Cricket
-
రిటైర్మెంట్ ప్రకటించిన ఐపీఎల్ దిగ్గజం
ఐపీఎల్ దిగ్గజ బౌలర్ పియూశ్ చావ్లా క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఇవాళ (జూన్ 6) వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్తో పాటు దేశవాలీ క్రికెట్కు కూడా ఇది వర్తిస్తుందని పేర్కొన్నాడు. 36 ఏళ్ల పియూశ్ చావ్లాకు ఐపీఎల్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. View this post on Instagram A post shared by Piyush Chawla (@piyushchawla_official_)ఆరంభ సీజన్ నుంచి (2008) క్యాష్ రిచ్ లీగ్ ఆడుతున్న అతను 192 మ్యాచ్ల్లో 192 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్లో చహల్ (221), భువనేశ్వర్ కుమార్ (198) మాత్రమే చావ్లా కంటే ఎక్కువ వికెట్లు తీశారు. సునీల్ నరైన్ చావ్లాతో సమానంగా 192 వికెట్లు తీశాడు.2008లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్తో కెరీర్ ప్రారంభించిన చావ్లా.. ఆతర్వాత కేకేఆర్, సీఎస్కే, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు. చివరిగా 2024 సీజన్లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహించిన చావ్లాను ఈ సీజన్ మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్ బౌలర్ అయిన చావ్లా 2006లో టీమిండియా తరఫున టెస్ట్ అరంగేట్రం చేసి, ఆ ఫార్మాట్లో 3 మ్యాచ్లు ఆడి 7 వికెట్లు తీశాడు. ఆ తర్వాత 2007లో వన్డే, 2010లో టీ20 అరంగేట్రం చేసిన చావ్లా 25 వన్డేల్లో 32 వికెట్లు, 7 టీ20ల్లో 4 వికెట్లు తీశాడు. చావ్లా అంతర్జాతీయ కెరీర్ అంత సుదీర్ఘంగా సాగనప్పటికీ.. భారత్ గెలిచిన రెండు వరల్డ్కప్ టోర్నీల్లో భాగంగా ఉన్నాడు. చావ్లా 2007 టీ20 వరల్డ్కప్, 2011 వన్డే వరల్డ్కప్ గెలిచిన భారత జట్లలో సభ్యుడిగా ఉన్నాడు.ఉత్తర్ప్రదేశ్లోని అలీఘడ్లో జన్మించిన చావ్లా.. సొంత రాష్ట్రం తరఫున 2008-2013 వరకు దేశవాలీ క్రికెట్ ఆడాడు. ప్రస్తుతం అతను గుజరాత్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చావ్లాకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇందులో 137 మ్యాచ్లు ఆడిన చావ్లా మూడు 10 వికెట్ల ప్రదర్శనలు, 23 ఐదు వికెట్ల ప్రదర్శనల సాయంతో 446 వికెట్లు తీశాడు. దేశవాలీ క్రికెట్లో చావ్లా బ్యాటర్గానూ రాణించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతని పేరు మీద 6 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
నా నిర్ణయంతో మా నాన్న చాలా ఫీలయ్యారు: రోహిత్ శర్మ
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ ఇటీవలే టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కీలకమైన ఇంగ్లండ్ సిరీస్కు ముందు రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడించి అందరికి షాకిచ్చారు. అయితే హిట్మ్యాన్ నిర్ణయంతో కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, అతడి తండ్రి గురునాథ్ శర్మ సైతం నిరాశకు లోనయ్యారంట. ఈ విషయాన్ని స్వయంగా రోహిత్నే వెల్లడించాడు."మా నాన్న.. నేను రెడ్ బాల్తో క్రికెట్ ఆడటం ఎక్కువగా చూశారు. అందుకే ఆయనకు టెస్టు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నేను టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆయన కొంచెం నిరాశచెందారు. అదే సమయంలో నా సుదీర్ఘ కెరీర్ పట్ల ఆయన సంతోషం కూడా వ్యక్తం చేశారు.ఈ రోజు ఈస్ధాయికి నేను చేరుకున్నానంటే అందులో కీలక పాత్ర మా నాన్నదే. తల్లిదండ్రులు సపోర్ట్ లేకుండా మనం ఏదీ సాధించలేము. నాకు కూడా టెస్టు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నా కెరీర్ తొలి రోజు నుంచే ఆయన టెస్టు క్రికెట్కు అభిమానిగా మారారు. నేను వన్డేలో 264 పరుగులు చేసిన రోజు నాకు ఇంకా ఇప్పటికి బాగా గుర్తుంది. ఆ రోజు మాన్న నా దగ్గరకు వచ్చి ఏదో మొక్కుబడిగా బాగా ఆడావని ప్రశంసించారు. అంతే తప్ప అతనిలో ఎటువంటి ఉత్సాహం కన్పించలేదు" అని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ పేర్కొన్నాడు.రోహిత్ తన టెస్ట్ కెరీర్లో 67 మ్యాచ్లు ఆడి 40.57 సగటుతో 4,301 పరుగులు సాధించారు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి. 2019లో దక్షిణాఫ్రికాపై సాధించిన 212 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోరు. కెప్టెన్గా 24 టెస్టులకు నాయకత్వం వహించి, 12 విజయాలు, 9 ఓటములు, 3 డ్రాలు నమోదు చేశాడు.చదవండి: IND vs ENG; 'అతడికి చాలా అనుభవం ఉంది.. ఇంగ్లండ్ టూర్లో కీలకం కానున్నాడు' -
'అతడికి చాలా అనుభవం ఉంది.. ఇంగ్లండ్ టూర్లో కీలకం కానున్నాడు'
భారత క్రికెట్ జట్టు ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్కు పయనమైంది. హెడ్కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ శుబ్మన్ గిల్ నేతృత్వంలో మొత్తం టీమ్ సభ్యులు శుక్రవారం ముంబై విమానశ్రాయం నుంచి లండన్కు బయలు దేరారు. అక్కడకి వెళ్లాక పది రోజుల పాటు ప్రాక్టీస్ క్యాంపులో టీమిండియా తీవ్రంగా శ్రమించనుంది. జూన్ 20 నుంచి లీడ్స్ వేదికగా ఈ రెడ్బాల్ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా లండన్ విమానం ఎక్కేముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్, కొత్త టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ విలేకరుల సమావేశంలో పాల్గోనున్నారు. ఈ సందర్భంగా ఎనిమిదేళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేసిన కరుణ్ నాయర్పై గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లండ్ పర్యటనలో కరుణ్ నాయర్ అనుభవం భారత జట్టుకు కీలకం కానుందని గంభీర్ అభిప్రాయపడ్డాడు."కరుణ్ నాయర్ దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించి తిరిగి భారత జట్టులోకి వచ్చాడు. అది దేశవాళీ క్రికెట్కు ఉన్న ప్రాముఖ్యత. యువ ఆటగాళ్లకు నేను చెప్పేది ఒక్కటే. డిమాస్టిక్ క్రికెట్లో మీరు అత్యున్నత ప్రదర్శన ఇస్తున్నన్ని రోజులు మీకోసం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఈ పర్యటనలో కరుణ్ నాయర్ అనుభవం జట్టుకు ఎంతోగానే ఉపయోగపడనుంది. కౌంటీ క్రికెట్లో ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా అతడికి ఉంది. కౌంటీల్లో కూడా పరుగులు సాధించాడు. అక్కడి పరిస్థితులు అతడికి బాగా తెలుసు. ఇప్పుడు ఇండియా-ఎ తరపున కూడా సెంచరీ చేశాడు. ఇటువంటి పర్యటనలకు మంచి ఫామ్లో ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉండడం చాలా ముఖ్యం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఆటగాళ్లు ఫామ్ను ఒకటి లేదా రెండు టెస్ట్ మ్యాచ్ల ఆధారంగా అంచనా వేయాలనుకోవడం లేదు. ఎవరైతే నిలకడగా పరుగులుసాధిస్తారో, వారు అంతర్జాతీయ క్రికెట్లో కూడా రాణించగలరు అని ప్రెస్కాన్ఫరెన్స్లో గంభీర్ పేర్కొన్నాడు. కాగా కరుణ్ నాయర్ దేశవాళీ క్రికెట్లో పరుగులు వరద పారించాడు. రంజీ ట్రోఫీ 2024-25లో విదర్భ ఛాంపియన్గా నిలవడంలో కరుణ్ది కీలక పాత్ర. ఈ టోర్నీలో 16 ఇన్నింగ్స్లలో 53.93 సగటుతో 863 పరుగులు చేసి నాలుగో టాప్ స్కోరర్గా నిలిచాడు. నాయర్ చివరసారిగా భారత జట్టు తరపున 2017లో ఆడాడు. కాగా వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడిగా కరుణ్ నాయర్ కొనసాగుతున్నాడు. -
దక్షిణాఫ్రికా పొమ్మంది.. న్యూజిలాండ్ రమ్మంది
న్యూజిలాండ్ సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు ఆల్ ఫార్మాట్ హెడ్ కోచ్గా సౌతాఫ్రికాకు చెందిన రాబ్ వాల్టర్ నియమితుడయ్యాడు. గత నెలలో ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకున్న గ్యారీ స్టెడ్ స్ధానాన్ని వాల్టర్ భర్తీ చేయనున్నాడు. 2028 టీ20 ప్రపంచకప్ వరకు అతడు ఈ పదవిలో కొనసాగనున్నాడు.ఈ విషయాన్ని న్యూజిలాండ్ న్యూజిలాండ్ క్రికెట్ (NZC) శుక్రవారం ధ్రువీకరించింది. ఈ ఏడాది జూలైలో జింబాబ్వేతో జరగనున్న వైట్బాల్ సిరీస్లతో వాల్టర్ కివీస్ కోచ్గా తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. కాగా కోచ్గా వాల్టర్కు అపారమైన అనుభవం ఉంది. మొన్నటివరకు సౌతాఫ్రికా వైట్బాల్ జట్టు ప్రధాన కోచ్గా రాబ్ పనిచేశాడు. అతడి నేతృత్వంలోనే టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్కు ప్రోటీస్ జట్టు దూసుకెళ్లింది. అయినప్పటికి అతడి కాంట్రాక్ట్ను సౌతాఫ్రికా క్రికెట్ పొడిగించలేదు. అతడి స్ధానంలో ఆల్ ఫార్మాట్ హెడ్ కోచ్గా షుక్రి కాన్రాడ్ను సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. న్యూజిలాండ్ డిమాస్టిక్ క్రికెట్లో కూడా వాల్టర్ ఒటాగో వోల్ట్స్కు కోచ్గా పనిచేశాడు. 2018-19, 2019-20లో వరుసగా ఫోర్డ్ ట్రోఫీ ఫైనల్స్లకు ఒటాగోనే వాల్టర్ చేర్చాడు. పూణే వారియర్స్, ఢిల్లీ డేర్డెవిల్స్కు అసిస్టెంట్ కోచ్గా కూడా తన సేవలను అందించాడు.చదవండి: Shubman Gill: కోహ్లి, రోహిత్ ఉన్నా లేకున్నా ఒకేలా ఉంటుంది -
Worst Playing XI of IPL 2025: కెప్టెన్గా రిషబ్ పంత్..
రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను ఉరూతలూగించిన ఐపీఎల్-2025 సీజన్కు మంగళవారం(జూన్ 3) ఎండ్కార్డ్ పడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. తమ 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది.అయితే ఈ ఏడాది సీజన్లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సాయిసుదర్శన్(ఆరెంజ్ క్యాప్ విన్నర్), ప్రసిద్ద్ కృష్ణ(పర్పుల్ క్యాప్ విజేత) అద్బుతమైన ప్రదర్శనతో అదరగొట్టగా.. రిషబ్ పంత్, వెంకటేష్ అయ్యర్ వంటి ఖరీదైన ఆటగాళ్లు తీవ్ర నిరాశపరిచారు. ఈ క్రమంలో ఐపీఎల్-2025లో విఫలమైన ఆటగాళ్లతో కూడిన ప్లేయింగ్ ఎలెవన్ను ఓ న్యూస్ వెబ్సైట్ ప్రకటించింది.రచిన్ రవీంద్రమెగా వేలంలో న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్రను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 4 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ రవీంద్ర మాత్రం తన మార్క్ను చూపించలేకపోయాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన రవీంద్ర.. 8 మ్యాచ్ల్లో 191 పరుగులు మాత్రమే చేయగలిగాడు.ఇషాన్ కిషన్..ఇషాన్ కిషన్పై సన్రైజర్స్ హైదరాబాద్ భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ క్రమంలోనే అతడిపై రూ.11.25 కోట్ల భారీ ధర ఎస్ఆర్హెచ్ వెచ్చింది. కానీ కిషన్ మాత్రం అంచనాల తగ్గట్టు రాణించిలేకపోయాడు. తొలి మ్యాచ్లో సెంచరీ చేసిన కిషన్.. తిరిగి మళ్లీ ఆఖరి మ్యాచ్లో మెరిశాడు. మిగితా మ్యాచ్ల్లో దారుణంగా విఫలమయ్యాడు. ఓవరాల్గా 14 మ్యాచ్లు ఆడి 354 పరుగులు చేశాడు.రిషబ్ పంత్..ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన పంత్.. తన ధరకు తగ్గ న్యాయం చేయలేకపోయాడు. ఆఖరి మ్యాచ్లో సెంచరీ మినహా మిగితా మ్యాచ్లలో విఫలమయ్యాడు. 13 మ్యాచ్లలో 269 పరుగులు మాత్రమే చేయగలగాడు. సదరు వెబ్సైట్ ఈ జట్టుకు పంత్ను కెప్టెన్గా ఎంపిక చేసింది.వెంకటేశ్ అయ్యర్..మధ్యప్రదేశ్కు చెందిన వెంకటేశ్ అయ్యర్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన మూడో ఆటగాడిగా నిలిచాడు. అయ్యర్ను ఐపీఎల్ మెగా వేలంలో రూ.23.75 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసింది. కానీ అయ్యర్ మాత్రం పూర్తిగా తేలిపోయాడు. సీజన్ మొత్తంలో అతడు 11 మ్యాచ్లలో 7 ఇన్నింగ్స్ లు మాత్రమే ఆడి, 142 పరుగులు చేశాడు. మిగిలిన రెండు మ్యాచ్లకు బెంచ్కే పరిమితమయ్యాడు.గ్లెన్ మాక్స్వెల్..పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన గ్లెన్ మాక్స్వెల్ సైతం తీవ్ర నిరాశపరిచాడు. ఈ ఆసీస్ స్టార్ 6 మ్యాచ్లు ఆడి 48 పరుగులతో పాటు కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.నితీష్ కుమార్ రెడ్డిఐపీఎల్-2025 సీజన్కు ముందు నితీష్ కుమార్ రెడ్డిని ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకుంది. గతేడాది ఎమర్జింగ్ ప్లేయర్గా నిలిచిన నితీష్.. ఈ ఏడాది సీజన్ మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచాడు. 14 మ్యాచ్లు ఆడి 182 పరుగులతో పాటు 2 వికెట్లు పడగొట్టాడు.ధోని(వికెట్ కీపర్)సీఎస్కే దిగ్గజం ఎంఎస్ ధోనికి ఇది మర్చిపోలేని సీజన్. ఈ ఏడాది ధోనికి చాలా మ్యాచ్లలో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినప్పటికి సద్వినియోగ పరచుకోలేకపోయాడు. 14 మ్యాచ్ల్లో 135 పరుగులు చేశాడు.వీరితో స్టార్ ప్లేయర్లు రషీద్ ఖాన్(గుజరాత్ టైటాన్స్), రవిచంద్రన్ అశ్విన్(సీఎస్కే), మహ్మద్ షమీ(ఎస్ఆర్హెచ్), దీపక్ చాహర్ సైతం తీవ్ర నిరాశపరిచారు.Worst Playing XI of IPL 2025: రచిన్ రవీంద్ర, ఇషాన్ కిషన్, రిషబ్ పంత్(కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, ధోని(వికెట్ కీపర్), మాక్స్వెల్, వెంకటేశ్ అయ్యర్,రషీద్ ఖాన్,రవిచంద్రన్ అశ్విన్,మహ్మద్ షమీ,దీపక్ చాహర్ -
కోహ్లి, రోహిత్ ఉన్నా లేకున్నా ఒకేలా ఉంటుంది: శుబ్మన్ గిల్
టీమిండియా టెస్టు కెప్టెన్గా తొలి సవాల్ను ఎదుర్కొనేందుకు శుబ్మన్ గిల్ సిద్దమయ్యాడు. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం గిల్ సారథ్యంలోని భారత జట్టు శుక్రవారం ఇంగ్లండ్కు పయనమైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలు లేని భారత జట్టును గిల్ ఎలా నడిపిస్తాడో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఇక ఇంగ్లండ్కు బయలుదేరే ముందు బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో శుబ్మన్ గిల్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఇంగ్లండ్ పర్యటనకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అదేవిధంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్లపై కూడా గిల్ మాట్లాడాడు."సాధారణంగా ప్రతీ టూర్లోనూ ఒత్తిడి ఉంటుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలకడం మాకు నిజంగా గట్టి ఎదురుదెబ్చ అని చెప్పాలి. వారిద్దరూ చాలా అనుభవజ్ఞులైన ఆటగాళ్ళు. భారత జట్టుకు ఎన్నో అద్బుతమైన విజయాలు అందించారు. వారి స్ధానాలను భర్తీ చేయడం చాలా కష్టం. అయితే రోహిత్, కోహ్లి ఉన్నప్పుడు ఎలాంటి ఒత్తిడి ఉంటుందో ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. అందులో ఎటువంటి మార్పు ఉండదు. మా బ్యాటింగ్ ఆర్డర్ను ఇంకా మేము ఖారారు చేయలేదు. అందుకు మాకు ఇంకా రెండు వారాల సమయం ఉంది. లండన్లో 10 రోజుల ప్రాక్టీస్ క్యాంపును నిర్వహిస్తాము. ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్లు ఆడతాము. ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ను నిర్ణయిస్తాము అని గిల్ ప్రెస్కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్తోనే డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్కు తెరలేవనుంది. ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు: శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్చదవండి: IND vs ENG: ఇంగ్లండ్-భారత్ టెస్టు సిరీస్కు కొత్త పేరు ఖరారు -
తొక్కిసలాట ఘటన.. ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ అరెస్ట్
చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన విచారణలో బెంగళూరు పోలీసులు మరో అడుగు ముందుకు వేశారు. సీఎం సిద్దరామయ్య ఆదేశాల మెరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ మెనెజ్మెంట్పై చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను శుక్రవారం అరెస్టు చేశారు.ముంబైకి వెళ్తుండగా బెంగళూరు ఎయిర్పోర్టులో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా ఈ ఈవెంట్ నిర్వాహక సంస్థ డీఎన్ఎ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ముగ్గురు సిబ్బందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.నిఖిల్ సోసాలేను పోలీసులు ప్రస్తుతం రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అతడి అరెస్ట్పై ఆర్సీబీ యాజమాన్యం ఇప్పటివరకు ఇంకా స్పందించలేదు. కాగా బుధవారం (జూన్ 4) జరిగిన తొక్కిసలాటలో 11మంది మృతిచెందారు. దాదాపు 50 మందికి పైగా గాయపడ్డారు.ఇక ఈ ఘటనపై గురువారం విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీస ఏర్పాట్లు లేకుండా ఈవెంట్ ఎలా నిర్వహిస్తారని చీఫ్ జస్టిస్తో కూడిన ధర్మాసనం మండిపడింది. ఈ ఘటన వెనుక కారణాలను తేల్చాలని సిద్దరామయ్య సర్కార్ను హైకోర్టు ఆదేశించింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం సీఐడీ పోలీసులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కాగా ఇప్పటికే బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ బి.దయానంద్, డీసీపీ శేఖర్, ఇన్స్పెక్టర్ గిరీశ్లపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిందిచదవండి: IND vs ENG: ఇంగ్లండ్-భారత్ టెస్టు సిరీస్కు కొత్త పేరు ఖరారు -
IND Vs ENG: ఇంగ్లండ్కు బయలు దేరిన టీమిండియా.. 14 రోజుల ముందే
ఇంగ్లండ్-భారత మధ్య జరిగే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సమయం అసన్నమవుతోంది. జూన్ 20 నుంచి హెడ్డింగ్లీ వేదికగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ రెడ్ బాల్ సిరీస్ కోసం శుబ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు శుక్రవారం ఇంగ్లండ్కు పయనమైంది.ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తమ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. జట్టు తో పాటు హెడ్కోచ్ గౌతం గంభీర్ కూడా ఉన్నాడు. ఇంగ్లండ్ పరిస్థితులకు అలవాటు పడేందుకు 14 రోజుల ముందే అక్కడకు గిల్ సేన చేరుకోనుంది. జూన్ 13 నుంచి 16 వరకు బెకెన్హామ్ వేదికగా ఇండియా-ఎతో సీనియర్ భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత ప్రధాన సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఇంగ్లండ్కు పయనమవ్వకముందు కొత్త కెప్టెన్ శుబ్మన్ గిల్, గౌతం గంభీర్ విలేకరుల సమావేశంలో పాల్గోనున్నారు.ఈ సందర్బంగా పలు ప్రశ్నలకు వీరిద్దరూ సమాధనమిచ్చారు. ఈ సిరీస్లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కేవలం మూడు మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు గంభీర్ స్పష్టం చేశాడు. అదేవిధంగా భారత బ్యాటింగ్ ఆర్డర్ను ఇంకా ఖారారు చేయలేదని, తమకు ఇంకా రెండు వారాల సమయం ఉందని గిల్ పేర్కొన్నాడు.కాగా ఈ సిరీస్కు ముందు స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ క్రమంలో వీరిద్దరి స్ధానాలను ఎవరు భర్తీ చేస్తారో అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విరాట్ కోహ్లి స్ధానంలో కరుణ్ నాయర్ బ్యాటింగ్కు వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. ఎనిమిదేళ్ల తర్వాత భారత జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్.. ఇంగ్లండ్ లయన్స్తో జరుగుతున్న అనాధికారిక టెస్టు సిరీస్లో దుమ్ములేపుతున్నాడు.తొలి అనాధికారిక టెస్టులో నాయర్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. మరోవైపు సాయిసుదర్శన్, అర్ష్దీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లకు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది.ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు: శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ -
ఇంగ్లండ్-భారత్ టెస్టు సిరీస్కు కొత్త పేరు ఖరారు
భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే టెస్టు సిరీస్కు ‘అండర్సన్–టెండూల్కర్’ ట్రోఫీగా నామకరణం చేశారు. ఆటకు వన్నె తెచ్చిన ఆటగాళ్ల పేర్లను సిరీస్లకు పెట్టడం పరిపాటి కాగా... ఇకపై టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరిగే సిరీస్ను ఈ పేరుతోనే కొనసాగించాలని బీసీసీఐ, ఈసీబీ సమష్టిగా నిర్ణయించాయి.ఈ నెల 20 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా... దీంతోనే 2025–27 ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) సైకిల్ మొదలవుతుంది. తొలి టెస్టు ప్రారంభానికి ముందు ఈ ఇద్దరు దిగ్గజాలు ట్రోఫీని ఆవిష్కరించనున్నట్లు సమాచారం.క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ టీమిండియా తరఫున 200 టెస్టు మ్యాచ్లు ఆడి 15,921 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు (704) తీసిన పేస్ బౌలర్ అండర్సన్ 188 మ్యాచ్ల్లో ఇంగ్లండ్కు ప్రాతినిధ్యం వహించాడు.ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ మధ్య ఇంగ్లండ్లో జరిగే సిరీస్ను పటౌడీ ట్రోఫీగా, భారత్లో జరిగే సిరీస్ను ఆంటోనీ డి మెల్లో ట్రోఫీగా అభివర్ణిస్తున్నారు. ఇక మీద ఇంటా బయట ఎక్కడ సిరీస్ జరిగినా దాన్ని ‘అండర్సన్–టెండూల్కర్’ ట్రోఫీగానే పిలవనున్నారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్లను ఇదే మాదిరిగా ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’గా అభివర్ణిస్తున్న విషయం తెలిసిందే.ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు: శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ -
కేఎల్ రాహుల్పై అందరి దృష్టి
నార్తంప్టన్: ఇంగ్లండ్తో ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్కు ముందు... ఇంగ్లండ్ లయన్స్తో భారత ‘ఎ’ జట్టు రెండో అనధికారిక టెస్టు మ్యాచ్కు రంగం సిద్ధమైంది. భారత జట్టుకు ఎంపికైన ఆటగాళ్లకు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ నాలుగు రోజుల మ్యాచ్ మంచి ప్రాక్టీస్ కానుండగా... సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్పై అందరి దృష్టి నిలవనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్టు ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం జట్టులో అందరికంటే అనుభవజ్ఞుడైన రాహుల్పై బాధ్యత పెరగగా... ఈ మ్యాచ్లో అతడు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడో చూడాలి.టీమిండియా టెస్టు కెప్టెన్గా కొత్తగా ఎంపికైన శుబ్మన్ గిల్, యువ ఓపెనర్ సాయి సుదర్శన్ ఇంకా ఇంగ్లండ్కు చేరుకోకపోవడంతో ఆ ఇద్దరూ ఈ మ్యాచ్లో పాల్గొనడంలేదు. ఇంగ్లండ్తో సిరీస్ కోసం ఈరోజు లండన్ బయలు దేరనున్న మిగిలిన ఆటగాళ్లు ప్రాక్టీస్ అనంతరం ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్ ఆడనున్నారు. తొలి అనధికారిక మ్యాచ్లో కరుణ్ నాయర్ డబుల్ సెంచరీతో కదం తొక్కగా... సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, నితీశ్ కుమార్ రెడ్డి అర్ధశతకాలు సాధించారు. ఈ నెల 20 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు జరగనుండగా... ప్రాక్టీస్ మ్యాచ్ల ప్రదర్శన ఆధారంగా తుది జట్టు ఎంపిక జరగనుంది. భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న ఆరుగురు ఆటగాళ్లు ఇంగ్లండ్ లయన్స్తో తొలి అనధికారిక టెస్టులో పాల్గొనగా... పేసర్ ఆకాశ్ దీప్ ఈ మ్యాచ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆ్రస్టేలియా పర్యటనలో అటు బంతితో ఇటు బ్యాట్తో ఆకట్టుకున్న ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఈ ఏడాది ఐపీఎల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. తొలి ప్రాక్టీస్ మ్యాచ్లో ధనాధన్ షాట్లతో హాఫ్సెంచరీ చేసిన నితీశ్... బంతితోనూ సత్తాచాటాలని భావిస్తున్నాడు. తుది జట్టులో చోటు కోసం మరో పేస్ ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్తో నితీశ్ పోటీపడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్కు కూడా బ్యాటింగ్ పిచ్ అందుబాటులో ఉంది. ఇంగ్లండ్ టెస్టు జట్టులో సభ్యులైన క్రిస్ వోక్స్, జోష్ టంగ్ లయన్స్ తరఫున రాణించాలని చూస్తున్నారు. -
ఆర్సీబీ ప్రతినిధుల్ని అరెస్ట్ చేయండి: కర్ణాటక సీఎం
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన ఐపీఎల్ ట్రోఫీ విజయ సంబరాలు బెంగళూరులో 11 మంది కుటుంబాలను విషాదంలో ముంచాయి. దీంతో టైటిల్ గెలిచిన ఆనందం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) శిబిరంలో ఆవిరైంది. ఈ దుర్ఘటనను తీవ్రంగా పరిగణించిన కర్ణాటక సీఎం సిద్ధారామయ్య ఆర్సీబీ ప్రతినిధుల్ని అరెస్టు చేయాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. విధుల్లో నిర్లక్షంగా వ్యవహరించిన బెంగళూరు కమిషనర్ దయానంద్ సహా ఐదుగురు పోలీసు అధికారుల్ని సైతం సర్కారు సస్పెండ్ చేసింది. పలువురు దిగ్గజ క్రికెటర్లు పెను విషాదంపై విచారం వెలిబుచ్చారు. బెంగళూరు పోలీసులు ఫ్రాంచైజీ సహా కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘంపై కేసు నమోదు చేసింది. కర్ణాటక హైకోర్టు తక్షణ నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట దుర్ఘటనపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కన్నెర్రజేసింది. ఏకంగా 11 మంది మృత్యువాత పడిన ఈ విషాద ఘటనను తీవ్రంగా పరిగణించిన సీఎం సిద్ధరామయ్య దుర్ఘటనకు బాధ్యులైన వారిలో ఎవరినీ విడిచిపెట్టొద్దని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్రతినిధుల్ని వెంటనే అరెస్టు చేయాలని, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డీఎన్ఏ, కర్ణాటక క్రికెట్ సంఘం (కేఎస్సీఏ) ఉన్నతాధికారుల్ని సైతం అదుపులోకి తీసుకోవాలని ఆ రాష్ట్ర సీఎం ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన బెంగళూరు నగర్ పోలీస్ కమిషనర్ దయానంద్ సహా ఐదుగురు అధికారుల్ని సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వం వెల్లడించింది. జ్యుడీషియల్ విచరాణ కోసం హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ మైకేల్ డికున్హా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. కేసు దర్యాప్తును సీఐడీకి బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది. 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్లో తొలిసారి టైటిల్ గెలవడంతో బుధవారం బెంగళూరులో విజయోత్సవ సంబరాలు విషాదంగా ముగిశాయి.చిన్నస్వామి స్టేడియం ప్రేక్షకుల సామర్థ్యానికి పదిరెట్లకు మించి పోటెత్తిన అభిమాన సందోహాన్ని పోలీసులు నియంత్రించలేకపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమైన ఆర్సీబీ ఫ్రాంచైజీ యాజమాన్యం, కేఎస్సీఏ, డీఎన్ఏపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ప్రధాన నిందితులు ఏ1గా ఆర్సీబీపై కేసులు మోపారు. ఏ2గా డీఎన్ఏ, ఏ3గా కేఎస్సీఏపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని బెంగళూరు పోలీసులు తెలిపారు. కుబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహితలోని 105, 115, 118, 190, 132, 125, 142, 121 సెక్షన్ల కింద పలు నేరారోపణలలతో కేసులు నమోదు చేశారు. అయితే విషాదఘటన అనంతర విచారణకు పూర్తిగా సహకరిస్తామని ఆర్సీబీ యాజమాన్యం ప్రకటించింది. పోలీసు దర్యాప్తునకు, రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు సహకారం అందజేస్తామని ఆర్సీబీ తెలిపింది. ప్రస్తుత పరిస్థితిపై... తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు స్పందించింది. తాత్కాలిక చీఫ్ జస్టిస్ కామేశ్వర్ రావు, జస్టిస్ సీఎమ్ జోషిలతో కూడిన డివిజన్ బెంచ్ ప్రజా ప్రయోజనార్థం కేసును సుమోటోగా స్వీకరించింది. ప్రస్తుత పరిస్థితిపై పూర్తిస్థాయి నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హృదయ విదారక దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారు, గాయపడిన వారు, చికిత్స పొందుతున్న వారి వివరాలు సహా ప్రభుత్వం, పోలీసులు తక్షణం చేపట్టిన చర్యలు తదితర వివరాలతో కూడిన సంపూర్ణ నివేదిక ఇవ్వాల్సిందిగా కర్ణాటక సర్కారును డివిజన్ బెంచ్ ఆదేశించింది. ఆర్సీబీ పరిహారం ఇది వరకే రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. కేఎస్సీఏ కూడా రూ. 5 లక్షలు పరిహారం ఇస్తామంది. తాజాగా బెంగళూరు ఫ్రాంచైజీ యాజమాన్యం ఆర్సీబీ కూడా ఒక్కో మృతుడి కుటుంబానికి రూ. 10 లక్షలు పరిహారంగా అందజేస్తామని తెలిపింది. దిగ్గజాల దిగ్భ్రాంతి సంబరాల కంటే ప్రాణాలే ముఖ్యమని దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నారు. ‘ఈ ఘటన నన్ను తీవ్రంగా బాధించింది. ఇకనైనా మనం పాఠాలు నేర్వాలి. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. పొరపాట్లు జరగడం సహజమై ఉండొచ్చు... కానీ ఆ పొరపాట్లకు ప్రాణాలే మూల్యంగా చెల్లించుకోవడం అత్యంత విచారకరం. భవిష్యత్తులో ఏ జట్టయినా సరే టైటిల్ సాధిస్తే హుందాగా నడుచుకోవాలి. మితిమీరిన సంబరాలు, వేడుకల కంటే కూడా ప్రాణాలే విలువైనవని గుర్తుంచుకోవాలి’ అని కపిల్ విచారం వెలిబుచ్చారు. సామాజిక సైట్ ‘ఎక్స్’లో సచిన్ టెండూల్కర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. తొక్కిసలాట నన్ను నిర్ఘాంతపరిచిందని, బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని పోస్ట్ చేశాడు. గతంలో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించిన దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డివిలియర్స్ విషాదకర ఘటనపై విచారం వెలిబుచ్చాడు. బెంగళూరుకు చెందిన మాజీ భారత కెప్టెన్ అనిల్ కుంబ్లే క్రికెట్కు ఇదొక దుర్దినం అని అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన కుంబ్లే క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని అన్నారు. భారత హెడ్ కోచ్ గంభీర్ తాను ఇలాంటి రోడ్ షో విజయోత్సవాలకు వ్యతిరేకమని అన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని సూచించారు. -
బుమ్రా ఆడే మూడు టెస్టులేవి?
ముంబై: భారత స్పీడ్స్టర్ జస్ప్రీత్ బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడం క్లిష్టమైనప్పటికీ బౌలింగ్ దళంలో నైపుణ్యమున్న బౌలర్లు అందుబాటులో ఉన్నారని టీమిండియా హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరేముందు కొత్త కెప్టెన్ శుబ్మన్ గిల్తో కలిసి అతను మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మొత్తం ఐదు టెస్టుల్లో బుమ్రా ఆడబోయే మూడు టెస్టులు ఏవనే విషయాన్ని కోచ్ వెల్లడించలేదు. ‘ఐదు టెస్టుల్లో బుమ్రా ఏ ఏ టెస్టులు ఆడతాడనే నిర్ణయానికి ఇంకా రాలేదు. కాబట్టి ఆడే మూడు మ్యాచ్లు ఏవో ఇప్పుడే స్పష్టత ఇవ్వలేను. జట్టులో అతనొక అసాధారణ బౌలర్. అతని స్థానాన్ని భర్తీ చేయడం అంత సులభం కాదు. ఈ విషయాన్ని ఇంతకుముందే చాంపియన్స్ ట్రోఫీ సమయంలోనే చెప్పాను. అయితే ఈ సదవకాశాన్ని నైపుణ్యమున్న బౌలర్లు అందిపుచ్చుకోవాలి. ప్రస్తుతం జట్టులో ప్రతిభావంతులైన పేసర్లకు కొదవలేదు’ అని అన్నాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కోహ్లి టెస్టులకు గుడ్బై చెప్పడంతో కొత్తగా సారథ్యం చేపట్టిన శుబ్మన్ గిల్ కూడా బౌలింగ్ అటాక్కు వచ్చిన ఇబ్బందేమీ లేదన్నాడు. బుమ్రా పేస్ భారం తగ్గించే బౌలర్లు చాలా మంది ఉన్నారని చెప్పాడు. ఒకవేళ ఈ వెటరన్ బౌలర్ ఆడితే అది జట్టుకు మరింత బలమవుతుందని అన్నాడు. టెస్టు సిరీస్ మొదలయ్యాక ఏ మ్యాచ్లకు అతను అందుబాటులో ఉంటాడో తెలుసుకున్నాకే అతను ఆడే మూడు మ్యాచ్లపై నిర్ణయం తీసుకుంటామని గిల్ చెప్పాడు. శుక్రవారం తెల్లారేలోపే భారత జట్టు ఇంగ్లండ్కు బయలుదేరుతుంది. పూర్తిస్థాయి పర్యటనలో శుబ్మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా ఐదు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్లో పోటీపడుతుంది. ఈ నెల 20 నుంచి లీడ్స్లో ఇరు జట్ల మధ్య తొలి టెస్టుతో సిరీస్ మొదలవుతుంది. దీనికంటే ముందు భారత జట్టు... ‘ఎ’ జట్టుతో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. ఇంగ్లండ్లో ఉన్న భారత్ ‘ఎ’ జట్టు ఇంగ్లండ్ లయన్స్తో అనధికారిక టెస్టులు ఆడుతోంది.‘అండర్సన్–టెండూల్కర్’ ట్రోఫీభారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్కు నామకరణం న్యూఢిల్లీ: భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే టెస్టు సిరీస్కు ‘అండర్సన్–టెండూల్కర్’ ట్రోఫీగా నామకరణం చేశారు. ఆటకు వన్నె తెచ్చిన ఆటగాళ్ల పేర్లను సిరీస్లకు పెట్టడం పరిపాటి కాగా... ఇకపై టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరిగే సిరీస్ను ఈ పేరుతోనే కొనసాగించాలని బీసీసీఐ, ఈసీబీ సమష్టిగా నిర్ణయించాయి. ఈ నెల 20 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా... దీంతోనే 2025–27 ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) చక్రం మొదలవుతుంది. తొలి టెస్టు ప్రారంభానికి ముందు ఈ ఇద్దరు దిగ్గజాలు ట్రోఫీని ఆవిష్కరించనున్నట్లు సమాచారం. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ టీమిండియా తరఫున 200 టెస్టు మ్యాచ్లు ఆడి 15,921 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు (704) తీసిన పేస్ బౌలర్ అండర్సన్ 188 మ్యాచ్ల్లో ఇంగ్లండ్కు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ మధ్య ఇంగ్లండ్లో జరిగే సిరీస్ను పటౌడీ ట్రోఫీగా, భారత్లో జరిగే సిరీస్ను ఆంటోనీ డి మెల్లో ట్రోఫీగా అభివర్ణిస్తున్నారు. ఇక మీద ఇంటా బయట ఎక్కడ సిరీస్ జరిగినా దాన్ని ‘అండర్సన్–టెండూల్కర్’ ట్రోఫీగానే పిలవనున్నారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్లను ఇదే మాదిరిగా ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’గా అభివరి్ణస్తున్న విషయం తెలిసిందే. -
ఆర్సీబీ, కేఎస్సీఏలకు షాక్
బెంగళూరు: ఐపీఎల్ టైటిల్ను ఎట్టకేలకు గెలిచామన్న ఆనందం ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఆర్సీబీ టైటిల్ సాధించిన తర్వాత నిన్న(బుధవారం, జూన్ 4వ తేదీ) బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృత్యువాత పడ్డారు. దాంతో ఇది పొలిటికల్ టర్న్ తీసుకోవడమే కాకుండా హైకోర్టు వరకూ వెళ్లింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హైకోర్టు.. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఏజీని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్ అసోసియేన్లపై కేసు బుక్ చేశారు కర్ణాటక పోలీసులు. ఈ తొక్కిసలాట ఘటనను సుమోటోగా స్వీకరించిన పోలీసులు.. ఆర్సీబీ, కేఎస్సీఏలపై కేసు నమోదు చేశారు. అనంతరం దీన్ని క్రిమినల్ ఇన్విస్టిగేషన్ డిపార్ట్మెంట్(సీఐడీ)కి అప్పగించారు. అదే సమయంలో ఈ ఘటనకు సంబంధించి పూర్తి విచారణలో భాగంగా కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లా మేజిస్ట్రేట్ జి. జగదీషా కేఎస్సీఏ, ఆర్సీబీలకు నోటీసులు పంపనున్నారు. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై హైకోర్టు ఆగ్రహం -
పాండ్యా కుటుంబంలో 9 ఐపీఎల్ ట్రోఫీలు ఉంటాయని హార్దిక్కు చెప్పాను: కృనాల్
రెండు రోజుల క్రితం ముగిసిన ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ ఛాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. జూన్ 3న జరిగిన ఫైనల్లో ఆ జట్టు పంజాబ్ కింగ్స్పై గెలిచి, 18 ఏళ్ల ఐపీఎల్ ప్రస్తానంలో తొలి టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్లో కృనాల్ పాండ్యా అద్బుతమైన బౌలింగ్ ప్రదర్శన (4-0-17-2) చేసి ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో రెండు సార్లు ఫైనల్ మ్యాచ్ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. కృనాల్ 2017 సీజన్లో తొలిసారి ఫైనల్లో (RPSపై) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు.ఈ సీజన్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న తర్వాత కృనాల్ పాండ్యా యాంకర్ రవిశాస్త్రితో మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నాడు. 11 ఏళ్లలో పాండ్యా ఫ్యామిలీలో 9 ఐపీఎల్ ట్రోఫీలు ఉంటాయని హార్దిక్కు చెప్పినట్లు రివీల్ చేశాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు కృనాల్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ స్థాయికి చేరడానికి హార్దిక్, నేను కఠోరంగా శ్రమించామని తెలిపాడు. కృనాల్కు వ్యక్తిగతంగా ఇది నాలుగో టైటిల్ కాగా.. హార్దిక్ ఇదివరకే 5 ఐపీఎల్ టైటిల్స్ సాధించాడు.2016లో కృనాల్ ఐపీఎల్ జర్నీ ముంబై ఇండియన్స్ తరఫున మొదలైంది. 2017, 2019, 2020 సీజన్లలో అతను ఆ ఫ్రాంచైజీ తరఫునే మూడు టైటిళ్లు గెలిచాడు. ఇప్పుడు ఆర్సీబీ తరఫున తన నాలుగో ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. 34 ఏళ్ల ఈ బరోడా ఆఫ్ స్పిన్నర్ ఆర్సీబీ తరఫున తన నాలుగో ఐపీఎల్ టైటిల్ గెలవాలనుకున్నట్లు ఫ్రాంచైజీలో చేరిన మొదటి రోజే చెప్పాడు.హార్దిక్ విషయానికొస్తే.. 2015లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన హార్దిక్.. ఆ ఫ్రాంచైజీ తరఫున 2015, 2017, 2019, 2020 సీజన్లలో టైటిళ్లు గెలిచాడు. అనంతరం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా 2022లో తన ఐదో టైటిల్ను సాధించాడు. పాండ్యా సోదరులు కలిపి 9 టైటిళ్లు గెలవడం చూస్తే ఐపీఎల్ టైటిల్స్ అంటే ఆ ఇద్దరికి ఎంత పిచ్చో అర్దమవుతుంది.ప్లేయర్లుగా అత్యధిక ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన ఆటగాళ్లు..రోహిత్ శర్మ-6 (డెక్కన్ ఛార్జర్స్, ముంబై)అంబటి రాయుడు-6 (ముంబై, సీఎస్కే)ఎంఎస్ ధోని-5 (సీఎస్కే)కీరన్ పోలార్డ్-5 (ముంబై)హార్దిక్ పాండ్యా-5 (ముంబై, గుజరాత్) -
ఐపీఎల్ తర్వాత తొలి మ్యాచ్లోనే విధ్వంసం సృష్టించిన సూర్యకుమార్ యాదవ్
ఐపీఎల్ 2025 తర్వాత తొలి మ్యాచ్లోనే ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు. నిన్న (జూన్ 4) మొదలైన టీ20 ముంబై లీగ్లో ట్రయంప్ నైట్స్ ఫ్రాంచైజీకి సారథ్యం వహిస్తున్న స్కై.. ఈగల్ థానే స్ట్రయికర్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 25 బంతుల్లోనే 8 ఫోర్లు, సిక్సర్ సాయంతో అజేయమైన అర్ద సెంచరీతో అలరించాడు. ఈ మ్యాచ్లో స్కై సత్తా చాటినా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న ట్రయంప్ నైట్స్ ఓటమిపాలైంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్స్.. స్కై రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. నైట్స్ ఇన్నింగ్స్లో సురేంద్ర రాణా (53) కూడా అర్ద సెంచరీతో రాణించాడు. మిగతా బ్యాటర్లలో పరిక్షిత్ 29, సంజయ్ జైన్ 24, సూర్యాంశ్ షేడ్గే 8, సిద్దాంత్ 4 పరుగులు చేశారు. స్ట్రయికర్స్ బౌలర్లలో అమిత్ పాండే, హర్ష్ తన్నా, శశాంక్ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన స్ట్రయికర్స్.. సాయిరాజ్ పాటిల్ (22 బంతుల్లో 47 నాటౌట్), వరుణ్ లవండే (38 బంతుల్లో 57) చెలరేగడంతో 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. స్ట్రయికర్స్ ఇన్నింగ్స్లో అనిష్ ముకుంద్ (37) కూడా రాణించాడు. నైట్స్ బౌలర్లలో మినాద్ మంజ్రేకర్ 2,సూర్యకాంత్ పవార్, భరత్ పాటిల్, పరిక్షిత్ తలో వికెట్ తీశారు.కాగా, తాజాగా ముగిసిన ఐపీఎల్ 2025లో సూర్యకుమార్ యాదవ్ అత్యంత విలువైన ఆటగాడి అవార్డు (ప్లేయర్ ఆఫ్ ద సిరీస్) గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో స్కై 16 మ్యాచ్ల్లో 65.18 సగటున 5 అర్ద సెంచరీల సాయంతో 717 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో స్కై ప్రాతినిథ్యం వహించిన ముంబై ఇండియన్స్ ఆరంభంలో పరాజయాలు ఎదుర్కొన్నా, ఆతర్వాత అనూహ్య రీతిలో పుంజుకొని క్వాలిఫయర్-2 వరకు చేరింది. అయితే ఆ మ్యాచ్లో ముంబై పంజాబ్ చేతిలో ఓటమిపాలై లీగ్ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్లో ముంబై పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. -
భారత్తో తొలి టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. కీలక ఆటగాడు దూరం
జూన్ 20 నుంచి లీడ్స్ వేదికగా టీమిండియాతో జరుగబోయే తొలి టెస్ట్ కోసం 14 మంది సభ్యుల ఇంగ్లండ్ జట్టును ఇవాళ (జూన్ 5) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా బెన్ స్టోక్స్ ఎంపిక కాగా.. పేసర్ జేమీ ఓవర్టన్ దాదాపు మూడేళ్ల తర్వాత టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ జట్టులో కీలక ఆటగాడు గస్ అట్కిన్సన్కు చోటు దక్కలేదు. ఇటీవల జింబాబ్వేతో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా అతను గాయపడ్డాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అట్కిన్సన్కు మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో అతను తదుపరి టెస్ట్లు ఆడేది కూడా అనుమానంగా మారింది.అట్కిన్సన్ స్థానాన్ని ఇంగ్లండ్ సెలెక్టర్లు ఓవర్టన్తో భర్తీ చేశారు. ఓవర్టన్ 2022 జూన్లో ఇంగ్లండ్ తరఫున తన చివరి టెస్ట్ మ్యాచ్ (న్యూజిలాండ్) ఆడాడు. గాయాల కారణంగా ఇటీవల జింబాబ్వేతో జరిగిన టెస్ట్ మ్యాచ్కు దూరంగా ఉన్న పేసర్లు క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్ ఈ జట్టుకు ఎంపికయ్యారు. తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తరఫున రాణించిన జేకబ్ బేతెల్ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు.భారత్తో తొలి టెస్ట్కు ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, ఓలీ పోప్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్కాగా, భారత క్రికెట్ జట్టు ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం జూన్ 20 నుంచి ఇంగ్లండ్లో పర్యటించనుంది. జూన్ 20, జులై 2, 10, 23, 31 తేదీల్లో ఐదు టెస్ట్ మ్యాచ్లు లీడ్స్, బర్మింగ్హమ్, లార్డ్స్, మాంచెస్టర్, కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికలుగా జరుగనున్నాయి. ఈ సిరీస్కు ముందు భారత్ జూన్ 13-16 మధ్యలో ఓ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడనుంది. ఇంగ్లండ్ పర్యటనలో కోసం భారత జట్టును ఇదివరకే ఎంపిక చేశారు.ఇంగ్లండ్ పర్యటన కోసం భారత టెస్ట్ జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ , వాషింగ్టన్ సుందర్, శార్దూల ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ -
ఐపీఎల్ 2025 ఫైనల్లో ఓడినా భారీగా పెరిగిన శ్రేయస్ అయ్యర్ బ్రాండ్ విలువ
ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్లో ఆర్సీబీ చేతిలో ఓటమిపాలైన పంజాబ్ కింగ్స్ రన్నరప్తో సరిపెట్టుకుంది. ఈ సీజన్ ఆధ్యాంతం విశేషంగా రాణించిన ఆ జట్టు, తుది సమరంలో ఒత్తిడిలోనై ఆర్సీబీకి తలవంచింది. ఈ సీజన్లోనే పంజాబ్ పగ్గాలు చేపట్టిన శ్రేయస్.. ఆ జట్టును అద్బుతంగా ముందుండి నడిపించాడు. వ్యక్తిగంతానూ రాణించి, సహచరులకు మార్గదర్శకంగా నిలిచాడు.ఈ సీజన్లో పంజాబ్ టైటిల్ గెలవకపోయినప్పటికీ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా 100కు 100 శాతం మార్కులు సాధించాడు. ఈ సీజన్తో కెప్టెన్గా శ్రేయస్ ఇమేజ్ నింగికెగిసింది. ఐపీఎల్ చరిత్రలో మూడు సార్లు, మూడు వేర్వేరు ఫ్రాంచైజీలను ఫైనల్కు చేర్చిన తొలి కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. ఫైనల్లో ఓడినా శ్రేయస్ బ్రాండ్ విలువ కూడా భారీగా పెరగడం మరో విశేషం. శ్రేయస్ ప్రస్తుతం ఒక రోజు యాడ్లో నటిస్తే రూ.1.5 కోట్లు వసూలు చేస్తున్నాడు.శ్రేయస్ ఫీజు త్వరలోనే మరింత పెరుగుతుందని అతని ఎండార్స్మెంట్ వ్యవహారాలు చూసే నిఖిల్ బార్డియా తెలిపారు. నిఖిల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని RISE వరల్డ్వైడ్కు అధిపతిగా ఉన్నాడు. ఐపీఎల్-2025లో విజయవంతమైన కెప్టెన్సీ శ్రేయస్కు నాలుగైదు భారీ ఒప్పందాలు తెచ్చిపెడుతుందని నిఖిల్ అన్నారు. దీంతో శ్రేయస్ బ్రాండ్ విలువ 20-25 శాతం పెరుగుతుందని అంచనా వేశారు.అయ్యర్ ప్రస్తుతం నైక్, డ్రీమ్11, ఇన్క్రెడ్ ఫైనాన్స్ వంటి బ్రాండ్లతో స్వల్పకాలిక నాన్-ఎక్స్క్లూజివ్ కాంట్రాక్ట్ కలిగి ఉన్నాడు. ఐపీఎల్ 2025 ప్రదర్శన తర్వాత శ్రేయస్కు ఆడియో, పురుషుల గ్రూమింగ్ బ్రాండ్లు, ప్రోటీన్ సప్లిమెంట్ బ్రాండ్లు, సువాసన సంస్థల నుండి విచారణలు వస్తున్నాయి. శ్రేయస్తో ఎండార్స్మెంట్ ఒప్పందాలకు డిమాండ్ పెరిగినప్పటికీ, ఏజెన్సీ ఫీజులు పెంచాలని యోచించడం లేదని నిఖిల్ తెలిపారు.కాగా, శ్రేయస్ తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో 17 మ్యాచ్ల్లో 50.33 సగటుతో 604 పరుగులు చేసి, పంజాబ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 204 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శ్రేయస్ ఒత్తిడిని తట్టుకుని 41 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తద్వారా పంజాబ్ ఆ మ్యాచ్లో విజయం సాధించి 11 ఏళ్ల తర్వాత ఫైనల్కు చేరింది.వ్యక్తితంగా శ్రేయస్కు ఇది వరుసగా రెండో ఫైనల్. గత సీజన్లో శ్రేయస్ కేకేఆర్ను ఫైనల్కు చేర్చడమే కాకుండా ఛాంపియన్గా నిలబెట్టాడు. గతేడాది జరిగిన మెగా వేలంలో శ్రేయస్ను పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్ల ధర వెచ్చింది సొంతం చేసుకుంది. తద్వారా శ్రేయస్ ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అదే మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్ను రూ.27 కోట్లకు దక్కించుకుంది. పంత్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. -
