breaking news
Cricket
-
World Cup 2025: పాక్ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 (ICC World Cup)లో మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా రెండో విజయం సాధించింది. టోర్నీలో తొలుత న్యూజిలాండ్ వుమెన్ను 89 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించిన ఆసీస్ జట్టు.. తాజాగా పాకిస్తాన్ (Aus W vs Pak W)పై ఘన విజయం సాధించింది.కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో బుధవారం నాటి మ్యాచ్లో టాస్ ఓడిన ఆసీస్.. పాక్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు కెప్టెన్ అలిసా హేలీ (20), ఫోబే లిచ్ఫీల్డ్ (10).. వన్డౌన్ బ్యాటర్ ఎలిస్ పెర్రీ (5) విఫలం కావడంతో ఆసీస్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.మూనీ సెంచరీ.. అలనా హాఫ్ సెంచరీఆ తర్వాత కూడా పాక్ బౌలర్లు విజృంభించడంతో ఐదో నంబర్ ప్లేయర్ అనాబెల్ సదర్లాండ్ (1) సహా ఆ తర్వాత వచ్చిన ఆష్లే గార్డ్నర్ (1), తహీలా మెగ్రాత్ (5), జార్జియా వారేహామ్ (0), కిమ్ గార్త్ (11) పెవిలియన్కు క్యూ కట్టారు.ఈ నేపథ్యంలో కేవలం 76 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఆసీస్ను బెత్ మూనీ (Beth Mooney), అలనా కింగ్ అద్భుత ఇన్నింగ్స్తో ఆదుకున్నారు. మూనీ 114 బంతుల్లో 109 పరుగులతో చెలరేగగా.. అలనా 49 బంతుల్లో 51 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆసీస్ తొమ్మిది వికెట్ల నష్టానికి 221 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది.చెలరేగిన ఆసీస్ బౌలర్లుఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్కు ఆసీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. కిమ్ గార్త్ బౌలింగ్లో ఓపెనర్ సదాఫ్ షమాస్ 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించగా.. మునీబా అలీ (3)ని మేగన్ షట్ వెనక్కి పంపింది. అయితే, వన్డౌన్లో వచ్చిన సిద్రా ఆమిన్ (35) కాసేపు పోరాడగా.. ఆష్లే గార్డ్నర్ ఆమెను అవుట్ చేసింది.ఇక నాలుగో నంబర్ బ్యాటర్ సిద్రా నవాజ్ (5) వికెట్ను కిమ్ గార్త్ తన ఖాతాలో వేసుకోగా.. నటాలియా పర్వేజ్ (1)ను మేగన్ పెవిలియన్కు పంపింది. ఇక కెప్టెన్ ఫాతిమా సనా 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సదర్లాండ్ బౌలింగ్లో బౌల్డ్ కాగా.. డయానా బేగ్ (7)ను జార్జియా వారేహామ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది.114 పరుగులకే కుప్పకూలిన పాక్ఈ క్రమంలో 86 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన పాక్ను లక్ష్యం దిశగా నడిపించేందుకు స్పిన్నర్లు రమీన్ షమీమ్ (15), నష్రా సంధు (11) విఫలయత్నం చేశారు. అయితే, అలనా బౌలింగ్లో నష్రా తొమ్మిదో వికెట్గా.. సదర్లాండ్ బౌలింగ్లో షమీమ్ పదో వికెట్గా వెనుదిరగడంతో పాక్ పోరాటం ముగిసిపోయింది.ఈ క్రమంలో 36.3 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయిన పాక్.. ఆసీస్ చేతిలో 107 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇదిలా ఉంటే.. ఆసీస్ తమ రెండో మ్యాచ్లో శ్రీలంకతో ఆడాల్సి ఉండగా.. వర్షం కారణంగా టాస్ పడకుండానే ఆ మ్యాచ్ రద్దైపోయింది.చదవండి: అగార్కర్కు అవమానకర ముగింపు తప్పదు: మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు -
మహ్మద్ షమీ కీలక నిర్ణయం
టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami)కి గడ్డుకాలం నడుస్తోంది. భారత పేస్ దళంలో కీలక ఆటగాడిగా కొనసాగిన ఈ బెంగాల్ క్రికెటర్కు ఇప్పుడు జట్టులో చోటే కరువైంది. వన్డే వరల్డ్కప్-2023 టోర్నీలో గాయం తాలూకు బాధను దిగమింగి.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు షమీ.సొంతగడ్డపై జరిగిన ఈ మెగా టోర్నీలో కేవలం ఆరు మ్యాచ్లే ఆడిన షమీ ఏకంగా 23 వికెట్లు కూల్చాడు. తద్వారా ఈ ఐసీసీ ఈవెంట్లో లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. అయితే, ఆ తర్వాత నుంచి షమీ చీలమండ గాయం తీవ్రత ఎక్కువ కావడంతో సర్జరీ చేయించుకున్నాడు.చాంపియన్ జట్టులోకోలుకునే క్రమంలో దాదాపు ఏడాదిన్నర పాటు టీమిండియాకు దూరంగా ఉన్న షమీ.. స్వదేశంలో ఈ ఏడాది ఇంగ్లండ్తో సిరీస్ సందర్భంగా పునరాగమనం చేశాడు. ఈ క్రమంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచిన భారత జట్టులోనూ షమీ భాగమయ్యాడు. అయితే, ఈ వన్డే టోర్నీలో షమీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఐదు మ్యాచ్లలో కలిపి తొమ్మిది వికెట్లు తీయగలిగాడు.రెండేళ్ల నుంచీ నిరాశే పరిమిత ఓవర్ల క్రికెట్లో పరిస్థితి ఇలా ఉంటే.. టెస్టుల్లో మాత్రం షమీకి రెండేళ్ల నుంచీ నిరాశే ఎదురవుతోంది. ఫిట్నెస్ సమస్యల దృష్ట్యా అతడిని పక్కనపెట్టినట్లు టీమిండియా మేనేజ్మెంట్ చెబుతోంది. మరోవైపు.. ఇటీవల దులిప్ ట్రోఫీలో బెంగాల్ తరఫున బరిలోకి దిగిన షమీ.. 34 ఓవర్ల బౌలింగ్లో కేవలం ఒకే ఒక్క వికెట్ తీయగలిగాడు.షమీ కీలక నిర్ణయంఈ నేపథ్యంలో వెస్టిండీస్తో స్వదేశంలో టెస్టులకు కూడా సెలక్టర్లు షమీని ఎంపిక చేయలేదు. అంతేకాదు ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడే జట్టులోనూ అతడికి చోటి వ్వలేదు. ఈ విషయం గురించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. షమీ గురించి అప్డేట్ లేదని చెప్పడం గమనార్హం. ఈ క్రమంలో షమీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.తనను తాను నిరూపించుకునేందుకు రంజీ ట్రోఫీ తాజా సీజన్లో ఆడేందుకు షమీ సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయం గురించి బెంగాల్ కోచ్ టెలిగ్రాఫ్తో మాట్లాడుతూ.. ‘‘ఆరేడు రోజుల క్రితం షమీతో మాట్లాడాను. అతడు ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. రంజీ ట్రోఫీలో మా ఓపెనింగ్ మ్యాచ్ నుంచే అతడు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నాడు.తలుపులు శాశ్వతంగా మూసుకుపోయినట్లేఇదిలా ఉంటే.. బీసీసీఐ అధికారి ఒకరు షమీ గురించి ప్రస్తావన రాగా.. ‘‘టీమిండియాలోకి షమీ తిరిగి రావడం ప్రస్తుతం కష్టమే. ఇటీవల దులిప్ మ్యాచ్లోనూ అతడు రాణించలేకపోయాడు. రోజురోజుకీ వయసు మీద పడుతోంది. యువ ఆటగాళ్లతో అతడు పోటీ పడలేడు.అయితే, ఐపీఎల్లో అవకాశాలు దక్కించుకోవాలంటే.. అతడు ఆడక తప్పని పరిస్థితి’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. తద్వారా షమీకి టీమిండియా తలుపులు శాశ్వతంగా మూసుకుపోయినట్లేననే సంకేతాలు ఇచ్చారు సదరు అధికారి. కాగా ఐపీఎల్-2025లో సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించిన 35 ఏళ్ల షమీ కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీయగలిగాడు.చదవండి: IND vs AUS: 462 వికెట్లు.. స్వింగ్ సుల్తాన్.. కట్ చేస్తే! ఊహించని విధంగా కెరీర్కు ఎండ్ కార్డ్? -
చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా..
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. వుమెన్ వన్డే క్రికెట్లో తొమ్మిదో వికెట్కు వందకు పైగా స్కోరు జతచేసిన తొలి జట్టుగా నిలిచింది. ప్రపంచంలో ఇంత వరకు ఏ మహిళా జట్టుకు సాధ్యం కాని ఘనత సాధించింది.ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 (ICC Womens World Cup 2025)లో భాగంగా పాకిస్తాన్తో బుధవారం నాటి మ్యాచ్లో ఆసీస్ జట్టు ఈ ఫీట్ నమోదు చేసింది. ప్రపంచకప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. పాక్ శ్రీలంక వేదికగా తమ మ్యాచ్లు ఆడుతోంది. ఇందులో భాగంగా ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఆసీస్ (Aus W vs Pak W)తో తాజా మ్యాచ్లో టాస్ గెలిచిన పాక్.. తొలుత బౌలింగ్ చేసింది.టాపార్డర్ కుదేలైనా..అయితే, పాక్ బౌలర్ల ధాటికి ఆసీస్ టాపార్డర్ కుదేలైంది. ఓపెనర్లు కెప్టెన్ అలిసా హేలీ (20), ఫోబే లిచ్ఫీల్డ్ (10) నామమాత్రపు స్కోర్లకే పరిమితం కాగా.. వన్డౌన్లో వచ్చిన ఎలిస్ పెర్రీ 5 పరుగులకే నిష్క్రమించింది.మిగిలిన వాళ్లలో కిమ్ గార్త్ (11) తప్ప అంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. నాలుగో స్థానంలో వచ్చిన బెత్ మూనీ, పదో స్థానంలో వచ్చిన అలనా కింగ్ సంచలన ఇన్నింగ్స్తో మెరిశారు. మూనీ సెంచరీ (114 బంతుల్లో 109)తో చెలరేగగా.. అలనా 49 బంతుల్లో 51 పరుగులతో నాటౌట్గా నిలిచింది.మూనీ- అలనా కలిసి తొమ్మిదో వికెట్కు 106 పరుగులు జోడించారు. తద్వారా మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో తొమ్మిదో వికెట్కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా ప్రపంచ రికార్డు సాధించారు.ప్రపంచంలోనే తొలి జట్టుగా..ఇక 76 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన వేళ.. మూనీ- అలనా రాణించడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి.. 222 పరుగులు స్కోరు చేయగలిగింది. కాగా మహిళల వన్డే చరిత్రలో ఏడు ఎక్కువ వికెట్లు పడిన తర్వాత అత్యధిక పరుగులు సాధించిన జట్టుగానూ ఆసీస్ నిలిచింది. ఏడో వికెట్ పడిన తర్వాత ఆసీస్ 145 పరుగులు సాధించి ఈ ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఆ రికార్డూ ఆసీస్ పేరు మీదేఐసీసీ పురుషుల వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో ఆసీస్ 91 పరుగులకే ఏడు వికెట్ల నష్టపోయిన వేళ.. గ్లెన్ మాక్స్ వెల్, ప్యాట్ కమిన్స్ కలిసి అద్భుతం చేశారు. ఎనిమిదో వికెట్కు ఏకంగా 202 పరుగులు జోడించి ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా ఆసీస్ను నిలిపారు.చదవండి: అగార్కర్కు అవమానకర ముగింపు తప్పదు: మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు -
పాక్ బౌలర్ల విజృంభణ.. సంతోషాన్ని ఆవిరి చేసిన ఆసీస్ బ్యాటర్
పాకిస్తాన్తో మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాటర్ బెత్ మూనీ (Beth Mooney) అద్భుత శతకంతో చెలరేగింది. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మొక్కవోని దీక్షతో వంద పరుగుల మార్కును దాటి.. జట్టుకు మెరుగైన స్కోరు అందించింది. ‘న భూతో న భవిష్యతి’ అన్నట్లుగా కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కించి పాక్ సంబరాలపై నీళ్లు చల్లింది.ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 (ICC Women's ODI World Cup)లో భాగంగా కొలంబో వేదికగా ఆసీస్- పాకిస్తాన్ (Aus W vs Pak W) జట్ల మధ్య మ్యాచ్కు బుధవారం షెడ్యూల్ ఖరారైంది. ఆర్.ప్రేమదాస స్టేడియంలో టాస్ గెలిచిన పాకిస్తాన్ మహిళా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.పాక్ బౌలర్ల విజృంభణకెప్టెన్ ఫాతిమా సనాతో పాటు సైదా ఇక్బాల్ ఆది నుంచే చెలరేగి ఆసీస్ ఓపెనింగ్ జంటను విడదీశారు. ఈ క్రమంలో ఓపెనర్లలో ఫొబు లిచ్ఫీల్డ్ 10, కెప్టెన్ అలిసా హేలీ 20 పరుగులకే పరిమితం కాగా.. వన్డౌన్లో వచ్చిన ఎలిస్ పెర్రీ (5) దారుణంగా విఫలమైంది. నష్రా సంధు బౌలింగ్లో స్టంపౌట్గా వెనుదిరిగింది.పాక్ బౌలర్ల ధాటికి ఐదో స్థానంలో వచ్చిన అనాబెల్ సదర్లాండ్ (1), ఆష్లే గార్డ్నర్ (1), తాహిలా మెగ్రాత్ (5) ఇలా వచ్చి అలా వెళ్లగా.. జార్జియా వారేహమ్ (0), కిమ్ గార్త్ (11) కూడా చేతులెత్తేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాలుగో నంబర్ బ్యాటర్ బెత్ మూనీ.. ఆల్రౌండర్ అలనా కింగ్తో కలిసి అద్భుత పోరాటం చేసింది.బెత్ మూనీ సంచలన ఇన్నింగ్స్ఆసీస్ 76 పరుగులకే ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. బెత్ మూనీ సంచలన ఇన్నింగ్స్తో మెరిసింది. సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ 114 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 109 పరుగులు సాధించింది. అయితే, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ఫాతిమా సనా బౌలింగ్లో సదాఫ్ షమాస్కు క్యాచ్ ఇవ్వడంతో మూనీ అవుటైపోయింది.ఏకంగా 106 పరుగులు జోడించి.. పాక్ సంబరాలపై నీళ్లుమరో ఎండ్లో అలనా కింగ్ 49 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 51 పరుగులతో అజేయంగా నిలిచింది. వీరిద్దరు కలిసి తొమ్మిదో వికెట్కు ఏకంగా 106 పరుగులు జోడించి జట్టును గట్టెక్కించారు. మూనీ, అలనా అద్భుత ప్రదర్శన కారణంగా ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 221 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది.దీంతో ఆదిలోనే వరుస వికెట్లు తీసిన పాక్ జట్టుకు ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. ఇక పాక్ బౌలర్లలో నష్రా సంధు అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. రమీన్ షమీమ్, ఫాతిమా సనా చెరో రెండు.. డయానా బేగ్, సదియా ఇక్బాల్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉంటే.. పాక్పై బ్యాట్తో విజృంభించిన బెత్ మూనీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇదొక అత్యుత్తమ ఇన్నింగ్స్ అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెను కొనియాడుతున్నారు.చదవండి: అగార్కర్కు అవమానకర ముగింపు తప్పదు: మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు Alert 🚨 - You are watching one of the greatest comeback of all time as Australia 🇦🇺 were 76/7, but at the end scored 221/9 👏🏻- Beth Mooney and Alana King had a unbeaten partnership of 106 🔥 with Mooney's epic 💯 & King's 50 🥶- What's your take 🤔pic.twitter.com/nRkac6VuZy— Richard Kettleborough (@RichKettle07) October 8, 2025 -
టీమిండియాకు గంభీర్ డిన్నర్ పార్టీ!.. రోహిత్- కోహ్లి ఓ రోజు ముందుగానే..
ఇటీవలే ఆసియా టీ20 కప్-2025 (Asia Cup) గెలిచిన టీమిండియా వరుస సిరీస్లతో బిజీ బిజీగా గడుపనుంది. అక్టోబరు నెల మొత్తం భారత క్రికెట్ జట్టు ఆటలో తలమునకలు కానుంది. ఇప్పటికే స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టు సిరీస్ మొదలుపెట్టిన టీమిండియా.. తొలి మ్యాచ్ను మూడు రోజుల్లోనే ముగించి జయభేరి మెగించింది.ఇరుజట్ల మధ్య ఢిల్లీ వేదికగా రెండో టెస్టుకు అక్టోబరు 10- 14 వరకు రెండో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన (India Tour Of Australia 2025)కు బయల్దేరనుంది. అక్టోబరు 15వ తేదీనే గిల్ సేన భారత్ నుంచి ఆసీస్కు పయనం కానున్నట్లు సమాచారం.టీమిండియాకు గంభీర్ డిన్నర్ పార్టీ!అయితే, అంతకంటే ముందు హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) టీమిండియాకు తన నివాసంలో డిన్నర్ పార్టీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా ఆసీస్ టూర్కు ముందు... వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మపై వేటు వేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుబ్మన్ గిల్ను కొత్త సారథిగా ఎంపిక చేసింది.అయితే, రోహిత్ను ఓపెనర్గా జట్టులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్- హెడ్కోచ్ గంభీర్పై విమర్శలు వస్తున్నాయి. వీరిద్దరు కలిసే దిగ్గజ కెప్టెన్పై వేటు వేశారంటూ పలువురు మాజీ క్రికెటర్లు రోహిత్కు మద్దతుగా నిలుస్తున్నారు.రోహిత్- కోహ్లి ఓ రోజు ముందుగానే..ఈ నేపథ్యంలో భారత జట్టు కంటే ముందే రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి ఓ రోజు ముందుగానే ఆస్ట్రేలియాకు బయల్దేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో గంభీర్.. గిల్ సేనకు ఢిల్లీలోని తన ఇంట్లో పార్టీ ఇచ్చేందుకు సిద్ధం కావడం మరోసారి సందేహాలకు తావిచ్చింది. రో-కోలకు గంభీర్తో సఖ్యత చెడిందనే గుసగుసలు మరోసారి గుప్పుమంటున్నాయి.కాగా అక్టోబరు 19- నవంబరు 8 వరకు టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. తొలుత మూడు వన్డేల సిరీస్.. ఆ తర్వాత ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించి భారత్- ఆస్ట్రేలియా ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు టీమిండియాశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైశ్వాల్.ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు టీమిండియాసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్. చదవండి: టీమిండియాతో సిరీస్లకు ఆసీస్ జట్ల ప్రకటన -
అగార్కర్కు అవమానకర ముగింపు తప్పదు: మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar)పై ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్ (Steve Harmison) సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ (Rohit Sharma)- విరాట్ కోహ్లి (Virat Kohli) విషయంలో అగార్కర్కు ఓటమి తప్పదని వ్యాఖ్యానించాడు. ఈ ఇద్దరు దిగ్గజ కెప్టెన్లు.. ముఖ్యంగా కోహ్లి.. అగ్కార్ను తప్పక ఓడించితీరతాడని పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత రోహిత్- కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇటీవలే వీరిద్దరు టెస్టులకు కూడా రిటైర్మెంట్ ఇచ్చాడు. రో- కో ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతుండగా.. బీసీసీఐ ఇటీవల అనూహ్య నిర్ణయం తీసుకుంది.శుబ్మన్ గిల్కు పగ్గాలుఇటీవలే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన రోహిత్ శర్మ వన్డే కెప్టెన్గా తప్పించి.. శుబ్మన్ గిల్కు పగ్గాలు అప్పగించింది. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా గిల్ వన్డే సారథిగా తన ప్రయాణం మొదలుపెడతాడని వెల్లడించింది. ఇక ఈ జట్టులో రోహిత్, కోహ్లి ఆటగాళ్లుగా కొనసాగనున్నారు.రో- కోకు పరోక్షంగా వార్నింగ్ఇక రోహిత్పై వేటు వేయడం గురించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. రో- కో వన్డే వరల్డ్కప్-2027 వరకు ఆడతారని గ్యారెంటీ లేదని పేర్కొన్నాడు. అందుకే గిల్ను కెప్టెన్ చేసినట్లు వెల్లడించాడు. అంతేకాదు.. వరల్డ్కప్ నాటికి జట్టులో ఉండాలంటే దేశీ క్రికెట్ కూడా ఆడకతప్పదని రో- కోకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు.అగార్కర్కు అవమానకర ముగింపు తప్పదుఈ విషయం గురించి స్టీవ్ హార్మిసన్ తాజాగా స్పందించాడు. ‘‘దురదృష్టవశాత్తూ.. చివరికి అగార్కర్ అవమానకరమైన ముగింపు తప్పదని భావిస్తున్నా. ఈ పోటీలో మాజీ కెప్టెన్లు గెలుస్తారా? లేదంటే మాజీ ఆల్రౌండర్దే గెలుపా? అంటే.. కచ్చితంగా ఆ ఇద్దరే గెలుస్తారని అనుకుంటున్నా.అలా కాకుండా కేవలం కోహ్లి- శర్మలను రెచ్చగొట్టడానికి.. వారిని ఎలాగైనా వరల్డ్కప్లో ఆడించాలనే ఉద్దేశంతో అగార్కర్ ఈ మాటలు అంటే అది వేరే సంగతి. నిజంగా అదొక మంచి విషయమే అవుతుంది. అలా కాకుండా వారి గురించి ఉద్దేశపూర్వకంగానే ఇలా మాట్లాడితే ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేము.కోహ్లి మాత్రం కచ్చితంగా..రోహిత్ కంటే కోహ్లికి వన్డేల్లో గొప్ప రికార్డు ఉంది. రోహిత్ కోహ్లి కంటే వయసులోనూ కాస్త పెద్దవాడు. కాబట్టి వరల్డ్కప్ నాటికి రోహిత్ విషయం ఎలా ఉన్నా.. కోహ్లి మాత్రం కచ్చితంగా కొనసాగుతాడనే అనుకుంటున్నా.ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి జట్లపై 350 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లి లేకుంటే టీమిండియా ఎలా గెలవగలదు?.. బహుశా కోహ్లి మనసులో కూడా ఇదే ఉండి ఉంటుంది. ఏదేమైనా అగార్కర్కు ఈ విషయంలో ఓటమి తప్పదు.ఛేజింగ్ కింగ్ఒకవేళ అగార్కర్ నిజంగానే రో- కో గురించి అలా అన్నాడా? లేదంటే అనువాద తప్పిదాలు ఏమైనా ఉన్నాయో నాకైతే తెలియవు’’ అని స్టీవ్ హార్మిసన్ పేర్కొన్నాడు. కాగా వన్డేల్లో ఛేజింగ్లోనే కోహ్లి 28 శతకాలు బాది 8064 పరుగులు రాబట్టాడు. ఇందులో 41 హాఫ్ సెంచరీలు కూడా ఉండటం విశేషం. అత్యుత్తమ స్కోరు 183. అంతేకాదు.. 300 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లి ఏకంగా ఏడు సెంచరీలు నమోదు చేయడం అతడు ఛేజింగ్ కింగ్ అనడానికి మరో నిదర్శనం.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
ICC: దుమ్మురేపిన సిరాజ్.. కెరీర్ బెస్ట్!.. దిగజారిన జైసూ ర్యాంకు
టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) టెస్టు ర్యాంకింగ్స్లో అదరగొట్టాడు. ఇటీవలి కాలంలో సూపర్ ఫామ్ కనబరుస్తున్న ఈ హైదరాబాదీ బౌలర్లో కెరీర్లో అత్యుత్తమ రేటింగ్ సాధించాడు. ఈ క్రమంలో మూడు స్థానాలు ఎగబాకి పన్నెండో ర్యాంకుకు చేరుకున్నాడు.అగ్రస్థానం బుమ్రాదేఅంతర్జాతీయ క్రికెట్ మండలి తాజా టెస్టు ర్యాంకింగ్స్ ((ICC) Latest Test Rankings)ను బుధవారం ప్రకటించింది. బౌలర్ల విభాగంలో టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jaspreet Bumrah) అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. కగిసో రబడ, మ్యాట్ హెన్రీ, ప్యాట్ కమిన్స్, జోష్ హాజిల్వుడ్ టాప్-5లో కొనసాగుతున్నారు.సిరాజ్ కెరీర్లో అత్యుత్తమంగా ఆ తర్వాతి స్థానాల్లో నొమన్ అలీ, స్కాట్ బోలాండ్, నాథన్ లియోన్, మార్కో యాన్సెన్, మిచెల్ స్టార్క్, గస్ అట్కిన్సన్ కొనసాగుతుండగా.. జేడన్ సీల్స్, ప్రభాత్ జయసూర్య, షమాన్ జోసెఫ్లను వెనక్కి నెట్టి సిరాజ్ పన్నెండో స్థానానికి దూసుకువచ్చాడు. కెరీర్లో అత్యుత్తమంగా 718 రేటింగ్ పాయింట్లు సాధించాడు.ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఐదు టెస్టుల్లో కలిపి 23 వికెట్లు తీసిన సిరాజ్.. తాజాగా స్వదేశంలో వెస్టిండీస్తో తొలి టెస్టులోనూ ఫామ్ కొనసాగించాడు. అహ్మదాబాద్లో జరిగిన ఈ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లో కలిపి ఏడు వికెట్లు కూల్చాడు. ఈ క్రమంలోనే కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్లు సాధించాడు.రూట్.. రైట్ రైట్మరోవైపు.. ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ దిగ్గజం జో రూట్ టాప్ ర్యాంకులో కొనసాగుతుండగా.. టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండు స్థానాలు దిగజారి టాప్-5లో చోటు కోల్పోయాడు. సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా ఐదో స్థానంలోకి రాగా.. శ్రీలంక స్టార్ కమిందు మెండిస్ ఒక ర్యాంకు మెరుగుపరచుకుని ఆరో స్థానానికి చేరుకున్నాడు.దిగజారిన జైసూ ర్యాంకుఇక జైస్వాల్ ఐదో ర్యాంకు నుంచి ఏడుకు పడిపోయాడు. అయితే, టీమిండియా మరో స్టార్ రిషభ్ పంత్ మాత్రం తన ఎనిమిదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. గాయం కారణంగా రిషభ్ ఇంగ్లండ్తో ఐదో టెస్టు, విండీస్తో తొలి టెస్టుకు దూరమైనా తన ర్యాంకును నిలబెట్టుకోగా.. వెస్టిండీస్తో మొదటి టెస్టులో విఫలమైన జైసూ (36) ఈ మేరకు చేదు అనుభవం ఎదుర్కొన్నాడు.టాప్లోనే జడ్డూఅదే విధంగా.. టెస్టు ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా స్పిన్ స్టార్ రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. వాషింగ్టన్ సుందర్ నాలుగు స్థానాలు ఎగబాకి పదకొండో ర్యాంకుకు చేరుకున్నాడు. కాగా విండీస్ తొలి టెస్టులో అజేయ శతకం (104) బాదిన జడ్డూ.. నాలుగు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.చదవండి: వైభవ్ విఫలమైనా, బౌలర్లు గెలిపించారు.. ఆసీస్ గడ్డపై టీమిండియా గర్జన -
ద్రవిడ్ వల్లే సాధ్యమైంది.. చాంపియన్స్ ట్రోఫీ గెలిచాం: రోహిత్ శర్మ
టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మాజీ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) వల్లే తమకు వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు గెలవడం సాధ్యమైందని పేర్కొన్నాడు. భారత వన్డే జట్టు కెప్టెన్గా ఉద్వాసనకు గురైన తర్వాత రోహిత్ శర్మ తొలిసారి మంగళవారం మీడియా ముందుకు వచ్చాడు.ముంబైలో జరిగిన CEAT క్రికెట్ రేటింగ్ అవార్డు ప్రదానోత్సం కార్యక్రమంలో రోహిత్ పాల్గొన్నాడు. ఈ ఏడాది సారథిగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచినందుకుగానూ ప్రత్యేక పురస్కారం అందుకున్నాడు.ఒకటీ, రెండేళ్లలో సాధ్యమైంది కాదుఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఈ జట్టంటే నాకెంతో ఇష్టం. వారితో కలిసి ఆడటం, వారితో కలిసి ప్రయాణించడం గొప్ప విషయం. ఇదేదో ఒకటీ, రెండేళ్లలో సాధ్యమైంది కాదు. చాలా ఏళ్లుగా శ్రమిస్తున్న మాకు దక్కిన ప్రతిఫలం.చాలాసార్లు ఫైనల్ వరకు వచ్చి.. ట్రోఫీని చేజార్చుకున్నాం. అయితే, ఈసారి మాత్రం తప్పులు పునరావృతం కానివ్వద్దని నిర్ణయించుకున్నాం. ఒకరో.. ఇద్దరో ఆటగాళ్ల వల్ల ఇది సాధ్యం కాదు. ప్రతి ఒక్కరు గొప్పగా రాణిస్తేనే అనుకున్న ఫలితాన్ని రాబట్టగలం.నాకు, రాహుల్ భాయ్కు..చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలుపులో భాగమైన ఆటగాళ్లంతా.. టైటిల్కు అర్హులు. మేమంతా ఎన్నో ఏళ్లుగా దీనికోసం శ్రమిస్తున్నాం. కేవలం ఆట మీదే దృష్టి పెట్టాము. జట్టు నుంచి నాకు, రాహుల్ భాయ్కు అందిన సహకారం గొప్పది.టీ20 ప్రపంచకప్-2024లో మేము సిద్ధం చేసుకున్న ప్రణాళికలను పక్కాగా అమలు చేశాం. వాటినే చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ కొనసాగించాము. అయితే, 2023 వన్డే వరల్డ్కప్ ఫైనల్లో మాత్రం ఓడిపోయాము. ఆ తర్వాత మాలో పట్టుదల మరింత పెరిగింది’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.గంభీర్కు రోహిత్ కౌంటర్కాగా ద్రవిడ్ మార్గదర్శనంలో.. రోహిత్ కెప్టెన్సీలో 2024లో పొట్టి ప్రపంచకప్ గెలిచింది టీమిండియా. ఆ తర్వాత ద్రవిడ్ హెడ్కోచ్ పదవికి రాజీనామా చేయగా.. గౌతం గంభీర్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. అయితే, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో గంభీర్ మార్గదర్శనం చేసినా.. దాని వెనుక ద్రవిడ్ ఏళ్ల శ్రమ ఉందని రోహిత్ పరోక్షంగా చెప్పడం గమనార్హం.ఇక వన్డే కెప్టెన్గా కొనసాగాలనుకున్న రోహిత్ శర్మను తప్పించి.. శుబ్మన్ గిల్ను సారథి చేయడం వెనుక గంభీర్ హస్తం ఉందనేది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో రోహిత్ ఇలా తాను రెండు ఐసీసీ టైటిళ్లు గెలవడంలో ద్రవిడ్దే కీలక పాత్ర అని చెప్పడం గమనార్హం. పరోక్షంగా గంభీర్కు హిట్మ్యాన్ ఇలా కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ పలికిన రోహిత్.. వన్డేల్లో కొనసాగుతున్నాడు. మరోవైపు.. శుబ్మన్ గిల్ ఇప్పటికే టీమిండియా టెస్టు సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. సూర్యకుమార్ యాదవ్ టీ20 జట్టు నాయకుడిగా ఉన్నాడు.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
నాలుగున్నరేళ్ల కాపురం.. మోసగాడినే అయితే..
తన మాజీ భార్య ధనశ్రీ వర్మ (Dhanashree Verma)ను ఉద్దేశించి టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ (Yuzuvendra Chahal) ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తన పేరు వాడుకోనిదే ఒకరికి పూట గడవదని అనిపిస్తే.. వారు అలా చేయడాన్ని తాను తప్పుపట్టనంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.ప్రేమ పాఠాలు..అసలు విషయం ఏమిటంటే.. యూట్యూబర్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ వద్ద డాన్స్ పాఠాలు నేర్చుకునే క్రమంలో చహల్ ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఇరు కుటుంబాల సమ్మతితో వీరిద్దరు 2020లో పెళ్లి బంధంలో అడుగుపెట్టాడు. ఎక్కడైనా జంటగా వెళ్తూ అన్యోన్యంగా కనిపించే ఈ జంట.. 2025లో విడాకులు తీసుకుని అభిమానులకు షాకిచ్చారు.ఈ సందర్భంగా తాము 2022 నుంచే విడిగా ఉంటున్నట్లు న్యాయస్థానానికి తెలపడం గమనార్హం. అయితే, విడాకుల తర్వాత పరస్పర ఆరోపణలతో ఇద్దరూ రచ్చకెక్కారు. అధికారికంగా విడాకులు మంజూరు కావడానికి ముందే.. బాలీవుడ్ నటి, ఆర్జే మహ్వశ్తో చహల్ చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు.అతడే వదిలిపెట్టాడుఅంతేకాదు.. ధనశ్రీ రూ. 4 కోట్ల భరణం తీసుకున్న నేపథ్యంలో.. ‘‘ఎవరి తిండి వారే సంపాదించుకోవాలి’’ అనే కోట్ ఉన్న షర్ట్ వేసుకుని కోర్టుకు వచ్చాడు చహల్. ఈ పరిణామాల నేపథ్యంలో ధనశ్రీ స్పందిస్తూ.. తాను విడాకులు తీసుకోవాలని అనుకోలేదని.. అతడే తనను వదిలిపెట్టాడంటూ చహల్పై ఆరోపణలు చేసింది. ఏదేమైనా చహల్ సంతోషంగా ఉంటే చాలని పేర్కొంది.పెళ్లైన రెండు నెలల్లోనేతాజాగా ఓ రియాలిటీ షోలో పాల్గొన్న ధనశ్రీ.. తోటి కంటెస్టెంట్తో మాట్లాడుతూ.. పెళ్లైన రెండు నెలల్లోనే చహల్ తనను మోసం చేశాడని.. అయినా తాను సర్దుకుపోయినట్లు తెలిపింది. ఈ వ్యాఖ్యలు వైరల్ కాగా.. చహల్ తాజాగా హిందుస్తాన్ టైమ్స్తో మాట్లాడుతూ.. ధనశ్రీ వ్యాఖ్యలను ఖండించాడు.‘‘ఒకవేళ ఏదైనా బంధంలో ఓ వ్యక్తి రెండు నెలల్లోనే మోసగాడని తెలిస్తే.. అయినా అతడితో కలిసి ఎవరైనా జీవిస్తారా?.. నా దృష్టిలో ఇది ముగిసిన అధ్యాయం. అయిందేదో అయిపోయింది. నేను జీవితంలో ముందుకు సాగుతున్నాను.నాలుగున్నరేళ్ల కాపురం.. మోసగాడినే అయితే..కానీ కొందరు అదే పట్టుకుని వేలాడుతున్నారు. అయినా, మేమే నాలుగున్నరేళ్ల పాటు వివాహ బంధంలో ఉన్నాము. కలిసి కాపురం చేశాం. ఒకవేళ నేను నిజంగా మోసగాడినే అయితే.. ఆ వ్యక్తి అంతకాలం నాతో ఎలా కలిసి ఉంటారు?.. నా పేరు చెప్పుకోనిదే ఒకరికి పూట గడవదు అంటే అలాగే చేసుకోనివ్వండి.వారి మాటలు నాపై ఎలాంటి ప్రభావం చూపలేవు. ఈ విషయంపై నేను స్పందించడం ఇదే ఆఖరిసారి. ముగిసిన అధ్యాయం గురించి మరోసారి మాట్లాడను. నేను ఒక క్రీడాకారుడిని. మోసగాడిని కాదు’’ అని చహల్.. ధనశ్రీకి ఘాటు కౌంటర్ ఇచ్చాడు.టీమిండియా తరఫున 2016లో అరంగేట్రం చేసిన చహల్.. ఇప్పటి వరకు 72 వన్డేల్లో 121, 80 టీ20లలో 96 వికెట్లు పడగొట్టాడు. ఈ రైటార్మ్ లెగ్బ్రేక్ స్పిన్నర్ చివరగా.. 2023లో టీమిండియాకు ఆడాడు. ఇక ఐపీఎల్లో 174 మ్యాచ్లలో కలిపి 221 వికెట్లు తీసిన చహల్... అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు.చదవండి: తిట్టకు అమ్మా!.. ఏదో ఒకరోజు ఇంట్లో పట్టనంత డబ్బు సంపాదిస్తా.. కట్చేస్తే.. -
ముషీర్ ఖాన్తో గొడవ తర్వాత గర్ల్ ఫ్రెండ్తో చిల్ అయిన పృథ్వీ షా
వివాదాలు, క్రమశిక్షణ లేమి కారణంగా బ్రహాండమైన కెరీర్ను నాశనం చేసుకున్న మహారాష్ట్ర బ్యాటర్ పృథ్వీ షా (Prithvi Shaw) మరోసారి వార్తల్లో నిలిచాడు. నిన్న (అక్టోబర్ 7) ముంబైతో జరిగిన రంజీ వార్మప్ మ్యాచ్లో అద్భుతమైన సెంచరీ (181) చేసిన అనంతరం షా తన మాజీ సహచరుడు ముషీర్ ఖాన్తో (Musheer Khan) గొడవ పడ్డాడు.వాస్తవానికి ముషీర్ ఖానే మొదట షాను గెలికాడు. షాను ఔట్ చేసిన ఆనందంలో ముషీర్ వ్యంగ్యంగా థ్యాంక్యూ అని అన్నాడు. దీంతో సహనం కోల్పోయిన షా.. ఒక్కసారిగా ముషీర్పైకి దూసుకొచ్చి, కాలర్ పట్టుకొని బ్యాట్ ఎత్తాడు. అంపైర్లు, సహచరులు వారించడంతో షా తగ్గి పెవిలియన్ వైపు వెళ్లబోయాడు.పోయే క్రమంలో మరో ముంబై ఆటగాడు షమ్స్ ములానీ కూడా షాను ఏదో అన్నాడు. దీనికి కూడా షా ఘాటుగానే స్పందించాడు. ఈ గొడవల కారణంగా షా చేసిన సూపర్ సెంచరీ మరుగున పడింది. మిస్ బిహేవియర్ కారణంగా అందరూ షానే తప్పుబడుతున్నారు. ఈ వివాదాల కారణంగానే ఎక్కడో ఉండాల్సిన వాడు ఇంకా దేశవాలీ క్రికెట్లోనే మిగిలిపోయాడంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇదిలా ఉంటే, ఇంత వివాదం జరిగిన తర్వాత షా తన సోషల్మీడియా పోస్ట్ కారణంగా మరోసారి వార్తల్లోకెక్కడం విశేషం. మ్యాచ్ ముగిసిన అనంతరం షా తన ప్రేయసి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అకృతి అగర్వాల్తో (Akriti Agarwal) కలిసి రిలాక్స్ అవుతున్న ఫొటోను ఇన్స్టా స్టోరీలో షేర్ చేశాడు.గత కొంతకాలంగా షా-అకృతి మధ్య ప్రేయాణం నడుస్తుందన్న టాక్ నడుస్తుంది. వీరిద్దరూ ఇటీవల గణేశ్ చతుర్థి వేడుకల్లో కలిసి కనిపించారు. షా కొంతకాలం క్రితం మోడల్ నిధి తపాడియాతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అకృతితో డేటింగ్లో ఉన్నట్లు సోషల్మీడియా టాక్.ఎవరీ అకృతి..?అకృతి అగర్వాల్ ఒక డిజిటల్ కంటెంట్ క్రియేటర్, సోషల్మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో 3 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ముంబైలోని నిర్మలా కాలేజీ నుంచి BMS పూర్తి చేసిన అకృతి.. కోవిడ్ సమయంలో డాన్స్, లైఫ్స్టైల్ వీడియోల ద్వారా బాగా పాపులర్ అయ్యింది.షా సెకెండ్ ఇన్నింగ్స్18 ఏళ్ల వయసులో వెస్టిండీస్పై టెస్ట్ సెంచరీతో క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న షా.. ఆతర్వాత ఫిట్నెస్ సమస్యలు, ఫామ్ లేమి, వివాదాల కారణంగా కెరీర్ను చేజేతులా నాశనం చేసుకున్నాడు.ఇటీవలే క్రికెటర్గా జన్మనిచ్చిన ముంబై టీమ్ కూడా షాను వదిలేసింది. దీంతో అతను మకాంను మహారాష్ట్రకు మార్చాడు. ఈ జట్టు తరఫున కూడా వరుస సెంచరీలతో అదరగొడుతున్న షా.. టీమిండియాలో చోటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. షా తన ఆఫ్ ద ఫీల్డ్ యాక్టివిటీస్ను పక్కన పెడితే క్రికెటర్గా మంచి భవిష్యత్తు ఉంటుంది. షా కంటే జూనియర్ అయిన శుభ్మన్ గిల్ ఇప్పుడు రెండు ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్ అయిపోయాడు. కానీ, షా మాత్రం టీమిండియాలో చోటు కోసం పోరాడుతున్నాడు. చదవండి: సంచలన వార్త.. దేశం కోసం భారీ డీల్ను వదులుకున్న కమిన్స్, హెడ్..? -
దేశం కోసం భారీ డీల్ను వదులుకున్న కమిన్స్, హెడ్..?
క్రికెట్కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్మీడియాలో సంచలన టాపిక్గా మారింది. ఇద్దరు స్టార్ ఆస్ట్రేలియా ఆటగాళ్లు దేశం కోసం భారీ డీల్ను కాదనుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవాస్తవాలు ఎంత వరకో తెలీదు కానీ, సదరు ఆటగాళ్లను మాత్రం వారి స్వదేశ మీడియా ఆకాశానికెత్తేస్తుంది. మా ఆటగాళ్లకు దేశం కంటే డబ్బు ఎప్పుడూ ముఖ్యం కాదంటూ డబ్బా కొట్టుకుంటుంది. ఇది కదా నిజమైన దేశభక్తి అంటే అంటూ గొప్పలకు పోతుంది.ఆస్ట్రేలియాకు చెందిన ద ఏజ్ (The Age) అనే వార్తా సంస్థ కధనం ప్రకారం.. వారి దేశ స్టార్ ఆటగాళ్లు పాట్ కమిన్స్ (Pat Cummins), ట్రవిస్ హెడ్కు (Travis Head) ఓ ప్రముఖ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఏడాదికి 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 58.2 కోట్లు) చెల్లిస్తామని ఆఫర్ ఇచ్చింది. షరతేమిటంటే.. వారిద్దరు ఆస్ట్రేలియా తరఫున ఆడటం మానేసి, ఆ ఫ్రాంచైజీకి చెందిన గ్లోబల్ టీ20 లీగ్ల్లో మాత్రమే ఆడాలి. ఈ ఆఫర్ను కమిన్స్, హెడ్ ఇద్దరూ తిరస్కరించారు. దేశం కంటే తమకు డబ్బు ముఖ్యం కాదని సదరు ఫ్రాంచైజీ యాజమాన్యానికి తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని ఆసీస్ మీడియా గత కొన్ని రోజులుగా హైలైట్ చేస్తుంది. సోషల్మీడియాలో సైతం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుంది. వాస్తవాస్తవాలు తెలియని క్రికెట్ అభిమానులు దేశం పట్ల కమిన్స్, హెడ్కు ఉన్న అంకితభావాన్ని కొనియాడుతున్నారు. సాధారణంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లకు దేశం తరఫున ఆడితే ఏడాదికి 1.5 మిలియన్ డాలర్లకు మించి రావు. అలాంటిది కమిన్స్, హెడ్ ఇంత భారీ ఆఫర్ను ఎలా కాదనుకున్నారని కొందరనుకుంటున్నారు.ఇతర దేశాల ఆటగాళ్లు ఇలా లేరు..!కమిన్స్, హెడ్ విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం భారత్ మినహా ప్రపంచవాప్తంగా ఉన్న క్రికెటర్లంతా లీగ్ క్రికెట్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. జాతీయ జట్ల కెరీర్లను పూర్తి వదులుకొని లీగ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇటీవలే వెస్టిండీస్కు చెందిన నికోలస్ పూరన్, దక్షిణాఫ్రికాకు చెందిన హెన్రిచ్ క్లాసెన్ తమ అంతర్జాతీయ కెరీర్లు అర్దంతరంగా వదిలేసి లీగ్ల పంచన చేరారు. వీరే కాక చాలా మంది స్టార్ క్రికెటర్లు లీగ్ల్లో లభించే అధిక డబ్బు కోసం దేశానికి ప్రాతినిథ్యం వహించడాన్ని వద్దనుకుంటున్నారు. వాస్తవానికి ఇందులో ఆటగాళ్ల తప్పేమీ లేదు. ఫ్రాంచైజీలు అధిక డబ్బును ఆశగా చూపిస్తూ వారిని బుట్టలో వేసుకుంటున్నాయి.తిరిగి కమిన్స్, హెడ్ విషయానికొస్తే.. ప్రస్తుతం వీరు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీతో ఒప్పందంలో ఉన్నారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యం 2025 సీజన్ వేలానికి ముందు కమిన్స్ను రూ. 18 కోట్లకు, హెడ్ను రూ. 14 కోట్లకు రిటైన్ చేసుకుంది. గత సీజన్లో ఈ ఇద్దరు చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. కెప్టెన్గా, ఆటగాడిగా కమిన్స్ దారుణంగా విఫలమయ్యాడు. అంతకుముందు సీజన్లో చెలరేగిపోయిన హెడ్ గత సీజన్లో తస్సుమన్నాడు.చదవండి: వైభవ్ విఫలమైనా, బౌలర్లు గెలిపించారు.. ఆసీస్ గడ్డపై టీమిండియా గర్జన -
వైభవ్ విఫలమైనా, బౌలర్లు గెలిపించారు.. ఆసీస్ గడ్డపై టీమిండియా గర్జన
ఆస్ట్రేలియా గడ్డపై భారత యువ సింహాలు (India U19 Team) గర్జించాయి. వరుసగా వన్డే, టెస్ట్ సిరీస్ల్లో ఆతిథ్య జట్టును (Australia U19 Team) క్లీన్ స్వీప్ చేశాయి. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ల కోసం ఆస్ట్రేలియాలో పర్యటించిన యువ భారత్.. వన్డే సిరీస్ను 3-0తో, టెస్ట్ సిరీస్ను 2-0తో ఊడ్చేసింది.మెక్కే వేదికగా ఇవాళ (అక్టోబర్ 8) ముగిసిన రెండో టెస్ట్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో ఆస్ట్రేలియా కుర్ర జట్టు బెంబేలెత్తిపోయింది. తొలి ఇన్నింగ్స్లో 135 పరుగులకే కుప్పకూలింది. భారత్ సైతం తొలి ఇన్నింగ్స్లో 171 పరుగులకే ఆలౌటైనా.. 36 పరుగుల కీలక ఆధిక్యం సాధించింది.అనంతరం భారత బౌలర్లు మరోసారి చెలరేగిపోయారు. ఈసారి ఆసీస్ను 116 పరుగులకే (రెండో ఇన్నింగ్స్లో) కుప్పకూల్చారు. తద్వారా భారత్ ముందు నామమాత్రపు 81 పరుగుల లక్ష్యం ఉండింది.స్వల్ప ఛేదనలో భారత్ సైతం ఆదిలో తడబడింది. 13 పరుగుల వద్దే కెప్టెన్ ఆయుశ్ మాత్రే (13) వికెట్ కోల్పోయింది. ఆతర్వాత బంతికే స్టార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ డకౌటయ్యాడు. ఈ దశలో వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా భారత ఇన్నింగ్స్ను నిర్మించే ప్రయత్నం చేశారు. అయితే 52 పరుగుల వద్ద విహాన్ (21) కూడా ఔటయ్యాడు. ఈసారి వేదాంత్ (33 నాటౌట్) మరో ఛాన్స్ తీసుకోకుండా రాహుల్ కుమార్ (13 నాటౌట్) సహకారంతో భారత్ను విజయతీరాలకు చేర్చాడు.రెండు ఇన్నింగ్స్ల్లో విఫలమైన వైభవ్ఈ మ్యాచ్లో టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ రెండు ఇన్నింగ్స్ల్లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో (14 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్) మంచి ఆరంభం లభించినా భారీ స్కోర్గా మలచలేకపోయిన ఈ కుర్ర డైనమైట్.. రెండో ఇన్నింగ్స్లో ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు.చెలరేగిన బౌలర్లుఈ మ్యాచ్లో భారత బౌలర్లు రెండు ఇన్నింగ్స్ల్లో చెలరేగిపోయారు. కలిసికట్టుగా బౌలింగ్ చేసి ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. వీరి ధాటికి ఆసీస్ బ్యాటర్లు కొద్ది సేపు కూడా క్రీజ్లో నిలబడలేకపోయారు. రెండు ఇన్నింగ్స్ల్లో ఆసీస్ తరఫున అలెక్స్ లీ యంగ్ (66, 38) ఒక్కడే పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్లో హెనిల్ పటేల్ 6, ఖిలన్ పటేల్, ఉధవ్ మోహన్ తలో 4, నమన్ పుష్పక్ 3, దీపేశ్ దేవేంద్రన్ 2 వికెట్లు తీశారు. చదవండి: CEAT అవార్డుల విజేతలు వీరే.. రోహిత్ శర్మకు ప్రత్యేక పురస్కారం -
రెండో ఇన్నింగ్స్లోనూ రెచ్చిపోయిన టీమిండియా బౌలర్లు
ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరుగుతున్న రెండో యూత్ టెస్ట్ మ్యాచ్లో భారత యువ బౌలర్లు రెండో ఇన్నింగ్స్లోనూ చెలరేగిపోయారు. హెనిల్ పటేల్ (8-3-23-3), నమన్ పుష్పక్ (7-1-19-3), ఉధవ్ మోహన్ (8-4-17-2), దీపేశ్ దేవేంద్రన్ (6-2-15-1), ఖిలన్ పటేల్ (11.1-2-36-1) ధాటికి ఆసీస్ 116 పరుగులకు చాపచుట్టేసింది. తద్వారా భారత్ ముందు 81 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.ఆసీస్ ఇన్నింగ్స్లో 38 పరుగులు చేసిన అలెక్స్ లీ యంగ్ టాప్ స్కోరర్ కాగా.. మరో ముగ్గురు (కేసీ బార్టోన్ (19), జేడన్ డ్రేపర్ (15), అలెక్స్ టర్నర్ (10)) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. సైమన్ బడ్జ్, జెడ్ హోల్లిక్ డకౌట్లు కాగా.. కెప్టెన్ విల్ మలాజ్చుక్, యశ్ దేశ్ముఖ్ తలో 5, ఛార్లెస్ లచ్మండ్ 9, విల్ బైరోమ్ 8 పరుగులు చేశారు.అంతకుముందు ఆసీస్ బౌలర్లు భారత్ను 171 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా 30 పరుగుల మార్కును చేరలేదు. 28 పరుగులు చేసిన తొమ్మిదో నంబర్ ఆటగాడు దీపేశ్ దీపేంద్రన్ టాప్ స్కోరర్గా నిలువగా.. ఖిలన్ పటేల్, వేదాంత్ త్రివేది, హెనిల్ పటేల్, వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా వరుసగా 26, 25, 22, 20, 11 పరుగులు స్కోర్ చేశారు. కెప్టెన్ ఆయుశ్ మాత్రే వైఫల్యాల పరంపరను కొనసాగిస్తూ 4 పరుగులకే ఔట్ కాగా.. రాహుల్ కుమార్ 9, హర్వంశ్ పంగాలియా 1, నమన్ పుష్పక్ డకౌటయ్యారు. ఈ ఇన్నింగ్స్లో ఆసీస్ బౌలర్లు సైతం మూకుమ్మడిగా సత్తా చాటారు. కేసీ బార్టన్ 4, ఛార్లెస్ లిచ్మండ్, విల్ బైరోమ్, జూలియన్ ఓస్బర్న్ తలో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 171 పరుగులకే ఆలౌటైనా 36 పరుగుల కీలక ఆధిక్యం లభించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. హెనిల్ పటేల్ (9-3-21-3), ఖిలన్ పటేల్ (12-5-23-3), ఉధవ్ మోహన్ (6-0-23-2), దీపేశ్ దేవేంద్రన్ (7.3-2-22-1) ధాటికి 135 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్లో వికెట్ కీపర్ లీ యంగ్ (66) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.కాగా, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ల కోసం భారత అండర్ 19 జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలుత జరిగిన వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. టెస్ట్ సిరీస్లోనూ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్ను కూడా గెలిస్తే భారత్ ఆసీస్ను వారి సొంత ఇలాకాలో పూర్తిగా క్వీన్ స్వీప్ చేసినట్లవుతుంది.చదవండి: ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్.. మళ్లీ కెప్టెన్గా స్టీవ్ స్మిత్..? -
ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్.. మళ్లీ కెప్టెన్గా స్టీవ్ స్మిత్..?
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ 2025-26కు (Ashes Series) ముందు ఆస్ట్రేలియా (Australia) జట్టుకు భారీ షాక్ తగిలినట్లు తెలుస్తుంది. గాయం కారణంగా కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) ఈ సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడని సమాచారం. కమిన్స్ జులైలో వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా వెన్ను సంబంధిత గాయానికి గురయ్యాడు. ఈ గాయమే అతన్ని యాషెస్ సిరీస్కు దూరం చేసేలా కనిపిస్తుంది.సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ నివేదిక ప్రకారం.. కమిన్స్ ఇటీవల గాయానికి సంబంధించి స్కానింగ్ చేయించుకున్నాడు. ఇందులో అతని గాయం తీవ్రత తగ్గలేదని తేలింది. దీంతో నవంబర్ 21న పెర్త్లో ప్రారంభమయ్యే తొలి టెస్ట్ సమయానికి కమిన్స్ అందుబాటులో ఉండలేడు. పరిస్థితి చూస్తుంటే కమిన్స్ యాషెస్ సిరీస్ మొత్తానికి దూరమయ్యేలా ఉన్నాడన్నది సదరు నివేదిక సారాంశం.వాస్తవానికి కమిన్స్ ఈ సిరీస్ కోసమే గతకొంతకాలంగా క్రికెట్ మొత్తానికే దూరంగా ఉన్నాడు. ఇటీవల ఆసీస్ ఆడిన ఏ ఫార్మాట్లోనూ అతను ఆడలేదు. త్వరలో భారత్తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్లకు కూడా అతన్ని ఎంపిక చేయలేదు.యాషెస్ సమయానికి పూర్తిగా ఫిట్గా ఉండాలనే ఉద్దేశంతో కమిన్స్ ఈ మధ్యలో ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. తీరా చూస్తే అతని గాయం పూర్తిగా మానలేదని తెలుస్తుంది.ఒకవేళ కమిన్స్ యాషెస్కు పూర్తిగా దూరమైతే ఆసీస్ క్రికెట్ బోర్డు ప్రత్యామ్నాయాలను సిద్దం చేసుకుంది. సీనియర్ ప్లేయర్ స్టీవ్ స్మిత్కు తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. కమిన్స్ స్థానాన్ని స్కాట్ బోలాండ్తో భర్తీ చేయనున్నట్లు సమాచారం. యాషెస్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టును త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టును ఇదివరకు ప్రకటించారు. నవంబర్ 21-25 వరకు పెర్త్ వేదికగా తొలి టెస్ట్ జరుగుతుంది. అనంతరం డిసెంబర్ 4న రెండో టెస్ట్ (బ్రిస్బేన్), డిసెంబర్ 17న మూడో టెస్ట్ (అడిలైడ్), డిసెంబర్ 26న నాలుగో టెస్ట్ (మెల్బోర్న్), వచ్చే ఏడాది జనవరి 4న ఐదో టెస్ట్ (సిడ్నీ) మొదలవుతాయి.చదవండి: CEAT అవార్డుల విజేతలు వీరే.. రోహిత్ శర్మకు ప్రత్యేక పురస్కారం -
CEAT అవార్డుల విజేతలు వీరే.. రోహిత్ శర్మకు ప్రత్యేక పురస్కారం
27వ CEAT క్రికెట్ రేటింగ్ (CCR) అవార్డుల వేడుక నిన్న (అక్టోబర్ 7) ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఇటీవలికాలంలో ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రికెటర్లకు ఈ వేడుకలో పురస్కారాలు లభించాయి. ఈ వేడుకలో మాజీ భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రధాన ఆకర్షణగా నిలిచారు. భారత వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించబడిన తర్వాత రోహిత్కు ఇది మొదటి పబ్లిక్ అప్పియరెన్స్.ROHIT SHARMA - THE LEADER 🐐 Ro received the Special award from CEAT for winning the Champions Trophy. pic.twitter.com/ad5GbSdAZG— Johns. (@CricCrazyJohns) October 7, 2025ఈ వేడుకలో రోహిత్కు ఓ ప్రత్యేక అవార్డు లభించింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలిపించినందుకుగానూ అతన్ని ఈ అవార్డు వరించింది. రోహిత్ నాయకత్వంలో భారత్ వరుసగా గెలిచిన రెండో ఐసీసీ ట్రోఫీ ఇది. 2024లో రోహిత్ సారథ్యంలో టీమిండియా టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. రోహిత్కు ఈ అవార్డును భారత బ్యాటింగ్ లెజెండ్ సునీల్ గవాస్కర్ అందజేశారు.ఈసారి CCR అవార్డులను మెజార్టీ శాతం భారత క్రికెటర్లే గెలుచుకున్నారు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మను కాదని సంజూ శాంసన్ (Sanju Samson) టీ20 బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు.ఇటీవలికాలంలో టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని (Varun Chakravarthy) టీ20 బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వరించింది.సర్పంచ్ సాబ్ శ్రేయస్ అయ్యర్కు (Shreyas Iyer) ఓ ప్రత్యేక అవార్డు ఇచ్చారు. CEAT JioStar అవార్డుతో అతన్ని సత్కరించారు.మహిళల విభాగంలోనూ టీమిండియా ఆధిపత్యం కొనసాగింది. స్మృతి మంధన, దీప్తి శర్మ బెస్ట్ బ్యాటర్, బౌలర్ అవార్డులు గెలుచుకున్నారు. అయితే, వారు ఈ అవార్డులను అందుకునేందుకు రాలేకపోయారు. ప్రస్తుతం వారు వన్డే వరల్డ్కప్లో బిజీగా ఉన్నారు.విదేశీ ఆటగాళ్ల విషయానికొస్తే.. జో రూట్కు అంతర్జాతీయ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. కేన్ విలియమ్సన్కు వన్డే బ్యాటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. హ్యారీ బ్రూక్కు టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. ఇటీవల సౌతాఫ్రికాను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్గా నిలబెట్టిన టెంబా బవుమాకు బెస్ట్ కెప్టెన్ అవార్డు లభించింది. బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారాకు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది.విజేతల పూర్తి జాబితా:ఛాంపియన్స్ ట్రోఫీ విజయానికి గుర్తుగా ప్రత్యేక అవార్డు- రోహిత్ శర్మలైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు- బ్రియాన్ లారా అంతర్జాతీయ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- జో రూట్ T20I బ్యాటర్ ఆఫ్ ది ఇయర్- సంజు శాంసన్T20I బౌలర్ ఆఫ్ ది ఇయర్- వరుణ్ చక్రవర్తిCEAT JioStar అవార్డు- శ్రేయస్ అయ్యర్ODI బ్యాటర్ ఆఫ్ ది ఇయర్- కేన్ విలియమ్సన్ODI బౌలర్ ఆఫ్ ది ఇయర్- మ్యాట్ హెన్రీCEAT లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు- B.S.చంద్రశేఖర్మహిళల బ్యాటర్ ఆఫ్ ది ఇయర్- స్మృతి మంధనమహిళల బౌలర్ ఆఫ్ ది ఇయర్- దీప్తి శర్మఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్- అంగ్రిష్ రఘువంశీఉదాత్త నాయకత్వ అవార్డు- టెంబా బవుమాటెస్ట్ బౌలర్ ఆఫ్ ది ఇయర్- ప్రభాత్ జయసూర్యటెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- హ్యారీ బ్రూక్డొమెస్టిక్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- హర్ష్ దూబేచదవండి: ఇంగ్లండ్ కెప్టెన్ ఎంగేజ్మెంట్.. పాక్ ఓవరాక్షన్ స్పిన్నర్ రిసెప్షన్ -
ఇంగ్లండ్ కెప్టెన్ ఎంగేజ్మెంట్.. పాక్ ఓవరాక్షన్ స్పిన్నర్ రిసెప్షన్
అంతర్జాతీయ క్రికెట్కు సంబంధించి తాజాగా రెండు శుభకార్యాలు జరిగాయి. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్ల కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) తన దీర్ఘకాల ప్రియురాలు లూసీ లైల్స్తో నిశ్చితార్థం చేసుకోగా.. పాక్ ఓవరాక్షన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (Abrar Ahmed) వివాహ రిసెప్షన్ వేడుక జరిగింది.ముందుగా బ్రూక్ విషయానికొస్తే.. ఈ ఇంగ్లండ్ బ్యాటింగ్ యువ కెరటం లూసీ లైల్స్తో నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరు 2020లో తొలిసారి పబ్లిక్గా కనిపించారు. లూసీతో ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని బ్రూక్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. లూసీ చేతిలో నిశ్చితార్థ ఉంగరం కనిపించే ఫొటో సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంది. అభిమానుల బ్రూక్-లూసీ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. లూసీ యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మానసిక ఆరోగ్యం, విద్యా రంగానికి సంబంధించిన సేవా కార్యక్రమాల్లో పాల్గొంటోంది. బ్రూక్ ప్రస్తుతం ఎలాంటి కమిట్మెంట్స్ లేకపోవడంతో ఖాళీగా ఉన్నాడు. అక్టోబర్ 18 నుంచి ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం న్యూజిలాండ్లో పర్యటిస్తుంది.అబ్రార్ విషయానికొస్తే.. ఈ పాకిస్తానీ ఓవరాక్షన్ స్పిన్నర్ కొద్ది రోజుల కిందట అమ్నా రహీం అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం తాజాగా కరాచీలో జరిగింది. ఈ వేడుకకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మొహిసిన్ నఖ్వీ సహా పలువురు పాక్ ప్రస్తుత, మాజీ క్రికెటర్లు హాజరయ్యారు. ఆసియా కప్-2025లో నఖ్వీకి, పాక్ జట్టుకు ఘోర అవమానాలు ఎదురైన తర్వాత జరిగిన వేడుక కావడంతో అబ్రార్ రిసెప్షన్కు ప్రాధాన్యత సంతరించుకుంది.తాజాగా ముగిసిన ఆసియా కప్లో భారత్ పాక్ను ఫైనల్ సహా మూడు సార్లు ఓడించి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అలాగే ఏసీసీ చీఫ్గా ఉన్న పీసీబీ అధ్యక్షుడు నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోలేదు. భారత ఆటగాళ్లు తన చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించడంతో నఖ్వీ దాన్ని ఎత్తుకెళ్లిపోయాడు. తదనంతర పరిణామాల్లో నఖ్వీ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకు అప్పజెప్పాడని ప్రచారం జరిగినప్పటికీ క్లారిటీ లేదు. ఈ మధ్యలో భారత జట్టు పాక్ను మరోసారి చిత్తుగా ఓడించింది. మహిళల వన్డే ప్రపంచకప్-2025లో భాగంగా కొలొంబో వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా పాక్పై ఘన విజయం సాధించింది. చదవండి: స్వల్ప స్కోర్కే కుప్పకూలిన టీమిండియా.. సంతోషం ఎంతో సేపు మిగల్లేదు..! -
స్వల్ప స్కోర్కే కుప్పకూలిన టీమిండియా.. సంతోషం ఎంతో సేపు మిగల్లేదు..!
