Cricket
-
ఎన్ని రోజుల్లో ముగిస్తారు?
ఐపీఎల్ సందడి ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు మళ్లీ టెస్టు క్రికెట్కు సిద్ధమైంది. గత నవంబర్లో తమ చివరి టెస్టు ఆడిన టీమిండియా ఇప్పుడు సొంతగడ్డపై బలహీన ప్రత్యర్థి అఫ్గానిస్తాన్తో తలపడుతుంది. ఎలాంటి ప్రమాణాల ప్రకారం చూసినా అఫ్గాన్కంటే ఎంతో పెద్ద స్థాయిలో ఉన్న మన టెస్టు జట్టును నిలువరించడం ప్రత్యర్థికి అసాధ్యం కావచ్చు. ఎనిమిదేళ్ల క్రితం తమ తొలి టెస్టులో భారత్నే ఎదుర్కొన్న అఫ్గాన్ టీమ్ రెండు రోజుల్లోనే చిత్తుగా ఓడింది. ఇప్పుడు ఈ టెస్టు ఎన్ని రోజులు సాగుతుందో చూడాలి. న్యూ చండీగఢ్: వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో భాగం కాదు... ఇరు జట్ల మధ్య ఆటలో, అనుభవంలో ఎంతో అంతరం ఉంది... పైగా భారత్ తమ స్వదేశంలో ఆడుతోంది. ఇలాంటి స్థితిలో సహజంగానే భారత్, అఫ్గానిస్తాన్ మధ్య టెస్టు మ్యాచ్పై ఆసక్తి తక్కువగా కనిపిస్తోంది. వారం రోజుల క్రితం వరకు ఆరు ఐపీఎల్ మ్యాచ్లతో ఇంద్రధనుస్సులా కనిపించిన ముల్లాన్పూర్ స్టేడియంలో ఆకర్షణ తగ్గిపోయింది. 38 వేల సామర్థ్యం గల మైదానం తొలి టెస్టుకు వేదిక అవుతున్నా... ఐదు రోజులకు రూ. 250తో టికెట్లు నిర్ణయిస్తే టెస్టు మ్యాచ్ ఆరంభానికి రెండు రోజుల ముందు 1700 టికెట్లు అమ్ముడుపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి స్థితిలో నేటి నుంచి భారత్, అఫ్గానిస్తాన్ ఏకైక టెస్టులో ఢీకొంటున్నాయి. సుదర్శన్కు మరో చాన్స్... యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్ జోడీ భారత్కు శుభారంభం అందిస్తే భారీ స్కోరుకు పునాది పడుతుంది. మూడో స్థానంలో ఇప్పటి వరకు సాయి సుదర్శన్ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వకపోయినా (6 టెస్టుల్లో కలిపి 302 పరుగులు)... కోచ్ గంభీర్ అతనిపై నమ్మకం ఉంచాడు. సుదర్శన్కు మరిన్ని అవకాశాలు ఇస్తామని స్పష్టంగా చెప్పడంతో అతని స్థానానికి కూడా ఢోకా లేదు కాబట్టి పడిక్కల్కు చాన్స్ లేదు. కెప్టెన్ గిల్, పంత్, జురేల్, సుందర్లతో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. ఇప్పటికే వన్డేలు, టి20ల్లో దాదాపుగా జట్టుకు దూరమైన పంత్ ఈ ఫార్మాట్లోనైనా చెలరేగాలని పట్టుదలగా ఉన్నాడు. పేసర్లు సిరాజ్, ప్రసిధ్ కృష్ణ ఖాయం కాగా... ప్రధాన స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్పై భారం ఉంది. సుందర్ రెండో స్పిన్నర్ కాగా, స్వదేశంలో భారత్ సాధారణంగా ముగ్గురు స్పిన్నర్లతో ఆడుతుంది. కొత్త ఆటగాళ్లు మానవ్ సుతార్, హర్ష్దూబేలలో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. అశ్విన్, జడేజాలు ఇద్దరూ లేకుండా సొంతగడ్డపై చివరిగా భారత్ 2010లో టెస్టు ఆడింది! వారిద్దరిపైనే భారం... టెస్టుల్లో అడుగు పెట్టి ఎనిమిదేళ్లు దాటినా... అఫ్గానిస్తాన్ ఇప్పటి వరకు 12 టెస్టులే ఆడగలిగింది. ఆ్రస్టేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలాంటి పెద్ద జట్లతో ఒక్కసారి కూడా తలపడలేదు. ఈ ఫార్మాట్లో టీమ్ పరిస్థితిని ఇది సూచిస్తోంది. అఫ్గాన్ తరఫున రెండు డబుల్ సెంచరీలు సాధించిన కెప్టెన్ హష్మతుల్లా, ఓవరాల్గా అత్యధిక పరుగులు చేసిన రహ్మత్ షా బ్యాటింగ్పైనే జట్టు ప్రధానంగా ఆధారపడుతోంది. అజ్మతుల్లా కీలక ఆల్రౌండర్ కాగా, గుర్బాజ్ ఓపెనింగ్లో దూకుడుగా ఆడగలడని జట్టు ఆశిస్తోంది. రషీద్ ఖాన్ లేకపోవడంతో టీమ్ బౌలింగ్ బలహీనంగా మారింది. ఇలాంటి టీమ్ భారత్తో ఎంత వరకు పోరాడగలదనేది ఆసక్తికరం. 50 రిషభ్ పంత్కు ఇది 50వ టెస్టు. భారత్ తరఫున వికెట్ కీపర్లుగా ధోని (90), సయ్యద్ కిర్మాణీ (88) మాత్రమే ఇంతకంటే ఎక్కువ మ్యాచ్లు ఆడారు.పిచ్, వాతావరణం బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్. దాదాపు 40 డిగ్రీలతో ఉత్తరాదిలో తీవ్ర ఎండలు ఉండటం ఆటగాళ్లను బాగా ఇబ్బంది పెడుతోంది. -
టీమిండియాకు షాక్.. ఆరు నెలలు ఆటకు దూరమైన కోహ్లీ!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాలి పిక్క కండరాల గాయంతో అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు దూరమైన కోహ్లీ తాజాగా గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలింది. దీంతో కోహ్లీ కోలుకోవడానికి ఆరు నెలల సమయం పట్టే అవకాశముందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. దీంతో జూలైలో ఇంగ్లండ్తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్కు కోహ్లీ దూరమైనట్లే. అయితే దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. 'కోహ్లీ తొడ కండరంలో చీలిక వచ్చింది. ఈ గాయానికి శస్త్రచికిత్స అవసరం లేదు. అయితే ఇది నయం కావడానికి మాత్రం సుమారు ఆరు వారాల సమయం పట్టనుంది. దీనిలో భాగంగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కోహ్లీ పునరావాసం పొందే అవకాశముంది. కాగా కోహ్లీ తన గాయంపై ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలోని ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పర్దివాలాను టెలి-కన్సల్ట్ అయ్యాడు. ఎంఆర్ఐ స్కాన్లో కండరాల్లో చీలిక వచ్చినట్లు రిపోర్ట్లో తేలింది.' అని పేర్కొంది.ఇదిలా ఉండగా, ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న వన్డే సిరీస్కు ముందు ఫిట్నెస్ మదింపు కోసం రోహిత్ శర్మ జూన్ 8న బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)కి హాజరుకానున్నట్లు కూడా ఆ నివేదిక పేర్కొంది . ఈ సిరీస్ కోసం రోహిత్ను జట్టులోకి తీసుకున్నప్పటికీ, అతని లభ్యత పూర్తిగా ఫిట్నెస్ పరీక్షల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. చదవండి: కుప్పకూలిన కివీస్.. భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లండ్ -
కుప్పకూలిన కివీస్.. భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లండ్
లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగించినట్లుగా అనిపిస్తోంది. ఇంగ్లండ్ను తొలి ఇన్నింగ్స్లో 140 పరుగులకే ఆలౌట్ చేశామన్న ఆనందం న్యూజిలాండ్కు ఎక్కువసేపు నిలవలేదు. కివీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 113 పరుగులకే కుప్పకూలింది. 61/6 క్రితంరోజు స్కోరుతో రెండోరోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి ఎక్కువసేపు నిలవలేకపోయింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో కైల్ జేమీసన్ (38 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలవగా.. గ్లెన్ ఫిలిప్స్ (34) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్ 5 వికెట్లతో చెలరేగగా, జోష్ టంగ్ 3, అకిన్సన్లు రెండు వికెట్లు తీశాడు. దీంతో ఇంగ్లండ్కు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ తడబడినప్పటికీ టీ విరామ సమయానికి 42 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. జేమీ స్మిత్ (31), అకిన్సన్ (7) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓపెనర్ ఎమిలియో గే (57) అర్థసెంచరీ సాధించగా, బెన్ డకెట్ (33) పర్వాలేదనిపించాడు. కివీస్ బౌలర్లలో నాథన్ స్మిత్ మూడు వికెట్లు తీయగా, విలియం రూర్కీ 2 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 193 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. బౌలర్లకు విపరీతంగా అనుకూలిస్తున్న పిచ్పై మరో మూడు రోజులు ఆట మిగిలి ఉండడంతో ఇంగ్లండ్కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. That fifth-wicket feeling 🥰🤝 @IGcom pic.twitter.com/aeRVZsTyz3— England Cricket (@englandcricket) June 5, 2026చదవండి: వైభవ్ క్రేజ్.. స్వదేశంలో ముగిసి విదేశంలో మొదలు! -
వైభవ్ క్రేజ్.. స్వదేశంలో ముగిసి విదేశంలో మొదలు!
ఐపీఎల్ 2026 సీజన్ మొత్తం రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ గురించే చర్చ నడిచింది. ఈ సీజన్లో 16 మ్యాచ్లాడిన వైభవ్ 237 స్ట్రైక్రేట్తో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకోవడంతో పాటు మోస్ట్ వాల్యుబల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. అతడి బ్యాటింగ్ విధ్వంసంపై దిగ్గజాలు సహా మాజీ క్రికెటర్లు అభినందించారు. వైభవ్ను జాతీయ జట్టుకు ఎంపిక చేయాలని కూడా డిమాండ్లు వినిపించాయి. అయితే వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ఇప్పుడు విదేశాలకు కూడా పాకింది. విదేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు కూడా వైభవ్ను టీమిండియాకు ఎంపిక చేయాలని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులోనూ వైభవ్ సూర్యవంశీ గురించి ప్రస్తావన వచ్చింది. మ్యాచ్ తొలిరోజు మధ్యలో వర్షం పడడంతో విరామ సమయంలో కామెంటేటర్ సైమన్ డౌల్ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ ప్రస్తావన తీసుకొచ్చాడు. అతని బ్యాటింగ్ అద్భుతమంటూ, నేరుగా భారత జట్టులోకి తీసుకుంటారేమోనని పేర్కొన్నాడు. దీనికి సహచర కామెంటేటర్లు, మాజీ క్రికెటర్లు నాసిర్ హుస్సేన్, ఇయన్ వార్డ్ కూడా.. 'అవును వైభవ్ను జాతీయ జట్టులోకి తీసుకోవాల్సిన సమయం వచ్చేసినట్లుంది'అంటూ పేర్కొనడం ఆసక్తి కలిగించింది. అయితే టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ ఎంపికపై ఇంకా సమయం ఉందని బీసీసీఐ పేర్కొంది. 15 ఏళ్లే కావడంతో అతడికి క్రికెటర్గా చాలా భవిష్యత్తు ఉందని, ఈలోగా ఇండియా-ఏ తరఫున తన ఆటను చూపించే అవకాశమిస్తున్నట్లు తెలిపింది. లంక పర్యటనకు వెళ్లిన ఇండియా-ఏ జట్టులో వైభవ్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇండియా-ఏ జట్టు శ్రీలంక-ఏ, అఫ్గానిస్తాన్-ఏ జట్లతో ట్రై సిరీస్ ఆడనుంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 113 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్కు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ 31 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 124 పరుగులతో ఆడుతుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 151 పరుగుల లీడ్లో ఉంది."Open the batting with Sooryavanshi!" 😅👀 pic.twitter.com/PL21ZRvWFA— Sky Sports Cricket (@SkyCricket) June 4, 2026చదవండి: గెంటేస్తారన్న భయం.. కట్చేస్తే చరిత్రకు అడుగు దూరంలో! -
అఫ్గానిస్తాన్కు షాక్.. గుడ్బై చెప్పనున్న రషీద్ ఖాన్!
టీమిండియా, అఫ్గానిస్తాన్ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టెస్టు రిటైర్మెంట్పై త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే భారత్తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్కు రషీద్ ఖాన్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. టెస్టు క్రికెట్లో చాలాసేపు బౌలింగ్ చేయాల్సి రావడంతో, దీర్ఘకాలిక వెన్నునొప్పి వల్ల ఎక్కువ బంతులు వేయలేనని రషీద్ ఖాన్ గతం లోనే స్పష్టం చేశాడు. అయితే తాజాగా రషీద్ ఖాన్ టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడా అనే దానిపై ఆ జట్టు కోచ్ రిచర్డ్ ఫైబస్ స్పం దించారు. 'రషీద్ ఖాన్ దీర్ఘకాలిక నడుమునొప్పితో బాధపడుతున్నాడు. టెస్టు క్రికెట్కు దూరమవ్వాలని రషీద్ ఎప్పుడో నిర్ణయిం చుకున్నాడు.అతడు దేశంతో పాటు చాలా ప్రైవేటు లీగ్స్లో ఆడుతుంటాడు. అయితే రషీద్ మా జట్టుకు ఫ్రంట్లైన్ బౌలర్ కావడంతో అతడిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరముంది. టెస్టు క్రికెట్కు దూరంగా ఉండాలని భావిస్తున్న రషీద్తో నేను రెడ్బాల్ క్రికెట్లో కొనసాగాలని అడుగుతాను. కానీ ఆడతాడా లేదా అన్నది అతడి నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.27 ఏళ్ల రషీద్ ఖాన్ 2023 వన్డే ప్రపంచకప్కు ముందు నుంచే వెన్నుగాయం తీవ్రంగా ఇబ్బంది పెడుతూ వస్తోంది. అప్పటినుంచి ఎక్కువసేపు బౌలింగ్ చేయడంలో రషీద్ ఖాన్ తీవ్రంగా ఇబ్బంది పడుతూ వస్తున్నాడు. అయితే ఈ ఏడాది ఏప్రిల్లో తాను టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నా అని రషీద్ ఖాన్ తెలిపాడు. కాబట్టి టెస్టు క్రికెట్లో ఆడాలా వద్దా అనేది అతడి ఇష్టానికే వదిలేస్తున్నాం' అని తెలిపాడు.కాగా రషీద్ ఖాన్ గైర్హాజరీలో అఫ్గానిస్తాన్ జట్టుకు హష్మతుల్లా షాహిది జట్టును నడిపించనున్నాడు. జట్టులో రహమనుల్లా జద్రన్, అఫ్సర్ జజాయ్, ఇక్రమ్ అలీఖిలి, అజ్మతుల్లా ఒమర్జయ్లు కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. ఇక అఫ్గానిస్తాన్ 2018లో టెస్టు హోదా పొందింది. అప్పటినుంచి 12 మ్యాచ్లాడగా, నాలుగు విజయాలు, ఏడు ఓటములు, ఒక డ్రా నమోదు చేసింది. అఫ్గానిస్తాన్ చివరగా గతేడాది అక్టోబర్లో జింబాబ్వేతో టెస్టు మ్యాచ్ ఆడింది. అయితే ఆ మ్యాచ్లో అఫ్గానిస్తాన్ 73 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. అఫ్గానిస్తాన్ స్టార్ బౌలర్గా వెలుగొందుతున్న రషీద్ ఖాన్ ఆల్రౌండర్గా రాణిస్తున్నాడు. ఆ జట్టు తరఫున ఆరు టెస్టుల్లో 154 పరుగులు, 45 వికెట్లు; 117 వన్డేల్లో 1,393 పరుగులు, 210 వికెట్లు; 113 టీ20ల్లో 622 పరుగులు, 190 వికెట్లు తీశాడు.చదవండి: ఆసీస్పై సిరీస్ విజయం.. పాక్ క్రికెటర్కు బంపరాఫర్! -
IPL 2026: ‘మా కారు ట్రక్కు కిందకి దూసుకెళ్లింది’
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ షాకింగ్ విషయం వెల్లడించాడు. ఐపీఎల్-2026 ఫైనల్ ముగిసిన తర్వాత తాను ఘోరమైన ప్రమాదం బారినపడ్డాడనన్నాడు. దేవుడి దయ, భారత ప్రజల మంచితనం వల్ల సురక్షితంగా ఇంటికి చేరుకున్నానని తెలిపాడు.రెండోసారి టైటిల్ గెలిచిన ఆర్సీబీకాగా మార్చి 28- మే 31 మధ్య ఐపీఎల్ తాజా ఎడిషన్ జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)- గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో టైటాన్స్ను చిత్తు చేసి ఆర్సీబీ వరుసగా రెండోసారి టైటిల్ గెలిచింది.ఈ మ్యాచ్ కామెంట్రీ బృందంలో మైకేల్ క్లార్క్ కూడా భాగం. ఫైనల్ ముగిసిన తర్వాత అతడు నరేంద్ర మోదీ స్టేడియం నుంచి విమానాశ్రయానికి కారులో బయల్దేరాడు. కొద్దిదూరం వెళ్లగానే కారు ఘోర ప్రమాదానికి గురైంది. అప్పటికి క్లార్క్ నిద్రపోతున్నాడు. ఒక్కసారిగా శబ్దం రావడంతో నిద్రలేవగా.. అప్పటికే కారు ఓ ట్రక్కు కిందకి వెళ్లిపోయింది.మా కారు ట్రక్కు కిందకి దూసుకువెళ్లిందిఈ చేదు ఘటన గురించి మైకేల్ క్లార్క్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. బియాండ్23 క్రికెట్ పాడ్కాస్ట్తో మాట్లాడుతూ.. ‘‘ముందుగా ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇండియాలో ఇంత మంచి వ్యక్తులు ఉన్నందుకు ఆయనకు థాంక్యూ చెప్పాల్సిందే. వారి వల్లే నేను సురక్షితంగా మా ఇంటికి వెళ్లగలిగాను.ఆరోజు నేను కారులో నిద్రపోతున్నాను. అలసట వల్ల ఒళ్లు తెలీకుండా నిద్రపట్టేసింది. ఒక్కసారిగా శబ్దం వచ్చింది. లేచి చూసే సరికి మా కారు ఓ ట్రక్కు కిందకి దూసుకువెళ్లింది. డ్రైవర్ అప్పుడు నాకు జరిగిన విషయం చెప్పాడు.ట్రక్కు బ్రేక్ లైట్లు కనిపించకపోవడం వల్ల తాను కన్ఫ్యూజ్ అయ్యానన్నాడు. అందుకే వెనుక నుంచి మా కారు ట్రక్కును ఢీకొట్టింది. ఈ క్రమంలో ట్రక్కు కిందకి దూసుకువెళ్లిపోయింది. నాకు చిన్న చిన్న గాయాలయ్యాయి.కాలు విరిగిపోయింది!అయితే, మా డ్రైవర్ కాలు మాత్రం విరిగిపోయే ఉంటుంది. అతడు చాలా భయపడ్డాడు. అది అతడి సొంతకారు కూడా కాదు. పాపం కంపెనీ తరఫున కారు నడుపుతూ ఉపాధి పొందుతున్నాడు.విషయం తెలియగానే చుట్టుపక్కల ఉన్న ప్రజలు వచ్చి సాయం చేశారు. ఇక బీసీసీఐకి చెందిన ప్రతి ఒక్కరు నా బాగోగుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు. నిజంగా వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. వారికి ఎల్లవేళలా కృతజ్ఞుడినై ఉంటాను.చాలా భయపడిపోయానుఅదొక ఘోర ప్రమాదం. ఇలాంటివి రోజూ జరుగుతూనే ఉండొచ్చు. అయితే, నేను మాత్రం చాలా భయపడిపోయాను. నిద్రలో ఉన్నవాడిని లేచి చూసే సరికి ట్రక్కు కింద ఉంటే ఎవరైనా కంగారు పడతారు కదా!’’ అని మైకేల్ క్లార్క్ చేదు అనుభవాన్ని పంచుకున్నాడు.చదవండి: అతడికి అన్యాయం: గంభీర్ -
ఆసీస్పై సిరీస్ విజయం.. పాక్ క్రికెటర్కు బంపరాఫర్!
ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ విజయంతో పాకిస్తాన్ జట్టు జోష్లో ఉంది. అయితే సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన ఆ జట్టు ఆల్రౌండర్ షాదాబ్ఖాన్ను అదృష్టం తలుపుతట్టింది.ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభం కానున్న యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ఈటీపీఎల్) తొలి ఎడిషన్లో షాదాబ్ ఖాన్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. తద్వారా యూరోప్ టీ20 క్రికెట్ లీగ్లో ఆడనున్న తొలి పాక్ క్రికెటర్గా షాదాబ్ ఖాన్ నిలవనున్నాడు. ఇక ఈటీపీఎల్ టోర్నీలో షాదాబ్ ఖాన్ ఎడిన్బర్గ్ క్యాసిల్ రాకర్స్కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. కాగా ఈ ఎడిన్బర్గ్ క్యాసిల్ ఫ్రాంచైజీని మాజీ న్యూజిలాండ్ క్రికెటర్లు కైల్మిల్స్, నాథన్ మెక్కల్లమ్లు సొంతం చేసుకున్నారు. ఈ జట్టుకు మిచెల్ సాంట్నర్ కెప్టెన్గా ఉండనున్నాడు. టామ్ బ్రూస్, టామ్ కరన్, జేజే స్మట్స్, ఆండ్రీ గౌస్తో కలిసి షాదాబ్ ఖాన్ ఆడనున్నాడు. కాగా ఎడిన్బర్గ్ మంచి ధరకే షాదాబ్తో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. టీ20 క్రికెట్లో ఈ పాకిస్తాన్ క్రికెటర్కు మంచి డిమాండ్ ఉంది. పాకిస్తాన్ సూపర్లీగ్లో (పీఎస్ఎల్) ఇస్లామాబాద్ యునైటెడ్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్న షాదాబ్ ఆ జట్టుకు మూడు పీఎస్ఎల్ టైటిల్స్ అందించడం విశేషం. పీఎస్ఎల్, బీబీఎల్, సీపీఎల్, బీపీఎల్, హండ్రెడ్ టోర్నీ కలిపి 350కి పైగా మ్యాచ్లాడిన షాదాబ్ఖాన్ 3,915 పరుగులు సాధించాడు. పాకిస్తాన్ తరఫున 124 టీ20ల్లో 1009 పరుగులు చేయడంతో పాటు 123 వికెట్లు పడగొట్టాడు. యూరోప్లో క్రికెట్ను ప్రోత్సహించే దిశగా స్కాట్లాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్లోని స్థానిక క్రికెటర్లకు అవకాశాలు ఇచ్చేందుకు యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ పేరిట కొత్త టోర్నీని తీసుకొచ్చింది. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్కు బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కో-ఓనర్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్లో చాలా మంది మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు కలిపి ఆయా ఫ్రాంచైజీలను కొనుగోలు చేశారు. కైల్ మిల్స్, నాథన్ మెక్కల్లమ్ (ఎడిన్బర్గ్ క్యాసిల్), రాహుల్ ద్రవిడ్ (డబ్లిన్ గార్డియన్స్), గ్లెన్ మ్యాక్స్వెల్ (ఐరిష్ వోల్వ్స్), స్టీవ్ వా (ఆమ్స్టర్డామ్ ఫ్లేమ్స్), జాంటీ రోడ్స్, ఫాఫ్ డుప్లెసిస్, హెన్రిచ్ క్లాసెన్ (రోటర్డామ్ డాకర్స్)కు ఓనర్లుగా ఉన్నారు. ఈటీపీఎల్-2026 టోర్నీ ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ వేదికగా జరగనుంది.చదవండి: గాయాల బారిన సీనియర్లు.. టీమిండియాకు షాక్ తప్పదా? -
ODI WC: టీమిండియాకు 3 ఆప్షన్లు.. అతడే బెస్ట్!
సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాలో పునరాగమనం చేసిన ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఓపెనర్గా, వన్డౌన్ బ్యాటర్గా సత్తా చాటిన ఈ జార్ఖండ్ డైనమైట్.. ఐపీఎల్-2026లోనూ పరుగుల వరద పారించాడు.వన్డేలలోనూ రీఎంట్రీసన్రైజర్స్ హైదరాబాద్ తరఫున పదిహేను మ్యాచ్లలో కలిపి 602 పరుగులు సాధించాడు. ఈ మేరకు టీ20లలో సత్తా చాటిన ఇషాన్ కిషన్ (Ishan Kishan) వన్డేలలోనూ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. వన్డే వరల్డ్కప్-2023 తర్వాత జట్టుకు దూరమైన ఇషాన్.. అఫ్గనిస్తాన్ స్వదేశంలో జూన్ 13 నుంచి మొదలుకానున్న సిరీస్కు ఎంపికయ్యాడు.సీనియర్ కేఎల్ రాహుల్తో కలిసి వికెట్ కీపర్ కోటాలో ఇషాన్ కిషన్కు చోటు దక్కింది. వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి జట్టును సన్నద్ధం చేసే క్రమంలో ఇషాన్కు యాజమాన్యం ఈ మేరకు ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం.మూడో వికెట్ కీపర్గా..ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాహుల్, ఇషాన్లతో పాటు భారత్ మూడో వికెట్ కీపర్ను కూడా ఇప్పటి నుంచే సన్నద్ధం చేయాలని సూచించాడు. సంజూ శాంసన్ను బ్యాకప్ కీపర్గా ఎంపిక చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘వరల్డ్కప్ టోర్నీ నేపథ్యంలో నంబర్ వన్ వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్కు ప్రాధాన్యం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అతడు మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయగలడు. విలక్షణమైన ఆటగాడు.అతడి వన్డే రికార్డు గొప్పగా ఉందిఇక ఇషాన్ కిషన్ సైతం ఓపెనర్గా రాణించగలడు. వన్డౌన్లోనూ ఆడగలడు. అందుకే వారిద్దరికి సెలక్టర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే, సంజూ శాంసన్ వన్డే రికార్డు కూడా గొప్పగా ఉంది. అవకాశం వచ్చినప్పుడల్లా అతడు రాణించాడు.ఒత్తిడిలోనూ రాణించగల పరిణతి సాధించాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. కాబట్టి సంజూను కూడా సెలక్టర్లు దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది’’ అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. కాగా సంజూ ఇప్పటి వరకు 14 వన్డేలు ఆడి 510 పరుగులు సాధించాడు. చివరగా 2023 డిసెంబరులో టీమిండియా తరఫున వన్డే ఆడాడు.చదవండి: అతడికి అన్యాయం.. ఎక్కువ అవకాశాలు ఇవ్వలేదు: గంభీర్ -
గాయాల బారిన సీనియర్లు.. టీమిండియాకు షాక్ తప్పదా?
ఐపీఎల్ 2026 సీజన్ ముగియడంతో టీమిండియా ప్రస్తుతం అఫ్గానిస్తాన్తో జరగనున్న టెస్టుతో పాటు వన్డే సిరీస్పై దృష్టి సారించింది. రేపటి నుంచి భారత్, అఫ్గానిస్తాన్ మధ్య ముల్లన్పూర్ వేదికగా ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు గిల్ నేతృత్వంలోని టీమిండియా స్టేడియానికి చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసింది. టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత వెంటనే మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్కు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేర్లను పరిగణలోకి తీసుకొని ఎంపిక చేశారు. అయితే పిక్క కండరాల గాయంతో కోహ్లీ ఈ సిరీస్కు దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో కోహ్లీ స్థానంలో జట్టులోకి వచ్చేది ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆఫ్గన్తో వన్డే సిరీస్కు కోహ్లీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. జూన్ 13న ధర్మశాల వేదికగా జరగనున్న తొలి వన్డేకు రుతురాజ్ అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ప్రకటన విడుదల చేసినట్లు నివేదికలు వచ్చాయి. కానీ రుతురాజ్ గైక్వాడ్ భారత-ఏ జట్టుతో కలిసి శ్రీలంక పర్యటనకు బయల్దేరి వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఈ వార్తలన్నింటికీ ఫుల్స్టాప్ పడినట్లయింది.లంక పర్యటనలో భారత్.. శ్రీలంక-ఏ, అప్గానిస్తాన్-ఏ జట్లతో కలిసి ట్రై సిరీస్ ఆడనుంది. తాజాగా రుతురాజ్ కొలంబోలో దర్శనమివ్వడంతో మరి కోహ్లీ స్థానంలో ఆడే ఆటగాడు ఎవరన్నది ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది. అయితే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.ఎటూ తేల్చని బీసీసీఐ?ఆఫ్గన్తో వన్డే సిరీస్కు 15 మందితో జట్టును ప్రకటించడంతో కోహ్లీ దూరమైన అతడి స్థానాన్ని ఆ సిరీస్కు ఎంపికైన ఆటగాళ్లలో ఒకరితోనే భర్తీ చేయాలనే నిర్ణయానికి బీసీసీఐ వచ్చినట్లు తెలుస్తోంది. కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కూడా ఆఫ్గన్తో వన్డే సిరీస్ ఆడడం అనుమానంగానే ఉంది. అతడు కూడా పిక్క కండరాల గాయంతో బాధపడుతుండడం టీమిండియాకు ప్రతికూలంగా మారనుంది. మరోవైపు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా జట్టులోని సీనియర్లంతా గాయాల బారిన పడడంతో వన్డే సిరీస్లో అప్గానిస్తాన్ మనకు షాక్ ఇచ్చినా ఆశ్చర్యపోనసరం లేదని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. కోహ్లీ, రోహిత్, పాండ్యాలు దూరమైతే మాత్రం బీసీసీఐ వీరి స్థానంలో కనీసం ఇద్దరినైనా జట్టులోకి తీసుకోవాల్సిన అవసరముంటుంది. అయితే వన్డే సిరీస్కు ఇంకా సమయం ఉండడంతో బీసీసీఐ దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోనుంది.ఆఫ్గన్తో వన్డే సిరీస్కు టీమిండియాశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబేచదవండి: ఫిఫాకు ట్రోఫీ తిరిగివ్వని బ్రెజిల్.. విలువెంతో తెలుసా? -
షాకింగ్.. అమ్ముడుపోని కేఎల్ రాహుల్!?
ఐపీఎల్-2026లో దుమ్ములేపిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్కు తన సొంత గడ్డపై ఊహించని షాక్ తగిలింది. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక 'మహారాజా ట్రోఫి టీ20 లీగ్' వేలంలో రాహుల్ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించలేదు.రూ.2 లక్షల బేస్ ప్రైస్తో వేలంలోకి వచ్చిన రాహుల్, చివరికి అన్సోల్డ్గా మిగిలిపోయాడు. అద్భుతమైన ఫామ్లో ఉన్నప్పటికి రాహుల్ను ఏ జట్టు తీసుకోకపోవడానికి ప్రధాన కారణం అతడి అందుబాటుపై స్పష్టత లేకపోవడమేనని తెలుస్తోంది. జూన్ నెలలో భారత జట్టు అంతర్జాతీయ మ్యాచ్లతో బిజీగా ఉండనుంది.జూన్ 6 నుంచి అఫ్గానిస్తాన్తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్కు రాహుల్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఆ తర్వాత జూన్ 13 నుంచి జరగనున్న వన్డే సిరీస్లోనూ అతడు భాగం కానున్నాడు. అంతేకాకుండా జూలై రెండో వారంలో మూడు వన్డేల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు కూడా రాహుల్ వెళ్లనున్నాడు.రాహుల్ జాతీయ జట్టు బాధ్యతల కారణంగా ఈ లీగ్లో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఈ టోర్నీలో మ్యాచ్లు మొత్తం హుబ్లీ, మైసూర్, బెంగళూరు నగరాల్లో జరగనున్నాయి.చదవండి: 25 పరుగులకే ఆలౌట్.. 5 బంతుల్లో మ్యాచ్ ఫినిష్ -
అతడికి అన్యాయం.. ఛాన్సులు ఇవ్వలేదు: గంభీర్
టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో సిరీస్కు సిద్ధమైంది. ఇందులో భాగంగా తొలుత ముల్లన్పూర్ వేదికగా ఏకైక టెస్టు ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది.వన్డౌన్లో ఎవరు?శుబ్మన్ గిల్ సారథ్యంలోని టెస్టు జట్టులో కొత్తగా మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే కొత్తగా చోటు దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. మూడో స్థానం కోసం సాయి సుదర్శన్, దేవ్దత్ పడిక్కల్ మధ్య పోటీ నెలకొంది. సాయి సుదర్శన్ చివరగా స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా తరఫున బరిలో దిగాడు.ఈ మ్యాచ్లో సాయి దారుణంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో 15 పరుగులు చేసిన అతడు.. రెండో ఇన్నింగ్స్లో 14 పరుగులకే వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో అఫ్గన్తో టెస్టులో సాయికి కాకుండా పడిక్కల్కు అవకాశం ఇస్తారనే చర్చ నడుస్తోంది. ఈ విషయంపై టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ స్పందించాడు.న్యాయంగా మరొక్క ఛాన్స్ ఇవ్వాలిఅఫ్గన్తో శనివారం నాటి టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సాయి సుదర్శన్కు సరైన అవకాశాలు లభించలేదు. అతడు ఎక్కువగా ఇంగ్లండ్లోనే ఆడాడు. అతడికి న్యాయంగా మరొక్క ఛాన్స్ ఇవ్వాలని నేను బలంగా విశ్వసిస్తున్నా.ఏదేమైనా మేము పదకొండు మందిని మాత్రమే తుదిజట్టులోకి ఎంపిక చేస్తాము కదా!.. సాయి ఫామ్ కూడా మరీ అంత చెత్తగా ఏమీ లేదు. ఇటీవల ఐపీఎల్లో అతడు 700కు పైగా పరుగులు సాధించాడు. కేవలం 4-5 మ్యాచ్ల ద్వారా సాయి ఆట తీరుపై నిర్ణయానికి రాకూడదు’’ అని గంభీర్ పేర్కొన్నాడు.పడిక్కల్ మరోసారి బెంచ్కే తద్వారా అఫ్గనిస్తాన్తో ఏకైక టెస్టులో సాయి సుదర్శన్లో వన్డౌన్లో ఆడిస్తామని గంభీర్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు. దీంతో పడిక్కల్ మరోసారి బెంచ్కే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.కాగా కర్ణాటక బ్యాటర్ పడిక్కల్ రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో 543 పరుగుల సాధించి మంచి ఫామ్లో ఉన్నాడు. అయితే, గంభీర్ మాత్రం సాయి వైపే మొగ్గుచూపడం గమనార్హం.ఇదిలా ఉంటే.. చివరగా సొంతగడ్డపై సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడిన టీమిండియా.. ప్రత్యర్థి చేతిలో 2-0తో వైట్వాష్ అయింది. ఇదిలా ఉంటే.. అఫ్గన్తో టెస్టు ప్రపంచకప్ టెస్టు చాంపియన్షిప్ సైకిల్లో భాగం కాదు. అయితే, ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా తమ బలాన్ని పరీక్షించుకునే వీలు దొరికింది. కాగా టెస్టు తర్వాత టీమిండియా అఫ్గన్తో మూడు వన్డేలు ఆడనుంది.చదవండి: ‘ఇండియాలో లైఫ్ కోహ్లికి అస్సలు నచ్చదు’ -
ఇంత దారుణమా.. ఇదేం పిచ్?.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఫైర్
ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో చారిత్రాత్మక మ్యాచ్కు గురువారం తెరలేచింది. లండన్లోని ఈ ప్రఖ్యాత వేదికపై 150వ టెస్టుగా ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య పోరు అట్టహాసంగా ఆరంభమైంది. అయితే, తొలి రోజే ఏకంగా 16 వికెట్లు పడ్డాయి. లార్డ్స్ పిచ్ మీద ఇరుజట్ల పేసర్లు పండుగ చేసుకున్నారు.140 పరుగులకేఇంగ్లండ్తో తొలి టెస్టులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఆతిథ్య ఇంగ్లిష్ జట్టు 140 పరుగులకే కుప్పకూలింది. హ్యారీ బ్రూక్ 56 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలవగా.. మిగతా వాళ్లంతా కనీసం 20 పరుగుల మార్కు దాటలేదు.కివీస్ బౌలర్లలో కైలీ జెమీషన్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నాథన్ స్మిత్ మూడు, విలియం ఓరూర్కీ రెండు వికెట్లతో సత్తా చాటారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కివీస్.. గురువారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి కేవలం 61 పరుగులకే ఆరు వికెట్లు నష్టపోయింది.కివీస్ మరీ దారుణంగాఓలీ రాబిన్సన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, జోష్ టంగ్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ మైకేల్ వాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తొలి రోజే 16 వికెట్లు పడటం చూసి ప్రేక్షకుడిగా వినోదం పొందినా.. ఓ క్రికెటర్గా తనకు ఇది ఏమాత్రం నచ్చలేదన్నాడు.పిచ్ మరీ దారుణంగా ఉందిబీబీసీతో మాట్లాడుతూ.. ‘‘ఈరోజు పిచ్ను దగ్గరగా చూశాను. బంతిని అంచనా వేయడం కష్టమైపోయింది. ఇరుజట్లలో కలిపి దాదాపుగా ఆరుగురు లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగారు. డిఫెన్స్ ఆడే క్రమంలో వికెట్లు కోల్పోయారు.బంతి నేరుగా ప్యాడ్ల మీదకే వచ్చింది. దీనిని బట్టి పిచ్ ఎంత దారుణంగా ఉందో చెప్పవచ్చు. నిజానికి ప్రేక్షకుడిగా తొలిరోజే 16 వికెట్లు పడటం చూసి నేను సంతోషించాను. కానీ ఇది మంచి పిచ్ కాదు. లార్డ్స్ మైదానంలో ఇలాంటి పిచ్ చూసి మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ ఏమాత్రం సంతోషించదని చెప్పగలను.గత కొన్నేళ్లుగా ఈ సమస్య కొనసాగుతోంది. గతేడాది టీమిండియాతో మ్యాచ్ అద్భుతంగా సాగింది. కానీ అప్పుడు కూడా పిచ్ గురించి ఫిర్యాదులు వచ్చాయి. ముందుగా చెప్పినట్లు ఈ పిచ్ అంత గొప్పగా లేదు. కానీ ప్రేక్షకులకు వినోదం పంచుతోంది. ఈ మ్యాచ్ కూడా అలాగే సాగుతుందని అనుకుంటున్నా’’ అని మైకేల్ వాన్ విమర్శించాడు.చదవండి: ‘ఇండియాలో లైఫ్ కోహ్లికి అస్సలు నచ్చదు’ -
భారత తుది జట్టు ఇదే.. ఆ ఇద్దరి అరంగేట్రం ఫిక్స్?
ఐపీఎల్-2026 సీజన్ మెరుపులు తర్వాత సంప్రదాయ క్రికెట్ సమరానికి రంగం సిద్దమైంది. భారత్-అఫ్గానిస్తాన్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ శనివారం నుంచి ముల్లాన్పూర్ వేదికగా ప్రారంభం కానుంది. ఇది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC)లో భాగం కానప్పటికీ.. అందరి దృష్టి మాత్రం ఈ ఏకైక మ్యాచ్ పైనే ఉంది. ఎందుకంటే సౌతాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ తర్వాత స్వదేశంలో భారత్ ఆడుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇది.అంతకంటే ముందు సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో కూడా టీమిండియాకు ఘోర పరభావం ఎదురైంది. ఈ నేపథ్యంలో భారత జట్టు స్వదేశంలో తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అఫ్గాన్ కంటే భారత్ అన్ని విధాలగా పటిష్టంగా ఉన్నప్పటికి.. మైదానంలో ఆధిపత్య క్రికెట్ ఆడగలరా? లేదా అన్నది వేచి చూడాలి. ఈ మ్యాచ్తో కొన్ని కొత్త ముఖాలు అంతర్జాతీయ క్రికెట్కు పరిచయం అయ్యే అవకాశముంది. హర్ష్ దూబే, గుర్నార్ బ్రార్ వంటి యువ ఆటగాళ్లు డెబ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది.అదేవిధంగా దేవ్దత్త్ పడిక్కల్ టెస్టుల్లో తిరిగి పునరాగమనం చేయనున్నట్లు సమాచారం. సాయిసుదర్శన్ స్ధానంలో అతడిని ఆడించనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. పడిక్కల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. రంజీ ట్రోఫీ సీజన్ 2025-26లో ఈ కర్ణాటక బ్యాటర్ 54.30 సగటుతో 543 పరుగులు చేశాడు.ధ్రువ్ జురెల్ లేదా నితీశ్ కుమార్ రెడ్డిలో ఎవరికో ఒకరికే తుది జట్టులో చోటు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. రెగ్యులర్ వికెట్ కీపర్గా రిషబ్ పంత్ ఉండడంతో జురెల్ను బెంచ్కే పరిమితం చేసే అవకాశముంది. స్పెషలిస్ట్ బ్యాటర్ను ఆడించాలనుకుంటే నితీశ్ను పక్కన పెట్టక తప్పదు. ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని సిరాజ్ లీడ్ చేయనున్నాడు.భారత తుది జట్టు(అంచనా)శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దేవ్దత్త్ పడిక్కల్. నితీష్ కుమార్ రెడ్డి/ ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దుబే.చదవండి: క్రికెట్ దేవుడి రికార్డుకే ఎసరు.. చరిత్ర సృష్టించనున్న సూర్యవంశీ -
సూర్యకు టైమ్ లేదు!.. టీ20 కొత్త కెప్టెన్ ఖరారు!
టీమిండియా టీ20 కెప్టెన్ మార్పు విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సూర్యకుమార్ యాదవ్కు మరికొన్నాళ్లు సమయం ఇవ్వాలని తొలుత భావించినప్పటికీ.. ఇప్పుడు బోర్డు ఆ ఆలోచనను విరమించుకున్నట్లు సమాచారం.అగ్రపథంలో నిలిపి.. ప్రపంచకప్ అందించికాగా గత రెండేళ్లుగా టీ20లలో సారథిగా భారత్ను అగ్రపథంలో నిలిపాడు సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav). ఈ ఏడాది సొంతగడ్డపై ప్రపంచకప్ టోర్నీలో చాంపియన్గా నిలిపి.. దిగ్గజ కెప్టెన్ల సరసన చేరాడు. అయితే, ఒకప్పుడు ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్గా ఉన్న సూర్య.. కెప్టెన్ అయిన తర్వాత పూర్తిగా తేలిపోయాడు.ఈ నేపథ్యంలో 35 ఏళ్లపై సూర్యను కెప్టెన్సీ నుంచి తొలగించేందుకు నాయకత్వ బృందం సిద్ధమైంది. అయితే, ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో అతడి ప్రదర్శన చూసిన తర్వాతే తుది నిర్ణయానికి రావాలని భావించింది. తాజాగా ఈ విషయంలో యూటర్న్ తీసుకున్నట్లు సమాచారం.ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్కు ఆడిన సూర్య దారుణ వైఫల్యమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ సీజన్లో పదమూడు ఇన్నింగ్స్ ఆడిన సూర్య కేవలం 270 పరుగులే చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 60.ఐర్లాండ్ పర్యటన నుంచే కొత్త కెప్టెన్ఈ నేపథ్యంలో సూర్యను తక్షణమే కెప్టెన్సీ నుంచి తప్పించాలని బీసీసీఐ నిర్ణయానికి వచ్చినట్లు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో తెలిపింది. ఐర్లాండ్ పర్యటన నుంచే కొత్త కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు పగ్గాలు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం.ముంబైలో శనివారం జరిగే సెలక్షన్ ప్యానెల్ సమావేశంలో అతడి పేరును అధికారికంగా ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. స్వదేశంలో అఫ్గనిస్తాన్తో సిరీస్ తర్వాత టీమిండియా యూకేకు పయనం కానుంది.యూకే టూర్ సాగుతుందిలా..ఇందులో భాగంగా తొలుత జూన్ 26, 28 తేదీల్లో బెల్ఫాస్ట్ వేదికగా రెండు టీ20 మ్యాచ్లు ఆడనున్న టీమిండియా.. తదుపరి జూలై 1 నుంచి ఇంగ్లండ్తో ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్లలో పాల్గొంటుంది. అనంతరం సెప్టెంబరు- అక్టోబరు మధ్య జపాన్ వేదికగా ఆసియా క్రీడల్లో భాగమవుతుంది.వైస్ కెప్టెన్గా తిలక్!ఇదిలా ఉంటే.. సూర్యను కెప్టెన్గా తొలగించడంతో పాటు.. జట్టు నుంచి కూడా అతడిని తప్పించే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు పీటీఐ బుధవారం వెల్లడించింది. శ్రేయస్ అయ్యర్కు డిప్యూటీగా హైదరాబాదీ తిలక్ వర్మను నియమించనున్నట్లు పేర్కొంది. అదే విధంగా.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ జట్టులో సెలక్టర్లు చోటు ఇవ్వనున్నట్లు సదరు వార్తా సంస్థ తెలిపింది.కెప్టెన్గా పునరాగమనం!కాగా 2023లో చివరగా టీమిండియా తరఫున టీ20 మ్యాచ్ ఆడాడు శ్రేయస్ అయ్యర్. ఇక ఐపీఎల్-2024లో సారథిగా కోల్కతా నైట్ రైడర్స్ను చాంపియన్గా నిలిపిన ఈ ముంబైకర్.. 2025లో పంజాబ్ కింగ్స్ను ఫైనల్కు చేర్చాడు. అయితే, ఈ ఏడాది మాత్రం ప్లే ఆఫ్స్ వరకు కూడా తీసుకువెళ్లలేకపోయాడు. ఓవరాల్గా గత మూడేళ్లలో ఇటు బ్యాటర్గా.. అటు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు మంచి మార్కులే పడ్డాయి. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మద్దతుతో అతడు భారత టీ20 జట్టులో దాదాపు మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వడమే కాకుండా.. ఏకంగా కెప్టెన్గా పగ్గాలు చేపట్టేందుకు సిద్ధం కావడం విశేషం.చదవండి: ‘ఇండియాలో లైఫ్ కోహ్లికి అస్సలు నచ్చదు’ -
క్రికెట్ దేవుడి రికార్డుకే ఎసరు.. చరిత్ర సృష్టించనున్న సూర్యవంశీ
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది. ఐర్లాండ్, ఇంగ్లండ్తో జరిగే టీ20 సిరీస్లకు వైభవ్ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే భారత సీనియర్ క్రికెట్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును వైభవ్ బ్రేక్ చేయనున్నాడు. సచిన్ 16 ఏళ్ల 205 రోజుల వయసులో పాక్పై తన అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇప్పుడు వైభవ్ వయస్సు కేవలం 15 ఏళ్ల 70 రోజులు మాత్రమే. దీంతో మరో నెల రోజుల్లో సచిన్ ఆల్టైమ్ రికార్డు బద్దలు అవ్వడం ఖాయమన్పిస్తోంది. కాగా ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్లకు భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించనుంది. ఈ సందర్భంగా సెలక్టర్లు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.గత కొంత కాలంగా పేలవ ఫామ్తో సతమవుతున్న టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. అతడి స్ధానంలో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ను టీ20 జట్టు సారధిగా నియమించనున్నట్లు సమాచారం. అదేవిధంగా వైభవ్ సూర్యవంశీ ఎంపికను కూడా సెలక్టర్లు అధికారికంగా ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.వైభవ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్-2026లో 776 పరుగులు పరుగులతో టాప్ రన్స్కోరర్గా వైభవ్ నిలిచాడు. మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్,సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్ అవార్డులు కూడా సూర్యవంశీనే సొంతం చేసుకున్నాడు. అతడు ఐర్లాండ్ టూర్ కంటే ముందు శ్రీలంకలో ఇండియా-ఎ తరపున ఆడనున్నాడు.చదవండి: IND vs AFG: పంత్కు గంభీర్ క్లాస్.. లీక్ చేసిన అసిస్టెంట్ కోచ్! -
‘ఇండియాలో లైఫ్ కోహ్లికి అస్సలు ఇష్టం లేదు’
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అతడికి అభిమానులు ఉన్నారు. కోహ్లిని ఒక్కసారి నేరుగా చూస్తే తమ జన్మ ధన్యమైనట్లు భావించే వీరాభిమానులు కూడా కోకొల్లలు.కోహ్లికి ఉన్న విపరీతమైన ఈ క్రేజ్ అతడికి ఒక రకంగా శాపంగా మారిందంటున్నాడు ఇంగ్లండ్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్. నిజానికి భారత్లో జీవించడం కోహ్లికి కష్టంగా మారిందని.. అందుకే అతడు లండన్కు మకాం మార్చి ఉంటాడని అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్-2025లో లివింగ్స్టోన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్సీబీ లెజెండ్ కోహ్లి (Virat Kohli)తో తనకు ఏర్పడిన అనుబంధం, సహచర ఆటగాళ్ల పట్ల అతడు వ్యవహరించే తీరుపై లివింగ్స్టోన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.కోహ్లి అత్యద్భుతమైన వ్యక్తిస్టిక్ టు క్రికెట్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ‘‘కోహ్లి అత్యద్భుతమైన వ్యక్తి. విరాట్కు ప్రత్యర్థిగా బరిలోకి దిగడం నాకెంతో ఇష్టం. అతడితో కలిసి ఆడటాన్ని కూడా ఆస్వాదిస్తా. అతడు ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉంటాడు.ఎవరికి ఏ అవసరం ఉన్నా.. సలహా, సూచన కావాలన్నా అతడు ముందుంటాడు. అయితే, ఒక్కసారి మైదానంలో దిగిన తర్వాత అతడిలోని పోటీతత్వం తారస్థాయికి చేరుకుంటుంది. అతడు పూర్తిగా భిన్నమైన వ్యక్తిగా కనిపిస్తాడు.కుటుంబానికే ప్రాధాన్యంఅయితే, ముందుగా చెప్పినట్లు మైదానం వెలుపల మాత్రం అతడు అందరితో చాలా చాలా బాగుంటాడు. కుటుంబంతో సమయం గడపడం అంటే అతడికి ఎంతో ఇష్టం. నిజానికి ఇండియాలో జీవించే జీవితం అతడికి అసలు ఇష్టం లేదనే చెప్పవచ్చు.ఇండియాలో లైఫ్ అతడికి నచ్చదుప్రతి ఒక్కరూ తననే గమనిస్తూ ఉండటం అతడికి అస్సలు నచ్చదు. కోహ్లి చాలా మంచివాడు. మనసులో ఒకటి.. బయటకు ఒకటి ఉండదు. అయితే, మైదానంలోకి వెళ్లిన తర్వాత మాత్రం అతడిలా పూర్తిగా మారిపోయే మరొక ప్లేయర్ని మాత్రం నేను ఇంతవరకు చూడలేదు’’ అని లియామ్ లివింగ్స్టోన్ చెప్పుకొచ్చాడు.లండన్లో నివాసంకాగా బాలీవుడ్ నటి అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న కోహ్లికి.. కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ సంతానం. అనుష్క లండన్లోనే అకాయ్కు జన్మనిచ్చింది. అప్పటి నుంచి కోహ్లి కుటుంబం ఎక్కువగా లండన్లోనే నివసిస్తోంది. బ్రాండ్ ఎండార్స్మెంట్లు, ఐపీఎల్, స్వదేశంలో జరిగే మ్యాచ్లు, ఆశ్రమాలకు వెళ్లేందుకు మాత్రమే కోహ్లి భారత్కు వస్తున్నాడు.తమకున్న క్రేజ్ తన పిల్లలపై ప్రభావం చూపకూడదనే ఉద్దేశంతో విరుష్క దంపతులు ఇప్పటి వరకు వారి ఫొటోలు కూడా రివీల్ చేయలేదు. లండన్లో సామాన్యుల్లా రోడ్ల మీద నడుస్తూ చిల్ అవడమే తమకు సంతోషంగా ఉంటుందని ఈ జంట పలుమార్లు చెప్పకనే చెప్పింది.ఇక ఐపీఎల్ టైటిల్ గెలవాలన్న కోహ్లి కల గతేడాది నెరవేరింది. పద్దెమినిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. అదే జోరు కొనసాగిస్తూ ఐపీఎల్-2026లోనూ చాంపియన్గా నిలిచింది. దీంతో కోహ్లి సంతోషం రెట్టింపు అయింది.చదవండి: భారత క్రికెటర్ల రిటైర్మెంట్పై బీసీసీఐ కఠిన నిర్ణయం! -
25 పరుగులకే ఆలౌట్.. 5 బంతుల్లో మ్యాచ్ ఫినిష్
ఏసీసీ ఉమెన్స్ టీ20 ప్రీమియర్ కప్ 2026లో యూఏఈ- సౌదీ అరేబియా మధ్య జరిగిన మ్యాచ్ ఓ సంచలన రికార్డుకు వేదికైంది. ప్రత్యర్ధి నిర్ధేశించిన లక్ష్యాన్ని యూఏఈ మహిళల జట్టు కేవలం 5 బంతుల్లోనే ఛేదించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ టోర్నీలో భాగంగా బుధవారం భాంగ్ వేదికగా యూఏఈ, సౌదీ అరేబియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌదీ జట్టు యూఏఈ బౌలర్ల ధాటికి 15.3 ఓవర్లలో కేవలం 25 పరుగులకే కుప్పకూలింది. . ఆ జట్టులో ఏ ఒక్క బ్యాటర్ కూడా రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. ప్టెన్ మషాయెల్ వకాస్ చేసిన 9 పరుగులే జట్టులో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. సురక్షా కొట్టే, హీనా హోట్చందాని, ఈషా ఓజా తలా 3 వికెట్లు పడగొట్టి సౌధీ పతనాన్ని శాసించారు. అనంతరం 26 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ.. ఐదు బంతుల్లోనే మ్యాచ్ను ముగించేసింది. తొలి ఓవర్ వేసిన సౌదీ బౌలర్ మహ్ నూర్ అమీర్ 11 ఎక్స్ట్రాలు ఇవ్వగా.. యూఏఈ బ్యాటర్ ఈషా ఓజా కేవలం 5 బంతుల్లో 15 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించింది. దీంతో మహిళల టీ20 చరిత్రలోనే అత్యంత వేగవంతమైన చేజింగ్(బంతులు పరంగా) చేసిన నాలుగో జట్టుగా యూఏఈ నిలిచింది. ఈ జాబితాలో రువండా అగ్రస్ధానంలో ఉంది. మాలీతో జరిగిన మ్యాచ్లో రువండా తొలి నాలుగు బంతుల్లోనే మ్యాచ్ను ముగించింది.చదవండి: IND vs AFG: పంత్కు గంభీర్ క్లాస్.. లీక్ చేసిన అసిస్టెంట్ కోచ్! -
పంత్కు గంభీర్ క్లాస్.. లీక్ చేసిన అసిస్టెంట్ కోచ్!
అఫ్గానిస్తాన్తో ఏకైక టెస్ట్ మ్యాచ్కు ముందు టీమిండియా వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి రిషబ్ పంత్ను తప్పించిన సంగతి తెలిసిందే. అతడి స్ధానంలో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ను టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్గా బీసీసీఐ నియమించింది. గతేడాది రోహిత్ శర్మ నుంచి భారత టెస్ట్ జట్టు పగ్గాలను చేపట్టిన గిల్కు డిప్యూటీగా పంత్ ఎంపికయ్యాడు. కానీ ఆ తర్వాత అతడి ఫామ్ దారుణంగా పడిపోయింది. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లలో రిషబ్ పేలవమైన ప్రదర్శనలు కనబరిచాడు. దీంతో అతడిని వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఈ నేపథ్యంలో పంత్తో హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.అఫ్గాన్తో జరిగే టెస్టు మ్యాచ్లో ఒక సీనియర్ ఆటగాడిగా ఎలా వ్యవహరించాలనే విషయంపై గంభీర్ పంత్తో మాట్లాడాడు. ఈ విషయాన్ని ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెష్కాట్ వెల్లడించాడు."రిషబ్ ఒక సీనియర్ ప్లేయర్గా జట్టులో బాధ్యతాయుతమైన పాత్ర పోషించేందుకు సిద్దంగా ఉన్నాడు. యువ ఆటగాళ్లతో కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, పరిస్థితులకు తగ్గట్టుగా ఆటను ఎలా మార్చుకోవాలి అనే విషయాలపై గంభీర్, పంత్ మధ్య చర్చ జరిగింది. జట్టులో ఒక రోల్ మోడల్గా పంత్ నిలుస్తాడని ఆశిస్తున్నాను" అని డెష్కాట్ పేర్కొన్నాడు. కాగా 2025లో రిషబ్ మొత్తం 7 టెస్టులు ఆడి, 48.38 సగటుతో 629 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్గా రికార్డు బాగున్నప్పటికీ, సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్లోని నాలుగు ఇన్నింగ్స్ల్లో అతను కేవలం 27, 2, 7, 13 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఐపీఎల్-2026లో కూడా అదే తీరును కనబరిచాడు. ఐపీఎల్లో 12 మ్యాచ్లు ఆడి కేవలం 27.88 సగటుతో 251 పరుగులు మాత్రమే చేశాడు. అనంతరం లక్నో కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకొన్నాడు.చదవండి: AUS vs PAK: షాహీన్ దెబ్బ.. ఆసీస్ అబ్బా! వన్డే సిరీస్ పాక్దే -
క్రికెట్లో సంచలనం.. 'టైమ్డ్ అవుట్'గా వెనుదిరిగిన స్టార్ ప్లేయర్
భూటాన్ స్టార్ బ్యాటర్ రిత్షి చోడెన్ మహిళల క్రికెట్లో ‘టైమ్డ్ అవుట్’ అయిన తొలి ప్లేయర్గా గుర్తింపు పొందింది. ఏసీసీ ఉమెన్స్ ప్రీమియర్ కప్లో భాగంగా గురువారం నేపాల్తో జరిగిన టి20 మ్యాచ్ సందర్భంగా ఇది చోటు చేసుకుంది. క్రీజ్లోకి రావడానికి రిత్షి 90 సెకన్లకంటే ఎక్కువ సమయం తీసుకుంది. దాంతో నేపాల్ ఫీల్డర్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్లు సున్ మెంగ్, అంకిత గుహ ఆమెను అవుట్గా ప్రకటించారు. భూటాన్ ఇన్నింగ్స్ తొలి నిమిషంలోనే ఈ ఘటన జరిగింది. ఓపెనర్ ఎన్గవాంగ్ తొలి బంతికే బౌల్డ్ కాగా... ఆ సమయానికి సిద్ధంగా లేని రిత్షి మెల్లగా తన హెల్మెట్, గ్లవ్స్ చేతిలో పట్టుకొని మైదానంలోకి వచ్చింది అంపైర్ నిర్ణయం తర్వాత రిత్షి ఎలాంటి నిరసన తెలపకుండా మౌనంగా నిష్క్రమించింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ (సీఏఎన్) తమ జట్టు తరఫున భూటాన్ క్రికెట్కు క్షమాపణ చెప్పింది. నేపాల్ టీమ్ క్రీడా స్ఫూర్తిగా వ్యవహరించలేదని, నిబంధనల ప్రకారం ‘టైమ్డ్ అవుట్’ సరైందే అయినా... నేపాల్ టీమ్ క్రీడా స్ఫూర్తితో వ్యవహరించలేదంటూ తమ అసంతృప్తిని వెల్లడించింది. ఈ మ్యాచ్లో ముందుగా నేపాల్ 20 ఓవర్లలో 113 పరుగులు చేయగా, ఆ తర్వాత 20 ఓవర్లలో 8 వికెట్లకు 62 పరుగులే చేసిన భూటాన్ 51 పరుగులతో ఓడింది. -
షాహీన్ దెబ్బ.. ఆసీస్ అబ్బా! వన్డే సిరీస్ పాక్దే
లహోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో 4 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 2-1తో పాక్ కైవసం చేసుకుంది. ఈ ఆఖరి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 42 ఓవర్లలో కేవలం 157 పరుగులకే ఆలౌటైంది. షాహీన్ అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించగా.. షాదాబ్ ఖాన్, అబ్రార్ అహ్మద్ తలా రెండు వికెట్లు సాధించారు. ఆసీస్ ఇన్నింగ్స్లో కెప్టెన్ జోష్ ఇంగ్లిస్ (65 పరుగులు, 71 బంతుల్లో, 8 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేయగా, మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు. పాక్ గడ్డపై ఆసీస్కు ఇదే అత్యల్ప వన్డే స్కోర్ కావడం గమనార్హం.రాణించిన బాబర్ ఆజంఅనంతరం 158 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్కు ఆసీస్ స్పిన్నర్లు చుక్కలు చూపించారు. ఆతిథ్య జట్టు 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. పిచ్ స్పిన్కు అనుకూలించడంతో పాక్ బ్యాటర్లు పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డారు. ఈ సమయంలో మాజీ కెప్టెన్ బాబర్ ఆజం (40 పరుగులు, 84 బంతుల్లో) ఆచితూచి ఆడి ఇన్నింగ్స్ను చక్కదిద్దగా.. షాదాబ్ ఖాన్(42 బంతుల్లో 29), సమద్(30) అజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశారు. ఆసీస్ బౌలర్లలో మాథ్యూ కుహ్నెమాన్ 3 వికెట్లు పడగొట్టగా.. రెన్షా, ఎల్లీస్ తలా వికెట్ సాధించారు.చదవండి: ENG vs NZ: తొలి రోజే 16 వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో న్యూజిలాండ్ -
తొలి రోజే 16 వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో న్యూజిలాండ్
ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో పేసర్లు పండగ చేసుకున్నారు. ఇరు జట్ల బౌలర్లు విజృంభించడంతో తొలి రోజే 16 వికెట్లు నేలకూలాయి. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఈ పోరులో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు స్వల్ప స్కోరుకే ఆలౌటైంది.టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 39.4 ఓవర్లలో 140 పరుగులకు కుప్పకూలింది. హ్యారీ బ్రూక్ (71 బంతుల్లో 56; 10 ఫోర్లు) ఒక్కడే అర్ధశతకంతో పోరాడగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. బెన్ డకెట్ (19), ఎమిలియో (8), జాకబ్ బెథెల్ (6), జో రూట్ (1), జెమీ స్మిత్ (1), కెపె్టన్ బెన్ స్టోక్స్ (12) విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో కైల్ జెమీసన్ 5 వికెట్లు పడగొట్టగా... నాథన్ స్మిత్ 3, రూర్కె రెండు వికెట్లు పడగొట్టారు. మేఘావృతమైన వాతావరణంలో పిచ్ పేస్కు సహకరిస్తుండటంతో న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగిపోయారు. వెలుతురు లేమి కారణంగా పలుమార్లు మ్యాచ్కు అంతరాయం సైతం వాటిల్లింది. కివీస్ బౌలర్లు చెడుగుడు ఆడుకున్న చోట ఇంగ్లండ్ బౌలర్లు మరింత రెచ్చిపోయారు. ఫలితంగా న్యూజిలాండ్ టాపార్డర్ పేకమేడను తలపించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 61 పరుగులు చేసింది. కెప్టెన్ టామ్ లాథమ్ (3), కాన్వే (1), డారిల్ మిచెల్ (12), టామ్ బ్లండెల్ (4) విఫలమవగా... కేన్ విలియమ్సన్ (0), రచిన్ రవీంద్ర (0) సున్నాలు చుట్టారు. ఇంగ్లండ్ పేసర్ ఓలీ రాబిన్సన్ తన తొలి ఓవర్లోనే మూడు వికెట్లతో కివీస్ బ్యాటింగ్ వెన్ను విరిచాడు. ఫిలిప్స్ (34 బంతుల్లో 31 బ్యాటింగ్; 6 ఫోర్లు), నాథన్ స్మిత్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో 4 వికెట్లు ఉన్న కివీస్... ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 79 పరుగులు వెనుకబడి ఉంది.చదవండి: ఐపీఎల్పై దావూద్ కన్ను పడింది! -
ఐపీఎల్పై దావూద్ కన్ను పడింది!
