంగ్లండ్ పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా బౌలింగ్ చేయగల సత్తా ఉన్న షమీ వంటి బౌలర్ను ఎవరు మాత్రం ఎందుకు కాదనుకుంటారు?.. తనను సెలక్టర్లు ఎవరూ సంప్రదించలేదంటూ షమీ గురించి వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం.సెలక్టర్లు అడిగినా రాలేదుఅంతర్జాతీయ క్రికెట్లో వరుసగా మ్యాచ్లు ఆడేందుకు షమీ ఫిట్గా ఉన్నాడా? లేడా? అన్న అంశంపై స్పోర్ట్స్ సైన్స్ టీమ్ ఎప్పటికప్పుడు అతడి మెడికల్ రిపోర్టులు పరిశీలిస్తూనే ఉంది’’ అని సదరు అధికారి పేర్కొన్నారు. సెలక్టర్లు అడిగినా రాలేదని పరోక్షంగా వెల్లడించాడు. కాగా ఇప్పటికే టెస్టు, టీ20 జట్లలో చోటు కోల్పోయిన షమీ.. వన్డేల్లో మాత్రం సత్తా చాటుతున్నాడు.చివరగా ఈ ఏడాది మార్చిలో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీలో ఈ రైటార్మ్ పేసర్ భాగమయ్యాడు. ఈ మెగా ఈవెంట్లో షమీ తొమ్మిది వికెట్లు కూల్చాడు. ఆ తర్వాత ఇంత వరకు మళ్లీ జాతీయ జట్టుకు ఆడలేదు. కెరీర్కు ఎండ్కార్డ్ఇక వన్డే వరల్డ్కప్-2027ను దృష్టిలో పెట్టుకుని రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన యాజమాన్యం.. విరాట్ కోహ్లి అందుబాటుపై కూడా క్లారిటీ లేదని చెప్పింది. ఇలాంటి తరుణంలో 35 ఏళ్ల షమీకి ఇకపై వన్డేలలోనైనా అవకాశం ఇవ్వడం దాదాపు అసాధ్యమని ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఫలితంగా షమీ అంతర్జాతీయ కెరీర్కు పూర్తిస్థాయిలో ఎండ్కార్డ్ పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: ఆ ఓవరాక్షనే వద్దనేది.. అదేమైనా వరల్డ్ కప్ ట్రోఫీనా? -
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్కు తీవ్ర అస్వస్థత
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ (Former Bangladesh Captain), ప్రస్తుత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ అయిన ఫారూఖీ అహ్మద్ (Faruque Ahmed) తీవ్ర అస్వస్థత గురయ్యారు. ఫారూఖీకి నిన్న (నవంబర్ 9) మధ్యాహ్నం తీవ్రమైన గుండెపోటు వచ్చింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. డాక్టర్లు కార్డియాక్ అరెస్ట్గా నిర్దారించారు. యాంజియోగ్రామ్ చేయగా, గుండె ధమనాల్లో బ్లాకేజ్ గుర్తించారు. చికిత్సలో భాగంగా స్టెంట్ వేసి పూడికను తొలగించారు. క్రిటికల్ కేర్ యూనిట్లో (CCU) ఉంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.ఫారూఖీ 1984-1999 మధ్యలో బంగ్లాదేశ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. కొంతకాలం ఆ జట్టుకు కెప్టెన్గానూ సేవలందించాడు. రిటైర్మెంట్ తర్వాత రెండుసార్లు జాతీయ సెలెక్టర్గా వ్యవహరించిన అతను.. 2024 అగస్ట్లో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తాత్కాలిక అధ్యక్షుడిగానూ పని చేశారు. ఈ పదవిలో 9 నెలల పాటు కొనసాగాడు. ఆతర్వాత అమినుల్ ఇస్లాం పూర్తి స్థాయి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఆ పదవి నుంచి తప్పుకున్నాడు. 59 ఏళ్ల ఫారూఖీ ఇటీవలే బీసీబీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.ఫారూఖీ సుదీర్ఘకాలం జాతీయ జట్టులో ఉన్నా కేవలం 7 వన్డేలు మాత్రమే ఆడాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ సాయంతో 105 పరుగులు చేశాడు. ఫారూఖీ కుడి చేతి వాటం బ్యాటింగ్తో పాటు పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్ బౌలర్గానూ వ్యవహరించేవాడు.చదవండి: 'అతడొక గన్ ప్లేయర్.. కచ్చితంగా రిటైన్ చేసుకోవాలి' -