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియాకు సంబంధించి కీలక అప్డేట్
భారత టెస్ట్ జట్టు పూర్తి స్థాయి కెప్టెన్ హోదాలో శుభ్మన్ గిల్ తొలిసారి మీడియా ముందుకు రానున్నాడు. ఇవాళ (జూన్ 5) సాయంత్రం 7:30 గంటలకు ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్లో జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్ను హాజరు కానున్నాడు. ఈ సమావేశానికి గిల్తో పాటు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హాజరవుతాడు.భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగనుంది. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా త్వరలోనే లండన్కు బయల్దేరుతుంది. ఈ సమావేశంలో గిల్, గంభీర్ ఇంగ్లండ్లో అనుసరించబోయే వ్యూహాలు, తదుపరి డబ్ల్యూటీసీ సైకిల్లో ప్రణాళికల గురించి మీడియాకు వివరిస్తారు. దిగ్గజ ఆటగాళ్లు రోహిత్, విరాట్, అశ్విన్ టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించాక జరుగనున్న సిరీస్ కావడంతో ఇంగ్లండ్ టూర్కు ప్రాధాన్యత సంతరించుకుంది. గిల్ ఇటీవలే రోహిత్ శర్మ నుంచి భారత టెస్ట్ జట్టు పగ్గాలు చేపట్టాడు. బుమ్రా, పంత్ లాంటి సీనియర్లు ఉన్నా బీసీసీఐ గిల్కే టెస్ట్ కెప్టెన్సీ అప్పగించింది. గిల్ నేతృత్వంలో భారత టెస్ట్ క్రికెట్లో కొత్త శకం మొదలుకానుంది. ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో యువకులు, అనుభవజ్ఞులు ఉన్నారు. వీరిని సమన్వయపరుచుకుంటూ గిల్ ఏ మేరకు నెట్టుకు రాగలడో చూడాలి. ఇంగ్లండ్ పర్యటనలో గిల్కు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) రిషబ్ పంత్ను నియమించారు.ఇంగ్లండ్ పర్యటనలో భారత్ జూన్ 20న తొలి టెస్ట్ ఆడనుంది. లీడ్స్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. అనంతరం జులై 2, 10, 23, 31 తేదీల్లో రెండు, మూడు, నాలుగు, ఐదు టెస్ట్ మ్యాచ్లు బర్మింగ్హమ్, లార్డ్స్, మాంచెస్టర్, కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికలుగా జరుగనున్నాయి. ఈ సిరీస్కు ముందు భారత్ జూన్ 13-16 మధ్యలో ఓ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడనుంది.ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపికైన మెజార్టీ సభ్యులు ఇప్పటికే ఇంగ్లండ్లో పర్యటిస్తున్నారు. భారత-ఏ జట్టులో భాగమైన వారు ఇంగ్లండ్ లయన్స్తో రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నారు. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ ఇదివరకే ముగిసింది. రెండో మ్యాచ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది.ఇంగ్లండ్ పర్యటన కోసం భారత టెస్ట్ జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ , వాషింగ్టన్ సుందర్, శార్దూల ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ -
సంజూ శాంసన్ ఉదారత
టీమిండియా ఆటగాడు సంజూ శాంసన్ ఉదారత చాటుకున్నాడు. తన ఫౌండేషన్ (SSF) తరఫున రానున్న విద్యా సంవత్సరం కోసం 100 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్లు, బూట్లు డొనేట్ చేశాడు. తన తల్లి లిజి శాంసన్ ఆథ్వర్యంలో ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థులకు స్కూల్ సామాగ్రిని ప్రదానం చేయించాడు. పేద విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని సంజూ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని క్రికెట్ అభిమానులు అభినందిస్తున్నారు. సంజూ గతంలో కూడా తన ఫౌండేషన్ తరఫున చాలా సేవా కార్యక్రమాలు చేపట్టాడు. 🚨 A LOVELY GESTURE BY SANJU SAMSON 🚨- Sanju Samson Foundation has donated school bags & shoes to 100 students as they start their new academic year. 🫡 pic.twitter.com/o7kMc2zCSM— Johns. (@CricCrazyJohns) June 5, 2025ఇదిలా ఉంటే, సంజూ శాంసన్ తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్కు కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ సీజన్లో రాయల్స్ పెద్దగా పెర్ఫార్మ్ చేయలేకపోయింది. ఆ జట్టు 14 మ్యాచ్ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఈ సీజన్లో సంజూ వ్యక్తిగతంగానూ ఆకట్టుకోలేకపోయాడు. గాయం కారణంగా చాలా మ్యాచ్లకు దూరంగా ఉన్న అతను.. ఆడిన మ్యాచ్ల్లోనూ స్థాయికి తగ్గ ప్రదర్శనలు ఇవ్వలేకపోయాడు.ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత టెస్ట్ జట్టులో సంజూ చోటు దక్కించుకోలేకపోయాడు. యువ వికెట్కీపర్లు రిషబ్ పంత్, ధృవ్ జురెల్, కేఎల్ రాహుల్ ఈ టూర్ కోసం ఎంపిక చేసిన జట్టులో స్థానం సంపాదించారు. పంత్, రాహుల్ జట్టులో పాతుకుపోయిన నేపథ్యంలో సంజూ టెస్ట్ కెరీర్ దాదాపుగా ముగిసిందనే చెప్పుకోవాలి. ఈ కేరళ వికెట్కీపర్ బ్యాటర్ కేవలం పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు మాత్రమే పరిమితమయ్యాడు. -
బెంగళూరు దుర్ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు
ఆర్సీబీ విజయోత్సవాల నేపథ్యంలో నిన్న (జూన్ 4) జరిగిన బెంగళూరు దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 47 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై యావత్ క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చింది.ఓ ప్రముఖ వార్తా సంస్థ కథనం ప్రకారం.. బుధవారం (జూన్ 4) ఆర్సీబీ విజయోత్సవాలు జరుపుకోవద్దని పోలీసులు ముందే హెచ్చరించారు. అయినా ఆర్సీబీ యాజమాన్యం పట్టించుకోలేదు. విజయోత్సవ వేడులు బుధవారానికి బదులు ఆదివారం (జూన్ 8) నిర్వహించుకోవాలని సూచించారు.టైటిల్ గెలిచిన మరుసటి రోజే వేడుకలు నిర్వహిస్తే అభిమానుల్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయని, ఇది తీవ్రమైన గందరగోళానికి దారి తీయవచ్చని హెచ్చరించారు. అయినా ఆర్సీబీ యాజమాన్యం పెడచెవిన పెట్టింది. ఆదివారం వరకైతే విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండరని వాదించింది.వేడుకలు ఆదివారానికి వాయిదా వేసుకుంటే మంచిదని పోలీసులు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నివేదించారు. వేడి మీద వేడుకలు నిర్వహించకపోతే తమకు డ్యామేజ్ అవుతుందని భావించి రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆర్సీబీ యాజమాన్యం వాదనతోనే ముందుకెళ్లింది.ఆర్సీబీ టైటిల్ను గెలిచిన మరు క్షణం నుంచే బెంగళూరు వీధుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. జట్టు విజయోత్సవాలు జరుపుకుంటున్న అభిమానులు తెగ హడావుడి చేశారు. బుధవారం సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో ఆటగాళ్లకు సన్మానం జరుగుతుందని తెలియడంతో అభిమానులు భారీ సంఖ్యలో గుమికూడారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో గుమికూడవద్దని పోలీసులు ముందే హెచ్చరించినా అభిమానులు వినలేదు. తొక్కిసలాట జరిగిన సమయంలో స్టేడియం చుట్టూ రెండు లక్షలకు పైగా జనం ఉన్నట్లు తెలుస్తుంది.కాగా, ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత తొలి ఐపీఎల్ టైటిల్ సాధించడంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తొలుత ఆర్సీబీ యాజమాన్యం ఓపెన్ టాప్ బస్లో ఆటగాళ్ల ఊరేగింపుకు ప్లాన్ చేసింది. అయితే తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు వస్తాయని పోలీసులు వారించడంతో వెనక్కు తగ్గింది. తీరా చిన్నస్వామి స్టేడియంలో ఆటగాళ్ల సన్యాన కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తే, అది చివరికి విషాదాంతమైంది. -
బెంగళూరు దుర్ఘటనపై స్పందించిన ఆర్సీబీ యాజమాన్యం
నిన్న (జూన్ 4) జరిగిన బెంగళూరు దుర్ఘటనపై ఆర్సీబీ యాజమాన్యం స్పందించింది. ఊహించని ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెబుతూ మీడియా లేఖను విడుదల చేసింది. ఈ దురదృష్టకర ఘటనతో తీవ్ర వేదనకు గురయ్యామని తెలిపింది. తొక్కిసలాటలో మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేసింది. అభిమానులు, బెంగళూరు ప్రజల భద్రత, శ్రేయస్సు తమకు ముఖ్యమని పేర్కొంది. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్తో కలిసి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది.కాగా, ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన నేపథ్యంలో నిన్న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఊహించని రీతిలో రెండు లక్షలకు పైగా అభిమానులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఇందులో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 47 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై యావత్ క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. 𝗢𝗳𝗳𝗶𝗰𝗶𝗮𝗹 𝗦𝘁𝗮𝘁𝗲𝗺𝗲𝗻𝘁: 𝗥𝗼𝘆𝗮𝗹 𝗖𝗵𝗮𝗹𝗹𝗲𝗻𝗴𝗲𝗿𝘀 𝗕𝗲𝗻𝗴𝗮𝗹𝘂𝗿𝘂We are deeply anguished by the unfortunate incidents that have come to light through media reports regarding public gatherings all over Bengaluru in anticipation of the team’s arrival this… pic.twitter.com/C0RsCUzKtQ— Royal Challengers Bengaluru (@RCBTweets) June 4, 2025 -
ఆస్ట్రేలియా టీ20 జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడికి పిలుపు
వచ్చే నెలలో వెస్టిండీస్లో జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం 16 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (జూన్ 4) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా మిచెల్ మార్ష్ వ్యవహరించనున్నాడు. గత సీజన్ బిగ్బాష్ లీగ్ ఫైనల్లో 39 బంతుల్లోనే శతక్కొట్టిన విధ్వంసకర బ్యాటర్ మిచెల్ ఓవెన్ తొలిసారి జాతీయ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఓవెన్తో పాటు బౌలర్ మ్యాట్ కుహ్నేమన్కు కూడా తొలిసారి ఆసీస్ టీ20 జట్టు నుంచి పిలుపు అందింది. ఈ జట్టులో మరో విధ్వంసకర ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్కు చోటు దక్కలేదు. పేలవ ఫామ్ కారణంగా మెక్గుర్క్పై వేటు పడినట్లు తెలుస్తుంది. ఐపీఎల్ 2025 ఫైనలిస్ట్ పంజాబ్ కింగ్స్ జట్టులో సభ్యులైన మార్కస్ స్టోయినిస్, జేవియర్ బార్ట్లెట్కు కూడా ఈ జట్టులో చోటు దక్కలేదు. తాజాగా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన మ్యాక్స్వెల్కు ఈ జట్టులో చోటు దక్కింది. ఐపీఎల్ 2025 ఛాంపియన్ జట్టులో (ఆర్సీబీ) సభ్యుడైన టిమ్ డేవిడ్ కూడా ఈ జట్టులో చోటు సంపాదించాడు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లు కెమరూన్ గ్రీన్, కూపర్ కన్నోలీ టీ20 జట్టులోకి పునరాగమనం చేశారు. ఈ ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీని ఛాంపియన్గా నిలబెట్టడంతో కీలకంగా వ్యవహరించిన జోష్ హాజిల్వుడ్ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్ కోసం రెగ్యులర్ ఆటగాళ్లు పాట్ కమిన్స్, ట్రవిస్ హెడ్, మిచెల్ స్టార్క్కు విశ్రాంతినిచ్చారు.విండీస్తో టీ20 సిరీస్ జులై 19న మొదలు కానుంది. 19, 22, 24, 25, 27 తేదీల్లో ఐదు టీ20లు జరుగనున్నాయి. తొలి రెండు మ్యాచ్లు జమైకాలో జరుగనుండగా.. ఆఖరి మూడింటికి సెయింట్ కిట్స్ ఆతిథ్యమివ్వనుంది. ఈ సిరీస్కు ముందు ఆసీస్ విండీస్తో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కూడా ఆడనుంది. జూన్ 25, జులై 3, జులై 12 తేదీల్లో ఈ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. టెస్ట్, టీ20 సిరీస్ల కోసం ఆసీస్ వెస్టిండీస్లో పర్యటించనుంది. ఆసీస్ టెస్ట్ జట్టును ఇదివరకే ప్రకటించారు. విండీస్తో టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, కూపర్ కన్నోలీ, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కెమరూన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్వుడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మాట్ కుహ్నెమన్, గ్లెన్ మాక్స్వెల్, మిచ్ ఓవెన్, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపావిండీస్తో టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, కెమరూన్ గ్రీన్, సామ్ కొన్స్టాస్, బ్యూ వెబ్స్టర్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, జోష్ హాజిల్వుడ్, స్కాట్ బోలాండ్, నాథన్ లియోన్, మ్యాట్ కుహ్నేమన్, మిచెల్ స్టార్క్ -
RCB: హైదరాబాద్లో తప్పిన ముప్పు
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం సన్మానం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కొందరు చనిపోగా, అనేక మంది క్షతగాత్రులయ్యారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలోనూ ఇలాంటి ముప్పు తప్పింది. బుధవారం రాత్రి ఆర్సీబీ (RCB) జట్టు ఐపీఎల్ కప్పు గెలిచిన వెంటనే ట్యాంక్బండ్, తెలుగు తల్లి చౌరస్తా, అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా, సచివాలయం, ఎన్టీఆర్ మార్గ్లతో పాటు అనేక ప్రాంతాలు క్రికెట్ అభిమానులతో నిండిపోయాయి. ద్విచక్ర వాహనాలపై ఫీట్లు చేస్తూ యువకులు కేరింతలు కొట్టారు. రహదారులపై పెద్ద ఎత్తున బాణాసంచ కాల్చారు.ఎన్డీఆర్ మార్గ్, సచివాలయం, తెలుగుతల్లి చౌరస్తా ప్రాంతాల్లో కొందరు రెచ్చిపోయారు. అక్కడ ఆగిన వాహనాల పైకి ఎక్కి హంగామా చేశారు. ద్విచక్ర వాహనాల హారన్లు మోగిస్తూ, మితిమీరిన వేగంతో నడిపించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు (Police) వెంటనే అప్రమత్తమై అక్కడకు చేరుకున్నారు. ఉన్నతాధికారులు అదనపు బలగాలను ఆ ప్రాంతాలకు పంపారు. వీళ్లు అక్కడ ఉన్న యువకుల్ని చెదరగొట్టి పరిస్థితుల్ని చక్కదిద్దారు. చదవండి: ఒక్కగానొక్క కొడుకయ్యా.. మీకు దణ్ణం పెడతా -
మాటలు రావడం లేదు.. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై విరుష్క
బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విక్టరీ పరేడ్ సెలబ్రేషన్స్ తీవ్ర విషాదాన్ని నింపాయి. బుధవారం నగరంలోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో తొక్కిసలాట జరిగింది. 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 47 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై ఆర్సీబీ స్టార్ప్లేయర్ విరాట్ కోహ్లీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘మాటలు రావడం లేదు. తీవ్ర మనోవేదనకు గురయ్యాను. ఈ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది‘ అంటూ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశాడు. మరోవైపు ఈ ఘటనపై ఆర్సీబీ ఫ్రాంచైజీ స్పందించింది. ఈ తొక్కిసలాటలో మరణించిన వారికి సంతాపం ప్రకటించింది. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేసింది. ‘‘చిన్నస్వామి స్టేడియం బయట చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన పట్ల మేం తీవ్రంగా కలత చెందాం. ఈ మధ్యాహ్నం జట్టు రాకను అంచనా వేస్తూ బెంగళూరు అంతటా అభిమానులు భారీ ఎత్తున గుమిగూడారు. అయితే మీడియా ద్వారా మేం ఈ దురదృష్టకర సంఘటన గురించి తెలుసుకున్నాం. ప్రతీ ఒక్కరి భద్రత, శ్రేయస్సు మాకు అత్యంత ముఖ్యం. ఈ విషాద ఘటనలో మృతి చెందిన వారికి ఆర్సీబీ సంతాపం తెలుపుతోంది. వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి. ప్రాణ నష్టం మమ్మల్ని మరింత కలిచి వేసింది. ఈ సంఘటన గురించి మా దృష్టికి వచ్చిన వెంటనే మా కార్యక్రమాన్ని ఆపేసాం. స్థానిక అధికారుల మార్గదర్శకత్వం, సలహాలను పాటించే ఈ వేడుకలను నిర్వహించాం. అభిమానులంతా సురక్షితంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం.’’అని తెలిపింది. మరోవైపు ఇదే ప్రకటనను కోహ్లీ సతీమణి అనుష్క శర్మ సైతం సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఐపీఎల్లో 18 ఏళ్ల నిరీక్షణ ఫలించి, ఆర్సీబీ తొలిసారి టైటిల్ కప్ కైవసం చేసుకోవడంతో అసంఖ్యాక అభిమానులు సంబరాల్లో పాల్గొనేందుకు తరలివచ్చారు. వాస్తవానికి ఆర్సీబీ యాజమాన్యం విధానసౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి, ఆ తర్వాత సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని ప్రకటించింది. అయితే, ఉదయం ఆలస్యంగా ట్రాఫిక్ పోలీసులు ర్యాలీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో అప్పటికే భారీగా చేరుకున్న అభిమానుల్లో మరింత గందరగోళం నెలకొంది. బుధవారం మధ్యాహ్నానికే విధానసౌధ, ఎంజీ రోడ్, చర్చ్ స్ట్రీట్ పరిసర ప్రాంతాలకు సుమారు రెండు లక్షల మంది అభిమానులు చేరుకున్నారని ఒక అంచనా. ఈ అంచనా పోలీసుల అంచనాని మించిపోయి వాళ్ల చేతులు దాటిపోయింది. అదే సమయంలో.. ఏడో నెంబర్ గేటు దగ్గర విపరీతమైన రద్దీ, ఫ్రీ టికెట్ పుకార్లు, వర్షం, స్టేడియంలో జనాల బరువుకు కాలువ పైకప్పు కుప్పకూలిపోవడం.. ఇలా ఒకేసారి అన్నింటితో పరిస్థితి అదుపుతప్పడంతో తీవ్రమైన తొక్కిసలాటకు కారణమైందని పోలీసులు అంటున్నారు. మరోవైపు ఈ ఘటనకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్(కేఎస్సీఏ) కారణమనే విమర్శ బలంగా వినిపిస్తోంది. అయితే ఈ ఘటనపై కేఎస్సీఏ విచారం వ్యక్తం చేసింది. ’చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన విజయోత్సవ వేడుకల సందర్భంగా చోటు చేసుకున్న దురదృష్ట ఘటనపై ఆర్సీబీ, కేఎస్సీఏ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. మృతులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది.’అని ఓ ప్రకటనను విడుదల చేసింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల రూపాయలు అందజేస్తామని కేఎస్సీఏ ప్రకటించింది. ఇక.. ఈ దుర్ఘటనపై భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పందించింది. అది తమ ఈవెంట్ కాదని, అయితే నిర్వహణలో లోపాలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. నిర్వాహకుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ఎన్డీటీవీతో మాట్లాడుతూ అన్నారు. "పూర్తి వాస్తవాలు తెలియకుండా నేను ఇప్పుడు ఎవరినీ నిందించదలచుకోలేదు. గత ఏడాది వెస్టిండీస్లో టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు ముంబైలో బీసీసీఐ విజయోత్సవ సభ నిర్వహించినప్పుడు, స్థానిక క్రికెట్ సంఘం, ముంబై పోలీసులు, అగ్నిమాపక దళం, విపత్తు నిర్వహణ బృందాలతో కలిసి పక్కా ప్రణాళిక రచించాం. లక్షలాది మంది హాజరైనా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. అన్ని నిబంధనలు పాటించాం" అని సైకియా తెలిపారు. -
ఇంగ్లండ్ క్లీన్స్వీప్
లండన్: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఇంగ్లండ్ జట్టు వరుసగా మూడో విజయం నమోదు చేసింది. వెస్టిండీస్తో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 3–0తో క్లీన్స్వీప్ చేసింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన చివరిదైన మూడో వన్డేలో హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు ఏడు వికెట్ల తేడాతో వెస్టిండీస్ను ఓడించింది. వర్షం కారణంగా మ్యాచ్ను 40 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ 40 ఓవర్లలో 9 వికెట్లకు 251 పరుగులు చేసింది. షెర్ఫాన్ రూథర్ఫర్డ్ (71 బంతుల్లో 70; 9 ఫోర్లు, 2 సిక్స్లు), గుడకేశ్ మోతీ (54 బంతుల్లో 63; 5 ఫోర్లు, 3 సిక్స్లు), అల్జారీ జోసెఫ్ (29 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్స్లు) మెరిపించడంతో విండీస్ గౌరవప్రద స్కోరును సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 3 వికెట్లు తీయగా... సాఖిబ్ మెహమూద్, బ్రైడన్ కార్స్, మాథ్యూ పాట్స్ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఇంగ్లండ్ లక్ష్యాన్ని 40 ఓవర్లలో 246 పరుగులుగా నిర్ణయించారు. ఇంగ్లండ్ ధనాధన్ ఆటతీరుతో కేవలం 29.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు జేమీ స్మిత్ (28 బంతుల్లో 64; 10 ఫోర్లు, 3 సిక్స్లు), బెన్ డకెట్ (46 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్స్లు) ధాటిగా ఆడి అర్ధ సెంచరీలు చేశారు. వీరిద్దరు అవుటయ్యాక జో రూట్ (49 బంతుల్లో 44; 1 ఫోర్), హ్యారీ బ్రూక్ (36 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), జోస్ బట్లర్ (20 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్లు) లాంఛనాన్ని పూర్తి చేశారు. జేమీ స్మిత్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించగా... జో రూట్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం దక్కింది. రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్ల టి20 సిరీస్ శుక్రవారం మొదలవుతుంది. -
శ్రేయస్ అయ్యర్... సారథిగా సూపర్
ధోనీ మాదిరిగా వ్యూహరచనలో మేటి... కోహ్లి తరహాలో దూకుడులో ఘనాపాటి... రోహిత్ను అనుకరిస్తున్నట్లు అనిపించినా... అతడికి అతడే సాటి! ‘అతడి చేయి పడితే రాయి కూడా రత్నంలా మెరుస్తుంది’... అన్న రీతిలో దశాబ్ద కాలానికి పైగా ‘ప్లే ఆఫ్స్’ మొఖం చూడని జట్టును తుదిపోరుకు చేర్చిన ఘనుడతడు! ఐపీఎల్ చరిత్రలో మరే సారథికి సాధ్యం కాని విధంగా మూడు వేర్వేరు జట్లను తుదిపోరుకు తీసుకెళ్లిన మొనగాడతడు! అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ జట్టును నడిపించడంలో నేర్పరి అతడు! మనం ఇంతసేపు చెప్పుకున్నది... ఈసారి ఐపీఎల్ ట్రోఫీ గెలవకపోయినా తన నాయకత్వ చతురతతో అందరి మనసులు గెలిచిన పంజాబ్ కింగ్స్ సారథి శ్రేయస్ అయ్యర్ గురించే!! ధోనీ, రోహిత్ కూడా కెప్టెన్లుగా మూడు కంటే ఎక్కువ ఐపీఎల్ ఫైనల్స్ ఆడినా... ఆ ఇద్దరూ ఒకే జట్టును నడిపించారు. కానీ గత ఐదేళ్లలో అయ్యర్ మూడు వేర్వేరు ఫ్రాంఛైజీలకు తుదిపోరు మజా చూపాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు ఆడిన ఏకైక ఫైనల్ శ్రేయస్ సారథ్యంలోనే కాగా... పదేళ్ల విరామం అనంతరం గతేడాది కోల్కతా నైట్రైడర్స్కు ముచ్చటగా మూడో కప్పు అందించింది కూడా అయ్యరే. పంజాబ్కు ట్రోఫీ కట్టబెట్టలేకపోయినా... సారథిగా మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. ‘బాధ్యత సగం మాత్రమే పూర్తయింది. వచ్చే ఏడాది తప్పక కప్పు గెలుస్తాం’ అని ఫైనల్ అనంతరం ధీమా వ్యక్తం చేసిన అయ్యర్... భారత జట్టు భవిష్యత్తు నాయకత్వంపై భరోసా పెంచుతున్నాడు!!సాక్షి, క్రీడావిభాగం : 2024 ఐపీఎల్ ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్ను చిత్తుచేసి... కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) జట్టు మూడోసారి కప్పు కైవసం చేసుకుంది. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ట్రోఫీ అందుకున్నా... ఆ సమయంలో భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కేకేఆర్ జట్టు మెంటార్గా ఉండటంతో క్రెడిట్ అంతా అతడికే దక్కింది. తదనంతర పరిణామాల్లో గంభీర్ టీమిండియా హెడ్కోచ్గా ఎదగగా... సమర్థ నాయకుడిని కేకేఆర్ వేలానికి వదిలేసింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన కోల్కతా జట్టు... ఈసారి లీగ్ దశ దాటలేకపోవడమే గాక... పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంటే... వేలంలో భారీ ధర పెట్టి శ్రేయస్ను దక్కించుకున్న పంజాబ్ రెండోసారి రన్నరప్గా నిలిచింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు శ్రేయస్ సారథ్య సామర్థ్యాన్ని వివరించేందుకు.దేశవాళీ మ్యాచ్లు ఆడకుండా నిర్లక్ష్యం వహించినందుకు బీసీసీఐ కాంట్రాక్టు కోల్పోవడం... అపార ప్రతిభ ఉన్నా ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ఎంపిక కాకపోవడం ఇవన్నీ పక్కన పెడితే... అతడిలో గొప్ప నాయకుడు ఉన్నాడని తాజా ఐపీఎల్ నిరూపించిందింది. ఆటగాడిగా అదుర్స్... ఈ సీజన్లో 17 మ్యాచ్లాడిన శ్రేయస్ 50.33 సగటుతో 604 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు. మిడిలార్డర్లో బ్యాటింగ్కు దిగి 175.07 స్ట్రయిక్రేట్తో పరుగులు రాబట్టాడు. అతడి గణాంకాలను అంకెల్లో కొలవడం కష్టమే! సీజన్ ఆరంభంలో గుజరాత్తో జరిగిన పోరులో సెంచరీకి సమీపించినా... జట్టు ప్రయోజనాలకే పెద్దపీట వేయడంతోనే అయ్యర్ తీరు అందరినీ ఆకట్టుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 19 ఓవర్లు ముగిసేసరికి 220 పరుగులు చేసింది. అయ్యర్ 42 బంతుల్లో 97 పరుగులు చేసి సెంచరీకి సమీపించాడు. చివరి ఓవర్లో స్ట్రయికింగ్లో ఉన్న శశాంక్ సింగ్ దగ్గరకు వెళ్లి ‘నా శతకం గురించి ఆలోచించకు. జట్టు కోసం వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయి’ అని దిశానిర్దేశం చేశాడు. ఆ ఓవర్ మొత్తం ఆడిన శశాంక్ 23 పరుగులు రాబట్టగా... అయ్యర్ అజేయంగా నిలిచాడు. స్పిన్ను సమర్థవంతంగా ఆడతాడనే గుర్తింపును మరింత పెంచుకుంటూ... ఈసారి మిడిల్ ఓవర్స్లో భారీ షాట్లతో విరుచుకుపడి పరుగులు రాబట్టాడు. అందుకే సీజన్ మొత్తంలో 43 ఫోర్లే కొట్టిన అయ్యర్... 39 సిక్స్లతో అత్యధిక సిక్స్లు కొట్టిన వారి జాబితాలో నికోలస్ పూరన్ (40) తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. ముంబైపై అసమాన పోరాటం ఇక క్వాలిఫయర్–2లో ముంబై ఇండియన్స్పై శ్రేయస్ ఆడిన ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బుమ్రా యార్కర్లను ఎదుర్కొనేందుకు మహామహులు ఇబ్బంది పడుతున్న తరుణంలో అతడు దాన్ని షార్ట్థర్డ్ మ్యాన్ దిశగా తరలించిన తీరు చూసి తీరాల్సిందే. ఆశలే లేని స్థితిలో అద్భుత పోరాటం కనబర్చిన ఈ ముంబైకర్... జట్టును ఒంటిచేత్తో ఫైనల్కు చేర్చాడు.‘అయ్యర్ అవుట్ అయినప్పుడే... పంజాబ్ పరాజయం ఖాయమైంది’ బెంగళూరుతో ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ప్రతి ఒక్కరి నోట వినిపించిన మాట ఇదే. అంతలా అభిమానుల నమ్మకాన్ని సంపాదించుకున్న శ్రేయస్... చేతి వరకు వచ్చిన కప్పు చేజారుతున్నా కాస్త కూడా చలించలేదు. చిరకాల కల నెరవేరడంతో ప్రపంచ మేటి ఆటగాడు విరాట్ కోహ్లి చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడుస్తుంటే... సుదీర్ఘ కాలం ఫ్రాంఛైజీకి ప్రాతినిధ్యం వహించినా.. జట్టును విజేతగా నిలపలేకపోయిన ఏబీ డివిలియన్స్, క్రిస్ గేల్ వంటి దిగ్గజ ప్లేయర్లు సంబరాల్లో భాగమైపోయారు. ఇక ఆర్సీబీ అభిమానుల ఆనందానికైతే అవధులే లేవు! తన చుట్టూ ఇంత జరుగుతున్నా కనీసం ముఖ కవలికల్లో సైతం మార్పు కనబడని అయ్యర్ నింపాదిగా వచ్చే ఏడాది చూసుకుందాం అన్నట్లు ముందుకు సాగిపోయాడు. భవిష్యత్తు వన్డే కెప్టెన్! మైదానం బయట నుంచి పాంటింగ్ జట్టును తీర్చిదిద్దితే... ఆ వ్యూహాలను గ్రౌండ్లో ఆచరణలో పెట్టడంలో అయ్యర్ విజయవంతమయ్యాడు. బౌన్సీ పిచ్పై కైల్ జెమీసన్తో బ్యాక్ ఆఫ్ ది లెంత్ బంతులు వేయించడం... ముంబైతో మ్యాచ్లో వైడ్ యార్కర్లు వేసే విధంగా విజయ్ కుమార్ వైశాఖ్కు దిశానిర్దేశం చేయడం... అవసరమైనప్పుడు ‘నకల్ బాల్స్’ వేసే విధంగా ప్రోత్సహించడం ఇలా... ఒకటా రెండా సీజన్ ఆసాంతం శ్రేయస్ కెప్టెన్సీలో తనదైన పదును చూపాడు. క్వాలిఫయర్–2లో శశాంక్ సింగ్ నిర్లక్ష్యంతో రనౌట్ అయన సందర్భంలో సారథిగా అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అయ్యర్... ప్రియాన్‡్ష, ప్రభ్సిమ్రన్ వంటి యువ ఆటగాళ్లను పెద్దన్నలా వెన్నుతట్టి ప్రోత్సహించాడు. ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేయగా... అందులో అయ్యర్ పేరు లేకపోవడం చూసి పంజాబ్ కోచ్ పాంటింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అయినా దాన్ని పెద్దగా పట్టించుకోని శ్రేయస్... గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు ‘నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు... ఫలితం గురించి ఆలోచించకు’ అన్న రీతిలో ఐపీఎల్పైనే దృష్టి పెట్టాడు. ప్రస్తుతం టెస్టు, టి20 జట్లలో రెగ్యులర్ ఆటగాడు కాని 30 ఏళ్ల అయ్యర్... వన్డేల్లో మాత్రం రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత నాయకత్వ రేసులో ముందు నిలవడం ఖాయమే! -
‘ఈ విజయం మీ అందరిది’
సాక్షి, బెంగళూరు: తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తమ హోం గ్రౌండ్లో వేడుకలు జరుపుకుంది. బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జట్టు సభ్యులంతా పాల్గొని అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ‘ఈ సాల కప్ నమ్దు’ అంటూ విరాట్ కోహ్లి తనదైన శైలిలో ఫ్యాన్స్లో జోష్ నింపాడు. ‘ఈ విజయం మీ అందరిదీ. అభిమానులు, ఈ నగరానికి చెందినవారు, కష్టాల్లోనూ జట్టుకు మద్దతునిచ్చిన వారందరికీ గెలుపులో భాగం ఉంది. ప్రపంచంలో ఏ ఫ్రాంచైజీ జట్టుకు కూడా ఇంతటి వీరాభిమానులు ఉండటం నేను ఎప్పుడూ చూడలేదు’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. సీజన్ ఆరంభం నుంచి జట్టులోని ఆటగాళ్లంరికీ తగిన బాధ్యతలు అప్పగించామని, ఇప్పుడు వారందరి ప్రదర్శనతోనే టైటిల్ విజయం ఖాయమైందని కెప్టెన్ రజత్ పాటీదార్ చెప్పాడు. అంతకుముందు ఆర్సీబీ టీమ్ సభ్యులు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం విధాన సౌధ వద్ద క్రికెటర్లకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం జరిగింది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సాంప్రదాయ రీతిలో వారిని సత్కరించారు. ఆర్సీబీ టీమ్ తమ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిందని, 18 ఏళ్లు టైటిల్ కోసం పోరాడటం చిన్న విషయం కాదని ఆయన అన్నారు. విజయాన్ని అలవాటుగా మార్చుకోవాలి... ఒక్క టైటిల్ విజయంతో ఆర్సీబీ జట్టు ఆగిపోరాదని, వచ్చే ఏడాది కూడా ఇదే జోరును కొనసాగించి వరుసగా రెండో ఏడాది ట్రోఫీని సొంతం చేసుకోవాలని టీమ్ డైరెక్టర్ మొ బొబాట్ అన్నారు. ఫైనల్లో విజయం తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో సంబరాలు చేసుకుంటూ ఆయన టీమ్ సభ్యుల్లో మరింత స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు.‘ఈ అద్భుత విజయంలో అందరూ తమవంతు పాత్ర పోషించారు. దీని విలువ ఏమిటో రాబోయే రోజుల్లో ఇంకా మీకు అర్థమవుతుంది. గతంలో ఒక జట్టు వరుసగా రెండుసార్లు టైటిల్ గెలవడం రెండుసార్లు మాత్రమే జరిగింది. వచ్చే ఏడాది ఫైనల్ బెంగళూరులో జరుగుతుంది. అప్పుడు అక్కడా మనం ఉండాలంటే విజయాలను అలవాటుగా మార్చుకోవాలి. ఈ టైటిల్ మీలో గెలుపు ఆకలిని ఇంకా పెంచాలి’ అని బొబాట్ వ్యాఖ్యానించారు.‘బౌలింగ్ వల్లే గెలిచాం’ఐపీఎల్ టైటిల్ను ఆర్సీబీ తొలిసారి గెలవడంలో బౌలర్లే ప్రధాన పాత్ర పోషించారని జట్టు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ అన్నారు. వేలంలో కూడా మంచి బౌలర్లను సొంతం చేసుకోవడంపైనే దృష్టి పెట్టామని... గెలుపు దిశగా అక్కడే తమ తొలి అడుగు పడిందని ఫ్లవర్ వ్యాఖ్యానించారు. ‘పేరున్న బ్యాటర్లపై భారీ మొత్తాలు వెచ్చించడంకంటే గుర్తింపు ఉన్న బౌలర్లను ఎంచుకోవడం ముఖ్యమని భావించాం. తొలిరోజు వేలం ముగిశాక మాపై చాలా విమర్శలు వచ్చాయి. అయితే రెండో రోజు వేలంలో భువనేశ్వర్, కృనాల్, సుయాశ్ శర్మలను తీసుకున్నాం. వీరు ఎలాంటి ప్రభావం చూపించారో ఇప్పుడు కనిపిస్తోంది’ అని ఫ్లవర్ విశ్లేషించారు. -
నిశ్చితార్థం చేసుకున్న టీమిండియా స్టార్ క్రికెటర్
టీమిండియా స్టార్ క్రికెటర్ కుల్దీప్ యాదవ్ తన చిన్ననాటి స్నేహితురాలు వన్షికతో ఇవాళ (జూన్ 4) నిశ్చితార్థం చేసుకున్నాడు. లక్నోలోని ఓ హోటల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. కుల్దీప్-వన్షిక సంప్రదాయ బద్దంగా ఉంగరాలు మార్చుకున్నారు. కాన్పూర్లోని శ్యామ్ నగర్ ప్రాంతానికి చెందిన వన్షిక ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తుంది. కుల్దీప్-వన్షిక ఎంగేజ్మెంట్కు యూపీకి చెందిన పలువురు క్రికెటర్లు, టీమిండియా విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ హాజరయ్యారు. వివాహా తేదీని కుల్దీప్ త్వరలో ప్రకటించనున్నాడు.Kuldeep Yadav gets engaged to his childhood friend Vanshika. (Abhishek Tripathi).- Many congratulations to them. ❤️ pic.twitter.com/fdTncdtYa4— Mufaddal Vohra (@mufaddal_vohra) June 4, 2025కుల్దీప్ తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ సీజన్లో ఢిల్లీ ఆరంభంలో అద్బుత విజయాలు సాధించినా, ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. 30 ఏళ్ల కుల్దీప్ ఈ ఐపీఎల్ సీజన్లో 14 మ్యాచ్లు ఆడి 7.07 సగటున 15 వికెట్లు తీశాడు. కుల్దీప్ తర్వలో ఇంగ్లండ్తో జరుగబోయే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ ఒక్కడే. అశ్విన్ టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించాక కుల్దీప్ భారత టెస్ట్ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారే అవకాశం ఉంది. ఇంగ్లండ్ పర్యటనలో రాణిస్తే అతనికి తిరుగే ఉండదు. కుల్దీప్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇదివరకే తనను తాను నిరూపించుకున్నాడు. టీమిండియా ఛాంపియన్గా నిలిచిన 2024 టీ20 వరల్డ్కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో కుల్దీప్ కీలకంగా వ్యవహరించాడు. -
బెంగళూరు తొక్కిసలాట.. ఏ సమయంలో ఏం జరిగిందంటే..?
బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విజయోత్సవంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం జరిగిన చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరగడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. మృతుల్లో నలుగురు మహిళలు, ఓ బాలుడు ఉన్నట్లు సమాచారం. స్టేడియంలోకి ఒక్కసారిగా భారీ సంఖ్యలో అభిమానులు దూసుకురావడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. స్టేడియం గేట్ దగ్గర ఉన్న పైకప్పు కూలడంతో తొక్కిసలాట ప్రారంభమైందని తెలుస్తుంది. ఒక్కసారిగా ఫ్యాన్స్ స్టేడియంలోకి దూసుకురావడంతో పోలీసులు అదుపు చేయలేకపోయారు. ఈ క్రమంలో లాఠీచార్జ్ జరిగింది. స్టేడియం ఖాళీ చేయాలని అభిమానులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. గాయపడిన వారికి బౌరింగ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బౌరింగ్ ఆసుపత్రిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బాధితులను పరామర్శించారు.తొక్కిసలాట దురదృష్టకరమని కర్ణాటక డిప్యూటీ సీఎం అన్నారు. అభిమానులను అదుపు చేయలేకపోయామని ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు డీకే క్షమాపణ చెప్పారు.ఘోరం జరిగిందిలా..మధ్యాహ్నం 3 గంటల 49 నిమిషాలకు ఆర్సీబీ టీమ్ బెంగళూరుకు చేరింది4:47 విధాన సభ ప్రాంగణానికి ఆర్సీబీ టీమ్5:10కి భారీ వర్షంలోనే ఆర్సీబీ టీమ్కు సత్కారం5:16 చిన్నస్వామి స్టేడియం దగ్గర లాఠీచార్జ్5:16 భారీ కేడ్లు దూకిన ఫ్యాన్స్, తొక్కిసలాట5:30 ఘటనపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆరా5:47 స్టేడియం వద్దకు చేరుకున్న ఆంబులెన్స్5:50 ఎనిమిది మంది చనిపోయినట్లు ప్రకటన5:53 చేతులెత్తేసిన పోలీసులు6:01 పది మంది చనిపోయినట్లు ప్రకటన -
IPL 2025: అన్ లక్కీ చహల్.. చరిత్రలో తొలి ఆటగాడు
టాలెంట్ ఎంతున్నా ఆవగింజంతైనా అదృష్టం ఉండాలన్న నానుడు స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ విషయంలో మరోసారి నిరూపితమైంది. ఇతగాడు ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చలామణి అవుతున్నా (174 మ్యాచ్ల్లో 221 వికెట్లు).. ఇప్పటివరకు తాను ప్రాతినిథ్యం వహించిన ఒక్క ఫ్రాంచైజీకి కూడా టైటిల్ అందించలేకపోయాడు.2013 సీజన్లో ఆర్సీబీ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన యుజీ.. ఇప్పటివరకు మూడు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున ఫైనల్స్ ఆడాడు. మూడింటిలో అతన్ని అదృష్టం వెక్కిరించింది. తొలిసారి యుజీ 2016 సీజన్లో ఫైనల్ ఆడగా.. ఆ మ్యాచ్లో అతను ప్రాతినిథ్యం వహించిన ఆర్సీబీకి సన్రైజర్స్ చేతిలో భంగపాటు ఎదురైంది. రెండో సారి 2022 సీజన్లో ఫైనల్ ఆడగా.. ఆ మ్యాచ్లో అతని జట్టు రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయంపాలైంది. తాజాగా యుజీ ఆడిన మూడో ఫైనల్లో అతని కొత్త జట్టు పంజాబ్.. అతని మాజీ జట్టు ఆర్సీబీ చేతిలో ఓటమిని ఎదుర్కొంది. ఈ లెక్కన ఐపీఎల్ చరిత్రలో మూడు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున ఫైనల్స్ ఆడి ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన ఏకైక ఆటగాడిగా చహల్ చరిత్రకెక్కాడు. ఇది తెలిసి క్రికెట్ అభిమానులు అతన్ని అన్ లక్కీ ఛార్మ్ అని అంటున్నారు. మూడు ఫైనల్స్లో అతను ఆటగాడిగా రాణించినా అతని జట్లను మాత్రం గెలిపించుకోలేకపోయాడు. మూడు ఫైనల్స్లో చహల్ పొదుపుగానే బౌలింగ్ చేసి ఒక్కో వికెట్ తీశాడు.ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ ఛాంపియన్గా అవతరించింది. నిన్న (జూన్ 3) జరిగిన ఫైనల్లో పంజాబ్ కింగ్స్పై 6 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ సీజన్లో పంజాబ్, ఆర్సీబీ పోటీపోటీగా రాణించి ఫైనల్ వరకు చేరాయి. అయితే తుది సమరంలో ఆటగాళ్ల అనుభవం ఆర్సీబీని గట్టెక్కించింది. ఫైనల్లో ఓడినా శ్రేయస్ సేన శభాష్ అనిపించుకుంది. సీజన్ ఆధ్యాంతం ఆ జట్టు ఛాంపియన్ గేమ్ ఆడింది. అనుభవలేమి ఆటగాళ్లతో శ్రేయస్ జట్టును నడిపించిన తీరు అత్యద్భుతమని విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. నిన్నటి ఫైనల్లో సైతం ఆ జట్టు అంత ఈజీగా ఆర్సీబీకి తలొగ్గలేదు. తొలుత అద్భుతంగా బౌలింగ్ చేసి ఆర్సీబీ ఊహించిన దానికంటే తక్కువ స్కోర్కే కట్టడి చేసింది. ఆతర్వాత బ్యాటింగ్లో సైతం మంచి ఆరంభాన్నే పొందినప్పటికీ మధ్యలో ఒత్తిడికి లోనై వికెట్లు చేజార్చుకుంది. అయినా ఆర్సీబీకి అంత ఈజీగా గెలుపును దక్కనివ్వలేదు. చివరి ఓవర్ వరుకు ఆ జట్టు బ్యాటర్ శశాంక్ సింగ్ పోరాడాడు. ఓటమి ఖాయమైనా శశాంక్ తగ్గేదేలేదన్నాడు. హాజిల్వుడ్ వేసిన చివరి ఓవర్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 22 పరుగులు రాబట్టాడు. అయినా పంజాబ్ గెలుపుకు ఏడు పరుగులు తక్కువయ్యాయి. ఈ ఓటమితో పంజాబ్ గుండె ముక్కలైంది. ఈ యేడు శ్రేయస్ నేతృత్వంలో టైటిల్ ఖాయమని ఆ జట్టు అభిమానులు అనుకున్నారు. కానీ తుది మెట్టుపై ఆర్సీబీ అనుభవం గెలిచింది. ఆ జట్టుకు ఇదివరకే మూడు ఫైనల్స్ ఆడిన అనుభవం ఉండటంతో కీలక సమయంలో పరిస్థితులను బాగా హ్యాండిల్ చేసింది. ఫలితంగా 18 ఏళ్ల తమ టైటిల్ కలను సాకారం చేసుకుంది. -
ఆర్సీబీ విజయోత్సవంలో పెను విషాదం.. 11 మంది మృతి
బెంగళూరులో జరుగుతున్న ఆర్సీబీ విజయోత్సవ సంబురాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం జరిగిన చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరగడంతో 11 మృతి చెందినట్లు తెలుస్తుంది. 50 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. ఇంకా పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. మృతుల్లో మహిళలు, పిల్లలు ఉన్నట్లు తెలుస్తుంది.స్టేడియంలోకి ఒక్కసారిగా భారీ సంఖ్యలో అభిమానులు దూసుకురావడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. జనాలను అదుపు చేసే క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేశారని తెలుస్తుంది. VIRAT GOAT KOHLI - A FRAME FOR AGES IN IPL HISTORY 🥺❤️ pic.twitter.com/dse03LdrOQ— Johns. (@CricCrazyJohns) June 4, 2025స్టేడియం బయట విషాద ఛాయలు అలుముకున్నా లోపల ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం మాత్రం యధాతథంగా కొనసాగింది. ఆర్సీబీ ఆటగాళ్లంతా వేదికపై వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 18 ఏళ్ల తమ ఐపీఎల్ టైటిల్ కలను సాకారం చేసినందుకు గాను ఆర్సీబీ ఆటగాళ్లకు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.తొలుత ఆర్సీబీ యాజమాన్యం ఓపెన్ టాప్ బస్లో విక్టరీ పరేడ్ను ప్లాన్ చేసింది. అయితే ఈ సమస్యలను ముందే ఊహించి పోలీసులు విక్టరీ పరేడ్కు అనుమతి నిరాకరించారు. అయినా అభిమానులు చిన్నస్వామి స్టేడియం వద్దకు భారీగా చేరుకున్నారు. అభిమానులు ఈ స్థాయిలో తరలి రావడంతో పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి అదుపు తప్పినట్లు తెలుస్తుంది. కాగా, 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ ఛాంపియన్గా అవతరించింది. నిన్న (జూన్ 3) జరిగిన 2025 సీజన్ ఫైనల్లో ఆ జట్టు పంజాబ్ కింగ్స్పై 6 పరుగుల తేడాతో విజయం సాధించి, తొలిసారి టైటిల్ను కైవసం చేసుకుంది. 18 సీజన్ల ప్రస్థానంలో నాలుగు సార్లు ఫైనల్కు చేరిన ఆర్సీబీ నాలుగో ప్రయత్నంలో టైటిల్ కలను సాకారం చేసుకుంది. ఈ టైటిల్ కోసం ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కూడా 18 సీజన్లు వేచి చూడాల్సి వచ్చింది. 18 ఏళ్లుగా ఆర్సీబీకే ప్రాతినిథ్యం వహిస్తున్న విరాట్ ఎట్టకేలకు 18వ ఎడిషన్లో టైటిల్ కలను సాకారం చేసుకున్నాడు. ప్రతి సీజన్కు ముందు ఆర్సీబీ అభిమానులు ఈ సాలా కప్ నమదే అంటూ ఎదురుచూసేవారు. ఎట్టకేలకు వారి కల కూడా 18వ ప్రయత్నంలో సాకారమైంది. -
Preity Zinta PBKSలో కేవలం రూ 35 కోట్ల పెట్టుబడి : లాభం ఎంతో తెలుసా?
ఐపీఎల్ 2025లో ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ (PBKS) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. క్వాలిఫైయర్-2 మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు దూసుకెళ్లిన పీబీకేఎస్, అదే తరహాలో టైటిల్ గెలుస్తుందని ఊహించిన అభిమానులకు తీరని నిరాశ మిగిలింది. 18 ఏళ్ల నిరీక్షణ తరువాత ఆసీబీ టైటిల్ను దక్కించుకుంది. పీబీకేఎస్ విలువ 925 మిలియన్ డాలర్లుఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గట్టి పోటీ ఇచ్చిన పంజాబ్ కింగ్స్ యజమాని బాలీవుడ్ నటి, ప్రీతి జింటా (Preity Zinta) ఆస్తి ఎంత, PBKS నెట్వర్త్ ఎంత అనే చర్చ నెట్టింట సందడిగా మారింది. ప్రీతి జింటా ఐపీఎల్ టీం పీబీకేఎస్ విలువ 925 మిలియన్ డాలర్లుగా తెలుస్తోంది.బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ సరసన ‘దిల్ సే’ మూవీతో ఆకట్టుకున్న ఈ సొట్ట బుగ్గల సుందరి రెండు దశాబ్దాలకు పైగాబాలీవుడ్ను ఏలింది. కెరీర్లో, ప్రీతి కల్ హో నా హో, వీర్ జారా, లక్ష్య, సలాం నమస్తే, సంఘర్ష్, కోయి... మిల్ గయా, క్యా కెహ్నా, కభీ అల్విదా నా కెహ్నా, చోరి చోరి చుప్కే చుప్కే, ది లాస్ట్ లియర్, సోల్జర్ , అనేక ఇతర చిత్రాలలో అద్భుతమైన పాత్రలు పోషించింది.ప్రీతి జీన్ గూడెనఫ్ను వివాహం తరువాత అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో సిర్థపడింది. నటనకు దూరంగా ఉంది. ప్రీతి-జీన్ దంపతులకు కవల పిల్లలున్నారు. అయితే, గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉన్నప్పటికీ, ఐపీఎల్ జట్టు ఓనర్షిప్ ఇతర వ్యాపారాలు, ఎండార్స్మెంట్ల ద్వారా భారీ ఆస్తులను సంపాదించింది. 2008లో, ప్రీతి జింటా ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్కు సహ యజమానిగా, వ్యాపారవేత్తగా అవతరించింది.మనీ కంట్రోల్ సమాచారం ప్రకారం, 2008లో ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్కు సహ యజమానిగా ప్రీతి ఆ సమయంలో రూ. 35 కోట్లు పెట్టుబడి పెట్టగా, అది ఇప్పుడు 350 కోట్ల రూపాయలకు పెరిగింది. 2008లో పంజాబ్ కింగ్స్ ప్రారంభించినప్పుడు, దానిని విలువ 76 మిలియన్ డాలర్లుగా ఉంది. 2022 నాటికి 925 మిలియన్ డాలర్లకు పెరిగింది.ప్రీతి జింటా ఆస్తి రూ. 183 కోట్లు ప్రీతి జింటా నికర ఆస్తుల విలువ రూ. 183 కోట్లు, ఇందులో ఆమె బ్రాండ్ ప్రమోషన్లు, వ్యాపార సంస్థలు, ఐపీఎల్ జట్టులో వాటా కూడా ఉన్నాయి. ముంబైలోని పాలి హిల్స్లో రూ. 17 కోట్ల విలువైన అపార్ట్మెంట్ ప్రీతి సొంతం. జీన్ గూడెనఫ్తో వివాహం తర్వాత ఆమె అమెరికాకు వెళ్లి బెవర్లీ హిల్స్లో నివసిస్తున్నప్పటికీ సిమ్లాలో రూ. 7 కోట్ల విలువైన ఇంటిని కూడా కొనుగోలు చేసింది.బ్రాండ్ ఎండార్స్మెంట్ల ఆదాయం కూడా భారీగానే ఉంటుంది. ప్రీతి జింటా ప్రచారం చేసే ప్రతి బ్రాండ్ నుండి దాదాపు రూ. 1.5 కోట్ల నుండి రూ. 2 కోట్ల వరకు సంపాదిస్తుంది. ప్రీతి జింటా కార్ల విషయానికి వస్తే లగ్జరీ కార్లు ఆమె గ్యారేజీలో ఉన్నాయి. వీటిలో రూ. 132 లక్షల విలువైన లెక్సస్ 400 క్రాస్ఓవర్, రూ. 58 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్ E క్లాస్, పోర్స్చే , BMW ఉన్నాయి. -
IPL 2025 Final: శ్రేయస్ అయ్యర్ను ఎగతాళి చేసిన ఆర్సీబీ ఎక్స్ట్రా ప్లేయర్..?