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను ఒకదశలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కూడా శాసించేందుకు ప్రయత్నించాడు. తన బెట్టింగ్ నెట్వర్క్ కోసం లీగ్ను నియంత్రించేందుకు అతను పట్టుదల కనబర్చాడు. ఈ క్రమంలో నాటి లీగ్ కమిషనర్ లలిత్ మోదీని అతను చంపేస్తానని కూడా బెదిరించాడు. ఈ విషయాలను స్వయంగా లలిత్ మోదీ వెల్లడించాడు. ఐపీఎల్కు రూపకల్పన చేసి తొలి మూడు సీజన్లు అన్నీ తానై నడిపించిన మోదీపై ఆ తర్వాత బీసీసీఐ చర్య తీసుకుంది. ఆర్థిక లావాదేవీల్లో అవినీతి ఆరోపణలు తదితర కారణాలతో 2010 సీజన్ తర్వాత భారత్ను విడిచి వెళ్లిన మోదీ లండన్లో స్థిరపడ్డాడు. క్రికెట్ పరిపాలన నుంచి తాను పూర్తిగా తప్పుకునేందుకు దావూద్ బెదిరింపులు కూడా కారణమని అతను చెప్పాడు. ‘ఎన్నికల కారణంగా నేను 2009 ఐపీఎల్ను దక్షిణాఫ్రికాకు తరలించడం వారికి నచ్చలేదు. టోర్నీ రద్దవుతుందని వారు భారీ మొత్తాల్లో పందెం కాశారు. ఈ పరిణామంతో పెద్ద ఎత్తున నష్టపోయారు. వారు లీగ్ను చేతుల్లోకి తీసుకోవాలని భావించారు. టోర్నీ ఆరంభం నుంచి కూడా నేను కఠినంగా వ్యవహరించి ఫిక్సింగ్ను అరికట్టాను. స్టేడియాల్లో ఎలాంటి తప్పుడు పనులు జరగనివ్వలేదు. ఇవన్నీ దావూద్ బృందానికి ఆగ్రహం కలిగించాయి. ముంబై, జొహన్నెస్బర్గ్, క్రొయేషియా సరిహదుల్లో మూడు సార్లు నాపై హత్యకు కుట్ర పన్నారు. లండన్లో నా కొడుకును కిడ్నాప్ చేసేందుకు కూడా ప్రయత్నించారు. 2012లో ఒక మధ్యవర్తి నాకు దావూద్తో ఫోన్ చేయించాడు. ఈ రోజుతో నీ పని ముగిసింది అని ఒకే ఒక మాట చెప్పి అతను ఫోన్ పెట్టేశాడు. నేను చాలా భయపడిపోయాను. ఆ తర్వాత క్రికెట్ పరిపాలనకు పూర్తిగా దూరమయ్యాను’ అని లలిత్ మోదీ వివరించాడు. -
భారత క్రికెటర్ల రిటైర్మెంట్పై బీసీసీఐ కఠిన నిర్ణయం..?
భారత క్రికెటర్ల రిటైర్మెంట్ విషయంలో బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ లేదా దేశవాళీ క్రికెట్కు వీడ్కోలు పలికిన వెంటనే కొందరు ఆటగాళ్లు విదేశీ లీగ్లలో ఆడేందుకు క్యూ కడుతుండటంతో కొత్త విధానం తీసుకురావాలని భావిస్తోంది. ఈ అంశంపై త్వరలో జరుగబోయే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ కీలక చర్చ జరపనుంది.ఇటీవల తమిళనాడు ఆటగాడు విజయ్ శంకర్ భారత క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి, వెంటనే క్యాండీ రాయల్స్ తరఫున లంక ప్రీమియర్ లీగ్లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో రిటైర్మెంట్ ప్రకటించి విదేశీ లీగ్లలో ఆడే ధోరణిపై బీసీసీఐ దృష్టి సారించింది.గతంలో దినేశ్ కార్తీక్, యువరాజ్ సింగ్, ఉన్ముక్త్ చంద్, ప్రవీణ్ తాంబే, ఇర్ఫాన్ పఠాన్ వంటి ప్రముఖ క్రికెటర్లు కూడా ఇదే మార్గాన్ని ఎంచుకున్నారు.ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నా, దేశవాళీ క్రికెట్ లేదా ఐపీఎల్ ఆడుతున్నా.. ఏ క్రికెటర్కూ విదేశీ లీగ్ల్లో ఆడేందుకు అనుమతి లేదు. అయితే దేశీయంగా సరైన అవకాశాలు రాని కొందరు క్రికెటర్లు అదే పనిగా భారత క్రికెట్తో సంబంధాలు తెంచుకొని పరాయి దేశ లీగ్లవైపు పయనమవుతున్నారు. -
టీమిండియా క్రికెటర్ సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్కు చెందిన టీమిండియా వికెట్కీపర్-బ్యాటర్ కేఎస్ భరత్ (Kona Srikar Bharat) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 32 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు."భారత్ తరఫున ఆడటం నా జీవితంలో అత్యున్నత గౌరవం. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, కోచ్లు, సహచర ఆటగాళ్లు, బీసీసీఐకి ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని పేర్కొన్నాడు.అలాగే తన కెరీర్లో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. ఐపీఎల్లో తొలి అవకాశం ఇచ్చిన కోహ్లీకి, టెస్టు అరంగేట్రం కల్పించిన రోహిత్కు, ఇండియా-ఏ నుంచి జాతీయ జట్టు వరకు తనను ప్రోత్సహించిన ద్రవిడ్కు కృతజ్ఞతలు తెలియజేశాడు.2023లో ఆస్ట్రేలియాతో నాగ్పూర్లో టెస్టు అరంగేట్రం చేసిన భరత్, భారత్ తరఫున 7 టెస్టులు ఆడి 221 పరుగులు చేశాడు. వికెట్కీపర్గా 18 క్యాచ్లు, ఒక స్టంపింగ్ నమోదు చేశాడు.అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, భారత్కు దేశవాళీ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. 113 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో 6102 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 34 అర్ధసెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 308 పరుగులు.లిస్ట్-ఏ క్రికెట్లో భరత్ 82 మ్యాచ్లు ఆడి 8 సెంచరీలు, 10 అర్ద సెంచరీల సాయంతో 2692 పరుగులు చేశాడు. అలాగే దేశవాలీ టీ20ల్లో 91 మ్యాచ్లు ఆడి 11 అర్ద సెంచరీల సాయంతో 1812 పరుగులు చేశాడు. ఐపీఎల్లో భరత్ 11 మ్యాచ్ల్లో ఓ అర్ద సెంచరీ సాయంతో 199 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినప్పటికీ.. భవిష్యత్తులో కోచింగ్, మెంటరింగ్ ద్వారా యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేస్తానని భరత్ వెల్లడించాడు. -
రోహిత్- కోహ్లి ఆడతారా?.. స్పందించిన టీమిండియా కోచ్
అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అందుబాటులో ఉంటారా? లేదా?.. క్రికెట్ వర్గాల్లో ఇప్పుడిదే చర్చనీయాంశం. ఐపీఎల్-2026లో కోహ్లి అదరగొట్టిన సంగతి తెలిసిందే.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓపెనర్గా కొనసాగుతున్న కోహ్లి.. ఈ సీజన్లో 16 మ్యాచ్లలో కలిపి 675 పరుగులు సాధించాడు. గుజరాత్ టైటాన్స్తో ఫైనల్లో 75 పరుగులతో అజేయంగా నిలిచి ఆర్సీబీ వరుసగా రెండోసారి ట్రోఫీ ముద్దాడటంలో కీలక పాత్ర పోషించాడు.అంతలోనే గాయమా?ఇక ఆర్సీబీ రెండోసారి టైటిల్ విజేతగా అవతరించిన తరుణంలో కోహ్లి సంబరాలు అంబరాన్నంటాయి. భార్య అనుష్క శర్మ, సహచర ఆటగాళ్లతో కలిసి అతడు ఉత్సాహంగా డాన్స్ చేసిన దృశ్యాలు వైరల్గా మారాయి. అయితే, అంతలోనే కోహ్లి తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడనే వార్త బయటకు వచ్చింది.ఫలితంగా అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు కోహ్లి దూరమయ్యాడనే వార్త చక్కర్లుకొడుతోంది. మరోవైపు.. ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయం కారణంగా ఐదు మ్యాచ్లకు దూరమయ్యాడు. ఆ తర్వాత తిరిగి వచ్చినా ఇంపాక్ట్ ప్లేయర్గానే బరిలోకి దిగాడు.రోహిత్ కూడా డౌటేఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సైతం సిరీస్కు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే తాజాగా స్పందించాడు. అఫ్గనిస్తాన్తో టీమిండియా ఏకైక టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడుతూ..కోచ్ ఏమన్నాడంటే..‘‘ఇప్పటి వరకు మాకు కూడా అధికారిక సమాచారం అందలేదు. విరాట్, రోహిత్ వంటి స్టార్ ప్లేయర్లు గాయాల వల్ల దూరవుతున్నారంటే అది నిజంగా పెద్ద వార్తే. అయితే, ఏ ఆటగాడి విషయంలోనైనా ప్రొటోకాల్ ఒకేలా ఉంటుంది.వాళ్లు ఫిట్నెస్ పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. మ్యాచ్ ఆడేందుకు ఫిట్గా ఉన్నారా? లేరా? అన్నది మా వైద్య బృందం నిర్ణయిస్తుంది. వారి సూచన ప్రకారమే రో-కోలను ఆడించాలా? వద్దా? అన్నది తేలుతుంది.ఒకవేళ వాళ్లు దూరమైతే వారి స్థానాలను భర్తీ చేసే అంశంపై కూడా యాజమాన్యం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని డష్కాటే తెలిపాడు. కాగా జూన్ 6- 20 మధ్య టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఏం జరుగుతోంది?ఇదిలా ఉంటే.. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి.. కేవలం వన్డేల్లో కొనసాగుతున్నారు. వన్డే వరల్డ్కప్-2027 ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ మెగా టోర్నీకి ముందు కొన్ని వన్డేలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇలాంటి తరుణంలో రో-కో గాయాల బారిన పడటం అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది. చదవండి: ‘పంజాబ్ కింగ్స్ ఈ ఐదుగురిని వదిలేయాలి’ -
‘పంజాబ్ కింగ్స్ ఈ ఐదుగురిని వదిలేయాలి’
ఐపీఎల్-2026 ఆరంభంలో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయాలు సాధించింది. వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచి టేబుల్ టాపర్గా కొనసాగింది. కానీ ఆ తర్వాత ఊహించనిరీతిలో వరుసగా ఆరు మ్యాచ్లు ఓడిపోయి ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్ హనుమ విహారి పంజాబ్ కింగ్స్ యాజమాన్యానికి కీలక సూచనలు చేశాడు. వచ్చే సీజన్ ఆరంభానికి ముందు ఈ ఐదుగురు ఆటగాళ్లను తప్పక వదిలించుకోవాలన్నాడు. ఇందులో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మార్కస్ స్టొయినిస్కు విహారి ప్రథమ స్థానం ఇచ్చాడు.రూ. 11 కోట్లు అందుకునే అర్హత లేదుతన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘నా అభిప్రాయం ప్రకారం.. పంజాబ్ మొట్టమొదటగా మార్కస్ స్టొయినిస్ను వదిలేయాలి. అతడిని ఏకంగా రూ. 11 కోట్లకు కొనుగోలు చేశారు. అదే ధరకు రిటైన్ చేసుకున్నారు.ఆరు లేదంటే ఏడో స్థానంలో ఆడతాడని ఇంత ధర పెట్టారు. కానీ అందుకు అతడు అర్హుడు కాడు. వచ్చే రెండు- మూడేళ్లలో అతడు రిటైర్మెంట్కు చేరువవుతాడు. బౌలింగ్లోనూ అతడు ప్రభావం చూపడం లేదు.వీళ్లను కూడా వదిలేయండిఅతడిని వేలంలోకి వదిలి.. కావాలంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. స్టొయినిస్తో పాటు నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మిచెల్ ఓవెన్లను కూడా వేలంలోకి వదిలేయండి. అసలు వాళ్లతో ఈ సీజన్లో ఏమాత్రం ప్రయోజనం చేకూరలేదు.లాకీ ఫెర్గూసన్ కూడా జట్టుకు అవసరం లేదు. వీళ్లందరినీ వదిలేస్తే పర్సులో కనీసం రూ. 25 కోట్లు మిగులుతాయి’’ అని హనుమ విహారి అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2026లో స్టొయినిస్ తొమ్మిది ఇన్నింగ్స్లో కలిపి కేవలం 216 పరుగులు చేశాడు. అదే విధంగా నాలుగు మ్యాచ్లలో బౌలింగ్ చేసి రెండే వికెట్లు తీశాడు.ఇక నేహాల్ వధేరా ఆరు ఇన్నింగ్స్ ఆడి 65 పరుగులకే పరిమితమయ్యాడు. మరోవైపు.. శశాంక్ సింగ్ సైతం తొమ్మిది ఇన్నింగ్స్లో కలిపి కేవలం 132 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఫెర్గూసన్ మూడు మ్యాచ్లు ఆడగా.. మిచెల్ ఓవెన్కు అసలు ఒక్క మ్యాచ్లోనూ అవకాశం రాలేదు.చదవండి: టీమిండియాలోకి కొత్త ప్లేయర్! -
చరిత్ర సృష్టించిన లార్డ్స్ మైదానం
క్రికెట్కు మక్కాగా పేరొందిన ఇంగ్లండ్లోని లార్డ్స్ క్రికెట్ మైదానం మరో అరుదైన ఘనత సాధించింది. 1884లో తొలి టెస్టు మ్యాచ్కు వేదికైన ఈ చారిత్రక మైదానం.. ఇవాళ ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య ప్రారంభమైన టెస్టుతో 150 టెస్టు మ్యాచ్లు పూర్తి చేసుకుంది. తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి క్రికెట్ మైదానంగా చరిత్ర సృష్టించింది.లార్డ్స్ తర్వాత అత్యధిక టెస్ట్ మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చిన మైదానంగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఉంది. ఈ మైదానంలో ఇప్పటివరకు 118 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. ఆతర్వాతి స్థానంలో ఆస్ట్రేలియాకే చెందిన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ఉంది. ఈ మైదానం ఇప్పటివరకు 114 టెస్ట్ మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చింది. ఆతర్వాతి స్థానంలో ఇంగ్లండ్లోని ద ఓవల్ గ్రౌండ్ ఉంది. ఈ మైదానంలో ఇప్పటివరకు 108 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి.కాగా, లార్డ్స్లో ఇప్పటివరకు జరిగిన 150 టెస్ట్ల్లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు ఏకంగా 146 మ్యాచ్లు ఆడింది. ఇందులో 60 విజయాలు, 35 పరాజయాలు, 51 డ్రాలు నమోదు చేసింది. ముఖ్యంగా యాషెస్ సిరీస్లో ఎన్నో క్లాసిక్ మ్యాచ్లు ఈ మైదానంలో జరిగాయి.దాదాపు 2.5 మీటర్ల వంపు (Slope) కలిగిన ప్రత్యేకత లార్డ్స్కు మాత్రమే ఉంది. మ్యాచ్ ప్రారంభ రోజున పేసర్లకు అనుకూలించే ఈ పిచ్ క్రమంగా ఎండిపోతూ స్పిన్నర్లు, బ్యాటర్లకు కూడా సహకరిస్తుంది.ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా ఇవాళ మొదలైన తొలి టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. వరుణుడి ఆటంకాల నడుమ సాగుతున్న ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. అరంగేట్రం బ్యాటర్ ఎమిలియో గే 8 పరుగులు చేసి జేమీసన్ బౌలింగ్లో డారిల్ మిచెల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 11.2 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 31-1గా ఉంది.బెన్ డకెట్ 19, జేకబ్ బెతెల్ 4 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు.న్యూజిలాండ్: టామ్ లాథమ్(కెప్టెన్), డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, రాచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, నాథన్ స్మిత్, కైల్ జామిసన్, మాట్ హెన్రీ, విలియం ఓ'రూర్క్ఇంగ్లండ్: ఎమిలియో గే, బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్(వికెట్ కీపర్), బెన్ స్టోక్స్(కెప్టెన్), గస్ అట్కిన్సన్, ఓలీ రాబిన్సన్, జోష్ టంగ్, షోయబ్ బషీర్ -
టీమిండియాలోకి కొత్త ముఖం.. కన్ఫర్మ్ చేసిన కోచ్
మరో రెండు రోజుల్లో (జూన్ 6) ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ (ముల్లాన్పూర్) కోసం టీమిండియా సర్వం సిద్దం చేసుకుంది. ఈ మ్యాచ్లో భారత్ తరఫున ఓ యువ ఆటగాడు అరంగేట్రం చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.టీమిండియా సహాయ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. యువ స్పిన్నర్లు హర్ష్ దూబే, మానవ్ సుతార్లో ఎవరో ఒకరికి తుది జట్టులో చోటు దక్కవచ్చని సంకేతాలు ఇచ్చాడు. దీంతో వీరిలో ఒకరు టెస్టు క్యాప్ అందుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.ముల్లాన్పూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే అవకాశముండటంతో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ప్రధాన స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్, రెండో స్పిన్నర్గా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగడం దాదాపుగా ఖాయం కాగా.. మూడో స్పిన్నర్ స్థానం కోసం హర్ష్, సుతార్ మధ్య పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. పేసర్లుగా మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ పేర్లు ఖరారయ్యాయి. బుమ్రా గైర్హాజరీలో సిరాజ్ పేస్ విభాగానికి నాయకత్వం వహిస్తాడు. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా నితీశ్ రెడ్డి బరిలోకి దిగడం కూడా ఖయంగా తెలుస్తోంది.బ్యాటింగ్ విషయానికొస్తే.. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. మేనేజ్మెంట్ ఒకవేళ మరో స్పెషలిస్ట్ బ్యాటర్తో బరిలోకి దిగాలని భావిస్తే.. నితీశ్ను పక్కన పెట్టి ధృవ్ జురెల్కు అవకాశం ఇవ్వవచ్చు. -
‘సొంతగడ్డపై టీమిండియా పటిష్టంగా కనిపించట్లేదు’
గత కొంతకాలంగా టెస్టుల్లో టీమిండియా స్థాయికి తగ్గట్లు రాణించడం లేదు. ముఖ్యంగా గౌతం గంభీర్ హెడ్కోచ్గా వచ్చిన తర్వాత భారత్కు ఘోర పరాజయాలు ఎదురయ్యాయి. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఏకంగా 3-0తో వైట్వాష్కు గురైంది టీమిండియా.ఇక ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని 3-2తో కోల్పోయింది. దాదాపుగా దశాబ్దకాలం తర్వాత టీమిండియా ఈ సిరీస్ కోల్పోవడం ఇదే తొలిసారి. అనంతరం ఇంగ్లండ్ పర్యటనలో 2-2తో డ్రా చేసుకోవడంతో జట్టుపై విమర్శల జడి కాస్త తగ్గింది.ఇదిలా ఉంటే.. చాన్నాళ్ల తర్వాత టీమిండియా టెస్టు బరిలో దిగనుంది. స్వదేశంలో అఫ్గనిస్తాన్తో ఏకైక టెస్టు ఆడనుంది. జూన్ 6 నుంచి ముల్లన్పూర్లో ఈ మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, ఈ మ్యాచ్ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగం కాదు.భారత్కు అత్యంత ముఖ్యంఅయినప్పటికీ ఈ మ్యాచ్ భారత్కు అత్యంత ముఖ్యమని అంటున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ సబా కరీం. జియోస్టార్తో మాట్లాడుతూ.. ‘‘ఈ టెస్టు మ్యాచ్ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో భాగం కాదు. అయినప్పటికీ ఈ మ్యాచ్ను తేలికగా తీసుకోకూడదు.టీమిండియాకు ఇది అతి ముఖ్యమైన మ్యాచ్. ఈ మ్యాచ్ ద్వారా తమ లోపాల్ని సరిచేసుకుని.. జట్టును పరీక్షించుకునే వీలు కలిగింది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఉన్న సమస్యలను గుర్తించి వాటిని అధిగమించాల్సి ఉంది.టెస్టు క్రికెట్పై భారత జట్టు మరింత దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా సొంతగడ్డపై గతంలో మాదిరి టీమిండియా పటిష్టంగా కనిపించడం లేదు’’ అని సబా కరీం అభిప్రాయపడ్డాడు.యువ ఆటగాళ్లను పరీక్షించే అవకాశంఅదే విధంగా.. ‘‘అఫ్గన్తో టెస్టు రూపంలో యువ ఆటగాళ్లను కూడా పరీక్షించే అవకాశం వచ్చింది. కొత్త కొత్త కాంబినేషన్లు ప్రయత్నించండి. ఒకవేళ వాళ్లు బాగా ఆడితే తదుపరి సిరీస్లకు కూడా ఎంపిక చేయండిజఇది ఇప్పటికప్పుడు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. అయితే, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొన్నిసార్లు ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. ఇది గెలుపోటముల గురించి ఆలోచించే సమయం కాదు. భవిష్యత్తును తప్పక దృష్టిలో పెట్టుకోండి’’ అని సబా కరీం సెలక్టర్లకు సూచించాడు.అఫ్గనిస్తాన్తో ఏకైక టెస్టుకు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషభ్ పంత్, దేవ్దత్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, ధ్రువ్ జురెల్.చదవండి: కావ్యా మారన్పై SRH ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు -
అత్యుత్తమ టెస్టు జట్టు ఇదే.. జైసూకు దక్కని చోటు!
సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా అంతర్జాతీయ క్రికెట్ బరిలో దిగేందుకు సిద్ధమైంది. దాదాపు రెండు నెలల పాటు ఐపీఎల్-2026 టోర్నీతో బిజీగా గడిపిన భారత ఆటగాళ్లు.. జూన్ 6 నుంచి జాతీయ జట్టు తరఫున విధుల్లో చేరనున్నారు.స్వదేశంలో అఫ్గనిస్తాన్తో ఏకైక టెస్టు ఆడే క్రమంలో ముల్లన్పూర్లో ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టిన ప్లేయర్లు.. నెట్స్లో చెమటోడుస్తున్నారు. శుబ్మన్ గిల్ కెప్టెన్సీలో భారత్ అఫ్గన్తో టెస్టుతో పాటు.. మూడు వన్డేలు ఆడనుంది.ప్రస్తుత అత్యుత్తమ జట్టు ఇదేఇలాంటి తరుణంలో టీమిండియా మాజీ కోచ్ సంజయ్ బంగర్ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ జట్టు ఇదేనంటూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇందులో నలుగురు భారత క్రికెటర్లకు మాత్రమే చోటు దక్కింది.తన జట్టులో కేఎల్ రాహుల్కు ఓపెనర్గా స్థానమిచ్చిన సంజయ్ బంగర్.. యశస్వి జైస్వాల్ను మాత్రం విస్మరించాడు. అతడికి బదులు ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రవిస్ హెడ్ను రాహుల్కు జోడీగా ఎంపిక చేశాడు.ఆసీస్, ఇంగ్లండ్ దిగ్గజాలకు చోటుకాగా గతేడాది జైసూ ఏకంగా మూడు సెంచరీల సాయంతో 700కు పైగా పరుగులు చేశాడు. మరోవైపు.. హెడ్ 817, రాహుల్ 813 పరుగులు సాధించారు. ఇక వన్డౌన్లో ఇంగ్లండ్ లెజెండ్ జో రూట్ను ఎంపిక చేసిన సంజయ్ బంగర్.. నాలుగో స్థానానికి టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ను ఎంచుకున్నాడు. ఐదో స్థానంలో ఆసీస్ దిగ్గజం స్టీవ్ స్మిత్కు చోటు ఇచ్చాడు.గతేడాది రూట్ 805 పరుగులతో సత్తా చాటగా.. స్మిత్ 651 రన్స్ రాబట్టాడు. వీరిద్దరి కంటే మెరుగ్గా గిల్.. ఏకంగా 983 పరుగులతో దుమ్ములేపాడు. ఇక తన జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్గా బంగర్.. టీమిండియా స్టార్ రిషభ్ పంత్కు స్థానమిచ్చాడు. ఇక ఏడో స్థానానికి ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ను ఎంపిక చేశాడు.పేస్ దళంలో ఎవరంటేఅదే విధంగా స్పిన్నర్ల కోటాలో సౌతాఫ్రికా లెఫ్టార్మ్ బౌలర్ కేశవ్ మహరాజ్ను బంగర్ ఎంచుకున్నాడు. గతేడాది అతడు ఆరు మ్యాచ్లలో కలిపి ఏకంగా 25 వికెట్లు పడగొట్టాడు. పేస్ దళంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్లతో పాటు టీమిండియా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు బంగర్ చోటిచ్చాడు.ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ కంబైన్డ్ టెస్టు ప్లేయింగ్ ఎలెవన్ (సంజయ్ బంగర్)కేఎల్ రాహుల్, ట్రవిస్ హెడ్, జో రూట్, శుబ్మన్ గిల్, స్టీవ్ స్మిత్, రిషభ్ పంత్, బెన్ స్టోక్స్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, కేశవ్ మహరాజ్, జస్ప్రీత్ బుమ్రా.చదవండి: కావ్యా మారన్పై SRH ప్లేయర్ సంచలన ఆరోపణలు! -
ఆఫ్ఘన్ సిరీస్కు విరాట్ ప్రత్యామ్నాయం ఇతడే..!
త్వరలో (జూన్ 13) స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే 3 మ్యాచ్ల వన్డే సిరీస్ నుంచి టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయం కారణంగా తప్పుకున్న విషయం తెలిసిందే. విరాట్ తాజాగా ముగిసిన ఐపీఎల్ 2026లో హ్యామ్ స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు. ఈ గాయం విషయమై వైద్యులను సంప్రదించగా.. రెండు వారాల విశ్రాంతిని సూచించారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ ప్రకటించాడు.ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్ సిరీస్కు విరాట్ ప్రత్యామ్నాం ఎవరనే చర్చ పొద్దున్నుంచి నడుస్తుంది. ఈ విషయమై ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నా.. బీసీసీఐ ఓ వ్యక్తిని ఫైనల్ చేసిందని సమాచారం. విరాట్ రీప్లేస్మెంట్ కోసం తిలక్ వర్మ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ పోటీపడినప్పటికీ.. సెలెక్టర్లు రుతురాజ్ గైక్వాడ్వైపు మొగ్గుచూపారని తెలుస్తోంది.ఇప్పటికే ఇండియా-ఏ జట్టులో చోటు దక్కించుకున్న గైక్వాడ్.. త్వరలో మరోసారి భారత వన్డే జట్టు తరఫున బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. దక్షిణాఫ్రికాతో జరిగిన తన చివరి వన్డే సిరీస్లో గైక్వాడ్ అద్భుతంగా రాణించాడు. మూడు మ్యాచ్ల్లో 113 పరుగులు చేయడంతో పాటు రెండో వన్డేలో శతకం (105) నమోదు చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొనే సెలెక్టర్లు తిలక్, పడిక్కల్, పాటిదార్ను కాదని రుతురాజ్వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. -
బంగ్లాదేశ్ జట్టుకు భారీ షాక్
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు పేస్ బౌలింగ్ కోచ్, ఆసీస్ మాజీ స్పీడ్స్టర్ షాన్ టైట్ తన పదవికి రాజీనామా చేసినట్లు ధృవీకరించాడు. 2025 మేలో బాధ్యతలు చేపట్టిన టైట్, 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఒప్పందం ఉన్నప్పటికీ మధ్యలోనే తప్పుకోవడం చర్చనీయాంశమైంది. టైట్ శిక్షణలో యువ పేసర్ నహిద్ రాణా విశేషంగా రాణించాడు. అతడి వేగం, ప్రదర్శన మెరుగుపడటంలో టైట్ పాత్ర కీలకమని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.టైట్ కీలక సమయంలో బంగ్లాదేశ్ జట్టును దెబ్బేశాడు. జూన్ 9 నుంచి 21 వరకు ఆస్ట్రేలియా జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం బంగ్లాదేశ్ పర్యటించనుంది. ఈ సిరీస్కు కొద్ది రోజుల ముందు టైట్ హ్యాండ్ ఇవ్వడం బంగ్లాదేశ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బగా పరిగణించాలి. ఈ సమయంలో బంగ్లా పేసర్లకు టైట్ శిక్షణ (ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేసేందుకు) చాలా ముఖ్యం. అలాంటిది కారణం ఏంటో చెప్పకుండా టైట్ అర్దంతరంగా బంగ్లా జట్టుకు హ్యాండ్ ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తుంది. టైట్ స్థానంలో మాజీ బంగ్లా పేసర్ తల్హా జుబైర్ను తాత్కాలిక పేస్ బౌలింగ్ కోచ్గా నియమించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.కాగా, 3 మ్యాచ్ల వన్డే, 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్లో పర్యటించనుంది. జూన్ 9 నుంచి మొదలుకానున్న ఈ పర్యటనలో తొలుత వన్డేలు, ఆతర్వాత టీ20లు జరుగనున్నాయి. వన్డేలు జూన్ 9, 11, 14 తేదీల్లో ఢాకాలోని షేరే బంగ్లా స్టేడియంలో జరుగనుండగా.. మూడు టీ20లు జూన్ 17, 19, 21 తేదీల్లో చట్టోగ్రామ్లో జరుగనున్నాయి.ఈ సిరీస్ల కోసం వేర్వేరు ఆస్ట్రేలియా జట్లను ఇదివరకే ప్రకటించగా.. తొలి రెండు వన్డేల కోసం బంగ్లాదేశ్ జట్టును నిన్ననే ప్రకటించారు.ఆస్ట్రేలియా వన్డే జట్టు..మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ క్యారీ, కూపర్ కానలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కునెమాన్, మార్నస్ లాబుషేన్, మాథ్యూ రెన్షా, తన్వీర్ సంఘా, లియామ్ స్కాట్, ఆడమ్ జంపాఆస్ట్రేలియా టీ20 జట్టు..మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కానలీ, టిమ్ డేవిడ్, జోయెల్ డేవిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మాథ్యూ కుహ్నెమాన్, రిలే మెరెడిత్, జోష్ ఫిలిప్, మాథ్యూ రెన్షా, ఆడమ్ జంపాతొలి రెండు వన్డేలకు బంగ్లాదేశ్ జట్టు..మెహిది హసన్ మిరాజ్ (కెప్టెన్), సౌమ్య సర్కార్, సైఫ్ హసన్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, లిట్టన్ దాస్, మొసద్దెక్ హొస్సేన్, నూరుల్ హసన్ సోహన్, రిషద్ హుస్సేన్, తన్వీర్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, షొరీఫుల్ ఇస్లాం, నహిద్ రాణా -
కావ్యా మారన్పై SRH ప్లేయర్ సంచలన ఆరోపణలు!
ఐపీఎల్-2026లో సన్రైజర్స్ హైదరాబాద్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఆరంభ మ్యాచ్లకు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరం కాగా.. దేశీ స్టార్ ఇషాన్ కిషన్ జట్టును ముందుకు నడిపించాడు. అతడి సారథ్యంలో జట్టు ఏడింట నాలుగు మ్యాచ్లు గెలిచింది.ఇక కమిన్స్ తిరిగి వచ్చిన తర్వాత కూడా సన్రైజర్స్ హవా కొనసాగింది. మొత్తంగా ఈ సీజన్లో లీగ్ దశలో పద్నాలుగు మ్యాచ్లకు గానూ హైదరాబాద్ జట్టు తొమ్మిది గెలిచి.. 18 పాయింట్లతో పట్టికలో టాప్-3లో నిలిచింది. తద్వారా ప్లే ఆఫ్స్నకు అర్హత సాధించింది.ఎలిమినేటర్ మ్యాచ్లో ఓటమిఅయితే, అనూహ్య రీతిలో ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓడి.. సన్రైజర్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విదేశీ ఆటగాళ్లు ఇంటిబాటపట్టారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ స్టార్ లియామ్ లివింగ్స్టోన్ సన్రైజర్స్ యాజమాన్యాన్ని (కావ్యా మారన్) ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేశాడు.తనకు తుదిజట్టులో చోటు దక్కకపోవడానికి కావ్యా మారన్ కారణమని పరోక్షంగా లివింగ్స్టోన్ వ్యాఖ్యానించాడు. స్టిక్ టు క్రికెట్ పాడ్కాస్ట్తో మాట్లాడుతూ.. ‘‘ముంబై ఇండియన్స్కి అత్యవసరమైన ఓ ఆటగాడిని మా జట్టు కొనుగోలు చేసింది.అతడిని అమితంగా ప్రేమిస్తారువేలం సమయంలో మా యాజమాన్యం పర్సులో బోలెడు డబ్బు ఉంది. కాబట్టి అతడిని సొంతం చేసుకోగలిగింది. మా యజమానులకు అతడంటే చాలా చాలా ఇష్టం. అతడిని అమితంగా ప్రేమిస్తారు. అందుకే జట్టులోకి తీసుకున్నారు.మా కోచ్ డాన్ (డానియల్ వెటోరి) స్వయంగా నాతో ఈ మాట చెప్పాడు. అప్పుడే నాకో విషయం అర్థమైంది. ఎవరో ఒకరు గాయపడితే తప్ప నాకు తుదిజట్టులో చోటు దక్కదని తెలిసింది’’ అని లివింగ్స్టోన్ పేర్కొన్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో లివింగ్స్టోన్ ప్రస్తావించిన ఆటగాడు ఎవరా? అని నెట్టింట చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో చాలా మంది సలీల్ అరోరా పేరును తెరమీదకు తెస్తున్నారు.ఆ ఆటగాడు ఎవరు?పంజాబ్కు చెందిన 23 ఏళ్ల సలీల్ అరోరా వికెట్ కీపర్ బ్యాటర్. ఐపీఎల్-2026 మినీ వేలంలో సన్రైజర్స్- ముంబై ఇండియన్స్ అతడి కోసం పోటీ పడ్డాయి. ఈ క్రమంలో ఆఖరికి రూ. 1.5 కోట్లకు సన్రైజర్స్ సలీల్ను సొంతం చేసుకుంది.సీజన్ ఆరంభ మ్యాచ్లో భాగంగా ఆర్సీబీతో పోరు సందర్భంగా సలీల్ అరోరా సన్రైజర్స్ తరఫున అరంగేట్రం చేశాడు. ఆరో స్థానంలో బరిలోకి దిగి 9 పరుగులకే నిష్క్రమించాడు. సీజన్లో మొత్తంగా పదకొండు ఇన్నింగ్స్ ఆడి 156 పరుగులు చేశాడు.ఇదిలా ఉంటే.. గతేడాది ఆర్సీబీ తరఫున ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఎనిమిది ఇన్నింగ్స్ ఆడి కేవలం 112 పరుగులే చేయడంతో పాటు రెండు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో ఆర్సీబీ అతడిని వదిలేయగా.. సన్రైజర్స్ ఊహించని రీతిలో రూ. 13 కోట్ల భారీ ధరకు లివింగ్స్టోన్ను కొనుగోలు చేసింది. కానీ ఈ సీజన్లో కేవలం రెండు మ్యాచ్లే ఆడించగా.. అతడు 15 పరుగులు చేశాడు. బౌలింగ్ చేసే అవకాశమే రాలేదు. Liam Livingstone reveals SRH owners interefered in team selection"We bought a player Mumbai really wanted. We had more money, so we got him. The owners loved him, so he was locked in. Dan told me that, and I knew I wasn't getting a chance unless someone got injured."Who is… pic.twitter.com/jvoyzgTgGa— Brutal Truth (@sarkarstix) June 3, 2026చదవండి: భారత టీ20 జట్టు ఇదే.. వైభవ్, భువీకి చోటు! -
ప్రతి జట్టులో నలుగురు ఆఫ్ఘన్ ప్లేయర్లు తప్పనిసరి..!
యూఏఈ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ILT20) సీజన్-5కు ముందు నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఫ్రాంచైజీ తమ జట్టులో కనీసం నలుగురు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లను, ఓ ఐర్లాండ్ ఆటగాడిని తప్పనిసరిగా చేర్చుకోవాలని నియమం విధించారు. ఈ ఐదుగురు ఆటగాళ్లు జట్టులో ఉండాల్సిన కనీస 11 మంది ఫుల్ మెంబర్ దేశాల ఆటగాళ్ల కోటాలో (ఓవర్సీస్) భాగంగా పరిగణించబడతారు. ఈ ఏడాది నవంబర్ 22 నుంచి డిసెంబర్ 20 వరకు జరిగే సీజన్-5 కోసం విడుదల చేసిన నిబంధనల ప్రకారం.. ప్రతి జట్టులో 21 నుంచి 23 మంది ఆటగాళ్లు ఉండాలి. అందులో కనీసం 11 మంది ఫుల్ మెంబర్ దేశాల ఆటగాళ్లు, నలుగురు యూఏఈ ఆటగాళ్లు (ఒక క్యాప్డ్, ఒక అండర్-23 తప్పనిసరి), ఇద్దరు జీసీసీ దేశాల ఆటగాళ్లు (ఒకరు సౌదీ అరేబియా, మరొకరు కువైట్ నుంచి), అలాగే మరో అసోసియేట్ దేశానికి చెందిన ఆటగాడు ఉండాలి.ఆఫ్ఘనిస్తాన్కు చెందిన నలుగురు, ఐర్లాండ్కు చెందిన ఒకరు, యూఏఈకి చెందిన నలుగురు, జీసీసీ దేశాలకు చెందిన ఇద్దరు ఆటగాళ్లను "మ్యాండేటరీ ప్లేయర్స్"గా నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ నిబంధన వెనుక అసలు కారణాన్ని ILT20 వెల్లడించకపోయినా.. ఇది ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు, ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు, క్రికెట్ ఐర్లాండ్ మధ్య ఉన్న అవగాహన ఒప్పందానికి సంబంధించినదిగా భావిస్తున్నారు.అదే సమయంలో ప్రతి ఫ్రాంచైజీకి గరిష్ఠ వేతన పరిమితిని 20 లక్షల అమెరికన్ డాలర్లుగా నిర్ణయించారు. కనీసం 15 లక్షల డాలర్లు ఆటగాళ్లపై ఖర్చు చేయడం తప్పనిసరి. ఒక్కో ఆటగాడికి కనీస వేతనం 10 వేల డాలర్లు ఉండగా, గరిష్ఠ వేతనానికి మాత్రం ఎలాంటి పరిమితి లేదు. అదనంగా ఒక ‘వైల్డ్కార్డ్ ప్లేయర్’ను జట్టులో చేర్చుకునే అవకాశం కూడా కల్పించారు.ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్, అబుదాబి నైట్రైడర్స్, డెజర్ట్ వైపర్స్, దుబాయ్ క్యాపిటల్స్, షార్జా వారియర్స్, గల్ఫ్ జెయింట్స్ ఈ టోర్నీలో పాల్గొనే ఆరు జట్లు. గత సీజన్లో డెజర్ట్ వైపర్స్ ఛాంపియన్గా నిలిచింది. -
విరాట్ కోహ్లి అవుట్.. టీమిండియాలోకి హైదరాబాదీ!
అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాకు విరాట్ కోహ్లి రూపంలో భారీ షాక్ తగిలింది. ఈ సిరీస్కు తొడ కండరాల గాయం కారణంగా కోహ్లి దూరమయ్యాడు. ఐపీఎల్-2026 ఫైనల్లో కూడా గాయంతో బాధపడుతూనే ఆడాడు. అయితే గాయం తీవ్రత ఎక్కువ కావడంతో అఫ్గాన్ సిరీస్ నుంచి తప్పుకోవాలని విరాట్ నిర్ణయించుకున్నాడు. దీంతో కోహ్లి స్ధానాన్ని భర్తీ చేసే పనిలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ పడింది.ఈ క్రమంలో విరాట్ స్ధానంలో జట్టులోకి వచ్చే అవకాశమున్న ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.తిలక్ వర్మహైదరాబాదీ తిలక్ వర్మ ప్రస్తుత రేసులో అందరికంటే ముందున్నాడు. టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యునిగా కొనసాగుతున్న తిలక్ను.. ఇప్పుడు వన్డే జట్టులోకి తీసుకునే సూచనలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్కు మిడిలార్డర్లో రాణించే సత్తా ఉంది. అతడు ఇప్పటివరకు భారత్ తరపున కేవలం 5 వన్డేలు మాత్రమే ఆడాడు. కాగా సెలక్టర్లు ఇటీవలే తిలక్ను శ్రీలంక టూర్ కోసం భారత-ఎ జట్టు కెప్టెన్ ఎంపిక చేశారు. ఒకవేళ తిలక్ను వన్డే జట్టులోకి తీసుకోవాలని భావిస్తే ఇండియా-ఎ టీమ్ కెప్టెన్గా మరొకరని నియమించే అవకాశముంది.దేవదత్ పడిక్కల్కర్ణాటక ఆటగాడు దేవదత్ పడిక్కల్ కూడా సెలక్టర్ల రాడార్లో ఉన్నట్లు తెలుస్తోంది. అఫ్గానిస్తాన్తో ఏకైక టెస్టుకు ఎంపిక చేసిన భారత జట్టులో పడిక్కల్ భాగంగా ఉన్నాడు. ఇప్పుడు వన్డే జట్టులోకి తీసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. పడిక్కల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్-2026లో ఆర్సీబీ తరపున పడిక్కల్ దుమ్ములేపాడు. టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం తన ప్రత్యామ్నాయ జట్టులో పడిక్కల్ను నెం.3 స్థానానికి ఎంపిక చేయడం విశేషం.రజత్ పాటిదార్ఇక ఆర్సీబీకి వరుసగా రెండో టైటిల్ను అందించిన కెప్టెన్ పాటిదార్ను జట్టులోకి తీసుకోవడానికి ఇదొక మంచి అవకాశమని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నాడు. పాటిదార్ కూడా టాపర్డర్తో పాటు మిడిలార్డర్లో కూడా రాణించగలడు. అతడు మంచి ఫామ్లో కూడా ఉన్నాడు. వీరితో పాటు రుతురాజ్ గైక్వాడ్ రేసులో ఉన్నాడు. కానీ రుతురాజ్ భారత-ఎ జట్టు వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. వీరిలో ఎవరు వైపు సెలక్టర్లు మొగ్గు చూపుతారో వేచి చూడాలి. -
వన్డే సిరీస్కు అఫ్గనిస్తాన్ జట్టు ప్రకటన
ముక్కోణపు వన్డే సిరీస్కు అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) తమ జట్టును ప్రకటించింది. శ్రీలంక- ‘ఎ’, భారత్- ‘ఎ’ జట్లతో తలపడే అఫ్గన్- ‘ఎ’ జట్టు వివరాలను గురువారం వెల్లడించింది. ఈ జట్టుకు ఇమ్రాన్ మిర్ కెప్టెన్గా వ్యవహరిస్తాడని ఏసీబీ తెలిపింది. వికెట్ కీపర్ల కోటాలో నూర్ రహ్మాన్తో పాటు మొహమ్మద్ ఇషాక్లకు సెలక్టర్లు చోటిచ్చారు. బ్యాటింగ్ విభాగంలో హసన్ ఐసాఖిల్, ఖలీద్ తనీవాల్, ఐజాజ్ అహ్మద్జాయ్, బహీర్ షా మెహబూబ్, ఫైజల్ ఖాన్ షినోజదా స్థానం సంపాదించుకున్నారు.ఆల్రౌండర్ల జాబితాలో ఫర్మానుల్లా సూఫీ, షామ్స్ ఉర్ రహ్మాన్ ఎంపికయ్యారు. వీరు సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్లు కాగా.. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ ఖలీల్ గుర్బాజ్కు కూడా సెలక్టర్లు ఈ జట్టులో చోటిచ్చారు.ఇక స్పిన్ దళంలో రిస్ట్ స్పిన్నర్ జహీర్ ఖాన్ పక్టీన్ ఒక్కడే ఉండగా.. పేస్ విభాగంలో మహ్మద్ ఇబ్రహీం, అబ్దుల్లా అహ్మద్జాయ్, ఫరీదూన్ దావూద్జాయ్ సేవలు అందించనున్నారు. కాగా జూన్ 9 నుంచి 21 వరకు శ్రీలంక వేదికగా ఈ ముక్కోణపు వన్డే సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్లో భారత్-‘ఎ’ జట్టుకు హైదరాబాదీ తిలక్ వర్మ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అదే విధంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. దంబుల్లా వేదికగా భారత్- శ్రీలంక- అఫ్గన్ ‘ఎ’ జట్ల మధ్య మ్యాచ్లు జరుగనున్నాయి.శ్రీలంక- భారత్లతో ముక్కోణపు వన్డే సిరీస్కు అఫ్గన్-‘ఎ’ జట్టు ఇదేఇమ్రాన్ మిర్ (కెప్టెన్), నూర్ రహ్మాన్, మొహమ్మద్ ఇషాక్, హసన్ ఐసాఖిల్, ఖలీద్ తనీవాల్, ఐజాజ్ అహ్మద్జాయ్, బహీర్ షా మెహబూబ్, ఫైజల్ ఖాన్ షినోజదా, ఫర్మానుల్లా సూఫీ, షామ్స్ ఉర్ రహ్మాన్, జహీర్ ఖాన్ పక్టీన్, ఫరీదూన్ దావూద్జాయ్, మహ్మద్ ఇబ్రహీం, అబ్దుల్లా అహ్మద్జాయ్.సిరీస్ షెడ్యూల్ ఇదేజూన్ 9: భారత్ వర్సెస్ శ్రీలంకజూన్ 11: భారత్ వర్సెస్ అఫ్గన్జూన్ 13: అఫ్గన్ వర్సెస్ శ్రీలంకజూన్ 15: భారత్ వర్సెస్ శ్రీలంకజూన్ 17: భారత్ వర్సెస్ అఫ్గన్జూన్ 19: అఫ్గన్ వర్సెస్ శ్రీలంకజూన్ 12: ఫైనల్. -
నరాలు తెగే ఉత్కంఠ.. ఒక్క పరుగు తేడాతో..
ముంబై టీ20 లీగ్లో బుధవారం రెండు ఆసక్తికర మ్యాచ్లు జరిగాయి. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లు ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి. వాంఖడే వేదికగా మధ్యాహ్నం మ్యాచ్లో బాంద్రా బ్లాస్టర్స్- నార్త్ ముంబై పాంథర్స్ జట్లు తలపడ్డాయి.‘సూపర్’ విజయంఈ మ్యాచ్లో బాంద్రా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేయగా.. నార్త్ ముంబై సైతం 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి సరిగ్గా 228 పరుగులే చేసింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించగా.. నార్త్ ముంబై గెలుపు జెండా ఎగురవేసింది.172 పరుగులుఇక సాయంత్రం మ్యాచ్లో ఆకాశ్ టైగర్స్- ఈగల్ థానే స్ట్రైకర్స్ పోటీపడ్డాయి. వాంఖడే మైదానంలో టాస్ గెలిచిన ఈగల్ థానే కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఆకాశ్ టైగర్స్... 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.ఓపెనర్లలో జై గోకుల్ బిస్తా అర్ధ శతకం (56)తో రాణించగా.. కెప్టెన్ షామ్స్ ములానీ 22 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మిగిలిన వారిలో సఖామ్ పరాషర్, సౌరభ్ సింగ్ చెరో 30 పరుగులు చేశారు. ఈగల్ ఠానే బౌలర్లలో ఓంకార్ తర్మాలే మూడు వికెట్లతో సత్తా చాటగా.. అథర్వ ఆంకోలేకర్, సాయిరాజ్ పాటిల్, కార్తిక్ మిశ్రా, అమర్త్య రాజే తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఈగల్ థానేకు ఆరంభంలోనే షాకులు తగిలాయి. ఓపెనర్ శశ్వత్ జగ్తాప్ 2 పరుగులకే నిష్క్రమించగా.. వన్డౌన్ బ్యాటర్ ఏక్నాథ్ కేర్కార్ 3 పరుగులు చేసి అవుటయ్యాడు. మరో ఓపెనర్ సుమేర్ జవేరి 26 పరుగులు చేయగా.. సాయిరాజ్ పాటిల్ 39, వినయ్ కన్వార్ 24 పరుగులు చేసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు.మెరుపు ఇన్నింగ్స్మిగిలిన వారిలో సిద్ధాంత్ సింగ్ (19 బంతుల్లో 37).. కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ (15 బంతుల్లో 25) మెరుపు ఇన్నింగ్స్ ఆడి విజయం దిశగా నడిపించారు. ఆఖరి ఓవర్ ఐదో బంతి నో బాల్ అయింది. అప్పటికి ఈగల్ థానే విజయానికి రెండు పరుగులు అవసరం కాగా.. ఓంకార్ థర్మాలే సింగిల్ తీశాడు.ఆఖరి బంతికి రనౌట్అయితే ఆఖరి బంతికి అమర్త్య రాజే రనౌట్ కావడంతో ఈగల్ థానే కథ ముగిసింది. ఆకాశ్ టైగర్స్ ఒక్క పరుగు తేడాతో గెలిచి సంబరాల్లో మునిగిపోయింది. ఇక మూడు వికెట్లతో చెలరేగి ఈగల్ థానే పతనాన్ని శాసించిన శశాంక్ అట్రాడేకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.కాగా జూన్ 1 నుంచి మొదలైన ముంబై టీ20 లీగ్లో నార్త్ ముంబై పాంథర్స్ రెండింట రెండు గెలిచి నాలుగు పాయింట్లతో టాప్లో ఉండగా.. ఆకాశ్ టైగర్స్కు రెండింట తొలి విజయం.చదవండి: సూర్యకుమార్కు భారీ షాక్! -
భారత టీ20 జట్టు ఇదే.. వైభవ్, భువనేశ్వర్కు చోటు!
ఐపీఎల్ 2026 సీజన్ దాదాపు రెండు నెలల పాటు అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజాను అందించింది. ఒకవైపు 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డులు సృష్టిస్తే, మరోవైపు సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన క్లాస్ ఏంటో చూపించాడు.అంతేకాకుండా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్, యువ ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ వంటి వారు కూడా అంచనాలకు మించి రాణించారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2026 ప్రదర్శనల ఆధారంగా ప్రత్యామ్నాయ భారత టీ20 జట్టును దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎంపిక చేశాడు. ఈ 15 మంది సభ్యుల జట్టులో ఆర్సీబీ నుంచి అత్యధిక నలుగురు ఆటగాళ్లకు అశ్విన్ చోటిచ్చాడు. కానీ తన మాజీ జట్టు సీఎస్కే నుంచి మాత్రం అతడు కేవలం కేవలం ఒకే ఒక్కరికే అవకాశం ఇచ్చాడు. ఆర్సీబీ నుంచి ఛాన్స్ లభించిన వారిలో దేవ్దత్త్ పడిక్కల్, కెప్టెన్ రజత్ పాటిదార్, భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యా ఉన్నారు. విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో అతడిని అశ్విన్ పరిగణలోకి తీసుకోలేదు. ఇక ఈ జట్టులో ఓపెనర్లగా రాజస్తాన్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ, ఢిల్లీ సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ను అశ్విన్ ఎంపిక చేశాడు. మిడిలార్డర్లో పడిక్కల్, శ్రేయస్ అయ్యర్, రజత్ పాటిదార్ వంటి స్టార్లకు అవకాశమిచ్చాడు. ఆల్రౌండర్ల కోటాలో నితీశ్ కుమార్ రెడ్డి, కృనాల్ పాండ్యాకు ఛాన్స్ దక్కింది. ఫినిషర్గా ఢిల్లీ ఆటగాడు అశుతోష్ శర్మను ఈ స్పిన్ మాంత్రికుడు సెలక్ట్ చేశాడు. అయితే అశ్విన్ తన ఎంచుకున్న జట్టులో స్పిన్నర్లగా శివాంగ్ కుమార్, హర్ష్దూబేలకు అవకాశమివ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే అశ్విన్ తన ఎంచుకున్న జట్టులో స్పిన్నర్లగా శివాంగ్ కుమార్, హర్ష్దూబేలకు అవకాశమివ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది. వీరిద్దరూ ఈ ఏడాది సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇక రాజస్తాన్ నుంచి వైభవ్తో పాటు ధ్రువ్ జురెల్ కూడా ఈ జట్టులో ఉన్నాడు. ఫాస్ట్ బౌలర్ల కోటాలో భువనేశ్వర్ కుమార్తో పాటు మహ్మద్ షమీ, అన్షుల్ కాంబోజ్లకు అశ్విన్ ఛాన్స్ ఇచ్చాడు.అశ్విన్ ఎంపిక చేసిన ప్రత్యామ్నాయ భారత టీ20 జట్టు ఇదేవైభవ్ సూర్యవంశీ, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శ్రేయాస్ అయ్యర్, రజత్ పాటిదార్, నితీష్ కుమార్ రెడ్డి, అశుతోష్ శర్మ, కృనాల్ పాండ్యా, శివంగ్ కుమార్, భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్, అన్షుల్ కాంబోజ్, హర్ష్ దూబే, మహమ్మద్ షమీ, ధృవ్ జురెల్చదవండి: ఆ తప్పిదమే పంజాబ్ కింగ్స్ కొంపముంచింది: సచిన్ -
టీమిండియాకు బిగ్ షాక్!
అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి హ్యామ్స్ట్రింగ్ గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. కాగా అఫ్గాన్తో మూడు వన్డేల సిరీస్ కోసం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు జూన్ 9న ముల్లాన్పూర్లో భారత జట్టుతో కలవనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కానీ ఇప్పుడు తొడ కండరాల గాయం బారిన పడడంతో విరాట్ సిరీస్ మొత్తానికే దూరం కావాల్సి వచ్చింది. వన్డే ప్రపంచకప్-2027 సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న ఈ వైట్బాల్ సిరీస్కు కోహ్లి దూరం కావడం భారత్కు నిజంగా గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి.విరాట్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్-2026లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడి ఆర్సీబీకి వరుసగా రెండో టైటిల్ను అందించాడు. ఐపీఎల్లో దుమ్ములేపిన విరాట్ను భారత జెర్సీలో చూడాలని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. అతడు మళ్లీ జూలైలో ఇంగ్లండ్తో జరగనున్న వన్డే సిరీస్లో బరిలోకి దిగననున్నాడు.మరోవైపు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్లో ఆడటంపై కూడా ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. రోహిత్ కూడా ప్రస్తుతం తొడ కండరాల గాయంతోనే బాధపడుతున్నాడు. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు రోహిత్ తన ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంది. ఫిట్నెస్ పరీక్షలలో అతడు పాసైతేనే జట్టులో కొనసాగనున్నాడు. లేదంటే అతడి స్ధానాన్ని యశస్వి జైశ్వాల్తో భర్తీ చేయనున్నారు. ఇక అఫ్గాన్-భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్ జూన్ 13 న ధర్మశాల వేదికగా ప్రారంభం కానుంది.అఫ్గానిస్తాన్తో వన్డేలకు భారత జట్టుశుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్, కుల్దీప్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, హార్దిక్ పాండ్యాచదవండి: ఆ తప్పిదమే పంజాబ్ కింగ్స్ కొంపముంచింది: సచిన్ -
టీమిండియా టీ20 కెప్టెన్సీలో ఊహించని ట్విస్ట్!
టీమిండియా టీ20 కెప్టెన్సీ మార్పు విషయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తొలుత సూర్యకుమార్ యాదవ్ స్ధానంలో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ను సారథిగా నియమిస్తారని ప్రచారం జరిగింది. కానీ అందుకు హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ ఒప్పుకోలేదని, అతడికి బదులుగా సంజూ శాంసన్ పేరును సూచించాడని వార్తలు వచ్చాయి.అయితే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ మాత్రం అందుకు విముఖత చూపినట్లు తెలుస్తోంది. లాంగ్ టర్మ్ కెప్టెన్గా శాంసన్ను ఇప్పుడే నమ్మడం తొందరపాటు అవుతుందని గంభీర్కు అగార్కర్ తెలియజేసినట్లు సమాచారం. దీంతో తన మనసు మార్చుకున్న గంభీర్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఎంపికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.మరోవైపు భారత టీ20 జట్టు కెప్టెన్ మాత్రమే కాదు వైస్ కెప్టెన్ కూడా మారబోతున్నాడు. ఇప్పటివరకు డిప్యూటీగా ఉన్న అక్షర్ పటేల్ స్థానంలో హైదరాబాదీ తిలక్ వర్మను కొత్త వైస్ కెప్టెన్గా నియమించబోతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడతున్నాయి. గురువారం జరగనున్నబీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం అనంతరం దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.ఈ నెలఖారులో ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా కొత్త కెప్టెన్తో వెళ్లనుంది. సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గానే కాకుండా పూర్తిగా జట్టు నుంచే తప్పించే యోచనలో బీసీసీఐ ఉంది. సూర్య టీ20 ప్రపంచకప్ను అందించినప్పటికి, అతడి పేలవ ఫామ్ కారణంగానే వేటు వేసేందుకు బోర్డు సిద్దమైంది. శ్రేయస్ అయ్యర్ విషయానికి వస్తే.. చివరగా 2023లో భారత తరపున టీ20 మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి అతడు కేవలం వన్డేలకు మాత్రం పరిమితమయ్యాడు. దీంతో అయ్యర్ భారత టీ20 జట్టులోకి తిరిగి రావడం కష్టమని అంతా భావించారు. కానీ ఇప్పుడు ఏకంగా కెప్టెన్సీ రేసులో ముందు వరుసలో ఉన్నాడు. శ్రేయస్కు అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. ప్రస్తుతం అతడు ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా ఉన్నాడు. దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టును నడిపించిన అనుభవం కూడా ఉంది.చదవండి: ఆ తప్పిదమే పంజాబ్ కింగ్స్ కొంపముంచింది: సచిన్ -
ఆ తప్పిదమే పంజాబ్ కింగ్స్ కొంపముంచింది: సచిన్
ఐపీఎల్-2026 విజేతగా రజత్ పాటిదార్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను చిత్తు చేసిన ఆర్సీబీ.. వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్ను ముద్దాడింది. రన్నరప్గా గుజరాత్ టైటాన్స్ నిలవగా, రాజస్తాన్ రాయల్స్ క్వాలిఫయర్-2, ఎస్ఆర్హెచ్ ఎలిమినేటర్లో ఓడిపోయాయి.అయితే ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ ప్రయాణం ఎవరూ ఊహించని విధంగా ముగిసింది. మొదటి ఏడు మ్యాచ్లలో ఒక్క ఓటమి కూడా చూడని పంజాబ్.. ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్లలో దారుణ ఓటమిపాలై కనీసం ప్లే ఆఫ్స్కు చేరకుండా నిష్క్రమించింది. తమ చివరి లీగ్ మ్యాచ్లో గెలిచినా పంజాబ్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించలేకపోయింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్ధానంతో సరిపెట్టుకుంది. అయితే పంజాబ్ కింగ్స్ పతనానికి గల కారణాలను తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విశ్లేషించారు.పంజాబ్ కింగ్స్ ఈ ఏడాది సీజన్కు మంచి ఊపు తీసుకొచ్చింది. వారి క్రికెట్ చాలా చాలా పాజిటివ్గా, సాహసోపేతంగా, కొన్ని సార్లు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసేలా కొనసాగింది. ఇలాంటి సుదీర్ఘమైన టోర్నీల్లో 'మొమెంటం' కీలక పాత్ర పోషిస్తుంది. ఇంత వేగంగా సాగిపోయే టోర్నమెంట్లో ఆయా జట్లు కేవలం తమ 'ఆట విధానం' పైనే దృష్టి పెట్టాలి.అంతే తప్ప ఫలితాలు గురుంచి ఎక్కువగా ఆలోచించకూడదు. పంజాబ్ ఇప్పుడు అదే తప్పు చేసింది. ఫస్ట్ హాఫ్లో పంజాబ్ ఫలితాలను పట్టించుకోకుండా కేవలం తమ ఆటపై మాత్రమే ఫోకస్ చేసింది. అందుకే అద్భుతంగా రాణించింది. కానీ సెకెండ్ హాఫ్నకు వచ్చేసారికి పరిస్థితి తారుమారు అయిపోయింది. ఒత్తిడి పెరగడంతో పంజాబ్ జట్టు ఆట విధానాన్ని పక్కనబెట్టి.. కేవలం ఫలితాలపై దృష్టి పెట్టింది. అందుకే టోర్నీలో ముందుకు సాగలేకపోయింది సచిన్ 'రెడ్డిట్' పోస్ట్లో రాసుకొచ్చారు.చదవండి: సూర్యకుమార్కు భారీ షాక్.. టీమిండియా కెప్టెన్గా తెలుగోడు! -
వెస్టిండీస్ను చిత్తు చేసిన శ్రీలంక
వెస్టిండీస్ పర్యటనలో శ్రీలంక జట్టు శుభారంభం చేసింది. బుధవారం కింగ్స్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో విండీస్పై 41 పరుగుల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. ఈ గెలుపుతో లంక జట్టు మూడు వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ తొలుత శ్రీలంకను బ్యాటింగ్కు అహ్హనించాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన లంకేయులు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 303 పరుగుల భారీ స్కోరు సాధించారు. ఓపెనర్ పతుమ్ నిస్సాంక (79 పరుగులు, 103 బంతుల్లో), వికెట్ కీపర్ బ్యాటర్ కుసాల్ మెండిస్ (72 పరుగులు, 62 బంతుల్లో) హాఫ్ సెంచరీలతో సత్తాచాటగా.. చరిత్ అసలంక(45), జనిత్ లియాంగే(44) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. విండీస్ బౌలర్లలో జైడన్ సీల్స్, మాథ్యూ ఫోర్డ్, ఛేజ్ తలా రెండు వికెట్లు సాధించారు. 304 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్.. 49.2 ఓవర్లలో 262 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ షాయ్ హోప్ (56) , గ్రీవ్స్(45) రాణించగా, మిగిలిన బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. లంక పేసర్ దుష్మంత చమీర 4 వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు తీక్షణ రెండు, హసరంగ, అసలంక తలా వికెట్ సాధించారు. కుశాల్ మెండిస్కు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఇరు జట్లు రెండో వన్డే ఇదే వేదికలో ఆదివారం జరగనుంది.చదవండి: సూర్యకుమార్కు భారీ షాక్.. టీమిండియా కెప్టెన్గా తెలుగోడు! -
సూర్యకుమార్కు భారీ షాక్.. టీమిండియా కెప్టెన్గా తెలుగోడు!