ఆస్ట్రేలియా పర్యటనలో భారత అండర్-19 జట్టు (India U19 vs Australia U19) తొలిసారి బ్యాటింగ్లో తడబడింది. మెక్కే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 171 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా కనీసం 30 పరుగుల మార్కును చేరలేదు. 28 పరుగులు చేసిన తొమ్మిదో నంబర్ ఆటగాడు దీపేశ్ దీపేంద్రన్ టాప్ స్కోరర్గా నిలిచాడు. ఖిలన్ పటేల్, వేదాంత్ త్రివేది, హెనిల్ పటేల్, వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) వరుసగా 26, 25, 22, 20 పరుగులు స్కోర్ చేశారు. ఓపెనర్గా ప్రమోషన్ పొందిన విహాన్ మల్హోత్రా 11 పరుగులు చేశాడు.కెప్టెన్ ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) వైఫల్యాల పరంపరను కొనసాగిస్తూ 4 పరుగులకే ఔట్ కాగా.. రాహుల్ కుమార్ 9, హర్వంశ్ పంగాలియా 1, నమన్ పుష్పక్ డకౌటయ్యారు. ఈ ఇన్నింగ్స్లో ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటారు. కేసీ బార్టన్ 4, ఛార్లెస్ లిచ్మండ్, విల్ బైరోమ్, జూలియన్ ఓస్బర్న్ తలో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా స్వల్ప స్కోర్కే ఆలౌటైనా 36 పరుగుల కీలక ఆధిక్యం సాధించడం విశేషం.ఆసీస్కు సంతోషం ఎంతో సేపు మిగల్చలేదుదీనికి తోడు స్వల్ప లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాను భారత పేసర్ హెనిల్ పటేల్ రెండో ఓవర్లోనే కోలుకోలేని దెబ్బకొట్టాడు. హెనిల్ రెండో ఓవర్లో వరుసగా తొలి, రెండో బంతులకు సైమన్ బడ్జ్, జెడ్ హోల్లిక్లను పెవిలియన్కు పంపాడు. ఆసీస్ అప్పటికి ఖాతా కూడా తెరవలేదు. 2 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 0/2గా ఉంది.అంతకుముందు భారత బౌలర్లు తొలి ఇన్నింగ్స్లోనూ చెలరేగడంతో ఆసీస్ 135 పరుగులకే కుప్పకూలింది. హెనిల్ పటేల్ (9-3-21-3), ఖిలన్ పటేల్ (12-5-23-3), ఉధవ్ మోహన్ (6-0-23-2), దీపేశ్ దేవేంద్రన్ (7.3-2-22-1) కలిసికట్టుగా ఆసీస్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు. ఆసీస్ ఇన్నింగ్స్లో వికెట్ కీపర్ లీ యంగ్ (66) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.కాగా, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ల కోసం భారత అండర్ 19 జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలుత జరిగిన వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. టెస్ట్ సిరీస్లోనూ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్ను కూడా గెలిస్తే భారత్ ఆసీస్ను వారి సొంత ఇలాకాలో పూర్తిగా క్వీన్ స్వీప్ చేసినట్లవుతుంది.చదవండి: సహనం కోల్పోయిన వైభవ్ సూర్యవంశీ.. కారణం ఇదే! -
భారత్, పాక్ మధ్య మ్యాచ్లు పదే పదే వద్దు
లండన్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టోర్నమెంట్లలో ఆర్థిక అవసరాల కోసం భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్లు పెట్టే సంస్కృతిని ఇప్పటికైనా వీడాలని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ అన్నాడు. ఇటీవల జరిగిన ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో భారత్, పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్లు జరగగా... మూడింట్లోనూ టీమిండియానే విజయం సాధించింది. అయితే ఫైనల్లో పాకిస్తాన్పై విజయానంతరం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా ఉన్న పాకిస్తాక్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా విన్నర్స్ ట్రోఫీ అందుకునేందుకు టీమిండియా నిరాకరించింది. ఈ టోర్నమెంట్ ఆరంభం నుంచే ఇరు జట్ల కెపె్టన్లు, ఆటగాళ్ల మధ్య ‘షేక్ హ్యాండ్’ కూడా జరగలేదు. తొలి మ్యాచ్ అనంతరం భారత జట్టు చేయి కలపలేదనే అంశాన్ని పాకిస్తాన్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతూ అమాయకుల ప్రాణాల ను బలిగొంటున్న వారికి అండగా నిలుస్తున్నంత కాలం... తమ తీరు మారదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తదుపరి రెండు మ్యాచ్ల్లో తేల్చిచెప్పింది. ఈ పూర్తి విషయాన్ని దగ్గర నుంచి పరిశీలిస్తున్న పాకిస్తాన్ బోర్డు అధ్యక్షుడు... విన్నర్స్ ట్రోఫీ తానే అందించాలని మంకుపట్టు పట్టాడు. దీంతో టీమిండియా ట్రోఫీ అందుకోకుండానే... స్వదేశానికి తిరిగి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అథర్టన్... భారత్, పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలు... వాటిని ఐసీసీ వినియోగించుకుంటున్న తీరును ఓ పత్రికకు రాసిన కాలమ్లో వివరించాడు. వారానికో మ్యాచా? ఇలాంటి చేదు అనుభవాలకంటే... ఇరు దేశాల మధ్య క్రికెట్ను పూర్తిగా నిలిపివేయడం మంచిదని సూచించాడు. ‘మూడు వారాల పాటు సాగిన ఆసియా కప్లో... ప్రతి ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగేలా షెడ్యూల్ రూపొందించారు. కేవలం ఇదొక్కటే కాదు... ఆ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు నిలిచిపోయినప్పటి నుంచి గమనిస్తే... అన్నీ ఐసీసీ టోర్నమెంట్లలో లీగ్ దశలోనే ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగేలా షెడ్యూల్ చేస్తున్నారు. 2013 నుంచి చూసుకుంటే 3 వన్డే ప్రపంచకప్లు, 5 టి20 ప్రపంచకప్లు, 3 చాంపియన్స్ ట్రోఫీలు జరగగా... వాటన్నింటిలో గ్రూప్ దశలోనే ఇరు జట్లు తలపడ్డాయి. రౌండ్ రాబిన్ పద్ధతైనా... లేక గ్రూప్ల విధానమైనా... ఆరంభ దశలోనే ఈ రెండు టీమ్ల మధ్య మ్యాచ్ పరిపాటిగా మారింది’ అని అథర్టన్ రాసుకొచ్చాడు. 2008 ముంబై దాడుల సమయం నుంచే భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్లు నిలిచిపోగా... ఇటీవల పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడితో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత సంక్లిష్టమయ్యాయి. ఈ ఘటనలో 26 మంది అమాయకులు మృతిచెందగా... దీనికి బదులుగా భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట శత్రు దేశంలోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసి తుదముట్టించింది. ఆర్థిక అంశాలే ముఖ్యమా! ప్రపంచ క్రికెట్లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్కు ఉన్న ప్రాధాన్యత ఎక్కువ అని అథర్టన్ అభిప్రాయపడ్డాడు. ‘భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఎన్నో ఆర్థిక అంశాలతో కూడింది. ఐసీసీ టోర్నమెంట్ ప్రసార హక్కులకు విపరీతమైన డిమాండ్ ఉండటానికి ఈ మ్యాచ్ ప్రధాన కారణం. ద్వైపాక్షిక సిరీస్లకు రోజురోజుకూ ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో... ఐసీసీ ఈవెంట్ల ప్రాముఖ్యత పెరిగింది. దీంట్లో తరచూ భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. దీన్ని ముగించాల్సిన సమయం ఆసన్నమైంది. ఒకప్పుడు దౌత్యానికి ఆట దోహదం చేస్తే... ఇప్పుడదే ఉద్రిక్తతలు, ప్రచారానికి ప్రతినిధిగా మారింది. కేవలం ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు ఆ రెండు జట్ల మధ్య పదే పదే మ్యాచ్లు నిర్వహించడం ఇప్పటికైనా మానుకుంటేనే మంచిది’ అని అథర్టన్ పేర్కొన్నాడు. విస్తృత ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ ఇలాంటి పనులు చేయడం సరికాదని ఇంగ్లండ్ మాజీ సారథి సూచించాడు. కావాలనే రెండు జట్ల మధ్య మ్యాచ్లు ఉండే విధంగా చూసుకోవడానికి బదులు... ‘డ్రా’ పారదర్శకంగా ఉండాలని అభిప్రాయపడ్డాడు. పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ అంశాన్ని సైతం అథర్టన్ లేవనెత్తాడు. పాకిస్తాన్లో ఆడేందుకు టీమిండియా నిరాకరించడంతో... భారత ఆడే మ్యాచ్లను తటస్థ వేదికపై నిర్వహించగా... ఆతిథ్య హోదా ఉన్న పాకిస్తాన్ జట్టు టీమిండియాతో మ్యాచ్లు ఆడేందుకు పదేపదే దుబాయ్కు వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగకపోతుండటంతో దాన్ని సొమ్ము చేసుకోవాలని ఐసీసీ టోర్నీల్లో పదే పదే ఇలాంటి ఏర్పాట్లు చేయడం తగదని అథర్టన్ సూచించాడు. -
స్టార్క్ పునరాగమనం
మెల్బోర్న్: ఆ్రస్టేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్... టీమిండియాతో జరిగే వన్డే సిరీస్ బరిలో దిగనున్నాడు. ఇటీవల అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్క్... దాదాపు ఏడాది తర్వాత వన్డే మ్యాచ్ ఆడనున్నాడు. గతేడాది నవంబర్లో పాకిస్తాన్తో చివరిసారి వన్డే ఆడిన స్టార్క్... తిరిగి ఇప్పుడు టీమిండియాతో సిరీస్లో పాల్గొననున్నాడు. యాషెస్ సిరీస్కు ముందు వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా స్టార్క్ పలు అప్ర«దాన్య మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. ఈ నెల 19 నుంచి భారత్, ఆ్రస్టేలియా మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభంకానుండగా... దీంతో పాటు టి20 సిరీస్లోని మొదటి రెండు మ్యాచ్ల కోసం మంగళవారం క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) జట్లను ప్రకటించింది. గత పది ఇన్నింగ్స్లలో ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయని లబుషేన్పై వేటు పడగా... అతని స్థానంలో రెన్షాకు తొలిసారి చోటు దక్కింది. 29 ఏళ్ల రెన్షా 14 టెస్టుల్లో ఆ్రస్టేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. అన్ని కలిసొస్తే భారత్పై రెన్షా వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశముంది. మరోవైపు రెగ్యులర్ సారథి ప్యాట్ కమిన్స్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతడి స్థానంలో మిచెల్ మార్ష్ సారథిగా కొనసాగనున్నాడు. ఈ నెల 19న జరగనున్న తొలి వన్డేకు పెర్త్ ఆతిథ్యమిస్తుండగా... ఆ తర్వాత 23న అడిలైడ్లో, 25న సిడ్నీలో రెండో, మూడో మ్యాచ్లు జరగనున్నాయి. అనంతరం అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 మధ్య టి20 సిరీస్ జరుగుతుంది. ఆ్రస్టేలియా వన్డే జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), బార్ట్లెట్, కేరీ, కొనొల్లీ, డ్వార్షుయ్, ఎలీస్, గ్రీన్, జోష్ హాజల్వుడ్, హెడ్, ఇన్గ్లిస్, ఓవెన్, రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా. టి20 జట్టు (తొలి రెండు మ్యాచ్లకు): మిచెల్ మార్ష్ (కెప్టెన్), అబాట్, బార్ట్లెట్, టిమ్ డేవిడ్, డ్వార్షుయ్, ఎలీస్, హాజల్వుడ్, హెడ్, ఇన్గ్లిస్, కూనెమన్, ఓవెన్, షార్ట్, స్టొయినిస్, జంపా. -
గట్టెక్కిన ఇంగ్లండ్
గువాహటి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్లో ఇంగ్లండ్ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. తొలి పోరులో దక్షిణాఫ్రికాపై సునాయాసంగా నెగ్గిన ఇంగ్లండ్... రెండో మ్యాచ్లో బంగ్లాదేశ్పై గెలిచేందుకు కష్టపడాల్సి వచ్చింది. స్వల్ప లక్ష్యఛేదనలో మొదట్లో తడబడ్డా ఆ తర్వాత తేరుకొని విజయ తీరాలకు చేరింది. మంగళవారం జరిగిన ఈ పోరులో నాట్ సీవర్ బ్రంట్ నాయకత్వంలోని ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ జట్టు 49.4 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. శోభన మోస్తారీ (108 బంతుల్లో 60; 8 ఫోర్లు) అర్ధశతకంతో మెరిపించింది. ఆఖర్లో రాబియా ఖాన్ (27 బంతుల్లో 43 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ షాట్లతో ఆకట్టుకుంది. షర్మిన్ అక్తర్ (30; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. కెప్టెన్ నిగార్ సుల్తానా (0) డకౌట్ కాగా... రూబ్యా (4), షోర్నా అక్తర్ (10), రీతు మోని (5), ఫహీమ ఖాతూన్ (7), నహిదా అక్తర్ (1) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎకిల్స్టోన్ 3 వికెట్లు పడగొట్టగా... లిన్సే స్మిత్, చార్లీ డీన్, అలీస్ కాప్సీ తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 46.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హీథర్ నైట్ (111 బంతుల్లో 79 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్తో జట్టును గెలిపించింది. కెప్టెన్ సీవర్ బ్రంట్ (41 బంతుల్లో 32; 5 ఫోర్లు), అలీస్ కాప్సీ (20; 3 ఫోర్లు), చార్లీ డీన్ (27 నాటౌట్; 2 ఫోర్లు) తలాకొన్ని పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్తో ఆకట్టుకోవడంతో... ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సాఫీగా సాగలేదు. లక్ష్యం చిన్నదే అయినా... బంగ్లా క్రమశిక్షణాయుత బౌలింగ్తో దాన్ని కఠినతరంగా మార్చింది. అమీ జోన్స్ (1), బ్యూమౌంట్ (13), సోఫీ డంక్లీ (0), ఎమ్మా లాంబ్ (1) విఫలమయ్యారు. దీంతో ఒకదశలో ఇంగ్లండ్ 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే బంగ్లాదేశ్కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా హీథర్ నైట్ ఇన్నింగ్స్కు ఇరుసుగా నిలిచింది. వన్డౌన్లో దిగిన నైట్... చివరి వరకు అజేయంగా నిలిచింది. అబేధ్యమైన ఏడోవికెట్కు డీన్తో కలిసి 79 పరుగులు జోడించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ఫహీమా ఖాతూన్ 10 ఓవర్ల కోటాలో 16 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. మారుఫా అక్తర్ 2 వికెట్లు తీసింది. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ నెగ్గి ఇంగ్లండ్ 4 పాయింట్లతో అగ్రస్థానానికి చేరింది. నేడు కొలంబో వేదికగా జరిగే మ్యాచ్లో పాకిస్తాన్తో ఆ్రస్టేలియా తలపడనుంది. -
ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ రేసులో అభిషేక్ శర్మ..
ఈ ఏడాది సెప్టెంబర్ నెలకు గాను 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' నామినీలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మంగళవారం ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఆసియాకప్-2025లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా ప్లేయర్లు అభిషేక్ శర్మ, కుల్దీప్ యాదవ్లు షార్ట్ లిస్ట్ అయ్యారు.వీరిద్దరితో పాటు జింబాబ్వేకు చెందిన బ్రియాన్ బెన్నెట్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. ఇటీవలే ముగిసిన ఆసియాకప్లో అభిషేక్ పరుగుల వరద పారించాడు. ఈ మెగా టోర్నీలో 7 మ్యాచ్లు ఆడిన అభిషేక్ 200 స్ట్రైక్ రేట్తో 314 పరుగులు చేశాడు.ఒక్క ఫైనల్ మ్యాచ్లో మినహా మిగితా మ్యాచ్లలో ఈ పంజాబ్ ప్లేయర్ దుమ్ములేపాడు. అదేవిధంగా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బంతితో మ్యాజిక్ చేశాడు. ఆసియాకప్లో కుల్దీప్ లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. 7 మ్యాచ్లలో కుల్దీప్ 17 వికెట్లు పడగొట్టాడు.ఈ మెగా టోర్నీలో కుల్దీప్ కాకుండా షాహీన్ షా అఫ్రిది మాత్రమే 10 వికెట్లు తీసుకున్నాడు. మరోవైపు జింబాబ్వే ప్లేయర్ బెన్నెట్ గత కొంత కాలంగా టీ20 క్రికెట్లో అదరగొడుతున్నపాడు. 21 ఏళ్ల బెన్నెట్ గత నెలలో శ్రీలంక, ఉగాండా, నమీబియా, బోట్స్వానాపై అర్ధ సెంచరీలు చేశాడు.టీ20 ప్రపంచ కప్-2026 ఆఫ్రికా క్వాలిఫైయర్లో టాంజానియాపై కూడా బెన్నెట్ సెంచరీ సాధించాడు. మహిళల విభాగంలో భారత్ స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఈ అవార్డు రేసులో ఉంది. గత నెలలో మంధాన ఆసీస్తో జరిగిన వన్డే సిరీస్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. నాలుగు మ్యాచ్ల్లో 77 సగటుతో 308 పరుగులు చేసింది.చదవండి: PAK vs SA: ఫ్రీ ఫ్రీ.. రండి బాబు రండి! బ్రతిమాలుకుంటున్న పీసీబీ -
ఫ్రీ ఫ్రీ.. రండి బాబు రండి! బ్రతిమాలుకుంటున్న పీసీబీ
ఆసియాకప్-2025 టైటిల్ను కోల్పోయిన పాకిస్తాన్ జట్టు ఇప్పుడు మరో కఠిన సవాల్కు సిద్దమవుతోంది. స్వదేశంలో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో సౌతాఫ్రికాతో పాక్ తలపడనుంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు లహోర్ వేదికగా అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 16 వరకు జరగనుంది.ఈ నేపథ్యంలో అభిమానులను ఆకర్షించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు మ్యాచ్లు జరిగే స్టేడియాల్లో కొన్ని స్టాండ్స్ వరకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశాన్ని పీసీబీ కల్పించింది. జనరల్, ఫస్ట్-క్లాస్, ప్రీమియం, వీఐపీ ఎన్క్లోజర్ స్టాండ్స్కు ఎటువంటి ధరలను పాక్ క్రికెట్ కేటాయించలేదు. తొలి టెస్టు జరిగే లహోర్లో వీఐపీ ఇక్బాల్ అండ్ జిన్నా ఎండ్, గ్యాలరీ టిక్కెట్ ధరలను పీకేఆర్ 800-1,000( భారత కరెన్సీలో రూ.350-రూ.440)గా నిర్ణయించారు. రావాల్పిండి స్టేడియంలో పీసీబీ గ్యాలరీ మొదటి నాలుగు రోజుల టిక్కెట్ ధర పీకేఆర్ 800(రూ.350), ఐదో రోజు పీకేఆర్ 1,000 (రూ.440)గా కేటాయించారు. పాకిస్తాన్లో టెస్టు క్రికెట్కు అదరణ రోజు రోజుకు తగ్గిపోతుంది. పాక్ జట్టు ప్రదర్శన కూడా అంతంత మాత్రంగా ఉండడంతో ప్రేక్షకులు స్టేడియంకు రావడం లేదు. ఇంతకుముందు జరిగిన టెస్టు సిరీస్లలో స్టాండ్స్ ఖాళీగా దర్శనమిచ్చాయి. ఈ క్రమంలోనే ప్రీ ఎంట్రీ ఇవ్వాలని పీసీబీ నిర్ణయించింది. ఇప్పటికైనా స్టేడియాలకు ప్రేక్షకులు వస్తారో లేదో వేచి చూడాలి.చదవండి: సహనం కోల్పోయిన వైభవ్ సూర్యవంశీ.. కారణం ఇదే! -
సహనం కోల్పోయిన వైభవ్ సూర్యవంశీ.. కారణం ఇదే!
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)కి కోపమొచ్చింది. అంపైర్ తీసుకున్న నిర్ణయం కారణంగా అతడు తీవ్ర అసహనానికి లోనయ్యాడు. ఐపీఎల్-2025 (IPL 2025)లో సత్తా చాటిన ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు.. ప్రస్తుతం భారత అండర్-19 జట్టు తరఫున దుమ్ములేపుతున్నాడు.ఆస్ట్రేలియా పర్యటనలోనూ..ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో యూత్ వన్డే, టెస్టుల్లో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ.. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనలోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. ఆసీస్ అండర్-19 జట్టుతో యూత్ వన్డేల్లో మూడు మ్యాచ్లలో వరుసగా 38, 70, 16 పరుగులు చేసిన వైభవ్.. సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేయడంలో తనవంతు పాత్ర పోషించాడు.ఇక ఆసీస్ అండర్-19 జట్టుతో తొలి యూత్ టెస్టులో వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసకర శతకంతో చెలరేగడం విశేషం. కేవలం 86 బంతుల్లోనే తొమ్మిది ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 113 పరుగులు రాబట్టాడు ఈ ఓపెనింగ్ బ్యాటర్. ఈ మ్యాచ్లో భారత జట్టు 58 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.HUNDRED FOR 14-YEAR-OLD VAIBHAV SURYAVANSHI IN AUSTRALIA Smashed a brilliant 100 off 78 balls vs Australia U-19 at Ian Healy Oval. A future star in the making!#vaibhavsuryavanshi pic.twitter.com/ZWE0GTNBN1— Rupeshh Suryavanshi (@RupeshSurya288) October 1, 2025ఆసీస్ 135 పరుగులకే ఆలౌట్ఈ క్రమంలో భారత్- ఆసీస్ అండర్-19 జట్ల మధ్య మంగళవారం (అక్టోబరు 7) రెండో యూత్ టెస్టు మొదలైంది. మెకాయ్ వేదికగా టాస్ గెలిచిన ఆతిథ్య ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత బౌలర్ల ధాటికి 43.3 ఓవర్లలో కేవలం 135 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.ఆసీస్ బ్యాటర్లలో వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ లీ యంగ్ (66) టాప్ రన్ స్కోరర్గా నిలవగా.. భారత బౌలర్లలో హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్ చెరో మూడు వికెట్లతో చెలరేగారు. ఉద్ధవ్ మోహన్ రెండు, దీపేశ్ దేవేంద్రన్ ఒక వికెట్ దక్కించుకున్నారు.అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. విల్ బైరోమ్ బౌలింగ్ అలెక్స్టర్నర్కు క్యాచ్ ఇచ్చి కెప్టెన్ ఆయుశ్ మాత్రే (4) పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ విహాన్ మల్హోత్రా (11) కూడా విఫలమయ్యాడు.ఊహించని విధంగా..ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ సత్తా చాటుతాడని ఆశించగా.. అందుకు తగ్గట్లుగానే దూకుడుగా తన ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. 14 బంతుల్లోనే రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నవేళ.. ఊహించని విధంగా అవుటయ్యాడు.చార్ల్స్ లచ్మండ్ బౌలింగ్లో వికెట్ కీపర్ అలెక్స్ లీ యంగ్కు క్యాచ్ ఇచ్చి వైభవ్ పెవిలియన్ చేరాడు. అయితే, అంపైర్ నిర్ణయం పట్ల వైభవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. బంతి బ్యాట్ కంటే ముందు ప్యాడ్కు తాకిందని వైభవ్ అంపైర్తో వాదించినట్లు కనిపించింది.సహనం కోల్పోయిన వైభవ్ఈ క్రమంలో సహనం కోల్పోయిన వైభవ్ అవుటైన కాసేపటి దాకా క్రీజును వీడకుండా అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత అన్యమస్కకంగానే పెవిలియన్ చేరాడు. ఇక వైభవ్తో పాటు మరో ఎండ్లో ఉన్న వేదాంత్ త్రివేవది కూడా అంపైర్తో ఇదే విషయం గురించి కాసేపు చర్చించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.Vaibhav Suryavanshi was wrongly given out in the second Youth Test against Australia U19. He looked shocked by the decision and gestured to indicate that there was a clear gap between the bat and the ball. pic.twitter.com/En8tKe4ErE— Varun Giri (@Varungiri0) October 7, 2025 ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మంగళవారం నాటి తొలి రోజు ఆట ముగిసేసరికి భారత జట్టు 40 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఆసీస్ కంటే తొలి ఇన్నింగ్స్లో తొమ్మిది పరుగుల ఆధిక్యంలో నిలిచింది. వైభవ్ 20 పరుగులు చేయగా.. వేదాంత్ 25, ఖిలన్ పటేల్ 26 పరుగులు చేశారు. హెనిల్ పటేల్ 22, దీపేశ్ దేవేంద్రన్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.చదవండి: రోహిత్ను తప్పించడం సరైన నిర్ణయం.. కోహ్లి జట్టులో కొనసాగాలంటే..: డివిలియర్స్ -
మళ్లీ మొదటికి వచ్చావా పృథ్వీ..? ఆటగాళ్లతో గొడవ! వీడియో
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్కు ముందు మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో మహారాష్ట్ర, ముంబై జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో తన మాజీ జట్టుపై మహారాష్ట్ర బ్యాటర్ పృథ్వీషా అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.షా కేవలం 140 బంతుల్లోనే 100 పరుగుల మార్కును చేరుకున్నాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ ఒకప్పటి పృథ్వీషాను గుర్తు చేశాడు. దూకుడుగా ఆడిన షా మొత్తంగా 181 పరుగులు సాధించి అవుటయ్యాడు. మరో యువ ఆటగాడు అర్షిన్ కులకర్ణితో కలిసి 305 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు.ఆఖరికి భారీ షాట్కు ప్రయత్నించి షామ్స్ ములానీ బౌలింగ్లో పృథ్వీ ఔటయ్యాడు. ఇక్కడవరకు అంతా బాగానే ఉన్న ఔటయ్యి డగౌట్కు వెళ్లే క్రమంలో పృథ్వీషా.. ముంబై ఆటగాళ్లతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. పృథ్వీ ఔటయ్యాక ముంబై ఆల్రౌండర్ ముషీర్ ఖాన్ ఏదో అన్నాడు. దీంతో సహనం కోల్పోయిన పృథ్వీ.. ముషీర్ వద్దకు వెళ్లి తన నోటికి పనిచెప్పాడు. ఆ తర్వాత షమ్సీ ములానీతో కూడా షా గొడవపడ్డాడు. అంపైర్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దమణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు పృథ్వీ ఇది నీకు అవసరమా.. మళ్లీ మొదటకు వచ్చావా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. రాబోయే రంజీ సీజన్కు ముందు పృథ్వీ షా తన మకాంను ముంబై నుంచి మహారాష్ట్రకు మార్చిన సంగతి తెలిసిందే. పేలవ ఫామ్, సరైన క్రమశిక్షణ లేకపోవడంతో ముంబై క్రికెట్ అసోసియేషన్ అతడిని పక్కన పెట్టింది. దీంతో మహారాష్ట్ర జట్టుకు పృథ్వీ వెళ్లిపోయాడు. అక్కడకు వెళ్లినా కూడా అతడి తీరు మారలేదు. ముంబై 25 ఏళ్ల పృథ్వీ షా ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇప్పటికి 58 మ్యాచ్లు ఆడి సగటు 46.02తో 4556 పరుగులు సాధించాడు. ఇందులో 13 శతకాలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 379గా ఉంది.చదవండి: ఆసియాకప్లో అట్టర్ ప్లాప్.. పాక్ కెప్టెన్పై వేటు!?Heated exchange between Prithvi Shaw and Mumbai players after his wicket! pic.twitter.com/l9vi1YgeYs— INSANE (@1120_insane) October 7, 2025 -
ఊహకైనా అందడం లేదు: శ్రేయస్ అయ్యర్పై మాజీ చీఫ్ సెలక్టర్ ఫైర్
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తీరుపై మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్సర్కార్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. శ్రేయస్ చెప్పే సాకులు తన ఊహకు కూడా అందడం లేదంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా శ్రేయస్ అయ్యర్ గత కొన్నాళ్ల నుంచి వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.వన్డే ఫార్మాట్లో జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన శ్రేయస్ అయ్యర్.. ఆ తర్వాత ఐపీఎల్-2025 (IPL)లోనూ సత్తా చాటాడు. బ్యాటర్గా, కెప్టెన్గా రాణించి పంజాబ్ కింగ్స్ను ఫైనల్కు చేర్చాడు. అంతకుముందు దేశీ క్రికెట్లోనూ రాణించాడు.కెప్టెన్సీ వదులుకోవడంతో పాటు...అయినప్పటికీ ఆసియా టీ20 కప్-2025 (Asia Cup 2025) జట్టుకు సెలక్టర్లు శ్రేయస్ను ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో స్వదేశంలో ఆస్ట్రేలియా-‘ఎ’తో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్కు అతడిని భారత్-‘ఎ’ కెప్టెన్గా సెలక్ట్ చేశారు. ఈ క్రమంలో తొలి టెస్టు ఆడి విఫలమైన శ్రేయస్.. రెండో టెస్టు ఆరంభానికి ముందే కెప్టెన్సీ వదులుకోవడంతో పాటు జట్టు నుంచీ తప్పుకొన్నాడు.ఆరు నెలల విరామంవెన్నునొప్పి కారణాంగా నాలుగు రోజుల పాటు ఫీల్డింగ్ చేయలేకపోతున్నానంటూ శ్రేయస్ అయ్యర్ బీసీసీఐకి లేఖ రాశాడు. ఆరు నెలలపాటు రెడ్బాల్ క్రికెట్కు విరామం ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. టీమిండియా వన్డే వైస్ కెప్టెన్గా ప్రమోషన్ఈ విషయాన్ని ధ్రువీకరించిన బోర్డు.. ఆసీస్-ఎ జట్టుతో వన్డేలకు అతడిని సారథిగా నియమించింది. అంతేకాదు.. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్కు టీమిండియా వైస్ కెప్టెన్గా శ్రేయస్ను ఎంపిక చేసింది.ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్సర్కార్ శ్రేయస్ అయ్యర్ తీరుపై విస్మయం వ్యక్తం చేశాడు. ‘‘నిజం చెప్పాలంటే.. శ్రేయస్ అయ్యర్ చేసిన పని నన్ను సందిగ్దంలోకి నెట్టేసింది.ఊహకు కూడా అందడం లేదురెడ్బాల్ క్రికెట్కు తాను అన్ఫిట్ అని శ్రేయస్ స్వయంగా చెప్పాడు. అయితే, వైట్బాల్ క్రికెట్ ఆడేందుకు మాత్రం ఫిట్గా ఉన్నానన్నాడు. రెడ్బాల్, వైట్బాల్ క్రికెట్ల మధ్య అంతరం ఏమిటో నాకైతే అర్థంకావడం లేదు.ఒకవేళ ఒక ఆటగాడు వైట్బాల్ క్రికెట్ ఆడేందుకు ఫిట్గా ఉన్నాడంటే.. రెడ్బాల్ క్రికెట్కు కూడా సిద్ధంగా ఉండాలి కదా!.. ఈ రెండింటిలో ఏదో ఒకదానిని ఎంచుకోవడం ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు. నా ఊహకు కూడా అందడం లేదు’’ అని దిలీప్ వెంగ్సర్కార్ మిడ్-డేతో పేర్కొన్నాడు.చదవండి: Prithvi Shaw: భారీ శతకంతో చెలరేగిన పృథ్వీ షా -
ఆసియాకప్లో అట్టర్ ప్లాప్.. పాక్ కెప్టెన్పై వేటు!?
ఆసియాకప్-2025 రన్నరప్గా పాకిస్తాన్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో పాక్ జట్టు ఫైనల్కు చేరినప్పటికి తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో మాత్రం విఫలమైంది. భారత్పై ఆడిన మూడు మ్యాచ్లలోనూ పాక్ చిత్తు అయింది.ముఖ్యంగా కెప్టెన్ సల్మాన్ అఘా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఈ మెగా ఈవెంట్లో సల్మాన్ బ్యాటర్గా లీడర్గా తీవ్ర నిరాశపరిచాడు. ఈ ఖండాంతర టోర్నీలో 7 మ్యాచ్లు ఆడిన అఘా.. 12 సగటుతో 72 పరుగులు చేశాడు.ఆఖరికి ఒమన్, యూఏఈ వంటి పసికూనలపై కూడా అతడు రాణించలేకపోయాడు. అతడి ప్రదర్శలనపై పీసీబీ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సెలక్టర్లు, హెడ్ కోచ్ మైక్ హుస్సేన్ అతడికి సపోర్ట్గా ఉన్నప్పటికి పాక్ క్రికెట్ బోర్డు పెద్దలు మాత్రం గుర్రుగా ఉన్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. పాక్ జట్టు ఈ నెలఖారున దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడనుంది. ఈ సిరీస్లో కూడా అతడు విఫలమైతే కెప్టెన్సీతో పాటు జట్టు నుంచి కూడా తొలిగించే అవకాశముంది.కెప్టెన్ల మార్పు పాక్కు కొత్తేమి కాదు. టీ20ల్లో బ్యాటర్గా కూడా సల్మాన్కు మంచి రికార్డు ఏమి లేదు. ఇప్పటివరకు 32 మ్యాచ్ల్లో అతడు 110 స్ట్రైక్ రేట్తో 561 పరుగులు మాత్రమే చేశాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు పాక్ జట్టులోకి సీనియర్లు రిజ్వాన్, బాబర్ ఆజం రానున్నట్లు తెలుస్తోంది.ఆసియాకప్నకు వీరిద్దరిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. దీంతో సెలక్టర్లపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే వారిద్దరికి తిరిగి పిలుపునవ్వాలని సెలక్టర్లు నిర్ణయించుకున్నట్లు సమాచారం.చదవండి: భారత్-పాక్ మ్యాచ్లు వద్దు.. అందుకు వారు ఒప్పుకొంటారా?: బీసీసీఐ -
రోహిత్పై వేటు సరైన నిర్ణయం.. కోహ్లి జట్టులో కొనసాగాలంటే..: డివిలియర్స్
టీమిండియా వన్డే కెప్టెన్ను మారుస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీసుకున్న నిర్ణయం సరైందా? కాదా? అన్న చర్చ నడుస్తూనే ఉంది. రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పించి శుబ్మన్ గిల్కు పగ్గాలు ఇవ్వడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ క్రమంలో భారత దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar)తో పాటు మదన్ లాల్ వంటి వారు సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థిస్తుండగా. హర్భజన్ సింగ్, రాబిన్ ఊతప్ప, మహ్మద్ కైఫ్ వంటి మాజీ క్రికెటర్లు దీనిని తొందరపాటు చర్యగా అభివర్ణిస్తున్నారు.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా లెజండరీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ కూడా భారత వన్డే జట్టు కెప్టెన్ మార్పు అంశంపై తాజాగా స్పందించాడు. రోహిత్ శర్మను తప్పించి గిల్ను కెప్టెన్ను చేయడం సరైన నిర్ణయమని పేర్కొన్నాడు. ఇందుకు గల కారణాలు వివరిస్తూ..రోహిత్పై వేటు సరైన నిర్ణయం‘‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి (Virat Kohli).. వన్డే వరల్డ్కప్-2027 వరకు ఆడతారో లేదో నమ్మకం లేదు. ఆ ఆలోచనతోనే శుబ్మన్ గిల్ను వన్డే కెప్టెన్గా చేసి ఉంటారు. అతడికి గొప్ప అవకాశం లభించింది.యువకుడు.. బ్యాటర్గానూ మంచి ఫామ్లో ఉన్నాడు. అద్భుతమైన నాయకుడిగా ఎదగగలడు. రోహిత్, కోహ్లి జట్టులో ఉండగానే గిల్ను కెప్టెన్ చేయడం సరైన నిర్ణయం. ఈ ఇద్దరు గొప్ప, అనుభవజ్ఞులైన కెప్టెన్ల నుంచి గిల్ ఎంతో నేర్చుకునే అవకాశం లభిస్తుంది.రోహిత్, కోహ్లి జట్టులో కొనసాగాలంటే..వారి అనుభవం తనకు ఉపయోగపడుతుంది. కెప్టెన్గా ఎదిగే క్రమంలో అతడికి ఇది ఎంతో ముఖ్యం. వాళ్లిద్దరు జట్టులో ఉండటం గిల్కు సానుకూలంగా ఉంటుంది. ఏదేమైనా ఒకవేళ రోహిత్, కోహ్లి 2027 వరల్డ్కప్ వరకు కొనసాగాలనుకుంటే.. తప్పకుండా పరుగులు రాబట్టాల్సి ఉంటుంది.సెలక్టర్లకు బ్యాట్ ద్వారానే సందేశం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం టీమిండియాలో చోటు కోసం తీవ్రమైన పోటీ ఉంది. ఈ పోటీని దాటి ముందుకు వెళ్లాలంటే కచ్చితంగా పరుగులు చేయాల్సిందే. రోహిత్, కోహ్లి వరల్డ్కప్ వరకు జట్టులో ఉంటే.. టీమిండియాకు అంతకంటే గొప్ప ఆస్తి మరొకటి ఉండదు’’ అని డివిలియర్స్ పేర్కొన్నాడు.ఆసీస్తో సిరీస్తో రీఎంట్రీకాగా ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లి.. వన్డేల్లో మాత్రం కొనసాగుతున్నారు. చివరగా ఇద్దరూ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 సందర్భంగా టీమిండియా తరఫున బరిలోకి దిగారు. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్తో రో- కో పునరాగమనం చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే టీమిండియా టెస్టు కెప్టెన్గా గిల్ జట్టును ముందుకు నడిపిస్తుండగా.. టీ20 టీమ్కు సూర్యకుమార్ యాదవ్ సారథిగా ఉన్నాడు.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
అజిత్ నుంచి గిల్ వరకు.. టీమిండియా వన్డే కెప్టెన్లు వీరే
టీమిండియా కొత్త వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్ను బీసీసీఐ ఎంపిక చేసింది. రోహిత్ శర్మ స్ధానాన్ని గిల్ భర్తీ చేయనున్నాడు. ఆసీస్ టూర్ నుంచి వన్డే సారథిగా గిల్ తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. భారత వన్డే కెప్టెన్గా ఎంపికైన 28వ ఆటగాడిగా గిల్ నిలిచాడు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు భారత జట్టు వన్డే కెప్టెన్గా పనిచేసిన ప్లేయర్లపై ఓ లుక్కేద్దాం.అజిత్ వాడేకర్: వన్డేల్లో భారత్కు కెప్టెన్గా వ్యవహరించిన తొలి ఆటగాడు. అతడి నాయకత్వంలో 1974లో భారత్ రెండు వన్డేలు ఆడింది.శ్రీనివాసరాఘవన్ వెంకటరాఘవన్: శ్రీనివాసరాఘవన్ ఏడు వన్డేల్లో టీమిండియాకు నాయకత్వం వహించాడు.బిషన్ సింగ్ బేడి: లెజెండరీ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడి నాలుగు వన్డే మ్యాచ్లలో భారత్ను నడిపించాడు.సునీల్ గవాస్కర్: 1980 నుండి 1985 వరకు సునీల్ గవాస్కర్ నాయకత్వంలో భారత్ 37 వన్డే మ్యాచ్లు ఆడింది.గుండప్ప విశ్వనాథ్: 1981లో గుండప్ప విశ్వనాథ్ ఒక వన్డే మ్యాచ్కు భారత జట్టుకు నాయకత్వం వహించాడు.కపిల్ దేవ్: కపిల్ దేవ్ నాయకత్వంలో భారత్ 74 వన్డేలు ఆడింది. అతడి కెప్టెన్సీలోనే 1983 ప్రపంచ కప్ను టీమిండియా గెలుచుకుంది.సయ్యద్ కిర్మాణి: 1983లో సయ్యద్ కిర్మాణి ఒక వన్డే మ్యాచ్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు.మోహిందర్ అమర్నాథ్: 1984లో మోహిందర్ అమర్నాథ్ ఒక వన్డే మ్యాచ్లో టీమిండియా కెప్టెన్గా వ్యవహరించాడు.రవిశాస్త్రి:1986 నుండి 1991 వరకు 11 వన్డే మ్యాచ్లకు రవిశాస్త్రి టీమిండియా కెప్టెన్గా పనిచేశాడు.దిలీప్ వెంగ్సర్కార్: 1987 నుండి 1998 వరకు దిలీప్ వెంగ్సర్కార్ నాయకత్వంలో భారత్ 18 వన్డేలు ఆడింది.కృష్ణమాచారి శ్రీకాంత్: 1989లో కృష్ణమాచారి శ్రీకాంత్ భారత జట్టు కెప్టెన్గా వ్యవహరించాడు.అజారుద్దీన్: మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్సీలో భారత్ 174 వన్డే మ్యాచ్లు ఆడింది.సచిన్ టెండూల్కర్: లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ 1996 నుండి 1999 వరకు 73 వన్డేల్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. కానీ అతడి కెప్టెన్సీలో 23 మ్యాచ్ల్లో మాత్రమే భారత్ విజయం సాధించింది. అజయ్ జడేజా: అజయ్ జడేజా భారత కెప్టెన్గా 13 వన్డేల్లో వ్యవహరించాడు. కెప్టెన్గా 8 విజయాలను అందుకున్నాడు.సౌరవ్ గంగూలీ: 1999 నుండి 2005 వరకు సౌరవ్ గంగూలీ నాయకత్వంలో భారత్ 146 వన్డేలు ఆడి 76 గెలిచింది.రాహుల్ ద్రవిడ్: 2000 నుండి 2007 వరకు 79 వన్డేల్లో భారత్కు నాయకత్వం వహించిన ద్రవిడ్ 42 మ్యాచ్లను గెలిపించాడు.అనిల్ కుంబ్లే: 2002లో కుంబ్లే భారత కెప్టెన్గా ఒకే ఒక వన్డే మ్యాచ్లో వ్యవహరించాడు.వీరేంద్ర సెహ్వాగ్: వీరేంద్ర సెహ్వాగ్ నాయకత్వంలో భారత్ 12 వన్డేలు ఆడి 7 విజయాలు సాధించింది.ఎంఎస్ ధోని: వన్డేల్లో అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్లలో ధోని ఒకడిగా నిలిచాడు. 2007 నుంచి 2018 వరకు అతడి సారథ్యంలో 200 మ్యాచ్లు ఆడిన భారత్.. 110 మ్యాచ్లలో విజయం సాధించింది. అతడి నాయకత్వంలో భారత్ ఆసియాకప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది.సురేష్ రైనా: 2010 నుండి 2014 వరకు 12 వన్డేల్లో రైనా భారత్కు నాయకత్వం వహించాడు.గౌతమ్ గంభీర్: ప్రస్తుత హెడ్కోచ్ భారత కెప్టెన్గా ఆరు వన్డేల్లో వ్యవహవరించాడు. మొత్తం అన్ని మ్యాచ్లలోనూ భారత్ విజయం సాధించింది.విరాట్ కోహ్లీ: 2013 నుండి 2021 వరకు భారత కెప్టెన్గా విరాట్ కోహ్లి వ్యవహరించాడు. అతడి సారథ్యంలో 95 వన్డేలు ఆడిన భారత్ 65 విజయాలు సాధించింది.అజింక్య రహానే: 2015లో, అజింక్య రహానే మూడు వన్డే మ్యాచ్ల్లో భారత్కు నాయకత్వం వహించాడు.రోహిత్ శర్మ: రోహిత్ శర్మ 2017 నుండి 2025 వరకు 56 వన్డేల్లో టీమిండియాకు నాయకత్వం వహించాడు. 42 మ్యాచ్లలో భారత్ గెలుపొందింది. అతడి కెప్టెన్సీలోనే భారత్ 2025 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.శిఖర్ ధావన్: మాజీ ఓపెనింగ్ బ్యాటర్ శిఖర్ ధావన్ కూడా 12 మ్యాచ్లలో భారత జట్టు కెప్టెన్గా వ్యవహరించాడు.కెఎల్ రాహుల్: స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇప్పటివరకు 12 వన్డేల్లో భారత్కు నాయకత్వం వహించాడు.హార్దిక్ పాండ్యా: రోహిత్ శర్మ గైర్హజరీలో హార్దిక్ పాండ్యా మూడు వన్డేల్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు.శుభ్మన్ గిల్: అక్టోబర్ 19న పెర్త్లో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్తో టీమిండియా వన్డే కెప్టెన్గా గిల్ శకం మొదలు కానుంది. -
భారత్-పాక్ మ్యాచ్లు వద్దు.. అందుకు వారు ఒప్పుకొంటారా?: బీసీసీఐ
ఆసియాప్-2025లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ఊహించని పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీ అంతటా భారత జట్టు ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో అంటిముట్టనట్టే ఉన్నారు. కనీసం కరచాలనం చేసేందుకు కూడా ఇష్టపడలేదు. అంతేకాకుండా ఫైనల్ మ్యాచ్ అనంతరం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చీఫ్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదగా ట్రోఫీని తీసుకోవడానికి కూడా భారత్ నిరాకరించింది.నఖ్వీ పీసీబీ చీఫ్తో పాటు పాక్ మంత్రిగా ఉండడమే అందుకు కారణం. అయితే ఈ ఆసియాకప్లో జరిగిన సంఘటనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది భారత్కు సపోర్ట్ చేస్తే మరి కొతమంది పాక్కు మద్దతుగా నిలిచారు.ఇదే విషయంపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ అథర్టన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇరు దేశాల మధ్య సమస్యలు పరిష్కారం అయ్యే వరకు భారత్-పాకిస్తాన్ మ్యాచ్లను నిర్వహించవద్దని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి అథర్టన్ సూచించాడు. అతడి వ్యాఖ్యలపై బీసీసీఐ అధికారి ఒకరు స్పందించారు."భారత్-పాకిస్తాన్ మధ్య సమస్యలు అంత సులువుగా పరిష్కరం కావు. బయట నుంచి వ్యక్తులు ఏదైనా మాట్లాడుతారు. ఏదైనా చెప్పినంత ఈజీ కాదు. అందుకు స్పాన్సర్లు, బ్రాడ్కాస్టర్లు అంగీకరిస్తారా? ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియానే కాదు ఏ ప్రధాన జట్టు అయినా టోర్నమెంట్ నుండి వైదొలిగితే తర్వాత స్పాన్సర్లను ఆకర్షించడం చాలా కష్టమని" సదరు అధికారి పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది ఆసియాకప్లో మూడు సార్లు పాక్-భారత్ జట్లు తలపడ్డాయి. మూడు మ్యాచ్లలోనూ పాక్ను టీమిండియా చిత్తు చేసింది. అయితే విన్నింగ్ ట్రోఫీ ఇప్పటివరకు ఇంకా భారత్ వద్ద చేరలేదు.చదవండి: Prithvi Shaw: భారీ శతకంతో చెలరేగిన పృథ్వీ షా -
Prithvi Shaw: భారీ శతకంతో చెలరేగిన పృథ్వీ షా
మహారాష్ట్ర బ్యాటర్ పృథ్వీ షా (Prithvi Shaw) అద్బుత శతకంతో మెరిశాడు. 140 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. ముంబైతో వార్మప్ మ్యాచ్ (రెడ్బాల్) సందర్భంగా పృథ్వీ ఈ మేరకు రాణించాడు.కాగా ముంబై తరఫున దేశీ క్రికెట్లో అరంగేట్రం చేసిన పృథ్వీ షా.. అండర్-19 వరల్డ్కప్ టోర్నీలో సారథిగా భారత్కు ట్రోఫీ అందించాడు. ఆ తర్వాత టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఫిట్నెస్లేమి, క్రమశిక్షణారాహిత్యం, ఫామ్లేమి కారణంగా జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు.ముంబైని వీడి మహారాష్ట్రకుఇక గతేడాది ముంబై రంజీ జట్టు (Ranji Team)లోనూ పృథ్వీకి ఎక్కువ అవకాశాలు రాలేదు. ఈ నేపథ్యంలో 2025-26 సీజన్లో మహారాష్ట్రకు ఆడేందుకు.. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ముంబై (Mumbai Cricket Team) జట్టును వీడాడు. ఇక త్వరలోనే రంజీ ట్రోఫీ తాజా సీజన్ మొదలుకానున్న నేపథ్యంలో మహారాష్ట్ర- ముంబై జట్లు అక్టోబరు 7-9 మధ్య ఎంసీఏ స్టేడియంలో వార్మప్ మ్యాచ్ ఆడుతున్నాయి.భారీ శతకంతో చెలరేగిన పృథ్వీ షాఈ క్రమంలో మంగళవారం నాటి తొలిరోజు ఆట సందర్భంగా పృథ్వీ షా సెంచరీ సాధించాడు. ముంబై రంజీ జట్టు కొత్త కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో సింగిల్ తీసి వంద పరుగులు పూర్తి చేసుకున్న పృథ్వీ.. మొత్తంగా 181 పరుగులు సాధించి అవుటయ్యాడు. అర్షిన్ కులకర్ణితో కలిసి 305 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి.. షామ్స్ ములానీ బౌలింగ్లో పృథ్వీ షా నిష్క్రమించాడు.కాగా 25 ఏళ్ల పృథ్వీ షా ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇప్పటికి 58 మ్యాచ్లు ఆడి సగటు 46.02తో 4556 పరుగులు సాధించాడు. ఇందులో 13 శతకాలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 379. ఇదిలా ఉంటే.. అక్టోబరు 15న కేరళతో మ్యాచ్ సందర్భంగా మహారాష్ట్ర జట్టు తాజా రంజీ ఎడిషన్లో తమ ప్రయాణం ఆరంభించనుంది. తదుపరి సౌరాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, గోవా, మధ్యప్రదేశ్ జట్లతో మహారాష్ట్ర టీమ్ తలపడనుంది.మహారాష్ట్ర రంజీ జట్టుపృథ్వీ షా, అర్షిన్ కులకర్ణి, సిద్ధేష్ వీర్, రుతురాజ్ గైక్వాడ్, అంకిత్ బవానే (కెప్టెన్), సౌరభ్ నవలే (వికెట్ కీపర్), జలజ్ సక్సేనా, విక్కీ ఓస్త్వాల్, రామకృష్ణ ఘోష్, ముఖేష్ చౌదరి, ప్రదీప్ ధాడే, హితేష్ వాలుంజ్, మందార్ భండారి (వికెట్ కీపర్), హర్షల్ కేట్, సిద్ధార్థ్ మాత్రే, రాజ్వర్ధన్ హంగర్గేకర్, రజ్నీశ్ గుర్బానీ.ముంబై రంజీ జట్టుశార్దూల్ ఠాకూర్ (కెప్టెన్), ముషీర్ ఖాన్, అఖిల్ హెర్వాడ్కర్, సువేద్ పార్కర్, సిద్ధేష్ లాడ్, శివమ్ దూబే, ఆకాష్ ఆనంద్, హార్దిక్ తమోర్, షామ్స్ ములానీ, తనుష్ కోటియన్, హిమాన్షు సింగ్, తుషార్ దేశ్పాండే, ఇర్ఫాన్ ఉమైర్, సిల్వెస్టర్ డిసౌజా, రాయిస్టన్ డయాస్.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
కాంతారపై టీమిండియా స్టార్ ప్రశంసల వర్షం.. రిషబ్ యాక్షన్కు ఫిదా
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార చాప్టర్-1(Kantara: Chapter 1) బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో సునామీ సృష్టిస్తోంది. 4 రోజుల్లోనే 300 కోట్లకు పైగా వసుళ్లు చేసింది. ఈ సినిమాపై సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) చేరాడు.రిషబ్ శెట్టి మ్యాజిక్కు రాహుల్ ఫిదా అయిపోయాడు. "ఇప్పుడే కాంతార సినిమా చూశాను. రిషబ్ శెట్టి మరోసారి అద్బుతం సృష్టించాడు. ఈ సినిమా మంగళూరుకు చెందిన అందమైన ప్రజల సంస్కృతిని ప్రతిబింబించిందని" రాహుల్ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.2022లో విడుదలై సంచలనం సృష్టించిన కాంతార సీక్వెల్ కూడా తనకు బాగా నచ్చిందని రాహుల్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. కర్ణాటకకు చెందిన రాహుల్ ఐపీఎల్-2025లో కాంతార సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. రాహుల్ ప్రస్తుతం స్వదేశంలో వెస్టిండీస్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో భారత తరపున ఆడుతున్నాడు. తొలి టెస్టు అనంతరం విశ్రాంతి లభించడంతో కాంతార సినిమా చూసి ఎంజాయ్ చేశాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రాహుల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఇప్పుడు శుక్రవారం నుంచి ఢిల్లీ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టుకు కేఎల్ సన్నద్దం కానున్నాడు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న భారత జట్టు రెండు రోజుల పాటు ప్రాక్టీస్లో పాల్గోనుంది. రాహుల్ టెస్టు క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు. గత పది ఇన్నింగ్స్లలో 532 పరుగులు చేశాడు. ఇంగ్లండ్తో సిరీస్ను భారత్ 2-2తో డ్రా చేసుకోవడంలో రాహుల్ ది కీలక పాత్ర. ఇప్పుడు అదే జోరును విండీస్పై కూడా కొనసాగిస్తున్నాడు.చదవండి: ‘వైభవ్ సూర్యవంశీని వెంటనే టీమిండియాలోకి పంపండి’ -
‘వైభవ్ సూర్యవంశీ ఉంటే డబుల్ సెంచరీ చేసేవాడు’
భారత క్రికెట్లో కొన్నాళ్లుగా వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) పేరు మారుమ్రోగిపోతోంది. పన్నెండేళ్ల వయసులోనే రంజీల్లో అరంగేట్రం చేసిన ఈ బిహారీ పిల్లాడు.. పద్నాలుగేళ్లకే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లోనూ అడుగుపెట్టాడు. అంతేకాదు.. అత్యంత పిన్న వయసులో ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు.ఫాస్టెస్ట్ సెంచరీలుఈ ఏడాది రాజస్తాన్ రాయల్స్ తరఫున గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో 35 బంతుల్లోనే శతకం బాది వైభవ్ సూర్యవంశీ ఈ ఘనత సాధించాడు. ఇక ఆ తర్వాత భారత్ అండర్-19 జట్టు తరఫునా పరుగుల వరద పారిస్తున్నాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్.ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో యూత్ వన్డేల్లో అత్యంత వేగవంతమైన శతకం నమోదు చేసిన వైభవ్ సూర్యవంశీ.. తాజాగా ఆస్ట్రేలియా గడ్డ మీద కూడా సత్తా చాటుతున్నాడు. ఈ నేపథ్యంలో రాజస్తాన్ రాయల్స్ హై పర్ఫామెన్స్ డైరెక్టర్ జుబిన్ బరూచా (Zubin Barucha) వైభవ్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.వైభవ్ సూర్యవంశీ ఉంటే డబుల్ సెంచరీ చేసేవాడు‘‘వీలైనంత త్వరగా అతడిని సీనియర్ జట్టు (టీమిండియా)లోకి పంపించాలి. చాలా ఏళ్ల క్రితం సచిన్ టెండుల్కర్ (16 ఏళ్ల వయసులో అరంగేట్రం) విషయంలో ఇలాగే చేశారు. ఇప్పుడు వైభవ్ విషయంలోనూ త్వరగా నిర్ణయం తీసుకోవాలి.కనీసం ఇండియా-‘ఎ’ తరఫునైనా అతడిని ఆడించాలి. తక్షణమే ఆ జట్టులోకి వైభవ్ను పంపించండి. ఇటీవల అనధికారిక టెస్టు సిరీస్లో ఆస్ట్రేలియా-ఎ బౌలర్ల బౌలింగ్ చూస్తే.. వైభవ్ గనుక జట్టులో ఉండి ఉంటే డబుల్ సెంచరీ బాదేవాడని అనిపించింది.జోఫ్రా ఆర్చర్ను ఎదుర్కోవడానికి స్టీవ్ స్మిత్ వంటి మేటి బ్యాటర్లే భయపడతారు. మా జట్టు తరఫున నెట్స్లో బరిలోకి దిగినా ఆర్చర్ ప్రధాన మ్యాచ్లో మాదిరే బౌల్ చేస్తాడు. అలా ఓసారి ప్రాక్టీస్ సెషన్లో ఆర్చర్ బౌలింగ్లో స్మిత్ తలకు గాయమైంది.ఆరోజు వైభవ్ అద్భుతం చేశాడుఅప్పటి నుంచి ఆర్చర్ నెట్స్లో ఉంటే స్మిత్ బ్యాటింగ్కు వచ్చేవాడే కాదు. అందుకే ఆర్చర్ బౌలింగ్లో వైభవ్ బ్యాటింగ్ చేయబోతున్నపుడు నేను భయపడ్డాను. కానీ.. ఆ పిల్లాడు బ్యాక్ఫుట్ షాట్ ఆడి.. బంతిని స్టేడియం అవతలకు తరలించాడు. నాతో పాటు కోచింగ్ స్టాఫ్.. ఆఖరికి ఆర్చర్ కూడా ఆశ్చర్యపోయాడు’’ అని జుబిన్ బరూచా చెప్పుకొచ్చాడు. వైభవ్ను త్వరలోనే టీమిండియాకు ఎంపిక చేయాలని చీఫ్ సెల క్టర్ అజిత్ అగార్కర్కు ఈ మేరకు విజ్ఞప్తి చేశాడు.కాగా సొంతగడ్డపై ఇండియా-‘ఎ’ జట్టు ఇటీవల ఆసీస్-‘ఎ’తో రెండు అనధికారిక మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడింది. ఈ సిరీస్ను 1-0తో భారత్ సొంతం చేసుకుంది. చదవండి: 50 ఓవర్ల క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ విధ్వంసం -
వైభవ్ సూర్యవంశీ విఫలం.. టీమిండియా తడ'బ్యాటు'
ఆస్ట్రేలియా పర్యటనలో భారత అండర్-19 జట్టు (Team India) తొలిసారి బ్యాటింగ్లో తడబాటుకు లోనైంది. మెక్కే వేదికగా ఇవాళ (అక్టోబర్ 7) మొదలైన రెండో టెస్ట్లో టాపార్డర్ విఫలం కావడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత స్కోర్ 7 వికెట్ల నష్టానికి 144 పరుగులుగా ఉంది.వన్డౌన్లో వచ్చిన చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) (14 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్) తన సహజ శైలిలో ధాటిగా ఆడినప్పటికీ, ఎక్కువ సేపు క్రీజ్లో నిలబడలేకపోయాడు. ఈ మ్యాచ్లో ఓపెనర్గా ప్రమోషన్ పొందిన విహాన్ మల్హోత్రా (11) నిరాశపరిచాడు. మరో ఓపెనర్, కెప్టెన్ ఆయుశ్ మాత్రే (4) వైఫల్యాల పరంపర కొనసాగించాడు.వేదాంత్ త్రివేది (25) నిలదొక్కుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. రాహుల్ కుమార్ (9), వికెట్కీపర్ హర్వంశ్ పంగాలియా (1) సింగిల్ డిజిట్ స్కోర్కే టపా కట్టేశారు. ఖిలన్ పటేల్ (26) కాసేపు పోరాడినప్పటికీ, ఆట ముగిసే సమయానికి కొద్ది ముందుగా ఔటయ్యాడు. హెనిల్ పటేల్ (22 నాటౌట్), దీపేశ్ దేవేంద్రన్ (6 నాటౌట్) సహకారంతో భారత్కు గౌరవప్రదమైన స్కోర్ అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు.ఆసీస్ బౌలర్లలో కేసీ బార్టన్, విల్ బైరోమ్ టీమిండియా టాపార్డర్ను ఇబ్బంది పెట్టారు. కేసీ 2, బైరోమ్ 2 వికెట్లు పడగొట్టగా.. ఛార్లెస్ లచ్మండ్, జూలియన్కు తలో వికెట్ దక్కింది. టాపార్డర్ తడబడినా టీమిండియాకు ఇప్పటికే 9 పరుగుల ఆధిక్యం లభించింది. అంతకుముందు భారత బౌలర్లు చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 135 పరుగులకే కుప్పకూలింది. హెనిల్ పటేల్ (9-3-21-3), ఖిలన్ పటేల్ (12-5-23-3), ఉధవ్ మోహన్ (6-0-23-2), దీపేశ్ దేవేంద్రన్ (7.3-2-22-1) కలిసికట్టుగా ఆసీస్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు. ఆసీస్ ఇన్నింగ్స్లో వికెట్ కీపర్ లీ యంగ్ (66) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.కాగా, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ల కోసం భారత అండర్ 19 జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలుత జరిగిన వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. టెస్ట్ సిరీస్లోనూ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్ను కూడా గెలిస్తే భారత్ ఆసీస్ను వారి సొంత ఇలాకాలో పూర్తిగా క్వీన్ స్వీప్ చేసినట్లవుతుంది.చదవండి: కర్ణాటక కెప్టెన్గా రాహుల్ ద్రవిడ్ కొడుకు.. కరుణ్ నాయర్ రీఎంట్రీ -
ఏదో ఒకరోజు ఇంట్లో పట్టనంత డబ్బు సంపాదిస్తా.. కట్చేస్తే..
