breaking news
Cricket
-
విజయం వాకిట్లో...
ఇంగ్లండ్తో రెండో టెస్టులో టీమిండియా విజయం వాకిట్లో నిలిచింది. బ్యాటర్ల అసమాన ప్రదర్శనకు బౌలర్ల సహకారం తోడవడంతో భారీ విజయంపై కన్నేసింది. గిల్ రికార్డు శతకానికి పంత్, జడేజా, రాహుల్ హాఫ్ సెంచరీలు జతవడంతో ఆతిథ్య జట్టు ముందు కొండంత లక్ష్యం నిలవగా... 608 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్ టాపార్డర్ తడబడింది. 72 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. విజయానికి ఇంకా 536 పరుగులు చేయాల్సి ఉండగా... ఇక్కడి నుంచి ఆ జట్టు గెలవాలంటే మహాద్భుతం జరగాల్సిందే! భారత బౌలర్ల జోరు చూస్తుంటే ఆదివారం వేగంగా ఏడు వికెట్లు తీయడం ఖాయంగా అనిపిస్తుండగా... రోజంతా వర్షం కురవాలని ప్రార్థించడం తప్ప ఇంగ్లండ్ ముందు మరో అవకాశం కనిపించడం లేదు!బర్మింగ్హామ్: ఇంగ్లండ్తో రెండో టెస్టులో భారత క్రికెట్ జట్టు సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ విజయానికి చేరువైంది. రెండో ఇన్నింగ్స్లో దంచి కొట్టిన టీమిండియా... ప్రత్యర్థి ముందు ఏకంగా 608 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కొండంత స్కోరును చేరుకునే క్రమంలో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 16 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. క్రాలీ (0), డకెట్ (15 బంతుల్లో 25; 5 ఫోర్లు), రూట్ (6) పెవిలియన్ చేరగా... పోప్ (24 బ్యాటింగ్; 3 ఫోర్లు), బ్రూక్ (15 బ్యాటింగ్; 2 ఫోర్లు) పోరాడుతున్నారు. భారత బౌలర్లలో ఆకాశ్దీప్ 2, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. ఆదివారం ఆటకు చివరి రోజు కాగా... చేతిలో 7 వికెట్లు ఉన్న ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు... విజయానికి ఇంకా 536 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 64/1తో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా 83 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 427 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ డబుల్ సెంచరీ హీరో, యువ సారథి శుబ్మన్ గిల్ (162 బంతుల్లో 161; 13 ఫోర్లు, 8 సిక్స్లు) మరో శతకంతో కదం తొక్కాడు. రవీంద్ర జడేజా (118 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ (58 బంతుల్లో 65; 8 ఫోర్లు, 3 సిక్స్లు), కేఎల్ రాహుల్ (84 బంతుల్లో 55; 10 ఫోర్లు) అర్ధ శతకాలు సాధించారు. ఈ క్రమంలో టీమిండియా రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి తమ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక (1014) స్కోరు నమోదు చేసుకోగా... గిల్ రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 430 పరుగులతో విజృంభించాడు. పంత్ ఫటాఫట్... గత మ్యాచ్లో ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా... పరాజయం పాలైన టీమిండియా ఈ సారి ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో కనిపించింది. నాలుగో రోజు తొలి సెషన్ ఆరంభంలో కొన్ని ఉత్కంఠ క్షణాలు ఎదురైనా... వాటిని అధిగమించి భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్ పేసర్లు కట్టుదిట్టంగా బంతులేస్తుండటంతో పరుగుల రాక కష్టం కాగా... కరుణ్ నాయర్ (26; 5 ఫోర్లు) మరోసారి మంచి ఆరంభాన్ని వృథా చేసుకున్నాడు. కాసేపటికి అర్ధశతకం అనంతరం రాహుల్ కూడా వెనుదిరగగా... పంత్ వచ్చిరావడంతో విరుచుకుపడ్డాడు.ఎదుర్కొన్న మూడో నాలుగు బంతులకు వరుసగా 4, 6 కొట్టి తన ఉద్దేశం చాటాడు. అతడి దూకుడుకు ఇంగ్లండ్ పేలవ ఫీల్డింగ్ కూడా తోడ్పడింది. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పంత్ ఇచ్చిన క్యాచ్ను క్రాలీ అందుకోలేకపోయాడు. దీన్ని సద్వినియోగం చేసుకున్న అతడు... తదుపరి ఓవర్లో మరో 4, 6 బాదాడు. బషీర్కు రెండు ఫోర్లతో స్వాగతం పలికిన పంత్... చిత్రవిచిత్రమైన షాట్లతో చెలరేగిపోయాడు. దీంతో తొలి సెషన్లో భారత్ 25 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. గిల్ నిలకడ... రెండో సెషన్లో పంత్తో పాటు గిల్ కూడా దంచి కొట్టడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. టంగ్ బౌలింగ్లో 6, 4, 4 కొట్టిన గిల్.. అతడి తదుపరి ఓవర్లో మరో 6, 4తో 57 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మరోవైపు పంత్ 48 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. స్కోరు పెంచే క్రమంలో పంత్ ఔట్ కాగా... జడేజా రాకతో పరుగుల వేగం మందగించింది. ఈ మధ్యలో కొన్ని చక్కటి షాట్లతో అలరించిన గిల్ 129 బంతుల్లో మ్యాచ్లో రెండో సెంచరీ తన పేరిట లిఖించుకున్నాడు. రెండో సెషన్లో టీమిండియా 30 ఓవర్లు ఆడి ఒక వికెట్ నష్టానికి 127 పరుగులు చేసింది. ఇక మూడో సెషన్లో గిల్, జడేజా దుమ్మురేపారు. బంతి తమ పరిధిలో ఉంటే చాలు దానిపై విరుచుకుపడిన ఈ జంట స్కోరు బోర్డుకు రాకెట్ వేగాన్నిచ్చింది. వోక్స్ ఓవర్లో గిల్ 6, 4, 4తో చెలరేగాడు. మరోవైపు జడేజా కూడా మ్యాచ్లో రెండో అర్ధశతకం తన పేరిట లిఖించుకున్నాడు. రూట్ బౌలింగ్ 6, 4తో గిల్ 150 పరుగుల మార్క్ అందుకున్నాడు. పంత్తో నాలుగో వికెట్కు 110 పరుగులు జోడించిన గిల్... జడేజాతో ఐదో వికెట్కు 175 పరుగులు జతచేశాడు. ఎట్టకేలకు బషీర్ బౌలింగ్లో గిల్ ఔట్ కాగా... ఆంధ్రప్రదేశ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (1) ఇలా వచ్చి అలా వెళ్లాడు. వాషింగ్టన్ సుందర్ (12 నాటౌట్) అండతో జడేజా జట్టు ఆధిక్యాన్ని 607కు చేర్చాడు. స్కోరు వివరాలుభారత్ తొలి ఇన్నింగ్స్: 587; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 407; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (ఎల్బీ) (బి) టంగ్ 28; రాహుల్ (బి) టంగ్ 55; నాయర్ (సి) స్మిత్ (బి) కార్స్ 26; గిల్ (సి అండ్ బి) బషీర్ 161; పంత్ (సి) డకెట్ (బి) బషీర్ 65; జడేజా (నాటౌట్) 69; నితీశ్ రెడ్డి (సి) క్రాలీ (బి) రూట్ 1; సుందర్ (నాటౌట్) 12; ఎక్స్ట్రాలు 10; మొత్తం (83 ఓవర్లలో 6 వికెట్లకు డిక్లేర్డ్) 427. వికెట్ల పతనం: 1–51, 2–96, 3–126, 4–236, 5–411, 6–412. బౌలింగ్: వోక్స్ 14–3–61–0; కార్స్ 12–2–56–1; టంగ్ 15–2–93–2; స్టోక్స్ 7–1–26–0; బషీర్ 26–1–119–2; రూట్ 9–1–65–1. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: డకెట్ (బి) ఆకాశ్దీప్ 25; క్రాలీ (సి) (సబ్) సుదర్శన్ (బి) సిరాజ్ 0; పోప్ (బ్యాటింగ్) 24; రూట్ (బి) ఆకాశ్దీప్ 6; బ్రూక్ (బ్యాటింగ్) 15; ఎక్స్ట్రాలు 2; మొత్తం (16 ఓవర్లలో 3 వికెట్లకు) 72. వికెట్ల పతనం: 1–11, 2–30, 3–50, బౌలింగ్: ఆకాశ్దీప్ 8–1–36–2; సిరాజ్ 5–1–29–1; ప్రసిధ్ కృష్ణ 3–0–6–0.430 ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి గిల్ చేసిన పరుగులు. భారత్ తరఫున ఇదే అత్యధికం. సునీల్ గావస్కర్ (344; 1971లో వెస్టిండీస్పై)ను అతను అధిగమించాడు. ఓవరాల్గా గూచ్ (456; 1990లో భారత్పై) అగ్ర స్థానంలో ఉండగా... గిల్ రెండో స్థానంలో నిలిచాడు.1014 ఈ మ్యాచ్లో భారత్ చేసిన పరుగులు. మన టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధికం. 2004లో ఆస్ట్రేలియాపై చేసిన 916 పరుగుల స్కోరును టీమ్ దాటింది.2 ఒక టెస్టు రెండు ఇన్నింగ్స్ల్లో డబుల్ సెంచరీ, సెంచరీ చేసిన రెండో భారత ప్లేయర్గా గిల్ నిలిచాడు. గతంలో సునీల్ గావస్కర్ ఒక్కడే ఈ ఘనత సాధించాడు. రెండు ఇన్నింగ్స్ల్లో 150+స్కోర్లు చేసిన రెండో బ్యాటర్గాను గిల్ నిలిచాడు. గతంలో అలెన్ బోర్డర్ ఈ ఫీట్ నమోదు చేశాడు. -
సునామీ శతకంతో విరుచుకుపడ్డ వైభవ్.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్
భారత యువ క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించింది. నాలుగో యూత్ వన్డేలో ఇంగ్లండ్ అండర్-19 జట్టును చిత్తు చేసింది. ఏకంగా 55 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది.వోర్సెస్టర్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో టాస్ ఓడిన భారత్ అండర్-19 జట్టు.. తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ ఆయుశ్ మాత్రే విఫలం కాగా.. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi), వన్డౌన్ బ్యాటర్ విహాన్ మల్హోత్రా (Vihaan Malhotra) దుమ్ములేపారు. వైభవ్ సునామీ శతక ఇన్నింగ్స్వైభవ్ కేవలం 52 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. మొత్తంగా 78 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 143 పరుగులు సాధించాడు. అయితే, బెన్ మేయ్స్ బౌలింగ్లో జోసెఫ్ మూర్స్కు క్యాచ్ ఇవ్వడంతో వైభవ్ సునామీ శతక ఇన్నింగ్స్కు తెరపడింది.ఇక విహాన్ 121 బంతుల్లో 15 ఫోర్లు, మూడు సిక్స్ల సాయంతో 129 పరుగులు సాధించాడు. మిగతా వారిలో కెప్టెన్ అభిజ్ఞాన్ ముకుంద్.. 23 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. రాహుల్ కుమార్, హర్వన్ష్ పంగాలియా డకౌట్ అయ్యారు. కనిష్క్ చౌహాన్ (2), ఆర్ఎస్ అంబరీష్ (9), దీపేశ్ దేవేంద్రన్ (3) విఫలం కాగా.. యుధాజిత్ గుహ 15, నమన్ పుష్పక్ 2 పరుగులతో అజేయంగా నిలిచారు.ఫలితంగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది.రాకీ ఫ్లింటాఫ్ అద్భుత సెంచరీ వృథాఇంగ్లండ్ బౌలర్లలో జాక్ హోమ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. సెబాస్టియన్ మోర్గాన్ మూడు వికెట్లు తీశాడు. బెన్ మేయ్స్, జేమ్స్ మింటో చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ఇక భారత్ విధించిన 364 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ 308 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్లు బెన్ డాకిన్స్ (67), జోసెఫ్ మూర్స్ (52) అర్ధ శతకాలు బాదగా.. రాకీ ఫ్లింటాఫ్ అద్భుత సెంచరీ (91 బంతుల్లో 107) వృథాగా పోయింది. భారత బౌలర్లలో నమన్ పుష్పక్ మూడు వికెట్లు, ఆర్ అంబరీష్ రెండు వికెట్లు కూల్చి ప్రత్యర్థిని దెబ్బకొట్టగా.. దీపేశ్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇరుజట్ల మధ్య నామమాత్రపు ఐదో యూత్ వన్డే సోమవారం వోర్సెస్టర్లోనే జరుగనుంది.ఇక ఐదు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లింది భారత జట్టు. మొదటి, మూడు, నాలుగో యూత్ వన్డేల్లో గెలిచిన 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది. చదవండి: వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు.. -
Ind vs Eng: పట్టుబిగించిన భారత్.. భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తడబాటు!
ఇంగ్లండ్తో రెండో టెస్టులో భారత్ సంపూర్ణ ఆధిపత్యం సాధించింది. ఆది నుంచి పట్టుబిగించిన గిల్ సేన.. ఆతిథ్య జట్టుకు కొండంత లక్ష్యాన్ని విధించింది. బ్యాటింగ్లో దుమ్ములేపిన టీమిండియా.. శనివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా 427/6 పరుగుల వద్ద తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.తద్వారా ఇంగ్లండ్ ముందు ఏకంగా 608 పరుగుల టార్గెట్ ఉంచింది. 64/1 ఓవర్ నైట్ స్కోరుతో టీమిండియా శనివారం తమ ఆట మొదలుపెట్టింది. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ (269)తో చెలరేగిన భారత కెప్టెన్ శుబ్మన్ గిల్.. రెండో ఇన్నింగ్స్లోనూ ధనాధన్ దంచికొట్టాడు. 162 బంతుల్లో 161 పరుగులతో భారీ శతకం సాధించాడు.మిగతా వారిలో ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (55), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (65) అర్ధ శతకాలతో రాణించగా.. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (69 నాటౌట్) కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. ఫలితంగా ఆరు వికెట్ల నష్టానికి 427 పరుగుల వద్ద టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, షోయబ్ బషీర్ రెండేసి వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, జో రూట్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్కు మహ్మద్ సిరాజ్ ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్ జాక్ క్రాలే (0)ను డకౌట్గా వెనక్కి పంపాడు.ఇక మరో భారత పేసర్ ఆకాశ్ దీప్ మరో ఓపెనర్ బెన్ డకెట్ (25), జో రూట్ (6) వికెట్లు కూల్చి సత్తా చాటాడు. ఈ క్రమంలో నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ 16 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ 15, ఓలీ పోప్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆఖరిదైన ఐదో రోజు భారత్ మిగిలిన ఏడు వికెట్లు కూల్చి గెలుపొందాలని పట్టుదలగా ఉండగా.. విజయానికి 536 పరుగుల దూరంలో ఉన్న ఇంగ్లండ్ కనీసం డ్రా కోసం ప్రయత్నించే అవకాశం ఉంది.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టు-2025 (బుధవారం (జూలై 2)- ఆదివారం (జూలై 6))👉వేదిక: ఎడ్జ్బాస్టన్ స్టేడియం, బర్మింగ్హామ్👉టాస్: ఇంగ్లండ్- మొదట బౌలింగ్👉భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు- 587 ఆలౌట్👉ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు- 407 ఆలౌట్ 👉భారత్కు తొలి ఇన్నింగ్స్లో 180 పరుగుల ఆధిక్యం👉భారత్ రెండో ఇన్నింగ్స్- 427/6 డిక్లేర్డ్- తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొని మొత్తం 607👉ఇంగ్లండ్ లక్ష్యం- 608👉శనివారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 72/3 (16). -
అదరగొట్టిన టీమిండియా.. ఇంగ్లండ్కు కొండంత లక్ష్యం
రెండో టెస్టులో టీమిండియా ఇంగ్లండ్కు భారీ లక్ష్యం విధించింది. ఆతిథ్య జట్టుపై ఆద్యంతం పైచేయి సాధించిన భారత్.. ఏకంగా 608 పరుగుల టార్గెట్ ఇచ్చింది. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Torphy)లో భాగంగా బర్మింగ్హామ్ వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు బుధవారం మొదలైంది.587 పరుగులుఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులు స్కోరు చేసింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) భారీ ద్విశతకం (269) బాదగా.. రవీంద్ర జడేజా (89), యశస్వి జైస్వాల్ (87) అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నారు. వీరితో పాటు వాషింగ్టన్ సుందర్ (42) కూడా రాణించాడు.ఇక ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్, జోష్ టంగ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. మిగిలిన వారిలో కెప్టెన్ బెన్ స్టోక్స్, బ్రైడన్ కార్స్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్.. మూడో రోజు ఆటలో భాగంగా 407 పరుగులకు ఆలౌట్ అయింది.హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184 నాటౌట్) అద్భుత శతకాలతో 303 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో.. ఇంగ్లండ్ మేర స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో పేసర్లు మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో చెలరేగగా.. ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్తో కలుపుకొని 180 పరుగుల ఆధిక్యం సంపాదించిన భారత్.. ఓవర్ నైట్ స్కోరు 64/1 (13)తో శనివారం నాటి నాలుగో రోజు ఆట మొదలుపెట్టింది.మరోసారి గిల్ దంచేశాడుఆట మొదలైన కాసేపటికే కరుణ్ నాయర్ (26) పెవిలియన్ చేరగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ (55) అర్ధ శతకంతో రాణించాడు. ఇక గిల్ మరోసారి భారీ శతకం (161)తో దుమ్ములేపగా.. వికెట కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (65), ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (69 నాటౌట్) అర్ధ శతకాలతో అదరగొట్టారు. నితీశ్ రెడ్డి (1) మరోసారి నిరాశపరచగా.. వాషింగ్టన్ సుందర్ జడేజాతో కలిసి 12 పరుగులతో అజేయంగా నిలిచాడు.గిల్ భారీ శతకం పూర్తైన కాసేపటికి భారత్ తమ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 83 ఓవర్ల ఆటలో ఆరు వికెట్ల నష్టానికి 427 పరుగుల వద్ద డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో దక్కిన 180 పరుగులకు ఈ మేర (427) స్కోరు జతచేసి... ప్రత్యర్థికి భారీ లక్ష్యం విధించింది. ఈ క్రమంలో శనివారం మూడో సెషన్ ఆఖర్లో లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్.. 108 ఓవర్లలో పనిపూర్తి చేయాలి. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి ఆఖరి రోజు ఆట ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్ను టీమిండియా ఆలౌట్ చేస్తుందా? లేదంటే.. డ్రా చేసుకునేందుకు స్టోక్స్ బృందం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా? అన్న విషయం తేలుతుంది.చదవండి: వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు.. మరో ఆటగాడి శతకం.. భారత్ భారీ స్కోరు -
శెభాష్!.. మరోసారి శతక్కొట్టిన గిల్.. అరుదైన రికార్డు
టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) తన కెరీర్లోనే అద్భుత ఫామ్లో ఉన్నాడు. ఇంగ్లండ్ గడ్డ మీద వరుస శతకాలతో దుమ్ములేపుతున్నాడు. ఆతిథ్య జట్టుతో లీడ్స్ వేదికగా తొలి టెస్టులో గిల్ భారీ శతకం (147) బాదిన విషయం తెలిసిందే.అనంతరం బర్మింగ్హామ్లో బుధవారం మొదలైన రెండో టెస్టులోనూ శతక్కొట్టిన శుబ్మన్ గిల్.. దానిని డబుల్ సెంచరీగా మార్చాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 387 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 30 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 269 పరుగులు సాధించాడు. అయితే, కెరీర్లో సాధించిన తొలి ద్విశతకాన్ని ట్రిపుల్ సెంచరీగా మార్చడంలో గిల్ విఫలమయ్యాడు.జోష్ టంగ్ బౌలింగ్లో ఓలీ పోప్నకు క్యాచ్ ఇచ్చి గిల్ పెవిలియన్ చేరడంతో.. అతడి భారీ డబుల్ సెంచరీ ఇన్నింగ్స్కు తెరపడింది. ఇక శనివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా గిల్ మరోసారి బ్యాట్ ఝులిపించాడు. యాభై ఏడు బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న కెప్టెన్ సాబ్.. 129 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో వంద పరుగుల మార్కు అందుకున్నాడు.భారీ ఆధిక్యంలో భారత్ఇదిలా ఉంటే.. 64/1 ఓవర్నైట్ స్కోరుతో శనివారం నాటి నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. కాసేపటికే వన్డౌన్ బ్యాటర్ కరుణ్ నాయర్ (26) వికెట్ కోల్పోయింది. అయితే, ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అర్ధ శతకం(55)తో రాణించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మెరుపు హాఫ్ సెంచరీ (58 బంతుల్లో 65) సాధించాడు. ఇక గిల్ మరోసారి శతక్కొట్టగా.. 68 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. గిల్ సెంచరీ పూర్తి చేసుకునేసరికి, టీ బ్రేక్ సమయానికి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (180)తో కలుపుకొని భారత్.. 484 పరుగుల భారీ లీడ్ సాధించింది.భారత రెండో బ్యాటర్గా..కాగా టెస్టు మ్యాచ్లో ఓ ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ.. మరో ఇన్నింగ్స్లో సెంచరీ బాదిన భారత రెండో బ్యాటర్గా గిల్ చరిత్రకెక్కాడు. అతడి కంటే ముందు భారత మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ 1971లొ పోర్ట్ ఆఫ్ స్పెయిన్వేదికగా వెస్టిండీస్పై ఈ ఘనత సాధించాడు. ఇక ఓవరాల్గా ఈ జాబితాలో గిల్ తొమ్మిదో ఆటగాడు.టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టుషెడ్యూల్: బుధవారం (జూలై 2)- ఆదివారం (జూలై 6)వేదిక: ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హామ్టాస్: ఇంగ్లండ్- తొలుత బౌలింగ్టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 587 ఆలౌట్ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 407 ఆలౌట్ టీమిండియాకు తొలి ఇన్నింగ్స్లో 180 పరుగుల ఆధిక్యం.చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకం.. మరోసారి సునామీ ఇన్నింగ్స్ -
వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు.. విహాన్ శతకం.. భారత్ భారీ స్కోరు
ఇంగ్లండ్ గడ్డ మీద భారత యువ జట్టు అదరగొడుతోంది. ఆతిథ్య అండర్-19 జట్టుతో ఐదు యూత్ వన్డేల సిరీస్లో ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్.. నాలుగో మ్యాచ్లో భారీ స్కోరు సాధించింది.వోర్సెస్టర్ వేదికగా శనివారం యూత్ వన్డేలో టాస్ ఓడిన భారత అండర్-19 జట్టు తొలుత బ్యాటింగ్కు దిగింది. అయితే, ఆదిలోనే భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఆయుశ్ మాత్రే 14 బంతులు ఎదుర్కొన్ని కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు.దీంతో ఆదిలోనే వికెట్ తీసినందుకు ఇంగ్లండ్ సంబరాలు చేసుకోగా.. ఆ ఆనందాన్ని భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కాసేపట్లోనే ఆవిరి చేశాడు. మరోసారి బ్యాట్తో వీర విహారం చేసిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.ఆ తర్వాత కూడా ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు.. 52 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా యూత్ వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీని తన పేరిట నమోదు చేసుకున్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో 78 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్ బౌలింగ్ను చితక్కొడుతూ 143 పరుగులు సాధించాడు. ఈ లెఫ్టాండర్ బౌలింగ్లో పదమూడు ఫోర్లతో పాటు ఏకంగా పది సిక్సర్లు ఉండటం విశేషం.ఇక వైభవ్ వరుసగా ఇలా నాలుగో మ్యాచ్లో సునామీ ఇన్నింగ్స్తో విరుచుకుపడితే.. వన్డౌన్ బ్యాటర్ విహాన్ మల్హోత్రా కూడా శతకంతో చెలరేగాడు. 121 బంతుల్లో 15 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 129 పరుగులు సాధించాడు. అయితే, వీరిద్దరు అవుటైన తర్వాత భారత ఇన్నింగ్స్ నెమ్మదించింది.మిగతా వారిలో కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు 23 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. రాహుల్ కుమార్ (0), హర్వన్ష్ పంగాలియా (0), కనిష్క్ చౌహాన్ (2) పూర్తిగా విఫలమయ్యారు. ఇక ఆర్ఎస్ అంబరీష్ (9), దీపేశ్ దేవేంద్రన్ (3) కూడా చేతులెత్తేయగా.. యుధాజిత్ గుహ 15, నమన్ పుష్పక్ రెండు పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచారు.ఫలితంగా భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 363 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్ అండర్-19 బౌలర్లలో జాక్ హోమ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. సెబాస్టియన్ మోర్గాన్ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇతరులలో బెన్ మేయ్స్, జేమ్స్ మింటో ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇదిలా ఉంటే.. తొలి యూత్ వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలవగా.. రెండో మ్యాచ్లో ఇంగ్లండ్ ఒక వికెట్ తేడాతో గట్టెక్కింది. ఈ క్రమంలో మూడో వన్డేలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించి సిరీస్లో 2-1తో ముందంజలో ఉంది. కీలకమైన నాలుగో మ్యాచ్లో గెలిచి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. కాగా భారత్ విజయాల్లో వైభవ్ సూర్యవంశీ ( 48 (19) - 45 (34)- 86 (31))దే కీలక పాత్ర.వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు..యూత్ వన్డే చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. 14 ఏళ్ల 100 రోజుల వయసులోనే ఈ ఘనత సాధించాడు. ప్రపంచంలో ఈ ఫీట్ అందుకున్న తొలి ఆటగాడు వైభవ్. అంతేకాదు.. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ నజ్ముల్ షాంటో (2009లో 14 ఏళ్ల 241 రోజుల వయసులో శతకం) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కూడా ఈ సందర్భంగా బద్దలు కొట్టాడు. -
వాటే ఫామ్!.. ధనాధన్ దంచికొట్టి.. గిల్, పంత్ హాఫ్ సెంచరీలు
టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇంగ్లండ్ (Ind vs Eng)తో తొలి టెస్టులో శతకం (147) బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో విరాట్ కోహ్లి (Virat Kohli) లేని లోటు పూడుస్తూ.. ఇంగ్లండ్ గడ్డ మీద అతడి రికార్డునే బద్దలు కొట్టాడు.భారీ ద్విశతకం (269)తో ఆకట్టుకుని.. ఎడ్జ్బాస్టన్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన టీమిండియా క్రికెటర్, కెప్టెన్గా నిలిచాడు. ఇక రెండో ఇన్నింగ్స్లోనూ శుబ్మన్ గిల్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. యాభై ఏడు బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. జోష్ టంగ్ బౌలింగ్లో ఫోర్ బాది 51 పరుగులు సాధించాడు.𝐅𝐥𝐮𝐞𝐧𝐭. 𝐅𝐞𝐚𝐫𝐥𝐞𝐬𝐬. 𝐅𝐨𝐜𝐮𝐬𝐞𝐝. 🔥Leading with intent, #ShubmanGill crafts a classy fifty, setting the stage for a commanding team effort 🫡#ENGvIND 👉 2nd TEST, Day 4 | LIVE NOW on JioHotstar ➡ https://t.co/2wT1UwEcdi pic.twitter.com/ftaIUA9YIy— Star Sports (@StarSportsIndia) July 5, 2025మరోవైపు.. గిల్కు తోడుగా వైస్ కెప్టెన్ బ్యాటర్ రిషభ్ పంత్ కూడా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 51 బంతుల్లోనే 50 పరుగుల మార్కు అందుకున్నాడు. ఈ క్రమంలో 44 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి మూడు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసిన టీమిండియా ఆధిక్యం.. 400కు చేరింది.పంత్ అవుటైన తర్వాత స్కోరు ఇలాకాగా ఎడ్జ్బాస్టన్ టెస్టులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 587 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ డబుల్ సెంచరీ (269)తో అదరగొట్టగా.. రవీంద్ర జడేజా (89), యశస్వి జైస్వాల్ (87) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ మూడు వికెట్లు తీయగా.. క్రిస్వోక్స్, జోష్ టంగ్ రెండేసి వికెట్లు కూల్చారు. బ్రైడన్ కార్స్, కెప్టెన్ బెన్స్టోక్స్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆలౌట్ అయింది. హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184 నాటౌట్) శతకాలతో చెలరేగారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ ఆరు, ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్తో కలుపుకొని భారత్కు 180 పరుగుల ఆధిక్యం లభించింది.ఈ క్రమంలో 64/1 ఓవర్నైట్ స్కోరుతో శనివారం నాటి నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. కేఎల్ రాహుల్ (55), రిషభ్ పంత్ (65) అర్ధ శతకాలు.. గిల్ అజేయ హాఫ్ సెంచరీ (ప్రస్తుతానికి 58) కారణంగా 46.2 ఓవర్ల ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసి.. 416 పరుగుల ఆధిక్యంలో ఉంది. పంత్ 65 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షోయబ్ బషీర్ బౌలింగ్లో డకెట్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకం.. మరోసారి సునామీ ఇన్నింగ్స్ -
చరిత్ర సృష్టించిన పంత్.. ఆల్టైమ్ వరల్డ్ రికార్డు బద్దలు
భారత స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ గడ్డపై ధనాధన్ ఆటతో అలరిస్తున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. రెండో టెస్టు సందర్భంగా ఓ అరుదైన రికార్డు సాధించాడు. విదేశీ గడ్డపై టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్గా అవతరించాడు.ఈ క్రమంలో బెన్ స్టోక్స్ (Ben Stokes) పేరిట ఉన్న ఆల్టైమ్ వరల్డ్ రికార్డు (World Record)ను పంత్ బద్దలు కొట్టాడు. కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లీడ్స్ వేదికగా తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్లోనూ రిషభ్ పంత్ శతకాలతో చెలరేగాడు.వరుసగా రెండు శతకాలుతొలి ఇన్నింగ్స్లో 178 బంతుల్లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో 140 బంతుల్లో 15 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 118 పరుగులు సాధించాడు. అయితే, ఎడ్జ్బాస్టన్ వేదికగా బుధవారం మొదలైన రెండో టెస్టులో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఆరంభంలో విఫలమయ్యాడు.దూకుడుగా ఆడుతూరెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 42 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ బాది 25 పరుగులు చేసిన పంత్.. షోయబ్ బషీర్ బౌలింగ్లో జాక్ క్రాలేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే, రెండో ఇన్నింగ్స్లో మాత్రం తనలోని దూకుడైన ఆటను మరోసారి వెలికితీశాడు. శనివారం నాటి నాలుగో రోజు ఆట భోజన విరామ సమయానికి పంత్ 35 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 41 పరుగులతో అజేయంగా ఉన్నాడు.ఈ క్రమంలోనే పంత్ స్టోక్స్ ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. ఇంగ్లండ్లో టెస్టు ఫార్మాట్లో మొత్తంగా 23 సిక్సర్లు పూర్తి చేసుకున్న పంత్.. విదేశీ గడ్డ(ఒకే దేశం)పై అత్యధిక సిక్స్లు నమోదు చేసిన క్రికెటర్గా నిలిచాడు. అంతకుముందు బెన్ స్టోక్స్ సౌతాఫ్రికాలో 21 సిక్సర్లు బాదాడు. ఇక ఇంగ్లండ్పై పంత్ తర్వాత అత్యధిక సిక్స్లు కొట్టిన రెండో పర్యాటక బ్యాటర్గా.. వెస్టిండీస్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్ (16 సిక్సర్లు) నిలిచాడు.విదేశీ గడ్డపై టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లు🏏రిషభ్ పంత్ (ఇండియా)- ఇంగ్లండ్పై 23 సిక్సర్లు🏏బెన్ స్టోక్స్ (ఇండియా)- సౌతాఫ్రికాపై 21 సిక్సర్లు🏏మాథ్యూ హెడెన్ (ఆస్ట్రేలియా)- టీమిండియాపై 19 సిక్సర్లు🏏వివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్)- ఇంగ్లండ్పై 16 సిక్సర్లు🏏హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్)- న్యూజిలాండ్పై 16 సిక్సర్లు.భారత్ 177/3 @ లంచ్ బ్రేక్ఇక ఓవర్నైట్ స్కోరు 64/1తో శనివారం నాటి ఆట మొదలుపెట్టిన టీమిండియా.. భోజన విరామ సమయానికి 38 ఓవర్ల ఆటలో మూడు వికెట్ల నష్టానికి 177 పరుగులు సాధించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్ధ శతకం (55) చేయగా.. వన్డౌన్ బ్యాటర్ కరుణ్ నాయర్ (26) మరోసారి స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. కెప్టెన్ శుబ్మన్ గిల్ 24, పంత్ 41 పరుగులతో క్రీజులో ఉన్నారు. నాలుగో రోజు లంచ్ బ్రేక్ సమయానికి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (180) కలుపుకొని భారత జట్టుకు ఇంగ్లండ్పై 357 పరుగుల ఆధిక్యం లభించింది. కాగా తొలి టెస్టులో ఐదు వికెట్ల తేడాతో ఓడిన గిల్ సేన.. ఎడ్జ్బాస్టన్ టెస్టులో గెలిచి సిరీస్ 1-1తో సమం చేయాలని పట్టుదలగా ఉంది.పంత్ 65 పరుగులు చేసి...కాగా 51 బంతుల్లోనే 50 పరుగులు చేసిన పంత్.. 65 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. షోయబ్ బషీర్ బౌలింగ్లో బెన్ డకెట్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకం.. ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడిన చిచ్చరపిడుగుIt’s Rishabh’s world and we’re just living in it! 😌#SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/d1V9UBz17b— Sony Sports Network (@SonySportsNetwk) July 5, 2025 -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకం.. మరోసారి సునామీ ఇన్నింగ్స్
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అద్భుత ఫామ్ కొనసాగుతోంది. ఇంగ్లండ్తో యూత్ వన్డేల్లో పద్నాలుగేళ్ల ఈ చిచ్చరపిడుగు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. హోవ్ వేదికగా ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో తొలి వన్డేలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ దుమ్ములేపిన విషయం తెలిసిందే. కేవలం 19 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో.. 252కు పైగా స్ట్రైక్రేటుతో 48 పరుగులు సాధించాడు.వరుసగా నాలుగో మ్యాచ్లో..ఇక రెండో యూత్ వన్డేలో 34 బంతుల్లో 45 పరుగులతో ఫర్వాలేదనిపించిన వైభవ్.. మూడో మ్యాచ్లో మరోసారి తన విశ్వరూపం ప్రదర్శించాడు. నార్తాంప్టన్ వేదికగా ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ 31 బంతుల్లో ఆరు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు బాది 86 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.వైభవ్ వీరబాదుడుతాజాగా వోర్సెస్టర్ వేదికగా నాలుగో యూత్ వన్డేలో వైభవ్ సూర్యవంశీ మరోసారి బ్యాట్ ఝులిపించాడు. ఇంగ్లండ్ బౌలింగ్ను చితక్కొడుతూ కేవలం 24 బంతుల్లోనే అర్ధ శతకం బాదాడు. ఇందులో 46 పరుగులు బౌండరీల ద్వారానే రావడం విశేషం. దీనిని బట్టి వైభవ్ వీరబాదుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.ఫాస్టెస్ట్ సెంచరీఅంతటితో వైభవ్ పరుగుల దాహం తీరలేదు. అర్ధ శతకాన్ని సెంచరీగా మార్చేశాడు యువ సంచలనం. కేవలం 52 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని.. తన వీరవిహారాన్ని కొనసాగిస్తున్నాడు. కాగా యూత్ వన్డేలలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ అని తెలుస్తోంది.కాగా ఐదు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత అండర్-19 క్రికెట్ జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా తొలి మూడు యూత్ వన్డేల్లో రెండు గెలిచిన ఆయుశ్ మాత్రే సేన.. శనివారం నాలుగో మ్యాచ్లోనూ దుమ్ములేపుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్.. సగం ఆట అంటే 25 ఓవర్లు పూర్తయ్యే సరికి వికెట్ నష్టానికి 216 పరుగులు సాధించింది. ఓపెనర్ ఆయుశ్ మాత్రే (5) మరోసారి నిరాశపరచగా.. వైభవ్ 74 బంతుల్లో 140, విహాన్ మల్హోత్రా 62 బంతుల్లో 47 పరుగులతో ఆడుతున్నారు.143 పరుగులు చేసి అవుట్..ఇక ఈ మ్యాచ్లో మొత్తంగా 78 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ.. 143 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో 13 ఫోర్లతో పాటు 10 సిక్సర్లు ఉన్నాయి. అయితే, బెన్ మాయెస్ బౌలింగ్లో జోసెఫ్ మూరేస్కు క్యాచ్ ఇవ్వడంతో వైభవ్ విధ్వంసకర శతక ఇన్నింగ్స్కు తెరపడింది. చదవండి: కోహ్లి, రోహిత్ కాదు!.. వైభవ్ సూర్యవంశీ రోల్మోడల్ ఆ సూపర్స్టారే! -
కేఎల్ రాహుల్ అర్ధ శతకం.. పంత్ ధనాధన్
ఇంగ్లండ్తో రెండో టెస్టులో టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) అర్ధ శతకంతో మెరిశాడు. సంప్రదాయ ఫార్మాట్లో తన 18వ ఫిఫ్టీ నమోదు చేశాడు. కాగా భారత్- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య ఎడ్జ్బాస్టన్ వేదికగా బుధవారం రెండో టెస్టు మొదలైన విషయం తెలిసిందే.ఈ క్రమంలో తొలి రెండు రోజుల్లో టీమిండియా ఏకఛత్రాధిపత్యం కొనసాగింది. తమ మొదటి ఇన్నింగ్స్లో 587 పరుగులకు ఆలౌట్ అయిన టీమిండియా.. రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ 77 పరుగుల వద్ద ఉండగా మూడు వికెట్లు కూల్చి సత్తా చాటింది.ఇంగ్లండ్ 407 పరుగులకు ఆలౌట్అయితే, శుక్రవారం నాటి మూడో రోజు ఆటలో మాత్రం ఇంగ్లండ్ కుదురుకుంది. హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184 నాటౌట్) అద్భుత శతకాలతో రాణించి 303 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. అయితే, ఆ తర్వాత మరోసారి భారత బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లండ్ 407 పరుగులకు ఆలౌట్ అయింది.ఈ క్రమంలో 180 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా శుక్రవారం ఆట పూర్తయ్యేసరికి వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 28 పరుగుల వద్ద నిష్క్రమించగా.. కేఎల్ రాహుల్ 28, కరుణ్ నాయర్ 7 పరుగులతో క్రీజులో నిలిచారు.కేఎల్ రాహుల్ అర్ధ శతకంఈ నేపథ్యంలో 64/1 ఓవర్నైట్ స్కోరుతో శనివారం నాటి నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. కరుణ్ నాయర్ (26) రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. బైడన్ కార్స్ బౌలింగ్లో 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు వికెట్ కీపర్ జేమీ స్మిత్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.ఈ క్రమంలో కెప్టెన్ శుబ్మన్ గిల్తో కలిసి నిలకడగా ఆడిన కేఎల్ రాహుల్ 78 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, కాసేపటికే జోష్ టంగ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. టంగ్ అద్భుత డెలివరీతో మిడిల్ స్టంప్ ఎగరగొట్టగా.. ఆశ్చర్యపోవడం రాహుల్ వంతైంది. కాగా మొత్తంగా 84 బంతులట్లో 55 పరుగులు చేసి రాహుల్ నిష్క్రమించగా.. రిషభ్ పంత్ గిల్కు జతయ్యాడు. ముప్పై ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. తద్వారా తొలి ఇన్నింగ్స్తో కలిపి 315కు పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది.UPDATE: ఇక భోజన విరామ సమయానికి టీమిండియా 38 ఓవర్ల ఆటలో మూడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. రిషభ్ పంత్ 35 బంతులలో 41, శుబ్మన్ గిల్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా ప్రస్తుతం 357 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.చదవండి: IND vs ENG 2nd Test: నన్ను మూడో టెస్టులో ఆడిస్తారో?.. లేదో తెలియదు: టీమిండియా స్టార్ Must have taken an absolute peach to get KL out 😳Josh Tongue, you beauty 👌 #SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/gE7laUME3c— Sony Sports Network (@SonySportsNetwk) July 5, 2025 -
టెస్టుల్లో ఆడతా.. నా రోల్ మోడల్ అతడే: వైభవ్ సూర్యవంశీ
భారత క్రికెట్ వర్గాల్లో ఇద్దరు ఆటగాళ్లు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నారు. ఒకరు టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) అయితే.. మరొకరు భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). వీరిద్దరూ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నారు.గిల్ శతకాల మోతఇంగ్లండ్తో టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tenudulkar- Anderson Trophy)లో భాగంగా గిల్ కెప్టెన్గా తన తొలి టెస్టులోనే శతకం (147) బాదడంతో పాటు.. రెండో టెస్టులో భారీ డబుల్ సెంచరీ (269)తో చెలరేగాడు. తద్వారా ఎడ్జ్బాస్టన్ మైదానంలో ఇప్పటి వరకు ఏ భారత క్రికెటర్కూ సాధ్యం కాని ఘనత సాధించాడు.వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్ఈ వేదికపై అత్యధిక వ్యక్తిగత స్కోరు (269) సాధించిన భారత తొలి క్రికెటర్, కెప్టెన్గా గిల్ చరిత్ర సృష్టించాడు. మరోవైపు.. వైభవ్ సూర్యవంశీ అండర్-19 భారత జట్టు తరఫున అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరుగుతున్న యూత్ వన్డే సిరీస్లో ఈ బిహారీ చిచ్చరపిడుగు దుమ్ములేపుతున్నాడు.ఆయుశ్ మాత్రే సారథ్యంలోని జట్టులో భాగమైన పద్నాలుగేళ్ల వైభవ్.. తొలి మూడు వన్డేల్లో వరుసగా 19 బంతుల్లో 48, 34 బంతుల్లో 45, 31 బంతుల్లోనే 81 పరుగులతో అదరగొట్టాడు. చివరగా మూడో యూత్ వన్డేలో సంచలన ఇన్నింగ్స్తో మెరిసిన వైభవ్.. ఆ తర్వాత వెంటనే తమ జట్టుతో కలిసి ఎడ్జ్బాస్టన్కు వెళ్లాడు.ఇంగ్లండ్తో తలపడుతున్న సీనియర్ జట్టు ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు యువ జట్టును బీసీసీఐ అక్కడకు పిలిపించింది. ఈ నేపథ్యంలో గిల్ అద్భుత, చిరస్మరణీయ ఇన్నింగ్స్ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం వైభవ్తో పాటు యువ ఆటగాళ్లందరికీ కలిగింది.టెస్టుల్లో ఆడతా.. నా రోల్ మోడల్ అతడేఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ ముగిసిన అనంతరం వైభవ్ సూర్యవంశీ మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్లో నాకిదే తొలి టెస్టు. ఇక్కడ టెస్టు మ్యాచ్ చూడటం ఇదే తొలిసారి. మ్యాచ్ ఎలా సాగుతుందో ప్రత్యక్షంగా వీక్షించాను. నాకెంతో సంతోషంగా ఉంది. మ్యాచ్ చూసేందుకే మమ్మల్ని ప్రత్యేకంగా ఇక్కడకు తీసుకువచ్చారు.టీమిండియా ఆట చూసి మేమెంతగానో స్ఫూర్తి పొందాము. శుబ్మన్ గిల్ మా అందరికీ రోల్ మోడల్. దేశం తరఫున రెడ్ బాల్ క్రికెట్ ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్ కోరుకుంటాడు’’ అని పేర్కొన్నాడు. టెస్టుల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడమే తన చిరకాల కోరిక అని చెప్పుకొచ్చాడు. కాగా అనేక మంది క్రికెటర్ల మాదిరి.. భారత దిగ్గజాలైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల పేర్లు కాకుండా టీమిండియా యువ సారథి గిల్ను వైభవ్ తన రోల్మోడల్గా చెప్పడం విశేషం.యువ భారత్దే పైచేయికాగా ఇంగ్లండ్ యువ జట్టుతో ఐదు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత అండర్-19 జట్టు అక్కడికి వెళ్లింది. ఇప్పటికి మూడు యూత్ వన్డేలు పూర్తి కాగా భారత్ రెండింట గెలిచి 2-1తో ఆధిక్యంలో ఉంది. వోర్సెస్టర్ వేదికగా శనివారం నాటి నాలుగో యూత్ వన్డేలో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో తలపడుతున్న టీమిండియా తొలి టెస్టులో ఓడింది. ఎడ్జ్బాస్టన్ టెస్టులో గెలిచి సిరీస్ సమం చేయాలని పట్టుదలగా ఉంది.చదవండి: WCL: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా యువరాజ్ సింగ్ -
నన్ను మూడో టెస్టులో ఆడిస్తారో?.. లేదో తెలియదు: టీమిండియా స్టార్
టీమిండియా- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య రెండో టెస్టు రసవత్తరంగా మారింది. మొదటి రెండు రోజులు భారత్ ఏకపక్షంగా పైచేయి సాధించగా.. మూడో రోజు మాత్రం ఇంగ్లండ్ అదరగొట్టింది. భారత బౌలర్ల ధాటికి ఒక దశలో 84 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన స్టోక్స్ బృందాన్ని జేమీ స్మిత్ (184 నాటౌట్), హ్యారీ బ్రూక్(158) అద్భుత ఇన్నింగ్స్తో ఆదుకున్నారు.ఇద్దరూ సెంచరీలతో చెలరేగి ఏకంగా 303 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దీంతో టీమిండియా పట్టుతప్పినట్లే అనిపించింది. అయితే, పేసర్లు మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ (Akash Deep) తమ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్ను దెబ్బకొట్టారు. సిరాజ్ ఏకంగా ఆరు వికెట్లతో మెరవగా.. ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు.180 పరుగుల మేర ఆధిక్యంభారత పేసర్ల దెబ్బకు ఇంగ్లండ్ బజ్బాల్ ఇన్నింగ్స్ 407 పరుగుల వద్ద ముగిసిపోయింది. 89.3 ఓవర్లలో ఈ మేర స్కోరు చేసి ఇంగ్లండ్ ఆలౌట్ కాగా.. భారత్కు తొలి ఇన్నింగ్స్లో 180 పరుగుల మేర ఆధిక్యం లభించింది. ఇక మ్యాచ్లో బెన్ డకెట్ (0), ఓలీ పోప్ (0), హ్యారీ బ్రూక్ (158) రూపంలో మూడు కీలక వికెట్లు కూల్చిన ఆకాశ్ దీప్.. క్రిస్ వోక్స్(5) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి మూడో రోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆకాశ్ దీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తదుపరి మ్యాచ్లో ఆడతానో లేదో తెలియదని.. రెండో టెస్టులో మిగిలిన రెండు రోజుల్లో తానేంటో మరోసారి నిరూపించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపాడు.మూడో టెస్టులో ఆడిస్తారో?.. లేదో తెలియదు‘‘ఈ టెస్టు మ్యాచ్లో మాకు ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రతి మ్యాచ్లోనూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతాం. మూడో టెస్టు గురించి నేను ఇప్పుడే ఆలోచించడం లేదు. ఈ రెండు రోజుల్లో నా శాయశక్తులా జట్టు విజయం కోసం పనిచేయడమే ముఖ్యం.ఆ తర్వాతే మరో మ్యాచ్లో ఆడిస్తారా? లేదా? అన్న విషయం గురించి ఆలోచిస్తాను. ఈ విషయంలో మేనేజ్మెంట్దే తుది నిర్ణయం. లార్డ్స్ టెస్టు ఆడతారా? అంటే నాకైతే కచ్చితంగా తెలియదు. నేను ఆడొచ్చు.. ఆడకపోవచ్చు. మ్యాచ్కు ఒకరోజు ముందే మాకు ఆ విషయం తెలుస్తుంది’’ అని ఆకాశ్ దీప్ మీడియా ప్రశ్నలకు బదులిచ్చాడు.బుమ్రా స్థానంలోకాగా ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లిన టీమిండియా తొలి మ్యాచ్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. లీడ్స్లో జరిగిన ఈ మ్యాచ్లో గిల్ సేన ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలు కాగా.. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో బుధవారం రెండో టెస్టు మొదలైంది.ఇక లీడ్స్లో తొలి టెస్టు ఆడిన భారత ప్రధాన జస్ప్రీత్ బుమ్రాకు.. రెండో టెస్టు నుంచి విశ్రాంతినిచ్చారు. ఈ క్రమంలో అతడి స్థానంలో ఆకాశ్ దీప్ జట్టులోకి వచ్చాడు. అయితే, బుమ్రాను తదుపరి లార్డ్స్ టెస్టులో ఆడించేందుకే ఇప్పుడు రెస్ట్ ఇచ్చామని కెప్టెన్ గిల్ చెప్పాడు. దీనిని బట్టి ఆకాశ్ దీప్నకు మూడో టెస్టులో చోటు దక్కదా? అన్న ప్రశ్నకు ఈ పేసర్ ఇలా బదులిచ్చాడు.ఇదిలా ఉంటే.. శుక్రవారం నాటి మూడో రోజు పూర్తయ్యేసరికి టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (28) పెవిలియన్ చేరగా.. కేఎల్ రాహుల 28, కరుణ్ నాయర్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్పై భారత్ మూడో రోజు ఆట ముగిసే సరికి 244 పరుగుల ఆధిక్యంలో ఉంది.చదవండి: 'అతడిని ఆడించకపోవడం తెలివితక్కువ నిర్ణయం'.. గంభీర్పై ఇంజనీర్ ఫైర్ -
చూపు లేకపోయినా.... ప్రపంచమంతా చూస్తోంది!
ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్(ఐబీఎస్ఎఫ్) వరల్డ్ గేమ్స్లో టీ 20 క్రికెట్ భాగం అయిన తరవాత కొత్తగా ఏర్పాటైన భారత మహిళా క్రికెట్ జట్టు తమ అద్భుత ప్రతిభతో క్రీడాలోకాన్ని ఆకట్టుకుంది. లీగ్ దశలో ప్రతి మ్యాచ్ గెలిచింది. ఆస్ట్రేలియా జట్టుపై విజయం సాధించడాన్ని దృష్టిలో పెట్టుకొని... ‘మా విజయానికి నాకు మాటలు రావడం లేదు. క్రికెట్లో నేను మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వంగా ఉంది. చిన్నప్పుడు ఎంతోమంది క్రికెటర్ల గురించి మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు మా గురించి మాట్లాడు కుంటుంటే ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంది’ అంటుంది కర్నాటకకు చెందిన దీపిక టీసి.ఆటలో అత్యత్తమ ప్రతిభ కనబరుస్తున్న బ్లైండ్ ఇండియన్ ఉమెన్ టీమ్పై ‘దేఖ్లే ఇండియా’ పేరుతో శాంతి మోహన్, ముకుంద మూర్తి డాక్యుమెంటరీ నిర్మించారు. ‘భిన్నమైన సాంస్కృతిక నేపథ్యాల నుంచి రావడం వల్ల తొలిరోజుల్లో ఒకరినొకరు అర్థం చేసుకోవడం కష్టంగా ఉండేది. మొదట నే΄ాల్తో జరిగిన మ్యాచ్లో సమన్వయం చేయడం కష్టమైంది. దీంతో ఓడి΄ోయాం. క్రమక్రమంగా ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలైంది. సమన్వయం చేసుకోవడంతో సులభం అయింది’ అంటుంది కర్నాటక ప్లేయర్, టీమ్ కెప్టెన్ వర్ష. ‘మాకు కావాల్సింది మీ సానుభూతి కాదు. మద్దతు’ అంటున్నారు టీమ్ సభ్యులు.‘మన దేశంలో క్రికెట్ అనేది చాలా పాపులర్ అయినప్పటికీ చాలామందికి బ్లైండ్ క్రికెట్ ఉమెన్ టీమ్ ఉంది అనే విషయం తెలియదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని డాక్యుమెంటరీ తీయాలనుకున్నాం. ఈ జట్టులో ఉన్న అమ్మాయిలు అంధులు మాత్రమే కాదు కఠినమైన సామాజిక, ఆర్థిక నేపథ్యం నుంచి వచ్చినవారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈ స్థాయికి రావడం అనేది సాధారణ విషయం కాదు’ అంటున్నాడు ‘దేఖ్లే ఇండియా’ డాక్యుమెంటరీ నిర్మించిన వారిలో ఒకరైన శాంతి మోహన్ -
సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్న సురేశ్ రైనా.. ప్రకటన విడుదల
టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా (Suresh Raina) కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నాడు. సినిమా నటుడిగా అవతారం ఎత్తేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని రైనా స్వయంగా వెల్లడించాడు. తాను కోలీవుడ్లో నటించనున్నట్లు తెలిపాడు.ఇందుకు సంబంధించి తమిళ సినిమా నిర్మాణ సంస్థ నుంచి శనివారం అధికారిక ప్రకటన వెలువడింది. డ్రీమ్ నైట్ స్టోరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీలో రైనాకు స్వాగతం పలుకుతున్న వీడియోను క్రికెటర్ శివం దూబే చేతుల మీదుగా విడుదల చేశారు.క్రికెట్ మైదానం నుంచి.. కోలీవుడ్ ఫ్రేమ్స్ దాకా..ఈ నేపథ్యంలో సురేశ్ రైనా స్పందిస్తూ.. ‘‘క్రికెట్ మైదానం నుంచి.. కోలీవుడ్ ఫ్రేమ్స్ దాకా.. చెన్నై నాలో నిండి నన్ను ముందుకు నడిపిస్తోంది. నా ఈ కొత్త ప్రయాణంలో డీకేఎస్ సంస్థతో జట్టుకట్టడం ఎంతో గర్వంగా ఉంది’’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు. కాగా ఉత్తరప్రదేశ్కు చెందిన సురేశ్ రైనా.. 2005 నుంచి 2018 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.అంతర్జాతీయ స్థాయిలో 226 వన్డేలు, 78 టీ20లు, 18 టెస్టులు ఆడిన రైనా.. ఆయా ఫార్మాట్లలో 5615, 1604, 768 పరుగులు సాధించాడు. ఇక ఈ లెఫ్టాండర్ బ్యాటర్కు ఐపీఎల్లో ఘనమైన రికార్డు ఉంది. క్యాష్ రిచ్ లీగ్లో మొత్తంగా 205 మ్యాచ్లు ఆడిన రైనా.. 5528 పరుగులు సాధించి మిస్టర్ ఐపీఎల్గా గుర్తింపు పొందాడు.చిన్న తలాగా అభిమానుల హృదయాల్లో చోటుఇక ఐపీఎల్ కెరీర్లో చాలా ఏళ్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన సురేశ్ రైనా.. చిన్న తలాగా గుర్తింపు పొందాడు. మహేంద్ర సింగ్ ధోని తర్వాత అంతటి స్థాయిలో చెన్నై అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు అక్కడి నుంచే తన సినీ ప్రయాణం కూడా మొదలుపెట్టనున్నాడు.సంతోషంగా ఉందితాను తమిళ సినిమా ద్వారా అరంగేట్రం చేయడం గురించి సురేశ్ రైనా మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు నా దగ్గరకు వచ్చి కథ చెప్పినపుడు అది నా మనసుకు ఎంతో దగ్గరగా అనిపించింది. క్రికెట్కు సంబంధించిన ఈ సినిమాలో నటించడం గర్వకారణం.అది కూడా ఎన్నో ఏళ్లుగా సీఎస్కేకు ఆడి.. తమిళనాడు నుంచి నా సినిమా ప్రయాణం మొదలుపెట్టడం మరింత సంతోషంగా ఉంది. ఇక్కడి ప్రజలు మాపై ఎంతో ప్రేమను కురిపించారు’’ అని పేర్కొన్నాడు. కాగా సురేశ్ రైనా నటిస్తున్న తమిళ చిత్రానికి లోగాన్ దర్శకుడు కాగా.. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా మరో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా కోలీవుడ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అదే విధంగా.. కేరళకు చెందిన మాజీ పేసర్ శ్రీశాంత్ కూడా తమిళ సినీ రంగంలో నటుడిగా అడుగుపెట్టాడు. నయనతార, సమంతలతో కలిసి విజయ్ సేతుపతి నటించిన కాతువాకుల రెండు కాదల్ సినిమాలో శ్రీశాంత్ మోబీ అనే పాత్రలో నటించాడు.చదవండి: వేలంలో రికార్డులు బద్దలు.. అత్యంత ఖరీదైన ఆటగాడిగా సంజూ శాంసన్ -
సూపర్ కింగ్స్కు హార్ట్ బ్రేకింగ్.. ఒక్క పరుగు తేడాతో ఓటమి
మేజర్ లీగ్ క్రికెట్-2025లో శనివారం శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, టెక్సాస్ సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఆఖరి వరకు ఉత్కంఠిభరితంగా సాగిన ఈ పోరులో సూపర్ కింగ్స్పై ఒక్క పరుగు తేడాతో శాన్ ఫ్రాన్సిస్కో విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన శాన్ ఫ్రాన్సిస్కో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. యూనికార్న్స్ బ్యాటర్లలో కెప్టెన్ మాథ్యూ షార్ట్ (80: 63 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లు) అద్బుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు హసన్ ఖాన్ (40: 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 69 పరుగులు జోడించారు. మిగితా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. టెక్సాస్ బౌలర్లలో స్టోయినిష్ మూడు, మోసిన్, అకీల్, బర్గర్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు.ఫెర్రీరా పోరాటం వృథా..అనంతరం లక్ష్య ఛేదనలో టెక్సాస్ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులకే పరిమితమైంది. ఆఖరి ఓవర్లో సూపర్ కింగ్స్ విజయానికి 13 పరుగులు అవసరమయ్యాయి. ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను ఆసీస్ స్పీడ్ స్టార్ బార్ట్లెట్కు షార్ట్ అప్పగించాడు. బార్ట్లెట్ ఆ ఓవర్లో 11 పరుగులే ఇచ్చి తన జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు.చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన క్రమంలో కాల్విన్ (2) రనౌట్ కావడంతో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. సూపర్ కింగ్స్ బ్యాటర్లలో డొనొవన్ ఫెర్రీరా( 39: 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు.అతడితో పాటు , సాయితేజ ముక్కామల (34), శుభమ్ రంజనె (28) తమవంతు ప్రయత్నం చేశారు. . శాన్ ఫ్రాన్సిస్కో బౌలర్లలో బ్రాడీ కౌచ్ , రొమారియో షెఫర్డ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా..హసన్ ఖాన్, కరీమా గోరె చెరో వికెట్ తీశారు. ఇప్పటికే ఇరు జట్లు తమ ప్లే ఆఫ్ బెర్త్లను ఖారారు చేసుకున్నాయి.చదవండి: వేలంలో రికార్డులు బద్దలు.. అత్యంత ఖరీదైన ఆటగాడిగా సంజూ శాంసన్ -
'అతడిని ఆడించకపోవడం తెలివితక్కువ నిర్ణయం'.. గంభీర్పై ఇంజనీర్ ఫైర్
ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో 587 పరుగుల భారీ స్కోర్ చేసిన భారత్.. బౌలింగ్లో కూడా పర్వాలేదన్పించింది. ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్కు 180 పరుగుల ఆధిక్యం లభించింది.ఓవరాల్గా గిల్ సేన ప్రస్తుతం 244 పరుగుల లీడ్లో కొనసాగుతోంది. అయితే ఎడ్జ్బాస్టన్లో భారత్ పట్టుబిగించినప్పటికి, ఈ మ్యాచ్లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఆడించకపోవడం తీవ్రవిమర్శలకు దారితీసింది. చాలా మంది మాజీలు ఇండియన్ టీమ్ మెనెజ్మెంట్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఈ జాబితాలో భారత మాజీ వికెట్ కీపర్ ఫరూఖ్ ఇంజనీర్ చేరాడు. కుల్దీప్ను ఆడించకపోవడం తెలివతక్కువ నిర్ణయమని అతడు మండిపడ్డాడు.గత మూడేళ్ల నుంచి భారత జట్టులో అత్యంతవిజయవంతమైన స్పిన్నర్గా కుల్దీప్ కొనసాగుతున్నాడు. అయితే ఎడ్జ్బాస్టన్ టెస్టులో కుల్దీప్కు చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ ఆఖరి నిమిషంలో గంభీర్ అండ్ కో కుల్దీప్కు బదులుగా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ను జట్టులోకి తీసుకున్నారు. సుందర్ బ్యాటింగ్ పరంగా పర్వాలేదన్పించినా బౌలింగ్లో మాత్రం విఫలమయ్యాడు.ఈ క్రమంలో ఫరూఖ్ ఇంజనీర్ మాట్లాడుతూ.. "కుల్దీప్ యాదవ్ మొదటి టెస్టు నుంచి ఆడాల్సింది. అతడొక మ్యాచ్ విన్నర్. ఫ్లాట్ వికెట్పై కూడా బంతిని తిప్పే సత్తా అతడికి ఉంది. కానీ అతడి పట్ల భారత జట్టు మెనెజ్మెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అతన్ని ఆడించకపోవడం తెలివితక్కువ నిర్ణయం. కనీసం రెండు టెస్టులోనైనా అతడి ఆడి ఉంటే కచ్చితంగా ప్రభావం చూపేవాడు. మూడో టెస్టుకైనా అతడిని ఎంపిక చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఆటగాళ్ల ఎంపిక పట్ల భారత్ అనుసరిస్తున్న విధానం సరైనది కాదు. అంతేకాకుండా బుమ్రా ఐదు మ్యాచ్ల సిరీస్లో మూడు టెస్టులు మాత్రమే ఆడాలని ముందే నిర్ణయించుకోవడం సరైనది కాదు. ఎందుకంటే ప్రతీ మ్యాచ్కు ముందు దాదాపు వారం రోజుల పాటు విశ్రాంతి లభిస్తోంది. ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లకపోతే టెస్టు సిరీస్ను మీరు గెలవలేరు" అని పేర్కొన్నారు. -
భారత బౌలర్ అత్యంత చెత్త రికార్డు.. 148 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలోనే?