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై వేటుకు రంగం సిద్దమైంది. జూన్, జూలైలో జరగనున్న ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకే ముందే సూర్యకుమార్ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. ఈ ముంబై ఆటగాడు సారథిగా భారత్కు టీ20 ప్రపంచకప్ను అందించినప్పటికి.. అతడి ఫామ్ మాత్రం దారుణంగా పడిపోయింది. ఒకప్పుడు టీ20 ప్రపంచ నంబర్ వన్గా కొనసాగిన సూర్య.. ఇప్పుడు హాఫ్ సెంచరీ మార్క్ను అందుకోవాడానికి కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్-2026లో అదే తీరును కనబరిచాడు. 13 ఇన్నింగ్స్లలో 270 పరుగులు మాత్రమే చేసి, 2017 తర్వాత సూర్యకుమార్ తన అత్యంత పేలవమైన ఐపీఎల్ సీజన్ను సూర్య చవిచూశాడు. ఈ క్రమంలోనే అతడి స్దానంలో మరొకరని సారథిగా నియమించాలని బోర్డు భావిస్తోంది. కెప్టెన్గానే కాకుండా బ్యాటర్గా కూడా అతడిని జట్టు నుంచి తప్పించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్లతో చర్చలు జరిపిన బీసీసీఐ.. త్వరలోనే కొత్త సారథి పేరును అధికారికంగా ప్రకటించనుంది."సెలక్షన్ కమిటీ, బీసీసీఐ, టీమ్ మేనేజ్మెంట్..హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో చర్చించి, ఇకపై టీ20ల్లో భారత జట్టు కొత్త కెప్టెన్తో ముందుకు వెళ్లాలని నిర్ణయించాయి. సూర్య కెప్టెన్సీలో భారత్ టీ20 ప్రపంచకప్ గెలిచినప్పటికి, అతడి ఫామ్, భవిష్యత్తు ప్రణాళికలు దృష్టిలో ఉంచుకుని బోర్డు కొత్త కెప్టెన్ను నియమించేందుకు సిద్దమైంది. రాబోయే పర్యటనలకు సూర్యకుమార్ను జట్టు సెలెక్షన్కు కూడా పరిశీలించడం లేదు. ఈ విషయాన్ని త్వరలోనే అతనికి స్పష్టం చేస్తాం" అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు 'ది ఇండియన్ ఎక్స్ప్రెస్'తో పేర్కొన్నారు.కాగా కెప్టెన్సీ రేసులో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లతో పాటు హైదరాబాదీ తిలక్ వర్మ పేరు కూడా వినిపిస్తోంది. తిలక్కు హైదరాబాద్ జట్టుకు కెప్టెన్గా పనిచేసిన అనుభవం ఉంది. అంతేకాకుండా శ్రీలంక పర్యటనలో భారత-ఎ జట్టు కెప్టెన్గా కూడా తిలక్ వ్యవహరించనున్నాడు. త్వరలోనే కొత్త కెప్టెన్ పేరును బీసీసీఐ ఖరారు చేయనుంది.చదవండి: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. బంగ్లాదేశ్ జట్టు ప్రకటన -
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. బంగ్లాదేశ్ జట్టు ప్రకటన
3 మ్యాచ్ల వన్డే, 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్లో పర్యటించనుంది. జూన్ 9 నుంచి మొదలుకానున్న ఈ పర్యటనలో తొలుత వన్డేలు, ఆతర్వాత టీ20లు జరుగనున్నాయి. వన్డే సిరీస్లోని తొలి 2 మ్యాచ్ల కోసం బంగ్లాదేశ్ జట్టును ఇవాళ (జూన్ 3) ప్రకటించారు.స్టార్ ఆల్రౌండర్ మొసద్దెక్ హొసేన్ దాదాపు నాలుగేళ్ల తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. 2022 ఆగస్టులో చివరిసారిగా వన్డే ఆడిన మొసద్దెక్, ప్రస్తుతం జరుగుతున్న ఢాకా ప్రీమియర్ లీగ్లో అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అబాహని లిమిటెడ్ తరఫున ఆడుతున్న అతడు ఆరు ఇన్నింగ్స్ల్లో 77.50 సగటుతో 310 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అలాగే ఏడు ఇన్నింగ్స్ల్లో 12 వికెట్లు కూడా పడగొట్టాడు.మొసద్దెక్తో పాటు నురుల్ హసన్ కూడా గ్యాప్ తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. లిట్టన్ దాస్, నజ్ముల్ హొసేన్ షాంటో, తౌహిద్ హృదోయ్, కెప్టెన్ మెహిది హసన్ మిరాజ్ తదితర బ్యాటర్లు జట్టులో కొనసాగుతున్నారు. బౌలింగ్ విభాగంలో ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, షొరిఫుల్ ఇస్లాం, నహిద్ రాణా వంటి పేసర్లు జట్టులో స్థానం తిరిగి పొందారు.ఈ సిరీస్లోని వన్డేలు జూన్ 9, 11, 14 తేదీల్లో ఢాకాలోని షేరే బంగ్లా స్టేడియంలో జరుగనున్నాయి. అనంతరం మూడు టీ20లు జూన్ 17, 19, 21 తేదీల్లో చట్టోగ్రామ్లో జరుగనున్నాయి.ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేలకు బంగ్లాదేశ్ జట్టు..మెహిది హసన్ మిరాజ్ (కెప్టెన్), సౌమ్య సర్కార్, సైఫ్ హసన్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, లిట్టన్ దాస్, మొసద్దెక్ హొస్సేన్, నూరుల్ హసన్ సోహన్, రిషద్ హుస్సేన్, తన్వీర్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, షొరీఫుల్ ఇస్లాం, నహిద్ రాణా -
ఉత్కంఠ పోరు.. 'రహానే' జట్టు సూపర్ విజయం
టీ20 ముంబై లీగ్ 2026లో ఇవాళ (జూన్ 3) ఓ ఆసక్తికర సమరం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన మ్యాచ్లో నార్త్ ముంబై పాంథర్స్, బాంద్రా బ్లాస్టర్స్ జట్లు తలపడగా.. అజింక్య రహానే నేతృత్వం వహిస్తున్న ముంబై పాంథర్స్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. నిర్ణీత ఓవర్లలో ఇరు జట్లు సమాన స్కోర్లు చేయగా.. సూపర్ ఓవర్లో ముంబై పాంథర్స్ పైచేయి సాధించింది.నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బాంద్రా బ్లాస్టర్స్.. కెప్టెన్ సువేద్ పార్కర్ (110) శతక్కొట్టుడుతో నిర్ణీత 20 ఓవర్లలో 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన పాంథర్స్ టీమ్.. బ్లాస్టర్స్కు ధీటుగా పోరాడి స్కోర్ను సమం చేసింది. 16 ఓవర్ల వరకు ఓటమి ఖాయమనుకున్న పాంథర్స్ అనూహ్యంగా పుంజుకొని చివరి 4 ఓవర్లలో బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి స్కోర్ను సమం చేసింది. వైభవ్ మాలి (32), రాహుల్ సావంత్ (10), తనుశ్ కోటియన్ (32 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా తనుశ్ చివరి ఓవర్లో బౌండరీ, సిక్సర్ సహా చివరి బంతికి రెండు పరుగులు సాధించి మ్యాచ్ టై కావడంలో కీలకపాత్ర పోషించాడు. అనంతరం సూపర్ ఓవర్లో వైభవ్ మాలి మరోసారి రెచ్చిపోవడంతో (2 సిక్సర్లు, ఫోర్) తొలుత బ్యాటింగ్ చేసిన పాంథర్స్ 6 బంతుల్లో 20 పరుగులు చేసింది. ఛేదనలో మోహిత్ అవస్థి అద్భుతంగా బౌలింగ్ చేయడంతో బ్లాస్టర్స్ జట్టు 7 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. కాగా, ఈ టోర్నీలో రహానే, శివమ్ దూబే, శ్రేయస్ అయ్యర్ లాంటి ఐపీఎల్ స్టార్లు పాల్గొంటున్న విషయం తెలిసిందే. -
ఐపీఎల్ 2026లో అత్యంత ప్రమాదకర పేస్ దళం ఏది..?
ఐపీఎల్ 2026లో బ్యాటర్ల హవా కొనసాగినా, పేస్ బౌలర్లు కూడా తమదైన ముద్ర వేశారు. ఈ సీజన్లో అత్యధిక 200+ స్కోర్లు నమోదైనా, కొన్ని జట్లు తమ బలమైన ఫాస్ట్ బౌలింగ్ దళంతో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాయి. సీజన్ మొత్తంలో ఏ జట్టుకు అత్యంత ప్రమాదకర పేస్ దళం ఉందో ఈ కంటెంట్లో చూద్దాం. చివరి నుంచి మొదలుపెడితే..కోల్కతా నైట్రైడర్స్ (2/10)ఈ సీజన్లో అత్యంత బలహీనమైన పేస్ అటాక్ కేకేఆర్ది అని చెప్పవచ్చు. హర్షిత్ రాణా, మతీష పతిరణ గాయాలతో దూరమవ్వడం ఈ సీజన్లో ఆ జట్టుకు భారీ దెబ్బ. కార్తీక్ త్యాగి 18 వికెట్లు తీసినా మిగతా పేసర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు.పంజాబ్ కింగ్స్ (2/10)ఈ జట్టులో అర్షదీప్ సింగ్ వంటి స్టార్ పేసర్ ఉన్నప్పటికీ, మిగతా పేసర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. వీరి కారణంగా కీలక మ్యాచ్ల్లో తక్కువ స్కోర్లను కూడా కాపాడుకోలేకపోయారు.ముంబై ఇండియన్స్ (3/10)ఈ జట్టు పేస్ దళం ఈ సీజన్లో అతిపెద్ద నిరాశగా నిలిచింది. బుమ్రా, బౌల్ట్ లాంటి స్టార్ పేసర్లు ఆశించిన ప్రభావం చూపలేకపోయారు.చెన్నై సూపర్ కింగ్స్ (4/10)ఈ జట్టు తరఫున అన్షుల్ కంబోజ్ 21 వికెట్లతో మెరిసినా.. గాయాలు, అస్థిర ప్రదర్శనల కారణంగా పేస్ విభాగం బలహీనంగా కనిపించింది.ఢిల్లీ క్యాపిటల్స్ (4/10)ఈ జట్టులో స్టార్క్, నటరాజన్ కొంత మేర రాణించినా, మిగతా పేసర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.లక్నో సూపర్ జెయింట్స్ (5/10)ఈ సీజన్లో ఎల్ఎస్జీ చివరి స్థానంలో నిలిచినా, పేస్ బౌలింగ్లో మంచి సామర్థ్యం చూపింది. ప్రిన్స్ యాదవ్, షమీ ఆకట్టుకున్నారు. అయితే గాయాలు జట్టును దెబ్బతీశాయి.రాజస్థాన్ రాయల్స్ (6/10)ఈ సీజన్లో రాయల్స్ విజయాల్లో జోఫ్రా ఆర్చర్ కీలక పాత్ర పోషించాడు. 25 వికెట్లతో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.సన్రైజర్స్ హైదరాబాద్ (7/10)ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ పేస్ విభాగం బలంగా కనిపించింది. కమిన్స్ నేతృత్వంలో ఆ జట్టు పేస్ దళం మంచి సమతుల్యతను ప్రదర్శించింది. ఎషాన్ మలింగ 20 వికెట్లతో మెరిశాడు.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (8/10)బ్యాక్ టు బ్యాక్ టైటిళ్లు గెలవడంలో ఆర్సీబీ పేస్ బౌలర్ల పాత్ర అమోఘం. భువనేశ్వర్ కుమార్ 28 వికెట్లతో అదరగొట్టగా, రసిక్ సలాం, హాజిల్వుడ్ మంచి ప్రదర్శనలు ఇచ్చారు.గుజరాత్ టైటాన్స్ (9/10)ఈ సీజన్లో అత్యంత భయంకరమైన పేస్ దళం మాత్రం గుజరాత్ టైటాన్స్దే. ఈ జట్టులోని రబాడ, సిరాజ్, హోల్డర్, ప్రసిద్ద్ సమిష్టిగా సత్తా చాటారు. 29 వికెట్లు తీసి రబాడ పర్పుల్ క్యాప్ కూడా గెలుచుకున్నాడు. -
‘మమ్మల్ని ఆదరించండి’.. మంధాన సంచలన వ్యాఖ్యలు!
మహిళల క్రికెట్ చరిత్రలో మరో అత్యుత్తమ సమరానికి తెరలేవబోతోంది. జూన్ 12 నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన మహిళల టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా వైస్కెప్టెన్ స్మృతి మంధాన సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రపంచకప్ లాంటి మెగాటోర్నీ జరుగుతున్నా భారత్-పాక్ మధ్య మ్యాచ్కు మాత్రమే హైప్ ఉందని, మిగిలిన టోర్నీకి కూడా అదే స్థాయిలో ఆదరణ చూపాలని అభిమానులకు విజ్ఞప్తి ఆసక్తి కలిగించింది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్కు ఉండే క్రేజ్, హైప్ సహజమైనదే అయినప్పటికీ.. కేవలం ఆ ఒక్క మ్యాచ్కే పరిమితం కాకుండా టోర్నీ మొత్తానికి భారీ స్థాయిలో ప్రచారం కల్పించాలని ఆమె కోరారు. మహిళల క్రికెట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందుతోందని, ప్రతి జట్టులోనూ అద్భుతమైన ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారని ఆమె గుర్తుచేశారు. అభిమానులు, క్రీడా విశ్లేషకులు, మీడియా సంస్థలు కేవలం భారత్-పాక్ పోరుపైనే కాకుండా, టోర్నమెంట్లో జరిగే మిగిలిన అన్ని మ్యాచ్లపై కూడా అంతే శ్రద్ద పెట్టాలని, అప్పుడే మహిళల క్రికెట్కు నిజమైన గుర్తింపు దక్కుతుందని మంధాన అభిప్రాయపడ్డారు. పురుషుల క్రికెట్తో సమానంగా తాము అద్భుతాలు చేస్తున్నప్పటికీ మహిళల క్రికెట్పై ఇంకా చిన్నచూపేనని పేర్కొన్నారు. స్మృతి మంధాన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా లోకంలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ టోర్నీ విజయవంతం కావడానికి సోషల్ మీడియా పాత్ర కూడా ఎంతో కీలకమని, ప్రతీ మ్యాచ్ గురించి చర్చ జరగాలని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. మంధాన చెప్పినట్లుగా కేవలం ఒకే ఒక్క హై-వోల్టేజ్ మ్యాచ్ టోర్నీని ముగించకుండా, ప్రతీ లీగ్ మ్యాచ్ను, ప్రతీ జట్టు ప్రదర్శనను హైలైట్ చేయడం వల్ల మహిళల క్రీడలకు మరింత వాణిజ్య పరమైన ఆదరణ, స్పాన్సర్షిప్ లభించే అవకాశం ఉంది. వరల్డ్కప్లో అందరి దృష్టిని ఆకర్షించే అత్యంత కీలకమైన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జూన్ 14న జరగనుంది. ఇక ప్రపంచకప్లో పాల్గొంటున్న అన్ని జట్లు టైటిల్ గెలవడమే లక్ష్యంగా శిక్షణ తీసుకున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ వంటి బలమైన జట్లతో పాటు భారత్, శ్రీలంక, పాకిస్తాన్ జట్లు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఈసారి ఎలాగైనా ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో ఉంది. గత కొన్ని సిరీస్లుగా భారత మహిళల జట్టు అద్భుతమైన ఫామ్లో కొనసాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ సమతూకంతో కనిపిస్తోంది. ముఖ్యంగా యువ ఆటగాళ్లు జట్టులోకి రావడం జట్టు బలాన్ని మరింత పెంచింది.చదవండి: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. బౌలింగ్లో మెరిసిన టీమిండియా స్టార్! -
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. బౌలింగ్లో మెరిసిన టీమిండియా స్టార్!
టీమిండియా వెటరన్ క్రికెటర్ ఉమేశ్ యాదవ్ చాన్నాళ్ల తర్వాత తన బౌలింగ్తో దర్శనమిచ్చాడు. భారత జట్టులో ఎప్పుడో చోటు కోల్పోయిన ఉమేశ్ ప్రస్తుతం విదర్భ ప్రీమియర్ లీగ్ ఆడుతూ బిజీగా గడుపుతున్నాడు. ఈ లీగ్లో నాగ్పూర్ హీరోస్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమేశ్ యాదవ్ మంగళవారం ఇండియా వారియర్స్తో మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్లో ఉమేశ్ యాదవ్ 3 ఓవర్లలో 41 పరుగులిచ్చి ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఈ నేపథ్యంలో ఉమేశ్ యాదవ్ బౌలింగ్ వీడియోనూ ఒక అభిమాని ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. 'ఎన్ని రోజులకు దర్శనమిచ్చావయ్యా.. నీ బౌలింగ్ చూసి కొన్నేళ్లయింది.. థాంక్యూ ఉమేశ్' అంటూ కామెంట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఉమేశ్ యాదవ్ టీమిండియా తరఫున 57 టెస్టుల్లో 170 వికెట్లు, 75 వన్డేల్లో 106 వికెట్లు, 9 టీ20ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో వివిధ ఫ్రాంచైజీల తరఫున ఆడిన వైభవ్ మొత్తంగా 148 మ్యాచ్ల్లో 144 వికెట్లు పడగొట్టాడు. ధోని సారథ్యంలో 2013 చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన టీమిండియాలో ఉమేశ్ యాదవ్ సభ్యుడిగా ఉన్నాడు. 2015 వన్డే ప్రపంచకప్లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఉమేశ్ యాదవ్ నిలిచాడు. 2019లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్లో 310 స్ట్రైక్రేట్తో 10 బంతుల్లోనే 31 పరుగులు చేయడం ఇప్పటికీ ఒక రికార్డుగా మిగిలిపోయింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే ఉమేశ్ యాదవ్ ప్రాతినిధ్యం వహించిన నాగ్పూర్ హీరోస్పై ఇండియన్ వారియర్స్ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా వారియర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 261 పరుగుల భారీ స్కోరు చేసింది. అభిషేక్ శర్మ (19 బంతుల్లోనే 63 నాటౌట్), శుభమ్ దూబే (33 బంతుల్లో 74 నాటౌట్) మెరిశారు. అనంతరం నాగ్పూర్ హీరోస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసి ఓడిపోయింది. సిద్ధేశ్ వత్ (78) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇండియా వారియర్స్ బౌలర్లలో ప్రఫుల్ హింగే, దర్శన్ నల్కండే, రాహుల్ డోంగర్వార్, గుర్దీప్సింగ్లు తలా రెండు వికెట్లు తీశారు. Saw Umesh Yadav bowling after a long timeFeels NostalgicHe is playing Vidarbha premier league pic.twitter.com/Bp0TwGQez2— Sawai96 (@Aspirant_9457) June 3, 2026చదవండి: వైభవ్ సూర్యవంశీపై పరిశోధనలు! -
వైభవ్ సూర్యవంశీ ఎఫెక్ట్.. బిగ్ న్యూస్
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రభావం అంతర్జాతీయ స్థాయిలోనూ కనిపిస్తోంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించిన వైభవ్, త్వరలో శ్రీలంకలో జరుగబోయే ముక్కోణపు టోర్నీకి (భారత-ఏ జట్టుకు) ఎంపికైన విషయం తెలిసిందే. వైభవ్ ఆడనుండటంతో ఈ టోర్నీకి ఊహించని ఆదరణ లభిస్తోంది.దీంతో నిర్వాహకులు (సోనీ నెట్వర్క్) ఈ టోర్నీని ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తమ సోషల్ మీడియా పోస్టులో "The Sooryavanshi Express is coming to light up the stage in a high-octane Tri-series" అంటూ ప్రచారం మొదలుపెట్టారు. వైభవ్ క్రేజ్కు ఓ సాధారణ టోర్నీ కూడా ప్రత్యక్ష ప్రసారానికి నోచుకుంది.వైభవ్ బ్రాండ్ను వినియోగించుకొని నిర్వహకులు తమ వ్యాపారాభివృద్దికి ప్రయత్నిస్తున్నారు. టీ20 వరల్డ్కప్ 2026 మరియు ఐపీఎల్ ప్రసార హక్కులు కోల్పోయిన సోని నెట్వర్క్, వైభవ్ క్రేజ్ను ఉపయోగించుకొని తిరిగి అభిమానులకు దగ్గర కావాలని భావిస్తోంది. ఈ మేరకు ఈ టోర్నీపై భారీ ఫోకస్ పెట్టింది. అన్ని మ్యాచ్లు సోని స్పోర్ట్స్, సోని లివ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.ఈ టోర్నీలో భారత-ఏ జట్టుతో పాటు శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ జూన్ 9 నుంచి 21 వరకు డంబుల్లా వేదికగా జరుగనుంది.ఈ టోర్నీ కోసం భారత-ఏ జట్టును ఇదివరకే ప్రకటించారు. ఈ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్గా వ్యవహరిస్తున్నప్పటికీ, ప్రధాన ఆకర్షణ మాత్రం వైభవ్ సూర్యవంశీయే. ఐపీఎల్లో ప్రత్యర్ది బౌలర్లకు చుక్కలు చూపించిన వైభవ్.. అంతర్జాతీయ వేదికపై ఎలా రాణిస్తాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొద్ది రోజుల కిందటే భారత-ఏ జట్టుకు సంబంధించి ఓ కీలక మార్పు జరిగింది. గాయంతో బాధపడుతున్నరియాన్ పరాగ్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేశారు.శ్రీలంక ముక్కోణపు టోర్నీకి భారత-ఏ జట్టు..తిలక్ వర్మ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, రుతురాజ్ గైక్వాడ్, ప్రియాంశ్ ఆర్య, ఆయుశ్ బదోని, నిషాంత్ సింధు, సూర్యాంశ్ షేడ్గే, విప్రాజ్ నిగమ్, అన్షుల్ కంబోజ్, అనుకూల్ రాయ్, అర్షాద్ ఖాన్, ప్రభ్సిమ్రన్ సింగ్, కుమార్ కుషాగ్రా, యశ్ ఠాకూర్, యుద్ద్వీర్ సింగ్ చరక్ -
టీ20 కొత్త కెప్టెన్గా అతడికే ఓటేసిన అగార్కర్!
టీమిండియా టీ20 కెప్టెన్ మార్పు అంశంపై భారత క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. భారత్కు ఈ ఏడాది ప్రపంచకప్ టైటిల్ అందించినప్పటికీ సూర్యకుమార్ యాదవ్పై వేటు వేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఆ రెండు కారణాల వల్ల..ఒకప్పుడు ప్రపంచ నంబర్వన్ బ్యాటర్గా ఉన్న సూర్య.. సారథిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆటగాడిగా తేలిపోవడమే ఇందుకు కారణం. అంతేగాక టీ20 ప్రపంచకప్-2028 టోర్నీకి జట్టును సన్నద్ధం చేసే క్రమంలో 35 ఏళ్ల సూర్య వయసు కూడా ఓ అడ్డంకిగా మారిందనే అభిప్రాయాలు ఉన్నాయి.పరిశీలనలో మూడు పేర్లుఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ కొత్త కెప్టెన్ విషయంలో తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు బోర్డు సన్నిహిత వర్గాలు తెలిపాయి. వరల్డ్కప్ వీరుడు సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ఇటీవల వెల్లడించాయి.అయితే, తాజా సమాచారం ప్రకారం.. సంజూ, అక్షర్లను కాదని శ్రేయస్ అయ్యర్కే సెలక్షన్ కమిటీ ఓటేసినట్లు సమాచారం. ఇందులో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్దే ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో మాట్లాడుతూ..అతడికే ఓటేసిన అగార్కర్‘‘అజిత్ దృఢచిత్తం గల చీఫ్ సెలక్టర్. స్ట్రాంగెస్ట్ చీఫ్ సెలక్టర్లలో అతడు ముందు వరుసలో ఉంటాడు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అతడు ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు.తన ప్యానెల్తో కలిసి కొత్త టీ20 కెప్టెన్ కోసం అగార్కర్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే శ్రేయస్ అయ్యర్ను తొలుత వన్డేలకు వైస్ కెప్టెన్గా నియమించారు. టీ20 ప్రపంచకప్-2026 ఆరంభానికి ముందే శ్రేయస్ విషయంలో ఒక నిర్ణయమైతే జరిగిపోయింది’’ అని పేర్కొన్నాయి.గంభీర్ విముఖత!అయితే, హెడ్కోచ్ గౌతం గంభీర్ మాత్రం శ్రేయస్ అయ్యర్ విషయంలో అగార్కర్తో ఏకీభవించడం లేదని సమాచారం. ‘‘గంభీర్ మనసులో ఒకరు ఉండొచ్చు. సెలక్టర్లు వేరొకరి గురించి ఆలోచించవచ్చు. అయితే, అక్షర్ పటేల్ వరల్డ్కప్ టోర్నీలో వైస్ కెప్టెన్గా వ్యవహరించిన విషయాన్ని మర్చిపోవద్దు.రేసులో ఇషాన్ కూడా!ఇక ఇషాన్ కిషన్.. అతడి వయసు చిన్నదే. ఫామ్లో ఉన్నాడు. సారథిగానూ నిరూపించుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. సంజూ శాంసన్ విషయంలో మాత్రం సెలక్టర్లు సంతృప్తిగా లేరు. అతడి నిలకడలేని ఆట తీరే ఇందుకు కారణం.కాబట్టి శ్రేయస్ అయ్యర్తో పాటు ఇషాన్, అక్షర్ కూడా రేసులో ఉన్నారని చెప్పవచ్చు. కానీ సంజూకు మాత్రం అవకాశం ఉండకపోవచ్చు’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఏదేమైనా ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటన తర్వాత కొత్త టీ20 కెప్టెన్ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.చదవండి: వైభవ్తో కోహ్లి చెప్పిన మాటలు ఇవే! -
దేశవాలీ టోర్నీలో అభిషేక్ విధ్వంసం..
దేశవాలీ టోర్నీ విదర్భ ప్రీమియర్ లీగ్లో సంచలనం నమోదయ్యింది. మంగళవారం ఇండియా వారియర్స్, నాగ్పూర్ హీరోస్ మధ్య జరిగిన మ్యాచ్లో పలు రికార్డులు బద్దలయ్యాయి. ఇటీవలే ఐపీఎల్లో పెద్దగా మెరవని శుభమ్ దూబేతో పాటు అభిషేక్ అగర్వాల్ సంచలన ఇన్నింగ్స్లతో మెరిశారు. ముఖ్యంగా అభిషేక్ అగర్వాల్ కేవలం 19 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 63 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు శుభమ్ దూబే కూడా (33 బంతుల్లో 74 పరుగులు నాటౌట్, 4 ఫోర్లు, 7 సిక్సర్లు) తడాఖా చూపించాడు. ఈ ఇద్దరూ కలిసి ఆరో వికెట్కు అజేయంగా 107 పరుగులు జోడించడం దేశవాలీ క్రికెట్లో ఒక రికార్డుగా మిగిలిపోనుంది. ఇక ఇన్నింగ్స్ చివరి ఓవర్లో అభిషేక్ అగర్వాల్ ఒక సిక్స్, నాలుగు ఫోర్లు కొట్టి మొత్తంగా 24 పరుగులు పిండుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అభిషేక్ 16 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ సాధించాడు. మ్యాచ్ విషయానికొస్తే నాగ్పూర్ హీరోస్పై ఇండియన్ వారియర్స్ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా వారియర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 261 పరుగుల భారీ స్కోరు చేసింది. అభిషేక్ శర్మ (19 బంతుల్లోనే 63 నాటౌట్), శుభమ్ దూబే (33 బంతుల్లో 74 నాటౌట్) మెరిశారు. అనంతరం నాగ్పూర్ హీరోస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసి ఓడిపోయింది. సిద్ధేశ్ వత్ (78) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇండియా వారియర్స్ బౌలర్లలో ప్రఫుల్ హింగే, దర్శన్ నల్కండే, రాహుల్ డోంగర్వార్, గుర్దీప్సింగ్లు తలా రెండు వికెట్లు తీశారు.చదవండి: వైభవ్ సూర్యవంశీ ఎఫెక్ట్.. బిగ్ న్యూస్ -
వైభవ్తో కోహ్లి చెప్పిన మాటలు ఇవే.. వీడియో వైరల్
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి సంతోషంలో మునిగితేలుతున్నాడు. ఐపీఎల్ తొలి టైటిల్ కోసం పద్దెనిమిదేళ్లు ఎదురుచూసిన ఈ రన్మెషీన్ కల గతేడాది ఫలించింది. క్యాష్ రిచ్ లీగ్ ఆరంభ సీజన్ నుంచి అతడు ప్రాతినిథ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 2025లో తొలిసారి ట్రోఫీ గెలిచింది.ఐపీఎల్-2026లోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేసిన ఆర్సీబీ.. వరుసగా రెండోసారి చాంపియన్గా నిలిచింది. గుజరాత్ టైటాన్స్తో ఆదివారం నాటి ఫైనల్లో ఐదు వికెట్ల తేడాతో గెలిచి విజేతగా అవతరించింది. ఈ మ్యాచ్లో కోహ్లి 75 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.వైభవ్ నమస్కారం చేయగా.. ఇదిలా ఉంటే.. ఫైనల్లో విజయం తర్వాత రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు, ఆరెంజ్క్యాప్ విన్నర్ వైభవ్ సూర్యవంశీతో కోహ్లి కాసేపు ముచ్చటించాడు. కోహ్లిని చూసి వైభవ్ నమస్కారం చేయగా.. ప్రతిగా అతడి భుజం తట్టి హత్తుకున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ గురించి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ‘కింగ్’.. ‘బేబీ బాస్’తో ఏం మాట్లాడాడో తెలుసుకోవాలని నెటిజన్లు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు.వాళ్ల మాటలు పట్టించుకోకుఈ నిరీక్షణకు ఆర్సీబీ తెరదించింది. కోహ్లి- వైభవ్ల వీడియోను బుధవారం షేర్ చేసిన యాజమాన్యం.. కోహ్లి వైభవ్కు ఇచ్చిన సలహా ఏమిటో తెలియజేసింది. వీడియో ప్రకారం.. ‘‘నువ్వు ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. నీ కఠోర శ్రమ, ఆత్మవిశ్వాసం వల్లే నువ్వు ఇది సాధించగలిగావు.అయితే, నీ గురించి ఎవరు.. ఏం మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? అన్న విషయాల గురించి అస్సలు పట్టించుకోకు. నిజం చెప్పాలంటే.. బిహారీ ఎవరినైనా ఓడించగలడు. ఎవరినైనా అధిగమించగలడు’’ అని కోహ్లి వైభవ్తో పేర్కొన్నాడు.776 పరుగులుకాగా గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. ఈ సీజన్లో ఏకంగా 776 పరుగులు సాధించాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు.. రాజస్తాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు.. కోహ్లి ఈ సీజన్లో 675 పరుగులు సాధించి టాప్-4లో నిలిచాడు. ఫైనల్లో రాణించి ఆర్సీబీ రెండో టైటిల్ గెలవడంలో తన వంతు సాయం అందించాడు.చదవండి: నువ్వు కూర్చో.. అతడినే వన్డౌన్లో పంపుతాం అన్నాడు!𝗧𝗵𝗲 𝗺𝗮𝗻 𝘄𝗵𝗼 𝗺𝗮𝗱𝗲 𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗰𝗿𝗶𝗰𝗸𝗲𝘁 𝗳𝗲𝗮𝗿𝗹𝗲𝘀𝘀 🤝 𝘁𝗵𝗲 𝗯𝗼𝘆 𝘄𝗵𝗼 𝗯𝗮𝘁𝘀 𝗳𝗲𝗮𝗿𝗹𝗲𝘀𝘀 🫶💪The best piece of advice the 15-year old Vaibhav Suryavanshi could get! And who better than Virat Kohli to help fuel his fire in the right direction.… pic.twitter.com/MUqCRBo0la— Royal Challengers Bengaluru (@RCBTweets) June 3, 2026 -
వైభవ్ సూర్యవంశీపై పరిశోధనలు!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీజన్లో 16 మ్యాచ్లాడిన వైభవ్ 237 స్ట్రైక్రేట్తో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్తో పాటు ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును అందుకున్నాడు. 15 ఏళ్ల వయసులోనే బ్యాటింగ్లో సంచలనాలు చేస్తుండడంపై దిగ్గజ క్రికెటర్లు కూడా వైభవ్ను అభినందించకుండా ఉండలేకపోయారు. ఈ నేపథ్యంలో అతడి జీవితాన్ని, చిన్న వయసులోనే ఒత్తిడిని అధిగమించి ఇవాళ స్టార్ క్రికెటర్ రేంజ్కు ఎదిగిన వైభవ్ సూర్యవంశీ ఘనతను తమ పాఠ్యాంశంలో చేర్చాలని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)-ఇండోర్ భావిస్తోంది. త్వరలోనే ఈ రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్పై ఐఐఎం-ఇండోర్ పరిశోధనలు చేపట్టనుంది. చిన్న వయసులోనే క్రికెట్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన వైభవ్ సూర్యవంశీపై ఒక ప్రత్యేక కేస్స్టడీ చేయనున్నట్లు ఐఐఎం ఇండోర్ ప్రతినిధులుతెలిపారు. దీంతో వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. చిన్నవయసులోనే స్టార్డమ్ రావడం, చిన్నవయసులోనే స్టార్డమ్ రావడం, కెరీర్ భవిష్యత్తు, ఒత్తిళ్లు, సవాళ్లు.. వాటి ప్రభావాలను వైభవ్ ఎలా అధిగమించాడనే దానిపై తమ సంస్థ అధ్యయనం చేయనుందని ఐఐఎం ఇండోర్కు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.‘బాల మేధావుల అసాధారణ ప్రదర్శనకు ఎలాంటి కారకాలు దోహదపడుతాయనేవి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇందుకోసం చిన్నతనం నుంచే అలవడే వ్యక్తిత్వం, ప్రవర్తన, సాధన పద్దతులు.. కుటుంబం నుంచి అందుతున్న సహకారం, ఉపాధ్యాయులు, కోచ్లు, సీనియర్ల మద్దతుతో వివిధ రంగాల్లో ఎదుగుతున్న పిల్లలపై అధ్యయనం చేయాలని నిర్ణయించాం. స్పోర్ట్స్ విభాగంలో వైభవ్ సూర్యవం శీని ఎంపిక చేసుకున్నాం. ఇప్పటికే ఈ విషయాన్ని అతడికి తెలియజేశాము.’ అని ఐఐఎం డైరక్టర్ తెలిపారు.బాలల ప్రతిభపై సంస్థ జరిపే అధ్యయనంలో మనస్తత్వ శాస్త్రం, సామాజిక శాస్త్రం, మానవ వనరులు, సమాచారవ్యాప్తి, ప్రవర్తనకు సంబంధించి ప్రత్యేక పరిశోధనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ అధ్యయనం కేవలం క్రీడలకే కాకుండా చిన్న వయసులోనే గణితం, సైన్స్, కళలు, ఇతర వృత్తుల్లో రాణిస్తున్న ప్రతిభావంతులపై కూడా జరగనుంది. అయితే ఈ అధ్యయనం పూర్తవ్వడానికి రెండు నుంచి మూడు నెలలు పట్టే అవకాశముందని ఐఐఎం ఇండోర్ తెలిపింది.చదవండి: వరల్డ్ నంబర్వన్ను చావుదెబ్బ కొట్టిన ప్రజ్ఞానంద! -
కింద పడ్డ రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో రోహిత్ నడుస్తూ బ్యాలెన్స్ కోల్పోయి నేలపై ముందుకు పడ్డాడు. ఈ వీడియో ఇప్పటిదా లేక పాతదా అన్న విషయంపై క్లారిటీ లేనప్పటికీ.. రోహిత్ అభిమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. తమ ఆరాధ్య ఆటగాడు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు అందుబాటులో ఉంటాడా లేదా అని గాబరా పడుతున్నారు.రోహిత్ త్వరలో ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే వన్డే సిరీస్కు ఎంపికైన విషయం తెలిసిందే. అతడు టెస్ట్, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి టీ20ల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. రోహిత్ తాజాగా ముగిసిన ఐపీఎల్ 2026లో హ్యామ్స్ట్రింగ్ గాయంతో పలు మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. అయితే ఆడిన మ్యాచ్ల్లో మాత్రం తనదైన క్లాస్ను ప్రదర్శించి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లు ఆడాడు.🚨🚨ROHIT SHARMA OUT OF THE FIRST 2 ODIs AGAINST AFGHANISTAN [CRICBUZZ]According to reliable sources and reports, Rohit Sharma suffered a knee twist after losing balance and is feeling discomfort. As per reports, he won't be available for the opening two games. India's… pic.twitter.com/xVn7qXcQg0— Oxygen (@Oxygen18_) June 3, 2026కాగా, ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే వన్డే సిరీస్కు రోహిత్తో పాటు విరాట్ కోహ్లి కూడా ఎంపికయ్యాడు. అతడు కూడా రోహిత్లాగే టెస్ట్, అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లకు గుడ్బై చెప్పి, కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2026లో రోహిత్తో పోలిస్తే విరాట్ చాలా మెరుగ్గా ఆడాడు. వరుసగా రెండో ఎడిషన్లో తన జట్టు ఛాంపియన్గా నిలపడంలో ప్రధానపాత్ర పోషించాడు. గుజరాత్తో జరిగిన ఫైనల్స్లో అజేయమైన అర్ద సెంచరీతో తన జట్టును ఛాంపియన్గా నిలిపాడు.రోహిత్, విరాట్ 2027 వన్డే ప్రపంచకప్ దృష్ట్యా అంతర్జాతీయ వన్డేల్లో కొనసాగుతున్నారు. ఆ సమయం వరకు ఫామ్లో ఉండి, ఫిట్నెస్ కాపాడుకుంటూ ఉంటేనే జట్టులో ఉంటారని సెలెక్టర్లకు వారిద్దరికి ఖరాకండిగా చెప్పారు. ఈ మేరకే రో-కో అడుగులు వేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్తో వన్డే మ్యాచ్లు జూన్ 13, 17, 20 తేదీల్లో ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా జరుగనున్నాయి. -
ఇదే ఆఖరి మ్యాచ్: కేన్ విలియమ్సన్ కీలక వ్యాఖ్యలు
నవతరం అత్యుత్తమ టెస్టు క్రికెటర్లలో కేన్ విలియమ్సన్ ఒకడు. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి.. ఇంగ్లండ్ లెజెండ్ జో రూట్, ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్తో కలిసి ‘ఫ్యాబ్ ఫోర్’లో ఈ న్యూజిలాండ్ స్టార్కు స్థానం ఉంది.ఇప్పటికే కోహ్లి టెస్టులకు వీడ్కోలు పలకగా.. రూట్, స్మిత్ మాత్రం ఇంకా తమ ప్రయాణం కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సచిన్ టెండుల్కర్ (15,921) అత్యధిక పరుగుల రికార్డుకు చేరువైన జో రూట్ (13,943 రన్స్).. సచిన్ ఘనతను సమం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.ఇలాంటి తరుణంలో కేన్ విలియమ్సన్ రిటైర్మెంట్పై సంకేతాలు ఇచ్చాడు. దీంతో ‘ఫ్యాబ్ ఫోర్’లో మరో వికెట్ పడుతుందా? అంటూ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఐర్లాండ్తో టెస్టులు ఆడిన విలియమ్సన్.. తదుపరి ఇంగ్లండ్ గడ్డపై సత్తా చాటేందుకు సిద్ధమమ్యాడు.ఈ టూర్లో భాగంగా న్యూజిలాండ్ ఆతిథ్య ఇంగ్లండ్తో మూడు టెస్టులు ఆడనుంది. లండన్లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఈ సిరీస్కు తెరలేవనుంది. ఇరుజట్ల మధ్య గురువారం (జూన్ 4) నుంచి తొలి టెస్టు మొదలుకానుంది.ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్కు లార్డ్స్లో మీరు ఆడే చివరి మ్యాచ్ ఇదేనా అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు.. ‘‘అవును.. బహుశా ఇదే ఆఖరి మ్యాచ్ కావొచ్చు’’ అంటూ జీరబోయిన గొంతుతో విలియమ్సన్ బదులిచ్చాడు. బాధను అణిచిపెట్టుకుంటూ.. ‘‘మీ వల్ల నా భోజనానికి (లంచ్) ఆలస్యమవుతోంది. మీరిలా చేయడం అస్సలు మంచిది కాదు’’ అంటూ నవ్వులు పూయించాడు.కాగా 35 ఏళ్ల విలియమ్సన్ ఇప్పటి వరకు తన కెరీర్లో న్యూజిలాండ్ తరఫున 109 టెస్టులు ఆడాడు. 33 సెంచరీలు, 38 అర్ధ శతకాల సాయంతో 9497 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు ద్విశతకాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ మూడు టెస్టులు ఆడనుంది. లార్డ్స్, కెన్నింగ్టన్ ఓవల్, ట్రెంట్ బ్రిడ్జ్ ఇందుకు వేదికలు.చదవండి: కమిన్స్ సంచలన నిర్ణయం! -
‘నువ్వు కూర్చో.. అతడినే వన్డౌన్లో పంపుతాం అన్నాడు’
గత రెండేళ్లుగా గుజరాత్ టైటాన్స్ టాపార్డర్ అద్భుతంగా రాణిస్తోంది. ఐపీఎల్-2025లో గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ 15 మ్యాచ్లు ఆడి 759 పరుగులు సాధించాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.పరుగుల వీరులుఇక మరో ఓపెనర్, కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) కూడా 15 మ్యాచ్లలో కలిపి 650 పరుగులు రాబట్టి సత్తా చాటాడు. వీరికి తోడుగా వన్డౌన్ బ్యాటర్ జోస్ బట్లర్ 14 మ్యాచ్లు ఆడి 538 పరుగులు సాధించాడు. ఐపీఎల్-2026లోనూ ఈ ముగ్గురూ రాణించారు.గిల్ 732, సాయి సుదర్శన్ 722 పరుగులతో మరోసారి సత్తా చాటగా.. బట్లర్ 526 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో ఫైనల్లో గుజరాత్ యాజమాన్యం బట్లర్ను వన్డౌన్లో కాకుండా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు పంపింది.అనూహ్య నిర్ణయంమూడో స్థానంలో అన్క్యాప్డ్ ప్లేయర్ నిశాంత్ సింధు (20)ను పంపగా.. అతడు విఫలమయ్యాడు. ఇక నాలుగో స్థానంలో వెళ్లిన బట్లర్ సైతం 19 పరుగులే చేసి నిష్క్రమించాడు. ఇక గిల్, సాయి వరుసగా 10, 12 పరుగులే చేశారు. ఫలితంగా 155 పరుగులే చేసిన గుజరాత్.. ఐదు వికెట్ల తేడాతో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది.కాగా బట్లర్ను వన్డౌన్లో కాకుండా నాలుగో నంబర్ బ్యాటర్గా పంపడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఈ విషయంలో గుజరాత్ నాయకత్వ బృందాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు. ఈ విషయంపై బట్లర్ తాజాగా స్పందించాడు.నువ్వు ఇక్కడే కూర్చో.. తనను నాలుగో స్థానంలో ఆడించాలన్న ఆలోచన హెడ్కోచ్ ఆశిష్ నెహ్రాదేనని బట్లర్ స్పష్టం చేశాడు. ‘ఫర్ ది లవ్ ఆఫ్ క్రికెట్’తో మాట్లాడుతూ.. ‘‘తొలి వికెట్ (గిల్) పడగానే.. బ్యాటింగ్కు వెళ్లేందుకు హెల్మెట్ పెట్టుకుని సిద్ధమయ్యాను.ఇంతలో ఆశిష్ నెహ్రా.. ‘నువ్వు ఇక్కడే కూర్చో.. వన్డౌన్లో మేము నిశాంత్ను పంపాలని నిర్ణయించుకున్నాము’ అని చెప్పాడు. మ్యాచ్ తర్వాత ఈ విషయం గురించి నేను నెహ్రాను అడిగాను.అప్పుడు నిశాంత్ను పంపితే బాగుంటుందని.. టాపార్డర్లో ఆడేందుకు అతడికి ఇదే మంచి అవకాశం అని నెహ్రా నాతో అన్నాడు.వర్కౌట్ కాలేదుఅతడిని ఏడో స్థానంలో బ్యాటింగ్కు పంపలేము కదా.. అందుకే ఫైనల్లో ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారు. కోల్కతా మ్యాచ్లో కూడా అతడు నాకంటే ముందే బ్యాటింగ్కు వెళ్లాడు. అది తప్పో.. ఒప్పో తెలియదు. ఫైనల్లో మాత్రం ఆ నిర్ణయం మాకు వర్కౌట్ కాలేదు’’ అని బట్లర్ పేర్కొన్నాడు.చదవండి: శ్రేయస్ అయ్యర్ విఫలం.. ఘోర పరాజయం -
కప్పు గెలిచారు.. అంతలోనే ఆర్సీబీ లెజెండ్ రిటైర్మెంట్
ఐపీఎల్-2026 సీజన్ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ బాసు శంకర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ ఫ్రాంచైజీ బుధవారం ఎక్స్వేదికగా ధ్రువీకరించింది.మా అందరి కళ్లల్లో నీళ్లు"మీరు తీసుకున్న ఈ నిర్ణయం మా అందరి కళ్లల్లో నీళ్లు తెప్పించింది. బసు శంకర్ సార్… ఈ సీజన్ విజయంలో మీ పాత్ర వెలకట్టలేనిది. ఈ విజయం.. తెరవెనుక మీరు పడిన లెక్కలేనన్ని గంటల కష్టానికి ప్రతిఫలం. ఈ సక్సెస్లో భాగమైన మా సపోర్ట్ స్టాఫ్ ,మేనేజ్మెంట్ సభ్యులందరికీ ధన్యవాదాలు" ఆర్సీబీ ఓ భావోద్వేగ పోస్ట్ను ఎక్స్లో షేర్ చేసింది. ఎనిమిది సీజన్ల పాటు2019లో ఆర్సీబీ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన బసు శంకర్, ఎనిమిది సీజన్ల పాటు తన సేవలను అందించాడు. బెంగళూరు జట్టు వరుసగా రెండు సార్లు విజేతగా నిలవడంలో ఆయనది కీలక పాత్ర. ప్లేయర్లతో వివిధ రకాల వ్యాయామాలు చేయిస్తూ శారీరక సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఆయన తెరవెనుక పోషించిన పాత్ర అసాధారణమైనది. అంతకంటే ముందు భారత జాతీయ క్రికెట్ జట్టుకు హెడ్ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్గా పనిచేశారు. భారత క్రికెట్లో 'యో-యో' (Yo-Yo) టెస్ట్ను ప్రాచుర్యంలోకి తెచ్చి, టీమిండియాను ప్రపంచంలోనే అత్యంత ఫిట్ ప్రొఫెషనల్ జట్టుగా మార్చిన ఘనత ఆయనదే. విరాట్ కోహ్లి లాంటి దిగ్గజం ఫిట్నెస్ సక్సెస్ వెనక కూడా బసు శంకర్ ఉన్నారు.This news made us all teary eyed. 𝐁𝐚𝐬𝐮 𝐒𝐡𝐚𝐧𝐤𝐞𝐫 𝐒𝐢𝐫… ❤️🥺This season was built on countless hours of hard work behind the scenes. To every member of our support staff and management who made this journey possible, thank you. 🤗🫶A special salute to Basu Shanker… pic.twitter.com/K2UInIBhC9— Royal Challengers Bengaluru (@RCBTweets) June 3, 2026 -
కమిన్స్ సంచలన నిర్ణయం..! సన్రైజర్స్ కెప్టెన్గా విధ్వంసకర ప్లేయర్?
ఆస్ట్రేలియా స్టార్, సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్కు దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్కు ప్రాధాన్యత ఇవ్వడం కోసం తాను ఐపీఎల్-2027కు అందుబాటులో ఉండకపోవచ్చని కమిన్స్ ఇప్పటికే సూచించాడు. తాజాగా ఓ కార్యక్రమంలో కమ్మిన్స్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. వచ్చే ఏడాది యాషెస్ సిరీస్తో పాటు వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్, వన్డే ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలు ఉన్నాయి. కాగా యాషెస్ 2025-26ను ఆస్ట్రేలియా సొంతం చేసుకున్నప్పటికి, కమ్మిన్స్ మాత్రం గాయం కారణంగా ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత కీలకమైన టీ20 ప్రపంచకప్కు దూరమయ్యాడు. ఈసారి మాత్రం కమిన్స్ పూర్తిగా ఫిట్గా అన్ని ప్రధాన టోర్నీల్లో పాల్గోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు."వచ్చే ఏడాది బిజీ షెడ్యూల్ కారణంగా ఏదో ఒకదానికి విరామం ఇవ్వక తప్పదు. అయితే అది ఖచ్చితంగా టెస్ట్ మ్యాచ్లు లేదా వన్డే ప్రపంచ కప్ మాత్రం కాదు. టెస్ట్ క్రికెట్, వన్డే వరల్డ్ కప్లకే నా మొదటి ప్రాధాన్యత ఉంటుంది. లీగ్ క్రికెట్ మ్యాచ్లు ఆడటంపై తుది నిర్ణయాన్ని ఆయా ఫ్రాంచైజీలతో మాట్లాడి తీసుకుంటాను. గాయాల బారిన పడే అవకాశం ఉన్నందున ఇప్పుడే దేనికీ కమిట్ అవ్వకూడదు అనుకుంటున్నాను.బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వంటి సుదీర్ఘ సిరీస్లో అన్ని మ్యాచ్లు ఆడితే.. ఆ తర్వాత జరగబోయే 'యాషెస్' సిరీస్ కంటే ముందు నాకు కచ్చితంగా విశ్రాంతి అవసరమని కమ్మిన్స్ ఓ కార్యక్రమంలో పేర్కొన్నాడు. ఒకవేళ కమిన్స్ అందుబాటులో లేకపోతే ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా ఇషాన్ కిషన్ వ్యవహరించనున్నాడు.ఐపీఎల్-2026 సీజన్ ఫస్ట్హాఫ్లో కూడా కమ్మిన్స్ గైర్హజరీలో కిషనే సన్రైజర్స్ జట్టును నడిపించాడు. అతడి సారథ్యంలో 8 మ్యాచ్లు ఆడిన ఆరెంజ్ ఆర్మీ.. ఐదింట విజయం సాధించింది. ఈ జార్ఖండ్ ఆటగాడు బ్యాటర్గా కూడా రాణించాడు. కిషన్ 15 మ్యాచ్లలో 602 పరుగులు చేశాడు. కానీ ఎస్ఆర్హెచ్ ప్రయాణం ఎలిమినేటర్లోనే ముగిసిపోయింది.చదవండి: NZ vs ENG: ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. 'గే'కు ఛాన్స్ -
ప్రేమ నుంచి పెళ్లిదాకా.. చీర్లీడర్స్తో క్రికెటర్ల బంధం!
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ వరుసగా సంచలన విషయాలు వెల్లడిస్తూ వస్తున్నాడు. ఇటీవలే ‘హ్యూమన్ బాంబే’ అనే పాడ్కాస్ట్కు లలిత్ మోదీ ఇంటర్వ్యూ ఇచ్చిన విషయాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఇప్పటికే లక్నో సూపర్జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకాపై విరుచుకుపడిన లలిత్ మోదీ తాజాగా ఐపీఎల్ ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన చీర్ లీడర్స్తో క్రికెటర్ల ప్రేమాయణాలకు సంబంధించిన విషయాలను బయపెట్టడం ఆసక్తి రేపింది. చీర్లీడర్స్ ఐపీఎల్కు ప్రత్యేక ఆకర్షణగా ఉంటారనే ఉద్దేశంతోనే వారిని తీసుకొచ్చినట్లు పేర్కొన్నాడు. టోర్నమెంట్ సమయంలో జరిగే మైదానం వెలుపలి వివాదాలలో అధికభాగం ముందు రాసుకునే స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుందని తెలిపాడు. ఐపీఎల్ చూసే వీక్షకుల రేటింగ్లు పడిపోతే, హైప్ సృష్టించడం కోసం ఐపీఎల్ థింక్-ట్యాంక్ ఉద్దేశపూర్వకంగా మీడియాలో వార్తలను ప్రచారం చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక దక్షిణాఫ్రికా ఆటగాడు చీర్ లీడర్తో సంబంధం కొనసాగిస్తున్నాడన్న వార్తను తానే వ్యాప్తి చేశానంటూ లలిత్ మోదీ బాంబు పేల్చాడు.అయితే కొందరు క్రికెటర్లు చీర్లీడర్స్తో ప్రేమ మత్తులో మునిగి తేలుతున్నట్లు వార్తలు సృష్టించడం లాంటివన్నీ ముందే రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుందని వెల్లడించాడు.ఇదే విషయాన్ని మీడియాకు వెల్లడించడం, వారు వ్యూయర్షిప్ కోసం దానికి మరింత హంగులు అద్ది రేటింగ్స్ను పెంచుకోవడానికి ఆయుధంలా వాడుకునేవారు. సౌతాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డికాక్ చీర్ లీడర్తో రిలేషన్షిప్లో ఉన్నట్లు తాము బహిరంగపరిచిన మాట వాస్తవమే. కానీ కొన్ని చానెళ్లు మాత్రం దిగజారి డికాక్ చీర్లీడర్తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటూ రాసుకొచ్చాయి. ఇది వారి టీఆర్పీ రేటింగ్ను పెంచేసి ఉండొచ్చు.. కానీ ఒక క్రికెటర్ కెరీర్కు ఇదొక మాయని మచ్చలా మిగిలిపోతుంది. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. సౌతాఫ్రికా డికాక్ ఆ చీర్లీడర్నే పెళ్లి చేసుకోవడం చెప్పుకోవాల్సిన అంశం. ఈ నేపథ్యంలో చీర్ లీడర్స్ను పెళ్లి చేసుకున్న క్రికెటర్ల గురించి ఒక లుక్కేద్దాం.👉డికాక్, షాషా హర్లీ..సౌతాఫ్రికా సీనియర్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్, షాషా హర్లీల ప్రేమకథ, వివాహబంధంలోకి అడుగుపెట్టడం ఒక చిన్నపాటి సినిమా కథలాగా ఉంటుంది. 2012లో చాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీ జరిగిన సమయంలో డికాక్ హైవైల్డ్ లయన్స్ తరఫున ఆడుతున్నాడు. అదే జట్టుకు షాషా హర్లీ చీర్లీడర్గా పనిచేసినట్లు సమాచారం. టోర్నీ జరిగిన సమయంలోనే డికాక్తో షాషా హర్లీకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే ప్రేమగా మారింది. కొన్ని సంవత్సరాల పాటు ఇద్దరు రిలేషన్షిప్లో మునిగి తేలారు. 2015లో నిశ్చితార్థం చేసుకున్న డికాక్, షాషాహర్లీలు మరుసటి ఏడాది వివాహబంధంతో ఒక్కటయ్యారు. 2022లో ఈ జంట తమ మొదటి బిడ్డ కియారాకు స్వాగతం పలికారు. అప్పటినుంచి డికాక్ ఏ టోర్నీకి వెళ్లినా షాషా హర్లీ తన వెంటే వస్తూ అతన్ని ఉత్సాహంగా ఉంచుతుంది.👉మహ్మద్ షమీ, హసిన్ జహాన్..చీర్లీడర్ను పెళ్లిచేసుకున్న మరో క్రికెటర్ మహ్మద్ షమీ. 2012 ఐపీఎల్ సీజన్లో మాజీ మోడల్ హసీన్ జహాన్ చీర్లీడర్గా పనిచేసింది. ఈ సీజన్లోనే షమీ మొదటిసారి ఆమెను కలిశాడు. మాటల మధ్యలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొంతకాలం ఇద్దరు ప్రేమలో మునిగితేలారు. ఆ తర్వాత 2014 జూన్ 6న మొరాదాబాద్లో కుటుంబసభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత హసీన్ జహాన్ చీర్ లీడర్ పాత్రకు ఫుల్స్టాప్ పెట్టింది. 2015లో ఈ దంపతులు ఐరా షమీకి స్వాగతం పలికారు. అయితే నాలుగేళ్లకే వీరి వివాహబంధం ముగిసింది. షమీపై శారీరక వేధింపులు, గృహహింస కేసులు పెట్టిన హసీన్ జహాన్ షమీతో విడాకులు తీసుకొని విడిపోయింది. అలా క్రికెటర్లలో చీర్ లీడర్స్ను పెళ్లి చేసుకున్న ఇద్దరిలో ఒకరు తమ వైవాహిక బంధంలో సంతోషంగా ఉంటే.. మరొకరు మాత్రం వివాహబంధం విచ్ఛిన్నం కావడంతో ఒంటరిగా మిగిలిపోయాడు. చదవండి: గంభీర్ తప్పుకోనున్నాడా? టీమిండియాకు కొత్త కోచ్! -
చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ మహిళా క్రికెట్లో ఇంత వరకు ఏ ప్లేయర్కూ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించింది. టీమిండియా తరఫున 2009లో అరంగేట్రం చేసింది హర్మన్.అంచెలంచెలుగా ఎదిగి కెప్టెన్ స్థాయికి చేరుకున్న హర్మన్.. మహిళా క్రికెట్లో భారత్కు మొట్టమొదటి వన్డే వరల్డ్కప్ అందించింది. స్వదేశంలో గతేడాది జరిగిన మెగా టోర్నీలో జట్టును చాంపియన్గా నిలిపి.. దిగ్గజ కెప్టెన్ల సరసన చేరింది.ఇంగ్లండ్ పర్యటనలో..ఇటీవలే పద్మశ్రీ అవార్డు అందుకున్న 37 ఏళ్ల హర్మన్ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఆతిథ్య జట్టు తొలి టీ20కి దూరమైన ఆమె.. రెండో మ్యాచ్ నుంచి జట్టుతో చేరింది. అయితే, హర్మన్ సారథ్యంలో రెండో టీ20తో పాటు.. తాజాగా మూడో టీ20లోనూ ఓటమిపాలైంది.సిరీస్ ఇంగ్లండ్దేటాంటన్ వేదికగా మంగళవారం నాటి మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అయితే, ఇంగ్లండ్ కేవలం 18.3 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్లో హర్మన్ 40 బంతులు ఎదుర్కొని 56 పరుగులతో అజేయంగా నిలిచింది. ఇక ఈ విజయంతో ఇంగ్లండ్ టీ20 సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది.చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్కాగా హర్మన్ అంతర్జాతీయ కెరీర్లో ఇది 368వ మ్యాచ్. తద్వారా మహిళల క్రికెట్లో అత్యధిక ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా హర్మన్ ప్రపంచ రికార్డు సాధించింది. కాగా గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ స్టార్ సుజీ బేట్స్ పేరిట ఉండేది. ఆమె తన కెరీర్లో 367 మ్యాచ్లు ఆడింది.ఇక టీ20 ప్రపంచకప్-2026 తర్వాత సుజీ బేట్స్ రిటైర్ కానుండగా.. హర్మన్ప్రీత్ కౌర్ రిటైర్మెంట్ గురించి ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. తద్వారా మరికొన్ని మ్యాచ్లలో పాల్గొని.. అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా హర్మన్ తన పేరును సుస్థిరం చేసుకునే అవకాశం లేకపోలేదు.మహిళల క్రికెట్లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన ప్లేయర్లు🏏హర్మన్ప్రీత్ కౌర్ (భారత్)- 368🏏సుజీ బేట్స్ (న్యూజిలాండ్)- 367🏏ఎలిస్ పెర్రీ (ఆస్ట్రేలియా)- 357🏏మిథాలీ రాజ్ (భారత్)- 333🏏సోఫీ డివైన్ (న్యూజిలాండ్)- 313.చదవండి: కెప్టెన్గా శ్రేయస్.. భువీ రీఎంట్రీ! -
గంభీర్ తప్పుకోనున్నాడా? టీమిండియాకు కొత్త కోచ్!