17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ ఛాంపియన్గా అవతరించింది. నిన్న (జూన్ 3) జరిగిన 2025 సీజన్ ఫైనల్లో ఆ జట్టు పంజాబ్ కింగ్స్పై 6 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది. 18 సీజన్ల ప్రస్థానంలో నాలుగు సార్లు ఫైనల్కు చేరిన ఆర్సీబీ నాలుగో ప్రయత్నంలో చివరి మెట్టును దాటింది. ఈ టైటిల్ కోసం ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కూడా 18 సీజన్లు వేచి చూడాల్సి వచ్చింది. 18 ఏళ్లుగా ఆర్సీబీకే ప్రాతినిథ్యం వహిస్తున్న విరాట్ ఎట్టకేలకు 18వ ఎడిషన్లో టైటిల్ కలను సాకారం చేసుకున్నాడు. ప్రతి సీజన్కు ముందు ఆర్సీబీ అభిమానులు ఈ సాలా కప్ నమదే అంటూ ఎదురుచూసేవారు. ఎట్టకేలకు వారి కల 18వ ప్రయత్నంలో సాకారమైంది.టైటిల్ గెలిచాక ఆర్సీబీ ఆటగాళ్లు ఉద్వేగభరితమైన సంబరాలు చేసుకున్నారు. విజయం ఖరారు కాగానే విరాట్ నెలకొరిగి కన్నీరు పెట్టుకోగా.. మిగతా ఆటగాళ్లంతా అతన్ని చుట్టుముట్టారు. ట్రోఫీ సెలబ్రేషన్స్ సందర్భంగా కెప్టెన్ పాటిదార్ విరాట్నే ట్రోఫీ లిఫ్ట్ చేయాల్సిందిగా కోరాడు. విరాట్ చిన్నపిల్లాడిలా మైమరచిపోయి సంబరాలు చేసుకున్నాడు. Swastik you can mock Shreyas Iyer's victory dance , but you can't replicate what he has achieved.Be humbled pic.twitter.com/ysRPubyUFI— RONIT. (@Hyperx96) June 3, 2025ఎక్స్ట్రా ప్లేయర్ స్వస్తిక్ చికారా విరాట్ను ఇంప్రెస్ చేసే క్రమంలో గంగ్నమ్ స్టయిల్ డ్యాన్స్ చేశాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లి, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాక శ్రేయస్ అయ్యర్ ఇదే తరహా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. తాజాగా చికారా గంగ్నమ్ స్టయిల్ డ్యాన్స్ వేయడంతో శ్రేయస్ అయ్యర్ను ఎగతాళి చేశాడనే అభిప్రాయం కలుగుతుంది. ఆర్సీబీ వ్యతిరేకులు ఈ విషయాన్ని హైలైట్ చేస్తున్నారు. వాస్తవానికి ఆ సమయంలో చికారా శ్రేయస్ గురించి ఆలోచించకపోయి ఉండవచ్చు. కేవలం విరాట్ను ఇంప్రెస్ చేయడంలో భాగంగానే ఆ డ్యాన్స్ చేసి ఉండవచ్చు. ఈ సీజన్ ప్రారంభం నుంచి చికారా విరాట్ మెప్పు పొందడమే పనిగా పెట్టుకున్నాడు. విరాట్ ఎక్కడికెళ్లిన అతని పక్కనే చికారా ఉండేవాడు. 20 ఏళ్ల చికారాకు ఇదే తొలి ఐపీఎల్ సీజన్. ఈ సీజన్లో అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. చికారాకు క్లీన్ హిట్టర్గా పేరుంది. భవిష్యత్తులో అతను విరాట్తో ఆడే అవకాశాలు లేకపోలేదు. విరాట్ మరికొన్ని సీజన్లు ఐపీఎల్ ఆడితే చికారా కల నెరవేరవచ్చు. -
జనసంద్రగా మారిన బెంగళూరు.. ఐపీఎల్ విజేత ఆర్సీబీకి ఘన స్వాగతం
బెంగళూరు నగర వీధుల జనసంద్రంగా మారాయి. ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచాక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఇవాళ మధ్యాహ్నం నగరానికి చేరుకుంది. ఎయిర్పోర్ట్లో ఆర్సీబీ సభ్యులకు ఘన స్వాగతం లభించింది. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి సహా ఆర్సీబీ బృంద సభ్యులంతా ప్రత్యేక బస్సులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలిసేందుకు బయల్దేరారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ 'విధాన సౌధ' ముందు సిద్దరామయ్య చేతుల మీదుగా ఆర్సీబీ సభ్యులకు సన్మానం జరుగనుంది. WHAT A WELCOME FOR RCB IN BENGALURU. pic.twitter.com/8KFfcxiWj4— Mufaddal Vohra (@mufaddal_vohra) June 4, 2025విధాన సౌధకు వెళ్లే దారిలో ఆర్సీబీ అభిమానులు ఇసుకేస్తే రాలనంతగా ఉన్నారు. ఆర్సీబీ సభ్యులు ప్రయాణిస్తున్న వాహనంపై పూల వర్షం కురుస్తుంది. ఆర్సీబీ, విరాట్ కోహ్లి నామస్మరణతో బెంగళూరు నగర వీధులు మార్మోగిపోతున్నాయి. ఆర్సీబీ బృంద సభ్యులు ప్రయాణిస్తున్న బస్సులో విరాట్ కోహ్లి ముందు కూర్చుకున్నాడు. విరాట్ బస్సు అద్దాల గుండా అభిమానులకు అభివాదం చేస్తున్నాడు. విరాట్ తన భార్య అనుష్కతో పాటు ఉన్నాడు.MASSIVE CROWD OUTSIDE CHINNASWAMY STADIUM...!!! 🙏👊 pic.twitter.com/hK7Hpbcmi8— Johns. (@CricCrazyJohns) June 4, 2025ప్రస్తుతమున్న సమాచారం మేరకు ఓపెన్ టాప్ బస్సులో విక్టరీ పరేడ్ జరగడం లేదు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలిసిన తర్వాత పోలీసులు విక్టరీ పరేడ్కు అనుమతిచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇదలా ఉంచితే, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఆటగాళ్ల సత్కార కార్యక్రమం జరుగనుంది. టికెట్, పాస్ ఉన్న వారికి మాత్రమే స్టేడియంలోకి అనుమతి ఉంటుందని పోలీసులు చెప్పారు.🚨 KARNATAKA DEPUTY CM WELCOMING KOHLI & RCB TEAM 🚨 [ANI] pic.twitter.com/y6V338rWfx— Johns. (@CricCrazyJohns) June 4, 2025విరాట్ బృందానికి వెల్కమ్ చెప్పిన కర్ణాటక డీసీఎంబెంగళూరు ఎయిర్పోర్ట్లో ఆర్సీబీ బృంద సభ్యులకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి (డీసీఎం) డీకే శివకుమార్ ఘన స్వాగతం పలికాడు. డీకే విరాట్ కోహ్లికి ప్రత్యేకంగా పూలు ఇచ్చి స్వాగతం పలికాడు. డీకే విరాట్ను ఆర్సీబీ జెండాతో పాటు కర్ణాటక జెండా పట్టుకోవాల్సిందిగా కోరాడు. THE CROWD OUTSIDE VIDHANA SOUDHA FOR RCB 🤯 pic.twitter.com/13YK0AzpYz— Johns. (@CricCrazyJohns) June 4, 2025 -
IPL 2025: ఆర్సీబీ అభిమానులకు నిరాశ
ఇండియన్స్ ప్రీమియర్ లీగ్లో (ఐపీఎల్) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టైటిల్ చేజిక్కించుకుంది. నిన్న (జూన్ 3) జరిగిన ఫైనల్లో ఆర్సీబీ పంజాబ్ను 6 పరుగుల తేడాతో ఓడించి తమ తొలి టైటిల్ను కైవసం చేసుకుంది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన పంజాబ్ లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ మ్యాచ్లో పంజాబ్ ఓడినా అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. చివరి బంతి వరకు పోరాడింది. సీజన్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన పంజాబ్ టైటిల్ గెలవలేకపోయినా ప్రతి క్రికెట్ అభిమాని మనసును దోచుకుంది. యువ జట్టుతో శ్రేయస్ అయ్యర్ పంజాబ్ అద్భుతంగా నడిపించాడు. వ్యక్తిగతంగా రాణించడంతో పాటు జట్టుకు మంచి మార్గదర్శిగా నిలిచాడు. మరోవైపు సీజన్ ప్రారంభం నుంచి పంజాబ్తో పోటీపడిన ఆర్సీబీ ఫైనల్లో తమ అనుభవాన్నంత రంగరించి టైటిల్ను చేజిక్కించుకుంది. ఈ గెలుపుతో ఆర్సీబీ అభిమానుల 17 ఏళ్ల కల నెరవేరింది. ప్రతి సీజన్లో ఆ జట్టు అభిమానులు ఈ సాలా కప్ నమదే అంటూ ఎదురుచూసేవారు. ఎట్టకేలకు వారి కల 18వ ప్రయత్నంలో సాకారమైంది. 18 ఏళ్లుగా ఆర్సీబీకే ఆడుతున్న విరాట్ కోహ్లి కూడా ప్రతి సీజన్కు ముందు ఈ సాలా కప్ నమదే అనుకుంటూ బరిలోకి దిగేవాడు. ఎట్టకేలకు అతని కల కూడా ఈ సీజన్తో సాకారమైంది.18వ ప్రయత్నంలో టైటిల్ గెలిచాక ఆర్సీబీ అభిమానుల ఆనందానికి అవథుల్లేవు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం సాధించిన టైటిల్ కావడంతో ప్రతి అభిమాని తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. టైటిల్ గెలిచాక ఆర్సీబీ అభిమానుల సంబురాలు అంబరాన్నంటాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో అభిమానులు హడావుడి చేశారు. ఆర్సీబీ యాజమాన్యం ఈ రోజు బెంగళూరులో విజయోత్సవ ర్యాలీని ప్లాన్ చేసింది. ఓపెన్ టాప్ బస్సులో విక్టరీ పరేడ్ నిర్వహించాలని అనుకుంది. అయితే ఈ ర్యాలీకి పోలీసులు అనుమతిని నిరాకరించారు. భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుందన్న కారణంగా విక్టరీ పరేడ్ను అనుమతివ్వలేమని ఆర్సీబీ యాజమాన్యానికి సమాచారమిచ్చారు. పోలీసుల నిర్ణయంతో ఆర్సీబీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.అయితే సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు చిన్నస్వామి స్టేడియంలో ఆటగాళ్ల సత్కార కార్యక్రమానికి మాత్రం అనుమతి లభించింది. అయితే ఇక్కడ కూడా పరిమితులతోనే కార్యక్రమం జరుపుకోవాలని సూచనలు అందాయి. టికెట్, పాస్ ఉన్న వారికి మాత్రమే స్టేడియంలోకి అనుమతి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. -
చాలా బాధగా ఉంది.. అతడే మ్యాచ్ను టర్న్ చేశాడు: శ్రేయస్ అయ్యర్
తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలని కలలు కన్న పంజాబ్ కింగ్స్కు మరోసారి నిరాశే ఎదురైంది. ఐపీఎల్-2025 సీజన్లో ఆఖరి మొట్టుపై పంజాబ్ బోల్తా పడింది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఫైనల్ పోరులో 6 పరుగుల తేడాతో పంజాబ్ ఓటమి పాలైంది.ఆర్సీబీ నిర్ధేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని శ్రేయస్ సేన చేధించలేకపోయింది. లక్ష్య చేధనలో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ బ్యాటర్లలో శశాంక్ సింగ్(61), జోష్ ఇంగ్లిష్(39) మినహా మిగితా అందరూ తీవ్ర నిరాశపరిచారు.ఆర్సీబీ బౌలర్లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఈ హార్ట్బ్రేకింగ్ ఓటమిపై మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. ఫైనల్లో ఓటమి పాలైనప్పటికి.. ఈ టోర్నీ ఆసాంతం తమ కుర్రాళ్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారని అయ్యర్ కొనియాడాడు."ఈ మ్యాచ్లో ఓటమి మమ్మల్ని తీవ్ర నిరాశపరిచింది. ఫైనల్లో ఓడినా మా కుర్రాళ్ళు ఆ సందర్భానికి తగ్గట్టు ఆడారు. ఈ మ్యాచ్లో ఆశించిన ఫలితం మాకు దక్కలేదు. కానీ మాకు మద్దతుగా నిలిచిన సపోర్ట్ స్టాఫ్, టీమ్ మేనేజ్మెంట్, ప్రతీ ఒక్కరికి క్రెడిట్ ఇవ్వాలి.మా యాజమాన్యం కూడా చాలా సపోర్ట్ చేశారు. మా గత మ్యాచ్ దృష్ట్యా 200 పరుగుల లక్ష్యం సులువు అనుకున్నాం. కానీ ఈ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా కృనాల్ తన బౌలింగ్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అతడికి చాలా అనుభవం ఉంది.తన ఎక్స్పీరియన్స్ను మరోసారి చూపించాడు. జట్టులోని ప్రతీ ఒక్కరూ బాగా రాణించారు. వారి ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది. మా జట్టులోని చాలా మంది కుర్రాళ్లకు ఇదే తొలి సీజన్. అయిప్పటికి వారు ఫియర్లెస్ క్రికెట్ ఆడారు. వారందరికి అభినందనలు. వారు లేకపోయింటే మేము ఇక్కడివరకు వచ్చేవాళ్లం కాదు. మా పని ఇంకా పూర్తి కాలేదు. వచ్చే ఏడాది ట్రోఫీ గెలవడమే మా లక్ష్యం. ఈ టోర్నీలో మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. యువ ఆటగాళ్లు ఈ సీజన్ నుంచి చాలా అనుభవాన్ని పొందారు. వచ్చే ఏడాది మరింత మెరుగైన ప్రదర్శన చేస్తారని అశిస్తున్నాను. కొత్త వ్యూహాలు, ప్రణాళికలతో మళ్లీ తిరిగివస్తామని" పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో అయ్యర్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్లో అయ్యర్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన కృనాల్ పాండ్యా.. 18 ఏళ్లలో ఒకే ఒక్కడు -
RCBvPBKS: చరిత్ర సృష్టించిన కృనాల్ పాండ్యా.. 18 ఏళ్లలో ఒకే ఒక్కడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) చరిత్రలో సరికొత్త ఛాంపియన్ అవతరించింది. ఐపీఎల్-2025 సీజన్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆరు పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించిన ఆర్సీబీ.. తమ 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది.ఈ తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(43) టాప్ స్కోరర్గా నిలవగా.. పాటిదార్(26), జితేష్ శర్మ(24), లివింగ్ స్టోన్(25) రాణించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్, జామీసన్ తలా మూడు వికెట్లు పడగొట్టారు.తిప్పేసిన కృనాల్..అనంతరం లక్ష్య చేధనలో పంజాబ్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేయగల్గింది. శశాంక్ సింగ్(61) ఆఖరి వరకు పోరాడినప్పటికి తన జట్టును మాత్రం విజయతీరాలకు చేర్చాడు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. పాండ్యా తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగుల మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లను పడగొట్టాడు. పాండ్యా ఆసాధరణ ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది.తద్వారా కృనాల్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ ఫైనల్లో రెండుసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన తొలి ఆటగాడిగా కృనాల్ పాండ్యా రికార్డుల్లోకెక్కాడు. 2017లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్పై ముంబై ఇండియన్స్ విజయం సాధించిన సందర్భంలోనూ కృనాల్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.చదవండి: Virat Kohli On RCB Win: ఈ రోజు వస్తుందని అనుకోలేదు.. ప్రశాంతంగా నిద్రపోతా -
ఈ రోజు వస్తుందని అనుకోలేదు.. ప్రశాంతంగా నిద్రపోతా: విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి.. తన 18 ఏళ్ల కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించాడు. వన్డే, టీ20 వరల్డ్కప్లు, ఛాంపియన్స్ ట్రోఫీలు వంటి ఐసీసీ టైటిల్స్ను సైతం విరాట్ సొంతం చేసుకున్నాడు. కానీ కింగ్ కెరీర్లో ఐపీఎల్ ట్రోఫీ ఒక్కటే వెలితిగా ఉండేది. ఇప్పుడు ఎట్టకేలకు కోహ్లి ఖాతాలో ఐపీఎల్ టైటిల్ కూడా చేరింది.కోహ్లి 18 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. ప్రతీ సీజన్లో బ్యాటర్గా, ఫీల్డర్గా, కెప్టెన్గా ఆర్సీబీని భుజాల మీద మోసిన కోహ్లి.. తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాడు. ఐపీఎల్-2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. దీంతో ఏన్నో ఏళ్ల నుంచి అందని ద్రాక్షగా ఊరించిన కలల కప్పు కింగ్ సొంతమైంది.ఫైనల్లో ఆర్సీబీ విజయం ఖరారైన వెంటనే మైదానంలోనే కన్నీటిపర్యంతమయ్యాడు. ఆ తర్వాత ట్రోఫీని అందుకుని మైదానం చుట్టూ తిరిగుతూ సందడి చేశాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ రోజు వస్తుందని అస్సలు అనుకోలేదని కోహ్లి తెలిపాడు.పసి పాపలా ప్రశాంతంగా నిద్రపోతా"18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఈ విజయం జట్టు సభ్యులది మాత్రమే కాదు అభిమానులది కూడా. నేను యువకుడిగా, ఆ తర్వాత కెరీర్ అత్యుత్తమ దశలో, ఇప్పుడు అనుభవజ్ఞుడిలా ఈ టీమ్తో ఉన్నాను. ప్రతీ సీజన్లోనూ ఇదే తరహాలో విజయం కోసం తీవ్రంగా శ్రమించాను. నేను చేయగలిగిందంతా చేశాను. చివరకు ఇప్పుడు దక్కిన భావన గొప్పగా ఉంది. ఈ రోజు వస్తుందని అనుకోలేదు. ఆఖరి బంతి తర్వాత భావోద్వేగాలను నియంత్రించుకున్నాను. ఏం జరిగినా ఇదే జట్టుతో ఉన్నాను. టీమ్ మేనేజ్మెంట్ కూడా నాతో నిలబడింది. ఇదే జట్టుతో టైటిల్ గెలవాలని కలగన్నాను. మరో టీమ్తో గెలిచి ఉంటే ఇంత ఆనందం దక్కకపోయేదేమో. నా హృదయం, ఆత్మ బెంగళూరుతోనే ఉన్నాయి.గతంలో చెప్పినట్లుగా నేను ఐపీఎల్ ఆడినంత వరకు ఇదే జట్టుతో ఉంటా. ఎంతో పోటీ, తీవ్రత ఉండే ఈ టోర్నీలో టైటిల్ విజయాన్ని ఎంతో ప్రాధాన్యత ఉంది. నేను ఇలాంటి పెద్ద టోరీ్నలను గెలవాలని, చిరస్మరణీయ క్షణాలను కోరుకుంటా. కెరీర్లో అత్యుత్తమ విజయాల్లో ఇదొకటి. ఈ రోజు నేను ప్రశాంతంగా పసిపాపలా నిద్రపోతా. వేలంలో మా ఎంపికను చాలా మంది ప్రశ్నించారు. కానీ వాటిని తప్పని నిరూపించామని కోహ్లి పేర్కొన్నాడు.చదవండి: Virat Kohli Emotional Video: 18 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెక్కి వెక్కి ఏడ్చిన కోహ్లి! వీడియో వైరల్ -
IPL 2025: ఛాంపియన్గా ఆర్సీబీ.. ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. గత 17 ఏళ్ల నుంచి ఊరిస్తున్న ఐపీఎల్ కప్ ఎట్టకేలకు ఆర్సీబీ సొంతమైంది. ఐపీఎల్-2025 విజేతగా ఆర్సీబీ అవతరించింది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించిన బెంగళూరు జట్టు.. తమ కలల ట్రోఫీని ముద్దాడింది. ఆర్సీబీ గెలుపుతో అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. ‘‘ఈసాలా కప్ నమ్దు’’ నినాదాలతో స్టేడియం హోరెత్తి పోయింది. ఈ క్రమంలో విజేతగా నిలిచిన ఆర్సీబీ ఎంత ప్రైజ్మనీని గెల్చుకుంది, రన్నరప్గా నిలిచిన పంజాబ్ కింగ్స్ టీమ్ ఎంత మొత్తం దక్కించుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.విజేతకు ఎన్ని కోట్లంటే?👉ఛాంపియన్స్గా నిలిచిన ఆర్సీబీకి ప్రైజ్మనీ రూపంలో రూ.20 కోట్లు లభించాయి. అదేవిధంగా రన్నరప్తో సరిపెట్టుకున్న పంజాబ్కు రూ.12.5 కోట్లు ప్రైజ్మనీ దక్కింది. ఇక క్వాలిఫయర్-2లో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్కు రూ.7 కోట్లు, ఎలిమినేటర్లో టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు రూ.6.5 కోట్లు లభించాయి.👉ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా నిలిచిన సాయిసుదర్శన్కు రూ.15లక్షల నగదు బహుమతి లభించింది. ఈ ఏడాది సీజన్లో 15 మ్యాచ్లు ఆడిన సుదర్శన్.. 54.21 సగటుతో 759 పరుగులు చేశాడు.👉పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచిన ప్రసిద్ద్ కృష్ణకు రూ.15లక్షల నగదు బహుమతి లభించింది. ఈ ఏడాది సీజన్లో 15 మ్యాచ్లు ఆడిన ప్రసిద్ద్.. 25 వికెట్లు పడగొట్టాడు.👉జితేశ్ శర్మ (సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ది మ్యాచ్) రూ.లక్ష ప్రైజ్మనీ👉శశాంక్ సింగ్ (ఫాంటసీ కింగ్ ఆఫ్ ది మ్యాచ్) రూ.లక్ష ప్రైజ్మనీ👉శశాంక్ సింగ్ (సూపర్ సిక్సర్స్ ఆఫ్ ది మ్యాచ్) రూ.లక్ష ప్రైజ్మనీ👉ప్రియాన్ష్ ఆర్యా (మ్యాచ్లో అత్యధిక ఫోర్లు) రూ.లక్ష ప్రైజ్మనీ👉కృనాల్ పాండ్యా (గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ది మ్యాచ్) రూ.లక్ష ప్రైజ్మనీ👉కృనాల్ పాండ్యా (మ్యాన్ ఆఫ్ది మ్యాచ్) రూ.5లక్షల ప్రైజ్మనీ👉సాయి సుదర్శన్ (ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్) రూ. 10 లక్షల ప్రైజ్మనీ👉వైభవ్ సూర్యవంశి (సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ది సీజన్) టాటా కర్వ్ కారు విజేత👉సాయి సుదర్శన్ ( ఫాంటసీ కింగ్ ఆఫ్ ది సీజన్) రూ.10 లక్షల ప్రైజ్మనీ👉నికోలస్ పూర్ (సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్) రూ.10 లక్షల ప్రైజ్మనీ👉సాయి సుదర్శన్ (ది గో ఫోర్స్ ఆఫ్ ది సీజన్) రూ.10 లక్షల ప్రైజ్మనీ👉మొహ్మద్ సిరాజ్ (గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ది సీజన్) రూ. 10 లక్షల ప్రైజ్మనీ👉కమిండు మెండిస్ (క్యాచ్ ఆఫ్ ది సీజన్) రూ. 10 లక్షల క్యాష్ ప్రైజ్👉ఫెయిర్ ప్లే అవార్డు (చెన్నై సూపర్ కింగ్స్) రూ.10లక్షల ప్రైజ్మనీ👉ప్రసిద్ధ్ కృష్ణ (పర్పుల్ క్యాప్) రూ.10లక్షల ప్రైజ్మనీ👉సాయి సుదర్శన్ (ఆరెంజ్ క్యాప్) రూ.10లక్ష ప్రైజ్మనీ👉సూర్యకుమార్ యాదవ్ (మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్) రూ.15లక్షల ప్రైజ్మనీ👉డీడీసీఏ (పిచ్ అండ్ గ్రౌండ్) రూ.50లక్షల ప్రైజ్మనీThis wasn’t luck. This was loyalty paying rent after 18 years. 🤌pic.twitter.com/kOfZ7aX7RF— Royal Challengers Bengaluru (@RCBTweets) June 3, 2025 -
RCBvsPBKS: 18 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెక్కి వెక్కి ఏడ్చిన కోహ్లి! వీడియో వైరల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల కల ఎట్టకేలకు నెరవేరింది. ఐపీఎల్-2025 ఛాంపియన్స్గా ఆర్సీబీ నిలిచింది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ పోరులో 6 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించిన ఆర్సీబీ.. తొలి ఐపీఎల్ టైటిల్ను ముద్దాడింది.ఈ విజయనంతరం ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి భావోద్వేగానికి గురయ్యాడు. ఎన్నో ఏళ్లగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఐపీఎల్ ట్రోఫీ.. ఎట్టకేలకు తన సొంతమైనందుకు విరాట్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఆఖరి ఓవర్ అవుతున్నప్పటికి ఆర్సీబీ విజయం లాంఛనం కావడంతో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కింగ్.. చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చాడు. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. చివరి బంతి పడగానే మోకాళ్లపై కూర్చుని చేతులతో ముఖాన్ని దాచుకున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. తొలి సీజన్ నుంచి బెంగళూరుకే ఆడుతున్న విరాట్ కోహ్లి.. మూడు ఫైనల్స్(2009, 2011, 2016) తర్వాత తన కలను సాకారం చేసుకున్నాడు. ప్రతీ ఎడిషన్లోనూ సత్తా చాటే కోహ్లి.. ఈ ఏడాది సీజన్లోకూడా దుమ్మలేపాడు. ఈ ఏడాది సీజన్లో 15 మ్యాచ్లు ఆడిన కోహ్లి.. 54.75 సగటుతో 657 పరుగులు చేశాడు. ఫైనల్ మ్యాచ్లో కూడా కోహ్లి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 35 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 43 పరుగులు చేశాడు.The tears say it all 🥹An 1️⃣8️⃣-year wait comes to an end 👏Updates ▶ https://t.co/U5zvVhcvdo#TATAIPL | #RCBvPBKS | #Final | #TheLastMile | @imVkohli pic.twitter.com/X15Xdmxb0k— IndianPremierLeague (@IPL) June 3, 2025ప్రతీ ఎడిషన్లోనూ సత్తా చాటే కోహ్లి.. ఈ ఏడాది సీజన్లోకూడా దుమ్మలేపాడు. ఈ ఏడాది సీజన్లో 15 మ్యాచ్లు ఆడిన కోహ్లి.. 54.75 సగటుతో 657 పరుగులు చేశాడు. ఫైనల్ మ్యాచ్లో కూడా కోహ్లి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 35 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 43 పరుగులు చేశాడు. -
ఆర్సీబీకి అందిన ద్రాక్ష
విరాట్ కోహ్లి 17 సీజన్లలో కలిపి 8 వేల పరుగులు చేసినా... క్రిస్ గేల్ విధ్వంసక బ్యాటింగ్తో 7 సీజన్లలో రికార్డులు బద్దలు కొట్టినా... డివిలియర్స్ 11 సీజన్లలో మరచిపోలేని మెరుపు ప్రదర్శనలు చూపించినా సాధ్యం కాలేదు... ఈ ముగ్గురు కలిసి 7 సీజన్లలో టి20 క్రికెట్ మజా ఏమిటో చూపిస్తూ అభిమానులకు అంతులేని వినోదాన్ని పంచినా... అసలు లక్ష్యం మాత్రం అందనంత దూరంలో నిలిచిపోయింది... గేల్ ఎప్పుడో టీమ్కు దూరమయ్యాడు...డివిలియర్స్ ఇక నా వల్ల కాదంటూ మూడు సీజన్ల క్రితం తప్పుకున్నాడు...వీరిద్దరితో కలిసి ఐపీఎల్లో ఓవరాల్గా టాప్–2 భాగస్వామ్యాలు నెలకొల్పిన కోహ్లి... ఆ తర్వాత డుప్లెసిస్తో కలిసి మరో మూడు సీజన్లు బ్యాటింగ్ భారం మోశాడు. కానీ ఎన్ని గొప్ప ఇన్నింగ్స్లు వచ్చినా ఐపీఎల్ ట్రోఫీ మాత్రం దక్కలేదు! అయితే ఎట్టకేలకు బెంగళూరు ఇప్పుడు తమ కలను నెరవేర్చుకుంది. కోహ్లి ఆనందభాష్పాలు చూస్తే ఈ విజయం విలువేమిటో తెలుస్తుంది! స్టార్లు కాకపోయినా.... పెద్ద పెద్ద పేర్లు ముఖ్యం కాదు... చిన్న ఆటగాళ్లే అయినా వారు చూపించే ప్రభావం ముఖ్యమని ఆర్సీబీ నిరూపించింది. టోర్నీలో పది మంది బ్యాటర్లు కనీసం అర్ధ సెంచరీలు సాధించారు. ఫైనల్కు ముందు జట్టు 10 మ్యాచ్లు గెలిస్తే 9 మంది వేర్వేరు ఆటగాళ్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’లుగా నిలిచారు. ‘బిగ్ త్రీ’పై మాత్రమే ఆధారపడిన గెలుపును ఆశించిన జట్టులా ఈసారి బెంగళూరు ఏమాత్రం కనిపించలేదు.వైవిధ్యంతో పాటు బ్యాటింగ్ లోతును కూడా టీమ్ చూపించింది. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతీ సారి నేనున్నానంటూ ఎవరో ఒకరు ముందుకొచ్చి ఆదుకున్నారు. లీగ్ దశలో పంజాబ్పై టిమ్ డేవిడ్, చెన్నైపై షెఫర్డ్, లక్నోపై జితేశ్ ఆడిన ఇన్నింగ్స్లు అసాధారణ ప్రదర్శనలుగా నిలిచాయి. ఐపీఎల్ చరిత్రలో ప్రత్యర్థి వేదికపై ఆడిన 7 మ్యాచ్లూ గెలిచిన తొలి జట్టుగా ఆర్సీబీ నిలిచింది. సాల్ట్ను ఎంచుకొని... ఐపీఎల్ వేలం సమయంలో టీమ్ డైరెక్టర్ బొబాట్ ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ‘వారు ఎలా ఆడతారన్నది మేం ఆలోచించడం లేదు. మేం ఎలా ఆడించాలనే ఆలోచనే అన్నింటికంటే ముఖ్యం. దాని ప్రకారమే మేం ఆటగాళ్లను ఎంచుకున్నాం’ అని ఆయన చెప్పారు. హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్, మెంటార్ దినేశ్ కార్తీక్లతో పాటు పన్నిన వ్యూహాలు, ప్రణాళికలు బెంగళూరుకు అద్భుతంగా పని చేశాయి. కోహ్లికి జోడీగా విధ్వంసకర ఓపెనర్ కావాలంటూ కార్తీక్ పట్టుబట్టి మరీ సాల్ట్ను రూ. 11.25 కోట్లకు తీసుకునేలా చేశాడు. ఏకంగా 175 స్ట్రయిక్రేట్తో అతను 403 పరుగులు చేసి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. కెప్టెన్ సూపర్... కెప్టెన్గా కూడా రజత పాటీదార్ను ఎంచుకోవడంలో ఆర్సీబీ ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంది. భారత్ క్రికెట్లో స్టార్ ఆటగాడు కాకపోయినా... ముస్తాక్అలీ ట్రోఫీలో అతని నాయకత్వ లక్షణాలు చూసి ఎంచుకుంది. ఇది ఎంత గొప్పగా పని చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోల్కతా, చెన్నై, ముంబైలపై వారి వేదికల్లో ఎన్నో ఏళ్ల తర్వాత విజయాలు సాధించడంలో బ్యాటర్గా పాటీదార్ పాత్ర ఎంతో ఉంది. 312 పరుగులతో అతను రాణించాడు. సుయాశ్ శర్మ, యశ్ దయాళ్లను సరైన సమయంలో సమర్థంగా వాడుకోవడంలో అతని కెప్టెన్సీ ప్రతిభ కనిపించింది. ఇప్పుడు 17 సీజన్లలో సాధ్యం కాని ఘనతను కెపె్టన్గా తన తొలి సీజన్లోనే అందుకొని పాటీదార్ ఐపీఎల్ చరిత్రలో తన పేరును ఘనంగా లిఖించుకున్నాడు. అంతా కోహ్లిమయం... బెంగళూరు టీమ్ సభ్యులలో గతంలో కృనాల్ పాండ్యా, హాజల్వుడ్, భువనేశ్వర్, సాల్ట్ ఐపీఎల్ గెలిచిన జట్లలో సభ్యులుగా ఉన్నారు. ఇతర యువ ఆటగాళ్ల కెరీర్ ఇంకా పూర్తిగా ఊపందుకోలేదు. ఇప్పటికిప్పుడు టైటిల్ గెలిచినా, ఓడినా వారికి పెద్ద తేడా ఉండకపోవచ్చు. కానీ విరాట్ కోహ్లి పరిస్థితి అందరికంటే భిన్నం. అతను 18 సీజన్లుగా ఒకే జట్టుకు తన సర్వం ధారబోశాడు. ఎన్నో గొప్ప విజయాలను అందించాడు. కానీ టైటిల్ మాత్రం గెలవలేని లోటు ప్రతీసారి వెంటాడేది. గతంలో మూడు ఫైనల్ మ్యాచ్లో ఓడిన బాధ ఇంకా వెంటాడుతూనే ఉంది. ముఖ్యంగా 2016 సీజన్లో ఏకంగా 973 పరుగులతో చెలరేగినా ఫైనల్లో పరాజయం అతడికి తీవ్ర వేదనను కలిగించింది. నాటినుంచి ఇప్పటి వరకు మళ్లీ జట్టు ట్రోఫీకి చేరువగా రాలేకపోయింది. కెరీర్ చరమాంకంలో ఉన్న అతను ఈసారి గెలవలేకపోతే మరింత ఆవేదన కలిగేది. ఇలాంటి స్థితిలో దక్కిన విజయం కోహ్లి కోసమే వచ్చినట్లుగా ఉంది. అందుకే మైదానమంతా కోహ్లి చుట్టే సంబరాలు. గతంలో జట్టులో భాగంగా ఉండి ట్రోఫీ గెలవలేని డివిలియర్స్, గేల్ కూడా కోహ్లి పక్కన ఉండి అతని సంతోషంలో భాగం కావడం విశేషం. -సాక్షి క్రీడా విభాగం ‘పసి పాపలా ప్రశాంతంగా నిద్రపోతా’ 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఈ విజయం జట్టు సభ్యులది మాత్రమే కాదు అభిమానులది కూడా. నేను యువకుడిగా, ఆ తర్వాత కెరీర్ అత్యుత్తమ దశలో, ఇప్పుడు అనుభవజ్ఞుడిలా ఈ టీమ్తో ఉన్నాను. ప్రతీ సీజన్లోనూ ఇదే తరహాలో విజయం కోసం తీవ్రంగా శ్రమించాను. నేను చేయగలిగిందంతా చేశాను. చివరకు ఇప్పుడు దక్కిన భావన గొప్పగా ఉంది. ఈ రోజు వస్తుందని అనుకోలేదు. ఆఖరి బంతి తర్వాత భావోద్వేగాలను నియంత్రించుకున్నాను. ఏం జరిగినా ఇదే జట్టుతో ఉన్నాను. టీమ్ మేనేజ్మెంట్ కూడా నాతో నిలబడింది. ఇదే జట్టుతో టైటిల్ గెలవాలని కలగన్నాను. మరో టీమ్తో గెలిచి ఉంటే ఇంత ఆనందం దక్కకపోయేదేమో. నా హృదయం, ఆత్మ బెంగళూరుతోనే ఉన్నాయి. గతంలో చెప్పినట్లుగా నేను ఐపీఎల్ ఆడినంత వరకు ఇదే జట్టుతో ఉంటా. ఎంతో పోటీ, తీవ్రత ఉండే ఈ టోర్నీలో టైటిల్ విజయాన్ని ఎంతో ప్రాధాన్యత ఉంది. నేను ఇలాంటి పెద్ద టోర్నీలను గెలవాలని, చిరస్మరణీయ క్షణాలను కోరుకుంటా. కెరీర్లో అత్యుత్తమ విజయాల్లో ఇదొకటి. ఈ రోజు నేను ప్రశాంతంగా పసిపాపలా నిద్రపోతా. వేలంలో మా ఎంపికను చాలా మంది ప్రశ్నించారు. కానీ వాటిని తప్పని నిరూపించాం. –విరాట్ కోహ్లి -
RCB Vs PBKS: కల నిజమాయెగా.. కప్పు సొంతమాయెగా
ఎన్నిసార్లు గుండెకోతలు... ఎన్ని అవమానాల పర్వాలు... ఆర్సీబీ అభిమాని అంటే అదో చిన్నచూపుతో చూసిన ఎన్నో సందర్భాలు... ఎప్పటికీ విజేతగా నిలవదనే వ్యాఖ్యలు... గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నప్పుడే సాధ్యం కాలేదు ఇప్పుడేమవుతుందిలే అనే జోస్యాలు... కొన్నిసార్లు లీగ్ దశకే పరిమితమైతే మరికొన్ని సార్లు ‘ప్లే ఆఫ్స్’కు చేరినా ముందంజ వేయని రోజులు... మూడు ఫైనల్స్లలో ఓడిన వేదన దీనికి అదనం. ఒకదశలో ఆర్సీబీ అభిమానుల నినాదం ‘ఈ సాల కప్ నమ్దే’ (ఈ ఏడాది కప్ మనదే) జోక్గా మారిపోయిన పరిస్థితి... కానీ 2008 నుంచి గెలుపోటములతో నిమిత్తం లేకుండా ఆర్సీబీ జెండాను తమ మనసులో నింపుకున్న ఫ్యాన్స్ గర్వపడే క్షణం వచ్చేసింది...తమ టీమ్లోని 18వ నంబర్ జెర్సీకి కానుక ఇస్తున్నట్లుగా ఐపీఎల్ 18వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చాంపియన్గా నిలిచింది. లీగ్ దశలోనే అసాధారణ ప్రదర్శనలతో ‘ప్లే ఆఫ్స్’కు చేరి తొలి క్వాలిఫయర్లోనే గెలుపుతో ఫైనల్ చేరిన టీమ్ తుది పోరులోనూ అదే జోరును కొనసాగించింది... ఒకరు కాదు ఇద్దరు కాదు జట్టులోని సమష్టితత్వం ఈ చిరస్మరణీయ విజయాన్ని అందించింది. ఎన్నో చాలెంజ్లను అధిగమించి రాయల్గా సాధించిన ఈ ట్రోఫీని బెంగళూరులో సగర్వంగా ప్రదర్శించే సమయమిది... ఘనవిజయాలు, వైఫల్యాలు అన్నింటినీ చూస్తూ ఆర్సీబీ పట్ల విధేయత వీడకుండా జట్టుతోనే కొనసాగిన విరాట్ కోహ్లి కెరీర్లో మిగిలిన ఈ ఒక్క లోటు ఈ రోజుతో తీరిపోయింది. అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీ చరిత్రలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు కొత్త చాంపియన్గా అవతరించింది. గతంలో మూడుసార్లు ఫైనల్ మ్యాచ్లలో (2009, 2011, 2016) ఓటమి పాలైన జట్టు ఎట్టకేలకు 18వ సీజన్లో ‘ఈ సాల కప్ నమ్దు’ (ఈ ఏడాది కప్ మనది) అంటూ ట్రోఫీని ముద్దాడింది. నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం జరిగిన ఫైనల్లో రజత్ పాటీదార్ సారథ్యంలోని ఆర్సీబీ జట్టు 6 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (35 బంతుల్లో 43; 3 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులే చేయగలిగింది. శశాంక్ సింగ్ (30 బంతుల్లో 61 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్స్లు) అర్ధ సెంచరీ చేయగా, జోష్ ఇన్గ్లిస్ (23 బంతుల్లో 39; 1 ఫోర్, 4 సిక్స్లు) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కృనాల్ పాండ్యా (2/17) అద్భుత బౌలింగ్తో మ్యాచ్ను బెంగళూరు వైపు తిప్పగా, ఒత్తిడిలో పంజాబ్ పూర్తిగా చిత్తయింది. ఫలితంగా రెండోసారి పంజాబ్ కింగ్స్ జట్టు రన్నరప్ట్రోఫీతో సరిపెట్టుకుంది. 2014లో తొలిసారి ఫైనల్ చేరిన పంజాబ్ జట్టు తుది పోరులో కోల్కతా నైట్రైడర్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఐపీఎల్ టోర్నీ విజేతగా నిలిచిన బెంగళూరు జట్టుకు రూ. 20 కోట్లు... రన్నరప్ పంజాబ్ కింగ్స్ జట్టుకు రూ. 12 కోట్ల 50 లక్షలు ప్రైజ్మనీగా లభించాయి. మూడో స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టుకు రూ. 7 కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన గుజరాత్ టైటాన్స్కు రూ. 6 కోట్ల 50 లక్షలు దక్కాయి. సమష్టి బ్యాటింగ్ ప్రదర్శన... ఆర్సీబీ ఇన్నింగ్స్లో విధ్వంసక ప్రదర్శనలు లేకపోయినా... ప్రధాన బ్యాటర్లంతా తలా ఓ చేయి వేయడంతో జట్టు మెరుగైన స్కోరు సాధించగలిగింది. దూకుడుగా మొదలు పెట్టిన ఫిల్ సాల్ట్ (9 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువసేపు నిలవలేకపోగా, కోహ్లి జాగ్రత్తగా ఆడాడు. పవర్ప్లేలో జట్టు 55 పరుగులు చేసింది. తొలి వికెట్ పడ్డాక తర్వాతి నలుగురు బ్యాటర్లు తలా ఓ చేయి వేయడంలో జట్టు మెరుగైన స్కోరు సాధించగలిగింది. మయాంక్ అగర్వాల్ (18 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ రజత్ పాటీదార్ (16 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్లు), లివింగ్స్టోన్ (15 బంతుల్లో 25; 2 సిక్స్లు), జితేశ్ శర్మ (10 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక పరుగులు సాధించారు. పంజాబ్ కట్టుదిట్టమైన బౌలింగ్తో పరుగులు ఆశించినంత వేగంగా రాకపోయినా... జేమీసన్ వేసిన 17వ ఓవర్లో 3 సిక్స్లతో 23 పరుగులు రాబట్టడంతో స్కోరు దాదాపు 200 వరకు వెళ్లింది. అర్ష్ దీప్ సింగ్ వేసిన ఆఖరి ఓవర్లో ఆర్సీబీ 3 వికెట్లు కోల్పోయింది. టపటపా... సీజన్ ఆసాంతం అద్భుత ఆరంభాలతో పంజాబ్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (19 బంతుల్లో 24; 4 ఫోర్లు), ప్రభ్సిమ్రన్ సింగ్ (22 బంతుల్లో 26; 2 సిక్స్లు) అసలు పోరులో ఆ ధాటిని చూపించలేకపోయారు. తడబడుతూనే ఆడిన వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరగ్గా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (1) పేలవ షాట్కు వెనుదిరగడంతో జట్టు విజయావకాశాలపై దెబ్బ పడింది. మరో ఎండ్లో దూకుడు ప్రదర్శించిన ఇన్గ్లిస్ను కృనాల్ పాండ్యా వెనక్కి పంపడంతో కింగ్స్ గెలుపు ఆశలు ఆవిరయ్యాయి. చివర్లో శశాంక్ పోరాడినా అప్పటికే ఆలస్యమైపోయింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) అయ్యర్ (బి) జేమీసన్ 16; కోహ్లి (సి అండ్ బి) అజ్మతుల్లా 43; మయాంక్ అగర్వాల్ (సి) అర్ష్ దీప్ (బి) చహల్ 24; పాటీదార్ (ఎల్బీ) (బి) జేమీసన్ 26; లివింగ్స్టోన్ (ఎల్బీ) (బి) జేమీసన్ 25; జితేశ్ శర్మ (బి) వైశాక్ 24; షెఫర్డ్ (ఎల్బీ) (బి) అర్ష్ దీప్ 17; కృనాల్ (సి) అయ్యర్ (బి) అర్ష్ దీప్ 4; భువనేశ్వర్ (సి) ప్రియాన్ష్ ఆర్య (బి) అర్ష్ దీప్ 1; యశ్ దయాళ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–18, 2–56, 3–96, 4–131, 5–167, 6–171, 7–188, 8–189, 9–190. బౌలింగ్: అర్ష్ దీప్ సింగ్ 4–0–40–3, జేమీసన్ 4–0–48–3, అజ్మతుల్లా 4–0–35–1, వైశాక్ 4–0–30–1, యుజువేంద్ర చహల్ 4–0–37–1. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ ఆర్య (సి) సాల్ట్ (బి) హాజల్వుడ్ 24; ప్రభ్సిమ్రన్ (సి) భువనేశ్వర్ (బి) కృనాల్ 26; ఇన్గ్లిస్ (సి) లివింగ్స్టోన్ (బి) కృనాల్ 39; అయ్యర్ (సి) జితేశ్ (బి) షెఫర్డ్ 1; నేహల్ వధేరా (సి) కృనాల్ (బి) భువనేశ్వర్ 15; శశాంక్ సింగ్ (నాటౌట్) 61; స్టొయినిస్ (సి) యశ్ దయాళ్ (బి) భువనేశ్వర్ 6; అజ్మతుల్లా (సి) (సబ్) భందగే (బి) యశ్ దయాళ్ 1; జేమీసన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1–43, 2–72, 3–79, 4–98, 5–136, 6–142, 7–145. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–38–2, యశ్ దయాళ్ 3–0–18–1, హాజల్వుడ్ 4–0–54–1, కృనాల్ పాండ్యా 4–0–17–2, సుయాశ్ శర్మ 2–0–19–0, షెఫర్డ్ 3–0–30–1. 6 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ గెలిచిన ఆరో భారతీయ కెపె్టన్గా రజత్ పాటీదార్ గుర్తింపు పొందాడు. గతంలో ధోని (చెన్నై సూపర్ కింగ్స్; 5 సార్లు), రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్; 5 సార్లు), గౌతమ్ గంభీర్ (కోల్కతా నైట్రైడర్స్; 2 సార్లు), శ్రేయస్ అయ్యర్ (కోల్కతా నైట్రైడర్స్; ఒకసారి), హార్దిక్ పాండ్యా (గుజరాత్ టైటాన్స్; ఒకసారి) ఈ ఘనత సాధించారు.10 ఇప్పటి వరకు జరిగిన 18 ఐపీఎల్ ఫైనల్స్లో 10 సార్లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు విజేతగా నిలిచింది. ఎనిమిది సార్లు ఛేజింగ్ చేసిన జట్టుకు టైటిల్ లభించింది. 9 ఐపీఎల్–2025లో నమోదైన సెంచరీలు. మొత్తం 18 ఐపీఎల్ సీజన్లలో రెండుసార్లు మాత్రమే (2023లో 12 సెంచరీలు; 2024లో 14 సెంచరీలు) పది అంతకంటే ఎక్కువ సెంచరీలు వచ్చాయి.2 ముంబై ఇండియన్స్ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తోపాటు ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టైటిల్ సాధించిన రెండో జట్టుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు గుర్తింపు పొందింది. స్మృతి మంధాన కెప్టెన్సీలో బెంగళూరు జట్టు 2024లో డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలిచింది.1 ఐపీఎల్ ఫైనల్లో రెండుసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన తొలి ఆటగాడిగా కృనాల్ పాండ్యా రికార్డుల్లోకెక్కాడు. 2017లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్పై ముంబై ఇండియన్స్ విజయం సాధించిన సందర్భంలోనూ కృనాల్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. -
IPL 2025: ఈ సాలా కప్ ఆర్సీబీదే.. ఫైనల్లో పంజాబ్పై ఘన విజయం
ఎట్టకేలకు 18వ ప్రయత్నంలో ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ కల సాకారమైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో ఇవాళ (జూన్ 3) జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్లో ఆర్సీబీ విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. చివరి ఓవర్ను అర్షదీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇతర బౌలర్లలో జేమీసన్ 3, ఒమర్జాయ్, విజయ్కుమార్ వైశాక్, చహల్ తలో వికెట్ తీశారు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో 35 బంతుల్లో 43 పరుగులు చేసిన విరాట్ కోహ్లినే టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో సాల్ట్16, లివింగ్స్టోన్ 25, జితేశ్ శర్మ 24, మయాంక్ అగర్వాల్ 24, రజత్ పాటిదార్ 26, రొమారియో షెపర్డ్ 17, కృనాల్ పాండ్యా 4, భువనేశ్వర్ కుమార్ 1 పరుగు చేసి ఔటయ్యారు.అనంతరం 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమై 6 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఇన్నింగ్స్ మధ్యలో ఒత్తిడికి లోనైన పంజాబ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగింది. ఆఖర్లో శశాంక్ సింగ్ (30 బంతుల్లో 61 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) పంజాబ్ను గెలిపించేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. అయితే అప్పటకే మ్యాచ్ పంజాబ్ చేతుల్లో నుంచి జారి పోయింది. పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రియాంశ్ ఆర్మ 24, ప్రభ్సిమ్రన్ సింగ్ 26, జోస్ ఇంగ్లిస్ 39, శ్రేయస్ అయ్యర్ 1, నేహల్ వధేరా 15, స్టోయినిస్ 6, ఒమర్జాయ్ 1 పరుగు చేసి ఔటయ్యారు.ఆర్సీబీ బౌలర్లులో కృనాల్ పాండ్యా (4-0-17-2) అద్బుతంగా బౌలింగ్ చేసి పంజాబ్ చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ 2, యశ్ దయాల్, హాజిల్వుడ్, షెపర్డ్ తలో వికెట్ తీసుకున్నారు. VIRAT KOHLI IN TEARS - THE DREAM MOMENT FOR THE GOAT ❤️ pic.twitter.com/jPxUsccRUL— Johns. (@CricCrazyJohns) June 3, 2025ఈ గెలుపుతో ఆర్సీబీతో పాటు ఆ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కల కూడా సాకారమైంది. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్సీబీకే ఆడుతున్న విరాట్ ఎట్టకేలకు 18వ సీజన్లో టైటిల్ కలను సాకారం చేసుకున్నాడు. విరాట్కు 18 నంబర్ మరోసారి కలిసొచ్చింది. విరాట్ జెర్సీ నంబర్ కూడా 18 అన్న విషయం తెలిసిందే. టైటిల్ గెలిచాక విరాట్ తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. -
RCB Vs PBKS: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన సాల్ట్
పంజాబ్తో జరుగుతున్న ఐపీఎల్ 2025 ఫైనల్లో ఆర్సీబీ ఆటగాడు ఫిల్ సాల్ట్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. బౌండరీ లైన్ వద్ద నమ్మశక్యం కాని రీతిలో ప్రియాంశ్ ఆర్య క్యాచ్ అందుకున్నాడు. ఆర్సీబీ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుండగా ఇన్నింగ్స్ ఐదో ఓవర్ చివరి బంతికి ఇది జరిగింది. ఈ వికెట్ హాజిల్వుడ్ ఖాతాలో పడింది. ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది.A GAME CHANGING CATCH BY SALT 🥶 pic.twitter.com/SxdpRgA4Se— Johns. (@CricCrazyJohns) June 3, 2025మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 200లోపు స్కోర్కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేయగలిగింది. చివరి ఓవర్ను అర్షదీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇతర బౌలర్లలో జేమీసన్ 3, ఒమర్జాయ్, విజయ్కుమార్ వైశాక్, చహల్ తలో వికెట్ తీశారు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. 35 బంతుల్లో 43 పరుగులు చేసిన విరాట్ కోహ్లినే టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో సాల్ట్16, లివింగ్స్టోన్ 25, జితేశ్ శర్మ 24, మయాంక్ అగర్వాల్ 24, రజత్ పాటిదార్ 26, రొమారియో షెపర్డ్ 17, కృనాల్ పాండ్యా 4, భువనేశ్వర్ కుమార్ 1 పరుగు చేసి ఔటయ్యారు.అనంతరం 191 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ 11 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. ప్రియాంశ్ ఆర్య (24), ప్రభ్సిమ్రన్ సింగ్ (26), శ్రేయస్ అయ్యర్ (1) ఔట్ కాగా.. జోష్ ఇంగ్లిస్ (31), నేహల్ వధేరా (1) క్రీజ్లో ఉన్నారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్వుడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్ తలో వికెట్ తీశారు. -
IPL 2025 Final: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ (జూన్ 3) జరుగుతున్న ఐపీఎల్ 2025 ఫైనల్లో రికార్డుల రారాజు విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో మూడు ఫోర్లు బాదిన విరాట్.. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో అత్యధిక బౌండరీలు సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్కు ముందు ఈ రికార్డు శిఖర్ ధవన్ పేరిట ఉండేది. ఐపీఎల్లో శిఖర్ 768 బౌండరీలు బాదగా.. విరాట్ ఈ మ్యాచ్లో ఆ మార్కును క్రాస్ చేశాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 770 బౌండరీలు ఉన్నాయి.ఐపీఎల్ చరిత్రలో అత్యధిక బౌండరీలు బాదిన టాప్-5 ఆటగాళ్లు..విరాట్ కోహ్లి- 770 (267 ఇన్నింగ్స్లు)శిఖర్ ధవన్-768 (222)డేవిడ్ వార్నర్-663 (184)రోహిత్ శర్మ-640 (272)అజింక్య రహానే-514 (172)భారీ రికార్డును మిస్ చేసుకున్న విరాట్ఈ మ్యాచ్లో విరాట్ మరో భారీ రికార్డు సొంతం చేసుకునే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో విరాట్ 86 పరుగులు చేసుంటే, ఐపీఎల్ చరిత్రలో మూడు సీజన్లలో 700 పరుగుల మార్కును తాకిన తొలి ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించేవాడు. అయితే విరాట్ 43 పరుగులకే ఔట్ కావడంతో ఈ సీజన్లో అతని పరుగుల సంఖ్య 657 పరుగుల వద్ద ఆగిపోయింది. విరాట్ 2016 సీజన్లో 973 పరుగులు, 2024 సీజన్లో 741 పరుగులు చేశాడు. ప్రస్తుతం విరాట్తో పాటు క్రిస్ గేల్ ఒక్కడే రెండు సీజన్లలో 700 పరుగుల మార్కును తాకిన ఆటగాడిగా ఉన్నాడు. గేల్ వరుసగా 2012, 2013 సీజన్లలో ఈ ఘనత సాధించాడు.ఫైనల్ మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ 15 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. లివింగ్స్టోన్ 16, జితేశ్ శర్మ 1 పరుగుతో క్రీజ్లో ఉన్నారు. సాల్ట్ 16, విరాట్ కోహ్లి 43, మయాంక్ అగర్వాల్ 24, రజత్ పాటిదార్ 26 పరుగులు చేసి ఔటయ్యారు. పంజాబ్ బౌలర్లలో జేమీసన్ 2, ఒమర్జాయ్, చహల్ తలో వికెట్ తీశారు. -
IPL 2025 Final: పంజాబ్పై ఆర్సీబీ విజయం
పంజాబ్పై ఆర్సీబీ విజయంఅహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో ఇవాళ (జూన్ 3) జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్లో ఆర్సీబీ విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. అనంతరం 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమై 6 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.ఓటమి దిశగా పంజాబ్16.4వ ఓవర్- పంజాబ్ ఓటమి దిశగా సాగుతుంది. 142 పరుగుల వద్ద ఆ జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో సిక్సర్ బాదిన మరుసటి బంతికే స్టోయినిస్ (6) ఔటయ్యాడు. ఉత్కంఠగా సాగుతున్న మ్యాచ్పంజాబ్ గెలుపుకు 24 బంతుల్లో 55 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. నేహల్ వధేరా (15), శశాంక్ సింగ్ (22) క్రీజ్లో ఉన్నారు. కష్టాల్లో పంజాబ్12.1వ ఓవర్- 98 పరుగుల వద్ద పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా బౌలింగ్లో బౌండరీ లైన్ వద్ద లివింగ్స్టోన్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో జోష్ ఇంగ్లిస్ (39) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్9.4వ ఓవర్- 79 పరుగుల వద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. రొమారియో షెపర్డ్ బౌలింగ్లో జితేశ్ శర్మ క్యాచ్ పట్టడంతో ఇన్ ఫామ్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (1) ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్8.3వ ఓవర్- 72 పరుగుల వద్ద పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్కు క్యాచ్ ఇచ్చి ప్రభ్సిమ్రన్ సింగ్ (26) ఔటయ్యాడు. 8 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 70/1ప్రభ్సిమ్రన్ సింగ్ 25, జోష్ ఇంగ్లిస్ 16తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్4.6వ ఓవర్- 43 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. హాజిల్వుడ్ బౌలింగ్లో ఫిల్ సాల్ట్ అద్బుతమైన క్యాచ్ పట్టడంతో ప్రియాంశ్ ఆర్మ (24) ఔటయ్యాడు. టార్గెట్ 191.. 3 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 28/0ప్రభ్సిమ్రన్ 10, ప్రియాంశ్ ఆర్య 14200లోపు స్కోర్కే పరిమితమైన ఆర్సీబీటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 200లోపు స్కోర్కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేయగలిగింది. చివరి ఓవర్ను అర్షదీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇతర బౌలర్లలో జేమీసన్ 3, ఒమర్జాయ్, విజయ్కుమార్ వైశాక్, చహల్ తలో వికెట్ తీశారు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. 35 బంతుల్లో 43 పరుగులు చేసిన విరాట్ కోహ్లినే టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో సాల్ట్16, లివింగ్స్టోన్ 25, జితేశ్ శర్మ 24, మయాంక్ అగర్వాల్ 24, రజత్ పాటిదార్ 26, రొమారియో షెపర్డ్ 17, కృనాల్ పాండ్యా 4, భువనేశ్వర్ కుమార్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఆరో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ17.4వ ఓవర్-171 పరుగుల వద్ద ఆర్సీబీ ఆరో వికెట్ కోల్పోయింది. విజయ్కుమార్ వైశాక్ బౌలింగ్లో జితేశ్ శర్మ (24) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ16.5వ ఓవర్- 167 పరుగుల వద్ద ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. జేమీసన్ బౌలింగ్లో లివింగ్స్టోన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. విరాట్ కోహ్లి ఔట్14.5వ ఓవర్- 131 పరుగుల వద్ద ఆర్సీబీకి భారీ షాక్ తగిలింది. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి 35 బంతుల్లో 43 పరుగులు చేసి ఔటయ్యాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ విరాట్ను క్యాచ్ అండ్ బౌల్డ్ చేశాడు. 12 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 103/3విరాట్ కోహ్లి 32, లివింగ్స్టోన్ 3మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రజత్ పటిదార్ 26(16) పరుగుల వద్ద జెమీసన్ బౌలింగ్లో ఔటయ్యారు.పది ఓవర్లలో ఆర్సీబీ స్కోర్ 87/2పది ఓవర్లలో ఆర్సీబీ రెండు వికెట్లు కోల్పోయి 87 పరుగులు సాధించింది. 9 ఓవర్లలో ఆర్సీబీ స్కోర్ 80/2ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ 9 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 80 పరుగులు సాధించింది. కోహ్లీ 21(18), రజత్ పటిదార్ 17(9) క్రీజులో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ6.2వ ఓవర్- 56 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. చహల్ బౌలింగ్లో అర్షదీప్కు క్యాచ్ ఇచ్చి మయాంక్ అగర్వాల్ (24) ఔటయ్యాడు. 6 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 55/1మయాంక్ అగర్వాల్ 24, విరాట్ కోహ్లి 13తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ1.4వ ఓవర్- 18 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. జేమీసన్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి సాల్ట్ (16) ఔటయ్యాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ (జూన్ 3) జరుగుతున్న ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో పంజాబ్, ఆర్సీబీ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి.ఈ సీజన్లో ఐపీఎల్కు కొత్త ఛాంపియన్ రావడం ఖరారైపోయింది. ఆర్సీబీ, పంజాబ్ జట్లలో ఏ జట్టు గెలిచినా చరిత్రే అవుతుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయాయి. ఆర్సీబీ 3 సార్లు, పంజాబ్ ఓసారి ఫైనల్కు చేరినా రన్నరప్తో సరిపెట్టుకున్నాయి. ఈ సీజన్లో ఇరు జట్లు పోటీపోటీగా రాణించి ఫైనల్ వరకు చేరాయి. లీగ్ దశలో పంజాబ్, ఆర్సీబీ సమంగా మ్యాచ్లు గెలిచి (14లో 9) పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్ల్లో తలో మ్యాచ్ గెలిచాయి. క్వాలిఫయర్-1లో పంజాబ్పై ఆర్సీబీ పైచేయి సాధించింది. జట్ల వివరాలు..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్(సి), లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ(w), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హాజిల్వుడ్ఇంపాక్ట్ సబ్స్: రసిఖ్ సలామ్, మనోజ్ భాండాగే, టిమ్ సీఫెర్ట్, స్వప్నిల్ సింగ్, సుయాష్ శర్మ.పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(w), శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్కుమార్ వైషాక్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ఇంపాక్ట్ సబ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, జేవియర్ బార్ట్లెట్, హర్ప్రీత్ బ్రార్ -
ఇంగ్లండ్కు బయల్దేరిన కేఎల్ రాహుల్
త్వరలో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టాడు. రాహుల్ నిన్ననే ముంబై నుంచి లండన్కు బయల్దేరాడు. రాహుల్ లండన్లోని హీథ్రూ విమానాశ్రయంలో ల్యాండైన దృశ్యాలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.రాహుల్ ఇంగ్లండ్తో సిరీస్కు ముందు ఇంగ్లండ్ లయన్స్తో నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్ ఆడతాడు. ఈ మ్యాచ్ కోసమే రాహుల్ చాలా ముందుగా లండన్లో ల్యాండయ్యాడు. ఈ మ్యాచ్ జూన్ 6న ప్రారంభం కానుంది. నార్తంప్టన్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం తనను ముందుగానే ఇంగ్లండ్కు పంపాలని రాహుల్ బీసీసీఐకి ప్రత్యేక విజ్ఞప్తి చేశాడు. భారత్లో వాతావరణం ప్రాక్టీస్కు అనువుగా లేదని, అందుకే తనకు లయన్స్తో మ్యాచ్ ఆడే అవకాశం ఇవ్వాలని రాహుల్ బీసీసీఐని కోరాడు. రాహుల్ కోరిక మేరకు బీసీసీఐ అతన్ని ముందుగానే లండన్కు పంపింది.ఇంగ్లండ్తో సిరీస్కు ముందు భారత్-ఏ జట్టు ఇంగ్లండ్ లయన్స్తో రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ నిన్ననే ముగిసింది. ఈ మ్యాచ్ డ్రా అయ్యింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లకు మంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించింది. ఇంగ్లండ్ సిరీస్కు ఎంపికైన కరుణ్ నాయర్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్లో సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ తృటిలో సెంచరీలు మిస్ అయ్యారు. రెండో ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్, ధృవ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి అర్ద సెంచరీలతో రాణించారు.లయన్స్తో రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ తర్వాత భారత జట్టు ఓ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ జూన్ 13 నుంచి 16 వరకు జరుగుతుంది. అనంతరం జూన్ 20 నుంచి ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ కోసం శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు జూన్ 5వ తేదీ తర్వాత లండన్కు బయల్దేరుతుంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ సిరీస్కు ముందే గిల్ను కెప్టెన్గా ఎంపిక చేశారు. ఈ సిరీస్కు ముందే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు భారత జట్టు..శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్..జూన్ 20-24- తొలి టెస్ట్ (లీడ్స్)జులై 2-6- రెండో టెస్ట్ (బర్మింగ్హమ్)జులై 10-14- మూడో టెస్ట్ (లార్డ్స్)జులై 23-27- నాలుగో టెస్ట్ (మాంచెస్టర్)జులై 31-ఆగస్ట్ 4- ఐదో టెస్ట్ (కెన్నింగ్స్టన్ ఓవల్) -
IPL 2025 Final: అన్ని ఏఐ ప్లాట్ఫామ్లు 'ఆ జట్టే' ఛాంపియన్ అని అంటున్నాయి..!
ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్ ఇవాళ (జూన్ 3) రాత్రి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో విజేతపై ఎవరి అంచనాలు వారికున్నాయి. ప్రదర్శనల ప్రకారం ఈ సీజన్లో ఇరు జట్లు సమవుజ్జీలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలానా జట్టు గెలుస్తుందని అంచనా వేయలేని పరిస్థితి ఉంది. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్లు జరగగా.. ఆర్సీబీ 2, పంజాబ్ ఓ మ్యాచ్లో గెలిచాయి. దీని ఆధారంగా ఆర్సీబీకే స్వల్ప ఎడ్జ్ ఉందని చెప్పవచ్చు.మానవమాత్రుల అంచనాలను పక్కన పెడితే.. కృత్రిమ మేధ (Artificial Intelligence, AI) ఏం చెబుతుందో చూద్దాం. ప్రచుర్యంలో ఉన్న టాప్ ఏఐ ప్లాట్ఫామ్లను ఐపీఎల్ 2025 విజేత ఎవరని అడగగా.. దాదాపు అన్ని ఏఐ ప్లాట్ఫామ్లు (గ్రోక్, జెమిని, ఛాట్జీపీటీ) ముక్తకంఠంతో ఆర్సీబీని విజేతగా తేల్చాయి.X GROK: అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, RCB ఆధిక్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. క్వాలిఫయర్ 1లో ఆర్సీబీ పంజాబ్పై ఎనిమిది వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. ఆ మ్యాచ్లో పంజాబ్ను 101 పరుగులకే ఆలౌట్ చేసి, 60 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా ఆర్సీబీ ఫైనల్లో తమ స్థానాన్ని ఖాయం చేసుకుంది. జోష్ హాజిల్వుడ్ (11 మ్యాచ్ల్లో 21 వికెట్లు), సుయాష్ శర్మ నేతృత్వంలోని RCB బౌలింగ్ అద్భుతంగా ఉంది. విరాట్ కోహ్లీ (55.81 సగటుతో 614 పరుగులు), ఫిల్ సాల్ట్ విస్ఫోటకమైన ఫామ్లో ఉన్నారు.అహ్మదాబాద్లో RCB యొక్క చారిత్రక ప్రదర్శన (మొదట బ్యాటింగ్ చేసిన ఎనిమిది మ్యాచ్ల్లో ఆరు మ్యాచ్లు గెలిచింది) మరియు ఒత్తిడిలో సామర్థ్యం వారికే స్వల్ప ఎడ్జ్ను ఇస్తాయి. డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్ వంటి నిపుణులు కూడా RCBకి మద్దతు ఇచ్చారు. వార్నర్ హాజిల్వుడ్ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అంచనా వేశారు.అయితే, క్వాలిఫయర్ 2లో పంజాబ్ ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి తమను తక్కువ అంచనా వేయొద్దని అలర్ట్ చేస్తుంది. ఆ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ (87 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఒంటిచేత్తో పంజాబ్ను గెలిపించాడు. కైల్ జేమిసన్, యుజ్వేంద్ర చహల్ వంటి బౌలర్లతో పంజాబ్ బౌలింగ్ కూడా పటిష్టంగా ఉంది. అయితే క్వాలిఫయర్-1లో ఆర్సీబీ చేతిలో పతనం ఒత్తిడిలో పంజాబ్ బలహీనతను సూచిస్తుంది.ప్రస్తుత ఫామ్, సమతుల్య జట్టు, ఈ సీజన్లో వారి జోరును పరిగణనలోకి తీసుకుంటే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు IPL 2025 ఫైనల్ను గెలుస్తుందని అంచనా. ఆర్సీబీ బ్యాటింగ్ లోతు మరియు పెద్ద మ్యాచ్లలో అనుభవం వారిని ఛాంపియన్లుగా చేస్తాయి. -
IPL 2025 Final: క్రికెట్ అభిమానులకు చేదు వార్త
క్రికెట్ అభిమానులకు చేదు వార్త. ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్కు వేదిక అయిన అహ్మదాబాద్లో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వర్షం మొదలైంది. ఇవాళ (జూన్ 3) రాత్రి 7:30 గంటలకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. మ్యాచ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు వర్షం మొదలుకావడంతో క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. Will rain delay the IPL 2025 Final in Ahmedabad? Live Visuals from narendra modi stadium 🏟️ #RCBvsPBKS #IPLFinals #rain #iplfinal2025 #ahmedabadweather pic.twitter.com/Jwnqa7inIg— Parth Vyas (@ImPaRthVyas) June 3, 2025ఇదే వేదికపై జూన్ 1న జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్ వర్షం కారణంగా రెండు గంటలకు పైగా ఆలస్యమైంది. అయితే ఆ మ్యాచ్ ఎలాంటి ఓవర్ల కోత లేకుండా సాగింది. నేటి మ్యాచ్లో కూడా అదే పరిస్థితి పునరావృతమౌతుందేమోనని ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. ఇప్పుడిప్పుడే అభిమానులు స్టేడియంలోకి రావడం మొదలుపెట్టారు. మ్యాచ్ ప్రారంభానికి ఇంకా రెండు గంటలకు పైగా సమయం ఉండటంతో ఆలోపు వర్షం తగ్గుతుందని ఫ్యాన్స్ అశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి వర్షం మరీ అంత భారీగా కురువడం లేదు. ఒకవేళ ఇప్పుడు భారీ వర్షం పడినా నరేంద్ర మోదీ స్టేడియంలో అత్యాధునిక డ్రైనేజ్ వ్యవస్థ ఉంది కాబట్టి గ్రౌండ్ త్వరలోనే క్లియర్ అవుతుంది. హీన పక్షంలో ఇవాళ మ్యాచ్ సాధ్యపడకపోతే రేపు రిజర్వ్ డే ఉంది. రేపైనా విజేత ఎవరో తేలిపోతుంది. రేపు కూడా వర్షం పడితే మాత్రం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ కంటే మెరుగైన స్థానంలో ఉండటం చేత పంజాబ్ విజేతగా నిలుస్తుంది. అయితే పరిస్థితి ఇంత వరకు రాకపోవచ్చు. మ్యాచ్ వర్షాటంకం లేకుండా సాగాలని ఫ్యాన్స్ దేవుళ్లని ప్రార్దిస్తున్నారు.వర్షం విషయం అటుంచితే, ఈ సీజన్లో ఐపీఎల్కు కొత్త ఛాంపియన్ రావడం ఖరారైపోయింది. ఆర్సీబీ, పంజాబ్ జట్లలో ఏ జట్టు గెలిచినా చరిత్రే అవుతుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయాయి. ఆర్సీబీ 3 సార్లు, పంజాబ్ ఓసారి ఫైనల్కు చేరినా రన్నరప్తో సరిపెట్టుకున్నాయి. ఈ సీజన్లో ఇరు జట్లు పోటీపోటీగా రాణించి ఫైనల్ వరకు చేరాయి. లీగ్ దశలో పంజాబ్, ఆర్సీబీ సమంగా మ్యాచ్లు గెలిచి (14లో 9) పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్ల్లో తలో మ్యాచ్ గెలిచాయి. క్వాలిఫయర్-1లో పంజాబ్పై ఆర్సీబీ పైచేయి సాధించింది. -
వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడి రీ ఎంట్రీ
ఇంగ్లండ్, ఐర్లాండ్తో టీ20 సిరీస్లకు రెండు వెర్వేరు జట్లను వెస్టిండీస్ క్రికెట్ ప్రకటించింది. గతేడాది బార్బడోస్లో ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో గాయపడ్డ స్టార్ ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అతడితో పాటు మాజీ కెప్టెన్ హోల్డర్కు సెలక్టర్లు పిలుపునిచ్చారు.అయితే రస్సెల్ కేవలం ఇంగ్లండ్ సిరీస్కు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. అదేవిధంగా సూపర్ ఫామ్లో ఉన్న కీస్ కార్టీ.. ఇంగ్లండ్ సిరీస్కు దూరంగా ఉండనున్నాడు. అతడు ఐర్లాండ్ పర్యటనకు తిరిగి జట్టులో చేరనున్నాడు. టెస్టు కెప్టెన్ రోస్టన్ ఛేజ్, స్టార్ ఓపెనర్ బ్రాండెన్ కింగ్ సైతం ఇంగ్లండ్ టూర్ తర్వాత తమ స్వదేశాలకు పయనం కానున్నారు. మరోవైపు ఈ రెండు సిరీస్లకు విధ్వంసకర వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ దూరమయ్యాడు. అతడికి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు.విండీస్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్తో వన్డే సిరీస్ ఆడుతోంది. ఆ తర్వాత జూన్ 6 నుండి 10 వరకు ఇంగ్లండ్-విండీస్ మధ్య మూడు టీ20ల సిరీస్ జరగనుంది. అనంతరం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనున్న కరేబియన్ జట్టు. .జూన్ 12 నుండి 15 వరకు ఆతిథ్య టీమ్తో మూడు టీ20లు ఆడనుంది.ఇంగ్లండ్తో టీ20లకు విండీస్ జట్టుషాయ్ హోప్ (కెప్టెన్), కీసీ కార్టీ, జాన్సన్ చార్లెస్, మాథ్యూ ఫోర్డ్, జైడ్ గూలీ, షిమ్రాన్ హెట్మైర్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారి జోసెఫ్, ఎవిన్ లూయిస్, గుడాకేష్ మోటీ, రోవ్మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, రొమారియో షెపర్డ్ఐర్లాండ్తో టీ20లకు విండీస్ జట్టుషాయ్ హోప్ (కెప్టెన్), జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మైర్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారి జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడాకేష్ మోటీ, రోవ్మన్ పావెల్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, రొమారియో షెపర్డ్ -
'అతడితో పంజాబ్ జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే వార్ వన్ సైడే'
ఐపీఎల్-2025 ఫైనల్లో అహ్మదాబాద్ వేదికగా తలపడేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ సిద్దమయ్యాయి. ఈ తుది పోరుకు ఇరు జట్లు ఆస్త్రశస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి తొలి ఐపీఎల్ టైటిల్ను సొంతం చేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.ఈ హైవోల్జేజ్ మ్యాచ్కు ముందు భారత మాజీ క్రికెటర్ యోగరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లితో జాగ్రత్తగా ఉండాలని, పవర్ ప్లేలో ఔట్ కాకపోతే 250 పరుగులకు పైనా లక్ష్యమున్నా అతడు చేజ్ చేసేస్తాడని యోగరాజ్ పంజాబ్ను హెచ్చరించాడు."ఆరంభంలో విరాట్ కోహ్లిని ఔట్ చేయకపోతే పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అతడు పవర్ప్లేలో ఔట్ కాకపోతే 250 నుంచి 300 పరుగుల టార్గెట్నైనా కరిగించేగలడు. అయితే పంజాబ్ జట్టు అత్యుత్తమంగా ఉంది. వారు ఈ ఏడాది సీజన్లో అద్బుతంగా ఆడారు. ఈ మ్యాచ్లో పంజాబ్ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ మొదటి పది ఓవర్లలో కోహ్లి ఔట్ కాకపోతే మ్యాచ్ వన్సైడ్ అయినట్లే. పంజాబ్ జట్టుకు అద్భుతమైన కెప్టెన్ ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ ఒక టాలెంటెడ్ ప్లేయర్. ఈ మ్యాచ్ శ్రేయస్ అయ్యర్, కోహ్లి మధ్య పోటీ అనే చెప్పుకోవాలి.ఆర్సీబీని గెలిపించేందుకు కోహ్లి ఉంటే, పంజాబ్లో అయ్యర్ ఉన్నాడు. పంజాబ్ గెలవాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగరాజ్ పేర్కొన్నాడు.తుది జట్ల వివరాలు (అంచనా) బెంగళూరు: రజత్ పాటీదార్ (కెప్టెన్), కోహ్లి, సాల్ట్, మయాంక్ అగర్వాల్, లివింగ్స్టోన్, జితేశ్ శర్మ, షెఫర్డ్, భువనేశ్వర్, కృనాల్ పాండ్యా, యశ్ దయాళ్, హాజల్వుడ్.పంజాబ్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ప్రియాన్ష్ఆర్య, ప్రభ్సిమ్రన్, ఇన్గ్లిస్, నేహల్ వధేరా, స్టొయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా, చహల్, జేమీసన్, అర్ష్దీప్ సింగ్. -
సెంట్రల్ కాంట్రాక్ట్ను వదులుకున్న విలియమ్సన్..
