breaking news
Cricket
-
సరికొత్త టోర్నమెంట్ను ప్రకటించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు
దక్షిణాఫ్రికా, జింబాబ్వే వేదికలుగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2027 టోర్నీ దృష్ట్యా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వైట్ బాల్ క్రికెట్లో యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు విస్తృత అవకాశాలు కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా 'నేషనల్ ఛాంపియన్స్ కప్ 2026' అనే సరికొత్త టోర్నమెంట్ను పీసీబీ తీసుకొచ్చింది.సోమవారం ఈ లీగ్ ప్రారంభ ఎడిషన్కు సంబంధించిన షెడ్యూల్ను పీసీబీ విడుదల చేసింది. షెడ్యూల్తో పాటు పాల్గోనే మొత్తం నాలుగు జట్లను కూడా ప్రకటించారు. ఈ టోర్నీ ఆగస్టు 11 నుంచి ఆగస్టు 18 వరకు కేవలం వారం రోజుల పాటు జరగనుంది. మొత్తం మ్యాచ్లన్నింటికి ముల్తాన్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.ఈ ఈవెంట్ లీగ్ దశ రౌండ్-రాబిన్ ఫార్మాట్లో ఫార్మాట్లో నిర్వహించనున్నారు. ప్రతీ జట్టు మిగతా జట్లతో ఒకసారి తలపడనుంది. లీగ్ దశ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఆగస్టు 18న జరిగే గ్రాండ్ ఫైనల్లో తాడోపేడో తెల్చుకోనున్నాయి. కాగా ఈ లిస్ట్-ఎ క్రికెట్ టోర్నమెంట్లో పాకిస్తాన్ అగ్రశ్రేణి ఆటగాళ్లు షాహీన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్ పాల్గోనున్నారు. వీరు నలుగురు కెప్టెన్లగా వ్యవహరించనున్నారు.జట్ల వివరాలు:పాకిస్థాన్ గ్రీన్: షాదాబ్ ఖాన్ (కెప్టెన్), ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఫర్హాన్ యూసుఫ్, మెహ్రాన్ ముంతాజ్, మహమ్మద్ హస్నైన్, మహమ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, ఉమైర్ బిన్ యూసుఫ్, సాద్ బైగ్ (వికెట్ కీపర్), సమీర్ మిన్హాస్.పాకిస్థాన్ వైట్స్: సైమ్ అయూబ్ (కెప్టెన్), ఆకిఫ్ జావేద్, అలీ రజా, హ్యారీస్ రౌఫ్, హసన్ నవాజ్, ఖుష్దిల్ షా, మొహ్సిన్ రియాజ్, మహమ్మద్ వసీమ్ జూనియర్, సాద్ మసూద్, షెహ్జాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్).పాకిస్థాన్ బ్లూస్: సాహిబ్జాదా ఫర్హాన్ (కెప్టెన్), అహ్మద్ దానియల్, అరఫాత్ మిన్హాస్, హసన్ అలీ, హుస్సేన్ తలాత్, జహాన్ దాద్ ఖాన్, రోహైల్ నజీర్ (వికెట్ కీపర్), షామిల్ హుస్సేన్, సుఫియాన్ మోకిమ్, తైమూర్ ఖాన్ (వికెట్ కీపర్), తయ్యాబ్ తాహిర్.పాకిస్థాన్ గోల్డ్: షాహీన్ షా అఫ్రీది (కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్దుల్ సుభాన్, ఫైసల్ అక్రమ్, హైదర్ అలీ, కమ్రాన్ గులామ్, మాజ్ సదాకత్, మహమ్మద్ నవాజ్, ముహమ్మద్ అఖ్లాక్ (వికెట్ కీపర్), ముహమ్మద్ ఇమ్రాన్, సాద్ ఖాన్. -
నేపాల్ పేసర్ చారిత్రక ఘనత
నేపాల్ పేస్ బౌలర్ కరణ్ కేసీ వన్డే క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఈ ఫార్మాట్లో 100 వికెట్లు పూర్తి చేసిన తొలి నేపాల్ పేసర్గా, సందీప్ లామిచ్ఛానే తర్వాత రెండో నేపాల్ బౌలర్గా చరిత్ర సృష్టించాడు.ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ లీగ్-2లో భాగంగా నమీబియాతో జరుగుతున్న మ్యాచ్లో కరణ్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో కరణ్ 10 ఓవర్లలో కేవలం 29 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ ఇన్నింగ్స్లో రెండో వికెట్తో అతను 100 వికెట్ల మైలురాయిని తాకాడు.2018లో నెదర్లాండ్స్పై వన్డే అరంగేట్రం చేసిన కరణ్.. 72 ఇన్నింగ్స్ల్లో 103 వికెట్లు తీశాడు. బ్యాటింగ్ సామర్థ్యం కూడా కలిగిన కరణ్, ఈ ఫార్మాట్లో ఓ హాఫ్ సెంచరీ సాయంతో 700 పరుగులు కూడా చేశాడు. 34 ఏళ్ల కరణ్ టీ20 ఫార్మాట్లోనూ సత్తా చాటుతే 112 వికెట్లు తీశాడు.నమీబియా-నేపాల్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. జాన్ ఫ్రైలింక్ (100) సెంచరీతో సత్తా చాటగా.. స్టీన్క్యాంప్ (59) అర్ద సెంచరీతో రాణించాడు. వీరిద్దరూ క్రీజ్లో ఉండగా.. నమీబియా భారీ స్కోర్ సాధించేలా కనిపించింది. అయితే కరణ్ (10-2-29-5) అద్భుత స్పెల్తో వారి ఆశలు అడియాశలు చేశాడు. -
'అతడిని పక్కన పెట్టాల్సిన టైమ్ వచ్చేసింది'
జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్లో యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ... స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ పేలవ ఫామ్ మాత్రం మేనెజ్మెంట్ను తీవ్ర కలవరపెడుతోంది. ఇంగ్లండ్ టూర్లో ఆశించిన స్థాయిలో రాణించలేపోయిన అభిషేక్.. జింబాబ్వే గడ్డపై అంతకంటే దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. మూడు మ్యాచ్లలోనూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. ఈ ఎస్ఆర్హెచ్ స్టార్ ఓపెనర్ మూడు మ్యాచ్ల్లో కలిపి కేవలం 11 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మ బదులుగా సంజూ శాంసన్కు అవకాశమివ్వాలని శ్రీకాంత్ సూచించాడు.కాగా టీ20 వరల్డ్కప్-2026 హీరో శాంసన్ను జింబాబ్వే పర్యటన నుంచి సెలక్టర్లు తప్పించారు. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి అతడి స్ధానంలో అవకాశమిచ్చారు. అంతకుముందు ఇంగ్లండ్ టూర్లోనూ మూడు మ్యాచ్లకు సంజూను తుది జట్టు నుంచి పక్కన పెట్టారు. అయితే ఆసియా గేమ్స్కు ఎంపిక చేసిన భారత జట్టులో మాత్రం ఈ కేరళ ఆటగాడు ఉన్నాడు. అయితే వైభవ్ సూర్యవంశీ మెరుగ్గా రాణించడంతో ఆసియా గేమ్స్ నుంచి కూడా శాంసన్ను తప్పించే అవకాశముంది."అభిషేక్ శర్మ బలహీనతను ప్రత్యర్ధి జట్లు పసిగట్టేశాయి. వన్డే వరల్డ్కప్ నుంచి అతడి ప్రదర్శనలు అంతంతమాత్రమే గానే ఉన్నాయి. అతడి విషయంలో సెలక్టర్లు కఠిన నిర్ణయం తీసుకోక తప్పుదు. అభిషేక్ శర్మ స్ధానంలో సంజూ శాంసన్కు అవకాశమివ్వాలి. అతడికి కచ్చితంగా సెలక్టర్ల నుంచి పిలుపు వస్తుందని నమ్ముతున్నాను. అదేవిధంగా జింబాబ్వే పర్యటనలో లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచిన యువ పేసర్ మయాంక్ యాదవ్పై శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు. మయాంక్ మూడు మ్యాచ్ల సిరీస్లో 6.5 ఏకానమీ రేటుతో 5 వికెట్లు పడగొట్టాడు. -
రాజీనామా డిమాండ్ల మధ్య 'గంభీర'మైన పోస్ట్
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సోషల్ మీడియాలో చేసిన ఓ క్రిప్టిక్ పోస్ట్ చర్చనీయాంశమైంది. ఇటీవల భారత జట్టు వరుస సిరీస్ల్లో నిరాశపరిచిన తర్వాత కొందరు అభిమానులు గంభీర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఇటీవల కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో కొందరు నెటిజన్లు దానిని గంభీర్ పరిస్థితితో పోలుస్తూ మీమ్స్ను వైరల్ చేశారు.ఈ పరిస్థితి మధ్య గంభీర్ తన ఇన్స్టాగ్రామ్లో "Jab desh ka sabse Gambhir insaan muskura de…" అంటూ నవ్వుతున్న ఎమోజీలతో కూడిన పోస్ట్ను పంచుకున్నారు. ఈ పోస్ట్ను ఆయనపై వస్తున్న విమర్శలకు పరోక్ష సమాధానంగా పలువురు అభిమానులు భావిస్తున్నారు. అయితే గంభీర్ మాత్రం తన పోస్టులో ఎక్కడా రాజీనామా డిమాండ్లు లేదా విమర్శలను ప్రస్తావించలేదు.గంభీర్ మార్గదర్శకత్వంలోని భారత జట్టు ఇటీవల ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్ను 0-2తో, ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్ను 0-4తో, వన్డే సిరీస్ను 1-2తో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ వరుస పరాజయాల తర్వాత గంభీర్పై విమర్శలు తారాస్థాయికి చేరాయి.మరోవైపు, గంభీర్ విశ్రాంతిలో ఉండగా వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్గా జట్టుతో కలిసి జింబాబ్వే పర్యటనకు వెళ్లాడు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత జట్టు అక్కడ 3-0తో సిరీస్ను క్లీన్స్వీప్ చేయడంతో, లక్ష్మణ్ను శాశ్వత ప్రధాన కోచ్గా నియమించాలనే డిమాండ్లు తీవ్రమయ్యాయి.అయితే గంభీర్ కోచ్గా ఉన్న కాలంలో భారత్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్లను గెలుచుకున్న విషయాన్ని కూడా అభిమానులు గుర్తుంచుకోవాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఆయన పదవిపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. -
ముంబైలో ఫ్లాట్ కొన్న విరుష్క జోడీ.. ఎన్ని కోట్లంటే?
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ జంట ముంబైలోని వర్సోవా ప్రాంతంలో ఓ లగ్జరీ అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు. రియల్ ఎస్టేట్ ప్లాట్ఫారమ్ జాప్కీ.కామ్ ప్రకారం.. ఈ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు విరుష్క జోడీ రూ. 18.29 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ ఫ్లాట్ సుమారు 2,644 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ప్లాట్తో పాటు మూడు కార్ పార్కింగ్ స్లాట్లు కేటాయించబడ్డాయి. దీనికి సంబంధించి జూలై 21న రిజిస్ట్రేషన్ జరిగినట్లు సమాచారం. దీని కోసం కోహ్లీ దంపతులు రూ.1.09 కోట్ల స్టాంప్ డ్యూటీతో పాటు రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించారు. కాగా ముంబైలోని వర్లీలో ఇప్పటికే వీరికి లగ్జరీ అపార్ట్మెంట్ ఉన్న విషయం తెలిసిందే. అయితే కోహ్లి ఫ్యామిలీ ఎక్కువగా లండన్లో ఉంటుంది. అక్కడ కూడా విలాసవంతమైన ఇంటిని కోహ్లి కొనుగోలు చేశాడు.చివరగా ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో భారత తరపున బరిలోకి దిగిన కింగ్ కోహ్లి.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. సెప్టెంబర్ 27న వెస్టిండీస్తో జరగనున్న వన్డేలో కోహ్లి తిరిగి భారత జెర్సీలో కనిపించనున్నాడు. -
టీమిండియా ఓపెనర్తో మృణాల్ ఠాకూర్ డేటింగ్..?
బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్, భారత యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ డేటింగ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ముంబైలోని బాంద్రా వెస్ట్లో ఉన్న బూజీ కేఫే వద్ద వీరిద్దరూ కనిపించిన వీడియో వైరల్ కావడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి.Yashasvi Jaiswal dating Mrunal Thakur?😳 pic.twitter.com/dnr4FNSaEc— Wickets Hitting (@offpacedelivery) July 26, 2026ఆ వీడియోలో యశస్వి జైస్వాల్ కేఫే నుంచి బయటకు వస్తుండగా, మృణాల్ ఠాకూర్ లోపల ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే అందులో ఇద్దరూ కలిసి కనిపించలేదు. వారిద్దరి మధ్య ఎలాంటి సన్నిహిత సంబంధాన్ని సూచించే దృశ్యాలు కూడా వీడియోలో లేవు.ఇప్పటివ వరకు మృణాల్ గానీ, జైస్వాల్ గానీ ఈ ప్రచారంపై స్పందించలేదు. అలాగే వారు ప్రేమలో ఉన్నారని నిర్ధారించే ఆధారాలు కూడా లేవు. ఈ భేటీ వ్యక్తిగతమా, వృత్తిపరమైనదా లేదా ప్రకటన చిత్రీకరణకు సంబంధించినదా అన్నది స్పష్టంగా తెలియరాలేదు.మరోవైపు సోషల్ మీడియాలో వీరిద్దరి వయస్సు తేడాపైనా చర్చ జరుగుతోంది. మృణాల్కు ప్రస్తుతం 33 ఏళ్లు, జైస్వాల్కు 24. వీరి మధ్య సుమారు 9 ఏళ్లు తేడా ఉంది.ఇదిలా ఉంటే, గతంలో మృణాల్ ఠాకూర్ పేరు నటుడు ధనుష్తో ముడిపెడుతూ పలు కథనాలు వెలువడ్డాయి. అయితే ఆ వార్తలను ఆమె పూర్తిగా ఖండించింది. -
చారిత్రత్మక టెస్ట్ సిరీస్కు బంగ్లా జట్టు ప్రకటన
బంగ్లాదేశ్ పురుషల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడేందుకు సిద్దమవుతోంది. ఈ క్రమంలో ఆగస్టు 13 నుంచి డార్విన్ వేదికగా జరగనున్న తొలి టెస్టు కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును బంగ్లా క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా నజ్ముల్ హుస్సేన్ శాంటో సారథ్యం వహించనున్నాడు. బంగ్లాదేశ్ జట్టు 2003 తర్వాత ఆస్ట్రేలియాలో ఓ టెస్టు సిరీస్ ఆడనుండడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక ఈ సిరీస్ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-26లో భాగంగా జరగనుంది. కాబట్టి ఈ సిరీస్కు ఇరు జట్లకు కీలకం కానుంది. కాగా ఆల్రౌండర్ సౌమ్య సర్కార్కు చాన్నాళ్ల తర్వాత బంగ్లా టెస్ట్ జట్టులో చోటు దక్కింది. సర్కార్ చివరగా 2021లో బంగ్లా తరపున టెస్టుల్లో ఆడాడు. అదేవిధంగా సీనియర్ బ్యాటర్లు ముష్ఫికర్ రహీమ్, మోమినుల్ హక్ జట్టులో చోటు దక్కించుకున్నారు.పేస్ బౌలింగ్ విభాగంలో టాస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, ఖాలెద్ అహ్మద్, ఎబాదత్ హుస్సేన్ వంటి ఫాస్ట్ బౌలర్లను సెలక్టర్లు ఎంపిక చేశారు. వీరితో పాటు అన్క్యాప్డ్ పేసర్ ముష్ఫిక్ హసన్కు కూడా తొలిసారి జట్టులో స్థానం లభించింది.ఇక ఈ సిరీస్ కోసం ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ జట్టు ప్రకటించింది. ఈ జట్టుకు ప్యాట్ కమిన్స్ సారథ్యం వహించనున్నాడు. కాగా ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 87.5% పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, బంగ్లాదేశ్ 58.33% పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.తొలి టెస్టుకు బంగ్లాదేశ్ జట్టు:నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, షాద్మన్ ఇస్లామ్, తాంజిద్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, అమిత్ హసన్, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్ (వైస్ కెప్టెన్), తైజుల్ ఇస్లామ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, సయ్యద్ ఖాలెద్ అహ్మద్, ఎబాదత్ హుస్సేన్ చౌదరి, ముష్ఫిక్ హసన్. -
కేసుల ఎఫెక్ట్.. జట్టు మారిన ఆర్సీబీ బౌలర్
ఆర్సీబీ ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్ 2026-27 దేశవాళీ సీజన్కు ముందు ఉత్తరప్రదేశ్ జట్టును వీడి ఛత్తీస్గఢ్కు మారాడు. అతనిపై కొనసాగుతున్న చట్టపరమైన కేసుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్ జట్టు ప్రీ-సీజన్ శిక్షణ శిబిరంలో దయాల్ చేరి సాధన ప్రారంభించాడు.ESPNcricinfo కథనం ప్రకారం, ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (UPCA) నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) ప్రక్రియ కొనసాగుతోంది. కొత్త ప్రధాన కోచ్ అమయ్ ఖురాసియా ఆధ్వర్యంలో కర్ణాటకలోని ఆలూర్లో జరుగుతున్న శిక్షణ శిబిరంలో దయాల్ పాల్గొంటున్నాడు.కేసుల నేపథ్యంలో జట్టు మార్పుయశ్ దయాల్పై ప్రస్తుతం రెండు క్రిమినల్ కేసులు కొనసాగుతున్నాయి. ఓ మహిళను వివాహం చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 69 కింద ఘాజియాబాద్లో కేసు నమోదైంది. ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు అతడికి తాత్కాలిక అరెస్టు రక్షణ కల్పించింది. మరోవైపు జైపూర్లో నమోదైన POCSO కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ను ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది.ఈ కేసుల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ క్రికెట్ వ్యవస్థ నుంచి దూరమైన దయాల్, కొత్త అవకాశాల కోసం ఛత్తీస్గఢ్కు మారినట్లు సమాచారం.ఐపీఎల్లోనూ అవకాశం దక్కలేదు2025 ఐపీఎల్ ఫైనల్ తర్వాత యశ్ దయాల్ పోటీ క్రికెట్కు దూరంగా ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అతడిని ఐపీఎల్ 2026కు రిటైన్ చేసినప్పటికీ, వ్యక్తిగత న్యాయపరమైన పరిస్థితుల కారణంగా జట్టులో అవకాశం ఇవ్వలేదు.దేశవాళీ కెరీర్పై దృష్టిఛత్తీస్గఢ్ జట్టులో భారత స్పిన్నర్ జయంత్ యాదవ్, అనుభవజ్ఞుడు ధర్మేంద్రసింహ్ జడేజా వంటి ఆటగాళ్లతో కలిసి యశ్ దయాల్ సాధన చేస్తున్నాడు. న్యాయపరమైన విచారణలు కొనసాగుతున్నప్పటికీ, దేశవాళీ క్రికెట్లో మరోసారి తన కెరీర్ను గాడిలో పెట్టేందుకు అతడు ప్రయత్నిస్తున్నాడు. -
నా కల నెరవేరింది.. వారి వల్లే ఇదంతా: వైభవ్ సూర్యవంశీ
తన అరంగేట్ర సిరీస్లో విఫలమైన టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. జింబాబ్వే పర్యటనలో ఇరగదీశాడు. ఈ మూడు మ్యాచ్ల సిరీస్లో రెండు హాఫ్ సెంచరీలతో సహా మొత్తంగా 151 పరుగులు చేసి లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు. హరారే వేదికగా జరిగిన నామమాత్రపు మూడో టీ20లోనూ వైభవ్ సత్తాచాటాడు.49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్లతో 81 పరుగులు చేశాడు. దీంతో సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో ఈ రెండు అవార్డులను గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా సూర్యవంశీ నిలిచాడు. ఈ నేపథ్యంలో తనకు సపోర్ట్గా నిలిచిన టీమ్ మేనెజ్మెంట్కు వైభవ్ ధన్యవాదాలు తెలిపాడు."నా కల నెరవేరింది. మొదటిసారిగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సిరీస్ కోసం తీవ్రంగా శ్రమించాను. హరారే వచ్చిన తర్వాత మేము మూడు రోజుల పాటు ప్రాక్టీస్ చేశాం. ఇంతకుముందు ఇదే వేదికపై అండర్-19 ప్రపంచకప్ మ్యాచ్లు ఆడాను. ఈ గ్రౌండ్లో ఆడడం నాకు చాలా ఇష్టం. అదేవిధంగా కెప్టెన్, కోచ్లు, సహచర ఆటగాళ్లందరూ నాకు పూర్తి మద్దతు ఇచ్చారు. వారి వల్లే నేను ఇక్కడ మెరుగైన ప్రదర్శన చేయగలిగాను. టీ20 క్రికెట్లో మొదట నుంచి ఎలా ఆడుతున్నానో.. ఇక్కడ కూడా అదే కొనసాగించాను.జట్టుకు మంచి ఆరంభాన్ని ఇవ్వడమే నా ప్రధాన లక్ష్యం. ఒకసారి కుదురుకున్నాక, ఇన్నింగ్స్ను భారీ స్కోరుగా మలచడానికి ప్రయత్నించాను. సిరీస్ అంతటా ఇదే ప్లాన్తో ముందడుగు వేశాను" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో వైభవ్ పేర్కొన్నాడు. ఈ రాజస్తాన్ చిచ్చరపిడుగు మళ్లీ జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడల్లో భారత్ తరపున బరిలోకి దిగనున్నాడు. -
రేపు టెస్టు జట్టు ప్రకటన.. బుమ్రా ఆడకపోతే అతడికే చాన్స్!
జింబాబ్వేతో టీ20 సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన టీమిండియా తర్వాతి సిరీస్ శ్రీలంకతో ఆడనుంది. లంక పర్యటనలో ఈసారి వైట్బాల్ సిరీస్కు బదులుగా సంప్రదాయ టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్కు భారత్ జట్టును మంగళవారం ప్రకటించనుంది. ఏడాది కాలంగా టెస్టు క్రికెట్కు దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు తిరిగి టెస్టుల్లో ఆడనున్నారనేది ఆసక్తిగా మారింది. అయితే లంకతో టెస్టు సిరీస్కు స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో బుమ్రా ఒకవేళ లంకతో టెస్టు సిరీస్కు దూరమైతే అతడి స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలన్నది బీసీసీఐ ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల లంక-ఏ జట్టుతో జరిగిన అనధికారిక టెస్టులో 10 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన చేసిన గుర్నూర్ బ్రార్ ఎంపికలో ముందు వరుసలో ఉన్నాడు. స్వదేశంలో ఆఫ్గన్తో జరిగిన ఏకైక టెస్టుకు ఎంపికైనప్పటికీ గుర్నూర్ బెంచ్కే పరిమితమయ్యాడు. అయితే అఫ్గానిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్ ద్వారా గుర్నూర్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే టెస్టు క్రికెట్లో మాత్రం ఇంకా ఎంట్రీ ఇవ్వని గుర్నూర్, లంకతో సిరీస్లో బుమ్రా స్థానంలో ఆడే అవకాశాలున్నాయి. బుమ్రా దూరమైతే మాత్రం సిరాజ్, ప్రసిధ్ భారత పేస్ బౌలింగ్ దళాన్ని నడిపించనున్నారు.ఇంగ్లండ్తో లార్డ్స్ వేదికగా రెండో వన్డే సమయంలో మోకాలి గాయంతో బాధపడ్డాడు. దీంతో చివరి వన్డేకు దూరమయ్యాడు. జూలై 24న బుమ్రాకు నిర్వహించిన పరీక్షల్లో అతడి మోకాలు వాపు ఉందని తేలింది. దీంతో తదుపరి పరీక్షల కోసం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ లెక్కన బుమ్రా తన ఫిట్నెస్ను నిరూపించుకోవడంలో విఫలమైతే లంకతో సిరీస్కు అతడు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హర్షిత్ రానా, నితీశ్ కుమార్రెడ్డి, వాషింగ్టన్ సుందర్లు కూడా గాయాలతో బాధపడుతూ లంకతో టెస్టు సిరీస్ ఆడడం అనుమానంగా మారింది. టీమిండియా 2017లో చివరిసారి లంకలో టెస్టు సిరీస్ ఆడింది. అప్పటి సిరీస్లో కోహ్లి, అశ్విన్తో పాటు పుజారా ఆడారు. ఈ సిరీస్లో ఆతిథ్య లంక జట్టును వైట్వాష్ చేసింది. తాజాగా గిల్ నేతృత్వంలోని టీమిండియా లంక గడ్డపై సరికొత్త సవాల్కు సిద్ధమయింది.Read: ‘అగార్కర్ వింటున్నావా? వైభవ్ను రోహిత్కు జతగా పంపాలి’ -
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్
జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్ల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఈ విజయంతో భారత టీ20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు.మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్ల ద్వైపాక్షిక టీ20 సిరీస్లో జింబాబ్వేపై 3-0తో క్లీన్స్వీప్ చేసిన తొలి భారత కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు. తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన మూడో జట్టుగా భారత్ నిలిచింది. అంతకుముందు పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్ మాత్రమే జింబాబ్వేపై మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్ల టీ20 సిరీస్ను క్లీన్స్వీప్ చేశాయి.జింబాబ్వేపై టీ20 సిరీస్ క్లీన్స్వీప్లు* పాకిస్తాన్ – 3-0 (2020)* ఆఫ్ఘనిస్తాన్– 3-0 (2021)* ఆఫ్ఘనిస్తాన్ – 3-0 (2022)* ఆఫ్ఘనిస్తాన్ – 3-0 (2025)* **భారత్** – 3-0 (2026)ధోనికి కూడా సాధ్యపడలేదు..!2010లో సురేశ్ రైనా నేతృత్వంలో భారత్ జింబాబ్వేపై 2-0తో సిరీస్ గెలిచినా, అది రెండు మ్యాచ్ల సిరీస్ మాత్రమే. 2015లో అజింక్య రహానే సిరీస్ను 1-1తో సమం చేయగా, 2016లో ఎంఎస్ ధోని నాయకత్వంలో భారత్ 2-1తో విజయం సాధించింది.2024లో శుభ్మన్ గిల్ సారథ్యంలో భారత్ 4-1తో సిరీస్ గెలిచింది. అయితే మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్ల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన తొలి భారత కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ చరిత్రలో నిలిచాడు.ఊరటనిచ్చిన విజయంటీ20 ప్రపంచకప్ విజేత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్కు కెప్టెన్సీ ఆరంభం నిరాశాజనకంగా సాగింది. ఐర్లాండ్తో 0-2, ఇంగ్లండ్తో 0-4 తేడాతో వరుస సిరీస్ల్లో భారత్ పరాజయం పాలైంది. తొలి ఏడు మ్యాచ్ల్లో (ఒకటి ఫలితం లేకుండా) ఆరు ఓటములు ఎదుర్కొన్న భారత కెప్టెన్గా అయ్యర్ అవాంఛిత రికార్డు నమోదు చేశాడు.అయితే జింబాబ్వేపై 3-0 సిరీస్ విజయం శ్రేయస్ అయ్యర్కు, అలాగే భారత జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఫలితంగా నిలిచింది. రానున్న కఠిన సిరీస్లలో ఇదే జోరును కొనసాగించాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. -
‘అగార్కర్ వింటున్నావా? వైభవ్ను రోహిత్కు జతగా పంపాలి’
వన్డే ప్రపంచకప్ 2027 దృష్ట్యా టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని వన్డేల్లో కూడా ఆడిస్తే బాగుంటుందని మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజినీర్ అభిప్రాయపడ్డాడు. ఓపెనింగ్లో రోహిత్కు జతగా వైభవ్ను పంపించి కెప్టెన్ శుబ్మన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్కు ట్యాగ్ చేస్తూ తన సందేశాన్ని వెల్లడించాడు. దీనివల్ల మిడిలార్డర్ కూడా బలంగా మారుతుందని ఫరూఖ్ వెల్లడించాడు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫరూఖ్ ఇంజినీర్ మాట్లాడుతూ.. 'గిల్ క్లాస్ ప్లేయర్. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సత్తా అతడికి ఉంది. అయితే ఆరంభంలోనే దూకుడుగా ఆడే స్వభావం గిల్కు లేదు. అయితే వైభవ్ సూర్యవంశీ లెఫ్ట్ హ్యాండర్ కావడంతో పాటు రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ను ధాటిగా ఆరంభించగలడు. వైభవ్ ధాటిగా ఆడుతున్నాడంటే ఒక ఎండ్లో రోహిత్ క్రీజులో నిలబడేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. వైభవ్ ఉన్నంతసేపు రోహిత్ తన బ్యాట్కు పని చెప్పాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది. ఇక క్లాస్ బ్యాటర్ అయిన గిల్కు నాలుగో స్థానం సరైనది. కోహ్లి ఎలాగూ మూడో స్థానంలో వస్తాడు. ఐదు, ఆరు స్థానాల్లో శ్రేయస్, రాహుల్ వస్తారు. అయితే వైభవ్ను వయసుతో ముడిపెడుతూ వన్డేల్లో అవకాశాలు ఇవ్వడం లేదు. నా వరకు 15 ఏళ్ల వయసు అనేది వన్డే క్రికెట్లో ఎంట్రీకి అర్హతే. అయితే కొందరు మాత్రం వైభవ్ను టీ20ల్లోనే ఆడించాలని, వన్డేల్లో ఇప్పుడే అవసరం లేదని అంటున్నారు. కానీ ఒక బ్యాటర్కు ఏ ఫార్మాట్ అయినా పరుగులు చేయడమే ప్రధానం. ఆరంభంలో ఒకటి రెండు మ్యాచ్లు విఫలమైనప్పటికీ, కుదురుకుంటే ఎంత ప్రమాదకారో ఇప్పటికే వైభవ్ రుచి చూపించాడు. అతడు ఆడితే ఓడినవాటి కంటే గెలిచే మ్యాచ్లే ఎక్కువగా ఉంటాయి. నా దృష్టిలో సర్ వీవీ రిచర్డ్స్ గొప్ప బ్యాటర్. అతడంత గొప్ప బ్యాటర్ను నేను చూడలేదు. ఇప్పుడు సూర్యవంశీ కూడా అలానే కనిపిస్తున్నాడు. రాబోయే కాలంలో వైభవ్ కచ్చితంగా భారతదేశ భవిష్యత్తు ఆశాకిరణంగా మారనున్నాడు.'అని ఫరూఖ్ ఇంజినీర్ చెప్పుకొచ్చాడు.ఐర్లాండ్, ఇంగ్లండ్తో సిరీస్ల్లో అంతగా ఆకట్టుకోని వైభవ్ సూర్యవంశీ జింబాబ్వేతో టీ20 సిరీస్లో మాత్రం అదరగొట్టాడు. మూడు మ్యాచ్లు కలిపి 151 పరుగులు సాధించిన వైభవ్ ఖాతాలో రెండు అర్ధసెంచరీలున్నాయి. తన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా సొంతం చేసుకున్నాడు.Read: కసి మీదున్న సూర్యకుమార్.. 3 గంటల్లో వెయ్యి బంతులా! -
పాక్తో తొలి టెస్ట్.. హోప్ సెంచరీ మిస్
స్వదేశంలో పాకిస్తాన్తో జరుగుతున్న తొలి టెస్ట్లో వెస్టిండీస్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్లో 311 పరుగులకే ఆలౌటైంది. స్టార్ ప్లేయర్ షాయ్ హోప్ (92) తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. మరో బ్యాటర్ కవెమ్ హాడ్జ్ (84) కూడా సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. వీరిద్దరు రాణించడంతో విండీస్ ఈ స్కోరైనా చేయగలిగింది.మిగతా ప్లేయర్లలో తేజ్నరైన్ చంద్రపాల్ 21, బ్రాండన్ కింగ్ 12, ఆమిర్ జాంగూ 21, జస్టిన్ గ్రీవ్స్ 15, కెప్టెన్ రోస్టన్ ఛేజ్ 10, కీమర్ రోచ్ 3, షమార్ జోసఫ్ 23, జేడన్ సీల్స్ డకౌట్, జోమెల్ వార్రికన్ 1 (నాటౌట్) చేశారు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అలీ 4 వికెట్లతో సత్తా చాటగా.. మొహమ్మద్ అబ్బాస్ 3, ఖుర్రమ్ షెహజాద్ 2, ఆమిర్ జమాల్ ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. వన్డౌన్ బ్యాటర్, తాజా మాజీ కెప్టెన్ షాన్ మసూద్ అజేయ అర్ద సెంచరీతో (88) సత్తా చాటగా.. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (63) అర్ద సెంచరీతో రాణించాడు. కెప్టెన్ బాబర్ ఆజం 23 పరుగులకు ఔట్ కాగా.. మరో ఓపెనర్ అజాన్ అవైస్ డకౌటయ్యాడు. షాన్ మసూద్తో పాటు సల్మాన్ అఘా (0) క్రీజ్లో ఉన్నారు. విండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు పాక్ ఇంకా 112 పరుగులు వెనుకపడి ఉంది. విండీస్ బౌలర్లలో రోచ్, సీల్స్, షమార్ తలో వికెట్ తీశారు. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టు వెస్టిండీస్లో పర్యటిస్తుంది. -
ట్విన్ బ్రదర్స్ పోరు.. సీఎస్కే బౌలర్కు చుక్కెదురు
ఇంగ్లండ్ వేదికగా జరిగే హండ్రెడ్లో ట్విన్ బ్రదర్స్ పోరు అభిమానులను అలరించింది. 2026 ఎడిషన్లో భాగంగా ట్రెంట్ రాకెట్స్, లండన్ స్పిరిట్ మధ్య జరిగిన మ్యాచ్లో కవల సోదరులు క్రెయిగ్ ఓవర్టన్, జేమీ ఓవర్టన్ తలపడ్డారు. ఈ పోరులో ట్రెంట్ రాకెట్స్ ఆల్రౌండర్ క్రెయిగ్ ఓవర్టన్ పైచేయి సాధించాడు.చివరి ఐదు బంతుల్లో 10 పరుగులు అవసరమైన సమయంలో తన కవల సోదరుడు జేమీ ఓవర్టన్ (లండన్ స్పిరిట్) బౌలింగ్ను ధాటిగా ఎదుర్కొని ట్రెంట్ రాకెట్స్కు నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. జేమీ ఓవర్టన్ ఐపీఎల్ 2026లో సీఎస్కే ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రెంట్ రాకెట్స్కు బెన్ డకెట్ 47 బంతుల్లో 75 పరుగులతో అద్భుత ఆరంభం అందించాడు. చివర్లో క్రెయిగ్ ఓవర్టన్ కేవలం 6 బంతుల్లో అజేయంగా 20 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. జేమీ వేసిన చివరి ఓవర్లో సిక్సర్తో పాటు రెండు వరుస డబుల్స్ సాధించి మ్యాచ్ను ముగించాడు.అంతకుముందు లండన్ స్పిరిట్ 100 బంతుల్లో 159/9 స్కోరు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ 24 బంతుల్లో 39 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, కెప్టెన్ లియామ్ లివింగ్స్టోన్ 33 పరుగులు చేశాడు. క్రెయిగ్ ఓవర్టన్ బౌలింగ్లోనూ సత్తా చాటి రెండు వికెట్లు తీశాడు.బట్లర్ విధ్వంసంమరో మ్యాచ్లో ఇంగ్లండ్ స్టార్ జోస్ బట్లర్ మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగడంతో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. బర్మింగ్హామ్ ఫీనిక్స్పై 87 పరుగుల తేడాతో గెలిచి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.బట్లర్ 50 బంతుల్లో 90 పరుగులు చేసి జట్టుకు 187/5 భారీ స్కోరు అందించాడు. అతని ఇన్నింగ్స్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. చివర్లో టామ్ మూర్స్ 17 బంతుల్లో అజేయంగా 39 పరుగులు జోడించాడు.188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బర్మింగ్హామ్ ఫీనిక్స్ కేవలం 100 పరుగులకే ఆలౌటైంది. లియామ్ డాసన్ 3/15తో రాణించగా, జోష్ టంగ్, సోనీ బేకర్, నూర్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టి ఫీనిక్స్ బ్యాటింగ్ను కుప్పకూల్చారు. కెప్టెన్ డొనోవన్ ఫెరెరా చేసిన 23 పరుగులే ఆ జట్టులో అత్యధిక స్కోరు. -
కసి మీదున్న సూర్యకుమార్.. 3 గంటల్లో వెయ్యి బంతులా!
టీమిండియా టీ20 స్పెషలిస్ట్, మాజీ కెప్టెన్ సూర్యకుమార్ కసిగా కనిపిస్తున్నాడు. పేలవ ఫామ్తో జట్టులో చోటు కోల్పోయిన సూర్యకుమార్ రీఎంట్రీ కోసం తెగ కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ముంబైలోని వాసూ పరన్జేప్ క్రికెట్ అకాడమీలో సూర్యకుమార్ మూడు గంటల పాటు నెట్స్లో సాధన చేశాడు. దాదాపు 3 గంటల పాటు వెయ్యి బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ వినూత్న షాట్లు ఆడి అలరించాడు. మళ్లీ టీమిండియాలో ఎప్పుడెప్పుడు అడుగుపెడదామా అన్నంతగా సూర్యలో కసి కనిపిస్తుంది. నెట్స్లో చెమటోడ్చిన వీడియోను ఎక్స్లో పంచుకున్న సూర్య.. ‘సండే ఫన్డే. క్విక్ రన్. 3 గంటల పాటు వెయ్యి బంతులు ఆడాను. మంచి ఫీల్ వచ్చింది’ అని క్యాప్షన్ జత చేశాడు. తాజాగా శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా 3-0తో జింబాబ్వేను క్లీన్స్వీప్ చేసింది. ఇక 35 ఏళ్ల సూర్యకుమార్ టీమిండియా కెప్టెన్గా 2026 టీ20 ప్రపంచకప్ను అందుకున్నాడు. అయితే బ్యాటర్గా విఫలమవుతూ వచ్చిన సూర్యకుమార్ ఐపీఎల్లోనూ పేలవ ప్రదర్శన కనబరిచాడు. దీంతో టీ20 కెప్టెన్సీ పదవిని కోల్పోయిన సూర్యకుమార్కు జట్టులోనూ చోటు ప్రశ్నార్థకంగా మారింది. అయితే సూర్య టీమిండియాలో చోటు కోల్పోయిన తర్వాత మహారాజ ట్రోఫీలో తన బ్యాటింగ్తో అదరగొట్టాడు. అప్పటినుంచి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్న సూర్యకుమార్ కఠోర సాధన కొనసాగిస్తున్నాడు. Sunday was fun. Quick run 🏃🏾 Batted around 1000 balls for 3 hours. Felt good 💪 pic.twitter.com/x6wH9Ebpmv— Surya Kumar Yadav (@surya_14kumar) July 26, 2026Read: మీరాబాయి స్వర్ణ పతకం వెనుక కన్నీటిగాథ! -
'గంభీర్ వద్దు; లక్ష్మణ్ ముద్దు'.. బీసీసీఐకి ఆటగాళ్ల విజ్ఞప్తి!
భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియా హెడ్కోచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న గంభీర్ కోచ్గా వరుస వైఫల్యాలు చవిచూస్తున్న వేళ.. తాత్కాలిక కోచ్గా లక్ష్మణ్ అదరగొట్టడంతో కోచ్ మార్పు చేయాలని కొందరు టీమిండియా ఆటగాళ్లు బీసీసీఐ వద్ద వాపోయినట్లు సమాచారం. టీమిండియా హెడ్కోచ్గా గౌతమ్ గంభీర్ను తొలగించి, అతడి స్థానంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్కు పూర్తి స్థాయి కోచ్ బాధ్యతలు అప్పగించాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. తాజాగా వరుస వైఫల్యాలతో జింబాబ్వే టూర్కు గంభీర్కు విశ్రాంతి ఇవ్వడంతో వీవీఎస్ లక్ష్మణ్ను తాత్కాలిక కోచ్గా జట్టుతో పంపించారు. గంభీర్ కోచ్గా ఉన్న సమయంలో ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్ల్లో వరుస ఓటములు చవిచూసిన కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జింబాబ్వే గడ్డపై తొలి విజయాన్ని అందుకున్నాడు. అంతేకాదు లక్ష్మణ్ రాకతోనే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా తొలి సిరీస్ విజయాన్ని అందుకున్నాడు. జింబాబ్వే చిన్న జట్టే అయినప్పటికీ, వారిపై సాధించిన ఏకపక్ష విజయాలు మాత్రం టీమిండియా దూకుడును చూపెట్టింది. దీంతో కెప్టెన్తో పాటు పలువురు ఆటగాళ్లు గంభీర్ను తొలగించి లక్ష్మణ్ను కోచ్గా ఎంపిక చేయాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఒకవేళ బీసీసీఐ గంభీర్ స్థానంలో లక్ష్మణ్కు హెడ్కోచ్ పదవి కట్టబెడితే, దానిని స్వీకరించడానికి లక్ష్మణ్ సిద్ధంగా ఉన్నాడా లేడా అనేది తెలియాల్సి ఉంది.ఇక టీమిండియా తాత్కాలిక కోచ్గా లక్ష్మణ్ ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉంది. అతడి కోచింగ్లో టీమిండియా 2022లో వరుసగా ఐర్లాండ్పై 2-0తో, జింబాబ్వేపై 3-0తో, న్యూజిలాండ్పై 1-0తో టీ20 సిరీస్లు గెలుచుకుంది. అయితే న్యూజిలాండ్తో వన్డే సిరీస్ను కోల్పోయినప్పటికీ, మళ్లీ 2024లో జింబాబ్వేపై 4-1 తేడాతో, సౌతాఫ్రికాపై 3-1 తేడాతో టీ20 సిరీస్లు గెలుచుకుంది. తాజాగా జింబాబ్వేతో టీ20 సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన టీమిండియాకు వీవీఎస్ లక్ష్మణ్ లక్కీ కోచ్గా మారిపోయాడు. మరి టీమిండియా కోచ్ మార్పు తధ్యమేనా! 🚨 BREAKING NEWS 🚨🚨 INDIA PLAYERS REPORTEDLY WANT VVS LAXMAN AS PERMANENT HEAD COACH 🚨According to reports, several Indian team players have reportedly requested the BCCI to consider appointing VVS Laxman as the permanent head coach. The reports claim some players believe… pic.twitter.com/uiwSTwNi38— Muffatball vikrant (@Vikrant_1589) July 26, 2026చదవండి: ‘అసాధారణమే కానీ మెరుగుపడాలి’.. వైభవ్కు చురకలు! -
‘అసాధారణమే కానీ మెరుగుపడాలి’.. వైభవ్కు చురకలు!
జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన మూడో టీ20లో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 49 బంతుల్లో 81 పరుగుల మెరపు ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. సిరీస్లో రెండు అర్ధసెంచరీలు సాధించిన వైభవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు కూడా ఎగరేసుకుపోయాడు. ఈ నేపథ్యంలోనే జింబాబ్వే టూర్కు గంభీర్ స్థానంలో కోచ్గా వ్యవహరించిన వీవీఎస్ లక్ష్మణ్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించాడు. 15 ఏళ్ల వయసులోనే అద్భుతాలు చేస్తున్న వైభవ్కు ఎంతో భవిష్యత్తు ఉందని పేర్కొన్నాడు. చిన్న వయసులో అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న వైభవ్ ఫిట్నెస్ విషయంలో మాత్రం మరింత కష్టపడాలని యాజమాన్యం కోరుకుంటుందని లక్ష్మణ్ పేర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం లక్ష్మణ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాడు. 'వైభవ్ గురించి మాకు బాగా తెలుసు. సుమారు రెండున్నరేళ్ల క్రితం, 2024 అండర్-19 ప్రపంచకప్నకు ముందే అతని ప్రతిభను గుర్తించాం. విజయవాడలో జరిగిన క్వాడ్రాంగులర్ సిరీస్లో ఇండియా-బి తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో వైభవ్ ఒకడిగా ఉన్నాడు. అప్పటి నుంచి బీసీసీఐ ఆధ్వర్యంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) క్యాంపుల్లో వైభవ్ నిరంతరం శిక్షణ పొందుతున్నాడు. అంతేకాదు అండర్-19 ప్రపంచకప్లోనూ వైభవ్ సూర్యవంశీ టాప్ స్కోరర్గానూ నిలిచాడు. వైభవ్లో వచ్చిన పరిణతి, అవగాహన అసాధారణంగా పెరిగాయి. అందుకే కఠిన పరిస్థితులను సైతం తట్టుకుని, ఒత్తిడిలో మేటి ఆటగాళ్లపై రాణించగలుగుతున్నాడు. అయితే, అతను మెరుగుపరుచుకోవాల్సిన ముఖ్యమైన అంశం అతని ఫిట్నెస్. అతని వయసు కేవలం 15 ఏళ్లేనని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆఖరి మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడినా, మైదానంలోనే ఉండాలని అతను కోరుకున్నాడు. కానీ, మా ఫిజియో సూచన మేరకు అతన్ని బయటకు పంపించాల్సి వచ్చింది. జట్టు కోసం ప్రతీ విషయంలోనూ ది బెస్ట్ అందించాలనే తపన అతనిలో ఉంది' అని లక్ష్మణ్ పేర్కొన్నాడు. ये #VaibhavSooryavanshi के बारे में बात कर रहे है।“वैभव हर कीर्तिमान पार करेगा”इनका नाम VVS Laxman हैं जिन्हें तब की Mighty आस्ट्रेलियाई खिलाड़ी और मीडिया "Very Very special "Laxman" बोला करती थी।जिसने 134 टेस्ट मैच खेला है और कभी टीम इंडिया के मशहूर fab-4 का हिस्सा थे।…— Uday Yadav (@USY_79) July 27, 2026 -
సుందర్ సందేహమే!
న్యూఢిల్లీ: వచ్చే నెలలో శ్రీలంకలో పర్యటించనున్న భారత టెస్టు జట్టును మంగళవారం ఎంపిక చేయనున్నారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇందుకు కసరత్తులు చేస్తోంది. అయితే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయాలు సెలక్షన్ కమిటీని ఇబ్బంది పెడుతున్నాయి. గాయం కారణంగా ఇంగ్లండ్తో చివరి వన్డేకు దూరమైన బుమ్రా... సుదీర్ఘ ఫార్మాట్లో బరిలోకి దిగడంపై సందేహాలున్నాయి. అతడు పూర్తి ఫిట్నెస్ సాధించాడా లేదా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు వాషింగ్టన్ సుందర్ కూడా తొలి టెస్టు వరకు కోలుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు... శ్రీలంకతో రెండు టెస్టులు ఆడనుంది. ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలెలో తొలి టెస్టు జరగనుండగా... 23 నుంచి 27 వరకు కొలంబోలో రెండో టెస్టు నిర్వహించనున్నారు. పేస్ ఆల్రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా కండరాల గాయాలతో ఇబ్బంది పడుతుండగా... వీరిద్దరు లంక పర్యటనకు వరకు కోలుకునే అవకాశం లేదని బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీఓఈ) వెల్లడించింది. ‘సుందర్ రెండో టెస్టు వరకు ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది. దీంతో సెలక్టర్లు అతడిని కేవలం ఒక్క టెస్టుకే పరిగణించవచ్చు. అది కూడా ఫిట్నెస్ సాధిస్తేనే. రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్యాదవ్తో పాటు... నాలుగో స్పిన్నర్గా హర్‡్ష దూబేకు అవకాశం దక్కొచ్చు’ అని బీసీసీఐ అధికారి తెలిపారు. శ్రీలంక ‘ఎ’ జట్టుతో సిరీస్లో భారత్ ‘ఎ’ తరఫున ఆకట్టుకున్న ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్ను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. లోయర్ ఆర్డర్లో చక్కటి బ్యాటింగ్ చేయగల సామర్థ్యం సారాంశ్ సొంతం. జీషాన్ అన్సారీ, విప్రాజ్ నిగమ్ను కూడా పరిశీలించవచ్చు. బుమ్రా అందుబాటులో లేకుంటే... మొహమ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్, ప్రసిధ్ కృష్ణ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో ఆకట్టుకున్న ఆకాశ్దీప్ కోలుకునేందుకు మరింత సమయం పట్టనుంది. హార్దిక్ ఆగస్టు తర్వాతే... మరోవైపు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వచ్చే నెల తర్వాతే సెలక్టర్ల పరిధిలోకి వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం బెంగళూరుకు మకాం మార్చిన పాండ్యా పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. ‘వన్డే, టి20 ఫార్మాట్లు ఆడేందుకు హార్దిక్ సిద్ధమవుతున్నాడు. ఈ నెలాఖరులోగా అతడు ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది. వచ్చే నెలలో అతడు సెలక్షన్కు అందుబాటులో ఉండనున్నాడు. ప్రస్తుతం బెంగళూరు సీఓఈలో అతడి సాధన సాగుతోంది. అటు ఫిట్నెస్ మెరుగు పరుచుకోవడానికి కృషి చేస్తూనే... పూర్తి స్థాయిలో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు’ అని బీసీసీఐ అధికారి తెలిపారు. -
"సవాళ్లకు మేం సిద్ధం".. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు
ఆదివారం హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన నామమాత్రపు మూడో టీ20లోనూ భారత్ అదరగొట్టింది. ఈ మ్యాచ్లో ఆతిథ్య జట్టును 35 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. దీంతో మూడు టీ20ల సిరీస్ను 3-0 తేడాతో మెన్ బ్లూ క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(81) హాఫ్ సెంచరీతో మెరిశాడు. అనంతరం బౌలింగ్లో మయాంక్ యాదవ్ మూడు వికెట్లతో సత్తాచాటాడు. ఈ అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. తమ ఆటగాళ్లపై అయ్యర్ ప్రశంసల వర్షం కురిపించాడు.'ఈ సిరీస్లో మా ఆటగాళ్లు ఫియర్లెస్ క్రికెట్ ఆడారు. మూడు మ్యాచ్లలోనూ మేము అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేశాము. కెప్టెన్గా ఇది నాకు మొదటి సిరీస్ విజయం. అందుకే ఇది నాకు చాలా ప్రత్యేకమైనది మరోసారి చెబుతున్నాను.జట్టులోని చాలామంది ఆటగాళ్లకు ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. వారు మైదానంలో స్వేచ్ఛగా ఆడేలా చూడటమే నా బాధ్యత. రాబోయే రోజుల్లో మాకు మరిన్ని కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయి.అయితే జట్టు సభ్యులు ఇదే తరహా ధైర్యాన్ని, పట్టుదలను మైదానంలో చూపిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచించుకుండా సానుకూల దృక్పథంతో ముందుకు సాగడమే మా సిద్దాంతం అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో అయ్యర్ పేర్కొన్నాడు. -
హరారేలో 'వైభవం'.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో 35 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఈ నామమాత్రపు మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. 49 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ.. 8 ఫోర్లు, 4 సిక్స్లతో 81 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(27), రింకూ సింగ్(25), ఇషాన్ కిషన్(29) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ రెండు, సికిందర్ రజా, ముజార్బానీ, మాధవీరే తలా వికెట్ పడగొట్టారు.బర్ల్ ఒంటరి పోరాటంఅనంతరం 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగల్గింది. జింబాబ్వే బ్యాటర్లలో ర్యాన్ బర్ల్(54 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. యశ్ ఠాకూర్ రెండు, అశోక్ శర్మ, రవి బిష్ణోయ్ తలా వికెట్ సాధించారు.చదవండి: IND vs ZIM: అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. భారత టీ20 క్రికెట్ చరిత్రలోనే -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా
జింబాబ్వే పర్యటనలో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. హరారే వేదికగా జరిగిన మూడో టీ20లో వైభవ్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఓ దశలో తొలి అంతర్జాతీయ సెంచరీ చేసేలా కనిపించిన సూర్యవంశీ.. భారీ షాట్కు ప్రయత్నించి 81 పరుగుల వద్ద ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఈ సిరీస్లో అతడికి ఇది రెండో హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. తద్వారా ఈ చిచ్చర పిడుగు ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 16 ఏళ్ల వయస్సు నిండకముందే ఒకటి కంటే ఎక్కువ అర్ధశతకాలు నమోదు చేసిన తొలి ప్లేయర్గా వైభవ్ వరల్డ్ రికార్డు సృష్టించాడు.కాగా తొలి టీ20లో వైభవ్ కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు సాధించి, టీ20 క్రికెట్లో హాఫ్ సెంచరీ చేసిన అతి పిన్న వయష్కుడిగా నిలిచాడు. అదేవిధంగా ఓవరాల్గా టీ20 క్రికెట్లో ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 86 సిక్సర్లు బాదాడు. ప్రపంచంలో ఏ ఇతర ఆటగాడు కూడా ఈ ఏడాది ఇన్ని సిక్సర్లు కొట్టలేదు. ఒక క్యాలెండర్ ఇయర్లో భారత్ తరఫున అత్యధిక టీ20 సిక్సర్లు (108 సిక్సర్లు - 2025లో) కొట్టిన రికార్డు అభిషేక్ శర్మ పేరిట ఉంది. రాబోయే నెలల్లో వైభవ్ ఈ రికార్డును దాటేసే అవకాశముంది.That was Hugeeeeee by Vaibhav Sooryavanshi 💥🤯🤯😯 pic.twitter.com/Y8pxze9nyg— TheFakeFakeer (@TheFakeFakeer) July 26, 2026 -
అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. భారత టీ20 క్రికెట్ చరిత్రలోనే
జింబాబ్వే పర్యటనలో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతున్నప్పటికీ.. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ మాత్రం జట్టు మేనెజ్మెంట్ను తీవ్ర కలవరపెడుతోంది. హరారే వేదికగా జరిగిన నామమాత్రపు మూడో టీ20లోనూ అభిషేక్ విఫలమయ్యాడు. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. మరోసారి జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజార్బానీ బౌలింగ్లో అభిషేక్ దొరికిపోయాడు. ఈ సిరీస్లోని ప్రతీ మ్యాచ్లోనూ అతడు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. ఈ సిరీస్లోని 3 ఇన్నింగ్స్లలో కలిపి అభిషేక్ చేసింది కేవలం 11 పరుగులు మాత్రమే. దీంతో ఈ ఎస్ఆర్హెచ్ స్టార్ బ్యాటర్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో అతి తక్కువ పరుగులు చేసిన భారత (టాప్-7) బ్యాటర్గా అభిషేక్ శర్మ ఘోర రికార్డును మూటగట్టుకున్నాడు.ఇంతకుముందు ఈ చెత్త రికార్డు టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పేరిట ఉండేది. 2019లో వెస్టిండీస్పై మూడు మ్యాచ్ల సిరీస్లో అయ్యర్ 14 పరుగులు చేశాడు. తాజా ఇన్నింగ్స్తో అయ్యర్ను అభిషేక్ దాటేశాడు.3-మ్యాచ్ల టీ20 సిరీస్లో అతి తక్కువ పరుగులు చేసిన భారత ఆటగాళ్లు:అభిషేక్ శర్మ – 11 పరుగులు (విత్ జింబాబ్వే, 2026)శ్రేయస్ అయ్యర్ – 14 పరుగులు (వెస్టిండీస్, 2019)హార్దిక్ పాండ్యా – 15 పరుగులు (న్యూజిలాండ్, 2017)కేఎల్ రాహుల్ – 15 పరుగులు (ఇంగ్లాండ్, 2021)దినేష్ కార్తీక్ – 17 పరుగులు (ఆస్ట్రేలియా, 2022)చదవండి: 'వరల్డ్కప్ గెలవాలంటే అతడిని జట్టులోకి తీసుకోండి' -
అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ.. సెంచరీ చేస్తాడనుకుంటే?