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ద్ కృష్ణ దారుణ ప్రదర్శన కనబరిచాడు. తొలి టెస్టు కాస్త పర్వాలేదన్పించిన ఈ కర్ణాటక పేసర్.. రెండో టెస్టులో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ప్లాట్ పిచ్పై ఎలా బౌలింగ్ చేయాలో తెలియక భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. పదే పదే షార్ట్ బంతుల్ని సంధించి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 13 ఓవర్లు వేసిన ప్రసిద్ద్.. 5.50 ఏకానమితో 72 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా ప్రసిద్ద్ను ఇంగ్లండ్ యువ ఆటగాడు జేమీ స్మిత్ ఉతికారేశాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 32వ ఓవర్ వేసిన ప్రసిద్ద్ బౌలింగ్లో స్మిత్ ఏకంగా 23 పరుగులు రాబట్టాడు. స్మిత్ వరుసగా 4, 6, 4, 4, 4 బాదగా.. వైడ్ రూపంలో మరో పరుగు వచ్చింది. ఈ క్రమంలో ప్రసిద్ద్ అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో 500 లేదా అంతకంటే ఎక్కువ బంతులు వేసిన బౌలర్లలో అత్యధిక ఎకానమీ రేట్ నమోదు చేసిన బౌలర్గా ప్రసిద్ద్ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్(4.77) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో ఆరోన్ రికార్డును కృష్ణ బ్రేక్ చేశాడు.అదేవిధంగా 2000 సంవత్సరం తర్వాత టెస్టు క్రికెట్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన నాలుగో భారత బౌలర్గా ఈ కర్ణాటక పేసర్ నిలిచాడు. ఈ మ్యాచ్లో ప్రసిద్ద్ ఒకే ఓవర్లో 23 రన్స్ ఇచ్చాడు. ఈ జాబితాలో ప్రసిద్ద్ కంటే ముందు హర్భజన్ సింగ్(27), మునాఫ్ పటేల్(25), కర్ణ్ శర్మ (24) ఉన్నారు.ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆలౌటైంది. జెమీ స్మిత్(207 బంతుల్లో 21 ఫోర్లు, 4 సిక్స్లతో 184 నాటౌట్), హ్యారీ బ్రూక్(234 బంతుల్లో 17 ఫోర్లు, సిక్స్తో 158) భారీ సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరూ 6వ వికెట్కు 303 పరుగులు జోడించారు.భారత బౌలర్లలో సిరాజ్తో పాటు ఆకాష్ దీప్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్కు 180 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది.చదవండి: వేలంలో రికార్డులు బద్దలు.. అత్యంత ఖరీదైన ఆటగాడిగా సంజూ శాంసన్ -
వేలంలో రికార్డులు బద్దలు.. అత్యంత ఖరీదైన ఆటగాడిగా సంజూ శాంసన్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్(Sanju Samson) తొలిసారి కేరళ క్రికెట్ లీగ్ (KCL)లో ఆడనున్నాడు. శనివారం తిరువనంతపురంలో జరిగిన కేసీఎల్ సీజన్-2 ఆటగాళ్ల వేలంలో శాంసన్ను కొచ్చి బ్లూ టైగర్స్ రూ. 26.80 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది.తద్వారా కేరళ క్రికెట్ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా సంజూ నిలిచాడు. అతడి కోసం కొచ్చి ఫ్రాంచైజీ తమ పర్స్లో ఉన్న సగానికిపైగా మొత్తాన్ని వెచ్చింది. తొలుత శాంసన్ బిడ్డింగ్ పోరు రూ.5 లక్షలతో ప్రారంభమైంది. త్రిస్సూర్ టైటాన్స్ ఒక్కసారిగా రూ.20 లక్షలకు బిడ్ను పెంచింది.అయితే ఆఖరికి కొచ్చి 26.80 లక్షలు వెచ్చించి అతడిని కైవసం చేసుకుంది. వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలకు కేసీఎల్ మెనెజ్మెంట్ రూ. 50 లక్షలు కేటాయించింది. ఇప్పుడు సంజూ శాంసన్పైనే 26.80 లక్షలు వెచ్చించడంతో కొచ్చి వద్ద రూ. 23.2 లక్షలే మిగిలియాయి. దీంతో వేలంలో మిగితా స్టార్ ప్లేయర్లను సొంతం చేసుకోవడం కొచ్చి కష్టం కావచ్చు.ఈ వేలం ముందువరకు కెసీఎల్లో అత్యధిక ధర కలిగిన రికార్డు ఎం. సజీవన్ పేరిట ఉండేది. తొలి ఎడిషన్లో సజీవన్ను త్రివేండ్రం రాయల్స్ రూ.7.4 లక్షలకు సొంతం చేసుకుంది. ఇప్పుడు సంజూ ఆ రికార్డును బద్దలు కొట్టాడు.ఈ ఏడాది వేలంలో సంజూ కంటే ముందు బాసిల్ తంపిని రూ.8.4 లక్షలకు తివేండ్రం రాయల్స్ సొంతం చేసుకుంది. సంజూ ప్రస్తుతం భారత టీ20 జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నాడు. అయితే ఈ మధ్యలో టీ20 సిరీస్లు లేకపోవడంతో కెసీఎల్ టోర్నీ మొత్తానికి అందుబాటులో ఉండనున్నాడు. కెసీఎల్ సీజన్-2 ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 6 వరకు జరగనుంది.చదవండి: IND vs ENG: రివ్యూ తీసుకున్న జైశ్వాల్.. అంపైర్పై కోపంతో ఊగిపోయిన స్టోక్స్! వీడియో -
వారెవ్వా కమ్మిన్స్.. క్రికెట్ చరిత్రలోనే అద్బుతమైన క్యాచ్! వీడియో
గ్రెనడా వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ సంచలన క్యాచ్తో మెరిశాడు. విండీస్ ఆటగాడు కీస్ కార్టీని సింగిల్ హ్యాండ్ క్యాచ్తో కమ్మిన్స్ పెవిలియన్కు పంపాడు. విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్ 9 వ ఓవర్ వేసిన కమ్మిన్స్.. రెండో బంతిని కార్టీగా గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు.ఆ బంతిని కార్టీ ఆఫ్సైడ్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్తీసుకుని లెగ్సైడ్ షార్ట్ స్క్వేర్ మిడ్ వికెట్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో ఫాలో త్రూలో కమ్మిన్స్ తన కుడివైపనకు పరిగెత్తుకుంటూ వెళ్లి సింగిల్ హ్యాండ్ క్యాచ్ను అందుకున్నాడు.ఇది చూసిన విండీస్ బ్యాటర్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ క్యాచ్లలో ఒకటిగా నిలిచిపోతుందని కొనియాడుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది.కంగారులు ప్రస్తుతం 45 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అంతకుముందు విండీస్ తమ మొదటి ఇన్నింగ్స్లో 253 పరుగులకు ఆలౌటైంది. వెస్టిండీస్ బ్యాటర్లలో కింగ్(75), జాన్ క్యాంప్బెల్(40) పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో లియోన్ మూడు, హాజిల్వుడ్, కమ్మిన్స్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 286 పరుగులు చేసింది.CUMMINS, YOU BEAUTY 🤯 Pat Cummins pulls off a diving, one-handed caught & bowled screamer to dismiss Keacy Carty 🔥#AUSvWI pic.twitter.com/0JxwJaz16t— FanCode (@FanCode) July 4, 2025 -
రివ్యూ తీసుకున్న జైశ్వాల్.. అంపైర్పై కోపంతో ఊగిపోయిన స్టోక్స్!
ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన సహనాన్ని కోల్పోయాడు. ఫీల్డ్ అంపైర్తో స్టోక్స్ తీవ్ర వాగ్వాదానికి దిగాడు. అసలేమి ఏమి జరిగిందంటే.. టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో పేసర్ జోష్ టంగ్ వేసిన బంతి జైస్వాల్ ప్యాడ్ను తాకింది.దీంతో ఇంగ్లండ్ ఆటగాళ్లతో పాటు బౌలర్ కూడా ఎల్బీ కోసం అప్పీల్ చేశాడు. వెంటనే అంపైర్ షర్ఫుద్దౌలా ఔట్ అంటూ వేలు పైకెత్తాడు. ఈ క్రమంలో జైశ్వాల్ డీఆర్ఎస్ తీసుకోవాలా? వద్దా అని? నాన్స్ట్రైకర్లో ఎండ్లో ఉన్న కేఎల్ రాహుల్తో చర్చించాడు. కొద్దిసేపు మాట్లాడకున్నాక జైశ్వాల్ చివరకు రివ్యూ కోసం వెళ్లాడు.అయితే జైస్వాల్ రివ్యూ అడగడానికి ముందే 15 సెకన్ల టైమర్ ముగిసినట్లు బిగ్ స్క్రీన్పై కన్పించింది. అయినప్పటికి అంపైర్ మాత్రం రివ్యూకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. దీంతో స్టోక్స్ అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగాడు.మైదానంలో ఉన్న ఇంగ్లండ్ అభిమానులు సైతం అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఆ సమయంలో స్టాండ్స్ నుంచి బిగ్గరగా అరుపులు వినిపించాయి. అయితే రిప్లేలో మాత్రం బంతి స్టంప్స్ను హిట్చేస్తున్నట్లు తేలడంతో జైశ్వాల్(28) మైదానాన్ని వీడక తప్పలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: IND vs ENG: ఉత్కంఠ పోరు.. ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమిpic.twitter.com/fJTJeyRZ4n— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) July 4, 2025Josh Tongue gets Jaiswal trapped in front! ☝️🇮🇳 5️⃣1️⃣-1️⃣ pic.twitter.com/raWBqQXjv4— England Cricket (@englandcricket) July 4, 2025 -
ఉత్కంఠ పోరు.. ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి
లండన్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో 5 పరుగుల తేడాతో భారత మహిళల జట్టు ఓటమిపాలైంది. ఆఖరివరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో భారత్పై ఇంగ్లండ్ పై చేయి సాధించింది. చివరి ఓవర్లో టీమిండియా విజయానికి 12 పరుగులు అవసరమయ్యాయి.క్రీజులో హర్మన్ ప్రీత్ కౌర్ ఉండడంతో మన అమ్మాయిలు విజయం సాధిస్తారని అంతా భావించారు. కానీ ఆ ఓవర్ వేసిన ఇంగ్లండ్ పేసర్ లారెన్ బెల్ అద్బుతంగా బౌలింగ్ చేసి తొలి ఐదు బంతుల్లో 6 పరుగులే మాత్రమే ఇచ్చింది. చివరి బంతికి ఆరు పరుగులు అవసరం కాగా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ క్యాచ్ ఔటైంది. దీంతో 172 పరుగుల లక్ష్య చేధనలో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 166 పరుగులే చేయగల్గింది. భారత బ్యాటర్లలో ఓపెనర్లు స్మృతి మంధాన (56: 49 బంతుల్లో 10 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయగా, షఫాలీ వర్మ (47: 25 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లు) చెలరేగింది. అయితే మంధాన ఎక్కువ బంతులు ఆడేయడంతో మిడిలార్డర్పై ఒత్తిడిపెరిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ ఫైలర్ రెండు, ఎకిలిస్టోన్, వాంగ్ తలా వికెట్ సాధించారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్లు సోఫియా డంక్లీ (75: 53 బంతుల్లో 7 ఫోర్లు ఒక సిక్స్), వ్యాట్ హాడ్జ్ (66: 42 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లు) చెలరేగారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.భారత బౌలర్లలో అరుంధతీ రెడ్డి 3, దీప్తి శర్మ 3, శ్రీ చరణి 2, రాధా యాదవ్ ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో ఇంగ్లండ్ సిరీస్ ఆశలను సజీవగా ఉంచుకుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-2తో భారత్ ఆధిక్యంలో కొనసాగుతోంది. మిగిలిన రెండు మ్యాచ్లో ఒక్కదాంట్లో గెలిస్తే చాలు సిరీస్ భారత్ సొంతమవుతోంది. ఇక ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 మాంచెస్టర్ వేదికగా జరగనుంది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన యశస్వి జైశ్వాల్.. తొలి భారత ప్లేయర్గా -
ఈ రోజు కోసమే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నా: మహ్మద్ సిరాజ్
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. తన సంచలన బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా లేని లోటును సిరాజ్ తీర్చాడు. తొలి ఇన్నింగ్స్లో సిరాజ్ మియా ఆరు వికెట్లతో సత్తాచాటాడు.రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని ఔట్ చేసిన సిరాజ్.. ఆ తర్వాత మూడో రోజు బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్ వంటి కీలక వికెట్లను పడగొట్టాడు. ఇంగ్లీష్ జట్టు టెయిలాండర్లను ఈ హైదారబాదీ వరుస క్రమంలో పెవిలియన్కు పంపాడు.ఒక ఇన్నింగ్స్లో సిరాజ్ ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ఇది నాలుగో సారి కావడం గమనార్హం. తన ప్రదర్శనపై మూడో రోజు ఆట అనంతరం సిరాజ్ స్పందించాడు. ఇది తనకు ఎంతో ప్రత్యేకమని అతడు చెప్పుకొచ్చాడు."ఇంగ్లండ్ గడ్డపై ఐదు వికెట్ల ప్రదర్శన కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నా. అందుకే నమ్మశక్యంగా అనిపించడం లేదు. నిజానికి నేను చాలా బాగా బౌలింగ్ చేస్తున్నా వికెట్లు మాత్రం రావడం లేదు. ఇప్పటి వరకు నాలుగు వికెట్లకు మించి తీయలేదు.ఇప్పుడు ఆరు వికెట్లు సాధించడం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. పిచ్ నెమ్మదిగా ఉన్నా క్రమశిక్షణతో సరైన చోట బంతులు వేస్తే ఫలితం రాబట్టవచ్చని నమ్మాను. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ పరుగులు నిరోధించే ప్రయత్నం చేశాను. మిగతా ఇద్దరితో పోలిస్తే నాకే అనుభవం ఎక్కువ కాబట్టి ఆ సవాల్ను స్వీకరించి బాధ్యతగా బౌలింగ్ చేశాను. బుమ్రా లేకపోవడంతో పేస్ బౌలింగ్ ఎటాక్ను లీడ్ చేశాను" అని విలేకరుల సమావేశంలో సిరాజ్ పేర్కొన్నాడు.ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆలౌటైంది. జెమీ స్మిత్(207 బంతుల్లో 21 ఫోర్లు, 4 సిక్స్లతో 184 నాటౌట్), హ్యారీ బ్రూక్(234 బంతుల్లో 17 ఫోర్లు, సిక్స్తో 158) భారీ సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరూ 6వ వికెట్కు 303 పరుగులు జోడించారు.భారత బౌలర్లలో సిరాజ్తో పాటు ఆకాష్ దీప్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్కు 180 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన యశస్వి జైశ్వాల్.. తొలి భారత ప్లేయర్గా -
చరిత్ర సృష్టించిన యశస్వి జైశ్వాల్.. తొలి భారత ప్లేయర్గా
బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్(Yashasvi Jaiswal) అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్లో 87 పరుగులు చేసిన జైశ్వాల్.. రెండో ఇన్నింగ్స్లో కేవలం 22 బంతుల్లో 28 పరుగులు సాధించాడు.కేఎల్ రాహుల్తో కలిసి 50 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని ఈ ముంబైకర్ నెలకొల్పాడు. ఈ క్రమంలో జైశ్వాల్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో 2000 పరుగులు మైలు రాయిని అత్యంతవేగంగా అందుకున్న భారత ప్లేయర్గా జైశ్వాల్ నిలిచాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో 10 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఫీట్ సాధించాడు. భారత ఓపెనర్ కేవలం 21 మ్యాచ్ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు.గవాస్కర్ రికార్డు బద్దలు..ఇంతకముందు ఈ రికార్డు టీమిండియా లెజెండ్ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) పేరిట ఉండేది. గవాస్కర్ 23 మ్యాచ్లలో ఈ మైల్స్టోన్ను సాధించాడు. గవాస్కర్ ఈ రికార్డును 1976లో సాధించాడు. తాజా మ్యాచ్తో 49 ఏళ్ల గవాస్కర్ ఆల్టైమ్ రికార్డును జైశూ బ్రేక్ చేశాడు. అయితే ఇన్నింగ్స్ల పరంగా మాత్రం ఈ ఫీట్ సాధించిన జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ సరసన జైశ్వాల్ నిలిచాడు. సెహ్వాగ్, ద్రవిడ్ ఈ ఘనతను 40 ఇన్నింగ్స్లలో సాధించగా.. జైస్వాల్ వారిని సమం చేశాడు. అయితే వారిద్దరికి ఈ ఫీట్ను అందుకోవడానికి 25 మ్యాచ్లు అవసరమయ్యాయి. ఓవరాల్గా ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్మాన్(15 మ్యాచ్లు) అగ్రస్ధానంలో ఉండగా.. జార్జ్ హెడ్లీ (17), హెర్బర్ట్ సట్క్లిఫ్ (22),మైఖేల్ హస్సీ (20), మార్నస్ లబుషేన్(20) ఉన్నారు.ఆరేసిన సిరాజ్..ఇక ఈ ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత్ పట్టు బిగించింది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియాకు 180 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 6 వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు ఆకాష్ దీప్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.ఇంగ్లండ్ బ్యాటర్లలో జేమీ స్మిత్ (184 నాటౌట్; 207 బంతుల్లో 21×4, 4×6), హ్యారీ బ్రూక్ (158; 234 బంతుల్లో 17×4, 1×6) అద్బుతమైన సెంచరీలతో మెరిశారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 64/1తో నిలిచింది. రాహుల్ (28), కరుణ్ నాయర్ (7) క్రీజులో ఉన్నారు.చదవండి: బ్రాత్వైట్ వరల్డ్ రికార్డు.. ఇక ముందు కూడా ఎవరికీ సాధ్యం కాదు! -
సిరాజ్ ‘సిక్సర్’
భారత బౌలింగ్ ధాటికి ఒకదశలో ఇంగ్లండ్ స్కోరు 84/5... ఇక మూడో రోజే మ్యాచ్ మన చేతికి చిక్కినట్లే అనిపించింది. అయితే జేమీ స్మిత్, హ్యారీ బ్రూక్ అసాధారణ బ్యాటింగ్తో ఎదురుదాడి చేసి ‘ట్రిపుల్ సెంచరీ’ భాగస్వామ్యం నెలకొల్పడంతో ఇంగ్లండ్ తేరుకోగలిగింది. హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఆరు వికెట్ల ప్రదర్శన శుక్రవారం ఆటలో హైలైట్గా నిలవగా, ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఆరుగురు ‘డకౌట్’ కావడం విశేషం. అయినా సరే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 180 పరుగులతో కలిపి ఇప్పటికే 244 పరుగులు ముందంజలో ఉన్న టీమిండియా మ్యాచ్ను శాసించే స్థితికి చేరింది. నేడు మన బ్యాటర్లు చెలరేగి ప్రత్యర్థి ముందు ఎంత లక్ష్యం ఉంచుతారనేది ఆసక్తికరం.బర్మింగ్హామ్: ఇంగ్లండ్తో రెండో టెస్టుపై భారత్ పట్టు బిగించింది. మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. ప్రస్తుతం జట్టు ఓవరాల్గా 244 పరుగుల ఆధిక్యంలో ఉంది. జైస్వాల్ (22 బంతుల్లో 28; 6 ఫోర్లు) అవుట్ కాగా... కేఎల్ రాహుల్ (38 బంతుల్లో 28 బ్యాటింగ్; 6 ఫోర్లు), కరుణ్ నాయర్ (7 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 77/3తో శుక్ర వారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 89.3 ఓవర్లలో 407 పరుగులకు ఆలౌటైంది. జేమీ స్మిత్ (207 బంతుల్లో 184 నాటౌట్; 21 ఫోర్లు, 4 సిక్స్లు), హ్యారీ బ్రూక్ (234 బంతుల్లో 158; 17 ఫోర్లు, 1 సిక్స్) భారీ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరు ఆరో వికెట్కు 303 పరుగులు జోడించారు. భారత పేసర్లు మొహమ్మద్ సిరాజ్ (6/70), ఆకాశ్దీప్ (4/88) కలిసి ప్రత్యరి్థని పడగొట్టారు. మెరుపు భాగస్వామ్యం... మూడో రోజు ఆటలో తొలి 10 బంతులు ముగిసేసరికి మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేసినట్లు అనిపించింది! ‘హైదరాబాద్ పేసర్’ సిరాజ్ వరుసగా రెండు చక్కటి బంతులతో రూట్ (22), స్టోక్స్ (0)లను పెవిలియన్ పంపించాడు. ఈ ఇన్నింగ్స్లో రెండోసారి ఇంగ్లండ్ వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. అయితే ఈ వికెట్ల తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బ్రూక్, స్మిత్ కలిసి బౌండరీలతో చెలరేగిపోయారు. వీరిద్దరిని నిలువరించేందుకు తీవ్రంగా ప్రయత్నించిన భారత బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడిన స్మిత్ 80 బంతుల్లోనే సెంచరీ (14 ఫోర్లు, 3 సిక్స్లు) సాధించడం విశేషం. తొలి సెషన్లో ఇంగ్లండ్ 27 ఓవర్లలో ఏకంగా 172 పరుగులు రాబట్టడం విశేషం. తప్పిన ఫాలోఆన్... లంచ్ తర్వాత కూడా బ్రూక్, స్మిత్ అంతే పట్టుదలతో బ్యాటింగ్ను కొనసాగించారు. ఈ క్రమంలో బ్రూక్ కూడా 137 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా, భాగస్వామ్యం 200 పరుగులు దాటింది. రెండో సెషన్లో ఒక్క వికెట్ కూడా కోల్పోని ఇంగ్లండ్ 28 ఓవర్లలో 106 పరుగులు జోడించింది. విరామానంతరం సిరాజ్ ఓవర్లో స్మిత్ స్వే్కర్ లెగ్ దిశగా ఆడి రెండు పరుగులు తీయడంతో పార్ట్నర్íÙప్ 300 పరుగులకు చేరింది. అయితే ఎట్టకేలకు ఈ జోడీని ఆకాశ్దీప్ విడదీశాడు. కొత్త బంతితో వేసిన మూడో ఓవర్లోనే బ్రూక్ను ఆకాశ్దీప్ బౌల్డ్ చేయగా... తర్వాతి ఓవర్లోనే ఇంగ్లండ్కు ఫాలో ఆన్ ప్రమాదం తప్పింది. అయితే ఆ తర్వాత 12 పరుగుల వ్యవధిలో చివరి 4 వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 587; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) నాయర్ (బి) సిరాజ్ 19; డకెట్ (సి) గిల్ (బి) ఆకాశ్దీప్ 0; పోప్ (సి) రాహుల్ (బి) ఆకాశ్దీప్ 0; రూట్ (సి) పంత్ (బి) సిరాజ్ 22; బ్రూక్ (బి) ఆకాశ్దీప్ 158; స్టోక్స్ (సి) పంత్ (బి) సిరాజ్ 0; స్మిత్ (నాటౌట్) 184; వోక్స్ (సి) నాయర్ (బి) ఆకాశ్దీప్ 5; కార్స్ (ఎల్బీ) (బి) సిరాజ్ 0; టంగ్ (ఎల్బీ) (బి) సిరాజ్ 0; బషీర్ (బి) సిరాజ్ 0; ఎక్స్ట్రాలు 19; మొత్తం (89.3 ఓవర్లలో ఆలౌట్) 407.వికెట్ల పతనం: 1–13, 2–13, 3–25, 4–84, 5–84, 6–387, 7–395, 8–396, 9–407, 10–407. బౌలింగ్: ఆకాశ్దీప్ 20–2–88–4, సిరాజ్ 19.3–3–70–6, ప్రసిధ్ 13–1–72–0, నితీశ్ రెడ్డి 6–0–29–0, జడేజా 17–2–70–0, సుందర్ 14–0–73–0. భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (ఎల్బీ) (బి) టంగ్ 28; రాహుల్ (బ్యాటింగ్) 28; నాయర్ (బ్యాటింగ్) 7; ఎక్స్ట్రాలు 1; మొత్తం (13 ఓవర్లలో వికెట్ నష్టానికి) 64. వికెట్ల పతనం: 1–51. బౌలింగ్: వోక్స్ 5–0–28–0, కార్స్ 5–1–23–0, టంగ్ 3–1–12–1. ఒకే ఓవర్లో 23 పరుగులు... ప్రసిధ్ కృష్ణ ఓవర్లో స్మిత్ చెలరేగిన తీరు ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో హైలైట్గా నిలిచింది. ఈ ఓవర్లో తొలి బంతికి పరుగు తీయని స్మిత్ ఆ తర్వాత వరుసగా 4, 6, 4, 4, (వైడ్), 4 బాదడంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. తొలి టెస్టులోనే ఆరుకు పైగా ఎకానమీతో చెత్త బౌలింగ్ ప్రదర్శన చేసిన ప్రసిధ్ ఈ టెస్టులోనూ ఘోరంగా విఫలమయ్యాడు.క్యాచ్లు చేజారె... మూడో రోజు ఆటలో బ్రూక్, స్మిత్ జోరును నిలువరించేందుకు కొన్ని అవకాశాలు వచి్చనా అవి వృథా అయ్యాయి. మరీ సులువైనవి కాకపోయినా... మూడు క్యాచ్లు వదిలేయడం ఇంగ్లండ్కు మేలు చేసింది. జడేజా బౌలింగ్లో బ్రూక్ (వ్యక్తిగత స్కోరు 63) ఇచ్చిన క్యాచ్ను గిల్ అందుకోలేకపోయాడు. వేగంగా వచి్చన బంతి అతని తలకు కూడా తగిలింది. తన బౌలింగ్లోనే స్మిత్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్ (స్కోరు 90)ను సుందర్ చేజార్చాడు. ఆ తర్వాత నితీశ్ బౌలింగ్లో స్మిత్ (స్కోరు 121) ఇచి్చన క్యాచ్ను పంత్ నేలపాలు చేశాడు.⇒ 4 సిరాజ్ కెరీర్లో నాలుగో సారి ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఈ నాలుగూ వేర్వేరు దేశాల్లో (ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్) రావడం విశేషం. -
ENG VS IND 2nd Test: ఆరేసిన సిరాజ్.. 407 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
ఎడ్జ్బాస్టన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184 నాటౌట్) భారీ సెంచరీలు చేసి ఇంగ్లండ్ను గట్టెక్కించారు. 84 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఇంగ్లండ్ను బ్రూక్, స్మిత్ అద్భుతమైన ఇన్నింగ్స్లతో ఆదుకున్నారు. వీరిద్దరు ఆరో వికెట్కు 303 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లండ్ను తిరిగి ఆటలోకి తెచ్చారు. బ్రూక్, స్మిత్ ద్వయం సగం వికెట్లు కోల్పోయినా డిఫెన్స్లో పడకుండా భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో స్మిత్ 80, బ్రూక్ 137 బంతుల్లో సెంచరీలు పూర్తి చేశారు.387 పరుగుల వద్ద బ్రూక్ ఔటయ్యాక ఇంగ్లండ్ మరో 20 పరుగుల వ్యవధిలో చివరి 5 వికెట్లు కోల్పోయింది. జేమీ స్మిత్ అర్హమైన డబుల్ సెంచరీని మిస్ అయ్యాడు. అతనికి మరికొద్ది బంతులు అవకాశం దొరికినా డబుల్ పూర్తి చేసేవాడు. బ్రూక్ను ఆకాశ్దీప్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ పతనం మొదలైంది. ఆతర్వాత కొద్ది సేపటికే ఆకాశ్దీప్ క్రిస్ వోక్స్ను కూడా పెవిలియన్కు పంపాడు. చివరి 3 వికెట్లను సిరాజ్ పడగొట్టాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఆరుగురు (డకెట్, పోప్, స్టోక్స్, కార్స్, టంగ్, బసీర్) డకౌట్ అయ్యారు. క్రాలే 19, రూట్ 22, వోక్స్ 5 పరుగులు చేశారు. ఇంగ్లండ్ స్కోర్లో 80 శాతం పరుగులు బ్రూక్, స్మిత్లే చేశారు. భారత బౌలర్లలో సిరాజ్ (6/70), ఆకాశ్దీప్ (4/88) అద్భుతంగా బౌలింగ్ చేసి మొత్తం వికెట్లు తీశారు. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. మొత్తంగా భారత్కు 180 పరుగుల కీలకమైన ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్.. శుక్రవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 28 పరుగుల చేసి ఔట్ కాగా.. కే ఎల్ రాహూల్ 28 , కరుణ్ నాయర్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 244 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీతో (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి భారత్కు భారీ స్కోర్ అందించాడు. భారత ఇన్నింగ్స్లో గిల్తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు. -
వరుస సెంచరీలు.. జట్టులో స్థానం గల్లంతు
బంగ్లాదేశ్ టెస్ట్ జట్టు కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటోపై వేటు పడింది. త్వరలో శ్రీలంకతో జరుగబోయే టీ20 సిరీస్ కోసం అతన్ని ఎంపిక చేయలేదు. ఇటవలి కాలంలో షాంటో పొట్టి ఫార్మాట్లో పేలవ ఫామ్లో ఉన్నాడు. ఈ కారణంగానే అతన్ని టీ20 జట్టు నుంచి తప్పించినట్లు సెలెక్టర్లు తెలిపారు. బ్యాటింగ్పై దృష్టి సారించేందుకు షాంటో ఇటీవలే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఈ లోపే అతన్ని జట్టు నుంచే తప్పించారు. షాంటో ప్రస్తుత శ్రీలంక పర్యటనలో జరిగిన తొలి టెస్ట్లో రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేశాడు. అయినా అతన్ని టీ20 జట్టు నుంచి తొలగించారు. షాంటో గత కొద్ది రోజులుగా తరుచూ వార్తల్లో నిలుస్తున్నాడు. బోర్డుతో విబేధాల కారణంగా అతను టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని వార్తలు వస్తున్నాయి. షాంటో గతేడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ ఆల్ ఫార్మాట్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. అనంతర పరిణామాల్లో అతను పరిమిత ఓవర్ల కెప్టెన్సీని వదిలి పెట్టాడు. జులై 10 నుంచి శ్రీలంకతో జరుగబోయే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టును ఇవాళ (జులై 4) ప్రకటించారు. ఈ జట్టులో షాంటోతో పాటు మరో ఐదుగులు స్థానాలు కోల్పోయారు. పాకిస్తాన్తో చివరిగా ఆడిన జట్టులో సభ్యులైన సౌమ్య సర్కార్, హసన్ మహమూద్, తన్వీర్ ఇస్లాం, నహీద్ రాణా, ఖలీద్ అహ్మద్ లంకతో సిరీస్కు ఎంపిక కాలేదు. ఆల్రౌండర్ మొహమ్మద్ సైఫుద్దీన్ ఏడాది తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. తస్కిన్ అహ్మద్, షొరీఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహ్మాన్, నసుమ్ అహ్మద్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. జులై 10, 13, 16 తేదీల్లో పల్లెకెలె, డంబుల్లా, కొలొంబో వేదికలుగా శ్రీలంకతో మూడు టీ20లు జరుగనున్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ శ్రీలంకతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ శ్రీలంక 77 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను శ్రీలంక 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో తొలి టెస్ట్ డ్రా కాగా.. రెండో టెస్ట్లో శ్రీలంక ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రేపు కొలొంబో వేదికగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే జరుగుతుంది.శ్రీలంకతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు.. లిట్టన్ కుమార్ దాస్ (కెప్టెన్), తంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, మహ్మద్ నయీమ్ షేక్, తౌహిద్ హృదయ్, జాకెర్ అలీ అనిక్, షమీమ్ హుస్సేన్ పట్వారీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషద్ హుస్సేన్, షాక్ మహిదీ హసన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షొరీఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్ సాకిబ్, మహ్మద్ సైఫుద్దీన్. -
ఇంగ్లండ్లో కొనసాగుతున్న టీమిండియా యువ సంచలనం హవా.. మరో సెంచరీ, 6 వికెట్లు
ఇంగ్లండ్ పర్యటనలో భారత యువ సంచలనం ముషీర్ ఖాన్ హవా కొనసాగుతోంది. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎమర్జింగ్ టీమ్ (MCA Colts) తరఫున ఇంగ్లండ్లో పర్యటిస్తున్న ముషీర్.. వరుసగా రెండు మ్యాచ్ల్లో అదిరిపోయే ఆల్రౌండ్ ప్రదర్శనలతో అదరగొట్టాడు.Notts 2nd XIతో జరిగిన తొలి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్లో 123 పరుగులు (127 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో) చేసిన ముషీర్.. ఆతర్వాత బౌలింగ్లో 6 వికెట్ల ప్రదర్శన (8.2 ఓవర్లలో 6/31) నమోదు చేశాడు.తాజాగా రెండో మ్యాచ్లోనూ ముషీర్ తొలి మ్యాచ్ తరహా ప్రదర్శనలు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్లో కూడా ముషీర్ సెంచరీ, 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసి భారత క్రికెట్ అభిమానులు ముషీర్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.భారత క్రికెట్కు మరో భవిష్యత్తు తార దొరికాడని ఆకాశానికెత్తుతున్నారు. ముషీర్కు సంబంధించిన తాజా వార్త ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతుంది.కారు ప్రమాదం నుంచి బయటపడి..!20 ఏళ్ల ముషీర్ గతేడాది సెప్టెంబర్లో కారు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో ముషీర్ మెడకు బలమైన గాయమైంది. ఆ ప్రమాదం తర్వాత ముషీర్ ఆడుతున్న తొలి రెడ్ బాల్ టోర్నీ ఇదే. ముషీర్ తన చివరి రెడ్ బాల్ మ్యాచ్ను దులీప్ ట్రోఫీలో ఇండియా-బి తరఫున ఆడాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ముషీర్ ఐపీఎల్ 2025లో ఆడాడు (పంజాబ్ కింగ్స్ తరఫున ఓ మ్యాచ్). ఆర్సీబీతో జరిగిన ఆ మ్యాచ్లో ముషీర్ డకౌటై నిరాశపరిచాడు. ఆ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన ముషీర్ 3 బంతులు ఎదుర్కొని సుయాశ్ శర్మ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అయితే ఇదే మ్యాచ్లో ముషీర్ బంతితో పర్వాలేదనిపించాడు. 2 ఓవర్లలో 27 పరుగులిచ్చి మయాంక్ అగర్వాల్ వికెట పడగొట్టాడు.ముషీర్ ఖాన్ మరో టీమిండియా అప్ కమింగ్ మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు. ముషీర్కు దేశవాలీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. 2022-23 రంజీ సీజన్లో ముంబై తరఫున అరంగేట్రం చేసిన ముషీర్.. ఆడిన 9 మ్యాచ్ల్లో 51.14 సగటున 3 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 716 పరుగులు చేశాడు. ఇందులో ఓ అజేయ డబుల్ సెంచరీ కూడా ఉంది.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ముషీర్ బౌలర్గానూ రాణించాడు. 9 మ్యాచ్ల్లో 8 వికెట్లు తీశాడు. ముషీర్ 2024 అండర్-19 వరల్డ్కప్లో భారత జట్టు సభ్యుడిగా ఉన్నాడు. టీమిండియా రన్నరప్గా నిలిచిన ఈ టోర్నీలో ముషీర్ రెండు సెంచరీలు చేశాడు. 2024 రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన ముషీర్.. ముంబై తరఫున రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. -
బ్రాత్వైట్ వరల్డ్ రికార్డు.. ఇక ముందు కూడా ఎవరికీ సాధ్యం కాదు!
వెస్టిండీస్ క్రికెటర్ క్రెయిగ్ బ్రాత్వైట్ (Kraigg Brathwaite) అరుదై ఘనత సాధించాడు. విండీస్ తరఫున వంద టెస్టులు పూర్తి చేసుకున్న ఈ మాజీ కెప్టెన్.. ఇంత వరకు ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ క్రమంలో టీ20 క్రికెట్ ప్రవేశపెట్టిన తర్వాత.. పొట్టి ఫార్మాట్లో అరంగేట్రం చేయకుండా వంద టెస్టుల క్లబ్లో చేరిన తొలి ఆటగాడిగా నిలిచాడు.ఏకైక క్రికెటర్గాకాగా బ్రాత్వైట్ విండీస్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లోనూ.. అదే విధంగా లీగ్ క్రికెట్లోనూ ఒక్క పొట్టి మ్యాచ్ కూడా ఆడకపోవడం విశేషం. ప్రపంచంలో ఇలా టీ20 మ్యాచ్ ఆడకుండానే.. టెస్టుల్లో వంద మ్యాచ్ల మైలురాయిని అందుకున్న ఏకైక క్రికెటర్గా బ్రాత్వైట్ గుర్తింపు పొందాడు. ఆస్ట్రేలియా (WI vs AUS)తో తాజా సిరీస్ రెండో టెస్టు సందర్బంగా ఈ ఘనత సాధించాడు. ఈ టీ20 లీగ్ల జమానాలో బ్రాత్వైట్ మాదిరి ఇలాంటి రికార్డు ఇక ముందు కూడా ఎవరికీ సాధ్యం కాదని చెప్పవచ్చు. కాగా మూడు టెస్టులు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడేందుకు ఆస్ట్రేలియా వెస్టిండీస్లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా బార్బడోస్లో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ 159 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. ఈ క్రమంలో గురువారం ఇరుజట్ల మధ్య గ్రెనెడా వేదికగా రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. తొలిరోజు ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్లో 286 పరుగులకు ఆలౌట్ అయింది. బ్యూ వెబ్స్టర్ (60), వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ (63) అర్ధ శతకాలతో రాణించారు.వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ నాలుగు వికెట్లు కూల్చగా.. జేడన్ సీల్స్ రెండు, షమార్ జోసెఫ్, ఆండర్సన్ ఫిలిప్, జస్టిన్ గ్రీవ్స్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. విండీస్ టెస్టు స్పెషలిస్టు అయిన బ్రాత్వైట్కు సంప్రదాయ ఫార్మాట్లో ఇది వందో మ్యాచ్.ఇక 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన 32 ఏళ్ల బ్రాత్వైట్.. 39 టెస్టుల్లో విండీస్కు సారథ్యం వహించాడు. విండీస్ తరఫున ప్రస్తుతం ఆటగాడిగా కొనసాగుతున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 100 టెస్టులు పూర్తి చేసుకున్న పదో వెస్టిండీస్ ప్లేయర్. ఓవరాల్గా 82వ ఆటగాడు.బ్రాత్వైట్ చెత్త రికార్డువంద టెస్టులు ఆడిన టాప్-6 స్పెషలిస్టు బ్యాటర్లలో లోయస్ట్ యావరేజ్ బ్రాత్వైట్దే. అతడి బ్యాటింగ్ సగటు 32.83 కాగా.. తర్వాతి స్థానంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (36.11) ఉన్నాడు. ఇదిలా ఉంటే.. బ్రాత్వైట్ ఖాతాలో మొత్తం పన్నెండు శతకాలు ఉన్నాయి. కాగా 100 టెస్టు క్లబ్లో అతి తక్కువ శతకాలు బాదిన ఆటగాడిగా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ (7 శతకాలు) ఉండగా.. అతడి తర్వాతి స్థానం బ్రాత్వైట్దే. చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ!.. చరిత్ర సృష్టించిన జేమీ స్మిత్.. ఇంగ్లండ్ తొలి ప్లేయర్గా.. -
నా హృదయం ముక్కలైంది.. కుల్దీప్ యాదవ్ భావోద్వేగం
పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ డియాగో జోటాకు టీమిండియా క్రికెటర్ కుల్దీప్ యాదవ్ నివాళి అర్పించాడు. జోటా మరణంతో ఫుట్బాల్ ప్రపంచం మొత్తం మూగబోయిందని.. అతడు లేని లోటు ఎవరూ పూడ్చలేరంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. నా హృదయం ముక్కలైందిఈ మేరకు.. ‘‘2020 (లివర్పూల్)లో ఒప్పందం.. 20వ నంబర్ను సాధించావు.. అదే నీ శాశ్వత గుర్తింపుగా మార్చుకున్నావు. ఈరోజు ఫుట్బాల్ ఒక్కటే నిన్ను కోల్పోలేదు.ప్రపంచం మొత్తం చీకటిగా మారింది. పిచ్పై అడుగుపెట్టేటపుడు నీ చిరునవ్వే ఉజ్వలమైన కాంతిలా అనిపించేది. పోర్టో లేదంటే వోల్వ్స్.. లేదంటే లివర్పూల్.. ఎక్కడ ఉన్నా నువ్వు అందరి హృదయాలను గెలుచుకున్నావు.నీ కుటుంబానికి ఆ దేవుడు ధైర్యం అందించాలి. నీ ఆత్మకు శాంతి చేకూరాలి డియాగో’’ అంటూ ఇన్స్టా స్టోరీలో కుల్దీప్ యాదవ్ భావోద్వేగపూరిత నోట్ రాశాడు. హార్ట్బ్రేక్ ఎమోజీతో తన అభిమాన ఆటగాడికి నివాళి అర్పించాడు.కారు ప్రమాదంలో..కాగా పోర్చుగల్ ఫుట్బాల్ జట్టు ఫార్వర్డ్ ప్లేయర్ డియాగో జోటా రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన విషయం విదితమే. స్పెయిన్లో జరిగిన కారు ప్రమాదంలో 28 ఏళ్ల డియాగో జోటాతో పాటు అతడి సోదరుడు ఆండ్రె సిల్వా (25) దుర్మరణం పాలయ్యాడు. జమోరా నగరంలో బుధవారం అర్ధరాత్రి దాటాక ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో ఇతర వాహనాల ప్రమేయం లేదని... అతి వేగంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు.ఈ బంధం శాశ్వతంఅయితే ఘటన జరిగిన సమయంలో కారు ఎవరు నడుపుతున్నారనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. జోటా ఇటీవలే తన ప్రియురాలు రూట్ కార్డోసోను వివాహమాడాడు. ‘ఈ బంధం శాశ్వతం’ అని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించిన వారాల్లోనే అనుకోని ప్రమాదంలో జొటా కన్నుమూశాడు. వీరికి ముగ్గురు సంతానం.గత నెలలో పోర్చుగల్ జాతీయ జట్టు నేషన్స్ లీగ్ టైటిల్ సాధించడంలో జోటా కీలక పాత్ర పోషించాడు. మరోవైపు ఆండ్రె సిల్వా పోర్చుగల్ క్లబ్ పినాఫైల్ తరఫున పలు డివిజన్ లీగ్లలో పాల్గొన్నాడు. ‘ఈ విషాదం తీవ్రంగా బాధిస్తోంది’ అని లివర్పూల్ ఫుట్బాల్ క్లబ్ ప్రకటించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో జోటా, ఆండ్రె కుటుంబానికి అండగా ఉంటామని వెల్లడించింది.లివర్పూల్ ప్రధాన ఆయుధం ప్రముఖ ఫుట్బాల్ క్లబ్ లివర్పూల్ తరఫున 123 మ్యాచ్లాడిన జోటా 47 గోల్స్ సాధించాడు. లెఫ్ట్ వింగ్లో ఫార్వర్డ్గా ఆడే డియాగో జోటా... అద్వితీయమైన ఫినిషింగ్, ప్రత్యర్థికి అంతుచిక్కని డ్రిబ్లింగ్లో సిద్ధహస్తుడు. చిన్నప్పటి నుంచి ఆటను ప్రేమించిన జోటా... జూనియర్ స్థాయిలో సంచలనాలతో వెలుగులోకి వచ్చాడు.లా లీగాలో అట్లెటికో మాడ్రిడ్ తరఫున 2016 నుంచి రెండు సీజన్లు ఆడిన జోటా... ఆ తర్వాత వివిధ క్లబ్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2020 నుంచి లివర్పూల్ తరఫున కొనసాగుతున్న జొటా... మూడు మేజర్ ట్రోఫీలు గెలుచుకున్నాడు. గత సీజన్లో ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలిచిన జట్టులో డియాగో ప్రధాన సభ్యుడు. ఇక 2019లో పోర్చుగల్ జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసిన జోటా... కెరీర్లో 49 మ్యాచ్లాడి 14 గోల్స్ చేశాడు. ఇది తీరని లోటు... పోర్చుగల్ సాకర్ సమాఖ్య కూడా జోటా మృతికి సంతాపం తెలిపింది. ‘ఇది పూడ్చలేని లోటు. జాతీయ జట్టు తరఫున 50కి పైగా మ్యాచ్లు ఆడిన అద్భుత ఆటగాడు ఇలా అర్ధాంతరంగా మృతిచెందడం కలచివేస్తోంది. సహచరులు, ప్రత్యర్థులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవించే అత్యుత్తమ ఆటగాడు అప్పుడే లోకం వీడి వెల్లడం బాధగా ఉంది’ అని ఒక ప్రకటనలో తెలిపింది.జోటా మృతికి సంతాపంగా... గురువారం పోర్చుగల్, స్పెయిన్ మహిళల జట్ల మధ్య యూరోపియన్ చాంపియన్షిప్ మ్యాచ్కు ముందు ఇరు జట్ల ఆటగాళ్లు ఒక నిమిషం పాటు మౌనం వహించారు. పోర్చుగల్ ప్రధానమంత్రి లూయిస్ మోంటెనెగ్రో కూడా డియాగో జోటా మృతికి సంతాపం ప్రకటించారు.‘మేము ఇద్దరు చాంపియన్లను కోల్పోయాము. వారి లోటు పోర్చుగల్ సాకర్కు తీరని లోటు. వారి వారసత్వాన్ని గౌరవించేందుకు మా వంతు కృషి చేస్తాం. దేశ ఖ్యాతిని పెంచిన ఆటగాళ్లో జోటా ఒకడు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. ఇది సాకర్కు విషాదకరమైన రోజు’ అని పేర్కొన్నారు.ఇక సహచర ఆటగాడు పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో... ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ‘ఇప్పటి వరకు జాతీయ జట్టులో డియాగోతో కలిసి ఆడాను. ఇంతలో ఇలా ఎలా జరిగిందో. ఇటీవలే జోటా వివాహం జరిగింది. కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతాడు అనుకుంటే ఊహించని ఘటన అతడిని దూరం చేసింది. ఈ క్లిష్ట సమయంలో అతడి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. మేమందరం మిమ్మల్ని మిస్ అవుతాము’ అని రొనాల్డో అన్నాడు.మరోవైపు.. బాస్కెట్బాల్ దిగ్గజం లెబ్రాన్ జేమ్స్తో పాటు టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ వంటి పలు ప్లేయర్లతో పాటు... ఇతర క్లబ్లు, పలువురు ప్రముఖులు కూడా సంతాపం ప్రకటించారు. టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా జోటా మృతికి సంతాపం తెలిపాడు. కాగా కుల్దీప్ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాడు. అయితే, తొలి రెండు టెస్టుల్లోనూ అతడికి తుదిజట్టులో ఆడే అవకాశం లభించలేదు. చదవండి: వింబుల్డన్లో సంచలనాల మోత.. టాప్ సీడ్లకు ఊహించని షాకులు -
ENG VS IND 2nd Test: శతక్కొట్టిన బ్రూక్.. కేవలం 44 ఇన్నింగ్స్ల్లోనే..!
ఎడ్జ్బాస్టన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ సెంచరీతో మెరిశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యతను భుజాన వేసుకున్న బ్రూక్ తన శైలికి విరుద్దంగా ఎంతో సంయమనంతో ఆడి 137 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బ్రూక్కు ఇది టెస్ట్ల్లో తొమ్మిదో సెంచరీ. బ్రూక్ ఈ తొమ్మిది సెంచరీలను కేవలం 44 ఇన్నింగ్స్ల్లో చేశాడు. తద్వారా ఇంగ్లండ్ క్రికెట్లో అత్యంత వేగంగా తొమ్మిది సెంచరీలు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.ఇంగ్లండ్ తరఫున అతి తక్కువ ఇన్నింగ్స్ల్లో తొమ్మిది టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్లు37 - డెనిస్ కాంప్టన్43 - హెర్బర్ట్ సట్క్లిఫ్44 - హ్యారీ బ్రూక్50 - వాలీ హామండ్52 - మైఖేల్ వాన్26 ఏళ్ల బ్రూక్ 44 టెస్ట్ ఇన్నింగ్స్ల్లో ఓ డబుల్ సెంచరీ, 9 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీల సాయంతో 60.48 సగటున 2540 పరుగులు చేశాడు. బ్రూక్ స్ట్రయిక్రేట్ 87కి పైగా ఉండటం విశేషం.మ్యాచ్ విషయానికొస్తే.. మూడో రోజు లంచ్ విరామం తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 284/5గా ఉంది. బ్రూక్ (102), జేమీ స్మిత్ (126) క్రీజ్లో ఉన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంగ్లండ్ ఇంకా 303 పరుగులు వెనుకపడి ఉంది. బ్రూక్, స్మిత్ ఆరో వికెట్కు అజేయమైన 200 పరుగులు జోడించారు.లంచ్కు ముందు జేమీ స్మిత్ సెంచరీ పూర్తి చేశాడు. స్మిత్ కేవలం 80 బంతుల్లోనే శతక్కొట్టి టెస్ట్ల్లో ఇంగ్లండ్ తరఫున నాలుగో వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో క్రాలే (19), బెన్ డకెట్ (0), ఓలీ పోప్ (0) నిన్న ఔట్ కాగా.. రూట్ (22), స్టోక్స్ (0) ఇవాళ ఆట ప్రారంభం కాగానే పెవిలియన్కు చేరారు. భారత బౌలర్లలో సిరాజ్ 3, ఆకాశ్దీప్ 2 వికెట్లు పడగొట్టారు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీతో (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి భారత్కు భారీ స్కోర్ అందించాడు. భారత ఇన్నింగ్స్లో గిల్తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు. -
అయ్యో జడేజా.. టైం అయిపోయిందంటూ..!
ప్రస్తుత టీమిండియా టెస్ట్ టీమ్లో అందరికంటే సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజా. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్ కావడంతో జట్టులో సీనియర్గా కొనసాగుతున్నాడు జడ్డూ. ఇంగ్లండ్తో జరుగుతున్న తాజా టెస్ట్ సిరీస్లో శుబ్మన్ గిల్ నాయకత్వంలోని జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నాడు. రెండో టెస్టులో కీలకమైన ఇన్నింగ్స్ ఆడి.. జట్టు భారీ స్కోరు చేయడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఆట రెండో రోజు 89 పరుగులు చేసి జట్టుకు తన విలువను మరోసారి గుర్తు చేశాడీ సీనియర్ ఆల్రౌండర్. కెప్టెన్ గిల్తో కలిసి కీలకమైన 203 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆరో వికెట్ అంతకంటే దిగువ స్థానాల్లో 200 పరుగులు భాగస్వామ్యాల్లో పాలుపంచుకోవడం జడేజాకు ఇది మూడోసారి.కాగా, ఇంగ్లండ్తో సెకండ్ టెస్ట్ మ్యాచ్లో రెండో రోజు ఆట ముగిసిన తర్వాత జడేజాకు మీడియా నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. కెప్టెన్సీపై ఇంకా ఆశలు ఉన్నాయా అని మీడియా ప్రతినిధి అడగ్గా.. చిరునవ్వుతో లేదన్నట్టుగా సమాధానం ఇచ్చాడు. 'వో టైమ్ గయా' (ఆ సమయం దాటిపోయింది) అని వ్యాఖ్యానించాడు.చాన్స్ లేదా?నిజంగానే అతడికి సమయం మించిపోయిందని క్రీడావ్యాఖ్యతలు అభిప్రాయపడుతున్నారు. జడేజా వయసు ఇప్పుడు 35 ఏళ్లు. ఇంకో రెండుమూడేళ్లు క్రికెట్ ఆడినా కూడా అతడికి కెప్టెన్ చాన్స్ రాదు. ఎందుకంటే జట్టు ప్రయోజనాలను గమనంలోకి తీసుకుని గిల్కు టెస్ట్ టీమ్ సారథ్య బాధ్యతలు కట్టబెట్టింది బీసీసీఐ. నాయకత్వ బాధ్యతను భుజానికెత్తుకోవడానికి బుమ్రా నిరాకరించడంతో గిల్కు చాన్స్ దక్కింది. బహుశా రోహిత్ శర్మ తప్పుకున్న తర్వాత వన్డే జట్టు పగ్గాలు కూడా శుబ్మన్కే దక్కుతాయి. ఈ నేపథ్యంలోనే తనకు ఇక చాన్స్ లేదని జడేజా వ్యాఖ్యానించి ఉంటాడని క్రీడావ్యాఖ్యతలు పేర్కొంటున్నారు.కలిసిరాని కెప్టెన్సీఅయితే దేశం తరపున జాతీయ జట్టుకు నాయకత్వం వహించే చాన్స్ రాకపోయినా.. మరోవిధంగా అతడికి కెప్టెన్సీ దక్కింది. సారథిగా తనకు వచ్చిన అవకాశాన్ని జడేజా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు 2022లో కెప్టెన్గా చాన్స్ దక్కించకున్నాడు. వరుస పరాజయాలతోనే మధ్యలోనే నాయకత్వం నుంచి వైదొలగడంతో మళ్లీ ధోనికే పగ్గాలు అప్పగించాల్సి వచ్చింది. ఆ రకంగా చూస్తే కెప్టెన్సీ జడ్డూకు కలిసిరాలేదనే చెప్పాలి.నంబర్ 1 ఆల్రౌండర్ఆల్రౌండర్గా జడేజా ఆటకు పేరు పెట్టలేం. బ్యాట్తోనే కాకుండా బంతితో కూడా తానేంటో నిరూపించుకున్నాడు. మెరుపు ఫీల్డింగ్తో జట్టు విజయాల్లో ఎన్నోసార్లు కీలకపాత్ర పోషించాడు. ఇప్పటికీ యంగ్ ప్లేయర్స్తో పోటీ పడుతూ మైదానంలో విన్యాసాలు చేస్తుంటాడు. చాలా సందర్భాల్లో జట్టును కష్టాల నుంచి గట్టెక్కించిన ఘనత అతడికి ఉంది. అందుకే ఐసీసీ టెస్ట్ ఆల్రౌండర్ల ర్యాంకుల్లో టాప్లో కొనసాగుతున్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన జడేజా.. డబ్ల్యూటీసీలో తొలి ప్లేయర్ గిల్ గురించి జడేజా.. ఆటగాడి నుంచి టెస్ట్ కెప్టెన్ వరకు గిల్ ఎదుగుదల గురించి మీడియా ప్రతినిధులు జడేజాను అడగ్గా.. శుబ్మన్ గిల్ (shubhman gills) ఎంత ఎదిగాడో మీరు చూడలేదా? అంటూ ఎదురు ప్రశ్నించాడు. డబుల్ సెంచరీ చేసిన గిల్ను ప్రశంసించాడు. సుదీర్ఘ భాగస్వామ్యం నెలకొల్పాలని తామిద్దం మాట్లాడుకున్నామని వెల్లడించాడు. -
ENG VS IND 2nd Test: చరిత్ర సృష్టించిన బ్రూక్.. కొనసాగుతున్న పరుగుల ప్రవాహం
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ ఖాతాలో మరో భారీ రికార్డు చేరింది. బంతుల పరంగా (2832) టెస్ట్ల్లో అత్యంత వేగంగా 2500 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ పేరిట ఉండేది. బాబర్ 62 ఇన్నింగ్స్ల్లో 3806 బంతులు ఎదుర్కొని ఈ మైలురాయిని తాకాడు.అయితే బ్రూక్ బాబర్ కంటే చాలా తక్కువ బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. ఇన్నింగ్స్ పరంగా కూడా బాబర్కు బ్రూక్కు భారీ తేడాతో ఉంది. ఈ మైలురాయిని చేరుకునేందుకు బాబర్కు 62 ఇన్నింగ్స్లు అవసరమైతే.. బ్రూక్ కేవలం 44 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించాడు.బ్రూక్ టెస్ట్ కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. 26 ఏళ్ల బ్రూక్ కేవలం 44 టెస్ట్ ఇన్నింగ్స్ల్లోనే ఓ డబుల్ సెంచరీ, 8 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీల సాయంతో 60.21 సగటున 2529 పరుగులు చేశాడు. బ్రూక్ స్ట్రయిక్రేట్ 88కి పైగా ఉండటం విశేషం. ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్లో బ్రూక్ ఈ ఘనత సాధించాడు.మెరుపు శతకంఈ మ్యాచ్లో బ్రూక్ 127 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్ సాయంతో 91 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. మరో ఎండ్లో జేమీ స్మిత్ మెరుపు సెంచరీ సాధించాడు. స్మిత్ కేవలం 80 బంతుల్లోనే శతక్కొట్టి టెస్ట్ల్లో ఇంగ్లండ్ తరఫున నాలుగో వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. స్మిత్ 82 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. మూడో రోజు లంచ్ విరామం సమయానికి ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంగ్లండ్ ఇంకా 338 పరుగులు వెనుకపడి ఉంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో క్రాలే (19), బెన్ డకెట్ (0), ఓలీ పోప్ (0) నిన్ననే ఔటయ్యారు. బుమ్రా స్థానంలో ఈ మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్దీప్ వరుస బంతుల్లో తొలి టెస్ట్ సెంచరీ హీరోలు బెన్ డకెట్, ఓలీ పోప్లను డకౌట్ చేశాడు. అప్పటికి ఇంగ్లండ్ స్కోర్ 13 పరుగులు మాత్రమే. 25 పరుగుల వద్ద ఇంగ్లండ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సిరాజ్ బౌలింగ్లో కరుణ్ నాయర్ క్యాచ్ పట్టడంతో జాక్ క్రాలే (19) ఔటయ్యాడు. నిప్పులు చెరిగిన సిరాజ్.. ఆదుకున్న బ్రూక్, స్మిత్ఇవాళ ఆట ప్రారంభం కాగానే సిరాజ్ బౌలింగ్లో వరుస బంతుల్లో రూట్ (22), స్టోక్స్ (0) వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను బ్రూక్, స్మిత్ జోడీ ఆదుకుంది. వీరిద్దరు ఆరో వికెట్కు అజేయమైన 165 పరుగులు జోడించారు. ఓవర్నైట్ స్కోర్ 77/3 వద్ద ఇంగ్లండ్ ఇవాల్టి ఆటను ప్రారంభించింది.ముందు రోజు (రెండో రోజు) టీ విరామం తర్వాత భారత తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీతో (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో 587 పరుగులకు ఆలౌటైంది.భారత ఇన్నింగ్స్లో గిల్తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. గిల్.. జడేజాతో ఆరో వికెట్కు 203 పరుగులు , వాషింగ్టన్ సుందర్తో (42) ఏడో వికెట్కు 144 పరుగులు జోడించాడు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు. -
ఫాస్టెస్ట్ సెంచరీ!.. చరిత్ర సృష్టించిన జేమీ స్మిత్.. ఇంగ్లండ్ తొలి ప్లేయర్గా..
టీమిండియాతో రెండో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ జేమీ స్మిత్ సంచలన ఇన్నింగ్స్తో మెరిశాడు. కేవలం 80 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా ఇంగ్లండ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు.ఇంగ్లండ్ తొలి ప్లేయర్గా..అంతేకాదు.. టెస్టు మ్యాచ్లో భాగంగా ఓ రోజు ఆటలో భోజన విరామానికి ముందు సెషన్లోనే వందకు పైగా పరుగులు స్కోరు చేసిన ఇంగ్లండ్ తొలి బ్యాటర్గానూ చరిత్రకెక్కాడు జేమీ స్మిత్. అతడి శతక ఇన్నింగ్స్లో పద్నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఇక భారత యువ పేసర్ ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో ఒకే ఓవర్లో జేమీ స్మిత్ ఏకంగా 23 పరుగులు పిండుకోవడం విశేషం.టెస్టుల్లో ఇంగ్లండ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్లు🏏గిల్బర్ట్ జెసప్- 1902లో ది ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాపై 76 బంతుల్లో శతకం🏏జానీ బెయిర్ స్టో- 2022లో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా న్యూజిలాండ్పై 77 బంతుల్లో శతకం🏏హ్యారీ బ్రూక్- 2022లో రావల్పిండి వేదికగా పాకిస్తాన్పై 80 బంతుల్లో శతకం🏏జేమీ స్మిత్- 2025లో ఎడ్జ్బాస్టన్ వేదికగా టీమిండియాపై 80 బంతుల్లో శతకం🏏బెన్ స్టోక్స్- 2015లో లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్పై 85 బంతుల్లో శతకం.The THIRD-FASTEST England Test century 🤯Counter-attacking in the extreme from Jamie Smith ☄️ pic.twitter.com/8Yz3Ccc0WL— England Cricket (@englandcricket) July 4, 2025 లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు: 249/5 (47)ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టులో ఆతిథ్య జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా రెండో టెస్టు మొదలైంది.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రెండో రోజు ఆటలో భాగంగా 587 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ డబుల్ సెంచరీ (269)తో అదరగొట్టగా.. రవీంద్ర జడేజా (89), యశస్వి జైస్వాల్ (87) కూడా అద్భుత అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ మూడు వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్, జోష్ టంగ్ రెండేసి వికెట్లు కూల్చారు. అదే విధంగా... కెప్టెన్ స్టోక్స్, బ్రైడన్ కార్స్, జో రూట్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్.. గురువారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి మూడు వికెట్లు నష్టపోయి 77 పరుగులు చేసింది. ఇక శుక్రవారం నాటి ఆటలో ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్.. హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ బజ్బాల్ ఇన్నింగ్స్ కారణంగా భోజన విరామ సమయానికి 249 పరుగులు స్కోరు చేసింది. లంచ్ బ్రేక్ సమయానికి స్మిత్ 102, బ్రూక్ 91 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు కూల్చగా.. ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ టీమిండియా కంటే ఇంకా 338 పరుగులు వెనుకబడి ఉంది.చదవండి: IND vs ENG 2nd Test: వైభవ్ సూర్యవంశీని పిలిపించిన బీసీసీఐ! -
కాస్తైనా కనికరం లేదా?!.. ఇంత చెత్త బౌలింగ్ ఏంటి బ్రో!
టీమిండియా యువ పేసర్ ప్రసిద్ కృష్ణ (Prasidh Krishna)పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంత చెత్తగా బౌలింగ్ చేస్తావా? అంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. అదే సమయంలో.. ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ (Jamie Smith)పై క్రికెట్ ప్రేమికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే..ఆదిలోనే షాకులుభారత్-ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య బుధవారం మొదలైన రెండో టెస్టులో గిల్ సేన తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో రెండో రోజు భారత ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత.. బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు ఆదిలోనే షాకులు తగిలాయి. భారత బౌలర్ల దెబ్బకు... ఇంగ్లిష్ జట్టు ఓపెనర్లు జాక్ క్రాలే (19), బెన్ డకెట్ (0) సహా వన్డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ (0)లు పెవిలియన్కు క్యూ కట్టారు. ‘బజ్బాల్’ దూకుడుఈ క్రమంలో గురువారం నాటి ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ మూడు వికెట్లన నష్టానికి 77 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోరు 77/3తో శుక్రవారం ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్.. వెనువెంటనే జో రూట్ (22), బెన్ స్టోక్స్ (0) వికెట్లు కోల్పోయింది. ఇలా జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ తమదైన శైలి ‘బజ్బాల్’ ఆటకు తెరలేపారు.43 బంతుల్లోనేఈ క్రమంలో కేవలం 43 బంతుల్లోనే జేమీ స్మిత్ అర్ధ శతకం పూర్తి చేసుకోవడం విశేషం. ప్రస్తుతం భారత్- ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న సిరీస్లో ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కావడం గమనార్హం. కాగా ఆదిలో కాస్త నెమ్మదిగానే ఆడిన జేమీ స్మిత్ వేగంగా యాభై పరుగుల మార్కు చేరుకోవడానికి.. భారత పేసర్ ప్రసిద్ కృష్ణ చెత్త బౌలింగే కారణం.ఒకే ఓవర్లో 23 పరుగులుఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 32వ ఓవర్లో బంతితో బరిలోకి దిగిన ప్రసిద్ కృష్ణ... ఏకంగా 23 పరుగులు సమర్పించుకున్నాడు. తొలి బంతిని కట్టుదిట్టంగా వేసిన అతడు.. ఆ తర్వాత పదే పదే షార్ట్ బంతుల్ని సంధించి మూల్యం చెల్లించాడు. ప్రసిద్ బౌలింగ్లో జేమీ స్మిత్ వరుసగా 4, 6, 4, 4, 4 బాదగా.. వైడ్ రూపంలో మరో పరుగు వచ్చింది.Jamie Smith with back-to-back boundaries to start the 38th over 🔥He's absolutely flying here 😍 pic.twitter.com/rLEry94aGo— England Cricket (@englandcricket) July 4, 2025కాస్తైనా కనికరం లేదా?!.. ఇంత చెత్త బౌలింగ్ ఏంటి బ్రోఇక జేమీ స్మిత్కు బజ్బాల్ అటాకింగ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ప్రసిద్ కృష్ణపై విమర్శల వర్షం కురుస్తోంది. ‘‘ఇంత చెత్త బౌలింగ్ ఏంటి బ్రో.. ఏదేమైనా జేమీ స్మిత్ సూపర్’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు.. కామెంటేటర్ రవిశాస్త్రి.. ‘‘కాస్తైనా కనికరం లేదా?!.. ఇంత నిర్దయగా బాదేస్తావా?!’’అంటూ జేమీ స్మిత్ సూపర్ బ్యాటింగ్ను కొనియాడాడు.కాగా 47 ఓవర్ల ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ ఐదు వికెట్ల నష్టానికి 249 పరుగులు సాధించింది. హ్యారీ బ్రూక్ 91 పరుగులతో ఉండగా.. జేమీ స్మిత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. లీడ్స్ వేదికగా తొలి టెస్టు జరుగగా.. స్టోక్స్ బృందం చేతిలో గిల్ సేన ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇరుజట్ల మధ్య బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో బుధవారం రెండో టెస్టు మొదలైంది.చదవండి: కోహ్లి, అజారుద్దీన్ కాదు!.. భారత అత్యుత్తమ స్లిప్ ఫీల్డర్ ఎవరో తెలుసా? -
గిల్ భారీ డబుల్ సెంచరీ.. టెస్ట్ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు ఇవే..!