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే టీమిండియా అఫ్గానిస్తాన్తో సిరీస్ ఆడేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్లకు సంబంధించి జట్టును ప్రకటించారు. గంభీర్ హెడ్కోచ్గా టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ సహా 2026 టీ20 ప్రపంచకప్ నెగ్గింది. 2027 వన్డే వరల్డ్కప్ వరకు గంభీరే టీమిండియాకు హెడ్కోచ్గా కొనసాగనున్నాడు. అయితే టీ20 క్రికెట్లో గంభీర్ను కోచ్గా తప్పించి వేరే వాళ్లకు అవకాశమివ్వాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది కేవలం ఊహాగానాలే అయినప్పటికీ ఇప్పటికిప్పుడు గంభీర్ స్థానంలో టీమిండియాకు కొత్త టీ20 కోచ్గా ఎవరు వస్తే బాగుంటుందనే దానిపై మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ తన అభిప్రాయం వెల్లడించాడు. గంభీర్ స్థానంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్కు హెడ్కోచ్గా ఉన్న ఆశిష్ నెహ్రా కోచ్ స్థానానికి సరైన వ్యక్తి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్పోర్ట్స్స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజయ్ మంజ్రేకర్ మాట్లాడాడు. ‘ఆశిష్ నెహ్రా చాలా స్మార్ట్ క్రికెటర్. క్రికెట్ గురించి అతడితో మాట్లాడితే కచ్చితంగా ఎమెషనల్ అవుతాము. అతడు ఎప్పుడు జట్టు గురించే ఆలోచిస్తాడు. ఆశిష్ నెహ్రా చాలా నిక్కచ్చిగా ఉండే కోచ్. ఆటను చాలా సూక్ష్మంగా అంచనా వేస్తాడు. ఎవరిని నొప్పించడానికి ప్రయత్నించడు. ఆటగాళ్లను తీర్చిదిద్దడం, వారి కెరీర్ ఎదుగుదలకు నెహ్రా సహయపడుతాడు. ఒక కోచ్గా జట్టును చాలా ప్రభావితం చేయగలడు. ఆటగాళ్లందరినీ ఒకే తాటిపై నడిపించగల సత్తా అతని సొంతం. బీసీసీఐ ఒకవేళ టీ20 క్రికెట్కు కొత్త కోచ్ను చూస్తున్నట్లయితే ఆ పాత్రకు ఆశిష్ నెహ్రా న్యాయం చేయగలడు. నెహ్రాను కేవలం బౌలింగ్ కోచ్గా చూడడం ఆపేయాలి. ఎందుకంటే ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు హెడ్కోచ్గా విజయవంతమయ్యాడు. అంతేగాక చాలాకాలం టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన ఆశిష్ నెహ్రాకు వేర్వేరు కెప్టెన్ల ఆధ్వర్యంలో ఆడిన అనుభవముంది. ఒకవేళ టీమిండియాకు కోచ్ పాత్రలో వస్తే హెడ్కోచ్గానే రావాలని కోరుకుంటున్నా’అంటూ తెలిపాడు. కాగా ఐపీఎల్లో ఆశిష్ నెహ్రా హెడ్కోచ్గా గుజరాత్ టైటాన్స్ను విజయవంతంగా నడిపించాడు. 2022లో చాంపియన్స్గా నిలిచిన గుజరాత్ ఆ తర్వాతి సీజన్లో రన్నరప్గా నిలిచింది. 2024 సీజన్లో విఫలమైనప్పటికీ, 2025 సీజన్లో ప్లేఆఫ్స్ చేరిన గుజరాత్ ఈ ఏడాది సీజన్లో ఫైనల్ చేరి మరోసారి రన్నరప్గా నిలిచింది.చదవండి: 'మాట తప్పిన మూర్ఖుడు.. అత్యంత చెత్త యజమాని!' -
'వైభవ్, కోహ్లి కాదు.. అతడిదే అద్భుతమైన ఇన్నింగ్స్'
రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్-2026కు ఎండ్ కార్డ్ పడిన సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో టైటిల్ను సొంతం చేసుకుంది. అయితే ఈ ఏడాది సీజన్కు సంబంధించిన అత్యుత్తమ బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శనలను టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా చోప్రా విశ్లేషించాడు.పంజాబ్ కింగ్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఆడిన ఇన్నింగ్స్ను.. ఈ సీజన్లోనే అత్యుత్తమ నాక్గా ఆకాశ్ చోప్రా ఎంపిక చేశాడు. ఈ టోర్నీ లీగ్ దశలో భాగంగా అరుణ్జైట్లీ స్టేడియం వేదికగా పంజాబ్తో జరిగిన మ్యాచ్లో రాహుల్ భారీ సెంచరీతో కదం తొక్కాడు. రాహుల్ కేవలం 67 బంతుల్లోనే 16 ఫోర్లు, 9 సిక్సర్లతో 152 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వక్తిగత స్కోర్ సాధించిన భారత బ్యాటర్గా రాహుల్ రికార్డులెక్కాడు. అయితే ఈ మ్యాచ్లో దురదృష్టవశాత్తూ ఢిల్లీ ఓటమి చవిచూసింది. ఇక ప్లేఆఫ్స్లో శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రజత్ పటిదార్, వైభవ్ సూర్యవంశీ ఆడిన ఇన్నింగ్స్లు కూడా ఈ రేసులో ఉన్నాయని చోప్రా పేర్కొన్నాడు. ఏదేమైనప్పటికి రాహుల్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం అద్భుతమని అతడు కొనియాడాడు.లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మోహ్సిన్ ఖాన్ కోల్కతా నైట్ రైడర్స్ పై వేసిన స్పెల్ను చోప్రా ఉత్తమ బౌలింగ్ ప్రదర్శనగా ఎంపిక చేశాడు. ఈ మ్యాచ్లో మోహ్సిన్ తన 4 ఓవర్ల కోటాలో కేవలం 23 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. రాహుల్ మాదిరే మోహ్సిన్ కూడా ప్రదర్శన కూడా వృథా అయిపోయింది. కేకేఆర్పై లక్నో సూపర్ ఓవర్లో ఓటమి చవిచూసింది.కాగా ఈ ఏడాది సీజన్లో బెస్ట్ ఓపెనర్గా రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఆకాష్ చోప్రా ఎంపిక చేశాడు. రాజస్తాన్ ఫైనల్కు చేరకపోయినప్పటికి, వైభవ్ మాత్రం దుమ్ములేపాడు. 776 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచి ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు. ఉత్తమ మిడిలార్డర్ బ్యాటర్ హెన్రిస్ క్లాసెన్, బెస్ట్ బౌలర్గా భువనేశ్వర్ కుమార్లను అతడు ఎంచుకున్నాడు.చదవండి: IND vs NZ: 12 మ్యాచ్లు.. 40 రోజులు! టీమిండియా ఫ్యాన్స్కు పండగే -
ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. 'గే'కు ఛాన్స్
న్యూజిలాండ్తో జూన్ 4 నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టు కోసం 12 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టులో డర్హమ్ టాపర్డర్ బ్యాటర్ ఎమిలియో గే(Emilio Gay), హాంప్షైర్ పేస్ బౌలర్ సోనీ బేకర్లకు చోటు దక్కింది. ఈ మ్యాచ్తో వారిద్దరూ ఇంగ్లండ్ తరపున టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నారు.అయితే కివీస్తో తొలి టెస్టుకు రాజస్తాన్ రాయల్స్ స్పీడ్ స్టార్ జోఫ్రా అర్చర్కు టీమ్ మేనెజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. అతడు తిరిగి రెండో టెస్టులో ఆడనున్నాడు. ఇక వెటరన్ పేసర్ రెండేళ్ల తర్వాత ఇంగ్లండ్ జట్టులోకి వచ్చాడు. అతడు చివరగా ఫిబ్రవరి 2024లో ఆడాడు. స్టార్ ఓపెనర్ జాక్ క్రాలీని జట్టు నుంచి తప్పించడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను బెన్ డకెట్తో కలిసి యువ ఆటగాడు గే ప్రారంభించనున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ డైరెక్టర్ రాబ్ కీ ధృవీకరించారు. 26 ఏళ్ల ఎమిలియో గే ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. 2026 కౌంటీ సీజన్లో అతడు కేవలం మ్యాచ్ల్లోనే 92 సగటుతో 554 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతడు ఇంగ్లండ్ తరపున అరంగేట్రం చేయడానికి సిద్దమయ్యాడు. ఇక యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం చవిచూసిన తర్వాత ఇంగ్లండ్ జట్టుకు ఇదే తొలి టెస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం. దీంతో ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి కమ్బ్యాక్ ఇవ్వాలని ఇంగ్లీష్ జట్టు భావిస్తోంది. అదేవిధంగా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ 7వ స్థానంలో ఉంది. ఈ సైకిల్లో స్టోక్స్ సేన ఆడిన 10 మ్యాచ్లలో, కేవలం 3 మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించి, 6 మ్యాచ్లలో ఓటమి పాలైంది. ఓ మ్యాచ్ను డ్రా చేసుకుంది. ఫైనల్ రేసులో ఉండాలంటే కివీస్తో సిరీస్ ఇంగ్లండ్కు అత్యంత కీలకం కానుంది.కివీస్తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ జట్టుబెన్ స్టోక్స్ (కెప్టెన్), గస్ అట్కిన్సన్,సన్నీ బేకర్,షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, ఎమిలియో గే, ఆలీ రాబిన్సన్, జో రూట్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్),జాష్ టంగ్ -
శ్రేయస్ అయ్యర్ విఫలం.. ఘోర పరాజయం
ఐపీఎల్-2026 ముగిసిన వెంటనే శ్రేయస్ అయ్యర్ మరో టీ20 లీగ్ బరిలో దిగాడు. ముంబై టీ20 లీగ్లో SoBo ముంబై ఫాల్కన్స్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. అయితే, స్థానిక లీగ్లో తొలి మ్యాచ్లోనే శ్రేయస్ అయ్యర్కు చేదు అనుభవం ఎదురైంది.కాగా ఐపీఎల్లో గతేడాది పంజాబ్ కింగ్స్ తరఫున శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఇటు బ్యాటర్గా.. అటు కెప్టెన్గా అదరగొట్టిన సంగతి తెలిసిందే. పదిహేడు మ్యాచ్లలో కలిపి 604 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. పంజాబ్ను ఫైనల్కు చేర్చాడు.ఈసారి ప్లే ఆఫ్స్ చేరకుండానే..ఇక ఇదే జోరును కొనసాగిస్తూ ఐపీఎల్-2026లోనూ పంజాబ్ ఆరంభంలో వరుసగా ఆరు విజయాలు సాధించింది. అయితే, ఆ తర్వాత అంతా తలకిందులైపోయింది. వరుసగా ఆరు ఓటములతో ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం చేసుకున్న శ్రేయస్ సేన.. రాజస్తాన్ రాయల్స్తో పోటీలో వెనుకబడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.తాజా ఐపీఎల్ ఎడిషన్లో శ్రేయస్ అయ్యర్.. పద్నాలుగు మ్యాచ్లు ఆడి 498 పరుగులు చేయగలిగాడు. ఇందులో ఓ అజేయ శతకం (101) కూడా ఉంది. ఇక ఐపీఎల్ ముగిసిన వెంటనే ముంబై టీ20 లీగ్లో బ్యాట్ ఝులిపించేందుకు సిద్ధమయ్యాడు శ్రేయస్.శ్రేయస్ అయ్యర్ విఫలం శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహిస్తున్న SoBo ముంబై ఫాల్కన్స్ మంగళవారం ARCS అంధేరి జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్లో శ్రేయస్ కేవలం ఐదు పరుగులే చేసి అవుటయ్యాడు. అంధేరి కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ శివం దూబే బౌలింగ్లో పెవిలియన్ చేరాడు.ఘోర పరాజయంఇక ఈ మ్యాచ్లో ముంబై ఫాల్కన్స్ను 126 పరుగులకే పరిమితం చేసిన అంధేరి జట్టు.. ఐదు ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. మూడు వికెట్లు తీయడంతో పాటు.. 16 పరుగులు చేసిన శివం దూబే జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.కాగా జూన్ 1 నుంచి 13 వరకు ముంబై టీ20 లీగ్ తాజా ఎడిషన్కు షెడ్యూల్ ఖరారైంది. ఈ లీగ్లో బాంద్రా బ్లాస్టర్స్, ఈగల్ థానే స్ట్రైకర్స్, ఆకాశ్ టైగర్స్ MWS, MSC మరాఠా రాయల్స్, నార్త్ ముంబై పాంథర్స్, ట్రిపుంహ్స్ నైట్స్ MNE, SoBo ముంబై ఫాల్కన్స్, ARCS అంధేరి జట్లు పాల్గొంటున్నాయి.ఈ లీగ్లో టీమిండియా స్టార్లు, ముంబైకర్లు సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, శివం దూబే, సర్ఫరాజ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, యశస్వి జైస్వాల్, తుషార్ దేశ్ పాండే, అంగ్క్రిష్ రఘువంశీ తదితరులు పాల్గొంటున్నారు. వెటరన్ స్టార్ అజింక్య రహానే కూడా ఈ లీగ్లో భాగమయ్యాడు.చదవండి: కెప్టెన్గా శ్రేయస్.. భువీ రీఎంట్రీ!Dube get a wicket of shreyas iyer 😭😭😭😭 pic.twitter.com/xk5DSo1wdf— sabas csk (@saba9361) June 2, 2026 -
12 మ్యాచ్లు.. 40 రోజులు! టీమిండియా ఫ్యాన్స్కు పండగే
న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు 2026 ఏడాదికిగాను తమ హోమ్ సీజన్ షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించింది. ఇందులో భాగంగా కివీస్ జట్టు భారత్తో చారిత్రత్మక సిరీస్లో తలపడనుంది. భారత జట్టు ఈ ఏడాది అక్టోబర్లో న్యూజిలాండ్ పర్యటనకు రానుంది.ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. కివీస్ గడ్డపై ఒకే పర్యటనలో ఇంత పెద్ద మొత్తంలో (12 మ్యాచ్లు) సిరీస్ నిర్వహించడం ఇదే మొదటిసారి. తొలుత టీ20 సిరీస్, ఆ తర్వాత వన్డే, టెస్ట్ మ్యాచ్లు జరగనున్నాయి.స్వదేశంలో వెస్టిండీస్తో వైట్ బాల్ సిరీస్లు ముగిసిన వెంటనే టీమిండియా న్యూజిలాండ్కు పయనం కానుంది. భారత జట్టు దాదాపు రెండు నెలల పాటు న్యూజిలాండ్లోనే గడపనుంది. 2027 వన్డే ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ ఇరు జట్ల సన్నద్ధతకు ఈ 5 వన్డే మ్యాచ్ల సిరీస్ చాలా ముఖ్యం."భారత్తో సిరీస్ కంటే గొప్పది మరొకటి లేదు. న్యూజిలాండ్ క్రీడాభిమానులకు ముందెన్నడూ లేని విధంగా ఒక అద్భుతమైన టూర్ను అందించాలని మేము భావిస్తున్నాం. విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ ఆటగాళ్లు ఇక్కడికి వస్తుండటంతో అభిమానుల సందడి, క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలోనే ఒకే టూర్లో స్వదేశంలో 12 మ్యాచ్లు నిర్వహించడం ఇదే తొలిసారి. భారత జట్టు రాక కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాం. భారత్ ఆడే ప్రతీ మ్యాచ్ టిక్కెట్లు పూర్తిగా అమ్ముడవుతాయని మేము ఆశిస్తున్నామని" న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రతినిధి గ్లెన్ క్రిచ్లీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా 2024లో భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ జట్టు.. టీమిండియాను టెస్ట్ సిరీస్లో క్లీన్ స్వీప్ చేసి షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత గతేడాది వన్డే సిరీస్ కూడా కివీస్కు భారత్ సమర్పించుకుంది. ఈ పరాభవాలకు ప్రతీకారం తీర్చుకుంటూ.. కివీస్ గడ్డపైనే వారికి గట్టి బుద్ది చెప్పాలని మెన్ ఇన్ బ్లూ పట్టుదలతో ఉంది.మ్యాచ్ల పూర్తి వివరాలు, వేదికలు:టీ20 సిరీస్ (అక్టోబర్ 22 - నవంబర్ 01)అక్టోబర్ 22: మొదటి టి20 – క్రైస్ట్చర్చ్ అక్టోబర్ 24: రెండో టి20 – క్రైస్ట్చర్చ్ అక్టోబర్ 27: మూడో టి20 – వెల్లింగ్టన్ అక్టోబర్ 30: నాలుగో టి20 – ఆక్లాండ్ నవంబర్ 01: ఐదో టి20 – హామిల్టన్వన్డే సిరీస్ (నవంబర్ 04 - నవంబర్ 15)నవంబర్ 04: మొదటి వన్డే – ఆక్లాండ్నవంబర్ 07: రెండో వన్డే – వెల్లింగ్టన్ నవంబర్ 10: మూడో వన్డే – హామిల్టన్నవంబర్ 13: నాలుగో వన్డే – మౌంట్ మాంగనుయ్నవంబర్ 15: ఐదో వన్డే – మౌంట్ మాంగనుయ్ టెస్ట్ సిరీస్ (నవంబర్ 19 - డిసెంబర్ 01)నవంబర్ 19-23: మొదటి టెస్ట్ – వెల్లింగ్టన్ నవంబర్ 27-డిసెంబర్ 01: రెండో టెస్ట్ –క్రైస్ట్ చర్చ్ -
ప్రతీకారం తీర్చుకున్న ఆసీస్.. రెండో వన్డేలో పాక్ చిత్తు
పాకిస్తాన్తో తొలి వన్డేలో ఎదురైన ఓటమికి ఆస్ట్రేలియా బదులు తీర్చుకుంది. మంగళవారం లహోర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య పాక్ను 41 పరుగుల తేడాతో ఆసీస్ చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను 1-1తో కంగారులు సమం చేశారు. లహోర్ వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు పాక్ స్పిన్నర్లు అరాఫత్ మిన్హాస్, అబ్రార్ అహ్మద్లు ఊహించని షాకిచ్చారు.వారి ధాటికి పర్యాటక జట్టు కేవలం 51 పరుగులకే మూడు కీలక వికెట్లు (అలెక్స్ క్యారీ 0, మాట్ షార్ట్ 15, మార్నస్ లబుషేన్ 5) కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో కెప్టెన్ జోష్ ఇంగ్లిష్, కామెరూన్ గ్రీన్(53) అద్భుతంగా ఆడి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ఇంగ్లిష్(74 బంతుల్లో 5 ఫోర్లతో 51 పరుగులు) హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత అరాఫత్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇంగ్లిస్ ఔటైన తర్వాత గ్రీన్ కూడా పెవిలియన్కు చేరాడు.అనంతరం రెన్షా (43 బంతుల్లో 43, మూడు ఫోర్లు), ఆలివర్ పీక్ (32 బంతుల్లో 31, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) కూడా తమ బ్యాట్కు పనిచెప్పారు. దీంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో షాహీన్ షా అఫ్రిది మూడు, హారిస్ రవూఫ్, మిన్హాస్, అబ్రార్ తలా రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు.నిప్పులు చెరిగిన ఎల్లిస్అనంతరం 232 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్కు ఆస్ట్రేలియా బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా పేసర్ నాథన్ ఎల్లిస్ నాలుగు వికెట్లు పడగొట్టి పాక్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు మాథ్యూ షార్ట్ కూడా 3 వికెట్లతో సత్తాచాటాడు. ఫలితంగా పాకిస్తాన్ 44 ఓవర్లలో 190 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో షాదాబ్ ఖాన్(71) ఒంటరి పోరాటం చేసినప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. ఇరు జట్ల మధ్య సిరీస్ డిసైడర్ లహోర్ వేదికగా జూన్ 4న జరగనుంది. -
హార్దిక్, రోహిత్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు.. ఒకవేళ అదే జరిగితే?
అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు ముందు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఫిట్నెస్ను పరీక్షించుకునేందుకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)కి వెళ్లనున్నాడు. వారం రోజుల పాటు అతను ఇక్కడ ఉండి వివిధ రకాల డ్రిల్స్లో పాల్గొనడంతోపాటు ‘మ్యాచ్ సిమ్యులేషన్స్’లో సాధన చేస్తాడు. ఐపీఎల్లో గాయం కారణంగా నాలుగు మ్యాచ్లకు దూరమైన అతను కోలుకొని మళ్లీ బరిలోకి దిగాడు.అయితే భారత వన్డే జట్టులోకి ఎంపిక కావడంలో బీసీసీఐ వైద్య బృందం అతడిని ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిందిగా సూచించింది. ఫిట్గా ఉంటేనే టీమ్లో అతని ఎంపిక ఖాయమవుతుంది. దాంతో పాండ్యా సీఓఈకి చేరాడు. పాండ్యాతో పాటు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను కూడా సీఓఈలో హాజరు కావాలని వైద్యులు చెప్పగా... ఇప్పటి వరకు రోహిత్ విషయంలో మాత్రం ఎలాంటి సమాచారం లేదు. హిట్మ్యాన్ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు.ఈ గాయం కారణంగానే ఇటీవల ముగిసిన ఐపీఎల్-2026లో రోహిత్ నాలుగు మ్యాచ్లకు దూరమయ్యాడు. అంతేకాకుండా ఈ ముంబైకర్ దాదాపు చాలా మ్యాచ్లలో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగాడు. అఫ్గానిస్తాన్తో వన్డేలకు రోహిత్ ఎంపికైనప్పటికి.. తన ఫిట్నెస్ను మాత్రం నిరూపించుకోవాల్సి ఉంది. ఒకవేళ ఫిట్నెస్ పరీక్షలో రోహిత్ విఫలమైతే ఈ వన్డే సిరీస్కు దూరం కానున్నాడు. అతడికి బ్యాకప్గా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ రిజర్వ్లో ఉంచినట్లు తెలుస్తోంది. అఫ్గాన్తో వన్డే సిరీస్ జూన్ 13 నుంచి ప్రారంభం కానుంది.అఫ్గాన్తో వన్డేలకు భారత జట్టు ఇదే:శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ(ఫిట్నెస్ లోబడి), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.చదవండి: IND vs AFG: టీమిండియా కెప్టెన్గా కేఎల్ రాహుల్? -
మూడో టీ20లో భారత్ ఓటమి.. సిరీస్ ఇంగ్లండ్దే
టౌంటన్ వేదికగా ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తద్వారా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-1 తేడాతో భారత్ కోల్పోయింది. టీ20 ప్రపంచకప్-2026 సన్నాహాల్లో భాగంగా జరిగిన ఈ సిరీస్లో మన అమ్మాయిల జట్టు ఆకట్టుకోలేకపోయింది. తొలి మ్యాచ్లో గెలుపొందిన హర్మన్ సేన.. ఆఖరి రెండు మ్యాచ్లలో తేలిపోయింది.సిరీస్ డిసైడర్ అయిన మూడో టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (56) టాప్ స్కోరర్గా నిలవగా.. యాస్తికా భాటియా(32), దీప్తి శర్మ(32) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్ రెండు వికెట్లు పడగొట్టగా.. స్మిత్, డీన్ తలా వికెట్ సాధించారు.అనంతరం 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్కు భారత బౌలర్లు ఆదిలోనే షాకిచ్చారు. ఇంగ్లీష్ జట్టు 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఆలిస్ క్యాప్సే (82), హీథర్ నైట్ (70*) అద్భుతమైన ఇన్నింగ్స్లతో ఇంగ్లండ్ను గెలిపించారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 137 పరుగుల మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్ తలా రెండు వికెట్లు తీశారు.చదవండి: IND vs AFG: టీమిండియా కెప్టెన్గా కేఎల్ రాహుల్? -
టీమిండియా కెప్టెన్గా కేఎల్ రాహుల్?
అఫ్గానిస్తాన్తో ఈ నెల 6 నుంచి జరిగే ఏకైక టెస్టు మ్యాచ్ కోసం భారత జట్టు సన్నద్ధమవుతోంది. మంగళవారం ముల్లాన్పూర్కు చేరుకున్న టీమిండియా తమ ప్రాక్టీస్ను మొదలు పెట్టింది. ఈ మ్యాచ్ కోసం రెగ్యులర్ టీమ్ సభ్యులతో పాటు అదనంగా నెట్ ప్రాక్టీస్ కోసం ఆరుగురు బౌలర్లను బీసీసీఐ ఎంపిక చేసింది. పేసర్లు ఆఖిబ్ నబీ, ప్రిన్స్ యాదవ్, గుర్జప్నీత్ సింగ్ పేస్ బౌలింగ్ను నెట్స్లో భారత బ్యాటర్లు ఎదుర్కోనున్నారు.లెగ్ స్పిన్నర్ జీషాన్ అన్సారి, ఎడంచేతి వాటం మణికట్టు స్పిన్నర్ శివాంగ్ కుమార్, ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. టెస్టు జట్టులోని ప్రధాన పేసర్లు సిరాజ్, ప్రసిధ్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఐదు రోజుల వ్యవధిలో మూడు కీలక మ్యాచ్లు ఆడి తీవ్రంగా అలసిపోయారు.వేడి వాతావరణం నేపథ్యంలో వారికి తగినంత విశ్రాంతినిచ్చేందుకు నెట్ బౌలర్ల అవసరం ఏర్పడిందని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. టెస్టుకు ముందు భారత బ్యాటర్లకు తగినంత ప్రాక్టీస్ అవసరమని, అందుకే అదనపు బౌలర్లను ఎంపిక చేశామని ఆయన అభిప్రాయపడ్డారు.కెప్టెన్గా రాహుల్!కాగా ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే ఆటగాళ్లు ముల్లన్పూర్ చేరుకోవాల్సి ఉన్నప్పటికీ, కొంతమంది కీలక ఆటగాళ్లు ఇంకా జట్టుతో కలవలేదు. ఈ జాబితాలో కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు తన సహచరులు సాయి సుదర్శన్, మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్ ఉన్నారు. వీరంతా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడిన గుజరాత్ జట్టులో భాగంగా ఉన్నారు.అయితే ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత గుజరాత్ టైటాన్స్ జట్టు ప్రయాణిస్తున్న బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఊహించని ఘటన వల్ల గుజరాత్ ఆటగాళ్లు తొలి బృందంతో కలిసి చండీగడ్కు చేరుకోలేకపోయారని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్కు గిల్తో పాటు పేసర్ మహ్మద్ సిరాజ్కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గిల్ స్ధానంలో కేఎల్ రాహుల్ జట్టును నడిపించనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అదేవిధంగా సిరాజ్ స్ధానంలో గుర్నూర్ బ్రార్ టెస్ట్ అరంగేట్రం చేసే అవకాశముంది.ఆఫ్ఘనిస్తాన్ టెస్టుకు భారత జట్టుశుభమన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్, హర్ష్ దూబే, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్)నెట్ బౌలర్లు: గుర్జప్నీత్ సింగ్, అకిబ్ నబీ, ప్రిన్స్ యాదవ్, శరన్ష్ జైన్, జీషన్ అన్సారీ, శివంగ్ కుమార్ -
రెండో వన్డేలోనూ రెచ్చిపోయిన పాక్ బౌలర్లు
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో పాకిస్తాన్ బౌలర్లు చెలరేగుతున్నారు. ఈ సిరీస్ తొలి మ్యాచ్లో ఆసీస్ను 200 పరుగులకే ఆలౌట్ చేసి, ఆతర్వాత సునాయాస విజయం సాధించిన పాక్ జట్టు.. ఇవాళ (జూన్ 2) జరుగుతున్న రెండో వన్డేలోనూ ఆసీస్పై పట్టు బిగించింది.లాహోర్లోని గడాఫీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పాక్.. ఆసీస్ను 231 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) పరిమితం చేసింది. తొలి వన్డేలో ఐదు వికెట్లతో చెలరేగిన లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ అరాఫత్ మిన్హాస్ (10-2-27-2) ఈ మ్యాచ్లోనూ సత్తా చాటాడు.అరాఫత్తో పాటు మరో స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (10-1-34-2), పేసర్లు షాహీన్ అఫ్రిది (8-1-36-3), హరీస్ రౌఫ్ (10-1-49-2) కూడా రాణించడంతో ఆసీస్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఆసీస్ ఇన్నింగ్స్లో ఇంగ్లిస్ (51), కెమరూన్ గ్రీన్ (53), మ్యాట్ రెన్షా (43), ఒలివర్ పీక్ (31) మినహా మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. ఓపెనర్గా బరిలోకి దిగిన అలెక్స్ క్యారీ డకౌట్ కాగా.. మరో ఓపెనర్ మాథ్యూ షార్ట్ 15, లబూషేన్ 5, కుహ్నేమన్ 5, నాథన్ ఇల్లిస్ 5 పరుగులకు ఔటయ్యారు. -
కెప్టెన్గా శ్రేయస్.. భువీ రీఎంట్రీ..!
భారత్-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య తొలిసారి ద్వైపాక్షిక టీ20 సిరీస్ జరుగనుందన్న ఓ వార్త ఇవాళ (జూన్ 2) సోషల్మీడియాలో వైరలైంది. ఈ సిరీస్ ఈ ఏడాది సెప్టెంబర్లో న్యూఢిల్లీలో జరుగనుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ చారిత్రక సిరీస్లో భారత జట్టు ఎలా ఉండబోతుందోనన్న అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి.ఈ సిరీస్ కోసం ఐపీఎల్ స్టార్లకు అధిక అవకాశాలు ఇవ్వవొచ్చని అభిమానులు భావిస్తున్నారు. ఈ అంచనాల ప్రకారం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. వికెట్కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించవచ్చు. వీరిద్దరూ ఇటీవలికాలంలో కెప్టెన్సీ బాధ్యతలను సమర్దవంతంగా నిర్వర్తించడంతో పాటు వ్యక్తిగతంగానూ విశేషంగా రాణించారు.ఐపీఎల్ 2026 పెను సంచలనం, రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి ఈ జట్టులో చోటు దక్కడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే తాజా ఐపీఎల్ సీజన్లో అద్భుతంగా రాణించిన పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్, సాయి సుదర్శన్లకు కూడా ఈ జట్టులో చోటు ఖాయమని అనుకుంటున్నారు.మిడిలార్డర్లో ఆర్సీబీకి రెండుసార్లు టైటిల్ అందించిన రజత్ పాటిదార్, ముంబై ఇండియన్స్ ఆటగాడు నమన్ ధిర్, ఢిల్లీ విధ్వంసకర బ్యాటర్ అశుతోష్ శర్మ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.ఆల్రౌండర్లుగా ఆర్సీబీ సంచలనాలు కృనాల్ పాండ్యా, రసిక్ సలాం దార్కు చోటు దక్కవచ్చని అంచనా.బౌలింగ్ విషయానికొస్తే.. ఆర్సీబీ వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ పేరు అందరి నోటా వినిపిస్తుంది. ఈ సిరీస్తో అతడు రీఎంట్రీ ఇవ్వడం ఖాయమని అంతా భావిస్తున్నారు. మిగతా పేసర్లుగా సీఎస్కే అన్షుల్ కంబోజ్, కేకేఆర్ కార్తీక్ త్యాగి, లక్నో ప్రిన్స్ యాదవ్లకు అవకాశం దక్కవచ్చనే అంచనాలు ఉన్నాయి. స్పిన్ బాధ్యతలు రవి బిష్ణోయ్కు అప్పగించవచ్చనే ప్రచారం జరుగుతుంది.అంచనా భారత జట్టు:వైభవ్ సూర్యవంశీ, ప్రభ్సిమ్రన్ సింగ్, సాయి సుదర్శన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రజత్ పాటిదార్, ఇషాన్ కిషన్ (వైస్ కెప్టెన్), నమన్ ధిర్, ఆశుతోష్ శర్మ, కృనాల్ పాండ్యా, రసిక్ సలామ్, అన్షుల్ కంబోజ్, కార్తిక్ త్యాగి, ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్.ఇదిలా ఉంటే, ఈ జట్టు అధికారిక జట్టు కాదు. ఐపీఎల్ ప్రదర్శనలు, ప్రస్తుత ఫామ్, జట్టు అవసరాలను ఆధారంగా చేసుకుని రూపొందించిన అంచనా జట్టు మాత్రమే. ఈ సిరీస్పై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన కూడా లేదు. ఇది కేవలం సోషల్మీడియాలో ప్రచారం మాత్రమే. ఈ సిరీస్ విషయాన్ని పక్కన పెడితే.. జూన్ 6 నుంచి భారత్-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్, 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ల కోసం భారత జట్లను ఇదివరకే ప్రకటించారు. -
పంజాబ్ స్పిన్ కింగ్కు టీమిండియా కీలక పదవి
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ స్పిన్ బౌలింగ్ కోచ్గా వ్యవహరించిన సాయిరాజ్ బహుతులేకు టీమిండియాలో కీలక పదవి దక్కింది. ఈ మాజీ లెగ్ స్పిన్నర్ను టీమిండియా ప్రత్యేక స్పిన్ బౌలింగ్ కోచ్గా నియమించారు. ఈ విషయాన్ని బీసీసీఐ ఇవాళ (జూన్ 2) అధికారికంగా ప్రకటించింది. మాజీ టీమిండియా ఆటగాడిగా, దేశీయ క్రికెట్లో దిగ్గజ ఆల్రౌండర్గా గుర్తింపు పొందిన బహుతులేకు ఆటగాడిగా, కోచ్గా విశేష అనుభవం ఉంది. ముఖ్యంగా యువ స్పిన్నర్లను తీర్చిదిద్దడంలో, వారి ప్రతిభను మెరుగుపరచడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో భారత జట్టు స్పిన్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఆయనకు ఈ బాధ్యతలను అప్పగించింది.బహుతులే భారత్ తరఫున రెండు టెస్టులు, ఎనిమిది వన్డేలు ఆడాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన ఫస్ట్క్లాస్ కెరీర్లో 6,176 పరుగులు చేసి, 630 వికెట్లు సాధించి దేశీయ క్రికెట్లో అత్యంత విజయవంతమైన ఆల్రౌండర్లలో ఒకరిగా నిలిచాడు.కోచ్గా కూడా బహుతులే విజయవంతమైన ప్రయాణం కొనసాగించాడు. విదర్భ, కేరళ, గుజరాత్, బెంగాల్ దేశవాలీ జట్లకు హెడ్ కోచ్గా సేవలందించాడు. అలాగే ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్తో పాటు రాజస్థాన్ రాయల్స్కు సుదీర్ఘంగా స్పిన్ బౌలింగ్ కోచ్గా పని చేశాడు.భారత క్రికెట్ అభివృద్ధి కార్యక్రమాల్లోనూ బహుతులే కీలక పాత్ర పోషించాడు. 2022 ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు బౌలింగ్ కోచ్గా వ్యవహరించాడు. 2024 అండర్-19 ప్రపంచకప్లో కూడా కోచింగ్ సిబ్బందిలో సభ్యుడిగా ఉన్నాడు. అదనంగా ఇండియా-ఏ, సీనియర్ జట్లతో పలు పర్యాయాలు ప్రత్యేక బౌలింగ్ కోచ్గా పని చేశాడు.2021 నుంచి 2024 వరకు బీసీసీఐ నిర్వహించే నేషనల్ క్రికెట్ అకాడమీ (ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్)లో కూడా కోచింగ్ బృందంలో కీలక సభ్యుడిగా కొనసాగాడు. యువ ఆటగాళ్ల అభివృద్ధిలో ఆయన చేసిన కృషి బీసీసీఐని ఆకట్టుకుంది.తన నియామకంపై స్పందించిన సాయిరాజ్ బహుతులే, భారత జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్గా ఎంపిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నాడు. ఆటగాడిగా భారత్కు ప్రాతినిధ్యం వహించడం ఎంత గర్వకారణమో, కోచ్గా సేవలందించడం కూడా అంతే ప్రత్యేకమని అన్నాడు. -
వారెవ్వా కోహ్లీ.. రోజు వ్యవధిలో ఎంత మార్పు!
ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు వృందావనంలోని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని మంగవారం సందర్శించారు. ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత ఆర్సీబీ బ్యాటర్ కోహ్లీ తన భార్య అనుష్కతో కలిసి ఆధ్యాత్మిక ఆశ్రమానికి వచ్చాడు. ప్రేమానంద్ మహారాజ్కు చెందిన రాధా కేళీ కుంజ్ ఆశ్రమానికి వెళ్లారు. కాగా కోహ్లీ, అనుష్క దంపతులు ఇప్పటికే అనేక సార్లు ఆశ్రమాన్ని విజిట్ చేశారు. ఆశ్రమానికి వెళ్లి బయటకు వస్తున్న కోహ్లీ, అనుష్కకు సంబంధించిన వీడియోలు, ఫొటోలే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చాలా సింపుల్ డ్రెస్సులో ఇద్దరూ ఆశ్రమానికి వెళ్లారు. మాస్క్లతో తమ ముఖాన్ని కవర్ చేసుకున్నారు. ప్రేమానంద్ ఆధ్యాత్మిక బోధనలు వినేందుకు తరుచూ అనుష్క, కోహ్లీ జంట ఆశ్రమానికి వెళ్తుంటారు. ఇది చూసిన ఆర్సీబీ అభిమానులు.. ‘వారెవ్వా కోహ్లీ.. ఒక్కరోజులో ఎంత మార్పు’..‘టైటిల్ టు ఆధ్యాత్మికం వైపు అడుగులు’ అంటూ కామెంట్లు చేశారు.గత ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్పై ఆర్సీబీ విజయం సాధించింది. అయితే ట్రోఫీ పట్టుకున్న సమయంలో కోహ్లీ నుదురుపై అనుష్కా కిస్ ఇచ్చింది.ఆ తర్వాత ఆర్సీబీ గెలుపు సంబరాలకు సంబంధించిన ఒక ఈవెంట్లోనూ విరుష్క జంట అదిరిపోయే స్టెప్పులతో అలరించారు. 🎥 | Virat Kohli and Anushka Sharma’s visit to #PremanandMaharaj’s Radha Keli Kunj Ashram in #Vrindavan has gone viral on #socialmedia, with a video showing the couple seeking blessings from the spiritual leader. The visit came days after #RCB’s historic #IPL title triumph, and… pic.twitter.com/QPucsbjK6i— The Statesman (@TheStatesmanLtd) June 2, 2026చదవండి: 'మాట తప్పిన మూర్ఖుడు.. అత్యంత చెత్త యజమాని!' -
ఐపీఎల్ తర్వాత కూడా 'స్కై' వైఫల్యాలు కొనసాగింపు
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వైఫల్యాల పరంపర ఐపీఎల్ 2026 తర్వాత కూడా కొనసాగుతోంది. క్యాష్ రిచ్ లీగ్ తర్వాత ఆడిన తొలి మ్యాచ్లోనే ఈ ముంబై ఇండియన్స్ విధ్వంసకర బ్యాటర్ చేతులెత్తేశాడు. ముంబై టీ20 లీగ్లో ట్రయంప్స్ నైట్స్ ఎంఎన్ఈకి ఆడుతున్న స్కై.. నార్త్ ముంబై పాంథర్స్తో జరిగిన మ్యాచ్లో 11 బంతుల్లో 19 పరుగులు (4 ఫోర్లు) మాత్రమే చేసి ఔటయ్యాడు.తాజా వైఫల్యం తర్వాత స్కై టీమిండియా భవిష్యత్తు మరోసారి చర్చనీయాంశంగా మారింది. స్కైను భారత టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి తొలగించడమే కాకుండా, జట్టు నుంచి కూడా తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ సైతం స్కైకు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.స్కై గతకొంతకాలంగా టీ20 ఫార్మాట్లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఐపీఎల్ 2026 అతడు 13 మ్యాచ్ల్లో కేవలం రెండు సార్లు మాత్రమే హాఫ్ సెంచరీ మార్కు తాకాడు. అంతకుముందు టీమిండియా ఛాంపియన్గా నిలిచిన టీ20 వరల్డ్కప్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. 9 మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. అది కూడా పసికూన యూఎస్ఏపై.ఈ వరుస వైఫల్యాల నేపథ్యంలో స్కైకు వ్యతిరేకులు ఎక్కువయ్యారు. తాజా వైఫల్యం తర్వాత సోషల్ మీడియాలో అభిమానుల స్పందనలు వైరల్గా మారాయి. కొందరు అతడికి మద్దతుగా నిలబడుతుంటే.. మరికొందరు వ్యతిరేకంగా భారీ క్యాంపెయినింగ్ చేస్తున్నారు.ముంబై టీ20 లీగ్లో స్కై వైఫల్యం అతడి జట్టు కొంప ముంచింది. కీలక దశలో ఔట్ కావడంతో అతడి జట్టు ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కై ప్రత్యర్ది జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన స్కై జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 188 పరుగులకే పరిమితమై, 21 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ముంబై టీ20 లీగ్లో స్కైతో పాటు చాలామంది టీమిండియా స్టార్లు పాల్గొంటున్న విషయం తెలిసిందే. -
'మాట తప్పిన మూర్ఖుడు.. అత్యంత చెత్త యజమాని!'
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ చైర్మన్ లలిత్ మోదీ లక్నో సూపర్జెయింట్స్ ప్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే సంజీవ్ గోయెంకా అత్యంత చెత్త యజమాని అని, అతడో మాట తప్పిన మూర్ఖుడిగా అభివర్ణించాడు. నిలకడ లేని వక్తి ఎవరైనా ఉన్నారంటే అది సంజీవ్ గోయెంకానే అంటూ ఘాటుగా పేర్కొన్నాడు. ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ పాడ్కాస్ట్ ఇంటర్య్వూలో లలిత్ మోదీ ఈ వ్యాఖ్యలు చేశాడు. లలిత్ మోదీ మాట్లాడుతూ.. ‘అతడికి (గోయెంకా) ఒక ఫ్రాంచైజీని కొనడం కానీ, నడిపించే హక్కు కానీ లేదు. సంజీవ్ గోయెంకా ఒక బిజినెస్ మైండ్ కలిగిన వ్యక్తి. తన విద్యుత్ వ్యాపారానికి పరిమితమవ్వాల్సింది. అనవసరంగా ఐపీఎల్లో ఫ్రాంచైజీని కొని చేతులు కాల్చుకున్నాడు. లక్నో సూపర్జెయింట్స్ను కొనుగోలు చేయడం వల్ల ఐపీఎల్ రేటింగ్ తగ్గుదలకు సంజీవ్ కారణమయ్యాడు. లక్నో జట్టు కూడా ప్రతీ సీజన్లో పేలవమైన ప్రదర్శననే కనబరుస్తూ వస్తోంది. ఈసారి కూడా లక్నో ఒట్టి చేతులతోనే లీగ్ నుంచి నిష్క్రమించడంతో సంజీవ్ గోయెంకా మీమర్స్కు దొరికిపోయారు. ఇప్పుడాయన ఒక మీమ్ కింగ్ అయిపోయారు.’ అంటూ లలిత్ మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. గోయెంకాపై వచ్చిన మీమ్స్లో అత్యధిక మంది చూసిన మీమ్కు కృతజ్ఞతగా రోలెక్స్ వాచీని బహుమతిగా ఇస్తానని లలిత్ మోదీ ఆఫర్ చేయడం గమనార్హం. ఇక అవకాశం దొరికినప్పుడల్లా సంజీవ్ గోయెంకాపై లలిత్ మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించడం పరిపాటిగా మారిపోయింది. ఈ సీజన్లో ఒక మ్యాచ్లో ఓటమి చెందడంపై జట్టు మాజీ కెప్టెన్ రిషబ్ పంత్తో సంజీవ్ గోయెంకా వాడీ వేడీ చర్చ జరపడంపై లలిత్ మోదీ కౌంటర్ ఇచ్చాడు. అయితే సీజన్లో లక్నో ఆట ముగిసిన తర్వాత ఆ జట్టు పంత్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామంపై స్పందించిన లలిత్ మోదీ.. ‘పంత్కు దీర్ఘకాలం అండగా ఉంటానన్న ఒక పెద్ద మనిషి (సంజీవ్ గోయెంకా) తన వాగ్ధానాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు’ అంటూ విమర్శలు సంధించాడు. ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్జెయింట్స్ దారుణ ఆటతీరు కనబరిచింది. సీజన్లో 14 మ్యాచ్లాడిన లక్నో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.చదవండి: సింధూ శుభారంభం.. అసలు గండం ముందుంది! -
కేన్-సాంట్నర్ ఫైట్.. 'బాక్స్' యుద్దం
క్రికెట్లో ఆటగాళ్ల భద్రతకు గత మూడు దశాబ్దాల్లో విపరీతమైన ప్రాధాన్యం పెరిగింది. హెల్మెట్లు, ప్యాడ్లు, గ్లోవ్స్, ఛెస్ట్ గార్డులు, ఆర్మ్ ప్రొటెక్టర్లు వంటి పరికరాలు ఆధునిక సాంకేతికతతో మరింత సురక్షితంగా మారాయి. అయితే పురుష క్రికెటర్లకు అత్యంత సున్నితమైన భాగాన్ని రక్షించే 'అబ్డొమినల్ గార్డ్' లేదా 'బాక్స్' విషయంలో మాత్రం పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. దాదాపు 1970ల నుంచి వాడుతున్న డిజైన్నే ఇప్పటికీ ఎక్కువ మంది ఆటగాళ్లు ఉపయోగిస్తున్నారు.ఇటీవల ఆటగాళ్ల భద్రతపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఈ అంశం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ముఖ్యంగా టీమిండియా బ్యాటర్ తిలక్ వర్మ టెస్టిక్యులర్ టార్షన్తో బాధపడిన ఘటన తర్వాత క్రికెటర్ల రక్షణ పరికరాలపై కొత్త చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్కు చెందిన ఇద్దరు మాజీ, ప్రస్తుత క్రికెటర్ల కుటుంబాలు అభివృద్ధి చేసిన రెండు కొత్త తరహా అబ్డొమినల్ గార్డులు ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో ఆసక్తికర పోటీకి కారణమయ్యాయి.కేన్ విలియమ్సన్ తన సంస్థ 'కవర్' (Cover) ద్వారా కొత్త తరహా బాక్స్ను మార్కెట్లోకి తీసుకొచ్చాడు. అల్యూమినియం మిశ్రమంతో తయారైన ఈ గార్డ్ పగలకుండా ఉండేలా ప్రత్యేకంగా రూపొందించబడింది. అంతేకాకుండా షాక్ను గ్రహించే ప్రత్యేక ఫోమ్ను కూడా ఇందులో ఉపయోగించారు. గతంలో తాను వాడిన గార్డులు దెబ్బతిన్న అనుభవాల నేపథ్యంలో మరింత బలమైన ఉత్పత్తిని రూపొందించినట్లు విలియమ్సన్ చెబుతున్నాడు.మరోవైపు మిచెల్ సాంట్నర్ సోదరుడు ఎలియట్ సాంట్నర్, ఓటాగో క్రికెటర్ రూబెన్ క్లింటన్ కలిసి 'ట్రూగార్డ్' (TruGuard) అనే ఉత్పత్తిని అభివృద్ధి చేశారు. ఇది ప్లాస్టిక్తో తయారైనప్పటికీ 'జైరాయిడ్ లాటిస్' అనే ప్రత్యేక నిర్మాణాన్ని ఉపయోగించి, విస్తృత ప్రాంతంలో ప్రభావాన్ని విభజించేలా రూపొందించారు. తేనెగూడు ఆకృతిని పోలిన ఈ నిర్మాణం దెబ్బ తీవ్రతను గణనీయంగా తగ్గిస్తుందని వారు చెబుతున్నారు.ఈ రెండు ఉత్పత్తులు ఇప్పటికే పలువురు ప్రొఫెషనల్ క్రికెటర్ల దృష్టిని ఆకర్షించాయి. అయితే అసలు పరీక్ష మాత్రం జూన్ 4 నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లండ్-న్యూజిలాండ్ వన్డే సిరీస్ సందర్భంగా జరగనుంది. లార్డ్స్ వేదికగా జరిగే మ్యాచ్లలో న్యూజిలాండ్ ఆటగాళ్లు ఈ రెండు కంపెనీల ఉత్పత్తులను ఉపయోగించే అవకాశం ఉంది. మైదానంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు పోటీపడుతుండగా, మైదానం వెలుపల విలియమ్సన్ 'కవర్', సాంట్నర్ కుటుంబం 'ట్రూగార్డ్' మధ్య ఆసక్తికర పోటీ నెలకొననుంది.ఐపీఎల్ 2026లో కేన్ విలియమ్సన్ లక్నో మెంటార్గా వ్యవహరించిన సమయంలో తన ఉత్పత్తిని ఆటగాళ్లకు పరిచయం చేశాడు. ఓ మ్యాచ్లో మిచెల్ మార్ష్కు బంతి బలంగా బాక్స్పై తాకినా పెద్దగా ఇబ్బంది లేకుండా ఆడటం ఈ ఉత్పత్తికి మంచి ప్రచారం తీసుకొచ్చింది. ఆ ఘటన తర్వాత విలియమ్సన్కు మార్ష్ థంబ్స్అప్ చూపించడం కూడా సోషల్ మీడియాలో వైరలైంది. -
హెడ్కోచ్గా ఆండ్రూ ఫ్లింటాఫ్
ఇంగ్లండ్ మాజీ ఆల్రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తొలిసారి విదేశీ లీగ్లో కోచ్గా వ్యవహరించనున్నాడు. ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) ఫ్రాంఛైజీ సిడ్నీ థండర్ తమ హెడ్కోచ్గా ఫ్లింటాఫ్ను నియమించింది. ఇందుకు సంబంధించి మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఒకసారి ఫైనల్.. కానీ రెండుసార్లు..కాగా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ట్రెవర్ బేలిస్ గత ఐదేళ్లుగా సిడ్నీ థండర్కు హెడ్కోచ్గా వ్యవహరిస్తున్నాడు. అతడి మార్గదర్శనంలోనే 2024-2025లో జట్టు ఫైనల్కు చేరింది. అయితే, 2023-24, 2025-26 సీజన్లలో మాత్రం దారుణంగా పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.ఈ నేపథ్యంలో సిడ్నీ థండర్ బేలిస్పై వేటు వేసి అతడి స్థానంలో ఆండ్రూ ఫ్లింటాఫ్ను తీసుకువచ్చింది. కాగా ఫ్లింటాఫ్ గతంలో ది హండ్రెడ్ లీగ్లో నార్తర్న్ సూపర్చార్జర్స్కు కోచ్గా పనిచేశాడు.అత్యుత్తమ ఆల్రౌండర్అంతేకాదు.. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్లకు 2023-24 సీజన్కు గానూ కన్సల్టెంట్గా ఫ్లింటాఫ్ వ్యవహరించాడు. అదే విధంగా ఇంగ్లండ్ లయన్స్ జట్టుకు మార్గదర్శనం చేశాడు. కాగా ఇంగ్లండ్ అందించిన అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఆండ్రూ ఫ్లింటాఫ్ ఒకడు.అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లండ్ తరఫున 1998- 2010 వరకు ఫ్లింటాఫ్ 79 టెస్టులు, 141 వన్డేలు, 7 టీ20లు ఆడాడు. వన్డేల్లో 3845 పరుగులు చేసిన ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్.. 226 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 3394 పరుగులు చేయడంతో పాటు 169 వికెట్లు కూల్చాడు.ఇక ఏడు టీ20లలో కలిపి 76 పరుగులు చేయడంతో పాటు.. ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు ఆండ్రూ ఫ్లింటాఫ్ . కాగా సిడ్నీ థండర్ తొలుత డాన్ క్రిస్టియన్, షేన్ వాట్సన్లను సంప్రదించినట్లు సమాచారం. అయితే, వారి కంటే 48 ఏళ్ల ఫ్లింటాఫే తమ జట్టుకు సరైన కోచ్ అని భావించి.. అతడితో రెండేళ్లకు ఒప్పందం కుదుర్చుకుంది.చదవండి: ODI WC: రోహిత్ శర్మ ఎందుకిలా చేస్తున్నాడు? -
భారత టెస్ట్ జట్టులో మార్పులు.. ఐపీఎల్ స్టార్లకు ప్రత్యేక అవకాశం
త్వరలో (జూన్ 6 నుంచి) ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే ఏకైక టెస్ట్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ జట్టుకు అదనంగా ఆరుగురు ప్లేయర్లను భారత సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. వీరిలో కొందరు ఐపీఎల్ 2026లో సత్తా చాటిన బౌలర్లు. వీరిని మెయిన్ జట్టులో కాకుండా నెట్ బౌలర్లుగా ఎంపిక చేశారు.బీసీసీఐ అధికారికంగా విడుదల చేసిన జాబితా ప్రకారం.. గుర్జప్నీత్ సింగ్, ఆకిబ్ నబీ, ప్రిన్స్ యాదవ్, సరాన్ష్ జైన్, జీషన్ అన్సారీ, శివాంగ్ కుమార్ ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే ఏకైక టెస్ట్ కోసం భారత జట్టు నెట్ బౌలర్లుగా ఎంపికయ్యారు. వీరు ప్రధాన జట్టులో సభ్యులు కాకపోయినా, భారత బ్యాటర్లకు నెట్ ప్రాక్టీస్లో సహాయపడతారు.పై బౌలర్లను టీమిండియా నెట్ బౌలర్లుగా తీసుకోవడానికి ప్రధాన కారణం ఐపీఎల్ 2026 వల్ల రెగ్యులర్ బౌలర్లపై పడిన శారీరక ఒత్తిడి అని తెలుస్తోంది. ఫైనల్ వరకు ఆడిన మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్ (రెగ్యులర్ జట్టు సభ్యులు) శారీరక అలసట కారణంగా ప్రాక్టీస్ సెషన్స్కు అందుబాటులో ఉండటం లేదు. దీంతో బ్యాటర్లకు సరైన ప్రాక్టీస్ కల్పించేందుకు అదనపు బౌలర్లను ఎంపిక చేశారు.అయితే ఈ ఎంపికలను కేవలం నెట్ బౌలర్ల అవసరంగా మాత్రమే చూడడం లేదు. భారత టెస్టు జట్టు ప్రస్తుతం మార్పుల దశలో ఉంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతిభావంతులైన యువ బౌలర్లను దగ్గరగా పరిశీలించాలనే ఉద్దేశంతోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. జట్టుతో కలిసి శిక్షణ పొందడం ద్వారా అంతర్జాతీయ స్థాయి వాతావరణాన్ని అర్థం చేసుకునే అవకాశం వీరికి లభించనుంది.ఈ ఆరుగురిలో కొందరు దేశీయ క్రికెట్లో అద్భుత ప్రదర్శనలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆకిబ్ నబీ దేశీయ సీజన్లో 10 మ్యాచ్ల్లో 60 వికెట్లు తీసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అలాగే జీషన్ అన్సారీ తన లెగ్స్పిన్తో మంచి పేరు సంపాదించాడు. గుర్జప్నీత్ సింగ్, సరాన్ష్ జైన్ కూడా రెడ్బాల్ క్రికెట్లో నిలకడైన ప్రదర్శనలు చేశారు.ప్రిన్స్ యాదవ్, శివాంగ్ కుమార్లకు ఐపీఎల్ 2026 ప్రదర్శనలు ఈ అవకాశాన్ని తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ప్రిన్స్ యాదవ్ తన వేగం, క్రమశిక్షణతో ఆకట్టుకుని ఇప్పటికే అఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్కు భారత జట్టులో చోటు సంపాదించాడు.అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ముందు భారత జట్టు డ్రెస్సింగ్రూమ్ వాతావరణాన్ని అనుభవించడం యువ ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే ఈ ఆరుగురి ఎంపికను భవిష్యత్ భారత టెస్టు జట్టు నిర్మాణంలో ఒక కీలక అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు. అఫ్ఘనిస్తాన్ టెస్టులో ప్రత్యక్షంగా ఆడే అవకాశం లేకపోయినా, జట్టుతో కలిసి పనిచేసే ఈ అనుభవం వారి కెరీర్కు కీలక మలుపుగా మారే అవకాశముంది.ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్ట్ కోసం భారత రెగ్యులర్ జట్టు..శుభ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషభ్ పంత్, దేవ్దత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ, గూర్నూర్ బ్రార్, ధ్రువ్ జురెల్, హర్ష్ దూబే -
కోహ్లీ, పాటీదార్ కాదు.. ఆర్సీబీ రాత మారింది ఆమె వల్లే!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. పాటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ వరుసగా రెండో ఏడాది చాంపియన్గా నిలిచింది. అయితే ఐపీఎల్ ఆరంభం నుంచి 'ఈ సాలా కప్ నమ్దే' అంటూ 17 ఏళ్లుగా టైటిల్ కోసం చకోర పక్షిలా ఎదురుచూసింది. అప్పటికీ మూడుసార్లు ఫైనల్ చేరినా తుది మెట్టుపై బోల్తా పడడంతో ఇక ఆర్సీబీ టైటిల్ కల కష్టమే అని ఫ్యాన్స్ కూడా ఒక అభిప్రాయానికి వచ్చేశారు.కానీ 17 ఏళ్లలో దక్కని టైటిల్ గతేడాది తమ చెంత చేరడంతో ఆర్సీబీ ఉబ్బితబ్బిబ్బైపోయింది. ఈ సీజన్లో అద్భుత ప్రదర్శనతో ఆర్సీబీ రెండోసారి కప్ ఒడిసిపట్టడంతో రజత్ పాటీదార్ లక్కీ కెప్టెన్ల జాబితాలో చేరిపోయాడు. వరుసగా రెండుసార్లు టైటిల్ సాధించిన మూడో కెప్టెన్గా పాటీదార్ నిలిచాడు. ఈ క్రమంలో పాటీదార్ను ఆర్సీబీకి ట్రోఫీ అందించిన లక్కీ కెప్టెన్ అని పొగుడుతున్నారు.కానీ ఆర్సీబీ రాత అంతకుముందే మారిందని కొంతమంది అభిమానులు పేర్కొంటున్నారు. ఆర్సీబీ పురుషుల జట్టు టైటిల్ సాధించ డానికి ముందే మహిళల జట్టు ఆ ఘనత సాధించింది. స్మృతి మందాన నేతృత్వంలోని ఆర్సీబీ వుమెన్ టీం 2024లోనే తొలి టైటిల్ సాధించింది. అయితే 2023లో మొదలైన డబ్ల్యూపీఎల్లో ఆర్సీబీ మహిళల జట్టు కూడా మొదట్లో ఓటమిబాటలోనే నడిచింది. ఆ సీజన్లో వరుసగా ఐదు మ్యాచ్లలో ఓడిపోయి పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. దీంతో పురుషుల జట్టు మాదిరే మహిళల జట్టు కూడా ట్రోలింగ్కు గురైంది. అయితే మరుసటి సీజన్లోనే మంధాన నేతృత్వంలోని ఆర్సీబీ కమ్బ్యాక్ ఇచ్చింది. ఆ సీజన్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసిన ఆర్సీబీ వుమెన్ తొలిసారి ఫ్రాంచైజీకి టైటిల్ అందించింది. దీంతో కెప్టెన్గా మంధాన పేరు మార్మోగిపోయింది. 2025 సీజన్లో టైటిల్ సాధించడంలో విఫలమైనప్పటికీ, 2026 సీజన్లో మరోసారి ఆర్సీబీ మహిళల జట్టు చాంపియన్గా నిలిచింది. ముఖ్యంగా కెప్టెన్గా, బ్యాటర్గా మంధాన అద్భుత ప్రదర్శన చేసింది. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఫైనల్లో మంధాన 41 బంతుల్లోనే 87 పరుగులు సాధించి ఒంటిచేత్తో ఆర్సీబీకి రెండో కప్పును అందించింది. దీంతో ఆర్సీబీ కూడా చాంపియన్గా నిలవగలదని మంధాన బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చింది. మహిళల జట్టును ఆదర్శంగా తీసుకున్న పురుషుల జట్టు లెగసీని కంటిన్యూ చేస్తూ ఇవాళ వరుసగా రెండోసారి చాంపియన్గా నిలిచింది. రాబోయే రెండు మూడేళ్లు ఆర్సీబీకి చెందిన మహిళల జట్టు డబ్ల్యూపీఎల్లో.. పురుషుల జట్టు ఐపీఎల్లో వరుస టైటిల్స్ సాధించినా ఆశ్చర్యపోనవసరం లేదు.ఆర్సీబీని మార్చిన కోహ్లీ సందేశం..2023 డబ్ల్యూపీఎల్లో వైఫల్యం తర్వాత ఆర్సీబీ మహిళల జట్టుతో కోహ్లీ ప్రత్యేకంగా మాట్లాడాడు. ఈ నేపథ్యంలో మహిళల జట్టుకు 'ఫలితం కోసం ఆశించకుండా 110 శాతం కష్టపడండి' అంటూ కోహ్లీ తన మోటివేషన్ స్పీచ్తో ఆ ఏడాది ఆర్సీబీ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. అలా కోహ్లీ సందేశాన్ని ఒంటబట్టించుకున్న మంధాన సేన 2024 సీజన్లో టైటిల్ను సాధించింది. ఆర్సీబీ తలరాత మార్చింది కోహ్లీ, పాటీదార్ కాదు.. మంధాన అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ ఫన్నీ పోస్టులు పెడుతున్నారు.𝙀𝙚 𝙎𝙖𝙡𝙖 𝘾𝙪𝙥 𝙉𝙖𝙢𝙙𝙪 x 2⃣ 🏆🏆Smriti Mandhana 🤝 Rajat Patidar #TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/QxVAOX8oq2— IndianPremierLeague (@IPL) May 31, 2026చదవండి: షకీరా కూడా పనికిరాదు.. ఫ్యాన్స్ను షేక్చేస్తోన్న ఫిఫా పాట! -
ODI WC: రోహిత్ శర్మ ఎందుకిలా చేస్తున్నాడు?
దాదాపు రెండు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉంది టీమిండియా. భారత జట్టులోని ప్రధాన ఆటగాళ్లంతా ఐపీఎల్-2026తో బిజీ బిజీగా గడిపారు. ఇక ఈ మెగా టోర్నీకి ఆదివారం నాటి ఫైనల్తో తెరపడింది.ఈ నేపథ్యంలో జూన్ 6 నుంచే టీమిండియా రంగంలోకి దిగనుంది. స్వదేశంలో అఫ్గనిస్తాన్తో తొలుత ఓ టెస్టు మ్యాచ్ ఆడి.. ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక అఫ్గన్తో మ్యాచ్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే తమ జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.ఫిట్నెస్లోబడే...శుబ్మన్ గిల్ సారథ్యంలో అఫ్గన్తో ఆడే ఈ జట్లలో వన్డేలకు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంపికయ్యారు. అయితే, వీరిద్దరు ఫిట్నెస్లోబడే ఆడతారని బీసీసీఐ స్పష్టం చేసింది. కాగా ఐపీఎల్-2026లో హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్కు ఆడిన రోహిత్ శర్మ.. సీజన్ మధ్యలో గాయపడ్డాడు.తొడ కండరాల గాయంతో ఐదు మ్యాచ్లకు రోహిత్ దూరమయ్యాడు. ఆ తర్వాత తిరిగి జట్టుతో చేరినా ఇంపాక్ట్ ప్లేయర్గానే బరిలోకి దిగాడు. మరోవైపు.. హార్దిక్ పాండ్యా సైతం వెన్నునొప్పితో నాలుగు మ్యాచ్లు ఆడలేకపోయాడు.క్లియరెన్స్ వస్తేనే..ఈ నేపథ్యంలో రోహిత్, హార్దిక్లను అఫ్గన్తో సిరీస్కు ఎంపిక చేసినప్పటికీ.. ఫిట్నెస్ ఆధారంగానే వారు ఆడతారో, లేదో తేలుతుందని బీసీసీఐ జట్టు ప్రకటన సమయంలో వెల్లడించింది. అదే విధంగా.. వీరిద్దరిని సిరీస్ ఆరంభానికి రెండు వారాల ముందే బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది.ఇంత వరకు రిపోర్టు చేయని రోహిత్!అక్కడి వైద్య బృందాన్ని సంప్రదించి.. వేగంగా కోలుకొనే అంశంపై దృష్టి పెట్టాలని.. వారి నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా మంగళవారం (జూన్ 2)న బెంగళూరుకు పయనం కానుండగా.. రోహిత్ శర్మ మాత్రం ఇంత వరకు రిపోర్టు చేయలేదని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వెల్లడించింది.కాగా వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి ముందు టీమిండియా కొద్ది వన్డేలు మాత్రమే ఆడనుంది. ఇలాంటి తరుణంలో రోహిత్ గాయపడటం.. బోర్డు ఆదేశాలు పాటించే అంశంలో స్పష్టత లేకపోవడం సందేహాలకు తావిస్తోంది.రేసులోకి జైసూ!ఇప్పటికే రోహిత్కు బదులు యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ పేర్లను శుబ్మన్ గిల్ ఓపెనింగ్ జోడీగా పరిగణించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ విషయంలో బోర్డు కూడా సానుకూలంగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 39 ఏళ్ల రోహిత్ శర్మనే స్వయంగా తప్పుకోనున్నాడనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ముల్లన్పూర్లో భారత్- అఫ్గన్ మధ్య ఏకైక టెస్టు జరుగనుండగా.. జూన్ 13, 17, 20 తేదీల్లో వన్డే సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: IPL 2026: అత్యుత్తమ జట్టు ఇదే! -
సాల్ట్, సుయాశ్ చారిత్రక ఘనత
ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కరికి దక్కిన అరుదైన ఘనతను, తాజాగా ఆర్సీబీ ఆటగాళ్లు ఫిల్ సాల్ట్, సుయాశ్ శర్మ సాధించారు. ఆర్సీబీతో ఐపీఎల్ 2026 ఛాంపియన్గా నిలవడంతో ఈ ఇద్దరూ హ్యాట్రిక్ ఐపీఎల్ టైటిళ్ల (సీజన్లో కనీసం ఒక మ్యాచ్ అయినా ఆడిన ఆటగాళ్లలో) అరుదైన ఫీట్ను నమోదు చేశారు. గతంలో కర్ణ్ శర్మ ఒక్కడే ఈ ఫీట్ను సాధించగా.. తాజాగా సాల్ట్, సుయాశ్ అతని సరసన చేరారు.కర్ణ్ శర్మ 2016లో ఎస్ఆర్హెచ్తో, 2017లో ముంబై ఇండియన్స్తో, 2018లో సీఎస్కేతో ఐపీఎల్ టైటిళ్లు సాధించగా.. సాల్ట్, సుయాశ్ 2024లో కేకేఆర్తో, 2025, 2026లో ఆర్సీబీతో ఐపీఎల్ టైటిళ్లు సాధించి, చారిత్రక రికార్డును సొంతం చేసుకున్నారు.మే 31న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్పై 5 వికెట్ల తేడాతో గెలుపొంది వరుసగా రెండో ఎడిషన్లో టైటిల్ను ఎగరేసుకుపోయింది. తొలి 17 ఎడిషన్లలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేని ఆర్సీబీ వరుసగా రెండు ఎడిషన్లు టైటిల్ సాధించి, టైటిళ్ల కరువును తీర్చుకుంది.ఈ మ్యాచ్లో గుజరాత్ ఆర్సీబీకి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. సీజన్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన ఆ జట్టు టాపార్డర్, బౌలింగ్ విభాగాలు తుది సమరంలో చేతులెత్తేశాయి. తొలుత బ్యాటింగ్లో సాధారణ స్కోర్కు (155-8) పరిమితమైన గుజరాత్.. ఆతర్వాత దాన్ని కాపాడుకోవడంలో దారుణంగా విఫలమైంది. విరాట్ కోహ్లి (75 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. -
టీమిండియాలోకి వికెట్ల వీరుడు!
ఐపీఎల్-2026 సీజన్ అనంతరం టీమిండియా తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమవుతోంది. జూన్ 6 నుంచి అఫ్గానిస్తాన్తో ప్రారంభం కానున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్గా శుబ్మన్ గిల్ వ్యవహరించనుండగా.. అతడి డిప్యూటీగా కేఎల్ రాహుల్ ఎంపికయ్యాడు.ఈ మ్యాచ్కు స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చిన సెలక్షన్ కమిటీ.. అతడి స్దానంలో గుర్నూర్ బ్రార్కు అవకాశమిచ్చింది. అయితే రంజీల్లో దుమ్ములేపుతున్న జమ్మూ కాశ్మీర్ స్పీడ్ స్టార్ అకిబ్ నబీని ఎంపిక చేయకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో సెలక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.అఫ్గానిస్తాన్తో టెస్ట్ కోసం ఆకిబ్ నబీని బ్యాకప్ ప్లేయర్గా ఎంపిక చేసినట్లు సమాచారం. అతడు గురువారం జట్టుతో కలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రాక్టీస్లో నెట్బౌలర్గా నబీ తన సేవలను అందించనున్నాడు. రాబోయో విదేశీ పర్యటనలను దృష్టిలో ఉంచుకుని, అతడి బౌలింగ్ నైపుణ్యాలను సెలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి పరిశీలించనున్నారు.కాగా నబీ రెడ్ బాల్తో ప్రస్తుతం అద్భుతాలు చేస్తున్నాడు. గత రెండు రంజీ సీజన్లలో కలిపి నబీ ఏకంగా 100కు పైగా వికెట్లు పడగొట్టాడు. రంజీ ట్రోఫీని జమ్మూ కాశ్మీర్ తొలిసారి సొంతం చేసుకోవడంలో నబీది కీలక పాత్ర. గత సీజన్లో నబీ 10 మ్యాచ్లు ఆడి 60 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 7 ఫైవ్ వికెట్ల హాల్స్ ఉన్నాయి.అఫ్గానిస్తాన్తో టెస్ట్కు భారత జట్టుశుభ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషభ్ పంత్, దేవ్దత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ, గూర్నూర్ బ్రార్, ధ్రువ్ జురెల్, హర్ష్ దూబె. -
ఒకే ఒక్క పరుగు.. వెస్టిండీస్కు షాకిచ్చిన ఐర్లాండ్
టీ20 ప్రపంచకప్-2016 ఛాంపియన్ వెస్టిండీస్కు ఐర్లాండ్ మహిళల జట్టు ఊహించని షాకిచ్చింది. ముక్కోణపు సిరీస్లో భాగంగా డబ్లిన్ వేదికగా జరిగిన విండీస్తో జరిగిన మ్యాచ్లో ఒక్క పరుగు (డక్ వర్త్ లూయిస్ పద్దతి) తేడాతో ఐర్లాండ్ విజయం సాధించింది. మహిళల టీ20ల్లో వెస్టిండీస్పై ఐర్లాండ్కు ఇదే తొలి విజయం కావడం విశేషం. ఈ విజయంతో ఐర్లాండ్ ఫైనల్కు చేరుకునే అవకాశాలను మెరుగుపరుచుకుంది. ఐర్లాండ్ కెప్టెన్ ఓర్లా ప్రెండర్గాస్ట్ బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ అద్భుత ప్రదర్శన తన జట్టును ఒంటి చేత్తో గెలిపించింది. ఈ ఉత్కంఠ భరిత పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. కెప్టెన్ హేలీ మాథ్యూస్(1), టేలర్(9),డాటిన్(16) వంటి సీనియర్ ప్లేయర్లు నిరాశపరినప్పటికి.. ఆఖరిలో గ్లాస్కో(36) కాస్త దూకుడుగా ఆడడంతో విండీస్ కాస్త గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. ఐర్లాండ్ బౌలర్లలో కానింగ్, ప్రెండర్గాస్ట్ తలా రెండు వికెట్లు సాధించారు. ఐర్లాండ్ స్కోర్ 14.1 ఓవర్లలో 95/5 వద్ద ఉండగా ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. అయితే ఆ సమయానికి డీఎల్ఎస్ పార్ స్కోరు ప్రకారం ఐర్లాండ్ 3 పరుగులు వెనుకబడి ఉంది. అంపైర్లు మ్యాచ్ను ఆపేసే ముందు కనీసం ఒక్క బంతి అయినా వేయాలని ఐర్లాండ్ బ్యాటర్లు పట్టుబట్టారు.జాజారా క్లాక్స్టన్ వేసిన బంతి లూయిస్ లిటిల్ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీకి వెళ్లింది. వర్షం తీవ్రత పెరగడంతో మ్యాచ్ను నిలిపివేశారు. అప్పటికి డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం ఐర్లాండ్ 1 పరుగు ఆధిక్యంలో ఉండటంతో విజేతగా ప్రకటించారు. ఓర్లా ప్రెండర్గాస్ట్(46 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్తో 71) అజేయంగా నిలిచింది.చదవండి: 'వైభవ్ను ఇప్పుడే టీమిండియాకు సెలక్ట్ చేయొద్దు' -
వైభవ్ కోసం పడిగాపులు.. అస్సలు తగ్గేదేలే!
రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్లో వండర్కిడ్ అనడంలో సందేహం లేదు. 15 ఏళ్ల వయసులోనే బ్యాటింగ్లో విధ్వంసం సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ ఇప్పటికిప్పుడు వేలంలోకి వస్తే 30 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత మాజీ క్రికెటర్లు సెహ్వాగ్, ఆకాశ్ చోప్రా పేర్కొన్నారు. అందుకు తగ్గట్లే వైభవ్ ఈ సీజన్లో 16 మ్యాచ్ల్లో 237 స్ట్రైక్రేట్తో 776 పరుగులు సాధించాడు. ఆరెంజ్ క్యాప్ సహా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా ఎంపికైన వైభవ్ రూ.55 లక్షలు అందుకున్నాడు. దీంతో వైభవ్ ఆట మారడంతోనే అతడి బ్రాండ్వాల్యూ కూడా అంతే స్థాయిలో పెరిగిపోయినట్లుగా తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్కు ముందు తాను సంతకాలు చేసిన ఎండార్స్మెంట్లకు సంబంధించిన ఫీజులన్నింటిని డబుల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వైభవ్ ఇప్పటికే కాంప్లాన్, రెడ్బుల్ వంటి బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరిస్తున్న వైభవ్.. ఇటీవలే ఐపీఎల్లో విధ్వంసకర ప్రదర్శనతో అతడితో ఒప్పందం కుదుర్చుకోవడానికి అనేక కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైభవ్ సూర్యవంశీ తన ఎండార్స్మెంట్ ఫీజులను రెట్టింపు చేసినట్లు ఒక కంపెనీకి చెందిన అడ్వర్టైజింగ్ అధికారి పేర్కొన్నారు. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు వైభవ్ ఒక్కో ఒప్పందానికి సుమారు రూ.కోటి చొప్పున సంతకాలు చేశాడు. సీజన్ ముగిసిన తర్వాత మాత్రం అతడు ఒక్కో ఒప్పందానికి రూ. 1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు ఫీజు వసూలు చేస్తున్నట్లు సదరు అధికారి పేర్కొన్నాడు. ఆట మారడంతోనే బ్రాండ్ కూడా మారిపోయిన వైభవ్ సూర్యవంశీ కెరీర్ ఉన్నత దశలో ఉంది. ఐపీఎల్ ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని కెరీర్ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మాత్రం వైభవ్ సమీప భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవడం ఖాయం. క్రికెట్లో ఇప్పటికే వైభవ్ను దిగ్గజాలు సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్తో పాటు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వంటి క్రికెటర్లతో పోలుస్తున్నారు. ఇలాంటి బ్రాండ్ వాల్యూలకు ఆకర్షితుడవ్వకుండా కెరీర్ కోసం కష్టపడితే మాత్రం వైభవ్కు ఇంతమించి ఎండార్స్మెంట్లు వస్తాయనడంలో సందేహాం లేదు.చదవండి: కింగ్ పదానికి కోహ్లీ అర్హుడు కాదు.. పాక్ కపట బుద్ధి! -
IPL 2026: అత్యుత్తమ జట్టు.. ఓపెనర్లుగా ఎవరంటే?
భారత మెగా క్రికెట్ సంబరం ఐపీఎల్-2026 ఆదివారంతో ముగిసింది. అహ్మదాబాద్ వేదికగా ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించి.. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రెండోసారి ట్రోఫీ సొంతం చేసుకుంది.ఇక రెండు నెలలకు పైగా వినోదం పంచిన క్యాష్ రిచ్ లీగ్లో రాజస్తాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీ ఈసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. మరోవైపు ఆర్సీబీ దిగ్గజం విరాట్ కోహ్లి ఫైనల్లో 75 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టును గెలిపించి.. వింటేజ్ కింగ్ను గుర్తుచేశాడు.అయితే, సీజన్ ఆసాంతం అదరగొట్టిన గుజరాత్ ఓపెనింగ్ జోడీ సాయి సుదర్శన్- శుబ్మన్ గిల్ టైటిల్ పోరులో మాత్రం నిరాశపరిచారు. సాయి 12, గిల్ 10 పరుగులకే నిష్క్రమించడంతో గుజరాత్ ఓటమికి అక్కడే పునాది పడింది.అత్యుత్తమ జట్టుఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. ఈ సీజన్కు గానూ తన అత్యుత్తమ జట్టును ప్రకటించాడు. ఇందులో పన్నెండు మందికి చోటిచ్చాడు. ఈ మేరకు..ఓపెనర్లుగా ఎవరంటే?‘‘వైభవ్ సూర్యవంశీ.. మరో మాటకు తావు లేకుండా నా జట్టులో అతడు ఉంటాడు. పదిహేనేళ్ల వయసులోనే అతడు ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. అతడితో పాటు దిగ్గజ విరాట్ కోహ్లి నా జట్టు ఓపెనర్గా ఉంటాడు.మూడో స్థానంలో సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఇషాన్ కిషన్ను ఆడిస్తాను. అతడే నా వికెట్ కీపర్.. అదే విధంగా వైస్ కెప్టెన్ కూడానూ!.. నాలుగో స్థానానికి ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ను ఎంచుకుంటాను. అతడే నా జట్టు సారథి.అతడు లేకుంటే ఎలా?ఐదో స్థానంలో హైదరాబాద్ పవర్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ ఉంటాడు. అతడు లేకుండా అసలు ఈ జట్టు కూర్పు సాధ్యమే కాదు. పందొమిదేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆరెంజ్ క్యాప్ కోసం పోటీపడ్డ ఏకైక మిడిలార్డర్ బ్యాటర్ అతడు.అతడికి తోడుగా హైదరాబాద్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా నా జట్టులో ఉంటాడు. హార్దిక్ పాండ్యా ఈసారి దారుణం గా విఫలం కాగా.. అదే సమయంలో నితీశ్ రెడ్డి అదరగొట్టాడు. ఏడో స్థానంలో కృనాల్ పాండ్యా సరైనోడు.ఎనిమిదో స్థానానికి సునిల్ నరైన్ లేదంటే రషీద్ ఖాన్ను ఎంచుకుంటాను. నాకు ఒక్క స్పిన్నర్ అవసరం మాత్రమే ఉంది. కాబట్టి సునిల్తో వెళ్తాను. ఇక తొమ్మిదో స్థానంలో భువనేశ్వర్ కుమార్ ఉంటాడనడంలో సందేహం లేదు.బౌలింగ్ దళం ఇదేఈ సీజన్లోనూ అత్యుత్తమంగా బౌలింగ్ చేశాడు. కగిసో రబడ, జోఫ్రా ఆర్చర్లకు కూడా నా జట్టులో చోటు ఉంటుంది. ఇక పన్నెండో స్థానం కోసం అన్షుల్ కాంబోజ్, సకీబ్ హుసేన్, రసిఖ్ సలామ్ దర్ పేర్లను పరిశీలించాను.సకీబ్ అత్యద్భుతంగా బౌలింగ్ చేశాడు. రసిఖ్ కూడా తక్కువేమీ కాదు. అన్క్యాప్డ్ కేటగిరీలో అతడే అత్యధిక వికెట్ల వీరుడు. కాబట్టి రసిఖ్కే నా ఓటు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. అయితే, అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఉన్న రెండు, మూడు స్థానాల్లో ఉన్న గిల్ (732 రన్స్), సాయి (722)లకు మాత్రం ఆకాశ్ చోప్రా తన జట్టులో చోటు ఇవ్వలేదు.ఐపీఎల్-2026 సీజన్కు గానూ ఆకాశ్ చోప్రా ప్రకటించిన అత్యుత్తమ జట్టు (12 member).వైభవ్ సూర్యవంశీ (776 రన్స్), విరాట్ కోహ్లి (675 రన్స్), ఇషాన్ కిషన్ (602 రన్స్), రజత్ పాటిదార్ (కెప్టెన్- 501 రన్స్), హెన్రిచ్ క్లాసెన్ (624 రన్స్), నితీశ్ కుమార్ రెడ్డి (302 రన్స్, 8 వికెట్లు ), కృనాల్ పాండ్యా (226 రన్స్, 14 వికెట్లు), సునిల్ నరైన్ (15 వికెట్లు), భువనేశ్వర్ కుమార్ (28 వికెట్లు), కగిసో రబడ (29 వికెట్లు), జోఫ్రా ఆర్చర్ (25 వికెట్లు), రసిఖ్ సలామ్ దర్ (19 వికెట్లు).చదవండి: నేనేమీ లక్కీ చార్మ్ కాదు.. కానీ నేనొచ్చాకే ఆర్సీబీకి ట్రోఫీలు! -
కింగ్ పదానికి కోహ్లీ అర్హుడు కాదు.. పాక్ కపట బుద్ధి!
ఈ తరం క్రికెటర్లలో ఆల్ టైమ్ గ్రేటెస్ట్ జాబితాలో ఆటగాళ్ల పేర్లను వెలికితీస్తే అందులో టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ కచ్చితంగా ఉంటాడు. భారత క్రికెట్లో సచిన్ టెండూల్కర్ తర్వాత మూడు ఫార్మాట్లు (టెస్టు, వన్డే, టీ20) కలిపి అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా కోహ్లీ చరిత్రకెక్కాడు. కోహ్లీ మూడు ఫార్మాట్లు కలిపి 559 మ్యాచ్ల్లో 28,215 పరుగులు సాధించాడు. ఇందులో 85 సెంచరీలు, 146 హాఫ్ సెంచరీలున్నాయి. అలాంటి కోహ్లీతో కొన్నాళ్ల క్రితం వరకు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం పరుగుల పరంగా పోటీ పడ్డ మాట నిజమే. ఒక దశలో కోహ్లీ రికార్డులను కూడా బాబర్ బద్దలుకొట్టాడు. అయితే క్రమేపి బాబర్ ఆజం ఆటలో పదును తగ్గుతూ రావడం.. అదే సమయంలో కోహ్లీ వయసు పెరుగుతున్న కొద్ది బ్యాటింగ్లో జోరు కనబరచడం జరిగిపోయింది. దీంతో బాబర్ ఆజం కోహ్లీకి ఆమడ దూరంలోనే నిలిచిపోయాడు. ఇప్పటివరకు బాబర్ ఆజం మూడు ఫార్మాట్లు కలిపి 15,647 పరుగులు సాధించాడు. ఇందులో 32 శతకాలు, 108 అర్థసెంచరీలున్నాయి. అయితే బాబర్ ఆజం టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. కానీ మూడు ఫార్మాట్లు కలిపి చూస్తే మాత్రం కోహ్లీ చేసిన పరుగుల్లో బాబర్ సగం కూడా చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో పాక్ మాజీ పేసర్ తన్వీర్ అహ్మద్ కోహ్లీ కంటే బాబర్ ఆజం గొప్పోడంటూ ప్రశంసలు కురిపించడం ఆసక్తి రేపింది. 'విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2026 సీజన్లో 675 పరుగులు సాదించాడు. కానీ అదే సమయంలో బాబర్ ఆజం పీఎస్ఎల్లో కోహ్లీ కంటే నాలుగు తక్కువ ఇన్నింగ్స్లు ఆడినప్పటికీ 588 పరుగులు సాధించాడు. మూడు ఫార్మాట్లు కలిపి చూస్తే కోహ్లీవి ఎక్కువ పరుగులు ఉండొచ్చు.. కానీ టీ20 క్రికెట్లో బాబర్ను మించిన బ్యాటర్ లేడు. పరుగులు సాధించడమే కాదు సెంచరీల విషయంలోనూ కోహ్లీపై బాబర్ ఆజందే పైచేయి. అదీగాక కోహ్లీ టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నాడు. కానీ బాబర్ ఇప్పటికీ మూడు ఫార్మాట్లు నిలకడగా ఆడుతున్నాడు. రాబోయే కాలంలో బాబర్ ఆజం టీ20 క్రికెట్లో ఉన్న రికార్డులన్నింటిని తన పేరిట లిఖించుకోనున్నాడు.' అని చెప్పుకొచ్చాడు. అంతటితో ఊరుకోకుండా తన్వీర్ అహ్మద్ తన ఎక్స్ ఖాతాలో కింగ్ అనే పదానికి బాబర్ ఆజం సరైన నిర్వచనమని, కోహ్లీ దీనికి ఎంతమాత్రం సరిపోడంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేయడం కనిపించింది. 'గత పదేళ్లలో అన్ని ఫార్మాట్లలోనూ కోహ్లీతో పోటీ పడి పరుగులు సాధించిన బాబర్ ఆజం నా దృష్టిలో గొప్ప క్రికెటర్. నేను అతడిని కింగ్ అని పిలుచుకుంటా' అని పేర్కొన్నాడు. తన్వీర్ అహ్మద్ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పరుగుల యంత్రంగా పేరున్న కోహ్లీని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోము.'..'టీమిండియా బ్యాటర్లు బాగా ఆడుతుంటే ఓర్వలేనితనం ఎలా ఉంటుందో పాక్ నిరూపించింది' టీమిండియా అంటే పాక్కు ఎప్పుడు కుళ్లే ఉంటుంది’ అని కామెంట్లు చేస్తున్నారు.కోహ్లీతో సరితూగలేడు.. నిజానికి బాబర్ కంటే ఏడేళ్ల ముందే కోహ్లీ (2008లో) అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. బాబర్ అడుగుపెట్టే సమయానికే కోహ్లీ స్టార్ క్రికెటర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కోహ్లీ బ్యాటింగ్తో ఏమాత్రం సరితూగని బాబర్ ఆజంకు కలిసొచ్చే అంశం ఏదైనా ఉందంటే.. వయసు దృష్ట్యా అతడు మరో ఐదారేళ్లు క్రికెట్ ఆడే అవకాశముంది. అసలు కోహ్లీతో బాబర్ ఆజంను పోల్చలేము. ఐసీసీ మేజర్ టైటిల్స్ సాధించకపోయినప్పటికీ, కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ను, ఆ తర్వాత ఇంగ్లండ్, సౌతాఫ్రికా దేశాల్లో నిలకడ విజయాలు అందుకుంది. మరోవైపు బాబర్ ఆజం కేవలం టీ20 ప్రపంచకప్పుల్లో మాత్రమే టీమిండియాను ఓడించాడు. అందులో కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా టీ20 ప్రపంచకప్లో 10 వికెట్ల తేడాతో పాక్ చేతిలో ఓడిపోవడమే బాబర్ ఆజంకు ఉన్న ఏకైక విజయం. అది మినహాయిస్తే కోహ్లీని ఏ విషయంలోనూ బాబర్ ఆజం మ్యాచ్ చేయలేడన్న సంగతి అందరికి తెలిసిందే.చదవండి: కోహ్లీకి ఏడుపొక్కటే తక్కువ.. ఆ కవర్లో ఏముంది? -
'వైభవ్ను ఇప్పుడే టీమిండియాకు సెలక్ట్ చేయొద్దు'
స్వదేశంలో అఫ్గానిస్తాన్తో టెస్ట్, వన్డే సిరీస్లు ముగిసిన అనంతరం టీమిండియా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇందులో భాగంగా భారత్ ఆతిథ్య జట్టుతో రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. అయితే ఈ టూర్కు రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎంపికవుతాడా లేదా అనే చర్చ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో జోరందుకుంది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ వైభవ్ సెలక్షన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. వైభవ్ను ఇప్పుడే విదేశీ గడ్డపై జరిగే సిరీస్లకు ఎంపిక చేయడం సరికాదని మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు.తొలుత ఐపీఎల్ తరహా పిచ్ల(ఉప ఖండ పరిస్థితులు)పై జరిగే అంతర్జాతీయ క్రికెట్ సిరీస్లలో వైభవ్ను ఆడించాలని అతడు సూచించాడు."ప్రస్తుత భారత టీ20 జట్టులో సంజూ శాంసన్, అభిషేక్ శర్మలు ఓపెనర్లుగా తమ స్ధానాలను సుస్ధిరం చేసుకున్నారు.. కచ్చితంగా వీరి తర్వాత స్ధానం వైభవ్ సూర్యవంశీదే. అయితే అతడిని భారత జట్టు ఎంపిక చేయాలనుకుంటే.. మొదట ఐపీఎల్ తరహా బ్యాటింగ్ అనుకూల పరిస్థితులన్న పిచ్లపై మాత్రమే ఆడించాలి. ఐపీఎల్ లాంటి పిచ్లపై జరిగే మ్యాచ్లలోనే అతడు అరంగేట్రం చేయాలి. అతడిని నేరుగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఐర్లాండ్ వంటి విదేశీ కండీషన్స్లో ఆడించడం సరైన నిర్ణయం కాకపోవచ్చు.ఐర్లాండ్లో ఉండే పచ్చని పిచ్లు, ఇంగ్లండ్ తరహా వాతావరణంలో బంతి బాగా స్వింగ్ అవుతుంది. కెరీర్ ఆరంభంలోనే 15 ఏళ్ల కుర్రాడిని అలాంటి కఠినమైన పరిస్థితుల్లోకి నెట్టడం సరికాదు. ఇక ఓపెనింగ్ స్ధానం కోసం వైభవ్తో పాటు గిల్ కూడా పోటీలో ఉన్నాడు. కానీ ఈ రేసులో గిల్ ముందంజలో ఉన్నాడా లేక వైభవ్ సూర్యవంశీనా చెప్పడం చాలా కష్టం. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో వేచి చూడాలివైభవ్ భవిష్యత్తు గురుంచి..టీ20ల్లో దుమ్ములేపుతున్న వైభవ్.. 'రెడ్-బాల్' క్రికెట్లో (టెస్టులు) ఎలా రాణిస్తాడో అని చాలామంది చర్చించుకుంటున్నారు. అయితే అతడి భవిష్యత్తు నిర్ణయించేది మనం కాదు. అది బీసీసీఐ బాధ్యత కూడా కాదు. అతడు ఒక స్వతంత్ర వ్యక్తి. అతడు తన కోచ్ల మార్గదర్శకత్వంలో ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. అతడు కేవలం టీ20ల్లో మాత్రమే పరిమితమై, ఒక స్టార్గా మిగిలిపోవాలంటే తన ఇష్టమది. వైభవ్ 50 ఓవర్ల క్రికెట్ కూడా సరిపోతాడు. రోహిత్ శర్మ వన్డే ప్రపంచకప్-2023లో మొదటి 10 ఓవర్లలోనే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగి, మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసేవాడు. వైభవ్ కూడా రోహిత్ మాదిరే దూకుడుగా ఆడి జట్టుకు శుభారంభం అందించగలడు. అవసరమైతే రోహిత్ కంటే వేగంగా ఆడగలడని అని స్పోర్ట్స్ స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ పేర్కొన్నాడు.చదవండి: మా ఇంట్లోనే ఉంటూ.. మా బిడ్డ ప్రాణం తీశాడు! -
నేనేమీ లక్కీ చార్మ్ కాదు.. కానీ నేనొచ్చాకే ఆర్సీబీకి ట్రోఫీలు!
పద్దెమినిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. గతేడాది తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ). డిఫెండింగ్ చాంపియన్గా భారీ అంచనాలతో ఐపీఎల్-2026లో బరిలోకి దిగి.. మరోసారి టైటిల్ సాధించి సత్తా చాటింది.అహ్మదాబాద్లో ఆదివారం జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి ఆర్సీబీ జయకేతనం ఎగురవేసింది. తద్వారా రజత్ పాటిదార్ సారథ్యంలో వరుసగా రెండోసారి టైటిల్ గెలిచి.. అభిమానులను సగర్వంగా తలెత్తుకునేలా చేసింది.ఈ నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పూసర్ల వెంకట సింధు (PV Sindhu) ఆర్సీబీకి శుభాకాంక్షలు చెప్పిన తీరు వైరల్గా మారింది. తాను బెంగళూరుకు మకాం మార్చిన తర్వాత.. అకస్మాత్తుగా ఆర్సీబీ ట్రోఫీల మీద ట్రోఫీలు గెలుస్తోందని సరదాగా ఆమె కామెంట్ చేశారు.నేనొచ్చాకే ఆర్సీబీకి ట్రోఫీలు!‘‘ఆర్సీబీ అభిమానులారా!... నేనేమీ మీ లక్కీ చార్మ్ అని చెప్పడం లేదు. కానీ.. మీరొకటి గమనించారా.. నేను బెంగళూరుకు మకాం మార్చినప్పటి నుంచి అకస్మాత్తుగా మీరు వరుసగా ట్రోఫీలు సాధిస్తున్నారు. అవునో.. కాదో మీరే లెక్కలు కట్టేయండి.ఏదేమైనా ఆర్సీబీ ఒక అసామాన్యమైన జట్టు. ఆటగాళ్లు, సహాయ సిబ్బంది.. అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా జట్టును తమ సొంతంగా భావించే అభిమానులకు కంగ్రాట్స్. ఈ ఫ్రాంఛైజీ భావోద్వేగాలకు నిలయం.అత్యంత ప్రత్యేకంఆర్సీబీ అంటే ఫ్యాన్స్కు ఒక రకంగా పిచ్చి. ఎన్నో ఏళ్లుగా ట్రోఫీ గెలుస్తామనే నమ్మకంతో వారు జట్టుకు అండగా నిలిచారు. ఇప్పుడిలా వరుసగా రెండుసార్లు చాంపియన్గా నిలవడం నిజంగా అత్యంత ప్రత్యేకం’’ అని పీవీ సింధు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆర్సీబీకి శుభాకాంక్షలు తెలిపారు.అయితే, ఫైనల్లో చాలా మంది మాదిరే తానూ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ పోరును చూడాలనుకున్నానన్న సింధు.. బెంగళూరు ఈ విజయానికి వందశాతం అర్హమైందని పేర్కొన్నారు. కాగా ఐపీఎల్లో వరుసగా రెండుసార్లు టైటిల్ సాధించిన కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోని (చెన్నై సూపర్ కింగ్స్), రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్) సరసన రజత్ పాటిదార్ నిలిచాడు. ఈ నేపథ్యంలో అతడిపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.చదవండి: అతడేమీ రోబో కాదు.. బీసీసీఐ తప్పు చేస్తోందా? -
ఐపీఎల్ ఫైనల్లోమెరిసిన అనుష్క, స్పెషల్ లగ్జరీ వాచ్, ధర ఎంతో?
ఐపిఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చారిత్రాత్మక విజయం సాధించిన వేళ నటి, స్టార్ క్రికెటర విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ (Anushka Sharma) మరోసారి ఆకర్షణీయంగా నిలిచారు. గుజరాత్లోని అహ్మదా బాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్లో అనుష్క శర్మ స్టాండ్స్ నుండి ఆర్సీబీని ఉత్సాహపరుస్తూ కనిపించారు. ముఖ్యంగా ఆమె చేతి రూ. 28 లక్షల విలువైన 'కార్టియర్ పాంథర్' (Cartier Panthère) లగ్జరీ వాచ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. సింపుల్ అండ్ లగ్జరీ స్టైల్, ఫ్యాషన్ ప్రియులకు తెగ నచ్చేసింది.సెజాన్ లియోనార్డ్ వైట్ టాప్, వైడ్ లెగ్ ట్రౌజర్ల ధరించి సింపుల్ అండ్ క్లాసీ లుక్లో కనిపించింది. దీని ధర విలువ దాదాపు 25 వేల రూపాయల వరకు ఉంటుందని అంచనా. అయితే ఆమె లుక్ సింపుల్గా ఉన్నప్పటికీ, చేతికి పెట్టుకున్న వాచ్ మాత్రం హైలైట్గా నిలిచింది. అభిమానులు అది ప్రముఖ లగ్జరీ బ్రాండ్ 'కార్టియర్ పాంథర్' వాచ్ అని గుర్తుపట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వివరాల ప్రకారం.. ఈ ఐకానిక్ వాచ్ ధర దాదాపు రూ. 28 లక్షల వరకు ఉంటుందని అంచనా. స్క్వేర్ డయల్, రోమన్ అంకెలు, బ్రాస్లెట్ స్టైల్తో ఉండే ఈ వాచ్ సెలబ్రిటీలలో చాలా ఫేమస్. నీతా అంబానీ లాంటి ఫ్యాషన్ ఐకాన్లతో ప్రజాదరణ పొందింది.కాగా ఆర్సీబీ ఐపీఎల్ 2026 ట్రోఫీని గెలవడంతో కోహ్లీ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత విరాట్, అనుష్క కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విరాట్ కోహ్లీకి అనుష్క ఎల్లప్పుడూ అండగా నిలిచే 'సపోర్ట్ సిస్టమ్' అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.మ్యాచ్ అనంతరం జరిగిన పార్టీలో విరాట్ కోహ్లీ 'One felt nice, we did twice' (ఒక్కసారి గెలిస్తే బాగుంటుంది అనుకున్నాం, కానీ రెండుసార్లు గెలిచాం) అని రాసి ఉన్న టీ-షర్ట్ ధరించి అనుష్కతో కలిసి డాన్స్ చేయడం విశేషం. మొత్తానికి ఆర్సీబీ విజయోత్సవాల్లో అనుష్క లగ్జరీ వాచ్ ఒక అనూహ్యమైన ఫ్యాషన్ హైలైట్గా నిలిచింది. ఇదీ చదవండి: వారెవ్వా! నటనలోనే కాదు, ఫార్మింగ్లోనూ సూపర్ స్టారే! -
క్రికెట్లో సరికొత్త రూల్స్.. కీలక నిర్ణయాలు తీసుకున్న ఐసీసీ
అంతర్జాతీయ క్రికెట్లో పలు మార్పులకు ఐసీసీ శ్రీకారం చుట్టింది. ఇకపై వెలుతురు లేమి కారణంగా టెస్ట్ మ్యాచ్లు నిలిచిపోకుండా ఉండేందుకు రెడ్ బాల్ స్ధానంలో పింక్ బాల్ను వినియోగించుకునేందుకు ఐసీసీ ఆమోదం తెలిపింది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే రెండు జట్ల కెప్టెన్లు ఇందుకు అంగీకరించాలి. అప్పుడే వెలుతురు తగ్గినప్పుడు పింక్ బాల్ను ఉపయోగించవచ్చు. ఫ్లడ్లైట్ల వెలుతురులో పింక్ బాల్ క్లియర్గా కన్పిస్తోంది. దీంతో టెస్ట్ మ్యాచ్లలో బ్యాడ్లైట్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికనట్లే. ప్రస్తుతం పింక్బాల్ను కేవలం డే అండ్ నైట్ టెస్టుల్లో మాత్రమే వాడుతున్నారు. అహ్మదాబాద్లో రెండు రోజుల పాటు జైషా అధ్యక్షతన జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే వెలుతురును మరింత కచ్చితంగా అంచనా వేయడానికి ఐసీసీ, ఎంసీసీ (మెరిల్బోన్ క్రికెట్ క్లబ్) సంయుక్తంగా సరికొత్త లైటింగ్ టెక్నాలజీపై పరిశోధనలు చేయనున్నాయి. ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్టుల కోసం ఎంసీసీ (MCC)తో కలిసి ఐసీసీ నిధులు సమకూర్చనుంది.బౌలింగ్ యాక్షన్ను పసిగట్టేందుకు 'హాక్-ఐ' (Hawk-Eye)👉ఇకపై బౌలర్ల అనుమానాస్పద బౌలింగ్ శైలిని (చకింగ్) అంచనా వేసేందుకు మ్యాచ్ అధికారులు ఇకపై'హాక్-ఐ' ట్రాకింగ్ డేటాను ఉపయోగించుకోవచ్చు.👉కోచ్లతో కమ్యూనికేషన్: ఫ్రాంచైజీ లీగ్ల తరహాలోనే.. ఇకపై అంతర్జాతీయ మ్యాచ్ల్లో కూడా అఫీషియల్ డ్రింక్స్ బ్రేక్ సమయంలో కోచింగ్ సిబ్బంది మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లతో మాట్లాడవచ్చు, వ్యూహాలను పంచుకోవచ్చు.👉అంతర్జాతీయ టీ20ల్లో తప్పనిసరిగా 15 నిమిషాల బ్రేక్ను ప్రవేశపెట్టనున్నారు. అలాగే డ్రింక్స్ బ్రేక్ లేదా ఇంటర్వెల్ బ్రేక్ ముగిసిన వెంటనే బ్యాటర్లు ఆలస్యం చేయకుండా క్రీజులోకి రావాల్సి ఉంటుంది.👉ఇప్పటి వరకు ట్రయల్ రూపంలో ఉన్న 'లెగ్సైడ్ వైడ్స్' నిబంధనను ఐసీసీ శాశ్వతంగా అమలు చేయాలని ఐసీసీ నిర్ణయించింది.👉క్రికెట్ వరల్డ్ కప్ ఛాలెంజ్ లీగ్లో పాల్గొనే జట్లు.. ఆ టోర్నమెంట్ సైకిల్ జరుగుతున్న సమయంలోనే ఇతర లిస్ట్-ఎ మ్యాచ్లు కూడా ఆడుకోవడానికి అనుమతించారు. అసోసియేట్ దేశాలకు మరిన్ని మ్యాచ్లు ఆడే అవకాశం కల్పించాలనే డిమాండ్తో ఈ నిర్ణయం తీసుకున్నారు.👉ఈ కొత్త రూల్స్ అక్టోబర్ 1, 2026 నుండి అధికారికంగా అమలుల్లోకి రానున్నాయి.చదవండి: క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి.. బీసీసీఐ సంచలన నిర్ణయం! -
క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి.. బీసీసీఐ సంచలన నిర్ణయం!
ప్రపంచ క్రికెట్లో మరో చారిత్రాత్మక ద్వైపాక్షిక సిరీస్ నిర్వహణకు రంగం సిద్దమవుతోంది. భారత్తో మూడు టీ20 మ్యాచ్ల సిరీస్కు ఆతిథ్యమిచ్చేందుకు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు పావులు కదపుతోంది. ఇదే విషయంపై ఏసీబీ ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే అఫ్గానిస్తాన్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, భద్రతా కారణాల వల్ల అక్కడ అంతర్జాతీయ మ్యాచ్లు ఆడేందుకు ఐసీసీ నుంచి అనుమతి లేదు. దీంతో భారత్తో సిరీస్ను న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నిర్వహించడానికి అఫ్గాన్ క్రికెట్ బోర్డు ప్రణాళికలు రచిస్తోంది. అఫ్గాన్-భారత్ మధ్య టీ20 సిరీస్ ఈ ఏడాది ఆఖరిలో జరిగే అవకాశముంది."బీసీసీఐ, ఏసీబీ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఐర్లాండ్, శ్రీలంక, జింబాబ్వే వంటి ఇతర బోర్డులను ఆర్థికంగా ఆదుకోవడానికి బీసీసీఐ భారత జట్టును అక్కడికి పంపించి మ్యాచ్లు ఆడిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అఫ్గానిస్తాన్కు కూడా భారత క్రికెట్ బోర్డు అండగా నిలవనుంది. ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య దైపాక్షిక టీ20 సిరీస్ నిర్వహణ విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుంది. ఈ సిరీస్ కోసం అఫ్ఘనిస్తాన్ జట్టుకు ఢిల్లీని 'హోమ్ గ్రౌండ్' గా కేటాయించనున్నారు. ఇప్పటికే ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) తో బీసీసీఐ చర్చలు జరిపింది. ఇందుకోసం డీడీసీఏ 'ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టీ20' షెడ్యూల్ను కూడా మార్చుకోవడానికి సిద్ధమైందని" బీసీసీఐ అధికారి ఒకరు టైమ్స్ ఇండియాతో పేర్కొన్నారు. కాగా అఫ్గానిస్తాన్ జట్టు భారత్ను తమ హోమ్ గ్రౌండ్గా వాడుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పలు సిరీస్లు ఇండియా వేదికగా జరిగాయి.భారత్లో హోంగ్రౌండ్ అఫ్గానిస్తాన్ ఆడిన సిరీస్లు2017: ఐర్లాండ్తో సిరీస్ (గ్రేటర్ నోయిడా)2018: బంగ్లాదేశ్తో సిరీస్ (డెహ్రాడూన్)2024: న్యూజిలాండ్తో ఏకైక టెస్ట్ మ్యాచ్ (గ్రేటర్ నోయిడా)ఇక హష్మతుల్లా షాహిదీ నేతృత్వంలోని అఫ్గాన్ జట్టు ప్రస్తుతం భారత పర్యటనలో ఉంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో ఏకైక టెస్ట్తో మూడు వన్డేల సిరీస్లో అఫ్గాన్ తలపడనుంది. జూన్ 6 నుంచి ముల్లాన్పూర్ వేదికగా టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. -
అతడేమి రోబో కాదు.. బీసీసీఐ తప్పు చేస్తోంది?
మహ్మద్ సిరాజ్.. ప్రస్తుతం అత్యంత ఫిట్గా ఉన్న భారత క్రికెటర్లలో ఒకడు. ఎంత అలసిపోయినా అదే వేగంతో, పట్టుదలతో బౌలింగ్ చేయడం అతడి ప్రత్యేకత. అది కొత్త సీజన్లోని మొదటి బంతి అయినా.. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లోని చివరి రోజైనా సరే సిరాజ్లో ఏ మాత్రం అలుపు కనిపించదు.2026లో సిరాజ్ ఇప్పటికే విశ్రాంతి లేకుండా దాదాపు 6 లిస్ట్ ఎ మ్యాచ్లు, 18 టీ20 మ్యాచ్లు, 2 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లు ఆడాడు. అంతకముందు ఇంగ్లండ్ పర్యటనలో కూడా సిరాజ్ మొత్తం 5 మ్యాచ్లు ఆడి మరోసారి తన ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్-2026, ఐపీఎల్-2026లో కూడా ఈ హైదరాబాదీ భాగమయ్యాడు.సిరాజ్కు విశ్రాంతి?ఈ నేపథ్యంలో జూన్ 6 నుంచి అఫ్గానిస్తాన్తో ప్రారంభం కానున్న ఏకైక టెస్ట్కు సిరాజ్కు విశ్రాంతి ఇవ్వాలని క్రికెట్ నిపుణులు బీసీసీఐని సూచిస్తున్నారు. బుమ్రా తరహాలోనే సిరాజ్ వర్క్లోడ్ను కూడా మేనేజ్ చేయాల్సిన అవసరముందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో సిరాజ్ ఏకంగా 17 మ్యాచ్లు ఆడాడు. సిరాజ్ చివరగా మే 31న ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున బరిలోకి దిగాడు.ఇప్పుడు కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే.. అఫ్గాన్తో టెస్ట్లో అతడు ఆడాల్సి ఉంది. 4 నెలల పాటు విరామం లేకుండా క్రికెట్ ఆడిన ఒక ఫాస్ట్ బౌలర్ను 5 రోజుల సుదీర్ఘ టెస్ట్ మ్యాచ్ ఆడమనడం ఎంతవరకు సమంజసం? ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అతడేమి రోబో కాదు కదా? అని సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.ఇదే కొనసాగితే అతడు గాయాల బారిన పడే అవకాశముంది. కాబట్టి బీసీసీఐ అతడి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని మాజీ క్రికెటర్లు సైతం హెచ్చరిస్తున్నారు. అఫ్గానిస్తాన్తో జరిగే వన్డే సిరీస్ నుండి సిరాజ్కు విశ్రాంతి ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత ఇంగ్లండ్ టూర్, శ్రీలంకతో 2 టెస్టులు, న్యూజిలాండ్ పర్యటనలతో మళ్లీ బిజీ కానున్నాడు.ముఖ్యంగా శ్రీలంక, న్యూజిలాండ్తో జరిగే రెడ్ బాల్ సిరీస్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా జరగనున్నాయి. ఈ సిరీస్ల సమయానికి సిరాజ్ 100% ఫిట్నెస్తో ఉండటం ముఖ్యం. కాగా అఫ్గాన్తో జరిగే టెస్ట్ మ్యాచ్ డబ్ల్యూటీసీ పరిధిలోకి రాదు. కాబట్టి ఈ మ్యాచ్ కోసం ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, నితీష్ కుమార్ రెడ్డి లాంటి యువ పేసర్లను వాడుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా ముల్లాన్పూర్ పిచ్ ఎక్కువగా స్పిన్నర్లకు అనుకూలిస్తోంది. జట్టులో కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే వంటి స్పిన్నర్లు ఉన్నారు.చదవండి: ఒకే ఓవర్లో 6 సిక్స్లు -
ఒకే ఓవర్లో 6 సిక్స్లు
సింగపూర్: అంతర్జాతీయ టి20 మ్యాచ్లో ‘ఓవర్లో 6 సిక్సర్ల’ ఫీట్ మరోసారి నమోదైంది. నేపాల్ బ్యాటర్ కుశాల్ భుర్తేల్ ఈ అరుదైన జాబితాలో చేరాడు. ఆసియా క్రీడల అర్హత టోర్నీలో భాగంగా ఆదివారం చైనాతో జరిగిన మ్యాచ్లో కుశాల్ ఈ ఘనతను సాధించాడు. చైనా లెఫ్టార్మ్ స్పిన్నర్ చెన్ జూ యూ ఓవర్లో అతను ఆరు సిక్సర్లు బాదాడు. ఈ ఓవర్లో తొలి ఐదు బంతులను కుశాల్ వరుసగా 6, 6, 6, 6, 6 కొట్టాడు. తర్వాతి బంతిని చెన్ ‘వైడ్’గా వేశాడు. అయితే ఈ అదనపు బంతిని కూడా కుశాల్ సిక్స్గా మలచడంతో ఓవర్లో 6 గీ6 పూర్తయింది. మ్యాచ్లో కుశాల్ 43 బంతుల్లోనే 5 ఫోర్లు, 16 సిక్సర్లతో 129 పరుగులు సాధించాడు. అతని జోరుకు తోడు కుశాల్ మల్లా (47 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 5 సిక్స్లు), రోహిత్ పౌడేల్ (21 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్స్లు) కూడా చెలరేగడంతో నేపాల్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 313 పరుగులు చేసింది. అనంతరం 19.2 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలిన చైనా 221 పరుగుల తేడాతో ఓడింది. -
మా ఆధిపత్యం కొనసాగింది: పాటీదార్
గత ఏడాదితో పోలిస్తే ఈసారి తమపై ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగామని, అందుకే స్వేచ్ఛగా ఆడి ప్రత్యర్థులపై ఆధిపత్యం ప్రదర్శించామని ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ వ్యాఖ్యానించాడు. విజయానంతరం తన ఆనందాన్ని అతను మీడియాతో పంచుకున్నాడు. ‘టోర్నీలో ఏ దశలోనూ ఒత్తిడిని ఎదుర్కోలేదు. ప్రతీ మ్యాచ్లో ప్రశాంతంగా ఆడాం. ఈసారి ఇతర జట్లను ఓడించడం మాత్రమే కాదు, సంపూర్ణంగా ఆధిపత్యం ప్రదర్శించాం. ఇలాగే ఆడితే రెండో టైటిల్ సాధించగలమనే నమ్మకం ఆరంభంలోనే కలిగింది.ఇంతకంటే మంచి పుట్టిన రోజు కానుక ఏదీ ఉండదు. ఇకపై వరుసగా మూడో టైటిల్ ఎలా గెలవాలనే దానిపైనే మా దృష్టి’ అని అతను అన్నాడు. కెప్టెన్గానే కాకుండా బ్యాటర్గా కూడా పాటీదార్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. బ్యాటింగ్లో స్వల్ప మార్పులతో ఈ దూకుడు సాధ్యమైందని అతను వెల్లడించాడు. ‘నా కెప్టెన్సీ శైలి భిన్నంగా ఉంటుందని అందరికీ తెలుసు. నేను ఎక్కువగా మాట్లాడకపోయినా మ్యాచ్లో పరిస్థితులపై పూర్తి అవగాహనతో నిర్ణయాలు తీసుకుంటాను. టీమ్ మేనేజ్మెంట్, ఆటగాళ్ల మద్దతు కూడా నాకు ఉండటంతో అంతా సానుకూలంగా మారిపోయింది. ఐపీఎల్కు ముందు బ్యాటింగ్ విషయంలో తీవ్రంగా సాధన చేశాను. మెంటార్ దినేశ్ కార్తీక్తో చర్చించి కొన్ని సాంకేతిక అంశాలను మార్చుకున్నాను. మ్యాచ్లో నా పాత్రపై నాకు చాలా స్పష్టత ఉండటం వల్లే ఈ స్కోర్లు సాధించగలిగాను’ అని పాటీదార్ చెప్పాడు. 2025లో చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవాల సమయంలో మరణించిన 11 మంది ఆర్సీబీ అభిమానులకు ఈ విజయాన్ని అంకితమిస్తున్నట్లు అతను ప్రకటించాడు. నాటి ఘటన నేపథ్యంలోనే ఈ సారి బెంగళూరు నగరంలో ఎలాంటి విక్టరీ పరేడ్ నిర్వహించరాదని, బహిరంగంగా ఏ తరహా సంబరాలు చేయరాదని ఆర్సీబీ యాజమాన్యం నిర్ణయించింది. అయితే ఆదివారం రాత్రి ఫైనల్ ముగిసిన తర్వాత పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ బెంగళూరు రోడ్లపైకి వచ్చి తమ ఆనందాన్ని ప్రదర్శించారు. ఇవన్నీ కూడా పోలీసుల పర్యవేక్షణలో, బ్యారికేడ్ల నియంత్రణలోనే జరగడం గమనార్హం. -
రాయల్గా సంబరాలు
అహ్మదాబాద్: ‘వన్ ఫెల్ట్ నైస్... వి డిడ్ ఇట్ ట్వైస్’... ఒక్క విజయం ఎంతో బాగు... రెండో విజయం బహు బాగు’ అంటూ ప్రత్యేకంగా సిద్ధం చేసిన టీ షర్ట్పై వ్యాఖ్య రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గెలుపు సంబరాలకు చిరునామాగా నిలిచింది. కోహ్లి సిక్సర్తో వరుసగా రెండో ఐపీఎల్ ట్రోఫీ ఖాయం కాగానే స్టేడియంలో మొదలైన వేడుకలు రాత్రంతా నిర్విరామంగా సాగాయి. ముందుగా మైదానంలో విజయోత్సవ వేడుకల్లో ఆటగాళ్లంతా భాగమయ్యారు. ఆ తర్వాత ఈ ఆనందం హోటల్ వరకు చేరింది. అక్కడ ఢోల్ బాజాలతో జట్టుకు ఘనమైన స్వాగతం లభించింది. ముందుగా కెప్టెన్ పాటీదార్ తన డ్యాన్స్తో ఇన్నింగ్స్ మొదలు పెట్టగా... ఆ తర్వాత కోహ్లి, కృనాల్ పాండ్యా బల్లే బల్లే అంటూ జత కలిశారు. రసిఖ్ సలామ్ తదితర కుర్రాళ్ల బృందం చేసిన హంగామాతో ప్రాంగణమంతా మారుమోగిపోయింది. ఆ తర్వాత హోటల్లో అసలు పార్టీ మొదలైంది. జట్టు విజయోత్సవంలో అంతా పాల్గొని తెల్లవారే వరకు నిర్విరామంగా సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా కోహ్లి, అనుష్క శర్మ కలిసి చేసిన డ్యాన్స్ ఈ మొత్తం ప్రోగ్రామ్కే హైలైట్గా నిలిచింది. జట్టు మెంటార్ దినేశ్ కార్తీక్ కూడా కోహ్లితో జత కట్టి ‘నాటు నాటు’ స్టెప్పులేశాడు. సోమవారం పుట్టిన రోజు జరుపుకున్న రజత్ పాటీదార్, దినేశ్ కార్తీక్లతో పాటు ఫిల్ సాల్ట్ ఏడాది బాబుకు కూడా కలిపి ముగ్గురి బర్త్డే వేడుకలు కూడా ఇదే వేదికపై నిర్వహించారు. మరోవైపు ఫైనల్లో ఓటమి తర్వాత గుజరాత్ టైటాన్స్ అనూహ్య ఘటనలో బాధితులయ్యారు. మ్యాచ్ ముగిశాక హోటల్కు వెళుతుండగా టీమ్ బస్సును దారి మధ్యలో నిలిపి వేయాల్సి వచ్చింది. షార్ట్ సర్క్యూట్తో బస్సు ఆగిపోవడంతో ఆటగాళ్లందరినీ కిందకు దించేశారు. ఆ తర్వాత మరో బస్సు లో గుజరాత్ ప్లేయర్లు హోటల్కు చేరుకున్నారు. విన్నింగ్ షాట్ కల తీరింది: కోహ్లి విరాట్ కోహ్లి తన అత్యద్భుత కెరీర్లో ఎన్నో గొప్ప విజయాలందించాడు. ఛేదనలో చివరి వరకు నిలిచి మరెన్నో మ్యాచ్లలో భారత జట్టును లక్ష్యానికి చేర్చాడు. కానీ ఐపీఎల్లో కూడా అలాగే గెలిపించాలని చాలాసార్లు కోరుకున్నాడు. చివరకు ఇప్పుడు అది జరిగిందని కోహ్లి సంతోషాన్ని ప్రదర్శించాడు. 2025లోనే ఆర్సీబీ టైటిల్ నెగ్గినా... నాడు జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. ఆదివారం కూడా విజయానికి 11 పరుగుల దూరంలో కోహ్లి అవుటైనట్లు కనిపించినా... చివరకు రీప్లేలో నాటౌట్గా తేలాడు. ‘ఐపీఎల్లో విన్నింగ్ షాట్ కొట్టాలనేది నా కల. దీని గురించి నిజంగా చాలాసార్లు ఆలోచించాను. ఎట్టకేలకు ఈ రోజు సాధ్యమైంది. ఛేదనలో ఏం చేయాలో నాకు సరిగ్గా తెలుసు. ఈతరం కుర్రాళ్ల జోరులో మరింత సాహసంతో ఆడాలనే విధంగా నా ఆలోచనా శైలి మారింది. అందుకే వేగవంతమైన అర్ధసెంచరీ సాధించగలిగా. పవర్ప్లేలోనే గెలుపు ఖాయం కావాలని వెంకటేశ్ అయ్యర్కు చెప్పాను. ఫ్యాన్స్కు మాకు అండగా నిలిచిన తీరు చూస్తే 7 కాదు 14 హోం మ్యాచ్లు ఆడినట్లుగా అనిపించింది. ఫైనల్లో కూడా వేదిక ప్రత్యర్థి జట్టుదే అయినా 90 శాతం ఫ్యాన్స్ మాకు మద్దతిచ్చారు’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. -
ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీకి బిగ్షాక్!
ఐపీఎల్ 2026 సీజన్ చాంపియన్గా నిలిచిన ఆర్సీబీకి ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ టిమ్ డేవిడ్ జరిమానా నుంచి తప్పించుకోలేకపోయాడు. వరుసగా రెండో సీజన్లోనూ టైటిల్ గెలిచి జోరు మీదున్న ఆర్సీబీకి టిమ్ డేవిడ్పై చర్య తీసుకోవడం కంటికి ఇంపుగా మారింది. టైటిల్ గెలిచిన ఉత్సాహం, సంబరాల నడుమ ఫైనల్ మ్యాచ్లో మైదానంలో దుష్ప్రవర్తనకు పాల్పడినందుకు టిమ్ డేవిడ్ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. అంతేకాదు ఐపీఎల్ 2027 సీజన్లో ఆర్సీబీ ఆడే తొలి మ్యాచ్ లేదా అతడు ప్రాతినిధ్యం వహించే ఫ్రాంచైజీ ఆడే తొలి మ్యాచ్లో టిమ్ డేవిడ్ ఆడకుండా అతడిపై సస్పెన్షన్ విధిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది.గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ 10వ ఓవర్లో టిమ్ డేవిడ్ ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ వైపు ఐస్బ్యాగ్ను విసరడం కనిపించింది. ఇది ఫన్నీగా చేశాడా లేక కావాలనే చేశాడా అన్నది పక్కనబెడితే.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.9 ప్రకారం మ్యాచ్ సమయంలో ఒక ఆటగాడు.. జట్టుపై లేదా అంపైర్ లేదా మ్యాచ్ రిఫరీ లేదా మూడో వ్యక్తిపై అనుచితంగా ప్రవర్తించడం లేదా ఏదైనా వస్తువును విసరడం నిబంధనలకు విరుద్ధం. 30 ఏళ్ల టిమ్ డేవిడ్ తన తప్పును అంగీకరించినందున తన దుష్ప్రవర్తనతో నిబంధనలను ఉల్లఘించినందుకు గాను అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానాతో పాటు రెండు డీ మెరిట్ పాయింట్లు విధిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. అయితే ఈ సీజన్లో టిమ్ డేవిడ్ బీసీసీఐ ఆగ్రహానికి గురికావడం ఇది మొదటిసారి కాదు. ఈ టోర్నీలో అతడు మూడుసార్లు ఐపీఎల్ లెవెల్ 1 నిబంధనను ఉల్లఘించడం గమనార్హం. మొదటిసారి ఈ సీజన్లో 20వ మ్యాచ్లో (ఒక డీమెరిట్ పాయింట్), 54వ మ్యాచ్లో రెండో ఉల్లంఘన కింద రెండు డీమెరిట్ పాయింట్లు కోత పడింది. మూడోసారి కూడా టిమ్ డేవిడ్ నిబంధన ఉల్లంఘించడంతో నిబంధనల ప్రకారం వచ్చే సీజన్లో అతడు తొలి మ్యాచ్ ఆడకుండా సస్పెన్షన్ పడనుంది.చదవండి: ఆమె తిరిగి వచ్చేస్తోంది.. జాగ్రత్త! -
కోహ్లీకి ఏడుపొక్కటే తక్కువ.. ఆ కవర్లో ఏముంది?
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ చాంపియన్గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్లో కోహ్లీ(75 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్తో ఆర్సీబీని గెలిపించడమే గాక రెండోసారి టైటిల్ అందించాడు.అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లి, అనుష్క శర్మల మధ్య జరిగిన ఒక సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. ఆ వీడియోలో అనుష్క, కోహ్లీ నడుచుకుంటూ వెళుతున్న సమయంలో, అనుష్క చేతిలో ఒక కవర్ కనిపించింది. ఇది చూసిన కోహ్లీ అందులో ఏముందో తెలుసుకోవడానికి అది ఒకసారి ఇవ్వాలని అడిగాడు. కానీ అనుష్క మాత్రం కోహ్లీకి లెటర్ ఇవ్వడానికి ఇష్టపడలేదు.అయినా కోహ్లీ అదే పనిగా ఆమె చేతి నుంచి లెటర్ తీసుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన అనుష్క శర్మ డగౌట్కు చేరుకున్న తర్వాత ఇస్తానులే అని చెప్పింది. దీంతో కోహ్లీ ఏంటి ఇలా చేస్తున్నావనడం వీడియోలో కనిపించింది. ఇది చూసిన అభిమానులు ఇంతకీ ఆ కవర్లో ఏముంది చెప్మా అంటూ కామెంట్లు పెట్టారు.మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (50) అర్థసెంచరీతో రాణించాడు. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలామ్ 3 వికెట్లు తీయగా, భువనేశ్వర్, హాజిల్వుడ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 18 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కోహ్లీ (75 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్తో ఆర్సీబీని గెలిపించగా, వెంకటేశ్ అయ్యర్ (32), టిమ్ డేవిడ్ (24) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీయగా, సిరాజ్, రబాడలు చెరొక వికెట్ తీశారు.FUNNY MOMENT AFTER THE FINAL 🤣🔥- Anushka had an envelope.- Virat Kohli was trying to take it.- But Anushka didn't want to give it.- Kohli tried multiple times but failed.- He was curious to know what was inside.Meanwhile, Anushka: "I'll give it to you there." 😅🔥 pic.twitter.com/v8k7jyaZ4z— Jara (@JARA_Memer) June 1, 2026చదవండి: కెనడా క్రికెట్పై సస్పెన్షన్.. కీలక మార్పులకు ఐసీసీ ఆమోదం! -
కెనడా క్రికెట్పై సస్పెన్షన్.. కీలక మార్పులకు ఐసీసీ ఆమోదం!
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టెస్టు క్రికెట్లో మార్పులకు ఆమోదముద్ర వేయడంతో పాటు కెనడా క్రికెట్పై సస్పెన్షన్, బంగ్లా క్రికెట్ బోర్డు ఎన్నికలను పర్యవేక్షించేందుకు ఐసీసీ ఉన్నతాధికారులను నియ మించడం వంటి నిర్ణయాలు తీసుకుంది. ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా అహ్మదాబాద్ వేదికగా ఐసీసీ చైర్మన్ జైషా నేతృత్వంలో రెండు రోజులపాటు సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే ఐసీసీ పలు కీలక మార్పులకు ఆమోద ముద్ర వేసింది.అవినీతి ఆరోపణలు..అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కెనడా క్రికెట్ను సస్పెండ్ చేయాలని ఐసీసీ బోర్డు తీర్మానించింది. సభ్యత్వానికి సంబంధించిన బాధ్యతలను ఉల్లంఘించిన కారణమే తక్షణ సస్పెన్షన్కు కారణమని తెలుస్తోంది. అయితే కెనడా క్రికెట్ బోర్డుపై వేటు వేసినప్పటికీ జట్టు ఆటగాళ్ల ప్రయోజనాలను కాపాడడం ఐసీసీ మొదటి ప్రాధాన్యమని తెలిపింది. జాతీయ పాలకమండలిని ప్రభావితం చేసే పాలనపరమైన సమస్యల వల్ల ఆటగాళ్లు నష్టపోకుండా చూడడం తమ బాధ్యత అని ఐసీసీ తెలిపింది.సస్పెన్షన్లో ఉన్న కెనడా క్రికెట్ బోర్డులో సమస్యలను పరిష్కరించడానికి ఐసీసీ నార్మలైజేషన్ కమిటీ పనిచేయనుందని, కెనడా క్రికెట్ బోర్డును తిరిగి కొత్తగా పునరుద్ధరించేందుకు దోహదపడుతుందని పేర్కొంది.పింక్బాల్ ట్రయల్..ఆటలో వెలుతురు సమస్య కారణంగా ఆట నిలిచిపోకుండా ఉండేందుకు, సంప్రదాయ రెడ్ బాల్కు బదులుగా అవసరమైతే పింక్ బాల్ వినియోగాన్ని ట్రయల్గా అనుమతించేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే పింక్ బాల్ ట్రయల్కు షరతులతో అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది.ముందుగా ఇరు జట్ల అంగీకారంతో, చెడు వెలుతురు కారణంగా ఆట ఆగే పరిస్థితులు ఉంటే రెడ్ బాల్ స్థానంలో పింక్ బాల్ ఉపయోగించేందుకు ట్రయల్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రతిపాదనను ఐసీసీ క్రికెట్ కమిటీ (మాజీ భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ నేతృత్వంలో) అలాగే చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ పరిశీలించి ఓకే చెప్పింది. టెస్టు క్రికెట్లో వెలుతురు తగ్గడం వల్ల ఆట తరచూ నిలిచిపోతుండటాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం. అధికారిక ప్రకటనలో పూర్తి విధివిధానాలు వెల్లడించకపోయినా, పరిస్థితులు క్షీణిస్తున్నప్పుడు మ్యాచ్ అధికారులు రెడ్ బాల్ నుంచి పింక్ బాల్కు మారే అవకాశం ఇవ్వబడుతుందని సమాచారం. పింక్ బాల్ సాధారణంగా డే-నైట్ టెస్టుల్లో ఉపయోగించబడుతుంది. తక్కువ వెలుతురులో మెరుగైన కనిపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఓవర్కాస్ట్ పరిస్థితులు, త్వరగా సూర్యాస్తమయం జరిగే దేశాల్లో బాడ్ లైట్ కారణంగా ఆట ఎక్కువగా నిలిచిపోతుండటంతో ఈ నిర్ణయాన్ని ప్రాక్టికల్ సొల్యూషన్గా చూస్తున్నారు.హాక్-ఐ డేటాకు అనుమతిసందేహాస్పద బౌలింగ్ యాక్షన్పై రిపోర్ట్ చేసే సందర్భంలో మ్యాచ్ అధికారులు ఇకపై 'హాక్-ఐ డేటాను ఉపయోగించేందుకు' ఐసీసీ అనుమతి ఇచ్చింది. .వన్డేల్లో హెడ్కోచ్లకు కొత్త అవకాశంఇక వన్డే మ్యాచ్లలో డ్రింక్స్ బ్రేక్ సమయంలో కోచ్లు మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లతో మాట్లాడేందుకు అనుమతి లభించింది. ఇప్పటివరకు ఇది కేవలం సబ్స్టిట్యూట్ ప్లేయర్లకే పరిమితమైంది. ప్రతి ఇన్నింగ్స్లో రెండు డ్రింక్స్ బ్రేక్లు ఉండటంతో కోచ్లు మ్యాచ్లో నాలుగు సార్లు ప్రత్యక్షంగా ఆటగాళ్లకు వ్యూహాలను చెప్పే అవకాశం పొందనున్నారు. అయితే కోచ్లు మైదానంలో ఎలాంటి డ్రెస్ కోడ్లో ఉండాలన్నది ఇంకా స్పష్టత రాలేదు.లెగ్-సైడ్ వైడ్ రూల్కు శాశ్వత ఆమోదంఐసీసీ లెగ్-సైడ్ వైడ్పై సవరించిన నిబంధనను శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించింది. అలాగే ఎంసీసీ క్రికెట్ నిబంధనల్లో మిగిలిన మార్పులు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.మరికొన్ని నిర్ణయాలు..క్రికెట్ వరల్డ్ కప్ ఛాలెంజ్ లీగ్లో పాల్గొనే జట్లు, టోర్నమెంట్ సైకిల్ సమయంలో ఇతర లిస్ట్-ఏ పరిమిత ఓవర్ల మ్యాచ్లు ఆడేందుకు అర్హత కొనసాగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. మొత్తంగా, టెస్టు క్రికెట్లో ఆట సమయాన్ని పెంచడం, ఆధునిక టెక్నాలజీ వినియోగం, అలాగే పరిమిత ఓవర్ల ఫార్మాట్లో వ్యూహాత్మక మార్పుల దిశగా ఐసీసీ ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. చదవండి: బీసీసీఐ ప్రాపర్టీని నాశనం చేసిన ఆర్సీబీ బ్యాటర్! -
బీసీసీఐ ప్రాపర్టీని నాశనం చేసిన ఆర్సీబీ బ్యాటర్!
ఐపీఎల్ 2026 సీజన్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి వరుసగా రెండోసారి టైటిల్ను నిలబెట్టుకుంది. అయితే ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్ బీసీసీఐ ప్రాపర్టీని నాశనం చేసేందుకు ప్రయత్నించడం వైరల్గా మారింది. అయితే టిమ్ డేవిడ్ ఇదంతా ఫన్ మోడ్లో చేయడంతో పెద్దగా వివాదం కాలేదు.విషయంలోకి వెళితే.. ఈ సీజన్లో బీసీసీఐ ఏఐ రోబోట్ చంపాక్ను పరిచయం చేసింది. ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు బంతిని తీసుకురావడం, బ్యాటర్లకు వెల్కమ్ చెప్పడం లాంటి పనులతో రోబో బాగా పాపులర్ అయింది. అయితే ఈ ఏఐ రోబోను టిమ్ డేవిడ్ నాశనం చేసినంత పని చేశాడు. మ్యాచ్ విజయం అనంతరం ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్తో చాంపియన్ ఫొటోలకు ఫోజిచ్చేందుకు వచ్చింది. ఈ సమయంలో టిమ్ డేవిడ్ చాంపియన్ అని రాసి ఉన్న బోర్డు నుంచి బయటకు వచ్చి ఏఐ రోబో చంపాక్ను తన్నాలని చూశాడు. కానీ తన ఆలోచనను విరమించుకొని తిరిగి తన స్థానానికి వెళ్లిపోయాడు. టిమ్ డేవిడ్ చర్య సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (50) అర్థసెంచరీతో రాణించాడు. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలామ్ 3 వికెట్లు తీయగా, భువనేశ్వర్, హాజిల్వుడ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 18 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కోహ్లీ (75 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్తో ఆర్సీబీని గెలిపించగా, వెంకటేశ్ అయ్యర్ (32), టిమ్ డేవిడ్ (24) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీయగా, సిరాజ్, రబాడలు చెరొక వికెట్ తీశారు.The moment when the rest of the players were celebrating with the IPL trophy, Tim David started having fun with Champak. Never change Timmy 😂❤️ pic.twitter.com/CYteAnZ53z— ` (@Atomickolly17) May 31, 2026చదవండి: IPL 2026: టాప్-10 వివాదాలపై ఒక లుక్కేద్దామా! -
IPL 2026: టాప్-10 వివాదాలపై ఒక లుక్కేద్దామా!
