breaking news
Cricket
-
ఫైనల్కు సౌతాఫ్రికా.. సెమీస్లో ఇంగ్లండ్ చిత్తు
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025 ఫైనల్ల్లో సౌతాఫ్రికా జట్టు అడుగు పెట్టింది. బుధవారం నవీ ముంబై వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్ను 125 పరుగుల తేడాతో చిత్తు చేసిన దక్షిణాఫ్రికా.. తొలిసారి ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. 320 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మహిళల జట్టు 42.3 ఓవర్లలో కేవలం 194 పరుగలకే కుప్పకూలింది.ఇంగ్లండ్ బ్యాటర్లలో నాట్ స్కివర్ బ్రంట్(64) టాప్ స్కోరర్గా నిలవగా..కాప్సీ(50), వ్యాట్(34) రాణించారు. ఇంగ్లండ్ టాపర్డర్ మొత్తం విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో కాప్ ఐదు వికెట్లతో చెలరేగగా. క్లార్క్ రెండు ,ఖాకా, లూస్ ఓ వికెట్ సాధించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగుల మేరకు భారీ స్కోర్ సాధించింది. సౌతాఫ్రికా కెప్టెన్ వోల్వార్డ్(169) సూపర్ సెంచరీతో చెలరేగింది. -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా కెప్టెన్
మహిళల ప్రపంచకప్-2025 తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్పై సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడింది. గౌహతి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో లారా భారీ సెంచరీతో చెలరేగింది. 26 ఏళ్ల వోల్వార్డ్ కేవలం 20 ఫోర్లు, 4 సిక్స్లతో 169 పరుగులు చేసింది. ఆమె విధ్వసంకర బ్యాటింగ్ ఫలితంగా సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగుల మేరకు భారీ స్కోర్ సాధించింది. ఈ తుపాన్ ఇన్నింగ్స్తో వోల్వార్ట్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.లారా సాధించిన రికార్డులు ఇవే..👉ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్లో సెంచరీ చేసిన తొలి సౌతాఫ్రికా కెప్టెన్గా ఆమె నిలిచింది.👉మహిళల వన్డే వరల్డ్కప్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ప్లేయర్గా భారత క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ రికార్డును లారా సమం చేసింది. మిథాలీ అత్యధికంగా 13 సార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించగా.. లారా కూడా సరిగ్గా 13 సార్లు ఏభైకి పైగా పరుగులు చేసింది. అయితే వోల్వార్డ్ కేవలం 23 మ్యాచుల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం.👉మహిళల వన్డే క్రికెట్లో 5000 పరుగులు పూర్తి చేసిన తొలి సౌతాఫ్రికా ప్లేయర్గా నిలిచింది.👉ప్రపంచ కప్ నాకౌట్లలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన మూడో ప్లేయర్గా లారా రికార్డు నెలకొల్పింది. ఈ జాబితాలో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(171), ఆసీస్ కెప్టెన్ అలీసా హీలీ(170) తొలి రెండు స్దానాల్లో ఉన్నారు. -
కంగారు పడతారా? కంగారు పెట్టిస్తారా?
మహిళల వన్డే ప్రపంచకప్-2025లో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నమెంట్లో భాగంగా గురువారం ముంబై వేదికగా జరగనున్న రెండో సెమీఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి మూడో సారి ఫైనల్లో అడుగుపెట్టాలని హర్మన్ సేన భావిస్తోంది. 2017 ప్రపంచకప్ సెమీఫైనల్ నాటి ఫలితాన్నే రిపీట్ చేయాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది.మరోవైపు ఆసీస్ అమ్మాయిలు మాత్రం రికార్డు స్దాయిలో పదో సారి ఫైనల్కు చేరాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలబలాలపై ఓ లుక్కేద్దాం. ఈ మెగా టోర్నీలో ఈ రెండు జట్లు ఇప్పటికే లీగ్ దశలో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టీమిండియా నిర్దేశించిన 330 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఛేదించి ప్రపంచ రికార్డు సృష్టించింది. భారత్ బ్యాటింగ్లో సత్తాచాటినప్పటికి బౌలింగ్లో మాత్రం తేలిపోయింది.భారత్కు బిగ్ షాక్.. ఆసీస్కు జోష్సెమీఫైనల్కు ముందు భారత్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అద్బుతమైన ఫామ్లో ఉన్న ఓపెనింగ్ బ్యాటర్ ప్రతికా రావల్ గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే వైదొలిగింది. దీంతో ఆమె స్దానంలో విధ్వంసకర బ్యాటర్ షెఫాలీ వర్మ తిరిగి జట్టులోకి వచ్చింది. ఛాన్నాళ్ల తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన షెఫాలీ ఎలా రాణిస్తుందో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు గాయం కారణంగా గత రెండు మ్యాచ్లకు దూరమైన ఆసీస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ అలీసా హీలీ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించింది. దీంతో భారత్తో జరగనున్న సెమీఫైనల్లో ఆమె ఆడడం దాదాపు ఖాయమైంది. హీలీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉంది. లీగ్ దశలో భారత్తో జరిగిన మ్యాచ్లో ఆమె భారీ శతకం(142)తో చెలరేగింది.బలంగా ఆసీస్ బ్యాటింగ్ లైనప్భారత్తో పోలిస్తే ఆసీస్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కన్పిస్తోంది. టాప్ ఆర్డర్ విఫలమైనా.. మిడిల్ ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్లో పరుగులు సాధించే సత్తా ఉన్న ప్లేయర్లు ఆసీస్ జట్టులో ఉన్నారు. అలీసా హీలీ, బెత్ మూనీ, మెక్గ్రాత్, గార్డెనర్, పెర్రీ వంటి స్టార్ ప్లేయర్లు చెలరేగితే భారత బౌలర్లకు కష్టాలు తప్పవు. ఇక బౌలింగ్ విభాగంలో కూడా కంగారులు బలంగా ఉన్నారు. మెగాన్ షూట్, అలానా కింగ్, గార్డెనర్ వంటి వరల్డ్క్లాస్ బౌలర్లు ఆసీస్ వద్ద ఉన్నారు.స్మృతి చెలరేగుతుందా?ఇక ఆసీస్తో సెమీఫైనల్ నేపథ్యంలో అందరి కళ్లు భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానపైనే ఉన్నాయి. అద్బుతమైన ఫామ్లో ఉన్న మంధాన కీలకమైన సెమీస్లో ఎలా రాణిస్తుందో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. టోర్నీ ఆరంభంలో తడబడిన మంధాన.. ఆ తర్వాత మాత్రం సూపర్ కమ్బ్యాక్ ఇచ్చింది. ఇప్పటివరకు ఈ టోర్నీలో 7 మ్యాచ్లు ఆడిన మంధాన, 60.8 సగటుతో 365 పరుగులు సాధించింది. ఇందులో ఒక సెంచరీ, రెండు ఆర్ధ శతకాలు ఉన్నాయి. ఆసీస్తో జరిగిన లీగ్ మ్యాచ్లో 80 పరుగులతో సత్తాచాటింది. ఇప్పుడు నాకౌట్ మ్యాచ్లో కూడా అదే జోరును కొనసాగించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. కానీ మంధానకు ఆసీస్ స్టార్ పేసర్ మెగాన్ షూట్ నుంచి గట్టి పోటీ ఎదురు కానుంది. కొత్త బంతితో బౌలింగ్ చేసే షూట్.. మంధానాను ఇప్పటివరకు వన్డేల్లో 4 సార్లు అవుట్ చేసింది. మంధానతో పాటు కొత్తగా జట్టులోకి వచ్చిన షెఫాలీ వర్మ బ్యాట్ ఝుళిపిస్తే భారత్కు తిరిగుండదు. మిడిలార్డర్లో రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్ ప్రీత్, రిచా ఘోష్లు తమ బ్యాట్కు పనిచెప్పాల్సిందే. అప్పుడే ఆసీస్ వంటి పటిష్టమైన జట్టును మన అమ్మాయిలు ఆపగలరు. బౌలింగ్లో భారత్కు రేణుకా సింగ్, దీప్తీ శర్మ, రాధా యాదవ్ కీలకం కానున్నారు. ఆసీపై స్పిన్నర్ రాధా యాదవ్కు మంచి రికార్డు ఉంది.ఆసీస్దే పైచేయి..భారత్-ఆస్ట్రేలియా ఇప్పటివరకు మూడు సార్లు వన్డే ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్లలో తలపడ్డాయి. ఆసీస్ రెండింట విజయం సాధించగా.. భారత్ ఒక్క మ్యాచ్లో గెలుపొందింది. 2017 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా మహిళలపై భారత్ ఘన విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 171 పరుగుల చారిత్రత్మక ఇన్నింగ్స్ ఆడింది.చదవండి: సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు -
భారీ సెంచరీతో చెలరేగిన సౌతాఫ్రికా కెప్టెన్
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా గౌహతి వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ అద్బుతమైన సెంచరీతో చెలరేగింది.ఓపెనర్గా బరిలోకి దిగిన వోల్వార్డ్ ఇంగ్లీష్ బౌలర్లను ఉతికారేసింది. ఆమె కేవలం 115 బంతుల్లోనే తన పదివ వన్డే సెంచరీ మార్క్ను అందుకుంది. సెంచరీ పూర్తియ్యాక లారా మరింత చెలరేగిపోయింది. 47వ ఓవర్ వేసిన స్మిత్ బౌలింగ్లో వోల్వార్డ్ ఏకంగా 20 పరుగులు పిండుకుంది. మొత్తంగా 143 బంతులు ఎదుర్కొన్న లారా వోల్వార్డ్.. 20 ఫోర్లు, 4 సిక్స్లతో 169 పరుగులు చేసింది. ఆమెతో పాటు టాజ్మిన్ బ్రిట్స్(45), కాప్(42), ట్రయాన్(33) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. సోఫీ ఎక్లెస్టోన్ 4 వికెట్లు పడగొట్టగా.. లారెన్ బెల్ రెండు, నాట్ స్కీవర్ ఒక్క వికెట్ సాధించారు. రెండో జట్టుగా రికార్డు..కాగా వన్డే వరల్డ్కప్ చరిత్రలో సౌతాఫ్రికాకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇంతకుముందు ప్రస్తుత వరల్డ్కప్లోనే పాకిస్తాన్పై 312 పరుగులు ప్రోటీస్ సాధించింది.అదేవిధంగా వరల్డ్కప్ నాకౌట్ మ్యాచ్లలో రెండో అత్యధిక టోటల్ నెలకొల్పిన జట్టుగా సౌతాఫ్రికా నిలిచింది. ఈ జాబితాలో ఆసీస్ అగ్రస్ధానంలో ఉంది. 2022 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్పై ఆసీస్ ఏకంగా 356 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.చదవండి: సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు -
సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టు హోదా ఉన్న జట్ల తరఫున అత్యంత వేగంగా 150 సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్గా ప్రపంచ రికార్డు సాధించాడు. ముంబైకి చెందిన 35 ఏళ్ల సూర్యకుమార్ ఆలస్యంగానే టీమిండియాలో ఎంట్రీ ఇచ్చాడు.ఇంగ్లండ్తో స్వదేశంలో టీ20 సిరీస్ సందర్భంగా భారత్ తరఫున 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సూర్యకుమార్ యాదవ్.. ఆ తర్వాత వన్డే, టెస్టుల్లోనూ అరంగేట్రం చేశాడు. అయితే, ఈ రెండు ఫార్మాట్లలోనూ సత్తా చాటలేక చతికిల పడ్డ సూర్య.. తనకు కలిసి వచ్చిన టీ20 క్రికెట్లో మాత్రం వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్గా ఎదిగాడు.వరుస విజయాలుఈ క్రమంలో గతేడాది ఏకంగా టీమిండియా టీ20 కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన సూర్య.. వరుస విజయాలు సాధించాడు. ఇటీవలే ఆసియా టీ20 కప్-2025లో భారత్ను చాంపియన్గా నిలిపాడు. కానీ బ్యాటర్గా మాత్రం విఫలం కావడం విమర్శలకు దారితీసింది.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటనలో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్న సూర్య.. తొలి టీ20లో ధనాధన్ ఇన్నింగ్స్తో అలరించాడు. కాన్బెర్రా వేదికగా టాస్ గెలిచిన ఆసీస్.. భారత్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది.వర్షం వల్ల మ్యాచ్ రద్దుఈ క్రమంలో ఓపెనర్ అభిషేక్ శర్మ (14 బంతుల్లో 19) వేగంగా ఆడే ప్రయత్నంలోనే.. నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో టిమ్ డేవిడ్కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్గా పెవిలియన్ చేరాడు. అతడి స్థానంలో వన్డౌన్లో వచ్చిన సూర్య.. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ (Shubman Gill)తో కలిసి దంచికొట్టాడు. అయితే, వర్షం వల్ల ఈ మ్యాచ్ అర్ధంతరంగా ముగిసిపోయింది.అప్పటికి.. 9.4 ఓవర్ల ఆట సాగగా.. వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది టీమిండియా. గిల్ 20 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 37 పరుగులు చేయగా.. సూర్యకుమార్ 24 బంతుల్లో 39 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. Fearless batting on display! 💥We’re in for a @surya_14kumar special!Match Update ➡️ Rain Delay. Revised start time awaited!#AUSvIND 👉 1st T20I | LIVE NOW 👉 https://t.co/nKdrjgZhGQ pic.twitter.com/87NwgUurcT— Star Sports (@StarSportsIndia) October 29, 2025205 సిక్సర్లతో టాప్లో రోహిత్ ఇక ఈ మ్యాచ్ సందర్భంగా సూర్య అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో 150 సిక్సర్ల క్లబ్లో చేరాడు. ఈ జాబితాలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ 205 సిక్సర్లతో టాప్లో ఉండగా.. సూర్య ఐదో స్థానంలో నిలిచాడు.అయితే, అత్యంత తక్కువ ఇన్నింగ్స్లోనే అంటే.. 86వ ఇన్నింగ్స్లోనే 150 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు సూర్య. తద్వారా ఐసీసీ ఫుల్ మెంబర్ల (టెస్టు హోదా) జట్ల తరఫున ఫాస్టెస్ట్ 150 సిక్సెస్ సాధించిన తొలి క్రికెటర్గా నిలిచాడు. ఇక అసోసియేట్ దేశమైన యూఏఈ తరఫున ముహమ్మద్ వసీం 66 ఇన్నింగ్స్లోనే ఈ ఘనత సాధించడం విశేషం.అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-5 క్రికెటర్లు🏏 రోహిత్ శర్మ (ఇండియా)- 159 మ్యాచ్లలో 205 సిక్సర్లు🏏ముహమ్మద్ వసీం (యూఏఈ)- 91 మ్యాచ్లలో 187 సిక్సర్లు🏏మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్)- 122 మ్యాచ్లలో 173 సిక్సర్లు🏏జోస్ బట్లర్ (ఇంగ్లండ్)- 144 మ్యాచ్లలో 172 సిక్సర్లు🏏సూర్యకుమార్ యాదవ్ (ఇండియా)- 91 మ్యాచ్లలో 150 సిక్సర్లు*.చదవండి: PKL 2025: అతడొక అద్భుతం.. తెలుగు టైటాన్స్కు దొరికిన ఆణిముత్యం -
భారత్- ఆస్ట్రేలియా తొలి టీ20 వర్షార్పణం
కాన్బెర్రా వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దు అయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ తొలుత టీమిండియాను బ్యాటింగ్ అహ్హనించాడు. అయితే భారత ఇన్నింగ్స్ ఐదవ ఓవర్ ముగిసిన వెంటనే వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఆటను అంపైర్లు నిలిపివేశారు. వర్షం పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో తిరిగి ఆటను ప్రారంభించారు. అయితే మ్యాచ్ను మాత్రం 18 ఓవర్లకు కుదించారు. తిరిగి క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్ ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇద్దరు బ్యాటర్లు మంచి జోరు మీద ఉన్న సమయంలో వర్షం మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. భారత్ స్కోర్ 97/1(9.4 ఓవర్లు) వద్ద ఆటను నిలిపివేశారు.అయితే ఈసారి వర్షం తగ్గుముఖం పట్టే సూచనలు కన్పించకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. ఫలితం తేలని ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్(39 నాటౌట్), శుభ్మన్ గిల్(37 నాటౌట్), అభిషేక్ శర్మ 19 పరుగులు చేశారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 మెల్బోర్న్ వేదికగా శుక్రవారం జరగనుంది.తుదిజట్లు:టీమిండియా అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.ఆస్ట్రేలియామిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టొయినిస్, జోష్ ఫిలిప్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్వుడ్.చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. టీమిండియాకు భారీ షాక్ -
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. టీమిండియాకు భారీ షాక్
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు భారీ షాక్ తగిలింది. ఐదు టీ20ల సిరీస్లో తొలి మూడు మ్యాచ్లకు స్టార్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది. అడిలైడ్లో ఆసీస్తో జరిగిన రెండో వన్డేలో నితీష్కు ఎడమ తొడ కండరాల (క్వాడ్రిసెప్స్) గాయం అయింది.దీంతో అతను సిడ్నీలో జరిగిన మూడో వన్డేకు దూరంగా ఉన్నాడు. అయితే టీ20 సిరీస్ సమయానికి ఈ ఆంధ్ర క్రికెటర్ కోలుకుంటాడని అంతా భావించారు. కానీ క్వాడ్రిసెప్స్ గాయం నుంచి కోలుకునే క్రమంలో అతడికి మెడకు (స్పాసమ్స్) సమస్య కూడా తలెత్తింది. దీంతో అతడు పూర్తి ఫిట్నెస్ సాధించడానికి వారం రోజుల సమయం పట్టనున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది జూన్లో కూడా ఇంగ్లండ్ పర్యటన మధ్యలోనే గాయం కారణంగా నితీశ్ స్వదేశానికి వచ్చేశాడు.కాగా కాన్బెర్రా వేదికగా జరుగుతున్న తొలి టీ20లో భారత్ నితీశ్ గైర్హజరీలో శివమ్ దూబే, హర్షిత్ రాణా వంటి పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే తొలి టీ20కు వర్షం పదే పదే అంతరాయం కలిగిస్తోంది. 9.4 ఓవర్ల వద్ద వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. భారత్ స్కోర్ 97-1గా ఉంది.తుదిజట్లు:టీమిండియా అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.ఆస్ట్రేలియామిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టొయినిస్, జోష్ ఫిలిప్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్వుడ్. -
శ్రేయస్ అయ్యర్ కోసం సూర్యకుమార్ తల్లి పూజలు.. వీడియో వైరల్
టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. త్వరలోనే శ్రేయస్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సోదరి దీనాల్ యాదవ్ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అమ్మ.. అయ్యర్ కోసం ప్రార్థిస్తోంది‘‘అమ్మ.. శ్రేయస్ అయ్యర్ కోసం ప్రార్థిస్తోంది’’ అంటూ దినాల్ ఇన్స్టా స్టోరీలో ఓ వీడియోను షేర్ చేసింది. ఛట్ పూజకు వెళ్లిన సూర్య తల్లి స్వప్న యాదవ్.. ‘‘ప్రతి ఒక్కరు శ్రేయస్ అయ్యర్ కోసం ప్రార్థించండి. అతడు క్షేమంగా తిరిగి రావాలని మొక్కుకోండి.అమ్మ ప్రేమ ఇలాగే ఉంటుందిశ్రేయస్ ఆరోగ్యం బాగా లేదని తెలిసి నా మనసు ఆందోళనకు గురైంది. అతడు త్వరలోనే ఇంటికి తిరిగి రావాలని దయచేసి అంతా ప్రార్థన చేయండి’’ అని స్వప్న యాదవ్ తన చుట్టూ ఉన్న వాళ్లకు విజ్ఞప్తి చేశారు. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘అమ్మ ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది.. శ్రేయస్ పట్ల మీ ఆప్యాయత మమ్మల్ని కదిలించింది’’ అంటూ ఉద్వేగానికి లోనవుతున్నారు.అంతర్గత రక్తస్రావంకాగా ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా ఆఖరిదైన మూడో వన్డే సందర్భంగా శ్రేయస్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. అలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్ అందుకున్న శ్రేయస్.. ఆ వెంటనే నొప్పితో విలవిల్లాడుతూ కుప్పకూలిపోయాడు. పక్కటెముకలకు తీవ్రమైన గాయం కావడంతో హుటాహుటిన సిడ్నీ హాస్పిటల్కు తరలించారు. పరీక్షల్లో అంతర్గత రక్తస్రావం గుర్తించిన ఆస్ట్రేలియా డాక్టర్లు వెంటనే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి చికిత్స అందజేయడంతో కోలుకున్నాడు.డాక్టర్ల పర్య వేక్షణలోనేశ్రేయస్ ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చి తదుపరి చికిత్సను కొనసాగిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘గాయం కచ్చితంగా ఎక్కడైందో గుర్తించి అంతర్గత రక్తస్రావాన్ని నిరోధించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ డాక్టర్ల పర్య వేక్షణలోనే ఉన్నాడు’ అని బోర్డు ఆ ప్రకటనలో పేర్కొంది.పెద్ద గాయమే అయినామరోవైపు.. ఆసీస్తో తొలి టీ20కి ముందు సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘దేవుడు అయ్యర్ పక్షాన వున్నాడు. అందుకే పెద్ద గాయమే అయినా వేగంగా కోలుకుంటున్నాడు. సిడ్నీ డాక్టర్లు, బోర్డు ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నారు. త్వరలోనే అతను పూర్తిగా కోలుకుంటాడు’ అని అన్నాడు. చదవండి: టీమిండియా ‘హెడ్కోచ్’తో ఆటగాళ్ల తెగదెంపులు.. వేటు వేసిన బీసీసీఐ!Suryakumar Yadav’s mother praying for Shreyas Iyer’s recovery during Chhath Puja. 🥺❤️pic.twitter.com/CkYD26lzHo— Mufaddal Vohra (@mufaddal_vohra) October 29, 2025 -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో (ICC ODI Rankings) టీమిండియా వెటరన్ స్టార్ రోహిత్ శర్మ (Rohit Sharma) నంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు. ఆసీస్తో జరిగిన రెండు, మూడు వన్డేల్లో (73, 121 నాటౌట్) చెలరేగడంతో 36 రేటింగ్ పాయింట్లు మెరుగుపర్చుకొని, తొలిసారి వన్డే ర్యాంకింగ్స్లో అగ్రపీఠాన్ని అధిరోహించాడు.ఈ ఘనతను రోహిత్ 38 ఏళ్ల 182 రోజల వయసులో సాధించాడు. తద్వారా అత్యంత లేటు వయసులో నంబర్ వన్ బ్యాటర్గా అవతరించిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గత వారం ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో ఉండిన రోహిత్.. రెండు స్థానాలు మెరుగుపర్చుకొని టాప్ ప్లేస్కు చేరాడు.ఈ క్రమంలో అగ్రపీఠంపై తిష్ట వేసిన సహచరుడు, వన్డే జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ను కిందికి దించాడు. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, శుభ్మన్ గిల్ తర్వాత నంబర్ వన్ వన్డే బ్యాటర్గా అవతరించిన భారత బ్యాటర్గానూ రికార్డుల్లోకెక్కాడు.ఆసీస్తో తాజాగా జరిగిన 3 మ్యాచ్లో సిరీస్లో (10, 9, 24) విఫలమైన గిల్ రెండు స్థానాలు కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు. ఇదే సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో డకౌటైన మరో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఓ స్థానం కోల్పోయి ఆరో స్థానానికి పడిపోయాడు. ఇదే సిరీస్లోని రెండో వన్డేలో హాఫ్ సెంచరీ సాధించిన శ్రేయస్ అయ్యర్ ఓ స్థానం మెరుగుపర్చుకొని 10 నుంచి తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్ టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ 3 స్థానాలు ఎగబాకి నాలుగో ప్లేస్కు చేరుకున్నాడు. ఆసీస్ పేసర్ జోష్ హాజిల్వుడ్ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి చేరాడు. టాప్-10లో ఏకైక టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ ఓ స్థానం కోల్పోయి ఏడో స్థానానికి పడిపోయాడు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో అక్షర్ పటేల్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి చేరగా.. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ టాప్ ప్లేస్ను ఎంజాయ్ చేస్తున్నాడు. చదవండి: రాణించిన రచిన్, మిచెల్.. న్యూజిలాండ్దే వన్డే సిరీస్ -
IND vs AUS 1st T20I: వర్షం వల్ల మ్యాచ్ రద్దు
Australia vs India, 1st T20I- Canberra: ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైపోయింది. కాన్బెర్రాలో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్కు దిగింది. ఈ క్రమంలో ఐదు ఓవర్ల తర్వాత ఆటకు వర్షం అంతరాయం కలిగించగా.. మ్యాచ్ను 18 ఓవర్లకు కుదించారు. కాసేపటి తర్వాత తిరిగి మొదలుపెట్టారు.అయితే, 9.4 ఓవర్ల మధ్య వర్షం మళ్లీ ఆటంకం కలిగించింది. ఆ తర్వాత వాన తగ్గే సూచనలు కనిపించకపోవడంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. 9.4 ఓవర్లలో టీమిండియా వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 14 బంతుల్లో 19 పరుగులు చేసి నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ (20 బంతుల్లో 37), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (24 బంతుల్లో 39) అజేయంగా నిలిచారు.మళ్లీ వర్షం.. ఆగిన ఆట9.4 ఓవర్ల వద్ద వర్షం మళ్లీ ఆటకు ఆటంకం కలిగింది. స్కోరు: 97-1. సూర్య 24 బంతుల్లో 39, గిల్ 20 బంతుల్లో 37 పరుగులతో క్రీజులో ఉన్నారు.తొమ్మిది ఓవర్లలో టీమిండియా స్కోరు: 82-1.సూర్య 20 బంతుల్లో 37, సూర్య 20 బంతుల్లో 25 పరుగులతో క్రీజులో ఉన్నారు.తిరిగి ప్రారంభమైన ఆట.. ఆట తిరిగి ప్రారంభమైంది. 6 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. క్రీజులో శుభ్మన్ గిల్(25), సూర్యకుమార్ యాదవ్(12) ఉన్నారు.వర్షం వల్ల ఆటకు అంతరాయంఐదు ఓవర్ల ఆట ముగిసే సరికి భారత్ స్కోరు: 43-1. గిల్ 16, సూర్య 8 పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన భారత్3.5: నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో తొలి వికెట్గా వెనుదిరిగిన అభిషేక్ శర్మ. 14 బంతుల్లో 19 పరుగులు చేసి టిమ్ డేవిడ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ఓపెనింగ్ బ్యాటర్. టీమిండియా స్కోరు: 36-1(4). గిల్ 16 పరుగులతో ఉండగా.. సూర్యకుమార్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నాడు.టాస్ గెలిచిన ఆస్ట్రేలియాకాన్బెర్రా వేదికగా టీమిండియాతో తొలి టీ20లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా (IND vs AUS 1st T20I) తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా ఆసీస్ సారథి మిచెల్ మార్ష్ (Mitchell Marsh) మాట్లాడుతూ.. ‘‘వికెట్ బాగుంది. కాన్బెర్రాలో ప్రేక్షకుల మద్దతు కూడా మాకు కలిసి వస్తుంది. టీమిండియా మాదిరే మేము కూడా దూకుడైన క్రికెట్ ఆడుతున్నాం.ఇరుజట్లు పటిష్టంగా ఉన్నాయి. ప్రస్తుతం టీమిండియా వరల్డ్ నంబర్ వన్ జట్టుగా ఉంది. ఇలాంటి జట్టుతో పోటీ అంటే ఆసక్తికరమే. మా జట్టులో అవసరమైన మేర బ్యాటర్లు, బౌలర్లు, ఆల్రౌండర్లు ఉన్నారు’’ అని పేర్కొన్నాడు.ఇక టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘మేము ముందుగా బ్యాటింగ్ చేయాలనే భావించాము. వికెట్ బాగుంది. మనుకా ఓవల్లో ఎక్కువ మ్యాచ్లు జరుగలేదని మా అనలిస్టుల ద్వారా విన్నాను. సెకండ్ ఇన్నింగ్స్లో వికెట్ కాస్త నెమ్మదించవచ్చు.అది ఎప్పుడూ తలనొప్పిగానే ఉంటుందిఅందుకే ముందుగానే బ్యాటింగ్ చేయాలనే అనుకున్నాం. మూడు- నాలుగు రోజుల ముందే ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేశాము. నిన్నటి మాదిరే ఈరోజు వాతావరణం చల్లగా ఉంది.మా జట్టులో ప్రతి ఆటగాడు తన వంతు పాత్ర పోషిస్తాడు. బాధ్యతాయుతంగా ఆడతారు. అందుకే తుదిజట్టు ఎంపిక ఎప్పుడూ తలనొప్పిగా మారుతుంది. అయితే, ఆ విషయంలో మాకు సంతోషంగా ఉంది. ఇంతమంది మంచి ఆటగాళ్లు అందుబాటులో ఉండటం సానుకూలాంశం. మాకు చాలా ఆప్షన్లు ఉన్నాయి.నితీశ్ రెడ్డి అవుట్ఈరోజు రింకూ సింగ్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, నితీశ్ రెడ్డి మిస్సవుతున్నారు’’ అని తెలిపాడు. కాగా గాయం కారణంగా నితీశ్ రెడ్డి ఆస్ట్రేలియాతో తొలి మూడు టీ20 మ్యాచ్లకు దూరం కానున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వెల్లడించింది. గజ్జల్లో గాయంతో ఇబ్బంది పడుతున్న నితీశ్ రెడ్డి బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపింది. తుదిజట్లు:టీమిండియా అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.ఆస్ట్రేలియామిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టొయినిస్, జోష్ ఫిలిప్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్వుడ్.చదవండి: నేను మాట్లాడితే కథ వేరేలా మారుతుంది.. సెలక్టర్ జోక్యంతో షమీ యూటర్న్?SKYBALL incoming!Get ready for some fearless batting, full hitting as #TeamIndia have been put in to bat first in the 1st T20I!#AUSvIND 👉 1st T20I | LIVE NOW 👉 https://t.co/nKdrjgZhGQ pic.twitter.com/wpak5bA2lz— Star Sports (@StarSportsIndia) October 29, 2025 -
అందుకే ఓడిపోయాం: పాకిస్తాన్ కెప్టెన్
స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆరంభంలోనే పాకిస్తాన్ క్రికెట్ జట్టు (Pak vs SA 1st T20I)కు చేదు అనుభవం ఎదురైంది. తొలి టీ20 మ్యాచ్లో పాక్.. పర్యాటక జట్టు చేతిలో ఏకంగా 55 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. బ్యాటర్లు, బౌలర్ల సమిష్టి వైఫల్యం కారణంగా ఓటమిని మూటగట్టుకుంది.సింగిల్స్, డబుల్స్తో నెట్టుకురాలేముఈ నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) ఓటమిపై స్పందిస్తూ.. జట్టు ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘బ్యాటింగ్లో శుభారంభమే అందుకున్నాం. కానీ దానిని కొనసాగించలేకపోయాం. మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడం తీవ్ర ప్రభావం చూపింది.ఈ లోపాన్ని మేము అధిగమించాలి. బ్యాటింగ్ బాగుంటేనే అంతా బాగుంటుంది. మధ్య ఓవర్లలో భాగస్వామ్యాలు నెలకొల్పాల్సిన అసవరం ఉంది. అలా అని సింగిల్స్, డబుల్స్తో నెట్టుకురాలేము.ఆరంభంలో అస్సలు బాగాలేదుఇక ఈ మ్యాచ్లో బంతితోనూ మేము రాణించలేకపోయాం. ముఖ్యంగా పవర్ ప్లేలో ధారాళంగా పరుగులు ఇచ్చాము. మా బౌలింగ్ ఆరంభంలో అస్సలు బాగాలేదు. అయితే, మధ్య ఓవర్లలో పొదుపుగా బౌల్ చేయడం సానుకూలాంశం’’ అని సల్మాన్ ఆఘా పేర్కొన్నాడు.కాగా రెండు టెస్టులు, మూడు టీ20, మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా పాకిస్తాన్లో పర్యటిస్తోంది. ఇప్పటికే టెస్టు సిరీస్ ముగియగా.. ఇరుజట్లు చెరో విజయంతో 1-1తో సమం చేసుకున్నాయి. ఈ క్రమంలో రావల్పిండి వేదికగా మంగళవారం రాత్రి టీ20 సిరీస్ ఆరంభమైంది.దంచికొట్టిన ఓపెనర్లుటాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 194 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు రీజా హెండ్రిక్స్ (40 బంతుల్లో 60), క్వింటన్ డికాక్ (13 బంతుల్లో 23) దంచికొట్టారు. వన్డౌన్లో వచ్చిన టోనీ డి జార్జ్ (16 బంతుల్లో 33), ఏడో నంబర్ బ్యాటర్ జార్జ్ లిండే (22 బంతుల్లో 36) మెరుపులు మెరిపించారు.పాక్ బౌలర్లలో మొహమ్మద్ నవాజ్ మూడు వికెట్లు తీయగా.. సయీమ్ ఆయుబ్ రెండు, షాహిన్ ఆఫ్రిది, నసీం షా, అబ్రార్ అహ్మద్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో పాక్ శుభారంభమే అందుకుంది.చెలరేగిన సఫారీ బౌలర్లుఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (19 బంతుల్లో 24), సయామ్ ఆయుబ్ (28 బంతుల్లో 37) వేగంగా ఆడే ప్రయత్నం చేశారు. అయితే, రీఎంట్రీలో బాబర్ ఆజం డకౌట్ కాగా.. కెప్టెన్ సల్మాన్ ఆఘా (2) పూర్తిగా నిరాశపరిచాడు. ఆఖర్లో మొహమ్మద్ నవాజ్ (20 బంతుల్లో 36) కాసేపు మెరుపులు మెరిపించినా.. ప్రొటిస్ బౌలర్ల ధాటికి ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. లోయర్ ఆర్డర్ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. పాక్కు ఓటమి తప్పలేదు.సఫారీ బౌలర్లలో కార్బిన్ బాష్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. జార్జ్ లిండే మూడు, లిజాడ్ విలియమ్స్ రెండు, లుంగీ ఎంగిడీ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇరుజట్ల మధ్య శుక్రవారం (అక్టోబరు 31) జరిగే మ్యాచ్కు లాహోర్లోని గడాఫీ స్టేడియం వేదిక.చదవండి: నేను మాట్లాడితే కథ వేరేలా మారుతుంది.. సెలక్టర్ జోక్యంతో షమీ యూటర్న్? -
న్యూజిలాండ్దే వన్డే సిరీస్
స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను (New Zealand vs England) న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. హ్యామిల్టన్ వేదికగా ఇవాళ (అక్టోబర్ 29) జరిగిన రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. బ్లెయిర్ టిక్నర్ (8-1-34-4), నాథన్ స్మిత్ (5-0-27-2) ధాటికి 36 ఓవర్లలో 175 పరుగులకే ఆలౌటైంది. జేకబ్ డఫీ, జకరీ ఫౌల్క్స్, మిచెల్ సాంట్నర్, బ్రేస్వెల్ కూడా తలో వికెట్ తీసి ఇంగ్లండ్ను మట్టుబెట్టడంలో తమవంతు పాత్ర పోషించారు.జేమీ ఓవర్టన్ (42), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. వీరితో పాటు జేమీ స్మిత్ (13), జో రూట్ (25), జేకబ్ బేతెల్ (18), సామ్ కర్రన్ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ (9) వైఫల్యాల పరంపరను కొనసాగించాడు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనను న్యూజిలాండ్ 33.1 ఓవర్లలోనే ముగించింది. అయితే లక్ష్యాన్ని చేరుకునేందుకు సగం వికెట్లు కోల్పోయింది. రచిన్ రవీంద్ర (54), డారిల్ మిచెల్ (56 నాటౌట్) రాణించారు. కేన్ విలియమ్స్ (21) మంచి ఆరంభం లభించినా పెద్ద స్కోర్గా మలచలేకపోయాడు.ఆఖర్లో కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (17 బంతుల్లో 34 నాటౌట్) బ్యాట్ ఝులిపించి మ్యాచ్ను వేగంగా ముగించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ (10-4-23-3) ప్రమాదకరంగా బౌలింగ్ చేశాడు. ఓవర్టన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.కాగా, మూడు మ్యాచ్ల టీ20, వన్డే సిరీస్ల కోసం ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్లో పర్యటిస్తుంది. టీ20 సిరీస్ను ఇంగ్లండ్ 1-0 తేడాతో (2 మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి) కైవసం చేసుకోగా.. వన్డే సిరీస్ను న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే ఖాతాలో వేసేసుకుంది. చదవండి: శతక్కొట్టిన స్టీవ్ స్మిత్.. యాషెస్ సిరీస్కు ముందు ఇంగ్లండ్కు వార్నింగ్ -
ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. అయినా పృథ్వీ షాకు తప్పని భంగపాటు!
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్తో మహారాష్ట్రతో తన ప్రయాణం మొదలుపెట్టాడు టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw). తొలుత కేరళతో జరిగిన మ్యాచ్లో డకౌట్ అయినా.. రెండో ఇన్నింగ్స్లో అర్ధ శతకం (75)తో సత్తా చాటాడు. తాజాగా చండీగఢ్తో మ్యాచ్లో మాత్రం పృథ్వీ షా విశ్వరూపం ప్రదర్శించాడు. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీచండీగఢ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 8 పరుగులకే పృథ్వీ పరిమితమయ్యాడు. అయితే, రెండో ఇన్నింగ్స్లో విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడి మహారాష్ట్ర విజయంలో కీలక పాత్ర పోషించాడు. 141 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రంజీ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ (Fastest Double Century) నమోదు చేశాడు.222 Runs of pure statement. 💥Prithvi Shaw lights up the Ranji stage with a jaw-dropping 222 — his maiden double ton for Maharashtra, laced with 28 fours and 5 sixes against Chandigarh. A knock that screams class, confidence, and comeback. #mca #mcacricket #teammaharashtra… pic.twitter.com/g3vcoropH8— Maharashtra Cricket Association (@MahaCricket) October 28, 2025పృథ్వీ షాకు భంగపాటు!మొత్తంగా 156 బంతుల్లో 222 పరుగులు సాధించిన పృథ్వీ షా.. ఇన్నింగ్స్లో 29 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అయితే, అర్జున్ ఆజాద్ బౌలింగ్లో నిషాంక్ బిర్లాకు క్యాచ్ ఇవ్వడంతో పృథ్వీ షా ఇన్నింగ్స్కు తెరపడింది. ఏదేమైనా డబుల్ సెంచరీతో సత్తా చాటిన పృథ్వీ షాను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరిస్తుందని అంతా భావించారు.పృథ్వీ షాకు రుతురాజ్ సర్ప్రైజ్అయితే, పృథ్వీని కాదని.. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ (163 బంతుల్లో 116) సాధించిన రుతురాజ్ గైక్వాడ్కు ఈ బహుమానం దక్కింది. ఈ నేపథ్యంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న రుతు.. పృథ్వీకి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చాడు. పృథ్వీని దగ్గరికి పిలిచి అతడితో కలిసి అవార్డును పంచుకున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియోను మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సమిష్టి కృషి, పరస్పర గౌరవం, క్రీడాస్ఫూర్తికి ఇది నిదర్శనం అంటూ హర్షం వ్యక్తం చేసింది. కాగా ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా చండీగఢ్పై మహారాష్ట్ర 144 పరుగుల తేడాతో విజయం సాధించింది.Shared Glory, True Spirit 🫡Ruturaj Gaikwad shared his Player of the Match award with Prithvi Shaw, recognising Shaw’s sensational 222-run knock that set up Maharashtra’s victory. A gesture that speaks volumes — teamwork, respect, and mutual excellence at its best.#mca… pic.twitter.com/yMWHsW7Miq— Maharashtra Cricket Association (@MahaCricket) October 28, 2025చండీగఢ్ వర్సెస్ మహారాష్ట్ర సంక్షిప్త స్కోర్లు👉మహారాష్ట్ర: 313 & 359/3 డిక్లేర్డ్👉చండీగఢ్ : 209 &319👉ఫలితం: చండీగఢ్పై 144 పరుగుల తేడాతో మహారాష్ట్ర గెలుపు.. మహారాష్ట్రకు ఆరు పాయింట్లు.చదవండి: నేను మాట్లాడితే కథ వేరేలా మారుతుంది.. సెలక్టర్ జోక్యంతో షమీ యూటర్న్? -
శతక్కొట్టిన స్టీవ్ స్మిత్
యాషెస్ సిరీస్కు (Ashes Series 2025-26) ముందు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (Steve Smith) సింహ గర్జన చేశాడు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా క్వీన్స్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో సెంచరీతో సత్తా చాటాడు. న్యూ సౌత్ వేల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న స్మిత్.. 158 బంతుల్లో 16 ఫోర్లు, సిక్సర్ సాయంతో మూడంకెల మార్కును చేరాడు.ఈ సెంచరీతో యాషెస్ తొలి టెస్ట్కు ముందు ప్రత్యర్ది ఇంగ్లండ్కు స్ట్రాంగ్ వార్నింగ్ మెసేజ్ పంపాడు. ఐదు మ్యాచ్ల యాషెస్ సిరీస్లో తొలి టెస్ట్ పెర్త్ వేదికగా నవంబర్ 21 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో స్మిత్ ఆసీస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఫిట్గా లేకపోవడంతో క్రికెట్ ఆస్ట్రేలియా స్మిత్కు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది.తొలి టెస్ట్ కోసం ఆసీస్ జట్టును ప్రకటించాల్సి ఉంది. 2018లో సాండ్పేపర్ వివాదం తర్వాత స్మిత్ కెప్టెన్సీ కోల్పోయాడు. అప్పటి నుంచి వైస్ కెప్టెన్గా కొనసాగుతూ ఆరు టెస్టుల్లో తాత్కాలిక నాయకత్వం వహించాడు. సాధారణ ఆటగాడిగా కంటే కెప్టెన్గా స్మిత్ బ్యాటింగ్ రికార్డు అద్భుతంగా ఉంది. సాధారణ ఆటగాడిగా అతని సగటు 49.9గా ఉంటే, కెప్టెన్గా అది 68.98గా ఉంది.మ్యాచ్ విషయానికొస్తే.. క్వీన్స్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న న్యూ సౌత్ వేల్స్ రెండో రోజు మూడో సెషన్ సమయానికి 2 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్తో పాటు కర్టిస్ ప్యాటర్సన్ (112) సెంచరీ పూర్తి చేసుకొని బ్యాటింగ్ను కొనసాగిస్తున్నారు. న్యూ సౌత్ వేల్స్కే ఆడే ఆసీస్ యువ ఓపెనర్ సామ్ కొన్స్టాస్ 10 పరుగులకే ఔటై నిరాశపరిచాడు.చదవండి: బట్లర్ మరో ఆడుగు ముందుకు..! -
ఈ హెడ్కోచ్ వద్దని పట్టుబట్టిన ఆటగాళ్లు.. తొలగించిన బీసీసీఐ!
గత దశాబ్ద కాలంగా భారత క్రికెట్ జట్టు- హెడ్కోచ్ల మధ్య అనుబంధం బాగా బలపడింది. రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)లతో మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ సత్సంబంధాలు కొనసాగించారు. ఇక ద్రవిడ్ మార్గదర్శనంలో.. రోహిత్ సారథ్యంలో టీమిండియా టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన విషయం తెలిసిందే.ఆ తర్వాత ద్రవిడ్ హెడ్కోచ్ పదవి నుంచి వైదొలగగా.. మరో మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ (Gautam Gambhir) భారత జట్టు ప్రధాన కోచ్గా నియమితుడయ్యాడు. తన వ్యూహాలకు అనుగుణంగా యువ ఆటగాళ్లకు వరుస అవకాశాలు వచ్చేలా చేస్తున్న గౌతీ.. ఇటీవలే శుబ్మన్ గిల్ టెస్టు, వన్డే పగ్గాలు చేపట్టడంలో కీలక పాత్ర పోషించాడు.ప్రస్తుతానికి కోచ్కు- ఆటగాళ్లకు మధ్య చిన్న చిన్న విభేదాలు తప్ప పెద్ద గొడవలేమీ లేనట్లే కనిపిస్తోంది. జట్టుపై పూర్తిగా పట్టు సాధించిన గౌతీ.. అవసరమైన వేళ ఆటగాళ్లకు మద్దతుగా ఉంటూ టీమ్ను ముందుకు నడిపిస్తున్నాడు.పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా వివాదంమరి గతంలో ఓ హెడ్కోచ్కు- ఆటగాళ్లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా వివాదం రాజుకుందని తెలుసా?.. మీరు ఊహించినట్లుగా ఇది గ్రెగ్ చాపెల్- సౌరవ్ గంగూలీ ఎపిసోడ్ గురించి కాదు. భారత వరల్డ్కప్ విన్నింగ్ హీరోకు- దిగ్గజ ఆటగాళ్లకు మధ్య జరిగిన గొడవ.. ఇంతకీ ఏంటీ విషయం?!కపిల్ దేవ్ కెప్టెన్సీలో వన్డే వరల్డ్కప్-1983 నెగ్గిన జట్టులో సభ్యుడైన మదన్ లాల్.. 1996- 97 మధ్య కాలంలో టీమిండియా హెడ్కోచ్గా పనిచేశాడు. ఈ క్రమంలో భారత జట్టు శ్రీలంక పర్యటనలో ఉండగా.. మదన్ లాల్ (Madan Lal) నాడు టీమ్లో ఉన్న కొందరు ఆటగాళ్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.విఫలం అవుతావని చెప్పాది హిందూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మదన్ లాల్ మాట్లాడుతూ.. టీమిండియా ఓటములకు సదరు ఆటగాళ్లే కారణం అనేలా విమర్శలు చేశాడు. అజయ్ జడేజా గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నువ్వు బౌలర్గా లేదంటే బ్యాటర్గా ఆడబోతున్నావా? అనేది ముందుగానే నిర్ణయించుకో అని అతడికి చెప్పాను. ఒక్క మ్యాచ్లో సరిగ్గా ఆడకపోతే తర్వాత ఐదు మ్యాచ్లలోనూ విఫలం అవుతావని చెప్పా’’ అని మదన్ లాల్ పేర్కొన్నాడు.ఆల్రౌండర్గా రాణించలేడుమరోవైపు రాబిన్ సింగ్ను ఉద్దేశించి.. ‘‘చాలానే కష్టపడతాడు కానీ.. అంతర్జాతీయ స్థాయిలో ఆల్రౌండర్గా రాణించలేడు’’ అని మదన్ లాల్ అన్నాడు. ఇక సబా కరీం గురించి మాట్లాడుతూ.. ‘‘అతడొక సగటు వికెట్ కీపర్ బ్యాటర్ మాత్రమే’’ అని ట్యాగ్ ఇచ్చాడు.కుంబ్లే ‘టర్న్’ కాదు.. దానిమీద దృష్టి పెట్టుఅంతేగాకుండా అప్పట్లో టీమిండియా ప్రధాన స్పిన్ అస్త్రమైన అనిల్ కుంబ్లే గురించి చెబుతూ.. ‘‘అతడి బౌలింగ్తో సంతోషంగా లేనని చెప్పా. నువ్వు బంతిని తిప్పడం కంటే లైన్ అండ్ లెంగ్త్ మీదే ఎక్కువగా దృష్టి పెట్టమని చెప్పా’’ అని మదన్ లాల్ పేర్కొన్నాడు. ఓవరాల్గా.. ‘‘మేము గెలవలేకపోతున్నాం. కానీ నేనొక్కడినే ఏం చేయగలను?’’ అంటూ ఆటగాళ్లను టార్గెట్ చేశాడు.ఈ ఇంటర్వ్యూ తర్వాత భారత క్రికెట్ శిబిరంలో కల్లోలం చెలరేగింది. అప్పటి మేనేజర్ రత్నాకర్ శెట్టి వెంటనే జర్నలిస్టు విజయ్ను సంప్రదించి.. మదన్ లాల్ నిజంగానే ఈ వ్యాఖ్యలు చేశారని నిర్దారించుకున్నాడు.మాటల్లేవ్.. బాయ్కాట్ చేసేశారుఈ నేపథ్యంలో.. మదన్ లాల్ వ్యాఖ్యలతో తీవ్రంగా నొచ్చుకున్న ఆటగాళ్లు అతడితో చాలా రోజుల పాటు మాట్లాడనే లేదు. నాటి సిరీస్లో ఓ వన్డేలో అజయ్ జడేజా సెంచరీ చేసిన తర్వాత ఈ విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ మ్యాచ్లో మొహమ్మద్ అజారుద్దీన్ కూడా సెంచరీ చేశాడు. వేటు వేసిన బీసీసీఐఆ తర్వాత ఈ హెడ్కోచ్ వద్దని ఆటగాళ్లు పట్టుబట్టడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మదన్ లాల్పై వేటు వేసి అన్షుమాన్ గైక్వాడ్తో అతడి స్థానాన్ని భర్తీ చేసింది. అలా టీమిండియా హెడ్కోచ్గా మదన్ లాల్ పది నెలల పదవీ కాలం వివాదంతో ముగిసిపోయింది. అప్పటి బీసీసీఐ మేనేజర్ రత్నాకర్ శెట్టి తన ఆటోబయోగ్రఫీ.. ‘ఆన్ బోర్డ్- మై ఇయర్స్ ఇన్ బీసీసీఐ’లో ఈ విషయాలను ప్రస్తావించాడు.చదవండి: కాంట్రాక్టర్ నుంచి శ్రేయస్ దాకా.. మైదానంలో తీవ్రంగా గాయపడిన క్రికెటర్లు వీరే..! -
బట్లర్ మరో అడుగు ముందుకు..!
ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ల జాబితాలో జోస్ బట్లర్ (Jos Buttler) మరో అడుగు ముందుకేశాడు. ఇవాళ (అక్టోబర్ 29) న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డేలో 9 పరగులు చేసిన అతను.. ఇంగ్లండ్ ఆల్టైమ్ హైయెస్ట్ రన్ స్కోరర్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో ఇయాన్ బెల్ను (5416) అధిగమించాడు.ప్రస్తుతం బట్లర్ ఖాతాలో 5245 వన్డే పరుగులు ఉన్నాయి. ఈ జాబితాలో జో రూట్ (7328) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. మాజీ ఆటగాడు ఇయాన్ మోర్గన్ (6975) రెండో స్థానంలో నిలిచాడు.వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లండ్ టాప్-10 బ్యాటర్లు..జో రూట్ - 7328ఇయాన్ మోర్గన్ - 6957జోస్ బట్లర్ - 5425ఇయాన్ బెల్ - 5416పాల్ కాలింగ్వుడ్ - 5092అలెక్ స్టీవర్ట్ - 4677కెవిన్ పీటర్సన్ - 4422మార్కస్ ట్రెస్కోథిక్ - 4335గ్రహం గూచ్ - 4290జేసన్ రాయ్ - 4271ఇదిలా ఉంటే, బట్లర్ కెరీర్ గత కొంతకాలంగా బాగా నెమ్మదించింది. అతను ఏ ఫార్మాట్లో అయినా సెంచరీ చేసి నాలుగేళ్లవుతుంది. చివరిగా 2021 అక్టోబర్ 30న శ్రీలంకపై T20 వరల్డ్కప్లో మూడంకెల మార్కును తాకాడు. అప్పటి నుంచి కొన్ని మంచి ఆరంభాలు లభించినా అతను భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. పెద్ద స్కోర్లు చేయకపోయినా బట్లర్ స్ట్రయిక్రేట్ను మెయింటైన్ చేస్తూ ఇంగ్లండ్ విజయాల్లో పాలు పంచుకుంటున్నాడు. యువ ఓపెనర్ల రాకతో బట్లర్ మిడిలార్డర్లో వస్తున్నాడు. ఇదే అతన్ని సెంచరీలు చేయనివ్వడం లేదు.మ్యాచ్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో ఇవాళ (అక్టోబర్ 29) జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసి స్వల్ప స్కోర్కే కుప్పకూలింది. బ్లెయిర్ టిక్నర్ (8-1-34-4), నాథన్ స్మిత్ (5-0-27-2) చెలరేగడంతో 36 ఓవర్లలో 175 పరుగులకే ఆలౌటైంది. జేకబ్ డఫీ, జకరీ ఫౌల్క్స్, మిచెల్ సాంట్నర్, బ్రేస్వెల్ కూడా తలో వికెట్ తీసి ఇంగ్లండ్ను మట్టుబెట్టడంలో పాలుపంచుకున్నారు.జేమీ ఓవర్టన్ (42), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. వీరితో పాటు జేమీ స్మిత్ (13), జో రూట్ (25), జేకబ్ బేతెల్ (18), సామ్ కర్రన్ (17) రెండంకెల స్కోర్లు చేశారు. బట్లర్ (9) వైఫల్యాల పరంపరను కొనసాగించాడు.కాగా, మూడు మ్యాచ్ల టీ20, వన్డే సిరీస్ల కోసం ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్లో పర్యటిస్తుంది. వర్షం కారణంగా రెండు మ్యాచ్లు రద్దైన టీ20 సిరీస్ను ఇంగ్లండ్ 1-0 తేడాతో కైవసం చేసుకోగా.. వన్డే సిరీస్లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది.చదవండి: నేను మాట్లాడితే కథ వేరేలా మారుతుంది.. సెలక్టర్ జోక్యంతో షమీ యూటర్న్? -
నేను మాట్లాడితే కథ వేరేలా మారుతుంది: షమీ
టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami)- చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) మధ్య మాటల యుద్ధానికి తెరపడినట్లే కనిపిస్తోంది. రంజీ ట్రోఫీ 2025-26 మ్యాచ్లో గుజరాత్పై బెంగాల్ విజయం సాధించిన తర్వాత షమీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.దేశీ ఫస్ట్క్లాస్ టోర్నీ రంజీ ట్రోఫీలో బెంగాల్కు ఆడుతున్న షమీ (3/44; 5/38) తన పేస్లో పదును ఏమాత్రం తగ్గలేదని బౌలింగ్తో నిరూపించాడు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా గ్రూప్ ‘సి’లో మంగళవారం ముగిసిన మ్యాచ్లో బెంగాల్.. 141 పరుగుల భారీతేడాతో గుజరాత్ (Bengal Vs Gujarat)పై ఘనవిజయం సాధించింది.185 పరుగులకే కుప్పకూలిన గుజరాత్ఆఖరి రోజు 170/6 ఓవర్నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన బెంగాల్ 214/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్నైట్ బ్యాటర్ అనుస్తుప్ (58; 9 ఫోర్లు) అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, ఆకాశ్దీప్ (25 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు) మోస్తరు పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 112 పరుగులు కలుపుకొని గుజరాత్ ముందు 327 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.5 కీలక వికెట్లు తీసిన షమీఈ టార్గెట్ను చేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ రెండో ఇన్నింగ్స్లో 185 పరుగులకే కుప్పకూలింది. ఉర్విల్ పటేల్ (109 నాటౌట్; 16 ఫోర్లు) అజేయ శతకం సాధించాడు. షమీ పదే ఓవర్లు వేసి 5 కీలక వికెట్లు తీసి జట్టు విజయానికి బాటవేశాడు. షహబాజ్ అహ్మద్కు 3 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీసిన షహబాజ్కే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది.నేను మాట్లాడితే కథ వేరేలా మారుతుందిఇదిలా ఉంటే.. గుజరాత్పై విజయం తర్వాత షమీని విలేకరులు పలకరించగా అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను మాట్లాడితే కథ వేరేలా మారుతుందని పేర్కొన్నాడు. ‘‘నేను ఎల్లప్పుడు వివాదాల్లో చిక్కుకుపోతున్నాను. మీరే (మీడియా) నన్ను కాంట్రవర్సీ బౌలర్గా మార్చేశారు. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా ఇబ్బందుల్లో పడటం ఖాయం.కాబట్టి ఇప్పుడేం చెప్పగలను? నేను మిమ్మల్ని కూడా నిందించను. ప్రతి ఒక్కరు నా విషయంలో ఇలాగే చేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారు’’ అంటూ షమీ యూటర్న్ తీసుకున్నాడు. దీంతో ఆశ్చర్యపోవడం రిపోర్టర్ల వంతైంది.షమీ వర్సెస్ అగార్కర్కాగా ఆస్ట్రేలియాతో వన్డేలకు షమీని ఎంపిక చేయకపోవడంపై అగార్కర్ స్పందిస్తూ.. అతడి ఫిట్నెస్ గురించి అప్డేట్ లేదని చెప్పాడు. ఇందుకు ప్రతిగా షమీ తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘రంజీల్లో ఆడేవాడిని.. వన్డేల్లో ఆడలేనా?.. నేను పూర్తి ఫిట్గా ఉన్నాను’’ అంటూ కౌంటర్ ఇచ్చాడు.ఈ క్రమంలో అగార్కర్ స్పందిస్తూ.. షమీ ఫిట్గా లేనందు వల్లే జట్టుకు ఎంపిక చేయలేదని పునరుద్ఘాటించగా... తాను కాదు తన ఆటే మాట్లాడుతుందంటూ షమీ మరోసారి గట్టిగానే ఇచ్చిపడేశాడు. సెలక్టర్ జోక్యంతో షమీ యూటర్న్?ఈ నేపథ్యంలో తాజాగా గుజరాత్పై ఎనిమిది వికెట్లతో చెలరేగిన షమీ.. చెప్పినట్లుగానే ఆటతోనే అగార్కర్కు సమాధానమిచ్చాడని ప్రశంసలు కురిశాయి. అయితే, అతడు మాత్రం తాను వివాదాల్లో చిక్కుకోవడానికి మీడియానే కారణమని చెప్పడం గమనార్హం.కాగా కోల్కతాలో జరిగిన ఈ రంజీ మ్యాచ్ సందర్భంగా.. ఈస్ట్జోన్ నుంచి టీమిండియా కొత్త సెలక్టర్గా ఎంపికైన ఆర్పీ సింగ్.. షమీతో మంతనాలు జరిపాడు. అతడి నుంచి హామీ లభించిన నేపథ్యంలోనే షమీ ఇలా ప్లేట్ తిప్పేశాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చదవండి: కాంట్రాక్టర్ నుంచి శ్రేయస్ దాకా.. మైదానంలో తీవ్రంగా గాయపడిన క్రికెటర్లు వీరే..! -
రెచ్చిపోయిన న్యూజిలాండ్ బౌలర్లు
న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 29) జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ స్వల్ప స్కోర్కే కుప్పకూలింది. బ్లెయిర్ టిక్నర్ (8-1-34-4), నాథన్ స్మిత్ (5-0-27-2) చెలరేగడంతో 36 ఓవర్లలో 175 పరుగులకే ఆలౌటైంది. జేకబ్ డఫీ, జకరీ ఫౌల్క్స్, మిచెల్ సాంట్నర్, బ్రేస్వెల్ కూడా తలో వికెట్ తీసి ఇంగ్లండ్ను మట్టుబెట్టడంలో పాలుపంచుకున్నారు.జేమీ ఓవర్టన్ (42), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖర్లో ఓవర్టన్ ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదాడు. వీరితో పాటు జేమీ స్మిత్ (13), జో రూట్ (25), జేకబ్ బేతెల్ (18), సామ్ కర్రన్ (17) రెండంకెల స్కోర్లు చేశారు. బట్లర్ (9) వైఫల్యాల పరంపరను కొనసాగించాడు.కాగా, మూడు మ్యాచ్ల టీ20, వన్డే సిరీస్ల కోసం ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్లో పర్యటిస్తుంది. వర్షం కారణంగా రెండు మ్యాచ్లు రద్దైన టీ20 సిరీస్ను ఇంగ్లండ్ 1-0 తేడాతో కైవసం చేసుకోగా.. వన్డే సిరీస్లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. చదవండి: కాంట్రాక్టర్ నుంచి శ్రేయస్ దాకా.. మైదానంలో తీవ్రంగా గాయపడిన క్రికెటర్లు వీరే..! -
కాంట్రాక్టర్ నుంచి శ్రేయస్ అయ్యర్ దాకా..!
