breaking news
Cricket
-
‘సూపర్–4’కు పాకిస్తాన్
దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీలో రెండో విజయంతో పాకిస్తాన్ ‘సూపర్–4’ దశకు అర్హత సాధించింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా బుధవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో పాక్ 41 పరుగుల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ని ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్ (36 బంతుల్లో 50; 2 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్గా నిలవగా, ఇతర ప్రధాన బ్యాటర్లంతా విఫలమయ్యారు. సయీమ్ అయూబ్ (0) వరుసగా మూడో మ్యాచ్లోనూ డకౌటై అంతర్జాతీయ టి20ల్లో ఈ చెత్త రికార్డును నెలకొల్పిన మూడో పాకిస్తానీ ఆటగాడిగా నిలిచాడు. ఫర్హాన్ (5), కెపె్టన్ సల్మాన్ ఆగా (27 బంతుల్లో 20), హసన్ (3), ఖుష్దిల్ (4), హారిస్ (18) ప్రభావం చూపలేకపోయారు. చివర్లో షాహిన్ అఫ్రిది (14 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడుగా ఆడటంతో పాక్ మెరుగైన స్కోరు సాధించింది. యూఏఈ బౌలర్లలో జునేద్ సిద్దిఖీ 4 వికెట్లు పడగొట్టగా, సిమ్రన్జీత్ సింగ్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం యూఏఈ 17.4 105 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ చోప్రా (35 బంతుల్లో 35; 1 ఫోర్, 1 సిక్స్) రాణించగా, ధ్రువ్ పరాశర్ (20) ఫర్వాలేదనిపించాడు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, రవూఫ్, అబ్రార్ అహ్మద్ రెండు వికెట్లు చొప్పున తీశారు. నేడు జరిగే మ్యాచ్లో అఫ్గానిస్తాన్తో శ్రీలంక తలపడుతుంది. -
మరోసారి బీభత్సం సృష్టించిన సాల్ట్.. ఈసారి పసికూన బలి
అంతర్జాతీయ టీ20ల్లో ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ విధ్వంసకాండ కొనసాగుతోంది. కొద్ది రోజుల కిందట సౌతాఫ్రికాపై సుడిగాలి శతకంతో (60 బంతుల్లో 141 నాటౌట్; 15 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడిన అతను.. ఇవాళ (సెప్టెంబర్ 17) పసికూన ఐర్లాండ్పై అదే తరహాలో రెచ్చిపోయాడు.మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఐర్లాండ్ నిర్దేశించిన 197 పరుగుల లక్ష్య ఛేదనలో ఆది నుంచే బ్యాట్ ఝులిపిస్తూ విధ్వంసం సృష్టించాడు. 46 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి గెలుపు ఖరారయ్యాక ఔటయ్యాడు.సాల్ట్ వీర ఉతుకుడు ధాటికి ఇంగ్లండ్ మరో 14 బంతులు మిగిలుండగానే (6 వికెట్లు కోల్పోయి) లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ అంచనాలకు మించి భారీ స్కోర్ చేసింది. హ్యారీ టెక్టార్ (36 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), లోర్కన్ టక్కర్ (36 బంతుల్లో 55; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలతో చెలరేగిపోయారు. ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్ (34), రాస్ అదైర్ (26) కూడా సత్తా చాటారు.ఐరిష్ బ్యాటర్ల ధాటికి ఇంగ్లండ్ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఓవర్టన్, డాసన్, ఆదిల్ రషీద్ మాత్రం తలో వికెట్ తీశారు.197 పరుగుల లక్ష్య ఛేదనలో సాల్ట్ తొలి బంతి నుంచే డ్యూటీకి ఎక్కాడు. అతనికి బట్లర్ (10 బంతుల్లో 28), జేకబ్ బేతెల్ (16 బంతుల్లో 24), సామ్ కర్రన్ (15 బంతుల్లో 27) తోడయ్యారు. మ్యాచ్ను మరింత వేగంగా ముగించే క్రమంలో ఇంగ్లండ్ బ్యాటర్లు వికెట్లు కోల్పోయారు. రెహాన్ అహ్మద్ 8, టామ్ బాంటన్ 11 పరుగులకు ఔటయ్యారు. ఓవర్టన్ బౌండరీతో మ్యాచ్ను ముగించాడు. ఐరిష్ బౌలర్లలో హంఫ్రేస్, హ్యూమ్ తలో 2, హ్యారీ టెక్టార్, గెరాత్ డెలానీ చెరో వికెట్ తీశారు. ఈ సిరీస్లోని రెండో టీ20 సెప్టెంబర్ 19న డబ్లిన్లోనే జరుగనుంది. ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ ఐర్లాండ్లో పర్యటిస్తుంది. -
మంధన విధ్వంసకర శతకం.. ఆసీస్ను చిత్తుగా ఓడించిన టీమిండియా
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో ఇవాళ (సెప్టెంబర్ 17) జరిగిన రెండో వన్డేలో టీమిండియా 102 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 49.5 ఓవర్లలో 292 పరుగులు చేసి ఆలౌటైంది.ఓపెనర్ స్మృతి మంధన (91 బంతుల్లో 117; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడింది. భారత ఇన్నింగ్స్లో మంధన మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. దీప్తి శర్మ (40), రిచా ఘోష్ (29), ప్రతిక రావల్ (25), స్నేహ్ రాణా (24) పర్వాలేదనిపించారు.హర్లీన్ డియోల్ (10), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (17), రాధా యాదవ్ (6), అరుంధతి రెడ్డి (4), క్రాంతి గౌడ్ (2) స్వల్ప స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో డార్సీ బ్రౌన్ 3, ఆష్లే గార్డ్నర్ 2, మెగాన్ షట్, అన్నాబెల్ సదర్ల్యాండ్, తహ్లియా మెక్గ్రాత్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో ఆసీస్ కెప్టెన్ హీలీ ఏకంగా ఎనిమిది బౌలర్లను ప్రయోగించింది.అనంతరం 293 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. క్రాంతి గౌడ్ (9.5-1-28-3), దీప్తి శర్మ (6-0-24-2), రేణుకా సింగ్ ఠాకూర్ (6.3-0-28-1), స్నేహ్ రాణా (6-0-35-1), అరుంధతి రెడ్డి (7.3-0-46-1), రాధా యాదవ్ (5-0-27-1) ధాటికి 40.5 ఓవర్లలో 190 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్లో సదర్ల్యాండ్ (45), ఎల్లిస్ పెర్రీ (44) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు.ఈ గెలుపుతో భారత్ సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. నిర్ణయాత్మక మూడో వన్డే న్యూఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 20న జరుగనుంది. -
Asia Cup 2025: పాక్ 'బాయ్కాట్' బెదిరింపులకు తలొగ్గని ఐసీసీ
నో హ్యాండ్షేక్ ఉదంతంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెనక్కు తగ్గింది. ఇవాళ (సెప్టెంబర్ 17) యూఏఈతో మ్యాచ్కు కొద్ది గంటల ముందు పీసీబీ హైడ్రామా నడిపింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను ఆసియా కప్ నుంచి తప్పించాలని భీష్మించుకు కూర్చుంది. పైక్రాఫ్ట్ను తప్పించకపోతే యూఏఈతో మ్యాచ్ను బాయ్కాట్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేసింది. మ్యాచ్ ప్రారంభానికి సమయం ఆసన్నమైనా, వారి ఆటగాళ్లను హోటల్ రూమ్ల నుంచి బయటకు రానివ్వలేదు.దీంతో ఆసియా కప్లో పాక్ కొనసాగడంపై కాసేపు నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఈ విషయంలో ఐసీసీ కూడా ఏమాత్రం తగ్గకపోవడంతో పాక్ క్రికెట్ బోర్డే తోక ముడిచింది. నో హ్యాండ్షేక్ ఉదంతంతో పైక్రాఫ్ట్ది ఏ తప్పు లేదని ఐసీసీ మరోసారి పీసీబీకి స్పష్టం చేసింది. మ్యాచ్ అఫీషియల్స్ విషయంలో పీసీబీ అతిని సహించబోమని స్ట్రిక్ట్గా వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది.దీంతో చేసేదేమీ లేక పీసీబీ తమ ఆటగాళ్లను మ్యాచ్ ఆడటానికి మైదానానికి రావాల్సిందిగా ఆదేశించింది. మ్యాచ్ను గంట ఆలస్యంగా ప్రారంభించాలని నిర్వహకులకు కబురు పంపింది. భారతకాలమానం ప్రకారం పాక్-యూఏఈ మ్యాచ్ రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా, పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్లో భారత క్రికెటర్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించారు. దీన్ని అవమానంగా భావించిన పాక్.. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది.అలాగే ఆ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్ను ఆసియా కప్ నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. పైక్రాఫ్ట్ షేక్హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్ సల్మాన్ అఘాకు చెప్పాడని, ఈ వివాదానికి అతనే బాధ్యుడని గగ్గోలు పెట్టింది.పీసీబీ డిమాండ్లను పరిశీలించిన ఐసీసీ.. షేక్ హ్యాండ్ ఇవ్వడమనేది ఆటగాళ్ల వ్యక్తిగత విషయమని కొట్టిపారేసింది. అలాగే షేక్హ్యాండ్ ఉదంతంలో పైక్రాఫ్ట్ పాత్ర ఏమీ లేదని, యూఏఈతో మ్యాచ్కు అతన్నే రిఫరీగా కొనస్తామని ప్రకటించింది. -
Asia Cup 2025: యూఏఈతో మ్యాచ్ను బాయ్కాట్ చేయనున్న పాకిస్తాన్..?
ఆసియా కప్-2025లో భాగంగా భారత్, పాకిస్తాన్ క్రికెటర్ల మధ్య చోటు చేసుకున్న 'హ్యాండ్షేక్ వివాదం' తీవ్రరూపం దాల్చినట్లు కనిపిస్తుంది. పాక్ క్రికెట్ టీమ్ ఇవాళ (సెప్టెంబర్ 17) యూఏఈతో జరుగబోయే మ్యాచ్ సహా ఆసియా కప్ మొత్తాన్ని బాయ్కాట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. యూఏఈతో మ్యాచ్ ప్రారంభానికి గంట సమయం మాత్రమే ఉన్నా, పాక్ క్రికెటర్లు ఇంకా హోటల్ రూమ్ల నుంచి బయటికి రాలేదని సమాచారం. హ్యాండ్షేక్ వివాదంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ కాసేపట్లో పాక్ నుంచి మీడియా సమావేశం నిర్వహిస్తాడని తెలుస్తుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్ సందర్భంగా భారత క్రికెటర్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించారు. దీన్ని అవమానంగా భావించిన పాక్.. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అలాగే ఆ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్ను ఆసియా కప్ నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. పైక్రాఫ్ట్ షేక్హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్ సల్మాన్ అఘాకు చెప్పాడని, ఈ వివాదానికి అతనే బాధ్యుడని పీసీబీ గగ్గోలు పెడుతుంది.పీసీబీ డిమాండ్లను పరిశీలించిన ఐసీసీ.. షేక్ హ్యాండ్ ఇవ్వడమనేది ఆటగాళ్ల వ్యక్తిగత విషయమని కొట్టిపారేసింది. అలాగే షేక్హ్యాండ్ ఉదంతంలో పైక్రాఫ్ట్ పాత్ర ఏమీ లేదని యూఏఈతో మ్యాచ్కు అతన్నే రిఫరీగా కొనసాగించేందుకు నిర్ణయించుకుంది.ఐసీసీ నిర్ణయాలతో ఖంగుతిన్న పీసీబీ చేసేదేమీ లేక ఆసియా కప్ను బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే, ఆసియా కప్లో ముందు దశకు (సూపర్-4) వెళ్లాలంటే పాక్ యూఏఈపై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంది. గ్రూప్-ఏలో పాక్ పసికూన ఒమన్పై విజయం సాధించి, టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది. మరోవైపు యూఏఈ టీమిండియా చేతిలో ఓడి, ఒమన్పై విజయం సాధించింది.ప్రస్తుతం పాక్, యూఏఈ ఆడిన రెండు మ్యాచ్ల్లో చెరో విజయంతో పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఒకవేళ పాక్ యూఏఈతో మ్యాచ్ను బహిష్కరిస్తే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇదే జరిగితే యూఏఈ భారత్తో పాటు సూపర్-4కు చేరుకుంటుంది. -
IND VS AUS: మంధన మెరుపు శతకంతో చెలరేగినా..!
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో ఇవాళ (సెప్టెంబర్ 17) జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓ మోస్తరు స్కోర్కే పరిమితమైంది. ఓపెనర్ స్మృతి మంధన (91 బంతుల్లో 117; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు శతకంతో చెలరేగినా భారత్ భారీ స్కోర్ చేయలేకపోయింది. చివరి వరుస బ్యాటర్లు విఫలం కావడంతో 49.5 ఓవర్లలో 292 పరుగులకే ఆలౌటైంది.ఓ దశలో భారత్ 350కి పైగా స్కోర్ చేస్తుందేమో అనిపించింది. అయితే మంధన ఔటైన తర్వాత పరిస్థితి తారుమారైంది. దీప్తి శర్మ (40), రిచా ఘోష్ (29) కాసేపు పోరాడారు. ఆతర్వాత వచ్చిన రాధా యాదవ్ (6), అరుంధతి రెడ్డి (4), క్రాంతి గౌడ్ (2) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో స్నేహ్ రాణా (24) బ్యాట్ ఝులిపించిడంతో భారత్ 290 పరుగుల మార్కునైనా తాకగలిగింది.అంతకుముందు టాపార్డర్ బ్యాటర్లు (మంధన మినహా) కూడా తడబడ్డారు. ఓపెనర్ ప్రతిక రావల్కు (25) మంచి ఆరంభం లభించినా భారీ స్కోర్గా మలచలేకపోయింది. వన్డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ (10), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (17) కూడా తక్కువ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు.ఓ పక్క వికెట్లు పడుతున్నా మంధన ఏమాత్రం తగ్గకుండా ధాటిగా ఆడటం కొనసాగించింది. 32.2 ఓవర్లలో 192 పరుగుల వద్ద మంధన ఔట్ కావడంతో భారత్ స్కోర్ నెమ్మదించింది. మంధన ఔటయ్యాక భారత్ చివరి 6 వికెట్లు 53 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. మంధన దెబ్బకు తొలుత లయ కోల్పోయిన ఆసీస్ బౌలర్లు, ఆఖర్లో పుంజుకున్నారు. డార్సీ బ్రౌన్ 3, ఆష్లే గార్డ్నర్ 2, మెగాన్ షట్, అన్నాబెల్ సదర్ల్యాండ్, తహ్లియా మెక్గ్రాత్ తలో వికెట్ తీశారు. వీరిలో గార్డ్నర్ (10-1-39-2) పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్లు తీయగలిగింది. ఈ మ్యాచ్లో ఆసీస్ కెప్టెన్ హీలీ ఏకంగా ఎనిమిది బౌలర్లను ప్రయోగించింది.అనంతరం 293 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్కు రెండో ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జార్జియా వాల్ను రేణుకా సింగ్ డకౌట్ చేసింది. రేణుకా బౌలింగ్కు ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడిన వాల్ 5 బంతులు ఎదుర్కొన్న తర్వాత క్లీన్ బౌల్డ్ అయ్యింది. భారత్కు ఐదో ఓవర్ ఐదో బంతికి మరో బ్రేక్ లభించింది. మరో ఓపెనర్ అలైస్సా హీలీని (9) క్రాంతి గౌడ్ బోల్తా కొట్టించింది. దీంతో ఆసీస్ 5 ఓవర్లలో 12 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్లో ఆసీస్ గెలవాలంటే 45 ఓవర్లలో మరో 281 పరుగులు చేయాలి. కాగా, ఈ సిరీస్లోని తొలి వన్డేలో గెలిచి ఆసీస్ 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
ఆసీస్ భారీ స్కోర్.. ధీటుగా బదులిస్తున్న టీమిండియా
స్వదేశంలో ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్లో భారత-ఏ జట్టుకు తొలి ఇన్నింగ్స్లో శుభారంభం లభించింది. ఓపెనర్లు అభిమన్యు ఈశర్వన్ (44), ఎన్ జగదీసన్ (50 నాటౌట్) తొలి వికెట్కు 88 పరుగులు జోడించారు. అనంతరం అభిమన్యు ఈశ్వరన్ను లియామ్ స్కాట్ క్లీన్ బౌల్డ్ చేయడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఈశ్వరన్ ఔటయ్యాక క్రీజ్లోకి వచ్చిన సాయి సుదర్శన్ (20 నాటౌట్) జగదీసన్తో కలిసి బాధ్యతగా ఆడుతున్నాడు. వీరిద్దరు రెండో వికెట్కు అజేయమైన 28 పరుగులు జోడించి భారత ఇన్నింగ్స్ను నిర్మిస్తున్నారు. ఈ దశలో వర్షం దంచికొట్టడంతో రెండో రోజు ఆటను ముగించారు. ఆ సమయానికి తొలి ఇన్నింగ్స్లో భారత-ఏ స్కోర్ వికెట్ నష్టానికి 116 పరుగులుగా ఉంది.అంతకుముందు ఆస్ట్రేలియా-ఏ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆ జట్టు.. తొలి ఇన్నింగ్స్ను 532 పరుగుల వద్ద (6 వికెట్ల నష్టానికి) డిక్లేర్ చేసింది. ఓపెనర్ సామ్ కొన్స్టాస్ (109), వికెట్ కీపర్ జోష్ ఫిలిప్ (123 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కగా.. క్యాంప్బెల్ కెల్లావే (88), కూపర్ కన్నోల్లీ (70), లియమ్ స్కాట్ (81) సెంచరీలకు చేరువై ఔటయ్యారు. భారత బౌలర్లు ఎంత శ్రమించినా ఆసీస్ బ్యాటర్లపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. టీమిండియాకు ఆడిన ప్రసిద్ద్ కృష్ణ (16-0-86-0), ఖలీల్ అహ్మద్ను (15-0-80-1) ఆసీస్ బ్యాటర్లు సునాయాసంగా ఎదుర్కొన్నారు. తనుశ్ కోటియన్కు (21-2-119-0) చుక్కలు చూపించారు. హర్ష్ దూబే (27-1-141-3), గుర్నూర్ బ్రార్ (19-2-87-2) వికెట్లు తీసినా ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు. మొత్తంగా భారత బౌలర్లను ఆసీస్ బ్యాటర్లు ఆటాడుకున్నారు. -
IND VS AUS: రికార్డు శతకం.. చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో ఇవాళ (సెప్టెంబర్ 17) జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధన చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగగా.. మంధన మెరుపు శతకంతో చెలరేగింది. కేవలం 77 బంతుల్లోనే శతక్కొట్టి, భారత్ తరఫున వన్డేల్లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేసింది. భారత్ తరఫున ఫాస్టెస్ట్ రికార్డు కూడా మంధన పేరిటే ఉంది. ఇదే ఏడాది ఐర్లాండ్పై ఆమె 70 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసింది.తాజా సెంచరీ మంధనకు వన్డేల్లో 12వది. ఈ శతకంతో ఆమె ప్రపంచ రికార్డును సమం చేసింది. మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఓపెనింగ్ బ్యాటర్గా సూజీ బేట్స్ (న్యూజిలాండ్), ట్యామీ బేమౌంట్ (ఇంగ్లండ్) సరసన చేరింది. మంధన, బేట్స్, బేమౌంట్ ఓపెనర్లుగా తలో 12 శతకాలు చేశారు. అయితే బేట్స్, బేమౌంట్ కంటే మంధననే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించింది. బేట్స్కు 130, బేమౌంట్కు 113 ఇన్నింగ్స్లు అవసరం కాగా.. మంధన తన 106వ ఇన్నింగ్స్లోనే 12 సెంచరీల మార్కును తాకింది.చరిత్ర సృష్టించిన మంధనతాజా సెంచరీ పూర్తి చేసిన తర్వాత మంధన ఓ విభాగంలో చరిత్ర సృష్టించింది. మహిళల క్రికెట్కు సంబంధించి, ఓ క్యాలెండర్ ఇయర్లో (వన్డేల్లో) అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా అవతరించింది. గతంలో ఈ రికార్డు దీప్తి శర్మ పేరిట ఉండేది. దీప్తి 2017లో 19 ఇన్నింగ్స్ల్లో సెంచరీ, 7 అర్ద సెంచరీల సాయంతో 787 పరుగులు చేయగా.. మంధన ఈ ఏడాది 13 ఇన్నింగ్స్ల్లనే 3 శతకాలు, 4 అర్ద శతకాల సాయంతో 803 పరుగులు చేసింది.చరిత్రలో తొలి క్రికెటర్తాజా సెంచరీతో మంధన మరో చారిత్రక రికార్డును కూడా సొంతం చేసుకుంది. మహిళల వన్డేల్లో రెండు వేర్వేరు క్యాలెండర్ ఇయర్స్లో 3కు పైగా సెంచరీలు చేసిన తొలి బ్యాటర్గా సరికొత్త చరిత్ర సృష్టించింది. 2024లో 4 సెంచరీలు చేసిన మంధన.. ఈ ఏడాది ఇప్పటికే 3 సెంచరీలు పూర్తి చేసింది.తాజా శతకంతో మంధన రెండు వేర్వేరు దేశాలపై (ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా) మూడు వన్డే సెంచరీలు చేసిన తొలి భారత ప్లేయర్గానూ చరిత్ర సృష్టించింది. ఈ సెంచరీతో మంధన మహిళల వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో ట్యామీ బేమౌంట్తో పాటు మూడో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో మెగ్ లాన్నింగ్ (15) అగ్రస్థానంలో ఉండగా.. సూజీ బేట్స్ (13), బేమౌంట్ (12), మంధన (12) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు.ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లో మంధన 91 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 117 పరుగులు చేసి ఔటైంది. తొలి అర్ద సెంచరీకి 45 బంతులు తీసుకున్న మంధన, ఆతర్వాత అర్ద సెంచరీని కేవలం 32 బంతుల్లోనే పూర్తి చేసింది. హాఫ్ సెంచరీ మార్కును సిక్సర్తో, సెంచరీ మార్కును బౌండరీతో అందుకుంది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 38 ఓవర్ల తర్వాత 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. మంధన (117), ప్రతిక రావల్ (25), హర్లీన్ డియోల్ (10), హర్మన్ప్రీత్ (17) ఔట్ కాగా.. రిచా ఘోష్ (19), దీప్తి శర్మ (20) క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డ్నర్ 2, తహ్లియా మెక్గ్రాత్ ఓ వికెట్ తీశారు. ఈ సిరీస్లోని తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించిన విషయం తెలిసిందే. -
ఆసీస్తో సిరీస్.. న్యూజిలాండ్కు భారీ షాక్
ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్ (NZ vs AUS)కు ముందు న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వైట్బాల్ రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) సర్జరీ కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ ధ్రువీకరించింది.విజయవంతమైన కెప్టెన్.. మరోసారిఆస్ట్రేలియాతో చాపెల్- హెడ్లీ టీ20 సిరీస్కు జట్టు ప్రకటన సందర్భంగా కివీస్ బోర్డు ఈ విషయాన్ని తెలియజేసింది. సాంట్నర్ గైర్హాజరీలో మైకేల్ బ్రాస్వెల్ (Michael Bracewell) న్యూజిలాండ్ జట్టును ముందుకు నడిపించనున్నాడు. ఈ ఆల్రౌండర్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించడం ఇదే తొలిసారి కాదు.ఆ ఇద్దరి రీ ఎంట్రీఇప్పటి వరకు పది టీ20 మ్యాచ్లలో బ్లాక్క్యాప్స్కు నాయకత్వం వహించిన బ్రాస్వెల్ ఆరు విజయాలు సాధించాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్తో టీ20 సిరీస్ ద్వారా కివీస్ పేసర్లు కైలీ జెమీషన్, బెన్ సియర్స్ జట్టులోకి తిరిగి వచ్చారు. తొలి సంతానానికి స్వాగతం పలికే క్రమంలో జెమీషన్ జింబాబ్వేతో సిరీస్కు దూరం కాగా.. సియర్స్ పక్కటెముకల నొప్పితో మ్యాచ్లు ఆడలేకపోయాడు.అయితే, తాజాగా వీరిద్దరు ఆసీస్తో సిరీస్ నేపథ్యంలో పునరాగమనం చేయనున్నారు. జెమీషన్, సియర్స్ రాకతో పేస్ దళం మరింత పటిష్టంగా మారింది. వీరితో పాటు మ్యాట్ హెన్రీ, జేకబ్ డఫీ కూడా పేస్ విభాగంలో సేవలు అందించనున్నారు.తప్పుకొన్న కేన్ విలియమ్సన్ఇదిలా ఉంటే.. కెప్టెన్ సాంట్నర్తో పాటు ఫిన్ అలెన్, లాకీ ఫెర్గూసన్, ఆడమ్ మిల్నే, విలియమ్ ఒరూర్కీ, గ్లెప్ ఫిలిప్స్ తదితరులు అనారోగ్య కారణాలు, ఫిట్నెస్ సమస్యల కారణంగా ఆసీస్తో సిరీస్కు దూరమయ్యారు. మరోవైపు.. సీనియర్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ తానే స్వయంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. దీంతో బ్రాస్వెల్ కెప్టెన్గా మరోసారి రంగంలోకి దిగనున్నాడు. కాగా కివీస్ సొంతగడ్డపై అక్టోబరు 1- 4 మధ్య ఆసీస్తో మూడు టీ20 మ్యాచ్లు ఆడనుంది.ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు న్యూజిలాండ్ జట్టుమైకేల్ బ్రాస్వెల్ (కెప్టెన్), మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జేకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మ్యాట్ హెన్రీ, బెవాన్ జేకబ్స్, కైలీ జెమీషన్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, టిమ రాబిన్సన్, బెన్ సియర్స్, టిమ్ సీఫర్ట్, ఇష్ సోధి.న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్ షెడ్యూల్👉అక్టోబరు 1- తొలి టీ20- బే ఓవల్, మౌంట్ మౌంగనీయ్👉అక్టోబరు 3- రెండో టీ20- బే ఓవల్, మౌంట్ మౌంగనీయ్👉అక్టోబరు 4- మూడో టీ20- బే ఓవల్, మౌంట్ మౌంగనీయ్.చదవండి: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. పొట్టి ఫార్మాట్లో తిరుగులేని భారత్ -
పూరన్ సిక్సర్ల సునామీ.. 53 బంతుల పాటు విధ్వంసం
కరీబియన్ ప్రీమియర్ లీగ్-2025 తుది దశకు చేరింది. భారతకాలమానం ప్రకారం ఇవాల్టి నుంచి (సెప్టెంబర్ 17) ప్లే ఆఫ్స్ మ్యాచ్లు మొదలయ్యాయి. ఇవాళ జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్పై ట్రిన్బాగో నైట్రైడర్స్ ఘన విజయం సాధించి, క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. నైట్రైడర్స్ చేతిలో ఓడిన ఫాల్కన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.రేపు జరుగబోయే క్వాలిఫయర్-1లో సెయింట్ లూసియా కింగ్స్, గయానా అమెజాన్ వారియర్స్ తలపడతాయి. ఈ మ్యాచ్లో విజేత సెప్టెంబర్ 22న జరిగే ఫైనల్కు నేరుగా అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు సెప్టెంబర్ 20న జరిగే క్వాలిఫయర్-2లో నైట్రైడర్స్తో పోటీపడుతుంది. ఇక్కడ గెలిచిన జట్టు క్వాలిఫయర్-1 విజేతతో ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది.ఎలిమినేటర్ మ్యాచ్ విషయానికొస్తే.. ఫాల్కన్స్పై నైట్రైడర్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫాల్కన్స్.. ఆమిర్ జాంగూ (55), ఆండ్రియస్ గౌస్ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఆఖర్లో షకీబ్ అల్ హసన్ (9 బంతుల్లో 26 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. నైట్రైడర్స్ బౌలర్లలో సౌరభ్ నేత్రావల్కర్ 3 వికెట్లు, ఉస్మాన్ తారిఖ్, ఆండ్రీ రసెల్ తలో 2, సునీల్ నరైన్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన నైట్రైడర్స్.. అలెక్స్ హేల్స్ (54 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), నికోలస్ పూరన్ (53 బంతుల్లో 90 నాటౌట్; 3 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో ఆడుతుపాడుతూ విజయతీరాలకు చేరింది. ఆ జట్టు 17.3 ఓవర్లలో కొలిన్ మున్రో (14) వికెట్ మాత్రమే కోల్పోయి అద్భుత విజయం సాధించింది. పూరన్ సిక్సర్ల సునామీ సృష్టించి మ్యాచ్ను ఏకపక్షం చేశాడు. -
చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్లో భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. గత కొంతకాలంగా అద్భుత ప్రదర్శనలతో చెలరేగుతున్న వరుణ్.. న్యూజిలాండ్ పేసర్ జాకబ్ డఫీను అధిగమించి టాప్ ప్లేస్కు చేరాడు. గత వారం ర్యాంకింగ్స్లో నాలుగో స్థానంలో ఉండిన వరుణ్.. మూడు స్థానాలు ఎగబాకి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. తద్వారా భారత్ తరఫున నంబర్ వన్గా అవతరించిన మూడో బౌలర్గా చరిత్రకెక్కాడు. వరుణ్కు ముందు జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్ నంబర్ వన్ టీ20 బౌలర్లుగా చలామణి అయ్యారు.2021లో టీ20 అరంగేట్రం చేసిన వరుణ్ ఈ ఏడాది అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడు. కెరీర్లో మొత్తం 20 టీ20లు ఆడిన అతను.. 2 ఐదు వికెట్ల ప్రదర్శనలతో 35 వికెట్లు తీశాడు. ప్రస్తుతం ఆసియా కప్ ఆడుతున్న వరుణ్ అక్కడ కూడా మెరుగైన ప్రదర్శనలే చేస్తున్నాడు. యూఏఈపై, పాక్పై పొదుపుగా బౌలింగ్ చేసి తలో వికెట్ తీశాడు. వరుణ్ అగ్రస్థానానికి చేరుకోవడంతో టీ20 ర్యాంకింగ్స్లో భారత ఆధిపత్యం సంపూర్ణమైంది. గతేడాది టీ20 వరల్డ్కప్ గెలిచినప్పటి నుండి టీమిండియా నంబర్ వన్ టీ20 జట్టుగా చలామణి అవుతుంది. బ్యాటర్ల విభాగంలో భారత్కే చెందిన అభిషేక్ శర్మ నంబర్ టీ20 బ్యాటర్గా కొనసాగుతున్నాడు. ఆల్రౌండర్ల విభాగంలో భారత్కే చెందిన హార్దిక్ పాండ్యా నంబన్ వన్గా కొనసాగుతున్నాడు. తాజాగా వరుణ్ నంబర్ వన్ బౌలర్గా అవతరించడంతో పొట్టి ఫార్మాట్లో భారత్ అన్ని విభాగాల్లో టాప్ ప్లేస్ సాధించినట్లైంది.ర్యాంకింగ్స్లో భారత ఆధిపత్యం టీ20లకే పరిమితం కాలేదు. వన్డేల్లోనూ భారత్ నంబర్ వన్ జట్టుగా కొనసాగుతుంది. ఈ ఫార్మాట్లో నంబర్ వన్ బ్యాటర్గా టీమిండియాకే చెందిన శుభ్మన్ గిల్ చలామణి అవుతున్నాడు. టెస్ట్ ర్యాంకింగ్స్లోనూ భారత హవా కొనసాగుతుంది. నంబర్ వన్ టెస్ట్ బౌలర్గా బుమ్రా కొనసాగుతున్నాడు. నంబర్ వన్ టెస్ట్ ఆల్రౌండర్గా రవీంద్ర జడేజా ఉన్నాడు. ఓవరాల్గా చూస్తే అన్ని ఫార్మాట్ల ర్యాంకింగ్స్లో భారత ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. -
‘వాళ్ల క్యారెక్టరే అంత.. చదువు, సంస్కారం ఉంటే ఇలాంటివి చేయరు’
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొహ్మద్ యూసఫ్పై టీమిండియా మాజీ ఆల్రౌండర్ మదన్ లాల్ (Madan Lal) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. పబ్లిసిటీ కోసం ఎంతకైనా దిగజారడం పాక్ క్రికెటర్లకు అలవాటేనని.. వాళ్ల క్యారెక్టరే అంత అంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా పాకిస్తాన్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే.నో- షేక్హ్యాండ్దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. పాక్ను 127 పరుగులకే పరిమితం చేసింది. ఇక స్వల్ప లక్ష్య ఛేదనను 15.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి పూర్తి చేసింది. ఇదిలా ఉంటే.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారి దాయాదితో ముఖాముఖి తలపడిన టీమిండియా మైదానంలో ఏ దశలోనూ పాక్ ఆటగాళ్లతో ఎలాంటి కమ్యూనికేషన్ పెట్టుకోలేదు.టాస్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాక్ సారథి సల్మాన్ ఆఘాకు షేక్హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా టీమిండియా ఇదే పంథా అనుసరించింది. దీనిని తీవ్ర అవమానంగా భావించిన పాక్.. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారంటూ నానాయాగీ చేసింది.సూర్యకుమార్ యాదవ్పై దిగజారుడు వ్యాఖ్యలుఈ క్రమంలో పాక్ మాజీ క్రికెటర్ మొహ్మద్ యూసఫ్.. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. సూర్య పేరును కావాలనే తప్పుగా పలుకుతూ ‘ఆ పంది’ కుమార్ అంటూ చీప్ కామెంట్లు చేశాడు. అంతేకాదు.. అంపైర్లను అడ్డుపెట్టుకుని టీమిండియా మ్యాచ్ గెలిచిందంటూ ఆరోపించాడు.పాకిస్తాన్ క్రికెటర్ల క్యారెక్టరే అంతఈ నేపథ్యంలో 1983 వరల్డ్కప్ విజేత మదన్ లాల్ మొహ్మద్ యూసఫ్ తీరుపై మండిపడ్డాడు. ‘‘పాకిస్తాన్ క్రికెటర్ల క్యారెక్టరే అంత. ఎవరైనా దూషించే హక్కు మీకెక్కడిది?.. వాళ్లకు ఇలా మాట్లాడటం మాత్రమే తెలుసు. అంతకంటే ఇంకేమీ పట్టదు.సొంత జట్టు ప్లేయర్లనే తిట్టిన చరిత్ర వారికి ఉంది. వరుస పరాజయాలతో విసుగెత్తిపోయి ఉన్నారు. అందుకే ఇప్పుడు ఇతర జట్ల ఆటగాళ్లను కూడా దూషించడం మొదలుపెట్టారు. దీనిని బట్టి వాళ్ల చదువు, సంస్కారాలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. ఇలా మాట్లాడేవారంతా మూర్ఖులు.పబ్లిసిటీ కోసమే ఈ విషయం గురించి మనం ఎక్కువగా మాట్లాడకూడదు. నిజానికి మనమే వాళ్లకు ఎక్కువగా ప్రచారం ఇస్తున్నాం. వాళ్లకు కావాల్సింది కూడా ఇదే. పబ్లిసిటీ కోసం వాళ్లు ఏమైనా చేస్తారు. భారత జట్టు గురించి మాట్లాడుతూ వ్యూస్ కోసం యూట్యూబ్ చానెళ్లు ఇలాంటి పనిచేస్తున్నాయి’’ అని 74 ఏళ్ల మదన్ లాల్ ANIతో పేర్కొన్నాడు.అదే విధంగా.. టీమిండియా తమ అద్భుత ఆట తీరుతో గెలిచిందంటూ యూసఫ్కు మదన్ లాల్ కౌంటర్ ఇచ్చాడు. కొన్నిసార్లు అంపైర్లు తప్పు చేసినా.. ఇప్పుడున్న అత్యాధునిక సాంకేతికతో వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు.చదవండి: చావో- రేవో!.. పాకిస్తాన్ సూపర్-4కు అర్హత సాధించాలంటే.. -
మా స్థాయి ఇది కాదు!.. అందుకే బంగ్లా చేతిలో ఓటమి: రషీద్ ఖాన్
బంగ్లాదేశ్ చేతిలో ఓటమిపై అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ (Rashid Khan) స్పందించాడు. తాము స్థాయికి తగ్గట్లు ఆడలేదని.. అందుకే ఓడిపోయామని విచారం వ్యక్తం చేశాడు. ఆసియా కప్-2025 టోర్నమెంట్లో అఫ్గనిస్తాన్.. శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్లతో కలిసి గ్రూప్-బిలో ఉంది.ఈ క్రమంలో తొలుత హాంకాంగ్తో తలపడిన అఫ్గన్ జట్టు.. 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే, తాజాగా తమ రెండో మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఢీకొట్టిన రషీద్ ఖాన్ బృందం ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. అబుదాబిలో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లా.. తొలుత బ్యాటింగ్ చేసింది.తప్పక గెలిస్తేనే.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. అయితే, ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో అఫ్గనిస్తాన్ విఫలమైంది. 20 ఓవర్లలో 146 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా బంగ్లా చేతిలో ఎనిమిది పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో అఫ్గన్ సూపర్-4 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. లీగ్ దశలో చివరిగా శ్రీలంకతో ఆడబోయే మ్యాచ్లో తప్పక గెలిస్తేనే.. రషీద్ బృందానికి సూపర్-4 ఆశలు సజీవంగా ఉంటాయి.మా స్థాయి ఇది కాదుఈ నేపథ్యంలో బంగ్లాదేశ్తో మ్యాచ్ ముగిసిన అనంతరం రషీద్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘ఆఖరి వరకు పోరాడినా అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయాము. 18 బంతుల్లో 30 పరుగుల సమీకరణం పెద్ద కష్టమేమీ కాదు. దూకుడైన క్రికెట్ ఆడే జట్టుగా మాకు పేరుంది. కానీ ఈసారి స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాము.చెత్త బ్యాటింగ్ వల్లే ఓటమిఅనవసరంగా ఒత్తిడికి లోనయ్యాము. ఆరంభంలో తడబడ్డా ప్రత్యర్థిని 160 పరుగులలోపే కట్టడి చేశాము. కానీ బ్యాటింగ్ పరంగా విఫలమయ్యాము. కొన్ని చెత్త, బాధ్యతారహిత షాట్లు ఆడి మూల్యం చెల్లించుకున్నాము.టీ20 ఫార్మాట్లో కొన్నిసార్లు ప్రత్యర్థి తొలి ఆరు ఓవర్లలోనే మ్యాచ్ను తమవైపునకు తిప్పేసుకున్నా.. తిరిగి పుంజుకోవడం కష్టం. ఈ మ్యాచ్ ద్వారా మేము చాలా పాఠాలు నేర్చుకున్నాం. ఆసియా కప్ టోర్నీలో ప్రతీ మ్యాచ్ ముఖ్యమైనదే.శ్రీలంకతో మ్యాచ్కు అన్ని విధాలుగా సన్నద్ధం కావాల్సి ఉంది. ప్రస్తుతం మా ముందున్న అతిపెద్ద సవాలు ఇదే’’ అని పేర్కొన్నాడు. కాగా అఫ్గన్ జట్టు గురువారం (సెప్టెంబరు 18) శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇరుజట్ల మధ్య జరిగే ఈ నాకౌట్ పోరుకు అబుదాబి వేదిక.బంగ్లాదేశ్ వర్సెస్ అఫ్గనిస్తాన్ స్కోర్లుబంగ్లాదేశ్: 154/5 (20)అఫ్గనిస్తాన్: 146 (20)చదవండి: చావో- రేవో!.. పాకిస్తాన్ సూపర్-4కు అర్హత సాధించాలంటే..Bangladesh win, keeping playoff hopes alive 🤞 Group B battles are going down the wire. Watch #DPWorldAsiaCup2025 from Sept 9-28, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #BANvAFG pic.twitter.com/9mHoLUcTGw— Sony Sports Network (@SonySportsNetwk) September 16, 2025 -
IND vs AUS: శతకాలతో చెలరేగిన కొన్స్టాస్, ఫిలిప్.. ఆసీస్ భారీ స్కోరు
భారత్-‘ఎ’ జట్టుతో అనధికారిక తొలి టెస్టులో ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టు భారీ స్కోరు సాధించింది. లక్నో వేదికగా ఇరుజట్ల మధ్య మంగళవారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ భారత పేసర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంది. సెంచరీతో కదంతొక్కిన కొన్స్టాస్టీమిండియాపై టెస్టు అరంగేట్రం చేసిన సామ్ కొన్స్టాస్ (Sam Konstas) సెంచరీతో కదంతొక్కగా... క్యాంప్బెల్ కెల్లావే (Campbell Kellaway- 97 బంతుల్లో 88; 10 ఫోర్లు, 2 సిక్స్లు), కూపర్ కనొల్లీ (84 బంతుల్లో 70; 12 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు.తొలి వికెట్కు 198 పరుగులు జోడించిన అనంతరం క్యాంపెబల్ అవుట్ కాగా.. ఈ దశలో భారత బౌలర్లు కాస్త పోరాటం కనబర్చారు. కెప్టెన్ నాథన్ మెక్స్వీనీ (1), ఒలీవర్ పీక్ (2)ను వెంట వెంటనే ఔట్ చేశారు. దీంతో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు 198/0 నుంచి 224/4కు చేరింది. ఇక పట్టు చేజిక్కించుకోవడమే తరువాయి అనుకుంటుంటే... కూపర్ కనొల్లీ, లియామ్ స్కాట్ (79 బంతుల్లో 47 బ్యాటింగ్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) పట్టుదల కనబర్చారు.దూబే... ఒక్కడే ఈ జంట ఐదో వికెట్కు 109 పరుగులు జోడించింది. ప్రసిధ్ కృష్ణ (0/47), ఖలీల్ అహ్మద్ (1/46) పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో... ఆసీస్ ప్లేయర్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. భారత బౌలర్లలో హర్ష్ దూబే 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా రికార్డుల్లోకెక్కిన దూబే... ఒక్కడే ఆసీస్ ప్లేయర్లను ఇబ్బంది పెట్టగలిగాడు. గుర్నూర్ బ్రార్ ఒక వికెట్ తీశాడు.జోష్ ఫిలిప్ అజేయ సెంచరీఈ క్రమంలో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు తొలి ఇన్నింగ్స్లో 73 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. లియామ్ స్కాట్తో పాటు జోష్ ఫిలిప్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. వర్షం కారణంగా తొలి రోజు 73 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.ఈ క్రమంలో బుధవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా లియామ్ స్కాట్ (81) అదరగొట్టగా.. వికెట్ కీపర్ జోష్ ఫిలిప్ అజేయ సెంచరీ (123)తో దుమ్ములేపాడు. మరోవైపు.. టెయిలెండర్ జేవియర్ బార్ట్లెట్ 39 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఈ క్రమంలో ఆరు వికెట్ల నష్టానికి 532 పరుగుల భారీ స్కోరు వద్ద ఆసీస్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. భారత బౌలర్లలో హర్ష్ దూబే మూడు వికెట్లతో సత్తా చాటగా.. గుర్నూర్ బ్రార్ రెండు, ఖలీల్ అహ్మద్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక బుధవారం భోజన విరామ సమయానికి భారత్-‘ఎ’ జట్టు మూడు ఓవర్లలో మూడు పరుగులు చేసింది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ 2, నారాయణ్ జగదీశన్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో..ఒకవైపు సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు యూఏఈ వేదికగా ఆసియా కప్ టీ20 టోర్నమెంట్లో పాల్గొంటుండగా... మరోవైపు యువ ఆటగాళ్లు ఆస్ట్రేలియా- ‘ఎ’తో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ ఆడుతున్నారు. ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా... సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, ప్రసిద్ కృష్ణ, ఖలీల్ అహ్మద్ వంటి వాళ్లు బరిలో ఉన్నారు. చదవండి: IND Vs WI: టీమిండియాతో టెస్టులకు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. వికెట్ల వీరుడికి చోటు -
ఆల్టైమ్ రికార్డు బద్దలు.. చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్
ఆసియా కప్ టోర్నమెంట్లో అఫ్గనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ (Rashid Khan) సరికొత్త చరిత్ర లిఖించాడు. ఈ ఖండాంతర టోర్నీ టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ ఫాస్ట్బౌలర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) పేరిట ఉన్న ఆల్టైమ్ ఆసియా కప్ టీ20 వికెట్ల రికార్డును బద్దలు కొట్టాడు.రెండు వికెట్లు పడగొట్టిన రషీద్బంగ్లాదేశ్తో మంగళవారం నాటి మ్యాచ్ సందర్భంగా రషీద్ ఖాన్ ఈ ఘనత సాధించాడు. ఆసియా కప్-2025 టోర్నీలో భాగంగా అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్తో తలపడింది. అబుదాబిలో టాస్ గెలిచిన బంగ్లా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఓపెనర్లు సైఫ్ హసన్ (30), తాంజిద్ హసన్ (52)లతో పాటు తౌహీద్ హృదోయ్ (26) రాణించడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లా ఐదు వికెట్ల నష్టానికి 154 పరుగులు స్కోరు చేసింది. అఫ్గన్ బౌలర్లలో కెప్టెన్ రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.ఈ మ్యాచ్లో అఫ్గన్ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్.. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటాలో 26 పరుగులు ఇచ్చి.. సైఫ్ హసన్ రూపంలో కీలక వికెట్ దక్కించుకోవడంతో పాటు షమీమ్ హొసేన్ను కూడా అవుట్ చేశాడు. ఈ క్రమంలోనే ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్ల వీరుడిగా రషీద్ ఖాన్ అవతరించాడు.ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు అత్యధిక వికెట్లు తీసింది వీరే👉రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్)- 10 మ్యాచ్లలో కలిపి 14 వికెట్లు👉భువనేశ్వర్ కుమార్ (భారత్)- 6 మ్యాచ్లలో కలిపి 13 వికెట్లు👉అమ్జద్ జావేద్ (యూఏఈ)- 7 మ్యాచ్లలో కలిపి 12 వికెట్లు👉వనిందు హసరంగ (శ్రీలంక)- 8 మ్యాచ్లలో కలిపి 12 వికెట్లు👉హార్దిక్ పాండ్యా (భారత్)- 10 మ్యాచ్లలో కలిపి 12 వికెట్లు.ఆఖరి వరకు పోరాడినా..ఇక మ్యాచ్ విషయానికొస్తే.. బంగ్లా విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించలేక అఫ్గనిస్తాన్ చతికిలపడింది. నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఆఖరి వరకు పోరాడినా ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది.అఫ్గన్ బ్యాటర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (35), అజ్మతుల్లా ఒమర్జాయ్ (30) మాత్రమే ఓ మోస్తరుగా రాణించారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ మూడు వికెట్లతో చెలరేగగా.. సనూమ్ అహ్మద్, టస్కిన్ అహ్మద్, రిషాద్ హొసేన్ రెండేసి వికెట్లు కూల్చారు. ఇక అఫ్గన్కు సూపర్-4 ఆశలు సజీవంగా ఉండాలంటే.. తదుపరి మ్యాచ్లో శ్రీలంకను తప్పక ఓడించాలి.చదవండి: IND Vs PAK Handshake Row: ఐసీసీ యూటర్న్.. పాకిస్తాన్కు ఊరట?!Rashid Khan proves his genius, even in a loss 🌟 Watch #DPWorldAsiaCup2025 from Sept 9-28, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #BANvAFG pic.twitter.com/voUMwhtD2g— Sony Sports Network (@SonySportsNetwk) September 16, 2025 -
చావో- రేవో!.. పాకిస్తాన్ సూపర్-4కు చేరాలంటే..
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా ఇప్పటికే సూపర్-4 దశకు అర్హత సాధించింది. గ్రూప్-‘ఎ’లో ఉన్న భారత జట్టు తొలుత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)ని ఓడించింది. యూఏఈ విధించిన లక్ష్యాన్ని 4.3 ఓవర్లలోనే ఛేదించి తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.సూపర్-4 బెర్తు ఖరారైంది ఇలా..ఇక రెండో మ్యాచ్లో సూర్యకుమార్ సేన.. దాయాది పాకిస్తాన్ (Ind vs Pak)ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ క్రమంలో నాలుగు పాయింట్లు సంపాదించిన టీమిండియా.. యూఏఈ- ఒమన్ను ఓడించి.. ఎలిమినేట్ చేయగానే సూపర్-4 బెర్తు ఖరారు చేసుకుంది. ఇక గ్రూప్-‘ఎ’ నుంచి రెండో బెర్తు కోసం పాకిస్తాన్- యూఏఈ పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం నాటి మ్యాచ్లో ఇరుజట్లు చావోరేవో తేల్చుకోనున్నాయి. కాగా యూఏఈ- పాకిస్తాన్ ఈ టోర్నీలో ఇప్పటి వరకు చెరో మ్యాచ్ గెలిచాయి. ఈ రెండు జట్లు ఒమన్ను ఓడించి చెరో రెండు పాయింట్లు సాధించాయి.గెలిచిన జట్టుకే అవకాశంఈ క్రమంలో దుబాయ్ వేదికగా జరిగే బుధవారం జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు ఖాతాలో మరో రెండు పాయింట్లు చేరతాయి. తద్వారా మొత్తంగా నాలుగు పాయింట్లతో సూపర్-4కు అర్హత సాధిస్తుంది.అంటే.. పాకిస్తాన్ యూఏఈని ఓడిస్తే.. నేరుగా సూపర్-4లో అడుగుపెడుతుంది. ఒకవేళ యూఏఈ గెలిస్తే.. టీమిండియాతో కలిసి గ్రూప్-‘ఎ’ నుంచి సూపర్-4కు అర్హత సాధిస్తుందన్న మాట.ఫలితం తేలకుంటే మాత్రంఒకవేళ మ్యాచ్ గనుక ‘టై’ అయినా.. ఏదేని కారణాల చేత ఫలితం తేలకపోయినా ఇరుజట్లకు చెరో పాయింట్ వస్తుంది. అప్పుడు నెట్ రన్రేటు ఆధారంగా మెరుగ్గా ఉన్న జట్టుకు బెర్తు ఖరారు అవుతుంది. ప్రస్తుతం నెట్ రన్రేటు పరంగా పాకిస్తాన్ (+1.649).. యూఏఈ కంటే మెరుగ్గా ఉంది. కాబట్టి ఈ సమీకరణ ఆధారంగా పాకిస్తాన్కే సూపర్-4 చేరే అవకాశం ఉంటుంది.AI ఆధారిత టేబుల్ఒమన్, హాంకాంగ్ ఎలిమినేట్యూఏఈ వేదికగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్ టోర్నీలో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ... గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ పాల్గొంటున్నాయి. ఇప్పటికే గ్రూప్-‘ఎ’ నుంచి ఒమన్.. గ్రూప్-‘బి’ నుంచి హాంకాంగ్ ఎలిమినేట్ అయ్యాయి.చదవండి: IND Vs PAK Handshake Row: ఐసీసీ యూటర్న్.. పాకిస్తాన్కు ఊరట?! -
IND vs WI: వెస్టిండీస్ జట్టు ప్రకటన.. వికెట్ల వీరుడికి చోటు
టీమిండియాతో టెస్టు సిరీస్కు వెస్టిండీస్ (West Indies tour of India- 2025) క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. భారత పర్యటనలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టుకు రోస్టన్ ఛేజ్ (Roston Chase) కెప్టెన్గా వ్యవహరిస్తాడని తెలిపింది. వారిపై వేటుఇక ఈ టూర్లో భాగంగా మాజీ సారథి క్రెయిగ్ బ్రాత్వెట్పై వేటు వేసిన విండీస్ బోర్డు.. చివరిగా ఆస్ట్రేలియాతో ఆడిన కేసీ కార్టీ, జొహాన్ లేన్, మికైల్ లూయీస్లను కూడా జట్టు నుంచి తప్పించింది.వికెట్ల వీరుడికి చోటుఅదే విధంగా.. లెఫ్టార్మ్ స్పిన్నర్ ఖారీ పియరికి తొలిసారిగా టెస్టు జట్టులో చోటు ఇచ్చింది. వైస్ కెప్టెన్ జోమెల్ వారికన్తో కలిసి పియరి స్పెషలిస్టు స్పిన్నర్గా బరిలో దిగనున్నాడు. ఇటీవల జరిగిన వెస్టిండీస్ చాంపియన్షిప్లో 41 వికెట్లతో సత్తా చాటినందుకు గానూ పియరీకి ఈ అవకాశం దక్కింది. ఇక అలిక్ అథనాజ్, తగెనరైన్ చందర్పాల్కు వెస్టిండీస్ సెలక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు.చందర్పాల్ రాకతో టాపార్డర్లో తమ జట్టు మరింత పటిష్టం అవుతుందని.. అదే విధంగా అథనాజ్ కూడా స్పిన్ బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కోగలడని తెలిపారు. కాగా అథనాజ్ చివరిసారిగా జనవరిలో పాకిస్తాన్తో జరిగిన టెస్టు సిరీస్లో ఆడాడు. సీమర్ల కోటాలో వీరేఅయితే.. పేసర్ గుడకేశ్ మోటికి మాత్రం విశ్రాంతినిచ్చినట్లు విండీస్ బోర్డు తెలిపింది. పరిమిత ఓవర్ల సిరీస్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఉపఖండ పిచ్లపై మ్యాచ్ నేపథ్యంలో స్పిన్ విభాగానికి వారికన్ నాయకత్వం వహించనుండగా.. ఖారీ పియర్రి, రోస్టన్ ఛేజ్ అతడికి సహాయకులుగా ఉండనున్నారు.ఇక సీమర్ల కోటాలో అల్జారీ జోసెఫ్, షమార్ జోసెఫ్, ఆండర్సన్ ఫిలిప్, జేడన్ సీల్స్ స్థానం దక్కించుకున్నారు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో భాగంగా వెస్టిండీస్ టీమిండియాతో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. అక్టోబరు 2- 14 వరకు ఇరుజట్ల మధ్య అహ్మదాబాద్, ఢిల్లీ వేదికలుగా ఈ రెండు మ్యాచ్లు జరుగనున్నాయి.టీమిండియాతో టెస్టు సిరీస్కు వెస్టిండీస్ జట్టురోస్టన్ ఛేజ్ (కెప్టెన్), జోమెల్ వారికన్ (వైస్-కెప్టెన్), కెవ్లాన్ ఆండర్సన్, అలిక్ అథనాజ్, జాన్ కాంప్బెల్, తగెనరైన్ చందర్పాల్, జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్, అల్జారీ జోసెఫ్, షమార్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఆండర్సన్ ఫిలిప్, ఖారీ పియర్రి, జేడన్ సీల్స్.చదవండి: మ్యాక్స్వెల్ కీలక నిర్ణయం -
Handshake Row: ఐసీసీ యూటర్న్.. పాకిస్తాన్కు ఊరట?!