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ డబుల్ సెంచరీతో కదంతొక్కాడు. గిల్కు టెస్ట్ల్లో ఇదే తొలి డబుల్ సెంచరీ. ఈ డబుల్ సెంచరీతో గిల్ చాలా రికార్డులను తిరగరాశాడు.టెస్ట్ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన భారత కెప్టెన్గా.. ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్గా.. సేనా దేశాల్లో (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆసియా కెప్టెన్గా.. ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక స్కోర్ చేసిన భారత ఆటగాడిగా.. సేనా దేశాల్లో 250 పరుగుల మార్కు తాకిన తొలి భారత ఆటగాడిగా పలు రికార్డులు నెలకొల్పాడు.గిల్ భారీ డబుల్ సెంచరీ అనంతరం క్రికెట్ అభిమానులు ఓ విషయంపై ఆరా తీయడం మొదలు పెట్టారు. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఎవరిదని వెతకడం ప్రారంభించారు. అలాగే భారత్ తరఫున టెస్ట్ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఎవరిదని.. ఇందులో గిల్ స్థానం ఏంటని గూగుల్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో టెస్ట్ల్లో టాప్ 10 అత్యధిక వ్యక్తిగత స్కోర్లపై ఓ లుక్కేద్దాం. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా పేరిట ఉంది. లారా 2004లో ఆంటిగ్వాలో ఇంగ్లండ్పై 400 పరుగలు చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో క్వాడ్రపుల్ సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా లారా కొనసాగుతున్నాడు.ఈ జాబితాలో లారా తర్వాతి స్థానంలో ఆసీస్ మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ఉన్నాడు. హేడెన్ 2003లో పెర్త్ మైదానంలో జింబాబ్వేపై 380 పరుగులు చేశాడు. దీనికి ముందు అత్యధిక స్కోర్ రికార్డు లారా పేరిటే ఉండింది. లారా 1994లో ఆంటిగ్వాలో ఇంగ్లండ్పై 375 పరుగులు చేశాడు. దాదాపు 9 ఏళ్లు లారా పేరిటే టెస్ట్ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు నమోదై ఉండింది.అయితే హేడెన్ 2003లో ఈ రికార్డును బద్దలు కొట్టాడు. హేడెన్ తన రికార్డును బద్దలు కొట్టిన ఏడాదిలోపే లారా క్వాడ్రాపుల్ సెంచరీ చేసి తిరిగి ఆ రికార్డును తన పేరిటే లిఖించుకున్నాడు.2006లో లారా రికార్డును శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్దనే బద్దలు కొడతాడని అంతా అనుకున్నారు. కొలొంబోలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో జయవర్దనే 374 పరుగులకు ఔటై లారా ఆల్టైమ్ రికార్డుకు 26 పరుగుల దూరంలో నిలిచిపోయాడు.లారా, హేడెన్, జయవర్దనేకు ముందు ఈ రికార్డు విండీస్ ఐకాన్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ పేరిట ఉండేది. 1958లో సోబర్స్ పాకిస్తాన్పై 365 పరుగులు చేశాడు. ఈ రికార్డు 36 ఏళ్ల పాటు సోబర్స్ ఖాతాలోనే ఉండింది. 1994లో తన దేశానికి చెందిన లారా ఈ రికార్డును బద్దలు కొట్టాడు.సోబర్స్కు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్ దిగ్గజం లెన్ హటన్ ఖాతాలో ఉండింది. 1938లో అతను ఆస్ట్రేలియాపై 364 పరుగులు సాధించాడు. అప్పటివరకు ఈ రికార్డు మరో ఇంగ్లండ్ ఆటగాడు వాలీ హేమండ్ పేరిట ఉండింది. హేమండ్ 1933లో న్యూజిలాండ్పై 336 పరుగులు చేశాడు.టెస్ట్ల్లో ఏడో అత్యధిక వ్యక్తిగత స్కోర్ శ్రీలంక డాషింగ్ బ్యాటర్ సనత్ జయసూర్య పేరిట ఉంది. జయసూర్య 1997లో భారత్పై 340 పరుగులు చేశాడు. జయసూర్య తర్వాత ఈ రికార్డు పాకిస్తాన్ స్టయిలిష్ బ్యాటర్ యూనిస్ ఖాన్ పేరిట ఉంది. 2009లో యూనిస్ శ్రీలంకపై 313 పరుగులు చేశాడు. తొమ్మిదో స్థానంలో ఇంగ్లండ్ ఆటగాడు వాలీ హేమండ్ (336) ఉన్నాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక స్కోర్ చేసిన పదవ ఆటగాడిగా డేవిడ్ వార్నర్ ఉన్నాడు. వార్నర్ 2019లో పాకిస్తాన్పై 335 పరుగులు చేశాడు.ఓవరాల్గా టెస్ట్ క్రికెట్లో ఇప్పటివరకు 31 మంది ఆటగాళ్లు ట్రిపుల్ సెంచరీలు చేశారు. భారత్ తరఫున ఈ ఘనతను వీరేంద్ర సెహ్వాగ్ రెండు సార్లు.. ప్రస్తుతం ఇంగ్లండ్లో పర్యటిస్తున్న భారత జట్టు సభ్యుడు కరుణ్ నాయర్ ఓ సారి సాధించారు. భారత్ తరఫున టెస్ట్ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. సెహ్వాగ్ 2008లో సౌతాఫ్రికాపై 319 పరుగులు చేశాడు. భారత్ తరఫున రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కూడా సెహ్వాగ్ పేరిటే ఉంది. 2004లో సెహ్వాగ్ ముల్తాన్లో పాకిస్తాన్పై 309 పరుగులు చేశాడు. కరుణ్ విషయానికొస్తే.. ఇతను 2016లో ఇంగ్లండ్పై అజేయమైన 303 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో 269 పరుగులు చేసిన గిల్ టెస్ట్ల్లో భారత్ తరఫున ఏడో అత్యధిక వ్యక్తిగత స్కోర్ను నమోదు చేశాడు. ఓవరాల్గా టెస్ట్ క్రికెట్లో 61వ అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. -
జైసూ నేర్చుకోవాలి!.. భారత అత్యుత్తమ స్లిప్ ఫీల్డర్ ఎవరో తెలుసా?
క్రికెట్ ప్రపంచంలోని అత్యుత్తమ టెస్టు జట్లలో టీమిండియా ఒకటి. భారత జట్టు ఫీల్డింగ్ కూడా అదే స్థాయిలో గుర్తింపు పొందింది. ముఖ్యంగా స్లిప్స్, గల్లీ పాయింట్లో టీమిండియా ఫీల్డింగ్కు తిరుగులేదు. 2023 నుంచి ఇప్పటి వరకు భారత జట్టు ఈ పాయింట్లలో క్యాచ్లు పట్టడంలో 80.6 శాతం మేర విజయవంతమైంది.ఈ గణాంకాల జాబితాలో టీమిండియా తర్వాత న్యూజిలాండ్ 78.5 శాతం, శ్రీలంక 78.3 శాతంతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అయితే, ఇటీవల ఇంగ్లండ్తో తొలి టెస్టులో టీమిండియా ఏకంగా ఎనిమిది క్యాచ్లు నేలపాలు చేసిన విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టు చేతిలో గిల్ సేన ఓటమికి ఇదే ప్రధాన కారణమైంది.ఫీల్డింగ్ వైఫల్యంపై విమర్శలుఈ నేపథ్యంలో భారత జట్టు ఫీల్డింగ్ వైఫల్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సీనియర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)తో పాటు.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)పై మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిలో జైసూ ఏకంగా నాలుగు క్యాచ్లు మిస్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. క్రిక్విజ్ కథనం ప్రకారం.. 2006 నుంచి ఉన్న డేటాను గమనిస్తే.. భారత్ ఇలా ఓ టెస్టు మ్యాచ్లో ఏకంగా ఎనిమిది క్యాచ్లు మిస్ చేయడం ఇది మూడోసారి. ఓవరాల్గా ఈ మ్యాచ్లో క్యాచ్లు పట్టడంలో 52.9 శాతం మాత్రమే విజయవంతమైంది.నిజానికి.. రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ ఆడుతున్న సమయంలో స్లిప్స్లో క్యాచ్లు అందుకోవడంలో భారత్ విజయశాతం అధికంగా ఉండేది. ముఖ్యంగా వీరిలో స్లిప్ ఫీల్డర్గా సక్సెస్ రేటు ఎక్కువగా ఉన్నది రాహుల్ ద్రవిడ్కే!..భారత అత్యుత్తమ స్లిప్ ఫీల్డర్ ఎవరో తెలుసా?స్లిప్లో ఫీల్డింగ్ చేయడం, క్యాచ్లు అందుకోవడం ఓ కళ. ఇందులో నంబర్ వన్ భారత ప్లేయర్గా ద్రవిడ్ పేరు చెప్పవచ్చని మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే చెప్పడం ఇందుకు నిదర్శనం. టెస్టు క్రికెట్లో ద్రవిడ్ స్లిప్స్ ఫీల్డర్గా ఏకంగా 210 క్యాచ్లు అందుకున్నాడు. ముఖ్యంగా స్పిన్నర్లు అటాకింగ్లో ఉన్నపుడు అతడు మరింత గొప్పగా రాణించేవాడు. ఓవరాల్గా టెస్టుల్లో ఇది రెండో అత్యుత్తమ ప్రదర్శన కాగా.. భారత క్రికెట్లో ద్రవిడ్దే అగ్రస్థానం.టీమిండియా మాజీ కోచ్ జాన్ రైట్ కూడా ద్రవిడ్ ఫీల్డింగ్ నైపుణ్యాల నుంచి గతంలో కొనియాడాడు. ‘‘2000 సంవత్సరంలో నేను టీమిండియా కోచ్గా బాధ్యతలు చేపట్టినప్పుడు తొలి టెస్టులోనే స్లిప్స్లో మూడు- నాలుగు క్యాచ్లు డ్రాప్ చేశాం.అయితే, ద్రవిడ్ ఫస్ట్ స్లిప్లోకి వచ్చిన తర్వాతే మా క్యాచింగ్ ప్రదర్శన మెరుగుపడింది. ముఖ్యంగా విదేశీ గడ్డపై అతడి వల్లే ఎక్కువ సక్సెస్ రేటు సాధించగలిగాం’’ అని జాన్ రైట్ ద్రవిడ్ను ప్రశంసించాడు.వీరు కూడా..ఇక ద్రవిడ్తో పాటు మాజీ కెప్టెన్లు మహ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి, అజింక్య రహానేలతో పాటు.. వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఈ ఫీల్డింగ్ పొజిషన్లో మెరుగ్గా రాణించాడు. ప్రస్తుతం అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ద్రవిడ్, అజారుద్దీన్ వంటి దిగ్గజాల ఫీల్డింగ్ వీడియోలు చూస్తే.. స్లిప్ ఫీల్డింగ్ ఎలా చేయాలో.. వారి వారసత్వాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో యువ ఆటగాళ్లకు అవగాహన వస్తుంది. తద్వారా ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవచ్చు. లేదంటే.. లీడ్స్ టెస్టు మాదిరి గెలవాల్సిన మ్యాచ్లో.. ఓటమి రూపంలో భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఇంగ్లండ్తో ఐదు టెస్టుల్లో భాగంగా తొలి మ్యాచ్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.చదవండి: IND vs ENG 2nd Test: వైభవ్ సూర్యవంశీని పిలిపించిన బీసీసీఐ! -
ENG VS IND 2nd Test Day 3: ఇంగ్లండ్కు వరుస షాక్లు
ఎడ్జ్బాస్టన్ టెస్ట్ మూడో రోజు ఆట ప్రారంభం కాగానే టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్ను భారీ దెబ్బేశాడు. రెండో ఓవర్లోనే వరుస బంతుల్లో స్టార్ బ్యాటర్లు జో రూట్ (22), బెన్ స్టోక్స్లను (0) ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 88 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. DSP SIRAJ HAS TAKEN CHARGE AT EDGBASTON 🥶 pic.twitter.com/ycxlvrtuMC— Johns. (@CricCrazyJohns) July 4, 2025ప్రస్తుతం హ్యారీ బ్రూక్ (31), జేమీ స్మిత్ (4) క్రీజ్లో ఉన్నారు. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంగ్లండ్ ఇంకా 499 పరుగులు వెనుకపడి ఉంది. భారత బౌలర్లలో సిరాజ్ 3, ఆకాశ్దీప్ 2 వికెట్లు తీశారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గట్టెక్కలేదు.ముందు రోజు (రెండో రోజు) టీ విరామం తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. ఇంగ్లండ్కు ఇన్నింగ్స్ ప్రారంభించగానే వరుస షాక్లు తగిలాయి. బుమ్రా స్థానంలో ఈ మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్దీప్ వరుస బంతుల్లో తొలి టెస్ట్ సెంచరీ హీరోలు బెన్ డకెట్, ఓలీ పోప్లను డకౌట్ చేశాడు. అప్పటికి ఇంగ్లండ్ స్కోర్ 13 పరుగులు మాత్రమే. 25 పరుగుల వద్ద ఇంగ్లండ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సిరాజ్ బౌలింగ్లో కరుణ్ నాయర్ క్యాచ్ పట్టడంతో జాక్ క్రాలే (19) ఔటయ్యాడు.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీతో (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో 587 పరుగులకు ఆలౌటైంది.భారత ఇన్నింగ్స్లో గిల్తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. గిల్.. జడేజాతో ఆరో వికెట్కు 203 పరుగులు , వాషింగ్టన్ సుందర్తో (42) ఏడో వికెట్కు 144 పరుగులు జోడించాడు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు. -
ENG VS IND 2nd Test: చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీతో (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో 587 పరుగులకు ఆలౌటైంది (తొలి ఇన్నింగ్స్లో).భారత ఇన్నింగ్స్లో గిల్తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. గిల్.. జడేజాతో ఆరో వికెట్కు 203 పరుగులు , వాషింగ్టన్ సుందర్తో (42) ఏడో వికెట్కు 144 పరుగులు జోడించాడు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్కు ఆదిలోనే వరుస షాక్లు తగిలాయి. బుమ్రా స్థానంలో ఈ మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్దీప్ వరుస బంతుల్లో తొలి టెస్ట్ సెంచరీ హీరోలు బెన్ డకెట్, ఓలీ పోప్లను డకౌట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 13 పరుగలకే 2 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 25 పరుగుల వద్ద ఇంగ్లండ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సిరాజ్ బౌలింగ్లో కరుణ్ నాయర్ క్యాచ్ పట్టడంతో జాక్ క్రాలే (19) ఔటయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. రూట్ (18), బ్రూక్ (30) క్రీజ్లో ఉన్నారు.చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజాఈ మ్యాచ్లో గిల్తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాకు జీవం పోసిన జడేజా ఓ భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. 79 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అప్పటికే బౌలర్గా 132 వికెట్లు తీసిన జడ్డూ.. డబ్ల్యూటీసీలో 2000 పరుగులు, 100 వికెట్లు సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. డబ్ల్యూటీసీలో మొత్తం 41 మ్యాచ్లు ఆడిన జడేజా తాజా ఇన్నింగ్స్తో కలుపుకొని 39 సగటుతో 2010 పరుగులు చేశాడు.బౌలింగ్లో 25.92 సగటున 132 వికెట్లు తీశాడు.ఎడ్జ్బాస్టన్ అంటే చాలు పూనకాలు వస్తాయి..!రవీంద్ర జడేజాకు ఇంగ్లండ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానం అంటే చాలు పూనకాలు వస్తాయి. జడ్డూ ఇక్కడ ఆడిన రెండు మ్యాచ్ల్లో మరపురాని ఇన్నింగ్స్లు ఆడాడు. 2022 పర్యటనలో సెంచరీ (194 బంతుల్లో 104; 13 ఫోర్లు) చేసిన జడ్డూ.. ఈసారి కూడా సెంచరీ చేసినంత పని చేశాడు. నాడు రిషబ్ పంత్తో కలిసి 222 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జడేజా.. తాజాగా గిల్తో కలిసి 203 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. -
కావాలనే ఖరాబ్ చేస్తున్నాడు!.. స్టోక్స్కు ఇచ్చిపడేసిన జడ్డూ
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) తనపై చేసిన ఆరోపణలపై టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) స్పందించాడు. తాను ఉద్దేశపూర్వకంగా పిచ్ మధ్యలోకి వెళ్లలేదని.. ఇంగ్లండ్ బౌలింగ్ విధానమే తనను అందుకు పురిగొల్పిందని పేర్కొన్నాడు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా ఇంగ్లండ్ ఆటగాళ్లు పదే పదే అంపైర్ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశారని.. కానీ తాము మాత్రం ఇలాంటి తప్పులు చేయమని తెలిపాడు.కాగా ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య ఎడ్జ్బాస్టన్ వేదికగా బుధవారం రెండో టెస్టు మొదలైంది. ఇందులో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ భారీ డబుల్ సెంచరీ (269)తో పాటు రవీంద్ర జడేజా (89), యశస్వి జైస్వాల్ (87 అద్భుతంగా రాణించగా.. తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులు చేసింది.అంపైర్కు ఫిర్యాదుఇక గురువారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా జడ్డూపై ఇంగ్లండ్ పేసర్ క్రిస్వోక్స్, కెప్టెన్ స్టోక్స్ పిచ్ను పాడుచేస్తున్నాడంటూ అంపైర్కు ఫిర్యాదు చేశారు. కావాలనే పదే పదే పిచ్ మధ్యలోకి పరిగెత్తుకు వచ్చి డ్యామేజ్ చేస్తున్నాడంటూ ఆరోపించారు.స్టోక్స్కు ఇచ్చిపడేసిన జడ్డూఇదే విషయంపై స్టోక్స్ జడ్డూతో.. ‘‘చూడు మేట్.. నువ్వేం చేస్తున్నావో కనబడుతోందా?’’ అంటూ మైదానంలోనే వాగ్వాదానికి దిగాడు కూడా!.. ఇందుకు జడ్డూ గట్టిగానే బదులిచ్చాడు. ‘‘నేను ఎక్కడి నుంచి వస్తున్నానో చూస్తూనే ఉన్నావు కదా!..నేనైతే ఇలాంటి ఏరియాల్లో బౌలింగ్ చేయను. అయినా నా దృష్టి మొత్తం ఇప్పుడు బ్యాటింగ్ మీదే ఉంది’’ అని కౌంటర్ ఇచ్చాడు. ఇక ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం జడేజా స్పందించాడు.మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘నేనేదో కావాలనే పిచ్ను తొక్కుతున్నట్లు వారు భావించారు. నిజానికి ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్ను ఎలా ఎదుర్కోవాలో నేను అదే పని చేశాను. కానీ వాళ్లు ప్రతిసారి అంపైర్ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశారు.నాకైతే పిచ్ మధ్యలోకి వెళ్లాలన్న ఉద్దేశం ఎంతమాత్రమూ లేదు. పరుగులు తీసే క్రమంలో నేను ముందుకు సాగిపోతూ ఉన్నానంతే!.. ఏదేమైనా నాకు అవకాశం వస్తే గనుక... నేను వాళ్లలా బౌల్ చేయను. సరైన లైన్ అండ్ లెంగ్త్తో.. సరైన చోటే బంతిని వేస్తాను’’ అని జడ్డూ చెప్పుకొచ్చాడు. కాగా గురువారం నాటి ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. చదవండి: IND vs ENG 2nd Test: వైభవ్ సూర్యవంశీని పిలిపించిన బీసీసీఐ! Sir Jadeja classic on the Stumps Mic. 😂 pic.twitter.com/SqhuVJqq4f— Mufaddal Vohra (@mufaddal_vohra) July 4, 2025 -
నైట్రైడర్స్ను చిత్తు చేసిన ఎంఐ న్యూయార్క్.. ప్లే ఆశలు సజీవం
మేజర్ లీగ్ క్రికెట్-2025 టోర్నీలో ఎంఐ న్యూయర్క్(MI New York) తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. శుక్రవారం ఫ్లోరిడా వేదికగా లాసెంజెల్స్ నైట్రైడర్స్తో జరిగిన డూఆర్డై మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో న్యూయర్క్ టీమ్ ఘన విజయం సాధించింది.ఈమ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన నైట్రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. నైట్రైడర్స్ బ్యాటర్లలో షెర్ఫెన్ రూథర్ఫర్డ్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ కరేబియన్ ఆటగాడు 44 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లతో 86 పరుగులు చేశాడు.ఓవైపు వికెట్లు పడుతున్నా రూథర్ఫోర్డ్ మాత్రం తన దూకుడును కొనసాగించాడు. మిగితా నైట్రైడర్స్ బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. న్యూయర్క్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లు పడగొట్టి నైట్రైడర్స్ను దెబ్బతీశాడు. అతడితో పాటు పొలార్డ్ రెండు, ఇషాన్ అదిల్, కెంజిగె చెరో వికెట్ తీశారు. అనంతరం 155 పరుగుల లక్ష్యాన్ని న్యూయర్క్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది.ఓపెనర్ మోనాంక్ పటేల్ (56), కెప్టెన్ నికోలస్ పూరన్ (62 నాటాట్) హాఫ్ సెంచరీలతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. నైట్రైడర్స్ బౌలర్లు సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్ చెరో వికెట్ తీశారు. ఎంఐ న్యూయర్క్ ప్లే ఆఫ్స్కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్లో గెలిచి రన్రేట్ను మెరుగుపరుచుకోవాలి. అంతేకాకుండా సీటెల్ ఓర్కాస్ టీమ్ మిగిలిన రెండు మ్యాచ్లలో ఓడిపోవాలి. అప్పుడే పూరన్ సేన నాలుగో జట్టుగా ప్లే ఆఫ్స్కు ఆర్హత సాధిస్తోంది. -
ఏం చూస్తున్నావు?.. వేగంగా పరిగెత్తలేవా?: ఆకాశ్ దీప్పై గిల్ ఫైర్!
ఇంగ్లండ్తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) అద్భుత ఇన్నింగ్స్తో దుమ్ములేపాడు. ఎడ్జ్బాస్టన్లో తొలి రోజు బాదిన శతకాన్ని ప్రిన్స్.. రెండో రోజు ఆట సందర్భంగా దానిని డబుల్ సెంచరీ (Double Century)గా మలిచాడు. మొత్తంగా 387 బంతులు ఎదుర్కొన్న గిల్.. 30 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 269 పరుగులు సాధించాడు. తద్వారా రికార్డుల మోత మోగించాడు.ఎడ్జ్బాస్టన్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత కెప్టెన్, ఆటగాడిగా గిల్ చరిత్రకెక్కాడు. ఈ నేపథ్యంలో గిల్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత టెస్టు క్రికెట్లో ప్రిన్స్ శకం మొదలైందంటూ అభిమానులు, మాజీ క్రికెటర్లు అతడిని ఆకాశానికెత్తుతున్నారు. మరోవైపు.. గిల్ తన ద్విశతకాన్ని ట్రిపుల్ సెంచరీగా మలిస్తే ఇంకా బాగుండేదంటూ కాస్త నిరాశకు లోనవుతున్నారు..@ShubmanGill rewrites the record books in England! 👑📚✅ First Asian captain to score a double century in SENA✅ First visiting captain to score 200 in England since 2003✅ Only the third Indian to score a double century in England!#ENGvIND 👉 2nd TEST, Day 2 | LIVE NOW… pic.twitter.com/VoVrRQT8VT— Star Sports (@StarSportsIndia) July 3, 2025 ఇదిలా ఉంటే.. డబుల్ సెంచరీ వీరుడు గిల్ రెండో రోజు బ్యాటింగ్ చేస్తున్న సందర్భంగా సహనం కోల్పోయాడు. తొలి రోజు నుంచి.. రెండో రోజు వరకు దాదాపు ఐదు సెషన్లలోనూ ఓపికగా ఉన్న గిల్కు కోపం రావడానికి కారణం భారత పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep).రనౌట్ రూపంలో బలయ్యేవారే!గురువారం నాటి రెండో రోజు ఆట టీ సమయానికి ముందు.. గిల్ చరిత్రాత్మక ట్రిపుల్ సెంచరీ దిశగా పయనిస్తున్న వేళ.. షోయబ్ బషీర్ బౌలింగ్ (139.5)లో మిడ్ వికెట్ మీదుగా గిల్ షాట్ బాదాడు. ఈ క్రమంలోనే అవతలి ఎండ్లో ఉన్న ఆకాశ్ దీప్ను పరుగుకు ఆహ్వానించాడు. కానీ అప్పుడు పరధ్యానంగా ఉన్న ఆకాశ్.. వెంటనే తేరుకుని డైవ్ కొట్టి ఎలాగోలా క్రీజులోకి చేరుకున్నాడు. లేదంటే ఎవరో ఒకరు రనౌట్ రూపంలో బలయ్యేవారే!pic.twitter.com/cXM1utO4a8— Nihari Korma (@NihariVsKorma) July 3, 2025ఏం చూస్తున్నావు?.. తొందరగా పరిగెత్తలేవా?దీంతో కోపోద్రిక్తుడైన గిల్.. ‘‘ఏం చూస్తున్నావు?.. తొందరగా పరిగెత్తలేవా?’’ అంటూ ఆకాశ్ దీప్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. ఇక అప్పటికి 260 పరుగుల వద్ద ఉన్న గిల్.. మరో తొమ్మిది రన్స్ తన స్కోరుకు జతచేసి జోష్ టంగ్ బౌలింగ్లో పోప్నకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరోవైపు.. ఆకాశ్ దీప్ ఆరు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.ఇదిలా ఉంటే.. ఎడ్జ్బాస్టన్ వేదికగా రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 587 పరుగుల మేర భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ భారీ ద్విశతకం (269) బాదగా.. యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89) కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడారు.చదవండి: IND vs ENG 2nd Test: వైభవ్ సూర్యవంశీని పిలిపించిన బీసీసీఐ! -
12 ఏళ్ల కిందట స్పాట్ ఫిక్సింగ్.. కట్ చేస్తే! ఇప్పుడు ఆ జట్టు హెడ్ కోచ్గా
ముంబై క్రికెట్ ఆసోయేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిషేదం ఎదుర్కొన్న మాజీ క్రికెటర్ అంకిత్ చవాన్(Ankeet Chavan)ను తమ అండర్-14 జట్టు ప్రధాన కోచ్గా ఎంసీఎ నియమించింది. ఐపీఎల్-2013 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడినప్పుడు అజిత్ చండిలా, ఎస్ శ్రీశాంత్తో పాటు చవాన్ స్పాట్ ఫిక్సింగ్ పాల్పడ్డాడు.దీంతో అతడిపై బీసీసీఐ(BCCI) జీవితకాల నిషేదం విధించింది. కానీ 2021లో చవాన్ పై విధించిన నిషేధాన్ని బీసీసీఐ ఏడు సంవత్సరాలకు తగ్గించింది. దీంతో అతడు తిరిగి క్రికెట్లో వచ్చేందుకు అవకాశం లభించింది. అంకిత్ ప్రస్తుతం ముంబైలో కర్ణాటక స్పోర్ట్స్ క్లబ్ తరపున క్లబ్ క్రికెట్ ఆడుతున్నాడు.ఈ క్రమంలో లెవల్-1 కోచింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో.. ఇప్పుడు ముంబై అండర్-14 హెడ్కోచ్గా ఎంపికయ్యాడు. చవాన్ తన కెరీర్లో 18 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లు, 20 లిస్ట్-ఎ మ్యాచ్లు, 13 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. హెడ్కోచ్గా ఎంపికైన అనంతరం చవాన్ స్పందించాడు."నాకు ఇది రెండో ఇన్నింగ్స్. నా సరికొత్త ప్రయాణాన్ని ఆరంభించేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను. జీవితంలో తిరిగి కమ్బ్యాక్ ఇచ్చేంందుకు ఎల్లప్పుడూ అవకాశం ఉంటుంది. నాపై నమ్మకం ఉంచినందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.కోచింగ్ అంటే నాకు ఎంతో ఇష్టం. అండర్-14 స్థాయిలో, ఆటగాళ్ల ఆటను మెరుగుపరచడంలో నావంతు కృషి చేస్తాను" అని ఇండియన్ ఎక్స్ప్రెస్తో చవాన్ పేర్కొన్నాడు. మరోవైపు ముంబై సీనియర్ జట్టు హెడ్కోచ్గా ఓంకార్ సాల్వి కొనసాగనున్నాడు.చదవండి: IND vs ENG: ఇలాంటి తప్పెలా చేశావు గిల్?.. యువీ తండ్రి అసంతృప్తి! -
ఇలాంటి తప్పెలా చేశావు గిల్?.. యువీ తండ్రి అసంతృప్తి!
టీమిండియా కెప్టెన్, డబుల్ సెంచూరియాన్ శుబ్మన్ గిల్( Shubman Gill)పై మాజీ క్రికెటర్ యువరాజ్ తండ్రి యోగరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో గిల్ ట్రిపుల్ సెంచరీ చేసే అవకాశం కోల్పోవడం పట్ల యోగరాజ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.ఈ మ్యాచ్లో గిల్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. 387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్స్లతో 269 పరుగులు చేశాడు. తన మొదటి ట్రిపుల్ సెంచరీకి 31 పరుగుల దూరంలో శుబ్మన్ నిలిచిపోయాడు. ఇంగ్లండ్ పేసర్ జోష్ టాంగ్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి తన వికెట్ను కోల్పోయాడు."యువరాజ్ సింగ్(Yuvraj Singh) తన కెరీర్లో ఏమి సాధించాడో, దానిని ఆటగాళ్లకు శిక్షణ రూపంలో అందించడం చాలా సంతోషంగా ఉంది. శుబ్మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్షదీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లను యువరాజ్ తన శిక్షణతో రాటుదేల్చాడు. ఈ మ్యాచ్లో శుబ్మన్ 200 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, అతను 250 పరుగులు చేసి నాటౌట్గా ఉండాలని నేను కోరుకున్నాను.250 పరుగుల మార్క్ చేరుకున్నాక ట్రిపుల్ సెంచరీ చేసి ఆజేయంగా ఉండాలని ఆశించాను. కానీ గిల్ అంతలోనే గిల్ ఔట్ కావడంతో నేను బాధపడ్డాను. యువరాజ్ కూడా నిరాశచెందాడు. అంత భారీ స్కోర్ సాధించాక అలా ఔట్ కావడం పెద్దం నేరం. రెండు వందులు అవ్వొచ్చు, మూడు వందలు అవ్చొచ్చు ఏదైనా కానీ నాటౌట్గా ఉంటే మన తప్పిదాలను సరిదిద్దుకోవచ్చు.ఇక శుబ్మన్ గిల్ కోసం చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు. వారందరికి ఒక్క విషయం చెప్పాలనకుంటున్నాను. దయచేసి మీరు క్రికెటర్ కాకపోతే, ఆ విషయం గురించి మాట్లాడకండి. గిల్ ఒక టాప్ క్లాస్ ప్లేయర్. గిల్కు 400 పరుగులు చేసే సత్తా కూడా ఉంది" అని ఎన్ఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగరాజ్ పేర్కొన్నాడు.చదవండి: 'ఇదంతా అతడి వల్లే'.. గిల్ డబుల్ సెంచరీ వెనక మాస్టర్ మైండ్ -
IND vs ENG 2nd Test: వైభవ్ సూర్యవంశీని పిలిపించిన బీసీసీఐ!
ఇంగ్లండ్తో రెండో టెస్టులో టీమిండియా అదరగొడుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గిల్ సేన.. మొదటి ఇన్నింగ్స్లో 587 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఎడ్జ్బాస్టన్ వేదికగా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) భారీ ద్విశతకం (269)తో చెలరేగగా.. రవీంద్ర జడేజా (Ravindra Jadeja- 89), యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal- 87) అర్ధ శతకాలతో రాణించారు. 510 పరుగుల ఆధిక్యంవీరికి తోడుగా వాషింగ్టన్ సుందర్ (42) మెరుగ్గా ఆడగా కరుణ్ నాయర్ (31) కూడా ఈసారి కాస్త ఫర్వాలేదనిపించాడు. ఇక బ్యాటింగ్లో అదరగొట్టిన భారత్.. బౌలింగ్లోనూ రాణిస్తోంది. గురువారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి మూడు వికెట్లు తీసిన టీమిండియా.. ఇంగ్లండ్ను 77 పరుగులకు పరిమితం చేసింది. తద్వారా ప్రస్తుతం 510 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.అరుదైన రికార్డులుఇక రెండో రోజు ఆటలో హైలైట్ గిల్ డబుల్ సెంచరీ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎడ్జ్బాస్టన్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన భారత బ్యాటర్గా నిలవడంతో పాటు.. ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్గానూ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు.అంతేకాదు.. SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో టెస్టుల్లో అత్యధిక స్కోరు సాధించిన ఆసియా తొలి కెప్టెన్గానూ గిల్ చరిత్రకెక్కాడు. వీటితో పాటు మరెన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు.ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో వైభవ్ ప్రత్యక్షంఇక గిల్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ను భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా ప్రత్యక్షంగా వీక్షించాడు. ఓవైపు గిల్కు సంబంధించిన మరుపురాని మధుర క్షణాలను ఒడిసిపడుతూనే.. స్టాండ్స్లో వైభవ్పై కూడా కెమెరామెన్ ఫోకస్ చేశాడు. ఈ నేపథ్యంలో ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ను వీక్షిస్తున్న ఫొటోలు వైరల్గా మారాయి.కాగా ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్ తరఫున సంచలన శతకం సాధించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం ఇంగ్లండ్లో భారత అండర్-19 జట్టు తరఫునా మెరుపులు మెరిపిస్తున్నాడు. ఇంగ్లండ్తో యూత్ వన్డేల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.తొలి యూత్ వన్డేలో 19 బంతుల్లోనే 48 పరుగులతో రాణించిన వైభవ్.. రెండో వన్డేలో 34 బంతుల్లో 45 రన్స్ చేశాడు. తాజాగా మూడో వన్డేలో 31 బంతుల్లోనే 81 పరుగులతో దుమ్ములేపాడు. ఇక నాలుగో యూత్ వన్డే జూలై 5న జరుగనుండగా.. ఆఖరిదైన ఐదో మ్యాచ్ జూలై 7న జరుగనుంది.యువ జట్టును పిలిపించిన బీసీసీఐఇక నార్తాంప్టన్లో మూడో యూత్వన్డే ముగిసిన తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI).. ఆయుశ్ మాత్రే సారథ్యంలోని యువ జట్టును ఎడ్జ్బాస్టన్కు పిలిపించింది. సీనియర్ల ఆటను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించింది. ఈ క్రమంలో గిల్ ఐకానిక్ ఇన్నింగ్స్ను వీక్షించిన వైభవ్ సూర్యవంశీ.. ‘‘మనదే ఆధిపత్యం’’ అంటూ గిల్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక వైభవ్ను ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో చూసిన అభిమానులు త్వరలోనే అతడు టీమిండియాలో అరంగేట్రం చేయాలంటూ ఆకాంక్షిస్తున్నారు.చదవండి: WCL: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా యువరాజ్ సింగ్Vaibhav Suryavanshi in the stands at the Edgbaston. pic.twitter.com/p7xMZoZdQf— Mufaddal Vohra (@mufaddal_vohra) July 3, 2025 -
'ఇదంతా అతడి వల్లే'.. గిల్ డబుల్ సెంచరీ వెనక మాస్టర్ మైండ్
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టు భారత కెప్టెన్ శుబ్మన్ గిల్కు తన కెరీర్లో చిర్మసరణీయంగా మిగిలిపోనుంది. ఈ మ్యాచ్లో గిల్ అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. గిల్కు టెస్టుల్లో ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం.అంతేకాకుండా టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత కెప్టెన్గా విరాట్ కోహ్లి రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో 387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్స్లతో 269 పరుగులు చేశాడు. అయితే హెడ్కోచ్ గౌతం గంభీర్ సలహాతోనే ఈ మారథాన్ ఇన్నింగ్స్ ఆడినట్లు గిల్ వెల్లడించాడు."తొలి రోజు ఆటలో లంచ్ బ్రేక్కు వెళ్లేముందు నేను క్రీజులోకి వచ్చాను. ఆ తర్వాత టీ సమయానికి నేను 100 బంతులు ఆడి 35 పరుగులు మాత్రమే చేశాను. ఆ సమయంలో డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లి గౌతమ్ గంభీర్ భాయ్తో మాట్లాడాను. నేను బౌండరీలు కొట్టలేకపోతున్నాని, ఫీల్డర్ల గ్యాప్ చూసుకుని ఆడుతున్నానని అతడితో చెప్పాను. అందుకు బదులుగా గౌతీ భాయ్ నన్ను క్రీజులో నిలదొక్కకోమని చెప్పాడు. వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉంటే పరుగులు వాటింతట అవే వస్తాయి అని అతడు అన్నాడు. ఇక ఐపీఎల్ ఆఖరిలో నా బ్యాటింగ్ టెక్నిక్పై తీవ్రంగా శ్రమించాను. నా ఫుట్ మూమెంట్, ఏ బంతులను ఆడాలో ఎంచుకోవడంపై ఎక్కువగా దృష్టిసారించాను.ప్రతీ మ్యాచ్లోనూ నేను బాగానే బ్యాటింగ్ చేస్తున్నాను. కానీ 30-40 పరుగుల మధ్య ఔటయ్యేవాడిని. అందుకే ఈ సారి నా బ్యాటింగ్ను ఆస్వాదించాలనుకున్నాను. అందుకు తగ్గట్టు నెట్స్లో కూడా ప్రాక్టీస్ చేశాను. టీ20 ఫార్మాట్లో ఆడి ఒక్కసారిగా టెస్టుల్లోకి తిరిగి రావడం కష్టం.మన మైండ్సెట్ను మార్చుకోని ఆడాలి. వైట్బాల్ క్రికెట్ పూర్తి భిన్నం. అందుకే ఐపీఎల్-2025 నుంచే రెడ్బాల్ క్రికెట్తో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాను" అని రెండో రోజు ఆట అనంతరం విలేకరుల సమావేశంలో గిల్ పేర్కొన్నాడు.ఇక భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత ఇన్నింగ్స్లో గిల్తో పాటు యశస్వి జైశ్వాల్( 87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది.చదవండి: ENG vs IND: ట్రిపుల్ సెంచరీ మిస్.. ఇంగ్లండ్ ఆటగాడి ట్రాప్లో పడ్డ గిల్! వీడియో -
ట్రిపుల్ సెంచరీ మిస్.. ఇంగ్లండ్ ఆటగాడి ట్రాప్లో పడ్డ గిల్! వీడియో
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్స్లతో 269 పరుగులు చేశాడు. ఈ మారథాన్ ఇన్నింగ్స్తో టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత కెప్టెన్గా విరాట్ కోహ్లి(254) రికార్డును గిల్ బ్రేక్ చేశాడు.ఓ దశలో గిల్ ట్రిపుల్ సెంచరీ మార్క్ను కూడా అందుకునేలా కన్పించాడు. అయితే సమయంలో ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మైండ్ గేమ్స్ మొదలు పెట్టాడు. టీ విరామం తర్వాత 265 పరుగుల మార్కును దాటి బ్యాటింగ్ చేస్తున్న శుబ్మన్ గిల్ ఏకగ్రాతను దెబ్బతీసేందుకు బ్రూక్ ప్రయత్నించాడు.స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న హ్యారీ బ్రూక్.. గిల్తో తన ట్రిపుల్ సెంచరీ కోసం చర్చించాడు. 143 ఓవర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. గిల్-బ్రూక్ మధ్య జరిగిన సంభాషణ స్టంప్ మైక్లో రికార్డు అయింది. అయితే ఇద్దరి మాటలు అంత క్లారిటీగా బయటకు వినిపించడం లేదు.ఈ క్రమంలో కామెంటరీ బాక్స్ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్.. ఆ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను వివరించాడు. "290 పరుగుల వద్ద ఆడటం చాలా కష్టం" అని బ్రూక్ అనగా, "నీ కెరీర్లో ఎన్ని ట్రిపుల్ సెంచరీలు చేశావ్? అని గిల్ బదులు ఇచ్చినట్లు అథర్టన్ తెలిపారు.ఇది జరిగిన తర్వాత ఓవరే గిల్ తన వికెట్ను కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. కాగా హ్యారీ బ్రూక్ పేరిట ఓ టెస్టు ట్రిపుల్ సెంచరీ ఉంది. గతేడాది పాకిస్తాన్తో జరిగిన టెస్టులో బ్రూక్ 317 పరుగులు చేశాడు.ఇక భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత ఇన్నింగ్స్లో గిల్తో పాటు యశస్వి జైశ్వాల్( 87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది.pic.twitter.com/PKokKBCd4R— The Game Changer (@TheGame_26) July 3, 2025 -
భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా యువరాజ్ సింగ్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) సీజన్ 2 కోసం ఇండియా ఛాంపియన్స్ మెనెజ్మెంట్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా లెజెండరీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ మరోసారి ఎంపికయ్యాడు. 2024లో అరంగేట్ర ఎడిషన్లో యువీ సారథ్యంలోనే భారత జట్టు విజేతగా నిలిచింది.ఇక ఈ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో శిఖర్ ధావన్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, యూసుఫ్ పఠాన్ వంటి దిగ్గజాలు ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో ఇండియా జట్టు సమతుల్యంగా కన్పిస్తోంది.పేస్ బౌలింగ్ విభాగంలో వరుణ్ ఆరోన్, సిద్ధార్థ్ కౌల్, వినయ్ కుమార్ చోటు దక్కించుకోగా.. స్పిన్ బాధ్యతలు హర్భజన్, పియూష్ చావ్లా, పవన్ నేగి నిర్వహించనున్నారు. ఇక బ్యాటింగ్ లైనప్లో యువీ, ధావన్, సురేష్ రైనా వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు.తొలి పోరు పాక్తోనే..ఇక డబ్ల్యూసీఎల్ సెకెండ్ సీజన్ జూలై 18 నుండి ఆగస్టు 2 వరకు ఇంగ్లండ్లోని నాలుగు వేదికలలో జరగనుంది. ఎడ్జ్బాస్టన్ (బర్మింగ్హామ్), కౌంటీ గ్రౌండ్ (నార్తాంప్టన్), గ్రేస్ రోడ్ (లీసెస్టర్), హెడింగ్లీ (లీడ్స్) మైదానాలు ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమివ్వనున్నాయి.ఈ టోర్నీలో భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మొత్తం ఆరు జట్లు పాల్గోనున్నాయి. ఈ మెగా ఈవెంట్ రౌండ్-రాబిన్ లీగ్ ఫార్మాట్లో జరగనుంది. పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్దానాల్లో నిలిచే జట్లు సెమీ-ఫైనల్స్కు చేరుకుంటాయి. ఇక ఇండియా ఛాంపియన్స్ తమ తొలి మ్యాచ్లో జూలై 20న పాకిస్తాన్తో తలపడనుంది.ఇండియా ఛాంపియన్స్ జట్టుయువరాజ్ సింగ్ (కెప్టెన్), శిఖర్ ధావన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, పీయూష్ చావ్లా, స్టువర్ట్ బిన్నీ, గురుకీరత్ మాన్, వినయ్ కుమార్, సిద్దార్థ్ కౌల్, వరుణ్ ఆరోన్, అభిమన్యు మిథున్, పవన్ నేగి మిథున్ -
వెస్టిండీస్తో రెండో టెస్టు.. 286 పరుగులకు ఆసీస్ ఆలౌట్
సెయింట్ జార్జెస్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా టాపార్డర్ విఫలమైంది. . ఓపెనర్లు సామ్ కొన్స్టాస్ (37 బంతుల్లో 25; 4 ఫోర్లు), ఉస్మాన్ ఖ్వాజా (29 బంతుల్లో 16; 2 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోగా... స్టీవ్ స్మిత్ (3), కామెరూన్ గ్రీన్ (37 బంతుల్లో 26; 4 ఫోర్లు), ట్రావిస్ హెడ్ (43 బంతుల్లో 29; 3 ఫోర్లు) పెవిలియన్కు వరుస కట్టారు. అయితే బ్యూ వెబ్స్టెర్(60), అలెక్స్ కారీ(63) మరోసారి హాఫ్ సెంచరీలతో ఆసీస్ను ఆదుకున్నారు. దీంతో ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 286 పరుగులు చేయగల్గింది. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 4 వికెట్లు పడగొట్టగా... సీల్స్ రెండు, షామార్ జోసెఫ్, ఫిలిప్ తలా ఒక వికెట్ తీశారు. అయితే వెలుతురు లేమి కారణంగా తొలి రోజు కేవలం 66.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. రెండో రోజు ఆటలో విండీస్ తమ తొలి ఇన్నింగ్స్ను ఆరంభించనుంది.బ్రాత్వైట్ 100వ టెస్టు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్వైట్ ఈ మ్యాచ్ ద్వారా వంద టెస్టులు ఆడిన పదో కరీబియన్ ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు. ఫ్రాంచైజీ క్రికెట్ ప్రభావంతో జాతీయ జట్టు కన్నా లీగ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న విండీస్ ప్లేయర్ల మధ్య బ్రాత్వైట్ ఈ ఘనత అందుకోవడం విశేషం.జాతీయ జట్టు తరఫున ఒక్క మ్యాచ్ ఆడినా చాలు అనే లక్ష్యంతో క్రికెట్ను కెరీర్గా ఎంచుకున్న బ్రాత్వైట్... సుదీర్ఘ ఫార్మాట్పై మక్కువతో టి20ల జోలికి వెళ్లకుండా ఈ స్థాయికి చేరుకున్నాడు.చదవండి: #Shubman Gill: టెస్టు క్రికెట్కు సరికొత్త రారాజు.. ఇంక అంతా 'శుభ్' మయం -
ఇంగ్లండ్తో మూడో టీ20.. తొలిసిరీస్ విజయంపై భారత్ కన్ను
ఇంగ్లండ్ పర్యటనకు వచ్చిన భారత మహిళల జట్టు మొదట సన్నాహకంగా ఈసీబీ డెవలప్మెంట్ టీమ్తో రెండు మ్యాచ్లాడింది. ఈ రెండు మ్యాచ్ల్లోనూ హర్మన్ప్రీత్ బృందం ఓడింది. అయితే అసలైన సిరీస్ మొదలుకాగానే అమ్మాయిల జట్టు అద్భుతంగా రాణిస్తోంది. వరుసగా ఓడిన జట్టే... ఇప్పుడు వరుసగా రెండు మ్యాచ్ల్ని గెలిచింది. ఇక ‘హ్యాట్రిక్’తో ఇంకో రెండు మ్యాచ్లుండగానే సిరీస్ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో భారత మహిళల జట్టు బరిలోకి దిగుతోంది. ఇదే జరిగితే ఇంగ్లండ్ గడ్డపై అమ్మాయిలు సాధించే తొలి టి20 సిరీస్ కానుంది. మరోవైపు సొంతగడ్డపై వరుస పరాభవాల భారం ఒత్తిడి పెంచగా... తాజాగా అనుభవజ్ఞురాలైన కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ గాయంతో కీలకమైన మూడో మ్యాచ్కు దూరమైంది. ఇది ఆతిథ్య జట్టుకు మరింత ప్రతికూలమవగా... సిరీస్ను గెలిచేందుకు భారత్కు అనుకూలతనీయనుంది. రెగ్యులర్ కెపె్టన్ గైర్హాజరీతో టామీ బ్యూమౌంట్ జట్టును నడిపించనుంది. బ్రంట్ స్థానంలో మైయా బౌచియెర్ను ఎంపిక చేశారు. జోరుమీదున్న భారత్ విజయాలిచ్చి ఉత్సాహం, బ్యాటర్ల ఫామ్తో భారత అమ్మాయిల జట్టు జోరుమీదుంది. తొలి మ్యాచ్లో స్మృతి మంధాన చెలరేగితే... గత మ్యాచ్లో జెమీమా రోడ్రిగ్స్, అమన్జోత్ కౌర్ బ్యాటింగ్ బాధ్యతను పంచుకున్నారు. రిచా ఘోష్ కూడా మెరుపులు మెరిపించింది. వీరితో పాటు షఫాలీ వర్మ, దీప్తి శర్మలు కూడా ఫామ్లో ఉండటం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. బౌలింగ్లో తెలుగమ్మాయి శ్రీచరణి నిలకడగా ప్రత్యర్థి బ్యాటర్లను తిప్పేస్తోంది.తొలి మ్యాచ్లో 4 వికెట్లు తీసిన ఆంధ్ర స్పిన్నర్, రెండో మ్యాచ్లో రెండు కీలక వికెట్లతో ఇంగ్లండ్ వెన్నువిరిచింది. దీప్తి శర్మ, అమన్జోత్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి కూడా బౌలింగ్లో ఆకట్టుకుంటున్నారు. ఇన్ని సానుకూలాంశాల మధ్య మూడో విజయం సాధించడం హర్మన్ప్రీత్ బృందానికి ఏమంత కష్టం కానేకాదు. అన్నింటికి మించి ఆల్రౌండ్ సత్తాతో ఆతిథ్య జట్టును చిత్తు చేస్తున్న తీరు వచ్చే ఏడాది ఇక్కడ జరిగే టి20 ప్రపంచకప్కు ఎంతగానో దోహదం చేసే అవకాశాలున్నాయి. గెలిస్తేనే నిలిచేది! వరుస వైఫల్యాలకు తోడు రెగ్యులర్ కెపె్టన్ బ్రంట్ గాయంతో ఈ మ్యాచ్కు దూరమవడం ఇంగ్లండ్ను తీవ్రమైన ఒత్తిడిలోకి నెడుతోంది. పర్యాటక బ్యాటర్లేమో చెలరేగుతుంటే... సొంతగడ్డపై ఇంగ్లండ్ బ్యాటర్లు పరుగులు సాధించేందుకు ఆపసోపాలు పడుతున్నారు. గెలిస్తేనే సిరీస్లో నిలిచే దశలో ఒత్తిడిని తట్టుకొని ఏ మేరకు నెట్టుకురాగలరన్నది ప్రశ్నార్థకంగా మారింది. తొలి టి20లో ఆడిన బ్రంట్ అందుబాటులో లేదు. రెండు మ్యాచ్లో బ్యూమౌంట్ రాణించింది. వీరిద్దరు మినహా ఇంకెవరూ భారత బౌలర్లను ఎదుర్కోలేకపోతున్నారు. మూడో మ్యాచ్లోనూ ప్రత్యర్థి బౌలర్లదే పైచేయి అయితే మాత్రం మాంచెస్టర్ (నాలుగో మ్యాచ్ వేదిక) వెళ్లకముందే ఇక్కడే సిరీస్ను కోల్పోవడం ఖాయం. తుది జట్లు (అంచనా) భారత్: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ, జెమీమా, అమన్జోత్, రిచా ఘోష్, దీప్తిశర్మ, రాధా యాదవ్, అరుంధతి, స్నేహ్ రాణా, శ్రీచరణి.ఇంగ్లండ్: టామీ బ్యూమౌంట్ (కెప్టెన్), సోఫియా, డానీ వ్యాట్, మైయా బౌచియెర్, అమీ జోన్స్, అలైస్ క్యాప్సీ, అర్లాట్, సోఫీ ఎకిల్స్టోన్, లారెన్ ఫిలెర్, లారెన్ బెల్, లిన్సే స్మిత్. -
టెస్టు క్రికెట్కు సరికొత్త రారాజు.. ఇంక అంతా 'శుభ్' మయం
"ఈ సిరీస్లో నేను బెస్ట్ బ్యాటర్గా నిలుస్తా.. కెప్టెన్గా ఎటువంటి ఒత్తిడి తీసుకోను".. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు భారత యువ సారథి శుబ్మన్ గిల్ చెప్పిన మాటలివి. ఇప్పుడు అందుకు తగ్గట్టే దూసుకుపోతున్నాడు ఈ యువ రాజు.ఎవరైతే అతడిని కెప్టెన్గా ఎంపికచేయడాన్ని వ్యతిరేకించారో.. ఇప్పుడు వారితోనే శెభాష్ అనిపించుకుంటున్నాడు. కెప్టెన్గా తొలి టెస్టులోనే సెంచరీతో మెరిసిన గిల్.. ప్రస్తుతం ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఏకంగా ద్విశతకంతో మెరిశాడు.తన అసాధారణ ప్రదర్శనతో టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత కెప్టెన్గా చరిత్రను తిరగ రాశాడు. ఈ సిరీస్ ముందు వరకు ఇంగ్లండ్ గడ్డపై ఒక్క సెంచరీ కూడా చేయని శుబ్మన్.. ఇప్పుడు శతకాల మోత మ్రోగిస్తున్నాడు. ఇంతకుముందు ఒక్క లెక్క.. కెప్టెన్ అయ్యాక ఒక లెక్క అన్నట్లు గిల్ ప్రయాణం సాగుతోంది.జయహో నాయక..ఒక జట్టు నాయకుడికి ఉండవలసిన అన్ని లక్షణాలు గిల్కు ఉన్నాయి. జట్టు గెలిస్తే క్రెడిట్ తీసుకున్న వాడు నిజమైన కెప్టెన్ కాడు.. అదే జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ముందుకొచ్చి ఆదుకున్న వాడే నిజమైన లీడర్. ఇది గిల్కు సరిగ్గా సరిపోతుంది.తొలి టెస్టులో ఓటమికి నైతిక బాధ్యత వహించిన గిల్.. ఇప్పుడు ఎడ్జ్బాస్టన్లో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్ ఆరంభంలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును.. తన బాధ్యయుత ఆటతీరుతో ఆదుకున్నాడు.ఆచితూచి ఆడి భారత ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. తొలుత 100 బంతుల్లో కేవలం 25 పరుగులు మాత్రమే చేసిన ఈ పంజాబీ ఆటగాడు.. క్రీజులో నిలదొక్కొన్నాక ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. గిల్ తొలి టెస్టు డబుల్ సెంచరీ వెనక ఎంతో శ్రమ దాగి ఉంది. దాదాపు రెండు రోజుల పాటు ఎంతో ఓర్పు, నిబద్దతతో బ్యాటింగ్ చేసి జట్టును పటిష్ట స్ధితిలో నిలిపాడు. అతడి ఆటతీరుకు ప్రత్యర్ధి ఆటగాళ్లు సైతం ఫిదా అయిపోయారు. అప్పటిలో సచిన్, కోహ్లి.. భారత టెస్టు జట్టులో నాలుగో నంబర్కు ప్రత్యేక స్ధానం ఉంది. ఒక దశాబ్ధం క్రితం జోహన్నెస్బర్గ్లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వదిలిపెట్టి వెళ్లిన నాలుగో నంబర్ స్ధానాన్ని లెజెండరీ విరాట్ కోహ్లి భర్తీ చేశాడు. ఆ స్ధానంలో దాదాపు పుష్కరకాలం పాటు విరాట్ కోహ్లి విజయవంతంగా కొనసాగాడు. విరాట్ తన అద్బుత ప్రదర్శనలతో మాస్టర్బ్లాస్టర్ను మరిపించాడు. ఇప్పుడు కింగ్ కోహ్లి వారసుడిగా అదే ఎంఆర్ఎఫ్( MRF) బ్యాట్తో 25 ఏళ్ల గిల్ బాధ్యతలు చేపట్టాడు. ఈ సిరీస్ ఆరంభానికి ముందు వరకు ఈ కీలకమైన స్దానంలో ఎవరి బ్యాటింగ్ వస్తారన్న చర్చ తీవ్ర స్ధాయిలో జరిగింది.కొంతమంది మాజీలు కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ను నాలుగో స్ధానంలో బ్యాటింగ్ పంపాలని సూచించారు. కానీ కెప్టెన్ గిల్ మాత్రం విరాట్ కోహ్లి స్దానానికి తానే సరైనోడనని ముందుకు వచ్చాడు. అందుకు తగ్గట్టే ఆ స్ధానంలో ఆడిన తొలి ఇన్నింగ్స్లో శతక్కొట్టాడు. ఇప్పుడు రెండో టెస్టులో 269 పరుగులు చేసి సత్తాచాటాడు. ఓవరాల్గా గిల్ ఇప్పటివరకు 34 టెస్టులు ఆడి 40.65 సగటుతో 2317 పరుగులు చేశాడు.పట్టు బిగిస్తున్న భారత్..ఇక ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత్ పట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. క్రీజులో హ్యారీ బ్రూక్(30), జో రూట్(18) ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాష్ దీప్ రెండు, సిరాజ్ ఒక్క వికెట్ సాధించారు. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా ఇన్నింగ్స్లో గిల్తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. -
గిల్ రికార్డుల హోరు ఇంగ్లండ్ బేజారు
‘హెడింగ్లీలో నేను 147 పరుగులకే అవుటయ్యా... మరింత సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాల్సింది. తప్పుడు షాట్తో వెనుదిరిగా’... రెండో టెస్టుకు ముందు భారత జట్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ చెప్పిన మాట ఇది. తాను నిజంగా నిలబడి పట్టుదలగా ఆడితే ఎలా ఉంటుందో ఇప్పుడు అతను ఎడ్జ్బాస్టన్లో చూపించాడు. 8 గంటల 29 నిమిషాల అసాధారణ బ్యాటింగ్, ఎక్కడా చిన్న తప్పుకు కూడా అవకాశం ఇవ్వకుండా... 94 శాతం నియంత్రణతో కూడిన చక్కటి షాట్లతో గిల్ అదరగొట్టాడు... ఏకంగా 269 పరుగులు చేసి పలు రికార్డులను అలవోకగా అధిగమిస్తూ పోయాడు. గిల్కు జడేజా, వాషింగ్టన్ సుందర్ అండగా నిలవడంతో టీమిండియా భారీ స్కోరుతో ప్రత్యర్థికి సవాల్ విసిరింది. ఒక దశలో 211/5తో కష్టాల్లో నిలిచిన జట్టు చివరి 5 వికెట్లకు ఏకంగా 376 పరుగులు జోడించింది. ఆపై బుమ్రా లేని లోటును తీర్చేలా ఆకాశ్దీప్, సిరాజ్ చెలరేగిపోయి ఇంగ్లండ్ టాప్–3ని కుప్పకూల్చారు. మూడో రోజూ మన బౌలర్ల జోరు సాగితే టీమిండియాకు మ్యాచ్పై పట్టు చిక్కడం ఖాయం. బరి్మంగ్హామ్: ఇంగ్లండ్తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసి కూడా ఓడిన భారత్ ఈసారి అంతకంటే మరింత భారీ స్కోరును నమోదు చేసింది. ఓవర్నైట్ స్కోరు 310/5తో ఆట కొనసాగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 151 ఓవర్లలో 587 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ క్రికెట్లో స్టోక్స్–మెకల్లమ్ (బజ్బాల్) శకం మొదలైన తర్వాత ఆ జట్టుపై ప్రత్యర్థి సాధించిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్స్లు) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చగా, రవీంద్ర జడేజా (137 బంతుల్లో 89; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేజార్చుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ (103 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆరో వికెట్కు జడేజాతో 203 పరుగులు జోడించిన గిల్... ఏడో వికెట్కు సుందర్తో 144 పరుగులు జత చేశాడు. అనంతరం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 20 ఓవర్లలో 3 వికెట్లకు 77 పరుగులు చేసింది. ఫాలోఆన్ తప్పించుకునేందుకు కూడా ఆ జట్టు మరో 311 పరుగులు చేయాల్సి ఉంది. జడేజా చేజారిన సెంచరీ మ్యాచ్ రెండో రోజు తొలి బంతికి సింగిల్తో గిల్, జడేజా భాగస్వామ్యం 100 పరుగులకు చేరింది. అనంతరం 80 బంతుల్లో జడేజా అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా... ధాటిని పెంచిన గిల్ టెస్టుల్లో తన అత్యధిక స్కోరును అందుకోవడంతో పాటు కెరీర్లో తొలిసారి 150 పరుగులు (263 బంతుల్లో) దాటాడు. ఆ తర్వాత మరింత జోరు ప్రదర్శించిన వీరిద్దరు బషీర్ ఓవర్లో చెరో సిక్స్ బాదారు. ఇదే ఊపులో శతకం దిశగా దూసుకుపోయిన జడేజా దురదృష్టవశాత్తూ ఆ అవకాశం కోల్పోయాడు. టంగ్ వేసిన షార్ట్ బంతి నుంచి అతను తప్పించుకునే ప్రయత్నం చేయగా... గ్లవ్కు తగిలిన బంతి గాల్లోకి లేచి కీపర్ చేతుల్లో పడింది. దాంతో ద్విశతక భాగస్వామ్యానికి తెర పడింది. అనంతరం సుందర్ కూడా చక్కటి షాట్లతో గిల్కు తగిన సహకారం అందించాడు. తొలి సెషన్లో భారత్ 25 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి 109 రన్స్ చేసింది. కొనసాగిన జోరురెండో సెషన్లో గిల్ మరింత చెలరేగిపోయాడు. బషీర్ ఓవర్లో సిక్స్ కొట్టిన అతను టంగ్ ఓవర్లో రెండు ఫోర్లతో 195కు చేరుకున్నాడు. ఆ తర్వాత టంగ్ బౌలింగ్లోనే ఫైన్ లెగ్ దిశగా సింగిల్ తీయడంతో 311 బంతుల్లో గిల్ డబుల్ సెంచరీ పూర్తయింది. ఆపై 200 నుంచి 250 వరకు చేరేందుకు గిల్కు కేవలం 37 బంతులు (8 ఫోర్లు, 1 సిక్స్) సరిపోయాయి. ఈ క్రమంలో బ్రూక్ ఓవర్లో అతను వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. ఎట్టకేలకు సుందర్ను రూట్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్కు కాస్త ఊరట లభించింది. రెండో సెషన్లో భారత్ 31 ఓవర్లలో ఓవర్కు 4.6 రన్రేట్తో ఏకంగా 145 పరుగులు సాధించడం విశేషం. టీ విరామానంతరం ‘ట్రిపుల్’పై కన్నేసిన గిల్ను నిలువరించడంలో ఇంగ్లండ్ సఫలమైంది. టంగ్ వేసిన షార్ట్ పిచ్ బంతిని ఆడబోయి స్క్వేర్లెగ్లో సునాయాస క్యాచ్ ఇవ్వడంతో గిల్ అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. మరో 13 పరుగుల తర్వాత భారత్ తమ చివరి 2 వికెట్లు కోల్పోయింది. టపటపా ప్రత్యర్థి చేసిన కొండంత స్కోరు కనిపిస్తుండగా ఒత్తిడిలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. ఆకాశ్దీప్ చెలరేగిపోతూ వరుస బంతుల్లో డకెట్ (0), పోప్ (0)లను అవుట్ చేయడంతో ఇంగ్లండ్ ఒక్కసారిగా షాక్కు గురైంది. ఆ తర్వాత క్రాలీ (19)ని సిరాజ్ పెవిలియన్ పంపడంతో పరిస్థితి మరింత దిగజారింది. అయితే రూట్, బ్రూక్ పట్టుదలగా నిలబడి ఇంగ్లండ్ను ఆదు కున్నారు. ఆరంభంలో కొంత తడబడినా చివరకు 12.5 ఓవర్లు నిలిచి రోజును ముగించారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్మిత్ (బి) స్టోక్స్ 87; రాహుల్ (బి) వోక్స్ 2; కరుణ్ నాయర్ (సి) బ్రూక్ (బి) కార్స్ 31; గిల్ (సి) పోప్ (బి) టంగ్ 269; పంత్ (సి) క్రాలీ (బి) బషీర్ 25; నితీశ్ రెడ్డి (బి) వోక్స్ 1; జడేజా (సి) స్మిత్ (బి) టంగ్ 89; సుందర్ (బి) రూట్ 42; ఆకాశ్దీప్ (సి) డకెట్ (బి) బషీర్ 6; సిరాజ్ (స్టంప్డ్) స్మిత్ (బి) బషీర్ 8; ప్రసిధ్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 22; మొత్తం (151 ఓవర్లలో ఆలౌట్) 587. వికెట్ల పతనం: 1–15, 2–95, 3–161, 4–208, 5–211, 6–414, 7–558, 8–574, 9–574, 10–587. బౌలింగ్: వోక్స్ 25–6–81–2, కార్స్ 24–3–83–1, టంగ్ 28–2–119–2, స్టోక్స్ 19–0–74–1, బషీర్ 45–2–167–3, రూట్ 5–0–20–1, బ్రూక్ 5–0–31–0. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) నాయర్ (బి) సిరాజ్ 19; డకెట్ (సి) గిల్ (బి) ఆకాశ్దీప్ 0; పోప్ (సి) రాహుల్ (బి) ఆకాశ్దీప్ 0; రూట్ (బ్యాటింగ్) 18; బ్రూక్ (బ్యాటింగ్) 30; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 77. వికెట్ల పతనం: 1–13, 2–13, 3–25. బౌలింగ్: ఆకాశ్దీప్ 7–1–36–2, సిరాజ్ 7–2–21–1, ప్రసిధ్ కృష్ణ 3–0–11–0, నితీశ్ రెడ్డి 1–0–1–0, జడేజా 2–1–4–0. -
ENG VS IND 2nd Test Day 2: పట్టుబిగిస్తున్న భారత్
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి భారత్కు భారీ స్కోర్ అందించాడు. భారత ఇన్నింగ్స్లో గిల్తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. గిల్.. జడేజాతో ఆరో వికెట్కు 203 పరుగులు , వాషింగ్టన్ సుందర్తో (42) ఏడో వికెట్కు 144 పరుగులు జోడించాడు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు.వరుస షాక్లుఅనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. బుమ్రా స్థానంలో ఈ మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్దీప్ నిప్పులు చెరిగాడు. వరుస బంతుల్లో తొలి టెస్ట్లో సెంచరీలు చేసిన బెన్ డకెట్, ఓలీ పోప్లను డకౌట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 13 పరుగలకే 2 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.మరో ఎదురుదెబ్బ13 పరుగుల వద్ద వరుస బంతుల్లో ఇన్ ఫామ్ బ్యాటర్లు డకెట్, పోప్ వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 25 పరుగుల వద్ద జాక్ క్రాలే (19) ఔటయ్యాడు. సిరాజ్ బౌలింగ్లో కరుణ్ నాయర్ క్యాచ్ పట్టడంతో క్రాలే పెవిలియన్కు చేరాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. 20 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 77/3గా ఉంది. రూట్ (18), బ్రూక్ (30) క్రీజ్లో ఉన్నారు. -
ENG VS IND 2nd Test: నిప్పులు చెరిగిన ఆకాశ్దీప్, సిరాజ్.. పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లండ్
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి భారత్కు భారీ స్కోర్ అందించాడు. భారత ఇన్నింగ్స్లో గిల్తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. గిల్.. జడేజాతో ఆరో వికెట్కు 203 పరుగులు , వాషింగ్టన్ సుందర్తో (42) ఏడో వికెట్కు 144 పరుగులు జోడించాడు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు.వరుస షాక్లుఅనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. బుమ్రా స్థానంలో ఈ మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్దీప్ నిప్పులు చెరిగాడు. వరుస బంతుల్లో తొలి టెస్ట్లో సెంచరీలు చేసిన బెన్ డకెట్, ఓలీ పోప్లను డకౌట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 13 పరుగలకే 2 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.మరో ఎదురుదెబ్బ13 పరుగుల వద్ద వరుస బంతుల్లో ఇన్ ఫామ్ బ్యాటర్లు డకెట్, పోప్ వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 25 పరుగుల వద్ద జాక్ క్రాలే (19) ఔటయ్యాడు. సిరాజ్ బౌలింగ్లో కరుణ్ నాయర్ క్యాచ్ పట్టడంతో క్రాలే పెవిలియన్కు చేరాడు. 10 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 33/3గా ఉంది. రూట్ (5), బ్రూక్ (5) క్రీజ్లో ఉన్నారు. -
ENG VS IND 2nd Test: గిల్ రికార్డు డబుల్ సెంచరీ.. టీమిండియా భారీ స్కోర్
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. రెండో రోజు టీ విరామం తర్వాత భారత తొలి ఇన్నింగ్స్ 587 పరుగుల వద్ద ముగిసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి భారత్కు ఈ స్థాయి స్కోర్ అందించాడు. ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి రోజు 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసిన భారత్.. ఇవాళ (రెండో రోజు) మరో 264 పరుగులు జోడించి మిగతా 5 వికెట్లు కోల్పోయింది. తొలి రోజే సెంచరీ పూర్తి చేసిన గిల్.. ఇవాళ డబుల్ సెంచరీ సాధించాడు.భారత ఇన్నింగ్స్లో గిల్తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. గిల్.. జడేజాతో ఆరో వికెట్కు 203 పరుగులు , వాషింగ్టన్ సుందర్తో (42) ఏడో వికెట్కు 144 పరుగులు జోడించాడు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు.కాగా, ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత్ ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. లీడ్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్లో భారత్ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. ఆ మ్యాచ్లో భారత తరఫున ఐదు శతకాలు నమోదైనా ప్రయోజనం లేకుండా పోయింది. తొలి ఇన్నింగ్స్లో జైస్వాల్ (101), గిల్ (147), పంత్ (134).. రెండో ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ (137), పంత్ (118) శతకాలు చేశారు. -
భారీ డబుల్ సెంచరీ.. కోహ్లి ఆల్ టైమ్ రికార్డు బద్దలు కొట్టిన గిల్
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ భారీ డబుల్ సెంచరీ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించి రికార్డులు తిరగరాశాడు. రెండో రోజు గిల్ టీ విరామం తర్వాత కాసేపటికే ఔటయ్యాడు. టంగ్ బౌలింగ్లో ఓలీ పోప్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ డబుల్ సెంచరీతో గిల్ చాలా రికార్డులు సాధించాడు.కోహ్లి ఆల్ టైమ్ రికార్డు బద్దలుఈ మ్యాచ్లో 269 పరుగులు చేసి ఔటైన గిల్.. టెస్ట్ల్లో అత్యధిక స్కోర్ చేసిన భారత కెప్టెన్గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉండేది. విరాట్ 2019లో సౌతాఫ్రికాపై 254 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్లో గిల్ కోహ్లి ఆల్టైమ్ రికార్డును బద్దలు కొట్టి టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్గా అవతరించాడు. గిల్ కెప్టెన్గా తన మూడో ఇన్నింగ్స్లోనే ఈ ఘనత సాధించడం విశేషం.టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 భారత కెప్టెన్లు..గిల్-269కోహ్లి-254 నాటౌట్ (2019)కోహ్లి-243 (2017)కోహ్లి-235 (2016)ధోని-224 (2013)టెస్ట్ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత ఆటగాళ్లు..వీరేందర్ సెహ్వాగ్ - 319వీరేందర్ సెహ్వాగ్ - 309కరుణ్ నాయర్ - 303*వీరేందర్ సెహ్వాగ్ - 293వీవీఎస్ లక్ష్మణ్ - 281రాహుల్ ద్రవిడ్ - 270శుభ్మన్ గిల్ - 269ఇంగ్లండ్లో 250+ స్కోర్లు సాధించిన పర్యాటక టెస్ట్ కెప్టెన్లు..311 - బాబ్ సింప్సన్ (AUS), ఓల్డ్ ట్రాఫోర్డ్, 1964277 - గ్రేమ్ స్మిత్ (SA), ఎడ్జ్బాస్టన్, 2003269 - శుభ్మన్ గిల్ (IND), ఎడ్జ్బాస్టన్, 2025259 - గ్రేమ్ స్మిత్ (SA), లార్డ్స్, 2003విదేశీ టెస్టుల్లో టీమిండియా తరపున 250+ స్కోర్లు చేసిన ఆటగాళ్లు..309 - వీరేంద్ర సెహ్వాగ్ vs PAK, ముల్తాన్, 2004270 - రాహుల్ ద్రవిడ్ vs PAK, రావల్పిండి, 2004269 - శుభ్మన్ గిల్ vs ENG, ఎడ్జ్బాస్టన్, 2025254 - వీరేంద్ర సెహ్వాగ్ vs PAK, లాహోర్, 2006గిల్ సాధించిన మరిన్ని రికార్డులు..ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్.. సేనా దేశాల్లో (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆసియా కెప్టెన్..ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక స్కోర్ చేసిన భారత ఆటగాడు.. సేనా దేశాల్లో 250 పరుగుల మార్కు తాకిన తొలి భారత ఆటగాడు.. విదేశాల్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారత కెప్టెన్.. ఇంగ్లండ్లో డబుల్ సెంచరీ సాధించిన మూడో భారత ఆటగాడు.. టెస్ట్ల్లో డబుల్ సెంచరీ సాధించిన ఆరో భారత కెప్టెన్మ్యాచ్ విషయానికొస్తే.. గిల్ రికార్డు డబుల్ సెంచరీతో చెలరేగడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. గిల్ ఔటయ్యాక భారత్ అదే స్కోర్ వద్ద ఆకాశ్దీప్ (6) వికెట్ కూడా కోల్పోయింది. 149 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 583/9గా ఉంది. సిరాజ్ (7), ప్రసిద్ద్ కృష్ణ (2) క్రీజ్లో ఉన్నారు.యశస్వి జైస్వాల్ (87), కేఎల్ రాహుల్ (2), కరుణ్ నాయర్ (31), రిషబ్ పంత్ (25), నితీశ్ కుమార్ రెడ్డి (1), రవీంద్ర జడేజా (89), సుందర్ (42), గిల్ (269), ఆకాశ్దీప్ (6) ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, టంగ్, బషీర్ తలో 2 వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, రూట్ చెరో వికెట్ పడగొట్టారు. -
ENG VS IND 2nd Test: భారీ డబుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ భారీ డబుల్ సెంచరీతో (266) చెలరేగి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. రెండో రోజు లంచ్ తర్వాత గిల్ ఈ అరుదైన ఘనత సాధించాడు. గిల్కు టెస్ట్ల్లో ఇది తొలి డబుల్ సెంచరీ. ఈ మైలురాయిని గిల్ 311 బంతుల్లో చేరుకున్నాడు. ఈ డబుల్తో గిల్ పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు.ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్గా.. సేనా దేశాల్లో (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆసియా కెప్టెన్గా..ఇంగ్లండ్లో డబుల్ సెంచరీ సాధించిన మూడో భారత ఆటగాడిగా.. ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక స్కోర్ చేసిన భారత ఆటగాడిగా.. టెస్ట్ల్లో డబుల్ సెంచరీ సాధించిన ఆరో భారత కెప్టెన్గా.. విదేశాల్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారత కెప్టెన్గా.. సేనా దేశాల్లో 250 పరుగుల మార్కు తాకిన తొలి భారత ఆటగాడిగా.. టెస్ట్ల్లో అత్యధిక స్కోర్ చేసిన భారత కెప్టెన్గా పలు రికార్డులు సాధించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. గిల్ రికార్డు డబుల్ సెంచరీతో చెలరేగడంతో భారత్ ఇప్పటికే భారీ స్కోర్ చేసేసింది. డబుల్ సెంచరీ తర్వాత కూడా గిల్ జోరు కొనసాగుతుంది. 266 పరుగుల వద్ద గిల్ బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా ఆకాశ్దీప్ (0) క్రీజ్లో ఉన్నాడు. టీ విరామం సమయానికి భారత్ స్కోర్ 565/7గా ఉంది.310/5 స్కోర్ వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్.. లంచ్ విరామానికి ముందు రవీంద్ర జడేజా (137 బంతుల్లో 89; 10 ఫోర్లు, సిక్సర్) వికెట్ కోల్పోయింది. 41 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన జడేజా గిల్తో అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చాడు. గిల్-జడేజా ఆరో వికెట్కు 203 పరుగులు జోడించారు. అనంతరం గిల్, వాషింగ్టన్ సుందర్తో (42) కలిసి ఏడో వికెట్కు 144 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి రోజు ఆటలో యశస్వి జైస్వాల్ (87), కేఎల్ రాహుల్ (2), కరుణ్ నాయర్ (31), రిషబ్ పంత్ (25), నితీశ్ కుమార్ రెడ్డి (1) వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2 వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, షోయబ్ బషీర్, జోష్ టంగ్ తలో వికెట్ పడగొట్టారు. -
IND vs ENG: గంభీర్ ఏం చేస్తున్నాడు?.. కుమార్ సంగక్కర ఫైర్
ఇంగ్లండ్తో రెండో టెస్టు నేపథ్యంలో టీమిండియా తీసుకున్న నిర్ణయాన్ని శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగర్కర విమర్శించాడు. సిరీస్ గెలవడం కంటే కూడా.. లార్డ్స్ టెస్టే ముఖ్యమా అంటూ భారత జట్టు నాయకత్వ తీరును ప్రశ్నించాడు. కాగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్కు వెళ్లిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య లీడ్స్ (Leeds Test)లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు జరిగింది. ఇందులో గిల్ సేన.. స్టోక్స్ బృందం చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా సిరీస్లో 0-1తో వెనుకబడింది. ఇక టెస్టు జట్టు కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే శతక్కొట్టిన శుబ్మన్ గిల్కూ పరాజయం రూపంలో చేదు అనుభవమే మిగిలింది.విశ్రాంతి పేరిటకాగా భారత్ -ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా బుధవారం (జూలై 2) రెండో టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్కు.. విశ్రాంతి పేరిట భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. పనిభారాన్ని తగ్గించే నిమిత్తం అతడిని ఇంగ్లండ్లో కేవలం మూడు టెస్టులే ఆడిస్తామన్న మేనేజ్మెంట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.ఇక టాస్ సందర్భంగా ఇదే విషయాన్ని మరోసారి పునరుద్ఘాటించిన కెప్టెన్ శుబ్మన్ గిల్.. లార్డ్స్లో జరిగే మూడో టెస్టులో బుమ్రాను ఆడిస్తామని చెప్పాడు. అక్కడి పిచ్ అనుకూలంగా ఉంటుంది కాబట్టి బుమ్రా తప్పక ఆడతాడని చెప్పాడు.విమర్శల వర్షంనిజానికి.. తొలి టెస్టుకు.. రెండో టెస్టుకు మధ్య వారం రోజుల విరామ సమయం దొరికింది. అయినప్పటికీ కీలక మ్యాచ్లో బుమ్రాకు విశ్రాంతినివ్వడాన్ని భారత మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, సునిల్ గావస్కర్ తదితరులు తప్పుబట్టారు. ఇక సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ అయితే.. టీమిండియా మేనేజ్మెంట్ తీరును తనదైన శైలిలో విమర్శించాడు.రొనాల్డో లేని పోర్చుగల్ మాదిరి‘‘ప్రపంచంలోని అత్యుత్తమ స్ట్రైకర్ అయిన రొనాల్డో లేకుండా పోర్చుగల్ బరిలోకి దిగితే ఎలా ఉంటుందో.. బుమ్రా లేని టీమిండియాకు కూడా అదే పరిస్థితి. నాకైతే ఏమీ అర్థం కావడం లేదు’’ అంటూ స్టెయిన్ చురకలు అంటించాడు. ఇక ఈ జాబితాలో తాజాగా.. శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార్ సంగక్కర కూడా చేరిపోయాడు.ఈ నిర్ణయం ఎవరిది?.. కోచ్ ఏం చేస్తున్నాడు?‘‘అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఎవరు తీసుకున్నారు? ఆటగాళ్లను, ఫిజియోలను సంప్రదించిన తర్వాతే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? సిరీస్ గెలవడం కంటే లార్డ్స్ టెస్టే ముఖ్యమని మీరు భావిస్తున్నారా?బుమ్రాను మూడు టెస్టులే ఆడించాలని భావిస్తే.. 1-3-5 మాత్రమే ఎందుకు కావాలి? కావాల్సినంత విరామం దొరికింది.. విజయం కోసం జట్టు పరితపిస్తోంది. మరి అలాంటపుడు కోచ్ బుమ్రా దగ్గరకు వెళ్లి ఇదే విషయాన్ని అర్థమయ్యేట్లు చెప్పవచ్చు కదా!’’ అని కుమార్ సంగక్కర స్కై స్పోర్ట్స్తో వ్యాఖ్యానించాడు.కాగా ఇంగ్లండ్తో రెండో టెస్టులో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. బుమ్రాకు రెస్ట్ ఇవ్వడంతో పాటు.. సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూర్లపై వేటు వేసింది. ఈ ముగ్గురి స్థానాలను ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్లతో భర్తీ చేసింది.చదవండి: Ind vs Eng: ఇదేం తీరు?.. గిల్పై మండిపడ్డ గావస్కర్!.. గంగూలీ విమర్శలు -
డబుల్ సెంచరీతో చెలరేగిన శుబ్మన్ గిల్
ఇంగ్లండ్తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకుంటున్న ఈ నాలుగో నంబర్ బ్యాటర్.. 311 బంతుల్లో 200 పరుగుల మార్కును అందుకున్నాడు. తద్వారా తన టెస్టు కెరీర్లో తొలి ద్విశతకం (Maiden Test Double Century)నమోదు చేయడంతో పాటు.. జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. కాగా గిల్ ఇన్నింగ్స్లో ప్రస్తుతానికి 21 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అంతేకాదు.. ఎన్నో అరుదైన రికార్డులను కూడా గిల్ సొంతం చేసుకున్నాడు. టీమిండియా కెప్టెన్ హోదాలో టెస్టుల్లో ద్విశతకం బాదిన దిగ్గజాల సరసన గిల్ చేరాడు. గిల్ కంటే ముందు.. విరాట్ కోహ్లి ఏడుసార్లు ఈ ఫీట్ నమోదు చేయగా.. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోని ఒక్కో డబుల్ సెంచరీ బాదారు.విదేశీ గడ్డ మీద కోహ్లి తర్వాత..అదే విధంగా.. విదేశీ గడ్డ మీద విరాట్ కోహ్లి (Virat Kohli) తర్వాత టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన రెండో కెప్టెన్గానూ గిల్ చరిత్రకెక్కాడు. కోహ్లి 2016లో నార్త్ సౌండ్లో 200 పరుగులు సాధించాడు.👉అత్యంత పిన్న వయసులో టెస్టు డబుల్ సెంచరీ చేసిన భారత రెండో కెప్టెన్గానూ ఘనత.. ఈ జాబితాలో గిల్ కంటే ముందు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ఉన్నాడు.🏏మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ- 1964లో ఢిల్లీ వేదికగా 23 ఏళ్ల 39 రోజుల వయసులో..🏏శుబ్మన్ గిల్- 2025లో ఎడ్జ్బాస్టన్ వేదికగా 25 ఏళ్ల 298 రోజుల వయసులో..🏏సచిన్ టెండుల్కర్- 1999లో అహ్మదాబాద్ వేదికగా 26 ఏళ్ల 189 రోజుల వయసులో..🏏విరాట్ కోహ్లి- 2016లో నార్త్ సౌండ్ వేదికగా 27 ఏళ్ల 260 రోజుల వయసులో...500 పరుగుల మార్కు దాటిన టీమిండియాఎడ్జ్బాస్టన్ వేదికగా ఓవైపు శుబ్మన్ గిల్ డబుల్ సెంచరీతో అదరగొట్టగా.. మరో ఎండ్ నుంచి వాషింగ్టన్ సుందర్ అతడికి సహకారం అందిస్తున్నాడు. 129 ఓవర్ల ఆట ముగిసేసరికి సుందర్ 24, గిల్ 231 పరుగులతో ఉండగా.. టీమిండియా స్కోరు: 510/6. అంతకు ముందు రవీంద్ర జడేజా అర్ధ శతకం (89) బాది అవుట్ కాగా.. తొలిరోజు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (87) కూడా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.చదవండి: Ind vs Eng: ఇదేం తీరు?.. గిల్పై మండిపడ్డ గావస్కర్!.. గంగూలీ విమర్శలు -
ENG VS IND 2nd Test: పాపం జడేజా.. తృటిలో సెంచరీ మిస్..!
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 310/5 స్కోర్ వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ లంచ్ విరామం సమయానికి 6 వికెట్ల నష్టానికి 419 పరుగులు చేసింది. 114 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు బరిలోకి దిగిన శుభ్మన్ గిల్ 150 పరుగులు పూర్తి చేసుకొని ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. 41 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన రవీంద్ర జడేజా 89 పరుగుల స్కోర్ (137 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో) వద్ద ఔటయ్యాడు.జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన జడేజా గిల్తో అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చాడు. గిల్-జడేజా ఆరో వికెట్కు 203 పరుగులు జోడించారు. గిల్తో పాటు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన జడేజా సెంచరీ మిస్ చేసుకోవడంతో టీమిండియా అభిమానులు పాపం అంటున్నారు. తొలి టెస్ట్లో సామర్థ్యం మేరకు రాణించలేక (11, 25 నాటౌట్) విమర్శలు ఎదుర్కొన్న జడేజా ఈ మ్యాచ్లో తానేంటో నిరూపించుకున్నాడు. జోష్ టంగ్ బౌలింగ్లో వికెట్కీపర్ జేమీ స్మిత్కు క్యాచ్ ఇచ్చి జడేజా ఔటయ్యాడు. లంచ్ విరామం సమయానికి గిల్ 168, వాషింగ్టన్ సుందర్ (1) క్రీజ్లో ఉన్నారు. ఈ ఇన్నింగ్స్తో గిల్ విరాట్ కోహ్లి రికార్డును బద్దలు కొట్టాడు. ఎడ్జ్బాస్టన్ మైదానంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు (168) సాధించిన భారత క్రికెటర్గా అవతరించాడు. గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లి (149) పేరిట ఉండేది. టెస్టుల్లో గిల్ 150 పరుగుల మార్కుకు చేరుకోవడం కూడా ఇదే తొలిసారి. ఇంగ్లండ్ గడ్డ మీద ఓ టెస్టు మ్యాచ్ ఇన్నింగ్స్లో నూట యాభైకి పైగా వ్యక్తిగత స్కోరు సాధించిన టీమిండియా రెండో కెప్టెన్గానూ గిల్ నిలిచాడు. 1990లో ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్ హోదాలో 179 పరుగులు సాధించాడు. -
చరిత్ర తిరగరాసిన శుబ్మన్ గిల్.. అత్యధిక స్కోరుతో..
ఇంగ్లండ్తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) అద్భుత ప్రదర్శనతో దుమ్ములేపుతున్నాడు. తొలిరోజే శతకం పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. గురువారం నాటి రెండో రోజు ఆటలో 150 పరుగుల మార్కు అందుకున్నాడు. 263 బంతుల్లో 17 ఫోర్ల సాయంతో గిల్ ఈ మేర స్కోరు చేశాడు.తద్వారా టీమిండియా దిగ్గజ బ్యాటర్, కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) పేరిట ఉన్న రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత క్రికెటర్గా అవతరించాడు. ఇంతకు ముందు 2018 నాటి టెస్టు మ్యాచ్లో కోహ్లి ఇదే వేదికపై 149 పరుగులు స్కోరు చేశాడు. తాజాగా గిల్ కోహ్లిని అధిగమించి ఎడ్జ్బాస్టన్లో చరిత్ర తిరగరాశాడు. ఇక టెస్టుల్లో గిల్ 150 పరుగుల మార్కుకు చేరుకోవడం ఇదే తొలిసారి.భారత రెండో కెప్టెన్గా..ఇంగ్లండ్ గడ్డ మీద ఓ టెస్టు మ్యాచ్ ఇన్నింగ్స్లో నూట యాభైకి పైగా వ్యక్తిగత స్కోరు సాధించిన టీమిండియా రెండో కెప్టెన్గానూ గిల్ నిలిచాడు. 1990లో ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్ హోదాలో 179 పరుగులు సాధించాడు.మూడో సారథిగా..అదే విధంగా.. 26వ పడిలో అడుగుపెట్టక ముందే టెస్టు ఇన్నింగ్స్లో 150 పరుగుల మార్కు దాటిన భారత మూడో కెప్టెన్గానూ గిల్ చరిత్రకెక్కాడు. అతడి కంటే ముందు మన్సూర్ అలీఖాన్ పటౌడీ రెండుసార్లు ఈ ఘనత సాధించగా.. సచిన్ టెండుల్కర్ కూడా ఈ ఫీట్ నమోదు చేశాడు.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడే నిమిత్తం భారత జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తోంది. ఈ సిరీస్తో గిల్ భారత టెస్టు జట్టు కెప్టెన్గా తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఇక లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఐదు వికెట్లు తేడాతో ఓటమిపాలైంది.జడేజాతో కలిసి 200 పరుగుల భాగస్వామ్యంఈ క్రమంలో బుధవారం (జూలై 2) నుంచి ఎడ్జ్బాస్టన్ వేదికగా రెండో టెస్టు మొదలు కాగా.. టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్కు దిగింది. తొలి రోజు ఆట ముగిసే సరికి ఐదు వికెట్లు నష్టపోయి 310 పరుగులు చేసిన భారత్.. గురువారం నాటి రెండో రోజు 400 పరుగుల మార్కు దాటింది. 107 ఓవర్లుముగిసే సరికి గిల్ 164, జడేజా 88 పరుగులతో ఉన్నారు. ఇద్దరూ కలిసి 200 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి జట్టును ఆదుకున్నారు. అయితే, తన స్కోరుకు మరో పరుగు జతచేసిన తర్వాత జడ్డూ జోష్ టంగ్ బౌలింగ్లో వికెట్ కీపర్ జేమీ స్మిత్కు క్యాచ్ ఇచ్చి 89 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.లంచ్ బ్రేక్ సమయానికి స్కోరు ఎంతంటే?గురువారం భోజన విరామ సమయానికి టీమిండియా స్కోరు: 419/6 (110). గిల్ 168, వాషింగ్టన్ సుందర్ ఒక పరుగుతో ఉన్నారు.చదవండి: ఇదేం సెలక్షన్?.. ఇచ్చిపడేసిన యశస్వి జైస్వాల్ -
ఊహలకందని విధ్వంసం.. 78 బంతుల్లో 28 సిక్సర్ల సాయంతో 263 పరుగులు
అమెరికాలో జరిగిన ఓ క్లబ్ క్రికెట్ మ్యాచ్లో ఊహలకందని విధ్వంసం జరిగింది. ఎడిసన్ క్రికెట్ క్లబ్కు ప్రాతినిథ్యం వహించే ఓ ఆటగాడు 78 బంతుల్లో 17 ఫోర్లు, 28 సిక్సర్ల సాయంతో 337.18 స్ట్రయిక్రేట్తో 263 పరుగులు (నాటౌట్) చేశాడు. క్రికెట్ చరిత్రలో బహుశా ఇంతటి విధ్వంసం ఎప్పుడూ జరిగి ఉండకపోవచ్చు. ఈ మ్యాచ్కు అధికారిక గుర్తింపు ఉందో లేదో తెలియదు కానీ.. సోషల్మీడియాలో మాత్రం ఈ వార్త హల్చల్ చేస్తుంది. ఇంతటి విధ్వంసానికి కారకుడు ఎవరని తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. View this post on Instagram A post shared by Loudoun Cubs Cricket Academy (@loudouncubs)వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల కిందట అమెరికాలో క్రికెట్ లీగ్ ఆఫ్ న్యూజెర్సీ (CLNJ) అనే క్రికెట్ టోర్నీ (40 ఓవర్ల ఫార్మాట్) జరిగింది. ఇందులో భాగంగా ఎడిసన్ క్రికెట్ క్లబ్, ఈసీసీ షార్క్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో రౌనక్ శర్మ (ఎడిసన్ క్రికెట్ క్లబ్) అనే ఆటగాడు సిక్సర్ల సునామీ సృష్టించి 78 బంతుల్లో అజేయమైన 263 పరుగులు చేశాడు. ఇందులో రౌనక్ తన తొలి సెంచరీని కేవలం 27 బంతుల్లోనే చేయడం మరో విశేషం.Raunaq Sharma lit up club cricket with a jaw-dropping 263 off just 78 balls against ECC Sharks!🔥💯His knock, in a 40-over clash, stands as one of the most explosive and highest-scoring innings in limited-overs cricket history. (official or unofficial) pic.twitter.com/3MuBcCQ2QW— CricTracker (@Cricketracker) July 3, 2025ఇదే టోర్నీలో అంతకుముందు జరిగిన మరో మ్యాచ్లోనూ రౌనక్ ఇదే తరహాలో విధ్వంసం సృష్టించాడు. NJ Lions CCతో జరిగిన మ్యాచ్లో 81 బంతుల్లో 15 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 209.88 స్ట్రయిక్రేట్తో 170 పరుగులు చేశాడు.దీనికి ముందు జరిగిన మరో టోర్నీలో (WMCB T20 League Elite Division) కూడా రౌనక్ ఉగ్రరూపాన్ని ప్రదర్శించాడు. ఓ మ్యాచ్లో 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ టోర్నీ మొత్తంలో 9 మ్యాచ్లు ఆడిన రౌనక్.. 220.65 స్ట్రయిక్రేట్తో 50.75 సగటున 406 పరుగులు చేశాడు. 33 ఏళ్ల రౌనక్ శర్మ భారత్లోని ముంబైలో జన్మించాడు. కుడి చేతి వాటం స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన ఆయన.. క్రికెట్ అవకాశాల కోసం యూఎస్ఏకు వలస వెళ్లాడు. ప్రస్తుతం రౌనక్ హ్యూస్టన్ స్టార్స్ అనే అమెరికన్ జట్టుకు ఆడుతున్నాడు. రౌనక్కు టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో మంచి పరిచయం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఇద్దరు చిన్నతనంలో కలిసి ఆడారట. -
ఇదేం సెలక్షన్?.. ఇచ్చిపడేసిన యశస్వి జైస్వాల్
ఇంగ్లండ్తో తొలి టెస్టులో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఎడ్జ్బాస్టన్ టెస్టులో గెలిచి ఐదు మ్యాచ్ల సిరీస్ను ప్రస్తుతానికి 1-1తో సమం చేయాలని భావిస్తోంది. అయితే, భారత్ రెండో టెస్టుకు ఎంపిక చేసిన తుదిజట్టుపై విమర్శలు వస్తున్నాయి.మూడు మార్పులుబర్మింగ్హామ్లో బుధవారం మొదలైన ఈ మ్యాచ్లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. పనిభారాన్ని తగ్గించే నిమిత్తం ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)కు విశ్రాంతినిచ్చిన యాజమాన్యం.. తొలి టెస్టులో విఫలమైన సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూలను జట్టు నుంచి తప్పించింది.వీరి స్థానాల్లో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy), స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep) తుదిజట్టులోకి వచ్చారు. అయితే, ఎడ్జ్బాస్టన్ పిచ్ స్పిన్కు కాస్త ఎక్కువగానే సహకరిస్తుందనే విశ్లేషణల నడుమ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను టీమిండియా పక్కనపెట్టడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.విమర్శల వర్షంఅంతేకాదు.. బ్యాటింగ్ ఆర్డర్ను మరింత పటిష్టం చేసేందుకు ఆల్రౌండర్లు నితీశ్, వాషీలను తీసుకున్నామని.. ఆఖర్లో కుల్దీప్ను కూడా పక్కనపెట్టాల్సి వచ్చిందని కెప్టెన్ శుబ్మన్ గిల్ చెప్పడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్లు సునిల్ గావస్కర్, రవిశాస్త్రి, సౌరవ్ గంగూలీ టీమిండియా నాయకత్వ బృందంపై విమర్శలు గుప్పించారు.ఎనిమిది రోజుల విరామం తర్వాత కూడా బుమ్రాకు విశ్రాంతినివ్వడాన్ని రవిశాస్త్రి తప్పుబడితే.. కుల్దీప్ను ఎలా పక్కనపెడతారంటూ గావస్కర్, గంగూలీ ఫైర్ అయ్యారు. కీలక మ్యాచ్లో తుదిజట్టు కూర్పు సరిగ్గా లేదంటూ విమర్శించారు.ఇచ్చిపడేసిన యశస్వి జైస్వాల్అయితే, బుధవారం నాటి తొలిరోజు ఆట ముగిసిన తర్వాత టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక్క మాటతో ఈ విమర్శలను తిప్పికొట్టాడు. ఆట పూర్తైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘లేదు.. తుదిజట్టు ఎంపికలో మాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు’’ అంటూ విమర్శకులకు ఇచ్చిపడేశాడు. తమ ప్రణాళికలకు అనుగుణంగానే మార్పులు చేసినట్లు చెప్పుకొచ్చాడు.అదే విధంగా.. కెప్టెన్ శుబ్మన్ గిల్ గురించి మాట్లాడుతూ.. ‘‘బ్యాటర్గా, కెప్టెన్గా అతడు అద్బుతం. జట్టును ఎలా ముందుకు తీసుకువెళ్లాలో అతడికి స్పష్టమైన అవగాహన ఉంది. మేము అనుకున్న పని పూర్తి చేస్తాం’’ అని జైస్వాల్ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. బర్మింగ్హామ్ వేదికగా రెండో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సరికి టీమిండియా ఐదు వికెట్లు నష్టపోయి 310 పరుగులు చేసింది. ఓపెనర్లలో కేఎల్ రాహుల్ (2) విఫలం కాగా.. యశస్వి జైస్వాల్ అద్భుత అర్ధ శతకం(87) సాధించాడు. ఇక కరుణ్ నాయర్ (31) మరోసారి నిరాశపరచగా.. రిషభ్ పంత్ 25 పరుగులకే వెనుదిరిగాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్ గిల్ శతక ఇన్నింగ్స్తో ఆకట్టుకోగా.. రవీంద్ర జడేజా అతడికి అండగా నిలిచాడు. బుధవారం ఆట పూర్తయ్యేసరికి గిల్ 114, జడ్డూ 41 పరుగులతో అజేయంగా ఉన్నారు.చదవండి: గిల్పై మండిపడ్డ గావస్కర్!.. గంగూలీ విమర్శలు -
ENG VS IND 2nd Test Day 2: ప్రమాదంలో కోహ్లి రికార్డు
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో భారత్ రెండో రోజు ఆటను ప్రారంభించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ అజేయ సెంచరీతో (114), రవీంద్ర జడేజా 41 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 87, కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1 పరుగు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2 వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, షోయబ్ బషీర్ తలో వికెట్ పడగొట్టారు.రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లి పేరిట ఉన్న ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. రెండో రోజు గిల్ మరో 36 పరుగులు చేస్తే, ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లండ్పై 150 పరుగులు మార్కును తాకిన తొలి భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ఎడ్జ్బాస్టన్లో భారత్ తరఫున ఇప్పటివరకు ఎవరూ 150 పరుగుల మార్కును తాకలేదు. 2018లో విరాట్ 149 పరుగులు చేశాడు. ఇదే ఇప్పటివరకు ఎడ్జ్బాస్టన్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్గా ఉంది. విరాట్ రికార్డును ఛేదించే క్రమంలో గిల్ సచిన్ టెండూల్కర్, రిషబ్ పంత్లను అధిగమించే అవకాశం ఉంది. ఎడ్జ్బాస్టన్లో సచిన్ 122, పంత్ 146 పరుగులు చేశారు.కాగా, ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత్ ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్లో భారత్ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. ఛేదనలో బెన్ డకెట్ (149) సూపర్ సెంచరీ చేసి ఇంగ్లండ్ను గెలిపించాడు. జాక్ క్రాలే (65), జో రూట్ (53 నాటౌట్), బెన్ స్టోక్స్ (33), జేమీ స్మిత్ (44 నాటౌట్) తలో చేయి వేశారు.ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు రెండు ఇన్నింగ్స్ల్లో అద్బుతంగా ఆడారు. ఈ మ్యాచ్లో భారత్ తరఫున ఐదు శతకాలు నమోదయ్యాయి. తొలి ఇన్నింగ్స్లో జైస్వాల్ (101), గిల్ (147), పంత్ (134).. రెండో ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ (137), పంత్ (118) శతకాలు చేశారు.ఇంగ్లండ్ తరఫున తొలి ఇన్నింగ్స్లో ఓలీ పోప్ (106) సెంచరీ చేయగా.. హ్యారీ బ్రూక్ (99) తృటిలో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో బుమ్రా 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. -
ఇదేం తీరు?.. గిల్పై మండిపడ్డ గావస్కర్!.. గంగూలీ విమర్శలు
ఇంగ్లండ్తో రెండో టెస్టుకు భారత్ ఎంచుకున్న తుదిజట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. కీలక మ్యాచ్లో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)కు విశ్రాంతినివ్వడంతో పాటు.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)ను జట్టులోకి తీసుకోకపోవడాన్ని మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. కాగా టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్తో తొలి టెస్టులో టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే.తప్పని ఓటమిలీడ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ ఐదు శతకాలు సాధించినా.. లోయర్ ఆర్డర్, బౌలర్లు, ఫీల్డింగ్ వైఫల్యం కారణంగా పరాభవం తప్పలేదు. ఫలితంగా ఐదు మ్యాచ్ల సిరీస్లో గిల్ సేన 0-1తో వెనుకబడింది. అయితే, రెండో టెస్టులోనైనా పొరపాట్లు సరిచేసుకుంటుందని భావిస్తే.. తుదిజట్టు కూర్పే సరిగ్గా లేదనే విమర్శలు వస్తున్నాయి.తొలి టెస్టులో ఆడిన బుమ్రాకు విశ్రాంతినిచ్చిన యాజమాన్యం.. సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూర్లపై వేటు వేసింది. ఈ ముగ్గురి స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్లను ఎడ్జ్బాస్టన్ టెస్టుకు తీసుకుంది.ఇద్దరు బెస్ట్ స్పిన్నర్లు ఉన్నారా?ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. ‘‘ఈ మ్యాచ్లో టీమిండియా తమ ఇద్దరు అత్యుత్తమ స్పిన్నర్లతో ఆడుతుందని నాకు అనిపించడం లేదు. ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడం కూడా నాకు ఆశ్చర్యం కలిగించింది.టీమిండియాకు ఇదే మంచి అవకాశం. వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధిస్తేనే సానుకూల ఫలితం రాబట్టగలము’’ అని పేర్కొన్నాడు ఇక భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ మాత్రం మేనేజ్మెంట్ తీరుపై ఘాటు విమర్శలు చేశాడు. ‘‘కుల్దీప్ యాదవ్ను తుదిజట్టుకు ఎంపిక చేయకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఎడ్జ్బాస్టన్ లాంటి పిచ్పై బంతి కాస్త టర్న్ అవుతుందనీ తెలిసి ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా?’’ అని ప్రశ్నించాడు.గిల్పై గావస్కర్ ఆగ్రహం!అంతేకాదు.. బ్యాటింగ్లో డెప్త్ కోసం ఆల్రౌండర్లు నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్లను తీసుకున్నామన్న కెప్టెన్ శుబ్మన్ గిల్ సమర్థనను కూడా గావస్కర్ తప్పుబట్టాడు. ‘‘మీ జట్టులోని టాపార్డర్ విఫలమవుతుంటే.. వాషింగ్టన్ ఏడో స్థానంలో వచ్చి.. నితీశ్ రెడ్డి ఎనిమిదో స్థానంలో వచ్చి ఏం చేయగలరు?వాళ్లేమీ తొలి టెస్టులో విఫలమైన బ్యాటర్ల మాదిరి కాదు కదా!.. మీరు మొత్తంగా 830కి పైగా పరుగులు చేశారు. కానీ రెండో ఇన్నింగ్స్లో కనీసం 380 స్కోరు చేయలేక ప్రత్యర్థికి అవకాశం ఇచ్చారు. బ్యాటింగ్ ఆర్డర్ను పటిష్టం చేస్తున్నామని చెప్పడం కాదు.. వికెట్లు తీసే బౌలింగ్ విభాగాన్ని ఎంచుకోండి’’ అని గావస్క కెప్టెన్ గిల్, హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా ఇంగ్లండ్తో బుధవారం మొదలైన ఎడ్జ్బాస్టన్ టెస్టులో స్పిన్ విభాగంలో ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లు ఆడుతున్నారు. వీరిలో ఒకరికి బదులు స్పెషలిస్టు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఎంపిక చేయాల్సిందని గావస్కర్ వంటి మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇక రెండో టెస్టు తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (87), కెప్టెన్ శుబ్మన్ గిల్ (114 నాటౌట్)లతో పాటు రవీంద్ర జడేజా (41 నాటౌట్) రాణించాడు.ఇంగ్లండ్తో రెండో టెస్టుకు భారత తుదిజట్టుయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.చదవండి: గిల్.. నిన్ను చూసి గ్రేమ్ స్మిత్ గర్వపడుతుంటాడు: యువరాజ్ -
ఇంగ్లండ్ గడ్డపై సరికొత్త చరిత్ర.. 51 ఏళ్ల రికార్డు బద్దలు
ఇంగ్లండ్ టూర్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఎడ్జ్బాస్టన్ మైదానంలో ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో జైశ్వాల్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. వన్డే తరహాలో ప్రత్యర్ధి బౌలర్లను యశస్వి ఉతికారేశాడు.తన మెరుపు బ్యాటింగ్తో భారత్కు ఘనమైన ఆరంభాన్ని అందించాడు. తొలి ఇన్నింగ్స్లో 107 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్.. 13 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేశాడు. ఈ క్రమంలో జైశ్వాల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.51 ఏళ్ల రికార్డు బద్దలుఎడ్జ్బాస్టన్ మైదానంలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత ఓపెనర్గా జైశ్వాల్ రికార్డులెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా మాజీ ఓపెనర్ సుధీర్ నాయక్ పేరిట ఉండేది. సుదీర్ నాయక్ 1974లో ఇదే మైదానంలో 77 పరుగులు చేశారు.ఇప్పుడు తాజా మ్యాచ్తో నాయక్ పేరిట ఉన్న 51 ఏళ్ల రికార్డును జైశ్వాల్ బ్రేక్ చేశాడు. జైశ్వాల్, సుదీర్ తర్వాతి స్ధానాల్లో సునీల్ గవాస్కర్ (68), చేతేశ్వర్ పుజారా (66), చేతన్ చౌహాన్ (56) వంటి భారత ఓపెనర్లు ఉన్నారు.సునీల్ గవాస్కర్ రికార్డుపై కన్ను..భారత టెస్టు జట్టులో యశస్వి కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. 2023లో టెస్ట్ అరంగేట్రం చేసినప్పటి నుంచి దాదాపు ప్రతీ మ్యాచ్లోనూ బ్యాటింగ్లో రాణిస్తూ వస్తున్నాడు. కేవలం 21 టెస్ట్ మ్యాచ్ల్లోనే యశస్వి.. ఐదు సెంచరీలు, పన్నెండు అర్ధ సెంచరీలతో సహా 1,990 పరుగులు చేశాడు.ఈ ముంబై ఆటగాడు టెస్ట్ క్రికెట్లో 2000 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి కేవలం 10 పరుగుల దూరంలో ఉన్నాడు. రెండవ ఇన్నింగ్స్లో అతడు 10 పరుగులు సాధిస్తే.. టెస్టుల్లో అత్యంతవేగంగా రెండు వేల పరుగులు చేసిన భారత ఆటగాడిగా గవాస్కర్ రికార్డును బ్రేక్ చేస్తాడు.సునీల్ గవాస్కర్ ఈ ఫీట్ను తన 23వ టెస్ట్లో నమోదు చేశారు. 1976 ఏప్రిల్ 7 నుండి 12 వరకు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన టెస్టులో ఈ ఘనత సాధించారు.చదవండి: SL vs BAN: 5 పరుగులు, 7 వికెట్లు: వన్డేల్లో శ్రీలంక ప్రపంచ రికార్డు -
SL vs BAN: 5 పరుగులు, 7 వికెట్లు: వన్డేల్లో శ్రీలంక ప్రపంచ రికార్డు
29 పరుగుల వద్ద తొలి వికెట్... సరిగ్గా 100 పరుగులు పూర్తి చేసిన తర్వాత రెండో వికెట్.. మరో రెండు పరుగులు జతచేసి రెండు వికెట్లు (102/4).. ఆ తర్వాత వైడ్ రూపంలో ఒక పరుగు అంటే అప్పటికి స్కోరు 103/4.. అదే స్కోరు వద్ద ఐదో వికెట్ కూడా డౌన్.. ఒక్క పరుగు జతచేర్చిన వెంటనే ఆరో వికెట్ కూడా పడింది (104/6)..మళ్లీ ఆలస్యం చేయకూడదు అనుకున్నారేమో బ్యాటర్లు.. అదే స్కోరు వద్ద ఏడో వికెట్ కూడా డౌన్.. వైడ్ రూపంలో మరో పరుగు రాగానే ఎనిమిదో వికెట్ కూడా పడిపోయింది.. అప్పటికి స్కోరు 105/8.. మరో పందొమ్మిది పరుగులు రాగానే తొమ్మిదో వికెట్ కూడా పడింది.. 167 పరుగులకు ఆలౌట్..ఐదు పరుగులు, ఏడు వికెట్లుశ్రీలంకతో తొలి వన్డే సందర్భంగా బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిన విధానం ఇది.. 100-1తో పటిష్టంగా కనిపించిన బంగ్లా.. కేవలం ఐదు పరుగుల వ్యవధిలోనే మరో ఏడు వికెట్లు కోల్పోయింది. తమ స్కోరుకు కేవలం ఐదు పరుగులు జతచేసి ఏడు వికెట్ల నష్టాన్ని చవిచూసింది. లంక బౌలర్ల ధాటికి తాళలేక 167 పరుగులకే కుప్పకూలి.. 77 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.ఈ మేరకు బంగ్లాదేశ్కు చుక్కలు చూపించిన శ్రీలంక ఖాతాలో ఓ ప్రపంచ రికార్డు నమోదైంది. వన్డే క్రికెట్ చరిత్రలో.. అత్యధికసార్లు ప్రత్యర్థి జట్టు మీద ఏడు లేదా అంతకంటే తక్కువ పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కూల్చిన తొలి జట్టుగా లంక నిలిచింది. లంక ఇలా ప్రత్యర్థిని కుదేలు చేయడం ఇది మూడోసారి.2008లో జింబాబ్వే మీద మూడు పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కూల్చిన లంక.. 2024లో అఫ్గనిస్తాన్ మీద. ఏడు పరుగుల వ్యవధిలో ఈ ఘనత సాధించింది. తాజాగా బంగ్లాదేశ్ మీద ఐదు పరుగుల వ్యవధిలో ఈ ఫీట్ నమోదు చేసింది.వన్డే క్రికెట్ చరిత్రలో తక్కువ పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కూల్చిన జట్లు🏏శ్రీలంక- 2008లో హరారే వేదికగా- జింబాబ్వేను 124-3 నుంచి 127-10కి పడగొట్టింది.🏏శ్రీలంక- 2025లో కొలంబో వేదికగా- బంగ్లాదేశ్ను 100-1 నుంచి 105-8కు పడగొట్టింది.🏏వెస్టిండీస్- 1986లో షార్జా వేదికగా- శ్రీలంకను 45-2 నుంచి 51-9కు పడగొట్టింది.🏏శ్రీలంక- 2024లో పల్లెకెలె వేదికగా- అఫ్గనిస్తాన్ను 146-3 నుంచి 153-10కు పడగొట్టింది.🏏నేపాల్- 2020లో కీర్తిపూర్ వేదికగా- యూఎస్ఏను 27-2 నుంచి 35-9కి పడగొట్టింది.🏏భారత్- 2014లో మిర్పూర్ వేదికగా- బంగ్లాదేశ్ను 50-3 నుంచి 58-10కు పడగొట్టింది.వన్డేల్లోనూ శుభారంభంసొంతగడ్డపై బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ నెగ్గిన శ్రీలంక జట్టు... వన్డేల్లోనూ శుభారంభం చేసిన విషయం తెలిసిందే. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన తొలి వన్డేలో శ్రీలంక 77 పరుగుల తేడాతో విజయం సాధించింది.ఆర్. ప్రేమదాస స్టేడియం వేదికగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 49.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ చరిత అసలంక (123 బంతుల్లో 106; 6 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీతో చెలరేగగా... వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ (43 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు.టెస్టు సిరీస్లో దంచికొట్టిన పాథుమ్ నిసాంక (0), నిశాన్ మధుషనక (6), కమిందు మెండిస్ (0) ఈసారి విఫలమయ్యారు. జనిత్ లియాంగె (29), మిలాన్ రత్ననాయకె (22), వనిందు హసరంగ (22) ఫర్వాలేదనిపించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కీన్ అహ్మద్ 4, తన్జీమ్ హసన్ మూడు వికెట్లు పడగొట్టారు.అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 35.5 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. తన్జీద్ హసన్ (61 బంతుల్లో 62; 9 ఫోర్లు, 1 సిక్స్), జాకీర్ అలీ (64 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధశతకాలతో పోరాడగా... మిగిలిన వాళ్లంతా విఫలమయ్యారు. లంక బౌలర్ల ధాటికి కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ (0), లిటన్ దాస్ (0), పర్వేజ్ (13), నజు్మల్ షంటో (23), తౌహిద్ హృదయ్ (1) పెవిలియన్కు వరుస కట్టారు. లంక బౌలర్లలో హసరంగ 4, కమిందు మెండిస్ 3 వికెట్లు పడగొట్టారు. అసలంకకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శనివారం రెండో వన్డే జరగనుంది. సంక్లిప్త స్కోర్లు🏏శ్రీలంక- 244 (49.2)🏏బంగ్లాదేశ్- 167 (35.5).చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగాBangladesh’s batting: now you see it, now you don’t 🎩The visitors went off a cliff in Colombo losing 7 wickets for just 5 runs in a stunning meltdown 😳#SLvBAN pic.twitter.com/8ea1xiXjOz— FanCode (@FanCode) July 2, 2025 -
మ్యాచ్ మధ్యలో గ్రౌండ్ లోకి పాము.. ఉలిక్కిపడిన ఆటగాళ్లు! వీడియో
కొలంబో వేదికగా తొలి వన్డేలో శ్రీలంక-బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ను వీక్షించడానికి అనుకోని అతిథి స్టేడియం వచ్చింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ సందర్భంగా సుమారు 6 అడుగుల పొడవున్న పాము మైదానంలో ప్రత్యక్షమైంది. బిగ్ స్క్రీన్లో పామ్ను చూసిన అంపైర్లు ఆటను కాసేపు నిలిపివేశారు.ఆటగాళ్లు సైతం కాస్త గందరగోళానికి గురయ్యారు. వెంటనే మైదాన సిబ్బంది దాన్ని అక్కడినుంచి బయటకి పంపించారు. దీంతో తిరిగి మళ్లీ ఆట ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా శ్రీలంక మైదానాల్లో సరృసృపాలు ప్రత్యక్షం కావడం ఇదేమి తొలిసారి కాదు. గతేడాది శ్రీలంక ప్రీమియర్ లీగ్ సందర్భంగా వరుసగా రెండు మ్యాచ్లకు పాము హాజరై కలకలం రేపింది. అదేవిధంగా బంగ్లా-శ్రీలంక టెస్టు సిరీస్ సందర్భంగా పాములు పట్టుకుని స్నేక్ క్యాచర్ కూడా కెమెరాకు చిక్కాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాదేశ్ను 77 పరుగుల తేడాతో శ్రీలంక చిత్తు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 49.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక(106) సెంచరీతో మెరిశాడు.బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కీన్ అహ్మద్ 4, తన్జీమ్ హసన్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 35.5 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో సునాయసంగా గెలిపించేలా కన్పించిన బంగ్లాదేశ్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. లంక బౌలర్లలో హసరంగ 4, కమిందు మెండిస్ 3 వికెట్లు పడగొట్టారు. అసలంకకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.చదవండి: గిల్.. నిన్ను చూసి గ్రేమ్ స్మిత్ గర్వపడుతుంటాడు: యువరాజ్Bangladesh’s batting: now you see it, now you don’t 🎩The visitors went off a cliff in Colombo losing 7 wickets for just 5 runs in a stunning meltdown 😳#SLvBAN pic.twitter.com/8ea1xiXjOz— FanCode (@FanCode) July 2, 2025#snake #Cricket pic.twitter.com/Y5KMfE94aZ— ABHISHEK PANDEY (@anupandey29) July 3, 2025 -
సౌతాఫ్రికా ఆటగాడి సునామీ ఇన్నింగ్స్.. కేవలం 9 బంతుల్లోనే! వీడియో
మేజర్ లీగ్ క్రికెట్-2025లో టెక్సాస్ సూపర్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ టోర్నీలో భాగంగా గురువారం వాషింగ్టన్ ఫ్రీడమ్తో జరిగిన మ్యాచ్లో 43 పరుగుల తేడాతో సూపర్ కింగ్స్ విజయభేరి మ్రోగించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 5 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 87 పరుగుల భారీ స్కోర్ చేసింది.సూపర్ కింగ్స్ ఓపెనర్లు స్టోయినిష్(2), డార్లీ మిచెల్(6 రిటైర్డ్ హార్ట్) నిరాశపరిచినప్పటికి.. శుభమ్ రంజనే( 14 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 39 నాటౌట్), డోనోవన్ ఫెరీరా(9 బంతుల్లో 5 సిక్స్లతో 37 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు.సౌతాఫ్రికాకు చెందిన ఫెరీరా.. ఆఖరి ఓవర్ వేసిన మిచెల్ ఓవెన్ బౌలింగ్లో నాలుగు సిక్సర్లు, రెండు డబుల్స్ సాయంతో ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. అతడి విధ్వంసకర బ్యాటింగ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా వాషింగ్టన్ బౌలర్లలో నేట్రావల్కర్ ఓ వికెట్ సాధించాడు. అనంతరం 88 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిదిగిన వాషింగ్టన్ జట్టు నిర్ణీత 5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 44 పరుగులకే పరిమితమైంది. వాషింగ్టన్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(18) టాప్ స్కోరర్గా నిలిచాడు. కెప్టెన్ మాక్స్వెల్ ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. సూపర్ కింగ్స్ బౌలర్లలో బర్గర్ రెండు, అకిల్ హోసేన్, నూర్ ఆహ్మద్ తలా వికెట్ సాధించారు. కాగా టెక్సాస్, వాషింగ్టన్ రెండు జట్లు ఇప్పటికే తమ ప్లే ఆఫ్ బెర్త్ను ఖారారు చేసుకున్నాయి.DONOVAN FERREIRA - THE SUPERSTAR OF TEXAS SUPER KINGS.!!!- 6, 6, 6, 2, 2, 6 vs Mitchell Owen in the final over to finish 37* (9) .!!!pic.twitter.com/hbmUUZAWwC— MANU. (@IMManu_18) July 3, 2025 -
రవిచంద్రన్ ఆశ్విన్ విధ్వంసం.. బెంబేలెత్తిన బౌలర్లు
తమిళనాడు ప్రీమియర్ లీగ్-2025లో దిండిగల్ డ్రాగన్స్ జట్టు క్వాలిఫయర్-2కు ఆర్హత సాధించింది. బుధవారం ఎన్పీఆర్ కాలేజీ గ్రౌండ్ వేదికగా జరిగిన ఎలిమినేటర్లో ట్రిచీ గ్రాండ్ చోళస్పై 6 వికెట్ల తేడాతో దిండిగల్ ఘన విజయం సాధించింది. దీంతో శుక్రవారం జరగనున్న క్వాలిఫయర్-2లో చెపాక్ సూపర్ గిల్లీస్తో దిండిగల్ డ్రాగన్స్ అమీతుమీ తెల్చుకోనుంది.కాగా ఎలిమేనటర్లో టీమిండియా స్పిన్ లెజెండ్, దిండిగల్ కెప్టెన్ రవిచంద్రన్ ఆశ్విన్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు. తొలుత బౌలింగ్లో మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించిన ఆశ్విన్.. ఆ తర్వాత బ్యాటింగ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 141 పరుగుల లక్ష్య చేధనలో ప్రత్యర్ధి బౌలర్లను ఆశూ ఉతికారేశాడు.కేవలం 48 బంతుల్లోనే 11 ఫోర్లు, మూడు భారీ సిక్సర్లతో 83 పరుగులు చేశాడు. ఆశ్విన్తో పాటు బాబా ఇంద్రజిత్(27) ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. ట్రిచీ బౌలర్లలో ఈశ్వరన్ రెండు వికెట్లు పడగొట్టగా.. శర్వన్ కుమార్, డేవిడ్సన్ తలా వికెట్ సాధించారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన ట్రిచీ గ్రాండ్ చోళస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ట్రిచీ బ్యాటర్లలో జాఫర్ జమాల్(33), వసీం అహ్మద్(36) రాణించారు. డ్రాగన్స్ బౌలర్లలో ఆశ్విన్తో పాటు జి పెరియస్వామి, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: గిల్.. నిన్ను చూసి గ్రేమ్ స్మిత్ గర్వపడుతుంటాడు: యువరాజ్ -
గిల్.. నిన్ను చూసి గ్రేమ్ స్మిత్ గర్వపడుతుంటాడు: యువరాజ్
ఎడ్జ్బాస్టన్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్(Shubman gill) అద్బుతమైన సెంచరీ సాధించాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన శుబ్మన్ గిల్.. బాధ్యయుత ఇన్నింగ్స్తో కష్టాల్లో పడిన జట్టును ఆదుకున్నాడు. తొలుత ఆచితూచి ఆడిన గిల్.. మొదటి 100 బంతుల్లో కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత క్రీజులో నిలదొక్కున్నాక తనదైన శైలిలో గిల్ బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో శుబ్మన్ 199 బంతుల్లో తన ఏడవ టెస్ట్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. గిల్ 216 బంతుల్లో 12 ఫోర్లతో 114 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. తొలి టెస్టులో కూడా గిల్ సూపర్ సెంచరీతో మెరిశాడు. ఈ నేపథ్యంలో గిల్పై భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. గిల్ ఆటను చూసి దక్షిణాఫ్రికా లెజెండ్ గ్రేమ్ స్మిత్ గర్వపడతుంటాడని యువరాజ్ కొనియాడాడు. కాగా గ్రేమ్ స్మిత్ దక్షిణాఫ్రికా కెప్టెన్గా ఇంగ్లండ్లో తన తొలి టెస్ట్ సిరీస్లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు సాధించాడు. ఇప్పుడు గిల్ డబుల్ సెంచరీలు సాధించికపోయినప్పటికి.. వరుసగా రెండు సెంచరీలు మాత్రం నమోదు చేశాడు. ఈ క్రమంలోనే గిల్ను స్మిత్తో యువీ పోల్చాడు."జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కొంతమంది నేను ఉన్నా అంటూ ముందుకు వస్తారు. ఆ కోవకు చెందినవాడే శుబ్మన్ గిల్. టెస్టు కెప్టెన్గా వరుసగా సెంచరీలు చేసిన అతికొద్ది మందిలో ఒకడిగా గిల్ నిలిచాడు. ఎంతో ప్రశాంతత, ధైర్యవంతంగా బ్యాటింగ్ చేయడం, జట్టును విజయవంతంగా నడిపించాలనే తపన గిల్లో కన్పించాయి.అతడిని చూసి గ్రేమ్ స్మిత్ కచ్చితంగా గర్వపడుతుంటాడు అని ఎక్స్లో యువీ రాసుకొచ్చాడు. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. క్రీజులో గిల్తో పాటు రవీంద్ర జడేజా(41) ఉన్నాడు.చదవండి: #Shubman Gill: చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. తొలి భారత ప్లేయర్గా -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా
ఇంగ్లండ్ గడ్డపై భారత అండర్-19 ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. బుధవారం నార్తాంప్టన్ వేదికగా ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరిగిన మూడో యూత్ వన్డేలో వైభవ్ విధ్వంసం సృష్టించాడు. 269 పరుగుల లక్ష్య చేధనలో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఇంగ్లీష్ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 31 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 86 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో తన తుపాన్ ఇన్నింగ్స్లో సూర్యవంశీ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.వైభవ్ సాధించిన రికార్డులు ఇవే..👉అండర్-19 వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 80 ప్లస్ రన్స్ చేసిన ఆటగాడిగా సూర్యవంశీ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ఆటగాడు సురేష్ రైనా పేరిట ఉండేది. రైనా 2004లో స్కాట్లాండ్ అండర్-19 జట్టుపై 236.84 స్ట్రైక్రేట్తో 38 బంతుల్లో 90 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్లో 31 బంతుల్లో 277.41 స్ట్రైక్రేట్తో 86 పరుగులు చేసిన వైభవ్.. రైనా ఆల్టైమ్ రికార్డు రికార్డు బ్రేక్ను చేశాడు.👉అండర్ 19 వన్డేలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్గా నిలిచాడు. వైభశ్ సూర్యవంశీ కంటే ముందు రిషభ్ పంత్.. అండర్ 19 వన్డేల్లో 18 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.👉అండర్-19 యూత్ వన్డేలో భారత తరపున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు మన్దీప్ సింగ్(8 సిక్స్లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్లో 9 సిక్సర్లు బాది మన్దీప్ రికార్డును వైభవ్ అధగమించాడు.చదవండి: #Shubman Gill: చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. తొలి భారత ప్లేయర్గా -
AUS Vs WI: ఆస్ట్రేలియా తుది జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ వచ్చేశాడు
గ్రెనడా వేదికగా వెస్టిండీస్తో రెండో టెస్టులో తలపడేందుకు ఆస్ట్రేలియా సిద్దమైంది. గురువారం ప్రారంభం కానున్న ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేయాలని కంగారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో రెండో టెస్టు కోసం ఆస్ట్రేలియా టీమ్మెనెజ్మెంట్ తమ ప్లేయింగ్ ఎలెవన్ ప్రకటించింది.చేతివేలి గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తిరిగి గ్రెనడా టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. స్మిత్ రాకతో వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిష్పై వేటు పడింది. తొలి టెస్టులో అవకాశం లభించినప్పటికి ఇంగ్లిష్ ఉపయోగించుకోలేకపోయాడు.అదేవిధంగా బార్బడోస్ టెస్టు రెండు ఇన్నింగ్స్లలో విఫలమైన సామ్ కాన్స్టాస్, ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్లకు ఆసీస్ టీమ్మెనెజ్మెంట్ మరో అవకాశం కల్పించింది. ఆస్ట్రేలియా తమ బౌలింగ్ లైనప్లో ఎటువంటి మార్పులు చేయలేదు. స్టార్క్, హాజిల్వుడ్, కమ్మిన్స్ ఆసీస్ ఫ్రంట్లైన్ పేసర్లగా ఉన్నారు.వీరితో పాటు నాలుగో పేసర్గా ఆల్రౌండర్ బ్యూ వెబ్స్టర్ బంతిని పంచుకోనున్నాడు. ఆసీస్ ప్లేయింగ్ ఎలెవన్లో నాథన్ లియాన్ ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్గా ఉన్నాడు. తొలి టెస్టులో 159 పరుగుల తేడాతో విండీస్ను కమ్మిన్స్ సేన చిత్తు చేసింది. దీంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ సైకిల్ 2025-27లో ఆసీస్ బోణీ కొట్టింది.విండీస్తో రెండో టెస్టుకు ఆసీస్ తుది జట్టుఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, కామెరాన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్స్టర్, అలెక్స్ క్యారీ, పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హాజిల్వుడ్చదవండి: #Shubman Gill: చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. తొలి భారత ప్లేయర్గా -
చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. తొలి భారత ప్లేయర్గా
భారత టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్(Shubman Gill) ఇంగ్లండ్ గడ్డపై అదరగొడుతున్నాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో గిల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఆరంభంలో వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడిన టీమిండియాను జైశ్వాల్తో కలిసి గిల్ ఆదుకున్నాడు.ఆ తర్వాత క్రీజులో కుదురుకున్నాక తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేశాడు. సూపర్ ఇన్నింగ్స్తో భారత్ను భారీ స్కోర్ దిశగా శుబ్మన్ నడిపిస్తున్నాడు. గిల్ 216 బంతుల్లో 12 ఫోర్లతో 114 పరుగులు చేసి తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. గిల్కు ఇది ఏడో టెస్టు సెంచరీ.కాగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. క్రీజులో గిల్తో పాటు రవీంద్ర జడేజా(41) ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్లో సెంచరీతో మెరిసిన శుబ్మన్ గిల్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.గిల్ సాధించిన రికార్డులు ఇవే..👉కెప్టెన్గా వరుసగా రెండు టెస్టుల్లో సెంచరీలు చేసిన నాలుగో భారత కెప్టెన్గా గిల్ రికార్డులెక్కాడు. ఇంతకుముందు విజయ్ హాజారే, సునీల్ గవాస్కర్ టెస్టు కెప్టెన్లుగా మొదటి రెండు టెస్టుల్లో రెండు సెంచరీలు చేయగా.. విరాట్ కోహ్లి వరుసగా మూడు మ్యాచ్లలో శతక్కొట్టాడు.👉ఇంగ్లండ్ గడ్డపై రెండు టెస్టు సెంచరీలు చేసిన అతి పిన్న వయస్కుడైన ఆసియా కెప్టెన్గా శుబ్మన్ నిలిచాడు. గిల్ కేవలం 25 సంవత్సరాల 297 రోజుల వయస్సులో ఈ ఫీట్ సాధించాడు. అయితే ఇంగ్లండ్లో అతి తక్కువ వయస్సులో రెండు టెస్టు సెంచరీలు పర్యాటక బ్యాటర్గా దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం గ్రేమ్ స్మిత్ కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా స్టార్ ఈ ఘనతను 22 సంవత్సరాల 180 రోజుల వయస్సులో సాధించాడు. స్మిత్ తర్వాత ఈ ఫీట్ సాధించింది శుబ్మనే కావడం గమనార్హం.👉అదేవిధంగా ఇంగ్లండ్లో రెండుసార్లు టెస్టు మ్యాచ్ మొదటి రోజే సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా గిల్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఏ భారత ఆటగాడిగా ఈ ఫీట్ సాధించలేకపోయారు. ఓవరాల్గా 13వ ప్లేయర్గా గిల్ రికార్డులకెక్కాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీ వీరవిహారం.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్ -
వైభవ్ సూర్యవంశీ వీరవిహారం.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (31 బంతుల్లో 86; 6 ఫోర్లు, 9 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో ఇంగ్లండ్ అండర్–19 జట్టుతో జరిగిన మూడో యూత్ వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో 2–1తో ఆధిక్యంలో నిలిచింది.నార్తంప్టన్ వేదికగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్ను వర్షం వల్ల 40 ఓవర్లకు కుదించగా ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. ఓపెనర్లు డాకిన్స్ (61 బంతుల్లో 62; 8 ఫోర్లు, 1 సిక్స్), ఇసాక్ మొహమ్మద్ (43 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్స్లు) తొలి వికెట్కు 78 పరుగులు జోడించి చక్కని ఆరంభమిచ్చారు. తర్వాత వన్డౌన్ బ్యాటర్ బెన్ మయెస్ (31) ఫర్వాలేదనిపించాడు.మిడిలార్డర్లో కెప్టెన్ థామస్ ర్యూ (44 బంతుల్లో 76 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్లు) ధాటిగా ఆడటంతో ఆఖర్లో స్కోరు వేగంగా దూసుకెళ్లింది. భారత బౌలర్లలో కనిష్క్ చౌహాన్ 3 వికెట్లు పడగొట్టగా, దీపేశ్, విహాన్, నమన్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ కెప్టెన్ అభిజ్ఞాన్ (12) వికెట్ను కోల్పోయింది.అయితే మరో ఓపెనర్ వైభవ్, వన్డౌన్లో వచ్చిన విహాన్ మల్హొత్రా (34 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా పరుగులు రాబట్టారు. ముఖ్యంగా వైభవ్ భారి సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో టి20ను తలపించేలా 7.3 ఓవర్లలోనే జట్టు స్కోరు వంద దాటింది.సూర్యవంశీ అవుటయ్యాక విహాన్, ఆ తర్వాత కనిష్క్ చౌహాన్ 42 బంతుల్లో 43 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో 34.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసి గెలిచింది. అలెగ్జాండర్ వేడ్కు 2 వికెట్లు దక్కాయి. -
గిల్ 'శతక' మోత
యువ సారథి శుబ్మన్ గిల్ మరో సెంచరీతో కదం తొక్కడంతో ఇంగ్లండ్తో రెండో టెస్టులో భారత జట్టు భారీ స్కోరుకు బాటలు వేసుకుంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ ధనాధన్ ఇన్నింగ్స్తో అలరిస్తే... రవీంద్ర జడేజా కీలక ఇన్నింగ్స్తో తన విలువ చాటుకున్నాడు. బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై రెండో రోజు గిల్, జడేజా జంట ఎంతసేపు నిలుస్తుందనే దానిపైనే భారత స్కోరు ఆధారపడి ఉంది.బర్మింగ్హామ్: పరాజయంతో ఇంగ్లండ్ పర్యటనను ప్రారంభించిన భారత క్రికెట్ జట్టు... రెండో టెస్టును మెరుగ్గా మొదలు పెట్టింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారం మొదలైన రెండో టెస్టులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (216 బంతుల్లో 114 బ్యాటింగ్; 12 ఫోర్లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. ఈ సిరీస్తోనే సారథ్య బాధ్యతలు చేపట్టిన గిల్... కెప్టెన్సీ ప్రభావం తన బ్యాటింగ్పై ఏమాత్రం లేదని మరోసారి నిరూపించాడు. తొలి టెస్టులో సెంచరీ చేసిన గిల్... రెండో టెస్టులోనూ దాన్ని పునరావృతం చేశాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (107 బంతుల్లో 87; 13 ఫోర్లు) సెంచరీ చేసే అవకాశం చేజార్చుకున్నాడు. రవీంద్ర జడేజా (67 బంతుల్లో 41 బ్యాటింగ్; 5 ఫోర్లు) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. కరుణ్ నాయర్ (50 బంతుల్లో 31; 5 ఫోర్లు), రిషబ్ పంత్ (42 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్) మెరుగైన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 2 వికెట్లు పడగొట్టగా... కార్స్, స్టోక్స్, బషీర్ తలా ఒక వికెట్ తీశారు. చేతిలో 5 వికెట్లు ఉన్న భారత జట్టు రెండో రోజు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందనేది కీలకం. జైస్వాల్ దూకుడు గత మ్యాచ్లో భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లండ్ జట్టు... ఈ సారి కూడా టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకుంది. లీడ్స్తో పోల్చుకుంటే ఈ పిచ్ బ్యాటింగ్కు మరింత అనుకూలంగా ఉంటుందనే అంచనాల మధ్య తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్కు శుభారంభం దక్కలేదు. కేఎల్ రాహుల్ (26 బంతుల్లో 2) తొమ్మిదో ఓవర్లో అవుటయ్యాడు. తొలి స్పెల్ను కట్టుదిట్టంగా వేసిన వోక్స్కు ఈ వికెట్ దక్కింది. ఈ దశలో కరుణ్ నాయర్తో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఆరంభంలో కొన్ని ఉత్కంఠ క్షణాలను ఎదుర్కొన్న ఈ జంట... ఆ తర్వాత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసింది. గత మ్యాచ్లో ఆరో స్థానంలో బరిలోకి దిగిన నాయర్... ఈసారి వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చాడు. క్రీజులో ఉన్నంతసేపు సాధికారికంగా ఆడిన అతడు కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. మరో ఎండ్లో జైస్వాల్ అలవోకగా పరుగులు రాబట్టాడు. వన్డే తరహాలో ఆడుతూ పాడుతూ... 59 బంతుల్లో 10 ఫోర్ల సహాయంతో హాఫ్సెంచరీ పూర్తిచేసుకున్నాడు. లంచ్ విరామానికి కాస్త ముందు కార్స్ బౌలింగ్లో నాయర్ అవుటయ్యాడు. దీంతో 80 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. గిల్ సంయమనం... రెండో సెషన్లో గిల్, జైస్వాల్ జోరు చూస్తే భారత్కు తిరుగులేనట్లు అనిపించింది. మంచి బంతులను గౌరవించిన ఈ జంట... గతి తప్పిన బంతులపై విరుచుకుపడి పరుగులు రాబట్టింది. ఈ క్రమంలో జైస్వాల్ మరో సెంచరీ చేయడం ఖాయం అనుకుంటే... ఇంగ్లండ్ కెపె్టన్ స్టోక్స్ అతడిని ఔట్ చేసి జట్టుకు బ్రేక్ త్రూ అందించాడు. చివరి సెషన్లో పంత్ ఎక్కువసేపు నిలవలేకపోగా... ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి (1) ఇలా వచ్చి అలా వెళ్లాడు. శార్దుల్ స్థానంలో జట్టులోకి వచ్చిన నితీశ్ ఆరు బంతులాడి వోక్స్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. వెంటవెంటనే రెండు వికెట్లు పడటంతో ఇంగ్లండ్ శిబిరంలో ఉత్సాహం పెరగగా... గిల్ సంయమనంతో ముందుకు సాగాడు. మరో ఎండ్ లో జడేజా అతడికి చక్కటి సహకారం అందించాడు.స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) జేమీ స్మిత్ (బి) స్టోక్స్ 87; రాహుల్ (బి) వోక్స్ 2; కరుణ్ నాయర్ (సి) బ్రూక్ (బి) కార్స్ 31; గిల్ (బ్యాటింగ్) 114 ; పంత్ (సి) క్రాలీ (బి) బషీర్ 25; నితీశ్ రెడ్డి (బి) వోక్స్ 1; జడేజా (బ్యాటింగ్)41; ఎక్స్ట్రాలు: 9; మొత్తం (85 ఓవర్లలో 5 వికెట్లకు) 310. వికెట్ల పతనం: 1–15, 2–95, 3–161, 4–208, 5–211. బౌలింగ్: వోక్స్ 21–6–59–2; కార్స్ 16–2–49–1; టంగ్ 13–0–66–0; స్టోక్స్ 15–0–58–1; బషీర్ 19–0–65–1; రూట్ 1–0–8–0. -
‘ఇదేం సెలక్షన్’
ప్రపంచంలో బెస్ట్ బౌలర్ మీ జట్టులో ఉన్నాడు... అప్పుడప్పుడు ఫిట్నెస్ సమస్యలు ఉన్నా రెండు టెస్టుల మధ్య ఏడు రోజుల విరామం వచ్చింది. గత మ్యాచ్లో ఒక వేళ ఏమైనా ఇబ్బంది కలిగినా...ఫిట్నెస్ ట్రైనర్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్, ఫిజియోథెరపిస్ట్ అందుబాటులో ఉన్నప్పుడు కోలుకునేందుకు ఏడు రోజుల సమయం కూడా సరిపోతుంది. ఇప్పటికే తొలి టెస్టులో ఓడి జట్టు వెనుకంజలో ఉంది. ప్రత్యర్థిపై పైచేయి సాధించి సింగిల్ హ్యాండ్తో గెలిపించగల సత్తా అతనికి ఉంది. అయినా సరే... భారత జట్టు జస్ప్రీత్ బుమ్రాను ఈ మ్యాచ్లో ఆడించలేదు. పైగా తర్వాతి టెస్టులో పిచ్ అనుకూలంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఆడతాడని కెప్టెన్ గిల్ వ్యాఖ్యానించడం క్షమించరానిది! అతని స్థానంలో ఆకాశ్దీప్కు అవకాశం లభించింది. మరో వైపు మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు మళ్లీ అన్యాయం జరిగింది. రెండో స్పిన్నర్గా అతనికి ఈ మ్యాచ్లోనూ అవకాశం లభించలేదు. అటాకింగ్ బౌలర్ అయిన కుల్దీప్ గత టెస్టులో లేకపోవడం లోటుగా కనిపించింది. ఈ సారి ఇంగ్లండ్పై చెలరేగే అవకాశం ఉందని భావించగా ఈ సారి స్థానమే దక్కలేదు. పైగా గత మ్యాచ్లో లోయర్ ఆర్డర్ విఫలమైంది కాబట్టి బ్యాటింగ్ చేయగల బౌలర్ కావాలంటూ సుదర్శన్ స్థానంలో సుందర్ను తీసుకున్నారు. ఒక రెగ్యులర్ బౌలర్ను అతని బ్యాటింగ్ సామర్థ్యాన్ని బట్టి ఎంపిక చేయడం ఏమిటో అర్థం కాలేదు! శార్దుల్ ఠాకూర్కు బదులుగా అదే తరహా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్, ఆంధ్రకు చెందిన నితీశ్ కుమార్ రెడ్డికి చాన్స్ ఇచ్చినా అతనూ విఫలమయ్యాడు. ‘బుమ్రాను తప్పించడం నమ్మశక్యంగా లేదు. అతని పని భారం తగ్గించాలని చూస్తే ఇప్పటికే తగినంత విశ్రాంతి లభించింది. ఎంతో కీలకమైన మ్యాచ్కు అతను లేకపోవడం ఆశ్చర్యకరం. ఆటగాడు తన ఇష్ట్రపకారం మ్యాచ్ను ఎంచుకునే అవకాశం ఇవ్వరాదు. ఇక్కడ టెస్టు గెలిచి 1–1తో సిరీస్ను సమం చేస్తే ఆ తర్వాత విశ్రాంతి ఇచ్చుకోవచ్చు’ అని రవిశాస్త్రి దీనిపై తీవ్రంగా వ్యాఖ్యానించాడు. ఇలా బ్యాటింగ్ బలమే కావాలంటే సిరీస్ చివరకు వచ్చే సరికి బుమ్రా, మరో పది మంది బ్యాటర్లే బరిలోకి దిగుతారేమో! -
ENG VS IND, 2nd Test: టీమిండియాను ఆదుకున్న కెప్టెన్ 'గిల్' సెంచరీ
ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ ఇవాళ (జులై 2) ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేయగా.. ఇంగ్లండ్ తొలి టెస్ట్లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది.భారత్ తరఫున బుమ్రా స్థానంలో ఆకాశ్దీప్.. సాయి సుదర్శన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్.. శార్దూల్ ఠాకూర్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇన్ ఫామ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 2 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్లో రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.రాహుల్ తర్వాత బరిలోకి దిగిన కరుణ్ నాయర్ కూడా తక్కువ స్కోర్కే (31) ఔటయ్యాడు. కరుణ్ వికెట్ బ్రైడన్ కార్స్కు దక్కింది. ఈ మధ్యలో యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్కు టెస్ట్ల్లో ఇది 11వ అర్ద సెంచరీ. జైస్వాల్ తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే.రాహుల్, కరుణ్ వికెట్లు కోల్పోయాక జాగ్రత్తగా ఆడిన జైస్వాల్, శుభ్మన్ గిల్ మూడో వికెట్కు 66 పరుగులు జోడించారు. ఈ దశలో జైస్వాల్ (107 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 87 పరుగులు) ఓ అనవసర షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్లో కట్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా బంతి బాటమ్ ఎడ్జ్ తీసుకొని వికెట్కీపర్ జేమీ స్మిత్ చేతుల్లోకి వెళ్లింది.జైస్వాల్ ఔటయ్యాక శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ కొద్ది సేపు జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 47 పరుగులు జోడించాక రిషబ్ పంత్ (25) షోయబ్ బషీర్ బౌలింగ్లో ఔటయ్యాడు. జాక్ క్రాలే అద్బుతమైన క్యాచ్ పట్టడంతో పంత్ పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం క్రీజ్లోకి వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి (1) ఇలా వచ్చి అలా వెళ్లాడు. ఇతని వికెట్ వోక్స్కు దక్కింది. వోక్స్ బౌలింగ్లో నితీశ్ క్లీన్ బౌల్ట్ అయ్యాడు.211 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను గిల్, రవీంద్ర జడేజా గట్టెక్కించే ప్రయత్నం చేశారు. వీరిద్దరు ఆరో వికెట్కు 99 పరుగులు జోడించి ఇన్నింగ్స్లను కొనసాగిస్తున్నారు. గిల్ 114, రవీంద్ర జడేజా 41 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. 85 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 310/5గా ఉంది. -
ENG VS IND 2nd Test Day 1: జైస్వాల్ సెంచరీ మిస్.. పోరాడుతున్న గిల్
ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ ఇవాళ (జులై 2) ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేయగా.. ఇంగ్లండ్ తొలి టెస్ట్లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. భారత్ తరఫున బుమ్రా స్థానంలో ఆకాశ్దీప్.. సాయి సుదర్శన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్.. శార్దూల్ ఠాకూర్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇన్ ఫామ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 2 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్లో రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.రాహుల్ తర్వాత బరిలోకి దిగిన కరుణ్ నాయర్ కూడా తక్కువ స్కోర్కే (31) ఔటయ్యాడు. కరుణ్ వికెట్ బ్రైడన్ కార్స్కు దక్కింది. ఈ మధ్యలో యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్కు టెస్ట్ల్లో ఇది 11వ అర్ద సెంచరీ. జైస్వాల్ తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే.రాహుల్, కరుణ్ వికెట్లు కోల్పోయాక జాగ్రత్తగా ఆడిన జైస్వాల్, శుభ్మన్ గిల్ మూడో వికెట్కు 66 పరుగులు జోడించారు. ఈ దశలో జైస్వాల్ (107 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 87 పరుగులు) ఓ అనవసర షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్లో కట్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా బంతి బాటమ్ ఎడ్జ్ తీసుకొని వికెట్కీపర్ జేమీ స్మిత్ చేతుల్లోకి వెళ్లింది.జైస్వాల్ ఔటయ్యాక శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ కొద్ది సేపు జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 47 పరుగులు జోడించాక రిషబ్ పంత్ (25) షోయబ్ బషీర్ బౌలింగ్లో ఔటయ్యాడు. జాక్ క్రాలే అద్బుతమైన క్యాచ్ పట్టడంతో పంత్ పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం క్రీజ్లోకి వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి (1) ఇలా వచ్చి అలా వెళ్లాడు. ఇతని వికెట్ వోక్స్కు దక్కింది. వోక్స్ బౌలింగ్లో నితీశ్ క్లీన్ బౌల్ట్ అయ్యాడు.211 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను గిల్, రవీంద్ర జడేజా గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరు ఆరో వికెట్కు 59 పరుగులు జోడించి ఇన్నింగ్స్లను కొనసాగిస్తున్నారు. గిల్ 86, రవీంద్ర జడేజా 30 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. 76 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 270/5గా ఉంది. -
అసలంక సూపర్ సెంచరీ.. హసరంగ మాయాజాలం
మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్తో ఇవాళ (జులై 2) జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య శ్రీలంక 77 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో శ్రీలంక సారధి చరిత్ అసలంక సూపర్ సెంచరీతో మెరిశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగి 123 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది.లంక ఇన్నింగ్స్లో అసలంక మినహా ఎవ్వరూ రాణించలేదు. కుసాల్ మెండిస్ (45), జనిత్ లియనాగే (29), మిలన్ రత్నాయకే (22), హసరంగ (22) రెండంకెల స్కోర్లు చేశారు. పథుమ్ నిస్సంక, కమిందు మెండిస్ డకౌటయ్యారు. నిషాన్ మదుష్క 6, తీక్షణ 1, ఎషాన్ మలింగ 5, అశిత ఫెర్నాండో 1 (నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ అద్బుతంగా బౌలింగ్ చేశారు. వీరిలో తస్కిన్ 4 వికెట్లు పడగొట్టగా.. తంజిమ్ 3 వికెట్లు తీశాడు. తన్వీర్ ఇస్లాం, షాంటో తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 245 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. హసరంగ (7.5-2-10-4), కమిందు మెండిస్ (5-0-19-3), మహీశ్ తీక్షణ (9-1-32-1) మాయాజాలం దెబ్బకు 35.5 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా ఇన్నింగ్స్లో తంజిద్ హసన్ (62), జాకిర్ అలీ (51) అర్ద సెంచరీలతో రాణించారు. మిగతా బ్యాటర్లలో పర్వేజ్ ఎమోన్ (13), నజ్ముల్ షాంటో (23) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. లిట్టన్ దాస్, కెప్టెన్ మెహిది హసన్, తస్కిన్ అహ్మద్ డకౌట్లు కాగా.. తౌహిద్ హృదోయ్, తంజిమ్ సకీబ్ తలో పరుగు చేశారు. తన్వీర్ ఇస్లాం 5 పరుగులు చేశాడు. రెండో వన్డే కొలొంబో వేదికగానే జులై 5న జరుగనుంది.కాగా, 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్, 3 మ్యాచ్ల వన్డే సిరీస్, 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. తొలి వన్డేలో గెలుపుతో శ్రీలంక 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. దీనికి ముందు జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను శ్రీలంక 1-0 తేడాతో కైవసం చేసుకుంది. -
వరుసగా మూడో మ్యాచ్లోనూ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ఈసారి ఊచకోత
14 ఏళ్ల భారత యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్ గడ్డపై వరుసగా మూడో మ్యాచ్లోనూ చెలరేగిపోయాడు. ఇంగ్లండ్ అండర్ 19 జట్టుతో జరిగిన తొలి రెండు వన్డేల్లో విధ్వంసం సృష్టించిన వైభవ్.. ఇవాళ (జులై 2) జరుగుతున్న మూడో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. నార్తంప్టన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వైభవ్.. మొత్తంగా 31 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 86 పరుగులు చేశాడు. వైభవ్ స్కోర్లో 78 పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో రావడం విశేషం. వైభవ్ ధాటికి భారత్ 8 ఓవర్లలో 111 పరుగులు చేసింది. వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఓపెనర్ డాకిన్స్ (62), కెప్టెన్ థామస్ రూ (44 బంతుల్లో 76 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించారు. మరో ఓపెనర్ ఇస్సాక్ (41), బెన్ మేస్ (31), రాల్ఫీ ఆల్బర్ట్ (21) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ దిగ్గజ ఆల్రౌండర్ తనయుడు రాకీ ఫ్లింటాఫ్ (16) తక్కువ స్కోర్కే ఔట్ కాగా.. జోసఫ్ మూర్స్ డకౌటై నిరాశపరిచాడు. సెబాస్టియన్ మోర్గాన్ 10 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో కనిశ్క్ 3 వికెట్లు తీయగా.. దీపేశ్ దేవేంద్రన్, విహాన్ మల్హోత్రా, నమన్ పుష్పక్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. వైభవ్ విధ్వంసం ధాటికి 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. వైభవ్తో పాటు ఇన్నింగ్స్ ప్రారంభించిన అభిగ్యాన్ కుందు 12.. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన చవ్డా డకౌటయ్యాడు. ప్రస్తుతం విహాన్ మల్హోత్రా (25), రాహుల్ కుమార్ (1) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే 30 ఓవర్లలో మరో 142 పరుగులు చేయాలి. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. ఇంగ్లండ్ బౌలర్లలో అలెగ్జాండర్ వేడ్ 2 వికెట్లు తీయగా.. జేమ్స్ మింటో ఓ వికెట్ పడగొట్టాడు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచాయి. తొలి వన్డేలో గెలిచి భారత్ బోణీ కొట్టగా.. ఉత్కంఠభరితంగా సాగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ వికెట్ తేడాతో బయటపడింది. వైభవ్ హిట్.. ఆయుశ్ మాత్రే ఫట్ తొలి మ్యాచ్లో 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసిస వైభవ్.. రెండో వన్డేలో 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేశాడు. ఆయుశ్ మాత్రే విషయానికొస్తే.. ఇతను వరుసగా రెండు మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. తొలి వన్డేలో 21 పరుగులు చేసిన మాత్రే.. రెండో వన్డే గోల్డెన్ డకౌటయ్యాడు. ఇవాల్టి మ్యాచ్లో మాత్రే ఆడటం లేదు. అతని స్థానంలో అభిగ్యాన్ కుందు భారత జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. -
ENG VS IND 2nd Test: పాపం జైస్వాల్..!
ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ ఇవాళ (జులై 2) ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేయగా.. ఇంగ్లండ్ తొలి టెస్ట్లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. భారత్ తరఫున బుమ్రా స్థానంలో ఆకాశ్దీప్.. సాయి సుదర్శన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్.. శార్దూల్ ఠాకూర్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇన్ ఫామ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 2 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్లో రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రాహుల్ తర్వాత బరిలోకి దిగిన కరుణ్ నాయర్ కూడా తక్కువ స్కోర్కే (31) ఔటయ్యాడు. ఈ వికెట్ బ్రైడన్ కార్స్కు దక్కింది. 11వ హాఫ్ సెంచరీఈ మధ్యలో యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్కు టెస్ట్ల్లో ఇది 11వ అర్ద సెంచరీ. జైస్వాల్ తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. రాహుల్, కరుణ్ వికెట్లు కోల్పోయాక జాగ్రత్తగా ఆడిన జైస్వాల్, శుభ్మన్ గిల్ మూడో వికెట్కు 66 పరుగులు జోడించాడు.పాపం జైస్వాల్ఈ దశలో జైస్వాల్ ఓ అనవసర షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్లో కట్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా బంతి బాటమ్ ఎడ్జ్ తీసుకొని వికెట్కీపర్ జేమీ స్మిత్ చేతుల్లోకి వెళ్లింది. వికెట్ తీసిన ఆనందంలో స్టోక్స్ సంబరాలు చేసుకోగా.. జైస్వాల్ క్రీజ్లో అలాగే ఉండిపోయాడు. ఈ ఇన్నింగ్స్లో జైస్వాల్ చాలా సార్లు కట్ షాట్లు ఆడే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. చివరికి అదే షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. జైస్వాల్ 107 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. జైస్వాల్ సెంచరీకి ముందు ఔట్ కావడంతో టీమిండియా అభిమానులు నిరాశపడ్డారు. పాపం జైస్వాల్ అంటూ సోషల్మీడియా వేదికగా సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.50 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 170/3గా ఉంది. శుభ్మన్ గిల్ 38, రిషబ్ పంత్ 6 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.కాగా, ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత్ ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్లో భారత్ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. -
శ్రీలంక కెప్టెన్ సూపర్ శతకం.. గత మూడు ఇన్నింగ్స్ల్లో రెండవది
కొలొంబో వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న వన్డే మ్యాచ్లో శ్రీలంక సారధి చరిత్ అసలంక సూపర్ సెంచరీతో మెరిశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఐదో స్థానంలో బరిలోకి దిగిన అసలంక.. 123 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేసి ఔటయ్యాడు. గత మూడు ఇన్నింగ్స్ల్లో అసలంకకు ఇది రెండో సెంచరీ. ఓవరాల్గా అతని కెరీర్లో ఐదవది. అసలంక చివరిగా ఆస్ట్రేలియాతో ఆడిన వన్డేల్లో వరుసగా 127, 78 నాటౌట్ పరుగులు చేశాడు. గత కొన్నేళ్లుగా అసలంక వన్డేల్లో అత్యంత నమ్మదగిన బ్యాటర్గా మారాడు. 2024లో 97.11 స్ట్రయిక్రేట్తో 50.41 సగటున పరుగులు చేసిన అసలంక.. ఈ ఏడాది ఏకంగా 68 సగటున, 96.03 స్ట్రయిక్రేట్తో పరుగులు సాధిస్తున్నాడు. కెరీర్లో ఇప్పటివరకు 74 వన్డేలు ఆడిన అసలంక 44.98 సగటున 5 సెంచరీలు, 15 అర్ద సెంచరీల సాయంతో 2474 పరుగులు చేశాడు.బంగ్లాదేశ్తో మ్యాచ్లో అసలంక ఆదుకోవడంతో శ్రీలంక గౌరవప్రదమైన స్కోర్ (49.2 ఓవర్లలో 244 పరుగులు) చేయగలిగింది. జట్టులో మిగతా బ్యాటర్లెవ్వరూ రాణించకపోగా అసలంక ఒక్కడే జట్టు భారం మొత్తాన్ని మోశాడు. కుసాల్ మెండిస్ (45), జనిత్ లియనాగే (29), మిలన్ రత్నాయకే (22), హసరంగ (22) రెండంకెల స్కోర్లు చేసి అసలంకకు సహకరించారు. కొద్ది రోజుల కిందట బంగ్లాదేశ్తోనే జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారీ శతకం బాదిన పథుమ్ నిస్సంక ఈ మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యాడు. 8 బంతులు ఎదుర్కొని డకౌటయ్యాడు. మరో స్టార్ బ్యాటర్ కమిందు మెండిస్ కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. ఓపెనర్ నిషాన్ మదుష్క 6, తీక్షణ 1, ఎషాన్ మలింగ 5, అశిత ఫెర్నాండో 1 (నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ అద్బుతంగా బౌలింగ్ చేశారు. వీరిలో తస్కిన్ 4 వికెట్లు పడగొట్టగా.. తంజిమ్ 3 వికెట్లు తీశాడు. తన్వీర్ ఇస్లాం, షాంటో తలో వికెట్ దక్కించుకున్నారు.3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరుగుతున్న తొలి వన్డే ఇది. దీనికి ముందు జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను ఆతిథ్య శ్రీలంక 1-0 తేడాతో కైవసం చేసుకుంది. వన్డే సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కూడా జరుగనుంది. -
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సౌతాఫ్రికాకు మరో కొత్త కెప్టెన్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సౌతాఫ్రికాకు రోజుల వ్యవధిలో ముగ్గురు కెప్టెన్లు మారారు. గత నెలలో జరిగిన డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్లో సౌతాఫ్రికాకు సారథ్యం వహించిన టెంబా బవుమా.. జింబాబ్వే పర్యటనకు విశ్రాంతి తీసుకోగా, కేశవ్ మహారాజ్ను తాత్కాలిక సారధిగా నియమించారు. జింబాబ్వే పర్యటనలో తొలి టెస్ట్లో అదరగొట్టిన కేశవ్ మహారాజ్ దురదృష్టవశాత్తు గాయపడటంతో, రెండో టెస్ట్లో అతనికి ప్రత్యామ్నాయంగా మరో కొత్త కెప్టెన్ను నియమించారు. కెరీర్లో కేవలం 20 టెస్ట్ మ్యాచ్లే ఆడిన వియాన్ ముల్దర్ను దక్షిణాఫ్రికా నూతన సారధిగా ఎంపిక చేశారు. జింబాబ్వేలో పర్యటిస్తున్న సౌతాఫ్రికా జట్టులో కేశవ్ మహారాజ్ తర్వాత ముల్దరే అత్యంత అనుభవజ్ఞుడు (కైల్ వెర్రిన్ (26) మినహా). మిగతా ఆటగాళ్లంతా 20కి మించి టెస్ట్లు ఆడలేదు. తొలి టెస్ట్తో ప్రిటోరియస్, బ్రెవిస్, కోడి యూసఫ్ అరంగేట్రం చేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం సీనియర్ ఆటగాళ్లంతా విశ్రాంతి తీసుకోవడంతో సౌతాఫ్రికా మేనేజ్మెంట్ జింబాబ్వే టూర్కు యువ జట్టును పంపింది. ఈ యువ జట్టుకు అత్యంత సీనియర్ అయిన కేశవ్ మహారాజ్ను కెప్టెన్గా నియమించింది.అయితే అతను తొలి టెస్ట్ సందర్భంగా గజ్జల్లో గాయానికి గురయ్యాడు. రెండో టెస్ట్లో అతనికి ప్రత్నామ్నాయ ఆటగాడిగా సెనురన్ ముత్తుస్వామిని ఎంపిక చేశారు. జులై 6 నుంచి బులవాయోలో జరిగే రెండో టెస్ట్లో వియాన్ ముల్దర్ దక్షిణాఫ్రికా సారధిగా వ్యవహరిస్తాడు. దీంతో సౌతాఫ్రికా మూడు వరుస టెస్ట్ మ్యాచ్ల్లో ముగ్గురు వేర్వేరు కెప్టెన్లతో బరిలోకి దిగినట్లవుతుంది.కొత్త కెప్టెన్ ముల్దర్ జింబాబ్వేతో జరిగిన తొలి టెస్ట్లో అద్బుతంగా రాణించాడు. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన అతను తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీసి, ఆతర్వాత బ్యాటింగ్లో సెంచరీ (147) చేశాడు. తొలి టెస్ట్లో సారధిగా వ్యవహరించిన కేశవ్ మహారాజ్ కూడా ఆల్రౌండర్గా రాణించాడు. బ్యాటింగ్లో 21, 51 పరుగులు చేసి బౌలింగ్లో 3,1 వికెట్లు తీశాడు.గాయంతో బాధపడుతున్న కేశవ్ మహారాజ్ను స్వదేశానికి పిలిపించిన సౌతాఫ్రికా యాజమాన్యం అతనితో పాటు సీనియర్ పేసర్ లుంగి ఎంగిడిని కూడా జట్టు నుంచి రిలీజ్ చేసింది. తొలి టెస్ట్లో అద్బుతంగా రాణించిన యువ పేసర్లకు మరో అవకాశం ఇవ్వడం కోసం ఎంగిడిని స్వదేశానికి పిలిపించారు. తొలి టెస్ట్లో పేసర్లు కోడి యూసఫ్, మఫాకా, బాష్, ముల్దర్ విశేషంగా రాణించారు. ఆ మ్యాచ్లో కేశవ్ మహారాజ్ ఏకైక స్పిన్నర్గా బరిలోకి దిగాడు.కాగా, జింబాబ్వేతో తాజాగా ముగిసిన టెస్ట్ మ్యాచ్లో సౌతాఫ్రికా 328 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో కార్బిన్ బాష్ (100, 5/43), డ్రి ప్రిటోరియస్ (153), వియాన్ ముల్దర్ (4/50, 147), కేశవ్ మహారాజ్ (3/70, 51), కోడి యూసఫ్ (3/42, 3/22) అద్భుత ప్రదర్శనలు చేసి సౌతాఫ్రికాను గెలిపించారు. ఈ గెలుపుతో సౌతాఫ్రికా చివరి 9 మ్యాచ్ల్లో గెలిచిన జట్టుగా అరుదైన ఘనత సాధించింది. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్లో ఏ జట్టు ఈ ఘనత సాధించలేదు. -
నిరాశపరిచిన రాహుల్.. మరో ఛాన్స్ను కూడా వృధా చేసుకున్న కరుణ్
ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ ఇవాళ (జులై 2) ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేయగా.. ఇంగ్లండ్ తొలి టెస్ట్లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. భారత్ తరఫున బుమ్రా స్థానంలో ఆకాశ్దీప్.. సాయి సుదర్శన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్.. శార్దూల్ ఠాకూర్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.నిరాశపరిచిన రాహుల్తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇన్ ఫామ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 2 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్లో రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 42, రెండో ఇన్నింగ్స్లో సెంచరీ (137) చేసిన రాహుల్ స్వల్ప స్కోర్కే ఔట్ కావడం టీమిండియా అభిమానులకు తీవ్రంగా నిరాశపరిచింది. విదేశాల్లో ఘనమైన ట్రాక్ రికార్డు కలిగిన రాహుల్కు ఎడ్జ్బాస్టన్ అచ్చిరాలేదు. గతంలోనూ అతను ఇక్కడ ఆడిన రెండు ఇన్నింగ్స్ల్లో ఘోరంగా విఫలమయ్యాడు (13, 4).మరో ఛాన్స్ను కూడా వృధా చేసుకున్న కరుణ్రాహుల్ తర్వాత క్రీజ్లోకి వచ్చిన కరుణ్ నాయర్ ఆదిలో కాస్త ఇబ్బంది పడినా ఆతర్వాత కుదురుకున్నాడు. అయితే దురదృష్టవశావత్తు బ్రైడన్ కార్స్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్కు క్యాచ్ ఇచ్చి 31 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో కరుణ్ మరో ఛాన్స్ను కూడా వృధా చేసుకన్నట్లైంది. 8 ఏళ్ల తర్వాత ఈ సిరీస్లోని తొలి టెస్ట్తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్.. ఆ మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో డకౌటై, రెండో ఇన్నింగ్స్లో 20 పరుగులు చేశాడు. జైస్వాల్ ఖాతాలో మరో హాఫ్ సెంచరీరాహుల్, కరుణ్ ఔటైనా ఏమాత్రం ఒత్తిడికి గురి కాని యశస్వి జైస్వాల్ ఈ మధ్యలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్కు టెస్ట్ల్లో ఇది 11వ అర్ద సెంచరీ. జైస్వాల్ తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో చెలరేగాడు.తొలి రోజు లంచ్ విరామం సమయానికి భారత్ 25 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. జైస్వాల్ 62, శుభ్మన్ గిల్ 1 పరుగుతో క్రీజ్లో ఉన్నారు.తొలి టెస్ట్లో ఇలా..కాగా, ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత్ ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్లో భారత్ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది.ఛేదనలో బెన్ డకెట్ (149) సూపర్ సెంచరీ చేసి ఇంగ్లండ్ను గెలిపించాడు. జాక్ క్రాలే (65), జో రూట్ (53 నాటౌట్), బెన్ స్టోక్స్ (33), జేమీ స్మిత్ (44 నాటౌట్) తలో చేయి వేశారు. భారత బౌలర్లు సెకెండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ బ్యాటర్లను ఏమాత్రం కట్టడి చేయలేకపోయారు. ఇంగ్లండ్ బ్యాటర్లు భారత బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొని పరుగులు చేశారు. ప్రసిద్ద్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ తలో 2 వికెట్లు తీసినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అనుభవజ్ఞుడైన స్పిన్నర్ రవీంద్ర జడేజాది కూడా అదే పరిస్థితి.ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు రెండు ఇన్నింగ్స్ల్లో అద్బుతంగా ఆడారు. అయినా సెకెండ్ ఇన్నింగ్స్లో బౌలర్లు ప్రభావం చూపలేకపోవడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్లో భారత్ తరఫున ఐదు శతకాలు నమోదైన ప్రయోజనం లేకుండా పోయింది.తొలి ఇన్నింగ్స్లో జైస్వాల్ (101), గిల్ (147), పంత్ (134) సెంచరీలు చేశారు. రెండో ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ (137), పంత్ (118) శతకాలు చేశారు. ఇంగ్లండ్ తరఫున తొలి ఇన్నింగ్స్లో ఓలీ పోప్ (106) సెంచరీ చేయగా.. హ్యారీ బ్రూక్ (99) తృటిలో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో బుమ్రా 5 వికెట్ల ప్రదర్శన చేసినప్పటికీ ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. -
దూసుకుపోతున్న రిషబ్ పంత్
టెస్ట్ ర్యాంకింగ్స్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ దూసుకుపోతున్నాడు. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో ఓ స్థానం మెరుగుపర్చుకొని ఆరో ప్లేస్కు ఎగబాకాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్ట్లో ట్విన్ సెంచరీస్ (రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు) చేసిన పంత్.. గత వారం ర్యాంకింగ్స్లోనే ఓ ర్యాంక్ మెరుగుపర్చుకున్నాడు. తాజాగా మరో ర్యాంక్ మెరుగుపర్చుకొని తన కెరీర్ అత్యుత్తమ ఐదో ర్యాంక్కు అ్యతంత చేరువయ్యాడు.గత వారం ర్యాంకింగ్స్ అనంతరం పంత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో 800 రేటింగ్ పాయింట్లు సాధించిన తొలి భారత వికెట్కీపర్ బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ వికెట్కీపర్ బ్యాటర్ 800 రేటింగ్ పాయింట్లు సాధించలేదు. టీమిండియా దిగ్గజ వికెట్కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనికి కూడా ఇది సాధ్యపడలేదు. ప్రస్తుతం పంత్ 801 రేటింగ్ పాయింట్లు ఖాతాలో కలిగి ఉన్నాడు.ఇంగ్లండ్తో ప్రస్తుతం జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో పంత్ ఇదే జోరును కొనసాగిస్తే.. త్వరలోనే నంబర్ వన్ టెస్ట్ బ్యాటర్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం టాప్ ర్యాంక్లో ఉన్న జో రూట్కు పంత్కు 88 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం ఉంది. పంత్ నెక్స్ట్ టార్గెట్ స్టీవ్ స్మిత్. స్మిత్ తాజా ర్యాంకింగ్స్లో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ హ్యారీ బ్రూక్, న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్, టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ వరుసగా 2 నుంచి 4 స్థానాల్లో ఉన్నారు.ఈ వారం ర్యాంకింగ్స్లో పంత్తో పాటు మరిన్ని చెప్పుకోదగ్గ మార్పులు జరిగాయి. ఆసీస్ ఆటగాడు ట్రవిస్ హెడ్ 3, శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక 14, ఆసీస్ ఆల్రౌండర్ బ్యూ వెబ్స్టర్ 11, సౌతాఫ్రికా ఆల్రౌండర్ 17, మరో సౌతాఫ్రికా ఆల్రౌండర్ కార్బిన్ బాష్ 15, వెస్టిండీస్ ప్లేయర్ జస్టిన్ గ్రీవ్స్ 15 స్థానాలు మెరుగుపర్చుకొని 10, 17, 53, 56, 59, 86 స్థానాలకు ఎగబాకారు.బౌలర్ల ర్యాంకింగ్స్లో బుమ్రా, రబాడ, కమిన్స్ టాప్-3లో కొనసాగుతుండగా.. విండీస్ పేసర్ షమార్ జోసఫ్ 14, ముల్దర్ 6, కార్బిన్ బాష్ 45, చివంగ 35 స్థానాలు మెరుగుపర్చుకొని 36, 52, 57, 88 స్థానాలకు ఎగబాకారు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. రవీంద్ర జడేజా, మెహిది హసన్, జన్సెన్ మొదటి మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. -
అందుకే కుల్దీప్ యాదవ్ను పక్కనపెట్టాం: శుబ్మన్ గిల్
టీమిండియా- ఇంగ్లండ్ (India vs England) మధ్య రెండో టెస్టు నేపథ్యంలో ప్రధానంగా చర్చకు వచ్చిన పేరు కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav). ఎడ్జ్బాస్టన్ పిచ్పై ఈ చైనామన్ స్పిన్నర్ను ఆడిస్తే భారత్కు ప్రయోజనకరంగా ఉంటుందని మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్తో పాటు.. సునిల్ గావస్కర్ వంటి భారత దిగ్గజ క్రికెటర్లు కూడా టీమిండియా మేనేజ్మెంట్కు సూచించారు.అతడికి విశ్రాంతి.. వారిపై వేటుఅయితే, రెండో టెస్టు ఆడే జట్టులో మాత్రం కుల్దీప్ యాదవ్కు చోటు దక్కలేదు. ఈ మణికట్టు స్పిన్నర్కు బదులు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar)కు సెలక్టర్లు తుదిజట్టులో స్థానం ఇచ్చారు. తొలి టెస్టులో ఆడిన ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వడంతో పాటు.. సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూర్లపై వేటు వేశారు.ఈ ముగ్గురి స్థానంలో పేసర్ ఆకాశ్ దీప్తో పాటు ఆల్రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చారు. ఈ నేపథ్యంలో జట్టులో చేసిన మార్పుల గురించి స్పందించిన టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్.. కుల్దీప్ యాదవ్ను ఆడించకపోవడానికి గల కారణాన్ని కూడా వెల్లడించాడు.అందుకే కుల్దీప్ యాదవ్ను పక్కనపెట్టాం‘‘ఇంగ్లండ్తో రెండో టెస్టులో మేము మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నాం. రెడ్డి, వాషీలతో పాటు ఆకాశ్ దీప్ జట్టులోకి వచ్చారు. బుమ్రాను ఈ మ్యాచ్లో ఆడించడం లేదు. అతడి వర్క్లోడ్ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం.మూడో టెస్టు లార్డ్స్లో జరుగనుంది. అక్కడ బుమ్రా అవసరం మాకు ఎక్కువగా ఉంటుంది. అక్కడి పిచ్ను బుమ్రా సద్వినియోగం చేసుకోగలడు. అందుకే ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతినిచ్చాం.ఇక కుల్దీప్ యాదవ్ను తీసుకోవాలని ఆఖరి వరకు అనుకున్నాం. అయితే, బ్యాటింగ్లో డెప్త్ గురించి ఆలోచించి అతడిని పక్కనపెట్టాం. ’’ అని శుబ్మన్ గిల్ వెల్లడించాడు. గత మ్యాచ్లో తమ లోయర్ ఆర్డర్ దారుణంగా విఫలమైందని... అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. కాగా గతంలో సొంతగడ్డపై ఇంగ్లండ్తో సిరీస్లోనూ కుల్దీప్ యాదవ్కు మొదట ప్రాధాన్యం ఇవ్వలేదు మేనేజ్మెంట్.భారత గడ్డపై ఇలాఈ క్రమంలో హైదరాబాద్ వేదికగా తొలి టెస్టు ఓడిన తర్వాత.. రెండో మ్యాచ్ నుంచి అతడిని తుదిజట్టులోకి తీసుకున్నారు. తదుపరి నాలుగు మ్యాచ్లలో కుల్దీప్ ఆకాశమే హద్దుగా చెలరేగి మొత్తంగా 19 వికెట్లు కూల్చాడు. తద్వారా టీమిండియా ఇంగ్లండ్పై 4-1తో గెలిచి సిరీస్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, ప్రస్తుతం సిరీస్ ఇంగ్లండ్లో జరుగుతున్నందున అతడికి ఎక్కువగా అవకాశం రాకపోవచ్చు. కానీ ఎడ్జ్బాస్టన్ పిచ్ స్వభావాన్ని బట్టి కుల్దీప్ను ఆడిస్తారని అంతా భావించారు. కాగా ఆండర్సన్-టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇంగ్లండ్తో ఐదు టెస్టులు ఆడుతోంది. ఐదు శతకాలు బాదినాఈ సిరీస్తో భారత టెస్టు జట్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఇక లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇంగ్లండ్ చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది.ఇక ఈ మ్యాచ్లో భారత్ ఐదు శతకాలు బాదినా ఫలితం లేకుండా పోయింది. యశస్వి జైస్వాల్తో పాటు శుబ్మన్ గిల్, కేఎల్ రాహుల్ సెంచరీలు కొట్టగా.. రిషభ్ పంత్ రెండు శతకాలతో అలరించాడు. అయితే, అప్పుడు కూడా బ్యాటింగ్ డెప్త్ కోసమని శార్దూల్ ఠాకూర్ను తీసుకోగా.. అతడు తీవ్రంగా నిరాశపరిచాడు. మొత్తంగా ఐదు పరుగులు చేయడంతో పాటు కేవలం రెండు వికెట్లే పడగొట్టగలిగాడు. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య బుధవారం (జూలై 2) రెండో టెస్టు ఆరంభం కాగా.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. 8.4 ఓవర్ వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. క్రిస్ వోక్స్ బౌలింగ్లో కేఎల్ రాహుల్ (2) బౌల్డ్ కాగా.. యశస్వి జైస్వాల్ 12 పరుగులతో ఉన్నాడు. భారత్ స్కోరు: 15/1 (8.4).చదవండి: IND vs ENG T20Is: చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్.. తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు -
IND vs ENG: తుదిజట్టులోకి నితీశ్ రెడ్డి, వాషీ, ఆకాశ్.. ఆ ఇద్దరిపై వేటు
England vs India 2nd Test Birmingham: టీమిండియాతో రెండో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఎడ్జ్బాస్టన్ పిచ్ పరిస్థితులకు అనుగుణంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) తెలిపాడు. మరోవైపు.. టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.బుమ్రాకు విశ్రాంతితాను టాస్ గెలిస్తే తప్పక తొలుత బౌలింగే ఎంచుకునేవాడినని తెలిపాడు. ఇక రెండో టెస్టులో తాము మూడు మార్పులతో బరిలోకి దిగినట్లు గిల్ వెల్లడించాడు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చామని.. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డితో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను తుదిజట్టులోకి తీసుకున్నట్లు తెలిపాడు.ఆ ఇద్దరిపై వేటుకాగా ఇంగ్లండ్తో తొలి టెస్టు ఆడిన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్తో పాటు.. ఈ మ్యాచ్తో అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్పై వేటు పడింది. శార్దూల్ తొలి టెస్టులో కేవలం ఐదు పరుగులు చేయడంతో పాటు.. రెండు వికెట్లు మాత్రమే తీయగలిగాడు.కరుణ్ నాయర్కు రెండో అవకాశంమరోవైపు.. వన్డౌన్ బ్యాటర్ సాయి తొలి ఇన్నింగ్స్లో డకౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్లో ముప్పై పరుగులు చేయగలిగాడు. అయితే, సాయి సుదర్శన్తో పాటే విఫలమైన సీనియర్ కరుణ్ నాయర్పై మేనేజ్మెంట్ మరోసారి నమ్మకం ఉంచింది. అతడికి రెండో ఛాన్స్ ఇచ్చింది. కాగా కరుణ్ తొలి ఇన్నింగ్స్లో పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. అదే విధంగా రెండో ఇన్నింగ్స్లోనూ 20 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టులు ఆడనుంది. ఈ క్రమంలో లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు జరుగగా.. గిల్ సేన ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.ఫలితంగా ఇంగ్లండ్ ఈ సిరీస్లో 1-0తో ముందంజలో నిలిచింది. ఇరుజట్ల మధ్య బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో జూలై 2-6 రెండో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను 1-1తో సమం చేయాలని పట్టుదలగా ఉంది.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టు తుదిజట్లుభారత్యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.ఇంగ్లండ్జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జామీ స్మిత్(వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్.చదవండి: చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్.. తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు -
‘అతడి డబుల్ సెంచరీ.. నా కెరీర్కు ముగింపు’
టీమిండియా ఓపెనర్గా శిఖర్ ధావన్ (Shikhar Dhawan) తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. రోహిత్ శర్మ (Rohit Sharma)తో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించిన ఈ లెఫ్టాండర్.. ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా వన్డేల్లో అత్యుత్తమంగా రాణించాడు. తన కెరీర్లో మొత్తంగా 167 వన్డేలు ఆడిన గబ్బర్ 6793 పరుగులు సాధించాడు.అయితే, నయా స్టార్లు శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్ (Ishan Kishan)ల రాకతో టీమిండియాలో ధావన్ స్థానం ప్రశ్నార్థకమైంది. ఈ ఇద్దరు ఓపెనర్లుగా పాతుకుపోవడంతో పాటు.. వీరికి తోడు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ కూడా రేసులోకి వచ్చారు. ఫలితంగా ధావన్ను సెలక్టర్లు పట్టించుకోవడమే మానేశారు.ఈ క్రమంలో 2022లో టీమిండియా తరఫున చివరగా ఆడిన శిఖర్ ధావన్.. రెండేళ్ల పాటు పునరాగమనం కోసం ఎదురుచూశాడు. కానీ యువ ఆటగాళ్ల జోరు ముందు నిలవలేక గతేడాది ఆగష్టులో అన్ని ఫార్మాట్ల క్రికెట్కు వీడ్కోలు పలికాడు.అతడి డబుల్ సెంచరీ.. నా కెరీర్కు ముగింపుతాజాగా ఈ విషయాల గురించి శిఖర్ ధావన్ స్పందించాడు. బంగ్లాదేశ్ మీద ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ బాదినపుడే తన కెరీర్ ముగింపు దశకు వచ్చిందని భావించినట్లు తెలిపాడు. ఈ మేరకు.. ‘‘నేను చాలాసార్లు ఫిఫ్టీలు బాదాను. ఎన్నోసార్లు డెబ్బైలలో అవుటయ్యాను.వాటిని సెంచరీలుగా మలచడంలో విఫలమయ్యాను. ఎప్పుడైతే ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్తో వన్డేలో 200 పరుగులు చేశాడో.. అప్పుడే నా కెరీర్ ముగింపునకు వచ్చేసిందని నా మనసు చెప్పింది. నా అంతరాత్మ చెప్పినట్లే జరిగింది.ఆ సమయంలో నా స్నేహితులు, శ్రేయోభిలాషులు నా గురించి చాలా ఫీలయ్యారు. నేనెక్కడ బాధపడిపోతానో అని నన్ను కనిపెట్టుకుని ఉన్నారు. కానీ నేను మాత్రం జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టాను’’ అని హిందుస్తాన్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. కాగా డబుల్ సెంచరీ వీరుడు ఇషాన్ కిషన్ కూడా అనతికాలంలోనే క్రమశిక్షణా రాహిత్యం వల్ల జట్టులో చోటుతో పాటు.. సెంట్రల్ కాంట్రాక్టు కూడా కోల్పోవడం గమనార్హం. మరోవైపు.. గిల్ మాత్రం నిలకడైన ఆటతో టీమిండియా టెస్టు కెప్టెన్గా ఎదిగాడు.ఒక్కరూ మాట్లాడలేదుఇక జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత ఒక్కరు కూడా తనను మళ్లీ కాంటాక్టు చేయలేదని ఈ సందర్భంగా ధావన్ చెప్పుకొచ్చాడు. ‘‘జట్టులో చోటు కోల్పోవడం సాధారణ విసయమే. పద్నాలుగేళ్ల వయసు నుంచే మాకు ఇది అలవాటు అవుతుంది.అంతేకాదు ఎవరి బిజీలో వాళ్లుంటారు. పర్యటనల్లో బిజీబిజీగా గడుపుతూ ఉంటారు. అయితే, ద్రవిడ్ భాయ్ మాత్రం ఆ సమయంలో నాతో మాట్లాడాడు. ఆయన నాకు మెసేజ్ చేశారు’’ అని ధావన్ తెలిపాడు. కాగా శిఖర్ ధావన్ ప్రస్తుతం లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు. నేపాల్ ప్రీమియర్ లీగ్లో, లెజెండ్స్ లీగ్ క్రికెట్లోనూ అతడు భాగమవుతున్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్.. తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు -
రోహిత్ శర్మ సరసన మంధాన.. భారత మూడో ప్లేయర్గా ఘనత
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన భారత ప్లేయర్ల జాబితాలో స్థానం సంపాదించింది. ఈ క్రమంలో టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సరసన చేరింది.ఇంగ్లండ్ మహిళా జట్టు (England Women vs India Women)తో రెండో టీ20 సందర్భంగా స్మృతి మంధాన ఈ ఫీట్ నమోదు చేసింది. కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు భారత మహిళా క్రికెట్ జట్టు ఇంగ్లండ్కు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ మొదలుకాగా.. మొదటి మ్యాచ్లో భారత్ 97 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.150వ టీ20 మ్యాచ్ఇక బ్రిస్టల్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన రెండో టీ20లోనూ ఆతిథ్య ఇంగ్లండ్పై.. భారత్ 24 రన్స్ తేడాతో గెలుపొందింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0తో ముందంజలో నిలిచింది. ఇక స్మృతి మంధానకు ఇది అంతర్జాతీయ స్థాయిలో 150వ టీ20.రోహిత్, హర్మన్ సరసనఇప్పటి వరకు భారత్ తరఫున టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ (159), మహిళా జట్టు సారథి హర్మన్ప్రీత్ కౌర్ (179) మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు. తాజాగా స్మృతి మంధాన కూడా ఈ లిస్టులో చేరిపోయింది. కాగా 149 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లలో కలిపి స్మృతి మంధాన 124కు పైగా స్ట్రైక్రేటుతో 3873 పరుగులు సాధించింది.తద్వారా మహిళల టీ20 ఫార్మాట్లో న్యూజిలాండ్ స్టార్ సుజీ బేట్స్ తర్వాత అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్గా స్మృతి కొనసాగుతోంది. అంతేకాదు.. అంతర్జాతీయ టీ20లలో నాలుగు వేల మైలురాయికి కూడా స్మృతి చేరువైంది. పురుషుల క్రికెట్లో ఇప్పటి వరకు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం, టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు మాత్రమే ఈ ఘనత సాధ్యమైంది. ఇక భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో శతకం బాదిన తొలి మహిళా క్రికెటర్గానూ స్మృతి చరిత్రకెక్కిన విషయం తెలిసిందే.రెండో టీ20లో విఫలంఇదిలా ఉంటే... తన 150వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్లో స్మృతి మంధాన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయింది. ఇంగ్లండ్తో తొలి టీ20లో శతకంతో చెలరేగిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. తాజాగా రెండో టీ20లో 13 బంతులు ఎదుర్కొని 13 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగింది.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. బ్రిస్టల్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన హర్మన్ సేన నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 181 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 157 పరుగులకే పరిమితమైంది. దీంతో 24 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఇక భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన అమన్జోత్ కౌర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 40 బంతుల్లోనే 63 పరుగులతో అజేయంగా నిలవడంతో పాటు.. ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్-బ్రంట్ (13) రూపంలో కీలక వికెట్ తీసింది పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అమన్జోత్.అగ్ర స్థానానికి చేరువైన స్మృతిభారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఒక స్థానం మెరుగుపర్చుకొని మూడో స్థానానికి చేరింది. ఇంగ్లండ్తో తొలి టీ20లో సెంచరీతో విజృంభించిన స్మృతి... మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో 771 పాయింట్లతో నాలుగు నుంచి మూడో ర్యాంక్ను అందుకుంది. మంధాన కెరీర్లో ఇవే అత్యధిక రేటింగ్ పాయింట్లు కావడం విశేషం.హర్మన్ప్రీత్ కౌర్ అందుబాటులో లేకపోవడంతో ఇంగ్లండ్తో తొలి మ్యాచ్లో కెప్టెన్గానూ వ్యవహరించిన మంధాన... ఈ ఫార్మాట్లో తొలి శతకం తన పేరిట లిఖించుకున్న విషయం తెలిసిందే. తద్వారా మూడు ఫార్మాట్ల (టెస్టు, వన్డే, టి20)లో సెంచరీ చేసిన తొలి భారత మహిళా క్రికెటర్గా చరిత్ర సృష్టించింది. ఇప్పటికే వన్డే బ్యాటింగ్ ర్యాకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న స్మృతి... టీ20ల్లో సైతం ఆ దిశగా ఆడుగులు వేస్తోంది.టీ20 ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా ప్లేయర్ బెత్ మూనీ (794 పాయింట్లు), వెస్టిండీస్ ప్లేయర్ హీలీ మాథ్యూస్ (774 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో భారత్ నుంచి హర్మన్ప్రీత్ కౌర్ (12వ ర్యాంక్), షఫాలీ వర్మ (13వ ర్యాంక్), జెమీమా రోడ్రిగ్స్ (15వ ర్యాంక్) టాప్–20లో చోటు దక్కించుకున్నారు. బౌలింగ్ విభాగంలో భారత్ నుంచి దీప్తి శర్మ (735 పాయింట్లు) మూడో ర్యాంక్లో ఉండగా... రేణుక సింగ్ (721 పాయింట్లు) ఆరో ర్యాంక్లో ఉంది. చదవండి: చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్.. తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు -
షిమ్రన్ హెట్మెయిర్ విధ్వంసకర ఇన్నింగ్స్.. ప్లే ఆఫ్స్ దిశగా?
సీటెల్ ఒర్కాస్ స్టార్ క్రికెటర్ షిమ్రన్ హెట్మెయిర్ (Shimron Hetmyer) మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్తో జరిగిన మ్యాచ్లో అద్భుత అర్ధ శతకంతో చెలరేగాడు. కేవలం 37 బంతుల్లోనే 78 పరుగులు సాధించిన ఈ విధ్వంసకర బ్యాటర్.. ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. సీటెల్కు వరుసగా ఇది మూడో విజయం కావడం మరో విశేషం.మేజర్ లీగ్ క్రికెట్-2025 (MLC)లో భాగంగా బుధవారం ఉదయం సీటెల్ ఒర్కాస్ శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్తో తలపడింది. ఫ్లోరిడా వేదికగా టాస్ గెలిచిన సీటెల్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. యూనికార్న్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ బ్యాటర్లలో ఫిన్ అలెన్ (23), జేక్ ఫ్రేజర్ మెగర్క్ (35)లతో పాటు సంజయ్ కృష్ణమూర్తి (41), టిమ్ సీఫర్ట్ (31) మాత్రమే రాణించారు. ఆఖర్లో రొమారియో షెఫర్డ్ (3 బంతుల్లో 13 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.మరో మూడు బంతులు మిగిలి ఉండగానే..ఇక సీటెల్ ఒర్కాస్ బౌలర్లలో అయాన్ దేశాయ్ రెండు, హర్మీత్ సింగ్, వకార్ సలామ్ఖీల్, కెప్టెన్ సికందర్ రజా ఒక్కో వికెట్ పడగొట్టారు. కాగా శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ విధించిన లక్ష్యాన్ని సీటెల్ 19.3 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ షయాన్ జహంగీర్ (36) ఫర్వాలేదనిపించగా.. షిమ్రన్ హెట్మెయిర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్లుఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఈ విండీస్ ప్లేయర్ 37 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 78 పరుగులతో అజేయంగా నిలిచాడు. షిమ్రన్ మెరుపు అర్ధ శతకం కారణంగా సీటెల్ ఒర్కాస్ 19.3 ఓవర్లలో కేవలం ఆరు వికెట్లు మాత్రమే నష్టపోయి 169 పరుగులు సాధించింది. శాన్ ఫ్రాన్సిస్కోపై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి.. ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది.ప్లే ఆఫ్స్ దిశగా కాగా అమెరికాలో జూన్ 12న మొదలైన మేజర్ లీగ్ క్రికెట్-2025 సీజన్.. జూలై 13న ఫైనల్తో ముగియనుంది. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టీ20 లీగ్లో ఇప్పటికే మూడు ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారయ్యాయి. శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ ఎనిమిదింట ఆరు, వాషింగ్టన్ ఫ్రీడమ్ ఏడింట ఆరు, టెక్సాస్ సూపర్ కింగ్స్ ఏడింట ఐదు గెలిచి టాప్-4లో అడుగుపెట్టాయి. ఇక నాలుగో స్థానం కోసం సీటెల్ ఒర్కాస్, ఎంఐ న్యూయార్క్, లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ బరిలో ఉన్నాయి. అయితే, వీటిలో సీటెల్ ఒర్కాస్ ఎనిమిదింట మూడు గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో ముందుంది. న్యూయార్క్, లాస్ ఏంజెల్స్ జట్లు ఏడింట ఒక్కటి మాత్రమే గెలిచి పూర్తిగా వెనుకబడ్డాయి. చదవండి: చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్.. తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డుThe six that all but sealed our third W in a row 😍#SeattleOrcas #AmericasFavoriteCricketTeam #ShimronHetmyer #MLC2025 #SFUvSO I @SHetmyer I @MLCricket pic.twitter.com/tcGxAFcWhr— Seattle Orcas (@MLCSeattleOrcas) July 2, 2025 -
నెలకు రూ. 4 లక్షలు ఇవ్వండి
టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami) విడాకుల కేసులో కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. భరణం కింద నెలకు నాలుగు లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. షమీ నుంచి విడిగా ఉంటున్న భార్య హసీన్ జహాన్ (Hasin Jahan)కు భరణం కింద నెలకు రూ. 1.5 లక్షలు.. అదే విధంగా వీరి కుమార్తె ఐరా నిర్వహణ ఖర్చు నిమిత్తం నెలకు రూ. 2.5 లక్షల చొప్పున చెల్లించాలని పేర్కొంది.అదే విధంగా.. 2018 నుంచి ఈ మేరకు ఇద్దరికీ నెలకు నాలుగు లక్షల చొప్పున చెల్లించాలని హైకోర్టు షమీని ఆదేశించింది. కాగా షమీపై అతడి భార్య హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అతడు స్త్రీలోలుడని, ఫిక్సింగ్కు కూడా పాల్పడ్డాడంటూ ఆరోపించిన హసీన్.. తనపై గృహహింసకు కూడా పాల్పడ్డాడంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలో ఏడేళ్లుగా వీరు విడిగా ఉంటున్నారు.ఈ నేపథ్యంలో కుమార్తెను తన వద్దే పెట్టుకున్న హసీన్.. భరణం కింద తనకు రూ. 10 లక్షల చొప్పున చెల్లించేలా షమీని ఆదేశించాలంటూ కోర్టుకు వెళ్లింది. ఈ క్రమంలో ఆమెకు రూ. 1.3 లక్షలు మాత్రమే చెల్లించేలా దిగువ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో హసీన్ జహాన్ హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా ఈ మేరకు తీర్పునిచ్చింది.ఈ సందర్భంగా జస్టిస్ ముఖర్జీ.. ‘‘ ఈ కేసులో పిటిషనర్ నంబర్ 1 అనగా భార్యకు నెలకు రూ. 1.50 లక్షలు.. అదే విధంగా ఆమె కూతురుకి రూ. 2.50 లక్షలు ఇవ్వడమే న్యాయం. వీరిద్దరి జీవనం సజావుగా సాగేందుకు ఈమాత్రం భర్త చెల్లించాల్సిందే’’ అని తన ఆదేశాల్లో పేర్కొన్నారు.పిటిషనర్ భర్త ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నారన్న న్యాయస్థానం.. అతడి నుంచి విడిపోయిన భార్య మరో పెళ్లి చేసుకోలేదని.. కుమార్తెను కూడా ఆమె పెంచుతున్నందున ఈమాత్రం భరణం సబబేనని పేర్కొన్నట్లు బార్ అండ్ బెంచ్ తెలిపింది. తల్లిదండ్రులతో కలిసి ఉన్నపుడు కుమార్తె జీవనశైలి ఎలా ఉండేదో.. ఇప్పుడే అదేలా ఉండాలన్నా, ఆమె భవిష్యత్తుకు బాగుండటానికి నెలకు రూ. 2.50 లక్షల మొత్తం చెల్లించాల్సిందేనని షమీని ఆదేశించినట్లు పేర్కొంది. అంతేకాదు ఈ కేసును త్వరితగతిన పూర్తి చేయాలని దిగువ కోర్టును ఆదేశించినట్లు తెలిపింది.ఇక హైకోర్టు ఆదేశాల అనంతరం హసీన్ జహాన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గత ఏడేళ్లుగా నా హక్కుల కోసం పోరాడే క్రమంలో నేను దాదాపుగా నా సర్వస్వం కోల్పోయాను. నా కూతురిని మంచి పాఠశాలలో కూడా చేర్చించలేకపోయాను. ఇప్పుడు నాకు కాస్త ఊరట లభించింది. న్యాయస్థానానికి ధన్యవాదాలు చెబుతున్నా’’ అని తన మనసులోని ఆవేదనను పంచుకున్నారు.కాగా ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్కతా నైట్ రైడర్స్ చీర్ లీడర్గా ఉన్న సమయంలో హసీన్ జహాన్కు షమీతో ఏర్పడిన పరిచయం పెళ్లికి దారితీసింది. వీరు 2014లో పెళ్లి చేసుకోగా మరుసటి ఏడాదే కుమార్తె జన్మించింది. అయితే, 2018 నుంచి విభేదాలు తారస్థాయికి చేరడంతో షమీ- హసీన్ జహాన్ విడిగా ఉంటున్నారు.ఇక షమీ కెరీర్ విషయానికొస్తే.. 34 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్ ఫిట్నెస్ లేమి కారణంగా దాదాపు ఏడాది ఆటకు దూరంగా ఉన్నాడు. ఇటీవల ఇంగ్లండ్తో వన్డేలతో తిరిగి మైదానంలో అడుగుపెట్టిన షమీ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ ఆడాడు. ఏడు మ్యాచ్లలో కలిపి పదకొండు వికెట్లు తీశాడు.అయితే, ఐపీఎల్-2025లో మాత్రం షమీ పూర్తిగా తేలిపోయాడు. సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన అతడు తొమ్మిది మ్యాచ్లలో కలిపి కేవలం ఆరు వికెట్లే తీశాడు. అనంతరం ఫిట్నెస్ సమస్యల కారణంగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ ఆడే జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. -
Ind vs Pak: ఆసియా కప్-2025.. భారత్-పాక్ మ్యాచ్ ఆరోజే!
ఆసియా కప్-2025 నిర్వహణకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరులో టోర్నమెంట్ నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ మండలి (ACC) ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి జూలై మొదటి వారంలోనే షెడ్యూల్ విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కాగా భారత్- పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య ఇటీవలి ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా కప్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్న విషయం తెలిసిందే. కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు అమాయక పర్యాటకులను కాల్చి చంపగా.. ఇందుకు ప్రతిగా భారత సైన్యం పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట దాడులు చేసింది.ఈ క్రమంలో పాకిస్తాన్ సైన్యం ఎదురుదాడికి తెగబడగా.. భారత ఆర్మీ ధీటుగా బదులిచ్చింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. అయితే, సింధు జలాల ఒప్పందం రద్దు సహా పాక్పై భారత్ కఠిన చర్యలకు ఉపక్రమించిన నేపథ్యంలో దాయాది కాల్పుల విరమణకు అంగీకరించింది. దీంతో ప్రస్తుతం పరిస్థితులు చక్కబడ్డాయి.అయితే, ఆసియా కప్లో భారత్- పాకిస్తాన్ కలిసి ఆడతాయా లేదా అన్న సందేహాల నడుమ.. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆసక్తికర కథనం ప్రచురించింది. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీని ముందుగా నిర్ణయించినట్లుగా తటస్థ వేదికైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో నిర్వహించనున్నట్లు తెలిపింది.భారత్- పాక్ మ్యాచ్ ఆరోజేఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్న ఆసియా కప్.. సెప్టెంబరు 5న ఆరంభం కానున్నట్లు పేర్కొంది. అదే విధంగా.. గ్రూప్ దశలో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్- పాక్ తొలుత సెప్టెంబరు 7న ముఖాముఖి తలపడనున్నట్లు వెల్లడించింది. ఇక 2022, 2023 మాదిరే ఈసారి కూడా గ్రూప్ దశ తర్వాత సూపర్ ఫోర్ ఫార్మాట్లోనే టోర్నీని నిర్వహించనున్నట్లు సమాచారం.ఒకవేళ భారత్తో పాటు పాకిస్తాన్ కూడా సూపర్ ఫోర్కు అర్హత సాధిస్తే సెప్టెంబరు 14న మరోసారి దాయాదులు పరస్పరం ఢీకొట్టనున్నాయి. అన్నీ సజావుగా సాగి ఇరు జట్లు ఫైనల్ చేరితే సెప్టెంబరు 21న మరోసారి హై వోల్టేజీ మ్యాచ్ చూసేందుకు అభిమానులకు అవకాశం లభిస్తుంది.మూడుసార్లు పోటీ పడే అవకాశం!అయితే, ప్రస్తుత ఫామ్ దృష్ట్యా పాక్ గ్రూప్ దశ దాటడమే కష్టంగా కనిపిస్తోంది. ఏదేమైనా దాయాదులు ఈ టోర్నీలో మూడుసార్లు ముఖాముఖి పోటీ పడే అవకాశాలు మాత్రం లేకపోలేదు. కాగా ఆసియా కప్-2025లో మొత్తంగా ఆరు జట్లు తలపడనున్నాయి. టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్లతో పాటు ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్లో అగ్రస్థానంలో నిలిచిన యూఏఈ కూడా టైటిల్ కోసం పోటీపడనుంది.తటస్థ వేదిక కాబట్టికాగా పాకిస్తాన్తో కలిసి ఆడకూడదని టీమిండియా భావించగా.. ఏసీసీ సమావేశంలో భాగంగా ఆతిథ్య హోదాలో ఆడేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల బ్రాడ్కాస్టన్ సోనీ స్పోర్ట్స్ విడుదల చేసిన పోస్టర్లో పాక్ కెప్టెన్ కనబడకపోవడంతో.. ఈ టోర్నీ నుంచి పాక్ తప్పుకొందనే సంకేతాలు వచ్చాయి. ఇక ఈ కథనాల్లో ఏది నిజమో తేలాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే!చదవండి: ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీస్తున్న ఇషాన్ కిషన్, తిలక్ వర్మ -
చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్.. ప్రపంచ రికార్డు
భారత క్రికెటర్ రిచా ఘోష్ (Richa Ghosh) సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక స్ట్రైక్రేటుతో వెయ్యి పరుగుల మైలురాయికి చేరుకున్న తొలి ప్లేయర్గా నిలిచింది. ఇంగ్లండ్తో రెండో టీ20 (England Women vs India Women) సందర్భంగా రిచా ఘోష్ ఈ ఘనత సాధించింది.కాగా భారత మహిళల క్రికెట్ జట్టు ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాటింగ్హామ్లో ఆతిథ్య జట్టును 97 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్.. తాజాగా రెండో టీ20లోనూ అదరగొట్టింది.బ్రిస్టల్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో 24 పరుగుల తేడాతో నాట్ సీవర్-బ్రంట్ బృందాన్ని ఓడించింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0తో ఆధిక్యం సంపాదించింది.దంచికొట్టిన అమన్జోత్, రిచాఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (13), షెఫాలీ వర్మ (3) నిరాశపరిచినా.. వన్డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ అద్భుత అర్ధ శతకం (41 బంతుల్లో 63)తో మెరిసింది.ఇక రెండో టీ20తో తిరిగి వచ్చిన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (1) తీవ్రంగా నిరాశపరచగా.. ‘ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్’ అమన్జోత్ కౌర్, వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ దంచికొట్టారు. అమన్జోత్ 40 బంతుల్లో తొమ్మిది ఫోర్ల సాయంతో 63 పరుగులతో అజేయంగా నిలిచింది. మరోవైపు.. రిచా ఘోష్ 20 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 32 పరుగులతో నాటౌట్గా ఉంది.తొలి మహిళా క్రికెటర్గా ప్రపంచ రికార్డుఈ క్రమంలోనే రిచా అరుదైన రికార్డులు తన సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ సందర్భంగా వెయ్యి పరుగుల మార్కు అందుకున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 140కి పైగా స్ట్రైక్రేటుతో ఈ ఘనత సాధించింది. తద్వారా మహిళల అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో (T20 Format) ఈ ఫీట్ నమోదు చేసిన తొలి క్రికెటర్గా ప్రపంచ రికార్డు సాధించింది.ఫాస్టెస్ట్ 1000.. రెండో ప్లేయర్గాఅదే విధంగా.. ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్లో బంతుల పరం (702)గా అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న రెండో మహిళా క్రికెటర్గానూ రిచా ఘోష్ నిలిచింది. అంతకుముందు ఐల్ ఆఫ్ మ్యాన్కు చెందిన లూసీ బార్నెట్ 700 బంతుల్లో ఈ ఘనత సాధించింది.కాగా పదహారేళ్ల వయసులో 2020లో రిచా టీమిండియా తరఫున టీ20లలో అరంగేట్రం చేసింది. ఇప్పటికి 64 మ్యాచ్లలో కలిపి 1029 పరుగులు సాధించింది. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. అంతేకాదు.. 21 ఏళ్ల రిచా 37 వన్డేల్లో 800, రెండు టెస్టు మ్యాచ్లలో కలిపి 151 పరుగులు సాధించింది.ఇంగ్లండ్ను మరోసారి ఓడించిన భారత్ఇక ఇంగ్లండ్తో రెండో టీ20 విషయానికొస్తే.. భారత్ విధించిన 182 లక్ష్యాన్ని ఛేదించడంలో ఆతిథ్య జట్టు విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసిన ఇంగ్లండ్ 24 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. టామీ బీమౌంట్ హాఫ్ సెంచరీ (54) చేయగా.. మిగతా వారిలో ఎమీ జోన్స్ (32), సోఫీ ఎక్లిస్టోన్ (35) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.భారత బౌలర్లలో శ్రీ చరణి రెండు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ, అమన్జోత్ కౌర్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. స్నేహ్ రాణా- రాధా యాదవ్, స్మృతి మంధాన- రిచా ఘోష్ జోడీలు రెండు రనౌట్లలో భాగమయ్యాయి.అత్యుత్తమ స్ట్రైక్రేటుతో మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్లు🏏రిచా ఘోష్ (ఇండియా)- 143.11 స్ట్రైక్రేటుతో 1029 రన్స్🏏లూసీ బార్నెట్ (ఐల్ ఆఫ్ మ్యాన్)- 139.69 స్ట్రైక్రేటుతో 1172 రన్స్🏏తాహిలా మెగ్రాత్ (ఆస్ట్రేలియా)- 132.94 స్ట్రైక్రేటుతో 132.94 రన్స్🏏క్లో టైరాన్ (సౌతాఫ్రికా)- 132.81 స్ట్రైక్రేటుతో 1283 రన్స్🏏అలీసా హేలీ (ఆస్ట్రేలియా)- 129.79 స్ట్రైక్రేటుతో 3208 రన్స్చదవండి: సెంచరీ, 6 వికెట్ల ప్రదర్శన.. ఇంగ్లండ్లో టీమిండియా యువ సంచలనం ఆల్రౌండ్ షో -
ENG W Vs IND W : ఇంగ్లండ్పై భారత్ ఘన విజయం
బ్రిస్టల్: బ్యాటర్లు జెమీమా రోడ్రిగ్స్ (41 బంతుల్లో 63; 9 ఫోర్లు, 1 సిక్స్), అమన్జ్యోత్ కౌర్ (40 బంతుల్లో 63 నాటౌట్; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. ఫలితంగా ఇంగ్లండ్తో రెండో టి20లో భారత మహిళల క్రికెట్ జట్టు మెరుగైన ప్రదర్శన చేసింది. కాగా ఐదు మ్యాచ్ల టి20 సిరీస్లో భాగంగా మంగళవారం రెండో మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. రిచా ఘోష్ (20 బంతుల్లో 32 నాటౌట్; 6 ఫోర్లు) ధాటిగా ఆడింది. గత మ్యాచ్లో సెంచరీతో విజృభించిన స్మృతి మంధాన (13; 2 ఫోర్లు), షఫాలీ వర్మ (3), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (1) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో లౌరెన్బెల్ 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కేవలం 157 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా భారత్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో టామీ బీమౌంట్ అర్ధ శతకం (54)తో రాణించగా.. మిగిలిన వారిలో ఎమీ జోన్స్ (32), సోఫీ ఎక్లిస్టోన్ (35) మాత్రమే ఫర్వాలేదనిపించారు. ఇక భారత బౌలర్లలో శ్రీ చరణి రెండు వికెట్లు దక్కించుకోగా.. దీప్తి శర్మ, అమన్జోత్ కౌర్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఆల్రౌండ్ ప్రదర్శనతో రాణించిన అమన్జోత్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. -
‘రెండో’ సవాల్కు సిద్ధం!
ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు మరో సవాల్కు సై అంటోంది. తొలి పోరులో భారీ స్కోర్లు, ఐదు సెంచరీల తర్వాత కూడా పరాజయాన్ని ఎదుర్కొన్న జట్టు ఈ సారి తప్పులు దిద్దుకొని లెక్క సరి చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో రెండో టెస్టులో తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇస్తే సిరీస్లో కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. మరోవైపు గత మ్యాచ్ ఇచ్చిన ఉత్సాహంతో ఆధిపత్యాన్ని కొనసాగించాలని ఆతిథ్య జట్టు పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్లో భారత స్టార్ పేసర్ బుమ్రా ఆడతాడా లేదా అనేదే చివరి నిమిషం వరకు సస్పెన్స్గా ఉండవచ్చు! బర్మింగ్హామ్: సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత బరిలోకి దిగిన తొలి సిరీస్లో భారత జట్టుకు సరైన ఆరంభం లభించలేదు. కొత్త కెప్టెన్ శుబ్మన్ గిల్కు నిరాశే ఎదురైంది. బ్యాటర్గా అతను సెంచరీ సాధించినా... ఫలితం మాత్రం సానుకూలంగా రాలేదు. ఇప్పుడు నాయకుడిగా తన సమర్థతను నిరూపించుకునేందుకు అతను సిద్ధమయ్యాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా నేటి నుంచి ఎడ్జ్బాస్టన్ మైదానంలో రెండో టెస్టు జరుగుతుంది. తొలి మ్యాచ్ నెగ్గిన ఇంగ్లండ్ 1–0తో ఆధిక్యంలో ఉంది. ఈ మైదానంలో మన జట్టు రికార్డు పేలవంగా ఉంది. 8 టెస్టులు ఆడితే 7 మ్యాచ్లు ఓడిన టీమిండియా మరో టెస్టును ‘డ్రా’ చేసుకోగలిగింది. కుల్దీప్కు చాన్స్! గత టెస్టు మ్యాచ్లో భారత జట్టు ప్రదర్శన చూస్తే తుది జట్టులో మార్పులు కచ్చితంగా ఉంటాయి. టీమ్ మేనేజ్మెంట్ పదే పదే చెబుతున్నట్లుగా టాప్ బౌలర్ బుమ్రా మిగిలిన నాలుగు టెస్టుల్లో రెండు మాత్రమే ఆడతాడు. తొలి, రెండో టెస్టుకు మధ్యలో తగినంత విశ్రాంతి లభించింది కాబట్టి అతను ఈ టెస్టు ఆడతాడా అనేది ఆసక్తికరంగా మారింది. లార్డ్స్లో జరిగే మూడో టెస్టులో అతను ఆడాలని భావిస్తే ఇక్కడ తప్పుకోవచ్చు. అదే జరిగితే మన బౌలింగ్ మరింత బలహీనంగా కనిపించడం ఖాయం. గత టెస్టులో విఫలమైన శార్దుల్కు బదులు స్పిన్నర్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. అయితే జడేజాకు తోడుగా ఎవరనే విషయంలోనే కాస్త సందిగ్ధత ఉంది. బ్యాటింగ్ బలహీనంగా మారవద్దని భావిస్తే సుందర్కు అవకాశం లభించవచ్చు. అయితే ప్రత్యర్థిని కట్టిపడేయగల పదునైన స్పిన్నర్ కావాలంటే మాత్రం కుల్దీప్కు చాన్స్ ఇవ్వాలి. మరోవైపు బ్యాటింగ్లో టాప్–6కు సంబంధించి ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. మార్పుల్లేకుండా... తొలి టెస్టు విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఈ పోరుకు సిద్ధమైన ఇంగ్లండ్ రెండు రోజుల ముందే తుది జట్టును ప్రకటించింది. ఫాస్ట్ బౌలర్ ఆర్చర్ వస్తే కూర్పులో మార్పు ఉండవచ్చని అనిపించినా ... అతడిని తీసుకోకుండా గత మ్యాచ్ గెలిపించిన టీమ్నే ఎంపిక చేసింది. మరోసారి ఇంగ్లండ్ తమ బ్యాటింగ్ బలాన్ని నమ్ముకుంది. ఓపెనర్లు క్రాలీ, డకెట్తో పాటు ఓలీ పోప్ కూడా తొలి టెస్టులో చెలరేగిపోయారు. ఫామ్లో ఉన్న రూట్ను నిలువరించడం భారత్కు అంత సులువు కాదు. బ్రూక్, స్టోక్స్లతో పాటు జేమీ స్మిత్ బ్యాటింగ్ పదును ఏమిటో గత మ్యాచ్లో కనిపించింది. తొలి టెస్టులో విఫలమైన వోక్స్ తన సొంత మైదానంలో సత్తా చాటా లని పట్టుదలగా ఉన్నాడు. కార్స్, టంగ్ అతడికి అండగా నిలవాల్సి ఉంది. ఏకైక స్పిన్నర్ షోయబ్ బషీర్ ఏమాత్రం ప్రభావం చూపిస్తాడో చూడాలి. పిచ్, వాతావరణంఎడ్జ్బాస్టన్ మైదానం కూడా ఛేదనకే అనుకూలం. గత సిరీస్లో ఇక్కడే ఇంగ్లండ్ రికార్డు స్థాయిలో భారత్పై 378 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. మ్యాచ్ సందర్భంగా అక్కడక్కడా వర్షంతో అంతరాయం కలగవచ్చు. -
సెంచరీ, 6 వికెట్ల ప్రదర్శన.. ఇంగ్లండ్లో టీమిండియా యువ సంచలనం ఆల్రౌండ్ షో
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా యువ ఆటగాడు ముషీర్ ఖాన్ ఇరగదీస్తున్నాడు. నాట్స్ సెకెండ్ 11తో జరుగుతున్న మ్యాచ్లో సెంచరీ సహా 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ తమ ఎమర్జింగ్ టీమ్తో ఇంగ్లండ్లో పర్యటిస్తుండగా.. ముషీర్ ముంబై టీమ్లో సభ్యుడిగా ఉన్నాడు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన ముషీర్.. తొలి ఇన్నింగ్స్లోనే బ్యాట్తో, బంతితో సత్తా చాటాడు. తొలుత బ్యాటింగ్లో 127 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసి, ఆతర్వాత బంతితో 'ఆరే'శాడు.ముషీర్ ఖాన్ ఇటీవల ముగిసిన ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో అతనాడిన ఏకైక మ్యాచ్లో డకౌటై నిరాశపరిచాడు. ఆర్సీబీతో జరిగిన తొలి ప్లే ఆఫ్స్ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన ముషీర్ 3 బంతులు ఎదుర్కొని సుయాశ్ శర్మ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అయితే ఇదే మ్యాచ్లో ముషీర్ బంతితో పర్వాలేదనిపించాడు. 2 ఓవర్లలో 27 పరుగులిచ్చి మయాంక్ అగర్వాల్ వికెట పడగొట్టాడు.20 ఏళ్ల ముషీర్ ఖాన్ టీమిండియా అప్ కమింగ్ మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు. ముషీర్కు దేశవాలీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. 2022-23 రంజీ సీజన్లో ముంబై తరఫున అరంగేట్రం చేసిన ముషీర్.. ఆడిన 9 మ్యాచ్ల్లో 51.14 సగటున 3 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 716 పరుగులు చేశాడు. ఇందులో ఓ అజేయ డబుల్ సెంచరీ కూడా ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ముషీర్ బౌలర్గానూ రాణించాడు. 9 మ్యాచ్ల్లో 8 వికెట్లు తీశాడు. ముషీర్ 2024 అండర్-19 వరల్డ్కప్లో భారత జట్టు సభ్యుడిగా ఉన్నాడు. టీమిండియా రన్నరప్గా నిలిచిన ఈ టోర్నీలో ముషీర్ రెండు సెంచరీలు చేశాడు. 2024 రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన ముషీర్.. ముంబై తరఫున రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. -
ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీస్తున్న ఇషాన్ కిషన్, తిలక్ వర్మ
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో టీమిండియా యువ బ్యాటర్లు ఇషాన్ కిషన్, తిలక్ వర్మ దుమ్మురేపుతున్నారు. కొద్ది రోజుల కిందటే కౌంటీ అరంగేట్రం చేసిన ఈ ఇద్దరు.. వరుసగా రెండు మ్యాచ్ల్లో అదరగొట్టారు. కౌంటీ ఛాంపియన్షిప్ కోసం హ్యాంప్షైర్తో ఒప్పందం చేసుకున్న తిలక్ వర్మ అరంగేట్రం మ్యాచ్లో అద్బుతమైన సెంచరీతో (241 బంతుల్లో 100) కదంతొక్కగా.. ఇదే టోర్నీ కోసం నాటింగ్హమ్షైర్తో ఒప్పందం చేసుకున్న ఇషాన్ కిషన్ అరంగేట్రం మ్యాచ్లో మెరుపు హాఫ్ సెంచరీ (98 బంతుల్లో 87) చేశాడు.తాజాగా ఈ ఇద్దరు తమతమ రెండో మ్యాచ్ల్లో కూడా సత్తా చాటారు. సోమర్సెట్తో జరుగుతున్న మ్యాచ్లో ఇషాన్ కిషన్ (128 బంతుల్లో 77; 8 ఫోర్లు, 2 సిక్సర్లు).. వార్సెస్టర్షైర్తో జరుగుతున్న మ్యాచ్లో తిలక్ వర్మ (171 బంతుల్లో 56; 7 ఫోర్లు, సిక్స్) అర్ద సెంచరీలతో రాణించారు. కౌంట్లీ ఈ ఇద్దరు యువ బ్యాటర్లు చెలరేగడం చూస్తుంటే టీమిండియా టెస్ట్ బెర్త్ల కోసం పోటీ మరింత తీవ్రతరమయ్యేలా కనిపిస్తుంది. తాజా కౌంటీ ఛాంపియన్షిప్లోనే మరో టీమిండియా ఆటగాడు కూడా అరంగేట్రం చేశాడు. భారత లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్ ఎసెక్స్తో ఒప్పందం చేసుకున్నాడు. ఖలీల్ తన తొలి మ్యాచ్లోనే (యార్క్షైర్) ఆకట్టుకున్నాడు. ఖలీల్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్స్టోతో జరిగిన పోటీలో పైచేయి సాధించాడు. తొలుత బెయిర్స్టో ఖలీల్ బౌలింగ్లో బౌండరీలు బాదగా.. ఆతర్వాత ఖలీల్ అతన్ని ఔట్ చేసి రివెంజ్ తీర్చుకున్నాడు.కాగా, ఈ కౌంటీ సీజన్లో ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, ఖలీల్ అహ్మద్తో పాటు మరో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు కూడా ఆడుతున్నారు. యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ యార్క్షైర్కు.. స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ నార్తంప్టన్షైర్కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. -
అర్ష్దీప్ వద్దు!.. బుమ్రా స్థానంలో అతడే సరైనోడు: ఇర్ఫాన్ పఠాన్
ఇంగ్లండ్తో రెండో టెస్టుకు ముందు భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ టీమిండియా నాయకత్వ బృందానికి కీలక సూచనలు చేశాడు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) స్థానాన్ని ఆకాశ్ దీప్తో భర్తీ చేస్తే బాగుంటుందన్నాడు. మహ్మద్ షమీ (Mohammed Shami) మాదిరి ఈ బెంగాల్ పేసర్ రాణించగలడని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు.ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్కు వెళ్లిన టీమిండియా.. ఓటమితో ఈ సిరీస్ను మొదలుపెట్టింది. లీడ్స్లో జరిగిన తొలి టెస్టులో ఐదు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఇక బుమ్రాపై పనిభారం తగ్గించే నిమితం టీమిండియా మేనేజ్మెంట్ అతడిని ఇక్కడ కేవలం మూడు టెస్టుల్లో మాత్రమే ఆడించనుంది.షమీ మాదిరి ఆకట్టుకోగలడుఈ నేపథ్యంలో బర్మింగ్హామ్లో జరిగే రెండో టెస్టుకు బుమ్రాకు విశ్రాంతినిస్తారని తెలుస్తోంది. ఈ విషయంపై స్పందించిన ఇర్ఫాన్ పఠాన్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు.‘‘ఒకవేళ బుమ్రా గనుక ఈ టెస్టు ఆడకపోతే.. అతడి స్థానంలో సరైన బౌలర్ ఎవరంటే.. ఆకాశ్ దీప్. నెట్స్లో అతడి ప్రాక్టీస్ చూస్తుంటే.. షమీ మాదిరి ఆకట్టుకోగలడని అనిపిస్తోంది. సీమ్, స్వింగ్పై మరింతగా దృష్టి సారిస్తే.. కచ్చితంగా ఇంగ్లండ్ బ్యాటర్లను అతడు ఇబ్బందిపెట్టగలడు.అర్ష్దీప్ వద్దు!.. బుమ్రా స్థానంలో అతడే సరైనోడుఅర్ష్దీప్ కూడా రేసులో ఉన్నాడు. కానీ బుమ్రా ఒకవేళ రెండో టెస్టు ఆడకపోతే అతడి స్థానంలో ఆకాశ్ దీప్ను తప్పక ఎంపిక చేయాలి’’ అని ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. ఇదిలా ఉంటే.. మంగళవారం మీడియాతో మాట్లాడిన టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్.. బుమ్రా రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడని స్పష్టం చేశాడు. అయితే, అతడిని ఆడించే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నాడు.మరోవైపు.. ఎడ్జ్బాస్టన్ పిచ్ పొడిగా ఉండనున్న నేపథ్యంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తుదిజట్టులోకి రావడం ఖాయమని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అంటున్నారు. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య జూలై 2-6 వరకు రెండో టెస్టు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.ఇదిలా ఉంటే.. ఆకాశ్ దీప్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు ఏడు టెస్టులు ఆడి పదిహేను వికెట్లు తీశాడు. మరోవైపు.. పరిమిత ఓవర్ల క్రికెట్లో దూసుకుపోతున్న అర్ష్దీప్.. సుదీర్ఘ ఫార్మాట్లో ఇంకా అరంగేట్రం చేయలేదు. ఇక టీమిండియాతో రెండో టెస్టుకు ఇంగ్లండ్ ఇప్పటికే తమ తుదిజట్టును ప్రకటించింది.భారత్తో రెండో టెస్టు కోసం ఇంగ్లండ్ తుది జట్టు ఇదేజాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్.చదవండి: చిచ్చర పిడుగులు ఇరగదీశారు.. వరల్డ్ చాంపియన్ చేతిలో జింబాబ్వే చిత్తు -
కఠినంగా ఉన్నా నమ్మాల్సిందే..! ఈ దశాబ్దంలో బాబర్ ఆజమే టాప్ బ్యాటర్
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఇటీవలి కాలంలో అన్ని ఫార్మాట్లలో దారుణంగా విఫలమవుతున్న విషయం తెలిసిందే. అతను అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ సాధించి దాదాపుగా రెండేళ్లవుతుంది. అతని చివరి సెంచరీ కూడా పసికూన నేపాల్పై (వన్డేలో) సాధించాడు.బాబర్ తన చివరి 10 టెస్ట్ల్లో, 10 వన్డేల్లో, 10 టీ20ల్లో కనీసం ఒక్క సెంచరీ కూడా చేయలేదు. హాఫ్ సెంచరీలు కూడా ఎనిమిదే చేశాడు (40 ఇన్నింగ్స్ల్లో). వరుస వైఫల్యాల కారణంగా కెప్టెన్సీ కోల్పోయిన బాబర్.. ప్రస్తుతం జట్టులో చోటును కూడా ప్రశ్నార్ధకంగా మార్చుకున్నాడు.కెరీర్లో అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నా, బాబర్ ఇప్పటికీ టాప్ బ్యాటర్గా ఉండటం నమ్మశక్యంగా లేదు. ఈ దశాబ్దంలో (2020-2025 జూన్ 30 వరకు) అత్యధిక పరుగులు చేసిన అంతర్జాతీయ బ్యాటర్ల జాబితాలో బాబర్ టాప్ ప్లేస్లో ఉన్నాడు.Babar Azam is currently the leading run-scorer of this decade among all international batters.#ViratKohli #RohitSharma #BabarAzam #CricTracker pic.twitter.com/WfD2qA4Y6H— CricTracker (@Cricketracker) July 1, 20252020-2025 మధ్యకాలంలో బాబర్ 202 ఇన్నింగ్స్లు ఆడి 8222 పరుగులు చేశాడు. ప్రపంచ క్రికెట్లో ఈ దశాబ్దంలో ఎవరూ ఇన్ని పరుగులు చేయలేదు. 2015లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బాబర్.. ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిపి 14600 పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో 31 సెంచరీలు, 102 అర్ద సెంచరీలు ఉన్నాయి.ఈ దశాబ్దంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో బాబర్ తర్వాతి స్థానంలో కూడా పాక్ ఆటగాడే ఉండటం విశేషం. ఆ జట్టు వన్డే సారధి మహ్మద్ రిజ్వాన్ ఈ దశాబ్దంలో 191 ఇన్నింగ్స్ల్లో 7231 పరుగులు చేశాడు.బాబర్, రిజ్వాన్ తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్ యువ సంచలనం హ్యారీ బ్రూక్ ఉన్నాడు. బ్రూక్ 2020 నుంచి 2025 జూన్ 30 వరకు 151 ఇన్నింగ్స్లు ఆడి 6998 పరుగులు చేశాడు. ఈ ముగ్గురి తర్వాత టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఉన్నారు. ఈ దశాబ్ద ఆరంభంలో పెద్దగా ఫామ్లో లేని కోహ్లి.. ఇప్పటివరకు 173 ఇన్నింగ్స్లు ఆడి 6155 పరుగులు చేయగా.. రోహిత్ 169 ఇన్నింగ్స్ల్లో 5982 పరుగులు చేశాడు. ప్రస్తుతం కోహ్లి, రోహిత్ టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. -
శుభవార్త చెప్పిన శుబ్మన్ గిల్
ఇంగ్లండ్తో రెండో టెస్టు (Ind vs Eng 2nd Test)కు భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అందుబాటులో ఉంటాడా? లేడా?.. గత కొన్ని రోజులుగా క్రికెట్ వర్గాల్లో ఇదే చర్చ. ఈ విషయంపై టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) స్పందించాడు. ఎడ్జ్బాస్టన్ టెస్టుకు బుమ్రా అందుబాటులో ఉంటాడని స్పష్టం చేశాడు. అయితే, అతడిని ఆడించే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదంటూ ట్విస్ట్ ఇచ్చాడు.తొలి టెస్టులో ఓటమిటెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్తో ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా అక్కడకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు జరుగగా.. గిల్ సేన స్టోక్స్ బృందం చేతిలో ఓటమిపాలైంది. ఐదో రోజు వరకు సాగిన ఆటలో ఆఖరికి ఐదు వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది.బుమ్రాపైనే భారంఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్లలో బుమ్రా ఒక్కడే గొప్పగా రాణించాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో అతడు ఐదు వికెట్లు కూల్చాడు. అయితే, మిగతా బౌలర్ల నుంచి అతడికి పెద్దగా సహకారం అందలేదు. అదే విధంగా.. ఫీల్డింగ్ తప్పిదాలు కూడా టీమిండియా కొంపముంచాయి.ఇదిలా ఉంటే.. ఫిట్నెస్, పనిభారం దృష్ట్యా బుమ్రా ఇంగ్లండ్తో ఐదింటిలో మూడు టెస్టులు మాత్రమే ఆడతాడని మేనేజ్మెంట్ ముందే స్పష్టం చేసింది. అయితే, అవి ఏ మూడో మాత్రం చెప్పలేదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బుమ్రా రెండో టెస్టు బరిలో దిగితేనే బాగుంటుందని విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు టీమిండియాకు సూచిస్తున్నారు.బుమ్రా అందుబాటులో ఉంటాడు.. కానీతొలి- రెండో టెస్టుకు మధ్య వారానికి పైగా విరామం దొరికింది కాబట్టి బుమ్రాను ఆడించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ శుబ్మన్ గిల్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బుమ్రా అందుబాటులో ఉన్నాడు. అతడి వర్క్లోడ్ మేనేజ్మెంట్ గురించి మేము ఆలోచిస్తున్నాం.అయితే, ఈరోజు సాయంత్రానికి మేము సరైన కూర్పుతో జట్టును ఎంపిక చేసుకోగలం. అప్పుడే బుమ్రా విషయంలో నిర్ణయం తీసుకుంటాం. ఈ సిరీస్ ఎంత ముఖ్యమో మాకు తెలుసు.కనీసం మూడు మ్యాచ్లకైనా బుమ్రా అందుబాటులో ఉంటాడు. తను జట్టు లేకపోతే ఆ లోటు స్పష్టంగా తెలుస్తుంది. కానీ అధిక పనిభారాన్ని మోపడం కూడా సరికాదు.20 వికెట్లు కూల్చడం సహా భారీగా పరుగులు రాబట్టగలిగే జట్టు కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం. పిచ్ను చూసిన తర్వాతే స్పిన్నర్లలో ఎవరిని తుదిజట్టులో చేర్చుకుంటామో చెప్పగలము’’ అని పేర్కొన్నాడు. కాగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో బుధవారం (జూలై 2-6) నుంచి భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు మొదలుకానుంది. చదవండి: జైస్వాల్పై గంభీర్ ఆగ్రహం!.. ‘వేటు’ తప్పదన్న డష్కాటే! -
రెండో టెస్ట్లోనే అరుదైన ఫీట్ సాధించిన సౌతాఫ్రికా ఆల్రౌండర్
సౌతాఫ్రికా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కార్బిన్ బాష్ తన కెరీర్లో రెండో టెస్ట్లోనే అరుదైన ఫీట్ సాధించాడు. సెంచరీ సహా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో సౌతాఫ్రికా ప్లేయర్గా, ఓవరాల్గా 40వ ఆల్రౌండర్గా రికార్డుల్లోకెక్కాడు. బాష్కు ముందు (సౌతాఫ్రికా) జిమ్మీ సింక్లైర్ (106, 6/26), ఏ ఫాల్కనర్ (123. 5/120), జాక్ కల్లిస్ (110, 5/90), జాక్ కల్లిస్ (139 నాటౌట్, 5/21) ఈ ఘనత సాధించారు.జింబాబ్వేతో తాజాగా ముగిసిన టెస్ట్ మ్యాచ్లో బాష్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో బాష్ తొలి ఇన్నింగ్స్లో అజేయ సెంచరీ (100) చేసి రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల ప్రదర్శన (5/43) నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో బాష్ సహా డ్రి ప్రిటోరియస్ (153), ముల్దర్ (4/50, 147), కేశవ్ మహారాజ్ (3/70, 51), కోడి యూసఫ్ (3/42, 3/ 22) సత్తా చాటడంతో జింబాబ్వేపై సౌతాఫ్రికా 328 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాతి మ్యాచ్లోనే సౌతాఫ్రికా ఛాంపియన్లా ఆడి కొత్త టెస్ట్ సైకిల్ను (2025-27) ఘనంగా ప్రారంభించింది. రెండు మ్యాచ్ల సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న సౌతాఫ్రికా ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగింది. అయినా ఛాంపియన్ ఆట ఆడి పసికూన జింబాబ్వేపై తమ పరాక్రమాన్ని చూపించింది. సీనియర్లు బవుమా, మార్క్రమ్, రబాడ లాంటి వారు ఈ సిరీస్ ఆడకుండా విశ్రాంతి తీసుకున్నారు.ఈ మ్యాచ్లో జింబాబ్వే ఓడినప్పటికీ వారి స్థాయికి మించి పోరాటం చేసింది. తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టు సౌతాఫ్రికాకు ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేసింది. సీన్ విలియమ్స్ (137) అద్బుతమైన సెంచరీతో జింబాబ్వేను గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. మరో ఎండ్ నుంచి ఎవరి సహకారం లేకపోవడంతో అతని పోరాటం వృధా అయ్యింది. రెండో ఇన్నింగ్స్లో జింబాబ్వే పూర్తిగా చేతులెత్తేసింది. భారీ లక్ష్య ఛేదనలో ఆ జట్టు స్వల్ప స్కోర్కే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన అరంగేట్రం ఆటగాడు డ్రి ప్రిటోరియస్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్లో ప్రిటోరియస్తో పాటు డెవాల్డ్ బ్రెవిస్, కోడి యూసఫ్ అరంగేట్రం చేశారు. రెండో టెస్ట్ జులై 6 నుంచి బులవాయో వేదికగానే జరుగనుంది. -
చిచ్చర పిడుగులు ఇరగదీశారు.. పాపం పసికూన!
జింబాబ్వేతో తొలి టెస్టు (ZIM vs SA 1st Test)లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టును ఏకంగా 328 పరుగుల భారీ తేడాతో ఓడించి జయభేరి మోగించింది. కీలక ఆటగాళ్లు జట్టుతో లేకపోయినా ప్రొటిస్ జట్టు ఆద్యంత ఆధిపత్యం కనబరిచి రెండు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజ వేసింది.అరంగేట్రంలోనే సత్తా చాటిన చిచ్చరపిడుగులుప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC)-2025 ఫైనల్ గెలిచిన తర్వాత సౌతాఫ్రికా.. తొలుత జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఆతిథ్య జట్టుతో రెండు టెస్టులు ఆడనుంది. రెగ్యులర్ కెప్టెన్ టెంబా బవుమా (Temba Bavuma)తో పాటు ఐడెన్ మార్క్రమ్ వంటి కీలక ఆటగాళ్లు ఈ టూర్కు దూరం కాగా.. కేశవ్ మహరాజ్ సారథ్యంలో లువాన్-డ్రి ప్రిటోరియస్, డెవాల్డ్ బ్రెవిస్ టెస్టులలో అరంగేట్రం చేశారు.ఇక బులవాయో వేదికగా జూన్ 28న మొదలైన తొలి టెస్టులో టాస్ గెలిచిన పర్యాటక సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది. టాపార్డర్ విఫలమైనప్పటికీ టీనేజర్లు లువాన్-డ్రి ప్రిటోరియస్, డెవాల్డ్ బ్రెవిస్ అదరొట్టారు. ప్రిటోరియస్ భారీ శతకం (153) బాదగా.. బ్రెవిస్ (41 బంతుల్లో 51) మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు.వీరిద్దరికి తోడు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కార్బిన్ బాష్ శతకం (100 నాటౌట్)తో చెలరేగాడు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 418 పరుగుల వద్ద ప్రొటిస్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. జింబాబ్వే బౌలర్లలో టనకా చివాంగ నాలుగు వికెట్లు తీయగా.. ముజర్బానీ రెండు, మసకజ్ద, మసేకెస ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. 251 పరుగులకే ఆలౌట్ ఇక తొలి ఇన్నింగ్స్లో జింబాబ్వే 251 పరుగులకే ఆలౌట్ అయింది. సీన్ విలియమ్స్ (137) శతక్కొట్టగా.. మిగతా వారి నుంచి అతడికి సహకారం అందలేదు. ప్రొటిస్ బౌలర్లలో వియాన్ ముల్డర్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. కెప్టెన్ కేశవ్ మహరాజ్, కోడి యూసఫ్ చెరో మూడు వికెట్లు తీశారు.ఈ క్రమంలో 167 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా.. 369 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈసారి వియాన్ ముల్డర్ (147) శతకంతో ఆకట్టుకోగా.. కేశవ్ మహరాజ్ హాఫ్ సెంచరీ (51) చేశాడు.జింబాబ్వే బౌలర్లలో ఈసారి మసకజ్ద నాలుగు, చివాంగ, మసెకెస రెండేసి వికెట్లు తీయగా.. ముజర్బానీ, మెధెవెరె చెరో వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్య ఛేదనలో తడబడిఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని సౌతాఫ్రికా జింబాబ్వేకు 537 పరుగుల లక్ష్యం విధించింది. అయితే, మంగళవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా 208 పరుగులకే జింబాబ్వే ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా భారీ గెలుపు దక్కించుకుంది.మరోవైపు.. టెస్టుల్లో జింబాబ్వేకు ఇదే అతిపెద్ద పరాజయం. ఇదిలా ఉంటే.. జింబాబ్వే రెండో ఇన్నింగ్స్లో కార్బిన్ బాష్ ఐదు వికెట్లతో చెలరేగగా.. యూసఫ్ మూడు, కేశవ్ మహరాజ్, డెవాల్డ్ బ్రెవిస్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అరంగేట్రంలోనే శతక్కొట్టిన సౌతాఫ్రికా 19 ఏళ్ల చిచ్చరపిడుగు ప్రిటోరియస్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.జింబాబ్వే వర్సెస్ సౌతాఫ్రికా తొలి టెస్టు సంక్షిప్త స్కోర్లుసౌతాఫ్రికా: 418/9 d & 369జింబాబ్వే: 251 & 208.చదవండి: IPL 2026: సీఎస్కేలోకి సంజూ.. బదులుగా రాజస్తాన్కు రుతురాజ్?! -
మళ్లీ వేలానికి రిషబ్ పంత్
గత ఐపీఎల్ సీజన్ మెగా వేలంలో రూ. 27 కోట్ల ధర దక్కించుకొని, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన లక్నో సూపర్ జెయింట్స్ సారధి రిషబ్ పంత్ మరోసారి వేలం బరిలోకి దిగనున్నాడు. ఈసారి పంత్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. జులై 6, 7 తేదీల్లో న్యూఢిల్లీలో జరుగబోయే డీపీఎల్ వేలంలో పంత్ పేరు నమోదు చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. పంత్ డీపీఎల్ ఆడేందుకు గతంలో తన ఇష్టాన్ని వ్యక్తం చేశాడు. పంత్ డీపీఎల్ ఎంట్రీ విషయాన్ని డీడీసీఏకు (ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్) చెందిన ఓ కీలక అధికారి బహిర్గతం చేశాడు. పంత్తో పాటు ఐపీఎల్ 2025 సంచలనాలు ప్రియాంశ్ ఆర్య (పంజాబ్ కింగ్స్), దిగ్వేశ్ రాఠీ (లక్నో సూపర్ జెయింట్స్) కూడా డీపీఎల్ వేలంలో పాల్గొననున్నారు. ఈ ముగ్గురితో పాటు మరో ఏడుగురు ఐపీఎల్ స్టార్లు (ఇషాంత్ శర్మ, ఆయుష్ బదోని, హర్షిత్ రాణా, హిమ్మత్ సింగ్, సుయాష్ శర్మ, మయాంక్ యాదవ్, అనూజ్ రావత్) కూడా డీపీఎల్ 2025 వేలం బరిలో ఉండనున్నారు. ప్రియాంశ్ ఆర్య, దిగ్వేశ్ రాఠీ గత డీపీఎల్ సీజన్లో సంచలనాలు సృష్టించి ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇద్దరూ ఐపీఎల్లోనూ ఇరగదీసి తమకు గుర్తింపునిచ్చిన డీపీఎల్ బరిలో మళ్లీ నిలువనున్నారు.కొత్తగా రెండు ఫ్రాంచైజీలుగతేడాదే పురుడుపోసుకున్న డీపీఎల్ రాబోయే ఎడిషన్లో మరో రెండు కొత్త జట్లను పరిచయం చేస్తుంది. తొలి ఎడిషన్లో (2024) ఆరు జట్లతో జరిగిన డీపీఎల్ ఈసారి ఎనిమిది జట్లతో సాగనుంది. కొత్త జట్ల వివరాలను డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ ఇవాళ వెల్లండించారు. ఇందులో ఓ జట్టు పేరు ఔటర్ ఢిల్లీ కాగా.. మరో జట్టు పేరు న్యూఢిల్లీ. ఔటర్ ఢిల్లీని సవిత పెయింట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు రూ.10.6 కోట్లకు కొనుగోలు చేయగా.. న్యూఢిల్లీ ఫ్రాంచైజీని భీమా టోలింగ్ అండ్ ట్రాఫిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు క్రేయాన్ అడ్వర్టైజ్మెంట్ సంస్థలు రూ.9.2 కోట్లకు దక్కించుకున్నాయి.డీపీఎల్ తొలి ఎడిషన్లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్, ఈస్ట్ ఢిల్లీ రైడర్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్, పురానీ దిల్లీ 6, సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్, వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్లు పాల్గొన్నాయి. గత ఎడిషన్లో ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్ను ఓడించి విజేతగా అవతరించింది. గత సీజన్లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్ ఊహలకందని విధంగా 20 ఓవర్లలో 308 పరుగులు చేసి ఔరా అనిపించింది. ఆ సీజన్లో ఇలాంటి ప్రదర్శనలు ఎన్నో నమోదయ్యాయి. గత సీజన్లో ప్రియాంశ్ ఆర్య రెండు సెంచరీలు నమోదు చేశాడు. ఆయుశ్ బదోని ఓసారి శతక్కొట్టాడు. గత సీజన్ సూపర్ సక్సెస్ కావడంతో ఈ సీజన్పై భారీ అంచనాలు ఉన్నాయి. డీపీఎల్ మహిళల విభాగంలోనూ జరుగుతుంది. -
‘వాళ్ల దగ్గర అల్లావుద్దీన్ అద్భుతదీపం లేదు.. తప్పంతా మీదే’
ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) యాజమాన్యం తీరును కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (CAT) తప్పుబట్టింది. ఆర్సీబీ విజయోత్సవం సందర్భంగా జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారణం మేనేజ్మెంటే అని తేల్చిచెప్పింది. ఐపీఎల్లో అత్యంత ఆదరణ ఉన్న జట్టు ఆర్సీబీ.తీరిన కలఇందుకు ప్రధాన కారణం టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli). 2008 నుంచి ఇప్పటిదాకా అదే జట్టుతో కొనసాగుతున్నాడు ఈ రన్మెషీన్. అయితే, పదిహేడేళ్లుగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఐపీఎల్ ట్రోఫీ ఈసారి ఆర్సీబీ సొంతమైంది. ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ను ఓడించి ఆర్సీబీ టైటిల్ సొంతం చేసుకుంది. దీంతో కోహ్లి, ఆర్సీబీ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.తీవ్ర విషాదంఫ్రాంఛైజీ కూడా ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునే క్రమంలో అభిమానులకు పిలుపునివ్వడం విషాదకర ఘటనకు దారితీసింది. అహ్మదాబాద్ నుంచి ట్రోఫీతో బెంగళూరుకు తిరిగి వచ్చిన ఆర్సీబీ ఆటగాళ్లకు స్వాగతం పలికే క్రమంలో.. జూన్ 4న తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏకంగా పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపుగా యాభై మంది గాయాలపాలయ్యారు. దీంతో ఆర్సీబీ, కర్ణాటక ప్రభుత్వ తీరుపై విమర్శలు వచ్చాయి.తప్పంతా మీదేఈ నేపథ్యంలో అదనపు పోలీస్ కమిషనర్ వికాస్ కుమార్పై వేటు పడింది. ఈ క్రమంలో కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ వద్దకు విషయం చేరగా.. మంగళవారం విచారణ చేపట్టిన ట్రిబ్యునల్ ఆర్సీబీ యాజమాన్యానిదే ఈ దుర్ఘటనకు బాధ్యత అని స్పష్టం చేసింది. వికాస్ కుమార్ను వెంటనే తన పదవిలో తిరిగి నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బలమైన సాక్ష్యాధారాలు లేకుండా ఇలా పోలీసులను సస్పెండ్ చేయడం సరికాదని పేర్కొంది.ఈ మేరకు.. ‘‘ఆర్సీబీ పోలీసుల నుంచి సరైన రీతిలో అనుమతి తీసుకోలేదు. వారి నుంచి ఆమోదమూ పొందలేదు. అకస్మాత్తుగా.. విజయోత్సవం గురించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో షేర్ చేసింది. దీంతో పెద్ద ఎత్తున జనసమూహం చిన్నస్వామి స్టేడియం వద్దకు చేరుకుంది.వాళ్ల దగ్గర అల్లావుద్దీన్ అద్భుతదీపం లేదుఅయితే, పన్నెండు గంటల్లోనే స్టేడియం వద్ద ఏర్పాట్లు చేయడం పోలీసులకు సాధ్యపడలేదు. నిజానికి వారికి మరింత సమయం ఇవ్వాల్సింది. పోలీసులు కూడా మనుషులే. వాళ్లేమీ దేవుళ్లో.. లేదంటే ఇంద్రజాలికులో కాదు.ఇలా అనుకోగానే.. అలా ఏర్పాట్లు చేయడానికి వారి వద్ద అల్లావుద్దీన్ అద్భుత దీపమేమీ లేదు’’ అంటూ ఆర్సీబీకి చివాట్లు పెట్టింది కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్. అదే సమయంలో పోలీసుల పట్ల సహానుభూతి వ్యక్తం చేసింది. కాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ సంబంధిత వివాదాలను క్యాట్ పరిష్యరిస్తుందన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు ఆర్సీబీ యాజమాన్యం రూ. 10 లక్షల పరిహారం ప్రకటించింది.చదవండి: నా మనసంతా అక్కడే.. ఎక్కడున్నా పట్టేస్తారు: పెదవి విప్పిన కావ్యా మారన్ -
IPL 2026: సీఎస్కేలోకి సంజూ.. బదులుగా రాజస్తాన్కు రుతురాజ్?!
టీమిండియా స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ (Sanju Samson) వచ్చే ఏడాది ఐపీఎల్ జట్టు మారనున్నాడా? రాజస్తాన్ రాయల్స్ను వీడి చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లో చేరనున్నాడా? అంటే అందుకు అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ వికెట్ కీపర్ బ్యాటర్పై సీఎస్కే ఒక్కటే కాదు.. ఇంకో రెండు-మూడు ఫ్రాంఛైజీలు కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.కేరళ స్టార్ సంజూ శాంసన్ 2013లో ఐపీఎల్ (IPL)లో అరంగేట్రం చేశాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున క్యాష్ రిచ్ లీగ్లో అడుగుపెట్టిన అతడు.. ఆ తర్వాత జట్టుపై నిషేధం పడటంతో 2016-17 సీజన్లలో ఢిల్లీ ఫ్రాంఛైజీకి మారాడు. అయితే, 2018లో తిరిగి సొంతగూటికి చేరుకున్నాడు.ఫైనల్ చేర్చిన సారథిఈ క్రమంలో అంచెలంచెలుగా ఎదిగిన సంజూ.. 2021లో కెప్టెన్గా నియమితుడయ్యాడు. సారథిగా అత్యుత్తమంగా 2022లో రాజస్తాన్ను అతడు ఫైనల్కు చేర్చాడు. 2008లో షేన్ వార్న్ కెప్టెన్సీలో టైటిల్ గెలిచిన రాజస్తాన్.. మళ్లీ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. ఇక 2023లో ఐదోస్థానంతో ముగించిన సంజూ సేన.. 2024లో ప్లే ఆఫ్స్ చేరినా ఫైనల్కు వెళ్లలేకపోయింది.ఇక ఈ ఏడాది సంజూ ఫిట్నెస్ సమస్యల కారణంగా ఎక్కువసార్లు ఇంపాక్ట్ ప్లేయర్గా మాత్రమే బరిలోకి దిగగా.. రియాన్ పరాగ్ తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించాడు. ఈసారి రాజస్తాన్ మరీ దారుణంగా తొమ్మిదో స్థానంలో నిలిచింది.ఇదిలా ఉంటే... కొత్త హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్కు సంజూకు మధ్య విభేదాలు ఉన్నట్లు గతంలో వార్తలు రాగా.. ద్రవిడ్ వాటిని ఖండించాడు. మరోవైపు.. రియాన్ పరాగ్ను పూర్తిస్థాయి కెప్టెన్ను చేయాలనే యోచనలో రాజస్తాన్ మేనేజ్మెంట్ ఉందనే రూమర్లు వస్తున్నాయి.సంజూపై సీఎస్కే ఆసక్తి నిజమేఇలాంటి తరుణంలో సంజూ శాంసన్ రాజస్తాన్ను వీడే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు క్రిక్బజ్ కథనం పేర్కొంది. సీఎస్కే ఈ రేసులో ముందున్నట్లు తెలిపింది. ఈ మేరకు సీఎస్కే వర్గాలు మాట్లాడుతూ.. ‘‘సంజూ భారత బ్యాటర్. వికెట్ కీపర్. ఓపెనింగ్ కూడా చేయగలడు.కాబట్టి కచ్చితంగా అతడిని జట్టులో చేర్చుకోవాలని మాకూ ఆసక్తి ఉంది. ఒకవేళ అతడు అందుబాటులో ఉంటే కచ్చితంగా తీసుకుంటాం. ట్రేడ్ చేసుకునైనా అతడిని దక్కించుకుంటాం. అయితే, విషయం అంతవరకు రాలేదు కానీ మాకు మాత్రం అతడిని తీసుకోవడం పట్ల కచ్చితంగా ఆసక్తి ఉంది’’ అని పేర్కొన్నట్లు క్రిక్బజ్ వెల్లడించింది.రుతును ఇచ్చేస్తారా?ఒకవేళ చెన్నై జట్టు గనుక సంజూను దక్కించుకోవాలంటే రాజస్తాన్ ప్లేయర్-టు- ప్లేయర్ ట్రేడ్ వైపే మొగ్గు చూపవచ్చు. అలా అయితే, 2025 మెగా వేలానికి ముందు రాజస్తాన్ సంజూను రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. జట్టుకు అతడే కెప్టెన్.మరోవైపు.. సీఎస్కే తమ కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ను అట్టిపెట్టుకునేందుకు రూ. 18 కోట్లు కేటాయించింది. కాబట్టి ఒకేస్థాయి ఆటగాళ్ల మార్పిడి జరగాలంటే సంజూ- రుతులను ఎక్స్చేంచ్ చేసుకోవాల్సి ఉంటుంది.అయితే, సీఎస్కే హెడ్కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇప్పటికే చాలాసార్లు రుతు గురించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే అతడిని సారథిగా నియమించినట్లు తెలిపాడు. మరి అలాంటపుడు సంజూను ఎవరితో మార్చుకుంటారు?.. అసలు అతడిని వదులుకునేందుకు రాజస్తాన్ సిద్ధంగా ఉందా??.. అంటే మినీ వేలం సమయంలోనే తేలుతుంది. -
విధ్వంసకర శతకం.. అగ్రపీఠం దిశగా దూసుకొస్తున్న మంధాన
ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ స్మృతి మంధాన భారీగా లబ్ది పొందింది. తాజాగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో రికార్డు శతకం బాదిన మంధాన.. కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్లు (771) సాధించడమే కాకుండా ఓ స్థానం మెరుగుపర్చుకొని మూడో స్థానానికి ఎగబాకింది. మంధానకు కెరీర్లో ఇదే అత్యుత్తమ టీ20 ర్యాంకింగ్. ప్రస్తుతం మంధానకు టాప్ ర్యాంకర్ బెత్ మూనీకి (794) మధ్య కేవలం 23 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది.రెండో స్థానంలో ఉన్న హేలీ మాథ్యూస్కు (774) మంధానకు మధ్య కేవలం మూడు పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. ఇప్పటికే వన్డేల్లో టాప్ ర్యాంక్ బ్యాటర్గా కొనసాగుతున్న మంధాన.. తన ఫామ్ను ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్ సిరీస్ మొత్తంలో కొనసాగిస్తే టీ20ల్లో కూడా నంబర్ వన్ స్థానానికి చేరుతుంది. టాప్-10 టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్లో మంధాన మినహా మరే ఇతర బ్యాటర్ లేరు. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్, షఫాలీ వర్మ 12, 13 స్థానాల్లో ఉండగా.. జెమీమా రోడ్రిగెజ్ 15వ స్థానంలో ఉంది. రిచా ఘోష్ 25, దీప్తి శర్మ 31వ స్థానాల్లో ఉన్నారు. ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో మెరుపు ఇన్నింగ్స్ (43) ఆడిన హర్లీన్ డియోల్ టీ20 ర్యాంకింగ్స్లోకి రీఎంట్రీ ఇచ్చింది. తాజాగా ర్యాంకింగ్స్లో ఆమె 86వ స్థానం దక్కింది.కాగా, 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా జూన్ 28న నాటింగ్హమ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మంధాన 62 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 112 పరుగులు చేసింది. టీ20ల్లో మంధానకు ఇదే తొలి సెంచరీ. ఈ సెంచరీతో ఆమె మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్గా రికార్డు నెలకొల్పింది. అంతర్జాతీయ కెరీర్ మొత్తంలో 14 సెంచరీలు చేసిన మంధాన టెస్ట్ల్లో 2, వన్డేల్లో 11, టీ20ల్లో ఓ సెంచరీ చేసింది. ఈ ఇన్నింగ్స్లో మంధాన చేసిన స్కోర్ టీ20ల్లో టీమిండియా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్గా (112) కూడా రికార్డైంది. గతంలో ఈ రికార్డు హర్మన్ప్రీత్ (103) పేరిట ఉండేది.ఇదిలా ఉంటే, భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టీ20 ఇవాళ (జులై 1) జరుగనుంది. బ్రిస్టల్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. -
జైస్వాల్పై గంభీర్ ఆగ్రహం!.. ‘వేటు’ తప్పదన్న డష్కాటే!
ఇంగ్లండ్తో తొలి టెస్టులో టీమిండియా ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటి ఫీల్డింగ్ వైఫల్యం. కీలక సమయాల్లో కీలక క్యాచ్లు నేలపాలు చేసి.. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు దాదాపు ఆరుసార్లు మనోళ్లు ‘లైఫ్’ ఇచ్చారు. అందుకు బదులుగా ఓటమి రూపంలో భారీ మూల్యమే చెల్లించారు.ఇక ఫీల్డర్ల తప్పిదాలు గమనిస్తే ప్రధాన దోషిగా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) పేరు చెప్పవచ్చు. ఆరింటిలో నాలుగు క్యాచ్లు అతడే జారవిడిచాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో సెంచరీ వీరుడు, గెలుపునకు పునాది వేసిన బెన్ డకెట్ ఇచ్చిన క్యాచ్ను జైసూ వదిలేయడం తీవ్ర ప్రభావం చూపింది.జైస్వాల్ ఫీల్డింగ్ తీరుపై గంభీర్ ఆగ్రహంఈ నేపథ్యంలో జైస్వాల్ ఫీల్డింగ్ తీరుపై హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అతడితో క్యాచింగ్ ప్రాక్టీస్ చేయించిన గౌతీ.. ఈ సందర్భంగా గట్టిగానే క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఫీల్డింగ్ విషయంలో జైసూని డిమోట్ చేయాలని నిర్ణయించినట్లు రెవ్స్పోర్ట్స్ పేర్కొంది.టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డష్కాటే సోమవారం నాటి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని దాదాపు ధ్రువీకరించింది. ‘‘క్యాచింగ్ విభాగం మరింత దృఢంగా మారాలి. ఇంగ్లండ్లో కనీసం నాలుగు ప్రధాన క్యాచర్లు ఒక్కోసారి కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.విరామం అనివార్యంయశస్వి కూడా మంచి క్యాచర్. ఇక ఇద్దరు స్పిన్నర్లను ఆడించినప్పుడు షార్ట్ లెగ్ ఫీల్డింగ్ స్థానం మరింత కీలకమవుతుందని చెప్తారు. అందుకే అక్కడ మేము ఒకరి కంటే ఎక్కువ మందిని సెట్ చేయాలని భావిస్తున్నాం.ఏదేమైనా యశస్వికి గల్లీ క్యాచ్ పాయింట్ నుంచి కాస్త విరామం ఇవ్వడం అవసరమే. ప్రస్తుతం అతడి ఫీల్డింగ్ తీరు బాగాలేదు. అయినా సరే అతడు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండాలంటే ఈ బ్రేక్ ఇవ్వాలి’’ అంటూ స్లిప్ క్యాచింగ్ రోల్ నుంచి జైసూను తప్పిస్తామని డష్కాటే చెప్పకనే చెప్పాడు. ఇదిలా ఉంటే.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీ (101)తో అదరగొట్టాడు.కాగా ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్కు వెళ్లిన టీమిండియా.. లీడ్స్లో జరిగిన తొలి మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు (జూలై 2-6) బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో జరుగనుంది.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్తో రెండో టెస్టు.. భారత తుది జట్టులోకి తమిళనాడు కుర్రాడు? -
County Championship: 126 ఏళ్ల రికార్డు బద్దలు
కౌంటీ క్రికెట్లో ఇంగ్లండ్ ఓపెనింగ్ బ్యాటర్, సర్రే ఆటగాడు డామినిక్ సిబ్లీ ట్రిపుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-1లో భాగంగా డర్హమ్తో జరుగుతున్న మ్యాచ్లో సిబ్లీ ఈ ఘనత సాధించాడు. ఈ ఇన్నింగ్స్లో సిబ్లీ 475 బంతులు ఎదుర్కొని 29 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 305 పరుగులు చేశాడు. సిబ్లీకి కెరీర్లో ఇదే మొదటి ట్రిపుల్ సెంచరీ.ఇదే ఇన్నింగ్స్లో మరో ముగ్గురు సర్రే ఆటగాళ్లు కూడా సెంచరీలు చేశారు. ఐపీఎల్లో సీఎస్కేకు ఆడే సామ్ కర్రన్ (124 బంతుల్లో 108; 14 ఫోర్లు, సిక్స్), ముంబై ఇండియన్స్కు ఆడే విల్ జాక్స్ (94 బంతుల్లో 119; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు శతకాలు బాదారు. మరో ఇంగ్లండ్ జాతీయ జట్టు ఆటగాడు డాన్ లారెన్స్ (149 బంతుల్లో 178; 19 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ శతకంతో చెలరేగాడు.సర్రే ఇన్నింగ్స్లో ఓ హాఫ్ సెంచరీ కూడా నమోదైంది. ఇంగ్లండ్ టెస్ట్ జట్టు మాజీ ఆటగాడు రోరి బర్న్స్ 74 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 55 పరుగులు చేశాడు. ఒకే ఇన్నింగ్స్లో ఓ ట్రిపుల్ సెంచరీ, 3 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ నమోదు కావడంతో సర్రే రికార్డు బ్రేకింగ్ స్కోర్ చేసింది. ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 820 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఆ క్లబ్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్. 1899లో సోమర్సెట్పై చేసిన 811 పరుగుల స్కోర్ ఈ మ్యాచ్కు ముందు వరకు సర్రే అత్యధిక స్కోర్గా ఉండింది. ఈ మ్యాచ్లో సర్రే 126 రికార్డును బద్దలు కొట్టింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన డర్హమ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. ఎమిలియో గే 7 పరుగులు చేసి ఔట్ కాగా.. ఆలెక్స్ లీస్ (33), విల్ రోడ్స్ (16) క్రీజ్లో ఉన్నారు. డర్హడ్ సర్రే తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 761 పరుగులు వెనుకపడి ఉంది. కౌంటీ క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోర్ఈ మ్యాచ్లో సర్రే చేసిన స్కోర్ కౌంటీ క్రికెట్ చరిత్రలోనే నాలుగో అత్యధిక టీమ్ స్కోర్గా రికార్డైంది. కౌంటీల్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు యార్క్షైర్ పేరిట ఉంది. 1896లో ఆ జట్టు వార్విక్షైర్పై 887 పరుగులు చేసింది. రెండో అత్యధిక స్కోర్ లాంకాషైర్ (863), మూడో అత్యధిక స్కోర్ సోమర్సెట్ (850/7) పేరిట ఉన్నాయి. -
రషీద్ ఖాన్ కాదు!.. షేన్ వార్న్ తర్వాత అతడే అత్యుత్తమం: గ్రెగ్ చాపెల్
ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓటమి నేపథ్యంలో భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ (Greg Chappell) కీలక వ్యాఖ్యలు చేశాడు. కేవలం ఫీల్డింగ్ తప్పిదాల వల్లే గిల్ సేన ఓడిపోలేదని.. బౌలింగ్లో వైవిధ్యం లేకపోవడం ఇందుకు ప్రధాన కారణమని పేర్కొన్నాడు. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy) ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇరుజట్ల మధ్య లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టు (IND vs ENG)లో భారత్ ఓటమిపాలైంది. గెలవాల్సిన మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో పరాజయాన్ని చవిచూసింది. అత్యధికంగా ఆరు క్యాచ్లు వదిలేయడం, కీలక సమయాల్లో నో బాల్స్ వేయడం తీవ్ర ప్రభావం చూపాయి.టీమిండియా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇదేఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ మాట్లాడుతూ.. ‘‘హెడింగ్లీ మైదానంలో భారత జట్టు ఫీల్డింగ్ చేసిన తీరు తీవ్రంగా నిరాశపరిచిన మాట వాస్తవం. అయితే, తొలి టెస్టులో టీమిండియా ఓడిపోవడానికి ప్రధాన కారణం మాత్రం.. ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్లో హ్యారీ బ్రూక్ను అవుట్ చేసినపుడు అది నో బాల్గా తేలడం.భారత బౌలింగ్ అటాక్లో ఏమాత్రం వైవిధ్యం లేదు. జస్ప్రీత్ బుమ్రా మినహా అందరు సీమర్లూ ఒకేలా బౌలింగ్ చేస్తున్నారు. అందరూ రైటార్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్లే. బౌలర్లను మార్చిన ప్రతిసారీ కచ్చితంగా ఫలితం ఉంటుంది.బౌలింగ్లో వైవిధ్యం ఉన్నప్పుడు బ్యాటర్ తడబడతాడు. కానీ టీమిండియాలో ఇప్పుడు అది కనిపించడం లేదు. బుమ్రాతో పాటు లెఫ్టార్మ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ను జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది.షేన్ వార్న్ తర్వాత అతడే అత్యుత్తమ బౌలర్ఇక కుల్దీప్ యాదవ్.. షేన్ వార్న్ తర్వాత ప్రపంచంలోనే అత్యుత్తమ మణికట్టు స్పిన్నర్ అతడు. అతడిని కూడా వీరికి జతగా తుదిజట్టుకు ఎంపిక చేస్తే బౌలింగ్లో వైవిధ్యం కనబడుతుంది.బుమ్రా తప్ప మిగతా సీమర్లు సరైన లెంగ్త్తో బౌలింగ్ చేయడం లేదు. వేస్తూ ఫుల్ బాల్స్.. లేదంటే మరీ షార్ట్ బాల్స్. ఇలా అయితే కష్టం. బుమ్రాపైనే భారం ఉంటుందని ఇంగ్లండ్ బ్యాటర్లుకు తెలుసు. ఒత్తిడిలో ఉన్న అతడిని వారు ఈజీగా టార్గెట్ చేస్తారు.జడ్డూ విషయంలో పునరాలోచన చేయాలిఅందుకే కుల్దీప్ యాదవ్ను కచ్చితంగా ఆడించాలి. రవీంద్ర జడేజా ఇంగ్లండ్ గడ్డపై ఫ్రంట్లైన్ స్పిన్నర్గా పనికిరాడు. బ్యాటింగ్ కారణంగా అతడికి అవకాశం ఇస్తున్నారు. కానీ.. అతడిని ఆడించే విషయంలో పునరాలోచన చేయాలి’’ అని గ్రెగ్ చాపెల్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోకు రాసిన కాలమ్లో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ఇక ప్రపంచంలో ప్రస్తుతం అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా కొనసాగుతున్న అఫ్గనిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్ను కాదని.. దిగ్గజ షేన్ వార్న్ తర్వాత బెస్ట్ అంటూ చాపెల్ కుల్దీప్ యాదవ్కు కితాబులివ్వడం విశేషం. కాగా భారత్-ఇంగ్లండ్ మధ్య బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో (జూలై 2-6) రెండో టెస్టు జరుగుతుంది. అక్కడి పిచ్ పొడిగా ఉండనున్న నేపథ్యంలో కుల్దీప్ తప్పనిసరిగా ఆడే అవకాశాలు ఉన్నాయి.చదవండి: నా మనసంతా అక్కడే.. ఎక్కడున్నా పట్టేస్తారు: పెదవి విప్పిన కావ్యా మారన్ -
ఇంగ్లండ్తో రెండో టెస్టు.. భారత తుది జట్టులోకి తమిళనాడు కుర్రాడు?
ఎడ్జ్బాస్టన్ వేదికగా జూలై 2 నుంచి ఇంగ్లండ్తో ప్రారంభం కానున్న రెండో టెస్టులో టీమిండియా యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఆడడం దాదాపు ఖాయమైంది. బౌలింగ్ ఆల్రౌండర్ శార్ధూల్ ఠాకూర్ స్ధానంలో నితీశ్ తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో విఫలం కావడంతో శార్ధూల్పై వేటు వేసేందుకు టీమ్ మెనెజ్మెంట్ సిద్దమైనట్లు సమాచారం.తొలి టెస్టులో ఓటమిపాలైన టీమిండియా.. ఎడ్జ్బాస్టన్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను సమం చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో సోమవారం తమ నెట్ప్రాక్టీస్ సెషన్ను భారత జట్టు పొడిగించింది. దాదాపు నాలుగైదు గంటల పాటు భారత ఆటగాళ్లు నెట్స్లో తీవ్రంగా శ్రమించారు. నితీశ్ కుమార్ రెడ్డి బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు.ఫీల్డింగ్ డ్రిల్స్లో కూడా ఈ ఆంధ్ర క్రికెటర్ పాల్గోన్నాడు. ముఖ్యంగా నితీశ్ స్లిప్స్లో ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది. జైశ్వాల్ బదులుగా నితీశ్ స్లిప్స్లో ఫీల్డింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తొలి టెస్టులో జైశ్వాల్ స్లిప్స్లో ఏకంగా మూడు క్యాచ్లు విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. అయితే శార్ధూల్ ఠాకూర్ మాత్రం ప్రాక్టీస్కు దూరంగా ఉన్నాడని ఎక్స్ప్రెస్ స్పోర్ట్స్ తమ కథనంలో పేర్కొంది.వాషింగ్టన్కు చోటు?మరోవైపు ఈ మ్యాచ్లో ఇద్దరు స్పిన్నర్లతో భారత్ ఆడనున్నట్లు తెలుస్తోంది. తొలుత కుల్దీప్ యాదవ్కు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు ఇవ్వాలని టీమిండియా మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు కుల్దీప్ యాదవ్కు బదులుగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు చోటివ్వాలని గంభీర్ అండ్ కో యోచిస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. సోమవారం జరిగిన నెట్సెషన్లో ఈ తమిళనాడు ఆల్రౌండర్ తీవ్రంగా శ్రమించడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి. అయితే ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన భారత జట్టు సహాయక కోచ్ ర్యాన్ టెన్ డస్కటే మాత్రం ఈ విషయంపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అదేవిధంగా బుమ్రా అందుబాటుపై కూడా మ్యాచ్ రోజున నిర్ణయం తీసుకుంటామని డస్కటే వెల్లడించాడు. కాగా ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును ఇప్పటికే ప్రకటించింది.టీమిండియాతో రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్చదవండి: నా మనసంతా అక్కడే.. ఎక్కడున్నా పట్టేస్తారు: పెదవి విప్పిన కావ్యా మారన్ -
నా మనసులో ప్రత్యేక స్థానం.. : తొలిసారి స్పందించిన కావ్యా మారన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. విధ్వంసకర బ్యాటింగ్కు మారుపేరుగా మారి.. లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరు (287) సాధించిన జట్టుగా కొనసాగుతోంది. 2016లో టైటిల్ గెలిచిన సన్రైజర్స్.. గత రెండేళ్లుగా మరోసారి ఇలా పాతరోజులను గుర్తుచేస్తూ ఆరెంజ్ ఆర్మీని ఖుషీ చేస్తోంది. దేశీ స్టార్ అభిషేక్ శర్మతో పాటు ఆస్ట్రేలియా స్టార్లు ప్యాట్ కమిన్స్, ట్రవిస్ హెడ్, సౌతాఫ్రికా స్టార్ హెన్రిచ్ క్లాసెన్ రాకతో జట్టు బలపడింది.కమిన్స్ కెప్టెన్సీలో గతేడాది ఏకంగా ఫైనల్ చేరిన సన్రైజర్స్ ఈసారి మాత్రం కాస్త నిరాశపరిచింది. ఆరంభంలో వరుస ఓటములు చవిచూసినా ఆఖర్లో వరుసగా మ్యాచ్లు గెలవడం అభిమానులకు కాస్త ఊరట కలిగించే అంశం. ఇక సన్రైజర్స్ అనగానే ఆటగాళ్లతో పాటు ఆ జట్టు సహ యజమాని కావ్యా మారన్ (Kavya Maran) ఠక్కున గుర్తుకువస్తారు.సోషల్ మీడియా క్వీన్సన్ నెట్వర్క్ అధినేత కళానిధి మారన్ కుమార్తె అయిన కావ్యా.. సన్రైజర్స్ బాధ్యతలు చూసుకుంటున్నారు. మ్యాచ్ జరిగిన ప్రతిసారి.. ముఖ్యంగా హైదరాబాద్లోని ఉప్పల్ మైదానంలో సన్రైజర్స్ ఆడుతుందంటే అక్కడ కావ్యా తప్పనిసరిగా కనిపిస్తారు. మ్యాచ్ సాగుతున్న వేళ తన భావోద్వేగాలను ఏమాత్రం దాచుకోరు.ప్రతికూల ఫలితం వచ్చినప్పుడు చిన్నబుచ్చుకునే కావ్యా.. అనుకూల ఫలితం వచ్చినప్పుడు మాత్రం చిన్న పిల్లలా ఎగిరి గంతులు వేస్తారు. ఈ నేపథ్యంలో తొలిసారి మీడియా కంటికి చిక్కినప్పటి నుంచి ఇప్పటిదాకా సోషల్ మీడియాలో కావ్యా మారన్కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మరోవైపు.. ఆమెను ట్రోల్ చేస్తూ మీమ్స్ క్రియేట్ చేసే వాళ్లూ ఎక్కువే.నన్ను తప్పక క్యాప్చర్ చేస్తాడుఈ క్రమంలో సోషల్ మీడియాలో తన ఫొటోలు, తనపై వచ్చే మీమ్స్పై కావ్యా మారన్ తాజాగా స్పందించారు. ఇన్సైడ్స్పోర్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నిజంగానే అవి నా మనసు నుంచి వచ్చిన భావోద్వేగాలు. మ్యాచ్ ఎక్కడ జరిగినా అక్కడికి వెళ్లడం నా పనిలో భాగం. అయితే, ఆట పట్ల ఉన్న అభిమానం కూడా అందుకు మరో కారణం.హైదరాబాద్లో ఇంకా వేరేగా నేనేం చేయగలను. స్టేడియంలో కూర్చోవాల్సిందే కదా!.. అక్కడ మాత్రమే నేను కూర్చుకునేందుకు వీలుంటుంది. ఒకవేళ్ల అహ్మదాబాద్ లేదంటే.. చెన్నై వెళ్తే అక్కడా ఏదో చోట కూర్చోవాల్సిందే.నేను ఎక్కడున్నా సరే కెమెరామెన్ నన్ను తప్పక క్యాప్చర్ చేస్తాడు. కొన్నిసార్లు అవే మీమ్స్గా రూపాంతరం చెందుతాయి’’ అని కావ్యా మారన్ పేర్కొన్నారు.నా మనసంతా అదే..ఇక సన్రైజర్స్ హైదరాబాద్ జట్టంటే తనకు ఎంతో ఇష్టమన్న కావ్యా మారన్.. ‘‘ సన్రైజర్స్ ఆడుతుందంటే నా మనసంతా అక్కడే ఉంటుంది. సన్రైజర్స్కు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. దాని కోసం నా శాయశక్తులా కష్టపడి చేయగలిగిందంతా చేస్తాను.కాబట్టి సహజంగానే జట్టు విజయాలు, అపజయాలను మనసుకు తీసుకుంటాను. అందుకే గెలిచినప్పుడు ఎంతగా సంతోషిస్తానో.. ఓడినప్పుడు అంతే బాధపడతాను’’ అని చెప్పుకొచ్చారు.చదవండి: రితికా కంటే ముందు ఆమెతో ప్రేమలో రోహిత్?.. నన్గా మారిన నటి?! -
అమ్మ చేతిలో శ్రేయస్ అయ్యర్ క్లీన్ బౌల్డ్.. వీడియో వైరల్
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎంపిక కాకపోయిన సంగతి తెలిసిందే. దీంతో అయ్యర్ తనకు లభించిన ఈ ఖాళీ సమయాన్ని కుటుంబానికి కేటాయించాడు. ప్రస్తుతం ఇంట్లోనే ఉన్న శ్రేయస్ తన ఫ్యామిలీతో సరదగా గడుపుతున్నాడు. తాజాగా శ్రేయస్ అయ్యర్ తన ఇంట్లో తల్లితో కలిసి క్రికెట్ ఆడాడు. అయ్యర్ బ్యాటింగ్ చేయగా.. అతడి తల్లి బౌలింగ్ చేసింది. అయితే ఆమె విసిరిన ఓ బంతిని శ్రేయస్ కొట్టలేకపోయాడు. దీంతో ఆమె అయ్యర్ను క్లీన్ బౌల్డ్ చేసినట్లు సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ వీడియోను పంజాబ్ కింగ్స్ ఎక్స్లో షేర్ చేసింది.మా సర్పాంచ్ సాబ్ ఇప్పుడు మాత్రం బౌల్డ్ అయినా పట్టించుకోడని పంజాబ్ క్యాప్షన్గా జోడించింది. ప్రస్తుతం ఈ వీడియో సొషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఐపీఎల్-2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ను అయ్యర్ రన్నరప్గా నిలిచాడు.అద్బుతమైన ప్రదర్శనలతో ఫైనల్ చేరినప్పటికి.. తుది మెట్టుపై ఆర్సీబీ చేతిలో పంజాబ్ బోల్తా పడింది. ప్రస్తుతం క్రికెట్ దూరంగా ఉన్న అయ్యర్ వచ్చే నెలలో బంగ్లాదేశ్తో జరిగే వన్డే సిరీస్కు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశముంది.చదవండి: ఇంగ్లండ్కు టీమిండియా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలి.. లేదంటే కష్టమే: రవిశాస్త్రిOnly time SARPANCH won't mind getting bowled! 😂♥️ pic.twitter.com/jYUDd7DkD7— Punjab Kings (@PunjabKingsIPL) June 30, 2025 -
భారత్-బంగ్లాదేశ్ వైట్ బాల్ సిరీస్లపై నీలినీడలు?
ఈ ఏడాది ఆగస్టులో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన వైట్బాల్ సిరీస్లపై అనిశ్చితి నెలకొంది. తాజాగా ఈ సిరీస్లకు సంబంధించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చీఫ్ అమీనుల్ ఇస్లాం కీలక అప్డేట్ ఇచ్చారు. బంగ్లాదేశ్ పర్యటనకు భారత జట్టును పంపేందుకు బీసీసీఐ(BCCI) ఇంకా ప్రభుత్వ అనుమతి కోసం వేచిచూస్తుందని అమీనుల్ ఇస్లాం తెలిపాడు.వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టులో భారత జట్టు మూడు టీ20, మూడు వన్డేల సిరీస్ కోసం బంగ్లాలో పర్యాటించాల్సి ఉంది. ఆగస్టు 17 నుంచి టీమిండియా టూర్ ప్రారంభమవ్వాల్సి ఉంది. కానీ బంగ్లాదేశ్-భారత్ మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ సిరీస్లు జరగడం అసంభవం అన్పిస్తోంది.అయితే బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ మాత్రం ఈ సిరీస్లకు ఆతిథ్యమిచ్చేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఆగస్టులో వీలుకాకపోయినా, తర్వాతైనా భారత జట్టు తమ దేశానికి రావాలని అతడు ఆశిస్తున్నాడు. "ఈ పర్యటనకు సంబంధించి మేము బీసీసీఐతో నిరంతరం చర్చలు జరుపుతున్నాము. వారు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఆగస్టు లేదా సెప్టెంబర్లో సిరీస్లను నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాము. ఒకవేళ ఇప్పుడు వీలుకాకపోతే తర్వాతైనా భారత్కు ఆతిథ్యమిస్తామన్న నమ్మకం మాకు ఉంది. భారత్ ఇంకా అధికారికంగా టూర్ను వాయిదా వేయలేదు. భారత జట్టు బంగ్లా పర్యటన అనేది ప్రభుత్వం నుండి అనుమతి లభించడంపై ఆధారపడి ఉందని" బోర్డు మీటింగ్ అనంతరం మీడియా సమావేశంలో అమీనుల్ పేర్కొన్నారు. కాగా భారత జట్టు వచ్చే నెలలో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లకపోతే, బీసీబీ ఐపీఎల్-2026 వేచి ఉండాల్సిందే. ఎందుకంటే వచ్చే ఏడాది జనవరిలో జరిగే టీ20 ప్రపంచకప్ వరకు టీమిండియా షెడ్యూల్ ముందుగానే ఫిక్స్ అయింది. పొట్టి ప్రపంచకప్ తర్వాత ఐపీఎల్ జరగనుంది. కాబట్టి వచ్చే ఏడాది ఐపీఎల్ తర్వాతే భారత జట్టుకు కాస్త సమయం లభిస్తోంది. టీమిండియా చివరగా 2022లో మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు బంగ్లాలో పర్యటించింది.చదవండి: టీమిండియాతో రెండో టెస్టు.. ఇంగ్లండ్ మాస్టర్ ప్లాన్! అతడికి పిలుపు? -
ఇంగ్లండ్కు టీమిండియా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలి.. లేదంటే కష్టమే: రవిశాస్త్రి
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో రెండో టెస్టులో తలపడేందుకు భారత జట్టు సిద్దమైంది. హెడింగ్లీలో జరిగిన తొలి టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైన టీమిండియా ఎలాగైనా తిరిగి పుంజుకోవాలని పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్టు నాలుగు రోజుల పాటు ప్రాక్టీస్ సెషన్లో గిల్ సేన తీవ్రంగా శ్రమించింది.ఈ క్రమంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఎడ్జ్బాస్టన్లో జరిగే రెండో టెస్టులో ప్రత్యర్ధికి ధీటైన సమాధానిమివ్వాలని భారత జట్టును రవిశాస్త్రి కోరాడు."రెండో టెస్టులో ఎలాగైనా గెలిచి ఇంగ్లండ్కు టీమిండియా కౌంటర్ పంచ్ ఇవ్వాలి. ఇది భారత్కు చాలా ముఖ్యమైన విషయం. ఈ మ్యాచ్లో భారత్ గెలవకపోతే సిరీస్లో వెనకబడుతోంది. తొలి టెస్టులో ఎక్కువ భాగం ఆధిపత్యం చెలాయించినప్పటికి.. ఆఖరి రోజు ఆటలో నిరాశపరచడంతో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. చివరి రోజు ఆటలో భారీ టార్గెట్ చేధించి గెలిచినందుకు ఇంగ్లండ్కు కచ్చితంగా క్రెడిట్ దక్కాల్సిందే. కానీ ఇప్పుడు ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని తిరిగి పుంజుకోవాల్సిన అవసరముంది. ఎడ్జ్బాస్టన్ టెస్టులో జస్ప్రీత్ బుమ్రా ఆడుతాడో లేదో ఇంకా తెలియదు. కానీ అతడు ఆడాలనే నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్.. ఇందులో గెలిస్తే సిరీస్ సమమవుతోంది. కాబట్టి ఈ ఒక్క మ్యాచ్లో అతడిని ఆడించి మిగితా మ్యాచ్లకు విశ్రాంతి ఇస్తే సరిపోతుంది. ఇది ఐదు మ్యాచ్ల సిరీస్ కాబట్టి భారత్ తిరిగి కమ్బ్యాక్ ఇస్తుందని ఆశిస్తున్నా" అని ఐసీసీ రివ్యూలో శాస్త్రి పేర్కొన్నాడు.టీమిండియాతో రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్చదవండి: IND vs ENG: టీమిండియాకు హార్ట్ బ్రేక్.. ఒక్క వికెట్ తేడాతో ఓటమి -
టీమిండియాతో రెండో టెస్టు.. ఇంగ్లండ్ మాస్టర్ ప్లాన్! అతడికి పిలుపు?
ఇంగ్లండ్-భారత్ మధ్య రెండో టెస్టు ఎడ్జ్బాస్టన్ వేదికగా జూలై 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కు ముందు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ది టెలిగ్రాఫ్ రిపోర్ట్ ప్రకారం.. మాజీ ఆల్రౌండర్ మోయిన్ అలీ(Moeen Ali) కోచింగ్ కన్సల్టెంట్గా ఇంగ్లండ్ జట్టులో చేరాడు.హెడ్ కోచ్ బ్రాండెన్ మెకల్లమ్తో కలిసి మోయిన్ అలీ తన సేవలను అందించనున్నట్లు టెలిగ్రాఫ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ విల్ మాక్ఫెర్సన్ వెల్లడించారు. సోమవారం అలీ నేతృత్వంలోనే ఇంగ్లండ్ జట్టు ప్రాక్టీస్ చేసినట్లు ఆయన ఎక్స్లో రాసుకొచ్చారు. ఎడ్జ్బాస్టన్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశమున్నందన మోయిన్ను తమ కోచింగ్ సెటప్లోకి ఇంగ్లండ్ తీసుకున్నట్లు తెలుస్తోంది.ఆఫ్ స్పిన్నర్ అయిన అలీ.. తొలి టెస్టులో విఫలమైన యువ స్పిన్నర్ షోయబ్ బషీర్కు గైడ్ చేసే అవకాశముంది. అంతేకాకుండా రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ వంటి మిస్టరీ స్పిన్నర్లను ఎదుర్కొవడంలో ఇంగ్లండ్ బ్యాటర్లకు అలీ చిట్కాలు ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అదేవిధంగా ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆడనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెండో టెస్టులో ఆడడంపై ఇంకా సందిగ్థం కొనసాగుతోంది. మ్యాచ్కు ముందే అతని అందుబాటుపై నిర్ణయం ఉంటుందని భారత అసిస్టెంట్ కోచ్ టెన్ డస్కటే చెప్పుకొచ్చాడు.ఒకవేళ బుమ్రాకు విశ్రాంతి ఇస్తే ఆకాష్ దీప్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు రెండో టెస్టు కోసం ఇంగ్లండ్ తమ ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించింది. స్పీడ్ స్టార్ జోఫ్రా అర్చర్కు తుది జట్టులో చోటు దక్కలేదు. మూడో టెస్టు నుంచి అతడు అవకాశముంది.టీమిండియాతో రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్చదవండి: బుమ్రాపై నిర్ణయం అప్పుడే.. మా దృష్టింతా దానిపైనే: టీమిండియా కోచ్ -
జింబాబ్వేతో తొలి టెస్టు.. విజయం దిశగా సౌతాఫ్రికా
బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా విజయం దాదాపు ఖాయమైనట్లే. మ్యాచ్ మూడో రోజు సోమవారం దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్లో 82.5 ఓవర్లలో 369 పరుగులకు ఆలౌటైంది. వియాన్ ముల్డర్ (206 బంతుల్లో 147; 17 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీతో చెలరేగగా... కెప్టెన్ కేశవ్ మహరాజ్ (70 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ సాధించాడు.మసకద్జాకు 4 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్లో 167 పరుగుల ఆధిక్యం సాధించిన దక్షిణాఫ్రికా మొత్తం కలిపి జింబాబ్వే ముందు 537 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. దీనిని ఛేదించే క్రమంలో ఆట ముగిసే సమయానికి జింబాబ్వే ఒక వికెట్ కోల్పోయి 32 పరుగులు చేసింది. ఆ జట్టు మిగిలిన రెండు రోజుల్లో మరో 505 పరుగులు చేయాల్సి ఉంది. టెస్టు క్రికెట్లో గతంలో ఏ జట్టుకూ సాధ్యం కాని ఈ లక్ష్యాన్ని జింబాబ్వే అందుకోవడం అసాధ్యమే!చదవండి: IND vs ENG: టీమిండియాకు హార్ట్ బ్రేక్.. ఒక్క వికెట్ తేడాతో ఓటమి -
IND Vs ENG: టీమిండియాకు హార్ట్ బ్రేక్.. ఒక్క వికెట్ తేడాతో ఓటమి
నార్తాంప్టన్ వేదికగా సోమవారం ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరిగిన రెండో యూత్ వన్డేలో ఒక్క వికెట్ తేడాతో భారత్ అండర్-19 జట్టు ఓటమి పాలైంది. దీంతో ఐదు వన్డేల సిరీస్ 1-1 సమమైంది. భారత్ నిర్ధేశించిన 291 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ 49.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి చేధించింది.లక్ష్య చేధనలో ఇంగ్లండ్ యువ జట్టు టాప్ ఆర్డర్ బ్యాటర్లు తడబడ్డారు. దీంతో ఓ దశలో టీమిండియా సునాయసంగా గెలుస్తుందని అంతా భావించారు. కానీ ఇంగ్లీష్ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ థామస్ రెవ్ అద్భుతమైన సెంచరీతో భారత్ నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడతున్నప్పటికి రెవ్ మాత్రం విరోచిత పోరాటం చేశాడు. 83 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్స్లతో 131 పరుగులు చేశాడు. అతడితో పాటు సెబాస్టియన్ మోర్గాన్నాట్(20), అలెక్స్ గ్రీన్(12) ఆఖరిలో కీలక ఇన్నింగ్స్లు ఆడారు. భారత బౌలర్లలో ఆర్ఎస్ అంబరీష్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. యుధాజిత్ గుహ, హెనిల్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు.వైభవ్ మెరుపులు..అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 49 ఓవర్లలో 290 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి మెరుపులు మెరిపించాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేసి ఔటయ్యాడు.అతడితో పాటు విహాన్ మల్హోత్రా(49), రాహుల్ కుమార్(47), కన్షిక్ చౌహన్(45) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రెంచ్ నాలుగు.. హోమ్, గ్రీన్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య మూడో వన్డే ఇదే వేదికలో జరగనుంది.చదవండి: బుమ్రాపై నిర్ణయం అప్పుడే.. మా దృష్టింతా దానిపైనే: టీమిండియా కోచ్ -
అమ్మాయిల జోరు కొనసాగేనా!
బ్రిస్టల్: ఇంగ్లండ్ పర్యటనలో శుభారంభం చేసిన భారత మహిళల జట్టు ఇదే జోరు కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. మంగళవారం జరిగే రెండో టి20లోనూ గెలిచి ఆధిక్యాన్ని రెట్టింపు చేసుకోవాలని భావిస్తోంది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో వరుస విజయాలతో పట్టుబిగించాలని ఆశిస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్లో ఎదురైన ఘోరపరాజయం నుంచి తేరుకొని తదుపరి మ్యాచ్లపై దృష్టి పెట్టాలని ఆతిథ్య ఇంగ్లండ్ యోచిస్తోంది మళ్లీ ఓడితే తీవ్రమైన ఒత్తిడిలోకి కూరుకుపోయే ప్రమాదం తప్పదని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య హోరాహోరీగా మ్యాచ్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. స్మృతి తెచ్చిన ఆత్మవిశ్వాసంతో రెగ్యులర్ కెపె్టన్ హర్మన్ప్రీత్ కౌర్ ఫిట్నెస్ సమస్యలతో అందుబాటులో లేకపోవడంతో జట్టును నడిపించిన స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన సెంచరీతో చెలరేగింది. అంతర్జాతీయ టి20లో తొలి శతకాన్ని బాదిన ఆమె అదే ఫామ్ను కొనసాగించాలనుకుంటోంది. షఫాలీ వర్మ తక్కువ స్కోరుకే వెనుదిరిగినా... హర్లీన్ డియోల్ మెరుపులు భారత స్కోరును 200 పైచిలుకు దాటించాయి. మొత్తానికి టాపార్డర్ బ్యాటర్లు మరోమారు బ్యాట్ ఝుళిపిస్తే భారీస్కోరు సాధ్యమవుతుంది. తొలి మ్యాచ్లో విఫలమైన రిచా ఘోష్, జెమీమాలు కూడా జతకలిస్తే స్కోరు వేగానికి అడ్డుఅదుపూ ఉండదు. కెపె్టన్ హర్మన్ తుదిజట్టుకు ఆడితే స్పిన్నర్ రాధా యాదవ్ బెంచ్కు పరిమితం అవుతుంది. స్పీడ్స్టర్ రేణుక లేకపోయినా... అమన్జోత్, దీప్తి శర్మ, శ్రీచరణి, స్నేహ్ రాణాలతో కూడిన బౌలింగ్ దళం గత మ్యాచ్లో సమష్టిగా ప్రభావం చూపించింది. వీళ్ల ప్రదర్శన కొనసాగితే భారత ఆల్రౌండ్ జోరుకు ఎదురుండకపోవచ్చు. బ్యాటింగ్పై దృష్టి ఆతిథ్య జట్టు బ్యాటర్లు గత మ్యాచ్లో ఘోరంగా విఫలమయ్యారు. మొత్తం 11 మంది బ్యాటింగ్కు దిగితే వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ సీవర్ బ్రంట్ మాత్రమే అర్ధసెంచరీతో అదరగొట్టింది. మిగతా బ్యాటర్లంతా మూకుమ్మడిగా చేతులెత్తేశారు. మొదట బౌలర్లు, లక్ష్యఛేదనలో బ్యాటర్లు కలిసికట్టుగా విఫలమవడం జట్టుకు ప్రతికూలంగా మారింది. ఈ నేపథ్యంలో జట్టు మేనేజ్మెంట్ ప్రధానంగా బ్యాటింగ్ విభాగంపై దృష్టిసారించింది. ఎందుకంటే కెపె్టన్ బ్రంట్ మినహా ఇక ఏ ఒక్కరు కూడా కనీసం 15 పరుగులైనా చేయలేకపోవడం జట్టును మరింత ఆందోళన పరిచింది. బ్యాటర్లు బాధ్యతగా కనబరిస్తేనే జట్టు గాడినపడుతుందని మేనేజ్మెంట్ ఆశిస్తుంది. లేదంటే సొంతగడ్డపై మరో భంగపాటు ఖాయమవుతుంది. ఇదేజరిగితే సిరీస్లో ఇంగ్లండ్ 0–2తో వెనుకబడిపోతుంది. -
బుమ్రాపై నిర్ణయం అప్పుడే.. మా దృష్టింతా దానిపైనే: టీమిండియా కోచ్
ఇంగ్లండ్ పర్యటనలో మొదటి నుంచి భారత స్టార్ పేసర్ బుమ్రా ఆడే మూడు టెస్టుల గురించే చర్చ జరుగుతూ వచ్చింది. ఇప్పుడూ అదే కొనసాగుతోంది. ఇప్పటికే బుమ్రా తొలి టెస్టు ఆడాడు. జట్టు ఇంకా ఆడాల్సిన నాలుగు టెస్టుల్లో బుమ్రా ఆడేవి రెండే మ్యాచ్లు. ఆ రెండు ఏవనే దానిపై చర్చంతా సాగుతోంది. తాజాగా దీనిపై భారత అసిస్టెంట్ కోచ్ టెన్ డస్కటే స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు.కానీ మ్యాచ్కు ముందే అతని అందుబాటుపై నిర్ణయం ఉంటుందని చెప్పాడు. ఎప్పటిలాగే అతను ట్రెయినింగ్ సెషన్లో పాల్గొంటున్నాడని, విశ్రాంతి తీసుకోవడం లేదన్నాడు. సోమవారం కూడా సహచరులతో కలిసి ప్రాక్టీస్లో చెమటోడ్చినట్లు చెప్పాడు. "తదుపరి మ్యాచ్కూ బుమ్రా అందుబాటులో ఉండే అవకాశముంది.అతను ఆడేది మూడు టెస్టులే అయినప్పటికీ గడిచిన తొలి టెస్టుకు, జరగబోయే రెండో టెస్టుకు మధ్య 8 రోజుల విశ్రాంతి లభించింది. అయితే సుదీర్ఘ ఫార్మాట్లో పనిభారాన్ని పరిశీలించాకే అతనిపై నిర్ణయం తీసుకుంటాం" అని అసిస్టెంట్ కోచ్ అన్నాడు. తొలి టెస్టులో ఆతిథ్య జట్టుకు దీటుగానే బదులిచ్చామని, రెండో ఇన్నింగ్స్లో బుమ్రా వికెట్లు తీయడంలో వెనుకబడినప్పటికీ గెలిచేదశలో కనిపించామని చెప్పాడు.ఇద్దరు స్పిన్నర్ల కూర్పుపై కూడా జట్టు మేనేజ్మెంట్ విశ్లేస్తోంది. బ్యాటింగ్ను బలోపేతం చేయాలనుకుంటే సీనియర్ స్పిన్నర్ జడేజాకు జతగా వాషింగ్టన్ సుందర్ను బరిలోకి దించే అంశాన్ని గట్టిగానే పరిశీలిస్తోంది. అయితే పిచ్ పరిస్థితులని బట్టే తుది నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నట్లు డస్కటే చెప్పాడు.తొలి మ్యాచ్లో బౌలింగ్ ఆల్రౌండర్ అయిన శార్దుల్ పెద్దగా రాణించలేకపోయాడు. అయితే ఒకే టెస్టుతో అతని సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయబోమని, అయితే బ్యాటింగ్ ఆల్రౌండర్ అవసరమనుకుంటేనే అతన్ని మార్చే అంశాల్ని పరిశీలిస్తామన్నాడు. ఇదే జరిగితే నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టుకు ఖాయమవుతాడు.లీడ్స్లో సులువైన క్యాచ్ల్ని నేలపాలు చేయడంతో ఫీల్డింగ్పై ప్రధానంగా దృష్టిసారించిన జట్టు స్లిప్స్, గల్లీ వద్ద కట్టుదిట్టం చేయనుంది. జైస్వాల్ను గల్లీ నుంచి తప్పించడం ఖాయమైంది. నాలుగో స్లిప్, గల్లీ ప్లేస్మెంట్లను కరుణ్ నాయర్, రాహుల్, కెప్టెన్ శుబ్మన్ గిల్లతో భర్తీ చేయనున్నట్లు డస్కటే తెలిపాడు. ఈ మేరకు ఆ ముగ్గురితో పాటు సాయి సుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డిలతో ఫీల్డింగ్ ప్రాక్టీస్ను ముమ్మరం చేశారు.చదవండి: నిరాశపరిచిన ఆయుశ్ మాత్రే.. మరోసారి విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ -
‘కెప్టెన్ కూల్’ ట్రేడ్ మార్క్ కోరుతూ... ఎమ్మెస్ ధోని దరఖాస్తు
న్యూఢిల్లీ: మైదానంలో నాయకుడిగా మహేంద్ర సింగ్ ధోని సాధించిన ఘనతల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతని సారథ్య శైలి, కీలక సమయాల్లోనూ ఒత్తిడిని అధిగమించి ప్రశాంతంగా ఉంటూ విజయాలు అందించిన తీరు ధోనికి ‘కెప్టెన్ కూల్’గా గుర్తింపు తెచ్చాయి. జనంలో బాగా ప్రాచుర్యంలోకి వచి్చన ఈ ‘కెప్టెన్ కూల్’ పదం తనకు మాత్రమే సొంతమని, ఇతరులు ఎవరూ వ్యాపార ప్రయోజనాల కోసం వాడరాదని ధోని చెబుతున్నాడు. అందుకే దీనికి సంబంధించి ట్రేడ్ మార్క్ హక్కులను కోరుతూ అతను దరఖాస్తు చేశాడు. ధోని అప్లికేషన్ను ‘ట్రేడ్మార్క్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా’ స్వీకరించింది. ‘క్రీడా శిక్షణ, క్రీడలకు సంబంధించిన సౌకర్యాలు’ అనే కేటగిరీ కింద ఈ దరఖాస్తు దాఖలైంది. నిజానికి 2023 జూన్లోనే ధోని ‘కెప్టెన్ కూల్’ ట్రేడ్మార్క్ కోసం దరఖాస్తు చేశాడు. అయితే అప్పటికే ప్రభ స్కిల్ స్పోర్ట్స్ అనే కంపెనీ దీని కోసం దరఖాస్తు చేసినట్లు తేలింది. దీనిపై ధోని అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఒక గుర్తింపు పొందిన వ్యక్తి పేరును దురుపయోగం చేసే ప్రయత్నం ఇది అంటూ ‘రెక్టిఫికేషన్ పిటిషన్’ దాఖలు చేశాడు. దీనిపై నాలుగు సార్లు వాదనలు జరిగిన తర్వాత ఇప్పుడు రెండేళ్లకు అతని దరఖాస్తు ఆమోదం పొందింది. -
ఇంగ్లండ్ గడ్డపై సెంచరీ చేసిన మరో టీమిండియా యువ సంచలనం
ప్రస్తుతం భారత క్రికెట్ మొత్తం ఇంగ్లండ్ చుట్టూ తిరుగుతుంది. పురుషులు, మహిళలు, దివ్యాంగులు.. ఇలా విభాగంతో సంబంధం లేకుండా భారత క్రికెటర్లంతా ఇంగ్లండ్లో పర్యటిస్తున్నారు. భారత పురుషుల సీనియర్ జట్టు ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుండగా.. భారత పురుషుల అండర్-19 జట్టు ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో ఐదు మ్యాచ్ల యూత్ వన్డే సిరీస్ ఆడుతుంది. భారత సీనియర్ మహిళల జట్టు కూడా ఇంగ్లండ్లోనే ఉంది. ఈ పర్యటనలో భారత జట్టు ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. పురుషులు, మహిళల జట్లే కాక, భారత పురుషుల దివ్యాంగ జట్టు కూడా ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ జట్టు ఇంగ్లండ్ దివ్యాంగ టీమ్తో ఏడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతుంది. ఇదే కాక చాలామంది భారత పురుష క్రికెటర్లు ఇంగ్లండ్లో కౌంటీ క్రికెట్ ఆడుతున్నారు. టీమిండియా యువ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, ఖలీల్ అహ్మద్ వేర్వేరు జట్ల తరఫున కౌంటీ ఛాంపియన్షిప్ ఆడుతున్నారు. వీరిలో తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ తమ కౌంటీ అరంగేట్రంలోనే సెంచరీలు చేసి అదరగొట్టగా.. మిగతా ఇద్దరు తమ తొలి మ్యాచ్లు ఆడాల్సి ఉంది.పైన పేర్కొన్న జట్లు, ఆటగాళ్లే కాక ప్రస్తుతం మరో భారత స్థానిక జట్టు కూడా ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ముంబై క్రికెట్ అసోసియేషన్ తమ ఎమర్జింగ్ జట్టును ఇంగ్లండ్కు పంపింది. ఈ జట్టు ప్రస్తుతం నాట్స్ సెకెండ్ 11తో మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్లో టీమిండియా యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ సెంచరీతో అదరగొట్టాడు. ముషీర్ 127 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. ముషీర్ సెంచరీ చేసిన విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్కు చెందిన ఓ అధికారి సోషల్మీడియాలో పోస్ట్ చేశాడు.HUNDRED FOR MUSHEER KHAN 🇮🇳- Mumbai Cricket Association has sent the Emerging players to UK and they are currently playing against Notts 2nd 11, A great work by MCA for Developing the young stars. pic.twitter.com/lFkqecQ37n— Johns. (@CricCrazyJohns) June 30, 2025ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న అన్ని భారత క్రికెట్ జట్లలో ఒక్క భారత సీనియర్ పురుషుల జట్టు మినహా అన్ని జట్లు సక్సెస్ చూశాయి. భారత సీనియర్ పురుషుల జట్టు ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్ట్లో ఓటమిపాలు కాగా.. అండర్-19 జట్టు తొలి వన్డేలో ఇంగ్లండ్ను మట్టికరిపించింది. మరోవైపు భారత సీనియర్ మహిళల జట్టు తొలి టీ20లో ఇంగ్లండ్ను చిత్తు చేయగా.. భారత పురుషుల దివ్యాంగుల జట్టు ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ను ఓడించింది.ప్రస్తుతం ఇంగ్లండ్లో పర్యటిస్తున్న భారత ఆటగాళ్లలో చాలామంది శతకాలు చేశారు. సీనియర్ పురుషుల జట్టులో జైస్వాల్, గిల్, రాహుల్, పంత్ (2).. సీనియర్ మహిళల జట్టులో స్మృతి మంధన.. కౌంటీల్లో తిలక్ వర్మ, ఇషాన్ కిషన్.. తాజాగా ముషీర్ ఖాన్ శతకాలతో హోరెత్తించారు. ముషీర్ ఖాన్ ఇటీవల ముగిసిన ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఈ సీజన్లో అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. ముషీర్ దేశవాలీ సీజన్లో అన్న సర్ఫరాజ్ ఖాన్తో పోటీపడి పరుగులు సాధిస్తున్నాడు. అన్నదమ్ములిద్దరూ ముంబై జట్టుకే ఆడతారు. సర్ఫరాజ్ ఇటీవల ఇంగ్లండ్ లయన్స్పై తృటిలో సెంచరీ చేజార్చుకుప్పటికీ.. టీమిండియా ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో మెరుపు సెంచరీ చేశాడు. అయినా అతనికి భారత జట్టు నుంచి పిలుపు రాలేదు. -
టీమిండియాతో రెండో టెస్ట్.. తుది జట్టును ప్రకటించిన ఇంగ్లండ్.. స్టార్ ఆటగాడికి నో ఛాన్స్
జులై 2వ తేదీ నుంచి బర్మింగ్హమ్ వేదికగా టీమిండియాతో జరుగబోయే రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ఇవాళ (జూన్ 30) ప్రకటించారు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ తొలి టెస్ట్లో ఆడిన జట్టునే యథాతథంగా కొనసాగించింది. రెండో టెస్ట్ కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్కు తుది జట్టులో చోటు దక్కలేదు. తొలి టెస్ట్లో రాణించిక పోయినా ఇంగ్లండ్ మేనేజ్మెంట్ క్రిస్ వోక్స్పై నమ్మకం ఉంచింది. అతనితో పాటు జోష్ టంగ్, బ్రైడన్ కార్స్ను కొనసాగించింది. నాలుగో పేసర్గా కెప్టెన్ బెన్ స్టోక్స్ వ్యవహరించనున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా షోయబ్ బషీర్ కొనసాగనున్నాడు. బ్యాటింగ్ విభాగంలో జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్,జో రూట్, హ్యారీ బ్రూక్ తమ యధా స్థానాల్లో బరిలోకి దిగనున్నారు. వికెట్కీపర్గా జేమీ స్మిత్ వ్యవహరించనున్నాడు.రెండో టెస్ట్ జులై 2న భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేక పరాజయంపాలైంది.ఛేదనలో బెన్ డకెట్ (149) సూపర్ సెంచరీ చేసి ఇంగ్లండ్ను గెలిపించాడు. జాక్ క్రాలే (65), జో రూట్ (53 నాటౌట్), బెన్ స్టోక్స్ (33), జేమీ స్మిత్ (44 నాటౌట్) తలో చేయి వేశారు. భారత బౌలర్లు సెకెండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ బ్యాటర్లను ఏమాత్రం కట్టడి చేయలేకపోయారు. ఇంగ్లండ్ బ్యాటర్లు భారత బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొని పరుగులు చేశారు. ప్రసిద్ద్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ తలో 2 వికెట్లు తీసినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అనుభవజ్ఞుడైన స్పిన్నర్ రవీంద్ర జడేజాది కూడా అదే పరిస్థితి.ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు రెండు ఇన్నింగ్స్ల్లో అద్బుతంగా ఆడారు. అయినా సెకెండ్ ఇన్నింగ్స్లో బౌలర్లు ప్రభావం చూపలేకపోవడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్లో భారత్ తరఫున ఐదు శతకాలు నమోదైన ప్రయోజనం లేకుండా పోయింది. తొలి ఇన్నింగ్స్లో జైస్వాల్ (101), గిల్ (147), పంత్ (134) సెంచరీలు చేశారు. రెండో ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ (137), పంత్ (118) శతకాలు చేశారు. ఇంగ్లండ్ తరఫున తొలి ఇన్నింగ్స్లో ఓలీ పోప్ (106) సెంచరీ చేయగా.. హ్యారీ బ్రూక్ (99) తృటిలో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో బుమ్రా 5 వికెట్ల ప్రదర్శన చేసినప్పటికీ ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది.టీమిండియాతో రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్ -
నిరాశపరిచిన ఆయుశ్ మాత్రే.. మరోసారి విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
14 ఏళ్ల భారత యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్ గడ్డపై మరోసారి రెచ్చిపోయాడు. ఇంగ్లండ్ అండర్ 19 జట్టుతో ఇవాళ (జూన్ 30) జరుగుతున్న మ్యాచ్లో మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తొలి వన్డేలో 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసిస వైభవ్.. రెండో వన్డేలో 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేసి ఔటయ్యాడు. వైభవ్ వరుసగా రెండు మ్యాచ్ల్లో అర్హమైన హాఫ్ సెంచరీలను మిస్ చేసుకున్నాడు. మరోవైపు వైభవ్తో పాటు ఇన్నింగ్స్ను ప్రారంభించిన మరో ఐపీఎల్ సంచలన ఆయుశ్ మాత్రే ఈ మ్యాచ్లో నిరాశపరిచాడు. మాత్రే తానెదుర్కొన్న తొలి బంతికే డకౌటయ్యాడు (గోల్డెన్ డక్). మాత్రే వైభవ్ తరహాలో కాకపోయినా తొలి వన్డేలో పర్వాలేదనిపించాడు. ఆ మ్యాచ్లో అతను 30 బంతులు ఎదుర్కొని 4 ఫోర్ల సాయంతో 21 పరుగులు చేశాడు.రెండో వన్డే విషయానికొస్తే.. ఇంగ్లండ్ టాస్ గెలిచి భారత్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. అధికారికంగా తొలి బంతికే ఆయుశ్ మాత్రే (0) వికెట్ కోల్పోయిన భారత్.. ఆతర్వాత కుదురుకుంది. వైభవ్ సూర్యవంశీ (45), విహాన్ మల్హోత్రా (49), చవ్డా (22), అభిగ్యాన్ కుందు (32), రాహుల్ కుమార్ (47), కనిష్క్ చౌహాన్ (45) రాణించడంతో ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ చేసింది. అయితే చివరి వరుస ఆటగాళ్లు వెంటవెంటనే ఔట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ 49 ఓవర్లలో 290 పరుగుల వద్ద ముగిసింది (ఆలౌట్). ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రెంచ్ 4 వికెట్లు పడగొట్టగా.. జాక్ హోమ్, అలెక్స్ గ్రీన్ తలో 3 వికెట్లు తీశారు. కాగా, భారత అండర్-19 జట్టు 5 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్ల కోసం ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. నాటింగ్హమ్ వేదికగా ప్రస్తుతం రెండో వన్డే జరుగుతుండగా.. హోవ్లో జరిగిన తొలి వన్డేలో భారత్ ఇంగ్లండ్పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 42.2 ఓవర్లలో 174 పరుగులకే కుప్పకూలగా.. భారత్ కేవలం 24 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ పర్యటనలో భారత జట్టుకు ఆయుశ్ మాత్రే సారథ్యం వహిస్తున్నాడు. -
మరో ఫ్రాంచైజీతో ఒప్పందం చేసుకున్న ఆర్సీబీ హెడ్ కోచ్
మహిళల ఆర్సీబీ హెడ్ కోచ్ లూక్ విలియమ్స్ మహిళల హండ్రెడ్ లీగ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2025 సీజన్ కోసం సథరన్ బ్రేవ్ హెడ్ కోచ్గా ఎంపికయ్యాడు. ప్రస్తుత కోచ్ చార్లోట్ ఎడ్వర్డ్స్ ఇంగ్లండ్ మహిళల జట్టుకు హెడ్ కోచ్గా వెళ్లడంతో లూక్ నియామకం జరిగింది.లూక్ హండ్రెడ్ లీగ్ ప్రారంభ ఎడిషన్ నుంచి చార్లోట్ ఎడ్వర్డ్స్కు డిప్యూటీగా వ్యవహరించాడు. వీరి ఆధ్వర్యంలో బ్రేవ్ 2021, 2022 ఎడిషన్లలో రన్నరప్గా.. 2023 ఎడిషన్లో విజేతగా నిలిచింది.లూక్ మహిళల ఐపీఎల్లో స్మృతి మంధన నేతృత్వంలోని ఆర్సీబీకి తొలి టైటిల్ను అందించాడు. 2024 ఎడిషన్లో లూక్ ఆధ్వర్యంలో ఆర్సీబీ టైటిల్ ఎగరేసుకుపోయింది. లూక్కు మహిళల బిగ్బాష్ లీగ్లోనూ ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. అతని ఆథ్వర్యంలో అడిలైడ్ స్ట్రయికర్స్ వరుసగా 2022, 2023 ఎడిషన్లలో విజేతగా నిలిచింది.బ్రేవ్ ఫ్రాంచైజీ రానున్న సీజన్ కోసం లూక్తో పాటు మరో కీలక నియామకం చేపట్టింది. ఆ ఫ్రాంచైజీ తమ బ్యాటింగ్ కోచ్గా ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ మార్కస్ ట్రెస్కోధిక్కు నియమించుకుంది. జిమ్మీ కానర్స్ స్థానంలో ట్రెస్కోధిక నియామకం జరిగింది.సథరన్ బ్రేవ్ గత సీజన్లో ఘోర ప్రదర్శన చేసింది. 8 మ్యాచ్ల్లో ఒకే ఒక విజయం సాధించి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచింది.2025 మహిళల హండ్రెడ్ లీగ్ కోసం సథరన్ బ్రేవ్ జట్టు.. లారా వోల్వార్డ్, డాని వ్యాట్-హాడ్జ్, మైయా బౌచియర్, లారెన్ బెల్, ఫ్రెయా కెంప్, జార్జియా ఆడమ్స్, టిల్లీ కోర్టీన్-కోల్మన్, రియానా సౌత్బై, సోఫీ డెవిన్, క్లోయ్ ట్రయాన్, మాడీ విలియర్స్, జోసీ గ్రోవ్స్, ఫోబ్ గ్రాహం -
సెంచరీతో కదంతొక్కిన సన్రైజర్స్ ఆల్రౌండర్
ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఆడే సౌతాఫ్రికా ఆల్రౌండర్ వియాన్ ముల్దర్.. జింబాబ్వేతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో సెంచరీతో కదంతొక్కాడు. మ్యాచ్ మూడో రోజు లంచ్ విరామానికి ముందు ముల్దర్ 149 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ముల్దర్కు టెస్ట్ల్లో ఇది రెండో సెంచరీ. గతేడాది అక్టోబర్లో ముల్దర్ బంగ్లాదేశ్పై అజేయ శతకం బాదాడు.ముల్దర్ ఇటీవలే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలిచిన సౌతాఫ్రికా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ముల్దర్ తాజా ఐపీఎల్ సీజన్లో ఇంగ్లండ్ ఆటగాడు బ్రైడన్ కార్స్కు రీప్లేస్మెంట్గా ఎస్ఆర్హెచ్లో చేరాడు. ఎస్ఆర్హెచ్ ముల్దర్ను 75 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. ముల్దర్ ఐపీఎల్ 2025లో 2 మ్యాచ్లు ఆడి కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్లో ఓ ఓవర్ మాత్రమే వేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్లో సౌతాఫ్రికా పటిష్ట స్థితిలో ఉంది. మూడో రోజు రెండో సెషన్ సమయానికి రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 415 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. వియాన్ ముల్దర్ 142, కైల్ వెర్రిన్ 30 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.అంతకుముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో 251 పరుగులకు ఆలౌటై ఫాలో ఆన్ తప్పించుకుంది. జింబాబ్వేను సీన్ విలియమ్స్ (137) అద్బుత సెంచరీతో గట్టెక్కించాడు. రెండో ఇన్నింగ్స్లో సెంచరీతో కదంతొక్కిన ముల్దర్ బంతితో కూడా రాణించాడు. 16 ఓవర్లు వేసి 4 వికెట్లు తీశాడు. కేశవ్ మహారాజ్, కోడి యూసఫ్ తలో 3 వికెట్లు పడగొట్టారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. లుహాన్ డ్రి ప్రిటోరియస్ (153), కార్బిన్ బాష్ (100 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కారు. డెవాల్డ్ బ్రెవిస్ (51) మెరుపు అర్ద సెంచరీతో రాణించారు.మిగతా ఆటగాళ్లలో టోని డి జోర్జి 0, బ్రీట్జ్కీ 13, ముల్దర్ 17, బెడింగ్హమ్ 0, వెర్రిన్ 10, కెప్టెన్ కేశవ్ మహారాజ్ 21, కోడి యూసఫ్ 27, మఫాకా 9 (నాటౌట్) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ 4, ముజరబానీ 2, మసరద్జ, మసెకెస తలో వికెట్ తీశారు. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం సౌతాఫ్రికా జింబాబ్వేలో పర్యటిస్తుంది. -
సెహ్వాగ్ ఇద్దరు కొడుకులు.. కోహ్లి కుటుంబం నుంచి ఒకరు..
దేశవ్యాప్తంగా టీ20 లీగ్లకు క్రమక్రమంగా ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) కూడా తెరమీదకు వచ్చింది. గతేడాది ఆరంభమైన ఈ లీగ్ ద్వారా.. ఐపీఎల్-2025 నయా సంచలనాలు ప్రియాన్ష్ ఆర్య (Priyansh Arya), దిగ్వేశ్ సింగ్ రాఠి (Digvesh Singh Rathee) వెలుగులోకి వచ్చారు.డీపీఎల్ ప్రస్తుతం రెండో సీజన్కు సిద్ధమైంది. ఈసారి అవుటర్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ పేరిట రెండు కొత్త జట్లు కూడా లీగ్లో ప్రవేశించాయి. ఈసారి మరో అదనపు ఆకర్షణ కూడా ఉంది. టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లి కుటుంబం నుంచి ఓ స్పిన్ బౌలర్ డీపీఎల్ వేలంలో తన పేరును నమోదు చేసుకున్నాడు.ఆర్యవీర్ కోహ్లి ఎంట్రీ?కోహ్లికి కొడుకు వరసయ్యే ఆర్యవీర్ కోహ్లి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ దగ్గర అతడు మెళకువలు నేర్చుకుంటున్నాడు అంతేకాదు.. భారత విధ్వంసకర ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ఇద్దరు కుమారులు ఆర్యవీర్ సెహ్వాగ్, వేదాంత్ సెహ్వాగ్ కూడా డీపీఎల్ వేలంలోకి రానున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరి పేర్లు షార్ట్లిస్ట్ అయినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ ఇప్పటికే ఢిల్లీ అండర్ 19 జట్టుకు ఆడుతుండగా.. 15 ఏళ్ల వేదాంత్ ఆఫ్ స్పిన్నర్. ఇతడు అండర్-16 జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ ఇద్దరూ డీపీఎల్ వేలంలో ‘బి’ కేటగిరిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే దిగ్గజాల వారసుల ఆట చూసేందుకు అభిమానులు డీపీఎల్పై ఓ లుక్కేయడం ఖాయం.సత్తా చాటిన ప్రియాన్ష్, దిగ్వేశ్కాగా జూలై 5న ఢిల్లీ ప్రీమియర్ లీగ్ వేలం జరుగనుంది. ఇక గతేడాది సౌత్ ఢిల్లీ సూపర్స్టార్స్కు ఆడిన ప్రియాన్ష్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతేకాదు.. పది మ్యాచ్లలో కలిపి 608 పరుగులు చేసి లీగ్ టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.ఈ క్రమంలో రూ. 3.80 కోట్ల ధరతో ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్లో చేరిన ప్రియాన్ష్ చెన్నై సూపర్ కింగ్స్ మీద 42 బంతుల్లో 103 పరుగులతో చెలరేగి చరిత్ర సృష్టించాడు. మరోవైపు.. సౌత్ ఢిల్లీకే ఆడిన దిగ్వేశ్ సింగ్ రాఠీ సైతం డీపీఎల్లో సత్తాచాటి ఐపీఎల్లో ప్రవేశించాడు. లక్నో సూపర్ జెయింట్స్ అతడిని రూ. 30 లక్షలకు కొనుగోలు చేయగా.. ఈ ఏడాది జట్టు తరఫున టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. 13 ఇన్నింగ్స్లో కలిపి పద్నాలుగు వికెట్లు పడగొట్టాడు.ఇక డీపీఎల్లో ఈసారి అవుటర్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ పేరిట రెండు కొత్త జట్లు కూడా లీగ్లో ప్రవేశించాయి. గతేడాది సౌత్ ఢిల్లీ సూపర్స్టార్స్, ఈస్ట్ ఢిల్లీ రైడర్స్, సెంట్రల్ ఢిల్లీ కింగ్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్, పురాణీ ఢిల్లీ 6 పేరిట ఆరుజట్లు తలపడ్డాయి. ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ టైటిల్ గెలవగా.. సౌత్ ఢిల్లీ సూపర్స్టార్స్ రన్నరప్గా నిలిచింది. ఇక తొలి సీజన్కు వీరేందర్ సెహ్వాగ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న విషయం తెలిసిందే.చదవండి: ‘షర్మిలా ఠాగూర్, సైఫ్ అలీ ఖాన్ను పిలవండి.. ఎవరూ వేలెత్తి చూపరు’ -
టెస్టుల్లో అత్యధిక LBW వికెట్లు తీసింది ఎవరంటే..?
క్రికెట్లో పొట్టి ఫార్మాట్ అభిమానులను ఊర్రూతలూగిస్తున్నా టెస్ట్ క్రికెట్ ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ సిసలైన క్రికెట్గా టెస్టులను పరిగణిస్తున్నారంటే.. లాంగ్ ఫార్మాట్ సత్తా ఏపాటిదో మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ నడుస్తోంది. శుబ్మన్ గిల్ నాయకత్వంలోని టీమిండియా మొదటి మ్యాచ్లో పరాజయం చవిచూసింది. ఇంకా 4 మ్యాచ్లు జరగాల్సివుంది. చూద్దాం టీమిండియా ఏం చేస్తుందో.అదలావుంచితే టెస్ట్ క్రికెట్లో అత్యధికంగా ఎల్బీడబ్ల్యూ వికెట్లు సాధించిన బౌలర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లెగ్ బిఫోర్ వికెట్ (leg before wicket) సంక్షిప్త నామమే ఎల్బీడబ్ల్యూ. పటిష్టమైన లైన్, లెంగ్త్తో యార్కర్లు సంధించి వికెట్ల ముందు బ్యాటర్లను దొరకబుచ్చుకోవడం అద్భుతమైన కళ. ఎందరో దిగ్గజ బౌలర్లు ఈ కళలో ప్రావీణ్యం సంపాదించి తమ జాతీయ జట్ల విజయాల్లో కీలకపాత్ర పోషించారు. బ్యాటర్లు క్రీజులో పాతుకుపోయి క్యాచవుట్లు, వికెట్లు ఇవ్వడానికి ఇష్టపడని సందర్భంలో బౌలర్లు ఎక్కువగా యార్కర్లు సంధిస్తూ ఎల్బీడబ్ల్యూ కోసం ప్రయత్నిస్తుంటారు.నంబర్ 1 మనోడేటెస్ట్ క్రికెట్లో అత్యధికంగా ఎల్బీడబ్ల్యూ వికెట్లు సాధించిన బౌలర్లలో మనోడే ముందున్నాడు. 'జంబో'గా ప్రసిద్ధుడైన టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (Anil Kumble) అందరికంటే ఎక్కువగా 156 ఎల్బీడబ్ల్యూ వికెట్లు దక్కించుకుని టాప్లో నిలిచాడు. 132 టెస్టులు ఆడిన అతడు మొత్తం 619 వికెట్లు పడగొట్టాడు. కుంబ్లే లెగ్ బ్రేక్ గూగ్లీ బౌలింగ్, అతడి నిబద్దత గురించి క్రికెట్ అభిమానులందరికీ బాగా తెలుసు. అందుకే ఇప్పటికీ టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఇండియన్ బౌలర్గా కుంబ్లేనే కొనసాగుతున్నాడు.ముత్తయ్య @ 150టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన శ్రీలంక లెజెండరీ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ (Muttiah Muralitharan) ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. 150 ఎల్బీడబ్ల్యూ వికెట్లు అతడి ఖతాలో ఉన్నాయి. 133 టెస్టులు ఆడిన మురళీధరన్ ఓవరాల్గా 800 వికెట్లు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. అతడి జీవిత కథ ఆధారంగా తమిళంలో '800' పేరుతో సినిమా కూడా వచ్చింది.వారెవా.. వార్న్ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ (Shane Warne) 138 ఎల్బీడబ్ల్యూ వికెట్లు సాధించాడు. స్లైడర్, ఫ్లిప్పర్, గూగ్లీలతో బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో చేయి తిరిగిన వార్న్.. తన కెరీర్లో 145 టెస్ట్ మ్యాచ్లు ఆడి 708 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక ఎల్బీడబ్ల్యూ వికెట్లు సాధించిన బౌలర్లో మొదటి మూడు స్థానాల్లోనూ స్పిన్నర్లే నిలవడం విశేషం.చదవండి: రెండో టెస్ట్లో అతడిని తప్పకుండా ఆడించండి.. ఎందుకంటే?119 ఎల్బీడబ్ల్యూ వికెట్లు తీసిన పాకిస్థాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రం (Wasim Akram) ఈ జాబితాలో 4వ స్థానంలో నిలిచాడు. టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 117 ఎల్బీడబ్ల్యూ వికెట్లుతో 5వ స్థానంలో ఉన్నాడు. గ్లెన్ మెక్గ్రాత్ (113), కపిల్ దేవ్ (111), వకార్ యూనిస్ (110), రంగన హెరాత్ (108), స్టువర్ట్ బ్రాడ్ (101) టాప్ టెన్లో ఉన్న మిగతా బౌలర్లు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక LBW వికెట్లు తీసిన టాప్ 10 బౌలర్లలో ఐదుగురు స్పిన్నర్లు, ఐదుగురు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ఈ 10 మంది బౌలర్లు టెస్ట్ క్రికెట్లో తమదైన ముద్ర వేసి ఔత్సహిక బౌలర్లకు ప్రేరణగా నిలిచిన వారే. -
పాకిస్తాన్ హెడ్ కోచ్గా కేకేఆర్ మాజీ ప్లేయర్
పాకిస్తాన్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్గా ఐపీఎల్ ఆడిన ఓ పాక్ మాజీ ఆటగాడు ఎంపికయ్యాడు. 50 ఏళ్ల అజహార్ మహమూద్ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తాత్కాలిక ప్రాతిపదికన హెడ్ కోచ్గా ఎంపిక చేసింది. ఈ పదవిలో అజహార్ 2026 ఏప్రిల్ వరకు కొనసాగుతాడు. గతేడాది అక్టోబర్లో అజహార్ తొలుత పాక్ ఆల్ ఫార్మాట్ అసిస్టెంట్ కోచ్గా ఎంపికయ్యాడు. తాజాగా ప్రమోషన్ పొంది టెస్ట్ జట్టుకు హెడ్ కోచ్ అయ్యాడు. ఆకిబ్ జావిద్ నుంచి అజహార్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. టెస్ట్ జట్టు హెడ్ కోచ్గా అజహార్ ప్రయాణం త్వరలో స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగబోయే టెస్ట్ సిరీస్తో మొదలవుతుంది. అజహార్ పాక్ తరఫున 21 టెస్ట్లు, 143 వన్డేలు ఆడి 3 సెంచరీలు, 4 అర్ద సెంచరీల సాయంతో 2400 పైచిలుకు పరుగులు చేశాడు. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన ఇతను.. టెస్ట్ల్లో 39, వన్డేల్లో 123 వికెట్లు తీశాడు. అజహార్కు కౌంటీ క్రికెట్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. అతను రెండు సార్లు కౌంటీ ఛాంపియన్షిప్ నెగ్గిన జట్లలో సభ్యుడిగా ఉన్నాడు. అజహార్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడిన అతి కొద్ది మంది పాక్ ఆటగాళ్లలో ఒకడు. 2012లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఇతను.. నాలుగు సీజన్ల పాటు క్యాష్ రిచ్ లీగ్లో పాల్గొని 23 మ్యాచ్ల్లో 2 హాఫ్ సెంచరీల సాయంతో 388 పరుగులు చేశాడు. బౌలింగ్లో 29 వికెట్లు పడగొట్టాడు. 2015 సీజన్లో అజహార్ న్యూజిలాండ్ ఆటగాడు జేమ్స్ నీషమ్కు ప్రత్యామ్నాయంగా కేకేఆర్ జట్టులో చేరాడు. ఐపీఎల్లో ఇదే అతనికి చివరి సీజన్. అప్పటికే భారత్-పాక్ మధ్య ఉద్రిక్తల కారణంగా పాక్ ఆటగాళ్లను ఐపీఎల్లో ఆడనివ్వలేదు. అయితే అజహార్కు బ్రిటన్ పౌరసత్వం ఉండటంతో ఐపీఎల్లో ఆడగలిగాడు. -
రోహిత్, కోహ్లికి నో ఛాన్స్!.. వరుణ్ చక్రవర్తి డ్రీమ్ టీ20 ఎలెవన్ ఇదే
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన డ్రీమ్ టీ20 ఎలెవన్ (Dream T20 Eleven)ను ప్రకటించాడు. ఇందులో భారత దిగ్గజ టీ20 స్టార్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli)లకు మాత్రం చోటు దక్కలేదు. అయితే, ఇందులో ఓ ట్విస్టు ఉంది. కాగా కర్ణాటకలోని బీదర్లో జన్మించిన వరుణ్ తొలుత ఆర్కిటెక్ట్గా పనిచేశాడు.నటన వైపు అడుగులుఆ తర్వాత గిటార్ ప్లేయర్గానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామని తన స్నేహితులతో కలిసి ఓ సినిమా షూటింగ్కు వెళ్లాడు. అయితే, అక్కడ ఆ అవకాశం దొరకలేదు కానీ.. క్రికెట్ ఆడతాడు కాబట్టి ఆ సినిమాలోని ఓ పాత్రకు వరుణ్ ఎంపికయ్యాడు. అలా నటుడిగా మారిన తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్'కు దర్శకుడిగానూ వ్యవహరించాడు.క్రికెట్ నైపుణ్యాలకు మెరుగుపెట్టుకునిఅయితే, తర్వాత మళ్లీ పాత కథే. ఇంటీరియర్ డిజైనర్గా సత్తా చాటాలనుకుని కంపెనీ పెట్టి చేతులు కాల్చుకున్నాడు. పాతికేళ్ల వయసుకే ఇన్ని అనుభవాలు సంపాదించిన వరుణ్.. క్రికెట్ నైపుణ్యాలకు మెరుగుపెట్టుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకున్నాడు.శ్రీలంకతో టీ20 మ్యాచ్ సందర్భంగా 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన వరుణ్ చక్రవర్తి.. ఈ ఏడాది వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025ని భారత్ కైవసం చేసుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 18 టీ20లు, నాలుగు వన్డేలు ఆడిన ఈ రైటార్మ్ లెగ్బ్రేక్ స్పిన్నర్ వరుసగా 33, 10 వికెట్లు తీశాడు.ట్విస్ట్ ఏమిటంటేప్రస్తుతం విరామం తీసుకుంటున్న వరుణ్ చక్రవర్తి.. మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన డ్రీమ్ టీ20 ఎలెవన్ను చెప్పాలంటూ అశూ.. వరుణ్ను అడిగాడు. అయితే, ఇక్కడే ఓ మెలిక పెట్టాడు. వరుణ్తో కలిసి ఆడిన ఆటగాళ్ల నుంచే జట్టును ఎంపిక చేసుకోవాలని చెప్పాడు.ఈ క్రమంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలను వదిలేసి వరుణ్ తన జట్టును ప్రకటించాడు. ఓపెనర్లుగా బట్లర్, హెడ్లను ఎంచుకున్న అతడు.. వన్డౌన్లో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు చోటిచ్చాడు. అదే విధంగా.. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్లో తన సహచర ఆటగాళ్లైన ఆండ్రీ రసెల్, సునిల్ నరైన్లను కూడా వరుణ్ తన జట్టులోకి ఎంపిక చేసుకున్నాడు. ఇక టీమిండియా నుంచి సూర్యతో పాటు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలకు స్థానం కల్పించాడు. స్పిన్నర్ల జాబితాలో రషీద్ ఖాన్కు పెద్దపీట వేశాడు. శ్రీలంక యువ పేసర్ పతిరణకు కూడా వరుణ్ తన జట్టులో చోటిచ్చాడు.వరుణ్ చక్రవర్తి డ్రీమ్ టీ20 ఎలెవన్:జోస్ బట్లర్ (ఇంగ్లండ్), ట్రవిస్ హెడ్ (ఆస్ట్రేలియా), సూర్యకుమార్ యాదవ్ (ఇండియా), నికోలస్ పూరన్ (వెస్టిండీస్), హెన్రిచ్ క్లాసెన్ (సౌతాఫ్రికా), హార్దిక్ పాండ్యా (ఇండియా), ఆండ్రీ రసెల్ (వెస్టిండీస్), సునిల్ నరైన్(వెస్టిండీస్), రషీద్ ఖాన్ (అఫ్గనిస్తాన్), జస్ప్రీత్ బుమ్రా (ఇండియా), మతీశ పతిరణ (శ్రీలంక).చదవండి: ‘షర్మిలా ఠాగూర్, సైఫ్ అలీ ఖాన్ను పిలవండి.. ఎవరూ వేలెత్తి చూపరు’ -
సుడిగాలి ఇన్నింగ్స్.. లేటు వయసులోనూ ఇరగదీస్తున్న పోలార్డ్
విండీస్ విధ్వంసకర బ్యాటర్ కీరన్ పోలార్డ్ 38 ఏళ్ల లేటు వయసులోనూ ఇరగదీస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ 2025 ఎడిషన్లో మెరుపు ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు. ఈ లీగ్లో పోలీ ఇన్నింగ్స్లు వింటేజ్ పోలార్డ్ను గుర్తు చేస్తున్నాయి. ఎంఎల్సీ 2025లో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన పోలార్డ్.. 186.11 స్ట్రయిక్రేట్తో 201 పరుగులు చేసి అదరగొట్టాడు.తాజాగా టెక్సాస్ సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో పోలీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 39 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో తన జట్టు ఎంఐ న్యూయార్క్ ఓటమిపాలైనా, పోలీ సుడిగాలి ఇన్నింగ్స్ మాత్రం అందరినీ అలరించింది.2022 సీజన్ తర్వాత ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించిన పోలార్డ్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మిగతా లీగ్ల్లో చెలరేగి ఆడుతున్నాడు. స్వదేశంలో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్, దుబాయ్లో జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో పోలార్డ్ దుమ్మురేపుతున్నాడు. పోలార్డ్ ఇటీవలే పొట్టి ఫార్మాట్లో 700 మ్యాచ్లు పూర్తి చేసుకొని చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలో ఏ క్రికెటర్ పొట్టి ఫార్మాట్లో ఇన్ని మ్యాచ్లు ఆడలేదు.ఐపీఎల్ రిటైర్మెంట్ అనంతరం పోలార్డ్ ముంబై ఇండియన్స్కు బ్యాటింగ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. పోలార్డ్కు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీతో విడదీయరాని బంధం ఏర్పడింది. ఆటగాడిగా రిటైరైనా అదే ఫ్రాంచైజీకి బ్యాటింగ్ కోచ్గా సేవలందిస్తున్న అతను.. సౌతాఫ్రికా టీ20 లీగ్, ఇంటర్నేషనల్ టీ20 లీగ్, మేజర్ లీగ్ క్రికెట్ లీగ్ల్లో ముంబై ఇండియన్స్ సిస్టర్ ఫ్రాంచైజీలకే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. పోలార్డ్ ఐపీఎల్తో పాటు అదే ఏడాది (2022) అంతర్జాతీయ క్రికెట్కు కూడా గుడ్బై చెప్పాడు.విండీస్ తరఫున123 వన్డేలు, 101 టీ20లు ఆడిన పోలార్డ్.. 3 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీల సాయంతో 4200 పైచిలుకు పరుగులు చేశాడు. అలాగే తన మీడియం పేస్ బౌలింగ్తో 97 వికెట్లు పడగొట్టాడు. 2010లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన పోలార్డ్ ఆ ఒక్క ఫ్రాంచైజీ తరఫునే కెరీర్ మొత్తం (189 మ్యాచ్లు) ఆడి 16 హాఫ్ సెంచరీల సాయంతో 3412 పరుగులు చేశాడు. బౌలింగ్లో 69 వికెట్లు పడగొట్టాడు. ముంబై ఇండియన్స్కు పోలార్డ్ ఎన్నో అపురూప విజయాలనందించాడు.యావత్ పొట్టి క్రికెట్లో 702 మ్యాచ్లు ఆడిన పోలార్డ్, 13783 పరుగులు చేసి, 328 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో ఇప్పటివరకు కనీసం 600 మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లు కూడా లేరు. -
‘షర్మిలా ఠాగూర్, సైఫ్ అలీ ఖాన్ను పిలవండి.. ఎవరూ వేలెత్తి చూపరు’
ఇంగ్లండ్- భారత్ మధ్య టెస్టు సిరీస్కు కొత్త పేరు పెట్టడం పట్ల టీమిండియా మాజీ క్రికెటర్ ఫారూఖ్ ఇంజనీర్ (Farookh Engineer) అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ చర్య వల్ల ఇంగ్లండ్- వేల్స్ క్రికెట్ బోర్డు తన విశ్వసనీయతను కోల్పోయిందని విమర్శించాడు. భారత క్రికెట్ రంగానికి సేవ చేయడంతో పాటు ఇంగ్లండ్కూ ఆడిన మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ (Mansur Ali Khan Pataudi) పేరు తొలగించడం ఎంత మాత్రం ఆమోదయోగ్యనీయం కాదన్నాడు.గొప్ప కుటుంబంకాగా ఇంగ్లండ్- టీమిండియా మధ్య టెస్టు సిరీస్ను గతంలో పటౌడీ ట్రోఫీగా పిలిచేవారు. అయితే, తాజాగా ఈ సిరీస్కు టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీగా నామకరణం చేసింది ఈసీబీ. ఈ క్రమంలో విమర్శలతో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నుంచి విజ్ఞప్తి రాగా.. విజేత జట్టు కెప్టెన్కు పటౌడీ మెడల్ను అందజేస్తామని ప్రకటించింది. తద్వారా పటౌడీ పేరు చిరస్మరణీయం కానుంది.అయితే, ఈసీబీ నిర్ణయం తనకు అంతగా సంతృప్తినివ్వలేదని షారూఖ్ ఇంజనీర్ అన్నాడు. ‘‘టైగర్ పటౌడీ నాకు స్నేహితుడు. ఇద్దరం కలిసి చాన్నాళ్లు క్రికెట్ ఆడాము. అతడిది గొప్ప వారసత్వం. వారిది గొప్ప కుటుంబం. 2007లో పటౌడీ ట్రోఫీని ప్రవేశపెట్టినపుడు ఎంతో సంతోషించా.షర్మిలా ఠాగూర్, సైఫ్ అలీ ఖాన్ను పిలవండిఅయితే, ఇప్పుడు ఆ పేరును తీసేయడం తీవ్ర నిరాశకు గురిచేసింది. ఆండర్సర్- టెండుల్కర్ కూడా దిగ్గజ ఆటగాళ్లే. వారికి ఎవరూ సాటిరారు. ట్రోఫీకి వారి పేరు పెట్టడంలో ఎలాంటి తప్పూ లేదు. అయితే, ఇలాంటి చర్య వల్ల ఈసీబీ తన విశ్వసనీయతను కోల్పోయింది.మెడల్ ఇస్తామంటూ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. మెడల్ అందిస్తామని చెప్పింది. కేవలం ఇలా చేస్తే సరిపోదు. మన్సూర్ భార్య షర్మిలా ఠాగూర్, కుమారుడు సైఫ్ అలీ ఖాన్ల చేతుల మీదుగా ఆ పతకం విజేత జట్టు కెప్టెన్కు అందజేయాలి. ఈసారి ఇలా చేయడం వల్ల ఈసీబీ వైపు ఎవరూ వేలెత్తి చూపే అవకాశం ఉండదు’’ అని ఫారూఖ్ ఇంజనీర్ పీటీఐతో పేర్కొన్నాడు. కాగా బాలీవుడ్ నటి షర్మిలాను పెళ్లాడిన మన్సూర్కు కుమారుడు సైఫ్తో పాటు కుమార్తెలు సబా, సోహా ఉన్నారు. ఇదిలా ఉంటే.. తాజా ఇంగ్లండ్ పర్యటనను టీమిండియా పరాజయంతో మొదలుపెట్టింది. లీడ్స్ వేదికగా తొలి టెస్టులో గిల్ సేన.. స్టోక్స్ బృందం చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇరుజట్ల మధ్య మొత్తంగా ఐదు టెస్టులు జరుగనుండగా.. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియం రెండో మ్యాచ్ (జూలై 2-6)కు వేదిక. చదవండి: ఇకపై మళ్లీ ఆడగలనా? -
చరిత్ర సృష్టించాడు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్, కెప్టెన్గా రికార్డు
సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ (Faf Du Plesis) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో ఇంత వరకు ఏ ఆటగాడికీ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు. నలభై ఏళ్ల వయసు దాటిన తర్వాత.. పొట్టి ఫార్మాట్లో రెండు శతకాలు బాదిన ఏకైక క్రికెటర్గా నిలిచాడు. మేజర్ లీగ్ క్రికెట్-2025లో భాగంగా డుప్లెసిస్ ఈ ఫీట్ నమోదు చేశాడు.ఎంఎల్సీ-2025 (MLC)లో డుప్లెసిస్ టెక్సాస్ సూపర్ కింగ్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం డల్లాస్లో జరిగిన మ్యాచ్లో సూపర్ కింగ్స్.. ఎంఐ న్యూయార్క్ జట్టుతో తలపడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్ల నష్టానికి 223 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.రెండు శతకాలుఓపెనర్ డుప్లెసిస్ శతక ఇన్నింగ్స్తో మెరిశాడు. మొత్తంగా 53 బంతుల్లో ఐదు ఫోర్లు, తొమ్మిది సిక్స్ల సాయంతో 103 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలోనే డుప్లెసిస్ ప్రపంచ రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. నలభైవ పడిలో అడుగుపెట్టిన తర్వాత డుప్లెసిస్కు ఇది రెండో టీ20 సెంచరీ.ఎంఎల్సీలో భాగంగా ఇటీవల శాన్ ఫ్రాన్సిస్కో జట్టుపై డుప్లెసిస్ 100 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో నలభై ఏళ్లు దాటిన తర్వాత రెండు టీ20 శతకాలు బాదిన క్రికెటర్గా చరిత్రకెక్కాడు. ఈ వయసులోనూ ఫిట్గా ఉంటూ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటమే గాక.. సెంచరీలతో అలరిస్తూ యువ క్రికెటర్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ సౌతాఫ్రికా దిగ్గజం.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. డుప్లెసిస్తో పాటు డొనోవాన్ ఫెరీరా (20 బంతుల్లో 53) రాణించడంతో సూపర్ కింగ్స్ 223 పరుగుల చేసింది. అయితే, లక్ష్య ఛేదనలో ఎంఐ న్యూయార్క్ జట్టు ఆరంభం నుంచే తడబడింది. సూపర్ కింగ్స్ బౌలర్ల దెబ్బకు 184 పరుగులకే పరిమితమైంది. ఎంఐ బ్యాటర్లలో కీరన్ పొలార్డ్ (70) ఒక్కడే మెరుగ్గా ఆడాడు. సూపర్ కింగ్స్ బౌలర్లలో మూడు కీలక వికెట్లు తీసిన అకీల్ హొసేన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోగా.. నండ్రీ బర్గర్, మార్కస్ స్టొయినిస్ రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.నలభై ఏళ్లు దాటిన తర్వాత టీ20 ఫార్మాట్లో శతకాలు బాదింది వీరే..ఫాఫ్ డుప్లెసిస్- 43 ఇన్నింగ్స్లో- రెండు శతకాలుజుబేర్ అహ్మద్- 4 ఇన్నింగ్స్లో- ఒక శతకంఇమ్రాన్ జనత్- 15 ఇన్నింగ్స్లో- ఒక శతకంగ్రాహమ్ హిక్- 23 ఇన్నింగ్స్లో- ఒక శతకంపాల్ కాలింగ్వుడ్- 29 ఇన్నింగ్స్లో- ఒక శతకం.బాబర్ ప్రపంచ రికార్డు బద్దలుఇక రికార్డుతో పాటు మరో ఘనతను కూడా డుప్లెసిస్ తన ఖాతాలో వేసుకున్నాడు. పొట్టి ఫార్మాట్లో కెప్టెన్గా అత్యధిక సెంచరీలు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. కెప్టెన్గా టీ20లలో అతడికి ఇది ఎనిమిదో సెంచరీ. ఈ క్రమంలో మైకేల్ క్లింగర్ (7 శతకాలు), బాబర్ ఆజం (7 శతకాలు) పేరిట ఉన్న సంయుక్త వరల్డ్ రికార్డును బద్దలుకొట్టాడు. అంతేకాదు మేజర్ లీగ్ క్రికెట్లో అత్యధికంగా మూడు శతకాలు బాదిన క్రికెటర్గానూ డుప్లెసిస్ నిలిచాడు.చదవండి: ఒక్కడిపైనే ఆధారపడొద్దు.. రెండో టెస్టులో అతడిని తప్పక ఆడించండి: అజారుద్దీన్ -
సిక్సర్ బాది.. గుండెపోటుతో కుప్పకూలి.. పిచ్పైనే ప్రాణాలొదిలి!
పంజాబ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానిక క్రికెటర్ పిచ్పైనే ప్రాణాలొదిలాడు. ఉత్సాహంగా మ్యాచ్ ఆడుతున్న అతడు.. సిక్సర్ బాదిన వెంటనే గుండెపోటుతో కుప్పకూలాడు. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే అతడు మరణించినట్లు సమాచారం.మృతుడిని హర్జీత్ సింగ్గా గుర్తించారు. కాగా ఫిరోజ్పూర్లోని డీఏవీ పాఠశాల మైదానంలో రెండు జట్లు క్రికెట్ మ్యాచ్లో తలపడుతున్నాయి. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన హర్జీత్.. సిక్సర్తో అలరించాడు. అయితే, ఆ వెంటనే పిచ్ మధ్యలోకి వచ్చిన అతడు ఒక్కసారిగా కుప్పకూలాడు.ఇంతలో సహచర ఆటగాళ్లు వచ్చి హర్జీత్ను పైకిలేపే ప్రయత్నం చేశారు. పరిస్థితిని గమనించి సీపీఆర్ (CPR- కార్డియోపల్మనరీ రిససిటేషన్) చేశారు. కానీ అప్పటికే అతడు స్పృహ కోల్పోయిన అతడిలో ఎలాంటి చలనం కనిపించలేదు. గుండెపోటు కారణంగా హర్జీత్ అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.సిక్సర్బాది ఆ వెంటనే కాగా సిక్సర్బాది ఆ వెంటనే అతడు కుప్పకూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. హర్జీత్ కుటుంబానికి నెటిజన్లు సానుభూతి తెలుపుతున్నారు. కాగా గతేడాది కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 35 ఏళ్ల క్రికెటర్ ఒకరు పుణెలోని గర్వారే స్టేడియంలో మ్యాచ్ ఆడుతూనే గుండెపోటుకు గురయ్యాడు.ఓపెనర్గా బ్యాటింగ్కు వచ్చిన ఇమ్రాన్ పటేల్ అనే వ్యక్తి కాసేపటికే ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పి.. ఫీల్డ్ అంపైర్ల అనుమతితో మైదానాన్ని వీడాడు. కానీ పెవిలియన్ చేరేలోపే అతడు కుప్పకూలిపోయాడు. పూర్తి ఫిట్గా, ఆరోగ్యంగా ఉన్నప్పటికీ అతడు గుండెపోటు కారణంగా మృతి చెందడం గమనార్హం. ఆల్రౌండర్ అయిన ఇమ్రాన్ మైదానంలో ఎంతో చురుగ్గా ఉండేవాడని.. దురదృష్టవశాత్తూ అతడిని కోల్పోయామని తోటి ఆటగాళ్లు, స్నేహితులు విచారం వ్యక్తం చేశారు.A local cricketer in Ferozepur hit a six off a delivery, but just moments later, he suffered a heart attack and tragically collapsed on the ground, losing his life. pic.twitter.com/7j4WXolkFf— Vipin Tiwari (@Vipintiwari952) June 29, 2025 -
బుమ్రా మూడు టెస్టులు ఆడితే.. షమీ కనీసం రెండు ఆడలేడా?
ఇంగ్లండ్ పర్యటనను ఓటమితో ఆరంభించిన టీమిండియా రెండో టెస్టులోనైనా సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. బర్మింగ్హామ్లో గెలిచి సిరీస్ను 1-1తో సమం చేసేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. అయితే, ఈ మ్యాచ్కు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అందుబాటులో ఉంటాడో, లేదోనన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.కాగా ఇంగ్లండ్తో ఐదు టెస్టులకు జట్టును ప్రకటించిన సమయంలోనే బుమ్రా కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే ఆడతాడని యాజమాన్యం పేర్కొంది. బుమ్రాపై పనిభారం తగ్గించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) స్వయంగా వెల్లడించాడు.బుమ్రాపైనే భారంఇక ఈ టూర్కు పేస్ దళంలో నాయకుడు బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, యువ ఆటగాళ్లు ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్ (Akash Deep) కూడా ఎంపికయ్యారు. లీడ్స్లో జరిగిన తొలి టెస్టులో బుమ్రా తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీయగా.. సిరాజ్ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఇక ప్రసిద్ కృష్ణ వికెట్లు తీసినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు.ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో సిరాజ్ 27 ఓవర్ల బౌలింగ్లో 122 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్లో 14 ఓవర్ల బౌలింగ్లో 51 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు. మరోవైపు.. ప్రసిద్ కృష్ణ తొలి ఇన్నింగ్స్లో 20 ఓవర్ల బౌలింగ్లో 128 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయగా.. రెండో ఇన్నింగ్స్లో 15 ఓవర్ల బౌలింగ్లో 92 రన్స్ ఇచ్చి రెండు వికెట్లు దక్కించుకోగలిగాడు.షమీ ఉంటే బాగుండేదిఅయితే, జట్టు బుమ్రాపైనే ఎక్కువగా ఆధారపడుతుండటంతో అతడిపైనే భారం పడుతోంది. ఇలాంటి తరుణంలో మహ్మద్ షమీ ఉండి ఉంటే ఉపయోగకరంగా ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పేస్ బౌలర్ 2023లో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియాపై చివరగా ఆడాడు.ఆ తర్వాత గాయం కారణంగా జట్టుకు చాలా కాలం దూరమైన షమీ.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో సత్తా చాటాడు. ఐదు మ్యాచ్లలో కలిపి ఒక ఫైఫర్ సాయంతో తొమ్మిది వికెట్లు కూల్చాడు. అయితే, ఐపీఎల్-2025లో మాత్రం రాణించలేకపోయాడు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడిన షమీ.. తొమ్మిది మ్యాచ్లలో కలిపి కేవలం ఆరు వికెట్లే తీయగలిగాడు.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో పర్యటనకు సెలక్టర్లు షమీ పేరును పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. ఫిట్నెస్ సమస్యలు కూడా ఇందుకు ఓ కారణం అని అగార్కర్ మాటల ద్వారా వెల్లడైంది. ఈ క్రమంలో బుమ్రాకు పనిభారం తగ్గించినట్లుగా.. షమీకి కూడా ఓ అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బుమ్రా మూడు ఆడితే.. షమీ కనీసం రెండు ఆడలేడా?సిరాజ్ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోవడం.. ప్రసిద్ అనుభవలేమి బౌలర్ కావడంతో షమీ పేరు ప్రముఖంగా తెరమీదకు వచ్చింది. బుమ్రాను మూడు టెస్టులు ఆడిస్తే.. షమీని కనీసం రెండు టెస్టుల్లో ఆడించాల్సిందనే వాదన వినిపిస్తోంది. కాగా 34 ఏళ్ల షమీ ఇప్పటి వరకు తన టెస్టు కెరీర్లో 64 మ్యాచ్లలో కలిపి 229 వికెట్లు కూల్చగా.. ఇందులో ఇంగ్లండ్ గడ్డ మీద 14 మ్యాచ్లు ఆడి 42 వికెట్లు తీశాడు.మరోవైపు సిరాజ్.. ఇప్పటికి ఆడిన 37 టెస్టుల్లో 102 వికెట్లు పడగొట్టాడు. ఏదేమైనా ఇంగ్లండ్ టూర్లో అనుభవజ్ఞుడైన షమీ ఉంటే పేస్ బౌలింగ్ విభాగం మరింత బలపడేదని విశ్లేషకులు అంటున్నారు. కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇంగ్లండ్తో ఐదు టెస్టులు ఆడనుంది. లీడ్స్లో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇరుజట్ల మధ్య బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియం వేదికగా రెండో టెస్టుకు జూలై 2-6 వరకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: సౌతాఫ్రికా క్రికెట్లో సరికొత్త అధ్యాయం.. చరిత్ర సృష్టించిన కేశవ్ మహారాజ్ -
గిల్ను విమర్శించొద్దు!.. రెండో టెస్టులో అతడిని ఆడించండి: అజారుద్దీన్
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill)కు భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహ్మద్ అజారుద్దీన్ అండగా నిలిచాడు. కెప్టెన్గా తొలి మ్యాచ్లో ఓటమి చవిచూసిన ఈ యువ ఆటగాడిని విమర్శించడం తగదని హితవు పలికాడు. అతడికి మరికాస్త సమయం ఇవ్వాలని కోరాడు.దిగ్గజాల నిష్క్రమణ తర్వాతఇంగ్లండ్ పర్యటనకు ముందు కెప్టెన్ రోహిత్శర్మ (Rohit Sharma), దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) టెస్టులకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అంతకు ముందే ఆస్ట్రేలియా టూర్లో స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇలాంటి తరుణంలో యువ ఆటగాడు శుబ్మన్ గిల్కు మేనేజ్మెంట్ టెస్టు జట్టు పగ్గాలు అప్పగించింది.ఐదు వికెట్ల తేడాతో ఓటమిఈ క్రమంలో తొలుత టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy) ఆడేందుకు గిల్ సారథ్యంలోని జట్టు ఇంగ్లండ్కు వెళ్లింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టులో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. లీడ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా ఐదు శతకాలు బాదినా ఫలితం లేకుండా పోయింది.లోయర్ ఆర్డర్, బౌలింగ్ విభాగం వైఫల్యం, ఫీల్డర్ల తప్పిదాల కారణంగా గెలవాల్సిన మ్యాచ్ను చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో గిల్ కెప్టెన్సీపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో మహ్మద్ అజారుద్దీన్ స్పందిస్తూ అతడికి మద్దతుగా నిలిచాడు.తొందరపాటే అవుతుంది‘‘కెప్టెన్గా అతడికి ఇదే తొలి మ్యాచ్. ఇప్పుడే కెప్టెన్సీ గురించి ఇంత చర్చ అవసరం లేదు. అతడికి ఇంకాస్త సమయం ఇవ్వాలి. ప్రతి ఒక్కరు అతడికి అండగా నిలవాల్సిన సమయం ఇది. ప్రతిసారీ ఏదో ఒక ఫిర్యాదు చేస్తూ ఆటగాళ్లను విమర్శించడం తగదు. ఏదేమైనా తొలి టెస్టు ఆఖర్లో మన బ్యాటింగ్ విభాగం కుప్పకూలింది. ఇప్పటికైనా సరైన కూర్పుతో జట్టును ఎంపిక చేసుకోవాలి. బౌలింగ్ కూడా మారాలి’’ అని స్పోర్ట్స్కీడాతో అజారుద్దీన్ పేర్కొన్నాడు.కుల్దీప్ను తప్పక ఆడించండిఅదే విధంగా.. భారత బౌలింగ్ విభాగం గురించి మాట్లాడుతూ.. ‘‘ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాపైనే జట్టు అతిగా ఆధారపడుతోంది. వికెట్లు పడగొట్టడంతో పాటు పరుగులు నియంత్రించేందుకు జట్టు ప్రతిసారి అతడినే ఆశ్రయిస్తోంది.అతడు ఒక్కడే రాణిస్తే సరిపోదు. అనుభవజ్ఞులైన మరికొంత మంది బౌలర్లు కూడా తమ వంతు పాత్ర పోషించాలి. రెండో టెస్టులో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకోవాలి. తద్వారా బౌలింగ్లో వైవిధ్యం పెరుగుతుంది’’ అని అజారుద్దీన్ అభిప్రాయపడ్డాడు.కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య బుధవారం (జూలై 2-6)నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియం ఇందుకు వేదిక. అయితే, ఇక్కడి పిచ్ పొడిగా ఉండనుండటంతో... కుల్దీప్ ప్రభావం చూపగలడని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అజారుద్దీన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.చదవండి: SA vs ZIM: చరిత్ర సృష్టించిన బేబీ ఏబీడీ.. అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డు -
సీన్ విలియమ్స్ సూపర్ సెంచరీ.. తప్పిన ఫాలో ఆన్ గండం
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు (ZIM vs SA 1st Test)లో జింబాబ్వే ఫాలో ఆన్ గండం తప్పించుకుంది. మిడిలార్డర్ బ్యాటర్ సీన్ విలియమ్స్ (Sean Williams- 164 బంతుల్లో 137; 16 ఫోర్లు) సెంచరీ సాధించి ఈ మేరకు ఊరట కల్పించాడు. బులవాయో వేదికగా ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్లో 67.4 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ (90 బంతుల్లో 36; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. బ్రియాన్ బెనెట్ (19), కిటానో (0), నిక్ వెల్చ్ (4), వెస్లీ మధెవెరె (15), ప్రిన్స్ (7), తఫద్జా ట్సిగా (9), మసకద్జా (4) ఒకరి వెంట ఒకరు పెవిలియన్కు వరుసకట్టారు.ముల్డర్కు నాలుగు వికెట్లుఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో వియాన్ ముల్డర్ 4 వికెట్లు పడగొట్టగా... కేశవ్ మహరాజ్, యూసుఫ్ చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది.ఓపెనర్లలో మాథ్యూ బ్రీజ్కె (1) అవుట్ కాగా... టోనీ డి జోర్జి (22 బ్యాటింగ్; 2 ఫోర్లు).. వన్డౌన్ బ్యాటర్ ముల్డర్ (25 బ్యాటింగ్; 4 ఫోర్లు)తో కలిసి క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 418/9 వద్దే దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో ఓవరాల్గా చేతిలో 9 వికెట్లు ఉన్న సఫారీ జట్టు ప్రస్తుతం 216 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. తద్వారా జింబాబ్వేతో తొలి టెస్టులో పట్టు బిగించింది.కేశవ్ మహరాజ్@ 200ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న కేశవ్ మహరాజ్... అరుదైన ఘనత సాధించాడు. సఫారీ జట్టు తరఫున 200 టెస్టు వికెట్లు పడగొట్టిన తొలి స్పిన్నర్గా రికార్డుల్లోకెక్కాడు. జింబాబ్వే కెప్టెన్ ఇరి్వన్ను అవుట్ చేయడం ద్వారా కేశవ్ మహరాజ్ సుదీర్ఘ ఫార్మాట్లో 200వ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. 9 ఏళ్లుగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 35 ఏళ్ల కేశవ్... ఇప్పటి వరకు 59 టెస్టుల్లో 202 వికెట్లు పడగొట్టాడు. -
డుప్లెసిస్ ధనాధన్ శతకం.. ఫెరీరా మెరుపు హాఫ్ సెంచరీ.. ఎంఐకి ఓటమి
టెక్సాస్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (Faf Du Plesis) విధ్వంసకర శతకంతో దుమ్ములేపాడు. ఎంఐ న్యూయార్క్ జట్టుతో మ్యాచ్లో 53 బంతుల్లోనే 103 పరుగులు బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ధనాధన్ ఇన్నింగ్స్తో దంచికొట్టి సూపర్ కింగ్స్ను గెలిపించాడు.మేజర్ లీగ్ క్రికెట్-2025 (MLC-2025)లో భాగంగా టెక్సాస్ సూపర్ కింగ్స్ ఎంఐ న్యూయార్క్ జట్టుతో తలపడింది. డల్లాస్ వేదికగా సోమవారం ఉదయం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఎంఐ జట్టు తొలుత బౌలింగ్ చేసింది.డుప్లెసిస్ ధనాధన్ శతకం.. ఫెరీరా మెరుపు హాఫ్ సెంచరీఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన సూపర్ కింగ్స్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ స్మిత్ పటేల్ మూడు పరుగులకే వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్, కెప్టెన్ డుప్లెసిస్ సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. మొత్తంగా 53 బంతులు ఎదుర్కొన్న అతడు ఐదు ఫోర్లు, తొమ్మిది సిక్సర్ల సాయంతో 103 పరుగులు సాధించాడు.డుప్లెసిస్కు తోడుగా వన్డౌన్ బ్యాటర్ సాయితేజ ముక్కామల్ల (18 బంతుల్లో 25), మార్కస్ స్టొయినిస్ (22 బంతుల్లో 25) రాణించగా.. డొనోవాన్ ఫెరీరా (Donovan Ferreira) మెరుపు హాఫ్ సెంచరీ (20 బంతుల్లో 53) సాధించాడు. సేవేజ్ రెండు పరుగులతో డుప్లెసిస్తో కలిసి అజేయంగా నిలిచాడు.ఫలితంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో టెక్సాస్ సూపర్ కింగ్స్ కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి ఏకంగా 223 పరుగులు సాధించింది. ఎంఐ బౌలర్లలో జార్జ్ లిండే, రుషిల్ ఉగార్కర్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎంఐ న్యూయార్క్ 184 పరుగులకే కుప్పకూలింది.పొలార్డ్ అర్ధ శతకం వృథాఓపెనర్ క్వింటన్ డికాక్ (35), ఆరో నంబర్ బ్యాటర్ మైకేల్ బ్రేస్వెల్ (26) ఫర్వాలేదనిపించగా.. కీరన్ పొలార్డ్ అర్ధ శతకం (39 బంతుల్లో 70)తో అలరించాడు. అయితే, మిగతా వారి నుంచి వీరికి సహకారం అందలేదు. ఫలితంగా 20 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి ఎంఐ న్యూయార్క్ తొమ్మిది వికెట్లు నష్టపోయి 184 పరుగులు చేసింది. తద్వారా సూపర్ కింగ్స్ చేతిలో 39 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.సూపర్ కింగ్స్ బౌలర్లలో.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అకీల్ హుసేన్ మూడు వికెట్లతో చెలరేగగా.. నండ్రీ బర్గర్, మార్కస్ స్టొయినిస్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.ఇక ఈ సీజన్లో సూపర్ కింగ్స్కు ఏడింట ఇది ఐదో విజయం కాగా.. ఎంఐ న్యూయార్క్ మాత్రం ఏడింట ఒక్కటి మాత్రమే గెలిచింది. సూపర్ కింగ్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్నకు అర్హత సాధించగా.. ఎంఐ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది.𝐇𝐔𝐋𝐊 unleashed! 💥#TSKvMINY#WhistleForSuperKings#MLC2025pic.twitter.com/PX1OdzIdu1— Texas Super Kings (@TexasSuperKings) June 30, 2025 చదవండి: నితీశ్ రెడ్డి కాదు!.. శార్దూల్ స్థానంలో అతడే సరైనోడు: భారత మాజీ క్రికెటర్ -
ఇకపై మళ్లీ ఆడగలనా?
లండన్: భారత వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్ ఇప్పుడైతే మైదానంలో సెంచరీలు చేసి... పిచ్పై ఎగిరి గంతులేస్తూ... పల్టీలతో సంబరాలు చేసుకుంటున్నాడు. కానీ... రెండున్నరేళ్ల క్రితమైతే అతను ఇకపై క్రికెట్ ఆడనేమో అన్న కంగారులో మంచంపై ఉండిపోయాడు. 2022లో పంత్ ఘోరమైన ప్రమాదానికి గురయ్యాడు. ఆ ఏడాది డిసెంబర్ 30వ తేదీన ఢిల్లీ నుంచి సొంతూరు రూర్కీకి కారు నడుపుకుంటూ వెళ్తుండగా ఆ కారు అదుపుతప్పి వేగంగా డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ఘోరప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. దాదాపు ప్రాణంమీదికి తెచ్చుకున్నాడు. వెంటనే హాస్పిటల్కు తరలించగా... స్పృహలోకి రాగానే తొలుత క్రికెట్ కెరీర్ గురించే ఆందోళన చెందాడు. తనకు చికిత్స అందిస్తున్న డాక్టర్ దిన్షా పర్దివాలాతో ‘ఇకపై నేను మళ్లీ క్రికెట్ ఆడగలనా?’ అని ప్రశ్నించాడని ఆ డాక్టర్ వెల్లడించాడు. గతేడాది పారిస్ ఒలింపిక్స్లో భారత బృందానికి చీఫ్ మెడికల్ ఆఫీసర్గా వ్యవహరించిన ఈ సీనియర్ డాక్టర్ అప్పటి ప్రమాదం, తదనంతర చికిత్సపై ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన సంగతులివి... బతికి బట్టకట్టడమే గొప్ప ఘోరమైన ఆ ప్రమాదంలో రిషభ్ బతికి బట్టకట్టడమే పెద్ద అదృష్టం. మంచంపై అతన్ని మొదట చూసినప్పుడు... పంత్ కుడికాలు మామూలు స్థితిలోనే లేదు. అక్కడక్కడ విరిగి చాలావరకు జరిగిపోయింది. ఆ కాలి చీలమండకు పెద్ద గాయమే అయ్యింది. ఒళ్లంతా గాయాలే. ప్రమాదంలో చర్మం అంతా గీరుకొనిపోయింది. శరీరభాగాల్లో పెద్దగా రాసుకుపోయింది. మెడ నుంచి మోకాళ్ల వరకైతే పైచర్మమంతా చీరుకుపోయింది. కారు లోపలి నుంచి లాగే ప్రయత్నంలో పగిలిన అద్దాలు అతని వీపును, చర్మాన్ని లోపలిదాకా చీల్చాయి. ఇలాంటి పరిస్థితిలోని ఓ క్షతగాత్రుడు బ్రతకడమే కష్టం. పంత్ చాలా అదృష్టవంతుడు కాబట్టే బ్రతకడం కాదు... ఏకంగా తనకిష్టమైన ఆటను ఆడేస్తున్నాడు 635 రోజులపాటు... వెంటనే ఐసీయూలో చికిత్స, తదనంతరం మోకాలుకు పలుమార్లు ఆపరేషన్లు, రోజుల తరబడి క్రమం తప్పని ఫిజియోథెరపీ చికిత్స అతన్ని బతికించాయి. కానీ ఆడించాలంటే అది చాలదుగా... ఇంకా చేయాలి. అప్పటిదాకా వైద్యులు శ్రమించారు. అక్కడి నుంచి వైద్యులతో కలిసి పంత్ శ్రమించాల్సి వచ్చింది. అలా ఓ వారమో నెలనో కాదు... ఏకంగా 635 రోజులు అంటే దాదాపు రెండేళ్లపాటు సాగిన వైద్యచికిత్స, పునరావాస కార్యక్రమాలతోనే రిషభ్ ఓ పెషెంట్ నుంచి ఎప్పట్లాగే మళ్లీ క్రికెటర్ అయ్యాడు. నిజం చెప్పాలంటే అతని పోరాటం క్రీడాచరిత్రలో నిలిపోయే పాఠమని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఘోరమైన ప్రమాదాల్లో మరణాలే ఎక్కువగా సంభవిస్తాయి. రక్తనాళాలు పని చేయడంవల్లే... ప్రమాదం తీవ్రత వల్ల అతని మోకాలు నుంచి పాదం వరకు జరిగిపోవడంతో అక్కడక్కడ ఎముక స్నాయువులు విరిగాయి. ఇలాంటపుడు కండరాలు, ప్రధాన రక్తనాళాలు కూడా తెగిపోయి రక్తసరఫరా ఆగిపోతుంది. దీంతో కాలు తీసేయాల్సిన పరిస్థితి రావడం సహజం. కానీ అదృష్టమేమిటంటే... ఇంత జరిగినా కూడా అతని రక్తనాళాలేవీ గాయపపడలేదు. తెగలేదు. దీనివల్లే అతని కాలు తీసేయాల్సిన దుస్థితి రాలేదు. కాలు తిరిగి యథాతథ స్థితికి వచ్చేందుకు, నడిచేందుకు, ఇప్పుడైతే ఆడేందుకు పనిచేస్తుందంటే దీనికంతటికి ప్రధాన కారణం బలమైన రక్తనాళాలే! ఇది ఎంతో అదృష్టముంటేగానీ జరగదు. వాళ్ల అమ్మయితే నడుస్తాడా అని విలపించింది రిషభ్ తాను మళ్లీ క్రికెట్ ఆడగలనా అని ప్రశ్నిస్తే... అతడి పరిస్థితిని చూసిన వాళ్ల అమ్మయితే ‘నా కొడుకు అసలు నడవగలడా’ అని విలపించింది. దీంతో అప్పుడు గాయాల తీవ్రత గురించి వివరించాను. మళ్లీ మోకాలు పునర్నిర్మాణానికి ఉన్న అవకాశాల్ని చెప్పాను. ఆ తర్వాతే ఏదైనా ఆశించవచ్చని బదులిచ్చాను. 2023 జనవరి 6న నిష్ణాతులైన ఆర్థోపెడిక్ వైద్య బృందం నాలుగు గంటలపాలు తొలి సర్జరీని విజయవంతంగా పూర్తి చేసింది.మూడు చోట్ల ఎముక స్నాయువుల్ని సరిచేసింది. మామూలుగా విరిగిన చోట్ల చికిత్స చేసింది. కొన్నివారాల తర్వాత కూడా అతను సొంతంగా తన పళ్లను బ్రష్ చేసుకోలేకపోయాడు. చేతులకు అయిన గాయాలు, చర్మంలోతుగా అయిన గాట్లతో చేతుల్ని కూడా సాధారణంగా కదిలించలేకపోయాడు. మెల్లమెల్లగా నీళ్లు తాగడంతో మొదలుపెట్టి... తర్వాత తర్వాత అన్ని పనులు అలవాటు చేసుకున్నాడు.హ్యాట్రిక్ మిరాకిల్స్ వల్లే...సర్జరీ, తదనంతరం పరిస్థితిని సమీక్షించిన మీదటే పంత్ తల్లికి అతను నడవగలడనే ధైర్యమిచ్చాం. ఇక అతను మాత్రం ఇంతటి ఘోరమైన ప్రమాదంలో జీవించి ఉండటమే అద్భుతమని, కాలు తిరిగి సాధారణ స్థితిలో నడవడం, పరుగెత్తడం మరో అద్భుతమని చెప్పాను. ఇక క్రికెట్ ఆడటమైతే మూడో మిరాకిల్ అని అతని ధైర్యాన్ని పెంచాను. తను కూడా ఆత్మస్థయిర్యంతో మెలిగాడు. తనకెంతో ఇష్టమైన క్రికెట్ కోసం తిరిగి పునరాగమనం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషిచేశాడు. అందువల్లే బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి తర్వాత మైదానంలోకి వచ్చి యథేచ్ఛగా ఆడగలుగుతున్నాడు. అయితే సెంచరీ చేశాక ఉత్సాహంతో పంత్ మైదానంలో పల్టీలు కొడుతున్నాడు. ఈ విన్యాసాలు చేయకపోతేనే మంచిదని సలహా ఇస్తున్నా. -
టీమిండియా చేతిలో దారుణ ఓటమి.. ఇంగ్లండ్ జట్టుకు మరో షాక్
నాటింగ్హమ్ వేదికగా నిన్న (జూన్ 28) జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్పై భారత మహిళల క్రికెట్ జట్టు 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్లో స్మృతి మంధన విధ్వంసకర శతకం (62 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 112 పరుగులు) సాధించి టీమిండియాను గెలిపించింది. ఈ సెంచరీతో మంధన మూడు ఫార్మాట్లలో శతకాలు చేసిన తొలి భారత మహిళా ప్లేయర్గా చరిత్ర సృష్టించింది. మంధన కేవలం 51 బంతుల్లోనే సెంచరీ మార్క్ను అందుకుంది. తద్వారా మహిళల టీ20ల్లో ఐదో ఫాస్టెస్ట్ సెంచరీని, భారత్ తరఫున రెండో ఫాస్టెస్ట్ సెంచరీని (హర్మన్-49 బంతుల్లో) నమోదు చేసింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. మంధన శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. అనంతరం 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. భారత బౌలర్ల ధాటికి కేవలం 113 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కడప అమ్మాయి శ్రీచరణీ నాలుగు వికెట్లతో సత్తాచాటింది. ఆమెతో పాటు దీప్తీ శర్మ, రాధా యాదవ్ తలో రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ సీవర్ బ్రంట్(66) టాప్ స్కోరర్గా నిలిచింది.ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్కు మరో షాక్ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్కు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు మ్యాచ్ ఫీజ్లో 10 శాతం జరిమానాగా విధించబడింది. నిర్ణీత సమయంలోగా ఇంగ్లండ్ రెండు ఓవర్లు వెనుకపడింది. ఓవర్కు 5 శాతం చొప్పున ఐసీసీ 10 శాతం మ్యాచ్ ఫీజ్ను జరిమానాగా విధించింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఇది ఆర్టికల్ 2.22 నిబంధన ఉల్లంఘన కిందికి వస్తుంది. ఐసీసీ జరిమానాను ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ స్వీకరించింది. ఇంగ్లండ్ జట్టులోకి సభ్యులందరికీ ఈ జరిమానా వర్తిస్తుంది.కాగా, ఇంగ్లండ్ మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో ఇదే అతి పెద్ద ఓటమి. టీ20ల్లో ఇంగ్లండ్పై 200 ప్లస్ స్కోర్ చేసిన రెండో జట్టుగా భారత్ రికార్డుల్లోకెక్కింది. రెండో టీ20 బ్రిస్టల్ వేదికగా జులై 1న జరుగనుంది. -
అద్భుతమైన సెంచరీ.. ఆండీ ఫ్లవర్ తర్వాతి స్థానంలో సీన్ విలియమ్స్
బులవాయో వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్లో జింబాబ్వే వెటరన్ బ్యాటర్ సీన్ విలియమ్స్ అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. జట్టు కష్టాల్లో (23/2) ఉన్నప్పుడు బరిలోకి దిగి 121 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. 38 ఏళ్ల విలియమ్స్కు టెస్ట్ల్లో ఇది ఆరో శతకం. సెంచరీ అనంతరం కూడా విలియమ్స్ పోరాటం కొనసాగిస్తూ జింబాబ్వేను గౌరవప్రదమైన స్కోర్ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. విలియమ్స్ ప్రస్తుతం 134 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా మసెకెస (4) క్రీజ్లో ఉన్నాడు. రెండో రోజు మూడో సెషన్ సమయానికి జింబాబ్వే 7 వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసింది. ఆ జట్టు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 176 పరుగులు వెనుకపడి ఉంది. జింబాబ్వే ఇన్నింగ్స్లో కైటానో 0, వెల్చ్ 4, క్రెయిగ్ ఎర్విన్ 36, వెస్లీ మెదెవెరె 15, మసౌరే 7, ట్సిగా 9, మసకద్జ 4 పరుగులు చేసి ఔట్ కాగా.. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (19) రిటైర్ట్ హర్ట్గా (తలకు గాయం) వెనుదిరగాడు. బెన్నెట్ ఈ మ్యాచ్లో తిరిగి బరిలోకి దిగడు. అతని స్థానంలో మసౌరేను కన్కషన్ సబ్స్టిట్యూట్గా ప్రకటించింది జింబాబ్వే మేనేజ్మెంట్. సౌతాఫ్రికా బౌలర్లలో యూసఫ్ కోడి, వియాన్ ముల్దర్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. కేశవ్ మహారాజ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. లుహాన్ డ్రి ప్రిటోరియస్ (153), కార్బిన్ బాష్ (100 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కారు. డెవాల్డ్ బ్రెవిస్ (51) మెరుపు అర్ద సెంచరీతో రాణించారు.మిగతా ఆటగాళ్లలో టోని డి జోర్జి 0, బ్రీట్జ్కీ 13, ముల్దర్ 17, బెడింగ్హమ్ 0, వెర్రిన్ 10, కెప్టెన్ కేశవ్ మహారాజ్ 21, కోడి యూసఫ్ 27, మఫాకా 9 (నాటౌట్) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ 4, ముజరబానీ 2, మసరద్జ, మసెకెస తలో వికెట్ తీశారు.ప్లవర్ సరసన విలియమ్స్ఈ మ్యాచ్లో సెంచరీతో విలియమ్స్ జింబాబ్వే మాజీ ఆటగాళ్లు గ్రాంట్ ఫ్లవర్, బ్రెండన్ టేలర్ సరసన చేరాడు. ఫ్లవర్, టేలర్, విలియమ్స్ టెస్ట్ల్లో తలో ఆరు సెంచరీలు చేసి జింబాబ్వే తరఫున ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. టెస్ట్ల్లో జింబాబ్వే తరఫున అత్యధిక సెంచరీల రికార్డు ఆండీ ఫ్లవర్ పేరిట ఉంది. -
సౌతాఫ్రికా క్రికెట్లో సరికొత్త అధ్యాయం.. చరిత్ర సృష్టించిన కేశవ్ మహారాజ్
సౌతాఫ్రికా క్రికెట్లో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఆ దేశం తరఫున తొలిసారి ఓ స్పిన్నర్ టెస్ట్ల్లో 200 వికెట్లు తీశాడు. సౌతాఫ్రికా తరఫున 200 టెస్ట్ వికెట్ల మార్కును ఇప్పటివరకు ఏ స్పిన్నర్ తాకలేదు. ఆ దేశం తరఫున 200కు పైగా టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్లంతా ఫాస్ట్ బౌలర్లే. సౌతాఫ్రికా తరఫున టెస్ట్ల్లో 200 వికెట్లు తీసిన తొలి స్పిన్ బౌలర్గా కేశవ్ మహారాజ్ రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్లో కేశవ్ ఈ ఘనత సాధించాడు. జింబాబ్వే కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ వికెట్ కేశవ్కు 200వ టెస్ట్ వికెట్. కేశవ్ తర్వాత టెస్ట్ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్లుగా టేఫీల్డ్ (170), పాల్ ఆడమ్స్ (134), పాల్ హ్యారిస్ (103), నికీ బోయే (100) ఉన్నారు. ఓవరాల్గా టెస్ట్ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా డేల్ స్టెయిన్ (439) ఉన్నాడు. అతని తర్వాత షాన్ పోలాక్ (421), ఎన్తిని (390), రబాడ (336), డొనాల్డ్ (330), మోర్కెల్ (309), కల్లిస్ (291), ఫిలాండర్ (224) 200 కంటే ఎక్కువ వికెట్లు తీసిన వారిలో ఉన్నారు. వీరంతా ఫాస్ట్ బౌలర్లే.మ్యాచ్ విషయానికొస్తే.. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బులవాయో వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్లో రెండో రోజు ఆట కొనసాగుతుంది. రెండో సెషన్ సమయానికి జింబాబ్వే 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. బ్రియాన్ బెన్నెట్ (19) రిటైర్డ్ హర్ట్ కాగా.. కైటానో 0, వెల్చ్ 4, క్రెయిగ్ ఎర్విన్ 36 పరుగులకు ఔటయ్యారు. సీన్ విలియమ్స్ (81), వెస్లీ మెదెవెరె (15) క్రీజ్లో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో కోడి యూసఫ్ 2, కేశవ్ మహారాజ్ ఓ వికెట్ తీశారు.అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. లుహాన్ డ్రి ప్రిటోరియస్ (153), కార్బిన్ బాష్ (100 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కారు. డెవాల్డ్ బ్రెవిస్ (51) మెరుపు అర్ద సెంచరీతో రాణించారు.మిగతా ఆటగాళ్లలో టోని డి జోర్జి 0, బ్రీట్జ్కీ 13, ముల్దర్ 17, బెడింగ్హమ్ 0, వెర్రిన్ 10, కెప్టెన్ కేశవ్ మహారాజ్ 21, కోడి యూసఫ్ 27, మఫాకా 9 (నాటౌట్) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ 4, ముజరబానీ 2, మసరద్జ, మసెకెస తలో వికెట్ తీశారు. -
ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి రికార్డు సెంచరీ చేసిన సౌతాఫ్రికా ప్లేయర్
బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్లో సౌతాఫ్రికా ఆటగాడు కార్బిన్ బాష్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు దిగి సెంచరీ చేశాడు. తద్వారా ఆ దేశ దిగ్గజాల సరసన రికార్డు బుక్కుల్లో చోటు దక్కించుకున్నాడు. గతంలో మార్క్ బౌచర్ (122 నాటౌట్), డాల్టన్ (117), ముర్రే (109), డేవ్ రిచర్డ్సన్ (109), విన్స్లో (108), జేపీ డుమిని (100 నాటౌట్) సౌతాఫ్రికా తరఫున టెస్ట్ల్లో ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగి సెంచరీలు చేశారు. జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్లో బాష్ తొలి ఇన్నింగ్స్లో 124 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో బాష్కు ముందు అరంగేట్రం ఆటగాడు లూహాన్ డ్రి ప్రిటోరియస్ (153) కూడా సెంచరీతో కదంతొక్కాడు. మరో అరంగేట్రం ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ (41 బంతుల్లో 51) మెరుపు అర్ద సెంచరీతో అలరించాడు.MAIDEN INTERNATIONAL HUNDRED FOR CORBIN BOSCH WHILE BATTING AT 8 🥶 pic.twitter.com/Md4Qv3DwNN— Johns. (@CricCrazyJohns) June 28, 2025ప్రిటోరియస్, బాష్ సెంచరీలతో సత్తా చాటడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో టోని డి జోర్జి 0, బ్రీట్జ్కీ 13, ముల్దర్ 17, బెడింగ్హమ్ 0, వెర్రిన్ 10, కెప్టెన్ కేశవ్ మహారాజ్ 21, కోడి యూసఫ్ 27, మఫాకా 9 (నాటౌట్) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ 4, ముజరబానీ 2, మసరద్జ, మసెకెస తలో వికెట్ తీశారు.అనంతరం బరిలోకి దిగిన జింబాబ్వే.. రెండో రోజు రెండో సెషన్ సమయానికి 2 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. సీన్ విలియమ్సన్ (56), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (30) క్రీజ్లో ఉన్నారు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్కు జింబాబ్వే ఇంకా 305 పరుగులు వెనుకపడి ఉంది. జింబాబ్వే ఇన్నింగ్స్లో బ్రియాన్ బెన్నెట్ 19 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ కాగా.. కైటానో 0, వెల్చ్ 4 పరుగులకు ఔటయ్యారు. అరంగేట్రం బౌలర్ కోడి యూసఫ్కు రెండు వికెట్లు దక్కాయి. కాగా, ఇటీవలే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్గా అవతరించిన సౌతాఫ్రికా తమ ద్వితియ శ్రేణి జట్టుతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటిస్తుంది. -
తొలి టెస్ట్లో ఆసీస్ చేతిలో ఘోర పరాజయం.. విండీస్ హెడ్ కోచ్కు భారీ షాక్
వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సామీకి ఐసీసీ భారీ షాకిచ్చింది. అంపైర్ నిర్ణయాలను విమర్శించినందుకు గానూ డిమెరిట్ పాయింట్తో పాటు జరిమానా విధించింది. అంపైర్ నిర్ణయాలను విమర్శించడం లేదా వ్యతిరేకించడం ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ లెవెల్-1 ఉల్లంఘన కిందికి వస్తుంది. దీంతో ఐసీసీ సామీపై చర్యలు తీసుకుంది.అసలేం జరిగిందంటే.. మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా జూన్ 25 నుంచి 27 మధ్య తేదీల్లో బార్బడోస్ వేదికగా విండీస్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ రెండో రోజు థర్డ్ అంపైర్ అడ్రియన్ హోల్డ్స్టాక్ తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. ఇందులో నాలుగు నిర్ణయాలు విండీస్కు వ్యతిరేకంగా వచ్చాయి. దీనిపై విలేకరుల సమావేశంలో విండీస్ హెడ్ కోచ్ డారెన్ సామీ మాట్లాడుతూ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. థర్డ్ అంపైర్ అడ్రియన్ హోల్డ్స్టాక్ తప్పుడు నిర్ణయాల వల్ల మ్యాచ్ తమ నుంచి చేజారిందని చెప్పుకొచ్చాడు. హోల్డ్స్టాక్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. నిర్ణయాలు తీసుకోవడంలో హోల్డ్స్టాక్ స్థిరత్వాన్ని ప్రశ్నించాడు. గతంలో కూడా హోల్డ్స్టాక్ ఇలాగే చేశాడని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో అంపైర్ తీరును బహిరంగంగా విమర్శించడం ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్టికల్ 2.7 ఉల్లంఘన కిందికి వస్తుంది.ఇందుకు గానూ సామీకి ఓ డిమెరిట్ పాయింట్తో పాటు మ్యాచ్ ఫీజ్లో 15 శాతం జరిమానా విధించారు. సామీ తన తప్పును ఒప్పుకోవడంతో అతనిని తదుపరి విచారణకు పిలువలేదు. సామీపై చర్యలు తీసుకున్న విషయాన్ని మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ వెల్లడించాడు.విండీస్ తొలి ఇన్నింగ్స్లో హోల్డ్స్టాక్ అప్పటికే క్రీజ్లో కుదురుకున్న షాయ్ హోప్, రోస్టన్ ఛేజ్ విషయంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడు. టీవీ రీప్లేలు ఈ ఇద్దరు నాటౌట్ అని చూపించినా హోల్డ్స్టాక్ ఔట్గా ప్రకటించాడు. హోప్, ఛేజ్ ఔట్ కావడం ఈ మ్యాచ్లో విండీస్పై భారీ ప్రభావం చూపించింది. తొలి ఇన్నింగ్స్లో ఈ ఇద్దరు రాణించినందుకు విండీస్కు స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.అయితే ఈ ఆధిక్యాన్ని విండీస్ వెంటనే కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్లో కుదురుగా ఆడిన ఆసీస్ బ్యాటర్లు భారీ స్కోర్ చేసి విండీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. ఛేదనలో పూర్తిగా చేతులెత్తేసిన విండీస్ 141 పరుగులకే ఆలౌటై 159 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఇరు జట్లతో పేసర్లు చెలరేగిపోవడంతో ఈ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. -
శివాలెత్తిన షిమ్రోన్ హెట్మైర్.. వరుసగా రెండో మ్యాచ్లో ఊచకోత
మేజర్ లీగ్ క్రికెట్ 2025 ఎడిషన్లో సియాటిల్ ఓర్కాస్ ఆటగాడు షిమ్రోన్ హెట్మైర్ చెలరేగిపోతున్నాడు. వరుసగా రెండు మ్యాచ్ల్లో విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడి తన జట్టును గెలిపించాడు. నిన్న ఎంఐ న్యూయార్క్పై చివరి బంతికి సిక్సర్ బాది ఓర్కాస్ను గెలిపించిన హెట్మైర్.. ఇవాళ (జూన్ 29) లాస్ ఏంజెలెస్ నైట్రైడర్స్పై కూడా అదే పని (19.5వ ఓవర్) చేశాడు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నైట్రైడర్స్.. రసెల్ (39 బంతుల్లో 65 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), రోవ్మన్ పావెల్ (21 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సైఫ్ బదార్ (21 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.భారీ లక్ష్య ఛేదనలో రెండో బంతికే వికెట్ (జోష్ బ్రౌన్ 0) కోల్పోయిన ఓర్కాస్.. షయాన్ జహంగీర్ (31 బంతుల్లో 43; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆరోన్ జోన్స్ (38 బంతుల్లో 73; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), హెట్మైర్ (26 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో మరో బంతి మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. హెట్మైర్ 19వ ఓవర్ ఐదో బంతికి సిక్సర్ బాది తన జట్టును వరుసగా రెండో మ్యాచ్లో గెలిపించాడు.ఈ మ్యాచ్లో 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన హెట్మైర్.. మేజర్ లీగ్ చరిత్రలో రెండో వేగవంతమైన అర్ద సెంచరీని నమోదు చేశాడు. ఎంఎల్సీలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు ఎంఐ న్యూయార్క్ ఆటగాడు నికోలస్ పూరన్ పేరట ఉంది. పూరన్ 2023 ఎడిషన్లో కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.ఈ మ్యాచ్లో 203 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఓర్కాస్ లీగ్ చరిత్రలో ఐదో అత్యధిక లక్ష్య ఛేదనను నమోదు చేసింది. ఈ గెలుపుతో ఓర్కాస్ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, వాషింగ్టన్ ఫ్రీడం ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్లు ఖరారు చేసుకున్నాయి. -
అరంగేట్రంలో అదుర్స్.. ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన కడప అమ్మాయి
భారత యువ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీ చరణి తన అంతర్జాతీయ టీ20 కెరీర్ను ఘనంగా ఆరంభించింది. కడపకు చెందిన నల్లపురెడ్డి శ్రీచరణి.. శనివారం ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో భారత తరపున అరంగేట్రం చేసింది. ఇప్పటికే వన్డేల్లో తన సత్తాను నిరూపించుకున్న ఈ తెలుగు అమ్మాయి..ఇప్పుడు టీ20ల్లో కూడా తన మార్క్ చూపింది.నాటింగ్హామ్ వేదికగా ఇంగ్లండ్తో మొదటి టీ20లో చరణి అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. తన స్పిన్ మయాజాలంతో ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టింది. ఈ మ్యాచ్లో 3.5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చసిన చరణి.. కేవలం 12 పరుగులిచ్చి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకుంది. తద్వారా 212 పరుగుల భారీ లక్ష్య చేధనలో ప్రత్యర్ధి జట్టు కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలో శ్రీ చరణి ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది.రెండో ప్లేయర్గా..అంతర్జాతీయ అరంగేట్రంలో భారత మహిళల జట్టు తరపున రెండువ అత్యత్తుమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన ప్లేయర్గా చరణి నిలిచింది. ఈ జాబితాలో అగ్రస్ధానంలో స్రవంతి నాయుడు ఉంది. 2014లో కాక్స్ బజార్ వేదికగా బంగ్లాదేశ్పై తన డెబ్యూ మ్యాచ్లో స్రవంతి తన 4 ఓవర్ల కోటాలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు సాధించింది. వీరిద్దరి తర్వాతి స్ధానంలో పూనమ్ యాదవ్ ఉంది. 2013లో వడోదర వేదికగా బంగ్లాదేశ్పై పూనమ్ తన అరంగేట్ర మ్యాచ్లో 21 పరుగులిచ్చి మూడో ప్లేయర్గా నిలిచింది. కాగా ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ను భారత మహిళల జట్టు 97 పరుగులతో చిత్తు చేసింది.చదవండి: 86 సెంచరీలు, 185 హాఫ్ సెంచరీలు చేసిన లెజెండ్ కన్ను మూత -
86 సెంచరీలు, 185 హాఫ్ సెంచరీలు చేసిన లెజెండ్ కన్ను మూత
ఇంగ్లండ్ క్రికెట్లో విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు మాజీ ప్లేయర్, నార్తాంప్టన్షైర్ లెజెండ్ వేన్ లార్కిన్స్(71) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడతున్న ఆయన.. శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. యూకేలోని బెడ్ఫోర్డ్షైర్కు చెందిన లార్కిన్స్.. 1979 మరియు 1991 మధ్య 13 టెస్టులు, 25 వన్డేలు ఇంగ్లండ్ తరపున ఆడాడు.1979 ప్రపంచ కప్ రన్నరప్గా నిలిచిన ఇంగ్లండ్ జట్టులో లార్కిన్స్ భాగంగా ఉన్నారు. అదేవిధంగా 1989-90 వెస్టిండీస్ పర్యటనలో ఇంగ్లండ్కు అద్బుతమైన విజయాలను అందించాడు. 1989లో హైదరాబాద్లో ఆస్ట్రేలియాపై లార్కిన్స్(124) సంచలన సెంచరీతో మెరిశాడు.ఓవరాల్గా ఇంగ్లండ్ తరపున ఆయన 1084 పరుగులు చేశాడు. అయితే 1982లో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆదేశాలను ఉల్లంఘించి దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన జట్టులో లార్కిన్స్ సభ్యునిగా ఉన్నాడు. దీంతో ఆయనపై మూడు సంవత్సరాలు నిషేధం విధించారు. లేదంటే లార్కిన్స్ మరిన్ని మ్యాచ్లలో ఇంగ్లండ్కు ప్రాతినిథ్యం వహించేవాడు.కానీ ఫస్ట్ క్లాస్ క్రికెట్, లిస్ట్-ఎ క్రికెట్లో మాత్రం ఆయనకు అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. డిమాస్టిక్ క్రికెట్లో లార్కిన్స్ పేరిట 85 సెంచరీలు, 182 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రెండు ఫార్మాట్లు కలిపి 40,736 పరుగులు సాధించారు. అటు బౌలింగ్లోనూ 119 పడగొట్టారు. ఆయన మృతి పట్ల ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంతాపం వ్యక్తం చేసింది.చదవండి: SA vs ZIM: చరిత్ర సృష్టించిన బేబీ ఏబీడీ.. అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డు -
5 వికెట్లతో చెలరేగిన ఆసీస్ యువ సంచలనం.. ప్లే ఆఫ్స్కు మాక్స్వెల్ టీమ్
మేజర్ లీగ్ క్రికెట్ (Major League Cricket) 2025 టోర్నీలో వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు ప్లేఆఫ్స్కు ఆర్హత సాధించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం డల్లాస్ వేదికగా శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్తో జరిగిన మ్యాచ్లో 12 పరుగుల తేడాతో విజయం సాధించిన వాషింగ్టన్.. తమ ప్లే ఆఫ్ బెర్త్ను ఖారారు చేసుకుంది.ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ జట్టు 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (58), జాక్ ఎడ్వార్డ్స్ (42), పియెనార్(30) రాణించారు. శాన్ ఫ్రాన్సిస్కో బౌలర్లలో జేవియర్ బెర్ట్లెట్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. హారీస్ రవూఫ్, షెఫర్డ్ తలా వికెట్ సాధించారు.ఐదేసిన ఓవెన్..ఇక బ్యాటింగ్లో విఫలమైన వాషింగ్టన్ స్టార్ ఆల్రౌండర్, ఆసీస్ యువ సంచలనం మిచెల్ ఓవెన్ (Mitchell Owen) బౌలింగ్లో మాత్రం సత్తాచాటాడు. ఐదు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి ఓటమిని శాసించాడు. లక్ష్య చేధనలో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ 9 వికెట్లు కోల్పోయి నిర్ణీత ఓవర్లలో 157 పరుగులకు పరిమితమైంది.వాషింగ్టన్ బౌలర్లలో ఓవెన్తో పాటు రచిన్ రవీంద్ర, ఎడ్వర్డ్స్,హోలండ్ తలా వికెట్ సాధించారు. శాన్ ఫ్రాన్సిస్కో బ్యాటర్లలో కెప్టెన్ మాథ్యూ షార్ట్ (67; 40 బంతుల్లో) మాత్రమే రాణించాడు. కాగా శాన్ ఫ్రాన్సిస్కో జట్టు ఇప్పటికే తమ ప్లే ఆఫ్ బెర్త్ను ఖారారు చేసుకుంది. మరో రెండు స్ధానాల కోసం టెక్సాస్ సూపర్ కింగ్స్, సియాటిల్ ఓర్కాస్, ఎంఐ న్యూయార్క్, లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ మధ్య పోటీనెలకొంది.చదవండి: SA vs ZIM: చరిత్ర సృష్టించిన బేబీ ఏబీడీ.. అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డు -
చరిత్ర సృష్టించిన బేబీ ఏబీడీ.. అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డు
తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) టైటిల్ను గెలుచుకున్న దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు.. ప్రస్తుతం రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు బులవాయోలోని క్వీన్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా శనివారం(జూన్ 28) నుంచి ప్రారంభమైంది.తొలి రోజు ఆటలో సఫారీ బ్యాటర్లు సత్తాచాటారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసింది. సఫారీ బ్యాటర్లలో అరంగేట్ర ఆటగాళ్లు లువాన్-డ్రి ప్రిటోరియస్(153), బాష్(100 బ్యాటింగ్) సెంచరీలతో చెలరేగగా.. డెవాల్డ్ బ్రెవిస్( 41 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీతో మెరిశాడు.అరంగేట్రంలోనే బ్రెవిస్ ఓ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. డెబ్యూ టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా బ్రెవిస్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో బేబీ ఏబీడీ కేవలం 38 బంతుల్లోనే ఆర్ధ శతకం సాధించాడు. బ్రెవిస్ కంటే ముందు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ టిమ్ సౌథీ తన డెబ్యూ టెస్టులో 29 బంతులు, ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతల్ 37 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. కానీ ఈ రెండు హాఫ్ సెంచరీలు కూడా రెండో ఇన్నింగ్స్లో వచ్చినవే కావడం గమనార్హం.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్తో రెండో టెస్టు.. టీమిండియాకు గుడ్ న్యూస్! వీడియో వైరల్ -
సెప్టెంబర్ 10 నుంచి ఆసియా కప్..! భారత్-పాక్ మ్యాచ్ ఉంటుందా?
సెప్టెంబర్లో ఆసియా కప్.. భారత్-పాక్ మ్యాచ్ ఉంటుందా?క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఆసియాకప్-2025 సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ జూలై మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు క్రిక్బజ్ తమ రిపోర్ట్లో పేర్కొంది.వాస్తవానికి టీ20 ఫార్మాట్లో జరగనున్న ఈ మెగా ఈవెంట్కు భారత్ ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో జరిగిన ఒప్పందం ప్రకారం.. పాక్ తమ మ్యాచ్లను యూఏఈలో ఆడనుంది. కానీ ఇప్పుడు మ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య రాజీకీయ ఉద్రిక్తలు మరింత పెరిగాయి.దీంతో ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ పాల్గోంటుందా? ఒకవేళ పాల్గోన్న భారత్ దాయాది జట్టుతో ఆడుతుందా అన్నది ఇంకా ప్రశ్నార్ధకంగానే ఉంది. ఈ విషయాలపై మరి కొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశముంది. ఈ మెగా టోర్నీలో పాల్గోనే ఆరు జట్లలో అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, యూఎఈ ఉన్నాయి.ప్రభుత్వం నిర్ణయమే ఫైనల్..కాగా పాకిస్తాన్తో ఉద్రిక్తల కారణంగా ఆసియాకప్ నుంచి వైదొలగాలని భారత్ నిర్ణయించుకుందని తొలుత వార్తలు వినిపించాయి. ఈ వార్తలను కార్యదర్శి దేవజిత్ సైకియా ఖండించారు. అవన్నీ ఆ వాస్తవమని, తాము ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అని సైకియా కొట్టిపారేశారు. తాజాగా మరో బీసీసీఐ సీనియర్ ఆధికారి కూడా ఇదే విషయాన్ని స్ఫష్టం చేశారు."ఆసియాకప్లో పాల్గోకపోవడం లేదా మ్యాచ్లను బాయ్కట్ చేయడం గురుంచి ఎటువంటి చర్చ కూడా జరగలేదు. ఐసీసీ ఈవెంట్లలో మేము పాకిస్తాన్తో ఆడుతాము. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మేము నడుచుకుంటాము.ఒకవేళ గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ రాకపోతే అందుకు తగ్గట్టు నిర్ణయం తీసుకుంటాము. ఈ టోర్నీకి సంబంధించి రాబోయే రోజుల్లో మాకు ఒక క్లారిటీ వస్తోంది" అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్సైడ్ స్పోర్ట్తో పేర్కొన్నారు. -
ఇంగ్లండ్తో రెండో టెస్టు.. టీమిండియాకు గుడ్ న్యూస్! వీడియో వైరల్
భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు జూలై 2 నుంచి బర్మింగ్హామ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ కీలక మ్యాచ్కు ముందు టీమిండియాకు కాస్త ఊరట లభించింది. శనివారం జరిగిన నెట్ ప్రాక్టీస్ సెషన్లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా పాల్గోన్నాడు.శుక్రవారం జరిగిన మొదటి ప్రాక్టీస్ సెషన్కు దూరంగా ఉన్న బుమ్రా.. రెండో రోజు మాత్రం దాదాపు ఆరగంట పాటు బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. రెండో టెస్టుకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో బుమ్రా తిరిగి మళ్లీ నెట్స్లో కన్పించడం ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.అయితే రెండవ టెస్ట్లో బుమ్రా పాల్గొనడంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో తమ రిపోర్ట్లో పేర్కొంది. కాగా ఈ సిరీస్కు ముందే బుమ్రా కేవలం మూడు మ్యాచ్లలో మాత్రమే ఆడతాడని టీమిండియా మెనెజ్మెంట్ స్పష్టం చేసింది.కానీ ఏ మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఒకవేళ రెండో టెస్టుకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని టీమ్ యాజమాన్యం భావిస్తే.. వారి నిర్ణయాన్ని మార్చుకునే అవకాశముంది. ఎందుకంటే తొలి టెస్టులో ఓటమి పాలైన భారత్కు.. బర్మింగ్హామ్ టెస్టు చాలా కీలకం. ఈ మ్యాచ్లో గెలిస్తే సిరీస్ 1-1 సమమవుతోంది. అదే ఓడిపోతే 0-2తో టీమిండియా వెనకబడుతోంది. కాబట్టి రెండో టెస్టులో ఆడించి బుమ్రాకు మూడో టెస్టుకు విశ్రాంతి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు గంభీర్ అండ్ కో ఉన్నట్లు సమాచారం. బుమ్రా విషయంలో మరి ఏ నిర్ణయం తీసుకుంటారో మరో మూడు రోజులు వేచి చూడాలి.కాగా రెండో రోజు ప్రాక్టీస్కు టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్, యశస్వి జైశ్వాల్, రిషబ్ పంత్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాక్టీస్లో మాత్రం భారత జట్టు ఫీల్డింగ్, ఫిట్నెస్ డ్రిల్స్పై ఎక్కువగా దృష్టిసారించింది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. తొలి భారత ప్లేయర్గాBoom Time! 💣 pic.twitter.com/AhXEZg2ven— Sahil Malhotra (@Sahil_Malhotra1) June 28, 2025