క్రికెటర్లు మైదానంలో గాయపడటం సహజమే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఏదో ఒక రకంగా దెబ్బలు తగులుతూనే ఉంటాయి. కొన్ని సార్లు చిన్న దెబ్బలతో బయటపడినా, మరికొన్ని సార్లు వాటి తీవ్రత అధికంగా ఉంటుంది. గాయాల వల్ల కొందరి కెరీర్లు అర్దంతరంగా ముగియగా.. దురదృష్టకర ఘటనల్లో పలువురు ప్రాణాలు సైతం కోల్పోయారు.తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్లో టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. స్ప్లీన్లో లేసరేషన్ గాయం కావడంతో అతను కొన్ని రోజులు ఐసీయూలో ఉన్నాడు. మొదట్లో శ్రేయస్ గాయం ఆందోళన చెందాల్సింది కాదని అంతా అనుకున్నారు.అయితే రోజుల గడిచే కొద్ది దాని తీవ్రత బయటపడింది. శ్రేయస్కు పక్కటెముకల్లో రక్తస్రావం జరిగి, పరిస్థితి సీరియస్గా ఉందని డాక్లరు తెలిపారు. దీంతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎలాంటి చెడు వార్త వినాల్సి వస్తుందోనని భారత్ క్రికెట్ అభిమానులు ఆందోళన పడ్డారు.అయితే అత్యుత్తమ చికిత్స అందడం వల్ల శ్రేయస్ త్వరగానే కోలుకొని సేఫ్ జోన్లో పడ్డాడు. శ్రేయస్ ఉదంతం తర్వాత మైదానంలో తీవ్ర గాయాలపాలైన క్రికెటర్లపై చర్చ మొదలైంది.ఈ ప్రస్తావన రాగానే ముందుగా గుర్తొచ్చే పేరు ఫిలిప్ హ్యూస్. మంచి భవిష్యత్తు ఉండిన ఈ ఆస్ట్రేలియా యువ బ్యాటర్, 2014లో తలకు బౌన్సర్ తగిలి, రెండు రోజుల అనంతరం మృత్యువాత పడ్డాడు.మైదానంలో తగిలిన గాయం కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో క్రికెటర్ రామన్ లాంబా. ఈ టీమిండియా ఆటగాడు 1998లో ఢాకాలో జరిగిన ఓ మ్యాచ్లో షార్ట్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తుండగా, బంతి తలపై బలంగా తాకింది. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో లాంబా మూడు రోజులు మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయాడు. క్రికెట్ చరిత్రలో ఇటీవలికాలంలో జరిగిన రెండు దురదృష్టకర ఘటనల ఇవి. మైదానంలో తీవ్రంగా గాయపడి అర్దంతరంగా కెరీర్లు ముగించిన ఆటగాళ్ల విషయానికొస్తే.. ఈ జాబితా చాలా పెద్దదిగా ఉంది. నారీ కాంట్రాక్టర్ మొదలుకొని శ్రేయస్ అయ్యర్ దాకా ఈ జాబితాలో చాలా మంది స్టార్ క్రికెటర్లు ఉన్నారు.1962లో వెస్టిండీస్ బౌలర్ చార్లీ గ్రిఫిత్ వేసిన బౌన్సర్ తలపై బలంగా తాకడంతో భారత ఆటగాడు నారీ కాంట్రాక్టర్ కెరీర్ అర్దంతరంగా ముగిసింది.2000 సంవత్సరంలో టీమిండియా ఆటగాడు సబా కరీం అనిల్ కుంబ్లే బౌలింగ్లో వికెట్కీపింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ ఉదంతంలో కరీం కుడి కంటిని కోల్పోయేవాడు. అదృష్టం కొద్ది చూపు దక్కించుకున్నా, అతని కెరీర్ అక్కడితో ముగిసింది.2012లో సౌతాఫ్రికా వికెట్ కీపర్ మార్క్ బౌచర్ కంటికి తీవ్ర రక్తస్రావ గాయమైంది. దీంతో అతను తక్షణమే ఆటకు వీడ్కోలు పలికాడు. బౌచర్ మరో క్యాచ్ కానీ స్టంపింగ్ కానీ చేసుంటే, ప్రపంచంలో 1000 డిస్మిసల్స్లో భాగమైన తొలి వికెట్ కీపర్గా చరిత్రకెక్కేవాడు.2014లో ఇంగ్లండ్ ప్రామిసింగ్ క్రికెటర్ క్రెయిగ్ కీస్వెట్టర్ బ్యాటింగ్ చేస్తుండగా, బంతి గ్రిల్ లోపటి నుంచి దూసుకొచ్చి ముక్కుపై, కంటిపై తీవ్ర గాయాలు చేసింది. ఈ ఉదంతం తర్వాత అతను 27 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇలాంటి దురదృష్టకర ఘటనలు మైదానంలో చాలానే జరిగాయి. వాటిలో ఇవి కొన్ని మాత్రమే. మైదానం వెలుపల జరిగిన ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన క్రికెటర్ల విషయానికొస్తే.. ముందుగా గుర్తొచ్చే పేరు రిషబ్ పంత్. 2022లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. పంత్ తిరిగి క్రికెట్ ఆడతాడని ఎవరూ ఊహించలేదు. ఈ ప్రమాదంలో అతని కాలు తీసేసినంత పని అయ్యింది. అయినా అతను దృడ సంకల్పంతో గాయాన్ని అధిగమించి తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు. మునుపటి తరమా ప్రదర్శనలతో సత్తా చాటాడు.ఒంటి కన్నుతో దేశాన్ని నడిపించిన పటౌడీ1961లో ఇంగ్లండ్లో జరిగిన కారు ప్రమాదంలో భారత దిగ్గజ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి ఓ కంటిని కోల్పోయాడు. ఆతర్వాత అతను ఒంటి కన్నుతో భారత క్రికెట్ జట్టును విజయవంతంగా ముందుండి నడిపించాడు. 21 ఏళ్ల వయసులో భారత జట్టు కెప్టెన్గా నియమితుడైన పటౌడీ.. అప్పట్లో టెస్ట్ క్రికెట్లో అత్యంత చిన్న వయసు గత కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు.చదవండి: ఆస్ట్రేలియాతో సెమీస్కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్ -
టీమిండియాకు బ్యాడ్ న్యూస్
నవీ ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో రేపు (అక్టోబర్ 30) జరుగబోయే మహిళల వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్కు (India vs Australia) ముందు టీమిండియాకు (Team India) బ్యాడ్ న్యూస్ అందింది. గాయం కారణంగా గత రెండు మ్యాచ్లకు (ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా) దూరంగా ఉన్న ఆసీస్ స్టార్ ప్లేయర్ అలైస్సా హీలీ (Alyssa Healy) ఈ మ్యాచ్కు అందుబాటులోకి రానుంది.ఈ విషయంపై క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. హీలీ ఫిట్నెస్ టెస్ట్ను క్లియర్ చేసినట్లు తెలుస్తుంది. నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టిన ఆమె, పునరాగమనం సంకేతాలు ఇచ్చింది. సెమీస్లో హీలీ బరిలోకి దిగితే టీమిండియాను కష్టాలు తప్పవు.గాయపడక ముందు ఆమె అరివీర భయంకరమైన ఫామ్లో ఉండింది. వరుసగా భారత్, బంగ్లాదేశ్పై సెంచరీలు (142, 113 నాటౌట్) చేసింది. ఇదే ఫామ్ను హీలీ సెమీస్లోనూ కొనసాగిస్తే.. టీమిండియా ప్రపంచకప్ సాధించాలన్న కల తలకిందులయ్యే ప్రమాదం ఉంది.ఈ టోర్నీలో హీలీ 4 మ్యాచ్ల్లో 2 సెంచరీల సాయంతో 98 సగటున 298 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది.కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో ఆస్ట్రేలియా అజేయ జట్టుగా సెమీస్కు చేరింది. లీగ్ దశలో న్యూజిలాండ్, పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికాపై విజయాలు సాధించి, జైత్రయాత్రను కొనసాగిస్తుంది. భారత్ విషయానికొస్తే.. చివరి లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్పై విజయం సాధించి సెమీస్కు అర్హత సాధించిన భారత్.. టోర్నీ ప్రారంభంలో వరుసగా శ్రీలంక, పాకిస్తాన్లపై విజయాలు సాధించి, ఆతర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఇంగ్లండ్ చేతుల్లో వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడింది. ఈ టోర్నీ నుంచి మరో రెండు సెమీస్ బెర్త్లు ఇంగ్లండ్, సౌతాఫ్రికాకు దక్కాయి. ఇరు జట్లు ఇవాళ (అక్టోబర్ 29) జరుగబోయే తొలి సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. చదవండి: పాక్ను చిత్తుగా ఓడించిన సౌతాఫ్రికా -
పాక్ను చిత్తుగా ఓడించిన సౌతాఫ్రికా
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ (Babar Azam) వైఫల్యాల పరంపర కొనసాగుతుంది. ఫార్మాట్లకతీతంగా అతను వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో బాబర్ సెంచరీ చేసి రెండేళ్లైపోయింది. ఈ మధ్యలో 75 ఇన్నింగ్స్లు ఆడినా ఓ మూడంకెల స్కోర్ లేదు.టెస్ట్ల్లో, వన్డేల్లో వరుస వైఫల్యాలు ఎదుర్కొన్న బాబర్.. తాజాగా టీ20 ఫార్మాట్లోనూ చెత్త ప్రదర్శనను కొనసాగించాడు. దాదాపుగా ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చి రెండు బంతుల్లో డకౌటయ్యాడు. ఈ ప్రదర్శన తర్వాత బాబర్పై ట్రోలింగ్ తారాస్థాయికి చేరింది.సొంత అభిమానులు కూడా అతన్ని భరించడం లేదు. వీడు మనకొద్దు రా బాబూ అంటూ తలలు బాదుకుంటున్నారు.మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా పాకిస్తాన్, సౌతాఫ్రికా జట్ల మధ్య నిన్న (అక్టోబర్ 28) తొలి టీ20 (Pakistan vs South Africa) జరిగింది. రావల్పిండి వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో బాబర్ సహా పాక్ ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఫలితంగా ఆ జట్టు సౌతాఫ్రికా చేతిలో 55 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (60) అర్ద సెంచరీతో రాణించగా.. టోనీ డి జోర్జి (33), జార్జ్ లిండే (36) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ నవాజ్ (40-26-3), సైమ్ అయూబ్ (4-0-31-2) రాణించారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. ఓ మోస్తరు ఆరంభం లభించినా ఆ తర్వాత పేకమేడలా కూలింది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ 24, సైమ్ అయూబ్ 37 పరుగులకు ఔటయ్యారు. అంతా అయిపోయాక మొహమ్మద్ నవాజ్ (36) కాసేపు బ్యాట్ ఝులిపించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కార్బిన్ బాష్ (4-0-14-4), జార్జ్ లిండే (3-0-31-3), లిజాడ్ విలియమ్స్ (3.1-0-21-2) అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్ పతనాన్ని శాశించారు. ఈ మ్యాచ్లో 9 మంది రెగ్యులర్ ప్లేయర్లు లేకపోయినా సౌతాఫ్రికా పాక్ను చిత్తుగా ఓడించింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 అక్టోబర్ 31న లాహోర్లో జరుగుతుంది. చదవండి: మహ్మద్ రిజ్వాన్ సంచలన నిర్ణయం.. -
IND Vs AUS: బోణీ ఎవరిదో?
కాన్బెర్రా: వచ్చే ఏడాది జరగనున్న టి20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా... భారత జట్టు కీలక సిరీస్కు సిద్ధమైంది. ఆ్రస్టేలియా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా... నేటి నుంచి ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడనుంది. ఇటీవల టి20 ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్లో అద్వితీయమైన ప్రదర్శన కనబర్చిన సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు... ఆసీస్పై కూడా అదే జోరు కనబర్చాలని చూస్తోంది. మరోవైపు సొంతగడ్డపై భారత హిట్టర్లను అడ్డుకునేందుకు బౌన్సీ పిచ్లతో ఆ్రస్టేలియా సిద్ధమైంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా... రెండో ‘ప్లేస్’లో ఉన్న ఆ్రస్టేలియా మధ్య రసవత్తర పోరు ఖాయమే. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక వేదికగా టి20 వరల్డ్కప్ జరగనుండగా... దానికి ముందు టీమిండియా మరో 15 టి20లు మాత్రమే ఆడనుంది. దీంతో మెగా టోర్నీ సన్నాహాల్లో ఈ సిరీస్ కీలకం కానుంది.గతేడాది టి20 ప్రపంచకప్ సాధించాక టీమిండియా ఈ ఫార్మాట్లో కేవలం 3 మ్యాచ్ల్లోనే ఓడింది. బ్యాటింగ్ లైనప్ హిట్టర్లతో పటిష్టంగా ఉండగా... వన్డే సిరీస్కు విశ్రాంతి తీసుకున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రాకతో బౌలింగ్ మరింత పదును పెరిగింది. మరోవైపు ఆస్ట్రేలియా గత 20 టి20ల్లో కేవలం రెండింట్లోనే ఓడింది. మరి సమ ఉజ్జీల సమరంలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి! కెప్టెన్ సూర్యపైనే దృష్టి! ఆసియా కప్లో బ్యాటర్లు దంచికొట్టడం... స్పిన్నర్లు తిప్పేయడంతో ఏమాత్రం పోటీ లేకుండానే భారత జట్టు ట్రోఫీ చేజిక్కించుకుంది. ఆడిన అన్నీ మ్యాచ్ల్లోనూ పూర్తి ఆధిపత్యంతో విజయాలు సాధించింది. అయితే ఆ్రస్టేలియా పర్యటనలో మాత్రం తొలి మ్యాచ్ నుంచే గట్టి పోటీ తప్పకపోవచ్చు. ఆసియా కప్లో పరుగుల వరద పారించిన ఓపెనర్ అభిషేక్ శర్మపై జట్టు గంపెడాశలు పెట్టుకుంది. అభిషేక్తో కలిసి గిల్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ సామ్సన్, రింకూ సింగ్తో మిడిలార్డర్ బలంగా ఉంది. అయితే గత కొంతకాలంగా సూర్యకుమార్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక పోతున్నాడు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్గా అక్షర్కు చోటు ఖాయం కాగా... శివమ్ దూబే, హర్షిత్ రాణాలో ఒకరికి చోటు దక్కనుంది. బుమ్రాతో కలిసి అర్ష్ దీప్ పేస్ బాధ్యతలు పంచుకోనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్ర వర్తి, కుల్దీప్లలో ఒకరికి చోటు దక్కనుంది. సమతూకంగా... గత వరల్డ్కప్లో భారత్ చేతిలో పరాజయంతో టోర్నీ నుంచి వైదొలిగిన ఆ్రస్టేలియా ఇప్పుడు సొంతగడ్డపై టీమిండియాతో పోరులో సమష్టిగా మెరిపించాలని భావిస్తోంది. ఓపెనర్లు మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ ఆ జట్టుకు ప్రధాన బలం. ఇన్గ్లిస్, టిమ్ డేవిడ్, జోష్ ఫిలిప్, మిచ్ ఓవెన్తో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. పేస్ ఆల్రౌండర్ స్టొయినిస్ భారీ షాట్లు కొట్టడంలో సిద్ధహస్తుడు. ఇక బౌలింగ్లో హాజల్వుడ్ నుంచి టీమిండియాకు ప్రధాన ముప్పు పొంచి ఉంది. వచ్చే ఏడాది భారత్లో వరల్డ్కప్ జరగనున్న నేపథ్యంలో కునేమన్ను పరీక్షించేందుకు ఇంతకుమించిన సమయం రాకపోవచ్చు. ఇటీవల ముగిసిన వన్డే సిరీస్కు పెద్ద ఎత్తున ప్రేక్షకులు తరలిరాగా... ఇప్పుడు టి20 సిరీస్ కూడా ‘హౌస్ ఫుల్’ కావడం ఖాయమే. భారీ జనసందోహం ముందు ఆడటం బాగుంటుందని మార్ష్ అన్నాడు. పిచ్, వాతావరణం బిగ్బాష్ లీగ్లో భాగంగా ఇక్కడ జరిగిన మ్యాచ్ల్లో స్వల్ప స్కోర్లు నమోదయ్యాయి. బౌండరీ పెద్దది కాగా... స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. బుధవారం ఇక్కడ తేలికపాటి వర్ష సూచన ఉంది. అయితే అది మ్యాచ్కు పెద్దగా ఆటంకం కలిగించకపోవచ్చు. 7 ఆస్ట్రేలియా గడ్డపై ఆ్రస్టేలియాతో భారత్ ఇప్పటి వరకు 12 టి20లు ఆడింది. ఇందులో 7 మ్యాచ్ల్లో గెలిచి, 4 మ్యాచ్ల్లో ఓడింది. ఒక మ్యాచ్ రద్దయింది. 2 భారత్, ఆ్రస్టేలియా జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ జరగనుండటం ఇది రెండోసారి. 2023లో భారత్ వేదికగా జరిగిన ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ను టీమిండియా 4–1తో గెలిచింది. తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, గిల్, తిలక్, సామ్సన్, రింకూ సింగ్, అక్షర్, శివమ్ దూబే/హర్షిత్ రాణా, కుల్దీప్/వరుణ్, అర్ష్ దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. ఆ్రస్టేలియా: మార్ష్ (కెప్టెన్), హెడ్, ఇన్గ్లిస్, టిమ్ డేవిడ్, ఫిలిప్, మిచ్ ఓవెన్, స్టొయినిస్, సీన్ అబాట్/జేవియర్, ఎలీస్, కునేమన్, హజల్వుడ్. -
దక్షిణాఫ్రికా...ఈసారైనా!
గువాహటి: అన్ని విభాగాల్లో సమష్టిగా రాణిస్తూ... మహిళల వన్డే ప్రపంచకప్లో జోరు మీదున్న దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్ బెర్త్పై గురి పెట్టింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా ఫైనల్ చేరుకోలేకపోయింది. మూడుసార్లు సెమీఫైనల్లోకి ప్రవేశించినా ఆ అడ్డంకిని దాటడంలో విఫలమైంది. నాలుగో ప్రయత్నంలోనైనా సెమీఫైనల్ అవరోధాన్ని అధిగమించి ఫైనల్లోకి దూసుకెళ్లాలని దక్షిణాఫ్రికా పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో నేడు జరిగే తొలి సెమీఫైనల్లో పటిష్టమైన ఇంగ్లండ్తో దక్షిణాఫ్రికా తలపడనుంది. దక్షిణాఫ్రికాతో పోలిస్తే ఇంగ్లండ్కు ప్రపంచకప్లో అద్భుతమైన రికార్డు ఉంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఇప్పటికే ఎనిమిదిసార్లు ఫైనల్ చేరుకున్న ఇంగ్లండ్... నాలుగుసార్లు విజేతగా నిలిచి, మరో నాలుగుసార్లు రన్నరప్ ట్రోఫీని అందుకుంది. ఇక తాజా ప్రపంచకప్లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్దే పైచేయిగా ఉంది. తమతో ఆడిన తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికాను 69 పరుగులకు కుప్పకూల్చిన ఇంగ్లండ్ మరోసారి అలాంటి ప్రదర్శన పునరావృతం చేయాలనే లక్ష్యంతో ఉంది. మరోవైపు ఇంగ్లండ్ చేతిలో ఎదురైన తొలి మ్యాచ్ పరాజయానికి బదులు తీర్చుకోవాలని దక్షిణఫ్రికా భావిస్తోంది. ఆస్ట్రేలియాతో లీగ్ దశ చివరి మ్యాచ్లో దక్షిణాఫ్రికా 97 పరుగులకే ఆలౌటైంది. ఈ రెండు సందర్భాల్లోనూ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో సఫారీ బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లోపాలను వినియోగించుకోవాలని ఇంగ్లండ్ ప్రణాళికలు రచిస్తోంది. సోఫీ ఎకిల్స్టోన్, లిన్సే స్మిత్, చార్లీ డీన్ రూపంలో ఇంగ్లండ్కు ముగ్గురు స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్... ఈ టోర్నీలో ఆడిన 7 మ్యాచ్ల్లో 50.16 సగటుతో 301 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపిస్తోంది. బ్రిట్స్, సునే లుస్, మరిజాన్ కాప్ రూపంలో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉంది. బౌలింగ్లో కాప్, ఖాకా, ఎంలాబా కీలకం కానున్నారు. మరోవైపు ఇంగ్లండ్ మాజీ సారథి కెప్టెన్ హీథర్ నైట్ ఈ వరల్డ్కప్లో 288 పరుగులు చేసి ఆ జట్టు తరఫున టాప్ స్కోరర్గా నిలిచింది. అమీ జోన్స్, బ్యూమౌంట్ కూడా రెండొందల పైచిలుకు పరుగులు చేశారు. కెప్టెన్ సివర్ బ్రంట్ రూపంలో నిఖార్సైన ఆల్రౌండర్ అందుబాటులో ఉంది. రిజర్వ్ డే... మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉన్నప్పటికీ ఈ టోర్నీలోని రెండు సెమీఫైనల్స్కు, ఫైనల్ మ్యాచ్కు ‘రిజర్వ్ డే’ ఉంది. బుధవారం వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యపడకపోతే... గురువారం నిర్వహిస్తారు. ఒకవేళ గురువారం కూడా మ్యాచ్ జరగపోతే మాత్రం లీగ్ దశలో మెరుగైన స్థానంలో ఉన్న జట్టు ఫైనల్ (ఇంగ్లండ్) చేరుకుంటుంది.36 దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు 47 వన్డేలు జరిగాయి. 36 మ్యాచ్ల్లో ఇంగ్లండ్ గెలుపొందగా ... 10 మ్యాచ్ల్లో దక్షిణాఫ్రికా నెగ్గింది. ఒక మ్యాచ్ రద్దయింది. ఇక వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్లు తొమ్మిదిసార్లు తలపడ్డాయి. 7 సార్లు ఇంగ్లండ్, 2 సార్లు దక్షిణాఫ్రికా విజయం సాధించాయి. -
మహ్మద్ రిజ్వాన్ సంచలన నిర్ణయం..
పాకిస్తాన్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2025-26 సీజన్కు సంబంధించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సెంట్రల్ కాంట్రాక్ట్ను రిజ్వాన్ తిరష్కరించినట్లు సమాచారం. మొత్తం 30 మంది క్రికెటర్లలో రిజ్వాన్ ఒక్కడే సెంట్రాక్ట్ కాంట్రాక్ట్ పేపర్లపై సంతకం చేయడానికి నిరాకరించినట్లు వార్తలు వస్తున్నాయి. తనను టీ20 జట్టు నుంచి తప్పించడంతో రిజ్వాన్ ఆసంతృప్తిగా ఉన్నట్లు పాక్కు చెందిన జియో 'జియో సూపర్' తమ కథనంలో పేర్కొంది. అయితే బోర్డు ముందు రిజ్వాన్ కొన్ని కండీషన్స్ పెట్టినట్లు సదరు వెబ్సైట్ వెల్లడించింది.తన డిమాండ్లను నెరవేరిస్తానే కాంట్రాక్ట్పై సంతకం చేస్తానని రిజ్వాన్ తెలిపాడంట. పీసీబీ కొత్త కాంట్రాక్ట్ జాబితాలో రిజ్వాన్ కేటగిరీ బిలో ఉన్నారు. స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం కూడా ఇదే కేటగిరీలో ఉన్నాడు. గతంలో వీరిద్దరూ కేటగిరీ ఎలో ఉండేవారు. కానీ పీసీబీ ఈసారి పూర్తి కేటగిరీ ఎనే తొలిగించింది.కాగా రిజ్వాన్ను తాజాగా పాక్ జట్టు వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తొలగించారు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో పాక్ జట్టుకు స్టార్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిది జట్టుకు నాయకత్వం వహించాడు. రిజ్వాన్ కెప్టెన్సీలో పాక్ 20 మ్యాచ్లలో 9 విజయాలు సాధించి, 11 ఓటములను చవిచూసింది. కెప్టెన్గా అతడి విజయ శాతం 45గా ఉంది. గతేడాది అక్టోబర్లో బాబర్ ఆజం నుంచి రిజ్వాన్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. కానీ నాయకుడిగా జట్టును విజయ పథంలో నడిపించడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతడిపై పీసీబీ వేటు వేసింది.పాక్ సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితా ఇదేకేటగిరీ Bఅబ్రార్ అహ్మద్, బాబర్ ఆజమ్, ఫఖర్ జమాన్, హారిస్ రవూఫ్, హసన్ అలీ, మహ్మద్ రిజ్వాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ ఆఘా, షాదాబ్ ఖాన్ మరియు షాహీన్ షా ఆఫ్రిది.కేటగిరీ Cఅబ్దుల్లా షఫీక్, ఫహీమ్ అష్రఫ్, హసన్ నవాజ్, మహ్మద్ హారిస్, మహ్మద్ నవాజ్, నసీమ్ షా, నోమాన్ అలీ, సాహిబ్జాదా ఫర్హాన్, సాజిద్ ఖాన్ మరియు సౌద్ షకీల్.కేటగిరీ Dఅహ్మద్ డానియల్, హుస్సేన్ తలత్, ఖుర్రం షాజాద్, ఖుష్దిల్ షా, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ అబ్బాస్ ఆఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, సల్మాన్ మీర్జా, షాన్ మసూద్ మరియు సూఫియాన్ మొకీమ్.చదవండి: శ్రేయస్ అయ్యర్ గాయంపై బీసీసీఐ మరో అప్డేట్ -
శ్రేయస్ అయ్యర్ గాయంపై బీసీసీఐ మరో అప్డేట్
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ అప్డేట్ ఇచ్చింది. అయ్యర్ వేగంగా కోలుకుంటున్నట్లు బోర్డు తెలిపింది. "ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా శ్రేయస్ అయ్యర్ పొత్తికడుపుపై బలమైన గాయమైంది. ఈ గాయం కారణంగా అతని ప్లీహం (Spleen) చీలికకు గురై, అంతర్గత రక్తస్రావం జరిగింది.వెంటనే అతడి గాయాన్ని గుర్తించి బీసీసీఐ వైద్య బృందం అంతర్గత రక్తస్రావాన్ని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం శ్రేయస్ ఆరోగ్యం నిలకడగా ఉంది. మంగళవారం (అక్టోబర్ 28) అతడికి మరోసారి స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. అతడి స్ల్పీన్ గాయంలో మెరుగుదల కన్పించింది. అతడు శరవేగంగా కోలుకుంటున్నాడు. అతడు మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు" అని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా పేర్కొన్నారు. అయ్యర్ను ప్రస్తుతం ఐసీయూ నుంచి బయటకు తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు. మరో మూడు నాలుగు రోజుల్లో అతడు ఆస్ప్రత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశముంది.చదవండి: ఆస్పత్రిలో శ్రేయస్ అయ్యర్.. ఖర్చులు ఎవరు భరిస్తారో తెలుసా? -
ఆస్పత్రిలో శ్రేయస్ అయ్యర్.. ఖర్చులు ఎవరు భరిస్తారో తెలుసా?
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) గాయపడిన సంగతి తెలిసిందే. సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో అలెక్స్ కారీ క్యాచ్ పట్టే ప్రయత్నంలో.. శ్రేయస్ ఎడమ వైపు పక్కటెముకలు నేలను బలంగా తాకడంతో స్ల్పీన్(ప్లీహాం)కి గాయమైంది.అయ్యర్ ప్రస్తుతం సిడ్నీలోని సెయింట్ విన్సెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని బీసీసీఐ వెల్లడించింది. అయ్యర్ను ఐసీయూ నుంచి బయటకు తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.అయితే ఆస్పత్రిలో ఈ చికిత్సకు శ్రేయస్ స్వయంగా ఖర్చు చేస్తున్నారా? లేక బీసీసీఐ భరిస్తుందా? అన్న సందేహం అందరిలో నెలకొంది. అధికారిక మ్యాచ్లు లేదా టూర్లలో గాయపడిన క్రికెటర్ల వైద్య ఖర్చులను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI)నే భరిస్తుంది.సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లకు బీసీసీఐ భరోసా..👉సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో ఉన్న ఆటగాళ్లందరూ బీసీసీఐ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ కింద పూర్తి కవరేజీని పొందుతారు. 👉విదేశాల్లో అత్యవసర చికిత్స, సర్జరీ, ఆసుపత్రి ఖర్చులు, బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) లో పునరావాసం ఖర్చులు అన్ని బీసీసీఐనే భరిస్తుంది.👉ఆటగాడు విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ గాయం అయిన వెంటనే బీసీసీఐ మెడికల్ స్టాప్.. స్ధానిక వైద్యుల సహాయంతో వెంటనే చికిత్సను ప్రారంభిస్తారు. శ్రేయస్ అయ్యర్ విషయంలో ఇప్పుడు అదే జరిగింది.👉గాయం కారణంగా ఒక ఆటగాడు మ్యాచ్లకు దూరమైనప్పుడు, మ్యాచ్ ఫీజును కూడా బీసీసీఐ పరిహారంగా చెల్లిస్తుంది.👉సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో భాగం కాని ఆటగాళ్లకు కూడా బీమా పాలసీలు ఉన్నాయి. కానీ కాంట్రాక్ట్ ఆటగాళ్లకు లభించేంత ప్రయోజనాలను వారికి ఉండవు.చదవండి: Shreyas Iyer injury update: శ్రేయస్ అయ్యర్ తల్లిదండ్రుల కీలక నిర్ణయం.. -
టీమిండియాతో తొలి టీ20.. ఆసీస్ తుది జట్టులో డేంజరస్ ప్లేయర్లు!
భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు రంగం సిద్దమైంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టీ20 కాన్బెర్రా బుధవారం(అక్టోబర్ 29) జరగనుంది. టీమిండియాతో వన్డే సిరీస్ను సొంతం చేసకున్న ఆస్ట్రేలియా.. ఇప్పుడు టీ20 సిరీస్ను కూడా కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది.తొలి టీ20లో ఎలాగైనా గెలిచి సిరీస్ను విజయంతో ఆరంభించాలని కంగారులు వ్యూహాలు రచిస్తున్నారు. భారత్ తమ తుది జట్టును ఖరారు చేయడానికి తర్జన భర్జన పడుతుంటే, ఆస్ట్రేలియా మాత్రం ఇప్పటికే తమ ప్లేయింగ్ ఎలెవన్ను ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. ఆసీస్ సెలక్టర్లు ఈ ఐదు మ్యాచ్ల సిరీస్ కోసం రెండు వెర్వేరు జట్లను ప్రకటించారు. తొలి రెండు టీ20లకు దూరంగా ఉండనున్న స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్.. ఆఖరి మూడు టీ20లకు ఎంపిక చేసిన జట్టులో మాత్రం చోటు దక్కించుకున్నాడు. అదేవిధంగా యాషెస్ సిరీస్ను దృష్టిలో ఉంచుకుని స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్కు ఆఖరి మూడు టీ20లకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు.టీమిండియా కంటే బెటర్గా..గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్లో అఫ్గానిస్తాన్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన తర్వాత.. ఆస్ట్రేలియా పొట్టి క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో వరుస సిరీస్ల విజయాలతో ఆసీస్ రెండో స్ధానంలో కొనసాగుతోంది. ర్యాంకింగ్స్లో కంగారుల కంటే భారత్ ముందుంజలో ఉన్నప్పటికి.. ఇటీవల కాలంలో ఆటగాళ్ల ప్రదర్శన పరంగా కంగారులే మెరుగ్గా కన్పిస్తున్నారు. టీ20 వరల్డ్కప్-2024 తర్వాత ఆస్ట్రేలియా ఇప్పటివరకు 19 టీ20లు ఆడి కేవలం కేవలం రెండు మాత్రమే ఓడిపోయింది. ఆసీస్ బ్యాటింగ్ రన్రేట్ 10.07గా ఉండగా, భారత్ 9.69తో రెండో స్థానంలో ఉంది. గతంతో పోలిస్తే ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆప్రోచ్ పూర్తిగా మారిపోయింది. మిచెల్ మార్ష్ నాయకత్వంలోని ఆసీస్ జట్టు ఫియర్ లెస్ బ్యాటింగ్ విధానాన్ని ఎంచుకుంది. ఓపెనర్ల నుంచి ఎనిమిదో స్ధానం బ్యాటర్ వరకు హిట్టింగ్ చేసే సత్తా ఉంది. మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ అద్భుతమైన ఆరంభాలను ఇస్తుండగా.. మిడిలార్డర్లో జోష్ ఇంగ్లిష్, టిమి డేవిడ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు మెరుపు ఇన్నింగ్స్లు ఆడుతున్నారు. ఆఖరిలో స్టోయినిష్, ఓవెన్ వంటి ఆల్రౌండర్లు తమ పని తాము చేసుకుపోతున్నారు. ఇటీవల కాలంలో పేసర్ దుర్హనియస్ కూడా బ్యాట్తో సత్తాచాటుతున్నాడు. అంతేకాకుండా వికెట్ కీపర్ జోష్ ఫిలిప్ ఛాన్నాళ్ల తర్వాత ఆసీస్ టీ20 జట్టులోకి వచ్చాడు. అతడు కూడా తన బ్యాట్కు పనిచెబితే భారత బౌలర్లకు కష్టాలు తప్పవు. ఇక తొలి తొలి టీ20కు స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా దూరమైనప్పటికి.. జోష్ హాజిల్వుడ్, ఈల్లీస్, బార్ట్లెట్ వంటి పేస్ పవర్ హౌస్ ఆసీస్ వద్ద ఉంది. భారత్తో తొలి టీ20కు ఆసీస్ తుది జట్టు(అంచనా)మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), జోష్ ఫిలిప్, టిమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ ఓవెన్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్వుడ్, తన్వీర్ సంఘాచదవండి: Shreyas Iyer injury update: శ్రేయస్ అయ్యర్ తల్లిదండ్రుల కీలక నిర్ణయం.. -
శ్రేయస్ అయ్యర్ తల్లిదండ్రుల కీలక నిర్ణయం..
టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) అభిమానులకు శుభవార్త. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో గాయపడిన(స్ల్పీన్ ఇంజూరీ) అయ్యర్.. శరవేగంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. శ్రేయస్ ప్రస్తుతం సిడ్నీలోని సెయింట్ విన్సెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.అయ్యర్ ఆరోగ్యం రోజు రోజుకు మెరుగు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ వారంలోపు అతడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశముంది. ఈ విషయాన్ని శ్రేయస్ తండ్రి సంతోష్ అయ్యర్ ధృవీకరించారు."శ్రేయస్ వేగంగా కోలుకుంటున్నాడు. బీసీసీఐ వైద్య బృందం అతడి పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. సిడ్నీలోని బెస్ట్ డాక్టర్లు అయ్యర్కు చికిత్స అందిస్తున్నారు. అతడు వారంలోపు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. వీలైతే అంతకంటే ముందు తిరిగి ఇంటికి రావచ్చు.అతడు టీ20 జట్టులో బాగం కానుందున నేరుగా ఇంటికే రానున్నాడు. దీంతో సిడ్నీ వెళ్లాలనుకున్న మా నిర్ణయాన్ని మార్చుకున్నాము. మేము అక్కడికి వెళ్లడం లేదని" సంతోష్ అయ్యర్ డెక్కన్ క్రానికల్తో పేర్కొన్నారు.అయ్యర్ ఎలా గాయపడ్డాడంటే?సిడ్నీ వేదికగా ఆసీస్తో జరిగిన మూడో వన్డేలో అలెక్స్ క్యారీ క్యాచ్ను అందుకునే క్రమంలో బంతి శ్రేయస్ అయ్యర్ ఎడమ పక్కటెముకులకు బలంగా తాకింది. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో మైదానాన్ని వీడాడు. అయితే అతడి గాయం చిన్నదే అని అంతా భావించారు. కానీ డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిన అయ్యర్, కాసేపటికే స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతడి అస్పత్రికి తరలించి స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు.స్కాన్లో అతడి ప్లీహానికి (స్ప్లీన్) గాయమైనట్లు తేలింది. అంతేకాకుండా అంతర్గత రక్తస్రావం కూడా జరిగిందని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో అతడికి ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందించారు. ఈ క్రమంలో తీవ్ర ఆందోళన చెందిన అయ్యర్ తల్లిదండ్రులు సిడ్నీకి పయనమయ్యేందుకు సిద్దమయ్యారు.కానీ అతడు ఆరోగ్యం కుదుట పడటంతో తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. కాగా శ్రేయస్ పరిస్థితి కాస్త మెరుగుపడటంతో ప్రస్తుతం ఐసీయూ నుంచి బయటకు తీసుకువచ్చినట్లు సమాచారం. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ కూడా శ్రేయస్ గాయంపై అప్డేట్ ఇచ్చాడు. తాను అయ్యర్ మాట్లాడని, బాగానే ఉన్నాడు అని సూర్య చెప్పుకొచ్చాడు. కాగా వచ్చే నెలలలో సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్కు శ్రేయస్ దూరమయ్యే అవకాశముంది.చదవండి: ఎనిమిది వికెట్లతో చెలరేగిన షమీ.. టీమిండియా సెలక్టర్లకు వార్నింగ్! -
ఎనిమిది వికెట్లతో చెలరేగిన షమీ.. టీమిండియా సెలక్టర్లకు వార్నింగ్!
టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami) రంజీ మ్యాచ్లో అదరగొట్టాడు. గుజరాత్తో పోరులో ఈ రైటార్మ్ బౌలర్ మొత్తంగా ఎనిమిది వికెట్లతో చెలరేగి బెంగాల్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా తనకు ఫిట్నెస్ లేదంటూ కామెంట్ చేసిన టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్క (Ajit Agarkar)ర్కు ‘బంతి’తోనే దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు.రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ రెండో మ్యాచ్లో భాగంగా బెంగాల్.. గుజరాత్ జట్టును ఢీకొట్టింది. ఎలైట్ గ్రూప్-‘సి’లో భాగంగా ఇరుజట్ల మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో శనివారం మ్యాచ్ మొదలుకాగా.. టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.మూడు హాఫ్ సెంచరీలుఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన బెంగాల్ తొలి ఇన్నింగ్స్లో 279 పరుగులకు ఆలౌట్ అయింది. సుదీప్ ఘరామి (56), వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్ (51), సుమంత గుప్తా (63) అర్ధ శతకాల కారణంగా ఈమాత్రం స్కోరు సాధ్యమైంది.167 పరుగులకేఅనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన గుజరాత్ 167 పరుగులకే కుప్పకూలింది. మనన్ హింగ్రాజియా (80) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. మిగతా వారి నుంచి అతడికి సహకారం లభించలేదు. బెంగాల్ బౌలర్లలో షాబాజ్ అహ్మద్ ఆరు వికెట్లు కూల్చగా.. షమీ మూడు, ఆకాశ్ దీప్ ఒక వికెట్ దక్కించుకున్నారు.ఈ క్రమంలో 112 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది బెంగాల్. ఎనిమిది వికెట్ల నష్టానికి 214 పరుగుల వద్ద ఉన్న వేళ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. సుదీప్ ఘరామి (54), అనుస్తుప్ మజుందార్ (58) అర్ధ శతకాలతో రాణించారు.ఐదు వికెట్లు కూల్చిన షమీఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని బెంగాల్.. గుజరాత్కు 327 పరుగుల లక్ష్యాన్ని విధించింది. అయితే, ఆది నుంచే చెలరేగిన షమీ గుజరాత్ ఓపెనర్ అభిషేక్ దేశాయిని డకౌట్ చేశాడు. జయమీత్ పటేల్ (45), విశాల్ జైస్వాల్ (1), సిద్దార్థ్ దేశాయ్ (0), అర్జాన్ నాగ్వాస్వల్లా (0)లను వెనక్కి పంపించాడు.మొత్తంగా 10 ఓవర్ల బౌలింగ్లో కేవలం 38 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు షమీ. మిగతా వారిలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ షాబాజ్ అహ్మద్ మూడు వికెట్లు దక్కించుకోగా.. ఆకాశ్ దీప్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. బెంగాల్ బౌలర్ల ధాటికి గుజరాత్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడంతో.. వికెట్ కీపర్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ అజేయ శతకం (124 బంతుల్లో 109) వృథాగా పోయింది. 185 పరుగులకే గుజరాత్ ఆలౌట్ కావడంతో.. బెంగాల్ 141 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.షమీకి ఫిట్నెస్ లేదంటూ..కాగా టీమిండియా తరఫున ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో సత్తా చాటిన షమీని.. ఆ తర్వాత సెలక్టర్లు పక్కనపెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల ఆస్ట్రేలియాతో వన్డేలకు కూడా అతడిని ఎంపిక చేయలేదు. ఈ విషయం గురించి చీఫ్ సెలక్టర్ అగార్కర్ మాట్లాడుతూ.. షమీకి ఫిట్నెస్ లేదని తెలిపాడు. ఇందుకు షమీ కౌంటర్ ఇచ్చాడు. రంజీల్లో ఆడేవాడిని వన్డేలు ఆడలేనా? అన్ని ప్రశ్నించాడు. బెంగాల్ తరఫున ఎలా ఆడుతున్నానో అందరూ చూస్తున్నారని పేర్కొన్నాడు. సౌతాఫ్రికాతో స్వదేశంలో టెస్టులకు ముందు.. తాజా ప్రదర్శనతో మరోసారి అగార్కర్కు గట్టి సందేశమే ఇచ్చాడు షమీ.చదవండి: స్పృహ తప్పి పడిపోయాడు!.. ప్రాణాపాయమే!;.. కీలక అప్డేట్ ఇచ్చిన సూర్య -
ఎడమచేతి వాటం క్రికెటర్లతో లాభాలేమిటి?
టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టీ20 మ్యాచ్లకు సిద్ధమైంది. అక్టోబరు 29- నవంబరు 8 వరకు ఈ సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో భారత జట్టును పరిశీలిస్తే ఇందులో ఏకంగా ఎనిమిది మంది ఎడమచేతి వాటం గల ఆటగాళ్లు ఉన్నారు.మరి లెఫ్టాండర్ల వల్ల జట్టుకు అదనపు ప్రయోజనాలు ఏమైనా ఉంటాయా? వీరిని ఎక్కువగా తుదిజట్టులోకి తీసుకోవడం వల్లే కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం!బ్రియన్ లారా మారథాన్ ఇన్నింగ్స్ నుంచి ఆడం గిల్క్రిస్ట్ విధ్వంసకర ఇన్నింగ్స్, సౌరవ్ గంగూలీ మెరుపులు .. ఎడమచేతి వాటం బ్యాటర్ల అద్భుత ప్రదర్శనలకు ఇవి నిదర్శనాలు.అడ్వాంటేజ్ ఏంటి?క్రికెట్లో కుడిచేతి వాటం బ్యాటర్లే ఎక్కువ. కాబట్టి బౌలర్లు కూడా అందుకు తగ్గట్లుగానే శిక్షణలో ఎక్కువగా రైట్ హ్యాండ్ బ్యాటర్లకే బౌల్ చేస్తూ ఉంటారు. కాబట్టి లెఫ్టాండర్లు బరిలో ఉన్నపుడు వారి లైన్ అండ్ లెంగ్త్ మార్చుకోవాల్సి ఉంటుంది.ఒకవేళ క్రీజులో లెఫ్ట్- రైట్ బ్యాటర్లు జోడీగా ఉన్నారంటే బౌలర్లకు వారిని విడదీయడం మరింత కష్టతరంగా మారుతుంది. ముఖ్యంగా స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ ఇద్దరూ దంచికొడుతున్నారంటే.. బౌలర్ల రిథమ్ దెబ్బ తింటుంది. ఫీల్డింగ్లోనూ మార్పులు చేయడం బౌలింగ్ చేస్తున్న కెప్టెన్కు తలనొప్పిగా మారుతుంది. తరచూ ఫీల్డర్లను మార్చడం కూడా మైనస్గా మారుతుంది.డేటా ఏం చెబుతోంది?తమ రైట్ హ్యాండ్ కౌంటర్పార్ట్స్ కంటే లెఫ్టాండర్లు మూడు ఫార్మాట్లలోనూ రాణించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. టెస్టు క్రికెట్లో లెఫ్టాండర్లు విండీస్ లెజెండ్ బ్రియన్ లారా, శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర వేల కొద్దీ పరుగులు రాబట్టారు. సంగక్కర టెస్టుల్లో 12,400 పరుగులు సాధిస్తే.. లారా 11,953 పరుగులు స్కోరు చేశాడు.ఇక వన్డేల్లో సౌరవ్ గంగూలీ, శిఖర్ ధావన్ టీమిండియా తరఫున అద్భుత ప్రదర్శనలు కనబరిచారు. గంగూలీ 311 వన్డేల్లో 11363 పరుగులు స్కోరు చేస్తే.. 167 వన్డేలు ఆడి 6793 రన్స్ రాబట్టాడు.అదే విధంగా టీ20 ఫార్మాట్లో డేవిడ్ వార్నర్ అద్భుతంగా రాణించగా.. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న విషయం తెలిసిందే.మ్యాచ్ స్వరూపాన్ని మలుపు తిప్పగలరు!లెఫ్టాండ్ బ్యాటర్లు ఆఫ్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోగలరు. స్పిన్నర్ల బౌలింగ్లో వీరికి షాట్ సెలక్షన్ సులభంగా ఉంటుంది.పవర్ ప్లే, డెత్ ఓవర్లలోనూ వీరి సంప్రదాయ విరుద్ధ బ్యాటింగ్ కారణంగా ప్రత్యర్థి బౌలర్లు, ఫీల్డర్లను మార్పు చేసే క్రమంలో గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి కీలక సమయాల్లో వ్యూహాలు మార్చుకోవాల్సి రావడం విజయావకాశాలను దెబ్బ తీస్తుంది.సైకలాజికల్ ఎడ్జ్కుడిచేతి వాటం బౌలర్లు లెఫ్టాండర్ బ్యాటర్లను ఎదుర్కొనేటపుడు సవాళ్లు ఎదుర్కొంటారు. ప్రతిసారి లైన్ అండ్ లెంగ్త్ మార్చడం వారికి కఠినతరంగా మారుతుంది. ఫీల్డింగ్ ప్లేస్మెంట్లను తరచూ మార్చాల్సి రావడం వల్ల బ్యాటర్లకు పరుగులు స్కోరు చేసే అవకాశాలు పెరుగుతాయి.లెజెండరీ లెఫ్టాండ్ బ్యాటర్లుబ్రియన్ లారా టెస్టుల్లో క్వాడ్రపుల్ (400*) సెంచరీ చేసి ఇప్పటికీ తన పేరిటే ఆ రికార్డును పదిలం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా దిగ్గజం ఆడం గిల్క్రిస్ట్ వన్డే, టెస్టుల్లో తనదైన ముద్ర వేశాడు. ఇక క్రిస్ గేల్, యువరాజ్ సింగ్ల గురించి త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా లెఫ్టాండ్ బ్యాటరే. ఇప్పటికే యూత్ వన్డే, యూత్ టెస్టులలో వైభవ్ ఇరగదీస్తున్నాడు.భారత ప్రస్తుత టీ20 జట్టులో ఎనిమిది మందిఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రస్తుత భారత టీ20 జట్టులో ఏకంగా ఎనిమిది మంది ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఉన్నారు. టాపార్డర్లో విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ.. వన్డౌన్లో తిలక్వర్మ అందుబాటులో ఉన్నారు. వీరిద్దరు స్పిన్ బౌలింగ్ కూడా చేయగలరు. ఇక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శివం దూబేతో పాటు నయా ఫినిషర్ రింకూ సింగ్ కూడా లెఫ్టాండరే. వీరితో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ కూడా ఎడమచేతి వాటం గల ప్లేయర్లే. స్పిన్ కోటాలో కుల్దీప్ యాదవ్, పేసర్ల కోటాలో అర్ష్దీప్ సింగ్ లెఫ్టాండర్ల జాబితాలో ఉన్నారు.చదవండి: స్పృహ తప్పి పడిపోయాడు!.. ప్రాణాపాయమే!;.. కీలక అప్డేట్ ఇచ్చిన సూర్య -
శతక్కొట్టిన సీఎస్కే చిచ్చరపిడుగు
రంజీ ట్రోఫీ 2025-26 ఎడిషన్లో (Ranji Trophy) భాగంగా బెంగాల్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ ఆటగాడు ఉర్విల్ పటేల్ (Urvil Patel) విధ్వంసకర శతకం బాదాడు. 327 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేవలం 96 బంతుల్లోనే 16 ఫోర్ల సాయంతో సెంచరీ చేశాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన ఉర్విల్.. టీమిండియా పేసర్లు మహ్మద్ షమీ, ఆకాశ్దీప్ను సమర్దవంతంగా ఎదుర్కొని శతక్కొట్టాడు.34 ఓవర్ల అనంతరం గుజరాత్ 3 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ఇప్పటివరకే వచ్చిన జట్టు స్కోర్లో ఉర్విల్దే సింహభాగం. అతనికి జతగా జైమీత్ పటేల్ (34) క్రీజ్లో ఉన్నాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ గెలవాలంటే మరో 177 పరుగులు చేయాలి. చివరి రోజు ఆటలో రెండో సెషన్ కొనసాగుతుంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్.. సుదీప్ ఘరామీ (56), ఇషాన్ పోరెల్ (51), సుమంత గుప్తా (63) అర్ద సెంచరీలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 279 పరుగులు చేసింది. సిద్దార్థ్ దేశాయ్ 4 వికెట్లతో సత్తా చాటాడు.అనంతరం బరిలోకి దిగిన గుజరాత్.. షాబాజ్ అహ్మద్ (19-5-34-6) చెలరేగడంతో 167 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ మనన్ హింగ్రాజియా (80 నాటౌట్) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. బెంగాల్ బౌలర్లలో షాబాజ్తో పాటు మహ్మద్ షమీ (18.3-6-44-3) కూడా సత్తా చాటాడు.112 పరుగుల కీలక ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్.. 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. సుదీప్ ఘరామీ (54), అనుస్తుప్ మజుందార్ (58) అర్ద సెంచరీలతో రాణించారు. సిద్దార్థ్ దేశాయ్ 5 వికెట్లతో సత్తా చాటాడు.27 ఏళ్ల ఉర్విల్ పటేల్ గత ఐపీఎల్ సీజన్ మధ్యలో వన్ష్ బేడీ స్థానంలో సీఎస్కేలో చేరాడు. 3 మ్యాచ్ల్లో అద్బుతమైన స్ట్రయిక్రేట్తో (212.50) 68 పరుగులు చేశాడు.ఉర్విల్కు భారత టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్గా రికార్డు ఉంది. 2024 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో త్రిపురపై అతను 28 బంతుల్లోనే శతక్కొట్టాడు. చదవండి: సిక్సర్ కొట్టి అదే బంతికి ఔటయ్యాడు..! -
సిక్సర్ కొట్టి అదే బంతికి ఔటయ్యాడు..!
బంగ్లాదేశ్, వెస్టిండీస్ (Bangladesh vs West Indies) జట్ల మధ్య నిన్న (అక్టోబర్ 27) జరిగిన వన్డే మ్యాచ్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. బంగ్లా ఆటగాడు తస్కిన్ అహ్మద్ (Taskin Ahmed) సిక్సర్ కొట్టిన బంతికే ఔటయ్యాడు. బంగ్లాదేశ్ 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుండగా.. ఇన్నింగ్స్ చివరి ఓవర్ నాలుగో బంతికి ఇది జరిగింది.When you think you've won but life pulls an UNO reverse ◀️#BANvWI pic.twitter.com/neEUjd6bcZ— FanCode (@FanCode) October 27, 2025బంగ్లా గెలుపుకు చివరి 3 బంతుల్లో 17 పరుగులు చేయాల్సి ఉండగా.. రొమారియో షెపర్డ్ను తస్కిన్ ఎదుర్కొన్నాడు. షెపర్డ్ సంధించిన ఫుల్ లెంగ్త్ డెలివరిని తస్కిన్ మిడ్ వికెట్ దిశగా సిక్సర్ బాదాడు. బంతిని బౌండరీ ఆవల పడగానే తస్కిన్ కాలు పొరపాటున వికెట్లను తాకింది. దీంతో బెయిల్ కింద పడి తస్కిన్ హిట్ వికెట్గా (ఆఖరి వికెట్) వెనుదిరగాల్సి వచ్చింది.ఫలితంగా బంగ్లాదేశ్ మరో రెండు బంతులు మిగిలుండగానే ఆలౌటై, 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగిన ఈ వన్డేలో (మొదటిది) తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.షాయ్ హోప్ (46 నాటౌట్), రోవ్మన్ పావెల్ (44 నాటౌట్), అలిక్ అథనాజ్ (34), బ్రాండన్ కింగ్ (33) రాణించారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 2, రిషద్ హొస్సేన్ ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం 166 లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 19.4 ఓవర్లలో 149 పరుగులకు ఆలౌటై, లక్ష్యానికి 17 పరుగుల దూరంలో నిలిచిపోయింది. జేడన్ సీల్స్, జేసన్ హోల్డర్ తలో 3 వికెట్లు తీయగా.. అకీల్ హొసేన్ 2, ఖారీ పియెర్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు.బంగ్లా ఇన్నింగ్స్లో తంజిమ్ హసన్ (33), తౌహిద్ హృదోయ్ (28), నసుమ్ అహ్మద్ (20) ఓ మోస్తరు ఇన్నింగ్స్లు ఆడారు. ఈ సిరీస్లోని రెండో టీ20 ఇదే వేదికగా అక్టోబర్ 29న జరుగనుంది.కాగా, ఇరు జట్ల మధ్య తాజాగా ముగిసిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను బంగ్లాదేశ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి, మూడు మ్యాచ్ల్లో బంగ్లాదేశ్ గెలవగా.. రెండో వన్డేలో వెస్టిండీస్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఈ పరిమిత ఓవర్లల సిరీస్ల కోసం వెస్టిండీస్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది. చదవండి: ఆసీస్తో తొలి టీ20.. భారత తుది జట్టు ఇదే..? -
నాకు ఫోన్ చేసి మరీ..: బీసీసీఐ, టీమిండియాపై సంచలన ఆరోపణలు
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, ఐసీసీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ (Chris Broad) టీమిండియాపై సంచలన ఆరోపణలు చేశాడు. పలు మ్యాచ్లలో భారత జట్టు చేసిన తప్పులను కప్పి పుచ్చాలంటూ తనకు ఫోన్లు వచ్చాయని.. రాజకీయ జోక్యం వల్లే ఒత్తిళ్లు పెరిగాయని ఆరోపించాడు.కాగా ఇంగ్లండ్ దిగ్గజ పేసర్లలో ఒకడైన స్టువర్ట్ బ్రాడ్ (Stuard Broad) తండ్రే క్రిస్ బ్రాడ్. ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 25 టెస్టుల్లో 1661, 34 వన్డేల్లో 1361 పరుగులు చేశాడు. అనంతరం 2003- 2024 వరకు ఐసీసీ మ్యాచ్ రిఫరీగా పనిచేశాడు క్రిస్ బ్రాడ్.కాంట్రాక్టును పునరుద్ధరించని ఐసీసీమొత్తంగా 123 టెస్టులు, 361 వన్డేలు, 138 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లకు బ్రాడ్ రిఫరీగా పనిచేశాడు. అయితే, ఇంకొన్నాళ్లు కొనసాగాలని చూసినా ఐసీసీ అతడి కాంట్రాక్టును పునరుద్ధరించలేదు.ఇదిలా ఉంటే.. తాజాగా ‘ది టెలిగ్రాఫ్నకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రాడ్ మాట్లాడుతూ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly)పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆనాటి మ్యాచ్లో నిర్ణీత ఓవర్ల కంటే ఇండియా మూడు, నాలుగు ఓవర్లు వెనుకబడి ఉంది.అక్కడ ఉంది టీమిండియాజరిమానా పడే పరిస్థితి నెలకొంది. ఇంతలో నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ‘ఉదారంగా వ్యవహరించండి. ఎందుకంటే అక్కడ ఉంది టీమిండియా’ అని నాకు సందేశం వచ్చింది. సరే మరేం పర్లేదు అనుకున్నా.గంగూలీ నా మాట లెక్కచేయలేదుతగినంత సమయం దొరకడంతో చెప్పినట్లే చేశాం. అయితే, ఆ తర్వాతి మ్యాచ్లోనూ ఇదే పునరావృతమైంది. స్లో ఓవర్ రేటు నివారించేలా చర్యలు తీసుకోవాలని సౌరవ్ గంగూలీకి చెప్పినా అతడు నా మాట లెక్కచేయలేదు.అంతలో మళ్లీ ఫోన్.. ‘నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు?’ అని అడిగాను. ఇందుకు బదులుగా.. ‘అతడు (గంగూలీ) ఏం చేస్తే అదే చేయనివ్వండి’ అనే సమాధానం వచ్చింది. అంతా రాజకీయం. అప్పటి నుంచే క్రీడల్లో రాజకీయ జోక్యం మొదలైంది. ఇంకా నయం నేను ఇంకా ఆ పదవిలో లేను.కానీ 20 ఏళ్ల పాటు నాపైకి ఎన్నో ‘బుల్లెట్లు’ దూసుకువచ్చాయి. రాజకీయ జోక్యం వల్ల సమస్యలు వచ్చాయి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. ‘20 ఏళ్ల సుదీర్ఘ సమయం. ఎలా తట్టుకున్నానో అనిపిస్తుంది’’ అని క్రిస్ బ్రాడ్ ఆరోపణలు చేశాడు. అయితే, టీమిండియా ఆడిన ఏ మ్యాచ్ విషయంలో తాను ఇలాంటి ఒత్తిళ్లకు గురయ్యానన్నది మాత్రం అతడు స్పష్టంగా చెప్పలేదు.అందుకే ఆరోపణలా?కాగా ఐసీసీ తన కాంట్రాక్టును పునరుద్ధరించకపోవడాన్ని దృష్టిలో పెట్టుకునే బ్రాడ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఐసీసీ ప్రస్తుత చైర్మన్గా.. బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా ఉన్న విషయం తెలిసిందే.చదవండి: క్రికెట్ ఒక్కటే జీవితం కాదు.. కోహ్లి నన్ను బాగా అర్థం చేసుకుంటాడు: రోహిత్ శర్మ -
ఆసీస్తో తొలి టీ20.. భారత తుది జట్టు ఇదే..?
ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా కాన్బెర్రా వేదికగా భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య రేపు (అక్టోబర్ 29) తొలి టీ20 జరుగనుంది. వన్డే సిరీస్ను 1-2 తేడాతో కోల్పోయిన భారత్.. టీ20 సిరీస్నైనా దక్కించుకొని పరువు కాపాడుకోవాలని పట్టుదలగా ఉంది. పొట్టి ఫార్మాట్లో ఆస్ట్రేలియాపై భారత్కు మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఇప్పటివరకు ఆడిన 32 మ్యాచ్ల్లో 20 సార్లు గెలుపొందింది. ఆసీస్ కేవలం 11 మ్యాచ్ల్లో మాత్రమే విజయాలు సాధించింది. చివరిగా ఇరు జట్ల మధ్య జరిగిన 6 మ్యాచ్ల్లో భారత్ ఏకంగా 5 సార్లు విజయాలు సాధించింది. 2024 ప్రపంచకప్లో భాగంగా జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 24 పరుగుల తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది.అంతకుముందు స్వదేశంలో జరిగిన 5 మ్యాచ్ల సిరీస్ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత యువ జట్టు ఇదే ఫామ్ను రేపటి నుంచి ప్రారంభం కాబోయే సిరీస్లోనూ కొనసాగించాలని భావిస్తుంది. ఇటీవలికాలంలో సూపర్ ఫామ్లో ఉండటంతో టీమిండియాపై అంచనాలు భారీగా ఉన్నాయి.విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ విశేషంగా రాణిస్తున్నాడు. వన్డౌన్లో తిలక్ వర్మ ఆకట్టుకుంటున్నాడు. సంజూ శాంసన్ సక్సెస్ ట్రాక్లో ఉన్నాడు. శుభ్మన్ గిల్ నుంచి స్థాయికి తగ్గ ఇన్నింగ్స్లు బాకీ ఉన్నాయి. శివమ్ దూబే, అక్షర్ పటేల్ ఆల్రౌండర్లుగా సత్తా చాటుతున్నారు. వరుణ్ చక్రవర్తి మ్యాజిక్ కొనసాగుతుంది. బుమ్రా, అర్షదీప్ సింగ్ రాణిస్తున్నారు. గంభీర సహకారంతో నెట్టుకొస్తున్న హర్షిత్ రాణా పర్వాలేదనిపిస్తున్నాడు. టీమిండియాను ప్రస్తుతం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఒక్కటే కలవరపెడుతుంది. స్కై బ్యాటింగ్లో రాణించి చాలాకాలమైంది. ఈ ఆసీస్ సిరీస్లో అయినా అతను సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. వరుసగా విఫలమవుతున్నా మేనేజ్మెంట్, కోచ్ స్కైకు అండగా ఉన్నారు. వ్యక్తిగంతా విఫలమవుతున్నా జట్టును విజయవంతంగా ముందుండి నడిపిస్తున్నాడన్న కారణం చేత అతనికి మద్దతు లభిస్తుంది. అయితే ఇది ఎంతో కాలం ఉండే అవకాశం లేదు. ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్లో విఫలమైతే మాత్రం సెలెక్టర్లు ప్రత్యామ్నాం వైపు చూడవచ్చు.ఆస్ట్రేలియాతో తొలి టీ20లో భారత జట్టు (అంచనా)..అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రాచదవండి: చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్ -
చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్
టీమిండియా టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) చరిత్ర సృష్టించాడు. భారత కెప్టెన్గా మూడు ఫార్మాట్లలో తొలి విజయాన్ని విదేశాల్లో నమోదు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. భారత కెప్టెన్గా టీ20ల్లో తన తొలి విజయాన్ని (తాత్కాలిక కెప్టెన్గా) జింబాబ్వేలో నమోదు చేసిన గిల్.. టెస్ట్ల్లో తొలి విజయాన్ని ఇంగ్లండ్లో, వన్డేల్లో తొలి విజయాన్ని ఆస్ట్రేలియా గడ్డపై సాధించాడు.తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో విజయం అనంతరం గిల్ ఖాతాలో ఈ అల్టిమేట్ రికార్డు చేరింది. ఈ మ్యాచ్ గెలవడంతో భారత్ క్లీన్ స్వీప్ పరాభవాన్ని కూడా తప్పించుకుంది. తొలి రెండు వన్డేల్లో గెలిచిన ఆతిథ్య ఆసీస్ 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. చివరి వన్డేలో రోహిత్ శర్మ అద్భుతమైన శతకంతో భారత్ను గెలిపించాడు. అతనికి విరాట్ కోహ్లి సహకరించాడు.కోహ్లి సరసనఇదే సిరీస్లో గిల్ కెప్టెన్గా ఓ చెత్త రికార్డును కూడా మూటగట్టుకున్నాడు. తొలి వన్డేతో ఈ ఫార్మాట్లో కెప్టెన్సీ అరంగేట్రం చేసిన గిల్.. ఆ మ్యాచ్లో ఓటమి తర్వాత మూడు ఫార్మాట్లలో తొలి మ్యాచ్ ఓడిన రెండో భారత కెప్టెన్గా విరాట్ కోహ్లి సరసన చేరాడు. గిల్ టీ20 కెప్టెన్గా తన తొలి మ్యాచ్లో జింబాబ్వే చేతిలో ఓడాడు. టెస్ట్ కెప్టెన్గా తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో పరాజయం ఎదుర్కొన్నాడు. తాజాగా వన్డే కెప్టెన్గా తొలి మ్యాచ్లో ఆసీస్ చేతిలో భంగపడ్డాడు.మొత్తంగా గిల్కు భారత కెప్టెన్గా మిశ్రమ అనుభవాలు ఎదురయ్యాయి. తాత్కాలిక కెప్టెన్గా టీ20ల్లో తొలి మ్యాచ్లో ఓడినప్పటికీ.. జింబాబ్వేతో జరిగిన ఆ సిరీస్ను భారత్ 4-1 తేడాతో గెలుచుకుంది.టెస్ట్ల్లో భారత కెప్టెన్గా తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి ఎదురైనప్పటికీ.. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకొని, 5 మ్యాచ్ల ఆ సిరీస్ను 2-2తో డ్రా చేసుకున్నాడు.తాజాగా ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల సిరీస్ను ఓటమితో ప్రారంభించినప్పటికీ.. గెలుపుతో ముగించి వైట్వాష్ పరాభవం నుంచి తప్పించుకున్నాడు.గిల్.. రేపటి నుంచి (అక్టోబర్ 29) సాధారణ ఆటగాడిగా ఆస్ట్రేలియాతో జరుగబోయే 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ మ్యాచ్ కాన్బెర్రా వేదికగా భారతకాలమానం ప్రకారం రేపు మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభమవుతుంది.చదవండి: మరోసారి 'మరో ఛాన్స్' అంటున్న కరుణ్ నాయర్..! -
స్పృహ తప్పి పడిపోయాడు!.. ప్రాణాపాయమే!;.. కీలక అప్డేట్ ఇచ్చిన సూర్య
భారత వన్డే క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి (Shreyas Iyer Health Update)పై టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ కీలక అప్డేట్ అందించాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉందంటూ అభిమానులకు శుభవార్త చెప్పాడు. వైద్యులు నిరంతరం శ్రేయస్ను కనిపెట్టుకుని ఉండి.. ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తున్నారని సూర్య తెలిపాడు.కాగా ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా శ్రేయస్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. హర్షిత్ రాణా (Harshit Rana) బౌలింగ్లో అలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్ను సంచలన రీతిలో అందుకున్న ఈ ముంబై బ్యాటర్.. వెంటనే కిందపడిపోయాడు. పొట్ట పట్టుకుని నొప్పితో విలవిల్లాడాడు. ఫిజియో వచ్చి అతడిని డ్రెసింగ్రూమ్కు తీసుకువెళ్లాడు.స్పృహ తప్పి పడిపోయాడుఆ తర్వాత గాయం తీవ్రత ఎక్కువ కావడంతో వెంటనే సిడ్నీలోని ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఈ క్రమంలో బీసీసీఐ వర్గాలు పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘అయ్యర్ డ్రెసింగ్రూమ్కు వెళ్లగానే స్పృహ తప్పి పడిపోయాడు.ప్రాణాంతకమైన గాయమేఆ వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, ఫిజియో, టీమ్ డాక్టర్ వెంటనే స్పందించి పరిస్థితి చేయి దాటకుండా చూసుకున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉన్నా.. ప్రాణాంతకమైన గాయమే అది. శ్రేయస్ పట్టుదల గల ఆటగాడు. త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెడతాడు’’ అని పేర్కొన్నాయి.ఇక ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు శ్రేయస్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘శ్రేయస్ గాయపడ్డాడని తెలిసిన వెంటనే నేను అతడికి కాల్ చేశాను.నేను అయ్యర్తో మాట్లాడుతున్నాఅయితే, అప్పుడు తన ఫోన్ తన దగ్గర లేదని తెలిసింది. వెంటనే ఫిజియో కమలేశ్ జైన్కు ఫోన్ చేశా. పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నా. ఇక గత రెండురోజులుగా నేను అయ్యర్తో మాట్లాడుతున్నా. దీనర్థం.. అతడు బాగానే ఉన్నట్లు కదా!అవును.. శ్రేయస్ పరిస్థితి మెరుగుపడుతోంది. వైద్యులు నిరంతరం అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరికొన్న రోజుల పాటు అయ్యర్ వారి పర్యవేక్షణలోనే ఉండనున్నాడు. ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది’’ అంటూ శ్రేయస్ గురించి ఆందోళన చెందుతున్న అభిమానులకు సూర్య ఊరట కలిగించాడు.కాగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన టీమిండియా వన్డే సిరీస్ను పూర్తి చేసుకుంది. ఇందులో మార్ష్ బృందం.. గిల్ సేనను 2-1తో ఓడించి సిరీస్ గెలుచుకుంది. ఇరుజట్ల మధ్య బుధవారం (అక్టోబరు 29) నుంచి టీ20 సిరీస్ మొదలుకానుంది. నవంబరు 8న ఐదో టీ20తో సిరీస్ ముగుస్తుంది.చదవండి: యశస్వి జైస్వాల్ కీలక నిర్ణయం -
మరోసారి 'మరో ఛాన్స్' అంటున్న కరుణ్ నాయర్..!