ఐపీఎల్లో పరుగుల పండుగ అభిమానులకు ఎంత కిక్ ఇస్తుందో, వివాదాలు, గొడవలు కూడా అదే స్థాయిలో ఫ్యాన్స్ను అలరించాయి. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి తాజా 19వ సీజన్ దాకా ఎన్నో గొడవలు, వివాదాలు చోటు చేసుకున్నాయి. మరి ఈ సీజన్లో అభిమానులకు కిక్ ఇచ్చిన టాప్-10 వివాదాలు ఏంటనేవి ఇప్పుడు తెలుసుకుందాం.1) కోహ్లి-గిల్ క్యాచ్ వివాదంఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లి క్యాచ్ ఔట్పై ఎంత రగడ జరిగిందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 63 పరుగులతో కోహ్లి ఆర్సీబీని విజయం వైపు నడిపిస్తున్న సమయంలో ఈ వివాదం చోటుచేసుకుంది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 16వ ఓవర్ చివరి బంతికి అర్షద్ ఖాన్ వేసిన బంతిని కోహ్లి మిడాఫ్ మీదుగా ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ గిల్ డైవ్ చేసి మరీ క్యాచ్ అందుకున్నాడు. అయితే, ఆ క్యాచ్ను గిల్ సరిగ్గా పట్టలేదని, చేతుల్లోకి వెళ్లడానికి ముందు బంతి నేలను తాకిందని కోహ్లీ భావించాడు. A chat between Virat Kohli and Shubman Gill on the catch. - The celebration by Kohli after winning the argument. 😄 pic.twitter.com/9yVbseOqGy— Mufaddal Vohra (@mufaddal_vohra) May 31, 2026అయితే అంపైర్ నితిన్ మీనన్ ఔట్ ఇవ్వడంతో షాక్ తిన్న కోహ్లీ అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. తాను ఔట్ కాదని, క్రీజు వదలి వెళ్లనని, థర్డ్ అంపైర్ రివ్యూకు చాన్స్ ఇవ్వాలిని మొండిపట్టు పట్టాడు. చేసేదేం లేక అంపైర్ తన నిర్ణయాన్ని థర్డ్ అంపైర్కు నివేదించాడు. రీప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్కు కూడా అది స్పష్టంగా కనిపించకపోయినా.. బంతిలో కొంత భాగం నేలను తాకినట్లు గుర్తించి ఔట్ నిర్ణయాన్ని రద్దు చేసి నాటౌట్గా ప్రకటించాడు. కోహ్లీ సంబరాలు చేసుకోగా, గిల్ మాత్రం నిరాశతో చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత 75 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో కోహ్లీ ఆర్సీబీకి రెండో టైటిల్ అందించాడు.2) షేక్హ్యాండ్ వివాదం..ఈ సీజన్లో అభిమానులకు మరింత కిక్ ఇచ్చిన ఎపిసోడ్ అంటే కోహ్లీ, హెడ్ మధ్య జరిగిన షేక్ హ్యాండ్ వివాదమే అని చెప్పొచ్చు. ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీతో హెడ్ వ్యంగ్యంగా మాట్లాడడం, దానికి కోహ్లీ ధీటుగా బదులివ్వడం జరిగిపోయాయి. అయితే ఈ గొడవ ఇక్కడితో సద్దుమణగలేదు. Look behind the whole SRH coaching staff, including Daniel Vettori and Muttiah Muralitharan, were watching Virat Kohli and Travis Head, expecting some drama and ready to stop a fight. But Kohli didn’t shake hands, and everyone started laughing. 😂Kohli you character 🔥 pic.twitter.com/W9CS6KM52t— Avénue.1 (@Avnueone8) May 23, 2026మ్యాచ్ పూర్తైన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చే క్రమంలో హెడ్ తన వద్దకు వచ్చినా కోహ్లీ అతడిని పట్టించుకోకుండా పక్కకు వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. ఈ వివాదం హెడ్ భార్యను కూడా తాకింది. ఆమెపై సోషల్ మీడియాలో అసభ్య కామెంట్లు పెడుతూ కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. మరి ఈ వివాదానికి ఈ సీజన్తో ముగింపు పడిందా అంటే చెప్పలేని పరిస్థితి.3) టిమ్ డేవిడ్ అనైతిక చర్యమే 11న ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ విజయం తర్వాత ఆర్సీబీ బ్యాటర్ టిమ్ డేవిడ్ చేతి వేళ్లతో అసభ్య సంజ్ఞలు చేయడం వివాదాస్పదమైంది. సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన మెగా వేలంలో ముంబై ఇండియన్స్ తనను విడుదల చేయడంపై వ్యంగ్యంగా ఈ సైగలు చేసినట్లు తేలింది. దీంతో బీసీసీఐ టిమ్ డేవిడ్ చర్యను తప్పుబడుతూ అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించడంతో పాటు రెండు డీ మెరిట్ పాయింట్లు కేటాయించింది.4) టాస్ వివాదం..ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫయర్-2 పోరు సందర్భంగా టాస్ సమయంలో నెలకొన్న గందరగోళం వివాదంగా మారింది. మొదట టాస్ వేసినప్పుడు పరాగ్ హెడ్ అని చెప్పాడు. అయితే మ్యాచ్ రిఫరీ ప్రకాశ్ భట్ మాత్రం పరాగ్ చెప్పింది అర్థం కాలేదంటూ టాస్ మళ్లీ వేయించాడు. రెండో ప్రయత్నంలో రాజస్తాన్ రాయల్స్కు టాస్ అనుకూలించడంతో బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే తొలి ప్రయత్నంలో గుజరాత్కు టాస్ అనుకూలంగా వచ్చినట్లు తర్వాత తేలింది. ఈ సమయంలో గుజరాత్ కెప్టెన్ గిల్ కాస్త అయోమయానికి గురయ్యాడు. కానీ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించడంతో ఈ వివాదంపై పెద్దగా చర్చ జరగలేదు.5) అంపైరింగ్పై ఎస్ఆర్హెచ్ ఫిర్యాదు ఈ సీజన్లో వరుస వివాదాస్పద అంపైరింగ్ నిర్ణయాలు తమను తీవ్ర ప్రభావితం చేశాయంటూ ఎస్ఆర్హెచ్ బీసీసీఐని ఆశ్రయించడం హైలైట్గా నిలిచింది. ఆర్సీబీతో మ్యాచ్లో క్లాసెన్ వివాదాస్పద క్యాచ్, కేకేఆర్తో మ్యాచ్లో అభిషేక్ శర్మ క్యాచ్పై, లక్నో ఆటగాడు అవేశ్ ఖాన్ బంతి బౌండరీ లైన్ను దాటకముందే, ఆ తాడును వెనక్కి నెట్టేయడంపై ఎస్ఆర్హెచ్ అసహనం వ్యక్తం చేసింది. ఎంసీసీ నిబంధనల ప్రకారం ఈ చర్యపై ఆటగాడికి భారీ జరిమానా విధించాలని బీసీసీఐ ఎదుట వాదించడం చర్చనీయాంశమైంది.6) పరాగ్ డ్రెస్సింగ్ రూమ్ ఘటనపంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్ డ్రెస్సింగ్ రూమ్లో ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ వేపింగ్ (ఈ-సిగరేట్) చేస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. నిబంధనల ప్రకారం ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లో ఇలాంటి చర్యలకు పాల్పడడం నిషిద్ధం. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో రంగంలోకి దిగిన బీసీసీఐ ఆట పరువుకు భంగం కలిగించినందుకు పరాగ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించడంతో పాటు, ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించింది.Captain of Rajasthan Royals team Riyan Parag enjoying vape in the RR dressing room .Vaping is illegal in India . Hello @BCCI is this allowed? #PBKSvsRR pic.twitter.com/banIgJDO6u— Surbhi (@SurrbhiM) April 29, 20267) రాజస్తాన్ డగౌట్ మొబైల్ వివాదంఈ సీజన్లో వివాదాల్లో హైలైట్గా నిలిచిన వాటిలో రాజస్తాన్ రాయల్స్ డగౌట్లో మొబైల్ ఫోన్ కనిపించడమే. ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా డగౌట్లో రాజస్తాన్ రాయల్స్ మేనేజర్ రోమి భిందర్ మొబైల్ ఫోన్ ఉపయోగిస్తుండడం కెమెరాల కంటికి చిక్కింది. ఈ చర్య పట్ల సీరియస్ అయిన బీసీసీఐ భిందర్ మొబైల్ అనుకోకుండా వాడానని, మెడికల్రిపోర్ట్స్ చూసుకునేందుకే ఫోన్ వాడినట్లు తెలిపాడు. తన చర్య పట్ల క్షమాపణ చెప్పినప్పటికీ, అతడి వివరణతో సంతృప్తి చెందని బీసీసీఐ రోమి భిందర్కు రూ.లక్ష జరిమానా విధించింది. రోమి భిందర్ చర్యను వ్యతిరేకిస్తూ బీసీసీఐ ఆటగాళ్లకు కఠిన ఆంక్షలు, నిబంధనలు జారీ చేసింది.8) అబ్స్ట్రకింగ్ ది ఫీల్డ్ఐపీఎల్ 2026 సీజన్లో లక్నోతో మ్యాచ్ సందర్భంగా కేకేఆర్ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద ఔటయ్యాడు. షాట్ ఆడిన అంగ్క్రిష్ సింగిల్ తీయడానికి ప్రయత్నించాడు. నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న గ్రీన్ వద్దని వారించడంతో వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ దశలో బంతిని అందుకున్న షమీ స్ట్రైకింగ్ ఎండ్ వికెట్ల వైపు విసిరాడు. The infamous Angkrish Raghuvanshi Run out today ! 😔What's your opinion on this decision 🤔 , my opinion is that it was not out, a blunder by 3rd umpire ! What was the hurry 😯?#LSGvsKKR #IPL2026pic.twitter.com/eJmxLm5Gwk— Cricket IQ (@S17Anurag) April 26, 2026ఈ నేపథ్యంలో తన రన్నింగ్ దిశను మార్చుకున్న రఘువంశీ షమీ వేసిన బంతికి అడ్డు రావడంతో అది అతడి ప్యాడ్లకు తగిలింది. దీంతో లక్నో ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో ఉద్దేశపూర్వకంగానే బంతిని అడ్డుకున్నందుకు అంపైర్ అంగ్క్రిష్ రఘువంశీని ఔట్గా ప్రకటించాడు.9) అర్ష్దీప్ ఇన్స్టా వివాదంపంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో దాదాపు 200 పైగా పోస్టులను తొలగించడం ఆసక్తిగా నిలిచింది. ఐపీఎల్ 2026 సీజన్లో పలు వివాదాల నేపథ్యంలో అర్ష్దీప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తేలింది. టోర్నీ జరుగుతున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్ సహా జట్టు సమావేశాలకు సంబంధించి కంటెంట్ను సోషల్మీడియాలో షేర్ చేసుకోవద్దంటూ బీసీసీఐ ఆటగాళ్లను హెచ్చరించింది. అందుకే అర్ష్దీప్ తన ఇన్స్టాలో పోస్టులు తొలగించి ఉంటాడని అభిమానులు భావించారు.10) జాసన్ హోల్డర్ క్యాచ్ వివాదంగుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్లో రజత్ పాటీదార్ ఇచ్చిన క్యాచ్ హోల్డర్ డైవ్ చేసి పట్టినప్పటికీ ఆ క్యాచ్ పూర్తి వివాదాస్పదమయింది. పాటిదార్ ఇచ్చిన క్యాచ్ను అందుకునే క్రమంలో హోల్డర్ బంతిని తొలుత నేలకు ఆనించినట్లు కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, అంపైర్ ఔటివ్వడం ఆర్సీబీ డగౌట్లో ఆటగాళ్లకు ఆగ్రహం తెప్పించింది. They checked the runout for 1 min and there was indeed a check of that Patidar's catch by Jason Holder, just judged in 17 secsTruly disappointing to see umpiring at this level this season. New day, new lowpic.twitter.com/KGgbi2a7qb— Gautam (@indiantweetrian) April 30, 2026హోల్డర్ పట్టిన క్యాచ్పై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఔట్ కాదని తెలుస్తున్నప్పటికీ మూడో అంపైర్ పాటిదార్ను ఔట్ అని ప్రకటించడం అత్యంత వివాదాస్పదమయ్యింది.చదవండి: భారత్లో ఫిఫా ప్రసార హక్కులు ఆ సంస్థకే! -
అతడిని వన్డౌన్లో ఆడిస్తారా?: ఇంగ్లండ్ దిగ్గజం ఫైర్
ఐపీఎల్-2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ అనుసరించిన వ్యూహాలపై ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ మండిపడ్డాడు. అసలు గుజరాత్ నాయకత్వ బృందం ఆలోచన ఏమిటో తనకు అర్థం కాలేదన్నాడు.జోస్ బట్లర్ను కాదని నిశాంత్ సింధును వన్డౌన్లో ఎలా ఆడిస్తారని బ్రాడ్ ప్రశ్నించాడు. అహ్మదాబాద్లో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో గుజరాత్ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.ఈ క్రమంలో బెంగళూరు వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడగా.. గుజరాత్ రన్నరప్తో సరిపెట్టుకుంది. కాగా ఆర్సీబీతో ఫైనల్ సందర్భంగా గుజరాత్ తమ టాపార్డర్ను మార్చిన సంగతి తెలిసిందే.ఆదిలోనే షాక్ఓపెనర్లుగా సాయి సుదర్శన్, కెప్టెన్ శుబ్మన్ గిల్ కొనసాగగా.. వన్డౌన్లో మాత్రం బట్లర్ను కాదని నిశాంత్ సింధును ఆడించారు. అయితే, సీజన్ ఆసాంతం ఆకట్టుకున్న సాయి ఫైనల్లో 12, గిల్ 10 పరుగులే చేయడంతో గుజరాత్కు ఆదిలోనే షాక్ తగిలింది.ఇలాంటి తరుణంలో అన్క్యాప్డ్ నిశాంత్ సింధు మూడో స్థానంలో వచ్చి 18 బంతుల్లో 20 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ నాలుగో నంబర్ బ్యాటర్గా బరిలోకి దిగి 23 బంతుల్లో 19 పరుగులే చేసి నిష్క్రమించాడు.ఈ నేపథ్యంలో స్టువర్ట్ బ్రాడ్ గుజరాత్ జట్టు యాజమాన్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ యూట్యూబ్ చానెల్తో మాట్లాడుతూ.. ‘‘ఈ టోర్నీ ఆసాంత బట్లర్ మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. కానీ ఫైనల్లో అనూహ్య రీతిలో అతడిని నాలుగో స్థానానికి మార్చారు.నాకైతే అర్థం కావడం లేదుఅసలు ఫైనల్లో.. అది కూడా ముందుగా బ్యాటింగ్ చేస్తూ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఏబీ డివిలియర్స్ సైతం దీనిని ఆత్మరక్షణ ధోరణిగానే అభివర్ణించాడు.ఇక ఈ సీజన్లో ఓపెనర్లు గిల్, సాయి చెరో 700కు పైగా పరుగులు సాధించారు. ఓపెనర్లు ఇంత నిలకడగా రాణించడం మంచిదే. అదే సమయంలో ఇలాంటి ప్రదర్శనల వల్ల మిడిలార్డర్ను పరీక్షించేందుకు వీలుకాదు. ఇద్దరు ఓపెనర్లు విఫలం కాగానే..ఒత్తిడిలో వారు ఎలా రాణిస్తారో తెలియదు. టైటిల్ పోరులో ఇద్దరు ఓపెనర్లు విఫలం కాగానే.. మిగతా వాళ్లు కూడా పెవిలియన్కు క్యూ కట్టేశారు’’ అని స్టువర్ట్ బ్రాడ్ విమర్శించాడు.బహుశా అందుకేనేమో!ఇక ఇదే షోలో ఇంగ్లండ్ మరో మాజీ ఆటగాడు స్టీవెన్ ఫిన్స్పందిస్తూ.. ‘‘ఇంగ్లండ్ తరఫున చాలా ఏళ్ల పాటు ఓపెనర్గా ఆడిన అనుభవం బట్లర్కు ఉంది. అలాంటిది అతడిని డిమోట్ చేయడం ఆశ్చర్యకరంగా అనిపించింది.అయితే, పాత బడుతున్న కొద్దీ వికెట్ బ్యాటింగ్కు అనుకూలిస్తుందని గుజరాత్ నాయకత్వ బృందం భావించి ఉంటుంది. కాసేపు నిశాంత్ స్టాండింగ్ ఇస్తే బట్లర్ కుదురుకోగలడని అంచనా వేసి ఉంటుంది. కానీ అదేమీ జరుగలేదు’’ అని పేర్కొన్నాడు.కాగా గుజరాత్ టాపార్డర్ కుదేలు కాగా.. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ అజేయ అర్ధ శతకం (50)తో రాణించాడు. ఫలితంగా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగలిగింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ 18 ఓవర్లలో పూర్తి చేసి టైటిల్ విజేతగా నిలిచింది.చదవండి: ఈ ఐదుగురు తమ చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడేశారు?! -
ఈ ఐదుగురు తమ చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడేశారు?!
ఐపీఎల్ పందొమ్మిదో సీజన్ ముగిసింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టైటిల్ నిలబెట్టుకుంది. అహ్మదాబాద్లో ఆదివారం జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించి వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడింది.ఇదిలా ఉంటే.. ఈ సీజన్తో కొంతమంది ఆటగాళ్లు ఐపీఎల్ కెరీర్ చరమాంకానికి చేరినట్లు తెలుస్తోంది. అంచనాలు అందుకోలేక చతికిలపడిన కొందరు ప్లేయర్లను వదిలించుకునేందుకు ఫ్రాంఛైజీలు సిద్ధమైనట్లు సమాచారం. ఈ జాబితాలో టాప్-5లో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు ఇవే!కరుణ్ నాయర్కరుణ్ నాయర్ను ఢిల్లీ క్యాపిటల్స్ గతేడాది రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. మిడిలార్డర్లో రాణిస్తాడనే ఉద్దేశంతో 34 ఏళ్ల ఈ వెటరన్ బ్యాటర్కు అవకాశం ఇచ్చింది. ఇక, ఐపీఎల్-2025లో కరుణ్ నాయర్ కాస్త ఫర్వాలేదనిపించాడు.ఎనిమిది ఇన్నింగ్స్లో కలిపి 198 పరుగులు చేయగలిగాడు. దీంతో ఈ ఏడాది కూడా ఫ్రాంఛైజీ అతడిని కొనసాగించింది. అయితే, ఐపీఎల్-2026లో రెండు ఇన్నింగ్స్ ఆడిన కరుణ్ కేవలం 18 పరుగులే చేశాడు. ఫీల్డింగ్లోనూ విఫలమయ్యాడు.వచ్చే సీజన్ నాటికి కరుణ్ 35వ వసంతంలోకి అడుగుపెడతాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టు పునర్నిర్మాణంలో భాగంగా యువ ఆటగాళ్లను ఎంచుకునే క్రమంలో కరుణ్ నాయర్కు స్వస్తి పలికే అవకాశం ఉంది. ఇక అతడికి కొత్త జట్టు దొరకడం కూడా కష్టమే!టి.నటరాజన్సన్రైజర్స్ హైదరాబాద్ నెట్ బౌలర్గా వచ్చి.. ఐపీఎల్లో ఇటీవలి కాలంలో ప్రభావం చూపిన లెఫ్టార్మ్ పేసర్లలో ఒకడిగా ఎదిగాడు టి.నటరాజన్. ఢిల్లీ క్యాపిటల్స్ గతేడాది అతడిని ఏకంగా రూ. 10.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.అందుకు తగ్గట్లుగానే ఆరంభంలో రాణించినప్పటికీ.. ఆ తర్వాత అదే జోరు కొనసాగించకలేకపోయాడు ఈ తమిళనాడు బౌలర్. పది ఇన్నింగ్స్లో కలిపి కేవలం ఐదు వికెట్లే తీశాడు. ఎకానమీ 11.18.వరుసగా ఆరు మ్యాచ్లలో నటరాజన్ ఒక్క వికెట్ కూడా తీయలేక చతికిలపడ్డాడు. కాబట్టి ఢిల్లీ అతడిని వదిలివేయడం ఖాయంగానే కనిపిస్తోంది.అన్రిచ్ నోర్జేసౌతాఫ్రికా స్పీడ్స్టర్ అన్నిచ్ నోర్జేను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. పదునైన పేస్ ఆయుధంతో రాణించగల నోర్జే.. అదే స్థాయిలో గాయాల బారిన పడటం ప్రతికూలంగా మారింది.తాజా ఎడిషన్లో అతడు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడగలిగాడు. గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు. గతంలో కేకేఆర్ తరఫున కూడా కేవలం రెండు మ్యాచ్లే ఆడి వెళ్లిపోయాడు. దీంతో గాయాల బెడదతో బాధపడుతున్న నోర్జేకు ఫ్రాంఛైజీలు మళ్లీ అవకాశం ఇవ్వడం దాదాపుగా అసాధ్యమే అనిపిస్తోంది.ట్రెంట్ బౌల్ట్న్యూజిలాండ్ సీనియర్ పేసర్ ఫాస్ట్బౌలర్ ట్రెంట్ బౌల్ట్కు ఐపీఎల్లోనూ ఘన చరిత్రే ఉంది. వివిధ ఫ్రాంఛైజీలకు ప్రాతినిథ్యం వహిస్తూ.. విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ కివీస్ బౌలర్.. ఇప్పటికి 124 మ్యాచ్లలో కలిపి 145 వికెట్లు పడగొట్టాడు.ఇక ఐపీఎల్-2026కు ముందు ముంబై ఇండియన్స్ రూ. 12.50 కోట్ల భారీ ధరకు బౌల్ట్ను కొనుగోలు చేసింది. అయితే, ఆశించిన రీతిలో అతడు రాణించలేకపోయాడు. ఐదు మ్యాచ్లు ఆడి కేవలం రెండే వికెట్లు తీశాడు. దీంతో అతడికి బౌలింగ్ కోటా పూర్తి చేసే అవకాశం కూడా రాలేదు. కాబట్టి 36 ఏళ్ల బౌల్ట్ను ముంబై వదిలేస్తే.. అతడికి మరో ఫ్రాంఛైజీ నుంచి అవకాశం రావడం కష్టమే అనిపిస్తోంది.హర్షల్ పటేల్ఐపీఎల్-2026కు ముందు సన్రైజర్స్ హైదరాబాద్ హర్షల్ పటేల్ను రూ. 8 కోట్లకు రిటైన్ చేసుకుంది. గతేడాది 13 ఇన్నింగ్స్లో కలిపి అతడు 16 వికెట్లు తీశాడు అయితే, గతంలో మాదిరి ఈసారి హర్షల్ రాణించలేదు.ఐదు మ్యాచ్లు ఆడి 10కి పైగా ఎకానమీతో పరుగులు ఇచ్చి.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. వచ్చే సీజన్ నాటికి హర్షల్ 35వ వసంతంలోకి అడుగుపెడతాడు. ఈ పరిణామాల క్రమంలో సన్రైజర్స్ అతడిని వదిలివేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. హర్షల్ వేలంలోకి వచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఫ్రాంఛైజీ అతడి వైపు మొగ్గుచూపకపోవచ్చు.చదవండి: IPL 2026: వైభవ్ తగ్గేదేలే.. ఎవరికెంత ప్రైజ్మనీ? -
భారత్లో ఫిఫా ప్రసార హక్కులు ఆ సంస్థకే!
భారత్లో ఫిఫా ప్రపంచకప్ 2026 మ్యాచ్ల ప్రసారాలకు సంబంధించి లైన్ క్లియర్ అయింది. జూన్ 11 నుంచి జరగనున్న ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్లకు సంబంధించిన ప్రసార హక్కులను జీ నెట్వర్క్ దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం 2026 నుంచి 2034 వరకు ఫిఫా ప్రపంచకప్ సహా మొత్తం 39 ఫిఫా ఈవెంట్లకు సంబంధించిన మ్యాచ్లను ఆ చానెల్ ప్రసారం చేయనుంది. ఈ విషయాన్ని జీ ఎంటర్టైన్మెంట్ సోమవారం అధికారికంగా వెల్లడించింది. 2026 ఫిఫా ప్రపంచకప్తో పాటు ఫిఫా మహిళల ప్రపంచకప్ 2027, ఫిఫా ప్రపంచకప్ 2030 సహా మిగతా ఈవెంట్లకు సంబంధించిన మ్యాచ్లను భారత్లో జీ నెట్వర్క్ ప్రసారం చేయనుంది. 8 ఏళ్ల కాలానికి ఒప్పందం చేసుకోవడంతో విలువ కూడా భారీ స్థాయిలోనే ఉండనుంది. రెండు రోజుల క్రితం ఫిఫా మ్యాచ్ల ప్రసారానికి సంబంధించి హక్కులను జీ నెట్వర్క్ సొంతం చేసుకుందని, సదరు బ్రాడ్కాస్టర్లకు 30 నుంచి 35 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 284 నుంచి 332 కోట్లు) చెల్లించనున్నట్లు సమాచారం అందింది. అయితే ఇప్పుడు ఆ సంఖ్య డబుల్ అయినట్లు తెలుస్తోంది. అంతకముందు భారత్లో మ్యాచ్ల ప్రసార హక్కుల ఒప్పందం కోసం ఫిఫా వంద మిలియన్ డాలర్లను ఆశించింది. కానీ జీ నెట్వర్క్ మంచి ధరకే ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2022 ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్లకు భారత్లో ప్రసార హక్కులను అప్పట్లో వయాకామ్ 18 (న్యూస్ 18) 62 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. మొత్తంగా ఒప్పందం విలువ ఎంత అనేది పక్కనబెడితే ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్లను భారత్లో వీక్షించాలనుకున్న అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. ఇక ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్లను జీ నెట్వర్క్ ఇటీవలే కొత్తగా లాంఛ్ చేసిన నాలుగు స్పోర్ట్స్ చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. యునైట్8 స్పోర్ట్స్ 1 (హిందీ), యునైట్8 స్పోర్ట్స్ 1 హెచ్డి (హిందీ), యునైట్8 స్పోర్ట్స్ 2 (ఇంగ్లీష్), యునైట్8 స్పోర్ట్స్ 2 హెచ్డి (ఇంగ్లీష్) లో మ్యాచ్లు ప్రసారం కానున్నాయి. జూన్ 11 నుంచి ప్రారంభం కానున్న ఫిఫా వరల్డ్ కప్ లో మొత్తం 104 మ్యాచ్లు జరగనున్నాయి. మొన్నటిదాకా ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్లను వీక్షించే భాగ్యం లేకుండా పోయిందని తెగ బాధపడిపోయిన అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.భారతీయ బ్రాడ్కాస్టర్లు ఈ హక్కులను కొనుగోలు చేయడానికి అంతగా ఆసక్తి చూపకపోవడానికి 'టైమింగ్స్' ఓ పెద్ద సమస్యగా మారాయి. ఈసారి టోర్నమెంట్లో మొత్తం 104 మ్యాచ్లు జరుగుతుండగా.. అందులో కేవలం 14 మ్యాచ్లు మాత్రమే భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి లోపు ప్రారంభమవుతాయి. మిగిలినవన్నీ అర్ధరాత్రి దాటాక లేదా తెల్లవారుజామున ప్రారంభం కానున్నాయి. ఫైనల్ మ్యాచ్ కూడా అర్ధరాత్రి 12:30 గంటలకు షెడ్యూల్ చేయబడింది. పీడబ్ల్యూసీ ఇండియా మీడియా నిపుణుడు రాజేష్ సేథి తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి దాటిన తర్వాత మ్యాచ్లు ప్రసారమైతే ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం భారీగా పడిపోతుంది. పైగా చివరి నిమిషంలో డీల్ కుదిరితే స్పాన్సర్లను వెతుక్కోవడానికి ఛానెళ్లకు తగిన సమయం ఉండదు. జనాభా ఎక్కువగా ఉన్నంత మాత్రాన ప్రకటనకర్తలు డబ్బులు కుమ్మరించరని, వీక్షకుల సంఖ్యను బట్టే రేట్లు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.చదవండి: ఆ విషయంలో గిల్ తోపు.. రబాడ తక్కువేం కాదు! -
‘కడుపున పుట్టిన పిల్లల్లాగే.. అప్పుడే సగం గెలిచేశాము’
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కడుపున పుట్టిన సంతానంలో ఎవరు ప్రత్యేకమో చెప్పడం కష్టమని.. ఐపీఎల్ ట్రోఫీల విషయంలోనూ తాను ఇదే మాట చెబుతానన్నాడు. ఈ ట్రోఫీలు కూడా తన సొంత పిల్లల్లాంటివే అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.కాగా గతేడాది ఆర్సీబీ తరఫున 109 పరుగులు చేసిన కృనాల్ పాండ్యా.. 17 వికెట్లతో సత్తా చాటాడు. తద్వారా ఆర్సీబీ తొలి టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్-2026లోనూ కృనాల్ అదరగొట్టాడు.ఐదుసార్లుఈసారి 226 పరుగులు చేసిన కృనాల్.. 14 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఆర్సీబీ వరుసగా రెండోసారి ట్రోఫీ గెలవడంలో కీలకంగా మారాడు. ఈ క్రమంలో ఐదుసార్లు ఐపీఎల్ నెగ్గిన జట్టులో సభ్యుడిగా కృనాల్ నిలిచాడు. ముంబై ఇండియన్స్ తరఫున 2017, 2019, 2020లలో టైటిల్ గెలిచిన ఈ బరోడా ఆల్రౌండర్... ప్రస్తుతం ఆర్సీబీతో ప్రయాణం కొనసాగిస్తూ.. 2025, 2026లలో విజేతగా నిలిచిన జట్లలో సభ్యుడిగా ఉన్నాడు.కడుపున పుట్టిన పిల్లల్లాంటివే..ఈ నేపథ్యంలో ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై విజయానంతరం కృనాల్ పాండ్యా మాట్లాడుతూ.. ‘‘ప్రతీ ఐపీఎల్ ట్రోఫీ దేనికదే ప్రత్యేకం. ఇది కూడా పిల్లల్ని కలిగి ఉండటం లాంటిదే. కడుపున పుట్టిన పిల్లల్లో ఎవరు ప్రత్యేకమో చెప్పలేము.అలాగే ఈ ట్రోఫీల విషయంలోనూ నేనేమీ చెప్పలేను. ఎంతో కష్టపడితే గానీ ట్రోఫీని ముద్దాడలేము. పదకొండేళ్ల వ్యవధిలో ఐదు ట్రోఫీలు గెలవడం నిజంగా నాకెంతో ప్రత్యేకం’’ అని తెలిపాడు.వేలం సమయంలోనే సగం గెలిచేశాముఇక తొలి టైటిల్ కోసం పద్దెనిమిదేళ్లు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన ఆర్సీబీ.. వరుసగా రెండోసారి విజేతగా నిలవడం పట్ల కృనాల్ స్పందించాడు. ‘‘నిజానికి గతేడాది వేలానికి ముందే మేము ఎంతగానో చర్చించాము.సమతుల్యమైన జట్టును తయారు చేసుకున్నాము. వేలం సమయంలోనే మేము సగం టోర్నీ గెలిచేశామని చెప్పవచ్చు. పద్దెనిమిదేళ్ల ఎదురుచూపుల తర్వాత ఇలా వరుసగా ట్రోఫీలు సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఆర్సీబీ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. మ్యాచ్ ఎక్కడైనా సరే.. అక్కడ మాకు అభిమానులు ఉంటారు. ఇదొక అద్వితీయమైన అనుభూతి’’ అని కృనాల్ పాండ్యా చెప్పుకొచ్చాడు.Celebration rukenge nahi ft. Krunal Pandya. 🕺🤭😂 pic.twitter.com/s6RgvHdxaR— Royal Challengers Bengaluru (@RCBTweets) May 31, 2026కృనాల్తో పాటు వీళ్లు కూడాఆర్సీబీ వరుస రెండు టైటిల్ విజయాల్లో 13 మంది భాగంగా ఉన్నారు. కెప్టెన్ రజత్ పాటీదార్, దిగ్గజ ఓపెనర్ విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, స్వప్నిల్, కృనాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్, జోష్ హాజల్వుడ్, రసిఖ్ సలామ్, భువనేశ్వర్ కుమార్, సుయాశ్ శర్మ, అభినందన్కి ఇది రెండో ట్రోఫీ. మరో 10 మంది దేవ్దత్ పడిక్కల్, కాక్స్, బెతెల్, వెంకటేశ్, సాత్విక్, మంగేశ్, విక్కీ ఒస్వాల్, విహాన్ మల్హోత్రా, కనిష్క్ చౌహాన్, డఫీలకు తొలిసారి గెలుపు ఆనందం దక్కింది. చదవండి: IPL 2026: వైభవ్ తగ్గేదేలే.. ఎవరికెంత ప్రైజ్మనీ? -
ఆ విషయంలో గిల్ తోపు.. రబాడ తక్కువేం కాదు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్లలో గుజరాత్ టైటాన్స్ ఒకటిగా నిలిచిపోనుంది. 2022 సీజన్ నుంచి స్థిరమైన ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన గుజరాత్ టైటాన్స్ ఆడిన నాలుగు సీజన్లలో మూడుసార్లు ఫైనల్ చేరడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. 2022లో చాంపియన్గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ 2023లో రన్నరప్గా, 2024 సీజన్లో లీగ్ దశ, 2025 సీజన్లో ప్లేఆఫ్స్, తాజా సీజన్లో మరోసారి రన్నరప్గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో గుజరాత్ను 5 వికెట్ల తేడాతో ఓడించిన ఆర్సీబీ వరుసగా రెండోసారి టైటిల్ అందుకుంది. అయితే రన్నరప్గా నిలిచిన గుజరాత్ టైటాన్స్లో ఉత్తమ ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్లకు రేటింగ్ ఇవ్వడం జరిగింది. ఫైనల్ ఆడిన తుది జట్టు సహా మొత్తం 15 మందికి సంబంధించిన ఆటగాళ్ల రేటింగ్ను విడుదల చేశారు. 10 పాయింట్లతో కూడిన రేటింగ్లో జట్టును అంతా తానై నడిపించిన కెప్టెన్ శుబ్మన్ గిల్, బౌలర్ కగిసో రబాడ చెరో 9 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా, సాయి సుదర్శన్ (8 పాయింట్లు) రెండో స్థానంలో ఉన్నాడు. జాసన్ హోల్డర్, మహ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్లు ఏడేసి పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. ఇక వికెట్ కీపర్ జాస్ బట్లర్ 6.5 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా, వాషింగ్టన్ సుందర్, ప్రసిధ్ కృష్ణ చెరో 6 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచారు. అశోక్ శర్మ, అర్షద్ ఖాన్లు చెరో 4 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా, 3 పాయింట్లతో రాహుల్ తెవాటియా ఏడో స్థానంలో నిలిచాడు.ఈ సీజన్లో ద్దగా ప్రభావం చూపని గ్లెన్ ఫిలిప్స్ (2 పాయింట్లు), షారుక్ ఖాన్, నిషాంత్ సింధూ ఒక్కో పాయింట్తో ఆఖరి స్థానాల్లో ఉన్నారు. లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్ల్లో 9 విజయాలతో పట్టికలో రెండో స్థానంలో నిలిచిన గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్-1 పోరులో ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది. అయితే క్వాలిఫయర్-2లో రాజస్తాన్ను చిత్తు చేసిన గుజరాత్ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే ఫైనల్లో ఆర్సీబీ చేతిలో చతికిలపడిన గుజరాత్ రన్నరప్కు పరిమితమైంది.చదవండి: 'కోహ్లీ కాస్త తగ్గి ఉండు.. మీ బ్యాటింగ్ అయిపోలేదు!' -
నాపై ఒత్తిడి పెరిగింది.. ఇకపై: వైభవ్ సూర్యవంశీ
భారత యువ సంచలనం, రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నానన్నాడు. అయితే, చిన్న వయసులోనే వచ్చిన ఈ ‘అమితాదరణ’ ఒక్కోసారి తనను ఒత్తిడిలోకి నెట్టేస్తుందని తెలిపాడు.గతేడాది.. పద్నాలుగేళ్ల వయసులో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. 35 బంతుల్లోనే శతక్కొట్టి తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. ఆ తర్వాత భారత్ అండర్-19 జట్టు తరఫునా సత్తా చాటి వరల్డ్కప్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.ఆరెంజ్ క్యాప్ విజేతఇక ఐపీఎల్-2026లో పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రాజస్తాన్ ఓపెనర్గా ఈసారి పూర్తి స్థాయిలో బరిలోకి దిగి.. ఏకంగా 776 పరుగులు సాధించాడు. తద్వారా ఈ సీజన్లో అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ అందుకోవడంతో పాటు ఎమర్జింగ్ ప్లేయర్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ తదితర అవార్డులు గెలుచుకున్నాడు.ఈ క్రమంలో ప్రజెంటర్, టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రితో మాట్లాడుతూ వైభవ్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ‘‘అందరూ నా గురించి మాట్లాడుతూ ఉంటే సంతోషంగా ఉంటుంది. అయితే, వరుస ఇంటర్వ్యూలు నాపై ఒత్తిడిని పెంచుతున్నాయి. నేను గర్వించదగ్గ క్షణం ఇది.నాపై ఒత్తిడి.. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నానువచ్చే సీజన్లోనూ ఇలాగే ఆడటానికి ప్రయత్నిస్తాను. కీలక మ్యాచ్లలో ఒత్తిడిని జయించడం ఎలాగో ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. మ్యాచ్.. మ్యాచ్కూ నా ఆట తీరు మారుతుంది. పరిస్థితులకు తగ్గట్లుగా.. జట్టు అవసరాలకు తగినట్లుగా ఆడతాను. ఈ సీజన్లో నేను నేర్చుకున్న ప్రధాన అంశాలు ఇవే.ప్రస్తుతానికి నా దృష్టి మొత్తం ఫిట్నెస్ మీదే ఉంది. నేను సుదీర్ఘకాలం కెరీర్ కొనసాగించాలంటే.. గాయాల బారిన పడకుండా ఉండాలి. అందుకోసం ఫిట్గా ఉండాలి. మా జట్టు మొత్తం నాకు అండగా నిలబడింది. సీనియర్ల నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’’ అని వైభవ్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు. చదవండి: IPL 2026: వైభవ్ తగ్గేదేలే.. ఎవరికెంత ప్రైజ్ మనీ?! -
విండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడి రీఎంట్రీ
జూన్ 3 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరుగబోయే 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యుల వెస్టిండీస్ జట్టును ఇవాళ (జూన్ 1) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా షాయ్ హోప్ కొనసాగనుండగా.. పలువురు కీలక ఆటగాళ్లు చాలాకాలం తర్వాత జట్టులోకి వచ్చారు.రీఎంట్రీల్లో ఎక్కువ ఆకర్శిస్తున్న పేరు షిమ్రోన్ హెట్మైర్ది. ఇతను గతేడాది జూన్ తర్వాత ఒక్క వన్డే కూడా ఆడలేదు. అయినా లంక సిరీస్కు ఎంపిక చేశారు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్లో అద్భుతంగా రాణించినందుకు అతడికి ఈ ఆఫర్ వచ్చింది. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ దృష్ట్యా ఈ ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది.అలాగే గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉన్న అల్జరీ జోసఫ్, గుడకేశ్ మోటీ కూడా ఈ సిరీస్తో రీఎంట్రీ ఇవ్వనున్నారు. వర్క్లోడ్ విషయం పరిగణలోకి వచ్చినా జేడన్ సీల్స్, షమార్ జోసఫ్ను ఎంపిక చేశారు. 2027 వన్డే ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధించాలంటే విండీస్కు ఈ సిరీస్ చాలా ముఖ్యం. అందుకే బలమైన జట్టుతో బరిలోకి దిగుతుంది. ఇటీవల విండీస్ జట్టుకు స్వదేశంలో తిరుగులేని రికార్డు ఉంది. వరుసగా ఐదు వన్డే సిరీస్లు గెలిచి అజేయ జట్టుగా చలామణి అవుతుంది.స్వదేశంలో శ్రీలంకతో సిరీస్కు వెస్టిండీస్ వన్డే జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), అకీమ్ ఆగస్టే, జాన్ క్యాంప్బెల్, కీసీ కార్టీ, రోస్టన్ ఛేజ్, మాథ్యూ ఫోర్డ్, జస్టిన్ గ్రీవ్స్, షిమ్రోన్ హెట్మైర్, అమీర్ జాంగూ, అల్జరీ జోసెఫ్, షమార్ జోసఫ్, గుడకేశ్ మోటీ, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, జేడన్ సీల్స్, షమార్ స్ప్రింగర్విండీస్-శ్రీలంక వన్డే సిరీస్ షెడ్యూల్జూన్ 3- తొలి వన్డే (కింగస్టన్)జూన్ 6- రెండో వన్డే (కింగస్టన్)జూన్ 8- మూడో వన్డే (కింగ్స్టన్)ఇదిలా ఉంటే, ఈ విండీస్ పర్యటనలో శ్రీలంక జట్టు వన్డే సిరీస్ తర్వాత 3 మ్యాచ్ల టీ20 సిరీస్, రెండు మ్యాచ్ల టెస్ట్ ఆడనుంది. జూన్ 11, 13, 14 తేదీల్లో ఇదే కింగస్టన్ వేదికగా మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం శ్రీలంక జట్టు విండీస్ సెలెక్ట్ టీమ్తో ఓ నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ (జూన్ 18-21) ఆడుతుంది. దీని తర్వాత జూన్ 25 నుంచి ఆంటిగ్వాలో తొలి టెస్ట్, జులై 3 నుంచి అదే అంటిగ్వాలో రెండో టెస్ట్ జరుగనున్నాయి. -
రికార్డు ఛేదన.. పాక్కు ఊహించిన షాక్
మహిళల క్రికెట్లో సంచలనం నమోదైంది. పసికూన ఐర్లాండ్ తమ టీ20 చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించి, పటిష్టమైన పాకిస్తాన్కు ఊహించని షాకిచ్చింది. ఐర్లాండ్ ట్రై సిరీస్లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో పాక్ నిర్దేశించిన 176 పరుగుల భారీ లక్ష్యాన్ని ఐర్లాండ్ జట్టు మరో 5 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఐర్లాండ్ మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో ఇదే అత్యంత భారీ ఛేదనగా (7 వికెట్ల తేడాతో) రికార్డైంది. ఆమీ హంటర్ (56), రెబెకా స్టాకెల్ (60 నాటౌట్) అద్భుతమైన అర్ద సెంచరీలతో ఐర్లాండ్కు ఈ చారిత్రక విజయాన్ని అందించారు. అంతకుముందు మ్యాచ్లో వెస్టిండీస్ చేతిలో పరాభవం ఎదుర్కొన్న ఐరిష్ మహిళలు, ఈ మ్యాచ్లో అనూహ్యంగా పుంజుకొని సంచలన విజయం సాధించారు. మరోవైపు పాక్ దీనికి ముందు మ్యాచ్లో విండీస్ చేతిలో, ఇప్పుడు ఐర్లాండ్ చేతిలో ఓడి నిష్క్రమణకు దగ్గర్లో ఉంది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. మునీబా అలీ (65) అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. మిగతా పాక్ బ్యాటర్లలో గుల్ ఫెరోజా (32), సైరా జబీన్ (36), కెప్టెన్ ఫాతిమా సనా (21) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. అమీ హంటర్, స్టోకెల్ అర్ద సెంచరీలతో రాణించగా.. కెప్టెన్ ఓర్లా ప్రెండర్గాస్ట్ (33) ఓ మోస్తరు స్కోర్తో పర్వాలేదనిపించింది. ఇవాళే జరిగే (జూన్ 1) తదుపరి మ్యాచ్లో ఐర్లాండ్ మరోసారి విండీస్తో తలపడనుంది. -
రెండో టైటిల్.. ఆర్సీబీ సాధించిన రికార్డులు ఇవే
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీ నెగ్గింది. ఐపీఎల్-2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. అహ్మదాబాద్లో ఆదివారం టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.టాపార్డర్ను కుదేలు చేసి ఆదిలోనే ప్రత్యర్థిని దెబ్బకొట్టిన ఆర్సీబీ.. గుజరాత్ను 155 పరుగులకే పరిమితం చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగి రెండు ఓవర్లు మిగిలి ఉండగానే పనిపూర్తి చేసింది. తద్వారా ఏకపక్ష విజయం సాధించి.. తమ స్థాయి ఏమిటో మరోసారి నిరూపించుకుంది. ఈ క్రమంలో ఆర్సీబీ తమ పేరిట పలు రికార్డులు లిఖించుకుంది. అవేమిటంటే..ఆర్సీబీ సాధించిన రికార్డులు ఇవే👉ఐపీఎల్ టోర్నీ టైటిల్ను వరుసగా రెండేళ్లు గెల్చుకున్న మూడో జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ (2010, 2011లో), ముంబై ఇండియన్స్ (2019, 2020లో) మాత్రమే ఈ ఘనత సాధించాయి.👉ఐపీఎల్లో 2011లో ‘ప్లే ఆఫ్స్’ ఫార్మాట్ మొదలయ్యాక ఇప్పటి వరకు ‘ప్లే ఆఫ్స్’లోని క్వాలిఫయర్–1 మ్యాచ్లో గెలిచిన జట్టే విజేతగా నిలువడం ఇది 13వసారి కావడం విశేషం. చెన్నై (2011, 2018, 2021, 2023లో), కోల్కతా (2012, 2014, 2024లో), ముంబై (2015, 2019, 2020లో), బెంగళూరు (2025, 2026), గుజరాత్ టైటాన్స్ (2022లో) జట్లు ఈ ఘనత సాధించాయి. 👉చెన్నై (5 సార్లు), ముంబై (5 సార్లు), కోల్కతా (3 సార్లు) జట్ల తర్వాత ఐపీఎల్ టోర్నీ టైటిల్ను రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు గెలిచిన నాలుగో జట్టుగా బెంగళూరు నిలిచింది.దిగ్గజాల సరసన రజత్ పాటీదార్👉ఐపీఎల్ టైటిల్ను రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు గెలిచిన నాలుగో కెప్టెన్ రజత్ పాటీదార్. గతేడాది (2025) పాటీదార్ సారథ్యంలోనే బెంగళూరు తొలిసారి ఐపీఎల్ టైటిల్ నెగ్గింది. ఈ జాబితాలో ధోని, రోహిత్ శర్మ (5 సార్లు చొప్పున), గౌతమ్ గంభీర్ (2 సార్లు) ఉన్నారు.👉ఒకే వేదికపై రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ సాధించిన మూడో జట్టు బెంగళూరు. 2025లోనూ అహ్మదాబాద్లోనే బెంగళూరు టైటిల్ నెగ్గింది. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ (కోల్కతా, ఈడెన్గార్డెన్స్; 2013, 2015లో; హైదరాబాద్, ఉప్పల్ స్టేడియం; 2017, 2019లో), కోల్కతా నైట్రైడర్స్ (చెన్నై, ఎంఎ చిదంబరం స్టేడియం; 2012, 2024లో) ఉన్నాయి.చదవండి: వైభవ్ గురించి కోహ్లి ఏమన్నాడంటే!Moments that became memories. Memories that became history. 🏆🎥 Reliving the defining moments of @RCBTweets going back-2️⃣-back in Ahmedabad ❤️#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/mHL9U36rB1— IndianPremierLeague (@IPL) June 1, 2026 -
ఐపీఎల్ 2026 చెత్త జట్టు.. కెప్టెన్గా హార్దిక్.. స్కై కూడా చోటు
ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత ఈ సీజన్లో నిరాశపరిచిన ఆటగాళ్లతో ఒక "ఫ్లాప్ జట్టు" రూపొందించబడింది. క్రెక్స్ అనే ప్రముఖ ఇంగ్లీష్ వెబ్సైట్ రూపొందించిన ఈ జట్టులో అనూహ్యంగా పెద్ద పెద్ద స్టార్లు చోటు దక్కించుకున్నారు. కెప్టెన్గా ముంబై ఇండియన్స్ను లీడ్ చేసిన హార్దిక్ పాండ్యా ఎంపిక కాగా.. ఆశ్చర్యకరంగా పంజాబ్ కింగ్స్ విధ్వంసకర ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య పేరు ఈ జట్టులో ప్రత్యక్షమైంది.ప్రియాంశ్ మినహా మిగతా ప్లేయర్ల పేర్లు ఊహించినవే అయినా, ఒకరిద్దరి పేర్లు తొలగించి ఉండాల్సిందన్న భావన కలిగింది. అలాంటి వారిలో సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేరు ఒకటి. రుతు ఈ సీజన్లో అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయినా, 337 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.ప్రియాంశ్ ఆర్య సైతం ఈ సీజన్లో 364 పరుగులు సాధించినా, నిలకడలేమి అతన్ని ఈ జట్టులో చేర్చింది. టాపార్డర్లో సూర్యకుమార్ యాదవ్ పేరు ఊహించిందే.మిడిలార్డర్లో ఈ సీజన్ వైఫల్యాధికుల పేర్లు ఉన్నాయి. లక్నో తరఫున ఘోర ప్రదర్శన చేసిన పూరన్, వైఫల్యాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన అదే జట్టు కెప్టెన్ రిషబ్ పంత్, డ్రాప్ క్యాచ్లతో ఈ సీజన్లో హైలైట్ అయిన పంజాబ్ ఆల్రౌండర్ శశాంక్ సింగ్, అదే జట్టు మరో ఆల్రౌండర్ మార్కో జన్సెన్ ఫ్లాప్ జట్టు మిడిలార్డర్లో చోటు దక్కించుకున్నారు.కెప్టెన్గా, వ్యక్తిగతంగా దారుణంగా విఫలమైన హార్దిక్ పాండ్యా ఈ ఫ్లాప్ జట్టుకు ఫస్ట్ ఛాయిస్ కెప్టెన్ అయ్యాడు.బౌలింగ్ విభాగానికొస్తే.. ఈ విభాగం కూడా స్టార్లతో నిండింది. మరిముఖ్యంగా టీమిండియా స్టార్లంతా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఆల్రౌండ్గా మిక్స్డ్ సీజన్ కలిగిన అక్షర్ పటేల్.. వికెట్లు లేకా, ధారాళంగా పరుగులు సమర్పించుకున్న కుల్దీప్ యాదవ్.. వికెట్ల కోసం కళ్లకు కాయలు కాసేలా ఎదురుచూసిన బుమ్రా, వికెట్లు తీయగలిగినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్న అర్షదీప్ సింగ్ ఈ ఫ్లాప్ టీమ్లో చోటు దక్కించుకున్నారు.మొత్తంగా హార్దిక్, సూర్యకుమార్, బుమ్రా, పంత్ వంటి పెద్ద పేర్లు ఈ జట్టులో ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే, నిన్న (మే 31) జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్లో ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్పై 5 వికెట్ల తేడాతో గెలుపొంది, వరుసగా రెండో ఎడిషన్లో ఛాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. క్రెక్స్ ప్రకటించిన ఫ్లాప్ జట్టులో ఛాంపియన్, రన్నరప్ ఆర్సీబీ, గుజరాత్ జట్లలో నుంచి ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. -
‘బాస్ బేబీ’ వైభవ్ గురించి కోహ్లి ఏమన్నాడంటే!
ఐపీఎల్-2026లో వైభవ్ సూర్యవంశీ దుమ్ములేపాడు. రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా పూర్తిస్థాయిలో బరిలోకి దిగిన ఈ బిహారీ పిల్లాడు.. జట్టు ప్లే ఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్లో మొత్తంగా 16 మ్యాచ్లు ఆడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 776 పరుగులు సాధించాడు.తద్వారా తాజా ఎడిషన్లో టాప్ రన్ స్కోరర్గా నిలిచి ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). అంతేకాదు ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు (72) బాదిన ప్లేయర్గానూ నిలిచి.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు.యూనివర్స్ బాస్ బేబీఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీని అభిమానులు ముద్దుగా ‘యూనివర్స్ బాస్ బేబీ’ అని పిలుచుకుంటున్నారు. ఇక అతడి ఆట తీరుకు టీమిండియా దిగ్గజాలు సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్.. సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్, విండీస్ స్టార్ గేల్ తదితరులు ఇప్పటికే ఫిదా అయిన సంగతి తెలిసిందే.తాజాగా... భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. గుజరాత్ టైటాన్స్తో ఆదివారం నాటి ఫైనల్లో ఆర్సీబీ ‘కింగ్’ కోహ్లి 75 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.Virat Kohli' talking with "Vaibhav Suryavanshi ❤️ pic.twitter.com/0OVwtASeVp— Priyanka Yadav (@Priyankaji1998) June 1, 2026వైభవ్ సూర్యవంశీతో కోహ్లి ముచ్చటఇక అదే సమయంలో వైభవ్ సూర్యవంశీ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచి.. కింగ్ హవాలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ విజయానంతరం కోహ్లి వైభవ్ సూర్యవంశీతో కాసేపు ముచ్చటించాడు.తనకు వినయంగా నమస్కరించిన ‘బేబీ బాస్’ భుజం తట్టి.. ఆత్మీయంగా హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ‘‘కింగ్’.. ‘బేబీ బాస్’తో ఏం మాట్లాడాడబ్బా!.. మాకూ తెలిస్తే బాగుండు’ అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.వైభవ్ గురించి కోహ్లి ఏమన్నాడంటే!ఈ నేపథ్యంలో ఆర్సీబీ దిగ్గజం, కామెంటేటర్ ఏబీ డివిలియర్స్ కోహ్లి.. వైభవ్ గురించి తనతో మాట్లాడిన విషయాన్ని బయటపెట్టాడు. ‘‘విరాట్ ఏం చెప్పాడోనని మీరంతా తెలుసుకోవాలని అనుకుంటున్నారు కదా!.. వైభవ్ ఆరెంజ్ క్యాప్ అందుకోవడానికి స్టేజీ పైకి వెళ్తుంటే విరాట్ నాతో అతడి గురించి మాట్లాడాడు.‘ఏబీ.. ఈ పిల్లాడు చాలా ప్రత్యేకమైన వాడు. ఈ అబ్బాయి చాలా కాలం క్రికెట్ను ఏలగలడు’ అని విరాట్ నాతో అన్నాడు’’ అని డివిలియర్స్ తెలియజేశాడు. కాగా సచిన్ సైతం వైభవ్ రిస్ట్ వర్క్, టెక్నిక్ అద్భుతం అంటూ కొనియాడిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే.. ఫైనల్ వీక్షించేందుకు ఆదివారం అహ్మదాబాద్కు వచ్చాడు వైభవ్ సూర్యవంశీ. ఐసీసీ చైర్మన్ జై షా, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాతో కలిసి మ్యాచ్ను ఆస్వాదించాడు.చదవండి: IPL 2026: వైభవ్ తగ్గేదేలే!.. ఎవరికెంత ప్రైజ్ మనీ? -
ఐపీఎల్ ముగిసింది.. వారంలోపే రంగంలోకి దిగనున్న టీమిండియా
ఐపీఎల్ 2026 ముగిసిన వారం వ్యవధిలోనే టీమిండియా రంగంలోకి దిగనుంది. జూన్ 6 నుంచి ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే ఏకైక టెస్ట్, 3 మ్యాచ్ల వన్డే సిరీస్తో భారత క్రికెట్ జట్టు అంతర్జాతీయ షెడ్యూల్ మొదలుకానుంది. ఈ ఏడాది ఆసాంతం టీమిండియా అన్ని ఫార్మాట్ల సిరీస్లతో బిజీగా ఉండనుంది. ఐపీఎల్ తర్వాత టీమిండియా ఆడబోయే సిరీస్ల వివరాలు ఇలా ఉన్నాయి.భారత్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు పర్యటనజూన్ 6-10: ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్ట్ (ముల్లాన్పూర్)జూన్ 13- ఆఫ్ఘనిస్తాన్తో తొలి వన్డే (ధర్మశాల)జూన్ 17- ఆఫ్ఘనిస్తాన్తో రెండో వన్డే (లక్నో)జూన్ 20- ఆఫ్ఘనిస్తాన్తో మూడో వన్డే (చెన్నై)ఐర్లాండ్లో టీమిండియా పర్యటనజూన్ 26- తొలి టీ20 (బెల్ఫాస్ట్)జూన్ 28- రెండో టీ20 (బెల్ఫాస్ట్)టీమిండియా టూర్ ఆఫ్ ఇంగ్లండ్జులై 1- తొలి టీ20 (చెస్టర్ లీ స్ట్రీట్)జులై 4- రెండో టీ20 (మాంచెస్టర్)జులై 7- మూడో టీ20 (నాటింగ్హమ్)జులై 9- నాలుగో టీ20 (బ్రిస్టల్)జులై 11- ఐదో టీ20 (సౌతాంప్టన్)జులై 14- తొలి వన్డే (ఎడ్జ్బాస్టన్)జులై 16- రెండో వన్డే (కార్డిఫ్)జులై 19- మూడో వన్డే (లండన్)టీమిండియా టూర్ ఆఫ్ జింబాబ్వేజులై 23- తొలి టీ20 (హరారే)జులై 25- రెండో టీ20 (హరారే)జులై 26- మూడో టీ20 (హరారే)టీమిండియా టూర్ ఆఫ్ శ్రీలంక (అధికారికంగా ఖరారు కాలేదు)2 టెస్టులు, 3 టీ20లుఏషియన్ గేమ్స్ 2026 (టీ20 ఫార్మాట్, సెప్టెంబర్ 17 – అక్టోబర్ 3)ఈ ఖండాంతర ఈవెంట్లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతుంది.భారత్లో వెస్టిండీస్ జట్టు పర్యటనసెప్టెంబర్ 27- తొలి వన్డే (తిరువనంతపురం)సెప్టెంబర్ 30- రెండో వన్డే (గౌహతి)అక్టోబర్ 3- మూడో వన్డే (ముల్లాన్పూర్)అక్టోబర్ 6- తొలి టీ20 (లక్నో)అక్టోబర్ 9- రెండో టీ20 (రాంచీ)అక్టోబర్ 11- మూడో టీ20 (ఇండోర్)అక్టోబర్ 14- నాలుగో టీ20 (హైదరాబాద్)అక్టోబర్ 17- ఐదో టీ20 (బెంగళూరు)భారత్లో శ్రీలంక జట్టు పర్యటనడిసెంబర్ 13- తొలి వన్డే (ఢిల్లీ)డిసెంబర్ 16- రెండో వన్డే (బెంగళూరు)డిసెంబర్ 19- మూడో వన్డే (అహ్మదాబాద్)డిసెంబర్ 22- తొలి టీ20 (రాజ్కోట్)డిసెంబర్ 24- రెండో టీ20 (కటక్)డిసెంబర్ 27- మూడో టీ20 (పూణే)భారత్లో జింబాబ్వే జట్టు పర్యటన2027, జనవరి 3- తొలి వన్డే (కోల్కతా)జనవరి 6- రెండో వన్డే (హైదరాబాద్)జనవరి 9- మూడో వన్డే (ముంబై)భారత్లో ఆస్ట్రేలియా పర్యటనజనవరి 21- తొలి టెస్ట్ (నాగ్పూర్)జనవరి 29- రెండో టెస్ట్ (చెన్నై)ఫిబ్రవరి 11- మూడో టెస్ట్ (గౌహతి)ఫిబ్రవరి 19- నాలుగో టెస్ట్ (రాంచీ)ఫిబ్రవరి 27- ఐదో టెస్ట్ (అహ్మదాబాద్) -
అప్పుడు బీసీసీఐ నిషేధం!.. ఇప్పుడీ కుర్రాడికి ‘సలామ్’ కొట్టాల్సిందే!
‘ఈ సాలా కప్ నమ్దూ’ అంటూ పద్దెనిమిదేళ్లుగా ఎదురుచూసిన అభిమానుల కలను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గతేడాది నిజం చేసింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. అయితే, అంతటితో ఆర్సీబీ ఆకలి తీరలేదు.ఆత్మ విశ్వాసంతో ఐపీఎల్-2026లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగి అద్భుత ప్రదర్శనతో మరోసారి టైటిల్ విజేతగా అవతరించింది. అహ్మదాబాద్లో ఆదివారం నాటి ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించి వరుసగా రెండోసారి ట్రోఫీ గెలిచి.. ‘ఈ సాలనూ కప్ నమ్దూ’ (ఈసారీ కప్పు మనదే) అంటూ విజిల్స్ వేయించింది.చివరి నిమిషంలో సువర్ణావకాశంనిజానికి ఆర్సీబీ అ‘ద్వితీయ’విజయంలో పేస్ బౌలింగ్ దళానిదే కీలక పాత్ర. టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (28 వికెట్లు), ఆస్ట్రేలియా స్టార్ జోష్ హాజిల్వుడ్ (15 వికెట్లు) ముందుండి నడిపించగా... మరో భారత కుర్రాడి పాత్ర కూడా మరువలేనిది. గతేడాది సత్తా చాటినా.. వివాదం కారణంగా చివరి నిమిషంలో యశ్ దయాళ్ దూరం కావడంతో మూడో పేసర్గా సత్తా చాటాల్సిన స్థితిలో తనకు లభించిన అవకాశాన్ని అతడు సమర్థంగా వినియోగించుకున్నాడు.అతడు మరెవరో కాదు జమ్ము కశ్మీర్కు చెందిన 26 ఏళ్ల రసిఖ్ సలామ్. ఈ సీజన్లో 19 వికెట్లతో రాణించి.. తన కెరీర్లోనే చిరస్మరణీయ విజయంలో భాగమయ్యాడు. అనూహ్య మలుపులతో సాగిన కెరీర్లో అతడు ఇక్కడి వరకు రాగలిగాడు.రెండేళ్ల నిషేధం విధించిన బీసీసీఐ!ఐపీఎల్లో 2019లో తొలిసారి ముంబై ఇండియన్స్ తరఫున ఒకే ఒక మ్యాచ్ ఆడి సలామ్ అరంగేట్రం చేశాడు. కొద్ది రోజుల్లోనే ‘తప్పుడు వయసు’ను చూపించిన కారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అతడిపై రెండేళ్ల నిషేధం విధించింది. దీంతో 2020 అండర్–19 వరల్డ్ కప్ ఆడే అవకాశం కోల్పోయాడు సలామ.ముంబై అండతో..అయితే ముంబై ఇండియన్స్ అండగా నిలిచి అన్ని సౌకర్యాలతో తమ ప్రైవేట్ క్లబ్లో అతడికి రెండేళ్ల పాటు ప్రాక్టీస్ చేసే అవకాశాన్ని కల్పించింది. ఈ క్రమంలో 2022లో మళ్లీ ఐపీఎల్ అవకాశం దక్కగా కేకేఆర్ 2 మ్యాచ్లే ఆడించింది. ఇక 2023లో సలామ్ గాయంతో ఆటకు దూరమయ్యాడు. కారు ప్రమాదం నుంచి కోలుకొని జాతీయ క్రికెట్ అకాడమీలో సాధన చేస్తున్న రిషభ్ పంత్... సలామ్ బౌలింగ్ పదును చూసి ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్లో అవకాశం కల్పించాడు.రసిఖ్ అంటే ‘నిలకడ’ అలా 2024లో 8 మ్యాచ్లు ఆడే చాన్స్ లభించడంతో సలామ్ ఆకట్టుకున్నాడు. ఇక గతేడాది ఆర్సీబీ రూ.6 కోట్లకు అతడిని తీసుకున్నప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలో రెండు మ్యాచ్లలోనే అవకాశం దక్కింది కానీ జట్టు అతడిలో మంచి భవిష్యత్తును చూసింది. దాని ఫలితం ఈ సారి కనిపించింది. కశ్మీరీ భాషలో రసిఖ్ అంటే ‘నిలకడ’ అని అర్థం.ఈసారి 12 మ్యాచ్లలో నిలకడగా రాణించిన సలామ్ కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టు నమ్మకాన్ని నిలబెట్టి.. జట్టులో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. గుజరాత్ టైటాన్స్తో ఫైనల్లో సీనియర్లు భువీ, హాజిల్వుడ్ కంటే.. సలామ్ మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 27 పరుగులే ఇచ్చి.. నిశాంత్ సింధు (20), రాహుల్ తెవాటియా (7), రషీద్ ఖాన్ (7) రూపంలో మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. Moments that became memories. Memories that became history. 🏆🎥 Reliving the defining moments of @RCBTweets going back-2️⃣-back in Ahmedabad ❤️#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/mHL9U36rB1— IndianPremierLeague (@IPL) June 1, 2026చదవండి: వైభవ్ తగ్గేదేలే!.. ఎవరికెంత ప్రైజ్ మనీ అంటే?! -
IPL 2026: వైభవ్ తగ్గేదేలే!.. ఎవరికెంత ప్రైజ్ మనీ?