న్యూజిలాండ్ క్రికెట్ (NZC) 2025-26 సీజన్ కోసం తమ ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించింది. గతేడాది కివీస్ తరపున అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన మిచ్ హే, ముహమ్మద్ అబ్బాస్, జాక్ ఫౌల్క్స్ వంటి యువ ఆటగాళ్లకు తొలిసారి సెంట్రాక్ట్ కాంట్రాక్ట్ దక్కింది.అదేవిధంగా స్పిన్నర్లు ఇష్ సోధి, అజాజ్ పటేల్, ఆల్ రౌండర్ జోష్ క్లార్క్సన్ లను కూడా ఈ జాబితా నుంచి న్యూజిలాండ్ క్రికెట్ తొలిగించింది. కివీస్ వైట్బాల్ జట్టులో సోధి, టెస్టు జట్టులో ఆజాజ్ పటేల్ రెగ్యూలర్ సభ్యులగా కొనసాగుతున్నప్పటికి వారిని కాంట్రాక్ట్ నుంచి ఎందుకు తప్పించారో స్పష్టత లేదు. మరోవైపు కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్, లాకీ ఫెర్గూసన్లు మరోసారి తమ కాంట్రాక్ట్ను వదులు కున్నారు. వీరు నలుగురు కాంట్రాక్ట్లను వదులుకున్నప్పటికి కివీస్ ఆడే ప్రధాన మ్యాచ్లు అన్నింటికీ అందుబాటులో ఉండనున్నారు. విలియమ్సన్ గతేడాది కూడా సెంట్రల్ కాంట్రాక్టును తిరస్కరించాడు. కానీ న్యూజిలాండ్ ఆడిన మొత్తం 13 మ్యాచ్లలో తొమ్మిదింట కేన్ మామ భాగమయ్యాడు. అయితే ఫ్రాంచైజీ లీగ్స్ల కమిట్మెంట్ కారణంగా ఈ నలుగురు కివీస్ ఆటగాళ్లు తమ కాంట్రాక్ట్ల నుంచి తప్పుకున్నారు. కేన్ ఇప్పటికే ది హండ్రెడ్లో లండన్ స్పిరిట్ , కౌంటీ ఛాంపియన్షిప్, టీ20 బ్లాస్ట్లో ఫ్రాంచైజీలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాముహమ్మద్ అబ్బాస్, ఆదిత్య అశోక్, టామ్ బ్లండెల్, మైఖేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మిచ్ హే, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, విలియం ఓ'రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రాచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, విల్ యంగ్చదవండి: IPL 2025 Final: ఆర్సీబీకి మరో బిగ్ షాక్.. ఇంటికి వెళ్లిపోయిన డెంజరస్ ప్లేయర్? -
ఆర్సీబీకి మరో బిగ్ షాక్.. ఇంటికి వెళ్లిపోయిన డెంజరస్ ప్లేయర్?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ 18 ఏళ్ల ఐపీఎల్ ట్రోఫీ కలను నేరవేర్చుకునేందుకు అడుగు దూరంలో ఉంది. ఐపీఎల్-2025 ఫైనల్లో మంగళవారం అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్తో ఆర్సీమీ తాడోపేడో తెల్చుకోనుంది. తొలి ఐపీఎల్ టైటిల్ను ముద్దాడాలని భావిస్తున్న బెంగళూరు జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఆ జట్టు విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఫైనల్ మ్యాచ్కు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడి భార్య మొదటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ క్రమంలో సాల్ట్ తన ఫ్యామిలీతో ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఫైనల్కు ముందు రోజు ఆర్సీబీ నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లో అతడు పాల్గొనలేదు. దీంతో అతడు ఆఖరి మ్యాచ్లో ఆడేది అనుమానంగా మారింది."పంజాబ్తో మ్యాచ్ కోసం ఫిల్ సాల్ట్ ఆర్సీబీ జట్టుతో పాటు అహ్మదాబాద్కు చేరుకోలేదు. తన భార్య మొదటి బిడ్డకు జన్మనివ్వనుండడంతో ఇంగ్లండ్కు వెళ్లాలని సాల్ట్ ప్లాన్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఇదివరకే ఆర్సీబీ మెనెజ్మెంట్కు తెలియజేశాడు" అని ఈఎస్సీఎన్ క్రిక్ ఇన్ ఫో తమ కథనంలో పేర్కొంది.అయితే ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్లో ఈ విషయంపై కెప్టెన్ రజత్ పాటిదార్, ప్రధాన కోచ్ అండీ ఫ్లవర్ కనీసం స్పందించలేదు. కీలక మ్యాచ్కు ముందు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని కోరుకుంటున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఒకవేళ తుది పోరుకు సాల్ట్ దూరమైతే ఆర్సీబీకి నిజంగా అది గట్టి ఎదురు దెబ్బే అవుతోంది. ఎందుకంటే ఈ ఏడాది సీజన్లో సాల్ట్ తన విధ్వంసకర బ్యాటింగ్తో ఆర్సీబీకి ఆదిరిపోయే ఆరంభాలను అందిస్తున్నాడు. . ఈ సీజన్లో ఇప్పటి వరకు 12 మ్యాచ్ల్లో 175.90 స్ట్రైక్రేటుతో 35.18 సగటుతో 387 పరుగులు చేశాడు. సాల్ట్ అందుబాటులో లేకపోతే అతడి స్ధానంలో కివీస్ ఆటగాడు టిమ్ సీఫర్ట్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. -
ఈసారి ఐపీఎల్ టైటిల్ ఆ జట్టుదే: వీరేంద్ర సెహ్వాగ్
ఐపీఎల్-2025 సీజన్ తుది అంకానికి చేరుకుంది. రెండు నెలల పాటు అభిమానులను అలరించిన ఈ మెగా టోర్నీ.. మంగళవారంతో ముగియనుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి.ఐపీఎల్లో ఆరంభం నుంచి బరిలో నిలిచినా ఒక్కసారి కూడా ఈ రెండు జట్లు టైటిల్ను ముద్దాడాలేకపోయాయి. దీంతో ఇరు జట్లు కూడా తమ 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని పట్టుదలతో ఉన్నాయి. ఇరు జట్లు సమవుజ్జీలగా ఉండడంతో ఫైనల్ పోరు ఉత్కంఠ భరితంగా సాగడం ఖాయం. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అంచనా వేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీని ఆర్సీబీ సొంతం చేసుకుంటుందని సెహ్వాగ్ జోస్యం చెప్పాడు."ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధిస్తుందని నేను అనుకుంటున్నాను. అయితే సాధరణంగా గత కొన్ని మ్యాచ్లగా నేను సపోర్ట్ చేసే జట్టు ఓడిపోతోంది. క్వాలిఫయర్-1లో ఆర్సీబీపై పంజాబ్ విజయం సాధిస్తుందని అంచనా వేశాను. కానీ ఆ మ్యాచ్లో పంజాబ్ చిత్తు అయింది.అదేవిధంగా ఎలిమినేటర్లో ముంబైపై గుజరాత్ గెలుస్తుందని చెప్పా. కానీ గుజరాత్ కూడా ఓడిపోయింది. ఆ తర్వాత క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్కు సపోర్ట్ చేశా. అక్కడ కూడా ముంబై పరాజయం పాలైంది. టీమిండియా విషయంలో కూడా ఇదే జరుగుతోంది. నేను గెలుస్తుందని చెప్పినా ప్రతీసారి భారత్ ఓడిపోయిందని" క్రిక్బజ్ లైవ్షోలో సెహ్వాగ్ పేర్కొన్నాడు.తుది జట్ల వివరాలు (అంచనా) బెంగళూరు: రజత్ పాటీదార్ (కెప్టెన్), కోహ్లి, సాల్ట్, మయాంక్ అగర్వాల్, లివింగ్స్టోన్, జితేశ్ శర్మ, షెఫర్డ్, భువనేశ్వర్, కృనాల్ పాండ్యా, యశ్ దయాళ్, హాజల్వుడ్.పంజాబ్: శ్రేయస్ అయ్యర్ (కెపె్టన్), ప్రియాన్ష్ఆర్య, ప్రభ్సిమ్రన్, ఇన్గ్లిస్, నేహల్ వధేరా, స్టొయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా, చహల్, జేమీసన్, అర్ష్దీప్ సింగ్. -
ఆర్సీబీ గెలుపు కోసం అభిమానుల పూజలు
మైసూరు: మైసూరు నగరంలోని దివాన్రోడ్డులోని సమృద్ధంశ్వర ఆలయంలో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనున్న ఆర్సీబీ, పంజాబ్ జట్ల మధ్య బుధవారం జరిగే ఫైనల్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు గెలుపొందాలని అభిమానులు విశేష హోమాలు, పూజలు నెరవేర్చారు. ఆర్సీబీ జట్టు గెలుపు కోసం ప్రారి్థంచి ఆర్సీబీ జర్సీ ధరించి అభిమానుల తరపున విశేష పూజలను చెల్లించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు కుమార్ నేతృత్వంలో విజయదుర్గ హోమాన్ని నెరవేర్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీ‹Ùగౌడ ఆర్సీబీ జెర్సీ ధరించి పాల్గొన్నారు. ఈసారి ఆర్సీబీ గెలుస్తుందని మేం ఆశిస్తున్నాం. ఈసారి ప్రతి ఆటగాడు బాగా రాణించాడు. కార్యక్రమంలో దేవరాజ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమే‹Ù, రాయప్ప, కర్ణాటక విజయ రక్షణ వేదిక అధ్యక్షుడు వినయ్కుమార్, గురురాజిత్ నవీన్, రవిచంద్ర పాల్గొన్నారు. -
ఆర్సీబీకి భారీ షాక్.. ఫైనల్కూ పవర్ హిట్టర్ దూరం?
ఐపీఎల్-2025 సీజన్ తుది పోరుకు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. ఈ మెగా టోర్నీ ఫైనల్లో ఆహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. తుది పోరులో గెలిచి 18 ఏళ్ల కలను నేరవేర్చుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆడుతున్నప్పటికి పంజాబ్, ఆర్సీబీ ఒక్కసారి కూడా టైటిల్ను సొంతం చేసుకోలేకపోయాయి. ఈసారి ఎవరు గెలిచినా అదే చరిత్రే అవుతోంది. అయితే ఈ మ్యాచ్కు ముందు ఆర్సీబీకి గట్టి ఎదురు దెబ్బతగిలింది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న పవర్ హిట్టర్ టిమ్ డేవిడ్ ఫైనల్ సమయానికి కోలుకుంటాడని ఆర్సీబీ మెనెజ్మెంట్ ఆశించింది.కానీ డేవిడ్ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్కు కూడా డేవిడ్ దూరం కానున్నట్లు సమాచారం. ఈ మెగా టోర్నీలో భాగంగా ఎస్ఆర్హెచ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా డేవిడ్ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఆ తర్వాత రెండు మ్యాచ్లకు డేవిడ్ దూరమయ్యాడు. ఈ ఆస్ట్రేలియా స్టార్ గాయం తీవ్రతపై ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ సైతం క్లారిటీ ఇవ్వలేదు."టిమ్ డేవిడ్ గాయం తీవ్రతపై నాకు ఇంకా ఎటువంటి అప్డేట్ రాలేదు. అతడు ప్రస్తుతం మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. ఈ సాయంత్రం లోపు నాకు ఓ క్లారిటీ వస్తుందని" సోమవారం ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాటిదార్ పేర్కొన్నాడు.ఆర్సీబీ ప్లెయింగ్ ఎలెవన్(అంచనా)విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్ (సి), లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, జోష్ హేజిల్వుడ్, సుయాష్ శర్మ (ఇంపాక్ట్ సబ్-ఆప్షన్) -
వర్షం వల్ల ఫైనల్ రద్దు అయితే.. ఐపీఎల్ విజేత ఎవరంటే?
ఐపీఎల్-2025 తుది సమరానికి సమయం అసన్నమైంది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. ఈ తుది పోరులో ఎలాగైనా గెలిచి తొలి ఐపీఎల్ టైటిల్ను ముద్దాడాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతోన్నాయి.ఇరు జట్లు సమవుజ్జీలగా ఉండడంతో విజేత ఎవరన్నది క్రికెట్ నిపుణులు అంచనా వేయలేకపోతున్నారు. ఈ ఆఖరి పోరు కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా క్వాలిఫయర్-2 లానే ఫైనల్కు కూడా వరుణుడు ఆటంకం కలిగించే అవకాశముంది. ఆదివారం ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన సెకెండ్ క్వాలిఫయర్ మ్యాచ్ వర్షం కారణంగా దాదాపు రెండు గంటల ఆలస్యంగా ప్రారంభమైంది.ఇప్పుడు ఆక్యూవెధర్ రిపోర్ట్ ప్రకారం.. మంగళవారం కూడా ఆహ్మదాబాద్లో తేలికపాటి వర్షం కురిసే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో వర్షం వల్ల కానీ మరీ ఏ ఇతర కారణాల చేత ఫైనల్ మ్యాచ్ రద్దు అయితే ఏంటి పరిస్థితి అని అభిమానుల తెగ చర్చించుకుంటున్నారు.మ్యాచ్ రద్దయితే..?ఫైనల్కు వర్షం ఆటంకం కలిగిస్తే.. మిగిలిన నాకౌట్ మ్యాచ్ల మాదిరిగానే ఈ మ్యాచ్కు కూడా 120 నిమిషాల అదనపు సమయం ఇవ్వబడుతుంది. అయితే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కు మాత్రం బీసీసీఐ రిజర్వ్ డే కేటాయించింది. మంగళవారం(జూన్ 3) నాడు వర్షం కారణంగా పూర్తిగా మ్యాచ్ మొదులు కాకపోతే రిజర్వ్ డే అయిన బుధవారం మ్యాచ్ను నిర్వహిస్తారు. ఒకవేళ మ్యాచ్ ప్రారంభమై ఆగిపోతే.. ఆదివారం ఎక్కడైతే మ్యాచ్ ఆగిందో అక్కడి నుంచే ఆటను కొనసాగిస్తారు.ఒకవేళ బుధవారం(జూన్ 4) కూడా మ్యాచ్ను నిర్వహించేందుకు అవకాశం లేకుంటే.. పాయింట్ల పట్టికలో టాపర్గా ఉన్న పంజాబ్ కింగ్స్ను విజేతగా ప్రకటిస్తారు. కాగా కనీసం సూపర్ ఓవర్ నిర్వహించేందుకు భారత కాలమానం ప్రకారం రాత్రి 1:20 వరకు సమయం ఉంటుంది. కాగా ఐపీఎల్-2023 సీజన్ ఫైనల్ మ్యాచ్ ఫలితం రిజర్వ్ డే రోజునే తేలింది.చదవండి: మొదటి ట్రోఫీని ముద్దాడేందుకు... -
రాణించిన జైశ్వాల్, నితీష్.. ఇంగ్లండ్ లయన్స్తో టెస్టు డ్రా
కాంటర్బరీ వేదికగా భారత్ ‘ఎ’, ఇంగ్లండ్ లయన్స్ జట్ల మధ్య జరిగిన నాలుగు రోజుల తొలి అనధికారిక టెస్టు మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. అయితే ఆఖరి రోజు భారత యువ బ్యాటర్లు చక్కగా ప్రాక్టీస్ చేసుకున్నారు. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (68; 8 ఫోర్లు), యశస్వి జైస్వాల్ (64; 8 ఫోర్లు, 2 సిక్స్లు) సహా టాప్–4 బ్యాటర్లు అర్ధసెంచరీలతో కదంతొక్కారు. ధ్రువ్ జురేల్ (53 నాటౌట్; 4 ఫోర్లు), నితీశ్ కుమార్ రెడ్డి (52 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్లు) అజేయ అర్ధసెంచరీలు సాధించారు. తొలి వికెట్కు ఓపెనర్లు 123 పరుగులు జోడిస్తే... జురేల్, నితీశ్ అబేధ్యమైన మూడో వికెట్కు 91 పరుగులు జతచేశారు. అయితే ఫలితం వచ్చే అవకాశమే లేకపోవడంతో నిరీ్ణత సమయానికి గంటన్నర ముందే మ్యాచ్ను ఆపేశారు. లయన్స్కు ఆధిక్యం అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 527/7తో ఆఖరి నాలుగోరోజు ఆటను కొనసాగించిన లయన్స్ 145.5 ఓవర్లలో 587 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్నైట్ బ్యాటర్ జమాన్ అక్తర్ (41; 4 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడగా, టెయిలెండర్లు ఎడీ జాక్ (25; 2 ఫోర్లు), అజిత్ సింగ్ (27 నాటౌట్; 5 ఫోర్లు) పోరాడారు.భారత బౌలర్లలో ముకేశ్ 3, శార్దుల్ ఠాకూర్ 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 557 పరుగులు చేయగా... ఇంగ్లండ్ లయన్స్కు 30 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ నెల 6 నుంచి నార్తంప్టన్లో రెండో అనధికారిక టెస్టు జరుగుతుంది.చదవండి: IPL 2025: శ్రేయస్ అయ్యర్కు భారీ షాకిచ్చిన బీసీసీఐ.. -
మొదటి ట్రోఫీని ముద్దాడేందుకు...
ఐపీఎల్ 2008లో మొదలైంది... తొలి సీజన్... రెండు.... మూడు... నాలుగు... ఇలా చూస్తూ చూస్తూ 17 సీజన్లు గడిచిపోయాయి. కానీ ఒక్కసారైనా విజేతగా నిలవాలనే ఆ రెండు జట్ల కోరిక మాత్రం నెరవేరలేదు. ఇన్నేళ్లలో ఎంతో మంది ఆటగాళ్లు మారారు... కోచ్లు కొత్తగా వచ్చారు, వ్యూహాలూ మారాయి... వైఫల్యాలతో నిష్క్రమించిన ప్రతీసారి వచ్చే ఏడు మనదే అవుతుందనే ఆశతో మళ్లీ సున్నా నుంచి మొదలు పెట్టడం, ఆపై కీలక దశలో కుప్పకూలడం సాధారణంగా మారిపోయాయి తప్ప ఐపీఎల్ టైటిల్ ద్రాక్ష అందనే లేదు... ఒక టీమ్ ఈ ప్రయత్నంలో మూడుసార్లు తుది పోరుకు చేరి నిరాశతో వెనుదిరగ్గా... మరో జట్టు ఒకే ఒక్కసారి ఆఖరి మెట్టుకు చేరి చతికిలపడింది... ఇప్పుడు ఆ రెండు టీమ్లలో ఒకరికి ఉపశమనం దక్కే సమయం వచ్చింది. ఐపీఎల్ 18వ సీజన్లో కొత్త జట్టు చాంపియన్గా నిలవడం ఖరారైన నేపథ్యంలో తొలిసారి ఈ టైటిల్ను ఎవరు అందుకుంటారనేది ఆసక్తికరం. మొదటి ట్రోఫీ వేటలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ జట్లు నేడు జరిగే ఫైనల్ మ్యాచ్లో సర్వశక్తులూ ఒడ్డనున్నాయి. రాత్రి 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం అహ్మదాబాద్: ఐపీఎల్–18 సీజన్లో 73 హోరాహోరీ మ్యాచ్ల తర్వాత ఈ ఏడాది విజేతను తేల్చే అసలు సమరానికి అంతా సిద్ధమైంది. నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు జరిగే ఫైనల్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. లీగ్ దశలో ప్రదర్శనను చూస్తే ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపించాయి. రన్రేట్ కారణంగా పంజాబ్ మొదటి స్థానంలో, బెంగళూరు రెండో స్థానంలో నిలిచినా... రెండు టీమ్లూ సమంగా తొమ్మిదేసి విజయాలు సాధించి 19 పాయింట్లతో నిలిచాయి.‘ప్లే ఆఫ్స్’కు ముందు ప్రత్యర్థులుగా తలపడిన మ్యాచ్లలో ఇరు జట్లు ఒక్కో విజయాన్ని అందుకోగా... క్వాలిఫయర్–1లో పంజాబ్ను చిత్తు చేసి బెంగళూరు పైచేయి సాధించింది. ఈ నేపథ్యంలో ఆఖరి పోరులో గెలిచి పంజాబ్ లెక్క సరి చేస్తుందా లేదా ఆర్సీబీ ఆధిత్యం కొనసాగుతుందా చూడాలి. మొత్తంగా ఎవరు గెలిచినా తొలి ట్రోఫీతో సంబరాలు అంబరాన్ని తాకడం ఖాయం. సమష్టి ప్రదర్శనతో... ఐపీఎల్లో ఆర్సీబీ 2016లో ఆఖరిసారిగా ఫైనల్ చేరింది. ఆ మ్యాచ్లో ఓటమి తర్వాత ఆడిన ఎనిమిది సీజన్లలో జట్టు ప్రదర్శన అంతంత మాత్రమే. ముఖ్యంగా ఎవరో ఒక ఆటగాడి ప్రదర్శనపైనే ఆధారపడటం, అతను విఫలమైతే జట్టు కుప్పకూలడం తరచుగా సాగాయి. కానీ ఈ సీజన్ పూర్తి భిన్నంగా కనిపించింది. జట్టు పది మ్యాచ్లు గెలిస్తే తొమ్మిది మంది వేర్వేరు ఆటగాళ్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’లుగా నిలిచారు. ఒకరు విఫలమైతే మరొకరు ఆదుకోవడంతో కీలక సమయాల్లో కూడా జట్టు పట్టు వీడలేదు. ఇప్పుడు అదే శైలి, పోరాటతత్వం బెంగళూరును ఫైనల్కు చేర్చాయి. ఎప్పటిలాగే స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి 600కు పైగా పరుగులు, 8 అర్ధసెంచరీలతో జట్టుకు చుక్కానిలా నిలిచాడు. అతని ఓపెనింగ్లో సరైన జోడీగా ఫిల్ సాల్ట్ 387 పరుగులతో శుభారంభాలు అందించాడు.మిగతా బ్యాటర్లలో షెఫర్డ్, జితేశ్, కృనాల్ పాండ్యా కూడా ప్రభావవంతమైన ఇన్నింగ్స్లు ఆడారు. కెపె్టన్ పాటీదార్ గత ప్రదర్శనలతో పోలిస్తే ఈసారి అంత అద్భుతంగా ఆడకపోయినా... కెపె్టన్గా తొలి సీజన్లో జట్టును ఫైనల్ చేర్చిన ఘనత అతనికి దక్కింది. మైదానంలో కోహ్లి అనుభవం, సూచనలు అండగా ఉన్న పాటీదార్ నాయకత్వంలో టీమ్ టైటిల్ గెలిస్తే ఆర్సీబీ అభిమానుల కోరిన నెరవేర్చిన ప్రత్యేక వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతాడు.బౌలింగ్లో కూడా టీమ్ పటిష్టంగా కనిపిస్తోంది. జట్టు బౌలింగ్ సత్తా తొలి క్వాలిఫయర్లో పంజాబ్పైనే కనిపించింది. ముఖ్యంగా హాజల్వుడ్ ఆ్రస్టేలియా నుంచి తిరిగి రావడం ఒక్కసారిగా జట్టు బలాన్ని పెంచింది. 21 వికెట్లతో అతను టీమ్ విజయాల్లో కీలకపాత్ర పోషించగా... భువనేశ్వర్, యశ్ దయాళ్ సహకరించారు. లెగ్ స్పిన్నర్ సుయాశ్ శర్మ కూడా పదునైన బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టిపడేయగలడు. ఆ నలుగురితో కలిసి... తొలి క్వాలిఫయర్ మ్యాచ్ను మినహాయిస్తే సీజన్ ఆసాంతం పంజాబ్ ప్రదర్శన అద్భుతంగా సాగింది. ముఖ్యంగా రెండో క్వాలిఫయర్లో ముంబైని చిత్తు చేసిన తీరు ఆ జట్టు సామర్థ్యాన్ని చూపించింది. కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ తన అసాధారణ బ్యాటింగ్తో 600కు పైగా పరుగులు చేయడంతో పాటు సమర్థ నాయకత్వంతో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇద్దరు విదేశీ బ్యాటర్లు ఇన్గ్లిస్, స్టొయినిస్లకు కీలక సమయాల్లో ఒత్తిడిని దాటి చెలరేగిపోగల నైపుణ్యం ఉంది. అయితే పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర మరో నలుగురు బ్యాటర్లు పోషిస్తున్నారు.వీరంతా జాతీయ జట్టుకు ఆడని ‘అన్క్యాప్డ్’ ఆటగాళ్లే కావడం విశేషం. ఓపెనర్లు ప్రియాన్ష్ఆర్య, ప్రభ్సిమ్రన్తో పాటు నేహల్ వధేరా, శశాంక్ సింగ్ ఈ మ్యాచ్లో రాణిస్తే కింగ్స్కు తిరుగుండదు. పంజాబ్ బౌలింగ్లో కాస్త తడబాటు కనిపిస్తోంది. అర్ష్దీప్ ఆశించిన స్థాయిలో సరైన ఆరంభాలు ఇవ్వడం లేదు. జేమీసన్ మెరుగ్గా ఉన్నా, మూడో పేసర్ అజ్మతుల్లా బౌలింగ్ కూడా సాధారణంగానే ఉంది. చహల్ స్పిన్ మరోసారి కీలకం కానుంది. ఫైనల్ ఒత్తిడిని అధిగమిస్తే పంజాబ్కు గెలుపు కష్టం కాబోదు. తుది జట్ల వివరాలు (అంచనా) బెంగళూరు: రజత్ పాటీదార్ (కెపె్టన్), కోహ్లి, సాల్ట్, మయాంక్ అగర్వాల్, లివింగ్స్టోన్, జితేశ్ శర్మ, షెఫర్డ్, భువనేశ్వర్, కృనాల్ పాండ్యా, యశ్ దయాళ్, హాజల్వుడ్. పంజాబ్: శ్రేయస్ అయ్యర్ (కెపె్టన్), ప్రియాన్ష్ఆర్య, ప్రభ్సిమ్రన్, ఇన్గ్లిస్, నేహల్ వధేరా, స్టొయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా, చహల్, జేమీసన్, అర్ష్దీప్ సింగ్. పిచ్, వాతావరణం సీజన్ ఆరంభం నుంచి భారీ స్కోర్లు నమోదయ్యాయి. రెండో క్వాలిఫయర్ తర హాలోనే టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపవచ్చు. వర్ష సూచన ప్రస్తుతానికి లేదు కానీ వాన వస్తే అదనపు సమయంతో పాటు బుధవారం ‘రిజర్వ్ డే’ కూడా ఉంది. -
IPL 2025: గత మూడు ఫైనల్స్లో విరాట్ కోహ్లి ఎలా ఆడాడో చూడండి..!
ఐపీఎల్ 2025 సీజన్ చివరి అంకానికి చేరింది. నిన్న (జూన్ 1) జరిగిన క్వాలిఫయర్-2తో ఫైనల్స్ రెండో బెర్త్ దక్కించుకున్న జట్టేదో తేలిపోయింది. ముంబై ఇండియన్స్ను మట్టికరిపించి పంజాబ్ కింగ్స్ 11 ఏళ్ల తర్వాత (2014 తర్వాత) ఫైనల్స్కు చేరింది. మరోవైపు ఆర్సీబీ క్వాలిఫయర్-1లో విజయంతో (పంజాబ్పై) నేరుగా ఫైనల్స్కు (తొమ్మిదేళ్ల తర్వాత) చేరింది. ఆర్సీబీకి ఇది నాలుగో ఫైనల్స్ (2009, 2011, 2016, 2025) అవుతుంది. పంజాబ్, ఆర్సీబీ జట్లకు ఇప్పటివరకు ఫైనల్స్ ఆడిన అనుభవం ఉన్నా ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. ఈ సీజన్లో ఏ జట్టు టైటిల్ గెలిచినా ఐపీఎల్కు కొత్త ఛాంపియన్ వస్తుంది.ఆర్సీబీ నాలుగోసారి ఫైనల్స్కు చేరిన నేపథ్యంలో ఓ విషయం గురించి తెలుసుకునేందుకు ఆర్సీబీ అభిమానులు తెగ ఆసక్తి చూపుతున్నారు. గత మూడు ఫైనల్స్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఎలా ఆడాడన్నదే వారి ఆతృత. 2009 సీజన్లో ఆర్సీబీ తొలి ఫైనల్స్ ఆడగా.. అందులో అప్పటి నవయువకుడు విరాట్ 8 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేసి ఆండ్రూ సైమండ్స్ బౌలింగ్లో స్టంపౌటయ్యాడు. ఆ మ్యాచ్లో ఆర్సీబీ డెక్కన్ ఛార్జర్స్ చేతిలో 6 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలై తృటిలో టైటిల్ గెలిచే అవకాశాన్ని చేజార్చుకుంది.ఆర్సీబీ రెండో సారి ఫైనల్స్కు చేరింది 2011 సీజన్లో. ఆ సీజన్ ఫైనల్లో ఆర్సీబీ నాటి డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కేతో తలపడింది. ఆ మ్యాచ్లో విరాట్ 32 బంతుల్లో 35 పరుగులు చేసి సురేశ్ రైనా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఆ మ్యాచ్లో ఆర్సీబీ 58 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొని రెండోసారి రన్నరప్తో సరిపెట్టుకుంది.ఆర్సీబీ మూడో సారి ఫైనల్కు చేరింది 2016 సీజన్లో. ఆ సీజన్లో విరాట్ అరివీర భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. ఆ సీజన్లో 900 పరుగుల క్లబ్లో చేరిన విరాట్.. ఎస్ఆర్హెచ్తో జరిగిన ఫైనల్లో మెరుపు అర్ద సెంచరీతో (35 బంతుల్లో) చెలరేగాడు. అయినా ఆ మ్యాచ్లో ఆర్సీబీ 8 పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొని మూడోసారి టైటిల్ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. ఆ మ్యాచ్లో విరాట్, గేల్ (76) మెరుపు ఆరంభాన్ని ఇచ్చినా ఆతర్వాత వచ్చిన ఆటగాళ్లంతా విఫలం కావడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. తాజాగా ఆర్సీబీ నాలుగోసారి ఫైనల్కు చేరింది. మరి ఈ సీజన్లో విరాట్ ఎన్ని పరుగులు సాధిస్తాడో, ఆర్సీబీ టైటిల్ కలను సాకారం చేసుకుంటుందో లేదో చూడాలి. -
వరల్డ్కప్ షెడ్యూల్ వచ్చేసింది.. పాకిస్తాన్ మ్యాచ్లన్నీ అక్కడే..!
మహిళల వన్డే వరల్డ్కప్ 2025 షెడ్యూల్ను ఐసీసీ ఇవాళ (జూన్ 2) విడుదల చేసింది. ఈ టోర్నీకి సంబంధించిన వేదికలు, తేదీలను ఇవాళ అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 5-నవంబర్ 2 మధ్యలో భారత్, శ్రీలంక వేదికగా ఈ మెగా టోర్నీ జరుగనుంది.భారత్లోని చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు), ఏసీఏ స్టేడియం (గౌహతి), హోల్కర్ స్టేడియం (ఇండోర్), ఏసీఏ-వీడిసీఏ స్టేడియంలో (విశాఖపట్నం) మ్యాచ్లు జరుగుతాయి. శ్రీలంకలో ప్రేమదాస స్టేడియంలో (కొలంబో) మ్యాచ్లు జరుగుతాయి. 2025 ICC Women's Cricket World Cup schedule 𝐑𝐄𝐕𝐄𝐀𝐋𝐄𝐃!Read more ➡ https://t.co/myj2Gfamkv pic.twitter.com/zl3IYWC2e6— ICC (@ICC) June 2, 2025ఈ టోర్నీలో పాకిస్తాన్ ఆడే మ్యాచ్లు ప్రేమదాస స్టేడియంలో జరుగనున్నాయి. పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమయంలో జరిగిన ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ భారత్లో పర్యటించదు. ఆ టోర్నీ పాకిస్తాన్లో జరగాల్సి ఉండగా.. భద్రతా కారణాల రిత్యా టీమిండియా ఆ దేశంలో అడుగుపెట్టలేదు. భారత్ ఆడాల్సిన మ్యాచ్లు హైబ్రిడ్ పద్దతి ప్రకారం దుబాయ్లో జరిగాయి. వరల్డ్కప్ మ్యాచ్ల కోసం పాకిస్తాన్ కూడా భారత్లో ఆడదని అప్పుడే ఒప్పందం చేసుకున్నారు. భారత్, పాక్ మధ్య తాజా పరిస్థితుల (ఆపరేషన్ సిందూర్ తర్వాత) నేపథ్యంలో పాక్ జట్టు మన దేశంలో మ్యాచ్లు ఆడతామన్న భారత ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితి లేదు.కాగా, ఈ మెగా టోర్నీ ఆరంభ మ్యాచ్ సెప్టెంబర్ 30న బెంగళూరులో జరుగనుంది. ఈ మ్యాచ్లో భారత ప్రత్యర్థి క్వాలిఫయర్ పోటీల ద్వారా నిర్ణయించబడుతుంది. అక్టోబర్ 29న తొలి సెమీఫైనల్ (గౌహతి లేదా కొలొంబో (పాక్ క్వాలిఫై అయితే)), 30న రెండో సెమీఫైనల్ (బెంగళూరు) జరుగనున్నాయి. నవంబర్ 2న ఫైనల్ (బెంగళూరు లేదా కొలొంబో) జరుగుతుంది. మహిళల వన్డే వరల్డ్కప్ 12 ఏళ్ల తర్వాత భారత్లో జరుగుతుంది.ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు (భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్) పాల్గొంటాయి. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది. 2022లో న్యూజిలాండ్లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఇంగ్లండ్ను ఓడించి ఏడోసారి ఛాంపియన్గా అవతరించింది. ఈ టోర్నీలో అత్యంత విజయంవంతమైన జట్టు ఆస్ట్రేలియానే. -
IPL 2025: ఓటమి బాధలో ఉన్న హార్దిక్ పాండ్యాకు భారీ షాకిచ్చిన బీసీసీఐ
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (జూన్ 1) జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా ముంబై ఇంటికి, పంజాబ్ ప్లే ఆఫ్స్కు చేరాయి. జూన్ 3న జరుగనున్న ఫైనల్లో పంజాబ్.. ఆర్సీబీతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ కూడా అహ్మదాబాద్ వేదికగా జరుగనుంది.కాగా, ఓటమి బాధలో ఉన్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాకిచ్చింది. ఈ సీజన్లో మూడోసారి స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గానూ రూ. 30 లక్షల జరిమానా విధించింది. ముంబై ఇండియన్స్లోని సభ్యులందరికీ కూడా 50 శాతం (రూ. 12 లక్షలు) మ్యాచ్ ఫీజ్ జరిమానాగా పడింది.ఈ సీజన్లో రూల్స్ మారడంతో హార్దిక్ సస్పెన్షన్ నుంచి తప్పించుకున్నాడు. ఈ సీజన్కు ముందు వరకు ఓ సీజన్లో మూడు మ్యాచ్ల్లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేస్తే ఓ మ్యాచ్ సస్పెన్షన్ విధించేవారు. ఇదే మ్యాచ్లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు కూడా జరిమానా పడింది. ఈ సీజన్లో రెండోసారి స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేయడంతో రూ.24 లక్షల ఫైన్ విధించారు. పంజాబ్ జట్టు సభ్యులకు ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం (ఇందులో ఏది తక్కువైతే అది జరిమానా విధిస్తారు) కోత విధించారు.ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్స్లు), తిలక్ వర్మ (29 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్లు), నమన్ ధీర్ (18 బంతుల్లో 37; 7 ఫోర్లు) దంచేశారు. అజ్మ తుల్లా ఒమర్జాయ్ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసి గెలిచింది. నాయకుడు శ్రేయస్ అయ్యర్ (41 బంతుల్లో 87 నాటౌట్; 5 ఫోర్లు, 8 సిక్స్లు) జట్టు గెలిచేదాకా నడిపించాడు. నేహల్ వధేరా (29 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. -
ENG VS WI 2nd ODI: చరిత్ర సృష్టించిన ఆదిల్ రషీద్
ఇంగ్లండ్ స్పిన్ బౌలర్ ఆదిల్ రషీద్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో అత్యధిక వికెట్లు తీసిన ఇంగ్లండ్ స్పిన్నర్గా అవతరించాడు. వెస్టిండీస్తో నిన్న (జూన్ 1) జరిగిన రెండో వన్డేలో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 4 వికెట్లు తీసిన రషీద్ తన వన్డే వికెట్ల సంఖ్యను 221కి పెంచుకున్నాడు. రషీద్ టీ20ల్లో 131, టెస్ట్ల్లో 60 వికెట్లు తీశాడు. మొత్తం కలిపి రషీద్ తన అంతర్జాతీయ కెరీర్లో 298 ఇన్నింగ్స్ల్లో 412 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలో మరే స్పిన్నర్ ఇన్ని వికెట్లు తీయలేదు. నిన్నటి మ్యాచ్లో రషీద్ గ్రేమ్ స్వాన్ను (223 ఇన్నింగ్స్ల్లో 410 వికెట్లు) అధిగమించి అత్యధిక వికెట్లు తీసిన ఇంగ్లిష్ స్పిన్నర్గా అవతరించాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 ఇంగ్లండ్ స్పిన్నర్లు..ఆదిల్ రషీద్-412 (298 ఇన్నింగ్స్లు)గ్రేమ్ స్వాన్-410 (223)మొయిన్ అలీ-366 (318)అండర్వుడ్-329 (175)జాన్ ఎంబురే-223 (164)ఓవరాల్గా ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రికార్డు దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ పేరిట ఉంది. ఆండర్సన్ ఇంగ్లండ్ తరఫున 560 ఇన్నింగ్స్ల్లో 991 వికెట్లు తీశాడు (మూడు ఫార్మాట్లు కలిపి). ఆండర్సన్ తర్వాత స్టువర్ట్ బ్రాడ్ (485 ఇన్నింగ్స్ల్లో 847 వికెట్లు), ఇయాన్ బోథమ్ (283 ఇన్నింగ్స్ల్లో 528 వికెట్లు), డారెన్ గాఫ్ (252 ఇన్నింగ్స్ల్లో 466 వికెట్లు) ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుగా ఉన్నారు. ఈ జాబితాలో ఆదిల్ రషీద్ ఐదో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మొదటి నలుగురు పేసర్లే కావడం విశేషం.ఇదిలా ఉంటే, నిన్న వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ కీసీ కార్టీ సెంచరీతో (103) చెలరేగడంతో 47.4 ఓవర్లలో 308 పరుగులు చేసింది.అనంతరం జో రూట్ భారీ సెంచరీతో (166 నాటౌట్) చెలరేగడంతో ఇంగ్లండ్ 48.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆదిల్ రషీద్ 4 వికెట్లు తీసి వెస్టిండీస్ను ఆలౌట్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్లో నామమాత్రపు మూడో వన్డే లండన్లోని కెన్నింగ్స్టన్ ఓవర్లో జూన్ 3న జరుగనుంది. -
హెన్రిచ్ క్లాసెన్ షాకింగ్ నిర్ణయం
సౌతాఫ్రికా విధ్వంసకర ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. 33 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్లాసెన్ రిటైర్మెంట్ ప్రకటన క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురి చేసింది. క్లాసెన్ ఈజీగా మరో రెండు, మూడేళ్లు అంతర్జాతీయ కెరీర్ను కొనసాగించి ఉండవచ్చు. మరో విధ్వంసకర బ్యాటర్, ఆసీస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే క్లాసెన్ రిటైర్మెంట్ ప్రకటన రావడంతో వారివారి దేశ క్రికెట్ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మ్యాక్స్తో పోలిస్తే క్లాసెన్కు వయసు, ఫామ్ రెండూ ఉన్నాయి. పైగా 2027లో సౌతాఫ్రికాలో వన్డే వరల్డ్కప్ జరుగనుంది. క్లాసెన్ ఈ టోర్నీ ఆడతాడని ఆ దేశ అభిమానులు ఆశించి ఉంటారు. అయితే క్లాసెన్ షాకింగ్ నిర్ణయం తీసుకుని వారికి దుఖాన్ని మిగిల్చాడు. ఈ ఏడాది స్టార్ క్రికెటర్లు ఒక్కొక్కరుగా రిటైర్మెంట్ ప్రకటిస్తూ వస్తున్నారు. రోహిత్, కోహ్లి టెస్ట్లకు.. స్టీవ్ స్మిత్, మ్యాక్స్వెల్ వన్డేలకు.. తాజాగా క్లాసెన్ మూడు ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు.2018లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన క్లాసెన్.. సౌతాఫ్రికా తరఫున 4 టెస్ట్లు, 60 వన్డేలు, 58 టీ20లు ఆడాడు. ఇందులో 4 సెంచరీలు (వన్డేల్లో), 16 హాఫ్ సెంచరీల సాయంతో 3245 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినా క్లాసెన్ ఐపీఎల్ తదితర లీగ్ల్లో కొనసాగుతాడు. క్లాసెన్ ఇటీవలే ఐపీఎల్లో సెంచరీ బాది వార్తల్లో నిలిచాడు. కేకేఆర్తో జరిగిన తమ చివరి మ్యాచ్లో క్లాసెన్ కేవలం 39 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 105 (నాటౌట్) పరుగులు చేశాడు. క్లాసెన్కు ఐపీఎల్లో ఇది రెండో సెంచరీ. ఈ సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన క్లాసెన్ 172.70 స్ట్రయిక్రేట్తో 487 పరుగులు చేశాడు. ఈ సీజన్లో క్లాసెన్ ప్రాతినిథ్యం వహించిన సన్రైజర్స్ హైదరాబాద్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఈ సీజన్ మెగా వేలానికి ముందు సన్రైజర్స్ యాజమాన్యం క్లాసెన్ను రీటైన్ చేసుకుంది. -
ఆసియా కప్ 2025 వాయిదా
జూన్ 6 నుంచి శ్రీలంకలో జరగాల్సిన మహిళల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2025 వాయిదా పడింది. ప్రతికూల వాతావరణం మరియు ఆరోగ్య పరిస్థితులు కారణంగా టోర్నీని వాయిదా వేస్తున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సోమవారం (జూన్ 2) ప్రకటించింది. టోర్నీని వాయిదా వేయాలని ఆతిథ్య బోర్డు (శ్రీలంక) అధ్యక్షుడు షమ్మీ సిల్వా ఏసీసీకి లేఖ రాశాడు. ఈ లేఖను పరిగణలోకి తీసుకొని ఏసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం శ్రీలంకలో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించేందుకు వాతావరణం అనుకూలంగా లేదని, ఆ ప్రాంతంలో చికున్గున్యా వ్యాప్తి చెందుతుందని సిల్వా తన లేఖలో పేర్కొన్నాడు. టోర్నీ తదుపరి షెడ్యూల్ను త్వరలో విడుదల చేస్తామని ఏసీసీ అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ వెల్లడించాడు.కాగా, ఏసీసీ మహిళల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023లో తొలిసారి జరిగింది. హాంగ్కాంగ్ వేదికగా నాడు జరిగిన టోర్నీలో భారత్ ఏ విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్ బంగ్లాదేశ్ ఏను 31 పరుగుల తేడాతో ఓడించి ఛాంపియన్గా నిలిచింది. ఈ టోర్నీలో భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక ఏ జట్లతో పాటు యూఏఈ, నేపాల్, థాయ్లాండ్, మలేసియా జట్లు పాల్గొంటాయి. -
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. క్యాష్ రిచ్ లీగ్లో ఓ సింగిల్ సీజన్లో 700 అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన తొలి ముంబై ఇండియన్స్ బ్యాటర్గా, ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన తొలి నాన్ ఓపెనర్గా రికార్డు నెలకొల్పాడు. నిన్న (జూన్ 1) పంజాబ్ కింగ్స్తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్తో కలుపుకొని స్కై ఈ సీజన్లో 16 మ్యాచ్లు ఆడాడు. ఇందులో 167.92 స్ట్రయిక్రేట్తో 65.18 సగటున, 5 హాఫ్ సెంచరీల సాయంతో 717 పరుగులు చేశాడు. స్కై ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.సూర్యకుమార్ తర్వాత ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ముంబై ఇండియన్స్ ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ 2010 సీజన్లో 618 పరుగులు చేశాడు. ఈ సీజన్లో స్కై సచిన్ రికార్డును అధిగమించాడు.ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-6 ఆటగాళ్లు..సాయి సుదర్శన్-15 మ్యాచ్ల్లో 759 పరుగులుసూర్యకుమార్ యాదవ్- 16 మ్యాచ్ల్లో 717 పరుగులుశుభ్మన్ గిల్-15 మ్యాచ్ల్లో 650 పరుగులుమిచెల్ మార్ష్- 13 మ్యాచ్ల్లో 627 పరుగులువిరాట్ కోహ్లి-14 మ్యాచ్ల్లో 614 పరుగులుశ్రేయస్ అయ్యర్-16 మ్యాచ్ల్లో 603 పరుగులుఈ సీజన్లో స్కై మరో ఘనత కూడా సొంతం చేసుకున్నాడు. వరుసగా 16 ఇన్నింగ్స్ల్లో 25 ప్లస్ స్కోర్లు చేశాడు. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఎవరూ వరుసగా ఇన్ని ఇన్నింగ్స్ల్లో 25 ప్లస్ స్కోర్లు చేయలేదు. స్కై తర్వాత అత్యధికంగా రాబిన్ ఉతప్ప వరుసగా 10 ఇన్నింగ్స్ల్లో 25 ప్లస్ స్కోర్లు చేశాడు (2014లో కేకేఆర్ తరఫున). స్కై, ఉతప్ప తర్వాత సాయి సుదర్శన్ (9, 2023-24, గుజరాత్), విరాట్ కోహ్లి (9, 2024-25, ఆర్సీబీ) అత్యధిక ఇన్నింగ్స్ల్లో (వరుసగా) ఈ ఘనత సాధించారు.ఈ సీజన్లో స్కై చేసిన పరుగులు (తాజా ఇన్నింగ్స్తో మొదలు)..44 (26), 33 (20), 57 (39), 73 నాటౌట్ (43), 24 (35), 48 నాటౌట్ (23), 54 (28), 40 నాటౌట్ (19), 68 నాటౌట్ (30), 26 (15), 40 (28), 28 (26), 67 (43), 27 నాటౌట్ (9), 48 (28), 29 (26)ఐపీఎల్లో ఓ సీజన్లో 700 ప్లస్ పరుగులు చేసిన ఆటగాళ్లు..విరాట్ కోహ్లి-973 (2016)శుభ్మన్ గిల్-890 (2023)జోస్ బట్లర్-863 (2022)డేవిడ్ వార్నర్-848 (2016)సాయి సుదర్శన్-759 (2025)విరాట్ కోహ్లి-741 (2024)కేన్ విలియమ్సన్-735 (2018)క్రిస్ గేల్-733 (2012)మైక్ హస్సీ-733 (2013)డుప్లెసిస్-730 (2023)సూర్యకుమార్ యాదవ్-717 (2025)క్రిస్ గేల్-708 (2013)ఇదిలా ఉంటే, ఈ సీజన్లో సూర్యకుమార్ చెలరేగినా ముంబై ఇండియన్స్ ప్రయాణం క్వాలిఫయర్-2లోనే ముగిసింది. నిన్న (జూన్ 1) పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబై 5 వికెట్ల తేడాతో పరాజయంపాలై లీగ్ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో స్కై విలువైన ఇన్నింగ్స్ (26 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడాడు. బ్యాటింగ్లో సత్తా చాటినా ముంబై బౌలర్లు 203 పరుగుల స్కోర్ను డిఫెండ్ చేసుకోలేకపోయారు. శ్రేయస్ అయ్యర్ (87 నాటౌట్) పంజాబ్ను విజయతీరాలకు చేర్చాడు. ఈ గెలుపుతో పంజాబ్ ఫైనల్కు చేరింది. ఫైనల్లో ఆర్సీబీతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
ఇదేంటి అయ్యర్.. సహచర ఆటగాడిని అలా తిడతావా? వీడియో వైరల్
తొలి ఐపీఎల్ టైటిల్ను ముద్దాడేందుకు పంజాబ్ కింగ్స్ అడుగు దూరంలో నిలిచింది. ఐపీఎల్ 18వ సీజన్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్ అడుగుపెట్టింది. ఆదివారం జరిగిన క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించిన పంజాబ్ కింగ్స్.. 11 ఏళ్ల తర్వాత తుది పోరుకు ఆర్హత సాధించింది. ఈ విజయంలో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ది కీలక పాత్ర. 204 పరుగుల భారీ లక్ష్య చేధనలో అయ్యర్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సెకెండ్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన శ్రేయస్.. ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ను ముగించాడు. అయ్యర్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లతో 87 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. మంగళవారం జరగనున్న ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ, పంజాబ్ జట్లు తలపడనున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. ఎప్పుడూ ప్రశాంతంగా కన్పించే శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్లో తన సహనాన్ని కోల్పోయాడు. తన సహచర ఆటగాడు శశాంక్ సింగ్ను ఆసభ్యపదజాలంతో దూషించాడు. మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ తన టీమ్ మేట్స్కు, ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లకు కరచాలనం చేస్తూ ముందుకు సాగాడు. ఈ క్రమంలో శశాంక్ సింగ్కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించాడు. అంతేకాకుండా పరుష పదజాలం వాడి అతడిని తిట్టాడు కూడా. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే శ్రేయస్ కోపానికి వెనక ఓ కారణం ఉంది.అసలేమి జరిగిదంటే?నేహాల్ వధేరా ఔటయ్యాక శశాంక్ సింగ్ క్రీజులోకి వచ్చాడు. అయితే కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చిన శశాంక్ కేవలం మూడు బంతులు మాత్రమే ఆడి రనౌటయ్యాడు. 17వ ఓవర్లో శశాంక్ (2) మిడ్ ఆన్ దిశగా షాట్ ఆడాడు. రన్ కోసం పరిగెత్తాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా నాన్స్ట్రైక్ ఎండ్లో స్టంప్స్ను గిరాటేశాడు. థర్డ్ అంపైర్కు రిఫర్ చేయగా రిప్లేలో శశాంక్ బ్యాట్ క్రీజుకు వెలుపుల ఉన్నట్లు కన్పించింది.దీంతో థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించాడు. అయితే శశాంక్ నిర్లక్ష్యంగా పరిగెత్తడంతోనే ఔటయ్యాడు. కనీసం డైవ్ చేసి ఉన్నా ఔటయ్యే ప్రమాదం నుంచి ఈ పంజాబ్ ఆటగాడు తప్పించుకుని ఉండేవాడు. కీలకమైన సమయంలో శశాంక్ నిర్లక్ష్యంగా రనౌట్ కావడమే అయ్యర్ అగ్రహానికి కారణమైంది.చదవండి: IPL 2025: శ్రేయస్ అయ్యర్కు భారీ షాకిచ్చిన బీసీసీఐAfter the match is over, Shreyas Iyer is saying something angrily to Shashank Singh, tell me what is he saying?#shreyashiyar |#ShashankSingh #IPLPlayoffs |#PBKSvsMI pic.twitter.com/Eo7s7YHSgn— Irfan isak shaikh (@irfan_speak786) June 1, 2025 -
WTC Final: సౌతాఫ్రికా మాస్టర్ ప్లాన్.. ఇక ఆసీస్కు చుక్కలే
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్(WTC)-2025 ఫైనల్కు సమయం అసన్నమవుతోంది. జూన్ 11 నుంచి 15 వరకు లార్డ్స్ వేదికగా జరగనున్న తుది పోరులో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ క్రమంలో సౌతాఫ్రికా క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ ఫైనల్ మ్యాచ్ కోసం తమ జట్టు బౌలింగ్ కన్సల్టెంట్గా ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం స్టువర్ట్ బ్రాడ్ను సీఎస్ఎ (Cricket South Africa) నియమించింది. ఫైనల్ మ్యచ్కు రెండు రోజుల ముందు ప్రోటీస్ జట్టుతో బ్రాడ్ చేరనున్నాడు. లార్డ్స్ మైదానంలో పరిస్థితులపై బ్రాడ్కు పూర్తి స్ధాయి అవగహన ఉంది. అతడు తన కెరీర్లో ఎన్నో మ్యాచ్లు ఈ క్రికెట్ మక్కాలో ఆడాడు. ఈ నేపథ్యంలోనే అతడితో సీఎస్ఎ తమ కోచింగ్ స్టాప్లోకి చేర్చుకుంది.రికార్డుల రారాజు..కెరీర్లో 167 టెస్ట్లు, 121, వన్డేలు, 56 టీ20లు ఆడిన బ్రాడ్ ఎన్నో రికార్డులను నమోదు చేశాడు. టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు (604) తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచిన బ్రాడ్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ పలు రికార్డులు నెలకొల్పాడు. టెస్ట్ల్లో బ్రాడ్ 244 ఇన్నింగ్స్లు ఆడి 3662 పరుగులు చేశాడు. ఇతని ఖాతాలో సెంచరీ (169), 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.డబ్ల్యూటీసీ ఫైనల్కు సౌతాఫ్రికా జట్టుటెంబా బావుమా (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, లుంగి ఎంగిడి, టోనీ డి జోర్జి, డేవిడ్ బెడింగ్హమ్, కేశవ్ మహారాజ్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్, సెనురన్ ముత్తుసామి, మార్కో జాన్సెన్, కగిసో రబాడ, కైల్ వెర్రెయిన్, డేన్ ప్యాటర్సన్, వియాన్ ముల్డర్, ర్యాన్ రికెల్టన్.డబ్ల్యూటీసీ ఫైనల్కు ఆసీస్ జట్టుఉస్మాన్ ఖ్వాజా, సామ్ కోన్స్టాస్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, ఇంగ్లిస్, అలెక్స్ క్యారీ, వెబ్స్టర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, హేజెల్వుడ్, స్కాట్ బోలాండ్, నాథన్ లయన్, మాథ్యూ కుహ్నెమాన్ -
రిటైర్మెంట్ ప్రకటించిన గ్లెన్ మాక్స్వెల్
ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేలకు మాక్స్వెల్ వీడ్కోలు పలికాడు. ఫైనల్ వర్డ్ పాడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాక్సీ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. 2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని తన స్ధానంలో యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు 36 ఏళ్ల మాక్స్వెల్ వెల్లడించాడు.ఆసీస్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీతో చర్చించాకే 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి తన తప్పుకుంటున్నట్లు ఈ స్టార్ ఆల్రౌండర్ తెలిపాడు. పదేపదే గాయాల బారిన పడడం కూడా మాక్సీ ఆకస్మిక రిటైర్మెంట్కు ఒక ప్రధాన కారణం కావచ్చు. ఇక ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ధ్రువీకరించింది. 2012లో ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేసిన మాక్స్వెల్.. తన 13 ఏళ్ల వన్డే కెరీర్లో ఎన్నో అసాధారణ ఘనతలను అందుకున్నాడు. ముఖ్యంగా వన్డే ప్రపంచకప్-2023లో అఫ్గానిస్తాన్పై మాక్సీ ఆడిన ఇన్నింగ్స్ సదరు క్రికెట్ అభిమానికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఓ వైపు గాయంతో బాధపడుతూ ఒంటి కాలితో అఫ్గానిస్తాన్పై విరోచిత డబుల్ సెంచరీతో మాక్స్వెల్ చెలరేగాడు. ఆఖరి వరకు క్రీజులో ఉండి తన జట్టును సెమీఫైనల్కు మాక్స్వెల్ చేర్చాడు. ఇక తన వన్డే కెరీర్ లో 149 వన్డేలు ఆడిన మాక్స్ వెల్.. 4,000 పరుగులు సాధించాడు. అదేవిధంగా అతడు 77 వికెట్లు కూడా వన్డేల్లో పడగొట్టాడు. 2015, 2019లో ఆస్ట్రేలియా ప్రపంచ కప్ విజయాలు సాధించడంలో గ్లెన్ మాక్స్వెల్ కీలక పాత్ర పోషించాడు. చివరగా ఆస్ట్రేలియా తరపున వన్డే మ్యాచ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. కాగా దాదాపు ఎనిమిదేళ్ల నుంచి టెస్టులకు కూడా దూరంగా ఉన్న మాక్స్వెల్.. ఇకపై కేవలం టీ20ల్లో మాత్రమే కొనసాగే ఛాన్స్ ఉంది.ONE OF THE GREATEST EVER MOMENTS IN WORLD CUP HISTORY. - Thank you, Glenn Maxwell. 🫡 pic.twitter.com/CJ21AI3CVE— Mufaddal Vohra (@mufaddal_vohra) June 2, 2025చదవండి: IPL 2025: శ్రేయస్ అయ్యర్కు భారీ షాకిచ్చిన బీసీసీఐ.. -
శ్రేయస్ అయ్యర్కు భారీ షాకిచ్చిన బీసీసీఐ..
ఐపీఎల్-2025 సీజన్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడే జట్టు ఏదో తేలిపోయింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్.. తుది పోరుకు ఆర్హత సాధించింది.మంగళవారం(జూన్ 3)న జరగనున్న ఫైనల్లో ఆర్సీబీ, పంజాబ్ తొలి టైటిల్ కోసం అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. గెలుపు జోష్లో ఉన్న పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు భారీ షాక్ తగిలింది. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో స్లో ఓవర్ రేటు మెయింటిన్ చేసినందుకుగానూ అయ్యర్కు బీసీసీఐ జరిమానా విధించింది. ఈ ఏడాది సీజన్లో పంజాబ్ స్లో ఓవర్ రేట్ను నమోదు చేయడం ఇది రెండోసారి. దీంతో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం అయ్యర్కు రూ.24 లక్షల ఫైన్ విధించారు. "శ్రేయస్ అయ్యర్కు జరిమానా విధించాం. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ను కొనసాగించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇది రెండో సారి అయినందున ఆర్టికల్ 2.22 ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం శ్రేయస్కు రూ. 24 లక్షలు ఫైన్ వేశాము.మిగిలిన సభ్యులకు ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం, ఇందులో ఏది తక్కువైతే అది జరిమానా విధించడం జరిగింది’ అని ఐపీఎల్ అధికారులు వెల్లడించారు. కాగా ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయ్యర్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లతో 87 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా 204 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కేవలం 19 ఓవర్లలోనే చేధించింది.చదవండి: అతడొక అత్యద్భుతం.. మేము అనుకున్నది జరగలేదు: హార్దిక్ -
రూట్ '164' నాటౌట్.. విండీస్ను చిత్తు చేసిన ఇంగ్లండ్
కార్డిఫ్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో 3 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. . తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 47.4 ఓవర్లలో 308 పరుగులకు ఆలౌటైంది.కేసీ కార్టీ (105 బంతుల్లో 103; 13 ఫోర్లు) శతకంతో చెలరేగగా... కెప్టెన్ షై హోప్ (66 బంతుల్లో 78; 4 ఫోర్లు, 4 సిక్స్లు) బ్రాండన్ కింగ్ (59; 10 ఫోర్లు) హాఫ్సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 4, సాఖిబ్ మహమూద్ మూడు వికెట్లు తీశారు.రూట్ సూపర్ సెంచరీ..అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 48.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 312 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్ భారీ శతకంతో చెలరేగాడు. 139 బంతులు ఎదుర్కొన్న రూట్.. 21 ఫోర్లు, 2 సిక్స్లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడతున్నప్పటికి రూట్ మాత్రం ఆచితూచి ఆడుతూ తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. రూట్తో పాటు కెప్టెన్ హ్యారీ బ్రూక్ (47; 7 ఫోర్లు, 1 సిక్స్), విల్ జాక్స్ (49; 2 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడాడరు. జెమీ స్మిత్ (0), బెన్ డకెట్ (0), జోస్ బట్లర్ (0) డకౌటయ్యారు. కాగా రూట్కు ఇది 18వ వన్డే సెంచరీ. ఈ క్రమంలో వన్డేల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా జో రూట్ (179 మ్యాచ్ల్లో 7082 పరుగులు) అవతరించాడు. ఇయాన్ మోర్గాన్ (6957 పరుగులు) పేరిట ఉన్న రికార్డును రూట్ అధిగమించాడు. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 4 వికెట్లు తీశాడు. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే మంగళవారం జరగనుంది. -
అతడొక అత్యద్భుతం.. మేము అనుకున్నది జరగలేదు: హార్దిక్
ఐపీఎల్-2025 సీజన్లో ముంబై ఇండియన్స్ పోరాటం ముగిసింది. ఆదివారం పంజాబ్ కింగ్స్తో జరిగిన క్వాలిఫయర్-2లో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైన ముంబై ఇండియన్స్.. ఈ టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. తొలుత బ్యాటింగ్లో అదరగొట్టిన ముంబై, బౌలింగ్లో మాత్రం చేతులెత్తేసింది. ఆఖరికి ఆ జట్టు ప్రధాన బౌలర్ బుమ్రా సైతం తేలిపోయాడు. 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి పంజాబ్ కింగ్స్ 5 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో చేధించింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయ్యర్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లతో 87 పరుగులు చేసి తన జట్టును ఫైనల్కు చేర్చాడు. అతడితో పాటు జోష్ ఇంగ్లిష్(38), వధేరా(48) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ముంబై బౌలర్లలో అశ్వినీ కుమార్ రెండు, బౌల్ట్, హార్దిక్ పాండ్యా తలా వికెట్ సాధించారు. బుమ్రా తన నాలుగు ఓవర్ల కోటాలో వికెట్ ఏమీ తీయకుండా ఏకంగా 40 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. బ్యాటింగ్లో రాణించినా, బౌలింగ్లో విఫలమయ్యామని హార్దిక్ అన్నాడు."శ్రేయస్ అయ్యర్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. అతడు ఆడిన షాట్లు అత్యద్భుతం. అయ్యర్తో పాటు మిగిలిన బ్యాటర్లు కూడా చాలా బాగా బ్యాటింగ్ చేశారు. మా ఇన్నింగ్స్ తర్వాత ఈ టార్గెట్ను డిఫెండ్ చేసుకోవచ్చు అని భావించామ. కానీ ఇటువంటి కీలక మ్యాచ్లలో బౌలింగ్ యూనిట్ కూడా సమిష్టిగా రాణించడం చాలా ముఖ్యం. ఈ మ్యాచ్లో మా బౌలర్లు తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయారు. పంజాబ్ బ్యాటర్లు చాలా ప్రశాంతంగా కన్పించారు. వారు తమ అద్బుత బ్యాటింగ్తో మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు. ఫస్ట్ ఇన్నింగ్స్కు సెకెండ్ ఇన్నింగ్స్కు పిచ్లో పెద్దగా మార్పులేదు. కొంచెం మంచు ప్రభావం ఉన్నప్పటకి దానిని మా ఓటమికి సాకుగా చెప్పాలనుకోవడం లేదు. కెప్టెన్గా నేను కూడా అంత వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోయాను.సరైన లెంగ్త్లో బౌలింగ్ చేయడం, సరైన సమయంలో సరైన బౌలర్ను ఉపయోగించడం వంటివి చేసుంటే ఫలితం భిన్నంగా ఉండేది. బుమ్రాను సరైన సమయంలో బౌలింగ్ చేయించాని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 17వ ఓవర్ వేయించి ఉంటే మరి తొందరయ్యేది.ఆ సమయంలో 4 ఓవర్లలో పంజాబ్ విజయానికి 41 పరుగులు అవసరమయ్యాయి. ఆఖరి మూడు ఓవర్లలో బుమ్రాతో ఓవర్ వేయించాలని మేము ప్లాన్ చేశాము. 18 బంతులు మిగిలిఉన్నప్పటికి బుమ్రా తన అనుభవంతో ప్రత్యేకంగా ఏదైనా చేయగలడు అని భావించాము. కానీ దురదృష్టవశాత్తు మేము అనుకున్నది ఈ రోజు జరగలేదు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో పాండ్యా పేర్కొన్నాడు. ఇక మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తుది పోరులో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. -
PBKS VS MI, Qualifier 2: ఫైనల్లో పంజాబ్ కింగ్స్
అహ్మదాబాద్: ఐపీఎల్లో ఫైవ్స్టార్ చాంపియన్లు (ముంబై, చెన్నై), మూడుసార్లు విజేత (కోల్కతా)ను చూసిన ఫ్యాన్స్ ఈ సీజన్లో కొత్త చాంపియన్ను చూడబోతున్నారు. తొలి క్వాలిఫయర్లో తేలిపోయిన పంజాబ్ కింగ్స్ రెండో క్వాలిఫయర్లో జూలు విదిల్చింది. 11 ఏళ్ల తర్వాత (2014) ఐపీఎల్లో ఫైనల్కు చేరింది. ఆదివారం శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ను ఇంటికి పంపింది. రేపు జరిగే ఫైనల్లో బెంగళూరు, పంజాబ్ తొలి ఐపీఎల్ టైటిల్ కోసం తలపడతాయి. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై నిరీ్ణత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్స్లు), ఠాకూర్ తిలక్ వర్మ (29 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్లు), నమన్ ధీర్ (18 బంతుల్లో 37; 7 ఫోర్లు) దంచేశారు. అజ్మ తుల్లా ఒమర్జాయ్ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసి గెలిచింది. నాయకుడు శ్రేయస్ అయ్యర్ (41 బంతుల్లో 87 నాటౌట్; 5 ఫోర్లు, 8 సిక్స్లు) జట్టు గెలిచేదాకా నడిపించాడు. నేహల్ వధేరా (29 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. గెలిపించిన అయ్యర్ పంజాబ్కు అంతపెద్ద లక్ష్యం ఛేదించడానికి అవసరమైన శుభారంభం దక్కలేదు. మూడో ఓవర్లో ప్రభ్సిమ్రన్ (6), కాసేపటికే ప్రియాన్ష్ ఆర్య (10 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుకు చుక్కెదురైంది. దీంతో పవర్ప్లేలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయిన 64/2 స్కోరు చేసింది. ఇన్గ్లిస్ (21 బంతుల్లో 38; 5 ఫోర్లు, 2 సిక్స్లు) దంచేసే ఆటను పాండ్యా అడ్డుకున్నాడు. దీంతో 72 పరుగులకే టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నేహల్ వాధేరా జట్టు స్కోరును వంద దాటించారు. 12 ఓవర్లలో 109/3 స్కోరు చేసిన పంజాబ్... విజయానికి 48 బంతుల్లో 95 పరుగులు కష్టమనిపించింది. టాప్లీ 13వ ఓవర్లో అయ్యర్ కొట్టిన వరుస 3 సిక్స్లు, ఆ వెంటనే బౌల్ట్ బౌలింగ్లో వాధేరా కొట్టిన బౌండరీలతో ఈ రెండు ఓవర్లలోనే 33 పరుగులు సాధించడంతో కింగ్స్ రేసులో పడింది. నాలుగో వికెట్కు 84 పరుగులు జోడించాక వాధేర అవుటయ్యాడు. శశాంక్ (2) రనౌటైనా... 27 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న అయ్యర్ భారీ సిక్స్లతో కింగ్స్ను గెలిపించాడు. దంచేసిన తిలక్, సూర్య రోహిత్ (8), బెయిర్స్టో (38)ల తర్వాత తిలక్, సూర్యకుమార్ అడపాదడపా మెరుపులతో జట్టు స్కోరు 10 ఓవర్లలో 100 పరుగులు దాటింది. ఈ జోడీ నిలబడి దూకుడు పెంచడంతో పరుగులు వేగంగా వచ్చాయి. చహల్ ఓవర్లో సిక్సర్ బాదిన సూర్యకుమార్... జేమీసన్ ఓవర్లో రెండు బౌండరీలు కొట్టాడు. ఇదే జోరుతో 4, 6 కొట్టిన అతన్ని చహల్ అవుట్ చేయడంతో మూడో వికెట్కు 72 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరుసటి ఓవర్లోనే తిలక్ను జేమీసన్ పెవిలియన్ చేర్చాడు. అయితే నమన్ ధీర్ ధనాధన్ బౌండరీలతో ఓవర్కు సగటున 10 రన్రేట్తో ముంబై స్కోరు దూసుకెళ్లింది. ఆఖరి ఓవర్లో నమన్ అవుట్ కాగా జట్టు 200 మార్క్ దాటింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) వైశాక్ (బి) స్టొయినిస్ 8; బెయిర్స్టో (సి) ఇన్గ్లిస్ (బి) వైశాక్ 38; తిలక్ వర్మ (సి) ప్రియాన్ష్ (బి) జేమీసన్ 44; సూర్యకుమార్ (సి) వధేరా (బి) చహల్ 44; హార్దిక్ పాండ్యా (సి) ఇన్గ్లిస్ (బి) అజ్మతుల్లా 15; నమన్ (సి) స్టొయినిస్ (బి) అజ్మతుల్లా 37; రాజ్ (నాటౌట్) 8; సాంట్నర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 203. వికెట్ల పతనం: 1–19, 2–70, 3–142, 4–142, 5–180, 6–197. బౌలింగ్: అర్‡్షదీప్ సింగ్ 4–0–44–0, జేమీసన్ 4–0–30–1, స్టొయినిస్ 1–0–14–1, అజ్మతుల్లా 4–0–43–2, వైశాక్ 3–0–30–1, చహల్ 4–0–39–1. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) హార్దిక్ (బి) అశ్వని 20; ప్రభ్సిమ్రన్ (సి) టాప్లీ (బి) బౌల్ట్ 6; ఇన్గ్లిస్ (సి) బెయిర్స్టో (బి) హార్దిక్ 38; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 87; వధేరా (సి) సాంట్నర్ (బి) అశ్వని 48; శశాంక్ (రనౌట్) 2; స్టొయినిస్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 4; మొత్తం (19 ఓవర్లలో 5 వికెట్లకు) 207. వికెట్ల పతనం: 1–13, 2–55, 3–72, 4–156, 5–173. బౌలింగ్: బౌల్ట్ 4–0–38–1, టాప్లీ 3–0– 40–0, బుమ్రా 4–0–40–0, అశ్వని 4–0–55–2, సాంట్నర్ 2–0–15–0, పాండ్యా 2–0–19–1. -
ENG VS WI 2nd ODI: 54వ సెంచరీ.. చరిత్ర సృష్టించిన జో రూట్
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ అంతర్జాతీయ క్రికెట్లో 54వ సెంచరీ, వన్డేల్లో 18వ సెంచరీని నమోదు చేశాడు. వెస్టిండీస్తో ఇవాళ (జూన్ 1) జరుగుతున్న రెండో వన్డేలో ఈ ఘనత సాధించాడు. సెంచరీ చేసే క్రమంలో రూట్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో 7000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 309 పరుగుల లక్ష్య ఛేదనలో రూట్ అజేయమైన సెంచరీతో ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. రూట్ సిక్సర్, బౌండరీతో సెంచరీ పూర్తి చేశాడు. 🚨 54th INTERNATIONAL HUNDRED FOR JOE ROOT 🚨- The Greatest England Batter ever. 🐐 pic.twitter.com/bs7uEjregH— Johns. (@CricCrazyJohns) June 1, 202538 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 226/5గా ఉంది. రూట్తో (117) పాటు విల్ జాక్స్ (35) క్రీజ్లో ఉన్నాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలవాలంటే 72 బంతుల్లో 83 పరుగులు చేయాల్సి ఉంది. ఛేదనలో ఇంగ్లండ్ ఆదిలో ఎదురుదెబ్బలు తినింది. ఓపెనర్లు జేమీ స్మిత్, బెన్ డకెట్ ఇద్దరూ డకౌట్ అయ్యారు. వన్డౌన్లో వచ్చిన రూట్ అజేయమైన సెంచరీతో విజయం దిశగా తీసుకెళ్తున్నాడు. హ్యారీ బ్రూక్ 47, జోస్ బట్లర్ 0, జేకబ్ బేతెల్ 17 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 2, జేడన్ సీల్స్, మాథ్యూ ఫోర్డ్, రోస్టన్ ఛేజ్ తలో వికెట్ తీశారు.అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 47.4 ఓవర్లలో 308 పరుగులకు ఆలౌటైంది. వన్డౌన్ బ్యాటర్ కీసీ కార్టీ సూపర్ సెంచరీతో (105 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 103 పరుగులు), ఓపెనర్ బ్రాండన్ కింగ్ (67 బంతుల్లో 59; 10 ఫోర్లు), నాలుగో నంబర్ ఆటగాడు షాయ్ హోప్ (66 బంతుల్లో 78; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ (10-0-63-4), సాకిబ్ మహమూద్ (9.4-0-37-3) చెలరేగగా.. బ్రైడన్ కార్స్, జేకబ్ బేతెల్, విల్ జాక్స్ తలో వికెట్ తీశారు.కాగా, విండీస్ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ల కోసం ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. తొలి వన్డేలో ఇంగ్లండ్ 238 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు (ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న ప్లేయర్లు)..విరాట్ కోహ్లి-82జో రూట్-54రోహిత్ శర్మ-49కేన్ విలియమ్సన్-48స్టీవ్ స్మిత్-48వన్డేల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు..జో రూట్-7000 (నాటౌట్)ఇయాన్ మోర్గాన్-6957ఇయాన్ బెల్-5416జోస్ బట్లర్-5196పాల్ కాలింగ్వుడ్-5092 -
IPL 2025 Qualifier 2, PBKS VS MI: మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటి..?