డియర్ క్రికెట్ మరో ఛాన్స్ ఇవ్వు అంటూ ఎనిమిదేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ (Karun Nair).. ఇచ్చిన ఛాన్స్ను సద్వినియోగం చేసుకోలేక, ఇలా వచ్చి అలా మాయమయ్యాడు. ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనలో భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన నాయర్.. 7 ఇన్నింగ్స్ల్లో ఒకే ఒక హాఫ్ సెంచరీ సాయంతో 205 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఫలితంగా తదుపరి సిరీస్కే జట్టులో స్థానం కోల్పోయాడు. ఆతర్వాత అతనికి 'ఏ' జట్టులోనూ స్థానం లభించలేదు. సెలెక్టర్లు కరుణ్ నుంచి చాలా ఆశించామని చెప్పి చేతులు దులుపుకున్నారు. తాజాగా కరుణ్ మరోసారి 'మరో ఛాన్స్' అంటూ ముందుకు వచ్చాడు.ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో తొలి మ్యాచ్లో అర్ద సెంచరీ (73), రెండో మ్యాచ్లో భారీ సెంచరీ (174 నాటౌట్) చేసి సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. సెంచరీ అనంతరం కరుణ్ విలేకరులతో మాట్లాడుతూ ఇలా అన్నాడు."టీమిండియా నుంచి తప్పించడం బాధ కలిగించింది. ఒక్క సిరీస్ కంటే ఎక్కువ అర్హుడినని నన్ను నేను ఒప్పించుకుంటూ ఉంటాను. గత రెండు సంవత్సరాల నా ప్రదర్శన చూస్తే, ఆ స్థాయికి అర్హుడిననే అనిపిస్తుంది. ప్రస్తుతం నా పని పరుగులు చేయడం ఒక్కటే. దేశం కోసం ఆడాలన్నదే నా లక్ష్యం. అది సాధపడకపోతే, నా జట్టుకు విజయాన్ని అందించడమే తదుపరి లక్ష్యం"కరుణ్ చేసిన ఈ వ్యాఖ్యలు చూస్తుంటే అతనిలో నిరాశతో కూడిన ఆశ కనిపిస్తుంది. క్రికెట్.. మరోసారి మరో ఛాన్స్ ఇవ్వు అంటూ అర్దించినట్లనిపిస్తుంది. దేశం కోసం ఆడాలన్న తాపత్రయం స్పష్టమవుతుంది.33 ఏళ్ల కరుణ్కు ఇంగ్లండ్ పర్యటనలో మంచి ఆరంభాలు లభించినా దురదృష్టవశాత్తు వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. ఐదో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో కరుణ్ కష్టమైన పిచ్పై అద్భుత ఇన్నింగ్స్ ఆడినా తగిన గుర్తింపు దక్కలేదు. ఆ ఇన్నింగ్స్లో ఇరు జట్లలో కరుణే టాప్ స్కోరర్గా నిలిచాడు.వాస్తవానికి కరుణ్కు అతి భారీ ఇన్నింగ్స్లు ఆడగల సామర్థ్యం ఉంది. ఇది చాలాసార్లు నిరూపితమైంది. ఇలాంటి ఆటగాడికి కొన్ని అవకాశాలు మాత్రమే ఇవ్వడం సబబు కాదు. కరుణ్కు కనీసం దక్షిణాఫ్రికా 'ఏ' సిరీస్తో అయినా భారత ఏ జట్టుకు ఎంపిక చేసి ఉండాల్సింది. అక్కడ ప్రదర్శనను బట్టి అతని భవిష్యత్తును డిసైడ్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకో సెలెక్టర్లు కరుణ్ విషయంలో పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే భావన కలుగుతుంది.చదవండి: చారిత్రక ఘట్టం.. భారత క్రికెట్ ప్రయాణంలో మరిచిపోలేని అధ్యాయం -
పది పరుగులే ఇచ్చి మూడు వికెట్లు కూల్చిన పున్నయ్య
పుదుచ్చేరి: హైదరాబాద్ సీమర్ పున్నయ్య (6–2–10–3) నిప్పులు చెరిగే బౌలింగ్తో పుదుచ్చేరి బ్యాటర్ల పనిపట్టాడు. వర్షం వల్ల కేవలం 25 ఓవర్ల ఆటే జరిగినా... పుదుచ్చేరి పతనావస్థకు చేరింది. రంజీ ట్రోఫీ గ్రూప్ ‘డి’ మ్యాచ్లో 25/1 ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన పుదుచ్చేరి వర్షంతో ఆట నిలిచే సమయానికి 34 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాటర్ ఆనంద్ బైస్ (41; 6 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేకపోయారు. పది మంది క్రీజులోకి రాగా... సిద్దాంత్ (16), గంగా శ్రీధర్ రాజు (11) తప్ప మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. హైదరాబాద్ సీమర్ పున్నయ్య ఆరు ఓవర్ల స్పెల్తోనే పుదుచ్చేరి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఇతనికి జతగా తనయ్ త్యాగరాజన్ (2/41) స్పిన్ మాయాజాలంతో కీలకమైన వికెట్లను తీయడంతో పుదుచ్చేరి ఆలౌట్కు సిద్ధమైంది. ప్రస్తుతం చేతిలో 2 వికెట్లు మాత్రమే మిగిలున్న పుదుచ్చేరి ఇంకా 343 పరుగులు వెనుకడి ఉంది. ఆటకు నేడు ఆఖరి రోజు. వర్షం వల్ల ఆట ఇంకా మొదలుకానేలేదు.మూడో రోజు ఆట రద్దు రంజీ ట్రోఫీ గ్రూప్ ‘ఎ’లో ఆంధ్ర, బరోడా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్కు మోంథా తుపాను అడ్డుపడింది. దీంతో మూడో రోజు ఒక్కబంతి కూడా పడకుండానే ఆట రద్దు అయ్యింది. బరోడా తొలి ఇన్నింగ్స్లో 363 పరుగులు చేయగా, ఆంధ్ర రెండో రోజు ఆట వరకే 43/2 స్కోరు చేసింది. -
అదొక్కటే జీవితం కాదు.. గిల్ అవుట్ కావడం.. శ్రేయస్ గాయం వల్ల..: రోహిత్
ఆస్ట్రేలియాతో సిరీస్కు ముందు తన ఇష్ట్రపకారం తనకు నచ్చిన రీతిలో సన్నద్ధమయ్యాయని టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నాడు. అదే ఇప్పుడు ఫలితాన్ని చూపించిందని హర్షం వ్యక్తం చేశాడు. సిడ్నీ వేదికగా ఆసీస్తో జరిగిన చివరి వన్డేలో సెంచరీ సాధించడంతో పాటు రోహిత్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా కూడా నిలిచాడు. ప్రొఫెషనల్ ఆటగాడిగా క్రికెట్ కెరీర్ కోసం సాధన చేయడం సహజమని... అయితే ఆట బయట కూడా మరో ప్రపంచం ఉందని భావించి ప్రాధాన్యతలు తెలుసుకోవాలని అతడు చెప్పాడు.క్రికెట్ ఒక్కటే జీవితం కాదు‘క్రికెటర్గా కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి ఒక సిరీస్ కోసం 4–5 నెలల సన్నద్ధం అయ్యే అవకాశం ఎప్పుడూ కలగలేదు. కాబట్టి ఈ సారి ఆ సమయాన్ని బాగా వాడుకున్నాను. నాకు నచ్చిన రీతిలో, నా ఇష్ట్రపకారం సాధన చేయాలని నిర్ణయించుకున్నా. అది బాగా పని చేసింది. మిగిలిన కెరీర్ కోసం ఏం చేయాలో అర్థమైంది కూడా.భారత్తో పోలిస్తే ఆస్ట్రేలియా భిన్నమైన పరిస్థితులు ఉన్నా చాలా సార్లు రావడంతో వాటిపై అవగాహన ఉంది. ఒక్కసారి లయ అందుకుంటే చాలని భావించా. నా కోసం ఎక్కువ సమయం కేటాయించా. జీవితంలో క్రికెట్ కాకుండా ఇతర ప్రాధాన్యతలు కూడా ఉన్నాయని తెలుసుకున్నా’ అని రోహిత్ వెల్లడించాడు.కోహ్లితో అద్భుతమైన భాగస్వామ్యంఆస్ట్రేలియా గడ్డపై ఆడతాన్ని తాను చాలా ఇష్టపడతానని, ఇక్కడి అభిమానులు కూడా ఎంతో మద్దతునిస్తారని రోహిత్ పేర్కొన్నాడు వివరించాడు. ‘సిడ్నీ వన్డేలో నేను భారీ స్కోరు చేయడంతో పాటు జట్టును గెలిపించడం సంతృప్తినిచ్చింది. చాలా కాలం తర్వాత కోహ్లితో అద్భుతమైన భాగస్వామ్యం కుదిరింది. మేం సెంచరీ పార్ట్నర్షిప్ నెలకొల్పి చాలా రోజులైంది. జట్టుకు ఇది ఉపయోగపడటం సంతోషకరం.గిల్ అవుట్ కావడం.. శ్రేయస్ గాయం వల్ల..గిల్ తొందరగా అవుట్ కావడంతో శ్రేయస్ గాయం కారణంగా మాపై బాధ్యత పెరిగింది. నేను, విరాట్ ఎన్నో ఏళ్లుగా కలిసి ఆడుతున్నాం. ఇద్దరికీ అనుభవం ఉంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలం. అందుకే క్రీజ్లో ఎంతో మాట్లాడుకుంటూ ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాం. సిరీస్ గెలవకపోయినా అభిమానులు ఎంతో మద్దతునిచ్చారు. జట్టుతో సంబంధం లేకుండా మంచి ఆటను ప్రోత్సహించిన వారికి కృతజ్ఞతలు’ అని రోహిత్ వెల్లడించాడు.మూడో వన్డేలో గెలిచికాగా ఆసీస్తో మూడు వన్డేల సిరీస్ను భారత్ కోల్పోయింది. ఆతిథ్య జట్టు తొలి రెండు వన్డేల్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోగా.. టీమిండియా నామమాత్రపు మూడో వన్డేలో గెలిచి పరువు నిలుపుకొంది. ఈ మ్యాచ్లో రోహిత్ 121, కోహ్లి 74 పరుగులతో అజేయంగా నిలిచి.. భారత్ను తొమ్మిది వికెట్ల తేడాతో గెలిపించారు. ఇద్దరూ కలిసి రెండో వికెట్కు ఏకంగా 168 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.ఇదిలా ఉంటే.. ఆసీస్తో సిరీస్కు ముందే రోహిత్ను వన్డే కెప్టెన్గా తప్పించి.. అతడి స్థానంలో శుబ్మన్ గిల్ను సారథిగా నియమించింది బీసీసీఐ. ఇక ఇప్పటికే అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రో- కో వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.చదవండి: అతడు అద్భుతం.. అహంకారం వద్దు.. రోహిత్- గిల్ సూపర్: గంభీర్ -
భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం
1930ల్లో భారత క్రికెట్ అంతర్జాతీయ స్థాయిలో అడుగుపెడుతున్న వేళ, దేశీయ క్రికెట్కు బలం చేకూర్చే దిశగా 1934లో "క్రికెట్ ఛాంపియన్షిప్ ఆఫ్ ఇండియా" పేరిట ఓ దేశీయ టోర్నీ ప్రారంభమైంది. ఈ టోర్నీ 1935-36లో (రెండో ఎడిషన్) రూపాంతరం చెంది రంజీ ట్రోఫీగా (Ranji Trophy) మారింది. తొలి రెండు ఎడిషన్లలో బాంబే (Bombay) ఛాంపియన్గా అవతరించింది.ఈ టోర్నీ మూడో ఎడిషన్ (1936-37) ఓ చారిత్రక ఘట్టానికి వేదికైంది. ఓ విదేశీ ఆటగాడు భారత దేశ అత్యుత్తమ క్రికెట్ టోర్నీ అయిన రంజీ ట్రోఫీని కైసవం చేసుకున్నాడు. ఇంగ్లండ్కు చెందిన అల్బర్ట్ ఫ్రెడ్రిక్ వెన్ల్సే (Albert Frederick Wensley) నావానగర్ (Nawanagar) అనే జట్టుకు నేతృత్వం వహించి ఛాంపియన్గా నిలబెట్టాడు.తద్వారా ఫ్రెడ్రిక్ రంజీ ట్రోఫీ గెలిచిన తొలి విదేశీ కెప్టెన్గా చరిత్రలో నిలిచాడు. ఆల్రౌండర్ అయిన ఫ్రెడ్రిక్ కోచ్గా వచ్చి, ఆటగాడిగా మారి నావానగర్కు తొలి టైటిల్ అందించాడు. భారత క్రికెట్ చరిత్రలో ఇది మరిచిపోలేని అధ్యాయం.బాంబేలోని జింంఖానా మైదానంలో బెంగాల్తో జరిగిన ఫైనల్లో నావానగర్ అద్భుత ప్రదర్శన చేసి ఛాంపియన్గా అవతరించింది. 1937, ఫిబ్రవరి 6-10 మధ్యలో జరిగిన ఆ మ్యాచ్లో నావానగర్ తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ (424) చేసింది. వినూ మన్కడ్ (185) సెంచరీతో కదంతొక్కాడు. సోరబ్జీ కోలా (66) అర్ద సెంచరీతో రాణించాడు.అనంతరం బరిలోకి దిగిన బెంగాల్.. ఫ్రెడ్రిక్ వెన్ల్సే (4/93) ధాటికి 315 పరుగులకు ఆలౌటైంది. బెంగాల్ ఇన్నింగ్స్లో పాల్ వాన్ డర్ గచ్ట్ (79) అర్ద సెంచరీతో రాణించాడు.109 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నావానగర్ 383 పరుగులకు ఆలౌటై, బెంగాల్ ముందు 493 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో ఫ్రెడ్రిక్ వెన్ల్సే (4/46) మరోసారి చెలరేగడంతో బెంగాల్ 236 పరుగులకే ఆలౌటై, 256 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.ఫ్రెడ్రిక్ వెన్ల్సే అద్భుతమైన బౌలింగ్తో నావానగర్ను ఛాంపియన్గా నిలబెట్టాడు. ఓ విదేశీ ఆటగాడు కోచ్గా వచ్చి, కెప్టెన్గా మారి, ఛాంపియన్గా నిలిచిన ఈ ప్రయాణం భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయింది. ఈ ఘట్టం రంజీ ట్రోఫీకి అంతర్జాతీయ గౌరవాన్ని తెచ్చింది. ఫ్రెడ్రిక్ వెన్ల్సే తర్వాత టామ్ లాంగ్ఫీల్డ్, హెర్బర్ట్ బారిట్ అనే ఇంగ్లీష్ ఆటగాళ్లు బెంగాల్ (1938-39), వెస్ట్రన్ ఇండియా (1943-44) జట్లను రంజీ ఛాంపియన్లుగా నిలబెట్టారు. చదవండి: యశస్వి జైస్వాల్ కీలక నిర్ణయం -
జైస్వాల్ కీలక నిర్ణయం
భారత టెస్ట్ జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీమిండియా తరఫున ఎలాంటి కమిట్మెంట్స్ లేకపోవడంతో దేశవాలీ క్రికెట్ ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. త్వరలో జరుగనున్న రంజీ ట్రోఫీ 2025/26 (Ranji Trophy) మూడో రౌండ్ మ్యాచ్ ఆడేందుకు సన్నద్దత వ్యక్తం చేస్తూ.. తన హోం టీమ్ మేనేజ్మెంట్కు లేఖ రాశాడు. ఈ విషయాన్ని సోషల్మీడియా వేదికగా వెల్లడించాడు.జైస్వాల్ కొద్ది కాలం క్రితం తన హోం టీమ్ ముంబైని కాదని గోవాకు ఆడాలని నిర్ణయించుకున్నాడు. అయితే తదనంత పరిణామాల్లో యూటర్న్ తీసుకున్నాడు. తాజాగా రాజస్తాన్తో జరిగబోయే మూడో రౌండ్ మ్యాచ్కు ముంబై తరఫున ఆడేందుకు అందుబాటులో ఉన్నట్లు ప్రకటించాడు.ఈ మ్యాచ్ నవంబర్ 1 నుంచి జైపూర్లో జరుగుతుంది. ఎలైట్ గ్రూప్ D భాగంగా ఈ మ్యాచ్ జరుగనుంది. ముంబై మేనేజ్మెంట్ తమను కాదని వెళ్లిపోవాలని చూసిన జైస్వాల్కు అవకాశం ఇస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒక వేళ అవకాశం ఇస్తే అతను ముంబై జట్టులో కీలకమవుతాడు.జైస్వాల్ తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో పాల్గొన్నాడు. అయితే అక్టోబర్ 29 నుంచి ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్ల టీ20ల సిరీస్కు అతను ఎంపిక కాలేదు. దీంతో దేశీయ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు.టీమిండియా తరఫున కమిట్మెంట్స్ లేని సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లు దేశీయ క్రికెట్ ఆడాలని బీసీసీఐ కండిషన్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకే జైస్వాల్ కూడా రంజీ ఆడాలని నిర్ణయించుకున్నాడు. మూడో రౌండ్కు ముంబై జట్టును త్వరలో ప్రకటిస్తారు.జైస్వాల్ గత సీజన్లో జమ్మూ అండ్ కాశ్మీర్తో జరిగిన మ్యాచ్లో ముంబై తరఫున చివరిసారి ఆడాడు. ఆ మ్యాచ్లో రోహిత్ శర్మ కూడా పాల్గొన్నాడు. జైస్వాల్ తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ను ఈ ఏడాది ఆగస్ట్లో ఆడాడు. దులీప్ ట్రోఫీ 2025లో వెస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగాడు.రంజీ ట్రోఫీలో ఆడటం జైస్వాల్కు వ్యక్తిగతంగా కలిసొస్తుంది. నవంబర్ 14 నుంచి దక్షిణాఫ్రికాతో జరుగబోయే హోం సిరీస్కు ముందు మంచి ప్రాక్టీస్ అవుతుంది. ఆ సిరీస్లో భారత్ రెండు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జైస్వాల్కు టెస్ట్ జట్టులో చోటు పక్కా కాగా.. వన్డే, టీ20ల్లో అవకాశం లభిస్తుందో లేదో చూడాలి. సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్లు నవంబర్ 14 (కోల్కతా), నవంబర్ 22 (గౌహతి) తేదీల్లో జరుగనున్నాయి.చదవండి: వెస్టిండీస్ బోణీ -
వెస్టిండీస్ బోణీ
బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో (Bangladesh vs West Indies) వెస్టిండీస్ బోణీ కొట్టింది. చట్టోగ్రామ్ వేదికగా నిన్న (ఆక్టోబర్ 27) జరిగిన తొలి మ్యాచ్లో 16 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.షాయ్ హోప్ (46 నాటౌట్), రోవ్మన్ పావెల్ (44 నాటౌట్), అలిక్ అథనాజ్ (34), బ్రాండన్ కింగ్ (33) రాణించారు. షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ డకౌటయ్యాడు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 2, రిషద్ హొస్సేన్ ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం 166 లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ ఓ మోస్తరు పోరాటం చేసి చేతులెత్తేసింది. 19.4 ఓవర్లలో 149 పరుగులకు ఆలౌటై, లక్ష్యానికి 17 పరుగుల దూరంలో నిలిచిపోయింది. జేడన్ సీల్స్, జేసన్ హోల్డర్ తలో 3 వికెట్లు తీయగా.. అకీల్ హొసేన్ 2, ఖారీ పియెర్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు.బంగ్లా ఇన్నింగ్స్లో తంజిమ్ హసన్ (33), తౌహిద్ హృదోయ్ (28), నసుమ్ అహ్మద్ (20) ఓ మోస్తరు ఇన్నింగ్స్లు ఆడారు. స్టార్ బ్యాటర్, కెప్టెన్ అయిన లిట్టన్ దాస్ 5 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. ఈ సిరీస్లోని రెండో టీ20 ఇదే వేదికగా అక్టోబర్ 29న జరుగనుంది.కాగా, ఇరు జట్ల మధ్య తాజాగా ముగిసిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను బంగ్లాదేశ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి, మూడు మ్యాచ్ల్లో బంగ్లాదేశ్ గెలవగా.. రెండో వన్డేలో వెస్టిండీస్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఈ పరిమిత ఓవర్లల సిరీస్ల కోసం వెస్టిండీస్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది. చదవండి: ఐసీయూ నుంచి బయటకు! -
‘సూర్య ఫామ్పై ఆందోళన లేదు’
కాన్బెర్రా: భారత టి20 జట్టు కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ ఇటీవల బ్యాటింగ్లో వరుసగా విఫలమవుతున్నాడు. ఆసియా కప్ టోర్నీలో జట్టును విజేతగా నిలిపినా... గత 14 ఇన్నింగ్స్లలో అతను ఒక్క అర్ధసెంచరీ కూడా చేయలేదు. అయితే సూర్యకు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అండగా నిలిచాడు. అతని ఫామ్తో తమకు ఆందోళన లేదని, ఒక ప్లేయర్ బ్యాటింగ్కంటే ఓవరాల్గా జట్టు ప్రదర్శనను చూడాలని అతను అభిప్రాయపడ్డాడు. ‘ఎలాంటి స్థితిలోనైనా దూకుడుగా ఆడాలని మేమందరం కలిసి డ్రెస్సింగ్ రూమ్లో నిర్ణయం తీసుకున్నాం. ఇలాంటప్పుడు సహజంగానే వైఫల్యాలు వస్తాయి. కాబట్టి సూర్య బ్యాటింగ్ గురించి మేం ఆందోళన చెందడం లేదు. 30 బంతుల్లో 40 పరుగులు చేసి అతను విమర్శల నుంచి తప్పించుకోవచ్చు. అయితే ధాటిని కొనసాగించి విఫలమైనా నష్టం లేదని ముందే అనుకున్నాం. ప్రస్తుతం అభిషేక్ శర్మ అద్భుత ఫామ్లో ఉన్నాడు. సూర్య ఒక్కసారి లయ అందుకుంటే తానూ దూసుకుపోతాడు. అయితే టి20ల్లో వ్యక్తిగత ప్రదర్శనలకంటే జట్టుకు పనికొచ్చే ప్రభావవంతమైన ఇన్నింగ్స్లు ముఖ్యం’ అని గంభీర్ వివరించాడు. జట్టు కెపె్టన్, కోచ్ల మధ్య మంచి అవగాహన ఉందని, అది జట్టు ఫలితాల్లో కనిపిస్తుందని అతను అన్నాడు. ‘ఎక్కడా వెనక్కి తగ్గని టీమ్గా దీనిని తీర్చిదిద్దాలని మేం భావిస్తున్నాం. అందుకే వైఫల్యాలకు మేం భయపడం. ఆసియా కప్ ఫైనల్లో కూడా ఏదైనా తప్పు చేసినా ఏమీ కాదని ఆటగాళ్లను ముందే చెప్పాను. తప్పులు మానవ సహజం. అయితే దూకుడును మాత్రం ప్రదర్శించకుండా సాధారణంగా ఆడితే ప్రత్యర్థిని అవకాశం ఇచ్చినట్లే’ అని గంభీర్ స్పష్టం చేశాడు. కాన్బెర్రాలో రేపు జరిగే తొలి మ్యాచ్తో ఆస్ట్రేలియా, భారత్ జట్ల ఐదు టి20 మ్యాచ్ల సిరీస్ మొదలవుతుంది. ఈ మ్యాచ్కు సన్నాహకంగా సోమవారం భారత ఆటగాళ్లందరూ ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొన్నారు. -
ప్రతీక స్థానంలో షఫాలీ
ముంబై: మహిళల వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్కు భారత ఓపెనర్ ప్రతీక రావల్ దూరమైంది. బంగ్లాదేశ్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ ఆమె గాయపడింది. ఫిజియో సహాయంతో ఆమె మైదానం వీడాల్సి వచ్చింది. ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం ప్రతీక తర్వాతి మ్యాచ్ ఆడే అవకాశం లేదని ఖాయమైంది. ప్రతీక స్థానంలో షఫాలీ వర్మను సెలక్టర్లు ఎంపిక చేశారు. వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన టీమ్లో షఫాలీకి చోటు దక్కలేదు. ఏడాది క్రితం షఫాలీ తన చివరి వన్డే ఆడింది. వరుస వైఫల్యాల తర్వాత ఆమె స్థానంలోనే వచ్చిన ప్రతీక తన నిలకడైన ఆటతో ఓపెనింగ్ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ప్రతీక ఈ ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానంలో (308 పరుగులు) ఉంది. ఇప్పుడు టీమ్లో ఉన్న ప్లేయర్లలో హర్లీన్, అమన్జ్యోత్, ఉమా ఛెత్రి, జెమీమాలతోపాటు రిజర్వ్ బ్యాటర్ తేజల్ హసబ్నిస్కు కూడా ఓపెనింగ్ చేసే సామర్థ్యం ఉన్నా... వారిని కాదని రిజర్వ్ జాబితాలో కూడా లేని షఫాలీని జట్టులోకి తీసుకున్నారు. దూకుడుకు మారుపేరైన 21 ఏళ్ల షఫాలీ కీలక మ్యాచ్లో స్మృతితో కలిసి ఓపెనర్గా బరిలోకి దిగనుంది. భారత్ తరఫున 29 వన్డేల్లో 23 సగటుతో షఫాలీ 644 పరుగులు చేసింది. ఇందులో 4 అర్ధసెంచరీలు ఉన్నాయి. టీమ్లో స్థానం కోల్పోయిన తర్వాత భారత ‘ఎ’ జట్టు తరఫున ఆమె నిలకడగా రాణిస్తూ పరుగులు సాధిస్తోంది. గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. -
Shreyas Iyer: ఐసీయూ నుంచి బయటకు!
సిడ్నీ: భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ గాయం తీవ్రత ఊహించిన దానికంటే ఎక్కువగా తేలింది. ఆ్రస్టేలియాతో జరిగిన మూడో వన్డేలో అలెక్స్ కేరీ క్యాచ్ పట్టే ప్రయత్నంలో శ్రేయస్ పక్కటెముకలకు గాయమైంది. వెంటనే మైదానం వీడిన అతడికి ముందు జాగ్రత్తగా వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం అతడి పక్కటెముకల లోపలి భాగంలో రక్త స్రావం జరిగినట్లు నిర్ధారణ అయింది. వైద్య పరిభాషలో ‘స్పీన్ లేసరేషన్’గా వ్యవహరించే ఈ ప్రమాదంతో ప్రాణాలకే అపాయం కలిగే అవకాశం ఉంది. దాంతో వెంటనే శ్రేయస్ను స్థానిక ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి చికిత్స నిర్వహించారు. అతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. శ్రేయస్ చికిత్సను పర్యవేక్షిస్తూ స్థానిక వైద్యులకు సహకరించేందుకు భారత టీమ్ డాక్టర్ రిజ్వాన్ ఖాన్ను సిడ్నీలోనే ఉంచినట్లు బీసీసీఐ వెల్లడించింది. ఎప్పటికప్పుడు శ్రేయస్ ఆరోగ్యంపై సమీక్ష నిర్వహిస్తామని బోర్డు వెల్లడించింది. కనీసం వారం రోజుల పాటు అతను సిడ్నీలోనే ఉండే అవకాశం ఉంది. తమ కొడుకు వద్దకు వెళ్లేందుకు శ్రేయస్ తల్లిదండ్రులు అత్యవసర వీసా కోసం ప్రయతి్నస్తున్నట్లు తెలిసింది. మరోవైపు బోర్డు నుంచి అధికారిక ప్రకటన లేకపోయినా... శ్రేయస్ పరిస్థితి కాస్త మెరుగుపడటంతో ప్రస్తుతం ఐసీయూ నుంచి బయటకు తీసుకువచ్చినట్లు సమాచారం. -
World Cup 2025: ఆసీస్తో సెమీ ఫైనల్.. భారత జట్టులో కీలక మార్పు
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 (ICC Women's ODI WC)లో సెమీ ఫైనల్ చేరిన టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఫామ్లో ఉన్న ఓపెనింగ్ బ్యాటర్ ప్రతికా రావల్ (Pratika Rawal) గాయం వల్ల జట్టుకు దూరమైంది. ఈ నేపథ్యంలో భారత జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది.ప్రతికా రావల్ స్థానంలో అండర్-19 వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్ జట్టులోకి వచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ విషయాన్ని సోమవారం ప్రకటించింది. ఇంతకీ ఎవరా ప్లేయర్ అంటే?!...కుడికాలి చీలమండకు గాయంసొంతగడ్డపై న్యూజిలాండ్తో కీలక మ్యాచ్లో గెలిచి భారత్ సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. లీగ్ దశలో చివరగా బంగ్లాదేశ్తో మ్యాచ్లోనూ సత్తా చాటి గెలుపొందాలని భావించింది. అయితే, నవీ ముంబై వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసి పోయింది.వాన వల్ల 27 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ మహిళా జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. అయితే, ఆదివారం నాటి ఈ మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ప్రతికా రావల్ కుడికాలి చీలమండకు గాయమైంది. నొప్పితో విలవిల్లాడుతూ ఆమె మైదానం వీడింది. ఆ తర్వాత కూడా బ్యాటింగ్కు రాలేదు.మంధానకు జోడీగా అమన్జోత్ కౌర్ ప్రతికా రావల్ స్థానంలో స్మృతి మంధాన (34 నాటౌట్)కు ఓపెనింగ్ జోడీగా అమన్జోత్ కౌర్ (15 నాటౌట్) వచ్చింది. అయితే, వర్షం ఎక్కువ కావడంతో 8.4 ఓవర్ల వద్ద ఆట నిలిచిపోయింది. అప్పటికి హర్మన్ సేన వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది.కాగా ఐసీసీ మహిళల వరల్డ్కప్ తుది అంకానికి చేరుకుంది. గువాహటిలో అక్టోబరు 29న తొలి సెమీస్ మ్యాచ్ జరుగనుండగా.. ఇందులో ఇంగ్లండ్- సౌతాఫ్రికా పోటీపడనున్నాయి. మరోవైపు.. భారత్- ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీ ఫైనల్ (అక్టోబరు 30) జరుగనుండగా.. ఇందుకు నవీ ముంబై వేదిక.లేడీ సెహ్వాగ్ వచ్చేసిందిఅయితే, పటిష్ట ఆస్ట్రేలియా జట్టుతో కీలక సెమీస్కు ముందు ఇన్ఫామ్ బ్యాటర్ ప్రతికా సేవలను భారత్ కోల్పోవడం ఆందోళన కలిగించే అంశం. ఆమె స్థానంలో ‘లేడీ సెహ్వాగ్’గా పేరొందిన షఫాలీ వర్మ జట్టులోకి వచ్చింది.కాగా సెమీస్ మ్యాచ్లో జట్టు మార్పు నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఈవెంట్ టెక్నికల్ కమిటీ నుంచి బీసీసీఐ అనుమతి తీసుకుంది. ఇక భారత జట్టు ఓపెనర్గా కొంతకాలం వెలుగొందిన షఫాలీ వర్మ.. తర్వాత ఫామ్లేమితో సతమతమైంది.527 పరుగులు సాధించి..అదే సమయంలో ప్రతికా రావల్ రావడం.. నిలకడగా ఆడటంతో జట్టులో షఫాలీ స్థానం గల్లంతైంది. ఈ క్రమంలోనే వన్డే వరల్డ్కప్ టోర్నీలోనూ ఆమె చోటు దక్కించుకోలేకపోయింది. కాగా షఫాలీ చివరగా 2024, అక్టోబరులో భారత్ తరఫున వన్డే ఆడింది.ఇక గతేడాది హర్యానా తరఫున దేశీ వన్డే క్రికెట్లో షఫాలీ మెరుగ్గా రాణించింది. 75.28 సగటుతో 527 పరుగులు సాధించింది. ఇదిలా ఉంటే.. 2024 డిసెంబరులో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ప్రతికా రావల్.. 23 ఇన్నింగ్స్లోనే వన్డేల్లో వెయ్యి పరుగుల మార్కు అందుకుంది.తద్వారా మహిళల వన్డేల్లో ఫాస్టెస్ట్ 1000 రన్స్ చేసిన క్రికెటర్గా నిలిచింది. మంధానతో కలిసి 23 ఇన్నింగ్స్లో ఓపెనింగ్ వికెట్కు ప్రతికా ఏకంగా 1799 పరుగులు జతచేసి రికార్డు సృష్టించడం గమనార్హం. ఏదేమైనా చాంపియన్ జట్టు ఆసీస్తో పోరులో ప్రతికా లేని లోటు స్పష్టంగా తెలుస్తుందనడంలో సందేహం లేదు. కాగా సారథిగా షఫాలీ భారత్కు అండర్-19 ప్రపంచకప్-2023 అందించిన విషయం తెలిసిందే.చదవండి: అతడు అద్భుతం.. అహంకారం వద్దు.. రోహిత్- గిల్ సూపర్: గంభీర్ -
ఫెయిల్ అయితే ఏంటి?!.. నాకైతే అలాంటి భయాలు లేవు: గంభీర్
టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనను పేలవంగా ఆరంభించింది. వన్డే సిరీస్లో ఆతిథ్య జట్టు చేతిలో 2-1 (Ind Loss ODI Series To Aus)తో ఓడిపోయింది. ఫలితంగా వన్డే కెప్టెన్గా శుబ్మన్ గిల్ (Shubman Gill)కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం మిగిలింది.ఈ నేపథ్యంలో టీ20 సిరీస్లోనైనా సత్తా చాటాలని టీమిండియా పట్టుదలగా ఉంది. టెస్టు, వన్డే ఫార్మాట్లలో తిరుగులేని ఆస్ట్రేలియా.. పొట్టి ఫార్మాట్లో మాత్రం అంత గొప్పగా రాణించిన దాఖలాలు లేవు. ముఖ్యంగా టీమిండియాతో ఆడిన 32 మ్యాచ్లలో కంగారూ జట్టు కేవలం 11 మ్యాచ్లలో మాత్రమే గెలుపొందడం ఇందుకు నిదర్శనం.బ్యాటింగ్ పరంగా విఫలంముఖాముఖి రికార్డు పరంగా భారత్ పటిష్ట స్థితిలోనే ఉన్నా సొంతగడ్డపై ఆస్ట్రేలియాను తక్కువగా అంచనా వేయలేము. మరోవైపు.. టీమిండియా టీ20 కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన తర్వాత వరుస విజయాలు అందుకుంటున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav).. బ్యాటింగ్ పరంగా విఫలం కావడం కలవరపెట్టే అంశం.గతేడాది జూలైలో టీ20 జట్టు పూర్తిస్థాయి కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న సూర్య.. 20 మ్యాచ్లలో కలిపి కేవలం రెండే హాఫ్ సెంచరీలు బాదాడు. సగటు 18 కంటే తక్కువ. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ఇంకా కేవలం మూడు నెలల సమయమే ఉన్న వేళ సూర్య ఫామ్ ఆందోళనకు గురి చేస్తోంది. 72 పరుగులేఇటీవల కెప్టెన్గా ఆసియా టీ20 కప్-2025 టైటిల్ గెలిచిన సూర్య.. ఆరు ఇన్నింగ్స్లో కలిపి కేవలం 72 పరుగులే చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ ఫామ్పై విమర్శలు వస్తుండగా.. టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ తనదైన శైలిలో స్పందించాడు.ఎలాంటి భయాలు లేవుఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆరంభం నేపథ్యంలో జియోస్టార్తో మాట్లాడుతూ.. ‘‘సూర్య బ్యాటింగ్ ఫామ్ నన్ను ఏమాత్రం ఆందోళనకు గురిచేయడం లేదు. ఈ విషయంలో ఎలాంటి భయాలు లేవు. అల్ట్రా- అగ్రెసివ్గా ఆడాలని డ్రెసింగ్రూమ్లో నిర్ణయించుకున్నాం. దూకుడుగా ఆడటమే మాకు ఇష్టం.ఇలాంటి సిద్ధాంతాలు పెట్టుకున్నపుడు వైఫల్యాలను కూడా ఆమోదించగలగాలి. ఇలాంటి అప్రోచ్ కారణంగా ఒక్కోసారి విఫలమైనా సరే.. మేము దానికే కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నాం’’ అని గంభీర్ తెలిపాడు.ఒక్కసారి లయ అందుకుంటేఇక టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘అతడు ఆసియా కప్ టోర్నీలో సూపర్ ఫామ్ కనబరిచాడు. ఏదేమైనా సూర్య ఒక్కసారి లయ అందుకుంటే బాధ్యత తన భుజం మీదు వేసుకోవడానికి ఏమాత్రం సందేహించడు.టీ20 క్రికెట్లో మేము వ్యక్తిగత పరుగుల కంటే కూడా మా క్రికెట్ బ్రాండ్పైనే ఎక్కువగా దృష్టి పెడతాం. దూకుడైన శైలితోనే ముందుకు సాగుతాం. బ్యాటర్లు తరచూ వ్యక్తిగతంగా విఫలమైనా.. జట్టు రాణిస్తే అది పెద్దగా లెక్కలోకి రాదు’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్లోనూ తమ దూకుడు కొనసాగుతుందంటూ ఆస్ట్రేలియా జట్టుకు గౌతీ హెచ్చరికలు జారీ చేశాడు. కాగా అక్టోబరు 29- నవంబరు 8 వరకు భారత్- ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: అతడు అద్భుతం.. అహంకారం వద్దు.. రోహిత్- గిల్ సూపర్: గంభీర్ -
కిచిడీ రూ. 620.. అన్నం రూ. 318.. ఒక్క నాన్ 118!.. ఈ రేట్లు ఎక్కడంటే..
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో అభిమానులను అలరించాడు. పెర్త్, అడిలైడ్లో డకౌట్లతో నిరాశపరిచిన ఈ రన్మెషీన్.. సిడ్నీలో మాత్రం సత్తా చాటాడు. మొత్తంగా 81 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో 74 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఆఖరి ఆస్ట్రేలియా టూర్ఓపెనర్ రోహిత్ శర్మ (121 నాటౌట్)తో కలిసి రెండో వికెట్కు ఏకంగా 168 పరుగులు జోడించిన కోహ్లి.. విన్నింగ్ షాట్గా ఫోర్ బాది టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి.. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో కోహ్లి కెరీర్లో ఇదే ఆఖరి ఆస్ట్రేలియా టూర్ కానుంది. దీంతో అభిమానులతో పాటు కింగ్ కూడా ఉద్వేగానికి లోనయ్యాడు. ఎట్టకేలకు సిడ్నీలో మరోసారి తన విలువను చాటుకుని ఆసీస్ పర్యటనను ముగించాడు. ఈ క్రమంలో తాజాగా మరోసారి కోహ్లి పేరు వైరల్గా మారింది.ఈసారి ఆటతో కాకుండా వ్యక్తిగత విషయంతో కోహ్లి వార్తల్లోకి ఎక్కాడు. కాగా ఈ క్రికెట్ సూపర్స్టార్ వన్8 కమ్యూన్ పేరిట రెస్టారెంట్ చైన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ముంబైలో 2022లో తొలి రెస్టారెంట్ తెరిచిన కోహ్లి.. జుహులోనూ ఓ బ్రాంచ్ పెట్టాడు.ఐకానిక్ బంగ్లాలో కోహ్లి రెస్టారెంట్బాలీవుడ్ లెజెండరీ సింగర్ కిషోర్ కుమార్కు చెందిన ఐకానిక్ బంగ్లాలో కోహ్లి రెస్టారెంట్ నడుస్తోంది. ఇందులో వడ్డించే ఆహార పదార్థాల ధరలు తాజాగా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి.కిచిడీ రూ. 620.. అన్నం రూ. 318జుహులోని వన్8 రెస్టారెంట్లో పావ్ భాజీ ధర రూ. 650. అదే విధంగా.. ఉడకబెట్టిన అన్నం ధర రూ. 318. సింగిల్ సర్వింగ్ ఫ్రైస్ ధర ఏకంగా రూ. 348. వీటి సంగతి ఇలా ఉంటే.. కిచిడీ, తందూరీ రోటీ, బేబీ నాన్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.విరాట్ రెస్టారెంట్లో ఒక తందూరీ రోటీ ధర రూ. 118. ఇక కిచిడీ ధర ఏకంగా అక్షరాలా 620 రూపాయలు. కాగా వన్8 రెస్టారెంట్లో మొక్కల ఆధారిత వంటకాలతో పాటు మాంసం, సీ ఫుడ్ కూడా అందుబాటులో ఉంటాయి.విరాట్ ఫేవరెట్స్అంతేకాదు.. ‘విరాట్ ఫేవరెట్స్’ పేరిట ప్రత్యేక వంటకాలు కూడా ఈ రెస్టారెంట్లో లభిస్తాయి. టోఫు స్టీక్, మష్రూమ్ డంప్లింగ్స్ విత్ ట్రఫోల్ ఆయిల్, సూపర్ఫుడ్ సలాడ్ ఇక్కడి వెజిటేరియన్ స్పెషల్స్. ఇక పెంపుడు జంతువుల కోసం వన్8లో ఫుడ్ అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ. 518- 818 వరకు ఉంటుంది.ఇక అభిమానులను ఆకర్షించేందుకు వన్8 కమ్యూన్ ఎంట్రన్స్లోనే కోహ్లి క్రికెట్ ప్రయాణాన్ని సూచించేలా ఫొటోలు ఉంటాయి. కోహ్లి జెర్సీ (నంబర్ 18)ని అక్కడి గోడపై వేలాడదీసి ఉంచారు. గ్లాస్ రూఫ్ ద్వారా సూర్యకాంతి పడుతూ ఉంటుంది. ‘‘చక్కటి, ఆహ్లాకరమైన పరిసరాలు ఉండటం అత్యంత ముఖ్యం. భోజన నాణ్యత ఎలాగూ బాగానే ఉంటుంది. ప్రతి వంటకాన్ని శ్రద్ధ పెట్టి తయారు చేస్తాం. కానీ అన్నింటికంటే ఆంబియన్స్ బాగుంటేనే ఎవరైనా ఇక్కడి వరకు వస్తారు’’.. ఆతిథ్య రంగంలో రాణిస్తున్న కోహ్లి తరచూ చెప్పే మాట ఇది!!చదవండి: అతడు అద్భుతం.. అహంకారం వద్దు.. రోహిత్- గిల్ సూపర్: గంభీర్ View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
అతడు అద్భుతం.. అహంకారం వద్దు.. రోహిత్- గిల్ సూపర్: గంభీర్
టీమిండియా దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ (Rohit Sharma)- విరాట్ కోహ్లి (Virat Kohli) ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతంగా ముగించారు. దాదాపు ఏడు నెలల విరామం తర్వాత భారత జట్టు తరఫున బరిలోకి దిగిన ఈ కుడిచేతి వాటం ఆటగాళ్లు.. ఆసీస్తో మూడో వన్డేలో దుమ్ములేపారు.168 పరుగులు భాగస్వామ్యంఓపెనర్ రోహిత్ శర్మ అజేయ శతకం (125 బంతుల్లో 121*)తో చెలరేగగా.. వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి 74 పరుగులతో చెలరేగి.. ఫోర్ బాది జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. ఈ వెటరన్ బ్యాటర్లు తమ వింటేజ్ ఇన్నింగ్స్ను గుర్తుచేస్తూ.. ఏకంగా 168 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.తప్పిన గండంమరోవైపు.. అంతకు ముందు కెప్టెన్, ఓపెనర్ గిల్ (24)తో కలిసి రోహిత్ 69 పరుగుల పార్ట్నర్షిప్ నిర్మించాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా విధించిన 237 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం ఒక వికెట్ కోల్పోయి 38.3 ఓవర్లలోనే పూర్తి చేసింది. తద్వారా సిడ్నీ వన్డేలో గెలుపొంది ఆసీస్ చేతిలో క్లీన్స్వీప్ నుంచి తప్పించుకుంది.మూడు వన్డేల సిరీస్లో ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించి పరువు కాపాడుకుంది. మరోవైపు.. ఆఖరిదైన ఈ మూడో వన్డేలో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా యువ పేసర్ హర్షిత్ రాణా తన కెరీర్లో తొలిసారి నాలుగు వికెట్ల హాల్ నమోదు చేసి.. ఆసీస్ను 236 పరుగులకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు.రోహిత్- గిల్ సూపర్ఈ నేపథ్యంలో డ్రెసింగ్ రూమ్లో ఆటగాళ్లతో మాట్లాడిన హెడ్కోచ్ గౌతం గంభీర్ జట్టుపై ప్రశంసలు కురిపించాడు. ‘‘శుబ్మన్, రోహిత్ మధ్య భాగస్వామ్యం అద్భుతం. ఛేదనలో వికెట్ కోల్పోకుండా 60కి పైగా పరుగులు చేయడం కలిసి వచ్చింది.ఆ తర్వాత రోహిత్-విరాట్ పార్ట్నర్షిప్ అత్యద్భుతం. ముఖ్యంగా రోహిత్ సెంచరీని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలి. అతడి ఆట తీరు అమోఘం. మ్యాచ్ను ముగించిన తీరు ప్రశంసనీయం. రోహిత్తో పాటు విరాట్ పని పూర్తి చేశాడు’’ అని గంభీర్ కొనియాడాడు.అహంకారం వద్దుఅంతకుముందు.. ‘‘బౌలర్లు కూడా అద్భుతంగా ఆడారు. హర్షిత్ అవుట్స్టాండింగ్ స్పెల్ వేశాడు. అయితే ఇది ఆరంభం మాత్రమే. ఒద్దికగా.. ఒదిగి ఉండాలి. మరింత కష్టపడాలి. అహంకారం వద్దు’’ అని గంభీర్ తన ప్రియ శిష్యుడు హర్షిత్ రాణాకు సూచించాడు. ఇక ఆఖర్లో ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును రోహిత్ శర్మ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.కాగా ఆస్ట్రేలియా పర్యటనకు ముందు వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మ తప్పించిన టీమిండియా యాజమాన్యం.. అతడి స్థానంలో శుబ్మన్ గిల్కు పగ్గాలు అప్పగించింది. ఇక ఆసీస్ టూర్లో కెప్టెన్గా తొలి ప్రయత్నంలోనే గిల్ విఫలమయ్యాడు.మూడు వన్డేల్లో గిల్ చేసిన స్కోర్లు వరుసగా.. 10, 9, 24. ఇక కెప్టెన్గానూ సిరీస్ను ఆసీస్కు 1-2తో కోల్పోయాడు. మరోవైపు.. రోహిత్ శర్మ 8, 73, 121* పరుగులతో రాణించి మూడో వన్డేలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవడంతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా దక్కించుకున్నాడు. చదవండి: Shreyas Iyer: పరిస్థితి సీరియస్?.. సిడ్నీకి పయనమైన తల్లిదండ్రులు! View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
టీమిండియాతో టెస్టు సిరీస్కు సౌతాఫ్రికా జట్టు ప్రకటన
టీమిండియాతో టెస్టు సిరీస్ (IND vs SA Tests)కు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. తమ కెప్టెన్ తెంబా బవుమా (Temba Bavuma) గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని.. భారత్లో సఫారీ జట్టుకు సారథ్యం వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు బవుమా కెప్టెన్సీలో టీమిండియాతో టెస్టులు ఆడబోయే జట్టులో పదిహేను మందికి చోటు ఇచ్చినట్లు సోమవారం వెల్లడించింది.భారత్తో రెండు టెస్టులుప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27 సీజన్లో భాగంగా సౌతాఫ్రికా టీమిండియాతో రెండు టెస్టుల్లో తలపడనుంది. భారత్ వేదికగా జరిగే ఈ సిరీస్ నిర్వహణకు నవంబరు 14- 26 వరకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన జట్టును ప్రొటిస్ బోర్డు తాజాగా ప్రకటించింది.ఇటీవల పాకిస్తాన్లో పర్యటించిన జట్టులో స్వల్ప మార్పులతోనే టీమిండియాతోనూ సఫారీలు బరిలో దిగనున్నారు. బవుమా తిరిగి రావడంతో డేవిడ్ బెడింగ్హామ్ జట్టులో చోటు కోల్పోయాడు. కాగా పాక్తో ఇటీవల సౌతాఫ్రికా జట్టు రెండు టెస్టులు ఆడింది.పాక్తో టెస్టు సిరీస్ సమంబవుమా గైర్హాజరీలో ఐడెన్ మార్క్రమ్ సారథ్యంలో డబ్ల్యూటీసీ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలో దిగిన సౌతాఫ్రికా.. అనూహ్య రీతిలో పాక్తో తొలి టెస్టులో ఓడింది. ఆ తర్వాత రావల్పిండి వేదికగా రెండో టెస్టు గెలిచి సిరీస్ను 1-1 సమం చేయగలిగింది. తతదుపరి పాక్తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడిన తర్వాత సౌతాఫ్రికా జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ టూర్లో బాగంగా టీమిండియాతో తొలుత రెండు టెస్టులు ఆడనున్న సఫారీలు.. తదుపరి మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లు ఆడనున్నారు. విండీస్ను వైట్వాష్ చేసిన టీమిండియాఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా వన్డే సిరీస్లో ఆతిథ్య జట్టు చేతిలో 2-1తో ఓటమి చవిచూసింది. తదుపరి ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ పూర్తి చేసుకుని.. స్వదేశంలో సౌతాఫ్రికాతో తలపడనుంది.ఇక డబ్ల్యూటీసీ తాజా సీజన్లో గిల్ సేన తొలుత ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేసింది. ఆ తర్వాత స్వదేశంలో వెస్టిండీస్ను 2-0తో వైట్వాష్ చేసి జోరు మీదుంది.టీమిండియాతో టెస్టులకు సౌతాఫ్రికా జట్టు ఇదేతెంబా బవుమా (కెప్టెన్), ఐడెన్ మార్క్రమ్, రియాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైలీ వెరెన్నె, డెవాల్డ్ బ్రెవిస్, జుబేర్ హంజా, టోనీ డీ జోర్జి, కార్బిన్ బాష్, వియాన్ ముల్దర్, మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, సెనురాన్ ముత్తుస్వామి, కగిసో రబడ, సైమన్ హార్మర్. చదవండి: Shreyas Iyer: పరిస్థితి సీరియస్?.. సిడ్నీకి పయనమైన తల్లిదండ్రులు! -
Shreyas Iyer: పరిస్థితి సీరియస్?.. సిడ్నీకి పయనమైన తల్లిదండ్రులు!
టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా గాయపడిన ఈ ముంబై బ్యాటర్ ప్రస్తుతం ఇంటెన్సిక్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతున్నాడు.గాయం మూలంగా శ్రేయస్ అయ్యర్కు అంతర్గత రక్తస్రావం జరిగినట్లు గుర్తించిన వైద్యులు సిడ్నీ ఆస్పత్రిలో అతడికి చికిత్స అందిస్తున్నారు. టీమిండియా డాక్టర్ కూడా సిడ్నీలోనే ఉండి.. స్థానిక వైద్యులతో కలిసి ఎప్పటికప్పుడు శ్రేయస్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.వేగంగా కోలుకుంటున్నాడు!ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) స్పందించింది. క్యాచ్ అందుకునే క్రమంలో అతడి పక్కటెముకల్లో (ఎడమ) గాయం అయిందని.. స్ల్పీన్ (ప్లీహం) ఇంజూరీ అయిందని తెలిపింది. ప్రస్తుతం శ్రేయస్ వేగంగా కోలుకుంటున్నాడని.. అతడి ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.సిడ్నీకి పయనమైన తల్లిదండ్రులు!దీంతో, శ్రేయస్ అయ్యర్ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే, తాజా సమాచారం మాత్రం వారిని మరోసారి ఆందోళనలోకి నెట్టింది. ఈ టీమిండియా స్టార్ కుటుంబ సన్నిహిత వర్గాలు ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. శ్రేయస్ గాయం తీవ్రత దృష్ట్యా అతడి తల్లిదండ్రులు వెంటనే సిడ్నీకి పయనం కానున్నట్లు తెలిపాయి. ఇందుకోసం అర్జెంట్ వీసా కోసం దరఖాస్తు చేసినట్లు వెల్లడించాయి. తమ కుమారుడి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వెంటనే వీసా మంజూరు చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు శ్రేయస్ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నాయి.అభిమానుల్లో సందేహాలుఈ నేపథ్యంలో మరోసారి శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో సందేహాలు నెలకొన్నాయి. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్ జరుగగా.. తొలి రెండు మ్యాచ్లు గెలిచిన ఆస్ట్రేలియా సిరీస్ సొంతం చేసుకుంది.ఈ క్రమంలో భారత్- ఆస్ట్రేలియా మధ్య సిడ్నీలో శనివారం నామమాత్రపు మూడో వన్డే జరిగింది. ఇందులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేయగా.. 34వ ఓవర్లో హర్షిత్ రాణా బంతితో రంగంలోకి దిగాడు.అప్పటికి క్రీజులో ఉన్న ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ మిడాఫ్/ఎక్స్ట్రా కవర్ దిశగా బంతిని గాల్లోకి లేపగా.. బ్యాక్వర్డ్ పాయింట్ నుంచి పరిగెత్తుకు వచ్చిన శ్రేయస్ డైవ్ కొట్టి మరీ సంచలన క్యాచ్ అందుకున్నాడు.Shreyas SUPERMAN Iyer! 💪Puts his body on the line for #TeamIndia and gets the much needed wicket. 🙌💙#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuAfKW pic.twitter.com/LCXriNqYFy— Star Sports (@StarSportsIndia) October 25, 2025ఐసీయూలో ఉంచి చికిత్సఈ క్రమంలో శ్రేయస్ గాయపడ్డాడు. ఎడమవైపు పక్కటెముకల్లో నొప్పితో విలవిల్లాడుతూ మైదానంలో కుప్పకూలిపోయాడు. సహచర ఆటగాళ్లు, ఫిజియో వచ్చి పరిశీలించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్కానింగ్ కోసం సిడ్నీలోని ఆస్పత్రికి పంపగా అంతర్గత రక్తస్రావాన్ని గుర్తించిన వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరో ఏడు రోజుల పాటు అయ్యర్ను ఐసీయూలోనే ఉంచనున్నట్లు తెలుస్తోంది.కాగా చాన్నాళ్ల క్రితమే టీమిండియా టీ20 జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్.. ఇటీవలే టెస్టు క్రికెట్కు విరామం ప్రకటించాడు. వన్డేల్లో మాత్రం మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో రాణిస్తున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్కు ఆసీస్ టూర్ సందర్భంగా వైస్ కెప్టెన్గా ప్రమోషన్ ఇచ్చింది బీసీసీఐ. కానీ ఈ గాయం కారణంగా అతడు చాన్నాళ్లపాటు జట్టుకు దూరమయ్యే పరిస్థితుల తలెత్తాయి. ఇక మూడో వన్డేలో తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించింది. తద్వారా క్లీన్స్వీప్ గండం నుంచి గట్టెక్కింది.Update: Shreyas Iyer: ఐసీయూ నుంచి బయటకు! చదవండి: పృథ్వీ షా విధ్వంసకర శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ -
ఉగ్రరూపం దాల్చిన పృథ్వీ షా.. సెకెండ్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ
వివాదాస్పద బ్యాటర్ పృథ్వీ షా (Prithvi Shaw) మహారాష్ట్ర (Maharashtra) తరఫున తన రెండో రంజీ మ్యాచ్లోనే ఉగ్రరూపం దాల్చాడు. 2025-26 ఎడిషన్లో (Ranji Trophy) భాగంగా చండీఘడ్తో జరుగుతున్న మ్యాచ్లో (రెండో ఇన్నింగ్స్) కేవలం 141 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాదాడు. రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ చరిత్రలో ఇది రెండో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.ఈ ఇన్నింగ్స్లో మొత్తం 156 బంతులు ఎదుర్కొన్న షా.. 29 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 222 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. డబుల్ సెంచరీ చేసే క్రమంలో షా కేవలం 72 బంతుల్లోనే శతక్కొట్టాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో మహారాష్ట్ర తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. మొత్తంగా షాకు ఇది ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 14వ సెంచరీ.ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 8 పరుగులకే ఔటైన షా.. రెండో ఇన్నింగ్స్లో అద్భుతంగా పుంజుకుని డబుల్ సెంచరీ సాధించాడు. మహారాష్ట్ర తరఫున రంజీ అరంగేట్రాన్ని (ఈ ఎడిషన్ తొలి మ్యాచ్) డకౌట్తో ప్రారంభించిన షా (కేరళపై).. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో 75 పరుగులతో రాణించాడు.ప్రస్తుత రంజీ సీజన్ ప్రారంభానికి ముందే ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన షా.. కొత్త జట్టు తరఫున ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ముంబైతో జరిగిన వార్మప్ మ్యాచ్లో 181 పరుగులు.. అంతకుముందు బుచ్చిబాబు టోర్నీలో చత్తీస్ఘడ్పై 111 పరుగులు చేశాడు. వరుస సెంచరీతో షా మరోసారి టీమిండియావైపు దూసుకొస్తున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్లో రుతురాజ్ గైక్వాడ్ (116) సెంచరీతో కదంతొక్కడంతో మహారాష్ట్ర 313 పరుగులు చేసింది. అనంతరం విక్కీ ఓస్త్వాల్ (21-6-40-6) ఆరేయడంతో చంఢీఘడ్ తొలి ఇన్నింగ్స్లో 209 పరుగులకు ఆలౌటైంది. రమన్ బిష్ణోయ్ (54), పదో నంబర్ ఆటగాడు నిషంక్ బిర్లా (56 నాటౌట్) చండీఘడ్కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు.104 పరుగుల కీలక ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మహారాష్ట్ర.. 3 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఫలితంగా 463 పరుగుల భారీ ఆధిక్యం సాధించి, ప్రత్యర్దికి 464 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.చదవండి: పక్కటెముకల్లో రక్తస్రావం.. సీరియస్గా శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి -
పక్కటెముకల్లో రక్తస్రావం.. ఐసీయూలో శ్రేయస్ అయ్యర్
భారత క్రికెట్ అభిమానులకు షాకింగ్ వార్త. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో గాయపడ్డ టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఆరోగ్య పరిస్థితి సీరియస్గా మారింది. ఆ మ్యాచ్లో అలెక్స్ క్యారీ క్యాచ్ అందుకునే క్రమంలో శ్రేయస్ ఎడమ వైపు రిబ్ కేజ్పై పడిపోయాడు. మొదట్లో స్వల్ప నొప్పిగా కనిపించినా, డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిన తర్వాత పరిస్థితి విషమంగా మారింది. వెంటనే మెడికల్ టీమ్ ఆయనను ఆసుపత్రికి తరలించింది.సిడ్నీలోని ఆసుపత్రిలో స్కానింగ్ చేసిన వైద్యులు, శ్రేయస్కు అంతర్గత రక్తస్రావం (internal bleeding) ఉందని గుర్తించారు. వెంటనే ఐసీయూకు తరలించి, రెండు రోజులుగా పర్యవేక్షణలో ఉంచారు. రక్తస్రావం ఆగే వేగం, ఇన్ఫెక్షన్ ప్రమాదం ఆధారంగా శ్రేయస్ను మరో రెండు నుంచి ఏడు రోజులు ఐసీయూలో ఉంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. శ్రేయస్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా స్పందించారు. శ్రేయస్కు స్ప్లీన్లో లాసరేషన్ గాయం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం శ్రేయస్ అరోగ్యం నిలకడగా ఉందని, వేగంగా కోలుకుంటున్నాడని తెలిపారు. బీసీసీఐ మెడికల్ టీమ్.. సిడ్నీ, భారత్లో ఉన్న వైద్యులను సమన్వయం చేసుకుంటూ శ్రేయస్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత డాక్టర్ శ్రేయస్తో పాటే ఉండి రోజువారీగా అతని ఆరోగ్యాన్ని పరిశీలిస్తారని తెలిపారు.30 ఏళ్ల శ్రేయస్, ఇటీవలే టెస్ట్ క్రికెట్కు విరామం తీసుకుని వన్డేలపై ఫోకస్ పెంచనున్నట్లు ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో (11) నిరాశపరిచిన శ్రేయస్.. రెండో వన్డేలో పుంజుకొని 61 పరుగులు చేశాడు. శ్రేయస్ మరో 83 పరుగులు చేస్తే.. వన్డేల్లో 3000 పరుగుల మైలురాయిని తాకుతాడు.తాజాగా గాయం కారణంగా శ్రేయస్ త్వరలో (నవంబర్ 30) స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్లో ఆడటం అనుమానంగా మారింది. శ్రేయస్ త్వరగా కోలుకోవాలని భారత క్రికెట్ అభిమానులు దేవుళ్లను ప్రార్దిస్తున్నారు. ఇటీవలికాలంలో శ్రేయస్ టీమిండియాకు ప్రధానాస్త్రంగా ఉన్నాడు. వన్డేల్లో నాలుగో స్థానంలో కీలక ఇన్నింగ్స్లు ఆడుతూ తురుపుముక్కగా మారాడు. సౌతాఫ్రికాతో సిరీస్కు శ్రేయస్ దూరమైతే టీమిండియా విజయావకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది.చదవండి: భారత్తో తొలి టీ20.. ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పు -
భారత్తో తొలి టీ20.. ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పు
టీమిండియాతో తొలి టీ20కి ముందు (India vs Australia) ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పు జరిగింది. వారి స్టార్ స్పిన్నర్, టీ20 లీడింగ్ వికెట్ టేకర్ ఆడమ్ జంపా (Adam Zampa) వ్యక్తిగత కారణాల చేత (రెండోసారి తండ్రి కాబోతున్నాడు) తొలి మ్యాచ్కు దూరమయ్యాడు. జంపా స్థానాన్ని మరో స్పిన్నర్ తన్వీర్ సంఘా (Tanveer Sangha) భర్తీ చేయనున్నాడు. సంఘా రెండేళ్ల తర్వాత టీ20 ఆడనున్నాడు. అతని చివరి మ్యాచ్ భారత్తోనే ఆడాడు. బెంగళూరు వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో తన కోటా 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి రింకూ సింగ్ వికెట్ తీశాడు. సంఘా ఆస్ట్రేలియా తరఫున 4 వన్డేలు, 7 టీ20లు ఆడాడు. సంఘా జంపా స్థానంలో జట్టులోకి వచ్చినప్పటికీ.. ప్లేయింగ్ ఎలెవెన్లో ఉంటాడో లేదో చూడాలి. ఆసీస్కు ఇప్పటికే మాథ్యూ కుహ్నేమన్ రూపంలో మరో స్పిన్ బౌలింగ్ ఆప్షన్ ఉంది.ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా కాన్బెర్రా వేదికగా ఈ నెల 29న తొలి టీ20 జరుగనుంది. ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా మూడు వేర్వేరు జట్లను ప్రకటించింది. తొలి రెండు మ్యాచ్లకు ఓ జట్టు.. మూడో టీ20కి ఓ జట్టు.. చివరి రెండు మ్యాచ్లకు మరో జట్టును ప్రకటించారు.తొలి రెండు టీ20లకు ఆస్ట్రేలియా జట్టు..మిచెల్ మార్ష్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మిచెల్ ఓవెన్, ట్రవిస్ హెడ్, మార్కస్ స్టోయినిస్, జోష్ ఇంగ్లిస్, జోష్ ఫిలిప్, సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఇల్లిస్, జోష్ హాజిల్వుడ్, మాథ్యూ కుహ్నేమన్, తన్వీర్ సంఘా (ఆడమ్ జంపా స్థానంలో తొలి టీ20కు మాత్రమే)మూడో టీ20కి ఆస్ట్రేలియా జట్టు..మిచెల్ మార్ష్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మిచెల్ ఓవెన్, ట్రవిస్ హెడ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, మహ్లీ బియర్డ్మన్, జోష్ ఇంగ్లిస్, జోష్ ఫిలిప్, సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఇల్లిస్, మాథ్యూ కుహ్నేమన్, ఆడమ్ జంపాచివరి రెండు టీ20లకు ఆస్ట్రేలియా జట్టు..మిచెల్ మార్ష్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మిచెల్ ఓవెన్, ట్రవిస్ హెడ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, మహ్లీ బియర్డ్మన్, జోష్ ఇంగ్లిస్, జోష్ ఫిలిప్, బెన్ డ్వార్షుయిస్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఇల్లిస్, మాథ్యూ కుహ్నేమన్, ఆడమ్ జంపాభారత్ టీ20 జట్టు..సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జితేశ్ శర్మ, సంజూ శాంసన్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణాటీ20 సిరీస్ షెడ్యూల్..తొలి టీ20- అక్టోబర్ 29 (కాన్బెర్రా)రెండో టీ20- అక్టోబర్ 31 (మెల్బోర్న్)మూడో టీ20- నవంబర్ 2 (హోబర్ట్)నాలుగో టీ20- నవంబర్ 6 (గోల్డ్ కోస్ట్)ఐదో టీ20- నవంబర్ 8 (బ్రిస్బేన్)చదవండి: పృథ్వీ షా విధ్వంసకర శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ -
పృథ్వీ షా విధ్వంసకర శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ
వివాదాస్పద బ్యాటర్ పృథ్వీ షా (Prithvi Shaw) రంజీ ట్రోఫీలో (Ranji Trophy) మహారాష్ట్ర (Maharashtra) తరఫున తన తొలి సెంచరీ సాధించాడు. 2025-26 ఎడిషన్లో భాగంగా చండీఘడ్తో జరుగుతున్న మ్యాచ్లో (రెండో ఇన్నింగ్స్) కేవలం 72 బంతుల్లోనే (13 ఫోర్ల సాయంతో) శతక్కొట్టాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఇది ఆరో వేగవంతమైన శతకం. తొలి ఐదు ఫాస్టెస్ట్ సెంచరీలు రిషబ్ పంత్ (48), రాజేశ్ బోరా (56), రియన్ పరాగ్ (56), రూబెన్ పాల్ (60), రజత్ పాటిదార్ (68) పేరిట ఉన్నాయి. రంజీ మహారాష్ట్ర తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. షాకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇది 14వ సెంచరీ. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 8 పరుగులకే ఔటైన షా.. రెండో ఇన్నింగ్స్లో అద్భుతంగా పుంజుకుని సెంచరీ సాధించాడు. మహారాష్ట్ర తరఫున రంజీ అరంగేట్రాన్ని (ఈ ఎడిషన్ తొలి మ్యాచ్) డకౌట్తో ప్రారంభించిన షా (కేరళపై).. రెండో ఇన్నింగ్స్లో 75 పరుగులతో రాణించాడు.ప్రస్తుత రంజీ సీజన్ ప్రారంభానికి ముందే ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన షా.. కొత్త జట్టు తరఫున అదరగొడుతున్నాడు. ముంబైతో జరిగిన వార్మప్ మ్యాచ్లో 181 పరుగులు.. అంతకుముందు బుచ్చిబాబు టోర్నీలో చత్తీస్ఘడ్పై 111 పరుగులు చేశాడు. వరుస సెంచరీలతో షా మరోసారి టీమిండియావైపు దూసుకొస్తున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్లో రుతురాజ్ గైక్వాడ్ (116) సెంచరీతో కదంతొక్కడంతో మహారాష్ట్ర 313 పరుగులు చేసింది. అనంతరం విక్కీ ఓస్త్వాల్ (21-6-40-6) ఆరేయడంతో చంఢీఘడ్ తొలి ఇన్నింగ్స్లో 209 పరుగులకు ఆలౌటైంది. రమన్ బిష్ణోయ్ (54), పదో నంబర్ ఆటగాడు నిషంక్ బిర్లా (56 నాటౌట్) చండీఘడ్కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు.104 పరుగుల కీలక ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మహారాష్ట్ర, మూడో రోజు తొలి సెషన్ సమయానికి వికెట్ నష్టానికి 164 పరుగులు చేసి, 268 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. షా 105, సిద్దేశ్ వీర 28 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. చదవండి: IND vs AUS T20 Series: తొలి పంజా మనదే..! -
IND vs AUS T20 Series: తొలి పంజా మనదే..!