జింబాబ్వే గడ్డపై టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. హరారే వేదికగా జరుగుతున్న నామమాత్రపు మూడో టీ20లో సూర్యవంశీ హాఫ్ సెంచరీతో మెరిశాడు. తన శైలికి విరుద్దంగా బ్యాటింగ్ చేసిన వైభవ్.. 31 బంతుల్లో తన రెండో హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు.అర్ధశతకం పూర్తి చేసుకున్న తర్వాత వైభవ్ తన బ్యాటింగ్లో దూకుడు పెంచాడు. దీంతో అతడు తొలి అంతర్జాతీయ సెంచరీ సాధిస్తాడని భావించారు. కానీ స్పిన్నర్ మాధవిరే బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు.దీంతో అతడి ఇన్నింగ్స్కు తెరపడింది. మొత్తంగా 49 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ.. 8 ఫోర్లు, 4 సిక్స్లతో 81 పరుగులు చేశాడు. కాగా తొలి టీ20లో వైభవ్ మెరుపు హాఫ్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. -
మూడో టీ20లో జింబాబ్వే చిత్తు.. సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్
India vs Zimbabwe 3rd T20 live updates and highlights: హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో 35 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగల్గింది. జింబాబ్వే బ్యాటర్లలో ర్యాన్ బర్ల్(54 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. యశ్ ఠాకూర్ రెండు, అశోక్ శర్మ, రవి బిష్ణోయ్ తలా వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(81) మరో హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. జింబాబ్వే ఆరో వికెట్ డౌన్జింబాబ్వే ఆరో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన మరుమణి.. అశోక్ శర్మ బౌలింగ్లో ఔటయ్యాడు.జింబాబ్వే ఐదో వికెట్ డౌన్జింబాబ్వే ఐదో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన మాధవీరే.. మయాంక్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు.స్పీడ్ పెంచిన జింబాబ్వే బ్యాటర్లు15 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే 4 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. క్రీజులో మాధవీరే(28), ర్యాన్ బర్ల్(40) ఉన్నారు. ఆతిథ్య జట్టు విజయానికి 30 బంతుల్లో 71 పరుగులు కావాలి.జింబాబ్వే నాలుగో వికెట్ డౌన్జింబాబ్వే నాలుగో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన బెన్ కుర్రాన్.. బిష్ణోయ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు జింబాబ్వే స్కోర్: 77/4జింబాబ్వే మూడో వికెట్ డౌన్యశ్ ఠాకూర్ వేసిన నాలుగో ఓవర్లో జింబాబ్వే వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. డియాన్ మైర్స్(19), సికిందర్(0) వెంటవెంటనే ఔటయ్యారు. 5 ఓవర్లకు జింబాబ్వే స్కోర్: 40/3జింబాబ్వే తొలి వికెట్ డౌన్193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు భారీ షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి బంతికే మయాంక్ యాదవ్ బౌలింగ్లో బెన్నెట్ ఔటయ్యాడుజింబాబ్వే టార్గెట్ ఎంతంటే?హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న నామమాత్రపు మూడో టీ20లో భారత బ్యాటర్లు దుమ్ములేపారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరో హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. 49 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ.. 8 ఫోర్లు, 4 సిక్స్లతో 81 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(27), రింకూ సింగ్(25), ఇషాన్ కిషన్(29) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ రెండు, సికిందర్ రజా, ముజార్బానీ, మాధవీరే తలా వికెట్ పడగొట్టారు.భారత్ నాలుగో వికెట్ డౌన్భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. బ్రాడ్ ఎవాన్స్ బౌలింగ్లో ఔటయ్యాడు. 18 ఓవర్లకు భారత్ స్కోర్: 172/4వైభవ్ అవుట్వైభవ్ సూర్యవంశీ రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 49 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ.. 8 ఫోర్లు, 4 సిక్స్లతో 81 పరుగులు చేశాడు.ఇషాన్ కిషన్ అవుట్ఇషాన్ కిషన్ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన కిషన్.. రజా బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.వైభవ్ ఫిప్టీవైభవ్ సూర్యవంశీ అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. వైభవ్ 31 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 10 ఓవర్లు ముగిసే సరికి భారత్ 95 పరుగలు చేసింది. క్రీజులో వైభవ్తో పాటు ఇషాన్ కిషన్(29) ఉన్నాడు.దూకుడుగా ఆడుతున్న వైభవ్భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(18 బంతుల్లో 31) దూకుడుగా ఆడుతున్నాడు. 6 ఓవర్లకు టీమిండియా స్కోర్: 60/1అభిషేక్ అవుట్జింబాబ్వే పర్యటనలో అభిషేక్ శర్మ పేలవ ఫామ్ కొనసాగుతోంది. హరారే వేదికగా జరుగుతున్న మూడో టీ20లో 2 పరుగులు చేసి ఔటయ్యాడు.హరారే వేదికగా నామమాత్రపు మూడో టీ20లో భారత్-జింబాబ్వే జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ చివరి టీ20లో భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగింది.ప్రిన్స్ యాదవ్, శివమ్ దూబేల స్ధానంలో అశోక్ శర్మ, సూర్యన్ష్ షెడ్గేలు తుది జట్టులోకి వచ్చారు. జింబాబ్వే కూడా ఓ మార్పు చేసింది. రిచర్డ్ నగరావా స్ధానంలో వెల్లింగ్టన్ మసకద్జాకు అవకాశమిచ్చారు.తుది జట్లుజింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, తడివానాషే మారుమణి(వికెట్ కీపర్), బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్హురి, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజరబానీభారత్: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, సూర్యాంశ్ షెడ్గే, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్, అశోక్ శర్మ -
'వరల్డ్కప్ గెలవాలంటే అతడిని జట్టులోకి తీసుకోండి'
దక్షిణాఫ్రికా, జింబాబ్వే వేదికలగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2026 కోసం టీమిండియా తమ సన్నహకాలను ప్రారంభించింది. ఈ మెగా టోర్నీ కోసం పటిష్టమైన జట్టును సిద్దం చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సెలక్టర్లకు కీలక సూచనలు చేశాడు.వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ను వరల్డ్కప్కు ఎంపిక చేయాలని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. భువనేశ్వర్ గత నాలుగేళ్లగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ రైట్ ఆర్మ్ పేసర్ ప్రస్తుతం ఐపీఎల్తో పాటు దేశవాళీ టీ20 క్రికెట్ లీగ్స్లో మాత్రమే ఆడుతున్నాడు. అయితే భువీలో ఏ మాత్రం జోరు తగ్గలేదు.ఫిట్గా ఉండి తన స్వింగ్ బౌలింగ్తో ప్రత్యర్ధులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. వరుసగా రెండు ఐపీఎల్ సీజన్లలోనూ ఆర్సీబీ తరపున అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతడిని తిరిగి జట్టులోకి తీసుకోవాలని చాలా మంది మాజీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అశ్విన్ కూడా భువీ తిరిగి పునరాగమనం చేస్తే చూడాలని ఉందని అన్నాడు."భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీ గురుంచి సెలక్షన్ కమిటీ ఆలోచించాలి. ప్రస్తుతం భారత జట్టు ఫాస్ట్ బౌలింగ్ విభాగం అంత పటిష్టంగా లేదు. కాబట్టి జట్టుకు భువీ అవసరముందని అనిపిస్తోంది. అయితే మహ్మద్ షమీని జట్టులోకి తీసుకోవాలని కొంతమంది సలహా ఇస్తున్నారు.కానీ షమీకి, భువీకి ఒక తేడా ఉంది. భువనేశ్వర్ వరుసగా రెండు సీజన్ల పాటు ఐపీఎల్ ఆడినప్పటికి పూర్తిగా ఫిట్గా ఉన్నాడు. కానీ షమీ మాత్రం ఫిట్నెస్ పరంగా కాస్త ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా భువనేశ్వర్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఆర్సీబీ వరుసగా రెండు టైటిల్స్ గెలవడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. అయితే వెంటనే అతడిని జట్టులోకి తీసుకోమని నేను చెప్పడం లేదు. కానీ ఓ అవకాశమిచ్చి ఇచ్చి చూడండి. అక్కడ రాణించగలిగితే అతడిని జట్టులో కొనసాగించండి. అతడు పవర్ప్లేతో పాటు డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. లోయార్డర్లో బ్యాట్తో రాణించే సత్తా కూడా భువీకి ఉంది" అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. -
టీమిండియాలోకి కొత్తగా ఎనిమిది మంది
భారత క్రికెట్ జట్టు 2026లో యువ ప్రతిభను ప్రోత్సహించే దిశగా అన్ని ఫార్మాట్లలో కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. టెస్టుల్లో మానవ్ సుతార్ అరంగేట్రం చేయగా, వన్డేల్లో హర్ష్ దుబే, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్ భారత జెర్సీ ధరించారు. టీ20ల్లో ప్రిన్స్ యాదవ్, సూర్యాంశ్ షెడ్గే, వైభవ్ సూర్యవంశీ, అశోక్ శర్మ, యశ్ ఠాకూర్ అంతర్జాతీయ క్రికెట్లో తొలి అడుగు వేశారు. కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం ద్వారా రాబోయే ఐసీసీ టోర్నీలు, 2028 ఒలింపిక్స్ వంటి ప్రధాన ఈవెంట్ల కోసం బలమైన బెంచ్ స్ట్రెంగ్త్ను సిద్ధం చేయాలని భారత జట్టు యాజమాన్యం భావిస్తోంది.2026లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన ఆటగాళ్లు:టెస్టులు: * మానవ్ సుతార్ – ఆఫ్ఘనిస్తాన్తో, ముల్లాన్పూర్వన్డేలు:* హర్ష్ దుబే – ఆఫ్ఘనిస్తాన్తో, ధర్మశాల* గుర్నూర్ బ్రార్ – ఆఫ్ఘనిస్తాన్తో, ధర్మశాల* ప్రిన్స్ యాదవ్ – ఆఫ్ఘనిస్తాన్తో, లక్నోటీ20లు:* ప్రిన్స్ యాదవ్ – ఐర్లాండ్తో, బెల్ఫాస్ట్* సూర్యాంశ్ షెడ్గే – ఐర్లాండ్తో, బెల్ఫాస్ట్* వైభవ్ సూర్యవంశీ – ఇంగ్లండ్తో, మాంచెస్టర్* అశోక్ శర్మ – జింబాబ్వేతో, హరారే* యశ్ ఠాకూర్ – జింబాబ్వేతో, హరారేఈ ఏడాది అరంగేట్రం చేసిన ఈ ఎనిమిది మందిలో వైభవ్ సూర్యవంశీపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా అతను సత్తా చాటకపోయినా, ఓ మోస్తరు ప్రదర్శనతో పర్వాలేదనిపించాడు. తాజాగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో అతను 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. బౌలర్ల విషయానికొస్తే..ప్రిన్స్ యాదవ్ (6 టీ20ల్లో 9 వికెట్లు), గుర్నూర్ బ్రార్ (6 మ్యాచ్ల్లో 11 వికెట్లు) సత్తా చాటారు. వచ్చే ఏడాది వన్డే వరల్డ్కప్ దృష్ట్యా ఈ ఏడాది మరికొంత మంది ఆటగాళ్లు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. -
IND vs SL: టీమిండియాకు భారీ షాక్!
ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో మొదలయ్యే 2 టెస్టు మ్యాచ్ల సిరీస్కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా లంక పర్యటనకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డే సందర్భంగా బుమ్రా మెకాలి గాయానికి గురయ్యాడు.దీంతో లార్డ్స్ వేదికగా జరిగిన చివరి వన్డేకు జస్ప్రీత్ దూరమయ్యాడు. అయితే బుమ్రా ఇంకా తన గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని ప్రముఖ స్పోర్ట్స్ రిపోర్టర్ అభిషేక్ త్రిపాఠి వెల్లడించాడు. బీసీసీఐ మెడికల్ టీమ్ అతడికి జూలై 30 వరకు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించిందంట. ఆ తర్వాత బుమ్రా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) కు చేరుకుని రికవరీ ప్రక్రియను పూర్తి చేయనున్నాడు. అక్కడ వైద్యుల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన తర్వాతే అతడి ఎంపికపై సెలక్టర్లు నిర్ణయం తీసుకోనున్నారు. ఏదేమైనప్పటికి బుమ్రా పూర్తిగా కోలుకోవడానికి దాదాపు మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టనుంది. ఈ క్రమంలోనే లంకతో టెస్టు సిరీస్కు బుమ్రా దూరమయ్యే అవకాశముంది. ఒకవేళ ఇదే నిజమైతే భారత్కు భారీ షాక్ అనే చెప్పాలి.ఎందుకంటే లంకతో టెస్ట్ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో జరిగింది. ఈ సిరీస్ టీమిండియాకు చాలా కీలకం. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఉండాలంటే భారత్ కచ్చితంగా గెలవాల్సిందే. ఇక ఈ సిరీస్కు బుమ్రాతో పాటు నితీష్ కుమార్ రెడ్డి కూడా దూరం కానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. మరోవైపు ఇంగ్లండ్ పర్యటనలో గాయపడ్డ వాషింగ్టన్ సుందర్ వేగంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. అతడు తొలి టెస్ట్కు కాకపోయిన రెండో టెస్టులోనైన ఆడే అవకాశముంది. -
నితీశ్ కుమార్ రెడ్డికి సంబంధించి బిగ్ న్యూస్..!
టీమిండియా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఓ బిగ్ న్యూస్ అందుతుంది. త్వరలో శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు అతను దూరమయ్యే అవకాశమున్నట్లు నివేదికలు వెల్లడించాయి.నితీశ్ ప్రస్తుతం ఎడమ క్వాడ్రిసెప్స్ (తొడ కండరాల) గాయం నుంచి కోలుకుంటున్నాడు. పునరావాసంలో మంచి పురోగతి సాధిస్తున్నప్పటికీ, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్ట్యా బీసీసీఐ అతడిని టెస్టు క్రికెట్లో తొందరగా బరిలోకి దించకూడదని భావిస్తున్నట్లు సమాచారం.ఇటీవల ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన తొలి వన్డే సందర్భంగా బౌలింగ్ చేస్తూ నితీశ్ అసౌకర్యానికి గురయ్యాడు. దీంతో రెండో వన్డేకు విశ్రాంతి ఇచ్చిన జట్టు యాజమాన్యం, మూడో వన్డేలో మళ్లీ ఆడించగా గాయం మరింత తీవ్రతరమైంది.క్రిక్బజ్ కథనం ప్రకారం, నితీశ్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాసం పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీలంక టెస్టు సిరీస్కు అతడిని ఎంపిక చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నివేదిక పేర్కొంది.అయితే, నితీశ్ కుమార్ రెడ్డి గైర్హాజరుపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఇది మీడియా కథనాల ఆధారంగా వచ్చిన సమాచారం మాత్రమే.కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు శ్రీలంకలో పర్యటింనుంది. తొలి టెస్ట్ గాలే వేదికగా ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం కానుండగా.. రెండో టెస్ట్ ఆగస్ట్ 23 నుంచి కొలొంబో వేదికగా జరుగనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. -
సిక్సర్లతో షెపర్డ్ విధ్వంసం.. గయానాకు భారీ విజయం!
వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ రొమారియో షెపర్డ్ గ్లోబల్ టీ20 లీగ్లో విధ్వంసం సృష్టించాడు. ఆరు సిక్సర్లతో షెపర్డ్ (21 బంతుల్లో 52 నాటౌట్) గయానా అమెజాన్ వారియర్స్ను ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన డెసర్ట్ వైపర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రిలీ రోసౌ (48 బంతుల్లో 61) అర్ధసెంచరీ సాధించగా, కైల్ మేయర్స్ (18 బంతుల్లో 35), బెవన్ జాకబ్స్ (30) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో వృత్యా అరవింద్ (11 బంతుల్లో 28 నాటౌట్) ధాటిగా ఆడడంతో డెసర్ట్ వైపర్స్ 200 పరుగుల మార్క్ను దాటింది. అనంతరం గయానా అమెజాన్ వారియర్స్ 19.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. మొహమ్మద్ నబీ (29 బంతుల్లో 40 నాటౌట్) యాంకర్ రోల్ పోషించాడు. ఓపెనర్లు రహమనుల్లా గుర్బాజ్ (15 బంతుల్లో 31), క్వింటిన్ సాంప్సన్ (17 బంతుల్లో 35) తొలి వికెట్కు 55 పరుగులు జోడించారు. మధ్యలో వికెట్లు కోల్పోయిన గయానా ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో నబీకి జత కలిసిన షెపర్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌండరీలు, సిక్సర్ల వర్షంతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 21 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న షెపర్డ్ చివర్లో ఔటైనా డ్వేన్ ప్రిటోరియస్ (9 బంతుల్లో 17 నాటౌట్)తో కలిసి నబీ జట్టును విజయతీరాలకు చేర్చాడు. డెసర్ట్ వైపర్స్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ మూడు వికెట్లు తీయగా, కారీ పియర్రే, విటెల్ లాస్ చెరో 2 వికెట్లు తీశారు.Runs - 52.Fours - 2.Sixes - 6.Strike rate - 247.61ROMARIO SHEPHERD SMASHED FIFTY OF JUST 21 BALLS.🥶🙇♂️#GSL | #Cricket pic.twitter.com/0bg3vaT4tZ— Rana Ahmad. (@AhmadRana056) July 26, 2026Read: కామన్వెల్త్ గేమ్స్లో అపశ్రుతి.. జిమ్నాస్టిక్స్లో భయానక దృశ్యం! -
IPL 2027: హార్దిక్ కోసం సీఎస్కే భారీ ఆఫర్..?
ఐపీఎల్ 2027 సీజన్కు ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ట్రేడ్ చర్చలు జోరుగా సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హార్దిక్ను తమ జట్టులోకి తీసుకురావడానికి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) భారీ ప్రతిపాదన చేసినట్లు జాతీయ మీడియా కథనం వెల్లడించింది.ఆ కథనం ప్రకారం.. హార్దిక్కు బదులుగా ముంబై ఇండియన్స్ యువ బ్యాటర్ ఆయుష్ మాత్రేతో పాటు నగదు ఇవ్వాలని సీఎస్కేను కోరినట్లు సమాచారం. అయితే మాత్రేను విడిచిపెట్టేందుకు సీఎస్కే ఆసక్తి చూపకపోవడంతో ప్రత్యామ్నాయ ప్రతిపాదనను ముందుంచినట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగా శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, అలాగే రూ.10 కోట్ల నగదు ఇవ్వడానికి సీఎస్కే సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఒప్పందం కుదిరితే హార్దిక్ పాండ్యా ట్రేడ్ విలువ మొత్తం రూ.20 కోట్లకు పైగా ఉండే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.అయితే ఇప్పటివరకు ఈ ట్రేడ్పై ముంబై ఇండియన్స్ లేదా చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఈ సమాచారం కేవలం మీడియా కథనాలు, ఊహాగానాలకే పరిమితమైంది.ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే కోల్కతా నైట్ రైడర్స్ (KKR) కూడా హార్దిక్ పాండ్యా కోసం రంగంలోకి దిగే అవకాశముందని నివేదిక పేర్కొంది.కాగా, హార్దిక్ పాండ్యా గత రెండు సీజన్ల ముందే గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. హార్దిక్ ముంబై ఇండియన్స్ పగ్గాలు చేపట్టాక, ఆ జట్టు దారుణంగా విఫలమయ్యింది. అప్పటివరకు గుజరాత్ను విజయపథాన నడిపించిన హార్దిక్ ముంబై ఇండియన్స్కు రాగానే ప్రభావహీనుడిగా మారిపోయాడు. అంతకుముందు ముంబై ఇండియన్స్ తరఫున సాధారణ ఆటగాడిగా చెలరేగిన హర్దిక్ కెప్టెన్గా చాలా నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ యాజమాన్యం హార్దిక్ ప్రదర్శనపై ఆసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడి ట్రేడ్ డీల్ జరుగుతున్న సమాచారం. -
పాక్తో తొలి టెస్ట్.. హాడ్జ్ అజేయ అర్ధశతకం
టరౌబాలోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ ఓ మోస్తరు ప్రదర్శన చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. తేజ్నరైన్ చంద్రపాల్ (21), బ్రాండన్ కింగ్ (12), ఆమిర్ జాంగూ (21) ఔట్ కాగా.. కవెమ్ హాడ్జ్ (83) అజేయ అర్ద శతకంతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. అతడికి జతగా షాయ్ హోప్ (39) క్రీజ్లో ఉన్నాడు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్ 2, ఆమిర్ జమాల్ ఓ వికెట్ తీశారు.వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలగడంతో తొలి రోజు కేవలం 67 ఓవర్లు మాత్రమే సాధ్యమయ్యాయి. హాడ్జ్ అజేయ అర్ధశతకంతో జట్టును బలమైన స్థితిలో నిలిపాడు.ఈ మ్యాచ్లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పాక్ పేసర్లు మొహమ్మద్ అబ్బాస్, ఖుర్రం షెహ్జాద్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. 13 పరుగుల వద్ద బ్రాండన్ కింగ్ వికెట్ను అబ్బాస్ పడగొట్టాడు.అనంతరం వర్షం కారణంగా దాదాపు రెండు గంటల ఆట నిలిచిపోయింది. ఆట పునఃప్రారంభమైన తర్వాత హాడ్జ్ ఓపికగా ఇన్నింగ్స్ను నిర్మించాడు. ఈ దశలో తేజ్నరైన్ చందర్పాల్ను ఆమిర్ జమాల్ ఔట్ చేశాడు. కొద్ది సేపటికి ఆమిర్ జాంగూను అబ్బాస్ పెవిలియన్కు పంపాడు.అనంతరం షాయ్ హోప్తో కలిసి హాడ్జ్ నాలుగో వికెట్కు అజేయంగా 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. రెండో రోజు కూడా వర్షం ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో వెస్టిండీస్ ఏ విధమైన బ్యాటింగ్ వ్యూహాన్ని అనుసరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం పాక్ జట్టు వెస్టిండీస్లో పర్యటిస్తుంది. రెండో టెస్ట్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా ఆగస్ట్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్కు ముందు పాక్ వెస్టిండీస్ సెలెక్ట్ ఎలెవెన్తో ఓ నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ పాక్కు మంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ ఇచ్చింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో పాక్ బ్యాటర్లు అజాన్ అవైస్, బాబర్ ఆజం సెంచరీలు చేశారు. -
విరాట్ రికార్డు బద్దలు కొట్టిన ఇషాన్
జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత వికెట్కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 44 బంతుల్లో 81 పరుగులు (9 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసిన అతను.. ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక అంతర్జాతీయ టీ20 పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లిని అధిగమించాడు. తాజా ఇన్నింగ్స్తో ఈ ఏడాది ఇషాన్ టీ20 పరుగుల సంఖ్య 783 పరుగులకు చేరగా.. 2022లో విరాట్ 781 పరుగులు చేశాడు. ఈ జాబితాలో పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ (2021లో 1326 పరుగులు) టాప్ ప్లేస్లో ఉన్నాడు. భారత్ తరఫున మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (2022లో 1164 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్న ఇషాన్ ఈ ఏడాది స్కై రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది. మరో 381 పరుగులు చేస్తే స్కై రికార్డు.. మరో 543 పరుగులు చేస్తే మహ్మద్ రిజ్వాన్ను కూడా అధిగమించి ప్రపంచ రికార్డు నెలకొల్పవచ్చు.భారత్కు ఈ ఏడాది ఇంకా వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంకలతో టీ20 సిరీస్లు ఉండటంతో పాటు ఆసియా క్రీడల్లో కూడా ఆడే అవకాశం ఉంది. దీంతో ఇషాన్ కిషన్కు ఈ రికార్డులను బద్దలు కొట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాళ్లు:* 1326 – మహ్మద్ రిజ్వాన్ (2021)* 1164 – సూర్యకుమార్ యాదవ్ (2022)* 996 – మహ్మద్ రిజ్వాన్ (2022)* 939 – బాబర్ ఆజమ్ (2021)* 936 – బ్రియాన్ బెన్నెట్ (2025)* 859 – అభిషేక్ శర్మ (2025)* 783 – ఇషాన్ కిషన్ (2026)* 781 – విరాట్ కోహ్లీ (2022)మ్యాచ్ విషయానికొస్తే.. ఇషాన్ రికార్డు ఇన్నింగ్స్ కారణంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు (219-5) సాధించింది. అనంతరం అభిషేక్ మూడు, యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీయడంతో జింబాబ్వే 129 పరుగులకే ఆలౌటై, 90 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. ఫలితంగా భారత్ మూడు మ్యాచ్ల ఈ సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ టీమిండియానే గెలిచింది. నామమాత్రపు మూడో టీ20 ఇవాళే (జులై 26) జరుగనుంది. భారత టీ20 జట్టు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు ఇది తొలి సిరీస్ విజయం. -
హార్దిక్ పాండ్యా విషయంలో బీసీసీఐ మాస్టర్ప్లాన్!
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా విషయంలో బీసీసీఐ మాస్టర్ ప్లాన్ వేసింది. 2027 వన్డే వరల్డ్కప్ వరకు పాండ్యా పూర్తి ఫిట్నెస్ సాధించాలనే ఉద్దేశంతో అప్పటివరకు జరగనున్న ద్వైపాక్షిక సిరీస్లకు అతడిని ఎంపిక చేయబోమని బీసీసీఐ పేర్కొనడం ఆసక్తి కలిగించింది. ఐపీఎల్ 2026 సీజన్ చివర్లో గాయం బారిన పడ్డ పాండ్యా కోలుకొని ఫిట్నెస్ సాధించిన పాండ్యాను మొదట అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు ఎంపిక చేశారు. కానీ ఇదే సమయంలో పాండ్యాకు తొడ కండరాల్లో గాయం తిరగబెట్టడంతో ఆఫ్గన్తో పాటు ఇంగ్లండ్ సిరీస్కు కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శిబిరంలోనే చికిత్స తీసుకుంటున్న పాండ్యా పూర్తిగా కోలుకునే పనిలో ఉన్నాడు. రేవ్ స్పోర్ట్స్ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం పాండ్యా తన ఫిట్నెస్పైనే పూర్తి దృష్టి సారించాడని తెలుస్తోంది. అందుకే పూర్తిగా కోలుకున్నా ఇప్పుడే టీమిండియాలోకి రాకూడదనే ఉద్దేశంతో పాండ్యా 'పర్ఫార్మెన్స్ బ్లాక్' పేరిట దీర్ఘకాలిక ఫిట్నెస్ టార్గెట్ చేసుకొని దానిని అనుసరిస్తున్నట్లు సమాచారం. 32 ఏళ్ల వయసున్న పాండ్యా ఇప్పటికే తన ప్రోగ్రామ్లో గరిష్ట ఫిట్నెస్ను సాధించేందుకు దగ్గర్లో ఉన్నాడని, అత్యుత్తమ ప్రదర్శనను కనబరచడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు సమాచారం. బీసీసీఐ కూడా పాండ్యాను 2027 వన్డే వరల్డ్కప్ వరకు జాగ్రత్తగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆచితూచి వ్యవహరిస్తునట్లు తెలుస్తోంది. అందుకే వన్డే ప్రపంచకప్లోపు జరిగే ద్వైపాక్షిక సిరీస్ల్లో పాండ్యాను ఎక్కువగా ఆడించే అవకాశం లేదనిపిస్తోంది. ఒకవేళ సెలెక్ట్ చేసినా అది 50 ఓవర్ల ఫార్మాట్ మాత్రమే అతడికి ప్రాధాన్యమివ్వనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027 వన్డే ప్రపంచకప్లో ఆల్రౌండర్గా పాండ్యా కీలకం కానున్నాడని బీసీసీఐ బలంగా నమ్ముతోంది. అందుకే ప్రపంచకప్ సమీపిస్తుందనగా, అప్పుడు జరిగే వన్డే సిరీస్లకు పాండ్యాను ఎంపిక చేయాలని చూస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శనతో హార్దిక్ పాండ్యాను ఆ ఫ్రాంచైజీ విడుదల చేయనుంది. దీంతో ట్రేడింగ్లో పాండ్యా కేకేఆర్ లేదా చెన్నై జట్లకు వెళ్లే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.Read: ‘వైభవ్ నా తమ్ముడు.. నేనిచ్చే సలహా అదొక్కటే’ -
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో ఓ అరుదైన రికార్డు సాధించాడు. బ్యాట్తో మరోసారి నిరాశపరిచినప్పటికీ, బంతితో అద్భుత ప్రదర్శన (3-17) చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో అతను అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భారత ఓపెనింగ్ బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. మూడు ఫార్మాట్లలో భారత ఓపెనర్ల అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు:* టెస్టులు: వినూ మాంకడ్ – 8/52 (పాకిస్థాన్పై, 1952)* వన్డేలు: రవి శాస్త్రి – 5/15 (ఆస్ట్రేలియాపై, 1991)* టీ20లు: అభిషేక్ శర్మ – 3/17 (జింబాబ్వేపై, 2026)అభిషేక్కు తోడుగా యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీయడంతో జింబాబ్వే 220 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం 129 పరుగులకే ఆలౌటై, 90 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. ఫలితంగా భారత్ మూడు మ్యాచ్ల ఈ సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ టీమిండియానే గెలిచింది. నామమాత్రపు మూడో టీ20 ఇవాళే (జులై 26) జరుగనుంది. భారత టీ20 జట్టు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు ఇది తొలి సిరీస్ విజయం.బ్యాట్తో తడబడుతున్న అభిషేక్అభిషేక్ ఈ మ్యాచ్లో బంతితో రాణించినా, గత కొన్ని ఇన్నింగ్స్లుగా బ్యాట్తో తడబడుతున్నాడు. చివరిగా ఇంగ్లండ్తో తొలి టీ20లో అర్ద సెంచరీ చేసిన అతడు.. ఆతర్వాత వరుసగా 43, 10, 16, 3, 1 పరుగుకు ఔటయ్యాడు.నిన్నటి రెండో టీ20లో ఓ మోస్తరు స్టార్ట్ లభించినప్పటికీ సద్వినియోగం చేసుకోలేక వికెట్ పారేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్లో అతడు 8 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 8 పరుగులు చేసి బ్లెస్సింగ్ ముజరబానీ బౌలింగ్లో ర్యాన్ బర్ల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. -
రోహిత్ శర్మ రికార్డును సమం చేసిన సికందర్ రజా
జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ఓ అవాంఛిత విషయంలో టీమిండియా డాషింగ్ బ్యాటర్ రోహిత్, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం రికార్డును సమం చేశాడు. నిన్న (జులై 25) భారత్తో జరిగిన రెండో టీ20లో డకౌట్ కావడంతో టీ20 అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్గా అత్యధిక డక్స్ నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్, బాబర్ సరసన చేరాడు.కెప్టెన్గా రజాకు ఇది ఆరో డక్. రోహిత్, బాబర్ కూడా కెప్టెన్లుగా ఇన్నే డక్స్ నమోదు చేశారు. దీంతో వీరు ముగ్గురు అత్యధిక డక్స్ నమోదు చేసిన ఐసీసీ ఫుల్టైమ్ సభ్య దేశాల కెప్టెన్ల జాబితాలో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఎనిమిది డక్స్తో అగ్రస్థానంలో ఉన్నాడు.టీ20ల్లో కెప్టెన్గా అత్యధిక డక్స్ (పూర్తి సభ్య దేశాలు):* 8 – ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా)* 6 – రోహిత్ శర్మ (భారత్)* 6 – బాబర్ ఆజం (పాకిస్థాన్)* 6 – సికందర్ రజా (జింబాబ్వే)అంతేకాకుండా, ఈ డక్తో రజా టీ20ల్లో జింబాబ్వే తరఫున 10 డక్స్ నమోదు చేసి, ఆ జట్టు తరఫున అత్యధిక డక్స్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరాడు. రెజిస్ చకాబ్వా 11 డక్స్తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.భారత్తో రెండో టీ20 విషయానికొస్తే.. జింబాబ్వేపై భారత్ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, మూడు మ్యాచ్ల సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. దీనికి ముందు తొలి టీ20లోనూ టీమిండియా విజయం సాధించింది. భారత టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు ఇది తొలి సిరీస్ విజయం. మిగిలిన నామమాత్రపు మూడో టీ20 ఇవాళ (జులై 26) అదే వేదికగా జరుగనుంది. -
‘వైభవ్ నా తమ్ముడు.. నేనిచ్చే సలహా అదొక్కటే’
జింబాబ్వే పర్యటనలో తొలి టీ20లో మెరుపు అర్ధసెంచరీతో ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ రెండో టీ20లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 9 బంతుల్లో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 81), తిలక్ వర్మ (29 బంతుల్లో 60 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్లతో టీమిండియా రెండో టీ20లో 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇషాన్ కిషన్ వైభవ్ సూర్యవంశీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మేనేజ్మెంట్తో పాటు సీనియర్ ప్లేయర్లు వైభవ్కు ఎలాంటి సలహాలు ఇస్తుందని ఇషాన్ కిషన్ను అడిగారు. దీనిపై ఇషాన్ స్పందిస్తూ.. సోషల్ మీడియా, ఇతర విషయాలను పట్టించుకోకుండా కేవలం తన ఆటపై దృష్టి పెట్టాలని మాత్రమే వైభవ్కు ఒక అన్నలా సలహా ఇస్తుంటానని పేర్కొన్నాడు. వైభవ్కు ఎంతో భవిష్యత్తు ఉన్న కారణంగా అతడిని కాపాడుకునేందుకు భారత జట్టు ఒక స్పష్టమైన వ్యూహాన్ని, ప్రణాళికలను రచించిందని ఇషాన్ కిషన్ తెలిపాడు.ఇషాన్ మాట్లాడుతూ.. ‘వైభవ్ నిజానికి చాలా తెలివైనవాడు. తాను ఏం చేస్తున్నాడో, ఎలా బ్యాటింగ్ చేయాలో, మైదానం బయట ఎలా ప్రవర్తించాలో, మైదానంలో ఎలా ఉండాలో అతనికి బాగా తెలుసు. అదే సమయంలో, అతను వచ్చిన నేపథ్యం వల్ల కావొచ్చు కొంత పరధ్యానం ఉండొచ్చు. మన స్నేహితుల వల్ల కూడా కొంత డిస్టర్బెన్స్ ఉండొచ్చు. నేను కూడా అదే నేపథ్యం నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. క్రికెట్ ఆడుతూ దేశానికి ప్రాతినిధ్యం వహించేటప్పుడు దేనిపై దృష్టి పెట్టాలన్న దానిపై క్లియర్గా ఉన్నాను. నేను మాత్రమే కాదు, వైభవ్తో పాటు అభిషేక్, అక్షర్ భాయ్, ఇంకా అతనితో మాట్లాడే చాలా మంది ఆటగాళ్లు ఇదే దృష్టితో వ్యవహరిస్తారు. ప్రస్తుతం వైభవ్ సోషల్ మీడియాలో ఏం జరుగుతోందన్నది, బయటి గోల ఏంటనేది, పరుగులు చేయడంలో విఫలమైనప్పుడు తనపై వచ్చే విమర్శలను పక్కనబెట్టి కేవలం క్రికెట్ గురించే ఆలోచించేలా చూసుకుంటాము. వైభవ్ది చిన్న వయసు కాబట్టి తప్పుడు కారణల వల్ల పరధ్యానంలోకి వెళ్లకూడదని కోరుకుంటాం. సహచరులుగా మేమంతా వైభవ్ను ఒక తమ్ముడిలానే చూసుకుంటాం. వైభవ్ గనుక క్రీజులో నిలదొక్కుకుంటే పవర్ ప్లేలోనే 80-90 పరుగులు రాబట్టగలడు, అతనొక్కడే ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు’ అని ఇషాన్ చెప్పుకొచ్చాడు. 🚨 ISHAN KISHAN ON VAIBHAV SOORYAVANSHI 🇮🇳"We're all trying to guide Vaibhav like an elder brother so he avoids the mistakes we made early in our careers. Axar, Abhishek and the whole group are doing their best to help him."#IshanKishan #VaibhavSooryavanshi #TeamIndia…— KUMAR (@MyCric101) July 25, 2026Read: హండ్రెడ్లో జేమిమా విధ్వంసం.. ఒంటిచేత్తో జట్టుకు విజయం -
హండ్రెడ్లో జేమిమా విధ్వంసం.. ఒంటిచేత్తో జట్టుకు విజయం
హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీషన్లో భారత బ్యాటర్లు అదరగొడుతున్నారు. తాజాగా సదరన్ బ్రేవ్ జట్టు ప్లేయర్ జేమిమా రోడ్రిగ్స్ అజేయ ఇన్నింగ్స్ ఆడి ఒంటిచేత్తో జట్టును గెలిపించింది. విషయంలోకి వెళితే శనివారం డబుల్ హెడర్లో భాగంగా తొలి మ్యాచ్లో సన్రైజర్స్ లీడ్స్, సదరన్ బ్రేవ్స్ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ లీడ్స్ 100 బంతుల్లో 116 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ బ్రియాని స్మిత్ (48), అనాబెల్ సదర్లాండ్ (22), దీప్తి శర్మ (23) రాణించారు. సదరన్ బ్రేవ్ బౌలర్లలో ఇస్సీ వాంగ్ మూడు వికెట్లు తీయగా, టిల్లీ కొలెమన్ 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం సదరన్ బ్రేవ్స్ 96 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. జేమిమా రోడ్రిగ్స్ (34 బంతుల్లో 42 నాటౌట్, 4 ఫోర్లు) చివరి వరకు నిలిచి జట్టును గెలిపించింది. సన్రైజర్స్ లీడ్స్ బౌలర్లలో కాసిడి మెక్కార్తీ 2 వికెట్లు తీయగా, జెస్ జొనాసన్, అనాబెల్ సదర్లాండ్, డానియెల్లె గిబ్సన్ తలా ఒక వికెట్ తీశారు. మరో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ లండన్పై వెల్ష్ ఫైర్ జట్టు 60 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెల్ష్ ఫైర్ వుమెన్స్ 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. సోఫి డివైన్ (52) అర్ధసెంచరీ సాధించగా, జార్జియా వోల్ (42), జార్జియా వర్హెమ్ (43 నాటౌట్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. అనంతరం ఛేదనలో ముంబై ఇండియన్స్ లండన్ 92 బంతుల్లో 117 పరుగులకు కుప్పకూలింది. చినెల్లి హెన్రీ (30) టాప్ స్కోరర్గా నిలిచింది. గ్రేస్ పాట్స్ 3 వికెట్లు పడగొట్టింది. Ice in her veins! Jemimah Rodrigues closes out the chase 💫She delivers a memorable victory under pressure!#TheHundred 2026 👉 Sunrisers Leeds v Southern Brave pic.twitter.com/6YyTj5DWuM— Star Sports (@StarSportsIndia) July 25, 2026"Stay calm, stick to our plans, keep it simple and enjoy cricket" 🏏Hear from the Match Hero Jemimah Rodrigues after her fantastic knock to help Southern Brave beat Sunrisers Leeds 💯 pic.twitter.com/5aXY4eGnZ9— Sky Sports Cricket (@SkyCricket) July 25, 2026చదవండి: ధర్మేంద్ర ప్రధాన్ ఎఫెక్ట్.. గంభీర్ రాజీమానాకు డిమాండ్! -
ధర్మేంద్ర ప్రధాన్ ఎఫెక్ట్.. గంభీర్ రాజీమానాకు డిమాండ్!
నీట్ లీకేజీ వ్యవహారంలో దేశవ్యాప్తంగా యువతరం భగ్గుమనడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన ఉద్యమానికి యువతరం పెద్ద ఎత్తున మద్దతు తెలపడంతో చివరకు కేంద్రం తలవంచాల్సి వచ్చింది. ఈ క్రమంలో భారత జట్టు హెడ్కోచ్ గౌతమ్ గంభీర్పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. నీట్ లీకేజీ వ్యవహారంలో తన బాధ్యతల్లో విఫలమైన ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసినట్లే.. గంభీర్ కూడా టీమిండియా వరుస వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ హెడ్కోచ్ పదవికి రాజీనామా చేయాల్సిందేనని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ డిమాండ్ చేయడం ఆసక్తి కనిపించింది. విద్యార్థులు చేసిన ఆందోళనలతో ధర్మేంద్ర ప్రధాన్ దిగొచ్చినట్లే.. గంభీర్ కూడా తమ నిరసనలకు దిగిరావాలని, లేకుంటే రోడ్లపైకి వచ్చి నిరసన తెలపాల్సి వస్తుందని హెచ్చరించడం గమనార్హం. గంభీర్ ఇలాగే కోచ్గా కొనసాగితే మాత్రం 2027 వన్డే ప్రపంచకప్లో భారత్ ఓటమి ఖాయమని కొందరు జోస్యం చెబుతున్నారు. వరుసగా విఫలమవుతున్నప్పటికీ హర్షిత్ రానా, సుందర్ లాంటి క్రికెటర్లకు తరచూ అవకాశాలు ఇస్తున్నాడని, సీనియర్లకు అవకాశాలు తగ్గేలా చేయడంలో గంభీర్దే కీలకపాత్ర అని విమర్శిస్తున్నారు. అయితే ఇటీవలే గంభీర్ హెడ్కోచ్గా ఐర్లాండ్ చేతిలో 2-0తో, ఇంగ్లండ్ చేతిలో 4-0తో ఓడిన టీమిండియా ఆ తర్వాత వన్డే సిరీస్ను కూడా 2-1తో కోల్పోయింది. దీంతో ప్రస్తుతం జింబాబ్వే టూర్కు గంభీర్కు విశ్రాంతినిచ్చి అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ను మెంటార్గా జట్టుతో పంపించారు. కోచ్ మారగానే టీమిండియా టీ20 సిరీస్ను గెలుచుకోవడంతో పాటు, తాజాగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎఫెక్ట్ కూడా గంభీర్ను ట్రోల్స్కు గురయ్యేలా చేసింది. అయితే కొంతమంది గంభీర్ మద్దతుదారులు మాత్రం అతడి కోచింగ్ సారథ్యంలోనే టీమిండియా 2026 టీ20 ప్రపంచకప్తో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిందన్న విషయం మరువకూడదని కామెంట్లు చేశారు. మొత్తంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎఫెక్ట్తో క్రికెట్ అభిమానుల నుంచి గంభీర్కు సెగ తగిలినట్లయింది. ఇదంతా కేవలం సోషల్ మీడియాలో ఫన్నీ ట్రోల్స్ మాత్రమే కావడంతో బీసీసీఐ పెద్దగా పట్టించుకోలేదు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు గంభీర్ టీమిండియా హెడ్కోచ్గా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. Education Minister Dharmendra Pradhan resigned. pic.twitter.com/Ne2s3DMB50— TukTuk Academy (@TukTuk_Academy) July 25, 2026🚨 FAN PROTESTS GROW AGAINST GAMBHIR 🚨Growing frustration over Team India's recent performances has sparked fresh online campaigns and fan protests demanding Gautam Gambhir step down as head coach! 🇮🇳🏏🔥 pic.twitter.com/KlXfpDb364— CreaseBuzz (@CreaseBuzz) July 25, 2026Ab resignation aa gaya hai toh asli protest shuru karein?#CJP #dharmendrapradharesign pic.twitter.com/GmC7Ze5S5e— Tigerexch.ai (@Tigerexch_ai) July 25, 2026 -
సిరీస్ విజయం.. టీ20ల్లో నంబర్వన్గా టీమిండియా
ఇంగ్లండ్, ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్లు కోల్పోయిన టీమిండియా నెంబర్వన్ ర్యాంకును కూడా కోల్పోయింది. తాజాగా జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. పనిలో పనిగా మరోసారి పొట్టి ఫార్మాట్లో అగ్రపీఠాన్ని అందుకుంది. 60 మ్యాచ్లాడిన టీమిండియా 268 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో ఇంగ్లండ్ (268 పాయింట్లు) ఉండగా, 260 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్, భారత్ మధ్య పాయింట్ల మధ్య వ్యత్యాసం లేకున్నప్పటికీ భారత్ ఎక్కువ మ్యాచ్లు ఆడడంతో నంబర్వన్ స్థానాన్నితిరిగి హస్తగతం చేసుకుంది. మూడో టీ20లోనూ గెలిచి సిరీస్ను క్లీన్స్వీప్ చేస్తే మాత్రం టీమిండియా నంబర్వన్ ర్యాంకు మరింత పటిష్టం కానుంది.శనివారం జరిగిన రెండో మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా 90 పరుగుల తేడాతో ఆతిథ్య జింబాబ్వేను చిత్తు చేసింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో సిరీస్ పట్టేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 81; 9 ఫోర్లు, 2 సిక్స్లు), హైదరాబాదీ తిలక్ వర్మ (29 బంతుల్లో 60 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధశతకాలతో మెరిశారు.అనంతరం భారీ లక్ష్యఛేదనలో జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (19 బంతుల్లో 32; 3 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అభిషేక్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా... అరంగేట్ర పేసర్ యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో టి20 నేడు ఇక్కడే జరగనుంది. చదవండి: ఫైనల్కు దూసుకెళ్లిన అనాహత్.. 21 ఏళ్ల రికార్డు బద్దలు -
సిరీస్ మనదే
హరారే: స్థాయికి తగ్గ ప్రదర్శనతో సత్తా చాటిన భారత క్రికెట్ జట్టు... జింబాబ్వేపై టి20 సిరీస్ కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం జరిగిన రెండో మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా 90 పరుగుల తేడాతో ఆతిథ్య జింబాబ్వేను చిత్తు చేసింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో సిరీస్ పట్టేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 81; 9 ఫోర్లు, 2 సిక్స్లు), హైదరాబాదీ తిలక్ వర్మ (29 బంతుల్లో 60 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధశతకాలతో మెరిశారు. గత మ్యాచ్లో రికార్డు అర్ధ శతకం నమోదు చేసిన 15 ఏళ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (9 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (19 బంతుల్లో 32; 3 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అభిషేక్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా... అరంగేట్ర పేసర్ యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో టి20 నేడు ఇక్కడే జరగనుంది. వైభవ్ ఆరంభ మెరుపులు... ఐర్లాండ్–ఇంగ్లండ్ పర్యటనలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన భారత బ్యాటింగ్ ఆర్డర్... ఈ మ్యాచ్లో దంచికొట్టింది. తొలి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అభిషేక్ శర్మ (8) ఎక్కువసేపు నిలవలేకపోగా... ఇన్నింగ్స్ మూడో ఓవర్లో సూర్యవంశీ వరుసగా 4, 6, 4, 4 బాదాడు. అయితే అదే ఊపులో మరో భారీ షాట్ ఆడేందుకు ప్రయతి్నంచి అవుటయ్యాడు. మంచి టచ్లో కనిపించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (25; 4 ఫోర్లు) భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోగా... 10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 95/3తో నిలిచింది. అక్కడి నుంచి ఇషాన్, తిలక్ ఇన్నింగ్స్ను నడిపించారు. మంచి బంతులను గౌరవించిన ఈ జోడీ... చెత్త బంతులపై విరుచుకుపడింది. ఈ క్రమంలో ఇషాన్ 31 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... ఇన్నింగ్స్ 13వ ఓవర్లో తిలక్ హ్యాట్రిక్ ఫోర్లతో హోరెత్తించాడు. మరుసటి ఓవర్లో ఇషాన్ 4, 4, 6 కొట్టడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరూ నిలకడగా రాణించడంతో మధ్య ఓవర్లలో భారత్ మెరుగైన స్కోరు చేసింది. ధాటిగా ఆడిన తిలక్ 23 బంతుల్లోనే హాఫ్సెంచరీ మార్క్ దాటాడు. తిప్పేసిన అభిషేక్... లక్ష్యఛేదనలో ఏ దశలోనూ జింబాబ్వే పోటీలో కనిపించలేదు. ఓపెనర్ బెన్నెట్ క్రీజులో ఉన్నంతసేపు భారీ షాట్లు ఆడగా... అతడిని తొలి అంతర్జాతీయ టి20 ఆడుతున్న యశ్ ఠాకూర్ అవుట్ చేశాడు. ఆ వెంటనే బెన్ కరెన్ (1) పెవిలియన్ చేరగా... మైయర్స్ (12),సికందర్ రజా (0) విఫలమయ్యారు. దీంతో జింబాబ్వే 49 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. బర్ల్ (20; 2 ఫోర్లు), మరుమని (24; 1 ఫోర్, 1 సిక్స్), ఇవాన్స్ (19; 1 ఫోర్, 2 సిక్స్లు) తలాకొన్ని పరుగులు చేశారు. పిచ్ స్పిన్కు అనుకూలిస్తుండటంతో... భారత సారథి శ్రేయస్ బంతిని పార్ట్టైమ్ స్పిన్నర్లు అభిషేక్ శర్మ, తిలక్ వర్మకు అందించాడు. వారిద్దరూ లోయర్ ఆర్డర్ పనిపట్టడంతో జింబాబ్వే ఆలౌటైంది.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: వైభవ్ (సి) ముజరబాని (బి) ఎన్గరవా 20; అభిషేక్ (సి) బర్ల్ (బి) ముజరబాని 8; ఇషాన్ (సి) బెన్నెట్ (బి) న్యూమన్ 81; శ్రేయస్ (సి) ఇవాన్స్ (బి) బెన్నెట్ 25; తిలక్ (నాటౌట్) 60; రింకూ (సి) బర్ల్ (బి) ఇవాన్స్ 12; శివమ్ దూబే (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–10, 2–29, 3–95, 4–189, 5–213. బౌలింగ్: సికందర్ రజా 4–0–47–0; ముజరబాని 4–0–36–1; ఎన్గరవా 3–0–43–1; ఇవాన్స్ 4–0–44–1; న్యూమన్ 3–0–25–1; బెన్నెట్ 2–0–22–1. జింబాబ్వే ఇన్నింగ్స్: బెన్నెట్ (సి) ఇషాన్ (బి) యశ్ 32; కరన్ (సి) శివమ్ దూబే (బి) ప్రిన్స్ 1; మైయర్స్ (బి) రవి బిష్ణోయ్ 12; బర్ల్ (సి) రింకూ (బి) తిలక్ 20; సికందర్ రజా (సి) ఇషాన్ (బి) ప్రిన్స్ 0; మదెవెరె (సి) శ్రేయస్ (బి) శివమ్ దూబే 2; మరుమని (బి) యశ్ 24; ఇవాన్స్ (బి) అభిషేక్ 19; న్యూమన్ (బి) అభిషేక్ 3; ఎన్గరవా (సి) రింకూ (బి) అభిషేక్ 1; ముజరబాని (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 8; మొత్తం (17.5 ఓవర్లలో ఆలౌట్) 129. వికెట్ల పతనం: 1–34, 2–34, 3–48, 4–49, 5–65, 6–82, 7–105, 8–119, 9–121, 10–129. బౌలింగ్: మయాంక్ 3–0–25–0; యశ్ ఠాకూర్ 4–0–30–2; ప్రిన్స్ 1.2–0–10–2; రవి బిష్ణోయ్ 4–0–20–1; శివమ్ దూబే 1.4–0–13–1; తిలక్ వర్మ 1–0–9–1; అభిషేక్ 2.5–0–17–3. -
వారిద్దరూ అద్భుతం.. గతం మాకు అవసరం లేదు: శ్రేయస్ అయ్యర్
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో 90 పరుగుల తేడాతో భారత్ భారీ విజయాన్ని అందుకుంది. దీంతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-0 తేడాతో టీమిండియా కైవసం చేసింది. ఈ మ్యాచ్లో భారత జట్టు ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్లో 219 పరుగుల భారీ స్కోర్ సాధించిన మెన్ ఇన్ బ్లూ.. అనంతరం బౌలింగ్లో ప్రత్యర్ధి జట్టును 129 పరుగులకే కట్టడి చేసింది. ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శ్రేయస్ స్పందించాడు. భారత జట్టు కెప్టెన్గా తొలి టీ20 సిరీస్ విజయాన్ని అందుకోవడం సంతోషంగా ఉందని అయ్యర్ చెప్పుకొచ్చాడు."ఏకపక్ష విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం వల్లే ఈ అద్భుత విజయం సాధ్యమైంది. తొలుత బ్యాటింగ్లో ఇషాన్ కిషన్, తిలక్ వర్మ అసాధరణ ప్రదర్శన కనబరిచారు. వారిద్దరూ ఆడిన కొన్ని షాట్లు చూడటానికి ఎంతో ముచ్చటగా ఉన్నాయి. ఈ పిచ్పై మొదట్లో 180 నుండి 200 పరుగులు చేస్తే మంచి స్కోర్ అని భావించాం. కానీ వారిద్దరి అద్భుత ఇన్నింగ్స్ వల్ల మేము ఏకంగా 219 పరుగులు సాధించాం. ఆ తర్వాత మా బౌలర్లు వారి పని వారు చేసుకుపోయారు. సరైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేసి ప్రత్యర్ధి జట్టును 129 పరుగులకే కట్టడి చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచే ఆతిథ్య జట్టుపై ఆధిపత్యం చెలాయించాం. టీ20 ఫార్మాట్లో ఫియర్ లెస్ క్రికెట్ ఆడడం చాలా ముఖ్యం. గతంలో ఏం జరిగింది అనే దాన్ని పక్కన పెట్టి, ప్రస్తుతం గురుంచి ఆలోచిస్తూ ముందుకు సాగడమే మా సిద్దాంతం. ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోవాడనికి ప్రయత్నించాలి. ఆదివారం కూడా మాకు మరో మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ను విజయంతో ముగించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో శ్రేయస్ పేర్కొన్నాడు. -
రెండో టీ20లో జింబాబ్వే చిత్తు.. సిరీస్ టీమిండియాదే
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో 90 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు టీ20ల సిరీస్ను 2-0తో టీమిండియా సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో ఇషాన్ కిషన్(44 బంతుల్లో 9 ఫోర్లు,2 సిక్స్లతో 1), తిలక్ వర్మ(29 బంతుల్లో 60 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. జింబాబ్వే బౌలర్లలో ముజార్బానీ, నగరవా, బెన్నెట్, న్యూమన్ న్యాముహురి తలా వికెట్ సాధించారు.అదరగొట్టిన అభిషేక్అనంతరం 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో పార్ట్టైమ్ స్పిన్నర్ అభిషేక్ శర్మ మూడు వికెట్లతో సత్తాచాటగా.. ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు రవి బిష్ణోయ్, దూబే, తిలక్కు ఒక్కో వికెట్ దక్కింది. జింబాబ్వే బ్యాటర్లలో బెన్నెట్(32) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కాగా భారత కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు ఇదే తొలి సిరీస్ విజయం కావడం గమనార్హం. కాగా జింబాబ్వే టూర్కు ముందు ఐర్లాండ్, ఇంగ్లండ్తో టీ20 సిరీస్లను భారత్ కోల్పోయిన సంగతి తెలిసిందే. -
జిడ్డు బ్యాటింగ్ అంటూ విమర్శలు.. కట్ చేస్తే! బౌండరీలతో విధ్వంసం
టీమిండియా సూపర్ స్టార్ తిలక్ వర్మ తన ఫామ్పై విమర్శలు చేస్తున్న వారికి బ్యాట్తోనే సమాధనమిచ్చాడు. శనివారం హరారే వేదికగా జింబాబ్వేతో రెండో టీ20లో తిలక్ విధ్వసంకర హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన తిలక్.. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ హైదరాబాదీ మైదానం నలుమూలల బౌండరీలు బాదుతూ అభిమానులను అలరించాడు.ఈ క్రమంలో తిలక్ కేవలం 23 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అతడికి ఇది 9వ టీ20 హాఫ్ సెంచరీ. మొత్తంగా భారత వైస్ కెప్టెన్ 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 44 బంతుల్లో కిషన్ 9 ఫోర్లు, 2 సిక్స్లతో 81 పరుగులు చేశాడు. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. కాగా ఇటీవల కాలంలో తిలక్ ఆట తీరుపై చాలా మంది మాజీలు విమర్శలు గుప్పించారు. చాలా తక్కువ స్ట్రైక్రేట్తో ఆడుతున్నాడని, జట్టు నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. వీటిపై స్పందిచిన తిలక్.. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగానే తన ఆటతీరు ఉంటుందని స్పష్టం చేశాడు. ఇప్పుడు మరోసారి తనలోని హిట్టర్ను తిలక్ బయటపెట్టాడు. తనకు దూకుడుగా ఆడడంతో పాటు సమయస్పూర్తితో కూడా ఆడడం తెలుసు అని తిలక్ చాటి చెప్పాడు.చదవండి: భారత్ తరపున అరంగేట్రం.. ఎవరీ యశ్ ఠాకూర్ -
భారత్ తరపున అరంగేట్రం.. ఎవరీ యశ్ ఠాకూర్?