ఆసియా కప్-2025 టోర్నీలో టీమిండియాతో మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) రచ్చకెక్కింది. తమ ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్లు కరచాలనం చేయకపోవడాన్ని పీసీబీ జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలో భారత్, పాక్ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్ (Andy Pycroft)ను తక్షణం ఆసియా కప్ నుంచి తప్పించాలని పీసీబీ డిమాండ్ చేసింది.ఆయనే బాధ్యుడంటూ..ఈ మేరకు ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లకు ఫిర్యాదు కూడా చేసింది. మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ షేక్హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్ సల్మాన్ ఆఘాకు చెప్పాడని, ఈ వివాదానికి ఆయనే బాధ్యుడని ఫిర్యాదులో ప్రముఖంగా పేర్కొంది.ఈ విషయంపై మంగళవారం స్పందించిన ఐసీసీ పాక్ బోర్డు ఫిర్యాదును తోసిపుచ్చింది. ‘సోమవారం రాత్రే ఐసీసీ తమ నిర్ణయాన్ని వెలువరించింది. రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ను తప్పించలేమని పాక్ బోర్డు ఫిర్యాదును తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశాం’ అని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. కాగా జింబాబ్వేకు చెందిన పైక్రాఫ్ట్కు అంతర్జాతీయ క్రికెట్లో విశేషానుభవం వుంది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో సీనియర్ రిఫరీ అయిన ఆయన మూడు ఫార్మాట్లలో కలిసి 695 మ్యాచ్లకు రిఫరీగా వ్యవహరించారు. పురుషులు, మహిళల మ్యాచ్లు కలిపి ఉన్నాయి.ఐసీసీ యూటర్న్.. పాక్కు ఊరట?!ఈ నేపథ్యంలో కనీసం తమ మ్యాచ్ల వరకైనా ఆండీ క్రాఫ్ట్ను దూరం పెట్టి రిచీ రిచర్డ్సన్కు రిఫరీ బాధ్యతలు ఇవ్వాలని పీసీబీ కోరింది. కాగా ఆసియా కప్ టోర్నీలో బుధవారం పాకిస్తాన్- యూఏఈ మధ్య జరిగే మ్యాచ్కూ పైక్రాఫ్ట్ రిఫరీగా ఉన్నారు. అయితే, పీసీబీ విజ్ఞప్తిని మన్నించిన ఐసీసీ.. ఈ టోర్నీలో పాకిస్తాన్ ఆడబోయే అన్ని మ్యాచ్ల నుంచి పైక్రాఫ్ట్ను రిఫరీగా తప్పించినట్లు ఎన్డీటీవీ తన తాజా కథనంలో పేర్కొంది.కాగా పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాక్ సారథి సల్మాన్ ఆఘాకు షేక్హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా భారత ఆటగాళ్లు పాక్ జట్టుతో కరచాలనం చేయలేదు. కచ్చితమైన నిబంధనలేమీ లేవుఈ నేపథ్యంలో పీసీబీ రిఫరీతో పాటు టీమిండియా తీరును తప్పుబట్టగా.. ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వాలన్న కచ్చితమైన నిబంధనలేమీ లేవని బీసీసీఐ కౌంటర్ ఇచ్చింది.ఇక దుబాయ్ వేదికగా ఏడు వికెట్ల తేడాతో పాక్ను ఓడించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కొన్ని అంశాలు క్రీడాస్ఫూర్తికి మించినవి ఉంటాయంటూ పాక్ విమర్శలను తిప్పికొట్టాడు. పాక్పై ఈ గెలుపును ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత సైన్యానికి అంకితం చేస్తున్నట్లు తెలిపాడు. అలాగే పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని సూర్య స్పష్టం చేశాడు.చదవండి: సూర్యకుమార్పై పాక్ మాజీ కెప్టెన్ దిగజారుడు వ్యాఖ్యలు.. ఇచ్చిపడేసిన కోచ్ -
Asia Cup: గట్టెక్కిన బంగ్లాదేశ్
అబుదాబి: ఆసియా కప్ టి20 టోర్నీలో బంగ్లాదేశ్ కీలక విజయాన్ని అందుకుంది. ‘సూపర్–4’ రేసులో తమకు పోటీగా వచ్చే అవకాశం ఉన్న అఫ్గానిస్తాన్పై పైచేయి సాధించింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్లో బంగ్లా 8 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ను ఓడించింది. ముందుగా బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఓపెనర్ తన్జీద్ హసన్ (31 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. తన్జీద్, మరో ఓపెనర్ సైఫ్ హసన్ (28 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) కలిసి తొలి వికెట్కు 40 బంతుల్లో 63 పరుగులు జోడించారు. అయితే ఆ తర్వాత అఫ్గాన్ స్పిన్నర్లు నూర్ అహ్మద్ (2/23), రషీద్ ఖాన్ (2/26) బంగ్లా బ్యాటర్లను కట్టి పడేసి తొలి నాలుగు వికెట్లు పడగొట్టారు. ఈ దశలో తౌహీద్ హృదయ్ (20 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) కొంత పోరాడటంతో స్కోరు 150 పరుగులు దాటింది. అనంతరం అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. గుర్బాజ్ (31 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్స్లు), ఒమర్జాయ్ (16 బంతుల్లో 30; 1 ఫోర్, 3 సిక్స్లు) ఫర్వాలేదనిపించగా...ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. చివర్లో రషీద్ ఖాన్ (11 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) గెలిపించేందుకు ప్రయత్నించినా ... 11 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన దశలో అతను అవుట్ కావడంతో అఫ్గాన్ ఓటమి ఖాయమైంది. ముస్తఫిజుర్ రహమాన్ 3 వికెట్లు పడగొట్టగా... నసుమ్ అహ్మద్, రిషాద్ హుస్సేన్ చెరో 2 వికెట్లు తీశారు. నేడు జరిగే మ్యాచ్లో యూఏఈతో పాకిస్తాన్ ఆడుతుంది. -
సిరీస్ కైవసం చేసుకున్న జింబాబ్వే
స్వదేశంలో నమీబియాతో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను జింబాబ్వే మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. బులవాయో వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 16) జరిగిన రెండో మ్యాచ్లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో నమీబియాను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగా.. జింబాబ్వే మరో 11 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో కూడా జింబాబ్వేనే గెలుపొందింది. 33 పరుగుల తేడాతో పర్యాటక జట్టును ఓడించింది. నామమాత్రపు చివరి టీ20 సెప్టెంబర్ 18న బులవాయో వేదికగా జరుగనుంది.రాణించిన క్రుగర్, లాఫ్టీతొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా.. మలాన్ క్రుగర్ (45), లాఫ్టీ ఈటన్ (47) రాణించడంతో గౌరవప్రదమైన స్కోర్ చేసింది. కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ (37), జాన్ ఫ్రైలింక్ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. చివరి ఓవర్లలో నమీబియా బ్యాటర్లు ఒత్తిడికి లోనై వికెట్లు పారేసుకుని పెద్ద స్కోర్ చేయలేకపోయారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఈవాన్స్, రిచర్డ్ నగరవ తలో 2 వికెట్లు తీయగా.. మపోసా, కెప్టెన్ సికందర్ రజా చెరో వికెట్ దక్కించుకున్నారు.చెలరేగిన బెన్నెట్.. సత్తా చాటిన మరుమణి170 పరుగుల ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే.. ఆది నుంచి ధాటిగా ఆడటం ప్రారంభించింది. ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ (40), మరుమణి (50) పోటీపడి పరుగులు రాబట్టారు. అనంతరం బ్రెండన్ టేలర్ (29), ర్యాన్ బర్ల్ (24 నాటౌట్) కూడా బ్యాట్ ఝులిపించడంతో జింబాబ్వే 5 వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. నమీబియా బౌలర్లలో స్మిట్ 2, బెర్నాల్డ్ స్కోల్జ్, ట్రంపల్మన్ తలో వికెట్ తీశారు. ముసేకివా సిక్సర్ కొట్టి జింబాబ్వేను గెలిపించాడు. -
అంతర్జాతీయ క్రికెటర్పై నిషేధం
నెదర్లాండ్స్ జాతీయ జట్టు ఆటగాడు వివియన్ కింగ్మా నిషేధానికి గురయ్యాడు. 30 ఏళ్ల ఈ పేసర్ ఐసీసీ యాంటీ-డోపింగ్ కోడ్ను ఉల్లంఘించినందుకు గానూ మూడు నెలల నిషేధానికి గురయ్యాడు. కింగ్మాకు ఈ ఏడాది మే 12న యూఏఈతో జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ లీగ్-2 వన్డే మ్యాచ్ తర్వాత డోపింగ్ పరీక్ష నిర్వహించగా.. అందులో అతను బెంజోయెల్కోగ్నిన్ (కోకైన్ మెటబోలైట్) అనే రిక్రియేషనల్ డ్రగ్ వాడినట్లు నిర్దారణ అయ్యింది. ఈ డ్రగ్ ఐసీసీ నిషేధిత జాబితాలో ఉంది.కింగ్మా నిషేధ కాలం ఆగస్టు 15 నుంచి మూడు నెలల పాటు అమల్లో ఉంటుందని ఐసీసీ తెలిపింది. ఐసీసీ ఆమోదించిన చికిత్సా కార్యక్రమాన్ని పూర్తి చేస్తే, నిషేధకాలాన్ని ఒక నెలకు తగ్గించే అవకాశం ఉంది. ఐసీసీ యాంటి-డోపింగ్ కోడ్ ప్రకారం.. మే 12 నుంచి (డోపీగా దొరికిన రోజు) కింగ్మా ఆడిన మ్యాచ్లన్నీ డిస్క్వాలిఫై అవుతాయి. అంటే ఆ మ్యాచ్ల్లో కింగ్మా తీసిన వికెట్లు, పరుగులు, క్యాచ్లు పరిగణలోకి రావు. నాటి నుంచి కింగ్మా యూఏఈతో వన్డే, నేపాల్, స్కాట్లాండ్తో రెండు వన్డేలు, ఓ టీ20 ఆడాడు. ఈ మ్యాచ్ల్లో కింగ్మా గణాంకాలన్నీ రికార్డుల్లో నుంచి తొలగించబడతాయి. మరోవైపు కింగ్మా తాను చేసిన తప్పును అంగీకరించాడు. నిషేధిత డ్రగ్స్ను పోటీకి బయట ఉపయోగించినట్లు ఒప్పుకున్నాడు. గత ఏడాది కాలంలో కగిసో రబాడా (దక్షిణాఫ్రికా), డగ్ బ్రేస్వెల్ (న్యూజిలాండ్) కూడా కింగ్మా లాగే రిక్రియేషనల్ డ్రగ్ వాడకానికి సంబంధించి నిషేధాలు ఎదుర్కొన్నారు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన కింగ్మా నెదర్లాండ్స్ తరఫున 30 వన్డేలు, 26 టీ20లు ఆడాడు. ఇందులో 40 వన్డే వికెట్లు, 24 టీ20 వికెట్లు పడగొట్టాడు. -
చరిత్ర సృష్టించిన నిసాంక.. శ్రీలంక తొలి ప్లేయర్గా..
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో శ్రీలంక వరుసగా రెండో విజయం సాధించింది. గ్రూప్-బిలో ఉన్న లంక జట్టు తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. అయితే, రెండో మ్యాచ్లో భాగంగా పసికూన హాంకాంగ్తో తలపడిన శ్రీలంక (SL vs HK).. గెలుపు కోసం ఆపసోపాలు పడింది.దుబాయ్ వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 149 పరుగుల మేర మెరుగైన స్కోరు సాధించింది.నిజాకత్ ఖాన్ మెరుపులుఓపెనర్లు జీషన్ అలీ (23), అన్షుమాన్ రథ్ (48) శుభారంభం అందించగా.. నాలుగో నంబర్ బ్యాటర్ నిజాకత్ ఖాన్ అజేయ మెరుపు అర్ధ శతకం (38 బంతుల్లో 52)తో అలరించాడు. అయితే, హాంకాంగ్ విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు శ్రీలంక గట్టిగానే శ్రమించాల్సి వచ్చింది.హాంకాంగ్ బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ఓపెనర్ కుశాల్ మెండిస్ 11, కమిల్ మిశారా 19, కుశాల్ పెరీరా 20 పరుగులు చేయగా.. కెప్టెన్ చరిత్ అసలంక (2), కమిందు మెండిస్ (5) పూర్తిగా విఫలమయ్యారు.పాతుమ్ నిసాంక హాఫ్ సెంచరీఅయితే, ఓవైపు వికెట్లు పడుతున్నా మరో ఓపెనర్ పాతుమ్ నిసాంక మాత్రం పట్టుదలగా నిలబడ్డాడు. మొత్తంగా 44 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేశాడు. నిసాంక అర్ధ శతకానికి తోడు ఆఖర్లో వనిందు హసరంగ (9 బంతుల్లో 29 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో లంక గట్టెక్కగలిగింది.శ్రీలంక తొలి ప్లేయర్గా..ఇక శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించిన పాతుమ్ నిసాంకకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అంతేకాదు ఈ మ్యాచ్ సందర్భంగా నిసాంక ఓ అరుదైన రికార్డు కూడా సాధించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో శ్రీలంక తరఫున అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.కాగా అంతకు ముందు ఈ రికార్డు కుశాల్ మెండిస్ పేరిట ఉండేది. అతడి ఖాతాలో 16 ఫిఫ్టీ ప్లస్ టీ20 స్కోర్లు ఉండగా.. నిసాంక (17) అతడిని అధిగమించాడు. ఇదిలా ఉంటే కుశాల్ పెరీరా కూడా 16సార్లు యాభైకి పైగా స్కోర్లు సాధించి కుశాల్ మెండిస్తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.శ్రీలంక వర్సెస్ హాంకాంగ్ స్కోర్లు👉హాంకాంగ్:149/4 (20)👉శ్రీలంక: 153/6 (18.5)👉ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో హాంకాంగ్పై శ్రీలంక గెలుపు.చదవండి: ఒకప్పుడు ‘చిరుత’.. ఇప్పుడు మెట్లు ఎక్కాలన్నా ఆయాసమే! -
మ్యాక్స్వెల్ కీలక నిర్ణయం
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఈ ఏడాది జూన్లో అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకు చాలా ముందు నుంచే అతను దేశవాలీ వన్డేలు (లిస్ట్-ఏ, 50 ఓవర్ల ఫార్మాట్) కూడా ఆడటం లేదు. తాజాగా మ్యాక్సీ 50 ఓవర్ల ఫార్మాట్లో మరోసారి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు.దేశవాలీ వన్డే టోర్నీ డీన్ జోన్స్ ట్రోఫీ కోసం విక్టోరియా తరఫున బరిలోకి దిగనున్నాడు. మ్యాక్సీ 2022 తర్వాత ఒకే ఒక లిస్ట్-ఏ మ్యాచ్ ఆడాడు. త్వరలో న్యూజిలాండ్తో జరుగుబోయే టీ20 సిరీస్కు ముందు ఫిట్నెస్ సాధించేందుకు మ్యాక్సీ డీన్ జోన్స్ ట్రోఫీ ఆడనున్నాడు. ఈ టోర్నీలో మ్యాక్సీ సెప్టెంబర్ 17న క్వీన్స్ల్యాండ్తో, సెప్టెంబర్ 19న టస్మానియాతో జరుగబోయే మ్యాచ్ల్లో ఆడతాడు.మ్యాక్స్వెల్ జట్టులో (విక్టోరియా) మ్యాట్ షార్ట్, పీటర్ హ్యాండ్స్కోంబ్, మార్కస్ హ్యారిస్, విల్ సదర్ల్యాండ్ లాంటి పేరున్న ఆటగాళ్లు ఉన్నారు. విక్టోరియా ఈ టోర్నీ గత సీజన్లో ఫైనల్కు చేరినప్పటికీ టైటిల్ గెలవలేకపోయింది. మ్యాక్స్వెల్ లాంటి అనుభవజ్ఞుడు ఈ సీజన్లో విక్టోరియా తరఫున బరిలోకి దిగుతుండటం ఆ జట్టుకు మానసిక బలాన్ని చేకూరుస్తుంది.ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా ఇటీవలికాలంలో వెస్టిండీస్, సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లు ఆడింది. వీటిలో విండీస్ సిరీస్ను 5-0 తేడాతో క్లీన్స్వీప్ చేసిన ఆసీస్.. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ను 2-1 తేడాతో దక్కించుకుంది. సౌతాఫ్రికా సిరీస్లోని నిర్ణయాత్మక చివరి మ్యాచ్లో మ్యాక్స్వెల్ ఆల్రౌండ్ ప్రదర్శనతో (0/15 (2), 62* (36)) ఆకట్టుకుని, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పర్యటన అక్టోబర్ 1 నుంచి మొదలవుతుంది. ఈ పర్యటనలో ఆసీస్ 3 టీ20లు ఆడుతుంది. అక్టోబర్ 1, 3, 4 తేదీల్లో మౌంట్ మాంగనూయ్ వేదికగా ఈ మూడు మ్యాచ్లు జరుగుతాయి. -
కొన్స్టాస్ శతకం.. శ్రేయస్ సేనపై ఆసీస్ బ్యాటర్ల పైచేయి
శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత్ ఏ జట్టుతో ఇవాళ (సెప్టెంబర్ 16) ప్రారంభమైన తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా-ఏ బ్యాటర్లు పైచేయి సాధించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆసీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 73 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. యువ ఓపెనర్ సామ్ కొన్స్టాస్ (114 బంతుల్లో 109; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కాడు. మరో ఓపెనర్ క్యాంప్బెల్ కెల్లావే (97 బంతుల్లో 88; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. వన్, టు డౌన్ బ్యాటర్లు నాథన్ మెక్స్వీని (1), ఒలివర్ పీక్ (2) స్వల్ప స్కోర్లకే ఔటై నిరాశపరిచినా.. ఆతర్వాత వచ్చిన కూపర్ కన్నోల్లీ (84 బంతుల్లో 70; 12 ఫోర్లు, సిక్స్) సత్తా చాటాడు. ఆట ముగిసే సమయానికి లియామ్ స్కాట్ 47, జోష్ ఫిలిప్ 3 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.టీ విరామం వరకు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయిన భారత బౌలర్లు.. ఆతర్వాత 26 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాచ్పై పట్టు సాధించేలా కనిపించారు. అయితే ఈసారి కూపర్ కన్నోల్లీ-లియామ్ స్కాట్ భారత్ పైచేయి సాధించకుండా అడ్డు తగిలారు. వీరిద్దరు ఐదో వికెట్కు 109 పరుగులు జోడించి ఆసీస్ను పటిష్ట స్థితికి చేర్చారు. కన్నోల్లీ ఔటైనా లియామ్ స్కాట్ బాధ్యతగా ఆడుతూ ఆసీస్ను భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తున్నాడు. అంతకుముందు కొన్స్టాస్-కెల్లావే జోడీ తొలి వికెట్కు 198 పరుగులు జోడించి ఇన్నింగ్స్కు గట్టి పునాది వేసింది.గుర్నూర్ బ్రార్ భారత్కు తొలి బ్రేక్ అందించారు. కెల్లావేను ఔట్ చేశాడు. అనంతరం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హర్ష్ దూబే ఒక్కసారిగా చెలరేగాడు. స్వల్ప వ్యవధిలో కెప్టెన్ మెక్స్వీనిని, సెంచరీ హీరో కొన్స్టాస్ను పెవిలియన్కు పంపాడు. ఆతర్వాత ఖలీల్ అహ్మద్ ఒలివర్ పీక్ను ఔట్ చేశాడు. అనంతరం కన్నోల్లీ, లియామ్ స్కాట్ భారత బౌలర్ల సహనాన్ని చాలాసేపు పరీక్షించారు. 333 పరుగుల వద్ద హర్ష్ భారత్కు మరోసారి బ్రేక్ ఇచ్చాడు. సెంచరీ దిశగా సాగుతున్న కన్నోల్లీని బోల్తా కొట్టించాడు.కాగా, ఆస్ట్రేలియా-ఏ జట్టు రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్లు (నాలుగు రోజుల మ్యాచ్లు), మూడు అనధికారిక వన్డేల కోసం భారత్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళే తొలి టెస్ట్ మొదలైంది. రెండో టెస్ట్ కూడా ఎకానా స్టేడియంలోనే సెప్టెంబర్ 23-26 మధ్యలో జరుగతుంది. ఆతర్వాత సెప్టెంబర్ 30, అక్టోబర్ 3, 5 తేదీల్లో కాన్పూర్లో వన్డేలు జరుగుతాయి. -
సూర్యపై పాక్ మాజీ కెప్టెన్ దిగజారుడు వ్యాఖ్యలు.. ఇచ్చిపడేసిన కోచ్
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొహ్మద్ యూసఫ్ (Mohammed Yousuf)పై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) చిన్ననాటి కోచ్ అశోక్ అస్వాల్కర్ మండిపడ్డాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన క్రికెటర్ నుంచి ఇలాంటి చెత్త మాటలు ఊహించలేదన్నాడు. అయినా అతడి స్థాయికి ఇంతకంటే గొప్పగా మాట్లాడతాడనుకోలేదంటూ చురకలు అంటించాడు.ఆసియా కప్-2025 టోర్నీలో భాగంగా టీమిండియా ఆదివారం పాక్తో మ్యాచ్ ఆడింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ టీ20 పోరులో సూర్యకుమార్ సేన సల్మాన్ ఆఘా బృందాన్ని ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. బీసీసీఐ కౌంటర్ అయితే, టాస్ సమయంలోగానీ.. మ్యాచ్ ముగిసిన తర్వాత గానీ భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో కరచాలనం చేయలేదు. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు మద్దతుగా పాక్ ఆటగాళ్లతో షేక్హ్యాండ్కు నిరాకరించింది.దీనిని అవమానంగా భావించిన పాక్ జట్టు.. విషయాన్ని ఐసీసీ వరకు తీసుకువెళ్లగా.. కచ్చితంగా షేక్హ్యాండ్ చేయాలన్న నిబంధన లేదంటూ బీసీసీఐ కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ మొహ్మద్ యూసఫ్ టీమిండియాపై అవాకులు, చెవాకులు పేలుతూ అక్కసు వెళ్లగక్కాడు.సూర్య పేరును ఉద్దేశపూర్వకంగానే తప్పుగా పలుకుతూషేక్హ్యాండ్ గురించి సామా టీవీలో మాట్లాడుతూ.. సూర్యకుమార్ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సూర్య పేరును ఉద్దేశపూర్వకంగానే తప్పుగా పలుకుతూ పంది అనే అర్థం వచ్చేలా దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు అంపైర్లను అడ్డుపెట్టుకుని గెలిచారంటూ నిరాధార ఆరోపణలు చేశాడు. అతడి మాటలకు అక్కడున్న వాళ్లు పళ్ళు ఇకిలిస్తూ శునకానందం పొందారు.ఇంతకంటే ఇంకా ఎంతకు దిగజారగలరు?ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ చిన్ననాటి కోచ్ అశోక్ అస్వాల్కర్ స్పందించాడు. ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఇంతకంటే ఇంకా ఎంతకు దిగజారగలరు? వాళ్లు ఇలాంటి చెత్త మాటలు మాట్లాడుతూనే ఉంటారు.మైదానంలో ఏం చేయాలో మాత్రం అది చేయరు. కానీ మైదానం వెలుపల ఇలాంటి పిచ్చి మాటలతో హైలైట్ అవుతారు. ప్రపంచం మొత్తం వీరిని గమనిస్తూనే ఉంది. ఇంతకంటే టీమిండియాను వారు ఏం చేయగలరు?ప్రతి ఒక్కరికి తమకంటూ గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన వ్యక్తి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడంటే వారు ఎలాంటి వారో అర్థం చేసుకోవచ్చు. అయినా.. ఎవరైనా సరే తమ స్థాయికి తగ్గట్లే మాట్లాడతారు కదా!మా జట్టు గొప్పగా ఆడుతోందిఆట గురించి ఎలాంటి విమర్శలు చేసినా తప్పులేదు. కానీ వ్యక్తిగతంగా ఇలా చేయడం ముమ్మాటికీ తప్పే. మీరు ఏదైనామాట్లాడాలనుకుంటే ఆట గురించి మాట్లాడండి. మా జట్టు గొప్పగా ఆడుతోంది. మీ ఆటగాళ్ల పరిస్థితి ఎలా ఉందో చూసుకోండి. క్రికెట్ మీద మాత్రమే దృష్టి పెట్టి.. బాగా ఆడితే మిమ్మల్ని కూడా ఎవరో ఒకరు పొగుడుతారు. అంతేగానీ ఇతర జట్ల ఆటగాళ్ల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు’’ అంటూ అశోక్ అస్వాల్కర్ మొహ్మద్ యూసఫ్నకు గట్టిగానే చురకలు అంటించాడు.చదవండి: టీమిండియా ‘బిగ్ లూజర్’ అంటూ కామెంట్లు?.. పాక్ మీడియాపై పాంటింగ్ ఫైర్ -
టీమిండియా ‘బిగ్ లూజర్’?.. పాక్ మీడియాపై పాంటింగ్ ఫైర్
టీమిండియా- పాకిస్తాన్ మధ్య ‘నో-షేక్హ్యాండ్ No- Shakehand)’ వివాదం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆసియా కప్-2025 టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా దాయాదులు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత జట్టు పాక్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది.అయితే, పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు భారత జట్టు నిరాకరించింది. షేక్హ్యాండ్ లేకుండానే డ్రెసింగ్ రూమ్కు వెళ్లిపోయింది. ఈ క్రమంలో తమను అవమానించారంటూ పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసేవరకు వెళ్లింది.మరోవైపు.. షేక్హ్యాండ్ చేయాలన్న నిబంధన లేదని.. తమ ఆటగాళ్లు చేసిన దాంట్లో తప్పేమీ లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో టీమిండియాను సమర్థిస్తూ భారత మాజీ క్రికెటర్లు వ్యాఖ్యలు చేయగా.. ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్ మాత్రం సూర్యకుమార్ సేనను విమర్శించినట్లు వార్తలు వైరల్ అయ్యాయి.టీమిండియా ‘బిగ్ లూజర్’?‘‘ఈ మ్యాచ్ ఎల్లకాలం గుర్తుండిపోతుంది. ఇండియా బిగ్ లూజర్గా మనకు గుర్తుంటుంది. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు వెళ్లిన పాకిస్తానీ జట్టు ప్రవర్తన జెంటిల్మేన్ గేమ్లో వాళ్లను అమరులుగా నిలిపితే.. భారత జట్టు మాత్రం పరాజితగా మిగిలిపోతుంది’’ అని పాంటింగ్ అన్నట్లుగా పాక్ మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.అసలు అలాంటి కామెంట్లు చేయనేలేదుఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్పై భారతీయ నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో పాంటింగ్ స్వయంగా ఈ విషయంపై స్పందించాడు. ‘‘సోషల్ మీడియాలో నా పేరు చెప్పి వైరల్ అవుతున్న వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి.నేను అసలు అలాంటి కామెంట్లు చేయనేలేదు. అసలు ఆసియా కప్ టోర్నమెంట్ గురించి నేను ఇంత వరకు బహిరంగంగా ఒక్క మాట కూడా మాట్లాడనే లేదు’’ అంటూ పాక్ నెటిజన్లకు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చాడు. ‘ఎక్స్’ వేదికగా పాంటింగ్ ఈ మేరకు స్పష్టతనిచ్చాడు.ఐపీఎల్తో విడదీయరాని అనుబంధంకాగా ఆసీస్ దిగ్గజ కెప్టెన్గా పేరొందిన పాంటింగ్కు ఐపీఎల్తో విడదీయరాని అనుబంధం ఉంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు హెడ్కోచ్గా పనిచేసిన ఈ లెజెండరీ బ్యాటర్.. గతేడాది పంజాబ్ కింగ్స్కు మార్గనిర్దేశనం చేశాడు. అతడి గైడెన్స్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ ఫైనల్ చేరింది. అయితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. చదవండి: ఛీ.. మరీ సిగ్గు లేకుండా తయారయ్యారు.. ఇదేం పద్ధతి? -
భారత గడ్డపై తొలి మ్యాచ్లోనే శతక్కొట్టిన ఆస్ట్రేలియా యువ సంచలనం
ఆస్ట్రేలియా యువ సంచలనం సామ్ కొన్స్టాస్ భారత గడ్డపై తన తొలి మ్యాచ్లోనే మెరుపు సెంచరీతో కదంతొక్కాడు. 19 ఏళ్ల ఈ ఆసీస్ యువ ఓపెనర్ ప్రస్తుతం ఆస్ట్రేలియా-ఏ జట్టులో భాగంగా భారత్లో పర్యటిస్తున్నాడు. లక్నోలోని ఎకానా స్టేడియంలో భారత-ఏ జట్టుతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్లో 122 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. తనుశ్ కోటియన్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాది మూడంకెల మార్కును తాకాడు. మొత్తంగా 126 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 101 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. కొన్స్టాస్కు జతగా మరో ఓపెనర్ క్యాంప్బెల్ కెల్లావే (88) కూడా సెంచరీని సమీపించాడు. కెల్లావే 73 పరుగుల వద్ద ఉండగా.. 56 పరుగుల వద్ద ఉండిన కొన్స్టాస్ వేగంగా సెంచరీ పూర్తి చేశాడు.ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా-ఏ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. తొలి రోజు టీ విరామం సమయానికి ఆసీస్-ఏ స్కోర్ 198/0గా ఉంది. భారత బౌలర్లు 37 ఓవర్ల పాటు బౌలింగ్ చేసినా ఒక్క వికెట్ను కూడా పడగొట్టలేకపోయారు. టీమిండియాకు ఆడిన అనుభవం ఉన్న బౌలర్లు ప్రసిద్ద్ కృష్ణ, ఖలీల్ అహ్మద్ కూడా ఈ మ్యాచ్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. తనుశ్ కోటియన్, హర్ష్ దూబే భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ ఒక్కడే ఆసీస్-ఏ ఓపెనర్లను కాస్త నిలువరించగలిగాడు.ఈ మ్యాచ్లో ఆసీస్-ఏ జట్టుకు నాథన్ మెక్స్వీని కెప్టెన్గా వ్యవహరిస్తుండగా.. కొన్స్టాస్, జోష్ ఫిలిప్, కూపర్ కన్నోలీ, జేవియర్ బార్ట్లెట్, టాడ్ మర్ఫీ లాంటి గుర్తించదగ్గ ఆటగాళ్లు తుది జట్టులో ఉన్నారు. భారత-ఏ జట్టు విషయానికొస్తే.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ వ్యవహరిస్తున్నాడు. అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, ఎన్ జగదీషన్, దేవ్దత్ పడిక్కల్, ధృవ్ జురెల్, తనుశ్ కోటియన్, హర్ష్ దూబే, ప్రసిద్ద్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ బ్రార్ తుది జట్టులో ఉన్నారు.ఆస్ట్రేలియా-ఏ జట్టు రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్లు (నాలుగు రోజుల మ్యాచ్లు), మూడు అనధికారిక వన్డేల కోసం భారత్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళే తొలి టెస్ట్ మొదలైంది. రెండో టెస్ట్ కూడా ఎకానా స్టేడియంలోనే సెప్టెంబర్ 23-26 మధ్యలో జరుగతుంది. ఆతర్వాత సెప్టెంబర్ 30, అక్టోబర్ 3, 5 తేదీల్లో కాన్పూర్లో వన్డేలు జరుగుతాయి. ఈ సిరీస్ల కోసం భారత-ఏ జట్లను ఇదివరకే ప్రకటించారు. బుమ్రాతో గొడవతో హైలైటైన కొన్స్టాస్కొన్స్టాస్ గతేడాది భారత్తో జరిగిన మెల్బోర్న్ టెస్ట్తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్లోనే అర్ద సెంచరీతో సత్తా చాటిన కొన్స్టాస్.. తన రెండో టెస్ట్లోనే (సిడ్నీ) టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో గొడవపడి మరింత హైలైట్ అయ్యాడు. -
టీమిండియాకు కొత్త జెర్సీ స్పాన్సర్
టీమిండియాకు కొత్త జెర్సీ స్పాన్సర్ వచ్చేసింది. అపోలో టైర్స్ (Apollo Tyres) భారత జట్టు జెర్సీ స్పాన్సర్ హక్కులు దక్కించుకుంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. ఒప్పందం ప్రకారం 2027 వరకు అపోలో టైర్స్ టీమిండియా జెర్సీ స్పాన్సర్గా వ్యవహరించనుంది. ‘డ్రీమ్ 11’తో కటీఫ్కాగా ఫాంటసీ స్పోర్ట్స్ కంపెనీ ‘డ్రీమ్ 11’ ఇటీవలే భారత క్రికెట్ జట్టు జెర్సీ స్పాన్సర్ హక్కులు కోల్పోయిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్’ను అనుసరించి.. డ్రీమ్ 11తో బీసీసీఐ తమ బంధాన్ని తెంచుకుంది. ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. కాగా మూడేళ్ల కాలానికి 2023లో రూ.358 కోట్లతో డ్రీమ్ 11 ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.ఒక్కో మ్యాచ్కు రూ. 4.5 కోట్లుఅయితే, ఇప్పుడు అనూహ్య రీతిలో డ్రీమ్ 11పై వేటు పడగా.. అపోలో టైర్స్ ఆ స్థానాన్ని భర్తీ చేసింది. ఈ క్రమంలో ఒక్కో మ్యాచ్కు రూ. 4.5 కోట్ల చొప్పున అపోలో టైర్స్ బోర్డుకు చెల్లించనుంది. ఒప్పంద కాలంలో దాదాపు 130 మ్యాచ్లకు ఈ సంస్థ జెర్సీ స్పాన్సర్గా ఉండనుంది. అంతకు ముందు డ్రీమ్ 11 జెర్సీ స్పాన్సర్గా ఉండి.. ఒక్కో మ్యాచ్కు రూ. 4 కోట్లు చెల్లించింది.కాగా టీమిండియా జెర్సీ స్పాన్సర్ హక్కులు దక్కించుకునేందుకు కాన్వా, జేకే టైర్, బిర్లా ఓప్టస్ పెయింట్స్ వంటివి ఆసక్తి చూపగా.. అపోలో టైర్స్ తమ బిడ్ను ఖరారు చేసుకుంది. ఇదిలా ఉంటే.. అర్ధంతరంగా డ్రీమ్ 11 తప్పుకోవాల్సి రావడంతో టీమిండియా ఆసియా కప్-2025 టోర్నమెంట్లో జెర్సీ స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగిన విషయం తెలిసిందే.చదవండి: ఛీ.. మరీ సిగ్గు లేకుండా తయారయ్యారు.. ఇదేం పద్ధతి? -
మరోసారి అగ్రపీఠాన్ని అధిరోహించిన టీమిండియా స్టార్ ప్లేయర్
భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధన ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానానికి చేరింది. గత వారం ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో ఉండిన మంధన.. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో రాణించి (58 బంతుల్లో 63; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) 7 అదనపు రేటింగ్ పాయింట్లను సాధించింది. తద్వారా తన పాయింట్ల సంఖ్యను 735కు పెంచుకుని టాప్ ర్యాంక్కు చేరింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ను కిందకు దించి, కెరీర్లో నాలుగో సారి అగ్రపీఠాన్ని అధిరోహించింది. 2019లో తొలిసారి టాప్ ర్యాంక్ను కైవసం చేసుకున్న మంధన.. ఈ ఏడాది జూన్, జులైల్లో కూడా స్వల్ప కాలం నంబర్ వన్ వన్డే బ్యాటర్గా కొనసాగింది. ప్రస్తుతం మంధనకు రెండో స్థానంలో ఉన్న బ్రంట్కు కేవలం నాలుగు రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. ఈ వారం ఆసీస్తో జరుగబోయే మరో రెండు వన్డేల్లో మంధన ఇదే ఫామ్ను కొనసాగిస్తే.. రేటింగ్ పాయింట్లను మరింత మెరుగుపర్చుకుని అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకునే అవకాశం ఉంది. మంధన కీలక సమయంలో నంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. ఈ నెలాఖరు నుంచి (సెప్టెంబర్ 30) భారత్, శ్రీలంకల్లో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఇలాంటి తరుణంలో నంబర్ వన్ స్థానానికి ఎగబాకడం ఆమెకు మానసిక స్తైర్యాన్ని ఇస్తుంది. తాజా ర్యాంకింగ్స్లో మంధనతో పాటు మరో ఇద్దరు భారత బ్యాటర్లు కూడా లబ్ది పొందారు. ప్రతీక రావల్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 42వ స్థానానికి.. హర్లీన్ డియోల్ 5 స్థానాలు మెరుగుపర్చుకుని 43వ స్థానానికి ఎగబాకారు. మిగతా భారత బ్యాటర్లలో హర్మన్ప్రీత్ 12వ స్ధానంలో.. జెమీమా రోడిగ్రెజ్ 15 స్థానంలో, దీప్తి శర్మ 24వ స్థానంలో, రిచా ఘోష్ 37 స్థానంలో ఉన్నారు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఇంగ్లండ్కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్ టాప్ ర్యాంక్లో కొనసాగుతుండగా.. భారత స్పిన్నర్ స్నేహ్ రాణా ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని 16వ స్థానానికి ఎగబాకింది. మరో భారత బౌలర్ దీప్తి శర్మ 3 స్థానాలు దిగజారి 7వ ర్యాంక్ను పడిపోయింది. మిగతా భారత బౌలర్లలో రేణక సింగ్ ఠాకూర్ 26, క్రాంతి గౌడ్ 62, అరుంధతి రెడ్డి 65, పూజా వస్త్రాకర్ 77, శ్రీ చరణి 83, ప్రియా మిశ్రా 85, టైటాస్ సాధు 91, సైమా ఠాకోర్ 96 స్థానాల్లో ఉన్నారు.ఆల్రౌండర్ల విషయానికొస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన యాష్ గార్డ్నర్ టాప్ ప్లేస్ను నిలబెట్టుకోగా.. హేలీ మాథ్యూస్, మారిజన్ కాప్ టాప్-3లో ఉన్నారు. భారత స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ 4వ స్థానంలో ఉంది. -
నీ గర్ల్ఫ్రెండ్ నాలా ఉండాలని కోరుకోవా?.. ఆమెతో హార్దిక్ పాండ్యా డేటింగ్?
టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఆసియా కప్-2025 టోర్నమెంట్తో బిజీగా ఉన్నాడు. ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఈ ఆల్రౌండర్ ఇప్పటి వరకు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు.తొలుత యూఏఈతో మ్యాచ్లో వికెట్లు తీయలేకపోయిన హార్దిక్.. పాకిస్తాన్తో మ్యాచ్లో మాత్రం ఫర్వాలేదనిపించాడు. సయీమ్ ఆయుబ్ రూపంలో కీలక వికెట్ కూల్చి టీమిండియాకు బ్రేక్ ఇచ్చిన హార్దిక్.. సాహిబ్జదా ఫర్హాన్ (40), మొహమ్మద్ హ్యారిస్ (3) ఇచ్చిన క్యాచ్లు అందుకుని ఫీల్డర్గా తన వంతు పాత్ర పూర్తి చేశాడు.ఇక పాక్ విధించిన 128 పరుగుల లక్ష్య ఛేదనలో హార్దిక్ పాండ్యాకు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. ఇక ఆటతోనే కాకుండా వ్యక్తిగత విషయాలతోనూ హార్దిక్ ఇటీవలి కాలంలో వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రాక్టీస్ సమయంలో రూ. 22 కోట్ల ధర కలిగిన వాచ్ ధరించి హాట్ టాపిక్ అయ్యాడు.మూడుసార్లు పెళ్లితాజాగా హార్దిక్ పాండ్యా రిలేషన్షిప్నకు సంబంధించి మరో వార్త తెరమీదకు వచ్చింది. కాగా సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్ను ప్రేమించిన హార్దిక్.. ఆమెను పెళ్లాడాడు. వీరికి కుమారుడు అగస్త్య సంతానం. అయితే, కోవిడ్ సమయంలో ఘనంగా పెళ్లి చేసుకోలేకపోయామన్న లోటు లేకుండా.. ఆ తర్వాత హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో కుమారుడి ముందే ఈ జంట వివాహం చేసుకుంది.జాస్మిన్కు కూడా గుడ్బై?ఎంతో అన్యోన్యంగా ఉండే హార్దిక్- నటాషా విడాకులు తీసుకున్నామంటూ గతేడాది ప్రకటన విడుదల చేసి అభిమానులకు షాకిచ్చారు. ఆ తర్వాత నటాషా కొన్నాళ్లు సెర్బియా వెళ్లిపోగా.. ఇంతలో హార్దిక్.. సింగర్ జాస్మిన్ వాలియాతో ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరి సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా ఇవి నిజమేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అయితే, హార్దిక్ జాస్మిన్కు కూడా గుడ్బై చెప్పినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా అతడు మరో ముద్దుగుమ్మతో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహీక శర్మతో హార్దిక్ ప్రేమలో ఉన్నట్లు సమాచారం. పరస్పరం సోషల్ మీడియాలో ఫాలో కావడంతో పాటు.. మహీక ప్రతీసారి హార్దిక్కు సంబంధించిన హింట్ ఇచ్చేలా పోస్టులు పెట్టడం ఇందుకు ఊతమిచ్చింది.నీ గర్ల్ఫ్రెండ్ నాలా ఉండాలని కోరుకోవా?ఇక హార్దిక్ పాండ్యా తాజా ప్రేమాయణానికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్న వేళ.. అతడి మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ షేర్ చేసిన సాంగ్ క్లిప్ వైరల్ అవుతోంది. ‘‘నీ గర్ల్ఫ్రెండ్ నాలా హాట్గా ఉండాలని కోరుకోవా.. నీ గర్ల్ఫ్రెండ్ నాలా ఫ్రీక్గా ఉండాలని కోరుకోవా?’’ అంటూ సాగే లిరిక్స్కు పెదాలు కదుపుతూ నటాషా డాన్స్ చేయడం నెటిజన్లను ఆకర్షించింది. View this post on Instagram A post shared by @angreziedaaru -
‘అల్లుడు’ నీ పరుగులేం అక్కర్లేదు.. పాక్ ప్లేయర్పై అఫ్రిది ఫైర్
ఆసియాకప్-2025లో దుబాయ్ వేదికగా ఆదివారం భారత్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. అయితే ప్రస్తుతం అంతా పాక్ చెత్త ప్రదర్శన గురించి కాకుండా ఈ మ్యాచ్ అనంతరం చెలరేగిన హ్యాండ్ షేక్ వివాదం గురించే చర్చించుకుంటున్నారు.కానీ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మాత్రం తమ జట్టు చెత్త ఆటను మర్చిపోలేదు. తాజాగా ఓ టీవీ ఛానల్ డిబేట్లో పాల్గోన్న అఫ్రిది.. తన అల్లుడు షాహీన్ షా అఫ్రిదిని విమర్శించాడు. షాహీన్ షా అఫ్రిది బౌలింగ్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.అఫ్రిది బౌలింగ్ను భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఉతికారేశాడు. కానీ బ్యాటింగ్లో మాత్రం అఫ్రిది మెరుపులు మెరిపించాడు. కేవలం 16 బంతుల్లో 33 పరుగులు చేసి పాక్ స్కోర్ 100 పరుగుల మార్కు దాటడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే షాహీన్ బ్యాట్తో కాకుండా బంతితో రాణించి ఉంటే బాగుండేదని షాహిద్ అఫ్రిది అన్నాడు."షాహీన్ బ్యాటింగ్లో కొన్ని పరుగులు చేశాడు. అతడి ఆడిన ఇన్నింగ్స్ ఫలితంగానే మా జట్టు స్కోర్ 100 పరుగులు దాటింది. అందుకు అతడికి ధన్యవాదాలు. కానీ షాహీన్ నుంచి నేను ఆశించింది పరుగులు కాదు. అతడు నుంచి మంచి బౌలింగ్ కావాలి. అలాగే అయుబ్ నుంచి నేను బౌలింగ్ను కోరుకోను.అతడు పరుగులు చేయాలి. జట్టులో అతడి పాత్ర ఎంటో షాహీన్ ఆర్ధం చేసుకోవాలి. కొత్త బంతిని స్వింగ్ చేసి, వికెట్లు సాధించేందుకు మార్గాలను అన్వేషించాలి. అతను తన గేమ్ ప్లాన్పై దృష్టి సారించాలి" అని సామా టీవీ ఇంటర్వ్యూలో అఫ్రిది పేర్కొన్నాడు -
యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పలకు ఈడీ నోటీసులు..
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దూకుడు పెంచింది. తాజాగా భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పలకు ఈడీ సమన్లు జారీ చేసింది. బెట్టింగ్ ప్లాట్ఫామ్ 1xBet సోషల్ మీడియా ప్రమోషన్లకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఈ మాజీ క్రికెటర్లను ఈడీ విచారించనుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద వారి వాంగ్మూలాలను నమోదు చేయనున్నారు. ఈ నెల 22న ఉతప్ప, 23న యువరాజ్ సింగ్లు ఈడీ విచారణకు హాజరు కానున్నారు. వీరిద్దరితో పాటు బాలీవుడ్ నటుడు సోనూ సూద్కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇక ఇప్పటికే ఈ కేసులో భారత మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ దావన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించింది. -
ఛీ.. మరీ సిగ్గు లేకుండా తయారయ్యారు.. ఇదేం పద్ధతి?
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ (Atul Wassan) తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. మరీ సిగ్గు లేకుండా తయారయ్యారంటూ ఘాటు విమర్శలు చేశాడు. అసలేం జరిగిందంటే.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత టీమిండియా- పాకిస్తాన్ ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నీలో భాగంగా తొలిసారి ముఖాముఖి తలపడిన విషయం తెలిసిందే.మరోసారి జయభేరిదుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో భారత జట్టు పాక్పై ఆధిపత్యం కొనసాగిస్తూ మరోసారి జయభేరి మోగించింది. సల్మాన్ ఆఘా బృందాన్ని ఏడు వికెట్ల తేడాతో సూర్యకుమార్ సేన చిత్తు చేసింది. ఇదిలా ఉంటే.. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా.. భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో కరచాలనానికి నిరాకరించారు.రచ్చకెక్కిన పాక్ బోర్డుటాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాక్ సారథి సల్మాన్ ఆఘాను పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా భారత జట్టు ఇదే పంథా అనుసరించింది. పాక్ ప్లేయర్లు షేక్హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేసినట్లు కనిపించగా.. భారత ఆటగాళ్లు మాత్రం ఇందుకు విముఖత వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు రచ్చకెక్కింది. తమను అవమానించారని.. క్రీడాస్ఫూర్తికి ఇది విరుద్దమని గగ్గోలు పెడుతోంది. మ్యాచ్ రిఫరీపై వేటు వేయాలంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలికి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి.మరీ సిగ్గు లేకుండా తయారయ్యారుఈ విషయంపై భారత మాజీ పేసర్ అతుల్ వాసన్ ఘాటుగా స్పందించాడు. ‘‘ఛీ.. వాళ్లు మరీ సిగ్గు లేకుండా తయారయ్యారు. షేక్హ్యాండ్ ఇవ్వాలంటూ మనల్ని బలవంతపెట్టాలని చూస్తున్నారు. ఇదేం పద్ధతి?.. మీకు అవమానం జరిగిందని ప్రపంచం మొత్తానికి తెలిసింది.మీతో కరచాలనం చేసేందుకు మేము సిద్ధంగా లేమని స్పష్టంగా అర్థమైంది కదా!.. మరి ఇంకెందుకు కరచాలనం కావాలంటూ పట్టుబడుతున్నారు? ఈ విషయంపై ఫిర్యాదు చేయడం ద్వారా తమను తామే మరింతగా కించపరుచుకున్నట్లు అయింది. అందుకే మ్యాచ్ ఆడారుఇలా కంప్లైంట్ చేయడం ద్వారా తమకు పరిణతి లేదని వారే చెప్పినట్లుగా ఉంది. క్రీడా విధానానికి అనుగుణంగానే మనం ఆ మ్యాచ్ ఆడాము.అంతేగానీ.. వాళ్లు మన నుంచి ఇంతకంటే ఎక్కువగా ఆశించడం తప్పే అవుతుంది. ఎందుకంటే మీరంటే మాకు ఇష్టం లేదు’’ అంటూ అతుల్ వాసన్ వార్తా సంస్థ ANIతో తన మనసులోని భావాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాడు.చదవండి: Asia Cup Handshake Controversy: హ్యాండ్ షేక్ వివాదం.. పాకిస్తాన్కు ఐసీసీ షాక్? -
'షేక్ హ్యాండ్’ వివాదంలో బిగ్ ట్విస్ట్.. అతడి తప్పేమీ లేదు?
ఆసియా కప్లో భాగంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అనంతరం ‘నో-షేక్ హ్యాండ్’ వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యుడిగా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను తొలగించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేయడంతో ఈ వివాదం మరింత రాజుకుంది.పాకిస్తాన్ జట్టు సభ్యులతో కరచాలనం చేయకూడదనే తమ నిర్ణయానికి భారత్ టాస్ నుంచి ఆట ముగిసే వరకు కట్టుబడి ఉంది. టాస్ సందర్భంగా ఆండీ పైక్రాప్ట్.. భారత సారధి సూర్యకుమార్ దగ్గరికి షేక్ హ్యాండ్ కోసం వెళ్లవద్దని పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాతో చెప్పాడు.ఇక్కడ నుంచే ఈ వివాదం మొదలైంది. దీంతో మ్యాచ్ రిఫరీ క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించాడని వెంటనే అతడిని ఆసియాకప్ నుంచి తప్పించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది.అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పుడు వరకు ఇండియన్ టీమ్ మెనెజ్మెంట్ సూచన మేరకే పై క్రాప్ట్.. నో షేక్ హ్యాండ్ కోసం అఘాకు చెప్పాడని అంతా అనుకున్నారు. కానీ టైమ్స్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. పీసీబీ ఛీఫ్ మొహ్సిన్ నఖ్వీ హెడ్గా ఉన్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ సూచనల మేరకే పై క్రాప్ట్ నో షేక్ హ్యాండ్ గురించి సల్మాన్ అఘాకు తెలియజేశాడంట."హ్యాండ్ షేక్ వివాదంతో ఐసీసీకి సంబంధం ఏంటి? మ్యాచ్ అధికారులను నియమించడంతో ఐసీసీ పాత్ర ముగిస్తోంది. ఆ తర్వాత అంతా ఏసియన్ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఏసీసీ నుంచి ఒకరు పైక్రాఫ్ట్తో మాట్లాడారు.దాని ఫలితమే టాస్ వద్ద మనం చూశాము. పైక్రాప్ట్తో ఎవరు మట్లాడారు..? దేని గురించి చర్చించారో తెలుసుకోవాల్సి బాధ్యత ఏసీసీ చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీపై ఉంది. అంతే తప్ప ఈ వివాదాన్ని మరింత తీవ్రం చేస్తూ ఐసీసీ వైపు వేలు చూపిస్తే ఫలితం ఉండదు అని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి.చదవండి: సూర్య గ్రేట్.. మా ఐన్స్టీన్ మాత్రం తొలుత బ్యాటింగ్ తీసుకున్నాడు: షోయబ్ అక్తర్ -
మా ఐన్స్టీన్ మాత్రం తొలుత బ్యాటింగ్ తీసుకున్నాడు: షోయబ్ అక్తర్
ఆసియాకప్-2025లో భాగంగా భారత్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. బౌలింగ్, బ్యాటింగ్లో దుమ్ములేపిన టీమిండియా దాయాది పాక్ను చావుదెబ్బ కొట్టింది. అయితే భారత్ చేతిలో ఓటమిని పాక్ మాజీ క్రికెటర్లు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.అంతేకాకుండా మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ప్లేయర్లతో కరచాలనం చేసేందుకు నిరాకరించారు. ఒకవైపు ఓటమి, మరోవైపు భారత్ చేసిన పనికి పాక్ మాజీ ఆటగాళ్లు ఘోర అవమానంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాపై ఆ జట్టు మాజీ స్పీడ్ స్టార్ షోయబ్ అక్తర్ విమర్శల వర్షం కురిపించాడు. సల్మాన్ తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడాన్ని అక్తర్ తప్పుబట్టాడు."టాస్ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పిచ్ రిపోర్ట్ మొత్తం చెప్పాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో మంచు ప్రభావం ఉండే అవకాశముందని, పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని అతడు అంచనా వేశాడు. మా బ్యాటింగ్ లైనప్ చాలా డెప్త్గా ఉంది.మేం మొదట బౌలింగే చేయాలనుకున్నాం అని సూర్య స్పష్టంగా చెప్పాడు. కానీ మా ఐన్స్టీన్ (సల్మాన్ అలీ ఆఘా) మాత్రం పిచ్ గురించి ఏమీ తెలుసుకోకుండానే మేం మొదట బ్యాటింగ్ చేస్తాం అన్నాడు. అందుకు తగ్గ మూల్యం పాక్ చెల్లించుకుందని" అక్తర్ ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.అదేవిధంగా భారత్ ఆటగాళ్లు హ్యాండ్ షేక్ ఇవ్వడంపై కూడా అక్తర్ స్పందించాడు. "నాకు మాటలు రావడం లేదు. చాలా బాధగా ఉంది. గెలిచిన టీమిండియాకు శుభాకాంక్షలు. కానీ మీరు క్రికెట్ మ్యాచ్ను రాజకీయాల నుంచి వేరుగా ఉంచండి. మీ గురించి మేము ఎన్నో గొప్ప విషయాలు చెప్పాము. మేము ఈ నో షేక్ హ్యాండ్ చర్య గురించి మాట్లాడొచ్చు. ప్రతి ఇంట్లోనూ గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ వాటిని మరచిపోయి ముందుకు సాగిపోవాలి" అని అక్తర్ అన్నాడు.చదవండి: పాకిస్తాన్తో ఆడితే తప్పు కాదా? షేక్ హ్యాండ్ ఇస్తేనే తప్పా?: మనోజ్ తివారీ -
పాకిస్తాన్తో ఆడితే తప్పు కాదా? షేక్ హ్యాండ్ ఇస్తేనే తప్పా?: మనోజ్ తివారీ
ఆసియాకప్-2025లో పాకిస్తాన్ జట్టుతో సంప్రదాయ కరచాలనాన్ని టీమిండియా ఆటగాళ్లు తిరష్కరించిన సంగతి తెలిసిందే. ఈ ఖండాంతర టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధులు మధ్య పోరు జరిగింది. అయితే ఈ మ్యాచ్ టాస్ దగ్గర నుంచి ఆట ముగిసే వరకు భారత జట్టు పాకిస్తాన్ ఆటగాళ్లతో అంటిముట్టనట్టు ఉన్నారు.తొలుత టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించాడు. అనంతరం మ్యాచ్ ముగిశాక కూడా కరచాలనం చేసేందుకు భారత జట్టు ఇష్టపడలేదు. దీంతో భారత జట్టు తీసుకున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.కానీ భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ మాత్రం టీమిండియా మెనెజ్మెంట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. పాకిస్తాన్తో ఆడాలని నిర్ణయించుకున్నప్పుడు, షేక్ హ్యాండ్ ఇస్తే తప్పు ఏముందని తివారీ అన్నాడు. అయితే పాకిస్తాన్ మ్యాచ్తో భారత్ బహిష్కరించాలని తివారీ ముందే నుంచే తన వాదన వినిపిస్తూ వస్తున్నాడు."నేను భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్తో ఆసియాకప్ మొత్తాన్ని బాయ్కట్ చేస్తున్నాను. ఎందుకంటే క్రికెట్ అనేది కేవలం ఒక క్రీడ మాత్రమే. క్రీడలకు ఇచ్చిన విలువ జీవితాలకు ఇవ్వడం లేదు. ఇది నాకు నచ్చడం లేదు. మనం మానవ జీవితాలను క్రీడలతో పోల్చడం సరి కాదు" అని పాకిస్తాన్తో మ్యాచ్కు ముందు తివారీ స్టెట్మెంట్ ఇచ్చాడు.ఇప్పుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. "పాక్ ఆటగాళ్లతో హ్యాండ్ షేక్ను తిరష్కరించడం సరైన నిర్ణయం కాదు. మీరు పాకిస్తాన్తో ఆడాలని నిర్ణయించుకున్నప్పుడు.. హ్యాండ్ షేక్ చేస్తే తప్పు ఏముంది. పాక్తో మ్యాచ్ను బహిష్కరించి మీరు ఏది చెప్పినా ప్రజులు నమ్మేవారు.ఈ టోర్నీ ఆరంభానికి ముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో సూర్యకుమార్ యాదవ్.. పాకిస్తాన్ కెప్టెన్కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ వీడియోను నేను చూశాను. మరి అప్పుడు ఎలా కరచాలనం చేశారు. ఆ సమయంలో మీకు తప్పు అన్పించలేదా? అంటే ఇప్పుడు విమర్శకుల నుంచి తప్పించుకోవడం కోసం నో హ్యాండ్ షేక్ నిర్ణయం తీసుకున్నారా? ముందే వారి కెప్టెన్, చైర్మెన్కు హ్యాండ్ షేక్ ఇచ్చి ఇప్పుడు మ్యాచ్లో తిరష్కరించి ఏమి సాధించారో నాకు ఆర్ధం కావడం లేదు. విమర్శకుల నుంచి తామును తాము రక్షించుకోవడానికే ఈ విజయాన్ని పహల్గామ్ బాధితులకు, భారత సాయుధ దళాలకు అంకితం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు" అని ఇన్సైడ్ స్పోర్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తివారీ పేర్కొన్నాడు.చదవండి: Asia Cup Handshake Controversy: హ్యాండ్ షేక్ వివాదం.. పాకిస్తాన్కు ఐసీసీ షాక్? -
సూపర్-4కు అర్హత సాధించిన భారత్.. పాకిస్తాన్ మరి?
ఆసియాకప్ 2025లో గ్రూపు-ఎ నుంచి భారత క్రికెట్ జట్టు సూపర్-4కు అర్హత సాధించింది. ఈ మెగా టోర్నీ గ్రూపు-ఎలో భాగంగా సోమవారం అబుదాబి వేదికగా యూఏఈ, ఒమన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఒమన్ను 42 పరుగుల తేడాతో యూఏఈ చిత్తు చేసింది.దీంతో ఆడిన మూడు మ్యాచ్లలోనూ ఓటమి పాలైన ఒమన్ టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. ఇదే సమయంలో వరుసగా రెండు మ్యాచ్లలో గెలిచి టేబుల్ టాపర్గా కొనసాగుతున్న సూపర్ ఫోర్కు క్వాలిఫై అయిన తొలి జట్టుగా నిలిచింది.రెండో జట్టు ఏది?ఇక గ్రూపు-ఎ నుంచి సూపర్ ఫోర్ రౌండ్కు అర్హత సాధించేందుకు పాకిస్తాన్, యూఏఈ జట్లు పోటీపడుతున్నాయి. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో భారత్, పాకిస్తాన్, యూఏఈ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. సెప్టెంబర్ 17న దుబాయ్ వేదికగా యూఏఈ-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు భారత్తో పాటు సూపర్-4లో అడుగు పెడుతోంది. బుధవారం జరిగే మ్యాచ్లో యూఏఈను ఓడించడం పాక్కు అంత సులువు కాదు.ఈ టోర్నీకి ముందు జరిగిన ట్రైసిరీస్లో కూడా పాక్కు యూఏఈ గట్టి పోటీ ఇచ్చింది. ఇప్పుడు ఆసియాకప్లోనూ అదే పట్టుదలతో పాక్ను ఢీకొట్టేందుకు ఆతిథ్య యూఏఈ సిద్దమైంది. పాకిస్తాన్ ఎప్పుడూ ఎలా ఆడుతుందో ఎవరూ ఊహించలేరు. పాకిస్తాన్ జట్టు జింబాబ్వే వంటి పసికూన చేతిలో కూడా ఓడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ రెండు జట్లలో ఎవరూ సూపర్-4కు వస్తారన్నది ముందే అంచనా వేయడం కష్టమనే చెప్పాలి. మరోవైపు భారత ఆటగాళ్లు తమకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో పాకిస్తాన్ ఘోర అవమానంగా ఫీల్ అవుతోంది. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని పీసీబీ డిమాండ్ చేస్తోంది. ఐసీసీ చర్యలు తీసుకోపోతే యూఏఈతో మ్యాచ్ను బాయ్కాట్ చేస్తామని పాకిస్తాన్ క్రికెట్ బెదరిస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే యూఏఈ సూపర్-4కు ఆర్హత సాధిస్తోంది.చదవండి: Asia cup 2025: హ్యాండ్ షేక్ వివాదం.. పాకిస్తాన్కు ఐసీసీ షాక్? -
హ్యాండ్ షేక్ వివాదం.. పాకిస్తాన్కు ఐసీసీ షాక్?
ఆసియాకప్-2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత హ్యాండ్ షేక్ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాళ్లతో భారత ప్లేయర్లు కరచాలనం చేసేందుకు నిరాకరించారు. పెహల్గమ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ వంటి పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్తో మ్యాచ్ ఆడడటంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలోనే బీసీసీఐ సూచన మేరకు నో హ్యాండ్షేక్ విధానాన్ని భారత్ అనుసరించినట్లు తెలుస్తోంది. ఇందుకు నిరసనగా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్కు హాజరకాలేదు. అదేవిధంగా భారత ఆటగాళ్లు పరస్పర కరచాలనం తిరస్కరించడంపై పాకిస్తాన్ అగ్గిమీద గుగ్గిలమవుతోంది.ఈ ఘటనపై పీసీబీ ఐసీసీకి,ఏసీసీకి ఫిర్యాదు చేసింది. భారత్, పాక్ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్ను ఆసియాకప్ 2025 నుంచి వెంటనే తొలగించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేసింది. 'నో హ్యాండ్షేక్' గురుంచి పైక్రాఫ్ట్కు ముందే తెలుసు అని పీసీబీ ఆరోపిస్తుంది. పైక్రాఫ్ట్ టాస్ సందర్బంగా ఈ విషయాన్ని తమ కెప్టెన్కు తెలియజేశాడని, కానీ మ్యాచ్ అనంతరం కూడా ఇదే విధానం కొనసాగుతుందని ఆయన చెప్పలేదని పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ఉల్లంఘన జరిగింది. మ్యాచ్ రిఫరీపై చర్య తీసుకోవాలి పాక్ క్రికెట్ ఐసీసీని అభ్యర్దించింది. ఒకవేళ ఐసీసీ చర్యలు తీసుకోపోతే యూఏఈతో జరిగే తమ తదుపరి మ్యాచ్ను బహష్కిరిస్తామని పీసీబీ బెదరింపులకు దిగింది.పీసీబీకి షాక్..?అయితే ఆసియా కప్ మ్యాచ్ రిఫరీల ప్యానెల్ నుండి ఆండీ పైక్రాఫ్ట్ను తొలగించాలని పీసీబీ చేసిన అభ్యర్థనను ఐసీసీ తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. క్రిక్బజ్ ప్రకారం.. పీసీబీ వాదనతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఏకీభవించకపోయినట్లు సమాచారం.ఈ ఘటనతో పైక్రాఫ్ట్కు సంబంధం లేదని పీసీబీకి ఐసీసీ తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా ఆటగాళ్లు తప్పనిసరిగా హ్యాండ్ షేక్ ఇవ్వాలని ఎంసీసీ మాన్యువల్లో లేదు అని ఐసీసీ ప్రతినిథులు పీసీబీ చీఫ్కు మెయిల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఐసీసీ అధికారికంగా స్పందించాల్సిన అవసరముంది.చదవండి: PKL 12: ఉత్కంఠపోరులో తెలుగు టైటాన్స్ ఓటమి.. -
Asia Cup 2025: ‘చేయి’ కలపలేదని...