టెస్ట్, వన్డే ఫార్మాట్లలో గుత్తాధిపత్యం చలాయించే ఆస్ట్రేలియా జట్టుకు పొట్టి క్రికెట్ బలహీనత ఉంది. ముఖ్యంగా టీమిండియా ఎదురైనప్పుడు ఆ బలహీనత మరింత ఎక్కువవుతుంది. 2007 నుంచి భారత్తో ఆడిన 32 మ్యాచ్ల్లో (India vs Australia) ఆసీస్ కేవలం 11 మ్యాచ్ల్లో మాత్రమే విజయాలు సాధించింది.ద్వైపాక్షిక సిరీస్ల్లో అయితే ఆసీస్ ట్రాక్ రికార్డు మరింత చెత్తగా ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 11 సిరీస్లు జరగ్గా, ఆసీస్ రెండింట మాత్రమే గెలుపొందింది. త్వరలో జరుగనున్న ఐదు మ్యాచ్ల సిరీస్ నేపథ్యంలో భారత్-ఆసీస్ మధ్య జరిగిన ద్వైపాక్షిక సిరీస్లపై ఓ లుక్కేద్దాం.తొలి పంజా మనదేభారత్, ఆసీస్ జట్ల మధ్య తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ 2007 అక్టోబర్ 20న జరిగింది. వన్ మ్యాచ్ సిరీస్లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఆసీస్పై తొలి పంజా విసిరింది. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్ షోతో సత్తా చాటింది. బౌలింగ్లో ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్.. బ్యాటింగ్లో గౌతమ్ గంభీర్ (63), యువరాజ్ సింగ్ (31 నాటౌట్) రాణించారు.అనంతరం 2008 ఫిబ్రవరి 1న మెల్బోర్న్లో జరిగిన వన్ మ్యాచ్ సిరీస్లో (డే అండ్ నైట్) ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 74 పరుగులకే ఆలౌట్ కాగా.. ఆసీస్ మరో 52 బంతులు మిడిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.గంభీర్ మరోసారి..!2012 ఫిబ్రవరిలో ఇరు జట్ల మధ్య తొలి మల్టీ మ్యాచ్ సిరీస్ జరిగింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ సిరీస్ 1-1తో డ్రా అయ్యింది. తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలుపొందగా.. రెండో మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20లో గంభీర్ (56 నాటౌట్) టీమిండియాను గెలిపించాడు. యువీ విధ్వంసం2013 అక్టోబర్లో జరిగిన మరో వన్ మ్యాచ్ సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. రాజ్కోట్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఆరోన్ ఫించ్ (89) చెలరేగడంతో 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం యువరాజ్ సింగ్ (77 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను గెలిపించాడు.చెలరేగిన కోహ్లి.. వైట్వాష్మళ్లీ మూడేళ్ల తర్వాత (2016, జనవరి) భారత్, ఆసీస్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ మూడు మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 3-0తో వైట్వాష్ చేసింది. ఈ సిరీస్లో విరాట్ కోహ్లి చెలరేగిపోయాడు. మూడు మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీలు (90 నాటౌట్, 59 నాటౌట్, 59) బాది టీమిండియా గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. రోహిత్ శర్మ కూడా రెండు అర్ద సెంచరీలతో రాణించాడు.రాణించిన శిఖర్అనంతరం 2017 అక్టోబర్లో జరిగిన 3 మ్యాచ్ల సిరీస్ (భారత్), 2018 నవంబర్లో జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లు (ఆస్ట్రేలియా) 1-1తో డ్రా అయ్యాయి. ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్లో శిఖర్ ధవన్, విరాట్ కోహ్లి సత్తా చాటారు. ఈ సిరీస్లోని చివరి మ్యాచ్లో కృనాల్ పాండ్యా (4-0-36-4) అదరగొట్టాడు.తొలి పరాభవం2019లో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్ల సిరీస్ కోసం భారత్లో పర్యటించింది. ఈ సిరీస్ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్లో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి సత్తా చాటారు.హ్యాట్రిక్ విక్టరీస్ఆతర్వాత భారత్ వరుసగా 2020 (ఆస్ట్రేలియాలో), 2022 (భారత్లో), 2023 (భారత్లో) సిరీస్ల్లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. 2020 సిరీస్లో రాహుల్, ధవన్, కోహ్లి, నటరాజన్, చహల్ సత్తా చాటడంతో భారత్ 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. 2022 సిరీస్లో అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ చెలరేగడంతో 2-1 తేడాతో గెలుపొందింది.యువ ఆటగాళ్ల హవా.. రుతురాజ్ విధ్వంసకర శతకం2023లో జరిగిన సిరీస్లో ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, రింకూ సింగ్ లాంటి యువ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఫలితంగా భారత్ 4-1 తేడాతో ఆసీస్ను ఖంగుతినిపించింది. ఈ సిరీస్లోని మూడో మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసకర శతకం బాదాడు.చదవండి: రోహిత్, కోహ్లి మళ్లీ రంగంలోకి దిగేది అప్పుడే..! -
రోహిత్, కోహ్లి మళ్లీ రంగంలోకి దిగేది అప్పుడే..!
టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli) ఏడు నెలల విరామం తర్వాత తాజాగా ముగిసిన ఆస్ట్రేలియా సిరీస్తో వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. టీ20లకు, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన వీరిద్దరు ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ ఆడటమే వీరి ఏకైక లక్ష్యం. ఇందులో భాగంగానే వారు ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు.రోకో తదుపరి టార్గెట్ స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే సిరీస్. ఈ సిరీస్లో మూడు వన్డేలు జరుగనున్నాయి. నవంబర్ 30, డిసెంబర్ 3, 6 తేదీల్లో రాంచీ, రాయ్పూర్, వైజాగ్ వేదికలుగా ఈ వన్డేలు జరుగుతాయి. ఈ సిరీస్లో రోహిత్, కోహ్లి చెలరేగే అవకాశం ఉంది. స్వదేశంలో జరిగే వన్డేల్లో ఈ ఇద్దరికి ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ప్రత్యర్ధి ఎవరైనా స్వదేశంలో రోకోను ఆపడం అసాధ్యం.రో'హిట్టు'తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో రోహిత్ శర్మ సూపర్ హిట్టయ్యాడు. 3 మ్యాచ్ల్లో సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 202 పరుగులు చేశాడు. ఈ సిరీస్ను భారత్ 1-2 తేడాతో కోల్పోయినప్పటికీ రోహిత్ ప్రదర్శన మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా చివరి వన్డేలో రోహిత్ చేసిన సెంచరీ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది.భారీగా బరువు తగ్గి ఫిట్నెస్ మెరుగుపర్చుకున్న రోహిత్ ఆ మ్యాచ్లో యధేచ్చగా షాట్లు ఆడాడు. మునుపటి రోహిత్ను గుర్తు చేశాడు. రెండో వన్డేలోనూ రోహిత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కష్టమైన పిచ్పై శైలికి విరుద్దంగా, చాలా ఓపిగ్గా బ్యాటింగ్ చేసి సెంచరీకి చేరువలో ఔటయ్యాడు.ఈ రెండు ఇన్నింగ్స్ల తర్వాత రోహిత్ భవితవ్యంపై అనుమానాలు పటాపంచలయ్యాయి. ప్రస్తుతం 38 ఏళ్ల వయసున్న రోహిత్ 2027 ప్రపంచకప్ సమయానికి 40వ పడిలో ఉంటాడు.ఆ వయసులో అతనెలా ఆడగలడని చాలా మంది అనుకున్నారు. అయితే ఈ అనుమానాలకు రోహిత్ తన ప్రదర్శనలతో చెక్ పెట్టేశాడు. ఫిట్నెస్ ఇలాగే కాపాడుకుంటే 40 కాదు మరో ఐదేళ్లైనా ఆడగలనన్న సంకేతాలు పంపాడు. మొత్తంగా ఆస్ట్రేలియా సిరీస్లో హిట్టైన రోహిత్ 2027 ప్రపంచకప్కు సిద్దమంటూ సంకేతాలు పంపాడు.పరువు కాపాడుకున్న కోహ్లిఆసీస్ సిరీస్లో రోహిత్ హిట్టైతే.. అతని సహచరుడు కోహ్లి మాత్రం నాట్ బ్యాడ్ అనిపించాడు. తొలి రెండు వన్డేల్లో డకౌటైనా, మూడో వన్డేలో రోహిత్తో పాటు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ (74 నాటౌట్) ఆడి పరువు కాపాడుకున్నాడు. ఈ ఇన్నింగ్స్తో కోహ్లి భవితవ్యంపై కూడా అనుమానాలు తొలగిపోయాయి. కోహ్లి సైతం 2027 ప్రపంచకప్కు రెడీ అంటూ సంకేతాలు పంపాడు. ఫిట్నెస్ పరంగా ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఉండే కోహ్లి.. ఫామ్ను కాపాడుకుంటే ఈజీగా మరో నాలుగైదేళ్లు ఆడగలడు. మొత్తానికి ఈ సిరీస్తో రోహిత్, కోహ్లి భవితవ్యంపై అనుమానాలకు తెరపడింది. ప్రపంచకప్ వరకు వారు ఈజీగా కొనసాగగలరు.ఈ మధ్యలో వారు ఆడే అవకాశమున్న మ్యాచ్లపై ఓ లుక్కేద్దాం..- స్వదేశంలో సౌతాఫ్రికాతో సిరీస్ అనంతరం వచ్చే ఏడాది స్వదేశంలోనే న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల సిరీస్ జరుగనుంది. - దీని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ భారత్లో పర్యటించి వన్డేలు ఆడనుంది. - అనంతరం ఇంగ్లండ్, బంగ్లాదేశ్ పర్యటనల్లో భారత్ వన్డే సిరీస్లు ఆడుతుంది. - ఆతర్వాత వెస్టిండీస్ భారత్లో పర్యటించి వన్డేలు ఆడనుంది. - అతర్వాత భారత్ న్యూజిలాండ్లో పర్యటించి వన్డేలు ఆడుతుంది. - 2027 వన్డే ప్రపంచకప్కు కొద్దిముందు భారత్ స్వదేశంలో శ్రీలంకతో వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్ల్లో రోకో అన్ని ఆడతారని చెప్పలేము కాని, మెజార్జీ శాతం సిరీస్ల్లో పాల్గొనే అవకాశం ఉంది. చదవండి: ఆస్ట్రేలియాతో సెమీఫైనల్కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ -
టీమిండియాకు బిగ్ షాక్
మహిళల వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) భాగంగా అక్టోబర్ 30న ఆస్ట్రేలియాతో జరుగబోయే సెమీఫైనల్ మ్యాచ్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. నిన్న (అక్టోబర్ 26) బంగ్లాదేశ్తో జరిగిన నామమాత్రపు మ్యాచ్ సందర్భంగా ఇన్ ఫామ్ ఓపెనర్ ప్రతిక రావల్ (Pratika Rawal) తీవ్రంగా గాయపడింది. దీంతో సెమీస్ మ్యాచ్కు ఆమె అందుబాటులో ఉంటుందా లేదా అన్నది అనుమానంగా మారింది.ప్రస్తుతానికి ప్రతిక గాయంపై ఎలాంటి అప్డేట్ లేనప్పటికీ.. అభిమానుల్లో మాత్రం ఆందోళన నెలకొలింది. ప్రతిక న్యూజిలాండ్తో జరిగిన చివరి మ్యాచ్లో స్మృతి మంధనతో సహా విధ్వంసకర శతకం బాదిన విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రపంచకప్లో ప్రతిక మంధనతో కలిసి భారత్కు శుభారంభాలు అందిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తుంది.అలాంటి ప్రతిక ఆసీస్తో జరుగబోయే డూ ఆర్ డై సెమీఫైనల్ మ్యాచ్కు దూరమైతే, టీమిండియా విజయావకాశాలు తప్పక ప్రభావితమవుతాయి.మ్యాచ్ రద్దునవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో నిన్న జరిగిన భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. 27 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 119 పరుగుల స్వల్ప స్కోర్కు పరిమితమైంది. బంగ్లా ఇన్నింగ్స్ 21వ ఓవర్ రెండో బంతికి మిడ్వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ప్రతిక తీవ్రంగా గాయపడింది.విలవిలాడిపోయిన ప్రతికమైదానం చిత్తడిగా ఉండటంతో రన్నింగ్ చేసే సమయంలో ప్రతిక కుడి కాలి మడమ మడతపడింది. తీవ్ర నొప్పితో బాధపడుతున్న ఆమెను సిబ్బంది డ్రెస్సింగ్ రూమ్కు తీసుకెళ్లారు. ఆతర్వాత ఆమె తిరిగి మైదానంలో అడుగుపెట్టలేదు. ఆమె స్థానంలో అమన్జోత్ కౌర్ భారత ఇన్నింగ్స్ను ప్రారంభించింది.ఛేదనలో అమన్జోత్, మంధన 8.4 ఓవర్లలో 57 పరుగులు జోడించాక వర్షం మళ్లీ మొదలుకావడంతో మ్యాచ్ను రద్దు చేశారు.రికార్డుల ప్రతికప్రతిక న్యూజిలాండ్తో జరిగిన గత మ్యాచ్లో పలు రికార్డులు నెలకొల్పింది. ఈ మ్యాచ్లో చేసిన సెంచరీ ఆమెకు ప్రపంచకప్ టోర్నీలో మొదటిది. ఈ మ్యాచ్లో ఆమె మహిళల వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్లలో ఒకరిగా నిలిచింది. అలాగే మంధన తర్వాత ఓ క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు చేసిన భారత మహిళా క్రికెటర్గా రికార్డుల్లోకెక్కింది.ప్రతిక దూరమైతే..?ప్రతిక ఆస్ట్రేలియాతో జరుగబోయే సెమీఫైనల్ మ్యాచ్కు దూరమైతే టీమిండియా తీవ్రమైన కష్టాలు ఎదుర్కోనుంది. ప్రతిక స్థానాన్ని భర్తీ చేసే ఓపెనర్ ఎవరూ జట్టులో లేరు. ఐసీసీ అంగీకారంతో రిజర్వ్లలో లేని ప్లేయర్ను పిలిపించుకోవాల్సి వస్తుంది. ప్రతిక పూర్తిగా టోర్నీ నుంచి తప్పుకుంటేనే ఇది సాధ్యపడుతుంది.టీమిండియాకు మరో సమస్యప్రతిక గాయానికి ముందే టీమిండియా మరో సమస్య ఉండింది. న్యూజిలాండ్తో మ్యాచ్ సందర్భంగా వికెట్కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ గాయపడింది. దీంతో బంగ్లాదేశ్ మ్యాచ్కు ఆమెకు విశ్రాంతినిచ్చారు. సెమీస్ మ్యాచ్కు రిచా అందుబాటులో ఉంటుందా లేదా అన్నదానిపై కూడా ప్రస్తుతానికి సమాచారం లేదు. గాయాల నేపథ్యంలో టీమిండియా సెమీస్లో పటిష్టమైన ఆసీస్ను ఏమేరకు నిలువరించగలదో చూడాలి.కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో భారత్తో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సెమీస్కు అర్హత సాధించాయి. అక్టోబర్ 29న జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా (గౌహతి).. 30వ తేదీ జరిగే రెండో సెమీస్లో భారత్, ఆస్ట్రేలియా (నవీ ముంబై) తలపడతాయి. ఫైనల్ మ్యాచ్ (నవీ ముంబై) నవంబర్ 2న జరుగుతుంది. చదవండి: ఆస్ట్రేలియా కెప్టెన్గా స్టీవ్ స్మిత్ -
ఆస్ట్రేలియా కెప్టెన్గా స్టీవ్ స్మిత్
ఊహించిన విధంగానే జరిగింది. యాషెస్ సిరీస్ (Ashes Series 2025-26) తొలి టెస్ట్కు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) దూరమయ్యాడు. వెన్నెముకలో స్ట్రెస్ ఇంజ్యూరీ కారణంగా కమిన్స్ జూలై నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. కమిన్స్ గైర్హాజరీలో తొలి టెస్ట్కు కెప్టెన్గా స్టీవ్ స్మిత్ (Steve Smith) ఎంపికయ్యాడు. ఈ విషయాలను క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 21న పెర్త్లో తొలి టెస్ట్ ప్రారంభమవుతుంది. కమిన్స్ స్థానాన్ని స్కాట్ బోలాండ్ భర్తీ చేసే అవకాశం ఉంది. బోలాండ్.. జోష్ హాజిల్వుడ్, మిచెల్ స్టార్క్తో కలిసి తొలి టెస్ట్లో బౌలింగ్ బాధ్యతలు చేపట్టవచ్చు.ప్రస్తుతం కమిన్స్ రన్నింగ్ చేయగలుగుతున్నా, బౌలింగ్ చేయడం లేదు. పూర్తి రికవరీకి కనీసం నాలుగు వారాల సమయపడుతుందని అతనే స్వయంగా చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే డిసెంబర్ 4న బ్రిస్బేన్లో ప్రారంభమయ్యే రెండో టెస్ట్కు కమిన్స్ అందుబాటులోకి రావొచ్చని తెలుస్తుంది.స్టీవ్ స్మిత్ విషయానికొస్తే.. 2018లో సాండ్పేపర్ వివాదం తర్వాత కెప్టెన్సీ కోల్పోయిన స్మిత్, కమిన్స్ వైస్ కెప్టెన్గా కొనసాగుతూ ఇప్పటివరకు ఆరు టెస్టుల్లో తాత్కాలిక నాయకత్వం వహించాడు. ఆసక్తికరంగా, కెప్టెన్గా ఉన్నప్పుడు స్మిత్ బ్యాటింగ్ యావరేజ్ 68.98గా ఉండగా, సాధారణంగా అది 49.9 మాత్రమే.కాగా, ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల యాషెస్ 2025-26 సిరీస్ నవంబర్ 21 నుంచి ప్రారంభమవుతుంది. తొలి టెస్ట్ నవంబర్ 21న పెర్త్లో, రెండో టెస్ట్ డిసెంబర్ 4న బ్రిస్బేన్లో, మూడో టెస్ట్ డిసెంబర్ 17న అడిలైడ్లో, నాలుగో టెస్ట్ డిసెంబర్ 26న మెల్బోర్న్లో, ఐదో టెస్ట్ వచ్చే ఏడాది జనవరి 4న సిడ్నీలో ప్రారంభం కానున్నాయి.స్వదేశంలో జరిగే ఈ సిరీస్ను ఆస్ట్రేలియా నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో తొలి టెస్ట్కు కమిన్స్ దూరం కావడం వారికి ఎదురుదెబ్బే. మరోవైపు ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ కూడా గట్టిగానే కసరత్తు చేస్తుంది. నెల ముందుగానే జట్టును ప్రకటించి సన్నద్దతను వ్యక్తం చేసింది.యాషెస్ సిరీస్ 2025-26కి ఇంగ్లండ్ జట్టు..బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేకబ్ బేతెల్, బెన్ డకెట్, జాక్ క్రాలే, జో రూట్, హ్యారీ బ్రూక్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జేమీ స్మిత్, ఓలీ పోప్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్, మాథ్యూ పాట్స్చదవండి: అదరగొట్టిన తెలుగు టైటాన్స్ -
హైదరాబాద్ 435 ఆలౌట్
పుదుచ్చేరి: దేశవాళీ ప్రతిష్ఠాత్మక క్రికెట్ టోర్నీరంజీ ట్రోఫీ రెండో మ్యాచ్లో హైదరాబాద్ జట్టు మెరుగైన స్కోరు చేసింది. ఓవర్నైట్ స్కోరు 255/1తో ఆదివారం రెండో రోజు బరిలోకి దిగిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో చివరకు 134.5 ఓవర్లలో 435 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ రాహుల్ రాధేశ్ (161 బంతుల్లో 81; 10 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. రోహిత్ రాయుడు (79 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. కెప్టెన్ రాహుల్ సింగ్ (175 బంతుల్లో 114; 12 ఫోర్లు, 1 సిక్స్) క్రితం రోజు స్కోరు వద్దే వెనుదిరగగా... హిమతేజ (159 బంతుల్లో 66; 1 ఫోర్, 2 సిక్స్లు) మరో నాలుగు పరుగులు మాత్రమే జోడించి పెవిలియన్ చేరాడు. వేణు గౌడ్ (0) విఫలమయ్యాడు. ఈ దశలో రోహిత్ రాయుడుతో కలిసి రాహుల్ రాధేశ్ ఇన్నింగ్స్ను నడిపించాడు. రాయుడు అవుటైనా... తక్కినవాళ్లతో కలిసి రాహుల్ రాజేశ్ కీలక పరుగులు జోడించి ఆఖరి వికెట్ రూపంలో వెనుదిగాడు. పుదుచ్చేరి బౌలర్లలో సాగర్ 4 వికెట్లు నేలకూల్చగా... జయంత్ యాదవ్, కరణ్ కన్నన్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాండిచ్చేరి ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 9 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది. పారస్ (5 బ్యాటింగ్) అవుట్ కాగా... గంగ శ్రీధర్ రాజు (6 బ్యాటింగ్), ఆనంద్ బియాస్ (14 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. హైదరాబాద్ బౌలర్లలో పున్నయ్య ఒక వికెట్ పడగొట్టాడు. చేతిలో 9 వికెట్లు ఉన్న పాండిచ్చేరి... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 410 పరుగులువెనుకడి ఉంది. తడబడ్డ ఆంధ్ర ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా విజయనగరం వేదికగా బరోడాతో జరుగుతున్న రంజీ మ్యాచ్లో ఆంధ్ర జట్టు తడబడింది. తొలుత ప్రత్యర్థికి మంచి స్కోరు చేసే అవకాశం ఇచి్చన ఆంధ్ర... ఆ తర్వాత ఇన్నింగ్స్ను ధాడిగా ఆరంభించేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఓవర్నైట్ స్కోరు 230/6తో ఆదివారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన బరోడా 109 ఓవర్లలో 363 పరుగులకు ఆలౌటైంది. క్రితం రోజు సెంచరీకి ఒక పరుగు దూరంలో నిలిచిన విష్ణు సోలంకి (131; 17 ఫోర్లు, 2 సిక్స్లు) శతకం పూర్తి చేసుకోగా... కెప్టెన్ అతీత్ సేథ్ (148 బంతుల్లో 86; 8 ఫోర్లు, 3 సిక్స్లు), మహేశ్ (82 బంతుల్లో 54; 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్సెంచరీలు చేశారు. ఆంధ్ర బౌలర్లలో అరంగేట్ర పేసర్ కావూరి సాయితేజ 4 వికెట్లు పడగొట్టగా... త్రిపురాణ విజయ్ మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు 16 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. ఓపెనర్లు శ్రీకర్ భరత్ (8), అభిషేక్ రెడ్డి (15) అవుట్ కాగా... కెప్టెన్ రికీ భుయ్ (7 బ్యాటింగ్), షేక్ రషీద్ (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో 8 వికెట్లు ఉన్న ఆంధ్ర జట్టు.. ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 320 పరుగులు వెనుకబడి ఉంది. -
మరో పోరు వర్షార్పణం
ముంబై: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్ను వరుణుడు వీడటం లేదు. ఇప్పటికే వర్షం కారణంగా పలు మ్యాచ్లు రద్దు కాగా... లీగ్ దశలో చివరి మ్యాచ్ కూడా వర్షార్పణమైంది. ఆదివారం ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన మ్యాచ్కు వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో చివరకు ఫలితం తేలకుండానే మ్యాచ్ను రద్దు చేశారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. అయితే ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్లు ఖరారు అయిపోవడంతో ఈ మ్యాచ్కు ప్రాధాన్యత లేకుండా పోయింది. వర్షం కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభం కాగా... ముందుగా మ్యాచ్ను 43 ఓవర్లకు కుదించారు. ఆ తర్వాత తిరిగి వర్షం పడటంతో 27 ఓవర్లకు తగ్గించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 27 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. షర్మిన్ అక్తర్ (53 బంతుల్లో 36; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... శోభన (26; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. భారత బౌలర్లలో రాధ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా... ఆంధ్ర స్పిన్నర్ శ్రీచరణి 2 వికెట్లు ఖాతాలో వేసుకుంది. రేణుక సింగ్, దీప్తి శర్మ, అమన్జ్యోత్ కౌర్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం 27 ఓవర్లలో 126 పరుగుల లక్ష్యంతో ఛేదన ఆరంభించిన భారత జట్టు 8.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 57 పరుగుల వద్ద ఉన్న స్థితిలో భారీ వర్షం ముంచెత్తింది. దీంతో పలుమార్లు సమీక్షించిన అనంతరం అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. గత మ్యాచ్లో సెంచరీతో మెరిసిన టీమిండియా ఓపెనర్ ప్రతీక రావల్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడటంతో ఈ మ్యాచ్లో అమన్జ్యోత్ కౌర్ (15 నాటౌట్; 2 ఫోర్లు) ఓపెనర్గా బరిలోకి దిగింది. స్మృతి మంధాన (27 బంతుల్లో 34 నాటౌట్; 6 ఫోర్లు) ధాటిగా ఆడే ప్రయత్నం చేసింది. రెండు రోజుల విరామం తర్వాత... గువాహటిలో బుధవారం జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్తో దక్షిణాఫ్రికా... నవీముంబైలో గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తలపడతాయి. ఈ రెండు మ్యాచ్లకు వర్ష సూచన ఉంది. అయితే సెమీఫైనల్స్తోపాటు ఫైనల్ మ్యాచ్కు ‘రిజర్వ్ డే’ ఉంది. ‘రిజర్వ్ డే’ రోజున కూడా వర్షంతో మ్యాచ్లు సాధ్యంకాకపోతే లీగ్ దశలో మెరుగైన స్థానాల్లో నిలిచిన జట్లు (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) ఫైనల్కు చేరుతాయి. ఫైనల్ కూడా రద్దయితే రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.6 ప్రస్తుత ప్రపంచకప్లో వర్షం కారణంగా రద్దయిన మ్యాచ్లు. శ్రీలంకలో జరిగిన 11 మ్యాచ్ల్లో ఐదు వర్షంతో రద్దయ్యాయి. తాజాగా ముంబై పోరు కూడా ఆ జాబితాలో చేరింది. -
టీమిండియా బౌలర్ల విజృంభణ.. స్వల్ప స్కోర్కే పరిమితమైన బంగ్లాదేశ్
మహిళల వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) భాగంగా బంగ్లాదేశ్తో ఇవాళ (అక్టోబర్ 26) జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్లో (India vs Bangladesh) టీమిండియా (Team India) బౌలర్లు చెలరేగిపోయారు. వర్షం కారణంగా 27 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. బంగ్లాదేశ్ను 119 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది.బంగ్లా ఇన్నింగ్స్లో 36 పరుగులు చేసిన షర్మిన్ అక్తర్ టాప్ స్కోరర్గా నిలువగా.. శోభన మోస్తరి (26), రుబ్యా హైదర్ (13), రితూ మోనీ (11) రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారిలో సుమయ్యా అక్తర్ 2, కెప్టెన్ నిగార్ సుల్తానా 9, షోర్నా అక్తర్ 2, నహీద అక్తర్ 3, రబేయా ఖాన్ 3, నిషిత అక్తర్ 4 (నాటౌట్), మరుఫా అక్తర్ 2 (నాటౌట్) పరుగులు చేశారు.భారత బౌలర్లలో రాధా యాదవ్ 3 వికెట్లు తీయగా.. శ్రీచరణి 2, రేణుకా సింగ్, దీప్తి శర్మ, అమన్జోత్ కౌర్ తలో వికెట్ తీశారు.కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో సెమీస్ బెర్త్లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, భారత్ ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. అక్టోబర్ 29న జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా (గౌహతి).. 30వ తేదీ జరిగే రెండో సెమీస్లో భారత్, ఆస్ట్రేలియా (నవీ ముంబై) తలపడతాయి. ఫైనల్ మ్యాచ్ (నవీ ముంబై) నవంబర్ 2న జరుగుతుంది. చదవండి: రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యద్భుతం -
రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యద్భుతం
రంజీ ట్రోఫీ 2025-26 (Ranji Trophy) ఎడిషన్లో అద్భుతం జరిగింది. అస్సాం, సర్వీసస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ (Assam vs Services) కేవలం 90 ఓవర్లలోనే ముగిసింది. 91 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యంత వేగంగా (బంతుల పరంగా) పూర్తైన మ్యాచ్ ఇదే.గతంలో ఈ రికార్డు 1961-62 ఎడిషన్లో ఢిల్లీ, రైల్వేస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పేరిట ఉండేది. ఈ మ్యాచ్ 547 బంతుల్లో ముగియగా.. అస్సాం-సర్వీసస్ మ్యాచ్ కేవలం 540 బంతుల్లోనే పూర్తైంది.అస్సామ్లోని టిన్సుకియా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ గ్రౌండ్లో నిన్న (అక్టోబర్ 25) మొదలైన ఈ మ్యాచ్ కేవలం నాలుగు సెషన్లలోనే (రెండో రోజు తొలి సెషన్) ముగిసింది. ఎలైట్ గ్రూప్-సిలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో అస్సాంపై సర్వీసస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన అస్సాం తొలి ఇన్నింగ్స్లో 17.2 ఓవర్లు (103 ఆలౌట్), రెండో ఇన్నింగ్స్లో 29.3 ఓవర్లు (75 ఆలౌట్) ఆడగా.. సర్వీసస్ తొలి ఇన్నింగ్స్లో 29.2 ఓవర్లు (108 ఆలౌట్), రెండో ఇన్నింగ్స్లో 13.5 ఓవర్లు (73/2) ఆడింది.మ్యాచ్ మొత్తంలో ఇరు జట్లు కలిపి 359 పరుగులు చేశాయి. 32 వికెట్లు పడ్డాయి. ఈ మ్యాచ్లో టీమిండియా ఆటగాడు రియాన్ పరాగ్ (Riyan Parag) (అస్సాం) బంతితో అద్భుత ప్రదర్శనలు చేశాడు. తొలి ఇన్నింగ్స్లో 5, రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్లు తీశాడు.చరిత్రాత్మక హ్యాట్రిక్స్ఈ మ్యాచ్లో మరో అద్భుతం కూడా చోటు చేసుకుంది. సర్వీసస్ బౌలర్లు అర్జున్ శర్మ (లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్), మోహిత్ జాంగ్రా (లెఫ్ట్ ఆర్మ్ సీమర్) ఒకే ఇన్నింగ్స్లో (అస్సాం తొలి ఇన్నింగ్స్) హ్యాట్రిక్లు నమోదు చేశారు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్లో డబుల్ హ్యాట్రిక్లు నమోదు కావడం ఇదే తొలిసారి.ఇన్నింగ్స్ విశ్లేషణ:- అస్సాం తొలి ఇన్నింగ్స్: 103 పరుగులు (17.2 ఓవర్లు) టాప్ స్కోరర్: ప్రద్యున్ సైకియా – 52 - సర్వీసస్ తొలి ఇన్నింగ్స్: 108 పరుగులు (29.2 ఓవర్లు) అస్సాం బౌలర్ రియాన్ పరాగ్: కెరీర్ బెస్ట్ 5/25 - అస్సాం రెండో ఇన్నింగ్స్: 75 పరుగులు (29.3 ఓవర్లు) అర్జున్ శర్మ: 4/20 అమిత్ శుక్లా: 6 ఓవర్లు – 3 వికెట్లు – కేవలం 6 పరుగులు - సర్వీసస్ లక్ష్యం- 71 పరుగులు 13.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించిందిచదవండి: Women's CWC: అద్వితీయ ప్రస్థానం.. చరిత్ర తిరగేస్తే అంతా వారే..! -
ఇంగ్లండ్ సునాయాస విజయం
మహిళల వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 26) ఉదయం జరిగిన నామమాత్రపు మ్యాచ్లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ (New Zealand vs England) జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ (England) సునాయాస విజయం సాధించింది. తొలుత బౌలర్లు, స్వల్ప ఛేదనలో బ్యాటర్లు సత్తా చాటడంతో ఆడుతూ పాడుతూ గెలుపుతీరాలు చేరింది. ఇదివరకే సెమీస్కు అర్హత సాధించిన ఇంగ్లండ్, ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఇదివరకే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన న్యూజిలాండ్ ఓటమితో టోర్నీ నుంచి వైదొలిగింది.చెలరేగిన బౌలర్లుటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి 38.2 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటైంది. లిండ్సే స్మిత్ 3, కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్, అలైస్ క్యాప్సీ తలో 2, ఛార్లీ డీన్, సోఫీ ఎక్లెస్టోన్ చెరో వికెట్ పడగొట్టి కివీస్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు.న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో ఓపెనర్ జార్జియా ప్లిమ్మర్ (43) టాప్ స్కోరర్గా నిలువగా.. అమేలియా కెర్ (35), కెప్టెన్ సోఫీ డివైన్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సూజీ బేట్స్ 10, బ్రూక్ హ్యాలీడే 4, మ్యాడీ గ్రీన్, ఇసబెల్లా గేజ్, జెస్ కెర్ 10, రోస్మేరీ మైర్ డకౌట్, లియా తహుహు 2 పరుగులకు ఔటయ్యారు.సత్తా చాటిన జోన్స్అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్.. ఓపెనర్ యామీ జోన్స్ (86 నాటౌట్) సత్తా చాటడంతో 29.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ట్యామీ బేమౌంట్ (40), హీథర్ నైట్ (33) రాణించారు. కివీస్ బౌలర్లలో సోఫీ డివైన్, లియా తహుహు తలో వికెట్ పడగొట్టారు.కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో సెమీస్ బెర్త్లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, భారత్ ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. అక్టోబర్ 29న జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా (గౌహతి).. 30వ తేదీ జరిగే రెండో సెమీస్లో భారత్, ఆస్ట్రేలియా (నవీ ముంబై) తలపడతాయి. ఈ మెగా టోర్నీ ఫైనల్ (నవీ ముంబై) నవంబర్ 2న జరుగుతుంది.చదవండి: Women's CWC: అద్వితీయ ప్రస్థానం.. చరిత్ర తిరగేస్తే అంతా వారే..! -
అద్వితీయ ప్రస్థానం.. చరిత్ర తిరగేస్తే అంతా వారే..!
మహిళల వన్డే ప్రపంచకప్లో (women's Cricket World Cup) ఆస్ట్రేలియా (Australia Women's Cricket Team) ప్రస్తానం అద్వితీయంగా సాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు పూర్తైన 12 ఎడిషన్లలో ఏడు సార్లు ఛాంపియన్గా నిలిచింది. తద్వారా టోర్నీ చరిత్రలో అత్యధిక టైటిళ్లు సాధించిన జట్టుగా ప్రపంచ రికార్డు కలిగి ఉంది.ఘన చరిత్ర కలిగిన ఆసీస్.. ప్రస్తుతం ఎనిమిదో టైటిల్ దిశగా అడుగులు వేస్తుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న 2025 ఎడిషన్లో ఓటమెరుగని ఏకైక జట్టుగా సెమీస్కు చేరింది. సెమీస్లో భారత్తో అమీతుమీకి సిద్దమైంది. ఈ మ్యాచ్ నవీ ముంబై వేదికగా అక్టోబర్ 30న జరుగనుంది. తొలి సెమీస్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా పోటీపడనున్నాయి. ఆసీస్ మరోసారి సెమీస్కు చేరిన నేపథ్యంలో ప్రపంచకప్లో ఆ జట్టు ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం.తొట్ట తొలి ఛాంపియన్ ఇంగ్లండ్ఈ మెగా టోర్నీ 1973లో (ఇంగ్లండ్లో) తొలిసారి జరిగింది. ఈ ఎడిషన్లో ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి తొట్ట తొలి జగజ్జేతగా ఆవిర్భవించింది. 7 జట్లు పాల్గొన్న ఆ ఎడిషన్లో ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచి రన్నరప్తో సరిపెట్టుకుంది. తొలిసారి జగజ్జేతభారత్ వేదికగా జరిగిన రెండో ఎడిషన్లో (1978) ఆస్ట్రేలియా తొలిసారి ఛాంపియన్గా నిలిచింది. ఈ ఎడిషన్లో ఆసీస్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి విజేతగా అవతరించింది. కేవలం నాలుగు జట్లు పాల్గొన్న ఈ ఎడిషన్లో ఇంగ్లండ్ రెండో స్థానంలో నిలిచింది. ఆతిథ్య భారత్ చివరి స్థానంతో సరిపెట్టుకుంది. భారత్కు ఇదే తొలి ప్రపంచకప్. రెండోసారిన్యూజిలాండ్ వేదికగా జరిగిన మూడో ఎడిషన్లో (1982) ఆస్ట్రేలియా రెండో సారి ఛాంపియన్గా నిలిచింది. రౌండ్ రాబిన్ ఫార్మాట్లోనే జరిగిన ఈ ఎడిషన్లో ఆసీస్ అజేయగా జట్టుగా నిలిచి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ ఎడిషన్లోనూ ఇంగ్లండ్ రన్నరప్తో సరిపెట్టుకుంది. హ్యాట్రిక్స్వదేశంలో జరిగిన 1988లో ఎడిషన్లో ఆసీస్ మరోసారి ఛాంపియన్గా నిలిచి, హ్యాట్రిక్ సాధించింది. ఐదు జట్లుతో 60 ఓవర్ల ఫార్మాట్లో జరిగిన ఈ ఎడిషన్లోనూ ఇంగ్లండ్ రన్నరప్గా నిలిచింది. ఫైనల్లో ఆసీస్ ఇంగ్లండ్ను చిత్తుగా ఓడించి, ముచ్చటగా మూడో టైటిల్ ఎగరేసుకుపోయింది.తొలిసారి పరాభవం1993 ఎడిషన్లో ఆస్ట్రేలియా తొలిసారి ఫైనల్కు చేరలేకపోయింది. రౌండ్ రాబిన్ పద్దతిలో జరిగిన ఈ ఎడిషన్లో ఇంగ్లండ్ ఛాంపియన్గా, న్యూజిలాండ్ రన్నరప్గా నిలువగా.. ఆస్ట్రేలియా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఈ ఎడిషన్లో 8 జట్లు పాల్గొనగా భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.తిరిగి జగజ్జేతగా..1997లో భారత్ వేదికగా జరిగిన ఎడిషన్లో ఆస్ట్రేలియా తిరిగి జగజ్జేతగా ఆవిర్భవించింది. 11 జట్లు పాల్గొన్న ఈ ఎడిషన్లో న్యూజిలాండ్ రన్నరప్గా నిలువగా.. భారత్ సెమీస్ వరకు చేరుకుంది.మూడు సార్లు పరాభవం తర్వాత..!మూడు సార్లు ఫైనల్లో పరాభవం తర్వాత న్యూజిలాండ్ తొలిసారి 2000 ఎడిషన్లో ఛాంపియన్గా అవతరించింది. స్వదేశంలో జరిగిన ఈ ఎడిషన్లో న్యూజిలాండ్ తిరుగులేని ఆధిపత్యం చలాయించి టైటిల్ను సొంతం చేసుకుంది. 8 జట్లు పాల్గొన్న ఈ ఎడిషన్లో ఆస్ట్రేలియా రన్నరప్తో సరిపెట్టుకుంది.భారత్పై గెలిచి ఐదోసారిసౌతాఫ్రికా వేదికగా జరిగిన 2005 ఎడిషన్లో ఆస్ట్రేలియా ఐదోసారి జగజ్జేతగా ఆవతరించింది. ఫైనల్లో భారత్పై విజయం సాధించి, ఛాంపియన్గా అవతరించింది.ఊహించని పరాభవంస్వదేశంలో జరిగిన 2009 ఎడిషన్లో ఆసీస్కు ఊహించని పరాభవం ఎదురైంది. ఈ ఎడిషన్లో ఆ జట్టు సూపర్ సిక్స్ దశను అధిగమించలేకపోయింది. ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఫైనల్కు చేరుకోగా.. ఇంగ్లండ్ తమ మూడో టైటిల్ను సొంతం చేసుకుంది.ఆరో టైటిల్భారత్ వేదికగా జరిగిన 2013 ఎడిషన్లో ఆస్ట్రేలియా తిరిగి పుంజుకొని ఛాంపియన్గా అవతరించింది. ఫైనల్లో వెస్టిండీస్పై విజయం సాధించి ఆరో టైటిల్ను ఖాతాలో వేసుకుంది. ఈ ఎడిషన్లో భారత్ సూపర్ సిక్స్కు కూడా చేరలేకపోయింది.ఇంగ్లండ్ నాలుగోసారి..స్వదేశంలో జరిగిన 2017 ఎడిషన్లో ఇంగ్లండ్ విజేతగా అవతరించింది. ఫైనల్లో భారత్పై విజయం సాధించి, నాలుగసారి జగజ్జేతగా నిలిచింది.ఏడోసారి జగజ్జేతగా..న్యూజిలాండ్ వేదికగా జరిగిన 2022 ఎడిషన్లో ఆస్ట్రేలియా ఏడో సారి ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది. ఫైనల్లో ఇంగ్లండ్పై విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ ఎడిషన్లో భారత్ నాకౌట్ దశకు చేరలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఎడిషన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆసీస్ ఎనిమిదో టైటిల్పై కన్నేసింది. చదవండి: కేకేఆర్ హెడ్ కోచ్గా రోహిత్ శర్మ ఫిట్నెస్ గురు -
కేకేఆర్ హెడ్ కోచ్గా రోహిత్ శర్మ ఫిట్నెస్ గురు
ఐపీఎల్ 2025లో నిరాశజనక ప్రదర్శన తర్వాత కోల్కతా నైట్రైడర్స్ (KKR) తమ ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్ను తప్పించింది. తాజాగా పండిట్ స్థానాన్ని మాజీ ముంబై ఆల్రౌండర్ అభిషేక్ నాయర్తో (Abhishek Nayar) భర్తీ చేసినట్లు తెలుస్తుంది. ఫ్రాంచైజీ నిర్ణయాన్ని గత వారం నాయర్కు తెలియజేసినట్టు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.నాయర్ గతంలో కేకేఆర్ అకాడమీకి కీలకంగా పనిచేశాడు. ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో, వారి ప్రతిభను వెలికితీయడంలో అతని పాత్ర ముఖ్యమైంది. గత సంవత్సరం సహాయక సిబ్బందిగా కేకేఆర్లో చేరిన నాయర్, ఇప్పుడు ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు.42 ఏళ్ల నాయర్, ఇటీవల మహిళల ఐపీఎల్లో (WPL) యూపీ వారియర్జ్కు (UP Warriorz) హెడ్ కోచ్గా పనిచేశాడు. అతని కోచింగ్ శైలి వ్యక్తిగతంగా ఆటగాళ్లను ఫిట్నెస్, ఫామ్ పరంగా తిరిగి పుంజుకునేలా చేస్తుంది. నాయర్ ఇటీవలే టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మలో (Rohit Sharma) ఊహించిన ఫిట్నెస్ పరివర్తను తీసుకొచ్చాడు. నాయర్ సహకారంతో రోహిత్ ఏకంగా 10 కిలోల బరువు తగ్గి స్లిమ్గా తయారయ్యాడు. నాయర్ రోహిత్కు మంచి మిత్రుడు కూడా. నాయర్ రోహిత్కు మాత్రమే కాకుండా కేఎల్ రాహుల్ తదితర ఆటగాళ్లకు కూడా ఫిట్నెస్ గురుగా ఉన్నాడు.వ్యక్తిగత కోచ్గా, ఫిట్నెస్ గురుగా మంచి పేరున్న నాయర్ టీమిండియా అసిస్టెంట్ కోచ్గా మాత్రం రాణించలేకపోయాడు. ఇటీవలే బీసీసీఐ అతన్ని ఆ పదవి నుంచి తప్పించింది. టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్ నియమితుడయ్యాక నాయర్ను ప్రత్యేకంగా తన బృందంలో చేర్చుకున్నాడు. అయితే జట్టు వైఫల్యాల కారణంగా నాయర్ ఎంతో కాలం భారత సహాయ కోచ్గా ఉండలేకపోయాడు.ఇదిలా ఉంటే, గత సీజన్లో కేకేఆర్ పేలవ ప్రదర్శన చేసింది. 14 మ్యాచ్ల్లో కేవలం 5 విజయాలు మాత్రమే సాధించి, ప్లేఆఫ్స్కు చేరలేకపోయింది. తదుపరి సీజన్లో కేకేఆర్ నాయర్పై భారీ ఆశలు పెట్టుకుంది. కేకేఆర్ హెడ్ కోచ్ పదవిపై అధికారిక ప్రకటన వచ్చాక నాయర్ యూపీ వారియర్జ్ కోచ్గా కూడా కొనసాగుతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.చదవండి: చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్లు.. స్వల్ప స్కోర్కే కుప్పకూలిన న్యూజిలాండ్ -
చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్లు.. స్వల్ప స్కోర్కే కుప్పకూలిన న్యూజిలాండ్
మహిళల వన్డే ప్రపంచకప్లో (Women's WC 2025) ఇవాళ (అక్టోబర్ 26) ఉదయం మొదలైన నామమాత్రపు మ్యాచ్లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు (England vs New Zealand) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగడంతో ఆ జట్టు 38.2 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటైంది.ఇంగ్లండ్ బౌలర్లలో లిండ్సే స్మిత్ 3, కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్, అలైస్ క్యాప్సీ తలో 2, ఛార్లీ డీన్, సోఫీ ఎక్లెస్టోన్ చెరో వికెట్ పడగొట్టారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో ఓపెనర్ జార్జియా ప్లిమ్మర్ (43) టాప్ స్కోరర్గా నిలువగా.. అమేలియా కెర్ (35), కెప్టెన్ సోఫీ డివైన్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.సూజీ బేట్స్ 10, బ్రూక్ హ్యాలీడే 4, మ్యాడీ గ్రీన్, ఇసబెల్లా గేజ్, జెస్ కెర్ 10, రోస్మేరీ మైర్ డకౌట్, లియా తహుహు 2 పరుగులకు ఔటయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ త్వరగా మ్యాచ్ ముగించే దిశగా సాగుతోంది. 10 ఓవర్లలో ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. ఇంగ్లండ్ గెలుపుకు మరో 119 పరుగులు కావాలి. యామీ జోన్స్ (20), ట్యామీ బేమౌంట్ (26) క్రీజ్లో ఉన్నారు.కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో సెమీస్ బెర్త్లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, భారత్ ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. అక్టోబర్ 29న జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా (గౌహతి).. 30వ తేదీ జరిగే రెండో సెమీస్లో భారత్, ఆస్ట్రేలియా (నవీ ముంబై) తలపడతాయి. ఈ మెగా టోర్నీ ఫైనల్ (నవీ ముంబై) నవంబర్ 2న జరుగుతుంది.చదవండి: హ్యారీ బ్రూక్ ఐకానిక్ శతకం వృధా -
హ్యారీ బ్రూక్ ఐకానిక్ శతకం వృధా
న్యూజిలాండ్ పర్యటనలో ఇంగ్లండ్ తొలి ఓటమి ఎదుర్కొంది. తొలుత జరిగిన టీ20 సిరీస్ను 1-0 తేడాతో కైవసం చేసుకున్న ఇంగ్లీష్ జట్టు.. మౌంట్ మాంగనూయ్ వేదికగా ఇవాళ (అక్టోబర్ 26) జరిగిన తొలి వన్డేలో (New Zealand vs England) 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) ఐకానిక్ శతకం (101 బంతుల్లో 135; 9 ఫోర్లు, 11 సిక్సరు) కారణంగా గౌరవప్రదమైన స్కోర్ (35.2 ఓవర్లలో 223 ఆలౌట్) చేయగా.. న్యూజిలాండ్ 36.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ల సిరీస్లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో వెళ్లింది. రెండో వన్డే హ్యామిల్టన్ వేదికగా అక్టోబర్ 29న జరుగనుంది.బ్రూక్ ఐకానిక్ శతకంఈ మ్యాచ్లో బ్రూక్ చేసిన శతకం వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత క్రేజీయెస్ట్ శతకంగా చెప్పవచ్చు. బ్రూక్ తన జట్టును 56 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశ నుంచి గౌరవప్రదమైన స్కోర్ వరకు చేర్చి పదో వికెట్గా వెనుదిరిగాడు.ఇంగ్లండ్ 166 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోగా ఆ సమయానికి బ్రూక్ స్కోర్ 86 పరుగులుగా ఉండింది. ఈ దశలో బ్రూక్ వరుసగా మూడు సిక్సర్లు కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో బ్రూక్ ఒంటిచేత్తో ఇన్నింగ్స్ మొత్తాన్ని నడిపాడు. జేమీ ఓవర్టన్ (46) అతనికి కాస్త సహకించాడు. మిగతా ఇంగ్లండ్ బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.గెలిపించిన మిచెల్స్వల్ప లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ కూడా తడబడింది. 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆ జట్టును డారిల్ మిచెల్ (78 నాటౌట్), మైఖేల్ బ్రేస్వెల్ (51) ఆదుకున్నారు. ముఖ్యంగా మిచెల్ చివరి వరకు క్రీజ్లో నిలబడి న్యూజిలాండ్ను విజయతీరాలకు చేర్చాడు. మిచెల్కు బ్రేస్వెల్తో పాటు టామ్ లాథమ్ (24), మిచెల్ సాంట్నర్ (27) సహకరించారు. చదవండి: జీరో నుంచి హీరో.. యువ క్రికెటర్లకు రోల్ మోడల్! ఈ వీరుడి గురుంచి తెలుసా? -
జీరో నుంచి హీరో.. యువ క్రికెటర్లకు రోల్ మోడల్! ఈ వీరుడి గురుంచి తెలుసా?
నవంబర్ 23, 1990.. ఆ రోజున ఇరవై ఏళ్ల యువ క్రికెటర్ శ్రీలంక తరపున టెస్టు అరంగేట్రం చేశాడు. ఎన్నో ఆశలతో తన అంతర్జాతీయ క్రికెట్ ప్రయణాన్ని ప్రారంభించిన ఆ యువ ఆటగాడికి.. తొలి మ్యాచ్లోనే తీవ్ర నిరాశ ఎదురైంది. ఓపెనర్గా బరిలోకి దిగిన అతడు తొలి ఇన్నింగ్స్లో డకౌటయ్యాడు. డ్రెస్సింగ్ రూమ్లో అప్పటి కెప్టెన్తో పాటు హెడ్ కోచ్ అతడికి సపోర్ట్ నిలిచారు. కానీ రెండో ఇన్నింగ్స్లోనూ ఖాతా తెరకుండానే పెవిలియన్కు చేరాడు. అప్పటికే అతడు దేశవాళీ క్రికెట్లో సెంచరీలు మోత మ్రోగిస్తున్నప్పటికి.. అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం తన మార్క్ చూపించలేకపోయాడు. దీంతో అతడిని జట్టు నుంచి తీసేశారు. అరంగేట్రం ఒక పీడకలగా మారింది. అయినప్పటికి శ్రీలంక తరపున ఆడాలన్న తన పట్టుదలను మాత్రం విడిచిపెట్టలేదు. దేశవాళీ క్రికెట్కు తిరిగి వెళ్లి తీవ్రంగా శ్రమించి మరో అవకాశం కోసం ఎదురు చూశాడు. సరిగ్గా 19 నెలల తర్వాత అతడికి జాతీయ జట్టు మళ్లీ పిలుపు వచ్చింది.మళ్లీ హార్ట్ బ్రేక్..రెండో సారి కూడా అతడికి హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ ఎదురైంది. మొదటి ఇన్నింగ్స్లో జీరో.. రెండు ఇన్నింగ్స్లో కేవలం ఒక్క పరుగు. అంటే అతడికి అంతర్జాతీయ క్రికెట్లో ఒక్క పరుగు సాధించడానికి దాదాపు రెండు ఏళ్ల సమయం పట్టింది. దీంతో అతడిని మళ్లీ జట్టులోని నుంచి తొలిగించారు. అందరూ అతడి ఇంటర్నేషనల్ కెరీర్ ముగిసిందని, ఒత్తడిని తట్టుకోలేడని విమర్శల వర్షం కురిపించాడు. కానీ అతడు మాత్రం విమర్శలను పక్కన పెట్టి తన ప్రాక్టీస్పైనే దృష్టి పెట్టాడు. డొమాస్టిక్ క్రికెట్ తిరిగొచ్చిన అతడు ఈసారి మరింత కష్టపడ్డాడు. మళ్లీ అతడికి 21 నెలల తర్వాత లంక తరపున ఆడేందుకు అవకాశం వచ్చింది. ఈసారి ఎలాగైనా తన సత్తా నిరూపించుకోవాలని ఆ యువ ఆటగాడు సిద్దమయ్యాడు. కానీ ముచ్చటగా మూడో సారి కూడా అతడికి నిరాశే ఎదురైంది. మరో రెండు సున్నాలు అతడి ఖాతాలో చేరాయి. రెండు ఇన్నింగ్స్లలోనూ డకౌటయ్యాడు. అంటే తొలి ఆరు ఇన్నింగ్స్లలో అతడు కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. మిగితా ఐదు ఇన్నింగ్స్లలో డకౌటయ్యాడు. దీంతో మరోసారి అతడిపై వేటు పడింది. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో చాలా మంది ఆటగాళ్లు ఇక చాలు అని తమ కెరీర్ను ముగించేస్తారు. కానీ అతడు మాత్రం వెనక్కు తగ్గలేదు. పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడాతునే ఉన్నాడు.పట్టు వదలని విక్రమార్కుడుఅతడు మళ్లీ దేశీయ క్రికెట్లోకి తిరిగి వచ్చి 36 నెలలు పాటు తీవ్రంగా శ్రమించాడు. అక్కడ మెరుగైన ప్రదర్శన చేసి దాదాపు మూడేళ్ల తర్వాత అతడు లంక టెస్టు జట్టులోకి వచ్చాడు. ఈసారి మాత్రం అతడి కృషి ఫలించింది. మొదటి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ సాధించి తన జైత్ర యాత్రను ప్రారంభించాడు. అక్కడి నుంచి అతడు వెనక్కి తిరిగి చూడలేదు. జీరో నుంచి హీరోగా మారిన అతడు ఏకంగా శ్రీలంక కెప్టెన్గా ఎదిగాడు. అతడే శ్రీలంక దిగ్గజం, మాజీ కెప్టెన్ మార్వన్ ఆటపట్టు. అతడి సక్సెస్ స్టోరీ ఎంతో మంది యువ క్రికెటర్లకు స్పూర్తి దాయకం. అంతర్జాతీయ క్రికెట్లో తన రెండవ రన్ సాధించడానికి మార్వన్కు 6 సంవత్సరాలు పట్టింది.ఇంత వైఫల్యం ఎదురైనా..అతడు మాత్రం గివప్ కాలేదు. అలా అని వేరే కెరీర్ చూసుకోలేదు. పడిన ప్రతీసారి బలంగా లేచిందుకు ప్రయత్నించాడు. ఫెయిల్ అవ్వడం ఎండ్ కాదు.. తిరిగి ప్రయత్నించడమే నిజమైన విజయమని మార్వన్ నిరూపించాడు.ఆరు డబుల్ సెంచరీలు.. ఒక్క పరుగు సాధించడానికే ఇబ్బంది పడిన ఆటపట్టు.. తన టెస్టు కెరీర్లో ఏకంగా ఆరు డబుల్ సెంచరీలు సాధించాడు. 90 టెస్టులు ఆడిన మార్వన్ 39.02 సగటుతో 5502 పరుగులు సాధించాడు. అతడి పేరిట 16 టెస్టు సెంచరీలు, 6 ద్విశతకాలు ఉన్నాయి. వన్డేల్లో కూడా ఈ మాజీ కెప్టెన్ 11 సెంచరీల సాయంతో 8529 పరుగులు చేశాడు. మొత్తంగా ఆటపట్టు తన అంతర్జాతీయ కెరీర్లో 14,031 పరుగులు చేశాడు. అతడి కెప్టెన్సీలోనే 2004 ఆసియాకప్ టైటిల్ను లంక సొంతం చేసుకుంది.చదవండి: IND vs SA: టీమిండియా పొమ్మంది.. కట్ చేస్తే! సెంచరీతో సెలక్టర్లకు వార్నింగ్ -
టీమిండియా పొమ్మంది.. కట్ చేస్తే! సెంచరీతో సెలక్టర్లకు వార్నింగ్
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు ముందు టీమిండియా వెటరన్ కరుణ్ నాయర్ అద్భుత సెంచరీతో సెలక్టర్లకు సవాల్ విసిరాడు. భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయిన వెటరన్ కరుణ్ నాయర్.. ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో కర్ణాటకకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ఈ క్రమంలో శిమొగా వేదికగా గోవాతో జరుగుతున్న మ్యాచ్లో నాయర్ శతక్కొట్టాడు. 65 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కర్ణాటకను నాయర్ తన సెంచరీతో ఆదుకున్నాడు. తొలుత అభినవ్ మనోహర్తో భాగస్వామ్యం నెలకొల్పిన నాయర్.. తర్వాత శ్రేయస్ గోపాల్తో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు.కరుణ్ ప్రస్తుతం 129 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. అతడి ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 11 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అంతకుముందు సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్లో కూడా హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్లో 95 ఓవర్లు ముగిసే సరికి కర్ణాటక 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది.నాయర్ మళ్లీ వస్తాడా?కాగా దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్.. ఇంగ్లండ్ గడ్డపై తనను లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ సిరీస్లో నాలుగు టెస్టులు ఆడి కేవలం 25.63 సగటుతో 205 పరుగులు మాత్రమే చేశాడు. భారత బ్యాటర్లు సెంచరీల మోత మ్రోగించిన చోట.. నాయర్ కనీసం ఒక్కసారి కూడా మూడెంకెల స్కోర్ సాధించకపోవడం సెలక్టర్లను తీవ్రంగా నిరాశపరిచింది.దీంతో స్వదేశంలో వెస్టిండీస్తో జరిగిన టెస్టు సిరీస్కు కరుణ్ నాయర్ను జట్టు నుంచి తప్పించారు. అతడి స్ధానంలో దేవ్దత్త్ పడిక్కల్కు అవకాశమిచ్చారు. ఇప్పుడు మళ్లీ తన ఫామ్ను తిరిగి అందుకోవడంతో నాయర్ను సౌతాఫ్రికా సిరీస్కు ఎంపిక చేస్తారో లేదో వేచి చూడాలి.చదవండి: రోహిత్ శర్మ రిటైర్మెంట్ అప్పుడే.. కన్ఫర్మ్ చేసిన కోచ్ -
దుమ్ములేపిన సచిన్ కొడుకు.. బ్యాటర్లను భయపెట్టేశాడగా!?
రంజీ ట్రోఫీ 205-26 సీజన్లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు, గోవా స్టార్ ఆల్రౌండర్ అర్జున్ టెండూల్కర్ అద్బుతమైన కమ్బ్యాక్ ఇచ్చాడు. చంఢీగర్తో జరిగిన తమ తొలి మ్యాచ్లో దాదాపు 100 పరుగులు సమర్పించుకున్న అర్జున్.. ఇప్పుడు శిమొగా వేదికగా కర్ణాటకతో జరుతున్న మ్యాచ్లో మాత్రం సత్తాచాటాడు.తన అర్జున్ తన అద్బుత బౌలింగ్తో కర్ణాటక టాపర్డర్ను దెబ్బతీశాడు. గోవా తరపున బౌలింగ్ ఎటాక్ను ప్రారంభించిన ఈ స్పీడ్ స్టార్.. కర్ణాటక ఓపెనర్ నికిన్ జోస్ను కేవలం మూడు పరుగులకే అవుట్ చేశాడు. ఆ తర్వాత వికెట్ కీపర్-బ్యాటర్ కృష్ణన్ శ్రీజిత్ను డకౌట్ అర్జున్ పెవిలియన్కు పంపాడు. అంతేకాకుండా క్రీజులో సెటిల్ అయిన అభినవ్ మనోహర్ను కూడా అర్జున్ బోల్తా కొట్టించాడు. తొలి రోజు ఆటలో12.2 ఓవర్లు బౌలింగ్ చేసిన అర్జున్ టెండూల్కర్.. మూడు వికెట్లు పడగొట్టి కేవలం 33 పరుగులే ఇచ్చాడు. అర్జున్ సూపర్ స్పెల్తో పాటు మరో ఫాస్ట్ బౌలర్ వాసుకి కౌశిక్ రెండు కీలక వికెట్లు తీసి గోవా జట్టును టాప్లో ఉంచారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కర్ణాటక 5 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. కాగా జూనియర్ టెండూల్కర్ 2021-22 సీజన్ తర్వాత ముంబై నుంచి గోవాకు తన మకాంను మార్చిన సంగతి తెలిసిందే.చదవండి: IND vs AUS: గెలుపు జోష్లో ఉన్న టీమిండియాకు భారీ షాక్.. -
ఇంగ్లండ్ కెప్టెన్ విధ్వంసకర సెంచరీ.. 9 ఫోర్లు, 11 సిక్స్లతో! వీడియో
మౌంట్ మౌంగనుయ్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్( Harry Brook) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు కివీస్ బౌలర్లు భారీ షాకిచ్చారు.బ్లాక్ క్యాప్స్ బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ కేవలం 34 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో హ్యారీ బ్రూక్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ జేమి ఓవర్టన్తో కలిసి కివీస్ బౌలర్లను ఎటాక్ చేశాడు. ఓవర్టన్తో కలిసి ఆరో వికెట్కు బ్రూక్ 87 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు పడతున్నప్పటికి ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ మాత్రం తన విధ్వంసాన్ని మాత్రం ఆపలేదు. మౌంట్ మౌంగనుయ్లో బౌండరీల వర్షం కురిపించాడు. అతడు మెరుపు బ్యాటింగ్ ఫలితంగా ఇంగ్లండ్ 35.2 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది.ఓవరాల్గా 135 బంతులు ఎదుర్కొన్న బ్రూక్..9 ఫోర్లు, 11 సిక్స్లతో 135 పరుగులు చేశాడు. ఆఖరి వికెట్గా బ్రూక్నే వెనుదిరిగాడు. కివీస్ బౌలర్లలో జకారీ ఫౌల్క్స్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. డఫీ మూడు, హెన్రీ రెండు వికెట్లు పడగొట్టారు. స్వల్ప లక్ష్య చేధనలో కివీస్ సైతం తడబడుతోంది. 66 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.చదవండి: రోహిత్ శర్మ రిటైర్మెంట్ అప్పుడే.. కన్ఫర్మ్ చేసిన కోచ్🚨One of the most iconic knocks by Harry Brook🤯England were 10/4 in 5 overs, and Captain Harry Brook stood tall, smashing 135 off 101 balls with 9 fours and 11 sixes.He single-handedly took England to a fighting total of 223 against New Zealand. 🔥#HarryBrook #ENGvNZ pic.twitter.com/5Nn4mHJbUd— ICC Asia Cricket (@ICCAsiaCricket) October 26, 2025 -
గెలుపు జోష్లో ఉన్న టీమిండియాకు భారీ షాక్..
ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో గెలిచి మంచి జోష్లో ఉన్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా దాదాపు నెల రోజుల పాటు జట్టుకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఆసీస్తో జరిగిన మూడో వన్డేలో క్యాచ్ను అందుకునే క్రమంలో అయ్యర్ పక్కటెముకులకు గాయమైంది.వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి స్కాన్లు చేయించగా.. గాయం కాస్త తీవ్రమైనదిగా తేలినట్లు సమాచారం. దీంతో వచ్చే నెల ఆఖరిలో సౌతాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్కు అయ్యర్ అందుబాటుపై అనుమానాలు నెలకొన్నాయి. భారత్కు బిగ్ షాక్.."మ్యాచ్ జరుగుతుండగానే శ్రేయస్ అయ్యర్ను స్కాన్ల కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక నిర్ధారణ ప్రకారం.. ఎడమ ప్రక్కటెముకలలో చిన్న ఫ్రాక్చర్ ఉంది.అతడు కనీసం మూడు వారాల పాటు ఆటకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అయ్యర్ కోలుకోవడానికి ఎక్కువ సమయం అవసరమా లేదా అని నిర్ధారించడానికి మరిన్ని రిపోర్ట్లు స్కాన్లు చేయాల్సి ఉంది.ఇది హెయిర్లైన్ ఫ్రాక్చర్ అయితే ఎక్కువ సమయం పట్టవచ్చు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు అయ్యర్ అందుబాటులో ఉంటాడో లేదో ఇప్పుడే చెప్పలేము. మూడు వారాలలో అతడు కోలుకుంటే సౌతాఫ్రికా సిరీస్లో ఆడే అవకాశం ఉందని" బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పీటీఐతో పేర్కొన్నారు.ఒకవేళ అయ్యర్ ప్రోటీస్తో సిరీస్కు దూరమైతే భారత్ గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. అయ్యర్ భారత వన్డే సెటాప్లో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. అయితే గతంలో కూడా శ్రేయస్ వెన్ను గాయంతో బాధపడ్డాడు. కోలుకుని తిరిగొచ్చాక ఇప్పుడు పక్కటెముల గాయం బారిన పడ్డాడు. కాగా సౌతాఫ్రికా-భారత్ మధ్య వన్డే సిరీస్ నవంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: రోహిత్ శర్మ రిటైర్మెంట్ అప్పుడే.. కన్ఫర్మ్ చేసిన కోచ్ -
రోహిత్ శర్మ రిటైర్మెంట్ అప్పుడే.. కన్ఫర్మ్ చేసిన కోచ్
వైట్బాల్ క్రికెట్లో టీమిండియా ముఖ చిత్రంగా నిలిచిన స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ.. మరోసారి తన మార్క్ను చూపించాడు. ఏడు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టాడు.తొలి మ్యాచ్లో విఫలమైనప్పటికి ఆ తర్వాత రెండు వన్డేల్లో సత్తాచాటాడు. అడిలైడ్లో 73 పరుగులు చేసిన హిట్మ్యాన్.. ఇప్పుడు సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో సెంచరీతో చెలరేగాడు. 38 ఏళ్ల వయసులోనూ అతని ఆట తీరు, షాట్ సెలెక్షన్ ఫ్యాన్స్ను మంత్రముగ్ధులను చేశాయి.చివరిసారిగా ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన రోహిత్.. తన అద్బుత సెంచరీతో అభిమానులకు మరుపురాని ఇన్నింగ్స్ను అందించాడు. 237 పరగుల లక్ష్య చేధనలో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్లో రోహిత్ 125 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 3 సిక్స్లతో 121 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.ఆసీస్ టూర్ తర్వాత వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడన్న ఉహగానాలకు తన సెంచరీతోనే హిట్మ్యాన్ తెరదించాడు. వన్డే వరల్డ్కప్-2027లో ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాము అని మ్యాచ్ అనంతరం రోహిత్ తెలిపాడు. ఇక రోహిత్ భవిష్యత్తు ప్రణాళికలపై అతడి చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిట్మ్యాన్ 2027 వన్డే ప్రపంచకప్లో ఆడుతాడని లాడ్ కూడా స్పష్టం చేశారు."రోహిత్లో ఇంకా పరుగుల దాహం తీరలేదు. అతడు ఈ మ్యాచ్లో అతడు బ్యాటింగ్ చేసిన విధానం, భారత జట్టును గెలిపించిన తీరు నిజంగా అద్భుతం. రోహిత్ తను ఎప్పుడు రిటైర్ అవ్వాలో ఇప్పటికే నిర్ణయించుకున్నాడు. 2027 వన్డే ప్రపంచ కప్ ఆడి ఆ తర్వాత రిటైర్ అవుతాడని" లాడ్ పేర్కొన్నాడు.కాగా రోహిత్ శర్మ తన కెరీర్లో టీ20 వరల్డ్కప్, ఆసియాకప్, ఛాంపియన్స్ ట్రోఫీలు గెలుచుకున్నప్పటికి.. వన్డే వరల్డ్కప్ అందని ద్రాక్షగా మిగిలిపోయింది. 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో రోహిత్ భాగంగా లేడు. ఆ తర్వాత 2015, 2019, 2023 ప్రపంచకప్లలోనూ అతడికి నిరాశే ఎదురైంది. దీంతో మరో రెండేళ్లలో జరిగే వరల్డ్కప్ను గెలుకుని తన కెరీర్కు ముగింపు పలకాలని రోహిత్ నిర్ణయించుకున్నాడు.చదవండి: ఆస్ట్రేలియా క్రికెటర్లకు సారీ చెప్పిన బీసీసీఐ.. -
ఒకే మ్యాచ్లో రెండు హ్యాట్రిక్లు.. 91 ఏళ్ల టోర్నీ చరిత్రలోనే
రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘సి’లో భాగంగా... అస్సాంతో జరుగుతున్న మ్యాచ్లో సర్వీసెస్ బౌలర్లు చరిత్ర సృష్టించారు. అర్జున్ శర్మ, మోహిత్ జాంగ్రా హ్యాట్రిక్లతో విజృంభించారు. సుదీర్ఘ చరిత్ర గల రంజీ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్లో ఇద్దరు బౌలర్లు హ్యాట్రిక్ నమోదు చేయడం ఇదే తొలిసారి. కాగా ఈ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న అస్సాం... తొలి ఇన్నింగ్స్లో 17.2 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది.ప్రద్యున్ సైకియా (42 బంతుల్లో 52; 3 ఫోర్లు, 6 సిక్స్లు), రియాన్ పరాగ్ (31 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్లు) ఫర్వాలేదనిపించగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. సర్వీసెస్ బౌలర్లలో అర్జున్ శర్మ హ్యాట్రిక్ సహా 5 వికెట్లు పడగొట్టగా... మోహిత్ జాంగ్రా 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.అనంతరం సర్వీసెస్ 29.2 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైంది. ఇర్ఫాన్ ఖాన్ (51) హాఫ్ సెంచరీ సాధించగా... అస్సాం బౌలర్లలో రియాన్ పరాగ్ 5 వికెట్లు, రాహుల్ సింగ్ 4 వికెట్లు తీశారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అస్సాం 21 ఓవర్లలో 5 వికెట్లకు 56 పరుగులు చేసింది. మొత్తంగా ఈ పోరులో తొలి రోజే 25 వికెట్లు నేలకూలాయి.చదవండి: ఆస్ట్రేలియా క్రికెటర్లకు సారీ చెప్పిన బీసీసీఐ.. -
ఆస్ట్రేలియా క్రికెటర్లకు సారీ చెప్పిన బీసీసీఐ..
వన్డే వరల్డ్కప్లో ఆడేందుకు వచ్చిన ఇద్దరు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లను మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ ఆకతాయి వేధింపులకు గురిచేసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు సభ్యులు ఇద్దరూ గురువారం రాత్రి హోటల్కు తిరిగి వస్తుండగా.. ఇండోర్లోని ఖజ్రానా రోడ్ వద్ద ఓ వ్యక్తి వారి వెంటపడుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే సదరు క్రికెటర్లు జట్టు మేనేజర్కు సమాచారం అందించారు. అతడి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసిన పోలీలుసు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఖజ్రానాకు చెందిన 30 ఏళ్ల అకీల్ను నిందుతుడిగా గుర్తించారు. ప్రస్తుతం అతడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇంతకుముందు కూడా అతడిపై పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బీసీసీఐ తీవ్రంగా స్పందించింది. "ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. భారత్ అతిథిలను గౌరవించే దేశంగా పేరుగాంచినది. ఇటువంటి ఘటనలు దేశ గౌరవాన్ని దెబ్బతీస్తాయి. ఎవరిపట్ల కూడా ఇలా ప్రవర్తించకూడదు. ఆసీస్ క్రికెటర్లకు ఇలా జరిగినందుకు మేము చింతిస్తున్నాము. నిందితుడిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నందుకు సంతోషిస్తున్నాము.ఈ వన్డే ప్రపంచ కప్లో ఆడేందుకు వచ్చిన అన్ని జట్లకు ఇప్పటికే పూర్తి స్ధాయి భద్రతను కల్పించాము. ఇకపై సెక్యూరిటీ మరింత పెంచుతాము. భవిష్యత్తులో అలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాము." అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా (Devajit Saikia) పీటీఐతో పేర్కొన్నారు. కాగా అక్టోబర్ 30న జరగనున్న రెండో సెమీఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.చదవండి: భారత్ సెమీస్ ప్రత్యర్థి ఆస్ట్రేలియా -
ఉమెన్స్ క్రికెట్.. ఇన్నింగ్స్ అదుర్స్!
» ప్రస్తుత ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ టోర్నమెంట్లో మొదటి 13 మ్యాచ్లను జియోహాట్స్టార్లో 6 కోట్ల మందికిపైగా ఆస్వాదించారు. ఈ వేదికపై వీక్షకుల సంఖ్య 2022లో జరిగిన మహిళల ప్రపంచ కప్తో పోలిస్తే ఐదు రెట్లు పెరిగింది. » తాజాగా జరిగిన మొదటి 11 మ్యాచ్లను 7.2 కోట్ల మంది టీవీలో వీక్షించారు. 2022తో పోలిస్తే టీవీ వీక్షకుల సంఖ్య 160% పెరిగింది. » ఉమెన్స్ క్రికెట్ను చూస్తున్న వారిలో 5758% మంది పురుషులే. » ఓటీటీ ప్లాట్ఫామ్లో మొత్తం వీక్షణ సమయం 700కోట్ల నిమిషాలకు చేరుకుంది. టీవీలో అయితే ఈ సంఖ్య 630 కోట్ల నిమిషాలు దాటింది. – వివరాలు 3లో సాక్షి, స్పెషల్ డెస్క్: క్రికెట్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. భారత జట్టు మైదానంలో ఉందంటే కోట్ల మంది టీవీలకు అతుక్కుపోవడమో, స్మార్ట్ఫోన్లను ముందు పెట్టుకోవడమో చేయాల్సిందే. అంతలా ఈ క్రీడ భారతీయులకు దగ్గరైంది. ఇక క్రికెట్ జట్టు అనగానే పురుషుల బృందం గుర్తొచ్చే రోజులు పోయాయి. మహిళల జట్లకూ క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. ఆన్లైన్ ద్వారా కోట్లలో మ్యాచ్ల వీక్షణ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్ గణాంకాల ప్రకారం ప్రస్తుత ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ టోర్నమెంట్లో ఎనిమిది దేశాల జట్లు ఆడుతుండగా మొదటి 13 మ్యాచ్లను 6 కోట్ల మందికిపైగా వీక్షించారు. ఈ వేదికపై వీక్షకుల సంఖ్య 2022లో జరిగిన మహిళల ప్రపంచ కప్తో పోలిస్తే ఏకంగా ఐదు రెట్లు పెరగడం విశేషం. ఓటీటీ ప్లాట్ఫామ్లో మొత్తం వీక్షణ సమయం 700 కోట్ల నిమిషాలకు చేరుకుంది. మూడేళ్ల క్రితం జరిగిన మ్యాచ్లతో పోలిస్తే అనూహ్యంగా ఇది 12 రెట్లు ఎక్కువ. ఇక టీవీ వీక్షణాల విషయానికి వస్తే ప్రస్తుత టోర్నమెంట్లో మొదటి 11 మ్యాచ్లను 7.2 కోట్ల మంది టీవీల్లో ఆస్వాదించారు. టీవీ వీక్షకుల సంఖ్య 2022తో పోలిస్తే 160 శాతం వృద్ధి చెందడం విశేషం. మహిళల క్రికెట్కూ ఆదరణ పెరుగుతోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. ఇంకేముంది.. ప్రకటన కంపెనీలు సైతం క్యూ కట్టాయి. స్పాన్సర్స్లో రెక్సోనా, గూగుల్ బ్రాండ్స్ జెమినై, పే, పిక్సెల్, ఆండ్రాయిడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ జెమాలాజికల్ ఇన్స్టిట్యూట్ ఉన్నాయి. అఫీషియల్ బేవరేజ్ పార్ట్నర్గా కోకా–కోలా ఉంది. కొత్త రికార్డులకు.. : ఈ సంవత్సరం ప్రపంచ కప్ మహిళల క్రికెట్ పోటీల్లో వీక్షకుల సంఖ్య, ప్రకటనలు కొత్త రికార్డులకు వేదికయ్యాయి. టోర్నమెంట్ ప్రకటనల కోసం బ్రాండ్స్ చేస్తున్న ఖర్చు గత ఎడిషన్ కంటే 50% ఎక్కువగా ఉంది. ఈ ఏడాది పురుషుల క్రికెట్ ఈవెంట్లతో క్యాలెండర్ బిజీగా ఉన్నప్పటికీ మహిళల క్రికెట్తో బ్రాండ్స్ భాగస్వామ్యం కావడం విశేషం. 2026లో మహిళల ప్రీమియర్ లీగ్కు ఈ కంపెనీలు మరింత ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సాధారణంగా పురుషుల క్రికెట్ వీక్షకుల్లో 70% మంది పురుషులు ఉంటుండగా ఉమెన్స్ క్రికెట్ను చూస్తున్న వారిలో 57–58 శాతం మంది పురుషులే ఉంటుండటం మరో ఆసక్తికర అంశం. ఇంగ్లండ్–ఆ్రస్టేలియా మ్యాచ్ వంటి భారతేతర మ్యాచ్లను కూడా దాదాపు 90 లక్షల మంది చూశారు. జెర్సీలతోనూ ప్రచారం.. కొన్ని సంవత్సరాలుగా బ్రాండ్లు మహిళల క్రికెట్లో టోకెన్ స్పాన్సర్íÙప్స్ నుంచి దీర్ఘకాలిక భాగస్వామ్యాలకు మారుతున్నాయి. ఇందుకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఒక గేమ్ ఛేంజర్గా నిలిచింది. అంతేకాదు.. మహిళల క్రికెట్కు ప్రైమ్–టైమ్ విజిబిలిటీని అందిస్తోంది. మీడియా కవరేజ్, సోషల్ మీడియా ట్రాక్షన్, క్రికెటర్లపై మీడియాలో సానుకూల కథనాలు.. వెరసి ప్రకటనదారులనేగాక వీక్షకుల ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. పురుషుల టోర్నమెంట్ల మాదిరిగానే బ్రాండ్లు కూడా మహిళల మ్యాచ్ల కోసం ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలను రూపొందిస్తున్నాయి. ఏషియన్ పెయింట్స్ ‘మేరీ వాలి బ్లూ’ప్రచారం ఇందుకు ఉదాహరణ. జియోస్టార్ ‘జెర్సీ వహి తో జస్బా వహి’నినాదం కూడా భారత జెర్సీ శక్తిని చాటి వీక్షకులను ఆకట్టుకుంటోంది. గతంలో కంటే అధికంగా.. మహిళల క్రికెట్కు సంబంధించి తక్కువ నిడివిగల స్పోర్ట్స్ కంటెంట్ పెరుగుతోంది. ఇది బ్రాండ్లకు కలిసి వచ్చిందని మార్కెటింగ్ సంస్థలు అంటున్నాయి. దీంతో మహిళల క్రికెట్పై గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ ఖర్చు చేస్తున్నాయని చెబుతున్నాయి. ముఖ్యంగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తర్వాత మహిళల క్రికెట్ వైపు బ్రాండ్ పెట్టుబడుల్లో స్థిరమైన పెరుగుదల ఉంది. కొన్నేళ్ల క్రితంతో పోలిస్తే మార్కెటింగ్ కంపెనీలు మహిళల క్రీడల బ్రాండింగ్కు నిధులు పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అభిమానుల సంఖ్య అధికం కావడం, మెరుగైన ప్రసారం, ఖర్చుకు తగ్గ రాబడులు పెరగడం ఇందుకు దోహదం చేస్తున్నాయని వెల్లడిస్తున్నారు. బ్రాండ్లకు ప్రచారకర్తలుగానూ.. మహిళా క్రికెటర్లు బ్రాండ్ ప్రచారకర్తలుగా నియమితులవుతున్నారు. సినీతారలు, పురుష క్రికెటర్లతో పోలిస్తే ఈ ఒప్పందాల సంఖ్య చాలా తక్కువ. మహిళా క్రికెటర్లు సహజంగానే క్రీడా దుస్తులు, వ్యక్తిగత సంరక్షణ వంటి కొన్ని విభాగాలకు బాగా సరిపోతారు. అయితే సంప్రదాయికంగా పురుష అంబాసిడర్లు ఉన్న ఆటోమొబైల్ వంటి విభాగాల్లో మహిళా క్రికెట్ స్టార్స్ను సైతం ప్రచారకర్తలుగా చేర్చుకుంటే మార్కెటింగ్ వ్యవస్థలో గణనీయమైన మార్పు ఉండవచ్చన్నది నిపుణుల మాట. -
‘శత’క్కొట్టిన రహానే
ముంబై: భారత టెస్టు జట్టులో తిరిగి చోటు దక్కించుకోవాలని భావిస్తున్న సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే... రంజీ ట్రోఫీలో సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా ఛత్తీస్గఢ్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ముంబై తొలి రోజు ఆట ముగిసే సమయానికి 84 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ అజింక్య రహానే (237 బంతుల్లో 118; 15 ఫోర్లు) ‘శత’క్కొట్టగా... సిద్ధేశ్ లాడ్ (146 బంతుల్లో 80; 13 ఫోర్లు) ఫిఫ్టీతో మెరిశాడు. సెంచరీ అనంతరం రహానే రిటైర్డ్ హర్ట్గా మైదానాన్ని వీడాడు. ముషీర్ ఖాన్ (12), అంగ్క్రిష్ రఘువంశీ (9), హిమాన్షు సింగ్ (0), సర్ఫరాజ్ ఖాన్ (1) విఫలమయ్యారు. షమ్స్ ములానీ (25 బ్యాటింగ్), ఆకాశ్ ఆనంద్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఛత్తీస్గఢ్ బౌలర్లలో రవికిరణ్, ఆదిత్య సర్వతే చెరో 2 వికెట్లు పడగొట్టారు. విమల్, ప్రదోశ్ సెంచరీలు నాగాలాండ్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘ఎ’మ్యాచ్లో తమిళనాడు బ్యాటర్లు విజృంభించారు. విమల్ కుమార్ (224 బంతుల్లో 189; 28 ఫోర్లు), ప్రదోశ్ రంజన్ పాల్ (252 బంతుల్లో 156 బ్యాటింగ్; 19 ఫోర్లు) భారీ సెంచరీలతో కదం తొక్కారు. ఫలితంగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న తమిళనాడు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. నాగాలాండ్ బౌలర్ల అనుభవలేమిని వినియోగించుకున్న తమిళనాడు బ్యాటర్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. ఓపెనర్ అతీశ్ (14) ఆరంభంలోనే అవుట్ కాగా... ఆ తర్వాత విమల్, ప్రదోశ్ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయారు. ముఖ్యంగా విమల్ కుమార్ వన్డే తరహా బ్యాటింగ్తో దుమ్మురేపాడు. ఈ క్రమంలో ఈ ఇద్దరూ రెండో వికెట్కు 307 పరుగులు జోడించారు. మరో గంటలో తొలి రోజు ఆట ముగుస్తుందనగా... విమల్ పెవిలియన్ చేరగా... అండ్రె సిద్ధార్థ్ (30 బ్యాటింగ్)తో కలిసి ప్రదోశ్ మరో వికెట్ పడకుండా తొలి రోజు ఆటను ముగించాడు. గత మ్యాచ్లో జార్ఖండ్ బౌలర్ల ధాటికి పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడిన తమిళనాడు బ్యాటర్లు... నాగాలాండ్ బౌలింగ్ను ఓ ఆటాడుకున్నారు. రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ భారత ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ (163 బంతుల్లో 116; 15 ఫోర్లు) రాణించడంతో మహారాష్ట్ర జట్టు ఓ మోస్తరు స్కోరు చేసింది. రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా శనివారం ప్రారంభమైన పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన మహారాష్ట్ర 85.5 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటైంది. సౌరభ్ నవాలె (122 బంతుల్లో 66; 7 ఫోర్లు, 1 సిక్స్), అర్షిన్ కులకర్ణి (55 బంతుల్లో 50; 8 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు సాధించారు. పృథ్వీ షా (8), సిద్ధేశ్ వీర్ (7), కెప్టెన్ అంకిత్ బావే (8), జలజ్ సక్సేనా (1) విఫలమయ్యారు. చండీగఢ్ బౌలర్లలో జగ్జీత్ సింగ్, అభిషేక్ సైనీ చెరో 3 వికెట్లు పడగొట్టగా... విషు కశ్యప్, రమణ్ బిష్ణోయ్ రెండేసి వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. విదర్భ మ్యాచ్కు వర్షం ఆటంకం డిఫెండింగ్ చాంపియన్ విదర్భ మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించింది. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా శనివారం ప్రారంభమైన పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన జార్ఖండ్ వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి 38 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 119 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ మోహన్ (127 బంతుల్లో 60 బ్యాటింగ్; 5 ఫోర్లు), శరణ్దీప్ సింగ్ (101 బంతుల్లో 46 బ్యాటింగ్; 4 ఫోర్లు) రాణించారు. విదర్భ బౌలర్లు ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. గత మ్యాచ్లో విదర్భ జట్టు నాగాలాండ్పై ఇన్నింగ్స్ విజయం సాధించగా... మరోవైపు జార్ఖండ్ జట్టు తమిళనాడుపై ఇన్నింగ్స్ తేడాతో గెలుపొందింది. మెరిసిన కరుణ్, అర్జున్ రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా కర్ణాటక, గోవా మధ్య జరుగుతున్న మ్యాచ్లో కరుణ్ నాయర్, అర్జున్ టెండూల్కర్ ఆకట్టుకున్నారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన కర్ణాటక తొలి రోజు ఆట ముగిసే సమయానికి 69 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. టీమిండియా ప్లేయర్ కరుణ్ నాయర్ (138 బంతుల్లో 86 బ్యాటింగ్; 7 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధసెంచరీ సాధించగా... శ్రేయస్ గోపాల్ (48 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్), అభినవ్ మనోహర్ (37) ఫర్వాలేదనిపించారు. గోవా బౌలర్లలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ 47 పరుగులిచ్చి 3 వికెట్లుపడగొట్టాడు. సౌరాష్ట్ర 258/8 చాన్నాళ్ల తర్వాత రంజీ ట్రోఫీ బరిలోకి దిగిన టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (62 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా మధ్యప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో జడేజా సౌరాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సౌరాష్ట్ర తొలి రోజు ఆట ముగిసే సమయానికి 82.3 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. చిరాగ్ జానీ (138 బంతుల్లో 82; 6 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్కాగా... అన్‡్ష గోసాయ్ (38), హారి్వక్ (26), అర్పిత్ (24), సమర్ (20) తలా కొన్ని పరుగులు చేశారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో కుమార్ కార్తికేయ 4 వికెట్లు పడగొట్టాడు. » ఉత్తరప్రదేశ్తో జరుగుతున్న ఎలైట్ గ్రూప్ ‘ఎ’మ్యాచ్లో ఒడిశా జట్టు 243 పరుగులకు ఆలౌటైంది. సందీప్ పట్నాయక్ (53), గోవింద (64), సంబిత్ బరాల్ (59 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఉత్తరప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. » కేరళతో జరుగుతున్న గ్రూప్ ‘బి’మ్యాచ్లో పంజాబ్ 87 ఓవర్లలో 6 వికెట్లకు 240 పరుగులు చేసింది. హర్నూర్ సింగ్ (259 బంతుల్లో 126 బ్యాటింగ్; 11 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కాడు. » ఈ సీజన్లో త్రిపుర తరఫున ఆడుతున్న హనుమ విహారి (110 బంతుల్లో 33), విజయ్ శంకర్ (5)మరోసారి విఫలమయ్యారు. ఫలితంగా హర్యానాతో మ్యాచ్లో త్రిపుర జట్టు 126 పరుగులకే ఆలౌటైంది. అనంతరం హర్యానా 39 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. » గుజరాత్తో గ్రూప్ ‘సి’మ్యాచ్లో బెంగాల్ 72 ఓవర్లలో 7 వికెట్లకు 244 పరుగులు చేసింది. అభిõÙక్ పొరెల్ (51), సుమంత గుప్తా (58 బ్యాటింగ్), సుదీప్ కుమార్ (56) హాఫ్సెంచరీలతో రాణించారు. » ఉత్తరాఖండ్తో మ్యాచ్లో రైల్వేస్ 89 ఓవర్లలో 4 వికెట్లకు 233 పరుగులు చేసింది. మొహమ్మద్ సైఫ్ (166 బంతుల్లో 99 బ్యాటింగ్; 4 ఫోర్లు, 6 సిక్స్లు) అదరగొట్టాడు. » జమ్మూకశ్మీర్తో గ్రూప్ ‘డి’మ్యాచ్లో రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 152 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ మహిపాల్ లోమ్రర్ (37 నాటౌట్) టాప్ స్కోరర్. జమ్మూకశ్మీర్ తొలి ఇన్నింగ్స్లో 24 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. » హిమాచల్ ప్రదేశ్తో జరుగుతున్న పోరులో ఢిల్లీ తొలి ఇన్నింగ్స్లో 86 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. సనత్ సాంగ్వాన్ (79; 8 ఫోర్లు), అర్పిత్ రాణా (64; 10 ఫోర్లు), యశ్ ధుల్ (61; 11 ఫోర్లు), ఆయుశ్ (51 బ్యాటింగ్) హాఫ్సెంచరీలతో రాణించారు. -
రాహుల్ అజేయ సెంచరీ
పుదుచ్చేరి: రాహుల్ సింగ్ (174 బంతుల్లో 114 బ్యాటింగ్; 12 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో చెలరేగడంతో... హైదరాబాద్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా పాండిచ్చేరితో శనివారం మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 70 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 255 పరుగులు చేసింది. రెగ్యులర్ కెప్టెన్ తిలక్ వర్మ ఆ్రస్టేలియాతో టి20 సిరీస్ ఆడేందుకు వెళ్లడంతో ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టుకు రాహుల్ సింగ్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయి ‘డ్రా’ చేసుకున్న హైదరాబాద్ జట్టు... ఈ పోరులో సాధికారికంగా ఆడింది. రాహుల్ అజేయ శతకంతో ఆకట్టుకోగా... కొడిమ్యాల హిమతేజ (137 బంతుల్లో 62 బ్యాటింగ్; 1 ఫోర్, 2 సిక్స్లు) హాఫ్ సెంచరీతో అతడికి అండగా నిలిచాడు. తన్మయ్ అగర్వాల్ (36), అభిరత్ రెడ్డి (35) ఫర్వాలేదనిపించారు. వర్షం కారణంగా మ్యాచ్ పూర్తి ఓవర్లపాటు సాగలేదు. పాండిచ్చేరి బౌలర్లలో సాగర్ ఒక వికెట్ పడగొట్టాడు. రాహుల్, హిమతేజ క్రీజులో ఉన్నారు. సత్తా చాటిన సాయితేజ విజయనగరం వేదికగా జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్‘ఎ’ మ్యాచ్లో ఆంధ్ర అరంగేట్ర బౌలర్ కావూరి సాయితేజ సత్తా చాటాడు. శనివారం ప్రారంభమైన పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బరోడా తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 79 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. విష్ణు సోలంకి (183 బంతుల్లో 99 బ్యాటింగ్; 12 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీకి అడుగు దూరంలో నిలిచాడు. కెప్టెన్ అతీత్ సేథ్ (122 బంతుల్లో 65 బ్యాటింగ్; 5 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ శతకంతో రాణించాడు. శివాలిక్ శర్మ (3), శాశ్వత్ రావత్ (8), సుకీర్త్ పాండే (15), నినాద్ రాథ్వా (0), మితేశ్ పటేల్ (0) విఫలమయ్యారు. జ్యోస్నిల్ సింగ్ (32) ఫర్వాలేదనిపించాడు. ఆంధ్ర బౌలర్లలో సాయితేజ 28 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో అతడికిదే తొలి మ్యాచ్ కాగా... ఈ కుడి చేతివాటం మీడియం పేసర్ తన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. త్రిపురాన విజయ్ 2 వికెట్లు తీశాడు. -
భారత్ సెమీస్ ప్రత్యర్థి ఆస్ట్రేలియా
ఇండోర్: మహిళల వన్డే వరల్డ్ కప్ రెండో సెమీ ఫైనల్లో భారత జట్టు డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాతో తలపడనుంది. ఆడిన 7 మ్యాచ్లలో 6 విజయాలతో (1 రద్దు) పాయింట్ల పట్టికలో ఆసీస్ అగ్రస్థానాన్ని అందుకుంది. నేడు బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా భారత్కు నాలుగో స్థానం ఖాయమైంది. భారత్, ఆ్రస్టేలియా సెమీస్ 30న ముంబైలో జరగనుండగా, గువాహటిలో 29న జరిగే తొలి సెమీస్లో దక్షిణాఫ్రికాతో ఇంగ్లండ్ తలపడనుంది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఆ్రస్టేలియా 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 24 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. లారా వోల్వర్ట్ (30), సినాలో జాఫ్తా (29) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలానా కింగ్ (7/18) తన లెగ్ స్పిన్తో 7 వికెట్లు పడగొట్టి సత్తా చాటింది. మహిళల వన్డేల్లో ఇది నాలుగో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కావడం విశేషం. అనంతరం ఆ్రస్టేలియా 16.5 ఓవర్లలో 3 వికెట్లకు 98 పరుగులు చేసి విజయాన్నందుకుంది. బెత్ మూనీ (42), జార్జియా వోల్ (38 నాటౌట్) కలిసి జట్టును గెలిపించారు. -
భారత్ x బంగ్లాదేశ్
ముంబై: మహిళల వన్డే వరల్డ్ కప్లో సెమీ ఫైనల్కు అర్హత సాధించే వరకు భారత జట్టు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. గత మ్యాచ్లో సెమీస్ స్థానం ఖాయమైన తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా తమ చివరి లీగ్ మ్యాచ్కు సిద్ధమైంది. ఆదివారం జరిగే ఈ పోరులో తమకంటే బలహీనమైన బంగ్లాదేశ్తో హర్మన్ సేన తలపడుతుంది. ఈ మ్యాచ్ ఫలితం లీగ్ దశలో భారత్ స్థానంపై ప్రభావం చూపే అవకాశం లేదు. గెలిచినా 8 పాయింట్లతో నాలుగో స్థానంతోనే ముగుస్తుంది. అయితే ఓడితే మాత్రం సెమీస్కు ముందు టీమ్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆసీస్తో అసలు పోరుకు ముందు తమ జట్టులోని లోపాలు సవరించుకొని అన్ని విధాలా సిద్ధమయ్యేందుకు భారత్కు ఈ మ్యాచ్ అవకాశం కల్పిస్తోంది. మరో వైపు బంగ్లాదేశ్ సంచలనాన్ని ఆశిస్తోంది. టోరీ్నలో ఒకే ఒక విజయం (పాక్పై) సాధించిన బంగ్లా ఇతర మ్యాచ్లలో ప్రత్యర్థులకు గట్టి పోటీనిచి్చంది. ప్రధానంగా తమ బలమైన స్పిన్పైనే ఆ జట్టు ఆధారపడుతోంది. -
రోహిత్ – కోహ్లి సూపర్హిట్
‘సినిమా ఇంకా మిగిలే ఉంది’... ఆ్రస్టేలియాతో చివరి వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆట చూస్తే అభిమానులందరికీ ఇదే అనిపిస్తుంది. సిరీస్ ఆరంభానికి ముందు వారి బ్యాటింగ్పై సందేహాలు, జట్టులో చోటుపై చర్చ... తొలి మ్యాచ్లో వైఫల్యం తర్వాత రోహిత్పై ఒత్తిడి పెరగగా, వరుసగా రెండు డకౌట్లు కోహ్లి సత్తాపై సందేహాలు రేకెత్తించాయి. కానీ వన్డే క్రికెట్ దిగ్గజాలుగా తమ అసలు స్థాయి ఏమిటో వారు ఇప్పుడు చూపించారు.మరికొంత కాలం తమ స్థానం గురించి ఎవరూ మాట్లాడకుండా చేశారు... అలవోకగా పరుగులు సాధించి తమ బ్యాటింగ్లో పదును తగ్గలేదని నిరూపించారు. ఆస్ట్రేలియా గడ్డపై చివరి సారిగా ఆడిన రోహిత్, కోహ్లి సిడ్నీ మైదానంలోని 40,587 మంది ప్రేక్షకులను చక్కటి షాట్లతో అలరించారు. రోహిత్ శతకంతో చెలరేగగా, కోహ్లి దీటైన ఇన్నింగ్స్ ఆడాడు. వన్డేల్లో రికార్డు స్థాయిలో 5483 పరుగులు జోడించిన ఈ జంట తమ జుగల్బందీతో మరో మ్యాచ్ను గెలిపించి ఫ్యాన్స్కు జోష్ను అందించింది. సిడ్నీ: ఆ్రస్టేలియాతో వన్డే సిరీస్ను భారత్ విజయంతో ముగించింది. ఇప్పటికే సిరీస్ కోల్పోయినా... చివరి మ్యాచ్ టీమిండియాకు ఆనందాన్ని పంచింది. శనివారం జరిగిన మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 పరుగులకే ఆలౌటైంది. మాట్ రెన్షా (58 బంతుల్లో 56; 2 ఫోర్లు) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 38.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 237 పరుగులు సాధించింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (124 బంతుల్లో 121 నాటౌట్; 13 ఫోర్లు, 3 సిక్స్లు) కెరీర్లో 33వ సెంచరీ సాధించగా, విరాట్ కోహ్లి (81 బంతుల్లో 74; 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు రెండో వికెట్కు 170 బంతుల్లో అభేద్యంగా 168 పరుగులు జోడించడంతో మరో 11.3 ఓవర్లు ఉండగానే భారత్ విజయం ఖాయమైంది. తొలి రెండు వన్డేలు నెగ్గిన ఆసీస్ 2–1తో సిరీస్ సొంతం చేసుకోగా, మొత్తంగా 202 పరుగులు చేసిన రోహిత్కే ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య బుధవారం నుంచి ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ మొదలవుతుంది. హర్షిత్ రాణాకు 4 వికెట్లు... ఆ్రస్టేలియా ఇన్నింగ్స్లో టాప్–6 బ్యాటర్లు మెరుగ్గా ఆరంభించినా, ఒక్కరూ కూడా దానిని భారీ స్కోరుగా మలచలేకపోయారు. ఓపెనర్లు మిచెల్ మార్ష్(50 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్), ట్రవిస్ హెడ్ (25 బంతుల్లో 29; 6 ఫోర్లు) తొలి వికెట్కు 56 బంతుల్లోనే 61 పరుగులు జోడించారు. ఆ తర్వాత మాథ్యూ షార్ట్ (41 బంతుల్లో 30; 2 ఫోర్లు), రెన్షా కూడా ఫర్వాలేదనిపించడంతో ఒక దశలో స్కోరు 183/3 వద్ద నిలిచింది. అయితే శ్రేయస్ అద్భుత క్యాచ్తో అలెక్స్ క్యారీ (24)ని అవుట్ చేయడంతో ఆసీస్ పతనం మొదలైంది. గత మ్యాచ్ గెలిపించిన కూపర్ కలోనీ (23)తో పాటు ఇతర బ్యాటర్లెవరూ క్రీజ్లో నిలబడలేకపోయారు. ఫలితంగా 53 పరుగుల వ్యవధిలో ఆసీస్ 7 వికెట్లు కోల్పోయింది. మరో 3.2 ఓవర్లు మిగిలి ఉండగానే జట్టు ఆలౌట్ అయింది. క్యారీ క్యాచ్ పట్టే క్రమంలో శ్రేయస్ పక్కటెముకలకు తీవ్ర గాయమైంది. దీంతో అతడు కనీసం మూడు వారాల పాటు ఆటకు దూరం అయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. నితీశ్ రెడ్డి, అర్ష్ దీప్ స్థానాల్లో కుల్దీప్, ప్రసిధ్ కృష్ణలకు చోటు కల్పించింది. భారీ భాగస్వామ్యం... ఛేదనలో భారత్కు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. రోహిత్, శుబ్మన్ గిల్ (24) చకచకా 62 బంతుల్లోనే 69 పరుగులు జత చేశారు. గిల్ వెనుదిరిగిన తర్వాత ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య కోహ్లి బరిలోకి దిగాడు. తన తొలి బంతికే సింగిల్ తీయడంతో స్టేడియం హోరెత్తిపోగా, కోహ్లి కూడా నవ్వుతూ వారికి అభివాదం చేయడం విశేషం! రోహిత్, కోహ్లి జోడి ఎదురు లేకుండా దూసుకుపోయింది. రోహిత్ దూకుడు ప్రదర్శించగా, కోహ్లి తనదైన శైలిలో చూడచక్కటి షాట్లు ఆడాడు. జంపా బౌలింగ్లో లాంగాఫ్ మీదుగా రోహిత్ కొట్టిన ‘ఇన్సైడ్ అవుట్’ సిక్స్ హైలైట్గా నిలిచింది. ముందుగా 63 బంతుల్లో రోహిత్, ఆ తర్వాత 56 బంతుల్లో కోహ్లి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆసీస్ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా వికెట్ తీయడంలో విఫలమయ్యారు. జంపా బౌలింగ్లో సింగిల్తో సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ ఎలాంటి సంబరాలు చేసుకోకపోగా, భారత్ స్కోరు 200 పరుగులకు చేరింది. ఆ తర్వాత మరో 33 బంతుల్లో జట్టు మ్యాచ్ను ముగించింది. 14,255 వన్డేల్లో కోహ్లి పరుగుల సంఖ్య. సంగక్కర (14,234)ను అధిగమించిన అతను సచిన్ (18,426) తర్వాత రెండో స్థానానికి చేరుకున్నాడు.9 ఆస్ట్రేలియాపై రోహిత్ సెంచరీల సంఖ్య. సచిన్ (9)తో అతను సమంగా నిలిచాడు.50 అన్ని ఫార్మాట్లు కలిపి రోహిత్ సెంచరీల సంఖ్య. మరో 9 మంది బ్యాటర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు.స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: మార్ష్(బి) అక్షర్ 41; హెడ్ (సి) ప్రసిధ్ (బి) సిరాజ్ 29; షార్ట్ (సి) కోహ్లి (బి) సుందర్ 30; రెన్షా (ఎల్బీ) (బి) సుందర్ 56; క్యారీ (సి) అయ్యర్ (బి) రాణా 24; కనోలీ (సి) కోహ్లి (బి) రాణా 23; ఒవెన్ (సి) రోహిత్ (బి) రాణా 1; స్టార్క్ (బి) కుల్దీప్ 2; ఎలిస్ (సి) రోహిత్ (బి) ప్రసిధ్ 16; జంపా (నాటౌట్) 2; హాజల్వుడ్ (బి) రాణా 0; ఎక్స్ట్రాలు 12; మొత్తం (46.4 ఓవర్లలో ఆలౌట్) 236. వికెట్ల పతనం: 1–61, 2–88, 3–124, 4–183, 5–195, 6–198, 7–201, 8–223, 9–236, 10–236. బౌలింగ్: సిరాజ్ 5–1–24–1, రాణా 8.4–0–39–4, ప్రసిధ్ 7–0–52–1, కుల్దీప్ 10–0–50–1, అక్షర్ 6–0–18–1, సుందర్ 10–0–44–2. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (నాటౌట్) 121, గిల్ (సి) క్యారీ (బి) హాజల్వుడ్ 24; కోహ్లి (నాటౌట్) 74; ఎక్స్ట్రాలు 18; మొత్తం (38.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 237. వికెట్ల పతనం: 1–69. బౌలింగ్: స్టార్క్ 5–0–31–0, హాజల్వుడ్ 6–1–23–1, ఎలిస్ 7.3–0–60–0, కనోలీ 5–0–36–0, జంపా 10–0–50–0, ఒవెన్ 1–0–2–0, షార్ట్ 4–0–29–0. -
రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG) వేదికగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ శతక్కొట్టాడు. 237 పరుగుల లక్ష్య చేధనలో ఆసీస్ బౌలర్లను హిట్మ్యాన్ ఉతికారేశాడు. మరో సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లితో కలిసి భారత జట్టును వైట్ వాష్ నుంచి గట్టెక్కించాడు.రోహిత్ ఓవరాల్గా 125 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 3 సిక్స్లతో 121 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు కోహ్లి (74నాటౌట్; 81 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఫలితంగా టీమిండియా లక్ష్యాన్ని 38.3 ఓవర్లలోనే ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది. ఇక ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్, సిరీస్గా నిలిచిన రోహిత్ పలు వరల్డ్ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.రోహిత్ శర్మ సాధించిన రికార్డులు ఇవే..👉సేనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో వన్డేల్లో అత్యధిక సిక్స్లు బాదిన విదేశీ ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. రోహిత్ ఇప్పటివరకు సేనా దేశాల్లో 95 సిక్స్లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు విండీస్ దిగ్గజం క్రిస్ గేల్(92) పేరిట ఉండేది. ఈ మ్యాచ్లో 3 సిక్స్లు బాదిన రోహిత్.. గేల్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.👉21వ శతాబ్దంలో ఆస్ట్రేలియాపై వన్డే సెంచరీ చేసిన అతి పెద్ద వయష్కుడిగా రోహిత్ నిలిచాడు.38 ఏళ్ల 178 రోజులు వయస్సులో ఈ ఫీట్ సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కర(37 సంవత్సరాలు, 132 రోజులు) పేరిట ఉండేది.👉వన్డే చరిత్రలో లేటు వయసులో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న భారత ఆటగాడిగా రోహిత్ నిలిచాడు👉ఆస్ట్రేలియాలో అత్యధిక వన్డే సెంచరీలు (6) చేసిన విదేశీ బ్యాటర్గా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి (5), కుమార సంగక్కర (5)లను హిట్మ్యాన్ అధిగమించాడు. 👉ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న తొలి భారత బ్యాటర్గా రోహిత్ రికార్డులకెక్కాడు.చదవండి: థాంక్యూ ఆస్ట్రేలియా.. ఇదే మా చివరి మ్యాచ్!? రోహిత్, కోహ్లి ఎమోషనల్ -
థాంక్యూ ఆస్ట్రేలియా.. ఇదే మా చివరి మ్యాచ్!? రోహిత్, కోహ్లి ఎమోషనల్
ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు తమ చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేశారు. ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రో-కో ద్వయం.. ప్రస్తుతం కేవలం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు.ఈ సీనియర్ క్రికెటర్లు మరో రెండేళ్ల పాటు జట్టులో కొనసాగే అవకాశమున్నప్పటికి టీమిండియా మాత్రం ఇప్పటిలో వైట్ బాల్ సిరీస్లు ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లదు. మళ్లీ భారత జట్టు 2028లో ఆసీస్ టూర్కు వెళ్లే అవకాశముంది.అప్పటికి కోహ్లి-రోహిత్ల వయస్సు 40 ఏళ్లు దాటుతుందున్నందన భారత జట్టులో కొనసాగే ఛాన్స్ లేదు. దీంతో శనివారం సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేనే కోహ్లి-రోహిత్కు ఆసీస్ గడ్డపై ఆఖరి మ్యాచ్ అయింది. ఈ మ్యాచ్లో వీరిద్దరూ ఆసాధరణ ప్రదర్శన కనబరిచారు.రోహిత్ శర్మ(121) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. కోహ్లి 74 పరుగులతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు 168 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. వన్డే క్రికెట్లో ఈ సీనియర్ జోడీకి 12వ 150 ప్లస్ భాగస్వామ్యం కావడం విశేషం. ఇక మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియాలో జ్ఞాపకాలను రో-కో గుర్తు చేసుకున్నారు."నేను ఆస్ట్రేలియాలో ఆడేందుకు ఎక్కువగా ఇష్టపడతాను. 2008 నుంచి ఇక్కడ ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో పర్యటించేందుకు మాకు మరొక అవకాశం లభిస్తుందో లేదో నాకు తెలియదు. కానీ ఇక్కడ ఆడిన ప్రతీ క్షణాన్ని అస్వాధించాము. ఇక్కడ మాకు సపోర్ట్గా నిలిచిన ప్రతీఒక్కరికి ధన్యవాదాలు": రోహిత్"ఆస్ట్రేలియాలో ఆడేందుకు మేము ఎంతో ఇష్టపడతాము. ఈ గడ్డపై మా నుంచి ఎన్నో అత్యుత్తమ ప్రదర్శనలు వచ్చాయి. ఇక్కడ అభిమానులు మద్దతు నిజంగా ఒక అద్భుతం. అందరికీ చాలా థాంక్స్: విరాట్ కోహ్లిచదవండి: IND vs AUS: తీవ్ర గాయం! అస్పత్రిలో శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ ప్రకటన -
ఆస్ట్రేలియా క్రికెటర్ వరల్డ్ రికార్డు.. ఒకే మ్యాచ్లో 7 వికెట్లు
మహిళల ప్రపంచకప్-2025లో సంచలనం నమోదైంది. ఇండోర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ అలానా కింగ్ 7 వికెట్లతో చెలరేగింది. ఆమె స్పిన్ ఉచ్చులో చిక్కుకుని ప్రోటీస్ బ్యాటర్లు విల్లవిల్లాడారు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా అమ్మాయిల జట్టు.. కింగ్ బౌలింగ్ ధాటికి 16.5 ఓవర్లలో కేవలం 97 పరుగులకే కుప్పకూలింది. మొత్తంగా 7 ఓవర్లు బౌలింగ్ చేసిన కింగ్ కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఏడు వికెట్లను తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో కింగ్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.కింగ్ ప్రపంచ రికార్డు..👉మహిళల ప్రపంచ కప్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన ప్లేయర్గా కింగ్ చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఈ రికార్డు జాకీ లార్డ్ పేరిట ఉండేది. 1982 ప్రపంచకప్లో లార్డ్ భారత్పై 10 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టింది. తాజా మ్యాచ్తో 33 ఏళ్ల ఆల్టైమ్ రికార్డును కింగ్ బ్రేక్ చేసింది.మహిళల వరల్డ్ కప్లో అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్స్7/18 – అలానా కింగ్ (Alana King) vs సౌతాఫ్రికా, 20256/10 – జాకీ లార్డ్ (Jackie Lord) vs ఇండియా, 19826/20 – గ్లెనిస్ పేజ్ (Glenys Page) vs ట్రినిడాడ్ & టొబాగో, 19736/36 – సోఫీ ఎక్ల్స్టోన్ (Sophie Ecclestone) vs సౌతాఫ్రికా, 20226/46 – అన్యా ష్రబ్సోల్ (Anya Shrubsole) vs ఇండియా, 2017👉అదేవిధంగా మహిళల వన్డే క్రికెట్లో అత్యంతవేగంగా ఫైవ్ వికెట్ హాల్(బంతుల పరంగా) సాధించిన బౌలర్గా కింగ్ నిలిచింది. కింగ్ కేవలం 21 బంతుల్లోనే ఈ ఫీట్ను అందుకుంది. ఇక ఈ మ్యాచ్లో సౌతాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. 98 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ అమ్మాయిల జట్టు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.చదవండి: #ViratKohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్ -
తీవ్ర గాయం! ఆస్పత్రిలో శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ ప్రకటన
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ గాయపడిన సంగతి తెలిసిందే. ఆసీస్ బ్యాటర్ అలెక్స్ క్యారీ క్యాచ్ను అందుకునే క్రమంలో బంతి అయ్యర్ ఎడమ పక్కటెముకలకు బలంగా తాకింది. దీంతో అడడు తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి ఏ మాత్రం నొప్పి తగ్గలేదు.దీంతో అతడు మైదానాన్ని వీడి వెళ్లాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 34వ ఓవర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత అయ్యర్ తిరిగి ఫీల్డ్లోకి రాలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టార్గెట్ను పూర్తి చేయడంతో శ్రేయస్కు బ్యాటింగ్కు ఛాన్స్ రాలేదు. ఒకవేళ అతడి వరకు బ్యాటింగ్కు వచ్చినా కూడా డ్రెస్సింగ్ రూమ్ పరిమితమయ్యేవాడు. తాజాగా శ్రేయస్ గాయంపై బీసీసీఐ అప్డేట్ ఇచ్చింది.అయ్యర్ గాయంపై బీసీసీఐ అప్డేట్"ఫీల్డింగ్ చేస్తుండగా శ్రేయస్ అయ్యర్ ఎడమ పక్కటెముకకు గాయమైంది. అతడి గాయం తీవ్రత తెలుసుకోనేందుకు ఆస్ప్రత్రికి తరలించారు" అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా అయ్యర్ గాయం తీవ్రమైనది కాకుడదని అభిమానులు కోరుకుంటున్నారు.అతడు భారత వన్డే జట్టులో కీలక సభ్యునిగా ఉన్నాడు. ఇటీవలే వైస్ కెప్టెన్గా కూడా ప్రమోట్ అయ్యాడు. ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. భారత మిడిలార్డర్లో అయ్యర్ ముఖ్యమైన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అడిలైడ్ వన్డేలో కూడా శ్రేయాస్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. అయితే దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ సమయానికి అయ్యర్ పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశముంది. వచ్చే నెల ఆఖరిలో భారత్-సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది. ఇక ఆఖరి వన్డే విషయానికి వస్తే.. ఆసీస్పై 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 237 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 38.3 ఓవర్లలో చేధించింది. భారత సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ(125 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్లతో 121 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(81 బంతుల్లో 7 ఫోర్లతో 74 నాటౌట్) ఆర్ధ శతకంతో సత్తాచాటాడు.చదవండి: #ViratKohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్ -
రోహిత్ ఉంటే చాలు చెలరేగిపోతా.. ఛేజింగ్ అంటే నాకు ఇష్టం: కోహ్లి
సింహం ఒక అడుగు వెనక్కి వేస్తే పదడుగులు ముందుకు వేస్తుంది.. ఈ డైలాగ్ సరిగ్గా టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సరిపోతుంది. దాదాపు ఏడు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన కోహ్లి.. ఆసీస్తో జరిగిన తొలి మ్యాచ్లోనే డకౌటై తీవ్ర నిరాశపరిచాడు.అ తర్వాత రెండో మ్యాచ్లో కూడా మళ్లీ డకౌట్. దీంతో కోహ్లిపై సర్వాత్ర విమర్శల కురిసింది. కోహ్లి రిటైర్ అయపోతాడని, ఇక లండన్కు బ్యాగ్ సర్ధుకోవాల్సిందే అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. కానీ కోహ్లి అభిమానులు మాత్రం తమ ఆరాధ్య క్రికెటర్గా బలంగా తిరిగొస్తాడని నమ్మారు.వారి నమ్మకాన్ని కోహ్లి నిలబెట్టాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో విరాట్ విశ్వరూపం చూపించాడు. 237 పరుగుల లక్ష్య చేధనలో కోహ్లి హాఫ్ సెంచరీతో మెరిశాడు. 81 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 7 ఫోర్ల సాయంతో 74 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. తన అద్బుత ఇన్నింగ్స్తో సచిన్, సంగక్కరల వరల్డ్ రికార్డులను కింగ్ బ్రేక్ చేశాడు. వన్డే వరల్డ్కప్-2027కు తను సిద్దమనేని ఈ నాక్తో కోహ్లి చాటి చెప్పాడు. ఇక తన ఇన్నింగ్స్పై మ్యాచ్ అనంతరం కోహ్లి స్పందించాడు."అదృష్టవశాత్తూ డకౌట్ల నుంచి బయటపడగలిగాను. అంతర్జాతీయ క్రికెట్లో చాలా కాలం ఆడినా.. ప్రతీ మ్యాచ్ కూడా మనకు కఠిన సవాల్ను విసరుతోంది. కొన్నిసార్లు పూర్తిగా పరుగులు ఎలా సాధించాలో తెలియకపోయినట్లు అన్పిస్తోంది. ఈ జేంటల్మేన్ గేమ్ మనల్ని పరీక్షిస్తోంది. నా కెరీర్లో ఇటువంటి పరిస్థితులు చాలాసార్లు ఎదురయ్యాయి. ఈ కఠిన పరిస్థితులలే నాలోని ప్రతిభను వెలికితీశాయి. రోహిత్తో కలిసి బ్యాటింగ్ చేయడమంటే నాకు చాలా ఇష్టం. రోహిత్ శర్మ క్రీజులో ఉంటే స్ట్రైక్స్ రొటేట్ చేయడం సులభమవుతుంది. అతడితో భాగస్వామ్యాన్ని అస్వాదించాను. ఛేజింగ్ ఎల్లప్పుడూ నాలోని అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తెస్తుంది. ఇద్దరం ఆజేయంగా నిలిచి మ్యాచ్ ఫినిష్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుత జట్టులో అత్యంత అనుభవజ్ఞులైన జోడీగా మేము ఉన్నాయి. ఇంతకుముందు కూడా చాలా మ్యాచ్లలో భారీ భాగస్వామ్యాలను నెలకొల్పాము.2013లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే హోమ్ సిరీస్ నుంచి మా ఇద్దరి పార్టనర్ షిప్ మొదలైంది. ఆ మ్యాచ్లో దాదాపు 20 ఓవర్ల పాటు కలిసి బ్యాటింగ్ చేశాము. ఆస్ట్రేలియాలో మాకు లభించిన ఆదరణకు మేము రుణపడి ఉంటాము" అని కోహ్లి పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్లో కోహ్లి-రోహిత్ ఇద్దరూ 168 పరుగుల ఆజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.చదవండి: #ViratKohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్ -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్
ఆస్ట్రేలియాతో వరుసగా రెండు మ్యాచ్లలో డకౌటైన టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి.. సిడ్నీ వన్డేలో అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చాడు. ఆదివారం జరిగిన మూడో వన్డేలో కోహ్లి మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. 237 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో విరాట్ ఆజేయ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ అభిమానులను కోహ్లి అలరించాడు. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి భారత్ను విజయతీరాలకు చేర్చాడు. 81 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 7 ఫోర్ల సాయంతో 74 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతడితో పాటు రోహిత్ శర్మ ((125 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్లతో 121) శతక్కొట్టాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ల ఫలితంగా లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 38.3 ఓవర్లలోనే చేధించింది. కాగా ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో మెరిసిన కోహ్లి పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్..👉అంతర్జాతీయ పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి చరిత్ర సృష్టించాడు. కోహ్లి ఇప్పటివరకు వన్డే, టీ20లు కలిపి 18437 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ రెండు వైట్ బాల్ ఫార్మాట్లు కలిపి 18436 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో సచిన్ ఆల్టైమ్ రికార్డును కింగ్ బ్రేక్ చేశాడు. అయితే సచిన్ తన కెరీర్లో భారత్ తరపున కేవలం ఒక్క టీ20 మ్యాచ్ మాత్రమే ఆడాడు.👉అదేవిధంగా అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఛేజింగ్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్గా సచిన్ రికార్డును కోహ్లి సమం చేశాడు. సచిన్ తన కెరీర్లో వన్డే రన్ చేజ్లో 70 హాఫ్ సెంచరీలు చేయగా.. కోహ్లి కూడా సరిగ్గా 70 ఆర్ధ శతకాలు సాధించాడు. మరో హాఫ్ సెంచరీ చేస్తే సచిన్ను విరాట్ అధిగమిస్తాడు.👉వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్గా కుమర సంగక్కర రికార్డును విరాట్ బ్రేక్ చేశాడు. సంగక్కర 380 ఇన్నింగ్స్లలో14234 పరుగులు చేయగా.. కోహ్లి కోహ్లి ఇప్పటివరకు 293* ఇన్నింగ్స్లో 14255 రన్స్ సాధించాడు. ఈ జాబితాలో సచిన్(18426 పరుగులు) అగ్రస్దానంలో కొనసాగుతున్నాడు.చదవండి: సంగక్కర రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. సచిన్ తర్వాత స్థానం ‘కింగ్’దే! -
శతక్కొట్టిన రోహిత్... కోహ్లి హాఫ్ సెంచరీ.. ఆసీస్ను చిత్తు చేసిన భారత్
ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో టీమిండియా (India Beat Australia) ఘన విజయం సాధించింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆతిథ్య జట్టును ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో మట్టికరిపించింది. భారత దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli) అద్భుత ప్రదర్శనలతో రాణించి జట్టుకు విజయం అందించారు. రోహిత్ సెంచరీతో చెలరేగగా.. కోహ్లి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పెర్త్, అడిలైడ్ వన్డేల్లో ఓడిన టీమిండియా.. సిడ్నీ వేదికగా శనివారం మూడో వన్డే ఆడింది. ఇందులో టాస్ గెలిచిన ఆసీస్ సారథి మిచెల్ మార్ష్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 236 పరుగులకు ఆసీస్ ఆలౌట్ ఈ క్రమంలో భారత బౌలర్ల ధాటికి ఆసీస్ 46.4 ఓవర్లలో 236 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (41), ట్రావిస్ హెడ్ (25 బంతుల్లో 29) ఫర్వాలేదనిపించగా.. మాథ్యూ షార్ట్ (30), అలెక్స్ క్యారీ (24), కూపర్ కన్నోలి (23) ఓ మోస్తరుగా బ్యాటింగ్ చేశారు.తొలి ఫోర్ వికెట్ హాల్అయితే, నాలుగో నంబర్ బ్యాటర్ మ్యాట్ రెన్షా తన కెరీర్లో తొలి వన్డే హాఫ్ సెంచరీ (56)తో సత్తా చాటాడు. తద్వారా ఆసీస్ ఇన్నింగ్స్లో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఇక భారత బౌలర్లలో పేసర్ హర్షిత్ రాణా నాలుగు వికెట్లు పడగొట్టి.. తన కెరీర్లో తొలి ఫోర్ వికెట్ హాల్ నమోదు చేశాడు.CLUTCH! ⭐⭐⭐⭐#HarshitRana bags his maiden 4-wicket haul in international cricket as #TeamIndia bowl out Australia in Sydney 👏#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuANAu pic.twitter.com/JXFhwCDgzX— Star Sports (@StarSportsIndia) October 25, 2025మిగిలిన వారిలో పేసర్లు మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ చెరో వికెట్ తీయగా.. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.రోహిత్, విరాట్ ధనాధన్ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నెమ్మదిగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్ (26 బంతుల్లో 24) త్వరగానే పెవిలియన్ చేరాడు. ఆసీస్ పేసర్ జోష్ హాజిల్వుడ్ బౌలింగ్లో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.ఈ క్రమంలో మరో ఓపెనర్ రోహిత్ శర్మ.. వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లితో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రోహిత్ 105 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 125 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 121 పరుగులతో అజేయంగా నిలిచాడు.Hitman has RO-ared with all class in Sydney! 💯👉 His 33rd ODI century, 50th across formats👉 9 - Joint-most 100s in ODIs against AUS👉 6- Most 100s by a visiting batter in ODIs in AUS#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuANAu pic.twitter.com/r5AtoC6u1i— Star Sports (@StarSportsIndia) October 25, 2025 కాగా రోహిత్ వన్డే కెరీర్లో ఇది 33వ శతకం కావడం విశేషం. మరోవైపు.. పెర్త్, అడిలైడ్ వన్డేల్లో డకౌట్ అయిన కోహ్లి.. ఈసారి మాత్రం తనదైన ముద్ర వేయడంలో సఫలం అయ్యాడు. వన్డే కెరీర్లో 75వ హాఫ్ సెంచరీ నమోదు చేసిన కోహ్లి.. మొత్తంగా 81 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో 74 పరుగులు సాధించాడు. ఫోర్ బాది రోహిత్తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.Hence proved: 𝘚𝘢𝘣𝘳 𝘬𝘢 𝘱𝘩𝘢𝘭 𝘩𝘶𝘮𝘦𝘴𝘩𝘢 𝘮𝘦𝘦𝘵𝘩𝘢 𝘩𝘰𝘵𝘢 𝘩𝘢𝘪! 🙌👉 Virat Kohli's 75th ODI fifty👉 His 70th 50+ score in ODI run chases - most by any batter👉 Completes 2500 runs against AUS in ODIs#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉… pic.twitter.com/Mw6oU1cNzk— Star Sports (@StarSportsIndia) October 25, 2025ఇక ఈ మ్యాచ్లో సత్తా చాటిన రోహిత్ శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా గెలుచుకున్నాడు. పెర్త్లో ఎనిమిది పరుగులే చేసిన రోహిత్.. అడిలైడ్లో మాత్రం 73 పరుగులతో ఆకట్టుకున్నాడు. తాజాగా సెంచరీతో చెలరేగి మరోసారి తన విలువను చాటుకున్నాడు. ఏదేమైనా సిడ్నీ వన్డేతో తాము వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి సిద్ధంగా ఉన్నామని రో- కో చెప్పారంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు.చదవండి: సంగక్కర రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. సచిన్ తర్వాత స్థానం ‘కింగ్’దే! INDIA WINNNNNN! 🇮🇳The crowd came to witness something special in Sydney and Ro-Ko didn’t disappoint! 🫂If this was their last match in Australia, what a way to leave a legacy behind! 💙 pic.twitter.com/3MR2KxQBxh— Star Sports (@StarSportsIndia) October 25, 2025 -
అత్యధిక పరుగుల వీరుడు.. సచిన్ తర్వాత స్థానం కోహ్లిదే!