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (జూన్ 1) పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్కు వరుణుడు వరుస విరామాల్లో అడ్డుపడుతున్నాడు. షెడ్యూల్ ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కావాల్సి మ్యాచ్ 9 గంటల వరకు ప్రారంభం కాలేదు. 9 గంటల ప్రాంతంలో వర్షం జోరుగా కురుస్తుంది. 9:30 గంటల లోపు మ్యాచ్ ప్రారంభమైతేనే ఎలాంటి ఓవర్ల కోత లేకుండా మ్యాచ్ జరుగుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే ఓవర్ల కోత లేకుండా మ్యాచ్ జరిగేలా లేదు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ సమయంలో లేని వర్షం మ్యాచ్ ప్రారంభ సమయానికి జోరందుకుంది.మ్యాచ్ రద్దైతే ఏంటి పరిస్థితి..?ఒకవేళ ఈ మ్యాచ్ పూర్తిగా రద్దైతే పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉండటం చేత పంజాబ్ కింగ్స్ ఫైనల్కు చేరుతుంది. ప్లే ఆఫ్స్లో మ్యాచ్లకు రిజర్వ్ డే లేదు. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ అయినా జరుగుతుందేమో చూడాలి.ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. ముంబై తరఫున గ్లీసన్ స్థానంలో రీస్ టాప్లే.. పంజాబ్ తరఫున హర్ప్రీత్ బ్రార్ స్థానంలో చహల్ తుది జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు జూన్ 3న జరిగే ఫైనల్లో ఆర్సీబీతో తలపడనుంది.జట్ల వివరాలు..పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(w), శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్కుమార్ వైషాక్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ఇంపాక్ట్ సబ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, జేవియర్ బార్ట్లెట్, హర్ప్రీత్ బ్రార్ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, జానీ బెయిర్స్టో(w), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, రాజ్ బావా, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రీస్ టాప్లీఇంపాక్ట్ సబ్స్: అశ్వని కుమార్, కృష్ణన్ శ్రీజిత్, రఘు శర్మ, రాబిన్ మింజ్, బెవోన్ జాకబ్స్ -
సెంచరీల మోత మోగిస్తున్న విండీస్ బ్యాటింగ్ సంచలనం.. 4 ఇన్నింగ్స్ల్లో 3 సెంచరీలు
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో ఇవాళ (జూన్ 1) జరుగుతున్న రెండో వన్డేలో విండీస్ వన్డౌన్ ఆటగాడు కీసీ కార్టీ సూపర్ సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. కార్టీ 105 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 103 పరుగులు చేయడంతో 47.4 ఓవర్లలో 308 పరుగులకు ఆలౌటైంది. కార్టీతో పాటు ఓపెనర్ బ్రాండన్ కింగ్ (67 బంతుల్లో 59; 10 ఫోర్లు), నాలుగో నంబర్ ఆటగాడు షాయ్ హోప్ (66 బంతుల్లో 78; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించారు. విండీస్ ఇన్నింగ్స్లో జువెల్ ఆండ్రూ 0, షిమ్రోన్ హెట్మైర్ 4, జస్టిన్ గ్రీవ్స్ 22, మాథ్యూ ఫోర్డ్ 1, రోస్టన్ ఛేజ్ 0, గుడకేశ్ మోటీ 18, అల్జరీ జోసఫ్ 10 పరుగులకు ఔటయ్యారు. కార్టీ, హోప్ క్రీజ్లో ఉండగా విండీస్ ఇంకా భారీ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే ఇంగ్లండ్ బౌలర్లు ఆదిల్ రషీద్ (10-0-63-4), సాకిబ్ మహమూద్ (9.4-0-37-3) చెలరేగడంతో విండీస్ 308 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, జేకబ్ బేతెల్, విల్ జాక్స్ కూడా తలో వికెట్ తీశారు.కాగా, విండీస్ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ల కోసం ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. తొలి వన్డేలో ఇంగ్లండ్ 238 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 400 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో బెన్ డకెట్ (60), జో రూట్ (57), హ్యారీ బ్రూక్ (58), జేకబ్ బేతెల్ (82) అర్ద సెంచరీలతో చెలరేగగా.. జేమీ స్మిత్ (37), జోస్ బట్లర్ (37), విల్ జాక్స్ (39) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. విండీస్ బౌలర్లలో జేడెన్ సీల్స్ 4, అల్జరీ జోసఫ్, జస్టిన్ గ్రీవ్స్ తలో 2 వికెట్లు పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్.. ఇంగ్లండ్ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 26.2 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. సాకిబ్ మహమూద్, జేమీ ఓవర్టన్ తలో 3, ఆదిల్ రషీద్ 2, బ్రైడన్ కార్స్, జేకబ్ బేతెల్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్లో 11వ నంబర్ ఆటగాడు జేడెన్ సీల్స్ (29 నాటౌట్) టాప్ స్కోరర్గా కాగా.. షాయ్ హోప్ (25), కీసీ కార్టీ (22) 20కి పైగా పరుగులు చేశారు.గత తొమ్మిది ఇన్నింగ్స్ల్లో నాలుగో సెంచరీఇంగ్లండ్తో రెండో వన్డేలో సెంచరీతో మెరిసిన కీసీ కార్టీకి గత తొమ్మిది వన్డే ఇన్నింగ్స్ల్లో ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. 28 ఏళ్ల కార్తీ గత 10 ఇన్నింగ్స్ల్లో 4 సెంచరీలు, 2 అర్ద సెంచరీల సాయంతో 95కు పైగా సగటుతో 864 పరుగులు సాధించాడు. ఓవరాల్ కెరీర్లో 36 వన్డేలు ఆడిన కార్టీ 5 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీల సాయంతో 50కి పైగా సగటుతో 1403 పరుగులు చేశాడు.2nd ODI Vs ENG 103 (105)1st ODI Vs ENG 22 (26) 3rd ODI Vs IRE 170 (142) 2nd ODI Vs IRE 102 (109) 1st ODI Vs IRE 6 (15) 3rd ODI Vs BAN 95 (88) 2nd ODI Vs BAN 45 (47) 1st ODI Vs BAN 21 (37) 3rd ODI Vs ENG 128 (114) 2nd ODI Vs ENG 71 (77) -
PBKS VS MI, Qualifier 2 Updates: ముంబైపై పంజాబ్ విజయం
ఫైనల్లో పంజాబ్19 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించి ఫైనల్కు చేరిన పంజాబ్ కింగ్స్.ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్169 పరుగుల వద్ద పంజాబ్ తన 5వ వికెట్ (షశాంక్) కోల్పోయింది.నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్ 156 పరుగుల వద్ద పంజాబ్ తన 4వ వికెట్ (నెహాల్) కోల్పోయింది.మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్ 72 పరుగుల వద్ద పంజాబ్ తన 3వ వికెట్ (జోష్) కోల్పోయింది.రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్55 పరుగుల వద్ద పంజాబ్ తన 2వ వికెట్ (ప్రియాన్ష్) కోల్పోయింది.మొదటి వికెట్ కోల్పోయిన పంజాబ్3వ ఓవర్లో పంజాబ్ కింగ్స్ తన మొదటి వికెట్ కోల్పోయింది.పంజాబ్ టార్గెట్ 204 పరుగులుముంబై ఇండియన్స్ తమ నిర్ణీత 20 ఓవర్లలో 203 పరుగులు చేశారు. దాంతో పంజాబ్కు 204 పరుగులు టార్గెట్గా నిర్దేశించారు.ఆరో వికెట్ కోల్పోయిన ముంబైచివరి ఓవర్లో ముంబై ఇండియన్స్ 6వ వికెట్ కోల్పోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 203 పరుగులు చేశారుఐదో వికెట్ కోల్పోయిన ముంబై17.6వ ఓవర్- 180 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ ఐదో వికెట్ కోల్పోయింది. అజ్మతుల్లా బౌలింగ్లో హార్దిక్ పాండ్యా (15) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై14.1వ ఓవర్- 142 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. జేమీసన్ బౌలింగ్లో తిలక్ వర్మ (44) ఔటయ్యాడు. ధాటిగా ఆడుతున్న తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్తిలక్ వర్మ (43), సూర్యకుమార్ యాదవ్ (26) ధాటిగా ఆడుతున్నారు. ఫలితంగా ముంబై 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. రెండో వికెట్ కోల్పోయిన ముంబై6.6వ ఓవర్- 70 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. విజయ్ కుమార్ వైశాఖ్ బౌలింగ్లో జోస్ ఇంగ్లిస్కు క్యాచ్ ఇచ్చి జానీ బెయిర్స్టో (38) ఔటయ్యాడు. 5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ /1జానీ బెయిర్స్టో 24, తిలక్ వర్మ 13 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన ముంబై.. రోహిత్ ఔట్2.2వ ఓవర్- 19 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్ కోల్పోయింది. స్టోయినిస్ బౌలింగ్లో వైశాఖ్కు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ (8) ఔటయ్యాడు.రోహిత్ శర్మకు లైఫ్1.5వ ఓవర్- రోహిత్ శర్మకు రెండో ఓవర్లోనే లైఫ్ లభించింది. జేమీసన్ బౌలింగ్లో ఒమర్జాయ్ కాస్త కష్టతరమైన క్యాచ్ డ్రాప్ చేశాడు. 9:45 గంటలకు ప్రారంభమైన మ్యాచ్.. ఎలాంటి ఓవర్ల కోత లేదువర్షం కారణంగా 2 గంటల 15 నిమిషాలు ఆలస్యమైన మ్యాచ్ ఎట్టకేలకు 9:45 గంటలకు ప్రారంభమైంది. ఆలస్యంగా ప్రారంభమైనా ఓవర్లలో ఎలాంటి కోత లేదు. తొలి ఇన్నింగ్స్ 11:15 గంటల వరకు జరుగుతుంది. ఇన్నింగ్స్ విరామ సమయాన్ని 10 నిమిషాలకే కుదించారు. 11:25 గంటలకు సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభమవుతుంది. 12:55 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025లో ఇవాళ (జూన్ 1) క్వాలిఫయర్-2 మ్యాచ్ జరుగుతుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. ముంబై తరఫున గ్లీసన్ స్థానంలో రీస్ టాప్లే.. పంజాబ్ తరఫున చహల్ తుది జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు జూన్ 3న జరిగే ఫైనల్లో ఆర్సీబీతో తలపడనుంది.జట్ల వివరాలు..పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(w), శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్కుమార్ వైషాక్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ఇంపాక్ట్ సబ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, జేవియర్ బార్ట్లెట్, హర్ప్రీత్ బ్రార్ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, జానీ బెయిర్స్టో(w), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, రాజ్ బావా, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రీస్ టాప్లీఇంపాక్ట్ సబ్స్: అశ్వని కుమార్, కృష్ణన్ శ్రీజిత్, రఘు శర్మ, రాబిన్ మింజ్, బెవోన్ జాకబ్స్ -
విరాట్ కోహ్లికి అవమానం.. 18 నంబర్ జెర్సీ మరొకరికి కేటాయింపు
భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరైన విరాట్ కోహ్లికి అవమానం జరిగింది. టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత విరాట్ జెర్సీ నంబర్ 18ని మరొకరి కేటాయించారు. ఇంగ్లండ్ లయన్స్తో జరుగుతున్న మ్యాచ్లో భారత-ఏ జట్టు ఆటగాడు ముకేశ్ కుమార్ 18 నంబర్ జెర్సీని ధరించి కనిపించాడు. బీసీసీఐ ఏ ఉద్దేశంతో ముకేశ్కు ఈ జెర్సీ నంబర్ కేటాయించిందోతెలీదు కానీ, విరాట్ అభిమానులు మాత్రం ఈ విషయమై మండిపడుతున్నారు. ఇది తమ ఆరాధ్య ఆటగాడిని అవమానించినట్లే అని బీసీసీఐని టార్గెట్ చేస్తున్నారు.క్రికెట్లో దిగ్గజ ఆటగాళ్లకు సంబంధించిన జెర్సీ నంబర్లను ఇతరులకు కేటాయించకపోవడం ఆనవాయితీ. అయితే ఈ ఆనవాయితీకి బీసీసీఐ తూట్లు పొడిచింది. విరాట్ విషయంలో మొదటి నుంచి పట్టీపట్టనట్లుండే బీసీసీఐ మరోసారి దిగ్గజ ఆటగాడిని అవమానింది. టెస్ట్ల్లో టీమిండియాను తిరుగులేని శక్తిగా నిలబెట్టడంతో విరాట్ కీలకపాత్ర పోషించాడు. అతను కెప్టెన్గా ఉన్న సమయంలో భారత్ చాలాకాలం పాటు నంబర్ వన్ జట్టుగా కొనసాగింది. విరాట్ నాయకత్వంలో టీమిండియా అపురూప విజయాలు సాధించింది. వ్యక్తిగతంగానూ విరాట్కు టెస్ట్ల్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది.అలాంటి విరాట్కు టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించాక బీసీసీఐ కనీసం వీడ్కోలు సభ కూడా ఏర్పాటు చేయలేదు. సాధారణంగా దిగ్గజ ప్లేయర్లు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించినా సంబంధిత క్రికెట్ బోర్డులు వారిని గౌరవించుకుంటాయి. అయితే బీసీసీఐ అలాంటి ప్లాన్లు ఏమీ చేయకపోగా.. దిగ్గజ ఆటగాడిని అవమానిస్తుంది. విరాట్ జెర్సీ నంబర్ను ఇతరులకు కేటాయించడంపై విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు కూడా పెదవి విరుస్తున్నారు. భారత క్రికెట్కు విరాట్ ఎంతో చేశాడని, అతని జెర్సీని ఇతరులకు కేటాయించకపోవడం కనీస ధర్మమని అంటున్నారు.ఇదిలా ఉంటే, తొలుత టీ20లకు, ఆతర్వాత టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతను ఐపీఎల్ 2025తో బిజీగా ఉన్నాడు. విరాట్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్సీబీ ఈ సీజన్లో ఫైనల్కు చేరింది. ఈసారి టైటిల్ సాధించి ఐపీఎల్ కెరీర్కు ముగింపు పలకాలని విరాట్ భావిస్తున్నాడు. జూన్ 3న ఐపీఎల్ 2025 ఫైనల్ జరుగుతుంది. ఇవాళ (జూన్ 1) జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్లో (ముంబై వర్సెస్ పంజాబ్) విజేతతో ఆర్సీబీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది. -
ఐపీఎల్పై ఫిక్సింగ్ అనుమానాలు.. ఫైనల్ మ్యాచ్ పోస్టర్లో హార్దిక్ పాండ్యా
క్వాలిఫయర్-2 మ్యాచ్కు ముందు ఐపీఎల్ మేనేజ్మెంట్ విడుదల చేసిన ఓ పోస్టర్ వివాదాస్పదంగా మారింది. ఇందులో ఇదివరకే ఫైనల్కు చేరిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఫోటో ఐపీఎల్ ట్రోఫీకి ఓ పక్కన ఉండగా.. మరో పక్క ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా నీడను పోలిన ఇమేజ్ ఉంది. ఫైనల్ నేపథ్యంలో ఐపీఎల్ ఈ పోస్టర్ను రిలీజ్ చేసింది. ఓ బెర్త్ ఆర్సీబీ దక్కించుకుంది. మరో బెర్త్ ఎవరిదో అన్న క్వశ్చన్ మార్కుతో ఈ పోస్టర్ను విడుదల చేసింది.2⃣ teams. 1⃣ seat next to #RCB 💙❤Qualifier 2 has all the answers 🔥#TATAIPL | #TheLastMile pic.twitter.com/gJNtTajmVk— IndianPremierLeague (@IPL) June 1, 2025వాస్తవానికి రెండో ఫైనల్ బెర్త్ కోసం ఇవాళ (జూన్ 1) పోటీ (క్వాలిఫయర్-2) జరుగనుంది. ఈ పోటీలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు జూన్ 3న జరిగే ఫైనల్లో ఆర్సీబీతో తలపడుతుంది.అయితే క్వాలిఫయర్-2 మ్యాచ్ ఫలితం రాకుండానే ఐపీఎల్ మేనేజ్మెంట్ ఫైనల్ పోస్టర్పై హార్దిక్ పాండ్యా నీడను పోలిన ఇమేజ్ను పెట్టడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఫైనల్లో ఆర్సీబీతో తలపడబోయేది ముంబై ఇండియన్సే అని ఐపీఎల్ మేనేజ్మెంట్ క్లూ ఇచ్చిందని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఐపీఎల్ 2025 ఫిక్స్ అయ్యిందంటూ సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుంది.ఐపీఎల్ మేనేజ్మెంట్ ఫైనల్ పోస్టర్పై హార్దిక్ నీడను పోలిన ఇమేజ్ పెట్టడంతో పాటు నీలం రంగు గుండె సింబల్తో ఏమోజీని పెట్టింది. నీలం రంగు ముంబై ఇండియన్స్ జెర్నీని సూచిస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఫైనల్లో ఆర్సీబీతో తలపడబోయేది ముంబై ఇండియన్సే అని పరోక్షంగా సంకేతాలు అందుతున్నాయి.ఐపీఎల్ ఉద్దేశపూర్వకంగా చేసిందో ఏమో తెలీదు కానీ, ముంబై ఇండియన్స్కు ఫేవర్గా ఫైనల్ పోస్టర్ ఉండటం నెట్టింట దుమారాన్ని రేపుతుంది. ఐపీఎల్ ఫిక్స్ అయ్యిందంటూ ముంబై ఇండియన్స్ వ్యతిరేకులు ప్రచారం మొదలుపెట్టారు. ఐపీఎల్ యాజమాన్యం వ్యవహారశైలిపై పంజాబ్ కింగ్స్ అభిమానులు మండిపడుతున్నారు. ఐపీఎల్ మేనేజ్మెంట్ ముంబై ఇండియన్స్కు అనుకూలంగా, మాకు వ్యతిరేకంగా మైండ్ గేమ్ ఆడుతుందని అంటున్నారు.ఐపీఎల్పై జరుగుతున్న ఫిక్సింగ్ ప్రచారంలో నిజానిజాలెంతో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాలి. ఒకవేళ మ్యాచ్ నిజంగానే ఫిక్స్ అయ్యుంటే క్రికెట్ అభిమానులు ఈజీగా పట్టేస్తారు. ఇవాళ రాత్రి 7:30 గంటలకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. -
నిబంధనల అతిక్రమణ.. వెస్టిండీస్కు షాకిచ్చిన ఐసీసీ
మే 29న ఇంగ్లండ్తో వన్డే మ్యాచ్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న వెస్టిండీస్ జట్టుకు ఐసీసీ భారీ షాకిచ్చింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఆర్టికల్ 2.22 నిబంధనను ఉల్లంఘించినందుకు గానూ ఆ జట్టు ఆటగాళ్లకు జరిమానా విధించింది. ఆర్టికల్ 2.22 నిబంధన ఉల్లంఘణ స్లో ఓవర్ రేట్ పరిధిలోకి వస్తుంది. ఆ మ్యాచ్లో విండీస్ అదనపు సమయం ముగిసినా తమ కోటా ఓవర్లు (50) పూర్తి చేయలేకపోయింది. ఓ ఓవర్ వెనకపడింది. దీంతో ఐసీసీ మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో విండీస్ జట్టులోని ఆటగాళ్లందరికీ ఐదు శాతం మ్యాచ్ ఫీజ్ను జరిమానాగా విధించాడు. ఈ జరిమానాను విండీస్ జట్టు సభ్యులు సవాలు చేయకుండా స్వీకరించారు. సాధారణంగా నిర్ణీత సమయంలోగా కోటా ఓవర్లు పూర్తి చేయలేకపోతే ఓవర్కు ఐదు శాతం మ్యాచ్ ఫీజ్ను జరిమానాగా విధిస్తారు.ఇదిలా ఉంటే, మూడు వన్డేలు, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్లో పర్యటిస్తున్న వెస్టిండీస్ జట్టు మే 29న తొలి వన్డే ఆడింది. ఈ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్ 238 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 400 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో బెన్ డకెట్ (60), జో రూట్ (57), హ్యారీ బ్రూక్ (58), జేకబ్ బేతెల్ (82) అర్ద సెంచరీలతో చెలరేగగా.. జేమీ స్మిత్ (37), జోస్ బట్లర్ (37), విల్ జాక్స్ (39) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. విండీస్ బౌలర్లలో జేడెన్ సీల్స్ 4, అల్జరీ జోసఫ్, జస్టిన్ గ్రీవ్స్ తలో 2 వికెట్లు పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్.. ఇంగ్లండ్ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 26.2 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. సాకిబ్ మహమూద్, జేమీ ఓవర్టన్ తలో 3, ఆదిల్ రషీద్ 2, బ్రైడన్ కార్స్, జేకబ్ బేతెల్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్లో 11వ నంబర్ ఆటగాడు జేడెన్ సీల్స్ (29 నాటౌట్) టాప్ స్కోరర్గా కాగా.. షాయ్ హోప్ (25), కీసీ కార్టీ (22) 20కి పైగా పరుగులు చేశారు. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇవాళ (జూన్ 1) రెండో వన్డే జరుగుతుంది. -
తొలి మ్యాచ్లోనే ఇరగదీసిన సీఎస్కే చిచ్చరపిడుగు బ్రెవిస్
సీఎస్కే చిచ్చరపిడుగు డెవాల్డ్ బ్రెవిస్ ఇంగ్లండ్ టీ20 లీగ్లో (వైటాలిటి టీ20 బ్లాస్ట్ 2025) తన తొలి మ్యాచ్లోనే ఇరగదీశాడు. ఈ లీగ్లో హ్యాంప్షైర్కు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్రెవిస్.. ఎసెక్స్తో జరిగిన మ్యాచ్లో విధ్వంసకర అర్ద శతకంతో విరుచుకుపడ్డాడు. 32 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేశాడు. బ్రెవిస్తో పాటు టాబీ ఆల్బర్ట్ (54), జేమ్స్ విన్స్ (62) కూడా మెరుపు అర్ద శతకాలతో చెలరేగడంతో హ్యాంప్షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 230 పరుగుల భారీ స్కోర్ చేసింది. హ్యాంప్షైర్ ఇన్నింగ్స్లో హోవెల్ 11, జేమ్స్ ఫుల్లర్ 4, వెథర్లీ 3, టామ్ ప్రెస్ట్ 3 పరుగులకు ఔట్ కాగా.. లియామ్ డాసన్ 19, వుడ్ 1 పరుగుతో అజేయంగా నిలిచారు. ఎసెక్స్ బౌలర్లలో మహ్మద్ ఆమిర్, వాల్టర్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. సామ్ కుక్, హార్మర్, క్రిచ్లే తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఎసెక్స్ ఏమాత్రం పోరాడకుండానే చేతులెత్తేసింది. డాసన్ (4-0-26-4), స్టార్ కర్రీ (2.2-0-20-2) చెలరేగడంతో ఆ జట్టు 16.2 ఓవర్లలో 124 పరుగులకే చాపచుట్టేసింది. ఫుల్లర్, హోవెల్ కూడా తలో వికెట్ తీశారు. ఎసెక్స్ ఇన్నింగ్స్లో కైల్ పెప్పర్ ఒక్కడే అర్ద సెంచరీతో (51) రాణించాడు. రొస్సింగ్టన్ (18), వాల్టర్ (23) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. డీన్ ఎల్గర్ 0, క్రిచ్లీ 4, అల్లీసన్ 0, బెన్కెన్స్టెయిన్ 6, హార్మర్ 2, స్నేటర్ 5, ఆమిర్ 3 పరుగులకు ఔటయ్యారు.ఐపీఎల్ 2025లో అదరగొట్టిన బ్రెవిస్ఐపీఎల్ 2025లో లేట్గా రంగప్రవేశం చేసిన డెవాల్డ్ బ్రెవిస్ ఈ సీజన్లో ఆడిన ఆరు మ్యాచ్ల్లోనే తన తడాఖా చూపించాడు. ఈ మ్యాచ్లో అతను 180 స్ట్రయిక్రేట్తో రెండు హాఫ్ సెంచరీల సాయంతో 225 పరుగులు చేశాడు. ఈ సీజన్లో బ్రెవిస్ ఆడిన ఇన్నింగ్స్లు వచ్చే సీజన్లో సీఎస్కే ప్రయాణానికి జీవం పోశాయి. బ్రెవిస్ను ఈ సీజన్లో సీఎస్కే రీప్లేస్మెంట్ ఆటగాడిగా తీసుకుంది. రూ.3 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ సీజన్లో సీఎస్కే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. -
ఎంపీతో రింకూ సింగ్ ఎంగేజ్మెంట్.. ఎప్పుడంటే?
టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ ప్రియా సరోజ్ను రింకూ పెళ్లిచేసుకోనున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరి నిశ్చితార్థం జూన్ 8న జరగనుంది. వీరి ఎంగేజ్మెంట్ కార్యక్రమం లక్నోలోని ఓ ఫైవ్ స్టార్ హాటల్లో జరగనుంది. అదేవిధంగా రింకూ సింగ్, ప్రియా సరోజ్ నవంబర్లో వివాహం చేసుకోనున్నారు. వారి పెళ్లి వారణాసిలో నవంబర్ 18న హోటల్ తాజ్లో గ్రాండ్గా జరగనుంది. ఈ విషయాన్ని రింకూ సింగ్ సన్నిహితులు వెల్లడించారు. కాగా వీరిద్దరి పెళ్లి అంశం ఈ ఏడాది జనవరిలో తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని ప్రియా తండ్రి, సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే తూఫానీ సరోజ్ ధృవీకరించారు. రింకూ, ప్రియాల పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయని ఆయన తెలిపారు. కాగా 27 ఏళ్ల రింకూ భారత టీ20 జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఈ యూపీ క్రికెటర్ టీమిండియా తరపున 30 టీ20లు, రెండు వన్డేలు ఆడాడు. అదేవిధంగా 26 ఏళ్ల ప్రియా ప్రస్తుతం ఉత్తర్ప్రదేశ్లోని మచ్లిషెహర్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. ప్రియా సరోజ్ ఎంపీ మాత్రమే కాకుండా ఆమె న్యాయవాది వృత్తిలో కూడా కొనసాగుతున్నారు.చదవండి: IND vs ENG: 'కోహ్లిని ముందే హెచ్చరించారు.. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాడు' -
ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ ఎంట్రీ
కార్డిఫ్ వేదికగా వెస్టిండీస్తో రెండో వన్డేలో తలపడేందుకు ఇంగ్లండ్ సిద్దమైంది. ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ జామీ ఓవర్టన్ చేతి వేలి గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. దీంతో ప్లెయింగ్ ఎలెవన్లో అతడి స్ధానంలో పేసర్ మాథ్యూ పాట్స్కు ఛాన్స్ లభించింది. ఈ ఒక్క మార్పు మినహా తొలి వన్డేలో ఆడిన జట్టునే ఇంగ్లండ్ కొనసాగించింది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో పర్యాటక విండీస్ను 238 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టు ఓడించింది.ఇప్పుడు రెండో వన్డేలోనూ అదే జోరును కొనసాగించాలని హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఇంగ్లండ్ భావిస్తోంది. బ్రూక్ సేన బ్యాటింగ్, బౌలింగ్లో పటిష్టంగా కన్పిస్తోంది. బ్యాటింగ్లో స్మిత్, రూట్, డకెట్, బట్లర్, బెథల్ వంటి బ్యాటర్లు అద్బుతమైన ఫామ్లో ఉండగా.. బౌలింగ్లో షోయబ్ మహమూద్, బ్రైడన్ కార్స్ వంటి స్టార్ పేసర్లు ఉన్నారు.మరోవైపు విండీస్ జట్టు ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేయాలని భావిస్తోంది. అయితే వెస్టిండీస్ టీమ్లో షాయ్ హోప్, కార్టీ, సీల్స్ మినహా మిగితా ఎవరూ చెప్పుకోదగ్గ ఫామ్లో లేరు. కనీసం రెండో వన్డేలోనైనా కరేబియన్ వీరులు చెలరేగుతారో లేదో వేచి చూడాలి.రెండో వన్డేకు ఇంగ్లండ్ తుది జట్టుబెన్ డకెట్, జేమీ స్మిత్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జాకబ్ బెథెల్, విల్ జాక్స్, బ్రైడాన్ కార్స్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్. -
'కోహ్లిని ముందే హెచ్చరించారు.. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాడు'
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆకస్మిక టెస్టు రిటైర్మెంట్పై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్తో సిరీస్ మొత్తం ఆడేందుకు తనకు అవకాశమివ్వమని సెలక్టర్లు చెప్పడంతోనే కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించాడని పనేసర్ అభిప్రాయపడ్డాడు. కాగా భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్కు ఇప్పటికే భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత కొత్త టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ ఎంపికయ్యాడు. టెస్టు జట్టులో యువ ఆటగాళ్లు సాయిసుదర్శన్, అర్ష్దీప్ సింగ్ తొలిసారి చోటు దక్కించుకున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి సీనియర్ ఆటగాళ్లు లేకుండా యువ భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలో గిల్ సేన ఇంగ్లండ్ వంటి కఠిన పరిస్థితుల్లో ఎలా రాణిస్తుందో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు."ఇంగ్లండ్ పర్యటనకు విరాట్ కోహ్లి వస్తాడని నేను అనుకున్నాను. ఇంగ్లండ్ జట్టు సభ్యులు కూడా కోహ్లి ఆడుతాడని ఆశించారు. కానీ కోహ్లి సడన్గా రిటైర్మెంట్ ప్రకటించడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఇంగ్లండ్ వంటి కఠిన సిరీస్ నుంచి కోహ్లి కావాలనే బయటపడ్డాడని అన్పిస్తోంది.ఎందుకంటే గత కొన్నేళ్లగా వైడ్ ఆప్ స్టంప్ సమస్యను కోహ్లి అధిగమించలేకపోతున్నాడు. టెస్టు క్రికెట్లో పదేపదే అదే బంతులకు కోహ్లి ఔట్ అవుతున్నాడు. బహుశా ఇది అతడి మైండ్లో ఉండవచ్చు. అదేవిధంగా సెలక్టర్లు కూడా కోహ్లితో ఓ విషయం చర్చించి ఉంటారు అని అనుకుంటున్నాను. తొలి రెండు టెస్టుల్లో బాగా రాణించకపోతే, మిగిలిన మూడు మ్యాచ్లకు దూరంగా ఉండాల్సి వస్తుందని సెలక్టర్లు చెప్పి ఉండొచ్చు. ఇవన్నీ ఆలోంచాకే కోహ్లి తన నిర్ణయాన్ని ప్రకటించాడు" అని హిందుస్థాన్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.చదవండి: బీసీసీఐ చైర్మెన్గా రాజీవ్ శుక్లా..? -
బీసీసీఐ చైర్మెన్గా రాజీవ్ శుక్లా..?
భారత క్రికెట్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఈ ఏడాది జూలైలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) చెర్మైన్ పదవి నుంచి రోజర్ బిన్నీ తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ రూల్స్ ప్రకారం.. 70 ఏళ్ల నిండిన తర్వాత ఆఫీసు బేరర్లు తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది.ఈ ఏడాది జూలై 19తో బిన్నీ70 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఈ క్రమంలో రోజర్ తనంతట తానే అధ్యక్షుడి పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు బీసీసీఐ వర్గాలు క్రిక్బ్లాగర్కు తెలిపాయి. అతని స్దానంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లా బోర్డు తాత్కాలిక చైర్మెన్గా బాధ్యతలు చేపట్టనున్నట్లు క్రిక్బ్లాగర్ తమ కథనంలో పేర్కొంది. ఈ విషయంపై బోర్డులో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. 1983 వరల్డ్కప్ విజేతైన రోజర్ బిన్నీ.. 2022లో గంగూలీ స్ధానంలో బీసీసీఐ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టారు. ఆయన దాదాపు మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగారు. ఇక రాజీవ్ శుక్లా చాలా ఏళ్ల నుంచి భారత క్రికెట్తో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లా గతంలో ఐపీఎల్ చైర్మెన్గా కూడా పనిచేశారు. త్వరలో జరగనున్న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో శుక్లా ఎంపికను అధికారికంగా ప్రకటించే అవకాశముంది.చదవండి: IPL 2025 Qualifier 2: పంజాబ్కు గుడ్ న్యూస్.. ముంబైకి బ్యాడ్ న్యూస్? -
IPL 2025 Qualifier 2: పంజాబ్కు గుడ్ న్యూస్.. ముంబైకి బ్యాడ్ న్యూస్?
ఐపీఎల్-2025లో క్వాలిఫయర్-2కు సమయం అసన్నమైంది. ఆదివారం సెకెండ్ క్వాలిఫయర్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ కీలక మ్యాచ్కు పంజాబ్ కింగ్స్కు గుడ్ న్యూస్ అందింది. గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్లకు దూరమైన యుజ్వేంద్ర చాహల్.. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. దీంతో క్వాలిఫయర్-2కు చాహల్ అందుబాటులో ఉండనున్నాడని రేవ్స్పోర్ట్స్ తమ రిపోర్ట్లో పేర్కొంది. కాగా చాహల్ గాయం నుంచి కోలుకుపోవడం పంజాబ్కు కలిసొచ్చే ఆంశంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్లో చాహల్ పంజాబ్ జట్టుకు ప్రధాన స్పిన్నర్గా ఉన్నాడు. ఓ హ్యాటిక్ కూడా అతడి ఖాతాలో ఉంది. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడిన చాహల్.. 9.56 ఏకానమితో 14 వికెట్లు పడగొట్టాడు.చాహర్ డౌటే..మరోవైపు ఈ మ్యాచ్కు కూడా ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ దీపక్ చాహర్ అందుబాటులో ఉండేది అనుమానమే. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న చాహర్.. ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించనట్లు తెలుస్తోంది. ఈ రైట్ ఆర్మ్ పేసర్ కోచింగ్ స్టాప్, కోచ్ మహేల జయవర్ధనేతో కలిసి ఫిట్నెస్ కసరత్తులు చేస్తున్నట్లు రేవ్స్పోర్ట్స్ తమ కథనంలో రాసుకొచ్చింది. కానీ అతడు ఇంకా కుంటుతున్నట్లు సదరు వెబ్సైట్ రాసుకొచ్చింది. ఒకవేళ ఈ మ్యాచ్కు చాహర్ దూరమైతే.. యువ పేసర్ అశ్వినీ కుమార్కు మరోసారి అవకాశం లభించనుంది.తుది జట్లు(అంచనా)పంజాబ్ కింగ్స్ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్ప్రీత్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, కైల్ జామీసన్, చాహల్ముంబై ఇండియన్స్రోహిత్ శర్మ, జానీ బెయిర్స్టో (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రిచర్డ్ గ్లీసన్ -
కరుణ్ డబుల్ సెంచరీ.. తొలి ఇన్నింగ్స్లో భారత్-ఎ భారీ స్కోర్
కాంటర్బరీ వేదికగా ఇంగ్లండ్ లయన్స్తో జరుగుతున్న మొదటి అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ జట్టు భారీ స్కోరు చేసింది. దేశవాళీల్లో నిలకడైన ప్రదర్శన కనబర్చి ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన కరుణ్ నాయర్ చక్కటి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. కరుణ్ నాయర్ 281 బంతుల్లో 26 ఫోర్లు, ఒక సిక్సర్తో 204 పరుగులు చేశాడు. ఓవర్నైట్ స్కోరు 409/3తో శనివారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘ఎ’ చివరకు 125.1 ఓవర్లలో 557 పరుగులకు ఆలౌటైంది.వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురేల్ (120 బంతుల్లో 94; 11 ఫోర్లు, 1 సిక్స్) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆ్రస్టేలియా పర్యటనలో అదరగొట్టిన ఆంధ్రప్రదేశ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (7) విఫలమయ్యాడు. శార్దుల్ ఠాకూర్ (27), హర్ష్ దూబే (32), అన్షుల్ కంబోజ్ (23) తలా కొన్ని పరుగులు చేశారు. ఇంగ్లండ్ లయన్స్ బౌలర్లలో జోష్ హాల్, జమాన్ అక్తర్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ లయన్స్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 52 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. టామ్ హైన్స్ (147 బంతుల్లో 103 నాటౌట్; 11 ఫోర్లు) అజేయ సెంచరీతో ఆకట్టుకోగా... మ్యాక్స్ హోల్డెన్ (61 బంతుల్లో 64 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. ఎమిలియో (46) ఫర్వాలేదనిపించాడు. బ్యాటింగ్లో సత్తాచాటిన భారత ‘ఎ’ ఆటగాళ్లు... బౌలింగ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో ఇంగ్లండ్ లయన్స్ ప్లేయర్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు.అన్షుల్ కంబోజ్, హర్ష్ దూబే చెరో వికెట్ పడగొట్టగా... ముకేశ్ కుమార్, హర్షిత్ రాణా భారీగా పరుగులు ఇచ్చుకున్నారు. బ్యాటింగ్లో ఆకట్టుకోలేకపోయిన నితీశ్ రెడ్డి బౌలింగ్లో 3 ఓవర్లే వేసి 27 పరుగులు సమరి్పంచుకున్నాడు. నాలుగు రోజుల ఈ పోరులో... చేతిలో 8 వికెట్లు ఉన్న ఇంగ్లండ్ లయన్స్ జట్టు భారత్ ‘ఎ’ స్కోరుకు ఇంకా 320 పరుగులు వెనుకబడి ఉంది. టామ్ హైన్స్, హోల్డన్ క్రీజులో ఉన్నారు. మూడో రోజు భారత బౌలర్లు ఎలాంటి ప్రభావం కనబరుస్తారో చూడాలి.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్ టూర్.. టీమిండియా మేనేజర్గా యుధ్వీర్ -
ఇంగ్లండ్ టూర్.. టీమిండియా మేనేజర్గా యుధ్వీర్
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటనలో భారత క్రికెట్ జట్టు మేనేజర్గా యుధ్వీర్ సింగ్ ఎంపికయ్యాడు. ఈ నెల 20 నుంచి టీమిండియా ఇంగ్లండ్తో 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ టూర్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) యు«ద్వీర్ను మేనేజర్గా ఎంపిక చేసింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ క్రికెట్ సంఘం (యూపీసీఏ) కార్యదర్శిగా పనిచేస్తున్న యుధ్వీర్... గతంలో యూపీసీఏ అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. క్రికెట్ వ్యవహారాల్లో అతడికి విశేష అనుభవం ఉందని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. ఈ సిరీస్ కోసం సెలెక్షన్ కమిటీ ఇప్పటికే జట్టును ప్రకటించగా... యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ను కెప్టెన్గా ఎంపిక చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్టు ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో గిల్ సారథ్యంలోని యువ జట్టు ఈ సిరీస్లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2025–27 సీజన్ను భారత జట్టు ఇదే సిరీస్తో ప్రారంభించనుంది.చదవండి: పది మందికి రూ. 1 కోటికి పైగా... -
MI Vs PBKS: ఫైనల్ చేరేదెవరో!
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఇప్పటికే ఫైనల్ చేరగా... రెండో ఫైనలిస్ట్ను తేల్చే సమరానికి సమయం ఆసన్నమైంది. ఆదివారం క్వాలిఫయర్–2లో ముంబై ఇండియన్స్తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. క్వాలిఫయర్–1లో బెంగళూరు చేతిలో ఘోర పరాజయం ఎదుర్కొన్న పంజాబ్... ఈ పోరులో సత్తా చాటి ఫైనల్లో మరోసారి బెంగళూరును ఎదుర్కోవాలని భావిస్తోంది. మరో వైపు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి... ఎలిమినేటర్లో గుజరాత్ టైటాన్స్ను చిత్తుచేసిన ముంబై ఇదే జోరులో పంజాబ్పై గెలిచి ఫైనల్ చేరాలని పట్టుదలగా ఉంది. క్వాలిఫయర్–1లో టాపార్డర్ విఫలమవడంతో పంజాబ్ 101 పరుగులకే పరిమితమై ఘోర ఓటమి మూటగట్టుకోగా... ఎలిమినేటర్లో గుజరాత్ బౌలింగ్ను ఓ ఆటాడుకుంటూ ముంబై భారీ స్కోరు చేసింది. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో పంజాబ్ విజయం సాధించింది. ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ సమష్టి ప్రదర్శన ముందు... ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన పంజాబ్ కింగ్స్ ఏమాత్రం నిలుస్తుందో చూడాలి! టాపార్డర్ రాణిస్తేనే... ఈ సీజన్లో ఆడిన 15 మ్యాచ్ల్లో ఏడింట రెండొందల పైచిలుకు స్కోర్లు చేసిన పంజాబ్ జట్టు... టాపార్డర్ ప్రదర్శనపై అతిగా ఆధారపడుతోంది. అన్క్యాప్డ్ ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య నిలకడకు ఇన్గ్లిస్, శ్రేయస్ మెరుపులు తోడవడంతో పంజాబ్ వరస విజయాలు సాధించగలిగింది. అయితే సొంతగడ్డపై జరిగిన క్వాలిఫయర్–1లో మాత్రం ఈ నలుగురు మూకుమ్మడిగా విఫలమవడంతో... జట్టు మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఐపీఎల్లో మూడు వేర్వేరు జట్లను ‘ప్లే ఆఫ్స్’కు చేర్చిన శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి... రికీ పాంటింగ్ వ్యూహాలు తోడవడంతో ఈ సీజన్లో పంజాబ్ పట్టికలో అగ్ర స్థానం దక్కించుకోగలిగింది. దీంతోనే క్వాలిఫయర్–1లో ఓడినా... ఫైనల్ చేరేందుకు మరో అవకాశం దక్కింది. ఈ సీజన్లో ప్రభ్సిమ్రన్ 517 పరుగులతో పంజాబ్ తరఫున అత్యధిక పరుగులు సాధించగా... శ్రేయస్ 516, ప్రియాన్ష్ 431 పరుగులు చేశారు. ఈ ముగ్గురితో పాటు ఇన్గ్లిస్, నేహల్, శశాంక్, స్టొయినిస్ సత్తాచాటాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. గాయం కారణంగా గత మూడు మ్యాచ్ల్లో బరిలోకి దిగని స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఈ మ్యాచ్ ఆడటం ఖాయమే. బౌలింగ్లో అర్ష్ దీప్ సింగ్, అజ్మతుల్లా, జెమీసన్, హర్ప్రీత్ బ్రార్ కీలకం కానున్నారు. గత మ్యాచ్ తప్పిదాలను సరిదిద్దుకోకపోతే... 11 ఏళ్ల తర్వాత ‘ప్లే ఆఫ్స్’కు చేరిన పంజాబ్ ఇక్కడితోనే ప్రయాణాన్ని ముగించాల్సి ఉంటుంది. బుమ్రానే ప్రధాన తేడా! ఐపీఎల్ నాకౌట్స్లో అపార అనుభవం ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు మరోసారి కలిసికట్టుగా కదంతొక్కి ఆరో టైటిల్ వేటకు చేరాలని చూస్తోంది. పలువురు ఆటగాళ్ల సేవలు కోల్పోయినా... వారి స్థానాలను భర్తిచేసే ఆటగాళ్లు ఉండటం ముంబైకి కలిసి రానుంది. లీగ్ దశ ముగిసిన తర్వాత రికెల్టన్, విల్ జాక్స్ జట్టును వీడినా... గత మ్యాచ్లో తొలిసారి ముంబై జట్టుకు ప్రాతనిధ్యం వహించిన జానీ బెయిర్స్టో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు.హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ కూడా టచ్లోకి రావడం ముంబై బ్యాటింగ్ బలాన్ని మరింత పెంచింది. రోహిత్, బెయిర్స్టో జట్టుకు శుభారంభం అందిస్తుంటే... సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్కు వెన్నెముకలా నిలుస్తున్నాడు. ఈ సీజన్లో 673 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. ఆలస్యంగా వేగం పుంజుకున్న రోహిత్ 410 పరుగులు చేయగా... హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్ ఫినిషర్ల పాత్ర పోషిస్తున్నారు. గాయం కారణంగా ఈ మ్యాచ్కు కూడా దీపక్ చహర్ అందుబాటులో ఉండటం కష్టమే కాగా... గత మ్యాచ్ చివర్లో కండరాలు పట్టేసిన గ్లీసన్ బరిలోకి దిగుతాడా లేదా చూడాలి. ఇరు జట్ల మధ్య ప్రధాన తేడా బుమ్రా కానున్నాడు. ఆశలే లేని స్థితిలో సైతం తన అద్భుత బౌలింగ్తో మ్యాచ్ను మలుపుతిప్పగల సామర్థ్యం ఉన్న బుమ్రాను... పంజాబ్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం. తుది జట్లు (అంచనా) పంజాబ్ కింగ్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ప్రభ్సిమ్రన్, ప్రియాన్ష్ ఆర్య, జోస్ ఇన్గ్లిస్, నేహల్, శశాంక్, స్టొయినిస్, అజ్మతుల్లా, హర్ప్రీత్ బ్రార్, జెమీసన్, చాహల్, అర్ష్ దీప్. ముంబై ఇండియన్స్: హార్దిక్ (కెప్టెన్), రోహిత్ శర్మ, బెయిర్స్టో, సూర్యకుమార్, తిలక్ వర్మ, నమన్, సాంట్నర్, రాజ్ బావా, గ్లీసన్, బుమ్రా, బౌల్ట్, అశ్వని కుమార్. పిచ్, వాతావరణం ఈ సీజన్లో అహ్మదాబాద్లో ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఆరింట మొదట బ్యాటింగ్ చేసిన జట్లు విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో టాస్ కీలక పాత్ర పోషించవచ్చు. మ్యాచ్కు వర్షం ముప్పులేదు. ఐపీఎల్లో నేడు (క్వాలిఫయర్–2)పంజాబ్ X ముంబైవేదిక: అహ్మదాబాద్రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో -
డబుల్ సెంచరీతో చెలరేగిన కరుణ్ నాయర్..
ఇంగ్లండ్ పర్యటనను టీమిండియా వెటరన్ ఆటగాడు కరుణ్ నాయర్ ఘనంగా ఆరంభించాడు. కాంటర్బరీ వేదికగా ఇంగ్లండ్ లయన్స్తో జరుగుతున్న తొలి అనాధికారిక-ఎ టెస్టులో కరుణ్ నాయర్.. భారత-ఎ జట్టు తరపున అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన నాయర్.. 272 బంతుల్లో తన డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 26 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఓవరాల్గా 204 పరుగులు చేసి ఔటయ్యాడు. నాయర్కు ఇది నాలుగో ఫస్ట్ క్లాస్ ద్విశతకం కావడం గమనార్హం.కోహ్లి వారసుడు ఫిక్స్..?కాగా విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించడంతో టెస్టుల్లో అతడి స్దానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న చర్చ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో నడుస్తోంది. కొంతమంది సాయిసుదర్శన్ పేరును సూచిస్తుంటే.. మరి కొంతమంది కరుణ్ నాయర్ను పేరును చెబుతున్నారు.ఇటువంటి సమయంలో కోహ్లి స్ధానానికి తనే సరైనోడనని నాయర్ డబుల్ సెంచరీతో చాటుకున్నాడు. కాగా కరుణ్ నాయర్ 8 ఏళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. దేశవాళీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన చేస్తుండడంతో నాయర్కు సెలక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు. నాయర్ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. రంజీ ట్రోఫీ 2024-25లో విదర్భ ఛాంపియన్గా నిలవడంలో కరుణ్ది కీలక పాత్ర. ఈ టోర్నీలో 16 ఇన్నింగ్స్లలో 53.93 సగటుతో 863 పరుగులు చేసి నాలుగో టాప్ స్కోరర్గా నిలిచాడు. నాయర్ చివరసారిగా భారత జట్టు తరపున 2017లో ఆడాడు. కాగా వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడిగా కరుణ్ నాయర్ కొనసాగుతున్నాడు.భారీ స్కోర్ దిశగా భారత్-ఎఇక అనాధికరిక టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్-ఎ జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకువెళ్తోంది. 112 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 510 పరుగులు చేసింది. భారత బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్(92), ధ్రువ్ జురెల్(94) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. -
Qualifier 2 PBKS vs MI: అలా జరిగితే ముంబై ఇండియన్స్ ఇంటికే?