మిగతా వాటితో పోలిస్తే క్రికెట్, సినిమాలను కెరీర్గా ఎంచుకుంటే ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకోవాల్సి ఉంటుంది. వీటిలో విజయశాతం తక్కువ. ముఖ్యంగా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇలాంటి రంగాల్లో నిలదొక్కుకోవడం కత్తిమీద సాము లాంటిదే.నూటికో కోటికో ఒక్కరే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో సఫలమవుతూ ఉంటారు. ఇక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వారు ఇలాంటి పెద్ద పెద్ద కలలు కంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.అయితే, ఆత్మవిశ్వాసం ఉంటే కఠిన సవాళ్లను సైతం సులువుగానే అధిగమించవచ్చని అంటున్నాడు టీమిండియా స్టార్ క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్. హైదరాబాద్ గల్లీల నుంచి.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ పేస్ బౌలర్లలలో ఒకడిగా ఎదిగాడు సిరాజ్ మియా.ఏదో ఒకరోజు ఇంట్లో పట్టనంత డబ్బు సంపాదిస్తాపట్టుదల ఉంటే ఆటో డ్రైవర్ కుమారుడైనా అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చని నిరూపించాడు. అయితే, చిన్ననాడు అందరిలాగే తానూ తల్లి చేత చివాట్లు తిన్నాడు సిరాజ్. గల్లీల్లో ఆడుతూ ఉంటే.. ‘ఈ ఆట అన్నం పెడుతుందా?’ అంటూ తల్లి ఆవేదన పడుతుంటే.. ఆమెను ఊరడించేందుకు.. ‘‘ఏదో ఒకరోజు ఇంట్లో పట్టనంత డబ్బు సంపాదిస్తా’’ అని చెప్పాడు.అయితే, తర్వాతి రోజుల్లో ఆ మాటనే నిజం చేశాడు సిరాజ్. ఈ విషయాల గురించి తాజాగా మాట్లాడుతూ.. ‘‘ఆరోజు నాకింకా గుర్తుంది. నేను క్రికెట్ ఆడేందుకు వెళ్లాను. మా అమ్మకు నేనలా వెళ్లడం అస్సలు ఇష్టం లేదు.భవిష్యత్తు గురించి నాకు బెంగలేదని తిట్టేది. ఆరోజు కూడా అలాగే తిట్టింది. అప్పుడు నేను.. ‘అమ్మ నన్ను కొట్టడం ఆపేయ్.. ఏదో ఒకరోజు నేను కచ్చితంగా ఈ ఇంట్లో పట్టనంత డబ్బు సంపాదిస్తాను. నువ్వేం బాధపడకు.. నేనది చేసి చూపిస్తా’ అని నమ్మకంగా చెప్పాను.ఆత్మవిశ్వాసం ఉంటేనే..ఆరోజు నేను అన్న మాటలు నిజమయ్యాయి. ఆ దేవుడే వాటిని నిజం చేశాడు. ఆత్మవిశ్వాసం ఉంటేనే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలం. ఒకవేళ మీపై మీకు నమ్మకం లేకుంటే జీవితంలో ఏమీ సాధించలేరు. మనల్ని మనం నమ్ముకోవాలి.మనకంటూ లక్ష్యాన్ని నిర్దేశించుకుని.. దాని కోసమే నిరంతరమూ పరితపించాలి. అప్పుడే అంతా సవ్యంగా సాగుతుంది. నేను ఈరోజు యార్కర్ వేసి వికెట్ తీస్తానని అనుకుంటే.. కచ్చితంగా అది సాధించగలను. నా ఆత్మవిశ్వాసమే అందుకు కారణం. మన ప్రణాళికలను పక్కాగా అమలు చేసినప్పుడు ఏదీ అసాధ్యం కాదు. కఠినంగా శ్రమిస్తే దక్కనిది ఏదీ ఉండదు’’ అని సిరాజ్ ఇండియన్ ఎక్స్ప్రెస్తో పేర్కొన్నాడు.కాగా హైదరాబాద్ తరఫున దేశీ క్రికెట్లో రాణించిన సిరాజ్.. 2017లో ఐపీఎల్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత అతడు వెనుదిరిగి చూసుకోలేదు. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలోనూ సత్తా చాటిన సిరాజ్.. ఇప్పటి వరకు తన కెరీర్లో 42 టెస్టులు, 44 వన్డేలు, 16 టీ20లు ఆడాడు.విలాసవంతమైన జీవితంటెస్టుల్లో ఇప్పటికి 130, వన్డేల్లో 71, టీ20లలో 14 వికెట్లు తీసిన సిరాజ్.. ప్రస్తుతం సొంతగడ్డపై వెస్టిండీస్తో జరుగుతున్న టెస్టు సిరీస్తో బిజీగా ఉన్నాడు. అన్నట్లు పేద కుటుంబంలో జన్మించిన సిరాజ్ నికర ఆస్తుల విలువ ప్రస్తుతం దాదాపు రూ. 60 కోట్లు. చిన్నపుడు ఇరుకు ఇంట్లో నివసించిన సిరాజ్ తల్లిని ఇప్పుడు జూబ్లీహిల్స్లోని కోట్ల విలువ గల ఇంట్లో నివసిస్తున్నారు. అంతేకాదు.. చిన్నపుడు తండ్రితో కలిసి ఆటోలో తిరిగిన ఈ హైదరాబాదీ బౌలర్ గ్యారేజీలో ఇప్పుడు విలాసవంతమైన కార్లు ఎన్నో ఉన్నాయి. అయితే, తన సక్సెస్ను పూర్తిగా ఆస్వాదించకుండానే తండ్రి మరణించడం సిరాజ్కు ఎప్పటికీ తీరని లోటు!చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
కర్ణాటక కెప్టెన్గా రాహుల్ ద్రవిడ్ కొడుకు.. కరుణ్ నాయర్ రీఎంట్రీ
త్వరలో జరుగనున్న వినూ మన్కడ్ ట్రోఫీ, రంజీ ట్రోఫీల కోసం కర్ణాటక జట్లను ఇవాళ ప్రకటించారు. వినూ మన్కడ్ ట్రోఫీలో పాల్గొనే జట్టుకు టీమిండియా దిగ్గజ బ్యాటర్ రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ (Anvay Dravid) సారధిగా ఎంపిక కాగా.. రంజీ ట్రోఫీ జట్టుకు మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) కెప్టెన్గా కొనసాగాడు. ఈసారి రంజీ జట్టులో పలు కొత్త ముఖాలకు చోటు దక్కింది. కృతిక్ కృష్ణ, శిఖర్ షెట్టి, మొహిసిన్ ఖాన్ తొలిసారి రంజీ జట్టులో చోటు దక్కించుకున్నారు.కరుణ్ నాయర్ రీఎంట్రీఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో విఫలమై, విండీస్ పర్యటనకు ఎంపిక కాని కరుణ్ నాయర్ (karun Nair) కర్ణాటక రంజీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. కరుణ్ గత రెండు రంజీ సీజన్లలో విదర్భ తరఫున ఆడాడు. గత సీజన్లో విదర్భ ఛాంపియన్గా నిలవడంలో కరుణ్ కీలకపాత్ర (16 ఇన్నింగ్స్ల్లో 53.96 సగటున 863 పరుగులు) పోషించాడు. గతకొంతకాలంగా దేశవాలీ క్రికెట్లో పరుగులు వరద పారించి, సెంచరీల మోత మోగించి టీమిండియాకు ఎంపికైన కరుణ్ ఇంగ్లండ్ పర్యటనలో నిరాశపరిచాడు. అక్టోబర్ 15న రాజ్కోట్లో సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్తో కరుణ్ కర్ణాటక తరఫున పునరాగమనం చేసేందుకు సిద్దంగా ఉన్నాడు.2025/26 రంజీ సీజన్ కోసం కర్ణాటక జట్టు: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), కరుణ్ నాయర్, ఆర్ స్మరణ్, కేఎల్ శ్రీజిత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ గోపాల్, వైశాక్ విజయకుమార్, విద్వత్ కవేరప్ప, అభిలాష్ శెట్టి, ఎం వెంకటేష్, నికిన్ జోస్, అభినవ్ మనోహర్, కృతిక్ కృష్ణ (వికెట్ కీపర్), కేవీ అనీష్, మోహ్సిన్ ఖాన్, శిఖర్ శెట్టి.కెప్టెన్గా అన్వయ్ ద్రవిడ్50 ఓవర్ల ఫార్మాట్లో జరిగే వినూ మన్కడ్ ట్రోఫీ అక్టోబర్ 9 నుంచి 17 వరకు డెహ్రాడూన్లో జరుగనుంది. ఈ టోర్నీ కోసం కర్ణాటక జట్టు కెప్టెన్గా అన్వయ్ ద్రవిడ్ ఎంపికయ్యాడు. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) ఎస్ మణికాంత్ నియమితుడయ్యాడు.వినూ మన్కడ్ ట్రోఫీ 2025 కోసం కర్ణాటక జట్టు: అన్వయ్ ద్రవిడ్ (కెప్టెన్, వికెట్ కీపర్), నితీష్ ఆర్య, ఆదర్శ్ డి ఉర్స, ఎస్ మణికాంత్ (వైస్ కెప్టెన్), ప్రణీత్ శెట్టి, వాసవ్ వెంకటేష్, అక్షత్ ప్రభాకర్, సి వైభవ్, కుల్దీప్ సింగ్ పురోహిత్, రతన్ బీఆర్, వైభవ్ శర్మ, కేఏ తేజస్, అథర్వ్ మాల్వియా, సన్నీ కాంచి, రెహాన్ మహమ్మద్అన్వయ్ ద్రవిడ్కు అవార్డుగత ఎడిషన్ అండర్-19 విజయ్ మర్చంట్ ట్రోఫీలో (రెడ్బాల్) సత్తా చాటిన అన్వయ్ ద్రవిడ్ను కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సన్మానించింది. ఈ టోర్నీలో అన్వయ్ 6 మ్యాచ్ల్లో 91.80 సగటున 459 పరుగులు సాధించి, కర్ణాటక తరఫున టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి.కాగా, రాహుల్ ద్రవిడ్ మరో కుమారుడు (పెద్దవాడు) కూడా క్రికెటరే అన్న విషయం తెలిసిందే. తమ్ముడు అండర్-16 విభాగంలో సత్తా చాటుతుంటే, అన్న సమిత్ సీనియర్ లెవెల్లో పర్వాలేదనిపిస్తున్నాడు. సమిత్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కాగా.. అన్వయ్ వికెట్ కీపర్ బ్యాటర్. చదవండి: తగ్గేదేలే!.. 459 పరుగులు.. ద్రవిడ్ చిన్న కుమారుడి జోరు.. -
World Cup 2025: వారి కోసం వరల్డ్కప్ గెలుస్తాం
కొలంబో: భారత్లో మహిళల క్రికెట్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన పలువురి కోసం తాము వన్డే ప్రపంచ కప్ (ICC Womens ODI World Cup)ను గెలవాలని కోరుకుంటున్నట్లు భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues)వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో బయట జరిగే చర్చ గురించి తాము పట్టించుకోమని, తమ దృష్టి మొత్తం విజయంపైనే ఉందని ఆమె వెల్లడించింది. ఆదివారం పాకిస్తాన్ను ఓడించిన తర్వాత జెమీమా తమ ప్రదర్శనపై మాట్లాడింది. సవాళ్ల గురించే చర్చ‘మేం ఒకసారి ఒక మ్యాచ్పైనే దృష్టి పెడుతూ ముందుకు వెళుతున్నాం. ప్రపంచ కప్ గురించి బయట ఎంతో చర్చ జరుగుతుందని మాకు తెలుసు. దాని ప్రభావం మాపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మా బృందం సమావేశాల్లో కూడా ఆటలో ఎదురయ్యే సవాళ్ల గురించే మాట్లాడుకుంటున్నాం. అప్పుడు మిథాలీ, జులన్.. ఇప్పుడు..ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుతున్నాం. నేను జట్టులోకి వచ్చినప్పుడు మిథాలీ, జులన్లాంటి సీనియర్లు నడిపించారు. ఇప్పుడు హర్మన్, స్మృతి కలిసి జట్టును ముందుకు తీసుకెళుతున్నారు. అందరూ తమ అత్యుత్తమ ప్రదర్శన చూపించే విధంగా వారు తీర్చిదిద్దారు. భారత మహిళల క్రికెట్ స్థాయిని పెంచిన మిథాలీ, జులన్, నీతూ డేవిడ్వంటి ప్లేయర్ల కోసం వరల్డ్ కప్ గెలవాలని పట్టుదలగా ఉన్నాం’ అని జెమీమా పేర్కొంది. గువహటి, కొలంబో పిచ్లను బ్యాటర్లకు సవాల్గా నిలిచాయని, పరిస్థితులకు తగినట్లుగా తమ ఆటను మలచుకున్నామని ఆమె వివరించింది. చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
విండీస్తో రెండో టెస్ట్.. భారీ రికార్డుపై కన్నేసిన రాహుల్, జడేజా
అక్టోబర్ 10 నుంచి ఢిల్లీ వేదికగా వెస్టిండీస్తో జరుగబోయే రెండో టెస్ట్ మ్యాచ్కు ముందు టీమిండియా స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్ (KL Rahul), రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఓ భారీ రికార్డుపై కన్నేశారు. ఈ మ్యాచ్లో రాహుల్ 111 పరుగులు, జడేజా 10 పరుగులు చేస్తే టెస్ట్ల్లో అరుదైన 4000 పరుగుల మైలురాయిని తాకుతారు.ప్రస్తుతం రాహుల్ 64 టెస్ట్ల్లో 11 సెంచరీలు, 19 అర్ద సెంచరీల సాయంతో 36.01 సగటున 3889 పరుగులు చేయగా.. జడేజా 86 టెస్ట్ల్లో 6 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీల సాయంతో 38.74 సగటున 3990 పరుగులు చేశాడు. రాహుల్తో పోలిస్తే జడేజాకు ఈ రికార్డును అందుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఎందుకంటే అతను మరో 10 పరుగులు చేస్తే 4000 పరుగుల మైలురాయిని తాకుతాడు.ప్రస్తుతం రాహుల్ ఉన్న ఫామ్ను బట్టి చూస్తే.. ఇతనికి కూడా ఇదే టెస్ట్లో ఈ రికార్డును అందుకునే అవకాశాలు ఉన్నాయి. గత కొంతకాలంగా రాహుల్ 50 సగటుకు దగ్గరగా పరుగులు సాధిస్తున్నాడు. ఈ లెక్కన రాహుల్ రెండు ఇన్నింగ్స్ల్లో హాఫ్ సెంచరీలు చేసినా ఇదే టెస్ట్లో 4000 పరుగుల మైలురాయిని తాకవచ్చు.భారత్ తరఫున ఇప్పటివరకు 17 మంది టెస్ట్ల్లో 4000 పరుగుల మైలురాయిని తాకారు. ప్రస్తుత భారత జట్టులో ఈ విభాగానికి సంబంధించి రాహుల్, జడేజాకు దగ్గర్లో ఎవ్వరూ లేరు. రిషబ్ పంత్ ఒక్కడే 3000 పరుగుల (3427) పరిధిలో ఉన్నాడు.ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా విండీస్తో జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ (100), రవీంద్ర జడేజా (104 నాటౌట్) శతకాలు చేశారు. వీరితో పాటు రిషబ్ పంత్ స్థానంలో జట్టులోకి వచ్చిన ధృవ్ జురెల్ (125) కూడా శతక్కొట్టాడు.ఈ మ్యాచ్లో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 162, రెండో ఇన్నింగ్స్లో 146 పరుగులకు కుప్పకూలింది. భారత్.. రాహుల్, జురెల్, జడ్డూ శతకాలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్లు కూడా సత్తా చాటారు. సిరాజ్ తొలి ఇన్నింగ్స్లో 4, రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీయగా.. బుమ్రా తొలి ఇన్నింగ్స్లో 3, కుల్దీప్ తొలి ఇన్నింగ్స్లో 2, రెండో ఇన్నింగ్స్లో 2, వాషింగ్టన్ సుందర్ రెండు ఇన్నింగ్స్ల్లో తలో వికెట్, జడేజా రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీశాడు. చదవండి: IND vs AUS: చెలరేగిన భారత బౌలర్లు.. వైభవ్ సూర్యవంశీ స్కోర్ ఎంతంటే..? -
చెలరేగిన భారత బౌలర్లు.. వైభవ్ సూర్యవంశీ స్కోర్ ఎంతంటే..?
ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో ఇవాళ (అక్టోబర్ 7) ప్రారంభమైన రెండో యూత్ టెస్ట్లో (IND U19 Vs AUS U19) యువ భారత్ బౌలర్లు చెలరేగిపోయారు. హెనిల్ పటేల్ (9-3-21-3), ఖిలన్ పటేల్ (12-5-23-3), ఉధవ్ మోహన్ (6-0-23-2), దీపేశ్ దేవేంద్రన్ (7.3-2-22-1) ధాటికి ఆస్ట్రేలియా 43.3 ఓవర్లలో 135 పరుగులకే కుప్పకూలింది.ఆసీస్ ఇన్నింగ్స్లో వికెట్ కీపర్ లీ యంగ్ (66) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. మరో ఇద్దరు (యశ్ దేశ్ముఖ్ (22), కెప్టెన్ విల్ మలాజ్చుక్ (10)) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. అలెక్స్ టర్నర్ (6), జెడ్ హోల్లిక్ (7), జేడన్ డ్రేపర్ (2), కేసీ బార్టన్ (9), ఛార్లెస్ లచ్మండ్ (1) అతి కష్టం మీద సింగిల్ డిజిట్ స్కోర్లు చేయగా.. సైమన్ బడ్జ్, విల్ బైరోమ్ డకౌట్లయ్యారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కూడా తడబడుతుంది. వైభవ్ సూర్యవంశీ స్థానంలో ఓపెనర్గా ప్రమోషన్ పొందిన విహాన్ మల్హోత్రా 11 పరుగులకే ఔట్ కాగా.. మరో ఓపెనర్, టీమిండియా కెప్టెన్ అయిన ఆయుశ్ మాత్రే (4) వైఫల్యాల పరంపరను కొనసాగించాడు.ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని విధంగా వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) వచ్చీ రాగానే ఎదురుదాడికి దిగినా ఎంతో సేపు క్రీజ్లో నిలబడలేకపోయాడు. వైభవ్ 14 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 20 పరుగులు చేసి ఔటయ్యాడు.తొలి రోజు టీ విరామం సమయానికి భారత స్కోర్ 3 వికెట్ల నష్టానికి 59 పరుగులుగా ఉంది. వేదాంత్ త్రివేది (11), రాహుల్ కుమార్ (6) క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో విల్ బైరోమ్ (5-0-22-2), ఛార్లెస్ లచ్మండ్ (6-0-33-1) భారత బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 76 పరుగులు వెనుకపడి ఉంది.కాగా, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ల కోసం భారత అండర్ 19 జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలుత జరిగిన వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. టెస్ట్ సిరీస్లోనూ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్ను కూడా గెలిస్తే భారత్ ఆసీస్ను వారి సొంత ఇలాకాలో పూర్తిగా క్వీన్ స్వీప్ చేసినట్లవుతుంది.చదవండి: భారత్తో వన్డే సిరీస్కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. నిప్పులు చెరిగే బౌలర్ వచ్చేశాడు..! -
భారత్తో వన్డే సిరీస్కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. నిప్పులు చెరిగే బౌలర్ వచ్చేశాడు..!
అక్టోబర్ 19 నుంచి స్వదేశంలో భారత్తో జరుగబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును (Australia) ఇవాళ (అక్టోబర్ 7) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా మిచెల్ మార్ష్ (Mitchell March) ఎంపిక కాగా.. పలువురు స్టార్ ఆటగాళ్లు ఈ సిరీస్తో రీఎంట్రీ ఇచ్చారు.ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్కు దూరంగా ఉన్న స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) ఈ సిరీస్లో బరిలోకి దిగనుండగా.. గాయాల నుంచి కోలుకొని మాథ్యూ షార్ట్, మిచెల్ ఓవెన్ రీఎంట్రీ ఇచ్చారు. ఓపెనింగ్ బ్యాటర్ మ్యాట్ రెన్షా 2022 తర్వాత తొలిసారి వన్డే జట్టుకు ఎంపికయ్యాడు.నవంబర్లో ప్రారంభమయ్యే యాషెస్ సిరీస్కు సన్నద్దమయ్యేందుకు పాట్ కమిన్స్ ఈ సిరీస్కు దూరంగా ఉండగా.. సౌతాఫ్రికాతో ఇటీవల ఆడిన సిరీస్లో భాగమైన లబూషేన్, కుహ్నేమన్, ఆరోన్ హార్డీ, సీన్ అబాట్పై వేటు పడింది. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ దేశవాలీ కమిట్మెంట్స్ కారణంగా తొలి వన్డేకు దూరంగా ఉండి, చివరి రెండు వన్డేలకు అందుబాటులోకి వస్తాడు.భారత్తో సిరీస్కు ఆస్ట్రేలియా వన్డే జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ క్యారీ, కూపర్ కన్నోల్లీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, అడమ్ జాంపావన్డే సిరీస్ షెడ్యూల్..తొలి వన్డే- అక్టోబర్ 19 (పెర్త్)రెండో వన్డే- అక్టోబర్ 23 (అడిలైడ్)మూడో వన్డే- అక్టోబర్ 25 (సిడ్నీ)వన్డే సిరీస్తో పాటు 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్తో జరిగే తొలి రెండు టీ20లకు కూడా ఆసీస్ జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు కూడా మిచెల్ మార్షే కెప్టెన్గా వ్యవహరిస్తుండగా.. గాయాల నుంచి కోలుకొని ఇంగ్లిస్, ఎల్లిస్ రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా న్యూజిలాండ్ పర్యటనలో గాయపడిన మ్యాక్స్వెల్ ఈ జట్టుకు ఎంపిక కాలేదు.న్యూజిలాండ్ సిరీస్లో ఆడిన జోష్ ఫిలిప్, అలెక్స్ క్యారీకి ఈ జట్టులో చోటు దక్కలేదు. మిగతా జట్టంతా యధాతథంగా కొనసాగింది.భారత్తో తొలి రెండు టీ20లకు ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నేమన్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, అడమ్ జాంపాటీ20 సిరీస్ షెడ్యూల్తొలి టీ20- అక్టోబర్ 29 (కాన్బెర్రా)రెండో టీ20- అక్టోబర్ 31 (మెల్బోర్న్)మూడో టీ20- నవంబర్ 2 (హోబర్ట్)నాలుగో టీ20- నవంబర్ 6 (గోల్డ్ కోస్ట్)ఐదో టీ20- నవంబర్ 8 (బ్రిస్బేన్)చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా బ్యాటర్.. ప్రపంచంలో తొలి ప్లేయర్ -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా బ్యాటర్.. ప్రపంచంలో తొలి ప్లేయర్
సౌతాఫ్రికా ఓపెనింగ్ బ్యాటర్ తజ్మిన్ బ్రిట్స్ (Tazmin Brits) మహిళల వన్డే క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓ క్యాలెండర్ ఇయర్లో ఐదు సెంచరీలు బాదిన తొలి మహిళా ప్లేయర్గా రికార్డు నెలకొల్పింది. వన్డే వరల్డ్కప్ 2025లో భాగంగా న్యూజిలాండ్తో నిన్న (అక్టోబర్ 6) జరిగిన మ్యాచ్లో సెంచరీ చేయడంతో ఈ ఘనత సాధించింది.తజ్మిన్కు ముందు ఈ రికార్డు టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) ఖాతాలో ఉండిది. మంధన 2024, 2025 క్యాలెండర్ ఇయర్స్లో నాలుగు సెంచరీలు బాదింది. తాజాగా తజ్మిన్ మంధన రికార్డును బద్దలు కొట్టి, సరికొత్త చరిత్ర సృష్టించింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ సుదీర్ఘంగా సాగనుండటంతో మంధన తిరిగి తన రికార్డును తజ్మిన్ నుంచి చేజిక్కించుకునే అవకాశాలు లేకపోలేదు. ఇటీవలికాలంలో మంధన కూడా అరివీర భయంకరమైన ఫామ్లో ఉంది. అయితే ఈ ప్రపంచకప్లో మాత్రం తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైంది.తజ్మిన్ ఖాతాలో మరో భారీ రికార్డుతాజా సెంచరీతో తజ్మిన్ మరో భారీ రికార్డును కూడా సొంతం చేసుకుంది. అతి తక్కువ ఇన్నింగ్స్ల్లో 7 సెంచరీలు పూర్తి చేసిన ప్లేయర్గా ఆసీస్ దిగ్గజం మెగ్ లాన్నింగ్ రికార్డును బ్రేక్ చేసింది. వన్డేల్లో 7 సెంచరీలు పూర్తి చేసేందుకు లాన్నింగ్కు 44 ఇన్నింగ్స్లు అవసరం కాగా.. తజ్మిన్ కేవలం 41 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించింది. ప్రపంచంలో తజ్మిన్, లాన్నింగ్ మినహా ఏ ఒక్క మహిళా ప్లేయర్ కూడా కనీసం 50 ఇన్నింగ్స్ల్లో 7 వన్డే సెంచరీలు పూర్తి చేయలేకపోయారు.మ్యాచ్ విషయానికొస్తే.. తజ్మిన్ మెరుపు సెంచరీతో (89 బంతుల్లో 101; 15 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో న్యూజిలాండ్పై సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 47.5 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా 40.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తజ్మిన్కు సూన్ లస్ (83 నాటౌట్) కూడా తోడవ్వడంతో సౌతాఫ్రికా సునాయాస విజయాన్ని సాధించింది. అంతకుముందు సోఫీ డివైన్ (85) రాణించడంతో న్యూజిలాండ్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఈ మ్యాచ్ తజ్మిన్తో పాటు న్యూజిలాండ్ ప్లేయర్స్ సూజీ బేట్స్, సోఫీ డివైన్కు కూడా ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది. ఎందుకంటే బేట్స్ మహిళ క్రికెట్లో 350 మ్యాచ్లు ఆడిన తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. సోఫీ డివైన్కు కూడా ఇది 300వ అంతర్జాతీయ మ్యాచ్. అతి తక్కువ మంది మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు.వైరలవుతున్న తజ్మిన్ సంబరాలుఈ మ్యాచ్లో తజ్మిన్ సెంచరీ తర్వాత చేసుకున్న 'బౌ అండ్ యారో' సంబరాలు వైరలవుతున్నాయి. తజ్మిన్ సెలబ్రేషన్స్కు భారత క్రికెట్ అభిమానులు సైతం ముగ్దులవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. The moment Tazmin Brits made it 4️⃣ hundreds in her last 5️⃣ ODIs 🤩Watch #NZvSA LIVE in your region, broadcast details here ➡️ https://t.co/MNSEqhJP29#CWC25 pic.twitter.com/NfSYRjCsOY— ICC Cricket World Cup (@cricketworldcup) October 6, 2025తజ్మిన్ ఇంతకుముందు కూడా ఇలాంటి వినూత్న సంబరాలు చేసుకొని వార్తల్లో నిలిచింది. ఒంటికాలిపై యోగాసనం లాంటివి చేసి బాగా పాపులరైంది.యాదృచ్చికంతజ్మిన్ ఓ క్యాలెండర్ ఇయర్లో 5 సెంచరీలు చేసిన రోజే (అక్టోబర్ 6), సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ గ్యారీ కిర్స్టన్ కూడా ఈ ఫీట్ను నమోదు చేశాడు. పురుషుల క్రికెట్లో కిర్స్టన్ 1996 క్యాలెండర్ ఇయర్లో ఇదే రోజు తన ఐదో వన్డే సెంచరీని పూర్తి చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి సౌతాఫ్రికన్గా చరిత్ర సృష్టించాడు. ఒకే రోజు ఇద్దరు సౌతాఫ్రికన్లు ఒకే ఫీట్ను సాధించడం యాదృచ్చికంగా జరిగింది.5 ఇన్నింగ్స్ల్లో 4 శతకాలుతజ్మిన్ తన వన్డే కెరీర్లో చేసిన 7 సెంచరీల్లో నాలుగింటిని గత 5 ఇన్నింగ్స్ల్లోనే చేయడం విశేషం. ఈ సెంచరీకి ముందు ఇంగ్లండ్తో వన్డేలో (5) విఫలమైన ఆమె.. అంతకుముందు మూడు వన్డేల్లో పాక్పై 2, వెస్టిండీస్పై ఓ సెంచరీ సాధించింది.గత 5 వన్డే ఇన్నింగ్స్ల్లో తజ్మిన్ స్కోర్లు- 101(91) Vs వెస్టిండీస్- 101*(121) Vs పాక్- 171*(141) Vs పాక్- 5(13) Vs ఇంగ్లండ్- 101(89) Vs న్యూజిలాండ్ (WC)తజ్మిన్ గురించి ఆసక్తికర విషయాలు..ప్రస్తుతం స్టార్ క్రికెటర్గా చలామణి అవుతున్న తజ్మిన్ తన కెరీర్ను అథ్లెట్గా మొదలుపెట్టింది. 2007లో ఆమె వరల్డ్ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించింది. 2012 ఒలింపిక్స్కు ఎంపిక కావాల్సిన సమయంలో ఆమె రోడ్డు ప్రమాదానికి గురై, రెండు నెలలు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. దీంతో అథ్లెట్గా ఆమె కెరీర్ అక్కడితో ముగిసింది. ఆతర్వాత 2018లో దక్షిణాఫ్రికా జట్టుకు ఎంపికైన తజ్మిన్ అప్పటి నుంచి కెరీర్ను విజయవంతంగా కొనసాగిస్తుంది. తజ్మిన్ తన తొలి 40 వన్డేల్లో ఒక్క డకౌట్ కూడా కాకుండా ఆడి అరుదైన ఆటగాళ్ల జాబితాలో నిలిచింది. చదవండి: రిషబ్ పంత్ రీఎంట్రీ..! -
జింబాబ్వేకు అదనపు బోనస్
2026 టీ20 ప్రపంచకప్కు అర్హత సాధించిన జింబాబ్వే క్రికెట్ జట్టుకు (Zimbabwe) అదనపు బోనస్ లభించింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్లో (ICC T20 World Cup 2026 Africa Regional Qualifiers) ఆ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో నమీబియాపై (Namibia) 7 వికెట్ల తేడాతో గెలుపొంది, ఆఫ్రికా క్వాలిఫయర్స్ టైటిల్ను కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. జింబాబ్వే మరో నాలుగు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. మరుమణి (74 నాటౌట్), డియాన్ మైర్స్ (44), ర్యాన్ బర్ల్ (26 నాటౌట్) జింబాబ్వే గెలుపులో కీలకపాత్ర పోషించారు. అంతకుముందు బౌలింగ్లో నగరవ 3 వికెట్లతో సత్తా చాటాడు.ఫైనల్లో ఓడినా నమీబియా కూడా జింబాబ్వేతో పాటు 2026 ప్రపంచకప్కు అర్హత సాధించింది. ఆఫ్రికా క్వాలిఫయర్స్ నుంచి ఈ రెండు జట్లు ప్రపంచకప్ బెర్త్లు దక్కించుకున్నాయి. జింబాబ్వే గత సీజన్ క్వాలిఫయర్స్లో సత్తా చాటలేక 2024 ప్రపంచకప్కు అర్హత సాధించలేకపోయింది.ఇటీవలికాలంలో సికందర్ రజా నేతృత్వంలో బాగా మెరుగుపడిన జింబాబ్వే తిరిగి ప్రపంచకప్ బెర్త్ దక్కించుకుంది. జింబాబ్వే, నమీబియా బెర్త్లు ఖరారు కావడంతో ప్రపంచకప్కు అర్హత సాధించిన జట్ల సంఖ్య 17కి చేరింది. ఇంకా మూడు జట్లు అర్హత సాధించాల్సి ఉంది. ఆ మూడు జట్లు ఆసియా క్వాలిఫయర్స్ ద్వారా ఖరారవుతాయి.ఇప్పటిదాకా భారత్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ స్టేట్స్, వెస్టిండీస్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, నమీబియా, జింబాబ్వే ప్రపంచకప్కు అర్హత సాధించాయి.చదవండి: రిషబ్ పంత్ రీఎంట్రీ..! -
రిషబ్ పంత్ రీఎంట్రీ..!
ఇంగ్లండ్ పర్యటనలో గాయపడి, కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న టీమిండియా స్టార్ వికెట్కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) రీఎంట్రీకి సిద్దమైనట్లు తెలుస్తుంది. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న అతను త్వరలో జరుగబోయే రంజీ ట్రోఫీలో (Ranji Trophy) తన సొంత జట్టు ఢిల్లీ (Delhi) తరఫున బరిలోకి దిగనున్నాడని సమాచారం.జట్టులోకి రావడమే కాకుండా రంజీ ట్రోఫీలో పంత్ ఢిల్లీ కెప్టెన్గానూ వ్యవహరిస్తాడని తెలుస్తుంది. అయితే ఇదంతా బీసీసీఐ మెడికల్ టీమ్ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ లభించిన తర్వాతే జరుగుతుందని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (DDCA) అధికారి ఒకరు తెలిపారు.అతని మాటల్లో.. పంత్ అక్టోబర్ 25 నుంచి ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్లు ఆడేందుకు అందుబాటులో ఉంటారు. అయితే అతను క్యాంప్లో చేరే ఖచ్చితమైన తేదీని ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే అతనికి బీసీసీఐ మెడికల్ టీమ్ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ రావాల్సి ఉంది. పంత్ అందుబాటులో వస్తే ఢిల్లీ జట్టుకు కెప్టెన్గానూ వ్యవహరించే అవకాశం ఉంది.కాగా, పంత్ ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనలో నాలుగో టెస్ట్ సందర్భంగా తీవ్రంగా గాయపడ్డాడు. ఆ గాయం కారణంగా ఆసియా కప్, వెస్టిండీస్ టెస్ట్ సిరీస్లకు దూరంగా ఉన్నాడు. గాయానికి చికిత్స పూర్తైనప్పటి నుంచి బీసీసీఐ సెంటల్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఉన్న పంత్ పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం.బీసీసీఐ నుంచి క్లియరెన్స్ వస్తే అతను త్వరలో జరుగబోయే రంజీ ట్రోఫీలో పాల్గొంటాడు. ఈ మధ్యలో భారత్ ఆస్ట్రేలియాలో పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడేందుకు వెళ్లనుంది. ఇందులో రెండు ఫార్మాట్ల (వన్డే, టీ20) జట్లకు పంత్ ఎంపిక కాలేదు. కాబట్టి అతను నవంబర్ మధ్య వరకు ఖాళీగా ఉంటాడు.ఈ మధ్యలో రంజీ ట్రోఫీలో సత్తా చాటితే, ఆతర్వాత జరిగే సౌతాఫ్రికా సిరీస్కు అతను సన్నద్దమవుతాడు. సౌతాఫ్రికా నవంబర్ 14 నుంచి భారత్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో రెండు టెస్ట్లు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.ఇదిలా ఉంటే, రంజీ ట్రోఫీలో ఢిల్లీ ప్రయాణం అక్టోబర్ 15న హైదరాబాద్తో జరిగే మ్యాచ్తో మొదలవనున్నప్పటికీ.. పంత్ మాత్రం అక్టోబర్ 25 నుంచి హిమాచల్ ప్రదేశ్తో జరిగే మ్యాచ్ నుంచి అందుబాటులో ఉంటాడు.టీమిండియా షెడ్యూల్ విషయానికొస్తే.. భారత జట్టు ప్రస్తుతం స్వదేశంలో వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్లో ఇప్పటికే ఓ మ్యాచ్ అయిపోయగా.. మరో మ్యాచ్ మిగిలింది. ఆ మ్యాచ్ అక్టోబర్ 10 నుంచి ఢిల్లీ వేదికగా జరుగనుంది. అంతకుముందు అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది.ఈ సిరీస్ ముగిసిన వెంటనే భారత పరిమిత ఓవర్ల జట్లు అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటిస్తాయి. ఈ పర్యటనలో భారత్ 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఈ సిరీస్ల కోసం భారత జట్లను ఇదివరకే ప్రకటించారు. ఈ పర్యటనలోని వన్డే సిరీస్తో టీమిండియా వెటరన్ స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తిరిగి బరిలోకి దిగుతారు. వీరిద్దరు టీ20, టెస్ట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి, కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. రో-కో చివరిగా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్నారు. చదవండి: World Cup 2025: టీమిండియా చేతిలో ఓడినా చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ -
విశాఖ స్టేడియంలో మిథాలీ స్టాండ్
సాక్షి, విశాఖపట్నం: భారత మహిళా క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ను సముచిత రీతిలో గౌరవించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) సిద్ధమైంది. నగరంలోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఒక స్టాండ్కు మిథాలీ రాజ్ పేరు పెట్టనున్నారు. ఈ నెల 12న ఈ స్టేడియంలో భారత్, ఆ్రస్టేలియా మధ్య జరిగే ప్రపంచ కప్ మ్యాచ్ సందర్భంగా అధికారికంగా ఈ స్టాండ్ను ఆవిష్కరిస్తారు. 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో మిథాలీ 333 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడింది. 232 వన్డేల్లో 7805 పరుగులు చేసిన మిథాలీ... ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కొనసాగుతోంది. వీటిలో 155 మ్యాచ్లకు ఆమె కెప్టెన్గా వ్యవహరించడం విశేషం. మిథాలీ మరో 12 టెస్టులు, 89 అంతర్జాతీయ టి20 మ్యాచ్లు కూడా ఆడింది. భారత క్రికెట్లో ఒక మహిళా క్రీడాకారిణి పేరుతో స్టాండ్ ఉండటం ఇదే మొదటిసారి కానుంది. 2022లో రిటైర్ అయిన 43 ఏళ్ల మిథాలీ ప్రస్తుతం క్రికెట్ వ్యాఖ్యాతగా కొనసాగుతోంది.రావి కల్పన పేరుతోనూ... ఆంధ్రప్రదేశ్కు చెందిన మాజీ క్రికెటర్ రావి కల్పన పేరు కూడా ఇదే మైదానంలో మరో స్టాండ్కు పెట్టనున్నారు. వికెట్ కీపర్ అయిన కల్పన 2015–16 మధ్య భారత్ తరఫున 7 వన్డేలు ఆడింది. 29 ఏళ్ల కల్పన క్రికెట్ గణాంకాలు అసాధారణంగా లేకపోయినా ... అతి సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఆమె ఎదిగిన తీరు పలువురు మహిళా వర్ధమాన క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచింది. దీనినే దృష్టిలో ఉంచుకొని ఆమె పేరుతో కూడా స్టాండ్ ఏర్పాటు చేస్తున్నారు. 2022లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన కల్పన దేశవాళీ క్రికెట్లో ఆంధ్ర, రైల్వేస్ జట్లకు ప్రాతినిధ్యం వహించింది.వైజాగ్లో భారత జట్టు ఈనెల 9న దక్షిణాఫ్రికాతో, 12న ఆ్రస్టేలియాతో విశాఖపట్నంలో జరిగే ప్రపంచకప్ మ్యాచ్ల కోసం భారత జట్టు సోమవారం కొలంబో నుంచి వైజాగ్కు చేరుకుంది. కొలంబోలో ఆదివారం పాకిస్తాన్ జట్టుతో ఆడిన భారత జట్టు 88 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. -
మెరిసిన దక్షిణాఫ్రికా
వన్డే ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా మహిళల జట్టు తమ స్థాయికి తగ్గ ప్రదర్శనను కనబర్చింది. తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో అనూహ్యంగా 69 పరుగులకే కుప్పకూలి తీవ్ర విమర్శలపాలైన సఫారీ టీమ్ వెంటనే కోలుకుంది. టోర్నీ ఫేవరెట్లలో ఒకటైన న్యూజిలాండ్ జట్టును ఓడించి టోరీ్నలో గెలుపు బోణీ చేసింది. బౌలింగ్లో ఎంలాబా ప్రదర్శనకు తోడు బ్యాటింగ్లో తజీ్మన్ బ్రిట్స్ సెంచరీ, సూన్ లూస్ కీలక ఇన్నింగ్స్ కలిపి జట్టుకు విజయాన్ని అందించాయి. ఇండోర్: మహిళల వన్డే వరల్డ్ కప్లో దక్షిణాఫ్రికా కీలక విజయాన్ని అందుకుంది. బలమైన జట్లలో ఒకటైన న్యూజిలాండ్... సఫారీ సమష్టి ప్రదర్శన ముందు తలవంచింది. సోమవారం జరిగిన ఈ పోరులో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో కివీస్ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 47.5 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. అనంతరం దక్షిణాఫ్రికా 40.5 ఓవర్లలో 4 వికెట్లకు 234 పరుగులు సాధించి గెలిచింది. ఈ టోరీ్నలో న్యూజిలాండ్కిది వరుసగా రెండో ఓటమి. దక్షిణాఫ్రికా తమ తర్వాతి మ్యాచ్లో గురువారం విశాఖపట్నంలో భారత్తో తలపడుతుంది. అంతర్జాతీయ కెరీర్లో 350వ మ్యాచ్ ఆడిన కివీస్ ఓపెనర్ సుజీ బేట్స్ ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్గా నిలిచింది. అయితే దురదృష్టవశాత్తూ ఈ మైలురాయి మ్యాచ్లో ఇన్నింగ్స్ తొలి బంతికే (0) వెనుదిరిగింది. అయితే ఆ తర్వాత మూడు భాగస్వామ్యాలతో కివీస్ జట్టు కోలుకుంది. జార్జియా ప్లిమ్మర్ (68 బంతుల్లో 31; 4 ఫోర్లు), అమేలియా కెర్ (42 బంతుల్లో 23; 4 ఫోర్లు) రెండో వికెట్కు 44 పరుగులు జోడించారు. ఆ తర్వాత కెప్టెన్ సోఫీ డివైన్ (98 బంతుల్లో 85; 9 ఫోర్లు) ముందుండి ఇన్నింగ్స్ను నడిపించింది. డివైన్ మూడో వికెట్కు అమేలియాతో 57 పరుగులు, నాలుగో వికెట్కు బ్రూక్ హాలిడే (37 బంతుల్లో 45; 6 ఫోర్లు)తో 86 పరుగులు జత చేసింది. అయితే తర్వాతి బ్యాటర్లంతా విఫలం కావడంతో కివీస్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. 44 పరుగుల తేడాతో కివీస్ జట్టు చివరి 7 వికెట్లు చేజార్చుకుంది. దక్షిణాఫ్రికా లెఫ్టార్మ్ స్పిన్నర్ నాన్కులులెకో ఎంలాబా (4/40) ప్రత్యరి్థని దెబ్బ తీసింది. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా కెపె్టన్ లారా వోల్వార్ట్ (14) ఆరంభంలోనే అవుటైంది. అయితే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తజీ్మన్ బ్రిట్స్ (89 బంతుల్లో 101; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగి జట్టు విజయానికి బాటలు వేసింది. బ్రిట్స్, సూన్ లూస్ (114 బంతుల్లో 83 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్కు 170 బంతుల్లో 159 పరుగులు జోడించి జట్టును గెలుపునకు చేరువగా తీసుకొచ్చారు. ఆ తర్వాత బ్రిట్స్తో పాటు మరిజాన్ కాప్ (14), అనెక్ బాష్ (0) తక్కువ వ్యవధిలో అవుటైనా... లూస్ అజేయంగా నిలిచి విజయం పూర్తి చేసింది. 350: న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్కు ఇది 350వ అంతర్జాతీయ మ్యాచ్. అత్యధిక మ్యాచ్లు ఆడిన జాబితాలో బేట్స్ అగ్ర స్థానంలో ఉండగా... ఆ తర్వాత వరుసగా హర్మన్ప్రీత్ కౌర్ (342), ఎలైస్ పెరీ (341), మిథాలీ రాజ్ (333), చార్లెట్ ఎడ్వర్డ్స్ (309) ఉన్నారు. ఇదే మ్యాచ్లో కివీస్ కెప్టెన్ సోఫీ డివైన్ 300 అంతర్జాతీయ మ్యాచ్లు పూర్తి చేసుకొని ఈ జాబితాలో డానీ వ్యాట్ (300)తో సమంగా ఆరో స్థానంలో నిలిచింది. -
పంత్ తిరిగి వస్తే ఏంటి?.. అతడికి మాత్రం తిరుగులేదు!
భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) గాయం కారణంగా కొన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ కాలికి గాయమైంది. మాంచెస్టర్లో జరిగిన నాలుగో టెస్టు సందర్భంగా పంత్ ఎడమకాలి పాదం ఫ్రాక్చర్ అయింది.త్వరలోనే రీఎంట్రీఅయినప్పటికీ కట్టుతోనే బ్యాటింగ్కు దిగిన పంత్ అర్ధ శతకం సాధించాడు. అయితే, గాయం తీవ్రం కావడంతో నిర్ణయాత్మక ఐదో టెస్టుకు ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ దూరమయ్యాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పునరావాస శిబిరంలో చికిత్స తీసుకున్న పంత్.. త్వరలోనే జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది.అయితే, పంత్ గైర్హాజరీలో మరో యువ ఆటగాడు ధ్రువ్ జురెల్ టెస్టు జట్టులో వికెట్ కీపర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా-ఎ జట్టుతో అనధికారిక రెండో టెస్టులో కెప్టెన్గానూ వ్యవహరించాడు. ఇక ఇటీవల వెస్టిండీస్తో తొలి మ్యాచ్ సందర్భంగా జురెల్ టెస్టుల్లో తన తొలి సెంచరీ నమోదు చేశాడు.పంత్ తిరిగి వస్తే అతడి పరిస్థితి ఏమిటి?గత కొన్నాళ్లుగా నిలకడగా పరుగులు సాధిస్తున్న 24 ఏళ్ల జురెల్ జట్టులో పాతుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే, పంత్ తిరిగి వస్తే అతడి పరిస్థితి ఏమిటన్న సందేహాల నడుమ.. భారత మాజీ క్రికెటర్ సదగోపర్ రమేశ్ (Sadagoppan Ramesh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘‘వెస్టిండీస్తో అహ్మదాబాద్ టెస్టులో జురెల్ అద్భుతమైన ఇన్నింగ్స్ (125) ఆడాడు. విండీస్ బౌలింగ్ అటాక్ పేలవంగానే ఉన్నా.. జురెల్ ఒత్తిడిలో ఉండటం సహజం.అచ్చమైన బ్యాటర్గా..ఎందుకంటే బీస్ట్ లాంటి పంత్తో అతడికి పోటీ ఉంది. అయితే, ఈ సెంచరీ ద్వారా మేనేజ్మెంట్కు అతడు ఓ విషయం స్పష్టం చేశాడు. తనకు, పంత్కు మధ్య పోటీ లేదని.. అచ్చమైన బ్యాటర్గా తాను అందుబాటులో ఉంటానని సంకేతాలు ఇచ్చాడు.సాయి సుదర్శన్ గనుక మూడో స్థానంలో విఫలమవుతూ ఉన్నా... నితీశ్ రెడ్డి బ్యాట్తో రాణించకపోయినా.. ఈ రెండు సందర్భాల్లో జురెల్కు ఢోకా ఉండదు. ఒకవేళ రిషభ్ పంత్ తిరిగి వచ్చినా జురెల్ మూడో నంబర్ ఆటగాడిగా ఫిక్సయిపోవచ్చు’’ అని సదగోపన్ రమేశ్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా జురెల్ ఇప్పటి వరకు టీమిండియా తరఫున ఆరు టెస్టుల్లో కలిపి 380 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ, సెంచరీ ఉన్నాయి.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
గిల్ కాదు!.. సూర్య తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్ అతడే!
భారత క్రికెట్లో గత కొన్నాళ్లుగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీమిండియా జూన్లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే ముందే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులకు వీడ్కోలు పలకగా.. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)కూడా సంప్రదాయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.రో- కో బైబైఅంతకంటే ముందే.. అంటే 2024లో టీమిండియా టీ20 ప్రపంచకప్ టైటిల్ సాధించిన తర్వాత రోహిత్- కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు వన్డేల్లో మాత్రమే కొనసాగుతండగా.. ఆస్ట్రేలియా టూర్కు ముందు బీసీసీఐ రోహిత్పై వేటు వేసింది. వన్డే కెప్టెన్సీ నుంచి అతడిని తప్పించింది.ఇప్పటికే టెస్టు జట్టు సారథిగా వ్యవహరిస్తున్న యువ ఆటగాడు శుబ్మన్ గిల్ (Shubman Gill)ను.. వన్డేలకూ కెప్టెన్గా నియమించింది. ఈ విషయం గురించి టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు ఉండటం సరికాదని పేర్కొన్నాడు.గిల్కే మేనేజ్మెంట్ మద్దతువన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి పూర్తిస్థాయిలో జట్టును సిద్ధం చేసే క్రమంలో గిల్కు సారథ్య బాధ్యతలు అప్పగించినట్లు అగార్కర్ తెలిపాడు. అంతేకాదు.. రోహిత్- కోహ్లి వన్డే ప్రపంచకప్ టోర్నీ ఆడతామనే హామీ ఇవ్వలేదంటూ అభిమానుల హృదయాలు ముక్కలు చేశాడు.ఇదిలా ఉంటే.. టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్ అయిన గిల్.. త్వరలోనే టీ20 కెప్టెన్గానూ స్వీకరించబోతున్నట్లు అగార్కర్ మాటలను బట్టి అర్థమవుతోంది. ప్రస్తుతం టీమిండియా టీ20 కెప్టెన్గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్-2026 తర్వాత తప్పుకొంటే.. గిల్ అతడి స్థానాన్ని భర్తీ చేస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.టెస్టులలో ఒకే.. కానీ వన్డేలలో..ఇలాంటి తరుణంలో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప మాత్రం భిన్నంగా స్పందించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘టెస్టు ఫార్మాట్కు గిల్ కెప్టెన్ కావడం మంచి పరిణామం. అందుకు తాను అర్హుడినని ఇప్పటికే తను నిరూపించుకుంటున్నాడు.అయితే, వన్డేల్లో మాత్రం.. గిల్ కంటే గొప్ప సామర్థ్యమున్న ఆటగాడు టీమిండియాకు దొరికేవాడు. బ్యాటర్గా అతడి గణాంకాలు ఫర్వాలేదు. కానీ ఇప్పటికిప్పుడు కెప్టెన్ అంటేనే కాస్త చిత్రంగా ఉంది.శ్రేయస్ అయ్యర్ వైపు చూపుటీ20 ఫార్మాట్లో మాత్రం ఇప్పటికీ శుబ్మన్ గిల్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నాల్లోనే ఉన్నాడు. నాకు తెలిసి టీ20 భవిష్య కెప్టెన్గా యాజమాన్యం శ్రేయస్ అయ్యర్ వైపు దృష్టి సారించే అవకాశం ఉందనిపిస్తోంది’’ అని భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప అభిప్రాయపడ్డాడు. కాగా ఫిట్నెస్ సమస్యల కారణంగా ఇటీవల టెస్టు ఫార్మాట్ నుంచి విరామం తీసుకున్న శ్రేయస్ అయ్యర్.. వన్డేల్లో మాత్రం సత్తా చాటుతున్నాడు. ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా తరఫున టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.జట్టులోనే స్థానం లేదుమరోవైపు.. ఐపీఎల్లో గతేడాది కెప్టెన్గా కోల్కతా నైట్రైడర్స్ను చాంపియన్గా నిలిపిన శ్రేయస్ అయ్యర్.. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ సారథిగా జట్టును ఫైనల్కు చేర్చాడు. బ్యాటర్గానూ పొట్టి ఫార్మాట్లో పరుగుల వరద పారించాడు. అయినప్పటికీ ఆసియా టీ20 కప్-2025 జట్టుకు సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు. ఆటగాడిగానే శ్రేయస్కు స్థానమివ్వని యాజమాన్యం.. సూర్యకుమార్ యాదవ్ తర్వాత అతడిని ఏకంగా కెప్టెన్ను చేస్తుందంటూ ఊతప్ప అంచనా వేయడం విశేషం. కాగా ఆసీస్తో వన్డేలకు గిల్కు డిప్యూటీగా.. వైస్ కెప్టెన్గా అయ్యర్ ఎంపిక కావడం గమనార్హం.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
తగ్గేదేలే!.. 459 పరుగులు.. ద్రవిడ్ చిన్న కుమారుడి జోరు..
టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) కుమారులు ఇద్దరూ తండ్రి బాటలోనే నడుస్తున్నారు. పెద్ద కుమారుడు సమిత్ ద్రవిడ్, చిన్న కొడుకు అన్వయ్ ద్రవిడ్ (Anvay Dravid) కర్ణాటక క్రికెట్ జట్టు తరఫున సత్తా చాటుతున్నారు.సమిత్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కాగా.. అన్వయ్ వికెట్ కీపర్ బ్యాటర్గా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. కాగా అండర్-16 క్రికెట్లో సత్తా చాటుతున్న అన్వయ్కు తాజాగా అవార్డు లభించింది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA) అతడిని సత్కరించింది.అత్యధిక పరుగుల వీరుడిగా మయాంక్తమ రాష్ట్రం తరఫున సత్తా చాటుతున్న క్రికెటర్లకు కేఎస్సీఏ ప్రతి ఏడాది అవార్డులు ఇస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం పురస్కారాలు అందజేసే కార్యక్రమం నిర్వహించింది. ఇందులో భాగంగా టీమిండియా వెటరన్ ఆటగాడు మయాంక్ అగర్వాల్ను సత్కరించింది.గతేడాది దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో ఓపెనింగ్ బ్యాటర్ మయాంక్ అగార్వల్ సగటు 93తో 651 పరుగులు చేసి.. లిస్ట్-ఎ క్రికెట్లో కర్ణాటక తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. ఇక టీమిండియా దిగ్గజం, మాజీ హెడ్కోచ్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ వరుసగా రెండో ఏడాది సత్తా చాటి అవార్డు అందుకున్నాడు.రెండు సెంచరీలు.. 459 పరుగులు.. అండర్-19 విజయ్ మర్చంట్ ట్రోఫీ (రెడ్బాల్)లో భాగంగా ఆరు మ్యాచ్లు ఆడిన అన్వయ్.. 91.80 సగటుతో 459 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండగా.. 46 బౌండరీలు కూడా అన్వయ్ ఖాతాలో చేరాయి. తద్వారా కర్ణాటక తరఫున టాప్ రన్ స్కోరర్గా నిలిచి అన్వయ్ అవార్డు అందుకున్నాడు.ఈ నేపథ్యంలో తండ్రి తగ్గ తనయుడు అంటూ అన్వయ్ను ద్రవిడ్ అభిమానులు కొనియాడుతున్నాడు. ఇదే జోరు కొనసాగిస్తూ.. టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.వీరికి కూడా అవార్డులుఇదిలా ఉంటే.. మిగతా వారిలో ఎడమచేతి వాటం బ్యాటర్ ఆర్. స్మరణ్ రంజీ ట్రోఫీలో రెండు శతకాల సాయంతో 516 పరుగులు చేసి.. టాప్ రన్ స్కోరర్గా అవార్డు అందుకున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో వాసుకీ కౌశిక్ గతేడాది 23 వికెట్లు పడగొట్టి పురస్కారం అందుకున్నాడు. అయితే, ఈ ఏడాది అతడు గోవాకు ఆడబోతుండటం గమనార్హం.అదే విధంగా.. లెగ్ స్పిన్నర్ శ్రేయస్ గోపాల్తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ శ్రీజిత్ కూడా సత్తా చాటి పురస్కారాలు అందుకున్నారు. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గోపాల్ 14 వికెట్లు తీయగా.. శ్రీజిత్ 213 పరుగులు సాధించాడు.ఇక మహిళా క్రికెటర్లకు కూడా KSCA ఈ సందర్భంగా అవార్డులు అందజేసింది. మలేషియా వేదికగా జరిగిన ఐసీసీ అండర్-19 వుమెన్స్ టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యులైన నికీ ప్రసాద్, మిథిలా వినోద్లను సత్కరించింది. అదే విధంగా పర్ఫామెన్స్ అనలిస్ట్ మాలా రంగస్వామికి కూడా అవార్డు అందజేసింది.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
ఇది నిజంగా సిగ్గుచేటు: రోహిత్పై గంభీర్ ‘కామెంట్స్’ వైరల్
టీమిండియా వన్డే కెప్టెన్ మార్పు విషయంలో హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పించాడంటూ హిట్మ్యాన్ అభిమానులు గౌతీని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. గౌతీతో పాటు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్క (Ajit Agarkar)ర్పై కూడా రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.అది సిగ్గుచేటుఈ నేపథ్యంలో గౌతం గంభీర్ రోహిత్ శర్మను ఉద్దేశించి గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో మరోసారి తెరమీదకు వచ్చింది. ఇందులో మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ కాకపోతే అది జట్టు చేసుకున్న దురదృష్టమే కానీ... రోహిత్కు కాదు.పరిమిత ఓవర్ల క్రికెట్ లేదంటే టీ20 జట్టుకు అతడు కెప్టెన్ కాలేదంటే.. అది సిగ్గుచేటు. ఇంతకంటే రోహిత్ శర్మ ఇంకేం చేస్తే కెప్టెన్సీకి అర్హుడు అవుతాడు?’’ అంటూ గంభీర్ టీమిండియా యాజమాన్యం తీరును విమర్శిస్తూ రోహిత్ శర్మకు మద్దతు తెలిపాడు. పరోక్షంగా విరాట్ కోహ్లిని టార్గెట్ చేశాడు.నాడు కోహ్లి స్థానంలో రోహిత్ శర్మకాగా టీ20 ప్రపంచకప్-2021లో కనీసం సెమీస్ కూడా చేరకుండానే టీమిండియా ఇంటిబాట పట్టడంతో అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత వన్డే సారథ్య బాధ్యతల నుంచి బీసీసీఐ కోహ్లిని తప్పించగా.. సౌతాఫ్రికా పర్యటన మధ్యలోనే టెస్టు కెప్టెన్సీ నుంచి కోహ్లి స్వయంగా తప్పుకొన్నాడు.ఈ క్రమంలో 2021-22 మధ్య కాలంలో కోహ్లి స్థానంలో రోహిత్ శర్మను మూడు ఫార్మాట్లలో కెప్టెన్ను చేసింది బీసీసీఐ. అప్పటి నుంచి రోహిత్ సారథ్యంలో టీ20 ద్వైపాక్షిక సిరీస్లలో సత్తా చాటిన టీమిండియా గతేడాది వరల్డ్కప్ గెలిచింది.అంతకుముందు వన్డే వరల్డ్కప్-2023లో అజేయంగా ఫైనల్ చేరింది. ఇటీవల ఐసీసీ చాంపియన్స్ట్రోఫీ-2025 గెలిచింది. అయితే, ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ వన్డేల్లో కొనసాగుతానని చెప్పగా.. బీసీసీఐ అనూహ్యంగా అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించింది.ఇపుడు రోహిత్ ప్లేస్లో గిల్రోహిత్ స్థానంలో టెస్టు సారథిగా వచ్చిన యువ ఆటగాడు శుబ్మన్ గిల్కు వన్డే పగ్గాలనూ అప్పగించింది. ఇందులో హెడ్కోచ్ గంభీర్ పాత్ర కీలకం అని తెలుస్తోంది. గంభీర్తో పాటు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కలిసి 38 ఏళ్ల రోహిత్ను కెప్టెన్గా తప్పించాలనే నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు జాతీయ మీడియాతో పేర్కొనడం గమనార్హం.ఈ నేపథ్యంలో గంభీర్ గతంలో రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపిస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. ‘‘అప్పుడలా.. ఇప్పుడిలా.. నిజంగానే ఇది సిగ్గుచేటు’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. కాగా వన్డే వరల్డ్కప్-2027 నాటికి గిల్ చుట్టు జట్టును నిర్మించే క్రమంలో అతడిని కెప్టెన్ను చేసినట్లు అగార్కర్ ఇప్పటికే స్పష్టం చేశాడు.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్Never seen anyone more hypocritical and two-faced than Gautam Gambhir. The same guy who once said, “If Rohit Sharma doesn’t become India’s captain, it’s India’s loss, not Rohit’s,” now doesn’t want him as captain after becoming coach himself. pic.twitter.com/pqRzYKDR2a— Kusha Sharma (@Kushacritic) October 4, 2025 -
IND vs PAK: పాకిస్తాన్ క్రికెటర్కు భారీ షాకిచ్చిన ఐసీసీ
పాకిస్తాన్ మహిళా క్రికెటర్ సిద్రా ఆమిన్ (Sidra Amin)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) భారీ షాకిచ్చింది. భారత్తో మ్యాచ్ సందర్భంగా ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఆమెను మందలించింది. అదే విధంగా.. ఓ డీమెరిట్ (Demerit Point) పాయింట్ను కూడా సిద్రా ఖాతాలో జమ చేసింది.అసలేం జరిగిందంటే... ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్ ఆడే మ్యాచ్లు మాత్రం తటస్థ వేదికైన శ్రీలంకలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దాయాదులు భారత్- పాక్ మధ్య ఆదివారం (అక్టోబరు 5) కొలంబో వేదికగా తలపడ్డాయి.భారత్ 247 పరుగులకు ఆలౌట్ఆర్.ప్రేమదాస స్టేడియంలో అనుకోని విధంగా టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు ప్రతికా రావల్ (31), స్మృతి మంధాన (23) ఫర్వాలేదనిపించగా.. వన్డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ 46 పరుగులతో రాణించింది.మిగతా వారిలో జెమీమా రోడ్రిగెస్ (32), దీప్తి శర్మ (25), రిచా ఘోష్ (35 నాటౌట్) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో డయానా బేగ్ నాలుగు వికెట్లు దక్కించుకోగా.. కెప్టెన్ ఫాతిమా సనా షేక్, సైదా ఇక్బాల్ చెరో రెండు, రమీన్ షమీమ్, నష్రా సంధూ ఒక్కో వికెట్ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.బౌలర్ల విజృంభణఇక లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్లు మునీబా అలీ (2), సదాఫ్ షమాస్ (6) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వాళ్లు కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయారు.సిద్రా ఆమిన్ హాఫ్ సెంచరీఐదో నంబర్లో ఆడిన నటాలియా పర్వేజ్ 33 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. వన్డౌన్ బ్యాటర్ సిద్రా ఆమిన్ ఒంటరి పోరాటం చేసింది. 106 బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 81 పరుగులు చేసింది. అయితే, పాక్ ఇన్నింగ్స్ 40వ ఓవర్ ఐదో బంతికి స్నేహ్ రాణా బౌలింగ్లో హర్మన్ప్రీత్కు క్యాచ్ ఇవ్వడంతో సిద్రా ఇన్నింగ్స్కు తెరపడింది.అప్పటికే పాక్ ఓటమి దాదాపు ఖరారు కాగా.. సిద్రా తన బ్యాట్ను నేలకేసి కొట్టి అసహనం వ్యక్తం చేసింది. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన ఐసీసీ.. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఆమెకు శిక్ష విధించింది.అందుకే సిద్రాకు పనిష్మెంట్ఈ మేరకు.. ‘‘ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం.. అంతర్జాతీయ మ్యాచ్లో క్రికెట్ పరికరాలు, దుస్తులు లేదంటే గ్రౌండ్ ఎక్విప్మెంట్, ఫిట్టింగ్స్ వంటి వాటికి నష్టం కలిగించేలా వ్యవహరించడం నేరం. సిద్రా ఈ నిబంధనను ఉల్లంఘించింది.అందుకే ఆమెను మందలించడంతో పాటు.. తన క్రమశిక్షణా రికార్డులో ఓ డీమెరిట్ పాయింట్ జత చేస్తున్నాం. గత 24 నెలల కాలంలో ఆమె చేసిన మొదటి తప్పిదం కాబట్టి ఇంతటితో సరిపెడుతున్నాం’’ అని ఐసీసీ సోమవారం నాటి ప్రకటనలో పేర్కొంది. సద్రా తన తప్పును అంగీకరించింది కావున తదుపరి విచారణ అవసరం లేకుండా పోయిందని.. ఐసీసీ ఈ సందర్భంగా తెలియజేసింది.ఆధిపత్యం చాటుకున్న భారత్కాగా సిద్రా అర్ధ శతకం వృథాగా పోయింది. భారత బౌలర్ల ధాటికి 43 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేసి పాక్ ఆలౌట్ అయింది. దీంతో భారత్ 88 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి.. వన్డేల్లో ముఖాముఖి పోరులో మరోసారి తమ ఆధిపత్యాన్ని (12-0) చాటుకుంది. పాక్తో తాజా మ్యాచ్లో భారత బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ క్రాంతి గౌడ్, దీప్తి శర్మ మూడేసి వికెట్లతో చెలరేగగా.. స్నేహ్ రాణా రెండు వికెట్లు తీసింది. దీప్తి, హర్మన్ రెండు రనౌట్లలో భాగమయ్యారు.స్ప్రే ప్రయోగిస్తూఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ సందర్భంగా మైదానంలో పురుగుల వల్ల భారత బ్యాటర్లు ఇబ్బంది పడుతున్న వేళ పాక్ కెప్టెన్ ఫాతిమా సనా స్ప్రే ప్రయోగిస్తూ.. పురుగులను వెళ్లగొట్టడం హైలైట్గా నిలిచింది. అంపైర్ల అనుమతితోనే ఆమె ఇలా చేయడం గమనార్హం.చదవండి: World Cup 2025: టీమిండియా చేతిలో ఓడినా చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ -
పాక్పై రికార్డు విజయం.. ఆసీస్ దిగ్గజాన్ని అధిగమించిన టీమిండియా కెప్టెన్
మహిళల వన్డే వరల్డ్కప్ 2025లో (Women's Cricket World Cup 2025) భాగంగా పాకిస్తాన్తో నిన్న (అక్టోబర్ 5) జరిగిన మ్యాచ్లో (India vs Pakistan) టీమిండియా 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి ఓ మోస్తరు స్కోర్కే (247) పరిమితమైనప్పటికీ.. ఆతర్వాత ఆ స్కోర్ను విజయవంతంగా కాపాడుకుంది. క్రాంతి గౌడ్ (10-3-20-3) అద్భుతమైన బౌలింగ్తో పాక్ పతనాన్ని శాశించింది. క్రాంతితో పాటు దీప్తి శర్మ (9-0-45-3), స్నేహ్ రాణా (8-0-38-2) కూడా సత్తా చాటడంతో పాక్ 43 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. పాక్ తరఫున సిద్రా అమీన్ (81) ఒంటరిపోరాటం చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అంతకుముందు భారత ఇన్నింగ్స్ డయానా బేగ్ (10-1-69-4) ధాటికి తడబడింది. టాపార్డర్ మొత్తానికి మంచి ఆరంభాలు లభించినా, ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. ఆఖర్లో రిచా ఘోష్ (20 బంతుల్లో 35 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించింది.ఈ గెలుపుతో భారత్ వన్డే ఫార్మాట్లో దాయాదిపై తమ రికార్డును (12-0) మరింత మెరుగుపర్చుకుంది. అలాగే వరల్డ్కప్ టోర్నీల్లోనూ పాక్పై ఆధిపత్యాన్ని (5-0) కొనసాగించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత క్రికెట్ జట్లు పాక్ను వరుసగా నాలుగు ఆదివారాల్లో ఓడించాయి. దీనికి ముందు భారత పురుషుల జట్టు ఆసియా కప్లో పాక్ను వరుసగా మూడు ఆదివారాల్లో ఓడించి ఆసియా ఛాంపియన్గా అవతరించింది.ఇదిలా ఉంటే, నిన్నటి గెలుపుతో భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet kaur) ఓ అరుదైన ఘనత సాధించింది. వన్డేల్లో ఆమె ప్లేయర్గా 90వ విజయాన్ని నమోదు చేసి, మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్ల జాబితాలో ఏడో స్థానానికి ఎగబాకింది. ఈ క్రమంలో ఆసీస్ దిగ్గజ ప్లేయర్, ఆ జట్టు మాజీ కెప్టెన్, రెండు సార్లు వన్డే ప్రపంచకప్ విన్నర్ మెగ్ లాన్నింగ్ను (Meg Lanning) అధిగమించింది. లాన్నింగ్ తన కెరీర్లో ప్లేయర్గా 89 విజయాలు సాధించగా.. హర్మన్ నిన్నటి మ్యాచ్తో ఆమెను దాటేసింది. ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అగ్రస్థానంలో ఉంది. మిథాలీ తన వన్డే కెరీర్లో 129 విజయాలు సాధించింది.మహిళల వన్డేల్లో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్లుమిథాలీ రాజ్- 129ఎల్లిస్ పెర్రీ- 125అలైస్సా హీలీ- 103బెలిండ క్లార్క్- 94కేట్ సీవర్ బ్రంట్- 93కేట్ ఫిజ్ప్యాట్రిక్- 91హర్మన్ప్రీత్ కౌర్- 90మెగ్ లాన్నింగ్- 89 చదవండి: లంక ప్రీమియర్ లీగ్లో భారత ఆటగాళ్లు.. చరిత్రలో తొలిసారి..! -
న్యూజిలాండ్ క్రికెటర్ వరల్డ్ రికార్డు.. చరిత్రలోనే తొలి ‘ప్లేయర్’గా..