'అతడొక గన్ ప్లేయర్.. కచ్చితంగా రిటైన్ చేసుకోవాలి'
ఐపీఎల్-2026కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్రాంచైజీ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను రాజస్తాన్ రాయల్స్కు ట్రేడ్ చేసేందుకు సిద్దమైనట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. జడేజాకు బదులుగా రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ను సీఎస్కే తీసుకోవాలని నిర్ణయించినట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.ఈ నేపథ్యంలో సీఎస్కే మాజీ బ్యాటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా కీలక వ్యాఖ్యలు చేశాడు. సీఎస్కే కచ్చితంగా జడ్డూను తమతో పాటు అట్టిపెట్టుకోవాలని రైనా సూచించాడు. జడేజా ఐపీఎల్-2011 సీజన్ నుంచి సీఎస్కే జట్టులో కొనసాగుతున్నాడు. ఐపీఎల్-2023 సీజన్ విజేతగా సీఎస్కే నిలవడంలో జడ్డూది కీలక పాత్ర. ఫైనల్ మ్యాచ్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టుకు ఐదో టైటిల్ను అందించాడు. అంతకుముందు 2019, 2017 సీజన్లో సీఎస్కే ఛాంపియన్గా నిలవడంలో జడ్డూ తన వంతు పాత్ర పోషించాడు. అటువంటి ప్లేయర్ను వదులుకోవడానికి సీఎస్కే సిద్దమైందంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు.రవీంద్ర జడేజాను సీఎస్కే రిటైన్ చేసుకోవాలి. అతడొక గన్ ప్లేయర్. గత కొన్ని సీజన్లగా సీఎస్కే ఎన్నో విజయాలను అందించాడు. కాబట్టి 'సర్ రవీంద్ర జడేజా' జట్టులో కచ్చితంగా ఉండాలి అని రైనా పేర్కొన్నాడు. అదేవిధంగా సీఎస్కే జట్టులో చేయాల్సిన మార్పులు కూడా అతడు సూచించాడు."చెన్నై డెవాన్ కాన్వేను జట్టు నుంచి విడుదల చేయాలి. సీఎస్కే కచ్చితంగా మినీ వేలంలో ఒక లోకల్ ఓపెనర్ కొనుగోలు చేసుకోవాలి. ఇక విజయ్ శంకర్, దీపక్ హుడాను కూడా రిలీజ్ చేయాలి. వీరిద్దరికి ఇప్పటికే చాలా అవకాశాలు లభించాయి. కానీ వాటిని వారు అందిపుచ్చుకోలేకపోయారు. ఈసారి కొత్త ఆటగాళ్లకు అవకాశమివ్వాలని" రైనా చెప్పుకొచ్చాడు. -
టీమిండియా కెప్టెన్కు నో ప్రమోషన్..! క్యాష్ ప్రైజ్ ఎంతంటే?
భారత మహిళల జట్టుకు తొలి వన్డే వరల్డ్కప్ టైటిల్ను అందించిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ను ఘనంగా సత్కరించేందుకు పంజాబ్ ప్రభుత్వం సిద్దమైంది. వరల్డ్కప్ గెలిచిన జట్టులో పంజాబ్ రాష్ట్రం నుంచి హర్మన్తో పాటు హర్లీన్ డియోల్, అమన్జోత్ కౌర్ ఉన్నారు.వీరి ముగ్గరికి తలా రూ.1.5 కోట్లు చొప్పున నగదు బహుమతి ఇవ్వాలని భగవంత్ మాన్ సర్కార్ నిర్ణయించున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ సర్కార్ త్వరలోనే సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.