టీమిండియా తరపున మరో యువ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. హరారా వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20లో పేసర్ యశ్ ఠాకూర్ భారత్ తరపున డెబ్యూ చేశాడు. తొలి టీ20 ఆడిన అశోక్ శర్మను పక్కన పెట్టి యశ్కు తుది జట్టులో చోటు కల్పించారు. దీంతో ఎవరీ యశ్ ఠాకూర్ నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.ఎవరీ యశ్ ఠాకూర్?27 ఏళ్ల యశ్ ఠాకూర్ 1998లో కోల్కతాలో జన్మించాడు. కానీ ఈ రైట్ ఆర్మ్ పేసర్ దేశవాళీ క్రికెట్లో విదర్భ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతడు ఇప్పటికే రంజీలతో పాటు లిస్ట్-ఎ క్రికెట్, టీ20ల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. భారత్ 'ఎ' జట్టు తరపున కూడా అతడు తన మార్క్ చూపించాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అంతకుమందు లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో భాగంగా ఉన్నాడు.ఈ ఏడాది సీజన్కు ముందు అతడిని రూ. 1.60 లక్షలకు పంజాబ్ సొంతం చేసుకుంది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను తన ఆదర్శంగా తీసుకున్న యశ్ ఠాకూర్.. డెత్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీయడంలో దిట్ట. ఈ క్రమంలోనే అతడికి భారత్ తరపున అత్యున్నత స్ధాయిలో ఆడే అవకాశం దక్కింది. ఈ విదర్భ పేసర్ టీ20(48 మ్యాచ్లు )లలో ఇప్పటి వరకు 69, లిస్ట్-ఏ క్రికెట్(37 మ్యాచ్లు)లో 54, ఫస్ట్ క్లాస్ క్రికెట్(22 మ్యాచ్లు)లో 67 వికెట్లు పడగొట్టాడు.తుది జట్లుభారత్: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్జింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, తడివానాషే మారుమణి(వికెట్ కీపర్), బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్హురి, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ -
టీమిండియా మాజీ క్రికెటర్పై చీటింగ్ కేసు
టీమిండియా మాజీ క్రికెటర్ రాజేశ్ చౌహాన్పై చీటింగ్ కేసు నమోదైంది. ఓ వ్యక్తిని రూ. 15 లక్షలకు పైగా మోసం చేసినట్టు ఆరోపణలు రావడంతో ఒడిశా పోలీసులు కేసు నమోదు చేశారు. ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లా స్థానిక కోర్టు ఆదేశాల మేరకు జులై 24న మోహన్ నగర్ పోలీస్ స్టేషన్లో బీఎన్ఎస్ సెక్షన్ 316(2) (నమ్మకద్రోహం) కింద కేసు నమోదైంది.ఆరోపణ ఏంటంటే..?మాజీ భారత, మధ్యప్రదేశ్ ఆఫ్ స్పిన్నర్ రాజేష్ చౌహాన్, జిందాల్ స్టీల్ కంపెనీతో ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టు కుదిర్చిస్తానని దింకర్ విశ్వమిత్ర అనే వ్యక్తికి హామీ ఇచ్చి రూ. 15.1 లక్షలు వసూలు చేసినట్టు ఆరోపణ. ఈ మేరకు ఫిర్యాదుదారు కోర్టును ఆశ్రయించగా, పోలీస్ దర్యాప్తునకు ఆదేశాలు జారీ అయ్యాయి.ఫిర్యాదుదారు తెలిపిన వివరాల ప్రకారం, ట్రాన్స్పోర్ట్ వ్యాపారంలో భాగస్వామిగా పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని చౌహాన్ హామీ ఇచ్చారు. దీంతో 2021 జులైలో చౌహాన్ సంస్థ 'గోవింద్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ'తో విశ్వమిత్ర ఒప్పందం కుదుర్చుకున్నారు. మొదట చెక్కు రూపంలో రూ. 2.51 లక్షలు, అనంతరం మిగిలిన రూ. 12 లక్షలను సంస్థ బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేశారు.అయితే పెట్టుబడి అనంతరం చౌహాన్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఫిర్యాదుదారు నేరుగా జిందాల్ స్టీల్ లిమిటెడ్ను సంప్రదించగా, చౌహాన్కు కానీ, గోవింద్ ట్రాన్స్పోర్ట్ కంపెనీకి కానీ ఎలాంటి కాంట్రాక్టు ఇవ్వలేదని తేలింది. దీంతో తాను మోసపోయినట్లు ఫిర్యాదుదారు కోర్టును ఆశ్రయించారు.చౌహాన్ స్పందనఈ వ్యవహారంపై గతంలో పీటీఐతో మాట్లాడిన చౌహాన్, ఇది వ్యాపార వివాదం మాత్రమేనని పేర్కొన్నారు. "ఫిర్యాదుదారుకు చెందిన కొంత మొత్తాన్ని ఇప్పటికే తిరిగి చెల్లించాం. వ్యక్తిగత కారణాల వల్ల మిగిలిన మొత్తం చెల్లింపులో ఆలస్యం జరిగింది" అని ఆయన వివరణ ఇచ్చారు.క్రికెట్ కెరీర్బిహార్లో జన్మించిన రాజేష్ చౌహాన్ 1988/89 నుంచి 2000/01 వరకు మధ్యప్రదేశ్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడారు. 1993లో ఈడెన్ గార్డెన్స్లో శ్రీలంకపై అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఐదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో 21 టెస్టులు, 35 వన్డేలు ఆడి 76 వికెట్లు పడగొట్టారు. దేశవాళీ క్రికెట్లో దాదాపు 100 ఫస్ట్-క్లాస్, అంతే సంఖ్యలో లిస్ట్-ఏ మ్యాచ్లు ఆడి 400కు పైగా వికెట్లు తీశారు. 2000/01లో క్రికెట్ కెరీర్కు వీడ్కోలు పలికిన తర్వాత, 59 ఏళ్ల చౌహాన్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. -
సెంచరీలతో కదంతొక్కిన లంక ప్లేయర్లు.. చిత్తుగా ఓడిన పాక్
3 మ్యాచ్ల వన్డే, టీ20 సిరీస్ల కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు తొలి ఓటమి చవిచూసింది. వన్డే సిరీస్లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్లో ఆతిథ్య జట్టు చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది.హంబన్తోట వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. సిద్రా అమీన్ (100) అజేయ శతకంతో సత్తా చాటడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఏమాత్రం తడబడని శ్రీలంక విష్మి గుణరత్నే (123), హర్షిత సమరవిక్రమ (100 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కడంతో 46.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.పాక్ ఇన్నింగ్స్లో సిద్రా సెంచరీతో సత్తా చాటగా.. మునీబా అలీ (45), అయేషా జాఫర్ (49), కెప్టెన్ ఫాతిమా సనా (25) విలువైన ఇన్నింగ్స్లు ఆడారు. శ్రీలంక తరఫున విష్మి గుణరేత్న ఔటయ్యాక.. హర్షితకు కవిష దిల్హరి (40 నాటౌట్) సహకరించింది. ఈ మ్యాచ్లో శ్రీలంక గెలవడంతో సిరీస్ 1-1 వద్ద కొనసాగుతోంది. తొలి వన్డేలో శ్రీలంకపై పాక్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ సిరీస్లోని నిర్ణయాత్మక మూడో వన్డే ఇదే హంబన్తోట వేదికగా జులై 28న జరుగనుంది. -
మళ్లీ తస్సుమన్న అభిషేక్.. వైభవ్ ధాటిగా ఆడినా..!
టీమిండియా డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచ్లో అతడు నిరాశపరిచాడు. చివరిగా ఇంగ్లండ్తో తొలి టీ20లో అర్ద సెంచరీ చేసిన అతడు.. ఆతర్వాత వరుసగా 43, 10, 16, 3, 1 పరుగుకు ఔటయ్యాడు.ఇవాళ (జులై 25) జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20లో ఓ మోస్తరు స్టార్ట్ లభించినప్పటికీ సద్వినియోగం చేసుకోలేక వికెట్ పారేసుకున్నాడు. 8 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 8 పరుగులు చేసి బ్లెస్సింగ్ ముజరబానీ బౌలింగ్లో ర్యాన్ బర్ల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.అభిషేక్ త్వరగా ఔట్ కావడంతో రెండో టీ20లో భారత్ ఆదిలోనే ఒత్తిడిలో పడినట్లైంది. అతడు ఔటైన వెంటనే మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కూడా ఔటయ్యాడు. తొలి మ్యాచ్ ఫామ్ను కొనసాగించిన వైభవ్ భారీ ఇన్నింగ్స్ ఆడతాడని భావిస్తే.. 9 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 20 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ 29 పరుగులకే ఓపెనర్లిద్దరి వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది. ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ క్రీజ్లో ఉన్నారు.కాగా, ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. అశోక్ కుమార్ స్థానంలో యశ్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చాడు. యశ్ ఠాకూర్కు ఇది తొలి టీ20 మ్యాచ్. కెప్టెన్ అయ్యాక వరుసగా ఏడు టాస్లు గెలిచిన శ్రేయస్ ఎట్టకేలకు ఎనిమిదో మ్యాచ్లో టాస్ ఓడాడు. 3 మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి మ్యాచ్ గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
IND vs ZIM: జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Ind vs Zim 2nd T20 live updates: హరారే వేదికగా జరిగిన రెండో టీ20లో జింబాబ్వేను 90 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో మూడు టీ20ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో పార్ట్టైమ్ స్పిన్నర్ అభిషేక్ శర్మ మూడు వికెట్లతో సత్తాచాటగా.. ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు రవి బిష్ణోయ్, దూబే, తిలక్కు ఒక్కో వికెట్ దక్కింది.జింబాబ్వే ఏడో వికెట్ డౌన్జింబాబ్వే ఏడో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన బ్రాడ్ ఎవాన్స్.. అభిషేక్ శర్మ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. జింబాబ్వే ఆరో వికెట్ డౌన్జింబాబ్వే ఆరో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన రియాన్ బర్ల్.. తిలక్ వర్మ బౌలింగ్లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు జింబాబ్వే స్కోర్: 90/6జింబాబ్వే ఐదో వికెట్ డౌన్జింబాబ్వే ఐదో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన మాధవీరే.. దూబే బౌలింగ్లో ఔటయ్యాడు.జింబాబ్వే నాలుగో వికెట్ డౌన్జింబాబ్వే నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో కెప్టెన్ సికందర్ రజా వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆతిథ్య జట్టు 54 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.జింబాబ్వే మూడో వికెట్ డౌన్జింబాబ్వే మూడో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన డియోన్ మైర్స్.. రవి బిష్ణోయ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.జింబాబ్వే రెండో వికెట్ డౌన్జింబాబ్వే రెండో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన బెన్ కుర్రాన్.. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు.జింబాబ్వే తొలి వికెట్ డౌన్జింబాబ్వే తొలి వికెట్ కోల్పోయింది. 19 బంతుల్లో 32 పరుగులు చేసిన బ్రియాన్ బెన్నెట్.. యశ్ ఠాకూర్ బౌలింగ్లో ఔటయ్యాడు.దూకుడుగా ఆడుతున్న జింబాబ్వే220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. క్రీజులో బెన్నెట్(22), బెన్ కుర్రాన్(1) తలా వికెట్ సాధించారు.జింబాబ్వే టార్గెట్ 220 పరుగులుహరారే వేదికగా జరుగుతున్న రెండో టీ20లో భారత బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో ఇషాన్ కిషన్(44 బంతుల్లో 9 ఫోర్లు,2 సిక్స్లతో 1), తిలక్ వర్మ(29 బంతుల్లో 60 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 9 బంతుల్లోనే 3 ఫోర్లు, ఒక సిక్సర్తో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. జింబాబ్వే బౌలర్లలో ముజార్బానీ, నగరవా, బెన్నెట్, న్యూమన్ న్యాముహురి తలా వికెట్ సాధించారు.ఇషాన్ కిషన్ అవుట్ఇషాన్ కిషన్ రూపంలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 81 పరుగులు చేసిన కిషన్.. న్యూమన్ న్యాముహురి బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి రింకూ సింగ్ వచ్చాడు. 18 ఓవర్లకు భారత్ స్కోర్: 195/5తిలక్ వర్మ ఫిప్టీతిలక్ వర్మ చెలరేగి ఆడుతున్నాడు. ఈ హైదరాబాదీ కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. 17 ఓవర్లకు భారత్ స్కోర్: 188/3భారీ స్కోర్ దిశగా భారత్16 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. క్రీజులో ఇషాన్ కిషన్(75), తిలక్ వర్మ(40) ఉన్నారు.ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీఇషాన్ కిషన్ ఎట్టకేలకు తన ఫామ్ను అందుకున్నాడు. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20లో కిషన్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. 51 పరుగులతో కిషన్ తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు.టీమిండియా మూడో వికెట్ డౌన్టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. బెన్నెట్ బౌలింగ్లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు భారత్ స్కోర్: 95/3నిలకడగా ఆడుతున్న శ్రేయస్, కిషన్8 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్(14), ఇషాన్ కిషన్(26) ఉన్నారు.భారత్ రెండో వికెట్ డౌన్.. వైభవ్ ఔట్వైభవ్ సూర్యవంశీ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 9 బంతుల్లోనే 20 పరుగులు చేసిన వైభవ్.. నగరావ బౌలింగ్లో ఔటయ్యాడు.తొలి వికెట్ కోల్పోయిన భారత్1.5వ ఓవర్- 10 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ముజరబానీ బౌలింగ్లో ర్యాన్ బర్ల్కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ (8) ఔటయ్యాడు. హరారే వేదికగా రెండో టీ20లో జింబాబ్వే-భారత్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.ఈ మ్యాచ్తో టీమిండియా తరపున యువ పేసర్ యాశ్ ఠాకూర్ అరంగేట్రం చేశాడు. అశోక్ శర్మ స్ధానంలో యశ్ ఠాకూర్కు అవకాశమిచ్చారు. జింబాబ్వే మాత్రం తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.తుది జట్లుభారత్: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్జింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, తడివానాషే మారుమణి(వికెట్ కీపర్), బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్హురి, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ -
వారిద్దరూ జట్టులో ఎందుకు? గంభీర్పై మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై భారత మాజీ చీఫ్ సెలెక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ మరోసారి ఘూటు వ్యాఖ్యలు చేశారు. కోచ్గా గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలను ఆయన తప్పుబట్టారు. శివం దూబే, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆటగాళ్లను మేనెజ్మెంట్ ఆల్రౌండర్లుగా పరిగణించడం పట్ల శ్రీకాంత్ అసహనం వ్యక్తం చేశారు. "శివమ్ దూబే, హర్షిత్ రాణాలను ఆల్రౌండర్లుగా పరిగణించలేం. ఒకవేళ వారిద్దరిని ఆల్రౌండర్లు అంటే నేను కూడా గొప్ప ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. హార్దిక్ పాండ్యా ఒక్కడే అసలైన ఆల్రౌండర్. నితీష్ కుమార్ రెడ్డి హాఫ్ ఆల్రౌండర్. అతడు 7వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ కొన్ని ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయగలడు. ఇప్పటికైనా మేనెజ్మెంట్ సరైన ఆల్రౌండర్లను జట్టులోకి తీసుకోవాలని" శ్రీకాంత్ పేర్కొన్నారు. అదేవిధంగా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ కచ్చితంగా వన్డే ప్రపంచకప్ జట్టులో ఉండాలని ఆయన సూచించారు.కాగా యూకే పర్యటనలో భారత జట్టు వరుసగా మూడు సిరీస్లు కోల్పోవడంతో గంభీర్పై తీవ్రస్ధాయిలో విమర్శలు వచ్చాయి. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ టీమిండియా విఫలమైంది. జట్టులో హార్దిక్ పాండ్యా లేని లోటు స్పష్టంగా కనిపించింది. శివమ్ దూబే ఉన్నప్పటికి ఆశించిన స్ధాయిలో రాణించలేకపోయాడు.చదవండి: AFG vs IRE: అఫ్గానిస్తాన్ జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ వేటు -
వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ సంచలన ప్రణాళిక
టీమిండియా బ్యాటింగ్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ సంచలన ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. వైభవ్ను భవిష్యత్తులో ఆల్రౌండర్గా తీర్చిదిద్దాలని భారత క్రికెట్ బోర్డు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు భారత స్టాండ్-ఇన్ బౌలింగ్ కోచ్ సునీల్ జోషి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు.15 ఏళ్ల వైభవ్ ఐపీఎల్ 2026లో రికార్డు స్థాయి ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అనంతరం ఇంగ్లండ్తో సిరీస్లో సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసినప్పటికీ, ఆశించిన ప్రభావం చూపలేకపోయాడు. అయితే జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో కేవలం 18 బంతుల్లోనే అర్ధసెంచరీ నమోదు చేసి, తన సత్తా మరోసారి రుజువు చేసుకున్నాడు.బ్యాటింగ్తో పాటు బౌలింగ్పైనా దృష్టివైభవ్లో బౌలింగ్ సామర్థ్యం కూడా ఉందని, సమయం లభించిన ప్రతిసారీ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో అతనితో ప్రత్యేకంగా పని చేస్తామని జోషి తెలిపారు. బౌలింగ్లో మెరుగుదల కనిపించిన వెంటనే దానిపై పూర్తి దృష్టి సారిస్తామని ఆయన స్పష్టం చేశారు.అయితే ప్రస్తుతానికి బ్యాటింగ్పైనే ప్రధానంగా దృష్టి పెట్టాలని, హరారే మైదానం వైభవ్కు కలిసొచ్చే ప్రాంతమని, గతంలో అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లోనూ ఇక్కడ మెరుగైన ప్రదర్శన కనబరిచారని జోషి గుర్తుచేశారు.కాగా, జోషి చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. వైభవ్ను తొందరపడి అంతర్జాతీయ స్థాయిలో బౌలర్గా వినియోగించే ఆలోచనలో లేదని, దశలవారీగా పార్ట్టైమ్ ఆల్రౌండర్గా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.బౌలింగ్ అనుభవంవైభవ్ ఎడమచేతి ఆఫ్ స్పిన్నర్గా పార్ట్టైమ్ బౌలింగ్ చేస్తాడు. డొమెస్టిక్ క్రికెట్లో అతని బౌలింగ్ అనుభవం పరిమితం. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అతని ఖాతాలో కేవలం రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. లిస్ట్-ఏ క్రికెట్లో మూడు ఇన్నింగ్స్లు బౌలింగ్ చేసి 56 పరుగులు ఇచ్చాడు. టీ20ల్లో రెండు మ్యాచ్ల్లో బౌలింగ్ చేసినప్పటికీ ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఐపీఎల్లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా బౌలింగ్ చేసిన దాఖలాలు లేవు.మొత్తంగా బౌలింగ్లో దాదాపు అనుభవం లేని వైభవ్ను సరైన శిక్షణతో తీర్చిదిద్దగలిగితే, భారత జట్టు కూర్పుకు మరింత వైవిధ్యం చేకూరే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో ఆల్రౌండర్లకు పెరుగుతున్న ప్రాధాన్యం దృష్ట్యా ఈ నిర్ణయం ఆశ్చర్యకరం కాదని కథనాలు పేర్కొంటున్నాయి.నేడే రెండో టీ20భారత్-జింబాబ్వే మధ్య జరుగుతున్న సిరీస్లో రెండో టీ20 నేడు (జులై 25, శనివారం) హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరగనుంది.ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి టీ20 గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. -
అఫ్గానిస్తాన్ జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ వేటు
ఐర్లాండ్తో జరగనున్న ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్తో రహమత్ షా అఫ్గానిస్తాన్ కెప్టెన్గా తన ప్రయణాన్ని ప్రారంభించనున్నాడు. హస్మతుల్లా షాహిది కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఆ బాధ్యతలను రహమత్కు ఏసీబీ అప్పగించింది. ఇక గత నెలలో భారత్లో జరిగిన వన్డే సిరీస్కు దూరమైన సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఫజల్హాక్ ఫరూఖీ తిరిగి జట్టులోకి వచ్చాడు. అయితే స్టార్ ఆల్రౌండర్ మహ్మద్ నబీపై మాత్రం అఫ్గాన్ సెలక్షన్ కమిటీ వేటు వేసింది. అతడి స్దానంలో యామిన్ అహ్మద్జాయ్కి పిలుపునిచ్చారు. అహ్మద్జాయ్ చివరగా అక్టోబర్ 2025లో అఫ్గాన్ తరపున ఆడాడు. ఈ జట్టులో అజ్మతుల్లా ఓమర్జాయ్, రషీద్ ఖాన్ వంటి సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. ఈ సిరీస్ వచ్చే నెలలో ఆగస్టు 5 నుండి ఆగస్టు 14 మధ్య జరగనుంది. వన్డే ప్రపంచకప్-2027 సన్నాహకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. అఫ్గానిస్తాన్ గత నెలలో భారత్లో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో 0-3తో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే అంతకుముందు అబుదాబిలో బంగ్లాదేశ్తో జరిగిన వన్డే సిరీస్లో మాత్రం 3-0 తేడాతో అఫ్గాన్ విజయం సాధించింది.చదవండి: IND vs ZIM: ‘అతడొక సంచలనం.. బౌలింగ్ కూడా చేయిస్తాం’ -
‘వైభవ్ సూర్యవంశీతో బౌలింగ్ కూడా చేయిస్తాం’
విధ్వంసకర బ్యాటింగ్కు పెట్టింది పేరు టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ. ఒక్కసారి క్రీజులో కుదురుకోవాలే గానీ ప్రత్యర్థి జట్టు బౌలర్లకు పదిహేనేళ్ల ఈ పిల్లాడు చుక్కలు చూపిస్తాడు. అయితే, ఇంగ్లండ్తో అరంగేట్రంలో విఫలమైనా.. తాజాగా జింబాబ్వే పర్యటనలో మాత్రం ఈ లెఫ్టాండర్ బ్యాటర్ శుభారంభం అందుకున్నాడు.మెరుపు అర్ద శతకంహరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా గురువారం నాటి తొలి టీ20లో వైభవ్ పందమ్మిది బంతుల్లోనే అర్ధ శతకం బాదాడు. తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి తన విలువను చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా తాత్కాలిక బౌలింగ్ కోచ్ సునిల్ జోషి వైభవ్పై ప్రశంసల వర్షం కురిపించాడు.అతడొక సంచలన బ్యాటర్భారత్- జింబాబ్వే మధ్య శనివారం రెండో టీ20 నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అతడొక సంచలన బ్యాటర్. తొలి మ్యాచ్లో అతడు అదరగొట్టాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ అంటే పూనకాలు వస్తాయి. నాలుగు నెలల క్రితం ఇక్కడే అండర్-19 వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లండ్పై వైభవ్ భారీ శతకం (80 బంతుల్లో 175) బాదాడు.జింబాబ్వేతో తొలి టీ20లోనూ మెరుపులు మెరిపించాడు. వైభవ్ ప్రస్తుతం తన బ్యాటింగ్ విషయంలో ఎంతో సౌకర్యంగా కనిపిస్తున్నాడు. ఒకవేళ అతడు బౌలింగ్ చేయాల్సిన టైమ్ వస్తే బెంగళూరులోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్లో నేను అతడితో సాధన చేయిస్తాను.వైభవ్తో బౌలింగ్ కూడా చేయిస్తాంఅతడు బౌలింగ్లోనూ మెరిశాడంటే.. కచ్చితంగా మేము అతడి సేవలను ఉపయోగించుకునే అంశంపై తప్పక దృష్టి సారిస్తాం’’ అని సునిల్ జోషి తెలిపాడు. కాగా జింబాబ్వేతో తొలి టీ20లో ఏడు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య శని, ఆది వారాల్లో మిగిలిన రెండు టీ20 మ్యాచ్లు జరుగనున్నాయి. ఇందుకు కూడా హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక. దీంతో కళ్లన్నీ మరోసారి వైభవ్ సూర్యవంశీ మీదే కేంద్రీకృతమై ఉన్నాయి. చదవండి: తెలివితక్కువోడు తప్పిస్తే.. తానేంటో నిరూపించాడు! -
IND vs ZIM: అతడు కోచ్గా ఉన్నాడంటే.. అన్నీ వైట్వాష్లే!
భారత టీ20 కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన తర్వాత శ్రేయస్ అయ్యర్కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. యూకే పర్యటనలో భాగంగా అతడి సారథ్యంలో పసికూన ఐర్లాండ్ చేతిలో టీమిండియా 2-0తో వైట్వాష్కు గురైంది.అనంతరం ఇంగ్లండ్ గడ్డ మీద 4-0తో క్లీన్స్వీప్ అయింది. ఈ సిరీస్లో ఓ మ్యాచ్ వర్షం వల్ల రద్దైపోయింది. దీంతో కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి ఏడు మ్యాచ్లలోనూ శ్రేయస్ అయ్యర్కు గెలుపన్నదే లేకుండా పోయింది. ఈ క్రమంలో జింబాబ్వే గడ్డ మీద తొలి మ్యాచ్ సందర్భంగా ఎట్టకేలకు శ్రేయస్ సేన విజయాల ఖాతా తెరిచింది.సమిష్టిగా రాణించి ఆతిథ్య జింబాబ్వే జట్టుపై ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా వరుస పరాభవాల తర్వాత శ్రేయస్ తొలిసారి గెలుపు రుచిచూశాడు. అయితే, జింబాబ్వేపై విజయాన్ని కూడా ఇంతలా సెలబ్రేట్ చేసుకోవాల్సిన పనిలేదంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా విమర్శించారు.మిగిలిపోయిందైనా.. అది విందు భోజనం లాంటిదే!ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సదగోపన్ రమేశ్ శ్రేయస్ అయ్యర్కు మద్దతుగా నిలిచాడు. ‘‘జింబాబ్వే మీద విజయాన్ని గొప్పగా భావించవద్దని చాలా మంది అంటున్నారు. అయితే.. టీ20 ప్రపంచకప్ చాంపియన్గా నిలిచిన తర్వాత టీమిండియా టీ20మ్యాచ్లో విజయం కోసం చకోర పక్షిలా ఎదురుచూసింది.చాన్నాళ్ల ఆకలి తర్వాత దక్కిన గెలుపు ఇది. కాబట్టి ఇది మిగిలిపోయిందే అయినా.. పెళ్లి భోజనం లాంటిదే. శ్రేయస్ అయ్యర్కు కాస్త ఊరట లభించింది. అతడి కెప్టెన్సీ ఆరంభంలోనే టీమిండియా ఘోర పరాజయాలు చవిచూసింది.కాబట్టి ఇప్పుడు జింబాబ్వే మీద గెలిచినా సరే.. అది విజయమే. ఇప్పుడు ఇదే అతడికి బూస్ట్’’ అని సదగోపన్ రమేశ్ పేర్కొన్నాడు. అదే విధంగా.. జింబాబ్వే టూర్లో గౌతం గంభీర్కు బదులు తాత్కాలిక హెడ్కోచ్గా వ్యవహరిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్పై రమేశ్ ప్రశంసలు కురిపించాడు.వీవీఎస్ లక్ష్మణ్పై ప్రశంసలు‘‘ఈ విజయంలో వీవీఎస్ లక్ష్మణ్దే సింహభాగం. అతడు ఎప్పుడు కోచ్గా వ్యవహరించినా సరే.. అప్పుడు టీమిండియా తప్పక విజయాలు సాధిస్తుంది. అతడి మార్గదర్శనంలో టీమిండియా ప్రత్యర్థులను దాదాపుగా అన్ని సిరీస్లలోనూ వైట్వాష్ చేసింది.టీమిండియా వైట్వాష్లకు గురైన తర్వాత కూడా అతడు ఇలాంటి ఫలితాలు రాబట్టాడు. వరుస పరాజయాల తర్వాత ఇప్పుడు జింబాబ్వేతో తొలి మ్యాచ్లోనూ టీమిండియా గెలిచింది’’ అని రమేశ్ వీవీఎస్ లక్ష్మణ్ను ప్రశంసించాడు. కాగా జింబాబ్వేతో మూడు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా గురువారం నాటి తొలి టీ20లో ఏడు వికెట్ల తేడాతో గెలిచి.. 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య శని, ఆది వారాల్లో మిగిలిన రెండు మ్యాచ్లు జరుగుతాయి. ఇందుకు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక.చదవండి: తెలివితక్కువోడు తప్పిస్తే.. తానేంటో నిరూపించాడు! -
జింబాబ్వేతో రెండో టీ20.. అభిషేక్పై వేటు పడనుందా!
హరారే వేదికగా ఇవాళ జింబాబ్వేతో రెండో టీ20 మ్యాచ్కు సిద్ధమైన టీమిండియా సిరీస్ విజయంపై కన్నేసింది. తొలి టీ20 మ్యాచ్లో బౌలర్ల సమిష్టి ప్రదర్శనకు తోడు వైభవ్ సూర్యవంశీ విధ్వంసం తోడవ్వడంతో టీమిండియా సునాయాస విజయాన్ని అందుకొని మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మరోసారి అదే వేదికలో మ్యాచ్ ఆడుతుండడంతో, రెండో టీ20లోనూ దాదాపు అదే జట్టుతో బరిలోకి దిగే అవకాశముంది. అయితే ఓపెనింగ్లో లెఫ్ట్, రైట్ కాంబినేషన్ అనుకుంటే మాత్రం తొలి టీ20లో ఒక్క పరుగు మాత్రమే చేసిన అభిషేక్ శర్మను తప్పించి అతడి స్థానంలో ప్రబ్సిమ్రన్ను ఆడించే అవకాశముంది.ఇది మినహా జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. మూడో స్థానంలో హార్డ్ హిట్టర్ ఇషాన్ కిషన్ రానుండగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్కు రానున్నాడు. ఆ తర్వాత మిడిలార్డర్లో తిలక్ వర్మ, రింకూ సింగ్ బాధ్యతలు తీసుకోనున్నారు. ఫినిషర్గా శివమ్ దూబే తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు.ఇక బౌలింగ్ విషయానికొస్తే రెండేళ్ల తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన మయాంక్ తాను ఆడిన తొలి మ్యాచ్లోనే ప్రభావం చూపించాడు. మయాంక్ యాదవ్తో పాటు ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మలతో పేస్ బౌలింగ్ లైనప్ బలంగా ఉంది. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్గా రవి బిష్ణోయి మరోసారి కీలకంగా మారనున్నాడు. టీమిండియా ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు, నలుగురు బౌలర్లు, ఒక ఆల్రౌండర్ కాంబినేషన్తో రెండో టీ20లో బరిలోకి దిగనుంది.భారత తుదిజట్టు అంచనా: వైభవ్ సూర్యవంశీ, ప్రబ్సిమ్రాన్ సింగ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్. -
అక్కడే మేం గెలిచాం.. ఆసీస్ సిరీస్పై బంగ్లా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆస్ట్రేలియాతో జరుగబోయే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తమ అత్యుత్తమ జట్టును ప్రకటించడం బంగ్లాదేశ్ క్రికెట్కు గౌరవకరమైన విషయమని పేర్కొన్నాడు. ఈ సిరీస్ను ఆస్ట్రేలియా ఏమాత్రం తేలికగా తీసుకోవడం లేదని అభిప్రాయపడ్డాడు."గతంలో మా జట్టుతో ఆడేటప్పుడు ప్రత్యర్థులు తరచూ ప్రయోగాలు చేసేవారు. కానీ ఈసారి ఆస్ట్రేలియా పూర్తి బలంతో కూడిన జట్టును పంపడం మా జట్టు సాధించిన గుర్తింపుగా భావిస్తున్నాను. ఇది ప్రపంచ స్థాయి జట్టుతో మా సామర్థ్యాన్ని నిరూపించుకునే గొప్ప అవకాశం" అని శాంటో అన్నాడు.ఆస్ట్రేలియా జట్టులో స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్వుడ్, స్కాట్ బోలాండ్, నాథన్ లియాన్, కామెరూన్ గ్రీన్, బో వెబ్స్టర్ వంటి స్టార్ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు.అయితే సిరీస్కు ముందు బంగ్లాదేశ్కు గాయాల సమస్యలు వెంటాడుతున్నాయి. వికెట్కీపర్ బ్యాటర్ లిట్టన్ దాస్ ఇంకా కాఫ్ గాయం నుంచి కోలుకోలేదు. అలాగే ఫాస్ట్ బౌలర్లు నహీద్ రానా (సైడ్ స్ట్రెయిన్), షోరిఫుల్ ఇస్లాం (హామ్స్ట్రింగ్ గాయం) కూడా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నారు.మరో పేసర్ ఎబాదోత్ హొస్సేన్ ఇటీవలే జన్మించిన తన బిడ్డతో ఉండేందుకు ఈ సిరీస్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అయితే అవసరమైతే తిరిగి జట్టుతో చేరే అవకాశముందని సమాచారం.తొలి టెస్ట్ డార్విన్ వేదికగా ఆగస్టు 13-17 వరకు, రెండో టెస్ట్ మెక్కే వేదికగా ఆగస్టు 22-26 మధ్య జరగనుంది. దీనికి ముందు పర్యాటక బంగ్లాదేశ్ క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవెన్తో ఓ మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ఆగస్టు 6-8 వరకు డార్విన్ వేదికగా జరుగనుంది. -
ఇంగ్లండ్ గడ్డ మీద సత్తా చాటిన టీమిండియా స్టార్
టీమిండియా స్టార్ క్రికెటర్ కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్ గడ్డ మీద సత్తా చాటాడు. దేశీ వన్డే కప్ మ్యాచ్లో రెండు వికెట్లు పడగొట్టి.. యార్క్షైర్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. కాగా అఫ్గానిస్తాన్తో స్వదేశంలో చివరగా వన్డే సిరీస్లో పాల్గొన్నాడు కుల్దీప్.మేనేజ్మెంట్ తీరుపై విమర్శలుఅయితే, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో ఈ చైనామన్ స్పిన్నర్కు ఒకే ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైనా ఒక్క వన్డేలోనూ ఆడించకుండా.. కుల్దీప్ను బెంచ్కే పరిమితం చేసింది యాజమాన్యం. ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.ముఖ్యంగా లార్డ్స్లో చివరిదైన, నిర్ణయాత్మక మూడో వన్డేలో కుల్దీప్ యాదవ్ను ఆడిస్తే ఫలితం వేరేలా ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ తమ పార్ట్ టైమ్ స్పిన్నర్ల సేవల్ని ఉపయోగించుకుని గెలుపొంది.. సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది.ఒకే ఓవర్లో రెండు వికెట్లతో సత్తాఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో ఆడే అవకాశం పొందలేని కుల్దీప్ యాదవ్.. ఆ వెంటనే కౌంటీ ఫ్రాంఛైజీ యార్క్షైర్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో రాయల్ వన్డే కప్-2026లో భాగంగా శుక్రవారం గ్లామోర్గాన్తో యార్క్షైర్ తరఫున కుల్దీప్ అరంగేట్రం చేశాడు.ఈ మ్యాచ్లో ఒకే ఓవర్లో రెండు వికెట్లతో సత్తా చాటాడు కుల్దీప్. మొత్తంగా పది ఓవర్ల కోటా పూర్తి చేసిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ మొదటి తొమ్మిది ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే, తన ఆఖరి ఓవర్లో అలెక్స్ హోర్టాన్, జేమీ మెక్రాయ్ వికెట్లు తీశాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 10 ఓవర్లలో 39 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.యార్క్షైర్ విజయంఇక యార్క్షైర్కు చెందిన మీడియం పేసర్ బెంజమిన్ క్లిఫ్ కేవలం 29 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఫలితంగా గ్లామోర్గాన్ 186 పరుగులకే పరిమితం కాగా.. లక్ష్య ఛేదనలో యార్క్షైర్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.మరోవైపు.. నార్తాంప్టన్ తరఫున కెంట్ జట్టుపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ కూడా రెండు వికెట్లు తీశాడు. అయితే, ఈ మ్యాచ్లో నార్తాంప్టన్ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.చదవండి: తెలివితక్కువోడు తప్పిస్తే.. తానేంటో నిరూపించుకున్నాడు! -
తెలివితక్కువోడు తప్పిస్తే.. తానేంటో నిరూపించాడు!
జింబాబ్వే గడ్డపై టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ సత్తా చాటాడు. ఆతిథ్య జట్టుతో తొలి టీ20 మ్యాచ్లో కేవలం పందొమ్మిది బంతుల్లోనే అర్ధ శతకంతో విధ్వంసం సృష్టించాడు. జింబాబ్వే బౌలర్లను ఉతికారేస్తూ పరుగులు పిండుకున్నాడు. తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఇంగ్లండ్ గడ్డ మీద అరంగేట్రంఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించాడు. అదే సమయంలో టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా భారత అండర్-19, ఐపీఎల్లో సత్తా చాటిన వైభవ్.. పదిహేనేళ్ల వయసులోనే టీమిండియాకు ఎంపికైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఐర్లాండ్తో టీ20 సిరీస్లో వైభవ్తో అరంగేట్రం చేయిస్తారనుకుంటే.. మేనేజ్మెంట్ అక్కడ ఈ పిల్లాడికి అవకాశం ఇవ్వలేదు. అయితే, ఐర్లాండ్తో రెండు టీ20లు, ఇంగ్లండ్తో తొలి టీ20 మ్యాచ్లో విఫలమైన తర్వాత సంజూ శాంసన్ను తప్పించి.. అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీని ఆడించారు.మూడు మ్యాచ్లలో విఫలం ఇంగ్లండ్తో రెండో టీ20 సందర్భంగా అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. వరుసగా మూడు మ్యాచ్లలో 14, 13, 15 పరుగులు చేసి విఫలమయ్యాడు. దీంతో ఐదో టీ20 నుంచి ఈ లెఫ్టాండర్ బ్యాటర్ను తప్పించి మళ్లీ సంజూనే ఆడించారు. అయితే, జింజాబ్వే పర్యటనకు ఎంపికైన జట్టులో సంజూ లేకపోవడంతో.. వైభవ్కు ఓపెనర్గా అవకాశం దక్కింది.ఈ క్రమంలో జింబాబ్వేతో హరారే వేదికగా గురువారం నాటి తొలి టీ20లో వైభవ్ సూర్యవంశీ మెరుపు ఫిఫ్టీతో అలరించాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఒక్క పరుగుకే వెనుదిరిగినా.. ఈ బిహారీ పిల్లాడు దూకుడుగా ఆడి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.తెలివితక్కువ వాడు తప్పిస్తే.. తానేంటో చూపించాడు!ఈ పరిణామాల నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ వైభవ్ను ప్రశంసిస్తూ.. గంభీర్ను విమర్శించాడు. ‘‘సూర్యవంశీ అద్భుతమైన షాట్లతో అలరించాడు. షాట్ సెలక్షన్లో ఒక్క పొరపాటు కూడా చేయలేదు. ఈ పిల్లాడు చాలా ప్రత్యేమని అందుకే అంటాను.అయినా ఇంగ్లండ్తో మూడు మ్యాచ్లలో విఫలం కాగానే.. గౌతం గంభీర్ తెలివితక్కువతనంతో అతడిని జట్టు నుంచి ఎలా తప్పిస్తాడు?.. గంభీర్ నిర్ణయం వల్ల ఆ పిల్లాడి ఆత్మవిశ్వాసం దెబ్బతినదా?అయితే, అందరిలా అతడు కుంగిపోలేదు. ఇంగ్లండ్తో సిరీస్ ముగిసిన వెంటనే.. ఇంటికి వెళ్లకుండా తన ఐపీఎల్ జట్టు రాజస్తాన్ రాయల్స్ క్యాంపునకు వెళ్లాడు. అక్కడ తన బ్యాటింగ్లో.. ముఖ్యంగా షార్ట్ బాల్ ఆడటంలో ఎదురైన సవాళ్లకు పరిష్కారం కనుగొనేలా తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు.అంకిత భావానికి సెల్యూట్నిజంగా వైభవ్ అంకిత భావానికి సెల్యూట్. తన బ్యాటింగ్ లోపాల్ని సరిచేసుకుని జింబాబ్వేలో సత్తా చాటాడు. తాను ఎందుకు స్పెషలో మరోసారి ఈ ప్రపంచానికి చాటిచెప్పాలనుకున్నాడు. చేసి చూపించాడు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నాడు. కాగా జింబాబ్వే పర్యటన నుంచి గంభీర్ విరామం తీసుకోగా.. వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియా తాత్కాలిక హెడ్కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఆతిథ్య జట్టుతో మూడు మ్యాచ్ల సిరీస్లో తొలి టీ20 గెలిచిన భారత్.. 1-0తో ముందంజలో ఉంది.చదవండి: బీసీసీఐ ఉపాధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు -
‘హ్యాండ్షేక్’ వివాదం.. రెండు నెలల తర్వాత నోరు విప్పిన హెడ్!
ఐపీఎల్ 2026 సీజన్ సమయంలో విరాట్ కోహ్లి, ట్రావిస్ హెడ్ల మధ్య షేక్ హ్యాండ్ ఘటన ఎంత పెద్ద వివాదంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఐపీఎల్ ముగిసిన రెండు నెలల తర్వాత హెడ్ 'హ్యాండ్షేక్' వివాదం ఘటనపై మౌనం వీడాడు. ఈ సంఘటన తర్వాత హెడ్, కోహ్లి మధ్య బంధం పూర్తిగా చెడిపోయిందంటూ వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై హెడ్ స్పందిస్తూ.. 'మా మధ్య ప్యాచ్-అప్ (రాజీ) చేసుకోవడానికి ఏమీ లేదు. కోహ్లితో నా సంబంధాలు ఎప్పటిలాగే సాధారణంగా ఉన్నాయి. మైదానంలో ఏం జరిగిందో అది లీగ్ ప్రక్రియలో భాగమే తప్ప, మా మధ్య ఎలాంటి వివాదం లేదు' అని స్పష్టం చేశాడు. అయితే మైదానంలో జరిగే విషయాలను ఒక ప్రొఫెషనల్ క్రికెటర్గా స్వీకరిస్తానని, కానీ సోషల్ మీడియాలో తన కుటుంబాన్ని టార్గెట్ చేయడం బాధించిందని హెడ్ ఆవేదన వ్యక్తం చేశాడు.'ఇలాంటి ఘటనలు క్రీడా ప్రపంచంలో సహజమేనని నేను, జెస్సికా ముందే గ్రహించాం. కానీ కొంతమంది పనిగట్టుకొని నా కుటుంబంపై అసభ్యకర కామెంట్లు చేయడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. జెస్సికా ఈ పరిస్థితిపై చాలా పరిణితితో వ్యవహరించడంతోనే సమస్య పెద్దది కాలేదు. మరో ఐపీఎల్ వచ్చేసరికి ఇలాంటి సంఘటనలు అందరూ మర్చిపోతారు. కానీ ఇలాంటి విషయాలను సీరియస్గా తీసుకుంటున్న కొందరు మాత్రం అదే పనిగా ఆటగాళ్ల కుటుంబాలను సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేసి వేధించడం నిజంగా బాధాకరం.' అని హెడ్ విచారం వ్యక్తం చేశాడు.ఆరోజు ఏం జరిగింది?ఐపీఎల్ 2026 సీజన్లో మే 22న జరిగిన ఆర్సీబీ-ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఇది చోటుచేసుకుంది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 4వ ఓవర్లో వెంకటేష్ అయ్యర్ భారీ షాట్లు ఆడుతుండగా.. కోహ్లి హెడ్ పట్ల చాలా ఆగ్రహంగా ఉన్నట్లు కనిపించాడు. నువ్వే వచ్చి బౌలింగ్ చేయ్యి అంటూ సైగలు చేయడం కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది. హెడ్ మాత్రం చిరునవ్వుతో స్పందించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు పరస్పరం హ్యాండ్షేక్లు చేసుకుంటుండగా.. కోహ్లి హెడ్ పట్ల మరోసారి అవమానకరంగా ప్రవర్తించాడు. కమిన్స్, అభిషేక్ శర్మలతో మాట్లాడి.. హెడ్ వద్దకు వచ్చేసరికి మాత్రం ఎలాంటి స్పందన లేకుండా ముందుకు సాగిపోయాడు. కోహ్లి ఇలా చేయడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఈ ఘటన అప్పట్లో వైరల్ అయింది.Look behind the whole SRH coaching staff, including Daniel Vettori and Muttiah Muralitharan, were watching Virat Kohli and Travis Head, expecting some drama and ready to stop a fight. 😳But Kohli didn’t shake hands, and everyone started laughing. 😂 pic.twitter.com/9F9pHwiC8T— Jeet (@JeetN25) May 23, 2026#ViratKohli 🆚 #TravisHead 🥵🤯Tensions rise in high voltage clash🔥#TATAIPL Race to Playoffs 2026 👉 #SRHvRCB | LIVE NOW ➡️https://t.co/52qPTW2gSO pic.twitter.com/JOiWaxNW6T— Star Sports (@StarSportsIndia) May 22, 2026Read: పాక్తో సిరీస్కు ఎంపిక.. ఆడేందుకు విండీస్ ప్లేయర్ నిరాకరణ! -
అది వాళ్ల నిర్ణయం: బీసీసీఐ ఉపాధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మను ఉద్దేశించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పట్లో రోహిత్ రిటైర్ అయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. కాగా ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన హిట్మ్యాన్ వన్డేల్లో కొనసాగుతున్నాడు.బ్యాట్తోనే సమాధానంవన్డే ప్రపంచకప్-2027 ఆడటమే లక్ష్యంగా రోహిత్ శర్మ ఫిట్నెస్ను కూడా మెరుగుపరచుకుని ముందుకు సాగుతున్నాడు. అయితే, ఇటీవల ఇంగ్లండ్తో లార్డ్స్లో జరిగిన వన్డేనే హిట్మ్యాన్ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ అనే ప్రచారం జరిగింది.అయితే, ఇవన్నీ వట్టి ఊహాగానాలే అని తేలింది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో మెరుపు శతకం (138)తో చెలరేగి విమర్శకులకు రోహిత్ బ్యాట్తోనే సమాధానం ఇచ్చాడు. అంతేకాదు.. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తాను ఇప్పట్లో రిటైర్ కానని.. తాను ఆడినంత కాలం ఇలాంటి వదంతులు వస్తూనే ఉంటాయని పేర్కొన్నాడు.నిప్పు లేనిదే పొగ రాదుబీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సైతం రోహిత్ రిటైర్మెంట్ వార్తల్ని కొట్టిపారేశాడు. కానీ.. భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ మాత్రం.. ‘‘నిప్పు లేనిదే పొగ రాదు.. ఏదో జరిగే ఉంటుంది’’ అని అభిమానుల్లో సందేహాలు రేకెత్తించాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.సెలక్టర్లదే అంతిమ నిర్ణయంయూపీ టీ20 లీగ్ మినీ వేలం కార్యక్రమానికి హాజరైన రాజీవ్ శుక్లా విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘మా జట్టులో రోహిత్ అంతర్భాగం. అతడి ఆట కొనసాగుతుంది. మీడియా, సోషల్ మీడియాలో రోహిత్ గురించి వస్తున్న వార్తలకు అసలు అర్థమే లేదు.ఇప్పట్లో అతడు రిటైర్ అయ్యే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కరికి తమ సొంత అభిప్రాయాలు ఉంటాయి. అయితే, జట్టులో ఎవరు ఉండాలి.. ఎవరిని తప్పించాలి అనే విషయంలో సెలక్టర్లదే అంతిమ నిర్ణయం’’ అని పేర్కొన్నాడు.ఇక ఐర్లాండ్, ఇంగ్లండ్లలో టీమిండియా వరుసగా మూడు సిరీస్లు కోల్పోయిన నేపథ్యంలో రాజీవ్ శుక్లా స్పందిస్తూ.. ‘‘టీమిండియా ప్రస్తుతం బాగానే ఆడుతోంది. మ్యాచ్లు గెలుస్తోంది. కాబట్టి ఇప్పట్లో నాయకత్వ బృందంలో మార్పులు చేయాల్సిన అవసరం అయితే లేదు’’ అని కుండబద్దలు కొట్టాడు.వరుస పరాజయాల తర్వాత..కాగా టీ20 సిరీస్లలో పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0, ఇంగ్లండ్ చేతిలో 4-0తో టీమిండియా క్లీన్స్వీప్ అయిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లోనూ 1-2తో ఓటమిపాలైంది. దీంతో టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్కోచ్ గౌతం గంభీర్, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్పై విమర్శలు రాగా.. రాజీవ్ శుక్లా మాత్రం తమ నాయకత్వ బృందానికి మద్దతుగా నిలవడం విశేషం. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత టీ20 జట్టు.. తొలి మ్యాచ్లో విజయం సాధించి.. మూడు టీ20ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.చదవండి: బంగ్లాదేశ్ అడ్డుపుల్ల.. అఫ్గాన్కు షాక్! -
పాక్తో సిరీస్కు ఎంపిక.. ఆడేందుకు విండీస్ ప్లేయర్ నిరాకరణ!
పాకిస్తాన్తో టెస్టు సిరీస్కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు శుక్రవారం జట్టును ప్రకటించింది. అయితే వ్యక్తిగత కారణాల రీత్యా విండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ పాక్తో సిరీస్కు దూరమైనట్లు విండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఒకటి ఉంది. పాకిస్తాన్తో మ్యాచ్లు ఆడడం తనకు ఇష్టం లేదన్న కారణంగానే, జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ అల్జారీ జోసెఫ్ ఆడేందుకు నిరాకరించాడని విండీస్ కోచ్ డారెన్ సామీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అల్జారీ వ్యక్తిగత కారణాలతో సిరీస్ నుంచి తప్పుకోలేదని, పాక్తో మ్యాచ్లు ఆడేందుకు అతడు నిరాకరించడంతో జట్టు నుంచి తప్పించాల్సి వచ్చిందని సామీ పేర్కొన్నాడు. జోసెఫ్ లేకపోవడం విండీస్కు పెద్ద లోటు అని, కానీ తమ జట్టు పాక్పై రాణిస్తుందని సామీ ధీమా వ్యక్తం చేశాడు. జట్టు ఎంపిక అనంతరం కోచ్ డారెన్ సామీ మీడియాతో మాట్లాడాడు. జోసెఫ్ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సామీ మాట్లాడుతూ.. ‘అల్జారీ జోసెఫ్ పాక్తో ఆడేందుకు నిరాకరించిన విషయం నా పరిధిలో లేదు. సెంట్రల్ కాంట్రాక్ట్లో ఉన్నఒక ఆటగాడు ఇలా జట్టు ఎంపికను తిరస్కరించే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా లేదా పరిష్కారాలు కనుగొనాలన్నా అది బోర్డు డైరెక్టర్లకే వదిలేస్తున్నా’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. 29 ఏళ్ల అల్జారీ జోసెఫ్ ఇటీవలే గాయం నుంచి కోలుకున్నాడు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్లో ఆడాడు. రెండు మ్యాచులలో 6 వికెట్లు తీశాడు. ఇప్పటివరకు అల్జారీ జోసెఫ్ వెస్టిండీస్ తరఫున 42 టెస్టులు ఆడాడు. ఇందులో ఏకంగా 130 వికెట్లు పడగొట్టాడు. 87 వన్డేల్లో 141, 45 టీ20లలో 62 వికెట్లు తీశాడు. మూడు ఫార్మాట్లలోనూ కీలక ప్లేయర్గా కొనసాగుతున్నాడు. వెస్టిండీస్, పాక్ మధ్య తొలి టెస్టు శనివారం ప్రారంభం కానుంది. రెండో టెస్టు ఆగస్టు 2 నుంచి జరుగుతుంది. -
బంగ్లాదేశ్ అడ్డుపుల్ల.. ఆఫ్గన్తో టీ20 సిరీస్ వాయిదా?