న్యూజిలాండ్ వెటరన్ క్రికెటర్ సుజీ బేట్స్ (Suzie Bates) సరికొత్త చరిత్ర లిఖించింది. మహిళల క్రికెట్లో 350 మ్యాచ్ల క్లబ్లో చేరిన తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు సాధించింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 (ICC Womens World Cup)లో భాగంగా సౌతాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా సుజీ బేట్స్ ఈ ఫీట్ నమోదు చేసింది.చేదు అనుభవంఅయితే, మహిళా క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘట్టానికి చేరువైన వేళ.. సుజీ బేట్స్కు ఓ చేదు అనుభవం మాత్రం తప్పలేదు. కాగా న్యూజిలాండ్ తరఫున 2006లో అరంగేట్రం చేసిన ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్ ఇప్పటికీ జట్టులో ప్రధాన సభ్యురాలిగా కొనసాగుతుండటం విశేషం.గోల్డెన్ డకౌట్తన సుదీర్ఘ కెరీర్లో ఇప్పటి వరకు 172 వన్డేలు.. 177 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడింది సుజీ బేట్స్. సౌతాఫ్రికా మహిళలతో సోమవారం నాటి వరల్డ్కప్ మ్యాచ్ సందర్భంగా 173వ వన్డే ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఓవరాల్గా అంతర్జాతీయ స్థాయిలో 350 మ్యాచ్ల మైలురాయిని చేరుకుంది. అయితే, ఈ మ్యాచ్లో సుజీ బేట్స్ గోల్డెన్ డకౌట్గా వెనుదిరగడం గమనార్హం.Dream start for South Africa! 🔥Marizanne Kapp makes an instant impact. Suzie Bates is gone!Catch the LIVE action ➡ https://t.co/UaXsqrDnrA#CWC25 👉 NZ 🆚 SA | LIVE NOW on Star Sports & JioHotstar! pic.twitter.com/6cWC1BwnKh— Star Sports (@StarSportsIndia) October 6, 2025 న్యూజిలాండ్ తరఫున ఇన్నింగ్స్ ఆరంభించిన సుజీ.. సౌతాఫ్రికా పేసర్ మరిజానే కాప్ బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్గా పెవిలియన్ చేరింది. కాగా సుజీ బేట్స్ ఇప్పటి వరకు వైట్ఫెర్న్స్ తరఫున వన్డేల్లో మొత్తంగా 5896, టీ20లలో 4716 పరుగులు సాధించింది.మరో విశేషం ఏమిటంటే..ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఇండోర్ వేదికగా సౌతాఫ్రికా వుమెన్ జట్టుతో మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మహిళా టీమ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. 25 ఓవర్ల ఆట ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 101 పరుగులు సాధించింది. ఇదిలా ఉంటే..న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్కు ఇది 300వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం మరో విశేషం.మహిళల క్రికెట్లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన టాప్-5 ప్లేయర్లు వీరే👉సుజీ బేట్స్ (న్యూజిలాండ్)- 350👉హర్మన్ప్రీత్ కౌర్ (ఇండియా)- 342👉ఎలిస్ పెర్రీ (ఆస్ట్రేలియా)- 341👉మిథాలీ రాజ్ (ఇండియా)- 333👉చార్లెట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్)- 309.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
లంక ప్రీమియర్ లీగ్లో భారత ఆటగాళ్లు.. చరిత్రలో తొలిసారి..!
శ్రీలంక వేదికగా జరిగే లంక ప్రీమియర్ లీగ్ (Lanka Premier League) ఆరో ఎడిషన్కు సిద్దమైంది. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి 23 వరకు జరుగనుంది. లీగ్ చరిత్రలో ఇదే అత్యంత సుదీర్ఘంగా సాగనున్న ఎడిషన్. ఈ ఎడిషన్ మొత్తం 24 రోజుల పాటు జరుగుతుంది.ఇందులో 20 లీగ్ స్టేజీ మ్యాచ్లు, 4 నాకౌట్ మ్యాచ్లు సహా మొత్తం 24 మ్యాచ్లు జరుగుతాయి. 5 ఫ్రాంచైజీలు పాల్గొనే ఈ లీగ్ కోసం మూడు వేదికలు ఇదివరకే సిద్దం చేయబడ్డాయి. కొలొంబోని ప్రేమదాస స్టేడియం, క్యాండీలోని పల్లెకెలె స్టేడియం, డంబుల్లాలోని రణగిరి స్టేడియం ఎల్పీఎల్ మ్యాచ్లకు ఆతిథ్యమివ్వనున్నాయి.తొలిసారి భారత ప్లేయర్లుఈ లీగ్లో తొలిసారి భారత ప్లేయర్లు పాల్గొననున్నారని తెలుస్తుంది. ఇందుకోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని సమాచారం. బీసీసీఐ నిబంధనల ప్రకారం భారత ఆటగాళ్లు విదేశీ లీగ్ల్లో పాల్గొనలేరు. రిటైర్డ్ ఆటగాళ్లు, నాన్ కాంట్రాక్ట్ ప్లేయర్లు, బీసీసీఐతో సంబంధాలు తెంచుకున్న ఆటగాళ్లకు మాత్రం ప్రత్యేక వెసులుబాటు ఉంటుంది.వీరు కూడా బీసీసీఐ నుంచి నామమాత్ర అనుమతి తీసుకోవాలి. లంక ప్రీమియర్ లీగ్ అధికారుల అభ్యర్థన మేరకు కొందరు నాన్ కాంట్రాక్ట్ ఆటగాళ్లను లంక ప్రీమియర్ లీగ్ 2025లో పాల్గొనేందుకు బీసీసీఐ క్లీన్ చిట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. వీరిలో టీమిండియా మాజీ ప్లేయర్లు, ఐపీఎల్ స్టార్లు సురేశ్ రైనా, యూసప్ పఠాన్, మనోజ్ తివారి, రాహుల్ శర్మ తదితర ఆటగాళ్లు ఉన్నట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.కాగా, భారత క్రికెట్తో పూర్తిగా బంధాన్ని తెంచుకున్న దినేశ్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్ ఇటీవలే ఇంటర్నేషనల్ టీ20 లీగ్, బిగ్బాష్ లీగ్లతో ఒప్పందాలు చేసుకున్న విషయం తెలిసిందే.చదవండి: World Cup 2025: టీమిండియా చేతిలో ఓడినా చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ -
‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు అన్న మాటతో ఇలా..: సిరాజ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో సత్తా చాటి టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఆటగాళ్ల జాబితాలో మొహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) కూడా ఉన్నాడు. 2017లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున క్యాష్ రిచ్ లీగ్లో అడుగుపెట్టిన ఈ పేస్ బౌలర్.. అదే ఏడాది అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లోనూ ఎంట్రీ ఇచ్చాడు.ఆ తర్వాత రెండేళ్లకు వన్డేల్లో.. మూడేళ్లకు టెస్టుల్లో అరంగేట్రం చేసిన సిరాజ్.. ప్రస్తుతం టీమిండియా పేస్ దళంలో జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)తో పాటు ప్రధాన బౌలర్గా ఎదిగాడు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో విశ్రాంతి లేకుండా వెయ్యికి పైగా బంతులు బౌల్ చేసి.. ఐదు టెస్టుల్లో కలిపి 23 వికెట్లు పడగొట్టాడు.ఇక ప్రస్తుతం వెస్టిండీస్తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్తో బిజీగా ఉన్న సిరాజ్.. కెరీర్ తొలినాళ్లలో తనపై ట్రోలింగ్ జరిగిన తీరు.. ఆ సమయంలో దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ఇచ్చిన సలహాల గురించి తాజాగా పంచుకున్నాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ..ధోని ఆరోజు నాకో మాట చెప్పాడు‘‘నేను టీమిండియాలో అడుగుపెట్టినపుడే ఎంఎస్ ధోని నాకో మాట చెప్పాడు. ‘ఇతరులు ఏమంటున్నారో అస్సలు పట్టించుకోకు. నువ్వు బాగా ఆడినపుడు ప్రపంచం మొత్తం నీతోనే ఉంటుంది. ఒకవేళ నువ్వు విఫలమైతే మాత్రం నిన్ను దూషించడానికి కూడా ఎవరూ వెనుకాడరు’ అని అన్నాడు.అవును.. కెరీర్ తొలినాళ్లలో నేనూ ట్రోలింగ్ బారినపడ్డాను. ఏదేమైనా ట్రోల్స్ చేయడం చెడ్డ విషయం. నేను బాగా ఆడినపుడు అభిమానులతో పాటు ఈ ప్రపంచం మొత్తం.. ‘వారెవ్వా.. సిరాజ్ లాంటి బౌలర్ మరొకరు లేనేలేరు’ అని ప్రశంసిస్తారు.వెళ్లి మీ నాన్నతో కలిసి ఆటో తోలుకోఒకవేళ నేను ఫెయిల్ అయితే.. ‘వెళ్లు.. వెళ్లి మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’ అన్నవాళ్లూ లేకపోలేదు. ఇదే తరీఖా?.. ఓ మ్యాచ్లో హీరో అయిన వాళ్లు మరో మ్యాచ్లో పూర్తిగా జీరో అయిపోతారా? (నవ్వులు).ప్రజలు అంత త్వరగా తమ మాటలు మార్చేస్తారా?.. బయట వ్యక్తుల అభిప్రాయాలను పట్టించుకోవద్దని నేను చాన్నాళ్ల క్రితమే నిర్ణయించుకున్నా. సహచర ఆటగాళ్లు, కుటుంబ సభ్యులు నా గురించి ఏమనుకుంటున్నారనేదే ముఖ్యం. వేరే వాళ్లను అసలు పట్టించుకోను. ఇతరులు నా గురించి ఏం అంటున్నా నేను లెక్క చేయను’’ అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.తీవ్ర విషాదాన్ని దిగమింగుకుని..కాగా హైదరాబాద్కు చెందిన సిరాజ్ పేద కుటుంబం నుంచి వచ్చాడు. అతడి తండ్రి మొహమ్మద్ గౌస్ ఆటో నడిపి కుటుంబాన్ని పోషించేవారు. అయినప్పటికీ క్రికెటర్ కావాలన్న కుమారుడి కలకు ఆయన ఊతమిచ్చారు. అయితే, తనకెంతో ఇష్టమైన సంప్రదాయ ఫార్మాట్లో కొడుకు అరంగేట్రం చేయడానికి కొన్ని రోజుల ముందే గౌస్ మరణించారు.ఊపిరితిత్తుల్లో సమస్య కారణంగా కోవిడ్ సమయంలో సిరాజ్ తండ్రి మృతి చెందారు. అయితే, సిరాజ్ మాత్రం అరంగేట్రం కోసం ఆస్ట్రేలియాలోనే ఉండిపోయాడు. తన తండ్రికి టెస్టు ఫార్మాట్ అంటే ఇష్టమని.. ఆయనకు తనిచ్చే నివాళి ఇదేనంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక అప్పటి నుంచి ప్రతి సిరీస్కు ముందు తండ్రి సమాధిని దర్శించుకోవడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు. ఆటో డ్రైవర్ కొడుకు క్రికెటర్ అవుతాడా అన్న హేళనలకు ఆటతోనే సమాధానం ఇచ్చి టీమిండియాలో కీలక సభ్యుడిగా ఎదిగి... రూ. కోట్లు సంపాదిస్తూ ఆర్థికంగానూ నిలదొక్కుకున్న సిరాజ్ యువతరానికి స్ఫూర్తిగా నిలిచాడు.కాగా 31 ఏళ్ల సిరాజ్ ఇప్పటి వరకు తన అంతర్జాతీయ కెరీర్లో 44 వన్డేలు, 42 టెస్టులు, 16 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఈ రైటార్మ్ పేసర్ టెస్టుల్లో 130, వన్డేల్లో 71, టీ20లలో 14 వికెట్లు కూల్చాడు. ఐపీఎల్లో 108 మ్యాచ్లలో కలిపి 109 వికెట్లు పడగొట్టాడు. చదవండి: Rishabh Pant Facts: రిషభ్ పంత్ నెట్వర్త్ ఎంతో తెలుసా? -
టీమిండియా చేతిలో ఓడినా చరిత్ర సృష్టించిన పాకిస్తాన్
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్ 2025లో (Women's Cricket World Cup) భాగంగా నిన్న (అక్టోబర్ 5) భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ (Inida vs Pakistan) జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ 88 పరుగుల తేడాతో పాక్ను ఓడించి, వన్డే ఫార్మాట్లో దాయాదిపై తమ రికార్డును (12-0) మరింత మెరుగుపర్చుకుంది. అలాగే వరల్డ్కప్ టోర్నీల్లోనూ పాక్పై ఆధిపత్యాన్ని 5-0 తేడాతో కొనసాగించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత క్రికెట్ జట్లు పాక్ను వరుసగా నాలుగు ఆదివారాల్లో ఓడించారు.తాజాగా ముగిసిన పురుషుల ఆసియా కప్లో టీమిండియా గ్రూప్ (సెప్టెంబర్ 14), సూపర్-4 (సెప్టెంబర్ 21), ఫైనల్ (సెప్టెంబర్ 28) మ్యాచ్ల్లో వరుసగా మూడు ఆదివారాల్లో పాక్ను ఓడించగా.. ఇప్పుడు భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్లో భాగంగా పాక్ను వరుసగా నాలుగో ఆదివారం (అక్టోబర్ 5) చిత్తు చేసింది.తాజా మ్యాచ్లో భారత మహిళా జట్టు చేతిలో ఓడినా పాక్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వన్డేల్లో పాక్ తొలిసారి భారత్ను ఆలౌట్ చేసింది. ఇరు జట్ల మధ్య దీనికి ముందు 11 మ్యాచ్లు జరిగినా, అందులో పాక్ బౌలర్లు ఒక్కసారి కూడా భారత్ను ఆలౌట్ చేయలేదు.నిన్న జరిగిన వరల్డ్కప్ మ్యాచ్లో పాక్ పేసర్ డయానా బేగ్ (10-1-69-4) చెలరేగడంతో భారత్ సరిగ్గా 50 ఓవర్లు ఆడి 247 పరుగులకు ఆలౌటైంది. మహిళల వన్డేల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు కాకుండా టీమిండియా చేసిన అత్యధిక స్కోర్ ఇదే. ఈ మ్యాచ్లో భారత ప్లేయర్లు ఏకంగా 173 బంతులకు పరుగులు చేయలేదు.ప్రస్తుత ప్రపంచకప్ టోర్నీలో ఓ జట్టు ఇన్ని బంతులకు పరుగులు చేయలేకపోవడం ఇదే ప్రప్రధమం. గత 34 వన్డేల్లో భారత మహిళల జట్టు ఈ మార్కును (173 డాట్ బాల్స్) తాకడం ఇది రెండోసారి. 2023 జనవరిలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 181 బంతులను వృధా చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. భారత బ్యాటర్లను ఉన్న టాలెంట్ ప్రకారం ఈ స్కోర్ నిజంగానే చాలా చిన్నది. అయినా భారత బౌలర్లు దాన్ని విజయవంతంగా కాపాడుకొని పాక్ను మట్టికరిపించాడు. ఈ మ్యాచ్లో భారత్ తక్కువ స్కోర్కే (247 ఆలౌట్) పరిమితం కావడానికి ఇతరత్రా కారణాలు కూడా ఉన్నాయి.టీమిండియా బ్యాటింగ్ చేసే సమయంలో పురుగులు చాలా ఇబ్బంది పెట్టాయి. వీటి వల్ల భారత బ్యాటర్లు ఏకాగ్రత సాధించలేకపోయారు. ఓ దశలో పురుగులను పారద్రోలేందుకు స్ప్రేను కూడా ప్రయోగించారు. అయితే అప్పటికే సగం మ్యాచ్ ఆయిపోయింది. నిన్నటి మ్యాచ్లో భారత్ పాక్పై భారీ స్కోర్ చేయలేకపోవడానికి పిచ్ మరో కారణం. పిచ్ను మ్యాచ్కు 48 గంటల ముందు వరకు క్లోజ్ చేసి ఉంచారు. దీంతో తేమ ఎక్కువై బంతి నిదానంగా కదిలింది. దీని వల్ల కూడా భారత బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. ఆఖర్లో రిచా ఘోష్ (20 బంతుల్లో 35 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడకపోయుంటే భారత్ ఇంకాస్త తక్కువ స్కోర్కే పరిమితమై ఉండేది. చదవండి: World Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. స్ప్రే ప్రయోగించిన పాక్ కెప్టెన్ -
గంభీర్, అగార్కర్ కలిసే చేశారు.. రోహిత్ కెప్టెన్గా ఉంటే ఆ ప్రమాదం!
‘వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మను అకస్మాత్తుగా ఎందుకు తొలగించారు?’.. భారత క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఇదే ప్రధాన చర్చ. టీమిండియాకు రెండు ఐసీసీ టైటిళ్లు అందించిన హిట్మ్యాన్ పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మండలి తీరుపై ఓవైపు విమర్శలు వస్తుండగా.. మరోవైపు.. సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) వంటి దిగ్గజాలు మాత్రం బోర్డు నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.రోహిత్ కెప్టెన్గా ఉంటే ఆ ప్రమాదం!ఈ నేపథ్యంలో టీమిండియా వన్డే కెప్టెన్సీ మార్పునకు సంబంధించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు కీలక విషయాలు వెల్లడించాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా అందించిన వివరాల మేరకు.. ‘‘నాయకుడిగా డ్రెసింగ్రూమ్లో రోహిత్ శర్మ (Rohit Sharma) వ్యవహరించే తీరు భిన్నంగా ఉంటుంది. సారథిగా తనకంటూ ప్రత్యేక శైలి ఉంది.అయితే, తను ఇప్పుడు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. మరి అలాంటపుడు.. కేవలం ఒక్క ఫార్మాట్కు తను కెప్టెన్గా ఉంటే టీమ్ కల్చర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టిన మొదటి ఆరు నెలలు గౌతం గంభీర్ టెస్టు, వన్డే జట్ల విషయంలో వెనక ఉండే నడిపించాడు.అంతా గంభీర్ ఆధీనంలోనే..అయితే, స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవం (టెస్టుల్లో 3-0తో వైట్వాష్), ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్లో ఓటమి తర్వాత గంభీర్ అన్ని విషయాలను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు.ప్రస్తుత నిర్ణయం (కెప్టెన్సీ నుంచి రోహిత్ను తప్పించడం) కూడా గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కలిసికట్టుగా తీసుకున్నారు. రోహిత్, విరాట్ కోహ్లిల వయస్సు ఇప్పటికే 35 ఏళ్లు దాటిపోయింది. కెరీర్లో వారు చివరి అంకానికి చేరుకుంటున్నారు. ఇలాంటి దశలో అకస్మాత్తుగా రోహిత్, కోహ్లిలు ఫామ్ కోల్పోతే నాయకత్వ బృందంలో గందరగోళం తలెత్తే పరిస్థితి ఉంటుంది.గంభీర్ నిర్ణయాల వల్లే మెరుగైన ఫలితాలునిజానికి ఇంగ్లండ్ పర్యటనకు ముందే వీరిద్దరు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం గురించి కూడా ఇక్కడ ప్రస్తావించాలి. ఏదేమైనా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీతో పాటు ఇంగ్లండ్లో రెండు టెస్టుల్లోనూ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే టీమిండియా గెలిచిన తీరు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత.. రోహిత్తో పాటు కోహ్లి కూడా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. ఇక ఇటీవల ఇంగ్లండ్తో టెస్టులకు ముందు సంప్రదాయ క్రికెట్కూ ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే, ఈ దిగ్గజ బ్యాటర్లు వన్డేల్లో మాత్రం మరికొన్నాళ్లు కొనసాగుతామని స్పష్టం చేశారు.త్వరలోనే టీ20 జట్టు పగ్గాలు కూడా అతడికేకానీ అనూహ్య రీతిలో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన బీసీసీఐ.. అతడి స్థానంలో శుబ్మన్ గిల్ను వన్డేలకూ సారథిని చేసింది. వన్డే వరల్డ్కప్-2027 టోర్నీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ సెలక్టర్ అగార్కర్ వెల్లడించాడు. అంతేకాదు.. రోహిత్- కోహ్లి 2027 ప్రపంచకప్ వరకు ఆడతామని తమకు హామీ ఇవ్వలేదని పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ టూర్ సందర్భంగా గిల్ టెస్టు జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇటీవలే టీ20 జట్టులోనూ సూర్యకుమార్ యాదవ్కు డిప్యూటీగా గిల్ ఆసియా కప్-2025లో పాల్గొన్నాడు. త్వరలోనే టీ20లకు కూడా అతడే కెప్టెన్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా రోహిత్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంలో గంభీర్ కీలక పాత్ర పోషించినట్లు బీసీసీఐ వర్గాల మాటల ద్వారా స్పష్టం అవుతోంది.చదవండి: 50 ఓవర్ల క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ విధ్వంసం -
విండీస్ క్రికెట్లో తీవ్ర విషాదం.. వరల్డ్ కప్ విన్నర్ కన్ను మూత
వెస్టిండీస్ క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దిగ్గజ క్రికెటర్, వరల్డ్కప్ విన్నర్ బెర్నార్డ్ జూలియన్(75) మరణించారు. అనారోగ్యం కారణంగా ట్రినిడాడ్లోని ఓ అస్పత్పిల్రో ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని క్రికెట్ వెస్టిండీస్ అధ్యక్షుడు కిషోర్ షాలో ధ్రువీకరించారు."బెర్నార్డ్ జూలియన్ మరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది. విండీస్ గొప్ప క్రికెటర్లలో జూలియన్ ఒకరు. ఆయన సుదీర్ఘ కాలం పాటు విండీస్ క్రికెట్కు తన సేవలను అందించాడు. విండీస్ క్రికెట్ చరిత్రలోనే ఆయన చిరస్మరణీయంగా నిలిపోతారు.బెర్నార్డ్ జూలియన్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము" అని ఓ ప్రకటనలో కిషోర్ షాలో పేర్కొన్నారు. మరో విండీస్ లెజెండ్, మాజీ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ సైతం బెర్నాల్డ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. బెర్నాల్డ్తో తన జ్ఞాపకాలను లాయిడ్ గుర్తుచేసుకున్నారు.1975లో వెస్టిండీస్ తొలిసారిగా ప్రపంచకప్ గెలవడంలో జూలియన్ది కీలక పాత్ర. టోర్నీ అంతటా ఆల్రౌండర్గా ఆయన అదరగొట్టారు. సెమీఫైనల్లో న్యూజిలాండ్పై 4 వికెట్లతో సత్తాచాటిన బెర్నార్డ్.. ఫైనల్లో ఆస్ట్రేలియాపై 26 పరుగులతో ఆజేయంగా నిలిచి విండీస్ను ఛాంపియన్గా నిలిపారు. జూలియన్ తన కెరీర్లో విండీస్ తరపున 24 టెస్టు మ్యాచ్లు, 12 వన్డేలు ఆడారు. మొత్తంగా 932 పరుగులు, 68 వికెట్లు పడగొట్టారు. -
ఆసియా కప్ వైఫల్యాల ఎఫెక్ట్.. శ్రీలంక కోచింగ్ బృందంలో భారీ మార్పులు
ఆసియా కప్ 2025లో ఘోర వైఫల్యాల తర్వాత శ్రీలంక క్రికెట్ జట్టు (Sri Lanka) తమ కోచింగ్ బృందంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. లాంగ్ స్టాండింగ్గా ఉన్న స్పిన్ బౌలింగ్ కోచ్తో పాటు రెండేళ్ల క్రితం నియమితుడైన బ్యాటింగ్ కోచ్ను కూడా మార్చింది. 2006 నుంచి స్పిన్ బౌలింగ్ కోచ్గా ఉన్న పియాల్ విజేతుంగే స్థానంలో రెన్ ఫెర్డినాండ్స్ను.. 2023 డిసెంబర్ నుంచి బ్యాటింగ్ కోచ్గా ఉన్న తిలిన్ కందాబి స్థానంలో జూలియన్ వుడ్ను నియమించింది. జూలియన్ వుడ్ ఏడాది ఒప్పందం మేరకు లంక పరిమిత ఓవర్ల జట్టుతో చేరతాడు. అతను లంక బ్యాటర్లకు పవర్ హిట్టింగ్లో శిక్షణ ఇవ్వనున్నాడు. వుడ్ గతంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.. ఇంగ్లండ్ కౌంటీలైన హ్యాంప్షైర్, గ్లోసెస్టర్షైర్, మిడిల్సెక్స్కు శిక్షణ ఇచ్చాడు. అలాగే అతను ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్కు కూడా బ్యాటింగ్ కన్సల్టెంట్గా పని చేశాడు.రెన్ ఫెర్డినాండ్స్ విషయానికొస్తే.. ఇతను లంక బోర్డుతో రెండేళ్ల ఒప్పందం మేరకు పని చేస్తాడు. ఈ సమయంలో అతను లంక స్పిన్ విభాగాన్ని పటిష్ట పరిచే ప్రయత్నం చేస్తాడు. గతంలో అతను న్యూజిలాండ్ క్రికెట్లో కన్సల్టెంట్గా పని చేశాడు. అలాగే బీసీసీఐ నేషనల్ అకాడమీలోనూ కొంతకాలం సేవలందించాడు.శ్రీలంక జట్టు తాజాగా ముగిసిన ఆసియా కప్లో గ్రూప్ దశలో మంచి విజయాలు సాధించినా.. సూపర్-4 దశలో ఆడిన మూడు మ్యాచ్ల్లో పరాజయాలు ఎదుర్కొని టోర్నీ నుంచి నిష్క్రమించింది. సూపర్-4లో వారికంటే బలహీనమైన బంగ్లాదేశ్ చేతిలో శ్రీలంక పరాభవాన్ని ఎదుర్కొంది.ఆసియా కప్ తర్వాత నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటున్న శ్రీలంక జట్టు నవంబర్లో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం పాకిస్తాన్ పర్యటనకు వెళ్తుంది. ఈ మ్యాచ్లు నవంబర్ 11, 13, 15 తేదీల్లో రావల్పిండి వేదికగా జరుగుతాయి. అనంతరం ఈ జట్టు పాకిస్తాన్లోనే జరిగే ముక్కోణపు ట్రై సిరీస్లో కూడా పాల్గొంటుంది. ఈ సిరీస్ నవంబర్ 17 నుంచి ప్రారంభమవుతుంది. చదవండి: భారీ శతకంతో కదంతొక్కిన ఆసీస్ ప్లేయర్ -
భారీ శతకంతో కదంతొక్కిన ఆసీస్ ప్లేయర్
ఆస్ట్రేలియా దేశవాలీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్లో (Sheffield Shield-2025) ఆసీస్ జాతీయ జట్టు ఆటగాడు, క్వీన్స్ల్యాండ్ కెప్టెన్ మార్నస్ లబూషేన్ (Marnus Labuschagne) భారీ శతకంతో కదంతొక్కాడు. ఈ ఎడిషన్ తొలి మ్యాచ్లోనే అతను ఈ ఘనత సాధించాడు. టాస్మానియాతో జరుగుతున్న మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 206 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 160 పరుగులు చేశాడు.గత కొంతకాలంగా ఫామ్లేమితో సతమతమవుతున్న లబూషేన్ ఈ సెంచరీతో తిరిగి ఫామ్ను అందుకున్నాడు. ఈ ఇన్నింగ్స్తో రెడ్ బాల్ క్రికెట్లో తన క్లాస్ను మరోసారి చాటుకున్నాడు. 14 నెలల తర్వాత ఫస్ట్క్లాస్ క్రికెట్లో లబూషేన్ చేసిన తొలి సెంచరీ ఇది. అతను చివరిగా 2024 జులైలో ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో గ్లామోర్గన్పై మూడంకెల స్కోర్ను చేశాడు. ఓవరాల్గా లబూషేన్కు ఇది ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 33 శతకం.ఈ సెంచరీతో అతను యాషెస్ సిరీస్కు ముందు ఆసీస్ సెలెక్టర్లకు గట్టి సవాల్ విసిరాడు. ఈ సెంచరీ చేయకపోయుంటే యాషెస్ జట్టులో అతనికి స్థానం ఖచ్చితంగా దక్కేది కాదు. గత కొంతకాలంగా లబూషేన్ ఆసీస్ తరఫున దారుణంగా విఫలమవుతూ వస్తున్నాడు. గత డబ్ల్యూటీసీ సైకిల్లో (2023-25) అతని ప్రదర్శన మరీ తీసికట్టుగా ఉండింది. ఆ సైకిల్లో 20 మ్యాచ్ల్లో కేవలం 27 సగటున, ఒకే ఒక సెంచరీ సాయంతో పరుగులు చేశాడు. ఇది అతని కెరీర్ తొలినాళ్లలో ప్రదర్శనలతో పోలిస్తే చాలా తక్కువ. లబూషేన్ కెరీర్ ఆరంభంలో 70కి పైగా సగటుతో పరుగులు చేశాడు. ఇప్పటివరకు 58 టెస్ట్లు ఆడిన లబూషేన్.. 46.2 సగటున 12 సెంచరీల సాయంతో 4435 పరుగులు చేశాడు.తాజా సెంచరీతో లబూషేన్ ఓ అరుదైన మైలురాయిని కూడా తాకాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 12000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. కెరీర్లో 167 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 33 సెంచరీలు, 60 అర్ద సెంచరీల సాయంతో 12000 ప్లస్ పరుగులు చేశాడు. కాగా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య యాషెస్ సిరీస్ నవంబర్ 21 నుంచి ప్రారంభమవుతుంది. ప్రతిష్టాత్మకమైన ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టును ఇదివరకే ప్రకటించగా.. ఆసీస్ జట్టును మరికొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. చదవండి: అష్టకష్టాలు పడుతున్న బాబర్ ఆజమ్ -
'ఇంకెందుకు ఆలస్యం.. రోహిత్ను జట్టు నుంచి కూడా తీసేయండి'
టీమిండియా వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మ స్ధానంలో శుబ్మన్ గిల్ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ నియమించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా టూర్కు జట్టు ఎంపిక సందర్భంగా ఈ అనుహ్య మార్పు చోటు చేసుకుంది. 2027 ప్రపంచ కప్ కోసం దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కకర్ పేర్కొన్నాడు. కాగా హిట్మ్యాన్ కెప్టెన్గా అద్బుతమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడు.ఎంఎస్ ధోని తర్వాత మూడు ఐసీసీ వైట్ బాల్ ఈవెంట్స్లో భారత జట్టును ఫైనల్కు చేర్చిన ఏకైక కెప్టెన్గా రోహిత్ నిలిచాడు. భారత్కు టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ను రోహిత్ అందించాడు. వన్డే ప్రపంచకప్-2023లో రన్నరప్గా టీమిండియాను నిలిపాడు.అయినప్పటికి రోహిత్ను సడన్గా కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని చాలా మంది మాజీలు తప్పుబడుతున్నారు. ఈ జాబితాలోకి భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ సబా కరీం చేరాడు. రోహిత్ను కెప్టెన్సీ తప్పించడంతో అతడి వన్డే భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందని కరీం అభిప్రాయపడ్డాడు."రోహిత్ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ సెలక్టర్ల తీసుకున్న నిర్ణయం నన్ను షాక్కు గురిచేసింది. ప్రస్తుతం అస్సలు కెప్టెన్సీ మార్పు అవసరమే లేదు. భారత్కు రోహిత్ వరుసగా రెండు ట్రోఫీలను అందించాడు. వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్కు మీరు ఇచ్చే గౌరవమిదేనా? 2027 ప్రపంచకప్కు ఇంకా సమయం ఉంది. తొందరపడాల్సిన అవసరం ఏమి వచ్చింది. అతడు ఇప్పటికే ఒక ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ ఒక నాయకుడిగా అద్బుతమైన జట్టును తాయారు చేశాడు. దాని ఫలితంగానే టీ20 ప్రపంచకప్-2024, ఛాంపియన్స్ ట్రోఫీ-2025ని భారత్ సొంతం చేసుకుంది.అంతేకాకుండా ప్రస్తుతం టీ20 ఫార్మాట్లలో దుమ్ములేపుతున్న భారత జట్టు వెనక కూడా రోహిత్ ఉన్నాడు. అందులో చాలా మంది ఆటగాళ్లు రోహిత్ సారథ్యంలోనే ఆడినవారే. రోహిత్ ఐదు ఆరు నెలలు ఆడకపోతే తన కెప్టెన్సీ, బ్యాటింగ్ను మర్చిపోయినట్లు కాదు.అతడికి వన్డే ఫార్మాట్లో ఎలా ఆడాలో తెలుసు, జట్టును విజయ పథంలో ఎలా నడిపించాలో తెలుసు. జట్టులో రోహిత్ రోల్పై సెలక్టర్లు క్లారిటీ వుందో లేదో నాకు ఆర్ధం కావడం లేదు. కెప్టెన్సీ నుంచి తప్పించారంటే రోహిత్ వన్డే ఫ్యూచర్పై మీకు స్పష్టత లేదు. 2027 ప్రపంచకప్లో హిట్ మ్యాన్ ఆడాడని మీరు అనుకుంటుంటే మరి జట్టులో ఎందుకు ఉంచారు. ప్రపంచకప్ ప్రణాళికలలో అతడు లేకపోతే జట్టులో ఎందుకు తీసేయండి? ఒకవేళ అతడు మీ ప్లాన్స్లో ఉంటే కెప్టెన్సీ నుంచి తొలిగించాల్సిన అవసరం ఏముంది? ఏదేమైనప్పటికి నా వరకు అయితే సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం సరైనది కాదు" తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. -
అష్టకష్టాలు పడుతున్న బాబర్ ఆజమ్
రెండు మూడేళ్ల కిందట ఓ వెలుగు వెలిగిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (Babar Azam), ప్రస్తుతం ఫామ్ కోల్పోయి గడ్డుకాలం ఎదుర్కొంటున్నాడు. టీ20 జట్టును శాశ్వతంగా తప్పించబడిన అతను.. వన్డే, టెస్ట్ జట్లలో అడపాదడపా అవకాశాలు దక్కించుకుంటున్నాడు.త్వరలో స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగబోయే టెస్ట్ సిరీస్ కోసం ఎంపికైన బాబర్.. పూర్వవైభవం సాధించేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు. ఈ క్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. చాలాకాలంగా ఆడని దేశవాలీ ఫస్ట్క్లాస్ టోర్నీ 'క్వైద్ ఎ ఆజమ్ ట్రోఫీ'లో పాల్గొంటున్నాడు. ఈ టోర్నీలో అతను లాహోర్ వైట్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు.గత కొంతకాలంగా రెడ్ బాల్ క్రికెట్ ఆడని బాబర్ క్వైద్ ఎ ఆజమ్ ట్రోఫీ ద్వారా టచ్లోకి రావాలని భావిస్తున్నాడు. బాబర్ తన చివరి టెస్ట్ మ్యాచ్ను ఈ ఏడాది ఆరంభంలో ఆడాడు. అప్పటి నుంచి వైట్ బాల్ క్రికెట్ ఆడతున్నా పెద్దగా రాణించింది లేదు. సౌతాఫ్రికాతో జరుగబోయే టెస్ట్ సిరీస్ బాబర్కు డు ఆర్ డై అన్న పరిస్థితిని తెచ్చిపెట్టింది.ఈ సిరీస్లో రాణిస్తేనే అతని టెస్ట్ కెరీర్ నిలబడుతుంది. లేదంటే టీ20 ఫార్మాట్ తరహాలోనే టెస్ట్లకు కూడా దూరం కావాల్సి ఉంటుంది.క్వైద్ ఎ ఆజమ్ ట్రోఫీలో బాబర్తో పాటు మరింత మంది స్టార్ ఆటగాళ్లు కూడా ఆడనున్నట్లు తెలుస్తుంది. బాబర్తో పాటు ఆసియా కప్ జట్టు నుంచి తప్పించబడ్డ మొహమ్మద్ రిజ్వాన్, టీ20 జట్టు కెప్టెన్ సల్మాన్ అఘా, హసన్ అలీ, సాజిద్ ఖాన్ తదితరులు క్వైద్ ఎ ఆజమ్ ట్రోఫీలో ఆడేందుకు సిద్దంగా ఉన్నారు.ఈ టోర్నీలో అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానుండగా.. సౌతాఫ్రికాతో సిరీస్ అక్టోబర్ 12 నుంచి మొదలవుతుంది. ఈ సిరీస్లో తొలి టెస్ట్ అక్టోబర్ 12 నుంచి లాహోర్లో.. రెండో టెస్ట్ అక్టోబర్ 20 నుంచి రావల్పిండిలో ప్రారంభమవుతాయి.పాక్ పర్యటనలో సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ తర్వాత మూడు మ్యాచ్ల టీ20, వన్డే సిరీస్లు కూడా ఆడనుంది. పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం సౌతాఫ్రికా జట్లను ఇదివరకే ప్రకటించగా.. పాక్ జట్లకు ప్రకటించాల్సి ఉంది.సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టు: షాన్ మసూద్ (కెప్టెన్), ఆమిర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, ఆసిఫ్ ఆఫ్రిది, బాబర్ ఆజమ్, ఫైసల్ అక్రమ్, హసన్ అలీ, ఇమామ్-ఉల్-హక్, కమ్రాన్ గులాం, ఖుర్రం షెహజాద్, మహ్మద్ రిజ్వాన్ (wk), నౌమాన్ అలీ, రోహైల్ నజీర్ (wk), సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ ఆఘా, సౌద్ షకీల్, షాహీన్ షా ఆఫ్రిదిపాకిస్తాన్తో తొలి టెస్ట్ కోసం సౌతాఫ్రికా జట్టు:ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, జుబేర్ హమ్జా, టోనీ డి జోర్జీ, సెనురన్ ముత్తాస్వామి, కార్బిన్ బాష్, వియాన్ ముల్దర్, మార్కో జన్సెన్, ప్రెనెలన్ సుబ్రాయన్, డేవిడ్ బెడింగ్హమ్, కైల్ వెర్రిన్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, సైమన్ హార్మర్, కగిసో రబాడచదవండి: భారత యువ ప్లేయర్ల మధ్య ఘర్షణ.. కొట్టుకున్నంత పని చేశారు..! -
పాక్ ఓపెనర్ది ఔటా? నాటౌటా? రూల్స్ ఏమి చెబుతున్నాయి
భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య వైరం మరింత ముదురుతోంది. మొన్న ఆసియాకప్లో ఇరు జట్ల మధ్య చోటు చేసుకున్న సంఘటనలు మరవకముందే.. మహిళల వన్డే ప్రపంచకప్-2025లో చిరకాల ప్రత్యర్ధుల మధ్య మరో వివాదం చోటు చేసుకుంది.ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా భారత్-పాక్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో పాక్ ఓపెనర్ మునీబా అలీ రనౌట్ వివాదస్పదమైంది. పాక్ అభిమానులు మునీబాది నాటౌట్ అంటుంటే ఇండియన్ ఫ్యాన్స్ క్లియర్ ఔట్ అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.అసలేమి జరిగిదంటే?పాకిస్తాన్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన క్రాంతి గౌడ్ ఆఖరి బంతిని మునీబాకు మిడిల్ అండ్ లెగ్ స్టంప్ దిశగా సంధించింది. ఆ బంతిని మునీబా లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించింది. కానీ బంతి బ్యాట్కు మిస్స్ అయ్యి మునీబా అలీ ఫ్రంట్ ప్యాడ్ తాకుతూ వికెట్ కీపర్ వైపు వెళ్లింది.దీంతో భారత ప్లేయర్లు ఎల్బీడబ్ల్యూకి అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌట్ అంటూ తల ఊపారు. ఇంతలోనే మునీబా క్రీజు బయటకు ఒక్క అడుగు ముందుకు వేసి తిరిగి రావడానికి ప్రయత్నించింది. ఇదే సమయంలో దీప్తి శర్మ వికెట్ కీపర్ వెనక నుంచి డైరక్ట్ త్రోతో స్టంప్స్ను గిరాటేసింది. దీంతో ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్కు రిఫర్ చేశారు. తొలుత థర్డ్ అంపైర్ నాటౌట్గా సూచించినప్పటికి.. అంపైర్ కెరిన్ క్లాస్ట్ ఆ తర్వాత పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించి తన నిర్ణయాన్ని మార్చి ఔట్గా ప్రకటించింది. బంతి స్టంప్స్కు తాకే సమయంలో మనీబా బ్యాట్ గాల్లో ఉందని అంపైర్ చెప్పుకొచ్చారు. థర్డ్ అంపైర్ నిర్ణయంతో పాక్ శిబిరం మొత్తం షాక్కు గురయ్యారు. అయితే బంతి స్టంప్స్కు తాకక ముందు మునీబా బ్యాట్ పాపింగ్ క్రీజులో ఉంచింది. కాబట్టి నాటౌట్ అంటూ పాక్ కెప్టెన్ ఫాతిమా సనా ఫోర్త్ అంపైర్తో వాగ్వాదానికి దిగింది. ఫోర్త్ అంపైర్ రూల్స్ను వివరించడంతో ఆమె వెనక్కి తగ్గింది. ఏదేమైనప్పటికి మైదానంలో కాసేపు గందరగోళం నెలకొంది.రూల్స్ ఏమి చెబుతున్నాయి?ఎంసీసీ కొత్త రూల్స్ ప్రకారం.. ఒక బ్యాటర్ బంతి స్టంప్స్కు తాకక ముందు తన బ్యాట్ను పాపింగ్ క్రీజ్ వెనుక ఒక్కసారి ఉంచితే చాలు. ఆ తర్వాత బంతి స్టంప్స్కు తాకే సమయంలో బ్యాట్ గాల్లో ఉన్న కూడా నాటౌట్గా పరిగిణిస్తారు. అయితే ఈ రూల్ కేవలం రన్కు ప్రయత్నించేటప్పుడు మాత్రమే వర్తిస్తుంది. కానీ మునీబా రన్ కోసం పరిగెత్తలేదు. క్రీజులో నిలబడి బయటకు వెళ్లి వచ్చింది. కాబట్టి ఆమె అవుట్ వికెట్ కీపర్ బ్యాటర్ స్టంప్ చేయడంతో సమానం. బంతి బెయిల్స్ పడగొట్టిన సమయంలో ఆమె బ్యాట్ గాలిలో ఉంది. అందుకే థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించారు. అదే ఆమె రన్కు ప్రయత్నించే సమయంలో ఇలా జరిగింటే నాటౌట్ ఇచ్చేవారు.రూల్ 30.1 ప్రకారం.. మునీబాను ఔట్గా ప్రకటించారు. ఈ రూల్ ప్రకారం ఒక బ్యాటర్ తన బ్యాట్ లేదా పాదం లేదా శరీరంలోని ఏ భాగమైనా పాపింగ్ క్రీజ్ చివరన లేకపోతే ఔట్గానే పరిగణిస్తారు.రూల్ 30.1.2 ప్రకారం.. ఒక బ్యాటర్ రన్కు పరిగెత్తడం లేదా డైవ్ చేసే సందర్భాల్లో బ్యాట్ ఒక్కసారి పాపింగ్ క్రీజు వెలుపుల గ్రౌండింగ్ చేస్తే చాలు. అనంతరం బెయిల్స్ పడే సమయంలో బ్యాట్ గాల్లో ఉన్నా నాటౌట్గానే లెక్కలోకి తీసుకుంటారు. View this post on Instagram A post shared by Star Sports India (@starsportsindia) -
భారత యువ ప్లేయర్ల మధ్య ఘర్షణ.. కొట్టుకున్నంత పని చేశారు..!
ఇరానీ కప్ 2025 (Irani Cup 2025) చివరి రోజు (అక్టోబర్ 5) హై వోల్టేజ్ డ్రామా చోటు చేసుకుంది. ఇద్దరు ఆటగాళ్ల మధ్య మాటామాటా పెరిగి తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఓ దశలో ఇరువురు కొట్టుకున్నంత పని చేశారు. ఈ ఘర్షణ గతంలో (2013) గంభీర్-కోహ్లి (Gambhir-Kohli) మధ్య జరిగిన ఫైట్ను గుర్తు చేసింది. తాజా ఘటన సోషల్మీడియాలో హాట్టాపిక్గా మారింది.పూర్తి వివరాల్లో వెళితే.. రంజీ ఛాంపియన్ విదర్భ, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్లు ఇరానీ కప్ 2025 కోసం తలపడ్డాయి. ఈ మ్యాచ్లో విదర్భ ఛాంపియన్గా నిలిచి గ్రాండ్ డబుల్ (రంజీ, ఇరానీ ట్రోఫీలు) సాధించింది.అయితే ఆట చివరి రోజు హై డ్రామా చోటు చేసుకుంది. రెస్ట్ ఆఫ్ ఇండియా బ్యాటర్ యశ్ ధుల్ (Yash Dhull), విదర్భ బౌలర్ యశ్ ఠాకూర్ (Yash Thakur) గొడవపడ్డారు. రెస్ట్ ఆఫ్ ఇండియా లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.మ్యాచ్ 63వ ఓవర్లో యశ్ ఠాకూర్ వేసిన షార్ట్ పిచ్ బంతిని యశ్ ధుల్ పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా, అథర్వ తైడే అద్భుతమైన క్యాచ్గా మలిచాడు. ఆ సమయానికి ధుల్ 92 పరుగుల వద్ద ఆడుతూ మ్యాచ్ను రెస్ట్ ఆఫ్ ఇండియా వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు. సెంచరీ ముందు ఔట్ కావడమే కాకుండా తన జట్టును గట్టెక్కించలేకపోయానన్న బాధలో ధుల్ ఉండగా.. యశ్ ఠాకూర్ అత్యుత్సాహంతో సంబురాలు చేసుకున్నాడు.ఈ క్రమంలో యశ్ ఠాకూర్ ధుల్ను ఉద్దేశిస్తూ ఏదో అన్నాడు. అప్పటికే ఔటైన అసహనంలో ఉన్న ధుల్ యశ్ ఠాకూర్పైకి తిరగబడ్డాడు. దీంతో ఇరువురి మధ్య చిన్నపాటి యుద్దమే జరిగింది. ధుల్, ఠాకూర్ ఒకరిపైకి ఒకరు దూసుకుపోయారు. అంపైర్లు అడ్డుపడకుంటే ఖచ్చితంగా కొట్టుకునే వారు. అంతిమంగా అంపైర్లు, సహచరులు వారించడంతో ఇరువురు తగ్గారు. దీంతో గొడవ సద్దుమణిగింది.pic.twitter.com/LwuqQrd4IA— Nihari Korma (@NihariVsKorma) October 5, 2025ధుల్ ఔటయ్యాక లయ తప్పిన రెస్ట్ ఆఫ్ ఇండియా 30 పరుగుల వ్యవధిలో చివరి నాలుగు వికెట్లు కోల్పోయి మ్యాచ్ను చేజార్చుకుంది. ధుల్కు చేదోడుగా ఉండిన మానవ్ సుతార్ అర్ద సెంచరీ పూర్తి చేసి చివరి వరకు క్రీజ్లో ఉన్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. రెస్ట్ ఆఫ్ ఇండియా లక్ష్యానికి 94 పరుగుల దూరంలో నిలిచిపోయి, ఓటమిపాలైంది.తొలి ఇన్నింగ్స్లో 143 పరుగులు చేసి విదర్భ గెలుపుకు ప్రధాన కారకుడైన అథర్వ తైడే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. చదవండి: World Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. స్ప్రే ప్రయోగించిన పాక్ కెప్టెన్ -
మూడో టీ20లో అఫ్గాన్ చిత్తు.. సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్
షార్జా వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన మూడో టీ20లో 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్ను 3-0 తేడాతో బంగ్లా జట్టు క్లీన్ స్వీప్ చేసింది. నామమాత్రపు మూడో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమైంది.అఫ్గాన్ బ్యాటర్లలో దర్విష్ రసూలి(32) టాప్ స్కోరర్గా నిలవగా.. అటల్(28), ముజీబ్(23) పర్వాలేదన్పించారు. మిగితా బ్యాటర్లంతా దారుణ ప్రదర్శన కనబరిచారు. సిరీస్ అంతటా అఫ్గాన్ బ్యాటర్లు తమ స్ధాయికి తగ్గట్టు రాణించలేకపోయారు. బంగ్లాదేశ్ బౌలర్లలో సైఫుద్దీన్ మూడు వికెట్లతో సత్తాచాటగా.. తంజిమ్ హసన్ సాకిబ్, నసీం అహ్మద్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు షోర్ఫుల్ ఇస్లాం, రిషాద్ చెరో వికెట్ పడగొట్టారు.సైఫ్ మెరుపు హాఫ్ సెంచరీ..అనంతరం 145 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా టైగర్స్ 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. సైఫ్ హసన్(38 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్లతో 64 నాటౌట్) అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు.అతడితో పాటు తంజీద్ 33 పరుగులతో రాణించాడు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ రెండు, ఓమర్జాయ్ అబ్దుల్లా తలా వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది.చదవండి: Abhishek Sharma: ఆసీస్పై అభిషేక్ మళ్లీ ఫెయిల్.. ఇలా అయితే కష్టమే? -
ఆసీస్పై అభిషేక్ మళ్లీ ఫెయిల్.. ఇలా అయితే కష్టమే?
టీ20ల్లో దుమ్ములేపుతున్న టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ.. 50 ఓవర్ల ఫార్మాట్లో తన మార్క్ను చూపించలేకపోయాడు. స్వదేశంలో ఆస్ట్రేలియా-ఎతో జరిగిన అనాధికారిక వన్డే సిరీస్లో భారత్-ఎ తరపున ఆడిన అభిషేక్ తీవ్ర నిరాశపరిచాడు. కాన్పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగిన ఈ పంజాబ్ క్రికెటర్ ఇప్పుడు మూడో వన్డేలోనూ అదే తీరును కనబరిచాడు.25 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ రెండు ఫోర్లు సాయంతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. స్పిన్నర్ టాడ్ ముర్ఫీ బౌలింగ్లో తన్వీర్ సంఘాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. అభిషేక్ ఈ తరహా ప్రదర్శనలు చేస్తే భారత వన్డే జట్టులోకి ఎంట్రీ ఇప్పటిలో కష్టమనే చెప్పాలి.ఎందుకంటే ఓపెనింగ్ స్ధానాల కోసం తీవ్రమైన పోటీ ఉంది. ఇప్పటికే వన్డే జట్టులో రెగ్యూలర్ ఓపెనర్లుగా శుబ్మన్ గిల్, రోహిత్ శర్మ కొనసాగుతున్నారు. బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైశ్వాల్ ఉన్నాడు. అవసరమైతే కేఎల్ రాహుల్ సైతం ఓపెనర్గా ప్రమోట్ చేసే అవకాశముంది. త్వరలోనే జరగనున్న విజయ్ హాజారే ట్రోఫీలో అభిషేక్ మెరుగైన ప్రదర్శన చేస్తే సెలక్టర్ల దృష్టిలో పడే అవకాశముంది. అక్కడ కూడా విఫలమైతే అభిషేక్ కేవలం టీ20లకే పరిమితం కాక తప్పదు. ఇటీవల ముగిసిన ఆసియాకప్లో శర్మ దుమ్ములేపాడు. అభిషేక్ 200 స్ట్రైక్ రేట్తో 314 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ది టోర్నమెంట్గా నిలిచాడు. లిస్ట్-ఎ క్రికెట్లో కూడా ఈ పంజాబీ ఆటగాడికి మెరుగైన గణాంకాలు ఉన్నాయి.అభిషేక్ శర్మ తన కెరీర్లో ఇప్పటివరకు 61 లిస్ట్-ఎ మ్యాచ్లు ఆడి 35.33 సగటుతో 2,014 పరుగులు చేశాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 170గా ఉంది. అదేవిధంగా బౌలింగ్లో కూడా 38 వికెట్లు పడగొట్టాడు.భారత్ ఘన విజయం..కాగా నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్-ఎ జట్టు 2 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో శ్రేయస్ అయ్యర్ సేన సొంతం చేసుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు 49.1 ఓవర్లలో 316 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్ జాక్ ఎడ్వర్డ్స్ (75 బంతుల్లో 89; 8 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... లియామ్ స్కాట్ (64 బంతుల్లో 73; 1 ఫోర్, 6 సిక్స్లు), కూపర్ కొనొల్లీ (49 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్స్లు) హాఫ్సెంచరీలు చేశారు. మొత్తంగా ఆసీస్ ఆటగాళ్లు ఈ మ్యాచ్లో 15 సిక్స్లు కొట్టారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 38 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన హర్షిత్ రాణా 61 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఆయుశ్ బదోనీ 2 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం లక్ష్యఛేదనలో భారత ‘ఎ’ జట్టు 46 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 322 పరుగులు చేసి గెలిచింది. ప్రభ్సిమ్రన్ సింగ్ (68 బంతుల్లో 102; 8 ఫోర్లు, 7 సిక్స్లు) మెరుపు సెంచరీతో చెలరేగాడు. ప్రభ్సిమ్రన్ ధనధాన్ సెంచరీకి తోడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (58 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్స్), రియాన్ పరాగ్ (55 బంతుల్లో 62; 5 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్సెంచరీలు తోడవడంతో భారత జట్టు అలవోకగా గెలుపొందింది.ఆసీస్ బౌలర్లలో టాడ్ మార్ఫీ, తన్వీర్ సంఘా చెరో 4 వికెట్లు తీశారు. ప్రభ్సిమ్రన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, రియాన్ పరాగ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. ఇరు జట్ల మధ్య జరిగిన అనధికారిక టెస్టు సిరీస్లో సైతం భారత ‘ఎ’ జట్టే విజయం సాధించింది.చదవండి: మా ఓటమికి కారణమదే.. లేదంటే ఈజీగా గెలిచేవాళ్లం: పాక్ కెప్టెన్ -
మా ఓటమికి కారణమదే.. లేదంటే ఈజీగా గెలిచేవాళ్లం: పాక్ కెప్టెన్
ఐసీసీ మహిళల ప్రపంచకప్లో కొలంబో వేదికగా ఆదివారం భారత్తో జరిగిన మ్యాచ్లో 88 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ ఓటమి పాలైంది. బౌలింగ్లో పర్వాలేదన్పించిన పాక్ జట్టు.. బ్యాటింగ్లో మాత్రం తేలిపోయింది. 248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు 43 ఓవర్లలో 159 రన్స్కే కుప్పకూలింది.యువ ఫాస్ట్ బౌలర్ క్రాంతి గౌడ్, సీనియర్ ఆల్రౌండర్ దీప్తి శర్మ తలా మూడు వికెట్లు పడగొట్టి పాక్ పతనాన్ని శాసించారు. వీరితో పాటు స్నేహ్ రాణా రెండు వికెట్లు తీశారు. పాక్ బ్యాటర్లలో సిద్రా అమిన్ (106 బంతుల్లో 81; 9 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేసింది.అంతకుముందు భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగుల వద్ద ఆలౌటైంది. హర్లీన్ డియోల్ (65 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలవగా.. రిచా ఘోష్ (20 బంతుల్లో 35 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడుగా ఆడింది. మహిళల వన్డేల్లో పాక్పై భారత్కు ఇది వరుసగా 12వ విజయం కావడం విశేషం. అయితే ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ ఫాతిమా సనా స్పందించింది. ప్రత్యర్ధి భారత జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో విఫలమయ్యామని సనా చెప్పుకొచ్చింది."పవర్ప్లేలో మేము చాలా పరుగులు ఇచ్చాము. అదే విధంగా డెత్ ఓవర్లలో మేము మెరుగ్గా బౌలింగ్ చేయలేకపోయాము. నేను బౌలింగ్ చేసినప్పుడు బంతి స్వింగ్ అవుతున్నట్లు అన్పించింది. కానీ డయానా బేగ్ మాత్రం సీమ్, స్వింగ్ మధ్య కాస్త కన్ఫూజన్కు గురైంది.నేను మాత్రం బంతి స్వింగ్ అవుతుందని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని నేను పదేపదే చెబుతునే ఉన్నాను. మా తదుపరి మ్యాచ్లో ఆమె మెరుగ్గా రాణిస్తుందని అశిస్తున్నాను. తొలుత భారత్ను 200 కంటే తక్కువ పరుగులకు పరిమితం చేసి ఉంటే బాగుండేది. ఆ టోటల్ను మేము సులువుగా చేధించేవాళ్లం.అయితే బ్యాటింగ్లో మేము కాస్త తడబడ్డాము. కానీ మా బ్యాటింగ్ లైనప్ అద్బుతంగా ఉంది. టాప్ 5లో మంచి బ్యాటర్లు ఉన్నారు. మా తర్వాతి మ్యాచ్లో రాణిస్తారని భావిస్తున్నారు. బ్యాటింగ్లో భాగస్వామ్యాలు నెలకొల్పడం అవసరం. ఈ మ్యాచ్లో మేడు అది చేయలేకపోయాము. అయితే సిద్రా పోరాటం గురించి ఎంత చెప్పుకొన్న తక్కువే. ఆమె నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తుంది. మా జట్టులో సిద్రా కీలక సభ్యురాలు" అని సనా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో పేర్కొంది. ఈ మ్యాచ్లో బేగ్ నాలుగు వికెట్లు పడగొట్టినప్పటికి 69 పరుగులు సమర్పించుకుంది.చదవండి: IND vs AUS: ఒకప్పుడు కోహ్లితో కలిసి ఆడారు.. కట్ చేస్తే.. ఇప్పుడు అంపైర్లగా! -
IND Vs AUS: ఒకప్పుడు కోహ్లితో కలిసి ఆడారు.. కట్ చేస్తే.. ఇప్పుడు అంపైర్లుగా!