దుబాయ్: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నిలో భారత్, పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఫలితం ఏకపక్షంగా ముగిసింది. చెత్తగా ఆడిన పాకిస్తాన్ తమ ఆటతీరును విశ్లేషించు కోవాల్సిందిపోయి ఇరు జట్ల ఆటగాళ్లు ‘షేక్ హ్యాండ్’ ఇచ్చుకోలేదనే అంశంపై వివాదాన్ని రాజేస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) దీనిపైనే దృష్టి పెట్టినట్లుంది. ఫిర్యాదులు, చర్యలు చేపట్టాలంటూ తెగ హడావుడి చేస్తోంది. కానీ కరచాలనం తిరస్కరణ కొత్తదేమీ కాదు. టెన్నిస్లో, ఫుట్బాల్లోనూ ఉద్రిక్తతలు, రాజకీయ వైరం కారణంగా ఆయా దేశాలకు చెందిన ప్లేయర్లు ఎన్నోసార్లు ‘షేక్ హ్యాండ్’ ఇచ్చుకోలేదు. దీనిపై టెన్నిస్ ఇంటిగ్రిటీ గానీ, ఫుట్బాల్ సమాఖ్య (ఫిపా) గానీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ పీసీబీ మాత్రం నానా యాగీ చేస్తోంది. మ్యాచ్ రిఫరీని తొలగించండి మ్యాచ్ ముగిసిన తర్వాత తమ జట్టు ఆటగాళ్లతో టీమిండియా క్రికెటర్లు పరస్పర కరచాలనం తిరస్కరించడంపై పీసీబీ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఆదివారం నాటి లీగ్ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించిన అండీ పైక్రాఫ్ట్ను తక్షణమే తొలగించాలని ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ)కి ఫిర్యాదు చేసింది. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జోక్యం చేసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. ఎందుకంటే ఏసీసీ చీఫ్గా పీసీబీ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ ఉంటే, ఐసీసీ చీఫ్గా భారత్కు చెందిన జై షా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై ఎవరెలా స్పందిస్తారోనన్నది, ఎలా ముగింపు పలుకుతారో అన్నది ఆసక్తికరంగా మారింది. ‘మ్యాచ్ రిఫరీపై ఐసీసీకి ఫిర్యాదు చేశాం. ఐసీసీ నియమావళి, ఎంసీసీ చట్టాలు, క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధంగా మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ వ్యవహరించారు. దీన్ని తీవ్రంగా పరిగణించి వెంటనే ఆయన్ని ఆసియా కప్ నుంచి తొలగించాలని పీసీబీ డిమాండ్ చేస్తోంది’ అని ఏసీసీ చీఫ్ కూడా అయిన నఖ్వీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. టాస్ వేసే సమయంలోనే భారత కెపె్టన్ సూర్యకుమార్తో షేక్హ్యాండ్ చేయొద్దని పాక్ కెపె్టన్ సల్మాన్ అగాతో రిఫరీ పైక్రాఫ్ట్ చెప్పారని పీసీబీ పేర్కొంది. టీమ్ షీట్ల మారి్పడి సజావుగా జరగలేదని పాకిస్తన్ జట్టు మేనేజర్ నవిద్ చిమా కూడా ఏసీసీకి ఫిర్యాదు చేశారు. షీమ్ షీట్లను ఇద్దరు కెపె్టన్లు మార్చుకోవడం సహజం. కానీ ఈ సారి టీమ్ షీట్లను కెపె్టన్ల నుంచి రిఫరీ తీసుకున్నారు. తెలుసా... ఆతిథ్య హక్కులు దక్కవు!పాక్తో క్రికెట్ మ్యాచ్లు ఆడొద్దు, ఇకపై జరగొద్దు అని భారత్లో చాలా మంది విమర్శలు చేస్తున్నారు. కానీ బహుళ జట్లు బరిలో ఉండే ఈవెంట్లలో తప్పుకుంటే ప్రతిష్టాత్మక మెగా ఈవెంట్ ఆతిథ్య హక్కులు పొందే అవకాశాలు రావు. ఎందుకంటే ప్రస్తుతం క్రికెట్ ఇప్పుడు ఒలింపిక్ చార్టర్లో భాగమైంది. లాస్ ఏంజెలిస్–2028 ఒలింపిక్స్లో నిర్వహణకు సిద్ధమైంది. ఇక భారత్ 2030 కామన్వెల్త్ క్రీడలు, 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం పోటీపడాలనుకుంటుంది. ఇలాంటి సమయంలో పాక్తో ఆడం, మ్యాచ్లను బహిష్కరిస్తామంటే ఆతిథ్య ఆశలు, అవకాశాలు అడుగంటుతాయి.గతంలో... టెన్నిస్లో...ఇప్పుడు ఆసియా కప్ క్రికెట్లో షేక్హ్యాండ్ ఇవ్వకపోవడం వివాదాస్పదం చేస్తున్నారు కానీ... ఇలా జరగడం క్రీడల్లో ఇదేమీ మొదటిసారి కాదు. 2023లో ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నిలో ఉక్రెయిన్కు చెందిన స్వితోలినా, బెలారస్ ప్లేయర్ విక్టోరియా అజరెంకా మ్యాచ్ అనంతరం షేక్హ్యాండ్ ఇచ్చుకోలేదు. వింబుల్డన్ నిర్వాహక కమిటీ స్వితోలినాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ అంశాన్ని అసలు పట్టించుకోనేలేదు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధంలో బెలారస్ అండగా నిలవడమే ఈ వైఖరికి కారణం కాగా... ఇప్పటికీ కూడా పలువురు ఉక్రెయిన్ ప్లేయర్లతో... బెలారస్, రష్యా ప్లేయర్లు కరచాలనం చేయడం లేదు. అమెరికా, ఇరాన్ దేశాల వైరం కారణంగా ఫుట్బాల్లో ఇరుజట్లు తలపడినపుడు కూడా ఆటగాళ్ల మధ్య షేక్హ్యాండ్స్ కనిపించవు. అదేమీ నిబంధన కాదు... రూల్ బుక్ చూస్కోండి పహల్గాంలో పాక్ ఉగ్రమూకల ఊచకోతకు గురైన కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు పాకిస్తానీ క్రికెటర్లతో పరస్పరం చేయి కలపకూడదని జట్టు మేనేజ్మెంట్ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఇది కోచ్ గంభీర్దో లేదంటే కెపె్టన్ సూర్యకుమార్ నిర్ణయం కానేకాదని జట్టు వర్గాలు స్పష్టం చేశాయి. దాయాది క్రికెటర్ల షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సమర్థించుకుంది. ‘ప్రత్యర్థి ఆటగాళ్లతో కరచాలనం ఇవ్వాలనే నిబంధనేది రూల్ బుక్లో లేదు. ఇది పూర్తిగా గుడ్విల్తో ముడిపడిన స్నేహపూర్వక అంశమే! అంతేకానీ చట్టం అయితే కాదు. కాబట్టి కచ్చితంగా షేక్హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు’ అని బోర్డు సీనియర్ అధికారి ఒకరు స్పష్టత ఇచ్చారు. -
Asia Cup 2025: శ్రమించి గెలిచిన శ్రీలంక
దుబాయ్: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీలో శ్రీలంక అనామక హాంకాంగ్ జట్టుపై గెలిచేందుకు శ్రమించింది. సోమవారం గ్రూప్ ‘బి’లో జరిగిన ఈ మ్యాచ్లో శ్రీలంక నాలుగు వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ నిజాకత్ (38 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు), అన్షీ రాఠ్ (46 బంతుల్లో 48; 4 ఫోర్లు) రాణించారు. అనంతరం ఛేదనలో లంక ఇబ్బంది పడింది. హాంకాంగ్ నిర్ణీత ఓవర్ల కోటాలో కేవలం 4 వికెట్లను కోల్పోతే... శ్రీలంక 20 ఓవర్లయినా ఆడకముందే 6 వికెట్లను కోల్పోయింది. 18.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ నిసాంక (44 బంతుల్లో 68; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధసెంచరీతో అదరగొట్టాడు. 19వ ఓవర్లో హసరంగ (9 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) వరుస బౌండరీలు బాది జట్టును గెలిపించాడు. మరో మ్యాచ్లో యూఏఈ 42 పరుగుల తేడాతో ఒమన్పై నెగ్గింది. నేడు జరిగే మ్యాచ్లో అఫ్గానిస్తాన్తో బంగ్లాదేశ్ ఆడుతుంది. -
Asia Cup 2025: బోణీ కొట్టిన యూఏఈ
ఆసియా కప్-2025లొ ఆతిథ్య యూఏఈ బోణీ కొట్టింది. ఇవాల్టి సాయంత్రం మ్యాచ్లో ఒమన్పై 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసి, ఆతర్వాత లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచి మూడో స్థానానికి ఎగబాకింది. ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడిన ఒమన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.పూర్తి వివరాల్లో వెళితే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. ఓపెనర్లు ముహమ్మద్ వసీం (54 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 69 పరుగులు), అలీషాన్ షరాఫు (38 బంతుల్లో 51; 7 ఫోర్లు, సిక్స్) అర్ద సెంచరీతో రాణించడంతో మంచి స్కోర్ చేసింది. ఆరంభంలో ధాటిగా ఆడి 200 స్కోర్ దిశగా పయనించిన యూఏఈ.. ఓ మోస్తరు స్కోర్కే పరిమితమైంది. ఆసిఫ్ ఖాన్ (2), వికెట్ కీపర్ రాహుల్ చోప్రా (0) నిరాశపర్చగా.. ముహమ్మద్ జోహైబ్ (21), హర్షిత్ కౌశిక్ (19 నాటౌట్) తేలికపాటి మెరుపులు మెరిపించారు. ఒమన్ బౌలర్లలో జితేన్ రామనంది 2, హస్నైన్ షా, సమయ్ శ్రీవాత్సవ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్ ఆది నుంచే తడబడుతూ వచ్చింది. 50 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఆ దశలోనే మ్యాచ్పై ఆశలు వదులుకుంది. ఆర్యన్ బిస్త్ (24), వినాయక్ శుక్లా (20), రామనంది (13) కొద్ది సేపు ఓటమిని వాయిదా వేయగలిగారు. 18.4 ఓవర్లలో ఆ జట్టు 130 పరుగులకే కుప్పకూలింది. జునైద్ సిద్దిఖీ 4 వికెట్లు తీసి ఒమన్ను దెబ్బకొట్టాడు. హైదర్ అలీ, ముహమ్మద్ జవాదుల్లా తలో 2, రోహిద్ ఖాన్ ఓ వికెట్ తీశారు. యూఏఈ తమ చివరి గ్రూప్ మ్యాచ్లో పాకిస్తాన్తో (సెప్టెంబర్ 17) తలపడుతుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే ఆ జట్టుకు సూపర్ 4 అవకాశాలు ఉంటాయి. -
చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్.. ప్రపంచ రికార్డు బద్దలు
యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం అంతర్జాతీయ టీ20ల్లో చరిత్ర సృష్టించాడు. బంతుల పరంగా అత్యంత వేగంగా 3000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వసీంకు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ పేరిట ఉండేది. బట్లర్ 3000 పరుగులు పూర్తి చేసేందుకు 2068 బంతులు తీసుకోగా.. వసీం కేవలం 1947 బంతుల్లోనే ఈ ల్యాండ్ మార్క్ను తాకాడు. ఈ జాబితాలో వసీం, బట్లర్ తర్వాతి స్థానాల్లో ఆరోన్ ఫించ్ (2077), డేవిడ్ వార్నర్ (2113), రోహిత్ శర్మ (2149) ఉన్నారు.మ్యాచ్ల పరంగా చూస్తే.. వసీం మొహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్), విరాట్ కోహ్లి (భారత్), బాబర్ ఆజమ్ (పాకిస్తాన్) తర్వాత అత్యంత వేగంగా 3000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ మైలురాయిని చేరుకునేందుకు రిజ్వాన్కు 79, విరాట్ కోహ్లికి 81, బాబర్ ఆజమ్కు 81 ఇన్నింగ్స్లు అవసరం కాగా.. వసీం తన 84వ ఇన్నింగ్స్లో 3000 పరుగుల మైలురాయిని తాకాడు. ఆసియా కప్-2025లో భాగంగా ఒమన్తో ఇవాళ (సెప్టెంబర్ 15) జరుగుతున్న మ్యాచ్లో వసీం పై రెండు ఘనతలు సాధించాడు. ఈ మ్యాచ్లో వసీం 54 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 69 పరుగులు చేశాడు. వసీంకు జతగా మరో ఓపెనర్ అలీషాన్ షరాఫు (38 బంతుల్లో 51; 7 ఫోర్లు, సిక్స్) కూడా అర్ద సెంచరీతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో ఒమన్ తడబడుతుంది. ఆ జట్టు 6.1 ఓవర్ల తర్వాత 4 వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది. షా ఫైసల్ (8), ఆర్యన్ బిస్త్ (5) క్రీజ్లో ఉన్నారు. ఈ టోర్నీలో యూఏఈ భారత్, పాక్, ఒమన్తో కలిసి గ్రూప్-ఏలో ఉంది. కొద్ది రోజుల కింద భారత్తో జరిగిన మ్యాచ్లో ఈ జట్టు చిత్తుగా ఓడింది. -
హ్యాండ్ షేక్ వివాదంలో అనూహ్య పరిణామం
భారత్-పాక్ ఆటగాళ్ల హ్యాండ్ షేక్ వివాదంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విషయాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడని సొంత అధికారినే సస్పెండ్ చేసింది. జట్టు క్రికెట్ ఆపరేషన్ష్ డైరెక్టర్ ఉస్మాన్ వాహ్లాపై పీసీబీ సస్పెన్షన్ వేటు వేసింది. అధ్యక్షుడు నఖ్వీ బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించి వాహ్లాను ఫైర్ చేశాడని తెలుస్తుంది.ఈ విషయాన్ని హ్యాండిల్ చేసే విషయంలో వాహ్లా నుంచి ఎక్కువగా ఆశించాము. అయితే అతను నిరాశపరిచాడు. వాహ్లా కారణంగా భారత్ ముందు పాక్ పరువు పోయింది. టాస్కు ముందే మ్యాచ్ రిఫరీ కరచాలనం విషయాన్ని ప్రస్తావించినా, వాహ్లా పరిస్థితిని నియంత్రించడంలో విఫలమయ్యాడని నఖ్వీ అన్నట్లు సమాచారం.కాగా, ఆసియా కప్లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వని విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ఆటగాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. సూపర్-4 దశ మ్యాచ్లోనూ భారత ఆటగాళ్లు నో హ్యాండ్షేక్ పాలసీని కొనసాగించనున్నట్లు తెలుస్తుంది.ఈ విషయంపై పీసీబీ ఇప్పటికే నానా యాగీ చేస్తుంది. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అలాగే మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను ఆసియా కప్ విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. భారత ఆటగాళ్లు క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించారని, ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనకు పాల్పడ్డారని వారికి తగని నీతులు చెబుతుంది.ఐసీసీ తమ డిమాండ్లను పరిష్కరించకపోతే యూఏఈతో తదుపరి జరుగబోయే మ్యాచ్ను బహిష్కరిస్తామని బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఐసీసీ మాత్రం ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం అన్నది ఆటగాళ్ల వ్యక్తిగతం అంశమని లైట్ తీసుకుంది. పీసీబీ మాత్రం భారత్ ముందు తమ పరువు పోయిందని ఐసీసీ ముందు గగ్గోలు పెడుతుంది. -
హ్యాండ్ షేక్ వివాదం.. భారత్కు ఫైన్ పడుతుందా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
ఆసియాకప్-2025 గ్రూపు-ఎలో భాగంగా ఆదివారం భారత్-పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో పాక్ను 7 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం కంటే హ్యాండ్షేక్ వివాదమే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసన తెలిపింది.టాస్ దగ్గర నుంచి మ్యాచ్ పూర్తి అయ్యేంతవరకు పాక్ ఆటగాళ్లను టీమిండియా కనీసం పట్టించుకోలేదు. గతంలో ఇరు జట్లు తలపడినప్పుడు ఆటగాళ్లు ఒకరొకరు పలకరించుకునేవారు. కానీ ఈసారి కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. మైదానంలోకి వచ్చామా, గెలిచి వెళ్లామా అన్నట్లు భారత జట్టు తమ వైఖరిని కనబరిచింది.తొలుత టాస్ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘాతో కరచాలనం చేసేందుకు నిరాకరించాడు. కనీసం అతడి ముఖం కూడా చూడకుండా సూర్య డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిపోయాడు. ఇదంతా ముందుస్తు ప్రణాళికలో భాగంగానే జరిగింది.ఆ తర్వాత మ్యాచ్ ముగిశాక కూడా పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు భారత జట్టు నిరాకరించింది. అంతేకాకుండా పాక్ ప్లేయర్లు టీమిండియా డ్రెసింగ్రూమ్ వైపు వెళ్లగా.. సహాయక సిబ్బంది తలుపు మూసేసినట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ టీమ్ అసహననానికి లోనైంది. ఫలితంగా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సెర్మనీని సల్మాన్ ఆఘా బహిష్కరించాడు. ఆ తర్వాత విలేకరుల సమావేశంలో పాల్గోన్న పాక్ హెడ్ కోచ్ మైక్ హసన్ భారత ఆటగాళ్లు తమ పట్ల వ్యవహరించిన తీరు బాధ కలిగించందని చెప్పుకొచ్చాడు.ఈ హ్యాండ్ షేక్ వివాదంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సైతం స్పందించింది. "భారత ఆటగాళ్లు కరచాలనం చేయకపోవడం పట్ల జట్టు మేనేజర్ నవీద్ చీమా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది క్రీడా స్పూర్తికి విరుద్దం. నిరసనలో భాగంగా తమ కెప్టెన్ను పోస్టు మ్యాచ్ సెర్మనీకి పంపలేదని" పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ హ్యాండ్ షేక్ వివాదంపై ఏసీసీకి, ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు పీసీబీ సిద్దమైనట్లు సమాచారం. అంతేకాకుండా ఐసీసీ చర్యలు తీసుకుపోతే యూఏఈతో తమ తదుపరి మ్యాచ్ను బహిష్కరిస్తామని పీసీబీ బెదిరిస్తోంది.ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టుపై ఐసీసీ చర్యలు తీసుకుంటుందా? అసలు రూల్స్ ఏమి చెబుతున్నాయి? అన్న విషయాలను ఓసారి తెలుసుకుందాం. ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయి?ఆసియాకప్ను ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహిస్తున్నప్పటికి.. ఈ టోర్నీపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్కు పూర్తి అధికారం ఉంటుంది. ఈ టోర్నీలో పాల్గోనే జట్లు, ఆటగాళ్లకు ఐసీసీ ప్రవర్తనా నియమావళి వర్తిస్తుంది. ఐసీసీ ఎల్లప్పుడూ క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహిస్తుంది.ఆటగాళ్లు తమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఐసీసీ కచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. కానీ మ్యాచ్ ముగిశాక ఇరు జట్ల ఆటగాళ్లు తప్పనిసరిగా షేక్ హ్యాండ్ ఇవ్వాలనే నిబంధన ఐసీసీ రూల్స్ బుక్లో ఎక్కడా లేదు. షేక్ హ్యాండ్ అనేది క్రీడా స్ఫూర్తికి చిహ్నంగా మాత్రమే పరిగణిస్తారు. అదేమి ఖచ్చితమైన రూల్ కాదు. కరచాలనం చేయాలా వద్దా అన్నది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఐసీసీ రూల్ బుక్ ముందు మాటలో ఆటగాళ్లు.. సహచరులను, మ్యాచ్ అధికారులను, అంపైర్లను గౌరవించడం గురుంచి ఉంటుంది. అంతే తప్ప షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం నేరమని ఐసీసీ తమ రూల్స్లో ఎక్కడా ప్రస్తావించలేదు.ఒకవేళ ఆటగాళ్లతో దురుసగా ప్రవర్తించి కరచాలనం చేయకపోతే దాన్ని ఐసీసీ నేరంగా పరిగణిస్తోంది. కానీ ఈ సందర్భంలో టీమిండియా ఆటగాళ్లు ప్రత్యర్థులను ఏ మాత్రం రెచ్చ గొట్టేలా ప్రవర్తించలేదు. దీంతో భారత జట్టుకు ఐసీసీ ఎటువంటి జరిమానా విధించే అవకాశం లేదు.బీసీసీఐ స్పందన ఇదే..ఈ విషయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. "మీకు ఏదైనా సందేహం ఉంటే ఒక్కసారి రూల్ బుక్ను చదవండి. అందులో ఎక్కడ కూడా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు కరచాలనం ఇవ్వాలని ప్రత్యేకంగా ఏమీలేదు. అది కేవలం మర్యాదపూర్వకమైన సంజ్ఞ మాత్రమే. షేక్ హ్యాండ్స్ ఇవ్వాలా లేదా అన్నది వారి సొంత నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప ప్రత్యేకంగా చట్టం ఏమీ లేదు. కాబట్టి ఇండియన్ క్రికెట్ టీమ్ ప్రత్యర్థి జట్టుతో కరచాలనం చేయకపోయిన అదేమి పెద్ద నేరం కాదు" అని సదరు అధికారి పీటీఐతో పేర్కొన్నారు. -
విధ్వంసం సృష్టించిన బెన్నెట్.. జింబాబ్వే ఘన విజయం
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నమీబియాతో ఇవాళ (సెప్టెంబర్ 15) జరిగిన తొలి మ్యాచ్లో జింబాబ్వే 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు.. ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ (51 బంతుల్లో 94; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), మరుమణి (48 బంతుల్లో 62; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది.ఆఖర్లో ర్యాన్ బర్ల్ (9 బంతుల్లో 22; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ సికందర్ రజా (11 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) సుడిగాలి ఇన్నింగ్స్లు ఆడారు. జింబాబ్వే బ్యాటర్లు చెలరేగి ఆడుతుండటంతో నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ తనతో సహా ఏడుగురు బౌలర్లను ప్రయోగించాడు. అలెగ్జాండర్ 2, ట్రంపల్మెన్కు ఓ వికెట్ దక్కిందిఅనంతరం భారీ లక్ష్య ఛేదనలో నమీబియా ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేసింది. అయినా లక్ష్యానికి 34 పరుగుల దూరంలో నిలిచిపోయింది. నమీబియా ఇన్నింగ్స్ల్లో తలా కొన్ని పరుగులు చేశారు. ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. నికోల్ లాఫ్టీ (38), జేన్ గ్రీన్ (33) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, ముజరబానీ తలో 2 వికెట్లు తీసి నమీబియా ఆటగాళ్లను ఇబ్బంది పెట్టారు. మసకద్జ, నగరవ, బ్రాడ్ ఈవాన్స్ తలో వికెట్ తీశారు. ఈ సిరీస్లో రెండో టీ20 రేపు (సెప్టెంబర్ 16) జరుగనుంది. -
Asia Cup 2025: రషీద్ ఖాన్ సేనకు భారీ ఎదురుదెబ్బ
ఆసియా కప్ 2025లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆఫ్ఘనిస్తాన్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్తో రేపు (సెప్టెంబర్ 16) జరుగబోయే కీలక మ్యాచ్కు ముందు స్టార్ పేసర్ నవీన్ ఉల్ హక్ గాయపడ్డాడు. గత కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్న నవీన్ ఆసియా కప్ మొత్తానికే దూరమయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు నవీన్కు ప్రత్యామ్నాయంగా అహ్మదుల్లా అహ్మద్జాయ్ను ప్రకటించింది. ఇదివరకే రిజర్వ్ ప్లేయర్ల జాబితాలో ఉండిన అహ్మద్జాయ్ మెయిన్ జట్టులోకి ప్రమోట్ అయ్యాడు.కాగా, ఆసియా కప్ను ఆఫ్ఘనిస్తాన్ గెలుపుతో బోణీ కొట్టింది. టోర్నీ ఓపెనర్లో హాంగ్కాంగ్పై 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రేపు బంగ్లాదేశ్తో జరుగబోయే మ్యాచ్ గెలిస్తే ఆఫ్ఘనిస్తాన్ సూపర్-4 దశకు చేరుకుంటుంది. ఈ టోర్నీలో ఆఫ్గన్లు.. శ్రీలంక, బంగ్లాదేశ్, హాంగ్కాంగ్తో పాటు గ్రూప్-బిలో ఉన్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తానే గ్రూప్-బి టాపర్గా ఉంది. ఆ జట్టు అద్భుతమైన రన్రేట్తో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. హాంగ్కాంగ్ ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడి చిట్టచివరి స్థానంలో ఉంది.గ్రూప్-ఏ విషయానికొస్తే.. ఈ గ్రూప్లో భారత్, పాక్, ఒమన్, యూఏఈ జట్లు ఉన్నాయి. ఆడిన రెండు మ్యాచ్ల్లో గెలిచిన భారత్ ఈ గ్రూప్ టాపర్గా ఉంది. పాకిస్తాన్, ఒమన్, యూఏఈ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నిన్న జరిగిన మ్యాచ్లో భారత్ పాక్ను చిత్తుగా ఓడించింది. టోర్నీలో ఇవాళ రెండు మ్యాచ్లు జరుగనున్నాయి. యూఏఈ, ఒమన్ మధ్య మ్యాచ్ 5:30 గంటలకు మొదలైంది. రాత్రి 8 గంటలకు శ్రీలంక, హాంగ్కాంగ్ మ్యాచ్ జరుగుతుంది. -
ఐసీసీకి పాక్ బెదిరింపులు.. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోకపోతే..!
ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 14) జరిగిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ వివాదాస్పదంగా మారింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు పాక్ జాతీయ గీతానికి బదులు 'జిలేబీ బేబీ' పాట ప్లే చేశారు. ఇది ఓ రకమైన గందరగోళాన్ని సృష్టించింది.టాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాక్ సారధి సల్మాన్ అఘాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత్ ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు.మ్యాచ్ అనంతరం కూడా భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు హ్యాండ్షేక్ ఇవ్వకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిపోయారు. భారత ఆటగాళ్లు తమ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ నిరాకరించడాన్ని పాక్ క్రికెట్ బోర్డు చాలా సీరియస్గా తీసుకుంది.ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లి భారత ఆటగాళ్లపై, మ్యాచ్ రిఫరి ఆండీ పైక్రాఫ్ట్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. భారత ఆటగాళ్లు క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించారని, వారికి పైక్రాఫ్ట్ వంత పాడాడని ఆరోపిస్తుంది.యూఏఈతో తదుపరి మ్యాచ్ సమయానికి (సెప్టెంబర్ 17) తమ డిమాండ్లకు పరిష్కారం చూపకపోతే ఆ మ్యాచ్ను బహిష్కరిస్తామని ఐసీసీకి ధమ్కీ ఇచ్చింది. పీసీబీ బహిష్కరణ బెదిరింపుతో షేక్ హ్యాండ్ ఉదంతం తీవ్ర రూపం దాల్చినట్లైంది.భారత ఆటగాళ్లు క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించడమే కాకుండా ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనకు కూడా పాల్పడిందని పీసీబీ గగ్గోలు పెడుతుంది. తాజాగా యూఏఈతో మ్యాచ్ రద్దు చేసుకుంటామని కొత్త పాట మొదలుపెట్టింది.మొత్తంగా ఈ వివాదం ఎలాంటి ఉద్రిక్తతలకు దారి తీస్తుందోనని క్రీడాభిమానులు భయపడుతున్నారు. కాగా, నిన్నటి మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ను 7 వికెట్ల తేడాతో చిత్తు ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో పాక్ తొలుత బ్యాటింగ్ చేసి 127 పరుగులకే పరిమితం కాగా.. భారత్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. -
'అలా ఎక్కడా రాసి లేదు'.. షేక్హ్యాండ్పై పాక్కు బీసీసీఐ స్ట్రాంగ్ కౌంటర్
ఆసియాకప్-2025లో ఆదివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో టీమిండియా విజయభేరి మ్రోగించింది. అయితే ఈ మ్యాచ్ టాస్ సందర్భంగా గానీ, ఆట ముగిశాక కానీ భారత జట్టు ఆటగాళ్లు పాకిస్తాన్ ప్లేయర్లతో కరచాలనం చేసేందుకు ఇష్టపడలేదు. ఎటువంటి కరచాలనాలు, పలకరింపులు లేకుండా తమ పని తాము చేసుకుని మైదానం వీడారు.పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా ఇండియన్ టీమ్ మెనెజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ సూపర్-4లో మరోసారి పాక్తో తలపడితే సూర్య అండ్ కో ఇదే పద్దతిని కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. బీసీసీఐ నుంచి అనుమతి లభించిన తర్వాతే పాక్ ఆటగాళ్లతో హ్యాండ్ షేక్చేయకూడదనే నిర్ణయాన్ని టీమిండియా తీసుకుందంట. అయితే భారత ఆటగాళ్లు తమతో కరచాలనం చేయకపోవడంపై పాకిస్తాన్ టీమ్ అసహనం వ్యక్తం చేసింది. ఇది క్రీడా స్పూర్తికి విరుద్దమని, భారత జట్టు తీరుపై ఆసియా క్రికెట్ కౌన్సిల్కు ఫిర్యాదు చేసేందుకు పాకిస్తాన్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్కు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు గట్టి కౌంటరిచ్చారు. పాక్ ఫిర్యాదు చేసిన అది చెల్లదు అని ఆయన తెలిపారు."మీకు ఏదైనా సందేహం ఉంటే ఒక్కసారి రూల్ బుక్ను చదవండి. అందులో ఎక్కడ కూడా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు కరచాలనం ఇవ్వాలని ప్రత్యేకంగా ఏమీలేదు. అది కేవలం మర్యాదపూర్వకమైన సంజ్ఞ మాత్రమే. షేక్ హ్యాండ్స్ ఇవ్వాలా లేదా అన్నది వారి సొంత నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప ప్రత్యేకంగా చట్టం ఏమీ లేదు. కాబట్టి ఇండియన్ క్రికెట్ టీమ్ ప్రత్యర్థి జట్టుతో కరచాలనం చేయకపోయిన అదేమి పెద్ద నేరం కాదు" అని సదరు అధికారి పీటీఐతో పేర్కొన్నారు.చదవండి: Asia Cup 2025: ఇది కదా సక్సెస్ అంటే.. గురువు రికార్డునే బద్దలు కొట్టిన అభిషేక్ -
ముదురుతున్న IND-PAK 'షేక్ హ్యాండ్' వివాదం
ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 14) జరిగిన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కొత్త వివాదానికి దారి తీసింది. మ్యాచ్ పూర్తయ్యాక భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లకు హ్యాండ్షేక్ ఇవ్వకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లిపోయారు. దీన్ని అవమానంగా భావించిన పాక్ క్రికెట్ బోర్డు భారత ఆటగాళ్లపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. భారత ప్లేయర్లు క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొంది.తాజాగా పీసీబీ నిన్నటి మ్యాచ్కు రిఫరిగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్పై (జింబాబ్వే) కూడా ఐసీసీకి కంప్లైంట్ చేసింది. పైక్రాఫ్ట్ను తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. దీనిపై పీసీబీ చైర్మన్ మొహిసిన్ నఖ్వీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ “ICC కోడ్ ఆఫ్ కండక్ట్, MCC Spirit of Cricket నిబంధనలను పైక్రాఫ్ట్ ఉల్లంఘించారు. వెంటనే ఆయన్ని తొలగించాలి” అని పేర్కొన్నారు.పైక్రాఫ్ట్కు ఏం సంబంధం..?నిన్నటి భారత్-పాక్ మ్యాచ్కు రిఫరిగా వ్యవహరించిన పైక్రాఫ్ట్ భారత ఆటగాళ్లు క్రీడా స్పూర్తికి విరుద్దంగా (షేక్ హ్యాండ్ ఇవ్వకుండా) ప్రవర్తించడాన్ని లైట్గా తీసుకున్నాడని పీసీబీ ఆరోపిస్తుంది. పైక్రాఫ్ట్ భారత ఆటగాళ్ల ప్రవర్తనపై చర్య తీసుకోలేదని అంటుంది. టాస్ సమయంలో పైక్రాఫ్ట్ ఇరు కెప్టెన్లను హ్యాండ్షేక్ ఇచ్చుకోవద్దని చెప్పినట్టు ఆరోపిస్తుంది. పాక్ టీమ్ మేనేజర్ నవీద్ చీమా పైక్రాఫ్ట్పై మాటల డోసును పెంచాడు. ఉర్దూ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పైక్రాఫ్ట్ ప్రవర్తనను “అస్పోర్ట్స్మన్షిప్”గా అభివర్ణించాడు.మొత్తంగా చూస్తే షేక్ హ్యాండ్ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తుంది. భారత్-పాక్ ఇదే టోర్నీలో మరోసారి (సూపర్-4) తలపడాల్సి ఉంది. సెప్టెంబర్ 21న జరిగే ఆ మ్యాచ్లో కూడా భారత ఆటగాళ్లు నో షేక్ హ్యాండ్ పాలసీని కొనసాగిస్తారని తెలుస్తుంది. ఈ వివాదం రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసేలా ఉంది.ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ను 7 వికెట్ల తేడాతో చిత్తు ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో పాక్ తొలుత బ్యాటింగ్ చేసి 127 పరుగులకే పరిమితం కాగా.. భారత్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇది కదా సక్సెస్ అంటే.. గురువు రికార్డునే బద్దలు కొట్టిన అభిషేక్
ఆసియాకప్-2025లో దుబాయ్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 128 పరుగుల లక్ష్య చేధనలో పాక్ బౌలర్లను అభిషేక్ ఉతికారేశాడు. ఈ పంజాబ్ ఆటగాడు ఇన్నింగ్స్ తొలి బంతి నుంచే బౌండరీలు బాదడం మొదలు పెట్టాడు. అభిషేక్ కేవలం 13 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్స్లతో 31 పరుగులు చేశాడు. ఈ యువ సంచలనం తన ఇన్నింగ్స్ను 238.46 స్ట్రైక్ రేట్తో ముగించాడు. ఈ మ్యాచ్లో అద్బుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచిన అభిషేక్.. తన మెంటార్ యువరాజ్ సింగ్ రికార్డును బ్రేక్ చేశాడు.పాకిస్తాన్పై టీ20ల్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిన భారత బ్యాటర్గా అభిషేక్ రికార్డులెక్కాడు. యువరాజ్ సింగ్ 2012లో పాక్పై 200.00 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి 36 బంతుల్లో 72 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్లో 238.46 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిన అభిషేక్.. యువీని అధిగమించాడు. కాగా అభిషేక్ శర్మ కెరీర్ ఎదుగుదలలో యువరాజ్ది కీలక పాత్ర. అతడి గైడెన్స్లోనే అభిషేక్ ఇంతలా రాటు దేలాడు. ఈ పంజాబీ బ్యాటర్కు యువీ దగ్గరుండి మరి మెళకువలు నేర్పాడు. ఇప్పుడు అభిషేక్ టీ20ల్లో ఏకంగా వరల్డ్ నెం1 బ్యాటర్గా కొనసాగుతున్నాడు. కాగా ఈ మ్యాచ్లో పాక్ను 7 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
జింబాబ్వే భారీ స్కోర్.. ధీటుగా బదులిస్తున్న నమీబియా
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం నమీబియా జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 15) తొలి మ్యాచ్ జరుగుతుంది. బులవాయో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ (51 బంతుల్లో 94; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), మరుమణి (48 బంతుల్లో 62; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ర్యాన్ బర్ల్ (9 బంతుల్లో 22; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ సికందర్ రజా (11 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) సుడిగాలి ఇన్నింగ్స్లు ఆడారు. జింబాబ్వే బ్యాటర్లు చెలరేగి ఆడుతుండటంతో నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ తనతో సహా ఏడుగురు బౌలర్లను ప్రయోగించాడు. అలెగ్జాండర్ 2, ట్రంపల్మెన్కు ఓ వికెట్ దక్కిందిఅనంతరం భారీ లక్ష్య ఛేదనలో నమీబియా కూడా ధీటుగా బదులిస్తుంది. 7 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆ జట్టు వికెట్ మాత్రమే కోల్పోయి 70 పరుగులు చేసింది. జాన్ లాఫ్టన్ (20 బంతుల్లో 37), జాన్ ఫ్రైలింక్ (9 బంతుల్లో 18) ధాటిగా ఆడుతున్నారు. ఓపెనర్ మలాన్ క్రూగర్ 13 పరుగులు చేసి ఔటయ్యాడు. -
పాక్తో టీమిండియా మ్యాచ్.. సురేశ్ రైనా సంచలన వ్యాఖ్యలు!
టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్ (IND vs PAK)ను ఉద్ధేశించి టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాక్తో మ్యాచ్ ఆడటం భారత ఆటగాళ్లకు ఇష్టం లేదని అన్నాడు. అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కుదుర్చుకున్న ఒప్పందం కారణంగానే వారంతా బరిలోకి దిగాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని వేదికలపై పాక్తో మ్యాచ్లు బహిష్కరించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే, ఆసియా క్రికెట్ మండలి (ACC), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిర్వహించే బహుళ దేశాలు పాల్గొనే టోర్నీల్లో మాత్రం పాక్తో ఆడేందుకు కేంద్ర ప్రభుత్వం టీమిండియాకు అనుమతినిచ్చింది.షేక్హ్యాండ్ నిరాకరణఈ నేపథ్యంలో ఆసియా టీ20 కప్-2025లో భాగంగా దుబాయ్ వేదికగా పాక్తో మ్యాచ్ ఆడిన భారత్.. ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా దాయాదిపై మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. అంతేకాదు.. పాక్ ఆటగాళ్లకు షేక్హ్యాండ్ నిరాకరించడం ద్వారా తమ నిరసనను బహిరంగంగానే తెలియజేసింది.ఎవరికీ ఇష్టం లేదు.. కానీ బీసీసీఐ వల్లే..అయితే, అసలు పాకిస్తాన్తో మ్యాచ్ ఆడాల్సిన అవసరమే లేదు కదా అంటూ కొందరు మాత్రం టీమిండియాను విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో సురేశ్ రైనా స్పందిస్తూ.. ‘‘ఆటగాళ్లను వ్యక్తిగతంగా కలిసి.. ‘ఆసియా కప్లో పాక్తో ఆడటం ఇష్టమేనా అడిగితే కచ్చితంగా లేదు’ అనే చెప్తారు.కానీ బీసీసీఐ ముందుగా ఇందుకు అంగీకరించిన కారణంగా బలవంతంగానైనా వారు ఆడాల్సి వచ్చింది. సూర్యకుమార్ యాదవ్ సేన పాక్తో మ్యాచ్ ఆడేందుకు వ్యక్తిగతంగా విముఖంగా ఉన్నారని నేను నమ్ముతున్నా. భారత జట్టులోని ఏ ఒక్క ఆటగాడికి కూడా పాక్తో మ్యాచ్ ఆడటం ఇష్టం లేదని కచ్చితంగా చెప్పగలను’’ అని రైనా స్పోర్ట్స్తక్తో పేర్కొన్నాడు.పాక్తో మ్యాచ్ బహి ష్కరించిన ఇండియాకాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత వరల్డ్ చాంపియన్షిన్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్)లో పాక్ చాంపియన్స్తో మ్యాచ్ ఆడాల్సి ఉండగా ఇండియా చాంపియన్స్ ఇందుకు తిరస్కరించింది. ఇంగ్లండ్ వేదికగా జరిగే ఈ టీ20 లీగ్లో పాక్తో మ్యాచ్ను లీగ్ దశలోనే బహిష్కరించింది. కానీ ఆ తర్వాత సెమీస్లో కూడా పాక్తో తలపడాల్సి రాగా.. అప్పుడు కూడా నిరాకరించి టోర్నీ నుంచే నిష్క్రమించింది. కాగా యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా చాంపియన్స్ జట్టులో శిఖర్ ధావన్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ వంటి ప్లేయర్లు ఉన్నారు.చదవండి: IND vs PAK: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ -
అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన సౌరవ్ గంగూలీ
భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యారు. 2015–2019 మధ్యకాలంలో తొలిసారి ఈ పదవిని నిర్వహించిన ఆయన.. ఇప్పుడు రెండోసారి క్యాబ్ బాస్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. తన అన్న స్నేహాశిష్ గంగూలీ స్థానాన్ని సౌరవ్ భర్తీ చేయనున్నారు. గంగూలీ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ పదవి కొసం ఇతరులెవ్వరూ నామినేషన్లు వెయ్యలేదు. ఇతరులెవ్వరైనా నామినేషన్లు వేసి ఉంటే అధ్యక్ష ఎన్నిక సెప్టెంబర్ 22న జరిగేది.గంగూలీ ప్యానెల్లో నితీష్ రంజన్ దత్తా ఉపాధ్యక్షుడిగా, బబ్లు కోలే కార్యదర్శిగా, మదన్మోహన్ ఘోష్ సహాయ కార్యదర్శిగా, సంజయ్ దాస్ ట్రెజరర్గా ఉంటారు.రెండో సారి క్యాబ్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత గంగూలీ మాట్లాడుతూ ఇలా అన్నాడు. చాలా ఆనందంగా ఉంది. మరోసారి క్యాబ్ కుటుంబంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. క్యాబ్ ఓ కుటుంబం లాంటిది. ఇక్కడ ఎలాంటి ప్రతిబంధకాలు లేవు. త్వరలో ఈడెన్ గార్డెన్స్లో జరగబోయే ఇండియా-సౌతాఫ్రికా టెస్ట్ మ్యాచ్పై దృష్టి పెడతాను. అలాగే టీ20 వరల్డ్కప్, బెంగాల్ ప్రో టీ20 లీగ్ను విజయవంతం చేసేందుకు కృషి చేస్తాను. మిగతా సభ్యుల సహకారంతో బెంగాల్ క్రికెట్ను ముందుకు తీసుకెళ్తాను.ఇదిలా ఉంటే, గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా మరోసారి ఎన్నికవుతారని టాక్ నడుస్తుంది. క్యాబ్ గంగూలీని తమ ప్రతినిధిగా ఏజీఎంకు నామినేట్ చేయడంతో ఈ ప్రచారం మొదలైంది. ఏజీఎంకు నామినేట్ కావడం వల్ల గంగూలీ బీసీసీఐ అధ్యక్ష రేసులో ఉంటాడు. గంగూలీ 2019-2022 మధ్యలో బీసీసీఐ బాస్గా వ్యవహరించాడు. తాజా మాజీ అధ్యక్షుడు రోజర్ బిన్నీ దిగిపోవడంతో సెప్టెంబర్ 28న ఎన్నిక జరుగనుంది. ఈ పదవికి సెప్టెంబర్ 20, 21 తేదీల్లో నామినేషన్లు వేస్తారు. -
‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్’గా సిరాజ్
ఇంగ్లండ్తో గత నెలలో ఓవల్లో జరిగిన ఐదో టెస్టులో విశేషంగా రాణించిన భారత పేస్ బౌలర్, హైదరాబాద్ క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్... అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’గా ఎంపికయ్యాడు. ఇంగ్లండ్తో ఆగస్టులో జరిగిన చివరి టెస్టులో సిరాజ్ తొమ్మిది వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఆఖరి టెస్టులో గెలిచిన భారత్ ఐదు టెస్టుల సిరీస్ను 2–2తో సమంగా ముగించింది. ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా ఎంపిక కావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ నా కెరీర్లో చిరస్మరణీయమైనది. హోరాహోరీగా జరిగిన ఆ సిరీస్లో నేనూ భాగస్వామి కావడం ఆనందంగా ఉంది’ అని సిరాజ్ వ్యాఖ్యానించాడు. 2021లో ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డులను ప్రారంభించింది. ఇప్పటి వరకు భారత్ నుంచి రిషభ్ పంత్ (2021–జనవరి), రవిచంద్రన్ అశి్వన్ (2021–ఫిబ్రవరి), భువనేశ్వర్ కుమార్ (2021–మార్చి), శ్రేయస్ అయ్యర్ (2022–ఫిబ్రవరి; 2025–మార్చి), విరాట్ కోహ్లి (2022–అక్టోబర్), శుబ్మన్ గిల్ (2023–జనవరి;2023–సెపె్టంబర్; 2025–ఫిబ్రవరి, 2025–జూలై), యశస్వి జైస్వాల్ (2024–ఫిబ్రవరి), జస్ప్రీత్ బుమ్రా (2024–జూన్; 2024–డిసెంబర్) ఈ అవార్డులు గెల్చుకున్నారు. చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ను భారత మహిళల జట్టు ఓటమితో ప్రారంభించింది. ఆదివారం ముల్లాన్పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో భారత్ పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్లో టాపార్డర్ బ్యాటర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. బౌలర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు.ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాటర్లు ప్రతీక రావల్ (96 బంతుల్లో 64; 6 ఫోర్లు), స్మృతి మంధాన (63 బంతుల్లో 58; 6 ఫోర్లు, 2 సిక్స్లు), హర్లీన్ డియోల్ (57 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధసెంచరీలతో కదంతొక్కారు.ఆ్రస్టేలియా బౌలర్లలో మేగన్ షుట్ 2 వికెట్లు తీయగా, కిమ్ గార్త్, అనాబెల్, అలానా కింగ్, తాలియా తలా ఒక వికెట్ సాధించారు. అనంతరం ఈ భారీ లక్ష్యాన్ని ఆసీస్ 44.1 ఓవర్లలో కేవలం రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది. . ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫోబ్ లిచ్ఫీల్డ్ (80 బంతుల్లో 88; 14 ఫోర్లు), బెత్ మూనీ (74 బంతుల్లో 77 నాటౌట్; 9 ఫోర్లు), అనాబెల్ సదర్లాండ్ (51 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు) ధాటిగా ఆడారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా చెరో వికెట్ తీశారు. 17న రెండో వన్డే కూడా ఇదే వేదికపై జరుగుతుంది.చరిత్ర సృష్టించిన ప్రతీక రావల్..ఇక ఈ మ్యాచ్లో భారత్ ఓటమి పాలైనప్పటికి స్టార్ ఓపెనర్ ప్రతీక రావల్ మాత్రం వరల్డ్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మహిళల వన్డే క్రికెట్తో తొలి 15 మ్యాచ్ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా ప్రతీక చరిత్ర సృష్టించింది. ఆమె ఇప్పటివరకు భారత తరపున 15 వన్డేలు ఆడి 767 పరుగులు చేసింది. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్ పేరిట ఉండేది. లానింగ్ తన వన్డే కెరీర్లో తొలి మ్యాచ్లలో 707 పరుగులలు చేసింది. తాజా మ్యాచ్తో లానింగ్ ఆల్టైమ్ రికార్డును రావల్ బ్రేక్ చేసింది. వీరిద్దరి తర్వాత స్ధానంలో ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ షార్లెట్ ఎడ్వర్డ్స్(655) మూడో స్ధానంలో ఉంది.చదవండి: ఏడ్చేసిన షోయబ్ అక్తర్..! కాస్తైనా బుద్ధి లేదంటూ ఫ్యాన్స్ ఫైర్ -
సౌతాఫ్రికా-ఇంగ్లండ్ మూడో టీ20 రద్దు.. సిరీస్ సమం
ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాల మధ్య మూడు టీ20ల సిరీస్ 1–1తో సమంగా ముగిసింది. నాటింగ్హామ్ వేదిగా ఆదివారం జరగాల్సిన నిర్ణాయక ఆఖరి పోరు వర్షంతో రద్దయ్యింది. తెరిపినివ్వని వాన వల్ల మ్యాచ్కు అవకాశమే లేకపోయింది. కనీసం టాస్ కూడా వేయలేదు. మైదానమంతా చిత్తడిగా మారడంతో చేసేదేమీ లేక ఫీల్డ్ అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సిరీస్లో భాగంగా కార్డిఫ్లో జరిగిన తొలి మ్యాచ్లో పర్యాటక దక్షిణాఫ్రికా గెలిచింది. ఈ మ్యాచ్కూ వరుణుడు అంతరాయం కలిగించగా సఫారీ డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 14 పరుగులతో గెలిచింది. మాంచెస్టర్లో జరిగిన రెండో టి20లో ఇంగ్లండ్ ఏకంగా 146 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది.ఈ రెండో టీ20లో ఇంగ్లండ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. మొదట బ్యాటింగ్ చేసిప ఇంగ్లండ్ జట్టు 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 60 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సాల్ట్ 15 ఫోర్లు, 8 సిక్సర్లతో 141 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.అతడితో పాటు జోస్ బట్లర్ 30 బంతుల్లో ఏకంగా 83 పరుగులతో తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం లక్ష్య చేధనలో సౌతాఫ్రికా 16.1 ఓవర్లలోనే 158 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకుముందు మూడు వన్డేల సిరీస్ను 2-1తో సఫారీలు సొంతం చేసుకున్నారు.చదవండి: చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్.. పాక్ ఆటగాడి రికార్డు బ్రేక్ -
చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్.. పాక్ ఆటగాడి రికార్డు బ్రేక్
ఆసియాకప్-2025లో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్లో బంతితో మ్యాజిక్ చేసిన కుల్దీప్.. ఇప్పుడు రెండో మ్యాచ్లో పాకిస్తాన్పై కూడా అదే తీరును కనబరిచాడు.ఆదివారం దుబాయ్ వేదికగా పాక్తో జరిగిన మ్యాచ్లో కుల్దీప్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతడి స్పిన్ బౌలింగ్ను ఎదుర్కొవడానికి పాక్ బ్యాటర్లు ముప్పు తిప్పలు పడ్డారు. ఈ ఎడమ చేతి వాటం స్పిన్నర్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 18 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఓ అరుదైన ఫీట్ను కుల్దీప్ తన పేరిట లిఖించుకున్నాడు.భారత్-పాకిస్తాన్ మధ్య టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసిన స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ రికార్డులెక్కాడు. ఇంతకుముందు వరకు ఈ ఘనత పాక్ స్పిన్నర్ మొహమ్మద్ నవాజ్ పేరిట ఉండేది. ఆసియాకప్-2022లో భారత్పై నవాజ్ 33 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించాడు. తాజా మ్యాచ్లో కేవలం 18 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టిన కుల్దీప్.. నవాజ్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్ను 7 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. ప్రత్యర్ధి నిర్ధేశించిన 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.5 ఓవర్లలో చేధించింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలవగా..భిషేక్ శర్మ (13 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు.పాక్ బౌలర్లలో అయూబ్ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులకే పరిమితమైంది.చదవండి: ఏడ్చేసిన షోయబ్ అక్తర్..! కాస్తైనా బుద్ధి లేదంటూ ఫ్యాన్స్ ఫైర్ -
ఏడ్చేసిన షోయబ్ అక్తర్..! కాస్తైనా బుద్ధి లేదంటూ ఫ్యాన్స్ ఫైర్
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు టీమిండియా (IND vs PAK) గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ముఖాముఖి తలపడిన తొలి పోరులో దాయాదికి చుక్కలు చూపించింది. దుబాయ్ వేదికగా ఆసియా కప్-2025 (Asia Cup)లో సమిష్టి ప్రదర్శనతో రాణించి.. పాక్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది.ఊహించని దెబ్బఅయితే, ఆట పరంగానే కాకుండా.. నైతికంగానూ భారత జట్టు పాకిస్తాన్ను ఊహించని దెబ్బ కొట్టింది. మైదానంలో పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. అంతేకాదు.. షేక్హ్యాండ్ కోసం మరోసారి ప్రయత్నం చేసినా డ్రెసింగ్రూమ్ తలుపులు మూసివేసినట్లు సమాచారం.మంచిగానే బుద్ధి చెప్పారుఈ విషయంపై స్పందించిన టీమిండియా అభిమానులు.. ‘‘ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశానికి మంచిగానే బుద్ధి చెప్పారు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా భారత ఆటగాళ్లను సమర్థిస్తున్నారు. అయితే, పాకిస్తాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మాత్రం నో- షేక్హ్యాండ్ చర్యను జీర్ణించుకోలేకపోయాడు.‘‘నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. నా మనసు ముక్కలైంది. హ్యాట్సాఫ్ ఇండియా. కానీ మీరు క్రికెట్ మ్యాచ్ను రాజకీయాల నుంచి వేరుగా ఉంచండి. మీ గురించి మేము ఎన్నో గొప్ప విషయాలు చెప్పాము.అక్తర్ కంటతడిఅలాంటి మాకు ఈ నో-షేక్హ్యాండ్ చర్య గురించి కూడా ఏదైనా మాట్లాడే హక్కు ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ వాటినే గుర్తుపెట్టుకుని ఇలా చేయకూడదు. మరచిపోయి ముందుకు సాగిపోవాలి.ఇది క్రికెట్. చేతులు కలపండి. కాస్త దయ చూపండి’’ అంటూ అక్తర్ కంటతడి పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ నెటిజన్లు అక్తర్కు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇస్తున్నారు.షేక్హ్యాండ్ ఇవ్వనందుకే ఇంత బాధగా ఉంటే..‘‘అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకల గురించి మర్చిపోవాలా?.. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా?.. షేక్హ్యాండ్ ఇవ్వనందుకే మీరు ఇంతగా బాధపడిపోతున్నారు.. తమ వారిని శాశ్వతంగా పోగొట్టుకున్న బాధితుల మనసులో ఎలాంటి అలజడి చెలరేగుతుందో మీరు కనీసం ఊహించగలరా?మ్యాచ్ గెలవడమే కాదు.. ఇలా వారికి సరైన బుద్ధి చెప్పినందుకు టీమిండియాకు హ్యాట్సాఫ్. దెబ్బ అదుర్స్’’ అంటూ అక్తర్ తీరును ఏకిపారేస్తూ.. సూర్యకుమార్ సేనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా ఇటీవల కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు అమాయక పర్యాటకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు.ఇందుకు బదులుగా భారత ఆర్మీ ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసి ధ్వంసం చేసింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పాకిస్తాన్ సైన్యం.. ఎదురుదాడికి ప్రయత్నించగా.. భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆసియా కప్ టోర్నీలో టీమిండియా- పాక్ ముఖాముఖి తలపడటం గమనార్హం.చదవండి: IND vs PAK: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మShoaib Akhtar crying over the handshake saga 😂 Same guy was chilling with Asim Munir & Afridi months back. Well done Surya – strike as deep as Nur Khan Air Base! 🔥🇮🇳 #INDvsPAK #IndianCricket #IndiaVsPakistan #aisacup2025 #indvspak2025 https://t.co/6O4XkugN8U pic.twitter.com/t9V8pCk0U8— Gaurav (@k_gauravs) September 15, 2025CAKEWALK 👏#TeamIndia cruise past Pakistan, chasing 127 inside 16 overs 🤩 Watch #DPWorldAsiaCup2025, from Sept 9-28 on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/EncO07RSlD— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 -
పాకిస్తాన్ కాదు.. టీమిండియాకు ఆ జట్టుతో డేంజర్?
ఆసియాకప్-2025లో టీమిండియా జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్లో యూఏఈను చిత్తు చేసిన భారత జట్టు.. ఇప్పుడు రెండో మ్యాచ్లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్పై అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో పాక్పై 7 వికెట్ల తేడాతో భారత్ విజయభేరి మ్రోగించింది.వరుసగా రెండు విజయాలతో గ్రూపు-ఎ నుంచి టేబుల్ టాపర్గా భారత్ నిలిచింది. భారత్కు ఇంకా ఒకే ఒక లీగ్ మ్యాచ్ మిగిలి ఉంది. సెప్టెంబర్ 19న పసికూన ఒమన్తో సూర్య కుమార్ సేన తలపడనుంది. ఈ మ్యాచ్లో భారత్ విజయం నల్లేరు మీద నడక అనే చెప్పుకోవాలి.ఇప్పటికే పాక్పై విజయంతో మెన్ ఇన్ బ్లూ సూపర్ బెర్త్ను ఖారారు చేసుకుంది. గ్రూపు-ఎ టేబుల్ టాపర్గా ఉన్న భారత్ సూపర్-4 రౌండ్ తొలి మ్యాచ్లో సెప్టెంబర్ 21న ఏ2తో తలపడనుంది. అంటే దాదాపు మళ్లీ పాక్-భారత్ జట్లు సూపర్ ఫోర్ దశలో తలపడే అవకాశముంది. శ్రీలంకతో జాగ్రత్త.. అయితే ఈ టోర్నీలో భారత్ అద్బుతమైన విజయాలతో దూసుకెళ్లుతున్నప్పటికి డిఫిండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో ముప్పు పొంచి ఉంది. ఆ తర్వాత అఫ్గానిస్తాన్ ఎంతో కొంత పోటీ ఎదురయ్యే అవకాశముంది. పాక్, బంగ్లాదేశ్ వంటి ప్రధాన జట్లు పోటీపడుతున్నప్పటికి.. ఆ టీమ్స్ తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాయి.ముఖ్యంగా శ్రీలంకను టీమిండయిఆ ఏ మాత్రం తేలికగా తీసుకుంటే భారీ మూల్యం చెల్లంచుకోక తప్పదు. శ్రీలంక ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉంది. ముఖ్యంగా బౌలింగ్లో సూపర్ స్టార్లు ఉన్నారు. ఈ టోర్నీలో అన్ని జట్లకు భిన్నంగా శ్రీలంక ముగ్గురు పేస్ బౌలర్లతో తమ తొలి మ్యాచ్లో ఆడింది. దుష్మాంత చమీరా, మతీషా పతిరానా, నువాన్ తుషారా వంటి పేస్ త్రయం శ్రీలంక వద్ద ఉంది. పవర్ప్లేలో తుషారా తన సంచలన బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లను కట్టడి చేయగలడు. స్పిన్ బౌలింగ్ విభాగంలో వరల్డ్ క్లాస్ వనిందు హసరంగా ఉన్నాడు.ఐపీఎల్లో ఆడిన అనుభవం హసరంగా ఉండడంతో భారత బ్యాటర్ల వీక్నెస్ అతడికి బాగా తెలుసు. అంతేకాకుండా ఐపీఎల్ ఎస్ఆర్హెచ్కు ఆడిన కమిందు మెండిస్ సైతం లంక జట్టులో భాగంగా ఉన్నాడు. అతడి కూడా బంతిని గింగరాలు తిప్పగలడు.బ్యాటింగ్ విషయానికి వస్తే కుశాల్ మెండిస్, నిస్సాంక, కుశాల్ పెరీరా, కెప్టెన్ చరిత్ అసలంక వంటి హిట్టర్లతో శ్రీలంక పటిష్టంగా ఉంది. యువ ఆటగాడు కమిల్ మిశ్రా సైతం మెరుపు బ్యాటింగ్ చేస్తున్నాడు. బంగ్లాదేశ్పై మిశ్రా 46 పరగులతో సత్తాచాటగా.. నిస్సాంక హాఫ్ సెంచరీతో రాణించాడు.శ్రీలంక కూడా టీమిండియా మాదిరిగానే అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఒకవేళ శ్రీలంక గ్రూపు-బి టేబుల్ టాపర్గా కొనసాగితే.. సూపర్-4 రౌండ్లో భారత్తో సెప్టెంబర్ 26న తలపడనుంది. కాగా చివరసారిగా టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియాకప్(2022)ను శ్రీలంకనే సొంతం చేసుకుంది.అత్యధిక ఆసియాకప్ టైటిల్స్ గెలుచుకున్న జట్టుగా భారత్ తర్వాత శ్రీలంకనే కొనసాగుతోంది. టీమిండియా అత్యధికంగా 8 సార్లు ఈ మెగా టోర్నీ విజేతగా నిలవగా.. లంక 6 సార్లు ఛాంపియన్గా నిలిచింది. -
Duleep Trophy 2025: ఆర్సీబీ కెప్టెన్ ఖాతాలో మరో టైటిల్..