అంతర్జాతీయ వన్డే ఫార్మాట్లో విరాట్ కోహ్లి (Virat Kohli) తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు. సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) తర్వాత యాభై ఓవర్ల క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్గా చరిత్రకెక్కాడు. ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా.. కుమార్ సంగక్కరను అధిగమించి కోహ్లి ఈ ఘనత సాధించాడు. అంతేకాదు అతి తక్కువ ఇన్నింగ్స్లోనే పద్నాలుగు వేల పరుగుల మైలురాయిని అధిగమించిన ఆటగాడిగానూ కోహ్లి నిలిచాడు.వరుసగా డకౌట్లుదాదాపు ఏడు నెలల విరామం తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ సందర్భంగా కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేశాడు. పెర్త్లో జరిగిన తొలి వన్డేలో డకౌట్ అయిన ఈ దిగ్గజ బ్యాటర్.. అడిలైడ్ వన్డేలోనూ ఇదే పునరావృతం చేశాడు. ఈ క్రమంలో భారీ అంచనాలు, ఒత్తిడి నడుమ సిడ్నీ వన్డే బరిలో దిగిన కోహ్లి వింటేజ్ కింగ్ను గుర్తు చేశాడు. నెమ్మదిగానే ఇన్నింగ్స్ ఆరంభించినా ఆ తర్వాత జోరు పెంచరీ అర్ధ శతకం సాధించాడు. వన్డే కెరీర్లో 75 హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మొత్తంగా 81 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో కోహ్లి 74 పరుగులతో అజేయంగా నిలిచాడు. తొమ్మిది వికెట్ల తేడాతో భారత్ గెలుపుశతకధీరుడు ఓపెనర్ రోహిత్ శర్మ (121 నాటౌట్)తో కలిసి 168 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. సిడ్నీ వన్డేలో తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచిన భారత్.. ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించి క్లీన్స్వీప్ గండం నుంచి తప్పించుకుంది.అంతర్జాతీయ వన్డే ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లు🏏సచిన్ టెండుల్కర్ (ఇండియా)- 452 ఇన్నింగ్స్లో 18426 పరుగులు🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 293* ఇన్నింగ్స్లో 14235 పరుగులు🏏కుమార్ సంగక్కర (శ్రీలంక)- 380 ఇన్నింగ్స్లో 14234 పరుగులు🏏రిక్కీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 365 ఇన్నింగ్స్లో 13704 పరుగులు🏏సనత్ జయసూర్య (శ్రీలంక)- 433 ఇన్నింగ్స్లో 13430 పరుగులుHence proved: 𝘚𝘢𝘣𝘳 𝘬𝘢 𝘱𝘩𝘢𝘭 𝘩𝘶𝘮𝘦𝘴𝘩𝘢 𝘮𝘦𝘦𝘵𝘩𝘢 𝘩𝘰𝘵𝘢 𝘩𝘢𝘪! 🙌👉 Virat Kohli's 75th ODI fifty👉 His 70th 50+ score in ODI run chases - most by any batter👉 Completes 2500 runs against AUS in ODIs#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉… pic.twitter.com/Mw6oU1cNzk— Star Sports (@StarSportsIndia) October 25, 2025 -
ఎంఎస్ ధోనీ కుమార్తె జివా ఏం కావాలనుకుంటుందో తెలుసా? వైరల్ వీడియో
డాక్టర్ బిడ్డ డాక్టర్ కావాలని, యాక్టర్ బిడ్డ యాక్టర్, వ్యాపారి బిడ్డ వ్యాపరే అవుతుందని సాధారణంగా భావిస్తుంటాం. తల్లిదండ్రుల వారసత్వాన్ని నిలబెట్టుకుని కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టనవారు కూడా చాలామందే ఉన్నారు. అయితే టీమీండియా స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ అభిమానిగా ఆయన కుమార్తె క్రికెటర్గా రాణించాలనుకుంటున్నారా? మెరుపువేగంతో సెంచరీలు చేస్తూ, క్రికెట్ గ్రౌండ్లో తనదైన వ్యూహాలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాలనుకుంటున్నారా? అయితే మీకో ఇంట్రస్టింగ్ న్యూస్. ధోని ముద్దుల తనయ పెరిగి పెద్దయ్యాక ఏం కావాలనుకుంటోందో తెలుసా?ఎంఎస్ ధోనీ, సాక్షిల ఏకైక కుమార్తె జీవా. ఈ జంటకు 2010లో వివాహం జరగ్గా.. 2015లో జీవా జన్మించింది. భవిష్యత్తులో ఏం చేస్తావు అంటే పిల్లలు సాధారణంగా, డాక్టర్, యాక్టర్, టీచర్, పైలట్ ఇలాంటి సమాధానాలే చెబుతారు. కానీ ప్రకృతిని ప్రేమించి, ప్రకృతి శాస్త్రవేత్తను అవుతాను ధోనీ కుమార్తె చెప్పడం విశేషంగా నిలిచింది.(రూ. 1.75 - 5.27 కోట్లదాకా జీతం : ఆ 600 మందికి సుదర్శన్ కామత్ ఆఫర్)శుక్రవారం నాడు ఉత్తరాఖండ్లోని హరిద్వార్కు చెందిన ఒక రాజకీయ నాయకుడితో జరిగిన సంభాషణలో, తాను పెద్దయ్యాక ప్రకృతి శాస్త్రవేత్త కావాలని కోరుకుంటున్నానని ఎంఎస్ ధోని కుమార్తె జీవా వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. ధోని భార్య సాక్షీ, జీవా కాశీ పర్యటనలో ఉన్నట్టు తెలుస్తోంది. హర్ కి పౌరి ప్రాంతం సమీపంలోని మరొక వీడియోలో, సాక్షి మరియు ఇతరులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య స్థానికులకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నట్లు చూపించారు. వారి సందర్శనల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గంగా సభ కార్యదర్శి తన్మయ్ వశిష్ఠ ఈ వీడియోను అప్లోడ్ చేశారు. 10 ఏళ్ల చిన్నారికి ఇలాంటి కోరిక ఉండటం చాలా ఆనందం అంటూ ప్రశంసించారు.భవిష్యతుల్లో మంచి మనిషిగా రాణిస్తుంది అంటూ దీవించారు నెటిజన్లు.I want to become Naturalist : Ziva Dhoni #MSDhoni pic.twitter.com/r0gqRiLrEu— Chakri (@ChakriDhonii) October 25, 2025 -
సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ..
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తన అంతర్జాతీయ క్రికెట్ పునరాగనమంలో సత్తాచాటుతున్నాడు. మొన్న అడిలైడ్లో తృటిలో సెంచరీ మిస్ చేసుకున్న హిట్మ్యాన్.. ఇప్పుడు సిడ్నీలో మాత్రం ఎటువంటి తప్పిదం చేయలేదు.ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ అద్బుతమైన శతకంతో చెలరేగాడు. కేవలం 105 బంతుల్లోనే 11 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. రోహిత్కు ఇది 33వ వన్డే సెంచరీ కావడం విశేషం. 237 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో ఆసీస్ బౌలర్లకు రోహిత్ చుక్కలు చూపించాడు. తొలుత కెప్టెన్ శుభ్మన్ గిల్తో కలిసి మొదటి వికెట్కు 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రోహిత్.. ఆ తర్వాత మరో సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లితో కలిసి జట్టును విజయం దిశగా నడిపిస్తున్నాడు. రోహిత్ సెంచరీ మార్క్ను అందుకోగానే సిడ్నీ స్టేడియం దద్దరిల్లిపోయింది. మొత్తంగా 125 బంతులు ఎదుర్కొన్న రోహిత్.. 13 ఫోర్లు, 3 సిక్స్లతో 121 పరుగులు చేశాడు. అతడితో పాటు విరాట్ కోహ్లి(74 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. వీరిద్దరి సూపర్ ఇన్నింగ్స్ల ఫలితంగా లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 38.3 ఓవర్లలో చేధించింది.చదవండి: #Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్ -
మొన్న బ్యాటింగ్.. ఇప్పుడు బౌలింగ్! గంభీర్ నమ్మకం నిజమే?
ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా యువ ఆటగాడు హర్షిత్ రాణా ఇరగదీస్తున్నాడు. విమర్శకులకు తన అద్భుత ప్రదర్శనలతోనే సమాధానిమిస్తున్నాడు. సిడ్నీ వేదికగా ఆసీస్తో జరుగుతున్న మూడో వన్డేలో హర్షిత్ సత్తాచాటాడు. 23 ఏళ్ల రాణా తన పేస్ బౌలింగ్తో కంగారులను కంగారెత్తించాడు.అతడి బౌలింగ్ దాటికి ఆసీస్ కేవలం 236 పరుగులకే పరిమితమైంది. మొత్తంగా 8.4 ఓవర్లు బౌలింగ్ చేసిన రాణా.. 39 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అలెక్స్ క్యారీ, కూపర్ కొన్నోలీ వంటి కీలక వికెట్లను ఈ ఢిల్లీ పేసర్ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్లో రాణాకు ఇవే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కావడం గమనార్హం.ఆసీస్ టూర్కు రాణాను ఎంపిక చేయడాన్ని చాలా మంది తప్పుబట్టారు. గంభీర్ సపోర్ట్ వల్లే అతడిని జట్టులోకి తీసుకున్నారని అశ్విన్, కృష్ణమాచారి శ్రీకాంత్ వంటి దిగ్గజ క్రికెటర్లు సైతం విమర్శించారు. అయితే విమర్శకులకు గంభీర్ స్ట్రాంగ్ కౌంటరిచ్చాడు. పూర్తిగా మెరిట్ ఆధారంగానే రాణాను సెలక్ట్ చేశామని, అతడిని టార్గెట్ చేయడం అపండి అంటూ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో గంభీర్ పేర్కొన్నాడు.అయితే గంభీర్ నమ్మకాన్ని రాణా నిలబెట్టుకున్నాడు. తొలి వన్డేలో వికెట్ పడగొట్టనప్పటికి.. రెండో వన్డేలో 24 పరుగులతో పాటు 2 వికెట్లు సాధించాడు. ఇక మూడో వన్డేలో కూడా అర్ష్దీప్ సింగ్ను కాదని మరి హర్షిత్ను టీమ్ మెనెజ్మెంట్ ఆడించింది. మెనెజ్మెంట్ నమ్మకాన్ని రాణా వమ్ము చేయలేదు. నాలుగు వికెట్లు పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించాడు. ఇదే తరహా ప్రదర్శనలు కనబరిస్తే అతడు వన్డే జట్టులో తన స్దానాన్ని మరింత పదిలం చేసుకోవడం ఖాయం.చదవండి: సింగిల్ తీసిన కోహ్లి.. దద్దరిల్లిన స్టేడియం.. వీడియో వైరల్ -
సింగిల్ తీసిన కోహ్లి.. దద్దరిల్లిన స్టేడియం.. వీడియో వైరల్
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆస్ట్రేలియా తాజా పర్యటనలో పరుగుల ఖాతా తెరిచాడు. తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో తన మార్కు చూపిస్తున్నాడు.కాగా కెరీర్ చరమాంకానికి చేరుకున్న కోహ్లికి ఇదే ఆఖరి ఆసీస్ టూర్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పెర్త్, అడిలైడ్లో కోహ్లి ఆట చూసేందుకు వచ్చిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. అయితే, రాజు ఎక్కడైనా రాజే అన్నట్లుగా అడిలైడ్ వన్డేలో ఈ లెజెండరీ బ్యాటర్ డకౌట్ అయినా.. టీమిండియా, ఆసీస్ అభిమానులు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చి కోహ్లి పట్ల ప్రేమను చాటుకున్నారు.తాజాగా శనివారం నాటి మూడో వన్డేలో కోహ్లి బ్యాటింగ్కు వస్తున్నపుడే సిడ్నీ క్రౌడ్... లేచి నిలబడి అతడిని చీర్ చేస్తూ ఎమోషనల్ అయింది. కాగా ఆస్ట్రేలియా విధించిన 237 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఓపెనర్, కెప్టెన్ శుబ్మన్ గిల్ త్వరగానే పెవిలియన్ చేరాడు.మొత్తంగా 26 బంతులు ఎదుర్కొన్న గిల్.. భారత ఇన్నింగ్స్ పదకొండో ఓవర్లో రెండో బంతికి జోష్ హాజిల్వుడ్ బౌలింగ్లో వికెట్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో గిల్ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన కోహ్లి.. రోహిత్ శర్మతో కలిసి సింగిల్ పూర్తి చేసుకున్నాడు.దీంతో సిడ్నీ ప్రేక్షకుల సంబరాలు అంబరాన్నంటాయి. కోహ్లి ఒక్క పరుగు పూర్తి చేసుకోగానే స్టేడియం కేరింతలతో దద్దరిల్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 16 ఓవర్ల ఆట (డ్రింక్స్ బ్రేక్) పూర్తయ్యేసరికి రోహిత్ 49 బంతుల్లో 43, కోహ్లి 21 బంతుల్లో 22 పరుగులతో క్రీజులో ఉన్నారు.So many emotions! ☺️🥹❤️He’s off the mark & the crowd has made its happiness loud and clear! 🙌Will we witness a Chase Master special from #ViratKohli tonight? 🔥#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuANAu pic.twitter.com/SZiBRnnvUY— Star Sports (@StarSportsIndia) October 25, 2025 ఇక మూడు వన్డేల సిరీస్ను ఆతిథ్య ఆసీస్ ఇప్పటికే 2-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నామమాత్రపు మూడో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన మార్ష్ బృందం.. 46.4 ఓవర్లలో 236 పరుగులు చేసి ఆలౌట్ అయింది.భారత యువ పేసర్ హర్షిత్ రాణా నాలుగు వికెట్లతో రాణించగా.. వాషింగ్టన్ సుందర్ రెండు. సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు. కోహ్లి మాథ్యూ షార్ట్ (30), కూపర్ కన్నోలి (23) క్యాచ్లు అందుకుని టీమిండియా కీలక వికెట్లు దక్కించుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. -
ఆసీస్ మహిళా క్రికెటర్లకు వేధింపులు
ఇండోర్: అంతర్జాతీయ మహిళా ప్రపంచకప్లో భాగంగా మ్యాచ్ ఆడేందుకు మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చేరుకున్న ఆ్రస్టేలియా మహిళా జట్టులోని ఇద్దరు సభ్యులతో ఓ దుండగుడు అసభ్యంగా ప్రవర్తించారు. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అనుచితంగా ప్రవర్తించిన ఆ వ్యక్తిని మధ్యప్రదేశ్ పోలీసులు వెంటనే అరెస్ట్చేశారు. తక్షణం స్పందించి చర్యలు తీసుకున్నందుకు పోలీసులకు బీసీసీఐ ధన్యవాదాలు తెలిపింది. అసలేం జరిగింది? మ్యాచ్లు ఆడేందుకు ఆస్ట్రేలియా మహిళా జట్టు ఇండోర్ సిటీకి చేరుకుని అక్కడి ర్యాడిసన్ బ్లూ హోటల్లో బసచేస్తోంది. గురువారం ఉదయం అక్కడి ఖజ్రానా రోడ్లోని ఒక కెఫెకు వెళ్లేందుకు ఇద్దరు ఆ్రస్టేలియా క్రీడాకారిణులు నడుచుకుంటూ వెళ్తుండగా అటుగా వచి్చన అకీల్ ఖాన్ వీరిద్దరినీ తన బైక్ మీద అనుసరించాడు. తర్వాత హఠాత్తుగా దగ్గరకు వచ్చి ఒక క్రీడాకారిణితో అసభ్యంగా ప్రవర్తించి బైక్ మీద పారిపోయాడు. వెంటనే ఈ ఘటనను క్రీడాకారులు తమ టీమ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన డ్యానీ సిమన్స్కు ఫిర్యాదుచేశారు. ఘటన జరిగిన చోటు లైవ్ లొకేషన్ను షేర్చేశారు. ఈ ఘటనను స్థానిక సెక్యూరిటీ అధికారికి సైతం చెప్పారు. అతిథి దేవోభవ అని నినదించే భారత్లో అంతర్జాతీయ క్రీడాకారులకు జరిగిన అవమానం విషయం తెల్సి పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ హిమీనా మిశ్రా వెంటనే రంగంలోకి దిగారు. ఆ ఇద్దరు క్రీడాకారిణులతో స్వయంగా మాట్లాడి ఘటన జరిగిన తీరును అడిగి తెల్సుకున్నారు. వారి వాంగ్మూలాలను నమోదుచేశారు. భారత న్యాయసంహితలోని సెక్షన్ 74(మహిళ గౌరవాన్ని భంగపరచడం), 78( వెంటబడి వేధించడం) సెక్షన్లకింద ఎంఐజీ పోలీస్స్టేషన్లో కేసు నమోదుచేశారు. ఉన్నతాధికారి ఆదేశాల మేరకు సబ్–ఇన్స్పెక్టర్ నిధి రఘువంశీ కేసు దర్యాప్తు మొదలెట్టారు. ఘటన జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఒక వ్యక్తి ఆ నిందితుడి బైక్ నంబర్ గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ వివరాలతో నిందితుడు అకీల్ ఖాన్ను గుర్తించి అరెస్ట్చేశారు. ఖాన్కు గతంలోనూ నేరచరిత్ర ఉందని దర్యాప్తులో తేలింది. ఘటనపై మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(ఎంపీసీఏ) సైతం తీవ్ర విచారం వ్యక్తంచేసింది. అంతర్జాతీయ క్రీడాకారులకు జరిగిన అవమానం పట్ల క్షమాపణలు తెలిపారు. ఇకపై క్రీడాకారులకు బయటివైపు తగు రక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటామని ఎంపీసీఏ హామీ ఇచి్చంది. ఘటనను క్రికెట్ ఆ్రస్టేలియా సంఘం సైతం ధ్రువీకరించింది. ఘటనపై బీజేపీ నేత, రాష్ట్ర మంత్రి కైలాశ్ విజయ్వర్గీయ స్పందించారు. ‘‘ఇది నిజంగా సిగ్గుచేటు. ఇలాంటి అంశాల్లో కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది దేశ పరువు, ప్రతిష్ట, ఆతిథ్యాలకు సంబంధించిన విషయం’’అని ఆయన అన్నారు. ఘటనకు ముందు రోజు ఇదే ఆస్ట్రేలియా టీమ్ ఇంగ్లండ్ జట్టుతో తలపడటం తెల్సిందే. చదవండి: భారత బౌలర్ల విజృంభణ... ఆసీస్ ఆలౌట్.. స్కోరెంతంటే? -
భారత బౌలర్ల విజృంభణ... ఆసీస్ ఆలౌట్.. స్కోరెంతంటే?
ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో టీమిండియా (IND vs AUS 3rd ODI) బౌలర్లు రాణించారు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఆతిథ్య జట్టును నామమాత్రపు స్కోరుకే ఆలౌట్ చేశారు. యువ పేసర్ హర్షిత్ రాణా (Harshit Rana) నాలుగు వికెట్లతో మెరిసి.. యాజమాన్యం తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్లో టీమిండియా చేదు అనుభవం చవిచూసింది. తొలి రెండు వన్డేల్లో ఓడి సిరీస్ను ఆసీస్కు కోల్పోయింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య సిడ్నీ వేదికగా శనివారం నాటి నామమాత్రపు మ్యాచ్లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. భారత్ను బౌలింగ్కు ఆహ్వానించింది.సిరాజ్ మొదలెడితే..ఆసీస్ టాపార్డర్లో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (25 బంతుల్లో 29) వేగంగా ఆడే ప్రయత్నంలో మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో ప్రసిద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక మరో ఓపెనర్, కెప్టెన్ మిచెల్ మార్ష్ (41)ను అక్షర్ పటేల్ బౌల్డ్ చేయగా.. వన్డౌన్ బ్యాటర్ మాథ్యూ షార్ట్ (30) వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో అవుటయ్యాడు.అదరగొట్టిన హర్షిత్విరాట్ కోహ్లి అద్భుత క్యాచ్ అందుకుని షార్ట్ను పెవిలియన్కు పంపడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక అలెక్స్ క్యారీ (24), కూపర్ కన్నోలి (23), మిచెల్ ఓవెన్ (1) రూపంలో మూడు కీలక వికెట్లు తీసిన హర్షిత్ రాణా.. జోష్ హాజిల్వుడ్ (0)ను కూడా అవుట్ చేశాడు. మొత్తంగా 8.4 ఓవర్లు బౌల్ చేసి 39 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.CLUTCH! ⭐⭐⭐⭐#HarshitRana bags his maiden 4-wicket haul in international cricket as #TeamIndia bowl out Australia in Sydney 👏#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuANAu pic.twitter.com/JXFhwCDgzX— Star Sports (@StarSportsIndia) October 25, 2025మిగతా వారిలో సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీయగా.. వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. భారత బౌలర్ల ధాటికి ఆసీస్ 46.4 ఓవర్లలో 236 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆసీస్ ఇన్నింగ్స్లో మ్యాట్ రెన్షా (56) టాప్ రన్ స్కోరర్గా నిలవగా.. లోయర్ ఆర్డర్లో నాథన్ ఎల్లిస్ (16) ఫర్వాలేదనిపించాడు. స్టార్క్ (2), జంపా (2*) ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఇక సిడ్నీలో గత మూడు మ్యాచ్లు ఓడిన టీమిండియా 237 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించి గెలుపు నమోదు చేయాలని పట్టుదలగా ఉంది.చదవండి: శ్రేయస్ అయ్యర్ సంచలన క్యాచ్.. టీమిండియాకు ఊహించని షాక్! -
IND vs AUS 3rd ODI: టీమిండియాకు భారీ షాక్!
ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంచలన క్యాచ్తో మెరిశాడు. హర్షిత్ రాణా బౌలింగ్లో అలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్ను అద్భుత రీతిలో అందుకున్నాడు. తద్వారా టీమిండియాకు కీలక వికెట్ దక్కడంలో తన వంతు పాత్ర పోషించాడు.అయితే, బంతిని ఒడిసిపట్టే క్రమంలో శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. నొప్పితో విలవిల్లాడుతూ మైదానం వీడాడు. దీంతో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువైతే అయ్యర్ రూపంలో కీలక బ్యాటర్ సేవలను టీమిండియా కోల్పోతుంది.మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన టీమిండియా.. ఇప్పటికే వన్డే సిరీస్ను 0-2తో కోల్పోయింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య సిడ్నీ వేదికగా శనివారం నాటి నామమాత్రపు మూడో వన్డేలోనూ టాస్ ఓడిన భారత్ తొలుత బౌలింగ్కు దిగింది.ఆసీస్ ఓపెనర్లు కెప్టెన్ మిచెల్ మార్ష్ (41), ట్రవిస్ హెడ్ (29) రాణించగా.. మాథ్యూ షార్ట్ 30 పరుగులు చేయగలిగాడు. ఇక నాలుగో నంబర్ బ్యాటర్ మ్యాట్ రెన్షా అర్ధ శతకం (56)తో మెరవగా.. వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు.ఈ క్రమంలో ఆసీస్ 34వ ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన భారత పేసర్ హర్షిత్ రాణా.. గంటకు 134.1 కిలోమీటర్ల వేగంతో అవుట్ సైడాఫ్ దిశగా నాలుగో బంతిని సంధించగా.. క్యారీ మిడాఫ్/ ఎక్స్ట్రా కవర్ దిశగా బంతిని గాల్లోకి లేపాడు.ఇంతలో బ్యాక్వర్డ్ పాయింగ్ నుంచి పరిగెత్తుకు వచ్చిన శ్రేయస్ అయ్యర్ డైవ్ కొట్టి మరీ సూపర్మేన్లా క్యాచ్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే అతడు గాయపడ్డాడు. నడుముకు ఎడమవైపు కిందిభాగంలో నొప్పితో విలవిల్లాడుతూ మైదానంలోనే పడుకుండిపోయాడు.సహచర ఆటగాళ్లు వచ్చి శ్రేయస్ను పరామర్శించగా.. ఫిజియో వచ్చి తీసుకువెళ్లాడు. ఇదిలా ఉంటే.. మూడో వన్డేలో ఆసీస్ 236 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక ఆసీస్తో రెండో వన్డేలో శ్రేయస్ అయ్యర్ అర్ధ శతకం (61)తో మెరిసిన విషయం తెలిసిందే. Shreyas SUPERMAN Iyer! 💪Puts his body on the line for #TeamIndia and gets the much needed wicket. 🙌💙#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuAfKW pic.twitter.com/LCXriNqYFy— Star Sports (@StarSportsIndia) October 25, 2025 -
ఎంత పనిచేశావు గిల్!.. టైమ్ ఉంది కదా.. రవిశాస్త్రి ఫైర్
ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) ఓ పొరపాటు చేశాడు. అతడి ఫీల్డింగ్ వైఫల్యం కారణంగా ఆసీస్ వన్డౌన్ బ్యాటర్ మాథ్యూ షార్ట్ (Matthew Short)ను త్వరగా పెవిలియన్కు పంపే అవకాశాన్ని భారత్ కోల్పోయింది. అసలేం జరిగిందంటే..ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ను ఆసీస్ (IND vs AUS)కు కోల్పోయిన టీమిండియా సిడ్నీ వేదికగా నామమాత్రపు ఆఖరి వన్డేలో.. టాస్ ఓడి తొలుత బౌలింగ్కు దిగింది. ఈ క్రమంలో ఆసీస్ ఓపెనర్లు మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ ఆది నుంచే బౌండరీలు బాదుతూ పరుగులు పిండుకున్నారు.డైరెక్ట్ త్రో మిస్ చేసిన గిల్ఈ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు గట్టిగానే ప్రయత్నించగా.. మొహమ్మద్ సిరాజ్ సఫలమయ్యాడు. ఆసీస్ ఇన్నింగ్స్ పదో ఓవర్లో రెండో బంతికి డేంజరస్ బ్యాటర్ హెడ్ (29)ను పెవిలియన్కు పంపాడు. ఈ క్రమంలో మాథ్యూ షార్ట్ క్రీజులోకి వచ్చాడు. పదో ఓవర్లో సిరాజ్ వేసిన మూడో బంతికి అతడు పరుగులు రాబట్టలేకపోయాడు.ఫ్రంట్ ఫుట్ డిఫెండ్ షాట్తో సేవ్ అయ్యాడు. అయితే, సిరాజ్ సంధించిన నాలుగో బంతిని షార్ట్.. షార్ట్ కవర్ దిశగా బాదాడు. ఈ క్రమంలో మిడాఫ్ నుంచి పరిగెత్తుకు వచ్చిన ఫీల్డర్ గిల్ బంతిని అందుకున్నా.. దానిని సమర్థవంతంగా వికెట్లకు గిరాటేయడంలో విఫలమయ్యాడు. ఈజీ డైరెక్ట్ త్రోకు ఆస్కారం ఉన్నా గిల్ మిస్ఫీల్డ్ కారణంగా టీమిండియా రనౌట్ చేసే అవకాశాన్ని కోల్పోయింది.Can't BatCan't BowlCan't FieldCan't Captain What does Shubman Gill even do? pic.twitter.com/1tftX7250A— ADITYA (@Wxtreme10) October 25, 2025రవిశాస్త్రి ఫైర్అప్పటికే సింగిల్కు వచ్చిన షార్ట్ నాన్ స్ట్రైకర్ ఎండ్లోకి చేరుకోగా.. నిరాశగా స్టంప్స్ వైపు వచ్చిన సిరాజ్ అదుపు తప్పి షార్ట్పై పడిపోయాడు. మరోవైపు.. మార్ష్ కూడా సర్వైవ్ అయ్యాడు. ఈ ఘటన గురించి కామెంటేటర్ .. ‘‘ఇదొక మిక్స్ అప్. రనౌట్ చేసే అవకాశం మిస్సయ్యారు’’ అని పేర్కొనగా.. రవిశాస్త్రి.. ‘‘అవును.. అతడికి చాలా సమయం ఉన్నా సరైన విధంగా హిట్ చేయలేకపోయాడు’’ అని గిల్ను విమర్శించాడు.ఇదిలా ఉంటే.. సున్నా వద్ద లైఫ్ పొందిన షార్ట్ 30 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో వెనుదిరిగాడు. మరోవైపు మార్ష్ (41) అక్షర్ పటేల్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. 33 ఓవర్ల ఆట ముగిసేసరికి ఆసీస్ మూడు వికెట్ల నష్టానికి 178పరుగులు చేసింది. అలెక్స్ క్యారీ 24, మ్యాట్ రెన్షా 46 పరుగులతో ఉన్నారు.చదవండి: IND vs AUS 3rd ODI: నితీశ్ రెడ్డి అవుట్.. కారణం వెల్లడించిన బీసీసీఐ A classic Axar Patel delivery! 🔥The Aussie skipper heads back, and #TeamIndia are right back in the contest! 🇮🇳👏#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuANAu pic.twitter.com/BDrWFPLvgs— Star Sports (@StarSportsIndia) October 25, 2025 -
చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్
ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (Travis Head) చరిత్ర సృష్టించాడు. ఆసీస్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో వన్డేల్లో అత్యంత వేగంగా మూడు వేల పరుగుల మైలురాయిని చేరుకున్న క్రికెటర్గా నిలిచాడు. టీమిండియాతో శనివారం నాటి మూడో వన్డే (IND vs AUS 3rd ODI) సందర్భంగా హెడ్ ఈ ఘనత సాధించాడు.స్వదేశంలో ఆస్ట్రేలియా భారత్తో మూడు వన్డే, ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్ను 2-0తో కైవసం చేసుకున్న కంగారూలు.. సిడ్నీ వేదికగా నామమాత్రపు మూడో వన్డేలోనూ శుభారంభం అందుకున్నారు.వన్డేల్లో మూడు వేల పరుగుల క్లబ్లోసిడ్నీ గ్రౌండ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. కెప్టెన్, ఓపెనర్ మిచెల్ మార్ష్ (Mitchell Marsh)తో కలిసి ట్రావిస్ హెడ్ వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 22 పరుగుల (20 బంతుల్లో) వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న వేళ వన్డేల్లో మూడు వేల పరుగుల క్లబ్లో చేరాడు. స్మిత్ రికార్డు బ్రేక్కాగా ఆసీస్ తరఫున హెడ్కు ఇది 76వ ఇన్నింగ్స్. తద్వారా తక్కువ ఇన్నింగ్స్లోనే వన్డేల్లో మూడు వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆసీస్ క్రికెటర్గా స్టీవ్ స్మిత్ సాధించిన రికార్డును హెడ్ తాజాగా బద్దలు కొట్టాడు. స్మిత్ 79 ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధిస్తే.. హెడ్ 76 ఇన్నింగ్స్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం.అంతేకాదు.. అతితక్కువ బంతుల్లో వన్డేల్లో మూడు వేల పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్ల జాబితాలో హెడ్ ఈ సందర్భంగా చోటు సంపాదించాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 2839 బంతుల్లో మూడువేల పరుగుల మార్కును అందుకున్నాడు.సిరాజ్ బౌలింగ్లో..ఇక ఆసీస్ ఇన్నింగ్స్ పదో ఓవర్లో భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ బంతితో రంగంలోకి దిగగా.. హెడ్.. ఫోర్తో అతడికి స్వాగతం పలికాడు. అయితే, రెండో బంతికే సిరాజ్ అతడిని పెవిలియన్కు పంపి ప్రతీకారం తీర్చుకున్నాడు.సిరాజ్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించిన హెడ్.. బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా బంతిని గాల్లోకి లేపాడు. ఈ క్రమంలో ప్రసిద్ కృష్ణ క్యాచ్ అందుకోవడంతో టీమిండియాకు ‘హెడేక్’ తప్పింది. Much needed! 💪Just as the opening stand was starting to look dangerous, #MohammadSiraj gets #TravisHead! 👏🇮🇳#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuANAu pic.twitter.com/Kimj8efFnZ— Star Sports (@StarSportsIndia) October 25, 202525 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 29 పరుగులు చేసిన హెడ్ మరో బౌండరీ బాదే క్రమంలో అవుటయ్యాడు. దీంతో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. 15 ఓవర్ల ఆట ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది. మార్ష్ 41, మాథ్యూ షార్ట్ 10 పరుగులతో క్రీజులో నిలిచారు.ఆస్ట్రేలియా తరఫున అత్యంత వేగంగా వన్డేల్లో మూడు వేల పరుగులు సాధించిన క్రికెటర్లు🏏ట్రావిస్ హెడ్- 76 ఇన్నింగ్స్లో🏏స్టీవ్ స్మిత్- 79 ఇన్నింగ్స్లో🏏మైఖేల్ బేవాన్/జార్జ్ బెయిలీ- 80 ఇన్నింగ్స్లో🏏డేవిడ్ వార్నర్- 81 ఇన్నింగ్స్లోవన్డేల్లో తక్కువ బంతుల్లోనే 3 వేల పరుగుల క్లబ్లో చేరిన క్రికెటర్లు🏏గ్లెన్ మాక్స్వెల్ (ఆస్ట్రేలియా)- 2440 బంతుల్లో🏏జోస్ బట్లర్ (ఇంగ్లండ్)- 2533 బంతుల్లో🏏జేసన్ రాయ్ (ఇంగ్లండ్)- 2820 బంతుల్లో🏏ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా)- 2839 బంతుల్లో🏏జానీ బెయిర్స్టో (ఇంగ్లండ్)- 2842 బంతుల్లో. చదవండి: అవమాన భారంతో ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన పాకిస్తాన్ -
ఎట్టకేలకు కుల్దీప్ ఎంట్రీ.. నితీశ్ రెడ్డి అవుట్.. కారణం ఇదేనన్న బీసీసీఐ
ఆస్ట్రేలియాతో నామమాత్రపు మూడో వన్డే (IND vs AUS 3rd ODI)లో భారత్ తమ తుదిజట్టులో కీలక మార్పులు చేసింది. గత రెండు వన్డేల్లోనూ పక్కన పెట్టిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)ను ఎట్టకేలకు ప్లేయింగ్ ఎలెవన్లోకి తీసుకుంది.పేసర్ అర్ష్దీప్ సింగ్ స్థానంలో కుల్దీప్ను తుదిజట్టులోకి ఎంపిక చేసుకుంది. మరోవైపు.. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) స్థానంలో యువ పేసర్ ప్రసిద్ కృష్ణ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు.కారణం వెల్లడించిన బీసీసీఐకాగా నితీశ్ కుమార్ రెడ్డి మూడో వన్డేకు దూరం కావడానికి గల కారణాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా వెల్లడించింది. గాయం కారణంగానే అతడిని పక్కనపెట్టినట్లు తెలిపింది. ఈ మేరకు ‘‘ఆస్ట్రేలియాతో అడిలైడ్లో జరిగిన రెండో వన్డేలో నితీశ్ కుమార్ రెడ్డి ఎడమవైపు గజ్జల్లో గాయంతో ఇబ్బంది పడ్డాడు.అందుకే మూడో వన్డే సెలక్షన్కు అతడు అందుబాటులో లేకుండా పోయాడు. బీసీసీఐ వైద్య బృందం అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తుంది’’ అని బీసీసీఐ కీలక అప్డేట్ అందించింది. ఒకవేళ నితీశ్ రెడ్డి త్వరగా కోలుకోకపోతే టీ20 సిరీస్ ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.సిరీస్ కోల్పోయిన భారత్కాగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్ మొదలుకాగా.. పెర్త్లో ఏడు వికెట్ల తేడాతో ఓడిన గిల్ సేన.. అడిలైడ్లో రెండు వికెట్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది.పరువు నిలుపుకోవాలనిఫలితంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆతిథ్య ఆస్ట్రేలియా సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం సిడ్నీ వేదికగా జరిగే నామమాత్రపు ఆఖరి వన్డేలోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని పట్టుదలగా ఉంది.ఈ నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ను తుదిజట్టులోకి తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. కాగా రెండో వన్డేలో ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా నాలుగు వికెట్లతో చెలరేగి తమ జట్టుకు విజయం అందించగా.. కుల్దీప్ను పక్కనపెట్టడం ద్వారా టీమిండియా భారీ మూల్యమే చెల్లించిందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మూడో వన్డే తుదిజట్లుభారత్రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.ఆస్ట్రేలియామిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మ్యాట్ రెన్షా, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), కూపర్ కన్నోలీ, మిచెల్ ఓవెన్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్వుడ్.చదవండి: తెలివి తక్కువ నిర్ణయం: టీమిండియా మేనేజ్మెంట్పై అశూ ఫైర్ -
IND vs AUS: సిడ్నీ వన్డేలో భారత్ ఘన విజయం
Australia vs India, 3rd ODI Updates And Highlights: సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో టీమిండియాతో నామమాత్రపు మూడో వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల ధాటికి 236 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ లక్ష్యం: 237 పరుగులుగా నిర్దేశించింది.భారత్ ఘన విజయం..సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో వైట్ వాష్ నుంచి టీమిండియా తప్పించుకుంది. 237 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రం కోల్పోయి చేధించింది. లక్ష్య చేధనలో సీనియర్ ద్వయం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు అద్బుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో చెలరేగగా.. కోహ్లి 74 పరుగులతో సత్తాచాటాడు. వీరిద్దరూ ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ను ఫినిష్ చేశారు.విజయం దిశగా32.6: జంపా బౌలింగ్లో సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ. వన్డేల్లో రోహిత్కు ఇది 33వ శతకం. 33 ఓవర్లలో టీమిండియా స్కోరు 200-1. రోహిత్ 100, కోహ్లి 59 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా విజయానికి 37 పరుగుల దూరంలో ఉంది.కోహ్లి హాఫ్ సెంచరీ..వరుసగా రెండు మ్యాచ్లలో డకౌటైన విరాట్ కోహ్లి.. సిడ్నీ వన్డేలో మాత్రం సత్తాచాటాడు. కోహ్లి 56 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. టీమిండియా స్కోరు: 178-1(29).రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ..సిడ్నీ వన్డేలోనూ రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 63 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 23 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్తో పాటు కోహ్లి(36) ఉన్నాడు.తొలి వికెట్ కోల్పోయిన భారత్10.2: గిల్ (24) రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. హాజిల్వుడ్ బౌలింగ్లో వికెట్ కీపర్ క్యారీకి క్యాచ్ ఇచ్చి గిల్ పెవిలియన్ చేరాడు. విరాట్ కోహ్లి క్రీజులోకి వచ్చాడు. టీమిండియా స్కోరు: 70-1(10.3). రోహిత్ 32 పరుగులతో ఉన్నాడు. కోహ్లికి సిడ్నీలో ఇదే ఆఖరి మ్యాచ్ అన్నట్లుగా ప్రేక్షకులు స్టాండింగ్ ఓవియేషన్ ఇస్తూ ఎమోషనల్ అయ్యారు.పవర్ ప్లేలో టీమిండియా స్కోరు: 68-0 (10).గిల్ 24, రోహిత్ 31 పరుగులతో ఉన్నారు.నిలకడగా ఆడుతున్న రోహిత్, గిల్237 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది టీమిండియా. ఆది నుంచే ఆసీస్ బౌలర్లు కట్టడి చేయగా.. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ ఆచితూచి ఆడుతున్నారు. 8 ఓవర్లలో టీమిండియా స్కోరు 48-0. రోహిత్ 25, గిల్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.హాజిల్వుడ్ బౌల్డ్46.4: హర్షిత్ రాణా బౌలింగ్లో హాజిల్వుడ్ (0) బౌల్డ్ కావడంతో ఆసీస్ పదో వికెట్ కోల్పోయింది. ఫలితంగా 236 పరుగులకే ఆలౌట్ అయింది.తొమ్మిదో వికెట్ డౌన్46.2: హర్షిత్ రాణా బౌలింగ్లో కోహ్లికి క్యాచ్ ఇచ్చిన కన్నోలి (23). దీంతో ఆసీస్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. స్కోరు: 236-9(46.2). హాజిల్వుడ్ క్రీజులోకి రాగా... జంపా రెండు పరుగులతో ఉన్నాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా43.5: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఎనిమిదో వికెట్గా వెనుదిరిగిన నాథన్ ఎల్లిస్ (16). స్కోరు: 223-8(43.5). కన్నోలి 13 పరుగులతో ఉన్నాడు. జంపా క్రీజులోకి వచ్చాడు.ఏడో వికెట్ డౌన్38.4: కుల్దీప్ బౌలింగ్లో ఏడో వికెట్గా వెనుదిరిగిన స్టార్క్ (2). కుల్దీప్ అద్భుత బంతితో స్టార్క్ను బౌల్డ్ చేశాడు. ఆసీస్ స్కోరు: 201-7(38.4). నాథన్ ఎల్లిస్ క్రీజులోకి రాగా.. కన్నోలి 8 పరుగులతో ఉన్నాడు.ఆరో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియాఓవెన్ (1) రూపంలో ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. హర్షిత్ బౌలింగ్లో రోహిత్కు క్యాచ్ ఇచ్చి ఓవెన్ పెవిలియన్ చేరాడు. స్టార్క్ క్రీజులోకి రాగా.. 38 ఓవర్లలో ఆసీస్ స్కోరు: 199-6(38). కన్నోలి 7, స్టార్క్ ఒక పరుగుతో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా36.2: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో హాఫ్ సెంచరీ వీరుడు మ్యాట్ రెన్షా (56) లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగాడు. అయితే, ఎల్బీడబ్ల్యూ విషయంలో ఆసీస్ రివ్యూకు వెళ్లగా.. బంతి లెగ్ స్టంప్ను హిట్ చేస్తున్నట్లుగా తేలింది. దీంతో ఆసీస్ ఐదో వికెట్ కోల్పోగా.. మిచెల్ ఓవెన్ క్రీజులోకి వచ్చాడు. 37 ఓవర్లలో ఆసీస్ స్కోరు: 197-5. కన్నోలి 6 పరుగులతో ఉన్నాడు.నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా33.4: హర్షిత్ రాణా బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి క్యారీ (24) అవుట్. అద్భుతమైన క్యాచ్తో మెరిసి టీమిండియా కీలక వికెట్ పొందడంలో తన వంతు పాత్ర పోషించిన శ్రేయస్ గాయపడినట్లు తెలుస్తోంది. కూపర్ కన్నోలి క్రీజులోకి రాగా 34 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోరు: 184-4. రెన్షా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్22.3: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి మాథ్యూ షార్ట్ అవుటయ్యాడు. 41 బంతుల్లో 30 పరుగులు చేసి మూడో వికెట్గా వెనుదిరిగాడు. అలెక్స్ క్యారీ క్రీజులోకి వచ్చాడు. 24 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ మూడు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. రెన్షా 22, క్యారీ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.The only leadership summit all of us want to be part of! 📝📚#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuANAu pic.twitter.com/HzAE2KIPI1— Star Sports (@StarSportsIndia) October 25, 2025 రెండో వికెట్ డౌన్15.1: మార్ష్ (41) రూపంలో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో మార్ష్ బౌల్డ్ అయ్యాడు. మ్యాట్ రెన్షా క్రీజులోకి రాగా.. షార్ట్ 11 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 92-2 (16)A classic Axar Patel delivery! 🔥The Aussie skipper heads back, and #TeamIndia are right back in the contest! 🇮🇳👏#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuANAu pic.twitter.com/BDrWFPLvgs— Star Sports (@StarSportsIndia) October 25, 2025తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా9.2: సిరాజ్ బౌలింగ్లో ప్రసిద్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన ట్రావిస్ హెడ్. 25 బంతులు ఎదుర్కొని 29 పరుగుల చేసిన హెడ్ అవుట్. ఫలితంగా తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా. మాథ్యూ షార్ట్ క్రీజులోకి రాగా.. మార్ష్ 25 పరుగులతో ఆడుతున్నాడు. పది ఓవర్లలో ఆసీస్ స్కోరు: 63-1ఐదు ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు: 26-0(5)మిచెల్ మార్ష్ 6, ట్రావిస్ హెడ్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. సిరాజ్ భారత బౌలింగ్ అటాక్ ఆరంభించగా.. హర్షిత్ రాణా సిరాజ్ కలిసి ఆల్టర్నేటివ్ ఓవర్లలో బరిలోకి దిగాడు.ఒక మార్పుతో బరిలోకిఈ సందర్భంగా ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ మాట్లాడుతూ.. ‘‘వికెట్ బాగుందనిపిస్తోంది. అందుకే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాం. యువ ఆటగాళ్లు రాణించడం మా జట్టుకు శుభపరిణామం. 3-0తో సిరీస్ క్లీన్స్వీప్ చేసే సువర్ణావకాశం మా ముందుంది. గత మ్యాచ్లో కూపర్ కన్నోలి అద్భుతంగా ఆడాడు. ఈ వన్డేలో మేము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నాం. జేవియర్ బార్ట్లెట్ స్థానంలో నాథన్ ఎల్లిస్ జట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు.టీమిండియాలో రెండు మార్పులుమరోవైపు.. టీమిండియా గత మ్యాచ్లలో చేసిన పొరపాటును సరిచేసుకున్నట్లు అనిపిస్తోంది. రెండు వన్డేల్లో బెంచ్కే పరిమితం చేసిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు ఎట్టకేలకు పిలుపునిచ్చింది. ఈ మ్యాచ్లో భారత్ తమ తుదిజట్టులో రెండు మార్పులు చేసింది. అర్ష్దీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి స్థానాల్లో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణలను ఎంపిక చేసుకుంది.టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడో వన్డే తుదిజట్లుటీమిండియారోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.ఆస్ట్రేలియామిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మ్యాట్ రెన్షా, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), కూపర్ కన్నోలీ, మిచెల్ ఓవెన్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్వుడ్. -
విజయంతో ముగిస్తారా!
సిడ్నీ: ఐసీసీ వన్డే టోర్నీ చాంపియన్స్ ట్రోఫీ విజేత హోదాలో భారీ అంచనాలతో ఆ్రస్టేలియాకు వచ్చిన భారత జట్టు పేలవ ప్రదర్శనతో ఇప్పటికే 0–2తో సిరీస్ను కోల్పోయింది. మిగిలిన చివరి మ్యాచ్లోనైనా గెలిస్తే టీమిండియాకు ఊరట దక్కుతుంది. భారత జట్టు తమ వన్డే చరిత్రలో ఒక్కసారి కూడా ఆస్ట్రేలియా చేతిలో క్లీన్స్వీప్నకు గురి కాలేదు. వన్డే ఫార్మాట్లో టీమిండియా కొత్త కెపె్టన్ శుబ్మన్ గిల్ నాయకత్వంలో అలాంటి అవకాశం ఇవ్వరాదని జట్టు పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో నేడు భారత్, ఆ్రస్టేలియా మధ్య మూడో వన్డేకు రంగం సిద్ధమైంది. కోహ్లి ఈసారైనా... సిరీస్కు ముందు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల బ్యాటింగ్ గురించే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తొలి మ్యాచ్లో విఫలమైనా...అడిలైడ్లో అర్ధసెంచరీతో రోహిత్ కాస్త ఫర్వాలేదనిపించాడు. అయితే అతని ఆటలో సహజశైలి, దూకుడు కనిపించలేదు. కోహ్లి అయితే రెండు సార్లూ డకౌట్ అయి పూర్తిగా నిరాశపర్చాడు. ఈ మ్యాచ్లో కూడా సహజంగానే వారిద్దరి బ్యాటింగ్పైనే అందరి దృష్టీ నిలిచింది. గతేడాది అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు ఆ్రస్టేలియా గడ్డపై ఆడటం ఇదే చివరిసారి కానుంది. అందుకే ఈ మ్యాచ్పై సిడ్నీ అభిమానులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపించడంతో టికెట్లన్నీ పూర్తిగా అమ్ముడుపోయి మైదానం హౌస్ఫుల్గా కనిపించనుంది. కోహ్లి తన స్థాయికి తగినట్లు ఆడి ఆకట్టుకోవాలని అంతా కోరుకుంటున్నారు. అయితే గిల్, కేఎల్ రాహుల్ కూడా విఫలమవుతుండటం భారత్ బృందానికి ఆందోళన కలిగించే అంశం. మరోసారి శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ కీలకం కానుండగా... ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డితో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా బ్యాటింగ్లో ప్రభావం చూపించాల్సి ఉంది. బౌలింగ్లో ఈ మ్యాచ్లోనైనా కుల్దీప్ యాదవ్కు అవకాశం ఇస్తారా అనేది చూడాలి. వారిద్దరికి విశ్రాంతి... అగ్రశ్రేణి ఆటగాళ్లు దూరమైనా... ఆసీస్ యువ క్రికెటర్లు రెండో వన్డేను గెలిపించడం టీమ్ మేనేజ్మెంట్కు ఉత్సాహాన్ని ఇచి్చంది. షార్ట్, కనోలీ, ఒవెన్, రెన్షాలాంటి ఆటగాళ్లంతా ప్రభావం చూపించగలిగారు. బౌలింగ్లో బార్త్లెట్ ఆకట్టుకోగా, లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా తన విలువను ప్రదర్శించాడు. ఇప్పటికే సిరీస్ గెలిచిన నేపథ్యంలో టాప్ పేసర్లు స్టార్క్, హాజల్వుడ్లకు ఆసీస్ విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. వీరి స్థానాల్లో ఎలిస్, జాక్ ఎడ్వర్డ్స్ బరిలోకి దిగుతారు. పిచ్ బ్యాటింగ్కు అనుకూలం కాబట్టి భారీ స్కోరుకు అవకాశం ఉంది. ఆ్రస్టేలియా ఇక్కడ ఆడిన గత ఆరు వన్డేల్లో విజయం సాధించింది. మ్యాచ్ రోజు వర్షసూచన లేదు. 16 సిడ్నీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య 19 వన్డేలు జరిగాయి. భారత్ రెండు మ్యాచ్ల్లో గెలిచి, 16 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఒక వన్డేలో ఫలితం రాలేదు. -
‘ఆ రోజే చనిపోయేవాడినేమో’
న్యూఢిల్లీ: భారత క్రికెట్లో ఇప్పుడు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ ఒక సంచలనం. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున పలు మార్లు తన ఆటతో ఆకట్టుకున్న అతడికి ఇటీవలి ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీ ఒక్కసారిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. పాకిస్తాన్తో జరిగిన ఫైనల్లో అద్భుత బ్యాటింగ్తో గెలిపించిన ఈ హైదరాబాదీ క్రికెటర్ జాతీయ హీరోగా మారాడు. అయితే మూడేళ్ల క్రితం తన జీవితంలో చోటు చేసుకున్న ఒక కీలక పరిణామం గురించి అతను మొదటిసారి వెల్లడించాడు. ముంబై ఇండియన్స్కు ఒక సీజన్లో ప్రాతినిధ్యం వహించిన తర్వాత తాను అనారోగ్యానికి గురి కావడం... ముంబై యాజమాన్యం తనకు అండగా నిలిచిన విషయాన్ని అతను ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్లో ముంబై జట్టుకు నాలుగు సీజన్లుగా (2022 నుంచి) తిలక్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తొలి ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత తాను కండరాలకు సంబంధించిన ‘రాబ్డోమయాలసిస్’ వ్యాధి బారిన పడ్డానని తిలక్ చెప్పాడు. అది చాలా ప్రమాదకరమైనదని, తన కండరాలు బిగుసుకుపోవడంతో దాని తీవ్రత తెలిసిందని అతను అన్నాడు. ‘ఆ సమయంలో నేను టెస్టు జట్టులో స్థానం దక్కించుకునే ప్రయత్నంలో వరుసగా మ్యాచ్లు ఆడుతున్నాను. ఫిట్గా ఉండే ప్రయత్నంలో అవసరానికి మించి ట్రైనింగ్లో పాల్గొనేవాడిని. విశ్రాంతి రోజుల్లో కూడా జిమ్లోనే గడిపాను. శరీరం కోలుకునేందుకు తగిన సమయం ఇవ్వకుండా దీనిని కొనసాగించాను. చివరకు అది ప్రతికూల ప్రభావం చూపించింది. నా కండరాలు సరిగా పని చేయలేదు. భారత ‘ఎ’ జట్టు తరఫున బంగ్లాదేశ్పై సెంచరీ చేసిన తర్వాత కళ్లు, చేతి వేళ్లు సరిగా పని చేయలేదు. శరీరమంతా రాయిలాగా మారినట్లు అనిపించింది. ఆ మ్యాచ్ నుంచి రిటైర్హర్ట్గా బయటకు వచ్చాను. వేళ్లలో కదలిక లేకపోవడంతో చేతి గ్లవ్స్ను కత్తిరించాల్సి వచి్చంది’ అని తిలక్ నాటి పరిస్థితిని వివరించాడు. అయితే తన ఆరోగ్యం గురించి తెలిసిన వెంటనే ముంబై ఇండియన్స్ యజమాని ఆకాశ్ అంబానీ, అప్పటి బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందించి వెంటనే చికిత్సకు ఏర్పాట్లు చేశారని తిలక్ కృతజ్ఞతలు చెప్పాడు. ‘వారిద్దరి చొరవతో వెంటనే నన్ను ఆస్పత్రిలో చేర్పించారు. ఆ సమయంలో నా పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. శరీరంలోకి గుచ్చిన సూది కూడా విరిగిపోయింది. కొన్ని గంటలు ఆలస్యమై ఉంటే పరిస్థితి చేయిదాటిపోయేదని, చనిపోవడానికి కూడా అవకాశం ఉండేదని డాక్టర్లు చెప్పారు. ఆ సమయంలో మా అమ్మ నాతోనే ఉంది’ అని తిలక్ భావోద్వేగంతో చెప్పాడు. ఆస్ట్రేలియాతో ఈనెల 29 నుంచి మొదలయ్యే ఐదు టి20 మ్యాచ్ల సిరీస్ కోసం కెపె్టన్ సూర్యకుమార్, శివమ్ దూబే, బుమ్రాలతో కలిసి తిలక్ వర్మ ఆ్రస్టేలియాకు బయలుదేరి వెళ్లాడు. ఆసియా కప్ ట్రోఫీ మాయం! భారత జట్టు విజేతగా నిలిచిన ఆసియా కప్ ట్రోఫీ వివాదం మరో మలుపు తిరిగింది. ఫైనల్ తర్వాత ట్రోఫీని భారత జట్టు అందుకోకపోగా... ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ ఆదేశాల మేరకు దానిని దుబాయ్లోని ఏసీసీ కార్యాలయంలో ఉంచారు. అయితే ఇప్పుడు అక్కడి నుంచి కూడా దానిని తరలించినట్లు తెలుస్తోంది. దానిని ఎక్కడికి తీసుకెళ్లారనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. బీసీసీఐ అధికారి ఒకరు ఇటీవల ఏసీసీ కార్యాలయానికి వెళ్లగా అక్కడ ట్రోఫీ కనిపించలేదు. దీనిపై అక్కడి ఉద్యోగులను విచారించగా...అబుదాబిలో ఉన్న నఖ్వీ తన వద్దనే ట్రోఫీని ఉంచుకున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ మ్యాచ్ జరిగిన రోజున భారత ఆటగాళ్లంతా ట్రోఫీని ఎప్పుడైనా తీసుకురావచ్చంటూ 40 నిమిషాల పాటు ఎదురు చూశామని...ఆ తర్వాతే అసలు విషయం తెలియడంతో ట్రోఫీ లేకుండానే సంబరాలు జరుపుకున్నట్లు తిలక్ వర్మ వెల్లడించాడు. -
అవమాన భారంతో ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన పాకిస్తాన్
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ జట్టు ఒక్క గెలుపు కూడా లేకుండా అవమాన భారంతో నిష్క్రమించింది. శ్రీలంకతో ఇవాళ (అక్టోబర్ 24) జరగాల్సిన వారి చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకునపోయింది. దీంతో ప్రస్తుత ఎడిషన్లో గెలుపు నోచుకోని ఏకైక జట్టుగా పాక్ టోర్నీ నుంచి వైదొలిగింది.టోర్నీ ప్రారంభానికి ముందు టీమిండియా సహా అగ్రశ్రేణి జట్లనన్నిటినీ ఓడిస్తామని ప్రగల్బాలు పలికిన పాక్ ప్లేయర్లు.. తొలి మ్యాచ్లోనే వారికంటే బలహీనమైన బంగ్లాదేశ్ చేతిలోనే ఓడారు. టోర్నీ మొత్తంలో 7 మ్యాచ్లు ఆడి 4 పరాజయాలు ఎదుర్కొన్నారు. 3 మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. భారత్పై ఏదో పొడిచేస్తామని బీరాలు పలికిన పాక్ 88 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఆతర్వాత ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతుల్లో కూడా అవమానకర ఓటములు ఎదుర్కొంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంకతో మ్యాచ్లు రద్దయ్యాయి.ఇవాళ శ్రీలంకతో జరగాల్సిన మ్యాచ్కు ఆది నుంచే వరుణుడు అడ్డు తగిలాడు. కొన్ని గంటల తర్వాత వర్షం కాస్త ఎడతెరిపినివ్వడంతో టాస్ పడింది. శ్రీలంక టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకోగా.. 4.2 ఓవర్ల తర్వాత మరోసారి భారీ వర్షం మొదలైంది. దీంతో చేసేదేమీ లేక అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి పాక్ వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే పాక్, శ్రీలంక జట్లు ఇదివరకే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. ఈ రెండు జట్లతో పాటు బంగ్లాదేశ్, న్యూజిలాండ్ కూడా నిష్క్రమించాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, భారత్ సెమీస్కు అర్హత సాధించాయి. పాయింట్ల పట్టికలో భారత్ నాలుగో స్థానాన్ని ఖరారు చేసుకోగా.. తొలి మూడు స్థానాల కోసం ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల మధ్య పోటీ జరుగుతుంది. సెమీస్కు చేరిన నాలుగు జట్లు ఇంకా తలో మ్యాచ్ ఆడాల్సి ఉంది. రేపటి మ్యాచ్లో (అక్టోబర్ 25) ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా తలపడనుండగా.. 26న ఉదయం మ్యాచ్లో ఇంగ్లండ్-న్యూజిలాండ్.. మధ్యాహ్నం మ్యాచ్లో భారత్-బంగ్లాదేశ్ ఢీకొంటాయి.చదవండి: ప్రపంచకప్ నుంచి తప్పుకొన్న పాకిస్తాన్ -
భారత్, ఆస్ట్రేలియా మూడో వన్డేకు సంబంధించి బిగ్ అప్డేట్
భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య సిడ్నీ వేదికగా రేపు (అక్డోబర్ 25) వన్డే మ్యాచ్ జరుగనుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరగాల్సిన చివరి మ్యాచ్ ఇది. ఈ సిరీస్ను ఆస్ట్రేలియా ఇప్పటికే కైవసం చేసుకుంది. ఆ జట్టు తొలి రెండు వన్డేల్లో భారత్పై ఏకపక్ష విజయాలు సాధించింది. రేపు జరుగబోయే మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది.కాగా, పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేకు వరుణుడు ఆటంకాలు కలిగించిన నేపథ్యంలో రేపు జరుగబోయే మ్యాచ్కు కూడా వర్షం ఆటంకం కలిగిస్తుందా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ విషయంలో వారికి గుడ్ న్యూస్ అందింది.Accuweather సమాచారం ప్రకారం, సిడ్నీలో రేపు వర్షం పడే అవకాశం లేదు. మ్యాచ్ పూర్తిస్థాయిలో సజావుగా సాగుతుంది. ఉష్ణోగ్రతలు సుమారు 16°C నుంచి 23°C మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్కు భారీ స్థాయిలో అభిమానులు హాజరుకానున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా ఇవాళ మధ్యాహ్నమే సిడ్నీ మైదానం బయట సోల్డ్ ఔట్ బోర్డులు పెట్టింది. అప్రాధాన్యమైన మ్యాచ్ అయినప్పటికీ.. టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. రేపు వీకెండ్ కావడంతో ఈ మ్యాచ్ను అదనపు ఆదరణ లభించనుంది.ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా పరంగా రేపటి మ్యాచ్ అప్రాధాన్యమైనప్పటికీ టీమిండియాకు మాత్రం చాలా కీలకం. ఎందుకంటే ఇప్పటికే 0-2తో సిరీస్ కోల్పోయిన భారత్, రేపటి మ్యాచ్లో ఎలాగైనా గెలిచి క్లీన్ స్వీప్ పరాభవాన్ని తప్పించుకోవాలని భావిస్తుంది. ఒకవేళ రేపటి మ్యాచ్లో కూడా భారత్ ఓడితే వన్డేల్లో ఆస్ట్రేలియా చేతిలో తొలి వైట్వాష్ పరాభవాన్ని ఎదుర్కొంటుంది.చదవండి: ప్రపంచకప్ నుంచి తప్పుకొన్న పాకిస్తాన్రేపటి మ్యాచ్ తర్వాత భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 సిరీస్ మొదలవుతుంది. ఈ సిరీస్ కోసం భారత టీ20 జట్టు ఇదివరకే ఆసీస్ గడ్డపై ల్యాండ్ అయ్యింది. భారత వన్డే జట్టులో కొందరు మాత్రమే టీ20 జట్టులో ఉన్నారు. సీనియర్లు విరాట్, రోహిత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వన్డే సిరీస్ తర్వాత భారత్కు బయల్దేరిపోతారు. -
నిబంధన ఉల్లంఘించిన ఆఫ్ఘనిస్తాన్
తాజాగా జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) ఇన్నింగ్స్ 73 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ ఓటమి నుంచి తేరుకోకముందే ఆ జట్టుకు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్తో (Slow Over) బౌలింగ్ చేసినందుకు ఐసీసీ ఆఫ్ఘన్ జట్టుకు జరిమానా విధించింది. ప్రతి ఆటగాడి మ్యాచ్ ఫీజ్లో 25 శాతం కోత పెట్టింది. నిర్దేశిత సమయంలోపు ఆఫ్ఘన్ బౌలర్లు ఐదు ఓవర్లు తక్కువ వేశారు. దీంతో మ్యాచ్ రిఫరీ ఫైన్ ఇంపోజ్ చేశాడు. విచారణలో ఆఫ్ఘన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది తప్పు ఒప్పుకోవడంతో ఎలాంటి చర్యలు లేకుండా జరిమానాతో సరిపెట్టారు.కాగా, ఆఫ్ఘనిస్తాన్-జింబాబ్వే జట్ల మధ్య అక్టోబర్ 20న మొదలైన టెస్ట్ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్లో జింబాబ్వే అన్ని విభాగాల్లో సత్తా చాటింది. ఆ జట్టు బౌలర్లు రెండు ఇన్నింగ్స్ల్లో ఆఫ్ఘనిస్తాన్ను కనీసం 200 స్కోర్ కూడా చేయనివ్వలేదు.బ్యాటర్లు ఒకే ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసి సత్తా చాటారు. ఓపెనర్ బెన్ కర్రన్ (Ben Curran) కెరీర్లో తొలి సెంచరీతో కదంతొక్కాడు. సికందర్ రజా అర్ద సెంచరీతో రాణించాడు. నిక్ వెల్చ్ 49 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.పేసర్ బ్రాడ్ ఈవాన్స్ (Brad Evans) తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్ పతనాన్ని శాశించాడు. ముజరబానీ 3 వికెట్లతో రాణించాడు. రెండో ఇన్నింగ్స్లో రిచర్డ్ నగరవ 5 వికెట్లతో చెలరేగాడు. ముజరబానీ ఈ ఇన్నింగ్స్లోనూ రాణించి 3 వికెట్లు తీశాడు.ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్కు ఒకే ఒక సానుకూల అంశం ఉంది. పేసర్ జియా ఉర్ రెహ్మాన్ 7 వికెట్లతో చెలరేగాడు. ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 127, రెండో ఇన్నింగ్స్లో 159 పరుగులకు ఆలౌటైంది.కాగా, ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. అక్టోబర్ 29 నుంచి మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ (అక్టోబర్ 29, 31, నవంబర్ 2) ప్రారంభం కానుంది.చదవండి: ప్రపంచకప్ నుంచి తప్పుకొన్న పాకిస్తాన్ -
IND vs AUS: అదొక తెలివి తక్కువ నిర్ణయం: అశ్విన్ ఫైర్
ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో టీమిండియా ఓటమిపై భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) స్పందించాడు. అడిలైడ్ మ్యాచ్లో భారత జట్టు యాజమాన్యం అనుసరించిన వ్యూహాన్ని తప్పుబట్టిన అశూ.. తెలివి తక్కువ నిర్ణయం కారణంగా సిరీస్ కోల్పోయామంటూ ఘాటు విమర్శలు చేశాడు.కాగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లింది టీమిండియా. తొలుత వన్డే సిరీస్ మొదలుకాగా పెర్త్లో ఏడు వికెట్ల తేడాతో ఓడిన గిల్ సేన.. గురువారం నాటి రెండో వన్డేలో రెండు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తద్వారా 0-2తో సిరీస్ను ఆసీస్కు కోల్పోయింది.బెంచ్కే పరిమితంఅయితే, ఈ రెండు వన్డేల్లోనూ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)ను బెంచ్కే పరిమితం చేసింది టీమిండియా మేనేజ్మెంట్. వికెట్ల తీయగల సత్తా ఉన్నా అతడిని తుదిజట్టుకు ఎంపిక చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.జంపా అదుర్స్ముఖ్యంగా రెండో వన్డేలో ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా (Adam Zampa) నాలుగు వికెట్లతో రాణించి.. భారత బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించడం.. కుల్దీప్ లేనిలోటును మరింత ఎత్తి చూపింది. ఆతిథ్య జట్టు తమ స్పిన్నర్ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటే.. టీమిండియా మాత్రం వ్యూహాత్మక తప్పిదం చేసిందనే విమర్శలు వచ్చాయి.వికెట్లు తీసే బౌలర్లు కావాలిఈ నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘అడిలైడ్ వన్డేలో టీమిండియా బౌలింగ్ అటాక్ అత్యంత సాధారణంగా అనిపించింది. అసలు వికెట్ తీయాలని ఎవరూ ప్రయత్నించినట్లుగా అనిపించనేలేదు. పరుగులు చేయడం కంటే కూడా వికెట్లు పడగొట్టగలిగే బౌలర్లను ఎంపిక చేసుకోవాలి.మంచి కెప్టెన్లు, నాయకులు ఎలా ఆలోచిస్తారంటేఆడం జంపా నాలుగు వికెట్లు ఎలా తీశాడో చూశారా?.. అతడు బంతిని తిప్పేశాడు. ప్రతిసారీ మన డ్రెసింగ్రూమ్ దృష్టికోణం గురించే ఆలోచించవద్దు. మంచి కెప్టెన్లు, నాయకులు.. ఎల్లప్పుడూ ప్రత్యర్థి జట్టు ఎలాంటి ప్రణాళికలు రచిస్తుందో ముందే ఊహించి.. అందుకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకుంటారు.ఈ మ్యాచ్లో ఆడిన కూపర్ కన్నోలి ఇది వరకు అసలు కుల్దీప్ యాదవ్ను ఎదుర్కొన్నాడా? లేదు కదా!.. మరి మాథ్యూ షార్ట్.. అలెక్స్ క్యారీ కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఇబ్బందిపడ్డాడు. మిచెల్ ఓవెన్ కూడా ఇంత వరకు కుల్దీప్ను ఎదుర్కొనేలేదు.తెలివి తక్కువ నిర్ణయంఆస్ట్రేలియా ప్రస్తుత బ్యాటింగ్ లైనప్లో చాలా మందికి కుల్దీప్ బౌలింగ్లో ఆడిన అనుభవమే లేదు. కాబట్టి అతడిని ఆడిస్తే.. ప్రత్యర్థి జట్టులోని ప్రతి బ్యాటర్ ఇబ్బంది పడేవాడు. కుల్దీప్ను బెంచ్కే పరిమితం చేయడం తెలివిగల నిర్ణయం అయితే కానేకాదు’’ అని అశ్విన్.. కెప్టెన్ శుబ్మన్ గిల్, హెడ్కోచ్ గౌతం గంభీర్పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు. చదవండి: రోహిత్ భయ్యా ఏ తప్పూ చేయలేదు.. నన్నెందుకు కెప్టెన్ చేశారు? -
రోహిత్ శర్మకు అనుకూలం.. టీమిండియాకు వ్యతిరేకం
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియాకు (Team India) క్లీన్ స్వీప్ భయం పట్టుకుంది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో (India vs Australia) తొలి రెండు మ్యాచ్ల్లో ఓడి, ఇదివరకే సిరీస్ కోల్పోయిన భారత జట్టు.. రేపు (అక్టోబర్ 25) సిడ్నీ వేదికగా జరుగబోయే మూడో వన్డేలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.చెత్త రికార్డుఅయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియాను గత రికార్డులు కలవరపెడుతున్నాయి. సిడ్నీలో భారత జట్టుకు చాలా చెత్త రికార్డు ఉంది. ఈ మైదానంలో ఆస్ట్రేలియాతో ఆడిన 19 వన్డేల్లో భారత్ కేవలం రెండింట మాత్రమే గెలిచింది. 16 మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా గెలవగా.. ఓ మ్యాచ్లో ఫలితం రాలేదు.ప్రస్తుతం ఈ రికార్డే భారత క్రికెట్ అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఒకవేళ సిడ్నీలో చరిత్ర రిపీటై భారత్ 17వ సారి ఓడితే ఆస్ట్రేలియా చేతిలో తొలి వైట్వాష్ (వన్డేల్లో) ఎదురవుతుంది.రోహిత్కు అనుకూలంసిడ్నీ మైదానంలో టీమిండియాకు వ్యతిరేకంగా ఉన్న ట్రాక్ రికార్డు, స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ విషయానికి వచ్చే సరికి అనుకూలంగా ఉంది. హిట్ మ్యాన్ గత నాలుగు వన్డేల్లో ఇక్కడ సెంచరీ, 2 అర్ద సెంచరీలు చేశాడు. చివరిగా (2019) ఆడిన మ్యాచ్లో మెరుపు సెంచరీ (133) బాదాడు.సిడ్నీలో గత నాలుగు వన్డే ఇన్నింగ్స్ల్లో ఆస్ట్రేలియాపై రోహిత్ స్కోర్లు..133 (129)99 (108)34 (48)66 (87)కాగా, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత జట్టు తొలి రెండు వన్డేల్లో పరాజయాలపాలై మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కోల్పోయింది. సిడ్నీ వేదికగా రేపు జరుగబోయే మ్యాచ్లో ఎలాగైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భారత జట్టు పట్టుదలగా ఉంది.విరాట్ వైఫల్యాలుఏడు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత) ఈ సిరీస్తోనే రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి అంచనాలను తలకిందులు చేస్తూ దారుణంగా విఫలమయ్యాడు. రెండు వన్డేల్లో డకౌటై అభిమానుల తీవ్ర నిరాశకు గురి చేశాడు. తొలి వన్డేలో 8 బంతులు, రెండో వన్డేలో 4 బంతులు ఆడిన కోహ్లి ఖాతా కూడా తెరవలేకపోయాడు. అతని 17 ఏళ్ల కెరీర్లో వరుసగా రెండు మ్యాచ్ల్లో డకౌట్ కావడం ఇదే మొదటిసారి.మరో పక్క కోహ్లితో పాటే ఏడు నెలల విరామం తర్వాత బరిలోకి దిగిన రోహిత్ శర్మ మాత్రం తొలి వన్డేలో (8) విఫలమైనా, రెండో వన్డేలో అత్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. పిచ్ నుంచి ఎలాంటి సహకారం లభించనప్పుడు చాలా బాధ్యతగా ఆడి అర్ద సెంచరీ (73) చేశాడు. రోహిత్ నిలకడగా ఆడటంతోనే తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ గౌరవప్రదమైన స్కోర్ (264) చేయగలిగింది. అయితే బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడం, కీలక సమయాల్లో క్యాచ్లు నేలపాలు చేయడంతో భారత్ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. చదవండి: భారత్తో మూడో వన్డే.. ఆసీస్ అన్క్యాప్డ్ ప్లేయర్కు చోటు.. ఎవరీ ఆల్రౌండర్? -
దిగజారిన పీసీబీ చీఫ్ నఖ్వీ!... ఈసారి..