టీమిండియాతో ఢిల్లీ వేదికగా చారిత్రక టీ20 సిరీస్ ఆడాలని భావించిన అఫ్గానిస్తాన్కు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. సెప్టెంబర్లో జరగాల్సిన టీ20 సిరీస్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో బంగ్లాదేశ్ కూడా తమ దేశంలో టీమిండియాతో వైట్బాల్ టూర్ ప్లాన్ చేయనుండడమే వాయిదాకు కారణమని తెలుస్తోంది. అయితే దీనిపై ఇరు దేశాల క్రికెట్ బోర్డులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. మరోవైపు అఫ్గానిస్తాన్లో రాజకీయ అస్థిరత కారణంగానే ఆ జట్టు తమ మ్యాచ్లను యూఏఈ లేదా భారత్ వేదికగా ఆడాలని నిర్ణయిం చుకుంది. ఈ నేపథ్యంలోనే టీమిండియాతో టీ20 సిరీస్కు ప్లాన్ చేసింది. ఢిల్లీ వేదికగా ప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో మ్యాచ్ల షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఈ సిరీస్కు అఫ్గానిస్తాన్ హోస్ట్గా వ్యవహరిస్తుండగా, సొంతగడ్డపై టీమిండియా పర్యాటక జట్టుగా మ్యాచ్లు ఆడనుండడం విశేషం.బంగ్లాదేశ్ అడ్డుపుల్ల..కొన్నాళ్ల కిందట భారత్తో అంటీముట్టనట్లుగా వ్యవహరించిన బంగ్లాదేశ్ ఇప్పుడు మాత్రం మనతో సంబంధాలు తిరిగి బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా సౌతాఫ్రికా వేదికగా జరిగిన 18వ బ్రిక్స్ సమావేశాల్లోనూ బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ భారత్తో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే క్రికెట్తోనే ఆ బంధాన్ని తిరిగి మొదలుపెట్టాలని బంగ్లా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే సెప్టెంబర్ 1 నుంచి 13 మధ్య టీమిండియా తమ గడ్డపై ఆరు మ్యాచ్ల వైట్ బాల్ సిరీస్ (మూడు వన్డేలు, మూడు టీ20లు) ఆడేలా ఇప్పటికే బీసీసీఐకి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఒకవేళ భారత ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వస్తే బీసీసీఐ బంగ్లాదేశ్ టూర్కు పచ్చజెండా ఉపనుంది. ఒకవేళ బీసీసీఐ ఆమోదం పొందితే మాత్రం అదే సమయంలో జరగాల్సిన ఆఫ్గన్తో టీ20 సిరీస్ వెనక్కి వెళ్లే అవకాశాలున్నాయి. సెప్టెంబర్ 24 నుంచి ఆసియా గేమ్స్ ఉండడం, ఆ తర్వాత సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్తో సిరీస్ ఉండడంతో అఫ్గానిస్తాన్తో సిరీస్ నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. ఈ లెక్కన విండీస్తో సిరీస్ ముగిసిన తర్వాత అంటే నవంబర్లో ఆఫ్గన్తో టీ20 సిరీస్ ఆడే అవకాశముంటుంది.రాజకీయ వివాదం..బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడం నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. బంగ్లాలోని యువత భారత్పై విష ప్రచారాలు చేస్తూ మతోన్మాద చర్యలకు పాల్పడ్డారు. దీంతో భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ చర్యలను సీరియస్గా తీసుకుంది. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే భారత ప్రభుత్వం ఆదేశాలతో కేకేఆర్ జట్టు బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ను తొలగించింది. దీంతో ఇరుదేశాల క్రికెట్ బోర్డుల మధ్య అగ్గి రాజుకుంది. ఈ నేపథ్యంలోనే భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్లో జరిగిన టీ20 ప్రపంచకప్ ఆడలేమంటూ బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకుంది. దీనిపై అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయినప్పటికీ బంగ్లా తన వైఖరిని మార్చుకోలేదు. దీంతో ఆ టోర్నీకి బంగ్లాదేశ్ దూరంగా ఉండిపోయింది. అయితే బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికల తర్వాత తారిక్ రెహమాన్ అధికారం చేపట్టిన తర్వాత భారత్తో సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నించారు.ఈ నేపథ్యంలోనే క్రికెట్ ద్వారా భారత్తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని తారిక్ రెహమాన్ ప్రభుత్వం భావిస్తోంది. మరి భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ టూర్లో పాల్గొనేందుకు బీసీసీఐకి అనుమతి ఇస్తుందో లేదో చూడాలి.Read: బీసీసీఐ కొత్త అవార్డు.. తొలి క్రికెటర్గా తిలక్ వర్మ రికార్డు -
బీసీసీఐ కొత్త అవార్డు.. తొలి క్రికెటర్గా తిలక్ వర్మ రికార్డు
జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్లో భాగంగా తొలి టీ20లో విజయం ద్వారా టీమిండియా వరుస ఓటములకు చెక్ పెట్టింది. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన భారత్ ఆ తర్వాత వైభవ్ విధ్వంసంతో సునాయాసంగా లక్ష్యాన్ని అందుకుంది. ఇవాళ హరారే వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లోనూ గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను ఒడిసిపట్టాలని చూస్తోంది. ఇదిలా ఉంటే, జింబాబ్వే సిరీస్కు హెడ్కోచ్ గంభీర్కు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ను మెంటార్గా జట్టుతో పంపించారు. తొలి టీ20లో విజయం తర్వాత వీవీఎస్ లక్ష్మణ్ డ్రెస్సింగ్ రూమ్లో విన్నింగ్ సందేశాన్ని ఇచ్చాడు. ఈ క్రమంలో మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు డ్రెస్సింగ్ రూమ్లో అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. Photo Credit: BCCI Twitterఅయితే బీసీసీఐ ఇటీవల ‘బెస్ట్ యాటిట్యూడ్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు ప్రవేశపెట్టింది. తాజాగా ఈ అవార్డును తిలక్ వర్మ అందుకున్నాడు. తిలక్వర్మకు అవార్డు ఇవ్వడంపై లక్ష్మణ్ వివరణ ఇచ్చాడు. ‘గ్రౌండ్తో పాటు మైదానం వెలుపల కూడా తన నైపుణ్యంతో అద్భుత వైఖరి ప్రదర్శించినందుకు తిలక్ వర్మకు ఈ అవార్డు ఇస్తున్నట్లు’ లక్ష్మణ్ తెలిపాడు. ఈ నేపథ్యంలో బెస్ట్ యాటిట్యూడ్ అవార్డు అందుకున్న తొలి భారత క్రికెటర్గా తిలక్ వర్మ నిలిచాడు. తిలక్ వర్మ మాట్లాడుతూ.. ‘జట్టుకు నా నుండి ఏమి అవసరమో అది చేయడానికి నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాను, దానికోసం నా వంతు ఉత్తమ ప్రదర్శన ఇస్తాను. మరో విషయమేమిటంటే, నేను మైదానం వెలుపల చేసే కఠోర శ్రమ మైదానంలో నన్ను మరింత మెరుగ్గా ఆడేలా చేస్తుంది. ఈ అవార్డు ఇచ్చినందుకు కృతజ్ఞతలు’ అని తిలక్ తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. BCCI introduces a new 'Best Attitude of the Match' award, with Tilak Varma becoming its first-ever recipient following the 1st India vs Zimbabwe T20I at Harare!!! pic.twitter.com/FQv7VH5FDx— 𝓝𝓾𝓽𝓽𝔂𝓣𝓲𝓵𝓪𝓴 (@TilakVarmaaa) July 24, 2026Read: కాంస్యంతో మెరిసిన ‘రిక్షావోడు’ .. కామన్వెల్త్లో భారత్ బోణీ -
సిరీస్పై భారత్ గురి
హరారే: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత జట్టు తొలి టి20 సిరీస్ సాధించేందుకు విజయం దూరంలో ఉంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత జట్టుకు ఒక్క గెలుపు కూడా దక్కలేదు. జింబాబ్వేతో మూడు మ్యాచ్ల టి20 సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో టీమిండియా అలవోక విజయం అందుకుంది. అదే జోరును రెండో మ్యాచ్లోనూ కొనసాగించాలని శ్రేయస్ అయ్యర్ బృందం పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 2–0తో సొంతం చేసుకుంటుంది. తొలి మ్యాచ్లో టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మెరుపు బ్యాటింగ్తో అర్ధ సెంచరీ సాధించాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ విఫలమైనా... ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ నిలకడగా రాణించి భారత్కు 40 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని కట్టబెట్టారు. మరోవైపు జింబాబ్వే జట్టుకు బ్యాటర్లు ఆశించిన స్కోరును అందించలేకపోయారు. కెప్టెన్ సికందర్ రజాతోపాటు బెన్ కరన్, బ్రియాన్ బెనెట్, డియాన్ మైర్స్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ర్యాన్ బుర్ల్, వెస్లీ మధెవెరె, మరుమని కాస్త పోరాడటంతో జింబాబ్వే స్కోరు 100 దాటగలిగింది. జింబాబ్వే బౌలర్లు ముజరబాని, ఎన్గరావా ఫర్వాలేదనిపించినా.. జింబాబ్వే నిర్దేశించిన లక్ష్యం తక్కువగా ఉండటంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్లో నిలవాలంటే అటు బ్యాటింగ్తోపాటు ఇటు బౌలింగ్లో జింబాబ్వే రాణించాల్సి ఉంటుంది. -
అసలు మనిషేనా? ఆ షాట్లు చూసి షాక్ అయ్యా!
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లో ఎట్టకేలకు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో వైభవ్ విధ్వంసం సృష్టించాడు. 126 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో వైభవ్.. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. ఈ క్రమంలో కేవలం 18 బంతుల్లోనే తన మొట్టమొదటి హాఫ్ సెంచరీ మార్క్ను సూర్యవంశీ అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో హాఫ్ సెంచరీ సాధించి అత్యంత పిన్నవయష్కుడిగా అతడు రికార్డులకెక్కాడు. ఈ నేపథ్యంలో వైభవ్పై తన సహచర ఆటగాడు మయాంక్ యాదవ్ ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్ అద్భుతమైన ఆటగాడని, ఐపీఎల్లోనే అతడి టాలెంట్ చూశాను అని మయాంక్ అన్నాడు. కాగా ఈ మ్యాచ్లో మయాంక్ యాదవ్ కూడా అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. నాలుగు ఓవర్లలో 18 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ నిలిచాడు."వైభవ్ బ్యాటింగ్ గురుంచి ఎంత చెప్పుకొన్న తక్కువే. ఐపీఎల్లో వైభవ్కు బౌలింగ్ చేసినప్పుడు, అతడు ఆడిన షాట్లను చూసి ఆశ్చర్యపోయాను. ఇప్పుడు తనతో కలిసి ఒకే జట్టులో ఉండటం చాలా సంతోషంగా ఉంది. అతడు భవిష్యత్తులో కచ్చితంగా గొప్ప క్రికెటర్గా ఎదుగుతాడు.అతడిలో అద్భుతమైన టాలెంట్ ఉంది. ఐపీఎల్లో మా బౌలింగ్ను వైభవ్ ఉతికారేశాడు. ఈ తొలి ఇంటర్నేషనల్ హాఫ్ సెంచరీ అతడికి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే తన అరంగేట్ర సిరీస్లో అతడు అంతగా రాణించలేకపోయాడు. కానీ ఇప్పుడు జాతీయ జట్టు తరపున తొలి అర్ధశతకాన్ని సాధించాడు. ఏ ఆటగాడికైనా ఇది స్పెషల్ మూమెంటే" అని మయాంక్ పేర్కొన్నాడు.చదవండి: ఇంగ్లండ్ తదుపరి టెస్ట్ కెప్టెన్ అతడే? -
చరిత్ర సృష్టించిన జోస్ బట్లర్.. క్రిస్ గేల్ రికార్డు బ్రేక్
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ స్టార్ ఆటగాడు జోస్ బట్లర్ టీ20 క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్( అంతర్జాతీయ క్రికెట్ + లీగ్ క్రికెట్)లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా బట్లర్ నిలిచాడు.'ది హండ్రెడ్ 2026' టోర్నీలో భాగంగా లార్డ్స్ వేదికగా లండన్ స్పిరిట్తో జరిగిన మ్యాచ్లో బట్లర్ 10 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. ఇప్పటివరకు బట్లర్ టీ20ల్లో 14,572 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(14,562) పేరిట ఉండేది.తాజా మ్యాచ్తో గిల్ను బట్లర్ వెనక్కి నెట్టాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్(14,803 పరుగులు) అగ్రస్ధానంలో ఉన్నాడు. పొలార్డ్ కంటే బట్లర్ కేవలం 231 పరుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. రాబోయే మ్యాచ్ల్లో ఇదే జోరు కొనసాగిస్తే పొలార్డ్ను దాటేసి నంబర్-1 స్థానానికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. లండన్ స్పిరిట్పై 7 పరుగుల తేడాతో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ సంచలన విజయం సాధించింది. లుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లండన్ స్పిరిట్ను మాంచెస్టర్ 131 పరుగులకే కట్టడి చేసింది.చదవండి: ఇంగ్లండ్ తదుపరి టెస్ట్ కెప్టెన్ అతడే? -
ఇంగ్లండ్ తదుపరి టెస్ట్ కెప్టెన్ అతడే?
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను సీనియర్ బ్యాటర్ జో రూట్ మరోసారి చేపట్టే అవకాశముంది. న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ తర్వాత ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, స్టార్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తమ టెస్టు జట్టు పగ్గాలను సీనియర్ బ్యాటర్ జోరూట్కు మరోసారి అప్పగించేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సిద్దమైనట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాతో జరగబోయే ప్రతిష్టాత్మక యాషెస్ హోమ్ సిరీస్ వరకు రూట్ను పూర్తిస్థాయి కెప్టెన్గా కొనసాగించాలని ఈసీబీ భావిస్తున్నట్లు'ది అథ్లెటిక్' తమ కథనంలో పేర్కొంది. అతడి డిప్యూటీగా హ్యారీ బ్రూక్ వ్యవహరించనున్నాడు.కివీస్తో జరిగిన రెండో టెస్టులో కూడా ఇంగ్లండ్ కెప్టెన్గా రూట్ బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే ఈ మ్యాచ్లో ఇంగ్లీష్ ఇంగ్లీష్ 253 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చూసింది. ఈ మ్యాచ్ ఫలితం పక్కన పెడితే జో రూట్కు కెప్టెన్గా అపారమైన అనుభవం ఉంది.రూట్ గతంలో 2017 ఫిబ్రవరి నుంచి 2022 ఏప్రిల్ వరకు సుదీర్ఘకాలం పాటు ఇంగ్లండ్ టెస్టు జట్టుకు సారథ్యం వహించారు. రూట్ మొత్తం 65 టెస్టుల్లో ఇంగ్లాండ్ను నడిపించగా.. అందులో 27 విజయాలు, 27 ఓటములు ఉన్నాయి. ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్ల్లో గెలిపించిన కెప్టెన్గా, అలాగే అత్యధిక మ్యాచ్ల్లో ఓడిపోయిన కెప్టెన్గా రెండూ రూట్ పేరిటే ఉండటం గమనార్హం. ఆటగాడిగా రూట్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రూట్ (14,114*) రెండో స్ధానంలో ఉన్నాడు. అగ్రస్ధానంలో ఉన్న సచిన్ టెండూల్కర్ (15,921 పరుగులు) కంటే రూట్ కేవలం 1,808 పరుగుల దూరంలో ఉన్నాడు.కాగా కివీస్తో సిరీస్ అనంతరం బ్రెండన్ మెక్కల్లమ్ను కూడా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఈసీబీ తప్పించింది. అతడి స్దానంలో మాజీ ఓపెనర్ మార్కస్ ట్రెస్కోథిక్ తాత్కాలిక హెడ్ కోచ్గా వ్యవహరించనున్నాడు. ఇంగ్లండ్ తమ తదుపరి సిరీస్లో స్వదేశంలో మూడు టెస్ట్లు ఆడనుంది. -
‘అదొక పెద్ద రిస్క్.. అయినా ఆ జట్టును వీడాను’
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాజస్తాన్ రాయల్స్ను వీడటం అతి పెద్ద రిస్క్ అని తెలిసినప్పటికీ.. తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నానన్నాడు. తన భార్య, కుటుంబంతో ఈ విషయం గురించి సుదీర్ఘంగా చర్చించానని.. అయితే, జట్టును వీడటమే సరైందని అనిపించిందన్నాడు.ట్రేడింగ్ ద్వారా కాగా ఐపీఎల్-2026 ఆరంభానికి ముందు సంజూ రాజస్తాన్ను వీడిన సంగతి తెలిసిందే. కెప్టెన్గా రాయల్స్ను 2022లో ఫైనల్కు చేర్చిన సంజూ.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో జట్టును వీడేందుకు సిద్ధమయ్యాడని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ సంజూను పొందేందుకు రాజస్తాన్కు రవీంద్ర జడేజా, సామ్ కరన్ను రాజస్తాన్కు ట్రేడ్ చేసింది.సంజూ ధర రూ. 18 కోట్లకు సమానంగా చెల్లించి అతడిని సీఎస్కే ట్రేడ్ చేసుకుంది. అయితే, టీ20 ప్రపంచకప్-2026 హీరోగా నిలిచిన సంజూ.. చెన్నై జట్టు తరఫున ఐపీఎల్-2026 ఆరంభంలో మాత్రం తేలిపోయాడు. ఆ తర్వాత సెంచరీలతో సత్తా చాటి ఫామ్లోకి వచ్చాడు.అతి పెద్ద రిస్క్ అని తెలుసుతాజాగా ఈ విషయాల గురించి సంజూ శాంసన్ జియోస్టార్తో మాట్లాడాడు. ‘‘రాజస్తాన్ రాయల్స్ను వీడటం అతి పెద్ద రిస్క్ అని తెలుసు. అయితే, ఒక్కసారి మన మనసులోని మాటను ఫ్రాంఛైజీకి చెప్పిన తర్వాత మళ్లీ వెనక్కి తీసుకోవడం కుదరదు. నేను ఆ జట్టును వీడటానికి రెండు కారణాలు ఉన్నాయి.ముందుగా.. అంటే 2025లోనే నేను రాజస్తాన్ను వీడాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయం గురించి నా భార్య, కుటుంబంతో దాదాపు మూడు వారాల పాటు చర్చించాను. వాళ్లు కూడా రిస్క్ ఎందుకు అన్నారు.నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువఅయితే, నేను మాత్రం ఆఖరికి ఇదే సరైన నిర్ణయం అని భావించాను. ఇక రెండో కారణం.. నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. మళ్లీ సున్నా నుంచి మొదలుపెట్టడానికి కూడా నేను సిద్ధంగానే ఉంటాను. చాలా మంది నా బ్యాటింగ్ స్టైల్.. చెన్నైలోని స్లో చెపాక్ వికెట్కు సరిపోదని చెప్పారు. అయినా సరే నేను ఆ జట్టులో చేరేందుకు మొగ్గుచూపాను. ‘ఇప్పుడు నీకు 30 ఏళ్లు.. ఏదైతే అది అయింది’ అని నా మనసుకు సర్దిచెప్పుకొన్నాను. నాకు అక్కడ కొత్త శక్తి లభించినట్లయింది. అయితే, ఆరంభంలో నేను తడబడ్డా. మూడు మ్యాచ్లలో విఫలమయ్యాను. జట్టు కూడా ఓడిపోయింది. వరల్డ్కప్లో సత్తా చాటిన తర్వాత ఇలా జరగడం పూర్తిగా నిరాశపరిచింది. మేనేజ్మెంట్తో పాటు మహీ భాయ్ కూడా!అయితే, ఆ పరిస్థితుల్లో మేనేజ్మెంట్ నాకు మద్దతుగా నిలిచింది. సహచర ఆటగాళ్లు కూడా ముందులానే నన్ను గౌరవించారు. నాపై నమ్మకం ఉంచారు. మహి భాయ్ (మహేంద్ర సింగ్ ధోని) కూడా నాకు అండగా నిలిచాడు. నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు’’ అని సంజూ శాంసన్ భావోద్వేగానికి లోనయ్యాడు.చదవండి: నేనింకా పిల్లాడినే.. ఆ అర్హత లేదు: వైభవ్ -
భేష్.. గెలిచారు!.. మరి మీ ఐదో బౌలర్ ఎవరు?
టీమిండియా టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఎట్టకేలకు విజయాల ఖాతా తెరిచాడు. అతడి నాయకత్వంలో జింబాబ్వేతో తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా ఏడు మ్యాచ్ల తర్వాత శ్రేయస్ అయ్యర్ తొలిసారి గెలుపు రుచిచూశాడు.హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా గురువారం నాటి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా.. జింబాబ్వేను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. భారత బౌలర్లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయిన జింబాబ్వే.. 125 పరుగులకే పరిమితమైంది.ఏడు వికెట్ల తేడాతోఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ మూడు వికెట్లు నష్టపోయి 13.2 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. తద్వారా ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించి మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే, ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించినప్పటికీ తుదిజట్టు కూర్పుపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.మరి మీ ఐదో బౌలర్ ఎవరు?‘‘జట్టులో కేవలం నలుగురు బౌలర్లు.. పేసర్లు ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అశోక్ శర్మ.. స్పిన్నర్ రవి బిష్ణోయి మాత్రమే ఉన్నారు. మరి మీ ఐదో బౌలర్ ఎవరు?.. దీనికి జవాబు శివం దూబే అంటారేమో!.. మరి ఆరో బౌలర్?.. ఎవరూ లేరు.ఆరో బౌలర్ లేకుండానే టీమిండియా బరిలోకి దిగింది. నిజానికి శివం దూబే ఆల్రౌండర్ కదా!.. అతడు ఈసారి బంతితో కాస్త మెరుగ్గానే రాణించాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్లో 32 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. నిజంగా ఇది పెద్ద విషయమేమంచి క్యాచ్ కూడా పట్టాడు. ఏదేమైనా నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేయించడం ద్వారా యాజమాన్యం అతడిపై పూర్తి విశ్వాసం కనబరిచింది. నిజంగా ఇది పెద్ద విషయమే.సరైన నిర్ణయంఇక మయాంక్ యాదవ్తో బౌలింగ్ ఎటాక్ ఆరంభించి కెప్టెన్ శ్రేయస్ మంచి పని చేశాడు. అశోక్ శర్మను కూడా ముందుగానే పంపించడం సరైన నిర్ణయం. ఏదేమైనా వీళ్లిద్దరిని జట్టులో చూడటం ఎంతో బాగుంది. ముఖ్యంగా మయాంక్ గాయం నుంచి కోలుకుని రెండేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు. నిలకడగా బౌలింగ్ చేశాడు’’ అని కామెంటేటర్ ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా యూకే పర్యటనతో భారత టీ20 జట్టు కెప్టెన్గా శ్రేయస్ ప్రయాణం మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా తొలుత ఐర్లాండ్ చేతిలో 2-0, ఇంగ్లండ్ చేతిలో 4-0తో టీమిండియా వైట్వాష్ అయింది.చదవండి: పిల్లాడినే.. నాకు ఆ అర్హత లేదు: వైభవ్ -
వెస్టిండీస్కు భారీ షాక్.. ఎగిరి గంతేస్తున్న పాకిస్తాన్!
స్వదేశంలో పాకిస్తాన్తో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు రోస్టన్ ఛేజ్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, జోమెల్ వారియోకన్ వైస్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్ జోషువా బిషప్ తొలిసారిగా విండీస్ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 26 ఏళ్ల బిషప్ గడిచిన మూడు వెస్టిండీస్ ఛాంపియన్షిప్ సీజన్లలో ఏకంగా 91 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్లు పిలుపునిచ్చారు.గడిచిన మూడు వెస్టిండీస్ ఛాంపియన్షిప్ సీజన్లలో ఈయన 91 వికెట్లు తీసి అత్యుత్తమ బౌలర్గా నిలిచాడు. డొమెస్టిక్ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేసిన లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్ జోషువా బిషప్ తొలిసారిగా విండీస్ టెస్టు జట్టులోకి పిలుపు అందుకున్నాడు. అదేవిధంగా న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో తొడకండరాల గాయానికి గురైన ఓపెనర్ జాన్ కాంప్బెల్.. పాక్తో టెస్ట్లకు దూరమయ్యాడు.అతడి స్ధానంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కిర్క్ మెకెంజీకి సెలక్టర్లు అవకాశమిచ్చారు. మరోవైపు స్టార్ పేసర్ అల్జారీ జోసెఫ్ వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్కు దూరమయ్యాడు. ఇది నిజంగా కరేబియన్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి. జోషఫ్ వంటి స్టార్ బౌలర్ జట్టులో లేకపోవడంతో విండీస్ గడ్డపై పాక్ బ్యాటర్లు పండగ చేసుకోనున్నారు.కాగా ఆల్రౌండర్ కిమో పాల్ తిరిగి జట్టులోకి వచ్చాడు. కేమర్ రోచ్, జేడెన్ సీల్స్, షమర్ జోసెఫ్లు ఫాస్ట్ బౌలర్లగా ఉన్నారు. ఈ సిరీస్లోని మొదటి టెస్టు మ్యాచ్ జూలై 25 నుంచి 29 వరకు టారోబాలోని 'బ్రియన్ లారా క్రికెట్ అకాడమీ' మైదానంలో జరగనుంది. ఈ వేదికపై అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ జరగనుండడం ఇదే తొలిసారి కావడం విశేషం. -
డీఎస్పీలుగా భారత క్రికెటర్లు
టీమిండియా ఫాస్ట్ బౌలర్లు ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్లకు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఇద్దరు క్రికెటర్లను బీహార్ ప్రభుత్వం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) హోదాతో సత్కరించింది. పాట్నాలోని 'ఎనర్జీ ఆడిటోరియం'లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి వీరిద్దరికీ నియామక పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా వారిద్దరూ అంతర్జాతీయ స్ధాయిలో బీహార్కు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారని సమ్రాట్ చౌదరి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్, క్రీడా శాఖ మంత్రి శ్రేయసి సింగ్లు కూడా పాల్గొన్నారు. కాగా ముకేష్, ఆకాష్ దీప్ బీహార్లో జన్మించినప్పటికి దేశవాళీ క్రికెట్లో మాత్రం బెంగాల్కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.ముఖేష్ కుమార్ 2023లో వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు. ఇదే టూర్లో మొత్తం మూడు ఫార్మాట్లలోనూ డెబ్యూ చేశాడు. అయితే అతడు నిలకడగా రాణించకపోవడంతో జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. కానీ దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్లో మాత్రం ఫర్వాలేదన్పిస్తున్నాడు. అతడు ఐపీఎల్-2026లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 10 మ్యాచ్లు ఆడి 6 వికెట్లు పడగొట్టాడు. ఇక ఆకాష్దీప్ విషయానికి వస్తే.. అతడు భారత టెస్ట్ జట్టులో కీలక సభ్యునిగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడతుండంతో ఆకాష్ పోటీ క్రికెట్ దూరం కానున్నాడు. ఈ గాయం కారణంగా ఐపీఎల్-2026 నుంచి కూడా అతడు వైదొలిగాడు.క్రీడకారులకు అండగా బీహార్కాగా గత కాలంగా బీహార్ ప్రభుత్వం క్రీడకారులకు అండగా ఉంటుంది. ఇప్పటివరకు క్రీడా కోటా కింద దాదాపు 180 మంది అథ్లెట్లకు వేర్వేరు ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలు కల్పించింది. సమ్రాట్ చౌదరి సర్కార్ ఈ ఏడాది 637 మందికి స్కాలర్షిప్లతో పాటు 'సక్షమ్' పథకం కింద ₹3 లక్షలు, 'ఉత్కర్ష్' పథకం కింద ₹5 లక్షల నుండి ₹20 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు. -
సిక్సర్లతో జట్టును గెలిపించిన భారత బ్యాటర్!
హండ్రెడ్ కాంపిటీషన్ 2026లో భారత మహిళా బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా భారత వికెట్కీపర్ రిచా ఘోష్ రెండు భారీ సిక్సర్లతో తన జట్టును విజయతీరాలకు చేర్చడం మ్యాచ్లో హైలైట్గా నిలిచింది. 81 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మాంచెస్టర్ రిచా ( 5 బంతుల్లో 15 నాటౌట్, రెండు సిక్సర్లు) ధాటికి 59 బంతుల్లోనే ఛేదించి 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మిగిలినవారిలో పేజ్ స్కోఫీల్డ్ (15 బంతుల్లో 22 నాటౌట్), మెగ్ లానింగ్ (24 బంతుల్లో 21) రాణించారు. అంతకముందు లండన్ స్పిరిట్ వుమెన్ 91 బంతుల్లో 80 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ చార్లెట్ డీన్ (14), చారిస్ పవెలి (13) పర్వాలేదనిపించారు. మాంచెస్టర్ బౌలర్లలో రియానా మెక్డొనాల్డ్ 4 వికెట్లతో సత్తా చాటింది.ఇక పురుషుల క్రికెట్లో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఏడు పరుగుల తేడాతో లండన్ స్పిరిట్పై విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ 100 బంతుల్లో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. టిమ్ సిఫెర్ట్ (45 బంతుల్లో 67) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం లండన్ నైట్స్ 100 బంతుల్లో 6 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. లివింగ్ స్టోన్ (40 బంతుల్లో 69 నాటౌట్) అజేయంగా నిలిచినప్పటికీ జట్టును గెలిపించకలేకపోయాడు. Power-hitting at its finest! 💥#RichaGhosh dispatches two massive sixes to power Manchester Super Giants to a comfortable win over London Spirit! 🔥#TheHundred 2026 👉 London Spirit vs Manchester Super Giants | LIVE NOW! pic.twitter.com/dMeQaYE6Ol— Star Sports (@StarSportsIndia) July 23, 2026Read: ప్లాన్ అదిరింది.. మెస్సీ రిటైర్మెంట్ అప్పుడే! -
‘అతడి కెప్టెన్సీలో నాకు పూర్తి స్వేచ్ఛ’
దాదాపు రెండేళ్ల తర్వాత టీమిండియాలో పునరాగమనం చేశాడు మయాంక్ యాదవ్. ఐపీఎల్లో సత్తా చాటిన ఈ ‘ఫాస్టెస్ట్’ బౌలర్.. 2024లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత గాయాల కారణంగా కనుమరుగైపోయాడు. తాజాగా జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భగా మయాంక్ రీఎంట్రీ ఇచ్చాడు.హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా గురువారం నాటి మ్యాచ్లో పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు రెండు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. తొలి బంతికే జింబాబ్వే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ను డకౌట్ చేసిన మయాంక్.. వన్డౌన్ బ్యాటర్ డియోన్ మైర్స్ (6)ను కూడా అవుట్ చేశాడు. నాలుగు ఓవర్ల కోటాలో 24 ఏళ్ల ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్.. 18 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.Aate hi kaam shuru kar diye 🔥💪Watch it LIVE only on FanCode! 🇮🇳 👇https://t.co/q6VBxaRJz3#ZIMvIND #RokoNahiThoko #MayankYadav pic.twitter.com/Pg9RugnnTR— FanCode (@FanCode) July 23, 2026గొప్పగా అనిపించిందితద్వారా టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో మయాంక్ యాదవ్ స్పందిస్తూ.. ‘‘రెండేళ్లు జట్టుగా దూరంగా ఉండటం నా జీవితంలో అత్యంత కష్టకాలం. అప్పుడు నాకు 22-23 ఏళ్ల మధ్య వయసు. అంత చిన్నవయసులోనే గాయాల వల్ల సుదీర్ఘకాలం ఆటకు దూరం కావడం తీవ్ర ప్రభావం చూపింది.అయితే, దేశానికి ఆడటం గొప్ప విషయం. అదే స్ఫూర్తిగా ముందుకు సాగి సవాళ్లను అధిగమించాను. జింబాబ్వేలో పిచ్లు ఫాస్ట్ బౌలర్లకు సహకరిస్తాయని విన్నాను. నేను హరారేలో ఆడటం ఇదే మొదటిసారి. గొప్పగా అనిపించింది. జట్టు విజయానికి నా వంతు సహకారం అందించాను’’ అని హర్షం వ్యక్తం చేశాడు.అతడి కెప్టెన్సీలో నాకు పూర్తి స్వేచ్ఛఅదే విధంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్పై మయాంక్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. ‘‘అతడి కెప్టెన్సీలో ఆడటం ఇదే తొలిసారి. మ్యాచ్కు ముందు మేము ఎక్కువగా మాట్లాడుకోలేదు కూడా!.. అయితే, మ్యాచ్ సమయంలో బౌలర్లపై అతడు పూర్తి నమ్మకం ఉంచాడు.నాకు నచ్చినట్లుగా బౌలింగ్ చేయమని చెప్పాడు. అతడూ కొన్ని సలహాలు ఇచ్చాడు. సారథి ఇచ్చిన ధైర్యంతో నేను ముందుకు సాగాను. అతడి కెప్టెన్సీలో నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు అనిపించింది’’ అని మయాంక్ యాదవ్ చెప్పుకొచ్చాడు. కాగా బంగ్లాదేశ్తో 2024 నాటి టీ20 సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన మయాంక్ యాదవ్.. ఇప్పటికి నాలుగు మ్యాచ్లు ఆడి ఆరు వికెట్లు పడగొట్టాడు.చదవండి: నేనింకా పిల్లాడినే.. క్రెడిట్ నాకు ఇవ్వొద్దు: వైభవ్ -
సొంతగడ్డపై పర్యాటక జట్టుగా టీమిండియా!
టీమిండియా విచిత్ర పరిస్థితిని ఎదుర్కోనుంది. సొంతగడ్డ మీదే పర్యాటక జట్టుగా మ్యాచ్లు ఆడనుంది. అవును.. మీరు చదివింది కరెక్టే!.. ఇంతకీ సంగతి ఏమిటంటే.. అఫ్గానిస్తాన్కు స్వదేశంలో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించే పరిస్థితులు లేవు.ఇప్పటికే పలు మ్యాచ్లు ఈ నేపథ్యంలో భారత్ అఫ్గాన్ క్రికెట్ బోర్డు (ACB)కు అండగా నిలుస్తోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సహకారంతో ఏసీబీ భారత్లో ఆతిథ్య దేశంగా తమ మ్యాచ్లు నిర్వహించుకుంటోంది. డెహ్రాడూన్, గ్రేటర్ నోయిడా, లక్నోలను తమ హోంగ్రౌండ్లుగా గతంలో ఎంచుకుంది. అంతేకాదు.. న్యూజిలాండ్తో ఏకైక టెస్టుకు కూడా షెడ్యూల్ను ఖరారు చేసుకుంది. అయితే, ఒక్క బంతి పడకుండానే ఈ మ్యాచ్ రద్దై పోయింది. తాజాగా టీమిండియాకే భారత్లో ఆతిథ్యం ఇచ్చేందుకు అఫ్గాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఢిల్లీలో అఫ్గాన్- భారత్ సిరీస్టీమిండియా- శ్రీలంక టెస్టు సిరీస్ ... ఆసియా క్రీడలు-2026 మధ్య విరామంలో టీమిండియా- అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆగష్టు 27 నుంచి భారత్- శ్రీలంక టెస్టు సిరీస్ మొదలుకానుండగా.. ఆసియా క్రీడలకు సెప్టెంబరు 24న తెర లేవనుంది.ఈ క్రమంలో సెప్టెంబరు 13 నుంచి టీమిండియాతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు అఫ్గాన్ బోర్డు ప్రణాళిక రచించినట్లు సమాచారం. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక అని తెలుస్తోంది. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో కథనం వెలువరించింది.గెలుపు బోణీఇదిలా ఉంటే.. ఇటీవలే అఫ్గాన్ జట్టు భారత్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆతిథ్య టీమిండియాతో ఏకైక టెస్టులో ఓడిపోయిన అఫ్గాన్.. మూడు వన్డేల సిరీస్లో 0-3తో క్లీన్స్వీప్ అయింది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026లో చాంపియన్గా నిలిచిన తర్వాత విదేశీ పర్యటనలో భాగంగా తొలిసారి టీ20 సిరీస్ ఆడిన టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది.పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్వాష్ అయిన శ్రేయస్ సేన.. ఆ తర్వాత ఇంగ్లండ్ చేతిలో 4-0తో క్లీన్స్వీప్ అయింది. తాజాగా జింబాబ్వే గడ్డ మీద గురువారం నాటి తొలి టీ20లో గెలిచి ఎట్టకేలకు.. ఏడు మ్యాచ్ల తర్వాత తొలి విజయం సాధించింది.చదవండి: విజయానికి క్రెడిట్ నాకు ఇవ్వొద్దు.. ఆ అర్హత లేదు: వైభవ్ -
‘నేనింకా పిల్లాడినే.. అందుకు అర్హుడిని కాను’
జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. తొలి టీ20 మ్యాచ్లో బౌలర్లు రాణించగా, ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మెరుపు ఫిఫ్టీ సాధించడంతో టీమిండియా సునాయాస విజయాన్ని అందుకుంది. అయితే మ్యాచ్ విజయంలో తన పాత్రేమి లేదని, నిజానికి బౌలర్లే మ్యాచ్ విన్నర్లంటూ వైభవ్ పేర్కొన్నాడు. తానింకా నేర్చుకునే దశలోనే ఉన్నానని.. గెలుపునకు అర్హుడిని కాదని వెల్లడించాడు.మ్యాచ్ విజయం తర్వాత బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైభవ్ మాట్లాడుతూ.. ‘కెరీర్ ప్రారంభంలో ఇలాంటి ఇన్నింగ్స్ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా గొప్పగా బ్యాటింగ్ చేయడానికే ప్రయత్నిస్తాను. జట్టు కోసం ఎప్పుడూ నా బెస్ట్ ఇచ్చేందుకే కష్టపడుతుంటా. జింబాబ్వేపై విజయంలో నేను క్రెడిట్ తీసుకోలేను. దానికి నేను అర్హుడిని కాను. నేనింకా నేర్చుకునే దశలోనే ఉన్నా’ అని వైభవ్ చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్లో ఫిఫ్టీ అనంతరం చేతి వేళ్లలో 'A' అక్షరం చూపిస్తూ సెలబ్రేషన్ చేసుకోవడంపై కూడా వైభవ్ వివరణ ఇచ్చాడు. ''A' అనేది మా అమ్మ పేరులో (Aarti Suryavanshi) మొదటి అక్షరం. నా హాఫ్ సెంచరీ సెలబ్రేషన్ను అందుకే A సంకేతంతో చూపించాను. నా కెరీర్లో సాధించిన తొలి అంతర్జాతీయ అర్ధసెంచరీని నా కుటుంబానికి, కోచ్లతో పాటు నా జర్నీలో సహకరించిన ప్రతీ ఒక్కరికి ఈ ఇన్నింగ్స్ను అంకితమి స్తున్నా.' అని వెల్లడించాడు. హరారే వేదికగా జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులకు పరిమితమైంది. అనంతరం భారత్ 13.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. వైభవ్ 19 బంతుల్లో ఫిఫ్టీ సాధించగా, ఇషాన్ కిషన్ 35 పరుగులు చేశాడు. ఆఖర్లో శ్రేయస్ అయ్యర్ (28 నాటౌట్) జట్టును గెలిపించాడు. ఇరుజట్ల మధ్య రెండో టీ20 శనివారం జరగనుంది.Read: అతడికి 2 నెలలే డెడ్లైన్.. రోహిత్, కోహ్లికి మంచి రోజులు! -
AUS vs ENG: భారత్లో యాషెస్ టెస్టు మ్యాచ్!
క్రికెట్లో అత్యంత ప్రాచీన, ప్రతిష్టాత్మక, చరిత్రాత్మక సిరీస్లలో యాషెస్ టెస్టు సిరీస్ ఒకటి. ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ పోరు 1882లో మొదలైంది. నాటి నుంచి ప్రతి రెండేళ్లకొకసారి ఇరుజట్ల మధ్య ఈ సిరీస్ను నిర్వహిస్తున్నారు.ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (FTP)లో భాగంగా జరిగే ఈ సిరీస్కు ఆసీస్, ఇంగ్లండ్ చెరోసారి ఆతిథ్యం ఇవ్వడం పరిపాటి. అయితే, ఈ చారిత్రక సిరీస్లో భాగంగా ఒక మ్యాచ్ను భారత గడ్డపై నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) సంకేతాలు ఇచ్చింది.బీసీసీఐతో అనుబంధంఆసీస్ క్రికెట్ బోర్డు సీఈఓ టాడ్ గ్రీన్బర్గ్ ఈ విషయం గురించి బీబీసీ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డుతో మా బంధం బలమైనది. అదే విధంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)తోనూ మాకు సత్సంబంధాలు ఉన్నాయి.ఇండియాలో యాషెస్ మ్యాచ్ నిర్వహించేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇప్పుడే దీని గురించి మేమేమీ ప్రణాళికలు రచించడం లేదు. కానీ ఈ అంశం అయితే మా పరిశీలనలో ఉంది. ఆసీస్- ఇంగ్లండ్- ఇండియా మధ్య టెస్టు క్రికెట్కు ఎంతో ఆదరణ ఉంది.ప్రపంచవ్యాప్తంగా ఈ మూడు జట్ల మ్యాచ్లకు అభిమానులు ఉన్నారు. వారిని అలరించడం కోసం.. టెస్టు క్రికెట్ అభివృద్ధి కోసం మేము ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాము’’ అని గ్రీన్బర్గ్ స్పష్టం చేశారు.డిసెంబరులో బీబీఎల్ మ్యాచ్ఆసీస్ టీ20 లీగ్ బిగ్ బాష్ లీగ్ (BBL) తాజా ఎడిషన్ ఆరంభ మ్యాచ్ను భారత్లో నిర్వహిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మెల్బోర్న్ రెనెగేడ్స్- పెర్త్ స్కార్చర్స్ మధ్య డిసెంబరు 12, 2026న ఈ మ్యాచ్ జరుగనుంది.యాషెస్ 2027 షెడ్యూల్ ప్రకటనఅదే విధంగా.. ఐపీఎల్లో కొన్ని మ్యాచ్లను ఆస్ట్రేలియాలో నిర్వహించేందుకు బీసీసీఐ కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. యాషెస్ 2027 షెడ్యూల్ను ఈసీబీ ఇటీవలే ప్రకటించింది. జూన్ 18- ఆగష్టు 2 వరకు ఈ సిరీస్ జరుగుతుంది.ట్రెంట్ బ్రిడ్జ్, లార్డ్స్, ఎడ్జ్బాస్టన్, సౌతాంప్టన్, ది ఓవల్ మైదానాలు ఇందుకు వేదికలు. ఇక క్రికెట్ ఆస్ట్రేలియాకు 2029-2030 సైకిల్లో ఆతిథ్య హక్కులు వస్తాయి. కాబట్టి అప్పటికి భారత్లో ఒక మ్యాచ్ నిర్వహించినా ఆశ్చర్యం లేదు.చదవండి: వైభవ్ మెరుపులు -
అతడికి 2 నెలలే డెడ్లైన్.. రోహిత్, కోహ్లికి మంచి రోజులు!
టీమిండియా చీఫ్ సెలెక్టర్ పదవిలో కొనసాగుతున్న మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ఈ సెప్టెంబర్తో ముగియనున్నట్లు తెలుస్తోంది. కాగా వన్డే ప్రపంచకప్ వరకు తనను సెలెక్టర్గా కొనసాగేందుకు అవకాశమివ్వాలని అగార్కర్ చేసిన అభ్యర్థనను బీసీసీఐ పట్టించుకోనట్లుగా అనిపిస్తోంది. సెలెక్టర్గా ఎంపికైన తర్వాత టీమిండియా ఐసీసీ టైటిల్స్ సాధించినప్పటికీ అగార్కర్ విషయంలో మాత్రం విమర్శలే వ్యక్తమయ్యాయి. అందుకే అగార్కర్ను సెలెక్టర్గా కొనసాగించేందుకు బీసీసీఐ ఇష్టపడడం లేదని తెలుస్తోంది. దీంతో అతడి స్థానంలో కొత్త సెలెక్టర్ కోసం వెతుకులాటను ప్రారంభించినట్లు సమాచారం. ఇక అగార్కర్ సెలెక్టర్ పదవి నుంచి దిగిపోతే మాత్రం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు వన్డే వరల్డ్కప్ 2027 ఆడేందుకు మార్గం సుగమం అవుతుందని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మాత్రం సెప్టెంబర్ తర్వాత టీమిండియాకు కొత్త సెలెక్టర్ను చూసే అవకాశాలున్నాయి. సెప్టెంబర్ తర్వాత నుంచి జరగనున్న సిరీస్లకు కొత్త సెలెక్టర్ నేతృత్వంలోనే జట్టు ఎంపిక జరగనుంది. ఇక అజిత్ అగార్కర్ 2023లో టీమిండియా చీఫ్ సెలక్టర్గా బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జట్టులో పలు కీలక మార్పులు చేస్తూ వస్తున్నాడు. Photo Credit: BCCI Twitterఅగార్కర్ పదవీకాలంలో టీమిండియా నాలుగు ఐసీసీ టోర్నీలు ఆడింది. 2023 వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్ 2024, చాంపియన్స్ ట్రోఫీ 2025, టీ20 ప్రపంచ కప్ 2026.. వీటిల్లో మూడు టైటిళ్లు భారత జట్టు సొంతం చేసుకోవడం విశేషం. అయినప్పటికీ సెలెక్టర్గా అగార్కర్పై మాత్రం విమర్శలే రావడం గమనార్హం. జట్టు సెలక్షన్ విషయంలో అగార్కర్ తీసుకున్న పలు నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ను టీ20 జట్టుకు కెప్టెన్ చేయడం, హార్దిక్ పాండ్యకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివి అప్పట్లో తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించడంపై అభిమానులు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని మాటలు అన్నా.. తన నిర్ణయాలను మాత్రం అగార్కర్ బహిరంగంగానే సమర్థించుకుంటూ వచ్చాడు. సెలక్షన్ అనేది కేవలం ప్లేయర్ల గణాంకాలపై ఆధారపడదని, జట్టుకు సరిపోయే కాంబినేషన్, ఆటగాళ్ల పాత్రలు, వ్యూహాలు కీలకమని అగార్కర్ ప్యానెల్ నిరూపించింది. టీ20 ప్రపంచకప్తో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన కారణంగా 2025లోనే అగార్కర్ సెలెక్టర్ పదవీకాలన్ని మరో ఏడాది పొడిగించిన బీసీసీఐ మరోసారి అతడి పదవీకాలాన్న పొడిగించేందుకు సముఖత వ్యక్తం చేయడం లేదు.చదవండి: Asian Games: క్రికెట్ ‘డ్రా’ విడుదల.. భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే? -
Asian Games: క్రికెట్ ‘డ్రా’ విడుదల.. భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
ప్రతిష్టాత్మక 2026 ఆసియా గేమ్స్కు సంబంధించి క్రికెట్ షెడ్యూల్ విడుదలైంది. ఏకకాలంలో పురుషుల, మహిళల క్రికెట్మ్యాచ్ల షెడ్యూల్ను ప్రకటించారు. రెండు విభాగాల్లో టెస్టు సభ్యత్వం కలిగిన నాలుగు దేశాలు (భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్) నేరుగా క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించాయి. కాగా ఆసియా గేమ్స్ జపాన్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి.అయితే క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అటు పురుషుల.. ఇటు మహిళల క్రికెట్లో ఫైనల్ లేదా సెమీస్లోనే తలపడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మహిళల విభాగంలో క్వార్టర్ ఫైనల్లో భారత్ తమ మ్యాచ్ను జపాన్తో ఆడనుంది. ఇక పురుషుల క్రికెట్లో మాత్రం టీమిండియా పాక్తో నేరుగా సెమీస్ లేదా ఫైనల్ పోరులో తలపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.పురుషుల క్రికెట్లో ఇలా..పురుషుల టోర్నీ విషయానికొస్తే టెస్టు సభ్యత్వం కలిగిన భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్ ఆడనున్నాయి. క్వార్టర్స్లో మిగిలిన నాలుగు స్థానాల కోసం ఆరుజట్ల మధ్య లీగ్ దశ మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఈ లీగ్ దశలో గ్రూప్-ఏ నుంచి అఫ్గానిస్తాన్, జపాన్, నేపాల్ ఉండగా; గ్రూప్-బి నుంచి చైనా, మలేషియా, ఓమన్ ఉన్నాయి. లీగ్ దశలో రెండు గ్రూప్ల్లో నుంచి టాప్-2లో నిలిచిన జట్లు క్వార్టర్స్ చేరుకోనున్నాయి. క్వార్టర్స్లో గెలిచిన నాలుగు జట్లు సెమీస్లో తలపడనున్నాయి. సెమీస్లో గెలిచిన జట్లు స్వర్ణం కోసం ఫైనల్ మ్యాచ్ ఆడనుండగా, ఓడిన జట్లు కాంస్య పతక పోరు కోసం తలపడనున్నాయి. టెస్టు సభ్యత్వం కలిగినప్పటికీ అఫ్గానిస్తాన్ ప్రిలిమినరీ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది.గ్రూప్-ఏ: అఫ్గానిస్తాన్, జపాన్, నేపాల్గ్రూప్-బి నుంచి చైనా, మలేషియా, ఒమన్జపాన్తో హర్మన్ సేన అమీతుమీ..మహిళల విభాగంలోనూ ఇవే జట్లు పోటీలో ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం నేరుగా క్వార్టర్ ఫైనల్మ్యాచ్లే నిర్వహించనున్నారు. క్వార్టర్ ఫైనల్లో భారత్తో జపాన్, థాయ్లాండ్తో పాకిస్తాన్, చైనాతో బంగ్లాదేవ్, శ్రీలంకతో మలేషియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. క్వార్టర్స్లో గెలిచిన జట్లు సెమీస్లో అడుగుపెట్టనున్నాయి. సెమీస్లో గెలిచిన జట్ల మధ్య స్వర్ణ పతక పోరు జరగనుంది.మహిళల క్రికెట్లో క్వార్టర్స్ షెడ్యూల్భారత్ vs జపాన్బంగ్లాదేశ్ vs చైనాశ్రీలంక vs మలేషియాపాకిస్తాన్ vs థాయిలాండ్సెమీ-ఫైనల్స్భారత్/జపాన్ vs బంగ్లాదేశ్/చైనాశ్రీలంక/మలేషియా vs పాకిస్తాన్/థాయిలాండ్2022లో డబుల్ స్వర్ణాలు..2022 హాంగ్జౌ ఆసియా గేమ్స్లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాయి. ఆనాడు టీమిండియా పురుషుల కెప్టెన్గా రుతురాజ్ వ్యవహరించాడు. వర్షంతో ఫలితం రాకపోవడంతో అత్యధిక విజయాలు సాధించిన భారత్కు గోల్డ్ మెడల్ ఇవ్వగా, అఫ్గానిస్తాన్ వెండిని గెలుచుకుంది. ఇక హర్మన్ప్రీత్ సారథ్యంలోని మహిళల జట్టు ఫైనల్లో శ్రీలంకను ఓడించి బంగారు పతకాన్ని అందుకుంది. ఈ గేమ్స్లో పాకిస్తాన్ రెండు విభాగాల్లోనూ నాలుగో స్థానానికే పరిమితం కావడం గమనార్హం.Read: గోళీలాట మాదిరే లాన్ బౌల్స్.. కాని చిన్న ట్విస్ట్! -
ఒక్క వీడియో కాల్తో కష్టాల్లో యువ క్రికెటర్..!
డేటింగ్యాప్లో పరిచయమైన మహారాష్ట్ర క్రికెట్ జట్టు యువక్రికెటర్ను ప్రేరేపించి అర్ధనగ్నంగా మార్చి వీడియో రికార్డు చేసిన యువతి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసింది. యువక్రికెటర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈశాన్య విభాగ సెన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈనెల 17వ తేదీన కణ్ణూరు వద్ద పంచతార హోటల్లో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరులో క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో యువక్రికెటర్ మహారాష్ట్ర నుంచి నగరానికి చేరుకుని హోటల్లో ఉన్నాడు. డేటింగ్ యాప్లో పేరు నమోదు చేసుకున్న క్రికెటర్కు 17వ తేదీ రాత్రి గుర్తు తెలియని యువతి నుంచి మెసేజ్ వచ్చింది. వాట్సాప్కాల్లో మాట్లాడాలని తెలిపి నెంబర్ షేర్ చేసింది. అనంతరం ఇద్దరు వాట్సాప్ వీడియో కాల్లో మాట్లాడుకున్నారు. ఆ సమయంలో యువతి ఒంటిపై దుస్తులు తీసేసింది. క్రికెటర్ కూడా దుస్తులు తీసి అర్ధనగ్నంగా ఉండగా వీడియో రికార్డ్ చేసింది. కొద్దిసేపటి తరువాత క్రికెటర్కు ఫోన్ చేసి నగ్న వీడియో స్క్రీన్షాట్లు పంపించి డబ్బు ఇవ్వాలని బెదిరించింది. కంగారు పడిన క్రికెటర్ రూ.1,500 ఆన్లైన్లో షేర్ చేశారు. ఇంకా ఎక్కువ డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. -
విద్యార్థుల నిరసన.. నాన్న మాటలు గుర్తు చేసుకున్న సచిన్
నీట్ పేపర్ లీక్పై దేశవ్యాప్తంగా ఆగ్రహం రాజుకుంటోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసన తీవ్రరూపం దాల్చింది. ఢిల్లీ నుంచి కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో జంతర్మంతర్కు తరలివస్తూ ఆందోళనలకు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు లాఠాచార్జీ చేసినప్పటికీ విద్యార్థులు ఏమాత్రం బెదరకుండా తమ నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. విద్యార్థుల ఆందోళనకు ప్రముఖుల మద్దతు కూడా పెరుగుతూ వస్తోంది . తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విద్యార్థుల నిరసనలకు మద్దతు పలికాడు. ఎంతో కష్టపడి చదివినా ఫలితం దక్కనప్పుడు విద్యార్థులు ఆవేదన చెందడం అర్థం చేసుకోదగిన అంశమేనని పేర్కొన్నాడు. విద్యార్థులు మరోసారి ఇలా నిరాశకు లోనవ్వకుండా చూసే బాధ్యత సమాజంపై ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు సచిన్ గురువారం రాత్రి ‘ఎక్స్’లో పోస్టు చేశాడు. స్వతహాగా తన తండ్రి ప్రొఫెసర్ కావడంతో చిన్నప్పుడే తనకు నూరి పోసిన మాటలను సచిన్ మరోసారి గుర్తుచేసుకున్నాడు. ‘ఓటములు ఎదురైనా పర్వాలేదు, కానీ మోసం మాత్రం చేయకూడదు. విజయం కోసం ఎప్పుడూ అడ్డదారులు తొక్కవద్దని మా నాన్న నాకు చెప్పేవారు. సమాజంలో పెద్దలుగా, మన సంస్కృతిని సరైన మార్గంలో తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కలేదని విద్యార్థులు నిరాశ చెందడం సహజం. భవిష్యత్తులో వారికి మళ్లీ ఇలాంటి చేదు అనుభవాలు ఎదురుకాకుండా మనమందరం సమష్టిగా కృషి చేయాలి. జైహింద్’ అని సచిన్ టెండూల్కర్ ఎక్స్లో రాసుకొచ్చాడు.కేవలం ఫలితాలకే ప్రాధాన్యమిచ్చే సమాజం, ప్రతిభ కంటే అక్రమ మార్గాలనే ఎక్కువగా ఆశ్రయిస్తుందని అని సచిన్ అభిప్రాయపడ్డాడు. యువత ఆకాంక్షలను పరిరక్షించే దిశగా త్వరలోనే సరైన పరిష్కారాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.సచిన్తో పాటు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్తో పాటు కోహ్లి, శుబ్మన్ గిల్ కూడా తమ సోషల్ మీడియా వేదికగా విద్యార్థులు చేస్తున్న శాంతియుత నిరసనలకు మద్దతు ప్రకటించారు. ఇదిలాఉంటే నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై అటు పార్లమెంట్ కూడా అట్టుడుకుతోంది. పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. మరోవైపు కాక్రోచ్ జనతాపార్టీ తమ ఆందోళనలను మరింత ఉధృతం చేసింది. pic.twitter.com/3a8WRHhWIK— Sachin Tendulkar (@sachin_rt) July 23, 2026 -
ఈసారి ఓవల్లో...