దులీప్ ట్రోఫీ-2025 విజేతగా సెంట్రల్ జోన్ నిలిచింది. బెంగళూరు వేదికగా జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో సౌత్ జోన్ను చిత్తు చేసిన సెంట్రల్ జోన్.. ఏడోసారి దులీప్ ట్రోఫీ టైటిల్ను ముద్దాడింది. ఈ విజయంతో తమ 11 ఏళ్ల నిరీక్షణకు సెంట్రల్ జోన్ తెరదించింది. రజత్ పాటిదార్ తన అద్బుత కెప్టెన్సీతో సెంట్రల్ జోన్ను ఛాంపియన్గా నిలిపాడు.కాగా తుది పోరులో తొలి రోజు నుంచే సెంట్రల్ ఆధిపత్యం చెలాయించింది. సౌత్ జోన్ నిర్ధేశించిన 65 పరుగుల లక్ష్యాన్ని సెంట్రల్ జోన్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఈ ఫైనల్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 149 పరుగులకే ఆలౌటైంది.సెంట్రల్ జోన్ స్పిన్నర్లు శరన్ష్ జైన్ ఐదు వికెట్లతో మెరవగా.. శరన్ష్ జైన్ నాలుగు వికెట్లు సాధించాడు. సౌత్జోన్ ఇన్నింగ్స్లో తన్మయ్ అగర్వాల్(31) టాప్ స్కోరర్గా నిలవగా.. సల్మాన్ నిజార్(24), అంకిత్ శర్మ(20) రాణించారు. అనంతరం సెంట్రల్ జోన్ తమ మొదటి ఇన్నింగ్స్లో 511 పరుగుల భారీ స్కోర్ చేసింది.సెంట్రల్ జోన్ బ్యాటర్లలో యశ్ రాథోడ్(194), కెప్టెన్ రజత్ పాటిదార్(101) అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. సౌత్జోన్ బౌలర్లలో గుర్జప్నీత్ సింగ్, అంకిత్ శర్మ తలా నాలుగు వికెట్లు సాధించారు. నార్త్జోన్కు మొదటి ఇన్నింగ్స్లో 362 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్లో అదుర్స్..తొలి ఇన్నింగ్స్లో పేలవ ప్రదర్శన కనబర్చిన సౌత్ జోన్ బ్యాటర్లు... రెండో ఇన్నింగ్స్లో ఫర్వాలేదనిపించారు. సెకెండ్ ఇన్నింగ్స్ సౌత్ జోన్ 426 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దీంతో సౌత్జోన్ సెంట్రల్ జోన్ ముందు కేవలం 65 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్ధేశించగల్గింది. సౌత్ జోన్ బ్యాటర్లలో అంకిత్ శర్మ (168 బంతుల్లో 99; 13 ఫోర్లు, 1 సిక్స్), ఆండ్రె సిద్ధార్థ్ (190 బంతుల్లో 84 నాటౌట్; 7 ఫోర్లు) అద్బుత ఇన్నింగ్స్లతో అలరించారు. వీరిద్దరూ ఏడో వికెట్కు 192 పరుగులు జోడించి తమ జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేశారు. రవిచంద్రన్ స్మరణ్ (118 బంతుల్లో 67; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకం సాధించగా... ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్ (85 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. సెంట్రల్ జోన్ బౌలర్లలో కుమార్ కార్తికేయ 4, సారాంశ్ జైన్ 3 వికెట్లు పడగొట్టారు. -
IND vs PAK: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma)సరికొత్త చరిత్ర లిఖించాడు. పాకిస్తాన్పై టీ20 ఫార్మాట్లో.. పవర్ ప్లేలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును అభిషేక్ శర్మ బద్దలు కొట్టాడు.ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్-2025 టోర్నమెంట్లో దుబాయ్ వేదికగా భారత్- పాక్ ఆదివారం మ్యాచ్ ఆడాయి. టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది.తొలి బంతికే బౌండరీ బాదిఈ క్రమంలో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభం అందించాడు. తొలి బంతికే బౌండరీ బాది.. పాక్ కీలక పేసర్ షాహిన్ ఆఫ్రిది (Shaheen Afridi)కి స్వాగతం పలికిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. రెండో బంతిని ఏకంగా సిక్సర్గా మలిచాడు.ధనాధన్ దంచికొట్టిఆ తర్వాత కూడా ధనాధన్ దంచికొట్టిన అభిషేక్ శర్మ మొత్తంగా.. 13 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 31 పరుగులు సాధించాడు. సయీమ్ ఆయుబ్ బౌలింగ్లో ఇచ్చిన క్యాచ్ను ఫాహిమ్ అష్రాఫ్ అందుకోవడంతో అభిషేక్ సునామీ ఇన్నింగ్స్ (3.4 ఓవర్లో)కు తెరపడింది. కాగా పాకిస్తాన్ జట్టు మీద పవర్ ప్లేలో భారత బ్యాటర్లలో ఎవరికైనా ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు (31) కావడం విశేషం. ఇదిలా ఉంటే.. అభిషేక్ (31)తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (47 నాటౌట్), తిలక్ వర్మ (31), శివం దూబే (7 బంతుల్లో 10 నాటౌట్) రాణించారు. ఫలితంగా 15.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసిన టీమిండియా.. పాక్పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.పాకిస్తాన్పై టీ20 ఫార్మాట్లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు రాబట్టిన భారత క్రికెటర్లు🏏అభిషేక్ శర్మ- 31 పరుగులు- 2025లో దుబాయ్ వేదికగా..🏏విరాట్ కోహ్లి- 29 పరుగులు- 2022లో దుబాయ్ వేదికగా🏏రోహిత్ శర్మ- 28 పరుగులు- 2022లో దుబాయ్ వేదికగా🏏కేఎల్ రాహుల్- 28 పరుగులు- 2022లో దుబాయ్ వేదికగా.చదవండి: పాక్ జట్టుకు ఘోర అవమానం!?.. అలాంటివాళ్లకు గంభీర్ కరెక్ట్! -
‘అక్కడికి వెళ్లినా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.. అందుకే మా కెప్టెన్ ఇలా’
టీమిండియా చేతిలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు (IND vs PAK)కు మరోసారి పరాభవమే ఎదురైంది. ఆసియా కప్ టీ20 టోర్నీ-2025లో భాగంగా భారత్ చేతిలో సల్మాన్ ఆఘా బృందం ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరుదేశాలు ముఖాముఖి తలపడటం ఇదే మొదటిసారి.ఈ నేపథ్యంలో తీవ్రమైన భావోద్వేగాల వ్యక్తీకరణల నడుమ భారత్- పాక్ మైదానంలో దిగాయి. ‘బాయ్కాట్’ ట్రెండ్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryalumar Yadav) ముందుగానే జాగ్రత్తపడ్డాడు. టాస్ సమయంలో పాక్ సారథి సల్మాన్ ఆఘా (Salman Agha)కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనానికి భారత ఆటగాళ్లు నిరాకరించారు. ఈ క్రమంలో పాక్ ప్లేయర్లు టీమిండియా డ్రెసింగ్రూమ్ వైపు వెళ్లగా.. సహాయక సిబ్బంది తలుపు మూసేసినట్లు తెలుస్తోంది.అక్కడికి వెళ్లినా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు..ఈ క్రమంలో అవమానభారంతో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్కు కూడా రాలేదు. ఈ విషయంపై పాక్ కోచ్ మైక్ హసన్ వివరణ ఇచ్చాడు. ‘‘ఏదో ఫ్లోలో అలా జరిగిపోయి ఉంటుందని అనుకున్నాం. వారితో కరచాలనం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ మా ప్రత్యర్థి జట్టు చేసిన పని మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది.ఆ తర్వాత కూడా షేక్హ్యాండ్ ఇవ్వడానికి వెళ్లాము. కానీ వాళ్లు అప్పటికే చేంజింగ్ రూమ్కి వెళ్లిపోయారు. నిజంగానే మేము కరచాలనానికి సిద్ధంగా ఉన్నా ఇలా జరగడం బాధ కలిగించింది’’ అని మైక్ హసన్ మీడియాతో పేర్కొన్నాడు.ఆడుతూ.. పాడుతూ.. అలవోకగా..కాగా దుబాయ్ వేదికగా భారత- పాక్ ఆదివారం తలపడ్డాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (40), పేసర్ షాహిన్ ఆఫ్రిది (33) రాణించడంతో.. నిర్ణీత 20 ఓవర్ల ఆటలో తొమ్మిది వికెట్ల నష్టానికి 127 పరుగులు చేయగలిగింది.భారత బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లతో చెలరేగగా.. అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలకు చెరో ఒక వికెట్ దక్కింది.ఇక లక్ష్య ఛేదనను టీమిండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. 15.4 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 131 పరుగులు చేసింది. ఫలితంగా దాయాదిపై ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. పాక్ స్పెషలిస్టు బౌలర్లంతా విఫలం కాగా.. పార్ట్టైమ్ స్పిన్నర్ సయీమ్ ఆయుబ్ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.చదవండి: పాక్ జట్టుకు ఘోర అవమానం!?.. అలాంటివాళ్లకు గంభీర్ కరెక్ట్! Trick after trick, Pakistan fell for Kuldeep's magic show 🪄Watch the #DPWorldAsiaCup2025, from Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/F5lOWqPrvK— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 -
ఒకటి.. రెండు.. మూడు.. అయ్యో పాపం! తిలక్ నవ్వులు.. వీడియో
ఆసియా కప్-2025 టోర్నీలో టీమిండియాతో మ్యాచ్లో పాకిస్తాన్ (Ind Vs Pak) ఆది నుంచే తడబడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్ల ధాటికి తాళలేక నామమాత్రపు స్కోరు కూడా చేయలేకపోయింది.అభిషేక్ శర్మ ధనాధన్ఏదేమైనా బ్యాటింగ్లో కాస్త ఫర్వాలేదనిపించినా.. బౌలింగ్లో మాత్రం పాక్ తేలిపోయింది. దాయాది విధించిన లక్ష్యాన్ని పటిష్ట టీమిండియా 15.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత ఓపెనర్లలో అభిషేక్ శర్మ (13 బంతుల్లో 31) మరోసారి విధ్వంసం సృష్టించగా.. శుబ్మన్ గిల్ (10) మాత్రం ఈసారి విఫలమయ్యాడు.రాణించిన తిలక్, సూర్యఅయితే, వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 47 నాటౌట్)తో కలిసి.. నాలుగో నంబర్ బ్యాటర్ తిలక్ వర్మ (31 బంతుల్లో 31) మెరుగ్గా రాణించాడు. అయితే, పన్నెండో ఓవర్లో తిలక్ 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నపుడు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.మూడుసార్లు ప్రయత్నించినా ఇందుకు పాక్ స్పిన్నర్ మహ్మద్ నవాజ్ పొరపాటే కారణం. తన బౌలింగ్లో తిలక్ ఇచ్చిన స్ట్రెయిట్ క్యాచ్ను పట్టడంలో నవాజ్ దారుణంగా విఫలమయ్యాడు. మూడుసార్లు ప్రయత్నించినా బంతిని ఒడిసిపట్టలేకపోయాడు. దీంతో తిలక్ వర్మ.. ‘మనం సేఫ్’ అన్నట్లుగా చిరునవ్వులు చిందించగా.. మహ్మద్ నవాజ్ మాత్రం నేలపై పంచ్లు కొడుతూ తనను తాను తిట్టుకున్నాడు.ఇంతలో మరో ఎండ్లో ఉన్న సూర్య వేగంగా స్పందించి.. రనౌట్ ప్రమాదం జరగకుండా చూసుకున్నాడు. అంతేకాదు.. జాగ్రత్తగా ఉండమంటూ తిలక్కు సైగ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఒకటి.. రెండు.. మూడు.. అయ్యో పాపం!‘‘ఒకటి.. రెండు.. మూడు.. అయ్యో పాపం!.. ప్రపంచంలోని బెస్ట్ స్పిన్నర్ ఇంత చెత్తగా ఫీల్డింగ్ చేస్తాడా?’’ అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్తాన్ హెడ్కోచ్ మైక్ హసన్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్ మహ్మద్ నవాజ్ మా జట్టులో ఉన్నాడు’’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు ఇలా కౌంటర్లు ఇస్తున్నారు.ఇదిలా ఉంటే.. సూర్యకుమార్తో కలిసి శివం దూబే (7 బంతుల్లో 10) ఆఖరి వరకు అజేయంగా నిలిచి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. ఇక ఆసియా కప్ టోర్నీలో భారత్కు ఇది వరుసగా రెండో విజయం. తొలుత యూఏఈని ఓడించిన టీమిండియా.. తాజాగా పాక్పై గెలిచి సూపర్-4కు లైన్ క్లియర్ చేసుకుంది.చదవండి: ఈ విజయం వారికి అంకితం.. నేను ఎల్లప్పుడూ ఆ బౌలర్లకు అభిమానినే: సూర్య Looked simple… until the ball turned lava 🤭Watch #INDvPAK LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/wVztsgkJv3— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 -
పాక్ జట్టుకు ఘోర అవమానం!?.. అలాంటివాళ్లకు గంభీర్ కరెక్ట్!
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో టీమిండియా వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి మ్యాచ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను ఓడించిన సూర్య సేన.. ఆదివారం నాటి రెండో మ్యాచ్లో దాయాది పాకిస్తాన్ను చిత్తు చేసింది. దుబాయ్ వేదికగా ఏడు వికెట్ల తేడాతో సల్మాన్ ఆఘా బృందాన్ని ఓడించి.. చిరకాల ప్రత్యర్థిపై తమదే పైచేయి అని మరోసారి నిరూపించింది.కాగా పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ఆర్మీ ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట ఉగ్రమూకలకు గట్టిగా బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత కూడా క్రీడల్లోనూ పాక్తో ఎలాంటి సంబంధాలు ఉండకూడదనే డిమాండ్లు వచ్చాయి. అయితే, బహుళ దేశాలు ఆడుతున్న ఆసియా కప్ టోర్నీలో మాత్రం దాయాదితో ఆడేందుకు కేంద్ర అనుమతినివ్వగా.. ఆదివారం మ్యాచ్ జరిగింది.నో షేక్హ్యాండ్!స్థాయికి తగ్గట్లుగానే టీమిండియా మరోసారి రాణించి పాక్పై ఘన విజయం సాధించింది. అయితే, సాధారణంగా టాస్ వేసినపుడు, ఆట ముగిసిన తర్వాత ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోవడం ఆనవాయితీ. అయితే, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత ఆటగాళ్లు కనీసం ఒక్క చిరునవ్వు గానీ.. షేక్హ్యాండ్ గానీ లేకుండానే వెనుదిరిగారు.ముఖం మీదే తలుపు వేశారు!ఆ తర్వాత పాక్ ఆటగాళ్లు ఇండియన్ డ్రెసింగ్ రూమ్ వైపునకు రాగా.. సిబ్బంది వారి ముఖం మీదే తలుపు వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘షేక్హ్యాండ్’ ఇవ్వకపోవడంపై భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు.క్రీడాస్ఫూర్తికి మించినవి కూడా ఉంటాయి‘‘ముందుగానే ఈ విషయం గురించి నిర్ణయం తీసుకున్నాము. ఇక్కడికి కేవలం మ్యాచ్ ఆడేందుకు మాత్రమే మేము వచ్చాము. వారికి సరైన విధంగా బదులిచ్చాము. కొన్ని విషయాలు క్రీడాస్ఫూర్తికి మించినవి ఉంటాయి. ఈ విజయం ఆపరేషన్ సిందూర్లో ధైర్యసాహసాలు చూపిన భారత ఆర్మీకి అంకితం. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు మేము ఎల్లవేళలా మద్దతుగా ఉంటాము’’ అని సూర్య చెప్పాడు.అలాంటివాళ్లకు గంభీర్ కరెక్ట్!కాగా టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ నిర్ణయానుగుణంగానే భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో షేక్ హ్యాండ్కు నిరాకరించినట్లు ‘టెలికామ్ ఆసియా స్పోర్ట్’ పేర్కొంది. అంతేకాదు మైదానంలోనూ వారితో ఒక్క మాట కూడా మాట్లాడవద్దని గౌతీ ముందుగానే హెచ్చరించినట్లు తెలిపింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ నేపథ్యంలో.. ‘‘పాకిస్తాన్కు సరైన విధంగా బుద్ధిచెప్పారు. ఉగ్రమూకలను ప్రోత్సహించే దేశానికి చెందిన ఆటగాళ్లకు ఇలాంటి సన్మానాలు తప్పవు. ఇలాంటి వారికి గంభీరే కరెక్ట్’’ అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ఆసియా కప్-2025 టీ20 టోర్నీ: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్👉పాక్ స్కోరు: 127/9 (20)👉టీమిండియా స్కోరు: 131/3 (15.5)👉ఫలితం: పాక్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.చదవండి: Asia Cup 2025: అభిషేక్ విధ్వంసం.. షాహిన్ అఫ్రిదికి ఫ్యూజ్లు ఔట్! వీడియో CAKEWALK 👏#TeamIndia cruise past Pakistan, chasing 127 inside 16 overs 🤩 Watch #DPWorldAsiaCup2025, from Sept 9-28 on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/EncO07RSlD— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 -
ఈ విజయం వారికి అంకితం.. నేను ఎల్లప్పుడూ ఆ బౌలర్లకు అభిమానినే: సూర్య
పాకిస్తాన్ జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించింది. ఆసియా కప్-2025 టోర్నమెంట్లో భాగంగా ఆదివారం పాక్ (IND vs PAK)తో తలపడిన భారత్.. ఏడు వికెట్ల తేడాతో దాయాదిని చిత్తు చేసింది. తద్వారా సూపర్-4 దశకు మార్గాన్ని సుగమం చేసుకుంది.ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శనపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సంతృప్తి వ్యక్తం చేశాడు. అదే విధంగా.. చిరకాల ప్రత్యర్థి పాక్పై సాధించిన ఈ విజయాన్ని భారత సైన్యానికి అంకితం చేశాడు. అంతేకాదు.. తన పుట్టినరోజున టీమిండియా అభిమానులకు ఇలాంటి కానుక ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్నాడు.పాక్పై టీమిండియా గెలుపు అనంతరం సూర్య మాట్లాడుతూ.. ‘‘స్టేడియంలోని ప్రేక్షకులు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం సంతోషకరం. టీమిండియాకు నా తరఫున ఇదొక రిటర్న్ గిఫ్ట్ లాంటిది. ముందు నుంచి గెలుపుపై ఆత్మవిశ్వాసంగానే ఉన్నాము.స్పిన్నర్లకు నేను ఎల్లప్పుడూ అభిమానినేఅన్ని మ్యాచ్లలాగే ఇదీ ఒకటి అని ముందుగానే అన్నింటికీ సిద్ధమయ్యాము. ఈ టోర్నీలో పాల్గొంటున్న అన్ని జట్లను ఎలా ఎదుర్కోవాలో ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. కొన్ని నెలల క్రితమే ఇక్కడ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచాము. ఇక్కడి పిచ్లపై స్పిన్నర్ల అవసరం ఎలాంటిదో నాకు తెలుసు. మధ్య ఓవర్లలో మ్యాచ్ను మలుపు తిప్పగల స్పిన్నర్లకు నేను ఎల్లప్పుడూ అభిమానినే’’ అని తెలిపాడు. భారత సైన్యానికి ఈ విజయం అంకితంఅదే విధంగా.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు మేము ఎల్లవేళలా అండగా ఉంటామని ఈ సందర్భంగా మరోసారి చెబుతున్నాను. ఉగ్రమూకలను ఏరివేయడంలో ధైర్యసాహసాలు చూపిన భారత సైన్యానికి ఈ విజయం అంకితం చేస్తున్నాము.వారు ఎల్లప్పుడూ ఇలాగే మనల్ని గర్వపడేలా చేస్తూ.. ఆదర్శంగా నిలుస్తూ ఉంటారని కోరుకుంటున్నా. వారి ముఖాలపై చిరునవ్వులు తీసుకువచ్చేందుకు మైదానంలో మాకు వచ్చిన ఏ అవకాశాన్ని మేము వదులుకోము’’ అంటూ సూర్యకుమార్ యాదవ్ ఉద్వేగానికి లోనయ్యాడు.భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ స్కోర్లు👉వేదిక: దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, దుబాయ్👉టాస్: పాకిస్తాన్.. తొలుత బ్యాటింగ్👉పాక్ స్కోరు: 127/9 (20)👉భారత్ స్కోరు: 131/3 (15.5)👉ఫలితం: పాక్పై ఏడు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కుల్దీప్ యాదవ్ (4 ఓవర్ల కోటాలో 18 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు).చదవండి: Asia Cup 2025: అభిషేక్ విధ్వంసం.. షాహిన్ అఫ్రిదికి ఫ్యూజ్లు ఔట్! వీడియోThis victory is for you, India 🇮🇳 Watch #DPWorldAsiaCup2025, Sept 9-28, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/KXXzoF9fIR— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 -
విజయం వాకిట్లో రజత్ పాటిదార్ సేన
బెంగళూరు: దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టు విజయానికి చేరువైంది. తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేసిన సెంట్రల్ జోన్ ముందు రెండో ఇన్నింగ్స్లో 65 పరుగుల లక్ష్యం నిలిచింది. సోమవారం ఆటకు చివరి రోజు కాగా... సెంట్రల్ జోన్ విజయం లాంఛనమే. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 129/2తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సౌత్ జోన్ జట్టు చివరకు 121 ఓవర్లలో 426 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన సౌత్ జోన్ బ్యాటర్లు... రెండో ఇన్నింగ్స్లో బాధ్యతాయుతంగా ఆడారు. ముఖ్యంగా అంకిత్ శర్మ (168 బంతుల్లో 99; 13 ఫోర్లు, 1 సిక్స్), ఆండ్రె సిద్ధార్థ్ (190 బంతుల్లో 84 నాటౌట్; 7 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్లతో అలరించారు. ఈ ఇద్దరూ ఏడో వికెట్కు 192 పరుగులు జోడించి జట్టును ఒడ్డున పడేసే ప్రయత్నం చేశారు. రవిచంద్రన్ స్మరణ్ (118 బంతుల్లో 67; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకం సాధించగా... ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్ (85 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. సెంట్రల్ జోన్ బౌలర్లలో కుమార్ కార్తికేయ 4, సారాంశ్ జైన్ 3 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో సౌత్ జోన్ 149 పరుగులకు ఆలౌట్ కాగా... సెంట్రల్ జోన్ 511 పరుగులు చేసింది. 192 పరుగుల భాగస్వామ్యం... సెంట్రల్ జోన్ స్పిన్నర్లను ఎదుర్కోలేక తొలి ఇన్నింగ్స్లో పేలవ ప్రదర్శన కనబర్చిన సౌత్ జోన్ బ్యాటర్లు... రెండో ఇన్నింగ్స్లో ఫర్వాలేదనిపించారు. రవిచంద్రన్ స్మరణ్, రికీ భుయ్ బాధ్యతాయుతంగా ఆడటంతో... ఇక సౌత్ జోన్ జట్టు కుదురుకున్నట్లే అనిపించింది. ఈ జంట మూడో వికెట్కు 85 పరుగులు జోడించగా... ఆ తర్వాత కెపె్టన్ మొహమ్మద్ అజహరుద్దీన్ (27; 2 ఫోర్లు, 1 సిక్స్), సల్మాన్ నిజార్ (12) ఎక్కువసేపు నిలవలేకపోయారు. దీంతో 161/2తో పటిష్టంగా కనిపించిన సౌత్ జోన్... 222/6తో ఓటమి అంచున నిలిచింది. ఈ దశలో అంకిత్, సిద్ధార్థ్ చక్కటి పోరాట పటిమ కనబర్చారు. ఒక్కో పరుగు జోడిస్తూ... ముందుకు సాగిన ఈ జంట... సెంట్రల్ జోన్ స్పిన్నర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంది. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాక స్వేచ్ఛగా షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించింది. ఈ క్రమంలో అంకిత్ శర్మ 84 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... సిద్ధార్థ్ 110 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. సెంచరీకి ఒక్క పరుగు దూరంలో అంకిత్ అవుట్ అయ్యాడు. దీంతో ఏడో వికెట్కు 192 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత మిగిలిని మూడు వికెట్లు పడేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. మొత్తంగా సౌత్ జోన్ 64 పరుగుల ఆధిక్యం సాధించింది. సెంట్రల్ జోన్ జట్టు 11 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీ చేజిక్కించుకోవాలంటే చివరి రోజు రెండో ఇన్నింగ్స్లో 65 పరుగులు చేయాల్సి ఉంది. స్కోరు వివరాలు సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్: 149; సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్ 511; సౌత్ జోన్ రెండో ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (బి) కుల్దీప్ సేన్ 26; మోహిత్ కాలే (ఎల్బీ) (బి) సారాంశ్ జైన్ 38; స్మరణ్ (సి) యశ్ రాథోడ్ (బి) కార్తికేయ 67; రికీ భుయ్ (సి) శుభమ్ శర్మ (బి) దీపక్ చాహర్ 45; అజహరుద్దీన్ (సి) కుల్దీప్ సేన్ (బి) కార్తికేయ 27; సల్మాన్ నిజార్ (సి) రజత్ పాటీదార్ (బి) కార్తికేయ 12; ఆండ్రె సిద్ధార్థ్ (నాటౌట్) 84; అంకిత్ శర్మ (సి) రజత్ పాటీదార్ (బి) కార్తికేయ 99; గుర్జపనీత్ సింగ్ (సి) మాలేవర్ (బి) సారాంశ్ 3; నిధీశ్ (రనౌట్) 0; వాసుకి కౌశిక్ (స్టంప్డ్) ఉపేంద్ర యాదవ్ (బి) సారాంశ్ జైన్ 0; ఎక్స్ట్రాలు 25; మొత్తం (121 ఓవర్లలో ఆలౌట్) 426. వికెట్ల పతనం: 1–62, 2–76, 3–161, 4–200, 5–221, 6–222, 7–414, 8–419, 99–420, 10–426. బౌలింగ్: దీపక్ చాహర్ 16–2–74–1; ఆదిత్య ఠాకరే 8–2–22–0; కుమార్ కార్తికేయ 39–3–110–4; సారాంశ్ జైన్ 42–8–130–3; కుల్దీప్ సేన్ 12–1–60–1, శుభమ్ శర్మ 4–1–21–0. -
‘షేక్ హ్యాండ్’ లేదు!
సాధారణంగా టాస్ వేసిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు చేతులు కలపడం ఆనవాయితీ. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది కానీ, ఒక చిరునవ్వు కానీ వివాదానికి, అనవసరపు చర్చకు దారి తీసే అవకాశం ఉంది. అందుకే కావచ్చు అటు సూర్యకుమార్ యాదవ్ గానీ ఇటు సల్మాన్ ఆగా కానీ అందుకు సాహసించలేదు. ‘షేక్ హ్యాండ్’ ఇవ్వకుండా, కనీసం ఒకరివైపు మరొకరు చూడకుండా ఇద్దరూ చెరో వైపునకు వెళ్లిపోయారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోకుండా వెళ్లిపోయారు. టోర్నీ ఆరంభానికి ముందు జరిగిన కెప్టెన్ల సమావేశంలో ఏసీసీ అధ్యక్షుడు, పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీకి సూర్యకుమార్ షేక్ హ్యాండ్ ఇవ్వడం మన అభిమానులకు అసంతృప్తిని కలిగించింది. ఆ ఒక్క విజువల్ను మళ్లీ మళ్లీ చూపిస్తూ సోషల్ మీడియాలో అంతా సూర్యను, బీసీసీఐని ఆడుకున్నారు. దాంతో ఈసారి అతను కూడా జాగ్రత్త పడ్డాడు! -
అలవోకగా... అలవాటుగా...
భారత జట్టు పాకిస్తాన్పై మరోసారి తమ బలాన్ని ప్రదర్శించింది. ఏమాత్రం పోటీ లేని మ్యాచ్లో ఏకపక్షంగాదాయాది జట్టుపై ఆధిపత్యం ప్రదర్శించి అతి సునాయాస విజయాన్ని అందుకుంది. ఇటీవల పాక్తో మ్యాచ్తో ఫలితం గురించి ఆలోచించాల్సిన అవసరం లేని విధంగా, అలవాటుగా మారిపోయినట్లుగా, అలవోకగా మరో గెలుపు మన ఖాతాలో చేరింది. ముందుగా భారత బౌలర్ల సమష్టి ప్రదర్శనతో తేలిపోయిన పాక్ బ్యాటర్లు తక్కువ స్కోరుకే పరిమితం కాగా... ఆ తర్వాత మన ప్రధాన బ్యాటర్లంతా పని పూర్తి చేశారు. దాంతో 25 బంతులæ ముందే టీమిండియా ఛేదన ముగిసింది. భారత్లో అక్కడక్కడా ఈ మ్యాచ్ ఆడటంపై నిరసనలు, విమర్శలు వినిపించినా... మైదానంలో మాత్రం ప్రేక్షకుల సంఖ్య సంతృప్తికర స్థాయిలో కనిపించింది. టోర్నీ తర్వాతి దశలో ఇరు జట్లు మరోసారి తలపడే అవకాశం ఉంది. దుబాయ్: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీలో ఆసక్తిని రేపిన పోరులో భారత్ పైచేయి సాధించింది. ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. సాహిబ్జాదా ఫర్హాన్ (44 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్స్లు), షాహిన్ అఫ్రిది (16 బంతుల్లో 33 నాటౌట్; 4 సిక్స్లు) రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 18 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా... అక్షర్ పటేల్, బుమ్రా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు సాధించి గెలిచింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), అభిషేక్ శర్మ (13 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్స్లు), హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ (31 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. భారత్ తమ తర్వాతి మ్యాచ్లో శుక్రవారం ఒమన్తో తలపడుతుంది. ఆదుకున్న ఫర్హాన్, అఫ్రిది... ఇన్నింగ్స్ తొలి బంతిని ‘వైడ్’గా వేసిన పాండ్యా... అదనపు బంతికి సయీమ్ అయూబ్ (0)ను అవుట్ చేశాడు. దాంతో తొలి బంతికే భారత్కు వికెట్ దక్కినట్లయింది. అయూబ్ వరుసగా రెండో మ్యాచ్లోనూ ‘గోల్డెన్ డక్’గా వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్లో బుమ్రా రెండో బంతికే మొహమ్మద్ హారిస్ (3)ని వెనక్కి పంపాడు. ఈ దశలో ఫర్హాన్, ఫఖర్ (17) కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. బుమ్రా వరుస ఓవర్లలో ఫర్హాన్ ఒక్కో సిక్స్ కొట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి పాక్ స్కోరు 42 పరుగులకు చేరింది. పాకిస్తాన్పై అటు వన్డేలు, ఇటు టి20ల్లో కలిపి బుమ్రా బౌలింగ్లో ఒక పాక్ బ్యాటర్ సిక్స్ కొట్టడం ఇది మొదటిసారి మాత్రమే. అతను వేసిన 400వ బంతికిగానీ ఇది సాధ్యం కాకపోవడం విశేషం! అయితే పవర్ప్లే తర్వాత భారత బౌలర్లు ప్రత్యరి్థని పూర్తిగా కట్టి పడేశారు. పరుగులు తీయడంలో పాక్ తీవ్రంగా ఇబ్బంది పడగా, మరో వైపు వరుసగా వికెట్లూ పడ్డాయి. ముగ్గురు భారత స్పిన్నర్లను ఏమాత్రం ఆడలేక పాక్ 19 పరుగుల వ్యవధిలో తర్వాతి 4 వికెట్లు చేజార్చుకుంది. ఫఖర్, సల్మాన్ ఆగా (3)లను వరుస ఓవర్లలో అక్షర్ వెనక్కి పంపగా... కుల్దీప్ వరుస బంతుల్లో హసన్ (5), నవాజ్ (0) పని పట్టాడు. 7–16 మధ్య 10 ఓవర్లలో పాక్ 2 ఫోర్లు, ఒక సిక్స్తో కేవలం 41 పరుగులే చేయగలిగింది. ఒకదశలో వరుసగా 33 బంతుల పాటు బౌండరీనే రాలేదు. అయితే చివర్లో షాహిన్ అఫ్రిది దూకుడుగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. హార్దిక్ వేసిన చివరి ఓవర్లో అతను 2 సిక్స్లు బాదాడు. అర్ధ సెంచరీ భాగస్వామ్యం... ఛేదనను భారత్ జోరుగా మొదలు పెట్టింది. అఫ్రిది వేసిన తొలి ఓవర్లో మొదటి రెండు బంతుల్లో 4, 6 బాదిన అభిషేక్... అతని తర్వాతి ఓవర్లో కూడా ఇలాగే 4, 6 కొట్టాడు. అయితే ఈ రెండు ఓవర్ల మధ్య అయూబ్ బౌలింగ్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన శుబ్మన్ గిల్ (7 బంతుల్లో 10) మరుసటి బంతికి వెనుదిరిగాడు. అయూబ్ తర్వాతి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అభిషేక్... అదే ఓవర్లో అవుటయ్యాడు. ఈ దశలో సూర్య, తిలక్ ఎక్కడా తగ్గకుండా ఇన్నింగ్స్ను నడిపించారు. తొలి 6 ఓవర్లలో భారత్ 61 పరుగులు చేసింది. ఆ తర్వాత చకచకా పరుగులు రాబట్టిన సూర్య, తిలక్ మూడో వికెట్కు 52 బంతుల్లో 56 పరుగులు జోడించారు. విజయానికి చేరువవుతున్న దశలో తిలక్ అవుటైనా...శివమ్ దూబే (10 నాటౌట్)తో కలిసి సూర్య గెలిపించాడు. వీరిద్దరు నాలుగో వికెట్కు 21 బంతుల్లో అభేద్యంగా 34 పరుగులు జత చేశారు. సూఫియాన్ బౌలింగ్లో మిడ్ వికెట్ మీదుగా సూర్య కొట్టిన భారీ సిక్స్తో మ్యాచ్ ముగిసింది. 10 అంతర్జాతీయ టి20ల్లో పాకిస్తాన్పై భారత్ సాధించిన విజయాల సంఖ్య. ఇప్పటి వరకు రెండు జట్ల మధ్య 14 టి20 మ్యాచ్లు జరిగాయి. నాలుగింటిలో మాత్రమే పాక్ గెలిచింది. ఆసియా కప్లో నేడు యూఏఈ X ఒమన్ వేదిక: అబుదాబి సాయంత్రం గం. 5:30 నుంచి శ్రీలంక X హాంకాంగ్ వేదిక: దుబాయ్ రాత్రి గం. 8:00 నుంచి సోనీ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారంస్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: అయూబ్ (సి) బుమ్రా (బి) పాండ్యా 0; ఫర్హాన్ (సి) పాండ్యా (బి) కుల్దీప్ 40; హారిస్ (సి) పాండ్యా (బి) బుమ్రా 3; ఫఖర్ (సి) తిలక్ (బి) అక్షర్ 17; సల్మాన్ (సి) అభిషేక్ (బి) అక్షర్ 3; హసన్ (సి) అక్షర్ (బి) కుల్దీప్ 5; నవాజ్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 0; ఫహీమ్ (ఎల్బీ) (బి) వరుణ్ 11; షాహిన్ అఫ్రిది (నాటౌట్) 33; సూఫియాన్ (బి) బుమ్రా 10; అబ్రార్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 127. వికెట్ల పతనం: 1–1, 2–6, 3–45, 4–49, 5–64, 6–64, 7–83, 8–97, 9–111. బౌలింగ్: హార్దిక్ పాండ్యా 3–0–34–1, జస్ప్రీత్ బుమ్రా 4–0–28–2, వరుణ్ చక్రవర్తి 4–0–24–1, కుల్దీప్ యాదవ్ 4–0–18–3, అక్షర్ పటేల్ 4–0–18–2, అభిషేక్ శర్మ 1–0–5–0. భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) ఫహీమ్ (బి) అయూబ్ 31; గిల్ (స్టంప్డ్) హారిస్ (బి) అయూబ్ 10; సూర్యకుమార్ (నాటౌట్) 47; తిలక్ వర్మ (బి) అయూబ్ 31; దూబే (నాటౌట్) 10; ఎక్స్ట్రాలు 2; మొత్తం (15.5 ఓవర్లలో 3 వికెట్లకు) 131. వికెట్ల పతనం: 1–22, 2–41, 3–97. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 2–0–23–0, అయూబ్ 4–0–35–3, అబ్రార్ 4–0–16–0, నవాజ్ 3–0–27–0, సూఫియాన్ 2.5–0–29–0. -
అభిషేక్, సూర్య మెరుపులు.. పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్
ఆసియాకప్-2025లో టీమిండియా జోరు కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన తమ రెండో మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ను భారత్ చిత్తు చేసింది. పాక్ విధించిన 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.5ఓవర్లలో చేధించింది.ఈ స్వల్ప లక్ష్య చేధనలో అభిషేక్ శర్మ(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 31), తిలక్ శర్మ(31) మెరుపు ఇన్నింగ్స్లు ఆడగా.. సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్తో 47), శివమ్ దూబే(10) ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశారు. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్ ఒక్కడే మూడు వికెట్లు సాధించాడు. మిగతా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు.కుల్దీప్ మ్యాజిక్..అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ భారత బౌలర్ల దాటికి విలవిల్లాడింది. పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 127 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో సాహిబ్జాదా ఫర్హాన్(40) టాప్ స్కోరర్గా నిలవగా.. షాహిన్ అఫ్రిది(16 బంతుల్లో 4 సిక్స్లతో 33) ఆఖరిలో మెరుపులు మెరిపించాడు.భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. స్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో భారత్ సూపర్-4కు ఆర్హత సాధించింది. ఇక తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో సెప్టెంబర్ 19న ఒమన్తో తలపడనుంది.#PKMKBForever#INDvsPAK pic.twitter.com/wSdhqOsx8R— Sarcastic Ujel (@Sarcasticujel) September 14, 2025 -
అభిషేక్ విధ్వంసం.. షాహిన్ అఫ్రిదికి ఫ్యూజ్లు ఔట్! వీడియో
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఆసియాకప్-2025లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్తాన్పై అభిషేక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 128 పరుగుల లక్ష్య చేధనలో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించాడు.ముఖ్యంగా పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిదిని ఈ పంజాబ్ ఆటగాడు ఉతికారేశాడు. భారత ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన అఫ్రిది బౌలింగ్లో అభిషేక్ తొలి బంతినే బౌండరీకి మలిచాడు. ఆ తర్వాత రెండో బంతికి లాంగాఫ్ మీదగా అభిషేక్ కొట్టిన సిక్స్ మ్యాచ్ మొత్తానికి హైలెట్గా నిలిచింది. మళ్లీ మూడో ఓవర్ వేసిన అఫ్రిది బౌలింగ్లో అభిషేక్ ఓ ఫోర్, భారీ సిక్సర్ బాదాడు. దీంతో షాహీన్ తెల్లముఖం వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. అభిషేక్ శర్మ కేవలం 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 31 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతకుముందు యూఏఈతో మ్యాచ్లో అభిషేక్ కూడా 30 పరుగులు చేశాడు.భారత్ ఘన విజయం..ఇక ఈ మ్యాచ్లో పాక్పై 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 15.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా చేధించింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్సర్తో 47 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలవగా.. అభిషేక్ శర్మ(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 31), తిలక్ శర్మ(31) రాణించారు.6️⃣ & 4️⃣ last time, 4️⃣ & 6️⃣ this time 🥵🥶Stay put & watch #INDvPAK as Abhishek takes off - #DPWORLDASIACUP2025. LIVE on #SonyLIV & #SonySportsNetwork TV Channels 📺#AsiaCup pic.twitter.com/guAssBLFJC— Sony LIV (@SonyLIV) September 14, 2025 -
Asia Cup 2025: నిన్ను ఎవరు భయ్యా కెప్టెన్ చేశారు?
ఆసియాకప్-2025లో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ఏ మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ఈ మెగా టోర్నీలో వరుసగా రెండో మ్యాచ్లోనూ సల్మాన్ అలీ విఫలమయ్యాడు. ఒమన్తో జరిగిన తొలి మ్యాచ్లో గోల్డెన్ డకౌటైన సల్మాన్.. ఇప్పుడు దుబాయ్ వేదికగా భారత్తో మ్యాచ్లో కూడా పేలవ ప్రదర్శన కనబరిచాడు.కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చిన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ తొలి బంతి నుంచే భారత స్పిన్నర్లను ఎదుర్కొవడానికి తీవ్రంగా శ్రమించాడు. ఆఖరికి 12 బంతులు ఆడి కేవలం 3 పరుగులు చేసిన సల్మాన్.. అక్షర్ పటేల్ బౌలింగ్లో ఔటయ్యాడు. అతడి వికెట్ పాక్ మరింత ఒత్తిడిలో కూరుకుపోయింది.దీంతో కెప్టెన్గా దారుణ ప్రదర్శన కనబరుస్తున్న అలీ అఘాను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. నిన్ను ఎవరు భయ్యా కెప్టెన్ చేశారు? అంటూ ఓ యూజర్ ఎక్స్లో పోస్ట్ చేశాడు. మహ్మద్ రిజ్వాన్ నుంచి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన సల్మాన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. కెప్టెన్గా ఒకట్రెండు సిరీస్లు గెలిపించినప్పటికి ఆటగాడిగా మాత్రం విఫలమవుతున్నాడు. దీంతో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని పాక్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.SALMAN ALI AGHA IN T20Is4(2) – 0(1) – 1(9) – 13(19) – 32(32)5 innings, 50 runs, 10 avg, 79 SR. pic.twitter.com/6rgh4P6ZlA— junaiz (@dhillow_) March 4, 2025ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులకే పరిమితమైంది. పాక్ బ్యాటర్లలో సాహిబ్జాదా ఫర్హాన్(40) టాప్ స్కోరర్గా నిలవగా.. షాహిన్ అఫ్రిది(16 బంతుల్లో 4 సిక్స్లతో 33) ఆఖరిలో మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ తీశారు. -
ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. భారత జట్టు ఓటమి
వన్డే ప్రపంచకప్-2025 సన్నాహాకాల్లో భాగంగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్ను భారత మహిళల జట్టు ఓటమితో ఆరంభించింది. ఆదివారం ముల్లాన్పుర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో హర్మాన్ సేన పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది.టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్లు ప్రతీకా రావల్ (96 బంతుల్లో 64), స్మృతి మంధాన (63 బంతుల్లో 58) అర్ధ శతకాలతో సత్తాచాటగా.. వన్డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ (57 బంతుల్లో 54) కూడా హాఫ్ సెంచరీతో రాణించింది. ఆసీస్ బౌలర్లలో మేగన్ షట్ రెండు వికెట్లు పడగొట్టగా.. కిమ్ గార్త్, అన్నాబెల్ సదర్లాండ్, అలనా కింగ్, తాహిలా మెగ్రాత్ తలా వికెట్ సాధించారు.అదరగొట్టిన మూనీ, లిచ్ఫీల్డ్అనంతరం 282 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 44.1 ఓవర్లలోనే చేధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఫోబీ లిచ్ఫీల్డ్(80 బంతుల్లో 14 ఫోర్లతో 88), బెత్మూనీ(74 బంతుల్లో 9 ఫోర్లతో 77 నాటౌట్), సదర్లాండ్(51 బంతుల్లో 54 నాటౌట్) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా ఒక్కో వికెట్ సాధించారు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే సెప్టెంబర్17న ముల్లాన్పుర్ వేదికగానే జరగనుంది. -
కోహ్లి రికార్డు బ్రేక్ చేసిన హార్దిక్ పాండ్యా
ఆసియా కప్-2025 (Asia Cup)లో భాగంగా టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా పాకిస్తాన్కు ఆదిలోనే షాకిచ్చాడు. భారత బౌలింగ్ అటాక్ను ఆరంభించిన ఈ పేస్ ఆల్రౌండర్ తొలి బంతిని వైడ్గా సంధించాడు. అయితే, ఆ తర్వాత వెంటనే వికెట్ తీసి టీమిండియాకు శుభారంభం అందించాడు.హార్దిక్ వేసిన అవుట్స్వింగర్ను తప్పుగా అంచనా వేసిన పాక్ ఓపెనర్ సయీమ్ ఆయుబ్.. బంతిని గాల్లోకి లేపగా జస్ప్రీత్ బుమ్రా క్యాచ్ పట్టాడు. దీంతో ఆయుబ్ డకౌట్ అయ్యాడు. ఫలితంగా పాక్ తొలి వికెట్ కోల్పోగా.. హార్దిక్ ఖాతాలో తొలి వికెట్ చేరింది.పాండ్యా సూపర్ క్యాచ్ఇక ఆ మరుసటి ఓవర్లో హార్దిక్ పాండ్యా మంచి క్యాచ్ అందుకున్నాడు. బుమ్రా బౌలింగ్లో వన్డౌన్ బ్యాటర్ మహ్మద్ హ్యారిస్ (3) ఇచ్చిన క్యాచ్ను పాండ్యా కష్టపడి పట్టాడు. బ్యాట్ టాప్ ఎడ్జ్ను తాకిన బంతి గాల్లోకి లేవగా లాంగ్ లెగ్లో నుంచి పరిగెత్తుకుని వచ్చి మరీ అందుకున్నాడు. ఫలితంగా పాక్ రెండో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా.. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లిని అధిగమించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న రెండో భారత ఫీల్డర్గా నిలిచాడు. రోహిత్ శర్మ 65 క్యాచ్లతో అగ్రస్థానంలో ఉండగా.. హార్దిక్ పాండ్యా.. మహ్మద్ హ్యారిస్ క్యాచ్తో కలిపి 55 క్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. దుబాయ్ వేదికగా ఆసియా కప్-2025 టోర్నమెంట్లో భారత్- పాక్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పది ఓవర్ల ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది.అంతర్జాతీయ టీ20లలో అత్యధిక క్యాచ్లు అందుకున్న భారత ఫీల్డర్లురోహిత్ శర్మ- 65హార్దిక్ పాండ్యా- 55*విరాట్ కోహ్లి- 54సూర్యకుమార్ యాదవ్- 51*సురేశ్ రైనా- 42. చదవండి: టీమిండియా కెప్టెన్గా తిలక్ వర్మ.. బీసీసీఐ ప్రకటన𝗕𝗢𝗢𝗠! 💥India are tearing through. Pakistan lose their 2nd wicket 🔥Watch #INDvPAK LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/xqJXwEHqnf— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 -
బుమ్రా బౌలింగ్లో 6 సిక్స్లు కొడతాడన్నారు.. కట్ చేస్తే! తొలి బంతికే ఔట్
ఆసియాకప్-2025లో పాకిస్తాన్ యువ ఓపెనర్ సైమ్ అయూబ్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఒమన్తో జరిగిన తొలి మ్యాచ్లో గోల్డెన్ డకౌటైన అయూబ్.. ఇప్పుడు దుబాయ్ వేదికగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో అదే తీరును కనబరిచాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అయూబ్ తను ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. పాక్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన పాండ్యా.. మొదటి బంతిని ఆఫ్ స్టంప్ దిశగా బ్యాక్ ఆఫ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని అయూబ్ ఆఫ్ సైడ్ పాయింట్ దిశగా షాట్ ఆడేందుకు ప్రయత్నిచాడు.అయూబ్ షాట్ అద్బుతంగా కనక్ట్ చేసినప్పటికి బంతి మాత్రం నేరుగా బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న జస్ప్రీత్ బుమ్రా చేతికి వెళ్లింది. దీంతో ఒక్కసారిగా అయూబ్ తెల్లముఖం చేశాడు. చేసేదేమిలేక నిరాశతో పెవిలియన్కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.అయితే భారత్ మ్యాచ్కు ముందు అయూబ్ను ఉద్దేశించి పాక్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ ఇచ్చిన స్టెట్మెంట్ ఇప్పుడు భారత అభిమానులు ప్రస్తావిస్తున్నారు. బుమ్రా బౌలింగ్లో అయూబ్ ఆరు సిక్స్లు కొడతాడని అహ్మద్ బిల్డప్ ఇచ్చాడు.దీంతో అహ్మద్, అయూబ్ను కలిసి నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. "భారత్పై కనీసం ఒక్క పరుగు చేయలేకపోయావు, నీవా బుమ్రా బౌలింగ్లో 6 సిక్స్లు కొడతావని" ఓ యూజర్ ఎక్స్లో పోస్ట్ చేశాడు.6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో తొలి వికెట్గా అయూబ్ వెనుదిరగగా.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో మహ్మద్ హరిస్(3) ఔటయ్యాడు. అయితే వీరిద్దరి ఔటయ్యాక ఫఖార్ జమాన్(16), సాహిబ్జాదా ఫర్హాన్(19) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 6 ఓవర్లు ముగిసే సారికి పాక్ రెండు వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది.Aapka Mother of all Rivalries mein 𝘏𝘈𝘙𝘋𝘐𝘒 swaagat 😉 Watch #INDvPAK LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/AEQE0TLQju— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025చదవండి: IND vs PAK: టాస్ గెలిచినా అదే చేసేవాళ్లం: సూర్య!.. తుదిజట్లు ఇవే Saim Ayub is gone! #Pakistan lose their first wicket. 🏏#PAKvIND #INDvsPAK pic.twitter.com/9p3V2jakgd— Maham Awan (@awanmaham_) September 14, 2025 -
IND vs PAK: టాస్ గెలిచినా అదే చేసేవాళ్లం: సూర్య!.. తుదిజట్లు ఇవే
భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్కు నగారా మోగింది. టీమిండియాతో మ్యాచ్లో పాక్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసియా కప్-2025 టోర్నమెంట్లో భాగంగా గ్రూప్-‘ఎ’లో ఉన్న దాయాదుల మధ్య ఆదివారం నాటి పోరుకు దుబాయ్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.ఈసారి టీ20 ఫార్మాట్లో జరుగుతున్న ఈ ఖండాంతర టోర్నీలో టీమిండియా, పాక్లతో పాటు యూఏఈ, ఒమన్ గ్రూప్-‘ఎ’లో ఉన్నాయి. ఇప్పటికే భారత జట్టు యూఏఈపై ఘన విజయం సాధించగా.. పాకిస్తాన్ ఒమన్పై గెలుపొందింది. ఈ క్రమంలో చిరకాల ప్రత్యర్థులు ఈ టోర్నీలో తమ రెండో మ్యాచ్లో పరస్పరం తలపడుతున్నాయి.మేము గొప్పగా ఆడుతున్నాముఇక భారత్తో మ్యాచ్లో టాస్ గెలిచిన నేపథ్యంలో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. ‘‘మేము తొలుత బ్యాటింగ్ చేస్తాము. గత కొన్ని రోజులుగా మేము గొప్పగా ఆడుతున్నాము. ఈ మ్యాచ్ కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నాం.ఇది కాస్త స్లో వికెట్లా కనిపిస్తోంది. అందుకే తొలుత బ్యాటింగ్ చేసి మెరుగైన స్కోరు సాధించాలని పట్టుదలగా ఉన్నాము. గత ఇరవై రోజులుగా మేము ఇక్కడ ఆడుతున్నాం కాబట్టి పిచ్ పరిస్థితులపై మాకు పూర్తి అవగాహన ఉంది’’ అని పేర్కొన్నాడు.కాగా ఆసియా కప్ టోర్నీ సన్నాహకాల్లో భాగంగా పాక్.. యూఏఈ- అఫ్గనిస్తాన్తో టీ20 ట్రై సిరీస్ ఆడింది. ఈ ముక్కోణపు సిరీస్ను పాక్ కైవసం చేసుకుంది. మరోవైపు.. టీమిండియాకు కూడా దుబాయ్ పిచ్లు కొత్తేం కాదు.తొలుత బౌలింగ్ చేయాలనే భావించాంఇక టాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘మేము తొలుత బౌలింగ్ చేయాలనే భావించాం. వికెట్ చాలా బాగుంది. పాతబడే కొద్ది బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. తేమగా ఉంది. కాబట్టి డ్యూ ఉంటుందని ఆశిస్తున్నాం. ఈ మ్యాచ్లో... యూఏఈతో ఆడిన తుదిజట్టునే ఆడిస్తున్నాం’’ అని తెలిపాడు.ఆసియా కప్-2025 భారత్ వర్సెస్ పాకిస్తాన్ తుదిజట్లుటీమిండియాఅభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిపాకిస్తాన్సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, మహ్మద్ హారీస్(వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, సల్మాన్ ఆఘా(కెప్టెన్), హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్.చదవండి: టీమిండియా కెప్టెన్గా తిలక్ వర్మ.. బీసీసీఐ ప్రకటన Coin falls in favour of Pakistan and they choose to bat first 🏏Watch #INDvPAK LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/IU98kUSWda— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 -
Asia Cup 2025: పాకిస్తాన్పై భారత్ ఘన విజయం
India vs Pakistan Match live updates: దుబాయ్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. పాక్ నిర్ధేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 15.5 ఓవర్లలో చేధించింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్సర్తో 47 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలవగా.. అభిషేక్ శర్మ(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 31), తిలక్ శర్మ(31) రాణించారు. పాక్ బౌలర్లలో అయూబ్ ఒక్కడే మూడు వికెట్లు సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులకే పరిమితమైంది.తిలక్ ఔట్..తిలక్ వర్మ రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన తిలక్ వర్మ.. సైమ్ అయూబ్ బౌలింగ్లో ఔటయ్యాడు. భారత విజయానికి ఇంకా 31 పరుగులు కావాలి. క్రీజులో సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే ఉన్నారు.నిలకడగా ఆడుతున్న సూర్య, తిలక్..8 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. క్రీజులో తిలక్ వర్మ(19), సూర్యకుమార్ (9) ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 57 పరుగులు కావాలి.రెండో వికెట్ కోల్పోయిన భారత్..అభిషేక్ శర్మ రూపంలో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. అభిషేక్ కేవలం 13 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్స్లతో 31 పరుగులు చేసి ఔటయ్యాడు. 4 ఓవర్లకు భారత్ స్కోర్: 42/1. క్రీజులో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు.భారత్ తొలి వికెట్ డౌన్.. గిల్ ఔట్128 పరుగుల లక్ష్య చేధనలో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన శుబ్మన్ గిల్.. సైమ్ అయూబ్ బౌలింగ్లో స్టంపౌట్గా వెనుదిరిగాడు. 2 ఓవర్లకు భారత్ స్కోర్: 22/1. అభిషేక్ శర్మ (5 బంతుల్లో 12) దూకుడుగా ఆడుతున్నాడు.టీమిండియా టార్గెట్@128దుబాయ్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత బౌలర్లు చెలరేగారు. టీమిండియా బౌలర్ల దాటికి పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులకే పరిమితమైంది. పాక్ బ్యాటర్లలో సాహిబ్జాదా ఫర్హాన్(40) టాప్ స్కోరర్గా నిలవగా.. షాహిన్ అఫ్రిది(16 బంతుల్లో 4 సిక్స్లతో 33) ఆఖరిలో మెరుపులు మెరిపించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ తీశారు.తొమ్మిదో వికెట్ డౌన్..పాకిస్తాన్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన సోఫియన్ ముఖియమ్.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.పాక్ ఎనిమిదో వికెట్ డౌన్..పాకిస్తాన్కు ఆలౌట్కు చేరువైంది. ఫహీం అష్రఫ్(11) రూపంలో పాక్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అష్రప్ ఔటయ్యాడు. 18 ఓవర్లకు పాక్ స్కోర్: 99/8. క్రీజులో షాహీన్ అఫ్రిది(15), ముఖియమ్(1) ఉన్నారు.పాక్ ఏడో వికెట్ డౌన్..సాహిబ్జాదా ఫర్హాన్ రూపంలో పాకిస్తాన్ ఏడో వికెట్ కోల్పోయింది. 40 పరుగులు చేసిన ఫర్హాన్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు.కుల్దీప్కు ఇది మూడో వికెట్. 16.1 ఓవర్లకు పాక్ స్కోర్: 83/712.5: ఆరో వికెట్ కోల్పోయిన పాక్కుల్దీప్ యాదవ్ మహ్మద్ నవాజ్ను డకౌట్ చేశాడు. వికెట్ల ముందు దొరకబుచ్చుకుని వచ్చీ రాగానే పెవిలియన్కు పంపాడు. దీంతో పాక్ ఆరో వికెట్ కోల్పోయింది. స్కోరు: 65/6 (13).12.4: ఐదో వికెట్ కోల్పోయిన పాక్కుల్దీప్ యాదవ్ బౌలింగ్ హసన్ నవాజ్ (5) అక్షర్ పటేల్కు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్గా వెనుదిరిగాడు. సాహిబ్జాదా 32, నవాజ్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 64/5 (12.4).నాలుగో వికెట్ కోల్పోయిన పాక్9.6: అక్షర్ పటేల్ మరోసారి అదరగొట్టాడు. అద్భుతమైన బంతితో సల్మాన్ ఆఘా (3)ను పెవిలియన్కు పంపాడు. అక్షర్ బౌలింగ్లో సల్మాన్ ఇచ్చిన బంతిని అభిషేక్ శర్మ క్యాచ్ పట్టడంతో పాక్ నాలుగో వికెట్ కోల్పోయింది. స్కోరు: 49/4 (10). సల్మాన్ స్థానంలో హసన్ నవాజ్ క్రీజులోకి రాగా.. సాహిబ్జాదా 22 పరుగులతో క్రీజులో ఉన్నాడు. Axar Patel joins the party 🥳Fakhar Zaman departs for just 17.Watch #INDvPAK LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/xwkBnHbnqr— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 మూడో వికెట్ కోల్పోయిన పాక్7.4: అక్షర్ పటేల్ బౌలింగ్లో ఫఖర్ జమాన్ (17) అవుటయ్యాడు. జమాన్ ఇచ్చిన క్యాచ్ను తిలక్ వర్మ అద్భుత రీతిలో పట్టడంతో.. పాక్ మూడో వికెట్ కోల్పోయింది. పాక్ స్కోరు: 45/3 (7.4) పవర్ ప్లేలో పాకిస్తాన్ స్కోరు: 42/2 (6)సాహిబ్జాదా 19, ఫఖర్ జమాన్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారుమూడు ఓవర్ల ఆట ముగిసే సరికి పాకిస్తాన్ స్కోరు: 20/2సాహిబ్జాదా మూడు, ఫఖర్ జమాన్ పది పరుగులతో క్రీజులో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన పాక్1.2: బుమ్రా బౌలింగ్లో రెండో వికెట్గా వెనుదిరిగిన మహ్మద్ హ్యారిస్. మూడు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి హ్యారిస్ అవుటయ్యాడు. పాక్ స్కోరు: 6/2 (1.2)తొలి వికెట్ కోల్పోయిన పాక్..0.1: పాకిస్తాన్కు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో సైమ్ అయూబ్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఆసియాకప్-2025లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడతున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాకిస్తాన్ తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరి ఫాస్ట్ బౌలర్లలతో మెన్ ఈన్ గ్రీన్ బరిలోకి దిగింది. స్పీడ్ స్టార్ హరిస్ రౌఫ్ మరోసారి బెంచ్కే పరిమితమయ్యాడు. మరోవైపు భారత్ కూడా తమ ప్లేయింగ్ ఎలెవన్లో ఎటువంటి మార్పులు లేకుండా ఆడుతోంది. ప్రాక్టీస్ సెషన్లో గాయపడిన సూపర్ స్టార్ శుబ్మన్ గిల్ పూర్తి ఫిట్నెస్ను సాధించాడు. దీంతో గిల్కు తుది జట్టులో చోటు దక్కింది. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ స్పిన్నర్లగా ఉండగా.. జస్ప్రీత్ బుమ్రా ఫ్రంట్ లైన్ పేసర్గా ఉన్నాడు. బుమ్రాతో పాటు ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే బంతిని పంచుకోనున్నారు.తుది జట్లుభారత్ : అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిపాకిస్థాన్ : సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, మహ్మద్ హారీస్(వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్ -
టీమిండియా కెప్టెన్గా తిలక్ వర్మ.. బీసీసీఐ ప్రకటన
ఆస్ట్రేలియా-ఎతో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం భారత-ఎ జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. అంత ఊహించనట్టుగానే ఆసీస్-ఎ సిరీస్లో టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఆడడం లేదు. తొలుతు ఆసీస్ పర్యటనకు ముందు సన్నాహాల్లో భాగంగా ఈ అనాధికారిక సిరీస్లో రో-కో ద్వయం ఆడనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఈ సిరీస్ కోసం సెలక్టర్లు ప్రకటించిన తాజా స్క్వాడ్లో వీరిద్దరి పేర్లు లేకపోవడంతో అవన్నీ వట్టి రూమర్సే అని రుజువైంది. ఈ సిరీస్ కోసం రెండు వెర్వేరు జట్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. తొలి వన్డే కోసం 13 మంది సభ్యులతో కూడిన జట్టును మాత్రమే బీసీసీఐ సెలక్ట్ చేసింది.ఆస్ట్రేలియా-ఎతో జరిగే తొలి వన్డేలో భారత-ఎ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ వ్యవహరించనున్నాడు. అతడితో పాటు ఈ జట్టులో ఐపీఎల్ స్టార్లు ప్రియాన్ష్ ఆర్య, ఆయూష్ బదోని, ప్రభుసిమ్రాన్ సింగ్, సిమర్జీత్ సింగ్, విప్రజ్ నిగమ్లకు చోటు దక్కింది.కెప్టెన్గా తిలక్ వర్మ..ఇక ఆఖరి రెండు మ్యాచ్లకు భారత-ఎ జట్టు కెప్టెన్గా హైదరాబాదీ తిలక్ వర్మను సెలక్టర్లు ఎంపిక చేశారు. తిలక్తో పాటు ఆసియాకప్ భారత జట్టులో భాగమైన అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్లకు కూడా ఈ అనాధికరిక వన్డే సిరీస్లో ఆడనున్నారు. ఆసియాకప్ ముగిశాక వీరి నలుగురు నేరుగా ఇండియా-ఎ జట్టుతో కలవనున్నారు.తొలి వన్డే జట్టులో భాగంగా ఉన్న ప్రియాన్ష్ ఆర్య, సిమర్జీత్ సింగ్లకు ఆఖరి రెండు వన్డేలకు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. ఇండియా-ఎ వర్సెస్ ఆసీస్-ఎ మధ్య మూడు వన్డేల సిరీస్ సెప్టెంబర్ 30 నుంచి ఆక్టోబర్ 5 మధ్య జరగనుంది. మొత్తం మూడు మ్యాచ్లు కాన్పూర్ వేదికగానే జరగనున్నాయి.తొలి వన్డే కోసం భారత-ఎ జట్టురజత్ పాటిదార్ (కెప్టెన్), ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ఆయుష్ బడోని, సూర్యాంశ్ షెడ్గే, విప్రజ్ నిగమ్, నిషాంత్ సింధు, గుర్జప్నీత్ సింగ్, యుధ్వీర్ సింగ్, రవి బిష్ణోయ్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, సిమర్జీత్ సింగ్.రెండు, మూడు వన్డేల కోసం భారత- జట్టుతిలక్ వర్మ (కెప్టెన్), రజత్ పాటిదార్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ఆయుష్ బడోని, సూర్యాంశ్ షెడ్గే, విప్రజ్ నిగమ్, నిషాంత్ సింధు, గుర్జప్నీత్ సింగ్, యుధ్వీర్ సింగ్, రవి బిష్ణోయ్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా -
మెదడు ఉందా?.. లేదా?.. అతడే నిరూపించాలి: ఇచ్చిపడేసిన దాదా
పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్కోచ్ మైక్ హసన్ కు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. హసన్ మెదడు పనిచేస్తుందో లేదో ఆ జట్టు స్పిన్నర్ మొహమ్మద్ నవాజే (Mohammad Nawaz)నిరూపించాల్సి ఉందని పేర్కొన్నాడు. ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో భాగంగా భారత్- పాక్ మధ్య మ్యాచ్ నిర్వహణకు ఆదివారం (సెప్టెంబరు 14) షెడ్యూల్ ఖరారైంది.ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్ఈసారి యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో టీమిండియా, పాకిస్తాన్ ఇప్పటికే చెరో విజయం సాధించాయి. తద్వారా గ్రూప్-‘ఎ’లో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఇదిలా ఉంటే.. దాయాదుల పోరు నేపథ్యంలో పాక్ హెడ్కోచ్ మైక్ హసన్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్ మొహమ్మద్ నవాజ్ మా జట్టులో ఉన్నాడు’’ అని పేర్కొన్నాడు.ఇదే విషయాన్ని సౌరవ్ గంగూలీ దగ్గర ఆనంద్ బజార్ పత్రిక విలేకరి ప్రస్తావించారు. ‘‘పాకిస్తాన్ కోచ్ మైక్ హసన్.. ప్రపంచలోని అత్యుత్తమ స్పిన్నర్ మా జట్టులో ఉన్నాడు’’ అని అన్నాడు సదరు విలేకరి చెప్పగా.. ‘‘ఎవరా స్పిన్నర్?’’ అని దాదా అడిగాడు.మెదడు ఉందా?.. లేదా?.. అతడే నిరూపించాలిఇందుకు బదులిస్తూ.. ‘‘మొహమ్మద్ నవాజ్’’ అని విలేకరి పేర్కొనగా.. ‘‘సరే.. తమ కోచ్ మెదడు సరిగ్గా పనిచేస్తుందని నిరూపించాల్సిన బాధ్యత సదరు స్పిన్నర్పైనే ఉంది’’ అంటూ గంగూలీ ఘాటుగా కౌంటర్గా ఇచ్చాడు.వీళ్లంతా వరల్డ్క్లాస్ క్రికెటర్లుఅదే విధంగా.. భారత్- పాక్ జట్ల మధ్య పోలికల గురించి ప్రస్తావన రాగా.. ‘‘రెండు జట్లకు అసలు పోలికే లేదు. పాక్ జట్టు నాణ్యత రోజురోజుకీ దిగజారిపోతోంది. వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్, సయీద్ అన్వర్, ఇంజమామ్ ఉల్ హక్, యూనిస్ ఖాన్, మొహహ్మద్ యూసఫ్... వీళ్లంతా వరల్డ్క్లాస్ క్రికెటర్లు.కానీ పాకిస్తాన్కు ఇపుడు ఆడుతున్న ప్లేయర్లు ఉన్నారో మీరే చూడండి. ఇక ఆ టీ20 జట్టులో బాబర్ ఆజం లేడు. మహ్మద్ రిజ్వాన్ కూడా లేడు. ఫఖర్ జమాన్ ఓకే. బౌలింగ్లో షాహిన్ ఆఫ్రిది, హ్యారిస్ రవూఫ్ ఫర్వాలేదు.షాహిన్ ఎన్నటికీ వసీం అక్రం కాలేడుకానీ టాలెంట్ విషయంలో షాహిన్ ఆఫ్రిది ఎన్నటికీ వసీం అక్రం కాలేడు కదా!.. వసీం, వకార్, షోయబ్లతో షాహిన్ లేదంటే రవూఫ్లను పోల్చగలమా? టీ20 ఫార్మాట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టమే. ఏదేమైనా ప్రస్తుత టీమిండియా- పాక్ జట్లకు ఎలాంటి పోలికా లేదని స్పష్టంగా చెప్పగలను’’ అని గంగూలీ పేర్కొన్నాడు. చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన భారత ఓపెనింగ్ జోడి -
భారత్తో మ్యాచ్.. అలా జరిగితే మాదే విజయం: షోయబ్ మాలిక్
ఆసియాకప్-2025లో అసలు సిసలైన పోరుకు సమయం అసన్నమైంది. ఈ ఖండాంతర టోర్నీలో భాగంగా మరికాసేపట్లో దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ చిరకాల ప్రత్యర్దుల పోరు తీవ్ర ఉద్రిక్తల నడుమ జరగనుంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్ వంటి పరిణామాల నేపథ్యంలో పాక్తో మ్యాచ్ను బహిష్కరించాలని దేశ వ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. బాయ్ కాట్ ఇండియా వర్సెస్ పాక్ హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ఎక్స్లో ట్రెండ్ అవుతుంది. కానీ ఈ మ్యాచ్లో తలపడేందుకు ఇరు జట్లు సిద్దమయ్యాయి. మరికాసేపట్లో ఇరు జట్ల ఆటగాళ్లు స్టేడియంకు చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉడేందుకు దుబాయ్ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. స్టేడియంలోకి జెండాలు, గొడుగులు, బ్యాన్సర్ లాంటివి పోలీసులు అనుమతించడం లేదు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు ముందు పాకిస్తాన్ వెటరన్ షోయబ్ మాలిక్ తన జట్టుకు కీలక సూచనలు చేశాడు. ఈ మ్యాచ్లో భారత టాపార్డర్ను తొందరగా ఔట్ చేస్తే పాక్కు గెలిచే అవకాశముందని మాలిక్ అభిప్రాయపడ్డాడు."ఈ మ్యాచ్లో టాస్ కీలకంగా మారనుంది. కానీ టాస్ అనేది ఎవరి చేతుల్లోనూ లేదు. ఒకవేళ పాక్ టాస్ ఓడిపోయినా కూడా మ్యాచ్ గెలిచేందుకు గెలిచేందుకు కొన్ని అవకాశాలు ఉన్నాయి. భారత్ అగ్రశ్రేణి బ్యాటర్లలో ముగ్గురు, నలుగురుని త్వరగా అవుట్ చేసి వారిని తక్కువ స్కోర్కే పరిమితం చేస్తే వారిని ఓడించవచ్చు.భారత్ స్కోర్ 150-160 మధ్య ఉంటే మనకు విజయం సాధించే అవకాశముంటుంది" అని ఓ లోకల్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాలిక్ పేర్కొన్నాడు. ఆసియాకప్లో పాక్పై భారత్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు 18 మ్యాచ్లలో తలపడ్డాయి. ఇందులో భారత్ 10 మ్యాచ్లలో గెలిస్తే, ఆరింట పాక్ విజయం సాధించింది. రెండు మ్యాచ్లలో ఫలితం రాలేదు. అయితే ఆసియాకప్ వన్డే ఫార్మాట్లో 15 మ్యాచ్లు జరగ్గా.. ఎనిమిదింట్లో భారత్.. ఐదింట్లో పాక్ గెలిచాయి. మూడు టీ20 మ్యాచ్లలో రెండింట్లో భారత్, ఒకసారి పాక్ విజయం సాధించాయి. మరోసారి పాక్పై భారత్ ఆధిపత్యం చెలాయించే అవకాశముంది. దీంతో హిస్టరీ చూసి మాట్లాడు అని మాలిక్కు టీమిండియా ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు.చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన భారత ఓపెనింగ్ జోడి -
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన భారత ఓపెనింగ్ జోడి
ఆస్ట్రేలియాతో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్లు స్మృతి మంధాన (Smriti Mandhana)- ప్రతీకా రావల్ (Pratika Rawal) అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఇద్దరూ అర్ధ శతకాలతో చెలరేగి వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ క్రమంలోనే పాతికేళ్లుగా బెలిండా క్లార్క్- లిసా కైట్లీ పేరిట ఉన్న వన్డే ప్రపంచ రికార్డును స్మృతి- ప్రతీకా బద్దలు కొట్టారు.టాపార్డర్ హాఫ్ సెంచరీలుకాగా మహిళల వన్డే ప్రపంచకప్-2025 (ICC ODI WC 2025) సన్నాహకాల్లో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మూడు మ్యాచ్ల సిరీస్లో తలపడుతున్నాయి. ఇందులో భాగంగా చండీగఢ్లోని ముల్లన్పూర్లో ఆదివారం నాటి తొలి వన్డేలో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది.ఓపెనర్లు ప్రతీకా రావల్ (96 బంతుల్లో 64), స్మృతి మంధాన (63 బంతుల్లో 58) అర్ధ శతకాలతో అదరగొట్టగా.. వన్డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ (57 బంతుల్లో 54) కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకుంది. అయితే, మిగతా వారంతా తేలిపోయారు.A half-century filled with stylish stroke play!4th ODI Fifty for Harleen Deol 👏👏#TeamIndia inching closer to the 200-run markUpdates ▶️ https://t.co/LS3igwDIqz#INDvAUS | @IDFCFirstBank | @imharleenDeol pic.twitter.com/49Wxr8LF6f— BCCI Women (@BCCIWomen) September 14, 2025281 పరుగులుకెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 11, జెమీమా రోడ్రిగ్స్ 18 పరుగులు మాత్రమే చేయగా.. రిచా ఘోష్ 25, దీప్తి శర్మ 20 (నాటౌట్) ఫర్వాలేదనిపించారు. రాధా యాదవ్ 19 పరుగులు చేసింది. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో భారత జట్టు ఏడు వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది.ఆసీస్ బౌలర్లలో మేగన్ షట్ రెండు వికెట్లు పడగొట్టగా.. కిమ్ గార్త్, అన్నాబెల్ సదర్లాండ్, అలనా కింగ్, తాహిలా మెగ్రాత్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన భారత ఓపెనింగ్ జోడిగతేడాది నుంచి భారత జట్టు ఓపెనర్లుగా వస్తున్న స్మృతి మంధాన- ప్రతీకా రావల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ఇప్పటికే మహిళల వన్డే క్రికెట్లో అత్యుత్తమంగా 84.66 సగటుతో వెయ్యి పరుగులు చేసిన తొలి జంటగా వీరు చరిత్రకెక్కారు.తాజాగా మరో వరల్డ్ రికార్డును స్మృతి- ప్రతీకా తమ పేరిట లిఖించుకున్నారు. ఓ క్యాలెండర్ ఇయర్లో ఏ వికెట్కైనా అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా నిలిచారు. ఆసీస్తో తొలి వన్డే సందర్భంగా స్మృతి- ప్రతీకా ఈ రికార్డు నమోదు చేశారు.కాగా 2025లో ఇప్పటి వరకు స్మృతి- ప్రతీకా కలిసి 958 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు.. 2000 సంవత్సరంలో బెలిండా క్లార్క్- లీసా కేట్లీ (ఆసీస్) 905 పరుగుల పార్ట్నర్షిప్ సాధించగా.. స్మృతి- ప్రతీకా తాజాగా వారిని అధిగమించారు.అంతేకాకుండా.. భారత మహిళా వన్డే క్రికెట్లో తక్కువ ఇన్నింగ్స్లోనే ఎక్కువసార్లు 100 ప్లస్ ఓపెనింగ్ గణాంకాలు నమోదు చేసిన క్రికెటర్లుగా స్మృతి- ప్రతీకా చరిత్రకెక్కారు. జయా శర్మ- కరుణా జైన్ 25 ఇన్నింగ్స్లో ఐదుసార్లు వందకు పైగా భాగస్వామ్యం సాధించగా.. స్మృతి- ప్రతీకా 15 ఇన్నింగ్స్లోనే ఈ ఫీట్ అందుకున్నారు.చదవండి: PKL 12: తమిళ్ తలైవాస్ సంచలన నిర్ణయం!.. జన్మలో కబడ్డీ ఆడనంటూ.. -
కాసేపట్లో భారత్-పాక్ మ్యాచ్.. క్రిస్ గేల్ ఆసక్తికర ట్వీట్
ఆసియాకప్ 2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు రంగం సిద్దమైంది. మరికాసేపట్లో దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్ధుల పోరుకు తెరలేవనుంది. ఓ వైపు బాయ్కాట్ డిమాండ్ వినిపిస్తున్నప్పటికి.. ఈ హైవోల్టేజ్ మ్యాచ్లో తలపడేందుకు ఇరు జట్లు సిద్దమయ్యాయి.ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, మాజీ క్రికెటర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందులో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం,యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ కూడా ఉన్నాడు. భారత్-పాక్ పోరు నేపథ్యంలో గేల్ ఆసక్తికర ట్వీట్ చేశాడు."ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఉర్రూతలూగించేందుకు భారత్-పాక్ జట్లు మరోసారి సిద్దమయ్యాయి. ఇరు జట్లు కూడా తమ సూపర్ స్టార్లు లేకుండా ఆడుతున్నాయి. దీంతో భారత్-పాక్ రైవలరీలో కొత్త శకం ప్రారంభం కానుంది. సీనియర్ ప్లేయర్లు లేనప్పటికి ఈ రోజు మ్యాచ్ అదరిపోతుందని ఆశిస్తున్నాను" గేల్ ఎక్స్లో రాసుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్లో ఇరు జట్లు తమ స్టార్ ప్లేయర్లు లేకుండా ఆడుతున్నాయి.భారత దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ మెగా టోర్నీలో భాగం కావడం లేదు. మరోవైపు పాక్ స్టార్ ప్లేయర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజంలను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఇటీవల కాలంలో ఈ నలుగురు క్రికెటర్లు లేకుండా భారత్-పాక్ మ్యాచ్ జరగనుండడం ఇదే తొలిసారి. కాగా ఆసియాకప్లో పాక్పై భారత్దే పై చేయిగా ఉంది. ఆసియా కప్లో ఇప్పటి వరకు 19 మ్యాచ్ల్లో భారత్, పాక్ ముఖాముఖి తలపడ్డాయి. టీమిండియా 10 మ్యాచుల్లో విజయం సాధిస్తే.. పాక్ ఆరు మ్యాచుల్లో గెలిచింది. 3 మ్యాచ్ల్లో మాత్రం ఫలితం తేలలేదు.తుది జట్లు (అంచనా)భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, గిల్, సామ్సన్, తిలక్, శివమ్ దూబే, పాండ్యా, అక్షర్, కుల్దీప్, బుమ్రా, వరుణ్. పాకిస్తాన్: సల్మాన్ ఆగా (కెప్టెన్), ఫర్హాన్, అయూబ్, ఫఖర్, హసన్, హారిస్, నవాజ్, ఫహీమ్, అఫ్రిది, ముఖీమ్, అబ్రార్ చదవండి: పాక్తో మ్యాచ్ బహిష్కరించాలంటూ విజ్ఞప్తులు!.. ఆటగాళ్లకు గంభీర్ మెసేజ్ ఇదే.. -
IND vs PAK: మనదే ఏకపక్ష విజయం.. అలా వద్దే వద్దు!.. ఊరించి మరీ..!
చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ (IND vs PAK) క్రికెట్ జట్లు ముఖాముఖి తలపడేందుకు ముహూర్తం ఖరారైంది. ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో భాగంగా ఆదివారం రాత్రి (సెప్టెంబరు 14) దాయాదులు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు సబా కరీం, ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అతడికి తిరుగులేదుటీమిండియా మాజీ వికెట్ కీపర్ సబా కరీం మాట్లాడుతూ.. భారత్- పాక్ మ్యాచ్లో కొందరు ఆటగాళ్ల మధ్య పోరు చూసేందుకు తాను ఆసక్తిగా ఉన్నానని తెలిపాడు. ‘‘పాక్ పేసర్ షాహిన్ ఆఫ్రిది- టీమిండియా స్టార్లు అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్ల మధ్య పోటీ ఎలా ఉండబోతుందో చూడాలి.ఇక కుల్దీప్ యాదవ్ మధ్య ఓవర్లలో ఎలా బౌలింగ్ చేయబోతున్నాడదనేది కూడా ఆసక్తికరం. బుమ్రా గురించి మాత్రం నేను మాట్లడను. ఎందుకంటే.. అతడికి తిరుగులేదు. ఎవరితో పోటీ కూడా లేదు. ఈసారి పాక్ జట్టు కనీస పోటీ ఇస్తుందనే అనుకుంటున్నా.ఏకపక్ష విజయంటీమండియా ఏకపక్ష విజయం సాధిస్తుంది. ప్రస్తుతం జట్టు పటిష్టంగా ఉంది. అందుకే సులువుగానే గెలుస్తారని నమ్ముతున్నా’’ అని సబా కరీం పేర్కొన్నాడు. అయితే, భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాత్రం భిన్నంగా స్పందించాడు.ఆఖరి వరకు సాగాలి.. ఊరించి గెలవాలి‘‘భారత్- పాక్ మ్యాచ్ ఆఖరి వరకు ఉత్కంఠగా సాగాలి. టీ20 ప్రపంచకప్-2022లో చివరి బంతి వరకు మ్యాచ్ సాగింది. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో కూడా ఇలాగే జరిగింది. అక్కడ బుమ్రా హీరో అయ్యాడు. ఈసారి కూడా పాక్ను ఊరించి మరీ టీమిండియా విజయం సాధించాలి’’ అని ఇర్ఫాన్ పఠాన్ ఆకాంక్షించాడు.కాగా 2022 ప్రపంచకప్లో భారత్ ఆఖరి బంతికి పరుగు తీసి.. పాక్పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక 2024 వరల్డ్కప్ టోర్నీలో ఆరు పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఇదిలా ఉంటే.. ఈసారి యూఏఈ వేదికగా ఆసియా కప్ టోర్నీని టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గ్రూప్-‘ఎ’లో ఉన్న భారత్, పాకిస్తాన్ ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచాయి. భారత్ యూఏఈపై అద్భుత విజయం సాధించగా.. పాక్ ఒమన్ను ఓడించింది.బాయ్కాట్ చేయాలంటూ డిమాండ్లుపహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్తో మ్యాచ్ను టీమిండియా బహిష్కరించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఇదొక మల్టీలేటరల్ టోర్నీ కావున ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దాయాదుల పోరుకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. కానీ.. మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న చర్చలు ఇప్పటికీ జరుగుతున్నాయి.చదవండి: విరాట్ కోహ్లిపై తాలిబన్ అగ్రనేత ఆసక్తికర వ్యాఖ్యలు -
పాక్తో మ్యాచ్ బహిష్కరించండి!;.. ఆటగాళ్లకు గంభీర్ మెసేజ్ ఇదే..
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో పాకిస్తాన్తో మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లలో హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) ఆత్మవిశ్వాసం నింపినట్లు తెలుస్తోంది. సాధారణ మ్యాచ్లాగానే దీనిని భావించాలని.. ఒత్తిడి దరిచేరనీయకుండా అనుకున్న ఫలితాన్ని రాబట్టాలని సూచించినట్లు సమాచారం. కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ ఆసియా కప్ వేదికగా తొలిసారి ముఖాముఖి తలపడనున్నాయి.పాక్తో మ్యాచ్ను బహిష్కరించాలిగ్రూప్-‘ఎ’లో ఉన్న దాయాది జట్ల మధ్య ఆదివారం రాత్రి మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, పహల్గామ్ బాధితులకు మద్దతుగా.. టీమిండియా పాక్తో మ్యాచ్ను బహిష్కరించాలంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ‘బాయ్కాట్’ ప్రచారం జరుగుతోంది. తమ మనోభావాలు వెల్లడిస్తూ భారతీయ నెటిజన్లు భావోద్వేగానికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్లపై ప్రతికూల ప్రభావం పడకుండా, ఒత్తిడి పెరగకుండా ఉండేందుకు మేనేజ్మెంట్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శుబ్మన్ గిల్ సహా ప్రధాన ఆటగాళ్లంతా ఈ విషయం గురించి గంభీర్తో చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా సున్నితమైన ఈ పరిస్థితుల నేపథ్యంలో కెప్టెన్, కోచ్ పాక్తో మ్యాచ్కు మీడియా ముందుకు రానేలేదు. అయితే అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే మాత్రం విలేకరులతో సమావేశమయ్యాడు.కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే ఈ సందర్భంగా డష్కాటే మాట్లాడుతూ.. ‘‘ఇదొక సున్నితమైన అంశం. భారత ప్రజల భావోద్వేగాలను, మనోభావాలను ఆటగాళ్లు అర్థం చేసుకోగలరు. అయితే, కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే మేము ఇక్కడ ఉన్నాము.దేశం కోసం ఆడేందుకు ఆటగాళ్లు ఎదురుచూస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రొఫెషనల్గా ఉండటం ఆటగాళ్ల లక్షణం. ప్రజల మనోభావాల పట్ల మాకు స్పష్టమైన అవగాహన ఉంది. గౌతీ కూడా ఆటగాళ్లకు ఇదే చెప్పాడు. ప్రొఫెషనల్గా ఉండాలని సూచించాడు.ఆట మీద మాత్రమే దృష్టిమన నియంత్రణలో లేని వాటి గురించి ఆలోచించవద్దని చెప్పాడు. ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. అయితే, జట్టుగా అంతా ఒకే తాటిపై ఉండాలి. ఏదేమైనా ఆట మీద మాత్రమే దృష్టి పెట్టడం అత్యంత ముఖ్యం’’ అని డష్కాటే శనివారం నాటి ప్రెస్మీట్లో పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. కాగా పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా భారత సైన్యం ‘ఆపరేషర్ సిందూర్’ పేరిట ఉగ్రమూకలకు బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర శిబిరాలను మన ఆర్మీ ధ్వంసం చేసింది. ఆ తర్వాత దాయాదితో క్రీడల్లోనూ ఎటువంటి సంబంధాలు ఉండకూడదనే డిమాండ్లు వచ్చాయి. అయితే, బహుళ దేశాలు పాల్గొంటున్న టోర్నమెంట్లలో మాత్రం ఆడవచ్చంటూ ఇటీవలే కేంద్రం పాక్తో మ్యాచ్కు టీమిండియాకు అనుమతినిచ్చింది.చదవండి: విరాట్ కోహ్లిపై తాలిబన్ అగ్రనేత ఆసక్తికర వ్యాఖ్యలు -
Asia Cup 2025: రోహిత్, రహానే సరసన బంగ్లాదేశ్ ఓపెనర్లు
ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 13) శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ ఓపెనర్లు తంజిద్ హసన్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఈ మ్యాచ్లో ఖాతా తెరవకుండానే ఔటైన వారిద్దరు.. టీ20 ఆసియా కప్ చరిత్రలో డకౌటైన నాలుగో ఓపెనింగ్ జోడీగా నిలిచింది. గతంలో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, అజింక్య రహానే, బంగ్లాదేశ్కే చెందిన మరో ఓపెనింగ్ జోడీ మొహమ్మద్ మిధున్, సౌమ్య సర్కార్, ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ ఇలాంటి చెత్త ప్రదర్శన (డకౌట్లు) చేశారు. తాజా ఉదంతంతో తంజిద్-పర్వేజ్ జోడీ రోహిత్, రహానే సరసన చేసింది.కాగా, నిన్నటి ఆసియా కప్ మ్యాచ్లో బంగ్లాదేశ్ శ్రీలంక చేతిలో 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. శ్రీలంక బౌలర్లు రెచ్చిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 139 పరుగులకే పరిమితమైంది. లంక బౌలర్లలో నువాన్ తుషార (4-1-17-1), చమీరా (4-1-17-1), హసరంగ (4-0-25-2) అద్భుతంగా బౌలింగ్ చేసి బంగ్లాదేశ్ పని పట్టారు. బంగ్లా ఇన్నింగ్స్కు ఓపెనర్లు తంజిద్, పర్వేజ్ డకౌటై చెత్త ఆరంభాన్ని ఇచ్చారు. లిట్టన్ దాస్ (28), జాకిర్ అలీ (41 నాటౌట్), షమీమ్ హొస్సేన్ (42 నాటౌట్) అతి కష్టం మీద పరుగులు చేసి బంగ్లాదేశ్కు ఆమాత్రం స్కోరైనా అందించారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో శ్రీలంక బ్యాటర్లు చెలరేగి ఆడారు. ఓపెనర్ పథుమ్ నిస్సంక (50), కమిల్ మిషారా (46 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడటంతో ఆ జట్టు 14.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తొలిసారి తమ జట్టుకు ఓ విదేశీయుడిని హెడ్ కోచ్గా నియమించింది. 2025-26 సీజన్కు పురుషుల సీనియర్ జట్టు హెడ్ కోచ్గా న్యూజిలాండ్కు చెందిన గ్యారీ స్టెడ్ ఎంపిక చేయబడ్డాడు. స్టెడ్ 2021లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచిన న్యూజిలాండ్కు హెడ్ కోచ్గా పని చేశాడు. ఆ ఎడిషన్ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్ను ఓడించి టెస్ట్ ఛాంపియన్గా అవతరించింది.53 ఏళ్ల స్టెడ్ తన కోచింగ్ ప్రయాణంలో న్యూజిలాండ్ను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్తో పాటు 2019 వన్డే వరల్డ్కప్, 2021 టీ20 వరల్డ్కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్స్కు చేర్చాడు. స్టెడ్ ఆథ్వర్యంలో న్యూజిలాండ్ గతేడాది భారత్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. 268 అంతర్జాతీయ మ్యాచ్లకు కోచ్గా వ్యవహరించిన స్టెడ్.. ఆంధ్ర క్రికెట్ను ఏమేరకు ముందుకు తీసుకెళ్తాడో చూడాలి.ఏసీఏలో భాగం కావడంపై స్టెడ్ స్పందిస్తూ.. ఇక్కడి క్రికెట్ పట్ల ఉన్న అభిమానం అద్భుతంగా ఉంది. ACA అభివృద్ధి పట్ల చూపుతున్న నిబద్ధత నాకు ఎంతో ప్రేరణనిచ్చింది. ఆటగాళ్లతో కలిసి పని చేయడం కోసం ఎదురు చూస్తున్నానని అన్నాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు పని చేయనున్న తొలి విదేశీ కోచ్ స్టెడ్.గతంలో చాలామంది ఫారిన్ కోచ్లు భారత దేశవాలీ జట్టకు కోచ్లుగా వ్యవహరించారు. మైఖేల్ బెవాన్ ఒడిషాకు, లాన్స్ క్లూసెనర్ త్రిపురకు, డేవ్ వాట్మోర్ కేరళ, బరోడా జట్లకు.. ఇంతికాబ్ ఆలం పంజాబ్కు, డారెన్ హోల్డర్, షాన్ విలియమ్స్, డెర్మాట్ రీవ్ మహారాష్ట్ర జట్టుకు వేర్వేరే దఫాల్లో కోచ్లుగా పని చేశారు. -
Asia Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా..?
ఆసియా కప్ 2025లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 14) జరుగబోయే భారత్, పాకిస్తాన్ మ్యాచ్పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ మ్యాచ్ను బహిష్కరించాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు ఈ మ్యాచ్కు ససేమిరా అంటున్నాయి. మ్యాచ్ చూడకుండా టీవీలు ఆఫ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.దేశవాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఈ మ్యాచ్ రద్దుకు పిలుపునిచ్చాయి. మ్యాచ్ ప్రారంభానికి మరికొద్ది గంటల సమయమే ఉన్న నేపథ్యంలో మ్యాచ్ బహిష్కరణ పిలుపులు తారాస్థాయికి చేరాయి. సోషల్మీడియా #BoycottIndvsPak హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ప్రస్తుత సందిగ్ద పరిస్థితుల్లో మ్యాచ్ జరుగుతోందో లేదోనని యావత్ క్రీడా ప్రపంచం ఆసక్తిగా గమనిస్తుంది.ఈ మ్యాచ్లో దుబాయ్లోని దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. మ్యాచ్ ప్రారంభానికి మరో 8 గంటలు ఉన్న నేపథ్యంలో ఏమైనా జరగవచ్చని (రద్దు) నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మెజార్జీ శాతం భారతీయులకు ఈ మ్యాచ్ జరగడం అస్సలు ఇష్టం లేదు. కొందరు ఈ మ్యాచ్ రద్దు చేయాలని సుప్రీం కోర్టును సైతం ఆశ్రయించారు. అయితే క్రికెట్ను రాజకీయాలతో ముడిపెట్టలేమని పలువురు వేసిన పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది.కాగా, ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పాక్ ఆధారిత ఉగ్రమూకలు ఈ దాడులకు తెగబడ్డాయి. ఇందుకు భారత్ కూడా ధీటుగా బదులిచ్చింది. ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్లో తలదాచుకున్న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. భారత్ కొట్టిన ఈ దెబ్బకు పాక్ విలవిలలాడిపోయింది.అపరేషన్ సిందూర్ తర్వాత భారత్ ఏ విషయంలోనూ పాక్తో సంబంధాలు పెట్టుకోకూడదని నిర్ణయించుకుంది. ఇందుకు అంతర్జాతీయ వేదికలపై జరిగే మేజర్ క్రీడా పోటీలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. ఈ క్రమంలోనే భారత్ బహుళ దేశాలు పాల్గొంటున్న ఆసియా కప్లో పాక్తో మ్యాచ్కు సిద్దమైంది. అయితే ఈ మ్యాచ్ రద్దుకు భారత్లో ఆందోళనలు ఉధృతమవడంతో సందిగ్దత నెలకొంది. -
విరాట్ కోహ్లిపై తాలిబన్ అగ్రనేత ఆసక్తికర వ్యాఖ్యలు
దిగ్గజ బ్యాటర్, టీమిండియా ప్లేయర్ విరాట్ కోహ్లి ఈ ఏడాది మే 12న టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించి యావత్ క్రికెట్ ప్రపంచానికి ఊహించని షాకిచ్చాడు. కోహ్లిలో మరో మూడు, నాలుగేళ్లు టెస్ట్ల్లో కొనసాగే సత్తా ఉన్నా ఎందుకో సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. కోహ్లి ఆకస్మిక టెస్ట్ రిటైర్మెంట్పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నా అతను మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. అంతకుముందే (గతేడాది టీ20 వరల్డ్కప్ తర్వాత) పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విరాట్.. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. త్వరలో ఆస్ట్రేలియాతో వారి దేశంలోనే జరుగబోయే మూడు మ్యాచ్ల సిరీస్లో విరాట్ పాల్గొనే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే, తాజాగా విరాట్ టెస్ట్ రిటైర్మెంట్పై ఆఫ్ఘనిస్తాన్కు చెందిన తాలిబన్ అగ్రనేత అనాస్ హక్కానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం సోషల్మీడియాలో వైరలవుతుంది. క్రికెట్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే హకాన్నీ విరాట్ టెస్ట్ రిటైర్మెంట్పై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. విరాట్ కోహ్లి టెస్ట్ రిటైర్మెంట్ వెనుక కారణాలు నాకు తెలియదు. బహుశా భారత మీడియా వల్ల విసిగిపోయి అతనలా చేసి ఉండవచ్చు. విరాట్ లాంటి ఆటగాడు కనీసం 50 ఏళ్ల వరకైనా ఆడాలన్నది నా కోరిక. విరాట్కు ఇంకా చాలా సమయం మిగిలి ఉంది. జో రూట్ను చూడండి, సచిన్ అత్యధిక టెస్ట్ పరుగుల రికార్డును ఛేదిస్తున్నాడు. విరాట్ కూడా ఆ రికార్డును టార్గెట్గా పెట్టుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.హక్కానీ లాంటి ఉగ్ర నేపథ్యమున్న నేత విరాట్ టెస్ట్ రిటైర్మెంట్పై స్పందించడం క్రికెట్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతం తాలిబన్ల ప్రభుత్వం నడుస్తున్న విషయం తెలిసిందే. హక్కానీకి తాలిబన్ ఉద్యమ నేత. తాలిబన్లు తీసుకునే అంతర్గత నిర్ణయాల్లో హక్కానీ కీలకపాత్రధారుడు. హక్కానీ క్రమం తప్పకుండా క్రికెట్ను ఫాలో అవుతుండటంతో పాటు సోషల్మీడియాలోనూ యాక్టివ్గా ఉంటాడు. హక్కానీ వారి దేశ క్రికెట్ జట్టుకు (ఆఫ్ఘనిస్తాన్) మంచి మద్దతుదారుడు. వారి తురుపుముక్క రషీద్ ఖాన్ను హక్కానీ అనునిత్యం ప్రోత్సహిస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ భారత్తో పాటు ఆసియా కప్లో పాల్గొంటుంది. ఈ ఖండాంతర టోర్నీలో ఇరు జట్లు వేరువేరు గ్రూప్ల్లో ఉండటంతో గ్రూప్ దశలో పోటీపడటం లేదు. ఇరు జట్లు తదుపరి దశకు అర్హత సాధిస్తే సూపర్ ఫోర్లో తలపడే అవకాశం ఉంటుంది. -
వరుసగా 5 సిక్సర్లు.. విధ్వంసకర శతరం.. చరిత్ర సృష్టించిన ఆసీస్ బ్యాటర్
టీ20 బ్లాస్ట్ 2025లో హ్యాంప్షైర్ ఆటగాడు (ఆసీస్) క్రిస్ లిన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీ ఫైనల్స్ డే (టీ20 బ్లాస్ట్లో సెమీస్, ఫైనల్స్ ఒకే రోజు జరుగుతాయి) చరిత్రలో శతకం బాదిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. నిన్న (సెప్టెంబర్ 13) నాటింగ్హమ్షైర్తో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు.ఈ మ్యాచ్లో 50 బంతుల్లో శతకం పూర్తి చేసిన లిన్.. మొత్తంగా 51 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో అజేయమైన 108 పరుగులు చేశాడు. తద్వారా తన జట్టును ఒంటిచేత్తో ఫైనల్స్కు చేర్చాడు. 159 పరుగుల లక్ష్య ఛేదనలో లిన్ ఒక్కడే 90 శాతం పరుగులు చేశాడు. సెంచరీ పూర్తి చేసే క్రమంలో ఓ ఓవర్లో (లాయిడ్ పోప్) వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు.లిన్ రికార్డు శతకంతో హ్యాంప్షైర్ను ఫైనల్స్కు చేర్చినా.. ఆ జట్టు తుది మెట్టుపై బోల్తా పడింది. తొలి సెమీఫైనల్ (ఇది కూడా నిన్ననే జరిగింది) విజేత సోమర్సెట్తో జరిగిన ఫైనల్లో హ్యాంప్షైర్ ఓటమిపాలైంది. సెమీస్లో విధ్వంసకర శతకంతో చెలరేగిన లిన్ ఫైనల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 7 బంతుల్లో సిక్స్, ఫోర్ సాయంతో 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.ఫైనల్లో లిన్ విఫలమైనా హ్యాంప్షైర్ భారీ స్కోరే (194/6) చేసింది. అయితే దాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. విల్ స్మీడ్ (58 బంతుల్లో 94; 14 ఫోర్లు, 14 ఫోర్లు, సిక్స్) విధ్వంసం సృష్టించి సోమర్సెట్ను ఛాంపియన్గా నిలిపాడు. సోమర్సెట్కు ఇది మూడో టీ20 బ్లాస్ట్ టైటిల్. ఫైనల్లో స్మీడ్ చేసిన పరుగులు (94) టోర్నీ ఫైనల్స్ ఛేదనల చరిత్రలో అత్యధికం. -
స్మీడ్ ఊచకోత.. టీ20 బ్లాస్ట్ 2025 విజేతగా సోమర్సెట్.. రికార్డు ఛేదన
టీ20 బ్లాస్ట్ 2025 విజేతగా సోమర్సెట్ ఆవిర్భవించింది. నిన్న (సెప్టెంబర్ 13) జరిగిన ఫైనల్లో హ్యాంప్షైర్పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన హ్యాంప్షైర్.. టాబీ ఆల్బర్ట్, కెప్టెన్ జేమ్స్ విన్స్ చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.టీ20 బ్లాస్ట్ ఫైనల్స్ చరిత్రలో ఇది రెండో భారీ స్కోర్. అయినా ఈ స్కోర్ను హ్యాంప్షైర్ కాపాడుకోలేకపోయింది. విల్ స్మీడ్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి సోమర్సెట్ను గెలిపించాడు. కెప్టెన్ లెవిస్ గ్రెగరి మరో ఓవర్ మిగిలుండగానే సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు. సోమర్సెట్కు ఇది మూడో టీ20 బ్లాస్ట్ టైటిల్.పూర్తి వివరాల్లోకి వెళితే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హ్యాంప్షైర్.. టాబీ ఆల్బర్ట్ (48 బంతుల్లో 85; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), జేమ్స్ విన్స్ (34 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో బెన్నీ హోవెల్ (19 బంతుల్లో 26 నాటౌట్; 2 సిక్సర్లు) వేగంగా పరుగులు రాబట్టాడు. క్రిస్ లిన్ 12, జేమ్స్ ఫుల్లర్ 1, బెన్ మేయర్స్ 9, అలీ ఒర్ 3 పరుగులు చేశారు. సోమర్సెట్ బౌలర్లలో జేక్ బాల్ 2, గ్రెగరి, ఓవర్టన్, గోల్డ్స్వర్తీ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సోమర్సెట్.. విల్ స్మీడ్ (58 బంతుల్లో 94; 14 ఫోర్లు, 14 ఫోర్లు, సిక్స్) విధ్వంసం సృష్టించడంతో 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది (4 వికెట్లు కోల్పోయి). సీన్ డిక్సన్ (22 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్రెగరి (5 బంతుల్లో 18 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) సోమర్సెట్ను విజయతీరాలకు చేర్చారు. మిగతా బ్యాటర్లలో టామ్ కొహ్లెర్ కాడ్మోర్ 23, టామ్ ఏబెల్ 0, జేమ్స్ రూ 20 పరుగులు చేశారు. హ్యాంప్షైర్ బౌలరల్లో స్కాట్ కర్రీ 2, సొన్నీ బేకర్, జేమ్స్ ఫుల్లర్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో స్మీడ్ చేసిన పరుగులు (94) టోర్నీ ఫైనల్స్ ఛేదనల చరిత్రలో అత్యధికం. ఈ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్కు గానూ స్మీడ్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్దు దక్కింది. -
అసలు సమరానికి సమయం
సరిహద్దు ఉద్రిక్తతలు, విభేదాలు, వివాదాలు, విమర్శలు ఎన్ని ఉన్నా క్రికెట్ మైదానానికి వచ్చే సరికి ఈ మ్యాచ్ ఫలితంపై అందరి దృష్టీ పడుతుంది... బలాబలాల మధ్య ఆకాశమంత అంతరం ఉన్నా ఆసక్తి విషయంలో ఎక్కడా లోటుండదు. ఆటగాళ్లు మారినా, వేదికలు మారినా అభిమానుల్లో ఈ పోరు కొత్త ఉత్సాహాన్ని రేపుతుంది.దాయాది జట్లు భారత్, పాకిస్తాన్ మధ్య ఆసియా కప్లో జరిగే మ్యాచ్లో నేడు తలపడనున్నాయి. పహల్గావ్ ఘటనను దృష్టిలో ఉంచుకొని మ్యాచ్ను బాయ్కాట్ చేయాలంటూ ఎన్నో వైపులనుంచి పిలుపులు వచ్చినా క్రికెటర్లు, నిర్వాహకులు, ప్రసారకర్తలు తమ పని తాము చేసుకుంటూ మ్యాచ్కు బహుళ ప్రచారాన్ని కల్పిస్తున్నారు. దుబాయ్: ఆసియా కప్ లీగ్ దశలో మొత్తం 12 మ్యాచ్లు జరుగుతాయి. మిగతా 11 మ్యాచ్లపై ఆసక్తి, ప్రేక్షకుల స్పందన చూస్తే అతి పేలవం. టోర్నీని నిలబెట్టగలిగే, భాగస్వాములకు కాస్త ఆర్థిక పుష్టి అందించే మ్యాచ్ ఏదైనా ఉందంటే అది భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే పోరు మాత్రమే. గత ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ తర్వాత ఈ రెండు టీమ్లు ఈ ఫార్మాట్లో తలపడటం ఇదే మొదటిసారి. భారత్ తరఫున సీనియర్లు రోహిత్, కోహ్లి నిష్క్రమించగా...పాక్ జట్టుకు బాబర్, రిజ్వాన్ దూరమయ్యారు. దాంతో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు తమ సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నారు. ఆసియా కప్లో తాము ఆడిన తొలి మ్యాచ్లో యూఏఈని భారత్ చిత్తు చేయగా...ఇదే తరహాలో ఒమన్పై పాక్ విజయం సాధించింది. అదే జట్టుతో... టోర్నీ తొలి పోరులో తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో చెలరేగిన భారత్ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఆ మ్యాచ్లో బౌలర్లంతా ఆకట్టుకోగా, ఓపెనర్లకు మినహా మిగతావారికి బ్యాటింగ్ అవకాశమే రాలేదు. అభిషేక్ శర్మ మరోసారి విధ్వంసకర బ్యాటింగ్కు సై అంటుండగా, మరో ఓపెనర్ గిల్ కూడా పాక్పై చెలరేగాలని పట్టుదలగా ఉన్నాడు. గిల్ ఇప్పటి వరకు పాకిస్తాన్పై ఒక్క టి20 మ్యాచ్ కూడా ఆడలేదు. పాక్పై ఇప్పటి వరకు 20 పరుగులు దాటలేకపోయిన సూర్యకుమార్ యాదవ్ కూడా లెక్క సరి చేసేందుకు సిద్ధమయ్యాడు. సంజు, తిలక్, దూబే, హార్దిక్లతో విధ్వంసకర లైనప్ టీమిండియాకు భారీ స్కోరును అందించగలదు. ఆల్రౌండర్గా అక్షర్ తన విలువ చూపిస్తే పాక్కు ఇబ్బంది తప్పదు. బుమ్రా ప్రమాదకర బౌలింగ్ను పాక్ బ్యాటర్లు ఏమాత్రం ఎదుర్కోగలరనేది సందేహమే. పాండ్యా, దూబేల రూపంలో ఆల్రౌండర్లు అందుబాటులో ఉండటంతో రెండో పేసర్ అవసరం జట్టుకు లేదు. కుల్దీప్, వరుణ్లను ప్రత్యర్థిని పూర్తిగా కట్టిపడేయగల సమర్థులు. పిచ్, వాతావరణం దుబాయ్లో సాధారణంగా భారీ స్కోర్లు నమోదు కావు. అటు పేసర్లు, ఇటు స్పిన్నర్లు కూడా మంచి ప్రభావం చూపే అవకాశం ఉంది. మ్యాచ్కు వర్షసూచన లేదు కానీ క్రికెటర్లు తీవ్రమైన ఎండలను తట్టుకోవాల్సి ఉంది. తుది జట్లు (అంచనా)భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, గిల్, సామ్సన్, తిలక్, శివమ్ దూబే, పాండ్యా, అక్షర్, కుల్దీప్, బుమ్రా, వరుణ్. పాకిస్తాన్: సల్మాన్ ఆగా (కెప్టెన్), ఫర్హాన్, అయూబ్, ఫఖర్, హసన్, హారిస్, నవాజ్, ఫహీమ్, అఫ్రిది, ముఖీమ్, అబ్రార్ -
శ్రీలంక శుభారంభం
అబుదాబి: ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో శ్రీలంక శుభారంభం చేసింది. గ్రూప్ ‘బి’లో శనివారం జరిగిన మ్యాచ్లో అసలంక సారథ్యంలోని లంక 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. టాస్ నెగ్గిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 139 పరుగులే చేసింది. ఓపెనర్లు తన్జీద్ హసన్ (0), పర్వేజ్ హుసేన్ (0) డకౌట్ కావడంతో జట్టు పరుగుల ఖాతా తెరువకముందే 2 టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. జట్టు రెండంకెల స్కోరు 11కు చేరగానే తౌహీద్ హృదయ్ (8) రనౌటయ్యాడు. ఈ దశలో కెపె్టన్ లిటన్ దాస్ (26 బంతుల్లో 28; 4 ఫోర్లు) కాసేపు పోరాడాడు. అయితే స్వల్ప వ్యవధిలోనే మెహదీ హసన్ (9)తో పాటు లిటన్ దాస్ కూడా పెవిలియన్ చేరడంతో బంగ్లా 53 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో షమీమ్ (34 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), జాకీర్ అలీ (34 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు) రాణించారు. మరో వికెట్ పడకుండా జట్టు స్కోరును వంద పరుగులు దాటించారు. అనంతరం సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 14.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లలో కుశాల్ మెండిస్ (3) నిరాశ పరచగా, నిసాంక (34 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు. వన్డౌన్ బ్యాటర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కమిల్ మిషార (32 బంతుల్లో 46 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు)తో కలిసి నిసాంక రెండో వికెట్కు 95 పరుగులు జోడించాడు. -
పాకిస్తాన్తో మ్యాచ్.. టీమిండియాకు భారీ షాక్!
ఆసియాకప్-2025లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ప్రాక్టీస్ సమయంలో భారత స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ గాయపడ్డాడు.త్రోడౌన్ స్పెషలిస్ట్ బౌలింగ్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా బంతి గిల్ చేతికి బలంగా తాకింది. వెంటనే గిల్ నొప్పితో విలవిల్లాడు. ఆ తర్వాత ఫిజియో వచ్చి అతడి ఐస్ ప్యాక్ పెట్టి చికిత్స అందించాడు. అయితే విశ్రాంతి తీసుకున్నాక గిల్ తన ప్రాక్టీస్ను తిరిగి మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. కానీ గిల్ కాస్త ఆసౌకర్యంగా కన్పించనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయితే ఇప్పటివరకు అతడి గాయంపై టీమ్ మెనెజ్మెంట్ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ గిల్ గాయం కారణంగా దూరమైతే అది భారత్కు గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి. గిల్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్లో 20 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.భారత్ తుది జట్టు(అంచనా)అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి -
నిప్పులు చెరిగిన శ్రీలంక బౌలర్లు.. తేలిపోయిన బంగ్లా బ్యాటర్లు
ఆసియాకప్ 2025 గ్రూపు-బిలో అబుదాబి వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక బౌలర్లు నిప్పులు చెరిగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్.. లంక బౌలర్ల ధాటికి విల్లవిల్లాడింది. ఆరంభంలోనే బంగ్లాదేశ్కు పేసర్లు నువాన్ తుషారా, దుష్మాంత చమీరలు భారీ షాకిచ్చారు.బంగ్లాదేశ్ మొదటి రెండు ఓవర్లలోనే ఎటువంటి పరుగు చేయకుండా రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ లిట్టన్ దాస్ (28) కాసేపు ధాటిగా ఆడాడు. అతడు ఔటయ్యాక మళ్లీ బంగ్లా స్కోర్ బోర్డు నెమ్మదించింది. ఈ క్రమంలో షమీమ్ హుస్సేన్(40), జాకర్ అలీ(33) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. వీరిద్దరూ ఆరో వికెట్కు 86 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. ఫలితంగా బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కేవలం 139 పరుగులు మాత్రమే చేయగల్గింది. శ్రీలంక బౌలర్లలో స్పిన్నర్ వనిందు హసరంగా రెండు వికెట్లు పడగొట్టగా.. చమీరా, తుషారా తలా వికెట్ సాధించారు. -
కావ్య మారన్ షాకింగ్ నిర్ణయం..! సన్రైజర్స్ టీమ్ కొత్త కెప్టెన్ అతడే?
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26 సీజన్కు ముందు కావ్య మారన్ జట్టు సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ కొత్త కెప్టెన్ను ప్రకటించేందుకు సిద్దమైంది. తొలి సీజన్ నుంచి సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ కెప్టెన్గా వ్యవహరించిన ఐడైన్ మార్క్రమ్.. నాలుగో సీజన్కు ముందు తెగదెంపులు చేసుకున్నాడు. వేలంలోకి వచ్చిన అతడిని రూ.7 కోట్ల భారీ ధరకు డర్బన్ సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. ఈ వేలంలో మార్క్రమ్ను తిరిగి దక్కించుకోవడానికి సన్రైజర్స్ రైట్ టు మ్యాచ్ (RTM) కార్డును ఉపయోగించింది. కానీ డర్బన్ భారీ ధర చెల్లించేందుకు సిద్దం కావడంతో ఈస్టర్న్ కేప్ వెనక్కి తగ్గింది.కెప్టెన్గా ట్రిస్టన్ స్టబ్స్..కాగా సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ కొత్త కెప్టెన్గా 25 ఏళ్ల యువ ఆటగాడు, సౌతాఫ్రికా సూపర్ స్టార్ ట్రిస్టన్ స్టబ్స్ ఎంపిక దాదాపు ఖారైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బ్యాటింగ్ కోచ్ రస్సెల్ డొమింగో ధ్రువీకరించాడు. ఇప్పటికే అతడి కెప్టెన్గా నియమిచేందుకు యాజమాన్యం సైతం అంగీకరించినట్లు డొమింగో తెలిపాడు. రాబోయే రెండు సీజన్ల పాటు తమ కెప్టెన్గా స్టబ్స్ వ్యవహరించనున్నాడని అతడు తెలిపాడు. త్వరలోనే సన్రైజర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. అయితే జట్టులో సీనియర్లు క్వింటన్ డి కాక్, లూయిస్ గ్రెగొరీ, జానీ బెయిర్స్టో, మార్కో జాన్సెన్ వంటి ప్లేయర్లు ఉన్నా.. టీమ్ యాజమాన్యం స్టబ్స్ వైపు మొగ్గు చూపడం గమనార్హం. సౌతాఫ్రికా టీ20 లీగ్ తొలి సీజన్ నుంచి సన్రైజర్స్తోనే స్టబ్స్ కొనసాగుతున్నాడు. మూడు సీజన్లలో అతను మొత్తం 723 పరుగులు సాధించాడు. అతడి స్ట్రైక్ రేట్ 140.11 పైగా ఉండడం విశేషం. -
భారత్తో మ్యాచ్.. అతడిని చూసి వణకిపోతున్న పాకిస్తాన్!
ఆసియాకప్-2025లో ఉత్కంఠభరితమైన పోరుకు సమయం అసన్నమైంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఈ మ్యాచ్ వీక్షించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెహల్గమ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ వంటి పరిణామాల తర్వాత దాయాదుల పోరు జరగనుండడంతో మరింత ఆసక్తి నెలకొంది. ఈ హైవోల్టేజ్ ఈ మ్యాచ్ కోసం తమ వ్యూహాలను ఇరు జట్లు సిద్దం చేసుకుంటున్నాయి. ఇరు జట్లు తమ తొలి మ్యాచ్లలో విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్నాయి. యూఏఈతో ఆడిన తుది జట్టునే పాక్తో మ్యాచ్కు భారత్ కొనసాగించే అవకాశముంది.అభిషేక్ 'ఫియర్'అయితే భారత యువ సంచలనం అభిషేక్ శర్మను చూసి పాకిస్తాన్ భయపడుతందంట. అతడి కోసం పాక్ టీమ్ మెనెజ్మెంట్ ప్రత్యేక వ్యూహాలను రచిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అభిషేక్ను ఎలాగైనా పవర్ ప్లే లోపు ఔట్ చేసేందుకు మెన్ ఇన్ గ్రీన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అతడి బ్యాటింగ్కు సంబంధించిన పాత వీడియోలను పాక్ హెడ్ కోచ్ తమ బౌలర్లకు చూపించి ప్రాక్టీస్ చేయస్తున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అభిషేక్కు అవుట్సైడ్ ఆఫ్స్టంప్ బంతుల వీక్నెస్ ఉంది. అతడి బలహీనతను క్యాష్ చేసుకోవాలని పాక్ భావిస్తోంది. కానీ ఒక ఆరు ఓవర్ల పాటు అభిషేక్ క్రీజులో ఉంటే పాక్ బౌలర్లను షేక్ ఆడించేస్తాడు. యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్లో కూడా ఈ పంజాబ్ బ్యాటర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 30 పరుగులు చేసి ఔటయ్యాడు.అభిషేక్.. విధ్వంసకర బ్యాటింగ్కు పెట్టింది పేరు. అంతర్జాతీయ టీ20ల్లో అతడి స్ట్రైక్ రేటు 193.50గా ఉంది. అంతేకాకుండా ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ తరపున ఎన్నో తుపాన్ ఇన్సింగ్స్లు ఈ లెఫ్డ్ హ్యాండ్ బ్యాటర్ ఆడాడు.చదవండి: టీమిండియాతో మ్యాచ్.. పాక్ జట్టులోకి డేంజరస్ బౌలర్? -
టీమిండియాతో మ్యాచ్.. పాక్ జట్టులోకి డేంజరస్ బౌలర్?