ఐపీఎల్-2025లో క్వాలిఫయర్-2కు రంగం సిద్దమైంది. జూన్ 1(ఆదివారం) జరగనున్న సెకెండ్ క్వాలిఫయర్లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. 2014 తర్వాత తొలిసారి ఫైనల్కు చేరుకునేందుకు పంజాబ్ ప్రయత్నిస్తుండగా.. ముంబై ఇండియన్స్ ఆరో ఐపీఎల్ టైటిల్ లక్ష్యంగా పెట్టుకుంది.క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్లకు మొహాలీలోని ముల్లాన్పూర్ స్టేడియం ఆతిథ్యమివ్వగా.. ఇప్పుడు క్వాలిఫయర్-2, ఫైనల్ మ్యాచ్లు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్నాయి.క్వాలిఫయర్-2 రద్దు అయితే?ఇక క్వాలిఫయర్-2 మ్యాచ్ వర్షం లేదా ఏదైనా కారణం వల్ల రద్దు అయితే ఏంటి పరిస్థితి అని ఇరు జట్ల అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. ఈ మ్యాచ్కు బీసీసీఐ రిజర్వ్ డే కేటాయించలేదు. దీంతో వర్షం లేదా వేరే ఇతర కారణం చేత మ్యాచ్ రద్దు అయితే.. పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉన్న జట్టు ఫైనల్కు ఆర్హత సాధిస్తోంది. అంటే పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో ఉన్న పంజాబ్ కింగ్స్ ఫైనల్లో అడుగుపెడుతోంది. ముంబై పాయింట్ల టేబుల్లో నాలుగో స్ధానంలో ఉంది. అయితే వర్షం ముప్పు పొంచిలేదు. వెధర్.కామ్ ప్రకారం.. 24 శాతం మాత్రమే వర్షం పడేందుకు ఆస్కారం ఉంది. దీంతో మ్యాచ్ సజావుగా జరిగనుంది. కాగా ఫైనల్ మ్యాచ్ మాత్రం బీసీసీఐ రిజర్వ్ డే కేటాయించింది. జూన్ 3న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.తుది జట్లు(అంచనా)ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, జానీ బెయిర్స్టో (వికెట్కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రిచర్డ్ గ్లీసన్ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హేజిల్వుడ్, సుయాష్ శర్మచదవండి: రిలాక్స్.. నా పని నాకు బాగా తెలుసు: కోచ్ మాట వినని బుమ్రా -
రిలాక్స్.. నా పని నాకు బాగా తెలుసు: కోచ్ మాట వినని బుమ్రా
ఐపీఎల్-2025 సీజన్ ఫైనల్కు చేరేందుకు ముంబై ఇండియన్స్ అడుగు దూరంలో నిలిచింది. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్లో గుజరాత్ టైటాన్స్ను 20 పరుగుల తేడాతో ఓడించిన ముంబై.. క్వాలిఫయర్-2కు ఆర్హత సాధించింది. ఆదివారం జరగనున్న సెకెండ్ క్వాలిఫయర్లో పంజాబ్ కింగ్స్తో హార్దిక్ సేన అమీతుమీ తెల్చుకోనుంది. కాగా ఎలిమినేటర్లో ముంబై విజయం సాధించడంలో పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాది కీలక పాత్ర.తీవ్ర ఒత్తిడిలో కూడా బుమ్రా తన అద్భుత బౌలింగ్తో ముంబైను గెలుపు తీరాలకు చేర్చాడు. 229 భారీ లక్ష్య చేధనలో పవర్ ప్లేలోనే కెప్టెన్ శబ్మన్ గిల్, మెండిస్ వికెట్లను గుజరాత్ కోల్పోయినప్పటికి.. సాయిసుదర్శన్(80), వాషింగ్టన్ సుందర్(48) ముంబై బౌలర్లపై విరుచుపడ్డారు.వీరిద్దరూ దూకుడుగా ఆడుతూ గుజరాత్ను లక్ష్యానికి చేరువ చేశారు. సుందర్, సాయి విధ్వంసం ఫలితంగా టైటాన్స్ 13 ఓవర్లలో 150 పరుగుల మార్క్కు చేరువైంది. దీంతో ముంబై డౌగట్తో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. 14 ఓవర్ వేసేందుకు బుమ్రాను తిరిగి ఎటాక్లో తీసుకొచ్చాడు. కెప్టెన్ నమ్మకాన్ని బుమ్బుమ్ బుమ్రా వమ్ము చేయలేదు. ఆ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ను బుమ్రా అద్బుతమైన యార్కర్తో క్లీన్ బౌల్డ్ చేశాడు. సుందర్ ఔటైనప్పటికి, క్రీజులో ఇంకా ఇన్ఫామ్ బ్యాటర్ సుదర్శన్ ఉండడంతో ముంబై కోచింగ్ స్టాఫ్ తీవ్ర ఒత్తిడిలో కన్పించారు. బౌండరీ లైన్ వద్దకు హెడ్కోచ్ జయవర్ధనే, కీరన్ పొలార్డ్ వచ్చి ఫీల్డర్లకు, బౌలర్లకు పదేపదే తమ సూచనలను పంపారు.కోచ్ మాట వినని బుమ్రా..ఈ క్రమంలో జయవర్దనే బౌండరీ లైన్ దగ్గర బుమ్రాకు ఏదో చెబుతుండగా అతడు విన్పించుకోలేదు. "ప్రశాంతంగా ఉండండి, నా పని నాకు తెలుసు. నేను చూసుకుంటా అని బుమ్రా అన్నట్లు హిందీ కామెంటేటర్ జతిన్ సప్రు వ్యాఖ్యనించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: ముంబై చేతిలో ఓటమి.. కన్నీరు పెట్టుకున్న గిల్ సోదరి! వీడియో వైరల్ -
రషీద్ ఖాన్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
రషీద్ ఖాన్.. ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా పేరు గాంచాడు. తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధులను ముప్పు తిప్పలు పెట్టే సత్తా ఉన్నోడు రషీద్. కానీ ఐపీఎల్-2025లో మాత్రం రషీద్ తన మార్క్ను చూపించలేకపోయాడు. ఈ ఏడాది సీజన్లో అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ దారుణంగా విఫలమయ్యాడు.ప్రతీ మ్యాచ్లోనూ భారీగా పరుగులు సమర్పించుకుంటూ జట్టుకు భారంగా మారాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్తో జరిగిన ఎలిమినేటర్లోనూ అదే తీరును కనబరిచాడు. తన నాలుగు ఓవర్లలో కోటాలో వికెట్ ఏమీ తీయకుండా 31 పరుగులు ఇచ్చాడు. ఓవరాల్గా ఈ ఏడాది సీజన్లో 15 మ్యాచ్లు ఆడిన రషీద్.. 9.34 ఏకానమితో కేవలం 9 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.రషీద్ ఖాన్ చెత్త రికార్డు..ఈ క్రమంలో రషీద్ ఖాన్ అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న బౌలర్గా రషీద్ ఆప్రతిష్టను మూటకట్టుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో రషీద్ ఏకంగా 33 సిక్సర్లు ఇచ్చాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ పేరిట ఉండేది. 2022 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తూ సిరాజ్ 31 సిక్సర్లు ఇచ్చాడు. తాజా మ్యాచ్లో రెండు సిక్సర్లు ఇచ్చిన రషీద్.. సిరాజ్ను అధిగమించాడు. వీరిద్దరి తర్వాత స్ధానాల్లో చాహల్(30), హసరంగా(30),బ్రావో ఉన్నారు. కాగా ఎలిమినేటర్ మ్యాచ్లో 20 పరుగుల తేడాతో గుజరాత్ ఓటమి పాలైంది.చదవండి: అదే మా కొంపముంచింది.. అతడు మాత్రం నిజంగా అద్బుతం: గిల్ -
ముంబై చేతిలో ఓటమి.. కన్నీరు పెట్టుకున్న గిల్ సోదరి! వీడియో వైరల్
ఐపీఎల్-2025 సీజన్లో గుజరాత్ టైటాన్స్ కథ ముగిసింది. శుక్రవారం ముంబై ఇండియన్స్తో జరిగిన ఎలిమినేటర్లో 20 పరుగుల తేడాతో గుజరాత్ ఓటమి పాలైంది. దీంతో ఈ మెగా ఈవెంట్ నుంచి గుజరాత్ నిష్కమ్రించింది. 229 పరుగుల భారీ లక్ష్య చేధనలో సాయిసుదర్శన్(49 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్తో 80), వాషింగ్టన్ సుందర్(48) అద్బుత ఇన్నింగ్స్లు ఆడినప్పటికి.. మిగితా బ్యాటర్ల నుంచి సహకారం లభించకపోవడంతో గుజరాత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.ముఖ్యంగా ఈ మ్యాచ్లో గుజరాత్ ఓటమికి ప్రధాన కారణం చెత్త ఫీల్డింగ్. మ్యాచ్ ఆరంభంలోనే ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు రెండు లైఫ్లు వచ్చాయి. వరుస ఓవర్లలో అతడి ఇచ్చిన ఈజీ క్యాచ్లను గుజరాత్ ఫీల్డర్లు జారవిడిచారు. అందుకు గుజరాత్ భారీ మూల్యం చెల్లుంచుకోవాల్సి వచ్చింది.3 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రోహిత్.. ఏకంగా 81 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. బౌలర్లు కూడా భారీ పరుగులు సమర్పించుకున్నారు. పేలవ ఫీల్డింగ్, బౌలింగ్ కారణంగానే ఈ టోర్నీ నుంచి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.కన్నీరు పెట్టుకున్న నెహ్రా ఫ్యామిలీ..ఇక ఓటమి అనంతరం గుజరాత్ టైటాన్స్ ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. స్టాండ్స్లో కూర్చున్న నెహ్రా కుమారుడు, కూమర్తె ఎక్కి ఎక్కి ఏడ్చారు. ఈ సమయంలో పక్కనే ఉన్న గుజరాత్ కెప్టెన్ గిల్ సోదరి షహ్నీల్ గిల్ కూడా వారిని ఓదర్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమె కూడా భోవోద్వేగానికి లోనైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.𝙈𝙄-𝙜𝙝𝙩𝙮 effort on a 𝙈𝙄-𝙜𝙝𝙩𝙮 occasion 💙@mipaltan seal the #Eliminator with a collective team performance ✌Scorecard ▶ https://t.co/R4RTzjQNeP#TATAIPL | #GTvMI | #TheLastMile pic.twitter.com/cJzBLVs8uM— IndianPremierLeague (@IPL) May 30, 2025 Nehra ka Beta bada hoke humse badla lega 🤣🤣#MIvsGT pic.twitter.com/2j8Z17Hxx1— WTF Cricket (@CricketWtf) May 30, 2025 -
అదే మా కొంపముంచింది.. అతడు మాత్రం నిజంగా అద్బుతం: గిల్
ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ ప్రయాణం ముగిసింది. శుక్రవారం ముల్లాన్పూర్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన ఎలిమినేటర్లో 20 పరుగుల తేడాతో ఓటమి పాలైన గుజరాత్.. ఈ టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. 229 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో గుజరాత్ విఫలమైంది. సాయిసుదర్శన్(81), వాషింగ్టన్ సుందర్(48) అద్బుత ఇన్నింగ్స్లు ఆడినప్పటికీ మిగితా బ్యాటర్లు తేలిపోవడంతో గుజరాత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. లక్ష్య చేధనలో టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పయి 208 పరుగులు చేయగల్గింది. ఇక ఈ హార్ట్బ్రేకింగ్ ఓటమిపై మ్యాచ్ అనంతరం గుజరాత్ కెప్టెన్ శుబ్మన్ గిల్ స్పందించాడు. తమ పేలవ ఫీల్డింగ్ కారణంగానే ఓడిపోయాము అని గిల్ తెలిపాడు."క్రికెట్ అనేది నిజంగా ఒక అద్బుతమైన గేమ్. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఈ మ్యాచ్లో మేము ఆఖరి వరకు పోరాడి ఓడిపోయాము. చివరి మూడు, నాలుగు ఓవర్లలో మాకు కలిసి రాలేదు. అయినప్పటికి మేము బాగానే ఆడాము. కచ్చితంగా క్యాచ్లు మ్యాచ్ ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి.ఈ మ్యాచ్లో మేము మూడు సునాయస క్యాచ్లు జారవిడిచాము. ఈజీగా క్యాచ్లను వదిలిస్తే బౌలర్లకు పరుగులను నియంత్రించడం అంత సులభం కాదు. సాయిసుదర్శన్, వాషింగ్టన్ సుందర్కు మేము ఒకటే మెసేజ్ పంపాము. ఎలాంటి ఒత్తిడి లేకుండా పూర్తిగా స్వేచ్ఛగా ఆడాలని వారికి చెప్పాం. జట్టును గెలిపించడమే వారద్దరి లక్ష్యం.మంచు కారణంగా వికెట్ కూడా బ్యాటింగ్కు అనుకూలంగా మారింది. ఈ సీజన్లో మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. గత మూడు మ్యాచ్లలో మేము స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాము. కానీ జట్టులోని ప్రతీ ఒక్కరూ కూడా మెరుగ్గా రాణించారు. ముఖ్యంగా సాయిసుదర్శన్ ఒక అద్బుం. ఈ సీజన్లో అతడు ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో గిల్ పేర్కొన్నాడు.చదవండి: సంతోషంగా ఉంది.. అతడి వల్లే ఓడిపోయే మ్యాచ్లో గెలిచాము: హార్దిక్ -
అతడి వల్లే ఓడిపోయే మ్యాచ్లో గెలిచాము: హార్దిక్
ఐపీఎల్-2025లో శుక్రవారం ముల్లాన్పూర్ వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఎలిమినిటేర్ మ్యాచ్ సస్పెన్ష్ థ్రిల్లర్ను తలపించింది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో గుజరాత్ 20 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. దీంతో ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2కు ఆర్హత సాధించింది. ఆదివారం జరగనున్న సెకెండ్ క్వాలిఫయర్లో పంజాబ్ కింగ్స్తో ముంబై తలపడనుంది. ఈ విజయంపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. మ్యాచ్ను మలుపు తిప్పిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై పాండ్యా ప్రశంసల వర్షం కురిపించాడు."కీలక మ్యాచ్లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఒకానొక దశలో గేమ్ సమానంగా మారింది. రెండో ఇన్నింగ్స్లో వికెట్ బ్యాటింగ్కు మరింత మెరుగ్గా అనుకూలించింది. మంచు కారణంగా బంతి సునాయసంగా బ్యాట్పైకి వచ్చింది. దీంతో రిథమ్ అందుకున్న గుజరాత్ బ్యాటర్లు దూకుడుగా ఆడడం మొదలు పెట్టారు. ఆ సమయంలో ఒత్తిడికి లోనవ్వకుండా మా బౌలర్లకు సపోర్ట్గా ఉండాలని నిర్ణయించుకున్నాము.ఇక జానీ బెయిర్ స్టో తన అరంగేట్రంలో ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. మాకు అతడు అద్బుతమైన ఆరంభాన్ని అందించాడు. రోహిత్ శర్మ మరోసారి తన క్లాస్ చూపించాడు. తొలుత కాస్త నెమ్మదిగా ఆడినప్పటికి.. తన రిథమ్ అనుకున్న తర్వాత ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. బౌలింగ్లో గ్లీసన్, బుమ్రా, అశ్విన్ కుమార్ ప్రతీ ఒక్కరూ రాణించారు.ఈ మ్యాచ్లో మేము ఎటువంటి ఒత్తిడి లోనవ్వలేదు. తొలి ఇన్నింగ్స్లో నేను మరో సిక్స్లు కొట్టి ఉంటే బాగుండేంది. ఎందుకంటే ఆఖరిలో చేసే పరుగులు మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపుతాయి. బ్యాటింగ్లో మేము అనుకున్న విధంగా దూకుడుగా ఆడాము. ఇక బుమ్రాతో ఎప్పుడు బౌలింగ్ చేయంచాలన్నది అన్నది చాలా సులభం. మ్యాచ్ చేజారిపోతుందని అనిపిచ్చినప్పుడు బుమ్రాను ఎటాక్లో తీసుకురావాలి. బుమ్రా లాంటి ప్లేయర్ జట్టులో ఉంటే కెప్టెన్కు అదొక వరం.ముంబైలో ఇళ్లు ఎంత ఖరీదుగా ఉంటాయో, బుమ్రా కూడా అంతే కాస్టలీ. చివరి ఓవర్లలో అదనపు పరుగులు ఉంచుకోగలిగితే, వాటిని డిఫెండ్ చేయగల బౌలర్లు జట్టులో ఉన్నారు అని భావించాను. అందుకే 18 ఓవర్ బుమ్రాతో వెయించాను. అందుకు తగ్గట్టే ఆ ఓవర్లో అతడు కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చింది. దీంతో గుజరాత్కు కావల్సిన రన్రేట్ పెరిగింది. మా తదుపురి మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని హార్ధిక్ పేర్కొన్నాడు.కాగా ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ(81) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులకే పరిమితమైంది. గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(80) పోరాడాడు. అయితే 48 పరుగులతో దూకుడుగా ఆడుతున్న వాషింగ్టన్ సుందర్ను ఔట్ చేసి బుమ్రా మ్యాచ్ మలుపు తిప్పాడు. -
MI Vs GT: ముంబై ముందుకు... గుజరాత్ ఇంటికి
ఒత్తిడితో కూడిన మ్యాచ్లు ఆడటంలో ఆరితేరిన ముంబై ఇండియన్స్... గుజరాత్ టైటాన్స్ను చిత్తు చేసి క్వాలిఫయర్–2కు చేరింది. బ్యాటింగ్లో రోహిత్ శర్మ దూకుడుకు... బెయిర్స్టో, సూర్యకుమార్ మెరుపులు తోడవడంతో మొదట భారీ స్కోరు చేసిన ముంబై... ఆ తర్వాత బౌలింగ్లోనూ ఆకట్టుకొని ముందంజ వేసింది. టాప్–3 ఆటగాళ్లపైనే ఎక్కువ ఆధారపడిన గుజరాత్... కీలక ఎలిమినేటర్ పోరులో అది సాధ్యపడక పరాజయంతో లీగ్ నుంచి నిష్క్రమించింది. ముల్లాన్పూర్: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ క్వాలిఫయర్–2కు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ పోరులో ముంబై 20 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్పై విజయం సాధించింది. మొదట ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (50 బంతుల్లో 81; 9 ఫోర్లు, 4 సిక్స్లు) దుమ్మురేపగా... జానీ బెయిర్స్టో (22 బంతుల్లో 47; 4 ఫోర్లు, 3 సిక్స్లు), సూర్యకుమార్ యాదవ్ (20 బంతుల్లో 33; 1 ఫోర్, 3 సిక్స్లు) ధాటిగా ఆడారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, సాయి కిషోర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (49 బంతుల్లో 80; 10 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... వాషింగ్టన్ సుందర్ (24 బంతుల్లో 48; 5 ఫోర్లు, 3 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై బౌలర్లలో బౌల్ట్ 2... బుమ్రా, గ్లీసన్, సాంట్నర్, అశ్వని కుమార్ తలా ఒక వికెట్ తీశారు. ఆదివారం జరగనున్న క్వాలిఫయర్–2లో పంజాబ్ కింగ్స్తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. దంచుడే దంచుడు... టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన ముంబై జట్టుకు ఓపెనర్లు రోహిత్, బెయిర్స్టో మెరుపు ఆరంభాన్నిచ్చారు. రికెల్టన్ అందుబాటులో లేకపోవడంతో... ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన బెయిర్స్టో తన విలువ చాటుకున్నాడు. ప్రసిధ్ కృష్ణ వేసిన రెండో ఓవర్లో ఫోర్తో దూకుడు పెంచిన బెయిర్స్టో... ప్రసిధ్ కృష్ణ వేసిన నాలుగో ఓవర్లో పరుగుల పండగ చేసుకున్నాడు. వరసగా 6, 4, 6, 6, 4... 26 పరుగులు పిండుకున్నాడు. సిరాజ్ ఓవర్లో రెండు ఫోర్లతో టచ్లోకి వచ్చిన రోహిత్ సాయి కిషోర్ బౌలింగ్లో 6, 4, 4తో గేర్ మార్చాడు. 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ ఇచ్చిన క్యాచ్ను కోట్జీ వదిలేయగా... 12 పరుగుల వద్ద మెండిస్ మరో సులువైన క్యాచ్ను నేలపాలు చేశాడు. దీన్ని పూర్తిగా వినియోగించుకున్న రోహిత్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి ముంబై జట్టు 79/0తో నిలిచింది. స్పిన్నర్ల రాకతో స్కోరు వేగం మందగించగా... బెయిర్స్టోను అవుట్ చేసి సాయి కిషోర్ గుజరాత్కు బ్రేక్ ఇచ్చాడు. రషీద్ ఓవర్లో 4, 6 ద్వారా ఐపీఎల్లో 7 వేల పరుగులతో పాటు 300 సిక్స్లు పూర్తి చేసుకున్న రోహిత్... 28 బంతుల్లో హాఫ్సెంచరీ మార్క్ అందుకున్నాడు. క్రీజులో ఉన్నంతసేపు భారీ షాట్లతో విరుచుకుపడిన సూర్యకుమార్ను సాయి కిషోర్ పెవిలియన్ పంపగా... ఈ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ (11 బంతుల్లో 25; 3 సిక్స్లు) కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. స్లో బంతితో రోహిత్ను ప్రసిధ్ కృష్ణ బుట్టలో వేసుకోగా... చివరి ఓవర్లో మూడు సిక్స్లు కొట్టిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 22 నాటౌట్; 3 సిక్స్లు) జట్టుకు భారీ స్కోరు అందించాడు. సుదర్శన్ పోరాడినా... భారీ లక్ష్యఛేదనలో గుజరాత్కు శుభారంభం లభించలేదు. కెప్టెన్ గిల్ (1) ఇన్నింగ్స్ నాలుగో బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో మరో ఓపెనర్ సుదర్శన్ బాధ్యతగా ముందుకు సాగాడు. ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడిన కుశాల్ మెండిస్ (10 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్స్లు) కాస్త సహకరించగా... సుదర్శన్ క్లాస్ కవర్ డ్రైవ్లతో ఆకట్టుకున్నాడు. భారీ లక్ష్యం కళ్లముందు ఉన్నా... ఏమాత్రం వెరవని టైటాన్స్ పవర్ప్లే ముగిసేసరికి 66/1తో నిలిచింది. గ్లీసన్, హార్దిక్, బుమ్రా, సాంట్నర్ ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టిన పసుదర్శన్ 28 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మెండిస్ వెనుదిరిగాక క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ కూడా ఆకట్టుకున్నాడు. ప్రమాదక బుమ్రా బంతులను కాచుకున్న ఈ జంట... మిగిలిన ఓవర్లలో ధాటిగా పరుగులు రాబట్టింది. దీంతో 13 ఓవర్లు ముగిసేసరికి టైటాన్స్ 148/2తో నిలిచింది. విజయానికి 42 బంతుల్లో 81 పరుగులు కావాల్సిన దశలో... బుమ్రా అద్భుత యార్కర్తో సుందర్ను క్లీన్ బౌల్డ్ చేయడంతో పరిస్థితి మారిపోయింది. సుదర్శన్ను గ్లీసన్ను అవుట్ చేయగా... రూథర్ఫోర్డ్ (24; 4 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. చివర్లో రాహుల్ తెవాటియా (16; 1 ఫోర్, 1 సిక్స్), షారుక్ ఖాన్ (13; 1 సిక్స్) మెరుపులు జట్టును గెలిపించలేకపోయాయి. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రషీద్ (బి) ప్రసిధ్ కృష్ణ 81; బెయిర్స్టో (సి) కోట్జీ (బి) సాయి కిషోర్ 47; సూర్యకుమార్ (సి) సుందర్ (బి) సాయి కిషోర్ 33; తిలక్ (సి) మెండిస్ (బి) సిరాజ్ 25; హార్దిక్ (నాటౌట్) 22; నమన్ ధీర్ (సి) రషీద్ (బి) ప్రసిధ్ కృష్ణ 9, సాంట్నర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 228. వికెట్ల పతనం: 1–84, 2–143, 3–186, 4–194, 5–206. బౌలింగ్: సిరాజ్ 4–0–37–1; ప్రసిధ్ కృష్ణ 4–0–53–2; సాయి కిషోర్ 4–0–42–2; రషీద్ ఖాన్ 4–0–31–0; కోట్జీ 3–0–51–0; సుందర్ 1–0–7–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (బి) గ్లీసన్ 80; గిల్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 1; మెండిస్ (హిట్ వికెట్) (బి) సాంట్నర్ 20; సుందర్ (బి) బుమ్రా 48; రూథర్ఫోర్డ్ (సి) తిలక్ (బి) బౌల్ట్ 24; తెవాటియా (నాటౌట్) 16; షారుక్ ఖాన్ (సి) సూర్యకుమార్ (బి) అశ్వని కుమార్ 13; రషీద్ ఖాన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–3, 2–67, 3–151, 4–170, 5–193, 6–208. బౌలింగ్: బౌల్ట్ 4–0–56–2; బుమ్రా 4–0–27–1; గ్లీసన్ 3.3–0–39–1; హార్దిక్ పాండ్యా 3–0–37–0; సాంట్నర్ 1–0–10–1; నమన్ ధీర్ 1–0–9–0; అశ్వని కుమార్ 3.3–0–28–1. -
IPL 2025 Eliminator Match: ఉత్కంఠ పోరులో గుజరాత్పై ముంబై ఇండియన్స్ గెలుపు
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 30) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ముంబై రెండో క్వాలిఫయర్కు అర్హత సాధించగా.. గుజరాత్ ఇంటిబాట పట్టింది.ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ (81), బెయిర్స్టో (47), సూర్యకుమార్ యాదవ్ (33), తిలక్ వర్మ (25) ఇరగదీయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో హార్దిక్ పాండ్యా (21 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు. మూడు సిక్సర్లు బాదాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, సాయికిషోర్ తలో రెండు వికెట్లు తీయగా.. సిరాజ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ ముంబై ఇండియన్స్ గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. ముఖ్యంగా సాయి సుదర్శన్ (80) ఆకాశమే హద్దుగా చెలరేగి ముంబై ఇండియన్స్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. సాయి క్రీజ్లో ఉన్నంత సేపు మ్యాచ్ గుజరాత్ చేతుల్లో ఉండింది. అయితే సాయి ఔటయ్యాక పరిస్థితి మెల్లగా చేజారుతూ వచ్చింది. చివరి ఓవర్ వరకు పోరాడినా గుజరాత్కు విజయం దక్కలేదు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేయగలిగింది. గుజరాత్ ఇన్నింగ్స్లో సాయి సుదర్శన్తో పాటు వాషింగ్టన్ సుందర్ (48) రాణించాడు. శుభ్మన్ గిల్ ఒక్క పరుగుకే ఔట్ కాగా.. రూథర్ఫోర్డ్ 24, తెవాతియా 16 (నాటౌట్), షారుఖ్ ఖాన్ 13 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో బౌల్ట్ 2, బుమ్రా, గ్లీసన్, సాంట్నర్, అశ్వనీ కుమార్ తలో వికెట్ పడగొట్టారు. ముంబై ఇండియన్స్ జూన్ 1న జరిగే క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఆ మ్యాచ్లో గెలిచిన జట్టు జూన్ 3న జరిగే ఫైనల్లో ఆర్సీబీని ఢీకొంటుంది. -
England Tour: డబుల్ సెంచరీకి చేరువలో కరుణ్ నాయర్
ఇంగ్లండ్ లయన్స్తో ఇవాళ (మే 30) మొదలైన తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్లో భారత-ఏ జట్టు ఆటగాళ్లు కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ ఇరగదీశారు. వీరిలో కరుణ్ నాయర్ డబుల్ సెంచరీకి చేరువలో (186 నాటౌట్) ఉండగా.. సర్ఫరాజ్ ఖాన్ (119 బంతుల్లో 92; 13 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. సర్ఫరాజ్ ఔటయ్యాక క్రీజ్లోకి వచ్చిన ధృవ్ జురెల్ (82 నాటౌట్) అర్ద సెంచరీతో ఆకట్టుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్-ఏ 3 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది.కాంటర్బరీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత-ఏ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగింది. భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కమ్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 8 పరుగులకే ఔటయ్యాడు. ఆతర్వాత మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కరుణ్ నాయర్తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో జైస్వాల్ కూడా 24 పరుగుల వద్ద ఔటయ్యాడు.జైస్వాల్ ఔటయ్యాక ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను కరుణ్ నాయర్ తీసుకున్నాడు. కరుణ్.. సర్ఫరాజ్ సహకారంతో అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారత జట్టును గౌరవప్రదమైన స్కోర్ దిశగా తీసుకొచ్చాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్ కూడా ఔటయ్యాడు. సర్ఫరాజ్ ఔటయ్యే సమయానికే భారత్ పటిష్ట స్థితిలో ఉంది.సర్ఫారాజ్ ఔటయ్యాక క్రీజ్లోకి వచ్చిన ధృవ్ జురెల్ కూడా ఇరగదీశాడు. కరుణ్, జురెల్ ఇద్దరు పోటీపోటీగా ఆడుతూ భారత్ను అతి భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తున్నారు. -
IPL 2025, Eliminator Match: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
ఐపీఎల్లో రోహిత్ శర్మ రెండు భారీ రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో ఇవాళ (మే 30) జరుగుతున్న కీలక ఎలిమినేటర్ మ్యాచ్లో 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. ఐపీఎల్లో 7000 పరుగులు సహా 300 సిక్సర్లు పూర్తి చేశాడు.ఈ ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 2 సిక్సర్లు బాదిన రోహిత్ ఐపీఎల్లో 300 సిక్సర్లు కొట్టిన తొలి భారత క్రికెటర్గా, ఓవరాల్గా రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్లో 8 పరుగుల వద్ద 7000 పరుగులు పూర్తి చేసిన రోహిత్ ఐపీఎల్లో విరాట్ కోహ్లి తర్వాత ఈ మార్కును తాకిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్-5 బ్యాటర్లు..క్రిస్ గేల్-357రోహిత్ శర్మ-300విరాట్ కోహ్లి-291ఎంఎస్ ధోని-264ఏబీ డివిలియర్స్-251ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు..విరాట్ కోహ్లి-8618రోహిత్ శర్మ-7000 (ఇన్నింగ్స్ కొనసాగుతుంది)శిఖర్ ధవన్-6769డేవిడ్ వార్నర్-6565సురేశ్ రైనా-5528మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ 13 ఓవర్ల అనంతరం రెండు వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (36 బంతుల్లో 60; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (0) క్రీజ్లో ఉన్నారు. ముంబై ఇన్నింగ్స్లో జానీ బెయిర్స్టో 22 బంతుల్లో 47 (4 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ 20 బంతుల్లో 33 పరుగులు (ఫోర్, 3 సిక్సర్లు) చేశారు. ఈ ఇద్దరి వికెట్లు సాయి కిషోర్కు దక్కాయి. కాగా, ఈ మ్యాచ్లో ఓడిన జట్టు లీగ్ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు ఫైనల్కు ముందు మరో మ్యాచ్ (క్వాలిఫయర్-2లో పంజాబ్తో) ఆడాల్సి ఉంటుంది. నిన్న జరిగిన క్వాలిఫయర్-1లో పంజాబ్పై విజయం సాధించి ఆర్సీబీ నేరుగా ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే. -
ఇంగ్లండ్ ఓపెనర్ల విధ్వంసకర శతకాలు
వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టుతో ఇవాళ (మే 30) జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ ఓపెనర్లు ట్యామీ బేమౌంట్, యామీ జోన్స్ చెలరేగిపోయారు. ఈ ఇద్దరూ విధ్వంసకర శతకాలతో విరుచుకుపడ్డారు. ఈ జోడీ తొలి వికెట్కు 222 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పింది. బేమౌంట్ 107 (104 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు), యామీ జోన్స్ 122 పరుగులు (121 బంతుల్లో 15 ఫోర్లు, సిక్సర్) చేసి ఔటయ్యారు. 41 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 262/3గా ఉంది. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (8), సోఫియా డంక్లీ (6) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది.కాగా, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ల కోసం వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో టీ20 సిరీస్ ఇదివరకే ముగియగా.. వన్డే సిరీస్ ఇవాళ ప్రారంభమైంది. టీ20 సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లండ్.. వన్డే సిరీస్ను కూడా అదే తరహాలో ముగించాలని భావిస్తుంది. మే 30, జూన్ 4, 7 తేదీల్లో మూడు వన్డేలు వేర్వేరు వేదికల్లో జరుగనున్నాయి. -
ఇంగ్లండ్ పర్యటనలో తొలి ఇన్నింగ్స్లోనే సత్తా చాటిన కరుణ్ నాయర్
దేశవాలీ క్రికెట్లో పరుగుల వరద పారించి ఎట్టకేలకు భారత జట్టులో చోటు సంపాదించిన కరుణ్ నాయర్.. ఇంగ్లండ్ పర్యటనలో తన తొలి ఇన్నింగ్స్లోనే సత్తా చాటాడు. ఇంగ్లండ్ లయన్స్, భారత్-ఏ మధ్య ఇవాళ (మే 30) ప్రారంభమైన తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్లో కరుణ్ అర్ద సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్లో వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన కరుణ్ 85 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్లో భారత-ఏ జట్టు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగింది. భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కమ్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 8 పరుగులకే ఔటయ్యాడు. ఆతర్వాత మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కరుణ్ నాయర్తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో జైస్వాల్ కూడా 24 పరుగుల వద్ద ఔటయ్యాడు. జైస్వాల్ ఔటయ్యాక ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను కరుణ్ నాయర్ తీసుకున్నాడు. కరుణ్.. సర్ఫరాజ్ సహకారంతో అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారత జట్టును గౌరవప్రదమైన స్కోర్ దిశగా తీసుకెళ్తున్నాడు. 44 ఓవర్ల అనంతరం భారత జట్టు స్కోర్ 158/2గా ఉంది. కరుణ్ 66, సర్ఫరాజ్ 48 పరుగుల వద్ద క్రీజ్లో ఉన్నారు.కాగా, కరుణ్ నాయర్కు ఇంగ్లండ్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. గతంలో ఇక్కడ కౌంటీలు ఆడిన కరుణ్.. 21 ఇన్నింగ్స్ల్లో ఓ డబుల్ సెంచరీ, ఓ సెంచరీ, 7 అర్ద సెంచరీల సాయంతో 1025 పరుగులు చేశాడు.2024 అక్టోబర్ నుంచి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కరుణ్ స్కోర్లు.. 66* (ప్రస్తుత మ్యాచ్), 135, 86, 6, 45, 29, 122, 105, 3, 4, 39, 123, 85ఇదిలా ఉంటే, 33 ఏళ్ల కరుణ్ నాయర్ ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. ఈ లీగ్లో తన తొలి మ్యాచ్లోనే కరుణ్ ఆకట్టుకున్నాడు. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడాడు. ఈ మ్యాచ్ మినహా కరుణ్ ఈ సీజన్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయినా దేశవాలీ క్రికెట్లో ట్రాక్ రికార్డు కారణంగా కరుణ్కు ఇంగ్లండ్ టూర్కు పిలుపు అందింది. ఇంగ్లండ్ లయన్స్తో రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్లకు, ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ మ్యాచ్లకు కరుణ్ ఎంపికయ్యాడు.గతేడాది కాలంగా భారత క్రికెట్ సర్కిల్స్లో కరుణ్ పేరు మార్మోగిపోతుంది. ఈ మధ్యకాలంలో అతను ఫార్మాట్లకతీతంగా చెలరేగిపోతున్నాడు.ఈ ఏడాది విజయ్ హజారే వన్డే టోర్నీలో 9 మ్యాచ్లు ఆడి నమ్మశక్యంకాని సగటుతో (389.50) 779 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి.ఈ ఏడాది రంజీ ట్రోఫీలోనూ కరుణ్ అదే జోష్ను కొనసాగించాడు. 16 ఇన్నింగ్స్ల్లో 57.33 సగటున 4 సెంచరీల సాయంతో 860 పరుగులు చేసి విదర్భ జట్టును ఛాంపియన్గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు.కరుణ్ అరివీర భయంకరమైన ఫామ్ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోనూ కొనసాగింది. ఈ టోర్నీలో కరుణ్ 6 ఇన్నింగ్స్ల్లో 177.08 స్ట్రయిక్రేట్తో 42.50 సగటున 255 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ద సెంచరీలు ఉన్నాయి.ఇవే కాక కరుణ్ గతేడాది ప్రారంభంలో జరిగిన మహారాజా ట్రోఫీలోనూ పరుగుల వరద పారించాడు. టీ20 ఫార్మాట్లో జరిగిన ఆ టోర్నీలో కరుణ్ 10 మ్యాచ్ల్లో 188.4 స్ట్రయిక్రేట్తో, 70 సగటున 490 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ద శతకాలు, ఓ శతకం ఉంది.కరుణ్ గతేడాది కౌంటీ క్రికెట్లోనూ సత్తా చాటాడు. ఇంగ్లండ్ దేశవాలీ సీజన్లో కరుణ్ 11 ఇన్నింగ్స్ల్లో 48.70 సగటున 487 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ సహా మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
IPL 2025 Eliminator Match: గుజరాత్పై ముంబై ఇండియన్స్ గెలుపు
గుజరాత్పై ముంబై ఇండియన్స్ గెలుపుఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 30) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ముంబై రెండో క్వాలిఫయర్కు అర్హత సాధించగా.. గుజరాత్ ఇంటిబాట పట్టింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేయగా.. ఛేదనలో చివరి వరకు పోరాడిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేయగలిగింది.ధాటిగా ఆడుతున్న సాయి సుదర్శన్రెండు వికెట్లు కోల్పోయిన సాయి సుదర్శన్ ఏమాత్రం తగ్గడం లేదు. 36 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో 67 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. అతనికి జతగా వాషింగ్టన్ సుందర్ (16) క్రీజ్లో ఉన్నాడు. 10 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 106/2గా ఉంది. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్6.2వ ఓవర్- 67 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్లో కుసాల్ మెండిస్ (20) హిట్ వికెట్గా వెనుదిరిగాడు. ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయినా, పవర్ ప్లేలో ఇరగదీసిన గుజరాత్ బ్యాటర్లుతొలి ఓవర్లోనే గిల్ (1) వికెట్ కోల్పోయినా గుజరాత్ బ్యాటర్లు సాయి సుదర్శన్ (43), కుసాల్ మెండిస్ (20) పవర్ప్లేలో ఇరగదీశారు. వీరి ధాటికి గుజరాత్ 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది.టార్గెట్ 229.. 3 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్229 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ 3 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్లో శుభ్మన్ గిల్ (1) ఔటయ్యాడు. ముంబై ఇండియన్స్ భారీ స్కోర్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ (81), బెయిర్స్టో (47), సూర్యకుమార్ యాదవ్ (33), తిలక్ వర్మ (25) ఇరగదీయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో హార్దిక్ పాండ్యా (21 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు. మూడు సిక్సర్లు బాదాడు.నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై17.2వ ఓవర్- 194 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్లో తిలక్ వర్మ (25) ఔటయ్యాడు.సెంచరీ మిస్ చేసుకున్న రోహిత్16.4వ ఓవర్- 186 పరుగుల వద్ద ముంబై మూడో వికెట్ కోల్పోయింది. 81 పరుగుల వద్ద ఔటై రోహిత్ సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు.సెంచరీకి చేరువగా రోహిత్.. భారీ స్కోర్ దిశగా ముంబై ఇండియన్స్16 ఓవర్ల తర్వాత ముంబై ఇండియన్స్ స్కోర్ 175/2గా ఉంది. రోహిత్ శర్మ 81, తిలక్ వర్మ 11 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. భారీ స్కోర్ దిశగా ముంబై15 ఓవర్ల తర్వాత ముంబై ఇండియన్స్ స్కోర్ 160/2గా ఉంది. రోహిత్ శర్మ 74, తిలక్ వర్మ 3 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ఒకే ఇన్నింగ్స్తో రెండు భారీ రికార్డులుఐపీఎల్లో రోహిత్ శర్మ రెండు భారీ రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో ఇవాళ (మే 30) జరుగుతున్న కీలక ఎలిమినేటర్ మ్యాచ్లో 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్.. ఐపీఎల్లో 7000 పరుగులు పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 2 సిక్సర్లు బాదిన రోహిత్ ఐపీఎల్లో 300 సిక్సర్లు కొట్టిన తొలి భారత క్రికెట్గా చరిత్ర సృష్టించాడు. 11 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 120/1 కాగా.. రోహిత్ 57, సూర్యకుమార్ యాదవ్ 13 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ముంబై7.2వ ఓవర్- 84 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. సాయి కిషోర్ బౌలింగ్లో కొయెట్జీ క్యాచ్ పట్టడంతో జానీ బెయిర్స్టో (47) ఔటయ్యాడు.ప్రసిద్ద్ కృష్ణను ఉతికి ఆరేసిన బెయిర్స్టోనాలుగో ఓవర్లో ప్రసిద్ద్ కృష్ణను జానీ బెయిర్స్టో ఉతికి ఆరేశాడు. ఈ ఓవర్లో అతను 3 సిక్సర్లు, 2 ఫోర్లు కొట్టాడు. ఫలితంగా ముంబై 4 ఓవర్లలోనే 50 పరుగులు దాటింది. బెయిర్స్టో 39, రోహిత్ శర్మ 13 పరుగుల వద్ద క్రీజ్లో ఉన్నారు. రోహిత్ శర్మకు రెండు లైఫ్లుముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మకు రెండు లైఫ్లు లభించాయి. గెరాల్డ్ కొయెట్జీ, కుసాల్ మెండిస్ సునాయాసమైన క్యాచ్లు వదిలేశారు. 3 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 28/0గా ఉంది. రోహిత్, బెయిర్స్టో తలో 13 పరుగుల వద్ద క్రీజ్లో ఉన్నారు. ఐపీఎల్ 2025లో ఇవాళ (మే 30) ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ముల్లాన్పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. జట్ల వివరాలు..ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, జానీ బెయిర్స్టో(w), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రిచర్డ్ గ్లీసన్ఇంపాక్ట్ సబ్స్: కృష్ణన్ శ్రీజిత్, రఘు శర్మ, రాబిన్ మింజ్, అశ్వనీ కుమార్, రీస్ టోప్లీ.గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్(సి), సాయి సుదర్శన్, కుసల్ మెండిస్(w), షారుక్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, గెరాల్డ్ కోయెట్జీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణఇంపాక్ట్ సబ్స్: షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, జయంత్ యాదవ్, అర్షద్ ఖాన్. -
IPL 2025, Eliminator: అదే జరిగితే ముంబై ఇండియన్స్ ఇంటికే..!
ఐపీఎల్ 2025లో ఇవాళ (మే 30) రాత్రి ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. ముల్లాన్పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు జూన్ 1న జరిగే క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఓడిన జట్టు లీగ్ నుంచి నిష్క్రమిస్తుంది. క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు జూన్ 3న జరిగే ఫైనల్లో ఆర్సీబీని ఢీకొంటుంది. నిన్న (మే 29) జరిగిన తొలి క్వాలిఫయర్లో ఆర్సీబీ పంజాబ్పై విజయం సాధించి, నేరుగా ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే.కాగా, నేడు జరుగబోయే ఎలిమినేటర్ మ్యాచ్కు రిజర్వ్ డే లేదు. ఈ మ్యాచ్కే కాదు ప్లే ఆఫ్స్లో ఏ మ్యాచ్కూ రిజర్వ్ డే లేదు. ఏదైనా కారణం చేత నేడు జరగాల్సిన గుజరాత్, ముంబై మ్యాచ్ రద్దైతే.. పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉండటం చేత (గుజరాత్ మూడో స్థానంలో ఉంటే, ముంబై నాలుగో స్థానంలో ఉంది) గుజరాత్ క్వాలిఫయర్-2కు చేరుతుంది. అప్పుడు ముంబై ఇండియన్స్ ఇంటిముఖం పడుతుంది. కాబట్టి నేటి మ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు కాకూడదని ముంబై ఇండియన్స్ కోరుకుంటుంది.వాస్తవానికి నేటి మ్యాచ్ ఏ కారణంగానూ రద్దయ్యే అవకాశం లేదు. ఈ మ్యాచ్కు వేదిక అయిన ముల్లాన్పూర్లో వాతావరణం పూర్తి మ్యాచ్ సజావుగా సాగేందుకు అనుకూలంగా ఉంది. ఎలాంటి వర్ష సూచనలు లేవు. నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ కూడా ఇదే వేదికగా జరిగింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ వాతావరణం ఇంకా సానుకూలంగా ఉంది.ముంబై-గుజరాత్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డును పరిశీలిస్తే.. గుజరాత్ స్పష్టమైన ఆధిక్యం కలిగి ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 7 మ్యాచ్ల్లో తలపడగా.. గుజరాత్ 5, ముంబై 2 గెలిచాయి. ఈ సీజన్లో లీగ్ దశలో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గుజరాతే గెలిచింది.తుది జట్లు (అంచనా)..ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, జానీ బెయిర్స్టో, సూర్యకుమార్ యాదవ్, చరిత్ అసలంక, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్/కర్ణ్ శర్మగుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభమాన్ గిల్, కుసల్ మెండిస్, షెర్ఫానే రూథర్ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, గెరాల్డ్ కోయెట్జీ, అర్షద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ -
కేఎల్ రాహుల్.. నీ కమిట్మెంట్కు సలాం..!
ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్కు చేరని జట్ల ఆటగాళ్లందరూ ప్రస్తుతం వారివారి పనుల్లో నిమగ్నమైపోయారు. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన భారత ఏ ఆటగాళ్లు ఇవాల్టి నుంచి ఇంగ్లండ్ లయన్స్తో తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో భారత ఏ జట్టు రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది. ఆతర్వాత టీమిండియా ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఐపీఎల్ పూర్తయిన తర్వాత ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు ఎంపికైన టీమిండియా ఆటగాళ్లంతా ప్రాక్టీస్ మొదలుపెడతారు.కాగా, ఐపీఎల్లో తన జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించిన తర్వాత ఖాళీగా ఉన్న ఢిల్లీ ఆటగాడు కేఎల్ రాహుల్ బీసీసీఐని ఓ విషయం కోసం అభ్యర్దించినట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ఎంపికై, ప్రస్తుతం భారత్లోనే ఉన్న రాహుల్ ఇంగ్లండ్ లయన్స్తో జరిగే రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ కోసం తనను ఎంపిక చేయాలని బీసీసీఐని కోరాడట.ప్రస్తుతం భారత్లో వాతావరణ పరిస్థితులు ప్రాక్టీస్కు అనుకూలంగా లేకపోవడంతో (వర్షాలు) లయన్స్తో టెస్ట్ మ్యాచ్ తన ప్రాక్టీస్కు ఉపయోగపడుతుందని రాహుల్ భావిస్తున్నాడట. ఇందుకే తనను లయన్స్తో రెండో టెస్ట్ మ్యాచ్కు ఎంపిక చేయాలని బీసీసీఐని కోరాడట. ఈ విషయంపై స్పందించిన అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రాహుల్కు రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. రాహుల్ను సోమవారం (జూన్ 2) లండన్కు బయల్దేరాల్సిందిగా ఆదేశించిందట.జాతీయ జట్టు తరఫున రాణించేందుకు రాహుల్ బీసీసీఐకి చేసిన విన్నపం గురించి తెలిసి భారత క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. రాహుల్ కమిట్మెంట్కు సలాం కొడుతున్నారు. స్టార్డమ్ ఉన్న ఇతర ఆటగాళ్లు ఖాళీ దొరికితే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని చూస్తారు. రాహుల్ మాత్రం తన దేశం తరఫున రాణించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాండంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంగ్లండ్ లయన్స్తో రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ జూన్ 6 నుంచి నార్తంప్టన్ వేదికగా జరుగనుంది.ఇంగ్లండ్ లయన్స్తో టెస్ట్ మ్యాచ్లకు ఎంపిక చేసిన భారత-ఏ జట్టు..కరుణ్ నాయర్, రుతురాజ్ గైక్వాడ్, అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, తనుశ్ కోటియన్, హర్ష్ దూబే, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, హర్షిత్ రాణా, మానవ్ సుతార్, తుషార్ దేశ్పాండే, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, ఆకాశ్దీప్ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు భారత జట్టు..శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ -
IPL 2025: 'ఈ లెక్కన' ఈ సారి ఆర్సీబీదే టైటిల్..!
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 29) జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఐపీఎల్లో ఆర్సీబీకి ఇది నాలుగో ఫైనల్ అవుతుంది. గడిచిన మూడు సందర్భాల్లో ఈ జట్టు రన్నరప్తో సరిపెట్టుకుంది.ఆర్సీబీ ఫైనల్కు చేరిన సీజన్లు..2009- డెక్కన్ ఛార్జర్స్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓటమి2011- సీఎస్కే చేతిలో 58 పరుగుల తేడాతో ఓటమి2016- ఎస్ఆర్హెచ్ చేతిలో 8 పరుగుల తేడాతో ఓటమి2025- ?కాగా, ఈ సీజన్లో ఆర్సీబీ ఫైనల్కు చేరాక ఓ ఆసక్తికర విషయం ట్రెండింగ్లోకి వచ్చింది. ప్రతి సీజన్లో ఈ సాలా కప్ నమదే అనే ఆర్సీబీ అభిమానులకు ఇది ఊపునిచ్చే అంశం. అదేంటంటే.. 2018 నుంచి క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టే టైటిల్ గెలిచింది. ఈ విషయం తెలిసి ఆర్సీబీ అభిమానులు ఉబ్బితబ్బిబవుతున్నారు. ఈ ఒక్క సెంటిమెంట్ చాలు మేము ఈ యేడు కప్ కొడతామని చెప్పడానికంటూ చాటింపు చేసుకుంటున్నారు.సెంటిమెంట్ విషయాన్ని పక్కన పెడితే, ఈ యేడు ఆర్సీబీకి టైటిల్ గెలిచే జట్టుకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. ఆర్సీబీ ఈ సీజన్లో గత సీజన్లకు చాలా భిన్నంగా కనిపిస్తుంది. టైటిల్ గెలవాలన్న కసి ఆ జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడిలో ఉంది. అందుకు తగ్గట్టుగానే వారి ప్రదర్శనలు కూడా ఉన్నాయి. పైపెచ్చు ప్రతి సీజన్లో వీక్గా కనిపించే ఆర్సీబీ బౌలింగ్ విభాగం ఈ సీజన్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. నిన్న జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్లో అది నిరూపితమైంది. ఇదే జోరును ఆర్సీబీ బౌలర్లు ఫైనల్ మ్యాచ్లోనూ కొనసాగిస్తే, ఆ జట్టును టైటిల్ గెలవకుండా ఎవరూ ఆపలేరు.ఈ సారి ఆర్సీబీకి పటిష్టమైన జట్టుతో పాటు సెంటిమెంట్లు కూడా వర్కౌటయ్యేలా ఉన్నాయి. క్వాలిఫయర్-1 సెంటిమెంట్తో పాటు విరాట్ కోహ్లి జెర్సీ నంబర్ సెంటిమెంట్ కూడా ఆ జట్టుకు ఈ సారి కలిసొచ్చేలా ఉంది. కోహ్లి జెర్సీ నంబర్ 18, ఐపీఎల్ సీజన్ సంఖ్య కూడా 18.2018 నుంచి క్వాలిఫయర్-1 గెలిచిన జట్లు, టైటిల్ గెలిచిన జట్ల వివరాలు..2018- క్వాలిఫయర్-1 విజేత సీఎస్కే- టైటిల్ విజేత కూడా సీఎస్కేనే2019- క్వాలిఫయర్-1 విజేత ముంబై ఇండియన్స్- టైటిల్ విజేత కూడా ముంబై ఇండియన్సే2020- క్వాలిఫయర్-1 విజేత ముంబై ఇండియన్స్- టైటిల్ విజేత కూడా ముంబై ఇండియన్సే2021- క్వాలిఫయర్-1 విజేత సీఎస్కే- టైటిల్ విజేత కూడా సీఎస్కేనే2022- క్వాలిఫయర్-1 విజేత గుజరాత్- టైటిల్ విజేత కూడా గుజరాతే2023- క్వాలిఫయర్-1 విజేత సీఎస్కే- టైటిల్ విజేత కూడా సీఎస్కేనే2024- క్వాలిఫయర్-1 విజేత కేకేఆర్- టైటిల్ విజేత కూడా కేకేఆరే2025- క్వాలిఫయర్-1 విజేత ఆర్సీబీ- టైటిల్ విజేత..? -
వైభవ్ సూర్యవంశీతో ప్రధాని మోదీ ముచ్చట్లు
పాట్నా: యువ క్రికెట్ కెరటం, చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీతో ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈరోజు(శుక్రవారం, మే 30వ తేదీ) ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ పర్యటనలో భాగంగా పాట్నా ఎయిర్ పోర్ట్ లో కలిసిన వైభవ్ సూర్యవంశీతో సరదాగా మాట్లాడారు. తొలుత వైభవ్ సూర్యవంశీని ఆప్యాయంగా పలకరించిన మోదీ..క్రికెట్ కు సంబంధించిన విషయాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. పాట్నా ఎయిర్ పోర్ట్ లో మోదీని కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవ్ సూర్యవంశీ కలిశారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు మోదీ.‘వైభవ్ సూర్యవంశీ భవిష్యత్ ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అతడు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. నా ఆశీస్సులు అతడికి ఎప్పుడూ ఉంటాయి’ అని మోదీ పేర్కొన్నారు.ఇదిలా ఉంచితే, వైభవ్ సూర్యవంశీ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఐపీఎల్ లో అరంగేట్రం ద్వారా సంచలన బ్యాటింగ్ తో మెరుపులు మెరిపిస్తున్న 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.. ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ఈ సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహించడం ద్వారా వైభవ్ సూర్యవంశీ తెరపైకి వచ్చాడు. At Patna airport, met the young cricketing sensation Vaibhav Suryavanshi and his family. His cricketing skills are being admired all over the nation! My best wishes to him for his future endeavours. pic.twitter.com/pvUrbzdyU6— Narendra Modi (@narendramodi) May 30, 2025 -
'నీ ఈగోను జేబులో పెట్టుకో శ్రేయస్'.. పంజాబ్ కెప్టెన్పై మూడీ ఫైర్
ఐపీఎల్-2025 క్వాలిఫయర్-1లో పంజాబ్ కింగ్స్కు ఘోర పరాభవం ఎదురైంది. గురువారం ముల్లాన్పూర్ వేదికగా ఆర్సీబీతో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో పంజాబ్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో పంజాబ్ బ్యాటర్లు తీవ్ర నిరాశపరిచారు. ఆర్సీబీ బౌలర్ల ధాటికి పంజాబ్ బ్యాటర్లు విల్లవిల్లాడారు.దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కేవలం 101 పరుగులకే ఆలౌటైంది. ఆ లక్ష్యాన్ని ఆర్సీబీ పది ఓవర్లలోనే ఛేదించి విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో దారుణ ప్రదర్శన కనబరిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ విమర్శల వర్షం కురిపించారు.పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేయడం నేర్చుకో అయ్యర్ అంటూ ఆయన మండిపడ్డారు. కాగా కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన అయ్యర్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. బాధ్యతాయుతంగా ఆడాల్సిన శ్రేయస్.. హాజిల్వుడ్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి వికెట్ కీపర్కు దొరికిపోయాడు. శ్రేయస్ కేవలం రెండు 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు.అదేవిధంగా టీ20ల్లో అయ్యర్పై హాజిల్వుడ్కు మంచి రికార్డు ఉంది. ఈ ఆసీస్ స్పీడ్ స్టార్ అయ్యర్ను నాలుగు సార్లు టీ20ల్లో ఔట్ చేశాడు. అయినప్పటికి అతడి బౌలింగ్లో నిర్లక్ష్యంగా షాట్ ఆడి అయ్యర్ ఔటయ్యాడని మూడీ వంటి దిగ్గజాలు విమర్శలు గుప్పిస్తున్నారు."శ్రేయస్ అయ్యర్ పరిస్థితులకు తగ్గట్టు ఏ మాత్రం ఆడలేదు. కెప్టెన్గా తన బాధ్యతను కూడా మర్చిపోయాడు. గతంలో చాలా సార్లు తనను హాజిల్వుడ్ ఔట్ చేశాడని అయ్యర్కు బాగా తెలుసు. అయినప్పటికి జాగ్రత్తగా ఆడకుండా ఈగోకి పోయి తన వికెట్ను సమర్పించుకున్నాడు. కొన్నిసార్లు మన అహాన్ని జేబులో పెట్టుకుని ముందుకు సాగాలి. అప్పుడే విజయాలు సాధించగలము" అని మూడీ పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది సీజన్ అసాంతం తన కెప్టెన్సీ, బ్యాటింగ్తో ఆకట్టుకున్న శ్రేయస్.. కీలకమైన మ్యాచ్లో మాత్రం విఫలమై విమర్శలను ఎదుర్కొంటున్నాడు. -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. ప్రపంచ క్రికెట్లో తొలి జట్టుగా
వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్ను ఇంగ్లండ్ విజయంతో ఆరంభించింది. గురువారం ఎడ్జ్బాస్టన్ వేదికగా తొలి వన్డేలో 238 పరుగుల తేడాతో వెస్టిండీస్ను ఇంగ్లండ్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 400 పరుగులు చేసింది. బెన్ డకెట్(60), జోరూట్(57), హ్యారీ బ్రూక్(58), జాకోబ్ బెతెల్(82) హాఫ్ సెంచరీలతో రాణించగా.. జేమీ స్మిత్(37), విల్ జాక్స్(39) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. విండీస్ బౌలర్లలో జైడెన్ సీల్స్ నాలుగు వికెట్లు సాధించగా.. అల్జారీ జోసెఫ్, జస్టిన్ గ్రీవ్స్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో కరేబియన్ జట్టు కేవలం 162 పరుగులకే కుప్పకూలింది.చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్..ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఒక్క ప్లేయర్ కూడా సెంచరీ చేయకుండా వన్డేల్లో అత్యధిక స్కోరును నమోదు చేసిన తొలి జట్టుగా ఇంగ్లండ్ రికార్డులకెక్కింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఏ ఒక్క బ్యాటర్ సెంచరీ చేయనప్పటికి.. టీమ్ స్కోర్ మాత్రం 400 పరుగుల మార్క్ను అందుకుంది. ఇప్పటివరకు ఈ రికార్డు దక్షిణాఫ్రికా పేరిట ఉండేది. 2007లో పాకిస్తాన్తో జరిగిన వన్డే మ్యాచ్లో ఏ ఒక్క ప్లేయర్ కూడా సెంచరీ చేయకుండా సౌతాఫ్రికా 392 పరుగులు చేసింది. తాజా మ్యాచ్తో సఫారీల ఆల్టైమ్ రికార్డును ఇంగ్లీష్ జట్టు బ్రేక్ చేసింది. అదేవిధంగా వన్డే క్రికెట్ చరిత్రలోనే ఒకే ఇన్నింగ్స్లో ఏడుగురు బ్యాటర్లు 30 ప్లస్ రన్స్ చేయడం కూడా ఇదే తొలిసారి.చదవండి: నేను సాకులు చెప్పను.. యుద్దం ఇంకా ముగియలేదు: శ్రేయస్ అయ్యర్ -
నేను సాకులు చెప్పను.. యుద్దం ఇంకా ముగియలేదు: శ్రేయస్ అయ్యర్
ఐపీఎల్-2025లో గురువారం ముల్లాన్పుర్ వేదికగా ఆర్సీబీతో జరిగిన క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్ దారుణ ప్రదర్శన కనబరిచింది. బ్యాటింగ్, బౌలింగ్లో విఫలమైన పంజాబ్.. 8 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. దీంతో ఫైనల్ చేరేందుకు ఇప్పుడు క్వాలిఫయర్-2లో తలపడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ పంజాబ్ కింగ్స్.. ఆర్సీబీ బౌలర్ల ధాటికి 14.1 ఓవర్లలోనే కేవలం 101 పరుగులకే కుప్పకూలింది.స్టోయినిష్(26) టాప్ స్కోరర్గా నిలవగా.. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓటమిపాలైమని అయ్యర్ అంగీకరించాడు. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు."ఈ రోజును అంతవేగంగా మర్చిపోలేము. డ్రెస్సింగ్ రూమ్కు తిరిగి వెళ్లి తప్పు ఎక్కడ జరిగిందో చర్చిస్తాము. ఏదేమైనప్పటికీ ఒక బ్యాటింగ్ యూనిట్గా తీవ్ర నిరాశపరిచాము. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయాయు. అయితే కెప్టెన్గా నేను తీసుకున్న నిర్ణయాలపై నాకు ఎటువంటి సందేహం లేదు. మైదానంలో గానీ, మైదానం వెలుపల గానీ మేము అన్ని ఆలోచించాకే ఏ నిర్ణయమైనా తీసుకుంటాము. ఈ మ్యాచ్లో మాత్రం మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాము. అలా అని బౌలర్లను కూడా తప్పుబట్టలేము. ఎందుకంటే మా బౌలర్లు డిఫెండ్ చేసుకోవడానికి ఈ టోటల్ సరిపోదు. ముల్లాన్పూర్ పిచ్ను మేము సరిగ్గా అంచనా వేయలేకపోయాము. ఈ వికెట్పై బ్యాటింగ్ పరంగా మరింత ప్రాక్టీస్ చేసి ఉంటే బాగుండేది. ఈ మైదానంలో మేము ఆడిన మూడు మ్యాచ్లలోనూ బౌన్స్ ఎక్కువగా ఉంది. అయితే మేము ప్రొఫెషనల్ క్రికెటర్లు కాబట్టి, ఇటువంటి సాకులు చెప్పాలని అనుకోవడం లేదు. పరిస్థితులు ఎలా ఉన్న అందుకు తగ్గట్టు బ్యాటింగ్ చేయాలి. ఇది చిన్న ఓటమి మాత్రమే.. యుద్దం ఇంకా పూర్తిగా ముగియలేదు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో అయ్యర్ పేర్కొన్నాడు.చదవండి: IPL 2025: ఏంటి కోహ్లి ఇది.. నీ స్దాయికి ఇది తగునా? ఫ్యాన్స్ కౌంటర్ -
ఏంటి కోహ్లి ఇది.. నీ స్దాయికి ఇది తగునా? ఫ్యాన్స్ కౌంటర్
ఐపీఎల్-2025లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్తో జరిగిన తొలి క్వాలిఫయర్లో 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో అరంగేట్ర ఆటగాడు ముషీర్ ఖాన్ పట్ల ఆర్సీబీ సూపర్ స్టార్ విరాట్ కోహ్లి ప్రవర్తించిన తీరు వివాదస్పదమైంది. సోషల్ మీడియా వేదికగా కోహ్లిపై విమర్శల వర్షం కురుస్తోంది.అసలేమి జరిగిదంటే?టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్.. ఆర్సీబీ బౌలర్ల దాటికి 8.2 ఓవర్లలో కేవలం 60 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో పంజాబ్ మెనెజ్మెంట్ యువ బ్యాటర్ ముషీర్ను ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్కు పంపింది. అతడికి ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్ కావడం గమనార్హం. అయితే క్రీజులోకి వచ్చిన ముషీర్ తొలి బంతిని ఎదుర్కొనేందుకు గార్డ్ తీసుకుంటుండగా.. స్లిప్లో ఉన్న కోహ్లి వాటర్ బాయ్ను బ్యాటింగ్కు పంపారు అన్నట్లు నవ్వుతూ సైగ చేశాడు. అయితే వాయిస్ అంత క్లారిటీగా స్టంప్స్ మైక్లో రికార్డు కాలేద.Kohli saying "yeh paani pilata hai" while pointing towards debutant Musheer Khan.Shameful. https://t.co/XgqQXzeAWK— Dhillon (@sehajdhillon_) May 29, 2025 ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు జూనియర్ల పట్ల ఇలానే ప్రవర్తిస్తావా? నీ స్దాయికి ఇది తగునా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు కోహ్లి అభిమానులు అతడికి సపోర్ట్గా నిలుస్తున్నారు. "ఇదే మ్యాచ్లో కొన్ని ఓవర్ల క్రితం మషీర్ డ్రింక్స్ తీసుకొచ్చడాని, అంతలోనే ఇప్పుడు బ్యాటింగ్కు రావల్సి వచ్చిందని కోహ్లి చెబుతున్నాడు. కావాలనే కోహ్లిని తప్పుబట్టి ట్రోలు చేస్తున్నారని" ఓ యూజర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడుFew overs ago, Musheer brought drinks in timeout.So Kohli was saying that just few minutes ago he was bringing water and now he had to come to bat. You people are so blind in your hate for Kohli that you make up things in your mind. https://t.co/JQYLlY299X— nitin (@Nitin__10) May 29, 2025. కాగా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన ముషీర్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. మూడు బంతులు ఎదుర్కొని సుయాష్ శర్మ బౌలింగ్లో ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. అయితే ఈ మ్యాచ్కు ముందు వరకు ముషీర్ కేవలం డ్రింక్స్ అందించిడానికే పరిమితమయ్యాడు.Virat Kohli pointing at the debutant and saying mockingly "ye paani pilaata hai"This Guy is so shameless shame on you kohli.pic.twitter.com/k1SMhEkEJJ— 𝐉𝐨𝐝 𝐈𝐧𝐬𝐚𝐧𝐞 (@jod_insane) May 30, 2025 -
చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. తొలి జట్టుగా రికార్డు
తొలి ఐపీఎల్ టైటిల్ను ముద్దాడేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అడుగు దూరంలో నిలిచింది. ఐపీఎల్-2025లో ఫైనల్ బెర్త్ను ఆర్సీబీ ఖారారు చేసుకుంది. గురువారం ముల్లాన్పూర్ వేదికగా జరిగిన తొలి క్వాలిఫయర్లో పంజాబ్ కింగ్స్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఆర్సీబీ.. నాలుగోసారి ఈ క్యాష్రిచ్ లీగ్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్లో బౌలింగ్, బ్యాటింగ్లో అద్బుతంగా రాణించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ఆర్సీబీ బౌలర్లు చెలరేగడంతో కేవలం 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. పంజాబ్ ఇన్నింగ్స్లో మార్కస్ స్టోయినిస్ (17 బంతుల్లో 26 పరుగులు; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలవగా.. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అనంతరం 102 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇక ఈ మ్యాచ్లో అద్బుత విజయం సాధించిన బెంగళూరు టీమ్ పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది.ఆర్సీబీ సాధించిన రికార్డులు ఇవే..👉ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలో ప్రత్యర్ధిని 15 ఓవర్లలోపే ఆలౌట్ చేసిన తొలి జట్టుగా ఆర్సీబీ రికార్డులెక్కింది. ఇప్పటివరకు ఏ జట్టు కూడా ఈ ఫీట్ సాధించలేదు.👉అదేవిధంగా ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్(20 ఓవర్ల ఫుల్ గేమ్)లో బంతులపరంగా అతిపెద్ద విజయాన్ని సాధించిన జట్టుగా బెంగళూరు నిలిచింది. ఈ మ్యాచ్ను ఆర్సీబీ 60 బంతులు మిగిలూండగానే ముగించింది. ఇంతకుముందు ఈ రికార్డు కోల్కతా నైట్రైడర్స్ పేరిట ఉండేది. ఐపీఎల్-2024 ఫైనల్లో ఎస్ఆర్హెచ్పై 57 బంతులు మిగిలూండగానే కేకేఆర్ విజయం సాధించింది. తాజా మ్యాచ్తో కేకేఆర్ నైట్రైడర్స్ రికార్డును ఆర్సీబీ బ్రేక్ చేసింది.👉అయితే 2017 సీజన్లో ఎలిమినేటర్లో సన్రైజర్స్ హైదరాబాద్పై కేకేఆర్ కేవలం 5.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కానీ ఆ మ్యాచ్ను వర్షం కారణంగా ఆరు ఓవర్లకు కుదించారు. -
విండీస్ను చిత్తు చేసిన ఇంగ్లండ్.. 238 పరుగుల తేడాతో విక్టరీ
వెస్టిండీస్తో వన్డే సిరీస్లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం బర్మింగ్హామ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ 238 పరుగుల తేడాతో విండీస్పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 400 పరుగులు చేసింది. బ్రూక్ కెప్టెన్సీలో ఆడిన తొలి మ్యాచ్లోనే ఇంగ్లండ్ భారీ స్కోరుతో విజృంభించింది. జాకబ్ బెథెల్ (53 బంతుల్లో 82; 8 ఫోర్లు, 5 సిక్స్లు), బెన్ డకెట్ (60; 6 ఫోర్లు, 1 సిక్స్), జో రూట్ (57; 5 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (58; 5 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. జెమీ స్మిత్ (37), బట్లర్ (37), విల్ జాక్స్ (39) కూడా రాణించారు. విండీస్ బౌలర్లలో జైడెన్ సీల్స్ 4, అల్జారీ జోసెఫ్, జస్టిన్ గ్రేవ్స్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 26.2 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. జైడెన్ సీల్స్ (29; 2 ఫోర్లు, 3 సిక్స్లు), కెపె్టన్ షై హోప్ (25) కాస్త పోరాడగా... మిగిలిన వాళ్లు ప్రభావం చూపలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాఖీబ్ మహమూద్, జేమీ ఓవర్టన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య ఆదివారం రెండో వన్డే జరగనుంది.చదవండి: నేను అతడికి పెద్ద అభిమానిని.. ఇంకా ఒకే ఒక మ్యాచ్: ఆర్సీబీ కెప్టెన్ -
RCB Vs PBKS: నేను అతడికి పెద్ద అభిమానిని.. ఇంకా ఒకే ఒక మ్యాచ్: ఆర్సీబీ కెప్టెన్
ఐపీఎల్-2025 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అడుగుపెట్టింది. గురువారం ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన తొలి క్వాలిఫయర్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆర్సీబీ.. తొమ్మిదేళ్ల తర్వాత ఈ క్యాష్ రిచ్ లీగ్ ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్.. ఆర్సీబీ బౌలర్ల ధాటికి 101 పరుగులకే ఆలౌటైంది.బెంగళూరు బౌలర్లలో సుయాష్ శర్మ, హాజిల్వుడ్ తలా మూడు వికెట్లు పడగొట్టి పంజాబ్ పతనాన్ని శాసించగా.. యశ్దయాల్ రెండు, షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్ తలా వికెట్ సాధించారు. పంజాబ్ బ్యాటర్లలో స్టోయినిష్(26) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం 102 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.ఆర్సీబీ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్ (27 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగగా..మయాంక్(19), కోహ్లి(12) పర్వాలేదన్పించారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ స్పందించాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సుయాష్ శర్మపై రజత్ ప్రశంసల వర్షం కురిపించాడు."ఈ మ్యాచ్లో స్పష్టమైన బౌలింగ్ ప్రణాళికలతో బరిలోకి దిగాము. మా ఫాస్ట్ బౌలర్లు పిచ్ కండీషన్స్ను బాగా ఉపయోగించుకున్నారు. ఇక సుయాష్ శర్మ గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. అతడు బౌలింగ్ చేసిన విధానం ఒక అద్బుతం. చక్కటి లైన్ అండ్ లెంగ్త్లతో బౌలింగ్ చేసి ప్రత్యర్ధి బ్యాటర్లను కట్టడి చేశాడు. కెప్టెన్గా అతడి బౌలింగ్పై నాకు ఒక క్లారిటీ ఉంది. స్టంప్స్ లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేయడమే అతడి బలం. సూయూష్ బౌలింగ్ను ఆర్దం చేసుకోవడం బ్యాటర్లకు చాలా కష్టం. నేనెప్పుడూ అతడిని కన్ఫ్యూజ్ చేయలేదు. ప్రతీ మ్యాచ్లోనూ అతడికి సపోర్ట్గా ఉన్నాము. ఈ క్రమంలో అతను కొన్ని పరుగులు ఇచ్చినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ టోర్నీ అసాంతం మేము చాలా మేము చాలా ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గోన్నాము. కాబట్టి ఒక రోజు ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల ఎలాంటి నష్టం లేదు. ఇక ఫిల్ సాల్ట్ ప్రతీ మ్యాచ్లోనూ మాకు అద్బుతమైన ఆరంభాలను అందించాడు. ఈ మ్యాచ్లో మరోసారి తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. అతడికి నేను పెద్ద అభిమానిని. డగౌట్ నుంచి అతడి ఆటను చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. చిన్నస్వామిలోనే కాదు మేము ఎక్కడికి వెళ్లినా మాకు సపోర్ట్గా నిలుస్తున్న ఆర్సీబీ అభిమానులకు ధన్యవాదాలు. మిమ్మల్ని మేము ప్రేమిస్తునే ఉంటాము, మీరు కూడా మాకు మద్దతు ఇస్తూ ఉండండి. మరో మ్యాచ్ మిగిలి ఉంది. ఆ తర్వాత కలిసి సెలబ్రేట్ చేసుకుందాం" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్లో పాటిదార్ పేర్కొన్నాడు.చదవండి: తొమ్మిదేళ్ల తర్వాత తుది పోరుకు... -
టెస్టు సిరీస్కు రిహార్సల్
కాంటర్బరీ (ఇంగ్లండ్): టీమిండియా యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి సహా పలువురు ప్లేయర్లు ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు సన్నాహక మ్యాచ్ బరిలోకి దిగనున్నారు. వచ్చే నెల 20 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ జరగనుండగా... దానికి ముందు ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో భారత ‘ఎ’ జట్టు శుక్రవారం నుంచి నాలుగు రోజుల మొదటి అనధికారిక టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఇందులో భారత్ ‘ఎ’ జట్టు తరఫున అభిమన్యు ఈశ్వరణ్, ధ్రువ్ జురేల్, కరుణ్ నాయర్, ఆకాశ్ దీప్, శార్దుల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, తనుశ్ కొటియాన్, ముకేశ్ కుమార్, హర్షిత్ రాణా, అన్షుల్ కంబోజ్, ఖలీల్ అహ్మద్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్పాండే, హర్ష్ దూబే బరిలోకి దిగనున్నారు. ఇంగ్లండ్తో సిరీస్కు ముందు అక్కడి పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ఈ సన్నాహక మ్యాచ్లు సహకరించనున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో భాగం కాని... భారత టెస్టు జట్టు ఆటగాళ్లను బీసీసీఐ ముందే ఇంగ్లండ్ పంపింది. కరుణ్ నాయర్ మినహా... మిగిలిన ఆటగాళ్లందరికీ ఇదే తొలి ఇంగ్లండ్ పర్యటన. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్న అనంతరం టీమిండియా ఆడనున్న తొలి టెస్టు సిరీస్ ఇదే కానుండటంతో... వారి స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్లను ఎంపిక చేసుకునేందుకు ఈ మ్యాచ్ తోడ్పడనుంది. ప్రధాన సిరీస్లో భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్ను నిర్ణయించేందుకు కూడా ఈ సన్నాహక మ్యాచ్లు సహాయపడనున్నాయి. అభిమన్యు ఈశ్వరణ్, కరుణ్ నాయర్, ఆంధ్రప్రదేశ్ పేస్ ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి ప్రదర్శనపై అందరి దృష్టి నిలవనుంది.ఆ్రస్టేలియా పర్యటనలో 298 పరుగులతో ఆకట్టుకున్న నితీశ్ రెడ్డి... ఐపీఎల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోగా... ఇంగ్లండ్తో తుది జట్టులో చోటు దక్కాలంటే ఈ మ్యాచ్లో సత్తాచాటాల్సిన అవసరముంది. పేస్ ఆల్రౌండర్గా శార్దుల్ ఠాకూర్ నుంచి అతడికి పోటీ ఎదురు కానుంది. అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో... కొత్త స్పిన్నర్గా ఎవరు వెలుగులోకి వస్తారో చూడాలి. -
గుజరాత్ X ముంబై
ముల్లాన్పూర్: ఐపీఎల్ 18వ సీజన్లో బెంగళూరు జట్టు తుది పోరుకు అర్హత సాధించగా... గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ మ్యాచ్కు సిద్ధమయ్యాయి. శుక్రవారం జరగనున్న పోరులో గెలిచిన జట్టు... క్వాలిఫయర్–1లో ఓడిన పంజాబ్ కింగ్స్తో క్వాలిఫయర్–2లో తలపడనుంది. ఓడిన జట్టు లీగ్ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ సీజన్లో ఆడిన 14 మ్యాచ్ల్లో 9 విజయాలు, 5 పరాజయాలతో 18 పాయింట్లు ఖాతాలో వేసుకున్న గుజరాత్ పట్టికలో మూడో స్థానంతో ‘ప్లే ఆఫ్స్’కు చేరుకుంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై 14 మ్యాచ్ల్లో 8 విజయాలు, 6 పరాజయాలతో 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి నాకౌట్కు చేరింది. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్లు జరగగా... రెండింట్లోనూ గుజరాత్నే విజయం వరించింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రికెల్టన్, హార్దిక్ పాండ్యా నమన్ ధీర్ ముంబై బ్యాటింగ్కు కీలకం కానుండగా... జస్ప్రీత్ బుమ్రా, బౌల్ట్, దీపక్ చహర్, సాంట్నర్ బౌలింగ్ భారం మోయనున్నారు. మరోవైపు స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ సేవలు అందుబాటులో లేకపోవడంతో గుజరాత్ కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది. కెపె్టన్ శుబ్మన్ గిల్, మరో ఓపెనర్ సాయి సుదర్శన్ ప్రదర్శనపైనే ఆ జట్టు భవితవ్యం ఆధారపడి ఉంది. రూథర్ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా సత్తా చాటాల్సిన అవసరముంది.ఐపీఎల్లో నేడు (ఎలిమినేటర్)గుజరాత్ X ముంబైవేదిక: ముల్లాన్పూర్రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో -
తొమ్మిదేళ్ల తర్వాత తుది పోరుకు...