లండన్: వచ్చే ఏడాది జరగనున్న ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు లండన్లోని ఓవల్ మైదానం వేదిక కానుంది. 2027 జూన్ 9 నుంచి 13 వరకు ఓవల్ గ్రౌండ్లో ఈ పోరు జరగనుందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) గురువారం వెల్లడించింది. సుదీర్ఘ ఫార్మాట్లో వరల్డ్కప్ తరహాలో నిర్వహిస్తున్న ఈ చాంపియన్షిప్ను 2021లో ప్రవేశ పెట్టారు. అప్పటి నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ ఇంగ్లండ్లోనే జరుగుతోంది. 2021లో తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీ ఫైనల్కు సౌతాంప్టన్లోని రోజ్బౌల్ మైదానం వేదిక అయింది. తుది పోరులో న్యూజిలాండ్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో భారత జట్టును ఓడించి విజేతగా నిలిచింది.ఆ తర్వాత 2023 డబ్ల్యూటీసీ ఫైనల్ లండన్లోని ఓవల్ మైదానంలో జరిగింది. ఆ్రస్టేలియా జట్టు 209 పరుగుల తేడాతో భారత జట్టుపై గెలిచి తొలిసారి టెస్టు చాంపియన్గా అవతరించింది. ఇక 2025 డబ్ల్యూటీసీ ఫైనల్ను లండన్లోని విఖ్యాత లార్డ్స్ మైదానంలో నిర్వహించారు. తెంబా బవుమా సారథ్యంలోని దక్షిణాఫ్రికా జట్టు ఐదు వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాను బోల్తా కొట్టించి ప్రపంచ టెస్టు చాంపియన్గా నిలిచింది. 2027 తర్వాత జరిగే మరో రెండు డబ్ల్యూటీసీ ఫైనల్స్ (2029, 2031) ఆతిథ్య హక్కులు కూడా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకే కేటాయించినట్లు ఐసీసీ వెల్లడించింది. అయితే వేదికలను, తేదీలను ఇంకా ఖరారు చేయలేదు. ఫార్మాట్ ఇలా... మొత్తం టెస్టులు ఆడే తొమ్మిది జట్ల మధ్య నిర్వహించే సిరీస్లకు పాయింట్లు కేటాయించి... 2025–27 మధ్య కాలంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన రెండు జట్లను ఫైనల్కు ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం ఈ పట్టికలో ఆ్రస్టేలియా 8 మ్యాచ్లాడి ఏడు విజయాలు, ఒక పరాజయంతో 87.50 విజయాల శాతంతో అగ్రస్థానంలో ఉంది. డిఫెండింగ్ చాంపియన్ దక్షిణాఫ్రికా 4 మ్యాచ్ల్లో మూడింట గెలిచి ఒక టెస్టులో ఓడి 75.00 విజయాల శాతంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ 6 మ్యాచ్ల్లో 4 విజయాలు, ఒక పరాజయం, ఒక ‘డ్రా’తో 72.22 విజయాల శాతం... బంగ్లాదేశ్ 4 మ్యాచ్ల్లో 2 విజయాలు, ఒక ఓటమి, ఒక ‘డ్రా’తో 58.33 విజయాల శాతంతో వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నాయి. ఈ క్రమంలో 9 మ్యాచ్లాడిన 4 విజయాలు, 4 పరాజయాలు, ఒక ‘డ్రా’తో 48.15 విజయాల శాతంతో భారత జట్టు ఐదో స్థానంలో ఉంది. శ్రీలంక (41.67 విజయాల శాతం), ఇంగ్లండ్ (24.36 విజయాల శాతం), వెస్టిండీస్ (15.00 విజయాల శాతం), పాకిస్తాన్ (8.33 విజయాల శాతం) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అధికారికంగా అన్నీ జట్లకు ఇంకా ఫైనల్ చేరే అవకాశలు ఉన్నాయి. త్వరలోనే ప్రారంభం కానున్న టెస్టు సీజన్లో వెస్టిండీస్తో పాకిస్తాన్... బంగ్లాదేశ్తో ఆ్రస్టేలియా... పాకిస్తాన్తో ఇంగ్లండ్.... శ్రీలంకతో భారత్ తలపడనున్నాయి. -
వైభవ్ మెరుపులు
హరారే: టి20 వరల్డ్ కప్లో విజేతగా నిలిచిన తర్వాత ఎట్టకేలకు ఈ ఫార్మాట్లో భారత్ మరో మ్యాచ్లో గెలుపు రుచి చూసింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లో ఆరు టి20ల్లో ఓడిన టీమిండియా ఇప్పుడు జింబాబ్వే పర్యటనలో బోణీ చేసింది. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు కూడా ఇదే మొదటి విజయం. గురువారం జరిగిన తొలి టి20లో భారత్ 7 వికెట్ల తేడాతో జింబాబ్వేను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. వెస్లీ మదెవెరె (34 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... మరుమని (20 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), ర్యాన్ బర్ల్ (35 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. ఒక దశలో జింబాబ్వే స్కోరు 64/5 కాగా...మదెవెరె, మరుమని ఆరో వికెట్కు 37 బంతుల్లో 58 పరుగులు చేసి ఆదుకున్నారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మయాంక్ యాదవ్ (2/18), ప్రిన్స్ యాదవ్ (2/19) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. అనంతరం భారత్ 13.2 ఓవర్లలో 3 వికెట్లకు 126 పరుగులు చేసి విజయాన్నందుకుంది. వైభవ్ సూర్యవంశీ (19 బంతుల్లో 50; 4 ఫోర్లు, 4 సిక్స్లు) కెరీర్లో తొలి అర్ధ సెంచరీ సాధించాడు. ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్లు), శ్రేయస్ అయ్యర్ (24 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు) రాణించారు. సిరీస్లో భారత్ 1–0తో ముందంజ వేయగా, రెండో టి20 శనివారం ఇదే మైదానంలో జరుగుతుంది. స్వల్ప స్కోరుకే... దాదాపు 21 నెలల తర్వాత అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడిన పేసర్ మయాంక్ ఘనంగా పునరాగమనం చేశాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే బెన్నెట్ (0)ను అవుట్ చేసి జింబాబ్వే పతనానికి శ్రీకారం చుట్టాడు. మైయర్స్ (6) వికెట్ కూడా అతని ఖాతాలోకే చేరగా, ప్రిన్స్ తన తొలి ఓవర్లో బెన్ కరన్ (10) వికెట్ తీశాడు. పవర్ప్లేలో జింబాబ్వే స్కోరు 26/3కి చేరింది. కీలక బ్యాటర్ సికందర్ రజా (4)ను దూబే పెవిలియన్కు పంపగా, బర్ల్ వికెట్ బిష్ణోయ్కు దక్కింది. ఈ దశలో మదెవెరె, మరుమని పోరాటంతో స్కోరు 100 పరుగులు దాటింది. ఆఖరి ఓవర్లో జింబాబ్వే మరో 2 వికెట్లు చేజార్చుకుంది. దూకుడైన బ్యాటింగ్... అభిషేక్ శర్మ (1) ఆరంభలోనే వెనుదిరగ్గా... కెరీర్ తొలి 3 మ్యాచ్లలో విఫలమైన వైభవ్ ఈసారి తనపై ఉన్న అంచనాలకు తగినట్లుగా చెలరేగాడు. ఐదు నెలల క్రితం ఇదే మైదానంలో అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో 80 బంతుల్లోనే 175 పరుగులు చేసిన అతను స్వేచ్ఛగా ఆడాడు. ఎన్గరవా ఓవర్లో వరుసగా 6, 4, 6 కొట్టిన అతను, ఇవాన్స్ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ బాదాడు. ముజరబాని ఓవర్లో కూడా 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన వైభవ్ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. తర్వాతి బంతికే అతను అవుటైనా... మరోవైపు కిషన్ కూడా ధాటిగా ఆడాడు. 62 బంతుల్లో జట్టు స్కోరు 100 పరుగులకు చేరింది. కిషన్ అవుటైనా... అయ్యర్, తిలక్ వర్మ (6 నాటౌట్) కలిసి మ్యాచ్ను ముగించారు.అశోక్ శర్మ@123 రాజస్తాన్ పేసర్ అశోక్ శర్మ ఈ మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టాడు. భారత్ తరఫున టి20లు ఆడిన 123వ ప్లేయర్గా అతను నిలిచాడు. ఐపీఎల్లో గుజరాత్కు ప్రాతినిధ్యం వహించిన అతను సీజన్లో ఫాస్టెస్ట్ బాల్ (154.2 కి.మీ.) వేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఒకే రోజు పుట్టిన పేసర్లు అశోక్, మయాంక్ (17/06/2002) ఈ మ్యాచ్లో తొలి బంతిని పంచుకోవడం విశేషం.15 ఏళ్ల 118 రోజులు అంతర్జాతీయ క్రికెట్లో అతి పిన్న వయసులో అర్ధసెంచరీ చేసిన బ్యాటర్గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు.స్కోరు వివరాలు జింబాబ్వే ఇన్నింగ్స్: బెన్నెట్ (సి) ఇషాన్ (బి) మయాంక్ 0; బెన్ కరన్ (సి) వైభవ్ (బి) ప్రిన్స్ 10; మైయర్స్ (సి) దూబే (బి) మయాంక్ 6; రజా (సి) (సబ్) సూర్యాంశ్ (బి) దూబే 4; బర్ల్ (సి) తిలక్ (బి) బిష్ణోయ్ 26; మదెవెరె (రనౌట్) 39; మరుమని (నాటౌట్) 27; ఇవాన్స్ (సి) అయ్యర్ (బి) ప్రిన్స్ 0; న్యూమన్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 125. వికెట్ల పతనం: 1–0, 2–19, 3–20, 4–32, 5–64, 6–122, 7–122. బౌలింగ్: మయాంక్ యాదవ్ 4–0–18–2, అశోక్ శర్మ 4–0–29–0, ప్రిన్స్ యాదవ్ 4–0–19–2, శివమ్ దూబే 4–0–32–1, రవి బిష్ణోయ్ 4–0–24–1. భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) ఇవాన్స్ (బి) ముజరబాని 1; వైభవ్ (సి) బెన్ కరన్ (బి) ఎన్గరవా 50; ఇషాన్ కిషన్ (సి) మైయర్స్ (బి) ముజరబాని 35; అయ్యర్ (నాటౌట్) 28; తిలక్ (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 6; మొత్తం (13.2 ఓవర్లలో 3 వికెట్లకు) 126. వికెట్ల పతనం: 1–23, 2–68, 3–114. బౌలింగ్: ముజరబాని 4–0–26–2, ఎన్గరవా 2.2–0–30–1, ఇవాన్స్ 2–0–26–0, న్యూమన్ 2–0–30–0, రజా 3–0–14–0. -
భయమనేది లేదు.. అతడొక అత్యద్భుతం: శ్రేయస్ అయ్యర్
టీ20ల్లో టీమిండియా ఎట్టకేలకు తిరిగి గెలుపు బాట పట్టింది. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టు నిర్ధేశించిన 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మెన్ ఇన్ బ్లూ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి కేవలం 13.2 ఓవర్లలో ఊదిపడేసింది.యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కేవలం 19 బంతుల్లో 50 పరుగులు సాధించి భారత తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్లో టీమిండియా 1-0తో ముందంజ వేసింది. ఇక ఈ కమ్బ్యాక్ విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. తన కెప్టెన్సీలో జట్టు తొలి విజయం సాధించడం సంతోషంగా ఉందని అయ్యర్ అన్నాడు."ఈ విజయం నాకు చాలా ప్రత్యేకమైనది. కెప్టెన్గా తొలి గెలుపును అందుకోవడం సంతోషాన్నిస్తోంది. ఈ మ్యాచ్లో మా బాయ్స్ అందరూ అద్భుతంగా రాణించారు. తొలుత మా బౌలర్లు పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్ చేశారు. ఈ పిచ్పై బంతి ఎక్కువగా బౌన్స్ అవుతుందని నేను ముందే పసిగట్టాను.అందుకే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాను. మయాంక్ యాదవ్ సంచలన స్పెల్ బౌలింగ్ చేశాడు. సరైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్ధి బ్యాటర్లకు ముప్పుతిప్పలు పెట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్లో వైభవ్ సూర్యవంశీ అసాధరణ ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి ఏ మాత్రం భయం లేదు. వైభవ్ బ్యాటింగ్ చేసిన తీరు నిజంగా అత్యద్భుతం. హరారే పిచ్పై అతడికి బాగా అవగాహన ఉంది. ఇదే గ్రౌండ్లో అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో 175 పరుగులు సాధించాడు. ఆ అనుభవమే ఈ మ్యాచ్లో అతడికి పనికొచ్చింది. రాబోయో రెండు మ్యాచ్లలో కూడా ఇదే జోరును కొనసాగించి సిరీస్ క్లీన్ చేస్తామని" పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో శ్రేయస్ పేర్కొన్నాడు. -
వరుస ఓటములకు బ్రేక్.. జింబాబ్వేపై టీమిండియా గ్రాండ్ విక్టరీ
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీమిండియా వరుస పరాజయాలకు బ్రేక్ పడింది. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు కూడా ఇదే తొలి విజయం కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది.భారత యువ పేసర్ మయాంక్ యాదవ్ తన రీఎంట్రీ మ్యాచ్లో అదరగొట్టాడు. మయాంక్ యాదవ్ ఇన్నింగ్స్ మొదటి బంతికే బ్రియాన్ బెనెట్ను అవుట్ చేసి షాక్ ఇచ్చాడు. తన 4 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అతడితో ప్రిన్స్ యాదవ్ రెండు, దూబే, బిష్ణోయ్ తలా వికెట్ సాధించారు.వైభవ్ వీర విహారం126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు వైభవ్ సూర్యవంశీ అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో అతడు బౌండరీల వర్షం కురిపించాడు. వైభవ్ కేవలం 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ సాధించాడు. అతడితో పాటు ఇషాన్ కిషన్(35), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(28 నాటౌట్) రాణించారు. ఫలితంగా 126 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 13.2 ఓవర్లలో ఊదిపడేసింది. మయాంక్ యాదవ్కు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఇదే వేదికగా శనివారం జరగనుంది. -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచ రికార్డు
వరుస వైఫల్యాల తర్వాత టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. జింబాబ్వేతో తొలి టీ20లో కేవలం 18 బంతుల్లోనే అర్ధ శతకం బాదాడు.తద్వారా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యంత పిన్న వయసులోనే హాఫ్ సెంచరీ చేసిన క్రికెటర్గా సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల 118 రోజుల వయసులోనే ఈ ఘనత అందుకుని ప్రపంచ రికార్డు సాధించాడు. 🇿🇼 𝐒𝐄 𝐊𝐄𝐇 𝐃𝐄𝐍𝐀 𝐒𝐎𝐎𝐑𝐘𝐀𝐕𝐀𝐍𝐒𝐇𝐈 𝐀𝐀𝐘𝐀 𝐇𝐀𝐈 🥵𝐑𝐔𝐊𝐄𝐆𝐀 𝐍𝐀𝐇𝐈, 𝐓𝐇𝐎𝐊𝐄𝐆𝐀 😎Watch it LIVE on FanCode! 🇮🇳 👇https://t.co/q6VBxaRJz3 #ZIMvIND #IndiaCricket #RokoNahiThoko pic.twitter.com/ACaAC23Zoq— FanCode (@FanCode) July 23, 2026భారత అండర్-19, ఐపీఎల్లో విధ్వంసకర బ్యాటింగ్తో అరుదైన ఫీట్లు నమోదు చేసిన వైభవ్ సూర్యవంశీ.. ఇటీవల ఇంగ్లండ్ గడ్డ మీద టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.ఇంగ్లండ్లో విఫలంఇంగ్లండ్తో రెండో టీ20 సందర్భంగా సంజూ శాంసన్ను తప్పించిన యాజమాన్యం.. వైభవ్ను అరంగేట్రం చేయించింది. అయితే, తొలి మ్యాచ్లో పదిహేనేళ్ల ఈ లెఫ్టాండ్ ఓపెనర్ 13 పరుగులే చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత మూడు, నాలుగో టీ20లలో వరుసగా 14, 15 పరుగులు చేసి నిష్క్రమించాడు. దీంతో వైభవ్ ఆట తీరుపై విమర్శలు వచ్చాయి.ఈ క్రమంలో ఐదో టీ20 నుంచి వైభవ్ను తప్పించి.. మళ్లీ సంజూను ఆడించారు. అయితే, జింబాబ్వేతో సిరీస్కు మాత్రం సంజూ శాంసన్ను పక్కనపెట్టిన మేనేజ్మెంట్.. అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేసింది. ఇక జింబాబ్వేతో హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా గురువారం నాటి తొలి టీ20లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు వైభవ్ సూర్యవంశీ శుభారంభం అందించాడు.ఆకాశమే హద్దుగా..తొలి ఓవర్లో అభిషేక్, వైభవ్ పెద్దగా పరుగులు చేయలేదు. బ్లెస్సింగ్ ముజర్బానీ బౌలింగ్లో కేవలం చెరో పరుగు చేశారు. అయితే, రెండో ఓవర్లో రిచర్ట్ నగవర బౌలింగ్కు రాగా.. మొదటి బంతికి పరుగులేమీ రాబట్టలేకపోయినప్పటికీ.. రెండు, మూడు, నాలుగు బంతుల్లో వైభవ్ వరుసగా 6,4,6 బాదాడు. రెండో ఓవర్లో మొత్తంగా 20 పరుగులు పిండుకున్నాడు.ఈ క్రమంలో మూడో ఓవర్ ఐదో బంతికి అభిషేక్ శర్మ (1)ముజర్బానీ బౌలింగ్లో అవుట్ అయినప్పటికీ.. వైభవ్ జోరు కొనసాగించాడు. కేవలం పద్దెనిమిది బంతుల్లోనే నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. ఏడో ఓవర్లో నగరవ బౌలింగ్లో తొలి బంతికే ఫిఫ్టీ పూర్తి చేసుకున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఆ మరుసటి బంతికే బెన్ కర్రాన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. చెప్పాడు.. చేసి చూపించాడుఅయితే, నాలుగు నెలల క్రితం ఇదే వేదిక మీద.. అండర్-19 వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లండ్ మీద వైభవ్ 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి భారత్కు టైటిల్ అందించాడు. జింబాబ్వేకు తొలి టీ20కి ముందు ఈ విషయం గురించి మాట్లాడుతూ.. తనకు హరారే స్పోర్ట్స్ క్లబ్ మీద ఆడిన అనుభవం, పిచ్ గురించి పూర్తి అవగాహన ఉందన్నాడు. అన్నట్లుగానే విధ్వంసకర హాఫ్ సెంచరీతో తళుక్కుమన్నాడు.అంతర్జాతీయ టీ20లలో అత్యంత పిన్న వయసులో తొలి అర్ధ శతకం బాదిన క్రికెటర్లు👉వైభవ్ సూర్యవంశీ (ఇండియా): జింబాబ్వే మీద హరారే వేదికగా 2026లో 15 ఏళ్ల 118 రోజుల వయసులో ఫిఫ్టీ👉లూయీస్ బ్రూస్ (గిబ్రాల్టర్): మాల్టా మీద అల్బేగరియా వేదికగా 2021లో 16 ఏళ్ల 56 రోజుల వయసులో ఫిఫ్టీ👉కవిన్ చద్దా (ఇండోనేషియా): స్వీడన్ మీద బాలి వేదికగా 2026లో 16 ఏళ్ల 76 రోజుల వయసులో ఫిఫ్టీ👉ఆల్సినే టురే (సియెర్రా లియోన్): ఘనా మీద బెనోని వేదికగా 2023లో 16 ఏళ్ల 89 రోజుల వయసులో ఫిఫ్టీ👉టెంజిన్ రాబ్గే (భూటాన్): చైనా మీద కౌలాలంపూర్ వేదికగా 2023లో 16 ఏళ్ల 118 రోజుల వయసులో ఫిఫ్టీసచిన్ రికార్డు బ్రేక్ఫుల్ మెంబర్ జట్లలో భాగంగా అఫ్గనిస్తాన్ స్టార్ రహ్మనుల్లా గుర్బాజ్ 17 ఏళ్ల 296 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా.. వైభవ్ తాజాగా అతడిని అధగమించాడు. అంతేకాదు.. ఫుల్ మెంబర్ జట్ల తరఫున అంతర్జాతీయ క్రికెట్ (ఆల్ ఫార్మాట్)లో అతి పిన్న వయసులోనే అర్ధ శతకం చేసిన తొలి బ్యాటర్గానూ చరిత్రకెక్కాడు. గతంలో సచిన్ టెండ్కులర్ పాకిస్తాన్ మీద 1989 నాటి టెస్టు మ్యాచ్లో 16 ఏళ్ల 213 రోజుల వయసులో అర్ధ శతకం చేయగా.. వైభవ్ ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టాడు. -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 18 బంతుల్లో హాఫ్ సెంచరీ
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన ఫామ్ను తిరిగి అందుకున్నాడు. హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20లో వైభవ్ విధ్వంసం సృష్టించాడు. తనకు అచ్చొచ్చిన హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో ఆతిథ్య జట్టు బౌలర్లను ఈ చిచ్చర పిడుగు ఉతికారేశాడు. ఈ క్రమంలో సూర్యవంశీ కేవలం 18 బంతుల్లోనే తొలి అంతర్జాతీయ హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అతడి తుపాన్ ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 4 సిక్స్లు ఉన్నాయి. అయితే ఆర్ధ శతకం సాధించిన వైభవ్.. తర్వాత బంతికే భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. అతడి విధ్వంసం ఫలితంగా భారత్ స్కోర్ పవర్ప్లేనే 60 పరుగులు దాటింది.వైభవ్ వరల్డ్ రికార్డుఇక మ్యాచ్లో హాఫ్ సెంచరీతో సాధించిన వైభవ్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అర్ధ శతకం చేసిన అతి పిన్న వయష్కుడిగా వైభవ్(15 ఏళ్ల 118 రోజులు) చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు జిబ్రాల్టర్ ప్లేయర్ లూయిస్ బ్రూస్(16 ఏళ్ల 56 రోజులు) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్తో బ్రూస్ ఆల్టైమ్ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు. -
రెండేళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్ చేస్తే! తొలి మ్యాచ్లోనే భయపెట్టాడు
టీమిండియా యువ పేసర్ మయాంక్ యాదవ్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. దాదాపు రెండేళ్ల తర్వాత భారత జట్టులోకి వచ్చిన మయాంక్.. హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్నతొలి టీ20లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.గంటకు దాదాపు 150 వేగంతో బౌలింగ్ చేస్తూ జింబాబ్వే బ్యాటర్లను బెంబేలెత్తించాడు. మయాంక్ ఇన్నింగ్స్ మొదటి బంతికే జింబాబ్వే స్టార్ బ్రియాన్ బెన్నెట్ను అవుట్ చేసి భారత్కు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఓవర్లలోనూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మరో వికెట్ పడగొట్టాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మయాంక్తో పవర్ప్లేలోనే తన కోటాలోని మూడు ఓవర్లు బౌలింగ్ చేయించాడు. ఆఖరిలో మరో ఓవర్ అతడు బౌలింగ్ చేశాడు. మయాంక్ మొత్తంగా తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు సాధించాడు. ఈ ఢిల్లీ పేసర్ 2024లో భారత తరపున అరంగేట్రం చేశాడు. కానీ వరుస గాయాలతో దాదాపు రెండేళ్ల పాటు జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. అయితే పూర్తి ఫిట్నెస్ సాధించి ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున బరిలోకి దిగాడు. అక్కడ పెద్దగా రాణించికపోయినప్పటి అతడిపై మరోసారి బీసీసీఐ సెలక్షన్ కమిటీ నమ్మకం ఉంది. అర్ష్దీప్ సింగ్, బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వడంతో జింబాబ్వే టూర్కు మయాంక్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. దీంతో తనకు లభించిన అవకాశాన్ని అతడు రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. -
నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. జింబాబ్వే స్కోరెంతంటే?
టీమిండియాతో తొలి టీ20 మ్యాచ్లో జింబాబ్వే బ్యాటర్లు తేలిపోయారు. భారత బౌలర్ల ధాటికి తాళలేక పెవిలియన్కు వరుస కట్టారు. దీంతో ఆతిథ్య జట్టు నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా భారత్- జింబాబ్వే మధ్య గురువారం నాటి తొలి మ్యాచ్కు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక. తొలి బంతికే వికెట్ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. జింబాబ్వే బ్యాటింగ్కు దిగింది. మయాంక్ యాదవ్ భారత బౌలింగ్ అటాక్ ఆరంభించి.. తొలి బంతికే బ్రియాన్ బెన్నెట్ను డకౌట్ చేశాడు.Aate hi kaam shuru kar diye 🔥💪Watch it LIVE only on FanCode! 🇮🇳 👇https://t.co/q6VBxaRJz3#ZIMvIND #RokoNahiThoko #MayankYadav pic.twitter.com/Pg9RugnnTR— FanCode (@FanCode) July 23, 2026మరో ఓపెనర్, అరంగేట్ర ఆటగాడు బెన్ కర్రాన్ (10) ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో అవుట్ కాగా.. వన్డౌన్ బ్యాటర్ డియోన్ మైర్స్ (6)ను మయాంక్ యాదవ్ వెనక్కి పంపాడు. కెప్టెన్ సికిందర్ రజా (4) వికెట్ను శివం దూబే తన ఖాతాలో వేసుకోగా.. నిలకడగా ఆడుతున్న ర్యాన్ బర్ల్ (26)ను రవి బిష్ణోయి వెనక్కి పంపాడు.BACK TO BACK WICKETS IN BACK TO BACK OVERS! 💪Full THOKO mode power-play mein 🔥Watch it LIVE on FanCode! 🇮🇳 👇https://t.co/q6VBxaRJz3 #ZIMvIND #RokoNahiThoko pic.twitter.com/6vpRLxPZ5I— FanCode (@FanCode) July 23, 2026రాణించిన మెధెవెరెఈ క్రమంలో వెస్లే మెధెవెరె ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఆరో స్థానంలో వచ్చిన ఈ ఆల్రౌండర్.. 34 బంతుల్లో 39 పరుగులతో జింబాబ్వే ఇన్నింగ్స్లో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. దురదృష్టవశాత్తూ అతడు రనౌట్ అయ్యాడు. మిగతా వాళ్లలో బ్రాడ్ ఎవాన్స్ డకౌట్ కాగా.. వికెట్ కీపర్ బ్యాటర్ తాడివనాషే మరుమాణి (20 బంతుల్లో 27) కాస్త వేగంగా ఆడాడు. జింబాబ్వే స్కోరెంతంటే?న్యూమన్ ఒక్క పరుగు చేసి మరుమాణితో కలిసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టానికి కేవలం 125 పరుగులు చేసింది. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీయగా.. శివం దూబే, రవి బిష్ణోయి తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. చదవండి: టీమిండియా తరఫున అతడి అరంగేట్రం -
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. కోహ్లికి కూడా సాధ్యం కాలేదు
హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అయ్యర్ టాస్ గెలవడం ఇది వరుసగా ఎనిమిదో సారి. దీంతో అంతర్జాతీయ టీ20లలో వరుసగా 8 టాస్లు గెలిచిన తొలి భారత కెప్టెన్గా శ్రేయస్ రికార్డులెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఉండేది. ధోని టీమిండియా సారథిగా 2010-12 మధ్య కాలంలో వరుసగా 7 సార్లు టాస్ గెలిచాడు. తాజా మ్యాచ్తో ధోనిని అయ్యర్ అధిగమించాడు.టీ20ల్లో వరుసగా టాస్లు గెలిచిన భారత కెప్టెన్లు వీరేశ్రేయస్ అయ్యర్: 8 (జూన్ 2026 – జూలై 2026)ఎం.ఎస్. ధోని: 7 (మే 2010 – ఫిబ్రవరి 2012)విరాట్ కోహ్లి: 6 (ఆగస్టు 2019 – డిసెంబరు 2019)రోహిత్ శర్మ: 5 (ఫిబ్రవరి 2020 – ఫిబ్రవరి 2022)ఓవరాల్గా వరల్డ్ క్రికెట్లో ఈ రికార్డు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారన్ సామీ పేరిట ఉంది. సామీ 2015-16 మధ్య కాలంలో టీ20ల్లో వరుసగా 10 టాస్లు గెలిచాడు. ఆ తర్వాత రెండో స్ధానంలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా(9) ఉన్నాడు. వీరిద్దరి తర్వాత స్ధానంలో హ్యారీ బ్రూక్(8), ఆరోన్ ఫించ్(8)లో కలిసి శ్రేయస్ సంయుక్తంగా నిలిచాడు. కాగా అయ్యర్ టాస్లు గెలుస్తున్నప్పటి మ్యాచ్లు మాత్రం గెలవడం లేదు. ఇప్పటివరకు అతడి సారథ్యంలో 7 మ్యాచ్లు ఆడిన టీమిండియా.. 6 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. -
రూ. 82 కోట్లకు కొన్నా!.. ఇప్పుడు రూ. 16 వేల కోట్లకు పైమాటే!
ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్ మాజీ సహ యజమాని రాజ్ కుంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన భార్య శిల్పా శెట్టికి ప్రేమికుల దినోత్సవం కానుకగా నాడు రాజస్తాన్ ఫ్రాంఛైజీలో వాటా కొనుగోలు చేసినట్లు తెలిపాడు.వాలైంటైన్స్ గిఫ్ట్ఎస్ఎమ్టీవీ యూట్యూబ్ చానెల్తో మాట్లాడుతూ.. ‘‘వాలైంటైన్స్ గిఫ్ట్గా 2009లో నేను రాజస్తాన్ రాయల్స్లో వాటా కొనుగోలు చేశాను. నా భార్య శిల్పాకు మంచి బ్రాండ్ వాల్యూ ఉంది. దానిని నేను డబ్బుగా మలచాలని అనుకున్నాను.ఇప్పుడు రూ. 16 వేల కోట్లకు పైమాటే!అప్పుడే వాటా కొన్నాను. అయితే, ఇప్పటికీ దానికి సంబంధించి కేసు కొనసాగుతూనే ఉంది. నేను ఆ ఫ్రాంఛైజీలో పెట్టుబడులు పెట్టినపుడు దాని విలువ రూ. 700 కోట్లు మాత్రమే. కానీ ఇప్పుడు ఏకంగా రూ 16 వేల కోట్లకు చేరింది’’ అని తెలిపాడు.ఇక బెట్టింగ్ వివాదం గురించి స్పందిస్తూ.. ‘‘బెట్టింగ్కు అనుమతి లేదు. కానీ మాపై బెట్టింగ్ ఆరోపణలు వచ్చాయి. మా జట్టుపై రెండేళ్ల నిషేధం విధించారు. కొంతమంది ఆటగాళ్లపై కూడా నిషేధం పడింది. యజమానులపై కూడా బ్యాన్ విధించారు.అలా మాట్లాడటం కూడా నిషిద్ధమేనిజంగా బెట్టింగ్ జరిగిందా? అంటే.. ఇద్దరు కూర్చుని సరదాగా పందెం వేసుకోవం సాధారణంగా ఎక్కడైనా జరిగే విషయమే. అయితే, ఆరోజు రూ. 500కు బెట్ వేద్దామా? అన్నట్లుగా సంభాషణ సాగింది. కానీ అలా మాట్లాడటం కూడా నిషిద్ధమే అని తర్వాత తెలిసింది.సరదాగా అన్న మాటలకు కూడా మమ్మల్ని బ్యాన్ చేస్తారా? ఇప్పటికీ ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. అయినా యజమానుల్లో కూడా నన్నొక్కడినే బాధ్యుడిని చేశారు’’ అని రాజ్ కుంద్రా చెప్పుకొచ్చాడు. కాగా అక్రమ బెట్టింగ్కు పాల్పడ్డాడనే ఆరోపణలతో 2013లో రాజ్ కుంద్రాపై ఆరోపణలు రాగా.. విచారణ కోసం సుప్రీం కోర్టు నాడు జస్టిస్ లోధా కమిటీ ఏర్పాటు చేసింది. జీవితకాల నిషేధంఈ క్రమంలో రాజ్ కుంద్రా ఎలాంటి క్రికెట్ సంబంధిత కార్యకలాపాల్లో భాగం కాకుండా 2015లో అతడిపై జీవితకాల నిషేధం పడింది. రాజస్తాన్రాయల్స్ను 2016, 2017 సీజన్లలో ఆడకుండా నిషేధించారు.ఇదిలా ఉంటే.. రాజ్ కుంద్రా నాడు రాజస్తాన్ ఫ్రాంఛైజీలో రూ. 81.9 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. అయితే, ఐపీఎల్ ఆరంభమైన (2008) నాటి నుంచి దాదాపు ఐదారేళ్ల పాటు యజమానులకు పెద్దగా లాభాలు రాలేదని రాజ్ కుంద్రా చెప్పాడు. వార్షిక లాభం రూ. 200- 500 కోట్ల వరకుఅయితే, ఇప్పుడు మాత్రం ఓనర్లు భారీగా ఆర్జిస్తున్నారని.. వారి వార్షిక లాభం రూ. 200- 500 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశాడు. 70 శాతం ఆదాయం ప్రసార హక్కుల ద్వారా.. 10-15 శాతం జెర్సీ స్పాన్సర్షిప్లు, మిగతా 10- 15 శాతం టికెట్ల అమ్మకాల ద్వారా వస్తుందని రాజ్ కుంద్రా తెలిపాడు.కాగా ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ మెరుగ్గా రాణించింది. అద్భుతమైన ఆట తీరుతో ప్లే ఆఫ్స్ దశకు చేరుకుంది. ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. అయితే, గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి నిరాశగా నిష్క్రమించింది. ఇక రాజస్తాన్ ఫ్రాంఛైజీ యాజమాన్యం ఇటీవలే చేతులు మారిన సంగతి తెలిసిందే. పారిశ్రామిక వేత్తలు లక్ష్మీనివాస్ మిట్టల్, ఆదిత్య మిట్టల్, ఆదార్ పూనావాలా ఈ ఫ్రాంఛైజీని దాదాపు రూ. 16 వేల కోట్లకు సొంతం చేసుకున్నారు. చదవండి: టీమిండియా తరఫున అతడి అరంగేట్రం -
సన్రైజర్స్ ఆల్రౌండర్కు జాక్పాట్.. కెప్టెన్గా ప్రమోషన్
లంకా ప్రీమియర్ లీగ్ (LPL) 2026 సీజన్ మధ్యలోనే 'కొలంబో క్యాప్స్' జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ కుశాల్ మెండిస్ తొడ కండరాల గాయం కారణంగా ఈ టోర్నీ నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలో కొలంబో క్యాప్స్ మేనెజ్మెంట్ తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆల్రౌండర్ కమిందు మెండిస్కు అప్పగించింది.గురువారం దాంబుల్లా వేదికగా క్యాండీ రాయల్స్తో మ్యాచ్లో కొలంబో కెప్టెన్గా కమిందు వ్యవహరిస్తున్నాడు. అయితే కెప్టెన్గా తొలి మ్యాచ్లో మెండిస్ నిరాశపరిచాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి షాహీన్ అఫ్రిది బౌలింగ్లో ఔటయ్యాడు. 2020 లో ఎల్పీఎల్ అరంగేట్రం చేసిన కమిందు ఇప్పటివరకు 43 మ్యాచ్ల్లో 877 పరుగులతో పాటు 8 వికెట్లు తీశాడు. ఈ శ్రీలంక ఆల్రౌండర్ ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ 2025లో 'బెస్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్' అవార్డును అతడు గెలుచుకున్నాడు. అంతేకాకుండా ఒకే ఓవర్లో రెండు యాక్షన్స్తో బౌలింగ్ అందరిని ఆశ్చర్చపరిచాడు. కానీ ఐపీఎల్-2026లో మాత్రం కమిందు మెండిస్కు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం లభించలేదు.చదవండి: IND vs ZIM: టీమిండియా తరఫున అతడి అరంగేట్రం -
IND vs ZIM: టీమిండియా తరఫున అతడి అరంగేట్రం
జింబాబ్వేతో తొలి టీ20 సందర్భంగా అశోక్ శర్మ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఈ ఫాస్ట్ బౌలర్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో సీనియర్లను పక్కనపెట్టిన యాజమాన్యం.. పేస్ దళంలో మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ వంటి యువ క్రికెట్లతో పాటు తొలిసారి అశోక్ శర్మను ఎంపిక చేసింది.ఎవరీ అశోక్ శర్మ?రాజస్తాన్లోని జైపూర్కి సమీపంలో గల రాంపుర అనే గ్రామంలో 2002లో జన్మించాడు అశోక్ శర్మ. అతడి తండ్రి సాధారణ రైతు. కుటుంబ పరిస్థితి ఆర్థికంగా అంతంత మాత్రమే. అయినప్పటికీ అశోక్తో పాటు అతడి అన్న అక్షయ్ శర్మ కూడా క్రికెటర్ కావాలనే కలలు కన్నాడు.జిల్లా స్థాయిలో అక్షయ్ ఆడాడు. అయితే, తమ్ముడి కోసం తన కెరీర్ను త్యాగం చేశాడు. దీంతో అశోక్కు మార్గం సుగమమైంది. ఈ విషయం గురించి అశోక్ శర్మ స్వయంగా జాతీయ మీడియాకు వెల్లడించాడు.లీడింగ్ వికెట్ టేకర్కుటుంబ సహకారంతో తన కలలను నిజం చేసుకునే క్రమంలో అశోక్ శర్మ.. 2025-26 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ దేశీ టీ20 టోర్నీ తాజా ఎడిషన్లో పది మ్యాచ్లలో కలిపి 22 వికెట్లు కూల్చి.. లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. గంటకు 150కి పైగా కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల సత్తా ఉన్న అశోక్ శర్మ.. ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిలో పడ్డాడు.ఫాస్టెస్ట్ బాల్ఈ క్రమంలో ఐపీఎల్-2026 వేలంలో గుజరాత్ టైటాన్స్ అశోక్ను రూ. 90 లక్షలకు కొనుగోలు చేసింది. ఆకాశ్ నెహ్రా మార్గదర్శనంలో అతడు రాటుదేలాడు. ఈ ఏడాది రాజస్తాన్తో మ్యాచ్ సందర్భంగా గంటకు 154.2 కిలో మీటర్లకు పైగా వేగంతో బంతిని విసిరి హాట్ టాపిక్గా మారాడు. మొత్తంగా ఈ సీజన్లో ఆరు మ్యాచ్లు ఆడిన ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ ఆరు వికెట్లు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైన 24 ఏళ్ల అశోక్ శర్మ.. తాజాగా అరంగేట్రం చేశాడు. ఇదిలా ఉంటే.. జింబాబ్వేతో తొలి టీ20లో భారత్ ముగ్గురు సీమర్లు, ఒక స్పిన్నర్తో బరిలోకి దిగింది. తుదిజట్టులో ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్లతో పాటు అశోక్ శర్మ కూడా పేస్ విభాగంలో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు.. జింబాబ్వే తరఫున బెన్ కర్రాన్ అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేశాడు.తుదిజట్లుభారత్వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్జింబాబ్వేబ్రియాన్ బెన్నెట్, తడివానాషే మారుమణి (వికెట్ కీపర్), బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్హురి, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ -
IND vs ZIM: వైభవ్ మెరుపులు.. టీమిండియా ఘన విజయం
హరారే వేదికగా గురువారం నాటి తొలి టీ20లో భారత్-జింబాబ్వే జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. భారత్ లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. 13.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది.ఓపెనర్లలో అభిషేక్ శర్మ (1) విఫలమైనప్పటికీ.. వైభవ్ సూర్యవంశీ మెరుపు అర్ద శతకంతో రాణించాడు. కేవలం 18 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, నాలుగు సిక్స్లు బాది 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అతడికి తోడుగా వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 35) రాణించగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (28*), వైస్ కెప్టెన్ తిలక్ వర్మ (6*)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా 13.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి భారత్ 126 పరుగులు చేసింది. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.Updates10 ఓవర్లలో టీమిండియా స్కోరు: 96-2ఇషాన్ 26, శ్రేయస్ అయ్యర్ 17 పరుగులతో ఉన్నారు.వైభవ్ మెరుపు అర్ధ శతకం6.1: నగరవ బౌలింగ్లో రెండు పరుగులు పూర్తి చేసుకుని యాభై పరుగుల మార్కు అందుకున్న వైభవ్. కేవలం 18 బంతుల్లోనే తొలి అంతర్జాతీయ హాఫ్ సెంచరీ. ఆ మరుసటి బంతికే అవుటయ్యాడు. స్కోరు: 68-2. ఇషాన్ 16 పరుగులతో ఉన్నాడు. శ్రేయస్ క్రీజులోకి వచ్చాడు.భారత్ తొలి వికెట్ డౌన్టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన అభిషేక్ శర్మ.. ముజరబాని బౌలింగ్లో ఔటయ్యాడు. మరోవైపు చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మాత్రం దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 9 బంతుల్లోనే 21 పరుగులు చేశాడు. 3 ఓవర్లకు భారత స్కోర్: 23/1 టీమిండియా టార్గెట్ ఎంతంటే?జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది. ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్లో మధెవెరే(39) టాప్ స్కోరర్గా నిలవగా.. మరుమణి(27), బర్ల్(26) రాణించారు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. శివమ్ దూబే, బిష్ణోయ్ తలా వికెట్ సాధించారు.వరుసగా రెండు వికెట్లుఆఖరి ఓవర్లో జింబాబ్వే వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. రెండో బంతికి మధెవెరే(39), మూడో బంతికి ఎవాన్స్(0) ఔటయ్యారు.ఐదో వికెట్ డౌన్13.1: రవి బిష్ణోయి బౌలింగ్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన బర్ల్ (26). మెధెవెరె 8 పరుగులతో ఉండగా.. స్కోరు: 64-5. మరుమాణి క్రీజులోకి వచ్చాడు.పది ఓవర్లలో జింబాబ్వే స్కోరు: 46-4 (10)మెధెవెరె 5, బర్ల్ 12 పరుగులతో ఉన్నారు.నాలుగో వికెట్ డౌన్జింబాబ్వే నాలుగో వికెట్ కోల్పోయింది. శివమ్ దూబే బౌలింగ్లో సికిందర్ రజా(4) ఔటయ్యాడు. మెధెవెరె క్రీజులోకి వచ్చాడు.పవర్ ప్లేలో జింబాబ్వే స్కోరు: 26-3 (6)బర్ల్ 1, రజా 4 పరుగులతో ఉన్నారు.పీకల్లోతు కష్టాల్లో జింబాబ్వేజింబాబ్వే మూడో వికెట్ కోల్పోయింది. మయాంక్ యాదవ్ బౌలింగ్లో డియాన్ మైర్స్(6) ఔటయ్యాడు. మయాంక్కు ఇది రెండో వికెట్ కావడం గమనార్హం. 5 ఓవర్లకు జింబాబ్వే స్కోర్: 21/2జింబాబ్వే రెండో వికెట్ డౌన్జింబాబ్వే రెండో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన బెన్ కర్రాన్.. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు జింబాబ్వే స్కోర్: 20/2తొలి వికెట్ కోల్పోయిన జింబాబ్వేభారత బౌలింగ్ అటాక్ ఆరంభించిన మయాంక్ యాదవ్ బౌలింగ్లో తొలి బంతికే... వికెట్ కీపర్ ఇషాన్ కిషన్కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్గా వెనుదిరిగిన బ్రియాన్ బెన్నెట్ (0). క్రీజులోకి డియాన్ మైర్స్. జింబాబ్వే స్కోరు: 6-1 (1). బెన్ కర్రాన్ సున్నా, డియాన్ మైర్స్ ఆరు పరుగులతో ఉన్నారు.అశోక్ శర్మ అరంగేట్రంరాజస్తాన్ పేసర్ అశోక్ శర్మ ఈ మ్యాచ్తో భారత్ తరపున అరంగేట్రం చేశాడు. అదేవిధంగా యువ పేసర్ మయాంక్ యాదవ్ దాదాపు రెండేళ్ల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. మరోవైపు యువ ఆటగాళ్లు న్యూమాన్ న్యామ్హురి, బెన్ కరన్ జింబాబ్వే తరపున డెబ్యూ చేశారు.తుది జట్లుజింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, తడివానాషే మారుమణి(వికెట్ కీపర్), బెన్ కర్రాన్, డియాన్ మైర్స్, సికందర్ రజా(కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్హురి, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీభారత్ : వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్ -
వాళ్లకు అన్యాయం చేశారు: టీమిండియా దిగ్గజం ఫైర్
టీమిండియా సెలక్టర్ల తీరుపై భారత మాజీ కెప్టెన్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అర్హత ఉన్న ఆటగాళ్లను జింబాబ్వే సిరీస్కు ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించాడు. ప్రభ్సిమ్రన్ సింగ్ ఒక్కడికే సెలక్టర్లు న్యాయం చేశారని.. కానీ మిగతా ఐపీఎల్ స్టార్లకు మాత్రం అన్యాయం చేశారని చిక్కా విమర్శించాడు.వరుస పరాజయాల తర్వాతకాగా ఐర్లాండ్, ఇంగ్లండ్లతో టీ20 సిరీస్లలో వరుసగా 2-0, 4-0తో క్లీన్స్వీప్నకు గురైన టీమిండియా.. తాజాగా జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు టీ20 మ్యాచ్లు ఆడుతుంది. ఈ క్రమంలో గురువారం ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుండగా.. హరారే స్పోర్ట్స్ క్లబ్ ఇందుకు వేదిక.ఇదిలా ఉంటే.. జింబాబ్వేతో సిరీస్కు సంజూ శాంసన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ (ప్రస్తుతం గాయపడ్డాడు), అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ వంటి సీనియర్లను పక్కనపెట్టారు. రవి బిష్ణోయికి కూడా ముందుగా ఈ జట్టులో చోటు దక్కలేదు. అయితే, ఆ తర్వాత మళ్లీ సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది.కొత్తగా వీళ్లుఇదిలా ఉంటే.. అశోక్ శర్మ, యశ్ ఠాకూర్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక కాగా.. ప్రభ్సిమ్రన్ సింగ్కు కూడా యాజమాన్యం ఈ సిరీస్ ఆడే జట్టులో చోటిచ్చింది. మయాంక్ యాదవ్, హర్ష్ దూబే కూడా జట్టులోకి వచ్చారు.రింకూ ఎక్కడి నుంచి వచ్చాడు?ఈ పరిణామాల నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ టీమిండియా యాజమాన్యం వైఖరిని ప్రశ్నించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ప్రభ్సిమ్రన్ సింగ్ను ఎంపిక చేశారు. మంచి సెలక్షన్. కానీ ఆర్సీబీకి వరుసగా రెండుసార్లు టైటిల్ అందించిన రజత్ పాటిదార్ సంగతేంటి?పాపం.. వాళ్లకు అన్యాయంఅసలు ఈ రింకూ సింగ్ మళ్లీ అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వచ్చాడు? అతడికి బదులు పాటిదార్ను సెలక్ట్ చేసి ఉండాల్సింది. అంతేకాదు.. స్పిన్ విభాగంలో రవి బిష్ణోయి లేదంటే హర్ష్ దూబే స్థానంలో ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించిన కృనాల్ పాండ్యాను ఎంపిక చేస్తే బాగుండేది.మీడియం పేసర్లకు బదులు ఆర్సీబీ స్టార్, స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ను ఎంపిక చేస్తే ఇంకా బాగుండేది. అసలు జింబాబ్వేతో సిరీస్కు జట్టును ఈ సెలక్టర్లు ఎలా ఎంపిక చేశారో నాకైతే అర్థం కావడం లేదు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డాడు. నిలకడగా రాణిస్తున్నప్పటికీ.. ఆర్సీబీ ప్లేయర్లకు అన్యాయం చేశారంటూ ఈ మాజీ చీఫ్ సెలక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చదవండి: IND vs ZIM: తొలి టీ20కి భారత తుదిజట్టు ఇదే! -
భారత్తో సిరీస్.. జింబాబ్వేకు భారీ ఎదురుదెబ్బ
స్వదేశంలో భారత్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు ముందు జింబాబ్వే జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ మిల్టన్ షుంబా కుడి కాలి హామ్స్ట్రింగ్ గాయం కారణంగా మొత్తం సిరీస్కు దూరమయ్యాడు.మంగళవారం నిర్వహించిన స్కాన్లలో గాయం తీవ్రత బయటపడటంతో షుంబాను జట్టు నుంచి తప్పించినట్లు జింబాబ్వే క్రికెట్ బోర్డు ప్రకటించింది. అతని స్థానంలో అనుభవజ్ఞుడైన ఇన్నోసెంట్ కైయాను జట్టులోకి తీసుకుంది. కైయా ఇప్పటికే హరారేలో జట్టుతో చేరాడు.బంగ్లాదేశ్తో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్తో షుంబా దాదాపు రెండేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి తిరిగి వచ్చాడు. అయితే భారత్తో సిరీస్కు ముందు గాయం అతని ఆశలకు గండికొట్టింది.కైయా విషయానికొస్తే.. ఇతను చివరిసారిగా 2024 జూలైలో భారత్పైనే, హరారే వేదికగా టీ20 మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు అదే ప్రత్యర్థిపై మరోసారి అవకాశం దక్కింది.భారత్-జింబాబ్వే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి మ్యాచ్ ఇవాళ (జూలై 23) హరారేలో జరగనుండగా, మిగిలిన రెండు మ్యాచ్లు జూలై 25, 26 తేదీల్లో ఇదే వేదికపై జరుగనున్నాయి. ఈ మ్యాచ్లన్నీ భారతకాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమవుతాయి. -
IND vs SL: శ్రీలంకను మట్టికరిపించిన భారత్
శ్రీలంకతో రెండో అనధికారిక టెస్టులో భారత అండర్-19 జట్టు అదరగొట్టింది. ఆతిథ్య జట్టును ఏకంగా 211 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. తద్వారా రెండు మ్యాచ్ల సిరీస్ను భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది.తొలి టెస్టు డ్రా కాగా మూడు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత అండర్-19 జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా వన్డే సిరీస్ను ఆతిథ్య లంక యువ జట్టు 2-1తో వశం చేసుకోగా.. ఇరుజట్ల మధ్య గాలె వేదికగా తొలి అనధికారిక టెస్టు డ్రా అయింది.తొలి ఇన్నింగ్స్లో 411ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య సోమవారం రెండో అనధికారిక టెస్టు మొదలైంది. కొలంబోలో టాస్ గెలిచిన శ్రీలంక అండర్-19 తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్కు దిగింది. తొలి ఇన్నింగ్స్లో 105.2 ఓవర్లలో 411 పరుగుల మేర భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది.శతక్కొట్టిన కుశాగ్ర, మనాల్మొదటి ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లలో ఓపెనర్లు లక్ష్య రాజేశ్ రాయ్ చందాని, సాగర్ విర్క్ డకౌట్ అయ్యారు. అయితే, వన్డౌన్ బ్యాటర్ కుశాగ్ర ఓజా (111), ఐదో స్థానంలో వచ్చిన మనాల్ చౌహాన్ (150) శతకాలతో అదరగొట్టారు. వీరికి తోడుగా కెప్టెన్ యశ్వర్దన్ చౌహాన్ అర్ధ శతకం (78)తో రాణించాడు. లోయర్ ఆర్డర్లో చిగురుపాటి వెంకట 25 పరుగులు రాబట్టాడు.148 పరుగులకే లంక ఆలౌట్ఇక శ్రీలంక బౌలర్లలో గిమ్హాన్ మెండిస్ మూడు వికెట్లు తీయగా.. సెత్మిక సెనెవిరత్నె, దుల్నిత్ సిగెర, విఘ్నేశ్వరన్ ఆకాశ్ తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 148 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ దిమంత మహావితన 24, విరాన్ చముదిత 21, దుల్నిత్ సిగెర 31, సెత్మిక 25 పరుగులతో ఫర్వాలేదనిపించారు.భారత బౌలర్లలో ప్రణవ్ రాఘవేంద్ర, చిగురుపాటి వెంకట, జగన్నాథన్ హెంచుదేశన్, రోహిత్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. కావ్యా పటేల్కు ఒక వికెట్ దక్కింది. ఇక శ్రీలంక మొదటి ఇన్నింగ్స్లో 148 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్కు 263 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.లక్ష్యం 472ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. మూడు వికెట్ల నష్టానికి 208 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈసారి ఓపెనర్లలో లక్ష్య రాయ్చందాని అజేయ శతకం (116 బంతుల్లో 100)తో మెరవగా.. సాగర్ విర్క్ (17) నిరాశపరిచాడు. వన్డౌన్లో వచ్చిన ఆర్యన్ సక్పా (6) విఫలం కాగా.. కెప్టెన్ యశ్వర్దన్ 20 పరుగులు చేయగలిగాడు. మనాల్ చౌహాన్ 51 పరుగలతో అజేయంగా నిలిచాడు.211 పరుగుల తేడాతో భారత్ జయభేరిఇక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని (263+208).. భారత్ శ్రీలంకకు 472 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. గురువారం నాటి ఆఖరి రోజు ఆటలో భాగంగా కేవలం 260 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్ 211 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించి సిరీస్ను కైవసం చేసుకుంది.చెలరేగిన భారత బౌలర్లులక్ష్య ఛేదనలో లంక బ్యాటర్లలో సెనుజ వెకునగొడ (64), కెప్టెన్ విమత్ దిన్సార (64) అర్ధ శతకాలతో రాణించగా.. కవిజ గెమాగే 36, సెత్మిక 42 పరుగులతో ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో రోహిత్ యాదవ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. చిగురుపాటి వెంకట మూడు వికెట్లు దక్కించుకున్నాడు. మిగిలిన వారిలో ప్రణవ్ రాఘవేంద్ర, జగన్నాథన్ హెంచుదేశన్, యశ్వర్దన్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.శ్రీలంక వర్సెస్ భారత్ రెండో అనధికారిక టెస్టు సంక్షిప్త స్కోర్లుభారత్: 411 & 208/3 డిక్లేర్డ్శ్రీలంక: 148 & 260చదవండి: IND vs ZIM: తొలి టీ20కి భారత తుదిజట్టు ఇదే! -
వైభవ్ సూర్యవంశీ కాదు.. నెక్స్ట్ విరాట్ కోహ్లి అతడే..!
విరాట్ కోహ్లి కెరీర్ చివరి దశకు చేరుకుంటున్న వేళ, భారత క్రికెట్లో తదుపరి స్టార్ ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. రేసులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు బలంగా వినిపిస్తున్నప్పటికీ, భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మాత్రం మరో ఆటగాడిని నెక్స్ట్ విరాట్ కోహ్లిగా అభివర్ణించాడు.తాజాగా దూరదర్శన్ నిర్వహించిన 'ది గ్రేట్ ఇండియన్ క్రికెట్ షో'లో మాట్లాడిన జాఫర్.. కేఎల్ రాహుల్ను భవిష్యత్ విరాట్ కోహ్లిగా పేర్కొన్నాడు. ప్రతిభ, టెక్నిక్ పరంగా రాహుల్ విరాట్తో సమానమని అన్నాడు. అయితే ఇద్దరి మధ్య తేడాను నిర్ణయించేది విరాట్ మానసిక దృఢత్వమని చెప్పాడు."కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆటగాడు. మూడు ఫార్మాట్లలోనూ అత్యుత్తమంగా రాణించగలడు. టెక్నిక్, ప్రతిభ పరంగా చూస్తే అతడు విరాట్ కోహ్లితో సమానమే. కానీ విరాట్ని ప్రత్యేకంగా నిలబెట్టింది అతని అసాధారణమైన మెంటాలిటీ" అని జాఫర్ వ్యాఖ్యానించాడు.అయితే గణాంకాల పరంగా విరాట్, రాహుల్ మధ్య భారీ అంతరం ఉంది. విరాట్ అంతర్జాతీయ క్రికెట్లో 28359 పరుగులు, 85 సెంచరీలు, 148 అర్ధసెంచరీలు నమోదు చేయగా.. కేఎల్ రాహుల్ ఇప్పటివరకు 9830 పరుగులు, 22 సెంచరీలు, 62 అర్ధసెంచరీలు సాధించాడు.మరోవైపు, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే భారత క్రికెట్లో సంచలనంగా మారాడు. ఐపీఎల్ 2026లో 16 ఇన్నింగ్స్లో 776 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించిన అతడు, అనంతరం టీ20 అంతర్జాతీయ అరంగేట్రం కూడా చేశాడు. ఇంగ్లండ్తో తొలి సిరీస్లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, జింబాబ్వేతో జరగనున్న టీ20 సిరీస్లో మరోసారి ప్రతిభను నిరూపించుకునే అవకాశం అతడికి దొరికింది. -
IND vs ZIM: తొలి టీ20కి భారత తుదిజట్టు ఇదే!
ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో క్లీన్స్వీప్ల తర్వాత భారత టీ20 జట్టు జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టింది. ఇరుజట్ల మధ్య గురువారం నాటి తొలి టీ20కి హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక. ఇక మూడు మ్యాచ్ల సిరీస్ నుంచి ఓపెనర్ సంజూ శాంసన్ను పక్కనపెట్టిన యాజమాన్యం.. వైభవ్ సూర్యవంశీని మాత్రం కొనసాగించింది.అదే విధంగా.. పంజాబ్ కింగ్స్ ఆటగాడు ప్రభ్సిమ్రన్ సింగ్, హర్ష్ దూబే, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్ తదితర యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. అశోక్ శర్మ, యశ్ ఠాకూర్లను తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక చేసింది. అదే విధంగా.. రింకూ సింగ్ను కూడా తిరిగి పిలిపించింది.అభిషేక్ జోడీగా ఎవరు?ఈ నేపథ్యంలో జింబాబ్వేతో తొలి టీ20కి భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతున్న అంశం ఆసక్తికరంగా మారింది. అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా.. చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీని ఆడిస్తారా? లేదంటే వైభవ్ను ఎంపిక చేస్తారా? అన్న చర్చ జరుగుతోంది. ఇంగ్లండ్ పర్యటనలో వైభవ్ 14, 13, 15 పరుగులు చేసి విఫలమయ్యాడు.అయితే, హరారే వేదికగా ఈ ఏడాది అండర్-19 వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లండ్పై వైభవ్ సూర్యవంశీ 80 బంతుల్లోనే 175 పరుగులతో విధ్వంసం సృష్టించి.. జట్టును చాంపియన్గా నిలిపాడు. కానీ టీమిండియా తరఫున అరంగేట్రం తర్వాత మాత్రం అతడు అంచనాలు అందుకోలేకపోతున్నాడు.ప్రభ్సిమ్రన్ సింగ్కు అవకాశం ఉంటుందా?అదే సమయంలో గత కొన్నేళ్లుగా ఐపీఎల్లో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న ప్రభ్సిమ్రన్ సింగ్.. ఈ ఏడాది కూడా 510 పరుగులతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుత టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోనే పంజాబ్ తరఫున ప్రభ్సిమ్రన్ ఈ మేరకు రాణించాడు.నా జట్టు ఇదేఇలాంటి తరుణంలో భారత మాజీ క్రికెటర్ ఎస్. బద్రీనాథ్ తన తుదిజట్టులో ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీకే పెద్దపీట వేశాడు. వన్డౌన్లో ఇషాన్ కిషన్, నాలుగో నంబర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో వైస్ కెప్టెన్ తిలక్ వర్మను కొనసాగించిన బద్రీనాథ్.. ఆరు, ఏడు స్థానాల్లో ఆల్రౌండర్లు శివం దూబే, సూర్యాంశ్ షెడ్గేలను ఎంచుకున్నాడు. రింకూ సింగ్ను మాత్రం పక్కనపెట్టాడు.ఇక స్పిన్ విభాగంలో హర్ష్ దూబే, రవి బిష్ణోయి రూపంలో ఇద్దరిని ఎంపిక చేసిన బద్రీనాథ్.. పేస్ దళంలో ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్లకు చోటిచ్చాడు.జింబాబ్వేతో తొలి టీ20కి బద్రీనాథ్ ఎంచుకున్న జట్టువైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, సూర్యాంశ్ షెడ్గే, హర్ష్ దూబే, రవి బిష్ణోయి, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్.చదవండి: ICC ODI WC 2027: దమ్ముంటే అతడిని తప్పించండి -
భారీ రికార్డుపై కన్నేసిన అభిషేక్ శర్మ
జింబాబ్వేతో ఇవాళ (జూలై 23) జరగనున్న తొలి టీ20కి ముందు భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్లో అతడు 16 పరుగులు చేస్తే, టీ20 క్రికెట్లో 6000 పరుగులు పూర్తి చేసిన భారత బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించుకుంటాడు.ప్రస్తుతం అభిషేక్ 203 టీ20 మ్యాచ్ల్లో 199 ఇన్నింగ్స్ ఆడి 5984 పరుగులు చేశాడు. తొలి టీ20లో 16 పరుగులు సాధిస్తే, 200 ఇన్నింగ్స్లోపు 6000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత బ్యాటర్గా నిలుస్తాడు. ఈ జాబితాలో ఇప్పటికే కేఎల్ రాహుల్ (166 ఇన్నింగ్స్), విరాట్ కోహ్లీ (184), శుభ్మన్ గిల్ (185) ఉన్నారు.అంతర్జాతీయంగా ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉంది. అతడు కేవలం 162 ఇన్నింగ్స్లోనే 6000 టీ20 పరుగులు పూర్తి చేశాడు.జింబాబ్వేపై అద్భుతమైన రికార్డుఅభిషేక్ శర్మకు జింబాబ్వేపై అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు ఆ జట్టుతో ఆడిన ఆరు టీ20ల్లో 179 పరుగులు చేసి, భారత్ తరఫున జింబాబ్వేపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కొనసాగుతున్నాడు.అంతేకాదు, ఈ మ్యాచ్లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా కంటే కనీసం 16 పరుగులు ఎక్కువ చేస్తే, భారత్-జింబాబ్వే మధ్య జరిగిన టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ కొత్త రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది.నేటి భారత్-జింబాబ్వే మ్యాచ్ భారతకాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు మొదలవుతుంది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత యువ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. -
భారత్లో నిరసనలపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
భారత్లో జరుగుతున్న నిరసనలపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేపడుతున్న నిరసనలను ఉద్దేశిస్తూ సోషల్ మీడియా వేదికగా ఇలా అన్నాడు.I am disturbed because every protest in India seems to have the same script.1. Abuse Lord Ram.2. Abuse Bharat Mata.3. Abuse PM Modi.4. Abuse PM Modi’s late mother.5. Abuse Brahmins.6. Abuse Hindutva.No discussion.No solutions.Only slogans, abuse, and chaos.The…— Danish Kaneria (@DanishKaneria61) July 22, 2026"భారత్లో జరిగే ప్రతి నిరసనకూ ఒకే రకమైన స్క్రిప్ట్ ఉండటం బాధాకరం. అనేక నిరసనల్లో సమస్యల పరిష్కారం కంటే రాముడిని తిట్టడం, భరతమాతను తిట్టడం, నరేంద్ర మోదీని, ఆయన తల్లిని తిట్టడం, హిందుత్వం, బ్రాహ్మణులపై విమర్శలు చేయడమే ఎక్కువగా కనిపిస్తుంది. చర్చలు లేవు, పరిష్కారాలు లేవు.. నినాదాలు, దూషణలు, గందరగోళమే కనిపిస్తుంది.అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఇంకా ఖరారు కాకముందే కొందరు రైతులు ఢిల్లీ ముట్టడికి సిద్ధమవుతున్నారు.ప్రతిపక్ష రాజకీయ వర్గాలు నేపాల్ తరహా పరిస్థితిని సృష్టించగలమనే భ్రమలో ఉన్నాయి. రోజురోజుకు పరిస్థితి మరీ సర్కస్లా మారుతుంది. వాస్తవాలను నిర్ధారించుకోకుండా నిరసన తెలపడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే, దేశం ఎలా పురోగమించగలదు" అంటూ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు.దానిష్ కనేరియా చేసిన ఈ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు అతడి అభిప్రాయాలకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు ప్రజాస్వామ్యంలో నిరసన హక్కు ప్రాముఖ్యతను గుర్తు చేస్తున్నారు.కాగా, పాక్ మాజీ లెగ్ స్పిన్నర్ అయిన కనేరియా గతంలోనూ భారత దేశానికి, ప్రధాని మోదీకి అనుకూలంగా మాట్లాడి వార్తల్లో నిలిచాడు. కనేరియా హిందువు కావడంతో పాక్ జట్టులో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడని గతంలో చాలాసార్లు ప్రస్తావించాడు. -
ఆస్ట్రేలియా జట్లలోకి మరో ఇద్దరు భారత సంతతి క్రికెటర్లు
భారత సంతతికి చెందిన మరో ఇద్దరు క్రికెటర్లు ఆస్ట్రేలియాలో వేగంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇటీవలే ఢిల్లీలో పుట్టిన నిఖిల్ చౌదరి ఆసీస్ తరఫున అరంగేట్రం చేయగా.. తాజాగా జెర్సిస్ వాడియా, ఆర్యన్ శర్మ అనే ఇద్దరు కుర్రాళ్లు క్రికెట్ ఆస్ట్రేలియాకు చెందిన వేర్వేరు జట్లకు ఎంపికయ్యారు.ముంబైలో జన్మించిన జెర్సిస్ వాడియా దక్షిణ ఆస్ట్రేలియా తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. స్వదేశంలో బంగ్లాదేశ్తో జరగనున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టులో అతడికి అవకాశం లభించింది. ఇటీవల బిగ్ బాష్ లీగ్లో అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున బ్రిస్బేన్ హీట్పై తొలి మూడు బంతులకే వరుసగా మూడు సిక్సర్లు బాది సంచలనంగా మారాడు.మరోవైపు 18 ఏళ్ల ఆల్రౌండర్ ఆర్యన్ శర్మను చెన్నైలోని ఎంఆర్ఎఫ్ పేస్ అకాడమీ కార్యక్రమం కోసం ఆస్ట్రేలియా డెవలప్మెంట్ స్క్వాడ్లోకి ఎంపిక చేశారు. కుడిచేతి బ్యాటర్, ఎడమచేతి స్పిన్ బౌలర్ అయిన ఆర్యన్ ప్రస్తుతం ఆస్ట్రేలియా అండర్-19 జట్టు, మెల్బోర్న్ స్టార్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.వలస కుటుంబంలో జన్మించిన ఆర్యన్ శర్మ చిన్నప్పటి నుంచే ఆస్ట్రేలియా తరఫున ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. 10 ఏళ్ల వయసులోనే "18 ఏళ్లకు ఆస్ట్రేలియా జట్టుకు ఆడాలి" అని రాసుకున్న లక్ష్యాన్ని అండర్-19 జాతీయ జట్టులో చోటు దక్కించుకుని నిజం చేసుకున్నాడు.వీరిద్దరి ఎంట్రీతో క్రికెట్ ఆస్ట్రేలియాలో భారత సంతతి ఆటగాళ్ల సంఖ్య ఐదుకు చేరింది. నిఖిల్ చౌదరికి ముందు గురిందర్ సంధు, తన్వీర్ సంఘా ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేయగా.. తాజాగా జెర్సిస్ వాడియా, ఆర్యన్ శర్మ ఆసీస్ అరంగేట్రానికి రెడీ అయ్యారు. ఇంకా చాలామంది భారత సంతతి చెందిన క్రికెటర్లు ఆస్ట్రేలియాలో క్రికెట్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. -
టీమిండియాకు మరిచిపోలేని షాక్
భారత్-జింబాబ్వే మధ్య టీ20 సిరీస్కు రంగం సిద్ధమైన వేళ, రెండు సంవత్సరాల క్రితం జరిగిన సంచలన మ్యాచ్ చర్చనీయాంశంగా మారింది. ఆ మ్యాచ్లో జింబాబ్వే కేవలం 116 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకొని చారిత్రక విజయం సాధించింది. పసికూన నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని కూడా టీమిండియా ఛేదించలేపోవడం అభిమానులకు నేటికీ గుర్తుంది.బిష్ణోయ్ మ్యాజిక్.. 115కే జింబాబ్వే ఆలౌట్టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన అనంతరం శుభ్మన్ గిల్ నాయకత్వంలోని యువ భారత జట్టు ఇప్పటిలాగే జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. తొలి టీ20లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.ముకేశ్ కుమార్ తొలి వికెట్ అందించగా, రవి బిష్ణోయ్ ( 4/13) తన అద్భుత స్పిన్తో జింబాబ్వే ఇన్నింగ్స్ను అతలాకుతలం చేశాడు. అతడికి వాషింగ్టన్ సుందర్ (2/11) కూడా తోడవ్వడంతో జింబాబ్వే 20 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది.కుప్పకూలిన టీమిండియాస్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభం నుంచే తడబడింది. తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ డకౌట్ కాగా, ఆ వెంటనే రుతురాజ్ గైక్వాడ్ కూడా పెవిలియన్ చేరాడు.సికందర్ రజా, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా కట్టుదిట్టమైన బౌలింగ్తో భారత బ్యాటింగ్ను పూర్తిగా కుదిపేశారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ (31), వాషింగ్టన్ సుందర్ (27) పోరాడే ప్రయత్నం చేసినా, మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. చివరకు భారత్ 102 పరుగులకే ఆలౌటై 13 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.టీమిండియాకు సవాల్ఆ ఓటమి షాక్ నుంచి కోలుకోకముందే టీమిండియా మరోసారి జింబాబ్వేలో పర్యటిస్తుంది. 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో జింబాబ్వేలో అడుగుపెట్టింది. ఈ సిరీస్లో భాగంగా ఇవాళ (జులై 23) తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమవుతుంది.శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత జట్టు వరుసగా ఐర్లాండ్, ఇంగ్లండ్లపై టీ20 సిరీస్లు కోల్పోయి ఒత్తిడిలో ఉంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో జరిగే సిరీస్లో తప్పక విజయం సాధించి మళ్లీ గెలుపు బాట పట్టాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, గత విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరో సంచలనం సృష్టించాలని జింబాబ్వే భావిస్తోంది. -
సీజేపీ నిరసనలపై స్పందించిన యువీ
గత కొద్ది రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలపై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా విద్యార్థులు, యువతను ఉద్దేశించి శాంతి, సంభాషణ, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చాడు.తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొస్తూ.."ప్రతి చిన్నారి, విద్యార్థి, మహిళ, పురుషుడు ప్రశాంత వాతావరణంలో చదువుకునే, సురక్షితంగా ఎదిగే, తమ కలలను సాకారం చేసుకునే అవకాశం పొందాలి. వారి సంక్షేమమే భారత భవిష్యత్తుకు బలమైన పునాది. సంభాషణ ద్వారానే దేశ భవిష్యత్తు కోసం అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం దొరుకుతుంది" అని పేర్కొన్నాడు.Yuvraj Singh Instagram Story. pic.twitter.com/ufb1k3JVBX— Jotdofficial (@jotdofficial_) July 22, 2026విద్యార్థుల నిరసనలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో యువరాజ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే ఆయన ఏ రాజకీయ పక్షానికీ మద్దతు ప్రకటించకుండా, విద్యార్థుల భద్రత, సంక్షేమం, విద్యా భవిష్యత్తుపైనే తన సందేశాన్ని కేంద్రీకరించాడు.క్యాన్సర్ను జయించిన తర్వాత యువరాజ్ స్థాపించిన 'YouWeCan' ఫౌండేషన్ ద్వారా క్యాన్సర్ అవగాహన, చికిత్స సహాయం, విద్యార్థులకు స్కాలర్షిప్లు, సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే, ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలపై ఇప్పుడిప్పుడే సెలబ్రిటి లోకం స్పందించడం మొదలు పెట్టింది. తొలుత ఈ విషయంపై మాట్లాడేందుకు వెనకడుగు వేసిన వారు ఒక్కొక్కరుగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి యువరాజ్ సింగ్ చేరాడు.కాక్రోచ్ల నిరసనలపై క్రికెట్ రంగానికి సంబంధించి యువరాజ్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన నేపథ్యంలో నెటిజన్లు మరో భారత దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. విద్యార్థుల నిరసనలతో దేశం అట్టుడికి పోతుంటే విరాట్ మాత్రం స్వామీజీల చుట్టూ తిరుగుతున్నాడని ఎద్దేవా చేస్తున్నారు.దేశ యువత భవిష్యత్తు పట్ల ఏమాత్రం బాధ్యత లేని వ్యక్తిగా విరాట్ను అభివర్ణిస్తున్నారు. ఇలాంటి వాడు యువతకు ఏరకంగా ఆదర్శంగా నిలుస్తాడని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంకొందరు విరాట్ తన మఖాంను యూకే మార్చడాన్ని ప్రస్తావిస్తూ.. ఇలాంటి వారిని దేశం నుంచే బహిష్కరించాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.దేశం పట్ల, దేశ యువత పట్ల ఏమాత్రం బాధ్యలేకుండా ఇక్కడ సంపాదించుకొని విదేశాల్లో స్థిరపడే వారికి కూడా యువత సరైన గుణపాఠం నేర్పాలని పిలుపునిస్తున్నారు. -
భారత్ X జింబాబ్వే
హరారే: ఐర్లాండ్–ఇంగ్లండ్ పర్యటనలో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన భారత క్రికెట్ జట్టు... మరో టి20 పోరుకు సిద్ధమైంది. నేటి నుంచి జింబాబ్వేతో టీమిండియా మూడు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. శ్రేయస్ అయ్యర్ భారత టి20 జట్టు పగ్గాలు అందుకున్న తర్వాత ఒక్క మ్యాచ్లో కూడా విజయం సాధించలేకపోయిన టీమిండియా... ఈ సిరీస్లో ఎలాంటి ఆటతీరు కనబరుస్తుందో చూడాలి. సంజూ సామ్సన్ను ఈ సిరీస్కు ఎంపిక చేయకపోవడంతో మూడు మ్యాచ్ల్లోనూ అభిషేక్ శర్మతో కలిసి 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో మూడు మ్యాచ్లు ఆడిన వైభవ్ 14, 13, 15 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్లో దంచి కొట్టిన వైభవ్... జింబాబ్వేతో సిరీస్లో అయినా చెలరేగుతాడా చూడాలి. అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో ఇదే మైదానంలో భారీ సెంచరీ బాదిన వైభవ్ సీనియర్ స్థాయిలో రాణించాల్సిన అవసరముంది. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబేతో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. అయితే వీరంతా సమష్టిగా రాణించాల్సి ఉంది. బౌలింగ్లో అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుండగా... ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్ కీలకం కానున్నారు. పేస్ ఆల్రౌండర్ సూర్యాషే షెడ్గే కంటే... స్పిన్నర్ హర్ష్ దూబేకే తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువ. గత జింబాబ్వే పర్యటనలో శతకంతో సత్తా చాటిన అభిషేక్ శర్మపై భారీ అంచనాలు ఉన్నాయి. గౌతమ్ గంభీర్ స్థానంలో ఈ సిరీస్కు వీవీఎస్ లక్ష్మణ్ భారత హెడ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. మరోవైపు సికందర్ రజా సారథ్యంలోని జింబాబ్వే జట్టులో బెనెట్, మరుమని, మధెవెరె, బర్ల్, ఇవాన్స్, మసకద్జ రూపంలో నైపుణ్యం గల ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగ్లో ఐపీఎల్ అనుభవం ఉన్న బ్లెస్సింగ్ ముజరబానితో భారత బ్యాటింగ్ ఆర్డర్కు ముప్పు పొంచి ఉంది. పిచ్ పేసర్లకు సహకరించనుంది. కుదురుకుంటే పరుగులు చేయడం పెద్ద కష్టం కాదు. మ్యాచ్కు వర్ష సూచన లేదు. -
'అతడికి సలహాలు అక్కర్లేదు.. కచ్చితంగా చెలరేగుతాడు'
భారత్-జింబాబ్వే మధ్య మూడు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ గురువారం హరారే వేదికగా జరగనుంది. వరుస సిరీస్ల ఓటముల అనంతరం జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమిండియా.. తొలి మ్యాచ్లో గెలిచి శుభారంభం చేయాలని భావిస్తోంది.ఈ మ్యాచ్కు ముందు భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన సహచరలకు కీలక సూచనలు చేశాడు. ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల్లో ఎదురైన పరాజయాలను పక్కనపెట్టి ఫియర్లెస్ క్రికెట్ ఆడాలని అయ్యర్ పిలుపునిచ్చాడు. "ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యనటనలలో మాకు అనుకూల ఫలితాలు రాలేదు. కానీ ఈ ఓటముల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. భవిష్యత్తులో ఒక జట్టుగా మనం ఏ విషయాలపై దృష్టి పెట్టాలి, మైదానంలో పరిస్థితులకు తగ్గట్లుగా ఎలా మారాలి అనే విషయాలపై స్పష్టత వచ్చింది. నాతో పాటు జట్టులో చాలా మంది ఆటగాళ్లకు ఇదే తొలి జింబాబ్వే పర్యటన.కాబట్టి ఇక్కడ కండీషన్స్కు ఎంత వేగంగా అలవాటుపడితే అంత మెరుగైన ఫలితాలు వస్తాయి. నేను మా బాయ్స్కు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. బయట నుంచి విమర్శలను పట్టించుకోవద్దు. కేవలం మీ ఆటపైనే దృష్టి సారించి ఫియర్ లెస్ క్రికెట్ ఆడండి. మేము ఒక జట్టుగా సమిష్టిగా రాణించాల్సిన అవసరముంది. జింబాబ్వేను ఏ మాత్రం తేలికగా తీసుకోము. ప్రత్యర్ధి జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. వారిలో కొంతమందికి ఐపీఎల్లో ఆడిన అనుభవం కూడా ఉందని" ప్రీమ్యాచ్ కాన్ఫరెన్స్లో అయ్యర్ పేర్కొన్నాడు.అదేవిధంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురుంచి శ్రేయస్ మాట్లాడుతూ.. "ఇంగ్లండ్ సిరీస్ తర్వాత మా బాయ్స్కు తగినంత విరామం దొరికింది. దీంతో యువ ఆటగాళ్లంతా నెట్స్లో తీవ్రంగా శ్రమించారు. వైభవ్ కూడా ఎక్కడ తప్పు చేశాడో దాన్ని సరిదిద్దుకుని ఉంటాడు. అందుకే నేను అతడికి పెద్దగా సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు" అని అన్నాడు.చదవండి: భారత్-జింబాబ్వే టీ20 సిరీస్ షెడ్యూల్.. జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే -
అఫ్గానిస్తాన్ కొత్త కెప్టెన్గా స్టార్ ప్లేయర్.. ఎవరంటే?
అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తమ వన్డే,టెస్ట్ జట్టు కెప్టెన్గా సీనియర్ బ్యాటర్ రహమత్ షాను ఏసీబీ నియమించింది. సుదీర్ఘకాలం కెప్టెన్గా వ్యవహరించిన హష్మతుల్లా షాహిదీ స్ధానాన్ని 33 ఏళ్ల రహమత్ షా భర్తీ చేయనున్నాడు.అదేవిధంగా టెస్ట్, వన్డేల్లో రహమత్ డిప్యూటీగా స్టార్ వికెట్ కీపర్ రహ్మానుల్లా గుర్బాజ్ ఎంపికయ్యాడు. కాగా రహమత్ షా 2021 నుంచి అఫ్గానిస్తాన్ జట్టు వైస్ కెప్టెన్గా సేవలందిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతడికి ఉన్న సుదీర్ఘ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని జట్టు పగ్గాలను అఫ్గాన్ క్రికెట్ అప్పగించింది."రహమత్ అపారమైన అనుభవం ఉంది. అతడు జట్టును సమర్ధవంతంగా నడిపించగలడని భావిస్తున్నాం. కొత్త బాధ్యతలు స్వీకరిస్తున్న రహమత్ షా, గుర్బాజ్లకు శుభాకాంక్షలు" అని ఏసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఐర్లాండ్తో జరగనున్న 5 మ్యాచ్ల వన్డే సిరీస్ నుంచి కెప్టెన్గా రహమత్ తన ప్రయాణాన్ని మొదలు పెట్టనున్నాడు.ఇక హష్మతుల్లా షాహిదీ విషయానికి వస్తే.. కెప్టెన్గా అఫ్గానిస్తాన్కు అద్భుతమైన విజయాలు అందించాడు. అతడి నాయకత్వంలోని అఫ్గాన్ 2023 వన్డే ప్రపంచకప్లో సంచలనాలు సృష్టించింది. ఆ టోర్నీలో ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంక వంటి బలమైన జట్టను ఓడించి అఫ్గాన్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. మొత్తంగా అతడి కెప్టెన్సీలో అఫ్గాన్ జట్టు 55 వన్డేలు ఆడగా, అందులో 27 మ్యాచ్ల్లో విజయం సాధించింది. అఫ్గాన్ టీ20 జట్టుకు రషీద్ ఖాన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.చదవండి: వన్డే వరల్డ్కప్-2027కు భారత జట్టు ఇదే? భువనేశ్వర్కు చోటు? -
టీమిండియాతో టెస్ట్ సిరీస్.. శ్రీలంకకు భారీ షాక్
స్వదేశంలో టీమిండియాతో టెస్ట్ సిరీస్కు ముందు శ్రీలంకకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండిస్ గాయం కారణంగా భారత్తో టెస్టులకు దూరమయ్యే అవకాశముంది. లంకా ప్రీమియర్ లీగ్ 2026లో కొలంబో కాప్స్కు సారథ్యం వహిస్తున్న మెండిస్.. గాలే గాలంటట్స్తో జరిగిన మ్యాచ్లో గాయపడ్డాడు. పరుగు తీసే క్రమంలో అతడి కుడి తొడ కండరాలు పట్టేశాయి. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు. అనంతరం పరిగెత్తలేక రనౌట్ రూపంలో మెండిస్ ఔటయ్యాడు. తర్వాత అతడిని అస్పత్రికి తరలించి స్కాన్లు నిర్వహించగా.. గాయం తీవ్రమైనదిగా తేలింది.దీంతో కుశాల్ లంకా ప్రీమియర్ లీగ్లో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా ధ్రువీకరించింది. అతడు తిరిగి కోలుకునేందుకు నేషనల్ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్కు వెళ్లనున్నాడు. కాగా భారత్-శ్రీలంక మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ సమయానికి కుశాల్ కోలుకుంటాడో లేదో ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ అతడు దూరమైతే ఇది లంకేయులకు భారీ షాక్ అనే చెప్పాలి. కుశాల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. మూడు ఫార్మాట్లలోనూ అతడు అదరగొడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడు త్వరగా కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. -
ODI WC: మీకు దమ్ముంటే అతడిని తప్పించండి!
వన్డే వరల్డ్కప్ విజేత, భారత మాజీ క్రికెటర్ మదన్ లాల్ టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మకు అండగా నిలిచాడు. దమ్ముంటే అతడిని జట్టు నుంచి తప్పించాలంటూ సెలక్టర్లకు సవాల్ విసిరాడు. కాగా రోహిత్ శర్మ భవితవ్యం గురించి గత కొంతకాలంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇదే చివరి మ్యాచ్ అంటూ..వన్డే వరల్డ్కప్-2027 నాటికి రోహిత్ 40వ వసంతంలో అడుగుపెడతాడు. వయసు రీత్యా ఫిట్నెస్ సమస్యల వల్ల అతడు జట్టుకు భారం అవుతాడనే అభిప్రాయాలు వ్యక్తంగా.. పది కిలోలకు పైగా బరువు తగ్గి స్లిమ్, ఫిట్గా మారాడు హిట్మ్యాన్. అయినప్పటికీ అతడి రిటైర్మెంట్పై ఊహాగానాలు ఆగలేదు.తాజాగా ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో ఆదివారం లార్డ్స్ మ్యాచ్ రోహిత్ కెరీర్లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ అనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, ఈ మ్యాచ్లో శతక్కొట్టి (138) మరీ విమర్శకులకు బ్యాట్తోనే సమాధానం చెప్పాడు రోహిత్. అంతేకాదు.. ఆ తర్వాత రిటైర్మెంట్ వార్తలపై స్వయంగా స్పందించాడు.ఆడినంత కాలం ఇలాగే..‘నేను అరంగేట్రం చేసినప్పటి నుంచీ ఇలాంటి చర్చలు, విమర్శలు వస్తూనే ఉన్నాయి. నేను ఆడినంత కాలం ఇవి కొనసాగుతూనే ఉంటాయి. అందుకే వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గ్రౌండ్లో నేను ఏం చేస్తున్నాననేదే నాకు ముఖ్యం. జట్టు విజయానికి నా వంతు కృషి చేయడంపైనే నా దృష్టి. ఈ చర్చలు సాగనివ్వండి లేకపోతే మజా ఏముంటుంది.నా పని మైదానం లోపల... వారి పని బయట’ అని రోహిత్ తనదైన శైలిలో స్పందించాడు. ఈ క్రమంలో మదన్ లాల్ సైతం హిట్మ్యాన్కు మద్దతుగా నిలిచాడు. ‘‘నేడో.. రేపో.. ప్రతీ ఒక్క ఆటగాడు ఏదో ఒకరోజు రిటైర్ అవ్వాల్సిందే. అయితే, రోహిత్ శర్మ ఇప్పుడు అద్భుతంగా ఆడుతున్నాడు. అతడు ఇంకా ఆడాలనుకుంటే ఆడనివ్వండి.ఒకవేళ దమ్ము, ధైర్యం ఉంటేసెలక్టర్లకు ఒకవేళ దమ్ము, ధైర్యం ఉంటే అతడిని తప్పించి ముందుకు సాగండి చూద్దాం. ప్రస్తుతం అతడు మంచి ఫామ్లో ఉన్నాడు. ఇలాంటపుడు అతడి విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అంతేగానీ.. అతడి దగ్గరకు వెళ్లి.. ‘నువ్వు మా దీర్ఘకాలిక, వన్డే వరల్డ్కప్ ప్రణాళికల్లో గానీ లేవు’ అని అన్నారనుకోండి.అప్పుడు అతడు.. ‘ఏం.. ఎందుకు మీ ప్లాన్లో నేను లేను. నేను పరుగులు రాబడుతున్నా కదా!.. మరి నన్నెలా పక్కనపెడతారు’ అని అడుగుతాడు. అలా అడిగే హక్కు అతడికి ఉంది’’ అని మదన్ లాల్ సెలక్టర్లకు సవాల్ విసిరాడు. కాగా ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు గుడ్బై చెప్పిన రోహిత్ వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. టీమిండియాకు కెప్టెన్గా రెండు ఐసీసీ టైటిళ్లు అందించిన ఘనత అతడిది. టీ20 ప్రపంచకప్- 2024, చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియాను విజేతగా నిలిపాడు.చదవండి: డెబ్బై పరుగులు చేయగానే గిల్కు కండరాలు పట్టేస్తాయి! -
వన్డే వరల్డ్కప్-2027కు భారత జట్టు ఇదే? భువనేశ్వర్కు చోటు?
సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల వేదికగా వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం ఇప్పటి నుంచే క్రికెట్ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్గా ఆస్ట్రేలియా బరిలోకి దిగనుండగా.. గత ప్రపంచకప్లో రన్నరప్గా నిలిచిన భారత జట్టుపై కూడా ఈసారి భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ మెగా టోర్నీ కోసం శుభ్మన్ గిల్ సారథ్యంలో బలమైన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ తాయారు చేస్తోంది. సీనియర్ ఆటగాళ్లతో పాటు యువ ఆటగాళ్లపై కూడా సెలక్టర్లు దృష్టి సారించారు. ఇందులో భాగంగా హర్ష్దూబే, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్ వంటి యంగ్ ప్లేయర్లను పరీక్షిస్తున్నారు. అంతేకాకుండా యశస్వి జైశ్వాల్ను రోహిత్ శర్మకు బ్యాకప్గా మేనెజ్మెంట్ సిద్దం చేస్తోంది. వరుసగా విఫలమవుతున్న ఇషాన్ కిషన్ స్ధానంలో రుతురాజ్ గైక్వాడ్ పేరును కూడా సెలక్టర్లు పరిశీలస్తున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్కప్-2027 కోసం పటిష్టమైన భారత ప్లేయింగ్ ఎలెవన్ను ఆంధ్ర మాజీ క్రికెటర్ హనుమా విహారి ఎంపిక చేశాడు. గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న వెటరన్ క్రికెటర్లు భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యాకు తను ఎంపిక చేసిన ప్లేయింగ్ ఎలెవన్లో విహారి చోటిచ్చాడు. భువీ, కృనాల్ వరుసగా రెండు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన ఆర్సీబీ జట్టులో భాగంగా ఉన్నాడు. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ అయితే గత రెండు సీజన్లలోనూ అద్భుతంగా రాణించాడు. దీంతో అతడిని తిరిగి భారత జట్టుకు ఎంపిక చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.ఇక విహారి తన జట్టులో ఓపెనర్లగా రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్నే కొనసాగించాడు. అదేవిధంగా మూడు, నాలుగు స్ధానాల్లో విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ చోటు దక్కించుకున్నారు. ఆల్రౌండర్ల కోటాలో అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలకు అతడు అవకాశమిచ్చాడు.కాగా హార్దిక్ పాండ్యా ప్రస్తుతం వరుస గాయాలతో సతమతమవుతున్నాడు. అతడు భారత వన్డే ప్రపంచకప్ ప్రణాళికలలో లేనిట్లు వార్తలు వస్తున్నాయి. కానీ బీసీసీఐ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక బౌలర్ల కోటాలో భువనేశ్వర్ కుమార్తో పాటు జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్లకు ఛాన్స్ ఇచ్చాడు. సిరాజ్ కూడా ప్రస్తుతం వన్డే జట్టుకు దూరంగా ఉన్నాడు.విహారి ఎంపిక చేసిన భారత తుది జట్టుశుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ -
అరుదైన ఘనత సాధించిన గిల్, రూట్
టీమిండియా టెస్ట్, వన్డే జట్ల కెప్టెన్ శుభ్మన్ గిల్, ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అరుదైన ఘనత సాధించారు. ఈ ఇద్దరూ ఇవాళ (జులై 22) ప్రకటించిన ఐసీసీ టెస్ట్, వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో టాప్-10లో నిలిచారు. తద్వారా ఈ వారాంత టెస్ట్, వన్డే ర్యాంకింగ్స్లో టాప్-10లో నిలిచిన ఇద్దరే ఇద్దరు బ్యాటర్లుగా రికార్డుల్లోకెక్కారు.టెస్టు ర్యాంకింగ్స్లో జో రూట్ మూడో స్థానంలో ఉండగా, గిల్ ఏడో స్థానంలో ఉన్నాడు. వన్డే ర్యాంకింగ్స్లో గిల్ రెండో స్థానంలో ఉండగా.. రూట్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఈ ఇద్దరు బ్యాటర్లు టెస్ట్, వన్డే ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తూ.. అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారు. టెస్ట్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే, టీమిండియా కెప్టెన్ ఓ స్థానం కోల్పోయి ఆరు నుంచి ఏడుకు పడిపోగా.. రూట్ మూడో స్థానాన్ని కాపాడుకున్నాడు. ఈ ఫార్మాట్ ర్యాంకింగ్స్లో ట్రవిస్ హెడ్, బ్రూక్ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు.వన్డే ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. గిల్ గత వారం లాగే రెండో స్థానంలోనే ఉన్నప్పటికీ, రేటింగ్ పాయింట్ల సంఖ్యను 800 దాటించాడు. తాజాగా భారత్తో జరిగిన సిరీస్లో విశేషంగా రాణించడంతో రూట్ ఏకంగా నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని 8వ స్థానానికి ఎగబాకాడు. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ టాప్లో కొనసాగుతుండగా.. భారత దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ 3, 4 స్థానాల్లో కొనసాగుతున్నారు. -
ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తారా?: సూర్య భార్య పోస్ట్ వైరల్
ఢిల్లీలో విద్యార్థుల ఉద్యమంపై టీమిండియా స్టార్లు ఇంతవరకు స్పందించలేదు. అయితే, భారత టీ20 జట్టు మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సతీమణి దేవిశా శెట్టి, టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేషన్ మాత్రం సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకున్నారు.దేవిశా, సంజనా వైఖరి పట్ల నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కాగా నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆందోళనలు మరింత ఉధృతం చేసిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేపట్టిన ‘చలో సంసద్’ ర్యాలీ హింసాత్మకంగా మారింది. విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సంజన ఇలా...ఈ నేపథ్యంలో సంజనా గణేషన్ స్పందిస్తూ.. ‘‘నిరసనకు దూరంగా ఉన్న ఆరేళ్ల పసి ప్రాణానికి టియర్ గ్యాస్ వల్ల ఇబ్బంది కలిగినప్పుడు.. ఎవరికైనా సరే ఇది ఇబ్బందిని కలిగిస్తుంది కదా!..చిన్నారులు టియర్ గ్యాస్ బారిన పడటాన్ని ప్రజాస్వామ్యంలో సాధారణ విషయంగా మార్చకండి. తమను రక్షించడం కోసమని రక్షణ పేరుతో భయపెట్టడాన్ని ఏ పౌరుడు కూడా కోరుకోడు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. సంజనకు పలువురు నెటిజన్లు మద్దతుగా నిలుస్తూ పోలీసుల వైఖరిని ప్రశ్నిస్తున్నారు.పోరాటాలు చేయండి అంటూనే...ఇక దేవిశా శెట్టి మాత్రం మరింత తీవ్రంగా, కాస్త భిన్నంగా స్పందించింది. ‘‘ఇది స్పాన్సర్ చేసిందే అనుకోండి. రాజకీయ ఉద్దేశాలు ఉన్న పోస్టు అనుకోండి. మీరు దీనికి ఏ పేరు పెట్టినా నిజం మాత్రం మారదు. భారతీయ యువత అగ్నిపంథాను ఎంచుకుంది. సవాళ్లకు ఎదురు నిల్చుంది.పోలీసులు ఈ సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. పరిస్థితులను చక్కదిద్దాలి. ప్రభుత్వం కూడా వారి సమస్యకు గల కారణం ఏమిటో తెలుసుకునేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వాన్ని విమర్శించండి. ప్రధానిని ప్రశ్నించండి.రాజకీయాలకు వ్యతిరేకంగా గళమెత్తండి. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమాలు నడపండి. ఓటుతో సమాధానం చెప్పండి. దానినే ప్రజాస్వామ్యం అంటారు. పబ్లిక్ ప్రాపర్టీ అంటే ప్రభుత్వ ఆస్తులు కావు.ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తారా?మీరు ధ్వంసం చేసిన ప్రతీ బస్సు, విరగొట్టిన ప్రతీ బారికేడ్, తగలబెట్టిన ప్రతీ వాహనం, మీరు నాశనం చేసిన రోడ్డు.. ఇలా ప్రతీదీ భారత పన్ను చెల్లింపుదారుల నుంచి వచ్చిన డబ్బు ద్వారా నిర్మితమైనవి. ఇందులో మీరు కూడా ఉంటారు.ఏదేమైనా హింస అనేది ఎప్పుడూ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. మీరు రాళ్లు విసిరినపుడు, పోలీసులపై దాడి చేసినపుడు.. బారికేడ్లను తోసుకుని వెళ్తూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉంటే దీనిని ఎవరూ నిరసన అనరు. మీరు చట్టాన్ని అతిక్రమిస్తున్నారు’’ అని పేర్కొంది. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు దేవిశాను విమర్శిస్తున్నారు.ఆస్తుల కంటే ప్రాణాలు విలువైనవి కాదా?‘ఓవైపు విద్యార్థులు ప్రాణాలకు తెగించి న్యాయం కోసం పోరాడుతుంటే.. మీరేమో మీ భర్తను తిరిగి టీమిండియాలోకి చేర్చాలనే ఉద్దేశంతో రాజ్యానికి వంతపాడుతున్నారు. మీరన్నది నిజమే. ప్రభుత్వ ఆస్తుల్ని నష్టపరిచే హక్కు ఎవరికీ లేదు.మరి ఆస్తుల కంటే ప్రాణాలు మరింత విలువైనవి కదా! పేపర్ లీకేజీ వ్యవహారంతో బలవన్మరణాలకు పాల్పడిన విద్యార్థులకు మద్దతుగా మీరు ఏనాడైనా రాజ్యాన్ని ప్రశ్నించారా? ఇప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మన వరకూ వస్తేనే ఏదైనా అర్థమవుతుంది’ అని విరుచుకుపడుతున్నారు. మరికొందరేమో దేవిశా సరిగ్గా చెప్పిందంటూ సమర్థిస్తున్నారు.చదవండి: వైఫల్యాలపై స్పందించిన వైభవ్ సూర్యవంశీ -
భారత్-జింబాబ్వే టీ20 సిరీస్ షెడ్యూల్.. జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే
భారత్-జింబాబ్వే మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు సమయం అసన్నమైంది. జూలై 23 నుంచి హరారే వేదికగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది. వరుసగా ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో ఘోర పరాజయాలను చవిచూసిన భారత్.. ఈ సిరీస్తో తిరిగి విజయాల బాట పట్టాలని పట్టుదలతో ఉంది.ఇప్పటికే జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టిన శ్రేయస్ సేన మూడు రోజుల పాటు నెట్స్లో తీవ్రంగా శ్రమించింది. ఈ సిరీస్ భారత జట్టుతో పాటు వైభవ్ సూర్యవంశీ, మయాంక్ యాదవ్ వంటి యువ ఆటగాళ్లకు ఎంతో కీలకం కానుంది. తన అరంగేట్ర సిరీస్లో విఫలమైన వైభవ్.. ఇప్పుడు జింబాబ్వేపై ఎలా రాణిస్తాడోనని అందరూ అతృతగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఛాన్నాళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన యువ పేసర్ మయాంక్ యాదవ్పై కూడా అందరి కళ్లు ఉన్నాయి. అంతేకాకుండా ఇంగ్లండ్, ఐర్లాండ్ సిరీస్లలో విఫలమైన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్కు కూడా తన ఫామ్ను అందుకోవడానికి ఈ జింబాబ్వే పర్యటన ఎంతగానో ఉపయోగపడనుంది.మరోవైపు సొంతగడ్డపై వరుస విజయాలతో మంచి జోష్ మీద ఉన్న జింబాబ్వే.. టీమిండియాను అడ్డుకునేందుకు తమ ఆస్త్రశాస్రాలను సిద్దం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ తదితర విషయాలను తెలుసుకుందాం.షెడ్యూల్ఈ సిరీస్లోని అన్ని మ్యాచ్లు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగానే జరగనున్నాయి.1వ టీ20- జూలై 23, 2026- గురువారం- సాయంత్రం 4:30- హరారే స్పోర్ట్స్ క్లబ్2వ టీ20- జూలై 25, 2026- శనివారం-సాయంత్రం 4:30- హరారే స్పోర్ట్స్ క్లబ్3వ టీ20-జూలై 26, 2026- ఆదివారం- సాయంత్రం 4:30- హరారే స్పోర్ట్స్ క్లబ్ఈ మ్యాచ్లను భారత్లో జీ ఎంటర్టైన్మెంట్కు చెందిన సరికొత్త స్పోర్ట్స్ ఛానెల్ Unite8 Sports లో వీక్షించవచ్చు. అదేవిధంగా ఫ్యాన్కోడ్ యాప్, వెబ్సైట్లో కూడా ఈ మ్యాచ్లను చూడవచ్చు.జట్లుభారత్శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, ప్రిన్స్ యాదవ్, యష్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), రవి బిష్ణోయ్. జింబాబ్వే సికిందర్ రజా (కెప్టెన్), బ్రియన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, తనకా చివాంగా, బెన్ కుర్రాన్, బ్రాడ్ ఎవాన్స్, వెస్లీ మాధెవెరె, తాడివనాషే మరుమాని, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజారబాని, డియోన్ మైయర్స్, రిచర్డ్ న్గరావా, న్యూమాన్ నియామ్హురీ, మిల్టన్ షుంబా, తఫద్వా త్సిగా (వికెట్ కీపర్). -
పాక్ క్రికెటర్లకు పీసీబీ వింత కండీషన్
పాకిస్తాన్ క్రికెటర్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు (PCB) వింత కండీషన్ పెట్టింది. లాహోర్లోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో శిక్షణ పొందే ఆటగాళ్ల ఫిట్నెస్ మెరుగుపరిచేందుకు 'పాడెల్' ఆటను తప్పనిసరి చేసింది. ప్రతి రెండో రోజు 40 నిమిషాల పాటు ప్రతి ఆటగాడు పాడెల్ గేమ్ను ఆడాల్సిందేనని ప్రకటన జారీ చేసింది.పీసీబీ సీనియర్ సెలెక్టర్, డైరెక్టర్ ఆఫ్ హై పెర్ఫార్మెన్స్ ఆకిబ్ జావెద్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఆటగాళ్ల చురుకుదనం, రిఫ్లెక్సులు, కదలికలు, ఫీల్డింగ్ నైపుణ్యాలను మెరుగుపరచడమే ఈ చర్య లక్ష్యమని ఆయన చెప్పారు.ఇప్పటికే పలువురు క్రికెటర్లు పాడెల్ ఆడుతున్నప్పటికీ, అందుకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని ఆకిబ్ తెలిపారు. ఇప్పుడు ఎన్సీఏలోనే ప్రత్యేక పాడెల్ కోర్టును ఏర్పాటు చేయడంతో శిక్షణతో పాటు ఈ ఆటను కూడా ఆడే అవకాశం కల్పించినట్లు చెప్పారు.టెన్నిస్, స్క్వాష్ అంశాల కలయికతో ఆడే పాడెల్ చిన్న కోర్టులో జరిగినప్పటికీ, అధిక స్థాయి ఫిట్నెస్, వేగం, స్టామినా అవసరమయ్యే క్రీడగా గుర్తింపు పొందింది. అందుకే దీన్ని క్రికెటర్ల శిక్షణలో భాగం చేశామని ఆకిబ్ వెల్లడించారు.అంతేకాకుండా, భవిష్యత్తులో ఎన్సీఏలో బాస్కెట్బాల్ కోర్టులు, స్నూకర్తో పాటు ఇతర ఇండోర్ గేమ్స్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే అత్యాధునిక ఏఐ (AI) బౌలింగ్ మెషీన్ను అకాడమీలో అందుబాటులోకి తీసుకువచ్చామని, ఆటగాళ్ల నైపుణ్యాలను మరింత మెరుగుపరచడమే పీసీబీ లక్ష్యమని ఆకిబ్ పేర్కొన్నారు.ఇదిలా ఉంటే, పాకిస్తాన్ జట్టు వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుంది. ఆ పర్యటనలో భాగంగా మూడు టెస్ట్లు ఆడనుంది. ఈ సిరీస్ కోసం పాక్ జట్టును ఇదివరకే ప్రకటించారు. ఈ పర్యటనతో కెప్టెన్గా బాబర్ ఆజం శకం మళ్లీ మొదలవుతుంది. మాజీ కెప్టెన్ షాన్ మసూద్ వరుస వైఫల్యాల నేపథ్యంలో అతడిని తొలగించి బాబర్కు కెప్టెన్సీ పగ్గాలు మళ్లీ కట్టబెట్టారు. -
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో శుబ్మన్ గిల్
టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ వన్డేల్లో వరల్డ్నంబర్ వన్ బ్యాటర్గా నిలిచేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకటించిన తాజా వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో అగ్రస్ధానానికి గిల్ మరింత చేరవయ్యాడు. ప్రస్తుతం అగ్రస్ధానంలో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డారిల్ మిచెల్ 802 రేటింగ్ పాయింట్లతో నంబర్ 1 స్థానంలో ఉండగా.. గిల్ (801) కేవలం ఒక్క పాయింట్ తేడాతో రెండో స్థానంలో నిలిచాడు. తదుపరి ఐసీసీ ర్యాంకింగ్స్ అప్డేట్లో గిల్ అగ్రస్థానానికి చేరుకుంటే.. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో అగ్రపీఠాన్ని అదరోహించిన అత్యంత పిన్న వయస్కుడైన భారత కెప్టెన్గా చరిత్ర సృష్టిస్తాడు. గతంలో భారత్ తరపున వన్డేల్లో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజ క్రికెటర్లు టాప్ ర్యాంక్ను సొంతం చేసుకున్నారు. కాగా ఇంగ్లండ్తో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్లో గిల్ అదరగొట్టాడు. మూడు మ్యాచ్లలో 94.00 అద్భుత సగటుతో 188 పరుగులు సాధించి, భారత్ తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ ప్రదర్శ కారణంగానే అతడిని నంబర్-1 ర్యాంక్ రేసులో ఉన్నాడు.కాగా ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత బ్యాటర్ల హవా కొనసాగుతోంది. గిల్తో పాటు విరాట్ కోహ్లి 767 పాయింట్లతో మూడో స్థానంలో, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 758 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ సిరీస్లో రోహిత్, కోహ్లి కూడా మెరుగైన ప్రదర్శన చేశారు. ఇక ఇదే సిరీస్లో దుమ్ములేపిన ఇంగ్లండ్ వెటరన్ జో రూట్ నాలుగు స్ధానాలు ఎగబాకి ఎనిమిదో ర్యాంక్కు చేరుకున్నాడు. -
డెబ్బై పరుగులు చేస్తాడు.. కండరాలు పట్టేస్తాయి: ఇంగ్లండ్ దిగ్గజం
టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ ఫిట్నెస్పై ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ప్రశ్నలు సంధించాడు. కాస్త ఎక్కువ సేపు బ్యాటింగ్ చేసిన ప్రతీసారీ అతడి కండరాలు పట్టేయడం శుభసూచకం కాదన్నాడు. ఇంగ్లండ్తో మొదటి, మూడో వన్డేలో 70 పరుగులు చేసిన తర్వాత గిల్ ఇబ్బంది పడ్డ తీరు జట్టుకు ఎంతమాత్రం మంచిది కాదని బ్రాడ్ పేర్కొన్నాడు.అసహనం వ్యక్తం చేసిన గిల్కాగా టీమిండియా ఆటగాళ్లు తరచూ గాయాల పాలవుతుండటంపై శుబ్మన్ గిల్ ఇటీవల తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రెండు, మూడు మ్యాచ్లకు ఒకసారి గాయాలతో అందుబాటులో లేకుండా పోతే... వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్లో ఎలా ఆడతారని ప్రశ్నించాడు. ఐర్లాండ్–ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఆడిన మూడు సిరీస్ల్లోనూ భారత జట్టు ఓటమి పాలైన సంగతి తెలిసిందే ఇంగ్లండ్తో ఆదివారం లార్డ్స్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో గిల్ సారథ్యంలోని టీమిండియా 27 పరుగుల తేడాతో ఓడింది.మోకాలి గాయం కారణంగా ఆఖరి వన్డేకు పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోగా... పెద్దగా అనుభవం లేని భారత బౌలింగ్ను ఇంగ్లండ్ బ్యాటర్లు ఓ ఆటాడుకున్నారు. దీంతో టీమిండియా ముందు రికార్డు లక్ష్యం నిలిచింది. ఛేదనలో ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ సూపర్ సెంచరీకి గిల్, కోహ్లి అర్ధశతకాలు తోడవడంతో ఒక దశలో భారత్ గెలుస్తుందనిపించినా... మిగిలిన ప్లేయర్లు చేతులెత్తేయడంతో పరాజయం తప్పలేదు.గాయాల బెడదఈ సిరీస్ ప్రారంభానికి ముందే పేస్ ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి గాయాలతో జట్టుకు దూరం కాగా... హర్షిత్ రాణా టీ20 సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. ఇక స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ రెండో మ్యాచ్లో గాయపడగా... మోకాలి గాయంతో బుమ్రా మూడో మ్యాచ్ ఆడలేదు. ఈ నేపథ్యంలో లార్డ్స్లో ఓటమి అనంతరం గిల్ మాట్లాడుతూ... ‘ముందు ప్రకటించిన జట్టులోని ఐదుగురు ఆటగాళ్లు చివరి మ్యాచ్ ఆడలేదు. ఒక ఆటగాడు గాయపడితే... ప్రత్యామ్నాయ వ్యూహాన్ని అనుసరించవచ్చు. ఇద్దరు అందుబాటులో లేకపోతే జట్టు కూర్పును మార్చుకోవచ్చు.దీనికి మందు కనిపెట్టాలికానీ ప్రతి మ్యాచ్ తర్వాత ఎవరో ఒకరు గాయపడుతుంటే... జట్టు సమతుల్యత దెబ్బతింటుంది. దీనికి మందు కనిపెట్టాలి. ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుంటే... అక్కడి వరుసగా పది, పదకొండు మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రెండు మ్యాచ్లకు గాయపడితే... మెగా టోర్నీలో ఎలా ఆడగలం. మ్యాచ్ రోజు ఉదయం వచ్చి నేను ఆడలేను అని అంటే వ్యూహాలు ఎలా అమలు చేయగలం’ అని అన్నాడు.వ్యక్తిగతంగా ఎవరి పేరు ప్రస్తావించకపోయినా... ఇటీవలి కాలంలో తరచూ గాయపడుతున్న ప్లేయర్లను ఉద్దేశించే గిల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవతుంది. ఇదిలా ఉంటే... ఇటీవలి కాలంలో గిల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తరచూ కండరాల నొప్పితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.డెబ్బై పరుగులు చేస్తాడు.. కండరాలు పట్టేస్తాయిఈ నేపథ్యంలోనే స్టువర్ట్ బ్రాడ్ గిల్ ఫిట్నెస్ సమస్యల గురించి తాజాగా విమర్శించాడు. ‘‘ప్రతిసారీ అతడు 70 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత.. కండరాల నొప్పితో విలవిల్లాడుతున్నాడు. ఇంగ్లండ్తో తొలి, మూడో వన్డేలో అతడు ఇలాగే రిథమ్ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు’’ అని పేర్కొన్నాడు. కాగా తొలి వన్డేలో 80 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన శుబ్మన్ గిల్.. మూడో వన్డేలో 77 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత ఆదిల్ రషీద్ బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగాడు.చదవండి: వైఫల్యాలపై స్పందించిన వైభవ్ సూర్యవంశీ -
కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం
భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్లోని యార్క్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని యార్క్షైర్ క్లబ్ అధికారికంగా ప్రకటించింది.31 ఏళ్ల ఎడమచేతి చైనామన్ స్పిన్నర్ కుల్దీప్, మెట్రో బ్యాంక్ వన్డే కప్లో ఐదు మ్యాచ్లు ఆడనున్నాడు. అనంతరం సెప్టెంబర్లో జరిగే రోతెసే కౌంటీ ఛాంపియన్షిప్ చివరి నాలుగు మ్యాచ్ల్లో మూడు మ్యాచ్లకు అందుబాటులో ఉండనున్నాడు. కుల్దీప్ శుక్రవారం గ్లామోర్గన్తో జరిగే వన్డే మ్యాచ్ ద్వారా యార్క్షైర్ తరఫున బరిలోకి దిగనున్నాడు.యార్క్షైర్తో ఒప్పందంపై స్పందించిన కుల్దీప్, "యార్క్షైర్ వంటి గొప్ప చరిత్ర కలిగిన క్లబ్కు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నాను. ఇంగ్లండ్ పరిస్థితుల్లో ఆడటం నాకు ఎప్పుడూ ఇష్టం. జట్టు యాజమాన్యంతో మాట్లాడిన తర్వాత ఇక్కడ ఆడాలనే ఆసక్తి మరింత పెరిగింది. జట్టు విజయాల్లో నా వంతు పాత్ర పోషించాలని ఎదురుచూస్తున్నాను" అని తెలిపాడు.కాగా, కుల్దీప్కు ఇటీవలికాలంలో టీమిండియా తరఫున సరైన అవకాశాలు రావడం లేదు. తాజాగా ఇంగ్లండ్ సిరీస్లో అతడు జట్టులో ఉన్నా, ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. రేపటి నుంచి జరుగబోయే జింబాబ్వే టీ20 సిరీస్లోనూ అవకాశం దక్కలేదు. దీంతో అతడు ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ బాట పట్టాడు.కుల్దీప్.. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, రవి బిష్ణోయ్ తదితర స్పిన్నర్ల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాడు. అతడి వైవిధ్యభరితమైన చైనామన్ శైలి కూడా అవకాశాలు తెచ్చిపెట్టడం లేదు. -
వార్న్, కుంబ్లేను అధిగమించిన న్యూజిలాండ్ స్పిన్నర్
న్యూజిలాండ్ ఎడమచేతి స్పిన్నర్ జేడెన్ లెనాక్స్ వెస్టిండీస్తో జరిగిన ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్లో అద్భుత ప్రదర్శనతో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సిరీస్లో మొత్తం 14 వికెట్లు పడగొట్టి, న్యూజిలాండ్కు 3-2తో సిరీస్ విజయాన్ని అందించడంతో పాటు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును సొంతం చేసుకున్నాడు.ఈ సిరీస్లో 14 వికెట్లు తీసిన లెనాక్స్, శ్రీలంక స్పిన్నర్ అకిల ధనంజయతో కలిసి ద్వైపాక్షిక వన్డే సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్ల జాబితాలో సంయుక్తంగా 10వ స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో స్పిన్ దిగ్గజాలు షేన్ వార్న్, అనిల్ కుంబ్లే, షాహిద్ అఫ్రిది సాధించిన 13 వికెట్ల రికార్డును అధిగమించాడు.31 ఏళ్ల లెనాక్స్ ఈ ఏడాది భారత్పై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన తర్వాత కేవలం తన మూడో ద్వైపాక్షిక వన్డే సిరీస్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ద్వైపాక్షిక వన్డే సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్గా భారత్కు చెందిన అమిత్ మిశ్రా (18 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా, కుల్దీప్ యాదవ్ (17), రషీద్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్ (16) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.సిరీస్ అనంతరం మాట్లాడిన లెనాక్స్.. వెస్టిండీస్లోని స్పిన్కు అనుకూలమైన పిచ్లు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపాడు. మిచెల్ సాంట్నర్ వంటి అనుభవజ్ఞుడిని దగ్గరగా గమనించడం ద్వారా బౌలింగ్లోని చిన్నచిన్న మెళకువలు నేర్చుకునే అవకాశం లభించిందని పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే, సిరీస్ను కోల్పోయిన వెస్టిండీస్ చివరి వన్డేలో మాత్రం రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. షిమ్రోన్ హెట్మైర్ అజేయంగా 69 పరుగులు చేయగా, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్ 61 పరుగులతో రాణించి 269 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించారు. హెట్మైర్కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. -
వైఫల్యాలపై స్పందించిన వైభవ్ సూర్యవంశీ
వరుస బ్యాటింగ్ వైఫల్యాలపై టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ స్పందించాడు. గత నాలుగు నెలల కాలంలో తన కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశానన్నాడు. అయితే, క్రికెట్లో ఇవన్నీ భాగమేనని.. జట్టు ప్రయోజనాల కోసం తాను ఎల్లప్పుడూ వందశాతం కష్టపడతానని స్పష్టం చేశాడు.కాగా ఐపీఎల్, భారత్ అండర్-19 జట్టు తరఫున విధ్వంసకర బ్యాటింగ్తో దుమ్ములేపిన వైభవ్ సూర్యవంశీ.. పదిహేనేళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తద్వారా అత్యంత పిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన భారత తొలి క్రికెటర్గా చరిత్రకెక్కాడు.భారీ అంచనాల నడుమఈ పరిణామాల నేపథ్యంలో భారీ అంచనాల నడుమ ఇంగ్లండ్తో రెండో టీ20 సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన వైభవ్.. పూర్తిగా విఫలమయ్యాడు. ఓపెనర్గా సంజూ శాంసన్ స్థానాన్ని భర్తీ చేసిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ మూడు మ్యాచ్లలో వరుసగా 14, 13 , 15 పరుగులు మాత్రమే చేశాడు.ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ ఆట తీరుపై విమర్శలు వచ్చాయి. దీంతో ఇంగ్లండ్తో ఐదో టీ20లో ఈ బిహారీ పిల్లాడిని తప్పించి.. మళ్లీ సంజూనే ఆడించింది మేనేజ్మెంట్. ఇక ఈ సిరీస్లో ఇంగ్లండ్ చేతిలో భారత్ 4-0తో క్లీన్స్వీప్ అయింది.అయితే, జింబాబ్వేతో తాజాగా మరో టీ20 సిరీస్ను గురువారం నుంచి మొదలుపెట్టనుంది. ఈ క్రమంలో సంజూ శాంసన్ను జట్టు నుంచి తప్పించిన యాజమాన్యం.. అభిషేక్ శర్మకు జోడీగా జింబాబ్వే సిరీస్కు వైభవ్ను ఎంపిక చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ..వంద శాతం కష్టపడతాను‘‘గడిచిన నాలుగు నెలల కాలంలో నేను ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాను. క్రికెట్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అయితే, ఆటను మెరుగుపరచుకునే ప్రక్రియపై మాత్రమే నేను దృష్టి పెట్టాను. జట్టు కోసం వందకు వంద శాతం కష్టపడతాను’’ అని వైభవ్ సూర్యవంశీ తెలిపాడు.అదే విధంగా.. ‘‘కోచ్లు, ఇతర సిబ్బంది నాకు మార్గదర్శనం చేస్తున్నారు. ప్రాక్టీస్ సమయంలో నాకేం కావాలో అన్నీ సమకూరుస్తున్నారు. అంతా బాగుంది. ఈ అనుభూతి గొప్పగా అనిపిస్తోంది. రోజురోజుకీ ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతోంది.ఈ పిచ్లపై నాకు అవగాహన ఉందిఇక జింబాబ్వేతో టీ20 సిరీస్ జరిగే హరారే స్పోర్ట్స్ క్లబ్ నా మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇక్కడే నాలుగు నెలల క్రితం అండర్-19 వరల్డ్కప్ ఫైనల్లో మేము గెలిచాం. అప్పుడు యువ జట్టు తరఫున.. ఇప్పుడు టీమిండియా తరఫున ఇదే గ్రౌండ్లో ఆడటం గొప్పగా ఉంది. ఈ పిచ్లపై నాకు అవగాహన ఉంది. కాబట్టి జట్టు గెలుపులో నా వంతు కృషి చేస్తాను’’ అని వైభవ్ సూర్యవంశీ పేర్కొన్నాడు. కాగా అండర్-19 వరల్డ్కప్ ఫైనల్లో వైభవ్ ఇంగ్లండ్ మీద 80 బంతుల్లోనే 175 పరుగులు సాధించాడు. తద్వారా భారత్ ప్రపంచకప్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. చదవండి: శ్రీలంకతో టెస్టు.. భారీ ఆధిక్యంలో భారత్ -
IND vs SL: శ్రీలంక ఆలౌట్.. భారీ ఆధిక్యంలో భారత్
భారత్ అండర్-19 జట్టుతో రెండో అనధికారిక టెస్టులో శ్రీలంక యువ జట్టు స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. మొదటి ఇన్నింగ్స్లో కేవలం 148 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కాగా రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్- శ్రీలంక అండర్-19 జట్ల మధ్య సోమవారం రెండో యూత్ టెస్టు మొదలైంది.తొలిరోజే కుశాగ్ర సెంచరీకొలంబోలో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో తొలి రోజు ఆట నిలిచే సమయానికి 65 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.ఓపెనర్లు లక్ష్య (0), సాగర్ (0) డకౌట్ కావడంతో... స్కోరు బోర్డు మీద ఒక్క పరుగు చేరకముందే మన జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ యశ్వర్ధన్తో కలిసి వన్డౌన్ బ్యాటర్ కుశాగ్ర ఓజా ఇన్నింగ్స్ను నిర్మించాడు. కుశాగ్ర ఓజా శతకం (177 బంతుల్లో 103 బ్యాటింగ్; 11 ఫోర్లు, 2 సిక్స్లు) సాధించగా... కెప్టెన్ యశ్వర్ధన్ చౌహాన్ (89 బంతుల్లో 78; 11 ఫోర్లు, 2 సిక్స్లు), మనల్ చౌహాన్ (108 బంతుల్లో 55 బ్యాటింగ్; 7 ఫోర్లు) అర్ధసెంచరీలతో మెరిశారు. లంక బౌలర్లను సమర్థంగా అడ్డుకున్న ఈజంట మూడో వికెట్కు 122 పరుగులు జోడించింది.రెండోరోజు ఆట సాగిందిలా..అనంతరం కెప్టెన్ అవుట్ కాగా... కుశాగ్రకు మనల్ చౌహాన్ అండగా నిలిచాడు... ఈ జోడీ అబేధ్యమైన నాలుగో వికెట్కు 131 పరుగులు జతచేసింది. ఈ క్రమంలో 253/3 ఓవర్నైట్ స్కోరుతో మంగళవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. 411 పరుగులకు ఆలౌట్ అయింది. ఆట మొదలైన కాసేపటికే కుశాగ్ర (111) అవుట్ కాగా.. మనాల్ చౌహాన్ భారీ శతకం (244 బంతుల్లో 150)తో చెలరేగాడు.ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో 105.2 ఓవర్లలో భారత్ 411 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన శ్రీలంక.. మంగళవారం ఆట పూర్తయ్యేసరికి 40 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 122 పరుగులు మాత్రమే చేసింది.148 పరుగులకు ఆలౌట్ఈ క్రమంలో 122/8 ఓవర్నైట్ స్కోరుతో బుధవారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన శ్రీలంక.. కేవలం మరో 26 పరుగులు జతచేసి ఆలౌట్ అయింది. దుల్నిత్ సిగెర 31 పరుగులతో లంక టాప్ రన్ స్కోరర్గా నిలవగా.. ఓపెనర్ దిమంత మహావితన 24, విరాన్ చముదిత 21, లోయర్ ఆర్డర్లో సెత్మిక సెనెవిరత్నె 25 (నాటౌట్) పరుగులతో ఫర్వాలేదనిపించారు.మిగిలిన వాళ్లలో అవీష సమాశ్ (9), సెనుజ వెకునగొడ (5), కెప్టెన్ విమత్ దిన్సారా (8), కవిజ గెమాగే (7), వికెట్ కీపర్ బ్యాటర్ జేసన్ ఫెర్నాండో (4), గిమ్హాన్ మెండిస్ (4), విఘ్నేశ్వరన్ ఆకాశ్ (4) పెవిలియన్కు వరుస కట్టారు.భారత బౌలర్లలో ప్రణవ్ రాఘవేంద్ర, చిగురుపాటి వెంకట, జగన్నాథన్ హేంచుదేశన్, రోహిత్ యాదవ్ తలా రెండు వికెట్లు కూల్చగా.. కావ్యా పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలో 263 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది భారత్.భారత్కు భారీ ఆధిక్యంబుధవారం నాటి భోజన విరామ సమయానికి 16 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. ఓపెనర్లలో సాగర్ విర్క్ (17) మరోసారి విఫలం కాగా.. వన్డౌన్లో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ఆర్యన్ సక్పా (6) నిరాశపరిచాడు. ఓపెనర్ లక్ష్య రాయ్చందాని 31, కెప్టెన్ యశ్వర్దన్ 5 పరుగులతో క్రీజులో నిలిచారు. లంక బౌలర్లలో కవిజ గెమాగే తొలి రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 330 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది.చదవండి: ప్రపంచంలోనే బెస్ట్.. ఎందుకు ఆడించలేదు? -
తొలి బంతి నుంచే హిట్టింగ్ ఆడగలను కానీ..: టీమిండియా స్టార్
ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో వైట్వాష్ తర్వాత భారత టీ20 జట్టు జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టింది. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం తొలి టీ20 నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఇందుకు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగ.ఈ నేపథ్యంలో టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడగల సత్తా తనకు ఉందని.. అయితే, పరిస్థితులకు తగ్గట్లుగానే తాను బ్యాటింగ్ చేస్తానని పేర్కొన్నాడు. వైస్ కెప్టెన్గా తనకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయని.. అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తానంటూ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు.తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవాలుకాగా ఐర్లాండ్తో సిరీస్ సందర్భంగా శ్రేయస్ అయ్యర్ టీ20లలో ఇవ్వడంతో పాటు కెప్టెన్గా నియమితుడయ్యాడు. ఇక టీ20 ప్రపంచకప్ టోర్నీలో మంచి ప్రదర్శన కనబరిచిన తిలక్ వర్మకు వైస్ కెప్టెన్గా ప్రమోషన్ లభించింది. అయితే, ఐర్లాండ్తో పాటు ఇంగ్లండ్ చేతుల్లో టీమిండియా వరుసగా 2-0, 4-0తో క్లీన్స్వీప్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి.బ్యాటర్గా శ్రేయస్ ఫర్వాలేదనిపించినా.. సారథిగా అతడికి చేదు అనుభవమే మిగిలింది. మరోవైపు.. తిలక్ వర్మ స్లోగా బ్యాటింగ్ చేస్తున్నాడనే విమర్శలు వచ్చాయి. ఐర్లాండ్తో సిరీస్లో అతడి స్ట్రైక్రేటు 110 కాగా.. ఇంగ్లండ్తో సిరీస్లో 152.94కు చేరినప్పటికీ సగటు 26 మాత్రమే.ఈ నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ వంటి మాజీ క్రికెటర్లు తిలక్ వర్మను జట్టు నుంచే తొలగించాలనే డిమాండ్లు చేశారు. ఈ క్రమంలో జింబాబ్వేతో తొలి టీ20కి ముందు తిలక్ వర్మ మాట్లాడుతూ.. ‘‘టీ20 ఫార్మాట్లో ఒక్కోసారి వేర్వేరు ఆటగాళ్లు వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్కు రావాల్సి ఉంటుంది.ఆ సత్తా నాకుంది.. కానీపిచ్ పరిస్థితులకు తగినట్లుగా ప్లాన్ ఉంటుంది. కాబట్టి ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి. అంతిమంగా జట్టు ప్రయోజనాలే ముఖ్యం. ఒకవేళ ప్రణాళిక ప్రకారం.. తొలి బంతి నుంచే హిట్టింగ్ ఆడాలంటే నేను అదే పని చేస్తా. మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడగల సత్తా నాకుంది. కానీ యూకే పిచ్ పరిస్థితుల్లో అది అంత సులువు కాదు. పైగా మ్యాచ్లో ఎలాంటి స్థితిలో ఉన్నామో కూడా చూసుకోవాలి.నేను బ్యాటింగ్కు వెళ్లేసరికి జట్టు పవర్ప్లేలోనే నాలుగైదు వికెట్లు కోల్పోతూ వచ్చింది. అలాంటప్పుడు వచ్చీ రాగానే షాట్లు ఆడటం సరైంది కాదు. పైగా వైస్ కెప్టెన్ అంటే నేను మరింత బాధ్యతగా ఆడాల్సి ఉంటుంది. అందుకే తొలి బంతి నుంచే దూకుడుగా ఆడేందుకు ఆలోచించాల్సి వచ్చింది. పోరాటపటిమ ఉన్న జట్టుగత రెండేళ్లుగా ఎక్కువగా ఆసియాలోని పిచ్లపైనే ఎక్కువ మ్యాచ్లు ఆడిన మేం ఇంగ్లండ్కు వెళ్లగానే ఇబ్బంది పడ్డాం’’ అని తిలక్ వర్మ తనను విమర్శించిన వారికి కౌంటర్ ఇచ్చాడు. అదే విధంగా.. జింబాబ్వే మంచి పోరాటపటిమ ఉన్న జట్టు అని ప్రశంసించిన తిలక్ వర్మ.. వారిని ఓడించడం కూడా అంత సులువేమీ కాదన్నాడు. చదవండి: టీమిండియాపై గెలవగలం: జింబాబ్వే కెప్టెన్ -
భారత్తో టీ20 సిరీస్కు జట్టును ప్రకటించిన జింబాబ్వే
రేపటి నుంచి స్వదేశంలో భారత్తో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం జింబాబ్వే క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఆల్రౌండర్ వెస్లీ మధేవెరే, ఫాస్ట్ బౌలర్ న్యూమన్ న్యాంహురిని తిరిగి జట్టులోకి తీసుకోగా, వికెట్కీపర్-బ్యాటర్ తఫాడ్జ్వా సిగాకు తొలిసారి టీ20 జట్టులో చోటు కల్పించింది.సికందర్ రజా కెప్టెన్గా వ్యవహరించనున్న ఈ జట్టు జులై 23, 25, 26 తేదీల్లో హరారే వేదికగా టీ20 ప్రపంచ ఛాంపియన్ భారత్తో మూడు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది.ఆశించిన ప్రదర్శనలు లేకపోవడంతో మధేవెరేను ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన టీ20 సిరీస్కు పక్కన పెట్టగా.. గాయం కారణంగా ఆ సిరీస్ను మిస్ అయిన న్యూమన్ న్యాంహురి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చాడు.న్యాంహురి స్థానంలో బంగ్లాదేశ్ సిరీస్లో అవకాశం పొందిన తనాకా చివాంగా ఈసారి కూడా జట్టులో స్థానం నిలబెట్టుకోగా.. క్లైవ్ మడాండే, టినోటెండా మపోసా, తషింగా ముసెకివా ఈ సిరీస్కు ఎంపిక కాలేదు.జింబాబ్వే జట్టు: సికందర్ రజా (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, తనకా చివంగా, బెన్ కర్రాన్, బ్రాడ్ ఎవాన్స్, వెస్లీ మాధవెరె, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజారబానీ, డియోన్ మైయర్స్, రిచర్డ్ నగరావా, న్యూమాన్ న్యాంహురి, మిల్టన్ షుంబా, తఫాడ్జ్వా సిగాకాగా, ఇటీవల బంగ్లాదేశ్తో స్వదేశంలో జరిగిన సిరీస్లో జింబాబ్వే అద్భుతాలు చేసింది. తొలుత ఏకైక టెస్ట్ మ్యాచ్ను, ఆతర్వాత 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను (2-1) కైవసం చేసుకుంది. అయితే చివర్లో జరిగిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను మాత్రం 1-2 తేడాతో కోల్పోయింది. రేపటి నుంచి భారత్తో జరుగబోయే సిరీస్లోనూ అదే జోరును కొనసాగించాలని సికందర్ రజా సేన లక్ష్యంగా పెట్టుకుంది. -
నేరాన్ని అంగీకరించిన వార్నర్.. ఆగస్టు 18న తుది తీర్పు!