ఆసియా టీ20 కప్-2025 టోర్నమెంట్లో చాంపియన్గా నిలిచిన టీమిండియా ఇప్పటి వరకు ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్, ఆసియా క్రికెట్ మండలి (ACC) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ ఇందుకు ప్రధాన కారణం.పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్తాన్ (IND vs PAK) తొలిసారిగా ఆసియా కప్ టోర్నీలో తొలిసారిగా ముఖాముఖి తలపడ్డాయి. ఈ క్రమంలో దాయాది దుశ్చర్యలకు నిరసనగా టీమిండియా ఆటగాళ్లు తొలుత లీగ్ దశలో.. పాక్ ప్లేయర్లతో షేక్హ్యాండ్ (No ShakeHand)కు నిరాకరించారు.పప్పులు ఉడకవని తెలుసుకునిదీనిని అవమానంగా భావించిన పాక్ బోర్డు.. టీమిండియాను నిందల పాలు చేయాలని ప్రయత్నాలు చేసింది. భారత్తో మ్యాచ్కు అంపైర్గా వ్యవహరించిన వ్యక్తిని తప్పించాలంటూ రచ్చ చేసింది. అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) దిగిరాకపోవడంతో తమ పప్పులు ఉడకవని తెలుసుకుని మిన్నకుండిపోయింది.అయితే, సూపర్-4 మ్యాచ్లోనూ భారత జట్టు షేక్హ్యాండ్కు నిరాకరించింది. ఇందుకు ప్రతిగా పాక్ ఆటగాళ్లు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. గన్ పేలుస్తున్నట్లు సెలబ్రేషన్స్ చేసుకుంటూ వక్రబుద్ధి చాటుకున్నారు. ఇక ఫైనల్లోనూ దాయాది పాక్తో.. సెప్టెంబరు 28న తలపడిన టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీ గెలుచుకుంది.నఖ్వీ చేతుల మీదుగా తీసుకోమునిబంధనల ప్రకారం తానే టీమిండియాకు ట్రోఫీ అందజేస్తానంటూ మొహ్సిన్ నఖ్వీ ముందుకు వచ్చాడు. అయితే, అతడు కేవలం పీసీబీ, ఏసీసీ చీఫ్ మాత్రమే కాకుండా.. పాక్ మంత్రి కూడా కావడంతో భారత జట్టు అతడి చేతుల మీదుగా కప్ అందుకునేందుకు నిరాకరించింది.ఈ క్రమంలో ట్రోఫీతో పాటు.. మెడల్స్ కూడా తనతోపాటు ఎత్తుకెళ్లిన నఖ్వీ ఇంత వరకు వాటిని తిరిగి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవల నఖ్వీకి ఇ-మెయిల్ పంపింది. ట్రోఫీ తమకు అప్పగించకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఐసీసీ వద్దే పంచాయతీ తేలుతుందిఅయినప్పటికీ నఖ్వీ బుద్ధి మారలేదు. తన చేతుల మీదుగానే ట్రోఫీ ఇస్తానని.. ఇందుకోసం బీసీసీఐ ఆటగాళ్లను తన దగ్గరకు పంపించాలంటూ అహంకారం ప్రదర్శించాడు. దీంతో ఐసీసీ వద్దే పంచాయతీ తేల్చుకునేందుకు బీసీసీఐ సిద్ధమైంది.తాజా సమాచారం ప్రకారం.. బీసీసీఐ వర్గాలు ANIతో మాట్లాడుతూ.. నఖ్వీ ట్రోఫీని ఏసీసీ ప్రధాన కార్యాలయం నుంచి తరలించాడని పేర్కొన్నాయి. ‘‘కొన్నిరోజుల క్రితం బీసీసీఐ అధికారి ఒకరు యూఏఈలో ఉన్న ఏసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు.మరింత దిగజారిన పీసీబీ చీఫ్ నఖ్వీ!... ఈసారి..ఏసీసీ ఆఫీస్లో ట్రోఫీ ఉందా అని ఆరా తీశారు. అయితే, స్టాఫ్ చెప్పిన సమాధానం విని ఆయన ఆశ్చర్యపోయారు. ట్రోఫీని ఇక్కడి నుంచి తరలించి.. అబుదాబిలో ఓ చోటు నఖ్వీ దాచిపెట్టాడని వాళ్లు చెప్పారు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో గెలిచిన జట్టు ట్రోఫీని ఎత్తుకెళ్లిన నఖ్వీ మరీ ఇంతలా దిగజారిపోతాడని అనుకోలేదంటూ నెటిజన్లు అతడిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.కాగా ఆసియా కప్-2025 టోర్నీలో లీగ్ దశలో పాక్ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత్.. సూపర్-4 మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఫైనల్లో ఐదు వికెట్ల తేడాతో గెలిచి టైటిల్ కైవసం చేసుకుంది. చదవండి: అతడు అదరగొట్టాడు.. కాబట్టి నితీశ్ రెడ్డిపై వేటు పడొచ్చు: మాజీ కెప్టెన్ -
భారత్తో మూడో వన్డే.. ఆసీస్ అన్క్యాప్డ్ ప్లేయర్కు చోటు.. ఎవరీ ఆల్రౌండర్?
స్వదేశంలో ఆస్ట్రేలియా సత్తా చాటింది. టీమిండియాతో మూడు వన్డేల సిరీస్ను 2-0 (IND vs AUS 2025 ODIs)తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య సిడ్నీ వేదికగా శనివారం నామమాత్రపు మూడో వన్డే జరుగనుంది.ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టులో కీలక మార్పులు చేసింది. ఆల్రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ (Jack Edwards)కు జట్టులో చోటిచ్చింది. దేశీ క్రికెట్లో అదరగొడుతూ సూపర్ ఫామ్లో ఉన్న ఈ న్యూ సౌత్వేల్స్ ఆటగాడిని తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక చేసింది. మార్నస్ లబుషేన్ స్థానంలో అతడిని జట్టులోకి తీసుకుంది. మరోవైపు.. నామమాత్రపు ఆఖరి వన్డేలో మ్యాట్ కుహ్నెమన్కు కూడా ఆసీస్ యాజమాన్యం జట్టులో స్థానం కల్పించింది.ఇంతకీ ఎవరీ జాక్ ఎడ్వర్డ్స్?అండర్-19 వరల్డ్కప్-2018లో బ్యాట్, బంతితో మెరిసిన జాక్ ఎడ్వర్డ్స్ ఆస్ట్రేలియా రన్నరప్గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ 216 పరుగులు చేయడంతో పాటు ఐదు వికెట్లు పడగొట్టాడు.ఆసీస్ వన్డే కప్ చరిత్రలోనే..ఈ క్రమంలో ఫామ్ను కొనసాగిస్తూ ఎడ్వర్డ్స్ ఆస్ట్రేలియా డొమెస్టిక్ వన్డే టోర్నీలోనూ సత్తా చాటాడు. ఆసీస్ వన్డే కప్ చరిత్రలో అత్యంత పిన్న వయసు (18 ఏళ్లు)లో సెంచరీ చేసిన క్రికెటర్గా ఈ కుడిచేతి వాటం బ్యాటర్ రికార్డు సాధించాడు.ఏడేళ్ల క్రితం క్వీన్స్లాండ్పై ఈ న్యూ సౌత్వేల్స్ బ్యాటర్ 112 బంతుల్లోనే 116 పరుగులు సాధించాడు. అప్పటికి ఎడ్వర్డ్స్ వయసు 18 ఏళ్ల 165 రోజులు మాత్రమే కావడం గమనార్హం.ఇండియా- ఎ జట్టుతో వన్డేలలో అదరగొట్టిఇక ఇటీవల ఇండియా- ఎ జట్టుతో అనధికారిక వన్డే సిరీస్లోనూ ఎడ్వర్డ్స్ అదరగొట్టాడు. తొలి వన్డే మిస్సయినప్పటికీ.. రెండో వన్డేలో మాత్రం అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ల వికెట్లు కూల్చాడు. ఓవరాల్గా 4/56 గణాంకాలతో అదరగొట్టాడు.అంతేకాదు.. 75 బంతుల్లోనే 89 పరుగులతో ఆకట్టుకున్నాడు. అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా బౌలింగ్లోనూ చితక్కొట్టి తనను తాను నిరూపించుకున్నాడు.కాగా ఎడ్వర్డ్స్ అన్న మిక్కీ ఎడ్వర్డ్స్ కూడా క్రికెటరే. ఆస్ట్రేలియా తరఫున అన్ని ఫార్మాట్లలోనూ దేశీ క్రికెట్ ఆడాడు. ఇక 2018లో బిగ్ బాష్ లీగ్లో అడుగుపెట్టిన జాక్ ఎడ్వర్డ్స్ నాటి నుంచి పొట్టి ఫార్మాట్లో తన ప్రభంజనం కొనసాగిస్తూనే ఉన్నాడు.సిడ్నీ సిక్సర్స్ 2019-20, 2020-21 సీజన్లలో టైటిల్ గెలవడంలో జాక్ తన వంతు పాత్ర పోషించాడు. ఇక వాషింగ్టన్ ఫ్రీడమ్ తరఫున గత రెండు ఎడిషన్లలోనూ అదరగొట్టాడు. ఇప్పటి వరకు 63 టీ20 మ్యాచ్లలో 25 ఏళ్ల జాక్ ఎడ్వర్డ్స్ 700 పరుగులు చేయడంతో పాటు 33 వికెట్లు కూల్చడం విశేషం.భారత్తో మూడో వన్డేకు ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, జాక్ ఎడ్వర్డ్స్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మాథ్యూ కుహ్నెమన్, మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మ్యాట్ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడం జంపా.చదవండి: -
చరిత్ర సృష్టించిన స్మృతి మంధన
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా ఆసీస్ దిగ్గజం మెగ్ లాన్నింగ్తో (Meg Lanning) వరల్డ్ రికార్డును షేర్ చేసుకుంది. ఈ ఇద్దరూ తలో 17 సెంచరీలు చేశారు. లాన్నింగ్ వన్డేల్లో 15, టీ20ల్లో 2 సెంచరీలు చేయగా.. మంధన వన్డేల్లో 14, టెస్ట్ల్లో 2, టీ20ల్లో ఓ సెంచరీ చేసింది.మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా నిన్న (అక్టోబర్ 23) న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో సూపర్ సెంచరీ చేసిన మంధన లాన్నింగ్ పేరిట ఉండిన ప్రపంచ రికార్డును సమం చేసింది. ఇకపై మంధన ఏ ఫార్మాట్లో అయినా సెంచరీ చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక శతకాల రికార్డు ఆమె పేరిటే సోలోగా ఉంటుంది.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన టాప్-5 బ్యాటర్లు..స్మృతి మంధన-17 (వన్డేల్లో 14, టెస్ట్ల్లో 2, టీ20ల్లో 1)మెగ్ లాన్నింగ్-17 (వన్డేల్లో 15, టీ20ల్లో 2)సూజీ బేట్స్-13 (వన్డేల్లో 13)ట్యామీ బేమౌంట్-12 (వన్డేల్లో 12)నాట్ సీవర్ బ్రంట్-10 (వన్డేల్లో 10)పై జాబితాలో మంధన మినహా మిగతా నలుగురు ఏదైన ఒకటి లేదా రెండు ఫార్మాట్లలో మాత్రమే సెంచరీలు చేశారు. మంధన మాత్రమే మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసి ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అనిపించుకుంది.న్యూజిలాండ్పై తాజా సెంచరీతో మంధన మరో రికార్డు కూడా సమం చేసింది. ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ప్లేయర్గా తజ్మిన్ బ్రిట్స్తో (సౌతాఫ్రికా) పాటు ప్రపంచ రికార్డును పంచుకుంది. తజ్మిన్, మంధన ఇద్దరు ఈ ఏడాది తలో 5 సెంచరీలు చేశారు.ఈ సెంచరీతో మంధన వన్డేల్లో అత్యధిక సెంచరీలు (14) చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ క్రమంలో సూజీ బేట్స్ను (13) దాటి, అగ్రస్థానంలో ఉన్న మెగ్ లాన్నింగ్కు (15) మరింత చేరువయ్యింది.న్యూజిలాండ్తో నిన్న జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టీమిండియా 53 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్) గెలుపొంది సెమీస్కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్లు ప్రతిక (122), స్మృతి మంధన (109) సెంచరీలతో చెలరేగడంతో 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. వన్డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగెజ్ (76 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది.అనంతరం భారీ లక్ష ఛేదనలో న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు మాత్రమే చేయగలిగింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో బ్రూక్ హాలీడే (81), ఇసబెల్లా (65 నాటౌట్) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో భారత్కు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీస్ బెర్త్ దక్కించుకున్న విషయం తెలిసిందే. -
టీమిండియా ప్లేయర్ ప్రపంచ రికార్డు
భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ ప్రతిక రావల్ (Pratika Rawal) ఖాతాలో ఓ ప్రపంచ రికార్డు చేరింది. వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) భాగంగా నిన్న న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో సూపర్ సెంచరీ చేసిన ఆమె.. వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ప్లేయర్గా ఆస్ట్రేలియాకు చెందిన లిండ్సే రీలర్తో ప్రపంచ రికార్డును షేర్ చేసుకుంది. లిండ్సే, ప్రతిక ఇద్దరూ 23 ఇన్నింగ్స్ల్లోనే 1000 పరుగులు పూర్తి చేశారు. సాధారణంగా ఆస్ట్రేలియా ప్లేయర్లతో నిండుకుపోయే ఇలాంటి రికార్డులలో ప్రతిక చేరడం గమనార్హం. వన్డేల్లో తొలి 1000 పరుగులను అత్యంత వేగంగా పూర్తి చేసిన టాప్-5 ప్లేయర్ల జాబితాలో ప్రతిక, లిండ్సే తర్వాత ముగ్గురూ ఆస్ట్రేలియన్లే ఉన్నారు. నికోల్ బోల్టన్, మెగ్ లాన్నింగ్ తలో 25 ఇన్నింగ్స్ల్లో ఈ మైలురాయిని తాకగా.. బెలిండా క్లార్క్ 27 ఇన్నింగ్స్ల్లో చేరుకుంది.25 ఏళ్ల ప్రతిక గతేడాది (2024) డిసెంబర్లో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. స్వల్ప కెరీర్లో తాజా ఇన్నింగ్స్ (న్యూజిలాండ్పై) సహా ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్లు ఆడింది. ఢిల్లీకి చెందిన ప్రతిక పదేళ్ల నుంచే క్రికెట్ ఆడటం ప్రారంభించింది. పలు దశలను దాటుకుంటూ ప్రస్తుతం టీమిండియాలో కీలక సభ్యురాలిగా కొనసాగుతుంది.ప్రస్తుత ప్రపంచకప్లోనూ ప్రతిక అద్భుతమైన టచ్లో ఉంది. 6 మ్యాచ్ల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 51.33 సగటున 308 పరుగులు చేసి టోర్నీలో సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతుంది. ఓవరాల్ కెరీర్లో 23 వన్డేలు ఆడిన ప్రతిక 2 సెంచరీలు, 7 అర్ద సెంచరీల సాయంతో 50.45 సగటున 1110 పరుగులు చేసింది.నిన్న న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టీమిండియా 53 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్) గెలుపొంది సెమీస్కు అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్లు ప్రతిక (122), స్మృతి మంధన (109) సెంచరీలతో చెలరేగడంతో 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. వన్డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగెజ్ (76 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది.అనంతరం భారీ లక్ష ఛేదనలో న్యూజిలాండ్ అనూహ్య పోరాటం ప్రదర్శించింది. 44 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేయగలిగింది. బ్రూక్ హాలీడే (81), ఇసబెల్లా (65 నాటౌట్) న్యూజిలాండ్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో భారత్కు ముందు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీస్ బెర్త్ దక్కించుకున్న విషయం తెలిసిందే.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఆసీస్ వరల్డ్ రికార్డు బ్రేక్ -
అతడు అదరగొట్టాడు.. నితీశ్ రెడ్డిపై వేటు పడొచ్చు: మాజీ కెప్టెన్
తొలి వన్డేతో పోలిస్తే మెరుగైన బ్యాటింగ్... బౌలింగ్లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన... విజయావకాశాలు లభించినా సరే, కీలక క్షణాల్లో పట్టు వదలడంతో చివరకు టీమిండియాకు నిరాశ తప్పలేదు. అడిలైడ్లో గురువారం ఆసక్తికరంగా సాగిన రెండో వన్డే (IND vs AUS)లో ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో గిల్ సేనను ఓడించి.. సిరీస్ను 2–0తో సొంతం చేసుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది.రోహిత్, శ్రేయస్ అర్ధ శతకాలు వృథారోహిత్ శర్మ (97 బంతుల్లో 73; 7 ఫోర్లు, 2 సిక్స్లు), శ్రేయస్ అయ్యర్ (77 బంతుల్లో 61; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించగా... అక్షర్ పటేల్ (41 బంతుల్లో 44; 5 ఫోర్లు) రాణించాడు. పేసర్ హర్షిత్ రాణా 18 బంతుల్లో 24 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఆసీస్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆడమ్ జంపా (Adam Zampa- 4/60) నాలుగు వికెట్లు పడగొట్టగా... బార్త్లెట్ 3, స్టార్క్ 2 వికెట్లు తీశారు. అనంతరం ఆస్ట్రేలియా 46.2 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసి విజయాన్నందుకుంది. మాథ్యూ షార్ట్ (74; 4 ఫోర్లు, 2 సిక్స్లు), కూపర్ కనోలీ (61 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేయగా, మిచెల్ ఒవెన్ (36; 2 ఫోర్లు, 3 సిక్స్లు) దూకుడుగా ఆడాడు.షార్ట్, కనోలీలదే కీలక పాత్రఅయితే, ఛేదనలో ఆసీస్ కూడా కొంత ఇబ్బంది పడింది. 132/4 వద్ద భారత్కు పట్టు బిగించే అవకాశం వచ్చింది. కానీ.. షార్ట్, కనోలీ కలిసి జట్టును గెలుపు దిశగా నడిపించారు. చివర్లో 14 పరుగుల వ్యవధిలో ఆసీస్ మూడు వికెట్లు కోల్పోవడంతో ఉత్కంఠ పెరిగింది. కానీ కనోలీ (Cooper Connolly) ప్రశాంతంగా ఆడి మ్యాచ్ను ముగించాడు.భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ రెండేసి వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, మొహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. ఇక బ్యాటింగ్లో కేవలం ఎనిమిది పరుగులే చేసి నిరాశపరిచిన ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి.. బౌలింగ్ పరంగానూ తేలిపోయాడు. మూడు ఓవర్లు బౌల్ చేసి ఏకంగా 24 పరుగులు ఇచ్చాడు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ నితీశ్ రెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ను ఆడించాల్సింది. ఏదేమైనా తదుపరి సిడ్నీ వన్డేకు నితీశ్ రెడ్డిని తప్పిస్తారో లేదంటే ఇంకెవరిపైనైనా వేటు వేస్తారో తెలియదు.అతడు అదరగొట్టాడు.. నితీశ్ రెడ్డిపై వేటు పడొచ్చునైపుణ్యం లేకుండా ఇలాంటి బౌలింగ్తో నితీశ్ రెడ్డి నిలదొక్కుకోలేడు. ఇలాగే ఉంటే బ్యాటర్లు అతడి బౌలింగ్ను చితక్కొడతారు. బ్యాటింగ్లో సిక్సర్లు బాదడం వరకు సరే.. కానీ బౌలింగ్ పరంగానూ రాణించాలి కదా!ఒకవేళ కావాలంటే హర్షిత్ను ఎనిమిది, కుల్దీప్ను తొమ్మిదో స్థానంలో ఆడించండి. హర్షిత్ ఈ వన్డేలో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కానీ నితీశ్ నిరాశపరిచాడు. హర్షిత్ రెండు వికెట్లు కూడా తీశాడు. కాబట్టి అతడిని తప్పించలేరు.అందుకే కుల్దీప్ను ఆడించాలంటే నితీశ్ రెడ్డిపై వేటు పడకతప్పకపోవచ్చని అనిపిస్తోంది’’ అని చిక్కా అభిప్రాయపడ్డాడు. కాగా హర్షిత్ రాణా ఎంపికను తప్పుబడుతూ చిక్కా.. హెడ్కోచ్ గౌతం గంభీర్ను విమర్శించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ యువ పేసర్ ప్రదర్శనకు ఫిదా అయి.. అతడిని ప్రశంసించడం గమనార్హం.చదవండి: WTC: ఒక్క మ్యాచ్తో మారిన పాక్ రాత.. టీమిండియాకు బూస్ట్! -
రోహిత్ భయ్యా ఏ తప్పూ చేయలేదు.. నన్నెందుకు కెప్టెన్ చేశారు?
వన్డే కెప్టెన్గా టీమిండియా పగ్గాలు చేపట్టిన శుబ్మన్ గిల్ (Shubman Gill)కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్ (IND vs AUS ODIS 2025)ను భారత్ కోల్పోయింది. తొలి రెండు వన్డేల్లో ఓడి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది.ఈ నేపథ్యంలో వన్డే సారథిగా తొలి సిరీస్లోనే వరుసగా రెండు వన్డేలు ఓడిన ఆరో భారత కెప్టెన్గా గిల్ నిలిచాడు. అతడి కంటే ముందు అజిత్ వాడేకర్, దిలీప్ వెంగ్సర్కార్, క్రిస్ శ్రీకాంత్, మొహమ్మద్ అజారుద్దీన్, కేఎల్ రాహుల్ ఈ చేదు అనుభవాన్ని చవిచూశారు.రోహిత్ శర్మపై వేటు వేసికాగా భారత్కు టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (వన్డే)-2025 అందించిన రోహిత్ శర్మ (Rohit Sharma)పై వేటు వేసి మరీ.. బీసీసీఐ గిల్కు పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అడిలైడ్లో రెండో వన్డేలో గిల్ సేన ఓటమి నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ తనదైన శైలిలో స్పందించాడు.రోహిత్ భయ్యా ఏ తప్పూ చేయలేదు..‘‘కొత్తగా పగ్గాలు చేపట్టిన ప్రతి కెప్టెన్ మదిలో ఇలాంటి ఆలోచనలే ఉంటాయి. గిల్ కూడా ఇందుకు అతీతం కాదు. అతడి జట్టులో ఇప్పుడు రోహిత్ శర్మ ఉన్నాడు. ఇప్పటికే నాయకుడిగా తనను తాను నిరూపించుకున్న దిగ్గజం. అతడి సారథ్యంలో గిల్ ఆడాడు. కెప్టెన్గా రోహిత్ ఎలాంటి తప్పూ చేయలేదని గిల్కు బాగా తెలుసు.అయినా సరే.. అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించారనీ తెలుసు. హోటల్ రూమ్లో నిద్రకు ఉపక్రమించే ముందు బహుశా గిల్ ఇదే అనుకుంటూ ఉంటాడు. ‘రోహిత్ భాయ్ ఎలాంటి తప్పూ చేయలేదు. అయినా ఎందుకిలా చేశారు?నన్నెందుకు కెప్టెన్ చేశారు?నన్ను సమర్థిస్తున్న వాళ్లు ఒక్కసారైనా రోహిత్ భాయ్ గురించి ఆలోచించారా? ఆయన రెండు ట్రోఫీలు గెలిచాడు. అయినా సరే కెప్టెన్గా వేటు వేశారు. కొత్త కెప్టెన్గా నన్ను ఎంపిక చేశారు’ అనే గిల్ట్తో సతమతమవుతూ ఉంటాడు’’ అని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ఇక టీమిండియా సిరీస్ ఓటమిపై స్పందిస్తూ..ఆ విషయం గుర్తే లేదు ‘‘వరుస సిరీస్లు, ప్రయాణ బడలిక. రోహిత్, కోహ్లి వంటి దిగ్గజాలను లీడ్ చేయడం వంటికి గిల్కు పెద్ద సవాలు. వన్డే కెప్టెన్గా గిల్ ఇప్పుడే బాధ్యతలు తీసుకున్నాడు. జట్టు మార్పు చెందే ప్రక్రియలో ఇలాంటివి సహజమే.గిల్ కాస్త ఒత్తిడికి లోనై ఉంటాడు. అతడి సారథ్యంలో మనం వన్డే సిరీస్ కోల్పోయాం. చివరగా ఎప్పుడు ఇది జరిగిందో కూడా ఎవరికీ గుర్తులేదు. గిల్ కెప్టెన్సీలో ఆరంభంలోనే ఇది జరిగింది’’ అని కైఫ్ చెప్పుకొచ్చాడు.చదవండి: WTC: ఒక్క మ్యాచ్తో మారిన పాక్ రాత.. టీమిండియాకు బూస్ట్!Oh my word! 🤩@ImRo45 is back to his very best. Just what #TeamIndia needed. 👏#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/P95TUGWl95— Star Sports (@StarSportsIndia) October 23, 2025 -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఆసీస్ వరల్డ్ రికార్డు బ్రేక్
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో భారత జట్టు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా.. తమ సెమీస్ బెర్త్ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్లో హర్మన్ సేన ఆల్రౌండ్షోతో అదరగొట్టింది.వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 49 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన మన అమ్మాయిల జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లకు 340 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన(109), ప్రతికా రావల్(122) అద్భుతమైన సెంచరీలతో సత్తాచాటగా.. జెమీమా రోడ్రిగ్స్ (76 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది.అనంతరం మళ్లీ వర్షం అంతరాయం కలిగించడంతో కివీస్ లక్ష్యాన్ని 44 ఓవర్లలో 325గా నిర్ణయించారు. కానీ న్యూజిలాండ్ లక్ష్య చేధనలో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 271 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఈ ఓటమితో కివీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ మ్యాచ్లో అదరగొట్టిన భారత మహిళల జట్టు ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఆసీస్ రికార్డు బ్రేక్..మహిళల వన్డే వరల్డ్కప్లో న్యూజిలాండ్పై అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ పేరిట ఉండేది. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్లోనే ఇండోర్ వేదికగా కివీస్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 326 పరుగులు చేసింది. తాజా మ్యాచ్లో 340 రన్స్ చేసిన టీమిండియా.. ఆసీస్ రికార్డును బ్రేక్ చేసింది.చదవండి: రోహిత్ నీకు ఇది ఫేర్వెల్ మ్యాచా? ఒక్క ఫోటో అయినా పెట్టు: గంభీర్ -
‘నాకు కాదు!.. తనకే ఇవ్వాల్సింది.. సెమీస్ చేరడం బిగ్ రిలీఫ్’
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 (ICC ODI WC 2025) టోర్నమెంట్లో భారత్ సెమీ ఫైనల్ చేరింది. న్యూజిలాండ్తో గురువారం నాటి మ్యాచ్లో 53 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత ఈ మేరకు అద్భుత గెలుపుతో టైటిల్ దిశగా ప్రయాణం మొదలుపెట్టింది.శతకాలతో చెలరేగిన ఓపెనర్లుకాగా కివీస్ జట్టు (IND W vs NZ W)పై భారత్ విజయంలో భారత ఓపెనర్లు ప్రతికా రావల్ (134 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్లు- 122), స్మృతి మంధాన (95 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్లు- 109)లది కీలక పాత్ర. ఇద్దరూ శతకాలతో చెలరేగి జట్టుకు భారీ స్కోరు అందించారు. వీరికి తోడుగా వన్డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (55 బంతుల్లో 76 నాటౌట్) కూడా అద్భుత రీతిలో రాణించింది.ఇక ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించిన కారణంగా.. ఇన్నింగ్స్ను 49 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో భారత్ మూడు వికెట్ల నష్టానికి 340 పరుగులు స్కోరు చేయగా.. డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం కివీస్ లక్ష్యాన్ని 44 ఓవర్లలో 325 పరుగులుగా నిర్దేశించారు.271 పరుగులే చేసి.. కివీస్ అవుట్అయితే, భారత బౌలర్ల ధాటికి తాళలేక నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయిన న్యూజిలాండ్ 271 పరుగుల వద్దే నిలిచిపోయింది. ఫలితంగా నవీ ముంబైలో హర్మన్సేన జయభేరి మోగించి సెమీస్లో అడుగుపెట్టింది.సెమీస్ చేరడం బిగ్ రిలీఫ్ఇక ఈ మ్యాచ్లో భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana)ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో విజయానంతరం స్మృతి స్పందిస్తూ.. ‘‘నాకౌట్స్కు అర్హత సాధించడం ఉపశమనం కలిగించింది. గత మూడు మ్యాచ్లలో మేము ఓడిపోయాం. అది గడ్డు దశ. మంచిగానే ఆడినా.. ఆ మ్యాచ్లలో మేము పరాజయం పాలయ్యాము.‘నాకు కాదు!.. తనకే ఇవ్వాల్సిందిఅయితే, ఈరోజు మాత్రం అనుకూలా ఫలితాన్ని రాబట్టగలిగాము. అయితే, ఈ అవార్డు నాకు ఇచ్చే కంటే ప్రతికాకు ఇస్తే బాగుండేది. నాతో పాటు ప్రతికా ఇందుకు అర్హురాలు. నిజంగా నేనైతే ఈ విషయంలో ఆశ్చర్యపోయాను. ఆమెకే అవార్డు ఇస్తారనుకున్నా’’ అని తెలిపింది.కాగా స్మృతి- ప్రతికా జోడీ ఈ ఏడాదిలో ఇప్పటికే 1557 పరుగులు సాధించింది. భారత పురుషుల క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండుల్కర్- సునిల్ గావస్కర్ జంట 1998లో 1635 పరుగులు చేయగా.. వారి రికార్డుకు స్మృతి- ప్రతికా ఇప్పుడు చేరువయ్యారు.ఇక భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న వన్డే వరల్డ్కప్ టోర్నీలో నాలుగు సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, భారత్ టాప్-4లో అడుగుపెట్టగా.. న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఎలిమినేట్ అయ్యాయి. చదవండి: IND vs AUS: భారత్తో టీ20 సిరీస్.. ఆసీస్ జట్టు ప్రకటన! విధ్వంసకర వీరుడు వచ్చేశాడుSemi-Final Bound! 😍🤩Deepti Sharma wraps it up as #TeamIndia storm into their 5th Women’s Cricket World Cup semi-final! 👍🏻Watch them next #CWC25 👉 #INDvBAN | SUN, 26th OCT, 2 PM pic.twitter.com/F9sKcNx8Lt— Star Sports (@StarSportsIndia) October 23, 2025 -
రోహిత్ నీకు ఇది ఫేర్వెల్ మ్యాచా? ఒక్క ఫోటో అయినా పెట్టు: గంభీర్
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమి పాలైనప్పటికి.. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం ఆకట్టుకున్నాడు. తొలి వన్డేలో విఫలమైన హిట్మ్యాన్ రెండో మ్యాచ్లో తన మార్క్ చూపించాడు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన రోహిత్ క్రీజులో నిలదొక్కున్నాక మాత్రం తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేస్తూ అలరించాడు.ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన జట్టు తన అద్బుత ఇన్నింగ్స్తో రోహిత్ ఆదుకున్నాడు. శ్రేయస్ అయ్యర్తో కలిసి మూడో వికెట్కు 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 97 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో 73 పరుగులు చేసిన రోహిత్ శర్మ స్టార్క్ బౌలింగ్లో బౌండరీ వద్ద క్యాచ్ రూపంలో అవుటయ్యాడు. అయితే మ్యాచ్ ముగిశాక టీమ్ హోటల్కు వెళ్లే క్రమంలో రోహిత్ శర్మను భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆటపట్టించాడు."రోహిత్.. అందరికీ ఇదే నీ ఫేర్వెల్ మ్యాచ్ అనిపిస్తోంది. ఒక్క ఫొటో అయినా పెట్టు" అని గంభీర్ అన్నాడు. అందుకు రోహిత్ నవ్వుతూ తన రూమ్కు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఆసీస్ టూర్కు ముందు వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ను తప్పించిన సంగతి తెలిసిందే.దీంతో రోహిత్ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తుపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పటికే టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన హిట్మ్యాన్ కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే వన్డే ప్రపంచకప్-2027లో రోహిత్ ఆడుతాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కూడా ఎటువంటి స్పష్టత లేదు. వరల్డ్కప్నకు ఇంకా రెండేళ్ల సమయం ఉండడంతో అప్పటికి ఈ ముంబై ఆటగాడి వయస్సు నాలభైకి చేరుకుంటుంది. ఒకవేళ రోహిత్ ఫిట్గా ఉండి, ఫామ్లో ఉంటే వరల్డ్కప్లో ఆడే అవకాశముంది. అంతేకాకుండా వరల్డ్కప్ జట్టు ఎంపికకు అందుబాటులో ఉండాలంటే దేశవాళీ టోర్నీ విజయహాజారే ట్రోఫీలో ఆడాల్సిందేనని అగార్కర్ స్పష్టం చేశాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడో వన్డే సిడ్నీ వేదికగా శనివారం జరగనుంది. View this post on Instagram A post shared by Rohit Sharma (Fan Page) (@rohit_cha_fans45)చదవండి: వరుసగా రెండుసార్లు డకౌట్.. కోహ్లి రిటైర్మెంట్?.. గావస్కర్ స్పందన ఇదే -
విరాట్ కోహ్లి రిటైర్మెంట్?.. గావస్కర్ స్పందన ఇదే
ఆస్ట్రేలియాతో రెండో వన్డేలోనూ విరాట్ కోహ్లి (Virat Kohli) విఫలమయ్యాడు. అడిలైడ్లో మంచి రికార్డు కలిగి ఉన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ గురువారం నాటి మ్యాచ్లో మాత్రం డకౌట్ అయ్యాడు. అంతకు ముందు పెర్త్ వేదికగా తొలి వన్డేలోనూ ఈ దిగ్గజ ఆటగాడు సున్నా చుట్టడం గమనార్హం.ఈ నేపథ్యంలో అడిలైడ్ వన్డేలో కోహ్లి అవుటై.. పెవిలియన్కు చేరుతున్న క్రమంలో స్టేడియంలోని ప్రేక్షకులు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. ఇందుకు ప్రతిగా కోహ్లి సైతం గ్లోవ్స్ తీసి.. ఇక సెలవు అన్నట్లుగా మైదానం వీడాడు. అయితే, కోహ్లి చర్య రిటైర్మెంట్కు సంకేతమంటూ వదంతులు వ్యాపించాయి.రెండుసార్లు డకౌట్ అయినంత మాత్రాన..ఈ విషయంపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) స్పందించాడు. ‘‘వన్డేల్లో 52 సెంచరీలు చేశాడు. 14 వేలకు పైగా పరుగులు సాధించాడు. టెస్టుల్లోనూ 32 దాకా శతకాలు ఉన్నాయి. ఇప్పటికే వేలకు వేలు పరుగులు రాబట్టాడు.అలాంటి ఆటగాడు వరుసగా రెండుసార్లు డకౌట్ అయినంత మాత్రాన తప్పుపట్టాల్సిన అవసరం ఏమీలేదు. అతడిలో ఇంకా చాలా ఆట మిగిలే ఉంది. మున్ముందు ఇంకా ఆడతాడు. తదుపరి సిడ్నీ వన్డేలో భారీ ఇన్నింగ్స్ ఆడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.నిజానికి టెస్టు, వన్డేల్లో అడిలైడ్ కోహ్లికి ఫేవరెట్ గ్రౌండ్. అక్కడ శతకాలు బాదిన చరిత్ర అతడికి ఉంది. కాబట్టి.. సహజంగానే ఈసారి వైఫల్యాన్ని అతడితో పాటు అభిమానులూ తట్టుకోలేకపోయారు. అయినా ఆటగాడి కెరీర్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.ఆ స్పందన అమోఘంఏదేమైనా కోహ్లి మైదానాన్ని వీడుతున్న వేళ అభిమానుల నుంచి వచ్చిన స్పందన అమోఘం. ఎందుకంటే అక్కడ చాలా మంది ఆస్ట్రేలియన్లు కూడా ఉన్నారు. వారంతా కూడా భారతీయ అభిమానులతో కలిసి కోహ్లికి ఓవియేషన్ ఇచ్చారు. గొప్ప ఆటగాడికి లభించే ఆదరణకు తార్కాణం అది.ఇది చాలా చాలా ప్రత్యేకం. ఇదేమీ కోహ్లి కెరీర్కు ముగింపు కాదు. అతడు ఆటగాళ్లు కూర్చునే స్టాండ్ వైపు వెళ్లాడు. అయితే, తన పట్ల అభిమానం చూపుతున్న వారి కోసం మాత్రమే గ్లోవ్స్ తీసి వారి పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు.అంత తేలికగా ఓటమిని ఒప్పుకోడువిరాట్ కోహ్లి.. అంత తేలికగా ఓటమిని ఒప్పుకొని ఆటను వదిలేసే రకం కాదు. వరుసగా రెండుసార్లు డకౌట్ అయిన తర్వాత అతడు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అనుకుంటున్నారా? ఛాన్సే లేదు. ఉన్నత స్థాయిలోనే అతడు ఆటకు వీడ్కోలు పలుకుతాడు.సిడ్నీ మ్యాచ్ తర్వాత.. సౌతాఫ్రికాతో స్వదేశంలో వన్డే సిరీస్ ఉంది. ఇంకా చాలా మ్యాచ్లు మిగిలే ఉన్నాయి. రోహిత్ శర్మతో కలిసి విరాట్ వన్డే వరల్డ్కప్-2027 ఆడతాడనే భావిస్తున్నా. లేదంటే టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా ఫ్యాన్స్కూడా నిరాశ చెందుతారనడంలో సందేహం లేదు.ఆ ఛాన్సే లేదుఏదేమైనా కోహ్లి తన పట్ల అభిమానం చూపిన వారికి కృతజ్ఞతగా మాత్రమే గ్లోవ్స్ తీశాడు. ఒకవేళ తను సెంచరీ చేసి ఉంటే బ్యాట్ ఎత్తి అభివాదం చేసేవాడు. కాబట్టి కోహ్లి రిటైర్మెంట్ అంటూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు’’ అని గావస్కర్ స్పోర్ట్స్తక్తో పేర్కొన్నాడు. కాగా పెర్త్ వన్డేలో ఆసీస్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడిన టీమిండియా.. అడిలైడ్లో రెండు వికెట్ల తేడాతో ఓడి సిరీస్ను చేజార్చుకుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే అంతర్జాతీయ టీ20ల, టెస్టు ఫార్మాట్కు గుడ్బై చెప్పిన కోహ్లి.. వన్డేల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.చదవండి: IND vs AUS: టీమిండియా కొంపముంచిన 22 ఏళ్ల కుర్రాడుA tough day for the King of Cricket 👑@imVkohli waved goodbye to the Adelaide crowd 🏏💬#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/yAG1uQFPA8— Star Sports (@StarSportsIndia) October 23, 2025 -
సౌతాఫ్రికా బౌలర్ సంచలనం.. ఏకంగా 1000 వికెట్లతో!
సౌతాఫ్రికా స్పిన్నర్ సైమన్ హర్మర్ 36 ఏళ్ల వయస్సులో సత్తచాటుతున్నాడు. రావల్పిండి వేదికగా పాకిస్తాన్తో జగిన రెండో టెస్టులో హర్మర్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్లు పడగొట్టిన హర్మర్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం బంతితో అద్భుతం చేశాడు. ఏకంగా 6 వికెట్లు పడగొట్టి పాక్ ఓటమిని శాసించాడు.మొత్తంగా రెండు ఇన్నింగ్స్లు కలిపి 8 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా వెటరన్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 1000 వికెట్లు పూర్తి చేసుకున్న నాలుగో దక్షిణాఫ్రికా బౌలర్గా హర్మెర్ నిలిచాడు.ఇప్పటివరకు తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 234 మ్యాచ్లు ఆడిన హర్మెర్.. 1000 వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికా తరపున ఫస్ట్క్లాస్ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా దిగ్గజం చార్లీ లెవెలిన్(1013) అగ్రస్ధానంలో కొనసాగుతుండగా.. తర్వాతి స్ధానాల్లో మైక్ ప్రాక్టర్(1417), అలెన్ డొనాల్డ్(1216) ఉన్నారు.కాగా ఫస్ల్ క్రికెట్లో సంచలన ట్రాక్ రికార్డు ఉన్న హర్మెర్.. జాతీయ జట్టుకు మాత్రం అతి తక్కువ మ్యాచ్లలో ప్రాతినిథ్యం వహించాడు. 2015లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అతడు ఇప్పటివరకు కేవలం 12 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. హర్మెర్ సెలక్టర్లు ఎక్కువగా అవకాశాలు ఇవ్వలేదు. కానీ ఇటీవల కాలంలో ప్రోటీస్ టెస్టు జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నాడు. అతడి పేరిట 52 టెస్టు వికెట్లు ఉన్నాయి.వచ్చే నెలలో భారత పర్యటనకు రానున్న సౌతాఫ్రికా జట్టులో భాగం కానున్నాడు. భారత్ పిచ్లు స్పిన్కు ఎక్కువగా అనుకూలించే అవకాశమున్నందన అతడు ప్రోటీస్ జట్టుకు కీలకం కానున్నాడు.చదవండి: IND vs AUS: అతడే ఉంటే కథ వేరేలా ఉండేది.. గంభీర్ ఇకనైనా మారవా? -
WTC: ఒక్క మ్యాచ్తో మారిన పాక్ రాత.. టీమిండియాకు బూస్ట్!
సౌతాఫ్రికాతో రెండో టెస్టులో పాకిస్తాన్ (PAK vs SA 2nd Test) ఓటమి పాలైంది. రావల్పిండి వేదికగా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన దక్షిణాఫ్రికా జట్టు... ఆతిథ్య పాక్పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 (WTC) సీజన్లో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ రెండు టెస్టులు ఆడేందుకు పాకిస్తాన్కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లాహోర్లో జరిగిన తొలి టెస్టులో పాక్ గెలిచి.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకువచ్చింది. అయితే, గురువారం ముగిసిన రెండో టెస్టులో సఫారీల చేతిలో ఓడటంతో పాక్ ర్యాంకు పడిపోయింది.బాబర్ ఆజమ్ అర్ధ శతకంకాగా 2025–27 డబ్ల్యూటీసీ సైకిల్లో పాకిస్తాన్- సౌతాఫ్రికా ఇదే తొలి సిరీస్ కాగా.. ఇరు జట్లు చెరో విజయం ఖాతాలో వేసుకున్నాయి. ఇక గురువారం ఓవర్నైట్ స్కోరు 94/4తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ చివరకు 49.3 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (87 బంతుల్లో 50; 7 ఫోర్లు) అర్ధశతకం పూర్తిచేసుకున్న వెంటనే వెనుదిరగ్గా... మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. మొహమ్మద్ రిజ్వాన్ (18), సల్మాన్ ఆగా (28), నోమాన్ అలీ (0), షాహీన్ షా అఫ్రిది (0), సాజిద్ ఖాన్ (13) ఒకరి వెంట ఒకరు పెవిలియన్కు వరుస కట్టారు.దక్షిణాఫ్రికా బౌలర్లలో సిమన్ హర్మెర్ 6 వికెట్లతో అదరగొట్టగా... కేశవ్ మహరాజ్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో వీరిద్దరే కలిసి 17 వికెట్లు తీశారు. ఈ క్రమంలో హర్మెర్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో వెయ్యి వికెట్లు పూర్తి చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్గా నిలిచాడు. రెండే వికెట్లు కోల్పోయి..అనంతరం 68 పరుగులు లక్ష్యఛేదనకు రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 12.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు రికెల్టన్ (25 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), మార్క్రమ్ (42; 8 ఫోర్లు) రాణించారు.లక్ష్యం మరీ చిన్నది కావడంతో సఫారీ జట్టు ఎలాంటి తడబాటు లేకుండా రెండే వికెట్లు కోల్పోయి గమ్యాన్ని చేరుకుంది. పాక్ బౌలర్లలో నోమాన్ అలీ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 333 పరుగులు చేయగా... దక్షిణాఫ్రికా 404 పరుగులు చేసింది. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టడంతో పాటు బ్యాట్తోనూ ఆకట్టుకున్న దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, సెనురన్ ముత్తుస్వామికి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’అవార్డులు దక్కాయి.ఒక్క మ్యాచ్తో మారిన పాక్ రాత.. టీమిండియాకు బూస్ట్!ఇక ఈ విజయంతో సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ పట్టికలో నాలుగో స్థానానికి చేరుకోగా.. పాకిస్తాన్ రెండు నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. అదే విధంగా ఆస్ట్రేలియా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. శ్రీలంక మూడు నుంచి రెండుకు, టీమిండియా నాలుగు నుంచి మూడో స్థానానికి చేరుకున్నాయి. డబ్ల్యూటీసీ నిబంధనల ప్రకారం.. టెస్టు మ్యాచ్ గెలిచిన జట్టుకు పన్నెండు పాయింట్లు కేటాయిస్తారు. ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే.. ఇరుజట్లకు నాలుగు పాయింట్లు.. టై అయితే ఆరు పాయింట్లు జమచేస్తారు.అత్యధిక మ్యాచ్లు ఆడింది ఎవరంటే?డబ్ల్యూటీసీ 2025-27లో ఆసీస్ జట్టు తొలుత వెస్టిండీస్ టెస్టు సిరీస్ను 3-0తో వైట్వాష్ చేసింది. అదే విధంగా.. శ్రీలంక.. సొంతగడ్డపై బంగ్లాదేశ్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్లో ఒకటి డ్రా చేసుకుని.. రెండో మ్యాచ్ గెలిచింది.మరోవైపు.. ఇప్పటికే ఏడు మ్యాచ్లు పూర్తి చేసుకుంది టీమిండియా. తొలుత ఇంగ్లండ్ పర్యటన రూపంలో కఠిన సవాలు ఎదుర్కొన్న భారత్.. ఐదు మ్యాచ్ల సిరీస్లో రెండు గెలిచి.. ఒకటి డ్రా చేసుకుంది. మరో రెండింటిలో ఓటమిపాలైంది.ఇటీవల సొంతగడ్డపై వెస్టిండీస్తో రెండు టెస్టులు ఆడిన టీమిండియా.. 2-0తో వైట్వాష్ చేసింది. తద్వారా ఇప్పటి వరకు నాలుగు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రా ద్వారా 52 పాయింట్లు సంపాదించింది. ఇక టీమిండియాపై రెండు టెస్టులు గెలిచిన ఇంగ్లండ్.. ఒకటి డ్రా చేసుకోవడం ద్వారా మొత్తంగా 26 పాయింట్లు సాధించింది. అయితే, సౌతాఫ్రికా తాజాగా టాప్-5లోకి దూసుకురాగా.. ఇంగ్లండ్ ఆరో స్థానానికి పడిపోయింది.చదవండి: IND vs AUS: అతడే ఉంటే కథ వేరేలా ఉండేది.. గంభీర్ ఇకనైనా మారవా? -
భారత్తో టీ20 సిరీస్.. ఆసీస్ జట్టు ప్రకటన! విధ్వంసకర వీరుడు వచ్చేశాడు
టీమిండియాతో మూడో వన్డేకు ముందు ఆస్ట్రేలియా జట్టులో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ను జట్టు నుంచి సెలక్టర్లు రిలీజ్ చేశారు. కామెరాన్ గ్రీన్ గాయం కారణంగా వన్డే సిరీస్కు దూరం కావడంతో లబుషేన్ను ఆసీస్ సెలక్టర్లు ఎంపిక చేశారు. కానీ రెండు వన్డేలకు కూడా అతడు బెంచ్కే పరిమితమయ్యాడు. ఇప్పుడు నామమాత్రపు మ్యాచ్కు మందుకు జట్టు నుంచి తప్పించడంతో.. లబుషేన్ తిరిగి డొమాస్టిక్ క్రికెట్లో క్వీన్స్ల్యాండ్ తరపున ఆడేందుకు వెళ్లనున్నాడు. ఇక ఆల్ రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్, స్పిన్నర్ మాట్ కుహ్నెమాన్లను జట్టులోకి చేర్చారు. మూడో వన్డేకు స్టార్ పేసర్లు జోష్ హాజిల్వుడ్, మిచెల్ స్టార్క్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది.మాక్సీ వచ్చేశాడు..ఇక భారత్తో ఆఖరి మూడు టీ20లకు కూడా తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. తొలి రెండు టీ20లకు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకోపోయిన స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్.. రీ ఎంట్రీకి సిద్దమయ్యాడు. ఆసీస్ సెలక్టర్లు తాజాగా ప్రకటించిన జట్టులో మాక్సీ ఉన్నాడు. అదేవిధంగా యువ ఫాస్ట్ బౌలింగ్ సంచలనం మహ్లి బియర్డ్మాన్కు సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు. 20 ఏళ్ల మహ్లి బియర్డ్మాన్ గతేడాది జరిగిన అండర్-19 ప్రపంచకప్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో అతడు 10 వికెట్లు పడగొట్టి.. ఆసీస్ ఛాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. భారత్తో జరిగిన ఫైనల్లో అతడు మూడు వికెట్లు సాధించాడు. అంతేకాకుండా దేశీయ క్రికెట్లో మెరుగ్గా రాణించాడు. ఈ క్రమంలోనే అతడికి తొలిసారి ఆసీస్ జట్టులో చోటు దక్కింది. ఇక చివరి మూడు టీ20లకు సీనియర్ పేసర్ జోష్ హాజిల్వుడ్కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అతడి స్దానంలోనే బియర్డ్మాన్ ఛాన్స్ లభించింది.భారత్తో టీ20 సిరీస్కు ఆసీస్ జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్ (గేమ్స్ 1-3), జేవియర్ బార్ట్లెట్, మహ్లి బియర్డ్మాన్ (గేమ్స్ 3-5), టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్ (గేమ్స్ 4-5), నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్వుడ్ (గేమ్స్ 1-2), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్వెల్ (గేమ్స్ 3-5), మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.ఆస్ట్రేలియా వన్డే జట్టు (మూడవ మ్యాచ్): మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ కారీ, కూపర్ కోనోలీ, జాక్ ఎడ్వర్డ్స్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్, మాట్ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపాచదవండి: IND vs AUS: అతడే ఉంటే కథ వేరేలా ఉండేది.. గంభీర్ ఇకనైనా మారవా? -
టీమిండియా కొంపముంచిన 22 ఏళ్ల కుర్రాడు..
అడిలైడ్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో 2 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 265 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 46.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి చేధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను మార్ష్ సేన మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0తో సొంతం చేసుకుంది. కాగా ఆసీస్ విజయంలో ఆ జట్టు యువ ఆటగాడు కూపర్ కొన్నోలీది కీలక పాత్ర.లక్ష్య చేధనలో కొన్నోలీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 132 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సమంయలో కంగారులను షార్ట్తో కలిసి కూపర్ ఆదుకున్నాడు. షార్ట్ ఔటయ్యాక కూడా 22 ఏళ్ల యువ సంచలనం ఏ మాత్రం ఒత్తడికి లోనవ్వకుండా జట్టును గెలుపు దిశగా నడిపించాడు. ఆఖరిలో 14 పరుగుల వ్యవధిలో ఆసీస్ 3 వికెట్లు కోల్పోవడంతో ఉత్కంఠ పెరిగింది. కానీ కనోలీ ప్రశాంతంగా ఉండి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. మొత్తంగా 53 బంతులు ఎదుర్కొన్న కొన్నోలీ.. 5 ఫోర్లు, ఒక సిక్సర్తో 61 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఒకవేళ కొన్నోలీ వికెట్ను టీమిండియా సాధించి ఉంటే కథ మరో విధంగా ఉండేది. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన కూపర్పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆసీస్ కెప్టెన్ మార్ష్ సైతం అతడిని పొగడ్తలతో ముంచెత్తాడు.కూపర్ ఒక అద్భుతం. అతడు బ్యాట్తో పాటు బంతితో కూడా రాణించగలడు. ఈ మ్యాచ్లో అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. అతడు వయస్సు 22 ఏళ్లు మాత్రమే. ఖచ్చితంగా ఆసీస్ గొప్ప క్రికెటర్లలో ఒకడిగా ఎదుగుతాడని మార్ష్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో పేర్కొన్నాడు. కొన్నోలీ ఇప్పటికే మూడు ఫార్మాట్లలో ఆసీస్ జట్టు తరపున అరంగేట్రం చేశాడు.అయితే ఈ మ్యాచ్ కంటే ముందు అతడు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా అతడు ఇప్పటివరకు కేవలం 8 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. కానీ బిగ్ బాష్ లీగ్లో మాత్రం అతడికి మంచి రికార్డు ఉంది.చదవండి: IND vs AUS: అతడే ఉంటే కథ వేరేలా ఉండేది.. గంభీర్ ఇకనైనా మారవా? -
అతడే ఉంటే కథ వేరేలా ఉండేది.. గంభీర్ ఇకనైనా మారవా?