హర్మన్కు నో ప్రమోషన్ప్రస్తుతం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) ఉన్న హర్మన్ను ఎస్పీగా ప్రమోట్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ సర్వీస్ నిబంధనల ప్రకారం ఎస్పీగా పదోన్నతి పొందాలంటే ఆమె కనీసం 12 నుంచి 15 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉండాలి. ఈ క్రమంలోనే హర్మన్ ప్రమోషన్కు బదులగా క్యాష్ ప్రైజ్ అందుకోనుంది. కాగా 2017 వన్డే ప్రపంచకప్లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత హర్మన్ను పంజాబ్ ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగంతో సత్కరించింది. కానీ ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన చౌదరి చరణ్ యూనివర్సిటీ యూజీసీ గుర్తింపు లేకపోవడంతో వివాదస్పదమైంది. దీంతో హర్మన్ను డీఎస్పీ నుండి కానిస్టేబుల్గా డిమోట్ చేశారు. అయితే ఆ తర్వాత ఆమె లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నుండి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా తన డిగ్రీని పూర్తి చేసి తిరిగి డీఎస్పీగా నియమించబడింది. అయితే భారత విజయంలో కీలక పాత్ర పోషించిన హర్లీన్ డియోల్, అమన్జోత్ కౌర్లకు ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశముంది.చదవండి: ఓడినా.. గెలిచినా ఒకటే పాట? ఇదెక్కడి న్యాయం?: భారత మాజీ కెప్టెన్ -
'బుమ్రా కంటే అతడు ఎంతో బెటర్'
పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాపై భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం భారత జట్టుకు బుమ్రా కంటే స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎక్కువ విలువైనవాడని సుబ్రమణ్యం అభిప్రాయపడ్డాడు. చక్రవర్తి గత కొంత కాలంగా అద్బుతంగా రాణిస్తున్నాడని, అందుకే టీ20ల్లో వరల్డ్ నంబర్ బౌలరయ్యాడని అతడు కొనియాడాడు.కాగా ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బౌలర్ అంటే అందరికి టక్కున గుర్తు వచ్చేది బుమ్రానే. అయితే బుమ్రా గత కొంతకాలంగా ఫిట్నెస్ సమస్యల వైట్ బాల్ క్రికెట్కు అంతగా ప్రాధన్యం ఇవ్వడం లేదు. అతడు ఎక్కువగా టెస్టు ఫార్మాట్పై దృష్టిసారించాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు దూరమైన బుమ్రా, టీ20 సిరీస్లో ఆడాడు. ఇప్పుడు సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్కు సిద్దంకానున్నాడు.అయితే ఆ తర్వాత జరిగే వన్డే, టీ20 సిరీస్కు అందుబాటులో ఉంటాడో లేదో ఇంకా స్పష్టత లేదు. పొట్టి ప్రపంచకప్కు సమయం దగ్గరపడుతున్నందున సఫారీలతో టీ20లు బుమ్రా ఆడే అవకాశముంది. బుమ్రా ప్రస్తుతం టెస్టుల్లో నంబర్ వన్ బౌలర్గా కొనసాగుతున్నాడు. టీ20ల్లో అయితే బుమ్రా 29 ర్యాంక్లో ఉన్నాడు."వరుణ్ చక్రవర్తి ప్రపంచంలోనే నంబర్ వన్ టీ20 బౌలర్ ఎందుకు అయ్యాడో అతడి గణాంకాలే చెబుతున్నాయి. అతడు బుమ్రా కంటే ఎక్కువ విలువైనవాడు. పవర్ ప్లేలో కావచ్చు, డెత్ ఓవర్లలో పరుగులు కట్టడి చేయాలన్న కెప్టెన్కు గుర్తు వచ్చేది చక్రవర్తినే. అతడు ఇప్పుడు భారత జట్టులో ప్రధాన బౌలర్గా కొనసాగుతున్నాడు.తన అంతర్జాతీయ కెరీర్ ఆరంభంలో పెద్దగా రాణించకపోయినా.. తన పునరాగమనంలో మాత్రం అద్భుతాలు చేస్తున్నాడు. టీ20 ప్రపంచకప్-2026లో అతడు భారత జట్టుకు కీలకం కానున్నాడు. వరుణ్ బంతితో మ్యాజిక్ చేస్తే భారత్కు తిరుగుండదు" అని స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వరుణ్ పేర్కొన్నాడు. కాగా వరుణ్, బద్రీనాథ్ ఇద్దరూ తమిళనాడుకు చెందిన క్రికెటర్లే. -
ఓడినా.. గెలిచినా ఒకటే పాట? ఇదెక్కడి న్యాయం?