ఐపీఎల్ ప్రారంభమైన నాటినుంచి తొలి టైటిల్ కోసం పోరాడుతూనే ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు... ఈ సీజన్లో ట్రోఫీ దిశగా మరో ముందడుగు వేసింది. బౌలర్లు విజృంభించడంతో క్వాలిఫయర్–1లో పంజాబ్పై ఏకపక్ష విజయం సాధించిన బెంగళూరు... తొమ్మిదేళ్ల తర్వాత నాలుగోసారి ఐపీఎల్ ఫైనల్కు చేరింది. హాజల్వుడ్ పేస్తో బెంబేలెత్తిస్తే... సుయాశ్ శర్మ గూగ్లీలతో పంజాబ్ పనిపట్టాడు. ఈ సీజన్లో ప్రధానంగా టాప్–3 ఆటగాళ్లపైనే ఎక్కువ ఆధారపడ్డ పంజాబ్.. ఆ ముగ్గురు మూకుమ్మడిగా చేతులెత్తేయడంతో ఓటమి పాలైంది. ముల్లాన్పూర్: సీజన్ ఆసాంతం నిలకడగా రాణించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) క్వాలిఫయర్–1లోనూ సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ ఐపీఎల్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన పోరులో బెంగళూరు 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ను చిత్తుచేసి తుదిపోరుకు చేరింది. బౌలర్లు సమష్టిగా సత్తా చాటడంతో ఆర్సీబీ ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టగా... 11 ఏళ్ల తర్వాత ‘ప్లే ఆఫ్స్’కు చేరిన పంజాబ్ బ్యాటర్ల వైఫల్యంతో పరాజయం వైపు నిలిచింది. మొదట పంజాబ్ 14.1 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. మార్కస్ స్టొయినిస్ (17 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... ప్రభ్సిమ్రన్ సింగ్ (18), అజ్మతుల్లా ఓమర్జాయ్ (18) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (2)తో పాటు ప్రియాన్ష్ ఆర్య (7), జోష్ ఇన్గ్లిస్ (4), నేహల్ వధేరా (8), శశాంక్ సింగ్ (3), ముషీర్ ఖాన్ (0) విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సుయాశ్ శర్మ, హాజల్వుడ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా... యశ్ దయాళ్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో బెంగళూరు 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (12; 2 ఫోర్లు) త్వరగానే అవుట్ అయినా... ఫిల్ సాల్ట్ (27 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తుదిపోరులో క్వాలిఫయర్–2 విజేతతో బెంగళూరు ట్రోఫీ కోసం తలపడనుంది. ఒకరి వెంట ఒకరు... టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్కు శుభారంభం దక్కలేదు. ఈ సీజన్లో మెరుగైన ఆరంభాలతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఓపెనర్లు ప్రియాన్ష్ ప్రభ్సిమ్రన్ కీలక పోరులో ఆకట్టుకోలేకపోయారు. యశ్ దయాళ్ వేసిన రెండో ఓవర్ రెండో బంతికి ప్రియాన్ష్ సులువైన క్యాచ్ ఇచ్చి వెనుదిరగగా... భువనేశ్వర్ వేసిన మరుసటి ఓవర్లో రెండు ఫోర్లతో టచ్లోకి వచ్చిన ప్రభ్సిమ్రన్ అదే జోరులో మరో షాటే ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్ బాట పట్టాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 3 బంతులే ఆడి అవుట్ అయ్యాడు. హాజల్వుడ్ బంతిని కట్ చేసే ప్రయత్నంలో కీపర్కు క్యాచ్ ఇచ్చాడు. హాజల్వుడ్ తన మరుసటి ఓవర్లో ఇన్గ్లిస్ను కూడా బుట్టలో వేసుకోగా... నేహల్ వధేరా ఇలా వచ్చి అలా వెళ్లాడు. స్టొయినిస్ కొన్ని షాట్లతో ఇన్నింగ్స్ను నడిపించే ప్రయత్నం చేసినా అతడికి సహాకారం అందించేవాళ్లే కరువయ్యారు. సుయాశ్ గూగ్లీని అర్థం చేసుకోలేక శశాంక్ క్లీన్ బౌల్డ్ కాగా... ఇంపాక్ట్ ప్లేయర్గా అనూహ్య అవకాశం దక్కించుకున్న ముషీర్ ఖాన్ ఐపీఎల్ అరంగేట్రంలో డకౌట్గా వెనుదిరిగాడు. బ్యాటర్లు వరసగా విఫలమవుతుండటంతో... ముషీర్కు తుది జట్టులో చోటు దక్కగా... ఆడిన తొలి ఐపీఎల్ మ్యాచ్లో ఒక్క పరుగు కూడా చేయకుండానే అతడు అవుట్అయ్యాడు. తన తదుపరి ఓవర్లో స్టొయినిస్ను కూడా సుయాశ్ పెవిలియన్కు పంపడంతో పంజాబ్ పనైపోయింది. ఆఖర్లో అజ్మతుల్లా విలువైన పరుగులు చేసి జట్టు స్కోరును వంద పరుగుల మార్క్ దాటించాడు. ఆడుతూ పాడుతూ.. బెంగళూరు బ్యాటింగ్ ప్రారంభానికి ముందే పంజాబ్ పరాజయం ఖాయమైపోగా... నాలుగో ఓవర్లో కోహ్లిని ఔట్ చేసి జెమీసన్ కాస్త ఆసక్తి రేపినా... సాల్ట్ విజృంభణతో ఎలాంటి సంచలనానికి అవకాశం లేకుండా పోయింది. మూడో ఓవర్లో 4, 6 కొట్టిన సాల్ట్... ఐదో ఓవర్లో రెండు ఫోర్లు బాదాడు. జెమీసన్ ఓవర్లో వరసగా 4, 4, 6 కొట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి ఆర్సీబీ 61/1తో నిలిచింది. మయాంక్ అగర్వాల్ (19; 2 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ రజత్ పాటీదార్ (15 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. 23 బంతుల్లో సాల్ట్ హాఫ్సెంచరీ పూర్తి చేసుకోగా... భారీ సిక్స్తో పాటీదార్ మ్యాచ్ను ముగించాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) కృనాల్ (బి) దయాళ్ 7; ప్రభ్సిమ్రన్ (సి) జితేశ్ (బి) భువనేశ్వర్ 18; ఇన్గ్లిస్ (సి) భువనేశ్వర్ (బి) హాజల్వుడ్ 4; శ్రేయస్ (సి) జితేశ్ (బి) హాజల్వుడ్ 2; నేహల్ (బి) దయాళ్ 8; స్టొయినిస్ (బి) సుయాశ్ 26; శశాంక్ (బి) సుయాశ్ 3; ముషీర్ (ఎల్బీ) (బి) సుయాశ్ 0; అజ్మతుల్లా (సి) జితేశ్ (బి) హాజల్వుడ్ 18; హర్ప్రీత్ (బి) షెఫర్డ్ 4; జెమీసన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 11; మొత్తం (14.1 ఓవర్లలో ఆలౌట్) 101. వికెట్ల పతనం: 1–9, 2–27, 3–30, 4–38, 5–50, 6–60, 7–60, 8–78, 9–97, 10–101. బౌలింగ్: భువనేశ్వర్ 2–0–17–1; యశ్ దయాళ్ 4–0–26–2; హాజల్వుడ్ 3.1–0–21–3; సుయాశ్ శర్మ 3–0–17–3; కృనాల్ పాండ్యా 1–0–10–0, రొమారియో షెఫర్డ్ 1–0–5–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (నాటౌట్) 56; కోహ్లి (సి) ఇన్గ్లిస్ (బి) జెమీసన్ 12; మయాంక్ (సి) శ్రేయస్ (బి) ముషీర్ 19; రజత్ పాటీదార్ (నాటౌట్) 15; ఎక్స్ట్రాలు: 4; మొత్తం (10 ఓవర్లలో 2 వికెట్లకు) 106. వికెట్ల పతనం: 1–30, 2–84. బౌలింగ్: అర్ష్ దీప్ సింగ్ 2–0–20–0; జెమీసన్ 3–1–27–1; అజ్మతుల్లా 1–0–10–0; హర్ప్రీత్ బ్రార్ 2–0–18–0; ముషీర్ ఖాన్ 2–0–27–1. -
IPL 2025: పంజాబ్ను చిత్తు చేసిన ఆర్సీబీ.. తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్లోకి ఎంట్రీ
ఐపీఎల్ 2025లో భాగంగా పంజాబ్ కింగ్స్తో ఇవాళ (మే 29) జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పంజాబ్ జూన్ 1న జరిగే క్వాలిఫయర్-2లో రేపు (మే 30) జరుగబోయే ఎలిమినేటర్ మ్యాచ్లో (గుజరాత్ వర్సెస్ ముంబై) విజేతతో తలపడుతుంది.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఆర్సీబీ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. హాజిల్వుడ్, సుయాశ్ శర్మ తలో 3, యశ్ దయాల్ 2, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు.పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రభ్సిమ్రన్ సింగ్ (18), మార్కస్ స్టోయినిస్ (26), అజ్మతుల్లా ఒమర్జాయ్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ప్రియాంశ్ ఆర్య 7, జోస్ ఇంగ్లిస్ 4, శ్రేయస్ అయ్యర్ 2, నేహల్ వధేరా 8, శశాంక్ సింగ్ 3, ముషీర్ ఖాన్ 0, హర్ప్రీత్ బ్రార్ 4 పరుగులకే ఔటయ్యారు. అనంతరం 102 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. 10 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి దర్జాగా విజయతీరాలకు చేరింది. ఫిల్ సాల్ట్ (27 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద శతకంతో చెలరేగగా.. విరాట్ కోహ్లి 12, మయాంక్ అగర్వాల్ 19, రజత్ పాటిదార్ 15 (నాటౌట్) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో జేమీసన్, ముషీర్ ఖాన్ తలో వికెట్ తీశారు.అతి పెద్ద విజయంఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలో బంతుల పరంగా ఆర్సీబీ అతి పెద్ద విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ మరో 60 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. గతంలో ఈ రికార్డు కేకేఆర్ పేరిట ఉండేది. 2024 సీజన్ ఫైనల్లో కేకేఆర్ ఎస్ఆర్హెచ్పై 57 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది.నాలుగోసారి..తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆర్సీబీకి ఇది నాలుగో ఫైనల్ అవుతుంది. ఆర్సీబీ 2009, 2011, 2016 సీజన్లలో కూడా ఫైనల్కు చేరింది. అయితే మూడు సందర్భాల్లో ఈ జట్టుకు ఓటమే ఎదురైంది. -
IPL 2025, Qualifier 1: ప్లే ఆఫ్స్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్న పంజాబ్
ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐపీఎల్ 2025లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మే 29) జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్లో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలిన పంజాబ్.. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలో అతి తక్కువ ఓవర్లు ఆడిన జట్టుగా చెత్త రికార్డును నమోదు చేసింది. గతంలో ఈ రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్ పేరిట ఉండేది. 2008 సీజన్లో ఢిల్లీ 16.1 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్లో పంజాబ్ చేసిన 101 పరుగుల స్కోర్ ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలో నాలుగో అత్యల్ప స్కోర్గానూ రికార్డైంది.ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో అత్యల్ప స్కోర్లు..82 - డెక్కన్ ఛార్జర్స్ vs RCB, DY పాటిల్, 2010 (3వ స్థానం ప్లేఆఫ్)87 - DC vs RR, ముంబై, 2008 SF101 - LSG vs MI, చెన్నై, 2023 ఎలిమినేటర్101 - PBKS vs RCB, ముల్లన్పూర్, క్వాలిఫైయర్ 1*104 - డెక్కన్ ఛార్జర్స్ vs CSK, DY పాటిల్, 2010 SFకాగా, ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఆర్సీబీ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. హాజిల్వుడ్, సుయాశ్ శర్మ తలో 3, యశ్ దయాల్ 2, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు. పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రభ్సిమ్రన్ సింగ్ (18), మార్కస్ స్టోయినిస్ (26), అజ్మతుల్లా ఒమర్జాయ్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ప్రియాంశ్ ఆర్య 7, జోస్ ఇంగ్లిస్ 4, శ్రేయస్ అయ్యర్ 2, నేహల్ వధేరా 8, శశాంక్ సింగ్ 3, ముషీర్ ఖాన్ 0, హర్ప్రీత్ బ్రార్ 4 పరుగులకే ఔటయ్యారు. 102 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. 30 పరుగుల వద్ద కోహ్లి (12) వికెట్ కోల్పోయింది. 4 ఓవర్ల అనంతరం ఆ జట్టు స్కోర్ 30/1గా ఉంది. సాల్ట్ (14), మయాంక్ అగర్వాల్ (0) క్రీజ్లో ఉన్నారు. -
IPL 2025, Qualifier 1: అరుదైన రికార్డు సాధించిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్
ఐపీఎల్ 2025లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మే 29) జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ ప్రభ్సిమ్రన్ సింగ్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్లో 18 పరుగులకే ఔటైన ప్రభ్సిమ్రన్.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో 500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఓ ఐపీఎల్ సీజన్లో 500 పరుగులు పూర్తి చేసిన ఆరో అన్క్యాప్డ్ ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు.ఐపీఎల్ తొలి సీజన్లో పంజాబ్కే చెందిన షాన్ మార్ష్ ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు కాగా.. 2018లో సూర్యకుమార్ యాదవ్ (ఎంఐ), 2020 సీజన్లో ఇషాన్ కిషన్ (ఎంఐ), 2023 సీజన్లో యశస్వి జైస్వాల్ (రాజస్థాన్ రాయల్స్), 2024 సీజన్లో రియాన్ పరాగ్ (రాజస్థాన్ రాయల్స్) ఈ ఘనత సాధించిన అన్క్యాప్డ్ ప్లేయర్లుగా రికార్డుల్లో ఉన్నారు. ఈ సీజన్లో 15 మ్యాచ్లు ఆడిన ప్రభ్సిమ్రన్ 517 పరుగులు చేశాడు. ఈ సీజన్లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా 500 పరుగుల మార్కును దాటాడు (15 మ్యాచ్ల్లో 516 పరుగులు).ఇదిలా ఉంటే, ఆర్సీబీతో జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పంజాబ్ దాదాపుగా చేతులెత్తేసింది. ఈ జట్టు 13 ఓవర్లలో కేవలం 92 పరుగులు మాత్రమే చేసి 8 వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పంజాబ్ బ్యాటింగ్ ఆర్డర్ను కకావికలం చేశారు. సుయాశ్ శర్మ 3, జోష్ హాజిల్వుడ్, యశ్ దయాల్ తలో 2, భువనేశ్వర్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు. పంజాబ్ బ్యాటర్లలో ప్రియాంశ్ ఆర్య 7, ప్రభ్సిమ్రన్ సింగ్ 18, జోస్ ఇంగ్లిస్ 4, శ్రేయస్ అయ్యర్ 2, నేహల్ వధేరా 8, మార్కస్ స్టోయినిస్ 26, శశాంక్ సింగ్ 3, ముషీర్ ఖాన్ 0 పరుగులకు ఔట్ కాగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ 13, హర్ప్రీత్ బ్రార్ 4 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలిస్తే నేరుగా ఫైనల్కు చేరుతుంది. ఈ మ్యాచ్లో పంజాబ్ ఓడినా మరో అవకాశం (క్వాలిఫయర్-2) ఉంటుంది. -
IPL 2025, Qualifier 1: పంజాబ్పై ఆర్సీబీ ఘన విజయం
పంజాబ్పై ఆర్సీబీ ఘన విజయంఐపీఎల్ 2025లో భాగంగా పంజాబ్ కింగ్స్తో ఇవాళ (మే 29) జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ ఫైనల్కు చేరింది. పంజాబ్ జూన్ 1న జరిగే క్వాలిఫయర్-2లో రేపు జరుగబోయే ఎలిమినేటర్ మ్యాచ్లో (గుజరాత్ వర్సెస్ ముంబై) విజేతతో తలపడుతుంది.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ఆర్సీబీ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. హాజిల్వుడ్, సుయాశ్ శర్మ తలో 3, యశ్ దయాల్ 2, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు.పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రభ్సిమ్రన్ సింగ్ (18), మార్కస్ స్టోయినిస్ (26), అజ్మతుల్లా ఒమర్జాయ్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ప్రియాంశ్ ఆర్య 7, జోస్ ఇంగ్లిస్ 4, శ్రేయస్ అయ్యర్ 2, నేహల్ వధేరా 8, శశాంక్ సింగ్ 3, ముషీర్ ఖాన్ 0, హర్ప్రీత్ బ్రార్ 4 పరుగులకే ఔటయ్యారు. అనంతరం 102 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. 10 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి దర్జాగా విజయతీరాలకు చేరింది. ఫిల్ సాల్ట్ (27 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద శతకంతో చెలరేగగా.. విరాట్ కోహ్లి 12, మయాంక్ అగర్వాల్ 19, రజత్ పాటిదార్ 15 (నాటౌట్) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో జేమీసన్, ముషీర్ ఖాన్ తలో వికెట్ తీశారు.రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ7.5వ ఓవర్- 84 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. ముషీర్ ఖాన్ బౌలింగ్లో మయాంక్ అగర్వాల్ (19) ఔటయ్యాడు. టార్గెట్ 102.. 30 పరుగుల వద్ద కోహ్లి ఔట్3.2వ ఓవర్- 102 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 30 పరుగుల వద్ద విరాట్ కోహ్లి (12) వికెట్ కోల్పోయింది. జేమీసన్ బౌలింగ్లో జోస్ ఇంగ్లిస్కు క్యాచ్ ఇచ్చి విరాట్ ఔటయ్యాడు. రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. 101 పరుగులకే కుప్పకూలిన పంజాబ్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఆర్సీబీ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. హాజిల్వుడ్, సుయాశ్ శర్మ తలో 3, యశ్ దయాల్ 2, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు. పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రభ్సిమ్రన్ సింగ్ (18), మార్కస్ స్టోయినిస్ (26), అజ్మతుల్లా ఒమర్జాయ్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ప్రియాంశ్ ఆర్య 7, జోస్ ఇంగ్లిస్ 4, శ్రేయస్ అయ్యర్ 2, నేహల్ వధేరా 8, శశాంక్ సింగ్ 3, ముషీర్ ఖాన్ 0, హర్ప్రీత్ బ్రార్ 4 పరుగులకే ఔటయ్యారు. 78 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయిన పంజాబ్10.3వ ఓవర్- 78 పరుగుల వద్ద పంజాబ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. సుయాశ్ శర్మ బౌలింగ్లో ప్రమాదకరంగా కనిపిస్తున్న మార్కస్ స్టోయినిస్ (26) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఏడో వికెట్ కోల్పోయిన పంజాబ్8.5వ ఓవర్- 60 పరుగుల వద్ద పంజాబ్ ఏడో వికెట్ కోల్పోయింది. సుయాశ్ బౌలింగ్లో ముషీర్ ఖాన్ (0) ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన పంజాబ్8.2వ ఓవర్- 60 పరుగుల వద్ద పంజాబ్ ఆరో వికెట్ కోల్పోయింది. సుయాశ్ శర్మ బౌలింగ్లో శశాంక్ సింగ్ (3) క్లీన్ బౌల్డయ్యాడు. 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన పంజాబ్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ జట్టు 50 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. 6.3వ ఓవర్లో యశ్ దయాల్ బౌలింగ్లో నేహల్ వధేరా (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దయాల్, హాజిల్వుడ్ తలో 2, భువీ ఓ వికెట్ తీశారు. 38 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్5.1వ ఓవర్- 38 పరుగుల వద్ద పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. హాజిల్వుడ్ బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్కు క్యాచ్ ఇచ్చి జోష్ ఇంగ్లిస్ (4) ఔటయ్యాడు. పీకల్లోతు కష్టాల్లో పంజాబ్3.4వ ఓవర్- 30 పరుగుల వద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. హాజిల్వుడ్ బౌలింగ్లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి శ్రేయస్ అయ్యర్ (2) ఔటయ్యాడు. ఇన్ ఫామ్ బ్యాటర్లు ప్రియాంశ్, ప్రభ్సిమ్రన్, శ్రేయస్ ఔట్ కావడంతో పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పంజాబ్2.6వ ఓవర్- టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పంజాబ్ 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఇన్ ఫామ్ బ్యాటర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (18) ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్1.2వ ఓవర్- 9 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. యశ్ దయాల్ బౌలింగ్లో కృనాల్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి ప్రియాంశ్ ఆర్య (7) ఔటయ్యాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ, స్టార్ బౌలర్ వచ్చేశాడుఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 29) జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. పంజాబ్ తరఫున మార్కో జన్సెన్ స్థానంలో అజ్మతుల్లా ఒమర్జాయ్ తుది జట్టులోకి వచ్చాడు. ఆర్సీబీ తరఫున స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ బరిలోకి దిగనున్నాడు. నువాన్ తుషార స్థానాన్ని జోష్ భర్తీ చేశాడు.జట్ల వివరాలు..పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లిస్(w), శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్ప్రీత్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, కైల్ జామీసన్ఇంపాక్ట్ సబ్లు: విజయ్కుమార్ వైషాక్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, ముషీర్ ఖాన్, జేవియర్ బార్ట్లెట్.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(సి), లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ(w), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హేజిల్వుడ్, సుయాష్ శర్మఇంపాక్ట్ సబ్స్: మయాంక్ అగర్వాల్, రసిఖ్ సలామ్, మనోజ్ భాండాగే, టిమ్ సీఫెర్ట్, స్వప్నిల్ సింగ్. -
విండీస్తో వన్డే సిరీస్ నుంచి ఇంగ్లండ్ తాజా మాజీ కెప్టెన్ ఔట్.. భారత్తో సిరీస్కు కూడా..!
ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు తాజా మాజీ కెప్టెన్ హీథర్ నైట్ త్వరలో వెస్టిండీస్తో జరుగనున్న వన్డే సిరీస్ నుంచి నిష్క్రమించింది. గాయం కారణంగా నైట్ ఈ సిరీస్తో పాటు జూన్, జులైల్లో షెడ్యూలైన భారత పర్యటనకు కూడా దూరమైంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న నైట్ పై రెండు సిరీస్లతో పాటు హండ్రెడ్ లీగ్ నుంచి కూడా తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నైట్ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మూడు నెలల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే నైట్ ఈ ఏడాది సెప్టెంబర్లో భారత్లో జరిగే వన్డే వరల్డ్కప్లో ఆడేది కూడా అనుమానంగా కనిపిస్తుంది. నైట్ గైర్హాజరీలో విండీస్తో సిరీస్లో నాట్ సీవర్ బ్రంట్ ఇంగ్లండ్ కెప్టెన్గా వ్యవహరించనుంది. ఈ సిరీస్లో నైట్ స్థానాన్ని అలైస్ క్యాప్సీ భర్తీ చేయనుంది. నైట్ మే 26న విండీస్తో జరిగిన మూడో టీ20 సందర్భంగా గాయపడింది. ఈ మ్యాచ్లో 66 పరుగుల వద్ద ఉన్న సమయంలో నైట్ అర్దంతరంగా మైదానాన్ని వీడింది.కాగా, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ల కోసం వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో టీ20 సిరీస్ ఇదివరకే ముగియగా.. వన్డే సిరీస్ మే 30 నుంచి ప్రారంభం కానుంది. టీ20 సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లండ్.. వన్డే సిరీస్ను కూడా అదే తరహాలో ముగించాలని భావిస్తుంది. మే 30, జూన్ 4, 7 తేదీల్లో మూడు వన్డేలు వేర్వేరు వేదికల్లో జరుగనున్నాయి.విండీస్తో వన్డే సిరీస్కు ఇంగ్లండ్ జట్టు..నాట్ సీవర్ బ్రంట్ (కెప్టెన్), అలైస్ డేవిడ్సన్ రిచర్డ్స్, మహిక గౌర్, సోఫీ డంక్లీ, ట్యామీ బేమౌంట్, అలైస్ క్యాప్సీ, ఆమీ జోన్స్, ఎమ్మా లాంబ్, ఎమ్ ఆర్లాట్, సారా గ్లెన్, కేట్ క్రాస్, లిన్సే స్మిత్, లారెన్ బెల్, చార్లెట్ డీన్ -
భారత్లో ఆస్ట్రేలియా పర్యటన.. షెడ్యూల్ విడుదల
ఈ ఏడాది సెప్టెంబర్లో ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు భారత్లో పర్యటించనుంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ ఇవాళ విడుదల చేసింది. ఈ పర్యటనలో ఆసీస్ మహిళా టీమ్ భారత మహిళల క్రికెట్ జట్టుతో మూడు వన్డేలు ఆడనుంది. సెప్టెంబర్ 14, 17, 20 తేదీల్లో చెన్నై వేదికగా ఈ మ్యాచ్లు జరుగనున్నాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్లు ప్రారంభమవుతాయి.ఆస్ట్రేలియా-ఏ, సౌతాఫ్రికా-ఏ జట్లు కూడా..!ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు భారత్లో పర్యటిస్తుండగానే ఆ దేశ పురుషుల ఏ టీమ్ కూడా భారత్లో పర్యటించనుంది. సెప్టెంబర్ 16- అక్టోబర్ 5 మధ్య తేదీల్లో ఆసీస్-ఏ టీమ్ భారత ఏ జట్టుతో రెండు అనధికారిక నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్లు, మూడు వన్డేలు ఆడుతుంది. టెస్ట్ మ్యాచ్లకు లక్నో ఆతిథ్యమివ్వనుండగా.. వన్డేలు కాన్పూర్లో జరుగనున్నాయి.భారత్లో ఆస్ట్రేలియా-ఏ మెన్స్ టీమ్ షెడ్యూల్..తొలి టెస్ట్: సెప్టెంబర్ 16-19 (లక్నో)రెండో టెస్ట్: సెప్టెంబర్ 23-26 (లక్నో)తొలి వన్డే: సెప్టెంబర్ 30 (కాన్పూర్)రెండో వన్డే: అక్టోబర్ 3 (కాన్పూర్)మూడో వన్డే: అక్టోబర్ 5 (కాన్పూర్)ఆస్ట్రేలియా ఏ పురుషుల టీమ్ భారత్లో పర్యటిస్తుండగానే సౌతాఫ్రికా ఏ పురుషుల ఏ టీమ్ కూడా భారత్లో పర్యటిస్తుంది. ఆస్ట్రేలియా ఏ టీమ్ లాగే ఈ జట్టు కూడా భారత్ ఏ జట్టుతో రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్లు, మూడు వన్డేలు ఆడుతుంది. టెస్ట్ మ్యాచ్లు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్లో జరుగనుండగా.. వన్డేలు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగనున్నాయి.భారత్లో సౌతాఫ్రికా-ఏ మెన్స్ టీమ్ షెడ్యూల్..తొలి టెస్ట్: అక్టోబర్ 30-నవంబర్ 2 (బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ గ్రౌండ్)రెండో టెస్ట్: నవంబర్ 6-9 (బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ గ్రౌండ్)తొలి వన్డే: నవంబర్ 13 (చిన్నస్వామి స్టేడియం)రెండో వన్డే: నవంబర్ 16 (చిన్నస్వామి స్టేడియం)మూడో వన్డే: నవంబర్ 19 (చిన్నస్వామి స్టేడియం) -
Qualifier 1: స్టార్ బౌలర్ దూరం.. బలహీనంగా కనిపిస్తున్న పంజాబ్ బౌలింగ్ విభాగం
ఐపీఎల్ 2025లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మే 29) జరుగబోయే క్వాలిఫయర్-1కు ముందు పంజాబ్ కింగ్స్ బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తుంది. ఈ మ్యాచ్కు ఆ జట్టు స్టార్ పేసర్ మార్కో జన్సెన్ దూరమయ్యాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ దృష్ట్యా అతను స్వదేశానికి వెళ్లిపోయాడు. జన్సెన్ స్థానాన్ని అజ్మతుల్లా ఒమర్జాయ్ భర్తీ చేసే అవకాశం ఉంది. కీలకమైన ఈ మ్యాచ్లో జన్సెన్ లేకపోవడం పంజాబ్ విజయావకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది.చహల్ ఆడేది కూడా అనుమానమే..!నేటి మ్యాచ్లో పంజాబ్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఆడేది కూడా అనుమానమే అని తెలుస్తుంది. చహల్ కొద్ది రోజుల కిందట గాయపడ్డాడు (చేతి వేలికి). ఈ కారణంగా అతను గత రెండు మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. కీలక మ్యాచ్ కావడంతో పంజాబ్ యాజమాన్యం చహల్ను బరిలోకి దించే సాహసం చేయవచ్చు.జన్సెన్, చహల్ లాంటి నాణ్యమైన బౌలర్లు నేటి మ్యాచ్లో ఆడకపోతే పంజాబ్కు ఇబ్బందులు తప్పకపోవచ్చు. వీరిద్దరు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల బౌలర్లు. వీరి గైర్హాజరీలో పంజాబ్ బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తుంది. నంబర్ వన్ టీ20 బౌలర్ అర్షదీప్ ఉన్నా ఒక్కడు ఏ మేరకు ప్రభావం చూపగలడో చూడాలి. జేమీసన్, ఒమర్జాయ్ లాంటి పేసర్లు ఉన్నా వారి నుంచి అతిగా ఆశించలేని పరిస్థితి. స్పిన్ విభాగంలో హర్ప్రీత్ బ్రార్పై కొద్దొగొప్పో నమ్మకాలు పెట్టుకోవచ్చు. ఒకవేళ చహల్ దూరమైతే అతని స్థానంలో విజయ్కుమార్ వైశాక్ ఆడవచ్చు. అయితే వైశాక్ చహల్ లేని లోటును భర్తీ చేయలేడు. వైశాక్ తుది జట్టులోకి వస్తే పంజాబ్ స్పిన్ విభాగాన్ని హర్ప్రీత్ బ్రార్ ఒక్కడే మోయాల్సి వస్తుంది. కాబట్టి గాయం తగ్గకపోయినా నేటి మ్యాచ్లో పంజాబ్ యాజమాన్యం చహల్ను బరిలోకి దించవచ్చు. భీకర ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లిని బలహీనంగా కనిపిస్తున్న ఈ పంజాబ్ బౌలింగ్ యూనిట్ ఏ మేరకు నిలువరించగలదో చూడాలి.బౌలింగ్ విషయాన్ని పక్కన పెడితే.. పంజాబ్ బ్యాటింగ్ విభాగం అత్యంత పటిష్టంగా ఉంది. ఈ జట్టులో దాదాపు అందరు బ్యాటర్లు మంచి ఫామ్లో ఉన్నారు. ఓపెనర్లు ప్రభ్సిమ్రన్, ప్రియాంశ్ ఆర్య ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ఇంగ్లిస్ గత మ్యాచ్లో తడాకా చాటాడు. శ్రేయస్ సీజన్ ఆరంభం నుంచి మంచి టచ్లో ఉన్నాడు. నేహల్ వధేరా, శశాంక్ సింగ్ ఇన్నింగ్స్ చివర్లో అద్భుతాలు చేయడం చూశాం. పంజాబ్ బ్యాటింగ్ విభాగాన్ని స్టోయినిస్ ఫామ్ ఒక్కటే కలవరపెడుతుంది. ఇతను కూడా నేటి మ్యాచ్లో టచ్లోకి వస్తే ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు కనిపిస్తాయి.నేటి మ్యాచ్లో పంజాబ్ తుది జట్టు (అంచనా)..ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ (WK), శ్రేయస్ అయ్యర్ (C), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్ప్రీత్ బ్రార్, కైల్ జామీసన్, అర్ష్దీప్ సింగ్, వైషాక్ విజయ్కుమార్/యుజ్వేంద్ర చాహల్ఇంపాక్ట్ ప్లేయర్: ప్రభ్సిమ్రాన్ సింగ్ -
IPL 2025 Qualifier 1: చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి
ఐపీఎల్-2025 సీజన్ తొలి క్వాలిఫయర్లో గురువారం ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. సమ ఉజ్జీలగా ఉన్న ఈ రెండు జట్ల మధ్య పోరు మరోసారి రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఇప్పటికే లీగ్ స్టేజిలో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్లు కూడా అభిమానులను మునివేళ్లపై నిలబెట్టాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు ఆర్హత సాధిస్తోంది. ఇక హైవోల్టేజ్ మ్యాచ్కు ముందు ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి.చరిత్రకు అడుగు దూరంలో..ఈ మ్యాచ్లో కోహ్లి మరో 30 పరుగులు చేస్తే పంజాబ్ కింగ్స్పై అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ఇప్పటివరకు పంజాబ్పై కోహ్లి 1104 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ పంజాబ్ కింగ్స్పై 1034 పరుగులు చేశాడు.ఒకే ఒక ఫిప్టీ..ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక ఆర్ధశతకాలు నమోదు చేసిన డేవిడ్ వార్నర్ రికార్డును సమం చేసేందుకు కోహ్లి అడుగుదూరంలో నిలిచాడు. ఈ మ్యాచ్లో విరాట్ హాఫ్ సెంచరీ సాధిస్తే వార్నర్ సరసన చేరుతాడు. కోహ్లి ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు ఎనిమిది ఆర్ధ శతకాలు నమోదు చేశాడు. 2016 ఐపీఎల్ సీజన్లో వార్నర్ 9 ఫిప్టీలు సాధించాడు. కాగా ఈ ఏడాది సీజన్లో విరాట్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. తన అద్బుత ఇన్నింగ్స్లతో ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కింగ్ కోహ్లి ఇప్పటివరకు 13 మ్యాచ్లు ఆడి 602 పరుగులు చేశాడు.పంజాబ్తో మ్యాచ్కు ఆర్సీబీ తుది జట్టు(అంచనా)ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, రజిత్ పాటిదార్(కెప్టెన్), లివింగ్స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, యశ్ దయాల్, జోష్ హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషారాచదవండి: ENG vs IND: 'శ్రేయస్ ఏమి తప్పు చేశాడు.. కావాలనే ఎంపిక చేయలేదు' -
క్వాలిఫయర్-1.. ఆర్సీబీకి అదిరిపోయే న్యూస్
ఐపీఎల్-2025 క్వాలిఫయర్-1కు సర్వసిద్దమైంది. చంఢీగడ్లోని ముల్లాన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇరు జట్లు సమ ఉజ్జీలగా ఉండడంతో గెలుపు ఎవరిదో క్రికెట్ నిపుణులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. ఈ మ్యాచ్కు ముందు ఆర్సీబీకి గుడ్న్యూస్ అందినట్లు తెలుస్తోంది.హాజిల్ వుడ్ రీ ఎంట్రీ?గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉన్న జోష్ హాజిల్వుడ్ తిరిగి ఆర్సీబీ తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది. భుజం నొప్పితో బాధపడుతున్న ఈ ఆసీస్ స్పీడ్ స్టార్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. రొమిరియో షెఫర్డ్ స్దానంలో ప్లేయింగ్ ఎలెవన్లోకి హాజిల్వుడ్ రానున్నట్లు ఆర్సీబీ వర్గాలు వెల్లడించాయి.హాజిల్వుడ్ తిరిగొస్తే బెంగళూరు బౌలింగ్ విభాగం మరింత పటిష్టం కానుంది. ఇప్పటికే భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషారా వంటి స్పీడ్ స్టార్లు ఆర్సీబీ జట్టులో ఉన్నారు. మరోవైపు గత రెండు మ్యాచ్లలో ఇంప్టాక్ ప్లేయర్గా బరిలోకి దిగిన ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్ సైతం ఈ మ్యాచ్కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాడు. అయితే విధ్వంసకర ఆటగాడు టిమ్ డేవిడ్ మాత్రం ఈ మ్యాచ్లో కూడా ఆడేది అనుమానమే. డేవిడ్ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. అతడు కోలుకోవడానికి మరి కొంత సమయం పడుతోంది.పంజాబ్తో మ్యాచ్కు ఆర్సీబీ తుది జట్టు(అంచనా)ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, రజిత్ పాటిదార్(కెప్టెన్), లివింగ్స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, యశ్ దయాల్, జోష్ హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషారాచదవండి: ENG vs IND: 'శ్రేయస్ ఏమి తప్పు చేశాడు.. కావాలనే ఎంపిక చేయలేదు' -
వరల్డ్ బౌలింగ్ లీగ్లో కోహ్లి పెట్టుబడి..
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి... వరల్డ్ బౌలింగ్ లీగ్ (డబ్ల్యూబీఎల్)లో అడుగు పెడుతున్నాడు. ఇప్పటికే పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టిన కోహ్లి... డబ్ల్యూబీఎల్లో వ్యూహాత్మక పెట్టుబడిదారుడిగా మారాడు. డబ్ల్యూబీఎల్లో భాగంగా ఇటీవల తొలి జట్టు ఓఎమ్జీ ఫ్రాంచైజీని ప్రకటించింది.ఇప్పుడు తాజాగా క్రికెట్ సూపర్ స్టార్ కోహ్లి భాగస్వామ్యాన్ని బహిర్గతం చేసింది. ‘నేను 11 ఏళ్ల వయసులో బౌలింగ్ చేయడం ప్రారంభించా. 12 ఏళ్ల వయసు నుంచి బంతిని తిప్పేందుకు ప్రయతి్నస్తున్నా. ఈ లీగ్లో భాగస్వామి కావడం ఆనందంగా ఉంది. వ్యాపారాభివృద్ధి కోణంలోనూ ఇది మంచి అడుగు అనుకుంటున్నా. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొత్త క్రీడలను ప్రోత్సహించాల్సిందే. ఈ1 సిరీస్లో మా జట్టు పురోగతి చూస్తే ముచ్చటేస్తోంది. డబ్ల్యూబీఎల్ వ్యూహాత్మక పెట్టుబడి దారుడిగా, సహ యజమానిగా ఉండడం ఉత్సాహాన్నిస్తోంది’అని విరాట్ కోహ్లి వెల్లడించాడు. -
'శ్రేయస్ ఏమి తప్పు చేశాడు.. కావాలనే ఎంపిక చేయలేదు'
ఐపీఎల్-2025 సీజన్ ముగిసిన వెంటనే భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఇంగ్లీష్ జట్టుతో టీమిండియా ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడనుంది. జూన్ 20 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. భారత టెస్టు కెప్టెన్గా రోహిత్ శర్మ స్ధానంలో శుబ్మన్ గిల్ ఎంపికయ్యాడు. అదేవిధంగా టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్గా శుబ్మన్ గిల్ నియమితుడయ్యాడు. అయితే ఈ జట్టులో అద్బుతమైన ఫామ్లో ఉన్న మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.శ్రేయస్ అయ్యర్ స్థానంలో యువ ఆటగాడు సాయి సుదర్శన్కు సెలక్టర్లు చోటిచ్చారు. తాజాగా సెలక్టర్ల నిర్ణయంపై భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. సుదర్శన్ బదులుగా అనుభవం ఉన్న అయ్యర్కు ఛాన్స్ ఇవ్వాల్సందని కైఫ్ అభిప్రాయపడ్డాడు."సాయి సుదర్శన్ ఒక అద్బుతమైన ఆటగాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఐపీఎల్ సీజన్లో బాగా రాణించడంతో అతడిని టెస్టు జట్టులోకి తీసుకున్నారు. అదే సమయంలో శ్రేయస్ అయ్యర్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. గత కొంతకాలంగా మూడు ఫార్మాట్లలోనూ అతడు నిలకడగా రాణిస్తున్నాడు. వన్డే ప్రపంచ కప్-2023, ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అయ్యర్ దాదాపు 550 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్లో కూడా అద్బుతంగా ఆడుతున్నాడు. కెప్టెన్గా అతడు విజయవంతమయ్యాడు. సుదర్శన్ను వైట్ క్రికెట్ ప్రదర్శన ఆధారంగా టెస్టు జట్టులోకి తీసుకున్నప్పుడు, మరి అయ్యర్ విషయంలో ఏమైందని" సెలక్టర్లపై కైఫ్ మండిపడ్డాడు.ఇంగ్లండ్ టూర్కు భారత జట్టుశుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేడా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుదంర్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ -
సిక్స్ బాదాడని బ్యాటర్ను కొట్టిన బౌలర్! వీడియో వైరల్
మిర్పూర్ వేదికగా దక్షిణాఫ్రికా-ఈ, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న అనధికారిక టెస్ట్ మ్యాచ్లో వివాదం చెలరేగింది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ షెప్టో తులి జెంటల్మేన్ గేమ్కు మాయని మచ్చ తీసుకొచ్చేలా ప్రవర్తించాడు. క్రికెట్లో చిన్న చిన్న గొడవలు సాధారణంగా మనం చూస్తూ ఉంటాము.కానీ ఈ యువ బౌలర్ తులి మాత్రం ప్రత్యర్ధి బ్యాటర్ సిక్స్ బాదడని దాడికి దిగాడు. బంగ్లా ఇన్నింగ్స్ 105వ ఓవర్ వేసిన తులి బౌలింగ్లో తొలి బంతిని రిపోన్ మోండోల్ స్ట్రైయిట్గా సిక్సర్ బాదాడు. దీంతో సహనాన్ని కోల్పోయిన సఫారీ బౌలర్.. రిపోన్తో గొడవపడ్డాడు. ఈ క్రమంలో అతడి వద్దకు వెళ్లి చేయి చేసుకున్నాడు.రిపోన్ కూడా తిరగబడడంతో గొడం పెద్దదైంది. ఇద్దరు ఆటగాళ్ళు ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో అంపైర్లు, సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకోవడంతో గొడవసద్దుమణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. క్రిక్ ఇనో ఫో రిపోర్ట్ ప్రకారం.. ఈ ఇద్దరి ఆటగాళ్లపై మ్యాచ్ రిఫరీ క్రికెట్ సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులకు తన నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరిపై వారి క్రికెట్ బోర్డు సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశముంది.I have never seen such an incident in the history of cricket. A direct fight. What a shameful incident of cricket happened between the talented bowler Shepo Ntuli of South Africa and Ripon Mondal of Bangladesh. This is extreme. #BANevsSAe #CricketTwitter #Bangladesh #SouthAfrica pic.twitter.com/3CbMTHwUEA— Monirul Ibna Rabjal 🇧🇩🇪🇺 (@to2monirul) May 28, 2025 -
నేను సెలక్టర్ను కాదు.. నన్ను ఎందుకు అడుగుతారు: గంభీర్
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు 18 సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టుకు కెప్టెన్గా శుబ్మన్ గిల్, అతడి డిప్యూటీగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎంపికయ్యాడు. సాయిసుదర్శన్, అర్షదీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లకు తొలి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది.అదేవిధంగా కరుణ్ నాయర్, శార్ధూల్ ఠాకూర్ వంటి వెటరన్ ఆటగాళ్లకు సెలక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు. అయితే ఈ జట్టులో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కలేదు. రంజీ ట్రోఫీ సహా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా చక్కటి రికార్డు ఉన్న అయ్యర్ పేరును సెలక్టర్లు పరిశీలించకపోవడం ఆశ్చర్యపర్చింది.క్రికెటేతర కారణాలతో అతడిని పక్కన పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఇదే విషయంపై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను ప్రశ్నించగా సూటిగా సమాధానం ఇవ్వలేదు. ‘నేను సెలక్టర్ను కాదు’ అంటూ ఒక్క ముక్కలో గంభీర్ స్పందించాడు.కానీ ఐపీఎల్ ఫైనల్కు త్రివిధ దళాల అధిపతులను ఆహ్వానించినందుకు బీసీసీఐని గంభీర్ ప్రశంసించాడు. అది నమ్మశక్యం కాని నిర్ణయమని అన్నాడు. దేశం మొత్తం మన సాయుధ దళాలకు సెల్యూట్ చేయాలని గంభీర్ పేర్కొన్నాడు. కాగా భారత్-ఇంగ్లండ్ మధ్య ఈ ఐదు మ్యాచ్ల సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ సైకిల్2025-27లో భాగంగా జరగనుంది.చదవండి: IPL 2025: రిషబ్ పంత్కు భారీ షాకిచ్చిన బీసీసీఐ -
PBKS Vs RCB: ఫైనల్ వేటలో...