‘కింగ్’ కోహ్లి టీనేజ్లో భారత్ను అండర్–19 ప్రపంచకప్ విజేతగా నిలిపాడు. 2008లో అతని సారథ్యంలోనే యువ భారత్ ‘కప్’ తెచ్చింది. తర్వాత సీనియర్ జట్టు సభ్యుడైన కొన్నాళ్లకే 2011లో ధోని నేతృత్వంలోని టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలిచింది.తర్వాత చాంపియన్స్ ట్రోఫీ, గతేడాది టి20 ప్రపంచకప్, ఈ ఏడాది మరో చాంపియన్స్ ట్రోఫీ ఇలా చాలా ఐసీసీ ట్రోఫీల్లో కోహ్లి కీలక ఆటగాడయ్యాడు. తదుపరి 2027 వన్డే ప్రపంచకప్ బరిలో నిలిచేందుకు ఫిట్నెస్తో ఉన్నాడు. అయితే అతని 2008 సహచరుల్లో ఇద్దరు తన్మయ్ శ్రీవాస్తవ, అజితేశ్ అర్గల్లు ఇప్పుడు ఫీల్డ్ అంపైర్లుగా మారారు. 35 ఏళ్ల తన్మయ్, 37 ఏళ్ల అజితేశ్లకు కాలం కలిసివస్తే... ఐసీసీ ఎలైట్ అంపైర్లయితే... కోహ్లి ఆడే మ్యాచ్లకు, 2027 మెగా ఈవెంట్కు ఫీల్డ్ అంపైర్లుగా బరిలోకి దిగే అవకాశాలు లేకపోలేదు. ఇదే జరిగితే 22 గజాల పిచ్పై వికెట్ల ముందు కోహ్లి ఆడుతుంటే... వికెట్ల వెనుక (నాన్ స్ట్రయిక్ ఎండ్లో) ఒకప్పటి సహచరులు అంపైరింగ్ చేయడాన్ని చూడొచ్చు. ఇక ప్రస్తుత విషయానికొస్తే తన్మయ్, అజితేశ్లు 2023లో బీసీసీఐ అంపైరింగ్ పరీక్షల్లో పాసయ్యారు. ఇప్పటికే రంజీ, విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలకు అంపైరింగ్ చేశారు. తాజాగా వీరికి ప్రమోషన్ లభించింది. వీళ్లిద్దరు ఇప్పుడు భారత్ ‘ఎ’, ఆ్రస్టేలియా ‘ఎ’ జట్ల మధ్య జరుగుతున్న సిరీస్కు కాన్పూర్లో అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.చదవండి: ICC Womens World Cup 2025: పాక్పై భారత్ గెలుపు.. మహిళలూ మురిపించారు -
IND Vs PAK: పాక్పై భారత్ గెలుపు.. మహిళలూ మురిపించారు
పాక్ టాస్ నెగ్గిన తీరు... బౌలింగ్ జోరు... భారత శిబిరాన్ని కాస్త కలవరపెట్టింది. కానీ చివరకు నిర్ణీత ఓవర్ల తర్వాత భారత స్కోరు హర్మన్ప్రీత్ బృందం ఆందోళనను దూరం చేసింది. లక్ష్యఛేదనకు దిగిన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను టీమిండియా కట్టుదిట్టమైన బౌలింగ్తో ఆరంభంలోనే చిక్కుల్లో పడేసింది. బౌలర్లు ఏమాత్రం పట్టుసడలించకుండా క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూనే మ్యాచ్ను ఏకపక్షంగా ముగించారు. పాకిస్తాన్పై తమ అజేయ రికార్డును పొడిగించారు. కొలంబో: సొంతగడ్డపై ఐసీసీ వన్డే ప్రపంచకప్లో బోణీ కొట్టిన భారత మహిళల జట్టు ఇప్పుడు శ్రీలంకలో పాకిస్తాన్ పనిపట్టింది. బ్యాటింగ్ వైఫల్యంతో తడబడిన హర్మన్ప్రీత్ కౌర్ బృందం బౌలింగ్ బలగంతో పాక్ను చిత్తు చేసింది. 88 పరుగుల తేడాతో భారత మహిళల జట్టు పాకిస్తాన్ను ఓడించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ కూడా పురుషుల ఈవెంట్లాగే ఏకపక్షంగా ముగిసింది. మొత్తమ్మీద వరుసగా నాలుగు ఆదివారాలు పాక్ జట్లకు, వారి అభిమానులకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత జట్టు నిరీ్ణత 50 ఓవర్లలో 247 పరుగుల వద్ద ఆలౌటైంది. హర్లీన్ డియోల్ (65 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, రిచా ఘోష్ (20 బంతుల్లో 35 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడింది. ప్రత్యర్థి బౌలర్లలో డయానా బేగ్ 4, సాదియా, ఫాతిమా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పాకిస్తాన్ 43 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. సిద్రా అమిన్ (106 బంతుల్లో 81; 9 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్రాంతి గౌడ్, దీప్తి శర్మ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఆడిన రెండు మ్యాచ్ల్లో నెగ్గిన భారత జట్టు నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఈనెల 9న విశాఖపట్నంలో జరిగే తమ తదుపరి మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో భారత్ ఆడుతుంది. నేడు ఇండోర్లో జరిగే మ్యాచ్లో న్యూజిలాండ్తో దక్షిణాఫ్రికా తలపడుతుంది. మెరుగ్గానే మొదలైనా... ప్రతీక (37 బంతుల్లో 31; 5 ఫోర్లు), స్మృతి మంధాన (23; 4 ఫోర్లు) ఓపెనింగ్ వికెట్కు 48 పరుగులతో మంచి ఆరంభమే ఇచ్చారు. కానీ 19 పరుగుల వ్యవధిలో ఇద్దరు ని్రష్కమించారు. తర్వాత హర్లీన్, కెప్టెన్ హర్మన్ జట్టు స్కోరును వంద పరుగులు దాటించారు. కాసేపటికే కెపె్టన్ వికెట్ను పారేసుకుంది. జెమీమా (37 బంతుల్లో 32; 5 ఫోర్లు), హర్లీన్ కొద్దిసేపు ఇన్నింగ్స్ను నడిపించారు. కానీ జట్టు స్కోరు 151 వద్ద హర్లీన్, 159 వద్ద జెమీమా అవుట్కావడంతో భారత్ ఇబ్బందిపడింది. స్నేహ్ రాణా (20; 2 ఫోర్లు), ఆఖర్లో రిచా మెరుపులతో చివరకు గట్టిస్కోరే ప్రత్యర్థి ముందుంచింది. సిద్రా ఒంటరి పోరాటం లక్ష్యం ఏమంత కష్టమైంది కాకపోయినా... పాక్ మాత్రం ఆరంభం నుంచే కష్టాల్లో కూరుకు పోయింది. తర్వాత ఏటికి ఎదురీదలేక, పూర్తి కోటా ఓవర్లనైనా ఆడలేక ఆలౌటైంది. భారత బౌలింగ్ దెబ్బకు ఓపెనర్లు మునీబా (2), సదాప్ షమా (6) సహా, మిడిలార్డర్లో అలియా (2), కెప్టెన్ ఫాతిమా సనా (2) సింగిల్ డిజిట్లకే వెనుదిరిగారు. సిద్రా అమిన్, నటాలియా (33; 4 ఫోర్లు)తో కలిసి ఒంటరి పోరాటం చేసింది. ఇద్దరు నాలుగో వికెట్కు 69 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరు అవుటయ్యాక ఇన్నింగ్స్ కూలేందుకు ఎంతోసేపు పట్టలేదు. స్నేహ్ రాణాకు 2 వికెట్లు దక్కాయి.మ్యాచ్ రిఫరీ చేసిన పొరపాటుతో... దక్షిణాఫ్రికాకు చెందిన రిఫరీ శాండ్రె ఫ్రిజ్ గందరగోళంతో ‘టాస్’ నిర్ణయమే బోల్తా పడింది. పాక్ సారథి ఫాతిమా ‘బొరుసు’ చెప్పగా... హర్మన్ ఎగరేసిన నాణెం ‘బొమ్మ’గా తేలింది. మ్యాచ్ రిఫరీ మాత్రం పాక్ కెపె్టన్ టాస్ గెలిచినట్లు ప్రకటించింది. అంతా తెలిసినా హర్మన్ కూడా అభ్యంతరం చెప్పక పోవడమే ఇక్కడ కొసమెరుపు! ఇక మహిళా సారథులు సైతం కరచాలనం చేసుకోకుండానే సమరానికి సై అన్నారు.స్కోరు వివరాలు భారత మహిళల ఇన్నింగ్స్: ప్రతీక (బి) సాదియా 31; స్మృతి (ఎల్బీడబ్ల్యూ) (బి) ఫాతిమా 23; హర్లీన్ (సి) నష్రా (బి) రమీన్ 46; హర్మన్ప్రీత్ (సి) సిద్రా నవాజ్ (బి) డయానా 19; జెమీమా (ఎల్బీడబ్ల్యూ) (బి) నష్రా 32; దీప్తి శర్మ (సి) సిద్రా నవాజ్ (బి) డయానా 25; స్నేహ్ రాణా (సి) ఆలియా (బి) ఫాతిమా 20; రిచా ఘోష్ (నాటౌట్) 35; శ్రీచరణి (సి) నటాలియా (బి) సాదియా 1; క్రాంతి (సి) ఆలియా (బి) డయానా 8; రేణుక (సి) సిద్రా నవాజ్ (బి) డయానా 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్) 247. వికెట్ల పతనం: 1–48, 2–67, 3–106, 4–151, 5–159, 6–201, 7–203, 8–226, 9–247, 10–247. బౌలింగ్: సాదియా 10–0–47–2, డయానా బేగ్ 10–1–69–4, ఫాతిమా 10–2–38–2, రమీన్ 10–0–39–1, నష్రా 10–0–52–1. పాకిస్తాన్ మహిళల ఇన్నింగ్స్: మునీబా అలీ (రనౌట్) 2; షమా (సి అండ్ బి) క్రాంతి 6; సిద్రా అమిన్ (సి) హర్మన్ (బి) స్నేహ్ రాణా 81; ఆలియా (సి) దీప్తి (బి) క్రాంతి 2; నటాలియా (సి) సబ్–రాధ (బి) క్రాంతి 33; ఫాతిమా (సి) స్మృతి (బి) దీప్తి 2; సిద్రా నవాజ్ (సి అండ్ బి) స్నేహ్ 14; రమీన్ (బి) దీప్తి 0; డయానా బేగ్ (రనౌట్) 9; నష్రా (నాటౌట్) 2; సాదియా (సి) స్మృతి (బి) దీప్తి 0; ఎక్స్ట్రాలు 8; మొత్తం (43 ఓవర్లలో ఆలౌట్) 159. వికెట్ల పతనం: 1–6, 2–20, 3–26, 4–95, 5–102, 6–143, 7–146, 8–150, 9–158, 10–159. బౌలింగ్: రేణుక 10–1–29–0, క్రాంతి 10–3–20–3, స్నేహ్ రాణా 8–0–38–2, శ్రీచరణి 6–1–26–0, దీప్తి శర్మ 9–0–45–3. -
ప్రభ్సిమ్రన్ విధ్వంసకర శతకం.. ఉత్కంఠ పోరులో ఆసీస్పై టీమిండియా గెలుపు
స్వదేశంలో ఆస్ట్రేలియా-ఏతో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను (India A vs Australia A) భారత-ఏ జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది. కాన్పూర్ వేదికగా ఇవాళ (అక్టోబర్ 5) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆసీస్పై (Australia) భారత్ (Team India) 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ సిరీస్లోని తొలి వన్డేలో భారత్ గెలవగా.. రెండో వన్డేలో ఆసీస్ గెలిచింది. దీనికి ముందు ఆసీస్తో జరిగిన రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను కూడా భారత్ చేజిక్కించుకుంది (1-0).భారీ స్కోర్ చేసిన ఆస్ట్రేలియాటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.1 ఓవర్లలో 316 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. కూపర్ కన్నోలీ (64), లియామ్ స్కాట్ (73), కెప్టెన్ జాక్ ఎడ్వర్డ్స్ (89) అర్ద సెంచరీలతో సత్తా చాటి ఆసీస్ భారీ స్కోర్ చేసేందుకు దోహదపడ్డారు.44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో కన్నోలీ.. లిచ్లన్ షా (32) సాయంతో ఆసీస్ ఇన్నింగ్స్కు జీవం పోశాడు. ఆతర్వాత లియామ్ స్కాట్, ఎడ్వర్డ్స్ సంచలన ఇన్నింగ్స్లతో భారీ స్కోర్ అందించారు. స్కాట్, ఎడ్వర్డ్స్ ఏడో వికెట్కు 152 పరుగులు జోడించి, భారత్కు కఠిన సవాల్ విసిరారు.భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా చెరో 3 వికెట్లు తీయగా.. పార్ట్ టైమ్ బౌలర్ ఆయుశ్ బదోని 2, గుర్జప్నీత్ సింగ్, నిషాంత్ సంధు తలో వికెట్ దక్కించుకున్నారు.ప్రభ్సిమ్రన్ సింగ్ విధ్వంసకర శతకంఅనంతరం బరిలోకి దిగిన భారత్.. ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (Prabhsimran Singh) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 46 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ప్రభ్సిమ్రన్ కేవలం 68 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో మెరుపు శతకం బాదాడు. ప్రభ్సిమ్రన్ ఔటయ్యాక భారత ఇన్నింగ్స్ను కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (62), రియాన్ పరాగ్ (62) తీర్చిదిద్దారు.ఆఖర్లో ఉత్కంఠగా మారిన మ్యాచ్అయితే ఆఖర్లో భారత ఆటగాళ్లు వరుస పెట్టి పెవిలియన్కు చేరడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఒక్కో పరుగు చేసేందుకు భారత ఆటగాళ్లు నానా కష్టాలు పడ్డారు. అయితే చివర్లో విప్రాజ్ నిగమ్ (24 నాటౌట్), అర్షదీప్ (7 నాటౌట్) సహకారంతో మ్యాచ్ను గెలిపించాడు. ఆసీస్ బౌలర్లు టాడ్ మర్ఫీ, తన్వీర్ సంఘా తలో 4 వికెట్లు తీసి భారత్ను భయపెట్టారు.చదవండి: భారత్ నా మాతృభూమి, దేవాలయం లాంటిది: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు -
ఆసీస్ భారీ స్కోర్.. ఛేదనలో విశ్వరూపం ప్రదర్శించిన టీమిండియా బ్యాటర్
భారత్-ఏ, ఆస్ట్రేలియా-ఏ జట్ల (India A vs Australia A) మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 5) నిర్ణయాత్మక మూడో వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా (Australia) 49.1 ఓవర్లలో 316 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. కూపర్ కన్నోలీ (64), లియామ్ స్కాట్ (73), కెప్టెన్ జాక్ ఎడ్వర్డ్స్ (89) అర్ద సెంచరీలతో సత్తా చాటి ఆసీస్ భారీ స్కోర్ చేసేందుకు దోహదపడ్డారు.44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో కన్నోలీ.. లిచ్లన్ షా (32) సాయంతో ఆసీస్ ఇన్నింగ్స్కు జీవం పోశాడు. ఆతర్వాత లియామ్ స్కాట్, ఎడ్వర్డ్స్ సంచలన ఇన్నింగ్స్లతో భారీ స్కోర్ అందించారు. స్కాట్, ఎడ్వర్డ్స్ ఏడో వికెట్కు 152 పరుగులు జోడించి, భారత్కు కఠిన సవాల్ విసిరారు.భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా చెరో 3 వికెట్లు తీయగా.. పార్ట్ టైమ్ బౌలర్ ఆయుశ్ బదోని 2, గుర్జప్నీత్ సింగ్, నిషాంత్ సంధు తలో వికెట్ దక్కించుకున్నారు.ప్రభ్సిమ్రన్ విశ్వరూపంఅనంతరం 317 భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ (Team India).. ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (Prabhsimran Singh) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 24 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ప్రభ్సిమ్రన్ కేవలం 68 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో మెరుపు శతకం బాదాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ తన శైలికి విరుద్దంగా నిదానంగా ఆడి 25 బంతుల్లో కేవలం రెండే ఫోర్ల సాయంతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. గత వన్డేలో సత్తా చాటిన తిలక్ వర్మ (3) ఈ మ్యాచ్లో నిరాశపరిచాడు. ప్రస్తుతం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (17), రియాన్ పరాగ్ (22) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే 26 ఓవర్లలో మరో 145 పరుగులు చేయాలి. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి.కాగా, ఈ మ్యాచ్ మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరుగుతుంది. ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్ల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు సిరీస్ను కైవసం చేసుకుంటుంది.వన్డే సిరీస్కు ముందు ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్ల అనధికారిక టెస్ట్ సిరీస్ కూడా జరిగింది. ఆ సిరీస్కు భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ల కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్లో పర్యటిస్తుంది. చదవండి: పాకిస్తాన్తో మ్యాచ్.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన టీమిండియా -
పాకిస్తాన్తో మ్యాచ్.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన టీమిండియా
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (ICC Women's World Cup 2025) భాగంగా పాకిస్తాన్తో ఇవాళ (అక్టోబర్ 5) జరుగుతున్న మ్యాచ్లో (India vs Pakistan) టీమిండియా (Team India) సామర్థ్యం మేరకు రాణించలేకపోయింది. కొలొంబో వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి పాక్ (Pakistan) ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసి ఓ మోస్తరు స్కోర్కే పరిమితమైంది. నిర్ణీత 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 247 పరుగులకు ఆలౌటైంది.46 పరుగులతో హర్లీన్ డియోల్ టాప్ స్కోరర్గా నిలువగా.. రిచా ఘోష్ 35 (నాటౌట్), జెమీమా రోడ్రిగెజ్ 32, ప్రతీక రావల్ 31, దీప్తి శర్మ 25, స్మృతి మంధన 23, స్నేహ్ రాణా 20, హర్మన్ప్రీత్ 19, శ్రీ చరణి 1, క్రాంతి గౌడ్ 8, రేణుకా సింగ్ డకౌటయ్యారు. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లకు మంచి ఆరంభాలు లభించినా పెద్దగా స్కోర్లుగా మలచలేకపోయారు.పాక్ బౌలర్లలో డయానా బేగ్ 4 వికెట్లతో సత్తా చాటగా.. సదియా ఇక్బాల్, కెప్టెన్ ఫాతిమా సనా తలో 2, రమీన్ షమీమ్, సష్రా సంధు చెరో వికెట్ పడగొట్టారు.స్ప్రే ఉపయోగించిన పాక్ కెప్టెన్భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చిన్నచిన్న పురుగులు పలు మార్లు మ్యాచ్కు అంతరాయం కలిగించాయి. ఓ దశలో పరుగుల సమస్య ఎక్కువ కావడంతో అంపైర్ అనుమతితో పాక్ కెప్టెన్ పరుగుల నివారణ స్ప్రేను ప్రయోగించింది. ఇన్నింగ్స్ 28వ ఓవర్లో ఇది జరిగింది. స్ప్రే ఉపయోగించిన తర్వాత పురుగుల ప్రభావం తగ్గడంతో భారత బ్యాటింగ్ సజావుగా సాగింది.టాస్ సమయంలో గందరగోళంటాస్ సమయంలో గందరగోళం నెలకొంది. పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా టాస్ గెలిచినట్లు రిఫరీ షాండ్రే ఫ్రిట్జ్, అనౌన్సర్ మెల్ జోన్స్ ప్రకటించారు. వాస్తవానికి పాక్ కెప్టెన్ టాస్ గెలవలేదు.భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ టాస్ వేయగానే ఫాతిమా "టెయిల్స్" అని చెప్పింది. కానీ రిఫరీ ఫ్రిట్జ్, అనౌన్సర్ మెల్ జోన్స్ "హెడ్స్"గా వినిపించుకున్నారు. తీరా నాణెం "హెడ్స్"గా పడడంతో టాస్ పాకిస్తాన్ గెలిచిందని ప్రకటించారు. టాస్ గెలిచిన ఫాతిమా ఫీల్డింగ్ ఎంచుకోగా, దీనిపై భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం ఆసక్తికరం.చదవండి: భారత్తో నిర్ణయాత్మక మూడో వన్డే.. ఆస్ట్రేలియా భారీ స్కోర్ -
World Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. స్ప్రే ప్రయోగించిన పాక్ కెప్టెన్
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (ICC Women's World Cup 2025) భాగంగా భారత్-పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య ఇవాళ (అక్టోబర్ 5) జరుగుతున్న మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో పాక్ కెప్టెన్ ఫాతిమా సనా మ్యాజిక్ స్ప్రేను (Spray) ప్రయోగించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. ఇంతకీ పాక్ కెప్టెన్ ఎందుకలా చేసిందని అభిమానులు ఆరా తీస్తున్నారు.వివరాల్లో వెళితే.. కొలొంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి చిన్నచిన్న పురుగులు మైదానమంతా వ్యాపించి ఇరు జట్ల ఆటగాళ్లను ఇబ్బంది పెట్టాయి. ఈ పరుగుల కారణంగా మ్యాచ్కు పలు మార్లు అంతరాయం కలిగింది.ఇన్నింగ్స్ మధ్యలో పురుగుల ప్రభావం చాలా ఎక్కువైంది. దీని వల్ల భారత ఆటగాళ్లు బ్యాటింగ్ చేయలేకపోయారు. ఈ విషయమై అప్పుడు క్రీజ్లో ఉన్న భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ అంపైర్కు ఫిర్యాదు చేసింది. పురుగుల వల్ల తాను బంతిపై దృష్టి సారించలేకపోతున్నానని తెలిపింది.దీంతో ఇన్నింగ్స్ 28వ ఓవర్లో అంపైర్ పురుగులు తరిమే స్ప్రేను ఉపయోగించేందుకు పర్మిషన్ ఇచ్చాడు. పాక్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ ఒకరు స్ప్రే తీసుకొచ్చి వారి కెప్టెన్ ఫాతిమా సనాకు ఇవ్వగా, ఆమె దాన్ని ఉపయోంచి పురుగులను తరిమికొట్టింది. స్ప్రే ఉపయోగించిన తర్వాత కాస్త ఉపశమనం లభించడంతో భారత ఆటగాళ్లు బ్యాటింగ్కు కొనసాగించారు.శ్రీలంకలోని క్రికెట్ మైదానాల్లో ఇలాంటి సన్నివేశాలు తరుచూ కనిపిస్తుంటాయి. పురుగులు, జంతువులు, పాములు పిలవని పేరంటాలకు వచ్చి పోతుంటాయి. తాజాగా భారత జట్టు ప్రాక్టీస్ చేస్తుండగా మైదానంలోకి పెద్ద పాము ప్రవేశించింది. పాములు పట్టే వారు వచ్చి దాన్ని తీసుకెళ్లి అడవిలో వదిలేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 44 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ప్రతీక రావల్ (31), స్మృతి మంధన (23), హర్లీన్ డియోల్ (46), హర్మన్ప్రీత్ (19), జెమీమా రోడ్రిగెజ్ (32) ఔట్ కాగా.. దీప్తి శర్మ (24), స్నేహ్ రాణా (16) క్రీజ్లో ఉన్నారు.చదవండి: భారత్తో నిర్ణయాత్మక మూడో వన్డే.. ఆస్ట్రేలియా భారీ స్కోర్ -
భారత్తో నిర్ణయాత్మక మూడో వన్డే.. ఆస్ట్రేలియా భారీ స్కోర్
కాన్పూర్ వేదికగా భారత్-ఏతో (India-A) ఇవాళ (అక్టోబర్ 5) జరుగుతున్న నిర్ణయాత్మక వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియా-ఏ (Australia-A) భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి 49.1 ఓవర్లలో 316 పరుగులకు ఆలౌటైంది. కూపర్ కన్నోలీ (64), లియామ్ స్కాట్ (73), కెప్టెన్ జాక్ ఎడ్వర్డ్స్ (89) అర్ద సెంచరీలతో సత్తా చాటి ఆసీస్ భారీ స్కోర్ చేసేందుకు దోహదపడ్డారు.44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో కన్నోలీ.. లిచ్లన్ షా (32) సాయంతో ఇన్నింగ్స్కు జీవం పోశాడు. ఆతర్వాత లియామ్ స్కాట్, ఎడ్వర్డ్స్ సంచలన ఇన్నింగ్స్లతో భారీ స్కోర్ అందించారు. స్కాట్, ఎడ్వర్డ్స్ ఏడో వికెట్కు 152 పరుగులు జోడించి, భారత్కు కఠిన సవాల్ విసిరారు. ఆసీస్ ఇన్నింగ్స్లో స్టార్ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ (5) వరుసగా మూడో మ్యాచ్లో నిరాశపరిచాడు.ఈ మ్యాచ్లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఏకంగా ఎనిమిది మంది బౌలర్లను ప్రయోగించాడు. వీరిలో అర్షదీప్ సింగ్ (10-2-38-3) ఒక్కడే సామర్థ్యం మేరకు రాణించగా.. హర్షిత్ రాణా (9.1-0-61-3) వికెట్లు తీసినప్పటికీ ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. పార్ట్ టైమ్ బౌలర్ ఆయుశ్ బదోని 2 వికెట్లు తీయగా.. గుర్జప్నీత్ సింగ్, నిషాంత్ సంధు తలో వికెట్ దక్కించుకున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ విప్రాజ్ నిగమ్కు (6-0-60-0) ఆసీస్ ఆటగాళ్లు చుక్కలు చూపించారు. అభిషేక్ శర్మ (4-0-19-0) పర్వాలేదనిపించాడు.కాగా, ఈ మ్యాచ్ మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరుగుతుంది. ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్ల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. వన్డే సిరీస్కు ముందు ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్ల అనధికారిక టెస్ట్ సిరీస్ కూడా జరిగింది. ఆ సిరీస్కు భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ల కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్లో పర్యటిస్తుంది. చదవండి: World Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు ముందు టాస్ గందరగోళం -
World Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు ముందు టాస్ గందరగోళం
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's Cricket World Cup 2025) భారత్, పాకిస్తాన్ (India VS Pakistan) మ్యాచ్ టాస్ గందరగోళం మధ్య ప్రారంభమైంది. కొలొంబోలోని ప్రేమదాస వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా టాస్ గెలిచినట్లు రిఫరీ షాండ్రే ఫ్రిట్జ్, అనౌన్సర్ మెల్ జోన్స్ ప్రకటించారు. వాస్తవానికి పాక్ కెప్టెన్ టాస్ గెలవలేదు.భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ టాస్ వేయగానే ఫాతిమా "టెయిల్స్" అని చెప్పింది. కానీ రిఫరీ ఫ్రిట్జ్, అనౌన్సర్ మెల్ జోన్స్ "హెడ్స్"గా వినిపించుకున్నారు. తీరా నాణెం "హెడ్స్"గా పడడంతో టాస్ పాకిస్తాన్ గెలిచిందని ప్రకటించారు. టాస్ గెలిచిన ఫాతిమా ఫీల్డింగ్ ఎంచుకోగా, దీనిపై భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.ఇటీవల పురుషుల ఆసియా కప్లో జరిగిన విధంగానే టాస్ అనంతరం భారత కెప్టెన్ పాక్ కెప్టెన్కు హ్యాండ్ షేక్ ఇవ్వలేదు. టాస్ ఫలితం వెలువడగానే ఇరువురు కెప్టెన్లు చెరో దిక్కు అయ్యారు. ఈ మ్యాచ్లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. భారత్ తరఫున అమన్జోత్ అనారోగ్యంతో బాధపడుతుండటంతో రేణుకా సింగ్కి అవకాశం ఇచ్చారు. పాకిస్తాన్ తరఫున ఒమైమా సోహాలీ స్థానంలో సదాఫ్ షమాస్ జట్టులోకి వచ్చింది.తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ సగం ఓవర్లు పూర్తయ్యే సమయానికి 3 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధన (23), ప్రతీక రావల్ (31), హర్మన్ప్రీత్ (19) ఔట్ కాగా.. హర్లీన్ డియోల్ (31), జెమీమా రోడ్రిగెజ్ (1) క్రీజ్లో ఉన్నారు.కాగా, పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇటీవల ముగిసిన పురుషుల ఆసియా కప్లో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు హ్యాండ్ షేక్కు నిరాకరించారు. ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలిచిన తర్వాత ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహిసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించింది. చదవండి: భారత్ నా మాతృభూమి, దేవాలయం లాంటిది: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు -
ఇరానీ కప్ కూడా వారిదే.. డబుల్ ధమాకా సాధించిన రంజీ ఛాంపియన్
ఈ ఏడాది (2025) రంజీ ఛాంపియన్గా నిలిచిన విదర్భ జట్టు (Vidarbha), ఇరానీ కప్ను (Irani Cup 2025) కూడా కైవసం చేసుకుంది. రెస్ట్ ఆఫ్ ఇండియాపై (Rest Of India) 93 పరుగుల తేడాతో గెలుపొంది, డబుల్ ధమాకా సాధించింది. విదర్భ రంజీ ట్రోఫీని, ఇరానీ కప్ను ఒకే ఏడాది గెలవడం ఇది మొదటిసారి కాదు. 2018, 2019 సీజన్లలోనూ రెండు ట్రోఫీలను సాధించింది. ఇటీవలికాలంలో సుదీర్ఘ ఫార్మాట్లో చెలరేగిపోతున్న ఈ తూర్పు మహారాష్ట్ర జట్టు.. హేమాహేమీలున్న జట్లను సైతం మట్టికరిపిస్తూ సంచలనాలు సృష్టిస్తుంది. ఆ జట్టు విజయాల్లో అథర్వ తైడే, ధృవ్ షోరే, డానిష్ మాలేవార్, యశ్ రాథోడ్, అక్షయ్ వాద్కర్, యశ్ ఠాకూర్, హర్ష్ దూబే, ఆదిత్య సర్వటే, దర్శన్ నల్కండే, పార్థ్ రేఖడే లాంటి ఆటగాళ్లు కీలకపాత్ర పోషిస్తున్నారు.తాజాగా ఇరానీ కప్ చేజిక్కించుకోవడంలో అథర్వ తైడే ప్రధానపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్లో అద్భుతమైన సెంచరీ (143) చేసి విదర్భ భారీ స్కోర్ చేయడానికి పునాది వేశాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు. ఈ మ్యాచ్లో యశ్ రాథోడ్ (91) కూడా సత్తా చాటడు. తొలి ఇన్నింగ్స్లో తైడేతో కలిసి కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. బౌలింగ్లో యశ్ ఠాకూర్ (16.5-3-66-4, 7-1-47-2) , హర్ష్ దూబే (22-5-58-2, 27.5-5-73-4)అదరగొట్టారు.ఈ మ్యాచ్లో రెస్ట్ ఆఫ్ ఇండియా ఆటగాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. జట్టులో టీమిండియాకు ఆడిన ఆకాశ్దీప్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ లాంటి ఆటగాళ్లు ఉన్నా తేలిపోయారు. తొలి ఇన్నింగ్స్లో కెప్టెన్ రజత్ పాటిదార్ (66), అభిమన్యు ఈశ్వరన్ (52).. రెండో ఇన్నింగ్స్లో యశ్ ధుల్ (92), సుతార్ (56 నాటౌట్) పర్వాలేదనిపించారు. బౌలింగ్లో ఆకాశ్దీప్, అన్షుల్, మానవ్ సుతార్, సరాన్ష్ రాణించినా, తొలి ఇన్నింగ్స్లో మంచి స్కోర్ చేయడంతో విదర్భ మ్యాచ్పై పట్టు సాధించింది.స్కోర్ల వివరాలు.. విదర్భ- 342 & 232రెస్ట్ ఆఫ్ ఇండియా- 214 & 26793 పరుగుల తేడాతో విదర్భ విజయంచదవండి: భారత్ నా మాతృభూమి, దేవాలయం లాంటిది: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు -
వాళ్లలా పట్టుకుని వేలాడే రకం కాదు!.. అయినా ఎందుకిలా?: కైఫ్ ఫైర్
టీమిండియా వన్డే జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పించడం పట్ల భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ స్పందించాడు. పదహారేళ్లుగా జట్టుకు సేవలు అందిస్తున్న దిగ్గజ ఆటగాడికి.. కేవలం ఇంకొక్క ఏడాదైనా సమయం ఇచ్చి ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. ఇప్పటికిప్పుడు కెప్టెన్ను మార్చాల్సిన అవసరం ఏముందని.. రోహిత్ పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీరు సరికాదని మండిపడ్డాడు.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు ముందే బీసీసీఐ వన్డే కెప్టెన్ను మార్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ను గెలిపించిన రోహిత్ను తప్పించి.. టెస్టు సారథి శుబ్మన్ గిల్ (Shubman Gill)కే వన్డే పగ్గాలూ అప్పగించింది. ఈ నేపథ్యంలో కైఫ్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.గొప్పతనాన్ని చాటుకున్నాడు‘‘టీమిండియా కోసం రోహిత్ శర్మ తన జీవితంలో ఇప్పటికే పదహారేళ్లు ఇచ్చాడు. అతడి కోసం ఒక్కటంటే ఇంకొక్క ఏడాదే కెప్టెన్గా సమయం ఇవ్వలేరా?.. ఐసీసీ ఈవెంట్లలో పదహారు మ్యాచ్లలో పదిహేను మ్యాచ్లను గెలిపించిన సారథి. వన్డే వరల్డ్కప్-2023లో జట్టును ఫైనల్కు చేర్చాడు.ఇటీవల దుబాయ్లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ట్రోఫీ ఫైనల్లో రోహిత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. జట్టుకు ట్రోఫీ అందించాడు. 2024లో టీ20 ప్రపంచకప్ గెలవగానే రిటైర్మెంట్ ప్రకటించి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు.కొందరు పట్టుకుని వేలాడతారు.. రోహిత్ అలా చేయలేదు‘మేము ప్రపంచకప్ గెలిచాం. కొత్త ఆటగాళ్లకు కూడా అవకాశాలు రావాలి’ అని తనే తప్పుకొన్నాడు. కొన్నాళ్లు లైమ్లైట్కు దూరంగా ఉన్నాడు. నిజానికి భారత క్రికెట్లో కెప్టెన్గా చాలామంది తమ కాలాన్ని పొడిగించుకునేందుకు, పదవిని పట్టుకుని వేలాడుతూ ఉంటారు.కానీ రోహిత్ శర్మ అలా చేయలేదు కదా!.. తను వాళ్ల లాంటి వాడు కాదు.. అయినా ఇలా ఎందుకు?.. నిజానికి రోహిత్ ఎంతో మంది ఆటగాళ్లను తీర్చిదిద్దాడు. వారికి ఎన్నో విషయాలు నేర్పించాడు. అయినా సరే అతడిని ఇంకొక్క ఏడాది కెప్టెన్గా కొనసాగించలేరా?ఇంత హడావుడిగా ఎందుకు?వన్డే వరల్డ్కప్-2027 గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. అందుకు ఇంకా సమయం ఉంది. అయితే, ఇప్పటికే రోహిత్ను తొలగించారు. శుబ్మన్ గిల్ కొత్త సారథిగా వచ్చాడు. గిల్ ఇంకా యువకుడే. ఇప్పుడే హడావుడిగా అతడికి వన్డే కెప్టెన్సీ అప్పగించాల్సిన అవసరమైతే నాకు కనిపించలేదు’’ అంటూ కైఫ్ బీసీసీఐ తీరును విమర్శించాడు. చదవండి: 50 ఓవర్ల క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ విధ్వంసం -
భారత్ నా మాతృభూమి, దేవాలయం లాంటిది: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
భారత మూలాలున్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా (Danish Kaneria) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలికాలంలో తరుచూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డును (PCB) ఎండగడుతూ, భారత్పై ప్రేమను వ్యక్తపరుస్తున్న డానిష్.. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశాడు. భారత్పై అతి ప్రేమను ఒలకబోస్తున్నాడని కొందరు పాకిస్తానీలు కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో డానిష్ ఇలా స్పందించాడు.ఇటీవలికాలంలో కొందరు పాకిస్తానీలు నన్ను ప్రశ్నిస్తున్నారు. భారత మూలాలున్నా, క్రికెటర్గా ఎదిగేందుకు పాకిస్తాన్ ఇన్ని అవకాశాలు ఇస్తే.. భారత్కు సానుకూలంగా ఎందుకు మాట్లాడతావని నిలదీస్తున్నారు. భారత పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్నాని కామెంట్లు చేస్తున్నారు.నాపై సోషల్మీడియా వేదికగా జరుగుతున్న ఈ మాటల దాడిపై స్పందించాల్సిన సమయం వచ్చింది. ముందుగా పాకిస్తాన్ ప్రజలకు నేను కృతజ్ఞుడిని. వారి నుంచి నాకు ఎంతో ప్రేమ లభించింది. అయితే కొందరు మాత్రం నా పట్ల చాలా వ్యతిరేక భావంతో వ్యవహరించారు.ముఖ్యంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. పీసీబీలోని కొందరు అధికారుల నుంచి నేను తీవ్ర వివక్షను ఎదుర్కొన్నాను. ఓ దశలో బలవంతంగా మతం మార్చించేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. కొందరు నేను భారత పౌరసత్వం ఆశిస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి నాకు అలాంటి ఉద్దేశం లేదు. భవిష్యత్తులో అలాంటి అవసరం ఉన్నా, CAA లాంటి చట్టాలు అందుబాటులో ఉన్నాయి.పౌరసత్వం కోసం నేను భారత్కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నానడం చాలా తప్పు. భారత్ నా పూర్వీకుల భూమి. అది నాకు దేవాలయం లాంటిది. పాకిస్తాన్ నా జన్మభూమే. కానీ భారత్ నా మాతృభూమి అంటూ తన ‘X’ ఖాతాలో రాసుకొచ్చాడు.కాగా, డానిష్ కనేరియా పాకిస్తాన్లో పుట్టి పెరిగనప్పటికీ.. అతని పూర్వీకుల మూలాలు భారత్లోని గుజరాత్ ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తుంది. 1980 డిసెంబర్ 16న పాకిస్తాన్లోని లాహోర్లో జన్మించిన డానిష్.. 61 టెస్టుల్లో 261 వికెట్లు, 18 వన్డేల్లో 15 వికెట్లు తీసి పాక్ తరఫున గొప్ప స్పిన్నర్గా పేరు తెచ్చుకున్నాడు. అయితే స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో ఇరుక్కోవడంతో అతని కెరీర్ అర్దంతరంగా ముగిసింది. దీని కారణంగా అతను జీవితకాల నిషేధం ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం అతను కుటుంబంతో పాటు అమెరికాలో ఉంటున్నాడు. చదవండి: వన్డే కెప్టెన్గా ఎంపిక.. శుబ్మన్ గిల్ ‘బోల్డ్’ రియాక్షన్ -
షోయబ్ మాలిక్ విడాకుల వార్తలు;.. సానియా మీర్జా పోస్ట్ వైరల్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ (Shoaib Malik) మూడో వివాహ బంధం కూడా చిక్కుల్లో పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. మూడో భార్య, నటి సనా జావెద్ (Sana Javed)తో విడాకులు తీసుకోవడానికి షోయబ్ సిద్ధపడ్డాడనేది వాటి సారాంశం.మనసు స్వచ్ఛంగా ఉన్నపుడు..ఈ నేపథ్యంలో భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా (Sania Mirza) సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టు వైరల్గా మారింది. ‘‘మనసు స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉన్నపుడు.. దానిని బయటకు చూపించేందుకు ఎలాంటి కృత్రిమ ఫిల్టర్ల అవసరం ఉండదు’’ అంటూ సానియా తన కుమారుడు ఇజహాన్, స్నేహితులతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది.కాగా టెన్నిస్లో ఉన్నత శిఖరాలు అధిరోహించిన హైదరాబాదీ సానియా మీర్జా.. పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ను 2010లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, అంతకంటే ముందే ఆయేషా సిద్ధిఖీ అనే మహిళతో షోయబ్కు వివాహం కాగా.. 2006లోనే విడాకులు తీసుకున్నాడు.షోయబ్కు సానియా విడాకులుఅయితే, సానియా మీర్జాతోనూ షోయబ్ బంధం ఎక్కువకాలం నిలవలేదు. 2023లో తాను షోయబ్కు విడాకులు ఇచ్చినట్లు సానియా మీర్జా గతేడాది ప్రకటించింది. అయితే, అంతకంటే ముందే నటి సనా జావెద్ను పెళ్లాడిన ఫొటోలను షోయబ్ సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం.ఇక సనాకు ఇది రెండో వివాహం కాగా.. షోయబ్కు మూడోది. అయితే, పెళ్లికి ముందే వీరిద్దరు తమ పాత బంధాలను కొనసాగిస్తూనే.. ‘రిలేషన్షిప్’లోనే ఉన్నారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సనా తన భర్తకు, షోయబ్ తన భార్యకు విడాకులు ఇచ్చి 2024లో అధికారికంగా పెళ్లి చేసుకున్నారు.ఆ ఫొటోలతో వదంతులకు చెక్అయితే, సనా- షోయబ్ మధ్య కూడా సఖ్యత చెడినట్లు ఇటీవల వదంతులు వ్యాపించాయి. ఓ కార్యక్రమంలో ఇద్దరూ ఒకే సోఫాలో కూర్చునప్పటికీ దూరం దూరంగా ఉండటం.. షోయబ్ ఆటోగ్రాఫులు ఇస్తున్నపుడు సనా ముఖం తిప్పేసుకోవడం ఇందుకు ఊతమిచ్చాయి.దీంతో సనా- షోయబ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ కథనాలు వచ్చాయి. అయితే, భర్త షోయబ్తో కలిసి అమెరికాలో విహరిస్తున్న ఫొటోలను పంచుకోవడం ద్వారా సనా జావెద్ ఈ వదంతులకు చెక్ పెట్టింది. ఇద్దరూ కలిసి హాలీవుడ్ యూనివర్సల్ స్టూడియోస్ను సందర్శించిన ఫొటోలను సనా షేర్ చేసింది. షోయబ్ కూడా ఇవే ఫొటోలు షేర్ చేస్తూ.. ‘‘తనతో కలిసి ఇలా విహరించడం ఎల్లపుడూ సంతోషమే’’ అని పేర్కొన్నాడు.సానియా మీర్జా పోస్ట్ వైరల్ఇదిలా ఉంటే.. సానియా- షోయబ్లకు సంతానంగా కుమారుడు ఇజహాన్ జన్మించాడు. సానియా తన కుమారుడితో కలిసి ప్రస్తుతం దుబాయ్లో నివసిస్తోంది. ఇక ఇన్స్టాగ్రామ్లో పదమూడు మిలియన్లకు పైగా ఫాలోవర్లు కలిగి ఉన్న సానియా మీర్జా ఎప్పటికప్పుడు ఫొటోలు పంచుకుంటూనే ఉంటుంది. అయితే, శనివారం ఆమె పంచుకున్న ఫొటోలకు ఇచ్చిన క్యాప్షన్.. షోయబ్ మూడో పెళ్లి పెటాకులు అన్న వార్తల వేళ నెటిజన్లను ఆకర్షిస్తోంది.చదవండి: 50 ఓవర్ల క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ విధ్వంసం View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar) -
వన్డే కెప్టెన్గా ఎంపిక.. శుబ్మన్ గిల్ రియాక్షన్ వైరల్
టీమిండియా వన్డే కెప్టెన్గా ఎంపిక కావడం పట్ల శుబ్మన్ గిల్ (Shubman Gill) హర్షం వ్యక్తం చేశాడు. వన్డేల్లోనూ జట్టుకు సారథ్యం వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నాడు. వరల్డ్కప్ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఈ సందర్భంగా గిల్ పేర్కొన్నాడు.కాగా ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వన్డే, టీ20 జట్లను శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అనూహ్య రీతిలో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించిన బోర్డు.. అతడి స్థానంలో గిల్కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. వన్డే వరల్డ్కప్-2027 (ICC ODI World Cup 2027) టోర్నీని దృష్టిలో పెట్టుకుని ముందుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు.ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంఈ నేపథ్యంలో తాను వన్డే కెప్టెన్గా ఎంపిక కావడం పట్ల టెస్టు సారథి శుబ్మన్ గిల్ స్పందించాడు. ‘‘వన్డే క్రికెట్లో జాతీయ జట్టును ముందుకు నడిపించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. చాంపియన్ జట్టుకు సారథిగా ఎంపిక కావడం గర్వంగా ఉంది. నేను కూడా జట్టును గొప్పగా ముందుకు నడిపించాలనే ఆశిస్తున్నా.వరల్డ్కప్ కంటే ముందు మేము 20 వరకు వన్డేలు ఆడబోతున్నాము. ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం. ప్రతి ఒక్క ఆటగాడు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే కోరుకుంటాడు. నేను కూడా అంతే. సౌతాఫ్రికాలో జరిగే ఐసీసీ టోర్నీకి మేము పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతాము. వరల్డ్కప్ గెలుస్తాం’’ అని శుబ్మన్ గిల్ పేర్కొన్నాడు.రోహిత్ ఖాతాలో రెండుకాగా చివరగా 2011లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో వన్డే వరల్డ్కప్ గెలిచిన టీమిండియా.. 2023లో సొంతగడ్డపై రోహిత్ శర్మ కెప్టెన్సీలో రన్నరప్గా నిలిచింది. అయితే, ఈ ఏడాది ఐసీసీ వన్డే చాంపియన్స్ ట్రోఫీ-2025లో మాత్రం విజేతగా నిలిచింది. తద్వారా కెప్టెన్గా రోహిత్ శర్మ ఖాతాలో రెండు ఐసీసీ టైటిళ్లు చేరాయి. అంతకుముందు టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలోనూ కెప్టెన్ హోదాలో రోహిత్ భారత్ను చాంపియన్గా నిలిపిన సంగతి తెలిసిందే.అనూహ్య రీతిలోఆ తర్వాత అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. ఇటీవలే టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేల్లో కొనసాగుతానని స్పష్టం చేసిన రోహిత్ శర్మ పది కిలోల బరువు తగ్గి ఫిట్నెస్ను మరింత మెరుగుపరచుకున్నాడు. వన్డే వరల్డ్కప్-2027 ఆడటమే లక్ష్యంగా తనను తాను తీర్చిదిద్దుకుంటున్న తరుణంలో అనూహ్య రీతిలో కెప్టెన్సీ కోల్పోయాడు. కాగా 2027లో సౌతాఫ్రికా- జింబాబ్వే- నమీబియా ఉమ్మడిగా వన్డే వరల్డ్కప్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. చదవండి: 50 ఓవర్ల క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ విధ్వంసం -
భారత జట్టుతో అనుబంధం.. హర్మన్ గొప్ప ప్లేయర్: పాక్ కెప్టెన్ ప్రశంసలు
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur)పై పాకిస్తాన్ సారథి ఫాతిమా సనా ప్రశంసలు కురిపించింది. హర్మన్ అనుభవజ్ఞురాలైన ప్లేయర్ అని.. ఆమె జట్టును నడిపించే తీరు అద్భుతమని కొనియాడింది. కాగా వరుసగా నాలుగో ఆదివారం భారత్- పాకిస్తాన్ మ్యాచ్కు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే.పాక్పై వరుస విజయాలతో ట్రోఫీ సొంతంఇటీవల పురుషుల క్రికెట్ ఆసియా టీ20 కప్-2025 (Asia Cup) సందర్భంగా దాయాదులు తలపడ్డాయి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అనంతరం ఈ ఖండాంతర టోర్నీలో తొలిసారి జరిగిన ముఖాముఖి పోరులో టీమిండియా.. లీగ్, సూపర్ దశలతో పాటు ఫైనల్లో పాక్ను చిత్తు చేసి ట్రోఫీ గెలిచింది.అయితే, ఈ మ్యాచ్ల సందర్భంగా పాక్ జట్టుతో కరచాలనానికి సూర్యకుమార్ సేన నిరాకరించగా.. పాక్ జట్టు హైడ్రామా నడిపించింది. అంతేకాదు.. హ్యారిస్ రవూఫ్తో పాటు ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ రెచ్చగొట్టే రీతిలో వ్యవహరించి ఐసీసీతో మొట్టికాయలు తిన్నారు.ట్రోఫీ, మెడల్స్ ఎత్తుకుపోయిన నక్వీఇక పీసీబీ చైర్మన్, పాక్ మంత్రి మొహ్సిన్ నక్వీనుంచి ట్రోఫీ తీసుకునేందుకు భారత జట్టు నిరాకరించగా.. అతడు ట్రోఫీ, మెడల్స్తో పారిపోయాడు. తన దగ్గరకు వస్తేనే వాటిని ఇస్తానంటూ ఓవరాక్షన్ చేయగా.. బీసీసీఐ ఐసీసీ వద్దనే ఈ పంచాయితీ తేల్చుకునేందుకు సిద్ధమైంది.ఈసారి కూడా నో షేక్హ్యాండ్ఇలాంటి పరిణామాల నడుమ ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 సందర్భంగా భారత్- పాక్ జట్ల మధ్య ఆదివారం (అక్టోబరు 5) జరిగే మ్యాచ్పై ఆసక్తి నెలకొంది. కొలంబో వేదికగా దాయాదితో జరిగే పోరులో హర్మన్సేన కూడా కరచాలనానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో మ్యాచ్కు మీడియాతో మాట్లాడిన పాక్ కెప్టెన్ ఫాతిమా సనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘హర్మన్ప్రీత్ కౌర్ సీనియర్, అనుభవజ్ఞురాలైన ప్లేయర్. అద్బుత రీతిలో జట్టును ముందుకు నడిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.తనొక ప్రతిభావంతమైన ప్లేయర్. పరిస్థితులకు తగ్గట్లు హిట్టింగ్ ఆడగలదు.. డిఫెండ్ కూడా చేసుకోగలదు. మైదానంలో తన వ్యూహాలను పక్కాగా అమలు చేస్తుంది’’ అని భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ను ప్రశంసించింది.అంతా ఒకే కుటుంబం అదే విధంగా.. ‘‘2022 వరల్డ్కప్లో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత.. భారత జట్టు మొత్తం మా దగ్గరికి వచ్చి.. మమ్మల్ని పలకరించింది. మాతో కలిసి వారు తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆరోజు ఎంతో ప్రత్యేకం.ఆరోజే ఆ ఇరుజట్ల మధ్య గొప్ప అనుబంధం ఉందని నాకు అనిపించింది’’ అంటూ ఫాతిమా సనా గత జ్ఞాపకాలు గుర్తుచేసుకుంది. ప్రస్తుతం బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసనని.. అయితే, మైదానంలో ఉండే 20- 22 ప్లేయర్లు అంతా ఒక కుటుంబం లాంటివారేనని పేర్కొంది. ఐసీసీ వరల్డ్కప్ ఆడటం ప్రతి ఒక్క ప్లేయర్ కల అని.. తామంతా కేవలం ఆట మీద మాత్రమే దృష్టి పెడతామని ఫాతిమా సనా తెలిపింది.ఈసారి ఏకపక్ష విజయమేఅయితే, సనా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాక్ ఆటగాళ్ల మనస్తత్వం ఎలాంటిదో ఇటీవలే మరోసారి చూశామని.. ట్రోఫీ ఎత్తుకెళ్లే నక్వీ నడిపించే బోర్డుకు చెందిన ఆటగాళ్లు ఇలా మాట్లాడటం ఆశ్చర్యకరమని నెటిజన్లు పేర్కొంటున్నారు.కాగా భారత్- పాక్ మహిళా జట్లు గతంలో 11 వన్డేల్లో ముఖాముఖి తలపడగా.. అన్ని మ్యాచ్లలోనూ భారత్ విజయం సాధించింది. ఈసారి కూడా గెలుపు ఏకపక్షమయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. అయితే, వర్షం రూపంలో దాయాదుల పోరుకు ప్రమాదం పొంచి ఉంది. ఇదిలా ఉంటే.. హర్మన్ప్రీత్ కౌర్కు బదులుగా భారత బౌలింగ్ కోచ్ ఆవిష్కార్ సాల్వీ మీడియా సమావేశానికి హాజరయ్యాడు. ఈ క్రమంలో భారత్- పాక్ మహిళా జట్ల మధ్య అనుబంధం గురించి పాక్ జర్నలిస్టు ప్రశ్నించగా.. టీమిండియా మేనేజర్ తదుపరి ప్రశ్నకు వెళ్దామని చెప్పారు.చదవండి: 50 ఓవర్ల క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ విధ్వంసం -
అకస్మాత్తుగా అతడెలా ఊడిపడ్డాడు?: బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
టీమిండియా సెలక్టర్ల తీరుపై భారత జట్టు మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ (Kris Srikkanth) ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొంతమంది ఆటగాళ్లను తప్పించడానికి వీరికి రోజుకో సాకు దొరుకుతుందని మండిపడ్డాడు. ఆస్ట్రేలియాతో వన్డేలకు ఎంపిక చేసిన జట్టు తనను ఆశ్చర్యపరిచిందని.. సంజూ శాంసన్ (Sanju Samson) పట్ల వివక్ష ఎందుకో అర్థం కావడం లేదని వాపోయాడు.ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియాస్వదేశంలో వెస్టిండీస్తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన (India Tour Of Australia 2025)కు వెళ్లనున్న విషయం తెలిసిందే. అక్టోబరు 19- నవంబరు 8 మధ్య ఇరుజట్లు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లలో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శనివారం ఇందుకు సంబంధించిన జట్లను ప్రకటించింది.వారిద్దరు తొలిసారి..వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మపై వేటు వేసి.. శుబ్మన్ గిల్కు పగ్గాలు అప్పగించారు. ఇక శ్రేయస్ అయ్యర్కు వైస్ కెప్టెన్గా ప్రమోషన్ ఇవ్వడంతో పాటు.. నితీశ్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్ను తొలిసారి వన్డే జట్టుకు ఎంపిక చేశారు. వికెట్ కీపర్ కోటాలో కేఎల్ రాహుల్తో పాటు జురెల్ను ఎంపిక చేసిన సెలక్టర్లు.. సంజూ శాంసన్కు మాత్రం మొండిచేయి చూపారు.అతడికి అన్యాయంఈ విషయంపై టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఘాటుగా స్పందించాడు. ‘‘మరోసారి అతడికి అన్యాయం చేశారు. ఆఖరిగా ఆడిన వన్డేలో అతడు సెంచరీ చేశాడు. ఆసీస్తో వన్డే సిరీస్కు సంజూను తప్పక ఎంపిక చేయాల్సింది.కానీ ఓ ఆటగాడిని తప్పించడానికి వీళ్లకు (సెలక్టర్లు) రోజుకో సాకు దొరుకుతుంది. ఓసారి అతడిని ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయమంటారు. మరోసారి ఓపెనర్గా రమ్మంటారు. ఇంకోసారి ఏడు లేదంటే ఎనిమిదో నంబర్ బ్యాటర్గా ఆడమంటారు.జురెల్ ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు?అయినా.. అకస్మాత్తుగా ధ్రువ్ జురెల్ ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు?.. వన్డేల్లో సంజూ శాంసన్ కంటే అతడికి మొదటి ప్రాధాన్యం ఎలా దక్కుతుంది?.. తుదిజట్టులో సంజూ ఉన్నా, లేకపోయినా జట్టులో మాత్రం అతడికి చోటివ్వాలి కదా!హర్షిత్ రాణా ఎందుకు?ఇలాంటి పనులు చేయడం ద్వారా ఆటగాళ్లను గందరగోళానికి గురిచేస్తున్నారు. ఒక్కోసారి యశస్వి జైస్వాల్ జట్టులో ఉంటాడు. మరోసారి అతడి పేరే కనిపించదు. అయితే, హర్షిత్ రాణా మాత్రం అన్ని జట్లలో ఉంటాడు.అతడు జట్టులో ఎందుకు ఉంటున్నాడో ఎవరికీ తెలియదు. ఇలా ప్రతిసారి ఒకరికి వరుస అవకాశాలు ఇస్తూ.. మరొకరిని తప్పించడం ద్వారా ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది’’ అని చిక్కా సెలక్టర్ల తీరును విమర్శించాడు. కాగా ఇప్పటికే టెస్టుల్లో ఇరగదీస్తున్న జురెల్.. టీమిండియా తరఫున టీ20 ఫార్మాట్లోనూ అరంగేట్రం చేశాడు.సౌతాఫ్రికా జట్టుపై సంజూ సెంచరీమరోవైపు.. సంజూ చివరగా 2023లో సౌతాఫ్రికాతో వన్డేలో 108 పరుగులు సాధించి.. టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా 16 వన్డేల్లో కలిపి సగటు 56తో 99కు పైగా స్ట్రైక్రేటుతో 510 పరుగులు సాధించాడు. అయినప్పటికీ సెలక్టర్లు మాత్రం అతడిని వన్డేలకు ఎంపిక చేయడం లేదు. అయితే, ఆసీస్తో టీ20 సిరీస్ ఆడే జట్టులో మాత్రం ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్కు చోటు దక్కింది.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు బీసీసీఐ ప్రకటించిన జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైశ్వాల్.చదవండి: 50 ఓవర్ల క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ విధ్వంసం -
రోహిత్పై వేటు!.. సరైన నిర్ణయం.. త్వరలోనే అతడూ అవుట్: గావస్కర్
ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత క్రికెట్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మ (Rohit Sharma)పై వేటువేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI).. అతడి స్థానంలో శుబ్మన్ గిల్ (Shubman Gill)ను సారథిగా ఎంపిక చేసింది.ఆసీస్తో అక్టోబరులో జరిగే వన్డే సిరీస్ సందర్భంగా గిల్ వన్డే జట్టు పగ్గాలు చేపట్టనుండగా.. రోహిత్ శర్మ కేవలం ఆటగాడిగా కొనసాగనున్నాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరుపై విమర్శలు వస్తుండగా.. భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ కూడా స్పందించాడు.త్వరలోనే అతడూ అవుట్రోహిత్ శర్మపై వేటు వేస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని గావస్కర్ సమర్థించాడు. ‘‘వన్డే వరల్డ్కప్-2027 నేపథ్యంలో బోర్డు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నాకేమీ ఆశ్చర్యంగా అనిపించలేదు. ప్రస్తుతం టీ20 కెప్టెన్సీ సూర్యకుమార్ యాదవ్ చేతిలో ఉంది.ఇటీవలే అతడు టీమిండియాను ఆసియా కప్ విజేతగా నిలిపాడు. ఈ టోర్నీలో సూర్య డిప్యూటీగా, వైస్ కెప్టెన్గా గిల్ వ్యవహరించాడు. అంటే.. త్వరలోనే అతడు మూడు ఫార్మాట్లకు కెప్టెన్గా ఉండబోతున్నాడని ముందుగానే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు’’ అని గావస్కర్ స్పోర్ట్స్ టుడేతో పేర్కొన్నాడు. వన్డే ప్రపంచకప్-2027 నాటికి గిల్ చుట్టూ జట్టును నిర్మించే క్రమంలో బీసీసీఐ సరైన నిర్ణయమే తీసుకుందని అభిప్రాయపడ్డాడు. అందుకే ఈ నిర్ణయం’కెప్టెన్సీ మార్పు గురించి రోహిత్కు ముందే తెలియజేశాం. 2027 వన్డే వరల్డ్ కప్కు చాలా సమయం ఉన్నా సహజంగానే దాని గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పుడు వన్డే జరుగుతున్న తీరు చూస్తే వచ్చే రెండేళ్లలో ఎక్కువగా మ్యాచ్లు లేకపోవచ్చు. కాబట్టి కెప్టెన్ జట్టు గురించి తెలుసుకునేందుకు, తన ప్రణాళికలు రూపొందించుకునేందుకు తగినంత సమయం కావాలి. అందుకే గిల్ను ఎంపిక చేశాం. నిజంగా చెప్పాలంటే మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు ఉండటం కూడా కష్టమే. కెప్టెన్గా రోహిత్ చాలా అద్భుతంగా నడిపించాడు. ఒక వేళ చాంపియన్స్ ట్రోఫీ గెలవకపోయినా అది అతని గొప్పతనాన్ని తగ్గించదు. కానీ ఇప్పుడు కాకపోతే ఆరు నెలల తర్వాత అయినా ఏదో ఒక దశలో టీమ్ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిందే’ అని టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా తమ నిర్ణయాన్ని సమర్థించుకున్న సంగతి తెలిసిందే. -
50 ఓవర్ల క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ విధ్వంసం
భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా క్రికెటర్ హర్జాస్ సింగ్ (Harjas Singh) ఊహకందని రీతిలో బ్యాట్తో చెలరేగాడు. కేవలం 141 బంతుల్లోనే 314 పరుగులు సాధించాడు. ఆసీస్ దేశీ క్రికెట్లో భాగంగా యాభై ఓవర్ల మ్యాచ్లో ఈ మేరకు విధ్వంసకర ట్రిపుల్ సెంచరీ (Triple Century In 50 Over Cricket)తో విరుచుకుపడ్డాడు.వెస్టర్న్ సబ్అర్బ్స్ (Western Suburbs) జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న 20 ఏళ్ల హర్జాస్ సింగ్.. సిడ్నీ క్రికెట్ క్లబ్ జట్టుతో మ్యాచ్ సందర్భంగా ఇలా పరుగుల సునామీ సృష్టించాడు. తద్వారా గ్రేడ్ లెవల్ క్రికెట్లో పరిమిత ఓవర్ల మ్యాచ్లో త్రిశతకం బాదిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు.చండీగఢ్ నుంచి..హర్జాస్ సింగ్ మెరుపు ఇన్నింగ్స్లో ఏకంగా 35 సిక్సర్లతో పాటు 14 ఫోర్లు ఉండటం విశేషం. భారత సంతతికి చెందిన హర్జాస్ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జన్మించాడు. అతడి తల్లిదండ్రులు 2000లోనే చండీగఢ్ నుంచి వలస వెళ్లారు.సౌతాఫ్రికా వేదికగా అండర్-19 వరల్డ్కప్-2024 ఫైనల్లో భారత్- ఆసీస్ మధ్య మ్యాచ్ సందర్భంగా హర్జాస్ సింగ్ తొలిసారి వెలుగులోకి వచ్చాడు. టైటిల్ పోరులో 64 బంతుల్లో 55 పరుగులతో సత్తా చాటి.. ఆసీస్ను గెలిపించాడు.ఇది ప్రత్యేకం తాజాగా పరిమిత ఓవర్ల క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ సాధించడం పట్ల హర్జాస్ సింగ్ హర్షం వ్యక్తం చేశాడు. పవర్ హిట్టింగ్ ఆడటం తనకు అలవాటని.. ఈరోజు మాత్రం తన కెరీర్లో అత్యంత ప్రత్యేకమైనదని పేర్కొన్నాడు. కాగా హర్జాస్ సింగ్ ఇలాగే చెలరేగితే.. ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఆడుతున్న తన సహచర ఆటగాడు సామ్ కొన్స్టాస్ మాదిరి త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడం ఖాయం.ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో హర్జాస్ సింగ్ ట్రిపుల్ సెంచరీ సాధిస్తే.. అంతకుముందు ఫస్ట్ గ్రేడ్ క్రికెట్లో న్యూ సౌత్వేల్స్ తరఫున ఫిల్ జాక్వెస్ (321), విక్టర్ ట్రంపర్ (335) ట్రిపుల్ సెంచరీ చేశారు.196 పరుగుల తేడాతో జయభేరిమ్యాచ్ విషయానికొస్తే... హర్జాస్ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా వెస్టర్న్ సబ్అర్బ్స్ యాభై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 483 పరుగులు భారీ స్కోరు సాధించింది. అయితే, కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సిడ్నీ క్రికెట్ క్లబ్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 287 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా వెస్టర్న్ సబ్అర్బ్స్ ఏకంగా 196 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.చదవండి: అందుకే రోహిత్ శర్మపై వేటు: అగార్కర్ -
ICC WC 2025: టాస్ పడకుండానే మ్యాచ్ రద్దు
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్ (ICC Womens World Cup 2025)ను వరుణుడు వీడటం లేదు. ఇప్పటికే పలు మ్యాచ్లకు స్వల్పంగా ఆటంకం కలిగించిన వర్షం... శనివారం పూర్తి మ్యాచ్ను తుడిచిపెట్టేసింది. కొలంబో వేదికగా డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా- శ్రీలంక ( Sri Lanka W vs Australia W) మధ్య జరగాల్సిన మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దు అయింది. మ్యాచ్ సమయం కంటే ముందు నుంచే భారీ వర్షం ముంచెత్తడంతో... కనీసం టాస్ కూడా వేసే అవకాశం దక్కలేదు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. వరల్డ్కప్లో భాగంగా నేడు దాయాది పాకిస్తాన్తో భారత మహిళల జట్టు తలపడనుంది. ఇదీ చదవండి: ఒంటిచేత్తో ఆసీస్ను గెలిపించిన మార్ష్మౌంట్ మాంగనీ: మిచెల్ మార్ష్ (52 బంతుల్లో 103 నాటౌట్; 8 ఫోర్లు, 7 సిక్స్లు) అజేయ శతకంతో చెలరేగడంతో న్యూజిలాండ్పై మూడో టీ20లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్ల ‘చాపెల్–హ్యాడ్లీ’ సిరీస్లో భాగంగా శనివారం జరిగిన ఆఖరి టీ20లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో ఆతిథ్య న్యూజిలాండ్ను చిత్తుచేసింది. తద్వారా 2–0తో సిరీస్ కైవసం చేసుకుంది.తొలి మ్యాచ్లో మార్ష్ మెరుపులతో ఆసీస్ అలవోకగా గెలవగా... రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. అంతర్జాతీయ టి20ల్లో మార్ష్కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. వికెట్ కీపర్ టిమ్ సైఫెర్ట్ (35 బంతుల్లో 48; 5 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ మిచెల్ బ్రేస్వెల్ (22 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్), నీషమ్ (18 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు.గత మ్యాచ్ సెంచరీ హీరో టిమ్ రాబిన్సన్ (13) ఈ సారి విఫలం కాగా... డెవాన్ కాన్వే (0), మార్క్ చాప్మన్ (4), డారిల్ మిచెల్ (9) ప్రభావం చూపలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో సీన్ అబాట్ 3 వికెట్లు పడగొట్టగా... జోష్ హాజిల్వుడ్, జేవియర్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. అనంతరం లక్ష్యఛేదనలో మార్ష్ మెరుపులు మెరిపించడంతో ఆ్రస్టేలియా 18 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. మిగిలిన వాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోగా, మార్ష్ ఒంటి చేత్తో జట్టును విజయపథాన నడిపాడు.ట్రావిస్ హెడ్ (8), మాథ్యూ షార్ట్ (7), టిమ్ డేవిడ్ (3), అలెక్స్ కారీ (1)మార్కస్ స్టొయినిస్ (2) పేలవ ప్రదర్శన కనబర్చారు. మరో ఎండ్లో వరుసగా వికెట్లు పడుతున్నా... మార్ష్ ఏమాత్రం వెరవకుండా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో అతడు 50 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20ల్లో 73 ఇన్నింగ్స్లు ఆడిన మార్ష్కు ఇదే తొలి మూడంకెల స్కోరు. న్యూజిలాండ్ బౌలర్లలో నీషమ్ 4 వికెట్లు పడగొట్టాడు. మార్ష్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. -
విజయానికి 331 పరుగుల దూరంలో..