ఐపీఎల్-2026 టోర్నీ ఆదివారంతో ముగిసింది. అహ్మదాబాద్ వేదికగా టైటిల్ పోరులో గుజరాత్ టైటాన్స్ను ఓడించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజేతగా అవతరించింది. తద్వారా వరుసగా రెండోసారి ట్రోఫీ సాధించి సంబరాల్లో మునిగిపోయింది. తొలి టైటిల్ కోసం పద్దెనిమిదేళ్లు ఎదురుచూసిన ఆర్సీబీ గతేడాది ఫైనల్లో.. పంజాబ్ కింగ్స్ను ఓడించి చాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. అదే జోరు కొనసాగిస్తూ తాజా ఎడిషన్లోనూ జయభేరి మోగించింది.Moments that became memories. Memories that became history. 🏆🎥 Reliving the defining moments of @RCBTweets going back-2️⃣-back in Ahmedabad ❤️#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/mHL9U36rB1— IndianPremierLeague (@IPL) June 1, 2026ఇక ఐపీఎల్ తాజా సీజన్లో చాంపియన్ ఆర్సీబీ, రన్నరప్ గుజరాత్ ప్రైజ్ మనీలతో పాటు.. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ తదితర అవార్డులు గెలిచిన ప్లేయర్లు, వారికి దక్కిన మొత్తం ఎంతో తెలుసుకుందామా?!ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు) వైభవ్ సూర్యవంశీ (రాజస్తాన్) 👉మ్యాచ్లు: 16; పరుగులు: 776 👉ప్రైజ్మనీ: రూ. 10 లక్షలుపర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు) కగిసో రబాడ (గుజరాత్) 👉మ్యాచ్లు: 17; వికెట్లు: 29 👉ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు ఎమర్జింగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ👉ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ👉ప్రైజ్మనీ: రూ. 15 లక్షలు సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్’ వైభవ్ సూర్యవంశీ👉స్ట్రయిక్ రేట్: 237.30 👉ప్రైజ్మనీ: టాటా కార్ ‘బెస్ట్ క్యాచ్’ ఆఫ్ ద టోర్నీ మనీశ్ పాండే (కోల్కతా)👉ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు‘ఫెయిర్ ప్లే’ అవార్డుపంజాబ్ కింగ్స్ అత్యధిక సిక్స్లువైభవ్ (72 సిక్స్లు) 👉ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు అత్యధిక ఫోర్లుసాయి సుదర్శన్ (75 ఫోర్లు)👉ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు ‘గ్రీన్ డాట్బాల్స్ ఆఫ్ ద సీజన్’ సిరాజ్ (గుజరాత్) 👉మొత్తం 172 డాట్ బాల్స్ 👉ప్రైజ్మనీ: రూ. 10 లక్షలుటైటిల్ విజేతకు ఎంతంటే?ఐపీఎల్ 19వ సీజన్ విజేతగా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు రూ. 20 కోట్లు లభించాయి. రన్నరప్ గుజరాత్ టైటాన్స్కు రూ. 12.50 కోట్లు దక్కాయి.వైభవ్దే హవారాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు ఈ సీజన్లో మొత్తం దాదాపుగా రూ. 55 లక్షల ప్రైజ్మనీ గెలిచాడు. ఓ టాటా కారు కూడా అతడి సొంతమైంది.చదవండి: రజతాభిషేకం -
కలలో కూడా ఊహించలేదు.. రాసి పెట్టి ఉంది: రజత్ పాటిదార్
19 ఎడిషన్ల ఐపీఎల్ చరిత్రలో తొలి 17 ఎడిషన్లు టైటిల్ కోసం ముఖం వాచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ.. ఇప్పుడు వరుసగా రెండో ఎడిషన్లో టైటిల్ సాధించి కరువు తీర్చుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిన్న (మే 31) జరిగిన 2026 ఎడిషన్ ఫైనల్లో ఆ జట్టు గుజరాత్ టైటాన్స్పై 5 వికెట్ల తేడాతో గెలుపొంది, టైటిల్ను నిలబెట్టుకుంది.ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఆర్సీబీకి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. సీజన్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన ఆ జట్టు టాపార్డర్, బౌలింగ్ విభాగాలు తుది సమరంలో చేతులెత్తేశాయి. తొలుత బ్యాటింగ్లో సాధారణ స్కోర్కు (155-8) పరిమితమైన గుజరాత్.. ఆతర్వాత దాన్ని కాపాడుకోవడంలో దారుణంగా విఫలమైంది. విరాట్ కోహ్లి (75 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు.ఈ సీజన్ ప్రారంభం నుంచి గుజరాత్ విజయాల్లో ప్రధానపాత్ర పోషించిన బౌలర్లు, ఆఖరి మెట్టుపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. 9వ ఓవర్లో రషీద్ ఖాన్ రెండు వికెట్లు (రజత్, కృనాల్) తీయడం మినహాయించి, ఏ దశలోనూ బౌలర్లు ప్రభావం చూపించలేకపోయారు. కాస్త పొదుపుగా బౌలింగ్ చేయగలిగినా, స్కోర్ మరీ చిన్నది కావడంతో కాపాడుకోలేకపోయారు.ఈ మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ రజత్ పాటిదార్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. వరుసగా రెండో ఏడాది టైటిల్ సాధించడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ట్రోఫీని అందుకున్న తర్వాత మాట్లాడుతూ..ఆర్సీబీకి కెప్టెన్గా వ్యవహరించి వరుసగా రెండు టైటిళ్లు గెలిపిస్తానని కలలో కూడా ఊహించలేదన్నాడు. టాస్ గెలిస్తే ఛేజ్ చేయడమే తమ ప్రణాళిక అని, పవర్ప్లేలోనే గుజరాత్ టాప్-3 బ్యాటర్లను ఔట్ చేయాలని ముందుగానే వ్యూహం సిద్ధం చేసుకున్నామని తెలిపాడు. ఆ ప్లాన్ను బౌలర్లు అద్భుతంగా అమలు చేశారని ప్రశంసించాడు.భువీ, హాజిల్వుడ్, రసిక్, కృనాల్, సుయాశ్ సీజన్ మొత్తం అద్భుతంగా రాణించారని కొనియాడాడు. గతేడాది తొలి టైటిల్ గెలవాలనే ఒత్తిడి ఎక్కువగా ఉండేదని, ఈసారి మాత్రం జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిందని చెప్పుకొచ్చాడు. సీజన్ ప్రారంభం నుంచి మంచి క్రికెట్ ఆడటమే తమకు ధైర్యాన్ని ఇచ్చిందన్నాడు.తన బ్యాటింగ్లో మెరుగుదల కోసం టోర్నీకి ముందు ప్రత్యేకంగా శ్రమించానని, వేగవంతమైన బౌలర్లపై కొన్ని షాట్లను మెరుగుపర్చుకునేందుకు కృషి చేశానని తెలిపాడు. ఈ క్రమంలో దినేశ్ కార్తీక్, విరాట్ కోహ్లి సహా పలువురు సీనియర్ల నుంచి విలువైన సూచనలు అందాయని చెప్పాడు.కోహ్లీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ.. మైదానంలోనూ, బయటా జట్టు కోసమే ఆలోచిస్తాడు. ముఖ్యంగా కొత్త ఆటగాళ్ల వద్దకు తానే వెళ్లి మాట్లాడతాడు. వారికి ధైర్యం ఇస్తాడు. జట్టుకు అతను గొప్ప బలమని కొనియాడాడు.చివరగా అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ "ఈసారి కూడా కప్ మనదే (Ee Sala Nu Cup Namdu) అంటూ అభిమానులకు ట్రోఫీని అంకితం చేశాడు. -
ఫైనల్లో ఓటమి అనంతరం గిల్ విశ్లేషణ
నిన్న (మే 31) జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్లో ఆర్సీబీ చేతిలో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్లో గుజరాత్ ఆర్సీబీకి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. తొలుత బ్యాటింగ్లో సాధారణ స్కోర్కు (155-8) పరిమితమై, ఆతర్వాత దాన్ని కాపాడుకోవడంలో దారుణంగా విఫలమైంది. విరాట్ కోహ్లి (75 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు.సీజన్ ఆధ్యాంతం గుజరాత్ విజయాల్లో ప్రధానపాత్ర పోషించిన బౌలర్లు తుది సమరంలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. 9వ ఓవర్లో రషీద్ ఖాన్ రెండు వికెట్లు (రజత్, కృనాల్) తీయడం మినహా, మిగతా బౌలర్లు చేసిందేమీ లేదు. కాస్త పొదుపుగా బౌలింగ్ చేయగలిగినా, స్కోర్ మరీ చిన్నది కావడంతో కాపాడుకోలేకపోయారు. మ్యాచ్ అనంతరం గుజరాత్ సారధి శుభ్మన్ గిల్ విశ్లేషణ ఇలా ఉంది. "180-190 పరుగులు చేసుంటే, మ్యాచ్ మరింత పోటీగా ఉండేది. పిచ్ పూర్తిగా స్లోగా లేదు. ఆరంభ ఓవర్లలో మాత్రం పేసర్లకు కొంత సహకారం లభించింది.ఆదిలోనే వికెట్లు కోల్పోవడం జట్టు మోమెంటంను దెబ్బతీసింది. మధ్య ఓవర్లలో వేగంగా పరుగులు చేయలేకపోవడం కష్టాలను అధికం చేసింది. ఫైనల్ మ్యాచ్ కావడంతో 150-160 పరుగులు చేసినా, పవర్ప్లేలో రెండు-మూడు వికెట్లు తీసుంటే పోటీలో ఉండేవాళ్లం.టార్గెట్ను కాపాడుకునే క్రమంలో పవర్ప్లేలో 15-20 పరుగులు ఎక్కువగా ఇచ్చేశాము. ఆ దశలో ప్రత్యర్థిని 50-55 పరుగులకు కట్టడి చేసి ఉంటే మ్యాచ్ మరోలా ఉండేది.సీజన్ మొత్తాన్ని పరిశీలిస్తే, మా బౌలింగ్ యూనిట్ అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా నిలిచింది. తొలి రెండు మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత కూడా జట్టు వెనక్కి తగ్గకుండా, చిన్నచిన్న అంశాల్లో మెరుగుపడుతూ బలంగా తిరిగి వచ్చింది.తుది మెట్టుపై ట్రోఫీ చేజారినా ఈ సీజన్ చాలా సంతృప్తినిచ్చింది. గెలిచినా, ఓడినా మెరుగుపర్చుకోవాల్సిన అంశాలు ఎప్పుడూ ఉంటాయి. జట్టుగా ఇంకా అభివృద్ధి చెందాల్సిన అంశాలపై దృష్టి పెడతాము" -
గుజరాత్ టైటాన్స్కు తప్పిన పెను ప్రమాదం
ఐపీఎల్ 2026 ఫైనల్లో ఓటమి బాధ నుంచి కోలుకోకముందే, గుజరాత్ టైటాన్స్కు మరో ఊహించని షాక్ తగిలింది. మ్యాచ్ ముగిసిన తర్వాత వారు ప్రయాణిస్తున్న టీమ్ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.బస్సులో పొగ వ్యాపించడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆటగాళ్లను బయటకు దించారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం లేదా క్యాజువాలిటీలు లేవు. ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ సురక్షితంగా బయటపడినట్లు సమాచారం.ఊహించని ఈ ఘటన కారణంగా గుజరాత్ బృందం మొత్తం దాదాపు గంటపాటు రోడ్డుపైనే వేచి ఉండాల్సి వచ్చింది. అనంతరం నిర్వాహకులు మరో బస్సును ఏర్పాటు చేసి వారిని హోటల్కు తరలించారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం నుంచి హోటల్కు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.కాగా, నిన్న (మే 31) రాత్రి జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, వరుసగా రెండో ఏడాది ఛాంపియన్గా నిలిచింది.ఈ మ్యాచ్లో గుజరాత్ ఏ దశలోనూ ఆర్సీబీకి పోటీనివ్వలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసి సాధారణ స్కోర్కు (155-8) పరిమితమైన ఆ జట్టు.. అనంతరం దాన్ని కాపాడుకోవడంలో దారుణంగా విఫలమైంది. విరాట్ కోహ్లి (75 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. -
IPL 2026: సత్తా చాటిన యంగ్ గన్స్
గత రెండు నెలలుగా మండు వేసవిలో నిండు వినోదం పంచిన ఐపీఎల్ 19వ సీజన్ ముగిసింది! ‘బేబీ బాస్’ వైభవ్ రికార్డులు తిరగరాస్తూ వీరబాదుడు బాదితే... అనామక అన్షుల్ ‘పర్పుల్ క్యాప్’ రేసులో చివరి వరకు నిలిచాడు!జోఫ్రా ఆర్చర్ తన పేస్ పవర్ తగ్గలేదని నిరూపించుకుంటే... రబాడ తానెంత ప్రమాదకర బౌలరో మరోసారి చాటాడు!ఐదేసిసార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ సీజన్ ఆసాంతం పరాజయాలతో సహవాసం చేయగా... లక్నో సూపర్ జెయింట్స్ను నడిపించలేక రిషభ్ పంత్ నాయకత్వ బాధ్యతలకు రాం రాం చెప్పాడు! చెన్నై భారీ ధర పెట్టిన కార్తీక్, ప్రశాంత్ పెద్దగా ఆకట్టుకోలేకపోగా... హైదరాబాద్ కొత్త పేసర్లు ప్రఫుల్, సాకిబ్ లీగ్పై తమదైన ముద్ర వేశారు!ఢిల్లీ హార్డ్ హిట్టర్ సమీర్ రిజ్వీ మెరుపులు ఆరంభ మ్యాచ్లకే పరిమితమైతే... లక్నో పించ్హిట్టర్ ముకుల్ ఒక్క ఇన్నింగ్స్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు!అంతర్జాతీయ టి20లకు వీడ్కోలు పలికినా తన పరుగుల దాహం తీరలేదని కోహ్లి నిరూపించుకుంటే... లయ దొరకబుచ్చుకోలేక సూర్యకుమార్, హార్దిక్ విమర్శల పాలయ్యారు!వెస్టిండీస్ ప్లేయర్ల విధ్వంసకర విన్యాసాలు కొన్ని మ్యాచ్లకే పరిమితం కాగా... అన్క్యాప్డ్ ప్లేయర్ల మెరుపులు భారత బెంచ్ బలాన్ని చాటాయి! టెస్టు ప్లేయర్లుగా ముద్రపడ్డ ఆటగాళ్లు ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో ముందుంటే.. దేశవాళీల్లో రాణించిన అఖీబ్ నబీ ఐపీఎల్లో అదే జోరు కనబర్చలేకపోయాడు!ఇలా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్లో జరిగిన కొన్ని కీలక అంశాలపై ఓ కన్నేస్తే... 10 జట్లు, 65 రోజులు, 74 మ్యాచ్లు, వందలకొద్దీ రికార్డులు, వేలాది బౌండరీలు... ఇలా వేసవిలో మస్తు మజా పంచిన ఐపీఎల్–19వ సీజన్ ఎప్పటిలాగే కోట్లాది మంది అభిమానాన్ని చూరగొంది. దినదిన ప్రవర్ధమానంగా దూసుకెళ్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్... ఈసారి కూడా ఎందరో యువ ఆటగాళ్లను అందలం ఎక్కించింది. బ్యాటింగ్కు అనుకూలమైన నిబంధనల కారణంగా భారీ స్కోర్లు నమోదయ్యాయనే అపవాదు ఉన్నా... ఈ సీజన్లో పరుగుల వరద పారిందనేది వాస్తవం. 200 స్కోరు సాధారణం అయిపోయిన తరుణంలో... రాజస్తాన్ రాయల్స్ తమ పదునైన బౌలింగ్తో 159 పరుగుల మ్యాచ్లో 40 పరుగుల తేడాతో విజయం సాధించడం విశేషం. మొహమ్మద్ షమీ తొలి బంతికి వికెట్ తీసే అలవాటును కొనసాగించగా... ప్రిన్స్ యాదవ్ తన వేగంతో టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. 264 పరుగులు చేసి కూడా ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ గెలవలేకపోగా... అంత పెద్ద లక్ష్యాన్ని పంజాబ్ మరో 7 బంతులుండగానే ఛేదించి ‘వావ్’ అనిపించింది. గత సీజన్లోనే మెరుపు సెంచరీతో వెలుగులోకి వచ్చిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది నిలకడైన బాదుడుతో ప్రపంచవ్యాప్తంగా తనపేరు మారుమోగేలా చేసి భారత సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ‘టెస్టు’ ప్లేయర్ల సత్తా... అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ ఎందులో తీసుకున్న టెస్టు ప్లేయర్లే ఐపీఎల్లో తమదైన ముద్ర వేశారు. బౌలింగ్లో రబాడ, ఆర్చర్, భువనేశ్వర్ విజృంభిస్తే... బ్యాటింగ్లో శుబ్మన్ గిల్, సాయి సుదర్శన్ సత్తా చాటారు. టీమిండియా టెస్టు కెపె్టన్ గిల్ 16 మ్యాచ్ల్లో 45.75 సగటుతో 732 పరుగులు సాధించి సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. ఈ ఏడాది టి20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయన గిల్... తాజా సీజన్లో తన బ్యాట్తోనే బదులిచ్చాడు. నిదానంగా ఆడతాడనే ముద్రను చెరిపేసుకుంటూ 163.02 స్ట్రయిక్రేట్తో చెలరేగిపోయాడు. క్వాలిఫయర్–2 మ్యాచ్ను పరిశీలిస్తే అతడి ధాటి ఎలాంటిదో అర్థమవుతుంది. వైభవ్ సూర్యవంశీ మినహా మిగిలినవాళ్లంతా బ్యాటింగ్ చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడిన పిచ్పై గిల్ మంచినీళ్ల ప్రాయంలా పరుగులు రాబట్టాడు. ఆర్చర్, బర్గర్, బ్రిజేశ్, జడేజాతో కూడిన బౌలింగ్ లైనప్ను ఎదుర్కొంటూ 53 బంతుల్లోనే 104 పరుగులు చేశాడు. అందులో ఎక్కడా మచ్చుకు కూడా అడ్డదిడ్డమైన బాదుడు లేదు. అచ్చమైన క్రికెటింగ్ షాట్లతో చాపకింద నీరులా పరుగులు సాధిస్తూ చూస్తుండగానే రాయల్స్ చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకున్నాడు. పట్టు సాధించేంత వరకు సిక్స్ల జోలికి పోని గిల్... సరైన టైమింగ్ వాడితే ఎంతటి లక్ష్యాన్ని అయినా చేధించవచ్చని నిరూపించాడు. మరోవైపు అతడి ఓపెనింగ్ సహచరుడు సాయి సుదర్శన్ కూడా ఈ సీజన్లో తనదైన ముద్ర వేశాడు. భారత టెస్టు జట్టు సభ్యుడైన సుదర్శన్ తాజా సీజన్లో 17 మ్యాచ్ల్లో 45.13 సగటుతో 722 పరుగులు సాధించాడు. గిల్, సుదర్శన్ల ఆటతీరు కారణంగానే టైటాన్స్ నిలకడైన ప్రదర్శన కొనసాగించగలిగిందనేది నిజం! టెస్టు ప్లేయర్లుగా ముద్ర పడ్డ ఈ ఇద్దరూ ఎక్కడా తొందరపాటుకు పోకుండా ఆచితూచి ఆడటంతోనే పరుగుల వీరుల జాబితాలో చోటు దక్కించుకోగలిగారు. ఫార్మాట్ ఏదైనా టెక్నిక్ ముఖ్యం అని ఈ జంట మరోసారి చాటింది. అన్షుల్ అదుర్స్ రంజీ ట్రోఫీ ఒకే ఇన్నింగ్స్లో 10కి 10 వికెట్లు పడగొట్టి వెలుగులోకి వచ్చిన అన్షుల్ కంబోజ్... ఈ సీజన్లో తనదైన ముద్ర వేశాడు. చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించిన ఈ కుడిచేతి వాటం పేసర్... 14 మ్యాచ్ల్లో 26.32 సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు. మిగతా జట్లతో పోల్చుకుంటే... పాతికేళ్ల అన్షుల్కు మరో ఎండ్ నుంచి సరైన సహకారం లేనçప్పటికీ అతడు నిలకడైన ప్రదర్శన కనబర్చాడు. కోల్కతా నైట్రైడర్స్ పేసర్ కార్తీక్ త్యాగీ మంచి వేగంతో అభిమానులను ఆకర్షించాడు. ఈ సీజన్లో అతడు 13 ఇన్నింగ్స్ల్లో 27.66 సగటుతో 18 వికెట్లు పడగొట్టాడు. ప్రిన్స్ యాదవ్ 14 మ్యాచ్ల్లో 28.68 సగటుతో 16 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 36 ఏళ్ల వయసులో భువనేశ్వర్ తన స్వింగ్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటాడు. కళ్లు చెదిరే అవుట్ స్వింగర్లతో బెంగళూరుకు ఇతోధిక సాయం చేశాడు. భారీగా పరుగులు ఇచ్చుకుంటాడనే ముద్రపడ్డ సిరాజ్ ఈసారి పొదుపైన బౌలింగ్తో ఆకట్టుకుంటే... టి20 ప్రంపచకప్ హీరోలు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్ అనామక బౌలర్లుగా కనిపించారు. వారెవ్వా వైభవ్ సూర్యవంశీ... నూనుగు మీసాలు కూడా రాని ఓ 15 ఏళ్ల కుర్రాడు... అంతర్జాతీయ స్థాయిలో కొమ్ములు తిరిగిన బౌలర్లను ఊచకోత కోయడం ఈ సీజన్కే హైలైట్గా నిలిచింది. గత సీజన్లో 35 బంతుల్లో సెంచరీతో తన రాకను ఘనంగా చాటిన రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ... ఈ ఏడాది ప్రతి క్రికెట్ అభిమాని తన పేరు జపించేలా చేశాడు. 16 మ్యాచ్ల్లో 48.50 సగటుతో 776 పరుగులు చేసి ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్గా నిలిచాడు. మామూలుగా ఒక వంద పరుగులు రెండొందల స్ట్రయిక్ రేట్తో కొట్టడమే కష్టం అనుకుంటే... వైభవ్ 776 పరుగులను ఏకంగా 237.30 స్ట్రయిక్రేట్తో బాదాడు. గణాంకాలు చూస్తే అతడి దూకుడును అర్ధం చేసుకోవడం కష్టమే. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర బౌలర్లను అతడు ఎదుర్కొన్న తీరు మాత్రం నభూతో! మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, జస్ప్రీత్ బుమ్రా వంటి వాళ్ల బౌలింగ్లో ఏమాత్రం బెరుకు లేకుండా తొలి బంతికే సిక్స్లు కొట్టిన అతడి తెగువకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. ఈ సీజన్లో ఒక సెంచరీ తన పేరిట రాసుకున్న వైభవ్... మరో రెండుసార్లు శతకం గుమ్మం వద్ద అవుటయ్యాడు. ఫోర్ (63)ల కంటే సిక్స్ (72)లే ఎక్కువ కొట్టిన సూర్యవంశీ... అవసరమైతే నిదానంగానూ ఆడగలనని క్వాలిఫయర్–2లో నిరూపించుకున్నాడు. సహచరుల విఫలమైన చోట వికెట్ విలువ గుర్తెరిగి ఆచితూచి ఆడటంతోనే అతడిపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. 90వ దశకంలో సచిన్ టెండూల్కర్ తరహాలో... రాజస్తాన్ రాయల్స్ జట్టును ఈ సీజన్లో వైభవ్ తన భుజస్కందాలపై మోశాడు. అతడు ఇదే నిలకడ, క్రమశిక్షణ, కఠోర శ్రమ కొనసాగిస్తే... క్రికెట్కు మరో ఆణిముత్యం దొరికినట్లే! –సాక్షి, క్రీడావిభాగం -
‘రజతాభిషేకం’
ఐపీఎల్లో వరుసగా రెండు టైటిల్స్ నెగ్గిన కెప్టెన్లు గతంలో ఇద్దరు ఉన్నారు. అయితే మిగతా ఇద్దరిలో పోలిస్తే నాయకుడిగా రజత్ పాటీదార్ ప్రస్థానం ఎంతో భిన్నం. రెండు ట్రోఫీలు గెలిపించే సమయానికి ధోని దిగ్గజ కెప్టెన్గా గుర్తింపు పొంది రెండు ప్రపంచ కప్లు కూడా అందించాడు. రోహిత్ వరుసగా రెండు గెలవడానికి ముందే కెప్టెన్గా అతని ఖాతాలో మరో మూడు కప్లు ఉన్నాయి. కానీ పాటీదార్ భారత్ తరఫున తన చివరి టెస్టును 2024లో, ఏకైక వన్డేను 2023లో ఆడాడు. ఆ తర్వాత మళ్లీ అతనికి టీమిండియా అవకాశం దక్కలేదు.గత ఏడాది పాటీదార్ను కెప్టెన్గా ఎంపిక చేసినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. మితభాషి, తన భావనలను ప్రదర్శించలేని అతను సారథిగా ఏం చేస్తాడు అని భావించారు. ద్రవిడ్, పీటర్సన్, కుంబ్లే, వెటోరి, కోహ్లిలాంటి దిగ్గజాల వల్ల సాధ్యం కాని భారం అతనిపై మోపినట్లు అనిపించింది. దాదాపు రెండేళ్ల క్రితం మొదటిసారి పాటీదార్ను కెప్టెన్గా చేయాలనే ఆలోచన వచ్చిప్పుడు ఆర్సీబీ డైరెక్టర్ బొబాట్, కోచ్ ఫ్లవర్ చిన్నపాటి ఇంటర్వ్యూ చేశారు. జట్టు పరిస్థితి బాగుపర్చేందుకు కెప్టెన్గా ఏం సూచిస్తావు అని అడిగారు. టీమ్ వాతావరణం, నమ్మకం, ముందుండి నడిపించడంలాంటి రొటీన్ మాటలు అతను చెప్పలేదు.‘పదునైన పేస్ బౌలింగ్ బృందం కావాలి’ అని ఒకే ఒక్క మాటతో ముగించాడు. ముస్తాక్ అలీ ట్రోఫీలో కెప్టెన్గా మధ్యప్రదేశ్ను నడిపించిన తీరు చూసి కోహ్లి అనుమతితో వెంటనే పాటీదార్ను కెప్టెన్గా నియమించారు. స్టార్ ఆటగాడిగా గుర్తింపు లేదు. ప్రత్యేక ఆకర్షణగా ఎక్కడా కనిపించడు. టీమ్ సమావేశాల్లో కూడా గలగలా మాట్లాడే అలవాటు లేదు. కానీ ఒక్కసారి మైదానంలోకి దిగిన తర్వాతే అతనిలోని కెప్టెన్ బయటకు వస్తాడు. ఆ తర్వాత తాను స్వేచ్ఛగా పని చేస్తాడు. సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఈ లక్షణాలే అతని సారథ్యంపై నమ్మకం ఉంచేందుకు కారణం అయ్యాయని ఆర్సీబీ మేనేజ్మెంట్ వెల్లడించింది. ఆటగాడిగా కూడా అతను ఒక్కసారిగా ఐపీఎల్ వేదికపై దూసుకురాలేదు. 2021లో ఆర్సీబీ తరఫున 4 మ్యాచ్లలో 71 పరుగులే చేయడంతో తర్వాతి ఏడాది జట్టు అతడిని వదిలేసుకుంది. అయితే గాయంతో లవ్నీత్ తప్పుకోవడంతో అతని స్థానంలో 2022లో మళ్లీ చాన్స్ దక్కగా, లక్నోపై అద్భుత సెంచరీతో సత్తా చాటాడు. తర్వాతి సీజన్ గాయంతో దూరమైనా...గత ఏడాది కెప్టెన్గా అసాధారణ విజయాన్ని అందించాడు. తాజా సీజన్లో బ్యాటర్గా కూడా అతను విధ్వంసం సృష్టించాడు. 14 ఇన్నింగ్స్లలో 30 ఫోర్లు, 42 సిక్సర్లు సహా ఏకంగా 192.69 స్ట్రయిక్రేట్తో 501 పరుగులు నమోదు చేసి కోహ్లి తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. ఆదివారమే ఫైనల్ ముగియగా... తన 33వ పుట్టిన రోజున అందుకున్న రెండో ట్రోఫీతో రజత్ పాటీదార్ తన పేరును ప్రత్యేకంగా లిఖించుకున్నాడు. -
మళ్లీ వేటాడేసింది...
‘సుదీర్ఘ కాలం మనం వేటాడబడ్డాం... ఇకపై వేటగాళ్లలా మారిపోవాలి. ఇది ఆరంభం మాత్రమే. విజయాన్ని వ్యసనంగా మార్చుకోవాలి. వరుసగా రెండుసార్లు టైటిల్ సాధించిన జట్టుగా మనం కూడా నిలవగలం’... గత ఏడాది ట్రోఫీని గెలుచుకున్న తర్వాత ఆర్సీబీ డైరెక్టర్ బొబాట్ డ్రెస్సింగ్రూమ్లో చేసిన వ్యాఖ్య ఇది. ఆ సమయంలో విజయోత్సాహంతో చెప్పిన మాటలుగానే ఇవి మిగిలిపోలేదు. నాడు జట్టులో కనిపించిన ఆత్మవిశ్వాసం, అద్భుత ప్రదర్శన స్ఫూర్తిగా ఈసారి కూడా బెంగళూరు దూసుకుపోయింది. దాదాపు అదే తరహా ప్రణాళికతో సరిగ్గా సంవత్సరం తర్వాత టీమ్ మళ్లీ చాంపియన్గా నిలిచి సత్తా చాటింది. ఒక్క టైటిల్తో ఆగిపోకుండా తమ ఆకలిని తీర్చుకుంటూ వరుసగా రెండో ట్రోఫీని గెలుచుకొని సగర్వంగా నిలిచింది.తేదీలు మారడం మినహా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రస్థానం సరిగ్గా 2025 తరహాలోనే సాగి టైటిల్ వరకు చేరింది. లీగ్ దశలో 9 విజయాలతో అగ్రస్థానం, తొలి క్వాలిఫయర్లో ఏకపక్ష గెలుపుతో ఫైనల్కు... తుది పోరులో కూడా సంపూర్ణ ఆధిపత్యం... డిఫెండింగ్ చాంపియన్గా సొంతగడ్డ బెంగళూరులో మళ్లీ ట్రోఫీనిముద్దాడతామని గత ఏడాది గర్వంగా చెప్పినా... వేర్వేరు కారణాలతో అది జరగలేదు. కానీ మళ్లీ అదే అహ్మదాబాద్ వేదికపై విజయానందాన్ని సొంతం చేసుకుంది. 18వ సీజన్లో తొలిసారి ‘ఈ సాలా కప్ నమ్దు’ అంటూ గర్జించిన జట్టు మరోసారి అదే ధ్వనిని బిగ్గరగా వినిపించింది. నాడు విజేతగా నిలిచిన జట్టులోని 13 మంది ఈసారి కూడా గెలుపులో భాగమై తమ ఆనందాన్ని రెట్టింపు చేసుకున్నారు. ఇరు జట్ల మధ్య తొలి క్వాలిఫయర్ పూర్తి ఏకపక్షంగా సాగగా... ఈసారి గుజరాత్ టైటాన్స్ కాస్త మెరుగ్గా ఆడింది. అయితే భయపడినట్లే గిల్, సుదర్శన్, బట్లర్ వైఫల్యం తర్వాత జట్టు కోలుకోలేకపోయింది. ఆర్సీబీ బౌలర్లు పదునైన బంతులతో ప్రత్యర్థిని కట్టి పడేశారు. సరిగ్గా నెలరోజుల క్రితం ఇదే మైదానంలో టైటాన్స్తో పోరులో సరిగ్గా 155 పరుగులే చేసి ఆర్సీబీ ఓడగా... ఇప్పుడు అసలు పోరులో సీన్ రివర్స్ అయింది. ఛేదనలో కోహ్లి, వెంకటేశ్ అయ్యర్ మెరుపు ఆరంభంతో ఆర్సీబీ విజయానికి బాట పడింది. ఆ తర్వాత కాస్త తడబాటు ఎదురైనా... దిగ్గజ ఆటగాడిగా ఛేదనలో తన స్థాయిని చూపిస్తూ దూసుకుపోయిన కోహ్లి భారీ సిక్స్తో విన్నింగ్ షాట్ కొట్టడంతో ఆర్సీబీ బృందంలో సంబరాలు షురూ అయ్యాయి. అహ్మదాబాద్: ఐపీఎల్లో వరుసగా రెండుసార్లు విజేతగా నిలిచిన మూడో జట్టుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన ఆర్సీబీ ఐపీఎల్–2026 టైటిల్ను గెలుచుకుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (37 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బెంగళూరు 18 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు చేసి గెలిచింది. విరాట్ కోహ్లి (42 బంతుల్లో 75 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్లు) చెలరేగిపోగా, వెంకటేశ్ అయ్యర్ (16 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడాడు. టపటపా... ప్రతీ సీజన్లో జట్టు బ్యాటింగ్ భారం మోస్తున్న ముగ్గురు ప్రధాన బ్యాటర్లు తొందరగా వెనుదిరగడంతోనే గుజరాత్ భారీ స్కోరు ఆశలు కోల్పోయింది. శుబ్మన్ గిల్ (8 బంతుల్లో 10; 2 ఫోర్లు), సాయి సుదర్శన్ (12 బంతుల్లో 12; 2 ఫోర్లు) నాలుగు పరుగుల వ్యవధిలో అవుట్ కాగా, నిశాంత్ సింధు (18 బంతుల్లో 20; 3 ఫోర్లు) ప్రభావం చూపలేదు. పవర్ప్లేలో జట్టు 45 పరుగులే చేసింది. క్రీజ్లో ఉన్నంత సేపు తడబడిన జోస్ బట్లర్ (23 బంతుల్లో 19; 1 ఫోర్) సహనం కోల్పోయి వికెట్ సమర్పించుకున్నాడు. ఈ దశలో సుందర్ కొంత పట్టుదలగా నిలబడినా... అతనూ పెద్ద షాట్లు కొట్టలేకపోయాడు. 4 పరుగుల వద్ద కాక్స్ క్యాచ్ అందుకున్నా... రీప్లేలో బంతి గ్రౌండ్కు తాకిందని తేలడంతో అతను బతికిపోయాడు. మరోవైపు అర్షద్ ఖాన్ (6 బంతుల్లో 15; 2 సిక్స్లు) కొన్ని పరుగులు జోడించగా, తర్వాతి బ్యాటర్లంతా పూర్తిగా చేతులెత్తేశారు. ఒక దశలో వరుసగా 40 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయిన గుజరాత్ ఇన్నింగ్స్లో 13వ ఓవర్ నాలుగో బంతికి గానీ తొలి సిక్స్ రాలేదు! తొలి 10 ఓవర్లలో 62 పరుగులు చేసిన జట్టు తర్వాతి 10 ఓవర్లలో 92 పరుగులు రాబట్టింది. శుభారంభం... ఛేదనలో వెంకటేశ్, కోహ్లి జట్టుకు మెరుపు ఆరంభాన్ని అందించారు. తొలి ఓవర్లో సిరాజ్ 5 పరుగులే ఇచ్చినా... రబాడ వేసిన తర్వాత ఓవర్లో వెంకటేశ్ 3 ఫోర్లు, సిక్స్ బాదాడు. సిరాజ్ రెండో ఓవర్లోనూ 3 బౌండరీలు రాగా... రబాడ తర్వాతి ఓవర్లో కోహ్లి వరుసగా 4, 4, 6, 4తో చెలరేగిపోయాడు. వెంకటేశ్, పడిక్కల్ (1) పరుగు తేడాతో వెనుదిరగ్గా... పవర్ప్లేలో జట్టులో 70 పరుగులు చేసింది. ఆ తర్వాత కెపె్టన్ రజత్ పాటీదార్ (13 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్), కృనాల్ పాండ్యా (1)లను రషీద్ ఒకే ఓవర్లో అవుట్ చేసి కొంత ఒత్తిడి పెంచాడు. అయితే కోహ్లి మాత్రం తగ్గకుండా దూసుకుపోయాడు. 25 బంతుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయింది. టిమ్ డేవిడ్ (17 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక పరుగులు జోడించగా... విరాట్ చివరి వరకు నిలిచి జట్టును విజయతీరం చేర్చాడు.స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) జితేశ్ (బి) భువనేశ్వర్ 12; గిల్ (సి) పాటీదార్ (బి) హాజల్వుడ్ 10; నిశాంత్ (సి) పడిక్కల్ (బి) సలామ్ 20; బట్లర్ (స్టంప్డ్) జితేశ్ (బి) కృనాల్ 19; సుందర్ (నాటౌట్) 50; అర్షద్ (సి) సలామ్ (బి) హాజల్వుడ్ 15; తెవాటియా (సి) పాటీదార్ (బి) సలామ్ 7; హోల్డర్ (సి) హాజల్వుడ్ (బి) భువనేశ్వర్ 7; రషీద్ (సి) షెఫర్డ్ (బి) సలామ్ 7; రబాడ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–22, 2–26, 3–55, 4–73, 5–99, 6–115, 7–142, 8–151. బౌలింగ్: డఫీ 4–0–38–0, భువనేశ్వర్ 4–0–29–2, హాజల్వుడ్ 4–0–37–2, సలామ్ 4–0–27–3, కృనాల్ 4–0–23–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: వెంకటేశ్ (సి) రబాడ (బి) సిరాజ్ 32; కోహ్లి (నాటౌట్) 75; పడిక్కల్ (సి) అర్షద్ (బి) రబాడ 1; పాటీదార్ (సి) రబాడ (బి) రషీద్ 15; కృనాల్ (ఎల్బీ) (బి) రషీద్ 1; డేవిడ్ (సి) బట్లర్ (బి) అర్షద్ 24; జితేశ్ (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 2; మొత్తం (18 ఓవర్లలో 5 వికెట్లకు) 161. వికెట్లపతనం: 1–62, 2–63, 3–89, 4–91, 5–132. బౌలింగ్: సిరాజ్ 4–0–36–1, రబాడ 3–0–44–1, హోల్డర్ 2–0–16–0, రషీద్ 4–0–25–2, అర్షద్ 4–0–32–1, ప్రసిధ్ 1–0–7–0. -
కోహ్లీ వీరవిహారం.. చాంపియన్స్గా ఆర్సీబీ
ఐపీఎల్ 2026 చాంపియన్గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చేజింగ్ మాస్టర్గా పేరు పొందిన విరాట్ కోహ్లీ ఆఖరి దాకా నిలిచి ఆర్సీబీని గెలిపించాడు. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ (42 బంతుల్లో 75 నాటౌట్), వెంకటేశ్ అయ్యర్ (16 బంతుల్లో 32), టిమ్ డేవిడ్ (17 బంతుల్లో 24 పరుగులు) ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2 వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్, రబాడ, అర్షద్ ఖాన్ తలా వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (50 నాటౌట్), నిషాంత్ సిందూ (20 పరుగులు) ఆడుతున్నారు. రసిక్ సలామ్ 3 వికెట్లు తీయగా, హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ చెరో 2 వికెట్లు తీశాడు.కోహ్లీ కమాల్..156 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. వెంకటేశ్ అయ్యర్, కోహ్లీలు కలిసి తొలి వికెట్కు 4.3 ఓవర్లలో 62 పరుగులు జోడించి మంచి పునాది వేశారు. ఈ దశలో పడిక్కల్, పాటీదార్లు రషీద్ఖాన్ బౌలింగ్లో వెనువెంటనే ఔట్ కావడంతో ఆర్సీబీ శిబిరంలో ఆందోళన నెలకొన్నప్పటికీ కోహ్లీ నిలకడగా ఆడి జట్టును విజయం దిశగా నడిపించాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ ఔటైనప్పటికీ జితేశ్ శర్మ (11 నాటౌట్)తో కలిసి కోహ్లీ ఆర్సీబీని గెలిపించి వరుసగా రెండో కప్పును అందించాడు.ఆర్సీబీ అరుదైన ఫీట్ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఒక అరుదైన ఫీట్ సాధించింది. వరుసగా రెండు సీజన్లలో టైటిల్ గెలిచిన మూడో జట్టుగా ఆర్సీబీ రికార్డులకెక్కింది. గతంలో చెన్నై సూపర్కింగ్స్ (2010, 2011), ముంబై ఇండియన్స్ (2019, 2020) ఈ ఫీట్ను సాధించాయి.Finishing off in style 🥳And it's none other than King Kohli 😎👑Scorecard ▶️ https://t.co/Yz6K3q6w0X#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/FZNGQ26gBs— IndianPremierLeague (@IPL) May 31, 2026 -
ఆరెంజ్ క్యాప్ వైభవ్దే.. ప్రైజ్మనీ ఎంతంటే?
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రతిష్టాత్మక ఐపీఎల్ ‘ఆరెంజ్ క్యాప్’ సొంతం చేసుకున్న వైభవ్.. యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్-2026 సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. సూర్యవంశీ 16 మ్యాచ్లలో 776 పరుగులు చేసి ఈ ఆరెంజ్ క్యాప్ను కైవసం చేసుకున్నాడు.దీంతో ఐపీఎల్ చరిత్రలోనే ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న అతి పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డులెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ (23 ఏళ్ల 263 రోజులు) పేరిట ఉండేది. ఐపీఎల్-2026 సీజన్లో గిల్ ఈ ఫీట్ సాధించాడు. తాజా సీజన్తో గిల్ ఆల్టైమ్ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు. ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచినందుకు వైభవ్కు రూ.10 లక్షలు నగదు బహుమతి దక్కింది.ఛాంపియన్స్గా ఆర్సీబీఇక ఐపీఎల్-2026 సీజన్ ఛాంపియన్స్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ.. వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్ను సొంతం చేసుకుంది. 156 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 18 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. లక్ష్య చేధనలో విరాట్ కోహ్లి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 75 పరుగులు చేసి తన జట్టును ఛాంపియన్గా నిలిపాడు. అతడితో పాటు వెంకటేశ్ అయ్యర్(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 32) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా గుజరాత్ నిర్ధేశించిన స్వల్ప లక్ష్యాన్ని బెంగళూరు 18 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది -
చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే
ఐపీఎల్-2026లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్లు విరాట్ కోహ్లి, వెంకటేశ్ అయ్యర్ విధ్వంసం సృష్టించారు. 156 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో గుజరాత్ పేసర్లకు వీరిద్దరూ చుక్కలు చూపించారు. ఫలితంగా ఆర్సీబీ స్కోర్ కేవలం 3.3 ఓవర్లలోనే (21 బంతుల్లో) 50 పరుగుల మార్క్ దాటింది. దీంతో ఆర్సీబీ ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఐపీఎల్ ఫైనల్ చరిత్రలో అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన జట్టుగా బెంగళూరు నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉంది. ఐపీఎల్-2023 సీజన్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై సీఎస్కే 4 ఓవర్లలో 50 పరుగులు చేసింది. తాజా మ్యాచ్తో సీఎస్కే రికార్డును ఆర్సీబీ బ్రేక్ చేసింది. విజేతగా ఆర్సీబీఇక ఈ ఏడాది సీజన్ ఛాంపియన్స్గా ఆర్సీబీ నిలిచింది. గుజరాత్ నిర్ధేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 18 ఓవర్లలో చేధించి రెండో ఐపీఎల్ టైటిల్ను తమ ఖాతాలో వేసుకుంది. విరాట్ కోహ్లి కేవలం 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లితో పాటు వెంకటేశ్ అయ్యర్ 32 పరుగులతో రాణించాడు.చదవండి: వైభవ్కు నో ఛాన్స్.. టీ20 ప్రపంచకప్లో భారత ఓపెనర్లు వీరే? -
అరుదైన ఫీట్తో భువనేశ్వర్ కొత్త చరిత్ర
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఫీట్ సాధించాడు. 16 మ్యాచ్లాడిన భువనేశ్వర్ 28 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఒక సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్గా భువనేశ్వర్ షమీతో కలిసి రికార్డులకెక్కాడు. కాగా ఈ జాబితాలో ఆర్సీబీ తరఫున హర్షల్పటేల్ (32 వికెట్లు, 2021 సీజన్), గుజరాత్ టైటాన్స్ తరఫున మహ్మద్ షమీ (28 వికెట్లు, 2023 సీజన్) ఈ ఫీట్ సాధించారు. ఇక ముంబై ఇండియన్స్ తరఫున జస్ప్రీత్ బుమ్రా (27 వికెట్లు, 2020 సీజన్), రాజస్తాన్ తరఫున చాహల్ (27 వికెట్లు, 2022), గుజరాత్ తరఫున మోహిత్ శర్మ (27 వికెట్లు, 2022) భువనేశ్వర్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇక ఈ సీజన్లో ఇప్పటికే పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్న భువనేశ్వర్ మరో ఫీట్ కూడా అందుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్లో తొలి పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో భువనేశ్వర్ (17 వికెట్లు) షమీతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఇదే సీజన్లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ కగిసో రబాడ (19 వికెట్లు) తీసి తొలి స్థానంలో ఉన్నాడు.Bhuvneshwar Kumar in IPL2026 - 𝟮𝟴 wickets (7.95 Eco)*2025 - 17 wickets (9.28 Eco)2024 - 11 wickets (9.35 Eco)2023 - 16 wickets (8.33 Eco)2022 - 12 wickets (7.34 Eco)2021 - 6 wickets (7.97 Eco)2020 - 3 wickets (6.98 Eco)2019 - 13 wickets (7.81 Eco)2018 - 9 wickets… pic.twitter.com/DLOczlJ22e— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) May 31, 2026చదవండి: 'కోహ్లీ కాస్త తగ్గి ఉండు.. మీ బ్యాటింగ్ అయిపోలేదు!' -
'కోహ్లీ కాస్త తగ్గి ఉండు.. మీ బ్యాటింగ్ అయిపోలేదు!'
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న ఫైనల్లో ఇప్పటికైతే ఆర్సీబీదే పైచేయిగా ఉంది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతున్న గుజరాత్ టైటాన్స్ సాధారణ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. అయితే గుజరాత్ వికెట్లు పడిన ప్రతీసారి కోహ్లీ హైపర్ యాక్టివ్గా కనిపించాడు. ముఖ్యంగా గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ వికెట్లు పడ్డప్పుడు కోహ్లీ ఇచ్చిన రియాక్షన్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హాజిల్వుడ్ బౌలింగ్లో గిల్ ఔటైన వెంటనే పిచ్పైకి పరిగెత్తుకొచ్చిన కోహ్లి గిల్వైపు చూస్తూ గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకోవడం కనిపించింది. అంతటితో ఆగకుండా సాయి సుదర్శన్ ఔట్ కావడానికి ముందు కోహ్లీ శ్రుతి మించిపోయాడు. హాజిల్వుడ్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లు ప్రతీ బంతికి ముందు కోహ్లీ సాయి సుదర్శన్ను టార్గెట్ చేస్తూ ఏదో ఒక మాట అనడం స్టంప్ మైక్లో రికార్డయింది. అదే ఓవర్ నాలుగో బంతికి సాయి సుదర్శన్ భారీ షాట్కు యత్నించి జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే కోహ్లీ చర్యలపై గుజరాత్ టైటాన్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోహ్లీ కాస్త తగ్గి ఉండు.. మీ బ్యాటింగ్ ఇంకా అయిపోలేదు. అని కామెంట్లు పెడుతున్నారు.మరో విషయమేంటంటే.. గత రెండు మ్యాచ్ల్లో హిట్ వికెట్గా వెనుదిరిగిన సాయి సుదర్శన్ ఈ మ్యాచ్లోనూ అలా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. హాజిల్వుడ్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్ రెండో బంతిని ఆడే క్రమంలో బ్యాట్ అతని చేతి నుంచి జారిపోయేలా కనిపించినప్పటికీ ఈసారి మాత్రం అలా జరగలేదు. ఇక మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాష్టింగ్టన్ సుందర్ (50) అర్థసెంచరీతో గుజరాత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. రసిక్ సలామ్ మూడు వికెట్లు తీయగా, హాజిల్వుడ్, భువనేశ్వర్లు చెరో 2 వికెట్లు పడగొట్టారు.pic.twitter.com/E5HLX9ALPr— crictalk (@crictalk7) May 31, 2026చదవండి: అయ్యో గుజరాత్.. సీన్ రివర్స్ అయ్యేలా ఉందే! -
వైభవ్కు నో ఛాన్స్.. టీ20 ప్రపంచకప్లో భారత ఓపెనర్లు వీరే?
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనలతో భారత సీనియర్ జట్ట వైపు దూసుకొస్తున్నాడు. ఇప్పటికే ఆసియా క్రీడలకు బీసీసీఐ ఎంపిక చేసిన 30 మంది ఆటగాళ్లతో కూడిన ప్రాబుబుల్స్ జాబితాలో వైభవ్ చోటు దక్కించుకున్నాడు.అంతకంటే ముందు ఐర్లాండ్ లేదా జింబాబ్వేలతో టీ20 సిరీస్ల కోసం భారత జట్టుకు వైభవ్ ఎంపికయ్యే అవకాశముంది. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే సంచనాలు సృష్టిస్తున్న వైభవ్ను భారత క్రికెట్ భవిష్యత్తు స్టార్గా అభివర్ణిస్తున్నారు.ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2028లో భారత జట్టుకు వైభవ్ కీలకం కానున్నాడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ టోర్నీలో వైభవ్.. అభిషేక్ శర్మ లేదా సంజూ శాంసన్లతో కలిసి భారత ఇన్నింగ్స్ను ప్రారంభించనున్నాడని మాజీలు ఇప్పటి నుంచే జోస్యం చెబుతున్నారు.కానీ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మాత్రం పొట్టి ప్రపంచకప్ కోసం కొత్త భారత ఓపెనింగ్ జోడీని ఎంచుకున్నాడు. శుబ్మన్ గిల్, సాయిసుదర్శన్లు భారత ఇన్నింగ్స్ను ఆరంభించాలని అతడు సూచించాడు. "ఆస్ట్రేలియా వంటి కఠిన పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోగల ఓపెనింగ్ జోడీ(సాయిసుదర్శన్-శుభ్మన్ గిల్)ని ఇప్పుడు మనం ఐపీఎల్లో చూస్తున్నాము. ప్రస్తుతం ఐపీఎల్లో కూడా పిచ్లు ఆస్ట్రేలియా మాదిరిగానే అంతే వేగం, బౌన్స్ను కలిగి ఉన్నాయి. అలాంటి పిచ్లపై కూడా గిల్-సుదర్శన్ జోడీ అద్భుతంగా రాణిస్తోంది. వీరిద్దరూ 2028 ప్రపంచ కప్ టోర్నీకి ఎంపిక కాకపోతే కచ్చితంగా నేను ఆశ్చర్యపోతాను. ఈ మెగా టోర్నీలో గిల్-సుదర్శన్లు టీమిండియా ఓపెనర్లగా బరిలోకి దిగాలి. ఎందుకంటే ఒకరి ఆట తీరుపై మరొకరికి చాలా మంచి అవగాహన ఉంది. విభిన్నమైన విదేశీ పరిస్థితుల్లో జట్టు రాణించాలనుకుంటే, వీరిద్దరూ కలిసి ఉండటం అనేది జట్టుకు చాలా పెద్ద సానుకూలాంశం" అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయుడు పేర్కొన్నాడు. కాగా శుబ్మన్ గిల్ ప్రస్తుతం భారత టీ20 సెటాప్లోనే లేడు. అతడు చివరగా సౌతాఫ్రికాపై టీ20 మ్యాచ్ ఆడాడు. వరుస మ్యాచ్లలో విఫలం కావడంతో టీ20 ప్రపంచకప్-2026 జట్టును అతడిని బీసీసీఐ సెలక్షన్ కమిటీ తప్పించింది. ఇప్పుడు మళ్లీ గిల్ను టీ20లకు ఎంపిక చేయమని రాయుడు సూచించడం గమనార్హం.చదవండి: IPL 2026: తుది పోరులో తుస్సుమనిపించిన శుబ్మన్ గిల్ -
తుది పోరులో తుస్సుమనిపించిన శుబ్మన్ గిల్
ఐపీఎల్-2026లో అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్లు శబ్మన్ గిల్, సాయిసుదర్శన్ తీవ్ర నిరాశపరిచారు. క్వాలిఫయర్-2లో మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీ.. తుది పోరులో మాత్రం పూర్తిగా తేలిపోయింది.గుజరాత్ ఇన్నింగ్స్ 3వ ఓవర్ వేసిన జోష్ హాజిల్వుడ్ బౌలింగ్లో రెండో బంతిని గిల్ షార్ట్-ఆర్మ్ జాబ్ ఫుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకుని మిడ్-ఆఫ్ దిశగా గాల్లోకి లేచింది. ఈ క్రమంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ తన కుడివైపునకు పరిగెత్తుకు వచ్చి బంతిని అందుకున్నాడు.దీంతో గిల్ 8 బంతుల్లో 10 పరుగులు చేసి తీవ్ర నిరాశతో పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ ఓవర్లో సాయిసుదర్శన్(12 బంతుల్లో 12) కూడా ఓ చెత్త షాట్ ఆడి తన వికెట్ను కోల్పోయాడు. దీంతో గుజరాత్ 26 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి గుజరాత్ కష్టాల్లో పడింది. ఇక ఓవరాల్గా ఈ ఏడాది సీజన్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో (732), సుదర్శన్(722) రెండు, మూడు స్ధానాల్లో నిలిచారు.చదవండి: IND vs SL: రుతురాజ్ గైక్వాడ్కు బంపర్ ఆఫర్ -
అయ్యో గుజరాత్.. సీన్ రివర్స్ అయ్యేలా ఉందే!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ పూర్తిగా తడబడుతోంది. ఆదిలోనే ఓపెనర్లిద్దరి వికెట్లను కోల్పోయిన గుజరాత్ కష్టాల్లో పడింది. అయితే హోంగ్రౌండ్లో గుజరాత్ టైటాన్స్కు మంచి రికార్డే ఉంది. టాస్ ఓడినా, గెలిచినా 2025 నుంచి చూసుకుంటే అప్పటినుంచి గుజరాత్ టైటాన్స్ ఐదు మ్యాచ్ల్లో తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ ఐదు మ్యాచ్ల్లోనూ గుజరాత్ విజయాలను సాధించింది. ఇందులో ముంబై ఇండియన్స్పై 36 పరుగులతో, రాజస్తాన్పై 58 పరుగులతో, ఎస్ఆర్హెచ్పై 38 పరుగులతో, ఎస్ఆర్హెచ్పై 82 పరుగులతో, సీఎస్కేపై 89 పరుగులతో విజయాలను అందుకుంది. అయితే ఈసారి జరుగుతున్న ఫైనల్లో మాత్రం గుజరాత్ టైటాన్స్కు సీన్ రివర్స్ అయ్యేలా కనిపిస్తుంది. పైగా టాస్ సమయంలో గిల్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా అనిపించాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ పటీదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అహ్మదాబాద్ పిచ్పై చేజింగ్ చేసిన జట్టే ఎక్కువ విజయాలు అందుకుంది. అయితే గిల్ మాత్రం తాను టాస్ గెలిచి ఉంటే బ్యాటింగ్ ఎంచుకునేవాడినని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు తొలుత బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ గుజరాత్ ఆర్సీబీ బౌలర్లను ఎదుర్కోలేకపోతుంది. 8 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ 2 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. నిషాంత్ సిందూ (20), జాస్ బట్లర్ (10) పరుగులతో ఆడుతున్నారు.🚨 Toss Update from the FINAL 🚨@RCBTweets have won the toss & will bowl first against @gujarat_titans in Ahmedabad.Updates ▶️ https://t.co/Yz6K3q6w0X#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/kgrF0LJ0gQ— IndianPremierLeague (@IPL) May 31, 2026చదవండి: చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్ జోడీ -
చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్ జోడీ
భారత బ్యాడ్మింటన్ స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. సింగపూర్ ఓపెన్లో ఈ జోడీ చాంపియన్గా నిలిచింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సాత్విక్ జోడీ 18-21, 21-17, 21-16తో ఇండోనేషియాకు చెందిన ఫజర్ అల్ఫియన్-ముహమ్మద్ ఫిక్రీ జంటపై అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో సింగపూర్ ఓపెన్ సాధించిన తొలి భారత డబుల్స్ జోడీగా సాత్విక్-చిరాగ్ రికార్డులెక్కారు. మ్యాచ్ తొలి గేమను 18-21 తేడాతో కోల్పోయినప్పటికీ, రెండో గేమ్లో ఫుంజుకొని సాత్విక్ - చిరాగ్ జోడీ అద్భుతంగా పుంజుకుంది. అనంతరం జరిగిన రెండో, మూడో గేమ్లలో వరుసగా 21-17, 21-16 స్కోర్లతో విజయం సాధించి టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో సాత్విక్-చిరాగ్ జోడీ రెండేళ్ల తర్వాత తమ తొలి అంతర్జాతీయ టైటిల్ను గెలుచుకుంది. కీలక సమయాల్లో ఒత్తిడిని తట్టుకుని అద్భుతమైన ప్రదర్శన చేయగల తమ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించింది. మ్యాచ్ మొత్తం భారత జోడీ పోరాట పటిమ, సమన్వయం, దూకుడు ఆటతీరు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలి గేమ్లో వెనుకబడినప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తిరిగి పోటీలోకి రావడం వారి విజయానికి ప్రధాన కారణమైంది. విజయం అనంతరం సాత్విక్-చిరాగ్ జోడీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. స్టేడియంలోని అభిమానుల మద్దతు తమకు ఎంతో ప్రేరణనిచ్చిందని పేర్కొంది.‘గతంలో మేము కొన్ని కీలక మ్యాచ్లో ఓడిపోయాం. కానీ ఈ టోర్నమెంట్ మా కోసం ప్రత్యేకమైనదిగా నిలిచింది. ప్రేక్షకుల మద్దతు అద్భుతంగా ఉంది. ఎవరు ఆడుతున్నారన్నది పక్కనపెట్టి ప్రతి మ్యాచ్ను మీరు ఎంతో ఉత్సాహంగా ఆస్వాదించారు. మేము ఆడిన అత్యుత్తమ స్టేడియంలలో ఇది ఒకటి. ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’ అని వారు తెలిపారు.SATCHI ARE THE CHAMPIONS OF BWF SINGAPORE OPEN 2026 ❤️🏆#SingaporeOpen2026 https://t.co/bYmk2NWHoD pic.twitter.com/DQCoRSQVmS— Badminton Media (@BadmintonMedia1) May 31, 2026చదవండి: స్వియాటెక్కు షాక్.. వరుసగా 16వ విజయం -
స్వియాటెక్కు షాక్.. వరుసగా 16వ విజయం
ఫ్రెంచ్ ఓపెన్లో మరో సంచలనం నమోదైంది. నాలుగుసార్లు చాంపియన్, మాజీ నంబర్వన్ ఇగా స్వియాటెక్ ప్రిక్వార్టర్స్లో ఇంటిబాట పట్టింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ నాలుగో రౌండ్లో ఉక్రెయిన్కు చెందిన 15వ ర్యాంకర్ మార్తా కొస్త్యుక్ చేతిలో 7-5, 6-1తో స్వియాటెక్ ఓటమి పాలైంది. గంటా 39 నిమిషాల పాటు సాగిన పోరులో కొస్త్యుక్ 5 ఏస్లు సంధించగా.. స్వియాటెక్ సున్నా ఏస్లకు పరిమితమైంది. కొస్త్యుక్ 25 విన్నర్లు సంధించగా, స్వియాటెక్ కేవలం 13 విన్నర్లకే పరిమితమైంది. గతంలో తలపడిన మూడుసార్లు ఓటమి పాలైన కొస్త్యుక్ ఈసారి మాత్రం స్వియాటెక్పై పైచేయి సాధించింది. స్వియాటెక్ను ఎదుర్కొనే క్రమంలో కొస్త్యుక్ గ్రౌండ్ నలుమూలలా షాట్లు ఆడింది. ముఖ్యంగా మ్యాచ్లో కొస్త్యుక్ గ్రౌండ్ స్ట్రోక్ విన్నర్స్తో అలరించింది. అయితే క్లే కోర్టుపై కొస్త్యుక్ తన రికార్డును మరింత మెరుగుపరుచుకుంది. ఇప్పటివరకు క్లే కోర్టులో కొస్త్యుక్ వరుసగా 16వ విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా ప్రెంచ్ ఓపెన్కు ముందు ఫ్రాన్స్లో క్లే కోర్టులో టైటిల్ నెగ్గిన కొస్త్యుక్ ఆ తర్వాత మాడ్రిడ్ టోర్నీ కూడా గెలుచుకుంది. మరోవైపు 2024 ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత స్వియాటెక్ క్లే కోర్టులో మరో టైటిల్ గెలవలేదు. జూన్ 2న జరగనున్న క్వార్టర్ ఫైనల్లో కొస్త్యుక్ ఏడో ర్యాంకర్ ఎలీనా స్వితోలినాను ఎదుర్కోనుంది.Still undeafeted on clay this season 👏#RolandGarros pic.twitter.com/ax2kZzUJe0— Roland-Garros (@rolandgarros) May 31, 2026చదవండి: పాక్ మాజీ కెప్టెన్కు అవమానం.. -
ఐపీఎల్-2026 సీజన్ విజేతగా ఆర్సీబీ
IPL 2026 RCB vs GT Live Updates: ఐపీఎల్-2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఆర్సీబీ.. వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్ను ముద్దాడింది. ఈ విజయంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిది కీలక పాత్ర. 156 పరుగుల లక్ష్య చేధనలో కోహ్లి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 75 పరుగులు చేసి తన జట్టును ఛాంపియన్గా నిలిపాడు. అతడితో పాటు వెంకటేశ్ అయ్యర్(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 32) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా గుజరాత్ నిర్ధేశించిన స్వల్ప లక్ష్యాన్ని బెంగళూరు 18 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీవిరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 25 బంతుల్లోనే కోహ్లి ఆర్ధ సెంచరీ సాధించారు. 12 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 116/4ఊహించని ట్విస్ట్.. నాలుగో వికెట్ డౌన్గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ పోరులో ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. ముందు పాటీదార్ (15)ను వెనక్కి పంపిన రషీద్.. ఆ తర్వాత కృనాల్ పాండ్యా (1)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది.8 ఓవర్లలో ఆర్సీబీ 88-28 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (38), రజత్ పాటీదార్ (15) పరుగులతో ఆడుతున్నారు.ఆర్సీబీ రెండో వికెట్ డౌన్ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన దేవ్దత్త్ పడిక్కల్.. రబాడ బౌలింగ్లో ఔటయ్యాడు.ఆర్సీబీ తొలి వికెట్ డౌన్ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 16 బంతుల్లో 32 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్.. సిరాజ్ బౌలింగ్లో ఔటయ్యాడు.దుమ్ములేపుతున్న విరాట్ కోహ్లి158 పరుగుల లక్ష్య చేధనలో విరాట్ కోహ్లి దుమ్ములేపుతున్నాడు. కోహ్లి కేవలం పది బంతుల్లోనే 28 పరుగులు చేశాడు. వెంకటేశ్ అయ్యర్(26) కూడా దూకుడుగా ఆడుతున్నాడు. ఫలితంగా ఆర్సీబీ స్కోర్ కేవలం 4 ఓవర్లలోనే 50 పరుగుల మార్క్ దాటింది.దూకుడుగా ఆడుతున్న వెంకటేశ్ అయ్యర్2 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్(22) దూకుడుగా ఆడుతున్నాడు.ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?అహ్మదాబాద్ వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్(50) హాఫ్ సెంచరీతో గుజరాత్ను ఆదుకున్నాడు. కెప్టెన్ శుబ్మన్ గిల్(12), సాయిసుదర్శన్(12), జోస్ బట్లర్(19) వంటి స్టార్ ప్లేయర్లు తీవ్ర నిరాశపరిచారు. ఆర్సీబీ బౌలర్లలో రాసిఖ్ సలామ్ దార్ మూడు వికెట్లు పడగొట్టగా.. భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్వుడ్ తలా రెండు వికెట్లు సాధించారు.ఏడో వికెట్ డౌన్గుజరాత్ ఏడో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన హోల్డర్.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో ఔటయ్యాడు. 18.4 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 143/7ఆరో వికెట్ కోల్పోయిన గుజరాత్ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 115 పరుగులవ వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన రాహుల్ తెవాటియా రసిక్ సలామ్ బౌలింగ్లో పాటీదార్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఐదో వికెట్ డౌన్అర్షద్ ఖాన్(15) రూపంలో గుజరాత్ ఐదో వికెట్ కోల్పోయింది. జోష్ హాజిల్వుడ్ బౌలింగ్లో అర్షద్ ఔటయ్యాడు.దూకుడుగా ఆడుతున్న అర్షద్ ఖాన్జోష్ బట్లర్ స్ధానంలో క్రీజులోకి వచ్చిన అర్షద్ ఖాన్ దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 5 బంతుల్లోనే రెండు సిక్సర్ల సాయంతో 15 పరుగులు చేశాడు. 14 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 100/4గుజరాత్ నాలుగో వికెట్ డౌన్గుజరాత్ టైటాన్స్ వికెట్ల పతనం కొనసాగుతోంది. జోస్ బట్లర్(19) రూపంలో గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 12.1 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 73/4గుజరాత్ మూడో వికెట్ డౌన్నిషాంత్ సింధు రూపంలో గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన సింధు.. రాసిఖ్ సలామ్ దార్ బౌలింగ్లో ఔటయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. క్రీజులో వాషింగ్టన్ సుందర్(2), జోస్ బట్లర్(2) ఉన్నారు.గుజరాత్కు భారీ షాక్గుజరాత్కు భారీ షాక్ తగిలింది. ఇన్ఫామ్ బ్యాటర్ సాయిసుదర్శన్(12) రూపంలో గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ బౌలింగ్లో సుదర్శన్ ఔటయ్యాడు. 4 ఓవర్లు గుజరాత్ టైటాన్స్ స్కోర్: 30/2గుజరాత్ తొలి వికెట్ డౌన్గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన శుబ్మన్ గిల్.. రజత్ పాటిదార్ బౌలింగ్లో ఔటయ్యాడు.2 ఓవర్లకు గుజరాత్ టైటాన్స్ స్కోర్: 18/02 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. క్రీజులో శుబ్మన్ గిల్(6), సాయిసుదర్శన్(9) ఉన్నారు.ఐపీఎల్-2026లో తుది పోరుకు తెరలేచింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. స్పిన్నర్ సాయికిషోర్ స్ధానంలో పేసర్ అర్షద్ ఖాన్ తుది జట్టులోకి వచ్చాడు. ఆర్సీబీ మాత్రం తమ ప్లేయింగ్ ఎలెవన్లో ఎలాంటి మార్పులు చేయలేదు.తుది జట్లుగుజరాత్ టైటాన్స్: శుభ్మన్ గిల్ (కెప్టెన్), బి సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, నిశాంత్ సింధు, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, అర్షద్ ఖాన్, మహ్మద్ సిరాజ్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, జోష్ హాజిల్వుడ్, రసిఖ్ సలాం దార్ -
రుతురాజ్ గైక్వాడ్కు బంపర్ ఆఫర్
శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత ‘ఎ’ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్, అస్సాం స్టార్ ప్లేయర్ రియాన్ పరాగ్ గాయం కారణంగా లంక టూర్కు దూరమయ్యాడు. అతడి స్దానాన్ని మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్తో బీసీసీఐ భర్తీ చేసింది. తిలక్ వర్మకు డిప్యూటీగా గైక్వాడ్ వ్యవహరించనున్నాడు. గైక్వాడ్ దాదాపు ఏడాది తర్వాత ఇండియా-ఎ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఈ సీఎస్కే కెప్టెన్ ప్రస్తుతం పేలవ ఫామ్తో సతమతవుతున్నాడు. ఐపీఎల్-2026లో రుతురాజ్ 14 మ్యాచ్లు ఆడి కేవలం 337 పరుగులు చేశాడు. అయితే రుతు తన ఫామ్ను తిరిగి అందుకోవడానికి ఈ టూర్ మంచి అవకాశం.ఇక పరాగ్ విషయానికి వస్తే.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆరంభంలోనే హ్యామ్స్ట్రింగ్ (Hamstring) గాయానికి గురయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్ మధ్యలోనే గాయం కారణంగా మైదానాన్ని వీడాడు.ఆ తర్వాత కొన్ని మ్యాచ్లకు దూరమైనప్పటికీ, జట్టు ప్లేఆఫ్స్ రేసులో ఉండటంతో నొప్పితోనే తిరిగి జట్టులోకి వచ్చాడు. కానీ రాజస్తాన్ ఎలిమినేటర్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. అయితే ఇప్పుడు అతడు గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో లంక పర్యటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే రుతురాజ్ను జట్టులోకి తీసుకున్నారు. అతడు చివరగా 2025లో ఇండియా-ఎ తరపున సౌతాఫ్రికా-ఎపై ఆడాడు. ఆ సిరీస్లో గైక్వాడ్ 210 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. కాగా లంక టూర్లో భాగంగా భారత్-ఎ జట్టు.. శ్రీలంక-ఎ, అఫ్గానిస్తాన్-ఎ టీమ్స్తో ముక్కోణపు వన్డే సిరీస్లో తలపడనుంది.శ్రీలంక సిరీస్ కోసం ఇండియా-ఎ జట్టు:తిలక్ వర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, సూర్యాంశ్ శెడ్గే, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), విప్రజ్ నిగమ్, యష్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్, అనుకుల్ రాయ్. -
పాక్ మాజీ కెప్టెన్కు అవమానం..
ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. శనివారం రావల్పిండి వేదికగా తొలి వన్డేలో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి 1000వ వన్డేను మధురానుభూతిగా మల్చుకుంది. మ్యాచ్లో హాఫ్ సెంచరీతో మెరిసిన బాబర్ ఆజంకు అవమానం జరిగింది. పాక్ వెయ్యి వన్డేలు పూర్తి చేసుకున్న క్రమంలో ఆ జట్టు మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ జట్టులో ఉండే నాలుగు స్లాట్లకు (బ్యాటర్, బౌలర్, ఆల్రౌండర్, వికెట్ కీపర్) సంబంధించి అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేశాడు. ఈ జాబితాలో బాబర్ ఆజంకు చోటు దక్కలేదు. 1992 వన్డే వరల్డ్కప్ సాధించిన పాక్ జట్టుకు నాయకత్వం వహించిన ఇమ్రాన్ఖాన్ను కెప్టెన్, ఆల్రౌండర్ స్లాట్కు ఎంపిక చేశాడు. ఇక బ్యాటర్గా బాబర్ ఆజం కాకుండా సయీద్ అన్వర్ను ఎంపిక చేశాడు. వికెట్ కీపర్గా రషీద్ లతీఫ్ను, ఫాస్ట్ బౌలర్ కోటాలో వసీమ్ అక్రమ్ను, స్పిన్నర్ కోటాలో సక్లెయిన్ ముస్తాక్ను ఎంపిక చేశాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 44.1 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. మాట్ రెన్షా (61), మాథ్యూ షార్ట్ (55) అర్థసెంచరీలు సాధించారు. అరాఫత్ మిన్హాస్ 5 వికెట్లు పడగొట్టగా, అబ్రార్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. అనంతరం పాకిస్తాన్ 42.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. బాబర్ ఆజం (69), గాజీ గోరి (65) హాఫ్ సెంచరీలతో జట్టును గెలిపించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 2 వికెట్లు తీయగా, మాథ్యూ కునెమన్, తన్వీర్ సంగా, మార్నస్ లబుషేన్ తలా ఒక వికెట్ తీశారు.చదవండి: ఐపీఎల్ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ! -
గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం! రోహిత్ శర్మకు భారీ షాక్?
వన్డే వరల్డ్కప్-2027లో టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆడుతాడా? లేదా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 39 ఏళ్ల రోహిత్ శర్మ ప్రస్తుతం ఫిట్నెస్ సమస్యలతో సతమవుతున్నాడు. తొడ కండరాల గాయం కారణంగా ఐపీఎల్-2026లో రోహిత్ కేవలం 9 మ్యాచ్లు మాత్రమే ఆడాడు.ఆ తర్వాత పునరాగమనం చేసినప్పటికి పూర్తి ఫిట్నెస్తో మాత్రం హిట్మ్యాన్ కనిపించలేదు. కేవలం ఇంపాక్ట్ ప్లేయర్గా మాత్రమే బరిలోకి దిగాడు. అయితే ఈ జూన్లో అఫ్గానిస్తాన్తో జరగనున్న వన్డే సిరీస్కు రోహిత్ను ఎంపిక చేసినప్పటికి, అతడు ఆడేది అనుమానమే. సిరీస్ ప్రారంభ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధిస్తేనే రోహిత్ శర్మను జట్టులో కొనసాగించే అవకాశముంది.కాగా వన్డే ప్రపంచకప్-2027 టోర్నీ భవిష్యత్తు ప్రణాళికలలో భాగంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ స్థానంలో మరొక ముంబై ఆటగాడు, యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ను ఓపెనర్గా గంభీర్ భావిస్తున్నట్లు 'క్రిక్బ్లాగర్' వెబ్సైట్ పేర్కొంది.వాస్తవానికి అఫ్గానిస్తాన్తో సిరీస్కే రోహిత్ స్థానంలో జైశ్వాల్ను ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావించందంట. కానీ రోహిత్ శర్మ బోర్డు అధికారులతో ఫోన్ చేసి మాట్లడడంతో సెలక్టర్లు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారని 'క్రిక్బ్లాగర్' వెల్లడించింది.జైస్వాల్ ఎంపికపై సస్పెన్స్కాగా జైశ్వాల్ గతేడాది డిసెంబర్లో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో భారత్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. రెగ్యూలర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయం కారణంగా దూరం కావడంతో జైశ్వాల్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ను జైశూ ప్రారంభించాడు.తొలి రెండు మ్యాచ్లలో నిరాశపరిచిన యశస్వి.. వైజాగ్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో మాత్రం శతక్కొట్టాడు. దీంతో జైశ్వాల్ను అఫ్గాన్తో వన్డేలకు కూడా ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ సెలక్టర్లు ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో అతడు పేరు లేదు. ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్కు మాత్రమే కాకుండా, శ్రీలంకలో జరగబోయే ముక్కోణపు సిరీస్ కోసం ప్రకటించిన 'ఇండియా-ఎ' జట్టులోనూ జైస్వాల్కు చోటు దక్కలేదు. రోహిత్ ఫిట్నెస్ను దృష్టిలో పెట్టుకుని జైశ్వాల్ను 'ఇండియా-ఎ' జట్టుకు ఎంపిక చేయకపోయినట్లు తెలుస్తోంది. ఒకవేళ అఫ్గాన్తో వన్డేలకు రోహిత్ దూరమైతే ఆ స్ధానాన్ని జైశ్వాల్ భర్తీ చేయనున్నాడు.ఆఫ్గాన్ వన్డే సిరీస్కు భారత జట్టుశుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ (ఫిట్నెస్కు లోబడి), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్), హార్దిక్ పాండ్యా (ఫిట్నెస్కు లోబడి), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే. -
Asian Games: వైభవ్కు చోటు.. భారత జట్టు ఇదే!
ఆసియా క్రీడల అరంగేట్రంలోనే చాంపియన్గా నిలిచిన టీమిండియా.. ఈసారీ అదే ఫలితం పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. ఇప్పటికే ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ రూపంలో ఐసీసీ టైటిల్ గెలిచిన భారత్.. ఆసియా క్రీడలు-2026 ఎడిషన్లో ఫేవరెట్గా బరిలో దిగనుంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే ముప్పై మందితో కూడిన ప్రాబబుల్స్ జాబితాను బీసీసీఐ భారత ఒలింపిక్ సంఘానికి అందజేసింది. ఇందులో రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి కూడా చోటు దక్కింది.ఓపెనర్ల విభాగంలో పోటీఓపెనర్ల విభాగంలో సీనియర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ల నుంచి వైభవ్ సూర్యవంశీకి గట్టి పోటీ ఉంది. అయితే, రాయల్స్లో తన సహచర ఆటగాడు జైసూ కంటే వైభవ్ ఈసారి గొప్పగా ఆడిన సంగతి తెలిసిందే.ఐపీఎల్-2026లో వైభవ్ 776 పరుగులతో సత్తా చాటగా.. జైస్వాల్ 427 పరుగులకే పరిమితమయ్యాడు. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్, టీ20 ప్రపంచకప్ విజేత అభిషేక్ శర్మ 563 పరుగులతో రాణించగా.. భారత్ వరల్డ్కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 477 పరుగులు సాధించాడు.ఇషాన్కు చోటు లేదు!ఇక ఇషాన్ కూడా సన్రైజర్స్ తరఫున 602 పరుగులతో దుమ్ములేపాడు. ఓవరాల్గా ఓపెనర్ల విభాగంలో అభిషేక్, ఇషాన్ సత్తా చాటగా.. అందరికంటే వైభవ్ అత్యధిక పరుగులతో ముందు వరుసలో ఉన్నాడు. అభిషేక్కు జోడీగా వైభవ్ను ఆడిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఆల్రౌండర్లు, బౌలర్లు వీరేఇక సంజూను వన్డౌన్లో పంపినా.. మరో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్, తిలక్ వర్మ, రింకూ సింగ్ బ్యాటర్ల విభాగంలో సెట్ అయిపోతారు. ఇక ఆల్రౌండర్ల జాబితాలో నితీశ్ కుమార్ రెడ్డి, శివం దూబే, హర్ష్ దూబేలను ఎంపిక చేసే అవకాశం ఉంది.బౌలర్ల విషయానికొస్తే.. పేస్ దళంలో అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, యశ్ ఠాకూర్.. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయిలకు అవకాశం ఉండొచ్చు. కాగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈసారి కూడా విశ్రాంతినివ్వడం ఖాయంగానే కనిపిస్తోంది.పసిడి పతకాలతో సత్తా చాటిన భారత జట్లుకాగా 2022లో తొలిసారిగా బీసీసీఐ సీనియర్ పురుషుల, మహిళల క్రికెట్ జట్టును ఆసియా క్రీడలకు పంపింది. టీ20 ఫార్మాట్లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ద్వితీయ శ్రేణి జట్టు పసిడి పతకం సాధించగా.. హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో మహిళా జట్టు స్వర్ణం గెలుచుకుంది.అయితే, ఈసారి ప్రధాన టీ20 జట్టులోని సభ్యులను కూడా ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది. కాగా జపాన్లోని ఐచీ- నగోయాలో సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 3 వరకు ఆసియా క్రీడలు-2026 ఎడిషన్ నిర్వహించనున్నారు. ఇక గత పర్యాయం చైనా ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే.ఆసియా క్రీడలు-2026: భారత అత్యుత్తమ టీ20 జట్టు ఇదేఅభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివం దూబే, రింకూ సింగ్, హర్ష్ దూబే, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయి, ప్రసిద్ కృష్ణ, యశ్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి.ప్రాబబుల్స్ జాబితాయశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి, అనుకూల్ రాయ్, ఆయుశ్ బదోని, హర్ష్ దూబే, ధ్రువ్ జురేల్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, షహబాజ్, శివమ్ దూబే, విప్రాజ్ నిగమ్, హర్షిత్ రాణా, యశ్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్. చదవండి: ‘అతడు 3 ఓవర్లు వేస్తే ఆర్సీబీ ఖేల్ ఖతం’ -
ఐపీఎల్ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ!
ఐపీఎల్ 2026 సీజన్లో ఎక్కువగా వార్తల్లో నిలిచిన పేరు రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. బ్యాటింగ్ చేసినా, ఫీల్డింగ్ చేసినా, తిన్నా, పడుకున్నా.. ఇలా అతడు ఏం చేసినా అది వార్తగానే నిలిచేది. ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసినప్పటికీ క్వాలిఫయర్-2 పోరులో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి పాలయిన రాజస్తాన్ రాయల్స్ సీజన్ను మూడో స్థానంతో ముగించింది. జట్టు ఓటమి పాలైనప్పటికీ వైభవ్ మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. వైభవ్ సూర్యవంశీ ఆటను మరొక్కసారి చూస్తే బాగుంటుందని అభిమానులు ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ అభిమానులకు ఒక శుభవార్త. అతడి ఆటను చూడలేకపోవచ్చు కానీ అతడిని స్టేడియంలో మరోసారి చూసే అవకాశం మాత్రం దక్కనుంది. అహ్మదాబాద్ వేదికగా నేడు ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్కు వైభవ్ సూర్యవంశీ హాజరుకానున్నాడు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లబ్భాయ్ పటేల్ అంతర్జాతీయ ఎయిర్పోర్టులో వైభవ్ తళుక్కుమన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు వైభవ్ తన కుటుంబంతో కలిసి అహ్మదాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం వైభవ్ సూర్యవంశీని ప్రత్యేకంగా సన్మానించే అవకాశం కూడా ఉంది. ఈ సీజన్లో 16 మ్యాచ్ల్లో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఒకవేళ ఇవాల్టి ఫైనల్లో గిల్, సాయి సుదర్శన్ తక్కువ స్కోర్లకు వెనుదిరిగితే మాత్రం వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకునే చాన్స్ ఉంది. ఈ సీజన్ ఆరంభం నుంచి స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తూ వచ్చిన వైభవ్ ఒక సెంచరీ సహా ఐదు అర్థసెంచరీలు సాధించాడు. సీజన్లో 72 సిక్సర్లతో ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్గా నిలిచాడు. ఇక గుజరాత్తో మ్యాచ్లో 47 బంతుల్లో 96 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్లో ఏడు సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. ఇక ఎలిమినేటర్ పోరులోనూ ఎస్ఆర్హెచ్పై సునామీ ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి ఔటయ్యాడు. వరుసగా రెండు మ్యాచ్ల్లో సెంచరీ చేజార్చుకున్నప్పటికీ అతడి ఆటతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.VAIBHAV SOORYAVANSHI AT AHMEDABAD TO WATCH IPL FINAL 🔥⭐ [IANS] pic.twitter.com/o7uRx10z3j— Johns. (@CricCrazyJohns) May 31, 2026చదవండి: IPL 2026: ఫైనల్ మ్యాచ్కు ముందు ఆర్సీబీకి షాక్! -
ఆస్ట్రేలియాను చిత్తు చేసిన పాకిస్తాన్
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. శనివారం రావాల్పిండి వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆసీస్ను 5 వికెట్ల తేడాతో పాక్ చిత్తు చేసింది. తమ 1,000 వన్డే మ్యాచ్లో ఆతిథ్య జట్టు ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. పాక్ బౌలర్ల ధాటికి 44.1 ఓవర్లలో 200 పరుగులకే కుప్పకూలింది. అరంగేట్ర ఆటగాడు అరాఫత్ మిన్హాస్ 5 వికెట్లు పడగొట్టి కంగారుల పతనాన్ని శాసించాడు. జోష్ ఇంగ్లిష్, గ్రీన్, లబుషేన్ వంటి కీలక వికెట్లను అరాఫత్ తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా వన్డే అరంగేట్రంలో 5 వికెట్లు పడగొట్టిన తొలి పాక్ బౌలర్గా మిన్హాస్ నిలిచాడు. ఇక ఆసీస్ బ్యాటర్లలో మాట్ రెన్షా(61), మాథ్యూ షార్ట్(55) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. పాక్ బౌలర్లలో మిన్హాస్తో పాటు అబ్రార్ రెండు, రౌఫ్, అఫ్రిది, అఘా తలా వికెట్ సాధించారు.బాబర్, ఘోరి హాఫ్ సెంచరీలుఅనంతరం పాకిస్తాన్ 32 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అయితే స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం (69), వికెట్ కీపర్ బ్యాటర్ ఘాజీ ఘోరి (65) మూడో వికెట్కు 127 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ ఔటైనప్పటికి మిన్హాస్(18), సమద్(1) అజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశారు.ఆసీస్ బౌలర్లలో నాథన్ ఈల్లీస్ రెండు, మాథ్యూ కునెమన్, తన్వీర్ సంగా, లబుషేన్ తలా వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే జూన్ 2న లహోర్ వేదికగా జరగనుంది.చదవండి: గర్వంగానే ఉంది.. నన్ను ఇరకాటంలో పెట్టొద్దు: అగార్కర్ -
నన్ను ఇరకాటంలో పెట్టొద్దు: అగార్కర్
టీమిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా అజిత్ అగార్కర్ వచ్చిన తర్వాత చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ విషయంలో అతడి నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. హెడ్కోచ్ గౌతం గంభీర్తో కలిసి కఠిన నిర్ణయాలు తీసుకుందనేది బహిరంగ రహస్యమే.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ను గెలిపించిన తర్వాత.. మరుసటి సిరీస్ నుంచే రోహిత్ శర్మ (Rohit Sharma)ను కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఇక సంజూ శాంసన్ను కాదని.. టెస్టు, వన్డే జట్ల సారథి శుబ్మన్ గిల్ను టీ20 ఓపెనర్గా దించి నాయకత్వ బృందం భారీ మూల్యమే చెల్లించింది.గిల్పై వేటు వేసి.. అయితే, పొరపాటును గ్రహించిన అగార్కర్ బృందం.. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ముందు సంచలన నిర్ణయం తీసుకుంది. గిల్పై వేటు వేసి.. ఇషాన్ కిషన్ను ప్రపంచకప్ జట్టులో కొనసాగించింది. ఇక స్వదేశంలో జరిగిన ఈ మెగా ఈవెంట్లో భారత్ ట్రోఫీ గెలుచుకున్న సంగతి తెలిసిందే.ఈ టోర్నీలో నాకౌట్ మ్యాచ్లలో గొప్పగా రాణించిన ఓపెనర్ సంజూ శాంసన్ (97*, 89, 89) ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు అందుకున్నాడు. ఏదేమైనా.. ఏ సిరీస్కు భారత జట్టును ప్రకటించినా అగార్కర్పై విమర్శలు రావడం సహజమే. ఈ విషయం గురించి అతడు తాజాగా స్పందించాడు.ముంబైలో శనివారం జరిగిన క్రిక్ఇన్ఫో అవార్డు ప్రదానోత్సవానికి అగార్కర్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ప్రజెంటర్ డానిష్ సైట్ (ఆర్సీబీ మిస్టర్ నాగ్స్గా పాపులర్) అతడిని తన ప్రశ్నలతో ఇరుకున పెట్టాడు.ప్రజెంటర్: ‘అబ్బ.. ఎంత గొప్ప జట్టును ఎంపిక చేశానో’ అని మీరు మురిపిసోయిన సందర్భాలు ఉన్నాయా?అగార్కర్ (నవ్వుతూ): నేను చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. లేదంటే నా మాటల్ని ఇష్టమొచ్చినట్లుగా వక్రీకరిస్తారు!.. ఏదేమైనా జట్టు గెలిచిన సందర్భంలో.. ఆ క్షణంలో నాకు గర్వంగానే ఉంటుంది. సెలక్షన్ కమిటీ చైర్మన్గా మంచి జట్టును ఎన్నుకున్నందుకు సంతోషంగా ఉంటుంది.ప్రజెంటర్: మన దేశంలో 140 కోట్లకు పైగా జనాభా ఉన్నారు. క్రికెట్ అభిమానుల దృష్టి మీపైనే ఉంటుంది. మరి ఓ ఆటగాడికి అవకాశం ఇవ్వలేనప్పుడు.. ‘సారీ మ్యాన్.. ఈసారి కాదు గానీ.. మళ్లీ వచ్చే సిరీస్కు చూద్దాంలే’ అని మీరు అతడికి చెప్పగలరా? ఇందుకు మీరు ఎలాంటి మార్గం ఎంచుకుంటారు?అగార్కర్ (గట్టిగా నవ్వేస్తూ): ఇప్పటికీ నో చెప్పేందుకు నాకు సరైన దారి దొరకలేదు. ఇది రోజూవారీ ప్రక్రియ. ఎప్పటికప్పుడు మెరుగుపడాల్సి ఉంటుంది.ప్రజెంటర్: మరి అందులో మీరు వినూత్నంగా కనుక్కున్న దారి ఏమైనా ఉందా?అగార్కర్: దయచేసి నన్ను ఇరకాటంలో పెట్టొద్దు. త్వరలోనే మేము మరో జట్టును ఎంపిక చేయాల్సి ఉంది అంటూ నవ్వులు పూయించాడు.చదవండి: ‘భారత టీ20 జట్టుకు ఎంపికయ్యే ఆలోచనే లేదు’ -
‘భారత టీ20 జట్టుకు ఎంపికయ్యే ఆలోచనే లేదు’
ఐపీఎల్ ట్రోఫీ కోసం కళ్లు కాచేలా పద్దెనిమిదేళ్లు ఎదురుచూసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు గతేడాది తమ చిరకాల కోరికను నెరవేర్చుకుంది. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి సారథ్యంలో సాధ్యం కాని ఈ ఫీట్ను.. రజత్ పాటిదార్ కెప్టెన్గా అరంగేట్రంలోనే సాధించాడు.ఏమాత్రం అంచనాలు లేకుండాతద్వారా ఆర్సీబీ అభిమానులకు మరింత ఇష్టమైన ఆటగాడిగా మారిపోయాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి ఈ మేరకు అరుదైన విజయం అందుకున్న పాటిదార్.. ఐపీఎల్-2026లోనూ ఆర్సీబీని అద్భుత రీతిలో ముందుకు నడిపించాడు. ఇటు బ్యాటర్గా.. అటు కెప్టెన్గా సత్తా చాటి జట్టును ఫైనల్కు చేర్చాడు.మెరుపులు మెరిపించిముఖ్యంగా గుజరాత్ టైటాన్స్తో ఫైనల్లో ఈ నాలుగో నంబర్ బ్యాటర్ దుమ్ములేపాడు. కేవలం 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 9 సిక్సర్లు బాది 93 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా ఈ సీజన్లో తన అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేయడంతో పాటు.. జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.ఇప్పటి వరకు ఈ సీజన్లో పద్నాలుగు మ్యాచ్లలో కలిపి పాటిదార్ 486 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే అతడు టీమిండియా తరఫున టీ20లలో అరంగేట్రం చేయడం ఖాయమని.. కెప్టెన్ రేసులోనూ ముందుంటాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ విషయంపై రజత్ పాటిదార్ తాజాగా స్పందించాడు. గుజరాత్ టైటాన్స్తో ఆదివారం నాటి ఫైనల్కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను నేనెప్పుడూ టీమిండియా టీ20 కెప్టెన్ కావాలని ఊహించుకోలేదు. అసలు ఇపుడు భారత టీ20 జట్టుకు ఎంపిక కావాలనే ఆలోచనే నా మదిలో లేదు.భారత టీ20 జట్టుకు ఎంపికయ్యే ఆలోచనే లేదునా దృష్టి మొత్తం ఐపీఎల్-2026 సీజన్ మీదే ఉంది. ప్రతి కెప్టెన్ ట్రోఫీ గెలవాలని కోరుకుంటాడు. నేను కూడా అంతే. గతేడాది మేము టైటిల్ సాధించాము. అక్కడితో ఆ ప్రయాణం ముగిసింది.తాజా ఎడిషన్లో సరికొత్తగా ముందుకు వచ్చాము. 2025లో ఏం జరిగిందన్న విషయం గురించే మాట్లాడుతూ కూర్చుంటే పనులు ముందుకు సాగవు. ప్రస్తుత సీజన్లో ఒక్కో మ్యాచ్ గెలవడమే లక్ష్యంగా ఇక్కడిదాకా చేరుకున్నాము.అదంతా నాకు అనవసరంగతంలో ఆర్సీబీ కెప్టెన్లు ఏం చేశారో నాకు అనవసరం. భవిష్యత్తులో కెప్టెన్ అయ్యేవారు ఏం చేస్తారన్న అంశంతోనూ నాకు పనిలేదు. సారథిగా నేనేం చేయగలను అన్నదే ముఖ్యం. వ్యక్తిగతంగా నా కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు ఉన్నాయి. అయితే, ఎవరినీ నాకు పోటీగా భావించను. నా పనిని పూర్తి చేయడంపైనే నా దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. మేము డిఫెండింగ్ చాంపియన్లమనే గర్వం మాకు లేదు. మా జట్టు ఈసారి కూడా ట్రోఫీ కోసం అదే స్థాయిలో కృషి చేస్తోంది. మా ఆకలి తీరలేదు’’ అని రజత్ పాటిదార్ పేర్కొన్నాడు.చదవండి: కెప్టెన్ రేసు.. ముగ్గురిని ఎంపిక చేసిన బీసీసీఐ? -
‘అతడు మూడు ఓవర్లు వేశాడంటే ఆర్సీబీ ఓటమి ఖాయం’
డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఈసారీ కప్పు కొట్టాలని పట్టుదలగా ఉంది. ఐపీఎల్-2026 సీజన్ ఆది నుంచి ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న పాటిదార్ సేన.. టేబుల్ టాపర్గా, తొలి ఫైనలిస్టుగా నిలిచింది.ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్తో ఆదివారం నాటి టైటిల్ పోరుకూ పూర్తిస్థాయిలో సన్నద్ధమైన ఆర్సీబీ.. ఆఖరి గండాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని ఉవ్విళ్లూరుతోంది. కాగా తాజా ఎడిషన్లోనూ ఆర్సీబీ బౌలింగ్ దళం అదరగొడుతున్న సంగతి తెలిసిందే.పటిష్టంగా పేస్ దళంటీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఇప్పటికి 26 వికెట్లతో సత్తా చాటగా.. యువ ఆటగాడు రసిఖ్ దర్ సైతం 16 వికెట్లు కూల్చాడు. మిగిలిన వారిలో కృనాల్ పాండ్యా, జట్టుతో ఆలస్యంగా చేరిన జోష్ హాజిల్వుడ్ చెరో 13 వికెట్లతో ఉన్నారు. వీరికి తోడుగా సూయశ్ శర్మ (9), జేకబ్ డఫీ (9) కూడా రాణిస్తున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ బెంగళూరు జట్టు నాయకత్వ బృందానికి కీలక సూచన చేశాడు. గుజరాత్తో ఫైనల్లో రొమారియో షెఫర్డ్ చేతికి మాత్రం బంతిని ఇవ్వొద్దని సూచించాడు. అదే విధంగా ఫిల్ సాల్ట్ తిరిగి వచ్చినా వెంకటేశ్ అయ్యర్నే ఓపెనర్గా కొనసాగించాలని చిక్కా పేర్కొన్నాడు.అతడినే ఓపెనర్గా కొనసాగించాలిఈ మేరకు.. ‘‘ఫిల్ సాల్ట్ పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించాడా? లేదా? అన్న అంశంపై స్పష్టత లేదు. ఒకవేళ అతడు ఫిట్గా ఉన్నా వెంకటేశ్ అయ్యర్ బాగా ఆడుతున్నాడు కాబట్టి అతడినే ఓపెనర్గా కొనసాగిస్తే మంచిది.అతడు 3 ఓవర్లు వేశాంటే ఆర్సీబీ ఖేల్ ఖతమేఇక బౌలింగ్ విషయానికొస్తే... ఒకవేళ రొమారియో షెఫర్డ్తో కనీసం మూడు ఓవర్లు బౌలింగ్ చేయించినా సరే ఆర్సీబీ ఓడిపోవడం లాంఛనమే. అతడు కచ్చితంగా మూడు ఓవర్లు వేశాంటే ఆర్సీబీ ఖేల్ ఖతమే.PC: BCCIషెఫర్డ్ చేతికి అస్సలు బంతిని ఇవ్వకండి. నన్నడిగితే అతడికి తుదిజట్టులో కూడా చోటు ఇవ్వకండి’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. కాగా వెస్టిండీస్ ఆల్రౌండర్ రొమారియో షెఫర్డ్ గతేడాది కప్పు గెలిచిన ఆర్సీబీ జట్టులో సభ్యుడు.పేలవ ప్రదర్శనఈ క్రమంలో తాజా ఎడిషన్కు కూడా ఆర్సీబీ షెఫర్డ్ను అట్టిపెట్టుకుంది. ఇక ఈ సీజన్లో అతడు.. ఇప్పటికి 14 మ్యాచ్లలో కలిపి సగటు 42, ఎకానమీ 12తో చెత్తగా బౌలింగ్ చేసి.. ఏడు వికెట్లు తీయగలిగాడు. ఇక బ్యాటర్గా 14 మ్యాచ్లలో కలిపి కేవలం 83 పరుగులే రాబట్టాడు. చివరగా గుజరాత్తో క్వాలిఫయర్-1లో షెఫర్డ్ ఒక ఓవర్ వేసి 15 పరుగులు ఇచ్చుకున్నాడు.ఐపీఎల్-2026 ఫైనల్.. ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ తుది జట్లు (అంచనా) ఆర్సీబీ: రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్/ వెంకటేశ్ అయ్యర్, దేవ్దత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, జితేశ్ శర్మ, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్వుడ్, రసిఖ్ దర్, జేకబ్ డఫీ/ సుయశ్ శర్మ గుజరాత్: శుబ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సంధు, జేసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, సాయికిషోర్. చదవండి: కెప్టెన్ రేసు.. ఆ ముగ్గురిని ఎంపిక చేసిన బీసీసీఐ! -
వైభవ్కు మరో భారీ జాక్పాట్..?
ఐపీఎల్ 2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఫైనల్లో ఆర్సీబీ-గుజరాత్ టైటాన్స్ తలపడుతుండగా, ట్రోఫీతో పాటు భారీ నగదు బహుమతులు కూడా ఆకర్షణగా నిలిచాయి. విజేత జట్టుకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుండగా, రన్నరప్కు రూ.13 కోట్లు అందనున్నాయి.ఈ సీజన్లో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే మూడుసార్లు తలపడగా, ఆర్సీబీ 2-1 ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు ఫైనల్లో గెలిచే జట్టు ట్రోఫీతో పాటు భారీ చెక్కును కూడా సొంతం చేసుకోనుంది.ప్లే ఆఫ్స్కు చేరిన జట్లకు దక్కే ప్రైజ్ మనీఫైనల్ విజేతకు రూ.20 కోట్లు, రన్నరప్కు రూ.13 కోట్లు అందనున్నాయి. ఇక క్వాలిఫయర్-2లో ఓడిన రాజస్థాన్ రాయల్స్కు రూ.7 కోట్లు, ఎలిమినేటర్లో నిష్క్రమించిన ఎస్ఆర్హెచ్కు రూ.6.5 కోట్లు లభించనున్నాయి.వైభవ్కు మరో భారీ జాక్పాట్..?ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ పోరు ఆసక్తికరంగా మారింది. 15 ఏళ్ల చిచ్చరపిడుగు, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 16 ఇన్నింగ్స్ల్లో 776 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే గుజరాత్ ఓపెనర్లు శుభ్మన్ గిల్ (722), సాయి సుదర్శన్ (710) కూడా ఇంకా రేసులోనే ఉన్నారు. ఆరెంజ్ క్యాప్ విజేతకు రూ.10 లక్షలు అందుతాయి.పర్పుల్ క్యాప్ కోసం రబడా–భువీ పోటీపర్పుల్ క్యాప్ రేసులో గుజరాత్ పేసర్ రబాడ 28 వికెట్లతో ముందంజలో ఉన్నాడు. ఆర్సీబీ పేసర్ భువనేశ్వ్ర్ కుమార్ 26 వికెట్లతో రబాడ వెన్నంటే ఉన్నాడు. పర్పుల్ క్యాప్ గెలిచే బౌలర్కు కూడా రూ.10 లక్షల బహుమతి ఉంటుంది.ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుకు వైభవ్ ఫేవరెట్ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు కోసం వైభవ్ సూర్యవంశీ, ప్రియాంశ్ ఆర్య (పంజాబ్ కింగ్స్)మధ్య పోటీ నెలకొంది. ఈ అవార్డు గెలిచే ఆటగాడికి రూ.20 లక్షలు అందుతాయి.ఎంవీపీగా ఎవరు..?మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ (MVP) అవార్డు కోసం వైభవ్ సూర్యవంశీ (436.5 పాయింట్లు), కగిసో రబడా (408), జోఫ్రా ఆర్చర్ (396.5) మధ్య పోటీ కనిపిస్తోంది. ఎంవీపీ విజేతకు రూ.10 లక్షలు దక్కనున్నాయి.ఫెయిర్ప్లే అవార్డుఈ సీజన్లో ఫెయిర్ప్లే పట్టికలో పంజాబ్ కింగ్స్ ముందంజలో ఉంది. ఫెయిర్ప్లే అవార్డు గెలిచే జట్టుకు రూ.10 లక్షల నగదు బహుమతి అందుతుంది.ఐపీఎల్ ప్రైజ్ మనీ చరిత్ర2008, 2009 సీజన్లలో విజేతలకు కేవలం రూ.4.8 కోట్లు మాత్రమే ఇచ్చేవారు. 2010 నుంచి రూ.10 కోట్లకు పెంచిన బీసీసీఐ, 2014లో రూ.15 కోట్లు చేసింది. 2016 నుంచి విజేతలకు రూ.20 కోట్లు అందిస్తున్నప్పటికీ, కోవిడ్ ప్రభావంతో 2020లో మాత్రమే రూ.15 కోట్లకు తగ్గించింది. 2021 నుంచి మళ్లీ రూ.20 కోట్లే కొనసాగుతున్నాయి.ఈసారి మొత్తం అవార్డుల రూపంలో బీసీసీఐ సుమారు రూ.47.1 కోట్లను పంపిణీ చేయనుంది. ఫైనల్ ఫలితం ఎలా ఉన్నా, ఐపీఎల్ 2026లో ఆటగాళ్లు, జట్లపై కనక వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది. -
ఇషాన్ కిషన్కు భారీ షాకిచ్చిన ముంబై ఇండియన్స్ అనామకుడు
ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న స్టార్ వికెట్కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్కు జార్ఖండ్ టీ20 లీగ్ వేలంలో ఊహించని షాక్ తగిలింది. సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఈ సీజన్లో పరుగుల వరద పారించిన ఇషాన్ను వెనక్కినెట్టి, ముంబై ఇండియన్స్ వికెట్కీపర్ బ్యాటర్ రాబిన్ మింజ్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ సంఘం నిర్వహించిన తొలి జార్ఖండ్ టీ20 లీగ్ మెగా వేలం మే 30న ఘనంగా జరిగింది. రాంచీ వేదికగా జరిగిన ఈ వేలంలో ఆరు జట్లు పాల్గొన్నాయి. రాంచీ టైటాన్స్, జంషెడ్పూర్ స్టీలర్స్, చోటా నాగ్పూర్ రాయల్స్, కోయలాంఛల్ సూపర్కింగ్స్, థన్బాద్ డైమాండ్స్, సంథల్ స్ట్రయికర్స్ ఫ్రాంచైజీలు తలో రూ.50 లక్షల బడ్జెట్తో ఆటగాళ్లను కొనుగోలు చేశాయి.ఈ వేలంలో రాబిన్ మింజ్ను దక్కించుకునేందుకు తీవ్రమైన పోటీ నెలకొంది. చివరకు కోయలాంఛల్ సూపర్ కింగ్స్ అతడిని రూ.15.25 లక్షలకు సొంతం చేసుకుంది. దీంతో టోర్నీ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రాబిన్ మింజ్ రికార్డు సృష్టించాడు.మరోవైపు ఇషాన్ కిషన్ను సంథల్ స్ట్రయికర్స్ రూ.14.70 లక్షలకు కొనుగోలు చేసింది. రాబిన్ మింజ్తో పోలిస్తే ఇషాన్ ధర రూ.55 వేల తక్కువగా ఉండటం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.వాస్తవానికి ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో ఇషాన్ కిషన్ అద్భుత ఫామ్లో కనిపించాడు. 15 ఇన్నింగ్స్ల్లో 40.13 సగటు, 182.42 స్ట్రయిక్రేట్తో 602 పరుగులు చేసి సన్రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు రాబిన్ మింజ్ మాత్రం ముంబై ఇండియన్స్ తరఫున కేవలం రెండే మ్యాచ్లు ఆడి ఆరు పరుగులు మాత్రమే చేశాడు.అయినా, దేశీయ క్రికెట్లో రాబిన్ మింజ్కు ఉన్న పవర్ హిట్టర్ ఇమేజ్ అతడిని ఇషాన్ కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడుపోయేలా చేసింది. ఇషాన్ జాతీయ జట్టు బాధ్యతల కారణంగా టోర్నీలో కొన్ని మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉండటం కూడా వేలంపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.కాగా, తొలి జార్ఖండ్ టీ20 లీగ్ జూన్ 10 నుంచి ప్రారంభం కానుంది. ఈ లీగ్లో మొత్తం 27 మ్యాచ్లు జరగనున్నాయి. లీగ్ దశ అనంతరం అగ్ర జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. అయితే టోర్నీ ప్రారంభానికి ముందే ఇషాన్ కిషన్ను అధిగమించి రాబిన్ మింజ్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. -
కెప్టెన్ రేసు.. ఆ ముగ్గురిని సెలక్ట్ చేసిన బీసీసీఐ?!
సారథిగా టీమిండియాకు ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ అందించిన సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ కెరీర్ దాదాపుగా ముగిసినట్లే కనిపిస్తోంది. బ్యాటర్గా పేలవ ఫామ్, వయసురీత్యా అతడిని మున్ముందు టీ20 ఫార్మాట్లో పరిశీలించే అవకాశం లేదని సెలక్టర్లు పరోక్షంగా చెప్పేశారు. ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడల కోసం 30 మందితో కూడిన ప్రాబబుల్స్ జాబితాను భారత ఒలింపిక్ సంఘానికి (IOA)కు.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అందజేసింది. ఇందులో 35 ఏళ్ల సూర్యకుమార్ పేరు లేకపోవడమే ఇందుకు నిదర్శనం.ఆ సమావేశంలోనే నిర్ణయం!ఈ నేపథ్యంలో టీమిండియా టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) వారసుడు ఎవరన్న అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. అఫ్గనిస్తాన్తో సిరీస్ ఆరంభానికి ముందు బీసీసీఐ సెలక్టర్లు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.ఆ మీటింగ్లోనే ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు పంపే జట్ల గురించి చర్చించనున్నట్లు.. అదే విధంగా టీ20 కొత్త కెప్టెన్ గురించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ..ఆ ముగ్గురిలో ఒకరికి అవకాశం!‘‘సూర్యను సారథిగా తొలగించే ముందే కొత్త కెప్టెన్ ఎవరన్న అంశంపై సెలక్టర్లు సుదీర్ఘంగా చర్చించనున్నారు. శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్ ఈ రేసులో ముందున్నారు. వరల్డ్కప్ టోర్నీలో వైస్ కెప్టెన్గా వ్యవహరించిన అక్షర్ పటేల్ పేరును కూడా సెలక్టర్లు పరిశీలిస్తున్నారు.అయితే, ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల రూపంలో సూర్యకు మరో అవకాశం ఇచ్చేందుకు సెలక్టర్లు సిద్ధంగానే ఉన్నారు. అతడు బ్యాటర్గా ఫామ్లోకి వస్తే అంతా బాగానే ఉంటుంది. లేదంటే మున్ముందు జట్టులో చోటు కష్టమే.నిజానికి మేనేజ్మెంట్ ప్రస్తుతం వన్డే వరల్డ్కప్-2027 సన్నాహకాల్లో ఉంది. అందుకే టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా క్రీడలకు ఎంపిక చేసే జట్టులో కొత్త ఆటగాళ్లకు చోటు ఇవ్వాలని భావించింది.సెప్టెంబరు 19 నుంచిఅయితే, ఒకవేళ భారత ప్రభుత్వం పూర్తిస్థాయి జట్టును ఆసియా క్రీడలకు పంపాలని ఆదేశిస్తే బీసీసీఐ అందుకు తగినట్లుగానే నిర్ణయం తీసుకుంటుంది’’ అని పేర్కొన్నాయి. కాగా ఈ ఏడాది సెప్టెంబరు 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఆసియా క్రీడల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.అదే సమయంలో స్వదేశంలో వెస్టిండీస్తో టీమిండియా వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ నేపథ్యంలో వీటి కోసం రెండు వేర్వేరు జట్లను ఎంచుకునేందుకు వీలుగా 30 మందితో పెద్ద జాబితాను బోర్డు ప్రకటించింది. వన్డే కెప్టెన్గా శుబ్మన్ గిల్ జట్టును నడిపిస్తాడు కాబట్టి ఆసియా క్రీడల కోసం అతడి పేరును పరిశీలించలేదు.ఇక ప్రాబబుల్స్లోనే అయినా తొలిసారి భారత సీనియర్ టీమ్ బృందంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం విశేషం. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026 ముగిసిన తర్వాత జూన్ 6 నుంచి టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడనుంది. ఆసియా క్రీడల ప్రాబబుల్స్ జాబితా: యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి, అనుకూల్ రాయ్, ఆయుశ్ బదోని, హర్ష్ దూబే, ధ్రువ్ జురేల్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, షహబాజ్, శివమ్ దూబే, విప్రాజ్ నిగమ్, హర్షిత్ రాణా, యశ్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్. చదవండి: అది సెలక్టర్ల పని: సచిన్ -
చరిత్ర సృష్టించిన నేపాల్ బ్యాటర్
అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత అరుదైన ఘనతల్లో ఒకటైన "ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు" బాదిన ఆటగాళ్ల జాబితాలో మరో పేరు చేరింది. నేపాల్ స్టార్ ఓపెనర్ కుషాల్ భుర్టెల్ ఈ ఘనతను సాధించి, క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.భుర్టెల్కు ముందు అంతర్జాతీయ క్రికెట్లో హెర్షల్ గిబ్స్, యువరాజ్ సింగ్, కీరన్ పోలార్డ్, జస్కరన్ మల్హోత్రా, దీపేంద్ర సింగ్ ఎయిరీ మాత్రమే ఈ ఘనత సాధించారు. తాజాగా భుర్టెల్ వీరి సరసన చేరాడు.పురుషుల ఏషియన్ గేమ్స్ టీ20 క్వాలిఫయర్-2026లో టోర్నీలో భాగంగా చైనాతో ఇవాళ (మే 31) జరిగిన మ్యాచ్లో భుర్టెల్ ఈ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన భుర్టెల్ చైనా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో Zhuoyue Chen వేసిన ఆరు బంతులను వరుసగా సిక్సర్లుగా మలిచి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.భుర్టెల్ కేవలం ఆరు సిక్సర్లతోనే ఆగిపోలేదు. మొత్తం 43 బంతుల్లోనే 129 పరుగులు చేసి చైనా బౌలింగ్ను చీల్చి చెండాడాడు. అతని ఇన్నింగ్స్లో ఏకంగా 16 సిక్సర్లు నమోదయ్యాయి. అనంతరం Deng Jinqi అతన్ని ఔట్ చేసినా అప్పటికే మ్యాచ్ పూర్తిగా నేపాల్ చేతుల్లోకి వెళ్లిపోయింది.భుర్టెల్కు తోడుగా కుషాల్ మల్లా 47 బంతుల్లో 85 పరుగులు, రోహిత్ పౌడెల్ కేవలం 21 బంతుల్లో అజేయంగా 69 పరుగులు చేసి చెలరేగారు. ఫలితంగా నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 313 పరుగుల అతి భారీ స్కోరు సాధించింది.314 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చైనా ఆరంభం నుంచే ఒత్తిడికి గురైంది. నేపాల్ బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శన ముందు చైనా బ్యాటింగ్ కుప్పకూలింది. చైనా జట్టు కేవలం 92 పరుగులకే ఆలౌట్ అయింది. Zheng Shenjian 31 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ముగ్గురు బ్యాటర్లు ఖాతా కూడా తెరవలేకపోయారు.కాగా, సింగపూర్ వేదికగా జరుగుతున్న పురుషుల ఏషియన్ గేమ్స్ టీ20 క్వాలిఫయర్-2026 టోర్నీలో మొత్తం 8 జట్లు రెండు గ్రూప్లుగా విభజించబడి పోటీపడుతున్నాయి. నేపాల్, చైనా, ఖతార్, మలేసియా ఓ గ్రూప్-ఏలో ఉండగా.. బెహ్రెయిన్, హాంగ్కాంగ్, ఒమన్, సింగపూర్ గ్రూప్-బిలో పోటీపడుతున్నాయి. -
కోహ్లిని మరోసారి గెలికిన హెడ్
ఐపీఎల్ 2026 ఫైనల్కు ముందు విరాట్ కోహ్లీ–ట్రావిస్ హెడ్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. కొద్ది రోజుల కిందట ఓ ఐపీఎల్ మ్యాచ్లో (ఆర్సీబీ-ఎస్ఆర్హెచ్) వీరిద్దరూ మాటా-మాటా అనుకున్న విషయం తెలిసిందే. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ, ఎస్ఆర్హెచ్లోని పలువురు ఆటగాళ్లతో కరచాలనం చేసినప్పటికీ, ట్రావిస్ హెడ్తో మాత్రం చేతులు కలపలేదు.ఆతర్వాత కోహ్లి అభిమానులు హెడ్ను, అతని భార్య జెస్సికా హెడ్ సోషల్మీడియా వేదికగా టార్గెట్ చేయడం ప్రారంభించారు. కోహ్లి అభిమానులు హెడ్ భార్యపై వ్యక్తిగత దూషణలు కూడా చేశారు.ఈ వివాదం హెడ్ తాజా సోషల్మీడియా పోస్ట్తో కొత్త మలుపు తీసుకుంది. ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్లో ఆశించిన ఫలితాలు సాధించలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ, జోఫ్రా ఆర్చర్ ధాటికి ఓటమి పాలైంది. తాజాగా ఎస్ఆర్హెచ్ ఆటగాడైన ట్రావిస్ హెడ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టాడు. అందులో "Appreciate those who showed love and respect" అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఈ క్యాప్షన్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.ఆ క్యాప్షన్లో హెడ్ నేరుగా ఎవరి పేరు ప్రస్తావించకపోయినా, కోహ్లినే పరోక్షంగా టార్గెట్ చేసినట్లు అర్దమవుతుంది. కోహ్లీ అభిమానుల నుంచి తనకు, తన కుటుంబానికి ఎదురైన ట్రోలింగ్ను ఉద్దేశించే ఈ వ్యాఖ్య చేశాడని సోషల్ మీడియాలో విశ్లేషణలు మొదలయ్యాయి.కాగా, హెడ్-కోహ్లి మధ్య గొడవ తర్వాత జెస్సికా హెడ్, ఆమె కుటుంబం, స్నేహితులపై సోషల్మీడియా వేదికగా తీవ్రస్థాయి దూషణలు వచ్చాయి. భారత్లో జరిగిన 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత కూడా ఇలాంటి చేదు అనుభవాలే ఎదురైనట్లు ఆమె స్వయంగా వెల్లడించింది. ఆ ప్రపంచకప్ ఫైనల్లో భారత్పై అద్భుత సెంచరీ సాధించి ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించిన ట్రావిస్ హెడ్ అప్పుడూ భారత అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. అలాగే 2024 బాక్సింగ్ డే టెస్టులో భారత్పై కీలక ఇన్నింగ్స్ ఆడిన తర్వాత కూడా ఇలాంటి ట్రోలింగ్ ఎదుర్కొన్నట్లు నివేదికలు వెల్లడించాయి. కుటుంబాలను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు..! క్రీడల్లో పోటీ ఎంత తీవ్రంగా ఉన్నా, ఆటగాళ్ల కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని దూషించడం సమర్థనీయం కాదనే అభిప్రాయం మాత్రం అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.ఇదిలా ఉంటే, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ (మే 31) రాత్రి ఐపీఎల్ 2026 ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ టైటిల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ- గుజరాత్ టైటాన్స్ పోటీపడనున్నాయి. -
అది సెలక్టర్ల పని: వైభవ్ సూర్యవంశీపై సచిన్ వ్యాఖ్యలు
ఐపీఎల్-2026లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ. రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా 16 మ్యాచ్లలో కలిపి ఏకంగా 776 పరుగులు సాధించాడు. ఈ లెఫ్టాండర్ ఇన్నింగ్స్లో ఓ విధ్వంసకర శతకం (36 బంతుల్లోనే) కూడా ఉండటం విశేషం. క్వాలిఫయర్-2 ముగిసేసరికి అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ కూడా తన వద్దే పెట్టుకున్నాడు ఈ చిచ్చరపిడుగు.టీమిండియాకు ఆడించాలనే డిమాండ్లుఇక అంతకు ముందు భారత అండర్-19 జట్టు తరఫున కూడా అదరగొట్టాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). ఈ పరిణామాల క్రమంలో ఇప్పటికే భారత్-‘ఎ’ జట్టుకు కూడా ఎంపికయ్యాడు. అయితే, వీలైనంత త్వరగా ఈ పదిహేనేళ్ల పిల్లాడిని టీమిండియాకు ఆడించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.అత్యద్భుతంఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ వైభవ్ సూర్యవంశీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ప్రతి ఒక్కరూ సూర్యవంశీ గురించే మాట్లాడుతున్నారు. నేను కూడా అతడి బ్యాటింగ్ చూశాను. నిజంగా అత్యద్భుతం. అతడు చాలా చాలా ప్రత్యేకమైన ఆటగాడు.కేవలం బంతిని బాదడమే కాదు.. బ్యాటింగ్ చేసేటప్పుడు అతడు మణికట్టును ఉపయోగించే విధానం నన్ను ఆశ్చర్యపరిచింది. మైదానం నలుమూలలా షాట్లు బాదాలంటే రిస్ట్ వర్క్ అత్యంత ముఖ్యం. వైభవ్ ఏదో దూకుడుగా, గుడ్డిగా బంతిని బాదడం లేదు.బాల్ను ఎదుర్కొనే ముందు లైన్ అండ్ లెంగ్త్ను సరిగ్గా అంచనా వేసి షాట్ ఆడుతున్నాడు. అందుకే మిగతా వారితో పోలిస్తే అతడు ఎక్కువగా బౌండరీలు బాదగలుగుతున్నాడు. అతడు టీమిండియాకు ఆడాలని అందరూ కోరుకుంటున్నారు.టెస్టు క్రికెట్ ఆడితే చూడాలని ఉంది..అయితే, ఇలాంటి విషయాలు వైభవ్పై ఒత్తిడి పెంచుతాయి. ఏదేమైనా అతడు తన సహజ శైలిని వదులుకోవద్దు. వైభవ్ టెస్టు క్రికెట్ ఆడితే చూడాలని ఉంది. మిగతా ఫార్మాట్లతో పోలిస్తే టెస్టుల్లో సవాళ్లు ఎక్కువగా ఉంటాయి.ప్రతీ బంతి ఒక ప్రశ్న లాంటిదే. దానికి బదులిచ్చే క్రమంలో పరిష్కారం కనుగొనే ఆలోచనా విధానం పెరుగుతుంది. కెరీర్లో చివరి రోజు వరకూ కూడా ఈ సవాళ్లు కొనసాగుతూనే ఉంటాయి. ఏదేమైనా వైభవ్ ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. తాను చేస్తున్న పనిపట్ల అతడికి చక్కటి అవగాహన ఉంది.అది సెలక్టర్ల పనిఅందరూ కోరుకున్నట్లుగానే వైభవ్ టెస్టు క్రికెట్ ఆడితే ఎంతో బాగుంటుంది. అయితే, అతడిపై ఒత్తిడి పెంచకూడదు. ప్రతిభావంతుడైన ఆటగాడికి అవకాశాలు ఇవ్వడం ఎంత ముఖ్యమో.. అతడిపై ఒత్తిడి పెరగకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం.ఇలా ఆడాలి.. అలా ఆడాలి అంటూ మరీ ఎక్కువగా సూచనలు ఇచ్చి అతడిని గందరగోళంలోకి నెట్టేయకూడదు. వైభవ్ ఎంపిక గురించిన అంశాన్ని సెలక్టర్లకు వదిలివేయాలి. అతడిని ఏ జట్టుకు ఎంపిక చేయాలో వారికే తెలుసు. అది వారి బాధ్యత కూడా!.. కాబట్టి వైభవ్ విషయంలో తొందరపడటం మంచిది కాదు’’ అని సచిన్ టెండుల్కర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు.చదవండి: ఐపీఎల్ ఎగ్గొట్టి.. అక్కడెలా ఆడావు?.. సంగక్కర ఆగ్రహం! -
చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్లు.. టీమిండియాకు భంగపాటు
ఇంగ్లండ్ పర్యటనలో భారత మహిళల క్రికెట్ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా బ్రిస్టల్ వేదికగా నిన్న (మే 30) జరిగిన రెండో టీ20లో ఆతిథ్య జట్టు 26 పరుగుల తేడాతో భారత్పై ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఫ్రేయా కెంప్ (39 నాటౌట్), డ్యానీ వాట్ హాడ్జ్ (29), అమీ జోన్స్ (28), అలైస్ క్యాప్సీ (28), డానియెలా గిబ్సన్ (11 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. సోఫీ డంక్లీ (10), హీథర్ నైట్ (18) తక్కువ స్కోర్లతో ఔటయ్యారు. భారత బౌలర్లలో శ్రీ చరణి (4-025-3) అద్భుతంగా బౌలింగ్ చేసింది. శ్రేయాంక పాటిల్ (4-0-29-1), నందిని శర్మ (4-0-26-1) కూడా పర్వాలేదనిపించారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో టీమిండియా తడబడింది. ఇంగ్లండ్ బౌలర్లు తలో చేయి వేయడంతో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులకే పరిమితమైంది. లారెన్ బెల్, ఛార్లోట్ డీన్, ఫ్రేయా కెంప్ తలో 2 వికెట్లు, సోఫీ ఎక్లెస్టోన్ ఓ వికెట్ తీసి టీమిండియాను దెబ్బకొట్టారు. భారత ఇన్నింగ్స్లో 33 పరుగులు చేసిన యస్తికా భాటియా టాప్ స్కోరర్ కాగా.. స్మృతి మంధన 32, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 28, షఫాలీ వర్మ 22 పరుగులు చేశారు. మిగతా ప్లేయర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. జెమీమా రోడ్రిగ్స్ 1, రిచా ఘోష్ 8, దీప్తి శర్మ 2, శ్రేయాంక 6, శ్రీచరణి 1, అరుంధతి రెడ్డి 4 (నాటౌట్), నందిని శర్మ 0 (నాటౌట్) పరుగులు చేశారు. ఈ గెలుపుతో ఇంగ్లండ్ సిరీస్లో బోణీ కొట్టింది. టాంటన్ వేదికగా జూన్ 2న జరిగే మూడో టీ20తో సిరీస్ డిసైడ్ అవుతుంది. తొలి టీ20లో భారత్ 38 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై విజయం సాధించింది. మూడో టీ20 తర్వాత ఇరు జట్ల మధ్య జూన్ 10 నుంచి ఏకైక టెస్ట్ మ్యాచ్ కూడా జరుగుతుంది. -
బంగ్లాదేశ్కు షాకిచ్చిన స్కాట్లాండ్
స్వదేశంలో జరుగుతున్న మహిళల టీ20 ట్రై-సిరీస్లో స్కాట్లాండ్ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. టోర్నీ ఓపెనర్లో నెదర్లాండ్స్ను చిత్తు చేసిన ఈ జట్టు.. తాజాగా బంగ్లాదేశ్కు భారీ షాకిచ్చింది.ఎడిన్బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేయగా.. స్కాట్లాండ్ 15.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.బౌలర్లు, బ్రైస్ సిస్టర్స్ స్కాట్లాండ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. తొలుత బౌలింగ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గాబ్రియెల్లా ఫోంటెనియా (4-1-11-1), క్రిస్టీ గోర్డాన్ (4-0-21-1), క్యాథరీన్ బ్రైస్ (3-0-24-1), అబ్తహా మక్సూద్ (2-0-14-1) రాణించగా.. ఛేదనలో క్యాథరీన్ బ్రైస్ (54 నాటౌట్), సారా బ్రైస్ (23 నాటౌట్) సత్తా చాటారు. డార్సీ కార్టర్ (23), క్యాథరీన్ ఫ్రేసర్ (28) కూడా తలో చేయి వేశారు. బంగ్లా బౌలర్లలో రీతూ మోనీ, షోర్నా అక్తెర్ తలో వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్లో కెప్టెన్ నిగార్ సుల్తానా (46 నాటౌట్) రాణించగా.. శోభన మోస్తరి (22), షోర్నా అక్తెర్ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మిగతా ప్లేయర్లలో దిల్హర అక్తెర్ 11, ఫిర్దోస్ 12, షర్మిన్ అక్తెర్ 10, రబేయా ఖాన్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. ఇవాళ (మే 31) జరుగబోయే తదుపరి మ్యాచ్లో బంగ్లాదేశ్ నెదర్లాండ్స్తో తలపడనుంది. -
అద్వితీయ ప్రదర్శనకు సై!
తొలి ట్రోఫీ కోసం 18 సీజన్ల పాటు వేచి చూసి ఇప్పుడు అదే జోరులో ఆనందాన్ని రెట్టింపు చేసుకునేందుకు వరుసగా రెండో ట్రోఫీపై గురి పెట్టిన జట్టు ఒక వైపు... ఆడిన తొలి సీజన్లోనే కప్ను గెల్చుకోవడంతో పాటు ఐదో సీజన్లోనే మరో సారి విజేతగా నిలిచే లక్ష్యంతో నిలిచిన జట్టు మరో వైపు... దూకుడైన బ్యాటింగ్ లైనప్, పదునైన బౌలింగ్తో పాటు అమిత ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న టీమ్ సవాల్ విసురుతుండగా... ముగ్గురు బ్యాటర్లే దాదాపు మొత్తం బ్యాటింగ్ భారం మోస్తుండగా క్రమశిక్షణతో కూడిన బౌలింగ్తో సమరానికి మరో జట్టు రెడీ అయింది. వరుసగా రెండో టైటిల్ నెగ్గిన కెపె్టన్గా అరుదైన జాబితాలో చేరేందుకు ఒక సారథి ఉవి్వళ్లూరుతుండగా, తన నాయకత్వంలో మొదటి టోర్నీ గెలిపించాలని మరొకరు పట్టుదలగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్–19 తుది పోరుకు రంగం సిద్ధమైంది. నేడు జరిగే పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.అహ్మదాబాద్: ఎన్నో అద్భుత ప్రదర్శనలు, మరెన్నో అనూహ్య ఫలితాలు, అసాధారణ బ్యాటింగ్ విన్యాసాలు, కొత్త రికార్డులు, సరికొత్త ఘనతలు...64 రోజులు, 73 మ్యాచ్లు, 2299 ఫోర్లు, 1416 సిక్సర్ల తర్వాత ఐపీఎల్ పోరాటం ఆఖరి ఘట్టానికి చేరింది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు, మాజీ చాంపియన్ గుజరాత్ను ఢీకొడుతుంది. ఏ జట్టు నెగ్గినా ఇది వారి రెండో టైటిల్ కానుంది. పాయింట్ల పట్టికలో టాప్–2 స్థానాల్లో నిలిచిన జట్లే చివరి సమరానికి సమాయత్తం కావడం విశేషం. తొలి క్వాలిఫయర్లో గుజరాత్ను చిత్తు చేసిన ఆర్సీబీ మానసికంగా పైచేయి సాధించగా... సొంతగడ్డపై ఫైనల్ ఆడనుండటం టైటాన్స్కు సానుకూలాంశం. ఆటగాళ్లంతా ఫామ్లో... డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన బెంగళూరు ఈ సారి గత ఏడాదికంటే మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చి దూసుకొచి్చంది. అన్ని అంచనాలను అందుకుంటూ జట్టు పాయింట్ల పట్టికలో టాపర్గా నిలిచింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో సమష్టి ప్రదర్శన టీమ్ను ముందంజ వేసేలా చేసింది. ఈ సీజన్లో ఆర్సీబీ 10 మ్యాచ్లు గెలవగా... 8 మంది వేర్వేరు ఆటగాళ్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’లుగా నిలవడం జట్టు సమష్టితత్వానికి నిదర్శనం. ప్రతీ ఒక్కరు జట్టు విజయాల్లో తమ వంతు పాత్ర పోషించారు. విరాట్ కోహ్లి అద్భుత ఫామ్ ఓపెనింగ్లో జట్టు శుభారంభానికి ప్రధాన కారణం. పదేళ్ల క్రితం 2016లో ఇదే స్థాయి ఆటతో ఒంటిచేత్తో బెంగళూరును ఫైనల్కు చేర్చిన విరాట్ కోహ్లి... మరోసారి నాటి ఆటను గుర్తుకు తెచ్చాడు. ఇప్పుడు అదే ఉత్సాహంతో జట్టుకు రెండో టైటిల్ అందించాలని అతను పట్టుదలగా ఉన్నాడు. కోహ్లి 600 పరుగులు చేయగా, కెపె్టన్ రజత్ పాటీదార్ (486) ఏకంగా 196.76 స్ట్రైక్రేట్తో 5 అర్ధ సెంచరీలతో తన స్థాయిని ప్రదర్శించాడు. పడిక్కల్ (463) కూడా చెలరేగగా... కృనాల్ పాండ్యా ఆల్రౌండర్ ప్రదర్శన (225 పరుగులు, 13 వికెట్లు) జట్టును నడిపించాయి. 2011 నుంచి ఐపీఎల్ ఆడుతున్న భువనేశ్వర్ కుమార్ అనుభవం జట్టుకు ఎంతో పనికొచి్చంది. భువీ ఇప్పటికే 26 వికెట్లు తీయగా...హాజల్వుడ్ (13) అండగా నిలిచాడు. వీరికి తోడు యువ బౌలర్ రసిఖ్ సలామ్ (16) సత్తా చాటడం బౌలింగ్ బలాన్ని పెంచింది. ఫిట్గా ఉంటే ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ చేస్తాడు. లేదంటే వెంకటేశ్ అయ్యర్ కొనసాగుతాడు. బౌలింగ్లో పరిస్థితిని బట్టి సుయాశ్, డఫీలలో ఒకరికి ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా అవకాశం దక్కుతుంది. టాప్–3 దూకుడు... టోర్నీ ఆరంభంనుంచి గుజరాత్ ఒకే విమర్శను మళ్లీ మళ్లీ ఎదుర్కొంది. టాప్–3 బ్యాటర్లు మినహా జట్టులో ఏమి లేదని, వీరిని అవుట్ చేస్తే కుప్పకూలడం ఖాయమని విమర్శలు వచ్చాయి. అయితే చివరిసారి ఈ విమర్శకు గుజరాత్ సిద్ధమైంది. మ్యాచ్ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా టాప్–3 బ్యాటింగ్పైనే ఆధారపడుతోంది. శుబ్మన్ గిల్ (722 పరుగులు), సాయి సుదర్శన్ (710), జోస్ బట్లర్ (507) తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారు కాబట్టి ఈ విషయంలో మేనేజ్మెంట్కు ఆందోళన లేదు. వీరు చెలరేగితే మిడిలార్డర్ అవసరం ఉండదనే భావన రాజస్తాన్తో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో కూడా రుజువైంది. సుందర్ (327) కూడా జట్టు విజయాల్లో కొంత పాత్ర పోషించాడు. అయితే పదునైన బౌలింగ్ దళం సహకారంతో గుజరాత్ ముందంజ వేయగలిగింది. కొత్త బంతితో రబాడ (28 వికెట్లు), సిరాజ్ (18) ప్రత్యర్థులను పూర్తిగా కట్టపడేస్తున్నారు. హోల్డర్ (17) కూడా కేవలం 7.54 ఎకానమీతో బౌలింగ్ చేయడం టైటాన్స్కు అదనపు బలంగా మారింది. గత పోరులో రషీద్ లైన్ తప్పినా... అతనిలాంటి స్టార్ బౌలర్ ఏ సమయంలోనైనా చెలరేగిపోగలడు. ఇక్కడి పిచ్ను బట్టి చూస్తే స్పిన్నర్ సాయికిషోర్కు ఈ సారి బౌలింగ్ అవకాశం లభించవచ్చు. తుది జట్లు (అంచనా) బెంగళూరు: పాటీదార్ (కెపె్టన్), కోహ్లి, సాల్ట్/ వెంకటేశ్, పడిక్కల్, కృనాల్, డేవిడ్, జితేశ్, షెఫర్డ్, భువనేశ్వర్, హాజల్వుడ్, సలామ్, డఫీ/ సుయాశ్ గుజరాత్: గిల్ (కెపె్టన్), సుదర్శన్, బట్లర్, సుందర్, నిశాంత్, హోల్డర్, తెవాటియా, రషీద్, రబాడ, సిరాజ్, ప్రసిధ్, సాయికిషోర్. పిచ్, వాతావరణం బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్. భారీ స్కోరుకు అవకాశం ఉన్నా...బౌలర్లూ ప్రభావం చూపగలరు. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన పిచ్పైనే ఫైనల్ నిర్వహిస్తున్నారు. ఆ పోరులో గుజరాత్ గెలిచింది. అన్నింటికి మించి ఈ స్టేడియంలో రెండో సారి బ్యాటింగ్ సులువుగా మారుతుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపవచ్చు. మ్యాచ్ రోజు వర్షసూచన లేదు. -
ఆసీస్ కొంపముంచిన పాక్ సంచలనం.. 4 దశాబ్దాల రికార్డు బద్దలు
పాకిస్తాన్ క్రికెట్కు మరో అద్భుతమైన ఆల్రౌండర్ దొరికాడు. అరంగేట్రంలో తన స్పిన్ బౌలింగ్తో ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్టుకే చుక్కలు చూపించాడు. ఆ యువ స్పిన్నర్ను జోష్ ఇంగ్లిష్, మార్నస్ లబుషేన్ వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లు సైతం ఎదుర్కోలేకపోయారు. అతడే 21 ఏళ్ల అరాఫత్ మిన్హాస్. శనివారం రావల్పిండి వేదికగా ఆసీస్తో జరుగుతున్న తొలి వన్డేతో మిన్హాస్ అరంగేట్రం చేశాడు.మిన్హాస్ మూడేళ్ల కిందటే టీ20ల్లో డెబ్యూ చేసినప్పటికి పేలవ ప్రదర్శనల కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. కానీ ఇటీవల డొమాస్టిక్ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన చేయడంతో పాక్ సెలెక్టర్ల నుంచి మళ్లీ అతడికి పిలుపు వచ్చింది. ఈసారి మాత్రం సెలెక్టర్ల నమ్మకాన్ని అరాఫత్ నిలబెట్టుకున్నాడు.తన మొదటి వన్డేలోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన 10 ఓవర్ల కోటాలో కేవలం 32 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడు ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే అరంగేట్రంలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన పాకిస్తాన్ బౌలర్గా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు 1984లో జకీర్ ఖాన్ తన వన్డే డెబ్యూలో 19 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్తో 42 ఏళ్ల రికార్డును అరాఫత్ బ్రేక్ చేశాడు.అతడి బౌలింగ్ ధాటికి టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 44 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో మాథ్యూ షార్ట్(55), మాట్ రెన్షా(61) మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. పాక్ బౌలర్లలో అరాఫత్తో పాటు షాహీన్ షా అఫ్రిది, రౌఫ్, అఘా ఒక్కో వికెట్ పడగొట్టారు.