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ జైలుకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తప్ప తాగి వాహనం నడిపినట్లు వార్నర్ తరఫు లాయర్ బుధవారం కోర్టు ఎదుట అంగీకరించాడు. దీంతో ఆగస్టు 18న వార్నర్కు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. విషయంలోకి వెళితే.. కొన్ని నెలల క్రితం ఈస్టర్ సండే రోజున వార్నర్ తన కారును వేగంగా నడుపుకుంటూ వచ్చాడు. అయితే దారిలో పోలీసులు ఏర్పాటు చేసిన ర్యాండమ్ టెస్టింగ్ సైట్కు కొద్ది దూరంలోనే తన వాహనాన్ని ఆపాడు. వార్నర్పై అనుమానంతో పోలీసులు అతనికి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించగా, పరిమితికి మించి మద్యం సేవించినట్టు తేలింది. దీంతో వార్నర్ను అదుపులోకి తీసుకొని దగ్గర్లోని పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా ఈ కేసు విచారణ కోర్టుకు రాగా, వార్నర్ వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయాడు. అయితే వార్నర్ తరఫు న్యాయవాది బాబీ హిల్ కోర్టుకు హాజరయ్యాడు. వార్నర్ ‘మిడ్ రేంజ్’లో డ్రింక్ చేశాడని కోర్టుకు వివరించాడు. అనంతరం వార్నర్ తన నేరాన్ని అంగీకరిస్తున్నట్లు కూడా అతని తరఫు లాయర్ కోర్టకు తెలిపాడు. ‘చాలామంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. వాటికి బాధ్యత వహించడం ముఖ్యం. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్మెన్ అయినా సరే, ఈ ప్రమాదం ఎవరికైనా పొంచి ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. లాయర్ వాదనలు విన్న కోర్టు ఆగస్టు 18న తీర్పు వెల్లడించనున్నట్లు స్పష్టం చేసింది. వార్నర్ తన నేరాన్ని ఒప్పుకోవడంతో గరిష్టంగా 9 నెలల జైలు శిక్షతో పాటు 2200 ఆస్ట్రేలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. లక్ష 48 వేలు) జరిమానా పడనుంది. అంతేకాదు ర్యాష్ డ్రైవింగ్ కారణంగా లైసెన్స్ను హోల్డ్లో పెట్టి ఆరు నెలల పాటు డ్రైవింగ్ కూడా దూరంగా ఉండాలని తీర్పులో వెల్లడించే అవకాశముంది.Read: అర్జెంటీనా చీటింగ్.. కాక రేపుతున్న రొనాల్డో 'లైక్' వివాదం -
IND vs ZIM: సిరీస్లో టీమిండియా ఫేవరెట్ కాదు: జింబాబ్వే కెప్టెన్
విదేశీ పర్యటనలో ఉన్న టీమిండియా వరుస పరాజయాలు చవిచూసింది. యూకే టూర్లో భాగంగా తొలుత ఐర్లాండ్తో టీ20 సిరీస్లో తలపడ్డ భారత జట్టు.. అనూహ్య రీతిలో పసికూన చేతిలో 2-0తో క్లీన్స్వీప్ అయింది. ఆ తర్వాత ఇంగ్లండ్ గడ్డ మీద అడుగుపెట్టి ఆతిథ్య జట్టు చేతిలో 4-0తో వైట్వాష్ అయింది.దీంతో యూకే పర్యటనతో భారత టీ20 జట్టు కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్కు అత్యంత చేదు అనుభవమే మిగిలింది. విజయమన్నదే లేకుండా అతడు ఈ రెండు సిరీస్లను అవమానకర రీతిలో ముగించాల్సి వచ్చింది.ఇపుడు జింబాబ్వేతో సిరీస్అనంతరం.. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో శుబ్మన్ గిల్ సారథ్యంలోనూ టీమిండియా ఓటమిపాలైంది. ప్రత్యర్థికి 1-2తో సిరీస్ను సమర్పించుకుంది. ఇక ఇప్పుడు భారత జట్టు జింబాబ్వేలో అడుగుపెట్టింది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు టీ20 మ్యాచ్లు ఆడనుంది.ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ బృందం ఎలాగైనా ఈసారి గెలుపు ఖాతా తెరిచి.. సిరీస్లో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. అయితే, అదేమీ అంత తేలిక కాదు. ఐరిష్ జట్టు వంటి పసికూన చేతిలో ఓడిన టీమిండియాకు.. జింబాబ్వే కూడా కఠిన సవాలు విసురుతోంది.అసాధారణ విజయాలుఇటీవలి కాలంలో ఆ జట్టు సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనం. టీ20 ప్రపంచకప్-2026లో అనూహ్య రీతిలో మాజీ చాంపియన్, పటిష్ట ఆస్ట్రేలియా జట్టునే జింబాబ్వే మట్టికరిపించింది. ఏకంగా 23 పరుగుల తేడాతో ఓడించి గ్రూప్ దశలోనే ఆసీస్ను ఎలిమినేట్ చేసింది. ఆ తర్వాత శ్రీలంక, బంగ్లాదేశ్లపై కూడా విజయాలు సాధించింది.ఇక ఇటీవల బంగ్లాదేశ్ జట్టు తమ దేశంలో పర్యటించగా ఏకైక టెస్టులో బంగ్లాను ఏకంగా ఇన్నింగ్స్ 85 పరుగుల తేడాతో జింబాబ్వే మట్టికరిపించింది. ఆ తర్వాత వన్డే సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. అయితే, టీ20 సిరీస్ను మాత్రం 1-2తో బంగ్లాకు కోల్పోయింది. ఏదేమైనా ఇటీవల అన్ని ఫార్మాట్లలో చెప్పుకోదగ్గ విజయాలతో జింబాబ్వే పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.టీమిండియా ఫేవరెట్ కాదుఈ నేపథ్యంలో తాజా టీ20 సిరీస్లో టీమిండియా హాట్ ఫేవరెట్ కదా అన్న ప్రశ్నకు జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా ఇచ్చిన సమాధానం వైరల్గా మారింది. ‘‘అదేం లేదు. ఈ సిరీస్లో గెలిచేందుకు ఇరుజట్లకు సమాన అవకాశాలు ఉన్నాయి.ఏదేమైనా నేనొక విషయం కచ్చితంగా చెప్పగలను. జింబాబ్వే ఇటీవలి కాలంలో అత్యంత నిలకడగా ఆడుతూ క్రికెట్లోని అసలైన మజాను అందిస్తోంది. ఈ సిరీస్ ద్వారా కూడా జింబాబ్వే కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది.వార్వన్ సైడ్ కానే కాదుప్రస్తుతం టీమిండియా సంధి దశలో ఉంది. జింబాబ్వే పరిస్థితి కూడా అంతే. కాబట్టి ఈ సిరీస్ ఎంతమాత్రం ఏకపక్షంగా ఉండబోదని చెప్పగలను’’ అని రజా పేర్కొన్నాడు. కాగా టీమిండియా- జింబాబ్వే మధ్య జూలై 23, 25, 26 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక. చదవండి: iND vs ENG: ప్రపంచంలోనే బెస్ట్.. అతడిని ఎందుకు ఆడించలేదు?Another exciting challenge awaits Team India! 🇮🇳Zimbabwe skipper Sikandar Raza is excited for the upcoming series against India and believes fans are in for an entertaining contest! 👊🔥#ZIMvIND pic.twitter.com/6iyXDzZbLn— Star Sports (@StarSportsIndia) July 21, 2026 -
పదవి నుంచి తప్పుకున్న ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్
ఆఫ్ఘనిస్తాన్ వన్డే జట్టు కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ తన పదవికి రాజీనామా చేశాడు. వ్యక్తిగత కారణాల వల్ల అతడు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) అధికారికంగా ప్రకటించింది. అయితే షాహిదీ ఆటగాడిగా మాత్రం వన్డే జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు.2021లో వన్డే జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టిన షాహిదీ ఆఫ్ఘనిస్తాన్కు ఎన్నో మరుపురాని విజయాలనందించాడు. అతడి నాయకత్వంలో ఆ జట్టు అంతర్జాతీయ క్రికెట్లో విశేష ప్రగతి సాధించింది. 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్లో ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక వంటి అగ్ర జట్లపై చారిత్రాత్మక విజయాలు నమోదు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అనంతరం 2025 ఛాంపియన్స్ ట్రోఫీలోనూ విశేషంగా రాణించింది. షాహిదీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని, అతడు ఆటగాడిగా జట్టుకు సేవలు కొనసాగిస్తాడని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. కొత్త వన్డే కెప్టెన్ను త్వరలోనే ప్రకటిస్తామని కూడా స్పష్టం చేసింది.ఇటీవల టెస్టు జట్టుకు రషీద్ ఖాన్ను కెప్టెన్గా నియమించిన ఆఫ్ఘనిస్తాన్ బోర్డు, ఇప్పుడు వన్డే జట్టుకు కూడా కొత్త నాయకుడిని ఎంపిక చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. -
బెన్ స్టోక్స్ అదిరిపోయే రీఎంట్రీ.. సూపర్ శతకం
ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ పోటీ క్రికెట్లోకి ఘనంగా తిరిగొచ్చాడు. టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన మూడు వారాల తర్వాత వన్డే కప్ (ఇంగ్లండ్) బరిలోకి దిగిన స్టోక్స్.. డర్హమ్ తరఫున అజేయ శతకంతో అదరగొట్టాడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత డర్హమ్ తరఫున లిస్ట్-ఏ మ్యాచ్ ఆడిన స్టోక్స్, డెర్బీషైర్ నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అజేయంగా 108 పరుగులు (10 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు.ఇన్నింగ్స్ మొత్తం తీవ్ర కండరాల నొప్పి (క్రాంప్స్)తో ఇబ్బంది పడినప్పటికీ, పోరాట పటిమను ప్రదర్శిస్తూ చివరి వరకు క్రీజ్లో నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.అంతకుముందు బౌలింగ్లోనూ స్టోక్స్ తొమ్మిది ఓవర్లు వేసి వికెట్లు తీయకపోయినా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. డెర్బీషైర్ 9 వికెట్లకు 256 పరుగులు చేసింది. మార్టిన్ ఆండర్సన్ (112) అద్భుత శతకం సాధించి జట్టుకు పోటీ స్కోరు అందించాడు.లక్ష్య ఛేదనలో డర్హమ్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. బెన్ ఐచిసన్ రెండు వికెట్లు తీయడంతో ఆ జట్టు ఒత్తిడిలో పడింది. అయితే స్టోక్స్, విల్ రోడ్స్ (45)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం కొలిన్ అకర్మన్, ఒల్లీ రాబిన్సన్ కూడా విలువైన పరుగులు జోడించారు.అర్ధశతకం తర్వాత క్రాంప్స్తో మైదానంలోనే కుప్పకూలిన స్టోక్స్, నొప్పిని తట్టుకుని మళ్లీ బ్యాటింగ్ కొనసాగించాడు. చివరకు శతకం పూర్తి చేసి అజేయంగా నిలిచి డర్హమ్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. -
పరువు కాపాడిన హెట్మైర్, రూథర్ఫోర్డ్.. విండీస్దే చివరి వన్డే
స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో వెస్టిండీస్ తన పరువును కాపాడుకుంది. ఇప్పటికే వన్డే సిరీస్ను కివీస్కు అప్పగించిన వెస్టిండీస్ బుధవారం జరిగిన చివరి వన్డేలో మాత్రం 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 269 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన వెస్టిండీస్ 47.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విండీస్ సీనియర్ బ్యాటర్ షిమ్రోన్ హెట్మైర్ (69 నాటౌట్) కడదాకా నిలిచి విజయంలో కీలకపాత్ర పోషించగా, షెర్ఫెన్ రూథర్ఫోర్డ్ (61) అర్ధసెంచరీతో మెరిశాడు. ఈ ఇద్దరు కలిసి ఐదో వికెట్కు 95 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించారు. రూథర్ఫోర్డ్ ఔటయ్యాకా మళ్లీ వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ హెట్మైర్ అజేయంగా నిలిచి విండీస్ను గెలిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ, జేడన్ లెన్నోక్స్ చెరో మూడు వికెట్లు తీయగా, నాథన్ స్మిత్, మైకెల్ బ్రాస్వెల్ చెరొక వికెట్ పడగొట్టారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. టామ్ లాథమ్ (69), నిక్ కెల్లీ (64), విల్ యంగ్ (56) అర్ధసెంచరీలు సాధించారు. విండీస్ బౌలర్లలో విటెల్ లాయిస్, అల్జారీ జోసెఫ్ చెరో 2 వికెట్లు తీశారు. విండీస్ను గెలిపించిన హెట్మైర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకోగా, సిరీస్లో 14 వికెట్లతో అదరగొట్టిన కివీస్ బౌలర్ జేడన్ లెనోక్స్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు సొంతం చేసుకున్నాడు.చదవండి: అతడి విషయంలో బీసీసీఐ ఆందోళన.. జట్టు ప్రకటన వాయిదా! -
అతడి విషయంలో బీసీసీఐ ఆందోళన.. జట్టు ప్రకటన వాయిదా!
శ్రీలంకతో రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ ప్రారంభానికి ముందు బీసీసీఐని ఒక అంశం తెగ కలవరపెడుతోంది. అదేంటంటే కండరాల గాయంతో బాధపడుతున్న ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ లంకతో టెస్టు సిరీస్కు దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సిరీస్కు సంబంధించి తుది జట్టును ఇంకా ప్రకటించనప్పటికీ అతడి గాయం తీవ్రత చాలా ఎక్కువగానే ఉండడంతో ఫిట్నెస్పై స్పష్టత రావడం లేదు. అందుకే శ్రీలంకతో టెస్టు సిరీస్కు జట్టు ప్రకటనను బీసీసీఐ సెలెక్టర్లు వాయిదా వేసినట్లు సమాచారం. సుందర్ గాయం తీవ్రతపై పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే బీసీసీఐ జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. టెస్టు సిరీస్ ప్రారంభానికి మరో మూడు వారాలు మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ వారం చివర్లో లేదా వచ్చే సోమవారం నాటికి జట్టును ప్రకటించాలని బీసీసీఐ భావిస్తోంది.వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నాడు. కండరాల గాయానికి స్కానింగ్ నిర్వహించనుండగా.. అది గ్రేడ్-1 గాయంగా పరిగనణించే అవకాశాలున్నట్లు ఒక నివేదిక పేర్కొంటుంది. దీంతో సుందర్ గాయంపై పూర్తి నివేదిక వచ్చాకే జట్టును ప్రకటించాలనుకుంటున్నట్లు బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇంగ్లండ్తో రెండో వన్డే సందర్భంగా సుందర్ కండరాల గాయానికి గురవ్వడంతో ఆ మ్యాచ్లో బౌలింగ్కు కూడా దూరంగా ఉన్నాడు.ఇక గిల్ సారథ్యంలోని టీమిండియా ఆగస్టు 4న శ్రీలంకలోని కొలంబోకు చేరుకోనుంది. టెస్టు సిరీస్ కు ముందు స్థానిక పరిస్థితులకు అలవాటు పడేందుకు ఆగస్టు 7 నుంచి 10 వరకు కొలంబోలో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ఆటగాళ్లకు శ్రీలంక పిచ్లు, వాతావరణానికి అలవాటు పడేందుకు ఎంతో ఉపయోగపడుతుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇరుజట్ల మధ్య తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 మధ్య గాలే వేదికగా, కొలంబో వేదికగా ఆగస్టు 23 నుంచి 27 వరకు రెండో టెస్టు జరగనుంది. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పట్టికలో పైకి ఎగబాకాలని చూస్తున్న ఇరుజట్లకు ఈ సిరీస్ కీలకం కానుంది. తొమ్మిది మ్యాచ్ల తర్వాత భారత్ 48.15 పాయింట్ల శాతంతో ఐదో స్థానంలో ఉండగా, శ్రీలంక 44.44 పాయింట్ల శాతంతో ఆరో స్థానంలో కొనసాగుతోంది.ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలు టాప్-2లో కొనసాగుతున్నాయి. ఇక 2017 తర్వాత శ్రీలంకలో భారత్ టెస్టు సిరీస్ ఆడడం ఇదే. 2017లో కోహ్లి కెప్టెన్సీలో లంకలో పర్యటించిన టీమిండియా 3-0 తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక చివరగా స్వదేశంలో అఫ్గానిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ తేడాతో విజయాన్ని అందుకుంది. మరోవైపు శ్రీలంక మాత్రం తాము ఆడిన చివరి టెస్టు సిరీస్ను వెస్టిండీస్కు 2-0తో కోల్పోయింది.చదవండి: ‘నిజమే సైకోలా ప్రవర్తించాడు కానీ శిక్షించొద్దు’ -
క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ముంబై, సన్రైజర్స్ అరుదైన ఫీట్!
ఇంగ్లండ్ వేదికగా ప్రారంభమైన హండ్రెడ్ లీగ్ టోర్నీలో ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ ఫ్రాంచైజీలు శుభారంభం చేశాయి. ఏకకాలంలో ప్రారంభమైన హండ్రెడ్ మెన్స్, హండ్రెడ్ వుమెన్స్ టోర్నీల్లో విజయాలు అందుకున్నాయి. పురుషుల హండ్రెడ్ లీగ్లో సన్రైజర్స్ లీడ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ లండన్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకోగా, అటు మహిళల విభాగంలో ముంబై ఇండియన్స్ లండన్పై సన్రైజర్స్ లీడ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించడం విశేషం. ఏకకాలంలో రెండు జట్లు ఒక దానిపై ఒకటి వేర్వేరుగా విజయాలు నమోదు చేయడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.దంచికొట్టిన పూరన్..పురుషుల హండ్రెడ్ లీగ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ లీడ్స్ 99 బంతుల్లో 143 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (27 బంతుల్లో 41), టామ్ అల్సోప్ (18 బంతుల్లో 31) దూకుడుగా ఆడారు. ముంబై బౌలర్లలో రిచర్డ్ గ్లెసన్ 4 వికెట్లు తీయగా, సామ్ కరన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ముంబై ఇండియన్స్ లండన్ జట్టు 84 బంతుల్లోనే 3 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ సామ్ కరన్ (39 బంతుల్లో 60 నాటౌట్), నికోలస్ పూరన్ (22 బంతుల్లో 58 నాటౌట్) విధ్వంసం సృష్టించారు.రాణించిన దీప్తి శర్మమహిళల హండ్రెడ్ టోర్నీ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ లండన్ జట్టు 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ (33), డానీ వ్యాట్ (29) పర్వాలేదనిపించారు. ఆల్రౌండర్ దీప్తి శర్మ, డానియెల్లి గిబ్సన్లు చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సన్రైజర్స్ 69 బంతుల్లోనే 3 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఫోబె లిచ్ఫీల్డ్ (3), అనాబెల్ సదర్లాండ్ (30) విజయంలో కీలకపాత్ర పోషించారు. -
‘వారిని ఓడించడం అంత సులువు కాదు’
హరారే: ఐర్లాండ్, ఇంగ్లండ్ల చేతుల్లో టి20 సిరీస్లు ఓడిపోయిన తర్వాత భారత జట్టు ఇప్పుడు ఈ ఫార్మాట్తో మరో పోరుకు సిద్ధమైంది. మూడు టి20ల సిరీస్లో భాగంగా రేపు భారత్, జింబాబ్వే మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇటీవల ప్రదర్శనను మరచి కొత్త ఉత్సాహంతో తాము బరిలోకి దిగుతున్నామని భారత జట్టు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ వ్యాఖ్యానించాడు. ‘జింబాబ్వే చాలా మంచి జట్టు. ఎంతో పోటీతత్వంతో పోరాడుతుంది. వారిని ఓడించడం అంత సులువు కాదు. గత ఏడాది జింబాబ్వేతో ఆడిన సిరీస్లో తొలి మ్యాచ్ వారే నెగ్గారు. నాటి భారత టీమ్లో ఉన్నవారిలో చాలా మంది ఇప్పుడూ వచ్చారు. మంచి పిచ్లతో బ్యాటింగ్కు అనుకూల పరిస్థితులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. గతంలో జింబాబ్వే గడ్డపై ఆడిన అనుభవం పనికొస్తుంది’ అని తిలక్ అన్నాడు. ఐర్లాండ్–ఇంగ్లండ్ల చేతుల్లో ఓటమికి పలు కారణాలు ఉన్నాయని, వాటిని విశ్లేషించుకున్నామని.. తాను మరింత బాధ్యతగా ఆడాల్సి ఉందని చెప్పాడు. -
పొరేల్ అరెస్ట్కు రంగం సిద్ధం!
కోల్కతా: బెంగాల్ క్రికెటర్, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ పొరేల్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఒక రేప్ కేసులో నిందితుడిగా 24 ఏళ్ల పొరేల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతని మొబైల్ ఫోన్ తదితర ఎల్రక్టానిక్ వస్తువులను వెంటనే సీజ్ చేయాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. బాధితురాలికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని పొరేల్ బయటపెట్టే ప్రమాదం ఉండటంతో కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. పొరేల్ ఎక్కడున్నా అతడిని అదుపులోకి తీసుకోవాలని కూడా కోర్టు ఆదేశించింది. గత నెలలో రేప్ ఆరోపణలతో మోగ్రా పోలీస్ స్టేషన్లో పొరేల్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటాననే హామీతో పొరేల్ తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని... తమ ఇద్దరికి సంబంధించి వ్యక్తిగత వీడియోలను రికార్డు చేసి ఇప్పుడు బెదిరిస్తున్నాడని ఒక అమ్మాయి ఫిర్యాదు చేసింది. 2023 నుంచి తమ మధ్య సంబంధం ఉందని ఆమె పేర్కొంది. -
తొలి మ్యాచ్లో తలపడనున్న సన్రైజర్స్- ముంబై ఇండియన్స్
క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు మరో ధనాధన్ లీగ్ సిద్దమైంది. 'ది హండ్రెడ్' (The Hundred) 6వ ఎడిషన్ మంగళవారం (జులై 21) నుంచి ప్రారంభం కానుంది. మహిళల ది హండ్రెడ్ కూడా ఈ రోజు నుంచే మొదలు కానుంది.ఈ రెండు టోర్నీల్లోనూ మొదటి మ్యాచ్లో సన్రైజర్స్ లీడ్స్, ఎంఐ లండన్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లు కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలైన సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్కు యాజమాన్యానికి చెందినివే కావడం గమనార్హం.34 రోజుల పాటు సాగే ఈ వంద బంతుల టోర్నీలో మొత్తం 8 జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఎంఐ లండన్, సన్రైజర్స్ లీడ్స్, మాంచెస్టర్ సూపర్ జెయింట్స్, సదరన్ బ్రేవ్,లండన్ స్పిరిట్ , బర్మింగ్హామ్ ఫోనిక్స్, ట్రెంట్ రాకెట్స్, వెల్ష్ ఫైర్ జట్లుగా ఉన్నాయి. ఈ టోర్నీలో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్లతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్కు చెందిన కీలక ఆటగాళ్లు కూడా భాగం కానున్నారు. ఫైనల్ మ్యాచ్ ఆగస్టు 16న జరగనుంది. ఈ లీగ్కు సంబంధించిన మ్యాచ్లను భారత్లో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో వీక్షించవచ్చు.జట్లు ఇవే1.ఏంఐ లండన్ (MI London) సామ్ కర్రన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, టామ్ కర్రన్, రిచర్డ్ గ్లీసన్, విల్ జాక్స్, రషీద్ ఖాన్, క్యాలమ్ పార్కిన్సన్, ఓలీ పోప్, నికోలస్ పూరన్, జాసన్ రాయ్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, నాథన్ సోటర్, ఓలీ స్టోన్, ఓలీ సైక్స్, జేమ్స్ విన్స్, ఎడ్డీ జాక్, సెబ్ మోర్గాన్.2.సన్రైజర్స్ లీడ్స్ (Sunrisers Leeds) జాక్ క్రాలీ (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, టామ్ ఆల్సోప్, ఎడ్ బర్నార్డ్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, నాథన్ ఎల్లిస్, బెన్నీ హోవెల్, టామ్ లావెస్, డేనియల్ లారెన్స్, మిచెల్ మార్ష్, లియామ్ పాటర్సన్-వైట్, మాథ్యూ పాట్స్, ర్యాన్ రికెల్టన్, రీస్ టోప్లీ, చార్లీ అల్లిసన్, మ్యాటీ రెవిస్.3.మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ (Manchester Super Giants)ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), గుస్ అట్కిన్సన్, సోనీ బేకర్, జోస్ బట్లర్, లియామ్ డాసన్, ల్యూస్ డు ప్లూయ్, టామ్ హార్ట్లీ, మాక్స్ హోల్డెన్, హెన్రిచ్ క్లాసెన్, టామ్ మూర్స్, తవాండా ముయెయ్, నూర్ అహ్మద్, జార్జ్ స్క్రిమ్షౌ, పాల్ష్ స్క్రిమ్షా, టిమ్ష్ టోయిఫ్షా, టిమ్ష్ ఫించ్, జేమ్స్ సేల్స్.4.సదరన్ బ్రేవ్ (Southern Brave) క్రిస్ జోర్డాన్ (కెప్టెన్), టామ్ అబెల్, జోఫ్రా ఆర్చర్, నిఖిల్ చౌదరి, కాలెబ్ ఫాల్కనర్, బెన్ మెక్కిన్నీ, డేవిడ్ మిల్లర్, మైఖేల్ పెప్పర్, ఆదిల్ రషీద్, థామస్ రేవ్, జేమీ స్మిత్, మార్కస్ స్టోయినిస్, ట్రిస్టన్ స్టబ్స్, ల్యూక్ వుడ్, డాన్ వోరాల్, మ్యానీ లమ్స్డెన్, సైఫ్ జైబ్.5. లండన్ స్పిరిట్ (London Spirit) లియామ్ లివింగ్స్టోన్ (కెప్టెన్), జానీ బేయిర్స్టో, డెవాల్డ్ బ్రెవిస్, జేమ్స్ కోల్స్, మేసన్ క్రేన్, మాట్ ఫిషర్, టైమల్ మిల్స్, ఆడమ్ మిల్నే, జేమీ ఓవర్టన్, లువాన్-డ్రే ప్రిటోరియస్, జేమ్స్ రేవ్, డేవిడ్ విల్లీ, ఆడమ్ జంపా, కిరణ్ కార్ల్సన్, హెన్రీ క్రోకోంబ్.6. బర్మింగ్హామ్ ఫోనిక్స్ (Birmingham Phoenix) జాకబ్ బెథెల్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జో క్లార్క్, స్కాట్ కర్రీ, లారీ ఎవాన్స్, డోనోవన్ ఫెరీరా, సాకిబ్ మహమూద్, మాథ్యూ మాంట్గోమెరీ, మిచ్ ఓవెన్, ముస్తఫిజుర్ రెహమాన్, విల్ స్మీడ్, ఉస్మాన్ తారిఖ్, జోర్డాన్ థాంప్సన్, క్రిస్ వుడ్, సీన్ డిక్సన్, టామ్ హెల్మ్7. ట్రెంట్ రాకెట్స్సామ్ బిల్లింగ్స్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మొహమ్మద్ అమీర్, టామ్ బాంటన్, డానీ బ్రిగ్స్, బ్రాడ్ కర్రీ, టిమ్ డేవిడ్, అనూరిన్ డొనాల్డ్, బెన్ డకెట్, లూయిస్ గ్రెగొరీ, మాట్ హెన్రీ, లూయిస్ కింబర్, బెన్ మేయెస్, డాన్ మౌస్లీ, క్రెయిగ్ ఓవర్టన్, మిచెల్ సాంట్నర్, బెన్ రైన్, బెన్ సాండర్సన్.8. వెల్ష్ ఫైర్ (Welsh Fire)ఫిల్ సాల్ట్ (కెప్టెన్), టామ్ ఆస్పిన్వాల్, జాఫర్ చోహన్, సామ్ కుక్, జోర్డాన్ కాక్స్, లాకీ ఫెర్గూసన్, మార్కో జాన్సెన్, బెన్ కెల్లవే, టామ్ కోహ్లర్-కాడ్మోర్, రచిన్ రవీంద్ర, జో రూట్, మాట్ షార్ట్, ఆసా ట్రైబ్, క్రిస్ వోక్స్, జోర్డాన్ క్లార్క్, డిల్లన్ పెన్నింగ్టన్. -
ఇంగ్లండ్ కొత్త టెస్ట్ కోచ్గా ఆస్ట్రేలియా దిగ్గజం?
ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి బ్రెండన్ మెకల్లమ్ వైదొలిగన సంగతి తెలిసిందే. దీంతో అతడి స్ధానాన్ని భర్తీ చేసేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) తమ వేటను తీవ్రతరం చేసింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్, దిగ్గజ కోచ్ జస్టిన్ లాంగర్ పేరు దాదాపుగా ఖారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ.. లాంగర్తో చర్చలు జరిపినట్లు సమాచారం. తమ హెడ్కోచ్గా లాంగర్ను నియమించాలని ఈసీబీ భావిస్తున్నప్పటికి.. అతడి ఫ్రాంచైజీ ఒప్పందాలు ఇందుకు అడ్డంకిగా మారినట్లు వార్తలు వస్తున్నాయి.లాంగర్ ప్రస్తుతం ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్, 'ది హండ్రెడ్' టోర్నీలో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ జట్లకు ప్రధాన కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ఇంగ్లండ్ జాతీయ జట్టు బాధ్యతలు స్వీకరిస్తే ఈ కాంట్రాక్టుల నుంచి అతడు తప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఈసీబీతో చర్చలు కొలిక్కి వస్తే లక్నో ఫ్రాంచైజీతో తన బంధాన్ని తెంచుకోవడానికి లాంగర్ సిద్ధంగా ఉన్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా తొలుత ఈ రేసులో జింబాబ్వే దిగ్గజం ఆండీ ఫ్లవర్ పేరు వినిపించింది. ఫ్లవర్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు హెడ్ కోచ్గా ఉంటూ 2025, 2026 లలో వరుసగా బ్యాక్-టు-బ్యాక్ టైటిల్స్ అందించాడు.గతంలో ఇంగ్లండ్ను కూడా టెస్టుల్లో నంబర్ వన్ జట్టుగా తీర్చిదిద్దాడు. దీంతో అతడిని తిరిగి ప్రధాన కోచ్గా నియమించాలని ఇంగ్లండ్ క్రికెట్ పెద్దలు భావించారు. కానీ ఫ్లవర్ మాత్రం అందుకు సముఖత చూపలేదు. ఫ్రాంచైజీ క్రికెట్లో కోచింగ్తో తను సంతృప్తిగా ఉన్నాని ఈసీబీకి ఫ్లవర్ తెలియజేశాడు. వచ్చే నెలలో పాకిస్తాన్తో జరగనున్న టెస్టు సిరీస్కు ముందు ఇంగ్లీష్ జట్టుకు కొత్త హెడ్ కోచ్ రానున్నాడు. -
IND vs ZIM: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం ఖాయం..!
భారత్-జింబాబ్వే మధ్య మూడు టీ20ల జూలై 23 నుంచి హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ప్రారంభం కానుంది. వరుసగా మూడు సిరీస్లను కోల్పోయి జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమిండియా అక్కడ ఎలా రాణిస్తుందోనని అందరూ ఆతృతగా ఎదరు చూస్తున్నారు. మరోవైపు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ సిరీస్ అత్యంత కీలకం కానుంది. తన అరంగేట్ర సిరీస్లో విఫలమైన వైభవ్కు ఈ జింబాబ్వే టూర్ అద్భుత అవకాశంగా చెప్పుకోవాలి.సంజూ శాంసన్కు విశ్రాంతి ఇవ్వడంతో భారత ఇన్నింగ్స్ను అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ ఆరంభించనున్నాడు. ఈ సిరీస్లో వైభవ్ తనను తను నిరూపించుకుంటే భారత టీ20 జట్టులో అతడి స్దానం పదిలంగా ఉంటుంది. అయితే జింబాబ్వే గడ్డపై సూర్యవంశీ అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది.వైభవ్ చెలరేగడం ఖాయం!ఈ ఏడాది ఆరంభంలో జింబాబ్వే వేదికగా అండర్-19 ప్రపంచకప్లో వైభవ్ దుమ్ములేపాడు. ముఖ్యంగా ఫైనల్లో ఇంగ్లండ్పై అతడు విధ్వంసం సృష్టించాడు. కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేశాడు. ఇది యూత్ వన్డే చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్లలో ఒకటిగా నిలిచిపోయింది.ఈ చిచ్చర పిడుగు జింబాబ్వేలో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడి 169.49 స్ట్రైక్ రేట్తో మొత్తం 439 పరుగులు సాధించాడు. ఇప్పుడు భారత సీనియర్ జట్టు తరపున కూడా అదే జోరును కనబరుస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కాగా జింబాబ్వే పర్యటనలో భారత జట్టు ప్రధాన కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. వరుస సిరీస్లతో బీజీగా ఉండడంతో రెగ్యులర్ హెడ్కోచ్ గౌతమ్ గంభీర్కు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది.చదవండి: వైభవ్ 'తరానికి ఒక్కడు'.. కాపాడుకోండి: సికందర్ రజా -
వరల్డ్లోనే బెస్ట్.. ఎందుకు ఆడించలేదు: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా యాజమాన్యం వైఖరిపై ఇంగ్లండ్ మాజీ ఆల్రౌండర్ మొయిన్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్ని తుదిజట్టులోకి తీసుకోకుండా పక్కనపెట్టడం ఏమిటని ప్రశ్నించాడు. కాగా ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.లార్డ్స్ వేదికగా నిర్ణయాత్మక మూడో వన్డేకు ముందు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడగా.. ఈసారి కుల్దీప్ను ఆడిస్తారని అంతా అనుకున్నారు. కానీ టీమిండియా మేనేజ్మెంట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. కుల్దీప్ను కాదని.. పేస్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ను ఆడించింది. మొత్తంగా నలుగురు సీమర్లతో బరిలోకి దిగి మూల్యం చెల్లించింది.బౌలర్లంతా విఫలంగుర్నూర్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కూడా తేలిపోయాడు. ఫలితంగా ఇంగ్లండ్ 50 ఓవర్లలో కేవలం మూడే వికెట్లు నష్టపోయి 387 పరుగుల రికార్డు స్కోరు నమోదు చేసింది.ఈ లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడిన టీమిండియా.. 27 పరుగుల తేడాతో ఓటమిపాలై.. సిరీస్నూ 1-2తో చేజార్చుకుంది. ఇంగ్లండ్ తమ పార్ట్టైమ్ స్పిన్నర్ల సేవలను కూడా ఉపయోగించుకుని గిల్ సేనను దెబ్బకొట్టింది. ఈ నేపథ్యంలో మొయిన్ అలీ టీమిండియా వ్యూహాన్ని తప్పుబట్టాడు.వరల్డ్లోనే బెస్ట్.. ఎందుకు ఆడించలేదుయూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘అసలు కుల్దీప్ యాదవ్ను ఎందుకు ఆడించలేదో నాకింకా అర్థం కావడం లేదు. ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో అతడూ ఒకడు. ఇంగ్లండ్కు ఆదిల్ రషీద్ మాదిరే.. టీమిండియాకు కుల్దీప్ కూడా!.. భాగస్వామ్యాలను విడదీస్తూ వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టడంలో అతడు దిట్ట. కానీ టీమిండియా మాత్రం వాళ్ల బ్యాటింగ్ లైనప్ను పటిష్టం చేసుకోవడానికి కుల్దీప్ను పక్కనపెట్టింది.భారత బౌలర్లకు బ్యాటింగ్ చేతకాదు. వాళ్ల జట్టులో ఉన్న అతిపెద్ద సమస్య ఇదే’’ అని మొయిన్ అలీ విమర్శించాడు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకుంటే టీమిండియా బౌలింగ్ విభాగం యావరేజ్గా ఉంటుందని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. కుల్దీప్ యాదవ్కు తుది జట్టులో తీసుకోకపోవడాన్ని టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ సమర్థించుకున్నాడు. తుది జట్టు కూర్పులో భాగంగా తీసుకున్న నిర్ణయమే అని వెల్లడించాడు. చదవండి: శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించిన భారత బౌలర్లు -
వైభవ్ 'తరానికి ఒక్కడు'.. కాపాడుకోండి: సికందర్ రజా
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అరంగేట్ర సిరీస్లో నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్లో వైభవ్ కేవలం 42 పరుగులు మాత్రమే చేశాడు. అయితే 15 ఏళ్ల వైభవ్కు అంతర్జాతీయ వేదికపై తన టాలెంట్ను నిరూపించుకోవడానికి మరో అవకాశం ఇప్పుడు లభించింది.జింబాబ్వేతో జరగనున్న మూడు టీ20ల సిరీస్లో భారత ఇన్నింగ్స్ను వైభవ్ ప్రారంభించనున్నాడు. ఈ నేపథ్యంలో సూర్యవంశీపై జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు ప్రపంచ క్రికెట్లో గొప్ప స్టార్గా ఎదుగుతాడని రజా కొనియాడాడు."వైభవ్ సూర్యవంశీ ఒక అద్భుతమైన క్రికెటర్. కేవలం 15 ఏళ్ల వయస్సులో ప్రపంచస్థాయి బౌలర్లను అతడు ఎదుర్కొన్న తీరు అమోఘం. అయితే అంతర్జాతీయ స్ధాయిలో ఆడేటప్పుడు సహజంగా ఆటగాళ్లపై ఒత్తడి ఉంటుంది. కాబట్టి కేవలం రెండు లేదా మూడు మ్యాచ్లలో విఫలమైనంత మాత్రాన వైభవ్ను విమర్శించడం సరికాదు.ఎంతో మంది గొప్ప క్రికెటర్లతో వైభవ్ డ్రెసింగ్ రూమ్ను షేర్ చేసుకుంటున్నాడు. వారి నుంచి చాలా విషయాలు నేర్చుకుంటున్నాడు. బీసీసీఐ వైభవ్ను సరైన దిశలో నడిపిస్తే, అతడు ఖచ్చితంగా ఈ తరంలో గొప్ప క్రికెటర్ అవుతాడని" రజా హాట్స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.కాగా జూలై 23న హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వే-భారత్ మధ్య తొలి టీ20 జరగనుంది. వరుసగా మూడు సిరీస్లు కోల్పోయిన టీమిండియా.. తిరిగి జింబాబ్వే పర్యటనలో పుంజుకోవాలని పట్టుదలతో ఉంది.చదవండి: ఐపీఎల్ టూ ఇంగ్లండ్.. ఢిల్లీ ఆటగాడికి లక్కీ ఛాన్స్ -
ODI WC: భారత జట్టు ఇదే.. వాళ్లకు నో ఛాన్స్!