ఐసీసీ మహిళ ప్రపంచకప్-2025 విజేతగా హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించిన మన అమ్మాయిల జట్టు.. తొలి వరల్డ్ కప్ టైటిల్ను ముద్దాడింది.స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ వంటి ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనతో ఈ ప్రతిష్టత్మక ట్రోఫీని భారత్ సొంతం చేసుకుంది. ఈ చారిత్రక విజయాన్ని యావత్ దేశం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం స్వయంగా భారత క్రికెటర్లను కలిసి అభినందించారు.ఈ గెలుపు సంబరాల మధ్య మాజీ భారత కెప్టెన్ శాంత రంగస్వామి చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యపరిచాయి. హర్మన్ప్రీత్ కెప్టెన్సీ నుంచి వైదొలగి బ్యాటింగ్, ఫీల్డింగ్పై దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. దీర్ఘకాలిక భవిష్యత్తు దృష్ట్యా కెప్టెన్సీ మార్పు అనివార్యమని శాంత రంగస్వామి అభిప్రాయపడ్డారు. తాజాగా ఆమె వ్యాఖ్యలపై మాజీ భారత కెప్టెన్ అంజుమ్ చోప్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది."ప్రతీ ప్రపంచకప్ తర్వాత ఇలాంటి కామెంట్స్ వస్తూనే ఉంటాయి. గత నాలుగైదు ప్రపంచకప్లను పరిశీలిస్తే ఆ విషయం స్పష్టంగా ఆర్దమవుతోంది. భారత్ ఓడిపోతే హర్మన్ను కెప్టెన్సీ తప్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు గెలిచినా కూడా అదే పాట పడుతున్నారు. ఇదెక్కడి న్యాయం. ఈ తొలి ప్రపంచకప్ గెలిచిన క్షణాలను అస్వాదిస్తున్న సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం బాధాకారం. కాబట్టి దీనిపై ఎక్కువగా మాట్లాడాలనుకోవడంలేదు. హర్మన్తో నాకు మంచి అనుబంధం ఉంది. దేశవాళీ క్రికెట్లో ఆమె మాతో కలిసి ఆడింది. అప్పుడే తనలోని టాలెంట్ను గమనించాను. అండర్-19 ప్లేయర్గా ఉన్నప్పుడే ఆమె భారీ షాట్లు ఆడేది. ఆమె ఒక మ్యాచ్ విన్నర్. అందుకే హర్మన్ కెప్టెన్గా కొనసాగాలని నేను చెబుతా ఉంటా అని ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చోప్రా పేర్కొన్నారు.చదవండి: ఆ ఓవరాక్షనే వద్దనేది.. అదేమైనా వరల్డ్ కప్ ట్రోఫీనా? -
పాకిస్తాన్ జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ రీ ఎంట్రీ
దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్లను సొంతం చేసుకున్న పాకిస్తాన్.. ఇప్పుడు స్వదేశంలో మరో కీలక పోరుకు సిద్దమైంది. సొంతగడ్డపై శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్లో పాక్ జట్టు తలపడనుంది. నవంబర్ 11న రావాల్పిండి వేదకగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.అనంతరం శ్రీలంక-అఫ్గానిస్తాన్తో పాక్ ట్రై సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సిరీస్లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. దాదాపుగా సౌతాఫ్రికాతో ఆడిన వన్డే జట్టునే సెలక్టర్లు కొనసాగించారు. గత సిరీస్తో పోలిస్తే సెలక్టర్లు ఒకే ఒక మార్పు చేశారు. జట్టు నుంచి మిడిలార్డర్ బ్యాటర్ హసన్ నవాజ్ను రిలీజ్ చేశారు. పాక్ దేశవాళీ టోర్నీ కైద్-ఎ-ఆజం ట్రోఫీలో నవాజ్ ఆడనున్నాడు. దీంతో అతడికి టీ20 జట్టులో కూడా చోటు దక్కలేదు. టీ20ల్లో అతడి స్ధానాన్ని స్టార్ ఓపెనర్ ఫఖార్ జమాన్తో భర్తీ చేశారు. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్కు జమాన్ను పక్కన పెట్టారు. అయితే సఫారీలతో వన్డే సిరీస్లో ఆడిన జమాన్ మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచాడు. అయినప్పటికి ఇప్పుడు వన్డే, టీ20 జట్టు రెండింటిలోనూ అతడికి చోటు దక్కడం గమనార్హం. సౌతాఫ్రికాతో కానీ వన్డే జట్టులోకి నవాజ్ స్ధానంలో ఎవరిని ఎంపిక చేయలేదు. మరోసారి స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్కు టీ20 జట్టులో చోటు దక్కలేదు.శ్రీలంకతో వన్డేలకు పాక్ జట్టు: షాహీన్ షా ఆఫ్రిది (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ అజామ్, ఫహీమ్ అష్రఫ్, ఫైసల్ అక్రమ్, ఫఖర్ జమాన్, హారీస్ రవూఫ్, హసీబుల్లా, హుస్సేన్ తలత్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్, వసీమ్ అగౌబ్, సలీమ్, సల్మాన్, సల్మాన్.టీ20 ముక్కోణపు సిరీస్కు పాక్ జట్టు: సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, బాబర్ అజామ్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, మహ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్,ఉస్మాన్ తారిఖ్