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో 2 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 2-0 తేడాతో టీమిండియా కోల్పోయింది. తొలి వన్డేతో పోలిస్తే మెరుగైన బ్యాటింగ్... బౌలింగ్లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరిచినప్పటికి కీలక క్షణాల్లో పట్టు వదలడంతో చివరికి భారత్కు నిరాశే మిగిలింది.265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్కు ఆరంభంలోనే భారత బౌలర్లకు షాకిచ్చారు. స్టార్ ఓపెనర్లు మిచెల్ మార్ష్(11), హెడ్(28) వెంటవెంటనే ఔటయ్యారు. ఆ తర్వాత మాథ్యూ షార్ట్(74), రెన్ షా(30) దూకుడుగా ఆడి భారత బౌలర్లపై ఒత్తిడి పెంచారు. రెన్ షా ఔటయ్యాక బ్యాటింగ్కు వచ్చిన అలెక్స్ క్యారీ(9) ఎక్కవసేపు క్రీజులో ఉండలేకపోయాడు. దీంతో 132/4 వద్ద భారత్కు పట్టు బిగించే అవకాశం వచ్చింది. అయితే షార్ట్, యువ ఆటగాడు కూపర్ కొన్నోలీ(61 నాటౌట్) కలిసి జట్టును గెలుపు దిశగా నడిపించారు. చివర్లో 14 పరుగుల వ్యవధిలో ఆసీస్ 3 వికెట్లు కోల్పోవడంతో ఉత్కంఠ పెరిగింది. కానీ కనోలీ ప్రశాంతంగా ఆడి మ్యాచ్ను ముగించాడు.అంతకుముందు భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (97 బంతుల్లో 73; 7 ఫోర్లు, 2 సిక్స్లు), శ్రేయస్ అయ్యర్ (77 బంతుల్లో 61; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించగా...అక్షర్ పటేల్ (41 బంతుల్లో 44; 5 ఫోర్లు) రాణించాడు.గంభీర్ ప్లాన్ అట్టర్ ప్లాప్..కాగా అడిలైడ్లో భారత్ ఒక వన్డే మ్యాచ్లో ఓడిపోవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో భారత తుది జట్టు ఎంపికపై సర్వాత్ర విమర్శల వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఆడించికపోవడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. గంభీర్ ఆల్రౌండర్ల వ్యూహాం బెడిసి కొట్టింది అని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. పిచ్ కండీషన్స్ తగట్టు ఆస్ట్రేలియా మెనెజ్మెంట్ ఒక ఫాస్ట్ బౌలర్ను పక్కన పెట్టి స్పిన్నర్ను తీసుకొస్తే.. భారత్ మాత్రం ముగ్గురు ఆల్రౌండర్లు, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగింది. ఆసీస్ జట్టులోకి వచ్చిన ఆడమ్ జంపా నాలుగు వికెట్లు పడగొట్టి ఏకంగా ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. అడిలైడ్లో పిచ్ పేసర్లతో పాటు స్పిన్నర్లకు కూడా అనుకూలిస్తుంది. ఇటువంటి వికెట్పై కుల్దీప్ బంతితో అద్భుతాలు చేయగలడు. కానీ గంభీర్ మాత్రం వరుసగా రెండో మ్యాచ్లో కూడా కుల్దీప్కు ఛాన్స్ ఇవ్వలేదు. బ్యాటింగ్ డెప్త్ను కారణంగా చూపుతూ.. మ్యాచ్ విన్నర్ కుల్దీప్ యాదవ్ను బెంచ్కే పరిమితం చేస్తున్నారు. ఈ మ్యాచ్లో భారత్ తరపున ఆడిన ముగ్గురు ఆల్రౌండర్లలో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ రాణించినప్పటికి.. నితీశ్ కుమార్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. బ్యాటింగ్లో విఫలమైన నితీశ్.. బౌలింగ్లో కేవలం 3 ఓవర్లలోనే 24 పరుగులు సమర్పించుకున్నాడు. ఇప్పటికైనా కళ్లు తెరిచి కుల్దీప్ ఛాన్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. కుల్దీప్ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఆసియాకప్-2025లో అతడు 17 వికెట్లు తీసి.. లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఆ తర్వాత వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్లోనూ సత్తాచాటాడు. ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే అక్టోబర్ 25న సిడ్నీ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో కుల్దీప్ ఆడే అవకాశముంది.చదవండి: IND vs AUS: ఏయ్.. ఏమి చేస్తున్నావు! శ్రేయస్పై రోహిత్ సీరియస్(వీడియో) -
ICC WC 2025: సత్తా చాటి సెమీఫైనల్కు భారత్
వరల్డ్ కప్లో వరుసగా మూడు పరాజయాలతో వెనుకబడి విమర్శలు ఎదుర్కొన్న భారత మహిళల జట్టు అసలు పోరులో చెలరేగింది. తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సత్తా చాటి దర్జాగా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. స్మృతి మంధాన, ప్రతీక రావల్ సెంచరీలతో పాటు జెమీమా మెరుపులు తోడవడంతో భారీ స్కోరుతో న్యూజిలాండ్ మహిళలకు సవాల్ విసిరిన టీమిండియా...ఆపై పదునైన బౌలింగ్తో ప్రత్యర్థిని కుప్పకూల్చి ఘన విజయాన్ని అందుకుంది. తాజా ఓటమితో మాజీ చాంపియన్ కివీస్ సెమీస్ అవకాశం కోల్పోయింది. ముంబై: స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్లో భారత మహిళల జట్టు సెమీఫైనల్కు చేరింది. ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ తర్వాత సెమీస్ చేరిన చివరి జట్టుగా హర్మన్ సేన నిలిచింది. గురువారం డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో భారత్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 53 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై విజయం సాధించింది. భారత బ్యాటింగ్ చివర్లో వాన కారణంగా ఇన్నింగ్స్ను 49 ఓవర్లకు కుదించగా, టీమిండియా 3 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రతీక రావల్ (134 బంతుల్లో 122; 13 ఫోర్లు, 2 సిక్స్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతి మంధాన (95 బంతుల్లో 109; 10 ఫోర్లు, 4 సిక్స్లు) శతకాలతో చెలరేగారు. వీరిద్దరు తొలి వికెట్కు 33.2 ఓవర్లలో 212 పరుగులు జోడించడం విశేషం. జెమీమా రోడ్రిగ్స్ (55 బంతుల్లో 76 నాటౌట్; 11 ఫోర్లు) కూడా మెరుపు బ్యాటింగ్తో జట్టు భారీ స్కోరులో కీలక పాత్ర పోషించింది. అనంతరం వర్షం మళ్లీ అంతరాయం కలిగించడంతో న్యూజిలాండ్ లక్ష్యాన్ని డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 44 ఓవర్లలో 325 పరుగులుగా నిర్ణయించారు. కివీస్ 44 ఓవర్లలో 8 వికెట్లకు 271 పరుగులు చేసింది. బ్రూక్ హ్యాలిడే (84 బంతుల్లో 81; 9 ఫోర్లు, 1 సిక్స్), ఇసబెల్లా గేజ్ (51 బంతుల్లో 65 నాటౌట్; 10 ఫోర్లు) రాణించారు. ఆదివారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో భారత్ తలపడుతుంది. నేడు కొలంబోలో జరిగే నామమాత్రమైన మ్యాచ్లో పాకిస్తాన్తో శ్రీలంక తలపడుతుంది. రికార్డు భాగస్వామ్యం... ప్రతీక, స్మృతి జాగ్రత్తగా ఇన్నింగ్స్ను మొదలుపెట్టడంతో తొలి 2 ఓవర్లు మెయిడిన్గా ముగియగా, 10 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 40/0కు చేరింది. ఆ తర్వాత బ్యాటర్లు నిలదొక్కుకొని పరుగులు రాబట్టడంతో తర్వాతి 46 బంతుల్లో 60 పరుగులు రాబట్టిన భారత్ 100 పరుగుల మార్క్ను అందుకుంది. ఇదే క్రమంలో ముందుగా స్మృతి 49 బంతుల్లో, ప్రతీక 75 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. సగం ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ 147/0 వద్ద నిలిచింది. 77 పరుగుల వద్ద స్మృతికి అదృష్టం కలిసొచ్చింది. అమేలియా బౌలింగ్లో షాట్కు ప్రయత్నించగా బంతి ప్యాడ్కు తగలడంతో బౌలర్ అప్పీల్ చేసింది. వెంటనే అంపైర్ అవుట్గా ప్రకటించడంతో స్మృతి రివ్యూ కోరింది. రీప్లేలో ముందుగా బంతి గమనాన్ని చూపించారు. అందులో బంతి స్టంప్స్ను తాకుతున్నట్లు అర్థం కావడంతో స్మృతి పెవిలియన్ వైపు సాగిపోయింది. అయితే ఆ తర్వాత అల్ట్రా ఎడ్జ్లో బంతి బ్యాట్కు తగిలినట్లు రేఖ కనిపించడంతో ఆమె వెనక్కి వచ్చింది. కొద్ది సేపటికి 88 బంతుల్లో స్మృతి శతకం పూర్తి చేసుకుంది. ఎట్టకేలకు 34వ ఓవర్లో తొలి వికెట్ (స్మృతి) తీయడంలో కివీస్ సఫలమైంది. 122 బంతుల్లో ప్రతీక సెంచరీ పూర్తి కాగా, మూడో స్థానంలో వచ్చిన జెమీమా ఆరంభంనుంచే దూకుడును ప్రదర్శించింది. కార్స్ ఓవర్లో మూడు ఫోర్లు బాది 38 బంతుల్లోనే హాఫ్సెంచరీ చేసింది. బ్యాటింగ్ వైఫల్యం... భారీ లక్ష్య ఛేదనలో కివీస్ ఆరంభం నుంచే తడబడింది. ఓపెనర్ సుజీ బేట్స్ (1) తన వైఫల్యం కొనసాగించగా...ప్లిమ్మర్ (30; 5 ఫోర్లు, 1 సిక్స్), అమేలియా కెర్ (45; 4 ఫోర్లు) కొద్దిగా ప్రతిఘటించారు. టోర్నీలో జట్టు బెస్ట్ బ్యాటర్, కెప్టెన్ సోఫీ డివైన్ (6)ను రేణుక చక్కటి బంతితో బౌల్డ్ చేయడంతోనే భారత్కు పట్టు చిక్కింది.59 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకొని ఒకవైపు నుంచి హ్యాలిడే పోరాడుతున్నా...మరో వైపు వరుసగా వికెట్లు తీసి భారత్ ఒత్తిడి పెంచింది. చివర్లో ఇసబెల్లా కూడా ప్రయత్నించినా, చేయాల్సిన రన్రేట్ పెరిగిపోవడంతో కివీస్ ఓటమి దిశగా పయనించింది. 340 వన్డే వరల్డ్కప్లో భారత్ అత్యధిక స్కోరు. ఇదే టోర్నీలో ఆసీస్పై సాధించిన 330 పరుగుల స్కోరును జట్టు అధిగమించింది. 212 స్మృతి, ప్రతీక జోడించిన పరుగులు. వరల్డ్ కప్లో ఏ వికెట్కైనా భారత్కు ఇదే అత్యధిక భాగస్వామ్యం.14 స్మృతి వన్డే కెరీర్లో ఇది 14వ సెంచరీ. అత్యధిక సెంచరీల జాబితాలో మెగ్ లానింగ్ (15) తర్వాత రెండో స్థానంలో నిలిచింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ప్రతీక (సి) (సబ్) రోవ్ (బి) అమేలియా 122; స్మృతి (సి) (సబ్) రోవ్ (బి) బేట్స్ 109; జెమీమా (నాటౌట్) 76; హర్మన్ప్రీత్ (సి) కార్సన్ (బి) రోజ్మేరీ 10; రిచా (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 19; మొత్తం (49 ఓవర్లలో 3 వికెట్లకు) 340. వికెట్ల పతనం: 1–212, 2–288, 3–336. బౌలింగ్: రోజ్మేరీ 8–1–52–1, జెస్ కెర్ 8–1–51–0, డివైన్ 6–0–34–0, కార్సన్ 6–0–46–0, తహుహు 4–0–37–0, అమేలియా కెర్ 10–0–69–1, బేట్స్ 7–0–40–1. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: బేట్స్ (సి) ప్రతీక (బి) క్రాంతి 1; ప్లిమ్మర్ (బి) రేణుక 30; అమేలియా కెర్ (సి) స్మృతి (బి) స్నేహ్ 45; డివైన్ (బి) రేణుక 6; హ్యాలిడే (సి) స్నేహ్ (బి) చరణి 81; గ్రీన్ (సి) క్రాంతి (బి) ప్రతీక 18; ఇసబెల్లా (నాటౌట్) 65; జెస్ కెర్ (సి) స్మృతి (బి) క్రాంతి 18; రోజ్మేరీ (సి) స్మృతి (బి) దీప్తి 1; ఎక్స్ట్రాలు 6; మొత్తం (44 ఓవర్లలో 8 వికెట్లకు) 271. వికెట్ల పతనం: 1–1, 2–51, 3–59, 4–115, 5–154, 6–226, 7–266, 8–271. బౌలింగ్: రేణుక 6–0–25–2, క్రాంతి గౌడ్ 9–0–48–2, స్నేహ్ రాణా 8–0–60–1, శ్రీచరణి 9–0–58–1, దీప్తి శర్మ 8–0–57–1, ప్రతీక 4–0–19–1. -
క్యాచ్లే కొంపముంచాయి.. ఓటమిపై శుభ్మన్ గిల్ కామెంట్స్
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో (India vs Australia) టీమిండియా 2 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 0-2 తేడాతో కోల్పోయింది. 17 ఏళ్ల తర్వాత అడిలైడ్లో భారత్కు ఇదే తొలి ఓటమి (వన్డేల్లో). మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) ఓటమిపై స్పందిస్తూ ఇలా అన్నాడు. తొలుత బ్యాటింగ్ చేసి డీసెంట్ స్కోర్ చేశాం. అయితే కొన్ని క్యాచ్లు వదిలేయడం వల్ల ఆ స్కోర్ను కాపాడుకోలేకపోయాం.ప్రారంభంలో పిచ్ ఊహించిన దానికంటే ఎక్కువగా స్పందించింది. 15–20 ఓవర్ల తర్వాత పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది. మొదటి మ్యాచ్లో టాస్ చాలా కీలకమైంది. వర్షం ప్రభావం ఉన్నందున అది మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది. అయితే రెండో మ్యాచ్లో టాస్ ప్రభావం పెద్దలా లేదు. ఇరు జట్లు దాదాపు 50 ఓవర్లు బ్యాటింగ్ చేశాయి.రోహిత్ శర్మపై ప్రశంసలుఏడు నెలల గ్యాప్ తర్వాత మునుపటి తరహాలో ఆడటం అంత ఈజీ కాదు. అయినా రోహిత్ ధైర్యంగా ఆడి, అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్లో అతను భారీ స్కోర్ మిస్ అయ్యాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో వీరోచితంగా పోరాడాడు. రోహిత్ బ్యాటింగ్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను.కాగా, ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ ఆదిలో కాస్త ఇబ్బంది పడినా.. రోహిత్ (73), శ్రేయస్ (61), అక్షర్ (44) బాధ్యతాయుతంగా ఆడటంతో గౌరవప్రదమైన స్కోర్ (264/9) చేసింది. ఆఖర్లో హర్షిత్ రాణా (24 నాటౌట్), అర్షదీప్ సింగ్ (13) అమూల్యమైన పరుగులు జోడించారు.ఛేదనలో ఆస్ట్రేలియా కూడా తడబడినప్పటికీ.. అంతిమంగా విజయం సాధించింది. మాథ్యూ షార్ట్ (74), కూపర్ కన్నోల్నీ (61 నాటౌట్) రాణించడంతో ఆ జట్టు 46.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్లో షార్ట్కు రెండు లైఫ్లు లభించాయి. కీలక సమయాల్లో అక్షర్ పటేల్, సిరాజ్ ఈజీ క్యాచ్లు నేలపాలు చేశారు. ఈ క్యాచ్లే మ్యాచ్ను ఆస్ట్రేలియాకు అనుకూలంగా మార్చాయి. ఈ సిరీస్లో నామమాత్రపు మూడో వన్డే సిడ్నీ వేదికగా అక్టోబర్ 25న జరుగనుంది. చదవండి: ఓపెనర్ల శతకాలు.. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్ -
ఓపెనర్ల శతకాలు.. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్
మహిళల వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) సెమీస్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా (Team India) భారీ స్కోర్ చేసింది. నవీ ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్లు స్మృతి మంధన (Smriti Mandhana) (95 బంతుల్లో 109; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), ప్రతిక రావల్ (Pratika Rawal) (134 బంతుల్లో 122; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర శతకాలతో చెలరేగిపోయారు.వన్డౌన్లో వచ్చిన జెమీమా రోడ్రిగెజ్ (55 బంతుల్లో 76 నాటౌట్; 11 ఫోర్లు) కూడా సునామీ ఇన్నింగ్స్ ఆడింది. ఫలితంగా వర్షం కారణంగా 49 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో భారత్ 3 వికెట్ల నష్టానికి 340 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్లో హర్మన్ప్రీత్ కౌర్ 10, రిచా ఘోష్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో రోస్మేరీ మైర్, అమేలియా కెర్, సూజీ బేట్స్కు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలవాలంటే డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 44 ఓవర్లలో 325 పరుగులు చేయాలి.కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో మొదటి మూడు సెమీస్ బెర్త్లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. నాలుగో సెమీస్ బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి. మరోపక్క బంగ్లాదేశ్, పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.చదవండి: గర్జించిన బంగ్లాదేశ్ పులులు.. బిత్తరపోయిన మాజీ ఛాంపియన్లు -
గర్జించిన బంగ్లాదేశ్ పులులు.. బిత్తరపోయిన మాజీ ఛాంపియన్లు
స్వదేశంలో వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో (Bangladesh vs West Indies) బంగ్లాదేశ్ (Bangladesh) పులులు గర్జించాయి. మూడు మ్యాచ్ల ఈ సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకున్నాయి. ఢాకా వేదికగా ఇవాళ (అక్టోబర్ 23) జరిగిన సిరీస్ డిసైడర్లో ఆతిథ్య జట్టు 179 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో బంగ్లా ఆటగాళ్లు అన్ని విభాగాల్లో చెలరేగారు. వీరి గర్జనకు మాజీ ప్రపంచ ఛాంపియన్లు బిత్తరపోయారు.తొలుత బ్యాటింగ్కు దిగి భారీ స్కోర్ చేసిన బంగ్లాదేశ్.. బౌలింగ్లో ప్రత్యర్దిని ఉక్కిరిబిక్కిరి చేసింది. బంగ్లా బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలింది. బంగ్లా బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగి విండీస్ బ్యాటర్ల భరతం పట్టారు.ఈ సిరీస్లోని తొలి వన్డేలోనూ బంగ్లాదేశ్ బౌలర్లు ఇదే రీతిలో చెలరేగిపోయారు. ఆ మ్యాచ్లో స్వల్ప స్కోర్ చేసినా విండీస్ను ఇంకా తక్కువ స్కోర్కే కట్టడి చేశారు. రెండో వన్డేలోనూ ఇదే ప్రదర్శనను కొనసాగించారు. అయితే ఈసారి విండీస్ బ్యాటర్లు కాస్త ప్రతిఘటించడంతో మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్లో విండీస్ గెలుపొందింది.మూడో వన్డే విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. ఓపెనర్లు సైఫ్ హసన్ (80), సౌమ్య సర్కార్ (91) సెంచరీలకు చేరువగా వచ్చి ఔటయ్యారు. మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేసిన తౌహిద్ హృదోయ్ (28), నజ్ముల్ హసన్ షాంటో (44) కూడా పర్వాలేదనిపించారు.అయితే ఆతర్వాత వచ్చిన వారు పెద్దగా రాణించకపోవడంతో బంగ్లాదేశ్ భారీ స్కోర్ చేయలేకపోయింది. ఓ దశలో సునాయాసంగా 350 పరుగులు చేస్తుందనుకున్న జట్టు మిడిలార్డర్ వైఫల్యం కారణంగా 300లోపే పరిమితమైంది.తొలుత తడబడిన విండీస్ బౌలర్లు ఆఖర్లో అనూహ్యంగా పుంజుకొని బంగ్లాను 300లోపే కట్టడి చేశారు. అకీల్ హోసేన్ 4, అలిక్ అథనాజ్ 2, రోస్టన్ ఛేజ్, మోటీ తలో వికెట్ తీసి, బంగ్లాను భారీ స్కోర్ చేయకుండా నియంత్రించారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చిన ఆ జట్టు 30.1 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. బంగ్లా బౌలర్లు నసుమ్ అహ్మద్, రిషద్ హొసేన్ తలో 3, మెహిది హసన్, తన్వీర్ ఇస్లాం చెరో 2 వికెట్లు తీసి విండీస్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు.కాగా, ఇరు జట్ల ఈ నెల 27 నుంచి మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ అక్టోబర్ 27, 29, 31 తేదీల్లో చట్టోగ్రామ్ వేదికగా జరుగుతుంది. చదవండి: తప్పక గెలవాల్సిన మ్యాచ్లో స్మృతి మంధన సూపర్ సెంచరీ -
సౌతాఫ్రికాకు భారీ షాక్లు
పాకిస్తాన్తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్లకు (Pakistan vs South Africa) ముందు సౌతాఫ్రికాకు (South Africa) భారీ షాక్లు తగిలాయి. ఆ జట్టు టీ20 కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (David Miller), కీలక బౌలర్ గెరాల్డ్ కొయెట్జీ (Gerald Coetzee) గాయాల కారణంగా ఈ సిరీస్లకు దూరమయ్యారు. మిల్లర్ కొద్ది రోజుల కిందట ప్రాక్టీస్ చేస్తూ గ్రేడ్-1 హ్యామ్స్ట్రింగ్ ఇంజ్యూరికి గురి కాగా.. కొయెట్జీ నబీమియాతో ఇటీవల జరిగిన టీ20 సందర్భంగా కండరాల గాయం బారిన పడ్డాడు. దీంతో ఈ ఇద్దరు పాక్తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్లకు దూరమయ్యారు.మిల్లర్ గైర్హాజరీలో టీ20 జట్టు కెప్టెన్గా అప్పటికే జట్టులో ఉన్న డొనోవన్ ఫెరీరాను ఎంపిక చేశారు. మిల్లర్ స్థానాన్ని మాథ్యూ బ్రీట్జ్కే భర్తీ చేశారు. కొయెట్జీ స్థానాన్ని టీ20ల్లో టోనీ డి జోర్జితో, వన్డేల్లో ఓట్నీల్ బార్ట్మన్తో భర్తీ చేశారు. ఈ రెండు మార్పులు మినహా ముందుగా ప్రకటించిన జట్టు యధాతథంగా కొనసాగనుంది.పాక్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ అక్టోబర్ 28 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ రావల్పిండి వేదికగా.. రెండో టీ20 అక్టోబర్ 31న లాహోర్ వేదికగా.. మూడో టీ20 నవంబర్ 1న అదే లాహోర్ వేదికగా జరుగనున్నాయి.అనంతరం నవంబర్ 4 నుంచి మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. నవంబర్ 4, 6, 8 తేదీల్లో ఫైసలాబాద్ వేదికగా మూడు వన్డేలు జరుగనున్నాయి. పరిమిత ఓవర్ల సిరీస్లకు ముందు సౌతాఫ్రికా పాక్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడింది. ఇవాళే (అక్టోబర్ 23) ముగిసిన ఈ సిరీస్ 1-1తో డ్రా అయ్యింది. తొలి టెస్ట్లో పాకిస్తాన్, రెండో టెస్ట్లో పర్యాటక సౌతాఫ్రికా గెలుపొందాయి.పాకిస్తాన్తో టీ20 సిరీస్కు సౌతాఫ్రికా జట్టు: డోనోవన్ ఫెరీరా (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్మన్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రే బర్గర్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, జార్జ్ లిండే, లుంగీ ఎంగిడి, న్క్వాబా పీటర్, లూహాన్ డ్రి ప్రిటోరియస్, అండైల్ సైమ్లేన్, లిజాడ్ విలియమ్స్వన్డే జట్టు: మాథ్యూ బ్రీట్జ్కే (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్మన్, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రే బర్గర్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, జోర్న్ ఫోర్టుయిన్, జార్జ్ లిండే, లుంగి ఎంగిడి, న్క్వాబా పీటర్, లుహాన్ డ్రి ప్రిటోరియస్, సినేతెంబా క్వెషైల్, లిజాడ్ విలియమ్స్చదవండి: తప్పక గెలవాల్సిన మ్యాచ్లో స్మృతి మంధన సూపర్ సెంచరీ -
అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ప్రపంచ రికార్డు.. రిజ్వాన్ పేరు చెరిపేసి..
ఆస్ట్రియా బ్యాటర్ కరణ్బీర్ సింగ్ (Karanbir Singh) అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 పరుగులు సాధించిన బ్యాటర్గా ఘనత సాధించాడు.ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కరణ్బీర్ సింగ్ బద్దలు కొట్టాడు. రొమేనియా పర్యటన సందర్భంగా నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ సందర్భంగా కరణ్బీర్ ఈ ఫీట్ నమోదు చేశాడు. తొలి మ్యాచ్లో 27 బంతుల్లోనే 57 పరుగులు రాబట్టిన కరణ్బీర్.. రెండో మ్యాచ్లో 46 బంతుల్లోనే 90 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.విధ్వంసకర ఇన్నింగ్స్ఈ క్రమంలోనే రిజ్వాన్ను అధిగమించిన కరణ్బీర్ సింగ్.. ఆ తర్వాత కూడా తన ప్రభంజనం కొనసాగించాడు. రొమేనియా టూర్లో మూడో మ్యాచ్లో 44 బంతుల్లోనే 74 పరుగులు సాధించిన ఈ ఆస్ట్రియా బ్యాటర్.. తదుపరి 12 బంతుల్లో 27 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా ఈ ఏడాదిలో 1488 పరుగుల మార్కును అందుకున్నాడు.ఇక రొమేనియాతో సిరీస్లో కరణ్బీర్ సింగ్ ఏకంగా 19 ఫోర్లు బాదాడు. ఈ క్యాలెండర్ ఇయర్లో ఓవరాల్గా 127 ఫోర్లు నమోదు చేశాడు. అంతేకాదు.. అతడి ఖాతాలో 122 సిక్సర్లు కూడా ఉన్నాయి.వెయ్యి పరుగుల మైలురాయి దాటిన మరో బ్యాటర్రొమేనియాతో మొయేరా వ్లాసే క్రికెట్ గ్రౌండ్లో జరిగిన నాలుగో టీ20లో కరణ్బీర్తో పాటు.. అతడి సహచర ఆటగాడు బిలాల్ జల్మాయి కూడా అదరగొట్టాడు. ఈ క్యాలెండర్ ఇయర్లో అతడు వెయ్యి పరుగుల మార్కును అందుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాటర్గా నిలిచాడు. ఇక ఆస్ట్రియా రొమేనియా టూర్ కొనసాగుతున్న నేపథ్యంలో కరణ్బీర్ విధ్వంసం కూడా కొనసాగడం ఖాయంగానే కనిపిస్తోంది. అసోసియేట్ జట్లకు చెందిన ఈ ఆటగాళ్లు ఇంతలా విజృంభించడం జట్లబంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందంటూ పొట్టి క్రికెట్ అభిమానులు మురిసిపోతున్నారు.పురుషుల అంతర్జాతీయ టీ20లలో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లు🏏కరణ్బీర్ సింగ్ (ఆస్ట్రియా)- 2025లో 32 ఇన్నింగ్స్ ఆడి 1488*🏏మొహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్)- 2021లో 26 ఇన్నింగ్స్ ఆడి 1326🏏సూర్యకుమార్ యాదవ్ (ఇండియా)- 2022లో 31 ఇన్నింగ్స్ ఆడి 1164🏏బిలాల్ జల్మాయి (ఆస్ట్రియా)- 2025లో 35 ఇన్నింగ్స్లో 1008*🏏మొహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్)- 2022లో 25 ఇన్నింగ్స్ ఆడి 996.చదవండి: బతికితే చాలనుకున్నా.. ఆకాశ్ అంబానీ హెల్ప్ చేశారు: తిలక్ వర్మ -
తప్పక గెలవాల్సిన మ్యాచ్లో స్మృతి మంధన సూపర్ సెంచరీ
మహిళల వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) సెమీస్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) సూపర్ సెంచరీతో కదంతొక్కింది. నవీ ముంబై వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (అక్టోబర్ 23) జరుగుతున్న మ్యాచ్లో 88 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసింది. మంధనకు ఈ ఏడాది ఇది ఐదో శతకం. ఓవరాల్గా వన్డేల్లో 14వ శతకం. ప్రస్తుత ప్రపంచకప్లో తొలి మ్యాచ్ల్లో నిరాశపరిచిన మంధన.. గత రెండు మ్యాచ్లుగా సత్తా చాటుతూ వస్తుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్తో జరిగిన చివరి రెండు మ్యాచ్ల్లో బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలతో మెరిసింది. వాస్తవానికి ఆ రెండు అర్ద సెంచరీలు కూడా సెంచరీల్లోకి మారాల్సింది. అయితే అవి తృటిలో చేజారాయి.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన టీమిండియా.. ఆది నుంచి నిలకడగా ఆడింది. ఓపెనర్లు మంధన, ప్రతీక రావల్ (77) సంయమనంతో బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్ను నిర్మించారు. అర్ద సెంచరీ తర్వాత మంధన గేర్ మార్చగా.. ప్రతీక రావల్ అదే టెంపోలో బ్యాటింగ్ చేస్తుంది. 31 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ వికెట్ నష్టపోకుండా 192 పరుగులుగా ఉంది. మంధన 100, ప్రతీక రావల్ 77 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో మొదటి మూడు సెమీస్ బెర్త్లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. నాలుగో సెమీస్ బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సెమీస్కు అర్హత సాధిస్తుంది. మరోపక్క బంగ్లాదేశ్, పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. చదవండి: IND vs AUS: టీమిండియాపై ఆసీస్ గెలుపు.. సిరీస్ కైవసం -
IND vs AUS: టీమిండియాపై ఆసీస్ గెలుపు.. సిరీస్ కైవసం
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో ఆతిథ్య ఆసీస్.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. పెర్త్లో జరిగిన తొలి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో గెలిచిన కంగారూలు.. తాజాగా అడిలైడ్ వేదికగా రెండో వన్డే (IND vs AUS 2nd ODI)లోనూ జయభేరి మోగించారు.టాస్ గెలిచిన ఆస్ట్రేలియాఅడిలైడ్ ఓవల్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. పర్యాటక భారత జట్టును తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఒకే ఓవర్లో ఓపెనర్, కెప్టెన్ శుబ్మన్ గిల్ (9)తో పాటు వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి (0) వికెట్ తీసి జేవియర్ బార్ట్లెట్ ఆసీస్కు శుభారంభం అందించాడు.రాణించిన రోహిత్, శ్రేయస్ఇలాంటి తరుణంలో మరో ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma), వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. రోహిత్ (97 బంతుల్లో 73), అయ్యర్ (77 బంతుల్లో 61) పరుగులతో రాణించగా.. మిగతా వారిలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ (41 బంతుల్లో 44), హర్షిత్ రాణా (18 బంతుల్లో 24 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ ఆడం జంపా నాలుగు వికెట్లతో చెలరేగి భారత బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (11) నితీశ్ రెడ్డి (8) రూపంలో కీలక వికెట్లు దక్కించుకున్నాడు. పేసర్లలో బార్ట్లెట్ గిల్, కోహ్లి, వాషింగ్టన్ సుందర్ (12) వికెట్లు తన ఖాతాలో వేసుకోగా.. మిచెల్ స్టార్క్ రోహిత్ శర్మ, అర్ష్దీప్ సింగ్ (13)లను అవుట్ చేశాడు.264 పరుగులుఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 264 పరుగులు స్కోరు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో ఆసీస్ ఆరంభంలో తడబడింది. ఓపెనర్, కెప్టెన్ మిచెల్ మార్ష్ (11)ను అర్ష్దీప్ త్వరగానే పెవిలియన్కు పంపగా.. ట్రవిస్ హెడ్ (40 బంతుల్లో 28)ను హర్షిత్ రాణా అవుట్ చేశాడు.అదరగొట్టిన షార్ట్, కన్నోలి అయితే, వన్డౌన్ బ్యాటర్ మాథ్యూ షార్ట్ అద్భుత అర్ధ శతకం (74)తో మెరిసి మ్యాచ్ను తమ వైపు తిప్పే ప్రయత్నం చేయగా.. మ్యాట్ రెన్షా (30) అతడికి సహకరించాడు. షార్ట్, రెన్షా వేసిన పునాదిపై ఆల్రౌండర్ కూపర్ కన్నోలి మిచెల్ ఓవెన్తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు.Just the wicket #TeamIndia needed! 🤩#NitishKumarReddy gets the wicket and #MohammedSiraj makes amends for the dropped catch. 👏#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/YZwdPY0nr7— Star Sports (@StarSportsIndia) October 23, 2025 ఆఖర్లో వరుస విరామాల్లో వికెట్లు పడినా కన్నోలి పట్టుదలగా నిలబడ్డాడు. ఓవెన్ 23 బంతుల్లో 36 పరుగులతో వేగంగా ఆడి.. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో వెనుదిరగగా.. బార్ట్లెట్ (3), స్టార్క్ (4) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.అయితే, కన్నోలి మాత్రం నిలకడగా ముందుకు సాగాడు. 53 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 61 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 46.2 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టపోయిన ఆస్ట్రేలియా లక్ష్యం పూర్తి చేసింది. రెండు వికెట్ల తేడాతో గెలిచి.. సిరీస్ను 2-0తో సొంతం చేసుకుంది. ఇరుజట్ల మధ్య శనివారం నాటి నామమాత్రపు మూడో వన్డేకు సిడ్నీ వేదిక. కాగా వన్డే సారథిగా గిల్కు తొలి సిరీస్లోనే ఇలా చేదు అనుభవం ఎదురైంది. ఇక రెండో వన్డేలో జంపాకు ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: బతికితే చాలనుకున్నా.. ఆకాశ్ అంబానీ హెల్ప్ చేశారు: తిలక్ వర్మ -
సిరీస్ డిసైడర్.. ఆరంభం అదిరినా, ఆఖర్లో తడబడిన బంగ్లాదేశ్
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా వెస్టిండీస్తో ఇవాళ (అక్టోబర్ 23) జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో (Bangladesh vs West Indies) బంగ్లాదేశ్ ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. ఓపెనర్లు సైఫ్ హసన్ (80), సౌమ్య సర్కార్ (91) సెంచరీలకు చేరువగా వచ్చి ఔటయ్యారు. మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేసిన తౌహిద్ హృదోయ్ (28), నజ్ముల్ హసన్ షాంటో (44) కూడా పర్వాలేదనిపించారు. అయితే ఆతర్వాత వచ్చిన వారు పెద్దగా రాణించకపోవడంతో బంగ్లాదేశ్ భారీ స్కోర్ చేయలేకపోయింది. ఓ దశలో సునాయాసంగా 350 పరుగులు చేస్తుందనుకున్న జట్టు మిడిలార్డర్ వైఫల్యం కారణంగా 300లోపే పరిమితమైంది. మిడిలార్డర్ బ్యాటర్లు మహిదుల్ ఇస్లాం 6, రిషద్ హొసేన్ 3, నసుమ్ అహ్మద్ 1 పరుగుకు ఔటయ్యారు. ఆఖర్లో నురుల్ హసన్ (16 నాటౌట్), కెప్టెన్ మెహిది హసన్ (17) ఓ మోస్తరుగా బ్యాట్ ఝులిపించడంతో బంగ్లాదేశ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. తొలుత తడబడిన విండీస్ బౌలర్లు ఆఖర్లో అనూహ్యంగా పుంజుకొని బంగ్లాను 300లోపే కట్టడి చేశారు. అకీల్ హోసేన్ 4, అలిక్ అథనాజ్ 2, రోస్టన్ ఛేజ్, మోటీ తలో వికెట్ తీసి, బంగ్లాను భారీ స్కోర్ చేయకుండా నియంత్రించారు.కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి వన్డేలో బంగ్లాదేశ్, రెండో వన్డేలో వెస్టిండీస్ (సూపర్ ఓవర్) గెలిచాయి. ఈ సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కూడా జరుగనుంది. ఈ సిరీస్ అక్టోబర్ 27, 29, 31 తేదీల్లో చట్టోగ్రామ్ వేదికగా జరుగుతుంది. ఈ పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం వెస్టిండీస్ బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది.చదవండి: IPL 2026: శ్రేయస్ అయ్యర్ టీమ్లో కీలక చేరిక -
IPL 2026: శ్రేయస్ అయ్యర్ టీమ్లో కీలక చేరిక
ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్కు ముందు గత సీజన్ రన్నరప్ పంజాబ్ కింగ్స్ (Punjab Kings) కీలక నిర్ణయం తీసుకుంది. సునీల్ జోషి (2023-2025) స్థానంలో భారత మాజీ లెగ్ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులేను (Sairaj Bahutule) కొత్త స్పిన్ బౌలింగ్ కోచ్గా నియమించింది. బహుతులే ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ స్పిన్ బౌలింగ్ కోచ్ పదని నుంచి వైదొలిగాడు. తదుపరి సీజన్లో బహుతులే రికీ పాంటింగ్ (హెడ్ కోచ్) నేతృత్వంలోని కోచింగ్ బృందంలో చేరతాడు. ఈ టీమ్లో బ్రాడ్ హడ్డిన్, జేమ్స్ హోప్స్ అసిస్టెంట్ కోచ్లుగా ఉన్నారు. బహుతులే చేరిక శ్రేయస్ (Shreyas Iyer) బృందానికి అదనపు బలాన్ని ఇస్తుందని పంజాబ్ మేనేజ్మెంట్ భావిస్తుంది. 51 ఏళ్ల బహుతులేకు దేశవాలీ క్రికెట్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. అతను బెంగాల్, కేరళ, విదర్భ, గుజరాత్ జట్లకు కోచింగ్ను అందించాడు. భారత యువ బౌలర్లను తీర్చిదిద్దడంలో సాయిరాజ్ది అందవేసిన చెయ్యిగా చెబుతారు.సాయిరాజ్ చేరికపై పంజాబ్ కింగ్స్ సీఈవో సతీష్ మీనన్ స్పందించాడు. అతని మాటల్లో.. "ముందుగా సునీల్ జోషికి కృతజ్ఞతలు. ఇప్పుడు బహుతులే చేరడం మాకు గర్వకారణం. అతని అనుభవం, వ్యూహాత్మక దృష్టి మా జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది".పంజాబ్ కింగ్స్తో డీల్ ఖరారయ్యాక సాయిరాజ్ కూడా స్పందించాడు. పంజాబ్ కింగ్స్లో చేరడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ జట్టు ప్రత్యేకమైన క్రికెట్ ఆడుతుంది. యువ ప్రతిభను మెరుగుపరచడంలో నా పాత్ర కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నాడు. కాగా, పంజాబ్ కింగ్స్ గత సీజన్ ఫైనల్లో ఆర్సీబీ చేతిలో ఓటమిపాలై తృటిలో టైటిల్ను చేజార్చుకుంది. శ్రేయస్ అయ్యర్ గత సీజన్లోనే పంజాబ్ కింగ్స్ పగ్గాలు చేపట్టి అద్భుతంగా ముందుండి నడిపించాడు. వ్యక్తిగతంగానూ రాణించాడు. శ్రేయస్ అంతకుముందు సీజన్లో (2024) కేకేఆర్కు విజేతగా నిలిపిన విషయం తెలిసిందే. గత సీజన్ వేలంలో శ్రేయస్ను పంజాబ్ యాజమాన్యం రికార్డు ధర వెచ్చించి సొంతం చేసుకుంది.చదవండి: NZ VS ENG: సిరీస్ ఇంగ్లండ్ వశం.. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా బ్రూక్ -
బతికితే చాలనుకున్నా.. ఆకాశ్ అంబానీ హెల్ప్ చేశారు: తిలక్ వర్మ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ముంబై ఇండియన్స్ తరఫున సత్తా చాటి టీమిండియాలోకి వచ్చాడు తిలక్ వర్మ (Tilak Varma). 2022లో ముంబై తరఫున అరంగేట్రం చేసిన తిలక్.. ఆ మరుసటి ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు.ఆసియా కప్ హీరోఅనతికాలంలోనే భారత టీ20 జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన ఈ హైదరాబాదీ బ్యాటర్.. ఇటీవల ఆసియా టీ20 కప్-2025 టోర్నీలోనూ అదరగొట్టాడు. పాకిస్తాన్తో ఫైనల్లో వీరోచిత ఇన్నింగ్స్ ఆడి భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.ఇక ఇప్పటి వరకు టీమిండియా తరఫున 32 టీ20 మ్యాచ్లు, నాలుగు వన్డేలు ఆడిన తిలక్ వర్మ.. ఆయా ఫార్మాట్లలో 962, 68 పరుగులు చేశాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీ సీజన్ 2025-26 సీజన్తో బిజీగా ఉన్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. హైదరాబాద్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.ఈ నేపథ్యంలో కెరీర్లోని చేదు అనుభవాన్ని తాజాగా గుర్తు చేసుకున్నాడు తిలక్ వర్మ. గాయాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల పరిస్థితి చేయిదాటిపోయిందని.. ఆ సమయంలో ముంబై ఫ్రాంఛైజీ సహ యజమాని ఆకాశ్ అంబానీ సాయం చేశారని తెలిపాడు. బ్రేక్ఫాస్ట్ విత్ చాంపియన్స్తో మాట్లాడుతూ..బ్యాట్ ఎత్తేందుకు కూడా శక్తి సరిపోలేదు‘‘2022లో బంగ్లాదేశ్లో మ్యాచ్ ఆడుతున్నాం. నేను భారత్-‘ఎ’ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నా. బ్యాటింగ్కు వచ్చిన కాసేపటి తర్వాత నా కళ్లు చెమ్మగా మారాయి. బ్యాట్ ఎత్తేందుకు కూడా శక్తి సరిపోవడం లేదు. నా నరాల్లో జీవం లేనట్లే అనిపించింది.ఆకాశ్ అంబానీ హెల్ప్ చేశారువెంటనే రిటైర్డ్ హర్ట్గా వెనక్కి వచ్చేశాను. ఆ సమయంలో విషయం తెలుసుకుని ఆకాశ్ అంబానీ ఫోన్ చేశారు. బీసీసీఐ పెద్దలతో మాట్లాడి.. నా పరిస్థితి గురించి చెప్పారు. నాకు చాలా సాయం చేశారు.బతికి బయటపడితే చాలుఆస్పత్రిలో వైద్యులు నన్ను హెచ్చరించారు. ఒకవేళ ఇంకాస్త ఆలస్యంగా వచ్చి ఉంటే పరిస్థితి ఇంకా దిగజారిపోయేదన్నారు. నా శరీరంలోకి సూది కూడా దిగడం లేదు. అలాంటి పరిస్థితుల్లో బతికి బయటపడితే చాలు అనుకున్నా’’ అని తిలక్ వర్మ చేదు జ్ఞాపకాన్ని పంచుకున్నాడు.కాగా ఐపీఎల్-2022 సీజన్ తర్వాత తిలక్ వర్మ కండరాల నొప్పితో బాధపడ్డాడు. అయితే, కోలుకోవడంపై దృష్టి పెట్టకుండా వరుస మ్యాచ్లు ఆడాడు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి.. ఆస్పత్రిలో చికిత్స తీసుకునేంత వరకు వచ్చింది. అయితే, అదృష్టవశాత్తూ త్వరగానే కోలుకున్న 22 ఏళ్ల తిలక్ వర్మ.. ప్రస్తుతం టీమిండియా తరఫున సత్తా చాటుతూ తనను తాను నిరూపించుకుంటున్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన హిట్మ్యాన్.. ఆసియాలోనే తొలి క్రికెటర్గా రోహిత్ రికార్డు -
సిరీస్ ఇంగ్లండ్ వశం.. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా బ్రూక్
న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో (New Zealand vs England) మరో మ్యాచ్ వర్షార్పణమైంది. ఆక్లాండ్ వేదికగా ఇవాళ (అక్టోబర్ 23) జరగాల్సిన మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. అంతకుముందు క్రైస్ట్చర్చ్లో జరగాల్సిన తొలి టీ20 కూడా వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది.మధ్యలో రెండో టీ20లో 65 పరుగుల తేడాతో గెలవడంతో సిరీస్ ఇంగ్లండ్ (England) వశమైంది (1-0). ఆ మ్యాచ్లో విధ్వంసం సృష్టించిన హ్యారీ బ్రూక్కు (Harry Brookk) (35 బంతుల్లో 78; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది.అక్టోబర్ 26 (మౌంట్ మాంగనూయ్), 29 (హ్యామిల్టన్), నవంబర్ 1 (వెల్లింగ్టన్) తేదీల్లో ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగనుంది. ఈ పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.3.4 ఓవర్ల పాటు సాగిన ఆటమూడో టీ20 3.4 ఓవర్ల పాటు సాగింది. టాస్ ఓడి ఇంగ్లండ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ వర్షం ప్రారంభమయ్యే సమయానికి వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. టిమ్ రాబిన్సన్ (2) ఔట్ కాగా.. టిమ్ సీఫర్ట్ (23), రచిన్ రవీంద్ర (10) క్రీజ్లో ఉన్నారు.వన్డే సిరీస్కు ఇరు జట్లు..ఇంగ్లండ్: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జో రూట్, బెన్ డకెట్, జేకబ్ బేతెల్, సామ్ కర్రన్, జేమీ ఓవర్టన్, రెహాన్ అహ్మద్, లియామ్ డాసన్, టామ్ బాంటన్, జేమీ స్మిత్, జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, సోన్నీ బేకర్, బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్, లూక్ వుడ్న్యూజిలాండ్: మార్క్ చాప్మన్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్, మైఖేల్ బ్రేస్వెల్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), జకరీ ఫౌల్క్స్, నాథన్ స్మిత్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, కైల్ జేమీసన్, జేకబ్ డఫీ, మ్యాట్ హెన్రీచదవండి: Virat Kohli: చెరగని మరక.. 17 ఏళ్ల కెరీర్లో తొలిసారి..! -
IND vs NZ: సెమీస్ రేసు.. టాస్ ఓడిన భారత్.. తుదిజట్లు ఇవే
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 (ICC Women's ODI World Cup) టోర్నమెంట్లో ఆఖరి సెమీ ఫైనల్ బెర్తు కోసం భారత్- న్యూజిలాండ్ (IND vs NZ) ముఖాముఖి తలపడుతున్నాయి. నవీ ముంబై వేదికగా గురువారం నాటి మ్యాచ్లో గెలిస్తే హర్మన్ సేన ఎలాంటి సమీకరణలతో పని లేకుండా నేరుగా సెమీ ఫైనల్ చేరుతుంది.టాస్ ఓడిన భారత్మరోవైపు.. న్యూజిలాండ్కు ఇది చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్గా మారింది. ఇందులో గెలిస్తేనే వైట్ఫెర్న్స్ సెమీస్ బెర్తు దక్కించుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుని.. భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది.టాస్ సందర్భంగా న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు ముందుగా మేము బౌలింగ్ చేస్తాం. వికెట్ పాతబడే కొద్దీ మొత్తంగా మారిపోయే సూచనలు కనిపించడం లేదు. ఈ మ్యాచ్ కోసం పూర్తి స్థాయిలో మేము సన్నద్ధమయ్యాము. రెండు అదనపు సెషన్లు ఏర్పాటు చేసుకుని ప్రాక్టీస్ చేశాం.ఈ టోర్నీలో మాకు పూర్తి స్థాయిలో బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. అయితే, ఈరోజు ఎలాంటి ఆటంకం (వర్షం) ఉండదనే భావిస్తున్నాం. 100 ఓవర్ల పాటు మ్యాచ్ సాగాలి. ఇలాంటి తీవ్రమైన ఒత్తిడి ఉన్న పరిస్థితుల నేపథ్యంలోనే క్రికెటర్లు తమలోని అత్యుత్తమ ప్రతిభను వెలికితీయాలి.ఇండియాలో ఇలాంటి పరిస్థితుల్లో గెలిచి సెమీస్ చేరితే అంతకంటే గొప్ప విషయం మాకు మరొకటి ఉండదు. భారత్తో మ్యాచ్ సవాలుతో కూడుకున్నదే. గత మ్యాచ్లో ఆడిన తుదిజట్టుతోనే ఇక్కడా బరిలోకి దిగుతున్నాం’’ అని పేర్కొంది.మూడు మార్పులుమరోవైపు.. తమ జట్టులో మూడు మార్పులు చేసినట్లు భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది. అదనంగా ముగ్గురు బ్యాటర్లను తుదిజట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా ఈ మ్యాచ్లో దురదృష్టవశాత్తూ భారత జట్టు ఓడినప్పటికీ బంగ్లాదేశ్తో మ్యాచ్ రూపంలో మరో అవకాశం ఉంటుంది. ఒకవేళ బంగ్లాను ఓడిస్తే సులువుగానే సెమీస్ చేరుతుంది. అదే సమయంలో న్యూజిలాండ్ తమ తదుపరి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో ఓడాల్సి ఉంటుంది. ఒకవేళ ఫలితం వేరుగా ఉంటే మాత్రం అప్పుడు నెట్ రన్రేటు కూడా కీలకం అవుతుంది. కాగా ఇప్పటికే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మహిళా జట్లు సెమీ ఫైనల్ చేరుకున్న విషయం తెలిసిందే.భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తుదిజట్లుభారత్ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్(వికెట్ కీపర్), స్నేహ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్.న్యూజిలాండ్సుజీ బేట్స్, జార్జియా ప్లిమ్మర్, అమేలియా కెర్, సోఫీ డివైన్(కెప్టెన్), బ్రూక్ హాలిడే, మాడీ గ్రీన్, ఇసాబెల్లా గాజ్(వికెట్ కీపర్), జెస్ కెర్, రోజ్మేరీ మెయిర్, లీ తహుహు, ఈడెన్ కార్సన్.చదవండి: WC 2025 Ind vs NZ: సెమీస్ సమీకరణం ఇదీ... -
Virat Kohli: చెరగని మరక.. 17 ఏళ్ల కెరీర్లో తొలిసారి..!
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో (India vs Australia) టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) వరుసగా రెండు మ్యాచ్ల్లో డకౌటయ్యాడు. తొలి వన్డేల్లో 8 బంతులు ఆడి ఖాతా తెరవలేకపోయిన కోహ్లి.. ఇవాళ (అక్టోబర్ 23) తనకు అచ్చొచ్చే మైదానమైన అడిలైడ్లో 4 బంతుల డకౌట్ను నమోదు చేశాడు.కోహ్లి తన 17 ఏళ్ల కెరీర్లో వరుసగా రెండు వన్డేల్లో డకౌట్ కావడం ఇదే మొదటిసారి. ఈ డబుల్ డక్ కోహ్లి కెరీర్లో చెరగని మరకలా మిగిలిపోతుంది. కెరీర్ చరమాంకంలో రికార్డుల రారాజుకు ఇలాంటి అనుభవం ఎదురు కావడం దురదృష్టకరం.టెస్ట్లకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి, ఏడు నెలల విరామం తర్వాత బరిలోకి దిగిన కోహ్లి మునుపటి జోరును ప్రదర్శించలేకపోతున్నాడు. రెండో వన్డేలో ఔటైన తర్వాత అతని ప్రవర్తన ఈ సిరీస్తో కెరీర్ ముగింపును సూచించింది. తమ ఆరాధ్య ఆటగాడు కెరీర్ చరమాంకంలో వరుస డకౌట్లు కావడాన్ని కోహ్లి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.డబుల్ డక్ తర్వాత కోహ్లి వన్డే సగటు కూడా పడిపోయింది. కోహ్లి ఫామ్లో ఉన్నప్పుడే రిటైరయ్యుంటే గౌరవంగా ఉండేదని అతని అభిమానులు అనుకుంటున్నారు. మరోపక్క కోహ్లిలాగే కెరీర్ చరమాంకంలో ఉన్న రోహిత్ శర్మ (Rohit Sharma) మాత్రం రెండో వన్డేలో హిట్ అయ్యాడు.రోహిత్ కూడా తొలి వన్డేలో నిరాశపరిచినా రెండో వన్డేలో మాత్రం బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో (73) జట్టును ఆదుకున్నాడు. ఈ ప్రదర్శనతో రోహిత్ అభిమానులు సంబరపడిపోతున్నారు. హిట్మ్యాన్ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. రోహిత్తో పాటు శ్రేయస్ అయ్యర్ (61), అక్షర్ పటేల్ (44) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడటంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్ (264/9) చేసింది. ఆఖర్లో హర్షిత్ రాణా (24 నాటౌట్), అర్షదీప్ సింగ్ (13) అమూల్యమైన పరుగులు జోడించారు.ఛేదనలో ఆస్ట్రేలియా తడబడుతుంది. 54 పరుగులకే ఓపెనర్లు మిచెల్ మార్ష్ (11), ట్రవిస్ హెడ్ (28) వికెట్లు కోల్పోయింది. మాథ్యూ షార్ట్ (32), మ్యాట్ రెన్షా (23) క్రీజ్లో ఉన్నారు. 19 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 96/2గాఉంది. ఈ మ్యాచ్లో గెలవాలంటే ఆసీస్ మరో 169 పరుగులు చేయాలి. కాగా, ఈ సిరీస్లోని తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించిన విషయం తెలిసిందే.చదవండి: కొత్త బ్యాటర్.. ఆరంభంలోనే అదుర్స్! -
టీమిండియా న్యూ టాలెంట్.. రికార్డులే రికార్డులు
''కూతురు, కొడుకు అనే తేడా నాకు లేదు. ఇద్దరూ సమానమే. నా కుమారుడు ఇంజనీర్, అతనికి క్రికెట్ అంటే ఆసక్తి లేదు. కానీ నా కూతురు భారతదేశం తరపున క్రికెట్ ఆడుతోంది'' అంటున్నారు ప్రదీప్ రావల్. తన పిల్లలు ఎంచుకున్న కెరీర్ పట్ల ఆయన సంతృప్తిగా ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్లో ఆడుతున్న భారత జట్టులో ఆయన కుమార్తె ప్రతీక రావల్ (Pratika Rawal) సభ్యురాలు.టీమిండియా (Team India) మహిళల జట్టు ఓపెనర్ అయిన ప్రతీక రావల్ తన ప్రతిభతో టీమ్లో కీలకంగా మారింది. 25 ఏళ్ల కుడిచేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్మన్.. ఇప్పటికే పలు ఘనతలు సాధించింది. తాజాగా వరల్డ్కప్లోనూ అంచనాలకు తగినట్టుగా ఆడుతూ జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తోంది. ఇదో జోరు కొనసాగిస్తే భవిష్యత్తులో ఆమె స్టార్ ప్లేయర్ల సరసన చేరడం ఖాయమని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇప్పటివరకు 22 అంతర్జాతీయ వన్డేలు ఆడిన ప్రతీక రావల్ 47 బ్యాటింగ్ సగటుతో 988 పరుగులు చేసింది. ఇందుల్లో సెంచరీతో పాటు 7 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 154. అంతేకాదు అప్పడప్పుడు బౌలింగ్ కూడా చేస్తోంది. 185 బంతులు విసిరి 5 వికెట్లు పడగొట్టింది. అతి తక్కువ అంతర్జాతీయ కెరీర్లోనే పలు రికార్డులు సాధించి దూసుకుపోతోంది.సరికొత్త చరిత్రమహిళల వన్డే క్రికెట్తో తొలి 15 మ్యాచ్ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా ప్రతీక సరికొత్త చరిత్ర లిఖించింది. మొదటి 15 వన్డేల్లో 767 పరుగులు సాధించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్ పేరిట ఉన్న రికార్డ్ను తిరగరాసింది. లానింగ్ తన వన్డే కెరీర్లో తొలి 15 మ్యాచ్లలో 707 రన్స్ చేసింది. ప్రపంచకప్కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లోనూ ప్రతీక సత్తా చాటింది. స్టార్ బ్యాటర్ స్మృతి మంధానతో (Smriti Mandhana) కలిసి మరో రికార్డ్ క్రియోట్ చేసింది. ఓ క్యాలెండర్ ఇయర్లో ఏ వికెట్కైనా అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా రికార్డ్ నెలకొల్పారు.తొలి జంటగా రికార్డ్ఏడాదిగా టీమిండియా ఓపెనర్లుగా వస్తున్న స్మృతి మంధాన- ప్రతీక రావల్ విశేషంగా రాణిస్తున్నారు. మహిళల వన్డే క్రికెట్లో అత్యుత్తమంగా 84.66 సగటుతో వెయ్యి పరుగులు చేసిన తొలి జంటగా వీరు చరిత్రకెక్కారు. భారత మహిళా వన్డే క్రికెట్లో తక్కువ ఇన్నింగ్స్లోనే ఎక్కువసార్లు 100 ప్లస్ ఓపెనింగ్ గణాంకాలు నమోదు చేసిన జోడీగానూ ఘనత సాధించారు.మూడేళ్ల వయసులోనే..దేశ రాజధాని ఢిల్లీలో క్రికెట్ను ఇష్టపడే కుటుంబంలో జన్మించిన ప్రతీక మూడేళ్ల వయసులోనే బ్యాట్ చేతబట్టింది. యూనివర్సిటీ స్థాయి క్రికెటర్, బీసీసీఐ లెవల్ 2 అంపైర్ అయిన ఆమె తండ్రి ప్రదీప్.. తాను సాధించలేని కలను తన కుమార్తె నెరవేర్చాలని కోరుకున్నాడు. అందుకే తన కూతురికి చిన్నప్పటి నుంచే క్రికెట్ నేర్పించడం మొదలుపెట్టాడు. తనకు సరైన మార్గదర్శకత్వం లేనందున జాతీయస్థాయి క్రికెటర్ కాలేకపోయానని, తన కూతురు విషయంలో అలా జరగకూడదన్న ఉద్దేశంతో చిన్ననాటి నుంచి శిక్షణపై ఫోకస్ పెట్టానని వివరించారు. అదృష్టవశాత్తూ ప్రతీకకు కూడా క్రికెట్పై మక్కువ ఉండటంతో తన పని సులువువయిందన్నారు.ట్రైనింగ్.. ఫిట్నెస్ఆమెకు పదేళ్ల వయసు ఉన్నపుడు తన పాఠశాల తరపున కాలేజీ జట్టుతో ఆడిన ప్రతీక తన బ్యాటింగ్తో అందరినీ ఆశ్చర్యపరిచిందని ప్రదీప్ గుర్తు చేసుకున్నారు. ఇంత చిన్నపిల్ల 50 కంటే ఎక్కువ పరుగులు చేయడంతో అక్కడున్న వారందరూ చకితులయ్యారని వెల్లడించారు. అక్కడి నుంచి ఒక్కో అడుగు వేసింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రీడాకారిణి దీప్తి ధ్యాని (Deepti Dhyani) దృష్టిలో పడింది. ప్రతీక ఆటతీరును నిశితంగా గమనించి ఆమెకు కోచ్గా మారింది. ''ప్రతీక కొన్ని డ్రైవ్లు ఆడటం చూశాను. ఆమెకు మంచి టాలెంట్ ఉందని గ్రహించాను. చాలా మంది రాష్ట్ర స్థాయి ఆటగాళ్లకు ప్రతిభ ఉంటుంది, దాన్ని ప్రొఫెషనల్ క్రికెట్గా మార్చడమే సవాలు. అక్కడే కోచ్లుగా మేము అడుగుపెడతాము" అని దీప్తి చెప్పింది. ఆటతో పాటు ఫిట్నెస్పై ప్రతీక తీవ్రంగా కృషి చేసిందని వెల్లడించింది.స్పెషల్ టాలెంట్ప్రొఫెషనల్ క్రికెటర్గా మారినప్పటికీ చదువును నిర్లక్ష్యం చేయలేదు ప్రతీక. సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేసింది. మైదానంలో వ్యూహాలను, భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి చదువు ఆమెకు ఉపయోగపడింది. ఇదే ఆమెను మిగతా క్రికెటర్ల కంటే ప్రత్యేకంగా నిలుపుతుంది. మైదానం వెలుపల కూడా ప్రతీక స్పెషల్ టాలెంట్తో ప్రత్యేకత చాటుకుంటోంది. రూబిక్స్ క్యూబ్ను సులువుగా పరిష్కరించగలదు. చదవండి: టీమిండియా యంగె(టె)స్ట్ సూపర్స్టార్! టర్నింగ్ పాయింట్ఢిల్లీ అండర్-19 టీమ్ తరపున ఆడిన ప్రతీక తర్వాత రైల్వేస్ జట్టుకు మారింది. దేశీయ క్రికెట్లో స్థిరంగా రాణించినప్పటికీ గతేడాది మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) వేలంలో తనను విస్మరించడంతో నిరాశకు గురైంది. అదీ కొద్ది వారాలు మాత్రమే. తర్వాత ఆమెకు తొలిసారిగా టీమిండియా కాల్ వచ్చింది. 2024, డిసెంబర్లో వెస్టిండీస్పై అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి నిలకడగా ఆడుతూ జట్టులో కీలక సభ్యురాలిగా మారింది. తన 6వ మ్యాచ్లో ఐర్లాండ్పై 154 పరుగులు చేయడం ప్రతీక ఇంటర్నేషనల్ కెరీర్లో టర్నింగ్ పాయింట్గా చెప్పవచ్చు.ఏ పాత్రకైనా సిద్ధంప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్లోనూ అంచనాల మేరకు ఆడుతూ జట్టు నమ్మకాన్ని చూరగొంటోంది. జట్టులో ఏ పాత్రకైనా తన కూతురు సిద్ధమని ప్రదీప్ రావల్ (Pradeep Rawal) అంటున్నారు. అంతేకాదు ఈసారి టీమిండియా వరల్డ్కప్ సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతీకపైనా కూడా చాలా అంచనాలు ఉన్నాయని ఆయన తెలిపారు. -
చరిత్ర సృష్టించిన ‘హిట్మ్యాన్’.. ఆసియాలోనే తొలి క్రికెటర్గా
ఆస్ట్రేలియా పర్యటనను పేలవంగా ఆరంభించిన టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) తిరిగి పుంజుకున్నాడు. పెర్త్లో జరిగిన తొలి వన్డేలో ఎనిమిది పరుగులే చేసిన ‘హిట్మ్యాన్’.. రెండో వన్డేలో మాత్రం రాణించాడు.అడిలైడ్ (IND vs AUS 2nd ODI)లో గురువారం నాటి మ్యాచ్లో ఓపెనింగ్ బ్యాటర్ రోహిత్ శర్మ.. అర్ధ శతకం సాధించాడు. డెబ్బై నాలుగు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. మొత్తంగా 97 బంతులు ఎదుర్కొని 73 పరుగులు సాధించాడు. ఇందులో ఏడు ఫోర్లతో పాటు రెండు సిక్సర్లు ఉన్నాయి.సరికొత్త చరిత్రఇక రోహిత్ బాదిన రెండు సిక్సర్లు కూడా భారత ఇన్నింగ్స్ 19వ ఓవర్లో వచ్చినవే. ఆసీస్ పేసర్ మిచెల్ ఓవెన్ బౌలింగ్లో తొలి బంతిని సిక్సర్గా మలిచిన హిట్మ్యాన్.. మూడో బంతిని కూడా బౌండరీ మీదుగా తరలించాడు. అయితే, తొలి సిక్సర్తోనే రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు.SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో 150 సిక్సర్లు బాదిన ఆసియా తొలి క్రికెటర్గా చరిత్రకెక్కాడు. ఇప్పటి వరకు రో‘హిట్’ శర్మ SENA దేశాల్లో మూడు ఫార్మాట్లలో కలిపి 156 మ్యాచ్లు ఆడి 151 సిక్సర్లు బాదడం విశేషం.Oh my word! 🤩@ImRo45 is back to his very best. Just what #TeamIndia needed. 👏#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/P95TUGWl95— Star Sports (@StarSportsIndia) October 23, 2025SENA దేశాల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆసియా క్రికెటర్లు🏏రోహిత్ శర్మ (ఇండియా)- 156 మ్యాచ్లలో 151*🏏సనత్ జయసూర్య (శ్రీలంక)- 171 మ్యాచ్లలో 113🏏షాహిద్ ఆఫ్రిది (పాకిస్తాన్)- 139 మ్యాచ్లలో 105🏏మహేంద్ర సింగ్ ధోని (ఇండియా)- 175 మ్యాచ్లలో 83🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 177 మ్యాచ్లలో 83.👉ఇదిలా ఉంటే.. శ్రేయస్ అయ్యర్ (61)తో కలిసి మూడో వికెట్కు 118 పరుగులు జతచేసిన రోహిత్ శర్మ.. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో జోష్ హాజిల్వుడ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక రోహిత్, శ్రేయస్ అర్ధ శతకాలకు తోడు అక్షర్ పటేల్ (41 బంతుల్లో 44), హర్షిత్ రాణా (18 బంతుల్లో 24 నాటౌట్) రాణించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 264 పరుగులు చేయగలిగింది. చదవండి: డకౌట్ తర్వాత కోహ్లి చర్య వైరల్.. గుడ్బై చెప్పేశాడా? -
అతడెందుకు అని తిట్టారు.. కట్ చేస్తే! 133.33 స్ట్రైక్ రేట్తో మెరుపులు
ఆస్ట్రేలియా టూర్కు ఎంపిక చేసిన భారత జట్టులో హర్షిత్ రాణాకు చోటు ఇవ్వడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. హెడ్ కోచ్ గౌతం గంభీర్ సపోర్ట్తోనే అతడిని ఎంపిక చేశారని అశ్విన్, కృష్ణమచారి శ్రీకాంత్ దిగ్గజ క్రికెటర్ల సైతం మండిపడ్డారు.ఆ తర్వాత వారిద్దరికి గంభీర్ సైతం గట్టిగా కౌంటరిచ్చాడు. మెరిట్ ఆధారంగా ఎంపిక చేశామని, రాణాకు బంతితో బ్యాట్తో రాణించే సత్తా ఉందని గౌతీ చెప్పుకొచ్చాడు. అయితే గంభీర్ చెప్పిన మాటలు నిజమేనని రాణా నిరూపించుకున్నాడు. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో హర్షిత్ రాణా సత్తాచాటాడు.తొమ్మిదో స్దానంలో బ్యాటింగ్కు దిగిన రాణా.. ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అద్భుతమైన షాట్లతో అలరించాడు. ఆడమ్ జంపా వంటి స్టార్ స్పిన్నర్ను సైతం సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. రాణా 18 బంతుల్లో మూడు ఫోర్లు సాయంతో 24 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. రాణా 133.33 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి విమర్శకుల నోళ్లు మూయించాడు. అతడి కీలక ఇన్నింగ్స్తో భారత స్కోర్ 250 పరుగుల మార్క్ దాటింది.రోహిత్, అయ్యర్ హాఫ్ సెంచరీలుకాగా అడిలైడ్ వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 97 బంతులు ఎదుర్కొన్న హిట్మ్యాన్ ఏడు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు.అతడితో పాటు శ్రేయస్ అయ్యర్(61), అక్షర్ పటేల్(44) రాణించారు. ఆఖరిలో హర్షిత్తో పాటు అర్ష్దీప్ కూడా 13 పరుగులతో కీలక నాక్ ఆడాడు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 4 వికెట్లు పడగొట్టగా..బార్ట్లెట్ మూడు, స్టార్క్ రెండు వికెట్లు సాధించాడు.Harshit Rana scored 24 unbeaten runs off 18 balls. It’s not a massive contribution but it clearly shows that he can bat. All those who troll him 24x7 will not a say a word about his good cameo. These runs can be a deciding factor sometimes. #INDvsAUS pic.twitter.com/eS6dTxiygJ— Madhav Sharma (@HashTagCricket) October 23, 2025 -
ఆసీస్ టూర్కు నో ఛాన్స్.. రవీంద్ర జడేజా సంచలన నిర్ణయం!
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా దాదాపు పది నెలల తర్వాత తిరిగి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో భాగంగా మధ్యప్రదేశ్తో మ్యాచ్కు ప్రకటించిన సౌరాష్ట్ర జట్టులో జడేజాకు చోటు దక్కింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్కు జడేజా ఎంపిక కాకపోవడంతో ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాడు.ఈ క్రమంలో ఎంపీతో మ్యాచ్కు అందుబాటులో ఉంటాని జడేజా తనంతట తానే సౌరాష్ట్ర సెలక్టర్లకు తెలియజేసినట్లు తెలుస్తోంది. జడేజా జట్టులోకి వచ్చినప్పటికి సౌరాష్ట్ర కెప్టెన్గా జయదేవ్ ఉనద్కట్ కొనసాగనున్నాడు. అక్టోబర్ 25 నుంచి రాజ్కోట్ వేదికగా సౌరాష్ట్ర-మధ్యప్రదేశ్ మ్యాచ్ ప్రారంభం కానుంది.సూపర్ ఫామ్లో జడ్డూ..కాగా జడేజా ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇటీవల వెస్టిండీస్తో టెస్టు సిరీస్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన జడ్డూ.. ప్లేయర్ ఆఫ్ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. అయితే ఆసీస్తో వన్డేలకు జడేజాను ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం ఎడమ చేతి వాటం స్పిన్నర్గా జడేజాకు బదులుగా అక్షర్ పటేల్ను తీసుకున్నారు.వాషింగ్టన్ సుందర్, పటేల్ను స్పిన్ ఆల్రౌండర్లగా ఎంపిక చేసిన సెలక్టర్లు.. జడేజాకు ఛాన్స్ ఇవ్వలేదు. అయితే జడ్డూతో చర్చించాకే సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సౌరాష్ట్ర క్రికెట్ తిరిగి వచ్చే నెలలో భారత జెర్సీలో కన్పించనున్నాడు. సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్లో జడ్డూ భాగంగా కానున్నాడు. ఈ సిరీస్ సన్నాహకంగా రంజీ ట్రోఫీ మ్యాచ్ను ఉపయోగించుకోవాలని జడేజా భావిస్తున్నాడు.సౌరాష్ట్ర జట్టు: హార్విక్ దేశాయ్ (వికెట్ కీపర్), తరంగ్ గోహెల్, రవీంద్ర జడేజా, యువరాజ్సిన్హ్ దోడియా, సమ్మర్ గజ్జర్, అర్పిత్ వాసవాడ, చిరాగ్ జానీ, ప్రేరక్ మన్కడ్, జయదేవ్ ఉనద్కత్ (కెప్టెన్), ధర్మేంద్రసింగ్ జడేజా, చేతన్ సకారియా, అన్ష్ గోసాయి, జే గోహిల్, పార్త్ భుట్, కెవిన్ జీవరాజని, హెత్విక్ కోటక్ మరియు అంకుర్ పన్వర్.