రంజీ ట్రోఫీ విజేత విదర్భ, రెస్టాఫ్ ఇండియా (Vidarbha vs Rest of India) మధ్య నాగ్పూర్ వేదికగా జరుగుతున్న ఇరానీ కప్ (Irani Cup 2025) రసవత్తరంగా సాగుతోంది. 361 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రెస్టాఫ్ ఇండియా... శనివారం ఆట ముగిసే సమయానికి 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. అభిమన్యు ఈశ్వరన్ (17), ఆర్యాన్ జుయల్ (6) అవుట్ కాగా... ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 5 బ్యాటింగ్), కెప్టెన్ రజత్ పాటీదార్ ( Rajat Patidar- 22 బంతుల్లో 2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. విజయానికి 331 పరుగుల దూరంలో..చేతిలో 8 వికెట్లు ఉన్న రెస్టాఫ్ ఇండియా... విజయానికి ఇంకా 331 పరుగులు చేయాల్సి ఉంది. తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేయలేకపోయిన రెస్టాఫ్ ఇండియా బ్యాటర్లు... మరి చివరి రోజు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారో చూడాలి.కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, యశ్ ధుల్, మానవ్ సుతార్ ఇంకా బ్యాటింగ్కు రావాల్సి ఉంది. విదర్భ బౌలర్లలో హర్శ్ దూబే, ఆదిత్య ఠాకరే చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 96/2తో శనివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ జట్టు... చివరకు 94.1 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 128 పరుగులతో కలుపుకొని ప్రత్యర్థి ముందు 361 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినట్లు అయింది. అమన్ (37), కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ (125 బంతుల్లో 36; 4 ఫోర్లు), దర్శన్ నల్కండే (92 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు. అన్షుల్ కంబోజ్కు 4 వికెట్లుతొలి ఇన్నింగ్స్లో మంచి పోరాటం కనబర్చిన విదర్భ ఆటగాళ్లు... రెండో ఇన్నింగ్స్లో అదే జోరు కొనసాగించలేకపోయారు. మెరుగైన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోవడంతో విదర్భ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది.ఇక హర్శ్ దూబే (43 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్లు) క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడేందుకు ప్రయత్నించాడు. రెస్టాప్ ఇండియా బౌలర్లలో అన్షుల్ కంబోజ్ 4 వికెట్లు పడగొట్టాడు.నేడు (అక్టోబరు 5) ఆటకు చివరి రోజు.స్కోరు వివరాలు విదర్భ తొలి ఇన్నింగ్స్: 342రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్: 214విదర్భ రెండో ఇన్నింగ్స్: అథర్వ తైడె (సి) ఆకాశ్దీప్ (బి) మానవ్ సుతార్ 15; అమన్ మోఖడే (సి) ఇషాన్ కిషన్ (బి) గుర్నూర్ బ్రార్ 37; ధ్రువ్ షొరే (ఎల్బీ) (బి) అన్షుల్ కంబోజ్ 27; దానిశ్ మాలేవార్ (సి) రుతురాజ్ (బి)అన్షుల్ కంబోజ్ 16; యశ్ రాథోడ్ (సి) ఇషాన్ కిషన్ (బి) అన్షుల్ కంబోజ్ 5; అక్షయ్ వాడ్కర్ (సి) ఇషాన్ కిషన్ (బి) అన్షుల్ కంబోజ్ 36; హర్శ్ దూబే (సి) సారాంశ్ (బి) గుర్నూర్ బ్రార్ 29; పార్థ్ రేఖడే (సి) రజత్ పాటీదార్ (బి) సారాంశ్ 2; యశ్ ఠాకూర్ (సి) ఆర్యాన్ జుయల్ (బి) మానవ్ సుతార్ 13; ఆదిత్య ఠాకరే (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు: 14; మొత్తం (94.1 ఓవర్లలో ఆలౌట్) 232.వికెట్ల పతనం: 1–42, 2–64, 3–97, 4–104, 5–105, 6–144, 7–155, 8–190, 9–207, 10–232. బౌలింగ్: సారాంశ్ జైన్ 21.1–0–52–2; ఆకాశ్దీప్ 10–4–13–0; మానవ్ సుతార్ 33–9–82–2; అన్షుల్ కంబోజ్ 12–1–34–4; గుర్నూర్ బ్రార్ 18–5–41–2.రెస్టాఫ్ ఇండియా రెండో ఇన్నింగ్స్: అభిమన్యు ఈశ్వరన్ (ఎల్బీ) (బి) హర్శ్ దూబే 17; ఆర్యాన్ జుయల్ (బి) ఆదిత్య 6; ఇషాన్ కిషన్ (బ్యాటింగ్) 5; రజత్ పాటీదార్ (బ్యాటింగ్) 2; ఎక్స్ట్రాలు 0; మొత్తం (12 ఓవర్లలో 2 వికెట్లకు) 30. వికెట్ల పతనం: 1–16, 2–24; బౌలింగ్: హర్శ్ దూబే 6–2–20–1; ఆదిత్య ఠాకరే 5–1–8–1; పార్థ్ రేఖడే 1–0–2–0. చదవండి: అందుకే రోహిత్ శర్మపై వేటు.. అప్పటి వరకు రో-కో ఆడటం కష్టమే: అగార్కర్ -
మహిళల ప్రపంచకప్లో నేడు భారత్ X పాకిస్తాన్
భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్లు వరుసగా నాలుగో ఆదివారం అంతర్జాతీయ వేదికపై తలపడనున్నాయి. అయితే ఈ సారి ఇది మహిళల సమరం. వన్డే వరల్డ్ కప్లో భాగంగా నేడు కొలంబోలో భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. బలాబలాలపరంగా చూస్తే పాక్కంటే భారత్ ఎంతో మెరుగైన స్థితిలో ఉంది. ఇరు జట్ల మధ్య గతంలో 11 వన్డేలు జరగ్గా అన్నీ భారతే గెలిచింది. పాక్ ఒక్క మ్యాచ్లోనూ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. భారత్ కనీసం 80 పరుగుల తేడాతో లేదా... 5 వికెట్ల తేడాతో ఈ మ్యాచ్లలో విజయాలు సాధించింది. ఈ సారి కూడా ఫలితం అదే వచ్చే అవకాశం ఉంది. ఈ టోర్నీ తొలి పోరులో శ్రీలంకపై సునాయాస విజయం సాధించగా... పాక్ జట్టు బంగ్లా చేతిలో చిత్తుగా ఓడింది. పురుషుల ఆసియా కప్ తరహాలోనే ఈ మ్యాచ్లోనూ పాక్ క్రికెటర్లతో కరచాలనం చేయరాదని హర్మన్ సేన నిర్ణయించింది. ఈ మ్యాచ్ కోసం భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. మరో వైపు కొలంబోను వర్షాలు వెంటాడుతున్నాయి. ఇదే వేదికపై శనివారం ఆసీస్, శ్రీలంక మధ్య మ్యాచ్ రద్దయిన నేపథ్యంలో నేటి మ్యాచ్కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. -
వన్డే సారథిగా గిల్
రోహిత్ శర్మ భారత వన్డే జట్టు కెప్టెన్ హోదాలో చాంపియన్స్ ట్రోఫీలో జట్టును విజేతగా నిలిపాడు. దీని తర్వాత టీమిండియా మరో వన్డే మ్యాచ్ ఆడలేదు. లెక్క ప్రకారం చూస్తే ఏదైనా స్వల్ప మార్పు మినహా అదే జట్టు తర్వాతి సిరీస్ కోసం కొనసాగాలి. కానీ బీసీసీఐ సెలక్షన్ కమిటీ భిన్నంగా ఆలోచించింది. ఐసీసీ టోర్నీని గెలిపించినా సరే... సారథ్యం నుంచి తప్పించి అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఓపెనింగ్ బ్యాటర్గా జట్టులో స్థానం దక్కించుకోగలిగిన ఆటగాడు నాయకత్వానికి మాత్రం అవసరం లేదని తేలి్చంది. ఇప్పటికే టెస్టు కెప్టెన్గా ఉన్న శుబ్మన్ గిల్ను ఇప్పుడు వన్డే కెప్టెన్గా కూడా నియమించి మార్పుకు సెలక్టర్లు శ్రీకారం చుట్టారు. ఆటగాళ్లుగా మాత్రం రోహిత్, విరాట్ కోహ్లి భారత జట్టు తరఫున ఆ్రస్టేలియా పర్యటనకు ఎంపికయ్యారు. అహ్మదాబాద్: భారత టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ ఇప్పుడు వన్డేల్లోనూ సారథ్య బాధ్యతలు చేపడుతున్నాడు. అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ గిల్ను వన్డే జట్టు కొత్త కెప్టెన్గా నియమించింది. ఇప్పటి వరకు కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మను అనూహ్యంగా నాయకత్వం నుంచి తప్పిస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై జరిగే 3 వన్డేలు, 5 టి20ల సిరీస్ల కోసం టీమ్లను సెలక్టర్లు ప్రకటించారు. కెప్టెన్గా రోహిత్ వైఫల్యం లేకపోయినా... భవిష్యత్తును, ముఖ్యంగా 2027 వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని 26 ఏళ్ల గిల్ను కెప్టెన్గా ఎంపిక చేసినట్లు సెలక్టర్లు వెల్లడించారు. ఇంగ్లండ్తో సిరీస్లో తొలి సారి టెస్టు కెప్టెన్గా వ్యవహరించిన గిల్ ఇప్పుడు రెండు ఫార్మాట్లలో కెప్టెన్ కావడంతో పాటు టి20 టీమ్కు వైస్ కెప్టెన్గా ఉన్నాడు. 2026 టి20 వరల్డ్ కప్ తర్వాత సూర్యకుమార్ యాదవ్నుంచి అతనికి టి20 సారథ్య బాధ్యతలు కూడా వచ్చే అవకాశం ఉంది. రోహిత్ వయసు (38)ను దృష్టిలో ఉంచుకొని చూస్తే 2027 వరకు ఆటగాడిగా, కెప్టెన్గా కొనసాగడం కష్టంగానే అనిపించినా... ఇంత తొందరగా అతడిని కెప్టెన్ హోదానుంచి తప్పిస్తారనేది మాత్రం ఎవరూ ఊహించలేదు. అయితే అసలు వన్డే జట్టులో ఉంటారా లేదా అనే చర్చ జరిగిన నేపథ్యంలో... రోహిత్తో పాటు మరో సీనియర్ విరాట్ కోహ్లిలకు కూడా వన్డే టీమ్లో స్థానం లభించింది. వైస్ కెప్టెన్గా శ్రేయస్... భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన జట్టులో పలు మార్పులు జరిగాయి. ఆ టీమ్లో ఉన్నవారిలో రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా ఇంకా గాయాలనుంచి కోలుకోలేదు. ఇద్దరు స్పిన్నర్లు జడేజా, వరుణ్ చక్రవర్తిలను ఎంపిక చేయలేదు. పేస్ బౌలర్ మొహమ్మద్ షమీకి కూడా జట్టులో స్థానం లభించలేదు. వారి స్థానాల్లో నితీశ్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురేల్, ప్రసిధ్ కృష్ణ, అర్‡్షదీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్ వచ్చారు. టాప్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు వన్డేల నుంచి మరోసారి విశ్రాంతినిచ్చారు. గత ఏడాది ఆగస్టు తర్వాత వన్డేలు ఆడని సిరాజ్ తన ఇటీవలి టెస్టు ప్రదర్శనతో మళ్లీ టీమ్లోకి రాగా... టెస్టులు, టి20ల్లో ఆకట్టుకున్న ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి, కీపర్ ధ్రువ్ జురేల్లకు వన్డేల్లో ఇదే తొలి అవకాశం. దుబాయ్ తరహాలో ఎక్కువ మంది స్పిన్నర్లను ఆడించే అవకాశం ఆ్రస్టేలియాలో లేదని...అందుకే జడేజాను పక్కన పెట్టామని అగార్కర్ స్పష్టం చేశాడు. వన్డేల్లో నిలకడగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్ను ఈ సిరీస్ కోసం వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు. సుందర్కు చోటు... టి20 టీమ్లో మాత్రం సెలక్టర్లు పెద్దగా మార్పేమీ చేయలేదు. ఆసియా కప్లో విజేతగా నిలిచిన జట్టులో ఒక్క హార్దిక్ పాండ్యా మాత్రమే గాయం కారణంగా దూరమయ్యాడు. అతని స్థానంలోనే ఆల్రౌండర్గా నితీశ్ రెడ్డికి స్థానం లభించింది. ఆ 15 మందితో పాటు ఆ్రస్టేలియా పర్యటన కోసం అదనంగా 16వ ఆటగాడి రూపంలో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను ఎంపిక చేశారు. వన్డేలకు దూరంగా ఉండనున్న బుమ్రా టి20లు మాత్రం ఆడతాడు. భారత్, ఆ్రస్టేలియా మధ్య అక్టోబర్ 19, 23, 25 తేదీల్లో వన్డేలు...అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 మధ్య 5 టి20లు జరుగుతాయి. -
భారత్ దెబ్బకు విండీస్ ఢాం!
అహ్మదాబాద్: భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి టెస్టులో ఎలాంటి సందేహం లేకుండా ఊహించిన ఫలితమే వచి్చంది. మ్యాచ్ పూర్తిగా మూడు రోజులు కూడా సాగలేదు. శనివారం ముగిసిన మొదటి టెస్టులో భారత్ ఇన్నింగ్స్, 140 పరుగుల తేడాతో వెస్టిండీస్పై ఘన విజయం సాధించింది. భారత్ తమ తొలి ఇన్నింగ్స్ను ఓవర్ నైట్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 448 పరుగుల వద్దే డిక్లేర్ చేసింది. 286 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన విండీస్ ఈ సారి కూడా కనీస పోటీ ఇవ్వలేకపోయింది. 45.1 ఓవర్లలో 146 పరుగులకే విండీస్ ఆలౌటైంది. భారత బౌలర్ల దెబ్బకు శనివారం కనీసం రెండు సెషన్లు కూడా ఆడకుండానే విండీస్ కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్తో పోలిస్తే రెండో ఇన్నింగ్స్లో సరిగ్గా ఒక్క ఓవర్ మాత్రమే ఆ జట్టు అదనంగా ఆడగలిగింది. అలిక్ అతనజె (74 బంతుల్లో 38; 3 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఒక దశలో జట్టు 46 పరుగులకే సగం వికెట్లు కోల్పోగా...అతనజె, గ్రీవ్స్ (25) ఆరో వికెట్కు 46 పరుగులు జోడించి కొద్ది సేపు ప్రతిఘటించారు. భారత బౌలర్లలో జడేజా 4 వికెట్లు పడగొట్టగా, సిరాజ్కు 3 వికెట్లు దక్కాయి. బ్యాటింగ్లో సెంచరీ కూడా నమోదు చేసిన జడేజాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సిరీస్లో భారత్ 1–0తో ముందంజ వేయగా... ఈ నెల 10 నుంచి న్యూఢిల్లీలో రెండో టెస్టు జరుగుతుంది. స్కోరు వివరాలువెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 162; భారత్ తొలి ఇన్నింగ్స్ 448/5 డిక్లేర్డ్; వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: క్యాంప్బెల్ (సి) సుదర్శన్ (బి) జడేజా 14; చందర్పాల్ (సి) నితీశ్ (బి) సిరాజ్ 8; అతనజె (సి) అండ్ (బి) సుందర్ 38; కింగ్ (సి) రాహుల్ (బి) జడేజా 5; ఛేజ్ (బి) కుల్దీప్ 1; హోప్ (సి) జైస్వాల్ (బి) జడేజా 1; గ్రీవ్స్ (ఎల్బీ) (బి) సిరాజ్ 25; పైర్ (నాటౌట్) 13; వారికన్ (సి) గిల్ (బి) సిరాజ్ 0; లేన్ (సి) సిరాజ్ (బి) జడేజా 14; సీల్స్ (సి) అండ్ (బి) కుల్దీప్ 22; ఎక్స్ట్రాలు 5; మొత్తం (45.1 ఓవర్లలో ఆలౌట్) 146. వికెట్ల పతనం: 1–12, 2–24, 3–34, 4–35, 5–46, 6–92, 7–98, 8–98, 9–122, 10–146. బౌలింగ్: బుమ్రా 6–1–16–0, సిరాజ్ 11–2–31–3, జడేజా 13–3–54–4, కుల్దీప్ 8.1–3–23–2, సుందర్ 7–1–18–1. -
మిచెల్ మార్ష్ విధ్వసంకర సెంచరీ.. కివీస్ను చిత్తు చేసిన ఆసీస్
దీంతో మూడు టీ20ల సిరీస్ను 2-0 తేడాతో ఆసీస్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో టిమ్ సీఫర్ట్(48) టాప్ స్కోరర్గా నిలవగా.. మైఖల్ బ్రెస్వెల్(26), నీషమ్(25) రాణించారు. మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో సీన్ అబాట్ మూడు వికెట్లు పడగొట్టగా.. హాజిల్వుడ్, బార్ట్లెట్ తలా రెండు వికెట్లు సాధించారు.మార్ష్ విధ్వంసకర సెంచరీ..అనంతరం లక్ష్య చేధనలో ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. మిగితా బ్యాటర్లు తేలిపోయినప్పటికి మార్ష్ మాత్రం కివీస్ బౌలర్లను ఉతికారేశాడు. ఆఖరి వరకు ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశాడు.కేవలం 52 బంతులు మాత్రమే ఎదుర్కొన్న మార్ష్.. 8 ఫోర్లు, 7 సిక్స్లతో 103 పరుగులు చేశాడు. అతడి విరోచిత పోరాటం ఫలితంగా ఆసీస్ లక్ష్యాన్ని 18 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. న్యూజిలాండ్ బౌలర్లలో నీషమ్ నాలుగు వికెట్లు సాధించాడు. అతడితో పాటు ఢపీ రెండు, సీర్స్ ఓ వికెట్ పడగొట్టాడు. -
మీకు కొంచమైనా తెలివి ఉందా? మ్యాచ్ విన్నర్ను పక్కన పెడతారా?
భారత క్రికెట్ జట్టు ఆక్టోబర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు వన్డేలు, ఐదు టీ20లు సిరీస్లలో తలపడనుంది. ఈ సిరీస్లకు శనివారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. ఈ సందర్భంగా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.టీమిండియా వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మను తప్పించి యువ ఆటగాడు శుబ్మన్ గిల్కు పగ్గాలను సెలక్టర్లు అప్పగించారు. అంతేకాకుండా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను వన్డే జట్టు నుంచి తప్పించారు. ఈ రెండు నిర్ణయాలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.టీ20లు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్.. వన్డేల్లో మాత్రం కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. కానీ సెలక్టర్లు మాత్రం వన్డే ప్రపంచకప్-2027ను దృష్ట్యా నాయకత్వ మార్పు అవసరమంటూ రోహిత్పై వేటు వేశారు. దీంతో అతడి అభిమానులు బీసీసీఐపై మండిపడుతున్నారు.మరోవైపు జడేజాను కూడా జట్టు నుంచి తప్పించడాన్ని క్రికెట్ నిపుణులు తప్పబడుతున్నారు. జడేజా లాంటి మ్యాచ్ విన్నర్ను ఎలా పక్కన పెడతారని సెలక్టర్లపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జడేజాను ఎంపిక చేయకపోవడంపై టీమ్ ప్రకటన సందర్భంగా ఛీప్ సెలక్టర్ అగార్కర్ స్పందించాడు. ఆస్ట్రేలియా కండీషన్స్కు జడేజా సరిపోడు అని అతడు చెప్పుకొచ్చాడు.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు ఒక ఎడమచేతి వాటం స్పిన్నర్ (స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్) మాత్రమే ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నాము. ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఆడే అవకాశం లేదు. ఆసీస్ పిచ్లు అక్షర్కు సరిగ్గా సరిపోతాయి. అందుకే రవీంద్ర జడేజా బదులుగా అక్షర్ తీసుకున్నాము. రవీంద్ర జడేజా ఎల్లప్పుడూ మా ప్రణాళికలలో ఉంటాడు. అతడొక అద్భుతమైన ఆల్రౌండర్. మంచి ఫీల్డర్ కూడా అని అగార్కర్ పేర్కొన్నాడు. ఏదేమైనప్పటికి జడేజా లాంటి ఆల్రౌండర్ను ఎంపిక చేయకపోవడం సరైన నిర్ణయం కాదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.శనివారం వెస్టిండీస్తో ముగిసిన తొలి టెస్టులో జడ్డూ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబరిచాడు. ఓ సెంచరీతో పాటు 4 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. కానీ కాసేపటికే ఆసీస్ టూర్కు చోటు దక్కకపోవడం జడేజాను నిరాశపరిచింది.చదవండి: అందుకే రోహిత్ శర్మపై వేటు.. అప్పటి వరకు రో-కో ఆడటం కష్టమే: అగార్కర్ -
462 వికెట్లు.. స్వింగ్ సుల్తాన్..కట్ చేస్తే! ఊహించని విధంగా కెరీర్కు ఎండ్ కార్డ్?
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్లేనా? అంటే అవునానే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కూ షమీని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఆసీస్ టూర్కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది.ఈ సందర్భంగా చీఫ్ సెలక్టర్ కనీసం షమీ ప్రస్తావన కూడా తీసుకు రాలేదు. షమీ ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తరుపున ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్-2025లో ఆడినప్పటికి ఈ వెటరన్ పేసర్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.అయితే ఐపీఎల్ అనంతరం ఇంగ్లండ్ పర్యటనకు షమీని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఐదో రోజుల పాటు జరిగే టెస్టు మ్యాచ్లో ఆడే ఫిట్నెస్ షమీకి లేదని సెలక్టర్లు చెప్పుకొచ్చారు. కానీ డొమాస్టిక్ క్రికెట్లో మాత్రం షమీ రెగ్యూలర్గా ఆడుతూనే వస్తున్నాడు. గత నెలలో జరిగిన దులీప్ ట్రోఫీలో ఈస్ట్జోన్ జట్టుకు ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ప్రాతినిథ్యం వహించాడు. కానీ షమీ ఏ మాత్రం రిథమ్లో కన్పించలేదు.దీంతో ప్రస్తుతం విండీస్తో జరుగుతున్న టెస్టు సిరీస్కు సెలక్టర్లు అతడిని పరిగణలోకి తీసుకోలేదు. అంతేకాకుండా ఆసియాకప్-2025కు కూడా షమీ ఎంపిక కాలేదు. టెస్టు, టీ20 ఫార్మాట్లను పక్కన పెడితే కనీసం వన్డే జట్టులో అయినా అతడికి చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ మరోసారి అతడి పేరు టీమ్ సెలక్షన్ లిస్ట్లో కన్పించలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత్ ఆడుతున్న తొలి వన్డే సిరీస్ ఇది. ఈ సిరీస్కు కూడా షమీ ఎంపిక కాకపోవడంతో అతడి ఇంటర్ననేషనల్ కెరీర్ ప్రశ్నార్ధకంగా మారింది. కెరీర్ను మార్చేసిన గాయం..షమీ గత రెండేళ్ల నుంచి చీలమండ గాయంతో సతమతవుతున్నాడు. వన్డే వరల్డ్కప్-2023 టోర్నీలో లీడ్ వికెట్ టేకర్గా నిలిచిన షమీ.. అనంతరం తన చీలమండ గాయానికి సర్జరీ చేయించుకున్నాడు. దీంతో ఈ రైట్ ఆర్మ్ పేసర్ దాదాపు ఏడాది పాటు ఆటకు దూరమయ్యాడు.ఆ తర్వాత ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్తో షమీ పునరాగమనం చేశాడు. అక్కడ మెరుగైన ప్రదర్శన చేయకపోయినప్పటికి ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ మెగా టోర్నీలో షమీ కాస్త పర్వాలేదన్పించాడు. కానీ అంత టచ్లో మాత్రం షమీ కన్పించలేదు. అప్పటినుంచి భారత జట్టుకు ఈ బెంగాల్ పేసర్ దూరంగా ఉంటున్నాడు. భారత క్రికెట్లో షమీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకున్నాడు. షమీకి టెస్టుల్లో 229, వన్డేల్లో 206 వికెట్లు ఉన్నాయి. అదేవిధంగా టీ20ల్లో అతడు 27 వికెట్లు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో మొత్తంగా 462 వికెట్లు పడగొట్టాడు. షమీ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ కెరీర్ ఇలా ముగుస్తుందని ఎవరూ ఊహించి ఉండరు.చదవండి: IND vs AUS: పాపం అభిషేక్ శర్మ.. ఊహించని షాకిచ్చిన బీసీసీఐ!? -
రోహిత్ శర్మపై కుట్ర..! ఇది మీకు న్యాయమేనా?
భారత క్రికెట్లో కెప్టెన్గా రోహిత్ శర్మ శకం ముగిసింది. ఇప్పటికే టెస్టు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ను తాజాగా వన్డే కెప్టెన్సీ నుంచి సైతం బీసీసీఐ తప్పించింది. అతడి స్ధానంలో యువ ఆటగాడు శుబ్మన్ గిల్ను కొత్త వన్డే కెప్టెన్గా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నియమించింది.బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని హిట్మ్యాన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా బీసీసీఐపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. రోహిత్ ఇప్పటికీ ఫిట్గా ఉన్నాడని, వన్డే ప్రపంచకప్-2027 వరకు అతడు ఆడగలడని ఫ్యాన్స్ పోస్ట్లు పెడుతున్నారు.రోహిత్ శర్మ ది బెస్ట్ కెప్టెన్.. బీసీసీపై అతడిని కావాలనే తప్పించందని ఓ యూజర్ ఎక్స్లో పోస్ట్ చేశాడు. రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ను ఇలా అవమానిస్తారా? అని మరో యూజర్ ఎక్స్లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఎక్స్లో రోహిత్ శర్మ పేరు ట్రెండ్ అవుతోంది. థాంక్యూ రోహిత్ అని అభిమానులు భావోద్వేగానికి లోనవతున్నారు.1 Like = 100 Slap .1 Rt =1000 Slap.#RohitSharma𓃵#RohitSharma #INDvsAUS pic.twitter.com/Qm4DJZI3ct— Avneesh Mishra (@RajaMishra007) October 4, 2025 END OF AN ERA 💔Thank You, Captain Rohit Sharma 🙌2 ICC trophies in just 8 months.A leader who gave India glory, pride & unforgettable memories. 🇮🇳THE HITMAN. THE CAPTAIN. THE LEGEND. #RohitSharma𓃵Congratulations Gill for your ODIs captaincy in #INDvsAUS#RohitSharma pic.twitter.com/V3KZeZAxWH— Adorable (@rehnedotumm_) October 4, 2025తిరుగులేని రోహిత్..మూడు ఫార్మాట్లలోనూ తిరిగి లేని కెప్టెన్గా రోహిత్ నిలిచాడు. నాయకుడిగా హిట్మ్యాన్ భారత్కు రెండు ఐసీసీ టైటిల్స్ను అందించాడు. టీ20 ప్రపంచకప్-2024, ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్స్ను అతడి సారథ్యంలోనే టీమిండియా సొంతం చేసుకుంది. అదేవిధంగా వన్డే ప్రపంచకప్ 2023లో జట్టును ఫైనల్ వరకూ తీసుకెళ్లాడు. ఆ టోర్నీలో భారత్ మొత్తంగా 11 మ్యాచ్లలో పదింట గెలిచింది. అనుహ్యంగా తుది పోరులో ఓటమి పాలై తృటిలో ట్రోఫీని కోల్పోయింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ఓవరాల్గా 56 వన్డే మ్యాచ్లు ఆడింది.అందులో 42 మ్యాచ్లలో గెలిచింది. 12 మ్యాచ్లలో ఓడిపోయింది. ఒక మ్యాచ్లో ఫలితం రాలేదు. మరో మ్యాచ్ టైగా ముగిసింది. కెప్టెన్గా అతడి విజయం శాతం 76గా ఉంది. ఆసీస్ టూర్కు భారత వన్డే జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ , అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్ -
పాపం అభిషేక్ శర్మ.. ఊహించని షాకిచ్చిన బీసీసీఐ!?
భారత వన్డే జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్న యువ సంచలనం అభిషేక్ శర్మకు నిరాశే ఎదురైంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టులో అభిషేక్కు చోటు దక్కలేదు. రెగ్యూలర్ ఓపెనర్లగా శుబ్మన్ గిల్, రోహిత్ శర్మ ఉండగా.. బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైశ్వాల్ను సెలక్టర్లు ఎంపిక చేశారు.జైశ్వాల్ చివరగా ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత తరపున వన్డేల్లో ఆడాడు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి అతడిని పక్కన పెట్టారు. మళ్లీ ఇప్పుడు ఆసీస్తో సిరీస్కు ఈ ముంబై ఆటగాడికి సెలక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు.అభిషేక్ వెయిట్ చేయాల్సిందే..అయితే అభిషేక్ శర్మ ప్రస్తుతం వైట్ బాల్ క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు. ఇటీవల ముగిసిన ఆసియాకప్లో అభిషేక్ ప్లేయర్ ఆఫ్ది టోర్నమెంట్గా నిలిచాడు. ఈ టోర్నీలో పంజాబ్ ఆటగాడు 200 స్ట్రైక్ రేట్తో 314 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.టీ20ల్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్గా అభిషేక్ కొనసాగుతున్నాడు. దీంతో ఆసీస్తో వన్డే సిరీస్కు అభిషేక్ను సెలక్టర్లు ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అతడిని పరిగణలోకి తీసుకోలేదు. రోహిత్ శర్మ, గిల్, జైశ్వాల్ రూపంలో ఓపెనర్లు అందుబాటులో ఉండడంతో అభిషేక్ వైపు సెలక్టర్లు మొగ్గు చూపున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 50 ఓవర్ల ఫార్మాట్లో శర్మ తన స్కిల్స్ను మరింత మెరుగుపరుచుకోవాలని సెలక్టర్లు సూచించినట్లు సమాచారం. అభిషేక్ శక్రవారం ఆసీస్-ఎతో జరిగిన అనాధికారిక వన్డేలో గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఇది కూడా అతడి ఎంపికపై ప్రభావం చూపించింది. అభిషేక్ శర్మ తన కెరీర్లో ఇప్పటివరకు 61 లిస్ట్-ఎ మ్యాచ్లు ఆడి 35.33 సగటుతో 2,014 పరుగులు చేశాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 170గా ఉంది. అదేవిధంగా బౌలింగ్లో కూడా 38 వికెట్లు పడగొట్టాడు. అయితే అభిషేక్ ఇదే ఫామ్ను కొనసాగిస్తే అత్యంత త్వరలోనే వన్డే జట్టులోకి కూడా వచ్చే అవకాశముంది. కాగా భారత వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మను బీసీసీఐ తప్పించింది. అతడి స్ధానంలో శుబ్మన్ గిల్కు వన్డే జట్టు పగ్గాలను అప్పగించారు. -
IND vs AUS: శ్రేయస్ అయ్యర్కు ప్రమోషన్.. బీసీసీఐ ప్రకటన
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ బీసీసీఐ ప్రమోషన్ ఇచ్చింది. భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్గా అయ్యర్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఆస్ట్రేలియా టూర్కు జట్టు ఎంపిక సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు వన్డే జట్టు వైస్ కెప్టెన్గా ఉన్న శుబ్మన్ గిల్.. రెగ్యూలర్ కెప్టెన్గా ప్రమోషన్ పొందాడు.రోహిత్ శర్మ స్దానాన్ని గిల్ భర్తీ చేయనున్నాడు. అయితే గిల్ కంటే కెప్టెన్గా అనుభవం ఎక్కువగా ఉండడంతో శ్రేయస్కు భారత వన్డే జట్టు పగ్గాలను అప్పగిస్తారని వార్తలు వచ్చాయి. కానీ మూడు ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ ఉండాలనే ఉద్దేశ్యంతో అజిత్ అగార్కర్ అండ్ కో ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకుంది.భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై కూడా వేటు వేసే అకాశముంది. టెస్టు, వన్డేల్లో భారత సారథిగా ఉన్న గిల్ త్వరలోనే టీ20 జట్టు పగ్గాలను చేపట్టిన ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే టీ20ల్లో వైస్ కెప్టెన్గా గిల్ను బీసీసీఐ నియమించింది.అయ్యర్ ఫ్యూచర్ కెప్టెన్..శుబ్మన్ గిల్ తర్వాత భారత వన్డే జట్టు పగ్గాలను శ్రేయస్ చేపట్టే అవకాశముంది. అయ్యర్కు కెప్టెన్గా అపారమైన అనుభవం ఉంది. దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టుతో పాటు ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్, పంజాబ్ కింగ్స్ టీమ్స్ను విజయ పథంలో నడిపించిన ట్రాక్ రికార్డు అతడిది.అయ్యర్ సారథ్యంలో కేకేఆర్ ఐపీఎల్-2024 ఛాంపియన్స్ నిలిచింది. అదేవిధంగా ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ను రన్నరప్గా నిలిపాడు. వైట్బాల్ క్రికెట్లో గత కొంత కాలంగా అయ్యర్ దుమ్ములేపుతున్నాడు. అయితే అయ్యర్ ఈ స్ధాయికి చేరుకోవడానికి తీవ్రంగా శ్రమించాడు.ఒకనొక దశలో భారత జట్టు తరపున అయ్యర్ కెరీర్ ముగిసిందని అంతా భావించారు. బీసీసీఐ తమ ఆదేశాలను ధిక్కరించడంతో జట్టుతో పాటు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. ఆ తర్వాత ఈ ముంబైకర్ దేశవాళీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన కనబరిచి తిరిగి జట్టులోకి వచ్చాడు.28 ఏళ్ల అయ్యర్ వన్డే ప్రపంచకప్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా టోర్నీలో 11 మ్యాచ్లు ఆడి ఏకంగా 530 పరుగులు చేశాడు. దీంతో బీసీసీఐ కాంట్రాక్ట్ను తిరిగి సంపాదించుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా భారత్ నిలవడంలో అయ్యర్ది కీలక పాత్ర.అతను ఐదు మ్యాచ్లలో 243 పరుగులు సాధించి టోర్నీలో భారత తరపున లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఈ క్రమంలో రోహిత్ తర్వాత అయ్యర్ను వన్డే కెప్టెన్గా ఎంపిక చేయాలని చాలా మంది మాజీలు సూచించారు. కానీ సెలక్టర్లు మాత్రం వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఆసీస్ టూర్ నుంచి కొత్త రోల్లో శ్రేయస్ కన్పించనున్నాడు.ఆసీస్ టూర్కు భారత వన్డే జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ , అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, విరాట్ కోహ్లిభారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్చదవండి: BCCI: రోహిత్ శర్మకు భారీ షాక్.. టీమిండియా వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్ -
అందుకే రోహిత్ శర్మపై వేటు: కుండబద్దలు కొట్టిన అగార్కర్
టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ (Rohit Sharma) శకం ముగిసింది. ఇప్పటికే టెస్టు, అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన హిట్మ్యాన్.. వన్డేల్లో మాత్రం కెప్టెన్గా కొనసాగుతానని ప్రకటించాడు. అయితే, అనూహ్య రీతిలో ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రోహిత్పై వేటు వేసింది.వన్డే సారథిగా రోహిత్ శర్మను తప్పించి.. అతడి స్థానంలో.. యువ ఆటగాడు, టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill)కు పగ్గాలు అప్పగించింది. దీంతో రోహిత్ కేవలం ఆటగాడిగానే జట్టులో కొనసాగనున్నాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరుపై రోహిత్ శర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిగ్గజ కెప్టెన్కు ఇది అవమానం లాంటిదేనని సోషల్ మీడియా వేదికగా సెలక్టర్ల తీరును ఎండగడుతున్నారు. వన్డేల్లో డెబ్బై ఐదుకు పైగా విజయశాతం కలిగి ఉన్న సారథి పట్ల ఇలా వ్యవహరించడం సరికాదని హితవు పలుకుతున్నారు.అందుకే రోహిత్ శర్మపై వేటుఇదిలా ఉంటే.. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్లకు జట్టును ప్రకటించిన సందర్భంగా ఈ విషయంపై వివరణ ఇచ్చాడు. ‘‘భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది.జట్టు అత్యుత్తమ ప్రయోజనాల గురించే ఆలోచించాల్సి ఉంటుంది. ముందుగానే స్పందించి.. కొత్త వ్యక్తి (గిల్) చుట్టూ జట్టును నిర్మించాల్సి ఉంటుంది. ఇది సహేతుకమైన నిర్ణయం’’ అగార్కర్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు.అదే విధంగా.. మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లు ఉండటం ప్రాక్టికల్గా అంతగా వర్కౌట్ కాదని.. అన్ని జట్లకు ఒకే కెప్టెన్ ఉండటం ద్వారా హెడ్కోచ్ గౌతం గంభీర్కు కూడా పని సులువు అవుతుందని పేర్కొన్నాడు. అయితే, కెప్టెన్సీ నుంచి తప్పించడంపై రోహిత్తో ఎలాంటి చర్చ జరిగిందన్న విషయంపై మాత్రం అగార్కర్ స్పష్టతనివ్వలేదు.అప్పటి వరకు రో-కో ఆడటం కష్టమేఏదేమైనా వన్డే వరల్డ్కప్-2027 టోర్నీని దృష్టిలో పెట్టుకుని.. కెప్టెన్సీ విషయం గురించి రోహిత్తో మాట్లాడమని మాత్రమే అగార్కర్ వెల్లడించాడు. ఇక రోహిత్తో పాటు మరో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా దేశీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఆటగాళ్లు అందుబాటులో ఉన్నపుడు కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందని మేము స్పష్టంగా చెప్పాము’’ అని పేర్కొన్నాడు.అంతేకాదు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వన్డే వరల్డ్కప్-2027 నాటికి ఆడే విషయంపై తమకు ఎలాంటి హామీ ఇవ్వలేదని అగార్కర్ ఈ సందర్భంగా పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం నిబంధనలకు అనుగుణంగా ఇద్దరికీ ఫిట్నెస్ టెస్టులు నిర్వహించామని.. ఇద్దరూ మ్యాచ్ ఆడేందుకు ఫిట్గా ఉన్నారని తెలిపాడు. కాగా అక్టోబరు 19 నుంచి నవంబరు 8 వరకు టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన బీసీసీఐ శనివారం తమ జట్లను ప్రకటించింది.చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియా టూర్కు భారత జట్టు ప్రకటన.. నితీశ్ రెడ్డికి బంపరాఫర్ -
ఆస్ట్రేలియా టూర్కు భారత జట్టు ప్రకటన.. నితీశ్ రెడ్డికి బంపరాఫర్
ఆస్ట్రేలియా టూర్కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. భారత జట్టు వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మను సెలక్టర్లు తప్పించారు. అతడి స్ధానంలో శుభ్మన్ గిల్ను కొత్త వన్డే కెప్టెన్గా నియమించారు. గత కొన్నేళ్లుగా భారత వన్డే జట్టును నడిపిస్తున్న రోహిత్ శర్మ ఇకపై కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడు.అతడితో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి కూడా వన్డే జట్టులో చోటు దక్కింది. కాగా ఆస్ట్రేలియా పర్యటనకు స్టార్ ప్లేయర్లు హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్ గాయాల కారణంగా దూరమయ్యారు. ఇంగ్లండ్ పర్యటనలో గాయపడిన పంత్ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు.అదేవిధంగా యూఏఈ వేదికగా జరిగిన ఆసియాకప్లో గాయపడ్డ హార్ధిక్ పూర్తిగా కోలుకోవడానికి మరో నెల రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరిద్దరిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. హార్ధిక్ పాండ్యా స్ధానంలో యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి వన్డే, టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. నితీష్ గత కొన్నాళ్లగా కేవలం టెస్టు జట్టులో మాత్రమే కొనసాగుతున్నాడు. కానీ హార్దిక్ గాయం పడడంతో నితీష్కు జాక్ పాట్ తగిలింది. పంత్ స్ధానంలో ధ్రువ్ జురెల్ ఎంపికయ్యాడు.బుమ్రాకు విశ్రాంతి..కాగా ఆసీస్తో వన్డే సిరీస్కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. మహ్మద్ సిరాజ్ తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. పేస్ బౌలింగ్ ఎటాక్ను సిరాజ్ లీడ్ చేయనున్నాడు. అతడితో పాటు యువ పేసర్లు అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ద్ కృష్ణలు బంతిని పంచుకోనున్నారు.స్పిన్నర్లగా కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకున్నారు. ఇక టీ20 జట్టులో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. కెప్టెన్గా సూర్య కొనసాగుతుండగా.. నితీష్, సుందర్ కొత్తగా జట్టులోకి వచ్చారు. ఆక్టోబర్ 19 నుంచి భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం కానుంది.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు భారత జట్టు:శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైశ్వాల్ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు భారత జట్టు:సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్చదవండి: BCCI: రోహిత్ శర్మకు భారీ షాక్.. టీమిండియా వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్ -
వరుసగా ఆరు ఓటములు.. మరేం పర్లేదు.. ఆ ముగ్గురు అద్భుతం: గిల్
వెస్టిండీస్తో తొలి టెస్టులో గెలుపు పట్ల టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) హర్షం వ్యక్తం చేశాడు. ఇదొక సంపూర్ణ మ్యాచ్ అని.. రెండు ఇన్నింగ్స్లో బౌలర్లు రాణించిన తీరు అద్భుతమని కొనియాడాడు. బ్యాటింగ్ పరంగానూ తాము గొప్పగా ఆడామని.. ముగ్గురు సెంచరీలు చేయడం సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నాడు.ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీమిండియా టెస్టు సారథిగా గిల్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ గడ్డ మీద బ్యాటర్గా, కెప్టెన్గా రాణించిన ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. ఐదు మ్యాచ్ల సిరీస్ను 2-2తో సమం చేసుకున్నాడు. అయితే, ఇంగ్లండ్ గడ్డ మీద ఐదు టెస్టుల్లోనూ గిల్ టాస్ ఓడిపోయాడు.వరుసగా ఆరు ఓటములుతాజాగా వెస్టిండీస్తో తొలి టెస్టు (IND vs WI 1st Test)లోనూ ఇదే రిపీటైంది. అయితే, సారథిగా టాస్ ఓడినా మ్యాచ్లు మాత్రం గెలిచాడు గిల్. ఈ నేపథ్యంలో విండీస్పై విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘వరుసగా ఆరుసార్లు టాస్ ఓడిపోయాను.అయితే, మ్యాచ్లు మాత్రం గెలుస్తూనే ఉన్నాం. కాబట్టి టాస్లో ఓడిన ప్రభావం పడిందని అనుకోను. దానిని అసలు లెక్కేచేయను. ఇదొక సంపూర్ణ మ్యాచ్. విజయం పట్ల సంతోషంగా ఉంది.ఎలాంటి ఫిర్యాదులూ లేవుముగ్గురు సెంచరీలు చేశారు. ఈ మ్యాచ్లో మా ఫీల్డింగ్ రెండు ఇన్నింగ్స్లోనూ భేషుగ్గా ఉంది. ఏ విషయంలోనూ ఎలాంటి ఫిర్యాదులూ లేవు. ఈ పిచ్ బ్యాటింగ్కు బాగానే ఉంది.అయితే, నేను, జైస్వాల్ మెరుగ్గా ఆడలేకపోయాము. శుభారంభం అందుకున్నా దానిని కొనసాగించలేకపోయాము. ఇక మా స్పిన్నర్ల గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. నాణ్యమైన స్పిన్నర్లు జట్టులో ఉన్నారు. వారిని రొటేట్ చేసుకోవడమే కష్టం. అయితే, ఇలాంటి సవాలు ఎదురుకావడం జట్టుకు మంచిదే.కెప్టెన్గా చాలా విషయాలు నేర్చుకుంటున్నాఅవసరమైనప్పుడు ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండి పని పూర్తి చేస్తారు. మా జట్టులో యువకులు ఎక్కువగా ఉన్నారు. కెప్టెన్గా నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నా. క్లిష్ట పరిస్థితులను ఎలా అధిగమించాలో తెలుసుకుంటున్నా. జట్టుగా మేమంతా ఇప్పటికీ నేర్చుకునే దశలోనే ఉన్నాం. అనుభవం గడించే కొద్దీ మేము మరింత సానుకూలంగా.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలం’’ అని గిల్ చెప్పుకొచ్చాడు. కాగా విండీస్తో తొలి టెస్టులో కేఎల్ రాహుల్ (100), ధ్రువ్ జురెల్ (125), రవీంద్ర జడేజా (104- నాటౌట్) సెంచరీలు చేయగా.. గిల్ 50 పరుగులు సాధించాడు. ఇక బౌలర్లలో పేసర్లు సిరాజ్ ఓవరాల్గా ఏడు వికెట్లు తీయగా.. బుమ్రా మూడు వికెట్లు కూల్చాడు. స్పిన్నర్లలో రవీంద్ర జడేజా నాలుగు, కుల్దీప్ యాదవ్ నాలుగు, వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ తొలి టెస్టు స్కోర్లుటీమిండియా: 448/5 డిక్లేర్డ్వెస్టిండీస్: 162 & 146ఫలితం: వెస్టిండీస్ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా.చదవండి: Rishabh Pant Facts: రిషభ్ పంత్ నెట్వర్త్ ఎంతో తెలుసా? -
రోహిత్ శర్మకు భారీ షాక్.. టీమిండియాకు కొత్త కెప్టెన్
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు ముందు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మ(Rohit sharma) స్ధానంలో యువ ఆటగాడు శుభ్మన్ గిల్ను అజిత్ అగార్కర్ అండ్ కో నియమించింది. ఆస్ట్రేలియా టూర్కు భారత జట్టు ఎంపిక సందర్భంగా ఈ నిర్ణయాన్ని సెలక్టర్లు తీసుకున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు వన్డే జట్టులో సభ్యులుగా కొనసాగనున్నారు.2027 వన్డే ప్రపంచ కప్ దృష్ట్యా రోహిత్ శర్మ స్ధానంలో కెప్టెన్గా గిల్ను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రపంచ కప్కు ఇంకా రెండేళ్ల కంటే ఎక్కువ సమయం ఉండడంతో అప్పటివరకు రోహిత్ ఆడుతాడో లేదో స్పష్టత లేనందున భారత క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.ముగిసిన రోహిత్ శకం..భారత క్రికెట్లో కెప్టెన్గా రోహిత్ శర్మ శకం ముగిసింది. ఇప్పటికే టెస్టులకు, టీ20లకు వీడ్కోలు పలికిన హిట్మ్యాన్.. ఇప్పుడు వన్డే కెప్టెన్సీ కోల్పోయాడు. దీంతో ఆసీస్ సిరీస్లో అతడిని కెప్టెన్గా చూడాలనకున్న అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది.వన్డేల్లో భారత సారథిగా రోహిత్కు అద్భతమైన ట్రాక్ రికార్డు ఉంది. టీమిండియాకు కెప్టెన్గా ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. వన్డేల్లో 50పైగా మ్యాచ్లలో భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన ఏడుగురులో ఒకడిగా రోహిత్ నిలిచాడు. వన్డేల్లో 75% విజయ శాతంతో అత్యుత్తమ కెప్టెన్గా రోహిత్ నిలిచాడు. ఇది ఎంఎస్ ధోని, గంగూలీ, కోహ్లి వంటి దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు. అదేవిధంగా అతడి సారథ్యంలోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ను భారత్ సొంతం చేసుకుంది. అదేవిధంగా వన్డే ప్రపంచకప్-2023 రన్నరప్గా భారత్ను హిట్మ్యాన్ నిలిపాడు.ఈ టోర్నీ అసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన భారత జట్టు తుది మొట్టుపై బోల్తా పడింది. మొత్తం 56 వన్డేల్లో భారత జట్టు కెప్టెన్గా వ్యవహరించిన రోహిత్.. 42 మ్యాచ్ల్లో విజయాలను అందించాడు. అతడి కెప్టెన్సీలో భారత్ కేవలం 12 వన్డేల్లో మాత్రం ఓటమి పాలైంది.పంత్ దూరం..కాగా ఆస్ట్రేలియా టూర్కు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరమయ్యారు. హార్దిక్ పాండ్యా స్ధానంలో నితీష్ కుమార్ రెడ్డి చోటు దక్కించుకోగా.. పంత్ స్ధానంలో ధ్రువ్ జురెల్ వన్డే జట్టులోకి వచ్చాడు. ఆసీస్తో వన్డేలకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు.ఆసీస్ టూర్కు భారత వన్డే జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ , అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, విరాట్ కోహ్లిభారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్ -
వెస్టిండీస్ను చిత్తుగా ఓడించిన టీమిండియా
వెస్టిండీస్తో తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును.. ఇన్నింగ్స్ మీద 140 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. సమిష్టిగా రాణించి ముచ్చటగా మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగించింది.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27 సీజన్లో భాగంగా తొలుత ఇంగ్లండ్తో తలపడిన టీమిండియా.. ఐదు మ్యాచ్లలో రెండు గెలిచి 2-2తో సిరీస్ సమం చేసుకుంది. అనంతరం స్వదేశంలో వెస్టిండీస్తో రెండు టెస్టు మ్యాచ్లు ఆడుతోంది.చెలరేగిన భారత బౌలర్లుఇందులో భాగంగా తొలుత అహ్మదాబాద్ వేదికగా గురువారం ఇరుజట్ల మధ్య తొలి టెస్టు (IND vs WI 1st Test) మొదలైంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేసింది. భారత పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ ధాటికి టాపార్డర్ కుదేలు కాగా.. మిడిలార్డర్లో కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (24), షాయీ హోప్ (26), జస్టిన్ గ్రీవ్స్ (32) ఓ మోస్తరుగా రాణించారు.ఈ క్రమంలో 44.1 ఓవర్లలో 162 పరుగులు చేసి వెస్టిండీస్ ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో సిరాజ్.. తగ్నరైన్ చందర్పాల్ (0), అలిక్ అథనాజ్ (12), బ్రాండన్ కింగ్ (13), రోస్టన్ ఛేజ్ రూపంలో నాలుగు కీలక వికెట్లు దక్కించుకున్నాడు.మరోవైపు.. బుమ్రా జాన్ కాంప్బెల్ (8), జస్టిన్ గ్రీవ్స్ (32), జొహాన్ లేన్ (1) వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్.. షాయీ హోప్ (26), వారికన్ (8) వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ ఖరీ పియరీ (11)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.రాహుల్, డీజే, జడ్డూ శతకాలుఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత్ శుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి 128 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 448 పరుగులు సాధించింది. కేఎల్ రాహుల్ (100), ధ్రువ్ జురెల్ (125), రవీంద్ర జడేజా (104 నాటౌట్) శతకాలతో చెలరేగగా.. కెప్టెన్ శుబ్మన్ గిల్ హాఫ్ సెంచరీ (50) చేశాడు.అయితే, శనివారం నాటి మూడో రోజు ఆట మొదలుకాగానే భారత్ తమ ఓవర్నైట్ స్కోరు 448/5 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో టీమిండియాకు 286 పరుగుల ఆధిక్యం దక్కింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన వెస్టిండీస్ 146 పరుగులకే కుప్పకూలింది.మరోసారి చెలరేగిన భారత బౌలర్లుభారత బౌలర్ల విజృంభణ కారణంగా విండీస్ బ్యాటర్లు పెవిలియన్కు వరుసకట్టారు. సిరాజ్ టీమిండియా తరఫున వికెట్ల వేట మొదలుపెట్టగా.. జడ్డూ వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ కూడా తన స్పిన్ మాయాజాలంతో విండీస్ను ఆడుకున్నాడు.ఈ క్రమంలో ఓపెనర్ తగ్నరైన్ చందర్పాల్ (8) మరోసారి విఫలం కాగా.. జాన్ కాంప్బెల్ 14, బ్రాండన్ కింగ్ 5, రోస్టన్ ఛేజ్ 1, షాయీ హోప్ 1 పరుగు చేశారు. వన్డౌన్బ్యాటర్ అలిక్ అథనాజ్ 38 పరుగులు సాధించగా.. అతడితో కలిసి జస్టిన్ గ్రీవ్స్ (25) కాసేపు పోరాటం చేశాడు.టీమిండియా ఘన విజయంఆఖర్లో ఖరీ పియరీ 13 పరుగులతో అజేయంగా నిలవగా.. బౌలర్ జేడన్ సీల్స్ 22 పరుగులతో సత్తా చాటాడు. అయితే, కుల్దీప్ బౌలింగ్లో సీల్స్ పదో వికెట్గా వెనుదిరగడంతో విండీస్ పరాజయం ఖరారైంది.ఇన్నింగ్స్ మీద 140 పరుగుల తేడాతో భారత్ జయభేరి మోగించింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ జడ్డూ నాలుగు, సిరాజ్ మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ రెండు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ విజయంతో టీమిండియా రెండు టెస్టుల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.భారత్ వర్సెస్ వెస్టిండీస్ తొలి టెస్టు సంక్షిప్త స్కోర్లు👉వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్👉టాస్: వెస్టిండీస్.. తొలుత బ్యాటింగ్👉వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 162 ఆలౌట్👉భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 448/5 డిక్లేర్డ్ ✊భారత్కు 286 పరుగుల ఆధిక్యం👉వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 146 ఆలౌట్✌️ఫలితం: వెస్టిండీస్పై ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం.చదవండి: Rishabh Pant Facts: రిషభ్ పంత్ నెట్వర్త్ ఎంతో తెలుసా?Hugs and smiles all around 😊#TeamIndia celebrate a magnificent victory in Ahmedabad and take a 1-0 lead in the series 👏Scorecard ▶ https://t.co/MNXdZceTab#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/22q4aUUhqp— BCCI (@BCCI) October 4, 2025 -
రిషభ్ పంత్ నెట్వర్త్ ఎంతో తెలుసా?