ఆసియాకప్-2025లో తమ తొలి మ్యాచ్లో ఒమన్ను చిత్తు చేసిన పాకిస్తాన్.. ఇప్పుడు అసలు సిసలైన పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా పాక్ ఆదివారం తమ చిరకాల ప్రత్యర్ధి భారత్ తలపడనుంది. పాక్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉంది.ఈ ఈవెంట్కు ముందు యూఏఈ వేదికగా జరిగిన ట్రైసిరీస్ను కూడా మెన్ ఇన్ బ్లూ సొంతం చేసుకుంది. ఒమన్తో జరిగిన మ్యాచ్లో పాక్ బ్యాటింగ్ పరంగా కాస్త నిరాశపరిచినప్పటికి బౌలింగ్లో మాత్రం అదరగొట్టింది. ముఖ్యంగా స్పిన్నర్లు సైమ్ అయూబ్, మహ్మద్ నవాజ్, సోఫియన్ ముఖియమ్, అబ్రార్ ఆహ్మద్ అద్బుతంగా రాణించారు. అయితే భారత్తో మ్యాచ్కు మాత్రం పాక్ తుది జట్టులో ఓ మార్పు చోటు చేసుకునే అవకాశముంది.హ్యారిస్ రౌఫ్ ఇన్..?తొలి మ్యాచ్కు బెంచ్కే పరిమితమైన స్పీడ్ స్టార్ హారిస్ రౌఫ్ను ప్లేయింగ్ ఎలెవన్లోకి తీసుకురావాలని పాక్ టీమ్ మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. యూఏఈతో మ్యాచ్లో ఫ్రంట్ లైన్ పేసర్గా షాహీన్ అఫ్రిది ఒక్కడే ఆడాడు. అతడితో ఆల్రౌండర్ ఫహీమ్ అష్రఫ్ బంతిని పంచుకున్నాడు. కానీ టీమిండియా వంటి కఠిన ప్రత్యర్ధితో ఆడుతున్నప్పుడు కచ్చితంగా పాక్ వ్యూహాలు మారుతాయి. స్పిన్నర్ సోఫియన్ ముఖియమ్ను పక్కన పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతడి స్ధానంలోనే రౌఫ్ ఎంట్రీ ఇవ్వనున్నాడంట. దుబాయ్ వికెట్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. అయితే భారత బ్యాటర్లు స్పిన్నర్లకు ఎలాగో మెరుగ్గానే ఆడుతారు. కాబట్టి అదనపు ఫాస్ట్ బౌలర్తో బరిలోకి దిగేందుకు పాక్ సిద్దమైందంట. ముఖియమ్ను పక్కన పెట్టిన అర్బర్ ఆహ్మద్, నవాజ్, అయూబ్ రూపంలో ముగ్గురు స్పిన్నర్లు ఉంటారు. ఒకవేళ నాలుగో స్పిన్నర్ అవసరమైతే కెప్టెన్ సల్మాన్ సైతం బంతిని గింగరాలు తిప్పగలడు. ఈ ఒక్క మార్పు మినహా ఒమన్తో ఆడిన జట్టునే పాక్ కొనసాగించే అవకాశముంది.భారత్తో మ్యాచ్కు పాక్ జట్టు..సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, ఫఖర్ జమాన్, సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), హసన్ నవాజ్, మహ్మద్ హారీస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, సుఫియాన్ ముఖీమ్ -
యుద్దం తర్వాత తొలి మ్యాచ్.. దుబాయ్ దద్దరిల్లిపోతుంది: అక్తర్
వరల్డ్ క్రికెట్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు ఉన్న క్రేజు గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు జట్లు ఎప్పెడెప్పుడు తలపడతాయా? అని ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తుంటారు. చివరగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్-పాక్ జట్లు తలపడ్డాయి.ఇప్పుడు మరోసారి అభిమానులను అలరించేందుకు చిరకాల ప్రత్యర్ధులు సిద్దమయ్యారు. ఆసియాకప్-2025లో భాగంగా ఆదివారం(సెప్టెంబర్ 14) దాయాదులు అమీతుమీ తేల్చుకోనున్నారు. అయితే ఈసారి ఈ హైవోల్టేజ్ మ్యాచ్పై అభిమానుల ఆసక్తి కాస్త తగ్గినట్లు అన్పిస్తోంది. సాధారణంగా భారత్- పాక్ మ్యాచ్ టిక్కెట్లు నిమిషాల్లో హట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. కానీ ఈసారి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. అమ్మకాలు ప్రారంభమై పది రోజులు అవుతున్నప్పటికి టిక్కెట్లు ఇంకా పూర్తి స్ధాయిలో అమ్ముడు పోలేదు. పహల్గామ్ ఉగ్ర దాడి, "ఆపరేషన్ సిందూర్" నేపథ్యంలో పాక్తో మ్యాచ్ను బాయ్ కాట్ చేయాలని చాలా మంది సూచిస్తున్నారు. ఈ కారణంగానే టిక్కెట్లు ఇంకా అమ్ముడుపోలేదని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.ఆదివారం భారత్-పాక్ మ్యాచ్కు దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం హౌస్ ఫుల్ కావడం ఖాయమని అక్తర్ జోస్యం చెప్పాడు. "భావోద్వేగాలు ఉప్పొంగుతున్నాయి. యుద్దం తర్వాత పాకిస్తాన్ తొలిసారి భారత్తో ఆడనుంది. అలాంటిప్పుడు స్టేడియం ఎలా హౌస్ ఫుల్ కాకుండా ఉంటుంది? టిక్కెట్లు అమ్ముడుపోవడం లేదని నాతో ఒకరు అన్నారు. వెంటనే అవన్నీ వట్టి రూమర్సే అని, అన్నీ అమ్ముడుపోయాయి అని చెప్పా. ఇదంతా బయట జరుగుతున్న ప్రచారమే అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ పేర్కొన్నాడు.చదవండి: SA20: సన్ రైజర్స్తో తెగదెంపులు.. కట్ చేస్తే! ఇప్పుడు ఆ జట్టు కెప్టెన్గా ఎంపిక -
సన్ రైజర్స్తో తెగదెంపులు.. కట్ చేస్తే! ఇప్పుడు ఆ జట్టు కెప్టెన్గా ఎంపిక
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26 సీజన్కు ముందు డర్బన్ సూపర్ జెయింట్స్ కెప్టెన్గా స్టార్ బ్యాటర్ ఐడైన్ మార్క్రమ్ ఎంపికయ్యాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా డర్బన్ సూపర్ జెయింట్స్ ప్రకటన చేసింది. గత సీజన్లో డర్బన్ కెప్టెన్గా వ్యహరించిన కేశవ్ మహారాజ్ స్ధానాన్ని మార్క్రమ్ భర్తీ చేయనున్నాడు. ఇటీవల జరిగిన వేలంలో మార్క్రమ్ను రూ.7 కోట్ల భారీ ధరకు డర్బన్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. ఎస్ఎ టీ20 తొట్ట తొలి సీజన్ నుంచి సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్కు ప్రాతినిథ్యం వహించిన మార్క్రమ్.. నాలుగో సీజన్కు ముందు ఆ జట్టుతో తెగదింపులు చేసుకున్నాడు. దీంతో వేలంలోకి వచ్చిన ఈ సౌతాఫ్రికా టీ20 కెప్టెన్ కోసం చాలా ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. రెండు సార్లు ఛాంపియన్ అయిన సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ సైతం అతడి సొంతం చేసుకోవాలని భావించింది. అందుకు కోసం మార్క్రమ్పై రైట్ టు మ్యాచ్ (RTM) కార్డును ఉపయోగించాలని చూసింది. కానీ డర్బన్ మాత్రం వారి పోటీగా భారీ మొత్తాన్ని పెంచుకుంటూ పోతూ మార్క్రమ్ను సొంతం చేసుకుంది. కాగా డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టు.. ఐపీఎల్కు చెందిన లక్నో సూపర్ జెయింట్స్ సిస్టర్ ఫ్రాంచైజీ కావడం గమనార్హం. ఐపీఎల్లో మార్క్రమ్కు లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే లక్నో యాజమాన్యం మార్క్రమ్కు తమ డర్బన్ జట్టు పగ్గాలను అప్పగించింది.సౌతాఫ్రికా టీ20 లీగ్లో మార్క్రమ్కు అద్బుతమైన రికార్డు ఉంది. కెప్టెన్గా రెండు సార్లు సన్రైజర్స్ను ఛాంపియన్గా నిలిపాడు. డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టులో హెన్రిచ్ క్లాసెన్, సునీల్ నరైన్, జోస్ బట్లర్, డెవాన్ కాన్వే వంటి సూపర్ స్టార్లు ఉన్నారు. ఈ ఎస్ఎ టీ20 నాలుగో ఎడిషన్ ఈ ఏడాది డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. గత సీజన్ ఛాంపియన్గా ఎంఐ కేప్టౌన్ జట్టు నిలిచింది. డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టునూర్ అహ్మద్, హెన్రిచ్ క్లాసెన్, సునీల్ నరైన్, జోస్ బట్లర్, క్వేనా మఫాకా, ఐడెన్ మార్క్రమ్, డెవాన్ కాన్వే, గెరాల్డ్ కోయెట్జీ, డేవిడ్ బెడింగ్హామ్, మార్క్వెస్ అకెర్మాన్, ఈథన్ బాష్, ఆండిలే సిమెలానే, టోనీ డీ జోర్జి, డయాన్ గలీమ్, తైజుల్ ఇస్లాం, ఎవాన్ జోన్స్, గిస్బెర్ట్ వేజ్, డేవిడ్ వీస్, డారిన్ డుపావిలోన్.Aiden Markram. That's it, that's the 𝘊𝘢𝘱𝘵𝘢𝘪𝘯💙 pic.twitter.com/fKVXYZRJc4— Durban's Super Giants (@DurbansSG) September 13, 2025 -
భారత్తో మ్యాచ్ ముఖ్యం కాదు.. మా టార్గెట్ అదే: పాక్ ఓపెనర్
ఆసియాకప్-2025లో రసవత్తర పోరుకు సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం(సెప్టెంబర్ 14) దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు అన్ని విధాల సిద్దమైంది.ఇప్పటికే ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు శుభారంభం చేశారు. టీమిండియా తమ తొలి మ్యాచ్లో యూఏఈను చిత్తు చేయగా.. పాక్ తమ మొదటి మ్యాచ్లో ఒమన్ను మట్టికర్పించింది. ఈ మల్టీనేషన్ టోర్నమెంట్లలో పాక్పై భారత్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. చివరగా ఈ రెండు జట్లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో పాక్ను భారత్ చిత్తు చేసింది. ఇప్పుడు మళ్లీ ఆరు నెలలు తర్వాత దాయాదుల మధ్య క్రికెట్ సమరం జరగనుంది. ఈ మ్యాచ్లో కూడా పాక్పై పూర్తి ఆధిపత్యం చెలాయించాలని భారత్ పట్టుదలతో ఉంది. ఇక ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్కు ముందు పాక్ యువ ఓపెనర్ సైమ్ అయూబ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమకు టీమిండియాపై గెలవడం ఒక్కటే ముఖ్యం కాదని, టోర్నీ విజేతగా నిలవడమే తమ లక్ష్యమని అయూబ్ చెప్పుకొచ్చాడు."మాకు జ్ఞాపకాలు ముఖ్యం కాదు. మా దృష్టింతా ప్రస్తుతం టోర్నమెంట్పైనే ఉంది. ఆసియాకప్ విజేతగా మేము నిలవాలనుకుంటున్నాము. టీమిండియాతో మ్యాచ్ ఒక్కటే మాకు ముఖ్యం కాదు. ఛాంపియన్షిప్ను గెలిచేందుకు మేము ఆతృతగా ఎదురు చూస్తున్నాము" అని ఒమన్తో మ్యాచ్ అనంతరం అయూబ్ పేర్కొన్నాడు.కాగా ఒమన్తో మ్యాచ్లో అయూబ్ బ్యాట్తో విఫలమైన బంతితో సత్తా చాటాడు. రెండు కీలక వికెట్లు పడగొట్టి పసికూన పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో మొహమ్మద్ హ్యారిస్ (43 బంతుల్లో 66) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్, ఆమిర్ కలీమ్ మూడేసి వికెట్లు తీయగా.. మొహమ్మద్ నదీమ్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం లక్ష్య చేధనలో ఒమన్ కేవలం 67 పరుగులకే ఆలౌటైంది.ఫలితంగా 93 పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది. పాక్ బౌలర్లలో సూఫియాన్ ముకీమ్, సయీమ్ ఆయుబ్ ఫాహిమ్ అష్రాఫ్ రెండేసి వికెట్లు సాధించారు. వీరితోపాటు షాహిన్ ఆఫ్రిది, అబ్రార్ అహ్మద్ , మొహమ్మద్ నవాజ్తలా ఒక వికెట్ పడగొట్టారు.చదవండి: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా.. -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా..
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర లిఖించింది. ఫుల్ మెంబర్ జట్టుపై అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో టీమిండియా పేరిట ఉన్న రికార్డును హ్యారీ బ్రూక్ బృందం బద్దలు కొట్టింది.అంతేకాదు.. అంతర్జాతీయ పొట్టి క్రికెట్లో అత్యధిక బౌండరీలు నమోదు చేసిన జట్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకుంది. స్వదేశంలో సౌతాఫ్రికా (ENG vs SA)తో రెండో టీ20 సందర్భంగా ఇంగ్లండ్ ఈ ఘనత సాధించింది.ఇంగ్లండ్ విశ్వరూపం కాగా సొంతగడ్డపై ప్రొటిస్ జట్టుతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతున్న ఇంగ్లండ్.. తొలి టీ20లో పద్నాలుగు పరుగుల స్వల్ప తేడాతో ఓడింది. ఈ క్రమంలో శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్లో మాత్రం ఇంగ్లండ్ విశ్వరూపం ప్రదర్శించింది. ఇటు బ్యాటర్లు.. అటు బౌలర్లు రాణించడంతో సౌతాఫ్రికాను ఏకంగా 146 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది.ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్.. ఊహకందని రీతిలో..మాంచెస్టర్లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఇంగ్లండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (Phil Salt), జోస్ బట్లర్ (Jos Buttler) ఆకాశమే హద్దుగా చెలరేగారు. సాల్ట్ 39 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.మొత్తంగా 60 బంతులు ఎదుర్కొన్న సాల్ట్ పదిహేను ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 141 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు.. బట్లర్ 30 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 83 పరుగులతో దుమ్ములేపాడు.304 పరుగులుఇక వన్డౌన్లో వచ్చిన జేకబ్ బెతెల్ 14 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్స్ల సాయంతో 26 పరుగులు చేయగా.. నాలుగో స్థానంలో ఆడిన కెప్టెన్ హ్యారీ బ్రూక్ 21 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ బాది 41 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్ రెండు వికెట్ల నష్టానికి 304 పరుగులు సాధించింది. అంతర్జాతీయ టీ20లలో ఫుల్ మెంబర్ జట్టు (ఐసీసీ టెస్టు హోదా కలిగిన జట్టు)పై ఇదే అత్యధిక స్కోరు. ఇంతకు ముందు జింబాబ్వే గాంబియా మీద 344 పరుగులు చేసింది. కానీ గాంబియా అసోయేట్ జట్టు మాత్రమే. ఇక్కడ ఇంగ్లండ్.. సౌతాఫ్రికా వంటి ఫుల్ మెంబర్ టీమ్పై ఈ ఘనత సాధించడం విశేషం.జింబాబ్వే తర్వాత..ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో మొత్తంగా 48 బౌండరీలు నమోదయ్యాయి. ఇందులో ముప్పై ఫోర్లు, పద్దెనిమిది సిక్సర్లు ఉన్నాయి. తద్వారా అంతర్జాతీయ టీ20లలో అత్యధిక బౌండరీలు బాదిన రెండో జట్టుగా ఇంగ్లండ్ చరిత్ర పుటల్లో చోటు సంపాదించింది. అంతకుముందు.. 2024లో జింబాబ్వే.. గాంబియా (అసోసియేట్ టీమ్) జట్టు మీద 57 బౌండరీలు నమోదు చేసింది. ప్రపంచంలోనే తొలి జట్టుగాఅయితే, పొట్టి ఫార్మాట్లో ఓ ఫుల్ మెంబర్ జట్టు (ఐసీసీ టెస్టు హోదా కలిగిన జట్టు) పై అత్యధిక బౌండరీలు బాదిన ఘనత మాత్రం ఇంగ్లండ్కే దక్కుతుంది. ప్రపంచంలో ఇంత వరకు ఏ జట్టు కూడా ఈ ఫీట్ నమోదు చేయలేదు.చదవండి: సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు బద్దలు -
బీసీసీఐ అధ్యక్షుడిగా హర్భజన్ సింగ్!?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్ష పదవి రేసులో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. క్రిక్ బజ్ రిపోర్ట్ ప్రకారం.. బీసీసీఐ అత్యున్నత పదవికి పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA) 45 ఏళ్ల హర్భజన్ను నామినేట్ చేసినట్లు సమాచారం.అయితే నామినేషన్ల అధికారిక జాబితా ఇక వెల్లడించలేదు. కానీ రాష్ట్ర క్రికెట్ సంఘం మద్దతు ఉన్న అభ్యర్థులు మాత్రమే బీసీసీఐ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయడానికి అర్హులు. రోజర్ బిన్నీ పదవి కాలం ముగియడంతో ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడి పోస్ట్ ఖాళీగా ఉంది. దీంతో ఈ నెలాఖరులో బీసీసీఐ ప్రెసిడెంట్ తో పాటు ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, జాయింట్ సెక్రటరీ, కోశాధికారి పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల అధికారి ఏకే జోటి విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20, 21 తేదీల్లో నామినేషన్లను స్వీకరిస్తారు. అభ్యర్థులు సెప్టెంబర్ 23 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. సెప్టెంబర్ 28న ఓటింగ్తో పాటు లెక్కింపు కూడా జరగనుంది. అదే రోజున బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పంజాబ్ క్రికెట్ బోర్డు ప్రతినిధిగా హర్భజన్ సింగ్ పాల్గోనున్నాడు.అతడితో పాటు బెంగాల్ క్రికెట్ అసోయేషిన్ తరపున భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సైతం ఈ భేటీకి హాజరుకానున్నారు. వీరిద్దరితో పాటు పలు రాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ ప్రతినిథులు పాల్గోనున్నారు. కాగా బీసీసీఐ ప్రెసిడెంట్ రేసులో భజ్జీతో పాటు కిరణ్ మోరే పేరు కూడా వినిపిస్తోంది. ఈసారి బీసీసీఐ బాస్ పదవి వెస్ట్ జోన్ నుంచి దక్కే అవకాశముంది. కిరణ్ మోరే సౌరాష్ట్రకు చెందిన క్రికెటర్. ఇటీవలే సచిన్ టెండూల్కర్ పేరు కూడా అధ్యక్ష పదవికి వినిపించినప్పటికీ, ఆ వార్తలను ఆయన టీమ్ ఖండించింది. కానీ భజ్జీ మాత్రం ఈ వార్తలపై ఇంకా స్పందించలేదు. ఒకవేళ హర్భజన్సింగ్కే బీసీసీఐ అధ్యక్ష పదవి లభిస్తే.. ఈ బాధ్యతలు చేపట్టిన మూడో భారత క్రికెటర్గా నిలవనున్నాడు. ఇంతకుముందు భారత మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, రోజర్ బిన్నీ బీసీసీఐ బాస్గా పనిచేశారు. ఇక భారత్ తరపున 367 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన హర్భజన్, అన్ని ఫార్మాట్లలో కలిపి 700కు పైగా వికెట్లు పడగొట్టాడు. భజ్జీ ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నాడు. 2022లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరపున నామనేట్ అయ్యారు.చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే: శుబ్మన్ గిల్ -
Asia Cup 2025: ఏ జట్టునైనా ఓడిస్తాం: పాకిస్తాన్ కెప్టెన్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో శుభారంభం అందుకుంది. తొలి మ్యాచ్లో పసికూన ఒమన్ను ఎదుర్కొన్న సల్మాన్ ఆఘా బృందం.. 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. దుబాయ్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాక్.. తొలుత బ్యాటింగ్ చేసింది.ఆయుబ్ డకౌట్.. హ్యారిస్ అర్ధ శతకంఓపెనర్లలో షాహిబ్జాదా ఫర్హాన్ (29) ఫర్వాలేదనిపించగా.. సయీమ్ ఆయుబ్ డకౌట్ అయ్యాడు. అయితే, వన్డౌన్ బ్యాటర్ మొహమ్మద్ హ్యారిస్ అర్ధ శతకం (43 బంతుల్లో 66)తో రాణించడంతో పాక్ ఇన్నింగ్స్ గాడినపడింది.హ్యారిస్తో పాటు ఫఖర్ జమాన్ (16 బంతుల్లో 23 నాటౌట్) రాణించగా.. నవాజ్ 19 పరుగులు చేయగలిగాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో పాక్ ఏడు వికెట్ల నష్టానినకి 160 పరుగులు రాబట్టగలిగింది. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్, ఆమిర్ కలీమ్ మూడేసి వికెట్లు తీయగా.. మొహమ్మద్ నదీమ్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. 67 పరుగులకే ఆలౌట్ చేసిఇక లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్ను పాక్ 67 పరుగులకే ఆలౌట్ చేసి సత్తా చాటింది. స్పిన్నర్లు సూఫియాన్ ముకీమ్, సయీమ్ ఆయుబ్.. పేసర్ ఫాహిమ్ అష్రాఫ్ రెండేసి వికెట్లు తీయగా.. షాహిన్ ఆఫ్రిది (పేసర్), అబ్రార్ అహ్మద్ (స్పిన్నర్), మొహమ్మద్ నవాజ్ (స్పిన్నర్) తలా ఒక వికెట్ పడగొట్టారు.ఇక ఒమన్ బ్యాటర్లలో హమావ్ మీర్జా 27 పరుగులతో టాప్ రన్స్కోరర్గా నిలిచాడు. ఒమన్పై విజయానంతరం పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. బౌలింగ్ విభాగం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. తమ జట్టులో మేటి స్పిన్నర్లు ఉన్నారని.. యూఏఈ వంటి వేదికపై వారి అవసరమే ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నాడు.స్పిన్నర్లు కీలకం‘‘బ్యాటింగ్పై మేము మరింత దృష్టి సారించాల్సి ఉంది. అయితే, బౌలింగ్ పరంగా మా వాళ్లు అద్భుతం. మా బౌలర్ల ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను. మా జట్టులో ముగ్గురు స్పిన్నర్లు.. తమకు తామే ప్రత్యేకం. వీరికి తోడుగా ఆయుబ్ కూడా ఉన్నాడు.దుబాయ్, అబుదాబి వంటి వేదికల్లో స్పిన్నర్లు కీలకం. మాకు 4-5 స్పిన్ ఆప్షన్లు ఉండటం సానుకూలాంశం. అయితే, మేము ఈ మ్యాచ్లో 180 పరుగులు చేయాల్సింది. కానీ ఒక్కోసారి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతాము. ఆటలో ఇలాంటివి సహజం.ఎలాంటి జట్టునైనా ఓడించగలమునిజానికి ఇక్కడ మేము చాలా రోజులుగా ఆడుతున్నాం. ఈ టోర్నీకి ముందు టీ20 ట్రై సిరీస్ ఆడాము. అలవోకగానే సిరీస్ను సొంతం చేసుకున్నాము. సుదీర్ఘ కాలంలో మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయగలిగితే ఎలాంటి జట్టునైనా ఓడించగలము’’ అని సల్మాన్ ఆఘా ధీమా వ్యక్తం చేశాడు.కాగా యూఏఈ వేదికగా ఆసియా కప్-2025లో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, ఒమన్, యూఏఈ... గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ రేసులో ఉన్నాయి. ఇక ఇప్పటికే టీమిండియా యూఏఈపై గెలుపొందగా.. పాక్ ఒమన్పై గెలిచింది. అయితే, నెట్ రన్రేటు పరంగా అందనంత ఎత్తులో ఉన్న భారత్ (+10.483) ప్రస్తుతం గ్రూప్-‘ఎ’ టాపర్గా ఉండగా.. పాక్ (+4.650) రెండో స్థానంలో ఉంది.ఆసియా కప్-2025: పాకిస్తాన్ వర్సెస్ ఒమన్ స్కోర్లు👉పాకిస్తాన్- 160/7 (20)👉ఒమన్- 67 (16.4)👉ఫలితం: ఒమన్పై 93 పరుగుల తేడాతో పాక్ గెలుపు.చదవండి: సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు బద్దలు.. తొలి ప్లేయర్గా సాల్ట్ చరిత్ర -
నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే: శుబ్మన్ గిల్
టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మ (Abhishek Sharma)తో కలిసి జీవితాంతం బ్యాటింగ్ చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. దాదాపు ఏడాది విరామం తర్వాత గిల్ భారత టీ20 జట్టులో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే.ఆసియా కప్-2025 (Asia Cup 2025) టోర్నీలో భాగంగా యూఏఈతో మ్యాచ్లో గిల్ ఆడాడు. తన చిన్ననాటి స్నేహితుడు అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తొమ్మిది బంతుల్లోనే 20 పరుగులతో అదరగొట్టాడు. తద్వారా యూఏఈ విధించిన 57 పరుగుల లక్ష్యాన్ని.. టీమిండియా 4.3 ఓవర్లలోనే ఛేదించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక గిల్ టీమిండియాతో కలిసి తదుపరి దాయాది పాకిస్తాన్ (సెప్టెంబరు 14)తో మ్యాచ్కు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ బ్రాడ్కాస్టర్ సోనీ స్పోర్ట్స్ గిల్ ర్యాపిడ్ ఫైర్ సెషన్లో పాల్గొన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో పలు ప్రశ్నలకు అతడు జవాబు ఇచ్చాడు.👉ఈ టోర్నమెంట్ కోసం మీరు ఎన్ని బ్యాట్లు తీసుకువచ్చారు?😊గిల్: తొమ్మిది బ్యాట్లు👉ఏ బ్యాటర్తో కలిసి జీవితాంతం బ్యాటింగ్ చేయాలని అనుకుంటున్నారు?😊గిల్: ప్రస్తుతానికైతే అభిషేక్ శర్మతో కలిసి👉మీరు ఏ ఆటగాడి నుంచైనా దొంగతనం చేయాలని అనుకునే నైపుణ్యం ఏమిటి?😊గిల్: ఏబీ డివిలియర్స్ స్కూప్ షాట్👉మీరు ఎదుర్కొన్న కఠినమైన బౌలర్?😊గిల్: జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లండ్)👉మీ క్రికెట్ కెరీర్లో ఇప్పటి వరకు అత్యంత మధురమైన జ్ఞాపకం?😊గిల్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలవడం.👉మీ చీట్ మీల్లో ఉండే ఫుడ్?😊గిల్: ప్యాన్కేక్స్, బటర్ చికెన్, దాల్ మఖ్నీ.మూడు ఫార్మాట్ల భవిష్య కెప్టెన్గా..ఇరవై ఆరేళ్ల శుబ్మన్ గిల్ ఇటీవలే భారత టెస్టు జట్టు కెప్టెన్గా పగ్గాలు చేపట్టాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ నేపథ్యంలో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా టీమిండియా సారథిగా సరికొత్త బాధ్యతలు తీసుకున్నాడు. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో 754 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.ఇక కెప్టెన్గా ఎడ్జ్బాస్టన్లో టీమిండియాకు తొలి విజయం అందించిన సారథిగా గిల్ చరిత్రకెక్కాడు. ఈ ఐదు మ్యాచ్ల సిరీస్ను భారత 2-2తో సమం చేసుకోవడంలో బ్యాటర్గానూ తన వంతు పాత్ర పోషించాడు. కాగా ప్రస్తుతం టీమిండియాకు మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లు ఉన్న విషయం తెలిసిందే. వన్డేలకు రోహిత్ శర్మ, టీ20లకు సూర్యకుమార్ యాదవ్, టెస్టులకు గిల్ సారథ్యం వహిస్తున్నారు.అయితే, భవిష్యత్తులో మూడు ఫార్మాట్లకు కలిపి గిల్ను నియమించేలా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే అతడిని టీ20 జట్టులోకి వైస్ కెప్టెన్గా తీసుకువచ్చింది. త్వరలోనే గిల్ భారత వన్డే, టీ20 జట్లకు కూడా కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.చదవండి: సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు బద్దలు.. తొలి ప్లేయర్గా సాల్ట్ చరిత్రThe Prince took on the rapid-fire challenge. Here’s how it went… Watch cricket's 𝑼𝑳𝑻𝑰𝑴𝑨𝑻𝑬 𝑹𝑰𝑽𝑨𝑳𝑹𝒀 come alive on Sept 14, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV 📺#SonySportsNetwork #DPWorldAsiaCup2025 #INDvPAK pic.twitter.com/d2Rz0TUVGa— Sony Sports Network (@SonySportsNetwk) September 12, 2025 -
అందుకే అతడిని ఆడించలేదు.. సంజూ మాత్రం హ్యాపీ: టీమిండియా కోచ్
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్లో కేవలం ఒకే ఒక స్పెషలిస్టు పేసర్తో బరిలోకి దిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో మ్యాచ్లో పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) సేవలు వినియోగించుకుంది.ఇక ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా (Hardik Pandya), శివం దూబేలను పార్ట్టైమ్ సీమ్ బౌలర్లుగా వాడుకుంది. మరోవైపు.. స్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిని ఆడించింది. వీరికి తోడుగా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను కూడా బరిలోకి దించింది.అర్ష్దీప్నకు మొండిచేయిఓవరాల్గా బౌలింగ్ విభాగంలో బుమ్రా, కుల్దీప్, వరుణ్ సేవలను ఉపయోగించుకున్న యాజమాన్యం.. యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ను మాత్రం పక్కనపెట్టింది. నిజానికి అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్ల వీరుడిగా ఉన్నది అర్ష్దీప్. ఇప్పటి వరకు ఈ లెఫ్టార్మ్ పేసర్ 63 మ్యాచ్లలో కలిపి 99 వికెట్లు కూల్చాడు.యూఏఈతో మ్యాచ్లో ఇలాంటి ఆటగాడిని పక్కనపెట్టడం పట్ల విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ స్పందించాడు. ‘‘కెప్టెన్, హెడ్కోచ్తో చర్చ తర్వాతే తుదిజట్టు కూర్పుపై స్పష్టత వస్తుంది.అందుకే అతడిని ఆడించలేదుజట్టులోని 15 మంది ఇందుకు అర్హులే. కానీ పరిస్థితులకు తగ్గట్లుగా నిర్ణయాలు ఉంటాయి. ఒక ఆటగాడికి తుదిజట్టులో చోటు దక్కనపుడు అతడు నిరాశకు గురికావడం సహజం. అయితే, ఇదొక టీమ్ స్పోర్ట్. ఎజెండా ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఇందులో వ్యక్తిగత ఇష్టాలు, అయిష్టాలకు తావు ఉండదు.ఆరోజు అత్యుత్తమ జట్టు ఏది అనిపిస్తుందో.. కెప్టెన్, హెడ్కోచ్ దానినే ఎంపిక చేసుకుంటారు. ఆడే అవకాశం రాని వాళ్లు కూడా.. ప్లేయింగ్ ఎలెవన్లో ఉన్న ప్లేయర్లకు సహకారం అందిస్తారు’’ అని సితాన్షు కొటక్ స్పష్టం చేశాడు.సంజూ సంతోషంగా ఉన్నాడుఅదే విధంగా.. చాన్నాళ్లుగా టీమిండియా టీ20 ఓపెనర్గా సంజూ శాంసన్ను మిడిలార్డర్కు పంపడంపై కూడా సితాన్షు కొటక్ స్పందించాడు. ‘‘బ్యాటింగ్ ఆర్డర్లో ఐదు లేదంటే ఆరో స్థానంలో సంజూ ఎక్కువగా బ్యాటింగ్ చేయలేదు. దీనర్థం అతడు ఆ స్థానంలో ఆడలేడని కాదు.ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సత్తా అతడికి ఉంది. ముందుగా చెప్పినట్లు జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే హెడ్కోచ్, కెప్టెన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. సంజూ కూడా మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసేందుకు సంతోషంగా ఉన్నాడు’’ అని కొటక్ మీడియా సమావేశంలో పేర్కొన్నాడు. కాగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్ టోర్నీలో భారత్ తదుపరి సెప్టెంబరు 14న దాయాది పాకిస్తాన్తో తలపడుతుంది. ఇందుకు దుబాయ్ వేదిక.చదవండి: పాక్ను ఓడించడానికి వైభవ్ సూర్యవంశీ వంటి వాళ్లు చాలు! -
సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు బద్దలు
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఫిల్ సాల్ట్ (Phil Salt) సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. అత్యంత తక్కువ ఇన్నింగ్స్లోనే.. అత్యధిక శతకాలు బాదిన ఆటగాడిగా నిలిచాడు.సొంతగడ్డపై సౌతాఫ్రికాతో రెండో టీ20 సందర్భంగా ఫిల్ సాల్ట్ ఈ ఘనత సాధించాడు. కాగా ఇంగ్లండ్ స్వదేశంలో సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్లో ప్రొటిస్ చేతిలో ఓడిన ఇంగ్లిష్ జట్టు.. శుక్రవారం నాటి రెండో టీ20లో మాత్రం అదరగొట్టింది.ధనాధన్.. ఫటాఫట్.. 60 బంతుల్లోనే..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 304 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాను 158 పరుగులకే ఆలౌట్ చేసి.. 146 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది.ఈ విజయంలో ఫిల్ సాల్ట్ది కీలక పాత్ర. ఈ ఓపెనింగ్ బ్యాటర్ మొత్తంగా 60 బంతులు ఎదుర్కొని 141 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో పదిహేను ఫోర్లతో పాటు ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి. కాగా ఇంగ్లండ్ తరఫున టీ20లలో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. అంతేకాదు సాల్ట్కు ఇది అంతర్జాతీయ స్థాయిలో నాలుగో శతకం.ఈ క్రమంలోనే ఫిల్ సాల్ట్.. సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డు బ్రేక్ చేశాడు. కేవలం 42 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్లోనే నాలుగు శతకాలు పూర్తి చేసుకున్న క్రికెటర్గా చరిత్రపుటల్లోకి ఎక్కాడు. అంతకు ముందు సూర్య 57 ఇన్నింగ్స్లో ఈ ఫీట్ అందుకున్నాడు.అంతర్జాతీయ టీ20లలో అత్యంత వేగంగా నాలుగు శతకాలు పూర్తి చేసుకున్న క్రికెటర్లు🏏ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్)- 42 ఇన్నింగ్స్లో🏏సూర్యకుమార్ యాదవ్ (ఇండియా)- 57 ఇన్నింగ్స్లో🏏రోహిత్ శర్మ (ఇండియా)- 79 ఇన్నింగ్స్లో🏏గ్లెన్ మాక్స్వెల్ (ఆస్ట్రేలియా)- 82 ఇన్నింగ్స్లో.ఇక ఈ రికార్డుతో పాటు మరో వరల్డ్ రికార్డును కూడా ఫిల్ సాల్ట్ సమం చేశాడు. సౌతాఫ్రికాపై ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ సాధించిన ఆటగాడిగా జొనాథర్ చార్లెస్తో కలిసి ప్రథమ స్థానంలో నిలిచాడు.సౌతాఫ్రికాపై ఫాస్టెస్ట్ టీ20 సెంచరీలు చేసింది వీరే🏏ఫిల్ సాల్ట్- 39 బంతుల్లో🏏జొనాథన్ చార్లెస్- 39 బంతుల్లో🏏తిలక్ వర్మ- 41 బంతుల్లో🏏సంజూ శాంసన్- 47 బంతుల్లో🏏బాబర్ ఆజం- 49 బంతుల్లో.చదవండి: టీమిండియాలో నో ఛాన్స్.. ఆ కసి అక్కడ చూపించేశాడు! 12 ఫోర్లు, 2 సిక్స్లతో -
పాక్ను ఓడించడానికి వైభవ్ సూర్యవంశీ వంటి వాళ్లు చాలు!
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా తొలి మ్యాచ్లోనే తమ సత్తా చూపించింది. ఈసారి టీ20 ఫార్మాట్లో జరుగుతున్న ఈ ఈవెంట్లో తొలుత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) జట్టుతో తలపడిన సూర్యకుమార్ సేన ఏకపక్ష విజయం సాధించింది.యూఏఈని తొలుత 57 పరుగులకే ఆలౌట్ చేసిన భారత జట్టు.. కేవలం 4.3 ఓవర్లలోనే లక్ష్య ఛేదనను పూర్తి చేసింది. తద్వారా తమ బలాన్ని మరోసారి నిరూపించుకుంది. మరోవైపు.. పాకిస్తాన్ ఈ టోర్నీ ఆరంభానికి ముందు యూఏఈ- అఫ్గనిస్తాన్లతో టీ20 ట్రై సిరీస్ ఆడింది. అయితే, ఈ రెండు జట్లపై మరీ అంత సునాయాసంగా మాత్రం గెలవలేకపోయింది. ఆసియా కప్ తొలి మ్యాచ్లో ఒమన్పై మాత్రం 93 పరుగుల తేడాతో గెలిచింది.వైభవ్ సూర్యవంశీ వంటి వాళ్లు చాలు!ఇక ఆసియా కప్ టోర్నీలో భాగంగా.. చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ సెప్టెంబరు 14న ముఖాముఖి తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. టీమిండియా పాక్ను చిత్తుగా ఓడించడం ఖాయం అంటున్నారు. అంతేకాదు.. ప్రస్తుత బలాబలాల దృష్ట్యా దాయాది స్థాయికి భారత ద్వితీయ శ్రేణి జట్టు సరిపోతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రియాన్ష్ ఆర్య, పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీ వంటి ఐపీఎల్ స్టార్లు ఉన్న జట్టుతో పాక్ను ఓడించవచ్చనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.ఆఫ్రో-ఆసియా కప్గా మార్చాలిఈ టోర్నీ ఆరంభానికి ముందు టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ.. ఆసియా క్రికెట్ మండలి (ACC)కి ఓ విజ్ఞప్తి చేశాడు. సౌతాఫ్రికాను కూడా ఈ టోర్నీలో చేర్చి.. దీనిని ఆఫ్రో-ఆసియా కప్గా మార్చాలన్నాడు. అంతేకాదు.. భారత్ నుంచి ప్రధాన జట్టుతో పాటు ‘ఎ’ టీమ్ను కూడా బరిలో దించాలని.. అప్పుడే కాస్త పోటీ ఉంటుందని అభిప్రాయపడ్డాడు.ఇండియా- ‘బి’ జట్టు సరిపోతుందిఇక టీమిండియా మాజీ పేసర్ అతుల్ వాసన్ (Atul Wassan) తాజాగా మాట్లాడుతూ.. పాకిస్తాన్ ప్రస్తుత జట్టును ఓడించేందుకు భారత ద్వితీయ శ్రేణి జట్టు చాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘‘90వ దశకంలో పాకిస్తాన్ పటిష్ట జట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ జట్టు బలహీనంగా కనిపిస్తోంది. ప్రస్తుత తరుణంలో పాకిస్తాన్ను ఓడించేందు ఇండియా- ‘బి’ జట్టు సరిపోతుంది. రో-కోను మిస్ కావడం లేదుఏదేమైనా ఈ టోర్నీలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల గైర్హాజరీ మాత్రం నన్ను బాధించడం లేదు. ఎందుకంటే వారి గురించి ఆలోచించడం మొదలుపెడితే.. నేను సునిల్ గావస్కర్, కపిల్ దేవ్ల గురించి ఆలోచిస్తూనే ఉండిపోతాను. కాలంతో పాటుగా ముందుకు సాగటమే ఉత్తమం’’ అని అతుల్ వాసన్ న్యూస్18తో పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రంపచకప్-2024లో భారత్ చాంపియన్గా నిలిచిన తర్వాత కోహ్లి, రోహిత్ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవలే టెస్టులకు కూడా ఈ దిగ్గజాలు వీడ్కోలు పలికారు.చదవండి: బుమ్రా బౌలింగ్లో మా వాడు 6 సిక్స్లు కొడతాడు: పాక్ ప్లేయర్ ఓవరాక్షన్ -
సాల్ట్ విధ్వంసకర, భారీ శతకం.. టీమిండియా రికార్డు బ్రేక్ చేసిన ఇంగ్లండ్
సౌతాఫ్రికాతో రెండో టీ20లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును ఏకంగా 146 పరుగుల తేడాతో చిత్తు చేసి.. తొలి మ్యాచ్లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసింది.కాగా మూడు వన్డే, మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లు ఆడేందుకు సౌతాఫ్రికా జట్టు ఇంగ్లండ్ (ENG vs SA)కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలి రెండు వన్డేలు గెలిచిన సఫారీలు 2-1తో సిరీస్ సొంతం చేసుకున్నారు. ఇక టీ20లలోనూ ప్రొటిస్ జట్టు శుభారంభమే అందుకుంది.కార్డిఫ్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్లో డీఎల్ఎస్ పద్ధతిలో 14 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై గెలిచింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం రాత్రి రెండో టీ20 జరిగింది. మాంచెస్టర్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఇంగ్లండ్ బ్యాటింగ్కు దిగింది.సాల్ట్ విధ్వంసకర, భారీ శతకంఓపెనర్ ఫిల్ సాల్ట్ (Phil Salt) ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ప్రొటిస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 19 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ముప్పై తొమ్మిది బంతుల్లోనే శతకమార్కు అందుకున్నాడు. మొత్తంగా 60 బంతుల్లో 15 ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 141 పరుగులతో.. 235కు పైగా స్ట్రైక్రేటుతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.బట్లర్ మెరుపు ఇన్నింగ్స్ఇక మరో ఓపెననర్ జోస్ బట్లర్ (Jos Buttler) సైతం మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగాడు. 30 బంతులు ఎదుర్కొన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 8 ఫోర్లు, 7 సిక్స్లు బాది.. 276కు పైగా స్ట్రైక్రేటుతో 83 పరుగులు రాబట్టాడు. మిగతా వారిలో జేకబ్ బెతెల్ (14 బంతుల్లో 26) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ ధనాధన్ (21 బంతుల్లో 41 నాటౌట్) దంచికొట్టాడు.ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఏకంగా 304 పరుగులు సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో బిజోర్న్ ఫార్చూన్కు రెండు వికెట్లు దక్కాయి.ఇక లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా శుభారంభమే అందుకున్నా దానిని కొనసాగించడంలో విఫలమైంది. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (20 బంతుల్లో 41), మరో ఓపెర్ రియాన్ రికెల్టన్ (10 బంతుల్లో 20) వేగంగా ఆడే ప్రయత్నం చేశారు.ఇంగ్లండ్ బౌలర్ల విజృంభణవన్డౌన్లో వచ్చిన లువాన్ డ్రి ప్రిటోరియస్ (2)తో పాటు.. డెవాల్డ్ బ్రెవిస్ (4) కూడా విఫలం కాగా.. ట్రిస్టన్ స్టబ్స్ (23), డొనోవాన్ ఫెరీరా (23), బిజోర్స్ ఫార్చూన్ (32) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి నిలవలేక స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు.ఈ క్రమంలో 16.1 ఓవర్లలో 158 పరుగులు మాత్రమే చేసిన సఫారీ జట్టు.. ఇంగ్లండ్ చేతిలో 146 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడింది.ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు, సామ్ కర్రన్, లియామ్ డాసన్, విల్ జాక్స్ రెండేసి వికెట్లు కూల్చి ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. ఆదిల్ రషీద్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇక విధ్వంసకర శతక వీరుడు, ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.టీమిండియా రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్కాగా అంతర్జాతీయ టీ20లలో ఫుల్ మెంబర్ జట్టు (ఐసీసీ టెస్టు హోదా కలిగిన జట్టు)పై అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. సౌతాఫ్రికాపై రెండు వికెట్ల నష్టానికి 304 పరుగులు స్కోరు చేసి ఈ ఘనత సాధించింది. ఈ క్రమంలో టీమిండియా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. కాగా 2024లో హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్పై టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 297 పరుగులు సాధించింది.చదవండి: బుమ్రా బౌలింగ్లో మా వాడు 6 సిక్స్లు కొడతాడు: పాక్ ప్లేయర్ ఓవరాక్షన్PHIL SALT - THE FASTEST CENTURION FOR ENGLAND IN T20I HISTORY. 🥶pic.twitter.com/JzhM7RrLme— Mufaddal Vohra (@mufaddal_vohra) September 12, 2025 -
పాకిస్తాన్ జోరు
దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీని పాకిస్తాన్ జట్టు విజయంతో మొదలు పెట్టింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో పాక్ 93 పరుగుల తేడాతో ఒమన్ను ఓడించింది. తొలిసారి ఆసియా కప్ బరిలోకి దిగిన ఒమన్ జట్టు పాక్ బౌలింగ్ ముందు నిలబడలేకపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగా...ఛేదనలో ఒమన్ 16.4 ఓవర్లలో 67 పరుగులకే కుప్పకూలింది. అబుదాబిలో నేడు జరిగే మ్యాచ్లో శ్రీలంక, బంగ్లాదేశ్ తలపడతాయి. ఓపెనర్ సయీమ్ అయూబ్ (0) డకౌట్ కాగా... మొహమ్మద్ హరీస్ (43 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్స్లు), సాహిబ్జాదా ఫర్హాన్ (29 బంతుల్లో 29; 1 ఫోర్) కలిసి పాక్ ఇన్నింగ్స్ను నడిపించారు. ఆరంభంలో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో ఒమన్ సఫలమైనా...ఆ తర్వాత పట్టు విడిచింది. హరీస్, ఫర్హాన్ రెండో వికెట్కు 64 బంతుల్లో 85 పరుగులు జోడించారు. కెప్టెన్ సల్మాన్ ఆఘా (0) తొలి బంతికే వెనుదిరగ్గా... ఫఖర్ జమాన్ (23 నాటౌట్; 2 ఫోర్లు), మొహమ్మద్ నవాజ్ (19 నాటౌట్) కూడా కీలక పరుగులు జత చేయడంతో స్కోరు 150 పరుగులు దాటింది. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్, ఆమిర్ కలీమ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో ఒమన్ పూర్తిగా చేతులెత్తేసింది. హమ్మద్ మీర్జా (23 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ కనీసం క్రీజ్లో నిలబడలేకపోయారు. పాకిస్తాన్ తరఫున ఫహీమ్ అష్రఫ్, ముఖీమ్, అయూబ్ తలా 2 వికెట్లు తీశారు. పాక్ తమ తర్వాతి మ్యాచ్లో రేపు భారత్ను ఎదుర్కొంటుంది. -
పాకిస్తాన్కు చుక్కలు చూపించిన పసి కూన..
ఆసియాకప్-2025లో దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాటర్లకు ఒమన్ బౌలర్లు చుక్కలు చూపించారు. పాక్ బ్యాటర్లలో మహ్మద్ హరిస్ మినహా మిగితా బ్యాటర్లు ఎవరూ తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు.టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేయగల్గింది. తొలి ఓవర్లోనే ఇన్ ఫామ్ బ్యాటర్ సైమ్ అయూబ్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మహ్మద్ హరిస్(43 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 66).. సాహిబ్జాదా ఫర్హాన్(29 బంతుల్లో 29)తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఫర్హాన్ దాదాపు 10 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నప్పటికి బ్యాట్ ఝూళిపించలేకపోయాడు. తన చెత్త బ్యాటింగ్తో జట్టుకు భారంగా మారాడు. అతడు ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ఫఖార్ జమాన్(16 బంతుల్లో 23) తన మార్క్ చూపించలేకపోయాడు. కెప్టెన్ సల్మాన్ అలీ అఘా అయితే తొలి బంతికే గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఆఖరిలో మహ్మద్ నవాజ్(10 బంతుల్లో 19) కాస్త దూకుడుగా ఆడాడు. ఇక ఒమన్ బౌలర్లలో షా ఫైజల్, అమీర్ కలీం తలా మూడు వికెట్లు తీయగా.. నదీమ్ ఒక్క వికెట్ తీశాడు. -
చిన్ననాటి స్నేహితుడిని కలిసిన గిల్.. 14 ఏళ్ల తర్వాత! వీడియో
టీమిండియా స్టార్ ప్లేయర్, టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ తన చిన్ననాటి స్నేహితుడు సిమ్రన్జీత్ సింగ్ను 14 ఏళ్ల తర్వాత కలిశాడు. ఇందుకు ఆసియాకప్-2025 వేదికైంది. పంజాబ్కు చెందిన స్పిన్నర్ సిమ్రంజీత్ సింగ్ ప్రస్తుతం యూఏఈ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు.ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం దుబాయ్ వేదికగా యూఏఈ, భారత్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో యూఏఈను తొమ్మిది వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్ ముగిశాక గిల్.. సిమ్రన్జీత్ వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకుంటూ ఆప్యాయతగా మాట్లాడాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ మ్యాచ్లో గిల్ కేవలం 9 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్స్తో 20 పరుగులు చేశాడు. అతడితో పాటు అభిషేక్ శర్మ( 16 బంతుల్లో 30) మెరుపులు మెరిపించాడు. దీంతో 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 4.3 ఓవర్లలో చేధించింది.నాకు గిల్ తెలుసు..కాగా భారత్తో మ్యాచ్కు ముందు పీటీఐతో మాట్లాడిన సిమ్రన్జీత్.. గిల్ తనకు చిన్ననాటి నుంచి తెలుసు అని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు అతడికి తాను గుర్తున్నానో లేదో తెలియదని ఈ యూఏఈ స్పిన్నర్ పేర్కొన్నాడు. కానీ ఇప్పుడు గిల్ కలిసి మాట్లాడడంతో సిమ్రన్జీత్ ఆనందంలో మునిగి తేలిపోతున్నాడు. ఇక భారత్ తమ తదుపరి మ్యాచ్లో ఆదివారం దుబాయ్ వేదికగా పాకిస్తాన్తో తలపడనుంది.When Shubman Gill Meets his childhood friend after 14 years | Asia Cup | Asia Cup 2025 | Simranjeet Singh | UAE | India | Team India | Ind vs uae...#Cricket #teamindia #india #shubmangill #shubman #asiacup #asiacup2025 #indvsuae #simranjeetsingh #shubmangillchildhoodfriend pic.twitter.com/WFQwrzIrPf— Dinesh Bedi (@dineshbedi6) September 11, 2025 -
తోపు, తురుము అన్నారు.. కట్ చేస్తే? తొలి బంతికే ఔట్
ఆసియాకప్-2025కు ముందు పాకిస్తాన్ యువ ఓపెనర్ సైమ్ అయూబ్పై భారీ అంచనాలు ఉండేవి. ద్వైపాక్షిక సిరీస్లలో అద్బుతంగా రాణిస్తున్న అయూబ్.. ఈ ఖండాంతర టోర్నీలో కూడా దుమ్ములేపుతాడని అంతా భావించారు. కానీ ఈ యువ ఆటగాడు అందరి అంచనాలను తలకిందలు చేశాడు.ఈ మెగా ఈవెంట్లో భాగంగా దుబాయ్ వేదికగా ఒమన్తో జరుగుతున్న మ్యాచ్లో యూబ్ తీవ్ర నిరాశపరిచాడు. గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్లో అయూబ్ తన ఎదుర్కొన్న తొలి బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. పాక్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన ఒమన్ పేసర్ షా ఫైజల్.. రెండో బంతిని మిడిల్ స్టంప్ దిశగా ఫుల్లర్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు.ఆ బంతిని అయూబ్ కాస్త బెండ్ అయ్యి లెగ్ సైడ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్కు మిస్స్ అయ్యి బ్యాక్ ప్యాడ్కు తాకింది. దీంతో బౌలర్తో పాటు ఫీల్డర్లు ఎల్బీకి అప్పీల్ చేయగా.. అంపైర్ వెంటనే ఔట్ అని వేలు పైకెత్తాడు. ఆ తర్వాత అయూబ్ రివ్యూ తీసుకున్నప్పటికి ఫలితం మాత్రం ఒమన్కు ఫేవర్గానే వచ్చింది. బంతి క్లియర్గా మిడిల్ స్టంప్కు తాకినట్లు తేలింది. దీంతో నిరాశతో అయూబ్ పెవిలియన్కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. తొలి బంతికే ఔటైన అయూబ్ నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు. ఎందుకంటే పాక్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్.. జస్ప్రీత్ బుమ్రాను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం దుబాయ్ వేదికగా భారత్-పాక్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో బుమ్రా బౌలింగ్లో అయూబ్ ఆరు సిక్స్లు కొడతాడని అహ్మద్ బిల్డప్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు అయూబ్ పసికూన ఒమన్పై ఆడలేకపోయాడు.💥 Golden Duck! Saim Ayub trapped plumb LBW, Pakistan lose review early!#AsiaCup2025 #Pakistan #Oman #starzplay pic.twitter.com/cJ74GBVZ7q— Cricket on STARZPLAY (@starzplaymasala) September 12, 2025 -
పాక్తో మ్యాచ్.. టీమిండియా తుది జట్టు ఇదే! అతడికి నో ఛాన్స్?
ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్లు దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. ఈ దాయాదుల పోరు కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ మెగా టోర్నీని ఇప్పటికే టీమిండియా అద్బుతమైన విజయంతో ప్రారంభించింది.బుధవారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో యూఏఈను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 4.3 ఓవర్లలోనే భారత్ ఊదిపడేసింది. ఇప్పుడు పాకిస్తాన్పై కూడా అదే జోరును కొనసాగించాలని మెన్ ఇన్ బ్లూ భావిస్తోంది. మరోవైపు పాక్ తమ తొలి మ్యాచ్లో శుక్రవారం దుబాయ్ వేదికగానే ఒమన్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో పసికూన ఒమన్ను పాక్ ఓడించడం దాదాపు ఖాయం అని చెప్పాలి. కానీ ఆదివారం మాత్రం పాక్కు భారత్ నుంచి కఠిన సవాల్ ఎదురుకానుంది. బ్యాటింగ్, బౌలింగ్లో దుమ్ములేపుతున్న సూర్య సేనను పాక్ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.నో ఛేంజ్..?కాగా పాక్తో మ్యాచ్కు భారత తుది జట్టులో ఎటువంటి మార్పులు చోటు చేసుకోపోవచ్చు. యూఈఏతో ఆడిన ప్లేయింగ్ ఎలెవన్తో టీమిండియా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తుది జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్గా సంజూ శాంసన్ను కొనసాగించనున్నారు.యూఏఈతో మ్యాచ్లో సంజూకు బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. ఈ కేరళ ఆటగాడు మిడిలార్డర్లో బ్యాటింగ్కు రానున్నాడు. ఈ మ్యాచ్లో కూడా భారత ముగ్గురు స్పిన్నర్లతో ఆడే అవకాశముంది. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఇద్దరూ స్పెషలిస్టు స్పిన్నర్లగా కొనసాగనున్నారు. దీంతో యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ మరోసారి బెంచ్కే పరిమితమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా ప్రధాన పేసర్గా ఉండనున్నాడు. అతడితో పాటు మీడియం పేస్ బౌలర్లు శివమ్ దూబే, హార్ధిక్ పాండ్యా బంతిని పంచుకోనున్నారు.భారత్ తుది జట్టు(పాకిస్తాన్)అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిచదవండి: టీమిండియాలో నో ఛాన్స్.. ఆ కసి అక్కడ చూపించేశాడు! 12 ఫోర్లు, 2 సిక్స్లతో -
టీమిండియాలో నో ఛాన్స్.. ఆ కసి అక్కడ చూపించేశాడు! 12 ఫోర్లు, 2 సిక్స్లతో
దులీప్ ట్రోఫీ-2025లో సౌత్ జోన్తో జరుగుతున్న ఫైనల్లో సెంట్రల్ జోన్ పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 384 పరుగులు చేసింది. క్రీజులో యష్ రాథోడ్(137), శరన్ష్ జైన్ ఉన్నారు. వీరిద్దరూ ఐదో వికెట్కు 118 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.సెంట్రల్ జోన్ వికెట్ల పడగొట్టడానికి సౌత్ జోన్ బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అంతకుముందు సెంట్రల్ జోన్ కెప్టెన్, ఆర్సీబీ సారథి రజత పాటిదార్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 50/0 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను మొదలు పెట్టిన సెంట్రల్ జోన్ ఆరంభంలోనే అక్షయ్ వాడ్కర్ (52 బంతుల్లో 20, 3 ఫోర్లు) వికెట్ను కోల్పోయింది.ఆ తర్వాత సెంట్రల్ జోన్ శుబ్మ్ శర్మ(6), డానిశ్ మాలేవర్ (64 బంతుల్లో 53 బ్యాటింగ్; 5 ఫోర్లు) వికెట్లను రెండు ఓవర్ల వ్యవధిలోనే కోల్పోయింది. ఈ సమయంలో పాటిదార్ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. వన్డే తరహాలో తన ఇన్నింగ్స్ను కొనసాగించిన పాటిదార్.. కేవలం 112 బంతుల్లోనే తన 15వ ఫస్ట్ క్లాస్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 115 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్లతో 101 పరుగులు చేశాడు. అంతేకాకుండా యష్ రాథోడ్తో కలిసి నాలుగో వికెట్కు 167 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని ఈ మధ్యప్రదేశ్ ఆటగాడు నెలకొల్పాడు. సౌత్ జోన్ బౌలర్లలో గుర్జప్నీత్ సింగ్ మూడు, నిదేశ్, కౌశిక్ తలా వికెట్ సాధించారు. సెంట్రల్ జోన్ ప్రస్తుతం 235 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.టీమిండియాలోకి రీ ఎంట్రీ?వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు ముందు పాటిదార్ సూపర్ సెంచరీతో సెలక్టర్లకు సవాలు విసిరాడు. ఆస్ట్రేలియా-ఎతో సిరీస్కు ఎంపిక చేసిన భారత-ఎ జట్టులో పాటిదార్కు చోటు దక్కకపోవడం అందరిని ఆశ్చర్యపరిచాడు. గత కొంత కాలంగా దేశవాళీ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తున్నప్పటికి పాటిదార్ను సెలక్టర్లు పరిగణలోకి తీసుకులోదు. దులీప్ ట్రోఫీలో కూడా పాటిదార్ దుమ్ములేపుతున్నాడు. ఒకవేళ దులీప్ ట్రోఫీలో ప్రదర్శనలను పరిగణలోకి తీసుకుంటే వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు పాటిదార్ ఎంపికయ్యే అవకాశముంది. ఇప్పటికే టీమిండియా టెస్టుల్లో అరంగేట్రం చేసిన పాటిదార్ తన మార్క్ చూపించలేకపోయాడు. ప్రస్తుత పరిస్థితుల బట్టి అతడి రీ ఎంట్రీ కష్టమే అనే చెప్పాలి.చదవండి: రూట్ ఒక్క సెంచరీ చెయ్.. లేదంటే మా నాన్న అన్నంత పనిచేస్తాడు: హేడెన్ కుమార్తె -
పాకిస్తాన్ డేంజరస్ ప్లేయర్లు.. ఎప్పుడు ఎలా ఆడతారో తెలీదు!
భారత్-పాకిస్తాన్ జట్లు క్రికెట్ మైదానంలో మరోసారి యుద్దానికి సిద్దమయ్యాయి. ఆసియాకప్-2025లో భాగంగా ఆదివారం(సెప్టెంబర్ 14) దుబాయ్ వేదికగా దాయాదుల పోరు జరగనుంది. చివరగా ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో ముఖాముఖి తలపడిన భారత్-పాక్.. ఇప్పుడు మళ్లీ ఆరు నెలల తర్వాత అభిమానులను ఉరూత్రలూగించనున్నాయి.ఈ మెగా టోర్నీలో భారత్ ఇప్పటికే అద్బుతమైన విజయంతో శుభారంభం చేసింది. దుబాయ్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్లో యూఏఈను 9 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. ఇప్పుడు అదే మైదానంలో పాక్ ఒమన్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. పసికూన ఒమన్ను చిత్తు చేసి టోర్నీలో శుభారంభం చేయాలని పాక్ కూడా యోచిస్తోంది. పాకిస్తాన్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉంది. ట్రైసిరీస్ విజయంతో ఈ టోర్నీలో అడుగుపెట్టింది. అయితే బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్లు లేకపోయినప్పటికి చాలా మంది యంగ్ టాలెంటడ్ ఆటగాళ్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో పాక్ బలాలు, బలహీనతలపై ఓ లుక్కేద్దాం.పాకిస్తాన్ జట్టు ఎప్పుడూ ఎలా ఆడుతుందో ఎవరూ చెప్పలేరు. తమదైన రోజున వరల్డ్ నెం1 జట్టును ఓడించగలిగే పాకిస్తాన్.. కొన్నిసార్లు జింబాబ్వే, అఫ్గాన్ వంటి పసికూన చేతిలో సైతం ఘోర పరాజయాల పాలై విమర్శకులకు దొరకిపోతుంటుంది. అయితే పాక్ జట్టు ప్రస్తుతం బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో పటిష్టం కన్పిస్తోంది. జమాన్తో జాగ్రత్త..ఫఖర్ జమాన్ గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి రావడం మెన్ ఇన్ గ్రీన్కు మరింత బలాన్ని చేకూరుస్తోంది. జమాన్కు భారత్పై మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2017ను పాక్ సొంత చేసుకోడంలో జమాన్ది కీలక పాత్ర. భారత్తో జరిగిన ఫైనల్లో అతడు అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. టీమిండియాపై టీ20ల్లో అతడు పెద్దగా రన్స్ సాధించికపోయినప్పటికి.. వన్డేల్లో మాత్రం కేవలం 6 మ్యాచ్లు ఆడి 234 పరుగులు చేశాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ పాక్కు మరోసారి కీలకం కానున్నాడు.వారిద్దరూ చాలా డేంజరస్..అతడితో పాటు యువ ఆటగాళ్లు సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్ల నుంచి భారత బౌలర్లకు గట్టి పోటీ ఎదురు కానుంది. టీ20ల్లో పాక్ కొత్త ఓపెనింగ్ జోడీ అయినా ఫర్హాన్, సైమ్లు.. ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నారు. వీరిద్దరూ యూఏఈ ట్రైసిరీస్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయనప్పటికి.. విధ్వంసకర బ్యాటింగ్ చేసే సత్తా వీరికి ఉంది. ఫర్హాన్కు టీ20ల్లో145కు పైగా స్ట్రైక్ రేట్ ఉంది. అయూబ్ అయితే తన అరంగేట్రం నుంచి బ్యాట్తో పాటు బంతితో కూడా రాణిస్తూ వస్తున్నాడు. ఇక మిడిలార్డర్లో కెప్టెన్ సల్మాన్ అఘా.. నిలకడకు పెట్టింది పేరు. అతడు పరిస్థితిని బట్టి తన బ్యాటింగ్ గేర్లను మారుస్తూ ఉంటాడు. అతడితో కొత్త ఆటగాడు హసన్ నవాజ్ సైతం మెరుపులు మెరిపించలడు. నవాజ్ న్యూజిలాండ్పై 44 బంతుల్లోనే సెంచరీ చేసి చరిత్రకెక్కాడు. హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా వంటి వెటరన్లు ఉన్నారు. అయితే వికెట్ కీపర్ మహ్మద్ హరిస్ ఫామ్లో లేకపోవడం పాక్ మెనెజ్మెంట్ను కాస్త కలవరపెడుతోంది.ఆ నలుగురు..ఇక ఆసియా ఉపఖండ పిచ్లలపై ప్రధాన ఆయుధం స్పిన్ బౌలింగ్. ఈ విభాగంలో పాక్ చాలా పటిష్టంగా ఉంది. ముఖ్యంగా మహ్మద్ నవాజ్, అబ్రార్ అహ్మద్ నుంచి భారత బ్యాటర్లకు సవాలు ఎదురు కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీ-2005లో గిల్ను అబ్రార్ ఔట్ చేసిన విధానం ఇప్పటికి గుర్తుండే ఉంటుంది. ఈ లెగ్ స్పిన్నర్ అద్బుతమైన బంతితో గిల్ను బోల్తా కొట్టించాడు. వీరిద్దరితో పాటు ఖుష్దిల్ షా, సుఫియాన్ ముకీమ్ బంతిని గింగిరాలు తిరిగేలా చేయగలరు.పేస్ బ్యాటరీ పవర్ ఫుల్..ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ చాలా పవర్ ఫుల్గా ఉంది. షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, హసన్ అలీలు వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నారు. వీరందరికి బంతిని స్వింగ్, రివర్స్ స్వింగ్ చేయడం వెన్నతో పెట్టిన విధ్య. ముఖ్యంగా దుబాయ్ పిచ్లపై ఆడిన అనుభవం మనకంటే వారికే ఎక్కువగా ఉంది.ఆ కండీషన్స్ ఉపయోగించుకుని ఈ పేస్ త్రయం చెలరేగితే భారత బ్యాటర్లకు కష్టాలు తప్పవు. అఫ్రిదికి భారత్పై మంచి రికార్డు ఉంది. అయితే ఎన్ని బలాలు ఉన్న పాక్కు బలహీనతలు కూడా ఉన్నాయి. బ్యాటింగ్లో స్ధిరత్వం లేకపోవడం పాక్ ప్రధాన బలహీనతగా ఉంది.టాప్ ఆర్డర్ మీద ఆధారపడటం ఎక్కువగా ఆధారపడుతూ వస్తుంది. అదేవిధంగా ఫీల్డింగ్లో కూడా పాక్ పేలవ ప్రదర్శన కనబరుస్తూ వస్తుంది. చాలా మ్యాచ్ల్లో కాచులు డ్రాప్, రన్ అవుట్స్ మిస్ చేయడం చేస్తూ భారీ మూల్యం చెల్లించుకుంటోంది. కాగా ఆసియాకప్లో పాక్పై టీమిండియానే ఇప్పటివరకు పూర్తి ఆధిపత్యం చెలాయించింది.ఆసియా కప్ 2025 కోసం పాకిస్థాన్ జట్టు:సల్మాన్ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహీన్ షా ఆఫ్రిది, సుఫియాన్ ముఖీమ్ -
రూట్ ఒక్క సెంచరీ చెయ్.. లేదంటే మా నాన్న అన్నంత పనిచేస్తాడు: హేడెన్ కుమార్తె
సంప్రదాయ క్రికెట్లో యాషెస్ సిరీస్కున్న ప్రత్యేకత, విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 141 సంవత్సరాల చరిత్ర గల ఈ సిరీస్లో మరోసారి ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమవుతున్నాయి. ఈ ఏడాది యాషెస్ సిరీస్ నవంబర్ నుంచి జనవరి 8, 2026 వరకు జరుగుతుంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్కు ఈసారి ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనుంది.ఈ సిరీస్ ఆరంభానికి ఇంకా రెండు నెలల పైగా సమయం ఉన్నప్పటికి మాజీ క్రికెటర్లు మాత్రం తమ సవాల్లతో మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడన్.. ఇంగ్లండ్ స్టార్ జో రూట్ను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశాడు. "యాషెస్ సిరీస్లో జో రూట్ కనీసం ఒక సెంచరీ అయినా సాధించకపోతే మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో నగ్నంగా నడుస్తా" అని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ బోల్డ్ ఛాలెంజ్పై హేడెన్ కుమార్తె, క్రికెట్ ప్రెజెంటర్ గ్రేస్ హేడెన్ స్పందించింది. "ప్లీజ్ రూట్ ఒక్కసెంచరీ చేయండి.. లేదంటే మా నాన్న అన్నంత పని చేస్తాడు" అని కామెంట్స్లో గ్రేస్ రాసుకొచ్చింది.ఒక్క సెంచరీ కూడా..వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా కొనసాగుతున్న జో రూట్.. ఆశ్చర్యకరంగా ఇప్పటివరకు ఆస్ట్రేలియా గడ్డపై కనీసం ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోయాడు. ఏ ఫార్మాట్లోనూ అతడు సెంచరీ మార్క్ను అందుకోలేకపోయాడు. ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు రూట్ 14 టెస్ట్ మ్యాచ్లు, 16 వన్డేలు, మూడు టీ20లు ఆడాడు.ఆసీస్లో మూడు ఫార్మాట్లలో కలిపి రూట్ 9 హాఫ్ సెంచరీలు చేశాడు. అతడి అత్యధిక స్కోర్ 91 నాటౌట్గా ఉంది. అయితే ఓవరాల్గా ఆసీస్పై రూట్కు మంచి రికార్డు ఉంది. రూట్ తన కరీర్లో కంగారులపై నాలుగు సెంచరీలు చేశాడు. అవన్నీ కూడా తన స్వదేశంలో వచ్చినవే కావడం గమానార్హం. -
విరాట్- అనుష్క.. మమ్మల్ని కూడా బయటకు పొమ్మన్నారు!
భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)కి ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన ఆట తీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ రన్మెషీన్.. వర్ధమాన క్రికెటర్లకు ఆదర్శప్రాయం. ఎంతో మంది యువ ఆటగాళ్లకు అతడొక రోల్మోడల్.కోహ్లిని నేరుగా కలిసి బ్యాటింగ్ మెళకువలు నేర్చుకోవాలని తహతహలాడే వారెందరో!.. తాము కూడా ఆ కోవకే చెందుతామని చెబుతోంది భారత మహిళా జట్టు స్టార్ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues). అయితే, తాను, స్మృతి మంధాన (Smriti Mandhana) చేసిన పని వల్ల విరాట్ కోహ్లి, అతడి భార్య అనుష్క శర్మ కాస్త అసౌకర్యానికి గురికావాల్సి వచ్చిందని తాజాగా వెల్లడించింది.ఒకే హోటల్లో బస.. అనుష్క కూడా అక్కడే‘‘అప్పుడు భారత పురుష, మహిళా క్రికెట్ జట్లు న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నాయి. ఇరుజట్లకు ఒకే హోటల్లో బస ఏర్పాటు చేశారు. అప్పుడు స్మృతి, నేను కలిసి విరాట్ను కలవాలి అనుకున్నాం.మీతో మాట్లాడాలనుకుంటున్నాము అనగానే.. ‘ఓహ్.. ప్లీజ్.. మేము ఇక్కడే కేఫ్లో ఉన్నాము వచ్చేయండి’ అని కోహ్లి చెప్పాడు. అప్పుడు అనుష్క శర్మ కూడా అక్కడే ఉంది.మొదటి అర్ధగంట సేపు క్రికెట్ గురించి మాట్లాడాము. ఈ క్రమంలో .. నేను, స్మృతి భారత మహిళా క్రికెట్లో కీలక ప్లేయర్లుగా ఉండిపోతామని కోహ్లి అన్నాడు. మేమిద్దరం గొప్ప పేరు తెచ్చుకుంటామని అన్నాడు.ఇక చాలు.. బయటకు వెళ్లండిఆ తర్వాత బ్యాటింగ్ గురించి మాకు కొన్ని టిప్స్ ఇచ్చాడు. మా మాటలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత వ్యక్తిగత జీవితాల గురించి కూడా మాట్లాడుకున్నాము. ఏదో.. పాత స్నేహితులు చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్నట్లుగా మా సంభాషణలు కొనసాగాయి.అప్పటికి నాలుగు గంటలు గడిచిపోయింది. అప్పుడు కేఫ్ నిర్వాహకులు వచ్చి.. ‘సమయం దాటిపోయింది.. ఇక వెళ్లండి’ అని చెప్పేంత వరకు అక్కడే కూర్చున్నాము. సుమారుగా రాత్రి 11.30 గంటల ప్రాంతంలో మేము అక్కడి నుంచి వెళ్లిపోయాము’’ అని జెమీమా రోడ్రిగ్స్ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది.లండన్లోనే నివాసంకాగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించిన విరాట్ కోహ్లి.. 2017లో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ సంతానం. లండన్లో అకాయ్కు జన్మనిచ్చిన తర్వాత అనుష్క కోహ్లితో కలిసి అక్కడే ఎక్కువగా ఉంటోంది. మ్యాచ్లు ఉన్నపుడు మాత్రమే కోహ్లి భారత్కు వస్తున్నాడు. ఇక పెళ్లికి ముందు నుంచే కోహ్లితో పాటు అనుష్క కూడా టీమిండియా వెళ్లే పర్యటనల్లో భాగమయ్యేదన్న విషయం తెలిసిందే.చదవండి: 21 సార్లు డకౌట్ అయినా సరే.. జట్టులోనే.. అతడికి గంభీర్ చెప్పిందిదే.. -
బుమ్రా బౌలింగ్లో మా వాడు 6 సిక్స్లు కొడతాడు: పాక్ ప్లేయర్
ఆసియాకప్-2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు సమయం అసన్నమవుతోంది. సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధులు అమీతుమీ తెల్చుకోనున్నారు. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. భారత్ ఇప్పటికే తమ తొలి మ్యాచ్లో యూఏఈను చిత్తు చేయగా.. పాక్ జట్టు వారి మొదటి మ్యాచ్లో శుక్రవారం ఒమన్తో తలపడనుంది.పాకిస్తాన్ కూడా వారి తొలి మ్యాచ్లో సునాయసంగా విజయం సాధించే అవకాశముంది. కానీ అసలు సిసలైన సవాల్ ఆదివారం ఎదురుకానుంది. ఆసియాకప్లో పాక్పై టీమిండియాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. మరోసారి దాయాదిపై తమ జోరును కొనసాగించాలని సూర్యకుమార్ సేన ఉవ్విళ్లూరుతోంది.ప్రత్యర్ధి పాక్ సైతం ఎలాగైనా టీమిండియాను ఓడించాలని పట్టుదలతో ఉంది. ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ తన్వీర్ అహ్మద్ సంచలన కామెంట్స్ చేశాడు. టీమిండియా సూపర్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో పాక్ యవ ఓపెనర్ సైమ్ అయూబ్ వరుసగా ఆరు సిక్స్లు కొడతాడని తన్వీర్ బిల్డప్ ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన్వీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. దీంతో భారత అభిమానులు తన్వీర్కు కౌంటరిస్తున్నారు. బుమ్రా బౌలింగ్లో అయూబ్ కనీసం ఫోర్ అయినా కొడతాడా? అని ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. కాగా ప్రపంచ క్రికెట్లో బుమ్రా నెంబర్ వన్ బౌలర్గా కొనసాగుతున్నాడు. స్మిత్, రూట్, స్టోక్స్ వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లు సైతం బుమ్రా బౌలింగ్ను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డారు. అటువంటిది ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు అంటే అది కలలో కూడా జరగదు. అయితే పాక్ జట్టులో అయూబ్ గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. 41 టీ20ల్లో 816 పరుగులు చేశాడు. ఆఫ్ బ్రేక్ బౌలింగ్ కూడా అయూబ్ చేయగలడు.చదవండి: మా జట్టుకు మాత్రం.. గిల్ ఇలా ఆడడు: గుజరాత్ టైటాన్స్ కోచ్ -
మా జట్టుకు మాత్రం.. గిల్ ఎప్పుడూ ఇలా ఆడడు: కోచ్
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నీతో అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేశాడు టీమిండియా స్టార్ శుబ్మన్ గిల్ (Shubman Gil). దాదాపు ఏడాది విరామం తర్వాత యూఏఈతో మ్యాచ్ సందర్భంగా బుధవారం రీఎంట్రీ ఇచ్చాడు. అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించిన గిల్ ధనాధన్ దంచికొట్టాడు.గిల్ ధనాధన్యూఏఈ విధించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గిల్ విశ్వరూపం ప్రదర్శించాడు. పసికూనపై ఆది నుంచే ఎదురుదాడి ఆరంభించాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతి (రెండో ఓవర్ మొదటి బంతి)నే ఫోర్గా మలిచిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. అదే ఓవర్లో ఓ సిక్సర్ కూడా బాదాడు.టీమిండియా ఘన విజయం ఇక ఈ మ్యాచ్లో మొత్తంగా తొమ్మిది బంతులు ఆడిన శుబ్మన్ గిల్.. రెండు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి స్ట్రైక్రేటు 222.22. ఇదిలా ఉంటే.. గిల్తో పాటు అభిషేక్ శర్మ (16 బంతుల్లో 30), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (2 బంతుల్లో 7 నాటౌట్) రాణించడంతో 4.3 ఓవర్లలోనే పని పూర్తి చేసింది టీమిండియా. యూఏఈని తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి ఘన విజయం సాధించింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, ఐపీఎల్ ఫ్రాంఛైజీ బ్యాటింగ్ కోచ్ పార్థివ్ పటేల్.. తమ కెప్టెన్ శుబ్మన్ గిల్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టైటాన్స్కు ఆడేటపుడు గిల్లో ఇలాంటి దూకుడు చూడలేదని అన్నాడు. ‘‘తొలి బంతి నుంచే గిల్ అటాకింగ్ మోడ్లోకి వెళ్లిపోయాడు.మా జట్టుకు మాత్రం.. గిల్ ఇలా ఆడడుఆ తర్వాత వెంటనే.. క్రీజు బయటకు వచ్చి మరీ ఫోర్ బాదాడు. అదే ఓవర్లో సిక్స్ కూడా కొట్టాడు. గుజరాత్ టైటాన్స్కు ఆడేటపుడు అతడిలో ఇలాంటి దూకుడు ఎప్పుడూ చూడలేదు. నిజానికి ఇక్కడ కుదురుకునేందుకు గిల్ కాస్త సమయం తీసుకుంటాడు.కానీ టీమిండియా తరఫున ఈ మ్యాచ్లో ఎనిమిది మంది బ్యాటర్లు ఉన్న కారణంగా ఆది నుంచే దూకుడు ప్రదర్శించాడు. అద్భుతంగా ఆడాడు కూడా!’’ అని పార్థివ్ పటేల్ గిల్ను ప్రశంసించాడు. టీ20 జట్టు వైస్ కెప్టెన్గాకాగా టైటాన్స్కు సారథ్యం వహించడంతో పాటు ఓపెనర్గానూ గిల్ సేవలు అందిస్తున్నాడు. ఇటీవలే ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా టీమిండియా టెస్టు కెప్టెన్గా గిల్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా బ్యాట్తో ఇరగదీసిన ఈ పంజాబీ బ్యాటర్.. కెప్టెన్గానూ 2-2తో సిరీస్ సమం చేయగలిగాడు.ఇక భవిష్యత్తులో టీమిండియా మూడు ఫార్మాట్లలో గిల్ను కెప్టెన్ను చేయాలనే ఉద్దేశంతో.. ఇటీవలే టీ20 జట్టు వైస్ కెప్టెన్గా బీసీసీఐ తిరిగి నియమించింది. ప్రస్తుతం టీమిండియాకు వన్డేల్లో రోహిత్ శర్మ, టీ20లలో సూర్యకుమార్ యాదవ్, టెస్టుల్లో శుబ్మన్ గిల్ కెప్టెన్లుగా పనిచేస్తున్నారు.చదవండి: 21 సార్లు డకౌట్ అయినా సరే.. జట్టులోనే.. అతడికి గంభీర్ చెప్పిందిదే.. -
చెమటలు గక్కిన హార్దిక్.. పడబోయిన రింకూ.. బీసీసీఐ వీడియో వైరల్
టీమిండియా ఆటగాళ్లు ‘బ్రాంకో టెస్టు’ (Bronco Test)లో భాగంగా చెమటలు గక్కారు. భారత జట్టు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ అడ్రియాన్ లీ రౌక్స్ (Adrian Le Roux) ఆధ్వర్యంలో కఠిన శ్రమకోరుస్తూ ప్రాక్టీస్ చేశారు. కాగా ఆటగాళ్ల ఫిట్నెస్ పరీక్ష కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవల బ్రాంకో టెస్టును ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.1200 మీటర్ల పరుగుసాధారణంగా రగ్బీ ఆటగాళ్లు ఏరోబిక్, కార్టియోవాస్క్యులర్ కెపాసిటీని పెంచుకునేందుకు ఈ టెస్టును ఉపయోగిస్తున్నారు. ఇందులో 0 మీటర్ల నుంచి మొదలు పెట్టి 60 మీ... పరిగెత్తి.. ఆ తర్వాత 0- 40 మీ.. 0-20 మీ. పరుగు తీయాలి. మొత్తంగా 240 మీటర్లను ఓ సెట్లో పూర్తి చేయాలి. మొత్తంగా ఐదు సెట్లను అంటే.. 1200 మీటర్లను ఆరు నిమిషాల్లో పూర్తి చేయాలి.చెమటలు గక్కిన హార్దిక్.. పడబోయిన రింకూఇక ఆసియా కప్-2025లో భాగంగా సెప్టెంబరు 14నాటి పాకిస్తాన్తో మ్యాచ్కు టీమిండియా తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో మైదానంలోనే రౌక్స్.. ఆటగాళ్లకు బ్రాంకో టెస్టు నిర్వహించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ విడుదల చేసింది. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా చెమటలు గక్కగా.. రింకూ కిందపడిపోబోయాడు. మిగతా ఆటగాళ్లు సైతం పరుగు పూర్తి చేసేందుకు తీవ్రంగా కష్టపడ్డారు.ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినాఈ విషయం గురించి రౌక్స్ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మేము బ్రాంకో టెస్టు రన్ చేశాము. ఇదేమీ కొత్త రకం పరీక్ష కాదు. వివిధ క్రీడల్లో ఇప్పటికే చాలా ఏళ్లుగా దీనిని వాడుతున్నారు.ఇదొక ఫీల్డ్ టెస్టు. ఎక్కడైనా దీనిని నిర్వహించవచ్చు. ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినా మేము దీనిని ఉపయోగించుకోవచ్చు. ట్రెయినింగ్ పరంగా.. ఆటగాళ్ల శారీరక దృఢత్వాన్ని పరీక్షించేందుకు .. ఇలా రెండు విధాలుగా ఇది ఉపయోగపడుతుంది.శారీరకంగా బలంగా ఉంటేనే..ఆటగాళ్ల ఏరోబిక్ ఫిట్నెస్ పెంచుకోవడానికి సహకరిస్తుంది. క్రికెట్ నైపుణ్యాలతో కూడిన ఆట. అయితే, ఆటగాళ్లు పూర్తి ఫిట్గా ఉన్నపుడే వారి కెరీర్సుదర్ఘీ కాలం కొనసాగుతుంది. శారీరకంగా బలంగా ఉన్నపుడే అన్ని రకాల సవాళ్లకు ఆటగాళ్లు సిద్ధం కాగలుగుతారు. మా ఆటగాళ్లు అద్బుతం. వారి హార్డ్వర్క్తో నన్నెంతగానో ఆకట్టుకుంటున్నారు.నేను గతంలో ఐపీఎల్ జట్లతో పనిచేశాను. ఎంతో మంది ఆటగాళ్లను చూశాను. ఇప్పుడిది నాకు కొత్త జట్టే. అయినా.. గతంలో ఇక్కడ పనిచేసిన అనుభవం నాకు ఉంది. ఇలాంటి పోరాట పటిమ ఉన్న జట్టుతో కలిసి ఉండటం గర్వంగా ఉంది’’ అని జట్టు పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.చదవండి: 21 సార్లు డకౌట్ అయినా సరే.. జట్టులోనే.. అతడికి గంభీర్ చెప్పిందిదే.. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
ఇలాంటివి మనకు అవసరమా సూర్య?.. గట్టిగానే ఇచ్చిపడేశాడు!
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) వ్యవహార శైలిపై భారత మాజీ క్రికెటర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా.. సూర్య తీరు విమర్శలకు దారితీసే విధంగా ఉందన్నాడు. అయితే, మాజీ కెప్టెన్ అజింక్య రహానే మాత్రం సూర్య చేసింది సరైన పనేనంటూ మద్దతు పలికాడు.అసలేం జరిగిందంటే... ఆసియా కప్-2025 (Asia Cup) టీ20 టోర్నమెంట్లో భాగంగా టీమిండియా తమ తొలి మ్యాచ్లో యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో బుధవారం తలపడింది. దుబాయ్లో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.57 పరుగులకే ఆలౌట్ఈ క్రమంలో ఆకాశమే హద్దుగా చెలరేగిన భారత బౌలర్లు యూఏఈని 57 పరుగులకే ఆలౌట్ చేశారు. కుల్దీప్ యాదవ్ నాలుగు, శివం దూబే మూడు వికెట్లు కూల్చగా.. అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. యూఏఈ బ్యాటర్లలో ఓపెనర్ అలీషాన్ షరాఫూ (22) పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.సూర్యకుమార్ యాదవ్ క్రీడాస్ఫూర్తిఇదిలా ఉంటే.. యూఏఈ పదో నంబర్ బ్యాటర్ జునైద్ సిద్దిఖీ విషయంలో సూర్యకుమార్ యాదవ్ క్రీడాస్ఫూర్తి కనబరిచాడు. యూఏఈ ఇన్నింగ్స్లో 13వ ఓవర్ను శివం దూబే వేశాడు. ఒకటో బంతికి ధ్రువ్ పరాశర్ (1)ను దూబే అవుట్ చేయగా జునైద్ క్రీజులోకి వచ్చాడు.ఈ క్రమంలో దూబే షార్ట్ డెలివరీ సంధించగా.. దానిని షాట్ ఆడబోయి జునైద్ విఫలమయ్యాడు. అయితే, దూబే బౌలింగ్ కోసం రన్ మొదలుపెట్టిన సమయంలో అతడి టవల్ జారి పడగా.. జునైద్ అటు వైపు చూసి సైగ చేశాడు. ఇంతలో బంతిని అందుకున్న భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ దానిని వికెట్లకు గిరాటేశాడు.అప్పీలును వెనక్కి తీసుకుని.. అప్పటికి జునైద్ క్రీజు బయట ఉండగా.. అంపైర్ అతడిని అవుట్గా ప్రకటించాడు. అయితే, కెప్టెన్ సూర్య మాత్రం తమ అప్పీలును వెనక్కి తీసుకుని.. జునైద్ను తిరిగి బ్యాటింగ్కు రావాల్సిందిగా ఆహ్వానించాడు. ఇలాంటివి అవసరమా సూర్య?ఈ విషయంపై స్పందించిన ఆకాశ్ చోప్రా.. ‘‘పాకిస్తాన్తో సెప్టెంబరు 14 నాటి మ్యాచ్లో మాత్రం ఇలా అస్సలు జరిగి ఉండేది కాదు. సల్మాన్ ఆఘా.. 14 ఓవర్లో బ్యాటింగ్ చేస్తున్నపుడు మ్యాచ్ రసవత్తరంగా ఉన్న వేళ.. సూర్య అస్సలు ఇలాంటి పని చేసి ఉండేవాడు కాదు. సంజూ అద్భుతంగా స్పందించి వికెట్లను గిరాటేశాడు. అతడు చేసింది సరైన పని.బ్యాటర్ క్రీజు బయట ఉన్నాడు కాబట్టి అది కచ్చితంగా అవుటే అని నా అభిప్రాయం. కానీ సూర్య ఇలా చేయడం వల్ల మున్ముందు పరిస్థితులు ఇబ్బందికరంగా మారతాయి. పాకిస్తాన్తో మ్యాచ్లో ఇలాంటివి జరిగితే అప్పుడు సూర్య అలా చేశాడు.. ఇలా చేశాడు అనే విమర్శలు వస్తాయి’’ అని పేర్కొన్నాడు.ఇచ్చిపడేసిన రహానేఅయితే, అజింక్య రహానే మాత్రం సూర్యను సమర్థించాడు. క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించినందుకు అతడిని ప్రశంసించాలని సూచించాడు. క్రికెట్లో ఇలాంటి ఘటనలు తరచూ జరగవని.. ఏదేమైనా టీమిండియా మంచి పనే చేసిందని కితాబులు ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. యూఏఈ విధించిన స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 4.3 ఓవర్లలో ఛేదించి.. తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది.చదవండి: 21 సార్లు డకౌట్ అయినా సరే.. జట్టులోనే.. అతడికి గంభీర్ చెప్పిందిదే.. -
‘ఇలాంటి జట్లపై ఎవరైనా ఆడతారు.. అతడికి మున్ముందు కఠిన సవాలు’
ఆసియా కప్-2025 (Asia Cup) టీ20 టోర్నమెంట్లో తమ తొలి మ్యాచ్లో టీమిండియా ముగ్గురు స్పెషలిస్టు బౌలర్లతో బరిలోకి దిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో మ్యాచ్లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav), మిస్టరీ స్పిన్ బౌలర్ వరుణ్ చక్రవర్తి, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాలను ఆడించింది.ఇక యూఏఈతో మ్యాచ్లో కేవలం ఏడు పరుగులే ఇచ్చి కుల్దీప్ నాలుగు వికెట్లు కూల్చగా.. బుమ్రా, వరుణ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. అయితే ఆల్రౌండర్ల కోటాలో బరిలోకి దిగిన అక్షర్ పటేల్ ఒక వికెట్ తీయగా.. శివం దూబే (Shivam Dube) అద్భుత గణాంకాలు నమోదు చేశాడు. రెండు ఓవర్ల బౌలింగ్లో కేవలం నాలుగు పరుగులే ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు.ఇలాంటి జట్లపై ఎవరైనా ఆడతారుఈ నేపథ్యంలో శివం దూబే గురించి టీమిండియా మాజీ క్రికెటర్ సదగోపన్ రమేశ్ (Sadagopan Ramesh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీ20లలో హార్దిక్ పాండ్యా భారత మూడో సీమర్గా సేవలు అందించేవాడు. అయితే, ఇప్పుడు శివం దూబే మూడో సీమర్గా ఉన్నాడు.యూఏఈతో మ్యాచ్లో అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయితే, అలాంటి జట్టులపై ఎవరైనా రాణించగలరు. మున్ముందు కాస్త పటిష్ట జట్లను ఎదుర్కొంటున్నపుడు అతడికి కఠిన సవాలు ఎదురవుతుంది.PC: BCCIనమ్మకం నిలబెట్టుకుంటేనే రింకూ సింగ్ను కాదని శివం దూబేను జట్టులోకి తీసుకోవడానికి కారణం.. అతడు మూడో సీమింగ్ ఆప్షన్గా అందుబాటులో ఉంటాడని మాత్రమే కదా!.. ఏదేమైనా శివం దూబేపై మేనేజ్మెంట్ నమ్మకం ఉంచుతున్న విషయం స్పష్టమవుతోంది. అతడు దానిని నిలబెట్టుకుంటేనే పరిస్థితులు మున్ముందు ఎలా ఉంటాయో తెలుస్తుంది’’ అని సదగోపన్ రమేశ్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు.తొలి మ్యాచ్లో ఘన విజయంకాగా యూఏఈ వేదికగా సెప్టెంబరు 9న ఆసియా కప్-2025 టోర్నీ ఆరంభమైంది. ఈ ఖండాంతర ఈవెంట్లో టీమిండియా.. పాకిస్తాన్, ఒమన్, యూఏఈతో కలిసి గ్రూప్-‘ఎ’లో ఉంది. ఈ క్రమంలో తమ తొలి మ్యాచ్లో యూఏఈతో ఆడిన టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచి .. శుభారంభం అందుకుంది.టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న భారత్ యూఏఈని 57 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత కేవలం 4.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. తదుపరి చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో సెప్టెంబరు 14న టీమిండియా తలపడనుంది.చదవండి: ఆకాశమే హద్దుగా చెలరేగిన అర్జున్ టెండుల్కర్.. సానియా చందోక్ రాకతో.. -
నువ్వు 21 సార్లు డకౌట్ అయినా సరే.. జట్టులో ఉంటావు: గంభీర్
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ను టీమిండియా అద్భుత విజయంతో ఆరంభించింది. గ్రూప్-‘ఎ’లో భాగమైన యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో తమ తొలి మ్యాచ్ ఆడిన భారత్.. పసికూనను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో రాణించి మరోసారి సత్తా చాటింది.టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. యూఏఈ జట్టును 57 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత స్వల్ప లక్ష్య ఛేదనను.. కేవలం 4.3 ఓవర్లలోనే పూర్తి చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (16 బంతుల్లో 30), శుబ్మన్ గిల్ (9 బంతుల్లో 20 నాటౌట్), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (2 బంతుల్లో 7 నాటౌట్) వేగంగా ఆడటంతో ఈ రికార్డు విజయం సాధ్యమైంది.వికెట్ కీపర్గా సేవలుఇదిలా ఉంటే.. యూఏఈతో ఆడిన భారత తుదిజట్టులో సంజూ శాంసన్కు చోటు దక్కింది. అయితే, గిల్ (Shubman Gill) గైర్హాజరీలో అంతర్జాతీయ టీ20లలో ఓపెనర్గా వచ్చిన సంజూ.. ఇప్పుడు మిడిలార్డర్లో ఆడనున్నాడు. యూఏఈతో బుధవారం నాటి మ్యాచ్లో అతడు వికెట్ కీపర్గా సేవలు అందించగా.. బ్యాటింగ్ చేసే అవకాశం మాత్రం రాలేదు.ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ సంజూ పట్ల టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్కోచ్ గౌతం గంభీర్ల వైఖరిపై స్పందించాడు. ‘‘నిజంగా నాకైతే ఆశ్చర్యంగా అనిపించింది. అయితే, సంజూకు కెప్టెన్, కోచ్ ఇంతలా మద్దతునివ్వడం సంతోషంగా ఉంది.నువ్వు 21 సార్లు డకౌట్ అయినా సరేసంజూ పట్ల వారు వ్యవహరిస్తున్న తీరు అద్భుతం. మీడియా సమావేశంలో తాము సంజూ గురించి శ్రద్ధ తీసుకుంటున్నామని సూర్య చెప్పడం ఆనందదాయకం. ఇక సంజూకు బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే అతడు మిడిలార్డర్లో వస్తాడు.పవర్ ప్లేలో త్వరగా వికెట్ కోల్పోతే సంజూ అప్పుడు బరిలోకి దిగుతాడు. అతడికి మంచి ప్రాధాన్యమే దక్కింది. ఏదేమైనా ఇది ప్రాజెక్ట్ సంజూ శాంసన్ అని చెప్పవచ్చు. నేను సంజూను ఇంటర్వ్యూ చేసినపుడు గంభీర్ తనతో ఏం చెప్పాడో సంజూ వివరించాడు.‘నువ్వు 21 సార్లు డకౌట్ అయినా సరే.. 22వ మ్యాచ్లో నీకు ఛాన్స్ ఉంటుంది’ అని గంభీర్ తనకు మద్దతుగా నిలిచాడని సంజూ చెప్పాడు. కోచ్, కెప్టెన్ ఓ ఆటగాడికి ఇలా అండగా నిలిస్తే అతడి ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది.నిజంగా అద్భుతంసంజూ నైపుణ్యాల పట్ల మేనేజ్మెంట్కు ఉన్న అవగాహన, నమ్మకం గురించి నాకు అప్పుడే అర్థమైంది. అతడి గురించి వారు ఆలోచించడం నిజంగా అద్భుతం’’ అని అశ్విన్.. సూర్య, గంభీర్లపై ప్రశంసలు కురిపించాడు. కాగా సంజూ శాంసన్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు 43 టీ20 మ్యాచ్లు ఆడి 861 పరుగులు చేశాడు.ఇందులో మూడు శతకాలు ఉన్నాయి ఇక ఆసియా టీ20 కప్-2025 కంటే ముందు స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో మాత్రం సంజూ తేలిపోయాడు. ఐదు మ్యాచ్లలో నాలుగింటిలో కేవలం సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు. అయితే, ఇటీవల జరిగిన కేరళ క్రికెట్ లీగ్లో భాగంగా సంజూ మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. చదవండి: IND vs WI: వాషింగ్టన్ సుందర్ కీలక నిర్ణయం -
ఆకాశమే హద్దుగా చెలరేగిన అర్జున్ టెండుల్కర్.. సానియా రాకతో..!
భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) కుమారుడు అర్జున్ టెండుల్కర్ (Arjun Tendulkar) గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవలే అతడి వివాహ నిశ్చితార్థం జరిగింది. ముంబైలోని ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనుమరాలు సానియా చందోక్ (Saaniya Chandok)తో అర్జున్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం.తొలి బంతికే వికెట్అయితే, తాజాగా మరోసారి అర్జున్ టెండుల్కర్ పేరు వైరల్ అవుతోంది. అయితే, ఈసారి వ్యక్తిగత విషయాలతో కాకుండా.. ఆటతో ఈ ఆల్రౌండర్ వార్తల్లోకి వచ్చాడు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) నిర్వహిస్తున్న డాక్టర్ కె. తిమ్మప్పయ్య మెమొరియల్ టోర్నమెంట్లో అర్జున్ టెండుల్కర్ తన దేశీ జట్టు గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ఈ రెడ్బాల్ ఇన్విటేషనల్ టోర్నీలో భాగంగా గోవా తొలుత మహారాష్ట్రను ఎదుర్కొంది. ఈ క్రమంలో టాస్ ఓడి బౌలింగ్కు దిగిన గోవాకు అర్జున్ అదిరిపోయే ఆరంభం అందించాడు. మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో తొలి బంతికే ఓపెనర్ అనిరుద్ సబాలేను అర్జున్ పెవిలియన్కు పంపాడు.ఆ తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ మహేశ్ మాస్కే (1)ను కూడా అర్జున్ అవుట్ చేశాడు. ఇంతలో గోవాకు చెందిన మరో బౌలర్ లక్ష్మేశ్ పవానే యశ్ క్షీర్సాగర్ వికెట్ పడగొట్టగా..అర్జున్ మరోసారి స్ట్రైక్ అయ్యాడు. దిగ్విజయ్ పాటిల్ను డకౌట్గా వెనక్కి పంపాడు. మరోవైపు.. పవానే మహారాష్ట్ర కెప్టెన్ మందార్ భండారీని పెవిలియన్కు పంపగా.. మిజాన్ సయ్యద్ వికెట్ను మోహిత్ రేడ్కర్, షంసుజానా కాశీ వికెట్ను దర్శన్ మిశాల్ దక్కించుకున్నారు.మొత్తంగా ఐదు వికెట్లు కూల్చిన అర్జున్ఈ క్రమలో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన మహారాష్ట్ర కోలుకోలేకపోయింది. ఎనిమిదో వికెట్కు 39 పరుగులు జోడించిన మెహుల్ పటేల్ (54)ను అర్జున్ టెండుల్కర్ అవుట్ చేయగా.. అక్షయ్ వైకార్ను వికాస్ సింగ్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత నదీమ్ షేక్ వికెట్ను కూడా అర్జున్ తన ఖాతాలో వేసుకున్నాడు.మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో అర్జున్ 14-4-36-5 గణాంకాలు నమోదు చేశాడు. గోవా బౌలర్ల విజృంభణతో మహారాష్ట్ర 136 పరుగులకే కుప్పకూలగా.. గోవా తొలి ఇన్నింగ్స్లో 333 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. అభినవ్ తేజ్రాణా, కెప్టెన్ మిశాల్, రేడ్కార్ అర్ధ శతకాల కారణంగా గోవాకు ఈ స్కోరు సాధ్యమైంది.అర్జున్ లేడీ లక్ సానియా అంటూ..మరోవైపు బ్యాట్తోనూ రాణించిన పేస్ ఆల్రౌండర్ అర్జున్ టెండుల్కర్ 36 పరుగులతో అజేయంగా నిలవడం విశేషం. ఇదిలా ఉంటే.. సానియాతో ఎంగేజ్మెంట్ తర్వాత అర్జున్ ఇలా అద్భుత రీతిలో రాణించడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘కాబోయే భార్య.. అర్జున్ లేడీ లక్’ అంటూ సానియాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అర్జున్ ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత క్రికెట్లో పునరాగమనం చేశాడు.చదవండి: జీవనాధారం కోసం ఉద్యోగానికి ‘జై’... క్రికెట్కూ ‘సై’Arjun Tendulkar Took Five Wicket in a Local Tournament after returning To The Cricket after 7 Month. pic.twitter.com/G7RWzxaGhI— яιşнí. (@BellaDon_3z) September 10, 2025 -
సారాంశ్కు ఐదు.. కార్తికేయకు నాలుగు.. చహర్ విఫలమైనా..
బెంగళూరు: దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ జట్టు తడబడింది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ మైదానంలో గురువారం ప్రారంభమైన తుదిపోరులో సెంట్రల్జోన్ బౌలర్లు విజృంభించారు. ఫలితంగా మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 63 ఓవర్లలో 149 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ రంజీ ప్లేయర్ తన్మయ్ అగర్వాల్ (76 బంతుల్లో 31; 3 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... సల్మాన్ నిజార్ (52 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్), అంకిత్ శర్మ (64 బంతుల్లో 20; 2 ఫోర్లు) క్రీజులో నిలదొక్కుకుంటున్న దశలో అవుటయ్యారు. వికెట్ నష్టపోకుండా 50 పరుగులుసెంట్రల్ జోన్ ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్ 24 ఓవర్లలో 49 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా... ఎడంచేతి వాటం స్పిన్నర్ కుమార్ కార్తికేయ సింగ్ 53 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన సెంట్రల్ జోన్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. ఈ సీజన్లో ఫుల్ ఫామ్లో ఉన్న దానిశ్ మాలేవర్ (64 బంతుల్లో 28 బ్యాటింగ్; 3 ఫోర్లు), అక్షయ్ వాడ్కర్ (52 బంతుల్లో 20 బ్యాటింగ్; 3 ఫోర్లు) ఆకట్టుకున్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న సెంట్రల్ జోన్... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 99 పరుగులు వెనుకబడి ఉంది. స్పిన్కు విలవిల... టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన సౌత్ జోన్ జట్టుకు ఏదీ కలిసిరాలేదు. సెంట్రల్ జోన్ స్పిన్ను తట్టుకోలేక సౌత్జోన్ ప్లేయర్లు విలవిలలాడారు. హైదరాబాదీ తన్మయ్ అగర్వాల్ ఒక్కడే కాస్త పోరాడగా... మరో ఓపెనర్ మోహిత్ కాలే (50 బంతుల్లో 9), రవిచంద్రన్ స్మరణ్ (19 బంతుల్లో 1) క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించినా పరుగులు సాధించలేకపోయారు. ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్ (53 బంతుల్లో 15; 2 ఫోర్లు) గంటకు పైగా క్రీజులో ఉన్నా పరుగులు చేసేందుకు ఇబ్బందిపడ్డాడు. కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ (4) విఫలం కాగా... అండ్రె సిద్ధార్థ్ (12) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. సల్మాన్, అంకిత్ తలా కొన్ని పరుగులు చేయడంతో సౌత్ జోన్ జట్టు ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. దీపక్ చహర్ విఫలంసెంట్రల్ జోన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న టీమిండియా బౌలర్ దీపక్ చహర్ ఆరు ఓవర్లకే పరిమితం కాగా... స్పిన్నర్లు చెలరేగిపోయారు. సారాంశ్ జైన్, కుమార్ కార్తికేయ కలిసి 45 ఓవర్లు వేసి 9 వికెట్లు పంచుకున్నారు. మిగిలిన ఒక్క వికెట్ రనౌట్ రూపంలో వచ్చింది. కార్తికేయ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో నిర్లక్ష్యంగా స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన మోహిత్ క్లీన్ బౌల్డ్ కాగా... ఇక అక్కడి నుంచి ప్రారంభమైన వికెట్ల పతనం ఏ దశలోనూ ఆగలేదు. లంచ్ సమయానికే సౌత్ జోన్ 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా ఏమాత్రం ఆటతీరు మార్చుకోలేకపోయింది. దీనికి తోడు పరుగు తీసే క్రమంలో రికీ భుయ్తో సమన్వయలోపం కారణంగా తన్మయ్ అగర్వాల్ రనౌట్ కావడం జట్టును మరింత దెబ్బతీసింది. స్కోరు వివరాలు సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (రనౌట్) 31; మోహిత్ కాలే (బి) కార్తికేయ 9; స్మరణ్ (సి) సారాంశ్ జైన్ (బి) కార్తికేయ 1; రికీ భుయ్ (ఎల్బీ) (బి) సారాంశ్ జైన్15; అజహరుద్దీన్ (బి) కార్తీకేయ 4; సల్మాన్ నిజార్ (సి) పాటీదార్ (బి) సారాంశ్ జైన్ 24; సిద్ధార్థ్ (స్టంప్డ్) ఉపేంద్ర యాదవ్ (బి) సారాంశ్ 12; అంకిత్ శర్మ (ఎల్బీ) సారాంశ్ జైన్ 20; గురజపనీత్ సింగ్ (ఎల్బీ) కార్తికేయ 2; నిదీశ్ (సి అండ్ బి) సారాంశ్ జైన్ 12; వాసుకి కౌశిక్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 17; మొత్తం (63 ఓవర్లలో ఆలౌట్) 149. వికెట్ల పతనం: 1–27, 2–35, 3–47, 4–57, 5–65, 6–97, 7–116, 8–129, 9–142, 10–149. బౌలింగ్: దీపక్ చహర్ 6–1–11–0; ఆదిత్య ఠాకరే 4–2–7–0; కుల్దీప్ సేన్ 8–3–15–0; కుమార్ కార్తికేయ 21–1–53–4; సారాంశ్ జైన్ 24–2–49–5. సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్: దానిశ్ మాలేవర్ (బ్యాటింగ్) 28; అక్షయ్ వాడ్కర్ (బ్యాటింగ్) 20; ఎక్స్ట్రాలు 2; మొత్తం (19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 50. బౌలింగ్: గుర్జపనీత్ సింగ్ 4–1–21–0; అంకిత్ శర్మ 8–1–22–0; నిధీశ్ 3–1–6–0; వాసుకి కౌశిక్ 4–3–1–0. -
జీవనాధారం కోసం ఉద్యోగానికి ‘జై’... క్రికెట్కూ ‘సై’
సాక్షి క్రీడా విభాగం : మన దేశంలో క్రికెట్ ఓ మతమైంది. కోట్ల మంది జీవితాల్లో భాగమైంది. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిల అంత స్థాయికి ఎదగలేకపోయినా సరే ఒక్కసారి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెంట్రల్ కాంట్రాక్టు దక్కితే చాలు... ‘గ్రేడ్’తో పని లేకుండా కోట్ల రూపాయల్లో వార్షిక పారితోషికం... పోటీలకు ఇంతని లక్షల్లో మ్యాచ్ ఫీజలు లభిస్తాయి. కాబట్టి ఆటగాడైతే చాలు... దేశవాళీ క్రికెట్తోనూ ఆటతోనే విలాసవంతంగా బ్రతికేస్తాడు. అంతెందుకు ఒక్క ఐపీఎల్ సీజన్లో జూనియర్ స్థాయి ఆటగాడైన సరే అదృష్టం తలుపుతట్టి వేలంలో ఆయా జట్లకు ఎంపికైనా చాలు మిగతా జీవితమంతా సుఖమయం అవుతుంది. అయితే ఇదంతా భారత్లోనే చెల్లుతుంది. కానీ ఇతర దేశాల్లోని క్రికెటర్లు మైదానంలో చెమటోడ్చాలి. ఆఫీస్లో ఉద్యోగం చేయాలి. చాలా దేశాల్లో ఇలానే... క్రికెట్ ఆడే ఎన్నో దేశాల్లో ఇలాగే ఉంటుంది. కేవలం బ్యాట్ పట్టి నెట్స్లో ప్రాక్టీస్ చేసి, మ్యాచ్లపుడు మైదానంలో దిగితే సరిపోదు. జీవనాధారం కోసం ఉద్యోగం లేదంటే వ్యాపారం ఏదో ఒకటి తప్పనిసరిగా చేయాల్సిందే! తాజా ఆసియా కప్ టి20 టోర్నీలో బరిలో ఉన్న ఒమన్ క్రికెటర్లు కూడా ఇదే చేస్తారు. రూపాయి మారకం విలువ పరంగా ఒమని రియాల్ (ఒమన్ కరెన్సీ) మనకంటే చాలా విలువైందే అయినా... క్రికెట్లో మాత్రం బలహీనమైంది. అక్కడి ప్రొఫెషనల్ క్రికెటర్లు సైతం తెల్లారితే లంచ్ బాక్స్లు కట్టుకొని ఆఫీస్కు వెళ్తారు. సాయంత్రమైతేనే ఆటకు సిద్ధమవుతారు. మ్యాచ్లు, పెద్ద పెద్ద సిరీస్లు ఉంటేనే పక్షం లేదంటే నెలకు మించి సెలవులు పెట్టి మెగా ఈవెంట్లు ఆడతారు. ఇది ముగియగానే ఒమన్ ఆటగాళ్లు మళ్లీ ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటారు. ఇవి ఎవరో ‘నెట్టింట’ పెట్టిన విషయాలో, ‘షార్ట్స్’, ‘రీల్స్’లో చెప్పిన కబుర్లో కాదు... స్వయంగా ఒమన్ కెప్టెన్ జతిందర్ సింగ్, ఆల్రౌండర్ సుఫియాన్ మెహమూద్ వెల్లడించిన వాస్తవాలు. ఉద్యోగానికే తొలి ప్రాధాన్యం క్రికెటే తమ కెరీర్ కానేకాదని జతిందర్ స్పష్టం చేశాడు. తమ తొలి ప్రాధాన్యం ఉద్యోగమేనన్నాడు. ఆటను మొదలు పెట్టిన తొలినాళ్లలో మా ప్రాధాన్యమంతా ఉద్యోగానికే ఉండేదని, క్రికెట్ ఆట తమకు రెండో ప్రాధాన్యమని ఒమన్ కెప్టెన్ చెప్పాడు. ‘నేనే కాదు చాలామంది ఇదే చేస్తారు. ఠంచనుగా ఉద్యోగం చేసేందుకు బయల్దేరతారు. క్రికెట్ను ఓ ప్రత్యామ్నాయంగానే చూస్తారు. అయితే ఇప్పుడు ఆసియా కప్ లాంటి పేరొందిన సిరీస్ ఆడటం ద్వారా క్రికెట్ కల పెద్దగా అనిపిస్తుంది. తొలిసారి ఈ టోర్నీ ఆడేందుకు ఆటగాళ్లంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు’ అని జతిందర్ అన్నాడు. కాంక్రిట్పై కష్టాలెన్నో... ఒమన్లో క్రికెట్కు ప్రత్యేకించి టర్ఫ్ గ్రౌండ్లు అంటూ లేని రోజుల్లో తాము సిమెంట్ వికెట్లపైనే ఆడాల్సి వచ్చిందని, 2008లో ఆస్ట్రోటర్ఫ్ వినియోగంలోకి వచ్చినా... మూడేళ్ల తర్వాతే 2011 నుంచి పూర్తిస్థాయి టర్ఫ్ గ్రౌండ్పై క్రమం తప్పకుండా ఆడుతున్నామని జతిందర్ ఒమన్ క్రికెట్ కష్టాలను చెప్పుకొచ్చాడు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ఫలితం (ప్రాభవం లేని క్రికెట్)లేని ఆట కోసం ఎందుకు కష్టపడాలని ఎన్నోసార్లు అనిపించినా... ఏదో క్రికెట్పై ఉన్న కాస్త మక్కువే ఇక్కడిదాకా తీసుకొచ్చిందని వివరించాడు. 36 ఏళ్ల జతిందర్ ఇప్పటి వరకు 36 వన్డేలాడి 1704 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలున్నాయి. అంతర్జాతీయ టి20ల్లో 115 స్ట్రయిక్రేట్తో 1120 పరుగులు సాధించాడు. మరోవైపు 34 ఏళ్ల ఆల్రౌండర్ సుఫియాన్ 8 వన్డేలాడి 107 పరుగులు చేయడంతో పాటు 24.50 సగటుతో 6 వికెట్లు కూడా తీశాడు. తనకు టీమిండియాలో గిల్, సూర్యకుమార్, అభిషేక్ శర్మ, అర్ష్ దీప్, తిలక్ వర్మ అంటే ఇష్టమని చెప్పాడు. క్రికెటెందుకు... చదువుకో ముందు! సుఫియాన్ ఒమన్ క్రికెట్ జట్టుకు ఎంపికవగానే అతని తల్లిదండ్రులు ససేమిరా అన్నారట! ఒమన్లో క్రికెట్కు భవిష్యత్తే లేదని, ఉన్నత చదువులు చదివి ఉన్నతోద్యోగంపైనే దృష్టి సారించాలని తన తల్లిదండ్రులు గట్టిగా చెప్పారని పేర్కొన్నాడు. ‘కానీ క్రికెట్ అంటే పిచ్చి. నాపై ఉన్న నమ్మకమే ఆటవైపు నడిపించింది. 2016 టి20 ప్రపంచకప్ అర్హత సాధించగానే మేం పడిన కష్టాలకు సాంత్వన చేకూరింది’ అని సుఫియాన్ తెలిపాడు. ఒమన్ క్రికెట్ నిలబడటానికి ఆ మెగా ఈవెంట్ ఎంతగానో దోహదం చేసిందన్నాడు. భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన అభిమాన క్రికెటర్ అని చెప్పుకొచ్చాడు. -
Asia Cup 2025: బంగ్లాదేశ్ శుభారంభం
అబుదాబి: ఆసియా కప్ టి20 టోర్నీని బంగ్లాదేశ్ సునాయాస విజయంతో మొదలుపెట్టింది. గ్రూప్ ‘బి’లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన బంగ్లా 7 వికెట్ల తేడాతో హాంకాంగ్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన హాంకాంగ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్ 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 144 పరుగులు సాధించి గెలిచింది. తమ తొలి పోరులో అఫ్గానిస్తాన్ చేతిలో ఓడిన హాంకాంగ్కు ఇది వరుసగా రెండో పరాజయం. ఓపెనర్ అన్షుమన్ రథ్ (4) తొందరగానే వెనుదిరిగినా... మరో ఓపెనర్ జీషాన్ అలీ (34 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి షాట్లతో హాంకాంగ్కు తగిన ఆరంభాన్ని అందించాడు. సీనియర్ బ్యాటర్ బాబర్ హయత్ (14) విఫలం కాగా, నిజాకత్ ఖాన్ (40 బంతుల్లో 42; 2 ఫోర్లు, 1 సిక్స్) పట్టుదలగా క్రీజ్లో నిలిచి పరుగులు సాధించాడు. ఈ క్రమంలో తాను ఆడిన 32వ బంతికి గానీ అతను తన తొలి బౌండరీ కొట్టలేకపోయాడు! చివర్లో కెప్టెన్ యాసిమ్ ముర్తజా (19 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడు హాంకాంగ్కు చెప్పుకోదగ్గ స్కోరును అందించింది. బంగ్లా బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేయడంలో సఫలమయ్యారు. ముఖ్యంగా 3–13 మధ్య ఆడిన 11 ఓవర్లలో ఒక్క ఓవర్లో మాత్రమే హాంకాంగ్ రెండంకెల స్కోరు చేయగలిగింది. అయితే ఆఖరి 6 ఓవర్లలో 54 పరుగులు రాబట్టడంతో హాంకాంగ్ గౌరవప్రదంగా ముగించగలిగింది. తన్జీమ్, తస్కీన్, రిషాద్ తలా 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో ఓపెనర్లు పర్వేజ్ (19), తన్జీద్ (14) ఎక్కువ సేపు నిలబడకపోయినా... కెపె్టన్ లిటన్ దాస్ (39 బంతుల్లో 59; 6 ఫోర్లు, 1 సిక్స్), తౌహీద్ (36 బంతుల్లో 35 నాటౌట్; 1 ఫోర్) భాగస్వామ్యంతో బంగ్లా సునాయాస విజయాన్ని అందుకుంది. వీరిద్దరు మూడో వికెట్కు 70 బంతుల్లో 95 పరుగులు జోడించారు. నేడు దుబాయ్లో జరిగే మ్యాచ్లో ఒమన్ జట్టుతో పాకిస్తాన్ ఆడుతుంది. -
రాణించిన హాంకాంగ్ బ్యాటర్లు.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే?
ఆసియాకప్-2025లో భాగంగా అబుదాబి వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో హాంకాంగ్ బ్యాటర్లు పర్వాలేదన్పించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 143 పరుగులు సాధించింది. హాంకాంగ్ బ్యాటర్లలో నిజాకత్ ఖాన్(42) టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ యాసిమ్ ముర్తజా(28), జీషన్ అలీ(30) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హుస్సేన్, తంజిమ్ హసన్ సాకిబ్, టాస్కిన్ ఆహ్మద్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ముస్తఫిజుర్ రెహ్మన్ ఓ వికెట్ సాధించాడు. కాగా ఈ మ్యాచ్ హాంకాంగ్కు చాలా కీలకం. ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడిపోతే హాంకాంగ్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. -
వాషింగ్టన్ సుందర్ కీలక నిర్ణయం.. మళ్లీ ఇంగ్లండ్కు
వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు ముందు టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ తమిళనాడు స్టార్ క్రికెటర్ ఇంగ్లండ్ కౌంటీల్లో మరోసారి ఆడనున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ వన్లో హాంప్షైర్కు ప్రాతినిథ్యం వహించనున్నాడు.ఈ టోర్నీలో భాగంగా సోమర్సెట్, సర్రేతో జరిగే చివరి రెండు హాంప్షైర్ మ్యాచ్ల్లో సుందర్ భాగం కానున్నాడు. ఈ విషయాన్ని హాంప్షైర్ క్రికెట్ క్లబ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. "భారత ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ మా చివరి రెండు మ్యాచ్ల్లో ఆడేందుకు మాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వెలకమ్ వాషీ" అంటూ హాంప్షైర్ ఓ పోస్ట్ చేసింది. సుందర్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడడం ఇది రెండో సారి. ఇంతకుముందు లంకాషైర్ క్రికెట్ క్లబ్ తరపున సుందర్ ఆడాడు. ఈ రెండు కౌంటీ మ్యాచ్లు (15 సెప్టెంబర్ వర్సెస్ సొమర్సెట్, 24 సెప్టెంబర్ వర్సెస్ సర్రే) వెస్టిండీస్ సిరీస్కు ముందు సన్నాహకంగా ఉపయోగపడనుంది.వాస్తవానికి స్వదేశంలో ఆసీస్-ఎతో జరిగే అనాధికారిక టెస్టు సిరీస్లో భారత్-ఎ తరపున వాషీ ఆడుతాడని అంతా భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం సుందర్కు ఛాన్స్ ఇవ్వలేదు. మానవ్ సుతార్, తనుష్ కోటియన్, హర్ష్ దుబే వంటి యువ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లకు అవకాశమిచ్చారు.కాగా ఇటీవల ముగిసిన ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టూర్లో సుందర్ ఏడు వికెట్లు, 284 పరుగులతో సత్తాచాటాడు. అంతకుముందు న్యూజిలాండ్ సిరీస్లో కూడా మొత్తంగా 16 వికెట్లు సాధించాడు. ఇప్పుడు సుందర్ తిరిగి విండీస్తో సిరీస్లో ఆడనున్నాడు. భారత్-విండీస్ మధ్య రెండు మ్యాచ్ల సిరీస్ ఆక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. -
టీమిండియా కెప్టెన్గా కేఎల్ రాహుల్.. శ్రేయస్ రీ ఎంట్రీ?
ఆసియాకప్-2025 తర్వాత టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడనుంది. ఈ రెడ్ బాల్ క్రికెట్ సిరీస్ ఆక్టోబర్ 2 నుంచి 16 వరకు జరగనుంది. వెంటనే ఆక్టోబర్ 19 భారత్-ఇండియా వైట్ బాల్ సిరీస్ ప్రారంభం కానుంది. దీంతో రాబోయో రెండు నెలల పాటు భారత జట్టు వరుస సిరీస్లతో బీజీబీజీగా గడపనుంది.కెప్టెన్గా రాహుల్..?వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు మరో పది రోజుల్లో ప్రకటించే అవకాశముంది. అయితే ఈ సిరీస్లోని తొలి టెస్టుకు టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ శుబ్మన్ గిల్కు దూరమయ్యే అవకాశముంది. గిల్ ప్రస్తుతం ఆసియా కప్ టోర్నీలో బిజీగా ఉన్నాడు. గ్రూపు-ఎలో ఉన్న భారత్ ఫైనల్కు చేరడం దాదాపు ఖాయమనే చెప్పుకోవాలి. ఈ ఖండాంతర టోర్నీ ఫైనల్ సెప్టెంబర్ 28న జరగనుంది. అక్కడికి మూడు రోజుల్లో అంటే అక్టోబర్ 2 నుంచి వెస్టిండీస్తో తొలి టెస్టు మొదలు కానుంది. దీంతో మొదటి టెస్టుకు సెలక్టర్లు గిల్కు విశ్రాంతి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇదే జరిగితే తొలి టెస్టులో భారత కెప్టెన్గా కేఎల్ రాహుల్ వ్యవహరించవచ్చు. రాహుల్ ఆసియాకప్ జట్టులో సభ్యునిగా లేని సంగతి తెలిసిందే.ఓపెనర్లగా రాహుల్, జైశ్వాల్..ఇక ఇంగ్లండ్ టూర్లో అద్బుతంగా రాణించిన యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనర్లగా కొనసాగనున్నారు. అదేవిధంగా అభిమన్యు ఈశ్వరన్ మరోసారి రిజర్వ్ ఓపెనర్గా ఉంటాడు. సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లగా ఎంపిక కానున్నారు. అయితే వీరిద్దరిలో ఒకరికే తుది జట్టులో చోటు దక్కే అవకాశముంది.పంత్కు గాయం, జగదీశన్కు చోటు..ఇక ఇంగ్లండ్ టూర్లో గాయపడ్డ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్.. విండీస్ సిరీస్కు దూరమయ్యే సూచనలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. అతడి స్ధానంలో ధ్రువ్ జురెల్ మరోసారి వికెట్ల వెనక బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అయితే తమిళనాడుకు చెందిన నారయణ్ జగదీశన్ సెకెండ్ వికెట్ కీపర్గా ఉండనున్నాడు.అయ్యర్ ఎంట్రీ?ఇక మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి భారత టెస్టు జట్టులోకి రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ కారణంతోనే అతడిని ఆసీస్-ఎతో సిరీస్కు భారత-ఎ జట్టు కెప్టెన్గా అయ్యర్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. శ్రేయస్కు భారత టెస్టు జట్టులో చోటు దక్కితే మరోసారి సర్ఫరాజ్ ఖాన్పై వేటు పడే అవకాశముంది.ఇక ఆల్రౌండర్లగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్,నితీష్ కుమార్ రెడ్డి తమ స్దానాలను పదిలం చేసుకున్నారు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చోటు దక్కించుకోనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ కొనసాగనున్నాడు. అయితే ఆసియాకప్లో కెప్టెన్ గిల్తో భాగమైన బుమ్రా, కుల్దీప్ యాదవ్లు తొలి టెస్టుకు అందుబాటులో ఉంటారో లేదో వేచి చూడాలి.వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు భారత జట్టు (అంచనా)యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్ జగదీశన్.చదవండి: #Babar Azam: 6 లగ్జరీ కార్లు.. పాక్ రిచెస్ట్ క్రికెటర్గా! బాబర్ ఆజం నెట్ వర్త్ ఎంతంటే? -
వన్డే ప్రపంచకప్కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన..
మహిళల వన్డే ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు బలమైన జట్టును ప్రకటించింది. వెటరన్ ఆల్రౌండర్ సోఫీ డివైన్ కివీస్ జట్టుకు సారథ్యం వహించనుండగా... నలుగురు కొత్త ప్లేయర్లకు వరల్డ్కప్ జట్టులో చోటు దక్కింది. ఈ నెల 30 నుంచి భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో ప్రారంభం కానున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్ బోర్డు 15 మందితో కూడిన జట్టును తాజాగా ప్రకటించింది.సుజీ బేట్స్, లీ తహుహు, సోఫీ డివైన్ ఐదోసారి ప్రపంచకప్ బరిలోకి దిగనుండగా... మ్యాడీ గ్రీన్, మెలియా కెర్కు ఇది మూడోది. 8 జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీ కోసం ప్రకటించిన కివీస్ జట్టు అటు అనుభవజ్ఞులు, ఇటు యువ ప్లేయర్లతో సమతూకంగా ఉందని న్యూజిలాండ్ కోచ్ బెన్ సాయర్ అన్నాడు. వరల్డ్కప్లో భాగంగా వచ్చే నెల 1న డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాతో న్యూజిలాండ్ తొలి మ్యాచ్ ఆడనుంది. న్యూజిలాండ్ జట్టు: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, ఈడెన్ కార్సన్, ఫ్లోరా డెవాన్షైర్, ఇజీ గేజ్, మ్యాడీ గ్రీన్, బ్రూకీ హాలిడే, బ్రీ ఇలింగ్, పాలీ ఇన్గ్లిస్, బెల్లా జేమ్స్, మెలీ కెర్, జెస్ కెర్, రోజ్మేరీ మైర్, జార్జియా ప్లిమర్, లీ తహుహు. -
6 లగ్జరీ కార్లు.. పాక్ రిచెస్ట్ క్రికెటర్గా! బాబర్ ఆజం నెట్ వర్త్ ఎంతంటే?
బాబర్ ఆజం.. పాకిస్తాన్కే కాకుండా ప్రపంచంలోనే అత్యత్తుమ బ్యాటర్లలో ఒకడిగా పేరుగాంచాడు. అరంగేట్రం చేసిన కొన్నాళ్లకే మూడు ఫార్మాట్లలోనూ పాక్ క్రికెట్ ముఖ చిత్రంగా మారాడు. తన కెప్టెన్సీతో పాటు అద్బుత బ్యాటింగ్తో పాటు జట్టును విజయ పథంలో నడిపించిన ఘనత అతడిది. క్లాసిక్ కవర్ డ్రైవ్ షాట్లకు పెట్టింది పేరు. అతడి క్రీజులో ఉంటే ప్రత్యర్ధి బౌలర్లకు గుండెల్లో రైళ్లు పరిగేత్తేవి. అయితే ఇదంతా ఒకప్పుడు. గత కొన్నేళ్లగా అతడు బ్యాట్ ముగబోయింది. అంతర్జాతీయ క్రికెట్లో బాబర్ సెంచరీ చేసి రెండేళ్లపైనే అయిపోయింది.ఒకనొక దశలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లితో పోటిపోడిన బాబర్ ఆజం.. ఇప్పుడు ఏకంగా జట్టులోనే చోటు కోల్పోయాడు. ఆసియాకప్-2025కు ఎంపిక చేసిన పాక్ జట్టులో బాబర్కు చోటు దక్కలేదు. అతడి పేలవ ఫామ్ కారణంగా సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.అయితే బాబర్ను జట్టు నుంచి తప్పించినప్పటికి అతడి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు. ఆజం తిరిగి సౌతాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్లో ఆడే అవకాశముంది. ఇక ఇది ఇలా ఉండగా.. అభిమానులు బాబర్ ఆజం నెట్వర్త్ ఎంతో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. బాబర్కు ఏడాదికి ఎంతో సంపాదిస్తున్నాడో ఓ లుక్కేద్దాం.బాబర్ ఆజం నెట్ వర్త్ ఎంతంటే?పాకిస్తాన్లో అత్యంత రిచెస్ట్ క్రికెటర్గా బాబర్ ఆజం కొనసాగుతున్నాడు. పలు రిపోర్ట్లు ప్రకారం.. 2024-25కు గానూ బాబర్ ఆజం నెట్ వర్త్ రూ. 41 కోట్లగా ఉన్నట్లు తెలుస్తోంది. బాబర్ మొన్నటివరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(PCB) ఏ గ్రేడ్ కాంట్రాక్ట్లో ఉన్నాడు. దీంతో అతడికి పీసీబీ నుంచి నెలకు పీకేఆర్ 4.5 మిలియన్లు(భారత కరెన్సీలో దాదాపు 13.95 లక్షలు) లభించేవి. అదేవిధంగా ఐసీసీ వాటా నుంచి పీకేర్ 2.07 మిలియన్లు బోనస్ రూపంలో బాబర్కు వచ్చేవి. అంటే మొత్తంగా ఏడాదికి జీతం రూపంలో ఆజంకు భారత కరెన్సీ ప్రకారం రూ.2 కోట్ల పైగా అందేది. అదే విధంగా అతడి మ్యాచ్ ఫీజుల విషయానికి వస్తే.. ప్రతీ టెస్టు మ్యాచ్కు రూ. సుమారు 4 లక్షలు, వన్డేకు రూ. 2 లక్షలు, టీ20 మ్యాచ్కు రూ.1.5 లక్షలు తీసుకుంటాడు.పీఎస్ఎల్ శాలరీ ఎంతంటే?పాకిస్తాన్ సూపర్ లీగ్లో పెషావర్ జల్మీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతడు పెషావర్ నుంచి కాంట్రాక్ట్ రూపంలో ఏడాదికి రూ. 1.88 కోట్లు అందుకుంటాడు.ఒక్కో యాడ్కు రూ.50 లక్షలు?బాబర్ ప్రస్తుతం పలు ఇంటర్నేషనల్ బ్రాండ్స్కు అంబాసిడర్గా వ్యహహరిస్తున్నాడు. ఒక్కో యాడ్లో నటించినందుకు ఆజం రూ.50 లక్షలు అందుకున్నట్లు సమాచారం. పెప్సి, హెడ్ అండ్ షోల్డర్స్, హెబీఎల్ బ్యాండ్లను బాబర్ ప్రమోట్ చేస్తున్నాడు. ఆడి ఎ-5, బీఎమ్డబ్ల్యూ, ఆడి ఇ-ట్రోన్, బ్లాక్ హ్యుందాయ్ సొనాటా,లంబోర్గిని అవెంటడోర్, BJ40 ప్లస్ జీప్ వంటి ఖరీదైన కార్లు బాబర్ వద్ద ఉన్నాయి. అదే విధంగా బాబర్కు లాహోర్లో విలాసవంతమైన ఓ ఫామ్హౌస్ కూడా ఉంది. బాబర్కు డిమోషన్..అయితే ఇటీవల 2025-26 ఏడాదికి గానూ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించిన పీసీబీ.. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్లకు భారీ షాకిచ్చింది. ఈ స్టార్ క్రికెటర్లకు డిమోషన్ లభించింది. గత కొన్ని సంవత్సరాలుగా కేటగిరీ ఎలో ఉన్న బాబర్, రిజ్వాన్లు ఇప్పుడు కేటగిరీ బికి పడిపోయారు. దీంతో వీరికి నెలకు పీకేఆర్ 3 మిలియన్లు( భారత కరెన్సీ 9.28 లక్షలు) అందుకోనున్నారు. గతేడాదితో పోలిస్తే వారి జీతంలో దాదాపు నాలుగు లక్షలపైగా కోత పడింది.చదవండి: Asia Cup 2025: టీమిండియాతో మ్యాచ్.. పాకిస్తాన్కు భారీ షాక్!? -
బుమ్రా కంటే అతడు ఎంతో బెటర్.. ఎందుకు పక్కన పెట్టారు?
ఆసియాకప్-2025ను టీమిండియా విజయంతో ఆరంభించిన సంగతి తెలిసిందే. దుబాయ్ వేదికగా జరిగిన తమ తొలి మ్యాచ్లో యూఏఈను 9 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్లో భారత్ ప్లేయింగ్ ఎలెవన్ నుంచి అర్ష్దీప్ సింగ్ను తప్పించడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాశంగా మారింది. గత కొన్నళ్లగా టీ20ల్లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్న ఆర్ష్దీప్కు యూఏఈపై ఆడే అవకాశం లభించలేదు. టీమ్ మెనెజ్మెంట్ తీసుకున్న ఈ నిర్ణయం అందరిని ఆశ్చర్యపరిచింది. తొలి మ్యాచ్లో భారత్ కేవలం ఒకే ప్రధాన పేసర్ బరిలోకి దిగింది. బుమ్రాతో పాటు మీడియం పేస్ బౌలర్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే బంతిని పంచుకున్నారు. దూబే మూడు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా ఓ వికెట్ సాధించాడు. హార్దిక్ కేవలం ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు.అర్ష్దీప్ను బెంచ్కే పరిమితం చేయడంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ లైనప్ను చూస్తుంటే భారత్ ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీ హ్యాంగోవర్ లో ఉన్నట్లు ఉందని చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్లను భారత్ దుబాయ్ వేదికగానే ఆడింది. ఫైనల్లో కివీస్ను చిత్తు చేసి టైటిల్ను మెన్ ఇన్ బ్లూ సొంతం చేసుకుంది.అర్ష్దీప్ సింగ్ అద్బుతమైన ఫాస్ట్ బౌలర్. అతడికి టీ20ల్లో 99 వికెట్లు ఉన్నాయి. ఈ ఫార్మాట్లో అతడు భారత్ తరపున లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. టీ20 క్రికెట్లో జస్ప్రీత్ బుమ్రా కంటే అర్ష్దీప్ గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి. ఈ ప్లేయింగ్ ఎలెవన్ను చూస్తుంటే భారత్ ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీ హ్యాంగోవర్ నుంచి రానిట్లు అన్పిస్తోంది. మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. ఆ సమయంలో వాతవారణం చాలా పొడిగా ఉంది. కాబట్టి అప్పుడు మీ వ్యహాలు పనిచేశాయి. కానీ ఇది సెప్టెంబర్. వాతారణ పరిస్థితులు మారాయి. అయినప్పటికి టీమ్ మెనెజ్మెంట్ అదే వ్యూహాంతో వెళ్లారు. ఫార్మాట్ మారిన భారత్ ప్లాన్ మారలేదు.వన్డే ఫార్మాట్కు టీ20కు చాలా తేడా ఉంది. రాబోయే మ్యాచ్లలో కూడా ఇదే ఎలెవన్తో ఆడనున్నారా? ఏదేమైనప్పటికి అత్యుత్తమ జట్టును ఎంపిక చేయండి" తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ నలుగురు స్పిన్నర్లతో ఆడింది. ఇప్పుడు ఫార్మాట్ మరినప్పటికి టీమిండియా అదే ప్రణాళికను అనుసరిస్తుందని చోప్రా విమర్శించాడు. కాగా ఈ మ్యాచ్లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. -
టీమిండియాతో మ్యాచ్.. పాకిస్తాన్కు భారీ షాక్!?
ఆసియాకప్-2025లో పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. శుక్రవారం (సెప్టెంబర్12) దుబాయ్ వేదికగా ఒమన్తో పాక్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు పాక్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ అలీ అఘాకు స్వల్ప గాయమైనట్లు వార్తలు వస్తున్నాయి.దీంతో బుధవారం (సెప్టెంబర్ 10) దుబాయ్లోని ఐసీసీ అకాడమీలో జరిగిన ప్రాక్టీస్ సెషన్కు అతడు దూరంగా ఉన్నట్లు పాక్ మీడియా వర్గాలు వెల్లడించాయి. జియో న్యూస్ రిపోర్ట్ ప్రకారం.. ప్రాక్టీస్ సెషన్లో సల్మాన్ ఆఘా నెక్ బ్యాండ్తో కన్పించినట్లు సమాచారం. జట్టుతో పాటు ఐసీసీ ఆకాడమీకి వెళ్లినప్పటికి అతడు ఎటువంటి ప్రాక్టీస్లోనూ పాల్గోలేదంట. ఈ క్రమంలో భారత్తో మ్యాచ్కు ముందు తమ కెప్టెన్ గాయం బారిన పడడంతో పాకిస్తాన్ శిబిరంలో ఆందోళన నెలకొంది. అయితే ముందుస్తు జాగ్రత్తలో భాగంగానే అతడి విశ్రాంతికి ఇచ్చినట్లు పాక్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అతడు ప్రస్తుతం మెడ నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.ఒకవేళ ఒమన్తో జరిగే తొలి మ్యాచ్కు అఘా దూరమైనా.. భారత్తో మ్యాచ్కు మాత్రం పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశముంది. అప్పటికి అతడి గాయం తీవ్రమై భారత్ మ్యాచ్కు దూరమైతే పాక్కు గట్టి ఎదురు దెబ్బే అని చెప్పుకోవాలి.కాగా పాకిస్తాన్ దాదాపు రెండు వారాల ముందే యూఏఈకు చేరుకుంది. ఆసియాకప్ టోర్నీ సన్నాహాకాల్లో భాగంగా అఫ్గానిస్తాన్-యూఏఈలతో ట్రైసిరీస్లో పాక్ తలపడింది. ఫైనల్లో అఫ్గాన్ను చిత్తు చేసి టైటిల్ను పాక్ సొంతం చేసుకుంది. అదే జోరును ఇప్పుడు ఆసియాకప్లోనూ కొనసాగించాలని మెన్ ఇన్ గ్రీన్ పట్టుదలతో ఉంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా భారత్-పాక్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.ఆసియాకప్కు పాక్ జట్టుసల్మాన్ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రాఫ్, ఫకర్ జమాన్, హారిస్ రవూఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారిస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వాసిమ్ జూనియర్, షహిబ్జాద ఫర్హాన్, సయామ్ ఆయుబ్, సల్మాన్ మిర్జా, షహీన్ షా అఫ్రిది, సుఫ్యాన్ మోకిమ్చదవండి: Asia Cup 2025: 'అతడొక సంచలనం.. అందుకే వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ అయ్యాడు' -
చేతులేత్తేసిన బ్యాటర్లు.. 149 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్
దులీప్ ట్రోఫీ-2025 సెమీఫైనల్లో దుమ్ములేపిన సౌత్ జోన్.. తుది పోరులో మాత్రం తడబడుతోంది. బెంగళూరు వేదికగా సెంట్రల్ జోన్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో సౌత్ జోన్ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. మొదటి ఇన్నింగ్స్లో సౌత్ జోన్ 63 ఓవర్లలో కేవలం 149 పరుగులకే కుప్పకూలింది. కుమార్ కార్తికేయ, శరన్ష్ జైన్ స్పిన్ వలలలో చిక్కుకుని సౌత్ జోన్ బ్యాటర్లు విలవిల్లాడారు. శరన్ష్ జైన్ ఫైవ్ వికెట్ హాల్తో మెరవగా.. శరన్ష్ జైన్ నాలుగు వికెట్లు సాధించాడు. సౌత్జోన్ ఇన్నింగ్స్లో తన్మయ్ అగర్వాల్(31) టాప్ స్కోరర్గా నిలవగా.. సల్మాన్ నిజార్(24), అంకిత్ శర్మ(20) రాణించారు. మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. సౌత్ జోన్ జట్టులో నారయణ్ జగదీశన్, దేవ్దత్ పడిక్కల్ లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది. వీరిద్దరు ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టుతో జరిగే అనధికారిక టెస్టు సిరీస్కు ఎంపిక కావడంతో దులీప్ ట్రోఫీ ఫైనల్లో భాగం కాలేదు. కాగా సెమీఫైనల్లో జగదీశన్ భారీ సెంచరీతో కదం తొక్కగా.. పడిక్కల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక బ్యాటింగ్లో విఫలమైన సౌత్ జోన్ కనీసం బౌలింగ్లో నైనా రాణిస్తుందో లేదో వేచి చూడాలి.చదవండి: Asia Cup 2025: 'అతడొక సంచలనం.. అందుకే వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ అయ్యాడు' -
టాప్-10లోకి అర్ష్దీప్ సింగ్.. ఆర్చర్ 16 స్ధానాలు జంప్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 బౌలింగ్ ర్యాంకింగ్స్లో భారత ప్లేయర్లు ముందడుగు వేశారు. స్పిన్నర్ రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్ ఒక్కో స్థానం మెరుగు పరుచుకున్నారు. ఈ జాబితాలో టీమిండియా నుంచి అత్యుత్తమంగా వరుణ్ చక్రవర్తి (706 పాయింట్లు) నాలుగో స్థానంలో ఉండగా... రవి బిష్ణోయ్ (674 పాయింట్లు) ఆరో ర్యాంక్లో, అర్ష్దీప్ సింగ్ సింగ్ (653 పాయింట్లు) పదో స్థానంలో ఉన్నారు. అక్షర్ పటేల్ (636 పాయింట్లు) సైతం ఒక స్థానం మెరుగు పరుచుకొని 13వ ర్యాంక్కు చేరుకున్నాడు. టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో అభిషేక్ శర్మ (829 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా... తిలక్ వర్మ (804 పాయింట్లు) రెండో ర్యాంక్లో ఉన్నాడు. టీమిండియా టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆరో స్థానంలో ఉండగా... ఆసియా కప్ టోర్నీకి ఎంపిక కాని ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక స్థానం కోల్పోయి 11వ ర్యాంక్లో నిలిచాడు. ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా 252 పాయింట్లతో ‘టాప్’లో ఉన్నాడు. వన్డే ర్యాంకింగ్స్లో ఎలాటి మార్పులు చోటుచేసుకోలేదు. బ్యాటింగ్లో శుబ్మన్ గిల్ (784 పాయింట్లు), రోహిత్ శర్మ (756 పాయింట్లు) వరుసగా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. విరాట్ కోహ్లి (736 పాయింట్లు) నాలుగో ర్యాంక్లో ఉన్నాడు. ఆర్చర్ అదుర్స్..కాగా వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ సత్తాచాటాడు. ఏకంగా 16 స్ధానాలు జంప్ చేసి టాప్-3 ర్యాంక్కు ఆర్చర్ చేరుకున్నాడు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో అద్బుతమైన ప్రదర్శన కనబరచడంతో ఆర్చర్ తన ర్యాంకింగ్స్లో గణనీయమైన పురోగతిని సాధించాడు. ఇదే సిరీస్లో దుమ్ములేపిన సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ 680 రేటింగ్ పాయింట్లతో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు.చదవండి: Asia Cup 2025: 'అతడొక సంచలనం.. అందుకే వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ అయ్యాడు' -
'అతడొక సంచలనం.. అందుకే వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ అయ్యాడు'
ఆసియాకప్-2025లో టీమిండియా శుభారంభం చేసింది. బుధవారం దుబాయ్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ 57 పరుగులకే ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం 4.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి చేధించింది.అభిషేక్ శర్మ(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 30), శుభ్మన్ గిల్(9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 20 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో 93 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని భారత్ అందుకుంది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. నాలుగు వికెట్లతో చెలరేగిన కుల్దీప్ యాదవ్, బ్యాటింగ్లో దుమ్ములేపిన అభిషేక్ శర్మపై సూర్య ప్రశంసల వర్షం కురిపించాడు."పిచ్ ఎలా స్పందిస్తుందో తెలుసుకోవాలనుకున్నాము. అందుకే టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాము. రెండు ఇన్నింగ్స్లోనూ వికెట్ ఒకేలా ఉంది. ఈ మ్యాచ్లో మా బాయ్స్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. మేము ప్రతీ మ్యాచ్లోనూ మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్ను కొనసాగించాలనకుంటున్నాము. ఈ మ్యాచ్లో మేము అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా రాణించాము. మా జట్టులో చాలా మంది ఆటగాళ్లు ఇటీవల ఛాంపియన్ ట్రోఫీలో ఇక్కడ ఆడారు. పిచ్ బాగానే ఉంది. కానీ వికెట్ కాస్త నెమ్మదిగా ఉంది. స్పిన్నర్లకు అనుకూలంగా ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం దుబాయ్లో వాతవారణం చాలా వేడిగా ఉంది. నిజంగా కుల్దీప్ యాదవ్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. అతడికి దూబే, బుమ్రా, వరుణ్ నుంచి సపోర్ట్ లభించింది. ఇక అభిషేక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడొక అద్భుతం. జట్టు 200 పరుగులు చేధించినా, టార్గెట్ 50 అయినా అతడి ఆట తీరు ఒకే విధంగా ఉంటుంది. అందుకే అతడు ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు. పాకిస్తాన్తో మ్యాచ్ కోసం మా ఆటగాళ్లంతా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో పేర్కొన్నాడు. సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనుంది.చదవండి: Asia Cup 2025: చరిత్ర సృష్టించిన టీమిండియా.. తొలి జట్టుగా -
ఐసీసీ చారిత్రక నిర్ణయం
మహిళల క్రికెట్ అభివృద్ధి దిశగా ఐసీసీ మరో కీలక అడుగు వేసింది. 13వ మహిళల వన్డే వరల్డ్ కప్ (2025) కోసం 14 మంది మహిళా అంపైర్లు, నలుగురు మహిళా మ్యాచ్ రిఫరీలను ఎంపిక చేసింది. మహిళల వన్డే వరల్డ్ కప్ చరిత్రలో పూర్తిగా మహిళా అధికారులనే నియమించడం ఇదే మొదటిసారి.ఈ చారిత్రక నిర్ణయం తీసుకోవడంలో ఐసీసీ అధ్యక్షుడు, బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా కీలకపాత్ర పోషించారు. ఇది మహిళల క్రికెట్ ప్రయాణంలో కీలక ఘట్టమని ఆయన అన్నారు.ఓవరాల్గా చూస్తే అందరూ మహిళా అధికారులే ఉన్న నాలుగో గ్లోబల్ టోర్నమెంట్ ఇది. 2022 కామన్వెల్త్ క్రీడలు, తాజాగా జరిగిన రెండు టీ20 వరల్డ్కప్ టోర్నీల్లో మ్యాచ్ అధికారులంతా మహిళలే.ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 కోసం ఎంపిక చేసిన మ్యాచ్ రిఫరీలు- ట్రూడీ ఆండర్సన్, - షాండ్రే ఫ్రిట్జ్ - జి.ఎస్. లక్ష్మి - మిచెల్ పెరెరాఅంపైర్లు- లారెన్ ఏజెన్బ్యాగ్ - కాండేస్ లా బోర్డే - కిమ్ కాటన్ - సారా డాంబనేవనా - షతిరా జకీర్ జెసీ - కెరిన్ క్లాస్టే - జనని ఎన్ - నిమాలి పెరెరా - క్లేర్ పోలోసాక్ - వృందా రాథీ - సూ రెడ్ఫెర్న్ - ఎలోయిస్ షెరిడన్ - గాయత్రి వేణుగోపాలన్ - జాక్వెలిన్ విలియమ్స్కాగా, మహిళల వన్డే ప్రపంచకప్ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్లో ఆతిథ్య దేశాలే తలపడనున్నాయి. ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ ఆడబోయే మ్యాచ్లన్నీ శ్రీలంకలో జరుగుతాయి. -
భారత్-పాక్ మ్యాచ్ రద్దుకు సుప్రీం కోర్టులో పిల్.. న్యాయస్థానం స్పందన ఇదే..!
ఆసియా కప్ 2025లో భాగంగా ఈ నెల 14న దుబాయ్లో జరుగబోయే భారత్-పాకిస్తాన్ మ్యాచ్పై సుప్రీం కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (PIL) దాఖలైంది. ఈ మ్యాచ్ను రద్దు చేయాలని ఉర్వశి జైన్ నేతృత్వంలో నలుగురు న్యాయ విద్యార్థులు ఆర్టికల్ 32 ప్రకారం పిటిషన్ను దాఖలు చేశారు.పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జాతీయ గౌరవానికి విరుద్ధమని వారు పిటిషన్లో పేర్కొన్నారు. మ్యాచ్ నిర్వహణ అమరవీరుల కుటుంబాలకు బాధ కలిగించే చర్యగా అభిప్రాయపడ్డారు.అయితే, ఈ పిటిషన్ను జస్టిస్ జె.కె.మహేశ్వరి, విజయ్ బిష్ణోయి నేతృత్వంలోని బెంచ్ విచారణకు తీసుకోలేదు. "ఇది కేవలం మ్యాచ్ మాత్రమే.. వదిలేయండి" అంటూ న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్పై రాజకీయ, సామాజిక భావోద్వేగాలు ఉన్నప్పటికీ, సుప్రీం కోర్టు ఈ విషయాన్ని క్రీడా పరంగా మాత్రమే పరిగణించింది. క్రికెట్ను జాతీయ ప్రయోజనాల కంటే పైగా చూడలేమన్న అభిప్రాయాలు ఉన్నా, ప్రస్తుత విధానాలు మరియు అంతర్జాతీయ ఒప్పందాలు కారణంగా మ్యాచ్ను కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బహుల దేశాలు పాల్గొనే టోర్నీల్లో పాక్తో మ్యాచ్ను రద్దు చేసుకుంటే, అది భారత ఆటగాళ్ల కెరీర్లపై ప్రభావం చూపే ప్రమాదముంది.బహుల దేశాలు పాల్గొనే టోర్నీల్లో టీమిండియా పాక్తో తలపడనున్నా, ద్వైపాక్షిక సిరీస్లు మాత్రం ఆడదు. ఈ విషయాన్ని బీసీసీఐ ఇదివరకే స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే, ఆసియా కప్లో భారత్ ఘనంగా బోణీ కొట్టింది. నిన్న (సెప్టెంబర్ 10) యూఏఈతో జరిగిన మ్యాచ్ను టీమిండియా 27 బంతుల్లోనే ముగించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. కుల్దీప్ యాదవ్ (2.1-0-7-4), శివమ్ దూబే (2-0-4-3), వరుణ్ చక్రవర్తి (2-0-4-1), అక్షర్ పటేల్ (3-0-13-1), బుమ్రా (3-0-19-1) ధాటికి 13.1 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. అభిషేక్ శర్మ (16 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), శుభ్మన్ గిల్ (9 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (2 బంతుల్లో 7 నాటౌట్; సిక్స్) చెలరేగడంతో 4.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
గెలుపు జోష్లో ఉన్న సౌతాఫ్రికాకు వరుస షాక్లు
ఇంగ్లండ్ పర్యటనలో వరుస విజయాలతో దూసుకుపోతున్న సౌతాఫ్రికాకు వరుస షాక్లు తగులుతున్నాయి. ఈ పర్యటనలో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న ఆ జట్టు.. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లోనూ ఘనంగా బోణీ కొట్టింది. నిన్న జరిగిన తొలి మ్యాచ్లో సౌతాఫ్రికా ఆతిథ్య ఇంగ్లండ్పై 14 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్దతి) గెలుపొంది, సిరీస్లో 1-0 ఆధిక్యంలో వెళ్లింది.ఈ మ్యాచ్కు ముందే సౌతాఫ్రికాకు రెండు భారీ షాక్లు తగిలాయి. స్టార్ పేసర్ లుంగి ఎంగిడి, స్టార్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ గాయాల బారిన పడ్డారు. వీరిలో ఎంగిడి ఇంగ్లండ్తో టీ20 సిరీస్ మొత్తానికి దూరంగా కాగా.. కేశవ్ మహారాజ్ ఇంగ్లండ్ టీ20 సిరీస్తో పాటు ఆతర్వాత పాకిస్తాన్తో జరిగే టెస్ట్ సిరీస్కు కూడా దూరం కావచ్చు. ఇంగ్లండ్ సిరీస్లో ఎంగిడికి ప్రత్యామ్నాయంగా నండ్రే బర్గర్ను ఎంపిక చేయగా.. మహారాజ్కు ప్రత్యామ్నాయాన్ని ఇంకా ప్రకటించలేదు. మహారాజ్ గాయంపై ఇంకా పూర్తి క్లారిటీ లేకపోవడంతో క్రికెట్ సౌతాఫ్రికా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మెడికల్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.మహారాజ్ ఇటీవలికాలంలో సౌతాఫ్రికా విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్నాడు. గత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్తో మొదలు.. తాజాగా ఇంగ్లండ్తో ముగిసిన వన్డే సిరీస్ వరకు అతని హవా కొనసాగింది. సౌతాఫ్రికా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో కొత్త డబ్ల్యూటీసీ సైకిల్ను ప్రారంభించే తరుణంలో (పాక్తో సిరీస్) మహారాజ్ గాయపడటం ఆ జట్టు విజయావకాశాలను తప్పక ప్రభావితం చేయవచ్చు. సౌతాఫ్రికా 2 టెస్ట్లు, 3 టీ20లు, 3 వన్డేల సిరీస్ల కోసం అక్టోబర్ 12 నుంచి పాకిస్తాన్లో పర్యటించనుంది. ఈ పర్యటనకు మహారాజ్ పూర్తిగా దూరమవుతాడా లేక టెస్ట్లకు మాత్రమే అందుబాటులో ఉండడా అన్న విషయంపై త్వరలోనే క్లారిటీ వస్తుంది.మహారాజ్ తాజాగా ఇంగ్లండ్తో ముగిసిన వన్డే సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు. ఈ సిరీస్లో అతను 3 మ్యాచ్ల్లో 8 వికెట్లు తీశాడు. మహారాజ్ తొలి టీ20 ఆడకపోయినా సౌతాఫ్రికా ఆ మ్యాచ్లో గెలుపొందింది. -
భారత పర్యటనకు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్
సెప్టెంబర్ 16 నుంచి ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్లో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలో ఆసీస్ భారత-ఏ జట్టుతో రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్లు, మూడు అనధికారిక వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్లకు ముందు ఆసీస్-ఏ టీమ్కు భారీ షాక్ తగిలింది.ఆల్రౌండర్ ఆరోన్ హార్డీ భుజం గాయం కారణంగా తప్పుకున్నాడు. హార్డీ స్థానాన్ని విల్ సదర్లాండ్ భర్తీ చేయనున్నాడు. ఇదివరకే వన్డే జట్టులో సభ్యుడైన సదర్లాండ్ రెండో టెస్ట్ సమయానికి జట్టుతో కలుస్తాడు. వన్డేల్లో హార్డీకి ప్రత్యామ్నాయాన్ని ప్రకటించలేదు.హార్డీ ఇటీవల వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20, వన్డే సిరీస్ల్లో పాల్గొన్నాడు. అయితే, ఆ సిరీస్ల్లో పేలవ ప్రదర్శన కారణంగా త్వరలో జరుగనున్న న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక కాలేదు. హార్డీ తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు భారత్-ఏ సిరీస్తో అవకాశం కల్పించగా, గాయం బారిన పడ్డాడు. గాయం తీవ్రం కాకపోతే, వన్డే సిరీస్ ఆడవచ్చు.భారత్లో ఆస్ట్రేలియా ఏ జట్టు పర్యటన వివరాలు..సెప్టెంబర్ 16-23: తొలి టెస్ట్ (లక్నో)సెప్టెంబర్ 23-26: రెండో టెస్ట్ (లక్నో)సెప్టెంబర్ 30: తొలి వన్డే (కాన్పూర్)అక్టోబర్ 3: రెండో వన్డే (కాన్పూర్)అక్టోబర్ 5: మూడో వన్డే (కాన్పూర్)ఆస్ట్రేలియా-ఏ టెస్ట్ జట్టు..జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోల్లీ, జాక్ ఎడ్వర్డ్స్, కాంప్బెల్ కెల్లావే, సామ్ కాన్స్టాస్, నాథన్ మెక్స్వీనీ, టాడ్ మర్ఫీ, ఫెర్గస్ ఓ'నీల్, ఆలివర్ పీక్, జోష్ ఫిలిప్, కోరీ రోచిసియోలి, లియామ్ స్కాట్, విల్ సదర్లాండ్, హెన్రీ థోర్న్టన్వన్డే జట్టు..కూపర్ కొన్నోల్లీ, హ్యారీ డిక్సన్, జాక్ ఎడ్వర్డ్స్, సామ్ ఎలియట్, జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, మెకెంజీ హార్వే, టాడ్ మర్ఫీ, తన్వీర్ సంఘ, లియామ్ స్కాట్, లాచీ షా, టామ్ స్ట్రాకర్, విల్ సదర్లాండ్, హెన్రీ థోర్న్టన్ఈ సిరీస్ల కోసం భారత-ఏ టెస్ట్ జట్టును కూడా ప్రకటించారు. ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహిస్తాడు. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) అభిమన్యు ఈశ్వరన్ ఉంటాడు.శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్, అభిమన్యు ఈశ్వరన్ (వైస్ కెప్టెన్), ఎన్ జగదీశన్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, హర్ష్ దూబే, ఆయుష్ బడోని, నితీష్ కుమార్ రెడ్డి, తనుష్ కోటియన్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్, మానవ్ సుతార్, యష్ ఠాకూర్ -
షాకింగ్ ఘటన.. క్రికెటర్లకు తుపాకీ బెదిరింపులు
తాజాగా జరిగిన ఓ ఘటన క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురి చేసింది. కరీబియన్ ప్రీమియర్ లీగ్లో (CPL) పాల్గొంటున్న ఇద్దరు స్టార్ ఆటగాళ్లు (సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియట్స్), ఓ సీపీఎల్ అధికారి తుపాకీ బెదిరింపులకు గురయ్యారు. ఈ ఘటన సెప్టెంబర్ 9వ తేదీ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగింది. పైన పేర్కొన్న వారు ఓ ప్రైవేట్ ఈవెంట్ నుండి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.పోలీసుల కథనం ప్రకారం.. ఆటగాళ్లను బెదిరించింది దొంగలై ఉండవవచ్చు. నగలు మరియు ఇతర విలువైన వస్తువుల కోసం ఇలా చేసి ఉంటారు. ఘటనా స్థలంలో ఓ తుపాకీ లభించింది. అది దొంగలదిగా భావిస్తున్నాం. ఈ ఘటనలో బాధితులు ఎవరూ గాయపడలేదు. విచారణ వేగవంతగా జరుగుతుంది.తాజా ఉదంతంతో సీపీఎల్ నిర్వహకులు అలర్ట్ అయ్యారు. ఆటగాళ్లు సహా సీపీఎల్లో భాగమైన వారందరికీ భద్రత పెంచారు. ఆటగాళ్ల సంక్షేమం తమకు చాలా ముఖ్యమని ప్రకటించారు. బాధితుల గోప్యతను గౌరవిస్తూ వారి పేర్లను వెల్లడించడం లేదని తెలిపారు.కాగా, తుపాకీ బెదింపుల ఘటన తర్వాత పేట్రియట్స్ ఇవాళ (సెప్టెంబర్ 11) జరుగబోయే మ్యాచ్కు ప్రిపేర్ అవుతుంది. ఆ జట్టు బార్బడోస్ రాయల్స్ను ఢీకొట్టనుంది. ఈ సీజన్లో పేట్రియాట్స్ ప్రదర్శన చాలా దారుణంగా ఉంది. ఆడిన 9 మ్యాచ్ల్లో కేవలం 3 విజయాలు మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది.పేట్రియాట్స్ సెప్టెంబర్ 7న జరిగిన తమ చివరి మ్యాచ్లో గయానా అమెజాన్ వారియర్స్పై 5 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్లో పాక్ ఆటగాడు రిజ్వాన్ (62 బంతుల్లో 85) ఒంటరిపోరాటం చేసి పేట్రియాట్స్ను గెలిపించాడు. రిజ్వాన్ ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన పాక్ జట్టుకు ఎంపిక కాలేదు. వన్డే జట్టు కెప్టెన్ అయినా పాక్ సెలెక్టర్లు ఫామ్ను సాకుగా చూపుతూ రిజ్వాన్ను పక్కన పెట్టారు. -
రోహిత్ శర్మకు సంబంధించి బిగ్ అప్డేట్
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరుగబోయే వన్డే సిరీస్లో హిట్మ్యాన్ పాల్గొనడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి రోహిత్ స్వయంగా క్లూ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ క్యాంప్లో ట్రైనింగ్ మొదలుపెట్టిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. View this post on Instagram A post shared by Rohit Sharma (@rohitsharma45)ఈ ఫోటోల్లో రోహిత్ ప్యాడింగ్ చేసుకుంటూ, స్ప్రింట్ చేస్తూ కనిపించాడు. రోహిత్ బరువు కూడా చాలా తగ్గినట్లు కనిపిస్తున్నాడు. పలు నివేదికల ప్రకారం హిట్మ్యాన్ ఇటీవలికాలంలో 8 కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తుంది. తాజాగా బీసీసీఐ నిర్వహించిన యో-యో టెస్ట్లో అతను 19.4 స్కోర్ సాధించాడని సమాచారం. రోహిత్ ఫిట్నెస్పై ఈ స్థాయిలో దృష్టి పెట్టడం ఖచ్చితంగా ఆస్ట్రేలియా పర్యటన కోసమేనన్న సంకేతాన్నిస్తుంది.టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించి, వన్డేల్లో కొనసాగుతానని స్పష్టంగా ప్రకటించినా.. రోహిత్ వన్డే భవితవ్యం అంత క్లారిటీగా లేదు. కొందరు రోహిత్ 2027 వన్డే వరల్డ్కప్ వరకు ఆడతాడని అంటుంటే, ఆస్ట్రేలియా పర్యటనే లాస్ట్ అని కొందరు, ఆస్ట్రేలియా సిరీస్ కూడా ఆడడని ఇంకొందరు అంటున్నారు.ఈ ప్రచారాల నేపథ్యంలో రోహిత్ ఫిట్గా కనిపిస్తూ ప్రాక్టీస్ మొదలుపెట్టడం, వన్డేల్లో కొనసాగాలనుకున్న అతని సంకల్పాన్ని సూచిస్తుంది. రోహిత్ రాక కోసం అతని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. హిట్మ్యాన్ చివరిగా ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా జెర్సీలో కనిపించాడు.టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన అక్టోబర్ 19న మొదలవుతుంది. ఈ పర్యటనలో భారత్ 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. తొలుత వన్డేలు, ఆతర్వాత టీ20 సిరీస్ జరుగనున్నాయి. అక్టోబర్ 19 (పెర్త్), 23 (అడిలైడ్), 25 (సిడ్నీ) తేదీల్లో వన్డేలు.. 29 (కాన్బెర్రా), 31 (మెల్బోర్న్), నవంబర్ 2 (హోబర్ట్), 6 (గోల్డ్ కోస్ట్), 8 (బ్రిస్బేన్) తేదీల్లో టీ20లు జరుగనున్నాయి. -
Asia Cup 2025: రోహిత్ శర్మ సరసన అభిషేక్ శర్మ
టీమిండియా యువ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ యూఏఈతో నిన్న (సెప్టెంబర్ 10) జరిగిన ఆసియా కప్ 2025 మ్యాచ్లో చెలరేగిపోయాడు. 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో తొలి బంతి నుంచే ఊచకోత మొదలుపెట్టిన అభిషేక్.. యూఏఈ బౌలర్లపై తారాస్థాయిలో విరుచుకుపడ్డాడు. హైదర్ అలీ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్సర్ బాదిన అభిషేక్ హిట్మ్యాన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ సరసన చేరాడు.ABHISHEK SHARMA - HIT THE FIRST BALL OF THE INNINGS FOR A SIX. 🤯 pic.twitter.com/4sWr6hOLl0— Johns. (@CricCrazyJohns) September 10, 2025రోహిత్ (2021లో ఇంగ్లండ్పై), జైస్వాల్ (2024లో జింబాబ్వేపై), సంజూ (2025లో ఇంగ్లండ్పై) కూడా గతంలో అభిషేక్ తరహాలనే ఇన్నింగ్స్ టీ20ల్లో తొలి బంతికే సిక్సర్ కొట్టారు.భారీ విజయంఅభిషేక్ విధ్వంసం ధాటికి యూఏఈ నిర్దేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 4.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. బంతుల పరంగా టీ20ల్లో భారత్కు ఇదే భారీ విజయం. మరో 93 బంతులు మిగిలుండగానే టీమిండియా లక్ష్యాన్ని ఊదేసింది. 2021లో స్కాట్లాండ్పై 81 బంతులు మిగిలుండగానే గెలుపొందడం దీనికి ముందున్న రికార్డు.ఆసియా కప్ చరిత్రలోనూ బంతుల పరంగా ఇదే భారీ విజయం. గతంలో ఈ రికార్డు ఆఫ్ఘనిస్తాన్ పేరిట ఉండేది. 2022 ఎడిషన్లో ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంకపై 59 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.27 బంతుల్లోనే టార్గెట్ ఫినిష్ఈ మ్యాచ్లో టీమిండియా మరో ఘనత కూడా సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా లక్ష్య ఛేదన చేసిన రెండో జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్లో భారత్ కేవలం 27 బంతుల్లోనే టార్గెట్ను ఊదేసింది. ఈ రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. 2022 ప్రపంచకప్లో ఆ జట్టు ఒమన్పై కేవలం 19 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన యూఏఈ.. కుల్దీప్ యాదవ్ (2.1-0-7-4), శివమ్ దూబే (2-0-4-3), వరుణ్ చక్రవర్తి (2-0-4-1), అక్షర్ పటేల్ (3-0-13-1), బుమ్రా (3-0-19-1) ధాటికి 13.1 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. యూఏఈ ఇన్నింగ్స్లో ఓపెనర్లు అలీషాన్ షరాఫు (22), ముహమ్మద్ వసీం (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. అభిషేక్, శుభ్మన్ గిల్ (9 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (2 బంతుల్లో 7 నాటౌట్; సిక్స్) ధాటికి 4.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఈ టోర్నీలో భారత్ సెప్టెంబర్ 14న పాకిస్తాన్తో తలపడనుంది. -
ఇంగ్లండ్కు సౌతాఫ్రికా మరో షాక్
సౌతాఫ్రికా ఇంగ్లండ్కు మరో షాక్ ఇచ్చింది. ఇంగ్లండ్ను వారి దేశంలోనే వన్డే సిరీస్లో ఓడించిన (2-1తో) ఆ జట్టు.. తాజాగా టీ20 సిరీస్లోనూ ఆ దిశగా తొలి అడుగు వేసింది. నిన్న (సెప్టెంబర్ 10) జరిగిన తొలి మ్యాచ్లో అతిథ్య జట్టుపై సౌతాఫ్రికా డక్వర్త్ లూయిస్ పద్దతిలో 14 పరుగులు తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.వర్షం అంతరాయాల నడుమ సాగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 7.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఆలస్యం కావడంతో ఈ మ్యాచ్ను తొలుత 9 ఓవర్ల మ్యాచ్గా నిర్ణయించారు. అయితే 7.5 ఓవర్ల తర్వాత వరుణుడు మరోసారి అడ్డుపడటంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ అక్కడే ముగించారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో మార్క్రమ్ (28), బ్రెవిస్ (23), డొనొవన్ ఫెర్రియెరా (25 నాటౌట్), స్టబ్స్ (13) ఉన్న పరిధిలో చెలరేగారు. ఇంగ్లండ్ బౌలర్లలో లూక్ వుడ్ 2, ఓవర్టన్, ఆదిల్ రషీద్, సామ్ కర్రన్ తలో వికెట్ తీశారు.వర్షం కారణంగా మరి కాస్త సమయం వృధా కావడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిన ఇంగ్లండ్ టార్గెట్ను 5 ఓవర్లలో 69 పరుగులకే కుదించారు. అయితే ఈ లక్ష్యాన్ని అందుకోవడంలో ఇంగ్లండ్ విఫలమైంది. 5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 54 పరుగులు మాత్రమే చేయగలిగింది. సౌతాఫ్రికా బౌలర్లు వికెట్ల రూపంలోనే ఐదు బంతులు వేస్ట్ చేసి ఇంగ్లండ్ను దెబ్బకొట్టారు. జన్సెన్, కార్బిన్ బాష్ తలో 2, రబాడ ఓ వికెట్ తీశారు. ఛేదనలో తొలి బంతికే సాల్ట్ను రబాడ పెవిలియన్కు పంపాడు. ఆతర్వాత ఇంగ్లండ్ ఓవర్కు ఒకటి చొప్పున వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో బట్లర్ (25), సామ్ కర్రన్ (10 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ సిరీస్లో రెండో టీ20 మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 12న జరుగనుంది. -
ఎవరిదో దులీప్ ట్రోఫీ?
బెంగళూరు: దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్కు రంగం సిద్ధమైంది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ గ్రౌండ్లో గురువారం ప్రారంభం కానున్న ఈ తుది పోరులో సెంట్రల్ జోన్తో సౌత్ జోన్ తలపడనుంది. ఓ వైపు టీమిండియా ఆసియాకప్ టి20 టోర్నమెంట్లో పాల్గొంటుండగా... మరోవైపు భారత ‘ఎ’ జట్టు ఆస్ట్రేలియా ‘ఎ’తో అనధికారిక టెస్టు సిరీస్కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కొత్త ఆటగాళ్లు తమ సత్తా చాటుకునేందుకు దులీప్ ట్రోఫీ చక్కటి వేదిక కానుంది. గతేడాది మాదిరిగా కాకుండా తిరిగి పాత పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో నార్త్ జోన్పై విజయంతో సౌత్ జోన్... వెస్ట్ జోన్ను ఓడించి సెంట్రల్ జోన్ ఫైనల్కు చేరాయి. సౌత్ జోన్ జట్టు చివరిసారిగా 2023లో దులీప్ ట్రోఫీ విజేతగా నిలవగా... 2014–15 సీజన్లో సెంట్రల్ జోన్ ట్రోఫీ చేజిక్కించుకుంది. అప్పుడు కూడా సౌత్జోన్పైనే నెగ్గిన సెంట్రల్ జోన్ అదే ఫలితం పునరావృతం చేయాలని యోచిస్తోంది. రజత్ పాటీదార్, దానిశ్ మాలేవర్, శుభమ్ శర్మ, యశ్ రాథోడ్, దీపక్ చాహర్, తన్మయ్ అగర్వాల్, తనయ్ త్యాగరాజన్, షేక్ రషీద్, రికీ భుయ్, మొహమ్మద్ అజహరుద్దీన్ వంటి వాళ్లు మెరుగైన ప్రద్శన చేసి సెలెక్టర్ల దృష్టిలో పడాలని భావిస్తున్నారు. మనవాళ్లు ఆకట్టుకునేనా... ముందస్తు షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ సౌత్ జోన్ జట్టుకు సారథ్యం వహించాల్సి ఉండగా... ఆసియా కప్లో ఆడుతున్న భారత జట్టుకు అతను ఎంపిక కావడంతో ఫైనల్కు దూరమయ్యాడు. దీంతో కేరళకు చెందిన మొహమ్మద్ అజహరుద్దీన్కు సారథ్య బాధ్యతలు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ రికీ భుయ్ వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. దేవదత్ పడిక్కల్, జగదీశన్ కూడా అందుబాటులో లేకపోవడంతో... స్మరణ్, సిద్ధార్్థలకు జట్టులో చోటు దక్కింది. హైదరాబాద్ ఆటగాళ్లు తన్మయ్ అగర్వాల్, తనయ్ త్యాగరాజన్, ఆంధ్ర ప్లేయర్లు షేక్ రషీద్, రికీ భుయ్ సౌత్ జోన్ జట్టుకు కీలకం కానున్నారు. మోహిత్ కాలె, స్మరణ్, సల్మాన్ నిజార్తో సౌత్ జోన్ బ్యాటింగ్ బలంగానే ఉంది. ఇక అజహరుద్దీన్ సారథిగా, వికెట్కీపర్గా, బ్యాటర్గా కీలకం కానున్నాడు. గుర్జపనీత్ సింగ్, వాసుకి కౌశిక్, నిదీశ్, తనయ్ త్యాగరాజన్ బౌలింగ్ భారం మోయనున్నారు. పిచ్ అటు బౌలింగ్కు ఇటు బ్యాటింగ్కు సమానంగా అనుకూలించనుంది. ఆరంభంలో కాస్త జాగ్రత్త వహిస్తే భారీ స్కోర్లు చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. మ్యాచ్ జరిగే ఐదు రోజుల్లోనూ వర్షం ముప్పు ఉంది. బ్యాటింగ్ బలంగా... సౌత్ జోన్తో పోల్చుకుంటే... సెంట్రల్ జోన్ బ్యాటింగ్ బలంగా ఉంది. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సెంట్రల్ జోన్ ప్లేయర్లు ముందు వరుసలో ఉన్నారు. దానిశ్ మాలేవర్ 294 పరుగులతో అగ్రస్థానంలో ఉంటే... రజత్ పాటీదార్ 268, శుభమ్ శర్మ 252 పరుగులతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పాటీదార్ 100కు పైగా స్ట్రయిక్ రేట్తో పరుగులు రాబట్టడం విశేషం. అతడు ఇదే జోరు తుదిపోరులోనూ కనబరిస్తే సౌత్ జోన్కు కష్టాలు తప్పకపోవచ్చు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో పాటీదార్ వరుస ఇన్నింగ్స్లలో 125, 66, 77 పరుగులు చేశాడు. ఐపీఎల్లో తొలిసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి టైటిల్ అందించిన పాటీదార్ సారథ్య అనుభవం కూడా సెంట్రల్ జోన్కు కలిసిరానుంది. ఖలీల్ అహ్మద్, మానవ్ సుతార్ వంటి వాళ్లు అందుబాటులో లేకపోయినా... సెంట్రల్ జోన్కు పెద్దగా ఇబ్బందులు లేవు. టీమిండియా ప్లేయర్ దీపక్ చాహర్తో పాటు వెస్ట్ జోన్తో సెమీఫైనల్లో 8 వికెట్లు పడగొట్టిన సారాంశ్ జైన్ బౌలింగ్లో కీలకం కానున్నారు. -
ధనాధన్... ఫటాఫట్
అంతర్జాతీయ టి20ల్లో భారత్కు, ఇతర జట్లకు మధ్య ఉన్న స్థాయీభేదం ఏమిటో మరోసారి కనిపించింది. వరల్డ్ చాంపియన్ టీమిండియా ముందు పసికూనలా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టు పూర్తిగా తేలిపోయింది. ఫలితంగా ఆసియా కప్ టి20 టోర్నీలో భారత్ భారీ గెలుపుతో సత్తా చాటింది. భారత బౌలర్ల ధాటికి 79 బంతుల్లోనే యూఏఈ ఇన్నింగ్స్ ముగియగా, లక్ష్యాన్ని ఛేదించేందుకు మన జట్టుకు 27 బంతులే సరిపోయాయి. కుల్దీప్ యాదవ్, శివమ్ దూబే కలిసి 7 వికెట్లతో ప్రత్యర్థిని పడగొట్టగా... అభిషేక్ శర్మ జోరుతో లాంఛనం ముగిసింది. ఇక అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమరంలో ఆదివారం పాకిస్తాన్తో భారత్ ఆడుతుది. దుబాయ్: ఆసియా కప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఘన విజయంతో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో యూఏఈని చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన యూఏఈ 13.1 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. అలీషాన్ (17 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్), వసీమ్ (22 బంతుల్లో 19; 3 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. కుల్దీప్ యాదవ్ (4/7), శివమ్ దూబే (3/4) బౌలింగ్లో చెలరేగారు. అనంతరం భారత్ 4.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసి గెలిచింది. ఇందులో 4 ఫోర్లు, 5 సిక్స్లతో మొత్తం 46 పరుగులు వచ్చాయి! అభిషేక్ శర్మ (16 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్స్లు) దూకుడుగా ఆడగా... శుబ్మన్ గిల్ (9 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (7 నాటౌట్) కలిసి మ్యాచ్ను ముగించారు. కుల్దీప్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం లభించింది. భారత్ తమ తదుపరి మ్యాచ్ను ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుతో ఆడుతుంది. అబుదాబి లో నేడు జరిగే గ్రూప్ ‘బి’ మ్యాచ్లో హాంకాంగ్తో బంగ్లాదేశ్ ఆడుతుంది. టపటపా... యూఏఈ ఇన్నింగ్స్ తొలి 21 బంతుల్లో 26 పరుగులు... ఇందులో 3 ఫోర్లు, ఒక సిక్స్తో అలీషాన్ ఒక్కడే 22 పరుగులు చేశాడు. ఆ తర్వాత బుమ్రా వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో కెప్టెన్ వసీమ్ మూడు ఫోర్లు బాది 12 పరుగులు రాబట్టాడు. ఈ రెండు సందర్భాలు మినహా యూఏఈ ప్రదర్శనలో చెప్పుకోవడానికేమీ లేదు. భారత బౌలర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంతో యూఏఈ బ్యాటర్లు పరుగులు చేయడంలో తీవ్ర తడబాటు కనిపించింది. సింగిల్ కూడా తీయడం కష్టంగా మారిపోవడంతో పాటు జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. 26/0 నుంచి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తర్వాతి 32 బంతుల్లో 24 పరుగులు మాత్రమే చేసిన టీమ్ సగం వికెట్లు కోల్పోవడంతో స్కోరు 50/5కి చేరింది. వీటిలో కుల్దీప్ ఒకే ఓవర్లో తీసిన మూడు వికెట్లు ఉన్నాయి. అనంతరం తర్వాతి 25 బంతుల్లో 7 పరుగులే చేసిన జట్టు మరో ఐదు వికెట్లు చేజార్చుకుంది. వీటిలో దూబే ఒకే ఓవర్లో తీసిన రెండు వికెట్లు ఉన్నాయి. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2, బుమ్రా 4 ఫోర్లు ఇవ్వగా... మిగతా నలుగురు బౌలర్లు కలిపి 55 బంతుల్లో ఒక్క ఫోర్ ఇవ్వకుండా ఒక సిక్స్ మాత్రం (అక్షర్ బౌలింగ్లో) ఇచ్చారు! 2024 టి20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత తొలిసారి భారత్ తరఫున టి20 మ్యాచ్ బరిలోకి దిగిన బుమ్రా... ఆరేళ్ల తర్వాత మొదటిసారి పవర్ప్లేలో మూడు ఓవర్లు వేశాడు. స్కోరు వివరాలు యూఏఈ ఇన్నింగ్స్: అలీషాన్ (బి) బుమ్రా 22; వసీమ్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 19; జోహెబ్ (సి) కుల్దీప్ (బి) వరుణ్ 2; రాహుల్ చోప్రా (సి) గిల్ (బి) కుల్దీప్ 3; ఆసిఫ్ ఖాన్ (సి) సామ్సన్ (బి) దూబే 2; కౌశిక్ (బి) కుల్దీప్ 2; ధ్రువ్ (ఎల్బీ) (బి) దూబే 1; సిమ్రన్జిత్ (ఎల్బీ) (బి) అక్షర్ 1; హైదర్ అలీ (సి) సామ్సన్ (బి) కుల్దీప్ 1; జునైద్ (సి) సూర్యకుమార్ (బి) దూబే 0; రోహిద్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 2; మొత్తం (13.1 ఓవర్లలో ఆలౌట్) 57. వికెట్ల పతనం: 1–26, 2–29, 3–47, 4–48, 5–50, 6–51, 7–52, 8–54, 9–55, 10–57. బౌలింగ్: పాండ్యా 1–0–10–0, బుమ్రా 3–0– 19–1, అక్షర్ 3–0–13–1, వరుణ్ 2–0–4–1, కుల్దీప్ 2.1–0–7–4, దూబే 2–0–4–3. భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) హైదర్ (బి) జునైద్ 30; గిల్ (నాటౌట్) 20; సూర్య కుమార్ (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 3; మొత్తం (4.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 60. వికెట్ల పతనం: 1–48. బౌలింగ్: హైదర్ అలీ 1–0–10–0, రోహిద్ 1–0–15–0, ధ్రువ్ 1–0–13–0, జునైద్ 1–0–16–1, సిమ్రన్జిత్ 0.3–0–6–0. 27 ఛేదనలో బంతుల పరంగా భారత్కు ఇదే అతి వేగవంతమైన విజయం. గతంలో 39 బంతుల్లో స్కాట్లాండ్పై లక్ష్యాన్ని ఛేదించింది. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. తొలి జట్టుగా
ఆసియాకప్-2025ను టీమిండియా అద్బుతమైన విజయంతో ఆరంభించింది. ఈ టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన తమ తొలి మ్యాచ్లో యూఏఈను 9 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. యూఏఈ నిర్ధేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 4.3 ఓవర్లలోనే చేధించింది.భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 30), శుబ్మన్ గిల్(9 బంతుల్లో 20 నాటౌట్) దూకుడుగా ఆడి మ్యాచ్ను ఫినిష్ చేశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన యూఏఈ 13.1 ఓవర్లలో కేవలం 57 పరుగులకే కుప్పకూలింది.భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు, శివమ్ దూబే మూడు వికెట్లు పడగొట్టగారు. వీరితో పాటు బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా వికెట్ సాధించారు.ఇక ఈ మ్యాచ్లో కేవలం 4.3 ఓవర్లను టార్గెట్ను ఫినిష్ చేసిన భారత్ పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది. చరిత్ర సృష్టించిన భారత్..ఆసియాకప్ టీ20 టోర్నీలో బంతులు పరంగా భారీ విజయం సాధించిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్లో 93 బంతులు మిగిలుండగానే భారత్ లక్ష్యాన్ని చేధించింది. ఇంతకుముందు ఈ రికార్డు అఫ్గానిస్తాన్ పేరిట ఉండేది.ఆసియాకప్-2022లో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో శ్రీలంకపై 59 బంతులు మిగిలూండగానే అఫ్గాన్ గెలుపొందింది. తాజా మ్యాచ్తో అఫ్గాన్ అల్టైమ్ రికార్డును భారత్ బ్రేక్ చేసింది. ఓవరాల్గా టీ20ల్లో టీమిండియాకు బంతులు పరంగా ఇదే భారీ విజయం కావడం గమనార్హం. అంతకుముందు టీ20 ప్రపంచకప్-2021లో స్కాట్లాండ్పై 81 బంతుల్లో మిగిలూండగా భారత్ విజయం సాధించింది. అదేవిధంగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యంతవేగంగా రన్ ఛేజ్ చేసిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. అగ్రస్దానంలో ఇంగ్లండ్ ఉంది. టీ20 ప్రపంచకప్-2024లో ఒమన్పై కేవలం 3.1 ఓవర్లలోనే ఇంగ్లండ్ లక్ష్యాన్ని చేధించింది. -
టీమిండియా సూపర్ విక్టరీ.. 27 బంతుల్లోనే టార్గెట్ ఫినిష్
ఆసియాకప్-2025లో భారత్ శుభారంభం చేసింది. ఈ టోర్నీలో భాగంగా బుధవారం దుబాయ్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ.. భారత బౌలర్ల ధాటికి 13.1 ఓవర్లలో కేవలం 57 పరుగులకే కుప్పకూలింది.టీమిండియా స్పిన్ ఉచ్చులో యూఏఈ బ్యాటర్లు చిక్కుకున్నారు. ఓపెనర్లు అలీషన్ షరాఫు(22), కెప్టెన్ వసీం మహ్మద్(19) ఆరంభంలో పర్వాలేదన్పించారు. షరాఫూను బుమ్రా ఔట్ చేశాక యూఏఈ వికెట్ల పతనం మొదలైంది. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 2.1 ఓవర్లలో కేవలం 7 పరుగులిచ్చి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో పాటు ఆల్రౌండర్ శివమ్ దూబే మూడు, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, బుమ్రా తలా వికెట్ సాధించారు.అభిషేక్ ధానాధన్..అనంతరం 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 4.3 ఓవర్లలో ఊదిపడేసింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 30) టాప్ స్కోరర్ కాగా.. శుబ్మన్ గిల్(20), సూర్యకకుమార్ యాదవ్(7) ఆజేయంగా నిలిచారు. యూఏఈ బౌలర్లలో సిద్దుఖీ ఒక్క వికెట్ సాధించాడు. ఇక భారత్ తమ తదుపరి మ్యాచ్లో సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్తో తలపడనుంది.చదవండి: Asia Cup 2025: జస్ప్రీత్ బుమ్రా సూపర్ యార్కర్.. దెబ్బకు బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో -
జస్ప్రీత్ బుమ్రా సూపర్ యార్కర్.. దెబ్బకు బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా మరోసారి తన మార్క్ చూపించాడు. ఆసియాకప్-2025లో భాగంగా యూఏఈతో జరుగుతున్న మ్యాచ్లో అద్బుతమైన యార్కర్తో మెరిశాడు. అతడి వేసిన బంతికి యూఏఈ బ్యాటర్ అలీషన్ షరాఫు వద్ద సమాధానమే లేకుండా పోయింది.యూఏఈ ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన బుమ్రా.. నాలుగో డెలివరీని అలీషన్కు సూపర్ యార్కర్గా సంధించాడు. అలీషన్ షరాఫు తన బ్యాట్ను కిందకు దించే లోపు బంతి ఆఫ్ స్టంప్ను గిరాటేసింది. దెబ్బకు యూఏఈ బ్యాటర్ బిత్తర పోయాడు. దీంతో అలీషన్(17 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్తో 22) ధానాదన్ ఇన్నింగ్స్కు తెరపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.కాగా వర్క్లోడ్ మెనెజ్మెంట్లో భాగంగా ఇంగ్లండ్ పర్యటనలో మధ్యలోనే వచ్చేసిన బుమ్రాకు ఇదే తొలి మ్యాచ్. అయితే యూఏఈతో మ్యాచ్కు బుమ్రాకు విశ్రాంతి ఇస్తారని వార్తలు వచ్చాయి. కానీ టీమ్మెనెజ్మెంట్ బుమ్రాకు మొదటి మ్యాచ్లో ఆడించి యువ పేసర్ అర్ష్దీప్ను బెంచ్కే పరిమితం చేసింది. ఈ మ్యాచ్లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా.. 19 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన యూఏఈ 13.1 ఓవర్లలో కేవలం 57 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించాడు. అతడితో పాటు శివమ్ దూబే మూడు, అక్షర్ పటేల్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి తలా వికెట్ సాధించాడు. యూఏఈ బ్యాటర్లలో అలీషన్ షరాఫు(22) టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.Jasprit Bumrah and knocking stumps over — name a better combo 💥Watch #DPWORLDASIACUP2025 - LIVE on #SonyLIV & #SonySportsNetwork TV Channels 📺#AsiaCup #INDvUAE pic.twitter.com/q3wrec57d2— Sony LIV (@SonyLIV) September 10, 2025