ఇంగ్లండ్తో వన్డే సిరీస్లోనూ టీమిండియాకు భంగపాటే ఎదురైంది. తొలుత టీ20 సిరీస్లో ఆతిథ్య జట్టు చేతిలో 4-0 క్లీన్స్వీప్ అయిన భారత జట్టు.. ఆ తర్వాత వన్డే సిరీస్లో 2-1తో ఓడిపోయింది. తొలి వన్డేలో గెలిచిన గిల్ సేన.. ఆ తర్వాత రెండు వన్డేల్లోనూ ఓడిపోయింది.ఫిట్నెస్లేని ఆటగాళ్లకు గిల్ వార్నింగ్ముఖ్యంగా లార్డ్స్లో భారత బౌలర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది. ఇక జస్ప్రీత్ బుమ్రా గాయం వల్ల ఈ మ్యాచ్కు అందుబాటులో లేకుండా పోయాడు. అంతకుముందే ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా గాయపడి జట్టుకు దూరమయ్యాడు.ఇక ఈ సిరీస్ కంటే ముందే ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి కూడా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో తరచూ గాయపడే ఆటగాళ్ల వల్ల తుదిజట్టు కూర్పు దెబ్బతింటోందని కెప్టెన్ శుబ్మన్ గిల్ అన్నాడు. వన్డే వరల్డ్కప్-2027లో వరుసగా ఏడు మ్యాచ్ల దాకా ఆడాల్సి ఉంటుందని.. అలాంటి కీలక సమయంలో వీరితో కష్టమేనంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు.తమ ఫిట్నెస్ ప్రమాణాలు మెరుగుపడితేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలమని గిల్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. ఇలాంటి తరుణంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ బ్యాటర్ అభినవ్ ముకుంద్ వరల్డ్కప్ జట్టును ఎంచుకున్నాడు.వారికే పెద్దపీటటాపార్డర్లో ఎలాంటి మార్పులు చేయని అభినవ్.. ఓపెనర్లుగా రోహిత్ శర్మ- కెప్టెన్ శుబ్మన్ గిల్ జోడీని వన్డౌన్లో విరాట్ కోహ్లిని కొనసాగించాడు. అయితే బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైస్వాల్కు మాత్రం చోటివ్వలేదు. ఇక వికెట్ కీపర్లుగా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్లను ఎంచుకున్న అభినవ్.. మిడిలార్డర్లో వీరితో పాటు శ్రేయస్ అయ్యర్కు చోటిచ్చాడు.ఆల్రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లను ఎంచుకున్న అభినవ్ ముకుంద్.. రవీంద్ర జడేజాను పక్కనపెట్టాడు. స్పెషలిస్టు స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్కు స్థానమిచ్చిన అతడు.. వరుణ్ చక్రవర్తికి చోటివ్వలేదు.ఇక పేస్ విభాగంలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, గుర్నూర్ బ్రార్లకు చోటు ఇచ్చాడు. ప్రిన్స్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్ పేర్లను అభినవ్ ముకుంద్ పరిగణనలోకి తీసుకోలేదు. వీళ్లు కూడా ఉండవచ్చుఅయితే, వరల్డ్కప్ టోర్నీకి ఇంకా సమయం ఉంది కాబట్టి.. నితీశ్ కుమార్ రెడ్డి, శివం దూబే, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, అర్ష్దీప్ సింగ్ ఆఖరి నిమిషంలో జట్టులోకి వచ్చినా అభినవ్ ఆశ్చర్యం లేదన్నాడు. కాగా వచ్చే ఏడాది సౌతాఫ్రికా- జింబాబ్వే- నమీబియా వేదికలుగా అక్టోబరు- నవంబరు మధ్య వన్డే వరల్డ్కప్ జరుగనుంది.వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి అభినవ్ ముకుంద్ ఎంచుకున్న భారత జట్టురోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, ప్రసిద్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్.చదవండి: ఐపీఎల్ టూ ఇంగ్లండ్.. ఢిల్లీ ఆటగాడికి లక్కీ ఛాన్స్! -
శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించిన భారత బౌలర్లు
శ్రీలంక అండర్-19 బ్యాటర్లకు భారత యువ బౌలర్లు చుక్కలు చూపించారు. అద్భుతమైన ప్రదర్శనతో ఆతిథ్య జట్టును ముప్పుతిప్పలు పెట్టారు. కాగా శ్రీలంక- భారత్ అండర్-19 జట్ల మధ్య సోమవారం రెండో అనధికారిక టెస్టు మొదలైంది.భారత్ భారీ స్కోరుకొలంబో వేదికగా టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్కు దిగింది. తొలిరోజు మూడు వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసిన భారత జట్టు.. 253/3 ఓవర్నైట్ స్కోరుతో మంగళవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో 105.2 ఓవర్లలో 411 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. వన్డౌన్ బ్యాటర్ కుశాగ్ర ఓజా (193 బంతుల్లో 111), ఆల్రౌండర్ మనాల్ చౌహాన్ (244 బంతుల్లో 150) సెంచరీలు.. యశ్వర్దన్ చౌహాన్ (89 బంతుల్లో 78) అర్ధ శతకంతో రాణించారు.శ్రీలంక బౌలర్లలో గిమ్హాన్ మెండిస్ మూడు వికెట్లు తీయగా.. సెత్మిక సెనెవిరత్నె, దుల్నిత్ సిగెర, విఘ్నేశ్వరన్ ఆకాశ్ తలా రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శ్రీలంకకు భారత బౌలర్లు ఆది నుంచే షాకులు ఇచ్చారు.శ్రీలంక బ్యాటర్లకు చుక్కలుఓపెనర్లలో అవీష సమాష్ (9)ను ప్రణవ్ రాఘవేంద్ర పెవిలియన్కు పంపగా.. దిమంత మహావితన (24)ను కావ్యా పటేల్ అవుట్ చేశాడు. గత మ్యాచ్లో డబుల్ సెంచరీతో చెలరేగిన వన్డౌన్ బ్యాటర్ సెనుజ వెకునగొడను ఈసారి భారత్ ఐదు పరుగులకే పరిమితం చేసింది. చిగురుపాటి వెంకట బౌలింగ్లో సెనుజ లక్ష్య రాయ్చందానికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఆ తర్వాత భారత బౌలర్లు జోరు కొనసాగించడంతో కెప్టెన్ విమత్ దిన్సార 8, కవిజ గమాగే 7, వికెట్ కీపర్ బ్యాటర్ జేసన్ ఫెర్నాండో 0 పరుగులకే పెవిలియన్ చేరారు. విరాన్ చముదిత 21, దుల్నిత్ సిగెర 31 పరుగులతో ఫర్వాలేదనిపించారు. ఈ క్రమంలో మంగళవారం నాటి ఆట ముగిసేసరికి శ్రీలంక 40 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేసింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ కంటే ఇంకా 289 పరుగులు వెనుకబడి ఉంది.భారత బౌలర్లలో ప్రణవ్ రాఘవేంద్ర, చిగురుపాటి వెంకట, రోహిత్ యాదవ్ తలా రెండు వికెట్లు తీయగా.. కావ్యా పటేల్, జగన్నాథ్ హెంచుదేశన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా భారత్- శ్రీలంక మధ్య తొలి అనధికారిక టెస్టు డ్రా అయింది.చదవండి: జింబాబ్వేతో శ్రేయస్ అయ్యర్ సేనకు ముప్పు -
ఇంగ్లండ్కు భారీ షాక్
ది హండ్రెడ్ లీగ్-2026కు ముందు బర్మింగ్హామ్ ఫీనిక్స్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, ఇంగ్లండ్ యువ సంచలనం జాకబ్ బెతల్ గాయం కారణంగా హండ్రెడ్ టోర్నీ నుంచి వైదొలిగాడు. భారత్తో జరిగిన మూడో వన్డేలో బెతల్ మోకాలికి గాయమైంది.మ్యాచ్ ముగిసిన తర్వాత అతడిని అస్పత్రికి తరలించి స్కాన్ చేయగా గాయం తీవ్రమైనదిగా తేలింది. దీంతో నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని బెతల్కు వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు హెండ్రెడ్ లీగ్కు దూరమయ్యాడు.ఆగస్టు 19 నుంచి స్వదేశంలో శ్రీలంకతో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్కు కూడా బెతల్ అందుబాటులో ఉండే సూచనలు కనిపించడం లేదు. ఆ తర్వాత జరిగే టీ20ల్లో బెతల్ ఆడే అవకాశముంది.కాగా ఈ యువ ఆటగాడు ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టులో కీలక సభ్యునిగా ఉన్నాడు. ఇటీవల భారత్తో జరిగిన టీ20, వన్డే సిరీస్లోనూ బెతల్ సత్తాచాటాడు. ఇక బెతల్ గైర్హజరీలో బర్మింగ్హామ్ ఫీనిక్స్ జట్టు కెప్టెన్గా డొనావన్ ఫెరీరా వ్యవహరించనున్నట్లు ఈసీబీ వర్గాలు వెల్లడించాయి.బర్మింగ్హామ్ ఫీనిక్స్ జట్టు ఇదేరెహాన్ అహ్మద్, జో క్లార్క్, స్కాట్ కర్రీ, లారీ ఎవాన్స్, డొనోవాన్ ఫెరీరా, సాకిబ్ మహమూద్, మ్యాథ్యూ మోంట్గోమరీ, మిచ్ ఓవెన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, విల్ స్మీడ్, ఉస్మాన్ తారిక్, జోర్డాన్ థాంప్సన్, క్రిస్ వుడ్, సీన్ డిక్సన్, టామ్ హెల్మ్.. -
జింబాబ్వేతో టీ20 సిరీస్.. శ్రేయస్ సేనకు ముప్పు వీరితోనే!
వరుసగా మూడు వైట్బాల్ సిరీస్లను కోల్పోయిన టీమిండియా వారం రోజులు తిరగక ముందే మరో కీలక పోరుకు సిద్దమైంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్లో తలపడనుంది. ఇప్పటికే జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది. వరుస పరాజయాల తర్వాత టీమిండియా మళ్లీ గెలుపు బాట పట్టడానికి ఈ టీ20 సిరీస్ అత్యంత కీలకంగా మారింది. అయితే పేపర్ మీద భారత్ అత్యంత బలమైన జట్టుగా కనిపిస్తున్నప్పటికి టీ20 ఫార్మాట్లో మాత్రం జింబాబ్వేను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పసికూనే కాదా అని తేలికగా తీసుకుంటే మన జట్టుకు మరో పరభావం ఎదురవ్వకతప్పదు. ఎందుకంటే తమ సొంతగడ్డపై జింబాబ్వే బంగ్లాదేశ్పై వరుస విజయాలు సాధించి మంచి జోష్లో ఉండి. తాజాగా టీ20 సిరీస్ను కోల్పోయినప్పటికి ఆ జట్టు ఆటగాళ్లంతా సూపర్ ఫామ్లో ఉన్నారు. టీ20 ప్రపంచకప్-2026లో పటిష్టమైన ఆస్ట్రేలియాను సైతం జింబాబ్వే చిత్తు చేసింది. ఈ క్రమంలో జింబాబ్వే బలాలు, బలహీనతలను ఓసారి పరిశీలిద్దాం.రజాతో డెంజర్..ముఖ్యంగా ఆ జట్టుకు కెప్టెన్ సికందర్ రజా అతిపెద్ద బలం. అతడు బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ టీమ్ను ముందుండినడిపించగలడు. అంతర్జాతీయ క్రికెట్తో పాటు ప్రపంచవ్యాప్తంగా లీగ్ క్రికెట్ ఆడిన అనుభవం అతడికి ఉంది. ఒంటో చేత్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలడు. మ్యాచ్పై భారత్ పట్టు సాధించాలంటే అతడిని తొందరగా పెవిలియన్కు పంపాల్సిందే. బంతితో కూడా మ్యాజిక్ చేయగలడు.అతడి ఆఫ్ స్పిన్ను భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఎదుర్కొవాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఆడితే వికెట్ సమర్పించుకోక తప్పదు. మరోవైపు యువ ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ నుంచి భారత జట్టుకు ముప్పు పొంచి ఉంది. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్లో టీమిండియాపై బెన్నెట్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన మల్టీ ఫార్మాట్ సిరీస్లలో కూడా అతడు దుమ్ములేపాడు.అతడి వికెట్ను ఆరంభంలోనే భారత్ సాధిస్తే ఆతిథ్య జట్టును ఒత్తిడిలోకి నెట్టవచ్చు. బెన్నెట్తో పాటు మరో బెన్ కుర్రాన్ రూపంలో మరో అద్భుతమైన ఓపెనర్ జింబాబ్వే వద్ద ఉన్నాడు. బంగ్లాదేశ్తో వన్డేలో బెన్ సూపర్ సెంచరీతో చెలరేగాడు.ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ సామ్ కుర్రాన్ సొదరుడే ఈ బెన్ కుర్రాన్ కావడం గమనార్హం. మిడిలార్డర్లో రియాన్ బర్ల్ వంటి సీనియర్ ఆల్రౌండర్ ఉన్నాడు. వీరితో పాటు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ బ్రాడ్ ఎవాన్స్ బ్యాట్తో కూడా మెరుపులు మెరిపించగలడు. బౌలింగ్లో రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ వంటి స్పీడ్ స్టార్లు ఉన్నారు.బలహీనతలు ఇవేఅయితే బ్యాటింగ్ ఆర్డర్లో స్థిరత్వం లేకపోవడం జింబాబ్వే ప్రధాన సమస్యగా ఉంది. టాప్ ఆర్డర్ త్వరగా వికెట్లు కోల్పోతే మిడిల్ ఆర్డర్ తీవ్ర ఒత్తిడికి లోనవుతుంది. కొన్నిసార్లు మెరుగైన ఆరంభం లభించినప్పటికి పవర్ ప్లే తర్వాత వరస వికెట్లు కోల్పోయి చిత్తు అయిన సందర్భాలు ఉన్నాయి. సికందర్ రజా లేదా బెన్నెట్పై కూడా అతిగా ఆధారపడడం కూడా వారి బలహీనతగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సరైన బెంచ్ బలం కూడా జింబాబ్వే వద్ద లేదు. -
అప్పుడు ఇషాన్ అసలు జట్టులోనే లేడు.. కానీ: సంజూ శాంసన్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒక్కసారి ఇషాన్ కిషన్ జట్టులో పాతుకుపోతే.. తనకు తుదిజట్టులో చోటు ఉండదన్న సంగతి ముందే తెలుసన్నాడు. ఫామ్లో ఉన్న ఆటగాళ్లకే యాజమాన్యం పెద్దపీట వేస్తుందని సంజూ పేర్కొన్నాడు.సంజూ పూర్తిగా విఫలంకాగా టీ20 ప్రపంచకప్-2026 కంటే టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్తో టీ20 సిరీస్ ఆడిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్తోనే జార్ఖండ్ డైనమో ఇషాన్ కిషన్ అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేశాడు. ఇక ఓపెనర్గా ఉన్న సంజూ కివీస్తో మ్యాచ్లలో 10, 6, 0, 24,6 పరుగులు చేసి పూర్తిగా విఫలమయ్యాడు.దుమ్ములేపిన ఇషాన్అదే సమయంలో ఇషాన్ 8, 76, 28, 103 పరుగులతో దుమ్ములేపాడు. ఫలితంగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ఆరంభ మ్యాచ్లలో అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఇషాన్ కిషన్ సంజూ స్థానాన్ని భర్తీ చేశాడు. దీంతో సంజూకు తుదిజట్టులో చోటు దక్కలేదు.అయితే, అనూహ్య రీతిలో నాకౌట్ దశలో తిరిగి ఓపెనర్గా వచ్చిన సంజూ 97*, 89, 89 పరుగులు సాధించి.. జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో తాజాగా నాటి సంగతులను ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ గుర్తుచేసుకున్నాడు.అతడు ముందుగా అసలు జట్టులోనే లేడుజియోస్టార్తో మాట్లాడుతూ.. ‘‘ఇషాన్ కిషన్ వచ్చిన తర్వాత కథ పూర్తిగా మారిపోయింది. నిజానికి అతడు ముందుగా అసలు జట్టులోనే లేడు. అయితే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ను ఒంటిచేత్తో గెలిచి.. తిరిగి టీమిండియాలో అడుగుపెట్టాడు.అతడి బ్యాటింగ్ కూడా వేరే లెవల్లో ఉంది. అప్పుడే నాకంటే ఇషాన్కు ప్రాధాన్యం పెరుగుతుందని అనిపించింది. ఐదు మ్యాచ్లలో ఆడే అవకాశం ఇచ్చినపుడు.. నేను 24, 6, 6, 10, 0 పరుగులు స్కోరు చేసి నిరాశపరిచాను. అదే సమయంలో.. మరొక ఆటగాడు ఏకంగా 70, 100 పరుగులు చేస్తూ శతక్కొట్టినప్పుడు.. నన్ను కాదని అతడిని నేరుగా ప్రపంచకప్ టోర్నీలో ఆడిస్తారని తెలుసు.డగౌట్లో కూర్చుని చప్పట్లు కొట్టడమే నా పనిఎవరైనా ఫామ్లో ఉన్న ఆటగాడే తుదిజట్టులో ఉండాలని కోరుకుంటారు. వారికే ప్రాధాన్యం ఇస్తారు. వరల్డ్కప్ సమయంలో నా విషయంలో ఇదే జరిగింది. జరిగిందేదో జరిగిపోయింది.. నేనేమీ చేయలేను.. డగౌట్లో కూర్చుని చప్పట్లు కొట్టడమే నా పని అర్థమైంది.భారత క్రికెటర్ల పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఒక్కరోజులో అంతా తలకిందులు కావొచ్చు. నాకు ఏడు మ్యాచ్లు ఆడే అవకాశం ఇస్తే.. నేను కనీసం మూడు సెంచరీలు అయినా కొడతానని అనిపించింది. కానీ అలా జరుగలేదు. టీ20 ఫార్మాట్ చాలా చిత్రమైనది. న్యూజిలాండ్తో సిరీస్లో నేను పూర్తిగా విఫలమయ్యాను.నా హయ్యస్ట్ స్కోరు 24 మాత్రమేఆ తర్వాత పిచ్చివాడిలా ప్రాక్టీస్ చేశాను. వరల్డ్కప్ తుదిజట్టులో చోటు దక్కాలంటే తీవ్రంగా కష్టపడాలని నిర్ణయించుకున్నా. అయితే, ఆ ఐదు మ్యాచ్లలో నా హయ్యస్ట్ స్కోరు 24 మాత్రమే. దీంతో నేను మరింతగా కుంగిపోయాను.అయితే, అప్పుడు నా భార్య చెప్పిన మాటలు నాకు ఊరటనిచ్చాయి. గంటలు గంటలు ప్రాక్టీస్ చేసే బదులు సంతోషంగా, మానసికంగా దేనికైనా సన్నద్ధంగా ఉంటే.. ఇలాంటి తప్పిదాలు జరగవని చెప్పింది. న్యూజిలాండ్తో సిరీస్ నాకు చాలా విషయాలు నేర్పింది’’ అని సంజూ శాంసన్ చేదు జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.చదవండి: ఐపీఎల్ టు ఇంగ్లండ్.. ఢిల్లీ ఆటగాడికి లక్కీ ఛాన్స్! -
ఐపీఎల్ టూ ఇంగ్లండ్.. ఢిల్లీ ఆటగాడికి లక్కీ ఛాన్స్
ఢిల్లీ క్యాపిటల్స్ ఫినిషర్ అశుతోష్ శర్మ ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీ 'వన్డే కప్ 2026'లో ఆడనున్నాడు. ఈ మేరకు హాంప్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్తో అతడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని హాంప్షైర్ క్రికెట్ క్లబ్ మేనేజ్మెంట్ అధికారికంగా ధ్రువీకరించింది.వన్డేకప్ కోసం అశుతోష్ మా జట్టుతో జతకట్టడం చాలా సంతోషంగా ఉంది. అతడొక అద్భుతమైన ఆటగాడు. ఇప్పటికే ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేశాడు. కాబట్టి అతడు 50 ఓవర్ల క్రికెట్లో అతడు రాణిస్తాడని ఆశిస్తున్నాము. అతడికి హాంప్షైర్ జట్టులోకి స్వాగతం పలుకుతున్నామని ఆ క్రికెట్ క్రికెట్ డైరెక్టర్ గైల్స్ వైట్ పేర్కొన్నారు.కాగా హాంప్షైర్ యాజమాన్యమైన జిఎంఆర్ గ్రూప్.. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కూడా సహ యజమానిగా వ్యవహరిస్తోంది. దీంతో ఈ చారిత్రత్మక క్లబ్ తరపున ఆడేందుకు అశుతోష్ మార్గం సుగమమైంది. కాగా 27 ఏళ్ల అశుతోష్కు ఇంగ్లండ్లో క్రికెట్ ఆడిన అనుభవం ఉంది.అతను గతంలో మిడిల్సెక్స్ టైటాన్స్ (2017), గ్రేవ్సెండ్ (2022, 2023), అలాగే లివర్పూల్ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ కాంపిటీషన్లో విగన్ (2025) జట్లకు ఆడాడు. ఇప్పుడు మరోసారి ఇంగ్లీష్ గడ్డపై రాణించేందుకు అతడు సిద్దమయ్యాడు. మధ్యప్రదేశ్కు చెందిన అశుతోష్ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో రైల్వేస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.అశుతోష్కు బ్యాట్తో పాటు బంతితో కూడా రాణించే సత్తా ఉంది. ఇక ఈ వన్డే కప్లో అశుతోష్ శర్మతో పాటు భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కూడా భాగం కానున్నాడు. చాహల్ నార్తాంప్టన్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తరఫున బరిలోకి దిగనున్నాడు. -
IND vs SL: శ్రీలంకతో టెస్టు.. భారత్ భారీ స్కోరు
శ్రీలంక అండర్-19 జట్టుతో రెండో అనధికారిక టెస్టులో భారత యువ జట్టు భారీ స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్లో 411 పరుగులు చేసి ఆలౌట్ అయింది. గాలె వేదికగా శ్రీలంక- భారత్ అండర్-19 జట్ల మధ్య తొలి యూత్ టెస్టు ‘డ్రా’గా ముగిసిన సంగతి తెలిసిందే.ఓపెనర్లు డకౌట్ అయినా..ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య కొలంబో వేదికగా సోమవారం రెండో యూత్ టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్కు దిగింది. తొలి రోజు ఆటలో ఓపెనర్లు లక్ష్య రాజేశ్ రాయ్ చందాని, సాగర్ విర్క్ డకౌట్ కాగా.. వన్డౌన్ బ్యాటర్ కుశాగ్ర ఓజా.. కెప్టెన్ యశ్వర్దన్ చౌహాన్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు.శతక్కొట్టిన కుశాగ్రఈ క్రమంలో కుశాగ్ర శతకం పూర్తి చేసుకోగా.. యశ్వర్దన్ అర్ధ శతకం (78) చేసి అవుటయ్యాడు. కుశాగ్రకు తోడుగా ఐదో నంబర్ బ్యాటర్ మనాల్ చౌహాన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఫలితంగా సోమవారం నాటి ఆట పూర్తయ్యేసరికి భారత్ 65 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.ఇక 253/3 ఓవర్నైట్ స్కోరుతో మంగళవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. భోజన విరామ సమయానికి 92 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 355 పరుగులు చేసింది. శతక వీరుడు కుశాగ్ర (193 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్లు: 111) రనౌట్ కాగా.. ఆల్రౌండర్ మనాల్ చౌహాన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.మనాల్ భారీ శతకంఅనంతరం అదే జోరు కొనసాగించిన మనాల్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. మొత్తంగా 224 బంతులు ఎదుర్కొన్న ఈ ఆల్రౌండర్.. 20 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 150 పరుగులు చేశాడు. అయితే, గిమ్హాన్ మెండిస్ బౌలింగ్లో విఘ్నేశ్వరన్ ఆకాశ్కు క్యాచ్ ఇవ్వడంతో అతడి మారథాన్ ఇన్నింగ్స్కు తెరపడింది.మనాల్ అవుటైన తర్వాత భారత జట్టు వేగంగా వికెట్లు కోల్పోయింది. వికెట్ కీపర్ బ్యాటర్ ఆర్యన్ సక్పా 10, జగన్నాథన్ హేంచుదేశన్ 4 పరుగులు చేసి వెనుదిరిగారు. రోహిత్ యాదవ్ డకౌట్ కాగా.. చిగురుపాటి వెంకట 25 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ప్రణవ్ రాఘవేంద్ర ఒక బంతిని ఎదుర్కొని ఖాతా ఏమీ తెరవలేదు.411 పరుగులకు ఆలౌట్ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్లో భారత్ 105.2 ఓవర్లలో 411 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కుశాగ్ర ఓజా (111), మనాల్ చౌహాన్ (150) సెంచరీలు.. యశ్వర్దన్ చౌహాన్ (78) అర్ధ శతకంతో రాణించడంతో భారత్కు ఈ మేర భారీ స్కోరు సాధ్యమైంది. ఇక శ్రీలంక బౌలర్లలో గిమ్హాన్ మెండిస్ మూడు వికెట్లు పడగొట్టగా.. సెత్మిక సెనెవిరత్నె, దుల్నిత్ సిగెర, విఘ్నేశ్వరన్ ఆకాశ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. చదవండి: ఇంగ్లండ్ అతడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది.. మీరేం చేస్తున్నారు? -
ఇంగ్లండ్ అతడికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది.. మీరేం చేస్తున్నారు?
టీమిండియాతో వన్డే సిరీస్లో ఇంగ్లండ్ స్టార్ జో రూట్ అదరగొట్టాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా తొలి వన్డేలో 76 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ వన్డౌన్ బ్యాటర్.. కార్డిఫ్లో జరిగిన రెండో వన్డేలో 99 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. సెంచరీ చేసే అవకాశం ఉన్నా.. సహచరుడికి మ్యాచ్ ముగించే అవకాశం ఇచ్చి.. హుందాగా వ్యవహరించాడు.ఈ మ్యాచ్లో రూట్ ఇన్నింగ్స్ కారణంగా ఇంగ్లండ్ జయభేరి మోగించి సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇక లార్డ్స్ వేదికగా నిర్ణయాత్మక మూడో వన్డేలోనూ రూట్ మరోసారి తన అనుభవాన్ని చూపించాడు. కేవలం 39 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మొత్తంగా 48 బంతుల్లో తొమ్మిది ఫోర్లు బాది 74 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇంగ్లండ్ తొలి క్రికెటర్గా రికార్డుఇక మూడో వన్డేలో గెలిచి ఇంగ్లండ్ సిరీస్ 2-1తో కైవసం చేసుకోగా.. టీమిండియా ఓటమితో నిరాశగా వెనుదిరిగింది. రూట్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.నిజానికి గత కొంతకాలంగా రూట్ వన్డేల్లోనూ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ ముప్పై ఐదేళ్ల బ్యాటర్ గత ఆరు వన్డే ఇన్నింగ్స్లో చేసిన పరుగులు వరుసగా.. 61, 75, 111*, 76*, 99*, 74*. తద్వారా ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో వరుసగా ఆరు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన తొలి క్రికెటర్గా రూట్ చరిత్రకెక్కాడు.ఇంగ్లండ్ అతడికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది.. మీరేం చేస్తున్నారు?ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ సదగోపన్ రమేశ్ టీమిండియా యాజమాన్యం వైఖరిని విమర్శించాడు. ఇంగ్లండ్ మేనేజ్మెంట్ జో రూట్కు పూర్తి స్వేచ్ఛనిచ్చి.. మంచి ఫలితాలు రాబడుతోందన్నాడు. అదే సమయంలో భారత జట్టు యాజమాన్యం మాత్రం దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి విషయంలో తప్పు చేస్తోందని మండిపడ్డాడు.కాగా ఇప్పటికే రోహిత్- కోహ్లి అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. వన్డే వరల్డ్కప్-2027 ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అయితే, అనూహ్య రీతిలో రోహిత్ను కెప్టెన్సీ తప్పించిన యాజమాన్యం.. రో-కో ప్రపంచకప్ ఆడతారో లేదోనన్న అంశంపై తమకు స్పష్టత లేదన్నారు.రోహిత్ భారీ శతకంఈ క్రమంలోనే లార్డ్స్లో ఇంగ్లండ్తో మూడో వన్డే సందర్భంగా రోహిత్ శర్మ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోడుతన్నాడంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే, ఈ మ్యాచ్లో రోహిత్ భారీ శతకం (138)తో రాణించి ఊహాగానాలకు చెక్ పెట్టాడు. తాను రిటైర్ కాబోవడం లేదని స్పష్టం చేశాడు.మీరు తప్పు చేస్తున్నారుఈ పరిణామాల నేపథ్యంలో నేపథ్యంలో రమేశ్ స్పందిస్తూ.. ‘‘విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు యాజమాన్యం మద్దతుగా ఉండాల్సిన సమయం ఇది. వాళ్లిద్దరు ఇప్పటికీ వన్డే ర్యాంకింగ్స్లో టాప్-5లో ఉన్న సత్తా కలవారు. ఓసారి ఇంగ్లండ్ మేనేజ్మెంట్ను చూడండి. జో రూట్కు వాళ్లు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నారు. అతడి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టుకునేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు.అతడిపై ఏమాత్రం ఒత్తిడి పెట్టడం లేదు. ఇంగ్లండ్ రూట్ను తమ బలంగా భావిస్తోంది. కానీ భారత జట్టు యాజమాన్యం మాత్రం రోహిత్- విరాట్లనే తమ వెన్నెముకగా భావించాల్సింది పోయి వారి విషయంలోనే స్పష్టత లేకుండా చేస్తోంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో రోహిత్ వరుసగా 11, 26, 138 పరుగులు చేయగా.. కోహ్లి 5, 74, 65 పరుగులు సాధించాడు.చదవండి: లార్డ్స్ వన్డేలో అదే హైలైట్: పాక్ మాజీ క్రికెటర్ -
లార్డ్స్ మ్యాచ్లో అదే హైలైట్: పాక్ మాజీ క్రికెటర్
టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ కెరీర్ చరమాంకానికి చేరిందంటూ గత కొంతకాలంగా వస్తున్న వార్తలకు.. ‘హిట్మ్యాన్’ లార్డ్స్లో శతకంతో చెక్ పెట్టాడు. ఇంగ్లండ్తో మూడో వన్డే సందర్భంగా క్రికెట్ ‘మక్కా’లో సెంచరీ బాది తన బ్యాట్ పదును ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. కాగా ఇంగ్లండ్తో లార్డ్స్ వన్డేనే రోహిత్ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్లో హిట్మ్యాన్ 110 బంతుల్లోనే పదిహేడు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాది 138 పరుగులతో అదరగొట్టాడు.లార్డ్స్ మ్యాచ్లో అదే హైలైట్అనంతరం తన రిటైర్మెంట్ వార్తలపై స్పందిస్తూ.. తాను క్రికెట్ ఆడుతున్నంత కాలం... రిటైర్మెంట్ ఊహాగానాలు వస్తూ ఉంటాయని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. ఇలాంటి వార్తలతో పోరాడటం కంటే... మైదానంలో పరుగులు సాధించడంపైనే దృష్టి పెడతానని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లతో పాటు పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ సైతం రోహిత్ శర్మకు మద్దతుగా నిలిచాడు. గేమ్ ప్లాన్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ‘‘ఈ సిరీస్లో గెలిచేందుకు ఇంగ్లండ్కు అర్హత ఉంది. అయితే, ఆ విషయం కంటే కూడా రోహిత్ శర్మ సెంచరీ చేయడమే లార్డ్స్ మ్యాచ్కు హైలైట్. ప్రపంచంలోని అత్యుత్తమ వన్డే బ్యాటర్లలో తానూ ఒకడినని.. ఇప్పటికీ తన ఆటలో పదును తగ్గలేని రోహిత్ తన ఇన్నింగ్స్ ద్వారా స్టేట్మెంట్ ఇచ్చాడు. అతడి భవిష్యత్తు గురించి చాలా వదంతులు వస్తున్నాయి. వన్డే వరల్డ్కప్-2027 ప్రణాళికల్లో అతడు లేడని చాలా మంది అంటున్నారు. వాళ్లు తలచుకుంటేనే..అయితే, తనను విమర్శించే వాళ్లందరికీ రోహిత్ బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. రోహిత్, విరాట్ కోహ్లి వంటి ఆటగాళ్లను ఎవరూ జట్టు నుంచి బయటకు పంపలేరు. ఆటకు వీడ్కోలు పలకడానికి సరైన సమయం వచ్చిందని భావిస్తే వాళ్లే స్వయంగా తప్పుకొంటారు. రిటైర్మెంట్ అనేది కేవలం వారి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. భారత క్రికెట్కు వీరిద్దరు చేసిన సేవలు వెలకట్టలేనివి. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చే క్రమంలో మిగతా ఫార్మాట్ల నుంచి వారే తప్పుకొన్నారు. అందుకే వాళ్లు నేటికీ సూపర్స్టార్లుగానే కొనసాగుతున్నారు’’ అని కమ్రాన్ అక్మల్ రో-కోలపై ప్రశంసలు కురిపించాడు. కాగా ఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్లో 4-0తో వైట్వాష్ అయిన టీమిండియా.. వన్డే సిరీస్ను 1-2తో కోల్పోయింది.ఇదిలా ఉంటే.. 2024 టీ20 ప్రపంచకప్ టోర్నీలో టీమిండియాను చాంపియన్గా నిలిపిన తర్వాత.. రోహిత్- కోహ్లి అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికారు. గతేడాది వారం రోజుల వ్యవధిలో ఇద్దరూ టెస్టులకూ గుడ్బై చెప్పారు. వరల్డ్కప్-2027 ఆడటమే లక్ష్యంగా వన్డేల్లో కొనసాగుతున్నారు.చదవండి: ఆటకు గుడ్బై చెప్పు... భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
లంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి ఆ ఇద్దరు!
ఐపీఎల్ తర్వాత వరుసగా వన్డే, టీ20 సిరీస్లతో బిజీగా గడిపిన టీమిండియా వచ్చే నెలలో శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఈ వారంలో టెస్టు సిరీస్కు సంబంధించి భారత జట్టును ప్రకటించే అవకాశముంది. కాగా సీనియర్లు జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు టెస్టు జట్టులోకి తిరిగి రానున్నారు. వీరితో పాటు మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ క్రిష్ణ, కుల్దీప్ యాదవ్ పేర్లు కూడా పరిగణలో ఉన్నాయి. గాయంతో ఇంగ్లండ్ సిరీస్ నుంచి వైదొలిగిన వాషింగ్టన్ సుందర్ శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడడం అనుమాంగానే ఉంది. అయితే గాయం నుంచి కోలుకున్న నితీశ్ కుమార్ రెడ్డి లేదా సారాన్ష్ జైన్లో ఒకరు ఈ సిరీస్కు ఎంపికయ్యే అవకాశముంది. ఇక బుమ్రా, జడేజాలు తమ చివరి టెస్టు మ్యాచ్ను 2025 నవంబర్లో సౌతాఫ్రికాతో ఆడారు.గిల్ సారథ్యంలోని టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికాలకు టెస్టు సిరీస్లను కోల్పోయింది. ఆఫ్గన్తో జరిగిన ఏకైక టెస్టులో మాత్రం భారీ విజయం సాధించడం ఊరట కలిగించింది. అయితే సొంతగడ్డపై ఎదురైన పరాభవాలను మరిచిపోయేందుకు లంకతో టెస్టు సిరీస్లో రాణించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. ఇక టెస్టు సిరీస్కు ముందు భారత జట్టు శ్రీలంక-ఏ జట్టుతో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనున్నట్లు తెలుస్తోంది. ఇక భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే వేదికగ2ఆ, ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబో వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత డిసెంబర్లో ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరగనుంది. 🚨 GOOD NEWS FOR TEAM INDIA 🇮🇳Jasprit Bumrah & Ravindra Jadeja set to play in the Test series vs Sri Lanka. [Sahil Malhotra from TOI]Test squad will be announced this week. pic.twitter.com/kAJ3m0tBqj— Johns. (@CricCrazyJohns) July 21, 2026Read: కోహ్లి సలహా నా ఆటను మార్చేసింది: పీవీ సింధు -
కమిన్స్ రీఎంట్రీ.. యాషెస్ హీరోకు మొండిచేయి!
బంగ్లాదేశ్తో స్వదేశంలో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) 13 మందితో కూడిన జట్టును ప్రకటించింది. కెప్టెన్ పాట్ కమిన్స్తో పాటు సీనియర్లు జోష్ హాజిల్వుడ్, స్పిన్నర్ నాథన్ లియోన్ రీఎంట్రీ ఇవ్వనుండగా, 2025-26 యాషెస్ సిరీస్ను ఆస్ట్రేలియా గెలవడంలో కీలకపాత్ర పోషించిన మైకెల్ నెసర్ను తుది జట్టు నుంచి తప్పించారు. ఆగస్టు 13 నుంచి 17 వరకు డార్విన్ వేదికగా తొలి టెస్టు, మాకే వేదికగా ఆగస్టు 22 నుంచి 26 వరకు రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. 13 మందితో కూడిన జట్టులో ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు, ఇద్దరు ఆల్రౌండర్లు, ఐదుగురు ఫాస్ట్ బౌలర్లు, ఒక స్పిన్నర్ ఉన్నారు.ఇక గతేడాది యాషెస్ సిరీస్ సందర్భంగా తొలి టెస్టు అనంతరం వెన్నునొప్పి కారణంగా రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు.ఇక కండరాల గాయంతో జోష్ హాజిల్వుడ్ కూడా యాషెస్ సిరీస్కు దూరంగా ఉన్నాడు. జట్టు స్పెషలిస్ట్ స్పిన్నర్గా నాథన్ లియోన్ మరోసారి జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. కమిన్స్ గైర్హాజరీలోనూ గతేడాది సొంతగడ్డపై యాషెస్ సిరీస్ను ఆస్ట్రేలియా 4-1తో నెగ్గింది. ఈ సిరీస్లో మైకెల్ నెసర్ రాణించాడు. మూడు మ్యాచ్లు కలిపి 15 వికెట్లు తీయడమే గాక, చివరి రెండు టెస్టుల్లో బ్యాట్తోనూ రాణించాడు. అయితే కమిన్స్, హాజిల్వుడ్ జట్టులోకి రావడంతో నెసర్ను జట్టు తప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే 2027 ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్న ఆస్ట్రేలియా వచ్చే సీజన్ (2027-2029) సైకిల్లోనూ ఫైనల్ చేరాలనే పట్టుదలతో ఉంది. తర్వాతి 12 నెలల్లో ఆస్ట్రేలియా మొత్తం 21 టెస్టు మ్యాచ్లు ఆడనుంది.ఆస్ట్రేలియా జట్టు:పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్స్టర్Read: దేశవాళీ క్రికెట్లో కొత్త రూల్స్.. తస్మాత్ జాగ్రత్త! -
దేశవాళీ క్రికెట్లో కొత్త రూల్స్.. తస్మాత్ జాగ్రత్త!
దేశవాళీ సీజన్కు (2026-27) ముందు బీసీసీఐ పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లో మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ప్రతిపాదించిన చట్టాలను ఐసీసీ అమలు పరచనున్న సంగతి తెలిసిందే. తాజాగా అంతర్జాతీయ క్రికెట్కు సమానంగా బీసీసీఐ కూడా దేశవాళీ టోర్నీల్లో ఆయా చట్టాలను అమలు చేయాలని భావించింది. ఈ నేపథ్యంలోనే రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు అన్ని దేశీయ టోర్నీల్లో అంతర్జాతీయంగా ఉన్న రూల్స్ అన్ని అమల్లోకి రానున్నాయి. దేశవాళీ క్రికెట్లో మరింత పారదర్శకత, న్యాయంతో కూడిన క్రికెట్ ఆడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాలను తీసుకొచ్చినట్లు బీసీసీఐ తెలిపింది.చివరి ఓవర్ పూర్తి చేయాల్సిందేఇకపై ఫస్ట్క్లాస్ క్రికెట్లో రోజులో చివరి ఓవర్ను తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందే. ఇప్పటి వరకు చివరి ఓవర్ మధ్యలో వికెట్ పడితే అంపైర్లు ఆ రోజు ఆటను ముగించే అవకాశం ఉండేది. అయితే కొత్త నిబంధన ప్రకారం వికెట్ పడినా మిగిలిన బంతులన్నీ తప్పనిసరిగా వేయాల్సి ఉంటుంది. దీంతో కొత్త బ్యాటర్ కూడా మిగిలిన బంతులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొత్త బ్యాటర్ను పంపకుండా సమయం వృథా చేసే అవకాశాన్ని నివారించడానికే ఈ మార్పు తీసుకొచ్చారు.ఉద్దేశపూర్వక నోబాల్ వేస్తే కఠిన చర్యలుకొత్త నిబంధనల్లో భాగంగా ఉద్దేశపూర్వకంగా నోబాల్స్ వేస్తే బౌలర్లపై కఠినచర్యలు తీసుకోనున్నారు. ఎవరైనా బౌలర్ ఉద్దేశపూర్వకంగా ఫ్రంట్ ఫుట్ నోబాల్ లేదా పిచ్పై పడకుండా డెలివరీ వేస్తే, అతడు ఆ ఇన్నింగ్స్కే కాదు, మొత్తం మ్యాచ్లోనే బౌలింగ్ చేసే హక్కును కోల్పోతాడు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేశాడా లేదా అన్నది అంపైర్లే నిర్ణయిస్తారు.ఫీల్డర్ ముందే బంతిని అడ్డుకుంటే?బ్యాటింగ్ సమయంలో స్ట్రైక్లో ఉన్న బ్యాటర్ వద్దకు చేరకముందే ఫీల్డర్ ఉద్దేశపూర్వకంగా బంతిని అడ్డుకుంటే, దానిని నోబాల్తో పాటు డెడ్ బాల్గా ప్రకటిస్తారు. అలాగే మ్యాచ్ చివరి ఇన్నింగ్స్లో జట్లు ‘డిక్లరేషన్’ లేదా ‘ఫోర్ఫిట్’ చేసే అవకాశాన్ని కూడా తొలగించారు.కోచ్లకు అనుమతి..వన్డే మ్యాచ్ల్లో డ్రింక్స్ బ్రేక్ సమయంలో హెడ్ కోచ్ మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లతో నేరుగా మాట్లాడేందుకు అనుమతి ఇవ్వనున్నారు.దీంతో మ్యాచ్ మధ్యలోనే వ్యూహాలను మరింత సమర్థంగా చర్చించే అవకాశం జట్లకు లభించనుంది.షార్ట్ రన్పై స్పష్టతబ్యాటర్లు ప్రత్యర్థిని మోసం చేయాలనే ఉద్దేశం లేకుండా పరుగు మధ్యలో తిరిగి వెనక్కి వస్తే, దానిని డెలిబరేట్ షార్ట్ రన్గా పరిగణించరు. కానీ ఉద్దేశపూర్వకంగా షార్ట్ రన్ తీసుకుంటే, తదుపరి బంతిని ఏ బ్యాటర్ ఎదుర్కోవాలో నిర్ణయించే అధికారం ఫీల్డింగ్ జట్టు కెప్టెన్కు ఉండేలా నిబంధన తీసుకొచ్చారు.డెడ్ బాల్ రూల్లో మార్పుఇప్పటి వరకు బంతి బౌలర్ లేదా వికెట్కీపర్ చేతిలోకి వచ్చిన తర్వాతే సాధారణంగా డెడ్ బాల్గా పరిగణించేవారు. ఇకపై బంతి ఏ ఫీల్డర్ చేతిలో స్థిరంగా ఉన్నా లేదా మైదానంలో పూర్తిగా నిలిచిపోయినా దానిని డెడ్ బాల్గా ప్రకటిస్తారు.👉వన్డే, టీ20 మ్యాచ్ల్లో లెగ్సైడ్ వైడ్ విషయంలో కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. బంతి విసిరే సమయంలో ఫీల్డర్లందరూ తప్పనిసరిగా బౌండరీ లైన్ లోపలే ఉండాలి. దీంతో బౌండరీ బయట నిలబడి ప్రయోజనం పొందే అవకాశానికి చెక్ పడుతుంది. అలాగే వికెట్కీపర్ బంతి డెలివరీ సమయంలో తప్పనిసరిగా వికెట్ వెనుకనే ఉండాలి.👉మ్యాచ్లో ఎవరైనా అక్రమ పరికరాలు ఉపయోగిస్తున్నట్లు గుర్తిస్తే, అంపైర్లు వాటి వినియోగాన్ని వెంటనే నిలిపివేసి సంబంధిత అధికారులకు నివేదించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదిత నిబంధనలను 2026-27 దేశీయ సీజన్ నుంచే అమలు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది.Read: గంభీర్ చేతుల్లో అతడి కెరీర్ కూడా నాశనమే! -
గంభీర్ చేతుల్లో అతడి కెరీర్ కూడా నాశనమేనా!
టీమిండియా మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ భారత హెడ్కోచ్ గౌతమ్ గంభీర్పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో కేఎల్ రాహుల్ను బ్యాటింగ్ ఆర్డర్లో మరింత ఆరో స్థానంలో పంపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారీ లక్ష్యం కళ్ల ముందు ఉన్నప్పుడు రాహుల్ లాంటి టాప్ క్లాస్ బ్యాటర్ను ఆరో స్థానంలో కాకుండా ఇషాన్ కిషన్ స్థానంలో పంపించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. Photo Credit: BCCI Twitterరాహుల్ క్రీజులోకి వచ్చే సమయానికి భారత్ విజయానికి 36 బంతుల్లో 84 పరుగులు కావాలి. కానీ రాహుల్ ఔటైతే ఆ తర్వాత స్పెషలిస్ట్ బ్యాటర్లు ఎవరూ లేరని, దీంతో ఒత్తిడికి లోనయ్యి వికెట్ సమర్పించుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. ఇది ముమ్మాటికి గంభీర్ తప్పిదమేనని, కేఎల్ రాహుల్ ఏమైనా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చేవాడిలా కనిపిస్తున్నాడా అని ప్రశ్నించారు. ఇప్పటికే ఆలోచనలేమితో వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ కెరీర్లు భ్రష్టు పట్టించిన గంభీర్ ఇప్పుడు కేఎల్ రాహుల్ కెరీర్ను కూడా నాశనం చేయాలని చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిజానికి మూడో వన్డేలో 387 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్కు బట్లర్లాగే ఆ స్థానంలో మనకు కీ ప్లేయర్ ఉండాలి. శ్రేయస్ అయ్యర్ ఐదో స్థానంలో బ్యాటింగ్కు వస్తే.. అప్పుడు నాలుగో స్థానంలో ఇషాన్ కిషన్కు బదులు కేఎల్ రాహుల్ను పంపించాల్సింది. Photo Credit: BCCI Twitter2023 వన్డే ప్రపంచకప్లో కేఎల్ రాహుల్ ఎక్కువగా ఐదో స్థానంలోనే బ్యాటింగ్కు వచ్చి కోహ్లితో కలిసి కీలక భాగస్వామ్యాలు నిర్మించాడు. నిన్నటి మ్యాచ్లో అది జరిగి ఉంటే టీమిండియా పరిస్థితి వేరుగా ఉండేదేమో అని అభిప్రాయపడ్డాడు. ఇషాన్ కిషన్ను ఆరో స్థానంలో ఆడించడం వల్ల మరో ఉపయోగం కూడా ఉండేది. ఆఖర్లో ధాటిగా ఆడాల్సిన సమయంలో అక్షర్ పటేల్తో కలిసి ఇషాన్ ఇన్నింగ్స్ను నడిపించగలడని పేర్కొన్నాడు. నిజానికి టాప్ క్లాస్ బ్యాటర్ అయిన కేఎల్ రాహుల్ పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ శైలిని మార్చుకోగల నేర్పరి అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇక 2023 వన్డే ప్రపంచకప్లో కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. 10 ఇన్నింగ్స్ ల్లో 452 పరుగులు బాదాడు. అయితే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాహుల్ను ఎక్కువగా ఆరో స్థానంలోనే బ్యాటింగ్కు పంపుతున్నాడు. అక్షర్ పటేల్ను అతని కంటే ముందుగా పంపే వ్యూహాన్ని టీమ్ మేనేజ్మెంట్ అమలు చేస్తోంది. ఈ ప్రయోగం 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫలితాన్ని ఇచ్చినా.. ఇంగ్లండ్ సిరీస్లో మాత్రం తీవ్రంగా దెబ్బ కొట్టింది. ప్రస్తుతం రాహుల్ బ్యాటింగ్ స్థానం, టీమ్ మేనేజ్మెంట్ వ్యూహాలపై క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ కొనసాగుతోంది.ఇక ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో 2 మ్యాచ్లు ఆడిన కేఎల్ రాహుల్ 13 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్ను ఇంగ్లండ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. Before recording this video, I honestly thought KL RAHUL might get out, and here he is..... Bowled😭 pic.twitter.com/fjrGLx96Vo— Vipin Tiwari (@Vipintiwari952) July 19, 2026Read: కోహ్లి సలహా నా ఆటను మార్చేసింది: పీవీ సింధు -
‘రోహిత్, కోహ్లిలను టచ్ చేయడం అసాధ్యం’
టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి భవితవ్యంపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్, కోహ్లిలను జట్టులో నుంచి తొలగించడం చాలా కష్టతరమని, బలవంతంగా పంపించాలని చూస్తే మాత్రం అభిమానులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించాడు. ఇటీవలే రోహిత్ రిటైర్మెంట్పై ఊహాగానాలు వచ్చిన వేళ అశ్విన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.తన యూట్యూబ్ షో 'ఆష్ కి బాత్’లో అశ్విన్ మాట్లాడుతూ... 'రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆడాలని అనుకుంటే వారిని జట్టు నుంచి తప్పించడం చాలా చాలా కష్టం. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది.. వారి అద్భుతమైన కెరీర్ రికార్డులు. రోహిత్ ఇప్పటికే 12 వేల అంతర్జాతీయ పరుగులు చేశాడు. అలాంటి ఆటగాడిని సులభంగా పక్కన పెట్టడం సాధ్యం కాదు. కోహ్లి గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదు. తన ఆటతో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. Photo Credit: BCCI Twitterఇక రెండో కారణం ఏంటంటే.. అది రోహిత్, కోహ్లికి భారీ అభిమాన బలం ఉంది. వీరిద్దరు మ్యాచ్లు ఆడుతున్నారంటే.. వారిని చూసేందుకే లక్షలాది మంది అభిమానులు స్టేడియాలకు తరలివస్తారు. అలాంటి స్టార్ ఆటగాళ్లను జట్టు నుంచి తప్పిస్తే భారీ స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. వారిని తప్పించాలని చూస్తే అభిమానులు ఊరుకుంటారా? ఒకవేళ తొలగిస్తే మాత్రం స్టేడియం పైకప్పు లేచిపోవడం గ్యారంటీ' అంటూ తనదైన శైలిలో అశ్విన్ చమక్కులు పంచాడు.Photo Credit: BCCI Twitterఇంగ్లండ్తో వన్డే సిరీస్లో తొలి రెండు వన్డేల్లో రోహిత్ విపలం కావడంతో మూడో వన్డే అతడికి చివరిది కానుందని, ఇంగ్లండ్తో సిరీస్ తర్వాత రోహిత్ అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలకనున్నాడని వార్తలు వచ్చాయి. అవన్నీ తప్పుడు వార్తలంటూ బీసీసీఐ కొట్టిపారేయడంతో ఊహాగానాలకు తెరపడింది. ఇక రోహిత్ కూడా తన రిటైర్మెంట్పై వస్తున్న వార్తలకు బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. ఇంగ్లండ్తో మూడోవన్డేలో రోహిత్ శర్మ సెంచరీతో మెరిశాడు. 110 బంతుల్లో 138 పరుగులు సాధించాడు. మరోవైపు కోహ్లి కూడా అర్ధసెంచరీతో రాణించి తమకు తిరుగులేదని చాటిచెప్పాడు. ఇక బౌలర్ల పరిస్థితి గురించి అశ్విన్ కాస్త భిన్నంగా స్పందించాడు. 'మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ లేదా భువనేశ్వర్ కుమార్ వంటి బౌలర్లు జట్టులో లేకపోతే కొంతమంది మాత్రమే ప్రశ్నిస్తారు. కానీ స్టార్ బ్యాటర్ల జరిగినంత స్థాయిలో చర్చ జరగదు. భవిష్యత్తులో బౌలర్ల కోసం కూడా అభిమానులు అదే స్థాయిలో గళమెత్తితే వారిని కూడా జట్టు నుంచి తప్పించడం కష్టమవుతుంది. ఇది జరగాలని నేను కోరుకుంటున్నా' అని అశ్విన్ తెలిపాడు. Read: స్పెయిన్ నంబర్వన్.. ర్యాంకింగ్స్లో మొరాకో, నార్వే సంచలనం -
అనధికారిక టెస్టులో విధ్వంసకర సెంచరీ.. ఎవరీ కుషాగ్ర?
కొలంబో వేదికగా శ్రీలంక అండర్-19 జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు మ్యాచ్లో భారత అండర్-19 జట్టు తొలిరోజే పట్టు బిగించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 65 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరు డకౌట్ అయిన వేళ వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన కుషాగ్ర ఓఝా (103 నాటౌట్) అజేయ సెంచరీతో మెరిశాడు. కెప్టెన్ యశ్బర్దన్ (78), మనాల్ చౌహన్ (55 నాటౌట్) అర్ధశతకాలతో రాణించడంతో భారీ స్కోరు దిశగా సాగుతోంది. లంక బౌలర్లలో గిమ్హన్ మెండిస్ రెండు వికెట్లు తీయగా, సెత్మికా ఒక వికెట్ పడగొట్టాడు.ఎవరీ కుషాగ్ర?సున్నా పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును అజేయ సెంచరీతో నడిపించిను కుషాగ్ర ఒక్కసారిగా హీరో అయిపోయాడు. రాజస్తాన్కు చెందిన 16 ఏళ్ల కుషాగ్ర ఓఝా టాపార్డర్లో బ్యాటింగ్కు వస్తుంటాడు. హంబన్టోటా వేదికగా శ్రీలంకతో జరిగిన యూత్ వన్డే సిరీస్ ద్వారా అండర్-19లో అరంగేట్రం చేసిన కుషాగ్ర ఆడిన తొలి మ్యాచ్లోనే 92 పరుగుల ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. తాజాగా తన తొలి అండర్-19 అనధికారిక టెస్టు మ్యాచ్ ఆడుతున్న కుషాగ్ర.. డెబ్యూ మ్యాచ్లోనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో 50 ఓవర్ల ఫార్మాట్లతో పాటు సంప్రదాయ ఫార్మాట్లోనూ అండర్-19 జట్టులో టాప్-4 బ్యాటింగ్లో కుషాగ్ర ఓఝా కీలక ఆటగాడిగా మారిపోయాడు.2023-24 సీజన్లో రాజస్తాన్ తరఫున విజయ్ మర్చంట్ ట్రోఫీ ద్వారా అండర్-19 క్రికెట్లో అరంగేట్రం చేసిన కుషాగ్ర 2025-26 దేశవాళీ టోర్నీలో అండర్-19 కూచ్ బెహర్ ట్రోఫీలో 565 పరుగులు సాధించి గుర్తింపు పొందాడు. ఈ టోర్నీలోనే రెండు సెంచరీలు సహా నాలుగు హాఫ్సెంచరీలు సాధించాడు. 2026 అండర్-19 వరల్డ్కప్కు కూడా కుషాగ్ర పరిగణలో ఉన్నాడు.Read: బుడ్డోడా మజాకా.. సవతి సోదరుడైనా తమ్ముడంటే ప్రాణం! -
వికెట్ తేడాతో సంచలన విజయం.. కివీస్దే వన్డే సిరీస్
వెస్టిండీస్తో జరుగుతున్న వన్డే సిరీస్ను న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆదివారం రాత్రి జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ వికెట్ తేడాతో వెస్టిండీస్పై సంచలనం విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 44.4 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది. విండీస్ బ్యాటర్లలో అమిర్ జాంగో (51) అర్ధసెంచరీ సాధించగా, ఆఖర్లో గుదకేశ్ మోతీ (41) రాణించాడు. ఒక దశలో 81 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడిన విండీస్ను గుదకేశ్, అమిర్ జాంగో ఆదుకున్నారు. ఈ ఇద్దరు ఏడో వికెట్కు 81 పరుగులు జోడించడంతో వెస్టిండీస్ గౌరవప్రదమైన స్కోరును సాధించింది. న్యూజిలాండ్ బౌలర్లలో మాథ్యూ ఫిషర్ మూడు వికెట్లు తీయగా, మిచెల్ సాంట్నర్, మైకెల్ బ్రాస్వెల్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ కూడా తడబడింది. 88 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో మార్క్ చాప్మన్ (80), మైకెల్బ్రాస్వెల్ (32), మిచెల్సాంట్నర్ (34 నాటౌట్) విలువైన భాగస్వామ్యాలు నిర్మించారు. చాప్మన్, బ్రాస్వెల్ వెనుదిరిగినప్పటికీ కడదాకా నిలిచిన కెప్టెన్ సాంట్నర్ మరో 35 బంతులు మిగిలి ఉండగానే (44.5 ఓవర్లలో) జట్టును విజయతీరాలకు చేర్చాడు. విండీస్ బౌలర్లలో గుదకేశ్ మోతీ 5 వికెట్లతో సత్తా చాటగా, మాథ్యూ ఫోర్డ్ 2 వికెట్లు తీశాడు. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన మిచెల్ సాంట్నర్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకున్నాడు. ఇరుజట్ల మధ్య నామమాత్రమైన చివరి వన్డే రేపు జరగనుంది.