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) పుట్టిన రోజు నేడు (అక్టోబరు 4). ఈ వికెట్ కీపర్ బ్యాటర్ శనివారం.. 28వ వసంతంలో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పంత్కు శుభాకాంక్షలు తెలుపగా.. అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా తమ ఆరాధ్య ఆటగాడికి విషెస్ చెబుతున్నారు.5507 పరుగులుఉత్తరాఖండ్లోని రూర్కీలో 1997, అక్టోబరు 4న రాజేంద్ర పంత్- సరోజ్ పంత్ దంపతులకు రిషభ్ పంత్ జన్మించాడు. 2016 ఇండియా అండర్-19 జట్టు తరఫున వరల్డ్కప్లో సత్తా చాటి వెలుగులోకి వచ్చిన పంత్.. 2017లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు.అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు మూడు ఫార్మాట్లలో కలిపి 154 మ్యాచ్లు ఆడిన పంత్.. 5507 పరుగులు సాధించాడు. అంతేకాదు.. వికెట్ కీపర్గానూ 250 డిస్మిసల్స్లోనూ భాగమయ్యాడు. పడిలేచిన కెరటందిగ్గజ కెప్టెన్, లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోని వారసుడిగా నీరాజనాలు అందుకున్న పంత్.. కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు ఉన్నాయి. అయితే, 2022లో జరిగిన ఘోర కారు ప్రమాదం అతడి కెరీర్నే ప్రశ్నార్థకం చేసింది.కొత్త సంవత్సరం వేడుకల కోసం ఢిల్లీ నుంచి స్వస్థలానికి వెళ్తున్న సమయంలో పంత్ ప్రయాణిస్తున్న కారు.. డివైడర్ను ఢీకొట్టి నుజ్జునుజ్జయింది. ఈ క్రమంలో మంటలు చెలరేగగా.. అదృష్టవశాత్తూ పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు.బీసీసీఐ చొరవ తీసుకుని పంత్ను ఉత్తరాఖండ్ నుంచి ముంబైకి ఎయిర్లిఫ్ట్ చేయించి.. మెరుగైన చికిత్స అందించింది. ఈ క్రమంలో దాదాపు ఏడాది ఆటకు దూరమైన పంత్.. 2024లో ఐపీఎల్ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు.పునరాగమనంలో ఆకాశమే హద్దుగాఇక పునరాగమనంలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అంతేకాదు.. ఐపీఎల్-2025 మెగా వేలంలో ఏకంగా రూ. 27 కోట్ల (లక్నో సూపర్ జెయింట్స్)కు అమ్ముడుపోయి లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్గా నిలిచాడు. కాగా టీమిండియా తరఫున టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచిన జట్లలో పంత్.. సభ్యుడిగా తన వంతు పాత్ర పోషించాడు.నెట్వర్త్ ఎంతో తెలుసా?బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో పంత్ A గ్రేడ్లో ఉన్నాడు. కాబట్టి.. బోర్డు ద్వారా పంత్కు ఏడాదికి రూ. 5 కోట్ల వేతనం అందుతుంది. ఇక ఇందుకు అదనంగా.. ఆడే ఒక్కో టెస్టు మ్యాచ్కు రూ. 15 లక్షలు, వన్డే మ్యాచ్కు రూ. 6 లక్షలు, టీ20 మ్యాచ్కు రూ. 3 లక్షలు అతడికి దక్కుతాయి.ఇక ఐపీఎల్లో లక్నో సూపర్జెయింట్స్కు రూ. 27 కోట్లకు అమ్ముడుపోయిన పంత్.. ఐపీఎల్ సాలరీ అంతకు ముందు కూడా తక్కువేమీ కాదు. ఇటు టీమిండియా తరఫున.. అటు ఐపీఎల్లో భారీ వేతనాలు పొందతున్న పంత్.. అడిడాస్, జొమాటో, క్యాడ్బరీ వంటి పలు ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగానూ ఉన్నాడు.ఒక్కో ఎండార్స్మెంట్ డీల్కు పంత్ రూ. 3.5 నుంచి 4 కోట్ల వరకు వసూలు చేస్తాడని వన్క్రికెట్ గతంలో వెల్లడించింది. ప్రచారకర్తగా ఏడాదికి రూ. 20- 25 కోట్ల వరకూ సంపాదిస్తున్నాడని వెల్లడించింది.ఇక పంత్కు రూర్కీలో రూ. 1 కోటి విలువైన స్థిరాస్థి ఉన్నట్లు సమాచారం. అదే విధంగా ఢిల్లీలోని ఉత్తమ్నగర్లో రూ. 2 కోట్ల విలువైన ఇల్లు అతడి పేరు మీద ఉన్నట్లు తెలుస్తోంది.లగ్జరీ కార్లుపంత్ గ్యారేజ్లో ఆడిఏ8, ఫోర్డ్ ముస్తాంగ్ జీటీ, మెర్సిడెస్-బెంజ్ ఎస్యూవీ, మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఈ వంటి పలు విలాసవంతమైన కార్లు కూడా ఉన్నట్లు సమాచారం. వన్క్రికెట్ వివరాల ప్రకారం.. 2025 నాటికి పంత్ నికర ఆస్తుల విలువ వంద కోట్లు అని అంచనా. ఇక ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా గాయపడిన పంత్.. టీమిండియాకు దూరమైన విషయం తెలిసిందే. అక్టోబరులో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.చదవండి: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. టెస్టు క్రికెట్ హిస్టరీలోనే ఏకైక ఆటగాడిగా.. -
జడ్డూ మాయాజాలం.. విండీస్ విలవిల!.. 49 పరుగులకే..
వెస్టిండీస్తో తొలి టెస్టులో టీమిండియా (IND vs WI) బౌలర్లు అదరగొడుతున్నారు. సొంతగడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఫలితంగా శనివారం నాటి మూడో రోజు ఆటలో విండీస్ తమ రెండో ఇన్నింగ్స్లో 49 పరుగులకే ఏకంగా ఐదు వికెట్లు కోల్పోయింది.162 పరుగులకేరెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా టీమిండియా- వెస్టిండీస్ మధ్య అహ్మదాబాద్ వేదికగా గురువారం తొలి టెస్టు మొదలైంది. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్లో విండీస్ను 162 పరుగులకే ఆలౌట్ చేసింది. హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) నాలుగు వికెట్లు పడగొట్టగా.. పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) మూడు వికెట్లు దక్కించుకున్నాడు.టీమిండియా భారీ స్కోరుచైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) రెండు వికెట్లు తీయగా.. స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్లో.. భారత్ ఐదు వికెట్ల నష్టానికి 448 పరుగుల భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కేఎల్ రాహుల్ (100), ధ్రువ్ జురెల్ (125), రవీంద్ర జడేజా (104 నాటౌట్) శతకాల వల్ల ఇది సాధ్యమైంది.220 పరుగులు వెనుకబడిఈ క్రమంలో శనివారం నాటి మూడో రోజు ఆటలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విండీస్.. భోజన విరామ సమయానికి 27 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి కేవలం 66 పరుగులు చేసింది. టీమిండియా కంటే ఇంకా 220 పరుగులు వెనుకబడి ఉంది.ఓపెనర్ తగ్నరైన్ చందర్పాల్ (8) రూపంలో సిరాజ్ తొలి వికెట్ అందించగా.. రవీంద్ర జడేజా తన స్పిన్ మాయాజాలంతో మరో ఓపెనర్ జాన్ కాంప్బెల్ (14), నాలుగో నంబర్ బ్యాటర్ బ్రాండన్ కింగ్ (5), వికెట్ కీపర్బ్యాటర్ షాయీ హోప్ (1)లను వెనక్కి పంపించాడు.ఇక కుల్దీప్ యాదవ్.. కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (1)ను అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో 66 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. శనివారం లంచ్ బ్రేక్ సమయానికి వన్డౌన్ బ్యాటర్ అలిక్ అథనాజ్ 27, ఆల్రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.చదవండి: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. టెస్టు క్రికెట్ హిస్టరీలోనే ఏకైక ఆటగాడిగా..#TeamIndia's fielding brilliance continues 👏This time it's Yashasvi Jaiswal 👌West Indies 5️⃣ down now!Updates ▶ https://t.co/MNXdZceTab#INDvWI | @IDFCFIRSTBank | @ybj_19 pic.twitter.com/5gKY0dXiVt— BCCI (@BCCI) October 4, 2025 -
వారెవ్వా!.. స్టన్నింగ్ క్యాచ్తో మెరిసిన నితీశ్ రెడ్డి.. వీడియో వైరల్
వెస్టిండీస్తో తొలి టెస్టు సందర్భంగా టీమిండియా ఆల్రౌండర్ నితీశ్కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) సంచలన క్యాచ్తో మెరిశాడు. పక్షిలా గాల్లోకి ఎగిరి రెండు చేతులతో బంతిని ఒడిసిపట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) షేర్ చేయగా నెట్టింట వైరల్గా మారింది.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో భాగంగా స్వదేశంలో టీమిండియా వెస్టిండీస్ (IND vs WI)తో సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా గురువారం తొలి టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన విండీస్ తొలి ఇన్నింగ్స్లో 162 పరుగులకు ఆలౌట్ అయింది.ఇన్నింగ్స్ డిక్లేర్ఇందుకు బదులుగా టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి.. శనివారం నాటి మూడో రోజు ఆట మొదలుకాగానే తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 286 పరుగుల ఆధిక్యంలో ఉన్న వేళ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో విండీస్ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టగా.. భారత సీనియర్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఆదిలోనే ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు.సిరాజ్ బౌలింగ్లో వెస్టిండీస్ ఓపెనర్ తగ్నరైన్ చందర్పాల్ 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద.. బంతిని గాల్లోకి లేపాడు. ఇంతలో.. స్క్వేర్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న నితీశ్ కుమార్ రెడ్డి గాల్లోకి ఎగిరి.. డైవ్ చేసి మరీ అద్భుత రీతిలో క్యాచ్ అందుకున్నాడు. దీంతో వెస్టిండీస్ తొలి వికెట్ కోల్పోయింది.49 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి..ఇక ఈసారి కూడా భారత బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కడుతున్నారు. శనివారం నాటి మూడో రోజు ఆటలో 23 ఓవర్లు ముగిసేసరికి 49 పరుగులు మాత్రమే చేసిన విండీస్ సగం వికెట్లు కోల్పోయింది. రవీంద్ర జడేజా మూడు వికెట్లతో చెలరేగగా.. సిరాజ్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.చదవండి: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. టెస్టు క్రికెట్ హిస్టరీలోనే ఏకైక ఆటగాడిగా.. 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗖𝗔𝗧𝗖𝗛. 👏Nitish Kumar Reddy grabs a flying stunner 🚀Mohd. Siraj strikes early for #TeamIndia ☝️Updates ▶️ https://t.co/MNXdZceTab#INDvWI | @IDFCFIRSTBank | @NKReddy07 pic.twitter.com/1Bph4oG9en— BCCI (@BCCI) October 4, 2025 -
IND vs WI Day 3: ట్విస్ట్ ఇచ్చిన టీమిండియా!
వెస్టిండీస్తో తొలి టెస్టులో టీమిండియా (IND vs WI 1st Test) తమ మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఊహించని రీతిలో శనివారం నాటి మూడో రోజు ఆట మొదలుకాగానే ఈ మేరకు తమ నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో విండీస్ బ్యాటింగ్కు దిగింది.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27 సీజన్లో భాగంగా సొంతగడ్డపై టీమిండియా.. విండీస్తో రెండు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గురువారం మొదటి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన పర్యాటక విండీస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది.భారత బౌలర్ల విజృంభణభారత బౌలర్ల ధాటికి.. తొలి ఇన్నింగ్స్లో భాగంగా 44.1 ఓవర్లలో కేవలం 162 పరుగులు మాత్రమే చేసి వెస్టిండీస్ జట్టు కుప్పకూలింది. ఓపెనర్లు జాన్ కాంప్బెల్ (8), తగ్నరైన్ చందర్పాల్ (0)లతో పాటు.. వన్డౌన్ బ్యాటర్ అలిక్ అథనాజ్ (12) కూడా పూర్తిగా విఫలమయ్యాడు.మిగతా వారిలో బ్రాండన్ కింగ్ (13), ఖరీ పియరీ (11) రెండంకెల స్కోరు చేయగా.. కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (24), షాయీ హోప్ (26) ఫర్వాలేదనిపించారు. ఆల్రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ 32 పరుగులతో విండీస్ ఇన్నింగ్స్లో టాప్ రన్స్కోరర్గా నిలిచాడు.టీమిండియా బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) నాలుగు వికెట్లతో చెలరేగగా.. బుమ్రా మూడు, కుల్దీప్ యాదవ్ రెండు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ దక్కించుకున్నారు. బౌలర్లు ఇలా తమ పనిని సమర్థవంతంగా పూర్తి చేసి ప్రత్యర్థిని కట్టడి చేయగా.. బ్యాటర్లు కూడా విజృంభించారు.ముగ్గురు మొనగాళ్లుఓపెనర్ కేఎల్ రాహుల్ (100)తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (125), ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (104 నాటౌట్) శతకాలతో ఆకట్టుకున్నారు. కెప్టెన్ శుబ్మన్ గిల్ 50 పరుగులు చేయగా.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (36) నిరాశపరిచాడు. ఇటీవల సూపర్ ఫామ్ కనబరిచిన సాయి సుదర్శన్ (7) మాత్రం ఈసారి పూర్తిగా విఫలమయ్యాడు.ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి.. విండీస్పై మొదటి ఇన్నింగ్స్లో 286 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అయితే, శనివారం నాటి మూడో రోజు ఆట మొదలుకాగానే తమ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. వేట మొదలుపెట్టిన సిరాజ్ఫలితంగా విండీస్ తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. తొమ్మిది ఓవర్ల ఆట ముగిసేసరికి వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. ఓపెనర్ తగ్నరైన్ చందర్పాల్ (8) మరోసారి విఫలం అయ్యాడు. సిరాజ్ బౌలింగ్లో నితీశ్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక మరో ఓపెనర్ జాన్ కాంప్బెల్ 12, అలిక్ అథనాజ్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.చదవండి: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. టెస్టు క్రికెట్ హిస్టరీలోనే ఏకైక ఆటగాడిగా.. -
చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. టెస్టు క్రికెట్ హిస్టరీలోనే ఏకైక ఆటగాడిగా
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) అరుదైన రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంత వరకు ఏ ఆటగాడికీ సాధ్యం కాని ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకీ అదేమిటంటే...!ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో భాగంగా టీమిండియా- విండీస్ (IND vs WI Tests) మధ్య రెండు మ్యాచ్ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గురువారం తొలి టెస్టు మొదలైంది.శతక్కొట్టిన కేఎల్ రాహుల్నరేంద్ర మోదీ మైదానంలో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేసి.. తొలి ఇన్నింగ్స్లో 162 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా శుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి.. కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 448 పరుగులు సాధించింది.I wish KL Rahul does what Michael Hussey has done in his career,KL hits his prime in 30s and wants him to score at least 10k test runs for india otherwise it's a waste of talent.India has done a lot of backing, now it's finally paying off.pic.twitter.com/JokYjzK6Lt— Sujeet Suman (@sujeetsuman1991) October 3, 2025 ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (36) ఫర్వాలేదనిపించగా... రెండో రోజు ఆట సందర్భంగా కేఎల్ రాహుల్ శతక్కొట్టాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 197 బంతులు ఎదుర్కొని 12 ఫోర్ల సాయంతో 100 పరుగులు చేశాడు. సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే.. వారికన్ బౌలింగ్లో జస్టిన్ గ్రీవ్స్కు క్యాచ్ ఇవ్వడంతో రాహుల్ శతక ఇన్నింగ్స్కు తెరపడింది.ఏకైక క్రికెటర్గా..కాగా టెస్టు మ్యాచ్లో రాహుల్ ఇలా సరిగ్గా వంద పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత అవుట్ కావడం ఇది రెండోసారి. జూలైలో ఇంగ్లండ్తో లార్డ్స్ టెస్టులోనూ సెంచరీ చేసిన తర్వాత రాహుల్ పెవిలియన్ చేరాడు. ఇలా ఒకే క్యాలెండర్ ఇయర్లో ఓ ఆటగాడు సరిగ్గా వంద పరుగులు చేసి రెండుసార్లు అవుట్ కావడం.. 148 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.అదే విధంగా.. ఓవరాల్గా టెస్టు కెరీర్లో 100 పరుగుల వద్ద రెండుసార్లు అవుటైన ఏడో ప్లేయర్గా కేఎల్ రాహుల్ నిలవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. రాహుల్ కెరీర్లో ఇది పదకొండో టెస్టు సెంచరీ కావడం విశేషం.448/5 డిక్లేర్డ్ఇక రాహుల్ (100)తో పాటు ధ్రువ్ జురెల్ (125) శతక్కొట్టగా.. రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అజేయ సెంచరీ (104)తో క్రీజులో ఉన్నాడు. మిగిలిన వాళ్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్ అర్ధ శతకం (100 బంతుల్లో 50) సాధించాడు. ఈ క్రమంలో రెండో రోజు ఆట ముగిసే సరికి 448 పరుగులు చేసిన టీమిండియా.. విండీస్ కంటే తొలి ఇన్నింగ్స్లో 286 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. శనివారం నాటి మూడో రోజు ఆట మొదలుకాగానే ఇదే స్కోరు వద్ద (448/5) టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.చదవండి: IND vs AUS: శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ విఫలం.. తిలక్ వర్మ మెరిసినా... -
224 పరుగుల ఆధిక్యంలో...
నాగ్పూర్ వేదికగా ఇరానీ కప్ (Irani Cup 2025) మ్యాచ్పై విదర్భ జట్టు పట్టు బిగించింది. రెస్టాఫ్ ఇండియా (Vidarbha vs Rest of India)తో జరుగుతున్న ఈ పోరులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి విదర్భ ఓవరాల్గా 224 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ప్రస్తుతం విదర్భ జట్టు రెండో ఇన్నింగ్స్లో 36 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. సెంచరీ హీరో ఈసారి ఫెయిల్దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీ (Ranji Trophy)లో చాంపియన్గా నిలిచిన విదర్భ జట్టు... ఇరానీ కప్లోనూ అదే జోరు కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో అథర్వ తైడె (15), అమన్ (37) అవుట్ కాగా... ధ్రువ్ షోరె (Dhruv Shorey- 60 బంతుల్లో 24 బ్యాటింగ్; 1 ఫోర్), దానిశ్ మాలేవర్ (37 బంతుల్లో 16 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. లక్ష్యం ఎంతో?రెస్టాఫ్ ఇండియా బౌలర్లలో మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్ చెరో వికెట్ పడగొట్టారు. వర్షం కారణంగా మూడో రోజు కూడా ఆటకు ఆటంకం వాటిల్లింది. మ్యాచ్లో మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగా... 8 వికెట్లు చేతిలో ఉన్న విదర్భ జట్టు... ప్రత్యర్థి ముందు ఎంత లక్ష్యాన్ని నిర్దేశిస్తుందో చూడాలి. అంతకుముందు విదర్భ జట్టు తొలి ఇన్నింగ్స్లో 342 పరుగులు చేయగా... రెస్టాఫ్ ఇండియా 69.5 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రజత్ పాటీదార్ (125 బంతుల్లో 66; 10 ఫోర్లు), అభిమన్యు ఈశ్వరన్ (112 బంతుల్లో 52; 6 ఫోర్లు) అర్ధసెంచరీలు చేశారు. రుతురాజ్ గైక్వాడ్ (9), ఇషాన్ కిషన్ (1), మానవ్ సుతార్ (1) విఫలమవడంతో రెస్టాఫ్ ఇండియా భారీ స్కోరు చేయలేకపోయింది. విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్ 4 వికెట్లు పడగొట్టగా... హర్ష్ దూబే, పార్థ్ చెరో 2 వికెట్లు తీశారు. స్కోరు వివరాలు విదర్భ తొలి ఇన్నింగ్స్: 342; రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్: అభిమన్యు (ఎల్బీ) (బి) పార్థ్ 52; ఆర్యాన్ జుయెల్ (ఎల్బీ) (బి) దర్శన్ 23; యశ్ ధుల్ (స్టంప్డ్) వాడ్కర్ (బి) హర్శ్ దూబే 11; రజత్ పాటీదార్ (సి) రాథోడ్ (బి) హర్శ్ దూబే 66; రుతురాజ్ గైక్వాడ్ (సి) రాథోడ్ (బి) యశ్ ఠాకూర్ 9; ఇషాన్ కిషన్ (ఎల్బీ) (బి) పార్థ్ 1; మానవ్ సుతార్ (ఎల్బీ) (బి) యశ్ ఠాకూక్ 10; ఆకాశ్దీప్ (సి) అథర్వ (బి) యశ్ ఠాకూర్ 14; అన్షుల్ కంబోజ్ (నాటౌట్) 10; గుర్నూర్ బ్రార్ (సి) దూబే (బి) యశ్ ఠాకూర్ 13; ఎక్స్ట్రాలు 4; మొత్తం (69.5 ఓవర్లలో ఆలౌట్) 214.వికెట్ల పతనం: 1–52, 2–73, 3–105, 4–119, 5–124, 6–142, 7–175, 8–191, 9–191, 10–214. బౌలింగ్: హర్శ్ దూబే 22–5–58–2; ఆదిత్య ఠాకరే 11–1–40–1; దర్శన్ నల్కండే 8–1–26–1; యశ్ ఠాకూర్ 16.5–3–66–4; పార్థ్ రెఖడే 12–3–24–2. విదర్భ రెండో ఇన్నింగ్స్: అథర్వ తైడె (సి) ఆకాశ్దీప్ (బి) మానవ్ సుతార్ 15; అమన్ (సి) ఇషాన్ కిషన్ (బి) గుర్నూర్ బ్రార్ 37; ధ్రువ్ షోరె (బ్యాటింగ్) 24; దానిశ్ మాలేవార్ (బ్యాటింగ్) 16; ఎక్స్ట్రాలు 4; మొత్తం (36 ఓవర్లలో 2 వికెట్లకు) 96. వికెట్ల పతనం: 1–42, 2–64. బౌలింగ్: సారాంశ్ జైన్ 9–0–28–0; ఆకాశ్దీప్ 3–1–4–0; మానవ్ సుతార్ 14–1–35–1; అన్షుల్ కంబోజ్ 4–0–14–0; గుర్నూర్ బ్రార్ 6–2–11–1. చదవండి: IND vs WI 1st Test: ముగ్గురు సెంచరీలు.. భారీ ఆధిక్యంలో భారత్.. -
IND vs AUS: ప్చ్... తిలక్ వర్మ మెరిసినా...
ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుతో జరిగిన రెండో అనధికారిక వన్డేలో భారత ‘ఎ’ (IND A vs AUS A) జట్టు పరాజయం పాలైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్లో... శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) సారథ్యంలోని భారత ‘ఎ’జట్టు డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 9 వికెట్ల తేడాతో ఓడింది. దీంతో సిరీస్ 1–1తో సమమైంది. 246 పరుగులకు ఆలౌట్కాన్పూర్ వేదికగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ ‘ఎ’ జట్టు 45.5 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. ఇటీవల ఆసియాకప్ టీ20 టోర్నమెంట్ ఫైనల్లో పాకిస్తాన్పై అజేయ అర్ధశతంతో మెరిసి జట్టును గెలిపించిన తిలక్ వర్మ (Tilak Varma) మరోసారి ఆకట్టుకున్నాడు. త్రుటిలో చేజారిన శతకంతాజా మ్యాచ్లో తిలక్ 122 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 94 పరుగులు చేసి త్రుటిలో శతకం కోల్పోయాడు. ప్రస్తుతం భారత టీ20 జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్న తిలక్ వర్మ... ఇప్పుడు వన్డే ఫార్మాట్లోనూ సత్తా చాటాడు. రియాన్ పరాగ్ (54 బంతుల్లో 58; 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ సాధించాడు. రియాన్తో కలిసి నాలుగో వికెట్కు తిలక్ 101 పరుగులు జతచేశాడు. వన్డౌన్లో బరిలోకి దిగిన ఈ హైదరాబాద్ బ్యాటర్ చివరి వికెట్గా వెనుదిరిగాడు. శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ విఫలంఇక తొలి మ్యాచ్లో సెంచరీలతో మెరిసిన ప్రభ్సిమ్రన్ సింగ్ (1), శ్రేయస్ అయ్యర్ (8)తో పాటు... అభిషేక్ శర్మ (0), నిశాంత్ (1) విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జాక్ ఎడ్వర్డ్స్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఆ్రస్టేలియా లక్ష్యఛేదన ప్రారంభించాక భారీ వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోగా... ఆసీస్ లక్ష్యాన్ని 25 ఓవర్లలో 160గా నిర్ణయించారు. సిరీస్ సమంఛేదనలో ఆసీస్ 16.4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 160 పరుగులు చేసి గెలిచింది. మెకంజీ హార్వే (49 బంతుల్లో 70 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్లు), కూపర్ (31 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్లు) అజేయ అర్ధశతకాలతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. భారత బౌలర్లలో నిషాంత్ ఒక వికెట్ పడగొట్టాడు. టీమిండియా పేసర్ అర్శ్దీప్ సింగ్ 4 ఓవర్లలో 44 పరుగులు సమర్పించుకున్నాడు. ఇరు జట్ల మధ్య ఆదివారం నిర్ణయాత్మక మూడో మ్యాచ్ జరగనుంది.చదవండి: ఆసియాకప్ ట్రోఫీని భారత్కు ఇవ్వొద్దు.. ఆ మొండితనం ఏంటి?: పాక్ మాజీ క్రికెటర్ -
టి20 వరల్డ్కప్లో నమీబియా, జింబాబ్వే
దుబాయ్: వచ్చే ఏడాది భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పురుషుల టి20 ప్రపంచకప్నకు నమీబియా, జింబాబ్వే అర్హత సాధించాయి. ఆఫ్రికా రీజినల్ టోర్నమెంట్లో ఫైనల్కు చేరడం ద్వారా ఈ రెండు జట్లు వరల్డ్కప్ బెర్త్ దక్కించుకున్నాయి. సెమీఫైనల్లో జింబాబ్వే 7 వికెట్ల తేడాతో కెన్యాపై విజయం సాధించగా... నమీబియా 63 పరుగుల తేడాతో టాంజానియాపై గెలుపొందింది. తద్వారా మెగా టోర్నీకి అర్హత సాధించాయి. 2026 ఫిబ్రవరి, మార్చి మధ్య జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 20 దేశాలు పాల్గొంటాయి. అందులో భారత్, శ్రీలంక ఆతిథ్య హక్కులతో నేరుగా అర్హత సాధించగా... 2024 వరల్డ్కప్లో మెరుగైన ప్రదర్శన చేసిన అఫ్గానిస్తాన్, ఆ్రస్టేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, అమెరికా, వెస్టిండీస్ జట్లు వరల్డ్కప్ బెర్త్ దక్కించుకున్నాయి. ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ ర్యాంకింగ్స్ ప్రకారం అర్హత సాధించాయి. దీంతో మొత్తం 12 జట్లు మెగా టోర్నీ బెర్త్ దక్కించుకోగా... మిగిలిన ఎనిమిది జట్లను వివిధ క్వాలిఫయింగ్ టోర్నీల ద్వారా ఎంపిక చేస్తారు. ఇప్పటికే జరిగిన అమెరికా క్వాలిఫయర్స్లో కెనడా జట్టు... యూరప్ క్వాలిఫయర్స్లో ఇటలీ, నెదర్లాండ్స్ జట్లు టోర్నీకి బెర్త్ దక్కించుకోగా... తాజాగా ఆఫ్రికా క్వాలిఫయర్స్ నుంచి నమీబియా, జింబాబ్వే ముందంజ వేశాయి. దీంతో వరల్డ్కప్లో పాల్గొనబోయే 17 జట్లపై స్పష్టత రాగా... ఆసియా క్వాలిఫయర్స్ ద్వారా మరో మూడు జట్లను ఎంపిక చేయనున్నారు. -
విండీస్తో టెస్టు: టీమిండియా శతకాల మోత
వెస్టిండీస్తో విజయ దశమి రోజు మొదలైన తొలి టెస్టులో రెండో రోజే టీమిండియా శాసించే స్థితిలో నిలిచింది. ఇంగ్లండ్ గడ్డపై భారత్ను గట్టెక్కించిన హైదరాబాద్ స్పీడ్స్టర్ సిరాజ్... కరీబియన్ జట్టును తొలి రోజే ఆలౌట్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. రెండో రోజు ఓవర్నైట్ బ్యాటర్ లోకేశ్ రాహుల్తో పాటు ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా శతక్కొట్టడంతో భారత్ ఇప్పటికే భారీ ఆధిక్యం అందుకుంది. ఈ రెండు రోజుల్లోనే విండీస్ జట్టు అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో కుదేలైంది.అహ్మదాబాద్: భారత పర్యటనకు వచ్చిన వెస్టిండీస్ జట్టుకు టెస్టు సిరీస్ మొదలైన రెండు రోజుల్లోనే టీమిండియా తడాఖా చూపెట్టింది. స్టార్ పేసర్లు సిరాజ్ (4/40), బుమ్రా (3/42) కరీబియన్ బ్యాటర్ల పని పట్టారు. కుల్దీప్, సుందర్ల స్పిన్ కూడా వారి పేస్కు తోడవడంతో కనీసం వన్డే ఓవర్ల కోటానైనా పర్యాటక జట్టు ఆడలేకపోయింది. తర్వాత భారత బ్యాటర్లు లోకేశ్ రాహుల్, ధ్రువ్ జురేల్, జడేజాలు మూకుమ్మడిగా విండీస్ బౌలర్లపై చెలరేగారు. భారత్ ఈ రకమైన ఆల్రౌండ్ జోరు చూస్తుంటే... మూడు రోజుల్లోనే ముగిసేలా ఉంది. ముందుగా వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 44.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. జస్టిన్ గ్రీవ్స్ (48 బంతుల్లో 32; 4 ఫోర్లు) చేసిన 30 పైచిలుకు స్కోరే ఇన్నింగ్స్ అత్యధిక వ్యక్తిగత స్కోరు! కుల్దీప్ 2, సుందర్ ఒక వికెట్ తీశారు. తర్వాత భారత్ తొలి ఇన్నింగ్స్లో 128 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసింది. ధ్రువ్ జురేల్ (210 బంతుల్లో 125; 15 ఫోర్లు, 3 సిక్స్లు), కేఎల్ రాహుల్ (197 బంతుల్లో 100; 12 ఫోర్లు), రవీంద్ర జడేజా (176 బంతుల్లో 104 బ్యాటింగ్; 6 ఫోర్లు, 5 సిక్స్లు) శతక్కొట్టారు. రోస్టన్ చేజ్కు 2 వికెట్లు దక్కాయి. సిరాజ్ కూల్చేశాడు మొదటి రోజు గురువారం టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్కు శ్రీకారం చుట్టింది. అయితే నాలుగో ఓవర్ నుంచే సిరాజ్ ఓ వైపు, బుమ్రా రెండో వైపు కట్టుదిట్టమైన బౌలింగ్తో కరీబియన్ బ్యాటర్లను క్రీజులోనే నిలువనీయలేదు. దీంతో తేజ్నారాయణ్ చందర్పాల్ (0), జాన్ క్యాంప్బెల్ (8), అలిక్ అతనేజ్ (12), బ్రాండన్ కింగ్ (13)... ఇలా టాప్–4 బ్యాటర్లను కోల్పోయిన విండీస్ 42/4 స్కోరు వద్దే కష్టాల్లో చిక్కుకుంది. కాసేపు కెప్టెన్ చేజ్ (24; 4 ఫోర్లు), షై హోఫ్ (26; 3 ఫోర్లు) వికెట్ల పతనాన్ని ఆపగలిగారే కానీ... కుల్దీప్ దిగగానే హోప్ను అవుట్ చేయడంతో వందలోపే సగం (ఐదు) వికెట్లను కోల్పోయింది. వందయ్యాక చేజ్ను సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. గ్రీవ్స్ చేసిన ఆమాత్రం స్కోరుతో విండీస్ 150 పైచిలుకు స్కోరును కష్టంగా చేయగలిగింది. రాహుల్ శతకం ఓపెనర్లు జైస్వాల్ (36; 7 ఫోర్లు), రాహుల్ చక్కని ఆరంభాన్నిచ్చారు. కానీ తక్కువ వ్యవధిలోనే జైస్వాల్, సాయి సుదర్శన్ (7) అవుటయ్యారు. కెప్టెన్ గిల్ అండతో రాహుల్ అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా తొలి రోజును 121/2 స్కోరు వద్ద ముగించారు. శుక్రవారం 57 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడిన రాహుల్ సెంచరీ దిశగా పయనించగా, అర్ధ శతకం పూర్తయిన వెంటనే గిల్ నిష్క్రమించాడు. జురేల్ క్రీజులోకి రాగా లంచ్ బ్రేక్కు ముందే భారత్ స్కోరు 200 దాటింది. దీంతో పాటే రాహుల్ టెస్టుల్లో 11వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వెంటనే తన కుమార్తె ఇవారా కోసం అన్నట్లుగా ఈల వేస్తూ వేడుక చేసుకున్నాడు. మొత్తానికి సొంతగడ్డపై దాదాపు తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెర దించుతూ సెంచరీ సాధించాడు. 2016 డిసెంబర్లో సెంచరీ అనంతరం మళ్లీ ఇప్పుడే భారత గడ్డపై రాహుల్ శతకం సాధించాడు. కదంతొక్కిన జురేల్, జడేజా రాహుల్ అవుటయ్యాక జురేల్కు జడేజా జత కలిశాడు. వీళ్లిద్దరు క్రీజులో పాతుకొనిపోవడంతో భారత్ స్కోరుతో పాటే విండీస్ కష్టాలు అంతకంతకు పెరిగిపోయాయి. రెండో సెషన్లోనే ఇద్దరు అర్ధ సెంచరీలు సాధించగా జట్టు స్కోరు 300లకు చేరింది. 162 పరుగులకే ప్రత్యర్థి జట్టు అన్ని వికెట్లను కోల్పోతే... జురేల్, జడేజా ఇద్దరే ఐదో వికెట్కు 206 పరుగులు జోడించడం భారత్ భారీస్కోరుకు బాటవేసింది. ఆరో టెస్టులో జురేల్ తొలి అంతర్జాతీయ సెంచరీ ముచ్చట తీర్చుకున్నాడు. అతను అవుటయ్యాక జడేజా శతకం పూర్తయ్యింది. భారత్ ఎదుర్కొన్న 128 ఓవర్లలో 3.5 రన్రేట్తో పరుగులు సాధించింది. బ్యాటర్లంతా కలిసి 45 బౌండరీలు, 8 సిక్సర్లు బాదారు. ఆట నిలిచే సమయానికి జడేజాతో సుందర్ (9 బ్యాటింగ్) అజేయంగా నిలిచాడు.‘అపోలో’ ఆట మొదలువిండీస్తో తొలి టెస్టులో భారత జట్టు కొత్త స్పాన్సర్ ‘అపోలో టైర్స్’ లోగో ఉన్న జెర్సీతో బరిలోకి దిగింది. ప్రధాన స్పాన్సరర్గా బీసీసీఐకి మూడేళ్ల కాలానికి అపోలో రూ. 579 కోట్లతో ఒప్పందం చేసుకుంది. స్కోరు వివరాలు వెస్టిండీస్ తొలిఇన్నింగ్స్: క్యాంప్బెల్ (సి) జురేల్ (బి) బుమ్రా 8; తేజ్ నారాయణ్ (సి) జురేల్ (బి) సిరాజ్ 0; అతనేజ్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 12; కింగ్ (బి) సిరాజ్ 13; చేజ్ (సి) జురేల్ (బి) సిరాజ్ 24; షై హోప్ (బి) కుల్దీప్ 26; గ్రీవెస్ (బి) బుమ్రా 32; పియర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సుందర్ 11; వేరికన్ (సి) జురేల్ (బి) కుల్దీప్ 8; జాన్ లేన్ (బి) బుమ్రా 1; సీలెస్ నాటౌట్ 6; ఎక్స్ట్రాలు 21; మొత్తం (44.1 ఓవర్లలో ఆలౌట్) 162. వికెట్ల పతనం: 1–12, 2–20, 3–39, 4–42, 5–90, 6–105, 7–144, 8–150, 9–153, 10–162. బౌలింగ్: బుమ్రా 14–3–42–3, సిరాజ్ 14–3–40–4, నితీశ్ 4–1–16–0, రవీంద్ర జడేజా 3–0–15–0, కుల్దీప్ యాదవ్ 6.1–0–25–2, సుందర్ 3–0–9–1. భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) షై హోప్ (బి) సీలెస్ 36; రాహుల్ (సి) గ్రీవెస్ (బి) వేరికన్ 100; సాయి సుదర్శన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చేజ్ 7; గిల్ (సి) గ్రీవెస్ (బి) చేజ్ 50; ధ్రువ్ జురేల్ (సి) షై హోప్ (బి) పియర్ 125; జడేజా బ్యాటింగ్ 104; సుందర్ బ్యాటింగ్ 9; ఎక్స్ట్రాలు 17; మొత్తం (128 ఓవర్లలో 5 వికెట్లకు) 448. వికెట్ల పతనం: 1–68, 2–90, 3–188, 4–218, 5–424. బౌలింగ్: సీలెస్ 19–2–53–1, జాన్ లేన్ 15–0–38–0, జస్టిన్ గ్రీవెస్ 12–4–59–0, జొమెల్ వేరికన్ 29–5–102–1, పియర్ 29–1–91–1, రోస్టన్ చేజ్ 24–3–90–2. -
సౌతాఫ్రికా చిత్తు.. 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో ఇంగ్లండ్ జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం గౌహతి వేదికగా సౌతాఫ్రికాతో మహిళలతో జరిగిన మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా దారుణ ప్రదర్శన కనబరిచింది.ఇంగ్లీష్ జట్టు బౌలర్ల దాటికి సౌతాఫ్రికా అమ్మాయిలు విలవిల్లాడారు. దక్షిణాఫ్రికా 20.4 ఓవర్లలో కేవలం 69 పరుగులకే కుప్పకూలింది. ప్రోటీస్ బ్యాటర్లలో మొత్తం పది మంది సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు. సినాలో జాఫ్తా(22) టాప్ స్కోరర్గా నిలిచింది.ఇంగ్లండ్ బౌలర్లలో లిన్సే స్మిత్ మూడు వికెట్లతో సౌతాఫ్రికాను దెబ్బతీయగా.. స్కివర్ బ్రంట్, ఎకిలిస్టోన్, డీన్ తలా రెండు వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం 70 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 14.1 ఓవర్లలో చేధించింది.ఓపెనర్లు టామీ బ్యూమాంట్(21), అమీ జోన్స్(40) ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశారు. మూడు వికెట్లతో సత్తాచాటిన స్మిత్ ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచింది. వన్డేల్లో దక్షిణాఫ్రికా మహిళల జట్టుపై ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించడం ఇదే తొలిసారి.చదవండి: ఆసియాకప్ ట్రోఫీని భారత్కు ఇవ్వొద్దు.. ఆ మొండితనం ఏంటి?: పాక్ మాజీ క్రికెటర్ -
ఆసియాకప్ ట్రోఫీని భారత్కు ఇవ్వొద్దు.. ఆ మొండితనం ఏంటి?
భారత క్రికెట్ జట్టు ఆసియాకప్ విజేతగా నిలిచి ఐదు రోజులు అవుతున్నప్పటికి ట్రోఫీ మాత్రం ఇంకా తమ వద్దకు చేరలేదు. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదగా మెడల్స్తో పాటు ట్రోఫీని అందుకోవడానికి భారత్ నిరాకరిచింది.పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్తో పాటు ఆ దేశ మంత్రిగా ఉండడంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో నఖ్వీ ట్రోఫీని, మెడల్స్ను తనతో పాటు తీసుకుని వెళ్లిపోయాడు. అతడి తీరుపై బీసీసీఐ తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. దీంతో దిగొచ్చిన నఖ్వీ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డు అందజేయనున్నట్లు వార్తలు వచ్చాయి.కానీ ఇప్పటివరకు యూఏఈ క్రికెట్ బోర్డు, బీసీసీఐ గానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే తాజాగా ఈ ట్రోఫీ వివాదంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా తన చేతుల మీదగా ట్రోఫీని తీసుకోకూడదనే వైఖరిని కొనసాగిస్తే, నఖ్వీని తన నిర్ణయాన్ని మార్చుకోవద్దని అలీ సూచించాడు. ఈ పాక్ మాజీ క్రికెటర్ టీమిండియాపై మరోసారి తన అక్కసు వెళ్లగక్కాడు."టీమిండియా నంబర్ వన్ జట్టుగా కొనసాగుతోంది. కానీ వారు చేసే పనులు మాత్రం థర్డ్ క్లాస్ను తలపిస్తున్నాయి. మొహ్సిన్ నఖ్వీనే ఆసియాకప్ ట్రోఫీని అందజేయాలి. వారు అందుకు నిరాకరిస్తే, ఖచ్చితంగా ప్రపంచం దృష్టిలో చెడ్డ పేరు తెచ్చుకుంటారు.అటువంటి అప్పుడు ఎట్టిపరిస్థితిలలోనూ ట్రోఫీని అప్పగించకూడదు. భారత్ బాగా ఆడి గెలిచింది. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ మొండితనం ఏంటి? మొహ్సిన్ నఖ్వీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మెన్గా ఉన్నారు. అదే ఐసీసీ ఈవెంట్ అయివుండి చైర్మెన్ జై షా నుండి పాకిస్తాన్ ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించినా కూడా నేను తప్పు పట్టేవాడిని" అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలీ పేర్కొన్నాడు.కాగా ఈ ఏడాది ఆసియాకప్ టోర్నీలో మొత్తంగా మూడు సార్లు పాక్ను భారత్ చిత్తు చేసింది. అయితే అతడి వ్యాఖ్యలకు టీమిండియా అభిమానులు కౌంటరిస్తున్నారు. ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేదు, ముందు మీ జట్టు సంగతి చూసుకో అని నెటిజన్లు పోస్ట్లు పెడుతున్నారు.చదవండి: IND vs AUS: పాపం తిలక్ వర్మ.. సెంచరీ జస్ట్ మిస్! భారత్ స్కోరెంతంటే? -
పాపం తిలక్ వర్మ.. సెంచరీ జస్ట్ మిస్! భారత్ స్కోరెంతంటే?
కాన్పూర్ వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్-ఎ జట్టు బ్యాటర్లు తేలిపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్ తమ నిర్ణయానికి ఏ మాత్రం న్యాయం చేయలేకపోయింది. 45.5 ఓవర్లలో 246 పరుగులకు ఇండియా-ఎ జట్టు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికి తిలక్ మాత్రం విరోచిత పోరాటం కనబరిచాడు. ఆచితూచి ఆడుతూ వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించాడు. అయితే ఈ మ్యాచ్లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడిన తిలక్ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 122 బంతులు ఎదుర్కొన్న తిలక్.. 5 ఫోర్లు, 4 సిక్స్లతో 94 పరుగులు చేశాడు. అతడితో పాటు రియాన్ పరాగ్(58) హాఫ్ సెంచరీతో రాణించాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(8)తో సహా అభిషేక్ శర్మ(0), ప్రభ్సిమ్రాన్ సింగ్(1) వంటి స్టార్ ప్లేయర్లు విఫలమయ్యారు.ఆసీస్ బౌలర్లలో జాక్ ఎడ్వర్డ్స్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. సదర్లాండ్, సంఘా తలా రెండు వికెట్లు సాధించారు. 247 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారులు దూకుడుగా ఆడుతున్నారు. 5.5 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 48 పరుగులు చేసింది. అయితే వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది.చదవండి: IND vs WI 1st Test: ముగ్గురు సెంచరీలు.. భారీ ఆధిక్యంలో భారత్.. -
ముగ్గురు సెంచరీలు.. భారీ ఆధిక్యంలో భారత్..