ముల్లాన్పూర్: ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ట్రోఫీ కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్న రెండు జట్లు... 18వ సీజన్ ఫైనల్ చేరేందుకు పోటీపడుతున్నాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గురువారం క్వాలిఫయర్–1లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. లీగ్ ఆరంభం నుంచి ఆడుతున్న ఇప్పటివరకు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయిన ఇరు జట్లు... ఈ సారి నిలకడైన ప్రదర్శనతో ‘ప్లే ఆఫ్స్’కు చేరాయి. లీగ్ దశలో 14 మ్యాచ్లాడిన పంజాబ్ కింగ్స్ 9 విజయాలు, 4 పరాజయాలు, ఒక ఫలితం తేలని మ్యాచ్తో 19 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో అగ్రస్థానం దక్కించుకుంది. 2014 తర్వాత పంజాబ్ జట్టు ‘ప్లే ఆఫ్స్’కు చేరడం ఇదే తొలిసారి కాగా... అప్పుడు కూడా పట్టికలో అగ్ర స్థానంలో నిలిచిన పంజాబ్... తుదిపోరులో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది. ఇక మరోవైపు 14 మ్యాచ్ల్లో 9 విజయాలు, 4 పరాజయాలు ఒక ఫలితం తేలని మ్యాచ్తో 19 పాయింట్లు సాధించిన బెంగళూరు రన్రేట్లో కాస్త వెనుకబడి రెండో స్థానంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య ఈ సీజన్లో రెండు మ్యాచ్లు జరగగా... చెరొకటి గెలిచాయి. బెంగళూరులో జరిగిన పోరులో పంజాబ్ గెలవగా... ముల్లాన్పూర్లో జరిగిన పోరులో బెంగళూరు పైచేయి సాధించింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరనుండగా... ఓడిన జట్టుకు క్వాలిఫయర్–2 రూపంలో మరో అవకాశం ఉండనుంది. టాప్–3పైనే ఆశలు... ఇప్పటికే మూడు వేర్వేరు జట్లను ఐపీఎల్ ‘ప్లే ఆఫ్స్’కు చేర్చిన కెప్టెన్గా ఘనత సాధించిన శ్రేయస్ అయ్యర్... పంజాబ్కు ప్రధాన బలం కానున్నాడు. మైదానం బయటి నుంచి రికీ పాంటింగ్ సలహాలు... లోపల శ్రేయస్ వ్యూహాలతో ఇప్పటికే పంజాబ్ కింగ్స్ అభిమానుల మనసులు గెలుచుకుంది. ముందుండి నడిపించే వాడే నాయకుడు అనే విధంగా శ్రేయస్ బ్యాట్తోనూ దుమ్మురేపుతున్నాడు. 14 మ్యాచ్ల్లో 51.40 సగటుతో అతడు 514 పరుగులు చేసి జట్టు తరఫున టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. మిడిలార్డర్లో బ్యాటింగ్ వస్తున్న శ్రేయస్ 171.90 స్ట్రయిక్రేట్తో ఈ పరుగులు చేయడం విశేషం. ఇక యువ ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్ సింగ్ 499 పరుగులు, ప్రియాన్ష్ ఆర్య 424 పరుగులతో సత్తా చాటారు. ఈ ఇద్దరు అందిస్తున్న శుభారంభాలతోనే పంజాబ్ భారీ స్కోర్లు చేయగలిగింది. ఈ సీజన్లో పంజాబ్ నిలకడైన విజయాలకు ఈ ముగ్గురి ఫామే ప్రధాన కారణం. ఇన్గ్లిస్ మంచి టచ్లో ఉండగా... నేహల్ వధేరా, శశాంక్, స్టొయినిస్ అవసరమైన సమయంలో సత్తా చాటుతున్నారు. బౌలింగ్లో అర్ష్ దీప్ సింగ్, కైల్ జేమీసన్, అజు్మతుల్లా కీలకం కానున్నారు. జాతీయ జట్టు అవసరాల నేపథ్యంలో దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ మార్కో యాన్సెన్ స్వదేశానికి తిరిగి వెళ్లడం జట్టుకు కాస్త ఇబ్బంది కాగా... గాయం కారణంగా గత రెండు మ్యాచ్లకు అందుబాటులో లేని చాహల్ రాకతో స్పిన్ విభాగం పటిష్టమైంది. విరాట్పై పెను భారం లీగ్ ఆరంభమైనప్పటి నుంచి ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్న ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కిన విరాట్ కోహ్లి... 18వ సీజన్లో అయినా ట్రోఫీని ముద్దాడాలని తహతహలాడుతున్నాడు. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నా... అనధికారిక కెపె్టన్గా కోహ్లిపైనే జట్టు అధికంగా ఆధారపడుతోంది. అందుకు తగ్గట్లే ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన విరాట్... 13 మ్యాచ్ల్లో 60.20 సగటుతో 602 పరుగులు చేశాడు. 147.91 స్ట్రయిక్రేట్తో పరుగులు రాబట్టిన కోహ్లి... 8 అర్ధ శతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు. తన వికెట్ విలువ అర్థం చేసుకొని ఆడుతున్న కోహ్లి... ఈ సీజన్లో అత్యధిక స్కోరు ముల్లాన్పూర్లోనే పంజాబ్పై నమోదు చేసుకోవడం అతడి ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం. కోహ్లి, సాల్ట్ జట్టుకు శుభారంభాలు అందిస్తుండగా... మయాంక్ అగర్వాల్, రజత్ పాటీదార్, జితేశ్ శర్మ చక్కటి ఫామ్లో ఉన్నారు. గత మ్యాచ్లో ఆశలే లేని స్థితిలో అద్భుత ప్రదర్శన చేసిన జితేశ్ శర్మ నుంచి ఫ్రాంఛైజీ అలాంటి ప్రదర్శనే ఆశిస్తోంది. గాయం కారణంగా టిమ్ డేవిడ్ అందుబాటులో లేకపోవడం జట్టుకు ఇబ్బందికరంగా మారగా... అతడి స్థానంలో లియామ్ లివింగ్స్టోన్ ఫినిషర్ పాత్ర పోషించనున్నాడు. ఫిట్నెస్ సాధించిన జోష్ హాజల్వుడ్ తిరిగి రావడం జట్టుకు కొండంత బలాన్నిస్తోంది. తన వైవిధ్యమైన బౌలింగ్తో ఎలాంటి బ్యాటర్నైనా ఇబ్బంది పెట్టగల హాజల్వుడ్ ఈ మ్యాచ్లో కీలకం కానున్నాడు. భువనేశ్వర్, యశ్ దయాళ్తో కలిసి అతడు పేస్ భారాన్ని మోయనుండగా... సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యా స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. తుది జట్లు (అంచనా) పంజాబ్ కింగ్స్: శ్రేయస్ (కెప్టెన్ ), ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్, ఇన్గ్లిస్, నేహల్ వధేరా, శశాంక్, స్టొయినిస్, అజ్మతుల్లా, జెమీసన్, హర్ప్రీత్, అర్ష్ దీప్, చాహల్. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటీదార్ (కెప్టెన్ ), కోహ్లి, సాల్ట్, మయాంక్ అగర్వాల్, జితేశ్, కృనాల్ పాండ్యా, లివింగ్స్టోన్, షెఫర్డ్, భువనేశ్వర్, యశ్ దయాళ్, హజల్వుడ్, సుయాశ్ శర్మ. పిచ్, వాతావరణం ముల్లాన్పూర్ మైదానంలో ఈ సీజన్లో నాలుగు మ్యాచ్లు జరగగా... అందులో మూడు ఇన్నింగ్స్ల్లో స్కోర్లు 200 దాటాయి. మిగిలిన ఐదు ఇన్నింగ్స్ల్లో స్వల్ప స్కోర్లు నమోదయ్యాయి. బుధవారం పిచ్ ఎలా స్పందిస్తుందనేది కీలకం. మ్యాచ్కు వర్షం ముప్పు లేదు. ఐపీఎల్లో నేడు (క్వాలిఫయర్ –1)పంజాబ్ X బెంగళూరువేదిక: ముల్లాన్పూర్రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో -
మరోసారి తండ్రైన టీమిండియా క్రికెటర్
టీమిండియా క్రికెటర్ జయదేవ్ ఉనద్కత్ మరోసారి తండ్రి అయ్యాడు. అతని భార్య రిన్నీ కంతారియా ఈ నెల 18న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఉనద్కత్ ఇవాళ (మే 28) సాయంత్రం సోషల్మీడియా వేదికగా వెల్లడించాడు. ఉనద్కత్, రిన్నీ 2021లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2023 డిసెంబర్లో జేడన్ (మగబిడ్డ) జన్మించాడు.👼🏻❤️ pic.twitter.com/Maoc5AbA3h— Jaydev Unadkat (@JUnadkat) May 28, 202533 ఏళ్ల ఉనద్కత్ ఐపీఎల్ 2025లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఆడాడు. ఈ సీజన్లో అతను 7 మ్యాచ్ల్లో 11 వికెట్లు తీశాడు. ఈ సీజన్లో సన్రైజర్స్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఉనద్కత్ రంజీల్లో సౌరాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తాడు. ఆ జట్టుకు అతను కెప్టెన్గానూ వ్యవహరిస్తున్నాడు. అతని సారథ్యంలో సౌరాష్ట్ర 2020లో రంజీ ట్రోఫీ గెలిచింది. ఇది ఆ జట్టుకు తొలి టైటిల్. 2010లో టీమిండియా అరంగేట్రం చేసిన ఉనద్కత్.. మధ్యలో చాలాకాలం జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. 15 ఏళ్లలో అతను టీమిండియా తరఫున 4 టెస్ట్లు, 8 వన్డేలు, 10 టీ20లు మాత్రమే ఆడాడు. ఇందులో 26 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో ఉనద్కత్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. క్యాష్ రిచ్ లీగ్లోనూ 2010లోనే కెరీర్ ప్రారంభించిన ఉనద్కత్.. ఇప్పటివరకు వివిధ ఫ్రాంచైజీల తరఫున 112 మ్యాచ్లు ఆడి 110 వికెట్లు తీశాడు. -
విండీస్తో తొలి వన్డే.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఐపీఎల్ స్టార్లకు చోటు
భారతకాలమానం ప్రకారం రేపు (మే 29) సాయంత్రం 5:30 గంటలకు వెస్టిండీస్తో జరుగబోయే తొలి వన్డే కోసం ఇంగ్లండ్ తుది జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టులో ఐపీఎల్-2025 స్టార్ త్రయం జోస్ బట్లర్ (గుజరాత్ టైటాన్స్), విల్ జాక్స్ (ముంబై ఇండియన్స్), జేకబ్ బేతెల్కు (ఆర్సీబీ) చోటు దక్కింది. వీరితో పాటు సీఎస్కే బౌలర్ జేమీ ఓవర్టన్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్లో ఇంగ్లిష్ జట్టుకు హ్యారీ బ్రూక్ నాయకత్వం వహిస్తున్నాడు. బట్లర్, బేతెల్, జాక్స్ ఐపీఎల్లో తమ జట్లు ప్లే ఆఫ్స్ ఆడాల్సి ఉన్నా లీగ్ మ్యాచ్లు పూర్తి కాగానే జాతీయ విధులకు హాజరయ్యారు. ఈ ముగ్గురు లీగ్ దశలో తమతమ జట్ల తరఫున అత్యుత్తమ ప్రదర్శనలు చేశారు.రేపు విండీస్తో జరుగబోయే మ్యాచ్లో జేమీ స్మిత్, బెన్ డకెట్ ఓపెనింగ్ చేస్తారు. వెటరన్ ఆటగాడు మూడో స్థానంలో, కెప్టెన్ బ్రూక్ నాలుగో స్థానంలో, బట్లర్, బేతెల్, జాక్స్, ఓవర్టన్ వరుసగా ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో బరిలోకి దిగుతారు. గాయం కారణంగా ఐపీఎల్ ప్రారంభానికి ముందే వైదొలిగిన బ్రైడన్ కార్స్ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు.ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహించిన జోఫ్రా ఆర్చర్ కూడా తొలుత ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆర్చర్ ఐపీఎల్ సందర్భంగా గాయపడటంతో అతని స్థానంలో సాకిబ్ మహమూద్ను ఎంపిక చేసుకుంది ఇంగ్లిష్ మేనేజ్మెంట్. రేపటి మ్యాచ్కు అతను కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. మొత్తంగా చూస్తే, రేపు విండీస్తో తలపడబోయే ఇంగ్లిష్ జట్టు ఐపీఎల్ డూప్ జట్టుగా కనిపిస్తుంది.విండీస్తో తొలి వన్డే కోసం ఇంగ్లండ్ తుది జట్టు..బెన్ డకెట్, జేమీ స్మిత్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జేకబ్ బేతెల్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, బ్రైడాన్ కార్స్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్.ఇదిలా ఉంటే, రేపటి మ్యాచ్ కోసం విండీస్ తుది జట్టును ప్రకటించాల్సి ఉంది. మూడు వన్డేలు, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం విండీస్ జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత వన్డే సిరీస్, ఆతర్వాత టీ20 సిరీస్ జరుగుతాయి. మే 29, జూన్ 3 తేదీల్లో వన్డేలు.. 6, 8, 10 తేదీల్లో టీ20లు జరుగనున్నాయి.పూర్తి జట్లు..వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, కీసీ కార్టీ, షాయ్ హోప్(w/c), అమీర్ జాంగూ, జస్టిన్ గ్రీవ్స్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, అల్జారి జోసెఫ్, గుడకేష్ మోటీ, షమర్ జోసెఫ్, జెడియా బ్లేడ్స్, జ్యువెల్ ఆండ్రూ, జేడెన్ సీల్స్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, రొమారియో షెపర్డ్, షిమ్రాన్ హెట్మైర్ఇంగ్లండ్: బెన్ డకెట్, జేమీ స్మిత్, జో రూట్, హ్యారీ బ్రూక్(c), జోస్ బట్లర్(wk), జాకబ్ బెథెల్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, బ్రైడాన్ కార్స్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ల్యూక్ వుడ్, టామ్ బాంటన్, మాథ్యూ పాట్స్, టామ్ హార్ట్లీ -
IPL 2025: రేటు తక్కువ.. ప్రభావం చాలా ఎక్కువ.. ఆ హీరోలు వీరే..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కొందరు క్రికెటర్లు అంచనాలకు మించి రాణించారు. వీరిలో కొందరు ఏమాత్రం అంచనాలు లేకుండానే అదరగొట్టారు. ఇలాంటి వారిపై ఫ్రాంచైజీలు చాలా తక్కువ పెట్టుబడి పెట్టి పైసా వసూల్ ప్రదర్శనలు చేయించుకున్నారు. ఇలా రేటు తక్కువ.. ప్రభావం చాలా ఎక్కువ చూపిన ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.ఈ జాబితాలో ముందొచ్చే పేరు వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ ఈ 14 ఏళ్ల కుర్ర చిచ్చరపిడుగును కేవలం రూ. 1.1 కోట్లకు సొంతం చేసుకుంది. తీసుకున్న డబ్బుకు వైభవ్ తొలి మ్యాచ్ నుంచే న్యాయం చేస్తూ వచ్చాడు. ఓ విధ్వంసకర సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 206.56 స్ట్రయిక్రేట్తో 252 పరుగులు చేశాడు.పైసా వసూల్ ప్రదర్శన చేసిన మరో చిచ్చరపిడుగు ప్రియాంశ్ ఆర్య. ఇతగాడిని పంజాబ్ వేలంలో రూ. 3.8 కోట్లకు సొంతం చేసుకుంది. తొలుత ప్రియాంశ్పై పంజాబ్ చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టిందని అంతా అనుకున్నారు. అయితే అతను ఫ్రాంచైజీ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, దాదాపు ప్రతి మ్యాచ్లో ఇరగదీశాడు. పంజాబ్ ఈ సీజన్లో టేబుల్ టాపర్గా నిలవడంలో ప్రియాంశ్ పాత్ర చాలా కీలకం. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ల్లో అతను 183.55 స్ట్రయిక్రేట్తో సెంచరీ, 2 అర్ద సెంచరీల సాయంతో 424 పరుగులు చేశాడు. రేటు తక్కువ, ప్రభావం ఎక్కువ చూపిన మరో ఆటగాడు ర్యాన్ రికెల్టన్. ముంబై ఇండియన్స్ ఇతన్ని కేవలం కోటి రూపాయలకే సొంతం చేసుకుంది. ఇతను దాదాపు ప్రతి మ్యాచ్లో ముంబైకు అద్భుతమైన ఆరంభాలు అందించాడు. ఈ సీజన్లో ముంబై ప్లే ఆఫ్స్కు చేరడంలో రికెల్టన్ కీలకపాత్ర పోషించాడు. ఇతను 14 మ్యాచ్ల్లో 150.97 స్ట్రయిక్రేట్తో 388 పరుగులు చేశాడు.ఈ సీజన్లో తక్కువ ధరకే అబ్బురపడే ప్రదర్శనలు చేసిన మరో ఆటగాడు అనికేత్ వర్మ. సన్రైజర్స్ హైదరాబాద్ ఇతన్ని కేవలం 30 లక్షలకే సొంతం చేసుకుంది. ఇతను ఈ సీజన్లో ఆడిన 12 మ్యాచ్ల్లో 166.20 స్ట్రయిక్రేట్తో 236 పరుగులు చేశాడు. లోయల్ మిడిలార్డర్లో బ్యాటింగ్కు దిగే అనికేత్ అంచనాలకు మించి భారీ హిట్టింగ్ చేసి తన జట్టుకు ఎంతో ఉపయోగపడ్డాడు. హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్, క్లాసెన్ లాంటి విధ్వంసకర వీరులు ఉన్న జట్టులో అనికేత్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.పైన పేర్కొన్న నలుగురే కాకుండా ఈ సీజన్లో రేటు తక్కువ, ప్రభావం చాలా ఎక్కువ చూపిన మరికొందరు ఆటగాళ్లు ఉన్నారు. సీఎస్కే తరఫున ఆయుశ్ మాత్రే (30 లక్షలు), డెవాల్డ్ బ్రెవిస్ (2.2 కోట్లు).. ఆర్సీబీ తరఫున కొద్ది మ్యాచ్లే ఆడిన దేవ్దత్ పడిక్కల్ (2 కోట్లు), ఢిల్లీ ఆల్రౌండర్ విప్రాజ్ నిగమ్ (50 లక్షలు), బౌలర్లలో ఎల్ఎస్జీకి చెందిన దిగ్వేశ్ రాఠీ (30 లక్షలు), ముంబై బౌలర్లు అశ్వనీ కుమార్ (30 లక్షలు), కర్ణ్ శర్మ (50 లక్షలు) అంచనాలకు మించి రాణించి ఈ సీజన్లో మంచి పేరు తెచ్చుకున్నారు. -
LSG VS RCB: రిషబ్ పంత్పై మండిపడ్డ అశ్విన్.. సొంత బౌలర్నే ఫూల్ చేశాడు..!
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 27) జరిగిన లక్నో-ఆర్సీబీ మ్యాచ్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ కీలక దశలో సాగుతుండగా లక్నో స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ మన్కడింగ్కు (నాన్ స్ట్రయికర్ ఎండ్లోని బ్యాటర్ బంతి వేయకముందే క్రీజ్ను దాటిన సమయంలో బౌలర్ వికెట్లను గిరాటు వేయడం) పాల్పడ్డాడు. ఈ విషయమై రాఠీ అప్పీల్ చేసినప్పటికీ.. లక్నో కెప్టెన్ పంత్ దాన్ని విత్డ్రా చేసుకున్నాడు. రీప్లే పరిశీలించిన అనంతరం థర్డ్ అంపైర్ దీన్ని నాటౌట్గా ప్రకటించాడు.టెక్నికల్గా (రాఠీ ఫ్రంట్ ఫుట్ ల్యాండ్ అయ్యే సమయానికి నాన్ స్ట్రయికింగ్ ఎండ్లో ఉన్న జితేశ్ శర్మ క్రీజ్లోనే ఉన్నాడు) ఇది నాటౌటే అయినప్పటికీ.. రూల్స్కు విరుద్దం అయితే కాదు. గతంలో చాలా సందర్భాల్లో బౌలర్లు మన్కడింగ్ చేసి బ్యాటర్లను ఔట్ చేశారు. తాజాగా అదే ప్రయత్నం జరిగింది. అయితే ఇక్కడ కెప్టెన్ బౌలర్ను సమర్థించకపోవడం చర్చనీయాంశంగా మారింది.అ విషయమై క్రికెట్ సర్కిల్స్లోభిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు రాఠీ చర్యను సమర్దిస్తుంటే.. మరికొందరు పంత్ అప్పీల్ను వెనక్కు తీసుకోవడాన్ని తప్పుబడుతున్నారు.రాఠీ చర్యను సమర్దించిన వారిలో సీఎస్కే వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఉన్నాడు. యాష్ ఓ పక్క రాఠీ చర్యను సమర్దిస్తూనే, అప్పీల్ను విత్డ్రా చేసుకున్న పంత్ను తప్పుబట్టాడు. పంత్ అప్పీల్ను విత్డ్రా చేసుకోవడం వల్ల రాఠీ కోట్లాది మంది అభిమానుల ముందు ఫూల్ అయ్యాడని అభిప్రాయపడ్డాడు. పంత్ రాఠీని జీవితంలో ఇంకోసారి మన్కడింగ్కు పాల్పడకుండా చేశాడని మండిపడ్డాడు.మన్కడింగ్ విషయంలో బౌలర్లంటే ఎందుకు అంత చిన్న చూపని ప్రశ్నించాడు. ఓ రకంగా బౌలర్కు ఇది అవమానమని అన్నాడు. పంత్ తీసుకున్న నిర్ణయం వల్ల రాఠీ భయపడి ఉంటాడని తెలిపాడు. బౌలర్ చర్యను వెనకేసుకురావడం కెప్టెన్ బాధ్యత అని గుర్తు చేశాడు. ఔటైనా, నాటౌటైనా మన్నడింగ్ అనేది ఆటలో భాగమని అన్నాడు. మ్యాచ్ కీలక దశలో సాగుతుండగా బౌలర్ ఇలాంటి ప్రయత్నం చేయడం తప్పేది కాదని అభిప్రాయపడ్డాడు.కాగా, ఆర్సీబీ 228 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా ఇన్నింగ్స్ 17వ ఓవర్లో (ఆఖరి బంతికి) ఇది జరిగింది. రాఠీ మన్కడింగ్కు పాల్పడే సమయానికి ఆర్సీబీ 19 బంతుల్లో 29 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. అప్పటకే జితేశ్ శర్మ జోరు మీదున్నాడు. ఒకవేళ జితేశ్ మన్కడింగ్ ద్వారా ఔటయ్యుంటే ఆర్సీబీ కష్టాల్లో పడేది. మ్యాచ్ను కూడా కోల్పోవాల్సి వచ్చేది. ఇలాంటి సందర్భంలో పంత్ బౌలర్ అప్పీల్ను ఉపసంహరించుకుని ఆర్సీబీకి ఫేవర్ చేశాడు. క్రీడా స్పూర్తి అని పెద్దపెద్ద మాటలు అనుకోవచ్చు కానీ, మ్యాచ్ను కాపాడుకునే ప్రయత్నంలో బౌలర్ చేసింది కరెక్టే అని చెప్పాలి. రాఠీ అప్పీల్ను పంత్ చిన్నచూపు చూసి తన వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకున్నాడు. అంతటితో ఆగకుండా అప్పీల్ విత్డ్రా చేసుకున్న తర్వాత జితేశ్ను కౌగించుకుని సొంత బౌలర్ను అవమానించాడు. మన్కడింగ్ తర్వాత మరింత రెచ్చిపోయిన జితేశ్ కొద్ది బంతుల్లోనే మ్యాచ్ను లక్నో చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. -
IPL 2025: ప్లే ఆఫ్స్లో ఆర్సీబీ చరిత్ర ఇదీ..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలవడం ద్వారా క్వాలిఫయర్-1లో పోటీ పడే అవకాశాన్ని (ఇక్కడ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుతుంది) కూడా దక్కించుకుంది. క్యాష్ రిచ్ లీగ్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు చేరడం ఇది పదోసారి. ఇన్ని ప్రయత్నాల్లో ఆ జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. మూడు సందర్భాల్లో (2009, 2011, 2016) ఫైనల్ వరకు చేరినా రిక్తహస్తాలతో వెనుదిరిగింది.ఐపీఎల్ చరిత్రలో 15 ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ.. ఐదు మ్యాచ్ల్లో గెలిచి, పదింట ఓడింది. ప్లే ఆఫ్స్లో ఆర్సీబీని అత్యంత దురదృష్టమైన జట్టు అని అంటారు. లీగ్ దశలో చెలరేగి ఆడే ఈ జట్టు నాకౌట్ మ్యాచ్లు వచ్చే సరికి ఢీలా పడిపోతుంది. గతమంతా ఇలాగే సాగింది. కానీ ఈ సారి పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తుంది.ఆర్సీబీ ఈ సీజన్లో చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఇందుకు నిన్న (మే 27) లక్నోతో జరిగిన మ్యాచే నిదర్శనం. ఈ మ్యాచ్లో ఆర్సీబీ 228 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. సూపర్ ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లి వికెట్ సహా నాలుగు వికెట్లు కోల్పోయినా ఏ మాత్రం ఒత్తిడికి లోనుకాకుండా అబ్బురపడే విజయం సాధించింది. జితేశ్ శర్మ (33 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని గెలిపించాడు.ఈ గెలుపుతో ఆర్సీబీ క్వాలిఫయర్-1లో పోటీపడే అవకాశాన్ని దక్కించుకుంది. మే 29న జరిగే ఈ పోటీలో ఆర్సీబీ టేబుల్ టాపర్ పంజాబ్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో ఓడినా ఆర్సీబీకి మరో అవకాశం ఉంటుంది. జూన్ 1న జరిగే క్వాలిఫయర్-2లో పోటీ పడే ఛాన్స్ ఉంటుంది. గుజరాత్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో విజేతతో ఆర్సీబీ క్వాలిఫయర్-2లో తలపడుతుంది.ప్లే ఆఫ్స్లో ఆర్సీబీ ప్రస్తానం..2009- ఫైనల్లో డెక్కన్ ఛార్జర్స్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓటమి2010- సెమీఫైనల్లో ముంబై ఇండియన్స్ చేతిలో 35 పరుగుల తేడాతో ఓటమి2011- ఫైనల్లో సీఎస్కే చేతిలో 58 పరుగుల తేడాతో ఓటమి2015- క్వాలిఫయర్-2లో సీఎస్కే చేతిలో 3 వికెట్ల తేడాతో ఓటమి2016- ఫైనల్లో సన్రైజర్స్ చేతిలో 8 పరుగుల తేడాతో ఓటమి2020- ఎలిమినేటర్లో సన్రైజర్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి2021- ఎలిమినేటర్లో కేకేఆర్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి2022- క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి2024- ఎలిమినేటర్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి2025- క్వాలిఫయర్-1లో పంజాబ్ ప్రత్యర్థి -
RCB VS PBKS Qualifier-1: అలా జరిగితే గెలవకపోయినా పంజాబ్ ఫైనల్కు చేరుతుంది..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో లీగ్ దశ మ్యాచ్లన్నీ ముగిశాయి. పంజాబ్, ఆర్సీబీ, గుజరాత్, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి. మే 29న జరిగే క్వాలిఫయర్-1లో ఆర్సీబీ, పంజాబ్ తలపడతాయి. మే 30న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకుంటాయి. లీగ్ దశలో సాధించిన విజయాలు, నెట్ రన్రేట్ ఆధారంగా ప్లే ఆఫ్స్ బెర్త్లు ఖరారయ్యాయి. పంజాబ్, ఆర్సీబీ తలో 14 మ్యాచ్ల్లో చెరో 9 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. పాయింట్లు సమంగా (19) ఉన్నా, ఆర్సీబీతో పోలిస్తే నెట్ రన్రేట్ మెరుగ్గా ఉండటంతో పంజాబ్కు తొలి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కింది.గుజరాత్ 14 మ్యాచ్ల్లో 9 విజయాలు, ముంబై ఇండియన్స్ 14 మ్యాచ్ల్లో 8 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. గుజరాత్ కూడా పంజాబ్, ఆర్సీబీ మాదిరి 14 మ్యాచ్ల్లో 9 విజయాలు సాధించినా.. పంజాబ్, ఆర్సీబీ ఆడాల్సిన ఓ మ్యాచ్ (వేర్వేరుగా) రద్దైంది. దీంతో పంజాబ్, ఆర్సీబీలకు అదనంగా తలో పాయింట్ లభించింది.ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ఎలా..?పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు (పంజాబ్, ఆర్సీబీ) మొదటి క్వాలిఫయర్లో తలపడతాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుతుంది. ఈ మ్యాచ్లో ఓడిన జట్టుకు మరో ఛాన్స్ ఉంటుంది. క్వాలిఫయర్-2లో (జూన్ 1) పోటీ పడే అవకాశం దక్కుతుంది. క్వాలిఫయర్-2లో ఇంకో బెర్త్ ఎలిమినేటర్ మ్యాచ్ ద్వారా తెలుస్తుంది. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు ఎలిమినేటర్ మ్యాచ్లో తలపడతాయి. గెలిచిన జట్టు క్వాలిఫయర్-2లో పోటీ పడాల్సి ఉంటుంది. ఎలిమినేటర్లో ఓడిన జట్టు ఇంటి ముఖం పడుతుంది. క్వాలిఫయర్-2లో గెలిచే జట్టు.. క్వాలిఫయర్-1లో గెలిచే జట్టుతో ఫైనల్లో (జూన్ 3) తలపడుతుంది.ఆర్సీబీ, పంజాబ్ క్వాలిఫయర్ మ్యాచ్ రద్దైతే..?పంజాబ్, ఆర్సీబీ మధ్య మే 29న జరగాల్సిన క్వాలిఫయర్-1 మ్యాచ్ ఏ కారణంగా అయినా రద్దైతే పంజాబ్ ఫైనల్కు చేరుతుంది. పాయింట్ల పట్టికలో పంజాబ్ అగ్రస్థానంలో ఉంది కాబట్టి, ఆ జట్టుకు ఈ అవకాశం దక్కుతుంది. షెడ్యూల్ ప్రకారం క్వాలిఫయర్-1కు రిజర్వ్ డే లేదు. కాబట్టి తప్పనిసరిగా మ్యాచ్ జరిగి గెలిస్తేనే ఆర్సీబీ ఫైనల్కు చేరుతుంది. పంజాబ్కు అలా కాదు. ఏ కారణంగా అయినా మ్యాచ్ రద్దైనా ఆ జట్టు ఫైనల్కు చేరుతుంది. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఏ కారణంగా కూడా పంజాబ్, ఆర్సీబీ క్వాలిఫయర్-1 మ్యాచ్ రద్దయ్యే అవకాశం లేదు. -
LSG VS RCB: అబ్బురపరిచే ఇన్నింగ్స్.. ధోని రికార్డు బద్దలు కొట్టిన జితేశ్
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 27) జరిగిన ఉత్కంఠ సమరంలో లక్నో సూపర్ జెయింట్స్పై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీని తాత్కాలిక కెప్టెన్ జితేశ్ శర్మ ఒంటిచేత్తో గెలిపించాడు. 227 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో జితేశ్ హీరోయిక్ ఇన్నింగ్స్ ఆడాడు. 33 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 85 పరుగులు చేసి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు.ఈ ఇన్నింగ్స్తో జితేశ్ ధోని పేరిట ఏడేళ్లు కొనసాగిన ఓ రికార్డును బద్దలు కొట్టాడు. విజయవంతమైన ఛేదనల్లో 6 అంతకంటే కింది స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 2018 సీజన్లో ధోని ఆర్సీబీపై 34 బంతుల్లో అజేయమైన 70 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్లో సీఎస్కే ఆర్సీబీపై విజయం సాధించింది.విజయవంతమైన ఛేదనల్లో 6 అంతకంటే కింది స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక స్కోర్ చేసిన ఆటగాళ్లు..85*(33) - జితేష్ శర్మ (RCB) vs LSG, లక్నో, 2025 70* (34) - MS ధోని (CSK) vs RCB, బెంగళూరు, 2018 70*(31) - ఆండ్రీ రస్సెల్ (KKR) vs PBKS, ముంబై WS, 2022 70(47) - కీరన్ పొలార్డ్ (MI) vs RCB, బెంగళూరు, 2017 68(30) - డ్వేన్ బ్రావో (CSK) vs MI, ముంబై WS, 2018లక్నో, ఆర్సీబీ మ్యాచ్ పూర్తి వివరాలు..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. రిషబ్ పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో, మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోర్ చేసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే (4 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. జితేశ్ శర్మ (33 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని ఒంటిచేత్తో గెలిపించాడు. అతనికి మయాంక్ అగర్వాల్ (23 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు) సహకరించాడు.అంతకుముందు విరాట్ కోహ్లి (30 బంతుల్లో 54; 10 ఫోర్లు), ఫిల్ సాల్ట్ (19 బంతుల్లో 30; 6 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి ఆర్సీబీ గెలుపుకు పునాది వేశారు.ఈ గెలుపుతో ఆర్సీబీ టేబుల్ సెకెండ్ టాపర్గా నిలిచి క్వాలిఫయర్-1 బెర్త్ ఖరారు చేసుకుంది. మే 29న జరిగే క్వాలిఫయర్-1లో ఆర్సీబీ.. పంజాబ్తో తలపడనుంది. మే 30న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకుంటాయి. -
టీమిండియాతో టెస్టు సిరీస్.. ఇంగ్లండ్కు ఊహించని షాక్
టీమిండియాతో టెస్టు సిరీస్కు ముందు ఇంగ్లండ్ ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ గస్ అట్కిన్సన్ గాయం బారిన పడ్డాడు. జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో అట్కిన్సన్ తొడ కండరాలు పట్టేశాయి. అతడు గాయం నుంచి కోలుకోవడానికి రెండు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. అతడు ప్రస్తుతం ఇంగ్లండ్ క్రికెట్ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు.ఈ క్రమంలో వెస్టిండీస్తో జరగనున్న వన్డే సిరీస్కు అట్కిన్సన్ దూరమయ్యాడు. అతడు విండీస్తో టీ20లలో కూడా ఆడేది అనుమానమే. కాగా జూన్ 20న ప్రారంభమయ్యే భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ సమయానికైనా 27 ఏళ్ల గస్ అట్కిన్సన్ ఫిట్నెస్ సాధిస్తాడో లేదో వేచి చూడాలి.కాగా విండీస్తో వన్డేలకు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఇప్పటికే స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ సేవలను కోల్పోయింది. గాయం కారణంగా ఆర్చర్ విండీస్ టూర్కు దూరమయ్యాడు. అతడి స్ధానాన్ని లూక్ వుడ్తో ఇంగ్లండ్ సెలక్టర్లు భర్తీ చేశారు. ఇక ఇంగ్లండ్-విండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ గురువారం నుంచి ప్రారంభం కానుంది.ఇంగ్లండ్ వన్డే జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్, విల్ జాక్స్, జో రూట్, బెన్ డకెట్, జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, జేకబ్ బెథెల్, బ్రైడన్ కార్స్, టామ్ హార్ట్లే, సాకిబ్ మహమూద్, మాథ్యూ పాట్స్, జేమీ ఒవర్టన్, ఆదిల్ రషీద్, జేమీ స్మిత్. ఇంగ్లండ్ టీ20 జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జేకబ్ బెథెల్, టామ్ బాంటన్, జోస్ బట్లర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, సాకిబ్ మహమూద్, మాథ్యూ పాట్స్, జేమీ ఒవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, ల్యూక్ వుడ్. -
భారత-ఎ జట్టు నుంచి తప్పుకున్న శుబ్మన్ గిల్..!
ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సమయం అసన్నమవుతోంది. జూన్ 20 నుంచి ఈ హైవోల్టేజ్ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ప్రధాన సిరీస్కు ముందు భారత-ఎ జట్టు ఇంగ్లండ్ లయన్స్తో రెండు అనాధికారిక టెస్టు మ్యాచ్లు ఆడనుంది.తొలి టెస్టు మే 30 నుంచి జూన్ 2 వరకు కాంటర్బరీ వేదికగా, రెండో టెస్టు నార్తాంప్టన్లో జూన్ 6 నుంచి 9 వరకు జరగనున్నాయి. అయితే ఈ అనాధికారిక టెస్టు సిరీస్కు ముందు టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియా- ఎ జట్టు నుంచి తప్పుకోవాలని గిల్ నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ సిరీస్కు ఎంపిక చేసిన భారత-ఎ జట్టులో గిల్ సభ్యునిగా ఉన్నాడు. ఇంగ్లండ్ కండీషన్స్కు అలవాటు పడేందుకు గిల్కు ఈ ప్రాక్టీస్ మ్యాచ్లు ఉపయోగపడతాయని సెలక్టర్లు భావించారు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కారణంగా తొలి వార్మాప్ మ్యాచ్కు గిల్ దూరంగా ఉంటాడని, రెండవ ప్రాక్టీస్ మ్యాచ్ కోసం ఇండియా-ఎ జట్టులో చేరతారని భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో తెలిపాడు. కానీ ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్న గిల్కు విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు కూడా యోచిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే భారత-ఎ జట్టు ఇంగ్లండ్కు పయనమైంది. ఈ జట్టు కెప్టెన్గా దేశవాళీ దిగ్గజం అభిమాన్యు ఈశ్వరన్ వ్యవహరించనున్నాడు. జూన్ 13 నుంచి బెకెన్హామ్ వేదికగా మూడు రోజుల పాటు జరిగే ఇంట్రా స్వ్కాడ్ ప్రాక్టీస్ మ్యాచ్లో గిల్ పాల్గోనే అవకాశముంది.ఇంగ్లండ్ పర్యటనకు భారత- ఎ జట్టు:అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధృవ్ జురెల్ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, తనుష్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్పాండే, హర్ష్ దూబేచదవండి: ఏయ్ నీవు ఏమి చేస్తున్నావు.. కోపంతో ఊగిపోయిన కోహ్లి! వీడియో వైరల్ -
ఏయ్ నీవు ఏమి చేస్తున్నావు.. కోపంతో ఊగిపోయిన కోహ్లి! వీడియో వైరల్
ఐపీఎల్-2025లో సోమవారం ఎకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. తాత్కాలిక కెప్టెన్ జితేష్ శర్మ తుపాన్ ఇన్నింగ్స్తో ఆర్సీబీ టాప్-2 ప్లేస్ను సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఇన్నింగ్స్ 17వ ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. లక్నో యువ స్పిన్నర్ దిగ్వేష్ సింగ్ రాఠి మరోసారి తన చర్యతో వార్తల్లోకెక్కాడు.అసలేమి జరిగిందంటే?228 పరుగుల భారీ లక్ష్య చేధనలో విరాట్ కోహ్లి(54) ఔటయ్యాక స్టాండ్ ఇన్ కెప్టెన్ జితేష్ శర్మ క్రీజులోకి వచ్చాడు. జితేష్ తన ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బౌండరీలు బదడం మొదలుపెట్టాడు. జితేష్ క్రీజులోకి వచ్చినప్పటికే ఆర్సీబీ కావల్సిన రన్ రేట్ ఓవర్కు 13పైగా ఉంది. దీంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బౌలర్లను ఎంతమంది మార్చిన అతడిని ఆపడం ఎవరి తరం కాలేదు.ఈ క్రమంలో అతడి దూకుడును అడ్డుకట్ట వేసేందుకు స్పిన్నర్ దిగ్వేష్ను తిరిగి పంత్ ఎటాక్లోకి తెచ్చాడు. దీంతో 17 ఓవర్ వేసిన దిగ్వేష్ ఓవరాక్షన్ చేశాడు. జితేష్ను తన బౌలింగ్తో ఆపలేకపోయిన దిగ్వేష్.. అతడిని మన్కడింగ్ చేసి పెవిలియన్కు పంపాలని ప్రయత్నించాడు. ఆ ఓవర్ ఆఖరి బంతిని వేసే క్రమంలో నాన్ స్ట్రైక్లో ఉన్న జితేష్ క్రీజు దాటడం గమనించిన దిగ్వేష్ బంతిని డెలివరీ చేయకుండా స్టంప్స్ను పడగొట్టాడు. వెంటనే రనౌట్కు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్కు రిఫర్ చేశారు. పలు మార్లు రిప్లేలు పరిశీలించిన థర్డ్ అంపైర్.. అప్పటికే దిగ్వేశ్ బౌలింగ్ యాక్షన్ పూర్తి చేయడంతో నిబంధనల ప్రకారం నాటౌట్గా ప్రకటించాడు.పంత్ క్రీడా స్పూర్తి.. అయితే ఇదే సమయంలో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ క్రీడా స్పూర్తిని ప్రదర్శించాడు. థర్డ్ అంపైర్ తన నిర్ణయం ప్రకటించికముందే పంత్ తమ అప్పీల్ను వెనక్కి తీసుకున్నాడు. దీంతో జితేత్.. పంత్కు వద్దకు వెళ్లి అలిగంనం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కోహ్లి ఫైర్..కాగా దిగ్వేష్ మన్కడింగ్కు ప్రయత్నించడంతో డ్రెస్సింగ్ రూమ్లో ఉన్ప విరాట్ కోహ్లి ఊగిపోయాడు. తన చేతిలో ఉన్న బాటిల్ను కిందకు విసిరి కొట్టాడు. అస్సలు నీవు ఏమి చేస్తున్నావు అన్నట్లు కోహ్లి సీరియస్ రియాక్షన్ ఇచ్చాడు. కాగా దిగ్వేష్ ఇప్పటికే తన మితిమీరిన ప్రవర్తనతో ఓ మ్యాచ్ నిషేదాన్ని కూడా ఎదుర్కొన్నాడు.థర్డ్ అంపైర్ ఎందుకు నాటౌట్ ఇచ్చాడంటే?మెరిల్బోన్ క్రికెట్ నిబంధనల ప్రకారం.. బౌలర్ నాన్ స్ట్రైకర్ బ్యాటర్ ను రనౌట్ చేయాలనుకుంటే యాక్షన్ను పూర్తి చేయకముందే ఔట్ చేయాలి. అంటే చేతిని పూర్తిగా తిప్పకముందే వికెట్లను గిరాటు వేయాలి. కానీ దిగ్వేష్ మాత్రం తన బౌలింగ్ యాక్షన్ను పూర్తి చేసి స్టంప్స్ను పడగొట్టాడు. దీంతో థర్డ్ అంపైర్ నాటౌట్గా ప్రకటించాడు. Watch out for Virat’s reaction after Digvesh attempted mankid on Jitesh Sharma. #IPL2025 #IPL #JiteshSharma pic.twitter.com/sAKf6Ck7TV— Akhilesh Dhar (@akhileshdhar1) May 27, 2025 -
కోహ్లి సరికొత్త చరిత్ర.. ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్కడు
ఐపీఎల్-2025లో టీమిండియా స్టార్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లెజెండ్ విరాట్ కోహ్లి పరుగులు వరద పారిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన కీలక మ్యాచ్లో కోహ్లి అద్బుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు.228 పరుగుల భారీ లక్ష్య చేధనలో ప్రత్యర్ధి బౌలర్లను కోహ్లి ఉతికారేశాడు. కేవలం 30 బంతులు మాత్రమే ఎదుర్కొన్న కోహ్లి 10 ఫోర్ల సాయంతో 54 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో మెరిసిన కింగ్ కోహ్లి పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.కోహ్లి సాధించిన రికార్డులు ఇవే..👉ఐపీఎల్లో అత్యధిక ఆర్ధ సెంచరీలు సాధించిన ప్లేయర్గా కోహ్లి రికార్డులెక్కాడు. కోహ్లి ఇప్పటివరకు 63 హాఫ్ సెంచరీలు ఐపీఎల్లో సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పేరిట ఉండేది. వార్నర్ ఐపీఎల్లో 62 ఆర్ధ శతకాలు నమోదు చేశాడు. తాజా హాఫ్ సెంచరీతో వార్నర్ను కోహ్లి అధిగమించాడు. ఈ ఫీట్ను కోహ్లి 257వ ఐపీఎల్ ఇన్నింగ్స్లో అందుకోగా.. వార్నర్ కేవలం 184 ఇన్నింగ్స్లలోనే సాధించాడు.👉అదేవిధంగా టీ20 క్రికెట్లో ఓ జట్టు తరుపున 9వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ఏకైక ఆటగాడిగా కోహ్లి చరిత్ర సృష్టించాడు. లక్నో మ్యాచ్లో 24 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లి ఈ ఫీట్ నమోదు చేశాడు. ఐపీఎల్తో పాటు ఛాంపియన్స్ లీగ్టీ20తో కలిపి కోహ్లి ఆర్సీబీ తరుపున 9వేల పరుగులు సాధించాడు. ఈ జాబితాలో రెండో స్దానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ ముంబై ఇండియన్స్ తరుపన 6060 పరుగులు చేశాడు.టీ20 క్రికెట్లో ఓ జట్టు తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..విరాట్ కోహ్లి (ఆర్సీబీ) – 9030 పరుగులురోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్) – 6060 పరుగులుజేమ్స్ విన్స్ (హాంప్షైర్) – 5934 పరుగులుసురేశ్ రైనా (సీఎస్కే) – 5529 పరుగులుఎంఎస్ ధోని (సీఎస్కే) – 5314 పరుగులు👉ఐపీఎల్ సీజన్లలో అత్యధిక సార్లు 600 పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డు సృష్టించాడు. కోహ్లి ఇప్పటివరకు ఐదు సీజన్లలో 600కు పైగా పరుగులు చేశాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 13 మ్యాచ్లు ఆడి 602 పరుగులు చేశాడు.చదవండి: IPL 2025: రిషబ్ పంత్కు భారీ షాకిచ్చిన బీసీసీఐ -
రిషబ్ పంత్కు భారీ షాకిచ్చిన బీసీసీఐ
ఐపీఎల్-2025 సీజన్ను లక్నో సూపర్ జెయింట్స్ ఓటమితో ముగించింది. సోమవారం ఏకానా స్టేడియం వేదికగా రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ పరాజయం పాలైంది. అయితే ఓటమి బాధలో ఉన్న లక్నో కెప్టెన్ రిషబ్ పంత్కు మరో బిగ్ షాక్ తగిలింది.ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేటు మెయింటిన్ చేసినందుకుగానూ పంత్కు రూ. 30 లక్షల భారీ జరిమానా ఐపీఎల్ ఎడ్వైజరీ కమిటీ విధించింది. అలాగే జట్టులో ఇంపాక్ట్ ప్లేయర్ సహా అందరూ రూ. 12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 50శాతం జరిమానాగా చెల్లించాలని సదరు కమిటీ ఆదేశించింది.ఈ ఏడాది సీజన్లో లక్నో జట్టు స్లో ఓవర్ రేట్ను నమోదు చేయడం ఇది మూడో సారి. అందుకే అంత భారీ మొత్తంలో జరిమానా విధించారు. "లక్నో సూపర్ జెయింట్స్ సారథి రిషబ్ పంత్కు జరిమానా విధించాం. ఏకానా స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ను కొనసాగించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇది మూడో సారి అయినందున ఆర్టికల్ 2.22 ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం పంత్ కు రూ. 30 లక్షలు ఫైన్ వేశాము ’ అని ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. సీజన్ ఆరంభం నుంచి విఫలమైన పంత్.. తమ ఆఖరి మ్యాచ్లో మాత్రం విధ్వంసం సృష్టించాడు. రిషబ్ 61 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 118 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67, 4 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో మెరిశాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 228 పరుగుల భారీ లక్ష్యాన్ని బెంగళూరు కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో చేధించింది.చదవండి: IND Vs ENG: బీసీసీఐ కీలక నిర్ణయం.. దిలీప్కు మళ్లీ పిలుపు -
IPL 2025: ఐపీఎల్ ప్లే ఆఫ్స్.. ఎవరితో ఎవరు ఆడతారంటే?
ఐపీఎల్-2025లో లీగ్ దశ మ్యాచ్లు సోమవారం(మే 27)తో ముగిశాయి. ఈ మెగా టోర్నీ ఆఖరి లీగ్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఆర్సీబీ క్వాలిఫియర్-1కు ఆర్హత సాధించింది. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్లో ఏ జట్టు ఎవరితో తలపడుతుందో ఓ లుక్కేద్దాం. ఈ ఏడాది సీజన్ పాయింట్ల పట్టికలో అగ్రస్దానంలో పంజాబ్ కింగ్స్(18) నిలవగా.. ఆర్సీబీ(18) రెండో స్ధానంలో నిలిచింది. పాయింట్ల పరంగా ఇరు జట్లు సమంగా ఉన్నప్పటికి బెంగళూరు కంటే పంజాబ్ రన్రేట్ మెరుగ్గా ఉండడంతో టాప్ ప్లేస్ను సుస్థిరం చేసుకుంది.క్వాలిఫయర్-1లో పంజాబ్, ఆర్సీబీ ఢీ..టాప్-2లో నిలిచిన పంజాబ్, ఆర్సీబీ మే 29న చంఢీగడ్ వేదికగా క్వాలిఫయర్-1లో తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు ఆర్హత సాధిస్తోంది. అయితే ఇక్కడ ఓడిన జట్టుకు కూడా ఫైనల్ చేరేందుకు మరో ఛాన్స్ ఉంటుంది. ఓటమి చెందిన జట్టు జూన్ 1న క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్ లేదా గుజరాత్ టైటాన్స్ ఆడాల్సి ఉంటుంది. అక్కడ గెలిస్తే ఫైనల్కు చేరుకోవచ్చు. ఇక పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్ధానాల్లో నిలిచిన గుజరాత్ టైటాన్స్, మంబై ఇండియన్స్ మే 30న ఎలిమినేటర్ మ్యాచ్లో తలపడనున్నాయి. ఇక్కడ గెలిచిన జట్టు ఫైనల్ బెర్త్ కోసం క్వాలిఫయర్-2లో క్వాలిఫయర్-1లో ఓడిన టీమ్తో తలపడాల్సి ఉంటుంది. ఇక చివరగా ఫైనల్ జూన్ 3న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.IPL 2025 ప్లేఆఫ్స్ షెడ్యూల్:క్వాలిఫయర్ 1: పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - మే 29, చండీగఢ్ఎలిమినేటర్: గుజరాత్ టైటాన్స్ vs ముంబై ఇండియన్స్ - మే 30, చండీగఢ్క్వాలిఫయర్ 2: క్వాలిఫయర్ 1లో ఓడిపోయిన జట్టు vs ఎలిమినేటర్ విజేత - జూన్ 1, అహ్మదాబాద్ఫైనల్: క్వాలిఫయర్ 1 విజేత vs క్వాలిఫయర్ 2 విజేత - జూన్ 3, అహ్మదాబాద్ -
చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. ఐపీఎల్ హిస్టరీలోనే
ఐపీఎల్-2025 సీజన్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆసాధరణ ప్రదర్శన కనబరిచింది. సోమవారం ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ క్వాలిఫయర్-1కు ఆర్హత సాధించింది. లక్నో నిర్ధేశించిన 228 పరుగుల భారీ లక్ష్యాన్ని బెంగళూరు కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదిపడేసింది.ఆర్సీబీ బ్యాటర్లలో స్టాండ్ ఇన్ కెప్టెన్ జితేష్ శర్మ(33 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లతో 85 నాటౌట్) విధ్వంసం సృష్టించగా.. విరాట్ కోహ్లి(30 బంతుల్లో 10 ఫోర్లతో 54), మయాంక్ అగర్వాల్(23 బంతుల్లో 41 నాటౌట్), సాల్ట్(30) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. లక్నో బౌలర్లలో విలియం ఓ రూర్క్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఆకాష్, అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రిషభ్ పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్స్లు) సీజన్లో తొలి సెంచరీతో చెలరేగగా, మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్స్లు) హాఫ్ సెంచరీతో మెరిశాడు.ఆర్సీబీ సరికొత్త చరిత్ర..ఇక ఈ మ్యాచ్లో అద్బుత విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. ఒక ఐపీఎల్ సీజన్లో ప్రత్యర్ధి జట్లతో వాటి హోం గ్రౌండ్స్లో జరిగిన అన్నీ మ్యాచ్లలోనూ గెలుపొందిన తొలి టీమ్గా ఆర్సీబీ చరిత్ర సృష్టించింది.ఈ ఏడాది సీజన్ తొలి మ్యాచ్లో ఈడెన్ గార్డెన్స్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ను ఓడించిన ఆర్సీబీ.. ఆ తర్వాత సీఎస్కే, ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ను వారి సొంత మైదానాల్లోనే చిత్తు చేసింది.చదవండి: IND vs ENG: బీసీసీఐ కీలక నిర్ణయం.. దిలీప్కు మళ్లీ పిలుపు -
బీసీసీఐ కీలక నిర్ణయం.. దిలీప్కు మళ్లీ పిలుపు
భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్గా హైదరాబాద్కు చెందిన టి.దిలీప్ మళ్లీ ఎంపికయ్యాడు. ప్రతిష్టాత్మక ఇంగ్లండ్ పర్యటన కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దిలీప్ను మరో సారి ఫీల్డింగ్ కోచ్గా నియమించింది. 2021 నుంచి ఈ ఏడాది ఆరంభం వరకు దిలీప్ టీమిండియా ఫీల్డింగ్ కోచ్గా వ్యవహరించగా... ఆ్రస్టేలియాలో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత జట్టు పేలవ ప్రదర్శనతో సహాయక కోచ్ అభిషేక్ నాయర్తో పాటు దిలీప్ను తొలగించింది.ఫీల్డింగ్ కోచ్గా విదేశీయుడిని నియమించాలని బోర్డు ప్రయత్నించనా... అది వీలు కాకపోవడంతో జట్టు సభ్యులతో మంచి అనుబంధం ఉన్న దిలీప్ను తిరిగి ఎంపిక చేసింది. "దిలీప్ చాలా మంచి కోచ్. నాలుగేళ్లుగా భారత జట్టుతో కలిసి పనిచేశాడు. ఆటగాళ్ల బలాబలాలు అతడికి బాగా తెలుసు. ఇంగ్లండ్తో సిరీస్కు ముందు అతడిని తిరిగి నియమించాం"అని బోర్డు అధికారి వెల్లడించారు. ఇక మరోవైపు భారత టెస్టు కొత్త కెపె్టన్ శుబ్మన్ గిల్, సుదర్శన్ జూన్ 6 నుంచి ఇంగ్లండ్ లయన్స్తో జరిగే వార్మప్ మ్యాచ్కు అందుబాటులో ఉండకపోవచ్చని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: జితేశ్ జితాదియా -
జితేశ్ జితాదియా
లక్నో: సొంతగడ్డపై విజయగర్వంతో సీజన్ను ముగించే భారీ స్కోరునే లక్నో చేసింది... ఛేదనలో సాల్ట్, లివింగ్స్టోన్, కోహ్లిలాంటి విలువైన వికెట్లను తీసింది. 52 బంతుల్లో 105 పరుగుల సమీకరణం బెంగళూరుకు క్లిష్టంగా అనిపించింది... అయితే కెప్టెన్ జితేశ్... మయాంక్తో కలిసి చేసిన బ్యాటింగ్ మ్యాజిక్ మ్యాచ్నే మార్చేసింది. ఇంకో 8 బంతులు మిగిలుండగానే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్పై జయభేరి మోగించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రిషభ్ పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్స్లు) సీజన్లో తొలి సెంచరీతో కదం తొక్కగా, మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్స్లు) ధాటిగా ఆడాడు. అనంతరం బెంగళూరు 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జితేశ్ శర్మ (33 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్స్లు), కోహ్లి (30 బంతుల్లో 54; 10 ఫోర్లు) చెలరేగారు. చితగ్గొట్టిన పంత్ మార్ష్ తో ఇన్నింగ్స్ ఆరంభించిన బ్రిట్జ్కీ (14) మూడో ఓవర్లో నిష్క్రమించాడు. తర్వాత రిషభ్ పంత్ రావడంతో లక్నో ప్రతీ ఓవర్లోనూ పండగ చేసుకుంది. యశ్ దయాళ్ వేసిన నాలుగో ఓవర్లో ఒక సిక్స్, రెండు బౌండరీలు బాదడం ద్వారా పంత్ ప్రతాపం మొదలైంది. పవర్ప్లే తర్వాత ఓ వైపు మార్ష్, ఇంకోవైపు రిషభ్ ధనాధన్ షోతో ఓవర్కు సగటున పది పరుగుల రన్రేట్ నమోదైంది. దీంతో 9.5 ఓవర్లో జెయింట్స్ 100 స్కోరును చేరుకుంది.ముందుగా పంత్ 29 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 14వ ఓవర్లో సిక్సర్తో మార్ష్ 31 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. ఆ ఓవర్లో రిషభ్ కూడా ఫోర్, సిక్స్ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. 16వ ఓవర్లో వరుసగా 2 సిక్సర్లు కొట్టిన మార్ష్ ను భువనేశ్వర్ అవుట్ చేశాడు. దీంతో రెండో వికెట్కు 152 పరుగుల సుదీర్ఘ భాగస్వామ్యానికి తెరపడింది. అతని మరుసటి ఓవర్లో బౌండరీతో పంత్ 54 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకోవడం, జట్టు 200మార్క్ దాటడం జరిగిపోయాయి. మెరుపు భాగస్వామ్యం... సాల్ట్, కోహ్లిలు పెద్ద లక్ష్యాన్ని ఛేదించేందుకు అవసరమైన మెరుపు ఆరంభాన్నిచ్చారు. ఇద్దరు బౌండరీలతో స్కోరుబోర్డును పరుగు పెట్టించారు. 4 ఓవర్లలోనే స్కోరు 50కి చేరింది. కానీ పవర్ప్లే ఆఖరి ఓవర్లోనే సాల్ట్ (19 బంతుల్లో 30; 6 ఫోర్లు) వికెట్ను కోల్పోయింది. తర్వాత కోహ్లికి జతయిన రజత్ పటిదార్ (14) ఫోర్, సిక్సర్ బాదాడు. కానీ రూర్కే ఒకే ఓవర్లో అతన్ని, లివింగ్స్టోన్ (0)ను అవుట్ చేసి బెంగళూరును కష్టాల్లో పడేశాడు. కోహ్లి తన మార్క్ షాట్లతో చెలరేగిపోవడంతో రన్రేట్ లక్ష్యాన్ని కరిగించేంత వేగంగా దూసుకెళ్లింది. 9.1 ఓవర్లోనే ఆర్సీబీ స్కోరు వందను దాటేసింది. కోహ్లి 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ధాటిని కొనసాగించే ప్రయత్నంలో కొట్టిన షాట్ మిడాఫ్లో బదోని చేతికి చిక్కడంతో కోహ్లి నిరాశగా వెనుదిరిగాడు. అప్పుడు జట్టు స్కోరు 11.2 ఓవర్లలో 123/4. కాగా గెలుపు సమీకరణం 52 బంతుల్లో 105 చాలా కష్టమైంది.మయాంక్, కెప్టెన్ జితేశ్ శర్మల మెరుపులకు తోడు... లక్నో ఆటగాళ్ల చెత్త ఫీల్డింగ్, సులువైన రనౌట్పట్ల రూర్కే అశ్రద్ధ వెరసి... పరుగులు, బౌండరీలు అలవోకగా రావడంతో చూస్తుండగానే లక్ష్యం దిగొచ్చింది. అబేధ్యమైన ఐదో వికెట్కు మయాంక్, జితేశ్లు కేవలం 44 బంతుల్లోనే 107 పరుగులు జోడించడం విశేషం! స్కోరు వివరాలు లక్నో సూపర్జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి) జితేశ్ (బి) భువనేశ్వర్ 67; బ్రిట్జ్కీ (బి) తుషార 14; పంత్ నాటౌట్ 118; పూరన్ (సి) యశ్ దయాళ్ (బి) షెఫర్డ్ 13; సమద్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 227. వికెట్ల పతనం: 1–25, 2–177, 3–226. బౌలింగ్: తుషార 4–0–26–1, కృనాల్ పాండ్యా 2–0–14–0, యశ్ దయాళ్ 3–0–44–0, భువనేశ్వర్ 4–0–46–1, సుయశ్ 3–0–39–0, షెఫర్డ్ 4–0–51–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) దిగ్వేశ్ (బి) ఆకాశ్ 30; కోహ్లి (సి) బదోని (బి) అవేశ్ఖాన్ 54; పటిదార్ (సి) సమద్ (బి) రూర్కే 14; లివింగ్స్టోన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రూర్కే 0; మయాంక్ నాటౌట్ 41; జితేశ్ నాటౌట్ 85; ఎక్స్ట్రాలు 6; మొత్తం (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 230. వికెట్ల పతనం: 1–61, 2–90, 3–90, 4–123. బౌలింగ్: ఆకాశ్ 4–0–40–1, విల్ రూర్కే 4–0–74–2, దిగ్వేశ్ రాఠి 4–0–36–0, షాబాజ్ 3–0–39–0, అవేశ్ఖాన్ 3–0–32–1, బదోని 0.4–0–9–0. ఐపీఎల్ ‘ప్లే ఆఫ్స్’క్వాలిఫయర్–1 (మే 29)పంజాబ్ X బెంగళూరువేదిక: ముల్లాన్పూర్ , రాత్రి 7: 30 గంటల నుంచిఎలిమినేటర్ (మే 30)గుజరాత్ X ముంబైవేదిక: ముల్లాన్పూర్ , రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
RCB Vs LSG: వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన జితేశ్.. ఉత్కంఠ పోరులో లక్నోపై ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 27) జరిగిన ఉత్కంఠ పోరులో లక్నోపై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో భారీ స్కోర్ (227/3) చేసింది. రిషబ్ పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో అలరించాడు. లక్నో ఇన్నింగ్స్లో మాథ్యూ బ్రీట్జ్కీ 14, పూరన్ 13 పరుగులు చేసి ఔటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో తుషార, భువనేశ్వర్ కుమార్, షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీ విజయవంతమైంది. ఆ జట్టు 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జితేశ్ శర్మ (33 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని గెలిపించాడు. అతనికి మయాంక్ అగర్వాల్ (23 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు) సహకరించాడు. అంతకుముందు విరాట్ కోహ్లి (30 బంతుల్లో 54; 10 ఫోర్లు), ఫిల్ సాల్ట్ (19 బంతుల్లో 30; 6 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి ఆర్సీబీ గెలుపుకు పునాది వేశారు. లక్నో బౌలర్లలో విలియమ్ ఓరూర్కీ 2, ఆకాశ్ సింగ్, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో ఆర్సీబీ టేబుల్ సెకెండ్ టాపర్గా నిలిచి ప్లే ఆఫ్స్కు చేరింది.మే 29న జరిగే క్వాలిఫయర్-1లో ఆర్సీబీ.. పంజాబ్తో తలపడనుంది. మే 30న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకుంటాయి. -
IPL 2025, LSG VS RCB: విధ్వంసకర శతకం.. పల్టీ కొట్టిన పంత్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పేలవ ప్రదర్శన కారణంగా ముప్పేట దాడిని ఎదుర్కొన్న పంత్ ఎట్టకేలకు తమ చివరి మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడు. ఆర్సీబీతో ఇవాళ (మే 27) జరుగుతున్న మ్యాచ్లో పంత్ విధ్వంసకర శతకంతో (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్లో ఆది నుంచే దూకుడుగా ఆడిన పంత్.. 54 బంతుల్లో సెంచరీని పూర్తి చేశాడు. ఐపీఎల్లో పంత్కు ఇది రెండో సెంచరీ. సెంచరీ పూర్తి చేసిన అనంతరం పంత్ ఆనందంతో పల్టీ కొట్టాడు. దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్, వీడియోలు సోషల్మీడియాలో వైరవలవుతున్నాయి.Coldest IPL hundred celebration 🥶pic.twitter.com/WDHHIvLVv6— CricTracker (@Cricketracker) May 27, 2025ఎట్టకేలకు పంత్ తనపై పెట్టిన పెట్టుబడికి (రూ. 27 కోట్లు) న్యాయం చేశాడని నెటిజన్లు అంటున్నారు. ఈ సీజన్లో పంత్ చాలా దారుణమైన ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్కు ముందు 12 ఇన్నింగ్స్ల్లో కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. పంత్ పేలవ ప్రదర్శన కారణంగా లక్నో సూపర్ జెయింట్స్ చాలా మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించాక ఎట్టకేలకు తమ చివరి మ్యాచ్లో పంత్ సెంచరీతో సత్తా చాటాడు.ఇటీవలికాలంలో పంత్ బ్యాట్ నుంచి జాలువారిన అత్యుత్తమ ఇన్నింగ్స్ ఇది. ఐపీఎల్లో పంత్ చివరిగా 2018 సీజన్లో సెంచరీ చేశాడు. నాడు సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో 128 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున నేటికి ఇదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్గా చలామణి అవుతుంది. తాజా శతకంతో పంత్ తనలో చేవ తగ్గలేదని నిరూపించుకున్నాడు.ఆర్సీబీతో మ్యాచ్లో పంత్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో పాటు మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీ సాధించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్నో ఇన్నింగ్స్లో మాథ్యూ బ్రీట్జ్కీ 14, పూరన్ 13 పరుగులు చేసి ఔటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో తుషార, భువనేశ్వర్ కుమార్, షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు.కాగా, ఈ సీజన్లో లక్నో ప్రయాణం ఇదివరకే ముగిసింది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఆ జట్టు రెండు మ్యాచ్ల ముందే నిష్క్రమించింది. సీజన్ ఆరంభంలో అద్భుత విజయాలు సాధించిన ఈ జట్టు క్రమంగా నీరసపడిపోయింది. మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్ అత్యుత్తమ ఫామ్లో ఉన్నా ఎందుకో విజయాలు సాధించలేకపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న లక్నో ఆర్సీబీతో ఇవాళ జరుగబోయే మ్యాచ్లో గెలిస్తే ఆరో స్థానానికి చేరుకుంటుంది.ఆర్సీబీ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో లక్నోపై గెలిస్తే ఆర్సీబీ క్వాలిఫయర్-1 బెర్త్ దక్కించుకుంటుంది. ఈ మ్యాచ్లో ఓడితే మాత్రం ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. పంజాబ్ ఇదివరకే క్వాలిఫయర్ బెర్త్ సాధించగా.. మరో బెర్త్ కోసం గుజరాత్, ఆర్సీబీ పోటీలో ఉన్నాయి. ముంబై తప్పనిసరిగా ఎలిమనేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. -
LSG VS RCB: అరుదైన మైలురాయిని తాకిన మిచెల్ మార్ష్
లక్నో సూపర్ జెయింట్స్ విధ్వంసకర ఆటగాడు మిచెల్ మార్ష్ టీ20ల్లో ఓ అరుదైన మైలురాయిని తాకాడు. పొట్టి ఫార్మాట్లో 5000 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 115వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. టీ20 కెరీర్లో 201 మ్యాచ్లు ఆడిన మార్ష్ 136 స్ట్రయిక్రేట్తో 2 సెంచరీలు, 31 అర్ద సెంచరీల సాయంతో 5000 పరుగుల మార్కును దాటాడు.ఐపీఎల్ 2025లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మే 27) జరుగుతున్న మ్యాచ్లో మార్ష్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో మార్ష్ 12 ఓవర్ల అనంతరం 45 పరుగులతో అజేయంగా ఉన్నాడు. సీజన్ ప్రారంభం నుంచి అదిరిపోయే ఫామ్లో ఉన్న మార్ష్ లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. 13 మ్యాచ్ల్లో సెంచరీ, 5 అర్ద సెంచరీల సాయంతో 607 పరుగులు చేసి పరుగుల వేటను కొనసాగిస్తున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ కష్టాలు కొని తెచ్చుకుంది. లక్నో ఆదిలోనే బ్రీట్జ్కీ (14) వికెట్ కోల్పోయినప్పటికీ.. రిషబ్ పంత్ (59), మిచెల్ మార్ష్ (47) విధ్వంసం సృష్టిస్తున్నారు. 13 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 131/1గా ఉంది.కాగా, ఈ సీజన్లో లక్నో ప్రయాణం ఇదివరకే ముగిసింది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఆ జట్టు రెండు మ్యాచ్ల ముందే నిష్క్రమించింది. సీజన్ ఆరంభంలో అద్భుత విజయాలు సాధించిన ఈ జట్టు క్రమంగా నీరసపడిపోయింది. మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్ అత్యుత్తమ ఫామ్లో ఉన్నా ఎందుకో ఈ జట్టు విజయాలు సాధించలేకపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న లక్నో ఆర్సీబీతో ఇవాళ జరుగబోయే మ్యాచ్లో గెలిస్తే ఆరో స్థానానికి చేరుకుంటుంది.ఆర్సీబీ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో లక్నోపై గెలిస్తే ఆర్సీబీ క్వాలిఫయర్-1 బెర్త్ దక్కించుకుంటుంది. ఈ మ్యాచ్లో ఓడితే మాత్రం ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. పంజాబ్ ఇదివరకే క్వాలిఫయర్ బెర్త్ సాధించగా.. మరో బెర్త్ కోసం పోటీలో గుజరాత్, ఆర్సీబీ ఉన్నాయి. ముంబై తప్పనిసరిగా ఎలిమనేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంది.