Cricket
-
IPL 2026: గ్రీన్ నుంచి పైసా వసూల్కు సిద్దమైన కేకేఆర్
ఐపీఎల్ 2026లో భాగంగా రేపు (ఏప్రిల్ 2) సన్రైజర్స్తో జరుగబోయే మ్యాచ్కు ముందు కేకేఆర్కు గుడ్ న్యూస్ అందుతుంది. ఆ జట్టు అత్యంత ఖరీదైన ఆటగాడు కెమరూన్ గ్రీన్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. Cameron Green has resumed bowling in nets. pic.twitter.com/YaJJPHKyky— Mufaddal Vohra (@mufaddal_vohra) April 1, 2026గ్రీన్ను కేకేఆర్ యాజమాన్యం ఆల్రౌండర్ కోటా రూ. 25 కోట్ల భారీ మొత్తం వచ్చించి కొనుగోలు చేసింది. అయితే గాయం కారణంగా అతను కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తాడని తెలిసి కేకేఆర్ అభిమానులు చాలా ఫీలయ్యారు. అంత భారీ మొత్తం వెచ్చించి కేవలం బ్యాటింగ్ మాత్రమే ఏంటని బహిరంగ విమర్శలు చేశారు.గత మ్యాచ్లో (ముంబై ఇండియన్స్) గ్రీన్ బౌలింగ్ చేయకపోవడం కేకేఆర్ను మ్యాచ్ కోల్పోయేలా చేసిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్ తర్వాత గ్రీన్ జాతీయ జట్టు క్రికెట్ బోర్డు క్రికెట్ ఆస్ట్రేలియా ముందుకొచ్చి అతనికి మద్దతుగా నిలబడింది. గ్రీన్కు శస్త్రచికిత్స జరిగింది. అతను మరికొంతకాలం కేవలం బ్యాటర్గా మాత్రమే కొనసాగుతాడని సర్ద చెప్పే ప్రయత్నం చేసింది. ఈ విషయాన్ని కేకేఆర్ యాజమాన్యానికి ముందే చెప్పామని వివరణ ఇచ్చింది. మరో 10-12 రోజుల్లో గ్రీన్ బౌలింగ్ ప్రారంభిస్తాడని ఓ ప్రకటన విడుదల చేసింది.అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ, ఈ ప్రకటన వెలువడని రెండు రోజుల్లోనే గ్రీన్ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఇది ఒక రకంగా కేకేఆర్కు శుభవార్తే అయినప్పటికీ.. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఆస్ట్రేలియాకు ఇబ్బందికరమైన విషయం. గ్రీన్ హడావుడిగా బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టడానికి కేకేఆర్ యాజమాన్యం ఒత్తిడి కారణమని తెలుస్తుంది. వారు కూడా ఈ విషయంలో తమ అభిమానుల డిమాండ్ల ముందు తలొగ్గాల్సి వచ్చింది.గ్రీన్ బౌలింగ్ విషయమై కేకేఆర్ అభిమానుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంది. అతను కేవలం బ్యాటింగ్ మాత్రమే చేసేందుకు వారు ససేమిరా అంటున్నారు. ఆటగాళ్ల విషయం ఫ్రాంచైజీ వ్యక్తిగతమే అయినా, ఇలాంటి విషయాల్లో అభిమానుల మనోభావాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వారు కూడా జట్టు గెలుపు కోసమే తహతహలాడుతుంటారు కాబట్టి, ఆటగాళ్లపై ఒత్తిడి తప్పదు.ఏదిఏమైనా గ్రీన్ బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించడం కేకేఆర్కు శుభపరిణామం. తొలి మ్యాచ్లో ఆ జట్టు 220 పరుగుల భారీ స్కోర్ చేసి కూడా సరైన బౌలింగ్ వనరులు లేకపోవడం చేత దాన్ని కాపాడుకోలేకపోయింది. రేపటి సన్రైజర్స్ మ్యాచ్లో గ్రీన్ బౌలింగ్ చేస్తే, ఆ జట్టు విజయావకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంటుంది. -
నసీమ్ షాకు రూ.67 లక్షల ఫైన్.. పీసీబీపై యూనిస్ ఖాన్ ఫైర్
పాకిస్తాన్ స్టార్ పేసర్ నసీమ్ షాకు ఆ దేశ క్రికెట్ బోర్డు రూ.67 లక్షల భారీ జరిమానా విధించిన సంగతి తెలిసిందే. పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ను ఉద్దేశించి సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యల కారణంగా పీసీబీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. అయితే పీసీబీ తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర చర్చకు దారితీసింది. తాజాగా ఈ చర్యపై పాక్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ అసహనం వ్యక్తం చేశాడు. ఇటువంటి చర్యలు ఆటగాళ్లను మానసికంగా దెబ్బతీస్తాయని యూనిస్ మండిపడ్డాడు.అసలు ఏం జరిగిందంటే?మార్చి 27న లాహోర్లోని గడ్డాఫీ స్టేడియంలో జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభ మ్యాచ్కు పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ హాజరయ్యారు. దీన్ని నసీమ్ తప్పుపడుతూ.. ‘‘ఆమెను లార్డ్స్లో రాణిలా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు?’’ అని మరియంను ఉద్దేశించి వ్యంగ్యంగా ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశాడు. వెంటనే అతడు ఆ పోస్టను తొలిగించినప్పటికి, పీసీబీ మాత్రం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. పీసీబీ క్రమశిక్షణ కమిటీ కేవలం మూడు రోజుల్లోనే విచారణ పూర్తి చేసి నసీమ్ షాకు 20 మిలియన్ల పాక్ రూపాయల జరిమానా విధించింది. ఈ క్రమంలోనే పీసీబీ నిర్ణయాన్ని యూనిస్ తప్పుబట్టాడు.నసీమ్ షా ఆ ట్వీట్కు క్షమాపణ కూడా చెప్పాడు. తన సోషల్ మీడియా మేనేజర్ పొరపాటున చేశాడని నసీమ్ ఇప్పటికే వివరణ ఇచ్చాడు. వెంటనే అతడిని ఉద్యోగం నుంచి కూడా తప్పించాడు. అలాంటప్పుడు హెచ్చరికతో వదిలేయాల్సింది. లేదంటే తక్కువ మొత్తంలో జరిమానా విధించాల్సింది. ఇటువంటి చర్యలు ఆటగాళ్లను నిరుత్సాహపరుస్తాయి అని యూనిస్ పేర్కొన్నాడు.చదవండి: KKR vs SRH: సన్రైజర్స్ తుది జట్టు ఇదే.. రూ.13 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్? -
గొయెంకా-రాహుల్ వివాదంపై స్పందించిన షమీ
లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా, ఆ ఫ్రాంచైజీ మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్ మధ్య ఐపీఎల్ 2024 ఎడిషన్లో జరిగిన సంఘటనపై ఆ ఫ్రాంచైజీ తాజా రిక్రూటీ మహ్మద్ షమీ స్పందించాడు. తాజాగా ఓ పోడ్కాస్ట్లో మాట్లాడుతూ, గోయెంకాను సమర్థించాడు.షమీ మాటల్లో.. గొయెంకా గారిని రెండు, మూడు సార్లు కలిశాను. ఎప్పుడూ చాలా లాజికల్గా, జట్టు గురించి మాత్రమే మాట్లాడారు. తన జట్టుపై పొజెసివ్గా ఉంటే తప్పేముంది. పెట్టుబడి పెట్టాక, ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ఆటతీరు ఆశించడం సహజం. తమ డబ్బు వృథా అవుతుందేమో అని ఎవరైనా ఆందోళన చెందుతారు.వివాదం నేపథ్యంఐపీఎల్ 2024 ఎడిషన్లో సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర పరాజయం పాలైంది. 165 పరుగుల లక్ష్యాన్ని SRH కేవలం 9.4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఛేదించింది. మ్యాచ్ అనంతరం గోయెంకా మైదానంలో అందరూ చూస్తుండగా కేఎల్ రాహుల్ను దండించాడు. దీనికి సంబంధించిన వీడియోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. ఎంత యజమాని అయితే మాత్రం, ఓ కెప్టెన్ను అలా పబ్లిక్గా విమర్శించడం సరైంది కాదని చాలామంది అభిప్రాయపడ్డారు. అయితే, అందుకు భిన్నంగా షమీ స్పందించడం చర్చనీయాంశమైంది.ఎల్ఎస్జీలోకి షమీఐపీఎల్ 2026కి ముందు షమీ SRH నుంచి LSGకి ట్రేడ్ అయ్యాడు. SRH ఆయనను IPL 2025లో రూ.10 కోట్లకు కొనుగోలు చేయగా.. అదే ధరకు LSG అతన్ని ట్రేడ్ చేసుకుంది. ఐపీఎల్ 2013లో కేకేఆర్ తరఫున అరంగేట్రం చేసిన షమీ.. Delhi Capitals, Punjab Kings, Gujarat Titans, SRH తరఫున ఆడాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున అతను 2022, 2023 సీజన్లలో వరుసగా 20, 28 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2026లో ఎల్ఎస్జీ ఇవాళ (ఏప్రిల్ 1) తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. లక్నోలోని ఎఖానా స్టేడియంలో Delhi Capitalsతో తలపడుతుంది. ఈ మ్యాచ్తో షమీ LSG తరఫున తొలి సారి ఆడబోతున్నాడు. -
చెలరేగిన ఢిల్లీ బౌలర్లు.. 141 పరుగులకే కుప్పకూలిన లక్నో
చెలరేగిన ఢిల్లీ బౌలర్లు.. 141 పరుగులకే కుప్పకూలిన లక్నోటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 141 పరుగులకే కుప్పకూలింది. నటరాజన్ (4-0-29-3), ఎంగిడి (3.4-0-27-3), కుల్దీప్ యాదవ్ (4-0-31-2), అక్షర్ పటేల్ (3-0-17-1) లక్నో పతనాన్ని శాశించారు. లక్నో ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.అబ్దుల్ సమద్ (36), మిచెల్ మార్ష్ (35) పర్వాలేదనిపించారు. ఆరో వికెట్ కోల్పోయిన లక్నో13.1వ ఓవర్- 105 పరుగుల వద్ద లక్నో ఆరో వికెట్ కోల్పోయింది. ముకుల్ ఛౌదరిని (14) కుల్దీప్ యాదవ్ క్యాచ్ అండ్ బౌల్డ్ చేశాడు.పీకల్లోతు కష్టాల్లో లక్నో9.3వ ఓవర్- టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన లక్నో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 71 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ట్రస్టన్ స్టబ్స్కు క్యాచ్ ఇచ్చి మిచెల్ మార్ష్ (35) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన లక్నో.. పూరన్ (8) ఔట్8.5వ ఓవర్- 65 పరుగుల వద్ద లక్నో నాలుగో వికెట్ కోల్పోయింది. ఎంగిడి బౌలింగ్లో పూరన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.మూడో వికెట్ కోల్పోయిన లక్నో.. బదోని డకౌట్6.3వ ఓవర్- 49 పరుగుల వద్ద లక్నో మూడో వికెట్ కోల్పోయింది. నటరాజన్ బౌలింగ్లో కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి ఆయుశ్ బదోని డకౌటయ్యాడు.రెండో వికెట్ డౌన్.. మార్క్రమ్ (11) ఔట్5.5వ ఓవర్- 48 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో మార్క్రమ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన లక్నో.. పంత్ (7) ఔట్2.6వ ఓవర్- ఓపెనర్గా బరిలోకి దిగిన రిషబ్ పంత్ అనూహ్య రీతిలో రనౌటయ్యాడు. స్ట్రయికర్ మిచెల్ మార్ష్ కొట్టిన బంతి బౌలర్ చేతికి తాకి నాన్ స్ట్రయికర్ ఎండ్లో ఉన్న వికెట్లను తాకడంతో పంత్ ఔటయ్యాడు.ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 1) జరుగుతున్న ఐదో మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. లక్నోలోని ఎఖానా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు..లక్నో: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మొహ్సిన్ ఖాన్, మహ్మద్ షమీ, అన్రిచ్ నోర్ట్జే, ప్రిన్స్ యాదవ్ఇంపాక్ట్ సబ్లు: దిగ్వేష్ రాఠీ, అవేష్ ఖాన్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, అక్షత్ రఘువంశీఢిల్లీ: KL రాహుల్(w), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, అక్షర్ పటేల్(c), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, విప్రజ్ నిగమ్, లుంగి ఎన్గిడి, కులదీప్ యాదవ్, T నటరాజన్, ముఖేష్ కుమార్ఇంపాక్ట్ సబ్లు: అశుతోష్ శర్మ, ఆకిబ్ నబీ, సమీర్ రిజ్వీ, దుష్మంత చమీరా, కరుణ్ నాయర్ -
సన్రైజర్స్ తుది జట్టు ఇదే.. రూ.13 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్?
ఐపీఎల్-2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తమ రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. గురువారం(ఏప్రిల్ 2) ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. తొలి మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో ఘోర ఓటమి పాలైన సన్రైజర్స్.. ఎలాగైనా తిరిగి పుంజుకోవాలని పట్టుదలతో ఉంది.ఆరెంజ్ ఆర్మీ బ్యాటింగ్ పరంగా ఎంత పటిష్టంగా ఉందో, బౌలింగ్ పరంగా అంతే బలహీనంగా కన్పిస్తోంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది. హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కట్ వంటి ఫాస్ట్ బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు.అంతేకాకుండా కొత్తగా జట్టులోకి వచ్చిన సీనియర్ పేసర్ డేవిడ్ పేయిన్, గత సీజన్లో అదరగొట్టిన ఎషాన్ మలింగ సైతం విఫలమయ్యారు. దీంతో కేకేఆర్తో మ్యాచ్కు ఎస్ఆర్హెచ్ జట్టులో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశముంది.డేవిడ్ పేయిన్ స్ధానంలో ఇంగ్లీష్ ఆల్రౌండర్ బ్రైడన్ కార్స్ తుది జట్టులోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. వాస్తవానికి తొలి మ్యాచ్లోనే కార్స్ ఆడాల్సి ఉండేది. కానీ ప్రాక్టీస్ సెషన్లో చిన్నపాటి గాయం కారణంగా అతడు మొదటి మ్యాచ్కు దూరమయ్యాడు. అయితే ఇప్పుడు అతడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు సమాచారం. అదేవిధంగా హర్ష్ దూబే స్ధానంలో జీషాన్ అన్సారీని ఆడించాలని ఎస్ఆర్హెచ్ మేనెజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గత మ్యాచ్లో బెంచ్కే పరిమితమైన ఇంగ్లండ్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్కు మరోసారి నిరాశే ఎదరయ్యే అవకాశముంది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ వంటి విధ్వంసకర బ్యాటర్లు ఉండటంతో లివింగ్స్టోన్కు చోటు దక్కడం లేదు. ఒకవేళ లివింగ్స్టోన్ ఆడించాలంటే ఎషాన్ మలింగ లేదా పేయిన్లో ఎవరో ఒకరిని పక్కన పెట్టాల్సి వస్తుంది. అలా చేస్తే జట్టులో క్వాలిటీ బౌలర్లు ఎవరూ ఉండరు. గతేడాది జరిగిన మినీ వేలంలో రూ.13 కోట్ల భారీ ధరకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. అంత భారీ ధర చెల్లించినప్పటికి అతడిని ఎస్ఆర్హెచ్ ఉపయోగించుకోకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఎస్ఆర్హెచ్ తుది జట్టు(అంచనా)అభిషేక్ శర్మ,ట్రావిస్ హెడ్,ఇషాన్ కిషన్,హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి,సలీల్ అరోరా, బ్రైడన్ కార్స్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కట్, జీషన్ అన్సారీఇంపాక్ట్ ప్లేయర్: పేయిన్/ ఎషాన్ మలింగచదవండి: ఇంగ్లండ్కు గుడ్బై..! జింబాబ్వేకు ఆడనున్న సామ్ కర్రాన్? -
ఐపీఎల్ ప్రత్యర్ది లీగ్కు భారత్ ఆతిథ్యం..?
ఐపీఎల్ 2026 ఉత్సాహభరితంగా కొనసాగుతున్న వేళ, బీసీసీఐ ఓ సంచలన నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. తమ ఆథ్వర్యంలో నడిచే ఐపీఎల్కు ప్రధాన ప్రత్యర్ది అయిన బిగ్ బాష్ లీగ్ (ఆస్ట్రేలియా)ను భారత్లో నిర్వహించే (ఆరంభ మ్యాచ్) అంశంపై క్రికెట్ ఆస్ట్రేలియాతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అందుతుంది. ఈ విషయమై బీసీసీయే స్వయంగా పావులు కదుపుతున్నట్లు క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఐపీఎల్ ప్రత్యర్ది లీగ్ను బీసీసీయే ఎందుకు ఎంకరేజ్ చేస్తుందన్న విషయం భారతీయ క్రికెట్ అభిమానికి అర్దం కావడం లేదు.ఆస్ట్రేలియా జర్నలిస్ట్ టామ్ మోరిస్ ప్రకారం, క్రికెట్ ఆస్ట్రేలియా 2026–27 సీజన్ తొలి బీబీఎల్ మ్యాచ్ను భారత్లో నిర్వహించాలని యోచిస్తోంది. ఇప్పటివరకు BBL ఎప్పుడూ విదేశీ నేలపై జరగలేదు. ఇది జరిగితే చారిత్రాత్మక ఘట్టం అవుతుంది. ఈ విషయమై క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతనిధుల ఇదివరకే బీసీసీఐతో చర్చలు జరిపారు. ఆస్ట్రేలియా బ్రాడ్కాస్టర్లు, ఫ్రాంచైజీలు ఈ ఆలోచనకు మద్దతు ఇస్తున్నాయి.బీసీసీఐతో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయి. మొదట్లో ఇది సాకారం అయ్యే కలలా అనిపించలేదు కానీ, ఇప్పుడు కార్యరూపం దాల్చే దిశగా అడుగులుపడుతున్నాయి. చెన్నైలో తొలి మ్యాచ్..? అన్నీ అనుకున్నట్లు జరిగితే, BBL 2026–27 సీజన్ తొలి మ్యాచ్ చెన్నైలో జరగవచ్చు. డిఫెండింగ్ ఛాంపియన్ పెర్త్ స్కార్చర్స్ ఆరంభ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. -
ఇంగ్లండ్కు గుడ్బై..! జింబాబ్వేకు ఆడనున్న సామ్ కర్రాన్?
సామ్ కర్రాన్, టామ్ కర్రాన్ లు ఇంగ్లండ్కు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికి.. జింబాబ్వే క్రికెట్తో వారికి వీడదీయరాని బందం ఉంది. వారి తండ్రి కెవిన్ కర్రన్ జింబాబ్వే తరఫున 11 వన్డేలు ఆడగా.. తమ్ముడు బెన్ కర్రన్ ప్రస్తుతం జింబాబ్వే జట్టులో కీలక సభ్యునిగా ఉన్నాడు.అంతేకాకుండా వారి తాత కెవిన్ పాట్రిక్ కర్రన్ కూడా గతంలో రోడేసియా (ప్రస్తుత జింబాబ్వే) తరఫున ఆడారు. అయితే ఇప్పుడు సామ్ కర్రాన్, టామ్ కర్రాన్లు కూడా ఇంగ్లండ్ జట్టును వదిలి జింబాబ్వే తరఫున ఆడబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది.జింబాబ్వే క్రికెట్ వర్గాల్లో చురుగ్గా ఉండే సీనియర్ జర్నలిస్ట్ ఆడమ్ థియో తాజాగా ఎక్స్లో ఓ పోస్ట్ చేశాడు. "మాజీ ఇంగ్లండ్ క్రికెటర్లు సామ్, టామ్ కర్రాన్లు ఇప్పుడు జింబాబ్వే క్రికెట్ తరపున ఆడాలని నిర్ణయించుకున్నారు. అయితే ప్రస్తుతం టామ్ కర్రాన్కు జింబాబ్వే జట్టు తరపున ఆడేందుకు లైన్ క్లియర్ అయినప్పటికి..సామ్ మాత్రం ఐసీసీ నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 తర్వాత ఈ చర్చలు జరిగాయి" అని ఎక్స్లో థియో రాసుకొచ్చాడు. అందుకు సామ్, టామ్ జింబాబ్వే జెర్సీలు ధరించిన ఒక ఫోటోను కూడా జోడించాడు. ఇది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాకయ్యారు. అయితే ఈ రోజు ఏప్రిల్ 1 కావడంతో, తన ఫాలోవర్లను ఆటపట్టించడానికి థియో ఈ పోస్ట్ చేశారు. అంతే తప్ప ఇందులో ఏ మాత్రం నిజం లేదు. కాగా సామ్ కర్రాన్, టామ్ కర్రాన్లు కేప్టౌన్లో జన్మించారు. ఆ తర్వాత వీరిద్దరూ యూకే పౌరసత్వం పొందారు. ఐసీసీ నిబంధనల ప్రకారం వారిద్దరూ.. జింబాబ్వేకు ఆడాలంటే కనీసం నాలుగు ఏళ్లు అక్కడ నివసించాలి. అంతేకాకుండా జింబాబ్వే తరపున డొమాస్టిక్ క్రికెట్ ఆడాలి. టామ్ కర్రాన్ ప్రస్తుతం జాతీయ జట్టుకు దూరంగా ఉండగా.. సామ్ కర్రాన్ మాత్రం కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడుచదవండి: ICC Rankings: దుమ్ములేపిన సౌతాఫ్రికా ప్లేయర్.. ఏకంగా 64 స్ధానాలు -
ఢిల్లీ తుదిజట్టు ఇదే.. ఓపెనర్గా ఊహించని ప్లేయర్!
గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. అక్షర్ పటేల్ సారథ్యంలో వరుస విజయాలతో ఆరంభంలో దుమ్ములేపిన ఢిల్లీ.. ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయింది. ఆడిన పద్నాలుగు మ్యాచ్లలో ఏడు గెలిచి ప్లే ఆఫ్స్ చేరుకుండానే నిష్క్రమించింది.ఈ క్రమంలో ఐపీఎల్-2026లో ఎలాగైనా సత్తా చాటాలని ఢిల్లీ పట్టుదలగా ఉంది. తాజా ఎడిషన్ తొలి మ్యాచ్లో అక్షర్ సేన.. లక్నో సూపర్ జెయింట్స్ (LSG vs DC)ను ఎదుర్కోనుంది. ఇక ఈసారి ఢిల్లీ ఓపెనింగ్ జోడీ మారనుంది.కేఎల్ రాహుల్ జోడీ ఎవరు?టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ ఢిల్లీ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. అయితే, అతడికి జోడీ ఎవరన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘లక్నోతో మ్యాచ్లో కేఎల్ రాహుల్తో కలిసి ఢిల్లీ ఇన్నింగ్స్ ఆరంభించేదెవరు?అభిషేక్ పోరెల్, పాతుమ్ నిస్సాంక లేదంటే పృథ్వీ షా?.. నేనైతే పృథ్వీ షాకే ఓటు వేస్తాను. నితీశ్ రాణా వన్డౌన్లో.. ఆ తర్వాతి స్థానాల్లో ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (Axar Patel), డేవిడ్ మిల్లర్, అశుతోశ్ శర్మ రావాలి.ఎనిమిదో స్థానంలో సీమర్ రిజ్వీ లేదంటే విప్రాజ్ నిగమ్ను ఆడించవచ్చు. కుల్దీప్ యాదవ్, లుంగి ఎంగిడి, దుష్మంత చమీర ఆ తర్వాతి స్థానాల్లో వస్తారు. ఒకవేళ మరో భారత బౌలర్ను ఆడించాలనుకుంటే టి.నటరాజన్ లేదంటే ఆకిబ్ నబీని తీసుకోవాలి. ఈసారి ఢిల్లీ జట్టు బాగుంది’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.ఊహించని విధంగా..కాగా గతంలో ఢిల్లీకి ఆడిన పృథ్వీ షా చాన్నాళ్లుగా లీగ్కు దూరమయ్యాడు. అయితే, దేశీ క్రికెట్లో సత్తా చాటి మినీ వేలంలో పేరు నమోదు చేసుకోగా ముందుగా అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. అయితే, ఆఖరి నిమిషంలో రూ. 75 లక్షల కనీస ధరకు ఢిల్లీ తమ పాత ఆటగాడిని సొంతం చేసుకుంది. తుదిజట్టులో అతడికి చోటు దక్కడం కష్టమేనన్న అభిప్రాయాల నేపథ్యంలో ఆకాశ్ చోప్రా ఊహించని విధంగా ఓపెనర్గా స్థానం ఇవ్వడం గమనార్హం.లక్నోతో మ్యాచ్కు ఆకాశ్ చోప్రా ఎంచుకున్న ఢిల్లీ తుదిజట్టుకేఎల్ రాహుల్, పృథ్వీ షా, నితీశ్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్, అశుతోశ్ శర్మ, సమీర్ రిజ్వి/విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎంగిడి, దుష్మంత చమీర, టి.నటరాజన్/ఆకిబ్ నబీ.చదవండి: ‘అందుకే IPL వద్దనుకుని PSLలో ఆడుతున్నా’ -
సినీ నటితో వివాదంలో శ్రీలంక విధ్వంసకర బ్యాటర్
శ్రీలంక విధ్వంసకర బ్యాటర్ భానుక రాజపక్స ఓ సినీ నటితో న్యాయపరమైన వివాదంలో చిక్కుకున్నాడు. ఈ కేసు ఓ బంగారు గొలుసు చుట్టూ తిరుగుతోంది. హర్షి రసంగా అనే స్థానిక యువ నటికి రాజపక్స ఓ బంగారు గొలుసు (రూ. 9 లక్షలు) ఇచ్చాడు. దీన్ని బహుమతిగా భావించిన ఆమె.. అవసరాల రిత్యా తాకట్టు పెట్టి డబ్బు చేసుకుంది. అయితే గొలుసును హర్షి తన వద్ద అరువు తీసుకొని, అనుమతి లేకుండా తాకట్టు పెట్టుకుందని రాజపక్స పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసుల విచారణ జరిపి హర్షిని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు రూ. 5 లక్షల చొప్పున రెండు ష్యూరిటీలు పెట్టి బెయిల్ మంజూరు చేసింది. విచారణలో హర్షి న్యాయవాదులు గొలుసును తాకట్టు పెట్టిన విషయాన్ని అంగీకరించి, తిరిగి విడిపిస్తామని హామీ ఇచ్చారు. మాట మార్చిన హర్షిబెయిల్ లభించిన తర్వాత హర్షి మాట మార్చింది. మీడియా ముందుకు వచ్చి షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. గొలుసు తనకు రాజపక్స వ్యక్తిగత సంబంధంలో గిఫ్ట్గా ఇచ్చాడని తెలిపింది. దీంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. రాజపక్స వైఖరిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.రాజపక్స ఇటీవల టీమిండియాపై నిరాధరమైన ఆరోపణలు చేసి వార్తల్లోకెక్కాడు. తాజాగా ముగిసిన టీ20 వరల్డ్ కప్లో భారత ఆటగాళ్లు ఉపయోగించే బ్యాట్లు అసాధారణంగా ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేశాడు. ఈ వ్యాఖ్యల తర్వాత అతను టీమిండియా అభిమానుల నుంచి చీవాట్లు తిన్నాడు. -
ఐసీసీ ర్యాంకింగ్స్లో దుమ్ములేపిన సౌతాఫ్రికా ప్లేయర్
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ తమ టాప్-2 స్దానాలను నిలబెట్టుకున్నారు. అభిషేక్ 875 పాయింట్లతో అగ్రస్ధానంలో కొనసాగుతుండగా.. కిషన్(848) రెండో స్ధానంలో నిలిచాడు. మూడో స్ధానంలో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్(848) ఉన్నాడు.ఇక ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో దుమ్ములేపిన సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ కానర్ ఎస్టర్హ్యూజెన్.. ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్లో కూడా సత్తాచాటాడు. ఎస్టర్హ్యూజెన్ ఏకంగా 64 స్ధానాలు ఎగబాకి 39వ ర్యాంక్కు చేరుకున్నాడు. ప్రోటీస్ సిరీస్లో ఎస్టర్హ్యూజెన్ 300 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ది సిరీస్గా నిలిచాడు.ఇక టాప్-10లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ జోస్ బట్లర్ ఒక స్థానం మెరుగుపరుచుకుని 8వ ర్యాంకుకు చేరుకోగా, కివీస్ బ్యాటర్ టిమ్ సీఫెర్ట్ 9వ స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్ వికెట్ కీపర్ టిమ్ రాబిన్సన్ రెండు స్థానాలు ఎగబాకి 32వ స్థానంలో నిలిచాడు. మరోవైపు బౌలింగ్ ర్యాంకింగ్స్లో అఫ్గానిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్ తన అగ్రస్ధానాన్ని పదిలం చేసుకున్నాడు. న్యూజిలాండ్ సిరీస్లో రాణించిన దక్షిణాఫ్రికా బౌలర్లు తమ ర్యాంక్లను మెరుగుపరుచుకున్నారు. జెరాల్డ్ కోయెట్జీ ఏకంగా 36 స్థానాలు ఎగబాకి 52వ ర్యాంకును కైవసం చేసుకోగా.. ఒట్నీల్ బార్ట్మాన్ 10 స్థానాలు మెరుగుపరుచుకుని 56వ స్ధానానికి చేరుకున్నాడు. ఇక ఆల్ రౌండర్ల జాబితాలో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. చదవండి: IND vs ZIM: టీమిండియా కెప్టెన్గా శ్రేయస్..! ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీ? -
IPL 2026: రాయల్స్ హీరోకు షాకిచ్చిన క్రికెట్ సౌతాఫ్రికా
రాజస్థాన్ రాయల్స్ స్టార్ బౌలర్ నండ్రే బర్గర్కు అతని సొంత దేశ క్రికెట్ బోర్డు (CSA) షాకిచ్చింది. తాజాగా ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్ల (2026–27 ) జాబితా నుంచి అతని పేరును తప్పించింది. బర్గర్తో పాటు మరికొంత మంది స్టార్ ఆటగాళ్లు కూడా ఈ జాబితా నుంచి తప్పించబడ్డారు. గెరాల్డ్ కొయెట్జీ, లిజాడ్ విలియమ్స్, డేవిడ్ మిల్లర్, రాసీ వాన్ డర్ డస్సెన్ లాంటి స్టార్లు కాంట్రాక్టులు కోల్పోయారు.కాంట్రాక్ట్ల విషయంలో క్రికెట్ సౌతాఫ్రికా ముందు నుంచి ఓ విషయం చెప్పుకుంటూ వచ్చింది. ఆటగాళ్లు ఎన్ని ప్రైవేట్ లీగ్ల్లో పాల్గొన్నా, జాతీయ జట్టు తరఫున వీలైనన్ని మ్యాచ్లు ఆడాలని కండీషన్ పెట్టింది. అయినా, చాలామంది ఆటగాళ్లు ప్రైవేట్ లీగ్లకే అధిక ప్రాధాన్యమిచ్చి జాతీయ విధులను నిర్లక్ష్యం చేశాడు. దీని ఫలితమే తాజాగా ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్ల జాబితాలో స్టార్ ప్లేయర్లకు చోటు దక్కకపోవడం.తాజాగా కాంట్రాక్ట్ కోల్పోయిన ఆటగాళ్లు ప్రైవేట్ లీగ్ల్లో ఆడటం వల్ల గాయాలపాలై జాతీయ జట్టు తరఫున ఎక్కువ మ్యాచ్లు ఆడలేకపోయారు. అందుకే వీరిని కాంట్రాక్ట్ జాబితా నుంచి తప్పించినట్లు క్రికెట్ సౌతాఫ్రికా వివరణ ఇచ్చింది. సౌతాఫ్రికా జట్టు గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 53 మ్యాచ్లు (7 టెస్టులు, 12 వన్డేలు, 34 టీ20లు) ఆడగా.. కొయెట్జీ 8 (టీ20లు), బర్గర్ 15 (9 వన్డేలు, 6 టీ20లు), విలియమ్స్ 6 (ఒక వన్డే, 5 టీ20లు) మ్యాచ్లు మాత్రమే ఆడారు.మిలర్ (36), డస్సెన్ (37) వయసు పైబడుతున్న కారణంగా కాంట్రాక్ట్లు కోల్పోయారు. అయితే ఆశ్చర్యకరంగా మరో వెటరన్ సైమన్ హార్మర్కు (37) కాంట్రాక్ట్ దక్కింది. ఈసారి కొత్తగా కాంట్రాక్ట్లు పొందిన ఆటగాళ్ల జాబితాలో ఓట్నీల్ బార్ట్మన్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్ తదితరులు ఉన్నారు.వార్షిక కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్ల జాబితా..టెంబా బవుమా, డేవిడ్ బెడింగ్హామ్, ఒట్నీల్ బార్ట్మన్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రీవిస్, టోనీ డి జోర్జి, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, ఐడెన్ మార్క్రామ్, వియాన్ ముల్డర్, సెనురన్ ముత్తుసామి, లుంగి ఎంగిడి, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రిన్, సైమన్ హార్మర్రాయల్స్ హీరోగా మారిన బర్గర్ ఐపీఎల్ 2026లో భాగంగా తాజాగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్తో నండ్రే బర్గర్ చెలరేగిపోయాడు. కీలకమైన సంజూ శాంసన్ వికెట్ సహా పొదుపుగా బౌలింగ్ చేసి, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఈ మ్యాచ్తో బర్గర్ రాయల్స్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్నాడు. అతను సంజూ వికెట్ తీసిన తీరు రాయల్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. -
‘బెంచ్ మీద ఉండలేను.. దానికి నేను వ్యతిరేకం’
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ ఇప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం పోరాడుతున్నాడు. దేశవాళీ క్రికెట్లో తొలుత సొంత జట్టు ముంబైకి ఆడిన ఈ ఆల్రౌండర్.. ఆ తర్వాత గోవాకు మారిపోయాడు. అయినప్పటికీ 26 ఏళ్ల అర్జున్ టెండుల్కర్ ఇంతవరకు పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.తండ్రి సచిన్ పదహారేళ్లకే భారత జట్టులో అరంగేట్రం చేసి.. లెక్కకు మిక్కిలి రికార్డులు సాధిస్తే.. అర్జున్ టీమిండియా ఇప్పటికీ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించలేకపోతున్నాడు. ఇక ఐపీఎల్లోనూ అతడికి అవకాశాలు కరువయ్యాయి.ఐదు మ్యాచ్లు ఆడి..సచిన్ మెంటార్గా ఉన్న ముంబై ఇండియన్స్ జట్టుతో చాలాకాలం కొనసాగిన అర్జున్ టెండుల్కర్ (Arjun Tendulkar).. ఐదు మ్యాచ్లు ఆడి మూడు వికెట్లు తీయగలిగాడు. చివరగా 2024లో ఐపీఎల్ మ్యాచ్ ఆడిన ఈ ఆల్రౌండర్.. ఆ తర్వాత మళ్లీ బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చింది.లక్నో సూపర్ జెయింట్స్లోకిఈ క్రమంలో 2026 మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ అర్జున్ టెండుల్కర్ను లక్నో సూపర్ జెయింట్స్కు ట్రేడ్ చేసింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2026లో భాగంగా లక్నో బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్తో తమ తొలి మ్యాచ్ ఆడనుండగా.. అర్జున్కు తుదిజట్టులో అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో శుభంకర్ మిశ్రా పాడ్కాస్ట్కు హాజరైన అర్జున్ టెండుల్కర్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ‘‘ముంబై ఇండియన్స్ తరఫున కొన్ని మ్యాచ్లు ఆడారు కదా! మీరు బాగా బౌలింగ్ చేశారు. స్వింగ్ కూడా బాగుంది. కాబట్టి మరికొన్ని అవకాశాలకు మీరు అర్హులు అని భావించారా?’’ అని హోస్ట్ అర్జున్ టెండుల్కర్ను అడిగాడు.బెంచ్ మీద కూర్చోవాలని ఎవరు కోరుకుంటారు?ఇందుకు బదులిస్తూ.. ‘‘ఎవరైనా సరే అలాగే ఫీలవుతారు. బెంచ్ మీద కూర్చోవాలని ఎవరికి మాత్రం ఆశగా ఉంటుంది. అయితే, అవకాశం వచ్చినపుడు కఠినంగా శ్రమించి అద్భుతంగా ఆడటం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది’’ అని అర్జున్ టెండుల్కర్ పేర్కొన్నాడు. అదే విధంగా ఐపీఎల్లో ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్పై అభిప్రాయం పంచుకుంటూ.. పదకొండు మంది ఆటగాళ్లతోనే తుదిజట్టు ఉంటే బాగుంటుందని అర్జున్ పేర్కొన్నాడు. వ్యక్తిగతంగా తానైతే ఇంపాక్ట్ సబ్ నిబంధనకు వ్యతిరేకమని స్పష్టం చేశాడు.చదవండి: సిరాజ్ జట్టులో ఎందుకున్నట్లు?.. టీమిండియా దిగ్గజం -
అర్ష్దీప్ సింగ్ చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
ఐపీఎల్-2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. మంగళవారం చండీగఢ్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో పంజాబ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. టీ20ల్లో టీమిండియా లీడింగ్ వికెట్ టేకర్ ఉన్న అర్ష్దీప్.. గుజరాత్తో మ్యాచ్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.తన 4 ఓవర్ల కోటాలో 42 పరుగులు సమర్పించుకుని వికెట్ లెస్గా వెనుదిరిగాడు. అతడి ఎకానమీ రేటు 10.50గా ఉంది. వైశాఖ్ విజయ్కుమార్ వంటి యువ బౌలర్ మూడు వికెట్లు పడగొట్టి తన సత్తాచాటితే, అర్ష్దీప్ వంటి స్టార్ పేసర్ తేలిపోవడం పంజాబ్ ఫ్యాన్స్ను నిరాశపరిచింది.కాగా గుజరాత్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసే బాధ్యతను అర్ష్దీప్ సింగ్కు కెప్టెన్ అప్పగించాడు. అయితే ఆ ఓవర్ను పూర్తి చేసేందుకు అర్ష్దీప్ ఏకంగా 11 బంతులు వేయాల్సి వచ్చింది. ఇందులో 5 వైడ్లు, 1 నో-బాల్ ఉన్నాయి. ఈ పంజాబీ స్పీడ్ స్టార్ తన చెత్త బౌలింగ్తో అందరిని విసిగించాడు. ఈ క్రమంలో అర్ష్దీప్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఐపీఎల్ చరిత్రలో లాంగెస్ట్ ఓవర్ వేసిన బౌలర్గా మహ్మద్ సిరాజ్, తుషార్ దేశ్పాండే, శార్దూల్ ఠాకూర్, సందీప్ శర్మ, హార్దిక్ పాండ్యాల సరసన అర్ష్దీప్ చేరాడు. వీరంతా అర్ష్దీప్ కంటే ముందు 11 బంతుల ఓవర్లు వేశారు. కాగా ఈ మ్యాచ్లో గుజరాత్ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 19.1 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి చేధించింది. కూపర్ కొన్నోలీ అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.చదవండి: IND vs ZIM: టీమిండియా కెప్టెన్గా శ్రేయస్..! ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీ? -
టీమిండియా కెప్టెన్గా శ్రేయస్..! ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీ?
భారత పురుషల క్రికెట్ జట్టు ఈ ఏడాది జూలైలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు టీ20ల సిరీస్లో తలపడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను జింబాబ్వే క్రికెట్ బోర్డు బుధవారం విడుదల చేసింది. ఈ సిరీస్ జూలై 23న ప్రారంభమై జూలై 26తో ముగిస్తుంది.అన్ని మ్యాచ్లు హరారే వేదికగా జింబాబ్వే వేదికగానే జరగనున్నాయి.భారత్, జింబాబ్వే మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగనుండడం 2024 తర్వాత ఇదే తొలిసారి. అయితే అంతకంటే ముందు భారత జట్టు.. ఇంగ్లండ్, ఐర్లాండ్, అఫ్గానిస్తాన్లతో వైట్బాల్ సిరీస్లలో తలపడనుంది. అంతేకాకుండా జింబాబ్వే పర్యటన ముగిసిన వెంటనే టీమిండియా శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడనుంది.అయితే ఈ వరుస సిరీస్ల నేపథ్యంలో ఐర్లాండ్, జింబాబ్వే టూర్లకు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది. ఈ సిరీస్లో వైభవ్ సూర్యవంశీ, అయూశ్ మాత్రే వంటి యువ ఆటగాళ్లకు చోటు దక్కేందుకు అస్కారం ముంది. ఐపీఎల్-2026లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచే యంగ్ క్రికెటర్లను కూడా సెలెక్టర్లు పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఏదేమైనప్పటికి 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి మాత్రం భారత సీనియర్ జట్టు తరపున పిలుపు రావడం దాదాపు ఖాయమన్పిస్తోంది.కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్?మరోవైపు గత కొంతకాలంగా కేవలం వన్డేలకు మాత్రమే పరిమితమైన శ్రేయస్ అయ్యర్ తిరిగి టీ20 జట్టులోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. ఇంగ్లండ్ టూర్ ముగిసిన తర్వాత టీమిండియా టీ20 రెగ్యులర్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిరిగి స్వదేశానికి వచ్చే అవకాశముంది. సూర్య ప్రస్తుతం స్వల్ప గజ్జ గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అతడికి ముఖ్యమైన సిరీస్లోనే అతడిని ఆడించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తుందంట. ఈ క్రమంలో ఐర్లాండ్ లేదా జింబాబ్వే టూర్లో భారత జట్టు పగ్గాలను శ్రేయస్ చేపట్టే అవకాశముందని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. శ్రేయస్ చివరగా రెండేళ్ల కిందట టీమిండియా తరపున టీ20ల్లో ఆడాడు. లక్నో స్పీడ్ స్టార్ యయాంక్ యాదవ్ను కూడా తిరిగి టీ20 జట్టులోకి తీసుకోవాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భావిస్తుందంట.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ లెజెండ్ -
సిరాజ్ జట్టులో ఎందుకున్నట్లు?.. టీమిండియా దిగ్గజం
ఐపీఎల్-2026 టోర్నీ తొలి మ్యాచ్లోనే గుజరాత్ టైటాన్స్కు చేదు అనుభవం ఎదురైంది. పంజాబ్ కింగ్స్తో మంగళవారం నాటి మ్యాచ్లో గిల్ సేన మూడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ యాజమాన్యంపై టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.ముఖ్యంగా పేసర్ మహ్మద్ సిరాజ్ సేవలను సరిగ్గా ఉపయోగించుకోలేదంటూ నాయకత్వ బృందాన్ని భజ్జీ తప్పుబట్టాడు. పంజాబ్తో మ్యాచ్లో టాస్ ఓడిన గుజరాత్ తొలుత బ్యాటింగ్కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.రెండు ఓవర్లు వేసి అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ 19.1 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసి గెలుపొందింది. ఈ మ్యాచ్లో భారత కీలక పేసర్లలో ఒకడైన గుజరాత్ బౌలర్ సిరాజ్ రెండు ఓవర్లు వేసి పదిహేను పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కొత్త బంతితో రంగంలోకి దిగిన అతడు.. ఆ తర్వాత మళ్లీ బౌలింగ్కు రాలేదు.ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ హర్భజన్ సింగ్ టైటాన్స్ యాజమాన్య వైఖరిని విమర్శించాడు. ‘‘ఈ మ్యాచ్లో మహ్మద్ సిరాజ్ ఎక్కువగా బౌలింగ్ చేయనేలేదు. ఇలా ఎందుకు జరిగిందో నాకైతే అర్థం కావడం లేదు.సిరాజ్ జట్టులో ఎందుకున్నట్లు?అతడితో కేవలం రెండు ఓవర్లే వేయించారు. నిజానికి నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేయించాల్సింది. గాయం కారణంగానా? లేదంటే మరే ఇతర కారణాల వల్ల అతడిని పక్కనపెట్టారో తెలియదు. ఏదేమైనా అతడు మరో రెండు ఓవర్లు బౌలింగ్ చేసి ఉంటే ఫలితం వేరుగా ఉండేది’’ అని భజ్జీ అభిప్రాయపడ్డాడు.కాగా పంజాబ్తో మ్యాచ్లో గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ మూడు వికెట్లు తీయగా.. కగిసో రబడ, అశోక్ శర్మ, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అయితే, పంజాబ్ బ్యాటర్ కూపర్ కన్నోలి మెరుపు ఇన్నింగ్స్ (44 బంతుల్లో 72 నాటౌట్)తో జట్టును విజయతీరాలకు చేర్చడంతో గుజరాత్కు పరాభవం తప్పలేదు. చదవండి: ‘అందుకే IPL వద్దనుకుని PSLలో ఆడుతున్నా’ -
రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ లెజెండ్
ఇంగ్లండ్ వెటరన్ ఆల్రౌండర్ రవి బొపారా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. బొపారా తన 23 ఏళ్ల సుదీర్ఘ కౌంటీ క్రికెట్ కెరీర్కు వీడ్కోలు పలికాడు. 2026 ఇంగ్లండ్ డొమెస్టిక్ సీజన్కు ముందే తన నిర్ణయాన్ని బొపారా వెల్లడించడం గమనార్హం. 40 ఏళ్ల బొపారా గత కొంతకాలంగా కేవలం ఇంగ్లండ్ టీ20 బ్లాస్ట్, వన్డే కప్లలో మాత్రమే ఆడుతున్నాడు. బొపారా 2002లో ఎసెక్స్ తరపున తన కౌంటీ కెరీర్ను ప్రారంభించాడు. దాదాపు 18 ఏళ్ల పాటు ఎసెక్స్ క్లబ్కు అతడు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత 2020లో ససెక్స్తో అతడు ఒప్పం కుదుర్చుకున్నాడు. కానీ మూడేళ్ల తర్వాత మళ్లీ నార్తాంప్టన్షైర్ జట్టులో బొపారా చేరాడు. గత రెండు సీజన్లలో అతడు నార్తాంప్టన్షైర్కు ప్రాతినిథ్యం వహించాడు. గత సీజన్లో నార్తాంప్టన్షైర్ జట్టు ఫైనల్కు చేరడంలో బొపారా కీలక పాత్ర పోషించాడు. క్వార్టర్ ఫైనల్లో సర్రే జట్టుపై కేవలం 46 బంతుల్లోనే 105 పరుగుల చేసి తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈ ఏడాది కూడా కౌంటీ క్రికెట్ ఆడేందుకు అతడికి ఆఫర్లు వచ్చినప్పటికి అతడు తిరస్కరించాడు. కానీ ఇప్పుడు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాకిచ్చాడు. ప్రస్తుతం కరాచీ కింగ్స్ హెడ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బొపారా.. త్వరలో కౌంటీ సీజన్లో కామెంటేటర్గా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నాడు. అంతేకాకుండా ఇంగ్లండ్ జాతీయ సెలెక్టర్ కావాలని బొపారా ఆశిస్తున్నాడు. కాగా బొపారా ఇంగ్లండ్ తరపున చివరగా 2015లో ఆడాడు.అప్పటి నుంచి కేవలం డొమాస్టిక్ క్రికెట్తో పాటు ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్లో ఆడుతూ వచ్చాడు. అతడు ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ (2009, 2010), సన్రైజర్స్ హైదరాబాద్ (2015) జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇంగ్లండ్ తరపున అతడు 13 టెస్టులు, 120 వన్డేలు, 38 టీ20లు ఆడాడు.రవి బొపారా టెస్టు క్రికెట్లో వరుసగా మూడు ఇన్నింగ్స్లలో మూడు సెంచరీలు బాదిన ఆటగాడిగా అరుదైన రికార్డును కలిగి ఉన్నాడు. 2009లో వెస్టిండీస్పై అతడు ఈ ఫీట్ సాధించాడు. ఫస్ట్ క్రికెట్లో కూడా అతడి పేరిట దాదాపు 13,000 వేల పరుగులు ఉన్నాయి.చదవండి: NZ vs SA: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
‘అందుకే IPL వద్దనుకుని PSLలో ఆడుతున్నా’
ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన ప్రతిభకు తగ్గ గుర్తింపు దక్కనందు వల్లే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)ను వదిలివేసినట్లు తెలిపాడు. అదే సమయంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ఆడేందుకు డబ్బే కారణం అంటూ జంపా విచిత్రమైన వ్యాఖ్యలు చేశాడు.డబ్బుకు డబ్బు.. పేరు పేరుకాగా ప్రపంచంలోనే ఖరీదైన లీగ్గా పేరొందిన ఐపీఎల్లో ఆడేందుకు విదేశీ ఆటగాళ్లు ఆసక్తి చూపుతుంటారు. ఐపీఎల్లో ఆడటం ద్వారా డబ్బుకు డబ్బు.. పేరు పేరు సంపాదించిన ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. అంతేకాదు ఐపీఎల్లో ఆడేందుకు పీఎస్ఎల్ను వీడిన ఆటగాళ్లు కూడా కోకొల్లలు.పీఎస్ఎల్ను వీడి ఐపీఎల్లోతాజాగా 2026 ఎడిషన్లో జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజర్బానీ, శ్రీలంక కెప్టెన్ దసున్ షనక (Dasun Shanaka), ఆస్ట్రేలియా పేసర్ స్పెన్సర్ జాన్సన్ తదితరులు పీఎస్ఎల్ను వీడి ఐపీఎల్లో చేరారు. అయితే, వీరికి ఆడం జంపా మాత్రం భిన్నంగా ఉన్నాడు. ఐపీఎల్లో తన ప్రతిభకు తగ్గ ధర దక్కలేదని.. అందుకే పీఎస్ఎల్లో చేరినట్లు తెలిపాడు.జంపా మాత్రం రివర్స్‘‘నేను రేసులో లేను. అందుకే ఐపీఎల్-2026 మినీ వేలంలో నా పేరు నమోదు చేసుకోలేదు. ఆ టోర్నీ నుంచి పూర్తిగా తప్పుకొన్నా. నిజం చెప్పాలంటే... నాలాంటి నైపుణ్యాలు ఉన్న ఆటగాడి కంటే ఇతరులకు ఎక్కువ డబ్బు లభిస్తోంది.అందుకే అక్కడ ఉండటం సరైన నిర్ణయం కాదనిపించింది. అందుకే ఐపీఎల్ ఆడకూడదని నిర్ణయించుకున్నా. విరామం తీసుకున్నా. ఇంతలో పీఎస్ఎల్ నుంచి పిలుపు వచ్చింది’’ అని ఆడం జంపా చెప్పుకొచ్చాడు. కాగా 2016లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన జంపా తొలుత రూ. 30 లక్షల జీతం అందుకోగా.. క్రమేణా ఆ మొత్తం 2.40 కోట్ల రూపాయలకు చేరింది. తాజాగా పీఎస్ఎల్లో కరాచీ కింగ్స్తో జంపా రూ. 1.51 కోట్లకు (పాకిస్తాన్ కరెన్సీలో రూ. 4.5 కోట్లు) ఒప్పందం చేసుకున్నాడు.చదవండి: మాక్స్వెల్కు షాకిచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా -
జింబాబ్వే టూర్కు టీమిండియా.. షెడ్యూల్ విడుదల
ఐపీఎల్-2026 సీజన్ తర్వాత టీమిండియా వరుస సిరీస్లతో బీజీబీజీగా గడపనుంది. తొలుత జూన్లో అఫ్గానిస్తాన్తో ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్లో భారత్ తలపడనుంది. ఈ సిరీస్లో స్వదేశంలోనే జరగనుంది. అనంతరం ఐర్లాండ్ టూర్లో భాగంగా రెండు టీ20లు టీమిండియా ఆడనుంది.మెన్ ఇన్ బ్లూ అటు నుంచి అటు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇంగ్లీష్ జట్టుతో ఐదు టీ20లు , మూడు వన్డేల సిరీస్లో భారత్ ఆడనుంది. భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన జూలై 1న మొదలై జూలై 19తో ముగియనుంది. అయితే అక్కడికి మూడు రోజుల తర్వాత టీమిండియా మూడు టీ20ల సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటించనుంది.తాజాగా ఈ సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ను జింబాబ్వే క్రికెట్ విడుదల చేసింది. భారత్-జింబాబ్వే మధ్య మూడు టీ20ల సిరీస్ కేవలం నాలుగు రోజుల వ్యవధిలో జరగనుంది. జూలై 23న ప్రారంభమై జూలై 26తో ముగిస్తుంది. అన్ని మ్యాచ్లు హరారే వేదికగా జింబాబ్వే వేదికగానే జరగనున్నాయి.భారత్, జింబాబ్వే మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగనుండడం 2024 తర్వాత ఇదే తొలిసారి.అయితే వరుస సిరీస్ల నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి, ఐపీఎల్లో రాణించిన యువ ఆటగాళ్లను జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం చేసే సూచనలు కన్పిస్తున్నాయి.భారత్-జింబాబ్వే టీ20 సిరీస్ షెడ్యూల్మొదటి టీ20: జూలై 23రెండో టీ20: జూలై 25మూడో టీ20: జూలై 26చదవండి: NZ vs SA: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
వెల్లింగ్టన్ వేదికగా దక్షిణాఫ్రికా మహిళలతో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ అమ్మాయిల జట్టు చారిత్రత్మక విజయాన్ని అందుకుంది. సౌతాఫ్రికా నిర్ధేశించిన 347 పరుగుల లక్ష్యాన్ని చేధించి భారత్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డును కివీస్ తిరగరాసింది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక రన్ ఛేజ్ చేసిన జట్టుగా న్యూజిలాండ్ రికార్డులెక్కింది. ఇంతకుముందు వరకు ఈ రికార్డు భారత మహిళల జట్టు పేరిట ఉండేది. వన్డే ప్రపంచకప్-2025లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో ఉమెన్ ఇన్ బ్లూ.. 339 పరుగులు టార్గెట్ను చేజ్ చేసింది. ఇప్పుడు ఈ రికార్డును కివీస్ బ్రేక్ చేసింది.ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 346 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో అన్నేకే బోష్(91) టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ లారా వోల్వార్డ్(69), ట్రయోన్(52), జాఫ్టా(37) రాణించారు.అదరగొట్టిన అమెలియా..ఇక ఈ భారీ లక్ష్య చేధనలో కివీస్ కెప్టెన్ అమెలియా కెర్ అద్భుతం చేసింది. సుజీ బేట్స్(8), ప్లిమ్మర్(23), మ్యాడీ గ్రీన్(13) వంటి స్టార్ బ్యాటర్లు విఫలమైన చోట అమెలియా సంచలన ఇన్నింగ్స్ ఆడింది. ఓ వైపు క్రమం తప్పుకుండా వికెట్లు పడుతున్నప్పటికి కెర్ మాత్రం తన విధ్వంసకర బ్యాటింగ్ను కొనసాగించింది.ఈ క్రమంలో అమెలియా కేవలం 90 బంతుల్లోనే తన ఐదువ వన్డే సెంచరీ మార్క్ను అందుకుంది. ఆఖరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా.. అమెలియా కేర్ వరుసగా మూడు బౌండరీలు బాది తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. మొత్తంగా మహిళల వన్డే క్రికెట్లో లక్ష్య చేధనలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రెండో ప్లేయర్గా కెర్ నిలిచింది. అదేవిధంగా న్యూజిలాండ్ గడ్డపై వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఉమెన్స్ ప్లేయర్గా కూడా కెర్ రికార్డు నెలకొల్పింది.మహిళల వన్డేల్లో అత్యధిక రన్ ఛేజ్ చేసిన జట్లు ఇవేన్యూజిలాండ్-347-ప్రత్యర్ధి- సౌతాఫ్రికాభారత్-339- ప్రత్యర్ధి- ఆస్ట్రేలియాఆస్ట్రేలియా-331- ప్రత్యర్ధి భారత్చదవండి: మాక్స్వెల్కు షాకిచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా -
మాక్స్వెల్కు షాకిచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా
క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) 2026-27 సీజన్కు సంబంధించి ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టుల జాబితా ప్రకటించింది. ఇందులో 21 మందికి చోటు దక్కింది. కాగా ఈ ఏడాది ఆగష్టు నుంచి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు 12 నెలల కాలంలో 20 టెస్టు మ్యాచ్లు ఆడనుంది.మాక్స్వెల్కు షాకిచ్చిన సీఏఈ నేపథ్యంలో టెస్టులకు సంబంధించి బిజీ షెడ్యూల్ కారణంగా.. వైట్బాల్ స్పెషలిస్టులు అయిన గ్లెన్ మాక్స్వెల్ (Glenn Maxwell), మ్యాట్ షార్ట్లకు సీఏ షాకిచ్చింది. గతేడాది వార్షిక కాంట్రాక్టులో ఉన్న వీరిద్దరిపై ఈసారి వేటు వేసింది. ఇక గతేడాది రిటైర్ అయిన ఉస్మాన్ ఖవాజా పేరును కూడా సీఏ తొలగించింది.మూడు ప్రపంచకప్లు గెలిచిన విజేతవీరితో పాటు గాయాలతో సావాసం చేస్తున్న ఫాస్ట్ బౌలర్ లాన్స్ మోరిస్ (Lance Morris)కు సైతం సెంట్రల్ కాంట్రాక్టు దక్కలేదు. కాగా 37 ఏళ్ల గ్లెన్ మాక్స్వెల్ ఆస్ట్రేలియా తరఫున రెండు వన్డే వరల్డ్కప్, ఒక టీ20 వరల్డ్కప్ గెలిచిన ఘనుడు. అయితే, ఈసారి మాత్రం అతడిని సీఏ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తొలగించడం గమనార్హం.ఇదిలా ఉంటే.. యువ ఓపెనర్ సామ్ కొన్స్టాస్ను కూడా సీఏ పక్కనపెట్టింది. 20 ఏళ్ల ఈ బ్యాటర్కు బదులు.. 31 ఏళ్ల జేక్ వెదర్లాండ్ను సెంట్రల్ కాంట్రాక్టు జాబితాలో చేర్చింది. మరోవైపు.. ఫాస్ట్ బౌలర్ జే రిచర్డ్సన్ పేరును కూడా సీఏ తొలగించింది. మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్వుడ్, స్కాట్ బోలాండ్ వారసుడిగా పేరొందిన రిచర్డ్సన్ను సీఏ పట్టించుకోకపోవడం విశేషం.వీరికి అవకాశంఅదే సమయంలో.. ఇంగ్లండ్తో ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్లో రాణించిన 31 ఏళ్ల బ్రెండన్ డాగెట్, 36 ఏళ్ల మైకేల్ నాజర్లకు సీఏ చోటు ఇచ్చింది. కాగా ఆగష్టులో స్వదేశంలో బంగ్లాదేశ్తో సిరీస్తో ఆసీస్ టెస్టు ప్రయాణం మొదలుకానుంది. ఆ తర్వాత సౌతాఫ్రికా, ఇండియా టూర్లకు వెళ్తుంది. ఆఖరిగా స్వదేవంలో ఇంగ్లండ్తో 150వ వార్షికోత్సవ టెస్టు మ్యాచ్ ఆడుతుంది.క్రికెట్ ఆస్ట్రేలియా 2026-27 సీజన్కు గానూ ప్రకటించిన కాంట్రాక్టు ప్లేయర్ల జాబితాజేవియర్ బార్ట్లెట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్, బ్రెండన్ డాగెట్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమన్, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, టాడ్ మర్ఫీ, మైకేల్ నాజర్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జేక్ వెదర్లాండ్, బ్యూ వెబ్స్టర్, ఆడం జంపా.చదవండి: IPL 2026: గెలుపు జోష్లో ఉన్న శ్రేయస్ అయ్యర్కు భారీ షాక్ -
‘స్నేహితుల్లేరు.. మా నాన్న ఫేవరెట్ క్రికెటర్ కాదు’
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. క్రికెటర్లలో తనకు స్నేహితులెవరు లేరని, తన ఆరాధ్య క్రికెటర్ మా నాన్న సచిన్ టెండూల్కర్ ఎంతమాత్రం కాదని అర్జున్ చెప్పడం ఆసక్తిగా అనిపించింది. ఐపీఎల్ 2026 సీజన్కు ముందు ముంబై ఇండియన్స్ నుంచి లక్నో సూపర్జెయింట్స్కు ట్రేడ్ అయిన అర్జున్ ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్తో జరగబోయే మ్యాచ్కు అవకాశం వస్తుందా? రాదా అన్నది చూడాలి. ఈ నేపథ్యంలో శుభంకర్ మిశ్రా పాడ్కాస్ట్కు అర్జున్ టెండూల్కర్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ‘మీరు ఎప్పుడూ ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటారు ’ అని అడిగిన ప్రశ్నకు అర్జున్ చాలా ఆసక్తికరంగా బదులిచ్చాడు. ‘గోవాలోని నా ఇంట్లో ఐదు పెంపుడు కుక్కలు ఉన్నాయి. వాటితో ఆడుకుంటూ సమయం గడుపుతాను. అదే నా ప్రశాంతతకు అసలు కారణం' అని అర్జున్ వివరించాడు. ఒత్తిడితో కూడిన క్రికెట్ ప్రపంచం నుండి దూరంగా ఉండటానికి ఈ మూగజీవాలు తనకు ఎంతో సహాయం చేస్తాయని తెలిపాడు.సాధారణంగా ఆటగాళ్లకు ఎక్కువగా తోటి క్రికెటర్లే స్నేహితులుగా ఉంటారు. కానీ అర్జున్ మాత్రం తాను ఇందుకు విరుద్ధమని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ‘నాకు నిజంగా క్రికెటర్ స్నేహితులు లేరు. నా ఫ్రెండ్స్లో చాలా మందికి క్రికెట్తో పెద్దగా పరిచయం కూడా లేదు. అందుకే నేను వారితో కలిసినప్పుడు అస్సలు క్రికెట్ గురించి మాట్లాడను’ అని చెప్పాడు. దీనివల్ల ఆట నుంచి తనకు మంచి విరామం దొరుకుతుందని అభిప్రాయపడ్డాడు.క్రికెట్ దిగ్గజం కుమారుడు కావడంతో అర్జున్ టెండూల్కర్ తరచూ విమర్శలకు గురవ్వడం చూస్తుంటాం. ఈ నేపథ్యంలో ‘విమర్శలంటే మీకు భయమా?’ అని అడిగిన ప్రశ్నకు, అర్జున్ ఏమాత్రం తడబడకుండా.. ‘లేదు, నాకు అస్సలు భయం లేదు’ అని చాలా ధీమాగా సమాధానమిచ్చాడు. ఇక తన ఫేవరెట్ క్రికెటర్ తన నాన్న సచిన్ టెండూల్కర్ కాదని, మాజీ డాషింగ్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తనకు ఆరాధ్య క్రికెటర్ అని పేర్కొనడం విశేషం. అతని బ్యాటింగ్ అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొన్నాడు.ఇక దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడైన అర్జున్ తన తండ్రిలా మాత్రం టీమిండియాలో చోటు సంపాదించడంలో విఫలమయ్యాడు. తండ్రి అండతో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు పలు మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించాడు. IPL-2026 సీజన్కు ముందు అర్జున్ టెండూల్కర్ను లక్నో ట్రేడ్ చేసుకుంది. ఐపీఎల్లో 5 మ్యాచ్లాడిన అర్జున్ టెండూల్కర్ మూడు వికెట్లు పడగొట్టాడు.చదవండి: IPL 2026: శ్రేయస్ అయ్యర్కు భారీ షాక్Shubhankar: How do you keep yourself so calm and cool?Arjun: I have 5 dogs in Goa & I spend time playing with them.Shubhankar: Do you have friends who are cricketers?Arjun: I don’t really have cricketer friends, most of my friends don’t play cricket.pic.twitter.com/gZJMrcO7Df— Cricketopia (@CricketopiaCom) March 31, 2026 -
IPL 2026: శ్రేయస్ అయ్యర్కు భారీ షాక్
గతేడాది రన్నరప్గా నిలిచిన పంజాబ్ కింగ్స్ ఐపీఎల్-2026లో తమ ఆరంభ మ్యాచ్లో అదరగొట్టింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన పోరులో గుజరాత్ టైటాన్స్పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. న్యూ చంఢీగగడ్లో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ చేసింది.నామమాత్రపు స్కోరుఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (39), జోస్ బట్లర్ (38), గ్లెన్ ఫిలిప్స్ (25) ఓ మోస్తరుగా రాణించారు. పంజాబ్ బౌలర్లలో విజయ్కుమార్ వైశాక్ మూడు వికెట్లు తీయగా.. యజువేంద్ర చహల్ రెండు, మార్కో యాన్సెన్ ఒక వికెట్ దక్కించుకున్నారు.కూపర్ కన్నోలి మెరుపులుఇక లక్ష్య ఛేదనలో పంజాబ్ ఆరంభంలోనే తడబడినప్పటికీ మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే పని పూర్తి చేసింది. ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ 37 పరుగులు చేయగా.. వన్డౌన్ బ్యాటర్ కూపర్ కన్నోలి (Cooper Connolly) 44 బంతుల్లో 72 పరుగులతో అజేయంగా నిలిచాడు. కన్నోలి మెరుపుల కారణంగా పంజాబ్ 19.1 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 165 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసింది.The debutant seals it in style! 💪@PunjabKingsIPL clinch a thriller in New Chandigarh to get their campaign going with a win ❤️Scorecard ▶️ https://t.co/75rCxTCOL1#TATAIPL | #KhelBindaas | #PBKSvGT pic.twitter.com/WqBQNjuvA1— IndianPremierLeague (@IPL) March 31, 2026భారీ జరిమానాఈ మ్యాచ్లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (18) మాత్రం నిరాశపరిచాడు. తాను విఫలమైనా.. జట్టు గెలుపొందడంతో అతడు సంతోషం వ్యక్తం చేశాడు. అయితే.. గెలుపు జోష్లో ఉన్న అయ్యర్ (Shreyas Iyer Fined)కు భారీ షాక్ తగిలింది. గుజరాత్తో మ్యాచ్లో నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున అతడికి పెద్ద ఎత్తున జరిమానా పడింది.ఇందుకు సంబంధించి ఐపీఎల్ తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందుకుగానూ పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు జరిమానా విధించడమైనది. సీజన్లో ఇదే తొలి తప్పిదం కాబట్టి ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలో ఆర్టికల్ 2.22 నిబంధన ప్రకారం రూ. 12 లక్షల ఫైన్తో సరిపెట్టాము’’ అని పేర్కొంది.చదవండి: IPL 2026: మూగబోయిన బ్యాట్.. విధ్వంస వీరుడికి ఏమైంది? -
మ్యాచ్ హీరో అతడే.. ప్రత్యర్థి కెప్టెన్పై ప్రశంసలు
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. మంగళవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ముగిసిన అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. మ్యాచ్ హీరో కచ్చితంగా కూపర్ కనోలీనేనని, అతడి వల్లే ఈ గెలుపు సాధ్యమైందన్నాడు. అయితే గుజరాత్ కెప్టెన్ గిల్పై శ్రేయస్ ప్రశంసలు కురిపించడం ఆసక్తిగా మారింది. శ్రేయస్ మాట్లాడుతూ..‘నా చేతికి స్పల్ప గాయమైంది. పెద్దది అవ్వొద్దని గట్టిగా కోరుకున్నా. ప్రస్తుతం అంతా బాగుంది. గాయం తీవ్రత కూడా పెద్దగా లేదు. అయితే ఈ మ్యాచ్లో హీరో మాత్రం కూపర్ కనోలీనే. అద్భుతమైన టెక్నిక్తో మ్యాచ్ ఆడాడు. కనోలీ బాదిన కొన్ని షాట్లు మాత్రం అద్భుతం. డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లి చేతి గాయానికి ఐస్ పెట్టుకునే లోపే టపాటపా వికెట్లు పడిపోయాయి. క్రికెట్లో ఇలాంటి పరిస్థితులు సహజం. ఏం జరిగినా పోరాటం ఆపొద్దు. కనోలీ అదే చేశాడు. ప్రశాంతంగా ఆడుతూ జట్టుకు విజయాన్ని అందించాడు. అర్ష్దీప్ సింగ్ వచ్చి బంతి కాస్త ఆగి వస్తోందని చెప్పాడు. అందుకే మేం బంతిని వీలైనంత త్వరగా పాతబడేలా చేయడానికి ప్రయత్నించాం. విజయ్ కుమార్ వైశాఖ్ గత సీజన్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. అతడు బిగ్ మ్యాచ్ ప్లేయర్. అయితే నేను బ్యాటింగ్ చేసే సమయంలో షార్ట్ లెగ్ ఫీల్డర్ను చూసి షాకయ్యాను. ఇంతకుముందు ఏ కెప్టెన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నేను చూడలేదు. ఈ విషయాన్ని గిల్తో కూడా చెప్పాను. శుభ్మన్ గిల్ ఇలాంటి అటాకింగ్ ఫీల్డింగ్ సెట్ చేయడం బాగుంది’ అని అయ్యర్ చెప్పుకొచ్చాడు.చదవండి: ఇటలీకి షాక్.. ఫిపా ప్రపంచకప్కు అనర్హత -
వాళ్లకు కంటగింపుగా ఉన్నా.. గంగూలీకి సంతోషమే!
భారత మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దేశంలోని అన్ని వేదికల్లోనూ టెస్టులు నిర్వహించా లన్నాడు. ఇటీవల 2026–27 సీజన్కు సంబంధించిన షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) విడుదల చేసింది. ఇందులో విఖ్యాత క్రికెట్ మైదానం ‘ఈడెన్ గార్డెన్స్’ను కాదని ఆస్ట్రేలియాతో టెస్టు కోసం గువాహటి వేదికను ఎంపిక చేసింది. కోల్కతా వాసులు, క్రికెట్ అభిమానులకు ఇది కంటగింపుగా ఉన్నా.. బోర్డు నిర్ణయాన్ని తాజాగా గంగూలీ సమర్థించాడు. ‘మాజీ క్రికెటర్గా, బెంగాలీగా, క్యాబ్ అధ్యక్షుడిగా ఈడెన్లో ఆ్రస్టేలియా లాంటి గట్టి ప్రత్యర్థితో టెస్టులు జరిగితే చాలా సంతోషిస్తాను. అలాగే ఓ సగటు భారతీయుడిగా దేశంలోని మిగతా వేదికల్లోనూ గొప్పగొప్ప మ్యాచ్లు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. కోల్కతాలో దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్ను ఏర్పాటు చేశారు. ఇటీవల టి20 ప్రపంచకప్ మ్యాచ్లు కూడా జరిగాయి. రెగ్యులర్గా ఐపీఎల్ పోటీలకు ఈడెన్ గార్డెన్స్ క్రమం తప్పకుండా ఆతిథ్యమిస్తోంది. ఇక్కడ నిర్వహించడం ఎంత బాగున్నా... మిగతా వేదికలను కూడా పట్టించుకోవడం అంతే ముఖ్యం. దేశంలోని పలు నగరాల్లోని క్రికెట్ మైదానాలన్నీ బాగున్నాయి. అలాంటపుడు టెస్టుల్ని కేవలం కొన్ని నగరాలకే పరిమితం చేయడం సమంజసం కాదు’ అని దాదా వివరించాడు. గువాహటి, రాంచీ సహా మిగతా నగరాల్లోనూ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లకు దీటైన వేదికల్ని సిద్ధం చేశారని గంగూలీ కితాబిచ్చాడు. చదవండి: పోరాటానికి పరిమితులెందుకు? -
అరంగేట్రంలోనే అదరగొట్టాడు.. ఎవరీ కూపర్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎందరో అనామక ఆటగాళ్లను వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రతీ సీజన్లో తమ అరంగేట్రం మ్యాచ్ల్లో అదరగొట్టే ప్రదర్శన నమోదు చేసే ఆటగాళ్లు అరుదుగా ఉంటారు. ఆ జాబితాలో చేరిపోయాడు పంజాబ్ కింగ్స్ ప్లేయర్ కూపర్ కనోలీ. తాను ఆడుతుంది తొలి ఐపీఎల్ మ్యాచ్ అయినప్పటికీ ఎలాంటి బెరుకు లేకుండా కడదాకా నిలిచి 72 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో పంజాబ్ను గెలిపించాడు. ఆడిన తొలి మ్యాచ్లోనే అందరూ మెచ్చే ఇన్నింగ్స్ ఆడిన కనోలీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా’ నిలిచాడు. తద్వారా ఐపీఎల్లో అరంగేట్రం మ్యాచ్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కూపర్ ఐదో స్థానంలో ఉన్నాడు. కూపర్ కంటే ముందు మెక్కల్లమ్ (158 నాటౌట్), మైక్ హస్సీ (116 నాటౌట్), షాన్ మార్ష్ (84 నాటౌట్), కైల్ మిల్స్ (73) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు.ఇక మంగళవారం గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఒక దశలోఈజీగా గెలవాల్సిందే. కానీ ప్రసిధ్ క్రిష్ణ సూపర్ స్పెల్ వేసి శ్రేయస్, స్టోయినిస్, శశాంక్ సింగ్లను ఔట్ చేసి పంజాబ్కు షాక్ ఇచ్చాడు. ఈ దశలో వన్డౌన్లో వచ్చిన కూపర్ కనోలీ కడదాకా నిలిచి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 44 బంతుల్లో 72 పరుగులు చేసిన కూపర్ ఇన్నింగ్స్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఆల్రౌండర్గా గుర్తింపు ఉన్నా వెన్ను గాయం కారణంగా లీగ్లో అతను బౌలింగ్ చేయడని, స్పెషలిస్ట్ బ్యాటర్గానే ఆడతాడని పంజాబ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కనోలీ కీలక ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ నమ్మకాన్ని నిలబెట్టాడు.ఎవరీ కూపర్ కనోలీ?ఆస్ట్రేలియాకు చెందని కూపర్ కనోలీ 2003, ఆగస్టు 22న పెర్త్లో జన్మించాడు. 22 ఏళ్ల కూపర్ ఆస్ట్రేలియా తరఫున 2024 సెప్టెంబర్లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అరంగేట్రం చేసిన నాలుగు నెలల్లోనే అన్ని అంతర్జాతీయ ఫార్మాట్లలో మ్యాచ్లు ఆడిన క్రికెటర్గా కూపర్ అరుదైన ఘనత సాధించాడు. 2022-23 బీబీఎల్ ఫైనల్లో కూపర్ ప్రదర్శన అతడికి గుర్తింపునిచ్చింది. కూపర్ ఆస్ట్రేలియా తరఫున ఒక టెస్టు, 8 వన్డేలు, 11 టీ20 మ్యాచ్లు ఆడాడు.The debutant seals it in style! 💪@PunjabKingsIPL clinch a thriller in New Chandigarh to get their campaign going with a win ❤️Scorecard ▶️ https://t.co/75rCxTCOL1#TATAIPL | #KhelBindaas | #PBKSvGT pic.twitter.com/WqBQNjuvA1— IndianPremierLeague (@IPL) March 31, 2026చదవండి: మూగబోయిన బ్యాట్.. విధ్వంస వీరుడికి ఏమైంది? -
మూగబోయిన బ్యాట్.. విధ్వంస వీరుడికి ఏమైంది?
టీ20 క్రికెట్లో విధ్వంసకర బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు...ఇంగ్లండ్కు టి20 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ ... ఐపీఎల్లో ఏడు సెంచరీలు సహా నాలుగు వేలకు పైగా పరుగులు, ఏడు సీజన్ల పాటు రాజస్తాన్ రాయల్స్ విజయాల్లో కీలక పాత్ర... గత ఏడాది కూడా గుజరాత్ తరఫున 163 స్ట్రయిక్ రేట్తో 538 పరుగులు... కానీ ఇప్పుడు జోస్ బట్లర్ ఒక్కో పరుగు కోసం శ్రమిస్తున్నాడు. బౌండరీలు కాదు కదా సింగిల్ తీయడమే కష్టంగా మారిపోయింది. తనపై వస్తున్న విమర్శలకు బట్లర్ ఒక్క ఇన్నింగ్స్తో సమాధానం చెప్తాడేమో చూడాలి..ఇటీవల టీ20 ప్రపంచకప్లోనూ బట్లర్ పేలవ ప్రదర్శన చేశాడు. 8 ఇన్నింగ్స్లలో కలిపి కేవలం 87 పరుగులే చేసిన బట్లర్ ఐదుసార్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. నిజానికి రెండేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో బట్లర్ ఆట ఏమాత్రం బాగా లేదు. గత నాలుగు ఐసీసీ టోర్నీల్లో కలిపి (రెండు టీ20 ప్రపంచకప్లు, వన్డే వరల్డ్కప్, చాంపియన్స్ ట్రోఫీ) ఇంగ్లండ్ తరఫున 28 ఇన్నింగ్స్లలో బట్లర్ ఒకే ఒక అర్ధసెంచరీ చేయడం చూస్తేనే పరిస్థితి అర్థమవుతుంది. అయితే ఐపీఎల్కు వచ్చేసరికి అన్నీ వెనక్కి తోసి మళ్లీ ఫామ్లోకి వచ్చి చెలరేగుతాడని ఆశించిన టైటాన్స్కు తొలి మ్యాచ్లోనే నిరాశ ఎదురైంది. పంజాబ్తో మ్యాచ్లో క్రీజ్లో ఉన్నంత సేపు బట్లర్ చాలా ఇబ్బందిగా కనిపించాడు. అసలు ఏమాత్రం సాధికారికంగా ఆడలేకపోయాడు. తన తొలి 30 బంతుల్లో అతను 11 డాట్ బాట్స్ ఆడాడు. ఆ తర్వాత లెక్క సరి చేసేందుకు అతను చాలా శ్రమించాడు. స్వీప్, రివర్స్ స్వీప్లు ప్రయత్నించినా ఆశించిన ఫలితం మాత్రం రాలేదు. చివరకు చహల్ బౌలింగ్లో వరుసగా రెండు డాట్ బాల్స్ తర్వాత అసహనంతో భారీ షాట్కు ప్రయత్నించి వెనుదిరిగాడు. కేవలం 115.15 స్ట్రయిక్రేట్తో ఇన్నింగ్స్ ముగించడం బట్లర్ స్థాయికి సరిపోదని క్రికెట్ ఫ్యాన్స్ వాపోయారు.2022లో ఆరెంజ్ క్యాప్..2022 ఐపీఎల్ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ చేరడంలో బట్లర్ కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్లో ఓపెనర్గా వచ్చిన బట్లర్ ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. 868 పరుగులు చేసిన బట్లర్ ఆ సీజన్లో అత్యధిక పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు ఒకే సీజన్లో నాలుగు సెంచరీలు బాదిన బట్లర్ ఈ ఘనత సాధించిన తొలి విదేశీ ఆటగాడిగా, ఐపీఎల్ చరిత్రలో రెండో ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. 2023, 2024 సీజన్లలోనూ బట్లర్ రాజస్తాన్ రాయల్స్ తరఫునే ప్రాతినిధ్యం వహించాడు. అయితే 2025 మెగావేలంలో బట్లర్ను దక్కించుకునేందుకు రాజస్తాన్, గుజరాత్ టైటాన్స్ పోటీ పడ్డాయి. చివరకు బట్లర్ను గుజరాత్ టైటాన్స్ రూ. 15.06 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్లో గుజరాత్ తరఫున 14 మ్యాచ్ల్లో 538 పరుగులు సాధించాడు. లెక్క సరిచేయాలి..కానీ ఈ సీజన్లో మాత్రం బట్లర్ బ్యాట్ మూగబోయినట్లుగా అనిపిస్తుంది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ అయినప్పటికీ బట్లర్ ఆడిన తీరు అతడు ఫామ్లేమితో సతమత మవుతున్నట్లు అర్థమవుతుంది. తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు బట్లర్కు ఒక్క ఇన్నింగ్స్ చాలు. రాబోయే మ్యాచ్ల్లో బట్లర్ మెరవాలని కోరుకుందాం. చదవండి: చెన్నై ఓటమి వెనుక తప్పులెన్నో! -
కూపర్... సూపర్
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో 163 పరుగుల విజయలక్ష్యం.... పంజాబ్ ఒకదశలో 11 ఓవర్లలో 110/2... మిగిలిన 48 బంతుల్లో మరో 53 పరుగులు అంటే అలవోకగా ఛేదించవచ్చు... కానీ ఇక్కడ జట్టు అనూహ్యంగా తడబడింది. 16 బంతుల వ్యవధిలో జట్టు 4 వికెట్లు కోల్పోవడంతో ఒక్కసారిగా ఉత్కంఠ పెరిగింది. అయితే ఈ మ్యాచ్తోనే ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఆ్రస్టేలియన్ కూపర్ కనోలీ పట్టుదలగా నిలబడ్డాడు. ఒత్తిడిని అధిగమిస్తూ చివరి వరకు నిలబడి ఒంటి చేత్తో గెలిపించాడు. అంతకుముందు పంజాబ్ పదునైన బౌలింగ్ ముందు నిలవలేక గుజరాత్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. న్యూ చండీగఢ్: ఐపీఎల్లో మూడు ఏకపక్ష మ్యాచ్ల తర్వాత ఉత్కంఠభరిత పోరు జరిగింది. మంగళవారం చివరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (27 బంతుల్లో 39; 6 ఫోర్లు), జోస్ బట్లర్ (33 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. అనంతరం పంజాబ్ 19.1 ఓవర్లలో 7 వికెట్లకు 165 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కూపర్ కనోలీ (44 బంతుల్లో 72 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్లు) చెలరేగగా, ప్రభ్సిమ్రన్ సింగ్ (24 బంతుల్లో 37; 1 ఫోర్, 4 సిక్స్లు) రాణించాడు. బ్యాటింగ్ వైఫల్యం! బార్ట్లెట్ ఓవర్లో గిల్ మూడు ఫోర్లు కొట్టి ధాటిని ప్రదర్శించగా, మరో ఓపెనర్ సాయిసుదర్శన్ (13) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. బట్లర్ కూడా ఆశించిన స్థాయిలో దూకుడుగా ఆడకపోవడంతో పవర్ప్లేలో గుజరాత్ 54 పరుగులే చేయగలిగింది. ఇందులో ఒక్క సిక్స్ కూడా లేకపోవడం విశేషం. ఆ తర్వాత చహల్ బౌలింగ్లో స్లాగ్ స్వీప్కు ప్రయత్నించి గిల్ వెనుదిరగ్గా, గ్లెన్ ఫిలిప్స్ (17 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్) కూడా ఎక్కువసేపు నిలవలేదు. 16వ ఓవర్ వరకు క్రీజ్లో ఉన్నా బట్లర్ ప్రభావం కనిపించలేదు. చివరి 4 ఓవర్లలో టైటాన్స్ కేవలం 2 ఫోర్లతో 31 పరుగులే రాబట్టగలిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మిడిలార్డర్లో వాషింగ్టన్ సుందర్ (18), షారుఖ్ ఖాన్ (4) కూడా విఫలమయ్యారు. రాణించిన ప్రభ్సిమ్రన్... ఛేదనలో ఆరంభంలోనే ప్రియాన్‡్ష ఆర్య (7) వెనుదిరిగినా... ప్రభ్ సిమ్రన్ సిక్సర్లతో చెలరేగాడు. రబాడ ఓవర్లో వరుసగా రెండు సిక్స్లు కొట్టిన అతను, సుందర్ బౌలింగ్లో మరో రెండు భారీ సిక్స్లు బాదాడు. అయితే కీలక సమయంలో గుజరాత్ కట్టుదిట్టమైన బౌలింగ్తో వరుస వికెట్లు తీసి పంజాబ్పై ఒత్తిడి పెంచింది. కానీ కనోలీ పోరాటంతో మ్యాచ్ పంజాబ్ వశమైంది. అశోక్ అరంగేట్రం... రాజస్తాన్కు చెందిన 23 ఏళ్ల అశోక్ శర్మ ఈ మ్యాచ్తోనే ఐపీఎల్లో అడుగు పెట్టాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేసే ఫాస్ట్ బౌలర్గా గుర్తింపు పొందాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కేవలం 15.63 సగటుతో 22 వికెట్లు పడగొట్టి టోర్నీ టాపర్గా నిలిచాడు. ఐపీఎల్లో 2022లో కోల్కతా, 2025లో రాజస్తాన్ జట్లలో ఉన్నా ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సుదర్శన్ (సి) అయ్యర్ (బి) యాన్సెన్ 13; గిల్ (సి) కనోలీ (బి) చహల్ 39; బట్లర్ (సి) బార్ట్లెట్ (బి) చహల్ 38; ఫిలిప్స్ (సి) యాన్సెన్ (బి) వైశాక్ 25; సుందర్ (సి) అర్ష్దీప్ (బి) వైశాక్ 18, షారుఖ్ (సి) అర్ష్దీప్ (బి) వైశాక్ 4; తెవాటియా (నాటౌట్) 11; రషీద్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–37, 2–83, 3–119, 4–129, 5–144, 6–150.బౌలింగ్: అర్ష్దీప్ 4–0–42–0, బార్ట్లెట్ 4–0–36–0, యాన్సెన్ 4–0–20–1, వైశాక్ 4–0–34–3, చహల్ 4–0–28–2, పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్‡్ష (సి) అశోక్ (బి) రబాడ 7; ప్రభ్సిమ్రన్ (సి) ప్రసిధ్ (బి) రషీద్ 37; కనోలీ (నాటౌట్) 72; శ్రేయస్ (సి) సుందర్ (బి) ప్రసిధ్ 18; వధేరా (సి) గిల్ (బి) సుందర్ 3; శశాంక్ (సి) బట్లర్ (బి) ప్రసిధ్ 4; స్టొయినిస్ (సి) రషీద్ (బి) ప్రసిధ్ 0; యాన్సెన్ (సి) గిల్ (బి) అశోక్ 9; బార్ట్లెట్ (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 4; మొత్తం (19.1 ఓవర్లలో 7 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–7, 2–83, 3–110, 4–113, 5–118, 6–118, 7–144. బౌలింగ్: సిరాజ్ 2–0–15–0 రబాడ 3–0–34–1, అశోక్ శర్మ 3–0–31–1, రషీద్ 4–0–29–1, సుందర్ 3.1–0–27–1, ప్రసిధ్ 4–0–29–3. -
IPL 2026: పంజాబ్ను గెలిపించిన కన్నోల్లీ
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మార్చి 31) జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా.. పంజాబ్ మరో 5 బంతులు (19.1 ఓవర్లలో) మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అరంగేట్రం ఆటగాడు కూపర్ కన్నోల్లీ (44 బంతుల్లో 72 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ను గెలిపించాడు.తొలుత సునాయాసంగా గెలుస్తుందనుకున్న పంజాబ్ ఓ దశలో తడబడింది. 8 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది. ఈ దశలో కన్నోల్లీ సంయమనంతో ఆడి పంజాబ్ను విజయతీరాలకు చేర్చాడు. అతనికి జేవియర్ బార్ట్లెట్ (11 నాటౌట్) సహకరించాడు. పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రభ్సిమ్రన్ సింగ్ (37) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. శ్రేయస్ అయ్యర్ (18), ప్రియాంశ్ ఆర్య (7), నేహల్ వధేరా (3), శశాంక్ సింగ్ (4), స్టోయినిస్ (0), జన్సెన్ (9) నిరాశపరిచారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ (4-0-29-3) అద్భుతమైన స్పెల్తో పంజాబ్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచగా.. రషీద్ ఖాన్ (4-0-29-1) పర్వాలేదనిపించాడు. మిగతా బౌలర్లలో రబాడ, అశోక్ శర్మ, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు.అంతకుముందు గుజరాత్ సైతం ఓ దశలో భారీ స్కోర్ చేసేలా కనిపించినప్పటికీ.. పంజాబ్ బౌలర్లు ఒక్కసారిగా పుంజుకోవడంతో నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. విజయ్కుమార్ వైశాక్ (4-0-34-3), యుజ్వేంద్ర చహల్ (4-0-28-2), మార్కో జన్సెన్ (4-0-20-1), బార్ట్లెట్ (4-0-36-0) అద్భుతంగా బౌలింగ్ చేసి గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఒక్క అర్షదీప్ సింగ్ (4-0-42-0) మినహా పంజాబ్ బౌలర్లంతా అద్బుతంగా బౌలింగ్ చేశారు.గుజరాత్ ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ (27 బంతుల్లో 39; 6 ఫోర్లు), జోస్ బట్లర్ (33 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్లెన్ ఫిలిప్స్ (17 బంతుల్లో 25; 2 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. సాయి సుదర్శన్ (13), వాషింగ్టన్ సుందర్ (18), షారుక్ ఖాన్ (4) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. రాహుల్ తెవాతియా (11), రషీద్ ఖాన్ (0) అజేయంగా నిలిచారు. -
చెలరేగిన పంజాబ్ బౌలర్లు.. స్వల్ప స్కోర్కే పరిమితమైన గుజరాత్
ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్తో ఇవాళ (మార్చి 31) జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. పంజాబ్ హోం గ్రౌండ్ అయిన మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో (ముల్లాన్పూర్) జరుగుతున్న ఈ మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.వారి బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులకే పరిమితమైంది. విజయ్కుమార్ వైశాక్ (4-0-34-3), యుజ్వేంద్ర చహల్ (4-0-28-2), మార్కో జన్సెన్ (4-0-20-1), బార్ట్లెట్ (4-0-36-0) అద్భుతంగా బౌలింగ్ చేసి గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఒక్క అర్షదీప్ సింగ్ (4-0-42-0) మినహా పంజాబ్ బౌలర్లంతా అద్బుతంగా బౌలింగ్ చేశారు.గుజరాత్ ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ (27 బంతుల్లో 39; 6 ఫోర్లు), జోస్ బట్లర్ (33 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్లెన్ ఫిలిప్స్ (17 బంతుల్లో 25; 2 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. సాయి సుదర్శన్ (13), వాషింగ్టన్ సుందర్ (18), షారుక్ ఖాన్ (4) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. రాహుల్ తెవాతియా (11), రషీద్ ఖాన్ (0) అజేయంగా నిలిచారు. -
బెన్ డకెట్కు శిక్ష
ఐపీఎల్ 2026 నుంచి అకారణంగా తప్పుకొని చిక్కుల్లో పడిన ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్, తాజాగా ఓ పాత కేసులో శిక్షను ఎదుర్కొన్నాడు. రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించినందుకు అతనికి కోర్టు భారీ జరిమానా విధించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 2025 ఆగస్టులో స్టోక్ సమీపంలోని A50 రహదారిపై డకెట్ 70 mph పరిమితి ఉన్న చోట 93 mph వేగంతో డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డాడు. స్టాఫోర్డ్షైర్ పోలీసులు స్పీడ్ గన్తో దాన్ని గుర్తించారు. వేగం పరిమితి చాలా ఎక్కువగా ఉండటంతో కేసు పరిధి జరిమానా దాటి కోర్టుకు వెళ్లింది. కానాక్ మేజిస్ట్రేట్స్ కోర్డులో డకెట్ నేరాన్ని అంగీకరించడంతో 700 పౌండ్ల జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్పై 4 పెనాల్టీ పాయింట్లు, 120 పౌండ్ల కోర్టు ఖర్చులు, 280 పౌండ్ల బాధితుల సర్చార్జ్ విధించారు. మొత్తం ఆయన చెల్లించాల్సిన మొత్తం 1,100 పౌండ్లకు చేరింది. కొత్తేమీ కాదు..!డకెట్కు ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. 2015లో డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులో ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్నారు. 2017లో యాషెస్ సిరీస్లో సహచరుడు జేమ్స్ ఆండర్సన్ పట్ల దురుసగా ప్రవర్తించి జట్టు నుంచి తొలగించబడ్డాడు. ఇటీవలి యాషెస్ సిరీస్ సమయంలో మద్యం మత్తులో రోడ్డుపై హల్చల్ చేశాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో డకెట్ ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడాల్సి ఉంది. ఈ సీజన్ వేలంలో ఆ ఫ్రాంచైజీ డకెట్ను రూ.2 కోట్లకు కొనుగోలు చేశారు. అయితే చివరి నిమిషంలో కౌంటీలు, జాతీయ జట్టు అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి లీగ్ నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్ నియమాల ప్రకారం, చివరి నిమిషంలో తప్పుకున్న ఆటగాళ్లకు 2–3 సంవత్సరాల నిషేధం విధించే అవకాశం ఉంది. దీంతో అతను ఐపీఎల్ కాంట్రాక్ట్ డబ్బును కూడా కోల్పోతారు. మరోవైపు ఢిల్లీ ఇంకా డకెట్కి ప్రత్యామ్నాయం ప్రకటించలేదు. ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ జేక్ ఫ్రేసర్ మెక్గర్క్ డకెట్ స్థానంలో వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ సీజన్లో ఢిల్లీ ఏప్రిల్ 1న ఎల్ఎస్జీతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. -
ఒక్కరోజులో రూ. 9.5 కోట్ల లాభం కళ్లజూసిన స్టీవ్ స్మిత్!
స్టీవ్ స్మిత్.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. తన అద్భుతమైన నైపుణాల్యతో ప్రపంచంలోని మేటి క్రికెటర్లలో ఒకడిగా పేరొందాడు ఈ ఆస్ట్రేలియా స్టార్. నవతరం క్రికెట్లో టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి, న్యూజిలాండ్ లెజెండ్ కేన్ విలియమ్సన్, ఇంగ్లండ్ దిగ్గజం జో రూట్తో కలిసి ఫ్యాబ్-4లో ఒకడిగా కొనసాగుతున్నాడు.ఒక్కరోజులోనే రూ. 9.5 కోట్ల లాభం!ఆస్ట్రేలియా కెప్టెన్గానూ చిరస్మరణీయ విజయాలు అందుకున్న స్మిత్ (Steve Smith).. మైదానం వెలుపలా ‘స్మార్ట్ ఆపరేటర్’ అని నిరూపించుకున్నాడు. స్మిత్కు ముందు చూపు ఎక్కువ. మార్కెట్పైనా అవగాహన ఉంది. అందుకే ఒక్కరోజులోనే అతడు ఏకంగా రూ. 9.5 కోట్ల మొత్తం లాభం కళ్లజూశాడు. ఇదెలా సాధ్యమైందంటే..ఎలా సాధ్యమైందంటేఓ ఆన్లైన్ బెడ్డింగ్, ఫర్నీచర్ రిటైలర్ కంపెనీలో స్మిత్ 2015లో లక్ష డాలర్ల (ఆస్ట్రేలియన్ డాలర్లు) మేర పెట్టుబడి పెట్టాడు. ప్రస్తుతం ఈ కంపెనీలో అతడికి 3.9 శాతం వాటా ఉంది. ఈ కంపెనీ మంగళవారం ఆస్ట్రేలియన్ సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ అయింది. ఈ క్రమంలో స్మిత్ వాటా విలువ 11.9 మిలియన్ డాలర్లుగా ఉండగా.. మార్కెట్ ముగిసేసరికి దీని విలువ 13.2 మిలియన్ డార్లకు చేరింది.తద్వారా స్మిత్ ఒక్కరోజులోనే సుమారుగా 1.4 మిలియన్ డాలర్ల మేర లాభం పొందినట్లు నైన్.కో.ఏయూ వెల్లడించింది. కాగా ఆన్లైన్ బెడ్డింగ్, ఫర్మీచర్ రిటైలర్ కంపెనీలోనే కాకుండా పలు ఇతర సంస్థల్లోనూ స్మిత్ పెట్టుబడులు పెట్టాడు. ఓట్ మిల్క్ గుడ్నెస్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకుడు కూడా!కాగా స్మిత్ కెరీర్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియా తరఫున 2010లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 123 టెస్టుల్లో 10763, 170 వన్డేల్లో 5800, టీ20లలో 1094 పరుగులు సాధించాడు కుడిచేతి వాటం బ్యాటర్. ఇక 36 ఏళ్ల స్మిత్ చివరగా ఇంగ్లండ్తో యాషెస్ టెస్టు సిరీస్లో భాగంగా ఈ ఏడాది జనవరిలో ఆసీస్ తరఫున బరిలోకి దిగాడు.గమనిక: స్మిత్ పెట్టుబడుల ద్వారా పొందిన లాభం గురించి మాత్రమే వార్త ఇవ్వడం జరిగింది. దీని ద్వారా సాక్షి.కామ్ ఎలాంటి పెట్టుబడులను ప్రోత్సహించడం లేదు.చదవండి: ఇంగ్లండ్ టూర్కు వైభవ్ సూర్యవంశీని పంపండి: మైకేల్ వాన్ -
గుజరాత్పై పంజాబ్ గెలుపు
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మార్చి 31) జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా.. పంజాబ్ మరో 5 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. అరంగేట్రం ఆటగాడు కూపర్ కన్నోల్లీ (44 బంతుల్లో 72 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ను గెలిపించాడు.శ్రేయస్ ఔట్12.1వ ఓవర్- 110 పరుగుల వద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో వాషింగ్టన్ సుందర్కు క్యాచ్ ఇచ్చి శ్రేయస్ అయ్యర్ (18) ఔటయ్యాడు.రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్9.3వ ఓవర్- 83 పరుగుల వద్ద పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్లో ప్రసిద్ద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి ప్రభ్సిమ్రన్ సింగ్ (37) ఔటయ్యాడు. ఆదిలోనే పంజాబ్కు ఎదురుదెబ్బ1.2వ ఓవర్- 163 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.రబాడ బౌలింగ్లో ప్రియాంశ్ ఆర్య (7) ఔటయ్యాడు. స్వల్ప స్కోర్కే పరిమితమైన గుజరాత్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్15.4వ ఓవర్- 129 పరుగుల వద్ద గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. చహల్ బౌలింగ్లో బార్ట్లెట్కు క్యాచ్ ఇచ్చి జోస్ బట్లర్ (38) పెవిలియన్ బాట పట్టాడు.మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్13.6వ ఓవర్- 119 పరుగుల వద్ద గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. విజయ్కుమార్ వైశాక్ బౌలింగ్లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి గ్లెన్ ఫిలిప్స్ (25) ఔటయ్యాడు. గిల్ ఔట్9.3వ ఓవర్- 83 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. చహల్ బౌలింగ్లో కన్నోల్లీకి క్యాచ్ ఇచ్చి శుభ్మన్ గిల్ (39) ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్.. సుదర్శన్ (13) ఔట్3.4వ ఓవర్- 37 పరుగుల వద్ద గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. జన్సెన్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి సాయి సుదర్శన్ ఔటయ్యాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మార్చి 31) జరుగుతున్న నాలుగో మ్యాచ్లో గత ఎడిషన్ రన్నరప్ పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ పంజాబ్ హోం గ్రౌండ్ అయిన మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో (ముల్లాన్పూర్) జరుగుతుంది. ఈ మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.ఇరు జట్లు చివరి సారి తలపడినప్పుడు పరుగుల వరద పారింది. అహ్మదాబాద్ వేదికగా గత ఎడిషన్లో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 243 పరుగుల భారీ స్కోర్ చేయగా.. గుజరాత్ సైతం అద్భుతంగా పోరాడినప్పటికీ, లక్ష్యానికి 12 పరుగుల దూరంలో (232) నిలిచిపోయింది. ఈ గెలుపుతో శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కెప్టెన్గా గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చాడు.తుది జట్లు..పంజాబ్: ప్రభ్సిమ్రాన్ సింగ్(w), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(c), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, విజయ్కుమార్ వైషాక్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్లు: ప్రియాంష్ ఆర్య, హర్ప్రీత్ బ్రార్, ప్రవీణ్ దూబే, విష్ణు వినోద్, సూర్యాంశ్ షెడ్గేగుజరాత్: సాయి సుదర్శన్, శుభమన్ గిల్(c), జోస్ బట్లర్(w), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, M షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, అశోక్ శర్మ, మహ్మద్ సిరాజ్గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ సబ్లు: ప్రసిద్ధ్ కృష్ణ, జాసన్ హోల్డర్, జయంత్ యాదవ్, మానవ్ సుతార్, కుమార్ కుశాగ్రా -
సంజూ శాంసన్ను రెచ్చగొట్టిన రియాన్ పరాగ్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (మార్చి 30) జరిగిన మ్యాచ్లో సీఎస్కే ఓపెనర్, మాజీ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ను ప్రస్తుత రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఈ మ్యాచ్లో నూర్ అహ్మద్ బౌలింగ్లో సిక్సర్ బాదిన తర్వాత వికెట్కీపింగ్ చేస్తున్న సంజూను కవ్విస్తూ ఓవరాక్షన్ చేశాడు. సంజూ తరహాలోనే కండలు చూపిస్తూ, ఇది నా పవర్ అన్నట్లు సెలబ్రేషన్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలైంది.pic.twitter.com/jV9dCFiTJn— crictalk (@crictalk7) March 31, 2026ఇది చూసి సంజూ అభిమానులు హర్ట్ అయ్యారు. హనుమంతుని ముందా కుప్పిగంతులు అంటూ పంచ్లు వేశారు. మాజీ కెప్టెన్ అన్న గౌరవం కూడా లేదా అంటూ మండిపడ్డారు. కెప్టెన్ కాగానే కళ్లు నెత్తికెక్కాయా అంటూ వార్నింగ్లు ఇచ్చారు. వాస్తవానికి రియాన్ను ఇలాంటి అతి ప్రవర్తన కొత్తేమీ కాదు. అతనికి ఓవరాక్షన్ స్టార్ అన్న బిరుదు కూడా ఉంది. అయితే, తాజా మాజీ కెప్టెన్ విషయంలోనూ ఇలా ప్రవర్తిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. రియాన్ ఏ ఉద్దేశంతో కండలు చూపించినా, అది సంజూ అభిమానులను మాత్రం హర్ట్ చేసింది.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో రియాన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ సీఎస్కేపై ఏకపక్ష విజయం సాధించింది. తొలుత బౌలింగ్లో సీఎస్కేను 127 పరుగులకే కుప్పకూల్చి, ఆతర్వాత మెరుపు వేగంతో లక్ష్యాన్ని ఛేదించింది. తొలిసారి సీఎస్కేకు ఆడుతున్న సంజూ శాంసన్ (6) ఈ మ్యాచ్లో దారుణంగా విఫలం కాగా.. ఫుల్టైమ్ కెప్టెన్గా రియాన్ తొలి మ్యాచ్లోనే బోణీ కొట్టాడు.బౌలింగ్లో కలిసికట్టుగా సీఎస్కే పతనాన్ని శాశించిన రాయల్స్.. బ్యాటింగ్లో వైభవ్ సూర్యవంశీ (17 బంతుల్లో 52; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర అర్ద సెంచరీతో విరుచుకుపడటంతో 12.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఊదేసింది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సీజన్లో ఘనంగా బోణీ కొట్టింది. -
బంగ్లాదేశ్ పర్యటన.. కివీస్ వన్డే, టీ20 జట్ల ప్రకటన
బంగ్లాదేశ్ పర్యటనకు న్యూజిలాండ్ క్రికెట్ జట్టును కివీస్ బోర్డు ప్రకటించింది. ఇందులో పేస్ త్రయం మ్యాట్ ఫిషర్, విలియం ఓ రూర్కీ, బ్లెయిర్ టిక్నర్లకు చోటు దక్కింది. కాగా భారత్తో టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో ఓడిన న్యూజిలాండ్.. రన్నరప్తో సరిపెట్టుకుంది.ఈ క్రమంలో ఐసీసీ టోర్నీ ముగిసిన వెంటనే దాదాపుగా ద్వితీయ శ్రేణి జట్టుతో స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడింది కివీస్ జట్టు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రొటిస్ జట్టు ఆతిథ్య న్యూజిలాండ్పై 3-2తో గెలిచింది.పరిమిత ఓవర్ల సిరీస్లుఇక ఈ సిరీస్ తర్వాత న్యూజిలాండ్ బంగ్లాదేశ్ పర్యటన (New Zealand tour of Bangladesh, 2026)కు వెళ్లేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. తొలుత ఏప్రిల్ 17న వన్డే సిరీస్ మొదలుకానుండగా.. మే 2 నాటి మూడో టీ20తో ఈ టూర్ ముగియనుంది.టామ్ లాథమ్ సారథ్యంలోఈ నేపథ్యంలో బంగ్లాదేశ్తో పరిమిత ఓవర్ల సిరీస్లకు కివీస్ బోర్డు తాజాగా తమ జట్లను ప్రకటించింది. మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) స్థానంలో వన్డే, టీ20 జట్లకు టెస్టు కెప్టెన్ టామ్ లాథమ్ సారథ్యం వహించనున్నాడు.కాగా సాంట్నర్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతడితో పాటు పలువురు కీలక ప్లేయర్లు సైతం ఐపీఎల్, పాకిస్తాన్ సూపర్ లీగ్ విధులతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ప్లేయర్లతో కివీస్ బోర్డు వన్డే, టీ20 జట్లను ప్రకటించింది.ఇక గాయాల నుంచి కోలుకున్న ఫిషర్, ఓరూర్కీ, టిక్నర్ తిరిగి జట్టుతో చేరడం పట్ల హెడ్కోచ్ రాబ్ వాల్టర్ హర్షం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే.. ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ డీన్ ఫాక్స్క్రాఫ్ట్ చాలా కాలం తర్వాత తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు.బంగ్లాదేశ్ పర్యటనకు న్యూజిలాండ్ వన్డే జట్టు (ఏప్రిల్ 17, 20, 23)టామ్ లాథమ్ (కెప్టెన్), ముహమ్మద్ అబ్బాస్, ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్, జోష్ క్లార్క్సన్, డేన్ క్లీవర్, డీన్ ఫాక్స్క్రాఫ్ట్, నిక్ కెల్లి, జేడెన్ లెనాక్స్, హెన్రీ నికోల్స్, విలియం ఓరూర్కీ, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్.బంగ్లాదేశ్తో టీ20లకు న్యూజిలాండ్ జట్టు (ఏప్రిల్ 27, 29, మే 2)టామ్ లాథమ్ (కెప్టెన్), కెటెనె క్లార్క్, క్రిస్టియన్ క్లార్క్, జోష్ క్లార్క్సన్, డేన్ క్లీవర్, మ్యాట్ ఫిషర్, డీన్ ఫాక్స్క్రాఫ్ట్, బెవాన్ జేకబ్స్, నిక్ కెల్లి, జేడెన్ లెనాక్స్, టిమ్ రాబిన్సన్, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, ఇష్ సోధి, బ్లెయిర్ టిక్నర్.చదవండి: ఇంగ్లండ్ టూర్కు వైభవ్ సూర్యవంశీని పంపండి: మైకేల్ వాన్ -
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్పై నిషేధం
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ ఫకర్ జమాన్ నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్-2026లో బాల్ టాంపరింగ్ ఆరోపణలు రుజువు కావడంతో లీగ్ యాజమాన్యం ఇతనిపై రెండు మ్యాచ్ల నిషేధం విధించింది. పీఎస్ఎల్లో లాహోర్ ఖలందర్స్కు ఆడే జమాన్.. మార్చి 29న కరాచీ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో బాల్ టాంపరింగ్కు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం టీవీ స్క్రీన్లలోనూ స్పష్టం కనిపించింది.అయితే జమాన్ ఈ ఆరోపణలు ఖండించాడు. తాను ఎలాంటి బాల్ టాంపరింగ్కు పాల్పడలేదని అన్నాడు. దీంతో మ్యాచ్ రిఫరి రోషన్ మహానామా రంగంగలోకి దిగి విచారణ చేపట్టారు. ఇందులో జమాన్ దోషిగా తేలడంతో నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. బాల్ టాంపరింగ్ అంశం పీఎస్ఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్లోని లెవల్–3 ఉల్లంఘన కిందకు వస్తుంది. ఇందుకు శిక్ష రెండు మ్యాచ్ల నిషేధం.నిషేధం ప్రకటనలో జమాన్ ఏప్రిల్ 3న ముల్తాన్ సుల్తాన్స్తో, ఏప్రిల్ 9న ఇస్లామాబాద్ యునైటెడ్తో జరుగనున్న మ్యాచ్లకు దూరం కానున్నాడు. అసలేం జరిగిందంటే..?కరాచీ కింగ్స్ విజయానికి చివరి ఓవర్లో 14 పరుగులు అవసరమయ్యాయి. ఈ ఓవర్ వేసే బాధ్యతను కెప్టెన్ షాహీన్ అఫ్రిది పేసర్ హరీస్ రవూఫ్కు అప్పగించాడు. అయితే ఈ క్రమంలో ఫకర్ జమాన్, అఫ్రిది, రవూఫ్ ముగ్గురూ కలిసి బౌలర్ ఎండ్ వద్ద మాట్లాడుకున్నారు. ఈ సమయంలో బంతికి ఒకరు చేతి నుంచి ఒకరు మార్చుకున్నారు.అయితే బంతిని ఫకర్ తన చేతి వేలితో గీకినట్లు కనిపించింది. దీంతో వెంటనే అంపైర్ బంతిని అతడి చేతి నుంచి తీసుకుని టాంపరింగ్కు గురైనట్లు నిర్ధారించారు. ఈ క్రమంలో బంతిని మార్చడంతో పాటు లహోర్కు ఐదు పరుగుల పెనాల్టీ విధించారు. దీంతో మ్యాచ్ ఫలితమే తారుమారైంది. జమాన్ జట్టు ఓటమిపాలైంది. -
ఐపీఎల్ 2026లో విషాదం
ఐపీఎల్ 2026లో ఓ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఇంగ్లండ్కు చెందిన 76 ఏళ్ల బ్రాడ్కాస్ట్ ఇంజనీర్ జాన్ విలియం లాంగ్ఫోర్డ్ ముంబైలోని తన హోటల్ గదిలో విగతజీవిగా పడి ఉన్నారు. లాంగ్ఫోర్డ్ మార్చి 24 నుంచి ముంబైలోని ట్రైడెంట్ హోటల్లో ఉంటున్నారు. మార్చి 29న జరిగిన ముంబై ఇండియన్స్–కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్లో ఆయన పని చేశారు. ఆ రాత్రి హోటల్ గదిలోకి వెళ్లిన అతను.. మరుసటి రోజు ఉదయం ఎంతకీ స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది స్పేర్ లాక్తో డోర్ ఓపెన్ చేసి చూడగా లాంగ్ఫోర్డ్ నేలపై పడివున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో రంగంలోకి దిగిన మెరైన్ డ్రైవ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్మార్టం నివేదికలో ఎలాంటి అనుమానాస్పద అంశాలు లభించలేదని పోలీసులు తెలిపారు. లాంగ్ఫోర్డ్ కెరీర్ బ్రిటిష్ సిటిజన్ అయిన లాంగ్ఫోర్డ్ ఐపీఎల్ 2026లో ZOOM కమ్యూనికేషన్స్ తరఫున ఫ్రీలాన్స్ విజన్ సూపర్వైజర్గా పని చేస్తున్నారు. గతంలో అతను మహిళల ప్రీమియర్ లీగ్, 2024 పారిస్ ఒలింపిక్స్, 2010 FIFA వరల్డ్ కప్ వంటి ప్రధాన ఈవెంట్లలో కూడా సేవలందించారు. 1996 నుంచి 2011 వరకు భారత్, శ్రీలంక, వెస్టిండీస్లో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్స్లో కూడా పని చేశారు. లాంగ్ఫోర్డ్కు ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్–కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ చివరి అసైన్మెంట్గా మిగిలిపోయింది. ఆ మ్యాచ్లో రోహిత్ శర్మ (78), ర్యాన్ రిక్ల్టన్ (81) మెరుపు ఇన్నింగ్స్ల కారణంగా ముంబై ఇండయన్స్ ఘన విజయం సాధించింది. -
ఒకే సీజన్లో 67 వికెట్లు.. అయినా పట్టించుకోరు!
గత కొన్నాళ్లుగా టీమిండియా సెలక్షన్ కమిటీ వెటరన్ పేసర్ మహ్మద్ షమీని పట్టించుకోవడం మానేసింది. వన్డే వరల్డ్కప్-2023లో భారత్ ఫైనల్ చేరడంలో ఈ రైటార్మ్ బౌలర్ కీలక పాత్ర పోషించాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా చాంపియన్గా నిలవడంలోనూ షమీది ముఖ్య భూమిక.అయితే, దాదాపు మూడేళ్లుగా షమీకి టెస్టుల్లో ఆడే అవకాశం రాలేదు. ఇక వన్డేల్లో మేజర్ టోర్నీల్లో సత్తా చాటినా.. ఆ తర్వాత సెలక్టర్లు అతడిని పూర్తిగా పక్కనపెట్టేశారు. ఫిట్నెస్ సమస్యల వల్లే షమీని జాతీయ జట్టుకు ఎంపిక చేయడం లేదని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్వయంగా వెల్లడించాడు.ఒకే సీజన్లో 67 వికెట్లు..కానీ షమీ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించడమే కాకుండా.. పూర్తి ఫిట్నెస్తో దేశవాళీ క్రికెట్ బరిలో దిగి సత్తా చాటాడు. బెంగాల్ తరఫున 2025-26 సీజన్లో షమీ మొత్తంగా 67 వికెట్లు కూల్చాడు. అయినప్పటికీ టీమిండియా సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదు.ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ ఊహాగానాలు వస్తుండగా షమీ స్పందించాడు. శుభంకర్ మిశ్రా షోలో మాట్లాడుతూ.. ‘నేను అలసిపోయానని భావించిన మరుక్షణం రిటైర్ అవుతాను. అంతేగాని ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏమీ లేదు. నిజానికి రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తే మనం వెనుకబడి పోతాము. ఆటను పూర్తిగా ఆస్వాదిస్తున్నాముందుగా చెప్పినట్లు నేను అలసిపోయాను.. ఆడలేను అని భావించినపుడే నిర్ణయం తీసుకుంటా. ప్రస్తుతానికి నేను ఆటను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. అందుకు తగ్గట్లే సానుకూల ఫలితాలు వస్తున్నాయి’ అని షమీ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026కు ముందు సన్రైజర్స్ హైదరాబాద్ షమీని లక్నో సూపర్ జెయింట్స్కు ట్రేడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ‘బౌలర్గా వంద శాతం బాధ్యతలు నిర్వర్తించగలను.అంచనాలు అందుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాను. మిగతాదంతా నా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. దానిని నేనైతే మార్చలేను. అంకితభావంతో ఆడటం మాత్రమే నా పని. లక్నో నన్ము నమ్మింది. కచ్చితంగా వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను’’ అని షమీ చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా తరఫున 2023లో చివరగా టెస్టు ఆడిన షమీ.. 2025లో వన్డే, టీ20 మ్యాచ్లు ఆడాడు.చదవండి: ఇంగ్లండ్ టూర్కు వైభవ్ సూర్యవంశీని పంపండి: మైకేల్ వాన్ -
IPL 2026: ’ప్రేక్షకుల్ని మురిపించడానికి ఆడను’
తనను విమర్శించే వారికి భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత కోల్కతా నైట్రైడర్స్ సారథి అజింక్య రహానే గట్టి కౌంటర్ ఇచ్చాడు. తాను క్రికెట్ ఆడేది పూర్తిగా తన వ్యక్తిగతమని.. ప్రేక్షకుల్ని మురిపించడానికో.. విమర్శకులకు తానేంటో నిరూపించడానికో కాదని స్పష్టం చేశాడు. ఆటగాడిగానేతన భవిష్యత్తుపై, రిటైర్మెంట్పై వచ్చే ఊహాగానాలను రహానే (Ajinkya Rahane) కొట్టిపారేశాడు. 37 ఏళ్ల రహానే గత సీజన్లో ముంబై రంజీ ట్రోఫీ సారథ్యం నుంచి తప్పుకున్నాడు. దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ నాయకుడిగా కాకుండా ఆటగాడిగానే కొనసాగాడు. దీంతో ఇక విమర్శకులు అదేపనిగా రహానే రిటైర్మెంట్ ఖాయమనే వ్యాఖ్యలు చేస్తున్నారు. 20 ఏళ్లుగా అదే పని ముంబైతో మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో దీనిపై రహానే స్పందిస్తూ ‘ఎవరికి తోచింది వారు మాట్లాడుకుంటారు. ఇవేమి కొత్తకాదు కదా! దాదాపు 20 ఏళ్లుగా నా గురించి మాట్లాడుకోవడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్లని అలాగే కొనసాగనివ్వండి. నేనేమో నా బ్యాటింగ్ను ఆస్వాదిస్తాను. వాళ్లనలా చూడనివ్వండినా ఆటతీరేంటో నాకు తెలుసు. నా ప్రదర్శన పట్ల సంతృప్తికరంగా ఉన్నాను. అంతేతప్ప నేనేంటో... నా ప్రతిభేంటో కొత్తగా ఎవరికీ చూపించుకోవడానికి ఆడట్లేదు. ప్రేక్షకులు చూస్తున్నారు. వాళ్లనలా చూడనివ్వండి. విమర్శకులు విమర్శిస్తారు. వీళ్లను అలాగే చేయనివ్వండి’ అని అన్నాడు. ముంబైతో జరిగిన పోరులో రహానే మెరుపు ఫిఫ్టీతో అదరగొట్టాడు. 40 బంతుల్లో 67 పరుగులు చేసిన ‘జింక్స్’... 5 సిక్సర్లు, మూడు బౌండరీలు బాదాడు. గత రెండు మూడేళ్లుగా, పరిమిత ఓవర్ల ఫార్మాట్లో నా బ్యాటింగ్ను మెరుగుపర్చుకున్న తీరుపట్ల తానెంతో సంతోషంగా ఉన్నానన్నాడు. ఓ క్రికెటర్గా, బ్యాటర్గా ఎదగడం ముఖ్యమని, తానిప్పుడు చేస్తున్నది కూడా అదేనని రహానె చెప్పుకొచ్చాడు. ముంబైతో జరిగిన పోరులో తాము బాగానే ఆడామని, కీలకమైన తరుణంలో మరిన్ని ఎక్కువ పరుగులు చేయాల్సి ఉండగా చేయలేకపోయామని అన్నాడు.మా ఓటమికి కారణం అదే‘ముందుగా మేం 220 స్కోరు చేస్తే చాలానుకున్నాం. కానీ ఓ దశలో 235 నుంచి 240 పరుగులు చేస్తామని కూడా అనిపించింది. అయితే బుమ్రా స్పెల్ మా జోరుకు అడ్డుకట్ట వేసింది. అతని రెండు ఓవర్ల స్పెలే మరిన్ని పరుగులు చేయకుండా నిరోధించింది’ అని రహానే అన్నాడు.అనుభవలేమి బౌలింగ్ కూడా తమ ఓటమికి కారణమని రహానే చెప్పాడు. వైభవ్, కార్తీక్ త్యాగి, ముజరబానిలు తేలిపోయారని చెప్పాడు. ముజరబానికి అంతర్జాతీయ అనుభవమైతే ఉండొచ్చు కానీ ఐపీఎల్ అనుభవమైతే లేదన్నాడు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మాయాజాలం కూడా పనిచేయలేదని, దీనివల్లే ముంబై జోరుకు ఏ దశలోనూ అడ్డుకట్ట వేయలేకపోయామన్నాడు. చదవండి: ఇంగ్లండ్ టూర్కు వైభవ్ సూర్యవంశీని పంపండి: మైకేల్ వాన్ -
IND vs ENG: ఇంగ్లండ్ టూర్కు వైభవ్ సూర్యవంశీ!
భారత యువ సంచలనం, రాజస్తాన్ రాయల్స్ స్టార్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్-2026 టోర్నీని ఘనంగా ఆరంభించాడు. చెన్నై సూపర్ కింగ్స్తో సోమవారం నాటి మ్యాచ్లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ దుమ్మురేపాడు. మెరుపు అర్ధ శతకం బాది శెభాష్ అనిపించుకున్నాడు.ప్రశంసల వర్షంగువాహటి వేదికగా కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులు సాధించాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). అతడి విధ్వంసకర ఇన్నింగ్స్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఇక వైభవ్ ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా రాజస్తాన్ చెన్నైపై అలవోక విజయం సాధించింది. 128 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని కేవలం 12.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అయితే ఓ అడుగు ముందుకేసి.. వైభవ్ను వెంటనే టీమిండియాకు ఎంపిక చేయాలనే ప్రతిపాదన తెచ్చాడు. క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ..నేనే గనుక సెలక్టర్ అయి ఉంటే‘‘అతడు ఎప్పుడు టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తాడు? అని నేనెంతో ఆతురతగా ఎదురుచూస్తున్నాను. ఇది కాస్త తొందరపాటే అని అనిపించవచ్చు. ఐపీఎల్ తాజా ఎడిషన్లో అతడికి ఇదే తొలి ఇన్నింగ్స్. ఏదేమైనా కొన్ని నెలల తర్వాత టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది.ఒకవేళ నేనే గనుక సెలక్టర్ అయి ఉంటే వైభవ్ను ఈ టూర్కు కచ్చితంగా ఎంపిక చేస్తా. ప్రస్తుతానికి అతడికి జట్టులో చేరాల్సిన అవసరం లేకపోవచ్చు. కానీ జట్టుకు అతడి అవసరం ఉంటుందేమో!.. పదిహేనేళ్ల పిల్లాడిని టూర్కు అనుమతిస్తారా? అంటే నేనేమీ చెప్పలేను.కానీ అతడు ఇప్పటికే ఆటగాడిగా పరిణతి సాధించాడు. టీమిండియా తరఫున కూడా కచ్చితంగా సత్తా చాటగలడు’’ అని మైకేల్ వాన్ పేర్కొన్నాడు. వీలైనంత త్వరగా వైభవ్ను జాతీయ జట్టుకు ఎంపిక చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి సూచించాడు.చదవండి: Ravindra Jadeja: రంగుమారిన మరుక్షణం మాట మార్చాడు! -
కేకేఆర్ను మోసం చేసిన గ్రీన్?.. రీఫండ్ చెల్లించాల్సిందే!
భారత క్రికెట్ వర్గాల్లో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరాన్ గురించి చర్చ నడుస్తోంది. ఐపీఎల్-2026 మినీ వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) అతడి కోసం ఏకంగా రూ. 25.20 కోట్లు ఖర్చు చేసింది. ఆండ్రీ రసెల్ రిటైర్మెంట్ నేపథ్యంలో అతడికి సరైన వారసుడిగా గ్రీన్ను భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.అయితే, ఊహించని రీతిలో కేకేఆర్కు షాక్ తగిలింది. ఈ సీజన్లో కేకేఆర్ తొలుత ముంబై ఇండియన్స్తో తలపడగా.. ఆ మ్యాచ్లో గ్రీన్ బౌలింగ్ చేయనేలేదు. ఈ నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే చేసిన వ్యాఖ్యలు.. అందుకు క్రికెట్ ఆస్ట్రేలియా బదులిచ్చిన తీరు ఇప్పుడు హాట్టాపిక్గా మారిపోయింది.క్రికెట్ ఆస్ట్రేలియానే అడగండి‘ఆ విషయం ఏదో క్రికెట్ ఆస్ట్రేలియానే (CA) అడగండి’... ముంబైతో మ్యాచ్లో కామెరాన్ గ్రీన్ (Cameron Green) బౌలింగ్ చేయకపోవడంపై అడిగిన ప్రశ్నకు అజింక్య రహానే సమాధానమిది. ఒక ఐపీఎల్ టీమ్ సారథిగా తన జట్టు సభ్యుడి గురించి తనకే తెలీదన్నట్లుగా ఒకింత అసహనంతో రహానే ఈ మాట చెప్పడం వివాదాన్ని రేపింది. 10–12 రోజుల్లో దీనిపై ఆస్ట్రేలియా వెంటనే స్పందించింది. ‘గ్రీన్ వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అతనిపై భారం ఎక్కువ పడకూడదని బౌలింగ్కు దూరంగా ఉంటున్నాడు. 10–12 రోజుల్లో అతను బౌలింగ్ చేయవచ్చు. ఈ విషయం కేకేఆర్ యాజమాన్యానికి కూడా తెలుసు’ అని సీఏ స్పష్టం చేసింది. ఒక ఆల్రౌండర్ బౌలింగ్ చేయలేకపోవడం కోల్కతా తుది జట్టులో కూర్పుకు సమస్యగా మారింది. నిజానికి మ్యాచ్కు రెండు రోజుల ముందు, మ్యాచ్ ఆరంభానికి కొద్ది సేపు ముందు కూడా గ్రీన్ బౌలింగ్ చేశాడు. కానీ మ్యాచ్లో మాత్రం అతను బంతిని అందుకోలేదు! ఇటీవల టీ20 వరల్డ్ కప్లో అన్ని మ్యాచ్లూ కలిపి గ్రీన్ 19 బంతులే వేశాడంటే ఇప్పటికి దీనిపై కోల్కతా యాజమాన్యానికి స్పష్టత వచ్చేసి ఉంటుంది. రూ.25.20 కోట్లా!!!.. తెలివైన మోసం?నిజానికి తాజా పరిస్థితికి నైట్రైడర్స్ స్వయంకృతమే కారణం అనిపిస్తుంది. గ్రీన్ తన వైపు నుంచి తెలివిగా వేలంలోకి అడుగు పెట్టాడు. రిజిస్ట్రేషన్లో కేవలం ‘బ్యాటర్’ జాబితాలోనే తన పేరును నమోదు చేసుకున్నాడు. ఇలా ఎందుకని అడిగితే తన మేనేజర్ పొరపాటు అని, బౌలింగ్ కూడా చేస్తానని చెప్పాడు. కానీ అది సాంకేతికంగా ముందు జాగ్రత్త కోసమే ‘ఆల్రౌండర్’ జాబితాలో పేరు నమోదు చేసుకోలేదు. ఆండ్రీ రసెల్ రిటైర్మెంట్తో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేకేఆర్ ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కోసం చూస్తోంది. ఇలాంటి సమయంలో గ్రీన్ పేరు వచ్చింది. వేలం నిబంధనల ప్రకారం మొదటి ‘సెట్’లో బ్యాటర్లు వస్తారు. ఆ సమయంలో అన్ని జట్ల వద్ద భారీ మొత్తంలో డబ్బు ఉంటుంది. వెర్రిగా వేలంలో ముందుకు వెళ్లిసహజంగానే జట్లు ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. ‘బ్యాటర్’ జాబితాలో వచ్చిన గ్రీన్ కోసం కేకేఆర్ తీవ్రంగా పోటీ పడింది. అప్పటికే గ్రీన్ బౌలింగ్ గురించి టీమ్కు సమాచారం ఉండే ఉంటుంది. ఎందుకంటే 2025 డిసెంబర్లో వేలం జరగ్గా... అంతకుముందు సంవత్సరంపాటు సెప్టెంబరు 24 నుంచి అక్టోబర్ 2025 వరకు గాయంతో గ్రీన్ బౌలింగ్ చేయలేదు. టీ20ల్లో బ్యాటర్గా గ్రీన్ రికార్డు ఏమీ ఘనంగా లేదు. పైగా కొన్ని బంతుల్లో మ్యాచ్ గమనాన్ని మార్చే విధ్వంసకర బ్యాటర్ కూడా కాదు. అయినా సరే వెర్రిగా వేలంలో ముందుకు వెళ్లిన కేకేఆర్ కేవలం అతని బ్యాటింగ్ కోసం ఏకంగా రూ.25.20 కోట్లు ఖర్చు చేసింది! విఫల సమర్థనఇప్పుడేమో బౌలింగ్ చేయడం లేదని వాపోతోంది. నిజానికి గ్రీన్ కోసం వెచ్చించిన మొత్తంపై సంతోషమే అంటూ కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ విఫల సమర్థన కొత్త కాదు. 2025 సీజన్ కోసం వెంకటేశ్ అయ్యర్కు రూ. 23.75 కోట్లు ఇచ్చినప్పుడు కూడా ఇలాగే జరిగింది. ఆ సీజన్లో అతను అన్ని మ్యాచ్లు కూడా ఆడలేదు. 7 ఇన్నింగ్స్లలో కలిపి ఒకే అర్ధసెంచరీతో 142 పరుగులు చేసిన వెంకటేశ్ ఒక్క బంతి కూడా బౌల్ చేయలేదు! రీఫండ్ చెల్లించాల్సిందే!ఇదిలా ఉంటే.. గ్రీన్ విషయంలో భారత మాజీ క్రికెటర్, కేకేఆర్ మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా కోల్కతా జట్టుకు అండగా నిలిచాడు. ‘ఒకవేళ మనం ఆల్రౌండర్గా ఆడే వ్యక్తికి భారీ మొత్తం చెల్లిస్తే.. అతడు కేవలం బ్యాటర్గా మాత్రమే అందుబాటులో ఉంటే.. రీఫండ్ పొందడం కనీస అర్హత’ అని ట్వీట్ చేశాడు. అయితే, అతడి పోస్ట్పై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరేమో గ్రీన్ కేకేఆర్ను తెలివిగా మోసం చేశాడని అంటుండగా.. మరికొందరు మాత్రం అన్నీ తెలిసే కేకేఆర్ ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకుందని చివాట్లు పెడుతున్నారు. చదవండి: IPL 2026: నిషేధిత బ్యాట్తో దొరికిపోయిన సర్ఫరాజ్ ఖాన్ -
చెన్నై ఓటమి వెనుక తప్పులెన్నో!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్కింగ్స్ అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటి. ఐపీఎల్లో ఐదు టైటిల్స్ కొట్టిన సీఎస్కే ప్రస్తుతం ముంబై ఇండియన్స్తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే ఐపీఎల్ 19వ సీజన్లో సోమవారం రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో పేలవ ఆటతీరుతో చెన్నై సూపర్కింగ్స్ దారుణ ఓటమిని ఎదుర్కొంది. సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ లేకపోవడం, అన్నింటికీ మించి ఎంఎస్ ధోని గాయంతో జట్టుకు దూరమవ్వడం సీఎస్కేను ఒత్తిడిలోకి నెట్టేసినట్లయింది. సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ అనుభవలేమి స్పష్టంగా కనిపించింది. అయితే ఒక్క మ్యాచ్లో ఓటమితోనే సీఎస్కేను తప్పు బట్టాల్సిన అవసరం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. కూర్పు గందరగోళం..కానీ మ్యాచ్ ఫలితం క్షణాల్లో మారిపోయే ఐపీఎల్లో ఫస్ట్ హాఫ్ సీజన్లో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు గెలవడమే అన్ని జట్లు టార్గెట్గా పెట్టుకుంటాయి. దీంతో సీజన్ తొలి మ్యాచ్ నుంచే అన్ని జట్లు గెలవాలనే సంకల్పంతోనే ఆడుతుంటాయి. వాస్తవానికి సీఎస్కే జట్టు కూర్పు కొంత గందరగోళంగానే కనిపిస్తుంది. డెవాల్డ్ బ్రెవిస్ గాయంతో మ్యాచ్కు దూరమవ్వడంతో సర్ఫరాజ్ఖాన్ను ఇంపాక్ట్ ప్లేయర్గా కాకుండా ఓపెనర్గా బరిలోకి దింపితే వేరుగా ఉండేది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో సర్ఫరాజ్ ముంబై తరఫున మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఒకవేళ సీఎస్కే సర్ఫరాజ్ సేవల్ని ఉపయోగించుకోవాలనుకుంటే బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇచ్చి ఓపెనింగ్ లేదా మూడో స్థానంలో ఆడిస్తే బాగుండేది.మిడిలార్డర్ ఫెయిల్సాధారణంగా మ్యాచ్లో టాపార్డర్ విఫలమైనప్పుడు మిడిలార్డర్ పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుంది.కానీ కెప్టెన్ రుతురాజ్ 11 బంతుల్లో ఆరు పరుగులకే పరిమితం కావడం, అండర్-19 టీమిండియా కెప్టెన్ ఆయుష్ మాత్రే డకౌట్ కావడం, మాథ్య షార్ట్ కూడా 2 పరుగులకే పెవిలియన్ చేరడం సీఎస్కేను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది. జట్టులో రుతురాజ్, సంజూ శాంసన్, దూబే మినహా మిగతావారంతా జూనియర్లే. దూబే విఫలం..ఈ నేపథ్యంలో బాధ్యతగా ఆడాల్సిన సీనియర్లు నిర్లక్ష్య ఆటతీరుతో వికెట్లు పారేసుకోవడం కూడా సీఎస్కే కొంపముంచింది. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్లో శివమ్ దూబే ఫినిషర్గా అద్భుత ఇన్నింగ్స్లు ఆడాడు. అదే సీన్ను ఇప్పుడు ఐపీఎల్లో సీఎస్కే తరఫున పునరావృతం చేస్తాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. వచ్చీ రాగానే సిక్స్ కొట్టి దూకుడు ప్రదర్శించినప్పటికీ.. అప్పుడున్న పరిస్థితుల్లో సిక్సర్లు బాదడం కంటే ఇన్నింగ్స్ నిర్మించడంపై దూబే దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. ఎందుకంటే దూబే తర్వాత బ్యాటర్లు పెద్దగా లేరు. అయితే సీఎస్కే తరఫున టాప్ స్కోరర్గా నిలిచిన జేమీ ఓవర్టన్కు దూబే నుంచి సహకారం అంది ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. దూబే బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి ఉంటే కనీసం 170 పరుగులైనా చేసి ఉండేది. ధోని గైర్హాజరీలో దూబే నిలబడి సాధికారికంగా బ్యాటింగ్ చేసి ఉంటే అతడి విలువ అమాంతం పెరిగిపోయేది. ఇక సీఎస్కే లో స్కోరింగ్ మ్యాచ్లను కూడా కాపాడుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కనిపించిన ధోని లోటు!అయితే అప్పుడు ధోని మాస్టర్ మైండ్లా వ్యవహరించి వ్యూహాలు పన్ని ప్రత్యర్థి జట్లను చిత్తు చేయడంలో సలహాలు, సూచనలు చేసేవాడు.కానీ ఇప్పుడు ధోని దూరం కావడంతో ఆ ప్రభావం కనిపించింది. ధోని ఉన్నప్పుడు కూడా సీఎస్కే మ్యాచ్లు ఓడిపోలేదా అని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజమే కావొచ్చు.కానీ ధోని కేవల సీఎస్కే ఆటగాడు మాత్రమే కాదు. రెండు మూడు సీజన్లుగా చివర్లోనే బ్యాటింగ్ వస్తున్నాడు. కాని అతడిచ్చి సలహాలు సీఎస్కే కెప్టెన్లు తప్పకుండా పాటించి ఫలితాలు సాధించేది. కానీ ఈసారి ధోని లేకపోవడం జట్టును దెబ్బతీసిందని చెప్పొచ్చు. చెన్నై సూపర్కింగ్స్ ఫీల్డింగ్ విషయంలో అప్రమత్తంగా ఉంటుంది. కానీ నిన్నటి రాజస్తాన్ మ్యాచ్లో ఆటగాళ్లలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ప్రమాదకర సూర్యవంశీ క్యాచ్ను కార్తిక్ శర్మ విడిచి పెట్టడం, ఆ తర్వాత బౌండరీ వెళ్లకుండా బంతిని కనీసం ఆపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. కర్ణుడి చావుకు సవా లక్ష కారణాలు అన్నట్లు రాజస్తాన్తో మ్యాచ్లో సీఎస్కే ఓటమికి కూడా కారణాలు చాలానే ఉన్నాయి. అయితే ఇది సీజన్లో తొలి మ్యాచ్ మాత్రమే కావడంతో రాబోయే మ్యాచ్ల్లో తప్పులను సరిదిద్దుకొని ఆడాల్సిన అవసరం సీఎస్కేకు ఉంది. ఇక డెవాల్డ్ బ్రెవిస్, ధోని ఎప్పుడు ఆడతారన్న దానిపై స్పష్టత లేదు. కాబట్టి వీరిద్దరు జట్టులోకి వచ్చేలోపూ తొలి హాఫ్లో కనీసం నాలుగు మ్యాచ్లు గెలిస్తే టాప్-4లో నిలిచేందుకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయని చెప్పొచ్చు.చదవండి: రంగుమారిన మరుక్షణం మాట మార్చాడు! -
రంగుమారిన మరుక్షణం మాట మార్చాడు!
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్లో 17 ఏళ్ల తర్వాత తన సొంత గూటికి చేరాడు. తనను వెలుగులోకి తీసుకొచ్చిన రాజస్తాన్ రాయల్స్ జట్టులోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. తాజాగా సోమవారం సీఎస్కేతో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్లోనే జడేజా అదుర్స్ అనిపించాడు. ఇన్నాళ్లు తాను ఆడిన జట్లే తనకు ప్రత్యర్థిగా మారిన వేళ బంతితో మెరిశాడు. మ్యాచ్లో పొదుపుగా బౌలింగ్ చేసిన జడేజా 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. రాజస్తాన్ మ్యాచ్ గెలవడంలో తన వంతు పాత్రను సమర్థంగా పోషించాడు. ‘నాకు పింక్ జెర్సీ బాగుంటుందనిపిస్తోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే సీఎస్కే జట్టుతో ఎన్నో ఏళ్ల అనుబంధముంది. ఆ జట్టులో ఏ ఆటగాడు ఎలా ఆడుతాడనే దానిపై స్పష్టత ఉంది. ముఖ్యంగా సీఎస్కే ఆల్రౌండర్శి శివమ్ దూబేకు నెట్స్లో చాలాసార్లు బౌలింగ్ చేశాను. కాబట్టి అతడు స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటా డనేది నాకు తెలుసు. అందుకే సీఎస్కేకు బౌలింగ్ చేయడంలో పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. ఆఫ్ స్టంప్ ఆవల బంతులు వేసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. అలా అయితే దూబే భారీ షాట్లు ఆడతాడని నాకు తెలుసు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉందన్న మాట నిజమే,. పిచ్ కాస్త పచ్చికగా ఉండడం, బంతి టర్న్ అవుతుండడంతో బౌలింగ్ చేయడం ఆనందాన్ని ఇచ్చింది. మొత్తంగా 17 ఏళ్ల తర్వాత నన్ను తొలిసారి వెలుగులోకి తీసుకొచ్చిన జట్టుతో (రాజస్తాన్ రాయల్స్) కలవడం సంతోషంగా అనిపిస్తోంది. 128 పరుగుల టార్గెట్ తక్కువే కదా అని నిర్లక్ష్యం చేసి ఉంటే మొదటికే మోసం వచ్చేది. కానీ మా బ్యాటర్లు జైస్వాల్, సూర్యవంశీలు దూకుడైన బ్యాటింగ్తో పని సులువు చేశారు. లోస్కోరింగ్, హై స్కోరింగ్ ఏదైనా సరే మనం వంద శాతం కష్టపడేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి.’ అని చెప్పుకొచ్చాడు. అయితే జడేజా కామెంట్స్పై అభిమానులు ఫన్నీ కామెంట్లు పెట్టారు. ‘జడేజా ఒక ఊసరవెల్లి.. జెర్సీ మారిందో లేదో వెంటనే మాట మార్చాడు’ అని పేర్కొన్నారు.ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో రాజస్తాన్ రాయల్స్కు ఆడిన రవీంద్ర జడేజా సూపర్ సక్సెస్ అయ్యాడు. ఆ సీజన్లో రాజస్తాన్ తొలి ఐపీఎల్ టైటిల్ గెలవడంలో జడేజా కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాతి సీజన్లోనూ ఆల్రౌండర్ పాత్రకు న్యాయం చేశాడు. 2010లో ఐపీఎల్కు దూరంగా ఉన్న జడేజాను 2011 సీజన్కు కొచ్చి టస్కర్స్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఆ జట్టుపై నిషేధం పడడంతో జడేజా కోసం 2012 వేలంలో ఎస్ఆర్హెచ్, చెన్నై పోటీ పడ్డాయి. చివరికి చెన్నై సూపర్కింగ్స్ అప్పట్లోనే రూ. 9.8 కోట్లకు జడేజాను దక్కించుకుంది. మధ్యలో చెన్నైపై రెండేళ్ల నిషేదం పడడంతో గుజరాత్ లయన్స్కు ఆడిన జడేజా ఆ తర్వాత 2025 సీజన్ వరకు మళ్లీ చెన్నై జట్టుతోనే కొనసాగాడు. తాజాగా 2026 సీజన్కు ముందు ట్రేడింగ్లో శాంసన్ను దక్కించుకున్న సీఎస్కే జడేజాను రాజస్తాన్కు బదలాయింపు చేసింది. ధోని కెప్టెన్సీలో 2018, 2021, 2023లో టైటిల్ గెలిచిన సీఎస్కే జట్టులో జడేజా సభ్యుడిగా ఉన్నాడు.జడ్డూ ఎమెషనల్2012 నుంచి 2025 వరకు సీఎస్కే జట్టులో కొనసాగిన రవీంద్ర జడేజా సోమవారం మ్యాచ్లో భాగంగా సీఎస్కే ఇన్నింగ్స్ సమయంలో ఎమెషనల్ అయినట్లు తెలుస్తోంది. 9వ ఓవర్లో బౌండరీ లైన్ వద్ద నిలబడిన జడేజాను చూస్తూ అభిమానులు సీఎస్కే.. సీఎస్కే అంటూ అరవడం కనిపించింది. ఇదే సమయంలో కెమెరాలు జడేజా వైపు తిప్పగా, జడ్డూ ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకున్నట్లుగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు జడేజా సీఎస్కే వదిలి వెళ్లినప్పటికీ తమ మనసులో మాత్రం ఎప్పటికీ ఉంటాడు* అని కామెంట్లు పెట్టారు. ఓవరాల్గా జడేజా ఐపీఎల్లో 255 మ్యాచ్లాడి 3,260 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో 172 వికెట్లు పడగొట్టాడు.Jadeja was seen emotional when crowd starts to chant CSK...CSK pic.twitter.com/oPRvmU2wAm— rocket.jadeja (@sherjedeja) March 30, 2026చదవండి: ‘మ్యాచ్ ఓటమి బాధ కలిగించలేదు’ -
‘మ్యాచ్ ఓటమి బాధ కలిగించలేదు’
ఐపీఎల్ 19వ సీజన్ను చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే) ఓటమితో ప్రారంభించింది. పేలవమైన బ్యాటింగ్, బౌలింగ్తో రాజస్తాన్ రాయల్స్ చేతిలో సీఎస్కే 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. అయితే రాజస్తాన్తో మ్యాచ్ ఓటమి మాకు గుణపాఠం లాంటిదని, తప్పులతో సీజన్ను ప్రారంభించినప్పుడే రాబోయే మ్యాచ్ల్లో ఎలా ఆడాలన్న దానిపై స్పష్టత వస్తుందని సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం రుతురాజ్ మీడియాతో మాట్లాడాడు. ‘మ్యాచ్ ఓటమి పెద్దగా నిరాశ కలిగించలేదు. అయితే మా ఇన్నింగ్స్ ఆరంభంలో రాజస్తాన్ రాయల్స్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, నండ్రీ బర్గర్లను ఎదుర్కొన్నప్పుడు పరిస్థితులు కఠినంగా ఉన్నాయనిపించింది. నిజానికి రాజస్తాన్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్తో బంతులు వేశారు. ఆరంభంలో పేసర్లు, మధ్యలో స్పిన్నర్లకు పిచ్ సహకరించినట్లు అనిపించింది. కానీ మేము బ్యాటింగ్ మరింత మెరుగ్గా చేసినట్లయితే 150 నుంచి 160 స్కోరు చేసేవాళ్లం. వికెట్ కఠినంగా ఉన్నప్పుడు పరుగులు రావడం కష్టమైపోతుంది. అందుకే ఫలితంపై పెద్దగా నిరాశ చెందడం లేదు. ఈ మ్యాచ్ గురించి ఇక్కడే మరిచిపోయి ముందుకు సాగుతాము. మరో మూడు రోజుల్లో ఇంకో మ్యాచ్ ఉందని, దీంతో జట్టులో అందరూ సానుకూల దృక్పథంతో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. మా జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. ఇది ఒక మంచి పరిణామం. మ్యాచ్లో చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుంటాం. మాది బలమైన బ్యాటింగ్ లైనప్. భారీ స్కోర్లు చేయగల సత్తా మాకు ఉంది.’ అని చెప్పుకొచ్చాడు. అయితే సీఎస్కే భారీ అంచనాలు పెట్టుకున్న సంజూ శాంసన్, శివమ్ దూబే పూర్తిగా విఫలం కావడం, గాయాలతో ధోని, డెవాల్డ్ బ్రెవిస్ దూరం కావడం కూడా సీఎస్కేను ఒత్తిడిలోకి నెట్టేసింది. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 19.4 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. జేమీ ఓవర్టన్ 43 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం రాజస్తాన్ రాయల్స్ 12.1 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ను ఛేదించింది.చదవండి: ఒక్క ఇన్నింగ్స్తో నలుగురికి చెక్! -
‘దొరికితే అంతే సంగతి.. అందుకే తప్పించుకున్నా’
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ శుభారంభం చేసింది. సోమవారం చెన్నై సూపర్కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లోస్కోరింగ్ మ్యాచ్ అయినప్పటికీ రాజస్తాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర ఆటతీరుతో అభిమానుల్లో జోష్ నింపాడు. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న సూర్యవంశీ సీఎస్కేతో మ్యాచ్ ముగిసిన అనంతరం దూకుడైన బ్యాటింగ్ వెనుక ఉన్న రహస్యాన్ని పంచుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ మాట్లాడుతూ..‘ నా బర్త్ డే సెలబ్రేషన్స్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే కేక్ కటింగ్ నుంచి తప్పించుకోవడానికి త్వరగా నిద్రపోయాను. ఇక సీఎస్కేతో మ్యాచ్ విషయానికొస్తే పవర్ ప్లేలో దూకుడుగా ఆడాలనే లక్ష్యంతో బరిలోకి దిగాను. అయితే మొదట్లో బ్యాటింగ్ కాస్త కష్టమనిపించింది. కానీ బంతి పాతబడేకొద్దీ నా పని సులువయింది. డిఫెన్స్ గురించి ఆలోచిస్తాను కానీ సీఎస్కే విధించిన లక్ష్యం చిన్నది కావడంతో పవర్ ప్లేలో వీలైనంత స్కోర్ చేయాలని భావించాం. ఒకవేళ స్కోర్ ఎక్కువగా ఉండి ప్రత్యర్థి బౌలర్లు మమ్మల్ని కట్టడి చేసి ఉంటే పరిస్థితి ప్రమాదకరంగా మారి ఉండేది. కానీ నేను ఎక్కడా ఆ అవకాశం తీసుకోలేదు. మా కోచ్లు కూడా ప్రతి బౌలర్పైనా అటాకింగ్ గేమ్ ఆడమని చెప్పారు. నేను వాళ్ల మాటలను తూచా తప్పకుండా పాటించాను. ఇక ప్రతీ బంతి తర్వాత జైస్వాల్తో మాట్లాడుతూనే వచ్చాను. అతను ఎక్కువగా సింగిల్స్ తీసి నాకు స్ట్రైకింగ్ ఇచ్చి ప్రోత్సహించడంతో స్వేచ్ఛగా భారీ షాట్లు ఆడగలిగాను’ అని చెప్పుకొచ్చాడు. మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్కింగ్స్పై విజయం సాధించింది.చదవండి: ఒక్క ఇన్నింగ్స్తో నలుగురికి చెక్! -
ఒక్క ఇన్నింగ్స్తో నలుగురికి చెక్!
ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ సూర్యవంశీ తన ఆట మొదలుపెట్టేశాడు. అండర్-19 టీ20 ప్రపంచకప్ ఫామ్ను కంటిన్యూ చేసిన సూర్యవంశీ ఐపీఎల్ 19వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున తన తొలి మ్యాచ్లోనే ఫాస్టెస్ట్ అర్థసెంచరీ సాధించాడు. తద్వారా ఒక్క ఇన్నింగ్స్తో నలుగురి రికార్డులకు చెక్ పెట్టాడు ఈ బీహార్ చిన్నోడు. మ్యాచ్లో 15 బంతుల్లోనే అర్థసెంచరీ సాధించిన సూర్యవంశీ 17 బంతుల్లో 52 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో గత ఐపీఎల్ సీజన్లలో 16 బంతుల్లో అర్థసెంచరీలు సాధించిన సురేశ్ రైనా, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ల రికార్డులు కనుమరుగయ్యాయి. చెన్నై విధించిన టార్గెట్ చిన్నది కావడంతో చప్పగా సాగుతున్నమ్యాచ్ను సూర్యవంశీ తన ఇన్నింగ్స్తో అభిమానుల్లో జోష్ నింపాడు. అంతేకాదు ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున తక్కువ బంతుల్లో ఫిఫ్టీ మార్క్ సాధించిన జాబితాలో రెండు సూర్యవంశీ పేరిటే ఉండడం విశేషం. 2025లో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో 17 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ అందుకున్న వైభవ్.. తాజాగా సీఎస్కేపై 15 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ అందుకొని తన రికార్డును తానే సవరించుకున్నాడు. కాగా 2023లో కేకేఆర్తో మ్యాచ్లో 13 బంతుల్లోనే అర్థశతకం సాధించిన జైస్వాల్ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. 2018లో జాస్ బట్లర్ ఢిల్లీ క్యాపిటల్స్పై 18 బంతుల్లో అర్థశతకం సాధించాడు. అంతేకాదు లోస్కోరింగ్ మ్యాచ్ అయినప్పటికీ మరికొన్ని రికార్డులు కూడా మ్యాచ్లో నమోదయ్యాయి. First ball of IPL 2025: SIX 😮💨Second ball of IPL 2026: SIX 😮💨pic.twitter.com/oJjCeUhf5p— Rajasthan Royals (@rajasthanroyals) March 30, 2026మ్యాచ్లో నమోదైన రికార్డులు..ఐపీఎల్లో సీఎస్కేపై అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్లలో రాజస్తాన్ రెండో స్థానానికి చేరుకుంది. పంజాబ్ కింగ్స్తో కలిసి సంయుక్తంగా ఉన్న రాజస్తాన్ సీఎస్కేపై తాజా దానితో కలిపి 16 విజయాలు నమోదు చేసింది. తొలి స్థానంలో ముంబై (21 విజయాలు) ఉంది. 13 విజయాలతో ఆర్సీబీ మూడో స్థానంలో, 12 విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో స్థానంలో, 11 విజయాలతో కేకేఆర్ ఐదో స్థానంలో ఉన్నాయి.2020 నుంచి చూసుకుంటే సీఎస్కేతో ఆడిన 11 మ్యాచ్ల్లో రాజస్తాన్ రాయల్స్ 9 విజయాలు సాధించి స్పష్టమైన ఆధిక్యంలో నిలవడం విశేషం.ఐపీఎల్లో 120 ప్లస్ స్కోర్లను అత్యంత తక్కువ ఓవర్లలో ఛేదించిన నాలుగో జట్టుగా రాజస్తాన్ నిలిచింది. గతంలో ఎస్ఆర్హెచ్ (9.4 ఓవర్లలో), పంజాబ్ కింగ్స్ (11.1 ఓవర్లలో), డెక్కన్ చార్జర్స్ (12 ఓవర్లలో) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.చదవండి: రాయల్స్ రాజసం -
టైటాన్స్తో పంజాబ్ ఢీ.. పంజా విసిరేదెవరు?
మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, గతేడాది రన్నరప్ పంజాబ్ కింగ్స్ ఈ ఐపీఎల్ సీజన్లో శుభారంభంపై దృష్టి పెట్టాయి. నేడు జరిగే పోరులో శుబ్మన్ గిల్ నాయకత్వంలోని టైటాన్స్తో శ్రేయస్ అయ్యర్ సారథిగా ఉన్న పంజాబ్ కింగ్స్ తలపడుతుంది. భారత టి20 జట్టులో స్థానంలేని ఇరు జట్ల కెప్టెన్లు అటు తమ బ్యాటింగ్తో, ఇటు నాయకత్వంతో తమను తాము నిరూపించుకోవాలని పట్టుదలగా ఉన్నారు. ప్రతీ సీజన్లో నిలకడగా పరుగులు సాధిస్తున్నా... గిల్ స్ట్రయిక్రేట్పై ఇటీవల చర్చ పెరిగింది. ఈ నేపథ్యంలో తనలో దూకుడు పెంచాలని అతను భావిస్తున్నాడు. మరోవైపు శ్రేయస్ గత ఏడాది అద్భుత బ్యాటింగ్తో 604 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపించాడు. ఈసారి కూడా అదే ఫామ్ను కొనసాగిస్తే జట్టు ముందంజ వేయవచ్చు. ఐపీఎల్ టోర్నీలో ఇప్పటి వరకు ఈ రెండు జట్లు ఆరుసార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. మూడుసార్లు గుజరాత్, మూడుసార్లు పంజాబ్ గెలిచి సమఉజ్జీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. చదవండి: సినెర్దే మయామి మాస్టర్స్ -
రాయల్స్ రాజసం
ఐపీఎల్లో గత ఏడాది రాజస్తాన్, చెన్నై జట్లు చివరి రెండు స్థానాల్లో నిలిచాయి. తాజా సీజన్లో పలు మార్పులతో కొత్తగా మొదలు పెట్టేందుకు ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి. ఈ పోరులో చివరకు రాజస్తాన్దే పైచేయి అయింది. బౌలింగ్లో సమష్టి ప్రదర్శనతో చెన్నైని స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన రాయల్స్ ఆ తర్వాత మరో 47 బంతులు మిగిలి ఉండగానే అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాది మరో సీజన్ను ఘనంగా మొదలు పెట్టడం విశేషం. గువాహటి: ఐపీఎల్లో రెండు భారీ స్కోర్ల మ్యాచ్ల తర్వాత మూడో మ్యాచ్లో బౌలర్ల ప్రభావం కనిపించింది. సోమవారం జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై 19.4 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. పవర్ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయిన టీమ్ ఒకదశలో 82/8 వద్ద నిలిచింది. అయితే జేమీ ఒవర్టన్ (36 బంతుల్లో 43; 2 ఫోర్లు, 2 సిక్స్) జట్టు స్కోరును 100 దాటించాడు. అనంతరం రాజస్తాన్ 12.1 ఓవర్లలో 2 వికెట్లకు 128 పరుగులు చేసి గెలిచింది. వైభవ్ సూర్యవంశీ (17 బంతుల్లో 52; 4 ఫోర్లు, 5 సిక్స్లు) చెలరేగడంతో రాయల్స్ గెలుపు లాంఛనంగా మారిపోయింది. యశస్వి జైస్వాల్ (36 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రెండు కీలక వికెట్లు తీసిన బర్గర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. వరల్డ్ కప్ స్టార్లు విఫలం... భారత్కు టి20 ప్రపంచ కప్ అందించిన జోష్లో ఉన్న సంజు సామ్సన్కు ఐపీఎల్ కొత్త జట్టుతో సరైన ఆరంభం లభించలేదు. 11 సీజన్ల పాటు రాజస్తాన్కు ప్రాతినిధ్యం వహించిన సామ్సన్ ఇప్పుడు తొలిసారి చెన్నై తరఫున తన పాత జట్టుపై ప్రత్యరి్థగా బరిలోకి దిగాడు. అయితే బర్గర్ అద్భుత బంతికి సామ్సన్ (6) బౌల్డ్ కాగా, మరో వరల్డ్ కప్ విజేత శివమ్ దూబే (6) ఆట ఒక సిక్స్కే ముగిసింది. ఈ ఏడాది భారత్కు కెప్టెన్గా అండర్–19 వరల్డ్ కప్ అందించిన ఆయుశ్ మాత్రే (0) తొలి బంతికే అవుటయ్యాడు. గత రెండు సీజన్లు ఐపీఎల్లో ఆడే అవకాశం రాని సర్ఫరాజ్ ఖాన్ (12 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్) ఇప్పుడు బరిలోకి దిగినా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. కార్తీక్ శర్మ అరంగేట్రం... ఐపీఎల్ వేలంలో రూ.14.20 కోట్లకు అమ్ముడుపోయి అందరి దృష్టినీ ఆకర్షించిన 20 ఏళ్ల కార్తీక్ శర్మకు చెన్నై తొలి మ్యాచ్లో అవకాశం కలి్పంచింది. అయితే కార్తీక్ (15 బంతుల్లో 18; 1 సిక్స్) కూడా ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాడు. చెన్నై టీమ్లోనే ఉన్న మరో రూ.14.20 కోట్ల ప్లేయర్ ప్రశాంత్ వీర్కు మ్యాచ్ చాన్స్ లభించలేదు. మరోవైపు బెంగాల్ ప్రొ టి20 లీగ్ ద్వారా వెలుగులోకి వచ్చిన పేసర్ బ్రిజేశ్ శర్మతో రాజస్తాన్ ఐపీఎల్లో అరంగేట్రం చేయించింది. ఏ స్థాయిలోనైనా ప్రొఫెషనల్ క్రికెట్లో అతనికి ఇదే తొలి మ్యాచ్. 277 మ్యాచ్ల అనంతరం... చెన్నై జట్టుకు కర్త, కర్మ, క్రియవంటి ధోని మాత్రమే కాకుండా సురేశ్ రైనాకు కూడా ప్రత్యేక అనుబంధం ఉంది. ధోని, రైనాలు రామలక్ష్మణుల్లా సుదీర్ఘ కాలం ఆ జట్టును నడిపించారు. అయితే ధోని, రైనాలలో ఏ ఒక్కరు కూడా తుది జట్టులో లేకుండా 277 మ్యాచ్ల తర్వాత చెన్నై టీమ్ బరిలోకి దిగడం (చాంపియన్స్ లీగ్తో కలిపి) విశేషం. వైభవ్ సూపర్... తనపై ఉన్న అంచనాలను అందుకుంటూ వైభవ్ సూర్యవంశీ మళ్లీ చెలరేగిపోయాడు. ‘సున్నా’ వద్ద కార్తీక్ కష్టసాధ్యమైన క్యాచ్ను వదిలేయడంతో బతికిపోయిన అతను ఆ తర్వాత దూసుకుపోయాడు. కంబోజ్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన వైభవ్... నూర్ బౌలింగ్లో వరుసగా 2 సిక్స్లతో అర్ధ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 6158 రోజుల తర్వాత... భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 17 ఏళ్ల తర్వాత తన మొదటి ఐపీఎల్ జట్టు రాజస్తాన్ తరఫున మ్యాచ్ ఆడాడు. 2008లో రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగి 20 మే, 2009న చివరిసారిగా ఆ జట్టుకు అతను ప్రాతినిధ్యం వహించాడు. 6158 రోజుల తర్వాత అతను మళ్లీ రాజస్తాన్కు ఆడటం విశేషం. ఈ మధ్య కాలంలో అతను కొచ్చి తరఫున ఒక సీజన్, గుజరాత్ లయన్స్ తరఫున రెండు సీజన్లు, చెన్నై తరఫున 12 సీజన్ల పాటు ఆడాడు.స్కోరు వివరాలు చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్: సామ్సన్ (బి) బర్గర్ 6; రుతురాజ్ (బి) ఆర్చర్ 6; మాత్రే (సి) జురేల్ (బి) బర్గర్ 0; షార్ట్ (సి) జైస్వాల్ (బి) సందీప్ 2; సర్ఫరాజ్ (ఎల్బీ) (బి) జడేజా 17; కార్తీక్ (ఎల్బీ) (బి) బ్రిజేశ్ 18; దూబే (సి) బిష్ణోయ్ (బి) జడేజా 6; ఒవర్టన్ (రనౌట్) 43; నూర్ (సి) జురేల్ (బి) ఆర్చర్ 1; హెన్రీ (సి అండ్ బి) బిష్ణోయ్ 5; కంబోజ్ (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 16; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 127. వికెట్ల పతనం: 1–14, 2–19, 3–19, 4–38, 5–51, 6–57, 7–74, 8–82, 9–94, 10–127. బౌలింగ్: ఆర్చర్ 4–0–19–2, బర్గర్ 4–0–26–2, బ్రిజేశ్ 3–0–17–1, సందీప్ 2.4–0–22–1, రవి బిష్ణోయ్ 3–0–16–1, జడేజా 3–0–18–2. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (నాటౌట్) 38; వైభవ్ (సి) సర్ఫరాజ్ (బి) కంబోజ్ 52; జురేల్ (బి) కంబోజ్ 18; పరాగ్ (నాటౌట్) 14; ఎక్స్ట్రాలు 6; మొత్తం (12.1 ఓవర్లలో 2 వికెట్లకు) 128. వికెట్ల పతనం: 1–75, 2–99. బౌలింగ్: హెన్రీ 3–0–40–0, ఖలీల్ 3–0–17–0, కంబోజ్ 3–0–27–2, నూర్ 2–0–24–0, ఒవర్టన్ 1–0–14–0, షార్ట్ 0.1–0–1–0.ఐపీఎల్లో ఇప్పటి వరకు 254 మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కేవలం 12 సార్లు మాత్రమే ఆలౌటైంది. ముంబై ఇండియన్స్ అత్యధికంగా 5 సార్లు చెన్నైను (2012, 2013, 2015, 2019, 2022లో) ఆలౌట్ చేయగా... రాజస్తాన్ రాయల్స్ (2008, 2026లో), పంజాబ్ కింగ్స్ (2022, 2025లో) రెండుసార్లు చొప్పున ఈ ఘనత సాధించాయి. ఢిల్లీ క్యాపిటల్స్ (2009లో), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (2009లో), సన్రైజర్స్ హైదరాబాద్ (2025లో) ఒక్కోసారి చెన్నైను ఆలౌట్ చేశాయి.ఆరు ఐపీఎల్ సీజన్ల తర్వాత (2020లో 74; 2021లో 119; 2022లో 55; 2023లో 55; 2024లో 82 నాటౌట్; 2025లో 66) సంజూ సామ్సన్ తన ఐపీఎల్ తొలి మ్యాచ్లో రెండంకెల స్కోరు చేయకుండా సింగిల్ డిజిట్కే అవుటయ్యాడు. -
వైభవ్ సూర్యవంశీ ఊచకోత.. సీఎస్కేను చిత్తు చేసిన రాయల్స్
ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో ఇవాళ (మార్చి 30) జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే, రాయల్స్ బౌలర్ల ధాటికి 19.4 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. ఆర్చర్, బర్గర్, రవీంద్ర జడేజా తలో 2.. బ్రిజేష్ శర్మ, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసి సీఎస్కే ఇన్నింగ్స్ను మట్టుబెట్టారు. సీఎస్కే ఇన్నింగ్స్లో ఓవర్టన్ (43), కార్తీక్ శర్మ (18, సర్ఫరాజ్ ఖాన్ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆఖర్లో ఓవర్టన్ పోరాడటంతో సీఎస్కే ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని రాయల్స్ కేవలం 12.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. వైభవ్ సూర్యవంశీ (17 బంతుల్లో 52; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర అర్ద సెంచరీతో ఆదిలోనే రాయల్స్ గెలుపును ఖరారు చేశాడు. యశస్వి జైస్వాల్ (36 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ రియాన్ పరాగ్ (11 బంతుల్లో 14 నాటౌట్; ఫోర్, సిక్స్) రాయల్స్ను విజయతీరాలకు చేర్చారు. మధ్యలో జురెల్ (9 బంతుల్లో 18; 4 ఫోర్లు) సైతం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్కు రెండు వికెట్లు దక్కాయి. -
IPL 2026: నిషేధిత బ్యాట్తో దొరికిపోయిన సర్ఫరాజ్ ఖాన్
సీఎస్కే బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఫ్రాంచైజీ తరఫున తన తొలి మ్యాచ్లోనే వివాదంలో చిక్కుకున్నాడు. ఐపీఎల్ 2026లో భాగంగా గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్తో ఇవాళ (మార్చి 30) జరుగుతున్న మ్యాచ్లో సర్ఫరాజ్ నిషేధిత కొలతలున్న బ్యాట్తో బ్యాటింగ్కు దిగి, ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే అంపైర్ చేతికి చిక్కాడు. ఈ మ్యాచ్లో సర్ఫరాజ్ ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా ఐదో స్థానంలో బరిలోకి దిగగా.. ఫీల్డ్ అంపైర్కు అతని బ్యాట్పై అనుమానం వచ్చి కొలతలు చెక్ చేశాడు. 2025 నుంచి అమల్లో ఉన్న నియమాల ప్రకారం బ్యాట్ ఎడ్జ్ మందం 4 సెంటి మీటర్లు (1.56 అంగుళాలు) దాటకూడదు. అలాగే మొత్తం లోతు 6.7 సెంటి మీటర్లు (2.64 అంగుళాలు), వెడల్పు 10.8 సెంటి మీటర్లకు (4.25 అంగుళాలు) మించకూడదు.అయితే సర్ఫరాజ్ తెచ్చుకున్న బ్యాట్ పరిమితులను దాటి ఉండటంతో అంపైర్లు గేజ్ చెక్ చేసి తిరస్కరించారు. అనంతరం డగౌట్తో ఉన్న సహచరుడు ఉర్విల్ పటేల్ సర్ఫరాజ్కు మరో బ్యాట్ తీసుకొచ్చి ఇచ్చాడు. దీనికి కూడా అంపైర్లు గేజ్ చెక్ చేసిన అనంతరం సక్రమంగా ఉందని, సర్ఫరాజ్ను బ్యాటింగ్కు అనుమతి ఇచ్చారు. ఆతర్వాత బ్యాటింగ్ కొనసాగించిన సర్ఫరాజ్ 12 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 17 పరుగులు చేసి ఔటయ్యాడు.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల ధాటికి 19.4 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. ఆర్చర్, బర్గర్, రవీంద్ర జడేజా తలో 2.. బ్రిజేష్ శర్మ, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసి ఇన్నింగ్స్ను మట్టుబెట్టారు. సీఎస్కే ఇన్నింగ్స్లో ఓవర్టన్ (43), కార్తీక్ శర్మ (18, సర్ఫరాజ్ ఖాన్ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆఖర్లో ఓవర్టన్ పోరాడటంతో సీఎస్కే ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది. అనంతరం స్వల్ప ఛేదనలో రాయల్స్ ఓపెనర్లు చెలరేగుతున్నారు. ముఖ్యంగా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ గత ఎడిషన్ ఫామ్ను కొనసాగిస్తూ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. -
రాయల్స్ బౌలర్ల విజృంభణ.. కుప్పకూలిన సీఎస్కే
ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో ఇవాళ (మార్చి 30) జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు చెలరేగిపోయారు. వీరి ధాటికి సీఎస్కే బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కుప్పకూలింది. గౌహతిలోని బర్సపరా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన రాయల్స్ సీఎస్కేను 19.4 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ చేసింది.తొలి బంతి నుంచే రాయల్స్ బౌలర్లను ఎదుర్కొనేందుకు సీఎస్కే బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. ఆరంభ ఓవర్లలో నండ్రే బర్గర్, జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరిగారు. రెండో ఓవర్ చివరి బంతికి తొలిసారి సీఎస్కే తరఫున ఆడుతున్న సంజూ శాంసన్ను (6) బర్గర్.. మూడో ఓవర్ చివరి బంతికి సీఎస్కే సారధి రుతురాజ్ గైక్వాడ్ను (6) ఆర్చర్ అద్భుతమైన బంతులతో క్లీన్ బౌల్డ్ చేశారు. ఆమరుసటి బంతికే (3.1 ఓవర్) యువ ఆటగాడు ఆయుశ్ మాత్రేను బర్గర్ మరో అద్భుతమైన బంతితో డకౌట్ చేశాడు.ఆతర్వాత మాథ్యూ షార్ట్ను (2) సందీప్ శర్మ.. సర్ఫరాజ్ ఖాన్ (17), శివమ్ దూబేను (6) రవీంద్ర జడేజా ఒకే ఓవర్లో పెవిలియన్కు పంపారు. కొద్ది సేపటికే కార్తీక్ శర్మను (18) బ్రిజేశ్ శర్మ.. నూర్ అహ్మద్ను (1) జోఫ్రా ఆర్చర్ ఔట్ చేశారు. మరి కొద్ది సేపటికి మ్యాట్ హెన్రీని (5) రవి బిష్ణోయ్ పెవిలియన్కు పంపగా.. ఓవర్టన్ (43) ఔట్ కావడంతో సీఎస్కే ఇన్నింగ్స్కు ఎండ్ కార్డ్ పడింది.చివర్లో ఓవర్టన్ అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శించడంతో సీఎస్కే 100 పరుగుల మార్కును దాటగలిగింది. అతనికి అన్షుల్ కంబోజ్ (7 నాటౌట్) సహకరించాడు. రాయల్స్ బౌలర్లలో ఆర్చర్, బర్గర్, రవీంద్ర జడేజా తలో 2.. బ్రిజేష్ శర్మ, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు. సీఎస్కే ఇన్నింగ్స్లో ఓవర్టన్తో పాటు కార్తీక్ శర్మ (18, సర్ఫరాజ్ ఖాన్ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే తలో 6, మాథ్యూ షార్ట్ 2, నూర్ అహ్మద్ 1, మ్యాట్ హెన్రీ 5, ఆయుశ్ మాత్రే డకౌటయ్యారు. -
చెత్త కెప్టెన్సీ.. అతడికి ఎందుకు బంతి ఇవ్వలేదు?
ఐపీఎల్-2024లో చాంపియన్గా నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్ గత సీజన్లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. అజింక్య రహానే సారథ్యంలో పద్నాలుగింట ఐదు మ్యాచ్లే గెలిచి ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇక తాజా ఎడిషన్ను కూడా కేకేఆర్ ఓటమితోనే ఆరంభించింది.ఐపీఎల్-2026లో భాగంగా ముంబై ఇండియన్స్తో ఆదివారం నాటి మ్యాచ్లో 220 పరుగుల భారీ స్కోరు చేసిన కోల్కతా (KKR vs MI).. లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ (43 బంతుల్లో 81), రోహిత్ శర్మ (38 బంతుల్లో 78) ధనాధన్ దంచికొట్టడంతో ముంబై ఇండియన్స్ మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.Sealed in style 🔒@mipaltan begin their #TATAIPL 2026 campaign with an impressive 6⃣-wicket victory at home 💙Scorecard ▶️ https://t.co/JmJcgsoHQ7#KhelBindaas | #MIvKKR pic.twitter.com/zOnWb5Sc8U— IndianPremierLeague (@IPL) March 29, 2026ఆరు వికెట్ల తేడాతోవాంఖడే స్టేడియంలో 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 224 పరుగులు సాధించి.. ఆరు వికెట్ల తేడాతో కేకేఆర్పై ముంబై గెలిచింది. ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ హర్భజన్ సింగ్.. కేకేఆర్ సారథి అజింక్య రహానే వ్యూహాలను విమర్శించాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో సునిల్ నరైన్కు బంతి ఇవ్వకపోవడాన్ని భజ్జీ తప్పుబట్టాడు.పవర్ ప్లేలో అదే అత్యుత్తమంజియోస్టార్ షోలో మాట్లాడుతూ.. ‘‘పవర్ ప్లేలో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ సునిల్ నరైన్తో బౌలింగ్ చేయించడం అత్యుత్తమ నిర్ణయం. అతడితో కనీసం రెండు ఓవర్లు అయినా వేయించాల్సింది. తద్వారా రోహిత్ శర్మను టార్గెట్ చేసే వీలు ఉండేది.నరైన్కు రోహిత్పై మంచి రికార్డు ఉంది. ఒకవేళ ఈరోజు కూడా రోహిత్ను త్వరగా అవుట్ చేసి ఉంటే.. ముంబై ఒత్తిడిలో కూరుకుపోయేది. ఇక పవర్ ప్లే సంగతి పక్కన పెడితే నరైన్కు పూర్తి కోటా బౌలింగ్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. కెప్టెన్సీ ఎంత చెత్తగా ఉందో చెప్పడానికి ఇదొక నిదర్శనం’’ అని హర్భజన్ సింగ్ రహానే కెప్టెన్సీని విమర్శించాడు.వారిద్దరు అద్బుతంఏదేమైనా రోహిత్ శర్మ, రికెల్టన్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందేనని భజ్జీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. వారిద్దరు అద్భుతంగా బ్యాటింగ్ చేశారని.. కేకేఆర్ బౌలర్లను ఏ దశలోనూ కోలుకోనివ్వలేదని ప్రశంసించాడు. కాగా ముంబైతో మ్యాచ్లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన సునిల్ నరైన్.. 30 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. తిలక్ వర్మ (18) వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు.చదవండి: బంగ్లాదేశ్కు బ్యాడ్న్యూస్!.. షాకిచ్చిన జియోస్టార్! -
వరల్డ్కప్ హీరో సంజూ అట్టర్ ఫ్లాఫ్.. తొలి మ్యాచ్లో ఫెయిల్
టీ20 ప్రపంచకప్-2026 హీరో సంజూ శాంసన్ ఐపీఎల్ తాజా ఎడిషన్ తొలి మ్యాచ్లోనే నిరాశపరిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున భారీ అంచనాలతో బరిలోకి దిగాడు ఈ కేరళ స్టార్. ఐపీఎల్-2026లో భాగంగా రాజస్తాన్ రాయల్స్తో సోమవారం నాటి మ్యాచ్ సందర్భంగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్తో కలిసి సీఎస్కే ఇన్నింగ్స్ ఆరంభించాడు సంజూ.క్లీన్బౌల్డ్ జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) రాయల్స్ బౌలింగ్ ఎటాక్ ఆరంభించగా.. సంజూ ఐదో బంతికి ఫోర్ బాది ఖాతా తెరిచాడు. అయితే, ఆ తర్వాత బ్యాట్ ఝులిపించలేకపోయిన ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. రెండో ఓవర్ ఆఖరి బంతికే పెవిలియన్ చేరాడు.రాయల్స్ పేసర్ నండ్రీ బర్గర్ బౌలింగ్లో సంజూ శాంసన్ (Sanju Samson) క్లీన్బౌల్డ్ అయ్యాడు. దీంతో మొత్తంగా ఏడు బంతులు ఎదుర్కొన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. సీఎస్కే తరఫున అరంగేట్ర మ్యాచ్లోనే సంజూ విఫలం కావడంతో అభిమానులు ఉసూరుమంటున్నారు.𝐒𝐨𝐮𝐧𝐝𝐬 𝐨𝐟 𝐓𝐢𝐦𝐛𝐞𝐫 🎶Nandre Burger 🤝 Jofra Archer #RR fans, how was that for a start? 😉 Updates ▶️ https://t.co/UzbuFk5G26#TATAIPL | #KhelBindaas | #RRvCSK | @rajasthanroyals pic.twitter.com/iqLU8yIgcX— IndianPremierLeague (@IPL) March 30, 2026వరల్డ్కప్ హీరో సంజూకాగా స్వదేశంలో టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముందు ఫామ్ కోల్పోయిన సంజూ శాంసన్కు.. అదృష్టవశాత్తూ సూపర్-8 మ్యాచ్ల సందర్భంగా తిరిగి తుది జట్టులోకి వచ్చే అవకాశం దక్కింది. ఈ క్రమంలో సూపర్-8 నాకౌట్ మ్యాచ్లో వెస్టిండీస్పై 97 పరుగులతో రాణించిన సంజూ.. ఆ తర్వాత కూడా భీకర ఫామ్ కొనసాగించాడు.ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లో, న్యూజిలాండ్తో ఫైనల్లో వరుసగా 89, 89 పరుగులు చేసిన సంజూ.. భారత్ చాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఇదే జోరులో చెన్నై తరఫునా చెలరేగుతాడని అభిమానులు కొండంత ఆశతో ఎదురుచూడగా.. తొలి మ్యాచ్లోనే సంజూ తడబడ్డాడు.కకావికలంకాగా తాజా సీజన్లో తమ తొలి మ్యాచ్లో చెన్నై రాజస్తాన్తో అమీతుమీ తేల్చుకునేందుకు మైదానంలో దిగింది. గౌహతి వేదికగా టాస్ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్కు దిగింది. ఇక గాయం కారణంగా దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని దూరంకాగా.. అతడి స్థానంలో సంజూ వికెట్ కీపర్గా సేవలు అందించనున్నాడు.కాగా రాయల్స్ పేసర్ల విజృంభణతో చెన్నై టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్లు సంజూ (6), రుతు (6) విఫలం కాగా.. ఆయుశ్ మాత్రే డకౌట్ అయ్యాడు. మాథ్యూ షార్ట్ రెండు పరుగులకే పెవిలియన్ చేరాడు. ఫలితంగా పవర్ ప్లే (6 ఓవర్లు)లో చెన్నై నాలుగు వికెట్ల నష్టానికి కేవలం 41 పరుగులే చేసింది.చదవండి: బంగ్లాదేశ్కు బ్యాడ్న్యూస్!.. షాకిచ్చిన జియోస్టార్! -
IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ చరిత్రలో తొలిసారి ఇలా..!
చెన్నై సూపర్ కింగ్స్ చరిత్రలో ఎన్నడూ జరగని ఓ విచిత్రం జరిగింది. 277 మ్యాచ్ల ఈ ఫ్రాంచైజీ ప్రస్తానంలో తొలిసారి ఓ మ్యాచ్లో ఎంఎస్ ధోని, సురేశ్ రైనా ఇద్దరూ లేరు. సీఎస్కే చరిత్రలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఇలా జరగలేదు. ఐపీఎల్ 2026లో భాగంగా గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్తో ఇవాళ (మార్చి 30) జరుగుతున్న మ్యాచ్లో ఈ ఘట్టం చోటు చేసుకుంది. తలా, చిన్న తలా అని పిలుచుకునే ధోని-రైనా లేకపోవడాన్ని సీఎస్కే అభిమానులు ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నారు.రైనా కొంతకాలం కిందటే ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించగా.. ధోని లీగ్లో కొనసాగుతున్నప్పటికీ గాయం కారణంగా ఈ సీజన్ తొలి రెండు వారాలకు దూరంగా ఉండనున్నాడు. ధోని-రైనా జోడీ సీఎస్కే విజయ ప్రస్తానంలో ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నారు. ధోని సీఎస్కే సాధించిన ప్రతి విజయంలో కీలకంగా వ్యవహరించగా.. రైనా మిస్టర్ ఐపీఎల్గా పేరుగడించాడు.ఇదిలా ఉంటే, రాజస్థాన్తో నేటి మ్యాచ్లో సీఎస్కే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. రాయల్స్ పేసర్ల ధాటికి సీఎస్కే టాపార్డర్ పేకమేడలా కూలింది. నండ్రే బర్గర్, జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరిగే బంతులతో సీఎస్కే బ్యాటర్లను పెవిలియన్కు పంపారు. రెండో ఓవర్ చివరి బంతికి తొలిసారి సీఎస్కే తరఫున ఆడుతున్న సంజూ శాంసన్ను (6) బర్గర్.. మూడో ఓవర్ చివరి బంతికి సీఎస్కే సారధి రుతురాజ్ గైక్వాడ్ను (6) ఆర్చర్ అద్భుతమైన బంతులతో క్లీన్ బౌల్డ్ చేశారు. ఆ మరుసటి బంతికే (3.1 ఓవర్) యువ ఆటగాడు ఆయుశ్ మాత్రేను బర్గర్ మరో అద్భుతమైన బంతితో డకౌట్ చేశాడు. ఆతర్వాత వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ వరుసగా బౌండరీ, సిక్సర్ బాది జోరును ప్రదర్శిస్తున్నాడు. 5 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 36-3గా ఉంది. సర్ఫరాజ్ ఖాన్ (14), మాథ్యూ షార్ట్ (1) క్రీజ్లో ఉన్నారు. తుది జట్లు..సీఎస్కే: సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్(సి), ఆయుష్ మ్హత్రే, మాథ్యూ షార్ట్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ(w), జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, మాట్ హెన్రీ, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్ఇంపాక్ట్ ప్లేయర్స్ ఆప్షన్స్: సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ వీర్, రాహుల్ చాహర్, గుర్జప్నీత్ సింగ్, రామకృష్ణ ఘోష్రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్(సి), ధృవ్ జురెల్(w), షిమ్రాన్ హెట్మెయర్, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మఇంపాక్ట్ ప్లేయర్స్ ఆప్షన్స్: డొనొవన్ ఫెరియెరా, లుహాన్ డ్రి ప్రిటోరియస్, సుషాంత్ మిశ్రా, రవి సింగ్ -
బంగ్లాదేశ్కు బ్యాడ్న్యూస్!.. ఊహించని షాక్!
టీ20 ప్రపంచకప్-2026 సందర్భంగా బంగ్లాదేశ్ మామూలుగా రచ్చ చేయలేదు. ఈ ఐసీసీ ఈవెంట్కు వేదికైన భారత్లో తమ ఆటగాళ్లు, సిబ్బందికి భద్రత లేదని ఆరోపించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) చెప్పినా సరే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ వైఖరి మార్చుకోలేదు.అక్కడ మొదలైన వివాదంభారత్ నుంచి వేదికను శ్రీలంకకు మార్చాలని మొండిపట్టు పట్టగా.. ఐసీసీ నిరాకరించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయం మేరకు తాము టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది. ఈ వివాదానికి మూలకారణం ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ఫాస్ట్బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ (Mustafizur Rahman)ను తొలగించడమే అని చెప్పవచ్చు.కాగా బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై దాడులు, ఈశాన్య భారతం గురించి బంగ్లా నేతల వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో భారత్తో దౌత్యపరమైన విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముస్తాఫిజుర్ రహమాన్ను ఐపీఎల్ నుంచి తొలగించాలనే డిమాండ్లు రాగా.. బీసీసీఐ అందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది.ఐపీఎల్ ప్రసారాలపై నిషేధంఈ పరిణామం తర్వాత టీ20 ప్రపంచకప్ ఆడేందుకు భారత్కు రాబోమని భీష్మించుకున్న బంగ్లాదేశ్.. ఆఖరికి టోర్నీ నుంచే వైదొలగాల్సి వచ్చింది. ఇక అదే సమయంలో తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిషేధిస్తున్నట్లు అప్పటి తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది.యూటర్న్అయితే, ఇటీవల ఎన్నికైన ప్రభుత్వం ఈ విషయంలో యూటర్న్ తీసుకుంది. రాజకీయాలు, క్రీడలను తాము కలపమని.. ఎవరైనా తమ దేశంలో ఐపీఎల్ను ప్రసారం చేయాలనుకుంటే అందుకు అనుమతి ఇస్తామని ప్రకటించింది. నిజానికి భారత్తో క్రికెట్ సంబంధాలు తెంచుకుంటే బంగ్లా క్రికెట్ పెద్ద ఎత్తున నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.ఊహించని షాక్ అయితే, బంగ్లా ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. బంగ్లాదేశ్లో ఐపీఎల్ను ప్రసారం చేసే టీ- స్పోర్ట్స్తో ఒప్పందాన్ని ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ జియోస్టార్ రద్దు చేసుకుంది. ఆర్థిక చెల్లింపుల విషయంలో టీ- స్పోర్ట్స్ ఆలస్యం చేయడం, ఒప్పందానికి అనుగుణంగా వ్యవహరించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.ఒప్పందం రద్దు కారణంగాదీంతో బంగ్లాదేశ్లో ఐపీఎల్ ప్రసారాలకు ప్రభుత్వం అనుమతినిచ్చినా.. టీ- స్పోర్ట్స్ నిర్వాకం వల్ల మ్యాచ్లు అక్కడ ప్రసారం కావు. కాగా 2023-2027 వరకు ఐపీఎల్తో పాటు డబ్ల్యూపీఎల్ కూడా బంగ్లాదేశ్లో ప్రసారం చేసుకునేందుకు జియోస్టార్ ద్వారా సబ్ లైసెన్స్ పొందింది. అయితే, నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా అనుమతులు కోల్పోయింది. దీంతో అధికారికంగా బంగ్లాదేశ్లో ఐపీఎల్ ప్రసారాలకు బ్రేక్ పడింది.చదవండి: IPL: ఈ ఐదు రికార్డులను ఎవరూ బ్రేక్ చేయలేరు!? -
సీఎస్కేపై రాయల్స్ ఘన విజయం
సీఎస్కేపై రాయల్స్ ఘన విజయంఐపీఎల్ 2026లో భాగంగా సీఎస్కేతో ఇవాళ జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే, రాయల్స్ బౌలర్ల ధాటికి 19.4 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలగా.. రాయల్స్ 12.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది.రెండో వికెట్ కోల్పోయిన రాయల్స్.. జురెల్ ఔట్8.3వ ఓవర్- 99 పరుగుల వద్ద రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. అన్షుల్ కంబోజ్ బౌలింగ్లో ధృవ్ జురెల్ (18) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వైభవ్ ఔట్17 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసిన అనంతరం వైభవ్ సూర్యవంశీ ఔటయ్యాడు. అన్షుల్ కంబోజ్ బౌలింగ్లో సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో పెవిలియన్కు చేరాడు.127 పరుగులకు సీఎస్కే ఆలౌట్సీఎస్కే ఇన్నింగ్స్ 127 పరుగుల వద్ద ముగిసింది. ఓవర్టన్ (43) అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శించడంతో సీఎస్కే 100 పరుగుల మార్కును దాటగలిగింది. ఓవర్టన్కు (7 నాటౌట్) అన్షుల్ కంబోజ్ సహకరించాడు. రాయల్స్ బౌలర్లలో ఆర్చర్, బర్గర్, రవీంద్ర జడేజా తలో 2.. బ్రిజేష్ శర్మ, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు. సీఎస్కే ఇన్నింగ్స్లో ఓవర్టన్తో పాటు కార్తీక్ శర్మ (18, సర్ఫరాజ్ ఖాన్ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఎనిమిదో వికెట్ డౌన్12.5వ ఓవర్- 82 పరుగుల వద్ద సీఎస్కే ఎనిమిదో వికెట్ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో జురెల్కు క్యాచ్ ఇచ్చి నూర్ అహ్మద్ (1) ఔటయ్యాడు.ఏడో వికెట్ కోల్పోయిన సీఎస్కేబ్రిజేశ్ శర్మ బౌలింగ్లో కార్తిక్ శర్మ (18) ఎల్బీడబ్ల్యూ. బ్రిజేశ్ ఖాతాలో తొలి ఐపీఎల్ వికెట్. స్కోరు: 74-7(11). ఓవర్టన్ తొమ్మిది పరుగులతో ఉండగా.. నూర్ అహ్మద్ క్రీజులోకి వచ్చాడు.ఆరో వికెట్ డౌన్జడేజా బౌలింగ్లో శివం దూబే రవి బిష్ణోయికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం ఆరు పరుగులు చేసి నిష్క్రమించాడు. స్కోరు: 57-6 (8). కార్తిక్ శర్మ 14 పరుగులతో ఉండగా.. జేమీ ఓవర్టన్ క్రీజులోకి వచ్చాడు.సగం వికెట్లు కోల్పోయిన సీఎస్కేరవీంద్ర జడేజా బౌలింగ్లో సర్ఫరాజ్ ఖాన్ ఐదో వికెట్గా వెనుదిరిగాడు. 12 బంతుల్లో 17 పరుగులతో ఆడుతున్న సర్ఫరాజ్ను జడ్డూ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. శివం దూబే క్రీజులోకి రాగా.. కార్తిక్ శర్మ 11 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 57-5(7.5).కుప్పకూలిన సీఎస్కే టాపార్డర్రాజస్థాన్ పేసర్ల ధాటికి సీఎస్కే టాపార్డర్ పేకమేడలా కుప్పకూలింది. బర్గర్.. సంజూ శాంసన్ (6), మాత్రే (0)ను ఔట్ చేయగా.. ఆర్చర్ రుతురాజ్ను (6), సందీప్ శర్మ షార్ట్ను (2) పెవిలియన్కు పంపారు. 6 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 41-4గా ఉంది. కార్తీక్ శర్మ (3), సర్ఫరాజ్ ఖాన్ (15) క్రీజ్లో ఉన్నారు. పీకల్లోతు కష్టాల్లో సీఎస్కేటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న సీఎస్కే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 19 పరుగులకే 3 వికెట్లు (3.1 ఓవర్లలో) కోల్పోయింది. ఆర్చర్, బర్గర్ వరుస బంతుల్లో రుతురాజ్ (6), ఆయుశ్ మాత్రేను (0) ఔట్ చేశారు. సంజూ క్లీన్ బౌల్డ్1.6వ ఓవర్- నండ్రే బర్గర్ బౌలింగ్లో సంజూ శాంసన్ (6) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మార్చి 30) రాజస్థాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. గౌహతిలోని బర్సపరా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్కు ముందు వర్షం పడటంతో 5 నిమిషాలు ఆలస్యమైంది. మ్యాచ్ సమయంలో కూడా వరుణుడి ఆటంకాలు తప్పకపోవచ్చు. ప్రస్తుతానికి వాతావరణం క్లియర్గా ఉంది.తుది జట్లు..సీఎస్కే: సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్(సి), ఆయుష్ మ్హత్రే, మాథ్యూ షార్ట్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ(w), జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, మాట్ హెన్రీ, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్ఇంపాక్ట్ ప్లేయర్స్ ఆప్షన్స్: సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ వీర్, రాహుల్ చాహర్, గుర్జప్నీత్ సింగ్, రామకృష్ణ ఘోష్రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్(సి), ధృవ్ జురెల్(w), షిమ్రాన్ హెట్మెయర్, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మఇంపాక్ట్ ప్లేయర్స్ ఆప్షన్స్: డొనొవన్ ఫెరియెరా, లుహాన్ డ్రి ప్రిటోరియస్, సుషాంత్ మిశ్రా, రవి సింగ్ -
నేను ముందే చెప్పాను కదా!: అంపైర్తో రోహిత్ శర్మ
టీమిండియా దిగ్గజ కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ ఐపీఎల్-2026 టోర్నీని ఘనంగా ఆరంభించాడు. కోల్కతా నైట్ రైడర్స్ (KKR)తో ఆదివారం నాటి మ్యాచ్లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ వింటేజ్ హిట్మ్యాన్ను గుర్తుచేశాడు. కేవలం 38 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 78 పరుగులు సాధించాడు.Rohit Sharma in his element 🙌🎥 Enjoy his scintillating early smacks for six 👊#MI are 64/0 after 5 overs.Updates ▶️ https://t.co/JmJcgsoHQ7#TATAIPL | #KhelBindaas | #MIvKKR | @mipaltan | @ImRo45 pic.twitter.com/ys8k0JNHlW— IndianPremierLeague (@IPL) March 29, 2026ఇక ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కోల్కతా (KKR vs MI)పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా 2012 తర్వాత తొలిసారి ఐపీఎల్లో తమ ఆరంభ మ్యాచ్లో ముంబై గెలుపు జెండా ఎగురవేసింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ సందర్భంగా అంపైర్తో రోహిత్ శర్మ (Rohit Sharma) వ్యవహరించిన తీరు వైరల్గా మారింది.గేజ్ టెస్టు నిర్వహిస్తుండగా.. కేకేఆర్ విధించిన 221 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ బ్యాటింగ్కు వస్తున్న సమయంలో.. అంపైర్ అతడి బ్యాట్ను పరీక్షించాడు. బ్యాట్ పరిమాణం సరిగ్గా ఉందా అన్న విషయాన్ని తెలుసుకునేందుకు గేజ్ టెస్టు నిర్వహిస్తుండగా.. రోహిత్ తన బ్యాట్ సరిగ్గానే ఉందంటూ రియాక్షన్ ఇచ్చాడు.నేను ముందే చెప్పాను కదా!అయితే, నిబంధన ప్రకారం బ్యాట్ను టెస్టు చేసిన అంపైర్ సంతృప్తి వ్యక్తం చేయగా.. ‘నేను ముందే చెప్పాను కదా!’ అన్నట్లుగా రోహిత్ శర్మ నవ్వులు చిందిస్తూ మైదానంలోకి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు హిట్మ్యాన్ అభిమానులను ఆకర్షిస్తున్నాయి.కాగా గతేడాది ఎక్కువగా ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా వచ్చిన రోహిత్.. ఈసారి మాత్రం తుదిజట్టులో భాగంగా బరిలోకి దిగుతున్నాడు. దీంతో అతడి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక టీమిండియాకు టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ అందించిన ఘనత రోహిత్ శర్మది. కెప్టెన్ హోదాలో ముంబైని సైతం ఐదుసార్లు చాంపియన్గా నిలిపాడు. అయితే, 2024లో ముంబై రోహిత్ను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. చదవండి: IPL: ఈ ఐదు రికార్డులను ఎవరూ బ్రేక్ చేయలేరు!?pic.twitter.com/0A7i9X5ybq— • (@ClassyCricket) March 30, 2026 -
IPL 2026: రాజస్థాన్-సీఎస్కే మ్యాచ్ జరిగేనా..? గౌహతిలో వర్షం
ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇవాల్టి (మార్చి 30) మ్యాచ్ జరగాల్సి ఉంది. గౌహతిలోని బర్సపరా వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 🚨 ITS RAINING AT GUWAHATI 🚨 pic.twitter.com/kMxhiDENqx— Johns. (@CricCrazyJohns) March 30, 2026ఎందుకంటే, మ్యాచ్ ప్రారంభానికి ముందు గౌహతిలో వర్షం మొదలైంది. పిచ్ను, కొంత భాగం మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ఈ విషయం సోషల్మీడియాలో వైరలవడంతో, నేటి మ్యాచ్పై నీలినీడలు కమ్ముకున్నాయి. వాతావరణ సమాచారం ప్రకారం, మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశం 20 శాతంగా ఉంది. ఇప్పటికే వర్షం మొదలైన నేపథ్యంలో టాస్ కూడా ఆలస్యమవ్వవచ్చు. కాగా, రాజస్థాన్ రాయల్స్ తమ మూడు హోం మ్యాచ్లను గౌహతిలో ఆడనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ రద్దైతే ఇరు జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది. కానీ, పరిస్థితి అంత వరకు వెళ్లకపోవచ్చని అంచనా. మ్యాచ్ సమయానికి వాతావరణం కుదురుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. హీన పక్షంలో కొన్ని ఓవర్ల మ్యాచ్ అయినా జరుగుతుందని అనుకుంటున్నారు. మ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లో రద్దు కాకూడదని ఇరు ఫ్రాంచైజీల అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. -
సీఎస్కే తుది జట్టు ఇదే.. రూ. 14 కోట్ల ఆటగాడికి ఛాన్స్?
ఐపీఎల్-2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్తో సీఎస్కే తలపడనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు సీఎస్కేకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని, విధ్వసంకర బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ గాయం కారణంగా సీఎస్కే ఆడే కొన్ని మ్యాచ్లకు దూరమయ్యారు. దీంతో జట్టు బాధ్యత మొత్తం సంజూ శాంసన్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్పైనే పడింది. ఈ క్రమంలో రాజస్తాన్తో జరిగే తొలి మ్యాచ్లో సీఎస్కే ప్లేయింగ్ ఎలెవన్లో ఎలా ఉండబోతుందో ఓ లుక్కేద్దాం. ఈ మ్యాచ్లో యువ ఆటగాడు ప్రశాంత్ వీర్ అరంగేట్రం చేసే అవకాశముంది.గతేడాది డిసెంబర్లో జరిగిన మినీ వేలంలో ప్రశాంత్ వీర్ను రూ. 14.2 కోట్ల భారీ ధర వెచ్చించి మరి సీఎస్కే కొనుగోలు చేసింది. ఈ 20 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్రౌండర్ను రవీంద్ర జడేజాకు ప్రత్యామ్నాయంగా తీసుకున్నారు. ఈ ఏడాది సీజన్కు ముందు జడేజా సీఎస్కే నుంచి రాజస్తాన్కు ట్రేడ్ అయిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మథ్యూ షార్ట్, ఇంగ్లండ్ పేసర్ జేమీ ఓవర్టన్ సీఎస్కే తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశముంది. అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్ పేస్ బౌలింగ్ బాధ్యతలను పంచుకోనున్నారు. స్పిన్నర్లగా నూర్ అహ్మద్, రాహుల్ చాహర్ తుది జట్టులో చోటు దక్కించుకునే సూచనలు కన్పిస్తున్నాయి. సీఎస్కే బ్యాటింగ్ను సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ ప్రారంభించనున్నారు.సీఎస్కే తుది జట్టు(అంచనా) సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, మాథ్యూ షార్ట్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, జామీ ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్, రాహుల్ చాహర్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్రాజస్తాన్ తుది జట్టు(అంచనా): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రోన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, దాసున్ షనక, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, ఆడమ్ మిల్నే -
IPL: ఈ ఐదు రికార్డులను ఎవరూ బ్రేక్ చేయలేరు!?
గత ఏడాది కాలంగా రికార్డుల మోత మోగిస్తున్నాడు భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ. పద్నాలుగేళ్ల వయసులోనే ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు ఈ బిహారీ పిల్లాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగి అత్యంత పిన్న వయసులో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.ఆ తర్వాత భారత్ అండర్-19 జట్టు తరఫునా వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అదరగొట్టాడు. ముఖ్యంగా వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లండ్పై 80 బంతుల్లోనే ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 175 పరుగులు సాధించడం విశేషం. తద్వారా భారత్ మరోసారి ట్రోఫీ గెలవడంలో తన వంతు పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.ఇక ఇటీవలే పదిహేనో వసంతంలో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్-2026లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఇక క్యాష్ రిచ్ లీగ్లో ఇప్పటి వరకు ఓ ఐదు ప్రధాన రికార్డులు చెక్కుచెదరకుండా ఉన్నాయి. మరి వైభవ్ సూర్యవంశీ వాటిని ఈసారి బ్రేక్ చేయగలడా?అత్యధిక వ్యక్తిగత స్కోరుఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా క్రిస్ గేల్ కొనసాగుతున్నాడు. ఈ వెస్టిండీస్ దిగ్గజం ఆర్సీబీ తరఫున పుణె వారియర్స్తో మ్యాచ్ సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించాడు.ఐపీఎల్ 2013 ఎడిషన్లో కేవలం 66 బంతుల్లోనే 175 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అతడి ఇన్నింగ్స్లో 13 ఫోర్లు, 17 సిక్సర్లు ఉండటం విశేషం. ఇక ఇటీవలే వైభవ్ సూర్యవంశీ ఈసారి తన టార్గెట్ గేల్ రికార్డు బద్దలు కొట్టడమే అని తెలిపిన సంగతి తెలిసిందే. మరి ఈ సీజన్లోనే ఈ కుర్రాడు గేల్ను అధిగమిస్తాడో? లేదో? చూడాలి.ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్ల రికార్డుయూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ విధ్వంసకర ఆట తీరుకు పెట్టింది పేరు. ఆర్సీబీ తరఫున పుణెపై 2013 నాటి మ్యాచ్లో అతడు ఏకంగా 17 సిక్సర్లు బాదాడు. ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డు సాధించాడు.ఇక వైభవ్ సూర్యవంశీ ఇటీవల అండర్-19 వరల్డ్కప్ ఫైనల్లో, యూత్ టీ20 మ్యాచ్లో ఏకంగా 15 సిక్సర్లు బాదాడు. గేల్ రికార్డును వైభవ్ ఈసారి బ్రేక్ చేసే అవకాశాలు లేకపోలేదు.ఒక ఎడిషన్లో అత్యధిక సిక్సర్లుఐపీఎల్లో ఒక ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగానూ క్రిస్ గేల్ నిలిచాడు. 2012 సీజన్లో ఈ విండీస్ లెజెండ్ 59 సిక్సర్లు బాదాడు. ఇక 2019లో ఆండ్రీ రసెల్ 52 సిక్స్లు బాదాడు. ఈ రికార్డులను వైభవ్ బద్దలు కొట్టే అవకాశం ఉంది. గతేడాది ఐపీఎల్లో ఏడు మ్యాచ్లు ఆడిన వైభవ్ 24 సిక్సర్లు బాదాడు.సీజన్లో అత్యధిక స్ట్రైక్రేటుఐపీఎల్ 2024 సీజన్లో ఆస్ట్రేలియా స్టార్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెగర్క్ తొమ్మిది మ్యాచ్లలో కలిపి 141 బంతులు ఎదుర్కొని 234.34 స్ట్రైక్రేటుతో పరుగులు రాబట్టాడు. తద్వారా ఓ సీజన్లో అత్యధిక స్ట్రైక్రేటు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. గతేడాది వైభవ్ 122 బంతులు ఎదుర్కొని 206కు పైగా స్ట్రైక్రేటుతో పరుగులు రాబట్టాడు.ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లుఫస్ట్ క్లాస్, లిస్ట్-ఎ, టీ20 మ్యాచ్లలో ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లు ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదారు. అయితే, ఐపీఎల్లో మాత్రం ఇంత వరకు ఏ ఆటగాడికీ ఈ ఘనత సాధ్యం కాలేదు. క్రిస్గేల్, రాహుల్ శర్మ, రాహుల్ తెవాటియా, రవీంద్ర జడేజా, రింకూ సింగ్, రియాన్ పరాగ్ ఇప్పటి వరకు ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదగలిగారు.చదవండి: జడ్డూ, సందీప్ శర్మను కాదని అతడికే పగ్గాలు.. ఎందుకంటే?: సంగక్కర -
IPL 2026: గ్రీన్ గురించి కీలక అప్డేట్
కేకేఆర్ స్టార్ ఆల్రౌండర్, ఆస్ట్రేలియా ప్లేయర్ కెమరూన్ గ్రీన్ గురించి కీలక అప్డేట్ అందుతుంది. గ్రీన్ మరికొంతకాలం బ్యాటర్గా మాత్రమే కేకేఆర్కు అందుబాటులో ఉంటాడని అతని జాతీయ క్రికెట్ బోర్డు క్రికెట్ ఆస్ట్రేలియా మరోసారి స్పష్టం చేసింది. నిన్న ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో గ్రీన్ కేవలం బ్యాటింగ్ మాత్రమే చేయడంతో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా మరోసారి వివరణ ఇచ్చింది.ఈ విషయాన్ని సీఏ గతంలోనే కేకేఆర్ యాజమాన్యానికి తెలియజేసింది. ఇందుకు వారు కూడా సమ్మతించారు. అయితే కేకేఆర్ అభిమానుల నుంచి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో సీఏ మరోసారి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. గ్రీన్ను కేకేఆర్ రూ.25.20 కోట్ల భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసింది. ఇతను ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు.ఇంత భారీ మొత్తం వెచ్చించబడిన గ్రీన్ కేవలం బ్యాటర్గా మాత్రమే అందుబాటులో ఉంటాడన్న విషయాన్ని కేకేఆర్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ముంబై ఇండియన్స్ మ్యాచ్లో అతను బ్యాట్తోనూ సత్తా చాటలేకపోవడం వారి అసహనాన్ని మరింత పెంచింది. ఈ మ్యాచ్లో గ్రీన్ 10 బంతుల్లో ఫోర్, సిక్స్ సాయంతో కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్లో గ్రీన్ అందుబాటులో లేకపోవడంతో కేకేఆర్ ఆరుగురు బౌలర్లను ప్రయోగించాల్సి వచ్చింది. ఇది వారిని భారీ మూల్యం చెల్లించుకునేలా చేసింది. భారీ స్కోర్ (220-4) చేసినా, ఆరో స్పెషలిస్ట్ బౌలింగ్ ఆప్షన్ లేకపోవడంతో కేకేఆర్ మ్యాచ్ను కోల్పోయింది. ఈ మ్యాచ్లో కేకేఆర్ ఓడిపోవడానికి గ్రీన్ పరోక్షంగా కారణమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఇంతమాత్రం దానికి (కేవలం బ్యాటర్) అతనికి 25 కోట్లు దండగ అని బహిరంగ విమర్శలు చేస్తున్నారు. గతంలో వెంకటేశ్ అయ్యర్ విషయంలోనూ ఇలానే జరిగింది. అతన్ని కూడా కేకేఆర్ మేనేజ్మెంట్ భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకుంది. అతను కూడా గ్రీన్ లాగే కేవలం అడపాదడపా బ్యాటింగ్కు మాత్రమే పరిమితమై జట్టుకు భారంగా ఉండేవాడు.గ్రీన్పై వస్తున్న భారీ వ్యతిరేకత నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా అతనికి మద్దతుగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో గ్రీన్ వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్నట్లు వివరణ ఇచ్చింది.గ్రీన్ మరో 10–12 రోజుల పాటు బౌలింగ్ చేయడని కూడా స్పష్టం చేసింది. గాయం నుంచి పూర్తిగా కోలుకుంటేనే బౌలింగ్ చేస్తాడని తెలిపింది. కాగా, 2024 చివర్లో గ్రీన్కు వెన్ను శస్త్రచికిత్స జరిగింది. -
'బాబు నీ మిస్టరీ.. హిస్టరీ అయిపోయింది'
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. టీ20 వరల్డ్కప్-2026 నాకౌట్ మ్యాచ్లలో దారుణంగా విఫలమైన వరుణ్.. ఇప్పుడు ఐపీఎల్-2026లో అదే తీరును కనబరుస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ తరపున వరుణ్ దారుణ ప్రదర్శన కనబరిచాడు.ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అయితే చక్రవర్తి బౌలింగ్ను ఉతికారేశాడు. మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ కూడా వరుణ్కు చుక్కలు చూపించాడు. ఈ తమిళనాడు స్పిన్నర్ మొత్తంగా తన నాలుగు ఓవర్ల కోటాలో 48 పరుగులిచ్చి వికెట్ లెస్గా వెనుదిరిగాడు.ఈ నేపథ్యంలో చక్రవర్తిపై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వరుణ్ బౌలింగ్లో ఇక ఏమాత్రం 'మిస్టరీ' మిగిలిలేదని, అతడి పని అయిపోయందని శ్రీకాంత్ విమర్శించాడు."వరుణ్ చక్రవర్తి బంతిని స్పిన్ చేయడం నేర్చుకోకపోతే కచ్చితంగా ఇబ్బంది పడతాడు. ఎప్పుడూ గూగ్లీలే వేస్తానంటే కుదరదు. బౌలింగ్లో వైవిధ్యం ఉండాలి. తన లెగ్ స్పిన్ స్కిల్స్ను మెరుగుపరుచుకోవాలి. అతడి బౌలింగ్లో ఇప్పుడు ఎలాంటి మిస్టరీ లేదు.అతడి మిస్టరీ కాస్త హిస్టరీ అయిపోయింది. లెగ్ స్పిన్ బౌలింగ్ చేస్తూ, బంతిని బ్యాటర్లకు కాస్త దూరంగా వేయాలి. అప్పుడే బ్యాటర్లు షాట్లు ఆడేందుకు భయపడతారు. అంతేకాకుండా పవర్ప్లేలో అతడితో బౌలింగ్ చేయించకూడదు" అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. పవర్ ప్లేలో వరుణ్ వేసిన నాలుగో ఓవర్లో రోహిత్ శర్మ ఏకంగా 15 పరుగులు పిండుకున్నాడు. వరుణ్ బంతితో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. వికెట్ల విషయం పక్కన పెడితే కనీసం పరుగులు కూడా కట్టడి చేయలేకపోయాడు. మరి తర్వాతి మ్యాచ్లలో ఎలా రాణిస్తాడో చూడాలి మరి.చదవండి: జడ్డూ, సందీప్ శర్మను కాదని అతడికే పగ్గాలు.. ఎందుకంటే?: సంగక్కర -
జడ్డూ, సందీప్ శర్మను కాదని అతడికే పగ్గాలు.. ఎందుకంటే?
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్గా రియాన్ పరాగ్ ఎంపిక పట్ల విమర్శలు కొనసాగుతున్నాయి. టీమిండియా స్టార్లు యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ పేర్లు కెప్టెన్సీ రేసులో బలంగా వినిపించినా యాజమాన్యం మాత్రం ఆఖరికి పరాగ్కే పగ్గాలు అప్పగించింది. ఈ అసోం ఆల్రౌండర్ గతేడాది తాత్కాలిక కెప్టెన్గా నిరాశపరిచినా అతడిపై మేనేజ్మెంట్ మరోసారి నమ్మకం ఉంచింది.ఇక ఐపీఎల్-2026లో తమ తొలి మ్యాచ్లో భాగంగా రాజస్తాన్ సోమవారం నాటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో తలపడనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రాజస్తాన్ హెడ్కోచ్, క్రికెట్ డైరెక్టర్ కుమార్ సంగక్కర రియాన్ పరాగ్ (Riyan Parag)ను కెప్టెన్ చేయడానికి గల కారణాలు వెల్లడించాడు.కఠినమైన పరీక్షలు‘‘రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్సీ రేసులో సందీప్ శర్మ (Sandeep Sharma), రవీంద్ర జడేజాతో కలిపి ఐదుగురు పోటీదారులు ఉన్నారు. వీరిలో ఒకరిని కెప్టెన్గా ఎంపిక చేసేందుకు మేము ఎంతగానో శ్రమించాము. కఠినమైన పరీక్షలు పెట్టాము.వీరితో జరిగిన సంభాషణల్లో భాగంగా ప్రతి ఒక్కరు కెప్టెన్ క్యాండిడేట్ అని నిరూపించుకున్నారు. అయితే, అందరిలోకెల్లా రియాన్ అగ్రస్థానంలో నిలిచాడు. కఠినమైన ప్రశ్నలకు అతడు జవాబు ఇచ్చిన తీరు అమోఘం. అతడు ఎంతగానో పరిణతి చెందాడు.అత్యంత పరిణతి చెందిన ఆటగాడిగాకెప్టెన్సీ, నాయకత్వం మధ్య సన్నని గీత ఉంటుంది. ఈ రెండూ అంత తేలికైన విషయాలేమీ కాదు. ఇతరులతో పోల్చి చూసినపుడు అతడు అత్యంత పరిణతి చెందిన ఆటగాడిగా కనిపించాడు. ఏదేమైనా ఏ కెప్టెన్, నాయకుడు పరిపూర్ణంగా ఉండరు.ఆటలో గెలుపు- ఓటములు సహజం. నేను కూడా పొరపాట్ల నుంచి నేర్చుకుని ఎదిగిన వాడినే. రియాన్ పరాగ్కు క్లిష్ట సమయాల్లో సాయం చేసేందుకు జట్టులో ఎంతో మంది సీనియర్లు ఉన్నారు.వారి మద్దతు ఉంటుందికష్ట సమయంలో రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, సందీప్ శర్మ, షిమ్రన్ హెట్మెయిర్, జోఫ్రా ఆర్చర్, దసున్ షనక.. తదితరులపై అతడు ఆధారపడగలడు’’ అని సంగక్కర చెప్పుకొచ్చాడు. కాగా సుదీర్ఘకాలంగా తమ కెప్టెన్గా ఉన్న సంజూ శాంసన్ను చెన్నైకి ట్రేడ్ చేసిన రాజస్తాన్.. టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను జట్టులో చేర్చుకుంది.చదవండి: అతడొక అద్భుతమైన ఫీల్డర్.. ఎందుకిలా చేశారు?: మాజీ కెప్టెన్ ఫైర్ -
పీఎస్ఎల్లో బాల్ టాంపరింగ్.. స్పందించిన పాక్ క్రికెట్ బోర్డు
పాకిస్తాన్ సూపర్ లీగ్-2026ను బాల్ టాంపరింగ్ వివాదం కుదిపేస్తోంది. ఆదివారం గడాఫీ స్టేడియంలో కరాచీ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో లాహోర్ ఖలందర్స్ బాల్ టాంపరింగ్ పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఫఖర్ జమాన్ బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించాడని అంపైర్లు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు. దీంతో అతడిపై లెవల్-3 నేరాన్ని మోపారు.ఏమి జరిగిందంటే?కరాచీ కింగ్స్ విజయానికి చివరి ఓవర్లో 14 పరుగులు అవసరమయ్యాయి. ఈ ఓవర్ వేసే బాధ్యతను కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది పేసర్ హరీస్ రవూఫ్కు అప్పగించాడు. అయితే ఈ క్రమంలో ఫఖర్ జమాన్, అఫ్రిది, రవూఫ్ ముగ్గురూ కలిసి బౌలర్ ఎండ్ వద్ద మాట్లాడుకున్నారు. ఈ సమయంలో బంతికి ఒకరు చేతి నుంచి ఒకరు మార్చుకున్నారు.అయితే బంతిని ఫఖర్ తన చేతి వేలితో గీకినట్లు కన్పించింది. దీంతో వెంటనే అంపైర్ బంతిని అతడి చేతి నుంచి తీసుకుని టాంపరింగ్కు గురైనట్లు నిర్ధారించారు. ఈ క్రమంలో బంతిని మార్చడంతో పాటు లహోర్కు ఐదు పరుగుల పెనాల్టీ విధించారు. దీంతో మ్యాచ్ ఫలితమే తారుమారైంది. అయితే ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సీరియస్గా తీసుకుంది.పీసీబీ సీరియస్మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామ నేతృత్వంలో జరిగిన విచారణలో ఫఖర్ జమాన్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. తదుపరి విచారణ వచ్చే 48 గంటల్లో మరో విచారణ జరగనుంది అని పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది.ఒకవేళ విచారణలో బాల్ టాంపరింగ్ పాల్పడినట్లు రుజువైతే జమాన్పై ఒక్క మ్యాచ్ నిషేదం పడే అవకాశముంది. కాగా గతంలో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ వంటి ఆసీస్ స్టార్ ప్లేయర్లు బాల్ టాంపరింగ్ పాల్పడి కఠిన శిక్షలు అనుభవించిన విషయం తెలిసిందే.చదవండి: PSL 2026: పాక్ స్టార్ ప్లేయర్కు భారీ జరిమానా.. ఎందుకంటే? -
అతడొక అద్భుతమైన ఫీల్డర్.. ఎందుకిలా చేశారు?: మాజీ కెప్టెన్ ఫైర్
కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అనుసరించిన వ్యూహాలను టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తప్పుబట్టాడు. ఇద్దరు కీలక పేసర్లను కాదని పవర్ ప్లేలో కెప్టెన్, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా రెండు ఓవర్లు ఎందుకు బౌలింగ్ చేశాడని ప్రశ్నించాడు.ఆరు వికెట్ల తేడాతోఅదే విధంగా సూర్యకుమార్ యాదవ్ విషయంలో యాజమాన్యం వ్యవహారశైలి ఏమిటో తనకు అర్థం కావడం లేదని చిక్కా విమర్శించాడు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 టోర్నీలో ముంబై బోణీ కొట్టిన విషయం తెలిసిందే. సొంతమైదానం వాంఖడే వేదికగా ఆదివారం నాటి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR)పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.తద్వారా పద్నాలుగేళ్ల విరామం తర్వాత తొలిసారి.. ఓ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్లో ముంబై జయభేరి మోగించింది. అయితే, ఈ మ్యాచ్లో ముంబై గెలిచినా.. ఆ జట్టు అనుసరించిన వ్యూహాలు మాత్రం తనకు ఆశ్చర్యం కలిగించాయని క్రిష్ణమాచారి శ్రీకాంత్ అన్నాడు.ఇది అసలు అంతుపట్టని విషయంతన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఇది అసలు అంతుపట్టని విషయం. భారత్కు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు తుదిజట్టులో చోటు ఇవ్వలేదు. సూర్యను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించడం సరికాదు.అతడొక అద్భుతమైన ఫీల్డర్అతడొక అద్భుతమైన ఫీల్డర్. సూర్యకు బదులు రూథర్ఫర్డ్ను ఇంపాక్ట్ ప్లేయర్గా పంపాల్సింది. ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా పంపి సూర్యకు అన్యాయం చేశారు’’ అని చిక్కా ముంబై యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.మరో వ్యూహాత్మక తప్పిదం ఇదిఇక పవర్ ప్లేలో ముంబై అనుసరించిన వ్యూహాలను ప్రస్తావిస్తూ.. ‘‘ముంబై చేసిన మరో వ్యూహాత్మక తప్పిదం ఇది. ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉన్నా.. వారి సేవలను పూర్తిగా వినియోగించుకోలేకపోయారు. వారిద్దరు ఆలస్యంగా బంతితో రంగంలోకి దిగారు.ఇక తన తొలి ఓవర్లోనే బుమ్రా ఐదు స్లో బంతులు ఎందుకు వేశాడో నాకైతే అర్థం కాలేదు. తనదైన సహజశైలిలో స్వింగ్, సీమ కలగలిపి అతడు బౌలింగ్ చేయలేదు. మరోవైపు.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు ఓవర్లు తానే వేశాడు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ విమర్శించాడు. కాగా కేకేఆర్తో మ్యాచ్లో బౌల్ట్ నాలుగు ఓవర్ల కోటాలో 38 పరుగులు ఇచ్చి వికెట్లు తీయలేకపోయాడు. మరోవైపు.. పాండ్యా 3 ఓవర్లలో 39 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీయగా.. బుమ్రా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 35 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఫిట్నెస్ సమస్యల కారణంగానేఇదిలా ఉంటే.. సూర్యను ఇంపాక్ట్ ప్లేయర్గా ఉపయోగించడంతో విమర్శలు రాగా.. హెడ్కోచ్ మహేళ జయవర్దనె స్పందించాడు. సూర్య గజ్జల్లో గాయంతో ఇబ్బంది పడుతున్నందు వల్లే అతడిని ఎక్కువగా శ్రమపెట్టదలచుకోలేదని తెలిపాడు. ఫిట్నెస్ సమస్యలు తీవ్రం కాకుండా చూసుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు.చదవండి: అంతుచిక్కని శార్దూల్ ఠాకూర్! -
పాక్ స్టార్ ప్లేయర్కు భారీ జరిమానా.. ఎందుకంటే?
పాకిస్తాన్ సూపర్ లీగ్-2026లో కరాచీ కింగ్స్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం గడ్డాఫీ స్టేడియం వేదికగా లహోర్ ఖలందర్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో కరాచీ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో హద్దు మీరి ప్రవర్తించిన కరాచీ కింగ్స్ స్పీడ్ స్టార్కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారీ షాకిచ్చింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు హసన్ అలీకి మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా పీసీబీ విధించింది.ఏమి జరిగిందంటే?లహోర్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన హసన్ అలీ.. చివరి బంతికి ప్రత్యర్ధి బ్యాటర్ హసీబుల్లా ఖాన్ను అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే ఈ సమయంలో హసన్ అలీ సెలబ్రేషన్స్ శ్రుతిమించాయి. హసీబుల్లాను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు దూకుడుగా సైగలు చేశాడు.ఈ విషయాన్ని పీసీబీ సీరియస్గా తీసుకుంది. హసన్ ఆర్టికల్ 2.5ను ఉల్లంఘించినట్లు పాక్ క్రికెట్ బోర్డు తేల్చింది. హసన్ అలీ తన తప్పును అంగీకరించడంతో పీసీబీ కేవలం ఫైన్తోనే సరిపెట్టింది.అయితే ఇదే మ్యాచ్లో లహోర్ స్టార్ ప్లేయర్ ఫఖర్ జమాన్ బాల్ టాంపరింగ్ పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు . చివరి ఓవర్లో కరాచీ విజయానికి 14 పరుగులు కావల్సిన సమయంలో, ఫఖర్ జమాన్ బంతి రూపాన్ని మార్చడానికి ప్రయత్నిస్తూ అంపైర్లకు దొరికిపోయాడు. అంపైర్లు వెంటనే బంతిని మార్చడమే కాకుండా, లాహోర్ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధించారు. ఈ ఘటనసై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విచారణ జరుపుతోంది.చదవండి: IPL 2026: సూర్యను ఎందుకు పక్కన పెట్టారు..? -
IPL 2026: బ్లూ సోఫాలో అంబానీ ఫ్యామిలీ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత ఖరీదైన జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. ఖరీదైన జట్టుగా మాత్రమే గాక క్యాచ్ రిచ్ లీగ్లో అత్యధిక టైటిల్స్ కొట్టిన జట్టుగానూ ముంబై ఇండియన్స్కు పేరుంది. ఇప్పటివరకు ఐపీఎల్లో ఐదు టైటిల్స్ కొట్టిన ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్కింగ్స్తో కలిసి సమానంగా ఉంది. ముంబై ఇండియన్స్ యాజామాన్యం ఎవరన్నది అందరికీ తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్న ముకేశ్ అంబానీ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి ఓనర్. అంబానీ ఫ్యామిలీ ఏది చేసినా రిచ్గానే కనిపిస్తుంటుంది. ఐపీఎల్లోనూ అది ఎన్నోసార్లు స్పష్టంగా తెలిసొచ్చింది. ముంబై ఇండియన్స్ జట్టు టైటిల్ గెలిచిన ప్రతీసారి అందులో ఉండే ఆటగాళ్లకు అంబానీ ఫ్యామిలీ ఎన్నో విలువైన కానుకలు కూడా అందించింది. తాజాగా ఐపీఎల్ 19వ సీజన్లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ను ఆదివారం కేకేఆర్తో ఆడింది. ముంబై ఇండియన్స్ విజయం సంగతి పక్కనబెడితే అంబానీ ఫ్యామిలీకి సంబంధించి ఒక వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారిపోయింది.అదేంటంటే.. కేకేఆర్తో మ్యాచ్ సందర్భంగా నీతా అంబానీ ఫ్యామిలీకి వాంఖడే స్టేడియం డగౌట్కు సమీపంలో వేసిన ప్రత్యేక బ్లూ సోఫాలో ఆసీనులయ్యారు. మ్యాచ్ ఆద్యంతం అక్కడే కూర్చుని నీతా అంబానీ జట్టు సభ్యులను చీర్ చేశారు. అయితే అభిమానులకు ఇక్కడే ఒక సందేహం కలిగింది. వాస్తవానికి ఏ ఫ్రాంచైజీ ఓనర్ అయినా బాక్స్లో లేదా అభిమానుల మధ్యలో కూర్చొని మ్యాచ్ వీక్షించడం ఆనవాయితీ. కానీ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ మాత్రం ఆ రూల్ను బ్రేక్ చేసి మైదానం డగౌట్లో ప్రత్యేక సోఫాలో అంబానీ ఫ్యామిలీని ఎందుకు కూర్చోబెట్టా రన్నది ఆసక్తి కలిగించింది. మరి అంబానీ ఫ్యామిలీకే ఎందుకు సోఫాలు వేస్తారు. మిగతా ఓనర్లకు ఎందుకు వేయరన్న ప్రశ్నలు చాలా మందిలో తలెత్తాయి. గతంలోనూ అంబానీ కుటుంబం ఎందుకు మైదానం సమీపంలో వేసిన సోఫాలో కూర్చొని మ్యాచ్లు వీక్షిస్తారనే ప్రశ్నలు చాలాసార్లు వచ్చాయి.నీతా అంబానీ టీమ్ ఓనరే కాదు.. ఆమె ముంబై జట్టుకు సీఈవో. టీమ్ మీటింగ్స్, స్టాటజీ మీటింగ్, ప్లేయర్ మీటింగ్ లకి నీతా అంబానీ తరచూ హాజరవుతూ ఉంటారు. ముంబై ఇండియన్స్ మాత్రమే కాదు అంబానీ ఫ్యామిలీ వేరే టీమ్ ఫ్రాంచైజీకి కూడా స్పాన్సర్గా వ్యవహరి స్తుంటారు. దీనికి తోడు భారత్లోనే అత్యంత ధనవంతుల జాబితాలో ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు. అంబానీ ఫ్యామిలీ వద్ద డబ్బులకు కొదవ లేకపోవడంతో ప్రపంచ క్రికెట్ను శాసిస్తున్న బీసీసీఐకి కూడా అంబానీ ఫ్యామిలీ స్పాన్సర్గా వ్యవరిస్తున్నట్లు వార్తలున్నాయి. అందుకే బీసీసీఐ కూడా అంబానీ ఫ్యామిలీ విషయంలో జోక్యం చేసుకోవడం లేదనిపిస్తోంది. బహుశా ఈ కారణం చేతనే ముంబై ఇండియన్స్ మ్యాచ్లు జరిగినప్పుడల్లా మైదానం డగౌట్ సమీపంలో బ్లూ సోఫాను ఉంచుతున్నట్లుగా అనిపి స్తోంది. ఇతర జట్ల యజమానులు మాత్రం వీఐపీ బాక్స్, కార్పొరేట్ బాక్సుల్లో కూర్చొవడం లేదా నిలబడి మ్యాచ్ ని వీక్షిస్తుంటారు. కానీ ముంబై ఇండియన్స్ యజమానులు రాయల్ గా గ్రౌండ్ పక్కనే కూర్చొని మ్యాచ్ వీక్షిస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మరోసారి వైరల్గా మారాయి. Nah man Nita Ambani just showed her power on live television😭😭 pic.twitter.com/tNXU262FTx— ` (@McgMadMan) March 30, 2026చదవండి: టైగర్వుడ్స్కు ట్రంప్ మాజీ భార్య వార్నింగ్! -
వెస్టిండీస్ చిత్తు.. వన్డే సిరీస్ ఆస్ట్రేలియాదే
కరేబియన్ గడ్డపై ఆస్ట్రేలియా మహిళల జట్టు జోరును కొనసాగుతోంది. ఇప్పటికే టీ20 సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు.. ఇప్పుడు వన్డే సిరీస్ను కూడా ఖాతాలో వేసుకుంది. సోమవారం సెయింట్ కిట్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో 90 పరుగుల తేడాతో వెస్టిండీస్ను ఆసీస్ చిత్తు చేసింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే మూడు వన్డేల సిరీస్ను 2-0 తేడాతో కంగారులు కైవసం చేసుకున్నారు. ఈ మ్యాచ్లో టాస్ మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన బెత్ మూనీ (65) టాప్ స్కోరర్గా నిలిచింది. ఆమెతో పాటు జార్జియా వేర్హమ్ (39), లిచ్ఫీల్డ్(46), నికోలా కేరీ (30*), అలానా కింగ్ (26*) కీలక ఇన్నింగ్స్లు ఆడారు.కుప్పకూలిన విండీస్అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఓపెనర్లు క్వీనా జోసెఫ్ (29), హేలీ మాథ్యూస్ (45) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాటర్లు విఫలం కావడంతో విండీస్.. 46 ఓవర్లలో కేవలం 179 పరుగులకే కుప్పకూలింది. గత మ్యాచ్లో సెంచరీతో సత్తాచాటిన సీనియర్ బ్యాటర్ టేలర్ సైతం రెండో వన్డేలో రాణించలేకపోయింది.ఆస్ట్రేలియా స్పిన్నర్లు జార్జియా వేర్హమ్, యాష్ గార్డనర్ తలా మూడు వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాసించారు. వీరిద్దరితో పాటు స్టాండ్ ఇన్ కెప్టెన్ మెక్గ్రాత్ రెండు వికెట్లు సాధించింది. మూడు వికెట్లతో సత్తాచాటిన జార్జియాకు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: IPL 2026: సూర్యను ఎందుకు పక్కన పెట్టారు..? -
గర్ల్ ఫ్రెండ్కు బెంజ్ కారు గిఫ్ట్గా ఇచ్చిన హార్దిక్.. ఎన్ని కోట్లంటే?
టీమిండియా స్టార్ ఆల్రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోసారి వార్తల్లో నిలిచాడు. హార్దిక్ తన ప్రేయసి మహికా శర్మకు అత్యంత ఖరీదైన కారును గిఫ్ట్గా ఇచ్చాడు. ఆమెపై ఉన్న ప్రేమను చాటుకుంటూ సుమారు రూ. 1.7 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ లగ్జరీ కారును కానుకగా అందించాడు.ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇటీవలే పాండ్యా తన కోసం రూ.12 కోట్ల విలువైన లగ్జరీ రును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన గర్ల్ఫ్రెండ్ కోసం ఏకంగా మెర్సిడెస్ బెంజ్ను కొనుగోలు చేసి అందరిని ఆశ్యర్యపరిచాడు. కాగా ఈ బరోడా క్రికెటర్ నటాషా స్టాంకోవిక్తో విడిపోయిన తర్వాత మహికా శర్మతో ప్రేమలో పడ్డాడు. హార్దిక్ ఆడే ప్రతీ మ్యాచ్లోనూ ఆమె మైదానంలో ఉండి ఉత్సహపరుస్తుంటుంది. తన విజయాల్లో మహికా కీలక పాత్ర పోషిస్తుందని హార్దిక్ ఇదివరకే పలుమార్లు పేర్కొన్నాడు. అయితే హార్దిక్ గత నెలలో తన మాజీ భార్య నటాషాకు కూడా ఖరీదైన కారును గిఫ్ట్గా ఇచ్చాడు. నటాషా, అగస్త్య కోసం రూ. 4 కోట్ల విలువైన లాండ్ రోవర్ డిఫెండర్ను పాండ్యా కొనుగోలు చేశాడు.ముంబై గ్రాండ్ విక్టరీఇక ఐపీఎల్-2026 సీజన్లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. ఆదివారం వాంఖడే వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్ విధించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై అలవోకగా ఛేదించింది.రోహిత్ శర్మ(78), ర్యాన్ రికెల్టన్ (81) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో జట్టును విజయతీరాలకు చేర్చారు. 2012 తర్వాత ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్లో విజయం సాధించడం ఇదే మొదటిసారి.చదవండి: PSL: వద్దు అన్నా.. హోటల్కు తీసుకెళ్లారు! చిక్కుల్లో స్టార్ క్రికెటర్లు -
సూర్యను ఎందుకు పక్కన పెట్టారు..?
ఐపీఎల్-2026 సీజన్ను ముంబై ఇండియన్స్ ఘనంగా ఆరంభించింది. ఆదివారం కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన తమ తొలి మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ముంబై విజయాన్ని అందుకుంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ 221 పరుగుల భారీ లక్ష్యాన్ని అలవోకగా చేధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(78), ర్యాన్ రికెల్టన్(81) తమ అద్భుత ఇన్నింగ్స్లతో జట్టుకు విజయాన్ని అందించారు. కాగా ఈ మ్యాచ్లో ముంబై గెలిచినప్పటికి.. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్కు స్టార్టింగ్ ఎలెవన్లో చోటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది. అతడు ఈ మ్యాచ్లో ఇంపాక్ట్ సబ్గా కేవలం బ్యాటింగ్కు మాత్రమే వచ్చాడు. దీంతో సూర్య గాయపడ్డాడా? అన్న సందేహం అందరిలోనూ నెలకొంది. అయితే సూర్యను పక్కన పెట్టడానికి గల అసలు కారణాన్ని మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేలా జయవర్దనే వెల్లడించాడు. సూర్యను కేవలం ఫిట్నెస్ జాగ్రత్తలలో భాగంగానే తుది జట్టులో ఆడించలేదని జయవర్ధనే స్పష్టం చేశాడు."మేము అనవసరమైన కథనాలను సృష్టించకూడడు అనుకుంటున్నాము. మా జట్టులోని ప్రతీ ఒక్కరు చాలా సంతోషంగా ఉన్నారు. సూర్య కాస్త ఆలస్యంగా మా జట్టుతో చేరాడు. అయితే అతడి కాలి గజ్జల్లో స్వల్పంగా పట్టేసినట్లు ఉంది. దీంతో ఫీల్డింగ్ చేసేటప్పుడు కాస్త ఇబ్బంది పడుతున్నాడు. అందుకే ఈ రోజు అతడికి విశ్రాంతి ఇచ్చాము. చివరి నాలుగు ఓవర్లలో తను ఫీల్డింగ్కు వచ్చేందుకు స్కై సిద్దమయ్యాడు. కానీ నేనే వద్దన్నాను. మా తదుపరి మ్యాచ్కు ఇంకా ఐదు రోజుల సమయం ఉంది. అప్పటికి సూర్య పూర్తి సిద్దంగా ఉంటాడని" జయవర్ధనే పేర్కొన్నాడు. ఈ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్కు వచ్చిన సూర్య కేవలం 15 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక ముంబై తమ తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 4న అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్లతో తలపడనుంది. చదవండి: PSL: వద్దు అన్నా.. హోటల్కు తీసుకెళ్లారు! చిక్కుల్లో స్టార్ క్రికెటర్లు -
అంతుచిక్కని శార్దూల్ ఠాకూర్!
శార్దూల్ ఠాకూర్.. ఆల్రౌండర్గా టీమిండియాకు కొన్ని మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించాడు. అయితే శార్దూల్ ఒక ఫాస్ట్ బౌలర్ కాదు.. స్వింగ్ బౌలర్ అంతకన్నా కాదు. అతడి బౌలింగ్లోనూ పెద్దగా వైవిధ్యత కనిపించదు. కానీ జట్టుకు అవసరమైనప్పుడల్లా వికెట్లు తీస్తూ విజయాల్లో భాగమవుతూ వస్తున్నాడు. తాజాగా ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టడంలో శార్దూల్ ఠాకూర్ కీలకపాత్ర పోషించాడు. ఆదివారం కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్లో స్టార్ బౌలర్ బుమ్రా బౌలింగ్ తేలిపోయిన చోట శార్దూల్ మాత్రం 3 కీలక వికెట్లు పడగొట్టి కేకేఆర్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకొని ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు సొంతం చేసుకున్నాడు.అయితే శార్దూల్ ఠాకూర్ టీ20 క్రికెట్లో పవర్ ప్లే, మిడిల్, డెత్ ఓవర్లలో ఎక్కడైనా బౌలింగ్ చేయడంలో సమర్థుడు. కేకేఆర్తో మ్యాచ్లనూ పవర్ ప్లేలో ఒకటి, మిడిల్ ఓవర్లలో ఒకటి, డెత్ ఓవర్లలో ఒకటి ఇలా మూడు వికెట్లు తీశాడు. సాధారణంగా ఒక బౌలర్ వికెట్లు తీస్తూ ఫామ్లో ఉన్నట్లయితే అతడితో వరుస ఓవర్లు వేయించి ప్రత్యర్థిని దెబ్బతీయాలని చూస్తారు. కానీ శార్దూల్ మాత్రం తాను ఆడే జట్టు కెప్టెన్కు బౌలింగ్ విషయమై ముందే క్లారిటీ ఇస్తాడట. అందుకే కెప్టెన్లకు అవసరమైనప్పుడు బౌలింగ్కు వచ్చి వికెట్లు తీయడం శార్దూల్లో ఉన్న ప్రత్యేకత. అంతేకాదు శార్దూల్ తన బౌలింగ్లో ఒకే రకం శైలిని ఎక్కువసార్లు ఉపయోగించు. సీమ్, పేస్ను మిక్స్ చేస్తూ వచ్చే స్లోపేస్ బంతులను ప్రత్యర్థి బ్యాటర్లు ఆడేందుకు ఇబ్బంది పడుతుంటారు. తాజాగా కేకేఆర్తో మ్యాచ్లోనూ శార్దూల్ దానినే ఫాలో అయ్యాడు. అందుకే ఫిన్ అలెన్, అజింక్యా రహానే, కామెరూన్ గ్రీన్లు ఔటైన విధానం పరిశీలిస్తే శార్దూల్ బౌలింగ్పై మరింత స్పష్టత వస్తుంది. ఇక 2012 వరకు ముంబై ఇండియన్స్కు నెట్బౌలర్గా ఉన్న శార్దూల్ ఇప్పుడు అదే జట్టుకు బుమ్రా తర్వాత ప్రధాన బౌలర్గా మారిపోయాడు. 2015 నుంచి ఐపీఎల్ ఆడుతున్న శార్దూల్ పదేళ్లలో ఆరుజట్లు మారాడు. పదేళ్ల తర్వాత కానీ సొంత జట్టుకు ఆడే అవకాశం రాలేదు. తాజాగా వచ్చిన అవకాశాన్ని శార్దూల్ రెండు చేతులతో ఒడిసిపట్టుకున్నాడు. శార్దూల్ ఠాకూర్ టీమిండియా తరఫున 13 టెస్టుల్లో 377 పరుగులు, 33 వికెట్లు; 47 వన్డేల్లో 329 పరుగులు, 65 వికెట్లు; 25 టీ20ల్లో 69 పరుగులు సహా 33 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ కెరీర్లో 106 మ్యాచ్లాడి 325 పరుగులు చేయడంతో పాటు 110 వికెట్లు పడగొట్టాడు. View this post on Instagram A post shared by IPL (@iplt20)చదవండి: ‘ఆ విషయం క్రికెట్ ఆస్ట్రేలియాను అడగండి’ -
వద్దు అన్నా.. హోటల్కు తీసుకెళ్లారు! చిక్కుల్లో స్టార్ క్రికెటర్లు
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 సీజన్లో లాహోర్ ఖలందర్స్ తొలి ఓటమిని చవిచూసింది. ఆదివారం లహోర్ వేదికగా కరాచీ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ఖలందర్స్ పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్ ఫలితం పక్కన పెడితే.. లాహోర్ ఖలందర్స్ కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది, ఆల్ రౌండర్ సికందర్ రజా ఓ వివాదంలో చిక్కుకున్నారు.భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు వీరిద్దరిపై స్థానిక పోలీసులు సీరియస్ అయ్యారు. లహోర్ డిప్యూటీ పోలీస్ ఇన్స్పెక్టర్ పీఎస్ఎల్ సీఈఓ సల్మాన్ నసీర్కు లేఖ రాయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.ఏమి జరిగిదంటే?షాహీన్ అఫ్రిది సారథ్యంలోని ఖలందర్స్ జట్టు లహోర్లోని ఓ హోటల్లో బస చేస్తోంది. అయితే సికిందర్ రజా తన ఉండే గదిలోకి నలుగురు గెస్ట్లను అనుమతించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డును కోరాడు. కానీ అతడు చేసిన విన్నపాన్ని పీసీబీ తిరస్కరించింది. ఈ విషయంలో లాహోర్ ఖలందర్స్ యజమాని సమీన్ రాణా కూడా జోక్యం చేసుకున్నారు. ఆ నలుగురును అనుమతించాలని సీఈఓ నసీర్ను సమీన్ అభ్యర్ధించాడు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆ విన్నపాన్ని అధికారులు తోసిపుచ్చారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాలను పక్కన పెట్టిమరి షాహీన్, రజా ఆ నలుగురిని హోటల్ లోపలికి తీసుకెళ్లారు.ఆ సమయంలో అక్కడ డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందితో వీరిద్దరూ వాగ్వాదానికి దిగారు. ఇదే విషయాన్ని సీఈఓ సల్మాన్ నసీర్కు రాసిన లేఖలో పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై లాహోర్ ఖలందర్స్ మీడియా హెడ్ ఉమర్ ఫరూక్ స్పందించారు.మా ఇద్దరు ఆటగాళ్లకు సంబంధించిన ఈ ఘటనపై మాకు స్పష్టత ఉంది. మేమే పీఎస్ఎల్ మేనెజ్మెంట్తో చర్చలు జరపుతున్నాము అని ఉమర్ ఫరూక్ తెలిపారు. అయితే షాహీన్, రజాపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది. -
‘ఆ విషయం క్రికెట్ ఆస్ట్రేలియాను అడగండి’
ఐపీఎల్ 2026 సీజన్ను కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) ఓటమితో ప్రారంభించింది. బ్యాటింగ్ బాగానే చేసినప్పటికీ బౌలింగ్ వైఫల్యంతో ఓటమి చవిచూసింది. అధిక ధరకు కొనుగోలు చేసిన కామెరూన్ గ్రీన్తో బౌలింగ్ చేయించకపోవడాన్ని అందరూ ప్రశ్నిస్తున్నారు. కానీ దీనికి సమాధానం క్రికెట్ ఆస్ట్రేలియానే దీనికి జవాబు చెప్పాలి అని తెలిపాడు. ఈ నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే మ్యాచ్ ఓటమి అనంతరం స్పందించాడు. ‘ఇప్పుడు అంతా బాగానే ఉంది. మ్యాచ్ సమయంలో కాస్త కండరాలు పట్టేశాయనిపించింది. ప్రస్తుతం బాగానే ఉన్నా. ముంబై ఇండియ న్స్కు నిర్దేశించిన 220 ప్లస్ స్కోరు సరిపోతుందని భావించాము. మా వరకు మేము మెరుగ్గానే ఆడాం. బౌలింగ్ అనుకున్నంత స్ట్రాంగ్గా లేకపోవడం మాకు కలిసిరాలేదు. బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబైని అడ్డుకోవడం సవాల్తో కూడుకున్నది. ముజరబానికి ఇదే తొలి ఐపీఎల్ కావడం, అనుభవజ్ఞులు లేకపోవడం పెద్ద లోటు. ఇక కార్తిక్ త్యాగి, వైభవ్ అరోరాలు ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారు. ఇద్దరు స్టార్ స్పిన్నర్లు ఉన్నప్పటికీ ముంబై బ్యాటర్లు అద్భుతంగా ఆడడంతో ఓటమి తప్పలేదు. రూ. 25 కోట్లు పెట్టి కొన్న కామెరూన్ గ్రీన్తో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించకపోవడాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం నేను కాదు క్రికెట్ ఆస్ట్రేలియానే చెప్పాలి. అయితే ఈ మ్యాచ్లో బౌలింగ్లో కాస్త భిన్నశైలిని ఎంచుకున్నాం. బ్యాటింగ్లో ఇబ్బందులు లేనప్పటికీ రాబోయే మ్యాచ్ల్లో బౌలింగ్ యూనిట్ను మెరుగుపరుచుకుంటాం. 37 ఏళ్ల వయసున్నా నన్ను నేను ఇప్పటికీ ఒక కుర్రాడిలాగే భావించుకుంటా.’ అని చెప్పుకొచ్చాడు.కేకేఆర్కు ముందే చెప్పాం: క్రికెట్ ఆస్ట్రేలియాకాగా గ్రీన్ విషయంలో కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే చేసిన కామెంట్స్పై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) స్పందించింది. ‘కొద్దికాలం కామెరూన్ గ్రీన్ బౌలింగ్కు దూరంగా ఉంటాడు. అతడు నడుంనొప్పితో బాధపడుతున్నాడు. కొన్ని రోజుల పాటు బౌలింగ్ చేయకూడదని సూచించాం. ఈ విషయం ఇప్పటికే కేకేఆర్తో చర్చించాం. గ్రీన్ పరిస్థితిపై వారికి పూర్తి అవగాహన ఉంది’ అని పేర్కొంది.చదవండి: పీఎస్ఎల్లో బాల్ టాంపరింగ్ వివాదం! -
పీఎస్ఎల్లో బాల్ టాంపరింగ్ వివాదం!
ఐపీఎల్కు పోటీగా ప్రారంభమైన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్ 2026)లో తొలి రోజునే తెల్లబంతి కాస్తా గులాబీ రంగులోకి మారిపోవడం వివాదానికి దారి తీసింది. దీనిపై చర్చ జరుగుతుండగానే తాజాగా బాల్ టాంపరింగ్ వివాదం పీఎస్ఎల్లో కలకలం రేపుతోంది. ఆదివారం లాహోర్ ఖలందర్స్, కరాచీ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో బాల్ టాంపరింగ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో, లాహోర్ ఖలందర్స్ బంతిని ట్యాంపరింగ్ చేసినట్లు అంపైర్లు అనుమానించారు. దీని ఫలితంగా ఐదు పరుగుల పెనాల్టీ విధించబడింది. కరాచీ ఇన్నింగ్స్ చివరి ఓవర్ను హారిస్ రవూఫ్ వేయడానికి సిద్ధమవుతున్న సమయంలో అంపైర్ ఫైసల్ అఫ్రిది బంతిని పరిశీలించారు. ఈ నేపథ్యంలో బంతి ఆకారం ఉద్దేశపూర్వకంగా మార్పు చెందిందని నిర్ధారణకు వచ్చిన అంపైర్ లాహోర్ జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ విధించారు. దీంతో లక్ష్యం ఒక్కసారిగా 14 పరుగుల నుంచి 9 పరుగులకు తగ్గింది. దీనిపై లాహోర్ కెప్టెన్ షహీన్ అఫ్రిది మైదానంలో అసహనం వ్యక్తం చేశాడు. అయితే మ్యాచ్ అనంతరం అఫ్రిది స్పందిస్తూ.. ‘అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. కెమెరా ఫుటేజీని చూసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం. ఐదు పరుగులు పెనాల్టీ విధించారు, ఇప్పుడు మేము చేయగలిగేది ఏమీ లేదు’ అని అఫ్రిది పేర్కొన్నాడు. దీంతో ఇప్పటికే వివాదాల నడుమ మొదలైన పీఎస్ఎల్లో బాలా టాంపరింగ్ అంశంతో మరింత రచ్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మ్యాచ్లో కరాచీ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ (33) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం కరాచీ కింగ్స్ 19.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ముహమ్మద్ వసీమ్ (38) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.This is so Shameful pic.twitter.com/DqTWMk1Mbg— Ehtisham Siddique (@iMShami_) March 29, 2026చదవండి: IPL 2026: ముగ్గురు మొనగాళ్లు! -
IPL 2026: ముగ్గురు మొనగాళ్లు!
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభమై రెండు రోజులే అయినప్పటికీ రెండు మ్యాచ్ల్లోనూ చేజింగ్ చేసిన జట్లే గెలవడం అభిమానులకు కిక్ ఇస్తోంది. అంతకంటే ఎక్కువ కిక్ ఇస్తున్న వార్త ఏదైనా ఉందంటే.. టీమిండియా సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, అజింక్యా రహానే, విరాట్ కోహ్లీల బ్యాటింగ్ అని చెప్పొచ్చు. 40 ఏండ్లకు దగ్గర్లో ఉన్న ఈ ముగ్గురు మొనగాళ్లు బ్యాటింగ్లో అద్భుతాలు చేస్తున్నారు. ఈ సీజన్లో తాము ఆడిన తొలి మ్యాచ్లోనే ఈ త్రయం తమ ప్రదర్శనతో అదరగొట్టారు. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత రోహిత్, కోహ్లీలు పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికితే.. జట్టులో అవకాశాల్లేక టీ20 క్రికెట్ ఆడే అవకాశం రహానే ఎప్పుడో కోల్పోయాడు. కానీ తాజాగా ప్రారంభమైన ఐపీఎల్ 19వ సీజన్లో మాత్రం తమ బ్యాటింగ్ విన్యాసాలతో అభిమానులను అలరిస్తున్నారు. ఈ ముగ్గురూ ఇలాగే ఆడుతూ పోతే రాబోయే మ్యాచ్ల్లో ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలే అని చెప్పొచ్చు.రోహిత్ శర్మ..భారత కెప్టెన్గా 2024 టీ20 ప్రపంచకప్ను అందుకున్న రోహిత్ శర్మ ఆ తర్వాత ఆ ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ శర్మ జనవరిలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ఆడాడు. ఆ సిరీస్లో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ లేదు. మూడు వన్డేలు కలిపి కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఇవాళ ఐపీఎల్లో మాత్రం తొలి మ్యాచ్లోనే రోహిత్ శర్మ విధ్వంసకర ఆటతీరును ప్రదర్శించాడు. కేకేఆర్తో మ్యాచ్లో 38 బంతుల్లోనే 78 పరుగులు చేసిన రోహిత్ అలవోకగా బంతులను బౌండరీ అవతలకు పంపిస్తూ పాత హిట్మ్యాన్ను గుర్తు చేశాడు. రికిల్టన్ కంటే ముందే ఔటైనప్పటికీ ఫోర్లు, సిక్సర్లతో కేకేఆర్కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముఖ్యంగా మ్యాచ్లో రోహిత్ ఫుట్వర్క్ అద్భుతమని చెప్పొచ్చు. ఎక్కడా చిన్న తప్పిదం లేకుండా ఇన్నింగ్స్ ఆసాంతం మంచి టైమింగ్తో షాట్లు ఆడాడు. తొలి మ్యాచ్తోనే ఫామ్ అందుకున్న రోహిత్ నుంచి సీజన్ ముగిసేలోపు మరిన్ని అద్భుత ఇన్నింగ్స్లు వచ్చే అవకాశముంది. View this post on Instagram A post shared by IPL (@iplt20)విరాట్ కోహ్లీ..కోహ్లీది కూడా అచ్చం రోహిత్ స్టోరీనే. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాలో సభ్యుడైన కోహ్లీ రోహిత్తో కలిసి ఏకకాలంలో టీ20లకు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత జనవరిలో న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లోనూ కోహ్లీ అదరగొట్టాడు. ఆ సిరీస్లో కోహ్లీ 3 మ్యాచ్ల్లో 240 పరుగులు సాధించి భారత్ తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు. తాజాగా అదే ఫామ్ను ఐపీఎల్లోనూ కంటిన్యూ చేశాడు. ఐపీఎల్ 19వ సీజన్లో ఎస్ఆర్హెచ్తో జరిగిన ఆరంభ మ్యాచ్లో బెంగళూరు స్టార్ కోహ్లీ చివరి వరకు నాటౌట్గా నిలిచి జట్టును గెలిపించాడు. కోహ్లీ (38 బంతుల్లో 69 నాటౌట్) చేజింగ్లో తనను కొట్టేవారు లేరని మరోసారి నిరూపించాడు. కోహ్లీ ఇన్నింగ్స్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. సీజన్ ఆద్యంతం కోహ్లీ ఇదే దూకుడు ప్రదర్శిస్తే ఆరెంజ్ క్యాప్ కూడా సొంయ్యే అవకాశం లేకపోలేదు. View this post on Instagram A post shared by IPL (@iplt20)అజింక్యా రహానే..రోహిత్, కోహ్లీలు రెండేళ్ల కిందట టీ20లకు వీడ్కోలు పలికితే రహానే టీమిండియా తరఫున తన చివరి టీ20 ఆడి దాదాపు పదేళ్లు కావొస్తోంది. రహానే 2016లో వెస్టిండీస్తో చివరి టీ20 ఆడాడు. అప్పటి నుంచి టెస్టుల్లో కొన్నాళ్లు ఆడిన రహానే ఇప్పుడు అవకాశాలు లేవు. దీంతో ఐపీఎల్లో మాత్రమే కొనసాగుతున్న రహానే గత రెండు, మూడు సీజన్లలో ఆట స్వరూపాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. రహానేను ఎక్కువగా టెస్టు క్రికెట్లో చూడడం వల్ల అతడి నుంచి నెమ్మదైన ఆటనే అభిమానులు ఊహించేవారు. కానీ ఐపీఎల్లో రహానే ఆడుతున్న తీరు షాక్ కలిగిస్తోందని చెప్పొచ్చు. తాజాగా ఐపీఎల్ 19వ సీజన్లో ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో రహానే కేకేఆర్ కెప్టెన్గా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో 67 పరుగులు చేసిన రహానే ఇన్నింగ్స్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. గతంలో చెన్నై సూపర్కింగ్స్కు ఆడినప్పుడు కూడా రహానే ఇదే దూకుడును ప్రదర్శించి సరికొత్త ఆటను రుచి చూపించాడు. మొత్తంగా టీమిండియా సీనియర్లయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానేలు ఒక్క మ్యాచ్తోనే ఆటలో మొనగాళ్లమని నిరూపించుకున్నారు.చదవండి: ‘14 ఏండ్లకు మమ్మల్ని కరుణించాడు’ -
‘14 ఏండ్లకు మమ్మల్ని కరుణించాడు’
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్లో విజయం సాధించడం పట్ల ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా సంతోషం వ్యక్తం చేశాడు. గత 13 సీజన్లలో తొలి మ్యాచ్లో తమను ఓటములే పలకరించాయని, కానీ 14 ఏండ్ల తర్వాత ఆ దేవుడు తమను కరుణించాడని పేర్కొన్నాడు. సీజన్లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్, కేకేఆర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో కేకేఆర్పై సునాయాస విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కెప్టెన్ పాండ్యా మాట్లాడాడు. ‘ఇది ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విజయం. గత 13 సీజన్లను ఓటమితోనే ప్రారంభించాం. కానీ ప్రతీ సీజన్ ప్రారంభ మ్యాచ్ను గెలవాలనే బలమైన సంకల్పంతోనే బరిలోకి దిగేవాళ్లం. 2013 నుంచి 2025 వరకు మాకు ఓటములే ఎదురయ్యాయి. కేకేఆర్పై విజయం పట్ల మా జట్టు పూర్తి సంతోషంగా ఉంది. ఎందుకంటే భారీ లక్ష్యాలను ఛేధించడం అంత సులువు కాదు. తొలి ఇన్నింగ్స్లో కేకేఆర్ పవర్ ప్లేలో మా బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో భారీగా పరుగులు వచ్చాయి. కానీ పవర్ ప్లే తర్వాత మా బౌలర్లు గాడిన పడి కేకేఆర్ మరింత భారీ స్కోరు చేయకుండా అడ్డుకోవడంలో సక్సెస్ అయ్యారు. లేదంటే కేకేఆర్ 240 లేదా 250కి పైగా స్కోరు చేసి ఉండేదేమో. కళ్ల ముందు భారీ టార్గెట్ కనిపిస్తున్నప్పటికీ మా టాప్ ఓపెనర్లు రోహిత్- రికిల్టన్లు తమ బ్యాటింగ్తో అదరగొట్టారు. ముఖ్యంగా రోహిత్ భాయ్ బ్యాట్ నుంచి కొన్ని అద్భుతమైన షాట్లు వచ్చాయి. అదే సమయంలో రికిల్టన్ కూడా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అయితే డికాక్ను కాదని రికిల్టన్కు అవకాశమివ్వడం రిస్క్ అనిపించినా అతడు తన బ్యాటింగ్తో మా అనుమానాలను పటాపంచలు చేశాడు. ఇక రోహిత్ భయ్యా గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. టీ20 క్రికెట్కు గ్యాప్ వచ్చినప్పటికీ గ్రౌండ్ నలువైపులా షాట్లు ఆడుతూ పాత రోహిత్ను గుర్తుకుతెచ్చాడు. రోహిత్ శర్మ కేవలం మా జట్టు ఆటగాడు మాత్రమే కాదు అతను మాకు మార్గనిర్దేశకుడు. ఎన్నో ఏళ్లుగా ఐపీఎల్ ఆడుతున్నప్పటికీ శార్దూల్ ఠాకూర్ తన సొంత జట్టుకు ఆడడం లేదన్న ఫీలింగ్ అతనికి ఉండేది. నాకు తెలిసి ఇవాళ్టితో శార్దూల్కు ఆ ఫీలింగ్ పోయి ఉండాలి (నవ్వుతూ). ఒక నిఖార్సైన ఆల్రౌండర్కు అర్థం శార్దూల్ ఠాకూర్. ఇవాళ మ్యాచ్ హీరో శార్దూల్ అని కచ్చితంగా చెప్పగలను’ అంటూ ముగించాడు. కేకేఆర్తో మ్యాచ్లో మూడు వికెట్లు తీసిన శార్దూల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకున్నాడు.చదవండి: కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ -
కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ శుభారంభం చేసింది. 2012 సీజన్ తర్వాత తాము ఆడిన తొలి మ్యాచ్లో విజయాన్ని అందుకొని సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. అయితే కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత ఇన్నింగ్స్తో మెరిశాడు. క్రీజులో తాను ఉన్నాడంటే పరుగులు రావాల్సిందే. 38 బంతుల్లో 78 పరుగులు చేసిన రోహిత్ ఇన్నింగ్స్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు ఉండడం విశేషం. ఈ నేపథ్యంలోనే తన సహచరుడు, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డును రోహిత్ శర్మ బద్దలుకొట్టాడు. టీ20 క్రికెట్లో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ తొలి స్థానానికి చేరుకున్నాడు. గతంలో డెక్కన్ చార్జర్స్తో పాటు ముంబై ఇండియన్స్ తరఫున కేకేఆర్పై రోహిత్ శర్మ 36 మ్యాచ్ల్లో 1161 పరుగులు సాధించాడు. ఇక కేకేఆర్తో మొత్తం 36 మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ డెక్కన్ చార్జర్స్ తరఫున 6 మ్యాచ్ల్లో 116 పరుగులు, ముంబై ఇండియన్స్ తరఫున 30 మ్యాచ్ల్లో 1045 పరుగులు సాధించడం విశేషం.ఇంతకముందు విరాట్ కోహ్లీ చెన్నై సూపర్కింగ్స్పై 36 మ్యాచ్ల్లో 1160 పరుగులు చేశాడు. తాజాగా కేకేఆర్తో మ్యాచ్లో రోహిత్ 78 పరుగులు చేయడంతో కోహ్లీ రికార్డు బ్రేక్ చేసినట్లయింది. అయితే కోహ్లీ పంజాబ్ కింగ్స్పై (36 మ్యాచ్ల్లో 1159 పరుగులు), ఢిల్లీ క్యాపిటల్స్పై( 32 మ్యాచ్ల్లో 1154 పరుగులు) సాధించాడు. అయితే ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్ పంజాబ్ లేదా ఢిల్లీతో ఎప్పుడు ఆడినా ఈసారి రోహిత్ శర్మను కోహ్లీ దాటేసి మరోసారి నంబర్వన్ స్థానాన్ని ఆక్రమించనున్నాడు. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు చేసింది. రహానే (67), రఘువంశీ (51), రింకూ సింగ్ (33 నాటౌట్) రాణించారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా, పాండ్యా ఒక వికెట్ తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఓపెనర్లు రికిల్టన్ (81), రోహిత్ శర్మ (78) దూకుడుతో 19.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించింది. చదవండి: అందుకే చేజింగ్ మాస్టర్ అనేది! -
కింగ్స్ X రాయల్స్
గువాహటి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్లో మరో రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. సీజన్ ఆరంభానికి ముందే ప్లేయర్ల బదిలీతో వార్తల్లో నిలిచిన మాజీ చాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ సోమవారం గువాహటి వేదికగా తలపడనున్నాయి. గతేడాది ఇరు జట్లు పేలవ ఆటతీరు కనబర్చాయి. చెన్నై పట్టికలో అట్టడుగున నిలవగా... రాయల్స్ తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. దశాబ్ద కాలానికి పైగా రాయల్స్కు కీలక ఆటగాడిగా ఉన్న సంజూ సామ్సన్ ఈసారి చెన్నై ఓపెనర్గా దర్శనమివ్వనుండగా... చెన్నై స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా తన పాత జట్టు రాజస్తాన్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఇటీవల టి20 ప్రపంచకప్లో దంచికొట్టిన సామ్సన్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడనేది కీలకం. గాయం కారణంగా ధోనీ రెండు వారాల పాటు అందుబాటులో లేకపోవడంతో... వికెట్ల వెనుక పెద్దన్న పాత్ర పోషించాల్సిన బాధ్యత కూడా సామ్సన్పై ఉంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్తో కలిసి సంజూ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా... శివమ్ దూబే, ఆయుశ్ మాత్రే, కార్తీక్ శర్మతో బ్యాటింగ్ ఆర్డర్ బలంగానే ఉంది. హిట్టర్ బ్రెవిస్ గాయం కారణంగా తొలి మ్యాచ్కు అందుబాటులో ఉండటం లేదు. వేలంలో రూ. 14.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసుకున్న 20 ఏళ్ల స్పిన్ ఆల్రౌండర్ ప్రశాంత్ వీర్పై భారీ అంచనాలు ఉన్నాయి. బౌలింగ్లో ఖలీల్, నూర్ అహ్మద్, అకీల్ హుసేన్, హెన్రీ కీలకం కానున్నారు. మరోవైపు రాజస్తాన్ జట్టుకు రియాన్ పరాగ్ సారథ్యం వహించనున్నాడు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, హెట్మైర్, ధ్రువ్ జురెల్ రూపంలో జట్టు నిండా హిట్టర్లు ఉన్నారు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లో జడేజా అనుభవం అక్కరకు రానుంది. ఆర్చర్ ప్రధాన పేసర్ కాగా... జడ్డూతో కలిసి రవి బిష్ణోయ్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నాడు. మ్యాచ్కు వర్ష సూచన ఉంది. -
సెహ్వాగ్, అశ్విన్ చురకలు
బెంగళూరు: ఐపీఎల్ 19వ సీజన్ ఆరంభ పోరు సందర్భంగా మాజీ ఆటగాళ్ల మధ్య సరదాగా మాటల యుద్ధం చోటుచేసుకుంది. శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్పై డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఈ మ్యాచ్తో భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యాతగా మారాడు. జియో హాట్స్టార్ హిందీ కామెంటరీ ప్యానల్లో అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా అతడికి స్వాగతం పలికే క్రమంలో సెహ్వాగ్ ‘కొత్త కోడి వచ్చింది’ (నయీ ముర్గీ ఆయీ హై) అని సంబోధించాడు. అక్కడి దాకా సరదాగా అనిపించినా... ఆ తర్వాత సెహ్వాగ్ అన్న మాటలు వివాదానికి దారితీశాయి. ‘ఈ రోజు మనం మనసు విప్పి మాట్లాడదాం... ఆలోచించి కాదు’ అని సెహ్వాగ్ అన్నాడు. దీనికి అశ్విన్ బదులిస్తూ... ‘ఏదైనా మాట్లాడేటప్పుడు ముందు వెనుక ఆలోచించి మాట్లాడమని మా తల్లిదండ్రులు నేర్పారు. మీరు దానికి విరుద్ధంగా చెబుతున్నారు’ అని చురకంటించాడు. సెహ్వాగ్ అక్కడితో వదిలేయకుండా... ‘కొంతమంది ఫాలోవర్స్ తగ్గిపోతారనే భయంతో ఆచితూచి మాట్లాడుతుంటారు. ఫ్యాన్స్ ఏమనుకుంటారో అని ఆలోచించి కామెంట్స్ చేస్తారు’ అని అశ్విన్ సామాజిక మాధ్యమాలను ఉద్దేశించి అన్నాడు. కాగా... దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మ్యాచ్ విశ్లేషణ పక్కనపెట్టి ఈ ఇద్దరూ వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లిపోయారనే వాదనలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం ఐపీఎల్లో అశ్విన్ ప్రదర్శనపై కూడా సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘వికెట్లు తీయకుండా కేవలం పరుగులు నియంత్రించాలని చూసే బౌలర్ వల్ల జట్టుకు ఎలాంటి లాభం ఉండదు. ఆశ్విన్ ఇలాగే చేస్తే అతడిని తదుపరి సీజన్లో ఎవరూ తీసుకోరు’ అని సెహ్వాగ్ అన్నాడు. -
ముంబై మెరిసె... నిరీక్షణ ముగిసె...
గత 13 సీజన్లుగా ఐపీఎల్ తొలి మ్యాచ్లో విజయం సాధించలేకపోయిన ముంబై ఇండియన్స్... ఎట్టకేలకు ఆ అడ్డంకిని అధిగమించింది. 2012 తర్వాత తొలిసారి ముంబై జట్టు విజయంతో ఐపీఎల్ సీజన్ను ప్రారంభించింది. వాంఖడే స్టేడియం వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన పోరులో బౌలర్ల క్రమశిక్షణకు బ్యాటర్ల దూకుడు తోడవడంతో ముంబై ఘనవిజయం సాధించింది.‘లోకల్ బాయ్’ శార్దుల్ ఠాకూర్ చక్కటి బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టడి చేయగా... బ్యాటింగ్లో రోహిత్, రికెల్టన్ మెరుపులతో హార్దిక్ పాండ్యా బృందం గెలుపు బోణీ కొట్టింది. తాజా సీజన్లో వరుసగా రెండో మ్యాచ్లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 200కు మించి స్కోరు చేసినా... దానిని కాపాడుకోవడంలో విఫలమైంది. ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ను ముంబై ఇండియన్స్ విజయంతో ప్రారంభించింది. ఆదివారం జరిగిన పోరులో ముంబై 6 వికెట్ల తేడాతో కోల్కతా నైట్రైడర్స్ను ఓడించింది. పచ్చికతో కనిపించిన పిచ్ బౌలర్లకు సహకరిస్తుందనుకుంటే... వాంఖడేలో ఇరు జట్ల బ్యాటర్లు పరుగుల పండగ చేసుకున్నారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 220 పరుగులు చేసింది. అజింక్య రహానే (40 బంతుల్లో 67; 3 ఫోర్లు, 5 సిక్స్లు) కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకోగా... అంగ్క్రిష్ రఘువంశీ (29 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక అర్ధశతకం చేశాడు. ఫిన్ అలెన్ (17 బంతుల్లో 37; 6 ఫోర్లు, 2 సిక్స్లు), రింకూ సింగ్ (33 నాటౌట్; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 39 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. ర్యాన్ రికెల్టన్ (43 బంతుల్లో 81; 4 ఫోర్లు, 8 సిక్స్లు), రోహిత్ శర్మ (38 బంతుల్లో 78; 6 ఫోర్లు, 6 సిక్స్లు) హాఫ్సెంచరీలతో విజృంభించారు. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ముంబైకిదే అత్యధిక లక్ష్య ఛేదన కావడం విశేషం. 10 ఓవర్లలో 120... అభిమానులతో కిక్కిరిసిన మైదానంలో తొలుత బ్యాటింగ్కు దిగిన కోల్కతాకు శుభారంభం దక్కింది. తొలి రెండు ఓవర్లలో 14 పరుగులు రాగా... మూడో ఓవర్ నుంచి మోత మొదలైంది. గజన్ఫర్ బౌలింగ్లో అలెన్ 4, 6, 6తో విజృంభించాడు. ఇక హార్దిక్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో రహానే, అలెన్ దంచికొట్టారు. తొలి రెండు బంతులకు రహానే సిక్స్లు బాదితే... చివరి మూడు బంతులకు అలెన్ ఫోర్లు కొట్టాడు. దీంతో 26 పరుగులు వచ్చాయి. ఫలితంగా 4 ఓవర్లు ముగిసేసరికి నైట్రైడర్స్ 57 పరుగులు రాబట్టింది. తదుపరి ఓవర్లో రెండు ఫోర్లు రాగా... చేంజ్ బౌలర్గా వచ్చిన శార్దుల్ ఈ జోడీని విడదీశాడు. అయినా రహానే నిలకడగా ఆడటంతో 10 ఓవర్లు ముగిసేసరికి కోల్కతా 120/2తో నిలిచింది. ఆ తర్వాత ముంబై బౌలర్లు పట్టు బిగించడంతో పరుగుల రాక గగనమైంది. ముంబై కుర్రాడు అంగ్క్రిష్ రఘువంశీ చక్కటి షాట్లు ఆడినా... వైస్ కెప్టెన్ రింకూ సింగ్ ఆశించినంత వేగంగా ఆడలేకపోయాడు. దీంతో చివరి 10 ఓవర్లలో కోల్కతా 100 పరుగులకు పరిమితమైంది. శార్దుల్ ‘లక్కీ హ్యాండ్’ 2015 నుంచి ఐపీఎల్ ఆడుతున్న శార్దుల్ ఠాకూర్ ఆరు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించిన తర్వాత... ఈ సీజన్లో ముంబై గూటికి చేరాడు. దేశవాళీల్లో ముంబై జట్టుకు సారథ్యం వహించే శార్దుల్... ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన తొలి మ్యాచ్లో అదరగొట్టాడు. తన తొలి ఓవర్లోనే ప్రమాదకర అలెన్ను వెనక్కి పంపిన అతడు... రెండో ఓవర్లో గ్రీన్ (18; 1 ఫోర్, 1 సిక్స్)ను బుట్టలో వేసుకున్నాడు. ధాటిగా ఆడుతున్న రహానేను సైతం అతడే అవుట్ చేసి కోల్కతా మరింత భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశాడు. అలవోకగా... ఐపీఎల్లో తమ అత్యధిక లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆడుతూ పాడుతూ ముందుకు సాగింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, రికెల్టన్ పోటీపడి బౌండరీలు బాదడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వరుణ్ చక్రవర్తి వేసిన ఐదో ఓవర్లో 4, 6, 4తో రఫ్ఫాడించిన రోహిత్... కార్తీక్ త్యాగీ ఓవర్లో మరో రెండు సిక్స్లతో 23 బంతుల్లో హాఫ్సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో ‘హిట్మ్యాన్’కు ఇదే వేగవంతమైన అర్ధశతకం. మరో ఎండ్లో రికెల్టన్ కూడా దూకుడు కనబర్చడంతో పవర్ప్లేలో ముంబై 88 పరుగులు చేసింది. ఈ క్రమంలో రికెల్టన్ 24 బంతుల్లో ‘ఫిఫ్టీ’ఖాతాలో వేసుకున్నాడు. తొలి వికెట్కు 11.5 ఓవర్లలో 148 పరుగులు చేశాక రోహిత్ అవుట్ కాగా... ‘ఇంపాక్ట్ ప్లేయర్’ సూర్యకుమార్ యాదవ్ (16; 3 ఫోర్లు) ప్రభావం చూపలేకపోయాడు. రికెల్టన్ దురదృష్టవశాత్తు రనౌట్ కాగా... తిలక్ వర్మ (20; 4 ఫోర్లు), కెప్టెన్ హార్దిక్ (18 నాటౌట్; 3 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేయడంతో ముంబై మరో ఐదు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది.కెప్టెన్ కామెంట్చాలా ఏళ్ల తర్వాత తొలి మ్యాచ్లో విజయం సాధించాం. 13 ఏళ్ల అనంతరం సీజన్ ఆరంభ పోరులో గెలవడం ఆనందంగా ఉంది. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా అనిపించింది. 220 లక్ష్యం పెద్దదేం కాదు. అందుకు తగ్గట్లే రోహిత్, రికెల్టన్ ఆరంభం నుంచే దూకుడు కనబర్చారు. శార్దుల్ ఠాకూర్ నుంచి జట్టు ఇలాంటి ప్రదర్శనే ఆశిస్తోంది. ఇక అతడి కెరీర్ ముగిసే వరకు ముంబై ఇండియన్స్తోనే ఉంటాడు. –హార్దిక్ పాండ్యా, ముంబై కెప్టెన్ 221 ఐపీఎల్లో ముంబైకు ఇదే అత్యధిక లక్ష్యఛేదన. 2021లో చెన్నై సూపర్ కింగ్స్పై చేజ్ చేసిన 219 పరుగుల లక్ష్యం రెండో స్థానానికి చేరింది. 200కు పైగా లక్ష్యాన్ని ఛేదించడం ముంబైకిది ఆరోసారి. పంజాబ్ కింగ్స్ ఎనిమిదిసార్లు ఈ ఘనత సాధించింది.గ్రీన్ విఫలం ఐపీఎల్ 19వ సీజన్ వేలంలో భారీ ధర (రూ. 25.20 కోట్లు) పెట్టి కోల్కతా నైట్రైడర్స్ కొనుగోలు చేసుకున్న ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చి 18 పరుగులే చేసిన అతడు... బౌలింగ్లో ఒక్క ఓవర్ కూడా వేయలేదు. » 2024 టి20 ప్రపంచకప్లో భారత జట్టుకు ట్రోఫీ అందించిన తర్వాత ఆడిన ఐపీఎల్లో రోహిత్ శర్మ ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా దర్శనమివ్వగా... ఇప్పుడు తాజా టి20 ప్రపంచకప్ విజయం అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ తరఫున ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగాడు. » దక్షిణాఫ్రికా స్టార్ క్వింటన్ డికాక్ను కాదని... అదే దేశానికి చెందిన ర్యాన్ రికెల్టన్కు ముంబై తుది జట్టులో చోటు కల్పించగా... అతడు ఐపీఎల్లో తన అత్యధిక వ్యక్తిగత స్కోరుతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. » కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయర్లు ఫిన్ అలెన్ (న్యూజిలాండ్), ముజరబాని (జింబాబ్వే)తో పాటు ముంబై ఇండియన్స్ ఆటగాడు గజన్ఫర్ (అఫ్గానిస్తాన్) ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్లో అరంగేట్రం చేశారు. » ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కోల్కతా నైట్ రైడర్స్ సారథి అజింక్య రహానే కండరాలు పట్టేయడంతో నాలుగో ఓవర్లో అతడు మైదానాన్ని వీడాడు. మిగతా మ్యాచ్లో రింకూ సింగ్ జట్టుకు నాయకత్వం వహించాడు. 1161 ఐపీఎల్లో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రోహిత్ (కోల్కతాపై 1161 పరుగులు) గుర్తింపు పొందాడు. విరాట్ కోహ్లి (పంజాబ్ కింగ్స్పై 1159 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు. 190 ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్లు ఆడిన విదేశీ ప్లేయర్గా సునీల్ నరైన్ గుర్తింపు పొందాడు. కీరన్ పొలార్డ్ (189 మ్యాచ్లు) పేరిట ఉన్న రికార్డును నరైన్ సవరించాడు.స్కోరు వివరాలుకోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: రహానే (సి) హార్దిక్ (బి) శార్దుల్ 67; అలెన్ (సి) తిలక్ (బి) శార్దుల్ 37; గ్రీన్ (సి) రూథర్ఫోర్డ్ (బి) శార్దుల్ 18; రఘువంశీ (సి) తిలక్ (బి) హార్దిక్ 51; రింకూ (నాటౌట్) 33; రమణ్దీప్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 10; మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 220. వికెట్ల పతనం: 1–69, 2–109, 3–145, 4–205. బౌలింగ్: బౌల్ట్ 4–0–38–0; హార్దిక్ 3–0–39–1; గజన్ఫర్ 4–0–51–0; బుమ్రా 4–0–35–0; శార్దుల్ 4–0–39–3; మార్కండే 1–0–16–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (రనౌట్) 81; రోహిత్ (సి) అనుకూల్ (బి) అరోరా 78; సూర్యకుమార్ (సి) రింకూ (బి) కార్తీక్ 16; తిలక్ (సి) (సబ్) మనీశ్ (బి) నరైన్ 20; హార్దిక్ (నాటౌట్) 18; నమన్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 6; మొత్తం (19.1 ఓవర్లలో 4 వికెట్లకు) 224. వికెట్ల పతనం: 1–148, 2–179, 3–184, 4–215. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–52–1; ముజరబాని 3–0–34–0; వరుణ్ చక్రవర్తి 4–0–48–0; కార్తీక్ త్యాగి 4–0–43–1; నరైన్ 3–0–30–1; అనుకూల్ రాయ్ 1.1–0–15–0. -
ముంబై ఇండియన్స్ ‘ట్రిపుల్ సెంచరీ’
ముంబై: కోల్కతా నైట్రైడర్స్తో ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బరిలోకి దిగడం ద్వారా ముంబై ఇండియన్స్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. 300 టి20 మ్యాచ్లు ఆడిన తొలి భారతీయ జట్టుగా గుర్తింపు పొందింది. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన మూడో జట్టుగా నిలిచింది. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి (2008) కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ ఐదుసార్లు టైటిల్ సాధించింది. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై జట్టు 2013, 2015, 2017, 2019, 2020లలో విజేతగా నిలిచింది. ఆ తర్వాత ముంబై జట్టు మరోసారి ఐపీఎల్ టైటిల్ను సాధించడంలో విఫలమైంది. గత ఏడాది ముంబై జట్టు క్వాలిఫయర్–2లో పంజాబ్ కింగ్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఇక అత్యధిక టి20 మ్యాచ్లు ఆడిన జట్ల జాబితాలో పాకిస్తాన్ జాతీయ జట్టు, సోమర్సెట్ కౌంటీ క్రికెట్ క్లబ్ జట్టు 303 మ్యాచ్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. 296 మ్యాచ్లతో హాంప్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ నాలుగో స్థానంలో, 287 మ్యాచ్లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐదో స్థానంలో ఉన్నాయి. -
రోహిత్, రికెల్టన్ విధ్వంసం.. కేకేఆర్పై ముంబై ఇండియన్స్ గెలుపు
ఐపీఎల్ 2026లో భాగంగా కేకేఆర్తో ఇవాళ (మార్చి 29) జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేయగా.. ముంబై ఇండియన్స్ మరో 5 బంతులు మిగిలుండగానే (19.1 ఓవర్లలో) 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.రోహిత్ శర్మ (38 బంతుల్లో 78; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), ర్యాన్ రికెల్టన్ (43 బంతుల్లో 81; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర అర్ద శతకాలతో ముంబై గెలుపును ఖరారు చేయగా.. ఆతర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (8 బంతుల్లో 16; 3 ఫోర్లు), తిలక్ వర్మ (14 బంతుల్లో 20; 4 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (11 బంతుల్లో 18 నాటౌట్; 3 ఫోర్లు), నమన్ ధిర్ (2 బంతుల్లో 5 నాటౌట్; ఫోర్) మ్యాచ్ను లాంఛనంగా ముగించారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, సునీల్ నరైన్ తలో వికెట్ తీయగా.. రికెల్టన్ను అనుకూల్ రాయ్ అద్భుతమైన డైరెక్ట్ త్రోతో రనౌట్ చేశాడు.అంతకుముందు రహానే (40 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 67 పరుగులు), ఫిన్ అలెన్ (17 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 37 పరుగులు), అంగ్క్క్రిష్ రఘువంశీ (29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 51 పరుగులు), రింకూ సింగ్ (21 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 33 నాటౌట్) సత్తా చాటడంతో కేకేఆర్ భారీ స్కోర్ చేసింది. కేకేఆర్ ఇన్నింగ్స్లో కెమరూన్ గ్రీన్ (18) ఒక్కడే నిరాశపరిచాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ (4-0-39-3), ట్రెంట్ బౌల్ట్ (4-0-38-0) అద్భుతంగా బౌలింగ్ చేయగా..హార్దిక్ పాండ్యా ఓ వికెట్ తీశాడు. -
IPL 2026: రోహిత్ శర్మ ఉగ్రరూపం.. సరికొత్త చరిత్ర
ఐపీఎల్ 2026లో భాగంగా కేకేఆర్తో ఇవాళ (మార్చి 29) జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ చెలరేగిపోతున్నాడు. కేవలం 23 బంతుల్లోనే అర్ద సెంచరీ (3 ఫోర్లు, 5 సిక్సర్లు) పూర్తి చేసి ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ భారీ రికార్డు నెలకొల్పి, చరిత్ర సృష్టించాడు.కేకేఆర్తో మ్యాచ్ అంటేనే పూనకం వచ్చినట్లు ఊగిపోయే హిట్మ్యాన్, మరోసారి అదే తరహా ప్రదర్శనతో రెచ్చిపోయి, ఐపీఎల్ చరిత్రలో ఈ ఫ్రాంచైజీపై అత్యధిక పరుగులు (36 మ్యాచ్ల్లో 1094 పరుగులు, 6 అర్ద సెంచరీలు, ఓ సెంచరీ) చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్కు ముందు వరకు ఈ రికార్డు డేవిడ్ వార్నర్ (1093 పరుగులు) పేరిట ఉండేది. ఈ జాబితాలో రోహిత్, వార్నర్ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లి (1021), శిఖర్ ధవన్ (907), సురేశ్ రైనా (829) ఉన్నారు.ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీఈ మ్యాచ్లో రోహిత్ చేసిన 23 బంతుల హాఫ్ సెంచరీ, ఐపీఎల్లో అతనికి వేగవంతమైందిగా నిలుస్తుంది. అతని గత ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ 25 బంతుల్లో వచ్చింది. 2015 ఎడిషన్ ఫైనల్లో సీఎస్కేపై ఈ ఫీట్ సాధించాడు.మరో మైలురాయిఈ హాఫ్ సెంచరీతో రోహిత్ ఐపీఎల్లో మరో మైలురాయిని తాకాడు. ఈ హాఫ్ సెంచరీ అతనికి ఐపీఎల్లో 50వది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ నాలుగో స్థానంలో ఉన్నాడు. అతని కంటే ముందు విరాట్ కోహ్లి (72), డేవిడ్ వార్నర్ (66), శిఖర్ ధవన్ (53) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. కేకేఆర్ నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ దూసుకుపోతుంది. 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 110 పరుగులు చేసి, లక్ష్యానికి మరో 111 పరుగుల దూరంలో ఉంది. రోహిత్ శర్మ (59), రికెల్టన్ (50) అర్ద సెంచరీలు పూర్తి చేసి ఇన్నింగ్స్లు కొనసాగిస్తున్నారు.అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. రహానే (67), రఘువంశీ (51) అర్ద సెంచరీలతో రాణించగా.. రింకూ సింగ్ (33 నాటౌట్) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలో ఫిన్ అలెన్ (37) సైతం మెరుపులు మెరిపించాడు. భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్న కెమరూన్ గ్రీన్ (18) దారుణంగా విఫలం కాగా.. రమన్దీప్ 4 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ (4-0-39-3), ట్రెంట్ బౌల్ట్ (4-0-38-0) అద్భుతంగా బౌలింగ్ చేయగా..హార్దిక్ పాండ్యా ఓ వికెట్ తీశాడు. -
IPL 2026: రెచ్చిపోయిన రహానే.. కేకేఆర్ భారీ స్కోర్
ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్తో ఇవాళ (మార్చి 29) జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ భారీ స్కోర్ చేసింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.రెచ్చిపోయిన రహానేకేకేఆర్ కెప్టెన్ రహానే లేటు వయసులో రెచ్చిపోయి, కేకేఆర్కు మెరుపు ఆరంభాన్ని అందించాడు. కేవంల 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అతను.. మొత్తంగా 40 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 67 పరుగులు చేశాడు. రహానేకు జతగా ఓపెనింగ్ చేసిన ఫిన్ అలెన్ కూడా చెలరేగిపోయాడు. కేవలం 17 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేశాడు.25 కోట్ల ప్లేయర్ అట్టర్ ప్లాప్ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచిన కెమరూన్ గ్రీన్ దారుణంగా విఫలమయ్యాడు. అలెన్ ఔటయ్యాక వన్డౌన్లో బరిలోకి దిగిన గ్రీన్.. 10 బంతుల్లో బౌండరీ, సిక్సర్ సాయంతో 18 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ సీజన్ వేలంలో కేకేఆర్ గ్రీన్ను రూ. 25.20 కోట్ల భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకుంది.రాణించిన రఘువంశీగ్రీన్ ఔటయ్యాక క్రీజ్లోకి వచ్చిన అంగ్క్క్రిష్ రఘువంశీ ఆరంభంలో కాస్త నిదానంగా ఆడినా, ఆతర్వాత బ్యాట్ ఝులిపించాడు. 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేసి ఔటయ్యాడు. రఘువంశీ మెరుపుల కారణంగానే కేకేఆర్ 200 పరుగుల మార్కును దాటగలిగింది.పర్వాలేదనిపించిన రింకూ ఇన్నింగ్స్ చివర్లో బరిలోకి దిగిన రింకూ సింగ్ తన సహజ శైలిలో మెరుపు బ్యాటింగ్ చేయనప్పటికీ పర్వాలేదనిపించాడు. 21 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 33 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ (4-0-39-3), ట్రెంట్ బౌల్ట్ (4-0-38-0) అద్భుతంగా బౌలింగ్ చేయగా..హార్దిక్ పాండ్యా ఓ వికెట్ తీశాడు. -
అనుకున్నదే జరిగింది.. రూ.25 కోట్ల ప్లేయర్ అట్టర్ ప్లాప్
ఐపీఎల్-2026 సీజన్ను కోల్కతా నైట్రైడర్స్ ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ పేలవంగా ఆరంభించాడు. ఐపీఎల్లో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచిన గ్రీన్.. తను ఆడిన తొలి మ్యాచ్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో 10 బంతులు ఎదుర్కొన్న గ్రీన్ కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కేకేఆర్కు ఓపెనర్లు అజింక్య రహానే(67), ఫిన్ అలెన్(37) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. ఫిల్ అలెన్ ఔటయ్యాక క్రీజులోకి గ్రీన్ వచ్చాడు. గ్రీన్ ఓ ఫోర్, సిక్సర్ బాది జోష్లో కన్పించాడు. కానీ గ్రీన్ తన జోరును కొనసాగించలేకపోయాడు. శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్లో రూథర్ ఫర్డ్కు క్యాచ్ ఇచ్చి గ్రీన్ ఔటయ్యాడు.కాగా గతేడాది జరిగిన మినీ వేలంలో గ్రీన్ను రూ. 25.20 కోట్ల భారీ ధర వెచ్చించి కేకేఆర్ మరి కొనుగోలు చేసింది. అయితే చాలా మంది గ్రీన్కు అంత ధర వెచ్చించడాన్ని తప్పుబట్టారు. ఇప్పుడు అందరూ అంచనా వేసినట్లే తొలి మ్యాచ్లోనే గ్రీన్ విఫలమయ్యాడు. అంతకుముందు జరిగిన టీ20 వరల్డ్కప్లోనూ గ్రీన్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఇప్పుడు ఐపీఎల్లోనూ అదే తీరును కొనసాగించేలా కన్పిస్తున్నాడు.తుది జట్లు..ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), షెర్ఫానే రూథర్ఫోర్డ్, నమన్ ధీర్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ మార్కండే, ఘజన్ఫర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రాకేకేఆర్: ఫిన్ అలెన్, అజింక్యా రహానే(కెప్టెన్), కామెరూన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజారబానీ -
సీఎస్కేకు మరో భారీ షాక్.. విధ్వంసకర వీరుడికి గాయం
ఐపీఎల్-2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. సోమవారం గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్తో సీఎస్కే తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందు సీఎస్కేకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. దక్షిణాఫ్రికా యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ గాయం కారణంగా సీఎస్కే ఆడే తొలి మూడు మ్యాచ్లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది.రెవ్స్పోర్ట్స్ నివేదిక ప్రకారం.. బ్రెవిస్ పక్కటెముకల కండరాల నొప్పి తో బాధపడుతున్నాడు. అతడు కోలుకోవడానికి దాదాపు రెండు వారాల సమయం పట్టనున్నట్లు సమాచారం. ఐపీఎల్-2025 సీజన్ మధ్యలో సీఎస్కేతో బ్రెవిస్ చేరాడు. గత సీజన్లో బ్రెవిస్ దుమ్ములేపాడు. కేవలం 6 మ్యాచ్ల్లోనే 225 పరుగులు చేసి సత్తాచాటాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా లీగ్ 2025-26లో కూడా అతడు తన పవర్ చూపించాడు. ప్రిటోరియా తరఫున 12 మ్యాచ్ల్లో 370 పరుగులు చేశాడు. అటువంటి విధ్వంసకర ప్లేయర్ గాయం బారిన పడడం సీఎస్కేకు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. మరోవైపు ఎంఎస్ ధోని కూడా కండరాల గాయంతో సతమతవుతున్నాడు. అతడు దాదాపు సీఎస్కే ఆడే ఆరు మ్యాచ్లకు దూరమయ్యాడు. ఇప్పుడు ఈ జాబితాలో బ్రెవిస్ కూడా చేరాడు. అంతకంటే ముందు ఆసీస్ స్పీడ్ స్టార్ నాథన్ ఎల్లీస్ ఏకంగా సీజన్ మొత్తానికే దూరమయ్యాడు.ఐపీఎల్-2026 సీఎస్కే జట్టురుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సంజు శాంసన్, ఆయుష్ మాత్రే, శివమ్ దూబే, ఉర్విల్ పటేల్, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, శ్రేయాస్ గోపాల్, ఖలీల్ అహ్మద్, రామకృష్ణ ఘోష్, ఓవర్సీస్, ముకేష్మీ చౌద్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అకేల్ హోసేన్, ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ (వికెట్ కీపర్), మాథ్యూ షార్ట్, అమన్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, మాట్ హెన్రీ, రాహుల్ చాహర్, జాక్ ఫౌల్కేస్. -
చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్
ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్తో ఇవాళ (మార్చి 29) జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ తుది జట్టులో చోటు దక్కించుకోవడంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్లు (190) ఆడిన విదేశీ ప్లేయర్గా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో తన దేశీయ (వెస్టిండీస్) సహచరుడు కీరన్ పోలార్డ్ను (189) అధిగమించాడు. ఈ విభాగంలో నరైన్, పోలార్డ్ తర్వాతి స్థానాల్లో ఏబీ డివిలియర్స్ (184), డేవిడ్ వార్నర్ (184), డ్వేన్ బ్రావో (161) ఉన్నారు. నరైన తన ఐపీఎల్ కెరీర్లో ఆడిన 190 మ్యాచ్లు కేకేఆర్ తరఫునే ఆడటం మరో విశేషం.మ్యాచ్ విషయానికొస్తే.. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే టాస్ గెలిచిన ఆనందం వారికి ఎంతో సేపు మిగల్లేదు. హార్దిక్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన కేకేఆర్ పవర్ ప్లే ఆప్షన్ను సద్వినియోగం చేసుకుంటూ పేట్రేగిపోతుంది. ఓపెనర్లు అజింక్య రహానే (10 బంతుల్లో 21; 3 సిక్సర్లు), ఫిన్ అలెన్ (14 బంతుల్లో 32; ఫోర్, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. 4 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 57-0గా ఉంది.తుది జట్లు..ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), షెర్ఫానే రూథర్ఫోర్డ్, నమన్ ధీర్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ మార్కండే, AM ఘజన్ఫర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రాకేకేఆర్: ఫిన్ అలెన్, అజింక్యా రహానే(కెప్టెన్), కామెరూన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజారబానీ -
ధోని ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్
ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి ముందే ఎంఎస్ ధోని రూపంలో చెన్నై సూపర్ కింగ్స్కు గట్టి ఎదురు దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పిక్క కండరాల గాయంతో ధోని.. తొలి రెండు వారాల్లో జరిగే మ్యాచ్లకు దూరం కానున్నాడని సీఎస్కే మేనెజ్మెంట్ ఇప్పటికే స్పష్టం చేసింది. అతడికి రెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు అంచనా వేశారు. కానీ ఇప్పుడు ఎంఎస్ కోలుకోవడానికి నాలుగు నుంచి వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో అయితే మిస్టర్ కూల్ ఇప్పుడు ఏప్రిల్ చివరి వారం వరకు అందుబాటులో ఉండకపోవచ్చు అని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.అంటే ధోని దాదాపు 6 మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవచ్చు. ధోని తిరిగి మళ్లీ ఏప్రిల్ 23న వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగే మ్యాచ్లో ఆడే అవకాశముంది. ధోని స్ధానంలో సంజూ శాంసన్ వికెట్ కీపర్గా వ్యవహరించనున్నాడు. ధోనికే ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ అయ్యే అవకాశముంది. దీంతో అతడు త్వరగా కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.ధోనీ దూరమయ్యే మ్యాచ్లు ఇవే: రాజస్థాన్ రాయల్స్ (మార్చి 30), పంజాబ్ కింగ్స్ (ఏప్రిల్ 3), ఆర్సీబీ (ఏప్రిల్ 5), ఢిల్లీ క్యాపిటల్స్ (ఏప్రిల్ 11). కేకేఆర్(ఏప్రిల్ 14), ఎస్ఆర్హెచ్(ఏప్రిల్ 18) -
కేకేఆర్పై ముంబై ఇండియన్స్ ఘన విజయం
221 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ (38 బంతుల్లో 78; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), ర్యాన్ రికెల్టన్ (43 బంతుల్లో 81; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర అర్ద శతకాలతో ముంబై గెలుపును ఖరారు చేశారు. అంతకుముందు రహానే (40 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 67 పరుగులు), ఫిన్ అలెన్ (17 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 37 పరుగులు), అంగ్క్క్రిష్ రఘువంశీ (29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 51 పరుగులు), రింకూ సింగ్ (21 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 33 నాటౌట్) సత్తా చాటడంతో కేకేఆర్ భారీ స్కోర్ చేసింది.రికెల్టన్ (81) ఔట్15.2వ ఓవర్- 184 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. అనుకూల్ రాయ్ అద్భుతమైన త్రో వేయడంతో ర్యాన్ రికెల్టన్ (81) ఔటయ్యాడు.సూర్యకుమార్ యాదవ్ (16) ఔట్14.2వ ఓవర్-179 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. కార్తీక్ త్యాగి బౌలింగ్లో రింకూ సింగ్ క్యాచ్ పట్టడంతో సూర్యకుమార్ యాదవ్ ఔటయ్యాడు. రోహిత్ శర్మ 78 (38) ఔట్11.5వ ఓవర్- 148 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. వైభవ్ అరోరా బౌలింగ్లో అనుకూల్ రాయ్కు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ ఔటయ్యాడు. రికెల్టన్కు (67) జతగా సూర్యకుమార్ యాదవ్ క్రీజ్లోకి వచ్చాడు.లక్ష్యం దిశగా దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్కేకేఆర్ నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ దూసుకుపోతుంది. 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 110 పరుగులు చేసి, లక్ష్యానికి మరో 111 పరుగుల దూరంలో ఉంది. రోహిత్ శర్మ (59), రికెల్టన్ (50) అర్ద సెంచరీలు పూర్తి చేసి ఇన్నింగ్స్లు కొనసాగిస్తున్నారు.ముంబై ఇండియన్స్ టార్గెట్ ఎంతంటే..?టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. రహానే (67), రఘువంశీ (51) అర్ద సెంచరీలతో రాణించగా.. రింకూ సింగ్ (33 నాటౌట్) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలో ఫిన్ అలెన్ (37) సైతం మెరుపులు మెరిపించాడు. భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్న కెమరూన్ గ్రీన్ (18) దారుణంగా విఫలం కాగా.. రమన్దీప్ 4 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ (4-0-39-3), ట్రెంట్ బౌల్ట్ (4-0-38-0) అద్భుతంగా బౌలింగ్ చేయగా..హార్దిక్ పాండ్యా ఓ వికెట్ తీశాడు.నాలుగో వికెట్ కోల్పోయిన కేకేఆర్18.3వ ఓవర్- 205 పరుగుల వద్ద కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి రఘువంశీ (51) ఔటయ్యాడు. రహానే (67) ఔట్13.3వ ఓవర్- 146 పరుగుల వద్ద కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో హార్దిక్కు క్యాచ్ ఇచ్చి రహానే (67) ఔటయ్యాడు. రఘువంశీకి (17) జతగా రింకూ సింగ్ క్రీజ్లోకి వచ్చాడు. రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. గ్రీన్ ఔట్8.5 ఓవర్- 109 పరుగుల వద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో రూథర్ఫోర్డ్కు క్యాచ్ ఇచ్చి కెమరూన్ గ్రీన్ (18) ఔటయ్యాడు. రహానేకు (49) జతగా రఘువంశీ క్రీజ్లోకి వచ్చాడు. తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్5.2 ఓవర్- 69 పరుగుల వద్ద కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి ఫిన్ అలెన్ (37) ఔటయ్యాడు. రహానేకు (28) జతగా గ్రీన్ క్రీజ్లోకి వచ్చాడు. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ (మార్చి 29) జరుగుతున్న ఐపీఎల్ 2026 రెండో మ్యాచ్లో ముంబై ఇండియన్స్- కోల్కతా నైట్రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.తుది జట్లు..ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), షెర్ఫానే రూథర్ఫోర్డ్, నమన్ ధీర్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ మార్కండే, AM ఘజన్ఫర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రాకేకేఆర్: ఫిన్ అలెన్, అజింక్యా రహానే(కెప్టెన్), కామెరూన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజారబానీ -
ప్రధాని మోదీ నోట సాధారణ క్రికెటర్ మాట
భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ నోట ఓ సాధారణ క్రికెటర్ మాట వినిపించింది. ఇవాళ (మార్చి 29) జరిగిన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మోదీ ఆ క్రికెటర్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ క్రికెటర్ పేరు ఆకిబ్ నబీ. జమ్మూ అండ్ కశ్మీర్కు చెందిన ఈ 29 ఏళ్ల కుడి చేతి వాటం మీడియం ఫాస్ట్ బౌలర్, ఇటీవల తన జట్టు తొలి రంజీ ట్రోఫీ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. సీజన్ మొత్తంలో 60 వికెట్లు తీసి, తన జట్టు 70 ఏళ్ల కలను సాకారం చేశాడు. ఈ కారణంగానే మోదీ నబీ పేరును మన్ కీ బాత్లో ప్రస్తావించారు. నబీ కారణంగా జమ్మూ అండ్ కశ్మీర్ సాధించిన విజయం అక్కడి యువతలో క్రీడలపై ఉత్సాహం పెంచిందని అన్నారు. నబీ స్పూర్తితో రాబోయే రోజుల్లో మరెందరో ఆ ప్రాంతం నుంచి క్రీడల్లోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ సాధారణ క్రికెటర్ మాట ప్రధాని నోట రావడంతో అతని పేరు సోషల్మీడియాలో ట్రెండ్ అవుతుంది.దేశవాలీ క్రికెట్లో ఇప్పటికే పేరు గడించిన నబీ, త్వరలో ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశం కూడా ఉంది. ఈ సీజన్ (2026) వేలంలో నబీని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.8.40 కోట్ల భారీ మొత్తానికి కైవసం చేసుకుంది. రూ.30 లక్షల బేస్ ప్రైస్తో వేలంలోకి వచ్చిన నబీ కోసం రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ వంటి ఫ్రాంచైజీలు పోటీపడినా, చివరికి అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. ఈ డీల్తో నబీ జీవితమే మారిపోనుంది. ఐపీఎల్లో అతను సత్తా చాటగలిగితే, టీమిండియా అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.ఇదిలా ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్కు సంబంధించి మిచెల్ స్టార్క్ అందుబాటులో లేకపోవడంతో అతని స్థానం ఖాళీగా ఉంది. పవర్ప్లేలో బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల నబీ ఆ లోటును భర్తీ చేసే అవకాశం ఉంది. ఢిల్లీ పేసర్లు లుంగి ఎంగిడి, దుష్మంత చమీరా మధ్య ఓవర్లలో బౌలింగ్ చేయడం ఇష్టపడతారు కాబట్టి, నబీ పవర్ప్లేలో కీలకంగా మారవచ్చు. ఢిల్లీ ఏప్రిల్ 1న లక్నో సూపర్ జెయింట్స్తో జరిగే మ్యాచ్తో ఐపీఎల్ 2026 ప్రయాణం మొదలుపెడుతుంది. -
టీ20 వరల్డ్ కప్ కేసులో ముంబై క్రికెటర్ అరెస్ట్
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన టీ20 వరల్డ్కప్ 2026కి సంబంధించిన కేసులో ముంబైకి చెందిన క్రికెటర్ అరెస్ట్ అయ్యాడు. ముంబై అండర్ 19 మాజీ ఆటగాడు బల్వంత్ సింగ్ స్వరూప్ సింగ్ సోధాను టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ కేసులో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ టికెట్లను అధిక ధరలకు విక్రయించినట్లు సోధాపై ఆరోపణలు ఉన్నాయి. ఇతగాడు సాధారణ టికెట్ను రూ. 25000కి విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. సోధా మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని, కాల్ డేటా రికార్డులను పరిశీలించగా విషయం బయటపడింది. సోధాను పోలీసులు కోర్టులో హాజరుపరచగా, అతనికి బెయిల్ మంజూరైంది. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్ 2026 భారత్ విజేతగా అవతరించిన విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఫైనల్లో న్యూజిలాండ్ను మట్టికరిపించి, వరుసగా రెండో టీ20 ప్రపంచకప్ను, ఓవరాల్గా మూడో టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకుంది.ఈ టోర్నీ గ్రూప్ దశలో అజేయ జట్టుగా నిలిచిన భారత్.. సూపర్-8లో సౌతాఫ్రికా మినహా జింబాబ్వే, వెస్టిండీస్పై అద్భుత విజయాలు సాధించి, సెమీస్కు చేరింది. సెమీస్లో ఇంగ్లండ్ను మట్టికరిపించి ఫైనల్కు చేరింది. ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించి మూడోసారి టి20 వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. -
IPL 2026: చరిత్ర సృష్టించిన ఆర్సీబీ
ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆర్సీబీ.. తొలి మ్యాచ్లోనే అదిరిపోయే విజయం సాధించింది. నిన్న (మార్చి 28) జరిగిన టోర్నీ ఓపెనర్లో సన్రైజర్స్పై 6 వికెట్ల తేడాతో గెలుపొంది, ఏకపక్ష విజయం నమోదు చేసింది. సన్రైజర్స్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని మరో 26 బంతులు మిగిలి ఉండగానే (15.4 ఓవర్లలో) ఛేదించడం ద్వారా ఓ భారీ రికార్డు నెలకొల్పింది.ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 200 ప్లస్ టార్గెట్ను ఊదేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. గతంలో ఈ రికార్డు రాజస్థాన్ రాయల్స్ పేరిట ఉండేది. రాయల్స్ గత ఎడిషన్లో (2025లో గుజరాత్పై) 200 ప్లస్ లక్ష్యాన్ని 15.5 ఓవర్లలో ఛేదించింది. తాజాగా ఆర్సీబీ ఈ రికార్డును బద్దలు కొట్టింది.ఆర్సీబీ ఈ రికార్డు సాధించడంలో కింగ్ విరాట్ కోహ్లి కీలకపాత్ర పోషించాడు. భారీ ఛేదనలో విరాట్ తన సహజ శైలికి భిన్నంగా భారీ షాట్లతో అలరించి (38 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మ్యాచ్ను వేగంగా ముగించాడు. గెలుపుకు 17 పరుగులు కావాల్సిన తరుణంలో విరాట్ వరుసగా 6, 4, 4, 4 బాది ఆర్సీబీ ఈ రికార్డు సొంతం చేసుకునేలా చేశాడు.ఆర్సీబీ ఈ రికార్డు సొంతం చేసుకోవడంలో దేవ్దత్ పడిక్కల్ (26 బంతుల్లో 61; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), రజత్ పాటిదార్ (12 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా తమవంతు పాత్ర పోషించారు. వీరిద్దరు కూడా వేగంగా ఆడి కొండంత లక్ష్యాన్ని కరిగించారు. అంతకుముందు ఇషాన్ కిషన్ (38 బంతుల్లో 80; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం, అనికేత్ వర్మ (18 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపుల కారణంగా సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది.ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన 200 ప్లస్ లక్ష్య ఛేదనలు..15.4 - RCB vs SRH, బెంగళూరు, 2026*15.5 - RR vs GT, జైపూర్, 202516.0 - RCB vs GT, అహ్మదాబాద్, 202416.3 - MI vs RCB, వాంఖేడే, 202317.3 - DC vs GL, ఢిల్లీ, 2017 -
'రెండేళ్ల నిషేధం సరిపోదు'.. బెన్ డకెట్పై గవాస్కర్ ఫైర్
ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ బెన్ డకెట్ ఐపీఎల్-2026 సీజన్ నుంచి ఆఖరి నిమిషంలో తప్పుకొన్న సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన వేలంలో రూ. 2 కోట్లకు డకెట్ను ఢిల్లీ కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజన్లో ఢిల్లీ ఇన్నింగ్స్ రాహుల్తో కలిసి డకెట్ ప్రారంభిస్తాడని అంతా భావించారు. కానీ డకెట్ మాత్రం అనుహ్యంగా ఈ ఏడాది సీజన్ నుంచి వైదొలిగి ఢిల్లీకి గట్టి షాకిచ్చాడు. ఇంగ్లండ్ తరపున టెస్టు క్రికెట్పై దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డకెట్ తెలిపాడు.ఈ ఇంగ్లీష్ ఓపెనర్ ఐపీఎల్కు బదులుగా కౌంటీ ఛాంపియన్షిప్లో నాటింగ్హామ్షైర్ తరపున ఆడనున్నాడు. కాగా బీసీసీఐ గతేడాది తీసుకొచ్చిన రూల్స్ ప్రకారం.. వేలంలో అమ్ముడుపోయిన ఏ విదేశీ ఆటగాడైనా, సరైన వైద్య కారణాలు లేకుండా టోర్నీ ప్రారంభానికి ముందు తప్పుకుంటే వారిపై రెండేళ్ల పాటు నిషేధం విధిస్తారు. దీంతో డకెట్ రెండేళ్ల ఐపీఎల్ బ్యాన్ను ఎదుర్కోనున్నాడు.తాజాగా ఇదే విషయంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్రంగా స్పందించారు. చివరి నిమిషంలో వైదొలగే విదేశీ ఆటగాళ్లపై రెండేళ్ల నిషేధం పెద్దగా ప్రభావం చూపడం లేదని గవాస్కర్ అన్నారు."బెన్ డకెట్ ఐపీఎల్ నుంచి తప్పుకోవడం నిజంగా ఢిల్లీ క్యాపిటల్స్కు గట్టి ఎదురు దెబ్బే. ఎందుకంటే అతడు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. యాషెస్ సిరీస్లో కూడా మెరుగైన ప్రదర్శన చేశాడు. అయితే ది హండ్రెడ్ లీగ్ వేలంలో అతడికి మంచి ధర దక్కడంతో ఐపీఎల్ కాంట్రాక్ట్ను వదులుకోవడానికి సిద్దమయ్యాడు. ఒకవేళ అతడికి నామమాత్రపు ధర దక్కి ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవి. వేలంలో ఒక ఆటగాడిని నమ్మి కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత, సదరు ఆటగాడు ఆకస్మికంగా తప్పుకుంటే జట్టు ప్రణాళికలపై కచ్చితంగా ప్రభావం చూపుతోంది. అందుకే ఆటగాళ్లకు భయం కలిగేలా మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం బీసీసీఐ విధిస్తున్న రెండేళ్ల బ్యాన్ సరిపోదు. అది పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఈ విషయంపై బీసీసీఐ మరోసారి ఆలోచించాలి" అని గవాస్కర్ ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: తొలి మ్యాచ్లోనే చరిత్ర సృష్టించనున్న ముంబై ఇండియన్స్ -
తొలి మ్యాచ్లోనే చరిత్ర సృష్టించనున్న ముంబై ఇండియన్స్
ఐపీఎల్-2026 సీజన్లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. ఆదివారం వాంఖడే వేదికగా కోల్కతా నైట్రైడర్స్ ముంబై తలపడనుంది. అయితే ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్కు ఒక అద్భుతమైన మైలు రాయిని అందుకోనుంది. ముంబై జట్టుకు ఇది 300వ టీ20 మ్యాచ్ కావడం గమానర్హం. తద్వారా టీ20 క్రికెట్ చరిత్రలో 300 మ్యాచ్లు పూర్తి చేసుకున్న తొలి ఐపీఎల్ ఫ్రాంచైజీగా ముంబై సరికొత్త రికార్డు సృష్టించనుంది.కాగా ముంబై ఇండియన్స్ ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలో తమకంటూ కొన్ని ప్రత్యేక పేజీలను లిఖించుకుంది. ముంబై జట్టు ఈ క్యాష్ రిచ్ లీగ్లో ఇప్పటివరకు ఐదు సార్లు ఛాంపియన్స్గా నిలిచింది. తద్వారా అత్యధిక సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టుగా సీఎస్కేతో కలిసి సంయుక్తంగా ముంబై అగ్రస్ధానంలో కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన 299 మ్యాచ్లలో 162 విజయాలు నమోదు చేసింది. ఓవవరాల్గా అత్యధిక టీ20లు ఆడిన జాబితాలో ముంబై ఇండియన్స్ మూడో స్ధానంలో నిలిచింది. మొదటి స్దానంలో పాకిస్తాన్(303) ఉండగా, రెండో సోమర్సెట్(303) కొనసాగుతోంది.అత్యధిక టీ20 మ్యాచ్లు ఆడిన టాప్-5 ఐపీఎల్ జట్లుముంబై ఇండియన్స్-299రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-287కోల్కతా నైట్రైడర్స్-281చెన్నై సూపర్ కింగ్స్-277ఢిల్లీ క్యాపిటల్స్-274చదవండి: SA vs NZ: ఉత్కంఠ పోరు.. చివరి బంతికి సిక్స్ కొట్టి గెలిచిన సౌతాఫ్రికా -
ఉత్కంఠ పోరు.. చివరి బంతికి సిక్స్ కొట్టి గెలిచిన సౌతాఫ్రికా
క్రైస్ట్చర్చ్ వేదికగా న్యూజిలాండ్-దక్షిణాఫ్రికా మహిళల మధ్య జరిగిన తొలి వన్డే అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ పోరులో 2 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. ప్రోటీస్ విజయంలో యువ ఆల్రౌడర్ కైలా రేనెకేది కీలక పాత్ర.ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌట్ అయింది. టాపార్డర్ పెద్దగా రాణించికపోయినప్పటికి.. మిడిలార్డర్ బ్యాటర్ మ్యాడీ గ్రీన్ మాత్రం 85 పరుగులతో సత్తాచాటింది. ఆమెతో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ ఇసాబెల్లా గేజ్ 37 పరుగులతో రాణించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో అయాబొంగా ఖాకా 6 వికెట్లు పడగొట్టి కివీస్ వెన్ను విరిచింది. ఆమెతో పాటు ట్రయోన్ రెండు, తుమీ సెఖుఖునే, నడైన్ డిక్లార్క్ తలా వికెట్ సాధించారు.అనంతరం 269 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు బ్రిట్జ్(0), లారా వోల్వడర్ట్(16) వరుస ఓవర్లలో పెవిలియన్కు చేరారు. ఈ సమయంలో అన్నేరీ డెర్క్సెన్( 72), సునే లూస్(53) తమ అద్భుత ఇన్నింగ్స్లతో జట్టును ఆదుకున్నారు.అయితే వీరిద్దరూ ఔటయ్యక ప్రోటీస్ మళ్లీ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో నడైన్ డిక్లార్క్(39), కైలా రేనెకే(42) జట్టును గెలిపించే బాధ్యతను తమ భుజాన వేసుకున్నారు. డిక్లార్క్ ఔటైనప్పటికి రేనెకే మాత్రం తన పట్టును వీడలేదు. చివరి ఓవర్లో ప్రోటీస్ విజయానికి 14 పరుగులు అవసరమయ్యాయి. సుజీ బేట్స్ వేసిన ఈ ఓవర్లో తొలి రెండు బంతులకు కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాయి. దీంతో విజయసమీకరణం 4 బంతుల్లో 12 పరుగులగా మారింది. ఆ తర్వాత మూడో బంతికి రేనెకే అద్భుతమైన సిక్సర్ బాదింది. దీంతో మూడు బంతుల్లో 6 పరుగులు అవసరమయ్యాయి. అయితే అనుహ్యంగా తర్వాత రెండు బంతులకు ఎలాంటి పరుగులు రాలేదు. దీంతో సౌతాఫ్రికా విజయానికి ఆఖరి బంతికి సిక్స్ అవసరమైంది. అయితే రేనెకే అద్భుతమైన సిక్స్ బాది ప్రోటీస్కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. రేనెకే ఇదే తొలి వన్డే మ్యాచ్ కావడం విశేషం.చదవండి: RCB Vs SRH: ఎస్ఆర్హెచ్పై విజయం.. కోహ్లీ ఫ్లయింగ్ కిస్ -
ఎస్ఆర్హెచ్పై విజయం.. కోహ్లీ ఫ్లయింగ్ కిస్
ఐపీఎల్ 2026 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) శుభారంభం చేసింది. శనివారం ఎస్ఆర్హెచ్తో జరిగిన సీజన్ తొలి మ్యాచ్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్లో ఆర్సీబీ విజయం ఖరారు కాగానే స్టేడియంలో అందరినీ ఆకట్టుకునేలా ఒక క్యూట్ ‘విరుష్క’ మూమెంట్ చోటుచేసుకుంది. గెలుపు ఆనందంలో విరాట్ కోహ్లీ తన హెల్మెట్ తీసి, స్టాండ్స్లో తన కోసం ఉత్సాహంగా చీర్ చేస్తున్న భార్య అనుష్క శర్మ వైపు చూస్తూ ముద్దుగా ‘ఫ్లయింగ్ కిస్’ ఇచ్చాడు. దానికి స్పందనగా అనుష్క కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా అంతే ప్రేమగా కోహ్లీకి రిటర్న్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. ఈ దృశ్యాన్ని అక్కడే మ్యాచ్ చూడటానికి వచ్చిన ఆర్సీబీ మహిళల జట్టు క్రికెటర్లు స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, శ్రేయాంక పాటిల్ నవ్వుతూ ఆశ్చర్యంగా చూశారు. ఈ అందమైన క్షణంతో చిన్నస్వామి స్టేడియం ఒక్కసారిగా అభిమానుల అరుపులతో హోరెత్తిపోయింది.మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు, కెప్టెన్ ఇషాన్ కిషన్ 80 పరుగుల మెరుపు ఇన్నింగ్స్తో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ క్రీజులో ఉండటంతో ఆర్సీబీ చాలా సులువుగా ఊదేసింది. కేవలం 15.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ విజయాన్ని అందుకుంది. THE WAY VIRAT KOHLI GIVING FLYING KISS TO ANUSHKA SHARMA AFTER WON THE MATCH. ♥️😍- Video of the Day! pic.twitter.com/lQugBW89Ju— Tanuj (@ImTanujSingh) March 28, 2026 -
ఫేవరెట్గా ముంబై.. భయం గుప్పిట్లో కేకేఆర్!
ఐపీఎల్ 19వ సీజన్లో ఇవాళ ముంబై ఇండియన్స్తో కోల్కతా నైట్రైడర్స్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్లో ఫేవరెట్గా ముంబై కనిపిస్తున్నప్పటికీ కేకేఆర్ను కూడా తక్కువ అంచనా వేయలేం. కానీ రెండు జట్లలో కేకేఆర్పై ఒత్తిడి కాస్త ఎక్కువే అని చెప్పొచ్చు. ఎందుకంటే ముంబైని వారి సొంత గ్రౌండ్లో కేకేఆర్ ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే ఓడించగలిగింది. వాంఖడేలో ఇరు జట్ల మధ్య 12 మ్యాచ్లు జరిగితే 10 సార్లు ముంబై విజయం సాధించడం విశేషం. అయితే ఈసారి దానిని తిరగరాసి విజయంతో సీజన్ను ఆరంభించాలని కేకేఆర్ ఉవ్విళ్లూరుతుంది. మరోవైపు ముంబై టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగుతున్నప్పటికీ, దాదాపు ప్రతీ ఐపీఎల్ సీజన్ను ముంబై ఓటమితోనే ప్రారంభించిన దాఖలాలున్నాయి. మరి ఈసారి తొలి మ్యాచ్లోనే విజయం సాధించి దానికి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి. ముంబై ఇండియన్స్ ఐదుసార్లు (2013, 2015, 2017, 2019, 2020) చాంపియన్స్గా నిలిచింది. 2020లో చివరిసారి ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై అప్పటినుంచి ఆరో టైటిల్ కోసం నిరీక్షిస్తూనే వస్తోంది. మూడుసార్లు (2012, 2014, 2024) ఐపీఎల్ విజేతగా నిలిచిన కేకేఆర్ మరో టైటిల్ కొట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. 2008 ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి చూసుకుంటే ఇప్పటిరవరకు 35 సార్లు తలపడగా ముంబై 24 సార్లు నెగ్గితే, కేకేఆర్ 11 సార్లు విజయం సాధించింది. బలబలాల విషయానికొస్తే.. కేకేఆర్తో పోలిస్తే ముంబై బ్యాటింగ్ లైనప్ కాస్త బలంగా ఉంది. ఇటీవలే టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాలోని నలుగురు (పాండ్యా, సూర్యకుమార్, తిలక్ వర్మ, బుమ్రా) ముంబై జట్టులో ఉండడం బలమని చెప్పొచ్చు. వీరితో సహా రూథర్ఫోర్డ్, రికిల్టన్లతో పాటు ఇంపాక్ట్ ప్లేయర్లుగా మయాంక్ లేదా శార్ధూల్ కూడా కీలకం కానున్నారు. బౌలింగ్లో బుమ్రా మరోసారి కీలకం కానుండగా, కివీస్ మాజీ బౌలర్ బౌల్ట్ కూడా ప్రమాదకారే.ఇక కేకేఆర్ బ్యాటింగ్ విషయానికొస్తే రహానే, సునీల్ నరైన్, సీఫెర్ట్, రఘువంశీ, రింకూ సింగ్తో పాటు ఆల్రౌండర్లు రమణ్దీప్, కామెరున్ గ్రీన్లు కీలకం కానున్నారు. బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, ముజరబానీ కీలకం. కేకేఆర్పై రోహిత్ శర్మ 127 స్ట్రైక్రేట్తో 967 పరుగులు సాధించగా, సునీల్ నరైన్ ముంబైతో ఆడిన మ్యాచ్ల్లో 26 వికెట్లు పడగొట్టాడు.ముంబై తుది జట్టు అంచనా: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, రియాన్ రికిల్టన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్, రూథర్ఫోర్డ్, నమన్ ధిర్, గజన్ఫర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రాఇంపాక్ట్ ప్లేయర్లు: మయాంక్ మార్కండే/ శార్దూల్ ఠాకూర్కేకేఆర్ తుది జట్టు అంచనా: అజింక్యా రహానే (కెప్టెన్), సునీల్ నరైన్, టిమ్ సీఫెర్ట్ (వికెట్కీపర్)/ ఫిన్ అలెన్, కామెరున్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ, రింకూ సింగ్, రమన్దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, ముజరబానీఇంపాక్ట్ ప్లేయర్స్: రాహుల్ త్రిపాఠి/ కార్తిక్ త్యాగి చదవండి: ‘బౌలర్ల వైఫల్యం మా కొంపముంచింది’ -
‘బౌలర్ల వైఫల్యం మా కొంపముంచింది’
బౌలర్ల పేలవ ప్రదర్శన కారణంగానే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమి చవి చూసినట్లు సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) కోచ్ డానియెల్ వెటోరి అభిప్రాయం వ్యక్తం చేశాడు. పడిక్కల్, కోహ్లీ, పటిదార్లు తమ బౌలింగ్ బలహీనతను ఆసరాగా చేసుకొని పరుగులు రాబట్టారని పేర్కొన్నాడు. మ్యాచ్ ఓటమి అనంతరం వెటోరి మాట్లాడుతూ.. ‘నిజానికి బంతితో మాకు మంచి ఆరంభమే లభించింది. ప్రమాదకర ఫిల్ సాల్ట్ను తొందరగానే పెవిలియన్ చేర్చడంలో సఫలమయ్యాం. కానీ ఆ తర్వాత అదే టెంపోను కొనసాగించలేకపోయాం. సాల్ట్ ఔటైన తర్వాత క్రమశిక్షణతో బౌలింగ్ చేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. అదే సమయంలో ప్రత్యర్థి జట్టులో జాకబ్ డఫీ పిచ్ పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ చేసి ఫలితం రాబట్టాడు. కానీ మా బౌలర్లు ఆ స్థాయి బౌలింగ్ చేయడంలో విఫలమయ్యారు. ఐపీఎల్లో తొలి మ్యాచ్ నుంచే గెలవాలని అన్ని జట్లకు ఉంటుంది. ఆరంభం ఘనంగా ఉంటే ఆ తర్వాత అంతా మెరుగ్గా ఉంటుందని నా నమ్మకం. ఆర్సీబీ దూకుడైన బ్యాటింగ్ ప్రదర్శించి మా నుంచి మ్యాచ్ను లాగేసుకుంది. మా బౌలింగ్ పూర్తిగా గాడి తప్పింది. విరాట్ కోహ్లీకి, పడిక్కల్కు మా బౌలర్లు దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఇది మా రోజు కాదు. రాబోయే మ్యాచ్ల్లో బౌలింగ్లో తప్పుల్ని సరిదిద్దుకొని మెరుగైన ప్రదర్శన చేస్తాం. డేవిడ్ పైన్, హర్ష్ దూబే వంటి బౌలర్లు రాబోయే మ్యాచ్ల్లో కీలకం కానున్నారు. మేము 200 పరుగులు చేసినప్పటికీ చిన్నస్వామి స్టేడియం పిచ్పై ఆ స్కోరు ఏమాత్రం సరిపోదని తాజా మ్యాచ్ ద్వారా స్పష్టమవుతోంది.ఇషాన్ కిషన్, క్లాసెన్ మినహా మిగతావారు రాణించకపోవడం కూడా ఒక కారణమే. అయితే మా ఓపెనర్లు ఇద్దరు తక్కువ స్కోరుకే ఔటవడం కూడా ప్రభావం చూపించింది. బ్యాటింగ్లో పెద్దగా సమస్యలు లేవు. కానీ రాబోయే మ్యాచ్ల్లో బౌలింగ్ను మెరుగుపరుచుకుంటాం’ అని చెప్పుకొచ్చాడు.మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అనంతరం ఆర్సీబీ 15.4 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 203 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. జాకబ్ డఫీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకున్నాడు.చదవండి: కావ్యా మారన్కు అనన్య చెక్! -
కావ్యా మారన్కు అనన్య బిర్లా చెక్!
ఐపీఎల్లో కావ్యా మారన్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సన్రైజర్స్ హైదరాబాద్ యజమానిగా ఉన్న కావ్యా మారన్ తమ జట్టు ఆడే ప్రతి మ్యాచ్కు హాజరై ఆటగాళ్లను, అభిమానులను ఉత్సాహపరుస్తుంటారు. ఎస్ఆర్హెచ్ గెలిచినా, ఓడినా కావ్యా మారన్ ఇచ్చే హావభావాలు హైలైట్గా నిలుస్తుండేవి. అలాంటి కావ్యా మారన్కు పోటీగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా తమ కావ్యా మారన్ను పరిచయం చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారిపోయింది. ఇంతకీ బెంగళూరు కావ్యా మారన్ ఎవరనే కదా మీరు అనుకుంటున్నారు. అక్కడికే వస్తున్నాం. ఆమె పేరు అనన్య బిర్లా. బిర్లా గ్రూప్ అధినేత కుమార మంగళం బిర్లా పెద్ద కుమార్తె. ఇటీవలే ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం చేతులు మారిన విషయం తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి జట్టును నడిపిస్తున్న యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్(యుఎస్ఎస్) సంస్థ తాజాగా.. రూ.16,706 కోట్ల ధరకు ఆర్సీబీని అమ్మేసింది. ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్ట్ వెంచర్స్, ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ కన్సార్టియం ఆర్సీబీని దక్కించుకున్నాయి. బిర్లా కుమారుడు 28 ఏళ్ల ఆర్యమాన్ బిర్లా ఆర్సీబీ కొత్త ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ మ్యాచ్కు అనన్య బిర్లా, ఆర్యమాన్ బిర్లా హాజరయ్యారు. ఆర్సీబీ జెర్సీ ధరించిన అనన్య బిర్లా చేతితో ఆర్సీబీ జెండాను ఊపుతూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఆమె ఇచ్చిన హావభావాలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఒకవైపు స్టాండ్స్లో కావ్యా మారన్ తన ఎస్ఆర్హెచ్ టీమ్ను ఎంకరేజ్ చేస్తుంటే.. మరో స్టాండ్ నుంచి అనన్య బిర్లా కావ్యా మారన్కు పోటీగా ఆర్సీబీ జెండాను ఊపుతూ కనిపించింది. ఇది చూసిన అభిమానులు కావ్యామారన్ లాగే అనన్య బిర్లా కూడా సీజన్లో ఆర్సీబీ ఆడబోయే అన్ని మ్యాచ్లకు హాజరైతే బాగుంటుందని చెవులు కొరుక్కుంటున్నారు. మరి వారి కోరికను అనన్య బిర్లా మన్నించి తర్వాతి మ్యాచ్లకు కూడా హాజరవుతుందేమో చూడాలి. ఇక విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మతో కలిసి అనన్య మ్యాచ్ వీక్షించారు. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఎవరీ అనన్య బిర్లా?1994లో ముంబైలో జన్మించిన అనన్య.. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదివారు. ప్రస్తుతం ఆదిత్య బిర్లా గ్రూప్లోని పలు కీలక వ్యాపార బాధ్యతలను చూసుకుంటున్నారు. మరి ఈ సీజన్లో ఆర్సీబీ ఆడే మిగతా మ్యాచులకు కూడా అనన్య హాజరవుతారా అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.Ananya Birla at the Chinnaswamy Stadium wearing RCB jersey. pic.twitter.com/dLWhmgwX4f— Mufaddal Vohra (@mufaddal_vohra) March 28, 2026 View this post on Instagram A post shared by Ananya Birla (@ananyabirla) చదవండి:వణికిపోయిన ఇషాన్ కిషన్! -
పాపం.. వణికిపోయిన ఇషాన్ కిషన్!
ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్కి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న ఇషాన్ కిష మ్యాచ్ ఆద్యంతం కాస్త ఒత్తిడికి లోనైనట్లుగా అనిపించింది. డిఫెండింగ్ ఛాంపియన్తో తొలి మ్యాచ్ ఆడాల్సి రావడం, కమిన్స్ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడంతో భయంతో కనిపించాడు. బ్యాటింగ్లో బాధ్యతగానే జట్టును ముందుకు తీసుకెళ్లినప్పటికీ ఫీల్డింగ్ సమయంలో మాత్రం టెన్షన్తో కీపింగ్ కూడా సరిగా చేయలేకపోయాడు.ఆర్సీబీ బ్యాటింగ్ దూకుడుతో ఒకవైపు బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటుంటే.. మరోవైపు ఇషాన్ కిషన్ వికెట్ల వెనుక బంతులు వదిలేసి బౌండరీలు అందించాడు. ఈజీగా వచ్చిన బంతుల్ని కూడా పట్టుకోలేక గ్లౌజుల కింద నుంచి ఫోర్లు ఇచ్చేశాడు. ఇషాన్ కిషన్ దగ్గర రెండు బంతులు మిస్సవగా.. రెండు కూడా గ్లౌజుల కింద నుంచే వెళ్లిపోయాయి.బౌలర్లను సమన్వయం చేసుకోవడంలో కెప్టెన్గా ఇషాన్ కిషన్ విఫలమయ్యాడు. రెండో ఓవర్లోనే ఫిల్ సాల్ట్ వికెట్ పడినప్పటికీ.. పవర్ ప్లేలో మరో వికెట్ తీయలేకపోయాడు. ఆర్సీబీ స్టార్స్ దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేకపోయాడు. జయదేవ్ ఉనద్కత్, నితీష్ కుమార్ రెడ్డి 10లోపు పరుగులు సమర్పించగా.. మిగతా బౌలర్లంతా 11, 14 పరుగులు ఇచ్చారు. ఈషాన్ మలింగ ఏకంగా 2 ఓవర్లలో 35 పరుగులు సమర్పించుకున్నాడు. మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్పై విన్ని అందుకుంది.మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. ‘మొదటి 3-4 ఓవర్ల తర్వాత వికెట్ ఖచ్చితంగా బాగా సహకరించిందని నేను భావిస్తున్నాను. మేము ఆరంభంలోనే కొన్ని వికెట్లు కోల్పోయాము, వచ్చేసారి ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే, రెండో ఇన్నింగ్స్ వికెట్ను చూస్తే, బ్యాటింగ్ చేయడానికి చాలా సులభంగా ఉంది. బంతి బ్యాట్పైకి చాలా చక్కగా వస్తోంది. కాబట్టి అవును, వచ్చేసారి మేము షాట్ ఎంపికలో మరింత వివేకంతో వ్యవహరించాలి’ అని చెప్పుకొచ్చాడు. -
విన్యాసాల వీరుడు.. ఫిల్ సాల్ట్
‘క్యాచ్స్ విన్ మ్యాచెస్’ అని ఊరికే అనలేదు. ఐపీఎల్ 2026 సీజన్ తొలి మ్యాచ్లోనే అది మరోసారి నిరూపితమయ్యింది. సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఆటగాడు ఫిల్ సాల్ట్ తన స్టన్నింగ్ క్యాచ్లతో హీరోగా నిలిచాడు. ఫిల్ సాల్ట్ తన అసాధారణ ఫీల్డింగ్తో ఆకట్టుకున్నాడు. సాల్ట్ అందుకున్న మూడు క్యాచ్లు దేనికవే సాటి. 14వ ఓవర్లో హెడ్ కొట్టిన బంతిని బౌండరీ సమీపంలోక్లాసెన్ క్యాచ్ వివాదాస్పదమైనప్పటికీ ఎస్ఆర్హెచ్తో అతడు అందుకున్న మూడు క్యాచ్లు దేనికవే సాటి అని చెప్పొచ్చు. ఫిల్ సాల్ట్ చేతికి చిక్కిన ముగ్గురు (ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్) డేంజర్ బ్యాటర్లే. ఈ ముగ్గురు సూపర్ బ్యాటింగ్తో అలరిస్తున్న సమయంలో సాల్ట్ అడ్డుగోడలా నిలిచాడు. ఇన్నింగ్స్ 2.4 ఓవర్లో జాకబ్ డఫీ వేసిన బంతిని హెడ్ బ్యాక్వర్డ్ స్వ్కేర్ దిశగా ఆడాడు. అయితే అక్కడే కాచుకు కూర్చున్న సాల్ట్ వెనక్కి పరిగెత్తి అద్భుతమైన రివర్స్ క్యాచ్ తీసుకున్నాడు. షెఫర్డ్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్ తొలి బంతికి క్లాసెన్ డీప్ మిడ్వికెట్ దిశగా భారీ షాట్ ఆడగా... అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న సాల్ట్ దాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు బౌండరీ రోప్ మీద పడ్డట్లు కనిపించింది. పలుమార్లు పరిశీలించిన థర్డ్ అంపైర్ క్లాసెన్ను అవుట్గా ప్రకటించాడు. దీంతో క్లాసెన్ అసంతృప్తిగా మైదానాన్ని వీడాడు. ఏదీ ఏమైనా సాల్ట్ అందుకున్న ఈ క్యాచ్ కూడా కాస్త క్లిష్టతరమైనదే. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్కు వెన్నుముకలా నిలిచిన ఇషాన్ కిషన్ ఇచ్చిన క్యాచ్ను సాల్ట్ అందుకున్న తీరు నభూతో నభవిష్యత్తు అని చెప్పొచ్చు. అభినందన్ వేసిన ఇన్నింగ్స్ 15.6 ఓవర్లో ఇషాన్ భారీ షాట్కు యత్నించాడు. పాయింట్ దిశగా ఇషాన్ కొట్టిన బంతిని సాల్ట్ రెప్పపాటులో అందుకున్నాడు. డీప్ బ్యాక్వర్డ్ పాయింట్ బౌండరీ వద్ద కుడివైపు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఒంటి చేత్తో బంతిని అందుకోవడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గతేడాది ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్లోనూ ఫీల్డింగ్లో ఇదే తరహా విన్యాసాలతో ఫిల్ సాల్ట్ అదరగొట్టాడు. హాజిల్వుడ్ బౌలింగ్లో ప్రియాన్ష్ ఆర్య భారీ షాట్ ఆడాడు. అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న సాల్ట్ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్ను ఒడిసిపట్టడం అప్పట్లో ట్రేడ్మార్క్ క్యాచ్గా నిలిచిపోయింది. మొత్తంగా సాల్ట్ బ్యాటింగ్లోనే కాదు ఫీల్డింగ్లోనూ మెరుపులు మెరిపించి విన్యాసాల వీరుడిగా ముద్ర వేసుకున్నాడు.𝐒𝐓𝐎𝐏 𝐖𝐇𝐀𝐓 𝐘𝐎𝐔 𝐀𝐑𝐄 𝐃𝐎𝐈𝐍𝐆 𝐀𝐍𝐃 𝐖𝐀𝐓𝐂𝐇 𝐓𝐇𝐈𝐒! 🛑🎥 Phil Salt with an absolute one-handed screamer at the ropes 🫡Do we already have the Catch of the Season on Day 1 of #TATAIPL 2026 🤔Updates ▶️ https://t.co/Eo5z0jh4K4 #KhelBindaas | #RCBvSRH |… pic.twitter.com/pPax3pVNt9— IndianPremierLeague (@IPL) March 28, 2026That’s not just a catch, that’s a full-on rollercoaster at the ropes 😮💨Screen badi, awaazein badi. Apne smart TV ke JioHotstar app pe dekhiye Champions waali commentary LIVE💥#TATAIPL 2026 | #RCBvSRH | LIVE NOW 👉 https://t.co/LWOEeT2vNG pic.twitter.com/IzIDC3MtkX— Star Sports (@StarSportsIndia) March 28, 2026Picking up where he left off... 🔥🔥Never change, Phil Salt. Never change. 🙏#PlayBold #ನಮ್ಮRCB #IPL2026 #RCBvSRH pic.twitter.com/gGu6BD388g— Royal Challengers Bengaluru (@RCBTweets) March 28, 2026చదవండి: అందుకే చేజింగ్ మాస్టర్ అనేది! -
అందుకే చేజింగ్ మాస్టర్ అనేది!
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్లోనే పలు రికార్డులు బద్దలయ్యాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అసలైన చాంపియన్ ఆటతీరును ప్రదర్శించి సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)పై సునాయాస విజయాన్ని నమోదు చేసుకుంది. ఎస్ఆర్హెచ్ విధించిన 202 పరుగుల టార్గెట్ను ఉఫ్ అని ఉదేసింది. పడిక్కల్, పటిదార్లు మెరుపు ఇన్నింగ్స్లతో ఆకట్టుకుంటే.. కోహ్లీ మాత్రం లక్ష్య ఛేదనలో తనను మాస్టర్ అని ఎందుకు పిలుస్తారో మరోసారి నిరూపించాడు. చేజింగ్ అంటేనే కోహ్లీలో ఎక్కడలేని ఊపు కనిపిస్తుంది. అందుకేనేమో ఈ చేజింగ్ మాస్టర్ను వెతుక్కుంటూ రికార్డులు వస్తుంటాయి. తాజాగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లోనూ కోహ్లీ రెండు అరుదైన రికార్డులు అందుకున్నాడు. ఐపీఎల్లో లక్ష్య ఛేదన సమయంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కోహ్లీ రికార్డులకెక్కాడు. 4027 పరుగులతో కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ తర్వాత వార్నర్ (3,285), రోహిత్ శర్మ (3,238), శిఖర్ ధావన్ (2,843), రాబిన్ ఊతప్ప (2,832) వరుసగా ఉన్నారు. ఎస్ఆర్హెచ్తో గత ఐదు మ్యాచ్ల్లో వరుసగా 100, 42, 51, 43, 69* పరుగులు చేయడం ద్వారా మరో రికార్డు లిఖించుకున్నాడు. మరిన్ని రికార్డులు..ఇక కోహ్లీకి వరుసగా రెండో ఐపీఎల్ సీజన్ను కూడా అర్థసెంచరీతోనే మొదలుపెట్టాడు. 2025 సీజన్లో కేకేఆర్తో జరిగిన తొలి మ్యాచ్లో అర్థసెంచరీ చేశాడు. తాజాగా ఎస్ఆర్హెచ్పై అర్థసెంచరీతో ఈ సీజన్లో బ్యాటింగ్ను షురూ చేశాడు.ఇక ఐపీఎల్లో 200 పరుగులకు పైగా ఛేదనను అతి తక్కువ ఓవర్లలో చేధించిన జట్టుగాను ఆర్సీబీ రికార్డు అందుకుంది. ఎస్ఆర్హెచ్ విధించిన 202 పరుగులు లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేదించింది. అంతకముందు 2025 సీజన్లో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 15.5 ఓవర్లలో అందుకుంది.ఐపీఎల్లో 200లకు పైగా పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ఛేదించడం ఇది నాలుగోసారి. గతంలో 2025లో లక్నో సూపర్జెయింట్స్పై, 2010లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్పై, 2024లో గుజరాత్ టైటాన్స్పై 200 ప్లస్ స్కోర్లు ఛేదించింది. -
సాల్ట్ వివాదాస్పద క్యాచ్
ఐపీఎల్ 2026 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బోణీ కొట్టింది. శనివారం సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. మొదట బౌలింగ్లో జాకబ్ డఫీ, రొమారియో షెపర్డ్ హడలెత్తించగా, ఆ తర్వాత ఛేదనలో పడిక్కల్, పటిదార్లు మెరుపు ఇన్నింగ్స్లతో అదరగొడితే.. చివరివరకు నిలిచిన మాస్టర్ చేజ్ కోహ్లీ యాంకర్ పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్లో బెంగళూరు ప్లేయర్ ఫిల్ సాల్ట్ తన అసాధారణ ఫీల్డింగ్తో ఆకట్టుకున్నాడు. సాల్ట్ అందుకున్న మూడు క్యాచ్లు దేనికవే సాటి. ఇన్నింగ్స్ 2.4 ఓవర్లో హెడ్ కొట్టిన బంతిని బౌండరీ సమీపంలో సునాయాసంగా పట్టిన సాల్ట్.. క్లాసెన్ క్యాచ్ను బౌండరీ వద్ద అనూహ్య రీతిలో అందుకున్నప్పటికీ అది వివాదాస్పదంగా మారింది.షెఫర్డ్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్ తొలి బంతికి క్లాసెన్ డీప్ మిడ్వికెట్ దిశగా భారీ షాట్ ఆడగా... అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న సాల్ట్ దాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు బౌండరీ రోప్ మీద పడ్డట్లు కనిపించింది. పలుమార్లు పరిశీలించిన థర్డ్ అంపైర్ క్లాసెన్ను అవుట్గా ప్రకటించాడు. దీంతో క్లాసెన్ అసంతృప్తిగా మైదానాన్ని వీడాడు. థర్డ్ అంపైర్ మరో కోణం నుంచి పరిశీలించకుండానే నిర్ణయం ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ తర్వాత ఎలాంటి వివాదం లేకుండా 16వ ఓవర్ చివరి బంతికి ఇషాన్ కొట్టిన భారీ షాట్ను సైతం సాల్ట్ రెప్పపాటులో అందుకున్నాడు. డీప్ బ్యాక్వర్డ్ పాయింట్ బౌండరీ వద్ద కుడివైపు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఒంటి చేత్తో బంతిని ఒడిసి పట్టాడు. సూపర్ క్యాచ్లతో ఆకట్టుకున్న సాల్ట్... క్లాసెన్ పట్టిన అలాంటి క్యాచ్కే పెవిలియన్ చేరడం కొసమెరుపు. That’s not just a catch, that’s a full-on rollercoaster at the ropes 😮💨Screen badi, awaazein badi. Apne smart TV ke JioHotstar app pe dekhiye Champions waali commentary LIVE💥#TATAIPL 2026 | #RCBvSRH | LIVE NOW 👉 https://t.co/LWOEeT2vNG pic.twitter.com/IzIDC3MtkX— Star Sports (@StarSportsIndia) March 28, 2026చదవండి: ఆర్సీబీ అదరగొట్టింది... -
ఆర్సీబీ అదరగొట్టింది...
బ్యాటింగ్లో ఆశించినంత భారీ స్కోరు చేయలేకపోయిన సన్రైజర్స్ హైదరాబాద్... బౌలింగ్లో ఎలాంటి మ్యాజిక్ కనబర్చలేక పరాజయంతో ఐపీఎల్ను ప్రారంభించింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు... చాంపియన్ ఆటతీరుతో సీజన్లో బోణీ కొట్టింది. జాకబ్ డఫీ అరంగేట్ర మ్యాచ్లోనే అదరగొడితే... షెఫర్డ్ అతడికి సంపూర్ణ సహకారం అందించాడు. వీరిద్దరి బౌలింగ్ మెరుపులకు... ఫిల్ సాల్ట్ ఫీల్డింగ్ విన్యాసాలు తోడవడంతో సన్రైజర్స్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ‘ఛేజ్ మాస్టర్’ విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్ దూకుడుతో మరో 26 బంతులు మిగిలుండగానే బెంగళూరు లక్ష్యాన్ని ఛేదించింది. బెంగళూరు: సొంతగడ్డపై ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ను ఘన విజయంతో ప్రారంభించింది. శనివారం జరిగిన టోర్నీ ఆరంభ పోరులో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను చిత్తుచేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (38 బంతుల్లో 80; 8 ఫోర్లు, 5 సిక్స్లు) కెప్టెన్ ఇన్నింగ్స్తో విజృంభించగా... అనికేత్ వర్మ (18 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపులు మెరిపించాడు. క్లాసెన్ (31; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించగా... హెడ్ (11), అభిషేక్ శర్మ (7), నితీశ్ కుమార్ రెడ్డి (1), సలిల్ అరోరా (9), హర్ష్ దూబే (3) విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో జేకబ్ డఫీ, రొమారియో షెఫర్డ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బెంగళూరు 15.4 ఓవర్లలో 4 వికెట్లకు 203 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (38 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్లు), దేవదత్ పడిక్కల్ (26 బంతుల్లో 61; 7 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధశతకాలతో అదరగొట్టగా.. కెప్టెన్ రజత్ పాటీదార్ (12 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్స్లు) క్రీజులో ఉన్నంతసేపు దంచికొట్టాడు. ఇషాన్ కెప్టెన్ ఇన్నింగ్స్ జాకబ్ డఫీ ధాటికి సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టిన సమయంలో ఇషాన్ చక్కటి ఇన్నింగ్స్తో అలరించాడు. కమిన్స్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అనూహ్యంగా జట్టు పగ్గాలు అందుకున్న ఇషాన్... బౌలర్లపై ఎదురుదాడికి దిగి ఫలితం రాబట్టాడు. అభినందన్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో ఇషాన్ వరుసగా 6, 4, 6 కొట్టి మైదానంలో జోష్ నింపాడు. కాసేపటికి క్లాసెన్ కూడా రెండు ఫోర్లతో సత్తాచాటాడు. సుయాశ్ శర్మ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన ఇషాన్ 27 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. కృనాల్ వేసిన 13వ ఓవర్లో ఈ ఇద్దరు కలిసి మూడు సిక్స్లు బాదారు. నాలుగో వికెట్కు 97 పరుగులు జోడించిన అనంతరం క్లాసెన్ వివాదాస్పద క్యాచ్ అవుట్గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత హైదరాబాద్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఒక ఎండ్లో వికెట్లు పడుతున్నా... అనికేత్ దూకుడు కొనసాగించడంతో సన్రైజర్స్ మెరుగైన స్కోరు చేయగలిగింది. ఆడుతూ పాడుతూ... దూకుడుకు మారుపేరైన ప్రత్యర్థి ఓ మాదిరి స్కోరుకే పరిమితం చేసిన బెంగళూరు... సొంతగడ్డపై దుమ్మురేపింది. సాల్ట్ (8) రెండో ఓవర్లోనే అవుటైనా... ఆ తర్వాత రైజర్స్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బెంగళూరు దంచికొట్టింది. మంచి ఫామ్లో ఉన్న పడిక్కల్ అలవోకగా భారీ షాట్లు ఆడుతూ లక్ష్యాన్ని కరిగించాడు. సిక్స్తో ఖాతా తెరిచిన అతడు... నితీశ్ రెడ్డి ఓవర్లో రెండు ఫోర్లు, పైన్ ఓవర్లో 6, 4, 6 బాదాడు. కోహ్లి కూడా 6, 4తో జోరు పెంచడంతో పవర్ప్లే ముగిసే సరికి బెంగళూరు 76/1తో నిలిచింది. దూబే బౌలింగ్లో 4, 6 కొట్టిన అనంతరం పడిక్కల్ అవుటయ్యాడు. దీంతో 101 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కెప్టెన్ రజత్ పాటీదార్ ఉన్నంతసేపు భారీ షాట్లతో చెలరేగడంతో... స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. బెంగళూరు విజయానికి 48 బంతుల్లో 40 పరుగుల అవసరమైన దశలో... వరుస బంతుల్లో పాటీదార్, జితేశ్ శర్మ (0) అవుటైనా... టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి కోహ్లి మిగిలిన పని పూర్తిచేశాడు. హడలెత్తించిన డఫీ న్యూజిలాండ్ పేసర్ జేకబ్ డఫీ ఇప్పటికే జాతీయ జట్టు తరఫున 48 టి20లు ఆడి 62 వికెట్లు తీశాడు. అయితే ఇప్పుడు తొలిసారి అతను ఐపీఎల్లో అడుగు పెట్టాడు. హేజల్వుడ్కు ప్రత్యామ్నాయంగా ఆర్సీబీ అతడిని తీసుకోగా, తన ఎంపికకు పూర్తి న్యాయం చేస్తూ సత్తా చాటాడు. తన రెండో ఓవర్లోనే కీలక బ్యాటర్లు అభిషేక్, హెడ్లను వెనక్కి పంపిన అతను తర్వాతి ఓవర్లో నితీశ్ను అవుట్ చేసి పవర్ప్లేలోనే 3/17తో రైజర్స్ పని పట్టాడు. కేవలం 530 మంది జనాభా ఉండే ఎలాంటి సౌకర్యాలు లేని చిన్న ఊరిలో పుట్టిన డఫీ ప్రస్థానం కివీస్ క్రికెట్ వర్గాల్లో ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. మరో ఇద్దరు... ఈ మ్యాచ్తో మరో ఇద్దరు భారత క్రికెటర్లు ఐపీఎల్లో అరంగేట్రం చేశారు. పేస్ బౌలర్ అభినందన్ సింగ్కు ఆర్సీబీ అవకాశమిచ్చింది. యూపీ టి20 లీగ్లో లక్నో ఫాల్కన్స్ తరఫున ఆడిన అతనికి సీనియర్ స్థాయిలో ఇదే తొలి అధికారిక టోర్నీ. గత సీజన్లోనూ ఆర్సీబీతోనే ఉన్నా మ్యాచ్ ఆడే చాన్స్ రాలేదు. సన్రైజర్స్ తరఫున ఆడిన సలీల్ అరోరాకు కూడా ఇదే తొలి మ్యాచ్. పంజాబ్కు చెందిన 23 ఏళ్ల సలీల్ ముస్తాక్ అలీ టోర్నీలో ఎనిమిది మ్యాచ్లలో దాదాపు 200 స్ట్రయిక్ రేట్తో 358 పరుగులు చేశాడు. టోర్నీలో ఏకంగా 28 సిక్సర్లతో అదరగొట్టి ఐపీఎల్ చాన్స్ దక్కించుకున్నాడు. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్: హెడ్ (సి) సాల్ట్ (బి) డఫీ 11; అభిషేక్ (సి) జితేశ్ (బి) డఫీ 7; ఇషాన్ (సి) సాల్ట్ (బి) అభినందన్ 80; నితీశ్ రెడ్డి (సి) అభినందన్ (బి) డఫీ 1; క్లాసెన్ (సి) సాల్ట్ (బి) షెఫర్డ్ 31; సలిల్ అరోరా (సి) పడిక్కల్ (బి) సుయాశ్ 9; అనికేత్ వర్మ (సి) కోహ్లి (బి) షెఫర్డ్ 43; హర్ష్ దూబే (సి) పడిక్కల్ (బి) షెఫర్డ్ 3; హర్షల్ (సి) పడిక్కల్ (బి) భువనేశ్వర్ 0; డేవిడ్ పైన్ (నాటౌట్) 6; ఉనాద్కట్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–18, 2–23, 3–29, 4–126, 5–137, 6–155, 7–167, 8–174, 9–192. బౌలింగ్: డఫీ 4–0–22–3; భువనేశ్వర్ 4–0–31–1; అభినందన్ 3–0–38–1; షెఫర్డ్ 4–0–54–3; సుయాశ్ 3–0–28–1; కృనాల్ 2–0–26–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: సాల్ట్ (సి) క్లాసెన్ (బి) ఉనాద్కట్ 8; కోహ్లి (నాటౌట్) 69; పడిక్కల్ (సి) క్లాసెన్ (బి) హర్ష్ 61; పాటీదార్ (సి) హర్ష్ (బి) పైన్ 31; జితేశ్ (సి) ఉనాద్కట్ (బి) పైన్ 0; టిమ్ డేవిడ్ (నాటౌట్) 16; ఎక్స్ట్రాలు 18; మొత్తం (15.4 ఓవర్లలో 4 వికెట్లకు) 203. వికెట్ల పతనం: 1–9, 2–110, 3–163, 4–163. బౌలింగ్: నితీశ్ రెడ్డి 2–0–19–0; ఉనాద్కట్ 3–0–29–1; డేవిడ్ పైన్ 3–0–35–2; హర్ష్ దూబే 3–0–35–1; ఇషాన్ మలింగ 2–0–35–0; హర్షల్ 2.4–0–39–0.ఐపీఎల్లో నేడుముంబై X కోల్కతా వేదిక: ముంబైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
తొక్కిసలాట మృతులకు సంతాపంగా...
ఆనవాయితీకి భిన్నంగా ఈసారి ఎలాంటి ఆరంభ వేడుకలు లేకుండానే ఐపీఎల్ ప్రారంభమైంది. గతేడాది బెంగళూరు జట్టు తొలిసారి ట్రోఫీ చేజిక్కించుకున్న అనంతరం విజయోత్సవంలో తొక్కిసలాట జరిగి 11 మంది అభిమానులు మృతిచెందారు. దీంతో వారిని స్మరిస్తూ... మ్యాచ్ ఆరంభానికి ముందు ఇరు జట్ల ప్లేయర్లు, మ్యాచ్ సిబ్బందితో పాటు ప్రేక్షకులు ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. అలాగే వారి జ్ఞాపకార్ధం పీ1 స్టాండ్లోని 11 సీట్లను ఖాళీగా పెట్టారు. -
జాతీయ చాంపియన్ ఆంధ్ర
గురుగ్రామ్: ఆంధ్రప్రదేశ్ బధిర మహిళల క్రికెట్ జట్టు జాతీయ చాంపియన్గా నిలిచింది. శనివారం జరిగిన ఐడీసీఏ మహిళల టి10 జాతీయ క్రికెట్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ జట్టు విజయం సాధించింది. ఫైనల్లో ఆంధ్ర 5 పరుగుల తేడాతో ఢిల్లీపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయి 68 పరుగులకే పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కాంతమ్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. ఉత్తర ప్రదేశ్కు చెందిన ప్రియా దీక్షిత్ ‘బెస్ట్ బౌలర్’గా నిలిచింది. -
దంచికొట్టిన పడిక్కల్, కోహ్లి.. భారీ లక్ష్యాన్ని ఊదేసిన ఆర్సీబీ
డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ ఐపీఎల్ 2026 సీజన్లో ఘనంగా బోణీ కొట్టింది. ఛాంపియన్ హోదాకు సార్దకత చేకూరుస్తూ, తొలి మ్యాచ్లోనే అబ్బురపరిచే విజయం సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో ఇవాళ (మార్చి 28) జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో సన్రైజర్స్పై ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్.. ఇషాన్ కిషన్ (38 బంతుల్లో 80; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం, అనికేత్ వర్మ (18 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపుల కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. జేకబ్ డఫీ (4-0-22-3) ధాటికి 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సన్రైజర్స్ను ఇషాన్.. హెన్రిచ్ క్లాసెన్ (22 బంతుల్లో 31; 2 ఫోర్లు, సిక్స్) సాయంతో గట్టెక్కించాడు.వరుస విరామాల్లో వికెట్లు పడినా ఆఖర్లో అనికేత్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా సన్రైజర్స్ 200 పరుగుల మార్కును దాట గలిగింది. మిగతా బ్యాటర్లలో హెడ్ 11, అభిషేక్ 7, నితీశ్ కుమార్ రెడ్డి 1, సలీల్ అరోరా 9, హర్ష్ దూబే 3, హర్షల్ పటేల్ డకౌట్ కాగా.. డేవిడ్ పేన్ 6, ఉనద్కత్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో డఫీ, రొమారియో షెపర్డ్ చెరో 3 వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, సుయాశ్ శర్మ తలో వికెట్ తీశారు.దంచికొట్టిన పడిక్కల్, కోహ్లిఅనంతరం బరిలోకి దిగిన ఆర్సీబీ.. దేవ్దత్ పడిక్కల్ (26 బంతుల్లో 61; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), విరాట్ కోహ్లి (38 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), రజత్ పాటిదార్ (12 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం ధాటికి కేవలం 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊదేసింది. విరాట్ సిక్సర్, హ్యాట్రిక్ బౌండరీలతో మ్యాచ్ను ముగించాడు. తొలి ఐపీఎల్ మ్యాచ్లోనే అద్భుత ప్రదర్శన చేసిన జేకబ్ డఫీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. -
ఇషాన్ విధ్వంసం.. అనికేత్ మెరుపులు.. సన్రైజర్స్ భారీ స్కోర్
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో ఇవాళ (మార్చి 28) ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్.. ఇషాన్ కిషన్ (38 బంతుల్లో 80; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం, అనికేత్ వర్మ (18 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపుల కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.ఆర్సీబీ అరంగేట్రం బౌలర్ జేకబ్ డఫీ (4-0-22-3) ధాటికి 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సన్రైజర్స్ను ఇషాన్.. హెన్రిచ్ క్లాసెన్ (22 బంతుల్లో 31; 2 ఫోర్లు, సిక్స్) సాయంతో గట్టెక్కించాడు. వరుస విరామాల్లో వికెట్లు పడినా ఆఖర్లో అనికేత్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా సన్రైజర్స్ 200 పరుగుల మార్కును దాట గలిగింది. మిగతా సన్రైజర్స్ బ్యాటర్లలో హెడ్ 11, అభిషేక్ 7, నితీశ్ కుమార్ రెడ్డి 1, సలీల్ అరోరా 9, హర్ష్ దూబే 3, హర్షల్ పటేల్ డకౌట్ కాగా.. డేవిడ్ పేన్ 6, ఉనద్కత్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో డఫీ, రొమారియో షెపర్డ్ చెరో 3 వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, సుయాశ్ శర్మ తలో వికెట్ తీశారు.తుది జట్లు..ఆర్సీబీ: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మసన్రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్/వికెట్కీపర్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ -
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్
ఎస్ఆర్హెచ్ తాత్కాలిక సారధి ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదారాబాద్ తరఫున కెప్టెన్సీ అరంగేట్రంలో అత్యధిక స్కోర్ సాధించిన ఆటగాడిగా అవతరించాడు. గతంలో ఈ రికార్డు మనీశ్ పాండే (69 నాటౌట్) పేరిట ఉండేది. ఐపీఎల్ 2026లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మార్చి 28) జరుగుతున్న మ్యాచ్లో ఇషాన్ ఈ రికార్డు నమోదు చేశాడు.బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఇషాన్ కష్టాల్లో ఉన్న తన జట్టును అద్భుతమైన ఇన్నింగ్స్తో గట్టెక్కించే క్రమంలో ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసిన ఇషాన్.. అభినందన్ సింగ్ బౌలింగ్లో సాల్ట్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో పెవిలియన్కు చేరాడు.ఈ ఇన్నింగ్స్తో ఇషాన్ మరో ఘనత కూడా సాధించాడు. ఐపీఎల్ కెప్టెన్సీ అరంగేట్రంలో అత్యధిక స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు.ఐపీఎల్ కెప్టెన్సీ అరంగేట్రంలో అత్యధిక స్కోర్లు119 - సంజు శాంసన్ (RR) vs PBKS, 202199* - మయాంక్ అగర్వాల్ (PBKS) vs DC, 202193* - శ్రేయస్ అయ్యర్ (DC) vs KKR, 201888 - ఫాఫ్ డు ప్లెసిస్ (RCB) vs PBKS, 202283 - కీరన్ పొలార్డ్ (MI) vs PBKS, 201980 - ఇషాన్ కిషన్ (SRH) vs RCB, 2026*కాగా, ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఎస్ఆర్హెచ్ 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ.. ఇషాన్ కిషన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి తన జట్టును ఆదుకున్నాడు. అతనికి క్లాసెన్ (31) కాసేపు సహకరించాడు.18 ఓవర్ల తర్వాత ఎస్ఆర్హెచ్ స్కోర్ 8 వికెట్ల నష్టానికి 175 పరుగులుగా ఉంది. అనికేత్ వర్మ (27), డేవిడ్ పేన్ (1) క్రీజ్లో ఉన్నారు. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో హెడ్ 11, అభిషేక్ 7, నితీశ్ కుమార్ రెడ్డి 1, సలీల్ అరోరా 9, హర్ష్ దూబే 3, హర్షల్ పటేల్ డకౌటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో డఫీ 3, రొమారియో షెపర్డ్ 2, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, సుయాశ్ శర్మ తలో వికెట్ తీశారు. -
అరంగేట్రంలోనే అదరగొట్టిన ఆర్సీబీ స్పీడ్ స్టార్
న్యూజిలాండ్ స్పీడ్ స్టార్ జాకబ్ డఫీ తన ఐపీఎల్ కెరీర్ను ఘనంగా ఆరంభించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఈ క్యాష్ రిచ్ లీగ్లో అడుగుపెట్టిన డఫీ.. తన అరంగేట్ర మ్యాచ్లోనే అదరగొట్టాడు. ఐపీఎల్-2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లను డఫీ బెంబేలెత్తించాడు.అభిషేక్ శర్మ , ట్రావిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి వంటి కీలక ఆటగాళ్లను అవుట్ చేసి ప్రత్యర్థి టాప్ ఆర్డర్ను దెబ్బతీశాడు. మొత్తంగా డఫీ తన 4 ఓవర్ల కోటాలో కేవలం 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. గతేడాది డిసెంబర్లో జరిగిన మినీ వేలంలో రూ. 2 కోట్ల బేస్ప్రైస్కు ఆర్సీబీ సొంతం చేసుకుంది. ఆర్సీబీ యాజమాన్యం నమ్మకాన్ని డఫీ నిలబెట్టుకున్నాడు. జోష్ హాజిల్వుడ్, నువాన్ తుషారా లేని లోటను డఫీ భర్తీ చేశాడు. అయితే ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్లో మాత్రం డఫీ విఫలమయ్యాడు.తుది జట్లు..ఆర్సీబీ: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మసన్రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్/వికెట్కీపర్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగచదవండి: IPL 2026: అభిషేక్ శర్మ అట్టర్ ప్లాప్ -
IPL 2026, SRH VS RCB: ఇషాన్ కిషన్ భారీ రికార్డు
ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్లోనే ఎస్ఆర్హెచ్ తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ భారీ రికార్డు సాధించాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్లో బాధ్యతాయుతంగా ఆడుతున్న అతను.. ఐపీఎల్లో 3000 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా క్యాష్ లీగ్ చరిత్రలో అత్యంత వేగంగా ఈ మైలురాయిని తాకిన ఆరో భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఇషాన్ ఈ మైలురాయిని చేరుకునేందుకు 2180 బంతులు తీసుకోగా.. రిషబ్ పంత్ (2028), యూసఫ్ పఠాన్ (2082), సూర్యకుమార్ యాదవ్ (2130), సురేశ్ రైనా (2135), ఎంఎస్ ధోని (2152) అతని కంటే వేగంగా ఈ మైలురాయిని చేరుకున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ కష్టాల్లో పడింది. ఆర్సీబీ అరంగేట్రం పేసర్ జేకబ్ డఫీ నిప్పులు చెరిగే బంతులతో ఎస్ఆర్హెచ్ టాపార్డర్ను కుప్పకూల్చాడు. ఈ దశలో ఇషాన్ బాధ్యతాయుతంగా ఆడుతూ ఇన్నింగ్స్ను నిర్మించే ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి జతగా హెన్రిచ్ క్లాసెన్ క్రీజ్లో ఉన్నారు. 7 ఓవర్ల తర్వాత ఎస్ఆర్హెచ్ స్కోర్ 54-3గా ఉంది. ఇషాన్ (12 బంతుల్లో 25), క్లాసెన్ (7 బంతుల్లో 6) ఇన్నింగ్స్లు కొనసాగిస్తున్నారు. డఫీ అద్బుతమైన స్పెల్ను (4-0-22-3) ముగించాడు.నిప్పులు చెరిగిన డఫీఎస్ఆర్హెచ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. డఫీ ఎస్ఆర్హెచ్ను దారుణంగా దెబ్బకొట్టాడు. 3వ ఓవర్లో ఓపెనర్లు అభిషేక్ (7), హెడ్ (11) వికెట్లు తీసిన ఇతను.. ఐదో ఓవర్ తొలి బంతికే నితీశ్కుమార్ రెడ్డిని (1) పెవిలియన్కు పంపాడు.తుది జట్లు..ఆర్సీబీ: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మసన్రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్/వికెట్కీపర్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ -
అభిషేక్ శర్మ అట్టర్ ప్లాప్
ఐపీఎల్-2026 సీజన్ను సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ పేలవంగా ఆరంభించాడు. చిన్నస్వామిస్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగుతున్న తొలి మ్యాచ్లో అభిషేక్ తీవ్ర నిరాశపరిచాడు. 8 బంతుల్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆర్సీబీ స్పీడ్ స్టార్ జాకబ్ డఫీ బౌలింగ్లో చెత్త షాట్ ఆడి తన వికెట్ను సమర్పించుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో కేవలం ఒక్క సిక్స్ మాత్రమే ఉంది. అయితే డఫీ మాత్రం తన పేస్ బౌలింగ్తో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. అతడి బౌలింగ్ ధాటికి సన్రైజర్స్ ట్రావిస్ హెడ్(11), నితీశ్ కుమార్ రెడ్డి(1) వంటి కీలక వికెట్లను కోల్పోయింది. మొత్తం మూడు వికెట్లు కూడా అతడే తీశాడు. ఈ కివీ పేసర్ టీ20 ప్రపంచకప్లో మెరుగ్గా రాణించికపోయినప్పటికి.. తన తొలి ఐపీఎల్ మ్యాచ్లో మాత్రం దుమ్ము లేపాడు. దీంతో సన్రైజర్స్ కేవలం 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.తుది జట్లు..ఆర్సీబీ: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మసన్రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్/వికెట్కీపర్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ -
నల్ల బ్యాండ్లతో బరిలోకి దిగిన ఆర్సీబీ, సన్రైజర్స్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన ఐపీఎల్-2026 సీజన్కు తెరలేచింది. తొలి మ్యాచ్లో చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతున్నాయి.ఈ సందర్భంగా గతేడాది చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది అభిమానులకు ఇరు జట్ల ఆటగాళ్లు నివాళులు అర్పించారు. మ్యాచ్ ఆరంభ సమయంలో మైదానంలోకి వెళ్లే ముందు బౌండరీ లైన్ వద్ద రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అదేవిధంగా ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ ఆటగాళ్లు నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. మ్యాచ్కు ముందు జరిగిన వార్మప్ సెషన్లో ఆర్సీబీ ఆటగాళ్లందరూ '11' సంఖ్య ఉన్న జెర్సీలను ధరించి ప్రాక్టీస్ చేశారు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) స్టేడియం ఆవరణలో ఆ అభిమానుల కోసం ఒక ప్రత్యేక స్మారక చిహ్నాన్ని కూడా ఆవిష్కరించింది. అంతేకాకుండా వారికి సంతాపంగా స్టేడియంలోని ఒక స్టాండ్లో 11 సీట్లను శాశ్వతంగా ఖాళీగా ఉంచారు. ఈ సీట్లను ఇకపై ఏ ఐపీఎల్ మ్యాచ్కు గానీ, అంతర్జాతీయ మ్యాచ్కు గానీ విక్రయించరు. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.చదవండి: నువ్వు ఫెయిలై పోతావు: అభిషేక్ శర్మపై యువీ తండ్రి ఫైర్Rajat Patidar 🆚 Ishan Kishan Are you ready for a blockbuster #TATAIPL 2026 opener? 🍿#KhelBindaas | #RCBvSRH pic.twitter.com/jRpfldwsSi— IndianPremierLeague (@IPL) March 28, 2026 -
పాకిస్తాన్ ఆటగాడితో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోనున్న అశ్విన్
భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన స్పిన్నర్లలో ఒకరైన రవిచంద్రన్ అశ్విన్, ఐపీఎల్ మరియు అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత మరో ఫ్రాంచైజీ లీగ్లోకి అడుగుపెట్టాడు. గతేడాది బిగ్బాష్ లీగ్లో ఆడే కల గాయం కారణంగా నెరవేరకపోయినా, ఈసారి అమెరికాలోని మేజర్ లీగ్ క్రికెట్ (MLC)తో ఒప్పందం కుదుర్చుకొని, విదేశీ లీగ్ల్లో ఆడాలన్న కలను సాకారాం చేసుకోనున్నాడు. MLCలోని శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ జట్టు ఆశ్విన్తో ఒప్పందం చేసుకుంది. దీంతో ఈ లీగ్లో ఆడే తొలి భారతీయ క్యాప్డ్ ప్లేయర్గా అశ్విన్ చరిత్ర సృష్టించాడు. ఈ జట్టులో ఇప్పటికే పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రౌఫ్ ఉన్నాడు. దీంతో ఇద్దరూ ఒకే డ్రెస్సింగ్ రూమ్ను షేర్ చేసుకోనున్నారు. భారత అభిమానులు లక్ష్యంగా..! MLC ఇప్పటికే ఫాఫ్ డుప్లెసిస్, కీరన్ పోలార్డ్, ట్రెంట్ బౌల్ట్ వంటి స్టార్ ఆటగాళ్లను కలిగి ఉంది. అశ్విన్ వంటి భారత లెజెండ్ కూడా చేరడం వల్ల ఈ లీగ్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగనుంది. అశ్విన్ చేరికతో ఈ లీగ్ను ఫాలో అయ్యే భారత అభిమానుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది.BBL, ILT20లో విఫలయత్నాలు అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ రిటైర్మెంట్ తర్వాత అశ్విన్ విదేశీ లీగ్ల్లో ఆడేందుకు పలు విఫలయత్నాలు చేశాడు. ILT20 వేలంలో పేరు నమోదు చేసుకున్నా, ఆశ్చర్యకరంగా ఎవరూ అతనిపై ఆసక్తి చూపలేదు. బీబీఎల్లో సిడ్నీ థండర్ తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నా, గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. IPL 2026లో వ్యాఖ్యాతగా..అశ్విన్ ఆటగాడిగా ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించినా, వ్యాఖ్యాతగా కొనసాగనున్నాడు. JioHotstar హిందీ కామెంటరీ ప్యానెల్లో వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా, అనిల్ కుంబ్లే, రవి శాస్త్రి, సునీల్ గవాస్కర్లతో కలిసి పని చేయనున్నాడు. ఆటపై లోతైన అవగాహన కలిగిన అశ్విన్ వ్యాఖ్యాతగా అభిమానులకు కొత్త అనుభవాన్ని అందించనున్నాడు. -
నువ్వు ఫెయిలై పోతావు: అభిషేక్ శర్మపై యువీ తండ్రి ఫైర్
గత రెండేళ్లుగా టీ20 ఓపెనర్గా టీమిండియాలో పాతుకుపోయాడు అభిషేక్ శర్మ. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన కొద్దికాలంలోనే ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్గా ఎదిగాడు. భారత దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్కు ప్రియ శిష్యుడిగా పేరొందాడు ఈ విధ్వంసకర బ్యాటర్.క్రమశిక్షణ అత్యంత ముఖ్యంఅయితే, యువీ తండ్రి యోగ్రాజ్ సింగ్ (Yograj Singh) మాత్రం అభిషేక్ శర్మ ఆట తీరు తనకు నచ్చడం లేదంటూ షాకింగ్ కామెంట్లు చేశాడు. ఈ పంజాబీ ప్లేయర్ ప్రతి బంతిని బౌండరీకి తరలించాలనే తొందరలో మూల్యం చెల్లిస్తున్నాడని యోగ్రాజ్ అభిప్రాయపడ్డాడు. క్రీడాకారులకు క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని.. అయితే, ఇప్పటి ఆటగాళ్లలో అది కొరవడిందని పేర్కొన్నాడు.ఒకే సర్ అంటాడు కానీ..ఇన్సైడ్స్పోర్ట్తో మాట్లాడుతూ.. ‘‘అభిషేక్ శర్మకు చెప్పీ చెప్పీ నేను విసిగిపోయాను. ఆటను తేలికగా తీసుకోవద్దని అతడికి ఎన్నోసార్లు మెసేజ్లు పెట్టాను. అందుకు బదులుగా.. ‘ఒకే సర్’ అని సమాధానమిస్తాడు.అలా అయితే ఫెయిలై పోతావుమైదానంలో అడుగుపెట్టిన తర్వాత షరా మమూలే. అతడి తీరు నాకు ఏమాత్రం నచ్చడం లేదు. సింగిల్, డబుల్, బౌండరీ అని ఉంటాయి. కానీ ప్రతిసారి బంతిని గాల్లోకి లేపి సిక్సరే బాదుతానంటే ఎలా?.. మైదానంలో ఉన్న ప్రేక్షకులను అలరించేందుకు ప్రతిసారి సిక్స్ బాదితే నువ్వు విఫలమైపోతావు’’ అంటూ యోగ్రాజ్ సింగ్ అభిషేక్ శర్మను ఘాటుగా విమర్శించాడు.కాగా ఇటీవల సొంతగడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో అభిషేక్ శర్మ విఫలమయ్యాడు. హ్యాట్రిక్ డకౌట్ల తర్వాత రెండు హాఫ్ సెంచరీలతో ఫర్వాలేదనిపించాడు. ముఖ్యంగా న్యూజిలాండ్తో ఫైనల్లో అర్ధ శతకం బాదడంతో అతడిపై విమర్శల జడి కాస్త తగ్గింది. మొత్తానికి భారీ అంచనాలతో తొలిసారి వరల్డ్కప్ బరిలో దిగిన అభిషేక్ శర్మ ఎనిమిది ఇన్నింగ్స్లో కలిపి 141 పరుగులు చేయగలిగాడు. ప్రస్తుతం ఐపీఎల్-2026 టోర్నీలో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఈ లెఫ్టాండర్ బ్యాటర్ బరిలోకి దిగాడు.చదవండి: IPL 2026: బంగ్లాదేశ్ యూటర్న్.. కీలక ప్రకటన -
సన్రైజర్స్పై ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్ 2026 ఓపెనింగ్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ ఘన విజయం సాధించింది. సన్రైజర్స్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లలో ఊదేసి, 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలింగ్లో డఫీ (4-0-22-3).. బ్యాటింగ్లో పడిక్కల్ (26 బంతుల్లో 61; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), విరాట్ కోహ్లి (38 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అదరగొట్టారు. అంతకుముందు ఇషాన్ కిషన్ (38 బంతుల్లో 80; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం, అనికేత్ వర్మ (18 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపుల కారణంగా సన్రైజర్స్ భారీ స్కోర్ చేసింది. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన ఆర్సీబీఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఆర్సీబీ వరుస బంతుల్లో (2,3) వికెట్లు కోల్పోయింది. డేవిడ్ పేన్ వరుసగా రజత్ పాటిదార్ (31), జితేశ్ శర్మ (0)ను ఔట్ చేశాడు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలవాలంటే 45 బంతుల్లో 39 పరుగులు చేయాలి. రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ8.4వ ఓవర్-110 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. విధ్వంసకర అర్ద శతకం బాదిన పడిక్కల్ (26 బంతుల్లో 61; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) హర్ష్ దూబే బౌలింగ్లో క్లాసెన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ202 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 9 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. ఉనద్కత్ బౌలింగ్లో క్లాసెన్ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ పట్టడంతో ఫిల్ సాల్ట్ (8) ఔటయ్యాడు. అయితే సాల్ట్ తర్వాత క్రీజ్లోకి వచ్చిన పడిక్కల్ (11 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తొలి బంతి నుంచే ఎస్ఆర్హెచ్ బౌలర్లపై ఎదురుదాడి ప్రారంభించాడు. అతనికి జతగా విరాట్ కోహ్లి (17 నాటౌట్) క్రీజ్లో ఉన్నాడు. 4.3 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 61-1గా ఉంది.ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే..?వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయినా ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్ (80) విధ్వంసం.. క్లాసెన్ క్లాస్ (31), ఆఖర్లో అనికేత్ వర్మ (43) మెరుపుల కారణంగా ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. హెడ్ 11, అభిషేక్ 7, నితీశ్ కుమార్ రెడ్డి 1, సలీల్ అరోరా 9, హర్ష్ దూబే 3, హర్షల్ పటేల్ డకౌట్ కాగా.. డేవిడ్ పేన్ 6, ఉనద్కత్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో డఫీ, రొమారియో షెపర్డ్ చెరో 3 వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, సుయాశ్ శర్మ తలో వికెట్ తీశారు. ఇషాన్ కిషన్ ఔట్15.6వ ఓవర్- 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి ఇషాన్ కిషన్ ఔటయ్యాడు. అభినందన్ సింగ్ బౌలింగ్లో సాల్ట్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో పెవిలియన్కు చేరాడు. 16 ఓవర్ల తర్వాత ఎస్ఆర్హెచ్ స్కోర్ 155-6గా ఉంది. ఐదో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్14.3వ ఓవర్- 137 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ కోల్పోయింది. సుయాశ్ శర్మ బౌలింగ్లో పడిక్కల్కు క్యాచ్ ఇచ్చి సలీల్ అరోరా (9) ఔటయ్యాడు.నాలుగో వికెట్ కోల్పోయిన సన్రైజర్స్13.1వ ఓవర్లో సన్రైజర్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. అద్భుతంగా ఆడుతున్న హెన్రిచ్ క్లాసెన్ (31) రొమారియో షెపర్డ్ బౌలింగ్లో ఫిల్ సాల్ట్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో పెవిలియన్కు చేరాడు. ఇషాన్ కిషన్కు (72) జతగా సలీల్ అరోరా క్రీజ్లోకి వచ్చాడు. 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్ఎస్ఆర్హెచ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. డఫీ ఎస్ఆర్హెచ్ను దారుణంగా దెబ్బకొట్టాడు. 3వ ఓవర్లో ఓపెనర్లు అభిషేక్, హెడ్ వికెట్లు తీసిన ఇతను.. ఐదో ఓవర్ తొలి బంతికే నితీశ్కుమార్ రెడ్డిని (1) పెవిలియన్కు పంపాడు. హెడ్ ఔట్.. 23 పరుగులకే ఓపెనర్లు డౌన్23 పరుగులకే (3 ఓవర్లు) ఎస్ఆర్హెచ్ ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. డేంజరెస్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ (11) డఫీ బౌలింగ్లో సాల్ట్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. అభిషేక్ ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ 18 పరుగుల వద్ద (2.1వ ఓవర్) తొలి వికెట్ కోల్పోయింది. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ (7) జేకబ్ డఫీ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి వికెట్ కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య ఇవాల్టి (మార్చి 28) మ్యాచ్తో ఐపీఎల్ 2026 ప్రారంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.తుది జట్లు..ఆర్సీబీ: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మసన్రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్/వికెట్కీపర్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ -
ఇంగ్లండ్ క్రికెట్కు భారీ దెబ్బ
ఇంగ్లండ్ క్రికెట్కు భారీ దెబ్బ తగిలింది. ఆ దేశ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ కొంతకాలం ప్రొఫెషనల్ క్రికెట్కు దూరంగా ఉండనున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న కౌంటీ సీజన్కు ముందు ఈ వార్త వెలువడింది. స్టోక్స్ కౌంటీ జట్టు (డర్హమ్) కోచ్ ర్యాన్ క్యాంప్బెల్ ఈ విషయాన్ని వెల్లడించాడు.అతని మాటల్లో.. స్టోక్స్ త్వరలో ప్రారంభం కానున్న కౌంటీ సీజన్కు అందుబాటులో ఉండాల్సింది. కానీ వైద్యులు అతనికి అనుమతి ఇవ్వలేదు. జూన్లో న్యూజిలాండ్తో జరిగే టెస్ట్ సిరీస్కు కూడా అతను అందుబాటులో ఉండవపోవచ్చు.క్యాంప్బెల్ ఇచ్చిన ఈ సమాచారం మేరకు స్టోక్స్ సమీప భవిష్యత్తులో క్రికెట్ ఆడటం కష్టమేనని స్పష్టమవుతుంది. స్టోక్స్ ఇటీవల నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బంతి ముఖానికి తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. దీని వల్ల అతని ముఖానికి శస్త్రచికిత్స కూడా జరిగింది. గాయమైన ముఖంతో స్టోక్స్ పెట్టిన పోస్ట్ సోషల్మీడియాలో వైరలైంది.స్టోక్స్ చివరిగా జనవరి 8న సిడ్నీలో జరిగిన యాషెస్ టెస్ట్లో ఆడాడు. ఆ మ్యాచ్కు ముందు కూడా అతను గాయపడ్డాడు. వరుస గాయాలు అతని కెరీర్ను సందిగ్దంలో పడేశాయి. స్టోక్స్ వ్యక్తిగతంగా, నాయకుడిగా విఫలం కావడంతో ఇంగ్లండ్ ఇటీవలి యాషెస్ సిరీస్ను 1-4తో కోల్పోయింది. ఈ దారుణ పరాభవం తర్వాత కూడా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు స్టోక్స్ను టెస్ట్ కెప్టెన్గా కొనసాగించాలని నిర్ణయించుకుంది. అయితే, తాజా గాయం స్టోక్స్ కెరీర్ను ప్రశ్నార్థకంగా మర్చేసింది.ఆటకు దూరంగా ఉన్నా, స్టోక్స్ ఇంగ్లండ్ క్రికెట్కు తన వంతు సహకారం అందిస్తూనే ఉన్నాడు. ఇంగ్లండ్ లయన్స్ జట్టుకు అతను కోచ్గా సేవలందిస్తున్నాడు. -
ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్.. గెలిచేది ఆ జట్టే!
ఐపీఎల్-2026 సీజన్కు సర్వం సిద్దమైంది. మరి కాసేపట్లో ఈ ధనాధన్ క్రికెట్ లీగ్కు తెరలేవనుంది. తొలి మ్యాచ్లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.అయితే ఈ మ్యాచ్కు ముందు భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలి మ్యాచ్లో ఆర్సీబీపై ఎస్ఆర్హెచ్ పై చేయి సాధించే అవకాశముందని పఠాన్ జోస్యం చెప్పాడు. ఎస్ఆర్హెచ్ కంటే ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ కాస్త వీక్గా కన్పిస్తోందని అతడు అభిప్రాయపడ్డారు.కాగా ఈ ఏడాది సీజన్ ఫస్ట్హాఫ్ సీజన్కు జోష్ హాజిల్వుడ్, నువాన్ తుషారాలు గాయం కారణంగా దూరమయ్యారు. అయితే ఎస్ఆర్హెచ్కు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ దూరమయ్యాడు. అయినప్పటికి జయదేవ్ ఉనద్కట్, హర్షల్ పటేల్ వంటి సీనియర్ బౌలర్లు అందుబాటులో ఉన్నారు.గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆర్సీబీ బౌలింగ్ పరంగా కాస్త బలహీనంగా కన్పిస్తోంది. ముఖ్యంగా హేజిల్వుడ్, యశ్ దయాల్ పేస్ బౌలర్ల సేవలను ఆర్సీబీ కోల్పోయింది. కాబట్టి ఈ మ్యాచ్లో బెంగళూరుపై ఎస్ఆర్హెచ్ పైచేయి సాధిస్తుందని నేను భావిస్తున్నాను.ఆర్సీబీ తమ తొలి మ్యాచ్నే సొంతమైదానంలో ఆడుతామని అస్సలు ఊహించిండదు. చిన్నస్వామి స్టేడియం బౌండరీలు చాలా చిన్నవి. ఇరు జట్లకు స్పిన్నర్లు కీలకం మారనున్నారు. ఎస్ఆర్హెచ్ మరి స్పిన్నర్గా ఎవరిని ఆడిస్తుందో చూడాలి. ఏదేమైనప్పటికి ఎస్ఆర్హెచ్కే గెలిచే అవకాశాలు ఉన్నాయని పఠాన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నారు.కాగా ఎస్ఆర్హెచ్ జట్టులో హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, జీషాన్ అన్సారీ వంటి క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారు. జీషాన్ అన్సారీ గత సీజన్లో ఆడగా.. దూబే, శివాంగ్లకు ఇదే తొలిసారి. దీంతో ఎస్ఆర్హెచ్ మేనెజ్మెంట్ మరి ఎవరికి తుది జట్టులో చోటు ఇస్తుందా? అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ప్యాట్ కమ్మిన్స్ స్ధానంలో ఇంగ్లీష్ ఆల్రౌండర్ బ్రైడన్ కార్స్కు చోటు దక్కే అవకాశముంది.చదవండి: IPL 2026: చరిత్రకు అడుగు దూరంలో భువనేశ్వర్ కుమార్ -
IPL 2026: పూర్తి షెడ్యూల్.. కొత్తగా వచ్చిన ప్లేయర్ల లిస్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 టోర్నీకి రంగం సిద్ధమైంది. ఆర్సీబీ- సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య బెంగళూరు వేదికగా ఈ మెగా ఈవెంట్కు శనివారం తెరలేవనుంది. మరి క్యాష్ రిచ్ లీగ్కు సంబంధించిన పూర్తి షెడ్యూల్.. గాయాల వల్ల తప్పుకొన్న ఆటగాళ్లు.. వారి స్థానాన్ని భర్తీ చేసిన ప్లేయర్లు, ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ తదితర వివరాలు తెలుసుకుందామా?ఈసారి ఐపీఎల్కు దూరమైన ఆటగాళ్లు వీరే👉హర్షిత్ రాణా (ఇండియా)- కోల్కతా నైట్ రైడర్స్- మోకాలి సర్జరీ👉ఆకాశ్ దీప్ (ఇండియా)- కోల్కతా నైట్ రైడర్స్- వెన్ను నొప్పి👉ముస్తాఫిజుర్ రహమాన్ (బంగ్లాదేశ్)- కోల్కతా నైట్ రైడర్స్- బీసీసీఐ ఆదేశాల మేరకు 👉సామ్ కర్రాన్ (ఇంగ్లండ్)- రాజస్తాన్ రాయల్స్- గజ్జల్లో గాయం👉నాథన్ ఎల్లిస్ (ఆస్ట్రేలియా)- చెన్నై సూపర్ కింగ్స్- తొడ కండరాల గాయం👉జాక్ ఎడ్వర్డ్స్ (ఆస్ట్రేలియా)- సన్రైజర్స్ హైదరాబాద్- కాలి గాయం👉పృథ్వీరాజ్ ఎర్రా (ఇండియా)- గుజరాత్ టైటాన్స్- గాయంఎవరి స్థానంలో ఎవరు?👉హర్షిత్ రాణా స్థానంలో నవ్దీప్ సైనీ👉ఆకాశ్ దీప్ స్థానంలో సౌరభ్ దూబే👉ముస్తాఫిజుర్ రహమాన్ స్థానంలో బ్లెస్సింగ్ ముజర్బానీ👉నాథన్ ఎల్లిస్ స్థానంలో స్పెన్సర్ జాన్సన్👉జాక్ ఎడ్వర్డ్స్ స్థానంలో డేవిడ్ పైన్👉పృథ్వీరాజ్ ఎర్రా స్థానంలో కుల్వంత్ ఖెజ్రోలియా. -
IPL 2026: భారత మీడియాపై ధ్వజమెత్తిన స్టార్క్
ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్, ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ భారత మీడియాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. ఐపీఎల్ 2026 నేపథ్యంలో తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ఇండియన్ మీడియాపై చిందులేశాడు. తాను ప్రీ-సీజన్ శిక్షణా శిబిరానికి హాజరు కాకపోవడానికి కారణాలు వెల్లడిస్తూ.. ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యానికి, అభిమానులకు క్షమాపణలు చెప్పాడు.అసలేం జరిగిందంటే.. స్టార్క్ ఐపీఎల్ 2026 ప్రీ-సీజన్ శిక్షణా శిబిరానికి హాజరుకాలేదు. ఈ గైర్హాజరు వెనుక కారణాలపై గత కొన్ని రోజులుగా అనేక ఊహాగానాలు వినిపించాయి. కొందరు క్రికెట్ ఆస్ట్రేలియా అతనికి NOC ఇవ్వలేదని.. వర్క్లోడ్ కారణంగా ఐపీఎల్ ఆడకూడదన్న కండీషన్ పెట్టిందని వార్తలు వచ్చాయి. అయితే, స్టార్క్ స్వయంగా ఈ ఊహాగానాలకు తెరదించాడు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ.. తనకు భుజం మరియు మోచేతి గాయాలు ఉన్నాయని, వాటి తీవ్రతను ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నానని వెల్లడించాడు. భారత మీడియాలోని కొన్ని వర్గాలకు నా శరీరం గురించి నాకన్నా ఎక్కువ తెలిసినట్లు ప్రచారం చేస్తున్నాయని చురకలంటించాడు. నిజానికి నేను ప్రస్తుతం రిహాబ్లో ఉన్నాను. ఈ గాయం ఢిల్లీ జట్టుకు, అభిమానులకు అసౌకర్యం కలిగించి ఉండవచ్చు. దీనికి నేను క్షమాపణ చెబుతున్నానని వివరణ ఇచ్చాడు. మేనేజ్మెంట్తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని, వీలైనంత త్వరగా జట్టులో చేరేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చాడు.కాగా, ఈ ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్ను ఏప్రిల్ 1న లక్నో సూపర్ జెయింట్స్తో ఆడనుంది. ఈ మ్యాచ్లో స్టార్క్ లేని లోటు జట్టుకు పెద్ద సవాలుగా మారనుంది. కైల్ జేమీసన్, లుంగి ఎంగిడి, దుష్మంత చమీరా వంటి విదేశీ పేస్ బౌలింగ్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ.. స్టార్క్ లేని లోటు భర్తీ చేయలేనిదని మేనేజ్మెంట్ భావిస్తుంది. -
చరిత్రకు అడుగు దూరంలో భువనేశ్వర్ కుమార్
ఐపీఎల్-2026 సీజన్ ఆరంభ మ్యాచ్లో తలపడేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్లో ఆర్సీబీ తరపున బరిలోకి దిగుతున్న భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.ఆర్సీబీపై భువీ కేవలం రెండు వికెట్లు పడగొడితే.. ఐపీఎల్లో 200 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి ఫాస్ట్ బౌలర్గా చరిత్ర సృష్టిస్తాడు. ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటివరకు కేవలం యుజువేంద్ర చాహల్ (221 వికెట్లు) మాత్రమే 200 వికెట్ల మార్కును దాటాడు. ఇప్పుడు భువనేశ్వర్ కూడా చహల్ సరసన చేరేందుకు సిద్దమయ్యాడు. కాగా ఈ ఏడాది సీజన్కు ఫస్ట్హాఫ్కు స్టార్ పేసర్లు జోష్ హాజిల్వుడ్లు అందుబాటులో లేకపోవడంతో ఆర్సీబీ బౌలింగ్ బాధ్యత అంతా భువీపైనే పడింది. పవర్ప్లేతో వికెట్లు తీయడంతో పాటు డెత్ ఓవర్లలో పరుగులను కట్టడి చేయడంలోనూ భువీ కీలకం కానున్నాడు. ఇప్పటివరకు భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్లో మొత్తంగా 190 మ్యాచ్లు 198 వికెట్లు పడగొట్టాడు.ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు వీరేయజ్వేంద్ర చాహల్: 221 వికెట్లు భువనేశ్వర్ కుమార్: 198 వికెట్లు సునీల్ నరైన్ : 192 వికెట్లుపీయూష్ చావ్లా : 192 వికెట్లు రవిచంద్రన్ అశ్విన్ : 187 వికెట్లుచదవండి: ఇదేం పద్ధతి?.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఓవరాక్షన్.. నెటిజన్లు ఫైర్ -
ఇదేం పద్ధతి?.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఓవరాక్షన్
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ముస్తాక్ అహ్మద్పై నెటిజన్లు మండిపడుతున్నారు. మీకసలు కామన్సెన్స్ ఉందా? అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డొమినిక్ కార్క్ పట్ల ముస్తాక్ ప్రవర్తించిన తీరే ఇందుకు కారణం.అసలు విషయం ఏమిటంటే.. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో క్వెటా గ్లాడియేటర్స్- కరాచీ కింగ్స్కు మధ్య మ్యాచ్కు ముందు పిచ్ పరిస్థితుల గురించి చర్చించే క్రమంలో డొమినిక్, ముస్తాక్ మైదానంలోకి వచ్చారు.నువ్వు జీనియస్ఈ క్రమంలో పిచ్ను చూపిస్తూ.. ‘నువ్వు జీనియస్. రెండు చేతులతోనూ బంతిని తిప్పేయగలవు. ఇక్కడ ఆడం జంపా ఉన్నాడు. ఈ పిచ్పై బౌలింగ్ చేసే విషయంలో అతడికి నువ్వు ఎలాంటి సలహాలు ఇస్తావు?’ అని డొమినిక్ ముస్తాక్ను అడిగాడు.ఇందుకు బదులుగా.. ‘ఆడం జంపా కంటే ముందు నీకు ఓ విషయం చెప్పాలి. టెస్టు, వన్డే, ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో నేను ఎన్నిసార్లు నిన్ను అవుట్ చేశానో గుర్తుందా? నాకైతే ఆ విషయం చాలా బాగా గుర్తుంది’ అని ముస్తాక్ పొంతనలేని సమాధానం ఇచ్చాడు.నన్ను ఒకసారి అవుట్ చేశావుఅయితే, డొమినిక్ కార్క్ .. ‘ముషీ.. నువ్వు నన్ను ఒకసారి అవుట్ చేశావు’ అని బదులిచ్చాడు. అయితే, ముస్తాక్ మాత్రం.. ‘లేదు.. లేదు.. చాలాసార్లు నిన్ను అవుట్ చేశాను’ అని పునరుద్ఘాటించాడు.ఇందుకు డొమినిక్ కార్క్.. ‘నేనైతే బ్యాటింగ్ చేయలేను కదా!.. నన్ను అవుట్ చేసే విషయం గురించి ఇప్పుడెందుకు గానీ.. టాపార్డర్పై దృష్టి పెట్టి ఉంటే బాగుండేది’ అని కౌంటర్ వేశాడు.ముందు ఈ పిచ్ గురించి మాట్లాడదామా?అయితే, ముస్తాక్ మరోసారి అదే టాపిక్ తీసుకువచ్చాడు. ‘నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. నువ్వు ఇంగ్లండ్ తరఫున ఆల్రౌండర్గా ఆడేవాడివి’ అని పేర్కొన్నాడు. దీంతో డొమినిక్కు చిర్రెత్తుకు వచ్చింది. ‘మనం ముందు ఈ పిచ్ గురించి మాట్లాడదామా? ఆడం జంపా గురించే నేను మాట్లాడదలచుకున్నాను’ అని బదులిచ్చాడు.వీరిద్దరి సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో డొమినిక్ హుందాగా పిచ్ గురించి మాట్లాడుతుంటే.. ముస్తాక్ మాత్రం అతడిని తక్కువ చేసే విధంగా పాత విషయాలు తవ్వడం ఏమిటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.ఇదేం పద్ధతి?‘ఇదేం పద్ధతి? కాస్తైనా సంస్కారం లేదా? పిచ్ గురించి అభిప్రాయం చెప్పమంటే ఇలా మాట్లాడటం సరికాదు’ అని చురకలు అంటిస్తున్నారు. కాగా ఇంగ్లండ్ తరఫున 37 టెస్టులు, 32 వన్డేలలో కలిపి పేస్ బౌలర్ డొమినిక్ కార్క్ 172 వికెట్లు కూల్చాడు. మరోవైపు.. ముస్తాక్ పాక్ తరఫున 52 టెస్టులు, 144 వన్డేలుఆడి 300కు పైగా వికెట్లు పడగొట్టాడు.చదవండి: PSL: పాకిస్తాన్కు మరో షాక్!.. ఈసారి..🚨🚨Mushtaq Ahmed embarrassed dominic cork on camera- i meam he was just simply asking him a question and all of sudden Mushtaq Ahmed just embarrassed him,• Lack of manners or what ? pic.twitter.com/5Uw0VcFGX0— SheR•ALI (@Sher__Ali) March 27, 2026 -
'రాసిపెట్టుకోండి.. ఆర్సీబీపై అతడు విధ్వంసం సృష్టిస్తాడు'
ఐపీఎల్-2026 సీజన్ మరో కొన్ని గంటల్లో షురూ కానుంది. తొలి మ్యాచ్లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అద్భుతమైన ప్రదర్శన చేసే అవకాశముందని అశ్విన్ జోస్యం చెప్పాడు. క్లాసెన్ గతేడాది నుంచి చెప్పుకోదగ్గ ప్రదరన్శన చేయలేకపోతున్నాడు. ఐపీఎల్-2025తో పాటు సౌతాఫ్రికా టీ20 లీగ్లోనూ క్లాసెన్ నిరాశపరిచాడు.గత 20 నెలలలో 65 మ్యాచ్లు ఆడిన క్లాసెన్.. 28.80 సగటుతో కేవలం 1440 పరుగులు మాత్రమే సాధించాడు. అతడి ఇన్నింగ్స్లలో ఒక సెంచరీ, ఏడు అర్ధశతకాలు ఉన్నాయి. దీంతో ఈ ఏడాది ఐపీఎల్లో క్లాసెన్ ఎలా రాణిస్తాడోనని అభిమానులు అతృతగా ఎదురు చూస్తున్నారు.తొలి మ్యాచ్లో ఓ అద్భుతం జరుగుతుందని అనుకుంటున్నాను. గత 18 నెలలగా పెద్దగా రాణించకపోయిన హెన్రిచ్ క్లాసెన్.. ఈ మ్యాచ్లో "గుర్తుండిపోయే ఇన్నింగ్స్" ఆడే అవకాశముంది. అదేవిధంగా ఆర్సీబీ తరపున జాకబ్ బెతల్ కీలక ఆటగాడిగా నిలవనున్నాడని తన యూట్యూబ్ ఛానల్లో అశ్విన్ పేర్కొన్నాడు.కాగా చిన్నస్వామి స్టేడియంలో క్లాసెన్కు అద్భుతమైన రికార్డు ఉంది. ఇదే వేదికగా ఐపీఎల్-2023లో ఆర్సీబీపై అతడు కేవలం 51 బంతుల్లోనే సెంచరీ చేశాడు. మరోవైపు జాకబ్ బెతల్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్కప్-2026లో భారత్తో జరిగిన సెమీఫైనల్లో బెతల్ విధ్వంసకర సెంచరీతో సత్తాచాటాడు.చదవండి: పెళ్లిపీటలెక్కనున్న కావ్య మారన్? -
ముంబై ఇండియన్స్కు ఓ గుడ్ న్యూస్.. ఓ బ్యాడ్ న్యూస్
ఐపీఎల్-2026 సీజన్కు ముందు ముంబై ఇండియన్స్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ అందింది. మొన్నటివరకు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో ఉన్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి ముంబై జట్టులో చేరాడు. వాంఖడే స్టేడియంలో ముంబై ట్రైనింగ్ క్యాంపులో బుమ్రా కన్పించకపోవడంతో ఏమైనా గాయపడ్డాడా? అన్న అనుమానాలు తలెత్తాయి.కానీ బుమ్రా ఇప్పుడు జట్టుతో చేరి ప్రాక్టీస్ను మొదలు పెట్టాడు. మార్చి 29న కోల్కతా నైట్రైడర్స్తో జరగనున్న ముంబై తొలి మ్యాచ్లో బుమ్రా బరిలోకి దిగనున్నాయి. అయితే ఈ మ్యాచ్కు కీలక ఆటగాళ్లు విల్ జాక్స్, మిచెల్ శాంట్నర్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ను పూర్తి చేసుకున్న శాంట్నర్ ఇంకా న్యూజిలాండ్లోనే ఉన్నాడు.మరోవైపు టీ20 ప్రపంచకప్-2026లో నాలుగు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న విల్ జాక్స్ కూడా ఇంకా ముంబై జట్టుతో చేరలేదు. దీంతో తుది జట్టులో కరేబియన్ ఆల్రౌండర్ షేర్ఫన్ 4 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకుని ఫామ్లో ఉన్నాడు. అతడి స్థానంలో షెర్ఫేన్ రూథర్ఫోర్డ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.తొలి మ్యాచ్లో ముంబై గెలుస్తుందా?కాగా ముంబై ఇండియన్స్కు తొలి మ్యాచ్ గండం పొంచి ఉంది. 2012 నుండి ఇప్పటివరకు ఆ జట్టు సీజన్ లో ఆడిన తొలి మ్యాచ్లో విజయం సాధించలేదు. ఈసారి ఎలాగైనా గెలిచి ఈసెంటిమెంట్ను బ్రేక్ చేయాలని ముంబై భావిస్తోంది. బుమ్రా, సూర్యకుమార్, హార్దిక్, రోహిత్ వంటి స్టార్ ఆటగాళ్లతో ముంబై ఇండియన్స్ పటిష్టంగా కన్పిస్తోంది.చదవండి: పెళ్లిపీటలెక్కనున్న కావ్య మారన్? -
IPL 2026: బంగ్లాదేశ్ యూటర్న్.. కీలక ప్రకటన
బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసారాలపై తమ దేశంలో ఎలాంటి నిషేధం లేదని ప్రకటించింది. బంగ్లాదేశ్ సమాచార, ప్రసార శాఖా మంత్రి జాహిర్ ఉద్దీన్ స్వపన్ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించాడు.కాగా గత కొంతకాలంగా భారత్- బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి బంగ్లా ఫాస్ట్బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ను తొలగించాలని భారత్లో డిమాండ్లు రాగా.. బీసీసీఐ సానుకూలంగా స్పందించింది.తమ జట్టులో ఉన్న ముస్తాఫిజుర్ను తొలగించాల్సిందిగా కోల్కతా నైట్ రైడర్స్ను ఆదేశించింది. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) టీ20 ప్రపంచకప్-2026 వేదికపై అభ్యంతరం లేవనెత్తింది. భారత్లో కాకుండా.. పాకిస్తాన్ కోసం ఏర్పాటు చేసిన తటస్థ వేదికైన శ్రీలంకలోనే తాము కూడా మ్యాచ్లు ఆడతామని పట్టుబట్టింది.భారత్లో తమ ఆటగాళ్లకు భద్రత ఉండదంటూ గగ్గోలు పెట్టగా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) బీసీబీ అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో బంగ్లా వరల్డ్కప్ టోర్నీ నుంచి తప్పుకొంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ ప్రసారాలను బంగ్లాలో నిషేధిస్తూ అప్పటి తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.అయితే, తాజాగా ఎన్నికైన ప్రభుత్వం మాత్రం భారత్తో స్నేహం కావాలని.. బీసీసీఐతో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు ఇటీవలే సంకేతాలు ఇచ్చింది. క్రీడా శాఖా మంత్రి అమినుల్ హక్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ నేపథ్యంలో తాజాగా మరో మంత్రి జహీర్ ఉద్దీన్ స్వపన్ మాట్లాడుతూ..‘‘ఐపీఎల్ ప్రసారాల కోసం ఇంత వరకు ఎవరూ దరఖాస్తు చేయలేదు. మేము రాజకీయాలు, క్రీడలను కలపాలని అనుకోవడం లేదు. వాణిజ్యపరంగా మాకు ప్రయోజనం చేకూర్చే అంశాలపై దృష్టి సారిస్తాము.ఏదేని చానెల్ ఐపీఎల్ ప్రసారాల కోసం అనుమతి కోరితే తప్పక సానుకూలాంగా స్పందిస్తాం. ఎవరికీ మేము అడ్డుచెప్పము. ఒకవేళ స్టార్ స్పోర్ట్స్ ఐపీఎల్ను ఇక్కడ ప్రసారం చేయాలనుకుంటే అందుకు వారికి అనుమతి లభిస్తుంది. ఏ చానెల్కైనా మేము అనుమతినిస్తాం’’ అని తెలిపాడు.కాగా బీసీసీఐతో సంబంధాలు తెంచుకుంటే బంగ్లాదేశ్ బోర్డు, ఆటగాళ్లు ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టపోవాల్సి ఉంటుంది. ఇప్పటికే టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలిగి భారీ మూల్యం చెల్లించిన బంగ్లా క్రికెట్.. ఇకపై సత్సంబంధాలు కొనసాగించడం ద్వారా ఆర్థికంగా లబ్ది పొందాలనే యోచనలో ఉంది. తెగేదాకా లాగితే మొదటికే మోసం వస్తుందేమోనన్న భయంతో ఇలా యూటర్న్లు తీసుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
పెళ్లిపీటలెక్కనున్న కావ్య మారన్?
ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ వివాహం చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో మరోసారి హాట్టాపిక్గా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే ఆంశంపై అనిరుధ్ స్పందించిన తీరు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.గతేడాది జూన్లో కూడా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కావ్య-అనిరుధ్ కలిసి అమెరికాకు వెళ్లారనే వార్తలు కూడా నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే వీటిన్నటికి అనిరుధ్ ఒక్క సమాధానంతో చెక్ పెట్టాడు.పెళ్ళా? హాహా.. ప్లీజ్ గాయ్స్, కాస్త కూల్ అవ్వండి. ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయడం ఆపండి" అని ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు. అయితే తాజాగా ఓ సినిమా ప్రమోషన్లో అనిరుధ్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ తన పెళ్లి గురించి అడగగా.. అందుకు అనిరుధ్ "మళ్లీ ఇదేనా " అని అసహనంతో సమాధానమిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయారు.ఈ వార్తలను అతడు పూర్తిగా ఖండించకపోవడంతో ఇద్దరి మధ్య ఏదో ఉందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అయితే అటు కావ్య మారన్ నుంచి కానీ, ఇటు అనిరుధ్ కుటుంబం నుంచి కానీ వీరి వివాహం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.కావ్య పాప దృష్టి మొత్తం ఐపీఎల్-2026 సీజన్పైనే ఉంది. టోర్నీ ఆరంభ మ్యాచ్లో చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. మరోవైపు అనిరుధ్ వరుస సినిమాలో బీజీగా ఉన్నాడు.చదవండి: ఆమెను ఎందుకు రాణిలా ట్రీట్ చేస్తున్నారు: చిక్కుల్లో పాక్ క్రికెటర్ -
పాకిస్తాన్ క్రికెటర్కు ఊహించని షాక్
పాకిస్తాన్ పేసర్ నసీం షా చిక్కుల్లో పడ్డాడు. పాక్లోని పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ గురించి అతడు చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) నసీం షాకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.సీఎంను ఆహ్వానించిన పీసీబీఅసలేం జరిగిందంటే.. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) మార్చి 26న ఆరంభమైన సంగతి తెలిసిందే. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో జరిగిన ఆరంభ మ్యాచ్ వీక్షించాల్సిందిగా పీసీబీ పంజాబ్ సీఎం మరియం నవాజ్ను ఆహ్వానించింది. ఈ క్రమంలో లాహోర్ ఖలందర్స్, హైదరాబాద్ కింగ్స్మన్ జట్ల ఫ్రాంఛైజీ యజమానులకు పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ.. మరియంను పరిచయం చేశాడు.ఆమెను ఎందుకు రాణిలా ట్రీట్ చేస్తున్నారుఆ తర్వాత ఇరుజట్ల ఆటగాళ్లతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమెకు అత్యంత గౌరవం ఇవ్వడాన్ని తప్పుబట్టిన నసీం షా.. ‘లార్డ్స్ (ఇంగ్లండ్ మైదానం)లో రాణిలా.. ఇక్కడిలా ఈమెను ఎందుకు చూస్తున్నారు? ఎందుకింత హడావుడి?’ అని నసీం షా ఎక్స్ అకౌంట్లో రాసుకొచ్చాడు. దీంతో వివాదం చెలరేగింది.నా అకౌంట్ హ్యాక్ అయిందిఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు దిగిన నసీం షా.. తన సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయిందని.. తాను ఎవరినీ ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని స్పష్టం చేశాడు. అయితే, పీసీబీ మాత్రం నసీం షా చర్యను తీవ్రంగా పరిగణించింది. అతడు సెంట్రల్ కాంట్రాక్టు, మీడియా నిబంధనలు ఉల్లంఘించాడని.. అలాంటి ట్వీట్ చేయడానికి గల కారణం ఏమిటో తెలపాలంటూ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. కాగా పీఎస్ఎల్లో నసీం షా రావల్పిండి పిండిజ్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ఇక పాకిస్తాన్ తరఫున ఇప్పటికి 20 టెస్టులు, 34 వన్డేలు, 37 టీ20 మ్యాచ్లు ఆడాడు నసీం షా. 23 ఏళ్ల ఈ కుడిచేతి వాటం ఫాస్ట్బౌలర్ ఖాతాలో 60 టెస్టు వికెట్లు, 60 వన్డే వికెట్లు, 32 టీ20 వికెట్లు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్లో చివరగా పాక్కు ప్రాతినిథ్యం వహించాడు నసీం షా.చదవండి: PSL: పాకిస్తాన్కు మరో షాక్!.. ఈసారి.. -
IPL 2026: ఆరంభం రోజునే ఇషాన్ అరుదైన రికార్డు!
సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) కెప్టెన్ ఇషాన్ కిషన్ ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభ మ్యాచ్తోనే అరుదైన రికార్డు అందుకోనున్నాడు. ఇవాళ చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో ఎస్ఆర్హెచ్ అమీతుమీ తేల్చుకోనుంది. ప్రస్తుతం ఇషాన్ కిషన్ వయసు 27 సంవత్సరాల 253 రోజులు. దీంతో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ చరిత్రలో కెప్టెన్గా జట్టును నడిపించనున్న రెండో అత్యంత పిన్న వయస్కుడిగా ఇషాన్ కిషన్ నిలవ నున్నాడు. అంతేకాదు టీమిండియా తరఫున ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగాను ఇషాన్ నిలవనున్నాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో న్యూజిలాండ్ సీనియర్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ఉన్నాడు. 2018లో ఎస్ఆర్హెచ్కు కెప్టెన్గా వ్యవహరించినప్పుడు విలియ మ్సన్ వయసు 27 సంవత్సరాల 244 రోజులు. గతంలో శిఖర్ ధావన్, మనీష్పాండే, భువనేశ్వర్ కుమార్లు కూడా తక్కువ వయసులోనే ఎస్ఆర్హెచ్ కెప్టెన్లుగా వ్యవహరించారు. ఇక ఎస్ఆర్హెచ్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ వెన్ను నొప్పితో సీజన్ ఆరంభ మ్యాచ్లకు దూరమైన సంగతి తెలిసిందే. కమిన్స్ స్థానంలో ఇషాన్ కిషన్కు తాత్కాలికంగా నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పుతూ ఎస్ఆర్హెచ్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అయితే కమిన్స్ ఈ సీజన్లో మొదటి సగం మ్యాచ్లకు దూరమైనట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఖండించిన ఎస్ఆర్హెచ్ కోచ్ డేనియల్ వెటోరి కమిన్స్ ఆడడంపై స్పష్టతనిచ్చాడు. కమిన్స్ ఫిట్గానే ఉన్నాడని, మరో 10 నుంచి 12 రోజుల్లో బరిలోకి దిగనున్నట్లు పేర్కొన్నాడు. మరోవైపు కమిన్స్ ఫిట్నెస్పై క్రికెట్ ఆస్ట్రేలియా కూడా దృష్టి సారించిందని తెలిపాడు. వరుస గాయాలతో ఇప్పటికే యాషెస్, టీ20 ప్రపంచకప్కు కమిన్స్ దూరమైన సంగతి తెలిసిందే. ఇక ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్, లివింగ్స్టోన్, నితీశ్కుమార్రెడ్డిలతో పటిష్టంగా కనిపిస్తుంది. అయితే కమిన్స్ లేకపోవడంతో బౌలింగ్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్ సహా దేశవాలీ క్రికెటర్లు కీలకం కానున్నారు.చదవండి: వివాదంలో యువరాజ్ తండ్రి! -
అసలు నిన్ను గుర్తుపట్టనే లేదు: షాకైన నీతా అంబానీ
టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ గత కొంతకాలంగా ఫిట్నెస్పై దృష్టి సారించాడు. అంతర్జాతీయ క్రికెట్లో మరికొంతకాలం కెరీర్ పొడిగించుకునే క్రమంలో ఇప్పటికే దాదాపు పది కిలోల బరువు తగ్గాడు. అంతటితో ఆగకుండా మరింత సన్నబడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు.స్లిమ్గా మారిన రోహిత్ శర్మ ఈ క్రమంలో మునుపటి కంటే మరింత స్లిమ్గా మారిన రోహిత్ శర్మ లుక్ (Rohit Sharma Transformation) చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ సహ యజమాని నీతా అంబానీ సైతం రోహిత్లో వచ్చిన మార్పు చూసి ఫిదా అయ్యారు. కాగా ఐపీఎల్-2026 టోర్నీకి శనివారం తెరలేవనున్న సంగతి తెలిసిందే.బెంగళూరు వేదికగా ఆర్సీబీ- సన్రైజర్స్ (RCB vs SRH) మ్యాచ్తో టోర్నీ మొదలుకానుండగా.. మార్చి 29న ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ను ఎదుర్కోనుంది. ఈ క్రమంలో వాంఖడేలో ముంబై ఇండియన్స్ జట్టు ప్రాక్టీస్ చేస్తుండగా.. నీతా అంబానీ వచ్చి ఆటగాళ్లను పలకరించారు.నేనసలు నిన్ను గుర్తుపట్టనే లేదుఈ సందర్భంగా ముంబై కోచింగ్ సిబ్బంది, ఆటగాళ్లతో కరచాలనం చేసిన ఆమె.. రోహిత్ శర్మను చూసి షాకయ్యారు. ‘‘ఓరి దేవుడా!.. రోహిత్ నేనసలు నిన్ను గుర్తుపట్టనే లేదు. నువ్వు కుర్రాడిలా కనిపిస్తున్నావు’’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇందుకు రోహిత్ నవ్వులు చిందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వన్డేలలో కొనసాగుతున్న రోహిత్కాగా 38 ఏళ్ల రోహిత్ శర్మ ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికాడు. వన్డే వరల్డ్కప్-2027లొ టీమిండియాకు ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. కెప్టెన్ హోదాలో భారత్కు టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిళ్లను రోహిత్ అందించాడు. అయితే, చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత బీసీసీఐ అతడిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది. దీంతో ఆటగాడిగా జట్టులో కొనసాగుతున్నాడు రోహిత్. కాగా ముంబైకి ఐదుసార్లు టైటిల్ అందించిన దిగ్గజ కెప్టెన్ రోహిత్.. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా సారథ్యంలో జట్టులో కొనసాగుతున్నాడు.చదవండి: IPL 2026: కుర్ర క్రికెటర్లపైనే అందరి దృష్టి!Mrs. Nita Ambani met the squad during training ahead of the start of TATA IPL 2026! 💙 pic.twitter.com/r2Gy9NaDOc— Mumbai Indians (@mipaltan) March 27, 2026 -
యువరాజ్ తండ్రి వివాదాస్పద వ్యాఖ్యలు!
భారత మాజీ డాషింగ్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ వివాదంలో చిక్కుకున్నారు. లింగ వివక్షకు సంబంధించి ఘాటైన వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో పడ్డారు. ఆటగాళ్లు తమ కెరీర్కు వీడ్కోలు పలకడం వెనుక వారి ఇంటి మహిళలు, పిల్లలే ప్రధాన కారణమని పేర్కొనడం ఆసక్తి కలిగించింది. రిటైర్మెంట్కు ఫిట్నెస్తో సంబంధం ఉండదని, ఆటగాడి కెరీర్కు మహిళలు అడ్డురాకూడదని పేర్కొన్నారు. మీడియా చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగ్రాజ్ సింగ్ మాట్లాడుతూ.. ‘ 40 ఏళ్లు దాటిన తర్వాత మాకు వయసైపోతుందని చాలా మంది అనడం గమనిస్తున్నా. 30 ఏళ్ల తర్వాత మహిళలు ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నారు. అందుకే ఒక జిమ్ డైరెక్టర్గా నా జిమ్కు వచ్చే మహిళలకు, సీనియర్ సిటిజన్లకు ఫిట్నెస్పై దృష్టి సారించేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని నిర్ణయించుకున్నా. అయితే క్రీడల్లో మాత్రం ఆటగాళ్ల రిటైర్మెంట్కు కారణం మాత్రం వారి ఇంట్లో ఉండే మహిళలే అని చెప్పగలను. ఒక ఆటగాడికి ఫిట్నెస్ సమస్యలు మొదలైన తర్వాత అతడి భార్య సలహాలు ఇవ్వడం మొదలుపెడుతుంది. మీరు రిటైర్ అవ్వాల్సిన సమయం వచ్చిందని, కుటుంబాన్ని, పిల్లల్ని చూసుకోవాల్సిన సమయం ఆసన్నమైందంటూ చెబుతారు. కానీ నా దృష్టిలో ఒక గొప్ప అథ్లెట్ కెరీర్ విషయంలో మహిళలు తలదూర్చకూడదన్న విషయాన్ని గట్టిగా నమ్ముతాను. క్రీడాకారులకు ఫిట్నెస్తో సంబంధం లేదు. శక్తి ఉన్నంతవరకు ఆడాలన్నది నా అభిప్రాయం’ అని చెప్పుకొచ్చారు. అంతకముందు ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ కావాలంటూ వస్తున్న విమర్శలను యోగరాజ్ సింగ్ ఖండించారు. ధోని ఫిట్నెస్ స్థాయిని పరిగణలోకి తీసుకుంటే, అతడు మరో దశాబ్దం పాటు ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నాడు. కాగా ధోని పిక్క కండరాల గాయంతో ఐపీఎల్ 19వ సీజన్లో తొలి రెండు వారాల పాటు దూరమైనట్లు సీఎస్కే యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది.చదవండి: కుర్ర క్రికెటర్లపైనే అందరి దృష్టి! -
PSL: పాకిస్తాన్కు మరో షాక్!.. ఈసారి..
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై గత కొంతకాలంగా విమర్శల వర్షం కురుస్తోంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో పాక్ సూపర్-8 దశలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్ తర్వాత బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుకు దాదాపు పదకొండేళ్ల తర్వాత వన్డే సిరీస్ను కోల్పోయింది.ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు రషీద్ లతీఫ్ (Rashid Latif), అహ్మద్ షెజాద్ పాక్ బోర్డు యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ, సెలక్టర్ల అనుచిత నిర్ణయాల వల్లే పాక్ క్రికెట్ నాశనమవుతోందని మండిపడ్డారు.ఐపీఎల్తో పోటీపడి.. బొక్కబోర్లాఇదిలా ఉంటే.. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ద్వారా పాక్ బోర్డు మెరుగైన ఆదాయం వచ్చేది. అయితే, గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్కు పోటీగా పీఎస్ఎల్ షెడ్యూల్ను ఖరారు చేస్తోంది పీసీబీ. ఈ నేపథ్యంలో విదేశీ ఆటగాళ్లు ఎక్కువగా ఐపీఎల్ వైపే మొగ్గుచూపుతుండగా.. ఇక్కడ అమ్ముడుపోని ప్లేయర్లు పీఎస్ఎల్లో ఆడేందుకు వెళ్తున్నారు.పీఎస్ఎల్ను వీడి ఐపీఎల్లో..అయితే, ఐపీఎల్ జట్లలోని ఆటగాళ్లు గాయాలు, ఇతరత్రా కారణాల వల్ల దూరమైతే పీఎస్ఎల్ను వీడి.. ఐపీఎల్లో చేరడానికి వారు ఏమాత్రం వెనుకాడటం లేదు. జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజర్బానీ పీఎస్ఎల్ను వీడి ఐపీఎల్లో కేకేఆర్ జట్టులో చేరగా.. శ్రీలంక కెప్టెన్ దసున్ షనక సైతం ఇదే బాటలో నడిచాడు.సామ్ కర్రాన్ స్థానంలో షనక రాజస్తాన్ రాయల్స్ జట్టులో చేరాడు. మరోవైపు.. ఆస్ట్రేలియా పేసర్ స్పెన్సర్ జాన్సన్ నాథన్ ఎల్లిస్ స్థానంలో సీఎస్కేలోకి వచ్చాడు. ఓవైపు పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వల్ల స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్లే నిర్వహిస్తున్న పీసీబీకి.. ఆటగాళ్లు అర్ధంతరంగా వెళ్లిపోవడం తలనొప్పిగా మారింది.కామెంటేటర్లు సైతం అదే బాటలోఈ నేపథ్యంలో ఇలాంటి ఆటగాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యామని పీసీబీ లీకులు ఇచ్చింది. అయినప్పటికీ పీఎస్ఎల్ను వీడి ఐపీఎల్లో చేరే ఆటగాళ్లు వెనుకడుగు వేయడం లేదు. ఇక ఈ జాబితాలో ఇప్పుడు కామెంటేటర్లు కూడా చేరినట్లు తెలుస్తోంది.ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నిక్ నైట్ తొలుత పీఎస్ఎల్ కామెంట్రీ ప్యానెల్లో ఉన్నాడు. తాజాగా అతడి పేరు ఐపీఎల్ కామెంట్రీ ప్యానెల్లో దర్శనమిచ్చింది. దీనర్థం ఇప్పుడు కామెంటేటర్లు కూడా పీఎస్ఎల్ వీడి ఐపీఎల్తో జట్టు కడుతున్నారు.స్టార్ స్పోర్ట్స్ ఐపీఎల్ కామెంట్రీ ప్యానెల్లో భారత దిగ్గజాలు సునిల్ గావస్కర్, రవిశాస్త్రి, వీరేందర్ సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్ తదితరులతో కలిసి నిక్ నైట్ వ్యాఖ్యానం చేయనున్నాడు. కాగా మార్చి 26న పీఎస్ఎల్ ఆరంభం కాగా.. మార్చి 28న ఐపీఎల్-2026 సీజన్కు తెరలేవనుంది. చదవండి: IPL 2026: ధోనికి గాయం.. ఐపీఎల్కు దూరం! -
IPL 2026: కుర్ర క్రికెటర్లపైనే అందరి దృష్టి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎందరో అనామక క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చింది. ఇవాళ టీమిండియా స్టార్లుగా చెలామణి అవుతున్న రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ సహా ఎందరో క్రికెటర్లకు లైఫ్ ఇచ్చింది కూడా ఐపీఎల్లే అనడంలో సందేహం లేదు. 2008 నుంచి 18 సీజన్ల పాటు నిరంతరాయంగా సాగుతూ వస్తున్న ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి మరో కొద్ది గంటలే మిగిలి ఉంది. గత సీజన్లో బీహార్ చిన్నోడు వైభవ్ సూర్యవంశీ, అయూశ్ మాత్రె రూపంలో కొత్తనీరు భారత క్రికెట్లోకి వచ్చి చేరింది. ఇక ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్న 19వ సీజన్లోనూ అలా రాణించగల సమర్థులెవరన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం.జూనియర్ మిల్లర్ సౌతాఫ్రికా ఆల్రౌండర్ డేవిడ్ మిల్లర్ తరహా బ్యాటింగ్ శైలిని పోలి ఉండే 20 ఏళ్ల అమేథీ కుర్రాడు ప్రశాంత్ వీర్పై ఈ సీజన్లో భారీ అంచనాలున్నాయి. గత రెండేళ్లుగా ఆశించినంతంగా ఫలితాలు రాకపోవడంతో జట్టులో యువ ఆటగాళ్లను నింపేందుకు చెన్నై సూపర్కింగ్స్ ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే వేలంలో ప్రశాంత్ వీర్ను ఏకంగా రూ. 14.20 కోట్లు పెట్టి దక్కించుకోవడం ఆశ్చర్యపరిచింది. దేశవాలీ క్రికెట్లో సంచలన ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన ప్రశాంత్ వీర్ గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అంచనాలకు మించి రాణించాడు. ఆ టోర్నీలో 320 పరుగులు చేయడంతో 8 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా మాదిరిగానే స్లో లెఫ్టార్మ్ స్పిన్, ఎడమచేతివాటం బ్యాటింగ్ కావడంతో జడ్డూ స్థానాన్ని ప్రశాంత్ భర్తీ చేస్తాడని సీఎస్కే భారీ ఆశలు పెట్టుకుంది. ‘జూనియర్ మిల్లర్’గా గుర్తింపు పొందిన ప్రశాంత్ అంచనాలను అందుకుంటాడా అన్నది చూడాలి.సిక్సర్లకు పెట్టింది పేరు..చెన్నై సూపర్కింగ్స్కే ఆడనున్న మరో విధ్వంసక వీరుడు కార్తిక్ శర్మ. రాజస్థాన్కు చెందిన కార్తిక్ శర్మ అవలీలగా సిక్సర్లు కొట్టగలడు. అందుకే వేలంలో సీఎస్కే ఇతడిని రూ. 14.2 కోట్లు పెట్టి దక్కించుకుంది. విజయ్హజారే ట్రోఫీతో పాటు 2025-26 రంజీ సీజన్లో అత్యధిక సిక్స్లు కొట్టినవారిలో కార్తిక్ శర్మ ముందు వరుసలో ఉన్నాడు.ఇక వేలంలో కార్తిక్ శర్మ కోసం ఐదు ఫ్రాంచైజీలు పోటాపోటీగా బిడ్ వేశాయంటేనే మనోడి టాలెంట్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా 11 టీ20 ఇన్నింగ్స్ల్లో 28 సిక్స్లు కొట్టిన కార్తీక్ చెన్నై జట్టుకు కీలక బ్యాటర్గా మారే అవకాశముంది.ఢిల్లీ ఆశాకిరణం..ఇటీవల కాలంలో దేశవాళీ క్రికెట్లో బాగా వినిపిస్తున్న పేరు అకిబ్ నబీ. ఈ జమ్మూకశ్మీర్ పేసర్ కొద్దిరోజుల క్రితం ముగిసిన రంజీ సీజన్లో ఏకంగా 60 వికెట్లు పడగొట్టి తన జట్టు చరిత్రాత్మక రంజీ ట్రోఫీ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. నబీని వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 8.40 కోట్లకు సొంతం చేసుకుంది.ఐపీఎల్ ద్వారా జాతీయ జట్టులో చోటు దక్కించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఇటీవలే పేర్కొన్నాడు. భారీ అంచనాలు పెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్కు ఆకిబ్ నబీ టైటిల్ అందిస్తాడేమో చూడాలి. ఒకవేళ నబీ ఆ ఫీట్ను సాధిస్తే మాత్రం టీమిండియాలోకి పిలుపు రావడం లాంఛనమే అవుతుంది.ఆ కొరత తీరినట్లే!భారత జట్టుకు లెఫ్టార్మ్ పేసర్ల కొరత ఎప్పట్నుంచో ఉంది. జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా తర్వాత చాలా రోజులకు పంజాబ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ జట్టులోకి వచ్చాడు. అతడి మార్గంలోనే యువ పేసర్ నమన్ తివారి అదరగొడుతున్నాడు. 2024 అండర్-19 ప్రపంచకప్ ద్వారా వెలుగులోకి వచ్చిన నమన్.. ఆ టోర్నీలో ఆరు మ్యాచ్ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. యూపీ టీ20 లీగ్లో అతడు పది మ్యాచ్ల్లో 19 వికెట్లు పడగొట్టి ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. 145 కిలోమీటర్ల వేగానికి తగ్గకుండా బౌలింగ్ చేయడం అతడి ప్రత్యేకత. అందుకే వేలంలో లక్నో జట్టు అతడికి కోటి రూపాయల ధరకు దక్కించుకుంది. నమన్ సత్తాచాటితే టీమ్ఇండియాకు మరో లెఫ్టార్మ్ పేసర్ దొరికేసినట్లే.దంచుడే లక్ష్యంగా..ఈ సీజన్లో కోల్కతా నైట్రైడర్స్కు ఆడబోతున్న తేజస్వీ దహియా కూడా విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పొచ్చు. వికెట్కీపర్ బ్యాటర్ అయిన ఈ ఢిల్లీ కుర్రాడు బరిలోకి దిగిందే తడవు దంచుడే లక్ష్యంగా బ్యాటింగ్ చేయడం అతడి నైజం. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ గత ఎడిషన్లో తేజస్వీ దహియా 10 ఇన్నింగ్స్ల్లో 190 సగటుతో 339 రన్స్ సాధించాడు. ఆ సీజన్లో దహియా 29 సిక్స్లు బాది టోర్నీలో అత్యధిక సిక్స్లు కొట్టినవారిలో రెండో స్థానంలో నిలిచాడు. కీపర్గాను అద రగొడుతున్నాడు. వీళ్లే కాదు ఇంకా చాలా మంది యువ క్రికెటర్లు ఈసారి ఐపీఎల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.చదవండి: ధోనికి గాయం.. ఐపీఎల్కు దూరం! -
ధోనికి గాయం.. ఐపీఎల్కు దూరం!
ఐపీఎల్ అభిమానులకు సీఎస్కే యాజమాన్యం షాకింగ్ వార్త చెప్పింది. సీఎస్కేను ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభ మ్యాచ్లకు దూరం కానున్నాడు. చెన్నై యాజమాన్యం విడుదల చేసిన అధికారిక ప్రకటనతో ఈ వార్త ఒక్కసారిగా క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. చెన్నై యాజమాన్యం వివరాల ప్రకారం.. ‘ధోనీ పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నాడు. అతను ప్రస్తుతం రీహాలిటేషన్ కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నాడు. దీంతో రెండు వారాల పాటు ఐపీఎల్ 19వ సీజన్కు దూరమయ్యే అవకాశముంది. ‘తలా’ తొందరగా కోలుకోవాలి!’ అని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేసింది. దీంతో సీజన్ ఆరంభంలోనే చెన్నై జట్టు పెద్ద పరీక్షను ఎదుర్కొనాల్సి వస్తోంది. అయితే ధోని ఆడకపోయినప్పటికీ సీఎస్కేకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎందుకంటే గత రెండు, మూడు సీజన్లుగా ధోని జట్టులో పెద్దన్న పాత్ర పోషిస్తూ వస్తున్నాడు. బ్యాటింగ్లో ఎక్కువగా లోయర్ ఆర్డర్లోనే వస్తున్న ధోని ఫీల్డింగ్లో మాత్రం తన మాస్టర్మైండ్కు పని చెబుతున్నాడు. కెప్టెన్కు విలువైన సలహాలు, సూచనలు చేస్తూ మార్గదర్శకుడి పాత్రకు ధోని మారిపోయాడు. 2023లో చివరిసారి ధోని సారథ్యంలోనే చెన్నై సూపర్కింగ్స్ ఐదోసారి ఐపీఎల్ టైటిల్ను దక్కించుకుంది. ప్రస్తుత సీజన్ ధోనికి ఆఖరిదని ప్రచారం జరుగుతున్న వేళ రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని సీఎస్కే ఆరోసారి టైటిల్ గెలిచి ధోనికి కానుకగా ఇవ్వాలని భావిస్తోంది. ఐపీఎల్ 19వ సీజన్కు ముందు సీఎస్కే జట్టులో భారీ మార్పులు చేసింది. ‘డాడీస్ ఆర్మీగా’ పేరు పొందిన సీఎస్కే మినీ వేలంలో యువ ఆటగాళ్ల కొనుగోలుకు ప్రాధాన్యత చూపింది. కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్ లాంటి అన్క్యాప్ ప్లేయర్లను చెరో 14.2 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఇక ట్రేడింగ్లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు సంజూ శామ్సన్ను దక్కించుకున్న సీఎస్కే జడేజా, సామ్ కరన్లను వదిలేసింది. మొత్తంగా ఈసారి సరికొత్తగా కనిపిస్తున్న సీఎస్కే తన తొలి మ్యాచ్ను మార్చి 30న రాజస్థాన్ రాయల్స్తో ఆడనుంది.చదవండి: అభిమానులకు గుడ్న్యూస్!Official StatementMS Dhoni is currently undergoing rehabilitation for a calf strain. As a result, he is likely to miss the first two weeks of TATA IPL 2026.Get well soon, Thala! 💛🦁 pic.twitter.com/4dgmt5EWFi— Chennai Super Kings (@ChennaiIPL) March 28, 2026 -
IPL 2026: అభిమానులకు గుడ్న్యూస్!
ఐపీఎల్ 2026 సీజన్కు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే మ్యాచ్కు సంబంధించిన టికెట్లు హాట్కేకుల్లా అమ్ముడయ్యాయి. మండు వేసవిలో ఫోర్లు, సిక్సర్ల వర్షంలో రెండు నెలల పాటు అభిమానులు తడిసి ముద్దయ్యేందుకు సిద్ధమయ్యారు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈసారి వరుణుడు కూడా ఐపీఎల్ మ్యాచ్లపై ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో సీజన్ తొలి మ్యాచ్కు వర్షం అడ్డంకి ఏమైనా ఉందా అన్న విషయం ఆసక్తిగా మారింది. అయితే మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం లేదని బెంగళూరు కేంద్రంగా ఉన్న వాతావరణ శాఖ పేర్కొంది. వాతావరణ శాఖ మేరకు బెంగళూరుకు చిన్న చినుకుకు కూడా అవకాశం లేదని తెలిపింది. ఆకాశం నిర్మలంగా ఉంటుందని, గాలిలో తేమ ఎక్కువ ఉన్నందును టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్కు మొగ్గు చూపే అవకాశముందని తెలిపింది. రాత్రి ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ మేర ఉంటుందని పేర్కొంది. ఇది అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. భారత్లో చిన్న స్టేడియాల్లో ఒకటైన చిన్నస్వామి స్టేడియంలో బౌండరీ మీటర్ తక్కువ దూరం ఉండడంతో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. 2025లో చాంపియన్గా నిలిచిన ఆర్సీబీ తమ 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. రజత్ పాటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ బ్యాటింగ్లో బలంగా కనిపిస్తోంది. కోహ్లీ, సాల్ట్, జితేశ్ శర్మ, పడిక్కల్, టిమ్ డేవిడ్, పాటిదార్, బ్యాటింగ్లో కీలకం కానున్నారు. మరోవైపు బౌలింగ్లో కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ భువనేశ్వర్, ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ పైనే భారం పడనుంది. ఇక ఐపీఎల్లోనే అత్యంత బలమైన బ్యాటింగ్ లైనప్ ఎస్ఆర్హెచ్ సొంతం. పాట్ కమిన్స్ గైర్హాజరీలో ఇషాన్ కిషన్ నాయకత్వంలో ఎస్ఆర్హెచ్ బరిలోకి దిగుతోంది. హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, లివింగ్స్టోన్, నితీవ్ కుమార్లతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. అయితే కమిన్స్ లేకపోవడంతో బౌలింగ్లో హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్ కీలకం కానున్నారు.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి , దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, కృనాల్ పాండ్యా , స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జాకబ్ బెథెల్, జోష్ హేజిల్వుడ్, యష్ దయాల్, భువనేశ్వర్ కుమార్ , రసీ షర్మా దయాల్, భువనేశ్వర్ కుమార్ వెంకటేష్ అయ్యర్, జాకబ్ డఫీ, సాత్విక్ దేస్వాల్, మంగేష్ యాదవ్, జోర్డాన్ కాక్స్, విక్కీ ఓస్త్వాల్, విహాన్ మల్హోత్రా, కనిష్క్ చౌహాన్సన్రైజర్స్ హైదరాబాద్: ఇషాన్ కిషన్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, ఆర్. స్మరన్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ , నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కమిందు మెండిస్, హర్షల్ పటేల్, బ్రైడన్ కార్సే, జయదేవ్ ఉనద్కత్ , శివన్ కుమార్ అన్ద్కత్, ఎషన్ కుమార్ అన్ద్కత్, ఎషాన్ మలింగస్ సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మలే, అమిత్ కుమార్, ప్రఫుల్ హింగే, క్రైన్స్ ఫులేట్రా, లియామ్ లివింగ్స్టోన్, శివమ్ మావి, జాక్ ఎడ్వర్డ్స్, పాట్ కమిన్స్చదవండి: ఉచితంగా ఐపీఎల్ టికెట్లు -
పంతమే నెగ్గింది.. ఉచితంగా ఐపీఎల్ టికెట్లు!
ఐపీఎల్ టికెట్ల విషయంలో కర్ణాటక అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పంతం నెగ్గించుకున్నారు. ఐపీఎల్ టికెట్లు కొనడానికి క్యూలైన్లో నిలబడేందుకు నిరాకరించిన ఎమ్మెల్యేలు ఉచితంగా ఐపీఎల్ టికెట్లు పొందనున్నారు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) అధ్యక్షుడు, టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ సీఎం సిద్ధరామయ్యను కలిసి ఎమ్మెల్యేలకు ఐపీఎల్ ఉచిత టికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతోపాటు శనివారం చిన్నస్వామి వేదికగా జరగనున్న సీజన్ తొలి మ్యాచ్ ఆర్సీబీ, హైదరాబాద్ మ్యాచ్కు రావాల్సిందిగా సీఎంను ఆహ్వానించారు. ఇదే క్రమంలో ఎమ్మెల్యేలకు చిన్నస్వామి స్టేడియంలో వీఐపీ స్టేటస్లో ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశం కల్పించ నున్నట్లు తెలిపారు. చిన్న స్వామి స్టేడియంలో జరిగే అన్ని మ్యాచులకు ఎమ్మెల్యేలు, మంత్రులకు ఒక్కొక్కరికి 3 టికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే ఈ పరిణామం జరగడానికి ఒక రోజు ముందు టికెట్ల విషయంలో ఎమ్మెల్యే చేసిన ఆరోపణలే ఇవాళ వారికి ఉచిత ఐపీఎల్ టికెట్లు రావడానికి కారణమైంది. రాష్ట్ర ఎమ్మెల్యేలకు కేఎస్సీఏ ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని, సామాన్యుల లాగే టికెట్స్ కోసం క్యూలో నిలబడడం ఏంటని విమర్శలకు దిగింది. దీంతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రంగంలోకి దిగి ప్రజాప్రతినిధులకు ఒక్కొక్కరికి రెండేసి టికెట్లు ఇవ్వాల్సిందిగా కర్ణాటక క్రికెట్ బోర్డును కోరారు. దీంతో ఉచిత టికెట్లు ఇచ్చేందుకు కేఎస్సీఏ ముందుకు వచ్చింది. గతేడాది ఐపీఎల్ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజేతగా నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీ ఈసారి తమ ఏడు హోం మ్యాచ్లలో ఐదింటిని చిన్నస్వామి స్టేడియంలో ఆడుతుంది. గత ఏడాది విజయోత్సవంలో జరిగిన విషాదం నేపథ్యంలో ఈసారి చిన్నస్వామిలో మ్యాచ్లు నిర్వహించేందుకు అనుమతి లభిస్తుందా లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తొలుత హోం గ్రౌండ్ను రాయ్పూర్కు మార్చాలని ముందుగా నిర్ణయించింది. అయితే చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణకు అనుమతి లభించింది. అయితే ముందుగా ఇచ్చిన మాట ప్రకారం రెండు మ్యాచ్లను రాయ్పూర్లో ఆడేందుకు ఆర్సీబీ సిద్ధమైంది. #WATCH | Bengaluru: On State MLAs' demand for IPL tickets, Karnataka Deputy CM DK Shivakumar says, "...Four tickets can't be given. So, every MLA, MP and Minister used to get one seat each. Now, we have requested them to give two tickets if the family members go. For tomorrow's… pic.twitter.com/1bA5wUNAnc— ANI (@ANI) March 27, 2026చదవండి: బుమ్రా స్థానంలో ఆకాశ్ మధ్వాల్! -
ఐపీఎల్ ఫీవర్ మొదలు.. హైదరాబాద్లో స్క్రీనింగ్ల సందడి!
సాక్షి, హైదరాబాద్: ధనాధన్ క్రికెట్ ఫీవర్ మరోసారి సిటీజనుల్ని చుట్టుముట్టనుంది. శనివారం నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్ కోసం నగర వ్యాప్తంగా వేదికలు సిద్ధమయ్యాయి. ఒంటరిగా, స్నేహితులతో, సన్నిహితులతో కలిసి, బృందాలుగా వీక్షించేవారి అవసరాలకు అనుగుణంగా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. భారీ స్క్రీన్స్ ప్రధాన ఆకర్షణగా, డీజే సంగీతం, రుచికరమైన వంటకాలు, సర్ప్రైజ్ గిఫ్టులు వంటివి జతగా ఈ వేదికలు క్రికెట్ ప్రియుల్ని ఆకట్టుకోనున్నాయి. బెంగళూరు పంథాలో.. నగరంలో ఐపీఎల్ సీజన్ కోసం ప్రత్యక్ష ప్రసారాలను అందించడానికి సిద్ధమయ్యాయి. వీటిలో భారీ స్క్రీన్లు, ప్రత్యేక మెనూలు ముఖ్యమైన మ్యాచ్లు ఉన్న రోజుల్లో ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. బెంగళూర్లో అండర్డాగ్స్ వైట్ ఫీల్డ్ పేరుతో ఒక ఎంటర్టైన్మెంట్ ప్లేస్ ఉంది. అది స్టేడియం తరహా వాతావరణం హై క్వాలిటీ స్క్రీన్స్, సరౌండ్ సౌండ్తో అలరిస్తోంది. అదే పంథాలో నగరంలోనూ పలు వేదికలు, పార్టీ ప్లేస్లు.. క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కొండల్లో సందళ్లు.. ఐపీఎల్ స్క్రీనింగ్కు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లోని పలు వేదికలు పేరొందాయి. జూబ్లీహిల్స్లోని ఎయిర్ లైవ్ 2 భారీ స్క్రీన్స్కి ఫేమస్. ఇక ప్రోస్ట్ బ్రూ పబ్ పెద్ద స్క్రీన్లతో కూడిన ఒక ప్రసిద్ధ వేదిక. అలాగే జీరో 40 బ్రూవింగ్ ఆహ్లాదకరమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. సందడిగా, ఆకర్షణీయంగా ఉండే సెట్టింగ్కు ప్రసిద్ధి చెందిన ఫర్జీ కేఫ్, హై లైఫ్ బ్రూవింగ్ కంపెనీ కూడా భారీ స్క్రీన్లకు ప్రసిద్ధి చెందింది. హ్యాపీ అవర్స్ పేరిట స్పెషల్ ఆఫర్లు అందించే అమ్నీసియా స్కై బార్ ఓపెన్ వాతావరణంలో వీక్షించాలనుకునేవారికి మంచి ఎంపిక. హైటెక్ సిటీలో.. క్రికెట్ సిరి.. మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో... సత్వా నాలెడ్జ్ సిటీ జెడ్ భారీ స్థాయి స్క్రీనింగ్లను నిర్వహిస్తోంది. ఇదే ప్రాంతంలోని రష్ స్పోర్ట్స్ కేఫ్..క్రీడా పోటీల వీక్షణకు ప్రత్యేకంగా పేరొందింది. ఇంటరాక్టివ్ గేమింగ్, మ్యాచ్ వీక్షణ అనుభవాన్ని అందించేందుకు ఇనార్బిట్ మాల్లోని స్మాష్ సిద్ధమైంది. గోవా వంటకాలకు పేరొందిన ది ఫిషర్ మ్యాన్స్ వాఫ్స్, బ్రాడ్ వే, గచ్చి»ౌలిలోని ఎల్స్ వేర్ లాంజ్, టికి షాక్ మరెన్నో ప్లేసెస్ ఆట చూడడాన్ని అపూర్వ అనుభవంగా మార్చేందుకు రెడీ అయ్యాయి. సికింద్రాబాద్ కూడా జిందాబాద్.. సికింద్రాబాద్ కార్ఖానాలోని ఎట్ ది బార్ నెక్ట్స్ డోర్ ఎస్ఎల్ఎన్ టెరి్మనస్లోని 10 డౌనింగ్ స్ట్రీట్, కొంపల్లిలోని ఓల్డ్ ట్రీస్ కేఫ్, ఆర్ అడ్డాలు లార్జ్ స్క్రీన్స్కు చిరునామాగా నిలుస్తున్నాయి. ఎల్బీనగర్లోని నార్ఫెస్ట్ ది దాబా వంటివి మేము సైతం అంటూ సిద్ధమయ్యాయి. ఇవి కాకుండా నగరం చుట్టుపక్కల ఫార్మ్ హౌజ్లు రిసార్ట్స్ కూడా ప్రత్యేక స్క్రీనింగ్స్తో ఆహా్వనిస్తున్నాయి. మొయినాబాద్లోని ఆయనా రిసార్ట్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ పోటీ ఉన్న రోజున ముందస్తు బుకింగ్స్ అవసరం అని గత అనుభవాలు చెబుతున్నాయి. -
బుమ్రా స్థానంలో ఆకాశ్ మధ్వాల్!
ఐపీఎల్ 2026 సీజన్ ఇవాళ షురూ కానుంది. మండు వేసవిలో రెండు నెలల పాటు సాగనున్న క్రికెట్ వినోదం అభిమానుల్లో జోష్ నింపింది. అయితే ఐపీఎల్లో ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ 2020 తర్వాత మళ్లీ ఆ స్థాయి ఆటను ప్రదర్శించడంలో విఫలమవుతూ వస్తోంది. ఈసారి కప్ కొట్టాలనే బలమైన సంకల్పంతో బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో మార్చి 30న ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్ను కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్)తో ఆడనుంది. ఇదిలా ఉంటే ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రం ఇంకా జట్టుతో చేరలేదు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను బుమ్రా శుక్రవారం సందర్శించాడు. ఆ తర్వాత బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో మెడికల్స్టాఫ్ పర్యవేక్షణలో బుమ్రా బౌలింగ్ సాధన చేశాడు. దీంతో కేకేఆర్తో జరగబోయే మ్యాచ్కు బుమ్రా అందుబాటులో ఉంటాడా లేదా అనే దానిపై స్పష్టత లేదు. ఒకవేళ బుమ్రా కేకేఆర్తో మ్యాచ్కు దూరమైతే మాత్రం ఆకాశ్ మధ్వాల్ ముంబై తుది జట్టులోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఐపీఎల్ మినీ వేలంలో ఆకాశ్ మధ్వాల్ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. కానీ శుక్రవారం రాత్రి మాత్రం ముంబై జట్టుకు నెట్ బౌలర్గా వ్యవహరించాడు. ఇదే సమయంలో రోహిత్ శర్మ అక్కడికి రావడం, రోహిత్ను చూసిన ఆకాశ్ మధ్వాల్ రెండు చేతులు జోడించి దండం పెట్టడం కనిపించింది. దీనికి బదులుగా రోహిత్ అతన్ని హగ్ చేసుకొని ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ప్రస్తుతానికి నెట్ బౌలర్గా ఉన్న ఆకాశ్ మధ్వాల్ కచ్చితంగా బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడానికే ముంబై యాజమాన్యం అతన్ని తీసుకొచ్చిందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే మరో బౌలర్ అథర్వ అంకోలేకర్ కూడా దూరమవ్వడంతో ముంబై జట్టుకు ఇబ్బంది ఎదురైంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ మధ్వాల్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఆకాశ్ మధ్వాల్ గతంలో (2023, 2024 సీజన్లు) ఇదే ముంబై ఇండియన్స్ తరఫున 13 మ్యాచ్ల్లో 19 వికెట్లు పడగొట్టాడు. అయితే 2023 సీజన్లో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఐదు పరుగులిచ్చి ఐదు వికెట్లు తీయడం ద్వారా ఆకాశ్ మధ్వాల్ పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత సీజన్కు రాజస్థాన్ రాయల్స్ ఆకాశ్ను జట్టులోకి తీసుకుంది. 2025 సీజన్లో ఆకాశ్ రాజస్థాన్ తరఫున నాలుగు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఆ తర్వాత రాజస్థాన్ జట్టు విడుదల చేయగా ఐపీఎల్ 2026 సీజన్కు ముందు జరిగిన మినీ వేలంలో ఆకాశ్ మధ్వాల్ అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు.చదవండి: గాయాలతో సతమతం.. ఆటకు గుడ్బైWe are sure you were not expecting this meet up 🥹💙 pic.twitter.com/MBbC2wMEAT— Mumbai Indians (@mipaltan) March 27, 2026 -
మెరుపుల పండగొచ్చింది
టి20 వరల్డ్ కప్లో భారత జట్టు జైత్రయాత్రను చూసి మూడు వారాలు గడిచాయి. వరుసగా రెండోసారి ప్రపంచ కప్ సాధించిన టీమిండియాకు మన అభిమానులంతా జేజేలు పలికారు. ఆ తర్వాత క్రికెట్ లేకుండా కాస్త స్తబ్దత. ఇప్పుడు మళ్లీ అందరిలో జోష్ నింపే వేసవి వినోదం వచ్చేసింది. కొద్ది రోజుల క్రితం వరకు ఒకే జట్టుగా టీమిండియాను చాంపియన్గా నిలిపిన సహచరులంతా ఇప్పుడు ప్రత్యర్థులుగా తలపడేందుకు సిద్ధమయ్యారు. ఆరో టైటిల్ వేటలో రెండు టీమ్లు పోటీ పడుతుండగా, నాలుగో ట్రోఫీపై మరో జట్టు గురి పెట్టింది. రెండోసారి విజేతగా నిలవాలని మరో నాలుగు టీమ్లు సిద్ధం కాగా... తొలిసారి కప్ను ముద్దాడేందుకు ఇంకో మూడు జట్లు తమ పోరాటాన్ని కొనసాగించనున్నాయి. రెండు నెలల పాటు జరిగే 74 మ్యాచ్లతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ సమరానికి రంగం సిద్ధమైంది. ఇక పగలూ రాత్రీ అక్కడా ఇక్కడా ఎక్కడైనా ఐపీఎల్ స్కోర్లు, ఫలితాలు, విశ్లేషణలపైనే చర్చ షురూ కానుంది. బెంగళూరు: ఐపీఎల్–2026కు నేటితో తెర లేవనుంది. చిన్నస్వామి మైదానంలో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), మాజీ చాంపియన్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్తో టోర్నీ మొదలవుతుంది. గత నాలుగు సీజన్ల తరహాలోనే ఈసారి కూడా మొత్తం 10 టీమ్లు బరిలోకి దిగుతున్నాయి. మే 24 వరకు లీగ్ దశలు పోటీలు జరుగుతాయి. వీటిలో 12 రోజుల్లో డబుల్ హెడర్ (ఒకే రోజు రెండు మ్యాచ్లు) ఉన్నాయి. ఆ తర్వాత ‘ప్లే ఆఫ్స్’ నిర్వహిస్తారు.‘ప్లే ఆఫ్స్’ మ్యాచ్ల వేదికలను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇంకా ప్రకటించలేదు. అయితే ఫైనల్ మ్యాచ్ మే 31న బెంగళూరులో నిర్వహిస్తారు. ప్రతీ ఏటా ప్రజాదరణలో, వాణిజ్యపరంగా కూడా స్థాయిని పెంచుకుంటూ వస్తున్న ఐపీఎల్ 19వ సీజన్ కూడా ఎప్పటిలాగే హోరాహోరీగా, ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. దిగ్గజ క్రికెటర్లు ధోని, కోహ్లి, రోహిత్ ఈ సీజన్లో కూడా అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. లీగ్లో మరో రసవత్తర వినోదానికి సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ సీజన్కు సంబంధించి కొన్ని విశేషాలు.... » డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీ ఈసారి తమ ఏడు హోం మ్యాచ్లలో ఐదింటిని చిన్నస్వామి స్టేడియంలో ఆడుతుంది. గత ఏడాది విజయోత్సవంలో జరిగిన విషాదం నేపథ్యంలో ఈసారి చిన్నస్వామిలో మ్యాచ్లు నిర్వహించేందుకు అనుమతి లభిస్తుందా లేదా అనే సందేహాల మధ్య హోం గ్రౌండ్ను రాయ్పూర్కు మార్చాలని ముందుగా నిర్ణయించింది. ఆ తర్వాత అనుమతి రాగా... ముందుగా ఇచి్చన మాట ప్రకారం రెండు మ్యాచ్లను రాయ్పూర్లో ఆడేందుకు సిద్ధమైంది. » ఢిల్లీ క్యాపిటల్స్ గత రెండు సీజన్లలో రెండేసి మ్యాచ్లు విశాఖపట్నంలో ఆడింది. ఈసారి ఆ జట్టు వైజాగ్లో బరిలోకి దిగడం లేదు. తమ ఏడు హోం మ్యాచ్లు అన్నింటినీ ఢిల్లీలోనే ఆడనుంది. ప్రతీ సీజన్లాగే రాజస్తాన్కు గువాహటి, పంజాబ్కు ధర్మశాల ‘రెండో హోం గ్రౌండ్’గా ఉంటాయి. » ఐపీఎల్ జట్లకు ఈసారి కొత్త కోచ్లు వచ్చారు. రాహుల్ ద్రవిడ్ స్థానంలో కుమార్ సంగక్కర రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్గా వ్యవహరించనున్నాడు. కోల్కతా నైట్రైడర్స్ చంద్రకాంత్ పండిత్ స్థానంలో అభిõÙక్ నాయర్ను హెడ్ కోచ్గా ఎంచుకుంది. ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆండ్రీ రసెల్ను తమతోనే ఉంచుకున్న కేకేఆర్ ‘పవర్ కోచ్’ అనే కొత్త పదవిని సృష్టించి బాధ్యతలు అప్పగించింది. కేన్ విలియమ్సన్ను లక్నో ఫ్రాంచైజీ ‘వ్యూహాత్మక సలహాదారు’గా నియమించుకుంది. ఆసీస్ మాజీ స్టార్ మాథ్యూ హేడెన్ గుజరాత్కు బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనుండగా, ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ ఇయాన్ బెల్ను ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్గా తీసుకుంది. » ఆటగాళ్లపరంగా చూస్తే టి20 వరల్డ్ కప్ స్టార్ సంజు సామ్సన్ జట్టు మారడమే ఆసక్తికర అంశం. 11 సీజన్ల పాటు రాజస్తాన్ రాయల్స్కు ఆడిన సామ్సన్ ఇప్పుడు అద్భుతమైన ఫామ్తో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగబోతున్నాడు. అదే తరహాలో 12 సీజన్ల పాటు చెన్నైతో అనుబంధం ఉన్న ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తన తొలి జట్టు రాజస్తాన్ రాయల్స్ తరఫున ఈసారి ఆడబోతున్నాడు. » ఐపీఎల్లో మొదటి నుంచి భారత్ తర్వాత ఆ్రస్టేలియన్లదే ఆధిపత్యం. అటు ఆటగాళ్లు, ఇటు కోచింగ్ బృందంలో కూడా వారంతా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈసారి వేలంలో రూ.25.20 కోట్లకు అమ్ముడుపోయిన కామెరాన్ గ్రీన్ ప్రధాన ఆకర్షణగా ఉన్నాడు. కోల్కతా నైట్రైడర్స్ తరఫున అతను ఏమాత్రం ప్రభావం చూపిస్తాడన్నదే ఆసక్తికరం. ముగ్గురు ఆసీస్ గ్రేట్ బౌలర్లు స్టార్క్, కమిన్స్, హాజల్వుడ్ మాత్రం లీగ్ ఆరంభంలో కనిపించకపోవచ్చు. గాయాల నుంచి పూర్తిగా కోలుకొని కమిన్స్ (సన్రైజర్స్), హాజల్వుడ్ (ఆర్సీబీ) తమ టీమ్లతో చేరినా... ఎప్పటి నుంచి మ్యాచ్లు ఆడతారనే సందేహం ఉంది. స్టార్క్ అయితే ఇంకా భారత్కే రాకపోగా, దీనిపై ఢిల్లీ మేనేజ్మెంట్కు ఇంకా స్పష్టత లేదు. వీరు కాకుండా ట్రావిస్ హెడ్, టిమ్ డేవిడ్, షార్ట్, స్పెన్సర్ జాన్సన్, మిచెల్ మార్‡్ష, ఇన్గ్లిస్, స్టొయినిస్, ఒవెన్, డ్వార్షుయిస్, కనోలీ, బార్త్లెట్ కూడా తమ ప్రభావం చూపించాలని పట్టుదలగా ఉన్నారు. మ్యాచ్ల ఫార్మాట్ మారింది... లీగ్లోకి పది టీమ్లు వచ్చిన తర్వాత ప్రతీ ఏటా అనుసరిస్తున్న ‘గ్రూపింగ్’ పద్ధతినే ఈసారి కూడా అనుసరించారు. ఆయా టీమ్లు సాధించిన ఐపీఎల్ టైటిల్స్ను బట్టి వీటిని రెండు గ్రూప్లుగా విభజించారు. దీని ప్రకారం గ్రూప్ ‘ఎ’లో చెన్నై (5), కోల్కతా (3), రాజస్తాన్ (1), బెంగళూరు (1), పంజాబ్ కింగ్స్ ఉన్నాయి. గ్రూప్ ‘బి’లో ముంబై (5), హైదరాబాద్ (1), గుజరాత్ (1), ఢిల్లీ, లక్నో ఉన్నాయి. గత సీజన్ వరకు ప్రతీ జట్టు తమ గ్రూప్లోని నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్లు (మొత్తం 8), ప్రత్యర్థి గ్రూప్లోని నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ (మొత్తం 4), ఒక టీమ్తో రెండుసార్లు (2) ఆడేవి. ఇలా ప్రతీ జట్టుకు 14 లీగ్ మ్యాచ్లు ఆడే అవకాశం దక్కింది. అయితే ఈసారి ఇదే ఫార్మాట్ను భిన్నంగా మార్చారు. ఈ సీజన్లో ప్రత్యర్థి గ్రూప్లోని ఐదు జట్లతో రెండేసి సార్లు (మొత్తం 10), తమ గ్రూప్లోని టీమ్లతో ఒక్కో మ్యాచ్ (4)లో తలపడాల్సి ఉంటుంది. దీని ప్రకారం ఐదుసార్లు చాంపియన్లు అయిన చెన్నై, ముంబైల మధ్య రెండు మ్యాచ్లు జరుగుతాయి.27 స్పాన్సర్లతో ప్రకటనల జోరు! ఐపీఎల్ క్రేజ్ను దృష్టిలో ఉంచుకొని చూస్తే పెద్ద సంఖ్యలో స్పాన్సర్లు రావడం కొత్త కాదు. కానీ ఈసారి ప్రసారకర్తలు మరింత పెద్ద సంఖ్యలో భారీ మొత్తాలకు స్పాన్సర్లతో జత కట్టారు. తాజా సీజన్ కోసం స్టార్ స్పోర్ట్స్–జియో హాట్స్టార్లలో కలిపి ఏకంగా 27 సంస్థలు స్పాన్సర్లుగా వ్యవహరించనున్నాయి. వీటితో బ్రాడ్కాస్టింగ్ టీమ్కు ప్రకటనల పండగ ఖాయం. స్పాన్సర్ల జాబితాలో గూగుల్ సెర్చ్ ఏఐ, క్యాంపా ఎనర్జీ, హావెల్స్, లాయిడ్, బిర్లా ఒపస్, హీరో మోటో కార్ప్, అమెజాన్, ఏఎంఎఫ్ఐ, ఏషియన్ పెయింట్స్, విమల్ ఇలైచీ, సూపర్ మనీ, ఎంఆర్ఎఫ్, ఫ్లిప్కార్ట్, జిల్లెట్, వీడా, రూపే, మాండెలెజ్, మదర్ డెయిరీ, గ్రో, ర్యాపిడో, ముత్తూట్ ఫినాన్స్, సన్ఫీస్ట్, గూగుల్ పే, టీవీఎస్ ఈవీ, ఏంజెల్ వన్, క్యాంపా ష్యూర్, అమూల్ ఉన్నాయి. టాప్–4 సన్రైజర్స్వే... లీగ్లో జట్టు నమోదు చేసిన అత్యధిక స్కోరు జాబితాలో హైదరాబాద్ హవానే సాగింది. టాప్–4 స్కోర్లు వరుసగా 287, 286, 278, 277 సన్రైజర్స్ నమోదు చేసింది. ఈసారి 300 నమోదవుతుందా అనేది ఆసక్తికరం.109 ఐపీఎల్ చరిత్రలో నమోదైన సెంచరీలు. 58 మంది క్రికెటర్లు సెంచరీలు చేశారు. 2024లో అత్యధికంగా 14 సెంచరీలు నమోదుకాగా ... 2009లో అత్యల్పంగా 2 సెంచరీలు వచ్చాయి. 4 ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు నలుగురు ప్లేయర్లు (ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, మనీశ్ పాండే) మాత్రమే ప్రతి సీజన్లో బరిలోకి దిగారు. రోహిత్ శర్మ (డెక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్), ధోని (చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్) రెండు జట్లకు ప్రాతినిధ్యం వహించగా... కోహ్లి ఐపీఎల్ ఆరంభం నుంచి ఒకే జట్టు (ఆర్సీబీ)కు ఆడుతున్నాడు. మనీశ్ పాండే మాత్రం ఏడు జట్లకు (ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పుణే వారియర్స్ ఇండియా, సన్రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ డేర్డెవిల్స్) ప్రాతినిధ్యం వహించాడు.278 ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్ ధోని. వరుసగా 19వ సీజన్లో బరిలోకి దిగనున్న ధోని 278 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. రోహిత్ శర్మ (272), విరాట్ కోహ్లి (267) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.10 ఐపీఎల్లో కనీసం 200 మ్యాచ్లు ఆడిన క్రికెటర్లు. ఈ జాబితాలో ధోని, రోహిత్, కోహ్లి, దినేశ్ కార్తీక్ (257), రవీంద్ర జడేజా (254), శిఖర్ ధావన్ (222), రవిచంద్రన్ అశ్విన్ (221), సురేశ్ రైనా (205), రాబిన్ ఉతప్ప (205), అంబటి రాయుడు (204) ఉన్నారు. ఈ సీజన్లో అజింక్య రహానే (198), భువనేశ్వర్ కుమార్ (190), సునీల్ నరైన్ (189) ఈ జాబితాలో చేరే అవకాశం ఉంది.ఐపీఎల్ రికార్డులు... ఐపీఎల్ చరిత్రలో కొందరు ఆటగాళ్లు తమదైన ప్రత్యేక ముద్ర వేశారు. వీరిలో కొందరు ఇప్పటికీ కొనసాగుతున్నారు. మరికొందరు ఆటనుంచి నిష్క్రమించినా వారు అందించిన వినోదం, మెరుపులు మర్చిపోలేనివి. ఇప్పుడు బరిలో ఉన్నా, లేకపోయినా 19వ సీజన్ నేపథ్యంలో కొన్ని ఘనతలను గుర్తు చేసుకోక తప్పదు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లి (8661), అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా యుజువేంద్ర చహల్ (221) పేరిట రికార్డు ఉంది. అత్యధిక వ్యక్తిగత స్కోరు క్రిస్ గేల్ (175 నాటౌట్) నమోదు చేయగా, అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన అల్జారి జోసెఫ్ (6/12) పేరిట ఉంది. అత్యధిక సిక్స్లు (357) క్రిస్ గేల్ బాదగా, ఒకే సీజన్లో ఎక్కువ పరుగులు చేసిన ఘనత (973–2016లో) కోహ్లి పేరు మీద చెక్కు చెదరకుండా ఉంది. -
ఎప్పటికీ మా హృదయాల్లో...
ఐపీఎల్లో గత ఏడాది ఆర్సీబీ విజేతగా నిలిచిన తర్వాత జరిగిన విజయోత్సవంలో 11 మంది అభిమానులు మృతి చెందారు. వారి స్మారకార్థం ఆర్సీబీ యాజమాన్యం భిన్న రీతిలో నివాళి అర్పించనుంది. ఇకపై చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లలో 11 సీట్లను ఖాళీగా ఉంచనుంది. పీ1 స్టాండ్లోని ఈ సీట్లలో ఎవరూ కూర్చోకుండా ఆ 11 మంది జ్ఞాపకార్ధం శాశ్వతంగా అలాగే ఉంచనుంది. ‘జట్టుతో వారికి ఉన్న అనుబంధానికి ఇవి గుర్తుగా ఉండిపోతాయి. వారు ఎప్పటికీ ఆర్సీబీ అభిమానులే’ అని తమ గౌరవాన్ని ప్రకటించింది. -
ఈసారి ఐపీఎల్ టైటిల్ సాధిస్తాం!
న్యూఢిల్లీ: ఐపీఎల్లో గత ఏడాది టైటిల్ సాధించేందుకు చేరువగా వచ్చి పంజాబ్ కింగ్స్ జట్టు ఫైనల్లో ఓటమి పాలైంది. లీగ్ దశలో 14 మ్యాచ్లలో 9 విజయాలు సాధించి దూసుకొచ్చిన పంజాబ్ను తుది పోరులో ఓడించి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తొలిసారి విజేతగా నిలిచింది. అయితే ఈసారి అలాంటి పొరపాటుకు తావు ఇవ్వమని, కచ్చితంగా ట్రోఫీని అందుకుంటామని పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శశాంక్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. డిఫెండింగ్ చాంపియన్ అయిన బెంగళూరు హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో మే 31న ఫైనల్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ‘మే 31న చిన్నస్వామి మైదానంలో మేం ఫైనల్ ఆడి కప్ను సొంతం చేసుకోబోతున్నాం. ఇది నా ఆశ మాత్రమే కాదు. కచ్చితంగా జరిగి తీరుతుందనే నమ్మకం ఉంది. టీమ్ సభ్యులందరిలో ఆత్మవిశ్వాసం మెండుగా కనిపిస్తోంది కాబట్టి జట్టు మొత్తం కూడా ఇదే నమ్ముతోంది’ అని శశాంక్ వ్యాఖ్యానించాడు. అయితే గత ఏడాది ఫైనల్ గురించి ఆలోచిస్తూ తాము ఒత్తిడి పెంచుకోమని, ఒక్కో మ్యాచ్లో గెలుస్తూ ముందుకు వెళ్లడమే లక్ష్యమని అతను పేర్కొన్నాడు. 2025 సీజన్లో ఆడిన జట్టు నుంచి 21 మంది పంజాబ్ కింగ్స్ కొనసాగిస్తోంది. ‘గత ఏడాది చేసిన చిన్న చిన్న తప్పులను కూడా సరిదిద్దుకుంటూ ఒక్కో మ్యాచ్లో విజయం సాధించడం ముఖ్యం. దాదాపు అదే జట్టు ఉండటం కూడా అందరిలో ప్రేరణ కలిగించే అంశం. ఈ సీజన్కు మేం మరింత బాగా సన్నద్ధమై వచ్చాం’ అని శశాంక్ వెల్లడించాడు. సాధారణంగా టాపార్డర్ బ్యాటర్ అయిన తాను పంజాబ్ కింగ్స్ జట్టు అవసరాల కోసం ఆర్డర్లో దిగువకు మారానని...అయితే ఈ పాత్రను, బాధ్యతను పూర్తిగా ఆస్వాదిస్తున్నట్లు చెప్పాడు. ఫిట్నెస్ టెస్టులో తుషారా విఫలంఐపీఎల్కు అనుమతించని శ్రీలంక బోర్డుకొలంబో: ఐపీఎల్లో ఇప్పటికే హాజల్వుడ్ అందుబాటులో లేక పేస్ బౌలింగ్లో డీలాగా మారిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి మరో సమస్య తోడైంది. హాజల్వుడ్ స్థానంలో తుది జట్టులో ఆడే అవకాశం ఉన్న శ్రీలంక పేసర్ నువాన్ తుషారా ఇప్పట్లో జట్టుతో చేరే అవకాశాలు కనిపించడం లేదు. శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్వహించిన ఫిట్నెస్ టెస్టులో తుషారా విఫలమయ్యాడు. దాంతో అతనికి ఐపీఎల్ కోసం ఎన్ఓసీ ఇచ్చేందుకు లంక బోర్డు తిరస్కరించింది. ఫిట్నెస్ టెస్టులో వేర్వేరు ప్రమాణాల ద్వారా అందుబాటులో ఉన్న 29 పాయింట్లలో కనీసం 17 పాయింట్లు సాధించాల్సి ఉండగా... తుషారా వాటిని అందుకోలేకపోయాడు. -
'ఐపీఎల్ కాదు.. టీమిండియాకు ఆడడమే నా టార్గెట్'
జమ్మూ కాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ ధార్ ఐపీఎల్ అరంగేట్రానికి సిద్దమయ్యాడు. ఐపీఎల్-2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు నబీ ప్రాతినిథ్యం వహించనున్నాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శనలు చేస్తుండడంతో గతేడాది జరిగిన మినీ వేలంలో నబీని రూ.8.40 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.కేవలం రూ.30 లక్షల బేస్ప్రైస్తో వేలంలోకి వచ్చిన నబీనీ ఇతరు ఫ్రాంచైజీలతో పోటీపడి మరి ఢిల్లీ సొంతం చేసుకుంది. అయితే తాజాగా విలేకరుల సమావేశంలో నబీ పలు విషయాలను పంచుకున్నాడు. వేలం రోజు తన ఇంట్లో జరిగిన సందడిని నబీ గుర్తు చేసుకున్నాడు. అయితే ఐపీఎల్ ఎంపిక కావడం సంతోషంగా ఉన్నప్పటికి, భారత్ తరపున ఆడడమే తన అంతిమ లక్ష్యమని నబీ తెలిపాడు."నాకు డబ్బు ముఖ్యం కాదు. కనీసం ఒక్కసారైనా ఐపీఎల్ వంటి మెగా టోర్నమెంట్లో ఆడాలనుకున్నాను. నాకు కనీస ధర రూ.30 లక్షలు వచ్చి ఉన్నా కూడా నేను సంతోషంగా ఉండేవాడిని. ఏదేమైనప్పటికి ఢిల్లీ ఇంత భారీ మొత్తం వెచ్చించి తీసుకోవడం నాకు ఆనందం కలిగించింది. వేలం రోజున నేను ఇంట్లోనే ఉన్నాను. వేలంలో నేను అమ్ముడుపోగానే బయట నం డ్యాన్స్లు చేస్తూ, బాణసంచా కాలుస్తూ హంగామా చేశారు. నా కటుంబ సభ్యులు చాలా సంతోషపడ్డారు. ఆ సమయంలో నేను కూడా కాస్త భావోద్వేగానికి లోనయ్యాను. కానీ నేను ఇంట్లో ఉన్నానని వారికి తెలియదు. అయినప్పటికి నా విజయాన్ని వారు సెలబ్రేట్ చేసుకున్నారు. ఐపీఎల్ నా కెరీర్ను మరింత ముందుకు తెసుకువెళ్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ప్రపంచ స్థాయి టోర్నమెంట్. దేశవాళీ క్రికెట్లో మెరుగ్గా రాణిస్తానే ఇక్కడ ఆడే అవకాశం లభిస్తోంది. నేను రెడ్ బాల్ క్రికెట్లో బాగా రాణించానని అన్పిస్తోంది. అందుకే నాకు ఆడే అవకాశం దక్కింది. ఇక్కడ కూడా బాగా రాణించి భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించడమే నా అంతిమ లక్ష్యమని" నబీ పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: ఎస్ఆర్హెచ్తో మ్యాచ్.. ఆర్సీబీకి భారీ షాక్ -
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్.. ఆర్సీబీకి భారీ షాక్
ఐపీఎల్-2026 సీజన్కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్కు ముందు ఆర్సీబీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ గాయం కారణంగా మొదటి మ్యాచ్కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ హెడ్ కోచ్ అండీ ఫ్లవర్ ధ్రువీకరించాడు. హాజిల్వుడ్ గురువారం జట్టుతో చేరి ప్రాక్టీస్ చేసినప్పటికి, అతడు ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్కు అతడు అందుబాటులో లేడు."ఎస్ఆర్హెచ్తో జరిగే మా మొదటి మ్యాచ్కు జోష్ హాజిల్వుడ్ అందుబాటులో లేడు. అతడు ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. జోష్ నిన్ననే మా జట్టుతో చేరాడు. అతడిపి ఫిట్నెస్ను మా వైద్యబృందం పరీక్షించనుంది. తర్వాతే తదుపరి మ్యాచ్లకు అతడి అందుబాటుపై నిర్ణయం తీసుకుంటాము" అని ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్లో ఫ్లవర్ పేర్కొన్నాడు. కాగా ఈ జింబాబ్వే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు."కోహ్లీ చాలా ఫిట్గా ఉన్నాడు, ఈసారి మరిన్ని పరుగులు సాధించాలన్న కసితో ఉన్నాడు. అతడు బంతిని హిట్ చేస్తున్న తీరు చూస్తుంటే ఈ సీజన్లో పరుగుల వరద పారించడం ఖాయమనిపిస్తోంది" అని ఫ్లవర్ అన్నారు.బెంగళూరు తుది జట్టు(అంచనా): ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రాజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జాకబ్ డఫీ.చదవండి: IPL 2026: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఇదే.. వికెట్ల వీరుడు అరంగేట్రం? -
ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఇదే.. వికెట్ల వీరుడు అరంగేట్రం?
ఐపీఎల్-2026 సీజన్లో తొలి మ్యాచ్ ఆడేందుకు సన్రైజర్స్ హైదరాబాద్ సిద్దమైంది. మార్చి 28న టోర్నీ ఆరంభ మ్యాచ్లో చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఎస్ఆర్హెచ్ ఢీకొట్టనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఆరెంజ్ ఆర్మీ అన్ని విధాల సిద్దమైంది.అయితే ఈ మ్యాచ్కు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ అందుబాటులో లేడు. దీంతో ఇషాన్ కిషన్ సారథ్యంలో ఎస్ఆర్హెచ్ బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎలా ఉండబోతుందో అనే దానిపై ఓ అంచనా వేద్దాం.గత ఏడాదిలాగే ఎస్ఆర్హెచ్ మేనెజ్మెంట్ తమ టాప్ ఆర్డర్ను కొనసాగించనుంది. ఓపెనర్లుగా విధ్వంసకర ప్లేయర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు బరిలోకి దిగనున్నారు. వరుసగా మూడు, నాలుగు స్ధానాల్లో ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ రానున్నారు. కిషన్ గత సీజన్లో మూడో స్ధానంలోనే బ్యాటింగ్కు వచ్చి అద్బుతమైన సెంచరీ సాధించాడు.ఇక ఐదో స్ధానంలో హెన్రిచ్ క్లాసన్ బ్యాటింగ్కు వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా జట్టులోకి కొత్తగా వచ్చిన ఆల్రౌండర్ లివింగ్స్టోన్, అనికేత్ వర్మలు ఫినిషర్ పాత్రను పోషించనున్నారు. బౌలింగ్ విభాగానికి వస్తే ప్యాట్ కమ్మిన్స్ స్ధానాన్ని ఇంగ్లీష్ ఆల్రౌండర్ బ్రైడన్ కార్స్తో భర్తీ చేసే సూచనలు కన్పిస్తున్నాయి.దూబే అరంగేట్రం?కార్స్ బంతితో పాటు బ్యాట్తో కూడా రాణించగలడు. హర్షల్ పటేల్, శివమ్ మావి, జయదేవ్ ఉనద్కత్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. అదేవిధంగా విధర్బ స్పిన్నర్ హర్ష్ దూబే ఈ మ్యాచ్లో అరంగేట్రం చేసే అవకాశముంది. అయితే గత సీజన్లో ఆకట్టుకున్న జేషాన్ అన్సారీ కూడా తుది జట్టు రేసులో ఉన్నాడు.కాగా రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఒక రంజీ సీజన్లో అత్యధిక వికెట్లు(69) వికెట్లు పడగొట్టిన బౌలర్గా చరిత్ర సృష్టించాడు. దీంతో గతేడాది జరిగిన మినీ వేలంలో రూ.30 లక్షల బేస్ప్రైస్కు అతడిని ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకుంది.ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఇదేట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, లియామ్ లివింగ్స్టోన్, అనికేత్ వర్మ, బ్రైడన్ కార్స్, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, శివమ్ మావిచదవండి: టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. ఆ సిరీస్తో ఎంట్రీ? -
ధోనికి హ్యాట్సాఫ్.. మరో పదేళ్లు ఆడాలి: యోగ్ రాజ్ సింగ్
ఐపీఎల్-2026కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. శనివారం(మార్చి 28) ఈ నుంచి ధానాధన్ క్రికెట్ లీగ్ షూరు కానుంది. తొలి మ్యాచ్లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. అయితే అందరి దృష్టి టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ ఎంఎస్ ధోనిపైనే ఉంది.42 ఏళ్ల ధోనికి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ కానుందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధోని 100 శాతం ఫిట్గా ఉన్నాడని, తన రిటైర్మెంట్ గురించి అనవసర చర్చలు పెడుతున్నారని యోగ్రాజ్ మండిపడ్డాడు."ధోని ఫిట్గా కన్పిస్తున్నాడు. ప్రతీ సీజన్లోనూ సరైన క్రమశిక్షణ, అంకితభావంతో తన ఫిట్నెస్ను నిరూపించుకుంటున్నాడు. ఇప్పటికీ అతడిలో ఏ మాత్రం పవర్ తగ్గలేదు. అతడి మోచేతి చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ధోని ఒక అద్భుతం. అతడు రిటైర్ అవ్వాలని చెప్పడానికి అసలు వీళ్లెవరు? అనవసర చర్చలు పెడుతున్నారు. అతడు మరో పదేళ్లు ఆడాలి. క్రికెట్ పరంగా ధోనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే" అని ఇన్సైడ్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగ్రాజ్ పేర్కొన్నాడు. అయితే వీలు చిక్కినప్పుడల్లా ధోనిపై విమర్శలు గుప్పించే యోగ్రాజ్.. ఈసారి మిస్టర్ కూల్కు మద్దతుగా నిలవడం గమనార్హం.మరోవైపు భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ధోని భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. రాజస్తాన్ రాయల్స్ నుంచి సీఎస్కేకు వచ్చిన సంజూ శాంసన్ధో.. ధోనికి సరైన వారసుడని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డాడు. సీఎస్కే తమ తొలి మ్యాచ్లో మార్చి 30న రాజస్తాన్ రాయల్స్తో తలపడనుంది. సీఎస్కే జట్టు కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరించనున్నాడు.చదవండి: టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. ఆ సిరీస్తో ఎంట్రీ? -
హార్దిక్ పాండ్యా మంచి మనసు.. ఆ 11 మందికి?
ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్, భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన మంచి మనసును చాటుకున్నాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలోని గ్రౌండ్ స్టాఫ్ ఒక్కొక్కరికి రూ.10,000 రూపాయల రివార్డును అందజేశాడు.కాగా టీ20 ప్రపంచకప్-2026కు ముందు హార్దిక్ పాండ్యా వాంఖడే స్టేడియంలో తీవ్రంగా శ్రమించాడు. ఆ సమయంలో గ్రౌండ్ స్టాఫ్ తమ పనివేళల కంటే అదనంగా శ్రమించి హార్దిక్ ప్రాక్టీస్కు సహకరించారు. దీంతో వారందరికీ నగదు బహుమతి ఇస్తానని పాండ్యా మాటిచ్చాడు.ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం హార్దిక్ వారిని వ్యక్తిగతంగా కలిసి మొత్తం 11 మందికి చెక్కులను అందజేశాడు. అయితే తొలుత ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు ఇచ్చారని ప్రచారం జరిగినప్పటికీ, వాస్తవానికి అది రూ. 10,000 మాత్రమే అని తేలింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో గ్రౌండ్ స్టాప్ కష్టాన్ని గుర్తించింనందుకు పాండ్యాపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇక టీ20 ప్రపంచకప్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన హార్దిక్.. ఇప్పుడు ఐపీఎల్లో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. ముంబై ఇండియన్స్ జట్టును పాండ్యా నడిపించనున్నాడు. ముంబై తమ తొలి మ్యాచ్లో మార్చి 29 వాంఖడే వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో తలపడనుంది.చదవండి: టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. ఆ సిరీస్తో ఎంట్రీ? -
టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. ఆ సిరీస్తో ఎంట్రీ?
వైభవ్ సూర్యవంశీ.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఫుట్బాల్ ప్రపంచంలో లామిన్ యమల్ ఎంతటి సంచలనమో.. ఇప్పుడు క్రికెట్ వరల్డ్లో వైభవ్ కూడా అంతే ఫేమస్. కేవలం 14 ఏళ్ల 23 రోజుల వయసులోనే ఐపీఎల్ అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించిన వైభవ్.. ఇప్పుడు అంతర్జాతీయ స్ధాయిలో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు.వరల్డ్క్లాస్ బౌలర్లను సైతం తన బ్యాటింగ్తో వణికిస్తున్న ఈ బిహార్ ఆటగాడు.. నేడు తన 15వ పుట్టిన రోజును జరపునకుంటున్నాడు. దీంతో వైభవ్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసేందేకు అర్హత సాధించాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఒక ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్ ఆడాలంటే కనీసం 15 ఏళ్లు నిండి ఉండాలి. ఇప్పుడు సరిగ్గా ఐపీఎల్ 2026 ప్రారంభానికి ఒక్క రోజు ముందే తన 15వ ఏటలోకి అడుగుపెట్టాడు. దీంతో సీనియర్ జట్టు తరుపున ఆడేందుకు ఎలాంటి అడ్డంకులు లేవు.వైభవ్ జోరు కొనసాగుతుందా?తన అరంగేట్ర ఐపీఎల్ సీజన్లో దుమ్ములేపిన వైభవ్ ఇప్పుడు.. ఐపీఎల్ 2026లో ఎలా రాణిస్తాడో అని అందరూ అతృతగా ఎదురు చూస్తున్నారు. గత సీజన్లో వైభవ్ తన ఆడిన తొలి బంతినే సిక్సర్గా మలిచాడు. అది కూడా శార్ధూల్ ఠాకూర్ వంటి సీనియర్ బౌలర్ బౌలింగ్లో కావడం గమనార్హం. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్తో 35 బంతుల్లోనే సెంచరీ బాదిన వైభవ్.. ఐపీఎల్ చరిత్రలో శతక్కొట్టిన అతి పిన్న వయష్కుడిగా రికార్డులెక్కాడు. అనంతరం అండర్-19 ప్రపంచకప్లోనై ఈ యువ సంచలనం సత్తాచాటాడు. ఇంగ్లండ్తో జరిగిన ఫైనల్లో భారీ సెంచరీ వైభవ్(175) చెలరేగాడు. ఇప్పుడు అదే జోరును ఈ ఏడాది ఐపీఎల్లో కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.డేంజర్లో సచిన్ రికార్డు!భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అత్యంత పిన్నవయష్కుడిగా రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కలిగి ఉన్నాడు. సచిన్ 16 ఏళ్ల 205 రోజుల్లో టీమిండియా తరపున డెబ్యూ చేశాడు. ఇప్పుడు ఈ క్రికెట్ దేవుడు రికార్డు డేంజర్లో పడింది. వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది జూన్లో ఐర్లాండ్తో జరగనున్న టీ20 సిరీస్కు ఎంపిక చేసే అవకాశముంది. ఐపీఎల్ తర్వాత టీమిండియా రెండు టీ20ల సిరీస్ కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అనంతరం అక్కడ నుంచి ఇంగ్లండ్ టూర్కు మెన్ ఇన్ బ్లూ వెళ్లనుంది. అయితే టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా ఐరీష్ టూర్కు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ వంటి ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి భారత సీనియర్ జట్టు నుంచి పిలుపు వచ్చే ఛాన్స్ ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదే జరిగితే భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అతి పిన్న వయష్కుడిగా వైభవ్ చరిత్ర సృష్టించనున్నాడు. ఒకవేళ ఐర్లాండ్ టూర్కు ఎంపిక కాకపోయినా.. ఈ ఏడాది ఆఖరిలో జరిగే ఏషియన్ గేమ్స్లోనైనా అతడు భారత్ తరపున డెబ్యూ చేసే ఛాన్స్ ఉంది.చదవండి: Evin Lewis: విండీస్ క్రికెటర్ సంచలన నిర్ణయం! -
విండీస్ క్రికెటర్ సంచలన నిర్ణయం!
వెస్టిండీస్ సీనియర్ బ్యాటర్ ఎవిన్ లూయిస్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో టీ20 ప్రపంచకప్కు ప్రకటించిన వెస్టిండీస్ జట్టులో ఎవిన్ లూయిస్కు చోటు దక్కలేదు. దీంతో 34 ఏళ్ల ఎవిన్ లూయిస్ ఉన్నపళంగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతూ నిర్ణయాన్ని వెల్లడించాడు. అయితే తాజాగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన లూయిస్ ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టు తరఫున నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. తన కెరీర్లో కేవలం వైట్బాల్ క్రికెట్ (వన్డే, టీ20 ఫార్మాట్)కే పరిమితమైన లూయిస్ తాజాగా తొమ్మిదేళ్ల తర్వాత రెడ్బాల్ క్రికెట్ (టెస్టు ఫార్మాట్)లోనూ తాను ఆడాలనుకుంటున్నట్లు మనసులోని మాటను బయటపెట్టాడు. అయితే ఫస్ట్క్లాస్ కెరీర్లో ట్రినిడాడ్ అండ్ టొబాగో తరఫున ఎవిన్ లూయిస్ 22 మ్యాచ్ల్లో 1,229 పరుగులు సాధించాడు. 2016లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఎవిన్ లూయిస్ 67 వన్డేల్లో 2,175 పరుగులు చేశాడు. 65 టీ20 మ్యాచ్ల్లో 1,782 పరుగులు సాధించాడు. ఇందులో వన్డేల్లో 5 శతకాలు, టీ20ల్లో రెండు సెంచరీలు సాధించాడు. 2016 టీ20 ప్రపంచకప్ గెలిచిన విండీస్ జట్టులో ఎవిన్ లూయిస్ సభ్యుడిగా ఉన్నాడు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్లో 176 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ అయిన క్రికెటర్గా లూయిస్ రికార్డులకెక్కాడు. ఇక అంతర్జాతీయ టీ20 క్రికెట్లో విండీస్ తరఫున అత్యధిక స్కోరు (125 నాటౌట్) సాధించిన ఆటగాడిగాను రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.చదవండి: సంచలనాల సూర్యవంశీ! -
సంచలనాల సూర్యవంశీ!
అతడు కూడా అందరిలా సాధారణంగా క్రికెట్ ఆడుకుంటూ పోతే పెద్దగా గుర్తింపు వచ్చేది కాదేమో. కానీ 12 ఏళ్లకే రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి ఆడకముందే రికార్డు సృష్టించాడు. ఇక బ్యాట్ పట్టి కదనరంగంలోకి దూకిన తర్వాత బ్యాట్కు అలుపొచ్చిందేమో కానీ అతడి పరుగుల దాహం కొనసాగుతూనే వస్తోంది.14 ఏళ్లకే ఐపీఎల్లో అడుగుపెట్టి సంచలనం సృష్టించిన ఆ బుడతడు ఇటీవలే ముగిసిన అండర్-19 ప్రపంచకప్లోనూ తన ప్రదర్శనతో అదరగొట్టాడు. ఆ ప్రపంచకప్లో ఇంగ్లండ్తో జరిగిన ఫైనల్లో 55 బంతుల్లోనే 175 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే పవర్హిట్టింగ్తో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారాడు బీహార్ చిన్నోడు వైభవ్ సూర్యవంశీ.ఇవాళ వైభవ్ సూర్యవంశీ 15వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. సచిన్ లాగే 15 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయాలని తహతహలాడుతున్న వైభవ్ సూర్యవంశీ కోరిక నెరవేరాలని ఆశిద్దాం. హ్యాపీ బర్త్డే టూ వైభవ్ సూర్యవంశీ..క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ మార్చి 27తో మరో మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి సరిగ్గా ఒక్క రోజు ముందు వైభవ్ తన 15వ పుట్టినరోజును జరుపుకోబోతున్నాడు. గతేడాది 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ బీహార్ కుర్రాడు, ఇప్పుడు 15వ ఏట అడుగుపెడుతూ మరింత జోరు చూపించడానికి సిద్ధమయ్యాడు.15వ పుట్టినరోజు సందర్భంగా వైభవ్ సూర్యవంశీ తన లక్ష్యాలను పంచుకున్నాడు. ఈసారి రాజస్థాన్ రాయల్స్కు ఐపీఎల్ టైటిల్ అందించడమే తన ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నాడు. ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్ పేరిట ఉన్న 175 పరుగుల రికార్డును బద్దలు కొట్టాలనేది తన చిరకాల కోరిక అని వైభవ్ పేర్కొన్నాడు. త్వరలో జాతీయ జట్టులోకి..ఇప్పటికే అండర్-19 జూనియర్ స్థాయి క్రికెట్లో టీ20 ప్రపంచకప్ ఫైనల్లోనే 175 పరుగుల ట్రేడ్ మార్క్ ఇన్నింగ్స్ ఆడి బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక ఆటగాడు సీనియర్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టేందుకు కనీసం 15 ఏళ్లు ఉండాలన్నది నిబంధన. తాజాగా వైభవ్ సూర్యవంశీ 15వ ఏట అడుగుపెట్టడంతో సీనియర్ జట్టు లోకి తొందర్లోనే పిలుపు వచ్చే అవకాశముంది. అండర్-19 క్రికెట్లో ఇప్పటివరకు వైభవ్ సూర్యవంశీ 18 మ్యాచ్లు ఆడి 701 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు, ఒక అర్థసెంచరీ ఉన్నాయి.హోంగ్రౌండ్లో వేడుకలు..ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తన మొదటి మ్యాచ్ను మార్చి 30న చెన్నై సూపర్ కింగ్స్తో ఆడనుంది. రాజస్థాన్ రాయల్స్కు ఇది రెండో హోమ్ గ్రౌండ్ కావడంతో జట్టు సభ్యులందరూ ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. వైభవ్ సూర్యవంశీ కూడా టీమ్తోనే ఉన్నాడు. దీంతో తన 15వ పుట్టినరోజు వేడుకలు తన జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ సొంత ఊరైన గౌహతిలోనే జరగనున్నాయి. వరుసగా రెండో ఏడాది వైభవ్ తన పుట్టినరోజును ఐపీఎల్ ఫ్రాంచైజీతో జరుపుకోవడం విశేషం.ఐపీఎల్ 2025 సీజన్కు ముందు జరిగిన వేలంలోకి వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఇవ్వడంతోనే రికార్డు లిఖించాడు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ అతడిని రూ. 1.1 కోట్లకు దక్కించుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరపున 7 మ్యాచ్లు ఆడిన వైభవ్, ఏకంగా 252 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 200 కంటే ఎక్కువగా ఉండటం విశేషం.ద్రవిడ్ పర్యవేక్షణలో..రాజస్థాన్ రాయల్స్ జట్టులో ప్రస్తుతం వైభవ్ అంటే అందరికీ ఎంతో ఇష్టం. టీమ్ మెంటార్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో వైభవ్ తన ఆటను మెరుగుపరుచుకుంటున్నాడు. రియాన్ పరాగ్ వంటి యువ కెప్టెన్ తోడుండటంతో వైభవ్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నాడు. బర్త్డే వేడుకల అనంతరం వైభవ్ తిరిగి నెట్స్ లో ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నాడు. రైతు కొడుకు నుంచి క్రికెటర్ దాకా..2011 మార్చి 27న బీహార్లోని తాజ్పూర్ అనే ఓ మారుమూల గ్రామంలో జన్మించాడు వైభవ్ సూర్యవంశీ. నాలుగేళ్ల వయసులోనే క్రికెట్పై వైభవ్ పెంచుకున్న మక్కువ అతని తండ్రి సంజీవ్కి అర్థమైంది. వెంటనే తన ఇంటి వెనుక భాగంలో వైభవ్ కోసం ఒక చిన్న ఆట స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఆయనే స్వయంగా రోజంతా కష్టపడి ఆ స్థలం అంతా చదును చేసి కొడుకు కోసం చిన్న ప్లే గ్రౌండ్ తయారు చేసి ఇచ్చాడు. అలా ఇంటి వెనుక వైభవ్ ఆడుకునే వాడు. అతనికి తొమ్మిది సంవత్సరాలు నిండగానే క్రికెట్ కోచింగ్ కోసం తమ ఊరికి దగ్గర్లోని సమస్తిపూర్ పట్టణంలోని క్రికెట్ అకాడమీలో వైభవ్ను చేర్పాడు వాళ్ల నాన్న. తొమ్మిదేళ్ల కొడుకు క్రికెటర్గా ఎదుగుతాడనే నమ్మకంతో.. సంజీవ్ చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. వైభవ్ క్రికెట్ కోచింగ్ కోసం తన పొలం అమ్మాలని నిర్ణయించుకున్నాడు.కొడుకు కోసం పొలం అమ్మి..ఆ పొలంపై తన కుటుంబం ఆధారపడి జీవిస్తుందనే విషయాన్ని కూడా పక్కనపెట్టి.. కొడుకు ఎదుగుదలనే నమ్మాడు. తన కొడుకు క్రికెట్ కలలను సాకారం చేసుకోవడానికి మోతీపూర్లోని తన పొలాన్ని అమ్మేశాడు. తండ్రి పొలం అమ్మిన విషయం తెలిసి వైభవ్ క్రికెట్ను ప్రాణం పెట్టి నేర్చుకున్నాడు. సమస్తిపూర్లో రెండున్నర సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత విజయ్ మర్చంట్ ట్రోఫీ కోసం అండర్-16 ట్రయల్స్ ఇచ్చాడు వైభవ్. అదే సమయంలో మాజీ రంజీ ఆటగాడు మనీష్ ఓజా ఆధ్వర్యంలో వైభవ్కు మంచి క్వాలిటీ కోచింగ్ కూడా అందింది. ఆయన కోచింగ్ వైభవ్కు ఎంతో ప్లస్ అయింది. ఆ తర్వాతి చరిత్ర అందరికీ తెలిసిందే.A boy with a dream who picked up a bat and has made it his mission to achieve it all 🔥Today is your day, Vaibhav Sooryavanshi 💗🎂 pic.twitter.com/oEJWupOgXp— Rajasthan Royals (@rajasthanroyals) March 26, 2026Wishing a very happy birthday to our very own Boss Baby, Vaibhav Suryavanshi. He consistently delivers explosive performances and lights up the field with his dynamic play. All the very best for IPL 2026 Vaibhav.#Vaibhavsooryavanshi #happybirthdayVaibhavSooryavanshi pic.twitter.com/8yyl49eZTq— 𝐈𝐂𝐓 ᴬᵁᴿᴬ🇮🇳 (@AURAICTT) March 26, 2026చదవండి: భారత ఫుట్బాల్ జట్టుకు అవమానం! -
‘సిగ్గుచేటు.. ఇలాంటిదెన్నడూ చూడలేదు’
పాకిస్థాన్ సూపర్లీగ్ (పీఎస్ఎల్) 2026 సీజన్ తొలిరోజే బంతి విషయంలో వివాదం చోటుచేసుకుంది. లాహోర్ వేదికగా లాహోర్ ఖలందర్స్, హైదరాబాద్ కింగ్స్మెన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో తెలుపు రంగు బంతి కాస్తా ఉదారంగులోకి మారిపోవడం ఆశ్చర్యం కలిగించింది. అయితే ఇక బంతి ఇలా వేరే రంగులోకి మారిపోవడం తన క్రికెట్ కెరీర్లో ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదంటూ హైదరాబాద్ కింగ్స్మెన్ కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ మార్నస్ లబుషేన్ పేర్కొన్నాడు. లబుషేన్ మాట్లాడుతూ.. 'నిజానికి రెండో ఓవర్లోనే బంతి రంగు మారడాన్ని గమనించాను. ఇదే విషయమై అంపైర్ల దృష్టికి కూడా తీసుకెళ్లాను. అసలు ఏం జరుగుతోంది? బంతి రంగు ఎందుకు మారుతోందంటూ అంపైర్లను అడిగాను. అయితే బంతి దుస్తులకు అదే పనిగా రాయడం వల్ల ఇలా జరిగిందని అనుకుంటున్నా. కానీ నా కెరీర్లో ఇలాంటి ఘటన మాత్రం ఎన్నడూ చూడలేదు. అయితే బ్యాట్పై ఉన్న ఏదైనా స్టిక్కర్పై బంతి పడి అది దానికి అతుక్కుపోవడం వల్ల బంతి రంగు మారడం చూశాను.కానీ దుస్తులకు బంతిని పదే పదే రుద్దడం ద్వారా వేరే రంగులోకి మారడం మాత్రం అరుదైన విషయమని చెప్పొచ్చు. అయితే రాబోయే మ్యాచ్ల్లో ఇలాంటివి జరగకుండా లీగ్ నిర్వాహకులు జాగ్రత్త పడతారని భావిస్తున్నా' అని చెప్పుకొచ్చాడు. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం హైదరాబాద్ కింగ్స్మెన్ తమ ‘ఎక్స్’ వేదికగా..‘ తొలి పింక్ బాల్ మ్యాచ్లో విజయం సాధించిన లాహోర్ ఖలందర్స్కు మా అభినందనలు’ అంటూ ఆసక్తికర ట్వీట్ చేసింది. ఈ మ్యాచ్లో లాహోర్ ఖలందర్స్ 69 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఓపెనర్ ఫఖర్ జమాన్ (53) అర్థసెంచరీతో రాణించగా, హసీబుల్లా ఖాన్ (40 నాటౌట్) చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. హైదరాబాద్ కింగ్స్ బౌలర్లలో రిలే మెరిడిత్, హసన్ ఖాన్లు చెరో 2 వికెట్లు పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ కింగ్స్మెన్ 20 ఓవర్లలో 130 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ లబుషేన్ (26) టాప్ స్కోరర్గా నిలిచాడు. లాహోర్ ఖలందర్స్ బౌలర్లలో హారిస్ రవూఫ్, సికందర్ రజా, ఉబైద్ షా తలా రెండు వికెట్లు తీశారు. నేడు జరగనున్న మ్యాచ్లో క్వెటా గ్లాడియేటర్స్, కరాచీ కింగ్స్ తలపడనున్నాయి.🚨🚨Marnus Labuschagne on the change of ball color"I did say to the umpires after the second over, What’s going on? The ball is red, it must be from the clothes or something like that. I’ve never seen anything like pic.twitter.com/VHSXouHZYx— SheR•ALI (@Sher__Ali) March 26, 2026చదవండి: PSL 2026: తొలిరోజే అనూహ్య పరిణామం! -
PSL 2026: తొలిరోజే అనూహ్య పరిణామం!
ఆంక్షల నడుమ మొదలైన పాకిస్థాన్ సూపర్లీగ్ (పీఎస్ఎల్) 2026 సీజన్ తొలిరోజునే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. లాహోర్ ఖలందర్స్ ఇన్నింగ్స్ 15వ ఓవర్ సందర్భంగా బంతి రంగు మారడం ఆశ్చర్యం కలిగించింది. సాధారణంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో వైట్బాల్ను ఉపయోగించడం ఆనవాయితీ. అయితే అనూహ్యంగా బంతి గులాబీ రంగులోకి మారిపోయింది. ఇది ఎలా జరిగిందో అర్థం కాక ఇరుజట్ల ఆటగాళ్లు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఓవర్ ముగిసిన తర్వాత బంతిని పరిశీలించిన అంపైర్లు దాని స్థానంలో మరొక బంతిని తీసుకొని మ్యాచ్ను కొనసాగించారు. దీనికి సంబంధించిన వీడియోను ఒక వ్యక్తి సామాజిక మాధ్యమంలో షేర్ చేసుకోవడంతో ఉన్నపళంగా వైరల్గా మారిపోయింది. క్రీడాభిమానులు సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లతో రెచ్చిపోయారు. 'బౌలర్లు పదేపదే బంతిని రుద్దడం వల్లే తెల్లబంతి కాస్తా గులాబీ రంగుకు మారిపోయి ఉంటుంది'.. 'ఇది పీఎస్ఎల్ కాదు పైసా షార్టేజ్ లీగ్ అనుకుంటా'.. 'ఇది అంతర్జాతీయ క్రికెటా లేక గల్లీ క్రికెటా అన్నది అర్థం కావడం లేదు'.. అని కామెంట్లు చేశారు. ప్రేక్షకులు లేకుండానే మొదలైన పీఎస్ఎల్లో తొలి మ్యాచ్ షహీన్ అఫ్రిది సారథ్యంలోని లాహోర్ ఖలందర్స్, లబుషేన్ నేతృ త్వంలోని హైదరాబాద్ కింగ్స్మెన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో లాహోర్ ఖలందర్స్ 69 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఓపెనర్ ఫఖర్ జమాన్ (53) అర్థసెంచరీతో రాణించగా, హసీబుల్లా ఖాన్ (40 నాటౌట్) చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. హైదరాబాద్ కింగ్స్ బౌలర్లలో రిలే మెరిడిత్, హసన్ ఖాన్లు చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ కింగ్స్మెన్ 20 ఓవర్లలో 130 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ లబుషేన్ (26) టాప్ స్కోరర్గా నిలిచాడు. లాహోర్ ఖలందర్స్ బౌలర్లలో హారిస్ రవూఫ్, సికందర్ రజా, ఉబైద్ షా తలా రెండు వికెట్లు తీశారు. నేడు జరగనున్న మ్యాచ్లో క్వెటా గ్లాడియేటర్స్, కరాచీ కింగ్స్ తలపడనున్నాయి.Peak Pakistan Super League standards 😭During the very first match of PSL 11, the ball literally turned pink every time Hyderabad Kingsmen players rubbed it on their kit.Did they get knockoff kits instead of authentic ones?International league or gully-level experiment? 🤡 pic.twitter.com/Beq5zhmSkb— Brutal Truth (@sarkarstix) March 26, 2026During today’s PSL match, the ball turned pink as early as the second over because players kept rubbing it on their pants, causing the dye to transfer onto the ball.Paisa Shortage League for a reason 🤣 pic.twitter.com/QQf7wlc2qG— Tejash (@Tejashyyyyy) March 26, 2026చదవండి: ధోనిపై మాజీ ఆటగాడి సంచలన వ్యాఖ్యలు! -
ధోనిపై మాజీ ఆటగాడి సంచలన వ్యాఖ్యలు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభానికి ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో గురువారం ఐపీఎల్ 19వ సీజన్కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ కూడా విడుదలైంది. ఇక ఐపీఎల్లో ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్కింగ్స్ లెజెండరీ ఆటగాడు ఎంఎస్ ధోనికి ఇదే చివరి సీజన్ అనే ప్రచారం జోరుగా సాగుతుంది. 2025 సీజన్కు ముందు ఈ టీమిండియా మాజీ వికెట్ కీపర్ను చెన్నై ఫ్రాంచైజీ రూ. 4 కోట్లకు రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. గత రెండు మూడు సీజన్లుగా చూసుకుంటే లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు వస్తున్న ధోని కేవలం జట్టులో పెద్దన్న పాత్ర పోషిస్తూ జూనియర్లకు మార్గనిర్దేశనం చేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో సీఎస్కే మాజీ ఆటగాడు సబ్రమణ్యం బద్రీనాథ్ ధోని వయసు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక యూట్యూట్ చానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన బద్రీనాథ్ మాట్లాడుతూ.. 'ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్ తరఫున 18వ ఓవర్ లేదా 19వ ఓవర్లో ఎంఎస్ ధోని బ్యాటింగ్కు వచ్చి సిక్సర్లు బాదడం చూడటానికి ఉత్సాహంగా ఉండవచ్చు. కానీ వయసును దృష్టిలో పెట్టుకుని చూస్తే మాత్రం ధోని అన్ని మ్యాచ్లు ఆడే సత్తా ఉండకపోవచ్చు. ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా జట్టులో కొనసాగే అవకాశముంది.ఎందుకంటే ఇప్పటికీ సీఎస్కేలో బ్యాటర్లు, వికెట్ కీపర్లు చాలా మందే ఉన్నారు. ఫీల్డింగ్ సమయంలోనూ ధోని ఎక్కువగా మైదానంలో కనిపించకపోవచ్చు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు ఒక అనుభవజ్ఞుడి స్థానంలో ధోని సలహాలు, సూచనలు ఇస్తాడా లేదా అన్నది చూడాలి. లేదంటే రుతురాజ్ స్వయంగా ధోనిని సూచనలు అడిగి వాటిని అమలు చేసే అవకాశం కూడా ఉంది. వాస్తవానికి మైదానంలో ధోని చాలా తక్కువగా మాట్లాడుతాడు.అలాగే జట్టులోకి ట్రేడింగ్ రూపంలో వచ్చిన సంజూ శాంసన్ కూడా గతంలో రాజస్థాన్ రాయల్స్కు కెప్టెన్గా వ్యవహరించినవాడే. కాబట్టి అతడి సలహాలు కూడా రుతురాజ్ తీసుకునేందుకు చాన్స్ ఉంటుంది. గత సీజన్ను పరిగణలోకి తీసుకొని చూసుకున్న తర్వాత ధోని విలువ అలాగే ఉందా అన్నది చూడాలి. అయితే ఒకసారి బరిలోకి దిగుతున్నా అని ధోని చెప్పాడంటే సీజన్ ఆఖరి వరకు మైదానంలో ఉంటాడని భావిస్తున్నా'అని చెప్పుకొచ్చాడు.ఇక ధోని 2026 సీజన్కు తన ప్రాక్టీస్ను ఎప్పుడో ఆరంభించాడు. గత సీజన్లో ఎక్కువగా 7, 8 స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చిన ధోని 14 మ్యాచ్ల్లో 196 పరుగులు చేశాడు. ఈ సీజన్లో చెన్నై సూపర్కింగ్స్ తన తొలి మ్యాచ్ను మార్చి 30న రాజస్థాన్ రాయల్స్తో ఆడనుంది.చదవండి: మిక్స్డ్ టీమ్ ఫైనల్లో రజత్ జోడీ