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తమ జోరును కొనసాగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 448 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దీంతో గిల్ సేన తమ మొదటి ఇన్నింగ్స్లో 286 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్(100), ధ్రువ్ జురెల్(125), రవీంద్ర జడేజా(104 నాటౌట్) సెంచరీలతో చెలరేగారు. 121/2 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు రాహుల్, గిల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. గిల్ సరిగ్గా హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత రాహుల్.. ధ్రువ్ జురెల్తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు.రాహుల్ తన సెంచరీ పూర్తి చేసిన వెంటనే పెవిలియన్కు చేరాడు. ఈ సమయంలో ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజాలు విండీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. వీరిద్దరూ క్రీజులోకి పాతుకుపోయి స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. రిషబ్ పంత్ స్దానంలో జట్టులోకి వచ్చిన తన లభించిన అవకాశాన్ని సద్వినియోపరుచుకున్నాడు. 190 బంతుల్లో తన తొలి టెస్టు సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 210 బంతులు ఎదుర్కొన్న జురెల్.. 15 ఫోర్లు, 3 సిక్స్లతో 125 పరుగులు చేశాడు. అయిదో వికెట్కు జడేజాతో కలిసి 206 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. జురెల్ ఔటయ్యాక జడేజా సైతం తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో జడేజా పాటు వాషింగ్టన్ సుందర్(9) ఉన్నారు. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ రెండు, సీల్స్, వారికన్, ఖరీ పియర్ తలా వికెట్ సాధించారు.చదవండి: IND vs AUS: ఆసీస్పై అభిషేక్ శర్మ ఫెయిల్.. తొలి బంతికే ఔట్ -
నిప్పులు చెరిగిన ఇంగ్లండ్ బౌలర్లు.. 69 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా గౌహతి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ బౌలర్లు నిప్పులు చెరిగారు. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా 20.4 ఓవర్లలో కేవలం 69 పరుగులకే కుప్పకూలింది.దక్షిణాఫ్రికా బ్యాటర్లలో సినాలో జాఫ్తా(22) టాప్ స్కోరర్గా నిలవగా.. మిగితా పది మంది సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభం నుంచే వికెట్ల పతనం మొదలైంది. లిన్సే స్మిత్ మూడు వికెట్లతో సౌతాఫ్రికాను దెబ్బతీయగా.. స్కివర్ బ్రంట్, ఎకిలిస్టోన్, డీన్ తలా రెండు వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు.ఈ మ్యాచ్లో దారుణ ప్రదర్శన కనబరిచిన సౌతాఫ్రికా ఓ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. మహిళల వన్డే ప్రపంచకప్లో అత్యల్ప టోటల్ను నమోదు చేసిన రెండో జట్టుగా సౌతాఫ్రికా నిలిచింది. ఈ జాబితాలో న్యూజిలాండ్ అగ్రస్ధానంలో ఉంది. న్యూజిలాండ్ 2009 ప్రపంచకప్లో 51 పరుగులకే ఆలౌటైంది.ఇంగ్లండ్టామీ బ్యూమాంట్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), హీథర్ నైట్, నాట్ స్కైవర్-బ్రంట్ (కెప్టెన్), సోఫియా డంక్లీ, ఎమ్మా లాంబ్, ఆలిస్ కాప్సే, షార్లెట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్, లిన్సే స్మిత్, లారెన్ బెల్సౌతాఫ్రికాలారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, సునే లూస్, మారిజానే కాప్, అన్నేకే బాష్, సినాలో జాఫ్తా (వికెట్ కీపర్), క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, మసాబాటా క్లాస్, అయాబొంగా ఖాకా, నాంకులులేకో మ్లాబా -
నో రిషబ్ పంత్.. నో ప్రోబ్లమ్.. డీజే ఉన్నాడుగా
భారత టెస్టు జట్టులో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ లేని లోటును ధ్రువ్ జురెల్ తీర్చాడు. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో జురెల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. పంత్ గాయపడంతో తన దక్కిన అవకాశాన్ని జురెల్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు.ఐదో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన 24 ఏళ్ల ఈ యువ ఆటగాడు తన సూపర్ బ్యాటింగ్తో జట్టును భారీ స్కోర్ దిశగా నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో ధ్రువ్ జురెల్ 190 బంతుల్లో తన తొలి టెస్టు సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 210 బంతులు ఎదుర్కొన్న జురెల్.. 15 ఫోర్లు, 3 సిక్స్లతో 125 పరుగులు చేశాడు. జురెల్ స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి ఐదో వికెట్కు 206 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడునో రిషబ్ పంత్.. నో ప్రోబ్లమ్ధ్రువ్ జురెల్ గతేడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్పై భారత తరపున టెస్టు అరంగేట్రం చేశాడు. తన డెబ్యూ సిరీస్లో జురెల్ తన ప్రదర్శనలతో అందరిని ఆకట్టుకున్నాడు. కానీ రిషబ్ పంత్ రెగ్యూలర్ వికెట్ కీపర్గా ఉండడంతో జురెల్ ఇప్పటివరకు టీమిండియా తరపున కేవలం 6 టెస్టు మ్యాచ్లు మాత్రమే ఆడాడు.బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టూర్లకు జురెల్ జట్టుకు ఎంపికైనప్పటికి ప్లేయింగ్ ఎలెవన్లో మాత్రం చోటు దక్కలేదు. ఈ ఏడాది జూన్లో ఇంగ్లండ్ పర్యటనకు కూడా భారత జట్టుతో పాటు జురెల్ వెళ్లాడు. నాలుగో టెస్టులో రిషబ్ పంత్ కాలికి గాయం కావడంతో సబ్స్ట్యూట్ వికెట్ కీపర్గా ధ్రువ్ బాధ్యతలు చేపట్టాడు. రెండు ఇన్నింగ్స్లలోనూ వికెట్ల వెనక తన సేవలను అందించాడు. ఆ తర్వాత ఐదో టెస్టుకు పంత్ దూరం కావడంతో జురెల్ తుది జట్టులోకి వచ్చాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేసిన జురెల్.. రెండో ఇన్నింగ్స్లో 34 పరుగులతో కీలక నాక్ ఆడాడు. ఇప్పుడు విండీస్తో సిరీస్తో మొత్తానికి పంత్ దూరం కావడంతో జురెల్ రెగ్యూలర్ వికెట్ కీపర్గా కొనసాగుతున్నాడు. విండీస్తో తొలి టెస్టులో జురెల్ వికెట్ల వెనక కూడా అద్బుతమైన క్యాచ్లను అందుకున్నాడు. అంతేకాకుండా తన వికెట్ కీపింగ్ స్కిల్స్తో దాదాపు ఇరవైకి పైగా ఎక్స్ట్రా రన్స్ను సేవ్ చేశాడు. పంత్ జట్టుకు అందుబాటులో లేక పోయినా ధ్రువ్ జురెల్ రూపంలో భారత్కు అద్బుతమైన వికెట్కీపర్ ఉన్నాడనే చెప్పుకోవాలి. తొలి ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 448 పరుగుల భారీ స్కోర్ సాధించింది. గిల్ సేన ప్రస్తుతం 286 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. భారత బ్యాటర్లలో జురెల్తో పాటు కేఎల్ రాహుల్(100), రవీంద్ర జడేజా(104 నాటౌట్) సెంచరీలతో మెరిశారు.చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన జడేజా.. దెబ్బకు కపిల్ దేవ్, ధోని రికార్డులు బ్రేక్ -
చరిత్ర సృష్టించిన జడేజా.. దెబ్బకు కపిల్ దేవ్, ధోని రికార్డులు బ్రేక్
టీమిండియా వెటరన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్లో తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో జడేజా హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన జడ్డూ.. ధ్రువ్ జురెల్తో కలిసి స్కోర్ను బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు.59 పరుగులతో జడేజా తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. జడేజాకు ఇది టెస్టుల్లో 28 హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. అదేవిధంగా జడేజా చివరి తొమ్మిది ఇన్నింగ్స్లలో ఇది ఏడో ఫిప్టీ కావడం విశేషం. అంతకుముందు ఇంగ్లండ్ పర్యటనలో కూడా జడేజా దుమ్ములేపాడు. మాంచెస్టర్లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో జడ్డూ సెంచరీ కూడా సాధించాడు.2025 ఏడాదిలో టెస్టుల్లో జడేజా సగటు 75పైగా ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు 605 పరుగులు చేశాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ హిస్టరీలో జడేజా 45 మ్యాచ్లు ఆడి 43 సగటుతో 2451 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 18 అర్ధ సెంచరీలు ఉన్నాయి.కపిల్ దేవ్ రికార్డు బ్రేక్..ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీతో సత్తాచాటిన జడేజా పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో ఐదు లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన నాలుగో భారత ఆటగాడిగా జడేజా రికార్డు సృష్టించాడు. జడేజా ఇప్పటివరకు 28 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్(27) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్తో కపిల్ దేవ్ ఆల్టైమ్ రికార్డును ఈ సౌరాష్ట్ర క్రికెటర్ బ్రేక్ చేశాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో వీవియస్ లక్ష్మణ్(40) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్ధానాల్లో ధోని(32), సౌరవ్ గంగూలీ(29) కొనసాగుతున్నాడు.అదేవిధంగా టెస్టుల్లో అత్యధిక సిక్సర్ల బాదిన భారత ఆటగాళ్ల జాబితాలో ఎంఎస్ ధోనిని జడేజా అధిగమించాడు. ధోని తన కెరీర్లో 78 టెస్టు సిక్సర్లు బాదగా.. జడేజా 79 కొట్టాడు. ఈ అరుదైన రికార్డు సాధించిన జాబితాలో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తొలి స్ధానంలో ఉన్నారు. సెహ్వాగ్ తన కెరీర్లో 91 సిక్సర్లు బాదగా.. పంత్ కూడా సరిగ్గా 90 సిక్సర్లు కొట్టాడు.టెస్టుల్లో భారత్ తరుపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు వీరే..రిషబ్ పంత్ – 47 మ్యాచ్ల్లో 90 సిక్సర్లువీరేంద్ర సెహ్వాగ్ – 103 మ్యాచ్ల్లో 90 సిక్సర్లురోహిత్ శర్మ – 67 మ్యాచ్ల్లో 88 సిక్సర్లురవీంద్ర జడేజా – 86 మ్యాచ్ల్లో 79 సిక్సర్లుఎంఎస్ ధోని – 90 మ్యాచ్ల్లో 78 సిక్సర్లుచదవండి: IND vs AUS: ఆసీస్పై అభిషేక్ శర్మ ఫెయిల్.. తొలి బంతికే ఔట్ -
47 ఏళ్ల కిందటి రికార్డును రిపీట్ చేసిన శుభ్మన్ గిల్
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో (India vs West Indies) భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) ఓ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ కెప్టెన్గా స్వదేశంలో తొలి ఇన్నింగ్స్లోనే హాఫ్ సెంచరీ బాది, 47 ఏళ్ల క్రితం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) నెలకొల్పిన రికార్డును పునరావృతం చేశాడు.1978లో గవాస్కర్ భారత కెప్టెన్గా స్వదేశంలో తన తొలి ఇన్నింగ్స్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ముంబై వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా డబుల్ సెంచరీనే (205) బాదాడు. తిరిగి 47 ఏళ్ల తర్వాత శుభ్మన్ గిల్ స్వదేశంలో భారత కెప్టెన్గా తన తొలి ఇన్నింగ్స్లోనే హాఫ్ సెంచరీ మార్కు తాకాడు.ఈ మ్యాచ్లో గిల్ సరిగ్గా 50 పరుగులు (100 బంతుల్లో 5 ఫోర్లు) చేసి రోస్టన్ ఛేజ్ బౌలింగ్లో జస్టిన్ గ్రీవ్స్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.మ్యాచ్ విషయానికొస్తే.. విండీస్ను 162 పరుగులకే ఆలౌట్ చేసి తొలి ఇన్నింగ్స్ కొనసాగిస్తున్న భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. రెండో రోజు మూడో సెషన్ సమయానికి జట్టు స్కోర్ 4 వికెట్ల నష్టానికి 338 పరుగులుగా ఉంది. ప్రస్తుతం 176 టీమిండియా 176 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ధృవ్ జురెల్ (75), రవీంద్ర జడేజా (56) అర్ద సెంచరీలు పూర్తి చేసుకొని ఇన్నింగ్స్లు కొనసాగిస్తున్నారు.అంతకుముందు కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో సత్తా చాటాడు. 190 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 100 పరుగులు చేసి ఔటయ్యాడు. వార్రికన్ బౌలింగ్లో గ్రీవ్స్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. దీనికి ముందే శుభ్మన్ గిల్ సరిగ్గా 50 పరుగుల వద్ద ఔటయ్యాడు. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 36, సాయి సుదర్శన్ 7 పరుగులు చేశారు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 162 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్ (14-3-40-4), బుమ్రా (14-3-42-3), కుల్దీప్ (6.1-0-25-2), వాషింగ్టన్ సుందర్ (3-0-9-1) ధాటికి విండీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.విండీస్ ఇన్నింగ్స్లో ఏడో నంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధికం. ఈ ఇన్నింగ్స్లో భారత వికెట్కీపర్ ధృవ్ జురెల్ 4 క్యాచ్లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. -
ఆసీస్పై అభిషేక్ శర్మ ఫెయిల్.. తొలి బంతికే ఔట్
కాన్పూర్ వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న రెండో వన్డేలో ఇండియా-ఎ తరపున ఆడుతున్న స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్ర నిరాశరిచాడు. తొలి వన్డేలో సెంచరీ చేసిన ప్రియాన్ష్ ఆర్య స్ధానంలో ఈ మ్యాచ్ ప్లేయింగ్ ఎలెవన్లోకి వచ్చిన అభిషేక్ తన మార్క్ను చూపించలేకపోయాడు. అభిషేక్ తను ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్కు చేరాడు. భారత ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన జాక్ ఎడ్వర్డ్ తొలి బంతిని అభిషేక్కు వైడ్-ఆఫ్ డెలివరీగా సంధించాడు.ఆ బంతిని ఈ పంజాబ్ ఆటగాడు కవర్స్పై నుంచి షాట్ ఆడాలని చూశాడు. కానీ బంతి మాత్రం అవుట్సైడ్-ఎడ్జ్ తీసుకుని మొదటి స్లిప్లో ఉన్న సదర్లాండ్ చేతికి వెళ్లింది. దీంతో అభిషేక్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. టీ20ల్లో దుమ్ములేపుతున్న అభిషేక్కు వన్డేల్లో కూడా అవకాశమివ్వాలని చాలా మంది మాజీ క్రికెటర్లు బీసీసీఐ సెలక్షన్ కమిటీని సూచించారు. దీంతో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు సెలక్టర్ల దృష్టిలో అభిషేక్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి.కానీ ఈ మ్యాచ్లో గోల్డెన్ డక్గా వెనుదిరగడంతో సెలక్టర్లు పునరాలోచనలో పడే అవకాశముంది. అయితే మూడో వన్డేలో అభిషేక్ తన బ్యాట్ను ఝూళిపిస్తే సెలక్షన్ రేసులో ఉండే ఛాన్స్ ఉంది. కాగా ఆసియాకప్-2025లో అభిషేక్ దుమ్ములేపాడు. 7 మ్యాచ్లలో 314 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు.తడబడుతున్న భారత్..ఇక రెండో అనాధికారిక వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్ తడబడుతోంది. 60 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత ఇన్నింగ్స్ను రియాన్ పరాగ్, తిలక్ వర్మ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. గత మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ రెండో వన్డేలో నిరాశపరిచాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి అయ్యర్ ఔటయ్యాడు. ప్రభ్సిమ్రాన్ సింగ్ సైతం(1) సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యాడు. -
రాహుల్ సెంచరీ.. గిల్, డీజే హాఫ్ సెంచరీలు.. భారీ స్కోర్ దిశగా టీమిండియా
అహ్మదాబాద్ టెస్ట్లో (India vs West Indies) టీమిండియా (Team India) భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. రెండో రోజు రెండో సెషన్ సమయానికి 124 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 286 పరుగులుగా ఉంది. ధృవ్ జురెల్ (Dhruv Jurel) అర్ద సెంచరీ పూర్తి చేసుకోగా.. రవీంద్ర జడేజా 30 పరుగులతో ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు.డీజే హాఫ్ సెంచరీరిషబ్ పంత్ స్థానంలో జట్టులోకి వచ్చిన ధృవ్ జురెల్ తనకు లభించిన అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో ఐదో స్థానంలో బరిలోకి దిగి అర్ద సెంచరీ పూర్తి చేశాడు. 91 బంతుల్లో డీజే ఈ మార్కును తాకాడు. గ్రీవ్స్ బౌలింగ్లో బౌండరీ బాది హాఫ్ సెంచరీ మార్కును తాకాడు.రాహుల్ సూపర్ సెంచరీఓపెనర్ కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో సత్తా చాటాడు. 190 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 100 పరుగులు చేశాడు. సెంచరీ పూర్తైన వెంటనే రాహుల్ ఔటయ్యాడు. వార్రికన్ బౌలింగ్లో గ్రీవ్స్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. టెస్ట్ల్లో రాహుల్కు ఇది 11వ శతకం. సొంతగడ్డపై మాత్రం రెండోదే. రాహుల్ స్వదేశంలో తన చివరి శతకాన్ని 2016లొ చెన్నైలో ఇంగ్లండ్పై చేశాడు.గిల్ హాఫ్ సెంచరీశుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ (100 బంతుల్లో 5 ఫోర్లు) పూర్తి చేసిన వెంటనే ఔటయ్యాడు. రోస్టన్ ఛేజ్ బౌలింగ్లో జస్టిన్ గ్రీవ్స్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 36, సాయి సుదర్శన్ 7 పరుగులు చేశారు. జైస్వాల్ వికెట్ సీల్స్కు, సాయి సుదర్శన్ వికెట్ ఛేజ్కు దక్కాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 162 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్ (14-3-40-4), బుమ్రా (14-3-42-3), కుల్దీప్ (6.1-0-25-2), వాషింగ్టన్ సుందర్ (3-0-9-1) ధాటికి విండీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.విండీస్ ఇన్నింగ్స్లో ఏడో నంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధికం. ఈ ఇన్నింగ్స్లో భారత వికెట్కీపర్ ధృవ్ జురెల్ 4 క్యాచ్లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.చదవండి: నిప్పులు చెరిగిన పంజాబ్ కింగ్స్ బౌలర్ -
నిప్పులు చెరిగిన పంజాబ్ కింగ్స్ బౌలర్
ఇరానీ కప్ 2025లో (Irani Cup 2025) రంజీ ఛాంపియన్ విదర్భ జట్టు (Vidarbha) బౌలర్ యశ్ ఠాకూర్ (Yash Thakur) (ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్కు ఆడతాడు) చెలరేగిపోయాడు. 16.5 ఓవర్లలో 66 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. యశ్ ధాటికి రెస్ట్ ఆఫ్ ఇండియా (Rest Of India) 214 పరుగులకే ఆలౌటైంది.ఆట మూడో రోజైన ఇవాళ (అక్టోబర్ 3) రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్నైట్ స్కోర్కు (124/5) మరో 90 పరుగులు మాత్రమే జోడించి మిగతా 5 వికెట్లు కోల్పోయింది. ఓవర్నైట్ బ్యాటర్, రెస్ట్ ఆఫ్ ఇండియా కెప్టెన్ రజత్ పాటిదార్ (66) పోరాడినంత సేపు పోరాడి తొమ్మిదో వికెట్గా వెనుదిరిగాడు. ఇవాల్టి ఆటలోనే యశ్ ఠాకూర్ 3 వికెట్లు తీశాడు. ఆట ప్రారంభం నుంచే యశ్ నిప్పులు చెరిగాడు. ఇవాళ హర్ష్ దూబే, ఆదిత్య ఠాకరే తలో వికెట్ తీశారు.మొత్తంగా యశ్ ఠాకూర్ 4, హర్ష్ దూబే, పార్థ్ రేఖడే చెరో 2, ఆదిత్య ఠాకరే, దర్శన్ నల్కండే తలో వికెట్ తీశారు. రెస్ట్ ఆఫ్ ఇండియా ఇన్నింగ్స్లో పాటిదార్తో పాటు ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (52) మాత్రమే రాణించాడు. ఈ జట్టులో ఉన్న టీమిండియా ప్లేయర్లు రుతురాజ్ గైక్వాడ్ (9), ఇషాన్ కిషన్ (1) దారుణంగా విఫలమయ్యారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ 342 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అథర్వ తైడే (143) సెంచరీతో కదంతొక్కగా.. యశ్ రాథోడ్ (91) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. వీరిద్దరు మినహా విదర్భ జట్టులో ఒక్కరు కూడా రాణించలేదు.అమన్ మొఖడే 19, ధృవ్ షోరే 18, దనిశ్ మాలేవార్ డకౌట్, కెప్టెన్ అక్షయ్ వాద్కర్ 5, యశ్ ఠాకూర్ 11, హర్ష్ దూబే డకౌట్, దర్శన్ నల్కండే 20, ఆదిత్య ఠాకరే 2 పరుగులకు ఔటయ్యారు.రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో మానవ్ సుతార్, ఆకాశ్దీప్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. సరాన్ష్ జైన్ 2, అన్షుల్ కంబోజ్, గుర్నూర్ బ్రార్ తలో వికెట్ తీశారు. కాగా, ఇరానీ ట్రోఫీ అనేది రంజీ ఛాంపియన్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య జరుగుతుంది.చదవండి: కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీ -
కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీ
వెస్టిండీస్తో జరుగుతున్న అహ్మదాబాద్ టెస్ట్లో (India vs West Indies) టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) సూపర్ సెంచరీ సాధించాడు. 190 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో మూడంకెల స్కోర్ను చేరుకున్నాడు. రాహుల్కు టెస్ట్ల్లో ఇది 11వ శతకం. సొంతగడ్డపై మాత్రం ఇది రెండోదే. రాహుల్ స్వదేశంలో తన చివరి శతకాన్ని 2016లొ చెన్నైలో ఇంగ్లండ్పై చేశాడు.CUTE CELEBRATION BY KL RAHUL 2.0 🥺 pic.twitter.com/TZ8hknrli8— Johns. (@CricCrazyJohns) October 3, 202566 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 214/3గా ఉంది. రాహుల్కు జతగా ధృవ్ జురెల్ (10) క్రీజ్లో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ 52 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇవాళ (అక్టోబర్ 2, రెండో రోజు) రాహుల్తో పాటు ఇన్నింగ్స్ ప్రారంభించిన శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వెంటనే ఔటయ్యాడు. రోస్టన్ ఛేజ్ బౌలింగ్లో జస్టిన్ గ్రీవ్స్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 36, సాయి సుదర్శన్ 7 పరుగులు చేసి ఔటయ్యాడు. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ 2, జేడన్ సీల్స్ ఓ వికెట్ తీశారు.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 162 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్ (14-3-40-4), బుమ్రా (14-3-42-3), కుల్దీప్ (6.1-0-25-2), వాషింగ్టన్ సుందర్ (3-0-9-1) ధాటికి విండీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.విండీస్ ఇన్నింగ్స్లో ఏడో నంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధికం. గ్రీవ్స్ కాకుండా అలిక్ అథనాజ్ (12), బ్రాండన్ కింగ్ (13), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (24), షాయ్ హోప్ (26), ఖారీ పియెర్ (11) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు.మిగతా వారిలో జాన్ క్యాంప్బెల్ 8, తేజ్నరైన్ చంద్రపాల్ డకౌట్, జోమెల్ వార్రికన్ 8, జోహన్ లేన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు. ఈ ఇన్నింగ్స్లో భారత వికెట్కీపర్ ధృవ్ జురెల్ 4 క్యాచ్లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.చదవండి: BAN Vs AFG: రషీద్ ఖాన్ తిప్పేసినా ఆఫ్ఘనిస్తాన్కు తప్పని ఓటమి -
గిల్ హాఫ్ సెంచరీ.. సెంచరీ దిశగా రాహుల్.. ఆధిక్యంలో టీమిండియా
గిల్ ఔట్శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వెంటనే ఔటయ్యాడు. రోస్టన్ ఛేజ్ బౌలింగ్లో జస్టిన్ గ్రీవ్స్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. 59 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 192/3గా ఉంది. ప్రస్తుతం భారత్ 30 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. రాహుల్ 86, జురెల్ 2 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్లో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో రోజు తొలి సెషన్లోనే ఇది సాధించింది. 56 ఓవర్ల తర్వాత భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 188/2గా ఉంది. ప్రస్తుతం టీమిండియా 26 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.శుభ్మన్ గిల్ (50) అర్ద సెంచరీ పూర్తి చేసుకోగా.. రాహుల్ (84) సెంచరీ దిశగా సాగుతున్నాడు. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 36, సాయి సుదర్శన్ 7 పరుగులు చేసి ఔటయ్యాడు. విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్, రోస్టన్ ఛేజ్ తలో వికెట్ తీశారు.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 162 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్ (14-3-40-4), బుమ్రా (14-3-42-3), కుల్దీప్ (6.1-0-25-2), వాషింగ్టన్ సుందర్ (3-0-9-1) ధాటికి విండీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.విండీస్ ఇన్నింగ్స్లో ఏడో నంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధికం. గ్రీవ్స్ కాకుండా అలిక్ అథనాజ్ (12), బ్రాండన్ కింగ్ (13), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (24), షాయ్ హోప్ (26), ఖారీ పియెర్ (11) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు.మిగతా వారిలో జాన్ క్యాంప్బెల్ 8, తేజ్నరైన్ చంద్రపాల్ డకౌట్, జోమెల్ వార్రికన్ 8, జోహన్ లేన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు. ఈ ఇన్నింగ్స్లో భారత వికెట్కీపర్ ధృవ్ జురెల్ 4 క్యాచ్లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: World Cup 2025: పాకిస్తాన్కు షాకిచ్చిన బంగ్లాదేశ్ -
ప్రపంచకప్కు అర్హత సాధించిన జింబాబ్వే
భారత్, శ్రీలంక వేదికలుగా జరుగబోయే 2026 టీ20 ప్రపంచకప్కు (T20 World Cup 2026) జింబాబ్వే (Zimbabwe) అర్హత సాధించింది. ఆఫ్రికా రీజియనల్ క్వాలిఫయర్స్ 2025లో ఫైనల్కు చేరడం ద్వారా ప్రపంచకప్ బెర్త్ దక్కించుకుంది. జింబాబ్వేతో పాటు నమీబియా (Namibia) కూడా ఆఫ్రికా రీజియనల్ క్వాలిఫయర్స్లో ఫైనల్కు చేరి ప్రపంచకప్ బెర్త్ దక్కించుకుంది. ఉగాండ చేతిలో ఓటమి కారణంగా జింబాబ్వే గత ప్రపంచకప్కు అర్హత సాధించలేకపోయింది.Here are the qualified teams for the T20 World Cup 2026 so far.🏏Namibia booked their spot in the 2026 T20 World Cup with a semi-final win in Harare, while Zimbabwe joined them after defeating Kenya.#T20WorldCup2026 pic.twitter.com/lOnoV1S9JD— CricTracker (@Cricketracker) October 2, 2025జింబాబ్వే, నమీబియా బెర్త్లు ఖరారు చేసుకోవడంతో ప్రపంచకప్కు అర్హత సాధించిన జట్ల సంఖ్య 17కి చేరింది. ఇంకా మూడు జట్లు అర్హత సాధించాల్సి ఉంది. ఆ మూడు జట్లు ఆసియా క్వాలిఫయర్స్ ద్వారా ఖరారవుతాయి.ఇప్పటిదాకా భారత్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ స్టేట్స్, వెస్టిండీస్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, నమీబియా, జింబాబ్వే ప్రపంచకప్కు అర్హత సాధించాయి.ఆఫ్రికా క్వాలిఫయర్స్లో నిన్న (అక్టోబర్ 2) జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్ల్లో నమీబియా టాంజానియాపై, జింబాబ్వే కెన్యాపై విజయాలు సాధించి ఫైనల్స్కు చేరాయి. రేపు జరుగబోయే ఫైనల్లో కెన్యా, నమీబియా ఆఫ్రికా క్వాలిఫయర్ ఛాంపియన్షిప్ కోసం పోటీపడతాయి. చదవండి: రషీద్ ఖాన్ తిప్పేసినా ఆఫ్ఘనిస్తాన్కు తప్పని ఓటమి -
రషీద్ ఖాన్ తిప్పేసినా ఆఫ్ఘనిస్తాన్కు తప్పని ఓటమి
ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ (Afghanistan vs Bangladesh) జట్లు షార్జా, అబుదాబీ వేదికలుగా మూడు మ్యాచ్ల టీ20, వన్డేల్లో సిరీస్ల్లో తలపడుతున్నాయి. ఇందులో భాగంగా షార్జా వేదికగా నిన్న (అక్టోబర్ 2) తొలి టీ20 జరిగింది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై బంగ్లాదేశ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో రహ్మానుల్లా గుర్బాజ్ (40), మొహమ్మద్ నబీ (38) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. బంగ్లా బౌలర్లలో తంజిమ్, రిషద్ చరో 2 వికెట్లు తీయగా.. తస్కిన్, నసుమ్, ముస్తాఫిజుర్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 152 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్కు శుభారంభం లభించినా, ఆతర్వాత రషీద్ ఖాన్ (Rashid Khan) (4-0-18-4) తన స్పిన్ మాయాజాలంతో వారిని వణికించాడు. ఓపెనర్లు తంజిద్ (51), పర్వేజ్ ఎమోన్ (54) అర్ద సెంచరీలతో రాణించి తొలి వికెట్కు 109 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసినప్పటికీ.. ఆతర్వాత రషీద్ ధాటికి 8 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయింది. ఎట్టకేలకు నురుల్ హసన్ (23 నాటౌట్), రిషద్ హొసేన్ (14 నాటౌట్) బంగ్లాదేశ్ను విజయతీరాలకు చేర్చారు. మరో 8 బంతులు మిగిలుండగా ఆ జట్టు లక్ష్యాన్ని చేరుకుంది (6 వికెట్లు కోల్పోయి). ఈ సిరీస్లో రెండో టీ20 ఇవాళే (అక్టోబర్ 3) జరుగనుంది. చదవండి: World Cup 2025: పాకిస్తాన్కు షాకిచ్చిన బంగ్లాదేశ్ -
World Cup 2025: పాకిస్తాన్కు షాకిచ్చిన బంగ్లాదేశ్
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's World Cup 2025) సంచలనం నమోదైంది. పాకిస్తాన్ను (Pakistan) వారికంటే బలహీనమైన బంగ్లాదేశ్ (Bangladesh) చిత్తుగా ఓడించింది. కొలొంబో వేదికగా నిన్న (అక్టోబర్ 2) జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. బంగ్లా బౌలర్ల ధాటికి 389.3 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌటైంది.షోర్నా అక్తర్ 3, మరుఫా అక్తర్, నహిద అక్తర్ చరో 2, నిషిత అక్తర్, ఫహీమా ఖాతూన్, రబేయా ఖాన్ తలో వికెట్ తీసి పాక్ను స్వల్ప స్కోర్కే పరిమితం చేశారు.పాక్ ఇన్నింగ్స్లో 23 పరుగులు చేసిన రమీన్ షమీమ్ టాప్ స్కోరర్ కాగా.. కెప్టెన్ ఫాతిమా సనా (22), మునీబా అలీ (17), అలియా రియాజ్ (13), సిద్రా నవాజ్ (15), డయానా బేగ్ (16 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఒమైమా సోహైల్, సిద్రా అమీన్ డకౌట్లయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. 31.1 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. రుబ్యా హైదర్ (54) అజేయ అర్ద సెంచరీతో బంగ్లాదేశ్ను గెలిపించింది. కెప్టెన్ నిగార్ సుల్తానా (23), శోభన మోస్తరి (24 నాటౌట్) రుబ్యాకు సహకరించారు. పాక్ బౌలర్లలో ఫాతిమా సనా, డయానా బేగ్, రమీన్ షమీమ్కు తలో వికెట్ దక్కింది. కాగా, ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ అక్టోబర్ 5న కొలొంబో వేదికగా జరుగనుంది.చదవండి: IND VS WI 1st Test: ఆల్టైమ్ రికార్డును సమం చేసిన బుమ్రా -
ప్రపంచకప్లో స్వర్ణ పతకం గెలిచిన ఆంధ్రప్రదేశ్ షూటర్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) జూనియర్ ప్రపంచకప్ టోర్నీని భారత్ ‘టాప్’ ర్యాంక్తో ముగించింది. చివరిరోజు బుధవారం భారత్కు మూడు పతకాలు లభించాయి. జూనియర్ పురుషుల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ షూటర్ ముకేశ్ నేలవల్లి స్వర్ణ పతకాన్ని సాధించాడు. గుంటూరు జిల్లాకు చెందిన ముకేశ్ 585 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. భారత్కే చెందిన సాహిల్ 573 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. ఈ టోరీ్నలో ముకేశ్కిది రెండో పతకం. అంతకుముందు ముకేశ్ 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో రజతం గెలిచాడు. జూనియర్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో భారత షూటర్ తేజస్విని 30 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించింది. ఓవరాల్గా భారత్ 8 స్వర్ణాలు, 10 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి మొత్తం 26 పతకాలతో ‘టాప్’ ర్యాంక్లో నిలిచింది. -
బంగ్లాదేశ్ బౌలర్ల విజృంభణ.. 129 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (ICC Women's World Cup 2025) ఇవాళ (అక్టోబర్ 2) పాకిస్తాన్ (Pakistan), బంగ్లాదేశ్ (Bangladesh) తలపడుతున్నాయి. కొలొంబో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసి స్వల్ప స్కోర్కే ఆలౌటైంది. బంగ్లాదేశ్ బౌలర్లు మూకుమ్మడిగా విజృంభించడంతో పాక్ 38.3 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. షోర్నా అక్తర్ 3, మరుఫా అక్తర్, నహిద అక్తర్ చరో 2, నిషిత అక్తర్, ఫహీమా ఖాతూన్, రబేయా ఖాన్ తలో వికెట్ తీసి పాక్ను స్వల్ప స్కోర్కే పరిమితం చేశారు. పాక్ ఇన్నింగ్స్లో 23 పరుగులు చేసిన రమీన్ షమీమ్ టాప్ స్కోరర్ కాగా.. కెప్టెన్ ఫాతిమా సనా (22), మునీబా అలీ (17), అలియా రియాజ్ (13), సిద్రా నవాజ్ (15), డయానా బేగ్ (16 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఒమైమా సోహైల్, సిద్రా అమీన్ డకౌట్లయ్యారు. కాగా, ప్రస్తుత ప్రపంచ కప్ సెప్టెంబర్ 30న ప్రారంభమైంది. ఈ మెగా టోర్నీ భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతుంది. టోర్నీ ఓపెనర్లో ఆతిథ్య దేశాలు గౌహతిలో తలపడ్డాయి. ఇందులో భారత్ శ్రీలంకపై 59 పరుగుల తేడతో గెలుపొంది బోణీ కొట్టింది. నిన్న జరిగిన రెండో మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడ్డాయి. ఇండోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో రేపు (అక్టోబర్ 3) ఇంగ్లండ్, సౌతాఫ్రికా తలపడనున్నాయి. అక్టోబర్ 4న శ్రీలంక, ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంది. అక్టోబర్ 5న కొలొంబో వేదికగా భారత్, పాకిస్తాన్ తలపడతాయి. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ముగిసిన పురుషుల ఆసియా కప్లో భారత్ ఫైనల్లో పాకిస్తాన్ను చిత్తుగా ఓడించి ఛాంపియన్గా నిలిచింది. ఈ టోర్నీలో భారత్ పాక్పై మూడుసార్లు గెలుపొందింది. ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు హ్యాండ్షేక్ను నిరాకరించారు. టోర్నీ గెలిచిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న పీసీబీ ఛైర్మన్ చేతుల మీదుగా ట్రోఫీని అందుకునేందుకు నిరాకరించింది. దీంతో చిర్రెత్తిపోయని ఏసీసీ అధ్యక్షుడు నఖ్వీ ట్రోఫీ సహా భారత ఆటగాళ్లకు ఇవ్వాల్సిన మెడల్స్ను ఎత్తుకెళ్లిపోయారు. ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. చదవండి: చెలరేగిన బౌలర్లు.. రాణించిన కేఎల్ రాహుల్.. భారీ స్కోర్ దిశగా టీమిండియా -
చెలరేగిన బౌలర్లు.. రాణించిన కేఎల్ రాహుల్.. భారీ స్కోర్ దిశగా టీమిండియా
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో (West Indies) జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా (Team India) మంచి స్కోర్ దిశగా సాగుతుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (36; 7 ఫోర్లు), సాయి సుదర్శన్ (7) ఔట్ కాగా.. కేఎల్ రాహుల్ (Kl Rahul) (53), శుభ్మన్ గిల్ (18) క్రీజ్లో ఉన్నారు. విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్, రోస్టన్ ఛేజ్ తలో వికెట్ తీశారు. విండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 41 పరుగులు వెనుకపడి ఉంది.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 162 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్ (14-3-40-4), బుమ్రా (14-3-42-3), కుల్దీప్ (6.1-0-25-2), వాషింగ్టన్ సుందర్ (3-0-9-1) ధాటికి విండీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.విండీస్ ఇన్నింగ్స్లో ఏడో నంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధికం. గ్రీవ్స్ కాకుండా అలిక్ అథనాజ్ (12), బ్రాండన్ కింగ్ (13), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (24), షాయ్ హోప్ (26), ఖారీ పియెర్ (11) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారిలో జాన్ క్యాంప్బెల్ 8, తేజ్నరైన్ చంద్రపాల్ డకౌట్, జోమెల్ వార్రికన్ 8, జోహన్ లేన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు. ఈ ఇన్నింగ్స్లో భారత వికెట్కీపర్ ధృవ్ జురెల్ 4 క్యాచ్లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: రుతురాజ్, ఇషాన్ కిషన్ విఫలం.. పోరాడుతున్న రజత్ పాటిదార్ -
రుతురాజ్, ఇషాన్ కిషన్ విఫలం.. పోరాడుతున్న రజత్ పాటిదార్
ఇరానీ కప్ 2025లో (Irani Cup 2025) రెస్ట్ ఆఫ్ ఇండియా (Rest Of India) ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టు 124 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఎదురీదుతుంది. స్టార్ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్ (9), ఇషాన్ కిషన్ (1) చేతులెత్తేశారు. యువ సంచలనాలు యశ్ ధుల్ (11), ఆర్యన్ జుయల్ (23) కూడా నిరాశపరిచారు. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (52) మాత్రమే అర్ద సెంచరీతో రాణించాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ (42 నాటౌట్) పోరాడుతున్నాడు. అతనితో పాటు మానవ్ సుతార్ (1) క్రీజ్లో ఉన్నాడు. విదర్భ బౌలర్లలో పార్థ్ రేఖడే 2, హర్ష్ దూబే, దర్శన్ నల్కండే, యశ్ ఠాకూర్ తలో వికెట్ తీశారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెస్ట్ ఆఫ్ ఇండియా 53 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. విదర్భ (Vidarbha) తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఈ జట్టు ఇంకా 200 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు విదర్భ తొలి ఇన్నింగ్స్లో 342 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ అథర్వ తైడే (143) సెంచరీతో కదంతొక్కగా.. యశ్ రాథోడ్ (91) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. వీరిద్దరు మినహా విదర్భ జట్టులో ఒక్కరు కూడా రాణించలేదు. అమన్ మొఖడే 19, ధృవ్ షోరే 18, దనిశ్ మాలేవార్ డకౌట్, కెప్టెన్ అక్షయ్ వాద్కర్ 5, యశ్ ఠాకూర్ 11, హర్ష్ దూబే డకౌట్, దర్శన్ నల్కండే 20, ఆదిత్య ఠాకరే 2 పరుగులకు ఔటయ్యారు. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో మానవ్ సుతార్, ఆకాశ్దీప్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. సరాన్ష్ జైన్ 2, అన్షుల్ కంబోజ్, గుర్నూర్ బ్రార్ తలో వికెట్ తీశారు. కాగా, ఇరానీ ట్రోఫీ అనేది రంజీ ఛాంపియన్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య జరుగుతుంది.చదవండి: IND vs WI 1st Test: పర్వాలేదనిపించిన జైస్వాల్.. నిరాశపరిచిన సాయి -
IND vs WI 1st Test: పర్వాలేదనిపించిన జైస్వాల్.. నిరాశపరిచిన సాయి
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. 68 పరుగుల వద్ద జైస్వాల్ (Yashasvi Jaiswal) (36), 90 పరుగుల వద్ద సాయి సుదర్శన్ (Sai Sudarshan) (7) ఔటయ్యారు. జైస్వాల్ తన సహజ శైలిలో ధాటిగా ఆడి జేడన్ సీల్స్ బౌలింగ్లో షాయ్ హోప్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. జైస్వాల్ ఈ ఇన్నింగ్స్లో 7 ఫోర్లు బాదాడు. సాయి సుదర్శన్ విషయానికొస్తే.. మంచి ఫామ్లో ఉన్న ఇతను కేవలం 7 పరుగులే చేసి రోస్టన్ ఛేజ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 26 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 92/2గా ఉంది. కేఎల్ రాహుల్ (40), శుభ్మన్ గిల్ (2) క్రీజ్లో ఉన్నారు. విండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 70 పరుగులు వెనుకపడి ఉంది.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 162 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్ (14-3-40-4), బుమ్రా (14-3-42-3), కుల్దీప్ (6.1-0-25-2), వాషింగ్టన్ సుందర్ (3-0-9-1) ధాటికి విండీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.విండీస్ ఇన్నింగ్స్లో ఏడో నంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధికం. గ్రీవ్స్ కాకుండా అలిక్ అథనాజ్ (12), బ్రాండన్ కింగ్ (13), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (24), షాయ్ హోప్ (26), ఖారీ పియెర్ (11) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారిలో జాన్ క్యాంప్బెల్ 8, తేజ్నరైన్ చంద్రపాల్ డకౌట్, జోమెల్ వార్రికన్ 8, జోహన్ లేన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు. ఈ ఇన్నింగ్స్లో భారత వికెట్కీపర్ ధృవ్ జురెల్ 4 క్యాచ్లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: IND VS WI 1st Test: ఆల్టైమ్ రికార్డును సమం చేసిన బుమ్రా -
IND VS WI 1st Test: ఆల్టైమ్ రికార్డును సమం చేసిన బుమ్రా
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో ఇవాళ (అక్టోబర్ 2) మొదలైన తొలి టెస్ట్లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఓ ఆల్టైమ్ రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్లో 3 వికెట్లతో చెలరేగిన అతను.. స్వదేశంలో అత్యంత వేగంగా 50 టెస్ట్ వికెట్లు తీసిన భారత ఫాస్ట్ బౌలర్గా జవగల్ శ్రీనాథ్ (javagal Srinath) రికార్డును సమం చేశాడు. బుమ్రా, శ్రీనాథ్ తలో 24 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత సాధించారు. ఈ జాబితాలో కపిల్ దేవ్ (25), ఇషాంత్ శర్మ (27), మొహమ్మద్ షమీ (27) బుమ్రా, శ్రీనాథ్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. భారత బౌలర్లు చెలరేగడంతో 162 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్ (14-3-40-4), బుమ్రా (14-3-42-3), కుల్దీప్ (6.1-0-25-2), వాషింగ్టన్ సుందర్ (3-0-9-1) ధాటికి విండీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.విండీస్ ఇన్నింగ్స్లో ఏడో నంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధికం. గ్రీవ్స్ కాకుండా అలిక్ అథనాజ్ (12), బ్రాండన్ కింగ్ (13), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (24), షాయ్ హోప్ (26), ఖారీ పియెర్ (11) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారిలో జాన్ క్యాంప్బెల్ 8, తేజ్నరైన్ చంద్రపాల్ డకౌట్, జోమెల్ వార్రికన్ 8, జోహన్ లేన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు. ఈ ఇన్నింగ్స్లో భారత వికెట్కీపర్ ధృవ్ జురెల్ 4 క్యాచ్లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: IND vs WI: వారెవ్వా బుమ్రా.. మిస్సైల్లా దూసుకొచ్చిన బంతి! ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది -
చెలరేగిన భారత బౌలర్లు.. 162 పరుగులకే కుప్పకూలిన వెస్టిండీస్
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న (India vs West Indies) తొలి టెస్టులో టీమిండియా (Team India) బౌలర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా పేసర్లు సిరాజ్ (Siraj), బుమ్రా (Bumrah) నిప్పులు చెరిగారు. వీరి ధాటికి వెస్టిండీస్ (West Indies) తొలి ఇన్నింగ్స్లో 162 పరుగులకే కుప్పకూలింది.సిరాజ్ 14 ఓవర్లలో 40 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా.. బుమ్రా 14 ఓవర్లలో 42 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. స్పిన్నర్లు కుల్దీప్ 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్లో ఏడో నంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధికం. గ్రీవ్స్ కాకుండా అలిక్ అథనాజ్ (12), బ్రాండన్ కింగ్ (13), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (24), షాయ్ హోప్ (26), ఖారీ పియెర్ (11) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారిలో జాన్ క్యాంప్బెల్ 8, తేజ్నరైన్ చంద్రపాల్ డకౌట్, జోమెల్ వార్రికన్ 8, జోహన్ లేన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు. ఈ ఇన్నింగ్స్లో భారత వికెట్కీపర్ ధృవ్ జురెల్ 4 క్యాచ్లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
వారెవ్వా బుమ్రా.. మిస్సైల్లా దూసుకొచ్చిన బంతి! ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది
జస్ప్రీత్ బుమ్రా.. యార్కర్లకు పెట్టింది పేరు. ఇంటర్నేషనల్, డొమెస్టిక్, ఐపీఎల్ ఏ ప్లాట్ఫామ్ అయినా బుమ్రాను మించిన బౌలర్ మరొకరు లేరు. అతడు సంధించే బంతులు మిస్సైల్లా దూసుకొస్తాయి. బుమ్రా బౌలింగ్ చేస్తుంటే స్ట్రైక్లో ఉన్న బ్యాటర్ వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఇప్పుడు ఆ అనుభవం వెస్టిండీస్ బ్యాటర్ జస్టిన్ గ్రీవ్స్కు ఎదురైంది. అహ్మదాబాద్ వేదికగా విండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో బుమ్రా మ్యాజిక్ చేశాడు. విండీస్ తొలి ఇన్నింగ్స్ 39వ ఓవర్లో బుమ్రా వేసిన యార్కర్కు గ్రీవ్స్ వద్ద సమాధానమే లేకుండా పోయింది.ఆ ఓవర్లో ఆఖరిని బంతిని బుమ్రా అద్బుతమైన యార్కర్గా సంధించాడు. ఆఫ్ స్టంప్ దిశగా పడిన బంతిని బ్యాట్తో ఆపడంలో గ్రీవ్స్ విఫలమయ్యాడు. అతడు బ్యాట్ కిందకు దించడంలో ఆలస్యం కావడంతో 142.7 కి.మీ వేగంతో పడిన బంతిని ఆఫ్ స్టంప్ను గిరాటేసింది. దెబ్బకు కరేబియన్ బ్యాటర్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.తొలి ఇన్నింగ్స్లో బుమ్రా మొత్తంగా మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా తొలి ఇన్నింగ్స్లో వెస్టిండీస్ 162 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. సిరాజ్, బుమ్రాతో పాటు కుల్దీప్ రెండు, సుందర్ ఓ వికెట్ సాధించారు. విండీస్ బ్యాటర్లలో గ్రీవ్స్ (32) టాప్ స్కోరర్గా నిలిచాడు.Two fiery deliveries, two similar results 🔥🔥Jasprit Bumrah, you absolute beauty!#TeamIndia @IDFCfirstbank | @Jaspritbumrah93 pic.twitter.com/JNcPGJxK8I— BCCI (@BCCI) October 2, 2025 -
చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. తొలి ఇన్నింగ్స్ అతడి బౌలింగ్ ధాటికి విండీస్ టాపార్డర్ కుదేలు అయ్యింది. ఆరంభంలోనే ఓపెనర్ తేజ్నారయన్ చంద్రపాల్ను ఔట్ చేసిన సిరాజ్ మియా.. ఆ తర్వాత కింగ్, అథ్నాజ్, ఛేజ్ వంటి కీలక వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా ఇప్పటివరకు 11 ఓవర్లు బౌలింగ్ సిరాజ్ 34 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో బంతితో మ్యాజిక్ చేసిన సిరాజ్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ఏడాది డబ్ల్యూటీసీ జట్లలో అత్యధిక టెస్టు వికెట్లు వికెట్లు పడగొట్టిన బౌలర్గా సిరాజ్ చరిత్ర సృష్టించాడు.2025లో సిరాజ్ ఇప్పటివరకు 31 వికెట్లు తీశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉండేది. స్టార్క్ ఈ ఏడాదిలో 29 టెస్టు వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్లో అథ్నాజ్ను ఔట్ చేసిన సిరాజ్ మియా.. స్టార్క్ను అధిగమించాడు. అదేవిధంగా డబ్ల్యూటీసీ సైకిల్ 2025-27లో సిరాజ్(27) లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో అతడు 23 వికెట్లతో సత్తాచాటాడు.2025లో అత్యధిక టెస్ట్ వికెట్లు(డబ్ల్యూటీసీ జట్లలో)మహ్మద్ సిరాజ్-31మిచెల్ స్టార్క్- 29 షామర్ జోసెఫ్ -24నాథన్ లియాన్- 22జోష్ టంగ్ -21చదవండి: AB de Villiers: ఆసియాకప్ ట్రోఫీ వివాదం.. టీమిండియాపై డివిలియర్స్ విమర్శలు -
ఆసియాకప్ ట్రోఫీ వివాదం.. టీమిండియాపై డివిలియర్స్ విమర్శలు
ఆసియాకప్-2025 ఫైనల్ మ్యాచ్ అనంతరం హైడ్రామా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. విజేతగా నిలిచిన భారత జట్టు ట్రోఫీని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చీఫ్, పాకిస్తాన్ మంత్రి మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా తీసుకోవడానికి నిరకారించింది.టీమిండియా చర్యతో మొహ్సిన్ నఖ్వీకి ఘోర అవమానం ఎదురైంది. దీంతో నఖ్వీ ట్రోఫీని తనతో పాటు హోటల్కు తీసుకుని వెళ్లిపోయాడు. అతడి తీరుపై బీసీసీఐ తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. అయినా ఇప్పటికీ ఇంకా ట్రోఫీ భారత్ వద్దకు చేరలేదు. అతడు ఆసియాకప్ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకు అందజేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ బీసీసీఐ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అదేవిధంగా ఈ టోర్నీ అంతటా పాక్ ఆటగాళ్లతో భారత ప్లేయర్లు కరచాలనం కూడా చేయలేదు. ఈ టోర్నీలో భారత్-పాక్ జట్ల మధ్య చోటు చేసుకున్న పరిణామాలపై దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఎబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించిన భారత జట్టు వైఖరిని డివిలియర్స్ తప్పు బట్టాడు. క్రీడలకు రాజకీయాలను దూరంగా ఉంచాలని అతడు కోరాడు."ఆసియాకప్ ట్రోఫీని ఏసీసీ చైర్మెన్ చేతుల మీదగా తీసుకోవడానికి టీమిండియా సముఖత చూపలేదు. అందుకు కారణం మనందరికి తెలుసు. కానీ నావరకు అయితే అది క్రీడలకు సంబంధించినది కాదు. క్రీడల నుంచి రాజకీయాలను పక్కన పెట్టాలి.స్పోర్ట్స్ను మనం ప్రత్యేకంగా చూడాలి. పాలిటిక్స్తో ముడిపెట్టకూడదు. ఆసియాకప్లో చోటు చేసుకున్న పరిణామాలు నాకు చాలా బాధ కల్గించాయి. అయితే భవిష్యత్తులో ఈ సమస్యలను పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నాను. ఇటువంటి సంఘటనలు క్రీడాకారులను మానసికంగా దెబ్బతీస్తాయి. నాకు ఇటువంటివి అస్సలు నచ్చవు. చివరికి వివాదాలతోనే ఆసియాకప్ ముగిసింది" అని ఏబీడీ తన యూట్యూబ్ ఛానల్లలో పేర్కొన్నాడు.అదేవిధంగా ఛాంపియన్స్గా నిలిచిన భారత జట్టు ఈ సౌతాఫ్రికా లెజెండ్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా చాలా పట్టిష్టంగా కన్పిస్తోందని, టీ20 ప్రపంచకప్-2026కు సిద్దంగా ఉందని అతడు కొనియాడాడు.చదవండి: IND vs WI: టీమిండియాతో మ్యాచ్.. చందర్పాల్ తనయుడు అట్టర్ ప్లాప్ -
నిప్పులు చెరిగిన సిరాజ్.. లంచ్ బ్రేక్కు విండీస్ స్కోరంతంటే?
అహ్మదాబాద్ వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన విండీస్ తడబడుతోంది. తొలి రోజు లంచ్ సమయానికి కరేబియన్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు కోల్పోయి 90 పరుగులు మాత్రమే చేసింది.ఓపెనర్లు తేజ్నారయణ్ చందర్పాల్(0), జాన్ క్యాంప్బెల్(8) తీవ్ర నిరాశపరిచారు. ఆ తర్వాత బ్రాండెన్ కింగ్(13), అలిక్ అథనాజ్(12) కాసేపు నిలకడగా ఆడారు. కానీ వీరిద్దరిని స్వల్ప వ్యవధిలో సిరాజ్ పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత కెప్టెన్ ఛేజ్(22), హోప్(26) ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే లంచ్ బ్రేక్ ముందు హోప్ వికెట్ను విండీస్ కోల్పోయింది. కుల్దీప్ అద్బుతమైన బంతితో హోప్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. టీమిండియా బౌలర్లలో మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. 7 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు. తుది జట్లువెస్టిండీస్ ప్లేయింగ్ ఎలెవన్: టాగెనరైన్ చందర్పాల్, జాన్ కాంప్బెల్, అలిక్ అథానాజ్, బ్రాండన్ కింగ్, షాయ్ హోప్ (వికెట్ కీపర్), రోస్టన్ చేజ్ (కెప్టెన్), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్, ఖరీ పియర్, జోహన్ లేన్, జేడెన్ సీల్స్ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: కెఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, బి సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్చదవండి: IND vs WI: టీమిండియాతో మ్యాచ్.. చందర్పాల్ తనయుడు అట్టర్ ప్లాప్ -
టీమిండియాతో మ్యాచ్.. చందర్పాల్ తనయుడు అట్టర్ ప్లాప్
వెస్టిండీస్ దిగ్గజం శివనారాయణ్ చందర్పాల్ తనయుడు తేజ్నారాయణ్ చందర్పాల్ తన పునరాగమనంలో తీవ్ర నిరాశపరిచాడు. దాదపు 20 నెలల తర్వాత విండీస్ జట్టులోకి వచ్చిన చందర్పాల్ తన రీ ఎంట్రీ మ్యాచ్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.అహ్మదాబాద్ వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో తేజ్నారాయణ్ డకౌట్గా వెనుదిరిగాడు. విండీస్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే భారత పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్లను ఎదుర్కొవడానికి చందర్పాల్ తీవ్ర ఇబ్బంది పడ్డాడు.ఈ క్రమంలో 11 బంతులు ఎదుర్కొన్న చందర్పాల్ సిరాజ్ బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్కు ఇచ్చి పెవిలియన్కు చేరాడు. దీంతో తన రీ ఎంట్రీ మ్యాచ్లో ఖాతా తెరవకుండానే పెవిలియన్స్ చేరాల్సింది. చందర్పాల్ 2022లో ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్రం చేశాడు.ఆ తర్వాత జింబాబ్వేపై అద్బుతమైన డబుల్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఈ జూనియర్ చందర్ పాల్ ఆకర్షించాడు. కానీ ఆ తర్వాత తన ఫామ్ను అతడు కోల్పోయాడు. దీంతో సెలక్టర్లు అతడిని పక్కన పెట్టాడు. అతడు ఈ మ్యాచ్ కంటే ముందు చివరగా ఆస్ట్రేలియాపై గతేడాది జనవరిలో విండీస్ తరపున ఆడాడు.అయితే దేశవాళీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన చేయడంతో సెలక్టర్లు అతడికి తిరిగి పిలుపునిచ్చారు. కానీ తనకు వచ్చిన అవకాశాన్ని ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్ సద్వినియోగపరుచుకోలేకపోయాడు. చందర్పాల్ ఇప్పటివరకు పది టెస్టు మ్యాచ్లు ఆడి 32.94 సగటుతో 560 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ తడబడుతోంది. విండీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 13 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. భారత పేసర్ మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టి కరేబియన్లను దెబ్బ తీయగా.. బుమ్రా ఓ వికెట్ సాధించాడు.చదవండి: IND vs AUS: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ఆసీస్ను చిత్తు చేసిన భారత్ -
Ind Vs Aus: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ఆసీస్ను చిత్తు చేసిన భారత్
ఆస్ట్రేలియా గడ్డపై భారత అండర్-19 జట్టు జోరు కొనసాగుతోంది. బ్రిస్బేన్ వేదికగా ఆసీస్ అండర్-19 జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 243 పరుగులకు ఆలౌటైంది.ఆసీస్ బ్యాటర్లలో స్టీవన్ హోగన్(92) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్ 5 వికెట్లు పడగొట్టగా.. కిషన్ కుమార్ మూడు వికెట్లు సాధించాడు. అనంతరం టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 81.3 ఓవర్లలో 428 పరుగుల భారీ స్కోర్ సాధించింది.భారత బ్యాటర్లలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (86 బంతుల్లో 113; 9 ఫోర్లు, 8 సిక్స్లు), వేదాంత్ త్రివేది (192 బంతుల్లో 140; 19 ఫోర్లు) అద్బుమైన సెంచరీలతో కదం తొక్కారు. ఇప్పటికే ఐపీఎల్లో దంచికొట్టిన 14 ఏళ్ల వైభవ్... టెస్టును సైతం టి20 తరహాలో ఆడాడు. ఆసీస్ బౌలర్లను ఏమాత్రం ఉపేక్షించకుండా... భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. . ఆసీస్ పేసర్లను ఓ ఆటాడుకున్న వైభవ్... వేదాంత్తో కలిసి మూడో వికెట్కు 152 పరుగులు జోడించాడు. వీరిద్దరితో పాటు ఖిలాన్ పటేల్ (49 బంతుల్లో 49; 7 ఫోర్లు, 2 సిక్స్లు) ఆయుశ్ మాత్రే (21), అభిజ్ఞ కుందు (26), రాహుల్ కుమార్ (23) రాణించారు.దీంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 185 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆ్రస్టేలియా బౌలర్లలో హెడెన్, విల్ మలాచుక్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.127 పరుగులకే ఆలౌట్..రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా బ్యాటర్ల ఆట తీరు ఏమాత్రం మారలేదు. సెకెండ్ ఇన్నింగ్స్లో ఆసీస్ కేవలం 127 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో దేవంద్రన్, ఖిలాన్ పటేల్ తలా మూడు వికెట్లు పడగొట్టి కంగారుల పతనాన్ని శాసించారు.వీరిద్దరితో పాటు కిషాన్ కుమార్, అన్మోల్జీత్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు. ఆసీస్ బ్యాటర్లలో ఆర్యన్ శర్మ(43) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు అక్టోబర్ 7 నుంచి మెక్కే వేదికగా ప్రారంభం కానుంది. కాగా మూడు వన్డేల యూత్ సిరీస్ను భారత్ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.చదవండి: WC 2025: వరల్డ్కప్లో ఆస్ట్రేలియా బోణీ.. న్యూజిలాండ్ చిత్తు -
భారత్తో తొలి టెస్టు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్! తుది జట్లు ఇవే
అహ్మదాబాద్ వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో టీమిండియా ఇద్దరు స్పెషలిస్టు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్లో ఆడుతున్నాడు. అదేవిధంగా ఇంగ్లండ్ టూర్లో గాయం కారణంగా మధ్యలోనే వైదొలిగిన ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి తిరిగి జట్టులోకి వచ్చాడు. యువ ఆటగాడు సాయిసుదర్శన్కు టీమ్ మెనెజ్మెంట్ మరో అవకాశమిచ్చింది. మరోవైపు విండీస్ తరపున ఖరీ పియర్, జోహన్ లేన్ టెస్టుల్లో అరంగేట్రం చేశారు.తుది జట్లువెస్టిండీస్ ప్లేయింగ్ ఎలెవన్: టాగెనరైన్ చందర్పాల్, జాన్ కాంప్బెల్, అలిక్ అథానాజ్, బ్రాండన్ కింగ్, షాయ్ హోప్ (వికెట్ కీపర్), రోస్టన్ చేజ్ (కెప్టెన్), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్, ఖరీ పియర్, జోహన్ లేన్, జేడెన్ సీల్స్ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: కెఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, బి సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ (సి), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ -
వరల్డ్కప్లో ఆస్ట్రేలియా బోణీ.. న్యూజిలాండ్ చిత్తు
మహిళలవన్డే వరల్డ్కప్ క్రికెట్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియా శుభారంభం చేసింది. బుధవారం ఇండోర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఆ్రస్టేలియా 89 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ్రస్టేలియా 49.3 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యాష్లే గార్డ్నర్ (83 బంతుల్లో 115; 16 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి సెంచరీ సాధించింది. ఆమెతో పాటు ఫోబ్ లిచ్ఫీల్డ్(45), పెర్రీ(33), కిమ్ గార్త్(38) రాణించారు. స్టార్ ప్లేయర్లు బెత్ మూనీ(5), సదర్లాండ్(5), హీలీ(19) నిరాశపరిచారు.న్యూజిలాండ్ బౌలర్లలో లీ తహుహు, జెస్ కెర్ 3 వికెట్ల చొప్పున... బ్రీ ఇలింగ్, అమెలియా కెర్ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. 327 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 43.2 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్ సోఫీ డివైన్ (112 బంతుల్లో 111; 12 ఫోర్లు, 3 సిక్స్లు) వీరోచిత సెంచరీ సాధించినా ఫలితం లేకపోయింది. ఆసీస్ బౌలర్లలో సోఫీ, అనాబెల్ 3 వికెట్ల చొప్పున తీశారు. కొలంబోలో నేడు జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్తో పాకిస్తాన్ తలపడుతుంది.చదవండి: క్లీన్స్వీప్పై భారత్ గురి -
మిచెల్ మార్ష్ మెరుపులు
మౌంట్ మాంగనీ (న్యూజిలాండ్): కెప్టెన్ మిచెల్ మార్ష్(43 బంతుల్లో 85; 9 ఫోర్లు, 5 సిక్స్లు) మెరిపించడంతో... న్యూజిలాండ్తో తొలి టి20 మ్యాచ్లో ఆ్రస్టేలియా ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్ల చాపెల్–హ్యాడ్లీ సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో... టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. టిమ్ రాబిన్సన్ (66 బంతుల్లో 106 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్లు)కెరీర్లో తొలి సెంచరీతో చెలరేగగా... డారిల్ మిచెల్ (23 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), బెవాన్ జాకబ్స్ (20) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. టిమ్ సీఫెర్ట్ (4), డెవాన్ కాన్వే (1), మార్క్ చాప్మన్ (0) విఫలమవడంతో రెండు ఓవర్లు కూడా ముగియక ముందే న్యూజిలాండ్ జట్టు 6/3తో నిలిచింది. ఈ దశలో మిచెల్ అండగా... రాబిన్సన్ విజృంభించాడు. ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన అతడు క్రీజులో కుదురుకున్నాక భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో రాబిన్సన్ 31 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. స్పిన్నర్ల రంగప్రవేశంతో స్కోరు వేగం మందగించగా... నాలుగో వికెట్కు మిచెల్తో కలిసి రాబిన్సన్ 55 బంతుల్లో 92 పరుగులు జోడించాడు. ఆ తర్వాత జాకబ్స్తో ఐదో వికెట్కు 47 బంతుల్లో 64 పరుగులు జతచేశాడు. చివరి ఓవర్లో సిక్స్తో రాబిన్సన్ తన కెరీర్లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షుయ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఆ్రస్టేలియా 16.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మార్ష్ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇన్నింగ్స్ తొలి రెండు బంతులకు బౌండరీలు బాదిన అతడు... ఆఖరి వరకు అదే ఊపు కొనసాగించాడు. మరో ఎండ్ నుంచి ట్రావిస్ హెడ్ (18 బంతుల్లో 31; 6 ఫోర్లు) కూడా ఎడెపెడా బౌండరీలు బాదడు. ఈ జంట తొలి వికెట్కు 5.3 ఓవర్లలోనే 67 పరుగులు జోడించడంతో ఆసీస్కు శుభారంభం దక్కింది. హెడ్ అవుటైనా... మాథ్యూ షార్ట్ (18 బంతుల్లో 29, 2 ఫోర్లు, 2 సిక్స్లు) దంచికొట్టడంతో ఆసీస్ వేగం కొనసాగింది. 23 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న మార్ష్రెండో వికెట్కు షార్ట్తో కలిసి 68 పరుగులు జోడించాడు. దీంతో ఛేదన సులువు కాగా... మొత్తంగా ఈ మ్యాచ్లో ఆసీస్ 20 ఫోర్లు, 9 సిక్స్లతో 21 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం రెండో టి20 జరగనుంది. -
శ్రేయస్, ఆర్య సెంచరీలు.. ఆసీస్ను చిత్తు చేసిన భారత్
కాన్పూర్ వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరిగిన తొలి అనాధికారిక వన్డేలో 171 పరుగుల తేడాతో భారత్-ఎ జట్టు ఘన విజయం సాధించింది. 414 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి ఆసీస్ జట్టు 33.1 ఓవర్లలో కేవలం 242 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్ నిశాంత్ సింధూ 4 వికెట్లు పడగొట్టి కంగారుల పతనాన్ని శాసించాడు. అతడితో పాటు రవి బిష్ణోయ్ రెండు, సిమ్రాన్జీత్ సింగ్, యుద్ద్వీర్ సింగ్, అయూష్ బదోని తలా వికెట్ సాధించారు. ఆసీస్ బ్యాటర్లలో మెకెంజీ హార్వే(68) టాప్ స్కోరర్గా నిలవగా.. సదర్లాండ్(50), లాచ్లాన్ షా(45) పర్వాలేదన్పించారు.అయ్యర్, ఆర్య సెంచరీలు..అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 413 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇండియా బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్( 83 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్లతో 110 పరుగులు), ప్రియాన్ష్ ఆర్య( 11 ఫోర్లు, 5 సిక్స్లతో 101) సూపర్ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరితో పాటు ప్రభ్ సిమ్రాన్ సింగ్(53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 56), రియాన్ పరాగ్(42 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 67), బదోని(27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 50) హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. సీస్ బౌలర్లలో విల్ సదర్లాండ్ రెండు, సంఘా, ముర్ఫీ, స్కాట్, స్టార్కర్ తలా వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆక్టోబర్ 3న కాన్పూర్ వేదికగానే జరగనుంది.చదవండి: ILT20: అశ్విన్కు ఘోర అవమానం.. అస్సలు ఊహించి ఉండడు -
అశ్విన్కు ఘోర అవమానం.. అస్సలు ఊహించి ఉండడు
ఇంటర్ననేషనల్ టీ20 లీగ్-2026 వేలంలో టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు ఘోర అవమానం ఎదురైంది. రూ. 1.06 కోట్ల కనీస ధరతో తొలి రౌండ్ వేలంలోకి వచ్చిన అశ్విన్ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.ఈ ఏడాది ఆగస్టులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి రిటైర్ అయిన అశ్విన్ విదేశీ లీగ్లలో ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఐఎల్టీ20 వేలంలో తన పేరును అశూ రిజిస్టర్ చేసుకున్నాడు. కానీ ఈ సీనియర్ స్పిన్నర్ తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. దీంతో అశ్విన్ అన్సోల్డ్గా మిగిలిపోయాడు. అశ్విన్కు అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్లోనూ అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఐపీఎల్లో ఐదు ఫ్రాంచైజీల తరపున 221 మ్యాచ్లు ఆడిన అశ్విన్.. 187 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.2010,2012 సీజన్లలో ఛాంపియన్గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అతడు భాగంగా ఉన్నాడు. మొత్తంగా ఈ తమిళనాడు స్పిన్నర్ 333 టీ20 మ్యాచ్ల్లో 317 వికెట్లు పడగొట్టాడు. గత సీజన్లో అశ్విన్ సీఎస్కే తరపున ఆడాడు. అతడిని సీఎస్కే ఏకంగా రూ. 9.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అటువంటి ప్లేయర్ ఐఎల్టీ20 వేలంలో అమ్ముడుపోకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోది. అయితే భారత లెజెండరీ స్పిన్నర్ ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్లో ఆడేందుకు మార్గం సుగమమైంది. బిగ్ బాష్ లీగ్ (BBL) సీజన్ 15లో సిడ్నీ థండర్స్ తరపున ఆడేందుకు అశ్విన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. బీబీఎల్లో సిడ్నీ థండర్స్కు ప్రాతినిధ్యం వహించిన తొలి భారత మెన్స్ క్రికెటర్గా అశ్విన్ నిలవనున్నాడు. కాగా అశ్విన్ గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.చదవండి: IND vs AUS: ఆసీస్పై శ్రేయస్ అయ్యర్ విధ్వంసం.. 413 పరుగులు చేసిన భారత్ -
గార్డనర్ సూపర్ సెంచరీ.. న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా ఇండోర్ వేదికగా శ్రీలకంతో జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన కనబరిచారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 326 పరుగుల భారీ స్కోర్కు ఆలౌటైంది.ఆసీస్ బ్యాటర్లలో స్టార్ ఆల్రౌండర్ ఆష్లీ గార్డనర్ అద్బుతమైన సెంచరీతో చెలరేగారు. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయిన ఆసీస్ను గార్డరన్ తన విరోచిత పోరాటంతో ఆదుకున్నారు. లోయార్డర్ బ్యాటర్ కిమ్ గార్త్తో కలిసి ఏభై పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని గార్డనర్ నెలకొల్పారు. మొత్తంగా 83 బంతులు ఎదుర్కొన్న గార్డనర్.. 16 ఫోర్లు, ఒక సిక్సర్తో 115 పరుగులు చేసి ఔటయ్యారు. ఆమెతో పాటు ఫోబ్ లిచ్ఫీల్డ్(45), పెర్రీ(33), కిమ్ గార్త్(38) రాణించారు. స్టార్ ప్లేయర్లు బెత్ మూనీ(5), సదర్లాండ్(5), హీలీ(19) నిరాశపరిచారు.న్యూజిలాండ్ బౌలర్లలో లియా తహుహు, జెస్ కేర్ తలా మూడు వికెట్లు సాధించగా.. ఈల్లింగ్, అమీలియా కేర్ చెరో రెండు వికెట్లు తీశారు. అయితే లక్ష్య చేధనలో వైట్ ఫెర్న్స్ జట్టు తడబడుతోంది. 0 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ కష్టాల్లో పడింది.చదవండి: IND vs AUS: ఆసీస్పై శ్రేయస్ అయ్యర్ విధ్వంసం.. 413 పరుగులు చేసిన భారత్ -
దిగొచ్చిన పీసీబీ చైర్మెన్ నఖ్వీ.. ఆసియా కప్ ట్రోఫీ అందజేత?
ఆసియా కప్-2025 ట్రోఫీ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లు తెలుస్తోంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చైర్మన్, పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ భారత క్రికెట్ బోర్డు దెబ్బకు దిగొచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. జీ న్యూస్ కథనం ప్రకారం.. నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకు అందజేసినట్లు సమాచారం. తాజాగా జరిగిన ఏసీసీ సమావేశంలో ఈ విషయంపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. అయితే ట్రోఫీ కావాలంటే భారత కెప్టెన్ నేరుగా ఏసీసీ కార్యాలయానికి వచ్చి తీసుకోవాలని నఖ్వీ చెప్పినట్లు పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి.కానీ ఇప్పుడు నఖ్వీ వెనక్కి తగ్గి ట్రోఫీ యూఏఈ క్రికెట్ బోర్డు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.అయితే ఈ విషయంపై బీసీసీఐ గానీ, యూఏఈ క్రికెట్ బోర్డు గానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా ఈ ఏడాది ఆసియాకప్ యూఏఈ ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే.అసలేంటి ఈ ట్రోఫీ వివాదం..?ఆసియాకప్ విజేతగా నిలిచిన అనంతరం ఏసీసీ చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదగా ట్రోఫీని తీసుకోవడానికి భారత్ నిరాకరించింది. నఖ్వీ ఏసీసీ చైర్మెన్తో పాటు పీసీబీ ఛీప్, పాకిస్తాన్ మంత్రిగా ఉండడమే ఇందుకు కారణం.అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్, యూఏఈ క్రికెట్ బోర్డు చైర్మెన్ చేతులు మీదగా ట్రోఫీని తీసుకుంటామని టీమిండియా తెలియజేసింది. కానీ అందుకు నఖ్వీ అంగీకరించలేదు. దీంతో అతడు ట్రోఫీని తనతో పాటు తీసుకుని వెళ్లిపోయాడు.అప్పటి నుంచి ఆసియాకప్ ట్రోఫీ అతడి వద్దే ఉంది. కాగా ఫైనల్ మ్యాచ్లో పాక్ను 5 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. ఈ టోర్నీ అంతటా పాక్ ఆటగాళ్లతో భారత ప్లేయర్లు షేక్ హ్యాండ్ చేయడానికి నిరకారించారు. పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.చదవండి: IND vs AUS: ఆసీస్పై శ్రేయస్ అయ్యర్ విధ్వంసం.. 413 పరుగులు చేసిన భారత్ -
ఆసీస్పై శ్రేయస్ అయ్యర్ విధ్వంసం.. 413 పరుగులు చేసిన భారత్
కాన్పూర్ వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న తొలి వన్డేలో ఇండియా-ఎ జట్టు బ్యాటర్లు జూలు విధిల్చారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత-ఎ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 413 పరుగుల భారీ స్కోర్ సాధించింది.భారత బ్యాటర్లలో ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్బుతమైన సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ ఆసీస్ బౌలర్లను ఉతికారేశారు. కాన్పూర్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించారు. ఆర్య 84 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్లతో 101 పరుగులు చేయగా.. అయ్యర్ 83 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 4 సిక్స్లతో 110 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరిద్దరితో పాటు ప్రభ్ సిమ్రాన్ సింగ్(53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 56), రియాన్ పరాగ్(42 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 67), బదోని(27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 50) మెరుపు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఆసీస్ బౌలర్లలో విల్ సదర్లాండ్ రెండు, సంఘా, ముర్ఫీ, స్కాట్, స్టార్కర్ తలా వికెట్ సాధించారు. ఈ మ్యాచ్లోభారత ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్, ఆర్య తొలి వికెట్కు 135 పరుగులు జోడించారు. అంతకుముందు రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను భారత్ 1-0 తేడాతో సొంతం చేసుకుంది. కాగా ఈ నెలలో భారత సీనియర్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20ల్లో భారత్ ఆసీస్తో తలపడనుంది.చదవండి: ఆసీస్పై విధ్వంసకర శతకం బాదిన ప్రియాంశ్ ఆర్య.. తొలి మ్యాచ్లోనే..! -
ఆసియాకప్ తర్వాత టీమిండియా బిజీ బిజీ.. షెడ్యూల్ ఇదే
ఆసియాకప్-2025 ఛాంపియన్స్గా నిలిచిన తర్వాత భారత క్రికెట్ జట్టు వరుస సిరీస్లతో బిజీబిజీగా గడపనుంది. టీమిండియా 3 నెలలపాటు మూడు ఫార్మాట్లలోనూ తలపడనుంది. వెస్టిండీస్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి అగ్రశ్రేణి జట్లను భారత్ ఢీకొట్టనుంది. ఈ క్రమంలో 2025 ఏడాదిలో టీమిండియా మిగిలిన షెడ్యూల్పై ఓ లుక్కేద్దాం.వెస్టిండీస్తో రెడ్ బాల్ సమరం..ఆసియాకప్ ముగిసిన మూడు రోజులకే వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. అక్టోబర్ 2 నుంచి ఈ రెడ్ బాల్ సిరీస్ ప్రారంభం కానుంది.🔹వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ షెడ్యూల్1వ టెస్ట్: అక్టోబర్ 2–6, నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్2వ టెస్ట్: అక్టోబర్ 10–14, ఈడెన్ గార్డెన్స్, కోల్కతావిండీస్ సిరీస్ ముగిసిన 5 రోజులకే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు వన్డేలు, 5 టీ20ల్లో తలపడనుంది. ఈ వైట్బాల్ సిరీస్లు అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానున్నాయి.టీమిండియా ఆస్ట్రేలియా టూర్ షెడ్యూల్ ఇదే..వన్డే సిరీస్:అక్టోబర్ 19: పెర్త్(తొలి వన్డే)అక్టోబర్ 23: అడిలైడ్(రెండో వన్డే)అక్టోబర్ 25: సిడ్నీ(మూడో వన్డే)టీ20 సిరీస్:అక్టోబర్ 29: మనుకా ఓవల్(తొలి టీ20)నవంబర్ 2: మెల్బోర్న్(రెండో టీ20)నవంబర్ 6: హోబర్ట్(మూడో టీ20)నవంబర్ 8: గోల్డ్ కోస్ట్(నాలుగో టీ20)నవంబర్ 10: బ్రిస్బేన్(ఐదో టీ20)ఆ తర్వాత భారత పురుషుల జట్టు స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్లో తలపడనుంది.భారత్-దక్షిణాఫ్రికా మల్టీ ఫార్మాట్ సిరీస్ షెడ్యూల్ ఇదే..టెస్ట్ సిరీస్:నవంబర్ 14–18: అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ(తొలి టెస్టు)నవంబర్ 22–26: బర్సపారా స్టేడియం, గౌహతి(రెండో టెస్టు)వన్డే సిరీస్:నవంబర్ 30: రాంచీ(తొలి వన్డే)డిసెంబర్ 3: రాయ్పూర్(రెండో వన్డే)డిసెంబర్ 6: విశాఖపట్నం(మూడో టీ20)టీ20 సిరీస్:డిసెంబర్ 9: కటక్(తొలి టీ20)డిసెంబర్ 11: న్యూ చండీగఢ్(రెండో టీ20)డిసెంబర్ 14: ధర్మశాల(మూడో టీ20)డిసెంబర్ 17: లక్నో(నాలుగో టీ20)డిసెంబర్ 19: అహ్మదాబాద్(ఐదో టీ20)👉ఆసీస్, సౌతాఫ్రికాలతో టీ20 సిరీస్లు పొట్టి ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా జరగనున్నాయి.